హీరోయిన్కు బ్యాడ్ టైమ్.. సినిమా కష్టాలు.. వ్యాపారంలోనూ నష్టాలు!
కెరీర్ ఊపులో ఉన్నప్పుడే కొంతమంది హీరోయిన్లు తెలివిగా వ్యవహరిస్తుంటారు. సినిమాల పైనే ఆధారపడకుండా ప్లాన్-బితో వారికి తెలిసిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అలానే ఓ ప్రముఖ హీరోయిన్ కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. ఎప్పటికైనా సినిమా అవకాశాలు తగ్గుతాయని ముందే ఊహించిన ఈ హీరోయిన్.. కెరీర్ ఊపందుకున్నప్పుడే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అప్పట్లో వరుసపెట్టి సినిమాలు చేసిన ఈ హీరోయిన్ తనకు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును పలు వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతం సౌత్లో ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు కానీ.. గతంలో సంపాదించిన మొత్తంతో ఇప్పటికీ చాలా ప్రశాంతంగానే ఉందట.అయితే తాజాగా ఆమె పెట్టిన పెట్టుబడుల్లో కొన్ని ఇబ్బందుల్లో పడినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అమెరికా వాణిజ్య విధానాలు, దేశీయ మార్కెట్లో జరుగుతున్న మార్పులు వంటి కారణాలతో కొన్ని వ్యాపారాలు నష్టాలను ఎదుర్కొంటున్నాయట. అయితే తనకు బాగా తెలిసిన జిమ్ బిజినెస్ మాత్రం ఆమెకు బాగా కలిసి వచ్చిందని సమాచారం. కానీ ఇతరుల సలహాలతో పెట్టుబడి పెట్టిన కొన్ని వ్యాపారాలు మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదట. వాటి నుంచి బయటపడలేక, కొనసాగించలేక ఆమె సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తన పెట్టుబడులను రక్షించుకోవడానికి ఇండస్ట్రీలో తనకు సన్నిహితంగా ఉండే వారితో ఆమె ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. నష్టాల నుంచి ఎలా బయటపడాలి అనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట.
‘మేము మీలాగ ప్రత్యేక జీవోలతో పోస్టులు అమ్ముకోలేదు’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం పెద్దలు డీఎస్సీలో అక్రమాలు కప్పి పుచ్చుకునేందుకు గ్రూప్-1ని వివాదం చేస్తున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. డీఎస్సీలో అక్రమాలు చేసి చంద్రబాబు ప్రభుత్వం అభాసుపాలైందని, దాన్ని డైవర్ట్ చేయడానికి గ్రూప్-1 అంటూ రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు(ఆదివారం, ఆగస్టు 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆదిమూలపు సురేష్.. ‘ గ్రూప్ 1 లో ఎక్కడా తప్పు జరగలేదని సిట్ కూడా తేల్చింది. మరి చంద్రబాబు ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తారు?, గ్రూప్ 1 లో మేము ఎక్కడా రాజీ పడలేదు. డీఎస్సీలో లాగా ప్రత్యేక జీవోలు తెచ్చి పోస్టులు అమ్ముకోలేదు. అలాంటప్పుడు గ్రూప్ 1, డీఎస్సీకి ఎలా ముడి పెడతారు?, గ్రూప్ 1 లో పేపర్ మూల్యాంకనం మీద మాత్రమే ఆరోపణలు చేస్తున్నారు. దానిపై కూడా హైకోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించాం. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం నియమించిన అధికారులే గ్రూప్ 1 మూల్యాంకన సమయంలో ఉన్నారు. వారిని చులకన చేసేలా టీడీపీ నేతలు, ఎల్లోమీడియా విష ప్రచారం చేస్తోంది. అభ్యర్థులు రాసిన పరీక్షా పత్రాలు ఇప్పటికీ కోర్టులో ఉన్నాయి.. కావాలంటే ఎవరైనా సరే వెళ్లి చెక్ చూసుకోవచ్చు’ అని సవాల్ చేశారు.
ముగిసిన రెండో రోజు ఆట.. భారీ స్కోర్ సాధించిన భారత్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వర్షం కారణంగా రెండో రోజు కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ఆరంభంలో పంత్(39) కాస్త దూకుడుగా ఆడినప్పటికి ఓ భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. కాగా తొలి రోజు ఆటలో కండరాల గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్.. రెండో రోజు బ్యాటింగ్కు వచ్చాడు. కానీ అతడు ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ పెవిలియన్కు చేరాడు. వరుస వికెట్లు పడుతున్నప్పటికి సెంచరీ హీరో దేవ్దత్త్ పడిక్కల్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఆచితూచి ఆడుతూ ధ్రువ్ జురల్తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే 167 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పడిక్కల్ అనుహ్యంగా స్టంపౌటయ్యాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ జట్టును ఇన్నింగ్స్ను నడిపించే భాధ్యతను తీసుకున్నాడు. ఈ క్రమంలో జురెల్ 66 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ను పూర్తి చేసుకున్నాడు. అయితే రెండో రోజు ఆట ఆఖరిలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న జురెల్(51), మానవ్ సుత్తార్(24) వరుస ఓవర్లలో ఔటయ్యాడు.ప్రాక్టీస్ మ్యాచ్లో సిక్సర్లతో సత్తాచాటిన మహ్మద్ సిరాజ్.. గాలే టెస్ట్లో కూడా తన బ్యాట్కు పనిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ 15 బంతుల్లో ఒక సిక్సర్తో 11 పరుగులు చేసి సిరాజ్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ప్రసిద్ద్ కృష్ణ(1), కుల్దీప్ యాదవ్(12) ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ ప్రభాత్ జైసూర్య నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశర నువాంత 3 వికెట్లు సాధించాడు.
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్రెడ్డి
అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ వివాహ వేడుకకు హాజరైన టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి రెచ్చిపోయారు. ఓ వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ నేతలు రావడంపై జేసీ ప్రభాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనుచితంగా ప్రవర్తించారు. కళ్యాణ మండపానికి తలుపులు వేసేసి మరీ తన అహంకార పూరిత ధోరణిని ప్రదర్శించారు. దాంతో మండపంలోనే మంత్రి జనార్థన్రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత శ్రీరాంరెడ్డిలు ఉండిపోయారు. సర్ది చెప్పేందుకు యత్నించిన శ్రీరాంరెడ్డిపై దౌర్జన్యం చేశారు జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు. అదే సమయంలో వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి వాగ్వాదానికి దిగారు జేసీ ప్రభాకర్రెడ్డి. ఈ క్రమంలోనే ఓ కారును ధ్వంసం చేశారు జేసీ వర్గీయులు. ఈ ఘటన మంత్రి బీసీ జనార్థన్రెడ్డి సమక్షంలోనే జరగడం గమనార్హం. వివాహ వేడుకలో జేసీ ప్రభాకర్రెడ్డి రాజకీయాలు చేసిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.
హీరోయిన్కు బ్యాడ్ టైమ్.. సినిమా కష్టాలు.. వ్యాపారంలోనూ నష్టాలు!
‘వ్యవస్థల్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు’
మరో యువకుడి చేతిలో ప్రియుడిని నుజ్జునుజ్జు చేయించిన అమ్మాయి
IND vs SL: ఒంటి చేత్తో క్యాచ్.. బిత్తర పోయిన భారత బ్యాటర్! వీడియో
రష్మిక.. నా గురించి అందుకే అలా మాట్లాడిందేమో
సీఎం పరకాల పర్యటనకు కొండా సురేఖ దూరం.. !
నాలుగేళ్లుగా చేస్తున్న ఉద్యోగం.. అందుకే వదిలేసా!
బోటు బోల్తా పడి మత్స్యకారుడి మృతి
రెండో ఉద్యమం మొదలు పెట్టిన సీజేపీకి బిగ్ షాక్.. ఒకరి మృతి
ఏంటి బ్రో.. కాస్త వెనక ముందు చూసుకోవాలి కాదా?
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
బ్రిటిష్ వారు మొత్తం ఎన్ని దేశాలు పాలించారు?
ఉద్యోగుల కనీస వేతనం.. రూ.55 నుంచి రూ.18,000 వరకు!
ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
జైసూను రనౌట్ చేయనా?.. ఇందులో తప్పేముంది?.. కానివ్వు!
ప్చ్.. యథా రాజా తథా ప్రజా!!
AUS vs BAN: నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్క్రిస్ట్
పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇక మరింత మందికి ఆ బెనిఫిట్
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్!
వివాదంలో బాలయ్య సతీమణి వసుంధర
సాక్షి కార్టూన్: 15-08-2026
'గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్
ఉన్నవే 26 ఐమ్యాక్స్ స్క్రీన్లు.. మరి జక్కన్న ప్లానేంటి..?
బోనాల్లో పాల్గొన్నందుకు ట్రోలింగ్.. ఏడ్చేసిన తెలుగు హీరోయిన్
వెండితెరపై మరో నట వారసుడు.. హీరోగా గ్రాండ్ ఎంట్రీ!
ఇజ్రాయెల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
బంగారం, వెండి కొనుగోళ్లకు కొత్త పోర్టల్
ఫ్యామిలీ పోషణ కోసం చీర, జాకెట్ కట్టుకున్నా: నటుడు
హీరోయిన్కు బ్యాడ్ టైమ్.. సినిమా కష్టాలు.. వ్యాపారంలోనూ నష్టాలు!
‘వ్యవస్థల్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు’
మరో యువకుడి చేతిలో ప్రియుడిని నుజ్జునుజ్జు చేయించిన అమ్మాయి
IND vs SL: ఒంటి చేత్తో క్యాచ్.. బిత్తర పోయిన భారత బ్యాటర్! వీడియో
రష్మిక.. నా గురించి అందుకే అలా మాట్లాడిందేమో
సీఎం పరకాల పర్యటనకు కొండా సురేఖ దూరం.. !
నాలుగేళ్లుగా చేస్తున్న ఉద్యోగం.. అందుకే వదిలేసా!
బోటు బోల్తా పడి మత్స్యకారుడి మృతి
రెండో ఉద్యమం మొదలు పెట్టిన సీజేపీకి బిగ్ షాక్.. ఒకరి మృతి
ఏంటి బ్రో.. కాస్త వెనక ముందు చూసుకోవాలి కాదా?
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
బ్రిటిష్ వారు మొత్తం ఎన్ని దేశాలు పాలించారు?
ఉద్యోగుల కనీస వేతనం.. రూ.55 నుంచి రూ.18,000 వరకు!
ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
జైసూను రనౌట్ చేయనా?.. ఇందులో తప్పేముంది?.. కానివ్వు!
ప్చ్.. యథా రాజా తథా ప్రజా!!
AUS vs BAN: నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్క్రిస్ట్
పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇక మరింత మందికి ఆ బెనిఫిట్
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్!
వివాదంలో బాలయ్య సతీమణి వసుంధర
సాక్షి కార్టూన్: 15-08-2026
'గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్
ఉన్నవే 26 ఐమ్యాక్స్ స్క్రీన్లు.. మరి జక్కన్న ప్లానేంటి..?
బోనాల్లో పాల్గొన్నందుకు ట్రోలింగ్.. ఏడ్చేసిన తెలుగు హీరోయిన్
వెండితెరపై మరో నట వారసుడు.. హీరోగా గ్రాండ్ ఎంట్రీ!
ఇజ్రాయెల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
బంగారం, వెండి కొనుగోళ్లకు కొత్త పోర్టల్
ఫ్యామిలీ పోషణ కోసం చీర, జాకెట్ కట్టుకున్నా: నటుడు
ఫొటోలు
పద్ధతిగా 'హిట్' సినిమా హీరోయిన్ (ఫొటోలు)
అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు)
భర్త బర్త్డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు)
నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు)
'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)
‘హుషారు పిట్టలు’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
శ్రీహరి కొడుకు మేఘాంశ్ 'ఆస్మాన్' చిత్రం మోషన్ పోస్టర్ లాంచ్ (ఫొటోలు)
హైదరాబాద్లో సందడి చేసిన నటుడు సోనూసూద్ (ఫొటోలు)
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం (ఫొటోలు)
‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
సినిమా
రష్మిక.. నా గురించి అందుకే అలా మాట్లాడిందేమో
రష్మిక స్వతహాగా కన్నడ అమ్మాయి. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్ అయింది. తర్వాత మాతృభాషలో కొన్ని మూవీస్ చేసింది. ఇదంతా 9-10 ఏళ్ల కిందటి ముచ్చట. అయితే ఈ టైంలో పలు వివాదాల్లోనూ ఈమె ఇరుక్కుంది. అందులో 'కేజీఎఫ్' హీరో యష్పై చేసిన 'షో ఆఫ్' కామెంట్ కూడా ఉంది. దీని కారణంగా యష్ అభిమానులు రష్మికని చాలా ట్రోల్ చేశారు. తొమ్మిదేళ్ల క్రితం నాటి వ్యాఖ్యపై యష్ ఇన్నాళ్లకు స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో సదరు విషయమై క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: చిరంజీవితో సినిమా.. నేను ఇంకాస్త ఎదగాలి: డైరెక్టర్ వెంకీ అట్లూరి)'ఆమె ఏ సందర్భంలో ఆ కామెంట్ చేసిందో నాకు తెలీదు. అప్పుడే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది. కొందరు యాంకర్లు ఇష్టమొచ్చినట్లు ప్రశ్నలు అడుగుతూ, ఆప్షన్లు ఇచ్చి ఏదో చెప్పమంటారు. బహుశా రష్మిక కూడా ఆ ఆప్షన్ నాకు సరిపోతుందని భావించి అలా మాట్లాడిందేమో! రష్మిక వ్యాఖ్యల వల్ల చాలామంది దర్శకులు ఇబ్బంది పడ్డారు. అయితే తోటి నటీనటులు ఎవరేమనుకున్నా నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. అది నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయదు. ఎవరైనా తమకు నచ్చింది చెప్పొచ్చు. కానీ దాని వల్ల నేనేం మారిపోను' అని యష్ అన్నాడు.ఇక తన అభిమానులని ఉద్దేశిస్తూ ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తోటి నటీనటులని గౌరవించలేని వాళ్లు తన అభిమానులే కాదని యష్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వివాదంపై అప్పట్లోన రష్మిక స్పందించింది. అలా అన్నందుకు క్షమాపణ కూడా చెప్పింది. అయితే ఇన్నేళ్లకు సందర్భం రావడంతో యష్ కూడా స్పందించి ఎట్టకేలకు దీనికి ముగింపు పలికాడు. ఇకపోతే యష్ హీరోగా చేసిన 'టాక్సిక్'.. వచ్చే బుధవారం (ఆగస్టు 26) థియేటర్లలోకి రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: 'ఇరుముడి' నుంచి 'మల్లెపూల పల్లకి సాంగ్' రిలీజ్)
'ఇరుముడి' నుంచి 'మల్లెపూల పల్లకి సాంగ్' రిలీజ్
రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. అయ్యప్పస్వామి నేపథ్యం కూడా ఇందులో కొంతమేర ఉంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్ రిలీజయ్యాయి. ఈ శుక్రవారమే (ఆగస్టు 21) మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే 'మల్లెపూల పల్లకి' అంటూ సాగే అయ్యప్ప పాటని విడుదల చేశారు.శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ ఓ మధ్య తరగతి తండ్రిగా నటించాడు. ప్రియా భవానీ శంకర్ ఇతడికి జంటగా కనిపించనుంది. నక్షత్ర అనే బాలనటి, రవితేజ కూతురిగా చేసింది. జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. గత కొన్నేళ్లుగా హిట్ అనేది లేని రవితేజకు ఇది కమ్ బ్యాక్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఇదెంత వరకు నెరవేరుస్తుందో చూడాలి?
స్పెషల్ చీరలో త్రిష.. వయ్యారంగా శోభిత
అమ్మ చీరలో అందంగా కనిపిస్తున్న త్రిషఆరెంజ్ కలర్ చీరలో శోభిత వయ్యారాలుఎర్ర చీరలో యంగ్ హీరోయిన్ నాగదుర్గగ్లామర్ చూపించేస్తున్న 'చిరుత' నేహాశర్మఎర్రని డ్రస్లో సింగర్ జోనితా గాంధీమత్తెక్కించే లుక్స్లో హీరోయిన్ ప్రణీత View this post on Instagram A post shared by Nagadurga Gutha (@_nagadurga_21) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by JONITA (@jonitamusic) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi)
బండ్ల గణేశ్ కూతురి పెళ్లి.. టాలీవుడ్ సినీతారల సందడి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కూతురు జనని వివాహం హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ సినీతారలు పెద్దఎత్తున సందడి చేశారు. ఈ పెళ్లి ఫంక్షన్లో హీరోలు వెంకటేశ్, నాగార్జున, చిరంజీవి, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, హాస్యనటులు బ్రహ్మనందం, సునీల్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పెళ్లి వేడుకలో మెగాస్టార్ సతీసమేతంగా పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు పెళ్లి వేడుకలో పాల్గొని నూతన జంటను ఆశీస్సులు అందించారు. బండ్లన్న కుమార్తె వివాహ వేడుకలో సునీల్ ..#sunil #Bandlaganesh #janani#Jananisuryapayanam pic.twitter.com/mZwETRvS5z— SZN (@Suzenbabu) August 16, 2026
క్రీడలు
ముగిసిన రెండో రోజు ఆట.. భారీ స్కోర్ సాధించిన భారత్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వర్షం కారణంగా రెండో రోజు కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ఆరంభంలో పంత్(39) కాస్త దూకుడుగా ఆడినప్పటికి ఓ భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. కాగా తొలి రోజు ఆటలో కండరాల గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్.. రెండో రోజు బ్యాటింగ్కు వచ్చాడు. కానీ అతడు ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ పెవిలియన్కు చేరాడు. వరుస వికెట్లు పడుతున్నప్పటికి సెంచరీ హీరో దేవ్దత్త్ పడిక్కల్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఆచితూచి ఆడుతూ ధ్రువ్ జురల్తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే 167 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పడిక్కల్ అనుహ్యంగా స్టంపౌటయ్యాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ జట్టును ఇన్నింగ్స్ను నడిపించే భాధ్యతను తీసుకున్నాడు. ఈ క్రమంలో జురెల్ 66 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ను పూర్తి చేసుకున్నాడు. అయితే రెండో రోజు ఆట ఆఖరిలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న జురెల్(51), మానవ్ సుత్తార్(24) వరుస ఓవర్లలో ఔటయ్యాడు.ప్రాక్టీస్ మ్యాచ్లో సిక్సర్లతో సత్తాచాటిన మహ్మద్ సిరాజ్.. గాలే టెస్ట్లో కూడా తన బ్యాట్కు పనిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ 15 బంతుల్లో ఒక సిక్సర్తో 11 పరుగులు చేసి సిరాజ్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ప్రసిద్ద్ కృష్ణ(1), కుల్దీప్ యాదవ్(12) ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ ప్రభాత్ జైసూర్య నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశర నువాంత 3 వికెట్లు సాధించాడు.
లంక గడ్డపై 'పడిక్కల్' రికార్డుల మోత.. రాహుల్ ద్రవిడ్ సరసన!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత యువ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన పడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఓ దశలో తన తొలి డబుల్ సెంచరీ మార్క్ను అందుకునేలా కనిపించిన పడిక్కల్.. అనుహ్యంగా స్టంపౌటయ్యాడు.మొత్తంగా ఈ కర్ణాటక బ్యాటర్ 230 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్తో 167 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పడిక్కల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంకపై టెస్టుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 150 ప్లస్ స్కోరు సాధించిన మూడో భారత బ్యాటర్గా పడిక్కల్ చరిత్ర సృష్టించాడు. గతంలో టీమిండియా దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్(177), ఛెతేశ్వర్ పుజారా (153 పరుగులు) మూడో స్ధానంలో బ్యాటింగ్కు 150 కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఇప్పుడు ఈ అరుదైన జాబితాలో పడిక్కల్ చేరాడు. అంతేకాకుండా స్వాతంత్య్ర దినోత్సవం రోజున టెస్టు సెంచరీ తొలి ప్లేయర్గా కూడా దేవ్ రికార్డులకెక్కాడు.అలాగే 21వ శతాబ్దంలో టీమిండియా తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్గా పడిక్కల్ రికార్డులెక్కాడు. పడిక్కల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో వచ్చిన అవకాశాన్ని పడిక్కల్ అద్భుతంగా వినియోగించుకున్నాడు.చదవండి: అస్సలు ఊహించలేదు.. ఇది అత్యంత అవమానకరం: పాంటింగ్
పంత్ సిక్సర్ల రికార్డు
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరో అరుదైన రికార్డు సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో భారీ సిక్సర్ బాదడంతో టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో లెజండరీ ఆల్రౌండర్ జాక్ కలిస్ను (97 సిక్సర్లు) అధిగమించాడు.ఈ జాబితాలో బెన్ స్టోక్స్ (138), బ్రెండన్ మెక్కల్లమ్ (107), ఆడమ్ గిల్క్రిస్ట్ (100), టిమ్ సౌథీ (98), క్రిస్ గేల్ (98) పంత్ (98) కంటే ముందున్నారు.2024లో విమర్శలు.. 2025లో అద్భుతమైన పునరాగమనంటెస్ట్ క్రికెట్లో పంత్ దూకుడైన బ్యాటింగ్కు ఎప్పటినుంచో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే 2024లో అతని ఆ దూకుడే ప్రతికూలంగా మారింది. ఆ ఏడాది 17 ఇన్నింగ్స్ల్లో 576 పరుగులు చేసిన పంత్ సగటు 36.00గా ఉంది.అయితే 2025లో పంత్ అద్భుతంగా పుంజుకున్నాడు. 13 ఇన్నింగ్స్ల్లో 629 పరుగులు, 48.38 సగటుతో రాణించాడు. 2026లోనూ అతను 81, 39 పరుగుల ఇన్నింగ్స్లతో ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం పంత్ 51 టెస్టుల్లో 3,596 పరుగులు, 43.32 సగటు, 73.91 స్ట్రైక్రేట్తో కొనసాగుతున్నాడు.అంతేకాదు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా గడ్డలపై టెస్ట్ సెంచరీలు సాధించిన అరుదైన వికెట్ కీపర్లలో పంత్ ఒకడిగా చలామణి అవుతున్నాడు.జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉందా..?పంత్ ఎంతటి మ్యాచ్ విన్నర్ అయినప్పటికీ, టెస్టుల్లో అతని దూకుడు బ్యాటింగ్పై అప్పుడప్పుడు విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీమిండియాలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వరుసగా విఫలమైతే ఏ ఆటగాడికైనా జట్టులో స్థానం ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంది.పంత్ ఇప్పటికే భారత టెస్ట్ వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు. ఒకవేళ భవిష్యత్తులో అతను టెస్ట్ జట్టులో చోటు కోల్పోతే, అతని స్థానాన్ని భర్తీ చేయడానికి ధృవ్ జురెల్ ప్రధాన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు.అయితే ప్రస్తుతానికి పంత్ తన బ్యాటింగ్తోనే సమాధానం ఇస్తున్నాడు. టెస్ట్ క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయికి అతను కేవలం రెండు సిక్సర్ల దూరంలో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా రెండో రోజు ఆటలో దాదాపు రెండు సెషన్ల ఆట జరగలేదు. మూడో సెషన్లో ఆట ప్రారంభమైంది. ఓవర్నైట్ బ్యాటర్లు దేవదత్ పడిక్కల్ (167), రిషభ్ పంత్ (39)తో పాటు కేఎల్ రాహుల్ (82) ఔటయ్యారు. ధృవ్ జురెల్ (22), రవీంద్ర జడేజా (9) క్రీజ్లో ఉన్నారు. జట్టు స్కోర్ 372-5గా ఉంది. తొలి రోజు ఆటలో భారత్ యశస్వి జైస్వాల్ (32), కెప్టెన్ శుభ్మన్ గిల్ వికెట్లు కోల్పోయింది. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య, కేశర నువంత తలో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో కోసం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
అస్సలు ఊహించలేదు.. ఇది అత్యంత అవమానకరం: పాంటింగ్
ఆస్ట్రేలియాకు వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ను 9 వికెట్ల తేడాతో బంగ్లా జట్టు చిత్తు చేసింది. ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు దారుణమైన ప్రదర్శన కనబరిచింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమై ఘోర ఓటమిని మూట కట్టుకుంది. ఈ ఓటమిపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు రికీ పాంటింగ్, మార్క్ వా తీవ్రంగా స్పందించారు. డార్విన్ టెస్ట్కు కామెంటేటర్లుగా వ్యవహరించిన ఈ సీనియర్ ద్వయం కమ్మిన్స్ సేనపై విమర్శలు వర్షం గుప్పించారు. ఆసీస్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన ఓటమని మండిపడ్డారు.ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇలాంటి ఘోర ఓటమిని నేను ఇప్పటివరకు చూడలేదు. మూడేళ్ల క్రితం గబ్బాలో వెస్టిండీస్ చేతిలో కూడా ఖంగుతిన్నారు. కానీ ఇది అంతకంటే దారుణమైన ఓటమి. ఎందుకంటే బంగ్లా జట్టులో వారి అత్యుత్తమ బౌలర్లు నహిద్ రానా, షోరిఫుల్ ఇస్లాం లేరు. అయినప్పటికి మన బ్యాటర్లు చేతులెత్తేశారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా తమ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగింది. వీటిన్నింటిని పరిగణలోకి తీసుకుంటే బంగ్లాకు ఇది చాలా పెద్ద విజయమని మార్క్ వా పేర్కొన్నారు.ఈ ఓటమి నన్ను తీవ్ర నిరాశపరిచింది. ఇది అత్యంత అవమానకరమైన ఓటమి. జట్టులో మార్పులు చేయడానికి నేను సాధారణంగా ఇష్టపడను. కానీ జట్టు తీవ్రంగా విఫలమైనప్పుడు మార్పులు తప్పవు. జట్టును పునర్నిర్మించడానికి కొత్త ఆటగాళ్లకు అవకాశమివ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా కొత్త ఓపెనర్, మూడో స్ధానానికి సరిపోయే యంగ్ ప్లేయర్లను తీసుకురావాలి అని పాంటింగ్ సూచించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెక్కే వేదికగా ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానుంది.
న్యూస్ పాడ్కాస్ట్
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
దేశ భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే... పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్య
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
బిజినెస్
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా..
భారతదేశంలో కొన్నాళ్లుగా భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నేడు (ఆదివారం) గోల్డ్ రేటు హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉంది. వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. కాబట్టి ఈ కథనంలో తాజా ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
జనాభా లెక్కల్లో 40 కీలక ప్రశ్నలు
భారతదేశంలో త్వరలో ప్రారంభం కానున్న ‘జనాభా లెక్కలు 2027’ ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విడత సెన్సెస్ లెక్కల సేకరణలో ప్రతి కుటుంబం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర హోంశాఖ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ జనాభా లెక్కల రెండో దశ కోసం 40 ప్రశ్నల జాబితాను నోటిఫై చేసింది. వీటి సరళి దేశ సామాజిక, ఆర్థిక స్థితిగతులను విశ్లేషించడంలో కీలక పాత్ర పోషించనుంది.ఈ సారి జనాభా గణనలో వ్యక్తుల ప్రాథమిక వివరాలు, విద్యా సంబంధిత విషయాలు, ఉపాధి మార్గాలు, వలసల కారణాలతో పాటు డిజిటల్ పురోగతిని ప్రతిబింబించే ప్రశ్నలను పొందుపరిచారు. ఆ ప్రశ్నల సరళి కింది విధంగా ఉంది.1. వ్యక్తి పేరు2. కుటుంబ యజమానితో ఉన్న సంబంధం3. జండర్(లింగం)4. పుట్టిన తేదీ, వయసు5. ప్రస్తుత వైవాహిక స్థితి6. వివాహ సమయానికి వయసు (పూర్తయిన ఏళ్లలో)7. జీవిత భాగస్వామి పేరు8. జాతీయత9. మతం10. ఎస్సీ / ఎస్టీ / కులం11. తండ్రి వివరాలు12. తల్లి వివరాలు13. దివ్యాంగులైతే వివరాలు14. మాతృభాష, తెలిసిన ఇతర భాషలు15. అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత16. ఏదైనా విద్యాసంస్థలో ప్రస్తుతం హాజరవుతున్నారా?17. అభ్యసించిన అత్యున్నత విద్య, విద్యా విభాగం (స్టీమ్/డిసిప్లిన్)18. గత ఏడాదిలో ఏ సమయంలోనైనా పనిచేశారా?19. ఆర్థిక కార్యకలాపాలు ఎలా ఉన్నాయి?20. వృత్తి21. పరిశ్రమ, వ్యాపారం లేదా సర్వీస్22. కార్మిక వర్గం23. నాన్-ఎకనామిక్ యాక్టివిటీ 24. ఏదైనా పని కోసం చూస్తున్నారా?25. పని ప్రదేశానికి వేరే ప్రాంతం నుంచి వచ్చారా?26. జన్మస్థలం27. చివరి నివాస ప్రాంతం28. వలసకు గల కారణం29. ఎప్పటి నుంచి ఈ వలస ప్రాంతంలో పని చేస్తున్నారు?30. శాశ్వత నివాస చిరునామా31. ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత, విడాకులు పొందిన, విడిపోయిన మహిళలకు)32. ఇప్పటివరకు జన్మించిన మొత్తం పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత, విడాకులు పొందిన, విడిపోయిన మహిళలకు)33. గత ఏడాదిలో జన్మించిన పిల్లల సంఖ్య34. కొవిడ్-19 వ్యాక్సినేషన్ పొందిన ప్రదేశం35. మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య36. మొబైల్ నంబర్ 37. ఆధార్ సంఖ్య 38. ఓటర్ ఐడీ నంబర్ 39. పాస్పోర్ట్ నంబర్ (భారతీయ పాస్పోర్ట్ ఉంటే)40. డ్రైవింగ్ లైసెన్స్ (లభ్యత ఉంటే)ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
రూ.1లక్ష పెట్టారు.. రూ.4.44 లక్షల లాభం పట్టారు!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) 2019-20 సీరీస్-3 ప్రీమెచ్యుర్ రిడెప్షన్(ముందస్తు విరమణ) పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించింది. ఈ సిరీస్ బాండ్లను ముందస్తుగా రీడీమ్ చేసుకునేందుకు ఆర్బీఐ రూ.15,310 ధరను ఖరారు చేసింది. దీనితో డిజిటల్ పద్ధతిలో దరఖాస్తు చేసిన మదుపరులకు ఏకంగా 344 శాతం (సుమారు 343.9%) అసాధారణ రాబడి లభించింది.పెట్టుబడి నాలుగు రెట్లకు పైగా పెరుగుదల2019 ఆగస్టు 14న ఈ సిరీస్ బాండ్లను ప్రభుత్వం విడుదల చేసింది. అప్పట్లో గ్రాము ధర రూ.3,499గా ఉండగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి రూ.50 డిస్కౌంట్తో రూ.3,449కి ఆఫర్ చేసింది. నియమాల ప్రకారం ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ముందస్తు ఎగ్జిట్ ఆప్షన్ లభిస్తుంది. ప్రస్తుతం ఆర్బీఐ నిర్ణయించిన రూ.15,310 రీడెంప్షన్ ధరతో బాండ్ విలువ నాలుగు రెట్లకు పైగా పెరిగింది.ఉదాహరణకు, 2019లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన మదుపరి బాండ్ విలువ ప్రస్తుతం రూ.4.44 లక్షలకు చేరుకుంది. అంటే కేవలం ధర పెరుగుదల రూపంలోనే రూ.3.44 లక్షల నికర లాభం సమకూరింది. దీని వార్షిక రాబడి రేటు దాదాపు 23.7 శాతంగా నమోదైంది.అదనపు వడ్డీ ప్రయోజనంపసిడి ధరల పెరుగుదల ద్వారా వచ్చిన మూలధన లాభంతో పాటు ఈ బాండ్లపై ఏడాదికి 2.5 శాతం స్థిర వడ్డీని పెట్టుబడిదారులు అర్ధవార్షికంగా పొందుతూ వచ్చారు. ఫిజికల్ గోల్డ్తో పోలిస్తే ఎస్జీబీల్లో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ, భద్రతా వ్యయాల భారం లేకపోవడమే కాకుండా వడ్డీ ఆదాయం కూడా దక్కడం విశేషం.ధర నిర్ణయం ఎలా జరిగిందంటే?ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించే 999 స్వచ్ఛత కలిగిన బంగారం చివరి మూడు పనిదినాల సరళ సగటు ధర ఆధారంగా ఆర్బీఐ ఈ రీడెంప్షన్ ధరను ఖరారు చేస్తుంది. ఆగస్టు 11, 12, 13 తేదీల ముగింపు ధరల ఆధారంగా ఈ ఆకర్షణీయమైన రూ.15,310 ధర నిర్ణయించారు. ధీర్ఘకాలిక భద్రతతో పాటు అత్యధిక రాబడులు అందించేందుకు ఎస్జీబీలు సరైన వేదికని ఈ సీరీస్ నిరూపించింది.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
రిఫైనరీలకు ఎల్పీజీ ఉత్పాదక లక్ష్యాలు
దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరత తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉండే ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన 21 రిఫైనరీలు, అప్స్ట్రీమ్ కంపెనీలకు గరిష్ఠ ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమాసియా సంక్షోభం, హార్మూజ్ జలసంధి గుండా సరఫరా అంతరాయాల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేశీయంగా అత్యవసర సరఫరా బఫర్ను సిద్ధం చేసేందుకు ఈ నిర్ణయం తోడ్పడనుంది.అన్ని రిఫైనరీలు, అప్స్ట్రీమ్ ప్రాసెసర్ల సంయుక్త ఉత్పాదక సామర్థ్యాన్ని రోజుకు 63,810 టన్నులుగా నిర్దేశించారు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సర దేశీయ ఉత్పత్తి కంటే రెట్టింపు మాత్రమే కాకుండా, దేశ మొత్తం రోజువారీ ఎల్పీజీ వినియోగంలో (సుమారు 91,000 టన్నులు) దాదాపు 70 శాతానికి సమానం.రిలయన్స్కు సింహభాగంగుజరాత్లోని జామ్నగర్లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ పాత రిఫైనరీకి రోజుకు అత్యధికంగా 18,000 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాన్ని కేటాయించారు. 18 ప్రభుత్వ రంగ రిఫైనరీలకు కలిపి రోజుకు 31,470 టన్నులు, నయారా ఎనర్జీ వాదినార్ రిఫైనరీకి రోజుకు 4,480 టన్నులు, ఓఎన్జీసీ, గెయిల్ వంటి అప్స్ట్రీమ్ సంస్థలకు రోజుకు 6,460 టన్నులు ఉత్పత్తి లక్ష్యం ఇచ్చారు. ఈ ఉత్పత్తి షెడ్యూల్ను ఏటా జనవరి 1, జులై 1 తేదీల్లో ఏడాదిన రెండుసార్లు సమీక్షిస్తారు.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
ఫ్యామిలీ
గర్భందాల్చిన తొలిరోజుల్లో జాగ్రత్తగా లేకుంటే ముప్పు తప్పదా?
మహిళలు గర్భందాల్చిన తొలిరోజుల్లో వారు తమ పనితీరులో భాగంగా తరచూ ముందుకు వంగడం, ఎక్కువసేపు నిలబడి పనిచేయాల్సి రావడంతోపాటు ఎక్కువసేపు నడక వంటి పనులతో గర్భస్రావాల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక డానిష్ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయన ఫలితాలు ‘ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్మెంట్ మెడిసిన్’అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఉద్యోగంలో లేదా తమ విధుల్లో భాగంగా మహిళలు చేసే శారీరక శ్రమ వారి గర్భధారణ/గర్భస్రావాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనే విషయాలపై చేసిన అధ్యయనంలో భాగంగా డెన్మార్క్కు చెందిన అధ్యయనవేత్తలు సుమారు 4.75 లక్షల మంది ఉద్యోగినుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. ఉద్యోగంలో భాగంగా ఎక్కువసేపు నిలబడటం, నడవడం, ముందుకు వంగి పనిచేయడం వంటి అంశాలు గర్భస్రావం ముప్పును పెంచినట్లుగా ఈ విశ్లేషణలో తేలింది. నిలబడి పనిచేయడం వల్ల మాత్రం ఈ ముప్పు చాలా స్వల్పంగా పెరిగినట్లు తేలింది. (చదవండి: రోజూ ఓ మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకుంటే..?)
అర్జున్ ఇన్ అండర్ గ్రౌండ్..!
‘ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్ (అజ్ఞాతం)లోకి వెళ్లాడు’ అంటూ ఉంటారు. అర్జున్ మాత్రం... అందరికీ కనిపిస్తూనే అండర్గ్రౌండ్లో ఉంటున్నాడు. అర్థం కాలేదా! ఇప్పుడు టాపిక్లోకి వద్దాం...మధ్యప్రదేశ్లోని ఝుబువాకు చెందిన అర్జున్ ఇంటిపై అలిగి బయటికి వచ్చాడు. ఇది విశేషమేమీ కాదు. అసలు సిసలు విశేషం... భూగర్భ గృహాన్ని నిర్మించుకోవడం. తన వెరైటీ ఇంటి విషయాల గురించి ఎప్పటికప్పుడు అర్జున్ షేర్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ఇంతకీ ఆ భూగర్భగృహం ఎలా ఉంటుంది?భూమి అడుగున నిర్మించిన చిన్నటి ఆవాసంలో మట్టితో చేసిన వేదిక ఉంది. దీనిపై చాప, దుప్పటి పరిచి పడుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నాడు. లోపల చేతితో చెక్కిన అరలు, వండుకోవడానికి చిన్న పొయ్యి ఉన్నాయి. పైకప్పుపై ఉండే టార్పాలిన్ వర్షం నుంచి రక్షణగా పనిచేస్తుంది.అలా అని సమస్యలు లేవని కాదు. ఒక వర్షానికి పై కప్పు పై కప్పిన టార్పాలిన్ చిరిగిపోయింది. వర్షం నీళ్లు ఇంట్లోకి రావడంతో అర్జున్ ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా ‘డోన్ట్ కేర్’ అంటున్నాడు. ఈ భూగర్భగృహం పుణ్యమా అని సదరు అర్జున్ సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యాడు! View this post on Instagram A post shared by Reel Pe Seal 🇮🇳 (@reelpesealofficial) (చదవండి: రోజూ ఓ మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకుంటే..?)
రోజూ ఓ మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకుంటే..?
ప్రతిరోజూ ఓ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవడం వృద్ధాప్యాన్ని కాస్తంత ఆలస్యం చేస్తుందని హార్వర్డ్ పరిశోధకులు నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి. మన దేహం తాలూకు వయసు (బయలాజికల్ ఏజ్), మన క్యాలెండర్ వయస్సు కంటే కాస్త వేరుగా ఉండవచ్చు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తికి 70 ఏళ్లు అనుకుందాం. అయితే అతని శరీరంలోని కణాలు అంతకంటే తక్కువ వయసున్నవిగా లేదా ఎక్కువ వయసున్నవిగా ప్రవర్తించవచ్చు. శరీరం ఎంత వేగంగా వృద్ధాప్యానికి దగ్గరవుతోందో అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు ఎపిజెనెటిక్ క్లాక్స్ అనే పద్ధతులను ఉపయోగిస్తారు. ఇవి కాలక్రమేణా డీఎన్ఏలో చోటుచేసుకునే చిన్న చిన్న మార్పులను పరిశీలిస్తాయి. ముఖ్యంగా, జన్యువులు ఎలా పనిచేయాలో నియంత్రించే ఈ డీఎన్ఏలోని కొన్ని ప్రాంతాల్లో జరిగే డీఎన్ఏ మిథిలేషన్ మార్పులను ఇవి కొలుస్తాయి. అంతేకాదు, ఒక వ్యక్తి ఎంత వేగంగా వృద్ధాప్యానికి లోనవుతున్నాడో, అలాగే మరణానికి చేరువయ్యే ముప్పు ఎంత ఉందో అంచనా వేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఈ అధ్యయనంలో మల్టీవిటమిన్ తీసుకున్నవారిలో వృద్ధాప్య ప్రక్రియ కొంత నెమ్మదించినట్లు కనిపించింది. మొత్తంగా చూస్తే, రెండేళ్ల కాలం పాటు మల్టీవిటమిన్ తీసుకున్నవారిలో వారి అసలు వయసు కంటే వారి బయాలజికల్ వయసు నాలుగు నెలల మేర తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధనల ఫలితాలు ‘నేచర్ మెడిసిన్’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ఆధారంగా ఎవరికి వారు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవడమూ అంత సరికాదు. తమ డాక్టర్ను సంప్రదించాకే దీనిపై నిర్ణయం తీసుకోవడం మంచిందంటున్నారు నిపుణులు. యాసిన్(చదవండి: ఎర్రమట్టితో ముఖానికి మెరుపు..!)
సర్వర్ సైలెంటైతే... పంటనష్టం వయొలెంట్!
ఆహార భద్రత అంటే పొలాల్లో పంటలు బాగా పండటం, పశువులు ఆరోగ్యంగా పెరగడం. అంతే కదా! ఇక సూపర్ మార్కెట్లకు వెళ్లినప్పుడు అక్కడ వరుసగా సర్ది ఉన్న తాజా పండ్లు, కూరగాయలు, నాణ్యమైన ధాన్యాలను చూసినప్పుడు మన ఆహార సరఫరా వ్యవస్థలు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయో అని కూడా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇప్పుడంతా డిజిటల్ అయిపోయాక.. ఈ సమృద్ధి, సరఫరాల వెనుక ఒక ప్రమాదం పొంచి ఉండటం కూడా కనిపిస్తుంది. అదే.. ‘డేటాబేస్ వైఫల్యం’! కంప్యూటర్ చెప్పినట్లుగా డేటాబేస్ ‘రైట్, రైట్’ అని అనకపోతే.. పండ్లు, కాయగూరలు, ఇతర ఆహార పదార్థాల లోడ్తో ఉన్న ట్రక్కులు ఎన్నాళ్లయినా ఎక్కడివక్కడే ఉండిపోతాయి! కదలటం ఆలస్యం అయ్యే కొద్దీ ట్రక్కులోని ఆహార, పంట పదార్థాలు పాడైపోతాయి.మన ఆహార సరఫరా వ్యవస్థలు పైకి ఎంత స్థిరంగా, ఆధునికంగా కనిపిస్తాయో... లోపల అంతకంటే ఎక్కువగా డిజిటల్ సిస్టమ్లు, సాఫ్ట్వేర్లు, కంప్యూటర్ నెట్వర్క్ల పైన ఆధారపడి ఉంటున్నాయి. ఈ డిజిటల్ సదుపాయాలలో ఒక చిన్న సాఫ్ట్వేర్ లోపం వచ్చినా లేదా సైబర్ దాడి జరిగినా, లారీలకు లారీల ఆహారం మన కళ్లముందే కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.ఈ దృశ్యాన్ని ఊహించుకోండిగోదాముల్లో టన్నుల కొద్దీ బియ్యం, చికెన్, తాజా పండ్లు సిద్ధంగా ఉన్నాయి. బయట లారీలు హార్న్ కొడుతూ రవాణాకు రెడీగా ఉన్నాయి. డ్రైవర్లు స్టీరింగ్ మీద చేతులు వేసి ‘ఎప్పుడు బయలుదేరాలి?’ అని వేచి చూస్తున్నారు. కానీ, లోపల డిజిటల్ సిస్టంలో పని నడవటం లేదు. అది నడిస్తేనే లారీ ముందుకు కదిలేందుకు అనుమతి లభిస్తుంది. సరకు రవాణా పత్రాలు ఎంతకూ రావు. ఆ పత్రాలు ఇవ్వవలసిన కంప్యూటర్.. ‘‘నా డేటాబేస్లో ఈ షిప్మెంట్కు ఇంకా ఆమోదం రాలేదు, కాబట్టి రవాణా పత్రాలను ఇవ్వలేను’’ అని సైలెంట్ అయిపోతుంది. అలా, ప్రజా పంపిణీకి వెళ్లవలసిన ఆహారం... కంప్యూటర్ పచ్చజెండా ఊపకపోవటం వల్ల – ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా ఎక్కడిదక్కడే నిలబడిపోతుంది. ఎందుకంటే, ఈ రోజుల్లో ఏదైనా ఒక కంటెయినర్ ఒక చోటు నుండి మరో చోటికి వెళ్లాలన్నా, అందులోని సరకు పంపిణీ కావాలన్నా లేదా ఇన్సూరెన్స్ పరిధిలోకి రావాలన్నా... అది తప్పనిసరిగా డిజిటల్ ప్లాట్ఫామ్లు, ఆటోమేటిక్ కంప్యూటర్ వ్యవస్థల ద్వారా ‘ధ్రువీకరణ’ పొంది ఉండాలి.డిజిటల్ సిస్టమ్ ధ్రువీకరించకుంటే..?ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఆహారం ఎంత నాణ్యమైనదైనా, డిజిటల్ రికార్డుల్లో ఆ నాణ్యత నమోదు కాకపోతే దానిని సూపర్ మార్కెట్లు అంగీకరించవు. చట్టబద్ధమైన పంపిణీ అయినా సరే నిలిచిపోతుంది. సరైన సమయంలో గోదాముల నుండి బయటకు రాని పండ్లు, మాంసం, పాల వంటి తక్కువ కాలపరిమితి గల ఆహార పదార్థాలు గంటల వ్యవధిలోనే పాడైపోతాయి. ఇక చివరి నిమిషంలో సరఫరా చేసే ఆధునిక పద్ధతుల్లో ఒక్క చోట సిస్టమ్ ఆగిపోయినా, మొత్తం నెట్వర్క్ స్తంభించిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. డిజిటల్ వ్యవస్థల కంటికి ‘కనపడని‘ (గుర్తింపు పొందని) ఆహారం ఎంత ఉన్నా, అది నిరుపయోగంగానే మిగిలిపోతుంది.ప్రధానమైన ముప్పులునేడు వ్యవసాయం నుండి ఆహార పంపిణీ వరకు ప్రతి దశలోనూ కీలక నిర్ణయాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేటెడ్ డిజిటల్ సిస్టమ్లే నిర్దేశిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎంత ఆహారానికి డిమాండ్ ఉందో లెక్కిస్తున్నాయి. పంటలను ఎప్పుడు వేయాలో, ఎప్పుడు కోత కోయాలో మార్గనిర్దేశం చేస్తున్నాయి. గోదాముల్లో ఎంత సరుకు ఉంది, ఎప్పుడు పంపాలి అనే రవాణా ప్రాధాన్యాలను నిర్ణయిస్తున్నాయి. ఇలా, అత్యంత వేగంగా పనులు జరగడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి కంపెనీలు ఏఐ పైన ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కానీ ఇందులో రెండు ప్రధాన ముప్పులు ఉన్నాయి. ఒకటి : మనుషులు తమ నిర్ణయాధికారం కోల్పోతారు. ఆహార పంపిణీకి సంబంధించిన కీలక నిర్ణయాలను సాఫ్ట్వేర్ ఏ ప్రాతిపదికన తీసుకుందో మనుషులు సులభంగా అర్థం చేసుకోలేరు, ప్రశ్నించలేరు. రెండవది : సైబర్ దాడుల భయం. శత్రుదేశాలు లేదా హ్యాకర్లు మన డిజిటల్ ఫుడ్ నెట్వర్క్లపై సైబర్ దాడులు జరిపితే, దేశం మొత్తం ఆహార కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది.అత్యవసర సమయాలుసాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ఈ డిజిటల్ విప్లవంలో అతిపెద్ద లోపం– మానవ వనరులను పక్కన పెట్టటం. కంప్యూటర్లతో కాకుండా మనుషులతో పని చేయించటం అనేది అనవసరమైన ఖర్చుతో కూడుకున్నదని భావించి, కంపెనీలు పాత పద్ధతులను పూర్తిగా రద్దు చేస్తున్నాయి. అత్యవసర సమయాల్లో కంప్యూటర్ సిస్టమ్తో పనిలేకుండా చేసి, చేతితో రికార్డులు రాసి పనులు జరిపేలా సిబ్బందికి ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదు. ఈ కారణంగా అత్యవసర సమయంలో తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయి. ఆహారాన్ని గోదాము నుండి బయటకు పంపే రిలీజ్ కోడ్లు నిలిచిపోతాయి. ముందే చెప్పినట్లు... డ్రైవర్లు లారీలతో సిద్ధంగా ఉన్నా, ఆమోదముద్ర లేక వేచి చూడక తప్పదు. గోదాములో టన్నుల కొద్దీ ఆహారం ఉన్నా, సర్వర్లలో సరుకు ‘సున్నా’ అని చూపించవచ్చు. కొన్ని పరిశోధనల నివేదికల ప్రకారం, సిస్టమ్ నిలిచిపోయిన 72 గంటల (3 రోజుల) తర్వాత తప్పనిసరిగా మనుషులు జోక్యం చేసుకుని కాగితాల ద్వారా రవాణా ప్రారంభించాలి. కానీ, ప్రస్తుత సిబ్బందికి కాగితపు పద్ధతులపై కనీస అవగాహన కూడా ఉండటం లేదు!నియంత్రణ ఎవరి చేతిలో ఉండాలి?కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఆహార రంగానికి కచ్చితమైన వ్యవసాయ సమాచారం అందుతుంది. ఎప్పుడు నీళ్లు పెట్టాలి, ఎప్పుడు ఎరువులు వేయాలి? అనే వివరాలు తెలుసుకుని దిగుబడిని పెంచుకోవడం మంచిదే. అయితే సమస్యల్లా సాంకేతికతను వాడటంలో లేదు... ఆ సాంకేతికతను ఎవరు నియంత్రిస్తున్నారు? అత్యవసరంలో స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? అనే దానిలోనే ఉంది. అందుకు కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆహార వ్యవస్థల్లో ప్రతి దశలోనూ మనుషుల పర్యవేక్షణ ఉండాలి. సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు పాత పద్ధతుల్లో పనులు నిర్వహించేలా సిబ్బందికి నిరంతరం మాక్ డ్రిల్స్, శిక్షణ ఇస్తుండాలి. ఆహార పంపిణీకి వాడే సాఫ్ట్వేర్ కోడ్లను, ఆల్గారిథమ్లను ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు ఆడిట్ చేసేలా పారదర్శకత ఉండాలి. కంపెనీల వ్యాపార రహస్యాల కంటే ప్రజల ఆహార భద్రతే ముఖ్యం. రైతులు, స్థానిక ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తి డేటాపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి.సేవకులే కాదు, యజమానులు కూడా!సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి గొప్ప సేవకులు. కానీ అత్యంత ప్రమాదకరమైన యజమానులు కూడా! మనం వేగం, డబ్బు ఆదా చేసుకోవడానికి డిజిటల్ సిస్టమ్లపై ఆధారపడటంలో తప్పులేదు. కానీ, మన కడుపు నింపే ఆహారాన్ని బతికించేది నేల, రైతు, మనిషి శ్రమ మాత్రమే తప్ప ఒక కంప్యూటర్ కోడ్ కాదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.అసలు ప్రశ్న ‘కంప్యూటర్లు లేదా డిజిటల్ వ్యవస్థలు విఫలమవుతాయా లేదా?’ అనేది కాదు... ‘ఒకవేళ కంప్యూటర్ వ్యవస్థలు విఫలమైనా తట్టుకుని నిలబడి, ప్రజలకు ఆహారాన్ని అందించే ప్రత్యామ్నాయ ప్రణాళికలు మన దగ్గర ఉన్నాయా లేదా?’ అన్నదే. సాంకేతికత సమస్య వచ్చినప్పుడు కంప్యూటర్ ‘సిస్టమ్ డౌన్’ అనవచ్చు. కానీ, మానవత్వంతో కడుపు నింపే వ్యవస్థలు ఎప్పటికీ డౌన్ కాకూడదు. – సాక్షి స్పెషల్ డెస్క్నిజంగా జరిగిన రెండు ఘటనలుసైబర్ దాడులు, డేటాబేస్ వైఫల్యం వంటివి భవిష్యత్తులో ఎప్పుడో రాగల అవకాశం ఉన్న ఊహాజనిత ప్రమాదాలైతే కాదు. ఇప్పటికే ప్రపంచంలో పలుచోట్ల సంభవించిన నిజమైన సంఘటనలు కొన్ని, హెచ్చరికలుగా మన కళ్ల ముందే ఉన్నాయి.జేబీఎస్ ఫుడ్స్పై దాడి (2021)బ్రెజిల్లో ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం ప్రాసెసింగ్ కంపెనీ అయిన జేబీఎస్ ఫుడ్స్పై హ్యాకర్లు సైబర్ దాడి చేశారు. పశువులు, పనిచేసే సిబ్బంది, గోదాములు అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ... కంప్యూటర్ సిస్టమ్లు హ్యాక్ అవ్వడం వల్ల ఆస్ట్రేలియా, అమెరికాలోని ప్లాంట్లు పూర్తిగా మూతపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు సిస్టమ్ను పక్కనపెట్టి సొంతంగా పని చేయడానికి ప్రయత్నించినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల భారీగా ఆహారం వృథా అయ్యింది. ఇటీవల యూకేలోని ప్రధాన సూపర్ మార్కెట్ నెట్వర్క్లకు సరుకు అందించే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సాఫ్ట్వేర్ సమస్య తలెత్తటం వల్ల, షెల్ఫ్లు ఖాళీగా మారిపోయాయి. ఆహారం దగ్గరలోని గోదాముల్లోనే ఉన్నప్పటికీ, డెలివరీ కోడ్లు జనరేట్ కాకపోవడం వల్ల ప్రజలకు ఆహారం అందలేదు.
అంతర్జాతీయం
జీవితాంతం జిమ్, స్కూల్కు వెళ్లొద్దు.. చిత్రహింసలు అనుభవించొచ్చు..
అఫ్గానిస్థాన్లో 2021 ఆగస్టు 15న తాలిబాన్ అధికారాన్ని పూర్తిగా చేజిక్కించుకుంది. అమెరికా, నాటో దళాల ఉపసంహరణ తర్వాత కాబూల్ తాలిబాన్ అధీనంలోకి వెళ్లింది. తాలిబాన్ అధికారంలోకి వచ్చి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తాలిబాన్ కాబూల్లో భారీ స్థాయిలో విజయోత్సవాలు నిర్వహించింది.అంతర్జాతీయా మీడియా కథనాల ప్రకారం.. తాలిబాన్ తన పాలనలో యుద్ధం, అస్థిరత తగ్గి దేశంలో భద్రత పెరిగిందని చెబుతోంది. ప్రస్తుతం తాలిబాన్ అఫ్గానిస్థాన్ మొత్తం భూభాగంపై నియంత్రణ కలిగి ఉంది. ఇస్లామిక్ స్టేట్-ఖొరాసాన్ వంటి సాయుధ ముప్పులను తాలిబాన్ బాగా బలహీనపరిచింది.ఐదేళ్లలో ఏం సాధించింది? ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ, 2021లో విదేశీ సహాయం భారీగా తగ్గిన తర్వాత కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా తాలిబాన్ నిలబెట్టింది. పన్నులు, సుంకాల వసూళ్లు పెరగడం, విదేశాల్లో ఉన్న అఫ్గాన్ల నుంచి వచ్చే డబ్బు, పొరుగు దేశాలతో వాణిజ్యం ఆర్థిక వ్యవస్థకు కొంత ఊతమిచ్చాయి. ఖోష్ తేపా కాలువ, టీఏపీఐ గ్యాస్ పైప్లైన్, విద్యుత్ ప్రసార మార్గాలు, రహదారులు వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులపై తాలిబాన్ దృష్టి పెట్టింది. అయితే ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లోపించింది. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడంలో తాలిబాన్ విఫలమైంది.మహిళలను మనుషుల్లా చూడట్లేదు..తాలిబాన్ పాలనలో అతిపెద్ద వైఫల్యం మహిళలు, బాలికలపై విధించిన ఆంక్షలు. బాలికలు 6వ తరగతి తర్వాత అధికారిక విద్య కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. యునెస్కో ప్రకారం ప్రస్తుతం సుమారు 2.4 మిలియన్ అఫ్గాన్ బాలికలు మాధ్యమిక విద్యకు దూరమయ్యారు. మహిళలకు విశ్వవిద్యాలయ విద్య కూడా నిషేధించారు. దీంతో అఫ్గానిస్థాన్ మహిళల ఉన్నత విద్యపై అధికారిక నిషేధం ఉన్న ప్రపంచంలోని ఏకైక దేశంగా నిలిచింది.తాలిబాన్ అధికారంలోకి రాకముందు 2021 నాటికి దాదాపు 10 లక్షల బాలికలు మాధ్యమిక పాఠశాలల్లో చదువుతున్నారు. ఆ విద్యా పురోగతి ఇప్పుడు తీవ్రంగా వెనక్కి వెళ్లింది. మహిళలపై విద్యా ఆంక్షల ప్రభావంతో మహిళా ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, మంత్రసానుల కొరత పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. మహిళలకు విద్య లేకపోవడం వల్ల భవిష్యత్తులో అవసరమైన మహిళా వైద్య నిపుణులను తయారు చేయడమే కష్టమవుతోంది. మహిళలను ఉద్యోగాలు, ప్రజా జీవితం, క్రీడలు, ఉద్యానవనాలు, వ్యాయామశాలలు వంటి అనేక రంగాల నుంచి దూరం చేశారు.చిత్రహింసలు, అక్రమ హత్యలు మహిళలు దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే పురుష సంరక్షకుడు వెంట ఉండాలనే ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ బెన్నెట్ ప్రకారం, అఫ్గానిస్థాన్లో పరిస్థితి తీవ్రమైన మానవ హక్కుల సంక్షోభంగా మారింది. మహిళలపై జరుగుతున్న వ్యవస్థీకృత వివక్షను బెన్నెట్ మానవత్వానికి వ్యతిరేకమైన లింగ ఆధారిత హింసగా అభివర్ణించారు. మహిళల సమస్యలకే పరిమితం కాకుండా ఏకపక్ష అరెస్టులు, చిత్రహింసలు, అక్రమ హత్యలు, బలవంతపు అదృశ్యాలు, భావప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు, జర్నలిస్టులపై దాడులు కొనసాగుతున్నాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మత, జాతి మైనారిటీలపై వివక్ష, పౌర సమాజం పనిచేసే స్థలం తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా కొనసాగుతున్నాయి.తాలిబాన్ అంతర్జాతీయ గుర్తింపు సాధించడంలో ఆశించినంతగా విజయవంతం కాలేదు. రష్యా మాత్రమే తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది. ఇతర దేశాలు మాత్రం వివిధ స్థాయుల్లో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. తాలిబాన్ అధికారాన్ని గట్టిగా నిలబెట్టుకున్నప్పటికీ ప్రజల్లో అసంతృప్తి నెమ్మదిగా పెరుగుతోంది. ప్రస్తుత స్థిరత్వాన్ని శాశ్వత రాజకీయ పరిష్కారంగా భావించలేమని, మహిళల హక్కులు, అంతర్జాతీయ ఒంటరితనం, ప్రజల అసంతృప్తి భవిష్యత్తులో తాలిబాన్కు పెద్ద సవాళ్లుగా మారవచ్చని విశ్లేషించింది.మొత్తంగా 5 ఏళ్ల తాలిబాన్ పాలనలో భద్రత, భూభాగంపై పూర్తి నియంత్రణ, కొన్ని మౌలిక వసతులు సాధించిన విజయాలుగా చెప్పుకోవచ్చు. కానీ బాలికల విద్య, మహిళల హక్కులు, సమగ్ర పాలన, అంతర్జాతీయ గుర్తింపు, ప్రజల స్వేచ్ఛ విషయంలో తీవ్ర వైఫల్యాలు కనిపిస్తున్నాయి.
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
బెర్లిన్: సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడవద్దని డాక్టర్లు హెచ్చరికలు జారీ చేసిన మనం లెక్కచేయం.. ఏమవుతుందిలే అని నేరుగా గ్రహణాన్ని చూస్తుంటాం తాజా ఇలాంటి నిర్లక్షం వందల మందిని ఆసుపత్రి పాలు చేసింది. ఐరోపాలో ఇటీవల వచ్చిన సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం ద్వారా పెద్ద సంఖ్యలో జనం ఆసుపత్రికి క్యూ కట్టాల్సి వచ్చింది. అయితే వారికి పెద్ద ప్రమాదమేది లేదని డాకర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఇటీవలే ఆగస్టు 12 న ఐరోపా ఖండంలో లో సూర్యగ్రహణం సంభవించింది. దీంతో అక్కడి స్థానిక ప్రభుత్వాలు సూర్యగ్రహాణాన్ని నేరుగా చూడవద్దంటూ సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ (రక్షణ కళ్లద్దాలు) ధరించే దానిని వీక్షించాలని ఆదేశాలు జారీ చేశాయి. అయితే కొంతమంది ప్రజలు అత్యుత్సాహం, నిర్లక్షంతో నేరుగా సూర్యగ్రహణాన్ని చూశారు. దీంతోవారు తీవ్రమైన కంటి సమస్యలతో ఆసుపత్రులపాలయ్యారు.బాధితులు ప్రధానంగా కళ్లలో మంట, దృష్టి లోపాలు, కంటి చూపు మందగించడం, తలనొప్పి మరియు కళ్లు తిరగడం వంటి సమస్యలతో బాధపడుతూ పెద్దఎత్తున ప్రజలు అత్యవసర చికిత్స కోసం వచ్చారని వైద్య సిబ్బంది తెలిపారు. ఐరోపావ్యాప్తంగా వందల సంఖ్యలో ఇటువంటి కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. జర్మనీ బెర్లిన్ బెర్లిన్ నగరంలోని ప్రముఖ ఆసుపత్రులైన చారిటే, వివాంటెస్ వంటి వైద్య కేంద్రాల అత్యవసర విభాగాలకు బాధితులు వరుసకట్టారని అక్కడి వైద్యులు తెలిపారు. అయితే వారిలో చాలా మందికి తాత్కాలిక సమస్యలేనని తీవ్రమైన సమస్యలు ఏవరికి లేవని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు ముందస్తు ప్రభుత్వ హెచ్చరికల కారణంగా మెజారిటీ ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడంతో బాధితుల సంఖ్య పరిమితంగానే ఉండిపోయింది. అయినప్పటికీ, సరైన సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ ధరించకుండా సూర్యుడిని నేరుగా చూడటం వల్ల కంటిలోని రెటీనా తీవ్రంగా దెబ్బతింటుందని, దీనివల్ల తాత్కాలికంగా లేదా శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఖగోళ అద్భుతాలను వీక్షించే సమయంలో ప్రజలు తప్పనిసరిగా సర్టిఫైడ్ సోలార్ సేఫ్టీ గ్లాసెస్ లేదా ప్రత్యేక టెలిస్కోపిక్ ఫిల్టర్లను మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
‘మరీ ఇలా ఉన్నారేంటి!’.. ఇజ్రాయెల్ సెటిలర్ల దుశ్చర్య
ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదం కేవలం భూమి, సరిహద్దులకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు నీటి వనరులపై ఆధిపత్య పోరు కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. సహజ ఊటలను ఇజ్రాయెలీ సెటిలర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరా నిలిచిపోవడంతో తమ వ్యవసాయం, జీవనాధారం దెబ్బతింటోందని కన్నీరు పెడుతున్నారు. అయితే మరో వాదనతో ఇజ్రాయెలీ వర్గాలు తమ చర్యలను సమర్థించుకుంటున్నాయి.జోర్డాన్ లోయలోని ఫసాయిల్ గ్రామం ఈ వివాదానికి కేంద్రంగా మారింది. తరతరాలుగా స్థానిక రైతులకు ఆధారంగా ఉన్న ఓ సహజ ఊట నీటిని ఇజ్రాయెల్ సెటిలర్లు మళ్లించుకున్నారు. ఆ సమీపంలోని ఓ పురాతన కొలనును నింపి.. ఈతలు కొడుతూ వినోదం పొందుతున్నారు. అదే సమయంలో కొందరు.. ఉత్త పుణ్యానికే ట్యాంకర్లలో ఊట నీటిని నింపి దారి పొడవునా పారబోసుకుంటూ పోవడం, నిర్జన ప్రదేశంలో వదిలేయడం లాంటి దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పాలస్తీనా రైతులు ఆందోళనకు గురవుతున్నారు.Israeli settler terrorists deliberately emptied Palestinian water tanks onto the ground in Ein al-Hilweh, in the northern Jordan Valley of the occupied West Bank.Palestinians in this herding community struggle every day for water after Israeli settlers seized their main spring… pic.twitter.com/EzRjMz621l— Ihab Hassan (@IhabHassane) August 10, 2026ఈ నీటితో గతంలో తమ పొలాల్లో వంకాయలు, సొరకాయలు, పుచ్చకాయలు వంటి పంటలు పండించేవారమని.. ఇప్పుడు సాగు నిలిచిపోయిందని వాపోతున్నారు. “నీరు లేకపోవడంతో మా పొలాలు ఎండిపోయాయి. కుటుంబాల జీవనోపాధి దెబ్బతింది” అని ఫసాయిల్కు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి పైపులను స్వాధీనం చేసుకున్నారని, ఊట వైపు వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.కొలనుగా మారిన ఊట.. పర్యాటక ప్రాంతమా?స్థానికులు చెబుతోంది ఏంటంటే.. ఊట నీటిని మళ్లించి పురాతన కొలనును నీటితో నింపారు. అనంతరం దానిని పర్యాటక ఆకర్షణగా ప్రచారం చేశారు. అయితే ఇజ్రాయెల్కు చెందిన కొందరు సెటిలర్లు మాత్రం మరోలా వాదిస్తున్నారు. ఈ ప్రాంతం తమ చారిత్రక వారసత్వంలో భాగమని చెబుతున్నారు. కానీ ఇందులో నిజమెంత? అనేదానిపై పురావస్తు నిపుణులు మరోలా స్పందించారు.Israeli "settlers" in the occupied West Bank diverted a spring that had long served as a lifeline for the Palestinian village of Fasayil, redirecting its water to fill a pool at an archaeological site and turning it into a tourist attraction.Palestinian farmers said the loss of…— Clash Report (@clashreport) August 14, 2026ఈ ప్రాంత చరిత్రపై పూర్తి స్పష్టత లేదని అంటున్నారు. దీంతో చరిత్ర, పురావస్తు అంశాలను ఉపయోగించి వెస్ట్ బ్యాంక్పై ఆధిపత్య భావనను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.‘ఇది నీటి యుద్ధం’.. పాలస్తీనా ఆరోపణపాలస్తీనా అధికారులు మాత్రం నీటి వనరుల నియంత్రణను పెద్ద సమస్యగా చూస్తున్నారు. నీటిని నిలిపివేయడం ద్వారా ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. “ఇది శబ్దం లేని బుల్లెట్లాంటి నీటి యుద్ధం” అని పాలస్తీనా వాటర్ అథారిటీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. వెస్ట్ బ్యాంక్లోని పలు నీటి, పారిశుద్ధ్య వనరులపై ఈ ఏడాది దాడులు జరిగినట్లు నమోదైంది. ముఖ్యంగా జోర్డాన్ లోయ ప్రాంతాల్లో నీటి వనరులపై నియంత్రణ కోసం ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అతిత్వరలో ఇది తాగునీటికి విస్తరించవచ్చనే ఆందోళన సైతం వ్యక్తమవుతోంది అక్కడ. గ్రామాలపై పెరుగుతున్న ఒత్తిడినీటి సమస్యతో పాటు సెటిలర్ల దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయని పాలస్తీనియన్లు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపివేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని చెప్పారు. మరోవైపు.. ఇజ్రాయెల్ సెటిలర్లు మాత్రం అవంతా ఆరోపణలనే అంటున్నారు. ఈ ప్రాంతాలు తమ చారిత్రక, మతపరమైన వారసత్వంతో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. పురాతన ప్రదేశాల అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహంలో భాగంగానే చర్యలు తీసుకుంటున్నట్లు సమర్థించుకుంటున్నారు.భవిష్యత్లో మరింత ఉద్రిక్తత?వెస్ట్ బ్యాంక్లో భూమి తర్వాత నీరు మరో ప్రధాన వివాద అంశంగా మారుతోంది. వ్యవసాయం, తాగునీరు, జీవనోపాధికి ఆధారమైన సహజ వనరులపై నియంత్రణ కోసం జరుగుతున్న పోరు భవిష్యత్లో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకే రోజు.. మూడు విపత్తులు.. చిగురుటాకులా వణికిన ఇండోనేషియా
అత్యంత శక్తివంతమైన భూకంపం ఇండోనేషియాను కుదిపేసింది. ప్రకంపనల ధాటికి భవనాలు పేకమేడల్లా ఒరిగిపోతూ నేల కూలాయి. అదే సమయంలో సముద్ర గర్భంలో అలజడి రేగడంతో సునామీ వస్తుందేమోనని వణికిపోయారు. మరోవైపు.. అగ్నిపర్వతం బద్దలు కావడం అలజడి రేపింది. ఫ్లోరెస్ దీవి, మరికొన్ని చోట్ల రికార్డైన భయానక దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వేకువ జామున 7.7 తీవ్రతతో వచ్చిన ప్రధాన భూకంపంతో ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ఆ తర్వాత వరుసగా ఆఫ్టర్షాక్స్ భయపెట్టాయి. 6.1, 5.9, 5.6 తీవ్రతలతో వరుస ప్రకంపనలు కొనసాగడంతో ఫ్లోరెస్ తీర ప్రజలు భయం భయంగా గడిపారు. ఎండె నగరానికి సమీపంలో భూకంప కేంద్రం నమోదు కాగా.. తూర్పు నుసా టెంగారా, పశ్చిమ నుసా టెంగారా, దక్షిణ సులవేసి ప్రాంతాల్లో సైతం జనాలు ప్రాణాలు అరచేత పట్టుకుని రోడ్ల మీదే గడిపారు. బలమైన ప్రకంపనలు పలు ప్రాంతాల్లో దాదాపు నిమిషం పాటు నమోదయ్యాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.🚨 The earthquake in Indonesia was magnitude 7.7. For many people, the early morning began with disaster. 🇮🇩#Indonesia #Earthquake #BreakingNews #EarthquakeAlert pic.twitter.com/c4edaQnCEh— Mahrosh Pervaiz (@MahroshPervaiz1) August 15, 2026#BREAKING : New Footage shows the Aftermath of Flores Indonesia Following 7.7m earthquake. 10 Dead & More than 1000 injured: Reports #Indonesia #Earthquake #BreakingNews #EarthquakeAlert #IndonesiaEarthquake #EarthquakeNews #NaturalDisaster https://t.co/2V8cg4oQ7m pic.twitter.com/NrAVUu5g5u— Indian Observer (@ag_Journalist) August 15, 2026🚨 7.7-MAGNITUDE EARTHQUAKE HITS INDONESIA 🇮🇩A powerful earthquake struck off the coast of Ternate, causing panic and evacuations. Authorities are assessing possible damage and casualties.#Indonesia #Earthquake #BreakingNews #Ternate pic.twitter.com/WdP3JgvAGF— Mahrosh Pervaiz (@MahroshPervaiz1) August 14, 2026🚨🇮🇩 BREAKING | 7.7-Magnitude Earthquake Hits IndonesiaA powerful 7.7-magnitude #earthquake struck off #Flores Island in eastern #Indonesia early Saturday, causing buildings to collapse and triggering widespread panic and evacuations. A #tsunami warning was issued but later… pic.twitter.com/OKTgVxpBaH— pradhyumn sharma (@pradhyu78651514) August 15, 2026కుప్పకూలిన భవనాలు.. వీధుల్లోకి పరుగులుభూకంపం తీవ్రతకు ఫ్లోరెస్ దీవిలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. మౌమెరే ప్రాంతంలోని పోర్టు టెర్మినల్ వెయిటింగ్ రూమ్ కూలిపోయింది. భవనాల శిథిలాలు పడుతుండటంతో ప్రజలు భయంతో పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. “భూకంపం చాలా తీవ్రంగా అనిపించింది. ఇంట్లో ఉన్న వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశాం” అని స్థానికులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు, గిడ్డంగులు, ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ఆసుపత్రుల్లో కలకలం.. బయటే చికిత్సప్రకంపనలతో ఆసుపత్రుల్లోనూ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోగులను భద్రత దృష్ట్యా బయటకు తరలించారు. బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను బయట ఏర్పాటు చేసి తాత్కాలిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు.సిక్కా ప్రాంతంలోని సెయింట్ పీటర్ మేజర్ సెమినరీలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో భవనం పైకప్పు కూలిపోయింది. అందులోని విద్యార్థులు, నన్స్ భయంతో పరుగులు తీశారు. పాస్టర్ ఒకరు రెండో అంతస్తు నుంచి దూకడంతో గాయపడ్డారు.సునామీ హెచ్చరిక.. ఎత్తివేతఫ్లోరెస్ సముద్ర గర్భంలో భూకంపం సంభవించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే కొన్ని గంటల తర్వాత హెచ్చరికను ఉపసంహరించారు.INDONESIA 🇮🇩 | #EARTHQUAKE 7.7 📹 IMAGES OF PANIC: Fear broke out near the coast of Ternate, and people had to be evacuated to safe areas. Authorities are assessing possible damage and casualties. There is a tsunami alert 🌊 pic.twitter.com/CSjsv5ckqW— Elizabeth J Trump (@eliza_Trump212) August 15, 2026మరింతగా మృతులు?ఈ ప్రకృతి విలయంలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. భవనాల శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి నష్టం అంచనా వేస్తున్నాయి. ప్రాణ నష్టంపై ఇప్పుడే అంచనాకు రావడం కష్టమని ఓ అధికారి అంటున్నారు. ఇక ఆస్తి నష్టం భారీగానే జరగొచ్చని తెలుస్తోంది.బద్ధలైన అగ్నిపర్వతం.. బూడిద మేఘాలుహల్మహెరా దీవిలోని మౌంట్ ఇబు అగ్నిపర్వతం బద్దలై.. భారీగా బూడిదను వెదజల్లింది. ఏకంగా 5 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు వ్యాపించాయి.🚨 BREAKING: Double disaster strikes Indonesia!🌋 Mount Ibu erupted on Halmahera, blasting a massive 5 km ash plume into the sky.💥 Shortly after, a powerful 7.7-magnitude earthquake rocked Flores Island.🌊 A tsunami warning has been activated for coastal areas.Stay safe and… pic.twitter.com/xviRMcR5i6— Byte Brief (@Byte_brief) August 15, 2026రింగ్ ఆఫ్ ఫైర్..భూకంపాలు, అగ్నిపర్వతాలకు ఇండోనేషియా అత్యంత ప్రమాదకర ప్రాంతం. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉండటంతో అక్కడ తరచూ భారీ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. 1992లో ఇదే ఫ్లోరెస్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం సునామీకి దారితీసి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 2004లో సుమత్రా సమీపంలో సంభవించిన భారీ భూకంపం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన సునామీల్లో ఒకదానికి కారణమైంది. ప్రస్తుతం ఫ్లోరెస్ దీవిలో ఆఫ్టర్షాక్స్ కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
జాతీయం
బెంగాల్లో మిస్టరీ మరణాలు.. టీఎంసీకి వరుస షాకులు!
బెంగాల్లో అధికారం మారింది.. కానీ రాజకీయ మంటలు మాత్రం చల్లారలేదు! బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత టీఎంసీ నేతలు, కార్యకర్తలపై దాడులు, వరుస మరణాలు, పోలీస్ కస్టడీలో డెత్, అనుమానాస్పద ఘటనలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఒకవైపు “టీఎంసీని టార్గెట్ చేస్తున్నారు” అంటూ మమతా బెనర్జీ పార్టీ ఆరోపిస్తుంటే.. మరోవైపు బీజేపీ “ప్రతి ఘటనను రాజకీయ హింసగా చిత్రీకరిస్తున్నారు” అని కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ బెంగాల్లో నిజంగా ఏం జరుగుతోంది? ఎవరు చనిపోయారు? ఎవరి మీద దాడులు జరిగాయి? ఏ కేసుల్లో రాజకీయ కోణం ఉంది? ఏ మరణాల వెనుక అసలు కారణం ఇంకా మిస్టరీగానే ఉంది? అధికార మార్పు తర్వాత బెంగాల్లో చోటుచేసుకున్న కీలక ఘటనల ఇవే..బీజేపీ ప్రభుత్వం అధికారికంగా 2026 మే 9న ఏర్పడింది. సువేందు అధికారి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే మే 4 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. ప్రమాణం చేయకముందే పోస్ట్ పోల్ హింస మొదలైంది.1. అభిషేక్ బెనర్జీపై దాడి.. మే 30సోనార్పూర్లో పోస్ట్-పోల్ హింసలో మరణించిన టీఎంసీ కార్యకర్త సంజు కర్మాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై గుంపు దాడికి దిగింది. రాళ్లు, గుడ్లు, చెప్పులు విసిరారు. ఈ ఘటనలో ఆయన షర్ట్ చిరిగింది, కళ్లజోడు దెబ్బతింది. రక్షణ కోసం హెల్మెట్ ధరించాల్సి వచ్చింది. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎంసీ దీనిని బీజేపీ మద్దతుదారుల దాడిగా ఆరోపించగా, బీజేపీ మాత్రం స్థానికుల ఆగ్రహంగా పేర్కొంది.2. కల్యాణ్ బెనర్జీపై దాడి.. మే 31అభిషేక్పై ఘటన జరిగిన మరుసటి రోజే టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై హూగ్లీ జిల్లా చందీతలలో దాడి జరిగిందని టీఎంసీ ఆరోపించింది. పోలీస్ స్టేషన్కు సమీపంలోనే తనపై కఠినమైన వస్తువుతో దాడి జరిగి తలకు గాయమైందని కల్యాణ్ చెప్పారు. బీజేపీ మాత్రం దాడి ఆరోపణలను ఖండించింది.3. బిశ్వజిత్ పట్టనాయక్ మృతి..మే 5న కోల్కతాలోని బెలేఘాటాలో టీఎంసీ కార్యకర్త బిశ్వజిత్ పట్టనాయక్ మృతదేహం లభించింది. టీఎంసీ దీనిని బీజేపీ దాడిగా ఆరోపించింది. పోలీసులు మాత్రం మరో కోణం చెప్పారు. కొంతమంది తన కోసం రావడంతో తప్పించుకునే క్రమంలో టెర్రస్ నుంచి పడిపోయి మరణించి ఉండొచ్చని తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగింది. అందువల్ల ఇది “అనుమానాస్పద మరణం”గా చిత్రీకరించబడింది.4. అబీర్ షేక్ హత్య.. మే 5బీర్భూమ్ నానూర్లో టీఎంసీ స్థానిక నేత అబీర్ షేక్ హత్యకు గురయ్యారు. పోలీసులు ఆయన మరో వర్గంతో జరిగిన ఘర్షణలో హత్యకు గురైనట్లు చెప్పారు. టీఎంసీ, కుటుంబ సభ్యులు మాత్రం బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని ఆరోపించారు.5. సంజు కర్మాకర్ మరణం..సోనార్పూర్కు చెందిన 40 ఏళ్ల టీఎంసీ కార్యకర్త సంజు కర్మాకర్ మే 5న దాడికి గురై, కొద్దిరోజుల తర్వాత ఆస్పత్రిలో మరణించారని టీఎంసీ ఆరోపించింది. బీజేపీ వర్గాలు, కొందరు స్థానికులు ఆయనకు మెడికల్ ఎమర్జెన్సీ/బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చని, కుటుంబం రాజకీయ హింసపై ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఈ వివాదమే తర్వాత అభిషేక్ బెనర్జీ సోనార్పూర్ పర్యటనకు కారణమైంది.6. సహదేవ్ బాగ్ మృతదేహం.. మే 10హూగ్లీ జిల్లాలోని గోఘాట్లో టీఎంసీ పంచాయతీ సభ్యుడు సహదేవ్ బాగ్ మృతదేహం పొలంలో లభించింది. టీఎంసీ దీనిని పోస్ట్-పోల్ రాజకీయ హత్యగా పేర్కొంది. బీజేపీ మాత్రం తమ కార్యకర్తలకు సంబంధం లేదని, వ్యక్తిగత లేదా ఆర్థిక వివాదం కారణం కావచ్చని చెప్పింది. పోలీసులు కూడా రాజకీయ కోణంతో పాటు వ్యక్తిగత/బిజినెస్ వివాదాలన్నింటినీ పరిశీలిస్తున్నామని తెలిపారు.7. మహువా మోయిత్రాపై దాడి.. జూలై 1నదియా జిల్లాలోని కలిగంజ్లో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా పార్టీ సమావేశానికి వెళ్లిన సమయంలో ఆమె కార్యాలయం వెలుపల గుంపు నిరసనకు దిగింది. గుడ్లు, బురద, రాళ్లు విసిరారని మహువా ఆరోపించారు. దాదాపు నాలుగు గంటలపాటు తాను కార్యాలయంలో చిక్కుకుపోయానని చెప్పారు. ఆమె 16 మందిపై ఆరోపణలు చేశారు. పోలీసులు మాత్రం పరిస్థితిని అదుపులో ఉంచి, ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు.8. బరుయిపూర్ ‘ఎన్కౌంటర్’.. జూలై 7ఇది టీఎంసీ నేత మరణం కాదు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెంగాల్లో జరిగిన తొలి ప్రధాన పోలీస్ ఎన్కౌంటర్ కావడంతో రాజకీయంగా కీలకమైంది. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మండల్ను పోలీసులు కాల్చిచంపారు. పోలీసులు అతడు ఆయుధం లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించడంతో ఆత్మరక్షణలో కాల్పులు జరిపామని చెప్పారు. టీఎంసీ దీనిని “జంగిల్ రాజ్”గా విమర్శించగా, బీజేపీ “దైవ న్యాయం”గా అభివర్ణించింది.9. బిర్జు కియోట్ కస్టడీ మరణం..ఇది ప్రస్తుతం అత్యంత సీరియస్గా పరిశీలించాల్సిన కేసుల్లో ఒకటి. 48 ఏళ్ల టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ పోలీస్ కస్టడీలో మరణించారు. కుటుంబం పోలీసు హింస వల్లే మరణించారని ఆరోపించింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా ఘటనపై స్పందిస్తూ, ఆయన పోలీస్ కస్టడీలోనే మరణించిన విషయం స్పష్టంగా ఉందని అన్నారు. అనంతరం దర్యాప్తు అధికారిని విధుల నుంచి తప్పించి, ఇన్స్పెక్టర్ ఇన్చార్జ్ను కూడా పక్కకు తప్పించి, మేజిస్ట్రియల్ విచారణకు ఆదేశించారు. ఇదే ఘటనపై మాజీ సీఎం మమతా బెనర్జీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఆమె కాన్వాయ్పై రాళ్లు, చెప్పులు విసిరారని ఆమె ఆరోపించారు. దాడి చేసిన వారి రాజకీయ అనుబంధం మాత్రం స్పష్టంగా నిర్ధారించబడలేదు.10. మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ హత్య.. ఆగస్టు 16ఈరోజు వెలుగులోకి వచ్చిన తాజా షాకింగ్ ఘటన ఇదే. మాజీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే ఆశిష్ బెనర్జీ బీర్భూమ్లోని టీఎంసీ పార్టీ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఇది రాజకీయ హత్య అని ప్రస్తుతం చెప్పడానికి ఆధారం లేదు. మరణానికి అసలు కారణం, ఆత్మహత్యా? ఇతర పరిస్థితులా? అన్నది దర్యాప్తు తర్వాతే స్పష్టమవుతుంది.
పానీపూరీ ప్రియులకు హెచ్చరిక
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు నగరంలోని ప్రతి వీధిలోనూ పానీపూరీ స్టాళ్లు కనిపిస్తుంటాయి అయితే అవి ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమవుతున్నాయి. కర్ణాటక ఆహార భద్రత, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎస్డీఏ) అధికారులు ప్రధానంగా పెద్ద వాణిజ్య సంస్థలపై దృష్టి సారిస్తుండటంతో, చిన్న తరహా వీధి వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం వీధి వ్యాపారులు గ్లౌజులు, ఏప్రాన్లు ధరించడం తప్పనిసరి అయినప్పటికీ, చాలా మంది పాటించడం లేదు.పెద్ద హోటల్స్తో పోలిస్తే చిన్న వ్యాపారులు కూడా ఆహారాన్ని తాజాగానే తయారు చేస్తారు. మాంసం, కూరగాయల వంటి పాడైపోయే పదార్థాలను సమమానునుసాయం తీసుకురావడం వల్ల నిల్వ ఉంచే అవసరం తగ్గి, అపరిశుభ్రత ముప్పు కొంతవరకు తగ్గుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గాంధీ బజార్లోని ‘సుగుణ’ అనే చిన్న తినుబండారాల యజమాని మాట్లాడుతూ, ‘మేము ప్రతిరోజూ ఇంట్లోనే తాజా ఆహారాన్ని తయారు చేసి ఇక్కడ విక్రయిస్తాము. స్థలం లేని కారణంగా డిస్పోజబుల్ పేపర్ ప్లేట్లను ఉపయోగిస్తాం’ అని తెలిపారు.రాజరాజేశ్వరి నగర్లో మాంసాహార స్టాల్ నడుపుతున్న నవీన్ మాట్లాడుతూ, చికెన్ను ఎక్కువ సేపు బయట ఉంచలేమని, అవసరమైతేనే వేడి చేస్తామని, వీకెండ్లలో సమీపంలోని హోటళ్లలో నిల్వ చేస్తామని చెప్పారు. పానీపూరీ విక్రేత సోమన్న మాట్లాడుతూ ‘గ్లౌజులు వేసుకుంటే పానీపూరీని కలపడం, అందించడం అసౌకర్యంగా ఉంటుంది. గోళ్లు కత్తిరించుకుని, ఏప్రాన్ ధరించి పరిశుభ్రతను పాటిస్తున్నాను’ అని పేర్కొన్నారు. చుర్మురి విక్రేత శ్యాము మాట్లాడుతూ, ఫుట్పాత్పై వ్యాపారం చేయడం వల్ల ఎలుకలు, బొద్దింకల వంటి సమస్యలు ఉన్నాయని, అయినప్పటికీ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. చెరకు రసం విక్రేతలు కూడా ఈగలు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. వీధి ఆహార నాణ్యతపై ప్రజల్లో ఆందోళన నెలకొన్నా, వ్యాపారుల జీవనోపాధి, నిబంధనల మధ్య సంఘర్షణ కొనసాగుతూనే ఉంది.ఇది కూడా చదవండి: బెంగాల్లో దారుణం: కాంగ్రెస్ నేత, కుమారుని కిరాతక హత్య!
ట్రాక్పై తోడేలు తల.. పట్టాలు తప్పిన స్పెషల్ ట్రైన్!
సిల్లీ: జార్ఖండ్లోని సిల్లీ- బొకారో రైలు మార్గంలో శనివారం తెల్లవారుజామున మధుపూర్ శ్రావణ మేళా స్పెషల్ ట్రైన్ (నంబర్ 08895) ప్రమాదానికి గురైంది. పోల్ నంబర్ 354/ఎస్ఏ-4 సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజిన్ నుంచి మూడో కోచ్ (నంబర్ ఎస్ఈసీ 64776) ఒక చక్రం పట్టాలు తప్పడంతో ప్రయాణికులలో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ప్రాథమిక సమాచారం ప్రకారం రైల్వే ట్రాక్ పాయింట్ అండ్ క్రాసింగ్ వద్ద ఒక తోడేలు (భేడియా) తల ఇరుక్కోవడం వల్ల కోచ్ చక్రం పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కోచ్లో ప్రయాణిస్తున్న భక్తులందరినీ సురక్షితంగా కిందకు దించామని అధికారులు తెలిపారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రాంచీ రైల్వే డివిజన్ మేనేజర్ కరుణా నిధి సింగ్తో పాటు రైల్వే అధికారులు, రైల్వే రక్షణ దళం, జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.సహాయక సిబ్బంది తక్షణమే స్పందించి సుమారు గంట వ్యవధిలోనే కోచ్ను తిరిగి పట్టాలపైకి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆ కోచ్ను మురి యార్డ్కు తరలించారు. ఘటనా స్థలంలో రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. భద్రతా చర్యల్లో భాగంగా ఈ సమయంలో పలు రైళ్ల మార్గాలను మళ్లించారు. గంట సమయం పట్టిన ఈ చర్యల అనంతరం బొకారో రైల్వే మార్గంలో ఉదయం దాదాపు 5:15 గంటలకు రైళ్ల రాకపోకలను పూర్తిగా పునరుద్ధరించారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో రైలును గమ్యస్థానానికి పంపించారు. పాయింట్ అండ్ క్రాసింగ్ అనేది రైళ్లను ఒక మార్గం నుంచి మరో మార్గానికి సురక్షితంగా మార్చడానికి ఉపయోగపడే అత్యంత కీలకమైన రైల్వే వ్యవస్థ అని అధికారులు వెల్లడించారు.ఇది కూడా చదవండి: మయన్మార్లో మరో ప్రళయం.. వణికిస్తున్న చైనా మెగా డ్యామ్!
ఐదు నిమిషాలు లేట్.. ఫోన్ లాక్కుని డెలివరీ బాయ్పై దాడి.. ఆపై బిగ్ ట్విస్ట్!
ఐదు నిమిషాల ఆలస్యం.. కస్టమర్కు కోపం కట్టలు తెంచుకుంది! ఆర్డర్ లేట్గా వచ్చిందన్న ఆగ్రహంతో ఓ డెలివరీ బాయ్పై కస్టమర్ దాడికి దిగాడు. ఫోన్ లాక్కొని, చెంపదెబ్బలు కొట్టి, తన్నడమే కాకుండా ఇంట్లోకి తీసుకెళ్లి మరీ దాడి చేశాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ మొత్తం ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు నిలిపివేస్తామని ప్రకటించి, నిరసనకు దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకోగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో గంగాసాగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమిత్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేందుకు అపార్ట్మెంట్కు వెళ్లాడు. అక్కడ కస్టమర్ యమన్తో డెలివరీ ఆలస్యంపై వాగ్వాదం జరిగింది. అమిత్ ప్రకారం ఆర్డర్ సుమారు ఐదు నిమిషాలు ఆలస్యమైంది. కానీ యమన్ మాత్రం తాను 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చానంటూ ఆరోపించినట్లు అమిత్ తెలిపాడు.ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సీసీటీవీ దృశ్యాల్లో యమన్.. అమిత్ ఫోన్ లాక్కొని, అతడిని కొట్టడం, తన్నడం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ కూడా దాడి కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమిత్ ఫిర్యాదు ప్రకారం.. యమన్ తనపై హత్య బెదిరింపులకు పాల్పడ్డాడని, డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించాడు. అంతేకాదు, తన భార్యకు సంబంధించిన వేధింపుల కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు కూడా చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తోటి డెలివరీ ఏజెంట్లు స్పందించారు. అమిత్ను గుర్తించి అతడిని సంప్రదించారు. అనంతరం అందరూ కలిసి భవన్పూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.An FIR has been registered against the couple who beat up a Blinkit delivery boy in Meerut, UP. Both have fled after locking their flat. Police raids are ongoing. pic.twitter.com/Sfke34hWFj— subash kumar (@Krishan10_) August 15, 2026డెలివరీ ఏజెంట్ల బంద్..ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన డెలివరీ ఏజెంట్లు పనులు నిలిపివేశారు. అమిత్కు కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు చేయబోమని ప్రకటించారు. “ఆర్డర్ కొన్ని నిమిషాలు ఆలస్యమైతే దాడి చేసే హక్కు ఎవరికీ లేదు” అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి 34 ఏళ్ల యమన్ను అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తామని భవన్పూర్ పోలీసులు తెలిపారు. ఐదు నిమిషాల ఆలస్యం.. ఆపై గొడవ.. చివరకు సీసీటీవీలో బయటపడిన దాడి! ఈ ఘటన ఇప్పుడు డెలివరీ ఉద్యోగుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఎన్ఆర్ఐ
తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) /TCSS యొక్క పదమూడో వార్షిక సర్వసభ్య సమావేశం ఆగస్టు 2వ తేదీన స్థానిక కుర్తాళం బోర్డర్, లిటిల్ ఇండియాలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 65-70 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. సమావేశంలో ముందుగా పన్నెండో సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2025-2026 ఆర్థిక సంవత్సరపు రాబడి ఖర్చుల పట్టికను సభ్యులకు వివరించి ఆమోదం పొందడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా సభ్యులు సమ్మయ్య మోలుగూరి, ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ పూర్వ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల,కోశాధికారి నంగునూరి వెంకట రమణ సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి మోడరేటర్ ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల వ్యవహరించారు.2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సేవలందించిన కిరణ్ కుమార్ ఎర్రబోయిన నీలం సుఖేందర్ గార్లకు కృతజ్ణతలు తెలియజేశారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ప్రస్తుత పదవీకాల అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన నల్ల భాస్కర్ గుప్త, ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుంచి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లు ప్రకటించారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అధ్యక్షుడు నల్ల భాస్కర్ తెలిపారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు శాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.ఈ సారి ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ణతలు తెలియజేశారు. దీని తోపాటు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సురేష్ మాటేటి, శ్రీధర్ బండారు గార్లను ప్రకటించి ఎన్నుకోవడం జరిగింది.నూతన కార్యవర్గం కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు నల్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు, శివ ప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్య, సరావేణి విజయ కుమార్ ఉన్నట్టు తెలిపారు.మాజీ అధ్యక్షుడు రమేష్ బాబు గడప, తన పదవీకాలంలో సొసైటీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన అసాధారణ, అద్భుతమైన సేవలను ఏవి (AV) రూపంలో ప్రదర్శించి కార్యనిర్వాహక సభ్యులందరూ మర్యాదపూర్వకంగా సన్మానించారు. గత పన్నెండు సంవత్సరాలుగా రమేష్ బాబు గడప అందించిన సేవలను పూర్వ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, నీలం మహేందర్ గార్లు ఘనంగా కొనియాడారు. గత పదమూడు సంవత్సరాలుగా సొసైటీలో భాగమై రెండు సార్లు అధ్యక్షుడిగా సేవచేసే అవకాశం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ సేవలందించిన దుర్గా ప్రసాద్, సుగుణాకర్ రెడ్డి గార్లకు కార్యనిర్వాహక సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి కార్యనిర్వాహక సభ్యులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. చివరిగా సర్వ సభ్యులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన హై టీని ఆస్వాదించారు.(చదవండి: అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్)
హైదరాబాద్కు శ్రీపతి దీపారెడ్డి పార్థీవదేహం
హైదరాబాద్: చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీకి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) అమెరికా న్యూజెర్సీలో గతనెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దీపారెడ్డి 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.గత నెల 28న భర్త రామకృష్ణారెడ్డిని కారులో కార్యాలయంలో దించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న దీపారెడ్డి కారును, ఓ మెడికల్ విద్యార్థి కారుతో ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆమె అవయవాలను మెడికల్ విద్యార్థులకు అందజేస్తానని అంగీకరించడంతో ఆమె అవయవాలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. సంబరపడే లోపే..రెండు రోజుల్లో మాదాపూర్లో ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ గృహప్రవేశానికి వస్తుందని సంబరపడ్డాం.. అన్ని ఏర్పాట్లు చేశాం, ఈవిధంగా వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టారు. నేడు చంపాపేటలో అంత్యక్రియలు దీపారెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం నగరానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంపాపేటలోని రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు.
అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్
సాక్షి,హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ 19వ మహసభలు శనివారం అమెరికాలోని బాల్టిమోర్లో ఘనంగా ప్రారంభమైయ్యాయి. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారితో పాటు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ల నుండి భారీ ఎత్తున వివిధ రంగాల ప్రముఖులు తొలి రోజు ఆరంభవేడుకలకు హాజరైయ్యారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎంఎల్ఎలు సినీ,సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరైయ్యారు.దాదాపు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు తెలుగు సంస్కృతిని చాటిచెప్పే కళాప్రదర్శనలు నిర్వహించారు.వివిధ రంగాల్లో విశేషసేవ చేసిన 15 మంది ప్రముఖులను ఆటా అవార్డులతో సత్కరించారు. అవార్డులు అందుకున్న వారిలో ఆర్.రవికాంత్రెడ్డి(జర్నలిజం) డాక్టర్ రవీందర్(వైద్యం), కిరణ్ చుక్కపల్లి(ఇండస్ట్రీ) తదితరులను ఆటా మాజీ అధ్యక్షులు పారిశ్రామికవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి సత్కరించారు.
ఎన్ఆర్ఐలు పార్టీకి సేవలు అందించాలి
సాక్షి, అమరావతి: అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో గురువారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, టెక్నాలజీ, కంటెంట్, డేటా, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఎన్ఆర్ఐలు తమ సేవలను పార్టీకి అందించాలని కోరారు. కేవలం పోస్టులు, లైకులు, షేర్లకు పరిమితం కాకుండా, స్పష్టమైన లక్ష్యాలు, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఉన్న ప్రజాభిప్రాయాన్ని వాస్తవాలు, సానుకూల కమ్యూనికేషన్, టెక్నాలజీ, సృజనాత్మక కంటెంట్ను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్ సమావేశంలో పాల్గొన్న ఆలూరు సాంబశివారెడి, తదితరులు
క్రైమ్
చిట్టి గుండె ఆగింది
నిజామాబాద్ రూరల్ : పంద్రాగస్టు రోజు ఉదయాన్నే లేచి జెండా పండుగను సంబురంగా జరుపుకుందామనుకున్న విద్యార్థిని గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందింది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేశాపూర్కు చెందిన సుంకె మౌనిక కూతురు సుంకే సాత్విక(11) సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. చిన్నారి గుండెకు గతంలో శస్త్రచికిత్స జరిగింది. కాగా, రెండు రోజుల క్రితం సాతి్వకకు గుండెలో నొప్పి రావడంతో ప్రిన్సిపల్ నళిని తల్లికి సమాచారం అందించారు. దీంతో మౌనిక తన కూతురిని నిజామాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా గతంలో గుండె ఆపరేషన్ చేసిన ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో హైదరాబాద్లోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారం పరిస్థితి విషమించి సాతి్వక ఆస్పత్రిలో మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. చిన్నారి మృతితో కేశాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మౌనిక భర్త గతంలోనే మృతి చెందగా, ఉన్న ఒక్కగానొక్క కూతురు మరణించడంతో గ్రామస్తులను కలచివేసింది.
ముందు కొడుకు, తర్వాత భర్త.. ఇప్పుడు తల్లి!
వెంటాడిన మృత్యువు.. రెండేళ్ల వ్యవధిలో ఆ కుటుంబాన్ని పూర్తిగా కబళించింది. మొదట కొడుకు.. ఆ తర్వాత భర్త.. ఇప్పుడు ఆ తల్లే అనంతలోకాలకు వెళ్లిపోయారు. తాడ్వాయి మండలం కొండపర్తి సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లా మార్కెటింగ్ అధికారి కలకోట్ల సురేఖ మృతి చెందడంతో హనుమకొండ జూలైవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న విషాదాలు బంధువులు, స్థానికులను కలచివేశాయి.వరంగల్: ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. మృత్యువు ఒక్కొక్కరిని తన ఒడికి చేర్చుకుంది. రెండేళ్లలో కుటుంబాన్ని మొత్తం కబళించింది. రెండేళ్ల క్రితం కొడుకు, ఐదు నెలల క్రితం భర్త మృతి చెందగా.. శనివారం భార్య సైతం అనంతలోకాలకు చేరుకుంది. హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన వరంగల్ మార్కెటింగ్ శాఖ అధికారి (డీఎంఓ) కలకోట్ల సురేఖ(43) శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలుసుకున్న స్థానికుల రోదనలతో పెద్దమ్మగడ్డ దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృత్యుపాశమైన ఇసుకలారీ..హనుమకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన కలకోట్ల సురేఖ వరంగల్ డీఎంఓగా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ ఇన్చార్జ్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఆమె గుడెప్పాడ్ మార్కెట్ యార్డులో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వ్యక్తిగత పనుల నిమిత్తం కారులో చింత విజయబాబు అనే వ్యక్తితో కలిసి ఏటూరునాగారం వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఇసుకలారీ ఢీకొట్టడంతో సురేఖతోపాటు విజయబాబు కూడా దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో కొడుకు.. అనారోగ్యంతో భర్తసురేఖ, కిరణ్ స్వస్థలం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ అయినప్పటికీ పదిహేనేళ్ల క్రితం జూలైవాడలో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. సురేఖ ఒక్కగానొక్క కుమారుడు సుక్రీత్ (16) రెండేళ్ల క్రితం క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తుండగా.. బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు. సురేఖ భర్త బొక్క కిరణ్ (50) అనారోగ్యంతో బాధపడుతూ ఐదు నెలల క్రితం మృతిచెందాడు. శనివారం సురేఖ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండేళ్లలో కుటుంబమంతా మృత్యు ఒడిలోకి చేరినట్లయ్యిందని కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చివరి స్టేటస్లో కొడుకు జ్ఞాపకాలు..పతాకావిష్కరణ అనంతరం సురేఖ తన విధి నిర్వహణకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకున్నారు. అదే సమయంలో తన కుమారుడు బతికున్నప్పుడు పాఠశాలలో దిగిన ఫొటోలు, అతడితో సరదాగా గడిపిన సందర్భాల ఫొటోలను కూడా స్టేటస్గా ఉంచుకున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకంకొడుకు, భర్త మరణించిన తర్వాత సురేఖ తన వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జూలైవాడలోని ఇంట్లో నివసిస్తున్నారు. సురేఖ తండ్రి సురేందర్ సీపీఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. కూతురుకు వరుసగా ఎదురైన విషాదాలను తలచుకుంటూ ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘ముందు మనవడిని.. ఆ తర్వాత అల్లుడిని కోల్పోయాం.. ఇప్పుడు కూతురిని కూడా కోల్పోయాం.. ఈ ఘోరాన్ని ఎలా భరించాలి..?’ అంటూ బంధువులను పట్టుకుని వారు గుండెలవిసేలా రోదించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సురేఖకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. సురేఖ మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషాదంలో పాలకవర్గం, సిబ్బందిఅప్పటివరకు తమతో ఉన్న అధికారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలియగానే గూడెప్పాడ్ మార్కెట్ పాలకవర్గం, సిబ్బంది, వరంగల్ మార్కెటింగ్శాఖ అధికారులు విషాదంలో మునిగిపోయారు. మంచి అధికారిని కోల్పోయామని పాలకవర్గం విచారం వ్యక్తం చేసింది. సిబ్బంది.. అధికారి సురేఖతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు.
నా అంత్యక్రియలు నా కొడుకుతోనే జరిపించండి
కర్ణాటక: భారీగా కట్న కానుకలు ఇచ్చి వివాహం జరిపించినా భర్త, అత్తమామల ధనదాహం తీరలేదు. వారి వేధింపులను తట్టుకోలేక వివాహిత ఉరివేసుకొని అత్మహత్య చేసుకొన్న సంఘటన చింతామణి పట్టణంలోని సొణ్ణశెట్టిహశ్లి బడావణెలో శనివారం జరిగింది. వివరాలు.. మృతురాలు మమతశ్రీ (26). పట్టణంలోని గణేష్నగరకి చెందిన శ్రీనివాసరెడ్డి కూతురు మమతశ్రీని ఐదేళ్ల కిందట తాలూకాలోని భక్తరహళ్లికి చెందిన మోహన్రెడ్డికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. వీరికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తకు చేళూరు రోడ్డులో బైకు షోరూం ఉంది. మధ్యాహ్నం భోజనానికి రాగా ఇంటి తాళాలు వేసి ఉన్నాయి, కిటికీలో నుంచి చూడగా మమత ఫ్యాన్కు ఉరివేసుకుని శవమైంది. దీంతో భర్త పోలీసులు సమాచారమిచ్చాడు. పోలీసులు తనిఖీలు చేయగా డెత్నోట్ లభించింది. తన అంత్యక్రియలను భర్త కాకుండా కొడుకుతో నిర్వర్తించాలని రాసి ఉంది. భర్త ఎంతగా సతాయించాడో దీనిని బట్టి అర్థమవుతుంది. ఎస్పీ జగన్నాథ్రై, తహశీల్దార్ సుదర్శన్ యాదవ్, సీఐ విజికుమార పరిశీలించి కేసు నమోదు చేశారు.
రూపారెడ్డిని హత్య చేసింది 20 ఏళ్ల యువకుడేనా?
నల్లగొండ జిల్లా: పట్టణ కేంద్రంలోని జేబీ కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన కల్లు రూపా రెడ్డి హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. హంతకుడు గ్లౌజులు ధరించి ఈ దారుణానికి పాల్పడటంతో ఘటనా స్థలంలో ఎలాంటి ఆనవాళ్లూ లభించలేదు. దీంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే, లభ్యమైన సీసీ ఫుటేజీల ఆధారంగా హత్య చేసిన నిందితుడి వయసు 20 నుంచి 25 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా, విన్నా రూపారెడ్డి హత్య గురించే సర్వత్రా చర్చ సాగుతోంది. హత్య మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాఠశాల సిబ్బందిని, కాలనీ వాసులను, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు, శనివారం ప్రత్యేక నిఘా విభాగానికి (స్పెషల్ బ్రాంచ్) చెందిన పోలీసులు సైతం రంగంలోకి దిగారు. మృతురాలు రూపారెడ్డి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న పాఠశాలలో.. 2010 నుంచి 2025 బ్యాచ్ల వరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల వివరాలను సేకరించి, ఆ కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేసినట్లు సమాచారం.
వీడియోలు
ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది! రూపా రెడ్డి భర్తపై పోలీసుల అనుమానాలు
100 షేర్లకు 1000 షేర్లు! లిస్టయిన 10 రోజుల్లోనే బంపరాఫర్..
ఎవరిది గొడ్డలి పార్టీ? ఇదిగో సాక్ష్యం.. ఈ వీడియో చూసే దమ్ముందా బాబు..
పెళ్లైన 7 రోజులకే.. నా భర్త అరాచకం అంతా ఇంతా కాదు
సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు.. బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా
నీకు మిగిలింది రెండేళ్లే.. తర్వాత నీ బ్రతుకు.. చింతమనేనికి లాయర్ శ్రీనివాస్ వార్నింగ్
ట్వీట్ తో హార్మోజ్ ను స్వాధీనం చేసుకోలేరు.. ట్రంప్ కు ఇరాన్ కౌంటర్
ముద్రగడ కుటుంబ సభ్యులకు YSRCP నేతలు పరామర్శ
చెన్నై లవ్ స్టోరీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
నల్లగొండ జిల్లా రూపా రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..


