ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు
తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి గత కొన్నాళ్ల నుంచి వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. భార్య ఆర్తితో విడాకుల వ్యవహారమే దీనికి కారణం. మరోవైపు గాయని కెనీషాతో ఇతడి రిలేషన్ గురించి సాగుతున్న ప్రచారం కూడా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. ఈ విషయమై దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న కెనీషా.. ఒక దశలో తమిళనాడు వదిలి వెళ్లిపోయింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ చైన్నె వచ్చింది.ఇప్పటివరకు గాయనిగా ఉన్న ఈమె.. ఇప్పుడు సంగీత దర్శకురాలిగా మారింది. అది కూడా రవి మోహన్ దర్శక నిర్మాతగా చేస్తున్న 'యాన్ ఆర్డినరీ మ్యాన్' సినిమా కోసమే. ఈ మూవీలో యోగి బాబు హీరో. ఈ చిత్రంతోనే కెనీషా సంగీత దర్శకురాలిగా పరిచయమవుతుండటం విశేషం. దీని గురించి స్పందించిన కెనీషా.. సరైన సమయంలో సరైన అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చిందని చెప్పుకొచ్చింది.తొలుత ఈ సినిమాలో భాగం కాకూడదని అనుకున్నాను. రవి మోహన్ చెప్పిన యాన్ ఆర్డినరీ మ్యాన్ స్టోరీ ఆర్టినరీనే అయినా అందులో విషయం మాత్రం ఎక్స్ట్రార్డినరి. ఈ చిత్ర కథనం ఇంప్రెస్ చేసింది. అందుకే సంగీతాన్ని అందించాలని నిర్ణయించుకున్నాను. దీనికి సంగీతమందించడం చాలా బాధ్యతతో కూడుకున్నది. చాలా రీసెర్చ్ చేసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నట్లు కెనీషా చెప్పుకొచ్చింది.
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: బొల్లారం ఆయుధాల అపహరణ కేసులో మిస్టరీ వీడింది. ఆయుధాలను మాజీ ఆర్మీ అధికారే చోరి చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో మద్రాస్ రెజిమెంట్లో పనిచేసినట్లు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై ఆయుధాల చోరీ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆయుధాల చోరీకి మరో ముగ్గురు అధికారులు సహకరించినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ చోరీ మూడు నెలలుగా పక్కా ప్లాన్తో ఆయుధాల మాయం చేసినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. శిక్షణా కేంద్రంలోని ఆయుధాలకు ప్రత్యేక కోడింగ్ నంబర్లు లేకపోవడాన్ని గుర్తించిన నిందితుడు ఆ లోపాన్ని ఆసరాగా చేసుకుని.. అవకాశం దొరికినప్పుడల్లా ఒక్కొక్క ఆయుధం బయటకు తరలించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా సిబ్బంది కళ్లుగప్పి తుపాకులతో పాటు బుల్లెట్లను కూడా దశలవారీగా తరలించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చోరీకి అనువుగా రాత్రివేళల్లో ఆయుధాగారం వద్ద సీసీటీవీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగా ఆఫ్ చేసినట్లు వెల్లడిరాత్రి వేళల్లో డ్యూటీలో ఉన్న అగ్నివీర్లను వేరే పనులకు పంపించి ఆయుధాల తరలింపుచివరగా ఆగస్టు 30 న భారీ వర్షాన్ని ఆసరాగా చేసుకుని తాళాలు పగులగొట్టి బయట దొంగల పని అన్నట్లుగా డ్రామా ఆడి ఆయుధాల చోరీ చేసినట్లు అధికారులు తెలిపారు. రికవరీ చేసిన వాటిలో 4 AK-203 అసాల్ట్ రైఫిల్స్, 1 INSAS రైఫిల్ 7 పిస్టల్స్.. 6 మిలిటరీ, 1 సివిలియన్ పిస్టల్ స్వాధీనం21 మ్యాగజైన్లు, నైట్ విజన్ బైనాక్యులర్ కూడా రికవరీ1,900కు పైగా లైవ్ బుల్లెట్లు పోలీసుల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, మిలిటరీ పోలీస్, NIA, బొల్లారం పోలీసులు సంయుక్త దర్యాప్తుతో జరిగినట్లు పేర్కొన్నారు.
కడియం, మంత్రులపై అక్బరుద్దీన్ సెటైర్లు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, ప్యానెల్ స్పీకర్ కడియం శ్రీహరి మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. అక్బరుద్దీన్ వరుసగా 20కి పైగా ప్రశ్నలు అడగడంపై కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో, అక్బరుద్దీన్.. మంత్రులపై సెటైర్లు వేశారు.అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా..‘క్వశ్చన్ అవర్లో ఇన్ని ప్రశ్నలు అడగడం ఏంటి? 20కి పైగా ప్రశ్నలు అడిగితే ఏ మంత్రి ఏ సమాచారాన్ని చెప్పాలి?’ అంటూ కడియం శ్రీహరి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్బరుద్దీన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అనంతరం, అక్బరుద్ధీన్..‘మంత్రులు చాలా గొప్ప గొప్ప చదువులు చదివారు.. వాళ్లు అన్నింటికీ సమాధానం చెబుతారు’ అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. ‘నేను కేవలం 12వ తరగతి పాస్ అయ్యాను.. నేను అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేరా?’ అంటూ సెటైర్ వేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో సభలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన సభా నిబంధనలు, అధికార-విపక్షాలకు వర్తించే రూల్స్పై ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. హైదరాబాద్లో కంపెనీలకు కేటాయించిన భూముల వినియోగంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీల పేరుతో భూములు తీసుకుని వాటిని రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న సంస్థలపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని కోరారు. కంపెనీలకు భూములు కేటాయించే సమయంలో స్పష్టమైన ఆంక్షలు, నిబంధనలు ఉండాలని సూచించారు.టెక్ మహీంద్రా వంటి సాఫ్ట్వేర్ రంగ దిగ్గజాలు హైదరాబాద్కు వస్తున్నప్పటికీ.. ఇక్కడ వ్యాపార అవకాశాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆసక్తి చూపుతున్న కంపెనీలను రాష్ట్రానికి రప్పించి ప్రోత్సహించాలని, తద్వారా పెట్టుబడులు పెరగడంతో పాటు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని చెప్పారు. కంపెనీలకు ఇచ్చిన భూములు కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు కాకుండా.. పరిశ్రమలు, ఐటీ కార్యకలాపాలు, ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడేలా చూడాలని దానం నాగేందర్ సూచించారు. ఈ అంశంపై ఐటీ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించాలని అసెంబ్లీలో కోరారు.ఇదీ చదవండి: కొండా సురేఖ మాజీ ఓఎస్డీ తండ్రి ఆత్మహత్యాయత్నం
నూకరాజు కేసులో భారీ ట్విస్ట్లు.. సాధిక్ విచారణలో సంచలన విషయాలు
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడు సాధిక్ ఖాన్ విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. రూ.25 కోట్ల విలువైన ఆస్తిపై కన్నేసిన సాధిక్.. జగదీశ్ను హత్య చేసి, ఆయన భార్య సౌజన్యను పెళ్లి చేసుకోవాలని పథకం వేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు పలు ప్రణాళికలు వేసినట్టు తెలిసింది.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు ముందే జగదీశ్ రెడ్డికి కాకినాడలో సాధిక్ స్లో పాయిజన్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్యానికి గురైన జగదీశ్ రెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం చివరిసారిగా కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాల ఆధారంగా స్లో పాయిజన్ కెమికల్, సైనైడ్ సరఫరా చేసిన వ్యక్తులను పోలీసులు గుర్తించి విచారించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. జగదీశ్ రెడ్డితో పాటు ఏఈ నూకరాజుకు సంబంధించిన ఆస్తిని కూడా దక్కించుకోవాలని సాధిక్ కుట్ర పన్నినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే నూకరాజు కుటుంబం ఇందుకు అంగీకరించకపోవడంతో వారిని కూడా చంపేస్తానని సాధిక్ బెదిరించినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ పరిణామాలతో తీవ్ర భయాందోళనకు గురైన నూకరాజు కుటుంబం రాజమండ్రిలో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు సాధిక్ ఖాన్ మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. ఇవాళ అతడిని అమలాపురం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. అంతకుముందు వైద్య పరీక్షల కోసం సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి ఆస్పత్రికి తరలించారు. నూకరాజు అల్లుడు జగదీశ్రెడ్డి హత్య కేసులో సాధిక్ ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా..తాజా దర్యాప్తులో భాగంగా సాధిక్ను గుడారిగుంటలోని ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీతో పాటు నూకరాజు, సౌజన్య నివాసాలకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించినట్లు సమాచారం. అక్కడి నుంచి కీలక ఆధారాలను సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు.ఇదీ చదవండి: దొంగ పెన్షన్ల కోసం టీడీపీ పన్నాగం
హెచ్పీవీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవగాహన
హలో డార్లింగ్.. ప్రభాస్కి కేటీఆర్ 'ప్రాంక్ కాల్'
ఢిల్లీ హైకోర్టు షాక్.. వినేశ్ ఫోగట్కు చుక్కెదురు!
ఎన్బీబీఎల్తో సెంట్రల్ బ్యాంక్ జట్టు
శుబ్మన్ గిల్ సహచరుడి విశ్వరూపం.. కేవలం 22 బంతుల్లోనే
చిటిమిటి పండుతో బోలెడన్ని లాభాలు..!
బ్రిక్స్తో మనకు లాభాలున్నాయండోయ్..!
కియా కొత్త కార్లు.. లాంచ్కు ముందే బుకింగ్లు
‘వైభవ్.. నువ్వు నా కెరీర్కు కూడా సాటి రాలేవు’
‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు
ఇవ్వడానికి ఏమీ లేదంటే కుదరదు.. ఉన్నదివ్వాల్సిందే!!
ప్రభుత్వాన్ని మూసెయ్యడం కాదయ్యా! ఓన్లీ కళాశాలలనే!
ఒక్కసారే అన్ని కహానీలు ఎందుకు చెప్పార్సార్!!
ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ
మోదీకి ఊహించని షాక్.. భారత్కు ముయిజ్జు వెన్నుపోటు?
హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లేకుండానే జుట్టు పెరుగుదల.. డా.స్తుతి ప్రత్యేక చికిత్స
ఏసీపీ దామోదర్పై సీపీకి వల్లభనేని వంశీ లాయర్ ఫిర్యాదు
పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..
సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్
‘నేనేం పారిపోలేదు.. న్యాయ బంధనాల్లో చిక్కుకున్నా’
తమిళనాడులో సంచలనం.. స్టాలిన్కు పళనిస్వామి బంపరాఫర్!
జియో రీచార్జ్: ఫ్యామిలీ ప్లాన్.. 4 సిమ్లకు అన్లిమిటెడ్!
తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది కరెక్టే: స్టాలిన్
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి
అర ఎకరం..ఏడాదికి రూ. 80 లక్షలు!
IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్ పాండ్యాకు చోటు
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 65 ఏళ్లలో ఒకే ఒక్కడు
బంగారానికి పోటీగా రాగి? మళ్లీ ఆనాటి పరిస్థితులు..
అదరగొట్టిన బంగారం! 25 ఏళ్లలో ఇది మూడోది..
హెచ్పీవీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవగాహన
హలో డార్లింగ్.. ప్రభాస్కి కేటీఆర్ 'ప్రాంక్ కాల్'
ఢిల్లీ హైకోర్టు షాక్.. వినేశ్ ఫోగట్కు చుక్కెదురు!
ఎన్బీబీఎల్తో సెంట్రల్ బ్యాంక్ జట్టు
శుబ్మన్ గిల్ సహచరుడి విశ్వరూపం.. కేవలం 22 బంతుల్లోనే
చిటిమిటి పండుతో బోలెడన్ని లాభాలు..!
బ్రిక్స్తో మనకు లాభాలున్నాయండోయ్..!
కియా కొత్త కార్లు.. లాంచ్కు ముందే బుకింగ్లు
‘వైభవ్.. నువ్వు నా కెరీర్కు కూడా సాటి రాలేవు’
‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు
ఇవ్వడానికి ఏమీ లేదంటే కుదరదు.. ఉన్నదివ్వాల్సిందే!!
ప్రభుత్వాన్ని మూసెయ్యడం కాదయ్యా! ఓన్లీ కళాశాలలనే!
ఒక్కసారే అన్ని కహానీలు ఎందుకు చెప్పార్సార్!!
ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ
మోదీకి ఊహించని షాక్.. భారత్కు ముయిజ్జు వెన్నుపోటు?
హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లేకుండానే జుట్టు పెరుగుదల.. డా.స్తుతి ప్రత్యేక చికిత్స
ఏసీపీ దామోదర్పై సీపీకి వల్లభనేని వంశీ లాయర్ ఫిర్యాదు
పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..
సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్
‘నేనేం పారిపోలేదు.. న్యాయ బంధనాల్లో చిక్కుకున్నా’
తమిళనాడులో సంచలనం.. స్టాలిన్కు పళనిస్వామి బంపరాఫర్!
జియో రీచార్జ్: ఫ్యామిలీ ప్లాన్.. 4 సిమ్లకు అన్లిమిటెడ్!
తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది కరెక్టే: స్టాలిన్
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి
అర ఎకరం..ఏడాదికి రూ. 80 లక్షలు!
IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్ పాండ్యాకు చోటు
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 65 ఏళ్లలో ఒకే ఒక్కడు
బంగారానికి పోటీగా రాగి? మళ్లీ ఆనాటి పరిస్థితులు..
అదరగొట్టిన బంగారం! 25 ఏళ్లలో ఇది మూడోది..
ఫొటోలు
తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)
పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్ (ఫొటోలు)
కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)
చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)
సౌండ్ బాక్స్తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)
కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)
'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)
ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)
వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ లుక్స్.. షూటింగ్ ఫొటోలు వైరల్
వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)
సినిమా
ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు
తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి గత కొన్నాళ్ల నుంచి వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. భార్య ఆర్తితో విడాకుల వ్యవహారమే దీనికి కారణం. మరోవైపు గాయని కెనీషాతో ఇతడి రిలేషన్ గురించి సాగుతున్న ప్రచారం కూడా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. ఈ విషయమై దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న కెనీషా.. ఒక దశలో తమిళనాడు వదిలి వెళ్లిపోయింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ చైన్నె వచ్చింది.ఇప్పటివరకు గాయనిగా ఉన్న ఈమె.. ఇప్పుడు సంగీత దర్శకురాలిగా మారింది. అది కూడా రవి మోహన్ దర్శక నిర్మాతగా చేస్తున్న 'యాన్ ఆర్డినరీ మ్యాన్' సినిమా కోసమే. ఈ మూవీలో యోగి బాబు హీరో. ఈ చిత్రంతోనే కెనీషా సంగీత దర్శకురాలిగా పరిచయమవుతుండటం విశేషం. దీని గురించి స్పందించిన కెనీషా.. సరైన సమయంలో సరైన అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చిందని చెప్పుకొచ్చింది.తొలుత ఈ సినిమాలో భాగం కాకూడదని అనుకున్నాను. రవి మోహన్ చెప్పిన యాన్ ఆర్డినరీ మ్యాన్ స్టోరీ ఆర్టినరీనే అయినా అందులో విషయం మాత్రం ఎక్స్ట్రార్డినరి. ఈ చిత్ర కథనం ఇంప్రెస్ చేసింది. అందుకే సంగీతాన్ని అందించాలని నిర్ణయించుకున్నాను. దీనికి సంగీతమందించడం చాలా బాధ్యతతో కూడుకున్నది. చాలా రీసెర్చ్ చేసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నట్లు కెనీషా చెప్పుకొచ్చింది.
బిగ్బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు
బిగ్బాస్ తెలుగు 10వ సీజన్ మొదలై నాలుగు రోజులు అయిపోయింది. మహాపరీక్ష పేరుతో ఇప్పటికే హోరాహోరీ పోటీ నడుస్తోంది. మరి నాలుగో రోజైన గురువారం(సెప్టెంబరు 10) ఎపిసోడ్లో అసలేం జరిగింది? ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకున్నాయి. మిడ్ వీక్లోనే చరణ్ ఎలిమినేట్ అయిపోవడం, అతడి చివరి మాటలు ఎలా సాగాయనేది ఈ హైలైట్స్లో చూద్దాం.బ్లాక్ షీప్ ఎవరు?మహాపరీక్ష పేరుతో జరుగుతున్న పోటీ కోసం కంటెస్టెంట్స్ బ్లూ, రెడీ టీమ్స్గా విడిపోయారు. తాజా ఎపిసోడ్లో చెరో బృందం నుంచి ఇద్దరిని నిల్చోమని బిగ్బాస్ చెప్పగా బ్లూ టీమ్ నుంచి త్రిగుణ్, ముఖేశ్.. రెడ్ టీమ్ నుంచి రోహిత్, వంశీ వచ్చారు. మీ టీమ్లో మీరు ఎవరిని హై రిస్క్లో పెట్టాలనుకుంటున్నారో చెప్పమని అడగడంతో.. త్రిగుణ్, ముఖేశ్... కృష్ణుడిని, రోహిత్, వంశీ.. చైత్ర పేరు చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని చెప్పిన బిగ్బాస్.. ఈ నలుగురు కంటెస్టెంట్స్ని బయటకు పంపి 'హూ ఈజ్ ది బ్లాక్ షిప్' గేమ్ ఆడించారు. ఇందులో బ్లూ టీమ్ గెలిచింది.షాలినీ- చైత్ర మాటల వార్అయితే ఈ గేమ్లో బ్లూ టీమ్ సరిగా ఆడలేదని రెడ్ టీమ్కి చెందిన రోహిత్ ప్రశ్నించగా.. కృష్ణుడి పేరు బ్లూ టీమ్ సరిగా రాయకపోవడంతో ఓడిపోయారు. చైత్ర పేరుని రెడ్ టీమ్ సరిగా రాసి టాస్క్లో గెలిచారు. అలా రోహిత్, వంశీ పర్మినెంట్ హౌస్మెట్స్ అయిపోయారు. ఈ సందర్భంగా షాలినీ.. ఏదైనా పాట పెట్టమని బిగ్బాస్ని అడిగింది. చైత్ర ఓవైపు హై రిస్క్లో ఉంటే డ్యాన్సులు కావాలా అని రాంప్రసాద్ అడగడంతో షాలినీ-చైత్ర మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. ఇద్దరూ మాటమాట అనుకున్నారు. చివరకు షాలిని ఏడ్చేసింది. దీంతో అంతా వెళ్లి ఆమెని ఓదార్చారు.త్రిగుణ్ వర్సెస్ రోహిత్కిచెన్లో గిన్నెలు తోమలేదని త్రిగుణ్ని రోహిత్ పిలిచి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా ఒకరికిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. అగ్రిపరీక్ష నుంచి చీప్గా వచ్చేశారు, నీ బాడీ మొత్తం మత్తు పదార్ధాలతో తయారైంది అని త్రిగుణ్, రోహిత్ని తక్కువ చేసి మాట్లాడాడు. రోహిత్ని డొల్లరాజా డొల్లరాజా అని పాట కూడా పాడి త్రిగుణ్ ఉడికించాడు.చరణ్ ఎలిమినేట్హై రిస్క్లో ఉన్న రాంప్రసాద్, చైత్ర, చరణ్ని పిలిచిన బిగ్బాస్.. ముగ్గురు మాట్లాడుకొని ఒకరు నామినేట్ అవ్వకుండా హై రిస్క్లో ఉంటూనే ఇంట్లో ఉంటారు అది ఎవరో మీరు నిర్ణయించుకోండి అని ఆదేశిస్తాడు. దీంతో చైత్ర లోపల ఉండాలని చరణ్.. రాం ప్రసాద్ లోపల ఉండాలని చైత్ర.. చైత్ర ఉండాలని రాం ప్రసాద్ చెప్పారు. దీంతో చైత్ర ఇంట్లోకి వెళ్లిపోయింది. మిగిలిన రాంప్రసాద్, చరణ్లో ఎవరు ఇంట్లో ఉండకూడదో వాళ్ల ముఖంపై పెయింట్ పూసి చెప్పాలని బిగ్బాస్.. మిగిలిన కంటెస్టెంట్స్ని ఆదేశించాడు. ఈ ప్రొసెస్లో తక్కువ ఓట్లు పడిన చరణ్.. మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు.కన్నీళ్లు తెప్పించిన చరణ్ఎలిమినేట్ అయిన తర్వాత మాట్లాడిన చరణ్ తెగ ఎమోషనల్ అయిపోయాడు. నేను వెళ్లిపోతానని కాదు గానీ జరిగింది నాకు నచ్చలేదు. నలుగురు అగ్నిపరీక్ష వాళ్లు నాకు ఓటేశారు. ఝాన్సీ నాకు ఓటు వేయలేదు. థ్యాంక్స్ ఇది గ్రూప్ గేమ్ కాదని నిరూపించినందుకు. నన్ను రాంప్రసాద్ అన్నని కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ అందరికీ నేను కొంచెం తక్కువగా కనిపిస్తా. మా టీమ్ నా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు. వాళ్లు నన్ను బలి పశువుని చేయలేదు అని భావోద్వేగానికి గురయ్యాడు. అలా నాలుగో రోజు ఆట ముగిసింది.
ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: ఎపిక్నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, శివాజీ, వాసుకి తదితరులుదర్శకత్వం: ఆదిత్య హాసన్సంగీతం: హేషమ్ వాహబ్సినిమాటోగ్రఫీ: అజీమ్ మహమ్మద్నిర్మాత: నాగవంశీవిడుదల తేదీ: 2026 సెప్టెంబరు 11‘బేబీ’తర్వాత ఇటు వైష్ణవి చైతన్య, అటు ఆనంద్ దేవరకొండ ఇద్దరూ బీజీ అయిపోయారు. వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకోలేకపోయారు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఇద్దరు కలిసి జంటగా ‘ఎపిక్’ మూవీలో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో నేడు(సెప్టెంబర్ 11 ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే?ఓటీటీలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన ‘#90స్’వెబ్ సిరీస్ లోని తమ్ముడు పాత్ర జీవితానికి సంబంధించిన కథ ఇది. ఆదిత్య(ఆనంద్ దేవరకొండ) పెద్దయ్యాక సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. అయితే ఇంట్లో వాళ్లు మాత్రం పైచదువుల కోసం లండన్ వెళ్లాలని ఒత్తిడి చేస్తారు. ప్లాన్ బిలో భాగంగా ఆదిత్య లండన్ వెళ్తాడు. అక్కడ కాలేజీలో తెలుగమ్మాయి కడలి(వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది. తొలి రోజే ఇద్దరూ బాగా దగ్గరవుతారు. ప్రేమ, పెళ్లి వద్దనుకొని సహజీవనం ప్రారంభిస్తారు. విభిన్న మనస్తత్వాలు, నేపథ్యాలు ఉన్న వీరి సహజీవనం ఎలా కొనసాగింది? పెళ్లి వద్దనుకొని లండన్ వచ్చిన కడలి.. ఆదిత్యతో బంధాన్ని ఎలా సాగించింది? వీరి బంధం సహజీవనానికే పరిమితం అయిందా లేదా ప్రేమ, పెళ్లి వరకు వెళ్లిందా? ప్రతి విషయంలోనూ ఇతరులపై ఆధారపడే ఆదిత్య.. ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..?కొన్ని సినిమా కథలు చాలా సింపుల్గా ఉంటాయి కానీ తెరపై చూస్తుంటే మాత్రం ఎంటర్టైన్ అవుతాం. ఎపిక్ కూడా అలాంటి సినిమానే. ఒక యువకుడు హైదరాబాద్ నుంచి యూకే వెళ్తాడు. అక్కడ ఒకమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది ఈ సినిమా కథ. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ పాయింట్ యూత్తో యూత్ని ఆకట్టుకునేలా సినిమా తీయొచ్చు. ఆదిత్య హాసన్ అదే చేశాడు. యువతరానికి నచ్చే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అవి వర్కౌట్ అయ్యాయి కానీ మిగతా చోట్ల చాలా వరకు రొటీన్గా, లాజిక్లెస్గా అనిపిస్తాయి. కడలి పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా సరిగా లేదు. మొదట్లో ఆ పాత్రను చాలా మెచ్యూర్డ్గా పరిచయం చేసి ఆ తర్వాత సాధారణ అమ్మాయిలాగే చూపించారు. ఆమె నేపథ్యం ఒకలా.. లండన్లో ఆమె ప్రవర్తించే తీరు మరోలా ఉంటుంది. ఆదిత్య, కడలి మధ్య ఉన్న బంధం ప్రేమేనా లేదా ఇంకా వేరేదా అనేది క్లారిటీ ఉండదు. పరిచయం అయిన తొలి రోజే కడలి మెచ్యూర్డ్ అమ్మాయి..ఆదిత్య రూమ్కి వెళ్లడం..ముద్దులు పెట్టుకోవడం..ఆ తర్వాత వెంటనే హద్దులు దాటడం అనేది కన్విన్సింగ్గా అనిపించదు. అయితే ఆయా సన్నివేశాలు మాత్రం యూత్ని బాగా ఆకట్టుకుంటాయి. అలా అని దర్శకుడు తెరపై రొమాన్స్ మాత్రమే చూపించలేదు. సింపుల్ కథే అయినా అందులో చాలా మంచి విషయాలు చర్చించాడు కూడా. ప్రస్తుతం సమాజంలో ఉన్న కులాల పట్టింపు, అమ్మాయిల ఎదుర్కొనే శారీరక సమస్యలు..లాంటి అంశాలను పైపైన చూపిస్తూనే ఆలోచింపజేశాడు.ఫస్టాఫ్ మొత్తం ఫుల్ రొమాంటిక్గా, యూత్ని ఆకట్టుకునే సన్నివేశాలతో కొనసాగతుంది. ఆదిత్య, కడలి పరిచయం అవ్వడం.. సహజీవనం కొనసాగించడం.. మధ్య మధ్యలో మిడిల్ క్లాస్ కష్టాలను చూపిస్తూ ప్రథమార్థం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక సెకండాఫ్ కాస్త ఎమోషనల్గా సాగుతుంది. ఇద్దరి సహజీవనం కాస్త ప్రేమగా మారడం..ఆదిత్య గందరగోళానికి లోనై స్నేహితుడితో మాట్లాడడం.. అతను చెప్పినట్లుగా ఫాలో అవ్వడం ఇలా కథ మొత్తం అక్కడక్కడే తిరుగుతుంది. దీంతో సెకండాఫ్ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ముగింపు కూడా గొప్పగా ఉండదు.ఎవరెలా చేశారు?ఇక నటన విషయానికి వస్తే ఆనంద్, వైష్ణవి అనగానే 'బేబి' సినిమా గుర్తొస్తుంది. ఆ ఇమేజ్ నుంచి బయటపడి కొత్తగా కనిపించారు. ఆనంద్ తన పాత్రలో సహజంగా అనిపించగా, వైష్ణవి మోడ్రన్ అమ్మాయి పాత్రలో కాన్ఫిడెంట్గా నటించింది. శివాజీ, వాసుకి తమ పాత్రలకు న్యాయం చేశారు. కళ్యాణ్ శంకర్, శ్రీనివాస్ గవిరెడ్డి అక్కడక్కడా నవ్వించారు. సాంకేతిక అంశాలకొస్తే హేషమ్ అబ్దుల్ వాహబ్ నేపథ్య సంగీతం బాగుంది. అజీమ్ మహమ్మద్ కెమెరా పనితనం, యూకే లొకేషన్స్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. నిర్మాణ విలువలు అదిరిపోయాయనని చెప్పొచ్చు.-అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్
పిల్లలు లేకపోయినా పర్లేదనుకున్నాం.. కానీ
సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లి, పిల్లల్ని కనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కెరీర్ పరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని ఈ విషయాల్ని కాస్త ఆలస్యంగానే ప్లాన్ చేస్తుంటారు. అయితే తన ప్రెగ్నెన్సీ మాత్రం అనుకోకుండానే జరిగిందని హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదంతా బయటపెట్టింది.'నాకు ప్రెగ్నెన్సీ రావడం పెద్ద సర్ప్రైజ్. గర్భం దాలుస్తానని అస్సలు ఊహించలేదు. మా ఇంటి బంగారం సినిమాలోని తస్సాదియ్యా పాట షూటింగ్ చేస్తున్న టైంలో నాకు కాస్త నీరసంగా అనిపించింది. డాక్టర్ దగ్గరకెళ్తే నా ప్రెగ్నెన్సీ గురించి తెలిసింది. నిజం చెప్పాలంటే నేను,రాజ్.. పిల్లల కోసం ప్లాన్ చేయలేదు. పెళ్లికి ముందే ఈ సంగతి మాట్లాడుకున్నాం''ఒకానొక టైంలో నేను, రాజ్ ఇద్దరం పిల్లలు లేకపోయినా పర్లేదని అనుకున్నాం. నాకు ఓకే. రాజ్ కూడా ఓకే అని అన్నాడు. కానీ ఇలా ప్రెగ్నెన్సీ వస్తుందని అనుకోలేదు. ఇది నాకు ఆశ్చర్యకరమైన విషయం' అని సామ్ చెప్పుకొచ్చింది. మగ-ఆడబిడ్డ ఎవరు పుట్టినా సరే వాళ్ల కోసం షాపింగ్ చేసేసింది. ఏం పేరు పెట్టాలనేది కూడా ముందే నిర్ణయించుకున్నామని కూడా సమంత చెప్పింది.గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. తర్వాత విడాకులు తీసుకుంది. గతేడాది డిసెంబరులో 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ రాజ్ నిడిమోరుని వివాహం చేసుకుంది. ఈ ఏడాది 'మా ఇంటి బంగారం' సినిమాతో వచ్చి రూ.100 కోట్లకు పైగా వసూళ్లని అందుకుంది. దీని రిలీజ్ టైంలో సామ్ ప్రెగ్నెంట్ అయిందనే సంగతి బయటకొచ్చింది. ఈ డిసెంబరులోనే బిడ్డ పుట్టే అవకాశముందని తెలుస్తోంది.
క్రీడలు
ఫైనల్లో సబలెంకా; పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు!
యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో బెలారస్ స్టార్ అరీనా సబలెంకా ఫైనల్కు దూసుకెళ్లింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సబలెంకా 7-5, 6-2తో అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై సునాయాస విజయాన్ని అందుకుంది. కేవలం రెండు సెట్లలోనే ప్రత్యర్థిని చిత్తు చేసిన సబలెంకా నాలుగోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పటికే 2024, 2025 యూఎస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన సబలెంకా హ్యాట్రిక్పై కన్నేసింది. అంతేకాదు హార్డ్కోర్ట్పై వరుసగా మూడో టైటిల్ అందుకునేందుకు సబలెంకా అడుగు దూరంలో నిలిచింది. మరో సెమీస్లో అమెరికా స్టార్ కోకో గాఫ్ను ఓడించిన రిబాకినా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. రేపు జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో డిపెండింగ్ చాంపియన్ సబలెంకాతో రిబాకినా అమీతుమీ తేల్చుకోనుంది. ఇక గతంలో రెండుసార్లు (2024, 2025 యూఎస్ ఓపెన్) ఫైనల్లో పెగులాను ఓడించి టైటిల్ అందుకున్న సబలెంకా ఈసారి పెగులాను సెమీస్లోనే చిత్తు చేయడం విశేషం.మ్యాచ్లో 29 విన్నర్లతో స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన సబలెంకా మ్యాచ్ విజయం అనంతరం మాట్లాడుతూ.. ‘నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా. గత రెండు యూఎస్ ఓపెన్ టోర్నీల్లో పెగులాను ఫైనల్లో చిత్తు చేసి టైటిల్ అందుకుంటే, ఈసారి మాత్రం ఆమెతో పోటీ సెమీస్లోనే ఎదురైంది. ఇదే హార్డ్కోర్టుపై నెల రోజుల క్రితం పెగులా నన్ను సెమీస్లో ఓడించింది. ఇప్పుడు ఆ ఓటమికి బదులు తీర్చుకున్నా (నవ్వుతూ). అయితే పెగులాను మ్యాచ్లో మాత్రమే ప్రత్యర్థిగా చూస్తాను. బయటం మేం మంచి స్నేహితులం. ఇక న్యూయార్క్ నగరం నాకు చాలా ఇష్టం. వరుసగా మూడో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించేందుకు అడుగు దూరంలో నిలిచిన నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా.’ అని చెప్పుకొచ్చింది.THREE-PEAT: STILL ON 🗽Aryna Sabalenka defeats Pegula 7-5, 6-2 and will once again compete in the US Open championship match on Saturday! pic.twitter.com/1mLbWR0HXG— US Open Tennis (@usopen) September 11, 2026 Del 2023 al 2026, Aryna Sabalenka he llegado a la Final del US Open. Dominante 🤯 pic.twitter.com/Eo2kpEZ2av— US Open Tennis (@usopen) September 11, 2026Read: నన్నే పక్కన పెడతారా? 10 వికెట్లతో విరుచుకుపడ్డ టీమిండియా స్టార్!
నన్నే పక్కన పెడతారా? 10 వికెట్లతో విరుచుకుపడ్డ టీమిండియా స్టార్!
న్యూజిలాండ్తో రాబోయే టెస్టు సిరీస్కు ముందు టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్లో యార్క్షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు తన బౌలింగ్తో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. సర్రే జరిగిన మ్యాచ్లో కుల్దీప్కు బౌలింగ్ చేసే అవకాశం రాకపోయినా.. హెడ్డింగ్లీ వేదికగా ఎసెక్స్తో పోరులో మాత్రం అతడు చెలరేగిపోయాడు. తన స్పిన్ మయాజాలంతో ఎసెక్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడగొట్టిన కుల్దీప్.. రెండో ఇన్నింగ్స్లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ఎసెక్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ యూపీ స్పిన్నర్ మొత్తంగా 10 వికెట్లు పడగొట్టి కివీస్తో సిరీస్కు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని సెలెక్టర్లకు బలమైన సంకేతాలు పంపాడు. ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో యార్క్షైర్ విజయం సాధించింది.ఇటీవల శ్రీలంక పర్యటనలో కుల్దీప్ యాదవ్కు కేవలం ఒక్క మ్యాచ్లోనే ఆడే అవకాశం లభించింది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత టీమ్ మేనేజ్మెంట్ అతడిని సరిగ్గా ఉపయోగించుకోలేదనే విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్ మొత్తం మీద అతడికి కేవలం 25 ఓవర్లు మాత్రమే బౌలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన రెండో టెస్టులో ఏకంగా అతడిని తుది జట్టు నుంచే తప్పించి, అతడి స్థానంలో సారాంశ్ జైన్కు చోటు కల్పించారు. అనారోగ్యం కారణంగానే కుల్దీప్కు విశ్రాంతి ఇచ్చామని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. కానీ అనారోగ్యం ఏమి లేదని, కావాలనే అతడిని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించారనే ప్రచారం గట్టిగా సాగింది. ఏదేమైనప్పటికి కుల్దీప్ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లకు, టీమ్ మేనేజ్మెంట్కు మరోసారి గట్టి సమాధానమిచ్చాడు.చదవండి: వైభవ్పై ఫిర్యాదు చేసిన తిలక్ వర్మ.. అసలేం జరిగిందంటే
US Open: సెమీస్లో గాఫ్ ఓటమి.. ఫైనల్కు దూసుకెళ్లిన రైబాకినా
యుఎస్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్లో అమెరికన్ టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ పోరాటం ముగిసింది. శుక్రవారం వరల్డ్ నంబర్ 2 ఎలెనా రైబాకినాతో జరిగిన సెమీఫైనల్లో 3-6, 6-4, 6-4 తేడాతో గాఫ్ ఓటమి పాలైంది. ఈ ఓటమితో గాఫ్ ఇంటి ముఖం పట్టగా.. రైబాకినా ఫైనల్కు దూసుకెళ్లింది. సెప్టెంబర్ 12న జరగనున్న తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అరినా సబాలెంకాతో రైబాకినా తలపడనుంది.ఇక సెమీస్ విషయానికి వస్తే.. ఆరంభంలో గాఫ్ ఆధిపత్యం ప్రదర్శించి ఆరో గేమ్లో సర్వీస్ బ్రేక్ చేసి మొదటి సెట్ను 3-6తో సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్లో గాఫ్ వరుస తప్పిదాలు చేయడంతో రైబాకినా తిరిగి పుంజుకుంది. ఈ కజకిస్తాన్ టెన్నిస్ స్టార్ రెండో సెట్ను 6-4తో గెలుచుకుని మ్యాచ్ను సమం చేసింది. అనంతరం నిర్ణయాత్మక మూడో సెట్ కూడా చివరివరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరంభంలోనే రైబాకినా 5-3 ఆధిక్యంలోకి వెళ్లగా.., గాఫ్ మళ్లీ బ్రేక్ సాధించింది. అయితే చివరికి సర్వీస్ను నిలబెట్టుకున్న 6-4 తేడాతో రైబాకినా విజయాన్ని ఖాయం చేసుకుంది.
వైభవ్పై ఫిర్యాదు చేసిన తిలక్ వర్మ.. అసలేం జరిగిందంటే
దులీప్ ట్రోఫీ-2026 విజేతగా ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్జోన్ నిలిచిన సంగతి తెలిసిందే. సౌత్జోన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ‘డ్రా’గా ముగియగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్కు 14 ఏళ్ల తర్వాత ట్రోఫీ దక్కింది. అయితే ఈ మ్యాచ్లో సౌత్జోన్ కెప్టెన్ తిలక్ వర్మ, ఈస్ట్జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ మధ్య సరదా స్లెడ్జింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.అసలేమి జరిగిందంటే?తొలి రోజు ఆటలో వైభవ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తిలక్ అతడి వద్దకు వెళ్లి.. ఏంటి వైస్ కెప్టెన్? అంత స్లోగా బ్యాటింగ్ చేస్తున్నావు? అని స్లెడ్జ్ చేశాడు. అయితే అందుకు బదులుగా నాలుగో రోజు ఆటలో తిలక్ బ్యాటింగ్కు వచ్చినప్పుడు వైభవ్ కూడా అతడిని సరదాగా ఆటపట్టించాడు. తిలక్ వద్దకు దగ్గరగా వెళ్లి మాట్లాడే క్రమంలో వైభవ్ భుజం అతడికి తగిలింది. దీంతో తిలక్ అంపైర్కు ఫిర్యాదు చేశాడు. అంపైర్ వచ్చి వైభవ్ను మందలిస్తుండగా.. "సార్, ఫస్ట్ ఇన్నింగ్స్లో నాతో కూడా ఇలాగే జరిగింది" అని వైభవ్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈస్ట్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(270) అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం సౌత్జోన్ తమ మొదటి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత ఈస్ట్జోన్ తమ రెండో ఇన్నింగ్స్ను ఆఖరి రోజు ఆటలో 7 వికెట్ల నష్టానికి 388 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కౌనైన్ ఖురేషీ (190 బంతుల్లో 116 నాటౌట్; 13 ఫోర్లు, 4 సిక్స్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా, అనుకూల్ రాయ్ (112 బంతుల్లో 64; 4 ఫోర్లు, 2 సిక్స్లు), కుమార్ కుషాగ్ర (46) రాణించారు.సౌత్ బౌలర్లలో నిధీశ్ 2 వికెట్లు పడగొట్టగా...సీవీ మిలింద్, సిరాజ్, రషీద్, విజయ్ ఒక్కో వికెట్ తీశారు. గురువారం 48.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఈస్ట్ మరో 176 పరుగులు జోడించింది. ఫలితం ‘డ్రా’ ఖాయం కావడంతో సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగకుండా ఇరు జట్ల కెప్టెన్లు ఆటను ముగించేందుకు అంగీకరించారు. ఇషాన్ కిషన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... తిలక్ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.చదవండి: ENG vs PAK: సేమ్ సీన్ రీపీట్! అప్పుడు సెహ్వాగ్.. ఇప్పుడు పాక్ ఓపెనర్Pure drama in the #DuleepTrophy 2026 Final! 🍿#TilakVarma had a word for #VaibhavSooryavanshi in the 1st innings... and the youngster served it right back while Tilak was batting! 🔥🗣️ pic.twitter.com/DPdi3iwVRA— Star Sports (@StarSportsIndia) September 10, 2026
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
కొండా సురేఖను తప్పించాల్సిందే.... కేసీ వేణుగోపాల్తో భేటీలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
బిజినెస్
కార్పొరేట్లకు ముకేశ్ అంబానీ పిలుపు
ముంబై: ఉద్యోగాలు చేసే మహిళలు, మాతృమూర్తులకు సహాయకరంగా ఉండే వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ఇందుకోసం కంపెనీలు సమిష్టిగా కలిసి పని చేయాలని సూచించారు. ఎస్బీఐ మాజీ చైర్పర్సన్, సేల్స్ఫోర్స్ దక్షిణాసియా ప్రెసిడెంట్, సీఈవో అరుంధతి భట్టాచార్య రాసిన ‘ఇన్డామిటబుల్: ఎ వర్కింగ్ ఉమన్స్ నోట్స్ ఆన్ వర్క్, లైఫ్ అండ్ లీడర్షిప్’ హిందీ ఎడిషన్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన తెలిపారు. దేశంలోని మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగినప్పుడే దేశం కూడా తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ముకేశ్ అంబానీ ఉద్ఘాటించారు. అరుంధతి భట్టాచార్య జీవితం ఇందుకు నిదర్శనమంటూ కొనియాడారు.
బంగారానికి క్రూడ్ ‘షాక్’!
ముంబై: బాండ్లపై రాబడులు పెరగడం, అమెరికా కరెన్సీ డాలర్ బలోపేతంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. కామెక్స్లో ఔన్స్ బంగారం ధర 1.68 శాతం క్షీణించి 4,400 డాలర్ల దిగువన 4,386 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ధర ఔన్స్ 5.37 శాతం పతనమై 65 డాలర్ల స్థాయిని కోల్పోయి 64.92 డాలర్ల వద్ద కదలాడుతోంది.బ్రెంట్ క్రూడాయిల్ ధర 102 డాలర్ల మార్కును దాటడంతో ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో అమెరికా కేంద్ర బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ వడ్డీ రేట్లను పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటుందనే అంచనాలు తీవ్ర ఒత్తిడి పెంచాయి. ‘‘రాబోయే అమెరికా పీసీఈ ద్రవ్యోల్బణ గణాంకాలు, వచ్చే వారం జరగనున్న ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయాలు పసిడి తదుపరి గమనాన్ని నిర్దేశిస్తాయి.’’ అని ఆనంద్ రాఠీ రీసెర్చ్ విశ్లేషకురాలు వేదికా నర్వేకర్ తెలిపారు.ఎంసీఎక్స్లోనూ నేల చూపులే అంతర్జాతీయ ప్రభావానికి తోడు డాలర్ మారకంలో రూపాయి విలువ 44 పైసలు క్షీణించడంతో ఎంసీఎక్స్లో బంగారం, వెండి ధరలు నేలచూపు లు చూశాయి. అక్టోబర్ కాంట్రాక్టు పది గ్రాము ల పసిడి ధర దాదాపు 1% క్షీణించి రూ. 1,52,249 వద్ద ట్రేడవుతుండగా, కిలో వెండి ధర 3.63 శాతం పతనమై రూ. 2,35,347 వద్ద ట్రేడవుతోంది. ‘‘స్వల్పకాలంలో దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ. 1,51,500 – రూ. 1,55,000 శ్రేణి మధ్య కదలాడొచ్చు’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ విశ్లేషకుడు జతీన్ త్రివేది విశ్లేషించారు.
హీరో మోటర్స్ రూ. 1,000 కోట్ల ఐపీవో
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ దిగ్గజం హీరో మోటర్స్ తమ ఐపీవోకి సంబంధించి షేర్ల ధర శ్రేణి రూ. 79–84గా ఉంటుందని వెల్లడించింది. దీని ద్వారా కంపెనీ రూ. 1,000 కోట్లు సమీకరించనుంది. ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 16న ప్రారంభమై 18న ముగుస్తుంది. సెప్టెంబర్ 23న లిస్ట్ కావొచ్చని అంచనా. ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్ల వరకు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్లు రూ. 400 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్ఎస్లో ఓపీ ముంజల్ హోల్డింగ్స్ రూ. 395 కోట్ల షేర్లను, హీరో సైకిల్స్ రూ. 5 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. తాజా షేర్ల జారీ ద్వారా లభించే నిధుల్లో రూ. 190 కోట్ల మొత్తాన్ని నిర్దిష్ట రుణాలను తిరిగి చెల్లించివేసేందుకు, రూ. 200 కోట్లను ఉత్తర్ ప్రదేశ్లోని ప్లాంటు విస్తరణకి యంత్రపరికరాలను కొనుగోలు చేసేందుకు కంపెనీ వినియోగించుకోనుంది. మిగతా మొత్తాన్ని ఇతర సంస్థల కొనుగోళ్లు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించుకోనుంది. హీరో మోటర్స్ 2025 జూన్లో రూ. 1,200 కోట్ల సమీకరణ కోసం డీఆర్హెచ్పీ దాఖలు చేసింది. దాని ప్రకారం తాజా షేర్ల జారీ ద్వారా రూ. 800 కోట్లు, ఓఎఫ్ఎస్ కింద రూ. 400 కోట్లు సమీకరించాలని సంస్థ భావించింది. ఆ తర్వాత తాజా షేర్ల జారీని రూ. 600 కోట్లకు కుదించడంతో మొత్తం ఐపీవో పరిమాణం రూ. 1,000 కోట్లకు పరిమితమైంది.
సిప్ సూపర్హిట్
న్యూఢిల్లీ: మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ ఈక్విటీలకు ఆకర్షణ తగ్గడం లేదు. ఆగస్టులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి (ఎంఎఫ్) రూ. 29,329 కోట్ల పెట్టుబడులు రావడం ఇందుకు నిదర్శనం. జూలైలో నమోదైన రూ. 24,697 కోట్లతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్పై ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగడం ఇందుకు దోహదపడినట్లు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సంఘం యాంఫీ గణాంకాల్లో వెల్లడైంది. ఇక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లలో (సిప్) రిటైల్ పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. జూలైలో రూ. 31,961 కోట్ల పెట్టుబడులు రాగా ఆగస్టులో రూ. 32,297 కోట్లకు పెరిగాయి. గతేడాది ఆగస్టులో నమోదైన రూ. 28,265 కోట్లతో పోలిస్తే 14 శాతం పెరిగాయి. తాజా గణాంకాలు కూడా కలిపితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లో సిప్ల రూపంలో మొత్తం రూ. 1.6 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచి్చనట్లయింది. దీర్ఘకాలికంగా సంపదను సృష్టించుకునేందుకు క్రమశిక్షణతో కూడుకున్న సాధనాలుగా ఫండ్స్పై ఇన్వెస్టర్లకు నమ్మకం పెరుగుతోందని, సిప్ ఖాతాలు కీలకమైన 10.02 కోట్ల మైలురాయిని దాటడం ఇందుకు నిదర్శనమని యాంఫీ సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. ఈక్విటీ ఫండ్స్లోకి వరుసగా 66వ నెలా పెట్టుబడుల ప్రవాహం కొనసాగిందని పేర్కొన్నారు. సిప్ పెట్టుబడులు రికార్డు స్థాయిలో రావడం, పెట్టుబడులను నిలిపివేసే ధోరణి నెమ్మదిస్తుండటం మొదలైన అంశాలు భారతీయ ఇన్వెస్టర్లలో పెరుగుతున్న క్రమశిక్షణను సూచిస్తోందని నిప్పన్ ఇండియా మ్యుచువల్ ఫండ్ ప్రెసిడెంట్ సౌగత చటర్జీ తెలిపారు. మార్చిలో మార్కెట్ దిగువ స్థాయి నుంచి మళ్లీ కోలుకున్నాక, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు ర్యాలీ కొనసాగిస్తుండగా, లార్జ్ క్యాప్స్ వెనుకబడినట్లు జర్మినేట్ ఇన్వెస్టర్ సరీ్వసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ తెలిపారు. గత రెండు, మూడు నెలలుగా మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి పెట్టుబడులు పెరిగాయని పేర్కొన్నారు. యాంఫీ గణాంకాల్లో మరిన్ని విశేషాలు.. → డెట్ ఆధారిత స్కీముల్లోకి పెట్టుబడుల రాక రివర్స్ కావడంతో ఆగస్టులో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ స్థాయిలోకి వచి్చన ఇన్వెస్ట్మెంట్స్ గణనీయంగా పడిపోయి రూ. 41,353 కోట్లకు పరిమితమయ్యాయి. n నికర ప్రవాహం తగ్గినప్పటికీ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఏయూఎం 1.5 శాతం పెరిగి రూ. 87.08 లక్షల కోట్లకు చేరింది. → ఈక్విటీ ఆధారిత స్కీముల్లోకి నికరంగా రూ. 29,328.62 కోట్లు వచ్చాయి. ఏప్రిల్ తర్వాత ఇదే అత్యధికం. అప్పట్లో రూ. 38,440 కోట్లు వచ్చాయి. n ఈక్విటీల విభాగంలో స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్స్ పటిష్టంగా ఉంటున్నాయి. ఈ రెండు కేటగిరీల్లోకి దాదాపు రూ. 15,000 కోట్లు వచ్చాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి అత్యధికంగా రూ. 7,973 కోట్లు, మిడ్ క్యాప్ ఫండ్స్లోకి రూ. 6,989 కోట్లు, వచ్చాయి. → గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)పై ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగింది. వీటిలోకి జూలైలో రూ. 1,559 కోట్లు రాగా ఆగస్టులో రూ. 2,597 కోట్లు వచ్చాయి. ఇక సిల్వర్ ఈటీఎఫ్లలోకి కూడా నికరంగా రూ. 1,271 కోట్లు వచ్చాయి.
ఫ్యామిలీ
క్యాట్లో మంచి స్కోర్.. ఐనా సైన్యంలోకి! కానీ చివరికి..
క్యాట్లో మంచి మార్కులు సంపాదించి చక్కటి కార్పొరేట్ కొలువుల్లో మంచి ప్యాకేజ్తో జాబ్ కొట్టాలనేది చాలామంది యువత డ్రీమ్. అయితే ఈ వ్యక్తి కష్టతరమైన క్యాట్ పరీక్షలో అవలీలగా మంచి మార్కులు తెచ్చుకున్నా..వద్దని మరి దేశ సేవ మిన్నా అటూ సైన్యంలో చేరాడు. కానీ అతడు ఒకటి తలిస్తే విధి మరోలా తలిచి ఎన్ని పరీక్షలు పెట్టిందంటే..వింటేనే కన్నీళ్లు వచ్చేస్తాయి. అయినా వెనక్కి తగ్గకుండా వెళ్లినా..ఈసారి మరింత కఠినంగా పరీక్ష పెట్టింది. ఎంతలా అంటే .. కథన రంగంలో కాదు నీ శరీరంతో యుద్ధ చేయి అని సవాలు విసురుతున్నట్లుగా దాడి చేస్తోంది ఆ అరుదైన వ్యాది. ఆ వ్యక్తే మాజీ ఆర్మీ అధికారి కల్నల్ అనురాగ్ ఉపాధ్యాయ్. క్యాట్ పరీక్షలో మంచి ప్రతిభ కనబర్చినప్పటికీ కార్పొరేట్ కెరీర్ వద్దంటూ ఆర్మీని ఎంచుకున్నారు. అందులో ఆయన అత్యంత కఠినతరమైన ఆయన పారా స్పెషల్ ఫోర్సెస్లోకి వెళ్లారు. ఇది భారతదేశపు అత్యున్న స్పెషల్ ఫోర్సెస్. అలా ఆయన 3 PARA (SF)తో తన ప్రొబేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత, సరికొత్తగా ఏర్పాటు చేసిన 12 PARA (SF) రెజిమెంట్ను బృందంలో కీలక సభ్యునిగా వ్యవహరించారు. అయితే ఆయన కలలు కన్న ప్రపంచంలోకి సాగనివ్వకుండా విధి ఆయన జీవితాన్ని ఎలాంటి కుదుపులకు గురిచేసిందంటే..చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు..ఐనా..2008లో గుండెపోటుకు గురైనప్పటికీ దేశ సేవను కొనసాగించాలనే అచంచలమైన లక్ష్యంతో తిరిగి విధుల్లోకి చేరారు. ఆయన ఇచ్చిన ఎంట్రీని తోటి మాజీ సైనికులు దృఢ సంకల్పం, శక్తిమంతమైన అంకితభావానికి కేరాఫ్గా అభివర్ణించారు. ఇంతలా రోగంతోనే యుద్ధం చేసిన ఈ వీరుడిని మరోసారి అనారోగ్యం దాడి చేసింది. ఈ సారి 2025 ఆగస్టులో తీవ్రమైన పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్కు గురయ్యారు. ఆ స్ట్రోక్ వల్ల ఆరోగ్యం తీవ్రంగా క్షీణించి నరాలకు సంబంధించిన లాక్డ్-ఇన్ సిండ్రోమ్ బారినపడ్డారు. దీని వల్ల తీవ్ర పక్షవాతానికి గురై మొత్తం అవయవాలన్ని చచ్చుబడిపోతాయి. కేవలం కంటి కదలికలతో ఆల్ఫాబేట్ స్కానింగ్తో మాత్రమే మాట్లాడగలరు. ఆయనకు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థమవుతున్నా.. ఆయన కదలలేరు, మాట్లాడలేరు. అంతేగాదు ఇతర అనారోగ్య సమస్యల రీత్యా మోకాళ్ల కింద నుంచి రెండు కాళ్లను కూడా తొలగించారు వైద్యులుఈసారి విధి అరుదైన వ్యాధి రూపంలో ఆయన్ను ఓడించేలా దాడి చేస్తున్నా..అనురాగ్ కనబరుస్తున్న మొక్కవోని ధైర్యం ప్రతి ఒక్కర్ని కదిలిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతడి కుటుంబం ఈ అరుదైన వ్యాధిపై పరిశోధనలు చేసే శాస్రవేత్తలు, నిపుణులు దయచేసి అతడికి సాయం చేయాలని కోరుతున్నారు. దేశ సేవ కోసం ఇంతలా కష్టపడ్డ అతడి కోసం ఏదైనా చేసి రక్షించండి అని వేడుకుంటున్నారు. అంతేగాదు అతడి చివరి శ్వాస వరకు దేశ సేవలో ఉండాలనేది అతడి ఆశయం అంటూ ఆర్మీ అధికారులను, నిపుణులను సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నిజానికి అసలు అనారోగ్య సమస్య వస్తేనే..రిస్క్ తీసుకుని పనిచేసే ఉద్యోగాల దరిదాపుల్లోకి రావడానికి ఇష్టపడం. కానీ అజేయమైన తెగువతో దేశ సేవ తన కర్తవ్యం, డ్యూటే దైవంగా సాగిన అతడి అంకితభావానికి, అనారోగ్యంతో పోరాడిన అతడి మొక్కవోని ధైర్యానికి జయహో అనాల్సిందే కదూ..!.(చదవండి: ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని కాదని యోగ టీచర్గా!)
ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని కాదని యోగ టీచర్గా!
సురక్షితమైన, స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామంది యువత డ్రీమ్ అలాంటి ఉద్యోగాన్ని వద్దనుకోవడానికి చాలా గట్స్ ఉండాలి. తీరా ఆ నిర్ణయం భవిష్యత్తులో బాధను కలిగించకుండా ఉంటుందా అనే సందేహాం సదా వెంటాడుతుంటుంది. అయినా సరే ఇంతటి భయానక నిర్ణయం తీసుకుంది ఈ మహిళ. అది కూడా దేని కోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఉత్తరప్రదేశ్కు చెందిన స్నిగ్ధా బోస్ సురక్షితమైన స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని కాలదన్నుకుంది. ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్గా మంచి జీతం ఆర్జించే ఉద్యోగాన్ని వదులకుందామె. అసలు ఈ నిర్ణయాన్ని చాలామంది తప్పుబట్టారు, వెర్రి నిర్ణయంగా అభివర్ణించారు. అయితే ఆ ఉద్యోగంలో తను పనిచేస్తున్నట్లుగా అనిపించలేదని, నిరంతరం ఒత్తిడి, మానసిక అలసట, సొంత శరీరంలో అనుసంధానం కావడానికి సమయమే లేనట్లుగా అనిపించిందని చెబుతుంది. ఏదో ఉక్కిరిబిక్కిరిగా అనిపించి ఆ ఉద్యోగం వదిలేసినట్లు పేర్కొంది స్నిగ్ధా. ఆ తర్వాత మీరట్లో యోగాకి సంబంధిచిన 'తులా వెల్నెస్ స్టూడియోని నడుపుతున్నట్లు తెలిపింది. తనకు ఆర్థిక భద్రత కంటే వ్యక్తిగత శ్రేయస్సే ముఖ్యమనిపించిందని అంటోంది. ఇలా తనలా ఉద్యోగం మానేసేంత సౌలభ్యం అందరికీ ఉండకపోవచ్చు. అలాగే తనలా చేయాల్సిన పనిలేదు కూడా. ఒత్తిడితో ఉద్యోగం చేస్తూ కూడా ఆరోగ్యాన్ని చూసుకోచ్చు. ఒక పక్క ఉద్యోగం, అలాగే శారీరక బలం పెంపొందిచుకునేలా చురుగ్గా ఉండే ప్రయత్నం చేయొచ్చని అంటోంది. చెప్పాలంటే జీవితాన్ని మార్చకుండానే ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయొచ్చని, కానీ తనకు ఆ అవకాశం ఉంది కాబట్టి మానసిక ఆరోగ్యమే ప్రధానంగా భావించి, ఇలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నా అని సోషల్ మీడియా వేదికగా తన స్టోరీని పంచుకుంది స్నిగ్ధా. అంతేగాదు నెటిజన్లు కూడా మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న స్నిగ్ధ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ..తమ అనుభవాల్ని పంచుకున్నారు. మరొక యూజర్ తాను కూడా ఎస్బీఐలో ఉద్యోగం మానేసి తనకు నచ్చి గోల్ప్ క్రీడపై ఫోకస్ పెట్టి అంతర్జాతీయ క్రీడాకారిణిగా దూసుకుపోతున్నా అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Snigdha | Certified Yoga & Pranayam Instructor (@tulaa_wellness) (చదవండి: అర ఎకరం..ఏడాదికి రూ. 80 లక్షలు!)
‘డాల్ఫిన్ గార్డ్’..! ఆరేళ్ల చిన్నారి ఘనత..
సముద్రంలో మనుషుల కార్యకలాపాలు పెరుగుతున్నకొద్దీ అందులోని జీవుల మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. ముఖ్యంగా పడవలు తిరిగే ప్రాంతాల్లో డాల్ఫిన్లు ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇందుకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైనా పరిష్కారం చూపించగలమా? అనే ప్రశ్న ఓ ఆరవ తరగతి బాలికను ఆలోచింపజేసింది. అలా ఆమె ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే డాల్ఫిన్ గార్డ్ ప్రాజెక్ట్. అదే పరిశోధన ఆమెను బుల్లిశాస్త్రవేత్తగానూ, స్టేట్ విన్నర్ గానూ నిలిచేలా చేసింది.అమెరికాలోని వర్జీనియా బీచ్, ఓల్డ్ డొనేషన్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న ఇషాన్వి సఖార్పే రూపొందించిన ‘డాల్ఫిన్ గార్డ్’ అనే ప్రాజెక్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఆవిష్కరణకు గాను ఆమెకు 2026 వర్జీనియా రాష్ట్ర ప్రతిభా పురస్కారం, ప్రత్యేక గుర్తింపు లభించాయి. డాల్ఫిన్లు ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత రక్షించడం కంటే.. అసలు ప్రమాదమే జరగకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం మంచిదన్నది అసలు డాల్ఫిన్ గార్డ్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.. పడవల ప్రొఫెల్లర్లు, చేపల వలలు వంటి వాటి వల్ల డాల్ఫిన్లకు తీవ్రమైన ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సముద్రంలో మానవ కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య కూడా పెరుగుతోంది. అందుకే ప్రమాదాన్ని గుర్తించి, అది తీవ్రమయ్యేలోపే తగ్గించే మార్గం గురించి ఇషాన్వి తన ప్రాజెక్ట్లో పరిశోధించింది. అదే డాల్ఫిన్ గార్డ్ ప్రత్యేకత. అయితే ఇషాన్వి ప్రాజెక్ట్ సాధారణ స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్గా మిగిలిపోలేదు. అమెరికాలోని మిడిల్ స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక ‘3ఎం’ యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్లో ఆమె ఇదే కాన్సెప్ట్తో పాల్గొంది. ఈ పోటీలో విద్యార్థులు తమ శాస్త్రీయ ఆలోచన లేదా ఆవిష్కరణను చిన్న వీడియో ద్వారా పరిచయం చేయాలి. కొత్త ఆలోచన, శాస్త్రీయ పరిజ్ఞానం, సమస్య పరిష్కార సామర్థ్యం, కమ్యూనికేషన్, ప్రదర్శన వంటి అంశాల ఆధారంగా ప్రాజెక్టులను పరిశీలిస్తారు. అయితే ఇషాన్వి రూపొందించిన ఈ ‘డాల్ఫిన్ గార్డ్’ప్రాజెక్టు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చివరకు ఆమె వర్జీనియా స్టేట్ మెరిట్ విన్నర్గా నిలిచింది. ఇషాన్వికి సైన్స్పై మాత్రమే ఆసక్తి ఉందనుకుంటే పొరపాటే. గణితంలోనూ ఆమెకు మంచి ప్రతిభ ఉంది. ఎన్నో మెడల్స్ని సైతం గెలుచుకుంది.చాలామంది పిల్లలు సైన్స్ను పాఠ్యపుస్తకాల్లో నేర్చుకుంటారు. కానీ ఇషాన్వి మాత్రం తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించింది. అందులోని సమస్యను గుర్తించి.. దానికి శాస్త్రీయ పరిష్కారం వెతికే ప్రయత్నం చేసింది. అదే ఆమెను నేడు బుల్లి శాస్త్రవేత్తగా నిలబెట్టింది.
అర ఎకరం..ఏడాదికి రూ. 80 లక్షలు!
పొలంలోకి దిగి వ్యవసాయ పనులు చేయడాన్ని చూసి ఆమెను ఎగతాళి చేశారు. కానీ ఆ మాటలకు సమాధానం చెప్పడానికి ఆమె మాటలను ఎంచుకోలేదు.. పనినే ఎంచుకుంది. అలా అర ఎకరంతో మొదలు పెట్టి 40 ఎకరాల వ్యవసాయ సామ్రాజ్యాన్ని నిర్మించింది పంజాబ్లోని మోగా ప్రాంతానికి చెందిన మణ్దీప్ కౌర్ ఖైరా. వ్యవసాయంలోకి అడుగుపెట్టినపుడు ఆమెకున్నది కేవలం అరెకరం పొలం మాత్రమే. కానీ ఆమెకు అది అడ్డంకిగా అనిపించలేదు. భూమిని లీజుకు తీసుకుని కూడా వ్యవసాయం చేయవచ్చునని ఆలోచించింది. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ చివరకు 40 ఎకరాల్లో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించే స్థాయికి చేరుకుంది. ఇందులో ఎక్కువ భూమి లీజుకు తీసుకున్నదే. అలా పొలంలో పనిచేయడం నుంచి పదిమందితో పెద్ద ఎత్తున వ్యవసాయం చేయించే స్థాయికి చేరుకుంది మణ్దీప్. అయితే 40 ఎకరాల స్థాయిలో వ్యవసాయం చేయాలంటే కేవలం భూమి ఉంటే సరిపోదు. యంత్రాలు, పరికరాలు, పెట్టుబడి, నిర్వహణ సామర్థ్యం కూడా అవసరం. ఇందుకోసం మణ్దీప్ కౌర్ మూడు ట్రాక్టర్లు, ఏడు ట్రాలీలు, ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా సొంతంగా కొనుగోలు చేసింది. అలా ఈ మహిళా రైతు ఏడాదికి వ్యవసాయం ద్వారా 80 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. సమాజంలో ఎక్కువ భూమి ఉన్నవారినే పెద్ద రైతులుగా భావించే పరిస్థితి ఉంది. కానీ మణ్దీప్ కౌర్ కథ ఈ ఆలోచనకు భిన్నమైనది. సొంత భూమి లేదని ఆగిపోకుండా.. తనకున్న ఆలోచనతో ముందుకు సాగి అందరి మన్ననలు పొందుతోంది. (చదవండి: ఒకప్పుడు సైన్యం కోసం రాకెట్లు..ఇవాళ చిన్నారుల ఫుడ్ బ్రాండ్ వ్యాపారం!)
అంతర్జాతీయం
భారత్లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు మోదీతో కీలక భేటీ
ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో ఆయన భారత్ పర్యటన సాగుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులు, అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల ప్రభావం వంటి అంశాలు ఈసారి బ్రిక్స్ సదస్సులో కీలకంగా మారనున్నాయి.మోదీ–పుతిన్ భేటీలో కీలక అంశాలుపుతిన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఔషధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ భేటీలో ప్రధానంగా ఉండనుంది.President Putin arrives in New Delhi:Government Il-96 landed at the base of the air force of the Republic of Palam.(3:54 am, Delhi time)NEW DELHI, September 11. /TASS/. Russian President Vladimir Putin arrived in India, in the capital of which New Delhi the BRICS summit… https://t.co/K9ZBz6ZsHk pic.twitter.com/tnM4Q7pHIM— ⏳Towhee 🌏☮️ (@amborin) September 10, 2026రక్షణ రంగంలో బ్రహ్మోస్ క్షిపణి ఆధునికీకరణపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. రష్యా నుంచి భారత్కు మిగిలిన ఎస్–400 వ్యవస్థల సరఫరా, సు–57 యుద్ధ విమానాల ప్రతిపాదిత సరఫరాపైనా చర్చలు జరగనున్నాయి. భారత్లో కొత్త సివిల్ న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుపైనా ఇరు దేశాలు చర్చించనున్నట్లు సమాచారం.ఏడేళ్ల తర్వాత భారత్కు జిన్పింగ్పుతిన్ మాత్రమే కాదు బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా హాజరుకానున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన భారత్లో పర్యటిస్తున్నారు. సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆయన భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జిన్పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. వాణిజ్యం, పెట్టుబడులతోపాటు ఇరు దేశాల సంబంధాలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. సరిహద్దు ప్రాంతంలో పరిస్థితిని కూడా నేతలు సమీక్షించే అవకాశం ఉంది.పశ్చిమాసియా సంక్షోభం.. బ్రిక్స్కు సవాల్ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు బ్రిక్స్ సదస్సుకు కీలక సవాల్గా మారాయి. ముఖ్యంగా ఇరాన్, యూఏఈ మధ్య విభేదాల నేపథ్యంలో కూటమి ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన సంక్షోభం అంతర్జాతీయ చమురు వాణిజ్యంపైనా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై బ్రిక్స్ నేతలు చర్చించనున్నారు. ఇదే సమయంలో అమెరికా వాణిజ్య, సుంకాల విధానాలు కూడా బ్రిక్స్ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ పాలనలో బహుపాక్షిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై భారత్ తన అధ్యక్ష హోదాలో దృష్టి పెట్టనుంది.విస్తరించిన బ్రిక్స్.. పెరిగిన ప్రాధాన్యంబ్రిక్స్లో తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఉండేవి. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా కూటమిలో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, హైటెక్నాలజీతోపాటు ఆరోగ్యం, వ్యవసాయం, ఆహారం, ఇంధనం, విపత్తుల నిర్వహణ, సరఫరా వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం ఈ సదస్సు ప్రధాన అజెండాలో ఉంది.రెండు రోజులపాటు కీలక భేటీలుభారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు సదస్సు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బ్రిక్స్ నేతలు రాజకీయాలు, భద్రత, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సహకారం, సాంస్కృతిక, మానవతా సంబంధాలపై చర్చిస్తారు. ఆదివారం విస్తృత సమావేశాలు నిర్వహించిన అనంతరం ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను విడుదల చేయడంతో సదస్సు ముగియనుంది.బ్రిక్స్ వేదికపై అధికారిక సమావేశాలతోపాటు నేతల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలపైనా ఆసక్తి నెలకొంది. పుతిన్తో మోదీ భేటీ, ఏడేళ్ల తర్వాత భారత్కు వచ్చిన జిన్పింగ్తో మోదీ సమావేశం, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో మోదీ చర్చలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తంగా.. ఒకవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ పరిణామాలు, వాణిజ్య యుద్ధాల ప్రభావం వంటి కీలక అంతర్జాతీయ సవాళ్ల మధ్య ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో పుతిన్–మోదీ భేటీతోపాటు భారత్ వేదికగా జరిగే ఇతర ద్వైపాక్షిక చర్చలు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇదీ చదవండి: మిస్టర్ సింగ్.. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ల్యాండ్
భారత్ వద్ద 190 అణ్వాయుధాలు
వాషింగ్టన్: భారత్ వద్ద 190 వరకు అణ్వాయుధాలు ఉండొచ్చంటూ అమెరికాకు చెందిన ఓ సంస్థ అంచనా వేసింది. ది ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్(ఎఫ్ఏఎస్)అనే లాభాపేక్షలేని ఓ సంస్థ ఇందుకు సంబంధించిన ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వం బహిర్గతం చేసిన గణాంకాలు, ఇతర వర్గాల నుంచి సేకరించిన సమాచారం, వాణిజ్య ఉపగ్రహాల చిత్రాల ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు వివరించింది. ‘భారత్ వద్ద ఉన్న అణు సామర్థ్య ప్రయోగ వాహనాల అమరిక, వ్యూహాలకు సంబంధించిన బహిరంగ సమాచారం ఆధారంగా ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్న కొత్త క్షిపణుల కోసం ఉద్దేశించిన 30 అదనపు వార్హెడ్లు సహా సుమారు 190 అణు వార్హెడ్లను తయారు చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. ఇందులో వాడకంలో ఉన్న ప్రయోగ వేదికల కోసం 160కి పైగా వార్హెడ్లు కూడా ఉన్నాయి’అని ’ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ –2026’ పేరుతో ఎఫ్ఏఎస్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్స్ క్రిస్టెన్సన్ ఆ నివేదికలో పేర్కొన్నారు.‘భారత్ తన అణ్వాయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటోంది. ఇటీవలి కాలంలో అనేక కొత్త ఆయుధ వ్యవస్థలను సైతం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అణు సామర్థ్యం కలిగిన యుద్ధ విమానాలు, భూమి, గగనతలం నుంచి ప్రయోగించే వ్యవస్థలను బలోపేతం చేసుకుంటోంది. పాత వాటి స్థానంలో కొత్తవి తీసుకువస్తోంది. ఇంకొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి’అని క్రిస్టెన్సన్ తెలిపారు. భారత్ 140 నుంచి 225 అణ్వాయుధాలకు సరిపడా సైనిక అవసరాల ప్లుటోనియంను సిద్ధం చేసుకుని ఉండొచ్చని కూడా ఆయన నివేదికలో పేర్కొన్నారు. ఈ నిల్వలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. అయితే, 1998లో పొఖ్రాన్–2 ఆపరేషన్లో భాగంగా అణు పరీక్షలు చేపట్టిన భారత్..శత్రువుపై ముందుగా అణ్వాయుధాన్ని ప్రయోగించరాదనే విధానాన్ని ప్రకటించడంతోపాటు అందుకు కట్టుబడి ఉందని గుర్తు చేశారు. 2026 ఆరంభం నాటికి భారత్ వద్ద 730 కిలోల (సుమారు 170 కిలోలు అటూఇటుగా) అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే ప్లుటోనియం నిల్వలున్నట్లు ’ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ ఫిజైల్ మెటీరియల్స్’ అంచనా వేసినట్లు కూడా క్రిస్టెన్సన్ ఉటంకించారు.
మిస్టర్ సింగ్.. వెళ్లిపో!
వాషింగ్టన్: రహదారులపై నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ అమెరికన్ల ప్రాణాలు తీస్తున్న సిక్కు డ్రైవర్లు స్వచ్ఛందంగా దేశం వీడాలంటూ అమెరికా ప్రభుత్వ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం రూపొందించిన వీడియో వివాదాస్పదంగా మారింది. గతంలో నిర్లక్ష్యంగా ట్రక్కులు నడిపి పలువురి ప్రాణాలుపోయేందుకు కారణమైన వలసదారులైన డ్రైవర్లు హర్జీందర్ సింగ్, రాజీందర్ కుమార్, బెకాన్ బిషెకేవ్, జస్వీర్ సింగ్ల ఫొటోలను చూపిస్తూ ఒక ఏఐ జనరేటెడ్ వీడియోను రూపొందించి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేసింది. సరైన దృవీకరణ పత్రాలు లేని, అక్రమ వలసదారులను, వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లను సిక్కులుగా చూపిస్తూ.. ‘‘మా రోడ్డ మీద నుంచి తప్పుకోండి. మిస్టర్ సింగ్ నీకసలు వాహనం నడపడమే రాదు. స్వచ్ఛందంగా అమెరికాను వదిలి వెళ్లిపో. లేదంటే నిన్ను అరెస్ట్చేసి బలవంతంగా దేశం నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసులు వస్తారు’’అని ఆ వీడియోలో హెచ్చరించింది. 2014లో హాలీవుడ్లో హిట్ అయిన ‘ట్రాన్స్ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ ఎక్స్టిన్షన్’కు పేరడీగా డ్రైవర్లను ట్రాన్స్ఫార్మర్లుగా పేర్కొంటూ కొత్త వీడియోకు ‘ట్రాన్స్ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ డిపోర్టేషన్’అని పేరు పెట్టి కొత్త వివాదం రేపింది. దీనిపై భారతీయ అమెరికన్లు, సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ప్రతి ఒక్క సిక్కు వ్యక్తి అక్రమంగా అమెరికాకు రాలేదు. ప్రతి ఒక్క సిక్కు డ్రైవర్ రహదారులపై ప్రమాదాలు చేయట్లేడు. పనిగట్టుకుని సిక్కు వ్యక్తులను నేరస్తులుగా, దోషులుగా చూపిస్తూ యావత్ సిక్కులను, భారతీయులను కించపరుస్తున్నారు. ఇది ముమ్మాటికీ జాత్యహంకారమే’’అని హిందూ అమెరికన్ ఫౌండేషన్, సిఖ్ కోలిషన్, ఉత్తర అమెరికా హిందువుల కూటమి వంటి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ‘‘అమెరికాలో లక్షలాది మంది సిక్కులు, హిందువుల పేర్ల చివర్లో సింగ్, కుమార్ అని ఉంటుంది. వాళ్లంతా రోడ్డుపై యాక్సిడెంట్లు చేస్తారన్నట్లు ఏఐ వీడియో రూపొందించడం చూస్తుంటే మమ్మల్ని శత్రువులుగా ప్రభుత్వం భావిస్తోందా?’’అని సిఖ్ కోలీషన్ అసహనం వ్యక్తంచేసింది.
మధ్యంతర ఎన్నికల్లో గెలిస్తే 5,000 డాలర్లు ఇస్తా
ఫినిక్స్: అమెరికా ఓటర్లకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. త్వరలో జరిగే మధ్యంతర ఎన్నికల్లో తమ పార్టీకి విజయం లభించి, ప్రతినిధుల సభ, సెనేట్పై రిపబ్లికన్ల నియంత్రణ కొనసాగితే ప్రతి ఒక్కరికీ 5,000 డాలర్ల చొప్పున అందజేస్తానని ప్రకటించారు. ట్రంప్ పార్టీకి ప్రజాదరణ నానాటికీ పడిపోతున్నట్లు సర్వేలు తేల్చిచెబుతున్న ఆయన ఈ ఆఫర్ ఇవ్వడం గమనార్హం. బుధవారం డల్లాస్లో రిపబ్లికన్ పార్టీ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. ‘‘రిపబ్లికన్లు గెలిస్తే మీరు కూడా మాతో కలిసి గెలుస్తారు. మీకు 5,000 డాలర్లు లభిస్తాయి. దీనిని ట్రంప్ డివిడెండ్ అని పిలుస్తారు’’అని పేర్కొన్నారు. ఈ చెల్లింపులను ఒక సంస్థ తన వాటాదారులకు చేసే పంపిణీలతో పోల్చారు. అమెరికా ఆర్థికంగా బలంగా ఉందని చెప్పుకొచ్చారు. నిజంగా ట్రంప్ వాగ్దానం నెరవేరాలంటే ఒక ట్రిలియన్ డాలర్లకుపైగా ఖర్చవుతుంది. దీనికి కాంగ్రెస్ ఆమోదం కూడా అవసరం. అంతేకాకుండా వార్షిక బడ్జెట్ లోటును మరింత తీవ్రతరం చేస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయే ప్రమాదం ఉంది. అమెరికా సర్కార్ ఇప్పటికే అప్పుల్లో మునిగిపోయింది. దాదాపు 1.8 ట్రిలియన్ డాలర్ల వార్షిక బడ్జెట్ లోటు ఉంది. ట్రంప్ తాజా ప్రకటనపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గంట వ్యవధిలోనే స్పందించారు. ఈ డివిడెండ్ చెల్లింపులు సంపన్నులకు అందవని తేల్చిచెప్పారు. వయోజనులకు ఇస్తామంటున్న 5,000 డాలర్లకు అవసరమైన నిధులను సుంకాల ద్వారా వచ్చే ఆదాయంతో సమకూర్చుకోవచ్చని పేర్కొన్నారు. ‘ఒబామాకేర్’లబ్దిదారులకు 500 డాలర్ల రిబేట్ చెక్కులు వాషింగ్టన్: అమెరికాలో 30 రాష్ట్రాల్లోని 10 లక్షల మంది ‘ఒబామాకేర్’లబ్దిదారులకు 500 డాలర్ల రిబేట్ చెక్కులు ఇస్తామని అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారు. బైడెన్ ప్రభుత్వ హయాంలో ఒబామాకేర్ కింద ప్రజల నుంచి ప్రీమియం అధికంగా వసూలు చేశారని ఆక్షేపించారు. ప్రతి ఒక్కరికీ డబ్బు వాపసు ఇవ్వడంతో ఉపశమనం లభిస్తుందని అన్నారు. కొద్ది వారాల్లోనే రాయితీలు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ చేసిన ప్రసంగాన్ని గురువారం వైట్హౌస్ ‘ఎక్స్’õÙర్ చేసింది. మరోవైపు ఈ రిబేట్ల కోసం నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అలాగే వాటి పంపిణీకి కాంగ్రెస్ ఆమోదం అవసరమా కాదా అనేది ఇంకా తెలియరాలేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య బీమా రుసుములు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రీమియంలు రెట్టింపు లేదా మూడు రెట్లు పెరిగాయి. దీంతో లక్షలాది మంది తమ ప్లాన్లను తగ్గించుకోవడానికి లేదా ఈ కార్యక్రమం నుంచి పూర్తిగా వైదొలగడానికి మొగ్గుచూపారు.
జాతీయం
బ్రిక్స్ సదస్సు.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీ: 18 అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సుకు భారత్ అతిథ్య నివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12,13 ఢిల్లీలోని భరత మండపంలో జరిగే ఈ సదస్సుకు ప్రపంచ అగ్రనేతలతో పాటు విదేశీ ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఢిల్లీకి రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అత్యంత కఠిన ఆంక్షలు విధించనుంది. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గాల మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి.రేపు బ్రిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నేటి నుంచి (శుక్రవారం) ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నడిచే, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆ రోజు పనిచేయవు. వారాంతం అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఢిల్లీ మెట్రో సేవలు కొనసాగింపుఅయితే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైలు సేవలు పూర్తిగా నిలిపివేయడం లేదు. నగరవ్యాప్తంగా మెట్రో సేవలు కొనసాగుతాయి. అయితే సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్లోని ఢిల్లీ మెట్రో మ్యూజియాన్ని సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూసివేయనున్నారు. 35కుపైగా రహదారులపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విదేశీ ప్రముఖులు, వీవీఐపీల కాన్వాయ్ల రాకపోకల కోసం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 4,800 మంది ట్రాఫిక్ సిబ్బందిని విధుల్లో మోహరించారు. వీవీఐపీ రాకపోకలు, కాన్వాయ్ రిహార్సల్స్ సమయంలో 22 ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించనున్నారు.మథురా రోడ్, సర్దార్ పటేల్ మార్గ్, శాంతి పథ్, జనపథ్, అశోకా రోడ్, బరాఖంబా రోడ్, టాల్స్టాయ్ మార్గ్, ఆఫ్రికా అవెన్యూ రోడ్, నీతి మార్గ్, ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ తదితర 35కుపైగా రహదారులపై వివిధ సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు లేదా మళ్లింపులు ఉండవచ్చని అధికారులు తెలిపారు.బస్సులు, క్యాబ్లకు మార్గ మళ్లింపులుసదస్సు జరిగే రోజుల్లో పరిస్థితిని బట్టి బస్సుల రూట్లను మళ్లించడం లేదా కొంతకాలం నియంత్రించడం జరగవచ్చని అధికారులు పేర్కొన్నారు. క్యాబ్ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసరం కాని ప్రయాణాలను ముందుగా ప్లాన్ చేసుకోవాలని, బయలుదేరే ముందు తాజా ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించాలని ఢిల్లీ వాసులకు అధికారులు సూచించారు.
పాక్ వక్రబుద్ధి.. హేమ్కుండ్ సాహిబ్ దర్శనానికి అడ్డంకి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయిటపెట్టింది. భారత్లోని సిక్కు పుణ్యక్షేత్రమైన శ్రీహేమ్కుండ్ సాహిబ్ను దర్శించుకునేందుకు వస్తున్న యాత్రికులను ఎన్వోసీ 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' పేరుతో అడ్డుకుంది. దీంతో యాత్రికులు నిరాశ చెందాల్సి వచ్చింది. అయితే, తమ ప్రయాణానికి NOC అవసరమని అధికారులు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని దీంతో తమ విమానాన్ని కోల్పోయి విమానాశ్రయంలోనే చిక్కుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.యాత్రికుల వివరాల ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.10 గంటలకు ఫైసలాబాద్ నుంచి షార్జాకు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో NOC కోసం అధికారులు పట్టుబట్టడంతో వారు ప్రయాణం చేయలేకపోయారు. అంతకుముందు నంకానా సాహిబ్లో పాకిస్థాన్ పంజాబ్ సిక్కు మైనారిటీ మంత్రి, పాకిస్థాన్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ (PSGPC) అధ్యక్షుడు రమేశ్ అరోరా, ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు డిప్యూటీ సెక్రటరీ నాసిర్ ముష్తాక్ యాత్రికులను కలిశారు.విమాన మార్గంలో భారత్కు వెళ్లకుండా అట్టారి–వాఘా భూసరిహద్దు ద్వారా రోడ్డు మార్గంలో పంపిస్తామని వారు హామీ ఇచ్చినట్లు సింగ్ తెలిపారు. అయితే NOC విషయాన్ని ముందుగా తమకు ఎవరూ చెప్పలేదని, విమానాశ్రయంలో అధికారులు NOC అడిగినప్పుడు దాన్ని సమకూర్చాలని రమేశ్ అరోరాను కోరినా ఆయన తమకు సహాయం చేయలేకపోయారని సింగ్ పేర్కొన్నారు. యాత్రికులకు ఢిల్లీ, అమృత్సర్, శ్రీ ఆనంద్పూర్ సాహిబ్, శ్రీ హేమ్కుండ్ సాహిబ్లను సందర్శించేందుకు భారత వీసాలు ఇప్పటికే మంజూరయ్యాయి.అట్టారి–వాఘా భూసరిహద్దు మూసివేయడంతో తమకు విమాన మార్గం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని యాత్రికులు తెలిపారు. శ్రీ హేమ్కుండ్ సాహిబ్ యాత్ర కోసం భారత్ 92 మంది సిక్కు భక్తులకు వీసాలు జారీ చేసిందని పపిందర్ సింగ్ చెప్పారు. ప్రయాణం, వసతి, ఇతర ఏర్పాట్ల కోసం వారు దాదాపు 2 కోట్ల పాకిస్థాన్ రూపాయలు ఖర్చు చేశారని, ఇప్పుడు ప్రయాణానికి అనుమతి లభించక తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు. ఫైసలాబాద్–షార్జా విమానం ఇప్పటికే మిస్ కావడంతో, షార్జా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన తదుపరి విమానం సైతం మిస్ అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.ప్రస్తుతం యాత్రికులు విమానాశ్రయంలోనే ఉండి, పాకిస్థాన్ ప్రభుత్వం సమస్యను పరిష్కరించి అట్టారి–వాఘా భూసరిహద్దు ద్వారా భారత్కు వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. హేమ్కుండ్ సాహిబ్ యాత్రను సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలని వారు పాకిస్థాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
యూపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మాయావతి మేనల్లుడిపై వేటు!
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్పై మరోసారి వేటు వేశారు. ఈసారి ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచే తొలగించారు. పార్టీ కంటే కుటుంబానికే ఆకాశ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని.. పైగా తాను చేసిన ట్వీట్ను అతను రీ-ట్వీట్ చేయలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారామె.బీఎస్పీ మాజీ రాజ్యసభ సభ్యుడు అశోక్ సిద్ధార్థ్ను మాయావతి ఆగస్టులో పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకోవడం, పార్టీ నాయకత్వ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరించడం వంటి కారణాలతో ఆయనపై మాయావతి చర్యలు తీసుకున్నట్లు అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 9న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.అశోక్ సిద్ధార్థ్ గనుక రాజకీయాల నుంచి తప్పుకుంటే.. ఆకాశ్ ఆనంద్ పార్టీ కోసం స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి వస్తుందని సూచించారు. ఆ వ్యాఖ్యల మరుసటి రోజే.. తన అల్లుడి రాజకీయ భవిష్యత్తు కోసం అశోక్ సిద్ధార్థ్ రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఇక ఆకాశ్కు మళ్లీ పార్టీలో కీలక బాధ్యతలు దక్కుతాయని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా మాయావతి అతడినే పార్టీ నుంచి పూర్తిగా తొలగించారు.ఆ ఒక్క రీపోస్ట్ చేయలేదని..ఆకాశ్పై చర్యకు కారణాన్ని మాయావతి స్వయంగా వెల్లడించారు. తాను ఎక్స్లో పెట్టే పోస్టులను ఆకాశ్ గతంలో తరచూ రీపోస్ట్ చేసేవాడని చెప్పారు. కానీ అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని తాను చేసిన సూచనను మాత్రం ఆకాశ్ రీపోస్ట్ చేయలేదని పేర్కొన్నారు. అతని రాజకీయ భవిష్యత్తు కోసమే తాను ఆ పోస్టు పెట్టినా.. ఆకాశ్ దానిని పట్టించుకోకపోవడం తనకు ఆగ్రహం తెప్పించినట్లు మాయావతి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. పార్టీ ప్రయోజనాల కంటే కుటుంబ బంధానికే ప్రాధాన్యం ఇస్తున్నాడనే సంకేతంగా ఆమె దీనిని పరిగణించారు. ఇలా రెండు వైపులా ఆలోచించే వ్యక్తి బీఎస్పీ ప్రయోజనాల కోసం ఎలా పనిచేయగలడని మాయావతి ప్రశ్నించారు. పార్టీ, బహుజన ఉద్యమం కంటే కుటుంబ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చేవారితో ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.ఆకాశ్ ఆనంద్కు రాజకీయంగా ఇబ్బందులు రావడానికి అతనికి పిల్లనిచ్చిన అశోక్ సిద్ధార్థ్ ప్రధాన కారణంగా మాయావతి భావిస్తూ వచ్చారు. సెప్టెంబర్ 9న సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించిన తర్వాత.. గురువారం ఆయన సన్యాసం ప్రకటించారు. మాయావతిని తన రాజకీయ గురువుగా, అక్కగా పేర్కొన్న సిద్ధార్థ్.. ఆమె ఆదేశమే తనకు అన్నింటికంటే ముఖ్యమని చెప్పారు. తన వల్ల ఆకాశ్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతోనే రాజకీయాలకు దూరమవుతున్నట్లు తెలిపారు.అయితే ఆయన నిర్ణయం మాయావతిని సంతృప్తిపరచలేదు. సిద్ధార్థ్ రాజకీయ సన్యాసం తీసుకున్నప్పటికీ అది చాలా ఆలస్యమైన నిర్ణయమని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ముందుగానే రాజకీయాల నుంచి తప్పుకుని ఉంటే బీఎస్పీ, బహుజన ఉద్యమం, ఆకాశ్ ఆనంద్ ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని అన్నారు. అంతేకాదు.. ఆకాశ్ రాజకీయ భవిష్యత్తు గురించి నిజంగా ఆలోచించి ఉంటే సిద్ధార్థ్ ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుని ఉండాల్సిందని మాయావతి వ్యాఖ్యానించారు.రెండేళ్లలో మూడోసారి..ఆకాశ్ ఆనంద్పై మాయావతి చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత రెండేళ్లలో ఆయనపై ఇది మూడో కీలక చర్య. వాస్తవానికి.. 2023 డిసెంబర్లో మాయావతి ఆకాశ్ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బీఎస్పీ భవిష్యత్ నాయకుడిగా ఆయనకు ప్రాధాన్యం పెరిగింది. జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా అప్పగించారు.2024 మేలో ఆకాశ్కు అప్పగించిన కీలక పార్టీ బాధ్యతలను మాయావతి తొలగించారు. ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. 2025 మార్చిలో మరోసారి ఆయనపై చర్య తీసుకుని పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం ఆకాశ్ క్షమాపణ చెప్పడంతో తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 3న జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తొలగించారు. సాధారణ కార్యకర్తగా పార్టీలో ఉండేందుకు మాత్రం అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వారం రోజులు కూడా తిరగకముందే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్నే రద్దు చేశారు.తమ్ముడికి కీలక బాధ్యతలు..ఆకాశ్పై వరుస చర్యలు జరుగుతున్న సమయంలోనే ఆయన తమ్ముడు ఇషాన్ ఆనంద్ బీఎస్పీలో కీలకంగా ఎదగడం ఆసక్తికరంగా మారింది. ఆకాశ్ను జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తొలగించిన కొద్ది రోజులకే 27 ఏళ్ల ఇషాన్ ఆనంద్కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మినహా ఇతర రాష్ట్రాల్లో బీఎస్పీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను ఆయనకు ఇచ్చారు. తన తండ్రి, బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు ఆనంద్ కుమార్కు ఇషాన్ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఆకాశ్ నిర్వహించిన బాధ్యతల్లో కొంత భాగం ఇప్పుడు ఇషాన్ చేతికి వెళ్లడంతో.. ఆయన మాయావతికి రాజకీయ వారసుడిగా ఎదుగుతారా? అనే చర్చ మొదలైంది.ఎన్నికల ముందు బీఎస్పీలో కలకలంఉత్తరప్రదేశ్లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఎస్పీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీని బలోపేతం చేసి తిరిగి అధికారంలోకి రావాలని మాయావతి లక్ష్యంగా పెట్టుకున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 403 స్థానాల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్నీ గెలవలేకపోయింది. ఓటు శాతం కూడా 9.39 శాతానికి పడిపోయింది. ఇలాంటి సమయంలో పార్టీ భవిష్యత్తుకు కీలకంగా భావించిన ఆకాశ్ ఆనంద్నే బయటకు పంపడం బీఎస్పీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇషాన్ ఆనంద్కు కీలక బాధ్యతలు అప్పగించడం మరింత ఆసక్తిని రేపుతోంది.2027 ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని మాయావతి ఇప్పటికే పిలుపునిచ్చారు. పూర్తి మెజార్టీతో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టాలని కోరారు.అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆకాశ్ ఆనంద్కు మళ్లీ బీఎస్పీలో కీలక స్థానం దక్కుతుందని భావించినా.. సీన్ పూర్తిగా మారిపోయింది. మామ రాజకీయ సన్యాసం తీసుకున్నా.. మేనల్లుడికి మాత్రం పార్టీ తలుపులు మూసుకుపోయాయి. అందుకు కుటుంబంపై ఉన్న అనుబంధమే కారణమని మాయావతి భావించడం ఇప్పుడు బీఎస్పీలో హాట్టాపిక్గా మారింది.ఇదీ చదవండి: టీవీకేకు తొలి పరీక్ష.. నెగ్గుతారా?
క్విక్ కామర్స్ సంస్థలపై దాడులు.. సంచలన విషయాలు?
జైపూర్: రాజస్థాన్లోని క్విక్ కామర్స్ సంస్థలపై ఆహరభద్రత అధికారులు చేసిన తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ ఈ క్విక్-కామర్స్ సంస్థలైన బ్లింకిట్, జెప్టో సంస్థలు నిర్వహిస్తున్న డార్క్ స్టోర్లపై ఆహార భద్రత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, దెబ్బతిన్న ఉత్పత్తులు, సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయని పాల ఉత్పత్తులు పెద్ద మొత్తంలో గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేసి తనిఖీల నిమిత్తం ల్యాబ్కు తరలించినట్లు పేర్కొన్నారు. జగత్పురాలోని Zepto డార్క్ స్టోర్లో సుమారు 1,550 పాల ఉత్పత్తుల ప్యాకెట్లు సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం లేదని అధికారులు గుర్తించారు. పాలు, పెరుగు, మజ్జిగ వంటి డెయిరీ ఉత్పత్తులను నిర్దేశిత తక్కువ ఉష్ణోగ్రతల్లోనే ఉంచాలి. అయితే అక్కడి రిఫ్రిజరేషన్ యూనిట్లలో ఉష్ణోగ్రత 6 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. దీంతో అక్కడ నిల్వ ఉంచిన సుమారు 1,550 ప్యాకెట్లను అధికారులు ధ్వంసం చేసినట్లు తెలిపారు.అదే స్టోర్లో గడువు ముగిసిన సుమారు 7 కిలోల ఆహార పదార్థాలు కూడా బయటపడ్డాయని వాటిని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.అనంతరం జైపూర్లోని ఆదర్శ్ నగర్లో ఉన్న Blinkit డార్క్ స్టోర్ను తనిఖీ చేశారు. అక్కడ సుమారు 800 పాల ఉత్పత్తుల ప్యాకెట్లతో పాటు మరికొన్ని గడువు ముగిసిన దెబ్బతిన్న ఆహార పదార్థాలు సైతం గణనీయమైన పరిమాణంలో ఉన్నట్లు గుర్తించారు. అవన్నీ అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అంతేకాకుండా పాలు, ఫుడ్-గ్రేడ్ నెయ్యి, Paper Boat కార్బొనేటెడ్ వాటర్ నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల నివేదికల ద్వారా ఆ ఉత్పత్తుల నాణ్యతపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.ఈ తనిఖీలపై ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అవిచల్ చతుర్వేది మాట్లాడుతూ, ఆహార పదార్థాల నిల్వలో నిర్దేశిత ఉష్ణోగ్రతలు, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. గడువు ముగిసిన, పాడైన ఉత్పత్తులను వెంటనే తొలగించి ధ్వంసం చేయాలని సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే డార్క్ స్టోర్లలో పరిశుభ్రత, కోల్డ్-చైన్ నిర్వహణ, ఆహార నిల్వ విధానాల్లో ఉన్న లోపాలను వెంటనే సరిచేయాలని అధికారుల బృందం సూచించింది.మొత్తంగా, జైపూర్లో జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 2,350 డెయిరీ ఉత్పత్తుల ప్యాకెట్లను, అలాగే గడువు ముగిసిన మరియు దెబ్బతిన్న ఇతర ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ముఖ్యంగా పాల ఉత్పత్తులను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం, గడువు ముగిసిన వస్తువులు స్టోర్లలో ఉండటం, పరిశుభ్రత లోపాలు వంటి అంశాలను అధికారులు తీవ్రంగా పరిగణించారు. సేకరించిన నమూనాల ప్రయోగశాల పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ఎన్ఆర్ఐ
జర్మనీలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
బెర్లిన్: జర్మనీలోని మ్యూనిచ్, స్టుట్గార్ట్, బెర్లిన్ నగరాల్లో ఈ రోజు సోమవారం దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు తరలివచ్చి, ఆయన సేవలను కొనియాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా నేడు తామంతా ఉన్నత స్థాయిలో ఉండగలుగుతున్నామని ఆయన సేవలను స్మరించుకున్నారు.17వ వర్ధంతి సందర్భంగా మ్యూనిచ్ నగరంలో నిర్వహించిన “YSR Chess Tournament” విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం కృష్ణ తేజ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కోర్ కమిటీ సభ్యులు నాగార్జున రెడ్డి ఆవుల (జనరల్ సెక్రటరీ), గురు (కో-కన్వీనర్), విష్ణు వర్ధన్ రెడ్డి మార్తల (ఐటీ కోఆర్డినేటర్), Dr. మల్లికార్జున రెడ్డి బండి (మీడియా స్పోకెస్పర్సన్), మనోజ్ కామసాని (మీడియా స్పోకెస్పర్సన్), నవీన్ రెడ్డి కలమకూరి (సోషల్ మీడియా కోఆర్డినేటర్), సాయి సూర్య చౌదరి (ఎగ్జిక్యూటివ్ మెంబర్), మంజునాథ్ రెడ్డి చవ్వాబాలన్న (ఎగ్జిక్యూటివ్ మెంబర్), వినోద్ అమలదాసు (ఎగ్జిక్యూటివ్ మెంబర్), షాలిని అక్షింతల (ఎగ్జిక్యూటివ్ మెంబర్), ఉపేంద్ర జలది, ప్రదీప్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ బాధ్యతని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తెలిపారు.
వైఎస్సార్ వర్ధంతి: వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్నారై కమిటీ రక్తదానం
ఫీనిక్స్ (అరిజోనా): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్నారై కమిటీ, వైటలెంట్ సహకారంతో సెప్టెంబర్ 6న రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కమ్యూనిటీ సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజాసేవకు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడానికి డాక్టర్ వైఎస్సార్ చూపిన నిబద్ధతను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్, మాజీ ముఖ్యమంత్రి విద్యా సలహాదారు ఆలూరు సాంబశివ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన జీవితం, ప్రజాసేవ, ప్రజా సంక్షేమం కోసం చేసిన కృషిని ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన నిర్వహించారు.కమిటీ సభ్యులు డాక్టర్ వైఎస్సార్తో తమకున్న వ్యక్తిగత అనుభవాలను, ఆయనలోని నిరాడంబరత, ధైర్యం, ప్రజాకేంద్రిత పాలనా విధానాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలూరు సాంబశివ రెడ్డి డాక్టర్ వైఎస్సార్ను “ప్రజల నాయకుడు”గా అభివర్ణిస్తూ, సామాన్య ప్రజలతో ఆయనకు ఉన్న విడదీయరాని అనుబంధాన్ని గుర్తుచేశారు. డాక్టర్ వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆ ఆశయాలను కొనసాగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన ఫీనిక్స్ ఎన్నారై కమిటీని ఆయన అభినందించారు. రక్తదానం అనేది సులభమైనదైనా, అత్యంత విలువైన సేవా కార్యక్రమమని, ఒకరి రక్తదానం నేరుగా మరొకరి ప్రాణాలను కాపాడగలదని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని ధీరజ్ పోలా, వంశీ ఎరువరం, చెన్నా రెడ్డి మద్దూరి, రుక్మన్, శ్రీధర్ చెమిడితి, అంజి రెడ్డి,నాగేష్ పొర్ల, వేమ శేఖర్, విఘ్నేష్, కొండా రెడ్డి , శ్రీనివాస్ మామిడి, హేమ కుమార్, అజయ్ కాల్వ , కుడుముల సుధీర్, సుజన్, రాజేశ్వరరావు బండారు, రాజశేఖర్ అవుదూరి, హితేష్ తదితరులు నిర్వహించి, పాల్గొన్నారు. పలువురు వాలంటీర్లు, కమ్యూనిటీ సభ్యులు కూడా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వైటలెంట్, రక్తదాతలు, వాలంటీర్లు, నిర్వాహకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవ, మానవతా విలువలు, సమాజ సంక్షేమం పట్ల డాక్టర్ వైఎస్సార్ చూపిన నిబద్ధతను కొనసాగిస్తూ, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురాగల సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఫీనిక్స్ ఎన్నారై కమిటీ తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించింది.
జయ పీసపాటి గౌరవార్థం సింగపూర్లో ఆత్మీయ సమ్మేళనం
సింగపూర్: హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి సింగపూర్ పర్యటన సందర్భంగా, శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సింగపూర్లో ఘనంగా జరిగింది. సరిగమ గ్రాండ్ రెస్టారెంట్లో సుమారు 25 మంది తెలుగు ప్రముఖులు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.సుబ్బు వి. పాలకుర్తి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి జయ పీసపాటి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరైనారు. ఈ సందర్భంగా జయ పీసపాటి మాట్లాడుతూ, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆవిర్భావానికి ముందు జరిగిన పరిణామాలతో పాటు, గత 22 సంవత్సరాలుగా సమాఖ్య ద్వారా తెలుగువారికి అందిస్తున్న సేవలను వివరించారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.మహిళలు మీడియా సహా వివిధ రంగాల్లో మరింత చురుకైన పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని మరెందరికో స్ఫూర్తిగా నిలవగలరని జయ పీసపాటి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పించడం ద్వారా వారికి భాషపై అభిమానం పెంపొందించడంతో పాటు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారిగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఆదివారం కూడా ఇంతమంది తెలుగువారు ఒకచోట చేరి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సింగపూర్, హాంగ్ కాంగ్ తెలుగు సంస్థల మధ్య ఇప్పటికే ఉన్న సత్సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.సింగపూర్తో 2016 నుంచే ప్రత్యేక అనుబంధంహాంగ్ కాంగ్లో తెలుగు సమాఖ్యను నిర్వహిస్తున్న తనకు విదేశాల్లో జరిగిన తెలుగు కార్యక్రమాల్లో తొలిసారిగా పాల్గొనే అవకాశం 2016లో సింగపూర్లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సు ద్వారా లభించిందని జయ పీసపాటి గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా సింగపూర్లోని తెలుగువారి ఐక్యత, చురుకుదనం తనకు ఎంతో ప్రేరణనిచ్చాయని ఆమె నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.ఇటీవల మలేషియా తెలుగు సంఘం నిర్వహించిన 70వ వార్షికోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలకు ఒక మార్గదర్శకంగా, బెంచ్మార్క్గా నిలిచాయని ఆమె అభినందించారు. ముఖ్యంగా నేటి తరం పిల్లలు ఎంతో చక్కగా తెలుగు మాట్లాడటంతో పాటు పద్యాలు, గద్యాలను స్పష్టంగా చదివి వినిపించడం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.మలేషియా తెలుగు సమాజం చూపించిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు భాష మరింతగా అభివృద్ధి చెంది, భావితరాల్లో సజీవంగా కొనసాగాలని జయ పీసపాటి ఆకాంక్షించారు.తమకు ఆత్మీయ‘జయక్క’గా మారిన“జయ పీసపాటి ఈ సందర్భంగా రత్న కుమార్ మాట్లాడుతూ అభినందనలు తెలిపారు. హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న కార్యక్రమాలుఎన్నో సందర్భాల్లో స్ఫూర్తినిచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాము చామిరాజు, భాస్కర్ వూలపల్లితో పాటు సింగపూర్ తెలుగు ప్రముఖులు సుదర్శన్ పూల, కొనాలి కాళికృష్ణ, సత్య జాస్తి, యోగి బూరుగుపల్లి, రాఘవాచార్యులు తట్టా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని, విద్యాధరి, రేణుక, శ్రీలలిత, పద్మావతి, సునీత, మాధవి తదితరులు పాల్గొన్నారు.
మిస్సిసాగాలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
మిస్సిసాగా: కెనడాలోని మిస్సిసాగా నగరంలో శనివారం(సెప్టెంబర్ 5వ తేదీ) సాయంత్రం 6 గంటలకు వైఎస్సార్సీపీ కెనడా విభాగం ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజా సేవ, సంక్షేమ పథకాలు, నాయకత్వ పటిమ, ప్రజల పట్ల ఆయన చూపిన నిబద్ధతను నేతలు, కార్యకర్తలు ఘనంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమం వైఎస్సార్సీపీ కెనడా అడ్వైజర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో, వైఎస్సార్సీపీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు గారి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమ నిర్వాహకులు (వైఎస్సార్సీపీ కెనడా టీమ్):* సుబ్బారావు – వైఎస్సార్సీపీ కెనడా కో-కన్వీనర్* నూర్ గారు – వైఎస్సార్సీపీ కెనడా యూత్ వింగ్ కన్వీనర్ముఖ్య అతిథులు మరియు వక్తలుచల్లా మధుసూదన్ రెడ్డి గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ) – జూమ్ ద్వారా హాజరయ్యారుపాండుగాయల రత్నాకర్ గారు (మాజీ వైఎస్సార్సీపీ యూఎస్ఏ/ఎన్ఆర్ఐ కన్వీనర్, ఏపీ ప్రభుత్వ మాజీ నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి) – జూమ్ ద్వారా హాజరయ్యారు. డాక్టర్ ప్రదీప్ చింత గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - ఎన్ఆర్ఐ వ్యవహారాలు) – జూమ్ ద్వారా హాజరయ్యారు. కొండం వెంకట్ రెడ్డి గారు (కెనడా కమ్యూనిటీ నాయకులు) – ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దూరదృష్టి, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావాన్ని కొనియాడారు.ఎగ్జిక్యూషన్ టీమ్: కార్యక్రమ నిర్వహణ, వేదిక ఏర్పాట్లు, సమన్వయంలో కీలక పాత్ర పోషించిన సభ్యులు: అస్లాం, సుమంత్, యశ్వంత్ నిమ్మకాయల, గోపిరెడ్డి కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, కృష్ణ, ఆరిఫ్, డాక్టర్ నిరంజన్ చుక్కలూరు, సుబ్బారెడ్డి దుగంపూడి, శ్రీనివాస్ కొరపోరలు.అడ్వైజర్ కమిటీ: కార్యక్రమానికి విలువైన మార్గదర్శకత్వం అందించిన సలహాదారుల కమిటీ సభ్యులు:* కృష్ణారెడ్డి పసల* రాజగోపాల్ గుంటక* విశ్వనాథ్ రెడ్డి* విజయభాస్కర్ రెడ్డి* కృష్ణ ఆలంపాటి* డాక్టర్ శివ రెడ్డిఈ కార్యక్రమంలో మిస్సిసాగాతో పాటు పరిసర ప్రాంతాల నుండి వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించిన కోర్ కమిటీ సభ్యులందరికీ, ఎగ్జిక్యూషన్ టీమ్కు, అడ్వైజర్ కమిటీ సభ్యులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
చిన్నారిపై ప్రైవేటు పాఠశాల హెచ్ఎం అత్యాచార యత్నం
ధర్మపురి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు గాడితప్పి ఓ బాలిక (4)పై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చల్లా శ్రీనివాస్ సదరు చిన్నారిని బుధవారం స్టాఫ్రూంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలపగా.. గురువారం తల్లిదండ్రులు, మరికొంతమంది కాలనీవాసులు పాఠశాలకు చేరుకుని హెచ్ఎంను నిలదీశారు. పాఠశాలలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ రాంనర్సింహరెడ్డి పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అవమానం భరించలేక కేదారి దంపతుల ఆత్మహత్య
నయీంనగర్: అద్దె డబ్బులు ఇవ్వడం లేదని హోటల్ భవన యజమాని తిట్టి తాళం వేయడంతో అవమానం భరించలేక లింగాల కేదారి దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. లింగాల కేదారి కొడుకు పృథ్వీ ఫిర్యాదు మేరకు బిల్డింగ్ యజమాని కుమారుడు రాముపై కేసు నమోదు చేసినట్టు సుబేదారి పోలీసులు గురువారం తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని అదాలత్ జంక్షన్ వద్ద అద్దె భవనంలో లింగాల కేదారి దంపతులు కొన్నేళ్లుగా తమ పేరుమీద హోటల్ నడుపుతున్నారు. అనివార్య కారణాలతో అద్దె చెల్లించడం లేదు. దీంతో భవన యజమాని కుమారుడు బుధవారం హోటల్ వద్దకు వచ్చి కిరాయి ఎందుకు ఇవ్వడం లేదని దూషించి తాళం వేశాడు. దీనిని అవమానంగా భావించిన లింగాల కేదారి దంపతులు సాయంత్రం హోటల్లోకి వెళ్లి తాళం తీసి లోనికి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. లింగాల కేదారి అక్కడికక్కడే చనిపోగా, భార్య పుష్పలతకు తీవ్రగాయాలు కాగా, ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.కాగా, ఎంతోమందికి ఉచితంగా అన్నం పెట్టిన లింగాల కేదారి మరణవార్త విని అంతిమయాత్రకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నగరంలో చదువుకునేందుకు వచ్చిన సమయంలో అతి తక్కువ ధరకు భోజనం పెట్టేవాడని, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని కన్నీరు పెట్టుకున్నారు. లింగాల కేదారి దంపతులకు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ నివాళులరి్పంచారు.దంపతుల అనుమానాస్పద మృతిపురుగుల మందు తాగి భార్య...రైలుకు ఎదురెళ్లి భర్త మృతి తండ్రి కళ్లముందే కొడుకు బలవన్మరణం ఇరువురి మధ్య గొడవలే కారణంసికింద్రాబాద్/అడ్డగుట్ట: పెళ్లై పదహారు నెలలు... రాఖీ పండుగకు సొంత ఊరికి వెళ్లి పది రోజుల కిందటే తిరిగి నగరానికి వచ్చారు. అంతలోనే ఏమైందో తెలియదు. దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య ఇంట్లో పురుగుల మందు తాగి మృతి చెందగా... భర్త రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు తార్నాక విజయపురి కాలనీలో విషాదాన్ని నింపాయి. సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయీశ్వర్గౌడ్, లాలాగూడ ఇన్స్పెక్టర్ రవి కిరణ్లు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా అఫ్జల్పూర్ గ్రామానికి చెందిన శరణప్ప (28) ఉపాధి కోసం కొద్ది కాలం క్రితం నగరానికి వచ్చి తార్నాక విజయపురి కాలనీలోని ఓ ఇంట్లో భార్య లక్ష్మి, తల్లిదండ్రులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. శరణప్ప నాచారంలోని ఒక హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గురువారం ఉదయం శరణప్ప తండ్రి ధర్మన్న మంగ ఇద్దరూ కలిసి లాలాపేట విజయ డెయిరీ సమీపంలో టీ తాగేందుకు వెళ్లారు. అనంతరం, అక్కడి నుంచి శరణప్ప పనికి వెళ్తున్నానని తన తండ్రికి చెప్పి పట్టాల మార్గం గుండా నాచారం వైపు వెళ్తుండగా ఖర్చుల నిమిత్తం తనకు యాభై రూపాయలు కావాలని తండ్రి శరణప్ప అతడి వెనుకనే వెళ్లాడు. ఈ క్రమంలో మౌలాలి రైల్వే స్టేషన్ అప్లైన్ ప్రాంతంలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి శరణప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్ల ముందే కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో శోకసంద్రంలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి వద్ద గల ఆధార్ కార్డు ఆధారంగా వివరాలు గుర్తించారు. ఇంట్లో భార్య ఆత్మహత్యకేసు నమోదు చేసుకున్న జీఆర్పీ పోలీసులు విచారణ సాగించగా మరో ఆత్మహత్య ఘటన వెలుగుచూసింది. శరణప్పకు 16 నెలల క్రితం సొంత జిల్లాకు చెందిన లక్ష్మి (24)తో వివాహం జరిగింది.అప్పటి నుంచి వీరిద్దరిమధ్య ఆర్థిక సమస్యలు, కుటుంబపరమైన గొడవలు ఉన్నట్లు పోలీసులకు బంధువుల ద్వారా సమాచారం అందింది. ఇటీవల రాఖీ పండుగ కోసం దంపతులిద్దరూ కర్ణాటక వెళ్లి పది రోజుల క్రితమే నగరానికి వచ్చారు. ఆ తర్వాత కూడా నిత్యం గొడవలు జరుగుతుండేవని తెలిసింది. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి లక్ష్మి పురుగుల మందు తాగి నిద్రపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉదయం శరణప్ప నిద్రలేచేసరికి విగతజీవిగా పడిఉన్న భార్య లక్ష్మి మృతదేహాన్ని గుర్తించి ఉంటాడని, భార్య మరణంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసులు నమోదు చేసుకున్న జీఆర్పీ, లాలాగూడ పోలీసులు ఇరువురి మృతదేహాలను గాం«దీమార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురి విషాదం!
ఆంధ్రప్రదేశ్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సమీపంలోని పీసీ ప్యాపిలి సబ్స్టేషన్ వద్ద బైక్ను ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను వజ్రకరూరు గ్రామానికి చెందిన జైనుల్లా, మహాబూబ్ బాషా, మహమ్మద్ రఫీగా గుర్తించారు. అయితే, వీరు ముగ్గురూ ఒకే బైక్పై ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఉరవకొండలో కోర్టు పనిమీద వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. వీరు ప్రయాణం చేస్తున్నటువంటి బైక్ పీసీ ప్యాపిలి సబ్స్టేషన్ సమీపంలోకి చేరుకున్న తరుణంలో ప్రమాదావశాత్తు ఐచర్ వాహనాన్ని బలంగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
చౌటుప్పల్లో విషాదం.. డీసీఎం ఢీకొని ఒకరి మృతి
తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఇద్దరిని డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో బైక్పై ఉన్నవారిలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే, రోడ్డు ప్రమాదం జరిగిన చోటు కొద్దిసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వీడియోలు
బంజారా హిల్స్ లో బిగ్ యాక్సిడెంట్ మహిళలకు తీవ్ర గాయాలు
లాలూ ఫ్యామిలీకి బిగ్ షాక్.. IRCTC స్కామ్ కేసులో కీలక మలుపు
TS: లారీ బ్రేకులు ఫెయిల్.. నడి రోడ్డుపై ఘోర ప్రమాదం
40 స్లీపింగ్ టాబ్లెట్స్ మింగిన కొండా సురేఖ మాజీ OSD తండ్రి
చంద్రబాబు చెల్లికి టీటీడీ భూములు.. నాగార్జున యాదవ్ కీలక వ్యాఖ్యలు
నీ కొప్పు సంగతేంటి లైవ్ లో పాట పాడి ఏకిపారేసిన అనిల్ కుమార్ యాదవ్
40 స్లీపింగ్ టాబ్లెట్స్ మింగిన కొండా సురేఖ మాజీ OSD తండ్రి
సాధిక్ ఖాన్ కు రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
9/11 విషాదానికి 25 ఏళ్లు... బిన్ లాడెన్ పై USA మెరుపు దాడి
మీరు శివ పార్వతులా? నేను మీ కాళ్లకు నమస్కారం చేశానని నిరూపిస్తే.. అనిల్ ఛాలెంజ్

