యశ్ను కర్ణాటకలో ఉండనివ్వం: టాక్సిక్పై ప్రముఖ నటి ఆగ్రహం
కేజీఎఫ్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్లో ఎక్కువగా వయొలెన్స్తో పాటు బోల్డ్ కంటెంట్ ఎక్కువగా చూపించారు. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాలోని కియారాతో బోల్డ్ సాంగ్పై పెద్దఎత్తున విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కేవలం పెద్దల కోసమేనని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే కన్నడ నటి రిషికా సింగ్ టాక్సిక్ చిత్రంపై విమర్శలు గుప్పించింది. ఈ ట్రైలర్లోని బోల్డ్ సీన్స్పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రైలర్లో చూపించిన రొమాంటిక్, బోల్డ్ సీన్స్ తనను తీవ్ర నిరాశకు గురి చేశాయని తెలిపింది. యశ్ కూడా ఓ భర్తగా, తండ్రిగా మహిళల పట్ల గౌరవం చూపాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. మహిళలను గౌరవించకపోతే అతడిని కర్ణాటక నుంచి ఖాళీ చేయిస్తామంటూ మాట్లాడింది. అంతేకాకుండా నేను టాక్సిక్ అంటూ కామెంట్స్ చేసింది.దీంతో రిషికా వ్యాఖ్యలపై నెట్టింట్ యశ్ అభిమానులు మండిపడుతున్నారు. 'టాక్సిక్'లోని బోల్డ్ సన్నివేశాలపై ఆమె చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషీకా గతంలో నటించిన చిత్రాలు, ఫోటోషూట్లకు సంబంధించిన క్లిప్లు కొందరు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేయనుంది. అసలు రిషికా సింగ్ ఎవరు?కన్నడ భామ రిషికా సింగ్ 'కల్ల మల్ల సుల్లా', 'బెంకి బిరుగలి', 'కంతిరవ', 'తుంటరు' లాంటి చిత్రాలతో ఫేమస్ అయింది. ఆమె చిత్రనిర్మాత రాజేంద్ర సింగ్ బాబు కుమార్తె కావడం విశేషం. అంతేకాకుండా బిగ్ బాస్ కన్నడ మొదటి సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొంది.
రూ.100 కోట్ల ఆస్తిని చాక్లెట్ ఇచ్చినట్లు ఇచ్చి పడేసిన వృద్ధుడు
హమీర్పూర్: హిమాచల్ ప్రదేశ్లో ఓ వృద్ధుడు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. వ్యక్తిగత ఆస్తిని సమాజ ప్రయోజనాలకు అంకితం చేస్తూ ఆయన చూపిన ఉదారత స్ఫూర్తిగా నిలిచింది. నాదౌన్ జిల్లాలో జోలాస్పాడ ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్యుడు రాజేంద్ర కన్వర్ (77) తన పేరిట, తన భార్య పేరిట ఉన్న రూ.100 కోట్ల విలువైన ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చారు. 2021లో డాక్టర్ కన్వర్ తన చరాస్తులు, స్థిరాస్తులు అన్నింటినీ ప్రభుత్వానికి దానం చేశారు. ఇప్పుడు జీవించి ఉండగానే, స్వచ్ఛందంగా, పూర్తి స్పృహతో దానపత్రం రూపొందించి తన ఆస్తిని ప్రభుత్వానికి బదిలీ చేశారు.దానపత్రం అనంతరం సంబంధిత భూమి బదిలీ నమోదు రాష్ట్ర ప్రభుత్వం పేరిట, అంటే హమీర్పూర్ డాక్టర్ రాధాకృష్ణన్ ప్రభుత్వ వైద్య కళాశాల పేరిట జరిగింది. అంతేకాదు, తన మరణానంతరం శిక్షణ పొందుతున్న వైద్యుల అధ్యయనం కోసం తన శరీరాన్ని దానం చేయాలని కూడా కన్వర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి వైద్య కళాశాల శరీర నిర్మాణ శాస్త్ర విభాగానికి లిఖితపూర్వకంగా సమ్మతి ఇచ్చారు. గుర్తింపు కార్డు కూడా పొందారు.ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?డాక్టర్ రాజేంద్ర కన్వర్ దీనిపై మాట్లాడుతూ.. తాను, తన భార్య తమ ఆస్తిని సమాజ ప్రయోజనాల కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తమకు సంతానం లేదని తెలిపారు. దానం చేసిన ఆస్తిలో 2 అంతస్తుల బంగ్లా, సుమారు 5 కనాల్ భూమి, వందల ఎకరాల భూమి, కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, వాహనాలు, ఫర్నిచర్, బ్యాంకులో జమ చేసిన డబ్బు సహా ఇతర ఆస్తులు ఉన్నాయి.ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ మొత్తం ఆస్తి విలువ రూ.100 కోట్లకు పైగా ఉంది. ఈ ఆస్తిని అవసరమైన ప్రజల ఆరోగ్య సౌకర్యాల కోసం వినియోగించాలని కన్వర్ అన్నారు. భవిష్యత్తులో తన భార్య జ్ఞాపకార్థం సంస్థకు “కృష్ణ రాజేంద్ర” అనే పేరు పెట్టాలని కూడా చెప్పారు.భార్య ప్రిన్సిపల్ హోదా నుంచి పదవీ విరమణ డాక్టర్ కన్వర్ భార్య కృష్ణా కన్వర్ విద్యాశాఖలో 32 సంవత్సరాలు సేవలందించారు. 2011లో ప్రిన్సిపల్గా పదవీ విరమణ చేశారు. 2020 డిసెంబర్ 6న ఆమె మరణించారు. అంతకు ముందే ఈ దంపతులు తమ ఆస్తిని సమాజ ప్రయోజనాల కోసం దానం చేయాలని నిర్ణయించారు. డాక్టర్ రాజేంద్ర కన్వర్ 1977 జనవరి 3న మెడికల్ ఆఫీసర్గా ఆరోగ్య శాఖలో చేరారు. 33 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగం అనంతరం 2010లో పదవీ విరమణ చేశారు. 77 ఏళ్ల వయసులో కూడా తన ఇంటి నుంచే తక్కువ ఫీజుతో రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, కన్వర్ దంపతులు తీసుకున్న నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలన వర్గాలు కూడా వారికి కృతజ్ఞతలు తెలిపాయి. డాక్టర్ కన్వర్ లాంటి వ్యక్తులు చాలా అరుదు. తన ఆస్తిని సమాజ వినియోగానికి ఇవ్వాలనే గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయం సమాజానికి స్ఫూర్తిదాయకం అని నాదౌన్ ఎస్డీఎం నిశాంత్ శర్మ వ్యాఖ్యానించారు.
పాన్షాప్ యజమానికి రూ. కోటి ఆస్తి,కారు, మరి ఎంబీఏ చదివినోడికి?
చిన్న చిన్న బడ్డీ కొట్లు, చిన్నదుకాణాలు, చిన్న వ్యాపారాలు బయట నుండి నిరాడంబరంగా కనిపించవచ్చు. కానీ కొంతమంది భారీ స్థాయిలోనే ఆదాయాన్ని ఆర్జిస్తారు. దీని వెనుక ఏళ్ల తరబడి శ్రమ, నిబద్ధత ఉంటుంది. అయితే ఇటీవల తన పరిసరాల్లోని ఒక పాన్ దుకాణాన్ని సందర్శించిన 34 ఏళ్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్ తన అనుభవాన్ని సోషల్మీడియాలో పంచు కోవడం నెట్టింట విశేషంగా నిలిచింది.రెడ్డిట్ యూజర్, ఎంబీఏ పట్టభద్రుడు,పంచుకున్న అనుభవం ప్రకారం తమ వీధిలోని ఒక సాధారణ పాన్ షాప్ యజమాని గురించి వివరిస్తూ. .‘‘నేను ఇటీవల సిగరెట్ తాగడానికి దగ్గర్లోని పాన్ షాపుకు వెళ్ళాను. అక్కడ యజమాని సుమారు కోటి రూపాయల విలువైన కారు, షాపు కొన్నాడని తెలిసింది. అతను తన ఇంటిని కూడా రెన్నోవేట్ చేస్తున్నాడు. ఆయన పని చాలా కష్టమైన పనే. ఒకసారి, తెల్లవారుజామున 2 గంటలకు ఒకరికి సిగరెట్ ఇవ్వడానికి నిరాకరించినందుకు అతనిపై కత్తితో దాడి కూడా జరిగింది.” అంటూ రాసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతను చుట్టూ ఉన్న మరిన్ని చిన్నదుకాణాలు ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, జ్యూస్ అమ్మేవారిని గమనించడం మొదలు పెట్టాడట.మరోవైపు సదరు MBA గ్రాడ్యుయేట్ వెన్నునొప్పి కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రస్తుతం సరైన పని దొరకక ఇబ్బంది పడుతున్నారు.తమ చుట్టూ ఉన్నపాన్ షాప్ యజమానులే కాకుండా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, జ్యూస్ సెంటర్లు, మొబైల్ విక్రేతలు కూడా స్వయంగా వ్యాపారం చేసుకుంటూ మంచి ఆస్తులు కూడబెట్టుకోవడం, కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించడం చూశారని పేర్కొన్నాడు. అలాగే తమ ప్రాంతంలో ఒకతను పెద్దగా చదువుకోకపోయినా, భారతదేశంలో ఖరీదైన మొబైల్ ఫోన్లను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే అమ్మి బాగా సంపాదిస్తున్నాడంటూ మరొక ఉదాహరణను పంచుకున్నాడు. వీరిని చూశాక చిన్న వ్యాపారం ప్రారంభించడం బెటర్ అనిపిస్తోంది. తనకు నడుము నొప్పి లేకపోయి ఉంటే, తాను కూడా వడా పావ్ లేదా రామెన్ కియోస్క్ ప్రారంభించి ఉండేవాడిని, లేదా ఆన్లైన్ స్టోర్ల కంటే మెరుగైన ధరలకు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మడం మొదలుపెట్టి ఉండేవాడినన్నాడు. అంతేకాదు చిన్న వ్యాపార యజమానులు గత 15-20 ఏళ్లలో ఒక టైర్-2 లేదా టైర్-3 కాలేజీ గ్రాడ్యుయేట్ తన జీవితకాలంలో సంపాదించే దానికంటే ఎక్కువే సంపాదించారు అంటూ ఉన్నత చదువులు (ఉదాహరణకు టైర్-2, టైర్-3 MBAలు) నిజంగానే మెరుగైన ఆర్థిక అవకాశాలను ఇస్తున్నాయా? లేదా చిన్న వ్యాపారాలే నయమా?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై స్పందనలుఈ పోస్ట్పై రెడ్డిట్లో తీవ్ర చర్చ జరిగింది. యూజర్లు వేర్వేరు దృక్పథాలను పంచుకున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ "మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇది కేవలం సక్సెస్ అయిన యజమాని కథ మాత్రమే. ప్రతి పాన్ షాప్ యజమానీ కోటీశ్వరుడు కాలేడు. చాలామంది పూట గడవడానికే కష్టపడతారు. సాధారణంగా ఒక సగటు MBA గ్రాడ్యుయేట్, ఒక సగటు పాన్ షాప్ యజమాని కంటే మెరుగైన ఆర్థిక స్థితిలోనే ఉంటాడు అంటూ వివరణ ఇచ్చారు.“నేను మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ మీ వైఖరి చాలా వర్గపరమైనది. అపారమైన లాభాలు సంపాదించేంత వ్యాపార చతురత ఉన్న పాన్ షాప్ యజమాని విలువైన వస్తువులు కొనుక్కోవడంలో తప్పేముంది’’ అని మరొకరు ప్రశ్నించారు. వ్యాపార ఆదాయానికి పరిమితులుండవు. ఉద్యోగాల్లో ఉండే పరిమితుల కంటే చిన్న వ్యాపారాల్లోనే ఎక్కువ సంపాదనకు అవకాశం ఉంటుంది. సరైన గ్రోత్ లేని తక్కువ జీతం ఉద్యోగాల్లో ఇరుక్కుపోయే కంటే, రిస్క్ తీసుకుని వ్యాపారం చేయడం మంచిదని మరొకరు అభిప్రాయపడ్డారు. అంతేకాదు వ్యాపార నైపుణ్యం ఉండి, శ్రమపడి సంపాదించిన వ్యక్తి కార్లు, ఆస్తులు కొనుగోలు చేయడంలో తప్పులేదని, ఏ పనినీ తక్కువగా చూడకూడదని మరికొందరు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుల్స్ : సుప్రీం సీరియస్, కేంద్రానికి అల్టిమేటంచాలా మంది 20-30 లక్షల వార్షిక ఆదాయాన్ని అరుదైనదిగా భావించడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. వారు తమ ఉద్యోగ ప్రపంచం నుండి బయటకు వచ్చి, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే, 20-30 లక్షల వార్షిక ఆదాయం చాలా సాధారణం. మీరు భవిష్యత్తులో కెరీర్ వృద్ధి లేని తక్కువ జీతం గల ఉద్యోగంలో చిక్కుకుపోయి ఉంటే, మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా వ్యాపార అవకాశాలను అన్వేషించడం ప్రారంభించండి ఇంకొకరు సలహా ఇచ్చారు.ఇదీ చదవండి: మాల్యా కేసు : బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఉన్నత విద్య కేవలం ఉద్యోగ భద్రతను ఇచ్చే మార్గం మాత్రమే. స్వయం ఉపాధి లేదా చిన్న వ్యాపారాలు చేసే శ్రమ, రిస్క్, కస్టమర్ మైండ్సెట్ ఉంటే చదువుతో సంబంధం లేకుండా గొప్ప ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు. ఏమంటారు?ఇదీ చదవండి: రోడ్డుపై టైగర్ : సెల్ఫీలకు ఎగబడిన పర్యాటకులు, వీడియో వైరల్
జంతర్ మంతర్ సీజన్-2లో ఏం చేస్తారు? ఎప్పుడు షురూ?
న్యూఢిల్లీ: జంతర్మంతర్ వద్ద 36 రోజుల పాటు ఉద్యమం నిర్వహించి నెల కూడా పూర్తికాకముందే.. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే 'సీజన్-2' త్వరలో మొదలవుతుందని ప్రకటించారు. సీజన్-2లో ఏం చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. అది ఎలా ముందుకు వెళ్లనుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యంగా ఈ సారి సీజేపీ ముందుకు వస్తోంది.సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ.. సీజన్-2లో అసలు ఏం జరగబోతోందో వివరించారు. ఈసారి పార్టీ దృష్టి దేశంలోని పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడంపై ఉంటుందని చెప్పారు. పాఠశాలల విషయంలో తమ మాట ప్రభుత్వం వినకపోతే మళ్లీ ఉద్యమం చేస్తామని చెప్పారు. 'స్కూల్ ఠీక్ కరో అభియాన్' ఆగస్టు 15 నుంచి మొదలవుతుందని అన్నారు. పాఠశాలలు బాగుపడాల్సిందే.. సీజేపీ కొత్త ప్రచారాన్ని ప్రారంభించబోతుందని ఆశుతోష్ ప్రకటించారు. ‘‘మా పిల్లలను పాఠశాలలకు దూరంగా ఉండనివ్వం. ఇదే జంతర్మంతర్ సీజన్-2. ఈ ప్రచారానికి దేశ ప్రజలే నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారు. గ్రామాల్లో ఉన్న పిల్లలను విద్యకు దూరంగా ఉంచారు. గత కొన్ని సంవత్సరాల్లో దేశంలో 94 వేల పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లలను బలహీనంగా ఉంచాలనే ప్రభుత్వ ప్రయత్నంలా ఇది కనిపిస్తోంది" అన్నారు.ప్రచార సమయంలో ఏం చేస్తారో కూడా రాంకా వివరించారు. "దేశవ్యాప్తంగా సర్పంచ్లను తమ పాఠశాలలను మెరుగుపరచాలని కోరుతాం. రాబోయే నెలల్లో మా బృందం దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలను సందర్శిస్తుంది. ఈ పాఠశాలలను మెరుగుపరచాలని కలిసి డిమాండ్ చేస్తాం. సర్పంచ్లకు పూర్తిగా మద్దతు ఇస్తాం" అన్నారు.పాఠశాలలను మెరుగుపరచని చోట తమ పార్టీ నిరసనలు కూడా చేపడుతుందని చెప్పారు. సీజేపీ బృందాలు వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలను సందర్శించనున్నాయి. పాఠశాలలు మెరుగుపడని ప్రాంతాల్లో నిరసనలు చేపడతాయి. నీట్ ఉద్యమం ముగిసినా తమ పోరాటం ముగియలేదని, ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఇతర సమస్యలపై దృష్టి పెడతామని సీజేపీ చెబుతోంది.
మోతె దంపతుల కేసులో బిగ్ ట్విస్ట్
నల్సార్ గ్రాడ్యుయేట్ల ఎన్రోల్మెంట్ నిలిపేయం: బీసీఐ స్పష్టం
రజినీకాంత్ సీక్వెల్.. భారీ ధరకు ఓటీటీ డీల్..!
చరిత్ర సృష్టించిన మోమినుల్ హక్.. బీసీబీ చైర్మెన్ రికార్డ్ బ్రేక్
ఒక్కసారే రీచార్జ్.. 412 రోజులు నో టెన్షన్!
ఇక మేమందరం వారిని కర్రలతో తరుముతాం: విద్యార్థులు
అన్నాడీఎంకేకు మరో దెబ్బ.. అప్సరా రెడ్డి రాజీనామా
లంక సిరీస్లో అతడే మా ఎక్స్-ఫ్యాక్టర్: భారత బౌలింగ్ కోచ్
గంటల వ్యవధిలోనే.. బంగారం ధరల్లో భారీ మార్పు!
జంతర్ మంతర్ సీజన్-2లో ఏం చేస్తారు? ఎప్పుడు షురూ?
'ఈ వయసులో సిగ్గుచేటు'.. ఉదయనిధికి త్రిష స్ట్రాంగ్ కౌంటర్
బలూచ్కు భారత్ మద్దతు.. ఉలిక్కిపడిన పాక్!
టాటా బైబై
వరుస యుద్ధాలతో అడుగంటిన ఆయుధ సామగ్రి
నిషేధం ఓకే.. మరి అభిమానులు వద్దా? : జాన్వీని ప్రశ్నించిన హైకోర్టు
అబ్బే! ఆయన అడిగేది క్రికెట్ స్కోరు కాద్సార్.. మన రోజువారీ అప్పు
బంగారం కొనుగోలుపై కియోసాకి కీలక వ్యాఖ్యలు
ఫోన్కు బానిసై, ఆస్పత్రిలో చేరిన షకీలా.. నరకయాతన!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యవహారాలలో పురోగతి
కూరగాయల కొట్టు నుంచి అండర్వరల్డ్ సింహాసనం వరకు..
విమానం కాదు! మన సారే సీక్రెట్గా వెళ్తున్నారు!
ఏలియన్స్ రాక.. పుతిన్ పతనం.. మూడో ప్రపంచ యుద్ధం
నెలకు ఒకసారే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారు..
బాసూ.. ఆ సినిమాని మర్చిపోయారా?
బాబు రాయబారం ఫెయిల్.. ఝలక్ ఇచ్చిన పవన్!
అసాధ్యమనుకున్నవి ఎన్నో నిజమయ్యాయి
భాష ముఖ్యం బిగిలూ!
అందుకే నేను ఝార్ఖండ్ ఆందోళనలకు వెళ్లట్లేదు: దీప్కే
సాయికృష్ణ కేసు.. హోంగార్డ్ రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారవృద్ధి
మోతె దంపతుల కేసులో బిగ్ ట్విస్ట్
నల్సార్ గ్రాడ్యుయేట్ల ఎన్రోల్మెంట్ నిలిపేయం: బీసీఐ స్పష్టం
రజినీకాంత్ సీక్వెల్.. భారీ ధరకు ఓటీటీ డీల్..!
చరిత్ర సృష్టించిన మోమినుల్ హక్.. బీసీబీ చైర్మెన్ రికార్డ్ బ్రేక్
ఒక్కసారే రీచార్జ్.. 412 రోజులు నో టెన్షన్!
ఇక మేమందరం వారిని కర్రలతో తరుముతాం: విద్యార్థులు
అన్నాడీఎంకేకు మరో దెబ్బ.. అప్సరా రెడ్డి రాజీనామా
లంక సిరీస్లో అతడే మా ఎక్స్-ఫ్యాక్టర్: భారత బౌలింగ్ కోచ్
గంటల వ్యవధిలోనే.. బంగారం ధరల్లో భారీ మార్పు!
జంతర్ మంతర్ సీజన్-2లో ఏం చేస్తారు? ఎప్పుడు షురూ?
'ఈ వయసులో సిగ్గుచేటు'.. ఉదయనిధికి త్రిష స్ట్రాంగ్ కౌంటర్
బలూచ్కు భారత్ మద్దతు.. ఉలిక్కిపడిన పాక్!
టాటా బైబై
వరుస యుద్ధాలతో అడుగంటిన ఆయుధ సామగ్రి
నిషేధం ఓకే.. మరి అభిమానులు వద్దా? : జాన్వీని ప్రశ్నించిన హైకోర్టు
అబ్బే! ఆయన అడిగేది క్రికెట్ స్కోరు కాద్సార్.. మన రోజువారీ అప్పు
బంగారం కొనుగోలుపై కియోసాకి కీలక వ్యాఖ్యలు
ఫోన్కు బానిసై, ఆస్పత్రిలో చేరిన షకీలా.. నరకయాతన!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యవహారాలలో పురోగతి
కూరగాయల కొట్టు నుంచి అండర్వరల్డ్ సింహాసనం వరకు..
విమానం కాదు! మన సారే సీక్రెట్గా వెళ్తున్నారు!
ఏలియన్స్ రాక.. పుతిన్ పతనం.. మూడో ప్రపంచ యుద్ధం
నెలకు ఒకసారే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారు..
బాసూ.. ఆ సినిమాని మర్చిపోయారా?
బాబు రాయబారం ఫెయిల్.. ఝలక్ ఇచ్చిన పవన్!
అసాధ్యమనుకున్నవి ఎన్నో నిజమయ్యాయి
భాష ముఖ్యం బిగిలూ!
అందుకే నేను ఝార్ఖండ్ ఆందోళనలకు వెళ్లట్లేదు: దీప్కే
సాయికృష్ణ కేసు.. హోంగార్డ్ రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారవృద్ధి
ఫొటోలు
కర్నూలులో వైఎస్ జగన్కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)
'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్ (ఫొటోలు)
బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు)
రవితేజ ‘ఇరుముడి’ మూవీ HD స్టిల్స్
హైదరాబాద్ : గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ రిహార్సల్స్ (ఫొటోలు)
ఫేమస్ బ్రిడ్జి దగ్గర హీరోయిన్ మమతా మోహన్ దాస్ (ఫొటోలు)
రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు)
‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
ప్రకృతి ఒడిలో టాలీవుడ్ హీరోయిన్ యోగా (ఫొటోలు)
సినిమా
దుల్కర్ మూవీ వాయిదా.. అదే కారణం..!
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటేస్ట్ మూవీ ఐ యామ్ గేమ్. ఈ మూవీకి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు దుల్కర్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ తేదీని ఇప్పటికే ప్రకటించారు. ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు.కానీ ఊహించని విధంగా ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తాజాగా అనౌన్స్ చేశారు. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయాలనే ఉద్దేశంతో విడుదలను వాయిదా వేస్తున్నట్లు దుల్కర్ సల్మాన్ వెల్లడించారు. భారీ స్థాయిలో విడుదల ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇంకా కొన్ని పనులు పూర్తి కాలేదని తెలుస్తోంది. అందువల్లే వాయిదా వేశారని అర్థమవుతోంది.ఈ చిత్రంలో దుల్కర్ సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు మిస్కిన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్పై జూనియ్ ఎన్టీఆర్ సైతం ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా ఉందంటూ పోస్ట్ పెట్టారు.
ఒకే రోజు ఐదు సినిమాలు.. గెలిచేదెవరో..?
ఒక్కో సినిమాది ఒక్కో కథ. ఒక్కో దర్శకుడిది ఒక్కో కాన్సెప్ట్. ఫ్యామిలీ డ్రామా నుంచి యాక్షన్ వరకు, హారర్ నుంచి పీరియాడిక్ కథల వరకు విభిన్న జానర్లతో ప్రేక్షకులను అలరించేందుకు ఐదు సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు సినిమాలపై అంచనాలను పెంచేశాయి. మరి ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆ సినిమాలేంటో ఓసారి చూద్దాం.విశ్వనాథ్ అండ్ సన్స్: సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమితా బైజు కథానాయికగా నటించింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.పళ్ళ బురుసు: ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పళ్ళ బురుసు'. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్లు నిర్మించిన ఈ సినిమా కూడా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.మకుటం: విశాల్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం 'మకుటం'. ఆర్బీ చౌదరి నిర్మించిన ఈ సినిమాలో దుషార విజయన్, అంజలి కథానాయికలుగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.అగధ: ఎంఎస్ రాజు రచన, దర్శకత్వంలో శ్రవణ్ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'అగధ'. కామాక్షీ భాస్కర్ల, ఉల్కా గుప్తా, జోవికా విజయ్కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయ రాణి రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కూడా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆవారాపన్ 2: 'ఆవారపన్' చిత్రానికి సీక్వెల్గా రూపొందిన సినిమా 'ఆవారపన్ 2'. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించాడు. ఇమ్రాన్ హష్మీ సరసన దిశా పటాని నటించింది. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.బట్వారా 1947: సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బట్వారా 1947'. ఈ చిత్రంతో ప్రీతి జింటా మళ్లీ వెండితెరపై కనిపించనుంది. షబానా ఆజ్మీ, అలీ ఫజల్, కరణ్ డియోల్, సర్గమ్ సింగ్లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ నిర్మించారు. ఈ సినిమా కూడా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇలా విభిన్న కథాంశాలతో వస్తున్న ఈ సినిమాల్లో ఏ చిత్రం ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరో కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
యశ్ను కర్ణాటకలో ఉండనివ్వం: టాక్సిక్పై ప్రముఖ నటి ఆగ్రహం
కేజీఎఫ్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్లో ఎక్కువగా వయొలెన్స్తో పాటు బోల్డ్ కంటెంట్ ఎక్కువగా చూపించారు. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాలోని కియారాతో బోల్డ్ సాంగ్పై పెద్దఎత్తున విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కేవలం పెద్దల కోసమేనని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే కన్నడ నటి రిషికా సింగ్ టాక్సిక్ చిత్రంపై విమర్శలు గుప్పించింది. ఈ ట్రైలర్లోని బోల్డ్ సీన్స్పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రైలర్లో చూపించిన రొమాంటిక్, బోల్డ్ సీన్స్ తనను తీవ్ర నిరాశకు గురి చేశాయని తెలిపింది. యశ్ కూడా ఓ భర్తగా, తండ్రిగా మహిళల పట్ల గౌరవం చూపాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. మహిళలను గౌరవించకపోతే అతడిని కర్ణాటక నుంచి ఖాళీ చేయిస్తామంటూ మాట్లాడింది. అంతేకాకుండా నేను టాక్సిక్ అంటూ కామెంట్స్ చేసింది.దీంతో రిషికా వ్యాఖ్యలపై నెట్టింట్ యశ్ అభిమానులు మండిపడుతున్నారు. 'టాక్సిక్'లోని బోల్డ్ సన్నివేశాలపై ఆమె చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషీకా గతంలో నటించిన చిత్రాలు, ఫోటోషూట్లకు సంబంధించిన క్లిప్లు కొందరు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేయనుంది. అసలు రిషికా సింగ్ ఎవరు?కన్నడ భామ రిషికా సింగ్ 'కల్ల మల్ల సుల్లా', 'బెంకి బిరుగలి', 'కంతిరవ', 'తుంటరు' లాంటి చిత్రాలతో ఫేమస్ అయింది. ఆమె చిత్రనిర్మాత రాజేంద్ర సింగ్ బాబు కుమార్తె కావడం విశేషం. అంతేకాకుండా బిగ్ బాస్ కన్నడ మొదటి సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొంది.
నటి శ్రీదేవీ బయోగ్రఫీపై కీలక అప్డేట్..!
దిగ్గజ నటి శ్రీదేవి జయంతి సందర్భంగా నటి ప్రియాంక చోప్రా ఆమె జీవిత చరిత్ర పుస్తకానికి సంబంధించిన తాజా అప్డేట్ను పంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'ఎంప్రెస్- ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి' పుస్తక ముఖచిత్రాన్ని షేర్ చేస్తూ ఆమెకు నివాళులర్పించారు. 'మీరు ఎంతో గుర్తుకొస్తున్నారు. స్వర్గంలో ఉన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు. శ్రీదేవి త్వరలో వస్తోంది' అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ పోస్టును శ్రీదేవి భర్త బోనీ కపూర్ కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు.2023లో వెస్ట్ల్యాండ్ బుక్స్ శ్రీదేవి అధికారిక జీవిత చరిత్రను ప్రచురిస్తున్నట్లు ప్రకటించింది. రచయిత ధీరజ్ కుమార్ రచించిన ఈ పుస్తకం శ్రీదేవి సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, ఆమె వదిలివెళ్లిన వారసత్వాన్ని తెలియజేయనుంది.ఒకానొక సమయంలో భారతీయ సినీ పరిశ్రమను ఏలిన శ్రీదేవి.. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో కన్నుమూశారు. బంధువు మోహిత్ మార్వా వివాహానికి హాజరైన సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. 'మిస్టర్ ఇండియా', 'చాందినీ', 'హిమ్మత్వాలా' వంటి చిత్రాలతో ఆమె భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. తెలుగులోనూ స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీదేవి చివరి చిత్రం..శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రం 'మామ్' (2017). ఇది ఆమె కెరీర్లో 300వ చిత్రం. దీనికి గాను ఆమెకు మరణానంతరం జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. ఆమె మరణానంతరం విడుదలైన 'జీరో' (2018) చిత్రంలోనూ అతిథి పాత్రలో కనిపించారు.
క్రీడలు
మోనికా సంతోషంగా ఉండాలి.. ఇకపై స్పందించను
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ ఎట్టకేలకు మౌనం వీడింది. వివాహేతర సంబంధం గురించి తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించింది. తన భార్య మోనికా రైట్ నుంచి విడిపోవడం పూర్తిగా వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది.2025లో పెళ్లిఅయితే, ఆరోపణల సమయంలోనూ తనకు మద్దతుగా నిలిచినందుకు క్రికెట్ ఆస్ట్రేలియాకు ఆష్లే గార్డ్నర్ ధన్యవాదాలు తెలిపింది. కాగా డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై.. ప్రేమలో పడ్డ తర్వాత ఆష్లే- మోనికా 2025 ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నారు. అయితే, వివాహం జరిగిన కొన్ని నెలల వ్యవధిలోనే వీరి మధ్య విభేదాలు తలెత్తాయి.ఆమెతో వివాహేతర సంబంధంఈ నేపథ్యంలో సహచర క్రికెటర్, ఆసీస్ ఓపెనర్ జార్జియా వోల్తో ఆష్లేకు వివాహేతర సంబంధం ఉందంటూ మోనికా రైట్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. వైస్ కెప్టెన్ స్థాయిలో ఉన్న క్రికెటర్ ఇలాంటి తప్పిదాలకు పాల్పడినా క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించడం లేదని ఆరోపించింది. ఆమెను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.గోప్యతను గౌరవిస్తాంఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగత విషయాల గురించి తాము పట్టించుకోమని.. వర్క్ పాలసీకి అనుగుణంగా పనిచేసే వారిపై చర్యలు తీసుకోమని స్పష్టం చేసింది. ప్రతీ క్రికెటర్ గోప్యతను గౌరవిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆష్లే గార్డ్నర్ తాజాగా ఇన్స్టా వేదికగా స్పందించింది.ఆష్లే స్పందన ఇదే‘‘నా భార్య నుంచి విడిపోవడం పూర్తిగా వ్యక్తిగత విషయం. నేను క్రికెట్ ఆస్ట్రేలియా తరఫు వైస్ కెప్టెన్ అనే గొప్ప స్థానంలో ఉన్నాను. కాబట్టి నా ప్రస్తుత రిలేషన్షిప్ గురించి తప్పక స్పందించాల్సిందే.ఇలాంటి సమయంలోనూ నాకు అండగా నిలుస్తూ.. నాయకత్వ బృందంలో కొనసాగిస్తున్నందుకు బోర్డుకు ధన్యవాదాలు. లీడర్గా నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను. ఏదేమైనా మోనికాతో ఉన్న క్షణాలు మర్చిపోను. ఆమెకు బాధ కలిగినందుకు చింతిస్తున్నాను. మోనికా సంతోషంగా ఉండాలిమోనికా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆమె భవిష్యత్తు బాగుండాలి. ఇక ఈ విషయంపై బహిరంగంగా స్పందించను. ఈ వివాదంలో భాగమైన వారి గోప్యతను గౌరవించాల్సి ఉంటుంది’’ అని ఆష్టే గార్డ్నర్ స్పష్టం చేసింది.చదవండి: ఓవరాక్షన్ వద్దు.. ఆట కంటే గొప్పోడివా?: స్టీవ్ స్మిత్పై ఫైర్
ఆసియాకప్ టోర్నీకి శ్రీలంక జట్టు ఇదే.. 17 ఏళ్ల యువ సంచలనానికి ఛాన్స్
యూఏఈ వేదికగా జరగనున్న మహిళల ఆసియాకప్-2026 టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు సీనియర్ ఆల్రౌండర్ చమి చమరి ఆటపట్టు సారథిగా వ్యవహరించనుండగా.. హర్షిత సమరవిక్రమ వైస్ కెప్టెన్గా ఎంపికైంది. ఇటీవల పాకిస్తాన్పై సెంచరీ బాదిన యువ బ్యాటర్ ఇమేషా దులాని జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకుంది. అదేవిధంగా పాక్ సిరీస్లో అదరగొట్టిన 17 ఏళ్ల యువ సంచలనం సంజన కవిందికు కూడా సెలక్టర్లు అవకాశమిచ్చారు. మరోవైపు పాక్తో సిరీస్కు జట్టులో చోటు కోల్పోయిన పేసర్ మిథాలి అయోధ్య తిరిగి రీఎంట్రీ ఇచ్చిందిసుగంధిక దాసనాయక, చాముడి ప్రబోద, చేతన విముక్తితో ఆమె బంతిని పంచుకోనుంది. కాగా ఈసారి ఆసియాకప్ను వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. శ్రీలంక డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. గత ఎడిషన్ (2024) ఫైనల్లో భారత్ను ఓడించి తొలిసారి ఆసియా కప్ ట్రోఫీని శ్రీలంక ముద్దాడింది. ఈ ఖండాంతర టోర్నీ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది.శ్రీలంక జట్టు: చమరి ఆటపట్టు (కెప్టెన్), ఇమేషా దులానీ, సంజన కవిందీ, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ (వైస్ కెప్టెన్), కవిషా దిల్హరి, నీలక్షిక సిల్వా, హాసిని పెరీరా, కౌశిని నూతనంగన (వికెట్ కీపర్), దేవ్మీ విహంగ, సుగండిక కుమారి, చమ్దికా కుమారి కవింది, మిథాలీ అయోధ్యచదవండి: AFG vs IRE: అఫ్గానిస్తాన్ ఓపెనర్ వరల్డ్ రికార్డ్
ఓవరాక్షన్ వద్దు.. ఆట కంటే గొప్పోడివా?: స్మిత్పై ఫైర్
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు చేదు అనుభవం ఎదురైంది. ‘క్రికెట్ కంటే నువ్వేమీ గొప్పోడివి కాదు’ అంటూ ఓ అభిమాని అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా ఆసీస్ సొంతగడ్డపై బంగ్లాతో రెండు మ్యాచ్లు ఆడుతోంది.చెలరేగిన హసన్ మహమూద్ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం డార్విన్లో తొలి టెస్టు మొదలైంది. మరారా స్టేడియంలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ దాటికి కంగారూల బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ రైటార్మ్ పేసర్ ఆరు వికెట్లతో చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించాడు.198 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో 53 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. నాలుగో నంబర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అర్ధ శతకం (71) బాదడంతో ఈ మేర గౌరవప్రదమైన స్కోరు సాధ్యమైంది. అయితే, మ్యాచ్ మధ్యలో స్మిత్ వ్యవహరించిన తీరు ఓ అభిమానికి చిర్రెత్తించింది.ఆటకు అంతరాయంసెకండ్ సెషన్ వేళ సైట్ స్క్రీన్ (బ్యాటర్ ఎదురుగా ఉండే స్క్రీన్) సరిగ్గా లేదంటూ స్మిత్ పదే పదే ఆటకు అంతరాయం కలిగించాడు. స్క్రీన్ను సరిచేయాల్సిందిగా గ్రౌండ్ సహాయక సిబ్బందికి చెప్పాడు. ఈ క్రమంలో ఆట ఆలస్యమైంది.ఓవరాక్షన్ చేయకుఈ నేపథ్యంలో ప్రేక్షకుల మధ్యలో ఉన్న ఓ అభిమాని.. ‘‘స్మడ్జ్ (స్మిత్ ముద్దుపేరు).. నువ్వు బంతిని బాదడంపై దృష్టి పెట్టు. ప్రత్యేకంగా ఏదో కావాలన్నట్లుగా ఓవరాక్షన్ చేయకు. నువ్వేమీ ఆట కంటే గొప్పోడికి కాదు స్టీవ్. ఆడి చూపించు’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫాక్స్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్గా మారింది.చదవండి: ఆసీస్ గడ్డ మీద చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్ View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket)
అఫ్గానిస్తాన్ ఓపెనర్ వరల్డ్ రికార్డ్
ఐర్లాండ్ గడ్డపై అఫ్గానిస్తాన్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. బుధవారం బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో ఆతిథ్య ఐర్లాండ్ను 42 పరుగుల తేడాతో అఫ్గాన్ ఓడించింది. ఈ విజయంలో అఫ్గానిస్తాన్ ఓపెనర్లు సెదీఖుల్లా అటల్, ఇబ్రహీం జద్రాన్లది కీలక పాత్ర. వీరిద్దరూ భారీ సెంచరీలతో చెలరేగాడు. అటల్ కేవలం 120 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 143 పరుగులు సాధించగా.. జద్రాన్ 118 బంతుల్లో 107 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 343 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో ఐరీష్ జట్టు 48 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ పేసర్ యామిన్ అహ్మద్జాయ్ నాలుగు, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు సాధించారు. ఇక ఈ మ్యాచ్లో అద్భుత సెంచరీతో సత్తాచాటిన సెదీఖుల్లా అటల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.పుట్టినరోజున వన్డేల్లో అత్యధిక వ్యక్తి స్కోర్ సాధించిన ప్లేయర్గా అటిల్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ పేరిట ఉండేది. లాథమ్ తన 30 బర్త్డే రోజున నెదర్లాండ్స్పై 140 పరుగులు చేశాడు.తాజా మ్యాచ్లో తన 25 పుట్టిన రోజున 143 పరుగులు చేసిన అటల్.. లాథమ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాత స్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(134) ఉన్నారు.చదవండి: ఓవరాక్షన్ వద్దు.. ఆట కంటే గొప్పోడివా?: స్టీవ్ స్మిత్పై ఫైర్
న్యూస్ పాడ్కాస్ట్
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్య
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
చంద్రబాబు పాలన రైతులకు హానికరం... చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ... వైఎస్ జగన్ ఆగ్రహం
అసత్య ప్రచారంలో ఆరితేరిన ఏపీ సీఎం చంద్రబాబు... రెండు మినహా హామీలన్నీ అమలు చేశానంటూ బుకాయింపు...
బీసీ నేతలపై రెడ్బుక్!. బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అక్రమ అరెస్టులు
బిజినెస్
డబ్బు, పేరు కాదు.. అందుకే 'రిచ్ డాడ్' బుక్ రాశా!
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత ''రాబర్ట్ కియోసాకి'' ఒక ట్వీట్లో చాలా సింపుల్గా ఒక లోతైన విషయాన్ని చెప్పారు. ఆయన ఒకప్పుడు రాక్ అండ్ రోల్ బిజినెస్లో పనిచేస్తూ.. ది పోలీస్, వాన్ హాలెన్, ఐరన్ మైడెన్ వంటి ప్రముఖ బ్యాండ్ల కోసం ఉత్పత్తులు తయారు చేసేవారు. ఆ సమయంలో ఆయనకు మంచి డబ్బు వచ్చేది, ఫేమస్ బ్యాండ్లతో కలిసి ఉండే అవకాశం ఉండేది. జీవితం చాలా సరదాగా, విజయవంతంగా ఉన్నప్పటికీ.. తనలో మాత్రం ఏదో లోటు ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు.ఆ సమయంలోనే ఆయన డాక్టర్ ఆర్. బక్మినిస్టర్ ఫులర్ను కలిశారు. కొంతకాలం పాటు ఆయన దగ్గర చదువుకున్నారు. ఆ సమయంలో తాను చెప్పిన మాటలు కియోసాకిని బాగా ప్రభావితం చేశాయి. మన జీవితం కేవలం మన కోసం, మన డబ్బు కోసం, మన సుఖం కోసం మాత్రమే కాదని అర్థం చేసుకున్నారు.చాలామంది జీవితంలో ఒక దశకు వచ్చిన తర్వాత ''నేను ఇది ఎందుకు చేస్తున్నాను?'', ''నా జీవితానికి అసలు అర్థం ఏంటి?'' అని ఆలోచిస్తారు. కియోసాకి కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. డబ్బు ఉన్నా, పేరు ఉన్నా, ఆనందంగా ఉన్నా తనకు ఏదో లోటుగా అనిపించింది. దాంతో ఆయనకు అర్థమైన విషయం ఏమిటంటే.. డబ్బు సంపాదించడం మాత్రమే జీవిత లక్ష్యం కాదు. మన వల్ల ఇతరులకు ఎంత ఉపయోగం జరుగుతోంది అనేదే అసలు విషయం.ఆ ఆలోచనను తన జీవితంలో అమలు చేసిన తర్వాతే కియోసాకి క్యాష్ఫ్లో అనే బోర్డ్ గేమ్ను రూపొందించారు, అలాగే రిచ్ డాడ్ పూర్ డాడ్ (Rich Dad Poor Dad) పుస్తకాన్ని రాశారు. వీటి ద్వారా ప్రజలకు డబ్బు గురించి, పెట్టుబడుల గురించి, ఆర్థిక స్వేచ్ఛ గురించి కొత్తగా ఆలోచించే అవకాశం కల్పించారు.అంటే.. తనకు తెలిసిన విషయాలను తన దగ్గరే ఉంచుకోకుండా, వాటిని ఇతరులతో పంచుకోవడం ద్వారా తన జీవితానికి ఒక అర్థం దొరికిందని ఆయన చెప్పాలనుకున్నారు.కియోసాకి చెప్పే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మన జీవిత లక్ష్యం ఎప్పుడూ మనకు వెంటనే అర్థం కాదు. కొన్నిసార్లు మనం ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంటాం. కానీ ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తూ ముందుకు వెళ్తే.. మన దారి మనకే క్రమంగా అర్థమవుతుంది. జీవితంలో ఎంత డబ్బు సంపాదించాం అనేదాని కంటే, మన వల్ల ఎంతమంది జీవితాల్లో మంచి మార్పు వచ్చింది అనేది కూడా ముఖ్యమే.చివరికి ''నీ జీవిత లక్ష్యం ఏంటి? దేవుడు నిన్ను ఈ భూమిపైకి ఎందుకు పంపాడు?'' ఇవి ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన విషయాలు అని కియోసాకి తన ట్వీట్ ముగించాడు. మొత్తం మీద జీవితం అంటే కేవలం మన కోసం బతకడం కాదు. మన ప్రతిభ, మన అనుభవం, మన సంపాదన, మన జ్ఞానం ద్వారా ఇతరులకు ఉపయోగపడేలా జీవించినప్పుడే మన జీవితానికి నిజమైన అర్థం వస్తుందని ఆయన స్పష్టం చేశారు.WORDS of TRANSFORMATION💥Years ago, I was making a lot of money in the Rock n Roll business developing products for bands such as the Police, Van Halen, Iron Maiden and more. It was fun because I often got to hangout back stage with the band. As much fun and profitable as…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 13, 2026
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 113.61 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో.. 78,079.96 వద్ద, నిఫ్టీ 40.10 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 24,395.85 వద్ద నిలిచాయి.ఆస్ట్రల్ లిమిటెడ్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, శారదా ఎనర్జీ & మినరల్స్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, ఫిజిక్స్వాలా లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
టాటా సన్స్ చైర్మన్ రాజీనామా.. కొత్త బాస్కు బిగ్ సవాల్!
వచ్చే ఐదేళ్లలో దాదాపు 120 బిలియన్ డాలర్ల (రూ.11.45 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టాలని టాటా సన్స్ పెద్ద ప్లాన్ వేసుకుంది. కానీ.. చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఆకస్మిక రాజీనామాతో ఈ ప్రణాళికపై కొంత అనిశ్చితి ఏర్పడింది. కొత్త నాయకుడు వచ్చే వరకు.. కొన్ని భారీ ప్రాజెక్టులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.చంద్రశేఖరన్ దాదాపు పదేళ్ల పాటు టాటా గ్రూప్ను నడిపారు. ఈ సమయంలో ఆయన టాటా భవిష్యత్తు కోసం సెమీకండక్టర్ చిప్స్, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలు, ఏఐ డేటా సెంటర్లు వంటి కొత్త రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ ప్రాజెక్టులు వెంటనే లాభాలు ఇచ్చేవి కావు. అయితే.. వీటికి చాలా డబ్బు, సమయం, టెక్నాలజీ అవసరం. ఇలాంటి సమయంలో చంద్రశేఖరన్ తప్పుకోవడం సంస్థ వృద్ధిపై తప్పకుండా ప్రభావం చూపే అవకాశం ఉంది.చంద్రశేఖరన్ రాజీనామా తరువాత.. నోయెల్ టాటా సంస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే.. చంద్రశేఖరన్ భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, నోయెల్ మాత్రం ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నారు. ఎక్కువ కాలం తర్వాత లాభాలు వచ్చే ప్రాజెక్టుల కంటే, పెట్టిన డబ్బు త్వరగా తిరిగి వచ్చే అవకాశమున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.అందుకే.. టాటా బోర్డు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను మళ్లీ పరిశీలిస్తోంది. ముఖ్యంగా సెమీకండక్టర్ ప్లాంట్, ఎయిర్ ఇండియా, టాటా డిజిటల్ వంటి వ్యాపారాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఇందులో పెట్టుబడులు పెడితే.. ఎంత లాభం వస్తుంది, పెట్టుబడి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయాలను బోర్డు తెలుసుకోవాలనుకుంటోంది. అంటే టాటా ఇప్పుడు కేవలం పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం మాత్రమే కాకుండా, వాటి ఫలితాలు మరియు ఖర్చులను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది.టాటా గ్రూప్ ఇప్పటికే జాగ్వార్ ల్యాండ్ రోవర్, తాజ్ హోటల్స్, ఎయిర్ ఇండియా, టెట్లీ టీ వంటి పెద్ద వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఇదే సమయంలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, ఏఐ డేటా సెంటర్లు వంటి కొత్త రంగాల్లోకి అడుగుపెడుతోంది. ఈ పెట్టుబడులు టాటాకు మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా ముఖ్యమైనవి.భారత్ను ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి టాటా పెట్టుబడులు ఉపయోగపడతాయి. అందుకే.. కొత్త టాటా చైర్మన్ ముందు పెద్ద బాధ్యత ఉంది. చంద్రశేఖరన్ ప్రారంభించిన పెద్ద ప్రణాళికలను కొనసాగించాలా, లేక పెట్టుబడులను కొంత తగ్గించి ముందుగా లాభాలపై దృష్టి పెట్టాలా అనేది నిర్ణయించాలి.ఇదీ చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. EV కొనేవారికి గుడ్న్యూస్!
‘టాటా’ సామ్రాజ్యానికి గుండెకాయ.. ‘బాంబే హౌస్’
ముంబై ఫోర్ట్ ప్రాంతంలోని ప్రశాంతమైన హోమి మోడీ వీధిలో కనిపించే నాలుగు అంతస్తుల చారిత్రక భవనం.. బయటకు చూస్తే సాధారణ కార్యాలయ భవనంలానే అనిపిస్తుంది. కానీ అదే ‘బాంబే హౌస్’. దాదాపు శతాబ్ద కాలంగా టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి ఇది ప్రధాన కార్యాలయం మాత్రమే కాదు.. కీలక నిర్ణయాలకు సాక్షిగా నిలిచిన కార్పొరేట్ చరిత్రకు చిరునామా. ఇప్పుడు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన పదవి నుంచి వైదొలగనున్నట్లు (2027 ఫిబ్రవరిలో తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన తర్వాత) ప్రకటించడంతో మరోసారి బాంబే హౌస్పై ఆసక్తి పెరిగింది.1924లో మొదలైన ప్రయాణంబాంబే హౌస్ కథ 1920లో ప్రారంభమైంది. టాటా సన్స్ రెండో చైర్మన్ సర్ దొరాబ్జీ టాటా.. బాంబే మునిసిపాలిటీ నుంచి ఫోర్ట్ ప్రాంతంలో సుమారు 21,285 చదరపు అడుగుల విస్తీర్ణంలోని రెండు స్థలాలను కొనుగోలు చేశారు. అనంతరం భవనం నిర్మాణ బాధ్యతలను అసోసియేటెడ్ బిల్డింగ్ కంపెనీకి అప్పగించారు.స్కాటిష్ ఆర్కిటెక్ట్ జార్జ్ విట్టెట్ దీనికి రూపకల్పన చేశారు. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం (ప్రస్తుతం ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ) వంటి ప్రముఖ నిర్మాణాల రూపకల్పనతో విట్టెట్ అప్పటికే పేరు సంపాదించారు. బాంబే హౌస్ నిర్మాణం 1924లో పూర్తయి జూలై 1న తలుపులు తెరుచుకుంది.ఈ భవనానికి ‘టాటా హౌస్’ అని పేరు పెట్టకుండా ‘బాంబే హౌస్’ అని పిలవడం వెనుక కూడా ప్రత్యేక భావన ఉంది. టాటా గ్రూప్ ఎదుగుదలకు కేంద్రంగా నిలిచిన బొంబాయి నగరంతో సంస్థకు ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ పేరు పెట్టారు.ఎడ్వర్డియన్ అందం.. భారతీయ వారసత్వంబాంబే హౌస్ నిర్మాణం ఎడ్వర్డియన్ నియో-క్లాసికల్ శైలిని ప్రతిబింబిస్తుంది. మలాడ్ రాతితో నిర్మించిన ముఖభాగం, సమతుల్య ఆకృతి, పెద్ద జార్జియన్ తరహా కిటికీలు, అలంకార కార్నిస్లు ఈ భవనానికి ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయి. మొదట భవనం బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మూడు పై అంతస్తులతో నిర్మించారు. 1941-42లో నాలుగో అంతస్తును చేర్చారు. ప్రస్తుతం ఇదే అంతస్తులో చైర్మన్ కార్యాలయం, బోర్డు రూమ్ ఉన్నాయి.బయటి రూపాన్ని దాదాపు యథాతథంగా కాపాడుకుంటూనే లోపలి భాగాలను కాలానుగుణంగా మార్చుకుంటూ వచ్చారు. పాత కళాఖండాలు, ఫర్నిచర్, జ్ఞాపికలు, చారిత్రక బోర్డు రూమ్ వంటి అంశాలు భవనానికి పాతకాలపు ప్రత్యేకతను కొనసాగిస్తున్నాయి.టాటా సామ్రాజ్యంలోని కీలక నిర్ణయాలకు వేదికబాంబే హౌస్లో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలు టాటా గ్రూప్ చరిత్రలో అనేక మలుపులకు దారి తీశాయి. ఒకప్పుడు టెక్స్టైల్స్, హోటళ్లు, ఉక్కు, విద్యుత్ వంటి నాలుగు ప్రధాన వ్యాపారాల కేంద్రంగా ఉన్న ఈ భవనం.. తర్వాత విస్తరిస్తూ వచ్చిన టాటా సామ్రాజ్యానికి నాడీ కేంద్రంగా మారింది.జేఆర్డీ టాటా కాలంలో విమానయాన రంగంలో టాటా గ్రూప్ అడుగులు వేయడానికి సంబంధించిన కీలక ఆలోచనలు కూడా ఈ సంస్థాగత వాతావరణంలోనే రూపుదిద్దుకున్నాయి. దశాబ్దాల తర్వాత 2007లో టాటా స్టీల్.. కోరస్ను సుమారు 13 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన భారీ అంతర్జాతీయ ఒప్పందం వంటి వ్యూహాత్మక నిర్ణయాలకు కూడా బాంబే హౌస్ కీలక కేంద్రంగా నిలిచింది.2017లో చంద్రశేఖరన్ తీసుకున్న కీలక నిర్ణయంబాంబే హౌస్ దాదాపు 94 ఏళ్ల చరిత్రలో 2017 వరకు పెద్ద స్థాయి సమగ్ర పునరుద్ధరణకు దూరంగానే ఉంది. టాటా సన్స్ చైర్మన్గా ఎన్. చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భవనాన్ని పూర్తిగా ఆధునీకరించాలనే నిర్ణయం తీసుకున్నారు.ఆర్కిటెక్ట్, అర్బన్ కన్జర్వేషన్ నిపుణురాలు బృందా సోమయ్య నేతృత్వంలోని బృందం ఈ ప్రాజెక్టును చేపట్టింది. కేవలం తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేసి 2018 జూలై 29న జేఆర్డీ టాటా జయంతి సందర్భంగా బాంబే హౌస్ను తిరిగి ప్రారంభించారు. రతన్ టాటా ఈ పునరుద్ధరించిన భవనాన్ని ప్రారంభించారు.పునరుద్ధరణలో భవనం చారిత్రక రూపాన్ని కాపాడుతూ ఆధునిక కార్యాలయ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఓపెన్ వర్క్స్పేస్లు, సహకార ప్రాంతాలు, డిజిటల్ మీటింగ్ రూమ్లు, టాటా ఎక్స్పీరియన్స్ సెంటర్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. పాత బోర్డు రూమ్కు కూడా ఆధునిక సాంకేతిక సదుపాయాలు జోడించారు.వీధి కుక్కలకు వెల్కమ్!బాంబే హౌస్ ప్రత్యేకతల్లో అత్యంత ఆసక్తికరమైనది అక్కడి వీధి కుక్కల సంప్రదాయం. దశాబ్దాలుగా భవనానికి వచ్చే కుక్కలను ఉద్యోగులు, సంస్థ ఆహ్వానితుల్లానే ఆదరిస్తున్నారు. 2018 పునరుద్ధరణలో వాటి కోసం ప్రత్యేక కెన్నెల్ను కూడా ఏర్పాటు చేశారు. నిద్రించే ప్రదేశం, సౌకర్యవంతమైన వాతావరణం, ఆహారం, వైద్య సంరక్షణ వంటి ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. టాటా గ్రూప్ స్వయంగా పేర్కొన్నట్టుగా, ఈ కుక్కలకు బాంబే హౌస్లోకి ప్రవేశించేందుకు ఉద్యోగుల మాదిరిగా యాక్సెస్ కార్డు అవసరం లేదు.నేటికీ అదే చిరునామా2024లో బాంబే హౌస్ తన శతాబ్దిని పూర్తి చేసుకుంది. టాటా గ్రూప్ అధికారిక చరిత్ర ప్రకారం, ఈ భవనం నేటికీ గ్రూప్నకు గ్లోబల్ హెడ్క్వార్టర్స్గా కొనసాగుతోంది. వందేళ్లలో టాటా గ్రూప్ నాలుగు ప్రధాన వ్యాపారాల నుంచి అనేక రంగాల్లో విస్తరించిన బహుళజాతి వ్యాపార సమూహంగా మారినా.. దాని సంస్థాగత హృదయం మాత్రం బాంబే హౌస్గానే ఉంది. అంతేకాదు, వారసత్వ భవనంగా ఉన్నప్పటికీ సుస్థిరత చర్యలకు గుర్తింపుగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినం రేటింగ్ పొందిన తొలి భారతీయ హెరిటేజ్ భవనంగా ఇది నిలిచింది.ఇప్పుడు చంద్రశేఖరన్ తన పదవీకాలం ముగిసిన తర్వాత కొత్త చైర్మన్కు బాధ్యతలు అప్పగించేందుకు మార్గం సుగమం చేశారు. దీంతో టాటా గ్రూప్ తదుపరి నాయకత్వం ఎవరి చేతుల్లోకి వెళ్తుందనే ప్రశ్న తెరపైకి వచ్చింది. అయితే ఆ నాయకత్వ మార్పు ఎక్కడి నుంచి సాగుతుంది అంటే.. సమాధానం మాత్రం ఇప్పటికీ అదే.. ముంబైలోని ఈ చారిత్రక ‘బాంబే హౌస్’ నుంచే.
ఫ్యామిలీ
శ్రావణంలో ఇవి చేస్తే శుభఫలితాలు!
మామూలు సమయాలలో ఎలా ఉన్నా శ్రావణమాసం రాగానే ఇంచుమించు ప్రతి భక్తుడి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెలరోజుల పాటు ఉదయం, సాయంత్రం ధూపదీప నైవేద్యాలతో, చందన సుగంధాలతో, చిరుగంటల సవ్వడితో... కర్పూర నీరాజనపు పరిమళాలతో... కాళ్లకు పసుపు, నొసట కుంకుమ ధరించిన ముత్తైదువల పట్టుచీరల రెపరెపలతో వీధులన్నింటా ఒక పవిత్రమైన వాతావరణం నెలకొంటుంది. అంత గొప్ప శుభమాసం నేడే ప్రారంభమైంది. ఇక ఈ మాసమంతా ఎన్నో పండుగలు, పర్వదినాలు, వివాహాది శుభముహూర్తాలతో సందడి చేయనుంది.సనాతన ధర్మంలో (హిందూ) చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది, ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసంగా శ్రావణమాసానికి పేరు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు విశిష్ట ఫలం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.శివారాధనకు ఎంతో విశిష్టతశ్రావణమాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం.సోమవారాల్లో శివుడి ప్రీత్యర్థం ఈ వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రిపూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రలు చెబుతున్నాయి. ఈ మాసంలో ఆచరించే ప్రతి పూజకు తగిన ఫలం ఉంటుందని శాస్త్రోక్తి.మంగళ గౌరీ వ్రతంశ్రావణ మాసం లో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అనీ పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీ కృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని ప్రతీతి..వరలక్ష్మీ వ్రతంశ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే ముత్తయిదువులకు వాయనాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి.విశిష్టతలుశుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందని ప్రతీతి.శుక్ల పక్ష పౌర్ణమిరాఖీ పౌర్ణమిగా జరుపుకునే శ్రావణ పున్నమి రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ చేస్తారు. వేదాభ్యాసాన్ని ప్రారంభిస్తారు.ఇక ఆ తర్వాత వచ్చే కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య పర్వాలు కూడా శ్రావణమాసంలోనే వస్తాయి. కృష్ణాష్టమి, ΄÷లాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలను ఆచరిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్రోక్తి.– పూర్ణిమాస్వాతినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్
నా భార్యకు రెండేళ్లుగా అవే ఆలోచనలు.. గంటల కొద్దీ అక్కడే!
నా భార్యకు 35 ఏళ్లు. ఆమెకు గత రెండేళ్ల నుండి పూజలు, భక్తి విపరీతంగా పెరిగిపోయాయి. పెళ్లయిన కొత్తలో ఏదో కొంతసేపు దేవుడి గదిలో గడిపేది. ఈమధ్య రోజంతా పూజల్లోనే ఉంటుంది. రోజుకు మూడుసార్లు తలస్నానం చేయటం, బాత్రూంలో గంటకు పైగా గడపటం, గదులన్నీ మాటిమాటికీ శుభ్రం చేయటం చేస్తుంది. దీనివల్ల ఇంట్లో పనులన్నీ చాలా ఆలస్యం అవుతున్నాయి. పిల్లలకు, నాకు కూడా ఆఫీసు సమయానికి క్యారేజీ కట్టలేకపోతోంది. అదేమని అడిగితే అలా చేయకపోతే కుటుంబానికి అరిష్టం కలుగుతుందని, దేవుడికి కోపం వస్తుందని చెబుతుంది. వీటిని కంట్రోల్ చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదని, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని చెబుతుంది. ఆమె చేయడమే కాదు, నన్ను, పిల్లలను కూడా తనలాగే చేయమని ఒత్తిడి చేస్తోంది. మాకేం చెయ్యాలో తెలియటం లేదు. ఇలా అతిగా పూజలు చేయటం కూడా ఏదైనా జబ్బంటారా?– రామసుబ్రహ్మణ్యం, మహబూబ్ నగర్ మీ బాధ నాకు అర్థం అయింది. పూజలు చేయడం, భక్తి భావం ఉండటం తప్పుకాదు. చాలామంది రోజూ వారివారి నమ్మకాల ప్రకారం దేవుడికి దండం పెట్టుకోవడం, కొంతసేపు పూజ చేయడం మామూలే! కానీ మీ భార్య లాగా, రోజులో ఎక్కువ సమయం పూజలు చేయడం, దేవుడి గదిలోనే రోజంతా గడపటం, ఇంటిని, వంటను సరిగా పట్టించుకోకపోవడం, పిల్లలకు, మీకు సమయానికి వండి పెట్టి స్కూలుకు, ఆఫీసుకు సమయానికి పంపక పోవటం... ఇవన్నీ ఆమెలోని ఒక మానసిక సమస్యను సూచిస్తున్నాయి. అయితే వీటిని తగ్గించుకోవాలని ప్రయత్నం చేసినా సాధ్యం కావడం లేదని, ఒకవేళ అలా చేయలేకపోతే, కుటుంబానికి ఏదైనా కీడు జరుగుతుందన్న భయంతో ఇలా చేస్తున్నట్లు ఆమె చెబుతోందంటున్నారు. ఇలా ఏదైనా ఒక పనిని పదేపదే చేస్తూ, మిగతా పనులను నిర్లక్ష్యం చేయడం, వద్దనుకున్నా కంట్రోల్ చేసుకోలేకపోవడం లాంటి లక్షణాలన్నీ‘‘అబ్సెసివ్–కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ)’’ అనే మానసిక రుగ్మతకు లోనైన వారిలో ఉంటాయి. ఇది కూడా ఒక మానసిక రుగ్మతే! మెదడులోని సెరటోనిన్ అనే ఒక ప్రత్యేక రసాయనిక పదార్థం సమతుల్యత తేడా వచ్చినప్పుడు, ఈ జబ్బు లక్షణాలు బయటపడతాయి. కొందరిలో వారసత్వంగా కూడా ఈ సమస్య రావచ్చు. ఇలాంటి వారికి మానసిక వైద్యశాస్త్రంలో మంచి చికిత్స ఉంది. కొన్ని మందుల ద్వారాను, ‘‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’అనే ప్రత్యేక మానసిక చికిత్స ద్వారానూ వీరిని ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడేయవచ్చు. ఏదైనా అతి మంచిది కాదు, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని మన పెద్దలు అన్నది అక్షరాలా నిజం. మీరు వెంటనే మీ భార్యని దగ్గర్లోని మంచి సైకియాట్రిస్టుకు చూపించి తగిన చికిత్స చేయించండి. ఆమెలో తప్పకుండా మార్పు వచ్చి మళ్లీ పూర్వస్థితికి వస్తుంది. మీరంతా మనశ్శాంతిగా ఉంటారు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
రొమాన్స్ స్కామ్!
పెళ్లి కోసమై వలలో పడెనే పాపం పసివాడు...అని పాడుకోవచ్చునేమో! ఇది పెళ్లిళ్ల పేరయ్యల కాలం కాదు. వివాహాలకు సంబంధించి చాలా మంది మాట్రిమోనియల్ వెబ్సైట్లపై ఆధారపడుతున్న కాలం. దీన్ని ఆసరాగా చేసుకొని మాట్రిమోనియల్ స్కామ్స్ జరుగుతున్నాయి. జీవిత భాగస్వామి కోసం వెదుక్కునే క్రమంలో కొందరు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఏఐ సాంకేతికత వల్ల మాట్రిమోనియల్ మోసాలను కనిపెట్టడం కష్టంగా మారింది. రొమాన్స్ స్కామ్ ప్రొఫైల్స్ విషయంలో భారతదేశం ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది! సైబర్ మోసగాళ్లు మాట్రిమోనియల్ సైట్లను విరివిగా ఉపయోగిస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి...ఒక మాట్రిమోనియల్ ప్లాట్ఫామ్ నుంచి ముప్పై అయిదేళ్ల సాప్ట్వేర్ ఇంజినీర్ నీరజ్కు ఆసక్తికరమైన రిక్వెస్ట్ వచ్చింది. తనను తాను క్వాలిఫైడ్ ఆర్కిటెక్ట్ అని పరిచయం చేసుకున్న ఆమె తన పేరు రీతిక అని చెప్పింది. కొన్ని వారాలపాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. తన కుటుంబం, తాను చేసే ఉద్యోగం, మ్యారేజ్ ప్లాన్స్ గురించి వివరంగా చెప్పింది. ఈ క్రమంలోనే ఫారెక్స్ ట్రేడింగ్ (ఫారిన్ ఎక్సే ్చంజ్ ట్రేడింగ్)లో ‘సేఫ్ రిటర్న్స్’ గురించి ప్రస్తావించింది. ‘మీరు ఇన్వెస్ట్ చేస్తే నేను సహాయం చేస్తాను’ అని కూడా చెప్పింది. ఆమె చెప్పిన ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్కు అది చట్టబద్ధమైన ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనే నమ్మకం వచ్చింది. డ్యాష్బోర్డ్లో ప్రాఫిట్స్ కనిపించాయి. ‘ఫరవాలేదు. ఇన్వెస్ట్ చేయవచ్చు’ అనే నమ్మకాన్ని కలిగించాయి.ఆ తరువాత ఏమైందంటే...ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేశాడు నీరజ్. కొంత లాభాలు వచ్చిన తర్వాత తన డబ్బును విత్డ్రా చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ ట్రేడింగ్(?) ప్లాట్ఫామ్ స్పందించడం మానేసింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రీతిక అనే పేరుతో ఎవరూ లేరని, ఆ ఫొటోగ్రాఫ్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సృష్టించారని, వీడియో కాల్స్ను ఏఐ టూల్స్తో మానిప్యులేట్ చేశారని, గుర్తింపు పత్రాలను ఫోర్జరీ చేశారనే విషయం దర్యాప్తులో బయటపడింది. డజన్ల కొద్దీ నకిలీ మాట్రిమోనియల్ ప్రొఫైల్స్ను నిర్వహిస్తున్న ఒక నెట్వర్క్ స్కామ్ ఇది అని తేలింది.నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారునకిలీ మాట్రిమోనియల్ ప్రొఫైల్స్, నకిలీ ఫారెక్స్ ఇన్వెస్ట్మెంట్ పథకం ద్వారా సూరత్కు చెందిన కొందరిని మోసం చేసిన సైబర్ మోసాల ముఠా సభ్యులను ఇటీవల గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒక వైద్యుడు కూడా ఉన్నాడు! మ్యాట్రిమోనీ ప్లాట్ఫామ్లు సైబర్ నేరగాళ్లకు ఆకర్షణీయమైన కేంద్రాలుగా మారాయి. మాట్రిమోనియల్ ప్లాట్ఫామ్లకు నమ్మకం అనేది ప్రధానం. ఆ నమ్మకాన్నే ఆధారంగా చేసుకొని మోసగాళ్లు చేతివాటం చూపుతున్నారు. తమ జీవితభాగస్వామి గురించి వెదుకుతున్నప్పుడు కుటుంబ నేపథ్యం నుంచి వృత్తి వివరాల వరకు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కడం వల్ల దుర్వినియోగం అవుతోంది.నకిలీ పేర్లు, దొంగిలించిన ఫొటోల స్థాయిని దాటి రొమాన్స్ స్కామ్స్ చాలా ముందుకువెళ్లాయి. సంభాషణలు నమ్మశక్యంగా, సహజంగా ఉండడానికి ఇమేజ్ ఎడిటింగ్, వాయిస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. జనరేటివ్ ఏఐ ద్వారా రొమాన్స్ స్కామ్స్ని కన్విన్సింగ్గా చేయడం సులువైంది. తక్కువ టైమ్లోనే వీలైనంత ఎక్కువ మందిని మోసం చేయవచ్చు.ఆ తరువాతే...‘గతంతో పోల్చితే మోసాలను గుర్తించడం కష్టమవుతుంది. ప్లాట్ఫామ్లు తమ ధ్రువీకరణ ప్రక్రియను బలోపేతం చేయాలి. తద్వారా మోసాలు జరగకుండా చేయవచ్చు’ అంటున్నారు నిపుణులు. గతంలో మాదిరిగా ‘వెంటనే మోసం చేయాలి–డబ్బులు దండుకోవాలి’ అని తొందరపడడం లేదు సైబర్ నేరగాళ్లు.‘తగిన సమయం వెచ్చించాలి. నమ్మకాన్ని పెంచుకోవాలి. ఆ తరువాతే డబ్బులు దండుకోవాలి’ అనే పాలసీని అనుసరిస్తున్నారు. మోసపోతే...→ చాట్ రికార్డులు, స్క్రీన్ షాట్లు, చెల్లింపు రసీదులు, మొబైల్ నంబర్లు, ఇ–మెయిల్ ఐడీలు, ప్రొఫైల్ లింక్లతో సహా అన్ని ఆధారాలను భద్రపరచండి.→ వీలైనంత త్వరగా సైబర్క్రైమ్ హెల్ప్లైన్ 1930కు కాల్ చేయాలి. లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి.→ నకిలీ ప్రొఫైల్ గురించి మాట్రిమోనియల్ ప్లాట్ఫామ్కు తెలియజేయండి. తద్వారా ఇతరులు మోసాల బారిన పడకుండా చూడవచ్చు.ఇలా అయితే అనుమానించాల్సిందే!→ నకిలీ లేదా ఏఐ రూపొందించిన ప్రొఫైల్ను గుర్తించే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు. → వ్యక్తిగత వివరాలు తక్కువగా ఉన్న ప్రొఫైల్, అసాధారణంగా, అతి వివరాలు ఉన్న ప్రొఫైల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. → కొత్తగా పరిచయం అయిన వ్యక్తి సాధారణ ప్రశ్నలకు కూడా అస్పష్టమైన, పొంతన లేని సమాధానాలు ఇస్తే అనుమానించాలి. → లైవ్ వీడియో కాల్స్ను నిరాకరిస్తే, వ్యక్తిగతంగా కలవడానికి ‘నో’ చెబితే అనుమానించాల్సిందే. → పరిచయం అయిన కొద్దికాలంలోనే డబ్బు, బహుమతులు, వ్యక్తిగత సమాచారం అడిగినా, ‘ఇన్వెస్ట్ చేయండి’ అని సలహా ఇచ్చినా...వీటిని ప్రమాద సంకేతాలుగా పరిగణించాలి → కస్టమ్స్ చార్జీలు, వీసా సమస్యలు, వైద్య ఖర్చులు... మొదలైన వాటి పేర్లతో డబ్బు దండుకోవడానికి ప్రయత్నిస్తుంటారు → ఆన్లైన్ సంభాషణల ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు.
బ్రిటిష్ గుండెల్లో 14 ఏళ్ల బుల్లెట్
1931 డిసెంబర్ 14. కమిల్లా జిల్లా కోర్టు. మేజిస్ట్రేట్ చార్లెస్ స్టీవెన్స్ ఎదుట చేతిలో రివాల్వర్తో14 ఏళ్ల స్కూల్ అమ్మాయి. తర్వాతి 10 సెకన్లలో పేలిన 5 గుళ్లు బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులనే కదిలించాయి. ఆ అమ్మాయి పేరు సునీతి చౌదరి. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో యంగెస్ట్ విప్లవకారిణి. చరిత్రలో మూలకు నెట్టివేయబడ్డ అగ్ని జ్వాల. ఆమె సాహసభరిత గాథ ఇది.భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఉరితీతతో దేశమంతా రగిలిపోతున్న కాలమది. ‘ఇంకా ఎంతకాలం ఈ బానిస సంకెళ్లు?’ అని ప్రతి యువకుడు ప్రశ్నిస్తున్న రోజులవి. బెంగాల్లోని కమిల్లా అనే చిన్న పట్టణంలో ఒక స్కూల్ అమ్మాయి ఈ ప్రశ్నకు తుపాకీతో జవాబు ఇచ్చింది. వయసు 14. పేరు సునీతి చౌదరి. పాఠాలు చదవాల్సిన వయసులో చరిత్ర రాసింది.బాల్యమే విప్లవ పాఠశాలసునీతి 1917 మే 22న కమిల్లా (నేటి బంగ్లాదేశ్)లో జన్మించింది. తండ్రి ఉమాచరణ్ చౌదరి. ఆమె అన్నయ్యలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూ ఉండటం వల్ల ఇంట్లో రోజూ దేశభక్తి, బ్రిటిష్ దౌర్జన్యాల గురించి చర్చ జరిగేది. బెంగాల్ అప్పటికే విప్లవ సంఘాలకు కేంద్రం. స్కూల్లో చదువుతూనే సునీతి రహస్య విప్లవ సభలకు హాజరయ్యేది. ఆమె ప్రాణస్నేహితురాలు 15 ఏళ్ల శాంతి ఘోష్ కూడా సునీతికి తోడైంది. ఇద్దరూ కలిసి ‘మనం ఏదో చేయాలి’ అని ప్రతిజ్ఞ చేశారు. శత్రువును శత్రువు భాషలోనే ఎదుర్కోవాలని భావించిన సునీతి ‘యుగాంతర్’ అనే విప్లవ సంస్థలో చేరింది. అక్కడ కర్రసాము, కత్తిసాముతోపాటు తుపాకీ కాల్చడంలో అసాధారణ శిక్షణ పొందింది. వయసు చిన్నదైనా, ఆమె గురి మాత్రం ఎప్పుడూ తప్పేది కాదు.రెచ్చగొట్టిన కలెక్టర్1931 సెప్టెంబర్లో కమిల్లా జిల్లా మేజిస్ట్రేట్ చార్లెస్ స్టీవెన్స్ స్వయంగా సునీతి, శాంతి చదువుతున్న గవర్నమెంట్ హైస్కూల్కి వచ్చాడు. అమ్మాయిలను లైన్ లో నిలబెట్టి ‘గాడ్ సేవ్ ది కింగ్’ అని నినదించమన్నాడు. ఒప్పుకోని పిల్లలను చెంపలు వాయించాడు. అతని మీద అప్పటికే అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. ‘పిల్లల మీద చేయి వేసేవాడు మనిషే కాదు’ అని సునీతి, శాంతి డిసైడ్ అయ్యారు. టార్గెట్ ఫిక్స్ అయ్యింది. గర్జించిన గుళ్లు1931 డిసెంబర్ 14. ఉదయం 10 గంటలు. సునీతి, శాంతి ఇద్దరూ స్కూల్ యూనిఫాం, చేతిలో పుస్తకాలు పట్టుకుని కోర్టుకు వచ్చారు. కలెక్టర్ స్టీవెన్స్ కు పిటిషన్ ఇవ్వడానికి వచ్చినట్టు నటించారు. కలెక్టర్ టేబుల్ దగ్గరికి వెళ్లగానే ఒక్కసారిగా పుస్తకాల్లో దాచిన రివాల్వర్లు బయటికి తీసి ఎడాపెడా 5 గుళ్లు పేల్చారు. స్టీవెన్స్ అక్కడికక్కడే కుప్పకూలాడు. అందరూ షాక్లో ఉండగా ఇద్దరూ పారిపోలేదు. నిలబడి ‘జై హింద్! భారత్ మాతా కీ జై!’ అని నినదించారు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు.దేశం కోసం చేశాం కోర్టులో జడ్జి అడిగాడు– ‘ఎందుకు చేశారు?’. 14 ఏళ్ల సునీతి తడబడకుండా చెప్పింది– ‘మా దేశం కోసం చేశాం’. ఈ ఒక్క వాక్యంతో బ్రిటిష్ చట్టం కూడా తలవంచింది. చిన్న పిల్లలు కాబట్టి ఉరిశిక్ష వేయలేక పోయారు. ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. బ్రిటిష్ పత్రికలు ‘Two School Girls Kill DM‘ అని మొదటి పేజీలో రాశాయి. లండన్ వరకు వార్త పాకింది. సునీతిని అలీపూర్ సెంట్రల్ జైలుకు పంపారు.బ్రిటిష్ జైల్లో నరకం..హత్య జరిగిన వెంటనే బ్రిటిష్ సైనికులు సునీతిని, శాంతిని బంధించారు. 14 ఏళ్ల పసిపిల్ల అని కూడా చూడకుండా సునీతిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. విప్లవ సంస్థ రహస్యాలు చెప్పాలంటూ బూట్లతో తన్నారు. కానీ ఆ పసిపెదవుల నుంచి కేవలం ‘వందేమాతరం’ అనే నినాదం తప్ప ఒక్క రహస్యం కూడా బయటకు రాలేదు. ఆమె వయసు చిన్నది కావడం వల్ల ఉరిశిక్ష తప్పి యావజ్జీవం పడింది. జైల్లో ఆమెకు కనీస సదుపాయాలు లేకుండా నరకం చూపించారు. అయినా ఆమె కళ్లలోని ధైర్యం, ముఖంలోని చిరునవ్వు చెదరలేదు. జ్లైలోనే చదువుకుంది. రాజకీయ ఖైదీలతో మాట్లాడి దేశ చరిత్ర, త్యాగాల గురించి ఇంకా తెలుసుకుంది. 1939లో ఆమ్నెస్టీ, గాంధీ జోక్యం కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ ఖైదీలను విడుదల చేసింది. అలా ఎనిమిదేళ్ల తర్వాత సునీతి బయటికి వచ్చింది.విడుదలైన తర్వాత విడుదల తర్వాత సునీతి మరో విప్లవ యోధుడు ప్రద్యోత్ కుమార్ గుహను పెళ్లి చేసుకుంది. అతను కూడా జైలుశిక్ష అనుభవించినవాడే. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ సునీతి ఎప్పుడూ లైమ్లైట్లోకి రాలేదు. ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ‘మేము చేసింది మా కర్తవ్యం’ అని మాత్రమే చెప్పేది. ప్రశాంతంగా కుటుంబంతో జీవితం గడిపి 1988 జనవరి 12న కలకత్తాలో కన్నుమూసింది. ఆమెతో పాటు కాల్పులు జరిపిన శాంతి ఘోష్ తర్వాత కాంగ్రెస్ నాయకురాలిగా మారింది. పశ్చిమ బెంగాల్ ఎం.ఎల్.ఏగా కూడా పని చేసింది. ఇద్దరూ కలిసి ‘కమిల్లా కన్యలు’ (ది గర్ల్స్ ఆఫ్ కమిల్లా) గా చరిత్రలో నిలిచారు. మనం ఇవాళ అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా వాయువుల వెనుక 14 ఏళ్ల వయసులోనే నవ్వుతూ జైలు పాలైన ఇలాంటి పసి హృదయాల రక్తం ఉందనే సత్యాన్ని మనం మరువలేము. వీర విప్లవ కిశోరం సునీతి చౌదరికి జోహార్లు! – కె.
అంతర్జాతీయం
అమెరికా: కుటుంబ సభ్యుల హత్య.. భారత యువకుడు అరెస్ట్
మసాచుసెట్స్: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. మసాచుసెట్స్లోని యాక్టన్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు తన తల్లి, తమ్ముడిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు అర్జున్ అరవింద్ అనే యువకుడిపై అధికారులు హత్య కేసులు నమోదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత మంగళవారం మార్తా లేన్లోని వారి నివాసంలో సుధా వెంకటేశన్ (45), ఆమె చిన్న కుమారుడు సిద్ధార్థ్ అరవింద్ (14) ఇద్దరూ విగతజీవులుగా పడిఉన్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆరోజు ఇంటికి వెళ్లాల్సిన ట్యూటర్ విషయాన్ని అర్జున్ తండ్రికి తెలిపారు. దీంతో ఆందోళన చెందిన అర్జున్ తండ్రి సాయంత్రం 6.37 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొదటి అంతస్తులో సిద్ధార్థ్, బేస్మెంట్లో సుధా మృతదేహాలను గుర్తించారు. ఇద్దరిపైనా తీవ్ర గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. హత్య అనంతరం నిందితుడు అర్జున్ తన తల్లి కారులో పరారయ్యాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టగా, బుధవారం ఉదయం వేలాండ్ ప్రాంతంలోని ఒక పార్కింగ్ స్థలంలో కారుతో పాటు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడే ముందు అర్జున్ అనుమానాస్పద రీతిలో ప్రవర్తించినట్లు మిడిల్సెక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం వెల్లడించింది. కుటుంబ సభ్యులను ఎలా అంతం చేయాలనే విషయాలపై అర్జున్ ఇంటర్నెట్, చాట్జీపీటీ ద్వారా శోధించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ సంచలన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రష్యాకు మైండ్బ్లాక్.. మెగా అటాక్తో ఉక్కిరిబిక్కిరి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో నల్ల సముద్రం మరోసారి అగ్నిగుండంగా మారింది. రష్యాకు అత్యంత కీలకమైన నోవొరోసిస్క్ నౌకాశ్రయంపై ఉక్రెయిన్ భారీ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. రష్యా నల్ల సముద్ర నౌకాదళానికి ప్రధాన స్థావరంగా ఉన్న ఈ పోర్టుపై జరిగిన దాడిలో నాలుగు రష్యా యుద్ధనౌకలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. వాటిలో రెండు ఫ్రిగేట్లు ఉన్నాయని తెలిపింది. అయితే ఈ నష్టంపై రష్యా నుంచి ఇప్పటివరకు పూర్తి స్థాయి అధికారిక ధృవీకరణ రాలేదు.ఈ దాడి సైనిక లక్ష్యాలకే పరిమితం కాలేదు. నోవొరోసిస్క్లోని రెండు ప్రధాన ధాన్యం ఎగుమతి టెర్మినల్స్ కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. దీంతో రష్యా ధాన్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. నల్ల సముద్రం ద్వారా ప్రపంచ మార్కెట్లకు రష్యా భారీగా గోధుమలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ఇప్పటికే దాడి కారణంగా సరకు రవాణాను బాల్టిక్, కాస్పియన్ సముద్ర నౌకాశ్రయాలతో పాటు భూ మార్గాలకు మళ్లించే అవకాశాలను రష్యా పరిశీలిస్తున్నట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.నోవొరోసిస్క్ రష్యాకు సాధారణ వాణిజ్య నౌకాశ్రయం కాదు. క్రిమియాలోని సెవాస్టోపోల్పై ఉక్రెయిన్ దాడుల ముప్పు పెరగడంతో రష్యా తన నల్ల సముద్ర నౌకాదళంలోని పెద్ద భాగాన్ని నోవొరోసిస్క్కు తరలించింది. అందువల్ల అక్కడి నౌకాదళ స్థావరంపై దాడి చేయగలిగామని ఉక్రెయిన్ ప్రకటించడం రష్యాకు వ్యూహాత్మకంగా పెద్ద సవాలుగా మారింది. సెవాస్టోపోల్ను వదిలి సురక్షిత ప్రాంతంగా భావించిన నోవొరోసిస్క్ కూడా పూర్తిగా సురక్షితం కాదన్న సందేశాన్ని ఈ దాడి ఇచ్చినట్లయింది.‘ప్రత్యేకమైన ఆపరేషన్’..ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఈ దాడిని ‘ప్రత్యేకమైన ఆపరేషన్’గా అభివర్ణించారు. రాకెట్లు, వైమానిక డ్రోన్లు, నౌకాదళ డ్రోన్లను కలిపి ఉపయోగించి రష్యా నౌకాదళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. రష్యా దూకుడు కొనసాగుతున్నంతకాలం ఆ దేశ నౌకాదళం, దానికి మద్దతు ఇచ్చే మౌలిక వసతులు సురక్షితంగా ఉండబోవని హెచ్చరించారు. రాత్రంతా నోవొరోసిస్క్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక నివేదికలు తెలిపాయి. రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు పలు లక్ష్యాలను కూల్చివేసినట్లు అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ డ్రోన్ల దాడి పోర్టు చుట్టుపక్కల ప్రాంతాలను తాకింది. పైప్లైన్లు దెబ్బతినడంతో నగరంలో నీటి సరఫరా నిలిచిపోయింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా నోవొరోసిస్క్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.ఈ దాడి రష్యాకు సైనికంగానే కాకుండా ఆర్థికంగానూ ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమ ఎగుమతిదారు. నల్ల సముద్రంలోని నౌకాశ్రయాలు ఆ ఎగుమతులకు అత్యంత కీలకం. రెండు ప్రధాన ధాన్యం టెర్మినల్స్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ఎగుమతులపై తక్షణ లాజిస్టికల్ ఒత్తిడి ఏర్పడింది. రష్యా తన సరకు రవాణాను ఇతర సముద్ర మార్గాలకు మళ్లించాల్సి వస్తే రవాణా సమయం, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం రష్యా వరకే పరిమితం కాకపోవచ్చు. రష్యా, ఉక్రెయిన్ రెండూ ప్రపంచ ధాన్యం వాణిజ్యంలో కీలక దేశాలు. ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియాలోని అనేక దేశాలు నల్ల సముద్రం నుంచి వచ్చే ధాన్యంపై ఆధారపడుతున్నాయి. యుద్ధం కారణంగా సరఫరా మార్గాల్లో అంతరాయం పెరిగితే ప్రపంచ ఆహార ధరలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది.
ట్రంప్ బిగ్ వార్నింగ్: హర్ముజ్ మాదే.. ఇక వదులుకోం!
పశ్చిమాసియా సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ.. హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంపై పూర్తి నియంత్రణ అమెరికాదేనని.. ఇక మీదట దానిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు సంపూర్ణ ఆధిపత్యం ఉందని, ఇరాన్ దీనిని ఎదుర్కొనే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ‘‘ఉక్కు గోడ’’గా అభివర్ణించారు. అయితే తన పోస్ట్ చివర్లో ‘అల్లాహ్కు స్తుతి’ అంటూ ట్రంప్ ముగించారు. సాధారణంగా ఇస్లామిక్ సందర్భాల్లో వినిపించే ఈ పదబంధాన్ని ట్రంప్ ఇరాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్య ధోరణిలో ఉపయోగించినట్లు భావిస్తున్నారు.వీక్ ఇరాన్!ఇరాన్కు నౌకాదళం, వైమానిక దళం బలహీనంగా ఉన్నాయని ట్రంప్ అంటున్నారు. ఇరాన్ సైనికులకు జీతాలు కూడా అందడం లేదని వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తీవ్రంగా దెబ్బతిన్నదని, వెనక్కి తగ్గుతోందని పేర్కొన్నారు.తగ్గమంటున్న ఇరాన్ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. హార్ముజ్ జలసంధిపై అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందన్న వాదన వాస్తవాన్ని మార్చలేదని పేర్కొంది. హార్ముజ్ ఇంకా మూసివేసే ఉందని, ఇరాన్ పెట్టిన షరతులు అంగీకరించే వరకు దానిని తిరిగి తెరవబోమని పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ (PGSA) స్పష్టం చేసింది. అమెరికా అధికారులు పదేపదే చేస్తున్న ప్రకటనలు పరిస్థితిని మార్చలేవని వెల్లడించింది. అమెరికా నౌకాదళ దిగ్బంధం ఎత్తివేయడం, తమ ఆస్తులపై ఆంక్షలు తొలగించడం, యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించడం వంటి డిమాండ్లను ఇరాన్ ముందుకు తెస్తోంది. ఈ షరతులు నెరవేరే వరకు జలసంధి విషయంలో వెనక్కి తగ్గబోమని చెబుతోంది.ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావంప్రపంచ చమురు సరఫరాలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. నౌకల రాకపోకలు తగ్గడం, భద్రతా భయాలు పెరగడంతో చమురు ధరలు, రవాణా వ్యయాలపై ప్రభావం కనిపిస్తోంది.చర్చలపై ట్రంప్ వ్యూహంఇరాన్తో చర్చల విషయంలో ట్రంప్ భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తున్నారు. తాము తక్కువ స్థాయిలో చర్చలు జరుపుతున్నామని, ఇది ఒక చెస్ ఆటలా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని, ద్రవ్యోల్బణం పెరిగిందని పేర్కొన్నారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాత్రం అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని, మధ్యవర్తుల ద్వారా కేవలం సందేశాల మార్పిడి మాత్రమే జరుగుతోందని తెలిపారు.
పాక్లో 62 మంది మిలిటెంట్లు హతం
పెషావర్: వాయువ్య పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్కు చెందిన రెండు జిల్లాల్లో 36 గంటల పాటు సాగిన నిఘా ఆధారిత వరుస ఆపరేషన్లలో 62 మంది మిలిటెంట్లు హతమైనట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. బన్ను జిల్లాలో 10 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. మంగళవారం ఉదయం నుంచి ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో చేపట్టిన ఇతర ఆపరేషన్లలో నలుగురు కీలక కమాండర్లతో సహా 52 మంది మృతిచెందారు. ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో ‘ఫిట్నా అల్–ఖవారిజ్’మిలిటెంట్లపై లక్షిత దాడులు నిర్వహించడానికి ముందు భద్రతా దళాలు అనుమానిత ప్రాంతాలపై నిఘాను కట్టుదిట్టం చేశాయి. ఫిట్నా అల్–ఖవారిజ్ అనేది నిషేధిత తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) కోసం ప్రభుత్వం ఉపయోగించే పదం. చెట్ల పొదల్లో దాక్కున్న ఉగ్రవాదులను గుర్తించడానికి క్వాడ్కాప్టర్లను ఉపయోగించారని, దీనివల్ల భద్రతా దళాలు వారిని కచి్చతంగా లక్ష్యంగా చేసుకోగలిగాయని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఫిట్నా అల్–ఖవారిజ్కు చెందిన నలుగురు కీలక కమాండర్లు సైతం ఉన్నట్లు తెలిపారు.
జాతీయం
ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుల్స్ : సుప్రీం సీరియస్, కేంద్రానికి అల్టిమేటం
సాక్షి, న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ ఫుడ్పై లేబుల్స్ వ్యవహరంలో సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించింది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై (Packaged Food Products) చక్కెర, ఉప్పు , సంతృప్త కొవ్వుల (Saturated Fat) పరిమాణం ఎక్కువగా ఉంటే హెచ్చరిక లేబుళ్లను (Front-of-pack warning labels) నిబంధనల ప్రకారం ముద్రించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరిచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, FSSAI (భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ)కి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. "మీరు ఈ పని చేయకపోతే, మేమే ఆర్డర్ ఇస్తాం" అని అత్యున్నత న్యాయస్థానం అల్టిమేటం జారీ చేసింది. దీనిపై తుది నిర్ణయం తెలపడానికి కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చింది.హెచ్చరిక లేబుళ్ల అమలుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, లేదంటే కోర్టు స్వయంగా తగు ఆదేశాలు జారీ చేస్తుందని స్పష్టం చేసింది. పిల్లలు, పౌరుల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేసింది. కేవలం సాధారణ పోషకాహార పట్టిక సరిపోదని, స్పష్టమైన హెచ్చరిక లేబుల్స్ ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.ఈ సందర్బంగా కార్పొరేట్ ఒత్తిళ్లపై అత్యున్నత కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ ఇండస్ట్రీ వ్యతిరేకిస్తుందనే కారణంతో ఈ లేబుళ్ల ప్రక్రియను ఆలస్యం చేయడంపై జస్టిస్ జె.బి. పారడీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు కార్పొరేట్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గుతున్నారా అని ప్రశ్నించింది. ప్రజా ఆరోగ్యం ముఖ్యమని తెలిపింది.ఇది దేశ పౌరుల, ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అంశమని, వ్యాపార వర్గాల ప్రయోజనాల కంటే వినియోగదారుల ఆరోగ్యమే ముఖ్యమని కోర్టు పేర్కొంది. లేబుల్ మీద హెచ్చరికలు ఉంచడం అంటే అమ్మకాలను ఆపడం కాదని, తాము ఏమి తింటున్నారో వినియోగదారులకు స్పష్టంగా తెలియజెప్పడమేనని తేల్చి చెప్పింది.కేంద్రం వాదనను తోసిపుచ్చిన కోర్టుసాంప్రదాయ భారతీయ పిండివంటలు/స్నాక్స్ (ఉదాహరణకు నమకీన్ వంటివి) పై ఎరుపు రంగు హెచ్చరిక మార్కులు పడతాయని, విదేశీ ప్రమాణాలను ఇక్కడ నేరుగా అమలు చేయడం కష్టమని కేంద్రం తరఫు న్యాయవాది వాదించారు. అయితే, ఈ వాదనను తిరస్కరించిన కోర్టు "భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోవాలా?" అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తుది నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చింది. లేనిపక్షంలో తదుపరి విచారణలో కోర్టు నేరుగా ఉత్తర్వులు జారీ చేస్తుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: చాట్జీపీటీ సాయం : తల్లి, తమ్ముడ్ని హత్య చేసిన 17 ఏళ్ల టీనేజర్కాగా ప్యాకెట్ల ముందు భాగంలోనే (Front-of-Pack) అనారోగ్యకరమైన అంశాల (ఉప్పు, చక్కెర, ఫ్యాట్) సమాచారాన్ని స్పష్టమైన గుర్తులు లేదా హెచ్చరికల రూపంలో ముద్రించాలని దాఖలైన పిటీషన్పై విచారించిన ఈ సుప్రీం తాజా వ్యాఖ్యలు చేసింది. కేవలం సాధారణ పోషకాహార పట్టిక సరిపోదని, స్పష్టమైన హెచ్చరిక లేబుల్స్ ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. ఇదీ చదవండి: మాల్యా కేసు : బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
వణికించిన భీమన అమావాస్య.. రాజ్కుమార్ కిడ్నాప్ జరిగిందిలా..
బెంగళూరు: నిన్న ఆగస్టు 12(బుధవారం) అమావాస్య. శ్రావణమాసంలో వచ్చే ఈ అమావాస్యను కన్నడనాట భీమన అమావాస్యగా పిలుస్తుంటారు. ఈ రోజు కన్నడనాట కలకలం చెలరేగే ఘటన చోటుచేసుకుంది... జూలై 30, 2000 వ సంవత్సరం.. రాష్ట్రమంతా భీమన అమావాస్య వేడుకల్లో నిమగ్నమై ఉన్న వేళ, కన్నడ చలనచిత్ర రత్నం, అభినవ భార్గవ డాక్టర్ రాజ్కుమార్ కిడ్నాప్ ఉదంతం కర్ణాటక చరిత్రలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. గజనూరులోని తన ఫామ్హౌస్లో బోరు బావి పనులు చూసుకునేందుకు వెళ్లిన రాజ్కుమార్ను అడవి గజదొంగ వీరప్పన్ బందీగా చేసుకున్నాడు. రాత్రి 9:30 గంటల సమయంలో ఆయుధాలతో వచ్చిన దుండగులు, రాజ్కుమార్ను కిడ్నాప్ చేశారు.అతని భార్య పార్వతమ్మకు ఒక ఆడియో క్యాసెట్ను అప్పగించి, ‘అయ్యా, పదండి’ అంటూ ఆయన్ని అడవుల్లోకి తీసుకెళ్లారు. ఈ ఘటనతో కర్ణాటక ఒక్కసారిగా స్తంభించిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ నివాసానికి చేరుకున్న పార్వతమ్మ, ఆ క్యాసెట్ అందజేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఆ తర్వాత మొదలైన 108 రోజుల కిడ్నాప్ ఉదంతం, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకు అతిపెద్ద సవాలుగా మారింది. జర్నలిస్టు ఆర్ఆర్ గోపాల్ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, అడవిలోకి పలుమార్లు వెళ్లి చర్చలు జరిపారు. రాజ్కుమార్ అపహరణతో కర్ణాటకలో వ్యాపారాలు, రవాణా వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. అభిమానులు రోడ్లపైకి వచ్చి కన్నీరు మున్నీరయ్యారు.అయితే అడవిలో బందీగా ఉన్న సమయంలో కూడా రాజ్కుమార్ చాలా ప్రశాంతంగా యోగా, ప్రాణాయామం చేసుకునేవారని, ఆయన నిబ్బరం వీరప్పన్ను సైతం ఆకట్టుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. సుదీర్ఘ చర్చలు, ఉత్కంఠభరిత పరిణామాల అనంతరం, 108 రోజుల తర్వాత నవంబర్ 15, 2000న రాజ్కుమార్ క్షేమంగా విడుదలయ్యారు. ఆయన రాకతో కర్ణాటక ప్రజల్లో ఆనందోత్సాహాలు నిండాయి. ఈ ఘటనపై 2013లో ‘అత్తహాస’ అనే సినిమా కూడా వచ్చింది. ఇప్పటికీ భీమన అమావాస్య వచ్చిందంటే, ఆ 108 రోజుల ఆందోళన, ప్రజల ఆవేదన అందరికీ గుర్తుకు వస్తుంది.
టీచర్కు అండగా.. చుక్కలు చూపించిన జెన్ఆల్ఫా
దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల నిరసనలు చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో జార్ఖండ్లో జరిగిన ఓ ఆందోళన ఆసక్తిని రేకెత్తిస్తోంది. జెన్జీ బాటలోనే తాము కూడా అంటూ ‘జెన్ ఆల్ఫా’గా రోడ్డెక్కెంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు మరీ వయొలెంట్గా ఉండడంతో.. నెట్టింట ఆసక్తికరమైన చర్చా నడుస్తోంది. కొత్త తరం పిల్లలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం, తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. జార్ఖండ్లోని గర్వా జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి బదిలీని వ్యతిరేకిస్తూ హైస్కూల్ విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. కాండీ బ్లాక్ పరిధిలో విద్యార్థుల ఆందోళనను అడ్డుకునేందుకు వచ్చిన బ్లాక్ చీఫ్ పింకు పాండే.. ఓ విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అసలు ఏం జరిగిందంటే..గర్వా జిల్లాలోని హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మలయ్ సింగ్ బదిలీ కావడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీని నిలిపివేయాలంటూ మూడు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. వీళ్లకు తల్లిదండ్రులు కూడా తోడయ్యారు. మొదట జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఆందోళన.. తర్వాత కాండీ బ్లాక్ వరకు విస్తరించింది. రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.ఈ తరుణంలో విద్యార్థులతో మాట్లాడేందుకు బ్లాక్ చీఫ్ పింకు పాండే అక్కడికి చేరుకున్నారు. అయితే చర్చ జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థిని ఆయన చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు, నిరసనకారులు తీవ్రంగా స్పందించారు. పాండే వాహనాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయన అక్కడి నుంచి పరుగులు తీసి పోలీస్ స్టేషన్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.ఆ తర్వాత విద్యార్థులు కూడా పోలీస్ స్టేషన్కు చేరుకుని.. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల డిమాండ్లపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.జెన్ ఆల్ఫా గళం.. స్కూల్ రోడ్డు కోసం పోరు!ఉత్తరప్రదేశ్లోని చందూపూర్ గ్రామంలో జెన్ ఆల్ఫా విద్యార్థులు తమ సమస్యపై గళమెత్తారు. స్కూల్కు వెళ్లేందుకు సరైన రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు, బ్యానర్లతో విద్యార్థులు తమ డిమాండ్ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో మట్టి రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడంలోనూ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ చాలాసార్లు విజ్ఞప్తి చేసినా తాత్కాలికంగా మట్టి పోసి వదిలేశారని, వర్షాలతో మళ్లీ దారంతా బురదగా మారిందని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వారు తమ నిరసనను కొనసాగించారు. విద్యార్థుల పోరాటానికి పలువురు మద్దతు తెలిపారు.జెన్ ఆల్ఫా అంటే ఎవరు?జెన్జీ తర్వాతి తరమే జెన్ ఆల్ఫా (Generation Alpha). సాధారణంగా 2010 నుంచి 2024 మధ్య జన్మించిన వారిని జెన్ ఆల్ఫాగా పరిగణిస్తారు.ఈ తరం పిల్లలు చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ మధ్య పెరిగారు. అందుకే వీరిని కొందరు “డిజిటల్ నేటివ్స్” అని కూడా పిలుస్తారు. వీరికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో భయం తక్కువగా ఉంటుందని, సామాజిక అంశాలపై వేగంగా స్పందించే స్వభావం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటు మధ్యప్రదేశ్ జబల్పూర్లోనూ విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ కొందరు పిల్లలు రోడ్డెక్కడం గమనార్హం.#Jabalpur में Gen Alpha का धरना प्रदर्शन.चीन-अमेरिका हमारे देश की शिक्षा व्यवस्था सुधारने के लिए इन छात्रों को Funding कर रहा है- कट्टर अंधभक्त pic.twitter.com/3IVFzMuuFC— NEYU MADHYAPRADESH (@NEYU4MP) August 13, 2026ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా యువత నిరసనలు, సామాజిక ఉద్యమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జెన్ జీ (సుమారు 1997–2012 మధ్య జన్మించిన తరం) ఉద్యమాలు వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు చిన్న వయసులోనే తమ హక్కులు, న్యాయం, విద్యా సమస్యలపై స్పందిస్తున్న జెన్ ఆల్ఫా పిల్లలు కూడా చర్చలోకి వస్తున్నారు. జార్ఖండ్ ఘటనలో విద్యార్థులు తమ ఉపాధ్యాయుడి కోసం ఏకంగా రోడ్డెక్కడం.. ఈ కొత్త తరం వైఖరిపై మరోసారి చర్చకు తెరతీసింది.
‘కన్వర్’ల నిర్వాకం: ఘాట్లలో వేలకొద్దీ మూత్రం బాటిళ్లు, విడిచిన దుస్తులు..
హరిద్వార్: కన్వర్ యాత్ర ముగిసిన తర్వాత హరిద్వార్లో భారీ వ్యర్థాల సమస్య తలెత్తింది. ఈ ఏడాది సుమారు 4.8 కోట్ల మంది కన్వర్ యాత్రికులు హరిద్వార్ను సందర్శించి, గంగాజలాన్ని సేకరించారు. యాత్ర ముగిసిన అనంతరం, గంగా తీరాలు, మేళా మైదానాల్లో సుమారు 7,000 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది.హర్ కీ పౌరీ సహా అనేక ఘాట్ల వద్ద పారిశుధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. మహిళల కోసం ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూముల్లో మూత్రంతో నిండిన సీసాలు, పాత బట్టలు, చెప్పులు, వ్యర్థాల కుప్పలు దర్శనమిచ్చాయి. యాత్రికులు వదిలి వెళ్లిన కన్వర్ పరికరాలు, ఇతర చెత్త వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు ఈ అపరిశుభ్రతను కళ్లకు కడుతున్నాయి.ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం ఆగస్టు 18 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ను చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ నందన్ కుమార్ తెలిపారు. ఈ శుభ్రత పనుల కోసం సుమారు 1,000 మంది ప్రత్యేక పారిశుధ్య కార్మికులను నియమించారు. వ్యర్థాలను తరలించేందుకు 80కి పైగా వాహనాలను సిద్ధం చేశారు.ముందుపెన్నడూ లేని విధంగా, ఈసారి డ్రోన్ కెమెరాల సాయంతో చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను గుర్తించి, వెంటనే క్లీనింగ్ సిబ్బందిని పంపే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా వ్యర్థాలు నిండిన వెంటనే హెచ్చరికలు పంపే ‘సోలార్ సెన్సార్’ డస్ట్బిన్లను ప్రయోగాత్మకంగా అమర్చారు. స్థానిక స్వచ్ఛంద సంస్థలు క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పవిత్రమైన గంగా తీరాలను తిరిగి పరిశుభ్రంగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఎన్ఆర్ఐ
హైదరాబాద్కు శ్రీపతి దీపారెడ్డి పార్థీవదేహం
హైదరాబాద్: చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీకి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) అమెరికా న్యూజెర్సీలో గతనెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దీపారెడ్డి 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.గత నెల 28న భర్త రామకృష్ణారెడ్డిని కారులో కార్యాలయంలో దించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న దీపారెడ్డి కారును, ఓ మెడికల్ విద్యార్థి కారుతో ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆమె అవయవాలను మెడికల్ విద్యార్థులకు అందజేస్తానని అంగీకరించడంతో ఆమె అవయవాలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. సంబరపడే లోపే..రెండు రోజుల్లో మాదాపూర్లో ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ గృహప్రవేశానికి వస్తుందని సంబరపడ్డాం.. అన్ని ఏర్పాట్లు చేశాం, ఈవిధంగా వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టారు. నేడు చంపాపేటలో అంత్యక్రియలు దీపారెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం నగరానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంపాపేటలోని రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు.
అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్
సాక్షి,హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ 19వ మహసభలు శనివారం అమెరికాలోని బాల్టిమోర్లో ఘనంగా ప్రారంభమైయ్యాయి. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారితో పాటు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ల నుండి భారీ ఎత్తున వివిధ రంగాల ప్రముఖులు తొలి రోజు ఆరంభవేడుకలకు హాజరైయ్యారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎంఎల్ఎలు సినీ,సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరైయ్యారు.దాదాపు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు తెలుగు సంస్కృతిని చాటిచెప్పే కళాప్రదర్శనలు నిర్వహించారు.వివిధ రంగాల్లో విశేషసేవ చేసిన 15 మంది ప్రముఖులను ఆటా అవార్డులతో సత్కరించారు. అవార్డులు అందుకున్న వారిలో ఆర్.రవికాంత్రెడ్డి(జర్నలిజం) డాక్టర్ రవీందర్(వైద్యం), కిరణ్ చుక్కపల్లి(ఇండస్ట్రీ) తదితరులను ఆటా మాజీ అధ్యక్షులు పారిశ్రామికవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి సత్కరించారు.
ఎన్ఆర్ఐలు పార్టీకి సేవలు అందించాలి
సాక్షి, అమరావతి: అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో గురువారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, టెక్నాలజీ, కంటెంట్, డేటా, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఎన్ఆర్ఐలు తమ సేవలను పార్టీకి అందించాలని కోరారు. కేవలం పోస్టులు, లైకులు, షేర్లకు పరిమితం కాకుండా, స్పష్టమైన లక్ష్యాలు, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఉన్న ప్రజాభిప్రాయాన్ని వాస్తవాలు, సానుకూల కమ్యూనికేషన్, టెక్నాలజీ, సృజనాత్మక కంటెంట్ను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్ సమావేశంలో పాల్గొన్న ఆలూరు సాంబశివారెడి, తదితరులు
అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్!
అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.అమెరికాలో F-1 విద్యార్థి వీసాపై చదివే విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం అక్కడే ఉండి తమ విద్యకు సంబంధించిన రంగంలో ఉద్యోగం చేసే అవకాశం OPT ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు OPT కింద పనిచేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు చేసిన వారికి ఈ గడువు మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ఉద్యోగ అనుభవం సంపాదించడంతో పాటు, తర్వాత H-1B వర్క్ వీసా పొందేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఈ అవకాశానికి ఏకంగా 100,000 డాలర్ల ఫీజు విధించే ఆలోచన ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల మార్గం మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా తుది ప్రకటన వెలువడలేదు.ఎవరిపై భారం పడనుంది?ప్రతిపాదిత ఫీజును విద్యార్థులే చెల్లించాలా? లేక వారిని ఉద్యోగంలోకి తీసుకునే కంపెనీలే చెల్లించాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులే చెల్లించాల్సి వస్తే.. చాలా మందికి ఇది అందనంత భారంగా మారే అవకాశం ఉంది. కంపెనీలు చెల్లించాల్సి వస్తే.. విదేశీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంపై సంస్థలు వెనుకడుగు వేసే పరిస్థితి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికన్ విద్యార్థులకు ప్రాధాన్యం పెరిగి, అంతర్జాతీయ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.భారతీయ విద్యార్థులపై ప్రభావం ఎంత?అమెరికా ఉన్నత విద్యకు భారతీయ విద్యార్థులు ప్రధాన వర్గంగా ఉన్నారు. ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే కాకుండా.. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేసి అంతర్జాతీయ అనుభవం పొందాలనే లక్ష్యంతో అమెరికాకు వెళ్తున్నారు.అమెరికా విద్య కోసం కుటుంబాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో.. OPTపై భారీ ఫీజు ప్రతిపాదన విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.నాలుగేళ్ల వీసా పరిమితి కూడా!OPT ఫీజు ప్రతిపాదనతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనల్లో మరో కీలక మార్పు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు విదేశీ విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” విధానంలో అమెరికాలో ఉండేవారు. అంటే.. వారు తమ కోర్సును నిబంధనల ప్రకారం కొనసాగిస్తున్నంత కాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది.తాజా ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే ఉండే అనుమతి ఇవ్వాలనే ఆలోచన ఉంది. అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న కారణంఅమెరికా వలస విధానాన్ని మరింత పర్యవేక్షించడం, చట్టబద్ధమైన వలస వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ భద్రతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే విద్యా రంగ నిపుణులు మాత్రం.. ఇలాంటి నిబంధనలు అమెరికాను అంతర్జాతీయ విద్యార్థులకు తక్కువ ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికిప్పుడు ఆందోళన అవసరం లేదా?$100,000 OPT ఫీజు ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే అమెరికా వలస విధానంలో క్రమంగా కఠినమైన మార్పులు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసి అక్కడే కెరీర్ నిర్మించుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై మార్గం మరింత ఖరీదైనదిగా, నిబంధనలతో కూడుకున్నదిగా మారే అవకాశం ఉంది.
క్రైమ్
ఇద్దరికీ ఇది రెండో పెళ్లి.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్!
అనంతపురం సెంట్రల్: ఓ మ్యాట్రిమోనీ ద్వారా వారిద్దరి మనసులు కలిశాయి. కొన్ని రోజులకే వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఏమైందో తెలియదు కానీ పెళ్లైన నెలరోజులకే భర్త కాలయముడిగా మారి భార్యను కడతేర్చాడు. పోలీసుల కథనం మేరకు... శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతుకుంట గ్రామానికి చెందిన మహేష్ గుంటూరుకు చెందిన శాంతి (26)కి మధ్య ఓ మ్యాట్రిమొనీ వెబ్సైట్ ద్వారా పరిచయం కుదిరి మనసులు కలిశాయి. నెలరోజుల క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. పెళ్లైన తర్వాత మహేష్ శాంతిలు అనంతపురం నగరంలోని యల్లమ్మకాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. శాంతి ఇంట్లోనే ఉంటుండగా, మహేష్ ఓ ఆటో తీసుకొని పాల ప్యాకెట్ల వ్యాపారం చేసేవాడు. ఏమైందో తెలియదు కానీ, మూడు రోజుల క్రితం రోకలి బండతో మోది శాంతిని మహేష్ దారుణంగా హత్య చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి తాళం వేసి ఎక్కడికో పరారయ్యాడు. కొత్తగా పెళ్లయిన వారు కావడంతో భార్యాభర్తలిద్దరూ బంధువుల ఊళ్లకు వెళ్లారేమోనని ఇంటి యజమానులు భావించారు. బుధవారం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా శాంతి రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుంటూరులో నివాసముంటున్న మృతురాలి బంధువులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని అనంతపురం డీఎస్పీ చంద్రశేఖర్ పరిశీలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
చాట్జీపీటీ సాయం : తల్లి, తమ్ముడ్ని హత్య చేసిన 17 ఏళ్ల టీనేజర్
అమెరికాలో జంట హత్యలు కలకలం రేపాయి. అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు తల్లిని, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. కుటుంబాన్ని ఎలా హత్య చేయాలనే విషయాలను ఏఐలో వెతికి మరీ ఈ దురాగతానికి పాల్పడటం మరింత ఆందోళ రేపింది. గోతిక్ నవల (Gothic novel) తరహా కథలు, పాత్రలను రూపొందించడంలో సాయం చేయాలని AI ఛాట్బాట్ను కోరినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.మసాచుసెట్స్ డిస్ట్రిక్ట్ అటార్నీకార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలోని మాసాచుసెట్స్ సబర్బన్ ఏరియాలో భారతీయ సంతతికి చెందిన టీనేజర్ అర్జున్ అరవింద్, తల్లి సుధా వెంకటేశన్ (45), సోదరుడు సిద్ధార్త్ (14) దారుణంగా హత్య చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు.Accused killer 17 year old Arjun Aravind of Acton was taken into custody in Wayland overnight and tomorrow he’s expected in adult court charged with murdering his mother and younger brother…his dad was at work when the murders took place #7News pic.twitter.com/ljpT6lNZGR— Steve Cooper (@scooperon7) August 12, 2026 మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిన ట్యూటర్ లోపలికి వెళ్లలేక అర్జున్ తండ్రికి సమాచారం అందించారు. తండ్రి ఫోన్ చేసినా ఎలాంటి సమాధానం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి ‘వెల్ బీయింగ్ చెక్’ చేయాల్సిందిగా కోరారు. పోలీసులు వచ్చి చూడగా తల్లీ కొడుకులిద్దరూ మృతి చెంది ఉన్నారు. ఆక్టన్ ప్రాంతంలోని వారి ఇంట్లోనే ఈ హత్యలు జరిగాయి.నేరం జరిగిన తర్వాత అర్జున్ తన తల్లికి చెందిన హోండా కార్లో పరారైనట్టు పోలీసులు గుర్తించారు. మృత దేహాలపై తీవ్రమైన గాయాలున్నాయనీ, తల్లి మృతదేహం బేస్మెంట్లో, తమ్ముడి మృతదేహం మొదటి అంతస్తులో లభ్యమయ్యాయనీ వెల్లడించారు. దీంతో అర్జున్పై రెండు హత్య కేసులు, కుటుంబ సభ్యులపై దాడి, కారు దొంగతనం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గాలింపు చర్యల అనంతరం వేలాండ్ (Wayland) ప్రాంతంలోని ఒక పార్కింగ్ లాట్లో కారులో అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు.ఛాట్జీపీటీ వాడకంపై పోలీసుల ప్రకటనఅర్జున్ కొంతకాలంగా విచిత్రమైన ప్రవర్తన కనబరుస్తున్నాడు. కుటుంబాన్ని చంపేందుకు సంబంధించిన ఊహాజనిత కథనాలు, ఆలోచనల కోసం ఇంటర్నెట్, ChatGPTని ఉపయోగించినట్లు విచారణలో తేలిందని మిడిల్సెక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
మదనపల్లె టౌన్ : తాము ఇద్దరము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. దగ్గరి బంధువులు అయినప్పటికీ, తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇంటి నుంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నాం. తాము పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేక ఆరు నెలల కూడా తిరగకనే హత మారుస్తామని వార్నింగ్లు ఇస్తున్నట్లు ఓ ప్రేమ జంట బుధవారం మదనపల్లె జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీని రక్షణ కొరింది. వివరాలు.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం లోని పీటీఎం మండలం, కాట్నగల్లు కు చెందిన వెంకటరమణ కుమార్తె పి ఐశ్వర్య (19) అదే ఊరికి చెందిన మురళిని ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని తమ తల్లిదండ్రులు వెంకటరమణ, విజయమ్మ, సంధ్యలు తాము ఎక్కడికి వెళ్లి వస్తున్నా వెంటాడుతూ చంపడానికి ప్రయత్నిస్తున్నారు కన్నీటిపర్వంతమయ్యారు. తమకు ప్రాణ రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని ఆశ్రయించి న్యాయం కోసం అభ్యర్థించారు. జిల్లా ఎస్పీ స్పందించి పేటీఎం పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే అప్పటికే పీటీఎంలో పంచాయతీలు కూడా జరిగాయని, పోలీసుల ను కూడా తమ పెద్దలు ఎదురిస్తున్నారని, ఎస్పీ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.
’బంజారాహిల్స్లో నా రూమ్ ఉంది అక్కడికికి రా’.. లేదంటే..?
హైదరాబాద్: ఐటీ ఉద్యోగం ఇప్పిస్తానంటూ పరిచయమైన వ్యక్తి తనను గదికి పిలిచి లైంగికంగా వేధించడంతో పాటు తనతో ఉన్న చాటింగ్, ఫొటోలను తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరిస్తున్నాడంటూ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన యువతి (20) కేపీహెచ్బీలోని ఓ హాస్టల్ ఉంటూ చదువుకుంటోంది. గతంలో చెన్నైలో నాన్–ఐటీ ఉద్యోగం చేస్తుండగా ఆమె అత్త.. తనకు పరిచయమైన మండాది వెంకట సాంబశివరెడ్డికి ఐటీ రంగంలో పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగం ఇప్పిస్తాడని చెప్పింది. దీంతో ఆమె అతడిని సంప్రదించగా నగరానికి వస్తే ఐటీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మి గత నెల 12న నగరానికి వచ్చి హాస్టల్లో ఉంటుంది. అదే నెల 16న ఇంటర్వ్యూ ఉందంటూ సాంబశివరెడ్డి ఆమెను తన గదికి పిలిచాడు. అక్కడ కొందరితో ఫోన్లో మాట్లాడిన అనంతరం ఆమెను పంపించాడు. 22వ తేదీన మళ్లీ ఇంటర్వ్యూ ఉందంటూ పిలిచి, ఇంటర్వ్యూ అనంతరం బంజారాహిల్స్లోని తన గదికి రావాలని కోరాడు. అయితే తాను రావడానికి నిరాకరించగా, గతంలో తనతో జరిగిన ఫోన్ సంభాషణలు, చాటింగ్ల స్క్రీన్షాట్లు, ఫొటోలు తన వద్ద ఉన్నాయని, వాటిని తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో భయపడి అతని గదికి వెళ్లింది. గదిలో ఆమె అనుమతి లేకుండా చేయి పట్టుకుని అసభ్యంగా ప్రయత్నించగా, వెంటనే అతడిని పక్కకు నెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. అనంతరం ఇంటర్నెట్ నుంచి ఆమె నగ్న ఫొటోలు పంపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె నిరాకరిస్తున్నా పట్టించుకోకుండా శారీరక సంబంధం కోసం నిరంతరం ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు
బాబు కార్యక్రమానికి పవన్ డుమ్మా.. అసలేం జరిగింది?
గుర్తుపెట్టుకో చంద్రబాబు వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్
అసలు ఆ రోజు... మినిట్ టూ మినిట్ ఏమి జరిగిందో వివరించిన జగన్
రిపీట్... రిపీట్.. రిపీట్ పోలీసులకు జగన్ మాస్ కౌంటర్
కథ,స్క్రీన్ ప్లే ..డైరెక్షన్ మొత్తం బాబుదే..!
విరుపాక్షి ఏమైనా ఉగ్రవాదా ? కూటమికి జగన్ వార్నింగ్..
రచించిన కుట్ర రాజకీయాలు బాబు పై జగన్ ఫైర్
ఎన్టీఆర్ భుజానికి సర్జరీ.. అసలు ఏం జరిగిందంటే?
జైలులో విరుపాక్షికి ధైర్యం చెప్పిన జగన్
LIVE: MLA విరూపాక్షితో ములాఖత్ అనంతరం YS జగన్ సంచలన PRESS MEET


