ఉన్మాద ఘటనలో విషాదం.. హెచ్ఐవీ ఇంజెక్షన్ బాధితురాలి సూసైడ్
పోచారం ఐటీ కారిడార్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిడ్స్ ఉందన్న కారణంతో ఓ వ్యక్తితో యువతి పెళ్లికి నిరాకరించగా.. సదరు ఉన్మాది కోపంతో ఆమెకు సిరంజీతో రక్తం ఎక్కించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో.. బాధితురాలు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ శివారు పోచారంలో గత నెల అమానుష ఘటన వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు.. సదరు యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చాడు. అయితే.. ఈ ఉదంతం తర్వాత కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చేరిన సదరు యువతి తర్వాత ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కఠోర నిజాన్ని దాచి.. పోచారానికి చెందిన మనోహర్కు ఆ మధ్య బాధిత యువతితో పెళ్లి ఖాయమైంది. గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవడంతో పాటు షాపింగ్, పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశారు కూడా. పెళ్లికి టైం దగ్గర పడుతున్న టైంలో.. మనోహర్కు ఎయిడ్స్ ఉన్నట్లు యువతి కుటుంబానికి తెలిసింది. దీంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ కోపంలో.. ఆమెపై పగ పెంచుకున్నాడు. మార్చి11వ తేదీన యువతి ఇంటికి వెళ్లిన మనోహర్.. అమ్మాయితో గొడవకు దిగాడు. తనను పెళ్లి ఎందుకు చేసుకోవంటూ నిలదీస్తూ ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత ముందే తెచ్చికున్న సిరంజితో ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకొని మనోహర్ను పట్టుకున్నారు.అనంతరం బాధితురాలిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బలవంతంగా ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన నిందితుడు మనోహర్ను అరెస్టు చేశారు. యువతి బలవన్మరణంతో ఈ ఉదంతం విషాదాంతంగా మారింది. నిందితుడు మనోహర్కు కఠిన శిక్ష పడాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ఎప్స్టీన్తో లింకులు.. పెదవి విప్పిన అమెరికా ఫస్ట్ లేడీ
అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్.. జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను ఖండించారు. తనపై వస్తున్న కథనాలు అబద్ధాలుగా ఆమె కొట్టిపారేశారు. మెలానియా తన పరువు తీసేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్స్టీన్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని.. అతని నేరాల గురించి కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను కుట్రగా ఆమె అభివర్ణించారు.ఎప్స్టీన్తో నన్ను ముడిపెడుతూ చేస్తోన్న అసత్య ప్రచారం వెంటనే ఆగాలి. నాపై దుష్ప్రచారం చేసే వ్యక్తులు నైతిక విలువలు లేనివారు. వారి అజ్ఞానాన్ని నేను వ్యతిరేకించను. కానీ నా ప్రతిష్టను దెబ్బతీయాలనే వారి దురుద్దేశాన్ని నేను ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఎప్స్టీన్ నేరాల బాధిత మహిళలను బహిరంగ విచారణ నిర్వహించి.. వారు తమ ఆవేదనను చెప్పుకునే అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ప్రతి మహిళకు తన కథను బహిరంగంగా చెప్పే హక్కు ఉండాలి. అప్పుడు మాత్రమే వాస్తవం వెలుగులోకి వస్తుందని మెలానియా అన్నారు.మోడల్గా ఉన్న మెలానియాను డొనాల్డ్ ట్రంప్నకు పరిచయం చేయడంలో జెఫ్రీ ఎప్స్టీన్ కీలక పాత్ర పోషించాడంటూ ట్రంప్ జీవిత విశేషాలను రాస్తున్న మైఖెల్ వోల్ఫ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మెలానియా ఈ ఆరోపణలను గతంలోనే ఖండించారు. తాను ట్రంప్ను తొలిసారి న్యూయార్క్లోని కిట్కాట్ క్లబ్లో కలుసుకొన్నట్లు ఆమె పేర్కొన్నారు.కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన మరిన్ని కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో భాగంగా వీటిని బహిర్గతం చేసింది. ఎప్స్టీన్ ద్వారా ట్రంప్కు పరిచయమైన ఒక మహిళను, ఆమె మైనర్గా ఉన్నప్పుడు ట్రంప్ లైంగికంగా వేధించారని తాజాగా ఆ పత్రాల్లో వెల్లడైంది. ఎప్స్టీన్ ఆ బాలికను న్యూయార్క్కి తీసుకెళ్లి ట్రంప్కు పరిచయం చేశాడు.ఆ సమయంలో ట్రంప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, తాను అతడ్ని గాయపరిచినట్టు ఆ మహిళ దర్యాప్తు అధికారులకు వివరించిందని 2019లో FBI జరిపిన ఇంటర్వ్యూల ప్రకారం తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని తనకు, తన కుటుంబ సభ్యులకు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆమె ఆరోపించింది.
చారిత్రక ద్వైపాక్షిక సిరీస్ను ప్రకటించిన పాకిస్తాన్
పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా మహిళల ద్వైపాక్షిక సిరీస్ జరగనుంది. జింబాబ్వే మహిళల జట్టు 3 మ్యాచ్ల వన్డే, టీ20 సిరీస్ల కోసం పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ సిరీస్ మహిళల క్రికెట్ అభివృద్ధిలో కీలక ఘట్టంగా నిలవనుంది. ఈ సిరీస్లు మే 3 నుంచి 15 మధ్య తేదీల్లో జరుగనున్నాయి. వన్డే సిరీస్ ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ 2025-29లో భాగంగా జరుగనుండగా.. టీ20 సిరీస్ సాధారణంగా సిరీస్గా పరిగణించబడుతుంది. అన్ని (వన్డే, టీ20) మ్యాచ్లు కరాచీ నేషనల్ బ్యాంక్ స్టేడియంలో జరగనున్నాయి.షెడ్యూల్.. - మే 3 – తొలి వన్డే - మే 6 – రెండో వన్డే - మే 9 – మూడో వన్డే - మే 12 – తొలి టీ20 - మే 14 – రెండో టీ20 - మే 15 – మూడో టీ20 జింబాబ్వే తొలిసారి ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్లో పాల్గొంటోంది. ఈ సిరీస్ మహిళల ఛాంపియన్షిప్లో భాగం కావడంతో 2029 వరల్డ్కప్ అర్హతపై ప్రభావం చూపుతుంది. మహిళల ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ 8, జింబాబ్వే 11వ స్థానంలో ఉన్నాయి.పాకిస్తాన్ ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్ కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. జింబాబ్వే ఇటీవల న్యూజిలాండ్ చేతిలో అన్ని మ్యాచ్ల్లో ఓటమిపాలై, అట్టడుగు స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇరు జట్లు ఈ సిరీస్లో పాయింట్లు సాధించి, ర్యాంకింగ్స్ మెరుగుపరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. జింబాబ్వే పరిమిత ఓవర్ల సిరీస్ల అనంతరం పాకిస్తాన్ ఐర్లాండ్ టీ20 ట్రై సిరీస్లో పాల్గొంటుంది. ఈ టోర్నీలో పాక్, ఐర్లాండ్తో పాటు వెస్టిండీస్ భాగం కానుంది. ఈ టోర్నీ మే 28 నుంచి ప్రారంభమవుతుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ 2025-29 పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్ జట్లు టాప్-5లో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
టెక్ స్టార్టప్ల్లోకి పెట్టుబడులు తగ్గాయ్..
ట్రెండింగ్లో 'లెజెండ్' ప్రభాస్
నటి ప్రియాంక చోప్రా తల్లి బ్యూటీ టిప్: మెరిసే చర్మం కోసం..
ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి దారి దొరికిందా?
చిన్న సినిమా ఘన విజయం.. వారం రోజుల్లోనే సెంచరీ
బంగారం అమ్మేసుకుంటున్న దేశాలు..
అక్కడ మృతదేహాలను కాల్చరు, పూడ్చరు..!
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్.. ప్రస్తుతం వార్నర్ పరిస్థితి ఇదీ!
AP: ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకం
ఉన్మాద ఘటనలో విషాదం.. హెచ్ఐవీ ఇంజెక్షన్ బాధితురాలి సూసైడ్
అవన్నీ పీరియడ్స్లో ఉండగానే చేశా: శ్రీలీల
రష్మిక ఊర్లో రిసెప్షన్.. మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తండ్రి
ఇది మా చారిత్రక విజయం.. మా లక్ష్యాలు ఇవే..: ఇరాన్
విజయ్కు షాక్.. పోటీ చేయకముందే ఓటమి
నా దగ్గర పైసలు లేవు. అమరావతి అని పదిసార్లు అనుకో! పో!
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
చంద్రబాబు సర్కార్ మళ్లీ అప్పు
ఆంటీ అనకూడదు
రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సీజ్ఫైర్ ప్రకటన
కీర్తి సురేశ్కు మందు అలవాటు లేదు కానీ..: సమంత
అంతకాలం సీఎంగా ఉండి ఆమె ఇంకేం పనిచేసినట్లు సార్!
PSL: పాక్ క్రికెట్ బోర్డు పరువు తీసిన ఆసీస్ స్టార్!
‘చిరయ్యా’ రివ్యూ : ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్ ఇది!
అనుష్క శెట్టి.. నమ్మశక్యం కాని రూమర్
బంగారం ధరలు రివర్స్.. కొనేవారికి గుడ్న్యూస్
‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’
పిట్ట ముట్టడం లేదని.. చెట్టును పెంచాడు!
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
బీసీబీ నూతన అధ్యక్షుడి సంచలన నిర్ణయం
'విశ్వంభర' విడుదల తేదీ వైరల్
టెక్ స్టార్టప్ల్లోకి పెట్టుబడులు తగ్గాయ్..
ట్రెండింగ్లో 'లెజెండ్' ప్రభాస్
నటి ప్రియాంక చోప్రా తల్లి బ్యూటీ టిప్: మెరిసే చర్మం కోసం..
ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి దారి దొరికిందా?
చిన్న సినిమా ఘన విజయం.. వారం రోజుల్లోనే సెంచరీ
బంగారం అమ్మేసుకుంటున్న దేశాలు..
అక్కడ మృతదేహాలను కాల్చరు, పూడ్చరు..!
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్.. ప్రస్తుతం వార్నర్ పరిస్థితి ఇదీ!
AP: ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకం
ఉన్మాద ఘటనలో విషాదం.. హెచ్ఐవీ ఇంజెక్షన్ బాధితురాలి సూసైడ్
అవన్నీ పీరియడ్స్లో ఉండగానే చేశా: శ్రీలీల
రష్మిక ఊర్లో రిసెప్షన్.. మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తండ్రి
ఇది మా చారిత్రక విజయం.. మా లక్ష్యాలు ఇవే..: ఇరాన్
విజయ్కు షాక్.. పోటీ చేయకముందే ఓటమి
నా దగ్గర పైసలు లేవు. అమరావతి అని పదిసార్లు అనుకో! పో!
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
చంద్రబాబు సర్కార్ మళ్లీ అప్పు
ఆంటీ అనకూడదు
రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సీజ్ఫైర్ ప్రకటన
కీర్తి సురేశ్కు మందు అలవాటు లేదు కానీ..: సమంత
అంతకాలం సీఎంగా ఉండి ఆమె ఇంకేం పనిచేసినట్లు సార్!
PSL: పాక్ క్రికెట్ బోర్డు పరువు తీసిన ఆసీస్ స్టార్!
‘చిరయ్యా’ రివ్యూ : ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్ ఇది!
అనుష్క శెట్టి.. నమ్మశక్యం కాని రూమర్
బంగారం ధరలు రివర్స్.. కొనేవారికి గుడ్న్యూస్
‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’
పిట్ట ముట్టడం లేదని.. చెట్టును పెంచాడు!
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
బీసీబీ నూతన అధ్యక్షుడి సంచలన నిర్ణయం
'విశ్వంభర' విడుదల తేదీ వైరల్
ఫొటోలు
గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
సీతామహాలక్ష్మిలా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)
తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
మిస్ తెలుగు యూఎస్ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)
తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)
గ్రాండ్గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)
సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)
గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)
సినిమా
లోక మూవీ.. నన్ను మోసం చేశారు: మమ్ముట్టి
గతేడాది బ్లాక్బస్టర్ విజయాలు సాధించిన చిత్రాల్లో లోక మూవీ ఒకటి. ఈ మలయాళ చిత్రం తెలుగులో 'కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర' గా రిలీజైంది. కల్యాణి ప్రియదర్శన్, నజ్లీన్, సాండీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. అయితే ఈ చిత్రంలో మూతన్ పాత్ర కోసం దుల్కర్ తండ్రి మమ్ముట్టి వాయిస్ను ఉపయోగించారు.దుల్కర్ అడగలేదుమరి సీక్వెల్లో మమ్ముట్టి గొంతు మాత్రమే వినిపిస్తుందా? లేక ఆయన కనిపిస్తాడా? అని సినీ ప్రేక్షకులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ ఊహాగానాలపై తాజాగా మమ్ముట్టి స్పందించాడు. 'సినిమాలో నా ప్రమేయం ఉంటుందని చిత్రయూనిట్ నాకసలు చెప్పనేలేదు. మొదటిభాగం సమయంలోనూ దుల్కర్ నన్ను సంప్రదించలేదు, అతడి మేనేజర్, ఫ్రెండ్ వచ్చి.. నా గొంతు అరువివ్వమని అడిగారు. ఆ చేయి కూడా నాదేనట!మొదట తిరస్కరించినప్పటికీ చివరకు ఆ ఒక్కసాయం చేశాను. తీరా మూవీ రిలీజయ్యాక.. నేను వాయిస్ ఇచ్చిన పాత్ర నాదేనని, అందులో కనిపించే చేయి కూడా నాదేనని చెప్పారు. ఇది మోసం చేయడం కాక ఇంకేమవుతుంది? వాళ్లు చేసిన పని వల్ల ఇప్పుడు సీక్వెల్లో ఆ పాత్రలో నటించాల్సిన బాధ్యత నాపై పడింది. అయితే రెమ్యునరేషన్ తీసుకునే యాక్ట్ చేస్తాను. నేనడిగినంత ఇస్తే సినిమాలో భాగం అవుతాను' అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన లోక మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో మమ్ముట్టి వాయిస్ ఓవర్ ఇచ్చిన మూతన్ పాత్ర తెరపై వినిపించిందే తప్ప కనిపించలేదు. సీక్వెల్లో ఆ పాత్ర కనిపించే అవకాశం ఉంది.చదవండి: మొదటి భార్యతో విడాకులు.. ఎంత దిగజారిపోయానంటే: ఆమిర్ ఖాన్
భారత్ సీక్రెట్ మిషన్ 'మిస్టర్- ఎక్స్' ట్రైలర్
కోలీవుడ్ నటుడు ఆర్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం మిస్టర్ ఎక్స్.. దర్శకుడు మను ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ ,నటి మంజు వారియర్, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్, ఖాళీ వెంకట్ తదితరులు ముఖ్యపాత్రుల్లోనూ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు. కోలీవుడ్లో ఎఫ్ఐఆర్ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ఫ్రేమ్ మను ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం అందిస్తుండటంతో బజ్ క్రియేట్ అయింది. ఏప్రిల్ 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది.దర్శకుడు మను ఆనంద్ మిస్టర్ ఎక్స్ కథను గతంలో ఒకసారి మీడియాతో పంచుకున్నారు. 1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోవడంతో ఎదురైన సమస్యలు ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించామన్నారు. 60 ఏళ్లకు పైగా వాటి గురించి పరిశోధనలు జరిపినప్పటికీ ఎలాంటి ఆచూకీ లేదన్నారు. అలాంటి న్యూక్లియర్ క్యాప్సిల్స్ నేపథ్యంలో సాగే కథే మిస్టర్ ఎక్స్ చిత్రమని చెప్పారు. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఎఫ్ఐఆర్ లేకుంటే ఈ చిత్రం అవకాశం తనకు వచ్చేది కాదని దర్శకుడు మను ఆనంద్ పేర్కొన్నారు.
మొదటి భార్యతో విడాకులు.. ఎంత దిగజారిపోయానంటే..: ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లికి సిద్ధమవుతున్నాడు. కొంతకాలం క్రితమే గౌరీ స్ప్రాట్ను తన ప్రియురాలిగా అందరికీ పరిచయం చేశాడు. తనతో కలిసి పలు ఈవెంట్లకు హాజరవుతున్నాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో తన మొదటి భార్యతో విడాకుల గురించి ఓపెనయ్యాడు. ఆమిర్ మాట్లాడుతూ.. 'సాధారణంగా నేను మద్యానికి దూరంగా ఉంటాను. కానీ ఎప్పుడైతే నా మొదటి భార్య రీనాతో విడాకులయ్యాయో నేను పూర్తిగా మారిపోయాను. నియంత్రించుకోలేకపోయా..తను పిల్లల్ని తీసుకుని ఇల్లు వదిలేసిన రోజు తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యాను. నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. మందు ముట్టని నేను తాగుబోతుగా మారిపోయాను. అతిథుల కోసం ఇంట్లో మద్యం బాటిళ్లు ఉంటే వాటిని ఖాళీ చేయడం మొదలుపెట్టాను. ఏడాదిన్నరపాటు ప్రతిరోజు రాత్రి ఒక బాటిల్ తాగేశాను. మందుకు దూరంగా ఉండే నేను బాటిల్ ఖాళీ చేసే స్థాయికి దిగజారిపోయాను' అని గుర్తు చేసుకున్నాడు.పర్సనల్ లైఫ్కాగా ఆమిర్ ఖాన్.. రీనా దత్తా 1986లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జునైద్, కూతురు ఇరా ఖాన్ సంతానం. 2002లో దంపతులు విడాకులు తీసుకున్నారు. 2005లో ఆమిర్.. దర్శకురాలు కిరణ్రావును పెళ్లి చేసుకున్నాడు. వీరికి సరోగసి ద్వారా కుమారుడు ఆజాద్ జన్మించాడు. ఆమిర్-కిరణ్ దాంపత్యం కూడా ఎంతోకాలం సాగలేదు. 2021లో వీరు విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి గౌరీ స్ప్రాట్తో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని 2025లో తన బర్త్డే సందర్భంగా అధికారికంగా వెల్లడించాడు. గౌరీతో ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు.చదవండి: డెకాయిట్ మూవీ రివ్యూ
నా ఇంట్లో కోట్లు లేవు, రూ.40 వేలే ఉన్నాయి: నిర్మాత
మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయి ఈ మధ్యనే బెయిల్పై విడుదలయ్యారు నిర్మాత జాఫర్ సాదిక్. ఈయన నిర్మిస్తున్న మంగై, ఇరైవన్ మిగ పెరియవన్ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా ఏప్రిల్ 6న ఐటీ అధికారులు, ఎన్నికల స్క్వాడ్ అధికారులు చెన్నైలో జాఫర్ సాదిక్కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై జాఫర్ స్పందించారు.ఆ ప్రచారంలో నిజం లేదుఅధికారులు తన ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం వాస్తవమేనని, అయితే పలు కోట్ల రూపాయలు, ఇతర డాక్యుమెంట్లు పట్టుబడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. 5వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సోదాలు నిర్వహించారని, ఎలాంటి అనధికారిక డబ్బుకానీ, ఇతర డాక్యుమెంట్స్ గానీ లభించలేదని చెప్పి పత్రాలపై సంతకం చేయించుకుని వెళ్లిపోయారన్నారు.ఇంట్లో అంతే ఉందితన ఇంట్లో ఒక సాధారణ కుటుంబ ఖర్చులకు సరిపోయే రూ.40 వేలు మాత్రమే ఉన్నాయన్నారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా పలు శాఖలకు చెందిన అధికారులు తన ఇళ్లల్లో తనిఖీలు చేశారని, అయితే ఐటీ అధికారులు మాత్రమే కరెక్ట్గా సోదాలు నిర్వహించారన్నారు. ఏదేమైనా ఈ వ్యవహారంలో తన గురించి అసత్య ప్రచారం చేయకూడదన్నారు. తాను ప్రశాంతంగా జీవించాలని భావిస్తున్నట్లు తెలిపారు. తను నిర్మిస్తున్న సినిమాలు రిలీజ్ చేసే పనిలో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు.
క్రీడలు
భార్యతో కలిసి చెట్టాపట్టాల్.. ఐపీఎల్కు డుమ్మా!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ పడుతూ లేస్తూ తన ప్రయాణం కొనసాగిస్తోంది. విజయంతో సీజన్ను ఆరంభించినప్పటికీ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడంతో జట్టు ఒత్తిడిలో పడింది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్కు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ ఎందుకు ఆడడం లేదన్న ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఈ వారంలోపూ విల్ జాక్స్ ముంబై ఇండియన్స్తో చేరతాడని యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే విల్ జాక్స్ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే విల్ జాక్స్ తన భార్య అనా బ్రుమ్వెల్తో కలిసి పారిస్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి. అంతేకాదు జాక్స్ భార్య తన ఇన్స్టాగ్రామ్లో ‘ఎంజాయింగ్ హాలిడే ట్రిప్’ పేరిట స్టోరీని షేర్ చేసుకోవడం పలు అనుమానాలకు తావి స్తోంది. ఈ లెక్కన విల్ జాక్స్ ఇప్పట్లో ఐపీఎల్లో అడుగుపెట్టే అవకాశాలు లేనట్లేనని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. అమెరికన్ సింగర్ అలెక్స్ వారెన్ మ్యూజిక్ కన్సర్ట్కు జాక్స్ తన భార్యతో కలిసి హాజరయ్యేందుకే పారిస్ వెళ్లినట్లు తెలుస్తోంది.ఇక ఫ్రాన్స్లో అడుగుపెట్టడానికి ముందు మొరాకోలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేశారు. కాగా విల్ జాక్స్ ఈ ఏడాది యాషెస్ సిరీస్ సమయంలోనే తన స్కూల్ ఫ్రెండ్ అయిన అనా బ్రూమ్వెల్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే విల్కు 14 ఏళ్ల వయసులోనే వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే, అసలే రెండు వరుస ఓటములతో ఢీలా పడిన ముంబై ఇండియన్స్కు విల్ జాక్స్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిస్తే ఏమవుతుందో అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అయితే విల్ జాక్స్ విషయమై ముంబై ఇండియన్స్ హెడ్కోచ్ మహేల జయవర్దనే రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ ముగిసిన అనంతరం స్పందించాడు. ‘విల్ జాక్స్ త్వరలోనే జట్టుతో చేరుతాడని ఆశిస్తున్నా’ అంటూ తెలిపాడు. 2025 ఐపీఎల్ సీజన్లో విల్ జాక్స్ ముంబై ఇండియన్స్ తరఫున 233 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీశాడు. విల్ జాక్స్ లేకపోవడం వల్ల ముంబై జట్టు సమతుల్యం దెబ్బతిన్నది. విల్ జాక్స్ అందుబాటులో లేకపోవడంతో తొలి మ్యాచ్లో ఆఫ్గన్ ఆటగాడు అల్లాఘన్జఫర్ను ఆడించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. రెండో మ్యాచ్లో అతడిని తొలగించి మిచెల్ శాంట్నర్కు అవకాశమిచ్చారు. ఇక మూడో మ్యాచ్లో ఐదుగురు బౌలర్ల వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. విల్ జాక్స్ జట్టులో చేరితే మాత్రం ఆల్రౌండర్గా తన పాత్రకు న్యాయం చేయగలడని ముంబై ఇండియన్స్ ఆశిస్తోంది. ముంబై తన తదుపరి మ్యాచ్ ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.No way my bruh Will Jacks is roaming in the streets of Paris 😭 https://t.co/OpZ8tjzYkw pic.twitter.com/atrDFVqePs— Mumbai Indians FC (@MIPaltanFamily) April 9, 2026చదవండి: ‘చనిపోయేలోపు ఫిఫా వరల్డ్కప్లో భారత జట్టును చూడాలి’
‘భారత్లోనే ప్రమాదకర బ్యాటర్.. ఈ మ్యాచ్తో నిరూపించాడు’
ముకుల్ చౌదరి.. ఒక్క మ్యాచ్తో భారత క్రికెట్ వర్గాల్లో హాట్టాపిక్గా మారిపోయిందీ పేరు. ఐపీఎల్-2026లో కోల్కతా నైట్ రైడర్స్తో గురువారం నాటి పోరులో.. ఈ లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లక్నో విజయానికి 32 బంతుల్లో 57 పరుగులు అవసరం కాగా... ఇందులో 54 తానొక్కడే చేశాడు.27 బంతుల్లోకోల్కతా విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏడో స్థానంలో బరిలోకి దిగిన ముకుల్ చౌదరి.. 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా లక్నోను విజయతీరాలకు చేర్చి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో లక్నో హెడ్కోచ్ జస్టిన్ లాంగర్ ముకుల్ చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా.. ‘‘వచ్చే నాలుగు నెలల్లో ఇండియాలోనే ఆరు లేదంటే ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్గా ముకుల్ ఎదగడం ఖాయం’’ అని లాంగర్ అన్నాడు.What JL said 🧿 pic.twitter.com/c7y4oI4Sgn— Lucknow Super Giants (@LucknowIPL) April 9, 2026ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో కోల్కతాతో మ్యాచ్ సందర్భంగా ముకుల్ గురించి లాంగర్ చెప్పిన మాటలు నిజమయ్యాయంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ ముకుల్ చౌదరి?రాజస్తాన్కు చెందిన 21 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరి జైపూర్ అకాడమీలో శిక్షణ పొందాడు. ముందుగా పేస్ బౌలర్గా మొదలు పెట్టినా... అకాడమీలో వికెట్ కీపర్లు లేకపోవడంతో ఆ వైపు దృష్టి సారించాడు. అండర్–23 టోర్నీలో 102 సగటుతో 617 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.ఇక దేశీ టీ20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్లలో ఏకంగా 199 స్ట్రయిక్రేట్తో 173 పరుగులు చేయడంతో ఐపీఎల్లో లక్నో రూ. 2.60 కోట్లకు తీసుకుంది. ‘వచ్చే నాలుగైదు నెలల్లో ఇతను ఆరు లేదా ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకర బ్యాటర్గా ఎదగడం ఖాయం’ అని లాంగర్ ఐపీఎల్కు ముందు వ్యాఖ్యానించగా... ఇప్పుడు తన సిక్సర్లతో ముకుల్ దానిని నిరూపించడం విశేషం. This is 𝐂𝐈𝐍𝐄𝐌𝐀 🫡🤯 pic.twitter.com/JTxw0DUgqM— Lucknow Super Giants (@LucknowIPL) April 10, 2026చదవండి: Yuvraj Singh: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’
‘చనిపోయేలోపు ఫిఫా వరల్డ్కప్లో భారత జట్టును చూడాలి’
క్రికెట్తో పోలిస్తే భారత్లో ఫుట్బాల్కు ఆదరణ తక్కువే. బైచుంగ్ భుటియా, సునీల్ ఛెత్రీ.. ఈ ఇద్దరే భారత్ ఫుట్బాల్లో కాస్త తెలిసిన ముఖాలు. అసలు మనకంటూ ఒక ఫుట్బాల్ టీం ఉందన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. పాశ్చాత్య దేశాల్లో ఫుట్బాల్కు ఉండే క్రేజ్ వేరు. క్రికెట్లో వరల్డ్కప్ ఎలాగూ ఫుట్బాల్లో ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ కూడా అలాంటిదే. ఇంకా చెప్పాలంటే ఐసీసీ వరల్డ్కప్ కంటే ఎక్కువే అని చెప్పొచ్చు. ఫిఫా వరల్డ్కప్లో ఒక్కసారైనా ఆడాలని చాలా దేశాలు కలలు కూడా కంటాయి.ఈ నేపథ్యంలోనే దేశవాలీలో ఫుట్బాల్ ఆటకు మళ్లీ తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు మినర్వా ఫుట్బాల్ క్లబ్ ఓనర్, కోచ్ రంజిత్ బజాజ్ వెల్లడించారు. తాను చనిపోయేలోగా భారత సీనియర్ జట్టును ఫిఫా ప్రపంచకప్లో చూస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయంగా భారత్ను ఫుట్బాల్లోనూ ఉన్నతస్థాయికి చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ఇటీవలే అండర్-15 మెడిటేరియన్ ఇంటర్నేషనల్ కప్ (ఎంఐసీ)లో భారత్కు చెందిన మినర్వా ఫుట్బాల్ క్లబ్ తమ ప్రదర్శనతో అదరగొట్టింది. ముఖ్యంగా ప్రిక్వార్టర్స్లో మినర్వా జట్టు 6-0 తేడాతో లివర్పూల్ జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. ఎంఐసీ కప్లో తొలిసారి ఆడుతున్నప్పటికీ ఏ బెరుకు లేకుండా ఆడిన మినర్వా జట్టు క్వార్టర్స్లో ఓడినప్పటికీ టోర్నీని ఐదో స్థానంతో ముగించి బెస్ట్ ప్రదర్శన నమోదు చేసింది.అయితే మినర్వా ఫుట్బాల్ క్లబ్ ఏర్పడడం వెనుక ఆ జట్టు కోచ్ రంజిత్ బజాజ్ చాలా ఏళ్ల శ్రమ దాగుంది. తాజాగా చందాలు పోగు చేసి మరీ తన జట్టును స్పెయిన్లో జరిగిన ఎంఐసీ కప్ ఆడేందుకు పంపించడం గమనార్హం. అయితే మార్చి 16న మినర్వా క్లబ్ జట్టును పంపించడానికి ముందు రంజిత్ బజాజ్ ఒక వీడియోను పంచుకున్నారు. అందులో ఆయన ఇచ్చిన సందేశం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించేలా ఉంది. మొత్తం జట్టును స్పెయిన్కు పంపేందుకు తన ఆస్తులను అమ్మినప్పటికీ మరో కోటి రూపాయలు తక్కువ పడింది. దీంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా డబ్బు సహాయం అందజేయాలని తన ఫాలోవర్లను కోరారు. ఆయన ఫాలోవర్లంతా ఈ విషయాన్ని షేర్ చేసి 27 లక్షల రూపాయలు ఆయనకు అందజేశారు. మొత్తంగా ఎలాగోలా తన జట్టును ఎంఐసీ కప్ ఆడేందుకు పంపించారు. View this post on Instagram A post shared by Ranjit Bajaj (@ranjitbajaj)మినర్వా ఫుట్బాల్ క్లబ్ జట్టు 2022లో మెనా కప్, 2023లో బ్రెజిల్ను ఓడించి గోథియా కప్ను కైవసం చేసుకుంది. కానీ సరైన ఫండ్స్ లేకపోవడంతో 2024లో ఒక్క టోర్నీ కూడా ఆడలేకపోయింది. ఇది భారత్లోని ప్రతిభావంతమైన ఫుట్బాల్ ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపిందని రంజిత్ బజాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఎవరీ రంజిత్ బజాజ్?రంజిత్ బజాజ్ (Ranjit Bajaj) భారత ఫుట్బాల్ రంగంలో, ముఖ్యంగా గ్రాస్రూట్ స్థాయిలో ప్రతిభను గుర్తించి వారిని ఆటగాళ్లుగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చండీగఢ్లో మినర్వా అకాడమీ నెలకొల్పి యువ ఫుట్బాల్ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తూ భారత ఫుట్బాల్ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. సందేశ్ జింగాన్, కమల్జిత్ సింగ్, జీక్సన్ సింగ్ (ఫిఫా వరల్డ్కప్లో భారత్ తరఫున మొదటి గోల్ చేసిన ఆటగాడు) వంటి ప్రముఖ ఆటగాళ్లంతా ఈయన అకాడమీ నుంచే వచ్చారు. భారత ఫుట్బాల్ అభివృద్ధి కోసం, ముఖ్యంగా యువతకు అవకాశం కల్పించడం కోసం ఆయన తన ఆస్తులను (భార్య బంగారు ఆభరణాలు) సైతం తాకట్టు పెట్టి అకాడమీని నడిపారు. తనకు ఎవరు సహాయం చేసేందుకు ముందుకు రానప్పటికీ 2020 నుంచి మినర్వా అకాడమీ తరఫున 250 మందికి పైగా ఆటగాళ్లకు వంద శాతం స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్లను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దారు. తాను చనిపోయేలోగా భారత సీనియర్ జట్టు ఫిఫా ప్రపంచకప్లో పాల్గొనేలా చూడడమే తన కల అని రంజిత్ బజాజ్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. మరి ఆయన కల నెరవేరాలని ఆశిద్దాం.ఫుట్బాల్లోనూ స్వర్ణయుగం..ఒకప్పుడు ఆసియాలోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా పరిగణించబడిన మన ఫుట్బాల్ టీం 1950 నుంచి 1960 మధ్య స్వర్ణయుగాన్ని చూసింది. హైదరాబాద్కు చెందిన సయ్యద్ అబ్దుల్ రహీం పర్యవేక్షణలో భారతదేశం 1951, 1962 ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతకాలను గెలుచుకోవడంతో పాటు 1956 ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచి ఔరా అనిపించింది. అయితే భారత జట్టు ఎప్పుడు ఫిఫా ప్రపంచకప్లో పాల్గొనలేదు.కానీ 1950 ఫిఫా వరల్డ్కప్లో మాత్రం క్వాలిఫికేషన్ గ్రూప్లోని ఇతర దేశాలన్నీ వైదొలగడంతో 1950 ప్రపంచ కప్కు డిఫాల్ట్గా అర్హత సాధించింది. అయితే, టోర్నమెంట్ ప్రారంభానికి ముందే భారత్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. భారత జట్టు ఆసియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అయిన ఏఎఫ్సీ ఆసియా కప్లో ఐదుసార్లు పాల్గొని , 1964 లో రన్నరప్గా నిలిచింది .దక్షిణాసియాలో పాపులర్ టోర్నీగా పిలవబడే దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ కప్ (శాప్-SAFF) కప్లో అజేయమైన టీమ్గా రికార్డు ఉంది. 1993లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ టోర్నమెంట్ను భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలుచుకుంది.🚨 India’s Minerva Football Club thrashed Liverpool FC 6–0. 🗿Man, Indian football has serious potential.Completely outplayed and knocked out Liverpool and reached the QF in the MIC Cup 2026 U-15 — pure attitude.Proud moment for India 🇮🇳 pic.twitter.com/DEibSGT7YR— Sonu (@Cricket_live247) April 3, 2026చదవండి: వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది!
US-Iran: పాక్ ప్రధానిపై ప్రశంసలు.. ఓవరాక్షన్ అవసరమా?
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాహిన్ ఆఫ్రిదిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఆటపై దృష్టి పెట్టకుండా.. ఇతర అంశాల్లో దూరడం ఎందుకంటూ సొంత జట్టు అభిమానులే మండిపడుతున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరును కూడా ఎండగడుతున్నారు. పాక్ మరో ఆటగాడు నసీం షా విషయంలో వ్యవహరించినట్లే షాహిన్ విషయంలోనూ కఠిన చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.పాక్ చేసిన పని వల్ల గందరగోళంఅసలేం జరిగిందంటే.. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం విదితమే. ఇప్పటికే పరస్పర దాడుల వల్ల మూడు దేశాలు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. ఇరాన్ అగ్ర నాయత్వాన్ని దాదాపుగా మట్టుబెట్టామని అమెరికా చెబుతోంది.అయితే, ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల చమురు సంక్షోభం తలెత్తింది. ఇలాంటి తరుణంలో కాల్పుల విరమణ ఒప్పందానికి తాము మధ్యవర్తిత్వం వహిస్తున్నామని పాకిస్తాన్ తెరమీదకు వచ్చింది.కానీ ఇక్కడా పాక్ చేసిన పని వల్ల గందరగోళం నెలకొంది. తమ భూభాగంతోపాట లెబనాన్ మీదా దాడులను ఆపేయాలని ఇరాన్ స్పష్టంగా ప్రతిపాదనలను పంపితే వాటిలోంచి పాకిస్తాన్ ‘లెబనాన్’అనే పేరును తొలగించి.. అమెరికా, ఇజ్రాయెల్లకు చేరవేసిందని ఆరోపణలు వస్తున్నాయి.విమర్శల వర్షంలెబనాన్పై అమెరికా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యవర్తిగా పాక్ చేసిన తప్పిదమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్ ద్వంద్వ వైఖరిపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ అయితే ఏకంగా మధ్యవర్తిత్వం విషయంలో పాక్ ఎంతమాత్రం నమ్మదగిన దేశం కాదని వ్యాఖ్యానించడం గమనార్హం.ప్రపంచ శాంతికి కృషి.. పాకిస్తానీగా గర్విస్తున్నాఇలాంటి తరుణంలో పాకిస్తాన్ పేసర్ షాహిన్ ఆఫ్రిది ఓ ట్వీట్ చేశాడు. ‘‘ప్రపంచ శాంతి కోసం పాకిస్తాన్ నాయకత్వం వహిస్తూ ముందుకు సాగుతున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. మా ప్రధాని షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్లు శాంతి చర్చలకు ఊతమిచ్చారు.సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు అడుగులు వేసేలా చేస్తున్నారు. కాల్పుల విరమణ ద్వారా మానవత్వం పరిఢవిల్లుతుంది. ఇందుకు పాకిస్తాన్ గొప్ప ముందడుగు వేసింది. శాంతి కోసం కృషి చేస్తోంది. పాకిస్తానీగా ఉన్నందుకు గర్వపడుతున్నా’’ అంటూ షాహిన్ ఓవరాక్షన్ చేశాడు.ఆటను వదిలి ఇతర అంశాల్లో జోక్యంఓవైపు.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై విమర్శలు, ఆరోపణలు వస్తున్న వేళ షాహిన్ ఆఫ్రిది ఇలా సొంతడబ్బా కొట్టుకున్నట్లుగా ట్వీట్ చేయడంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఆటను వదిలి ఇతర అంశాల్లో జోక్యం చేసుకోవడం అవసరమా? అని మండిపడుతున్నారు.కాగా ఇటీవల పాక్ పేసర్ నసీం షా.. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆరంభ వేడుకల్లో పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ను రాణిలా ట్రీట్ చేశారంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఇతర అంశాల్లో జోక్యం చేసుకున్నందున పీసీబీ అతడికి రూ. 2 కోట్ల (పాక్ కరెన్సీ) జరిమానా విధించింది. మరి ఇప్పుడు షాహిన్ కూడా పీసీబీ ఇలాగే శిక్షిస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కాగా ఇటీవల షాహిన్ కెప్టెన్సీలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది. బంగ్లాదేశ్ పర్యటనలో దాదాపు పదకొండేళ్ల తర్వాత తొలిసారి ఆతిథ్య జట్టుకు వన్డే సిరీస్ కోల్పోయింది.చదవండి: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో ‘సీఎంఆర్ఎఫ్’ నిధులు స్వాహా... టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి సీఎంవో వరకూ వసూళ్ల పర్వం
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మావిగన్.. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు: వైఎస్ జగన్
ఇరాన్ను తుడిచిపెట్టేస్తాం, వారి నాగరికతను నాశనం చేస్తాం. తీవ్రంగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
మళ్లీ పెరిగిన వెండి, బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీకి దినదిన గండం... ఐదో రోజూ స్తంభించిన ఓపీ, అత్యవసర వైద్యసేవలు
లోక్సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ... రెండు ఫైటర్ జెట్లను కూల్చివేసిన ఇరాన్
వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా చర్చ...
అవినీతి కోసమే అమరావతి... కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం..
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల కోట్ల రూపాయల బకాయిలు రాకపోవడంతో...
బిజినెస్
బంగారు.. తారుమారు! ధరలు మారాయిలా..
దేశంలో బంగారం ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. క్రితం రోజు భారీగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు మళ్లీ పెరుగుదలను అందుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా పెరుగుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
రఫేల్ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట!
భారత వాయుసేన(ఐఏఎఫ్)లో సుమారు రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో కొనుగోలు చేయనున్న 114 రఫేల్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంఆర్ఎఫ్ఏ) ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిబంధనను చేర్చబోతోంది. ఈ యుద్ధ విమానాల్లో భారతీయ క్షిపణులు, ఆయుధ వ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు వీలుగా ‘ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్’ (ఐసీడీ)ను ఒప్పందంలో అంతర్భాగం చేయాలని భారత్ నిర్ణయించుకుంది.ఏమిటీ ఐసీడీ? దీని ప్రాముఖ్యత ఏంటి?సాధారణంగా ఏ దేశమైనా ఇతర దేశాల నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసినప్పుడు ఆ విమానాల తయారీ సంస్థలు తమ సొంత క్షిపణులను మాత్రమే వాడుకునేలా సాఫ్ట్వేర్ కట్టడి చేస్తాయి. అయితే, రాబోయే 114 రాఫెల్ విమానాల విషయంలో భారత్ భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. తుది ఒప్పందంలో ఐసీడీలో మార్పులు చేయడంతో భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన అత్యాధునిక క్షిపణులు రఫేల్ వ్యవస్థతో అనుసంధానం కావడానికి మార్గం సుగమం అవుతుంది.దీనివల్ల భవిష్యత్తులో మనం ఫ్రాన్స్ నుంచి ఖరీదైన క్షిపణులను కొనాల్సిన అవసరం లేకుండా దేశీయ టెక్నాలజీతో గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులను, ఇతర స్వదేశీ బాంబులను ఈ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు.మేక్ ఇన్ ఇండియాకు ఊతంఫిబ్రవరి 12న డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఈ భారీ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. వచ్చే నెలలో డసో ఏవియేషన్ సంస్థకు ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ (ఆర్ఎఫ్పీ) జారీ కానుంది. మొత్తం 114 విమానాలలో 18 విమానాలు నేరుగా ఫ్రాన్స్ నుంచి సిద్ధంగా వస్తాయి. మిగిలిన 96 విమానాలు 25 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో భారత్లోనే తయారవుతాయి. ఇది దేశీయ రక్షణ రంగ తయారీలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.సోర్స్ కోడ్ వివాదంపై స్పష్టతసోర్స్ కోడ్ బదిలీ విషయంలో వస్తున్న అపోహలను రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కొట్టిపారేశారు. ఏవియానిక్స్, రాడార్, ఫ్లైట్ కంట్రోల్ వంటి కీలక విధులను నియంత్రించే సోర్స్ కోడ్ను పంచుకోకపోవడం అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక ప్రామాణిక పద్ధతి. భారత్కు అత్యంత సన్నిహిత దేశాలైన రష్యా (Su-30 MKI విషయంలో), అమెరికా కూడా తమ సోర్స్ కోడ్లను ఎవరికీ పంచుకోవు. అయినప్పటికీ, ఐసీడీ ద్వారా సాఫ్ట్వేర్ అనుసంధానత లభిస్తుంది కాబట్టి, సోర్స్ కోడ్ లేకపోయినా మన ఆయుధాలను వాడుకోవడానికి ఎటువంటి ఆటంకం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ?
450 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 151 పాయింట్లు పెరిగి 23,926 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 458 పాయింట్లు ఎగబాకి 77,122 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.89బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 96.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.62 శాతం పెరిగింది.నాస్డాక్ 0.83 శాతం పుంజుకుంది.Today Nifty position 10-04-2026(time: 9:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
టీసీఎస్ బోణీ బాగుంది! ఇక ఏప్రిల్ 1 నుంచే వేతనాల పెంపు
ఐటీ పరిశ్రమలో ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఆకర్షణీయమైన ఫలితాలతో క్యూ4 సీజన్కి బోణీ కొట్టింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 12.22 శాతం వృద్ధితో రూ. 13,718 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికం (క్యూ3)లో ఇది రూ. 10,657 కోట్లుగా ఉండగా, అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ4లో రూ. 12,224 కోట్లుగా నమోదైంది.ఆదాయం రూ. 64,479 కోట్ల నుంచి సుమారు 10 శాతం వృద్ధితో రూ. 70,698 కోట్లకు ఎగిసింది. 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్ లాభం 1.35 శాతం వృద్ధితో రూ. 48,553 కోట్ల నుంచి రూ. 49,210 కోట్లకు చేరింది. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 2.67 లక్షల కోట్లుగా నమోదైంది. ఒక్కో షేరుకు రూ. 31 చొప్పున తుది డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. దీనితో పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 39,571 కోట్ల మేర డివిడెండ్ ఇచ్చినట్లవుతుంది.ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు..క్యూ4లో నిర్వహణ మార్జిన్ 24.2 శాతం నుంచి 25.3 శాతానికి పెరిగింది. వార్షికంగా 2.3 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండేలా క్యూ4లో ఏఐ ఆదాయాలు నమోదయ్యాయి. నాలుగో త్రైమాసికంలో 12 బిలియన్ డాలర్ల విలువ చేసే కొత్త డీల్స్ కుదిరాయి.కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఏఐ నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చే ధోరణిని గతేడాది తరహాలోనే కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ కంపెనీ కొనసాగించనుంది.ఉద్యోగులు పెరిగారు.. వరుసగా రెండు త్రైమాసికాల పాటు క్షీణించిన ఉద్యోగుల సంఖ్య క్యూ4లో మళ్లీ పెరిగింది. నికరంగా 2,356 మంది చేరడంతో మార్చి ఆఖరు నాటికి మొత్తం సంఖ్య 5,84,519కి చేరింది. ఉద్యోగాల కోత చేపట్టడం వల్ల 2026 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 23,460 మేర తగ్గింది.వేతనాల పెంపు ఏప్రిల్ 1 నుంచే..ఏప్రిల్ 1 నుంచి తిరిగి వేతనాల పెంపును అమలు చేసే విధానానికి మళ్లినట్లు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సుదీప్ కున్నుమల్ తెలిపారు. గతేడాది ఇంక్రిమెంటు లభించని సీనియర్ సిబ్బంది ఈసారి అందుకోనున్నారు. టాప్ పర్ఫార్మర్లకు రెండంకెల స్థాయిలో పెంపు ఉంటుంది.టెక్నాలజీపై పెట్టుబడులకు ఆసక్తిసీక్వెన్షియల్గా వరుసగా మూడో క్వార్టర్లో వృద్ధిని సాధించాం. స్థూల ఆర్థిక పరిస్థితుల రీత్యా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ, టెక్నాలజీపై కస్టమర్లు పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మాకు ఇది సానుకూలాంశంగా ఉంటుంది. – కె. కృతివాసన్, టీసీఎస్ సీఈవో, ఎండీ
ఫ్యామిలీ
నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్చేస్తే..
ఏ వ్యాపారమైన ప్రారంభంలో ఒడిదుడుకులు సాధారణం. ఇక్కడ వాటిని అధిగమిస్తు ముందుకు సాగేవారు ఏదో ఒకరోజు తప్పక గెలుస్తారు. అందుకు ఉదాహరణ ఈ వ్యక్తి. ఒకప్పుడు సాదాసీదా తోపుడు బండిపై పండ్ల వ్యాపారం. ఒక్కోసారి ఒక్కటి కూడా అమ్ముడు అవ్వక వద్దురా ఈ వ్యాపారం అనేలా నిరాశను కలుగజేసింది. అయినా ఎలాగైనా ఏదో సాధించాలన్న కసి, పట్టుదల మళ్లీ మళ్లీ అదే వ్యాపారం చేసి నిలదొక్కుకోవడమే గాక పదిమందికి ఉపాధి ఇచ్చే స్థాయికి చేరాడు, పైగా కోట్లలో లాభాలు ఆర్జించడం మొదలైంది. ఎలా ఆ వ్యక్తి ఆ స్థాయిలో పండ్ల వ్యాపారంలో సక్సెస్ని అందుకున్నాడంటే..ఆ వ్యక్తే మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్కి చెందిన అబ్దుల్ రైస్. దాదాపు 30 ఏళ్ల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఒక సాధారణ బండిపై పండ్లు అమ్ముతూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రారంభరోజుల్లో అతడి వ్యాపారం ఎంత దారుణంగా ఉండేదంటే..సరిగా అమ్మకాలు సాగాక రోజంతా వేచి చూడాల్సి వచ్చేది. ఆ తోపుడు బండి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోక ఇక వదిలేద్దాం రా బాబు అని అనుకునేవాడు. మరోవైపు వర్షాకాలంలో ఆ కొద్దిపాటి అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయేవి. ఈ ఇబ్బందులతో ఆయన ఛీ ఈ వ్యాపారం నాకొద్దు అంటూ విలపించేవాడు. అయితే బంధువులు, కుటుంబ సభ్యుల మద్దతుతో అబ్దుల్ సుమారు రూ. 5 లక్షల రుణం తీసుకుని మళ్లీ అదే వ్యాపారం ప్రారంభించారు. ఈసారి ఆయనకు గతంలో చూసిన సవాళ్లు అన్ని పాఠాలుగా మారి, ఎలా వ్యాపారం నిర్వహించాలో తెలిసొచ్చింది. నిరంతర శ్రమ, పట్టుదలతో లాభాల పట్టేంచేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆ చిన్న వ్యాపారం కాస్త కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. కాలక్రమేణ తన చిన్న తోపుడు బండి వ్యాపారం ఒక అభివృద్ధి చెందుతున్న సంస్థగా మారింది. అలా అతని సంస్థ ఏకంగా రూ. 3 కోట్ల వార్షిక టర్నోవర్తో దూసుకుపోవడమే గాక దాదాపు 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఒకప్పుడు మనుగడ కోసం పడిన పోరాటం ఇప్పుడు చాలామందికి ఉపాధి అందించే రేంజ్కు చేరడం విశేషం. అతడి సంస్థ బుర్హాన్పూర్లో నీలం ఫ్రూట్’గా ప్రసిద్ధి చెందింది. నాణ్యత, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి అక్కడందరి మన్ననలకు అందుకుంది. అతడి దుకాణం నుంచి పండ్లు కొనడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం గమనార్షం. అతడి సంస్థ వద్దకు సుమారు రెండు నుంచి మూడు వాహానాలు వస్తాయట. చిల్లర వినియోగదారులే కాకుండా, చాలా మంది చిరు వ్యాపారులు కూడా అతని వద్ద పండ్లు కొని స్థానిక మార్కెట్లలో అమ్ముతారు. తద్వారా అతడి వ్యాపార విస్తరణ మరింత పెరుగుతూ వచ్చింది. పట్లుదల, నిరంతర కృషి ఉంటే ఎంతటి భయాంకరమైన సవాళ్లనైనా దాటగలుగతాం, విజయం సాధించగలం అని అబ్దుల్ రైస్.(చదవండి: కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నీతా..! గులాబీ కుర్తా..)
వధువు కావలెను
అమ్మాయికి వంట వచ్చా.. అనే ప్రశ్న బదులు.. అబ్బాయి సంపాదన ఎంత అనే క్వశ్చన్ బాగా వినిపిస్తోంది. అమ్మాయి చదువుకుందా.. అని ఆరా తీయడం బదులు.. అబ్బాయి బుద్ధిమంతుడా కాదా అన్న ఎంక్వైరీలు మొదలయ్యాయి. కట్నం ఎంత ఇస్తారు.. అన్న మాట వినిపిస్తున్నా.. కట్నం ఇవ్వకపోయినా పర్లేదు అన్న అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. జిల్లాలో పురుష పుంగవులకు వివాహ రేఖలు కనిపించడం లేదు. 30 దాటినా పెళ్లి కాని వారి మగవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. శ్రీకాకుళం కల్చరల్, శ్రీకాకుళం రూరల్: జిల్లాలో పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నారు. ఇదివరకు అబ్బాయి ఓకే అంటే అమ్మాయి తరఫు వారు హమ్మయ్య అంటూ గెంతులు వేసే వారు. కానీ ఇప్పుడు ఓకే చెప్పే అధికారం పూర్తిగా అమ్మాయి తరఫు వారికే మళ్లిపోయినట్టు ఉంది. ఫలితంగా వయసు ముదురుతున్నా పెళ్లి కాక ఎంతో మంది యువకులు మిగిలిపోతున్నారు. ఒకప్పటిలా తల్లిదండ్రులు చూపించిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పుడు తక్కువైపోయారు. అబ్బాయిలు రాజీ పడుతున్నా అమ్మాయిలు నో అంటున్నారు. పెరిగిన అడ్డుగోడలు.. ప్రస్తుతం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫలానా విధంగా ఉండాలని అమ్మాయిలు చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు. సంపాదన ఒక్కటే చూడకుండా ప్రొఫెషన్ను కూడా గమనిస్తున్నారు. తక్కువ సంపాదన ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వాళ్లకి తక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద స్థాయిలో జీతాలు ఉండి ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగాల సంబంధాలను కూడా వదిలేసుకోవడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తుండడంతో ఉన్నత ఉద్యోగులకు అందునా ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటిలాగానే డిమాండ్ ఉంది. పెళ్లికి అమ్మాయిల అనుమతి రోజులు మారాయి. అమ్మాయి కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి నేను నచ్చానో లేదో ఒకసారి అడగండి అని అబ్బాయిలే అంటున్నారు. అవసరమైతే కట్నం లేకుండా చేసుకుంటామంటున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బిఎస్సీ అగ్రికల్చరల్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజినీరింగ్ వంటి కోర్సులను చదివే వారి సంఖ్య తక్కువగా ఉండేది. ఈ అర్హతలు చెబితే చాలు ఇట్టే పెళ్లయిపోయేది. కానీ ఇప్పుడా పప్పులు ఉడకడం లేదు. పెరిగిన వివాహం వయసు ఒకప్పుడు అమ్మాయికి పెళ్లీడు రాగానే పెళ్లి చేసే వారు. ఇప్పుడు 25 ఏళ్ల వరకు వివాహ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఒకప్పుడు అబ్బాయిలు కూడా 20 ఏళ్లకు పెళ్లి చేసుకునే వారు. కానీ వారు కూడా 30 ఏళ్లు దాకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆ తర్వాత అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది. గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే సరైన వయసులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాలలో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెపుతున్నారు. అంతా 30 ఏళ్లు పైబడినవారే జాతకాల కోసం ముహుర్తాల కోసం వచ్చేవారు అధికంగా 30ఏళ్లు పైబడినవారే. చాలా మంది తల్లిదండ్రులు వారి అబ్బాయిలకు తగిన అమ్మాయిలు దొరకడం లేదని బాధ వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలను ఎంచుకునే అవకాశం అమ్మాయిలకు లభిస్తుండడం గమనిస్తున్నాం. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం, గుడివీధి యువత ఆలోచనలో మార్పు యువత ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పే ఒక కారణమైతే, అమ్మాయిలు తక్కువగా ఉండ డం మరో కారణం. పెళ్లి కోసం అమ్మాయిలను వెతుక్కోవడానికే సరిపోతుంది. – వేదుల విజయభాస్కరశర్మ, పురోహితులు
మా నాన్న ప్రవర్తనతో విసిగిపోయాము!
మా నాన్న గారిది మొదట్నుంచి వింత ధోరణే! ఇంటికి ఎవరైనా తెలిసినవారు, బంధువులు వస్తే అతిగా ప్రవర్తిస్తారు. ఫ్యాన్లు ఫుల్ స్పీడ్తో పెట్టడం, గట్టిగా మాట్లాడటం, వారితో తనకు పెద్ద పదవుల్లో ఉన్నవారంతా తెలుసునని, రోజూ వారితో ఫోన్లో మాట్లాడుతానని గొప్పలు చెబుతారు. ఎవరైనా అప్పు కావాలంటే తన అవసరాలు కూడా చూడకుండా, వారికి డబ్బులివ్వడం, ఏదైనా ఫంక్షన్కు వెళితే, మా తాహతుకు మించి ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడం కూడా మామూలే. మా నాన్న బలహీనత ఆసరాగా తీసుకుని, ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన్ను ఎక్కువగా వాడుకుంటున్నారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే, చాలా గ్రాండ్గా చేయాలని, అప్పైనా చేసి ఖర్చు పెడ్తారు. తనకు పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయ నాయకులు తెల్సని, తాను తల్చుకుంటే ఏదైనా చేయగలనని, అందరికీ తెలిసేలా చెబుతుంటారు. ఆయన ప్రవర్తన వల్ల, మేము ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా, ఒక్కోసారి నల్గురిలో తలెత్తుకోలేకపోతున్నాము. ఏం చేయాలో తెలియక మీ సలహా కోసం ఈ ఉత్తరం...– రమా కుమారి, బోధన్మీ బాధ అర్థం చేసుకున్నాను. మా ప్రాక్టీసులో ఇలాంటి మనస్తత్వమున్నవారిని తరచుగా చూస్తూనే ఉంటాము. ‘హైపోమేనిక్ పర్సనాలిటీ’ అనే ఒక ప్రత్యేక మనస్తత్వం కలవారు ఇలా ప్రవర్తిస్తారు. ఇది ఒక చిత్రమైన వ్యక్తిత్వ లక్షణం. మన చుట్టూ మీ నాన్న లాంటి వ్యక్తులు చాలా మందే ఉంటారు, ఇంటెన్సిటీలో తేడా అంతే! వీరు మొదట్నుంచీ అతిగా మాట్లాడ్డం, గొప్పలు చెప్పుకోవడం, ఎప్పుడూ ఓవర్ యాక్టివ్గా ఉండటం, ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటారు. వీరి గొప్పలు వింటూ ఉంటే, నిజమేమోనన్నంతగా నమ్మిస్తూ ఉంటారు. అయితే వీరికి నోటి దురదే తప్ప, వాస్తవానికి ఇతరులను మోసం చేయాలనే తలంపు సాధారణంగా ఉండదు. ఇతరులకంటే తాము గొప్ప అనిపించుకోవాలనే తపన వీరికి ఎక్కువ. ఇలాంటి వారు అతిగా ఊహించుకుని, రకరకాల వ్యాపారాలు మారుస్తూ, అనాలోచితంగా డబ్బులు పెట్టుబడి పెట్టి, ఆర్థికంగా కూడా నష్టపోతుంటారు. ఎప్పుడూ జోకులు వేస్తూ, అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఏదైనా కష్టాలొచ్చినా, వారి మొహంలో బాధ, దిగులు కనిపించడం చాలా అరుదు. ఇలాంటి మనస్తత్వం సాధారణంగా జీన్స్ ద్వారా కొందరికి వారసత్వంగా సంక్రమిస్తుంది. మెదడులోని కొన్ని రసాయనాలు అధికంగా పనిచేయడం వల్ల కూడా కొందరిలా ప్రవర్తిస్తారు. తమ ప్రవర్తన వల్ల ఇంట్లో ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారన్న స్పృహ వీరికి ఉండదు. విమర్శిస్తే తట్టుకోలేరు. ఇలాంటి వారు ఒక్కోసారి ‘బైపోలార్ డిసార్డర్’ అనే తీవ్రమైన మానసిక వ్యాధికి కూడా లోనయ్యే అవకాశముంది. మీ నాన్నగారి ప్రవర్తన మరీ శృతిమించి రాగాన పడేట్లయితే, ఒకసారి సైక్రియాట్రిస్టు సలహా తీసుకోండి. ‘మూడ్ స్టెబిలైజర్స్’ అనే కొన్ని మందుల ద్వారా వీరి ప్రవర్తనను చాలా వరకు మార్చే అవకాశముంది. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
ఉమెన్ పవర్...పంచ్
‘అమ్మాయిలకు బాక్సింగ్ ఎందుకండీ!’ అనే మాట అప్పుడెప్పుడో కాదు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. లింగ వివక్షతతో కూడిన మాటలను, అడ్డంకులను పట్టించుకోకుండా తమ దారిలో తాము దూసుకుపోతూ సత్తా చాటుతున్నారు యువ మహిళా బాక్సర్లు. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్–2026లో మన దేశానికి చెందిన ఆరుగురు మహిళా బాక్సర్లు ఫైనల్లోకి దూసుకొచ్చి స్వర్ణపతక పోరులో స్థానాన్ని ఖరారు చేసుకున్నారు. వారు...మీనాక్షి (48 కేజి), ప్రీతి (54 కేజి), జాస్మిన్ (57 కేజి), ప్రియ (60 కేజీ), అరుంధతి చౌదరి (70 కేజీ), అల్ఫియా పఠాన్ (81 కేజి). కుంచె నుంచి పంచ్ దాకా...చిన్నప్పటి నుంచి ప్రీతి పవార్కు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. బాక్సర్గా తన భవిష్యత్ చిత్రపటాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుకుంది. భారత బాక్సింగ్లో అత్యంత ప్రతిభావంతులైన యువతారలలో ఒకరిగా వేగంగా ఎదిగింది. హరియాణాలో భివానీలో జన్మించింది ప్రీతి. బాక్సర్ల ఊరుగా భివానీకి పేరున్నప్పటికీ మొదట్లో బాక్సింగ్పై ప్రీతికి పెద్దగా ఆసక్తి లేదు. ఆమె మామ వినోద్ జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న బాక్సర్. ఆయన ప్రోత్సాహంతో పద్నాలుగేళ్ల వయసులో బాక్సింగ్లోకి వచ్చింది ప్రీతి పవార్.పానిపట్లో జరిగిన ఓపెన్ స్టేట్ టోర్నమెంట్తో తన విజయయాత్ర మొదలుపెట్టింది. ఆ టోర్నమెంట్లో స్వర్ణం గెలుచుకుంది. జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఆమెకు ఎంతోకాలం పట్టలేదు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన యూత్ ఆసియా ఛాంపియన్షిప్స్లో రజత పతకం గెలుచుకుంది. మరుసటి సంవత్సరం సీనియర్ స్థాయిలో ఆసియా ఛాంపియన్షిప్స్లో కాంస్య పతకం గెలుచుకుంది. 2023 ఆసియా గేమ్స్లో మహిళల 54 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం ప్రీతి కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. 2024లో కజకిస్తాన్లో జరిగిన ఆసియా అండర్–22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణపతకం గెలిచిన ప్రీతి తన అద్భుతమైన ఫామ్ కొనసాగించింది. 2024లో ఒలింపిక్ ఆరంగేట్రం చేసింది.ఎంతోసేపు ఏడ్చిన తరువాత..రాజస్థాన్లోని కోటా శిక్షణ సంస్థలకు పెట్టింది పేరు. అలాంటి నగరంలో పెరిగిన అరుంధతి చౌదరి చదువులో ముందుండేది. గణితంలో కూడా అద్భుత ప్రతిభ చూపేది. అదే సమయంలో ఆమెకు ఆటలు అంటే కూడా ఇష్టం. ‘ఆటల్లో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’ అని తండ్రితో చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యంగా చూసి ‘ఆటలు వద్దు. ఐఐటీ చేయాల్సిందే’ అని ఆదేశించాడు. తండ్రి ఆదేశంతో ఇక ఆటలకు దూరం కావాల్సిందే అనుకున్న సమయంలో తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చిన అరుంధతి తనకు ఆటలు అంటే ప్రాణం అని చెప్పింది. తండ్రిని తల్లి చాలాసేపు బతిమిలాడిన తరువాత ‘చదువుతో పాటు ఆటలు కూడా ఓకే’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అరుంధతికి అప్పట్లో బాక్సింగ్పై ఆసక్తి లేదు. బాస్కెట్ బాల్ అంటే ఇష్టం. రాష్ట్రస్థాయిలో కూడా ఆడింది. ఇండివిడ్యువల్ గేమ్ను ఎంచుకుంటే మంచిది అని చె΄్పాడు తండ్రి. అప్పుడే ‘బాక్సింగ్’ ఆలోచన ఆమె మదిలోకి వచ్చింది.‘బాక్సింగ్లో నీ పళ్లు ఊడిపోవచ్చు. ముఖం వికృతంగా మారిపోవచ్చు’ అని హెచ్చరించాడు తండ్రి. ‘నేను కూడా నా ప్రత్యర్థి పళ్లు ఊడగొడతాను. ఆమె ముఖాన్ని వికృతంగా మారుస్తాను’ అని అరుంధతి అన్నప్పుడు తండ్రి పెద్దగా నవ్వాడు. తన కూతురు బాక్సింగ్ ఆటపై సరదా పడుతుంది అనుకున్నాడేగానీ పెద్ద స్థాయికి వెళుతుందని ఆ తండ్రి అనుకోలేదు. కల కనలేదు. అతడు అనుకోక పోయినా, కల కనకపోయినా ప్రపంచ స్థాయిలో బాక్సింగ్లో మెరుస్తోంది అరుంధతి చౌదరి.మట్టి కరిపించేలా...మాజీ ప్రపంచ ఛాంపియన్ను మట్టి కరిపించి సంచలనం సృష్టించిన ప్రియ ఘంగాస్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బాక్సింగ్ను తొలిసారిగా ప్రియకు పరిచయం చేసింది హరియాణా కోచ్ రవి సంగ్వాన్. మాజీ జాతీయ ఛాంపియన్ అయిన రవి దగ్గర ఏడేళ్ల పాటు శిక్షణ తీసుకున్న ప్రియ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో ప్రియ ఫైనల్లోకి అడుగు పెట్టడం గురించి రవి సంతోషంతో పులకించిపోయారు.‘దాద్రీ బాక్సింగ్ అకాడమీ అనే ఒక అకాడమీని ప్రారంభించాను. అప్పుడు ప్రియ ఆరవ తరగతి చదువుతుంది కావచ్చు. తన సోదరుడితో కలిసి అకాడమీకి వచ్చేది. నేర్చుకోవాలి, గెలవాలి అనే తపన ఆ చిన్నారి కళ్లలో కనిపించేది. ఆమెలో అంకితభావంతో పాటు ప్రతిభ కూడా ఉంది’ అంటూ జ్ఞాపకాల్లోకి వెళ్లారు రవి. అప్పట్లో అకాడమీలో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండేవి. అవేమీ పట్టించుకోకుండా పట్దుదలతో కష్టపడి ముందుకు సాగాలనే ఆమె సంకల్పబలం రవికి బాగా గుర్తుండి పోయింది.తాతగారు ససేమిరా అన్నా...జాస్మిన్ కుటుంబ సభ్యులు, బంధువులలో ఎంతోమంది బాక్సర్లు ఉన్నారు. అయినప్పటికీ జాస్మిన్ బాక్సింగ్ రింగ్లోకి అడుగు పెట్టడం ఆమె తాతగారికి నచ్చలేదు. అయితే బాక్సర్ అయిన బాబాయ్ ఆమెను ప్రోత్సహించాడు. జాస్మిన్ పతకాలు గెలుచుకున్నప్పుడల్లా ఆయన కళ్లలో వెలుగు కనిపించేది.‘నా కలలను నిజం చేస్తున్నావు’ అనేవాడు ఆనంద బాష్పాలతో. ‘రింగ్లోకి అడుగు పెట్టగానే నా మదిలోని ఆలోచనలన్నీ మాయమైపోతాయి. గెలవడం గురించి మాత్రమే ఆలోచిస్తాను’ అని తన సక్సెస్ మంత్రాను చెప్పనే చెప్పింది ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న జాస్మిన్. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో 57 కేజీల విభాగంలో ఉబ్జెకిస్తాన్కు చెందిన నిగిన ఉక్తమోనాపై విజయం సాధించింది.కష్టమైనా... ఇష్టంగా!హరియాణాలోని రూర్కికి చెందిన మీనాక్షి హూడా తండ్రి ఆటోడ్రైవర్. ఆరుగురు కుటుంబ సభ్యులలో మీనాక్షి చిన్నది. బాక్సింగ్ అంటే మీనాక్షికి ఇష్టం. ‘ఆడపిల్లకు బాక్సింగ్ ఎందుకు?’ ‘నీకు బాక్సింగ్లో శిక్షణ ఇప్పించడానికి నా దగ్గర డబ్బులు లేవు’ అని ఆ తండ్రి అనలేదు. బాక్సింగ్ అంటే కూతురికి ఉన్న ఇష్టానికి ముచ్చటపడి శిక్షణ ఇప్పించాడు. బాక్సింగ్లో తన కూతురు పెద్ద పేరు తెచ్చుకుంటుందనే నమ్మకంతో ఆర్థిక కష్టాలు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. 2014లో ‘ఖేల్ ఇండియా’ పోటీలో బంగారు పతకం గెలుచుకుంది మీనాక్షి. తాజాగా... ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్స్లో మహిళల 48 కేజీల సెమీ ఫైనల్çలో థాయ్లాండ్కు చెందిన థిప్సచాపై విజయాన్ని సాదించి స్వర్ణపతక పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది.అనుకోకుండా వచ్చి...అల్ఫియా పఠాన్ సోదరుడు రాష్ట్ర స్థాయి బాక్సర్, నాగ్పూర్లో తన సోదరుడు శిక్షణ తీసుకుంటున్న సమయంలో హాల్ బయట అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చునేది అల్ఫియా. ఆ తరువాత ఇద్దరూ ఇంటికి బయలుదేరేవారు. ఒకరోజు కోచ్ పురోహిత్ ఆమెతో సరదాగా ‘బాక్సింగ్ చేస్తావా?’ అన్నాడు. ‘ఆ.. ఏముంది గొప్ప. తన్నడం లేదా తన్నులు తినడం’ అన్నది అల్ఫియా. ఆమె చురుకుదనం చూసి ‘నువ్వు రేపటి నుంచి క్లాస్లో చేరాల్సిందే’ అంటూ వెళ్లిపోయాడు పురోహిత్. ఆయన యథాలాపంగా అన్నాడో, నిజంగానే అన్నాడో తెలియదుకానీ...ఆ మాటతో ఆల్ఫియా పఠాన్ బాక్సింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టి రాకెట్ వేగంతో దూసుకుపోతోంది.
అంతర్జాతీయం
హర్మూజ్పై ఇరాన్ సంచలన ప్రకటన
అమెరికాతో ఇరాన్ చర్చలకు అంగీకరించిన నేపథ్యంలో హర్మూజ్ జలసంధిపై ఇప్పటివరకూ కొనసాగిన హీట్ కాస్త చల్లారింది. హర్మూజ్ జలసంధిని తెరవడానికి తాత్కాలికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇరాన్.. తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధిని దాటే నౌకలు తమను తప్పకుండా సంప్రదించాలని స్పష్టం చేసింది. హర్మూజ్లో వాటర్ మైన్స్ ముప్పు పొంచి ఉందని, ఎలా పడితే అలా నౌకలు ఆ జలసంధిని దాటే ప్రయత్నం చేయద్దొన హెచ్చరించింది. నౌకల రాకపోకలపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)తో సమన్వయం చేసుకున్న తర్వాతే ముందుకు సాగాలని తెలిపింది. రోజుకు 15 నౌకలకు మాత్రమే అనుమతి..రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హోర్ముజ్ జలసంధిని దాటడానికి ఇరాన్ రోజుకు 15 నౌకల మాత్రమే అనుమతిస్తుంది. ఈ జలమార్గాన్ని దాటడానికి ఆ నౌకలకు ఇరాన్ అధికారుల నుండి ముందస్తు అనుమతి కూడా అవసరం. ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, పది కంటే తక్కువ నౌకలు మాత్రమే హోర్ముజ్ జలసంధిని దాటడానికి అనుమతిస్తున్నాయి.సీజ్ఫైర్ ఒప్పందం ప్రకారం.. ‘ హోర్ముజ్ జలసంధి గుండా రోజుకు 15కు మించి నౌకలు మించి ప్రయాణించడానికి లేదు. ఈ రాకపోకలు ఇరాన్ ఆమోదం, ఒక నిర్దిష్ట నియమావళి అమలుపై మాత్రమే ఆధారపడి ఉంటాయి’ అని ఒక సీనియర్ ఇరాన్ అధికారి చెప్పినట్లు రష్యన్ వార్తా సంస్థ TASS పేర్కొంది.యుద్ధానికి ముందున్న యథాస్థితికి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని, కొత్త హోర్ముజ్ నియంత్రణ చట్రాన్ని సంబంధించి ప్రాంతీయ పక్షాలకు తెలియజేయడం జరిగిందని ఇరాన్ వర్గాల సమాచారం.
మన భవిష్యత్తు ఏంటి?
మనం రోజూ ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో వనరులను వాడుతున్నాం. స్విచ్ వేస్తే వెలిగే కరెంట్, కుళాయి తిప్పితే వచ్చే నీరు, మనం కొనే బట్టలు, వాడే ప్లాస్టిక్.. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మనం వాడుతున్న ఈ వనరులు భూమి మీద శాశ్వతంగా ఉంటాయా? రీసెంట్ గా జరిగిన ఒక భయంకరమైన స్టడీ మనల్ని హెచ్చరిస్తోంది. మనం గడుపుతున్న ఈ విలాసవంతమైన జీవనశైలి ఇలాగే కొనసాగితే, మన అవసరాలు తీరడానికి ఒక భూమి సరిపోదు.. మనకి ఇంకో భూమి కావాలి! అవును, మీరు విన్నది నిజం. "వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఎర్త్". అసలు ఈ స్టడీ ఏం చెబుతోంది? మన భవిష్యత్తు ఏంటి? శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, భూమి తన వనరులను తిరిగి ఉత్పత్తి చేసే వేగం కంటే, మనం వాటిని వాడే వేగం చాలా రెట్లు ఎక్కువగా ఉంది. దీనినే 'ఎకలాజికల్ ఫుట్ ప్రింట్' అంటారు. మనం ఏటా భూమి మనకి ఇచ్చే కోటాను ఆగస్టు నెల నాటికే వాడేస్తున్నాం. మిగిలిన నాలుగు నెలలు మనం భవిష్యత్తు తరాలకు చెందాల్సిన వనరులను అప్పుగా వాడుకుంటున్నాం. మనం వాడే నీరు, మనం పారవేసే వ్యర్థాలు, గాలిలోకి వదులుతున్న కార్బన్.. ఇవన్నీ కలిసి ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్, ఇంట్లో ఏసీ, బయట కారు.. ఉంటున్నాయి. ఇవి మనకి సౌకర్యాలే కానీ, భూమికి మాత్రం భారాలు. ఒక్క ఐఫోన్ తయారీకి ఎన్ని వనరులు కావాలో తెలుసా? మనం వాడే ఫాస్ట్ ఫ్యాషన్ బట్టల వల్ల ఎన్ని కోట్ల లీటర్ల నీరు వృధా అవుతుందో ఊహించగలరా? ఈ రిపోర్ట్ ఏం చెబుతుందంటే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా అంతా అమెరికా లేదా యూరోపియన్ దేశాల స్థాయి జీవనశైలిని పాటిస్తే, మనకు కనీసం రెండున్నర గ్రహాలు అవసరమవుతాయి. కానీ మన దగ్గర ఉన్నది ఒకే ఒక్క గ్రహం.. మన భూమి! వనరుల తరుగుదల అంటే కేవలం నీరు, ఆహారం అయిపోవడం మాత్రమే కాదు. దీని వల్ల వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయి. అడవుల నరికివేత వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగి, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. దీనివల్ల సముద్ర మట్టాలు పెరిగి భవిష్యత్తులో ముంబై, న్యూయార్క్ లాంటి తీర ప్రాంత నగరాలు నీట మునిగే ప్రమాదం ఉంది. అకాల వర్షాలు, భయంకరమైన కరువులు ఇవన్నీ ప్రకృతి మనకు ఇస్తున్న ముందస్తు హెచ్చరికలు. మనం భూమిని రక్షించకపోతే, భూమి మనల్ని శిక్షించడం మొదలుపెడుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం ఆదిమానవుల్లా అడవుల్లోకి వెళ్ళిపోవాలా? అవసరం లేదు. కానీ మన అలవాట్లను మార్చుకోవాలి. వాటిలో ప్రధానంగా అవసరమైన దానికంటే ఎక్కువ వనరులను వాడటం ఆపేయాలి. 'నీరు' , 'విద్యుత్తు' విషయంలో పొదుపుగా ఉండాలి. అలాగే వాడి పారేసే సంస్కృతి నుండి వస్తువులను మళ్ళీ మళ్ళీ వాడే అలవాటు చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అంతేకాదు విదేశీ వస్తువుల కంటే స్థానికంగా దొరికే ఆహారం, వస్తువులను ప్రోత్సహించడం వల్ల ట్రాన్స్పోర్ట్ వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వీటన్నిటికన్నా ప్రధానంగా కనీసం మన వంతుగా మొక్కలు నాటడం, ప్రకృతిని గౌరవించడం నేర్చుకోవాలి..మనకి నివసించడానికి 'ప్లాన్ బి' లేదు. ఎందుకంటే మనకి ఇంకో గ్రహం లేదు. మార్స్ మీద ఇల్లు కట్టుకోవచ్చని మనం కలలు కనవచ్చు కానీ, కోట్లాది మంది సామాన్యులకు ఈ భూమే ఆధారం. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి కేవలం డబ్బు మాత్రమే కాదు.. వారు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి, తాగడానికి స్వచ్ఛమైన నీరు. ఆ బాధ్యత మనందరిదీ.ఈ రోజే మీ జీవనశైలిలో ఒక చిన్న మార్పు చేయండి. భూమిని రక్షించండి.. అది మనల్ని రక్షిస్తుంది.
ట్రంప్ తదుపరి అడుగు ఎటువైపు..?
డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షునిగా కాసేపు యుద్ధం అంటారు.. మరి కాసేపు శాంతి గెలిచింది అంటారు. అమెరికా పరిపాలన బాధ్యతలు రెండోసారి చేపట్టిన తర్వాత ప్రతీ అంశంలోనూ ఏదొక వివాదం లేకుండా ఆయనకు పూట ముందుకెళ్లడం లేదు. అమెరికాతో యుద్ధంలో భాగంగా చర్చలకు ఇరాన్ సిద్ధమవ్వగానే ప్రపంచ శాంతి గెలిచిందంటూ ఒక గంభీరమైన ప్రకటన ఇచ్చేశారు. ఇరాన్ చర్చలకు ఒప్పుకున్న మాట అత్యంత సంకట స్థితిలో ఉన్న ట్రంప్కు ఊపిరినిచ్చినట్లయ్యింది. అంతకుముందు వరకూ ఇరాన్ను అది చేస్తాం. ఇది చేస్తాం అన్న ట్రంప్ నోట శాంతి మాట వినిపించింది.అయితే అది కేవలం శాంతి చర్చలకు మాత్రమే ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అంటే ఇక్కడ యుద్ధానికి బ్రేక్ మాత్రమే వచ్చింది.. పూర్తిగా యుద్ధాన్ని ముగించేందుకు కాదనే విషయం ఇరానే తెలపడం ద్వారా చర్చలు తర్వాతే అసలు విషయం ఏమిటన్నది తెలుస్తుందని చెప్పేసింది. చర్చల్లో లెబనానే హాట్ టాపిక్..?ఇజ్రాయెల్ బుధవారం 100 మిస్సైళ్లను ప్రయోగించడంతో లెబనాన్లో 250 వరకూ మరణించారు. ఇది ఇరాన్ అత్యంత అసహనం తెప్పించింది. ఒకవైపు పాకిస్తాన్ వేదికగా ఇరు దేశాలు చర్చలకు సిద్ధమైన తరుణంలో ఇజ్రాయెల్ మాత్రం ఇంకా లెబనాన్పై దాడులు చేస్తూనే ఉండటం ఏంటని ప్రశ్నించింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై యుద్ధం చేస్తున్న సమయంలో ఆ దేశానికి సాయం చేసిన వారిలో హెజ్బుల్లా దళం ఒకటి. మరి వారిపై దాడులు చేస్తే ఇరాన్ ఊరుకుంటుందా?, తమతో చర్చలు అంటూ తమకు మద్దతిచ్చిన వారిపై దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తే ఉండదు.సీజ్ఫైర్ అనేది కేవలం అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య మాత్రమేనని అది లెబనాన్ విషయంలో కాదని అంటున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని కూడా ఇదే మాట అంటున్నారు. ఒకవేళ లెబనాన్ను సీజ్ఫైర్ అంశంలో చేర్చకపోతే ఇరాన్ ఒప్పుకుంటుందా? అనేదే ఇప్పుడు ట్రంప్ ముందున్న ప్రశ్న. అలా జరగని పక్షంలో ట్రంప్ ముందున్నది ఏమిటి అనే చర్చ మొదలైంది. ఇరాన్ పెట్టే ఈ షరతకు ఒప్పుకోవాలంటే.. అందుకు ముందుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను ట్రంప్ ఒప్పించాలి. మరి నెతన్యాహూ ఇందుకు ఒప్పుకుంటారా? అనేది మరో ప్రశ్న. నెతన్యాహూపై ఒత్తిడి తేగలరా?లెబనాన్పై యుద్ధాన్ని ఆపమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూపై ట్రంప్ ఒత్తిడి తీసుకు రావాల్సి ఉంటుంది. లెబనాన్పై దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్.. ఆ దాడిని ఆపాలని చర్చలకు ముందే చెప్పింది. వాటిపై అమెరికా-ఇజ్రాయెల్ పెద్దలు నో అంటున్నారు. శాంతి చర్చల్లో కూడా అదే మాట అంటే మాత్రం.. అదే సమయంలో ‘‘లెబనాన్పై దాడులు ఆపకపోతే చర్చలు లేవు.. ఏమీ లేవు’’ అని ఇరాన్ అంటే మాత్రం ట్రంప్ నోట్లో వెలక్కాయపడినట్లే. ఆ సమయంలో ట్రంప్ ముందున్నది మళ్లీ యుద్ధానికి దిగడమే. అంటే ఇక్కడ పూర్తిగా శాంతియుత వాతావరణం రావాలని కోరుకుంటే మాత్రం నెతాన్యాహూను ముందుగా ఒప్పించాలి ట్రంప్. పాక్కు జేడీ వాన్స్..!ఇరాన్ చర్చలకు వచ్చినా తాము పెట్టే ఆంక్షలకు ఒప్పుకోదనే నేరుగా అమెరికా ఉపాధ్యక్షుడే.. రేపు(శుక్రవారం) పాకిస్తాన్కు వస్తున్నారు. పాకిస్తాన్ వేదికగా ఈ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి.. కచ్చితంగా అమెరికా పెద్ద తలకాయలు ఉండాల్సిందేనని ఇరాన్ పట్టుబట్టిన నేపథ్యంలో జేడీ వాన్స్ను పాకిస్తాన్ పర్యటన దాదాపు ఖరారైంది. తమతో చర్చల్లో భాగంగా అమెరికా పరిపాలన విభాగంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థాయి తప్పితే మరే అధికారులు తమకు అవరసం లేదని ఇరాన్ పంతం పట్టుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ నమ్మదగిన జేడీ వాన్స్ ను పాక్కు పంపించబోతున్నారనే టాక్ నడుస్తోంది.మరి జేడీ వాన్స్.. ఇరాన్ను ఎంతవరకూ ఒప్పిస్తారనేది చూడాలి. లెబనాన్ను పక్కకు పెట్టి ఈ శాంతి చర్చలు సాగుతాయా?, ఇరాన్ పెట్టే పలు కండిషన్స్కు అమెరికా ఊ కొడుతుందా? అనేది చూడాలి. కొసమెరుపు ఎలా ఉండబోతుంది..?ఇరాన్తో కచ్చితంగా అమెరికా సుదీర్ఘ చర్చలే జరపనుంది. ఇప్పటివరకూ యుద్ధంలో అమెరికాకు ఇరాన్ అంతు చిక్కకపోవడం ఒకటైతే.. ఈ యుద్ధంలో అమెరికాలో ప్రజల నుంచి ట్రంప్పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ తరుణంలో ఇరాన్తో చర్చల ద్వారానే వారిపై గెలవాలనే భావనలో ఉన్నారు ట్రంప్. జేడీ వాన్స్ చర్చల తర్వాత ‘ ప్రపంచ శాంతి వెల్లివిరిసింది’ అంటూ ట్రంప్ మళ్లీ తనదైన శైలిలో ఓ ప్రకటన ఇవ్వనున్నారా?.. .. లేక ‘‘ఇరాన్కు చుక్కలు చూపించబోతున్నాం’’ అనే మాట ట్రంప్ నోట మళ్లీ వినబడుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి.
ఇరాన్ అణుసంస్థ అధిపతి కీలక వ్యాఖ్యలు
టెహ్రాన్: అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం తమ హక్కు అంటూ ఇరాన్ అణు సంస్థ అధిపతి మహ్మద్ ఎస్లామీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ హక్కుల పరిరక్షణకు అత్యవసరమంటూ ఇరాన్ స్పష్టం చేసింది. టెహ్రాన్లోని దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంస్మరణ కార్యక్రమాల సందర్భంగా.. మొహమ్మద్ ఎస్లామీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా, అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికాతో చర్చలకు ముందు ఇరాన్ ఘాటు హెచ్చరికలు చేసింది. చర్చలు విఫలమైతే దీర్ఘ కాలిక యుద్ధానికి సిద్ధమంటూ ఇరాన్ తేల్చి చెప్పింది. దీర్ఘకాలిక యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పేర్కొంది. హర్మూజ్ తెరవకపోతే మళ్లీ దాడులుచేస్తామంటూ ఇప్పటికే ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే..మరోవైపు.. కాల్పుల విరమణ నేపథ్యంలో.. నెలన్నర రోజుల యుద్ధంలో గెలిచింది తామంటే తామేనని అమెరికా, ఇరాన్ పోటాపోటీగా ప్రకటించుకున్నాయి. కాల్పుల విరమణ కోసం ఇరానే దేబిరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించగా.. ఆ దేశంపై తాము తలపెట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కనీవిని ఎరగని రీతిలో విజయం సాధించిందని చెప్పుకున్నారు. తమ దాడుల ధాటికి ఇరాన్ సైన్యం కనీసం మరికొన్నేళ్లదాకా కోలుకోలేనంతగా దెబ్బ తిన్నట్టు చెప్పారు. అమెరికాయే కాళ్లబేరానికి దిగొచ్చి తాము విధించిన 10 షరతులకు అంగీకరించిందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పలు పోస్టులు చేశారు.
జాతీయం
విడిగా ఉంచడం విభజనకు దారితీయొచ్చేమో
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి 10–50 ఏళ్ల వయసు మహిళలకు ప్రవేశం నిరాకరించే విధానం కారణంగా సమాజంలో విభజన తలెత్తవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆలయ ప్రవేశం నుంచి మహిళలను దూరంపెట్టడం హిందుత్వంపై ప్రతికూల ప్రభావం పడే ఆస్కారముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. రుతుక్రమ వయసు మహిళలనూ ఆలయంలోకి అనుమతించాలంటూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును సమీక్షించాలంటూ 50కిపైగా దాఖలైన పిటిషన్లకు సంబంధించిన వాదోపవాదనలను వరసగా మూడోరోజూ సుప్రీంకోర్టు ఆలకించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాహ్, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే, జస్టిస్ ఆర్.మహదేవన్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చిల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట గురువారం నాయర్ సర్వీస్ సొసైటీ, అయ్యప్ప సేవా సమాజం, క్షేత్ర సంరక్షణ సమితుల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ వైద్యనాథన్ వాదనలు విన్పించారు. ‘‘ప్రత్యేకంగా ఒక మతశాఖకు సంబంధించి ఆలయంలోకి ఎవరిని అనుమతించాలి? ఎవరు పూజించాలి? ఎవరు దర్శనం చేసుకోవాలి? అనేది ఆ మతశాఖ ఇష్టం’’అని అన్నారు. ఈ వాదనతో జస్టిస్ నాగరత్న విభేదించారు. ‘‘వెంకటరమణ దేవరు ఆలయంలోకి గౌడ సారస్వత్ బ్రాహ్మణులను మినహా ఎవరినీ రానివ్వబోమని అంటున్నారు. ఒక నిమిషం శబరిమల ఆలయ వివాదం విషయం పక్కనబెడదాం. కేవలం మా వర్గీయులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తాం, వేరే వాళ్లకు ప్రవేశం లేదు అని అనడం హిందుత్వంలో మంచిదికాదు. అంతిమంగా మతంపై ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవాలి’’అని అన్నారు. జడ్జి నాగరత్న వ్యాఖ్యలతో ధర్మాసనంలోని మరో జడ్జి జస్టిస్ అరవింద్ కుమార్ ఏకీభవించారు. భక్తులను ఇలా దూరం పెడితే సమాజంలో విభజనలు తలెత్తుతాయని ఆయన వ్యాఖ్యానించారు. అయినాసరే వైద్యనాథన్ తన వాదనలకు కట్టుబడ్డారు. ‘‘తమ వర్గీయులకే ఆలయంలో ప్రాధాన్యత దక్కాలనే ఆలయ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి నిధులను ఆశించబోవు. ప్రైవేట్ దాతల నుంచిగానీ ప్రజల నుంచిగానీ విరాళాలు స్వీకరించబోవు. ఆలయాలు వాళ్లపై ఆధారపడవు’’అని అన్నారు.
మోదీ చెప్పేవన్నీ తప్పుడు లెక్కలు
కోల్కతా: పశ్చిమబెంగాల్ టీఎంసీ పాలనలో మత్స్య ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించలేక పోయిందంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలపై సీఎం మమతా బెనర్జీ దీటుగా స్పందించారు. ఆయన చెబుతున్నవన్నీ తప్పుడు గణాంకాలంటూ ఎదురుదాడికి దిగారు. ‘బిహార్ అత్యధికంగా మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేస్తుండగా బెంగాల్లో వెనుకబడిపోయిందంటూ ప్రధాని మోదీ విమర్శించినట్లు తెలిసింది. బీజేపీ పాలనలోని రాష్ట్రాల్లో ప్రజలను మాంసాహారం, చేపలు, గుడ్లు తిననివ్వడం లేదు. అక్కడ బీఫ్, మాసం దుకాణాలను మూసివేస్తున్నారు. అందుకే, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్, బిహార్, యూపీలు మాంసం, బీఫ్, చేపలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. బెంగాల్లో మాత్రం ఎక్కడ చూసినా చేపల మార్కెట్లు కనిపిస్తాయి. ఇక్కడ దొరికే మత్స్య ఉత్పత్తులను ప్రతి వారూ ఇక్కడ ఆహారంగా వాడుతారు. అందుకే, దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది’అంటూ ఆమె వివరించారు. గతంలో ఏపీ నుంచి మత్స్య ఉత్పత్తులను దిగుమతి చేసుకునేవారమని, ఇప్పుడా పరిస్థితి లేదని ఆమె అన్నారు. సొంత పార్టీ నేతలు చెప్పేవన్నీ యథాతథంగా వల్లెవేయడానికి బదులుగా, ఇలాంటి వాటిని కూడా మోదీ తెలుసుకోవాలని హితవు పలికారు. గురువారం సీఎం మమత ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన పలు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో టీఎంసీని ఓడించాలనే కుట్రతోనే సర్ ప్రక్రియలో 90 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను తొలగించారని, అయినప్పటికీ విజయం ఖాయమని మమత స్పష్టం చేశారు.
బెంగాల్కు ఆరు గ్యారంటీలు
హల్దియా: క్రూరత్వానికి మారుపేరైన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పశ్చిమ బెంగాల్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి వైఫల్యానికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోందని, రాష్ట్రాన్ని వెనక్కి లాగుతోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రగతి కావాలంటే బీజేపీని గెలిపించాలని సూచించారు. బెంగాల్లో తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. భయానక పాలన నుంచి బెంగాల్ను రక్షిస్తామని, సర్వత్రా విశ్వాసం నెలకొనే వాతావరణాన్ని సృష్టిస్తామని ప్రకటించారు. రేవు నగరం హల్దియా, అసన్సోల్తోపాటు సూరి పట్టణంలో గురువారం ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. భయానక వాతావరణం నెలకొని ఉంటే పెట్టుబడులను ఆకర్షించలేమని, విశ్వాసం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని నిర్మమ్(క్రూరమైన) సర్కార్గా అభివర్ణించారు. దేశమంతా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే బెంగాల్ మాత్రం వెనుకంజలోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. వికసిత్ బెంగాల్ స్వప్నం సాకారం కావాలంటే ఈ క్రూర ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని పేర్కొన్నారు. బెంగాల్లో బీజేపీ గెలిస్తే చేపలు, మాంసం తిననివ్వరంటూ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. డిమాండ్కు సరిపడా చేపలను ఉత్పత్తి చేయడంలో గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రాగానే చేపల ఉత్పత్తిలో బెంగాల్ స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రధాన మంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే.. వందేళ్లకైనా విముక్తి లభించదు ‘‘ప్రతికూల వాతావరణంలోనూ ఈ సభకు జనం భారీగా తరలిరావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ మార్పునకు వారంతా సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈసారి తృణమూల్ కాంగ్రెస్కు ఉద్వాసన తప్పదు. బీజేపీ ప్రభంజనం సృష్టించబోతోంది. పూర్బమేదినీపూర్లో గత ఎన్నికల్లో బీజేపీ 16 స్థానాలకు గాను 15 స్థానాలు గెల్చుకుంది. ఈసారి బెంగాల్ మొత్తం అదే పరిస్థితి కనిపించబోతోంది. భవానీపూర్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో సీఎం మమతా బెనర్జీ ఓడిపోతారు. తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ బెంగాల్ యువతకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రైవేట్ రంగాన్ని నాశనం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకున్నారు. ఇప్పటిదాకా చేసిన పాపాలకు గాను ఆ పార్టీకి వందేళ్లకైనా విముక్తి లభించదు. ఇకపై తృణమూల్ ముక్త్ బెంగాల్ బెంగాల్లో కట్ మనీ సంస్కృతిని, సిండికేట్రాజ్ను అంతం చేస్తాం. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మాఫియారాజ్ చెలరేగిపోతోంది. బొగ్గు, ఇసుక, మట్టిని దోచుకుంటోంది. ప్రజలకు తీరని అన్యాయం చేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ పాపాలు గరిష్టస్థాయికి చేరాయి. ఈ పార్టీని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చింది.‘మా, మాటీ, మనుష్ ’నినాదం ఉత్తదే.. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టాలకు విలువ లేకుండాపోయింది. మహా జంగిల్రాజ్దే ఇక్కడ పెత్తనం. మాల్డా జిల్లాలో ఇటీవల జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించారు. చట్టవిరుద్ధంగా మనదేశంలోకి ప్రవేశించినవారి వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. రాష్ట్రంలో పాలన మారగానే చొరబాటుదార్ల పోషకులపై ప్రత్యేక దర్యాప్తు జరిపిస్తాం. ఊచలు లెక్కబెట్టిస్తాం. తృణమూల్ కాంగ్రెస్ ‘మా, మాటీ, మనుష్ ’నినాదం ఉత్తదేనని తేలిపోయింది. మా(తల్లి) రోదిస్తోంది. మనుషులు భయంతో బతుకున్నారు. ఇక్కడి భూములను చొరబాటుదార్లు ఆక్రమించారు. చొరబాటుదార్ల కారణంగా స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కడం లేదు. బీజేపీ సర్కార్ వచ్చాక జీ రామ్ జీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తాం. పేదలకు ఉపాధి కల్పిస్తాం’’అని ప్రధాని మోదీ ప్రకటించారు.
పార్కింగ్ కోసం తల నరికేస్తే : బంధువులు అతడిని కొట్టి చంపేశారు
బిహార్లో జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేపాయి. ఒక చిన్న పార్కింగ్ వివాదం రెండు హింసాత్మక ఘటనలకు దారి తీసింది. రోడ్డు పక్కన వ్యాపారి ఒక పికప్ డ్రైవర్ను తల నరికాడు, ఆ తర్వాత మృతుడి కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట నిందితుడిని హతమార్చిన కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం, అరేరియా జిల్లాలోని ఫోర్బ్స్గంజ్ పట్టణంలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడైన డ్రైవర్ను అరేరియాలోని జోగ్బాని పట్టణానికి చెందిన అలీ హుస్సేన్గా గుర్తించారు. ప్రతీకారంగా హత్యకు గురైన రోడ్డు పక్కన వ్యాపారిని రవి చౌహాన్గా గుర్తించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫోర్బ్స్గంజ్ పట్టణంలో ఒక చిన్న పార్కింగ్ సమస్యపై 'సత్తు' అమ్మే చౌహాన్, హుస్సేన్పై దాడి చేసి, అతని తల నరికి, అందరి ముందూ వీరంగం సృష్టించాడు. ఆ తర్వాత నిందితుడు మృతదేహాన్ని, నరికిన తలను సంఘటనా స్థలంలోనే వదిలిపెట్టి అక్కడినుంచివెళ్లి పోయాడు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?ఇది చూసి మృతుడి బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. హుస్సేన్ బంధువులతోపాటు, స్థానికులు కూడా ఇంటి దగ్గర దాక్కున్న నిందితుడిని సంఘటనా స్థలానికి లాక్కొచ్చి, కర్రలతో, రాడ్లతో కొట్టి, పోలీసుల కళ్లెదుటే చంపేశారు. ఈ జంట హత్యల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులకు, ఆగ్రహించిన గుంపుకు మధ్య ఘర్షణ జరిగింది. సంఘటనా స్థలం చుట్టూ ప్రజలు గుమిగూడటం ప్రారంభించడంతో, అదనపు పోలీసు బలగాలు మెహరించాయి. ఈ రెండు ఘటనల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ, పోలీసులు ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే!
ఎన్ఆర్ఐ
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’
అల్ఫారెట్టా, జార్జియా: స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి-2026’ అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు.ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. నాలుగేళ్ల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ(యూఎస్ఏ) సేవా సంస్థలకు అందజేయనున్నారు.ఈ వేడుకల్లో బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి (శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రతినిధులు), గిరిధర్ కొటగిరి (ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు), జ్యోత్స్న పాలకుర్తి (గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ చైర్మన్), రమణ గంద్ర (గేట్స్ అధ్యక్షులు), సునీత పోట్నూరు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు), ఆది శ్రీనివాసన్ (ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు), శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ (ప్రెసిడెంట్ అండ్ సీఈఓ), జనార్ధన్ పన్నెల (శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధి) పాల్గొన్నారు.
న్యూయార్క్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయుల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్టర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరంలోని ఇండియా హౌస్లో ఘనంగా నిర్వహించారు.గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వ్యాపారం, మీడియా, ఫైనాన్స్, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అమెరికాలో భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు.FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తమ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు.కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో', 'ఉజ్వల యోజన' వంటి పథకాల ద్వారా భారత్ మహిళా సాధికారతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అలాగే 100 మిలియన్ కుటుంబాలను మహిళల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థికంగా శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరఫున గుర్తింపు సర్టిఫికెట్లు, FIA శాలువాలు, ట్రోఫీలు అందజేశారు.నార్త్స్టార్ స్ట్రాటజీస్ COO జోడి లిన్ హెర్క్లోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల్ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాన్సుల్ జనరల్ సతీమణి మోనాలిసా శువదర్షిణి ప్రధాన్ కూడా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్ మాట్లాడుతూ, కమ్యూనిటీ నిర్మాణంలో FIA పాత్రను కొనియాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అమెరికన్ నటి రేష్మా శెట్టి.. మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ తానియా కిన్సెల్లా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం ఇస్తూ.. అడ్డంకులను అధిగమించిన వైనాన్ని వివరించారు.కార్యక్రమ ప్రారంభంలో దివంగత అవార్డు గ్రహీత రాధా సుబ్రమణ్యం జ్ఞాపకార్థం మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం ముగింపులో FIA ప్రధాన కార్యదర్శి సృష్టి కౌల్ నరులా ధన్యవాదాలు తెలిపారు. FIA జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల వందన సమర్పణతో వేడుకలను ముగిశాయి.ఎఫ్ఐఏ సంస్థ 1970 నుండి భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారతీయ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఇండో–అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తోంది.
సింగపూర్లో ఘనంగా ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి తనయులు కే నాగేంద్రనాథ్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం 43, బర్గండీ క్రిసెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 70 మంది దర్శకుడు కె. విశ్వనాథ్ అభిమానులు హాజరయ్యారు.సంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ, కె. నాగేంద్రనాథ్తో తనకు దాదాపు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తెలిపారు. సామవేదం షణ్ముఖ శర్మ 2017లో సింగపూర్ విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన శివపదం కార్యక్రమానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో సందేశాలు అందించిన పుస్తక రచయిత, ప్రముఖ దర్శకులు సీనియర్ డైరెక్టర్ వంశీకి, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయులు ఏడిద రాజాకి ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్య అతిథి కె. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ శంకరాభరణం’ చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం అప్పట్లో తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందిందని తెలిపారు. ప్రస్తుతం పుస్తక రచయిత వంశీని సంప్రదించి పునర్ముద్రణ చేయించామని చెప్పారు. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న హైదరాబాద్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామని, దానికి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలు, విశేషాలు వినిపించడంతో ఇది ఒక అచ్చ తెలుగు పండుగలా అనిపించిందని తెలిపారు.ఈ సందర్భంగా తొలి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినసంస్కార భారతి అధ్యక్షులు రమణమూర్తి కి, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు బి.వి.ఆర్. చౌదరి దంపతులకు, తంగిరాల రాజశేఖర్, సౌభాగ్యలక్ష్మి దంపతులకు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు.కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి ఆలపించగా, శేషశ్రీ వీణపై ఒక గీతాన్ని వాయించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ప్రేక్షకులతో పంచుకోగా, చిత్ర మరియు పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం రాజశేఖర్–సౌభాగ్యలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో భోజనాన్ని సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లలో శ్రీలలిత, మాధవి పాలకుర్తితోపాటు, సుబ్బు పాలకుర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ్, సత్య జాస్తి, రాజ్ కుమార్ తదితరులు సహాయ సహకారాలను అందించారు.
క్రైమ్
ప్రాణం తీసిన స్నానం సరదా
సాక్షి, పాడేరు: సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలో దిగిన ముగ్గురు గిరిజన యువతులు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతిచెందారు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. హుకుంపేట మండలం మారుమూల బూర్జ పంచాయతీ జంబువలస గ్రామానికి చెందిన గిరిజన యువతులు సాలెపు త్రిష (17), సాలెపు పవిత్ర (16), సాలెపు రత్నకుమారి(16) అంజలి కలిసి అనంతగిరి మండలం వాలాసి పంచాయతీలోని ములగుమ్మి జలపాతం వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. గ్రామంలో ఇటుకల పండుగ కావడంతో నలుగురు యువతులు జలపాతం వద్ద ఉత్సాహంగా గడిపారు. త్రిష, పవిత్ర, రత్నకుమారి జలపాతంలోకి దిగి స్నానాలు చేస్తుండగా, అంజలి ఒడ్డున పెద్ద బండరాయిపై నిల్చుని సెల్ఫోన్లో వారిని ఫొటోలు తీస్తోంది. అయితే, త్రిష, పవిత్ర, రత్నకుమారి ప్రమాదవశాత్తూ జారి జలపాతంలో పడిపోయారు. ముగ్గురూ నీటిలో మునిగి మృతిచెందారు. వారు మునిగిపోయారనే కంగారులో అంజలి బండరాయి నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న జంబువలస గ్రామానికి చెందిన గిరిజనులంతా జలపాతం వద్దకు చేరుకుని ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన అంజలిని అనంతగిరి మండలంలోని లుంగపర్తి పీహెచ్సీకి తరలించారు. మృతిచెందిన త్రిష హుకుంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. రత్నకుమారి అనంతగిరి మండలం బీంపోల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షలు రాసి ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది. ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన ముగ్గురు గిరిజన యువతులు మృతిచెందడంతో జంబువలస గ్రామంలో విషాదం నెలకొంది.వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతంలో ప్రమాదవశాత్తూ పడిపోయి ముగ్గురు యువతులు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముగ్గురు యువతుల మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవలే ఇంటర్మీడియెట్, టెన్త్ పరీక్షలు రాసి మంచి భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్థినులు ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
రేప్ చేసి ఉరివేశారు?
రాయపర్తి/వర్ధన్నపేట: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ తండాలో గురువారం గ్యాంగ్రేప్ కలకలం రేపింది. తల్లిదండ్రులు, బంధువుల కథనం ప్రకారం.. ఓ తండాకు చెందిన గిరిజన దంపతులకు కుమారుడు, కూతురు (21) ఉన్నారు. తల్లిదండ్రులు బతుకుదెరువుకోసం హైదరాబాద్లో ఉంటుండగా కుమారుడు మధ్యప్రదేశ్లో పోస్టుమ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. యువతి తన ఇంట్లో ఉంటోంది. పక్కనే పెద్దనాన్న ఇల్లు ఉండగా ఏదైనా అవసరం ఉంటే ఆ కుటుంబ సభ్యులతో చెప్పేది. నర్సంపేటలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆ యువతి నర్సు(ఏఎన్ఎం)గా శిక్షణ పొందుతోంది.తండానుంచి నర్సంపేటకు వస్తూ పోతున్న క్రమంలో పర్వతగిరి మండలం రావూరు తండాకు చెందిన కొంతమంది యువకులు తరుచూ వెంటపడుతుండేవారని తన పెద్దనాన్న కుటుంబ సభ్యులతో సదరు యువతి చెప్పేది. బుధవారం రాత్రి యువతి పెద్దనాన్న ఇంట్లో కాకుండా తన ఇంట్లో పడుకుంది, ఉదయం చూడగా ఉరేసుకుని కనిపించింది. ఈ క్రమంలో తల్లిదండ్రులతోపాటు బంధువులు సదరు యువతిని పక్కనే ఉన్న మొక్కజొన్న చేనులో రావూరుకు చెందిన నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసి ఇంట్లో ఉరివేసి వెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన.. పోలీసులు యువతి మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం వర్ధన్నపేటకు తీసుకురాగా కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. యువతిపై గ్యాంగ్ రేప్ చేయడం వల్లనే మృతిచెందిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సాయిబాబు ఆందోళనకారులను నచ్చచెప్పి న్యాయం చేస్తామనిచెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీస్ శాఖలో భారీగా జీతాల కుంభకోణం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సంచలనాత్మకంగా వెలుగులోకి వచ్చిన జీతాల కుంభకోణం కలకలం రేపుతోంది. మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ నిధులను అక్రమంగా వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు రూ.1 కోటి 40 లక్షల రూపాయల మేర నిధులు కాజేయబడినట్లు టాస్క్ ఫోర్స్ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో ఒక పోలీసు ఉద్యోగిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో ఆర్థిక వ్యవహారాలపై పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పార్కింగ్ కోసం తల నరికేస్తే : బంధువులు అతడిని కొట్టి చంపేశారు
బిహార్లో జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేపాయి. ఒక చిన్న పార్కింగ్ వివాదం రెండు హింసాత్మక ఘటనలకు దారి తీసింది. రోడ్డు పక్కన వ్యాపారి ఒక పికప్ డ్రైవర్ను తల నరికాడు, ఆ తర్వాత మృతుడి కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట నిందితుడిని హతమార్చిన కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం, అరేరియా జిల్లాలోని ఫోర్బ్స్గంజ్ పట్టణంలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడైన డ్రైవర్ను అరేరియాలోని జోగ్బాని పట్టణానికి చెందిన అలీ హుస్సేన్గా గుర్తించారు. ప్రతీకారంగా హత్యకు గురైన రోడ్డు పక్కన వ్యాపారిని రవి చౌహాన్గా గుర్తించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫోర్బ్స్గంజ్ పట్టణంలో ఒక చిన్న పార్కింగ్ సమస్యపై 'సత్తు' అమ్మే చౌహాన్, హుస్సేన్పై దాడి చేసి, అతని తల నరికి, అందరి ముందూ వీరంగం సృష్టించాడు. ఆ తర్వాత నిందితుడు మృతదేహాన్ని, నరికిన తలను సంఘటనా స్థలంలోనే వదిలిపెట్టి అక్కడినుంచివెళ్లి పోయాడు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?ఇది చూసి మృతుడి బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. హుస్సేన్ బంధువులతోపాటు, స్థానికులు కూడా ఇంటి దగ్గర దాక్కున్న నిందితుడిని సంఘటనా స్థలానికి లాక్కొచ్చి, కర్రలతో, రాడ్లతో కొట్టి, పోలీసుల కళ్లెదుటే చంపేశారు. ఈ జంట హత్యల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులకు, ఆగ్రహించిన గుంపుకు మధ్య ఘర్షణ జరిగింది. సంఘటనా స్థలం చుట్టూ ప్రజలు గుమిగూడటం ప్రారంభించడంతో, అదనపు పోలీసు బలగాలు మెహరించాయి. ఈ రెండు ఘటనల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ, పోలీసులు ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే!
వీడియోలు
జనసేన జయప్రకాష్పై కేసు నమోదు
అగ్రరాజ్యానికి ఇరాన్ గట్టి సవాల్ ఇరాన్ వ్యూహం ఏంటీ..?
గులాబీ దళపతి కేసీఆర్తో భేటీ
జగన్పై షర్మిల వ్యాఖ్యలు, రాచమల్లు అదిరిపోయే కౌంటర్
వరంగల్ లో మందుబాబుల వీరంగం
డెకాయిట్ మూవీ ఫస్ట్ రివ్యూ
ఒకప్పుడు నా మిత్రుడు.. నాపై చేసిన కామెంట్స్ మాత్రం.. రఘురామా వ్యాఖ్యలపై జడ రియాక్షన్
సెలూన్ షాప్ కు 70 లక్షల GST.. కంగుతిన్న సెలూన్ షాప్ ఓనర్
గల్ఫ్ దేశాలను చీకట్లోకి నెడుతున్న ఇరాన్
12 ఆగస్టు 2026 ఆకాశంలో పగలంతా చీకటి


