పసిడి తగ్గేదేలే..
న్యూఢిల్లీ: ఆయిల్ రేట్లు అంతర్జాతీయంగా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ బులియన్పై పెట్టుబడులకు సంబంధించి ట్రేడర్ల నుంచి గణనీయంగా డిమాండ్ నెలకొనడంతో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వరుసగా ఆరో సెషన్లోనూ ర్యాలీ కొనసాగించి, మంగళవారం ఏకంగా రెండు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 1,57,200కి చేరింది. గత 6 ట్రేడింగ్ సెషన్లలో బంగారం రేటు రూ. 9,800 (సుమారు 6.65%) పెరిగింది. మరోవైపు, వెండి కూడా అదే ధోరణిలో కేజీకి ఇంకో రూ. 2,000 పెరిగి రూ. 2,42,000కి చేరింది. ఇది కూడా దాదాపు 2 నెలల గరిష్ట స్థాయి.
జంగారెడ్డిగూడెంలో ఘోర బస్సు ప్రమాదం.. 30 మంది ప్రయాణికులు..
సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం పుట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో, హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.వివరాల ప్రకారం.. పుట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవేపై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండటంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్న గాయపడిన వారిని ఆసుపత్రి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
సీఎం తమ్ముడి కంపెనీకి రూ. 200 కోట్ల భూమి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డికి చెందిన టెస్సరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీకి సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే కేటాయించడంపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక్క ఉద్యోగి కూడా లేని, కేవలం రూ.లక్ష పెయిడ్ అప్ మూలధనం ఉన్న కంపెనీకి ఇంత విలువైన భూమిని ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం రాష్ట్రంలోని అతిపెద్ద భూకేటాయింపు అక్రమాల్లో ఒకటిగా అనుమానిస్తున్నామని చెప్పారు. గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే లోకాయుక్త, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క ఉద్యోగి లేని సంస్థకు ఐదెకరాలా?‘టెస్సరాక్ట్ చైర్మన్ తానేనంటూ సీఎం సోదరుడు కొండల్రెడ్డి తన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పేర్కొన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో తమ సంస్థ పనిచేస్తున్నట్టు పేర్కొంటూ కొండల్రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా కాన్సుల్ జనరల్ కూడా పాల్గొన్నారు. టెస్సరాక్ట్ చైర్మన్ హోదాలోనే యూఎస్ భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఎగ్జిక్యూటివ్ బోర్డులో కొండల్రెడ్డి చేరినట్టు ఆ సంస్థ ప్రకటించింది. టెస్సరాక్ట్ కంపెనీ వెబ్సైట్లో ఫోన్ నంబర్ 123456789గా పేర్కొంటూ, 2025 మార్చి 31 నాటికి ఉద్యోగుల సంఖ్య సున్నాగా పేర్కొన్నారు. పటాన్చెరులోని ఓ చిన్న ఫ్లాట్ను టెస్సరాక్ట్ చిరునామాగా చూపుతున్నారు. గజానికి సుమారు రూ.3,700 చొప్పున ఐదు ఎకరాల భూమిని ఫ్యూచర్ సిటీలో రూ.7 కోట్లకు కేటాయించింది. రూ.200 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు కేటాయించడం కుంభకోణం కాదా. టెస్సరాక్ట్కు, కొండల్రెడ్డికి సంబంధం లేదని మంత్రి శ్రీధర్బాబు చెప్పడం విడ్డూరం. అమెరికాలో ఉన్న సీఎం మరో సోదరుడు జగదీశ్రెడ్డికి చెందిన స్వచ్ఛ్ బయో సంస్థతో సుమారు రూ.1,000 కోట్ల ఎంఓయూను అమెరికా పర్యటన సందర్భంగా రేవంత్ కుదుర్చుకున్నాడు. మంత్రి శ్రీధర్బాబు శాఖలోనే ఈ నిర్ణయాలు జరిగితే ఆయనకు సమాచారం లేదా. టెస్సరాక్ట్కు భూ కేటాయింపు వ్యవహారంపై చివరి వరకు పోరాడతాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తే జల ఉద్యమం‘కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఏపీ కోరుతోంది. ఇదే విషయాన్ని ఈ నెల 18న జరిగే గోదావరినది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ఎజెండాలో చేర్చడం సరికాదు. ఎజెండాలో ఈ అంశాలను తొలగించకుంటే తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశాన్ని బహిష్కరించాలి. లేదంటే జల ఉద్యమం చేపట్టి, అవసరమైతే జీఆర్ఎంబీ సమావేశం జరిగే జలసౌధను ముట్టడిస్తాం. సీఎం యాగాలు చేయడాన్ని మేము తప్పు పట్టడం లేదు. కానీ నీటిని ఒడిసి పట్టే పనులు చేయకుండా యాగాలు చేయడాన్నే మేము ప్రశ్నిస్తున్నాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారవృద్ధి
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: అమావాస్య రా.11.41 వరకు, తదుపరి శ్రావణ శుద్ధ పాడ్యమి, నక్షత్రం: పుష్యమి ఉ.9.00 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.9.09 నుండి 10.41 వరకు, దుర్ముహూర్తం: ప.11.39 నుండి 12.30 వరకు, అమృత ఘడియలు: లేవు, గురుమూఢమి సమాప్తం.సూర్యోదయం : 5.45సూర్యాస్తమయం : 6.25రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం.... వ్యవహారాలలో అవరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.వృషభం.. కీలక సమాచారం.. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.మిథునం.... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.కర్కాటకం.... నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.సింహం.... ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.కన్య... నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.తుల..... పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. మిత్రులు, బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.వృశ్చికం.... ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.ధనుస్సు...... కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మకరం.... సోదరులతో సఖ్యత. కార్యజయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.కుంభం. దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆలయ దర్శనాలు. ఆస్తిలాభం. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.మీనం..... రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
టాక్సిక్లో టాప్ ఛైర్ ఆమెదే...
డేర్ డేవిల్లో వెంకటేశ్?
Telangana: రాష్ట్రంలో 2,64,87,214 ఓటర్లు!
'పవర్' ఫ్యాక్టర్ షాక్
హైదరాబాద్ టు తిరుపతి రూ. 18,315!
దామోదర్ నాయుడుకే మళ్లీ చాన్స్
పేపర్ లీక్స్ వ్యవస్థాగత సమస్య
రెండో డ్రగ్స్ టెస్టులోనూ పైలట్కు పాజిటివ్
నీ పుత్ర ప్రేమ గుట్టు తెలిసింది ‘గోవింద’
జాబిల్లిపై స్థావరం కడదాం రండి
హెరిటేజ్ - విజయ డెయిరీ
వరుస యుద్ధాలతో అడుగంటిన ఆయుధ సామగ్రి
కారు ప్రమాదంలో ఏఆర్ రెహమాన్ కొడుకు
'ఈ వయసులో సిగ్గుచేటు'.. ఉదయనిధికి త్రిష స్ట్రాంగ్ కౌంటర్
నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా'
‘నీట్’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు
79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్?
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యవహారాలలో పురోగతి
కేంద్రానికి పసిడి పంట
కూరగాయల కొట్టు నుంచి అండర్వరల్డ్ సింహాసనం వరకు..
ఈ రాశి వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది.. స్థిరాస్తివృద్ధి
బీఎస్ఎన్ఎల్ సరికొత్త ధమాకా ప్లాన్!
'శివ కోసం ఎడ్లబండిపై వచ్చా.. ఇప్పుడు శివ ఎదురుగా ఉన్నా'
ఏలియన్స్ రాక.. పుతిన్ పతనం.. మూడో ప్రపంచ యుద్ధం
సిరాజ్ సిక్సర్ల జోరు
'ఇంద్రపుత్ర'గా అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం
బంగారం ధరల్లో మార్పు.. ఎట్టకేలకు గుడ్న్యూస్
ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మెడికో ప్రియాంక కేసు.. అసలు మాల్లో ఏం జరిగింది?
మొజ్తాబా ఖమేనీ ఎక్కడ?.. ఇరాన్ సంచలన ప్రకటన
టాక్సిక్లో టాప్ ఛైర్ ఆమెదే...
డేర్ డేవిల్లో వెంకటేశ్?
Telangana: రాష్ట్రంలో 2,64,87,214 ఓటర్లు!
'పవర్' ఫ్యాక్టర్ షాక్
హైదరాబాద్ టు తిరుపతి రూ. 18,315!
దామోదర్ నాయుడుకే మళ్లీ చాన్స్
పేపర్ లీక్స్ వ్యవస్థాగత సమస్య
రెండో డ్రగ్స్ టెస్టులోనూ పైలట్కు పాజిటివ్
నీ పుత్ర ప్రేమ గుట్టు తెలిసింది ‘గోవింద’
జాబిల్లిపై స్థావరం కడదాం రండి
హెరిటేజ్ - విజయ డెయిరీ
వరుస యుద్ధాలతో అడుగంటిన ఆయుధ సామగ్రి
కారు ప్రమాదంలో ఏఆర్ రెహమాన్ కొడుకు
'ఈ వయసులో సిగ్గుచేటు'.. ఉదయనిధికి త్రిష స్ట్రాంగ్ కౌంటర్
నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా'
‘నీట్’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు
79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్?
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యవహారాలలో పురోగతి
కేంద్రానికి పసిడి పంట
కూరగాయల కొట్టు నుంచి అండర్వరల్డ్ సింహాసనం వరకు..
ఈ రాశి వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది.. స్థిరాస్తివృద్ధి
బీఎస్ఎన్ఎల్ సరికొత్త ధమాకా ప్లాన్!
'శివ కోసం ఎడ్లబండిపై వచ్చా.. ఇప్పుడు శివ ఎదురుగా ఉన్నా'
ఏలియన్స్ రాక.. పుతిన్ పతనం.. మూడో ప్రపంచ యుద్ధం
సిరాజ్ సిక్సర్ల జోరు
'ఇంద్రపుత్ర'గా అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం
బంగారం ధరల్లో మార్పు.. ఎట్టకేలకు గుడ్న్యూస్
ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మెడికో ప్రియాంక కేసు.. అసలు మాల్లో ఏం జరిగింది?
మొజ్తాబా ఖమేనీ ఎక్కడ?.. ఇరాన్ సంచలన ప్రకటన
ఫొటోలు
హైదరాబాద్లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)
‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్...(ఫొటోలు)
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)
ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)
ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)
కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)
‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
సినిమా
‘కొరియన్ కనకరాజు’పై చిరంజీవి ప్రశంసలు.. సత్య కోసం మరోసారి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.‘‘కొరియన్ కనకరాజు’ని ఇండియా నుంచి కొరియాకి వెళ్లిన తర్వాత చూస్తుంటే ఒక కొరియన్ మూవీ చూసినట్టు ఉంటుంది. ఇందుకు చాలా ఖర్చు అయి ఉంటుందనుకున్నాను. కానీ లిమిటెడ్ బడ్జెట్తోనే తెరకెక్కించారు మేర్లపాక గాంధీ. విజువల్స్ మీద, ఎడిటింగ్ సెన్స్ ఉండాలి డైరెక్టర్కి. కొరియా వెళ్లినా అంత ఖర్చు కాలేదంటే అది గాంధీ ప్లానింగ్... తన భయం, భక్తి. నిర్మాతలు బతకాలి... మనతో పాటు నిర్మాతలూ నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనుకోవాలి. అంతేకానీ నిర్మాతలను నలిపేసి సినిమా తీయకూడదు. తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయగలగాలి. ప్రతి ఒక్కరూ ఇది అమలు చేయాలి. ఇక 2026 సెకండ్ హాఫ్ ‘పెద్ది’ సినిమా హిట్తో మొదలైంది. ఆ తర్వాత ‘మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ’, ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’... ఇలా వరుసగా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ‘‘ఒక సినిమా విజయం సాధిస్తే ఎంతోమందిలో ఆనందాన్ని నింపుతుంది. అది మరోసారి ‘కొరియన్ కనకరాజు’తో పునరావృతమైంది’’ అని చెప్పారు. ముఖ్యంగా నటుడు సత్య కామెడీ తనను ఎంతగానో ఆకట్టుకుందని చిరంజీవి తెలిపారు. ఈ సినిమాకి “మేర్లపాక గాంధీ ఇంజనీర్ అయితే.. వరుణ్ ఐరన్ పిల్లర్, సత్య కాంక్రీట్ లాంటివాడని ఆయన ప్రశంసించారు. ఈ చిత్రంలో సత్య నటన నాకు చాలా నచ్చింది. అతని కోసం ఈ సినిమాను మరోసారి చూడాలనిపిస్తుందన్నారు.అలాగే హీరోయిన్ రితిక గ్లామర్, ఎనర్జీ, మురళీధర్ గౌడ్ సహజ నటనను ప్రశంసించారు. మంచి కంటెంట్, కొత్తదనం, హెల్దీ ఎంటర్టైన్మెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు తప్పకుండా వస్తారని చిరంజీవి పేర్కొన్నారు. ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ పట్ల వరుణ్ తేజ్, తమన్, మేర్లపాక గాంధీ, రితిక తదితరులు ఆనందం వ్యక్తం చేశారు.
'సంజయ్ రామస్వామిని మళ్లీ చూస్తారు': నాగవంశీ
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్కు సూర్యతో నిర్మాత నాగవంశీ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. సూర్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీతో సూర్యలో మరోసారి సంజయ్ రామస్వామిని గుర్తుకు తెస్తామని ప్రకటించారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నారు. మదర్ సెంటిమెంట్ ఈ మూవీలో మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమా చూశాక మీ మదర్ను పదిరెట్లు ఎక్కువగా ప్రేమిస్తారని అన్నారు. రాధిక క్యారెక్టర్ చూస్తే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూస్తారని అన్నారు. ఈ సినిమా త్రివిక్రమ్కు కూడా నచ్చిందని వెల్లడించారు. ఆయన మెచ్చుకున్న ఏ సినిమా నాది ఫెయిల్ అవ్వలేదని పేర్కొన్నారు.
చిరంజీవిని చూసి పొట్టిమామ ఎమోషనల్.. వీడియో వైరల్..!
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఈవెంట్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్కు హాజరైన చిరంజీవికి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ చిత్రంలో పొట్టి మామగా మెప్పించిన నటుడు మెగాస్టార్ కాళ్లపై పడబోయారు. ఇది గమనించిన చిరు అతన్ని వెంటనే దగ్గరికి తీసుకుని ఓదార్చారు. అతనితో ఫోటో దిగి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. చాలా రోజుల తర్వాత వరుణ్ తేజ్కు హిట్ పడడంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.A Fan Emotional moment ❤️@KChiruTweets #KoreanKanakaraju pic.twitter.com/tP2BZUHdRb— ⛩️GHANI BHAI 🗡️🐉 (@Ghanibhaipspk) August 11, 2026 Tears of pure joy! 🥺 Seeing Megastar @KChiruTweets live on stage became an emotional moment for one of the Korean Kanakaraju artists .... pic.twitter.com/nCSq5ypX0S— Let's X OTT GLOBAL (@LetsXOtt) August 11, 2026
'ఈ వయసులో సిగ్గుచేటు'.. ఉదయనిధికి త్రిష స్ట్రాంగ్ కౌంటర్
ప్రస్తుతం కోలీవుడ్లో త్రిష పేరే ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ సీఎం అయ్యాక ఆమె పేరు మార్మోగిపోయింది. ఇటీవల మరోసారి త్రిష పేరు తెరమీదకొచ్చింది. ఉదయనిధి స్టాలిన్.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో ఉదయనిధిని అరెస్ట్ చేయగా ఆయన బెయిల్పై విడుదలయ్యారు.ఈ వివాద జరిగిన దాదాపు వారం రోజులవుతోంది. తాజాగా ఈ కాంట్రవర్సీపై హీరోయిన్ త్రిష తనదైన శైలిలో కౌంటరిచ్చింది. నేరుగా ఉదయనిధి పేరు ప్రస్తావించకుండానే గట్టిగానే ఇచ్చిపడేసింది. ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. 'ఈ వయసులో డ్రామా చేయడం సిగ్గుచేటు. వెళ్లి కొంత డబ్బు సంపాదించు, మనశ్శాంతిని పొందు' అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. అయితే మరోవైపు ఈ పోస్ట్ విజయ్ భార్య సంగీతను ఉద్దేశించి పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే సంగీత విడాకుల కేసు వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే త్రిష ఆమెను ఉద్దేశించి పోస్ట్ చేశారని మరికొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఓకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. అటు ఉదయనిధికి.. ఇటు సంగీతకు కౌంటరిచ్చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అసలేం జరిగిందంటే..నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ "డబుల్ మీనింగ్" వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అరెస్ట్ చేసి ఆయనను విచారించిన తర్వాత పోలీసులు విడుదల చేశారు. తంజావూరుకు తీసుకెళ్లి గంటకుపైగా పోలీసులు విచారించారు. అంతకుముందు మద్రాస్ హైకోర్టు.. దర్యాప్తునకు అవసరమైనప్పుడు ఉదయనిధి స్టాలిన్ పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. విచారణ పూర్తైన వెంటనే ఆయనను విడుదల చేయాలని పోలీసులకు సూచించింది.
క్రీడలు
ఆసియా క్రీడల పతకమే లక్ష్యంగా...
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్లో త్రుటిలో పతకం కోల్పోయిన భారత స్కీట్ షూటర్ మహేశ్వరి చౌహాన్ ఆసియా క్రీడల్లో పతకం గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఆసియా గేమ్స్ జరగనుండగా... వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న మహేశ్వరి మెరుగైన ఫలితం సాధించాలని భావిస్తోంది. 2024 పారిస్ ఒలింపిక్స్ స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మహేశ్వరి–అనంత్జీత్ సింగ్ నరూకా జోడీ ఒక్క పాయింట్ తేడాతో కాంస్య పతకం కోల్పోయి నాలుగో స్థానానికి పరిమితమైంది. ఒలింపిక్స్లో స్కీట్ విభాగంలో ఫైనల్కు చేరిన తొలి భారత జంటగా వీరు రికార్డు సృష్టించారు. ప్రస్తుతం మహేశ్వరి ఢిల్లీలోని కర్ణీ సింగ్ షూటింగ్ రేంజ్లో ఆసియా క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ... ‘పారిస్ ఒలింపిక్స్ ఫలితం నుంచి ఎంతో నేర్చుకున్నా. అలాంటి పొరబాట్లు పునరావృత్తం కాకుండా మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా సాధన సాగిస్తున్నా. ఇవే నాకు తొలి ఆసియా క్రీడలు. ప్రస్తుతానికి దీన్ని ఆస్వాదిస్తున్నా. టోర్నమెంట్ ఏదైనా సన్నద్ధతలో ఎలాంటి మార్పు ఉండదు. 2024 పారిస్ క్రీడల అనుభవం అంత త్వరగా మరచిపోలేనిది. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కోసం ప్రయత్నిస్తా’ అని పేర్కొంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణలో ఆరుగురు స్కీట్, ఆరుగురు ట్రాప్ షూటర్లు పాల్గొంటున్నారు. ఈ నెల 18 వరకు కొనసాగనున్న ఈ శిక్షణకు సాయ్ నిధులు కేటాయిస్తోంది.శిక్షణలో ఉన్న షూటర్లు స్కీట్: అనంత్జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధాలివాల్, భవతేజ్ సింగ్ గిల్, మేరాజ్ అహ్మద్ ఖాన్, రైజా ఢిల్లాన్, మహేశ్వరి చౌహాన్. ట్రాప్: కైనన్ షెనాయ్, నీరు ధండా, అహవర్ రిజ్వీ, మనీషా కీర్, శపథ్ భరద్వాజ్, ఆశిమా అహ్లావత్.
రెజ్లర్ సుశీల్కు బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ: హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్న ఆందోళనల దృష్ట్యా జస్టిస్ పురుషైంద్ర కుమార్... సుశీల్ బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పతకం... 2012 లండన్ ఒలింపిక్స్లో రజతం నెగ్గిన సుశీల్ కుమార్ను 2021లో యువ రెజ్లర్ సాగర్ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్రశాల్ స్టేడియం హత్య కేసులో ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. సుశీల్ కుమార్ నుంచి తుపాకీ స్వాదీనం చేసుకోవడం, వీడియో ఆధారాలు ఉండటం ఆరోపణలను బలపరుస్తున్నాయని తెలిపింది. సుశీల్ కుమార్కు సమాజంలో ఉన్న పలుకుబడితో గతంలో అతడికి బెయిల్ లభించిన ప్రతిసారీ సాక్షులను ప్రభావితం చేశారని సుప్రీంకోర్టు కూడా గుర్తించినట్లు హైకోర్టు పేర్కొంది. కేసు ఏంటంటే... భూ వివాదాల నేపథ్యంలో జూనియర్ నేషనల్ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ ధన్కర్ను 2021లో సుశీల్ కుమార్ తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు. అనంతరం అతడిని ఛత్రశాల్ స్టేడియంకు తీసుకువచ్చి బేస్బాల్ బ్యాట్లు, హాకీ స్టిక్స్తో దారుణంగా కొట్టారు. దీంతో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఘటన అనంతరం కొన్ని రోజులు పరారీలో ఉన్న సుశీల్ కుమార్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది బెయిల్ మీద బయటకు వచ్చిన సుశీల్ కుమార్ సాక్షులను ప్రభావితం చేసి విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించిన సుప్రీంకోర్టు బెయిల్ను రద్దుచేసింది.
టీమిండియాతో సిరీస్ ఖరారు.. భారత్లో వారి ఆతిథ్యం!
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) టీమిండియాతో టీ20 సిరీస్ను ఖరారు చేసింది. ఇందులో భాగంగా భారత జట్టుతో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. అయితే, అఫ్గాన్ భారత్లోనే టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం.కాగా అఫ్గానిస్తాన్లో మ్యాచ్లు నిర్వహించే పరిస్థితి లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ భారత్ లేదంటే యూఏఈలలో పలు సిరీస్లకు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా టీమిండియాతో భారత్లో తలపడేందుకు సిద్ధమైంది.షెడ్యూల్ ఖరారుఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా టీమిండియా- అఫ్గానిస్తాన్ మధ్య సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మూడు మ్యాచ్లు నిర్వహిస్తారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. గతంలో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లకు అఫ్గానిస్తాన్ భారత్లో ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2017లో ఐర్లాండ్తో వైట్బాల్ సిరీస్ ఆడిన అఫ్గాన్ జట్టు.. 2017లో విండీస్తో ఆల్ ఫార్మాట్ సిరీస్ ఆడింది.టెస్టు, వన్డేలలో ఓటమిఇక ఇటీవల అఫ్గానిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో జూన్లో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత్.. అఫ్గాన్ను ఏకంగా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది.ఇక మూడు వన్డేల సిరీస్లోనూ ఆతిథ్య భారత జట్టు.. అఫ్గాన్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. తాజాగా మరోసారి అఫ్గాన్ టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈసారి భారత్లో ఆతిథ్య దేశంగా అఫ్గాన్.. శ్రేయస్ అయ్యర్ సేనతో టీ20 సిరీస్ ఆడుతుంది.పరాభవాల తర్వాత గెలుపు బాట పట్టిన భారత టీ20 జట్టుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో భారత్ను చాంపియన్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించిన బీసీసీఐ.. శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించింది. అయితే, యూకే టూర్లో భాగంగా అతడికి ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్లో భారత్ 2-0తో వైట్వాష్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలోనూ 4-0తో క్లీన్స్వీప్నకు గురై ఘోర పరాభవం ఎదుర్కొంది. అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లి.. ఆతిథ్య జట్టును 3-0తో వైట్వాష్ చేసి తిరిగి విజయాల బాట పట్టింది.శ్రీలంక పర్యటనలోఇక టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో గిల్ సేన రెండు మ్యాచ్లు ఆడుతుంది. ఇరుజట్ల మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు.. ఆగష్టు 23న రెండో టెస్టు మొదలుకానున్నాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. చదవండి: T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్గా SRH మాజీ ప్లేయర్
అతడు లేకపోవడం టీమిండియాకు లోటు: శ్రీలంక మాజీ స్టార్
శ్రీలంక- టీమిండియా మధ్య టెస్టు సిరీస్కు రంగం సిద్ధమైంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక. కాగా భారత జట్టు శ్రీలంక గడ్డపై 2017 తర్వాత టెస్టు సిరీస్ ఆడటం ఇదే మొదటిసారి.ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ ఆల్రౌండర్ ఫర్వేజ్ మహరూఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ లేనిలోటు టీమిండియాకు తప్పక కనిపిస్తుందన్నాడు. IANSతో మాట్లాడుతూ..అశూ లేకపోవడం అతిపెద్ద లోటు‘‘ఈసారి టీమిండియా అశ్విన్ను బాగా మిస్సవుతుంది. శ్రీలంక గడ్డ మీద అతడు గతంలో అద్భుతంగా రాణించాడు. ఇక్కడి టర్నింగ్ పిచ్లు అతడికి స్వర్గధామం. శ్రీలంక పిచ్ పరిస్థితులకు అశూ సరైన బౌలర్’’ అని ఫర్వేజ్ మహరూఫ్ పేర్కొన్నాడు.కాగా 2015, 2017లో శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్లలో టీమిండియా గెలుపులో అశ్విన్దే కీలక పాత్ర. ఆరు మ్యాచ్లలో కలిపి అతడు 38 వికెట్లు కూల్చాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అంతేకాదు బ్యాట్తోనూ అశూ దుమ్ములేపాడు. రెండు అర్థ శతకాలతో సత్తా చాటాడు.అదరగొడుతున్న సుతార్ ఇదిలా ఉంటే.. శ్రీలంక పర్యటనకు వెళ్లిన తాజా భారత జట్టులో ప్రస్తుతం నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లతో పాటు యువ స్పిన్నర్ మానవ్ సుతార్, వెటరన్ ఆటగాడు సారాంశ్ జైన్ కూడా ఉన్నారు. మానవ్ ఇప్పటికే అరంగేట్రం చేయగా.. సారాంశ్ టీమిండియాకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.నాకు అవకాశం ఉంటే గనుక..ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి కూడా ఫర్వేజ్ మహరూఫ్ స్పందించాడు. ‘‘కొన్ని నెలల క్రితం అఫ్గానిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే రాణించాడు. ఇటీవల శ్రీలంక ఎలెవన్ జట్టుతో వార్మప్ మ్యాచ్లోనూ బంతి, బ్యాట్తో సత్తా చాటాడు.అయితే, తుదిజట్టులో రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్కు కూడా చోటిస్తారా? అనేదే ప్రస్తుత ప్రశ్న. కుల్దీప్ యాదవ్ ఎలాగో తుదిజట్టులో ఉంటాడు. ఇక సారాంశ్ జైన్ ఇంకా అరంగేట్రం చేయలేదు. అయితే, అతడు డీసెంట్ బౌలర్. నాకే గనుక అవకాశం ఉంటే.. గాలె టెస్టుకు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్లను ఎంపిక చేస్తాను’’ అని ఫర్వేజ్ మహరూఫ్ చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంకతో సిరీస్ టీమిండియాకు అత్యంత ముఖ్యమైనది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో ఫైనల్ రేసులో ఉండాలంటే లంకను భారత్ 2-0తో వైట్వాష్ చేయాల్సిందే.చదవండి: T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్గా SRH మాజీ ప్లేయర్
న్యూస్ పాడ్కాస్ట్
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్య
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
చంద్రబాబు పాలన రైతులకు హానికరం... చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ... వైఎస్ జగన్ ఆగ్రహం
అసత్య ప్రచారంలో ఆరితేరిన ఏపీ సీఎం చంద్రబాబు... రెండు మినహా హామీలన్నీ అమలు చేశానంటూ బుకాయింపు...
బీసీ నేతలపై రెడ్బుక్!. బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అక్రమ అరెస్టులు
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
బిజినెస్
మాన్యువల్ కార్లకు ఎందుకింత డిమాండ్?
టెక్నాలజీ ఎంత వేగంగా మారుతున్నా.. కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నా.. భారతీయ డ్రైవర్లకు ఇప్పటికీ ‘మాన్యువల్’ గేర్బాక్స్లపై నమ్మకం కొనసాగుతోంది. సెకండ్ హ్యాండ్ (యూజ్డ్) కార్ల మార్కెట్లో క్లచ్ పెడల్తో నడిచే వాహనాలదే ఆధిపత్యం కొనసాగుతోంది. ‘గేర్స్ ఆఫ్ గ్రోత్–2025’ నివేదిక ప్రకారం.. 2025లో విక్రయమైన యూజ్డ్ కార్లలో 72 శాతం మాన్యువల్ గేర్బాక్స్ వాహనాలే ఉన్నాయి. అయితే, ఆటోమేటిక్ కార్ల వాటా 28 శాతంగా ఉంది. అంటే ఆటోమేటిక్ కంటే మాన్యువల్ కార్లను ఎంచుకునే వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. వయసు, లింగం, ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. మాన్యువల్ కార్ల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, ఆటోమేటిక్ వాహనాల వైపు ఆసక్తి క్రమంగా పెరుగుతోందని నివేదిక వెల్లడించింది.యువతలో 'ఆటోమేటిక్'పై ఆసక్తియువ కొనుగోలుదారులు, ముఖ్యంగా 35 ఏళ్లలోపు వారు మార్కెట్ సగటుతో పోలిస్తే ఆటోమేటిక్ కార్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ, డ్రైవింగ్లో సౌలభ్యం, మారుతున్న జీవనశైలి కారణంగా కొత్త తరం కొనుగోలుదారులు ఆటోమేటిక్ వాహనాల వైపు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో రోజువారీ ప్రయాణాల్లో క్లచ్ వినియోగం తగ్గించడం ఆటోమేటిక్ కార్లకు అనుకూలంగా మారుతోంది.భవిష్యత్తులో యువత ఆదాయ స్థాయి పెరిగే కొద్దీ ఆటోమేటిక్ కార్ల మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉంది. అయితే 45 ఏళ్లు పైబడిన కొనుగోలుదారులు మాత్రం మాన్యువల్ కార్లపైనే ఎక్కువ విశ్వాసం చూపుతున్నారు. తక్కువ నిర్వహణ వ్యయం, సులభమైన మరమ్మతులు, ఎక్కువ రీసేల్ అవకాశాలు ఇందుకు కారణాలుగా నివేదిక పేర్కొంది.ఏది కొనాలి?మాన్యువల్ లేదా ఆటోమేటిక్.. ఏది సరైన ఎంపిక అనేది కొనుగోలుదారుల వినియోగ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా నగరాల్లో, ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణించే వారికి ఆటోమేటిక్ కార్లు సౌకర్యవంతమైన ఎంపికగా నిలుస్తాయి. పదేపదే క్లచ్ నొక్కాల్సిన అవసరం లేకపోవడం, డ్రైవింగ్ సులభంగా ఉండటం వీటి ప్రధాన ప్రయోజనాలు. మరోవైపు ఎక్కువ దూరాలు ప్రయాణించే వారు, చిన్న పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించే వారు, తక్కువ నిర్వహణ వ్యయాన్ని కోరుకునే వారికి మాన్యువల్ కార్లు ఇప్పటికీ మెరుగైన ఎంపికగా ఉన్నాయి.అయితే.. సెకండ్ హ్యాండ్ ఆటోమేటిక్ కారు కొనుగోలు చేసే వారు గేర్బాక్స్ పనితీరు, సర్వీస్ రికార్డు, తనిఖీ నివేదికలు, వారంటీ అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో సమస్యలు వస్తే మరమ్మతు వ్యయం మాన్యువల్ కార్లతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది.మాన్యువల్ కార్లకు ఎందుకు డిమాండ్?సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో మాన్యువల్ కార్ల ఆధిపత్యానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. ఇందులో తొలి కారణం ధర. మాన్యువల్ కార్ల కొనుగోలు ధరతో పాటు నిర్వహణ ఖర్చు (సర్వీసింగ్ వ్యయం) కూడా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ‘విలువ’కు ప్రాధాన్యం ఇచ్చే కొనుగోలుదారులు వీటిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. రెండోది అలవాటైన డ్రైవింగ్. దేశంలో ఎక్కువ మంది డ్రైవింగ్ను మాన్యువల్ కార్లతోనే ప్రారంభించారు.కాబట్టి సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేసేవారు తమకు పరిచయమైన గేర్ వ్యవస్థనే ఎంచుకుంటున్నారు. మూడోది ఉత్తమ రీసేల్ విలువ. మాన్యువల్ కార్లకు దేశవ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉంటారు కాబట్టి సులభంగా విక్రయించవచ్చు. మరోవైపు మాన్యువల్ గేర్బాక్స్తో పోలిస్తే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను పరిశీలించడం కష్టంగా ఉంటుంది. టార్క్ కన్వర్టర్, ఏఎంటీ, సీవీటీ, డ్యూయల్ క్లచ్ వంటి ఆటోమేటిక్ వ్యవస్థల్లో సమస్యలు వస్తే మరమ్మతు ఖర్చు ఎక్కువగా ఉంటుంది.నగరాల్లో ఆటోమేటిక్స్.. పట్టణాల్లో మాన్యువల్స్ప్రాంతాల వారీగా పరిశీలిస్తే మెట్రో నగరాల్లో ఆటోమేటిక్ కార్ల వాటా ఎక్కువగా ఉంది. అధిక ట్రాఫిక్, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నగర వినియోగదారులు ఆటోమేటిక్ మోడళ్లను ఎంచుకుంటున్నారు. మెట్రో మార్కెట్లలో మారుతీ బాలెనో, హోండా సిటీ మోడళ్ల ఆటోమేటిక్ వేరియంట్లకు డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు నాన్-మెట్రో మార్కెట్లలో తక్కువ ధర, తక్కువ నిర్వహణ వ్యయం కలిగిన మోడళ్లకు డిమాండ్ కొనసాగుతోంది. మారుతీ స్విఫ్ట్ డిజైర్, వ్యాగన్ఆర్, ఆల్టో, గ్రాండ్ ఐ10 వంటి కార్లు ఈ మార్కెట్లలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
హైదరాబాద్లో ట్రంప్ టవర్స్!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు ఈ మార్కెట్లోకి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. ట్రైబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ కలిసి కోకాపేటలో 'ట్రంప్ టవర్స్ హైదరాబాద్' పేరుతో ఈ ప్రాజెక్ట్ను నిర్మించబోతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.గోల్డెన్ మైల్ రోడ్డులో 4 ఎకరాల్లో ట్రంప్ టవర్స్ హైదరాబాద్ ప్రాజెక్ట్ రానుంది. అక్టోబర్లో దీన్ని అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ఎరిక్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉంది.ఈ ప్రాజెక్ట్లో రెండు భారీ టవర్లు ఉండనున్నాయి. ఒక్కో టవర్ 65 అంతస్తుల ఎత్తులో, దాదాపు 800 అడుగుల ఎత్తు వరకు నిర్మించనున్నారు. ఈ రెండు టవర్లను 28వ అంతస్తులో ఒక స్కై బ్రిడ్జ్తో కలుపుతారు. ఆ బ్రిడ్జ్పైనే ప్రత్యేకంగా ట్రంప్ క్లబ్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 450కి పైగా ఇళ్లు ఉండబోతున్నాయి. 3.5 బీహెచ్కే, 4 బీహెచ్కే ఇళ్లతో పాటు పెంట్హౌస్లు కూడా ఉంటాయి.ధరలు ఇలా..ఇళ్ల ధరలు సుమారు రూ.5 కోట్ల నుంచి ప్రారంభమై, పెంట్హౌస్ ధర ఏకంగా రూ.18 కోట్ల వరకు ఉండనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు రూ.1,800 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే.. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రూ.3,500 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ట్రైబెకా డెవలపర్స్ అంచనా వేస్తోంది.పెంట్హౌస్లకు ఇప్పటికే మంచి డిమాండ్ ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే.. మొత్తం ఎనిమిది పెంట్హౌస్లు ఉండగా, ఒక కుటుంబం ఏకంగా రెండు పూర్తి ఫ్లోర్లను కొనుగోలు చేయడంతో నాలుగు పెంట్హౌస్లు అందులోనే వెళ్లిపోయాయని కంపెనీ తెలిపింది. ఆ తర్వాత మరో నాలుగు పెంట్హౌస్లను కూడా ఏర్పాటు చేశామని, అవి కూడా అమ్ముడయ్యాయని ట్రైబెకా డెవలపర్స్ ఫౌండర్ కల్పేష్ మెహతా పేర్కొన్నారు.
కేంద్రం కీలక నిర్ణయం.. EV కొనేవారికి గుడ్న్యూస్!
దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ డ్రైవ్ (PM E-Drive) పథకం కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు ఇచ్చే సబ్సిడీని 2028 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించింది.నిజానికి ఈ సబ్సిడీ గడువు 2026 ఆర్థిక సంవత్సరంతో ముగియాల్సి ఉండగా, మరో రెండేళ్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించనుంది.పెరిగిన బడ్జెట్ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే?.. ఎలక్ట్రిక్ టూ-వీలర్ల కోసం కేటాయించిన బడ్జెట్ను కూడా ప్రభుత్వం పెంచింది. ఇదివరకు దీనికోసం రూ.1,772 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. ఇప్పుడు దీనిని రూ.2,767 కోట్లకు పెంచింది. అంతే కాకుండా.. సబ్సిడీ పొందే వాహనాల సంఖ్యను 24 లక్షల నుంచి 45.7 లక్షలకు పెంచారు.ఎలక్ట్రిక్ టూ-వీలర్కు బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలోవాట్కు రూ. 2,500 సబ్సిడీ లభిస్తుంది. గరిష్ఠంగా రూ.5,000 వరకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. ఈ సబ్సిడీని క్లెయిమ్ చేసుకునే చివరి తేదీ 2027 డిసెంబర్ 31గా నిర్ణయించారు.పెరుగుతున్న ఈవీ సేల్స్దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. 2021-22లో సుమారు 2.53 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడవగా, 2025-26 నాటికి ఈ సంఖ్య 14.6 లక్షలకు చేరింది. మరోవైపు పెట్రోల్ టూ-వీలర్ల అమ్మకాలు కొంత తగ్గాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం వల్ల పెట్రోల్ ఖర్చు తగ్గడంతో పాటు, దేశం ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా టూ-వీలర్లు దేశంలో పెద్ద మొత్తంలో పెట్రోల్ వినియోగిస్తున్నందున, ఈ మార్పు ప్రభావం గణనీయంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం వల్ల కాలుష్యాన్ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు. మరోవైపు సబ్సిడీని 2028 వరకు కొనసాగించడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలకు కూడా భవిష్యత్తుపై మరింత స్పష్టత వస్తుంది. దీంతో కంపెనీలు పెట్టుబడులు పెంచి ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం ఉంది. మొత్తం మీద.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులతో పాటు దేశంలో ఈవీ మార్కెట్కు కూడా ఊతమిచ్చే అవకాశం ఉంది.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 388.19 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 78,154.25 వద్ద.. నిఫ్టీ 112.10 పాయింట్లు లేదా 0.46 శాతం నష్టంతో 24,471.70 వద్ద నిలిచాయి.చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. బలరాంపూర్ చిని మిల్స్ లిమిటెడ్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్, లాయిడ్స్ మెటల్స్ & ఎనర్జీ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ
కాంక్రీట్ మిల్లర్తో విత్తన గుళికల తయారీ!
ప్రకృతి వ్యవసాయంలో విత్తన గుళికల (సీడ్ పెల్లెట్ల) తయారీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే, సాధారణంగా గోనె సంచిని ఉపయోగించి ముగ్గురు వ్యక్తులు ఎటువంటి యంత్రం వాడకుండా విత్తన గుళికలు తయారు చేస్తుంటారు. ఈ పద్ధతిలో సమయం, శ్రమ ఎక్కువగా ఖర్చవుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా భవన నిర్మాణ పనుల్లో ఉపయోగించే కాంక్రీట్ మిల్లర్ (స్లాబ్ మిక్సర్) ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విత్తన గుళికలను తయారుచేసే విధానాన్ని తూర్పు గోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రాజెక్ట్ మేనేజర్ బొర్రా తాతారావు కొత్తగా ఆలోచించి ప్రారంభించారు.50–60 కిలోలుకాంక్రీట్ మిల్లర్ బక్కెట్లో ఒకేసారి సుమారు 50 నుంచి 60 కేజీల విత్తనాలను విత్తన గుళికలు తయారు చేసుకోవచ్చు. ముందుగా బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాలను ఇందుకు ఉపయోగించాలి. మిల్లర్ తిరుగుతున్నప్పుడు క్రమంగా మట్టి పొడిని విత్తనంపై చల్లుతూ ఉండాలి. మట్టి పొడి విత్తనాల చుట్టూ సరిగ్గా అంటుకోవడానికి తడి అవసరం. బ్యాటరీ స్ప్రేయర్తో నీటిని తగుమాత్రంగా స్ప్రే చేయాలి. ఆ తర్వాత ఘనజీవామృతం పొడిని చల్లాలి. గుళికలు తయారయ్యాక, చివరగా బూడిద లేదా బొగ్గు పొడిని చల్లితే చాలు.. విత్తన గుళికలు సిద్ధమైనట్లే. అరగంటలో విత్తన గుళికలు సిద్ధమవుతాయి.వెద వరి, పత్తి, మినుము, కందులు వంటి ఏకపంట విత్తనాలకే కాక, ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) పద్ధతిలో వాడే 30 రకాల విత్తనాలతో గుళికల తయారీకి కూడా ఈ యంత్రం బాగా ఉపయోగపడుతుందని తాతారావు తెలిపారు. చాలా ఎకరాల్లో విత్తన గుళికలు చల్లుకునే రైతాంగానికి కాంక్రీట్ మిల్లర్ విధానం ఎంతో సమయాన్ని, ఖర్చును ఆదా చేసే ఉత్తమ పద్ధతని తాతారావు తెలిపారు. కిలోకు ఖర్చు రూ.7–8 మాత్రమేకాంక్రీట్ మిల్లర్ ద్వారా కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మనుషులతో రోజుకు (7–8 గంటల్లో) సుమారు 1 టన్ను నుంచి 1.2 టన్నుల (1200 కేజీల) విత్తన గుళికలు తయారు చేసుకోవచ్చు. మెషిన్ అద్దె, డీజిల్, కూలీలు, బంక మట్టి పొడి, ఘనజీవామృతం.. తదితర ఖర్చులన్నింటినీ కలిపితే కేజీ తయారీకి సుమారు రూ. 7 నుంచి 8 మాత్రమే ఖర్చవుతుంది. కిలో విత్తనంతో కిలోన్నర గుళికలుఒక కిలో విత్తనాలను విత్తన గుళికలుగా తయారు చెయ్యటానికి అవసరమయ్యే పదార్థాలు, ఏయే మోతాదుల్లో కావాలంటే.. 1 కేజీ (మినుము, కందులు లేదా ఏవైనా ఇతర పంటల విత్తనాల) గుళికల తయారీకి ముందు విత్తనాన్ని తేమ చేసి శుద్ధి చేయటానికి 50–100 మి.లీ. బీజామృతం, సుమారు 250–300 గ్రాముల పుట్టమట్టి/మట్టి పొడి, 250–300 గ్రాముల ఘనజీవామృతం పొడి, 100–150 గ్రాముల బూడిద లేదా బొగ్గు పొడితో పాటు స్ప్రేయర్ ద్వారా చిలకరించడానికి కొద్దిగా నీరు అవసరం అవుతాయి. 1 కేజీ విత్తనాలతో తయారు చేసిన విత్తన గుళికల బరువు 1.5 కిలోల నుంచి 1.7 కేజీల వరకు ఉంటుంది. విత్తన గుళికలను విత్తిన తర్వాత వర్షం ఆలస్యమైనా విత్తనం వృథా కాదు. తేమ ఎక్కువ రోజులు ఉంటుుంది. నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకొని మొక్క దృఢంగా పెరుగుతుంది.ఏ పంటల కోసమైనా విత్తన గుళికలు చెయ్యొచ్చుకాంక్రీట్ మిల్లర్తో విత్తన గుళికలు తయారు చేసుకోవటం చాలా సులభం. గోనె సంచులతో విత్తన గుళికలు చేసుకోవటం పెద్ద రైతులకు ఇబ్బందికరంగా ఉండటంతో తూర్పుగోదావరి జిల్లాలో కాంక్రీట్ మిల్లర్తో తయారు చెయ్యటం గత ఏడాదే మొదలుపెట్టాం. మొలక శాతం చాలా బాగుంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 900 ఎకరాల్లో పీఎండీఎస్ పచ్చిరొట్ట పంటలు సాగు చేశాం. ఆ గడ్డిని కోసిన తర్వాత ఊడ్పులు కూడా పూర్తయ్యాయి. ఎల్నినో నేపథ్యంలో ప్రధాన పంట విత్తనాలను ఇప్పుడు కూడా కాంక్రీట్ మిల్లర్తో విత్తన గుళికలు తయారు చేస్తున్నాం. వెద వరి/ నారుమళ్లు పోసే వరి విత్తనాలు, కంది, మినుము, సజ్జతో పాటు కొర్ర వంటి అన్ని రకాల పంటల విత్తనాలను కూడా దీనితో చేస్తున్నాం. మొలక శాతం కూడా బాగుంది. ఈ పద్ధతి రైతులకు చాలా ఉపయోగంగా ఉంది.– బొర్రా తాతారావు (94404 97033), జిల్లా ప్రాజెక్టు మేనేజర్, తూ.గో. జిల్లానిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్
నిరాశకు చెక్ పెట్టి...
పదే పదే పరాజయమే పలకరిస్తూ ఉండడంతో నిరాశలోకి జారిపోయి.. ‘ఇక ఆడింది చాలు’ అని చెస్కు టాటా చెప్పేద్దాం అనుకుంటున్న సమయంలో... తల్లిదండ్రులు, కోచ్ మాటల వెలుగు ఆమె మదికి చేరింది. ‘ఈసారి ఓడిపోయినా, వచ్చేసారి కచ్చితంగా గెలుస్తాను’ అనే క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లి ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది గుంటూరుకు చెందిన నిహారిక చల్లా. తాజా విషయానికి వస్తే... ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (మహిళా అంతర్జాతీయ మాస్టర్) హోదా సాధించి తన ప్రత్యేకతను చాటుకుంది. స్పెయిన్లోని పోంటెవెడ్రా మాస్టర్స్ ఓపెన్ టోర్నమెంట్లో మూడవ నార్మ్తో ఈ ఘనత సాధించింది నిహారిక.కొన్ని సంవత్సరాల క్రితం...తండ్రి రమేష్తో సరదాగా చెస్ ఆడడం మొదలుపెట్టింది నిహారిక. ఈ క్రమంలో కూతురిలోని ప్రతిభను గుర్తించిన తండ్రి గుంటూరులోని ‘రవీంద్ర రాజు అకాడమీ ఆఫ్ చెస్ ఎడ్యుకేషన్’లో చేర్పించారు. కోచ్ రవీంద్ర రాజు శిక్షణలో తన ఆట తీరును మరింతగా మెరుగు పరుచుకోవడం మొదలుపెట్టింది నిహారిక. నిహారిక పట్టుదల, ఆటలో చురుకుదనం గమనించిన కోచ్ ప్రతి రోజూ ఆరు నుంచి ఏడు గంటలు సాధన చేయించే వారు. ఒకవైపు ఎంబిఏ చదువు, మరోవైపు చదరంగ సాధన... దీంతో ఆమెకు సరదా సమయాలు అంటూ లేకుండా పోయాయి. మొబైల్ ఫోన్లు, టీవి చూడడం లాంటి వాటికి చాలా తక్కువ సమయం కేటాయించేది. చెస్ ఆపేద్దామని...‘ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్’ అయ్యేందుకు దేశవిదేశాల్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. 2023లో పోలెండ్లో జరిగిన టోర్నీలో 9 రౌండ్లకు గాను నిహారిక కేవలం ఒక్క పాయింటే గెలుచుకుంది. దీంతో ఆమెను నిరాశ ఆవరించింది.ఆ బాధలోనే ‘ఇక చెస్ వదిలేద్దాం అనుకుంటున్నాను’ అన్నది కుటుంబ సభ్యులతో.‘ఆ మాట నీ నోటి నుంచి ఎప్పుడూ రాకూడదు. నువ్వు గెలిచే రోజు కచ్చితంగా వస్తుంది’ అని చెప్పారు తల్లిదండ్రులు.‘విజేతల వెనకాల కూడా పరాజయాలు ఉంటాయి. వాటిని దాటుకునే విజయాలు సాధించారు’ అంటూ ఎంతోమంది ప్రముఖ చెస్ ఛాంపియన్ల గురించి చెప్పారు కోచ్ రవీంద్ర రాజు.కుటుంబ సభ్యులు, కోచ్ మాటలు నిహారికలో కొత్త కాంతిని, ఉత్తేజాన్ని నింపాయి.మళ్లీ పూర్వ ఉత్సాహంతో ఆడడం మొదలు పెట్టింది. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అద్భుత విజయాలు సాధించింది. తాజాగా ‘ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్’ హోదా గెలుచుకుంది.నా కల... గ్రాండ్ మాస్టర్విజయాలు సాధించాలంటే ఓటములను తట్టుకునే శక్తిని పెం΄÷ందించుకోవాలి. ప్రతి ఓటమినీ అద్భుతమైన పాఠం కిందే తీసుకున్నాను. సమయాన్ని సమర్థంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల రోజుకు ఆరు గంటల చెస్ సాధనతో ‘ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్’ హోదా సాధించాను. 80 ప్లస్ మార్కులతో ఎంబిఏ పూర్తి చేసాను. కాస్పరోవ్, హంపీ నా అభిమాన ప్లేయర్స్. జియం ఆవడమే నా లక్ష్యం.– నిహారిక చల్లా – మురమళ్ళ శ్రీనివాసరావు, సాక్షి స్పోర్ట్స్, గుంటూరుఫొటోలు: గజ్జల రామ్గోపాల్ రెడ్డి
ఆలనాపాలన... రోడ్డుపాలు చేయొద్దు!
డాక్టర్ కావాల్సిన ప్రియాంక నూరేళ్ల జీవితం క్షణాల్లో కడతేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఘటన అందరి మనసునూ కలచివేసింది. పిల్లలకు కార్లిచ్చి పంపుతున్న తల్లిదండ్రులు ఆ పిల్లల ధోరణి గమనిస్తున్నారా?రేస్ ఉన్మాది – స్పీడ్ కోసం ప్రాణాలు తీసేవాడుఈగో ఉన్మాది – ‘దారి ఇవ్వలేదు’ అని గుద్దేవాడుమత్తు ఉన్మాది – తాగి స్టీరింగ్ పట్టేవాడుడాడీ పవర్ ఉన్మాది – ‘నాన్న చూసుకుంటాడు’ అని నడిపేవాడు. ఇంట్లో ‘బంగారు తండ్రి’ అని పిలుచుకునే కొడుకు రేపు ఈ నలుగురిలో ఒకడు కాకుండా చూసుకుంటున్నామా?ఆగస్టు 3, 2026 రాత్రి 10:00 గంటలు. రాజమండ్రిలోని ఒక మాల్లో సినిమా చూసి బయటకు వచ్చిన ప్రియాంక (28) తన స్కూటీ తీసి ఫ్రెండ్తో కలిసి ఇంటికి బయలుదేరింది. బహుశా ఆమె సినిమా కబుర్లలో మునిగి ఉంటుంది. హాస్టల్ నుంచి ఫోన్ వస్తే ‘ఇంకో పావుగంటలో చేరుకుంటున్నాం’ అని కూడా చెప్పి ఉంటుంది. కాని ప్రియాంక జీవితం సడన్గా విషాదంలో కూరుకుపోయింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ వాహనంతో ప్రియాంక స్కూటీని ఢీకొట్టడమే కాదు, ప్రియాంక తలపై నుంచి కారును పోనిచ్చి పరారయ్యారు.ఆ క్షణమే కోమాలోకి వెళ్లిన ప్రియాంక ఆగస్టు 9న మృతి చెందింది. ఆ అమ్మాయి చేసిన నేరం ఏమిటి? ఏ కొద్ది మందికో దక్కే ఎంబీబీఎస్ కోర్సు చదివి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఉన్న అమ్మాయి క్షణంలో ఉన్మాద చర్యకు ప్రాణం కోల్పోవడం ఏమిటి? ఆమె మృతికి ఇద్దరు వ్యక్తులే కారణంగా పైకి కనిపించవచ్చు. కాని వారి ‘మైండ్సెట్’ను అలా తయారు చేసిన వ్యవస్థ, పెంపకం, వ్యసనం, లెక్కలేనితనం... ఇవన్నీ కారణాలే. ఇవి సరికానంత వరకూ ఇలాంటి ఉత్పాతాలు జరగవని గ్యారంటీ ఇవ్వలేము. రోడ్డు మీద క్షేమంగా తిరగలేము.నాలుగు రకాల ఉన్మాదాలురోడ్ల మీద తిరిగే వాహనాల బ్రాండ్ కంటే వాటిని నడుపుతున్న మనుషుల మనస్తత్వాలు ముఖ్యం. నేటి రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే వాటికి కారణమైన వారిలో నాలుగు రకాల ఉన్మాదులు కనిపిస్తున్నారు.రేస్ ఉన్మాది: కేవలం స్పీడ్ కోసం, రోడ్డుపై థ్రిల్ కోసం పక్కవారి ప్రాణాలు తీసేవాడు. ‘మావాడు బైక్ స్పీడ్గా నడుపుతాడు’ అని తల్లిదండ్రులే గొప్పగా చెప్పి ఇలా తయారు చేస్తున్నారు. ‘ఫాస్ట్గా నడిపే వాడే గొప్ప’ అని కుర్రాడి బుర్రలో ఉంటే ఎవరిది దోషం?ఈగో ఉన్మాది: ‘నాకు దారి ఇవ్వలేదు’ అని, అహం దెబ్బతిన్నదని కావాలనే వెనుక నుంచి గుద్దేసేవాడు. ‘వాడికి ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు’ అని తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి అహాన్ని సాకుతారు.మత్తు ఉన్మాది: ఒంట్లో ఎంత మద్యం ఉందో తెలియకుండానే స్టీరింగ్ పట్టి, రోడ్డుపై నడిచే ప్రతి ఒక్కరినీ టార్గెట్గా మార్చేవాడు. స్నేహితులు ఎలాంటివారో తల్లిదండ్రులు చూడకపోవడం, రాత్రి ఒంటి గంటకు కూడా రాకపోతే పార్టీకి వెళ్లాడు అని సరిపెట్టుకోవడం... దాని ఫలితం ఇది.డాడీ పవర్ ఉన్మాది: ‘నా వెనుక నాన్న ఉన్నాడు, ఏ తప్పు చేసినా చూసుకుంటాడు’ అనే నమ్మకంతో బరితెగించి వాహనం నడిపేవాడు. కొడుక్కు పద్దెనిమిదేళ్లు రాకముందే తండ్రి కారు కీ చేతికి ఇవ్వడం, పోలీసు ఆపితే నా పేరు చెప్పు అని తండ్రి అనడం... ఇంకేముంది?రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను బలితీసుకున్నది ఈ ఉన్మాదాల కలయికే. ఈ విపరీత ధోరణులు రాత్రికి రాత్రి పుట్టవు. చిన్నప్పటి నుంచి తయారై ఉంటాయి. 20 సెకన్లలో జరిగిన ప్రియాంక మృత్యుఘటన వెనుక ‘20 ఏళ్ల బాధ్యతారాహిత్యపు పెంపకం’ కారణమై ఉండొచ్చు. రాత్రి పది తర్వాత కొడుకు బయట ఉంటే కారో, బైకో వేసుకుని తిరుగుతుంటే ‘ఎక్కడ ఉన్నావు?’ అని అడగ్గలిగే స్థితిలో తల్లిదండ్రులు లేకపోయినా, ‘చెప్పాల్సిన పని లేదనే’ ధోరణిలో పుత్రరత్నాలు ఉన్నా అది సమాజానికి అపాయకరం. మరవకూడని పాఠంఈ రోజు డాక్టర్ ప్రియాంక మన మధ్య లేదు. కానీ ఆమె మరణం నేర్పిన పాఠం చాలా పెద్దది. తల్లిదండ్రులారా.. మీ కొడుకులకు ఎదుటివారికి గౌరవం ఇవ్వడం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్పండి. రోడ్డు మీద కారు స్టీరింగ్ చేతిలో ఉందనో, వెనుక అండ ఉందనో అహంకారంతో ప్రవర్తిస్తే చట్టం ముందు, సమాజం ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించండి. కొడుకులను బాధ్యతగల పౌరులుగా పెంచినప్పుడే మన ఇళ్లలో, సమాజంలో నిజమైన భద్రత ఉంటుంది. బతుకును మింగే ‘బెల్టు’కంటి రెప్ప కునుకేస్తేనే స్టీరింగ్ ఎటో పోతుంది. మరి మత్తు తలకెక్కితే? అడుగుకొక బెల్టు షాపు రారమ్మని పిలుస్తుంటే దారిన పోయేవాడు ఆగి కాసింత పోసుకొని బయల్దేరుదాం అనుకుంటాడు. ఆ తర్వాత ప్రాణాల మీదకు తెస్తాడు. వ్యవస్థ ఇలా ఉంటే దానిని ఆపాల్సిన బాధ్యత పాలనది, పౌర సమాజానిది. అధిక అందుబాటు, వేళాపాళా లేకుండా సాగే అమ్మకాలు సహించరానివి. దీనికి కారకులెవరు... నిజంగా మత్తులో తేలుతున్నది ఎవరు అనేది కూడా తేలాలి.ఏం చేయాలి?→ లైసెన్స్ తీసుకోకుండా, 21 ఏళ్లు రాకుండా కారు ఇవ్వకండి. ఇచ్చే ముందు ‘నువ్వు తప్పు చేస్తే నేను కేసు నుంచి తప్పించను’ అని గట్టిగా చెప్పండి → ప్రతి రాత్రి 9 గంటలకల్లా కొడుకు ఇంటికి వచ్చాడా? కారు ఎక్కడుంది? పార్టీలో ఉన్నాడా... ఫోన్ చేసి చెక్ చేయండి. ఇది అనుమానం కాదు. బాధ్యత → ‘సారీ’ చెప్పడం నేర్పండి. రోడ్డుపై ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే దిగి క్షమాపణ చెప్పే అలవాటు చేయండి. ఈగో కంటే మనిషితనం గొప్పదని చూపించండి → సినిమా, రీల్స్ గురించి మాట్లాడండి. ‘రేసింగ్ సీన్లు సినిమాకే బాగుంటాయి... నిజ జీవితంలో చాలా ప్రాణాంతకం’ అని కూర్చుని చెప్పండి. హీరోయిజం అంటే స్పీడ్ కాదు.... బాధ్యత అని చెప్పండి.→ శిక్ష నుంచి తప్పించకండి. చిన్న స్క్రాచ్ అయినా, చిన్న ఫైన్ అయినా అబ్బాయినే కట్టనివ్వండి. ‘నాన్న ఉన్నాడు’ అనే నెట్ తీసేయండి. భయం ఉంటేనే బుద్ధి వస్తుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద గుహ.. ఇదొక ట్రావెల్ అడ్వెంచర్!
ప్రపంచంలోనే అతి పెద్ద గుహ అయిన సాన్ డూంగ్ కేవ్లోకి ఎంటర్ అయితే మనం మరో గ్రహంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. వియత్నాంలోని ఫోంగ్ నా కే బ్యాంగ్ నేషనల్ పార్క్లో సాన్ డూంగ్ కేవ్ ప్రపంచంలోనే అతిపెద్ద నేచురల్ కేవ్గా ప్రసిద్ధి పొందింది.ఈ గుహ లోపల పెద్ద పెద్ద అడవులు, ప్రవహిస్తున్న నదులు, 200 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తైన రాక్ వాల్స్, పై నుంచి పడే సూర్య కిరణాలు కలిసి ఒక మ్యాజికల్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. నేచర్ తన కళతో క్రియేట్ చేసిన మాస్టర్ పీస్ అని చెప్పడం అతిశయం కాదు.ఎందుకు స్పెషల్ ?సాన్ డూంగ్ గుహను 1991లో కనుగొన్నారు. కానీ 2009 లో అంతర్జాతీయ పరిశోధకులు పూర్తిగా సర్వే చేసిన అనంతరం ఈ గుహకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. సుమారు 9 కిమీ పొడవు, 200 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల వెడల్పు ఉన్న ఈ గుహలో ఒక చిన్న అడవి, మేఘాలు క్రియేట్ అయ్యే వాతావరణం, అండర్గ్రౌండ్ నది కూడా ఉంటాయి. అందుకే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద గుహ అని కూడా అంటారు.హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ముందుగా వియత్నాంలోని హానోయ్ లేదా హో చి మిన్ సిటీ కి కనెక్టింగ్ విమానం తీసుకోవాలి. అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్లో డాంగ్ హోయ్ ఎయిర్పోర్టుకు చేరుకోవాలి. డాంగ్ హోయ్ నుండి సుమారు 45 కిమీ దూరంలో ఫోంగ్ నా విలేజ్కి ట్యాక్సీ లేదా షటిల్ బస్లో చేరుకోవచ్చు. సాన్ డూంగ్ కేవ్కి గవర్నమెంట్ అప్రూవ్డ్ గైడ్ ద్వారా మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి.బడ్జెట్ ఎంత అవుతుంది? అఫిషియల్ సాన్ డూంగ్ ఎక్స్పిడిషన్ అనేది 4 నుంచి 6 రోజులు ఉంటుంది. గైడ్, పర్మిట్స్, క్యాంపింగ్, ఫుడ్ అన్నీ కలిసి ఒక వ్యక్తికి రూ.2 లక్షల 80 వేల నుంచి రూ.3 లక్షల 5 వేల వరకు ఖర్చు అవుతుంది. వియత్నాం ట్రిప్ని సాన్ డూంగ్ ఎక్స్పిడిషన్ లేకుండా ఫోంగ్ నా రీజియన్ వరకు ప్లాన్ చేస్తే రూ.60 వేల నుంచి రూ.90 వేల బడ్జెట్లో కంఫర్టబుల్గా పూర్తి చేయవచ్చు.ఏం తినాలి?వియత్నాం ఫుడ్ లవర్స్కి స్వర్గంలాంటిది. ఒక్క ఫో నూడిల్ సూప్, బాన్ మీ శాండ్విచ్, ఫ్రెష్ స్ప్రింగ్ రోల్స్, కామ్ టామ్ చాలా ఫేమస్. శాఖాహారుల కోసం వెజ్ ఆప్షన్స్ కూడా బాగానే ఉంటాయి. వియత్నాం లోకల్ కాఫీని మాత్రం మిస్ అవ్వకండి.దగ్గర్లో చూడాల్సినవిసాన్ డూంగ్ కేవ్తో పాటు ఫోంగ్ నా కేవ్, ప్యారడైజ్ కేవ్, డార్క్ కేవ్, మూక్ స్ప్రింగ్ ఎకో ట్రెయిల్, బొటానిక్ గార్డెన్ లాంటి ప్రాంతాలను అన్వేషించవచ్చు. ఈ ప్రాంతం మొత్తం యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపద కాబట్టి ప్రతీ చోట నేచర్ బ్యూటీ కనిపిస్తుంది.సాహసమే శ్వాసగా సాగిపోయేవారికి, నేచర్, ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్ ఈ నాలుగు మీకు ఇష్టం అయితే సాన్ డూంగ్ కేవ్ని లైఫ్లో ఒక్కసారి అయినా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశం. ఇది ఒక గుహ మాత్రమే కాదు... భూమిలోపల దాగున్న అద్భుత ప్రపంచం ఇది. వియత్నాం ట్రిప్ ప్లాన్ చేస్తున్న వాళ్లకి ఇది ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది.
అంతర్జాతీయం
అమెరికాలో కల్లోలం.. వాటర్ సిస్టమ్స్పై సైబర్ దాడులు
అమెరికాలో కీలక మౌలిక వసతులపై సైబర్ దాడుల ముప్పు మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి హ్యాకర్ల లక్ష్యంగా మారింది తాగునీటి సరఫరా వ్యవస్థలు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వాటర్ సిస్టమ్స్, వేస్ట్వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లపై జరిగిన సైబర్ దాడులు భద్రతా వర్గాలను అప్రమత్తం చేశాయి. ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారు? అని అమెరికా దర్యాప్తు సంస్థలు పరిశీలన ప్రారంభించాయి.జూలై చివరి వారంలో మిన్నెసోటాలోని 30కి పైగా స్థానిక నీటి సరఫరా వ్యవస్థలు సమన్వయ సైబర్ దాడులకు గురయ్యాయి. ఆ తర్వాత ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), సైబర్ భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. కనీసం ఏడు రాష్ట్రాల్లోని నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి వ్యవస్థల్లోకి హ్యాకర్లు చొరబడినట్లు అధికారులు గుర్తించారు.అమెరికాలోని నీటి సరఫరా వ్యవస్థలు కోట్లాది మంది ప్రజల రోజువారీ జీవితంతో ముడిపడి ఉన్నాయి. సరస్సులు, నదులు, భూగర్భ జలాల నుంచి సేకరించిన నీటిని శుద్ధి చేసి.. పైపుల ద్వారా ఇళ్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఆధునిక సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది.నీటి ఒత్తిడి, పంపుల పనితీరు, రసాయనాల మోతాదు వంటి అంశాలను నియంత్రించే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్లు (PLCs) ఈ వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పుడు ఇవే పరికరాలు హ్యాకర్ల టార్గెట్గా మారాయి. ఇంటర్నెట్కు అనుసంధానమైన కంట్రోల్ వ్యవస్థల్లోని లోపాలను గుర్తించి వాటిలోకి ప్రవేశించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.బలహీనమైన పాస్వర్డ్లు, భద్రతా లోపాలు, అప్డేట్ చేయని సాఫ్ట్వేర్లను ఉపయోగించుకుని హ్యాకర్లు వ్యవస్థల్లోకి చొరబడే అవకాశం ఉంటుంది. ఒకసారి నియంత్రణ వ్యవస్థలపై పట్టు సాధిస్తే.. పాస్వర్డ్లను మార్చడం, ఆదేశాల్లో మార్పులు చేయడం, పరికరాల పనితీరును ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది.ఈ దాడుల వెనుక ఇరాన్ హ్యాకర్ల పాత్ర ఉందా? అనే అంశంపై అమెరికా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇరాన్కు అనుబంధంగా పనిచేసే సైబర్ గ్రూపులు గతంలో కూడా కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు ఉన్నాయని అధికారులు గుర్తుచేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఏ దేశాన్నీ ఈ దాడులకు బాధ్యుడిగా ప్రకటించలేదు. మరోవైపు ఇరాన్ పేరుతో మరో దేశం లేదంటే గ్రూప్ ఉద్దేశపూర్వకంగా దాడులు చేసి దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందా? అనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు.ప్రస్తుతం జరిగిన దాడుల వల్ల తాగునీరు కలుషితమైనట్లు.. ప్రజల ఆరోగ్యానికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా నీటి వ్యవస్థలను మాన్యువల్గా నిర్వహించాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ప్రజలకు నీటిని మరిగించి వినియోగించాలని సూచనలు కూడా ఇచ్చారు.సైబర్ భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి దాడుల అసలు లక్ష్యం కేవలం నీటి సరఫరాను నిలిపివేయడం మాత్రమే కాకపోవచ్చు. ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకాన్ని దెబ్బతీయడం కూడా సైబర్ యుద్ధ వ్యూహాల్లో భాగమని వారు హెచ్చరిస్తున్నారు.ఈ ఘటనల నేపథ్యంలో అమెరికా నీటి సరఫరా సంస్థలు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తున్నాయి. నీటి వ్యవస్థలను నేరుగా ఇంటర్నెట్కు అనుసంధానం చేయకుండా చూడటం, బలమైన ఫైర్వాల్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, మల్టీ-లేయర్ అథెంటికేషన్ అమలు చేయడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే డిఫాల్ట్ పాస్వర్డ్లను మార్చడం, అవసరం లేని రిమోట్ యాక్సెస్లను నిలిపివేయడం, అత్యవసర పరిస్థితుల్లో వ్యవస్థలను మాన్యువల్గా నడిపించే సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.డిజిటల్ యుగంలో యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే జరగవని.. విద్యుత్, నీరు, రవాణా వంటి కీలక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే సైబర్ దాడులు భవిష్యత్తులో మరింత పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని తాజా ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.
కెనడా కార్చిచ్చు వేళ కీలక ప్రశ్న.. ఉండాలా? వెళ్లాలా?
కెనడాలో కార్చిచ్చులు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. దీంతో అగ్నిప్రమాదం ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇళ్లను, తమ ప్రాంతాలను వదిలి వెళ్లకుండా అక్కడే ఉండి మంటలను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇక్కడే ఉండి మంటలను ఎదుర్కొందాం’ అనే అక్కడి స్థానిక ప్రజల ఆలోచన తీరుపై కెనడాలో కొత్త చర్చ మొదలైంది.ఉత్తర అంటారియోలోని గుల్ బే ఫస్ట్ నేషన్(Gull Bay First Nation) ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల హ్యూబర్ట్ విగ్వాస్ కూడా ఇలాగే తన ఇంటిని వదిలి వెళ్లేందుకు నిరాకరించారు. అయితే, సమీపంలో కార్చిచ్చు చెలరేగడంతో ఇంటి పైకప్పుపై స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండిపోయిన వృద్ధులను భద్రతా అధికారులు పరామర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునేందుకు దగర్లోని సరస్సులో నాలుగు పడవలను కూడా సిద్ధంగా ఉంచారు. కానీ ఖాళీ చేయాలన్న అధికారుల ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనకు సుమారు 800 కెనడియన్ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టుగా అక్కడి ప్రభుత్వం తెలిపింది.ఇటీవల కెనడాలో కార్చిచ్చులు భారీగా పెరిగాయి. 2023లో నమోదైన కార్చిచ్చులు రికార్డు స్థాయిలో విధ్వంసం సృష్టించాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 750కి పైగా కార్చిచ్చులు చురుకుగా ఉన్నట్లు సమాచారం. మంటల పొగ అమెరికాలోని మిడ్వెస్ట్ ప్రాంతాలకూ చేరనుంది. దీంతో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలను రక్షించేందుకు సరిపడా అగ్నిమాపక సిబ్బంది ఉన్నారా? అత్యవసర సమయంలో స్థానికులు కూడా మంటలను ఎదుర్కొనేలా శిక్షణ పొందాలనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో బ్రిటిష్ కొలంబియాలోని ఫోర్ట్ నెల్సన్(Fort Nelson) ప్రాంతంలో సోంజా లెవర్కస్ ఆధ్వర్యంలో స్థానికులకు అగ్నిప్రమాదాలను ఎదుర్కొనే శిక్షణ ఇస్తున్నారు. గత మూడేళ్లలో 400 మందికి పైగా శిక్షణ పొందారు. చిన్న మంటలను అదుపు చేయడం, ఇళ్లను నిప్పురవ్వల నుంచి రక్షించడం, ప్రమాదకర పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడే మార్గాలను గుర్తించడం వంటి అంశాలను నేర్పుతున్నారు. అయితే, మంటలు చెలరేగిన సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండి వాటిని ఎదుర్కోవడం కంటే ముందుగానే ఖాళీ చేసి ప్రాణాలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం.నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మారుమూల ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను ముందుగానే అగ్ని ప్రమాదానికి తట్టుకునేలా సిద్ధం చేసుకోవచ్చు. స్థానికంగా శిక్షణ పొందిన బృందాలు కూడా అగ్నిమాపక సిబ్బందికి సహకరించవచ్చు. కానీ మంటలు చెలరేగిన సమయంలో అనుమతి లేకుండా అక్కడే ఉండటం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఇక తన ఇంటిని కాపాడుకోవడం కోసం అక్కడే ఉండిపోయిన విగ్వాస్ మాత్రం.. 'నా 58 ఏళ్ల జీవితంలో నిర్మించుకున్నదంతా ఇది. దాన్ని కాలిపోతుంటే చూస్తూ వెళ్లిపోలేను' అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీనిపై అక్కడి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనున్నట్లుగా సమాచారం.
అయ్యో ట్రంప్.. మరీ ఇలానా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రత కోసం చేపట్టిన ఓ అసాధారణ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు హాజరైన ట్రంప్.. అక్కడి నుంచి బయలుదేరే సమయంలో కనిపించిన దృశ్యాల వెనుక ఓ రహస్య వ్యూహం ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.కెమెరాల ముందు ట్రంప్ పాత ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ఎక్కినట్లు కనిపించారు. కానీ అది కేవలం డీకాయ్ (మభ్యపెట్టే ఏర్పాటు) మాత్రమేనని.. అసలు ఆయనను ఓ చిన్న సైనిక విమానంలోకి రహస్యంగా తరలించినట్లు సమాచారం. ఈ మొత్తం ఆపరేషన్లో ఓ సాధారణ క్యాటరింగ్ ట్రక్ కీలక పాత్ర పోషించడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.టర్కీ నుంచి బయలుదేరే ముందు ట్రంప్ పాత ఎయిర్ఫోర్స్ వన్లో ప్రయాణిస్తారని అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ సమయంలో ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో భద్రతా అధికారులు చివరి నిమిషంలో ప్రణాళిక మార్చినట్లు తెలుస్తోంది.ట్రంప్ ముందుగా ఎయిర్ఫోర్స్ వన్లోకి ఎక్కినట్లు కనిపించిన తర్వాత.. విమానం మరో వైపు నుంచి క్యాటరింగ్ ట్రక్ దగ్గరకు వెళ్లింది. సాధారణంగా విమానాలకు ఆహారం, ఇతర సరఫరాలు అందించే ఆ వాహనాన్ని ఈసారి భద్రతా వ్యూహంలో భాగంగా ఉపయోగించారు. ట్రక్ సహాయంతో ట్రంప్, ఆయన సిబ్బందిని ఎవరికీ కనిపించకుండా బయటకు తీసుకొచ్చి C-32A సైనిక విమానంలోకి తరలించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.డీకాయ్గా పాత విమానం.. అసలు ప్రయాణం మరో విమానంలోఈ వ్యూహం కారణంగా మీడియా ప్రతినిధులు, కొంతమంది సిబ్బంది కూడా ట్రంప్ పాత ఎయిర్ఫోర్స్ వన్లోనే ప్రయాణిస్తున్నారని భావించారు. కానీ ఆయన మాత్రం C-32A విమానంలో బ్రిటన్కు చేరుకున్నట్లు సమాచారం.ఎందుకీ రహస్య ఆపరేషన్?ట్రంప్ టర్కీలో ఉన్న సమయంలో ఇరాన్ అనుబంధ వర్గాల నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారం అందినట్లు నివేదికలు తెలిపాయి. అధ్యక్షుడి ప్రయాణ మార్గం, విమానం వివరాలు బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.ఖతార్ విమానంపై మళ్లీ చర్చఈ ఘటనతో ఖతార్ అందించిన కొత్త బోయింగ్ 747-8 విమానం భద్రతా సామర్థ్యాలపై మరోసారి చర్చ మొదలైంది. అయితే వైట్హౌస్ మాత్రం అధ్యక్షుడి రక్షణ కోసం అత్యున్నత భద్రతా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.అగ్రరాజ్య అధ్యక్షుడి ప్రయాణం(అందునా ట్రంప్).. రెండు విమానాలు.. రహస్య మార్గం.. ఓ క్యాటరింగ్ ట్రక్.. ట్రంప్ భద్రతా ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది.
కొలంబియా భూకంపం: ఒక్క కుదుపు.. సెకన్లలో శవాల దిబ్బలు!
ప్రకృతి కన్నెర్ర చేస్తే.. మనిషి నిర్మించిన ప్రపంచం క్షణాల్లో తుడిచిపెట్టుకుపోతుంది. అప్పటివరకు జనజీవనంతో కళకళలాడిన నగరాలు భూమి ఒక్కసారి కంపించగానే శిథిలాల గుట్టలుగా మారిపోతాయి. కట్టుకున్న ఇళ్లు కూలిపోతాయి.. కుటుంబాలు చెల్లాచెదురవుతాయి.. ప్రాణాలతో బయటపడిన వారి కళ్ల ముందు తమ ఆత్మీయులను కోల్పోయిన విషాదం జీవితాంతం వెంటాడుతుంది..భూకంపాలకు అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటైన లాటిన్ అమెరికా.. ఇలాంటి ఎన్నో ప్రకృతి విలయాలకు సాక్షిగా నిలిచింది. భూమి పొరల్లో చోటుచేసుకున్న కదలికలు కొన్ని సెకన్లలోనే నగరాల రూపురేఖలను మార్చేశాయి. లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. తాజాగా కొలంబియాలో సంభవించిన భారీ భూకంపం మరోసారి ఈ ప్రాంతంలోని పాత విషాదాలను ప్రపంచానికి గుర్తుచేసింది. ఈ ప్రకంపనల ధాటికి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. అనేక భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Powerful 7.4-magnitude earthquake hits Manizales, Colombia 🇨🇴 (10.08.2026)@AmirSaeedAbbasi @HussainAhmedCh8 @KulAalam #Colombia pic.twitter.com/FI2lrySjd8— Media Talk (@mediatalk922) August 11, 2026హైతీ.. ప్రపంచాన్ని కదిలించిన విషాదంలాటిన్ అమెరికా చరిత్రలో అత్యంత భయానక భూకంపాల్లో 2010లో హైతీలో సంభవించిన ప్రకంపనలు ఒకటి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0 మాత్రమే అయినప్పటికీ.. దాని ప్రభావం మాత్రం ఊహించని స్థాయిలో కనిపించింది. రాజధాని పోర్ట్–ఔ–ప్రిన్స్ నగరం తీవ్రంగా దెబ్బతింది. వేలాది భవనాలు కూలిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, నివాస ప్రాంతాలు శిథిలాలుగా మారాయి. భూకంప నిరోధక ప్రమాణాలు లేని నిర్మాణాలు భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి.ఈ విపత్తులో సుమారు 3.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఒక దేశం మొత్తం కోలుకోవడానికి ఏళ్లు పట్టింది.నిద్రలోనే మృత్యువు ఒడిలోకి వేలమంది.. 1868లో ఈక్వెడార్, కొలంబియా ప్రాంతాలను కుదిపేసిన భూకంపాలు మరో మహా విషాదాన్ని మిగిల్చాయి. **7.7 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు** అనేక పట్టణాలను నేలమట్టం చేశాయి. ప్రజలు గాఢనిద్రలో ఉన్న సమయంలో సంభవించిన ఈ భూకంపం.. క్షణాల్లో వేలాది ఇళ్లను శిథిలాలుగా మార్చింది. ఈక్వెడార్లో సుమారు 40 వేల మంది, కొలంబియాలో మరో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. చారిత్రక రికార్డుల ప్రకారం.. ఇబారా నగరం కొన్ని క్షణాల్లోనే విధ్వంసానికి గురైందని అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.పెరూలో భూకంపం.. కదిలిన పర్వతం1970లో పెరూలో సంభవించిన భూకంపం ప్రకృతి శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచానికి చూపించింది. 7.9 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు అండీస్ పర్వతాల్లో భారీ మంచు, రాళ్ల కొండచరియలు విరిగిపడేలా చేశాయి. మంచు, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం వేగంగా దూసుకొచ్చి యుంగే, రన్రాహిర్కా ప్రాంతాలను కప్పేసింది. కొన్ని నిమిషాల్లోనే అక్కడి జనజీవనం పూర్తిగా తారుమారైంది. ఈ ఘటనలో సుమారు 66,794 మంది మరణించారు. ప్రకృతి విపత్తుల్లో కొండచరియలు ఎంతటి ప్రాణాంతకంగా మారతాయో ఈ ఘటన చాటిచెప్పింది.ఈక్వెడార్లో ప్రకృతి ప్రకోపం.. 40 వేల మంది బలి1797లో ఈక్వెడార్లో సంభవించిన భూకంపం ఆ దేశ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఘటనల్లో ఒకటి. 8.3 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకంపనలు భారీగా కొండచరియలు విరిగిపడేలా చేశాయి. రియోబాంబా, లతకుంగా, అంబాటో వంటి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ విషాదంలో సుమారు 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.చిలీ.. భూకంపాల దేశంలో విషాద జ్ఞాపకంప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం 1960లో చిలీలో 9.5 తీవ్రతతో నమోదైంది. అయితే అత్యధిక మరణాలు మాత్రం 1939లో వచ్చిన చిల్లాన్ భూకంపంలో చోటుచేసుకున్నాయి. 8.3 తీవ్రతతో వచ్చిన ఆ ప్రకంపనలు చిల్లాన్, కాన్సెప్సియన్ నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. బలహీన నిర్మాణాల కారణంగా సుమారు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం తర్వాత చిలీ భూకంప నిరోధక నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.వెనిజులా నుంచి అర్జెంటీనా వరకు.. విషాదాల ఆనవాళ్లులాటిన్ అమెరికాలో మరెన్నో భూకంపాలు వేలాది కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చాయి. 1812 వెనిజులా భూకంపం సుమారు 26 వేల మందిని, 1868 అరికా భూకంపం దాదాపు 25 వేల మందిని, 1976 గ్వాటెమాలా భూకంపం 23 వేల మందిని బలిగొన్నాయి. 1797 వెనిజులా భూకంపం, 1861 అర్జెంటీనా భూకంపం కూడా వేలాది ప్రాణాలను హరించాయి. కొన్ని ప్రాంతాల్లో భూకంపం తర్వాత వచ్చిన సునామీలు, అగ్ని ప్రమాదాలు మరణాల సంఖ్యను మరింత పెంచాయి.ఎందుకింత ప్రాణ నష్టం?లాటిన్ అమెరికా భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారడానికి ప్రధాన కారణం.. ఈ ప్రాంతం భారీ టెక్టానిక్ పలకల సరిహద్దులపై ఉండటమే. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉన్న చిలీ, పెరూ, ఈక్వెడార్, కొలంబియా వంటి దేశాలు తరచూ భౌగోళిక కదలికలను ఎదుర్కొంటుంటాయి.సముద్రపు అడుగున ఉన్న నాజ్కా టెక్టానిక్ ప్లేట్.. దక్షిణ అమెరికా ప్లేట్ కిందికి జారిపోవడం వల్ల భూమి లోపల భారీ ఒత్తిడి పేరుకుపోతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భారీ ప్రకంపనలు సంభవిస్తాయి. అందుకే ఈ ప్రాంతంలో తరచూ శక్తివంతమైన భూకంపాలు చోటుచేసుకుంటుంటాయి.ప్రకృతి హెచ్చరిక.. మనిషికి గుణపాఠంభూకంపాలను ఆపడం మనిషి చేతుల్లో లేదు. కానీ వాటి ప్రభావాన్ని తగ్గించడం మాత్రం సాధ్యమే. భూకంప నిరోధక నిర్మాణాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సమర్థవంతమైన విపత్తు నిర్వహణ ప్రణాళికలు ఎన్నో ప్రాణాలను కాపాడగలవు. లాటిన్ అమెరికా భూకంప చరిత్ర ఒక చేదు నిజాన్ని చెబుతోంది. భూమి కదిలేది కొన్ని సెకన్లే.. కానీ ఆ ప్రకంపనలు మిగిల్చే విషాదం తరతరాల పాటు నిలిచిపోతుంది అని.
జాతీయం
త్రిషపై మరోసారి కామెంట్ల దుమారం.. ఈ సారి అన్నాడీఎంకే నేత
చెన్నై: తమిళనాడులో రాజకీయ పోరులో మరోసారి సినీనటి త్రిష ప్రస్తావన వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ను లక్ష్యంగా చేసుకుంటూ త్రిషపై వ్యాఖ్యలు చేసి అన్నాడీఎంకే నేత ఆర్బీ ఉదయకుమార్ మరో వివాదానికి తెరతీశారు.ఆగస్టు 8న తూత్తుకుడిలో జరిగిన అన్నాడీఎంకే కార్యక్రమంలో మాట్లాడిన ఉదయకుమార్.. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా త్రిషను ఎప్పుడు నియమిస్తారంటూ ప్రశ్నించారు. “విజయ్కు ‘ప్రియమైన’ త్రిషను తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఎప్పుడు నియమిస్తారో చూడాలని తమిళనాడు ఎదురుచూస్తోంది” అని కార్యక్రమంలో అన్నారు.ఉదయకుమార్ జయలలిత పేరవై సమావేశంలో అన్నాడీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. కావేరి జలాల అంశాన్ని తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన తీరును, కావేరి జలాల నిర్వహణ అథారిటీ ఆదేశాల మేరకు కర్ణాటక నుంచి నీటి విడుదల చేయించడంలో విఫలమైన విషయాన్ని ఆయన విమర్శిస్తున్నారు.త్రిష అభిమానుల నుంచి ఈ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. ఉదయకుమార్ వ్యాఖ్యలను ఖండిస్తూ త్రిష అభిమాన సంఘం మదురై అంతటా పోస్టర్లు ఏర్పాటు చేసింది. కొన్ని రోజుల క్రితం తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా త్రిషపై చేసినట్టు ఆరోపణలు వచ్చిన ద్వంద్వార్థ వ్యాఖ్యల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు.గత వారం కావేరి నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో జనంలో కొందరు “త్రిష, త్రిష” అంటూ నినాదాలు చేసినట్టు సమాచారం. దానికి స్పందించిన ఉదయనిధి ద్వంద్వార్థ వ్యాఖ్య చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అనంతరం తాను కావేరి జలాల గురించే మాట్లాడుతున్నానని చెప్పారు.ఆ వ్యాఖ్యల తర్వాత టీవీకే మహిళా విభాగం తంజావూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతిపక్ష నేత త్రిషను లక్ష్యంగా చేసుకుని ద్వంద్వార్థ వ్యాఖ్య చేశారని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం ఉదయనిధిని ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసి, కోర్టు విడుదల చేసింది. తాను అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని ఆయన ఖండించారు. ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, అవి ఏ వ్యక్తిని ఉద్దేశించి చేసినవి కావని, ప్రభుత్వ పనితీరును ఉద్దేశించిందేనని డీఎంకే తెలిపింది.ఇంతకుముందూ విజయ్కు సంబంధించిన రాజకీయ వ్యాఖ్యల్లో త్రిష ప్రస్తావన వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్, రాజకీయాల్లోకి రావాలంటే విజయ్ ముందుగా “త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి” అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో త్రిష న్యాయ బృందం ఆ వ్యాఖ్యలపై ప్రతి స్పందించింది.
రవి కిషన్పై యోగి జోక్.. కడుపుబ్బా నవ్వుకున్న ప్రేక్షకులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి గోరఖ్పూర్ ఎంపీ, సినీ నటుడు రవి కిషన్పై సరదాగా వ్యాఖ్యలు చేశారు. విమాన కనెక్టివిటీ మెరుగ్గా ఉండడంతో రవి కిషన్ ఏ రోజు గోరఖ్పూర్లో ఉంటారో, ముంబైలో ఉంటారో, ఢిల్లీలో ఉంటారో ఎవరికీ తెలియదని చమత్కరించారు. దీంతో అందరి ముఖాల్లో నవ్వులు పూశాయి. ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. గోరఖ్పూర్లో మెరుగైన విమాన కనెక్టివిటీ గురించి మాట్లాడిన యోగి.. నగరంలో భారీ మార్పు వచ్చిందన్నారు. 10 ఏళ్ల క్రితం రోజుకు ఒక్క విమానం మాత్రమే నడిచేదని, ప్రస్తుతం నగరం నుంచి 14 విమానాలు నడుస్తున్నాయని చెప్పారు.ఆ తర్వాత ప్రేక్షకుల్లో కూర్చున్న రవి కిషన్ వైపు తిరిగి మాట్లాడుతూ.. “రవి కిషన్ గురించి నేను ఎప్పుడూ చెబుతుంటాను. ఆయన గోరఖ్పూర్లో ఎప్పుడు ఉంటారో, ముంబైలో ఎప్పుడు ఉంటారో ఎవరికీ తెలియదు. ముంబైలో బ్రేక్ఫాస్ట్ చేస్తే, గోరఖ్పూర్లో లంచ్ కూడా చేసేస్తారు. ఇక్కడ ముఖం చూపించి మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోతారు” అన్నారు. విమాన అనుసంధానం లేకపోతే ఇలాంటి షెడ్యూల్ నిర్వహించడం కష్టమయ్యేదని అన్నారు. యోగి వ్యాఖ్యలపై రవి కిషన్తో పాటు అక్కడ ఉన్నవారు కూడా గట్టిగా నవ్వారు.గతంలోనూ ఓ సారి ఇలాగే..ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల ఒకే వేదికపై కనిపించినప్పుడల్లా ఇటువంటి సరదా సంభాషణలు జరుగుతుంటాయి. 2025 జూలైలో గోరఖ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమంలో, రామ్ఘర్ తాల్ ప్రాంతంలో కాలువపై రవి కిషన్ ఇల్లు కట్టారని యోగి సరదాగా ప్రస్తావించారు. నీరు నిలిస్తే ఆయనపైనా చర్యలు తప్పవని చమత్కరించారు. మురుగు నీటి ప్రవాహం సజావుగా సాగాలంటే కాలువకు కొంత దూరంగా ఇల్లు కట్టాలని సూచించారు. మరో సందర్భంలో అదే ఇంటిని ప్రస్తావిస్తూ, రామ్ఘర్ తాల్ ఒడ్డున ఒక “షీషే మహల్” ఉందని వ్యాఖ్యానించారు. అది రవి కిషన్ ఇంటినే ఉద్దేశించి చేసిన వ్యాఖ్య.
శబరిమల భక్తులకు శుభవార్త.. రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
తిరువనంతపురం: తమిళనాడులోని తేని నుంచి కేరళలో శబరిమల యాత్రకు ప్రధాన ప్రవేశ ద్వారమైన ఎరుమేలి వరకు ప్రతిపాదించిన 95 కిలోమీటర్ల బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వేకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటులో ధృవీకరించారు.ఈ ప్రాజెక్టు కోసం సాంకేతిక, కార్యాచరణ సాధ్యతలను అంచనా వేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) తయారు చేస్తారు. సర్వే పూర్తయిన తర్వాత తమిళనాడు, కేరళ ప్రభుత్వాల సంప్రదింపులతో పాటు నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం తేని పరిసర ప్రాంతాల భక్తులు కుంబం, కుమిలి, ఎరుమేలి, పంబాల మీదుగా రోడ్డు మార్గంలో మాత్రమే శబరిమలకు చేరుకుంటున్నారు. ఈ కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సులభతరం కానుంది.శబరిమలలో ఇతర రైల్వే ప్రాజెక్టుల పురోగతిశబరిమలకు సంబంధించి ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న 'అంగమలి-శబరి' లైన్ కోసం కేరళ ప్రభుత్వం స్థల సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.505 కోట్లు కేటాయించింది.రెండు మార్గాలు (తేని–ఎరుమేలి, అంగమలి–శబరి) అందుబాటులోకి వస్తే రెండు వేర్వేరు దిశల నుండి శబరిమల క్షేత్రానికి అద్భుతమైన రైలు సదుపాయం సమకూరుతుంది.
పిల్లల ప్రాణాలకు ముప్పు.. అత్యవసరంగా 25 స్కూళ్ల బంద్
జమ్మూ: జమ్మూలోని రాజౌరీ జిల్లా కోట్రంకా బ్లాక్లో పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో జిల్లా యంత్రాంగం నుంచి ఒక నోటీసు విడుదలైంది. దాదాపు 25 పాఠశాలలను తాత్కాలికంగా మూసి ఉంచనున్నట్లు ప్రకటించింది. అలాగే, పోలీసు సిబ్బంది, సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, గ్రామ రక్షణ దళాల సభ్యులను మోహరించాలని ఆదేశించింది.ఈ ఉన్నతస్థాయి ఆదేశాలు జారీ అయింది సరిహద్దు జిల్లాలో ఏదైనా వీఐపీ పర్యటన లేదా భద్రతా ముప్పు కారణంగా కాదు. గత 2 రోజుల్లో 9 మందిని వీధి కుక్కలు కరిచినట్లు ఆరోపణలు రావడంతో వాటిని పట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ ఆదేశాలు బ్లాక్ పరిధిలోని అరడజనుకు పైగా పంచాయతీల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలపై ప్రభావం చూపించాయి. ఆదివారం ఆరుగురు కుక్క కాట్లతో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి రావడం, సోమవారం మరో ముగ్గురు చేరడంతో కోట్రంకా అదనపు డిప్యూటీ కమిషనర్ దిల్ మీర్ చౌదరి ఈ ఆదేశాలు జారీ చేశారు.సోమవారం సాయంత్రం మరో వ్యక్తిపై దాడి చేసిన ఒక కుక్కను స్థానిక గ్రామస్థుడు కర్రతో కొట్టి చంపినట్లు సమాచారం. ఆదివారం నుంచి “పిచ్చి స్వభావం ఉన్న వీధి కుక్కలు” కరిచి 9 మందికి గాయాలైన విషయాన్ని ప్రస్తావిస్తూ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆదేశాల్లో, ఈ కుక్కలు “ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు సమాచారం ఉందని, ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే పిల్లల భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారాయని, స్థానిక ప్రజల్లో భయం, ఆందోళన కలిగిస్తున్నాయని” పేర్కొన్నారు.పాఠశాలల మూసివేతకు ఆదేశిస్తూ, కండి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోకు అవసరమైన చోట తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించాలని, అనుమానాస్పద పిచ్చి/ఉగ్ర స్వభావం ఉన్న కుక్కలను వీలైనంత త్వరగా సురక్షితంగా పట్టుకునేందుకు సీఆర్పీఎఫ్, గ్రామ రక్షణ దళాలు, స్థానిక ప్రతినిధులతో సమన్వయం చేయాలని, అమల్లో ఉన్న నిబంధనలు, జంతు సంక్షేమ విధానాలకు కట్టుబడి వ్యవహరించాలని సూచించారు.జంతు సంవర్ధక శాఖలోని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్కు ప్రభావిత ప్రాంతాల్లోని వీధి కుక్కలకు టీకాలు వేయేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, టీకాలు వేయడం, పశువైద్య పరీక్షలు నిర్వహించడం కోసం కుక్కలను సురక్షితంగా పట్టుకోవడంలో పోలీసులతో సమన్వయం చేయాలని కూడా ఆదేశించారు. అదనంగా, కోట్రంకా తహసీల్దార్కు “ఆపరేషన్ జరిగే ప్రాంతంలో ఒక మేజిస్ట్రేట్ను నియమించి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, పోలీసు బృందంతో సమన్వయం చేస్తూ చట్టవ్యవస్థను కాపాడేలా చూడాలని” చౌదరి ఆదేశించారు.అత్యంత అత్యవసర అంశంప్రజల భద్రత దృష్ట్యా ఈ అంశాన్ని “అత్యంత అత్యవసరంగా” పరిగణించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన అదనపు డిప్యూటీ కమిషనర్, అనుమానాస్పద పిచ్చి కుక్కల దాడులు లేదా కాట్లకు ఇంకెవరూ గురికాకుండా తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.స్థానిక గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, కోట్రంకా, మొహ్రా ఏ, మొహ్రా బీ, జగ్లాను, కండి లోయర్, కండి అప్పర్, ఖద్యోల్ పంచాయతీల్లోని పాఠశాలలు సోమవారం, మంగళవారం మూసి ఉంచారు. అయితే వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణ సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఈ మూసివేత ప్రకటించినట్లు అదనపు డిప్యూటీ కమిషనర్ తెలిపారు.సంప్రదించగా, గత 2 రోజుల్లో గ్రామస్థులపై జరిగిన అన్ని దాడులకు కారణమైన వీధి కుక్క సోమవారం రాత్రి స్థానిక వాగులో పడిపోవడంతో చనిపోయిందని స్థానిక పోలీసుల సమాచారాన్ని ఉటంకిస్తూ చౌదరి తెలిపారు. అయితే ఆ ప్రాంతానికి చెందిన మాజీ సైనికుడు, సామాజిక కార్యకర్త అలాంటి కుక్కలు 3 ఉన్నాయని చెప్పారు. “ఆ ప్రాంతంలో నిల్వ ఉన్న మొక్కజొన్న పంటల్లో ఈ కుక్కలకు సులభంగా దాక్కునే అవకాశం లభిస్తుండటంతో సమస్య తీవ్రంగా మారింది” అని ఆయన తెలిపారు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్!
అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.అమెరికాలో F-1 విద్యార్థి వీసాపై చదివే విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం అక్కడే ఉండి తమ విద్యకు సంబంధించిన రంగంలో ఉద్యోగం చేసే అవకాశం OPT ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు OPT కింద పనిచేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు చేసిన వారికి ఈ గడువు మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ఉద్యోగ అనుభవం సంపాదించడంతో పాటు, తర్వాత H-1B వర్క్ వీసా పొందేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఈ అవకాశానికి ఏకంగా 100,000 డాలర్ల ఫీజు విధించే ఆలోచన ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల మార్గం మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా తుది ప్రకటన వెలువడలేదు.ఎవరిపై భారం పడనుంది?ప్రతిపాదిత ఫీజును విద్యార్థులే చెల్లించాలా? లేక వారిని ఉద్యోగంలోకి తీసుకునే కంపెనీలే చెల్లించాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులే చెల్లించాల్సి వస్తే.. చాలా మందికి ఇది అందనంత భారంగా మారే అవకాశం ఉంది. కంపెనీలు చెల్లించాల్సి వస్తే.. విదేశీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంపై సంస్థలు వెనుకడుగు వేసే పరిస్థితి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికన్ విద్యార్థులకు ప్రాధాన్యం పెరిగి, అంతర్జాతీయ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.భారతీయ విద్యార్థులపై ప్రభావం ఎంత?అమెరికా ఉన్నత విద్యకు భారతీయ విద్యార్థులు ప్రధాన వర్గంగా ఉన్నారు. ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే కాకుండా.. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేసి అంతర్జాతీయ అనుభవం పొందాలనే లక్ష్యంతో అమెరికాకు వెళ్తున్నారు.అమెరికా విద్య కోసం కుటుంబాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో.. OPTపై భారీ ఫీజు ప్రతిపాదన విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.నాలుగేళ్ల వీసా పరిమితి కూడా!OPT ఫీజు ప్రతిపాదనతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనల్లో మరో కీలక మార్పు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు విదేశీ విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” విధానంలో అమెరికాలో ఉండేవారు. అంటే.. వారు తమ కోర్సును నిబంధనల ప్రకారం కొనసాగిస్తున్నంత కాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది.తాజా ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే ఉండే అనుమతి ఇవ్వాలనే ఆలోచన ఉంది. అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న కారణంఅమెరికా వలస విధానాన్ని మరింత పర్యవేక్షించడం, చట్టబద్ధమైన వలస వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ భద్రతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే విద్యా రంగ నిపుణులు మాత్రం.. ఇలాంటి నిబంధనలు అమెరికాను అంతర్జాతీయ విద్యార్థులకు తక్కువ ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికిప్పుడు ఆందోళన అవసరం లేదా?$100,000 OPT ఫీజు ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే అమెరికా వలస విధానంలో క్రమంగా కఠినమైన మార్పులు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసి అక్కడే కెరీర్ నిర్మించుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై మార్గం మరింత ఖరీదైనదిగా, నిబంధనలతో కూడుకున్నదిగా మారే అవకాశం ఉంది.
శ్రీ బాలాజీ దేవాలయంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం
యూకేలోని గ్లౌసెస్టర్షైర్ ప్రాంతంలో తాత్కాలిక శ్రీ బాలాజీ ఆలయం ఏర్పాటు తోపాటు ఘనంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది ఆధ్యాత్మిక శక్తి, ఐక్యతలకు నిదర్శంనగా నిలిచింది ఈ వేడుక. విదేశీగడ్డపై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు భక్తులంతా వాలంటీర్గా ముందుకు వచ్చి.. సనాతన ధర్మ స్ఫూర్తిని చాటడం విశేషం. ఈ వేడుకలో పురోహిత విధులను అరవింద్, లక్ష్మి, సహస్ర నిర్వహించగా, ఆలయ కార్యక్రమాల్ని దిగ్విజయంగా జరిగేలా శ్రీనిరెడ్డి, మాధురి కుటుంబం, అలాగే శ్రీలక్ష్మీ, శ్రీని అర్గిల్ల, శిల్ప కుటుంబం పర్యవేక్షించింది. నరేష్, సురేష్ బండారులు విగ్రహాలను సమకూర్చగా, మహిళలు, చిన్నారులు స్వామి అలకంరణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు శ్రీలక్ష్మీ, రాజేష్, నానీ, సోను కుటుంబ సభ్యులు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలా వాలంటీర్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవిశ్రాంతంగా సేవలందించారు. ఇది గ్లౌసెస్టర్ హిందూ సమాజపు బలాన్ని, సనాతన ధర్మ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. (చదవండి: న్యూయార్క్లో వైభవంగా ఆషాఢమాస బోనాలు)
అట్లాంటా: విజయవంతంగా ‘వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్’
అట్లాంటాలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలను వివరించారు. వైఎస్సార్సీపీ చేపడుతున్న Let’s Speak for Jagananna, Let’s Write for Jagananna, Let’s Post for Jagananna, Let’s Code for Jagananna’’ కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో Online Reputation Management-ORM ప్రాధాన్యతను ప్రత్యేకంగా వివరించారు. కేవలం పోస్టులు చేయడం, కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా.. స్పష్టమైన లక్ష్యం, సమన్వయంతో ముందుకు సాగాలని ఎన్ఆర్ఐ కార్యకర్తలకు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు.వాస్తవాలను ప్రజలకు సమర్థంగా చేరవేయాలన్న సాంబశివారెడ్డి.. తప్పుడు ప్రచారాలను ఆధారాలతో ఎదుర్కోవాలని సూచించారు. YSRCP NRI Wing Portal, Jagan 2.0 Super యాప్ల కూడా అవగాహన కల్పించారు. మన గ్లోబల్ డిజిటల్, సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
న్యూయార్క్లో వైభవంగా ఆషాఢమాస బోనాలు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా ప్రతిబింబించేలా స్థానిక ఐసెన్ హోవర్ పార్క్లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. లాంగ్ ఐలాండ్ (నాస్సా కౌంటీ) డిప్యూటీ డైరెక్టర్ మెంగ్ లీ, లెజిస్లేటర్ రోజ్ మేరీ వాకర్, టౌన్ క్లర్క్ రాగిని శ్రీవాస్తవ ఈ వేడుకలకు అతిథులుగా హాజరయ్యారు..ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రముఖ కళాకారులు, కవులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, గాయకుడు సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్యలు ప్రత్యేకంగా తమ పాటలు, ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు.అలాగే పద్మ కోడెల చేతుల మీదుగా జరిగిన అమ్మవారి అలంకరణ, పోతురాజు వేషధారణలో ఆశోక్ చింతకుంట చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అమెరికా నేలపై తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన ఈ బోనాల సంబరాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి.
క్రైమ్
రెజ్లర్ సుశీల్కు బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ: హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్న ఆందోళనల దృష్ట్యా జస్టిస్ పురుషైంద్ర కుమార్... సుశీల్ బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పతకం... 2012 లండన్ ఒలింపిక్స్లో రజతం నెగ్గిన సుశీల్ కుమార్ను 2021లో యువ రెజ్లర్ సాగర్ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్రశాల్ స్టేడియం హత్య కేసులో ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. సుశీల్ కుమార్ నుంచి తుపాకీ స్వాదీనం చేసుకోవడం, వీడియో ఆధారాలు ఉండటం ఆరోపణలను బలపరుస్తున్నాయని తెలిపింది. సుశీల్ కుమార్కు సమాజంలో ఉన్న పలుకుబడితో గతంలో అతడికి బెయిల్ లభించిన ప్రతిసారీ సాక్షులను ప్రభావితం చేశారని సుప్రీంకోర్టు కూడా గుర్తించినట్లు హైకోర్టు పేర్కొంది. కేసు ఏంటంటే... భూ వివాదాల నేపథ్యంలో జూనియర్ నేషనల్ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ ధన్కర్ను 2021లో సుశీల్ కుమార్ తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు. అనంతరం అతడిని ఛత్రశాల్ స్టేడియంకు తీసుకువచ్చి బేస్బాల్ బ్యాట్లు, హాకీ స్టిక్స్తో దారుణంగా కొట్టారు. దీంతో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఘటన అనంతరం కొన్ని రోజులు పరారీలో ఉన్న సుశీల్ కుమార్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది బెయిల్ మీద బయటకు వచ్చిన సుశీల్ కుమార్ సాక్షులను ప్రభావితం చేసి విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించిన సుప్రీంకోర్టు బెయిల్ను రద్దుచేసింది.
బయటికి రావాలంటే రూ.84 లక్షల బ్లడ్మనీ చెల్లించాల్సిందే..
నిజామాబాద్: పొట్టకూటి కోసం వలస వెళ్లిన యువకుడు సౌదీ అరేబియా దేశంలోని రియాద్ జైలులో మగ్గుతున్నాడు. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దివ్యాంగురాలైన భార్య చంటి బిడ్డను పట్టుకుని భర్త రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. తమ బిడ్డ తిరిగి రావాలని ఆ యువకుడి తల్లిదండ్రులు దేవుళ్లను వేడుకుంటున్నారు. కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాననే ఆశతో వలస వెళ్లిన యువకుడు శ్రావణ్కుమార్ కుటుంబ పరిస్థితి ఇది. సాలూర మండలం కుమ్మన్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రామయ్య, రాజమణి దంపతుల కుమారుడు శ్రావణ్కుమార్ (32). జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతల్పేటకు చెందిన దివ్యాంగురాలు మమతను 2022లో శ్రావణ్ పెళ్లి చేసుకున్నాడు. 2023 నవంబర్లో ఉపాధి కోసం సౌదీ అరేబియా దేశం రియాద్కు వెళ్లిన శ్రావణ్ అక్కడి ఓ ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ కంపెనీలో అంబులెన్స్ డ్రైవర్గా పనిలో చేరాడు. మంచి ఉద్యోగం రావడంతో తన కలలు సాకరమవుతాయని సంబురపడిన శ్రావణ్పై కోలుకోలేని దెబ్బపడింది. 2024 మే 6వ తేదీన శ్రావణ్ నడుపుతున్న అంబులెన్స వాహనం రోడ్డు ప్రమాదానికి గురికాగా.. ఈ ప్రమాదంలో స్థానికులైన భార్యాభర్తలు మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడి పోలీసులు శ్రావణ్ను అరెస్టు చేసి జైలు తరలించారు. కొన్ని నెలల్లోనే అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రోడ్డు ప్రమాద ఘటనకు శ్రావణ్కుమార్ను నేరస్థుడిగా నిర్ధారించింది. రూ.3.30 లక్షల సౌదీ రియాళ్లు (బ్లడ్ మనీ – రక్తపరిహారం) బాధితకుటుంబానికి చెల్లించాలని తీర్పులో పేర్కొంది. మన దేశ కరెన్సీలో ఆ మొత్తం సుమారు రూ.84 లక్షలు. బాధిత కుటుంబాల అంగీకారం మేరకు పరిహారం చెల్లిస్తే శ్రావణ్కుమార్కు జైలు నుంచి విముక్తి పొందే అవకాశం కలుగుతుంది. పరిహారం చెల్లించకపోతే జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి ఉండదు. అంత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించే ఆర్థిక స్థోమత లేక శ్రావణ్కుమార్ కుటుంబీకులు నిస్సహాయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ్కుమార్ పై అక్కడి దేశం ట్రావెలింగ్ బ్యాన్ ఆంక్షలు పెట్టింది. గడపగడపకు వెళ్తున్న మమత తన భర్తను జైలు నుంచి విడిపించాలని దివ్యాంగురాలైన మమత కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులను వేడుకుంటోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తోపాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాకు చెందిన ఎంపీకి, పలువురు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు అందజేసింది. ఈ ఏడాది మే 29న హైదరాబాద్లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలో తమ పరిస్థితిని వివరించింది. తన భర్తను తీసుకురావాలని వేడుకుంది. ప్రభుత్వం ఆదుకోవాలి మాది నిరుపేద కుటుంబం. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న నా కొడుకు రెండేళ్ల నుంచి సౌదీ అరేబియా జైలులో ఉన్నాడు. రెక్కల కష్టంపై బతుకుతున్నాం. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి. – కుమ్మరి రామయ్య, శ్రావణ్కుమార్ తండ్రి మమ్మల్ని ఆదుకోండి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మానవతావాదులు స్పందిస్తేనే మా కుటుంబం ఈ గండం నుంచి గట్టెక్కుతుంది. నేనే దివ్యాంగురాలిని చంటి బిడ్డను పట్టుకుని తిరుగుతున్నా. మా అత్తామామలు తల్లడిల్లుతున్నారు. సౌదీ అరేబియా కోర్టు చెప్పిన జరిమానా చెల్లించే స్థోమత మాకు లేదు. – మమత, శ్రావణ్కుమార్ భార్య
‘రాము.. ఇంటికి రా..!’ అర్ధరాత్రి ప్రియుడికి భార్య ఫోన్
కర్ణాటక: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను చంపి అతని మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టిన దారుణ ఘటనలో 6 నెలల తర్వాత సదరు నిందితురాలు పోలీసుల వలలో చిక్కింది. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కడక్లాట్లో ఈ దురంతం చోటు చేసుకుంది. వివరాలు.. రఘు గవాడే(40) హత్యకు గురైన వ్యక్తి. ఇతని భార్య బంగారి గవాడే, ప్రియుడు రాము రాణా నిందితులు. గత ఫిబ్రవరి 7న రాజు గవాడేను హత్య చేసి, భర్త పని కోసం వేరే ఊరికి వెళ్లాడని అందరినీ కిరాతక భార్య నమ్మించింది. బంగారి గవాడేకు రాము రాణాతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో భార్యపై అనుమాన పడుతూ రఘు ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న రాత్రి మద్యం తాగి వచ్చి ఘర్షణ పడ్డాడు. దీంతో ఆక్రోశానికి గురైన భార్య ప్రియుడు రామును పిలిపించి గాఢ నిద్రలో ఉన్న రఘు గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం అర్ధరాత్రి టాటాఏస్ వాహనంలో పొలానికి శవాన్ని తరలించి దాచిన నిందితులు ఫిబ్రవరి 8న చెరకు చేనులో గొయ్యి తీసి శవాన్ని పాతిపెట్టారని దర్యాప్తులో తేలింది. ఘటనపై కడక్లాట్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు.
గుప్త నిధుల పేరుతో రూ.7.5 లక్షలు స్వాహా
హైదరాబాద్: ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.7.5 లక్షలు తీసుకొని కనిపించకుండా పోయిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. గుడిమల్కాపూర్కు చెందిన మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36), జవహర్ నగర్ ఫర్హాన్ నగర్కు చెందిన సయ్యద్ అలీ అష్రఫ్ (40), బాలాజీ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ హాజీ (25), కీసర మండలం యాదగిరిపల్లికి చెందిన బైక్ మెకానిక్ మహ్మద్ సల్మాన్ (29)లు స్నేహితులు. మునావర్ పాత నేరస్థుడు. కార్ల పెయింటింగ్, డెంటింగ్ పనుల్లో వచ్చే ఆదాయం సరిపోక.. సులభంగా డబ్బు సంపాదించాలని కుట్రపన్నాడు. ఈ ఏడాది మార్చి 26న రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఆసిఫ్ను నిందితులు కలిశారు. జగిత్యాలలో నివాసం ఉండే ఆసిఫ్ స్నేహితుడు ఇమ్రాన్ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించారు. వాటిని తీయడానికి రూ.7.5 లక్షలు తీసుకొని కనిపించకుండా పోయారు. దీంతో ఆసిఫ్ ఈ నెల 7వ తేదీన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం మహ్మద్ మునావర్, అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు కార్లు, ఆటో, రెండు మోటారు సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్లను, నకిలీ బంగారు నాణేలు, బొగ్గును స్వా«దీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు వివిధ ప్రాంతాల్లో 11 మందిని ఇలాగే మోసం చేసి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. శంషాబాద్ జోన్ టాస్్కఫోర్స్ ఇన్స్పెక్టర్ కె. రవి, సబ్ ఇన్స్పెక్టర్లు మన్సూర్ అలీ, నర్సింగ్ రావు, ఎస్. శేషు, టాస్క్ఫోర్స్ సిబ్బంది, రాజేంద్రనగర్ పోలీసుల సహకారంతో ఈ ముఠాను పట్టుకున్నారు.
వీడియోలు
రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి
విజయ్ సంచలన నిర్ణయం.. డిప్యూటీ సీఎంగా త్రిష?
కారుతో తొక్కేసి మెడికో ప్రియాంకను చంపి పరార్.. పూర్తి CCTV ఫుటేజ్?
కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్
ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..?
భారతి సిమెంట్స్ వద్ద హై టెన్షన్.. TDP గూండాల బీభత్సం
ప్రభుత్వ భూమిపై కన్నేసిన మంత్రి నారాయణ
YS జగన్ కర్నూల్ పర్యటన షెడ్యూల్ ఇదే... పోలీసులకు మా విజ్ఞప్తి ఏంటంటే..?


