నేడు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 1,2 తేదీల్లో పులివెందులలో పర్యటించనున్నారు. 2న ఇడుపులపాయలో జరిగే దివంగత సీఎం వెఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. తొలుత.. సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల చేరుకుంటారు.అనంతరం భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బసచేస్తారు. రెండో తేదీ ఉదయం 7.45కు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
‘నా వ్యక్తిగత వివరాలెందుకు?’.. ప్రభుత్వంపై బిలావల్ నిప్పులు!
ఇస్లామాబాద్: దేశంలో నెలకొన్న కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తన వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో.. జర్దారీ షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆస్ట్రియా రాజకుటుంబానికి చెందిన మహిళతో తనకు వివాహం కుదిరినట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడారు.‘నా వివాహం ఖరారు కాలేదు, ఎలాంటి నిశ్చితార్థం జరగలేదు. ప్రిన్సెస్ గ్లోరియా అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా మా కుటుంబమే స్వయంగా ప్రకటిస్తుంది’ అని బిలావల్ స్పష్టం చేశారు. ఆగస్టు 26న ఇస్లామాబాద్లోని ‘పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (పీఐఎమ్ఎస్) ఆస్పత్రిలోని నియోనాటల్ వార్డులో అగ్నిప్రమాదం సంభవించి 14 మంది నవజాత శిశువులు మృతి చెందిన ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కనీసం ఫైర్ అలారాలు, స్ప్రింక్లర్లు లేకపోవడం, భద్రతా లోపాలపై మధ్యంతర విచారణ నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఒక ఆస్పత్రిని కూడా సరిగ్గా నిర్వహించలేని మంత్రి, పాకిస్థాన్కు గోర్బచేవ్లా మారి, దేశాన్ని 30 భాగాలుగా విభజించాలని చూస్తున్నారంటూ మంత్రి మొహసిన్ నఖ్వీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొత్త ప్రావిన్సుల ఏర్పాటు వంటి రాజ్యాంగపరమైన నిర్ణయాలను వీధుల్లో లేదా వ్యాపార సదస్సుల్లో తేల్చలేరని, వీటికి పార్లమెంటరీ, రాజ్యాంగ ప్రక్రియ అవసరమని బిలావల్ స్పష్టం చేశారు. కాగా అగ్నిప్రమాదం ఘటనపై స్పందించిన ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే ఎనిమిది మంది అధికారులను సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలకు ఆదేశించారు.ఇది కూడా చదవండి: అమెరికా: కత్తితో మహిళ వీరంగం: ఒకరి మృతి.. నిందితురాలి కాల్చివేత!
అశ్విని రాథోడ్ స్వరానికి జడ్జిలు ఫిదా!
‘ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్లో సింగిల్ సెషన్ గాయకుల ఎంపిక వేదిక అది. ఆర్కెస్ట్రాతో ఓ పాట పాడిన ఆమెను న్యాయనిర్ణేతలో ఒకరైన ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి జోక్యం చేసుకుని ఇదే పాటను ఆర్కెస్ట్రా లేకుండా పాడగలవా అని కోరతాడు.. ఆమె అదే బేస్ వాయిస్తో రేలారే..రేలారె.. నీళ్లల్ల నిప్పల్లె.. వచ్చింది నిజమల్లె’ అంటూ పాడడంతో ఆయనతోపాటు మరో జడ్జి, ప్రముఖ నేపథ్య గాయకురాలు శైలజ మంత్రముగ్ధులవుతారు. చప్పట్లతో హోరెత్తిస్తారు. ఇదే క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు కొదవలేదు. సరైన ప్రోత్సాహం లభిస్తే పల్లె ముద్దుబిడ్డలు కూడా అద్భుతాలు సృష్టిస్తారని నిరూపిస్తోంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం గాజరాంపల్లి తండాకు చెందిన బంజారా బిడ్డ, గాయని అశ్విని రాథోడ్. నల్లబంగారం కొలువైన నేలపై పుట్టిన ఆమె.. తన గానామృతంతో ఆ నేలకు, పుట్టిన ఊరికి ప్రత్యేక గుర్తింపు తెస్తోంది. చిన్నప్పటి నుంచే ఆమె సంగీతంపై ఆసక్తి పెంచుకుని తన మధుర గాత్రంతో పాటలు పాడుతోంది.ఏడేళ్ల సంగీత ప్రయాణం.. అశ్విని ఏడేళ్లుగా నిరంతర సాధన చేస్తూ సంగీతలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రారంభంలో గ్రామాల్లో జరిగే సాంస్కృతిక కా ర్యక్రమాల వేదికలపై పాటలు పాడుతూ ప్రేక్షకుల ను అలరించిన ఆమె క్రమంగా స్టూడియో రికార్డింగ్స్, సింగిల్ సెషన్స్ పాడే స్థాయికి ఎదిగింది. భావోద్వేగాలను పలికించే గాత్రం స్పష్టమైన ఉచ్ఛరణ ఆమె సొంతం. View this post on Instagram A post shared by Ashwini Rathod 🎙️ (@ashwinirathod.1)సరిగమప వేదికపై ప్రతిభఇటీవల ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సరిగమప సింగింగ్ రియాలిటీ షోలో అశ్విని పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఎందరో గాయనీగాయకుల మధ్య పోటీపడి తన గాత్ర మాధుర్యంతో న్యాయనిర్ణేతలను మెప్పించారు. మారుమూల పల్లెటూరు నుంచి వెళ్లి అంతటి ప్రతిష్టాత్మక వేదికపై పాడి జిల్లా కీర్తిని దశదిశలా చాటారు.ఇటీవల కాలంలో విడుదల అవుతున్న సింగిల్ ట్రాక్స్, స్టూడియో సెషన్స్లో తన గానంతో అశ్విని రాథోడ్ ప్రతిభ కనబరుస్తోంది. జానపద, భక్తి, సినీ గీతాలను సునాయాసంగా ఆలపిస్తూ సంగీత దర్శకుల మన్ననలు పొందుతోంది. మారుమూల తండా నుంచి వచ్చి ఎలాంటి పెద్ద సంగీత నేపథ్యం లేకపోయినా స్వయంకృషితోనే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎందరో గ్రామీణ కళాకారులకు ఆదర్శంగా నిలుస్తోంది.మరిన్ని అవకాశాలు రావాలి..అశ్విని సంగీతంలో రాణిస్తుండడంతో గాజరాంపల్లి తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారుమూలతండా నుంచి వచ్చిన ఇలాంటి ప్రతిభావంతురాలికి ప్రభుత్వం, సినీ పరిశ్రమ మరిన్ని అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలని ప్రజలు, కళాభిమానులు కోరుతున్నారు.పాటలు పాడడం అంటే ఇష్టం..సంగీతమే నా ప్రాణం. చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే ఎంతో ఇష్టం. ఏడేళ్లుగా ఎన్నో అనుభవాలు, సవాళ్లను ఎదుర్కొంటూ పాటలే సర్వస్వంగా ముందుకుసాగుతున్నా. ప్రముఖ వేదికలపై పాడడంతోపాటు గొప్ప నేపథ్య గాయనిగా ఎదడగమే నా జీవిత ఆశయం. నాకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకుధన్యవాదాలు.– అశ్విని, గాయని , వరంగల్ జిల్లాచదవండి: Nithya Menen: ఇన్నాళ్లు హీరోయిన్.. ఇప్పుడు కొత్త బాధ్యతలు
లేస్ నుంచి మ్యాగీ వరకు.. అసలేం జరుగుతుందంటే?
మీరు షాపుల్లో కొనుగోలు లేస్, కుర్కురే, మ్యాగీ ప్యాకెట్పై తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీ నిజమేనని నమ్ముతున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించాల్సిందే! నవీ ముంబైలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్యాకెట్లపై ఉన్న అసలు తేదీలను చెరిపేసి.. కొత్త తేదీలతో స్టిక్కర్లు అంటించి, గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం కలకలం రేపుతోంది. అధికారుల దాడుల్లో ఏకంగా రూ.75 లక్షలకు పైగా విలువైన సరుకు పట్టుబడింది.మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), నవీ ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో లేస్, కురుకురే, మ్యాగీ, నార్, రసోయ్, హెల్మాన్స్, థమ్స్ అప్, లిమ్కా వంటి శీతల పానీయాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్ట్ 24 నుంచి 29 మధ్య టర్బే పారిశ్రామిక ప్రాంతాలలో సాధనా ఎంటర్ప్రైజెస్ ప్రాంగణంలో ఈ దాడులు నిర్వహించారు.ఆహార ప్యాకేజింగ్పై ముద్రించిన తేదీలను తొలగించి వాటిపై వేరే తేదీలను ముద్రిస్తున్నారు. అసలు తయారీ సమాచారాన్ని చెరిపివేయడానికి ఇంక్జెట్ ప్రింటర్లు, థిన్నర్లు, ప్రత్యేకంగా తయారు చేసిన స్టిక్కర్లను ఉపయోగిస్తున్నట్లు ఎఫ్డీఐ అధికారులు గుర్తించారు. పదార్థాలు, పోషకాహార విలువలకు సంబంధించిన వివరాలున్న లేబుళ్లను తొలగించి.. వాటి స్థానంలో కొత్త స్టిక్కర్లను అతికించినట్లు తేలింది. ముంబైతో పాటు ఢిల్లీ, నోయిడాకు చెందిన ఎగుమతి-దిగుమతి కంపెనీలకు కూడా ఈ మోసంలో ప్రమేయం ఉన్నట్లు సమాచారం.
భారీగా పెరిగిన గణపతి విగ్రహాల ధరలు
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
‘నా వ్యక్తిగత వివరాలెందుకు?’.. ప్రభుత్వంపై బిలావల్ నిప్పులు!
ఒకే ఇంట్లో బయటపడ్డ 23 మృతదేహాలు!
అందరినీ తొలగించి కాంగ్రెస్ వారిని పెడతాం..
Viral Video: హైవేపై ‘ఫ్యామిలీ’ భోజనం
‘నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’
యువతకు ఉద్యోగావకాశాలు.. కుమారస్వామి కీలక వ్యాఖ్యలు!
'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని
కన్నడ పొలిటికల్ హీట్.. కుమారస్వామికి ప్రియాంక్ ఖర్గే సవాల్
జియో రీచార్జ్: రూ.199కే 1.5 GB ప్లాన్
ఆ తండ్రీకొడుకులది... అసలు పని ఈ తండ్రీ కొడుకులది.. క్రెడిట్ చోరీ!
నవ్వుతో నెట్టింట గెలిచాడు! ఎన్నో మీమ్స్, రీల్స్కి కేరాఫ్ అడ్రస్!!
ఆమె కన్నీటి శాపమే.. నేపాల్ను వెంటాడుతోందా?
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బకు 57 ఏళ్ల రికార్డ్ బ్రేక్
తేలాల్సింది మా బలం కాదయ్యా అంటే వినవేం!!
మేం విడాకులు తీసుకున్నాం.. కానీ పాప విషయంలో
'ఇరుముడి'లో అయ్యప్ప పాట.. ఫుల్ వీడియో రిలీజ్
చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్లో తోపులు.. ఎవరికి ఎంతంటే?
బేరాలాడకండి.. ఇదేమీ డీఎస్సీ ఉద్యోగం కాదు చౌకగా దొరికేదానికి..!!
జానీ మాస్టర్ భార్యకు షాక్.. పదవి నుంచి తొలగింపు
అతడి బౌలింగ్లో పసలేదు.. ఇలా అయితే కష్టమే: గవాస్కర్
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
‘థమన్కు 10 లక్షలా?.. కోర్టులో విజయ్ మాస్ కౌంటర్!
కర్ణాటకలో ఐఏఎస్ అధికారి గంగ్వార్ అరెస్ట్
భాష రాదని ఆపలేదు.. ఆటో డ్రైవర్ వినూత్న ప్రయోగం
12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
ప్చ్.. నువ్వు ఉన్నంత కాలం ఉంటుంది!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
IND vs AFG: టీమిండియాలోకి ఊహించని ప్లేయర్!
భారీగా పెరిగిన గణపతి విగ్రహాల ధరలు
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
‘నా వ్యక్తిగత వివరాలెందుకు?’.. ప్రభుత్వంపై బిలావల్ నిప్పులు!
ఒకే ఇంట్లో బయటపడ్డ 23 మృతదేహాలు!
అందరినీ తొలగించి కాంగ్రెస్ వారిని పెడతాం..
Viral Video: హైవేపై ‘ఫ్యామిలీ’ భోజనం
‘నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’
యువతకు ఉద్యోగావకాశాలు.. కుమారస్వామి కీలక వ్యాఖ్యలు!
'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని
కన్నడ పొలిటికల్ హీట్.. కుమారస్వామికి ప్రియాంక్ ఖర్గే సవాల్
జియో రీచార్జ్: రూ.199కే 1.5 GB ప్లాన్
ఆ తండ్రీకొడుకులది... అసలు పని ఈ తండ్రీ కొడుకులది.. క్రెడిట్ చోరీ!
నవ్వుతో నెట్టింట గెలిచాడు! ఎన్నో మీమ్స్, రీల్స్కి కేరాఫ్ అడ్రస్!!
ఆమె కన్నీటి శాపమే.. నేపాల్ను వెంటాడుతోందా?
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బకు 57 ఏళ్ల రికార్డ్ బ్రేక్
తేలాల్సింది మా బలం కాదయ్యా అంటే వినవేం!!
మేం విడాకులు తీసుకున్నాం.. కానీ పాప విషయంలో
'ఇరుముడి'లో అయ్యప్ప పాట.. ఫుల్ వీడియో రిలీజ్
చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్లో తోపులు.. ఎవరికి ఎంతంటే?
బేరాలాడకండి.. ఇదేమీ డీఎస్సీ ఉద్యోగం కాదు చౌకగా దొరికేదానికి..!!
జానీ మాస్టర్ భార్యకు షాక్.. పదవి నుంచి తొలగింపు
అతడి బౌలింగ్లో పసలేదు.. ఇలా అయితే కష్టమే: గవాస్కర్
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
‘థమన్కు 10 లక్షలా?.. కోర్టులో విజయ్ మాస్ కౌంటర్!
కర్ణాటకలో ఐఏఎస్ అధికారి గంగ్వార్ అరెస్ట్
భాష రాదని ఆపలేదు.. ఆటో డ్రైవర్ వినూత్న ప్రయోగం
12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
ప్చ్.. నువ్వు ఉన్నంత కాలం ఉంటుంది!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
IND vs AFG: టీమిండియాలోకి ఊహించని ప్లేయర్!
ఫొటోలు
యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)
పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)
యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)
‘ఐ యామ్ గేమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా నాగ్ అశ్విన్ (ఫొటోలు)
కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)
‘కూర్మావతార్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు
ట్రెండింగ్లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)
అమెరికా ట్రిప్లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు
'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్గా (ఫొటోలు)
సినిమా
భావోద్వేగాలు బలంగా ఉంటాయి: అనంతిక సనిల్కుమార్
‘‘రోమాంచకం’ చిత్రంలో ప్రేమ, హాస్యం, ఉత్కంఠ... ఈ మూడు భావోద్వేగాలు బలంగా ఉంటాయి. ఈ మూడింటిలో నాకు ఉత్కంఠ బాగా నచ్చింది. ఈ ఉత్కంఠ కూడా ప్రేమవల్లే అవుతుంది. అది ఎలా జరిగింది? అనేది సినిమాలోనే చూడాలి. నేను గతంలో చేసిన పాత్రలకు భిన్నంగా ‘రోమాంచకం’లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాని మేము ఎంత సరదాగా, సంతోషంగా చేశామో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అని హీరోయిన్ అనంతిక సనిల్కుమార్ తెలిపారు. సుమంత్ ప్రభాస్, అనంతిక జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అనంతిక సనిల్కుమార్ మాట్లాడుతూ–‘‘8 వసంతాలు’ సినిమా తర్వాత చాలా కథలు విన్నప్పటికీ ఎగై్జటింగ్గా అనిపించలేదు. ‘రోమాంచకం’ కథ విన్నాక చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలో బబ్లీ గర్ల్, సరదాగా ఉండే తమిళ అమ్మాయిగా కనిపిస్తా. ఇది ప్రేమ కథా చిత్రమే అయినప్పటికీ యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సుమంత్ ప్రభాస్ పాత్ర ఈ మూవీలో చాలా ఎనర్జిటిక్గా ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా ఆయనతో పోటీ పడేలా తీర్చిదిద్దారు డైరెక్టర్ వేణుగోపాల్గారు. సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డిగార్లు నా పాత్ర చాలా బాగా వచ్చిందని అభినందించడం సంతోషం. అయితే ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నాను. యాక్షన్, డ్యాన్స్ బేస్డ్ సినిమాలు వచ్చినా చేయడానికి సిద్ధమే. ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నా. తెలుగులో చర్చలు జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు.
మళ్లీ తన ఫేవరెట్ జానర్లోకి శ్రీవిష్ణు
ఇటీవల కాలంలో మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాడు హీరో శ్రీవిష్ణు. కొంత గ్యాప్ తరువాత మరోసారి అదే జానర్లోకి ఎంటరయ్యాడు ఈ హీరో. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.నేటి యువత అనుభవాలు, భావోద్వేగాలు, కలలు, జీవిత పోరాటాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'ఇది మన అందరి కథ’ అనే ట్యాగ్లైన్తో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. యానిమేషన్తో మొదలైన ఈ గ్లింప్స్ హీరో క్యారెక్టరైజేషన్ను ఆసక్తికరంగా పరిచయం చేసింది. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాతో సన్నీ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తనకు బాగా కలిసొచ్చిన మిడిల్ క్లాస్ పాత్రతో ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ చిత్రానికి చందు, రవి సంగీతమందించనున్నారు.ఈ సినిమా తరువాత హీరో రవితేజతో కలిసి 2027 సంక్రాంతి పండక్కి ఆడియన్స్ ముందుకు రానున్నారట. రవితేజ హీరోగా ‘రాజ రాజ చోర’ ఫేమ్ హసిత్గోలి దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. కథ రీత్యా ఇది మల్టీస్టారర్ మూవీ అని, రవితేజతో పాటు శ్రీవిష్ణు మరో లీడ్ రోల్లో నటించనున్నారని సమాచారం.
కార్తీ యాక్షన్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ హీరో కార్తి నటించిన సీక్వెల్ సర్దార్-2. ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. గతంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన సర్దార్కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఓ మిషన్ చుట్టూ కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ ట్రైలర్లో ఫుల్ యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. విలన్గా ఎస్జే సూర్య కనిపించడం ఈ చిత్రానికి మరింత ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం.. సెప్టెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ మూవీలో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతమందించారు. #Sardar2 Trailer is here! Tamil : https://t.co/XetVn1ESqfTelugu : https://t.co/bDJ6ffBYWB#Sardar2FromSep10— Karthi (@Karthi_Offl) August 31, 2026
ఏషనాగుల సాంగ్.. నాని, అనిరుధ్ వీడియో వైరల్
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్'. ఈ సినిమాకు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ.. షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఆయా షేర్ సాంగ్ ఆడియన్స్లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాయి.ఇటీవలే ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఏషనాగుల కట్టమీద అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ సైతం ఊహించని విధంగా యూట్యూబ్లో దూసుకెళ్తోంది. రిలీజైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్తో అదరగొడుతోంది.తాజాగా ఈ పాటకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హీరో నాని, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కలిసి చేసిన సరదా వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నాని, అనిరుధ్ న్యూయార్క్లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ వద్ద లైట్లతో ఓ రిక్షాలో సందడి చేశారు. ఈ క్రమంలో ఏషనాగుల పాట బీట్కు దరువు వేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. NANI & ANI are us. Vibing to #YeshaNagula everywhere and anywhere 🔥🔥#TheParadise second single is TRENDING #1 on YouTube ▶️ https://t.co/ffTvysQUod pic.twitter.com/9jIf1NfADQ— THE PARADISE (@TheParadiseOffl) August 31, 2026
క్రీడలు
US Open 2026: సబలెంకా శుభారంభం
యూఎస్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్, ప్రపంచ నంబర్ వన్ ఆర్యనా సబలెంకా శుభారంభం చేసింది. ఇటీవల ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న ఆమె, తొలి రౌండ్లో కొలంబియాకు చెందిన కామిలా ఒసోరియోపై 6-2, 6-4 తేడాతో సునాయాస విజయం సాధించింది. తద్వారా రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. గత 21 యూఎస్ ఓపెన్ మ్యాచ్ల్లో సబలెంకాకు ఇది 20వ విజయం కావడం విశేషం. రెండో రౌండ్లో సబలెంకా పోలినా ఇయాట్చెంకోతో తలపడనుంది.పేలవ ఫామ్యూఎస్ ఓపెన్కు ముందు సబలెంకా పేలవ ఫామ్లో ఉండింది. ఏప్రిల్ నుంచి ఆమె రికార్డు 17-7గా ఉంది. ఇటీవల ఆడిన రెండు హార్డ్కోర్ట్ టోర్నీల్లోనూ ప్రారంభ దశలోనే నిష్క్రమించింది. దీంతో యూఎస్ ఓపెన్లో ఆమె టైటిల్ను కాపాడుకోగలదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే సబలెంకా తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసి తొలి రౌండ్ను అధిగమించింది.చదవండి: జకోవిచ్.. ప్లీజ్ రిటైరవ్వు; ఇలా చూడలేకపోతున్నాం!
తరానికొక్కడు.. అల్విదా లియోనల్ మెస్సీ
మెస్సీ ఒక ఉత్పాతం, మౌన ముని. ఎన్ని అడ్డంకులు, వివాదాలు ఎదురైనా తన ఆటతోనే సమాధానం చెప్పాడు తప్ప హద్దులు మీరిన సందర్భాలు చాలా తక్కువ. నిజానికి మెస్సీకి కోపం కూడా ఎక్కువే. కానీ దాని అవసరం ఎంతమేర ఉంటుందో అంతే చూపిస్తుంటాడు. కాబట్టే ఇవాళ ప్రపంచంలో ప్రతీ మూలన అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో ఫుట్బాల్ పీలే, మారడోనా సహా ఎందరో దిగ్గజ ఆటగాళ్లను అందించినప్పటికీ ఈ తరంలో మాత్రం మెస్సీనే దిగ్గజ ఆటగాడు. ఇంకా చెప్పాలంటే అతడో ఆరాధ్య దైవం.అలాంటి ఈ తరంలో ఫుట్బాల్ తెలిసినోడిని నిద్రలో నుంచి లేపి ఒక ఆటగాడి పేరు చెప్పమంటే మొదట వినిపించే పేరు లియోనల్ మెస్సీ. రెండు దశాబ్దాలుగా తన ఆటతో ఫుట్బాల్ అభిమానుల గుండెల్లో గుడి కట్టేసుకున్న మెస్సీ చూడాల్సినవన్నీ చూశాడు. ఎనిమిది సార్లు బాలన్ డీ ఓర్ అవార్డు, ఆరుసార్లు యూరోపియన్ గోల్డెన్ షేస్, ఎనిమిది సార్లు ఫిఫా బెస్ట్ ప్లేయర్, అలాగే 2025లో ఆల్టైమ్ బెస్ట్ ప్లేయర్గాను నిలిచాడు. తన కెరీర్లో లోటుగా ఉన్న ఫిఫా ప్రపంచకప్ను కూడా నాలుగేళ్ల కిందట ఖతార్లోనే అందుకున్నాడు. అల్విదా మెస్సీ.లియోనల్ మెస్సీ పూర్తి పేరు లియోనల్ ఆండ్రస్ మెస్సీ. 24 జూన్ 1987లో అర్జెంటినాలో జన్మించాడు. తండ్రిపేరు జార్జ్ మెస్సీ, తల్లి మారియా. చిన్నప్పటినుంచే మెస్సీ క్రీడలపై ఆసక్తి చూపేవాడు. మెస్సీని ఫుట్బాల్ క్రీడాకారుడిగా తీర్చి దిద్దడంలో అతని అమ్మమ్మ కీలక పాత్ర పోషించింది. మెస్సీ శిక్షణకు, మ్యాచులకు ఆమె తోడుగా వెళ్లడంతో పాటు, డబ్బులు ఇస్తుండేది. మెస్సీకి పదకొండు సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె మరణించింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ తర్వాత చాలా ప్రమాదకరమైన వ్యాధితో మెస్సీ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సకాలంలో చికిత్స దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాడు. కుటుంబమంతా శ్రమించి అతని వైద్యానికి డబ్బులు సమకూర్చేది. దాదాపు చావు అంచుల్లోకి వెళ్లిన మెస్సీకి.. బార్సీలోనాకు చెందిన కోచ్ సాయం చేశాడు. బదులుగా బార్సీలోనా జట్టుకు మెస్సీ ఆడాల్సి ఉంటుందని కండిషన్ పెట్టాడు. దీనికి మెస్సీతో పాటు కుటుంబం మొత్తం అంగీకరించింది. మెస్సీ కోలుకున్న తర్వాత కుటుంబం మొత్తం స్పెయిన్కు షిఫ్ట్ అయింది. 2003లో మెస్సీ తన మొదటి ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు.2007లో అంతర్జాతీయ అరంగేట్రంమెస్సీ ప్రదర్శనకు అవక్కాయిన సెలెక్టర్లు.. అంతర్జాతీ మ్యాచ్ల్లో ఆడే అవకాశం కల్పించారు. 17 ఆగస్టు 2007న మెస్సీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మెస్సీ ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదు. ఒకదాని తర్వాత ఒకటి సాధించుకుంటూ వెళ్లాడు. రికార్డులు సృష్టించాడు. 2012లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గిన్సిస్ వరల్డ్ రికార్డులోనూ చోటు దక్కించుకుంటున్నాడు. 2022 ఫిఫా ప్రపంచ కప్, ఒలింపిక్ స్వర్ణం, అనేక క్లబ్, వ్యక్తిగత ట్రోఫీలు గెలుచుకున్నాడు. ఎనిమిదిసార్లు ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డును గెలుచుకున్నాడు.GRACIAS PARA TODA LA VIDA 💙🇦🇷El EMOTIVO video que subió Lionel Messi tras anunciar su retiro de la Selección Argentina. pic.twitter.com/hvFgppoTXF— TyC Sports (@TyCSports) August 31, 2026చదవండి: అంతర్జాతీయ ఫుట్బాల్కు మెస్సీ గుడ్ బై
అంతర్జాతీయ ఫుట్బాల్కు మెస్సీ గుడ్ బై
అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఈతరం ఫుట్బాల్ శకంలో దిగ్గజ ఆటగాడిగా పేరు పొందిన మెస్సీ సోమవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్లో 207 మ్యాచ్లాడిన మెస్సీ 125 గోల్స్ సాధించాడు. అంతర్జాతీయ ఫుట్బాల్ ఆల్ టైమ్ గోల్ స్కోరర్స్ జాబితాలో మెస్సీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో అర్జెంటీనా సారథిగా అన్నీ తానై జట్టును నడిపించాడు. ఫిఫా చరిత్రలోనే అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కిన మెస్సీ జట్టును ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. కానీ కీలకమైన ఫైనల్లో మెస్సీ గోల్ చేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా స్పెయిన్ 1-0తో అర్జెంటీనాను ఓడించి ఫిఫా ప్రపంచకప్ను కైవసం చేసుకుంది.అప్పటి నుంచే మెస్సీ అంతర్జాతీయ రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే మెస్సీ మాత్రం వచ్చే ఫిఫా వరల్డ్కప్ వరకు ఆడకపోయినప్పటికీ, కొంతకాలం పాటు జట్టు తరఫున ఆడాలని తొలుత భావించాడు. కానీ తన రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని భావించిన మెస్సీ సోమవారం గుట్టుచప్పుడు కాకుండా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. మెస్సీ తన దేశానికి 2022 ఫిఫా ప్రపంచ కప్తో పాటు 2021, 2024 రెండు కోపా అమెరికా టైటిళ్లను అందించాడు.“అర్జెంటీనా జెర్సీ కోసం తన శక్తినంతా ధారపోశాను. జట్టుతో కలిసి దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాను. అర్జెంటీనా ప్రజలను గర్వపడేలా చేయడం తనకు ఎప్పుడూ ఆనందమేజ్ఞ. ఈ నిర్ణయం నా హృదయాన్ని ఎంతో బాధించింది. జాతీయ జట్టులో తనకు ఇక ఇవ్వడానికి ఏమీ మిగలలేదు. యువ ఆటగాళ్లు జాతీయ జట్టులోకి రావడానికి ఇదే సరైన సమయం. 20 ఏళ్లుగా అందించిన ప్రేమ, అభిమానానికి అర్జెంటీనా ప్రజలకు కృతజ్ఞతలు. ఇకపై జాతీయ జట్టును బయట నుంచి అభిమానించే సాధారణ అభిమానిగా ఉంటాను. కుటుంబం, కోచ్లు, సహచరులు, జట్టు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. జాతీయ జట్టుతో గడిపిన అనుభవాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. సహచరులతో కలిసి అభిమానులకు కలలలాంటి క్షణాలు అందించగలిగినందుకు గర్వంగా ఉంది. నన్ను అర్జెంటీనియన్గా పుట్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు" అని తన రిట్మెర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు.🚨🚨🚨 BREAKING:LIONEL MESSI BECOMES THE FIRST PLAYER EVER TO RETIRE FROM THE NATIONAL TEAM TWICE.pic.twitter.com/B37oHMhpNx— The CR7 Timeline (@TimelineCR7) August 31, 2026Read: సిరీస్ ఓటమి; పాక్ జట్టులో మార్పులు.. కోచ్ పదవి ఊస్ట్!
సిరీస్ ఓటమి; పాక్ జట్టులో మార్పులు.. కోచ్ పదవి ఊస్ట్!
ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 0-2తో ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ ఓటమిని చవిచూసిన పాకిస్తాన్ రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో దారుణ పరాజయం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు ముందు జట్టులో కీలకమార్పులతో పాటు ప్రధానంగా రెడ్బాల్ కోచ్గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ పదవి ఊస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో వైట్బాల్ కోచ్గా వ్యవహరిస్తున్న మైక్ హసన్కే టెస్టు కోచ్ బాధ్యతలు అప్పజెప్పాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భావిస్తోంది. ఇదే గనుక జరిగితే మైక్ హసన్ మూడు ఫార్మాట్లకు హెడ్ కోచ్గా ఉండనున్నాడు.వరుస పరాజయాల నేపథ్యంలో టెస్ట్ జట్టు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్పై పీసీబీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ప్రస్తుతం లండన్లోనే ఉన్న మైక్ హెసన్, ఆకిబ్ జావేద్తో కలిసి ప్రిన్స్ చార్లెస్ ఏర్పాటు చేసిన ఒక డిన్నర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ పర్యటనలోనే ఆయనకు టెస్ట్ జట్టు బాధ్యతలను కూడా అప్పగించే ప్రక్రియ వేగవంతమైంది.సెప్టెంబర్ 9 నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే మైక్ హెసన్ పాకిస్తాన్ జట్టుతో కలవనున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మూడో టెస్ట్ సమయంలో హెసన్ నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది సర్ఫరాజ్ అహ్మద్ పదవికి ముగింపు కార్డు పడినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ 18న బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్కు ముందు సర్ఫరాజ్ అహ్మద్ను టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా నియమించారు. అయితే ఆయన ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రదర్శన మరీ దారుణంగా తయారైంది. మొదటి అసైన్మెంట్లోనే బంగ్లాదేశ్ చేతిలో సొంత గడ్డపై వైట్వాష్కు గురైంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో 2 టెస్టుల సిరీస్ను 1-1తో డ్రా చేసుకుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో మరో వైట్వాష్ దిశగా ప్రయాణిస్తుండటంతో పీసీబీ వేటు వేయక తప్పని పరిస్థితి నెలకొంది.ఇంగ్లండ్తో రెండో టెస్టు ముగిసిన అనంతరం ఇమామ్ ఉల్ హక్తో పాటు సీనియర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. తాజాగా బాబర్ గైర్హాజరీలో మొదటి టెస్టుకు కెప్టెన్గా వ్యవహరించిన సల్మాన్ అలీ అఘాను కూడా పీసీబీ జట్టు నుంచి విడుదల చేసింది. దీంతో సల్మాన్ అఘా స్వదేశానికి తిరిగి రానున్నాడు.🚨SARFARAZ AHMED SACKED FROM TEST COACH 🚨 - Pakistan current Test coach Sarfaraz Ahmed & bowling coach Umar Gul sidelined from test team. - Mike Hesson asked for take charge of Pakistan test team. pic.twitter.com/fDY7iF8fkv— Cricket Central (@CricketCentrl) August 31, 2026చదవండి: సచిన్ను వెంటాడిన ఫోబియా వైభవ్కు అంటుకుందా?
న్యూస్ పాడ్కాస్ట్
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
Audio: బీడు పడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు... కాలువకు నీరివ్వని కూటమి సర్కార్... బోరుమంటున్న రాయలసీమ రైతులు
నేపాల్లో ఆగని మృత్యుఘోష.... 579కి చేరిన మరణాల సంఖ్య... భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
కమిషనర్ ఔట్... వేతన సవరణ కమిషన్ లేదు... ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం
కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నా కుంభకర్ణుడి నిద్ర నటిస్తారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం మనదే... వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు చెబుతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
జరిమానా లెక్క తేల్చాల్సిందే... రామోజీకి, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్ చిట్ ఇవ్వలేదు.... తేల్చిచెప్పిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్
బిజినెస్
జీడీపీ జిగేల్!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ తగ్గేదేలే అంటూ భారీగా పుంజుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2026–27 ఏప్రిల్–జూన్, క్యూ1)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను మించి 7.8 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో జీడీపీ 6.9 శాతం వృద్ధి చెందింది. అయితే, గతేడాది చివరి క్వార్టర్ (2025–26, క్యూ4)లో వృద్ధి రేటు 8.6 శాతంతో పోలిస్తే మాత్రం నిదానించింది. కేంద్ర గణాంకాల శాఖ సోమవారం ఈ డేటాను విడుదల చేసింది. ఇరాన్–అమెరికా వార్తో అధిక క్రూడ్ ధరలు.. ఇంధన, కమోడిటీ మార్కెట్లు తీవ్ర కుదుపులకు గురవడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, బలహీన ప్రపంచ డిమాండ్ నేపథ్యంలో కూడా మన జీడీపీ మెరుగ్గానే వృద్ధి చెందడం గమనార్హం. అంతేకాదు పెద్ద ఎకానమీల్లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు సాధిస్తున్న దేశంగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) క్యూ1లో 7 శాతం వృద్ధిని అంచనా వేయగా, దీనికి మించి ఎకానమీ పరుగులు తీసింది. భౌగోళిక రాజకీయ రిస్కులు తీవ్రతరమైనా, పటిష్టమైన దేశీ ఆర్థిక కార్యకలాపాలు దన్నుగా నిలిచాయని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాగా, ప్రస్తుత 2026–27 పూర్తి ఏడాదికి గాను జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉండొచ్చని లెక్కగట్టింది. రూ. 81.36 లక్షల కోట్లు... స్థిర ధరల ప్రకారం 2026–27 క్యూ1లో వాస్తవ (రియల్) జీడీపీ విలువ రూ.81.36 లక్షల కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.75.46 లక్షల కోట్లుగా ఉంది. అంటే, 7.8 శాతం పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం సాధారణ (నామినల్) స్థూల దేశీయోత్పత్తి 10.3% వృద్ధితో రూ.80 లక్షల కోట్ల నుంచి రూ.88.27 లక్షల కోట్లకు ఎగబాకింది. వాస్తవ స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధి 8.2%గా నమోదైంది. అత్యంత అనిశ్చిత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో సైతం గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్మాణాత్మక సంస్కరణల ఫలితంగానే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ బలంగా నిలదొక్కుకోగలుగుతోందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాల పరంగా రానున్న కాలంలో కొన్ని సమస్యలు ఉండొచ్చని, అయితే, ప్రస్తుతం బలమైన దేశీ వినియోగం, ఎగుమతుల పనితీరుతో మరో త్రైమాసికంలో పటిష్టమైన వృద్ధి సాధ్యపడిందన్నారు.రంగాల వారీగా క్యూ1 పనితీరు..→ తయారీ రంగం 9.2 శాతం పటిష్టమైన వృద్ధిని సాధించింది. గతేడాది క్యూ1లో ఇది 8.3 శాతంగా ఉంది. → వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి 4.4 శాతం నుంచి 3.6 శాతానికి తగ్గింది. → ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ఐటీ, ప్రొఫెషనల్ సర్వీసుల్లో వృద్ధి 8.8 శాతం నుంచి 12.1 శాతానికి పెరిగింది. → నిర్మాణ రంగం 5.2 శాతం నుంచి 7.7 శాతానికి వృద్ధి చెందింది. → వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్స్ వృద్ధి 9.8 శాతం నుంచి 8.5 శాతానికి నిదానించింది. → పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సర్వీసుల రంగంలో వృద్ధి 4.6% నుంచి 7.5%కి ఎగసింది. → మైనింగ్ రంగం 12.4 శాతం వృద్ధి నుంచి మైనస్ 2.4 క్షీణతలోకి జారుకుంది. → విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సరీ్వసుల్లో మైనస్ 1.8 శాతం క్షీణత నుంచి 8.9 శాతం వృద్ధిలోకి దూసుకెళ్లింది.అసాధారణ ఘనత: ప్రధాని మోదీభారత్ క్యూ1లో సాధించిన అద్భుతమైన జీడీపీ వృద్ధి రేటును ప్రధాని నరేంద్ర మోదీ ’అసాధారణ ఘనత’గా అభివరి్ణంచారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ’ఎక్స్’లో చేసిన పోస్ట్లో ‘చమురు ధరల షాక్లు, సరఫరా వ్యవస్థ సమస్యలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ పటిష్టమైన వృద్ధిని సాధించగలిగిందంటే, దేశ ప్రజల సమష్టి బలానికి ఇది నిదర్శనం. ఆర్థిక వ్యవస్థ పనైపోయిందంటూ విమర్శించిన వారికి చుక్కెదురైంది. భారత్ మరోసారి వికసించింది’ అని మోదీ వ్యాఖ్యానించారు.సంస్కరణల ఫలితమిది: సీతారామన్ ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు తోడు ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం వల్లే జీడీపీ వృద్ధి రేటు తొలి త్రైమాసికంలో 7.8 శాతానికి పుంజుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ‘ఈ పటిష్టమైన ఆర్థిక పనితీరుకు ముమ్మాటికీ దేశ ప్రజలు, వారి కృషే కారణం. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు తీసుకొచి్చన సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థను చురుగ్గా నిర్వహించడం కూడా దీనికి తోడ్పడింది’ అని ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
పసిడి ప్రియులకు షాక్.. రూ.12,500 పెరిగిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు ఊహకందని రీతిలో విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఆగస్టు 01న రూ.1,44,220 వద్ద ఉన్న గోల్డ్ రేటు, ఈ రోజుకు (ఆగస్టు 31) రూ.1,56,770 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. నెల రోజుల్లో పసిడి ధరల్లో ఎంత మార్పు జరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఈ నెల (ఆగస్టు) ప్రారంభంలో హైదరాబాద్, విజయవాడలలో రూ.1,44,220 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, ఆగస్టు 31కి రూ.1,56,770 వద్దకు చేరింది. అంటే నెల రోజుల్లో రూ.12550 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల రేటు రూ.1,32,200 నుంచి రూ.1,43,700 (రూ.11,500 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీ కూడా బంగారం ధరలలో చాలా మార్పులు జరిగాయి. ఇక్కడ నెల ప్రారంభంలో రూ.1,32,350 వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు నేటికి రూ.1,43,700 (రూ.11350 పెరిగింది) వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,44,370 నుంచి రూ.1,56,770 (రూ.12400 పెరిగింది) వద్దకు చేరింది.ఇక వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ సిల్వర్ రేటు 30 రోజుల్లో రూ.2.35 లక్షల నుంచి రూ.2.60 లక్షలకు చేరింది. అంటే నెల రోజుల్లో 25000 రూపాయలు పెరిగింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. పెరిగే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమైపోతుంది.
రోజుకు రూ.10లోపే.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం 299 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 299 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 3 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. వినియోగదారుకు రోజుకు రూ.10 కంటే (రూ.9.96) తక్కువ ఖర్చు అవుతుంది. తక్కువ ధరలో మంచి ప్లాన్ కోసం ఎదురు చూసేవారికి ఇది మంచి ఆప్షన్స్.Your day has a lot to do, and a lot to say.#BSNLIndia #BSNLSelfCareApp #InternetForEveryone #DigitalLife #IndiaOnline #BSNLServices #SmartIndia #EverydayConnectivity #299plan @CMDBSNL @robertravi21 pic.twitter.com/NivCHPXBKr— BSNL India (@BSNLCorporate) August 31, 2026
E20 పెట్రోల్పై సుప్రీంకోర్టు తీర్పు ఇదే!
మనలో చాలామంది పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు లీటర్ పెట్రోల్కు ఎంత డబ్బు చెల్లిస్తున్నామో అని మాత్రమే చూస్తాం. కానీ.. అందులో ఎంత ఇథనాల్ కలిపి ఉంది? అనే విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోం. ఇప్పుడు ఇదే విషయంపై చర్చ జరుగుతోంది.పెట్రోల్ బంకుల్లో అమ్ముతున్న ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో.. కస్టమర్లకు స్పష్టంగా తెలియజేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే.. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించలేదు. ఈ అంశంపై సంబంధిత అధికారులను సంప్రదించుకోవచ్చని పిటిషనర్కు సూచించింది.E20 పెట్రోల్ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు E20 పెట్రోల్. ఇందులో 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ ఉంటుంది. విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, దేశంలోనే తయారయ్యే ఇంధనాన్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఇథనాల్ను పెట్రోల్లో కలుపుతోంది. అయితే.. కస్టమర్లు తాము కొంటున్న పెట్రోల్లో అసలు ఎంత ఇథనాల్ ఉందో తెలుసుకోవాలని కోరుతున్నారు.వాహనదారుల్లో సందేహాలుE20 పెట్రోల్పై వాహనదారుల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా.. పాత వాహనాల్లో ఈ20 ఇంధనం వాడితే మైలేజ్ ఎలా ఉంటుంది? ఇంజిన్పై ప్రభావం ఉంటుందా? ఫ్యూయల్ సిస్టమ్కు ఏమైనా సమస్యలు వస్తాయా? అనే ప్రశ్నలు ఉన్నాయి. అయితే మైలేజ్ అనేది.. కేవలం ఇంధనంపైనే మాత్రమే ఆధారపడి ఉంటుందనుకోవడం పొరపాటు. ఎందుకంటే.. డ్రైవింగ్ చేసే విధానం, ట్రాఫిక్, వెహికల్ మెయింటెనెన్స్, టైర్ ప్రెజర్, ఏసీ వినియోగం వంటి అంశాలు మైలేజిని ప్రభావితం చేస్తాయని ప్రభుత్వం చెబుతోంది.పంటలపై ప్రభావంఇథనాల్ తయారీకి పంటలను ఉపయోగించడంపై కూడా చర్చ మొదలైంది. ఆహారం కోసం ఉపయోగించే పంటలను ఇంధనం తయారీకి ఉపయోగిస్తే.. భవిష్యత్తులో ఆహార ధరలపై ప్రభావం పడుతుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే.. వ్యవసాయ వ్యర్థాలు, బయోమాస్తో 2జీ ఇథనాల్ తయారు చేయడం ద్వారా ఆహార పంటలపై ఒత్తిడి తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యర్థాలను ఉపయోగించి ఇంధనం తయారు చేస్తే ఫుడ్, ఫ్యూయల్ రెండింటి అవసరాలను బ్యాలెన్స్ చేయొచ్చన్నమాట.ఇదీ చదవండి: 23 ఏళ్లకే ఉద్యోగం వదిలేశాడు.. కొండల్లో తిరుగుతూ కోట్ల సంపాదన!
ఫ్యామిలీ
అల్పాహారం, మధ్యాహ్న భోజనం మానేస్తే..బరువు తగ్గగలమా? నటుడు రాజ్కుమార్..
బరువు తగ్గడం కోసం ఒక్కోక్కరూ ఒక్కో విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ల శారీరక ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తి అనుగుణంగా డైట్, వ్యాయామాలు ఉంటాయి. అయితే బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్కుమార్ రావు మాత్రం కావాలనుకుంటే బరువు పెరగగలడు, స్లిమ్గా మారిపోగలడు. ఒక పాత్ర కోసం శారీరక మార్పులతో సహా తనను తాను పూర్తిగా మార్చుకోగల నటుడు. ఆయన సుభాష్చద్రబోస్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 2017 నాటి వెబ్ సిరీస్ 'బోస్: డెడ్/అలైవ్' (Bose: Dead/Alive) కోసం ఈ నటుడు 13 కిలోల బరువు పెరిగాడు, ఆ తర్వాత ఏడాదే 2018లో విడుదలైన 'ఫన్నీ ఖాన్' (Fanney Khan) చిత్రం కోసం ఒక్కనెలలో ఏకంగా పది కిలోల బరువు తగ్గారు. తాను బోస్ వెబ్ సిరీస్ తర్వాత బరువు తగ్గించుకోవాల్సి ఉంటుందని తనకు ముందే తెలుసని, అందుకేనే అల్పాహార, మధ్యాహ్న భోజనం మానేశానని అన్నారు. ఇలా చేస్తే బరువు తగ్గగలమా అంటే..ఇది అత్యంత కష్టమైన విధానం. ఎందుకంటే ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్న భోజనం మానేసి, ఉండటం అంటే..శరీరాన్ని చాలా కష్టబెట్టడమే కాకుండా బలహీన పడే అవకాశాలు ఎక్కువ. కానీ రాజ్ కుమార్ మాత్రం తాను నేరుగా రాత్రి భోజనం మాత్రమే చేస్తానని, అది కూడా ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకుంటానని అన్నారు. మరి ఉదయం ఎలాంటి ఆహారం లేకుండా ఎలా ఉండగలరంటే..నిరంతరం పనిలో ఉంటాను కాబట్టి ఆకలి బాధ అంతగా అనిపించదని చెబుతున్నారు. అలాగే వ్యాయామాలు విషయానికొస్తే..ప్రతిరోజూ కనీసం మూడు గంటల పాటు కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తానని అన్నారు. దీపావలి వంటి పండుగ సమయాల్లో నోరు చాలా కట్టడి చేసుకుంటానని, ఎందుకంటే ఫిట్గా ఉండటమే తన ప్రధాన లక్ష్యం కాబట్టి అని చెబుతున్నారు రాజ్కుమార్. ప్రస్తుతం భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'దాదా' (Dada) మూవీలో కనిపించనున్నారు రాజ్కుమార్. ఈ మూవీ ఫస్ట్ లుక్ని గంగూలీ 54వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.మైదానంలోకి పరిగెత్తే ముందు షర్ట్ లేకుండా తన ఇండియా జెర్సీని ఊపుతూ గంగూలీ కనిపించడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన క్షణాలలో ఒకటి. అలాంటి క్షణాన్ని పోస్టర్ ఫస్ట్లుక్గా విడుదల చేసింది చిత్ర బృందం. కాగా, రాజ్ కుమార్ అనుసరించే డైట్ విధానం సరైనదేనా అంటే..అల్పాహార, మధ్యాహ్న భోజనం మానేస్తే..దీర్ఘకాలంలో ఇది శరీరంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. పైగా, బరువు తగ్గడానికి బదులు మరింత బరువు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే భోజనం అన్నేసి గంటలు తీసుకోకపోతే శరీరం "సర్వైవల్ మోడ్" (ఆకలి మోడ్) లోకి వెళ్తుంది. శక్తిని ఆదా చేయడానికి శరీరం కేలరీలను ఖర్చు చేయడం తగ్గించి, ఫ్యాట్ను ఎక్కువగా నిల్వ ఉంచుకుంటుంది. దీనివల్ల మెటబాలిజం రేటు దారుణంగా పడిపోతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా ఆకలి ఎక్కువ వేసి..నియంత్రణ కోల్పోయేలా ఎక్కువగా తినేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల బరువు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అలాగే శరీరం ఆహారం లభించనప్పుడు కొవ్వుని మాత్రమే గాక శక్తి కోసం కండరాలను కూడా కరిగించేలా చేస్తుంది. కండరాలు తగ్గితే శరీరం బలహీనపడి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు. అదీగాక రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల నీరసం, తలతిరగడం, మూడ్ స్వింగ్స్, ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి. ఒక్కోసారి పోషకాహార లోపం, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దానికి బదులుగా కేలరీలు తక్కువగా ఉండే పోషకాహారం, ఫైబర్ ఉండే పదార్థాలు తీసుకునేలా కేర్ తీసుకుంటే ఆకలిని నియంత్రించ గలుగుతాం. ఆ తర్వాత ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్కి ప్రాధాన్యతి స్తే కడుపునిండిన అనుభూతిని పొందడమే కాకుండా ఇతర ఆహారాల జోలికి వెళ్లరని చెబుతున్నారు. దీంతోపాటు వ్యాయామాలు, వాకింగ్ వంటివి క్రమం తప్పకుండా చేస్తే ఆరోగ్యకరంగా బరువు తగ్గడమే కాకుండా మళ్లీ యథావిధిగా పెరిగే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 67 నుంచి 57 కిలోలకు..! ఆ అలవాట్లకు గుడ్బై..)
వర్షం పడితే ఈ ద్వీపం అందం రెట్టింపు.. ఎక్కడో తెలుసా?
వర్షం కొన్ని ప్రదేశాలను మరింత అందంగా కనువిందు చేస్తుంది. డబుల్ బ్యూటీతో అలరించే ద్వీపాల సమూహమైన ఇండోనేషియా వర్షంలో కొత్త రంగులను పులుముకుంటుంది. మిగతా రోజుల్లో బాలి వెళ్లిన వాళ్లు వర్షాకాలంలో మరోసారి వెళ్లాల్సిందే అనుకుంటారు. చిరుజల్లులతో ఆకులపై నిలిచే చినుకులు, జారి నేలపై పడటం.. ఆలయ సమూహంలో నిలిచే నీరు.. ఇవన్నీ మణిరత్నం సినిమాలోని ఫ్రేమ్లా అనిపిస్తాయి.ఇండోనేషియా అంటే ఒక దేశం మాత్రమే కాదు. ఇది ఎన్నో ద్వీపాల సమూహం. ఏకంగా 17,380కు పైగా ద్వీపాలు ఉన్న ఈ దేశానికి ఒక వైపు సముద్రం ఉంటే మరోవైపు అగ్నిపర్వతాలు ఉంటాయి. ఇందులో బాలీ, జావా, లంబోక్ వంటి ద్వీపాలకు వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడతారు. దీనికి కారణం ఇక్కడి బ్యూటీ అనేది సీజన్ ను బట్టి మారుతుంది.ఎలా వెళ్లాలి..బాలి ఎలా వెళ్లాలి అని చాలా మంది ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తుంటారు. ఈ సమాచారం వారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ముందుగా హైదరాబాద్లోని శంషాబాద్ నుంచి ఈ డ్రీమ్ జర్నీ మొదలవుతుంది. కౌలాలంపూర్ లేదా సింగపూర్ మీదుగా సాగే ట్రిప్ మేఘాల సముద్రంలో పడవలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది.అలాగే బాలిలోని న్గురా రాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఒక చల్లని గాలి వచ్చి హాయ్ అని పలకరిస్తుంది. ఇదే ఇండోనేషియా వెల్కమ్ చెప్పే స్టైల్. ఈ విమానాశ్రయం డెన్ పసార్ నగరానికి సమీపంలోని టుబాన్ ప్రాంతంలో ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి ఉబుద్కు వెళ్లే సమయంలో సిటీ గజిబిజి నుంచి ప్రశాంతమైన పచ్చని పొలాల మధ్య ఈ ట్రాన్సిషన్ ఎంత స్మూత్గా జరుగుతుందో గమనించవచ్చు.విజయవాడలో ఉన్న వారు ఉదయానికి హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి జర్నీని ్రపారంభించవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రయాణం అంటే గమ్యస్థానానికి చేరుకోవడమే కాదు.. ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడమే.ఆసక్తికరమైన విషయాలు..2024 గణాంకాల ప్రకారం ఇండోనేషియాలో17,380 ద్వీపాలు ఉన్నాయి.బాలీ రాజధాని డెన్ పసార్. బాలీకి వచ్చే అంతర్జాతీయ పర్యాటకులకు న్గురా రాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన ప్రవేశ ద్వారం.ఉబుద్ బాలీ కళలు, సంప్రదాయాలు, సంస్కతికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం.జటిలువిహ్ వరి పొలాలు బాలీ యూనెస్కో గుర్తించి కల్చరల్ ల్యాండ్స్కేప్లో భాగం.ప్రపంచంలోనే అతిపెద్ద బల్లి జాతి అయిన కొమోడో డ్రాగన్ ఇండోనేషియాలోనే కనిపిస్తుంది.ఏం తినాలి..చాలా మంది ఫుడ్ లవర్స్ ఇండోనేషియా వెళ్లే ముందు అక్కడ మంచి ఫుడ్ లభిస్తుందా లేదా అని ఆలోచిస్తారు. వారిని ఇండోనేషియా అస్సలు డిస΄్పాయింట్ చేయదు. ఎందుకంటే భోజనం కూడా ప్రయాణంలో ఒక భాగమే.నాసి గోరెంగ్ అనే ఫ్రై డ్ రైస్, నంచుకోవడానికి ఫ్రై డ్ ఎగ్స్, ఫ్లేవర్ కోసం కొద్దిగా మిరపకాయ, వెల్లుల్లి, టమోటోలను దంచి చేసిన రోటి పచ్చడి లాంటి సాంబల్ ఇవన్నీ మన తెలుగు రుచులను గుర్తుచేస్తాయి. ముందు కాస్త కారంగా అనిపించినా, అరే టేస్ట్ బాగుంది అనిపిస్తుంది. రెండు రోజుల్లో అలవాటైపోతుంది.అలాగే చాలా మంది ఇండోనేషియాలో ఎంజాయ్ చేసే ఫస్ట్ డిష్ వచ్చేసి గడో గడో అనే లోకల్ రెసిపీ. దీనిని ఒక రెసిపీ అనడం కన్నా సలాడ్ అనడం బాగుంటుంది. ఇండోనేషియాలోని చాలా ప్రాంతాల్లో ఈ డిష్ లభిస్తుంది.ఏం చూడాలి..ఇండోనేషియాను కళ్లతో కాకుండా మనసుతో చూడాలి. కెమెరా కన్నులకు కాస్త విశ్రాంతిని ఇచ్చి అక్కడి లైఫ్ను ఎంజాయ్ చేయాలి. స్థానికంగా ఉండే సందర్శనీయ ప్రదేశాల్లో చాలా మంది తెలియకుండానే అక్కడి జటిలువిహ్ వరి పొలాలను కూడా యాడ్ చేసుకుంటారు. సూర్యుడి వెలుగును బట్టి అక్కడి పొలాల అందం మారిపోతుంది. అలాగే ఉబుద్లో కెచక్ డ్యాన్ ్స చూడటం, ప్రాంబనన్ దేవాలయ దర్శనం, లంబోక్ తీరంలో కూర్చొని ఇండోనేషియాను కొత్త కోణంలో చూడటం ఇలా ఎన్నో ΄్లాన్ చేసుకోవచ్చు.ఎక్కడ ఉండాలి..ఇండోనేషియా వెళ్తే బాలిని చూడాలి.. ఉబుద్లో ఉండాలి అనే సింపుల్ థియరీ గుర్తుంచుకోవాలి. ఉబుద్లో ఉండటానికి కారణం అక్కడి ప్రకతి. ఇక్కడ చెట్ల మధ్య కలపతో చేసిన జోగ్లో హౌస్లు ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి.వాటి ముందు చిన్న కొలను, చుట్టూ వరి చేలుం మార్నింగ్ లేవగానే బాల్కనీలో కూర్చుని.. ఆల్రెడీ తడిసిన పొలాలపై పడే వర్షాన్ని చూస్తూం కాఫీ లేదా చాయ్ సిప్ చేస్తుంటే వచ్చే ఫీలింగ్కు ఏం పేరు పెట్టగలమో చెప్పండి.ఒకవేళ మీరు సముద్రానికి దగ్గరగా ఉండాలి అనుకుంటే సనూర్, సెమిన్యాక్లో కూడా ΄్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడి విల్లాల్లో ఉంటే ఒకవైపు సముద్రం హోరు, మరోవైపు వర్షపు జోరు రెండూ కలిస్తే వచ్చే మ్యూజిక్ ఒక మ్యాజిక్లా ఉంటుంది.యోగ్యకర్త అనే ప్రదేశంలో అయితే పాతకాలపు హోటళ్లు ఉంటాయి, గోడల మీద బటిక్ పెయింటింగ్స్, మూలల్లో చెక్క బొమ్మలు కనిపిస్తాయి. ఒక్కసారిగా రాజుల కాలంలోకి వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది.యాత్ర, బడ్జెట్ వివరాలు..హైదరాబాద్ నుంచి ఐదు రోజుల బాలి ట్రిప్ కోసం సుమారు రూ.65 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు కావచ్చు. ఇందులో ఫుడ్, ఫ్లైట్, స్టే వంటి ఖర్చులు ఉంటాయి. కాస్త లగ్జరీగా ట్రావెల్ చేయాలి అనుకుంటే రూ.90 వేల నుంచి రూ.1 లక్షా 20 వేల వరకు, అల్ట్రా లగ్జరీ ట్రిప్కోసం రూ.1 లక్షా 50 వేల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది.హైదరాబాద్ నుంచి బాలి రిటర్న్ ఫ్లైట్ కాస్ట్ అనేది టికెట్ బుకింగ్ టైమ్, ఎయిర్లైన్ ను బట్టి మారుతుంది. విజయవాడ నుంచి బాలి వెళ్లాలి అనుకుంటి ఫ్లైట్ కాస్ట మరింత పెరిగే అవకాశం ఉంటుంది. స్టే విషయానికి వస్తే హోమ్స్టేలు, హోటల్స్ బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు వివిధ ధరల్లో లభిస్తాయి.భారతీయులు బాలికి వెళ్లాలి అంటే ఆన్ అరైవల్ వీసా పొందవచ్చు. దీని కోసం 5 లక్షల ఇండోనేషియా రుపియాలు ఖర్చు అవుతాయి. ఈ వీసాతో 30 రోజుల వరకు ఇండోనేషియాలో ఉండవచ్చు. ఒకసారి మరో 30 రోజులు పొడిగించుకునే అవకాశం ఉంది– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు
65 ఏళ్ల వయసులో టిఫిన్ సర్వీస్! ఇవాళ ఏకంగా రూ. 2.5 కోట్లు..
జీవితంలో ఏ దశలో ఉన్నా సరే కొత్తగా ఏదైనా చేయాలనే సంకల్పం ఉంటే..ఏవిధంగానైనా ముందుకు సాగిపోగలం అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఆమె. శరీరానికి వయసు తప్ప మనసుకి కాదు..యువకులకు తీసిపోని విధంగా కష్టపడగలమని నిరూపించి సంశయంతో కాలక్షేపం చేస్తున్న తన ఏజ్వాళ్లకు, యువతకు స్ఫూర్తిగా నిలిచింది. వాస్తవంగా ఆరుపదుల వయసులో కాళ్ల నొప్పులు, చేతుల నొప్పులు అని బాధపడుతుంటారు. కానీ ఆ వయసులో తనకంటూ ఓ గుర్తింపు కోసం ఆరాటపడుతూ..చిన్నాగా ఏదైనా చేయాలనుకోవడమే విశేషం అనుకుంటే..ఏకంగా శారీరక శ్రమతో కూడిన ఆహార వ్యాపారం చేయాలనుకోవడం అతిపెద్ద సాహసం. నీ వల్ల కాదు అన్న వాళ్లే విస్తుపోయేలా సక్సెస్ అందుకుని ముందుకు సాగిపోతోంది ఈ బామ్మ. ఆ బామ్మే పాట్నాకు చెందిన దేవ్నీ దేవి. 65 ఏళ్ల వయస్సులో తనకంటూ గుర్తింపు వచ్చేలా ఏదైనా చేయాలని అనిపించిందామెకు. బాధ్యతలు తీరిన సమయంలో కాయకష్టం చేసే పనివైపుకి మళ్లిందామె. చిన్న ఆలోచనతో మొదలైన చిన్న స్టార్లప్ లాంటి వ్యాపారం ఆమెది. ముందుగా ఇంట్లో వండిన సాధారణ భోజనాన్ని రూ. 20లకే విక్రయించే చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుంది. చిన్నగా ప్రారంభమైన ఆమె టిఫిన్ సెంటర్ కాస్తా..అనతి కాలంలోనే విశేష ఆధరణ లభించి, ఎక్కువ ఆర్డర్లు రావడం మొదలైంది. అంతేగాదు ఆమె చేతి రుచి భోజనప్రియుల మనసుని గెలుచుకుంది. దాంతో చూస్తుండగానే చిన్న వ్యాపారం కాస్తా..రుచికి నమ్మకమైన పేరుగా గుర్తింపు తెచ్చుకుని రూ. 2.5 కోట్ల ఆహార వ్యాపారంగా మారింది. దేవ్నీ దేవి ఈ వ్యాపారం చేయాలనుకునే నిర్ణయానికి కుటుంబం నుంచి, బంధువుల నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా..కఠిన శ్రమ, ఓర్పుతో విజయం సాధించి చూపారామె. నాణ్యత, రుచిలో రాజీపడకుండా ఎంతో శ్రద్ధతో తాజగా వండిన భోజనం అందించి కార్మికులు, విద్యార్థులు, కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకుంది. అది కూడా సరసమైన ధరలో మంచి భోజనం అందించే టిపిన్ సెంటర్గా పేరుతెచ్చుకునేలా కష్టపడింది. ఆ శ్రమకు తగిన గుర్తింపు లభించేలా పెద్ద ఆహార వ్యాపారంగా విస్తరించింది. అంతేగాదు క్యాటరింగ్ సేవలను ప్రారంభించి, ఎక్కువమందికి తన సర్వీస్ని అందించేలా రెస్టారెంట్ను కూడా తెరిచారామె. ఆరోజు ఈ వయసులోనా అని ముఖం చిట్లించిన వాళ్లే సిగ్గుపడేలా ఉవ్వెత్తున ఎగిసిపడేలా అందనంత ఎత్తుకు ఎదిగింది. కొత్తగా ఏ పని చేయాలన్న లేదా ప్రారంభించి విజయం సాధించడానికి వయసు ఎప్పటికీ అడ్డంకి కాదు..అది మీ మనస్సులోని సంకల్పం ముందు నిలువదు అని చెప్పే స్ఫూర్తిదాయక కథ. దైర్యం, ఓర్పు, నిరంత కృషి ఉన్నవాళ్లకి అపజయం అన్నదే కలగదు అనే మాటకు దేవ్నీ దేవి కథే ఓ ఉదాహరణ. View this post on Instagram A post shared by startup universe (@startup_universe) (చదవండి: అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చాక్లెట్లు..!)
ఆరు కేజీల బంగారు కొండ.. అసలు విషయం తెలిస్తే కళ్లలో నీళ్లు!
అదొక చిన్న పట్టణం. ఆ పట్టణంలో నాలుగు వీధులు కలిసే చోట బాబా గుడి ఉంది. అక్కడికి ఓ భక్తురాలు ప్రతిరోజూ వచ్చేది. గుడి ముందర ఉన్న ఒక అంగట్లో పూలు కొనుక్కుని బాబాకి సమర్పించేది.అయితే కొన్ని రోజులుగా ఆ భక్తురాలు హడావుడిగా వచ్చి వెళ్లడం గమనించింది పువ్వులమ్మే మహిళ. అదును దొరికిన సమయాన కారణం అడిగింది. ‘మా ఇల్లొక స్వర్గం. మా ఇంట్లో ఆరు కేజీల బంగారం ఉంది. దాన్ని భద్రంగా చూసుకోవాలి’ అని చెప్పింది. పువ్వులమ్మి ఆశ్చర్యపోయింది. ‘ఎన్నో ఏళ్ళుగా పూల వ్యాపారం చేస్తున్నా కోడిగుడ్డంత బంగారం సమకూర్చుకోలేకపోయాము. ఈమె చాలా అదృష్టవంతురాలు. ఒకటి కాదు రెండు కాదు ఆరు కేజీల బంగారం ఇంట్లో పెట్టుకుని ఉంది’ అని ఈర‡్ష్య పడింది.‘నీవు ఇలాగే ఆలోచిస్తే కడుపుమంట, కడుపులో మంట రెండూ వస్తాయి. ఒకసారి వెళ్లి చూసి రా. నీ కడుపు మంట తగ్గుతుందని’ చక్కని సలహా ఇచ్చాడు భర్త.ఒకరోజు సాయంత్రం వీలు చూసుకుని ఆ భక్తురాలి ఇంటికి వెళ్ళింది. అది చిన్న పెంకుటిల్లు. ఆ ఇంటి ముందర కానుగ చెట్టుకింద భక్తురాలు ఆరు నెలల చిన్న పాపతో ఆడుకుంటూ కనిపించింది. పువ్వులమ్మిని చూసి నవ్వుతూ పలకరించి ఇంట్లోకి తీసుకెళ్ళింది. తన మనవరాలి గురించిన ముచ్చట్లు చెప్పడం ప్రారంభించింది భక్తురాలు. అంతా ఓపికగా విన్న పువ్వులమ్మి చివరిగా ‘మీ ఇంట్లో ఆరు కేజీల బంగారం ఉందని చె΄్పారు కదా. ఈ జన్మకి అంత బంగారం మేము సంపాదించలేము. కనీసం కళ్ళారా చూసి పోదామని వచ్చాను’ అని చెప్పింది.ఆ భక్తురాలు పడీపడీ నవ్వుతూ ‘నా చేతిలో ఉన్నది ఆరు కేజీల బంగారమే కదా!’ అని మనవరాలిని చూపింది. ఆశ్చర్యపోయింది పువ్వులమ్మి.‘మా శ్రీవారి కుటుంబంలో మూడు తరాలుగా ఆడపిల్లలే పుట్టలేదు. ఆరు నెలల ముందు మా కోడలు ఆడబిడ్డను ప్రసవించింది. పాప బరువు ఆరు కేజీలు కాబట్టి ఆరు కేజీల బంగారమని చె΄్పాను. ఇంట్లో ఆడ బిడ్డల కాలిగజ్జెల శబ్దం వినబడితే అదే కదా స్వర్గసీమ. ఆ ఆనందం కరువై వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నాము. ఈసారి మా పూజ ఫలించింది. బంగారు కొండ మా ఇంటికి వచ్చింది’ అని చెప్పి తియ్యని లడ్డును పువ్వులమ్మి చేతికిచ్చింది. ‘ఆడబిడ్డలు లేని వారికి కదా తెలుస్తుంది ఆడబిడ్డల విలువ’ అనుకుంటూ అక్కడి నుంచి కదిలింది పువ్వులమ్మి.– ఆర్.సి. కృష్ణస్వామి రాజుఇవి చదవండి: ఒక్క వృద్ధుడి నమ్మకం.. మొత్తం గ్రామం తలరాతనే మార్చింది!
అంతర్జాతీయం
నా భార్య పేరు ఎత్తే సాహసం చేయొద్దు: జేడీ వాన్స్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మిషిగన్ డెమోక్రటిక్ సెనేట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయెద్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. వాన్స్ భార్య, సెకండ్ లేడీ ఉషా వాన్స్ను ఉద్దేశించి ఎల్-సయెద్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై వాన్స్ తీవ్రంగా స్పందించారు. ‘‘నీ నోటితో నా భార్య పేరు ఎత్తొద్దు’’ అంటూ ఘాటు హెచ్చరిక చేశారు.మిషిగన్లో రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి మైక్ రోజర్స్కు మద్దతుగా సోమవారం జరిగిన మాగా కంపెనీ ర్యాలీలో జేడీ వాన్స్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్-సయెద్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘నా భార్య పేరును నీ నోటితో ఎత్తొద్దు. నీ స్థాయికి అందనంత దూరంలో ఆమె ఉంది’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎల్-సయెద్ చాలా చాలా చెడ్డ వ్యక్తి అంటూ విమర్శించారు.ఎలా మొదలైంది?ఎల్-సయెద్ గతంలో షరియా చట్టంపై చేసిన వ్యాఖ్యలను వాన్స్ ఇటీవల విమర్శించారు. అమెరికా కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకునే ఓ రాజకీయ నాయకుడు షరియా చట్టానికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తన దివంగత తాతను గుర్తుచేసుకున్న వాన్స్.. ‘‘ఇది నా తాతకు తెలిసిన డెమోక్రటిక్ పార్టీ అయితే కాదు’’ అని వ్యాఖ్యానించారు.దీనిపై స్పందించిన అబ్దుల్ ఎల్-సయెద్ Abdul El Sayed.. వాన్స్ తన తాత గురించి మాట్లాడిన వీడియోను ఎక్స్లో షేర్ చేస్తూ ఆయన భార్య ఉషా వాన్స్ పేరును ప్రస్తావించారు. ‘‘జేడీ ఉషాను కూడా తనతో పాటు గతంలోకి తీసుకెళ్లి తాతను కలిపిస్తారా?’’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. దీనిపై వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవతలి వాళ్ల కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం ఎల్-సయెద్కు ఓ విచిత్రమైన అలవాటుగా మారిందని విమర్శించారు. ఇకపై తన భార్య పేరును ప్రస్తావించవద్దని హెచ్చరించారు.‘చాలా చాలా చెడ్డ వ్యక్తి’ఎల్-సయెద్పై వాన్స్ మరిన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకే వర్గం ప్రయోజనాల కోసం మిగిలినవారిని పట్టించుకోని రాజకీయ ధోరణి అమెరికాలో పెరుగుతోందని.. అందుకు ఎల్-సయెద్ ఉదాహరణ అని అన్నారు. తన మతానికి చెందినవారిపట్ల మాత్రమే సానుభూతి చూపుతూ, ఇతరుల సమస్యలను పట్టించుకోరని వాన్స్ ఆరోపించారు. నవంబర్ ఎన్నికల్లో ఎల్-సయెద్ రాజకీయాలను తిరస్కరించి, రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్కు మద్దతు ఇవ్వాలని మిషిగన్ ఓటర్లను కోరారు.వాన్స్కు ఎల్-సయెద్ కౌంటర్వాన్స్ చేసిన ‘‘చెడు’’ వ్యాఖ్యలకు ఎల్-సయెద్ కూడా ఘాటుగానే స్పందిస్తూ ట్రంప్ సర్కార్పై మండిపడ్డారు. ‘‘పనిచేసే ప్రజల ఆరోగ్య సంరక్షణను తొలగించి బిలియనీర్లకు పన్ను రాయితీలు ఇవ్వడం చెడు. ట్రేడ్ వార్స్, నిజమైన యుద్ధాల వైపు వెళ్తూ ప్రజలపై నిత్యావసర వస్తువులు, ఇంధన ధరల భారాన్ని పెంచడం చెడు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను విభజించడం చెడు’’ అంటూ ఎదురుదాడి చేశారు. రిపబ్లికన్లు తమపై చేస్తున్న విమర్శలను మిషిగన్ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, నవంబర్ ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెబుతారని అన్నారు.షరియా, ఇజ్రాయెల్ అంశాలపై వివాదంఎల్-సయెద్పై రిపబ్లికన్లు గత కొంతకాలంగా షరియా చట్టం, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై ఆయన వైఖరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. మిషిగన్లోని ఓ సినగాగ్పై మార్చిలో జరిగిన దాడి తర్వాత ఎల్-సయెద్ చేసిన ‘‘హింస అనేది ఓ చక్రం’’ వంటి వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. అయితే ఆ దాడిని, యూదు వ్యతిరేకతను ఆయన ఖండించారు.అలాగే ఎల్-సయెద్కు వామపక్ష రాజకీయ విశ్లేషకుడు హసన్ పైకర్తో ఉన్న సంబంధాన్ని కూడా రిపబ్లికన్లు విమర్శిస్తున్నారు. పైకర్ గతంలో అమెరికా ‘‘9/11కు అర్హమైనదే’’ అనే వ్యాఖ్య చేయడం వివాదాస్పదమైంది. విమర్శలు రావడంతో పైకర్ తర్వాత తన వ్యాఖ్య సరికాదని వెనక్కి తీసుకున్నాడు.మిషిగన్ పోరుపై ఆసక్తిమిషిగన్ సెనేట్ ఎన్నిక ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో కీలక పోరుగా మారింది. సెనేట్ నియంత్రణను నిర్ణయించే అవకాశం ఉన్న ఆరు కీలక పోటీల్లో మిషిగన్ కూడా ఒకటిగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాన్స్–సయెద్ మధ్య మాటల యుద్ధం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.అమెరికా సెకండ్ లేడీ ఉషా చిలుకూరి వాన్స్కు తెలుగు మూలాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వెళ్లిన కుటుంబంలో పుట్టిన ఆమె కాలిఫోర్నియాలో పెరిగారు. యేల్ లా స్కూల్లోనే జేడీ వాన్స్ను కలిసిన ఉషా.. 2014లో ఆయనను వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలోనూ వివాహ వేడుక నిర్వహించడం విశేషం. గతంలో డెమోక్రటిక్ పార్టీలో నమోదైన ఉషా.. రిపబ్లికన్ భర్త జేడీ వాన్స్ రాజకీయ ప్రయాణంలో కీలకంగా నిలిచారు.ఇదీ చదవండి: ఇరాన్ ‘ఖర్గ్’పై ట్రంప్ పోస్ట్.. దానర్థం ఏంటంటే?
‘ఈసారి గట్టిగానే కొడతాం’.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. అమెరికా దాడులకు ప్రతిగా జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. అయితే దీనికి దీటుగా స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. ‘‘మేం వారిని గట్టిగా కొడతాం. ప్రతిస్పందన తప్పకుండా ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ఫాక్స్ న్యూస్తో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ దాడులకు కచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. ఈసారి గట్టిగానే కొడతాం. అది వాళ్లు కోలుకోలేని స్థాయిలోనే ఉంటుందని అని అన్నారు. అయితే ఆ ప్రతీకార చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై స్పష్టత ఇవ్వకపోయినా.. అమెరికా సైనిక, ఆర్థిక మార్గాల్లో చర్యలకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇచ్చారు. అలాగే ఇరాన్ను ఓ విఫల దేశంగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, కరెన్సీ వంటి కీలక వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం తీవ్ర గందరగోళంలో ఉందని, దేశాన్ని సరిగ్గా నడిపించే స్థితిలో లేదని అన్నారు. అదే సమయంలో హర్ముజ్ జలసంధి సురక్షితంగానే ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా బలగాలపై ఇరాన్ దాడులు చేసినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో జోర్డాన్ సైన్యం అప్రమత్తమైంది. తమ గగనతలంలోకి వచ్చిన ఎనిమిది క్షిపణులను అడ్డుకున్నట్లు జోర్డాన్ ప్రకటించింది. దాదాపు నెల రోజుల తర్వాత.. లారక్ ద్వీపంపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. ఆ దాడుల్లో సాధారణ పౌరులు సైతం మరణించారని ఆరోపిస్తూ ఇరాన్ ఈ దాడులకు పాల్పడింది.మరోవైపు ఇరాన్ సాయుధ దళాలు, అమెరికా మధ్య ఉద్రిక్తతలు గల్ఫ్ ప్రాంతానికీ విస్తరించాయి. తూర్పు హర్ముజ్ జలసంధిపై అమెరికాకు చెందిన MQ-9 డ్రోన్ను తమ వాయు రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.‘ఖర్గ్’పై ట్రంప్ పోస్టు.. ఇరాన్కు సందేశమేఇరాన్లోని ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ ఆదివారం చేసిన సోషల్ మీడియా పోస్టు కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ద్వీపాన్ని పేల్చేస్తూ అమెరికా సైనిక దాడులకు సంబంధించినట్లు కనిపించే ఏఐ రూపొందించిన వీడియోను ఆ పోస్టుతో జత చేశారు. అయితే ఖర్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం రాత్రి దాడులు చేయలేదని ఓ అమెరికా అధికారి స్పష్టం చేశారు. ట్రంప్ పోస్టు వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించగా.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వ్యూహాత్మకంగా సందేశాలు ఇస్తారని, ఇరాన్కు ఆయన ఓ సందేశం పంపుతున్నారని చెప్పారు.ఐరాసను ఆశ్రయించిన ఇరాన్అమెరికా దాడులపై ఇరాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. లారక్ ద్వీపంపై అమెరికా దాడిలో సైనికులు, పౌరులు మరణించారని, పలువురు గాయపడ్డారని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడి తమ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమేనని పేర్కొంది. జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై తాము చేసిన దాడులు ‘‘ఆత్మరక్షణ చర్యల్లో భాగమే’’ అని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా మరిన్ని దాడులకు పాల్పడితే తాము వెనక్కి తగ్గబోమని హెచ్చరించింది. అమెరికా దాడులను నిలిపివేయాలని భద్రతా మండలిని కోరింది.ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బఇరాన్పై అమెరికా తాజాగా ప్రకటించిన ఆంక్షల ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. తాజా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ‘‘వారాలు లేదా నెలల్లో కుప్పకూలే అవకాశం ఉందని’’ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా అసలు లక్ష్యం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయడం కాదని.. చర్చలకు ఇరాన్ను రప్పించే ప్రయత్నమేనని బెసెంట్ స్పష్టం చేశారు. యూఏఈకి ఇరాన్ డ్రోన్.. తీవ్ర ఆగ్రహంఇరాన్ తమపై డ్రోన్ దాడికి ప్రయత్నించిందని యూఏఈ ఆరోపించింది. గగనతల రక్షణ వ్యవస్థలు ఆ డ్రోన్ను అడ్డుకున్నాయని తెలిపింది. ఈ ఘటనను ‘‘ప్రమాదకరమైన ఉద్రిక్తత’’గా అభివర్ణిస్తూ ఇరాన్ చర్యను తీవ్రంగా ఖండించింది.హర్ముజ్లో ట్యాంకర్పై దాడి జరిగిందా?హర్ముజ్ జలసంధిలో ఓ సూపర్ ట్యాంకర్ రెండు సముద్ర గనులను ఢీకొని నిలిచిపోయిందన్న ఇరాన్ ప్రభుత్వ మీడియా, రెవల్యూషనరీ గార్డ్స్ వాదనలను అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. ఆ వార్త పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం కావడంతో.. అక్కడ ఎలాంటి చిన్న ఘటన జరిగినా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇరాన్కు అండగా ఈయూ ఒత్తిడిఇరాన్ తన అస్థిరత సృష్టించే చర్యలను నిలిపివేసి శాంతి చర్చలకు రావాల్సిందేనని యూరోపియన్ యూనియన్ పేర్కొంది. అమెరికాతో పాటు ఇతర మిత్రదేశాలతో కలిసి ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని కొనసాగిస్తామని తెలిపింది. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్.. ఈ ప్రాంతంలో అమెరికాను చుట్టుముట్టేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. చమురు ఎగుమతి చేసే దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా అమెరికాపై ఆర్థిక ప్రభావం చూపాలని సూచించారు.ఇదీ చదవండి: H4 వీసాదారులకు ట్రంప్ ఝలక్
26 విపత్తుల తేదీ!
ఏడాదిలో ఉండే 365 రోజుల్లో ప్రకృతి విపత్తులు ఎప్పుడైనా ఏర్పడవచ్చు.... ఒకట్రెండు ఒకే తేదీలో వస్తే.. కాకతాళీయం, యాదృచి్ఛకం అనుకుంటాం... ఇలా కాకుండా బోలెడన్ని ప్రకృతి విపత్తులు.. 26వ తేదీనే వస్తే...? ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా నేపాల్ను వరద ముంచేసింది కానీ... గతంలో ఇదే 26వ తేదీ ఎన్ని విపత్తులు వచ్చాయో తెలుసా?సుమారు 96 ఏళ్లు అవుతోంది.. 26వ తేదీ ప్రకృతి విపత్తులు సంభవించడమనే ఆశ్చర్యకరమైన ఘటనలు చోటు చేసుకోవడం. 1930లో టర్కీని కుదిపేసి 32,700 మంది ప్రాణాలు తీసిన భూకంపం సంభవించింది నవంబరు 26. ఆ తరువాత కూడా అనేకసార్లు నెలలు మారినా విపత్తులు మాత్రం 26వ తేదీనే జరగడం యాదృచి్ఛకం అని కొట్టిపారేయలేమేమో. ప్రకృతి వైపరీత్యాల మాట అలా ఉంటే మానవ తప్పిదాల కారణంగా చోటు చేసుకున్న భారీ దుర్ఘటనల్లో కొన్ని కూడా 26వ తేదీనే చోటు చేసుకున్నాయి. మచ్చుకు కొన్నింటిని చూద్దాం. ఆగస్టు 26, 2026: నేపాల్ను ముంచేసిన మెరుపు వరదలు: హిమాలయ పర్వత శిఖరాల్లో ఓ హిమానీనదం అకస్మాత్తుగా విరిగి కిందకు పడటంతో నేపాల్లోని రసువా జిల్లాలో భోటే కోశి నదికి మెరుపు వరద వచ్చింది. దీంతో గ్రామాలు మునిగాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఆగస్టు 31 నాటికి 900 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 4,500 మంది గల్లంతయ్యారు. అక్టోబర్ 26, 2015: హిందూకుష్ భూకంపం: హిందూకుష్ ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారతదేశంసహా అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర కొన్ని ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. దాదాపు 400 మంది మరణించారు. మే 26, 2006: యోగ్యకర్త భూకంపం, ఇండోనేíసియా: ఇండోనేíÙయాలోని జావా ద్వీపంలో యోగ్యకర్త సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. వేల ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. 5,700 మందికి పైగా మృతి చెందారు. జూలై 26, 2005: మహారాష్ట్ర వరదలు: మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాజధాని ముంబైలో ఒకే ఒక్కరోజులో 944 మి.మీ. వర్షం నమోదైంది. రోడ్లు, ఇళ్లు, రైల్వే లైన్లు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. రాష్ట్రం మొత్తమ్మీద 1,094 మంది మృతి చెందారు. డిసెంబర్ 26, 2004: సునామీ ప్రళయం... సుమత్రా తీరం సమీపంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం సునామీగా మారి హిందూ మహాసముద్ర తీర దేశాలపై విరుచుకుపడింది. ఇండోనేసియా, శ్రీలంక, భారతదేశం, థాయిలాండ్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దాదాపు 2,28,000 మంది మరణించగా మరెందరో గల్లంతయ్యారు. చరిత్రలోనే అత్యంత ప్రాణాంతక విపత్తుల్లో ఒకటిగా ఇది నమోదైంది. డిసెంబర్ 26, 2003: బామ్ భూకంపం, ఇరాన్: ఇరాన్లో 6.6 తీవ్రతతో వచ్చిన భూకంపం చారిత్రక నగరం బామ్, చుట్టుపక్కల గ్రామాలను ధ్వంసం చేసింది. వేల భవనాలు మట్టిదిబ్బలుగా మారాయి. ఈ ప్రకృతి విపత్తులో సుమారు 31,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 25–26, 2002: వరుస భూకంపాలతో అఫ్గానిస్తాన్ అతలాకుతలం: ఉత్తర అఫ్గానిస్తాన్లోని బఘ్లాన్ ప్రాంతంలో రాత్రిపూట వరుస భూకంపాలు సంభవించి 1800 మంది ప్రాణాలు బలితీసుకున్నాయి. మట్టి ఇళ్లు కూలిపోగా వేల మంది నిరాశ్రయులయ్యారు. జనవరి 26, 2001: గుజరాత్ భూకంపం: 2001 జనవరి 26న గుజరాత్లో భయంకర భూకంపం సంభవించింది. ఫలితంగా కచ్ ప్రాంతం ధ్వంసమైంది. సుమారు 20,000 మంది ప్రాణాలు కోల్పోగా... 1,66,000 మందికి పైగా గాయపడ్డారు. జూలై 26, 1963: స్కోప్జే భూకంపం: అప్పటి యుగోస్లేవియాలోని స్కోప్జే నగరంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. నగరం ధ్వంసమైంది. 2,00,000 మంది నిరాశ్రయులయ్యారు. 1,070 మంది మృతి చెందారు. నవంబర్ 26, 1943: లాడిక్ భూకంపం, టర్కీ: టర్కీలోని లాడిక్–సామ్సన్–హవ్జా ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. టర్కీ ఉత్తర ప్రాంతంలో విస్తృత నష్టం జరిగింది. 4,020 మంది మృతి చెందారు. డిసెంబర్ 26–27, 1939: ఎర్జింకాన్ భూకంపం, టర్కీ: టరీ్కలోని ఎర్జింకాన్ ప్రాంతంలో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం 32,700 మంది ప్రాణాలు బలితీసుకుంది. అపారమైన ఆస్తినష్టం నమోదైంది. మానవ తప్పిదాలు తెచ్చిన విపత్తులు... → సెప్టెంబర్ 26, 2023: ఖరాఖోష్ వెడ్డింగ్ హాల్ అగ్నిప్రమాదం... ఇరాక్లోని మోసుల్ సమీపంలోని ఖరాఖోష్లోని వెడ్డింగ్ హాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. భవనం లోపలే పటాకులు పేల్చడంతో ఈ ప్రమాదం జరిగింది. పైరోటెక్నిక్స్ మండే పదార్థాలను తగలబెట్టాయి. నిండిన హాల్లో నిప్పు వేగంగా వ్యాపించింది. 100 మందికి పైగా మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. → ఆగస్టు 26, 2021: కాబూల్ ఎయిర్పోర్ట్ బాంబు పేలుడు అఫ్గానిస్తాన్లోని కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఆత్మా హుతి దాడిలో 183 మంది మృతి చెందారు. వీరిలో 170 మంది ఆఫ్గాన్ పౌరులు, 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు.→ నవంబర్ 26, 2008: ముంబై ఉగ్రదాడులు దేశాన్ని కుదిపేసిన అత్యంత భారీ ఉగ్రవాద దాడి ఇది. 2008 నవంబర్ 26 రాత్రి ముంబైలోకి ప్రవేశించిన పది మంది లష్కర్–ఎ–తొయిబా ఉగ్రవాదులు ఏకకాలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెరి్మనస్, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ వంటి ప్రాంతాల్లో కాల్పులకు దిగారు. మూడు రోజుల పాటు సాగిన ఈ ఉగ్రదాడిలో భద్రతాదళాలు తొమ్మిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. 166 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడ్డారు.→ మే 26, 1991: లాడా ఎయిర్ ఫ్లైట్ 004 ప్రమాదం బ్యాంకాక్ నుంచి వియన్నాకు వెళ్తున్న లాడా ఎయిర్ బోయింగ్ 767 విమానం థాయిలాండ్లో కూలిపోయింది. ఇంజన్ థ్రస్ట్ రివర్సర్ అనూహ్యంగా విచ్చుకోవడంతో విమానం నియంత్రణ కోల్పోయి ముక్కలైపోయి కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 223 మంది మృతి చెందారు. – న్యూఢిల్లీ
హిమాలయ బోర్డు ఏర్పాటు చేయాలి
కఠ్మాండు: హిమాలయ ప్రాంతాల్లో విపత్తులను ఎదుర్కోవడానికి ఐదు సరిహద్దు దేశాలతో కలిపి హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని ఆధ్మాతి్మక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ డిమాండ్చేశారు. సున్నితమైన ఈ పర్వత ప్రాంతానికి రాజకీయాలకు అతీతంగా భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్లతో కూడిన సరిహద్దు సహకారం అవసరమన్నారు. ఆదివారం కఠ్మాండులో ఏర్పాటు చేసిన ‘నేపాల్కు సంఘీభావం’కార్యక్రమంలో ప్రసంగించారు. తక్షణ సహాయానికి మించి, హిమాలయాలపై విస్తృతస్థాయిలో సామూహిక బాధ్యత అవసరమని సద్గురు పిలుపునిచ్చారు. ఆ పర్వతాలు దేశాల మధ్య గీసిన సరిహద్దులకు అతీతమైనవని, వాటి భవిష్యత్తు వాటిపై ఆధారపడిన వారందరికీ సంబంధించినదని గుర్తించాలని ఆయన అన్నారు. ‘పర్వతాలకు మీ రాజకీయాలు తెలియదు. మీరు మాట్లాడే అర్థంలేని మాటలు లేదా భాష పర్వతాలకు తెలియదు. హిమాలయ ప్రాంతం భూమిపై అద్భుతమైన, సున్నితమైన ప్రాంతం. అటువంటి పర్వతాల రక్షణ కోసం అవి విస్తరించి ఉన్న దేశాలన్నింటితో కూడిన ఒక సంస్థ ఏర్పాటు తక్షణ అవసరం. ఈ విపత్తు తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. దీని పరిణామాలను నేపాల్ లాంటి చిన్నదేశం ఒంటరిగా ఎదుర్కోలేదు. మనం దీనిపై దృష్టి పెట్టాలి’అని ఆయన అన్నారు. కోటి రూపాయల విరాళం.. నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి కోటి రూపాయల విరాళంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని ఇషా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. చైనా–నేపాల్ సరిహద్దు సమీప ప్రాంతాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల తర్వాత ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది యాత్రికుల బృందం ఆచూకీ లేకుండా పోయింది. నేపాల్ వైపున ఉన్న ముగ్గురు ఇషా వలంటీర్ల ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. ఇషా ఫౌండేషన్ ప్రతి సీజన్లో కైలాస్ మానసరోవర్ యాత్రలను నిర్వహిస్తోంది. యాత్రలో భాగంగా కాలినడకన ట్రెక్కింగ్ చేస్తూ బృందాలు కఠ్మాండు నుంచి నేపాల్ మీదుగా టిబెట్కు వెళ్తాయి.
జాతీయం
కార్ల మధ్య రహస్య సంభాషణతో రోడ్డు ప్రమాదాలకు చెక్
దేశంలోని రోడ్లపై ప్రయాణం ఇకపై పూర్తిగా మారిపోనుంది. ఎదురుగా వచ్చే ప్రమాదాలను ముందే పసిగట్టి, ఒకదానితో ఒకటి మాట్లాడుకునే సరికొత్త కార్లు త్వరలోనే మన ముందుకు రాబోతున్నాయి. దేశంలో ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వెహికల్-టు-వెహికల్’ (వీ టు వీ) కమ్యూనికేషన్ వ్యవస్థను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. కేంద్రం సంచలన నిర్ణయం2025లో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 1.83 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య సుమారు 6,000 పెరగడం ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ‘కేంద్ర మోటార్ వాహనాల (సవరణ) నిబంధనలు, 2026’ ముసాయిదాను జూలై 22న విడుదల చేసి, ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరించింది.అసలు ఏమిటీ ‘వీ టు వీ’టెక్నాలజీ?వీ టు వీ అంటే ‘వెహికల్-టు-వెహికల్’ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఈ సాంకేతికత ద్వారా రోడ్డుపై వెళ్లే వాహనాలు పరస్పరం సమాచారాన్ని మార్పిడి చేసుకుంటాయి. ప్రస్తుతం కార్లలో వస్తున్న ఏడీఏఎస్ భద్రతా ఫీచర్ల కంటే ఇది ఎంతో ముందంజలో ఉంటుంది. ఈ వ్యవస్థ సాయంతో ప్రయాణంలో ఎదురయ్యే ముప్పును డ్రైవర్ కంటే ముందే వాహనం గుర్తించి హెచ్చరిస్తుంది.అమలు గడువులు.. పాటించాల్సిన ప్రమాణాలుకొత్త నిబంధనల ప్రకారం, 2027 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే ఎల్ (ద్విచక్ర, త్రిచక్ర), ఎం (కార్లు, బస్సులు), ఎన్ (సరుకు రవాణా వాహనాలు) కేటగిరీ వాహనాల్లో వీ టు వీ సిస్టమ్ అమర్చితే అవి కచ్చితంగా ‘ఏఐఎస్-230’ ప్రమాణాలకు లోబడి ఉండాలి. అలాగే 2028 అక్టోబర్ 1 తర్వాత దేశంలో తయారయ్యే ఈ కేటగిరీల అన్ని వాహనాల్లోనూ ‘వీ టు వీ’ సిస్టమ్ ఏర్పాటును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. సిగ్నల్స్ బదిలీ, రేడియో ఫ్రీక్వెన్సీ, జీపీఎస్ అనుసంధానం, సైబర్ భద్రత నియమాలను ఈ ఏఐఎస్-230 ప్రమాణాలు నిర్దేశిస్తాయి.సాంకేతికత ఎలా పనిచేస్తుంది?వాహనంలో అమర్చే చిన్న ‘ఆన్-బోర్డ్ యూనిట్’ (ఓబీయూ)ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఇది 5.875 GHz నుండి 5.925 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్పై సెల్యులార్ వెహికల్-టు-ఎవ్రీథింగ్ (C-V2X) సాంకేతికతను వాడుకుంటుంది. టెలికాం శాఖ (DoT) ఇప్పటికే ఈ స్పెక్ట్రమ్ను లైసెన్స్ రహితంగా ప్రకటించింది. ఈ ఓబీయూ పరికరం దాదాపు 300 మీటర్ల పరిధిలోని వాహనాలను సులువుగా పసిగడుతుంది. కొత్త కార్లలో అమర్చే ఈ పరికరం ఖరీదు సుమారు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సాధారణ సెన్సార్లకు ‘వీ టూ వీ’కి తేడా ఏమిటి?ప్రస్తుతం కార్లలో ఉండే కెమెరా లేదా రాడార్ ఆధారిత ఏడీఏఎస్ వ్యవస్థలు కేవలం డ్రైవర్ లేదా కెమెరా చూడగలిగే పరిధిని మాత్రమే గుర్తిస్తాయి. కానీ ‘వీ టూ వీ’ వ్యవస్థ దృష్టికి ఆవల ఉన్న ప్రమాదాలను కూడా పసిగడుతుంది. ప్రమాదకరమైన మలుపులు (బ్లైండ్ కార్నర్స్), భారీ ట్రక్కుల వెనుక ఉన్న కార్లు, దట్టమైన పొగమంచులో దాగి ఉన్న వాహనాల వివరాలను వేగం, దిశ, బ్రేకింగ్ డేటా ద్వారా పరస్పరం పంచుకుంటుంది. విమానాలు తమ ఎత్తు, వేగాన్ని రేడియో సిగ్నల్స్ ద్వారా పంచుకునే విధానాన్ని పోలి ఉండే ఈ వ్యవస్థతో ఎదురెదురు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి.డేటా భద్రత.. ఎదురవుతున్న సవాళ్లు‘వీ టు వీ’ ఎంతో ఉపయోగకరమైనప్పటికీ, ప్రయాణ డేటా, వాహనం లొకేషన్, రూట్ సమాచారం నిరంతరం సేకరించడం వల్ల సైబర్ దాడులు, గోప్యతా సమస్యలు తలెత్తే ముప్పు ఉంది. లక్షలాది వాహనాలు ఒకేసారి రోడ్లపైకి వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ బ్యాండ్పై ట్రాఫిక్ లోడ్ పెరగడం, సిగ్నల్ లోపాలు రాకుండా చూసుకోవడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. ఈ భద్రతా లోపాలను అధిగమించేందుకు పటిష్టమైన సైబర్ చట్టాలు, రక్షణ చర్యలు అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: నేపాల్: శవాల గుర్తింపు ఎలా? కుటుంబ సభ్యులకు చూపిస్తారిలా..
అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత
ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి ఆయన్ని హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతుండగా.. హెల్త్ బులిటెన్ విడుదల కావాల్సి ఉంది.అహింసా పద్ధతుల్లో.. శాంతియుత మార్గాల్లో అన్నా హజారే గతంలో పలు సత్యాగ్రహాలు చేశారు. ఇప్పటిదాకా ఆయన 22 సార్లు నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే అవినీతి వ్యతిరేక ఉద్యమం ఇండియా అగైనెస్ట్ కరప్షన్ (ఐఏసీ) మాత్రం ఆయనకు బాగా పేరొచ్చింది. ఆ తర్వాత రైతు చట్టాలు సహా అనేక ఉద్యమాలకు ఆయన మద్దతు ప్రకటించారు. ఇటీవలి నీట్ నిరసనలపై ఆయన స్పందించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి.. విద్యార్థులతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యార్థులకు సంఘీభావంగా జూలై 23న రెండు గంటలపాటు మౌన దీక్ష కూడా చేపట్టారు.89 ఏళ్ల హజారే.. వైరల్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సంబంధిత సమస్యలతో.. తీవ్రమైన డీహైడ్రేషన్తో బాధపడుతున్నారు. రాలేగావ్ సిద్ధిలో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించారు. బాంబే ఆస్పత్రిలో వైద్యుడు గౌతమ్ భన్సాలీ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. హజారే ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అవసరమైన పరీక్షలు నిర్వహించిన అనంతరం తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నారు.కేజ్రీవాల్తో కలిసి..2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏప్రిల్ 5న ఢిల్లీలోని జంతర్ మంతర్లో జనలోక్పాల్ బిల్లును బలంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. నాలుగు రోజులపాటు సాగిన ఈ దీక్షకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభించడంతో ప్రభుత్వం జనలోక్పాల్ బిల్లుపై చర్చలకు దిగింది. ఈ ఉద్యమంలో సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ, ప్రశాంత్ భూషణ్ తదితరులు హజారేకు కీలక సహచరులుగా ఉన్నారు. హజారే ఉద్యమానికి కేజ్రీవాల్ బలమైన మద్దతు ఇవ్వడంతో ఇద్దరి పేర్లు అప్పట్లో దేశవ్యాప్తంగా మార్మోగాయి. అనంతరం అదే ఉద్యమం నేపథ్యంలో కేజ్రీవాల్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు.ఇదీ చదవండి: బీజేపీ సర్కార్కు ఆరేళ్ల పిల్లాడి వార్నింగ్!
ఇథనాల్ శాతం వెల్లడికి డిమాండ్ పిటిషన్కు సుప్రీంకోర్టు ‘నో’
న్యూఢిల్లీ: చమురు కంపెనీలు పెట్రోల్లో కలిపే ఇథనాల్ ఎంతో స్పష్టంగా తెలియజేయాలన్న డిమాండ్తో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు కింద నరేంద్ర కుమార్ గోస్వామీ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించేది లేదని జస్టిస్ ఎంఎం సుంద్రేశ్, జస్టిస్ పి.బి.వరాలేలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. పిటిషనర్ తగిన హైకోర్టును ఆశ్రయించే వెసలుబాటు కల్పించింది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకట రమణి వాదిస్తూ ఇలాంటి పిటిషన్ ఒకటి ఇప్పటికే డిస్మిస్ అయ్యిందని, దీంతో ఇప్పుడు పరోక్షంగా కేసు వేశారని చెప్పారు. ‘భారత ప్రభుత్వం తనకు జవాబుదారిగా ఉండాలని పిటిషనర్ కోరుకుంటున్నారు’’అని తెలిపారు. అయితే పిటిషర్ నరేంద్ర కుమార్ గోస్వామీ కోర్టుకు పెట్రోలు పంపు రసీదు ఒకటి సమర్పిస్తూ... తాను ఉపయోగించే పెట్రోలులో ఏమేమి కలిశాయో తెలుసుకునే హక్కు తనకుందని స్పష్టం చేశారు. ‘‘నేనొక్కడినే కాదు. దేశ పౌరుల్లో అధికులు పెట్రోలులో ఏమేం ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు’’అని తెలిపారు. తాను అందించిన రసీదులో పెట్రోలులో కలిపిన ఇథనాల్ మోతాదు ఎంతో లేదని చెప్పారు. పెట్రోలులో ఇథనాల్ కలపడాన్ని అటార్నీ జనరల్ గత విచారణలో ఒక ప్రయోగం అన్నారని, కానీ ఆ తరువాత ప్రభుత్వం తాము ఆ మాట అనలేదని ఒక ప్రకటన చేసిందని గోస్వామి గుర్తు చేశారు. ఈ దశలో న్యాయమూర్తులు మాట్లాడుతూ పిటిషనర్ తన అభ్యంతరాలను హైకోర్టు ముందు చెప్పుకోవాలని తెలిపారు. పెట్రోలులో ఇథనాల్ శాతాన్ని ప్రతి పంపుపైనా, రసీదులోనూ ప్రదర్శించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని నరేంద్ర కుమార్ గోస్వామీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏ వాహనానికి ఏ రకమైన పెట్రోలు, ఇథనాల్ మిశ్రమం పని చేస్తుందో చూపే ఒక జాబితాను తయారు చేసేలా కేంద్రానికి, సంబంధితులైన ఇతరులకు ఆదేశాలివ్వాలని కోరిన విషయం తెలిసిందే. ఈ జాబి తాలో తయారీదారు ఎవరు? మోడల్, ఇంజిన్ రకం, త యారైన సంవత్సరం వంటి విషయాలన్నీ పొందుపరిచి.. వెతికేందుకు అనువుగా ఉండేలా సిద్ధం చేయాలని కోరా రు. ఈ20 పెట్రోలును వాడుతున్న వాహనాలపై నిపుణు ల కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని, ఆ వాహనాల మైలేజీ, ఇంజిన్ మన్నిక, నిర్వహణ ఖర్చులు, వారంటీ, బీమా తదితర అంశాల ప్రభావాన్ని కూడా మదింపు చేసి నివేదిక సమర్పించేలా చూడాలని కోరారు.
సముద్ర భద్రతపై కొత్త సవాళ్లు!
ముంబై: ప్రపంచంలో ప్రస్తుతం వ్యూహాత్మక మార్పుల కాలం నడుస్తోందని, సముద్ర మార్గాల్లో ముప్పు పెరుగుతోందని, నౌకాయాన పరిస్థితుల్లోనూ చాలా తేడాలు వస్తున్నాయని భారత నావికాదళ అధ్యక్షుడు అడ్మిరల్ స్వామినాథన్ తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం ఇందుకు ఒక కారణమని చెప్పారు. సముద్ర గర్భంలో సుమారు 300 మీటర్ల లోతుల్లోనూ పనిచేయగల సరికొత్త జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ నిపుణ’ను సోమవారం జాతికి అంకితం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడ్మిరల్ స్వామినాథన్ మాట్లాడుతూ ముప్పు తీరుతెన్నులు నిరంతరం మారిపోతున్నాయని, కొత్త రకాల సవాళ్లు, సంక్లిష్టతలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. పశ్చిమ ఆసియాలో అస్థిరత నేపథ్యంలో ఆ ప్రాంతంలోని దేశాలు చాలా వేగంగా ఆయుధాలు సమకూర్చుకుంటున్నాయని, చెప్పారు. ఈ పరిస్థితుల్లో దేశ పశ్చిమ నౌకాదళ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. ‘దేశం ఏ రకమైన ముప్పు ఎదుర్కొంటుందో కచి్చతంగా ఊహించడం ఎల్లప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. కానీ, ముందస్తుగా అంచనాలున్న ముప్పులకు మాత్రం తయారుగా ఉండవచ్చు. అందుకు తగ్గ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు‘ అని ఆయన అన్నారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ పరిధిలో ఉన్న దేశ తీర ప్రాంతం సామర్థ్యాలను పెంచడంలో ఐఎన్ఎస్ నిపుణ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 300 మీటర్ల లోతులోనూ... విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్పింగ్ యార్డ్ నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్ 300 మీటర్ల లోతుల్లో జరిపే కార్యకలాపాలకూ దన్నుగా నిలవగలదు. భారతీయ నౌకాదళంలో ఇప్పటివరకూ ఇలాంటి నౌక ఒకటే ఉండగా... నిపుణ్ చేరికతో వీటి సంఖ్య రెండుకు చేరింది. సుమారు 119.4 మీటర్ల పొడవు, 10,500 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. రక్షణ కార్యకలాపాలు వేగంగా నిర్వహించగల సామర్థ్యం దీని సొంతం. విపత్తు సహాయక చర్యలు, మానవతా సాయం చేరవేతలకు కూడా దీనిని వినియోగించవచ్చు.
ఎన్ఆర్ఐ
అమెరికా నుంచి వచ్చిన యువతి అదృశ్యం
హైదరాబాద్: అమెరికాలో నివాసం ఉంటున్న యువతి అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు..పీర్జాదిగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన బుడిగె శైలజ కుమార్తె బుడిగె విహారిక (27), అల్లుడు హరీష్ లు ఈ ఏడాది జనవరి 26 నుంచి అమెరికాలో నివసిస్తున్నారు. అయితే ఈ నెల 20న విహారిక కనిపించడం లేదంటూ భర్త కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకోగా... విహారిక అమెరికా నుంచి తన పాస్పోర్ట్తో బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆమె హైదరాబాద్కు వస్తుందని భావించి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లగా ఆమె అక్కడికి చేరుకోలేదు. అయితే ఆగస్టు 21న విహారిక ముంబై విమానాశ్రయంలో ఉన్నట్లు సమాచారం అందింది. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ కలవకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. మేడిపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు.
ప్రేయసి దూరమైందని అమెరికాలో ఆత్మహత్య..!
హైదరాబాద్: చదువుకునేందుకు అమెరికా వెళ్లిన ఓ యువకుడు ప్రేమించిన యువతి దూరం కావడంతో ఆ బాధ తట్టుకోలేక ఈనెల 21న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపిన మేరకు.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ దమ్మాయిగూడలోని శ్రీనివాస్నగర్ కాలనీకి చెందిన కృష్ణ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు సాయిప్రదీప్(29) 2024లో మాస్టర్స్ చదువు కోసం అమెరికా వెళ్లారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో తన అన్న ప్రణీత్తో కలిసి ఉంటూ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ నుండి మూడు నెలల క్రితం మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న సిద్ధిపేటకు చెందిన యువతిని ప్రదీప్ 9 నెలల పాటు ప్రేమించారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని సాయి ప్రదీప్ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముందు తల్లిదండ్రులు అంగీకరించకపోయినా చివరకు ఒప్పుకున్నారు. ఇంతలోనే ప్రేమించిన యువతి దూరంగా ఉంటోంది. సున్నిత మనస్తత్వం కలిగిన ప్రదీప్ ఇది తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న ప్రేయసికి దాదాపు పది సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. తను చేస్తున్న జాబ్ బాధ్యతలను రెండు గంటల పాటు నిర్వర్తించాలని అన్నకు అప్పగించారు. ఆ తరువాత ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఘటన గురించి తల్లిదండ్రులకు ప్రణీత్ తెలిపారు. ప్రేయసి దూరం కావడంతోనే తమ్ముడు ప్రదీప్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని అమెరికాలో పోలీసులకు ప్రణీత్ ఫిర్యాదు చేశారని మృతుని తండ్రి కృష్ణ తెలిపారు. మృతదేహాన్ని ఈ నెలాఖరులోపు తెప్పించేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇదిఆ ఉండగా ప్రదీప్కు చిన్నతనంలోనే కిడ్నీ సమస్య ఉండటంతో ఒక కిడ్నీని వైద్యులు తొలగించారు. సాయిప్రదీప్ తల్లిదండ్రులను కాంగ్రెస్ పార్టీ దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షుడు రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, బీఆర్ఎస్ నేత హరిగౌడ్ తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఉద్యోగం రాలేదని అమెరికాలో హైదరాబాదీ యువకుడి ఆత్మహత్య
కోటి కలలతో రెక్కలు కట్టుకుని విదేశాలకు ఎగిరిపోయిన ఒక యువకుడి జీవితం విషాదంతమైంది. ఉన్నత చదువులు చదివినా కూడా ఉద్యోగం రాలేదని అమెరికాలో హైదరాబాద్కు చెందిన సాయిప్రదీప్ ఆత్మహత్య చేసుకున్న దిగ్బ్రాంతి రేపింది. హైదరాబాద్లోని దమ్మాయిగూడలోని శ్రీనివాసనగర్ కాలనీ చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. నివేదికల ప్రకారం, సాయి ప్రదీప్ 2024లో అమెరికాకు వెళ్లారు. ఇటీవల 'యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ శాన్ ఆంటోనియో'లో తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అతనికి సప్లై చైన్ అనలిస్ట్గా 5 సంవత్సరాల అనుభవం ఉన్నట్టు తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఫలితం దక్కకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైనాడు. దీంతో ఈ డిప్రెషన్తో ఆగస్టు 21న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని మృతదేహాన్ని భారతదేశానికి రప్పించడానికి మరియు అంత్యక్రియల ఖర్చులను భరించడానికి అతని కుటుంబం నిధుల సేకరణను ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కాగా అమెరికా కఠినమైన వలస విధానాలలో నెలకొన్న ఉద్యోగ సంక్షోభం, ఎన్నారైలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భవిష్యత్ అనిశ్చితి కెరీర్ కలలు, ఆర్థిక ఒత్తిడి వేలాది మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇదీ చదవండి: పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారు
వేటూరి గీతాల వెల్లువ.. డాలస్లో సాహితీ మహోత్సవం!
డాలస్, టెక్సస్: ‘వేటూరి సాహిత్యాభిమానసమితి ఆఫ్ అమెరికా’, ‘శుభం ఫౌండేషన్’ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ప్రిస్కో మెమోరియల్ హైస్కూల్ ఆడిటోరియంలో ‘కవికులాలంకార’ వేటూరి సుందర రామమూర్తి విరచిత 8 సినీ, సినీయేతర గీత సంపుటాల ఆవిష్కరణ, వేటూరి ప్రత్యేక పాటల నృత్యం, సంగీత విభావరి 500 మందికి పైగా హాజరైన సంగీతం, సాహిత్యాభిమానుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగువేదకవి, ప్రముఖ సినీగీత రచయిత, దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ సాహిత్య సంపుటాలను ఆవిష్కరించి, తొలి గ్రంథాన్ని విశిష్ట అతిథిగా హాజరైన ఈనాడు దినపత్రిక సంపాదకుడు ఎం. నాగేశ్వరరావుకు, ఆ తర్వాత ప్రత్యేక అతిథులుగా హాజరైన వామరాజు సత్యమూర్తికి, డా. కొమాండూరి రామాచారికి అందజేశారు.వేటూరి సాహిత్యాభిమానసమితి ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, శుభం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గోపాల్ పోణంగి ఆధ్వర్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో ఈ సాహిత్య సంపుటాలను ప్రచురించడానికి సహాయ సహకారాలు అందించిన వారిలో హాజరైన డా. బుచ్చిబాబు పైడిపాటి, చంద్రహాస్ మద్దుకూరి, చంద్రశేఖర్ రెంటచింతల, గోకుల్ కిలారు, ప్రొఫెసర్ జగదీశ్వరన్ పుడూర్, మురళి వెన్నం, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, రామకృష్ణ పొక్కునూరి, రావు కల్వల, డా. సుబ్రహ్మణ్యం బోయారెడ్డి, విజయసారధి జీడిగుంట, వినోద్ ఉప్పులను ఘనంగా సత్కరించారు.వేటూరితో సుదీర్ఘకాలం సాహిత్య ప్రయాణం చేసిన ప్రముఖ సినీగీత రచయిత, దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుతో డా. ప్రసాద్ తోటకూర నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమంలో పాత్రికేయుడిగా ఉన్న వేటూరి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు ఒత్తిడిమేరకు అయిష్టంగా రచయితగా సినీరంగ ప్రవేశం చేయడం, ఆ తర్వాత సినీ పరిశ్రమలో ఒక ముఖ్యభాగం అవడం, కవిపండితుడిగా వేటూరి కవితావైభవం, ఆయన కలం నుంచి అప్రయత్నంగా వేగంగా వెలువడే గీతాల వెల్లువ, ఆయన వ్యక్తిత్వం, అందరినీ గౌరవించే తత్వం ఆయనకున్న తెలుగు భాషాభిమానం గురించి మాట్లాడారు. అలాగే, పాత్రికేయుడిగా, సంపాదకుడిగా ఆయన రచనాశైలి, కేవలం వేలకొద్దీ సినిమా గీతాలేగాక ఎన్నో విలువైన వ్యాసాలు, ‘జీవనరాగం’, ‘రాబిన్ హుడ్’, ‘సిరికాకొలను చిన్నది’, ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ లాంటి విశిష్ట రచనలు, వేటూరి జీవితంలో జరిగిన కొన్ని హాస్య సంఘటనలు ఇంకా వివిధ అంశాలపై వీరి మధ్య దాదాపు గంటసేపు సాగిన చర్చా కార్యక్రమం ఆద్యంతం నవ్వులు పూయించి మంచి ప్రేక్షకాదరణ పొందింది.ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ “వేటూరి రాసిన పాటలలో గొప్ప పాటలు ఏవి? అని చాట్ జీపీటీని అడిగితే - ఆయన రాసిన వేలాది పాటలలో కొన్ని గొప్ప పాటలను ఎంపిక చేయడం కష్టం అనే సమాధానం వచ్చింది. దాన్నిబట్టి వేటూరి ప్రతిభ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు” అన్నారు. 18 సంవత్సరాల పాటు పాత్రికేయుడిగా పనిచేసిన వేటూరిని ఈనాడు జర్నలిజం స్కూల్కు ఆహ్వానించి అక్కడి విద్యార్థులతో మాట్లాడించే అవకాశం కలిగిందని, ఆయన జ్ఞాపకశక్తి అమోఘమని, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఇంటర్వ్యూ చేసిన తొలి తెలుగు జర్నలిస్ట్ వేటూరి అని, ప్రేమ, విరహం, భక్తి, తాత్వికత, శృంగారం, వేదన, ప్రకృతి, సామాజిక చైతన్యం ఇలా ఏ రకపు పాటనైనా అక్షరాలలో ఆవిష్కరించగల దిట్ట అని, “రాలిపోయే పువ్వా, నీకు రాగాలెందుకే” అనే పాటకు జాతీయ పురస్కారం అందుకున్న వేటూరి సాహిత్యం జ్ఞానపీఠ పురస్కారానికి నూటికి నూరు శాతం అర్హనీయమైనదన్నారు. వేటూరి పాటలు తెలుగుభాష ఉన్నంతవరకు చిరస్థాయిగా ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాయి అంటూ ఘన నివాళులర్పించారు.ప్రత్యేక అతిథిగా హాజరైన వామరాజు సత్యమూర్తి మాట్లాడుతూ “డా. ప్రసాద్ తోటకూర నిర్వహణలో గత జనవరిలో హైదరాబాద్లో భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా కన్నుల పండుగగా జరిగిన ఈ గ్రంథాల ఆవిష్కరణ సభలోనూ, మరలా ఇప్పుడు ఇక్కడ డాలస్లో అత్యంత వైభవంగా జరిగిన సభలోనూ పాల్గొనడం తన అదృష్టం” అన్నారు.ఆత్మీయఅతిథిగా హాజరైన ప్రముఖ సంగీతగురు డా. కొమండూరి రామాచారి వేటూరితో తనకున్న అనుబంధాన్ని, ఆయన గీత రచనా శైలిని ప్రశంసిస్తూ, కొన్ని పల్లవులను మధురంగా గానం చేసి వేటూరికి స్వరనీరాజనాలర్పించారు.ప్రముఖ గాయకుడు, సంగీతదర్శకుడు రాజశేఖర్ సూరిభొట్ల నిర్వహణలో సాగిన సంగీత విభావరిలో స్థానిక గాయనీ గాయకులు సంతోష్ ఖమ్మంఖర్, చంద్రహాస్ మద్దుకూరి, శిరీష కోటంరాజు, జానకి శంకర్, శ్రేయస్ సూరిభొట్ల, సాహితి కోటంరాజు పాడిన పాటలు అందరినీ అలరించాయి. రాజశేఖర్ కీబోర్డ్పై, ముద్దు పాయ్ కీబోర్డు, గిటార్పై, రాం యామిజాల, నీవ్ యామిజాల పెర్కషన్ వాయిద్యాలపై, సౌండ్ ఇంజనీర్గా రవి మాచ, రవి రావు భట్టిప్రోలు అందించిన సాంకేతిక సహకారం ఈ సంగీత విభావరికి మరింత శోభను చేకూర్చాయి.వేటూరి రాసిన అసంఖ్యాక అద్భుత గీతాలలో ఒక పద్నాలుగు పాటలను ఈ సంగీత విభావరిలో గానం చేశారు. వాటిలో “ఓం నమః శివాయ” (సాగర సంగమం) అనే గీతానికి గురు పరంపర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ డైరెక్టర్ గురు మంజు హేమమాలిని చావ శిష్యులు దేవినేని వైడూర్య, సాహితి వేముల, సింధు వేముల, తేజశ్రీ అబ్బూరు అద్భుతంగా నృత్యం చేశారు.“జగతి సిగలో జాబిలమ్మకు” (పరదేశి) గీతానికి రాగ మయూరి స్కూల్ ఆఫ్ డాన్స్ అండ్ యోగా గురు సింధుజ ఘట్టమనేని శిష్యులు గ్రీష్మా అశోక్, నందిత దినేష్, సహస్ర తటవర్తి, రుషిక కాళ్ల చేసిన నృత్యం కనువిందు చేసింది.“నెమలికి నేర్పిన నడకలివి” (సప్తపది) అనే పాటకు నాట్యాంజలి కూచిపూడి డాన్స్ స్కూల్ గురు శ్రీలత సూరి శిష్యులు ప్రియాంక పొత్తూరి, శ్రుతి పొత్తూరి, స్వప్నిక వడాలి, అంజిత నాయర్ నృత్యం అందరినీ ఆకట్టుకుంది.ఆ తర్వాత “మధుర మధురతర” (అర్జున్) అనే గీతానికి సాయి నృత్య అకాడమీ కూచిపూడి డాన్స్ స్కూల్ గురు శ్రీదేవి యడ్లపాటి శిష్యులు పల్లవి తూములూరు, సంజన కల్వకొలను నృత్యం అందరినీ అలరించింది.ఈ కార్యక్రమంలో ప్రత్యేకఅతిథులుగా హాజరైన టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబర్ మాట్ షాహీన్, ఫ్రిస్కో నగర మేయర్ మార్క్ హిల్, కౌన్సిల్ మెంబర్ యాన్ యాన్దర్సన్ను గోపాల్ పోణంగి, డా. ప్రసాద్ తోటకూర ఘనంగా సన్మానించారు. ఇదే కార్యక్రమంలో ఇటీవల కొలంబియా దేశంలో 8 సంవత్సరాల వయస్సులోపు పిల్లల కోసం జరిగిన చదరంగం పోటీలలో అమెరికా నుంచి పాల్గొని, పాన్ అమెరికన్ చాంపియన్గా నిలిచి బంగారు పతకం సాధించిన సరయు తలపనేనిని టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబర్ మాట్ షాహీన్ ఘనంగా సత్కరించి సరయు తల్లిదండ్రులు సందీప్, శ్రీలక్ష్మిని అభినందించారు.ఈ కార్యక్రమాన్ని మొత్తం ఎంసీలుగా అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించిన అనీషా పోణంగి, అభినుత మద్దుకూరికి, కార్యక్రమ విజయానికి తోడ్పడిన శుభం ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలు కిశోర్ నారె, పావని నున్న, నాగరాజు నలజల, నేలకొండ రాజు, పద్మ ముప్పిడి, శాస్త్రి అనిపిండి, వివిధ ప్రసార మాధ్యమాలకు, స్కూల్ యాజమాన్యానికి గోపాల్ పోణంగి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
శంకర్, మురుగదాస్ కాంబో..! తెరపైకి మరో క్రేజీ ప్రాజెక్ట్..?
తమిళ సినీ పరిశ్రమలో ఇద్దరు స్టార్ దర్శకులు శంకర్, ఏఆర్ మురుగదాస్ కలిసి పనిచేయనున్నారంటూ ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ‘మదరాసి’ విడుదలైన సమయంలో మురుగదాస్ పనితీరును శంకర్ ప్రశంసించడం కూడా ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. వీరిద్దరి కలయికపై వస్తున్న వార్తలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.శంకర్ టీమ్ కథతో మురుగదాస్?శంకర్ రైటింగ్ టీమ్ సిద్ధం చేసిన ఓ కథపై ఏఆర్ మురుగదాస్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఇది పూర్తిస్థాయి సినిమా కోసం జరుగుతున్న చర్చలా? లేక ప్రాథమిక కథా దశలోనే ఉందా? అనే దానిపై స్పష్టత రాలేదు. అలాగే ఈ ప్రాజెక్ట్లో శంకర్ కేవలం కథ అందిస్తారా? లేక మరేదైనా కీలక బాధ్యత తీసుకుంటారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ వార్తలపై అటు శంకర్, ఇటు మురుగదాస్గాని అధికారికంగా స్పందించలేదు.ఇదీ చదవండి: అందుకే ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ పెట్టా..: విష్ణుప్రియఎవరి సినిమాలతో వారు బిజీ..శంకర్ ఇటీవల రామ్చరణ్తో ‘గేమ్ ఛేంజర్’, కమల్హాసన్తో ‘ఇండియన్ 2’ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన ‘వెల్పారి’ అనే చారిత్రక నవలను భారీ స్థాయిలో మూడు భాగాలుగా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ను రూపొందించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది.మరోవైపు ఏఆర్ మురుగదాస్ ఇటీవల శివకార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రల్లో ‘మదరాసి’ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్, సూర్య, అజిత్కుమార్, రజనీకాంత్ వంటి అగ్ర కథానాయకులతోనూ ఆయన గతంలో సినిమాలు చేశారు. ప్రస్తుతం సన్నీ డియోల్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న హిందీ యాక్షన్ ఎంటర్టైనర్కు కూడా ఆయన దర్శకత్వం వహించనున్నారని సమాచారం.
రూ. 15 లక్షల కారు, 70 తులాల గోల్డ్ : అయినా కట్నదాహానికి టీచర్ భువనేశ్వరి ఆహుతి
సాక్షి, చెన్నై: చెన్నైలోని కోవిలంబక్కమ్లో మరో వరకట్న మరణం విషాదాన్ని నింపింది. ఉన్నత విద్యావంతురాలు, ఉద్యోగం, పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ముట్టజెప్పినప్పటికీ అత్తింటివారి ఆశ తీరలేదు. వేధింపులను తట్టుకోలేక పెళ్లైన రెండేళ్లకే ఏడాదిన్నర పసిగుడ్డును అనాథను చేసి, ఆమె ఉసురు తీసుకుంది.మృతురాల్ని చెన్నైలోని కోవిలంబాక్కంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భువనేశ్వరి (27)గా గుర్తించారు. M.Sc. B.Ed. పూర్తి చేసి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు ఒక సంవత్సరం వయసున్న కుమారుడు ఉన్నాడు. భారీగా కట్నం, అయినా తీరని దాహంభువనేశ్వరికి 2024 సెప్టెంబర్లో వివాహమైంది. పెళ్లి సమయంలో ఆమె కుటుంబ సభ్యులు రూ. 15 లక్షల విలువైన కారు, 50 సవర్ల బంగారం ఇచ్చారు. అదనంగా వరుడికి మరో 20 సవర్ల బంగారం సమర్పించారు. పెళ్లయిన రెండేళ్లలోపే అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యులు భువనేశ్వరిని శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు. ఇటీవల కుమారుడి మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు బాబుకు బంగారు గొలుసు కానుకగా ఇచ్చారు. ఈ విషయంలో దంపతుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది.ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’పెళ్లి అయింది మొదలు భర్త , అత్తమామలు నిరంతర కట్న వేధించేవారనీ, వాటిని భరించలేక తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహమైన ఏడేళ్లలోపు అనుమానాస్పద మృతి కావడంతో వరకట్న మరణంగా కేసు నమోదు చేశారు. దీనిపై RDO (రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్) విచారణకు ఆదేశించారు.ఇదీ చదవండి: నెవ్వర్ బిఫోర్ : లగ్జరీ ఈవీలపై శ్రీమంతుల మోజు
చలాన్లు తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్.. అడ్డంగా బుక్కయ్యాడు!
హైదరాబాద్: ఈఎంఐలు, పెండింగ్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబరు మార్చి.. పోలీసులను ఏ మార్చి తిరుగుతున్న ఓ వాహనాన్ని ఆర్జీఐ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఆర్జీఐఏ ట్రాఫిక్ సీఐ ప్రమోద్కుమార్ తెలిపిన మేరకు.. ఆదివారం సాయంత్రం ఆర్జీఐఏ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్టు ట్రంపెట్ బ్రిడ్జీ ఇండియానా బేకరి వద్ద చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఓ ఇన్నోవా వాహనం కనిపించింది. పరిశీలించగా ట్యాక్సీగా రిజి్రస్టేషన్ అయినట్లు గుర్తించారు. ట్యాక్సీ నంబరు తొలగించి తిరుగుతున్న కారణంగా డ్రైవర్ రమేష్ తో పాటు వాహనాన్ని స్వా«దీనం చేసుకుని ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇవి వదవండి: భర్తను కాదని.. మరొకరిని నమ్మి.. మూడో వ్యక్తి గొడవలో విషాదం!
రిటైర్డ్ అధికారి ఆత్మహత్య : 8 పేజీల లేఖ
రాంచీ: 61 ఏళ్ల రిటైర్డ్ అధికారి సునీల్ కుమార్ సింగ్ ఆత్మహత్య కలకలం రేపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జార్ఖండ్ రాజధాని నగరం రాంచీలోని సిధో-కన్హు పార్క్ సమీపంలో ఉన్న ఒక ఫ్లాట్లో ఆయన ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నారు.లాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిధో-కన్హు పార్క్ సమీపంలో ఉన్న ఒక ఫ్లాట్లో, సీలింగ్ ఫ్యాన్ హుక్కు వేలాడుతూ ఆయన మృతదేహం ఆదివారం లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. తీవ్రమైన కీళ్ల నొప్పులు లాంటి వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో, ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని ప్రాథమికంగా తెలుస్తోందని లాల్పూర్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’పోలీసులు ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో ఆయన తన వృద్ధాప్య అనారోగ్య సమస్యల వల్ల పడుతున్న బాధను వివరంగా పేర్కొన్నారు. అయితే, పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణం నిర్ధారణ అవుతుందని ఆయన తెలిపారు. అసాధారణ మరణం (UD) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. రాంచీలోని RIMSలో పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.కాగా సునీల్ కుమార్ సింగ్ బీహార్లోని పాట్నాకు చెందినవారు. ఆయన ఏడాది క్రితం రాంచీలో డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ (DDC)గా పదవీ విరమణ చేశారు. ఆయన కుటుంబం పాట్నాలో ఉంటుండగా, ఈయన మాత్రం రాంచీలోని ఒక ఫ్లాట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఇదీ చదవండి: అపుడు భర్త, ఇపుడు భార్య రాజీనామా? యూపీ రాజకీయాల్లోకి ఎంట్రీ?
వీడియోలు
AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం
అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!
నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!
కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి
Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!
నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..
బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!
ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా
ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

