అక్షరాస్యతపైనా అబద్ధాలా?
సాక్షి, అమరావతి : అక్షరాస్యతపై చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘వాస్తవ పరిస్థితులను, గణాంకాలను వక్రీకరిస్తున్నారు. అధికారిక గణాంకాలు ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 71.4 శాతంగా స్పష్టం చేస్తుంటే.. విద్యా శాఖ మంత్రి మాత్రం 82.1 శాతం అంటూ ప్రచారం చేయడం వెనుక ఉన్న లెక్కల మతలబు ఏమిటి?’ అని ప్రశ్నించారు. ఇంకా పూర్తికాని 2026 సంవత్సరానికి అక్షరాస్యత గణాంకాలు ఎలా వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే..2026 ఏడాది అక్షరాస్యత గణాంకాలు ఏ సంస్థా విడుదల చేయలేదు ‘సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయిలో తప్పుడు సమాచారంతో ప్రచారం చేసుకుంటోందో చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. 2024లో 72.6 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 2026లో 82.1 శాతానికి పెరిగిందని విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. కానీ 2026 కేలండర్ సంవత్సరానికి సంబంధించిన అక్షరాస్యత గణాంకాలను ఇప్పటి వరకు ఏ అధికారిక సంస్థా విడుదల చేయలేదు. అసలు 2026 సంవత్సరమే ఇంకా పూర్తి కాలేదు. మరి 82.1 శాతం అనే లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్ఎస్ఎస్వో నిర్వహించిన సర్వే ఆధారంగా పీఎల్ఎఫ్ఎస్ (పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే) 2023–24 వార్షిక నివేదికను రూపొందించారు. జూన్ 2023 నుంచి జూన్ 2024 మధ్య కాలానికి సంబంధించిన ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏడు సంవత్సరాలు పైబడిన వారి అక్షరాస్యత రేటు 72.6 శాతం. 2018–19లో 69.1 శాతంగా ఉన్న ఈ రేటు 2023 – 24 నాటికి 72.6 శాతానికి చేరింది. అలాగే, జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 మధ్య ఎన్ఎస్ఎస్వో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన పీఎల్ఎఫ్ఎస్ కేలండర్ ఇయర్ 2025 వార్షిక నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారు. ఈ అధికారిక నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏడు సంవత్సరాలు పైబడిన వారి అక్షరాస్యత రేటు 71.4 శాతం మాత్రమే.యూడైస్ గణాంకాల ప్రకారం వైఎస్ జగన్ హయాం(2023–24)లో, చంద్రబాబు హయాం (2025–26)లో రాష్ట్రంలో విద్యార్థుల వివరాలు టీడీపీ ప్రభుత్వం మోసపూరిత ప్రచారాలతో లేనిపోని గొప్పలు అధికారిక గణాంకాలు ఇంత స్పష్టంగా అందుబాటులో ఉన్నప్పటికీ, 82.1 శాతం అంటూ తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం. మరో ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుండగా, ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు పెరుగుతోందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన యూడైస్ (యూడీఐఎస్ఈ) గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకురావాలి? ప్రభుత్వ పాఠశాలలను ఎలా బలోపేతం చేయాలి? అనే అంశాలపై దృష్టి పెట్టాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రచారాలతో లేనిపోని గొప్పలు చెప్పుకోవడంలోనే నిమగ్నమైంది. విద్యాశాఖ మంత్రి ‘రెడ్బుక్ పాలన’పై సమయం వెచ్చించడం మానుకుని, తన శాఖపై ఎక్కువ సమయం, శ్రద్ధ పెట్టడం మంచిది’ అని వైఎస్ జగన్ హితవు పలికారు.
మంత్రివర్గంలోకి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్?
గాంధీ భవన్ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు ఒకటే ఉత్కంఠ! కొండా సురేఖ బర్తరఫ్తో ఖాళీ అయిన మంత్రి స్థానం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పాలకవర్గాల సమరానికి సిద్ధమవుతున్న వేళ..రాజధాని ప్రాంతం సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అనివార్యత కాంగ్రెస్ అధిష్టానానికి ఏర్పడింది. ఇప్పటికే మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో కలిపి భర్తీ చేయాల్సిన బెర్త్ల సంఖ్య మూడుకు చేరింది.సాక్షి, హైదరాబాద్: నగర పాలక సంస్థల సమరానికి సమయం దగ్గరపడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పారీ్టకి అగ్నిపరీక్ష ఎదురవుతోంది. కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కేబినెట్ బెర్తులపై చర్చ తీవ్రమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, పరిసర రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్కు ఆశించిన స్థానాలు దక్కకపోయినప్పటికీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, రాబోయే గ్రేటర్ పోరులో గులాబీ, కాషాయ దళాల హోరాహోరీని తట్టుకుని జెండా పాతాలంటే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో బలమైన ప్రాతినిధ్యం తప్పనిసరైంది. ఎమ్మెల్సీ అజహరుద్దీన్ను కేబినెట్లోకి తీసుకున్నప్పటికీ, స్థానిక రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయి క్యాడర్ను మెప్పించే బలమైన నేతలకు పీఠం దక్కలేదనే అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ..ఇప్పుడు గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కేబినెట్ విస్తరణను ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. కేబినెట్æలో రాజధాని బెల్ట్కు చోటు దక్కితేనే పార్టీకి మైలేజ్ వస్తుందనే రాజకీయ విశ్లేషణలు ఊపందుకున్నాయి.జెన్–జీ ప్లస్ బీసీ ఫార్ములాలో... జెన్–జీ ప్లస్ బీసీ ఫార్ములాలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, యువ నేత నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో ఆమె ఖాళీ చేసిన స్థానాన్ని తిరిగి బీసీ వర్గంతోనే భర్తీ చేసేవిధంగా ఒత్తిడి అధిష్టానంపై వచ్చే అవకాశం లేకపోలేదు. జెన్–జీ కోటాలో యువకుడైన నవీన్ యాదవ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే..ఒకవైపు బీసీ కోటా, జెన్జీ రాజకీయ ప్రాధాన్యతపై సముచిత నిర్ణయమవుతుందని కొందరు వాదిస్తున్నారు. కాగా బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే సమయంలో అధిష్టానం ఆయనకు సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా కల్పించడంపై సాంకేతిక, న్యాయపరమైన చిక్కులతో పాటు పాత కాంగ్రెస్ నేతల నుండి వస్తున్న నిరసనలను అధిష్టానం ఎలా సమన్వయం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.శివారులో అసంతృప్తి జ్వాలలు రాష్ట్ర రాజధానికి ఆనుకుని, అత్యధిక జనాభా, నియోజకవర్గాలు కలిగిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కేబినెట్లో సరైన ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి స్థానిక నాయకత్వంలో నెలకొని ఉంది.. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి వంటి సీనియర్ నేతలు ఇప్పటికే కేబినెట్ చోటు దక్కలేదనే ఆసంతృప్తి వ్యక్తం చేస్తూనే..సాక్షాత్తు ఏఐసీసీ పెద్దల వద్ద సైతం మొరపెట్టుకున్నారు. మరొకవైపు శాసనసభ స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించకపోతే గ్రేటర్ చుట్టుపక్కల అర్బన్–రూరల్ నియోజకవర్గాల్లో పారీ్టకి ఇబ్బందులు తప్పవని జిల్లా నేతలు హెచ్చరిస్తున్నారు.హైకమాండ్ కోర్టులో బంతి ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం పూర్తిగా పార్టీ అధిష్టానం వద్దే తేలాల్సి ఉంది. ఒకవైపు పార్టీలోని సీనియర్ నేతల ఆశలు, మరోవైపు కొత్తగా చేరిన నాయకుల అంచనాలు, వీటితో పాటు సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి కత్తిమీద సాములా మారింది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే ఈ విస్తరణ ఉండవచ్చనే ప్రచారంతో గాంధీ భవన్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పార్టీని బలపరచే దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తారా? లేక జిల్లా సీనియర్లు, బీసీ వర్గాలు నగర కీలక నేతల మధ్య సమతుల్యత పాటిస్తూ నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: మాజీ మంత్రి కొండా సురేఖకు మరో బిగ్ షాక్
యోగి సర్కార్కు కొత్త టెన్షన్.. అఖిలేష్-సీజేపీ భేటీపై రాజకీయ దుమారం!
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ.. ఓ కీలక భేటీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, విద్యార్థి ఉద్యమ సంస్థ సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా భేటీ కావడంతో యూపీలో కొత్త రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనా? లేక ఎన్నికల ముందు యువతను కేంద్రంగా చేసుకుని అఖిలేష్ కొత్త రాజకీయ వ్యూహానికి తెరతీశారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి.ఇక, అఖిలేష్తో సీజేపీ ప్రతినిధి సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరి మధ్య లక్నోలో జరిగిన భేటీ దాదాపు 90 నిమిషాల పాటు సాగినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. సమావేశం తర్వాత ఇరువైపుల నుంచి పెద్దగా వివరాలు బయటకు రాకపోవడంతో.. అసలు ఏం చర్చించారు? అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఎన్నికల ముందు అఖిలేష్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారా? సీజేపీ ద్వారా యూపీలో విద్యార్థి శక్తిని ఏకం చేయబోతున్నారా? ఈ భేటీ వెనుక అసలు వ్యూహం ఏమిటి? ఇప్పుడు యూపీ రాజకీయాల్లో ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇప్పటివరకు ఎస్పీ-సీజేపీ మధ్య ఎలాంటి అధికారిక రాజకీయ పొత్తు లేదా అవగాహన ప్రకటించలేదు.టార్గెట్ యూపీనా?సీజేపీ ఇటీవల విద్యార్థులు, యువతకు సంబంధించిన అంశాలపై ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. పరీక్షల వ్యవస్థ, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో లోపాలపై ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని పరిశీలించే ‘School Thik Karo’ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో అఖిలేష్తో రంకా భేటీ కావడంతో.. సీజేపీ తన విద్యార్థి ఉద్యమాన్ని యూపీలో విస్తరించేందుకు సిద్ధమవుతోందా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.యువ ఓటర్లపై అఖిలేష్ కన్ను?యూపీ రాజకీయాల్లో యువత, విద్యార్థులు కీలక ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఉద్యోగాలు, పరీక్షల నిర్వహణ, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థ వంటి అంశాలను అఖిలేష్ యాదవ్ కూడా తరచూ ప్రస్తావిస్తూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో యువతలో ప్రభావం పెంచుకుంటున్న ఓ ఉద్యమ సంస్థతో సంప్రదింపులు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదీ చదవండి: ‘విజయ్ ఫర్ పీఎం’.. కాంగ్రెస్కు టీవీకే మరో షాక్!అయితే, సీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? సమాజ్వాదీపార్టీతో కలిసి పనిచేస్తుందా? లేక కేవలం విద్యార్థి సమస్యలపై మాత్రమే సహకారం ఉంటుందా? అన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మరోవైపు.. వీరి భేటీపై బీజేపీ కూడా స్పందించింది. బీజేపీ నేత రాకేశ్ త్రిపాఠి ఈ పరిణామాన్ని విమర్శిస్తూ సీజేపీ ఉద్యమం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం ఈ రకమైన సంప్రదింపులను స్వాగతించింది. దీంతో ఈ భేటీ కేవలం విద్యార్థి సమస్యలపై చర్చకే పరిమితమా.. లేక యూపీలో కొత్త రాజకీయ కూటమికి తొలి సంకేతమా? అన్న ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారింది.
ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం.. ప్రేమ పేరిట ఆకర్షణ.. ఇవన్నీ యువతపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయో చెప్పేందుకు ఈ ఘటన మరో ఉదాహరణ. తమకు నచ్చిన వ్యక్తి కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో కొందరు హద్దులు దాటుతున్నారు. క్షణికమైన కోరిక కోసం తీసుకునే నిర్ణయాలు.. చివరికి జీవితాన్నే మార్చే పరిణామాలకు దారితీస్తున్నాయి. తమ ప్రేమను నిరూపించుకోవాలనే తాపత్రయంలో ఓ యువతి చేసిన పని ఇప్పుడు ఆమెను కటకటాల వెనక్కి నెట్టింది.ప్రియుడి మనసులో చోటు కోసం ఓ యువతి వెంపర్లాడింది. అతనికి ఉన్న ఖరీదైన బైక్ కలను నెరవేర్చాలని అనుకుంది. ఈ క్రమంలోనే ఆ కాలేజీ విద్యార్థినిని దొంగగా మారి.. తండ్రి పరువు తీసేసింది. తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. స్థానికంగా కాలేజీ చదువుతున్న ఓ యువతి.. ఓ అబ్బాయిని ఇష్టపడుతోంది. అతను కూడా ఆమెతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఖరీదైన బైక్ ఎప్పటికైనా కొనుక్కోవాలని అతను తరచూ ఆమెకు చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఓరోజు తన తండ్రి స్నేహితుడైన హెచ్. తమిళ్సెల్వన్ ఇంటికి వెళ్లింది. అక్కడ అల్మారాలో బంగారం ఉన్న విషయం గుర్తించింది. వాళ్ల కళ్లు గప్పి.. 9 సవర్ల బంగారు నగలను చోరీ చేసింది.ఆపై ఆ నగలను స్థానిక దుకాణంలో రూ.2.5 లక్షలకు విక్రయించింది. ఆ వచ్చిన డబ్బుతో తన ప్రియుడు జనగన్ శివకు ఓ కాస్ట్లీ బైక్ కొనిచ్చింది. అంతేకాదు.. సంతోషంగా ఆ సర్ప్రైజింగ్ క్షణాలను వీడియోగా తీసి సోషల్ మీడియాలోనూ పంచుకుంది. ఇంట్లో బంగారు నగలు కనిపించకపోవడంతో తమిళ్సెల్వన్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో.. స్నేహితుడి కూతురిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. విచారణలో తానే బంగారం తీసుకున్నట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు ఆమె ప్రియుడు జనగన్ శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.ప్రియుడికి బైక్ కొనివ్వాలన్న కోరికతో మొదలైన వ్యవహారం.. చివరకు దొంగతనం, అరెస్టు వరకు వెళ్లింది. క్షణికమైన ప్రేమ, ఆకర్షణ కోసం తీసుకున్న ఓ నిర్ణయం.. ఇప్పుడు ఆ యువతి జీవితానికే చేదు అనుభవంగా మారింది. ఇప్పుడీ కేసు.. ఆమె బైక్ కొనిచ్చిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.தந்தையின் நண்பர் வீட்டில் 9 சவரன் நகையைத் திருடி விற்று காதலனுக்கு புதிய பைக் வாங்கிக்கொடுத்த கல்லூரி மாணவி..!#Gold | #GoldTheft | #Bike | #Love | #PolimerNews pic.twitter.com/gcz136ETHK— Polimer News (@polimernews) September 4, 2026VIDEO CREDITS: Polimer News
పాము మన శత్రువు కాదా? ఈ స్టూడెంట్స్ ఏం చెబుతున్నారంటే!
9 ఏళ్ల వయసులో 'భరతనాట్యం'.. ఇప్పుడు స్టార్ హీరోయిన్
భుజాల నొప్పికి యోగా.. కానీ ఈ తప్పు మాత్రం చేయకండి!
మన కుల్ఫీకి ప్రపంచమే ఫిదా.. టాప్-10లో చోటు!
వచ్చే వారం 4 ఐపీవోలు రెడీ
నగ్న పూజ చేస్తే కోరికలన్ని నెరవేరుతాయని!
మీ షాపింగ్ బిల్లు పేపరు తెల్లగా మారుతోందా? అయితే ఇదే కారణం!
ఉపాధ్యాయులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
‘బిగ్బాస్’ కొత్త ఇల్లు సిద్ధం
ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!
కొత్త కెరీర్ను ప్రారంభించిన అభినందన్ వర్ధమాన్
కరువు, ధరల బరువు, అప్పుల అరువు.. ఈ టైంలో వెళితే దరువు తప్పేలా లేదు సార్!
Viral: భావోద్వేగంతో బస్సుకు వీడ్కోలు
‘రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి’
ఈసారి ప్రారంభోత్సవానికి హెల్మెట్, స్విమ్సూట్ తప్పనిసరి సార్!
సినిమాల్లో స్టార్.. రియల్ లైఫ్లో ఫెయిల్.. ఓ హీరోయిన్ జీవిత కథ..!
కృష్ణాష్టమి స్పెషల్.. అనుసూయ డ్యాన్స్ వైరల్
ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్కరోజే 12 సినిమాలు స్ట్రీమింగ్..!
వచ్చేస్తోంది సూపర్ ఎల్నినో!
జియో రూ.200 రీచార్జ్ ప్లాన్: ప్రయోజనాలివే..
సాక్షి కార్టూన్: 04-09-2026
‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది’
.. రెండో స్థానం ఏంటి సార్!మనమెప్పుడూ నెంబర్ 1 స్థానంలో ఉంటాం.. అంతే!
రోడ్డు కింద 20 వేల పాత టైర్లు.. ఎందుకు పాతిపెట్టారంటే?
రేవంత్రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి
Romanchakam: రోమాంచకం మూవీ రివ్యూ
జియో రూ.55 రీచార్జ్ ప్లాన్: బెనిఫిట్స్ ఇవే..
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఔట్
పాము మన శత్రువు కాదా? ఈ స్టూడెంట్స్ ఏం చెబుతున్నారంటే!
9 ఏళ్ల వయసులో 'భరతనాట్యం'.. ఇప్పుడు స్టార్ హీరోయిన్
భుజాల నొప్పికి యోగా.. కానీ ఈ తప్పు మాత్రం చేయకండి!
మన కుల్ఫీకి ప్రపంచమే ఫిదా.. టాప్-10లో చోటు!
వచ్చే వారం 4 ఐపీవోలు రెడీ
నగ్న పూజ చేస్తే కోరికలన్ని నెరవేరుతాయని!
మీ షాపింగ్ బిల్లు పేపరు తెల్లగా మారుతోందా? అయితే ఇదే కారణం!
ఉపాధ్యాయులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
‘బిగ్బాస్’ కొత్త ఇల్లు సిద్ధం
ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!
కొత్త కెరీర్ను ప్రారంభించిన అభినందన్ వర్ధమాన్
కరువు, ధరల బరువు, అప్పుల అరువు.. ఈ టైంలో వెళితే దరువు తప్పేలా లేదు సార్!
Viral: భావోద్వేగంతో బస్సుకు వీడ్కోలు
‘రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి’
ఈసారి ప్రారంభోత్సవానికి హెల్మెట్, స్విమ్సూట్ తప్పనిసరి సార్!
సినిమాల్లో స్టార్.. రియల్ లైఫ్లో ఫెయిల్.. ఓ హీరోయిన్ జీవిత కథ..!
కృష్ణాష్టమి స్పెషల్.. అనుసూయ డ్యాన్స్ వైరల్
ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్కరోజే 12 సినిమాలు స్ట్రీమింగ్..!
వచ్చేస్తోంది సూపర్ ఎల్నినో!
జియో రూ.200 రీచార్జ్ ప్లాన్: ప్రయోజనాలివే..
సాక్షి కార్టూన్: 04-09-2026
‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది’
.. రెండో స్థానం ఏంటి సార్!మనమెప్పుడూ నెంబర్ 1 స్థానంలో ఉంటాం.. అంతే!
రోడ్డు కింద 20 వేల పాత టైర్లు.. ఎందుకు పాతిపెట్టారంటే?
రేవంత్రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి
Romanchakam: రోమాంచకం మూవీ రివ్యూ
జియో రూ.55 రీచార్జ్ ప్లాన్: బెనిఫిట్స్ ఇవే..
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఔట్
ఫొటోలు
శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)
హాయ్ మూవీ మూడ్లో నయనతార పోజులు.. ఫోటోలు
బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు
సిప్లిగంజ్కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు
పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు
బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు
కర్నూలులో వైఎస్ జగన్కు ఘన స్వాగతం (ఫొటోలు)
కూతురిని ఆడిస్తూ.. ట్రిప్ను ఆస్వాదిస్తున్న సూర్యకుమార్ (ఫొటోలు)
‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
దేవతను తలపించే లుక్లో నికితా పోర్వాల్ (ఫోటోలు)
సినిమా
అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ
15-20 ఏళ్ల క్రితం కామెడీ సినిమాలు అనగానే అల్లరి నరేశ్ గుర్తొచ్చేవాడు. తర్వాత కాలంలో చాలానే మూవీస్ చేశాడు గానీ ఎందుకనో సక్సెస్ కాలేకపోయాడు. అనంతరం 'నాంది' లాంటి డిఫరెంట్ చిత్రం చేసి హిట్ అందుకున్నాడు. తర్వాత రకరకాల సీరియస్ సినిమాలు ట్రై చేశాడు. అవి పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో తిరిగి తనకు అచ్చొచ్చిన కామెడీనే నమ్ముకున్నాడు. అలా చేసిన మూవీ 'రంభ ఊర్వశి మేనక'. ఈరోజు(సెప్టెంబరు 04) థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మంతెన సూర్యనారాయణ అలియాస్ సూరి (అల్లరి నరేశ్) కుటుంబం నాటకాలు వేస్తూ బతుకుతుంటుంది. వీళ్ల ఇంట్లో ఓ మ్యాజిక్ బుక్. దానిపై సరిగ్గా గీతలు గీస్తే స్వర్గం నుంచి రంభ, ఊర్వశి, మేనక వస్తారని చిన్నతంలో సూరికి తెలుస్తుంది. దీంతో ఏ పనిచేయకుండా ఊరంతా అప్పులు చేసి సదరు పుస్తకంపై 15 ఏళ్లుగా గీతలు గీస్తూనే ఉంటాడు. ఓ సందర్భంలో సూరికి తన తల్లి ప్రాణాంతక వ్యాధి బారిన పడిందని తెలుస్తుంది. అదే టైంలో ప్రేమించిన చిన్ని(సురభి) తండ్రితో ఓ చిక్కొచ్చి పడుతుంది. మరోవైపు ఓ రాత్రి చేసిన పనివల్ల నిజంగానే రంభ-ఊర్వశి-మేనకలు సూరి కోసం దిగివస్తారు. వీళ్ల రాకతో సూరి జీవితం ఎలా మారింది? ఎస్సై అప్పలనాయుడితో సూరికి గొడవేంటి? చివరకు ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఒకప్పుడు అల్లరి నరేశ్ సినిమాలు గానీ మీరు చూసుంటే అతడు చేసే సిల్లీ కామెడీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో అవి బాగానే వర్కౌట్ అయ్యాయి. మళ్లీ ఇన్నాళ్లకు అదే తరహా కథ, కథనాలతో అదే హీరో చేసిన మూవీ ఇది. గతంలో ఇతడు తీసిన చిత్రాల చూస్తున్నట్లే ఉంటుంది. అక్కడక్కడ కామెడీ బాగానే వర్కౌట్ అయినప్పటికీ ఓవరాల్గా ఓకే ఓకే అనిపిస్తుంది తప్పితే మరీ పగలబడి నవ్వేంత గొప్పగా లేదు.నాటకాలు వేసే ఓ కుటుంబంలో హీరో పుట్టడం, మ్యాజిక్ బుక్ అతడి దొరకడం, రంభ, ఉర్వశి, మేనక కోసం హీరో పట్టువదలకుండా ప్రయత్నించడం.. ఇదంతా అలా సాగుతూ ఉంటుంది. మరోవైపు తన ఊరిలో ఉండే చిన్నితో హీరో ప్రేమ, వీళ్ల ప్రేమకథకు ఓ విలన్.. ఇలా హడావుడి లేకుండా ఫస్టాప్ అంతా ఉంటుంది. ఇదేమంత కొత్తగా ఉండదు. ఎన్నో తెలుగు సినిమాల్లో ఇలాంటివన్నీ చూసేశాం కదా.. అసలు పాయింట్లోకి ఎప్పుడొస్తారా అనిపిస్తుంది.ఎప్పుడైతే సూరి దగ్గరకు రంభ-ఊర్వశి-మేనకలు దిగివస్తారో అక్కడి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఓవైపు తల్లి చావు బతుకుల్లో ఉంటే అప్సరసలతో కలిసి హీరో కామెడీ చేయడం విడ్డూరంగా అనిపిస్తుంది. సరేలే కామెడీ కదా ఎంజాయ్ చేద్దాంలే అనుకుంటే మధ్యమధ్యలో తల్లి సెంటిమెంట్ వస్తూ ఉంటుంది. కామెడీని చూసి అక్కడక్కడ నవ్వుతాం గానీ తల్లి ఎమోషన్కి కనెక్ట్ కాలేకపోతాం. ఎందుకో తల్లి ట్రాక్ సహజంగా కుదరలేదు.ఈ సినిమా చూస్తున్నంతసేపు పెద్దగా లాజిక్స్ వెతక్కూడదు. పొరపాటున హీరో అలా ఎందుకు చేశాడు? ఇది ఎందుకు ఇలా జరిగింది? అనే సందేహం బుర్రలో వచ్చిందా? మూవీ కనెక్ట్ కావడం కష్టమైపోవచ్చు. కాబట్టి సరదాగా నవ్వుకోవడానికి చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారు?సూరి పాత్రలో అల్లరి నరేశ్ బాగానే చేశాడు. ఈ తరహా పాత్రలు ఇతడికి కొట్టినపిండి. సీనియర్ నరేశ్ కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. వయసైపోయిన వ్యక్తి పాత్రలో ఇతడు.. రంభతో నడిపే లవ్ ట్రాక్ మంచి ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. హీరోయిన్ సురభికి పెద్దగా స్కోప్ లేదు. రంభ, ఊర్వశి, మేనక పాత్రల్లో రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ అందంగా ఉన్నారు. కాకపోతే షో కేస్ బొమ్మలా చూపించారు తప్పితే వీళ్లకు సరైన సీన్స్ పడలేదనిపించింది. వెన్నెల కిశోర్, హరితేజ కామెడీ ఓకే ఓకే. ఎస్సై అప్పలనాయుడిగా కన్నడ నటుడు తారక్ పొన్నప్పకు మంచి స్కోప్ దొరికింది. ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగిలిన వాళ్లు ఓకే ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. అద్భుతాలు జరిగిపోయి తమ జీవితం రాత్రికి రాత్రే మారిపోతుందనుకునే చాలామంది సోమరిపోతు కుర్రాళ్లకు చివర్లో ఇచ్చిన మెసేజ్ బాగుంది. దర్శకుడు చంద్రమోహన్ తన రైటింగ్తో ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించాడు కానీ కొంతమేర సక్సెస్ అయ్యాడు.- చందు డొంకాన
కన్నప్పుడు కాలేజీ ఫీజు కూడా కట్టరా?.. ఎపిక్ ట్రైలర్ రిలీజ్
బేబీ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న టాలీవుడ్ జంట ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. ఈ జంట ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ అనే మూవీలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆదిత్యహాసన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే ఎపిక్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే లండన్ బ్యాక్డ్రాప్లో జరిగిన లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇండియా నుంచి లండన్ వెళ్లిన ఇద్దరు ప్రేమలో పడే నేపథ్యంలో ఈ కథ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు.
'ఎపిక్' లాంటి సినిమాలు చేయడం చాలా కష్టం: రష్మిక
‘‘ఎపిక్’ ట్రైలర్ చాలా నచ్చింది. మంచి రొమాంటిక్, కామెడీ వైబ్లో ఉంది. ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. ఈ నెల 11న మీతో (ప్రేక్షకులతో), యూనిట్తో కలిసి ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ నెల 10న ప్రీమియర్స్ వేస్తున్నారు... చూసి ఎంజాయ్ చేయండి’’ అని రష్మిక మందన్నా పేర్కొన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటించిన చిత్రం ‘ఎపిక్–ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. శుక్రవారం నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ– ‘‘ఎపిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వస్తారా? అని ఆనంద్ మెసేజ్ చేశాడు. ‘రణబాలి’ షూట్లో హైదరాబాద్లో ఉన్నాను. తప్పకుండా వస్తానని, వచ్చేశాను. ఆనంద్ చాలా కష్టపడతాడు. తన సినిమాలు బాగా ఆడాలి, మంచి వసూళ్లు రావాలి. వైష్ణవి కోసం అద్భుతమైన పాత్రలు రాస్తుండటం గొప్ప విషయం. ఆదిత్య హాసన్ ఈ మూవీని అద్భుతంగా తీశారనిపిస్తోంది’’ అని తెలిపారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘వదినమ్మతో (రష్మిక) ఇంట్లో ఎక్కువగా మాట్లాడను. కానీ, ‘ఎపిక్’ ప్రమోషన్స్ గురించి నన్ను అడిగి మరీ తెలుసుకుని సపోర్ట్ చేశారు. విజయ్లాంటి అన్నయ్య, రష్మికలాంటి వదినమ్మ ఉన్నందుకు అదృష్టవంతుణ్ణి. ‘ఎపిక్’ భావోద్వేగమైన, అందమైన సినిమా’’ అని చెప్పారు.
అప్పట్లో దేవుళ్లు.. ఇప్పుడు స్మగ్లర్లు, క్రిమినల్స్: నటి షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నటి కస్తూరి శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వస్తోన్న మూవీస్పై కీలక వ్యాఖ్యలు చేసింది. మన తెలుగులో మొదట్లో హీరోలు దేవుడి పాత్రల్లో నటించేవారని తెలిపింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో హీరోలు పోలీస్, లాయర్, విప్లవాత్మకమైన పాత్రలు ఎక్కువగా కనిపించాయని పేర్కొంది. అయితే ఈ నాటి చిత్రాల్లో మాత్రం స్మగ్లర్, క్రిమినల్ లాంటి పాత్రల్లో మాత్రమే హీరోలు కనిపిస్తున్నారని విమర్శించింది. సోషల్ మేసేజ్తో వచ్చే చిత్రాలు చాలా తగ్గాయని ఆవేదన వ్యక్తం చేసింది.కస్తూరి శంకర్ మాట్లాడుతూ.." చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సినిమాను సినిమాగానే చూడాలి. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మాయాబజారు, కృష్ణార్జున యుద్ధం, ప్రేమాభిషేకం లాంటి చిత్రాలు చూసేదాన్ని. అప్పట్లో దేవుడి పాత్రల్లో ఎక్కువ కనిపించేవారు. కానీ ఇప్పుడు సినిమాల్లో మాత్రం స్మగ్లర్, క్రిమినల్ పాత్రలు చేసే సినిమాలు వస్తున్నాయి. ఆనాడు ఒక సామాజిక బాధ్యతతో సినిమాలు చేసేవారు. అలాంటి సోషల్ మేసేజ్ ఇచ్చే మూవీనే మా ధర్మస్థల నియోజకవర్గం" అని తెలిపింది. ఆమె కీలక పాత్రలో నటించిన ధర్మస్థల నియోజకవర్గం ఇవాళే థియేటర్లలో రిలీజైంది. ఈ సందర్భంగా కస్తూరి శంకర్ తెలుగు సినిమాలను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. మొదట్లో తెలుగు సినిమాల్లో హీరోలు దేవుడి పాత్రల్లో నటించేవారు.ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో హీరోలు పోలీస్, లాయర్, విప్లవాత్మకమైన పాత్రల్లో నటించేవారు.ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరోలు స్మగ్లర్, క్రిమినల్ లాంటి పాత్రల్లో నటిస్తున్నారు.- Kasthuri Shankar… pic.twitter.com/s1FglISJx7— Tupaki (@tupaki_official) September 3, 2026
క్రీడలు
గంజాయి వాసన వస్తుందని మ్యాచ్ను ఆపిన సబలెంకా
యూఎస్ ఓపెన్ 2026లో ప్రపంచ నంబర్వన్ టెన్నిస్ క్రీడాకారిణి అరినా సబలెంకా మ్యాచ్కు అనూహ్య అంతరాయం ఏర్పడింది. కోర్టు చుట్టుపక్కల నుంచి గంజాయి వాసన బలంగా వస్తుండటంతో ఆమె మ్యాచ్ను కాసేపు ఆపి అంపైర్కు ఫిర్యాదు చేసింది.శుక్రవారం ఉజ్బెకిస్థాన్కు చెందిన కమిల్లా రఖిమోవాతో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో సబలెంకా 3-0 ఆధిక్యంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సర్వీస్ చేస్తుండగా కోర్టులోకి గంజాయి వాసన వస్తోందని సబలెంకా ఫిర్యాదు చేసింది."ఎవరో గంజాయి కాలుస్తున్నారు. వాసన చాలా బలంగా ఉంది. దయచేసి ఏదైనా చేయగలరా..?" అంటూ సబలెంకా అంపైర్ను కోరింది. అనంతరం మ్యాచ్ తిరిగి కొనసాగింది.మ్యాచ్ అనంతరం సబలెంకా ఈ ఘటనపై స్పందించింది. ఎవరైనా తమకు నచ్చిన విధంగా వినోదం పొందడంపై తనకు అభ్యంతరం లేదని, అయితే టెన్నిస్ కోర్టు సమీపంలో గంజాయి కాల్చకుండా ఉంటే మంచిదని చెప్పింది. అత్యుత్తమ స్థాయిలో ఆడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ వాసనను తట్టుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుందంటూ నవ్వులు పూయించింది.కాగా, యూఎస్ ఓపెన్ సందర్భంగా గతంలో కూడా ఆటగాళ్లు గంజాయి వాసనపై ఫిర్యాదులు చేశారు. ప్రాంగణంలో ధూమపానం అనుమతించకపోయినా, న్యూయార్క్లో 21 ఏళ్లు పైబడిన వారికి వినోదం కోసం గంజాయి వినియోగం చట్టబద్ధం. సమీపంలోని ఫ్లషింగ్ మెడోస్-కరోనా పార్క్ ప్రాంతం నుంచి గాలి ద్వారా వాసన టెన్నిస్ ప్రాంగణంలోకి వచ్చే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, హ్యాట్రిక్ టైటిల్ లక్ష్యంతో యూఎస్ ఓపెన్ బరిలోకి దిగిన సబలెంకా ఆ దిశగా మరో అడుగు వేసింది. మూడో రౌండ్లో 6–3, 6–4తో రఖిమోవా (ఉజ్బెకిస్తాన్)పై కష్టపడి గెలిచి, ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. చదవండి: సబలెంకా జోరు
నేడు పాకిస్తాన్తో భారత్ ఢీ
దుబాయ్: వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత మహిళల జట్టు ఆసియాకప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ‘హ్యాట్రిక్’పై గురి పెట్టింది. ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న టీమిండియా నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో చివరి లీగ్ మ్యాచ్లో తలపడనుంది. ఈ టోర్నీలో అజేయంగా సాగుతున్న హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు దాయాదిపై కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన టీమిండియా 4 పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోగా... పాకిస్తాన్ ఆడిన ఒక్క మ్యాచ్లో నెగ్గి 2 పాయింట్లతో సెమీఫైనల్ రేసులో ఉంది. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఆసియాకప్ క్రికెట్ టోర్నీ నిర్వహించగా... అందులో ఏడింట చాంపియన్గా నిలిచిన టీమిండియా... పాకిస్తాన్తో పోరులోనూ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ విభాగంలో చూసుకున్నా... పాకిస్తాన్ కంటే టీమిండియా ఎంతో మెరుగ్గా ఉంది. మరోవైపు భారత్ను ఓడించి సెమీఫైనల్కు అర్హత సాధించాలని ఫాతిమా సనా సారథ్యంలోని పాకిస్తాన్ జట్టుపట్టుదలగా ఉంది. ఓపెనింగ్ అదుర్స్... ఈ మ్యాచ్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన భారీ అంచనాల మధ్య బరిలోకి దిగనుంది. హాంకాంగ్తో జరిగిన గత మ్యాచ్లో రికార్డుల దుమ్ముదులిపిన స్మృతి అదే జోరు కొనసాగిస్తే పాకిస్తాన్కు తిప్పలు తప్పకపోవచ్చు. గత మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు... భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా నిలిచిన స్మృతి... పాకిస్తాన్పై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది కీలకం. మరో ఓపెనర్ షఫాలీ వర్మ కూడా మంచి టచ్లో ఉంది. గత రెండు మ్యాచ్ల్లోనూ జట్టుకు మెరుగైన ఆరంభాలు అందించింది. వన్డౌన్లో బ్యాటింగ్కు వస్తున్న ప్రతీక రావల్ మరింత భారీ స్కోర్లు చేయాల్సి ఉంది. అయితే ఈ ముగ్గురు తప్ప మిగిలినవాళ్లు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లు ఆడకపోవడం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. ఇక దీప్తి శర్మతో పాటు ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడం పాక్ ప్లేయర్లకు శక్తికి మించిన పనే కానుంది.శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో యూఏఈ 6 వికెట్ల తేడాతో ఇండోనేసియాను చిత్తు చేసింది. ఇండోనేసియా 19.4 ఓవర్లలో 73 పరుగులకే కుప్ప కూలింది. యూఏఈ 13.1 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసి విజయాన్నందుకుంది.17 భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇప్పటి వరకు 17 టి20 మ్యాచ్లు జరిగాయి. 14 మ్యాచ్ల్లో భారత జట్టు... 3 మ్యాచ్ల్లో పాకిస్తాన్ జట్టు గెలుపొందాయి.
సబలెంకా జోరు
న్యూయార్క్: ‘హ్యాట్రిక్’ టైటిల్ లక్ష్యంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్వన్ సబలెంకా ఆ దిశగా మరో అడుగు వేసింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఆడుతున్న ఈ బెలారూస్ స్టార్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో టాప్ సీడ్ సబలెంకా 6–3, 6–4తో రఖిమోవా (ఉజ్బెకిస్తాన్)పై కష్టపడి గెలిచింది. రెండో రౌండ్ మ్యాచ్లో కేవలం 54 నిమిషాల్లో నెగ్గిన సబలెంకా మూడో రౌండ్ మ్యాచ్లో మాత్రం 89 నిమిషాలు తీసుకుంది. 10 ఏస్లు సంధించిన సబలెంకా ఒక్కటే డబుల్ ఫాల్ట్ చేసింది. రెండుసార్లు రఖిమోవా సర్వీస్ను బ్రేక్ చేసిన ఆమె తన సర్వీస్లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ ఇవ్వలేదు. 29 విన్నర్స్ కొట్టిన 2024, 2025 చాంపియన్ 19 అనవసర తప్పిదాలు చేసింది. 11వ సీడ్ మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్), మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), 16వ సీడ్ సొరానా కిర్స్టియా (రొమేనియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్ మ్యాచ్ల్లో కొస్టుక్ 6–3, 6–2తో 18వ సీడ్ ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై, పెగూలా 1–6, 6–4, 6–3తో 2021 రన్నరప్ లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై, సొరానా 6–3, 6–3తో 19వ సీడ్ పావోలిని (ఇటలీ)పై విజయం సాధించారు. రెండో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఐదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా), పదో సీడ్ అనిసిమోవా (అమెరికా) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో రిబాకినా 6–2, 6–4తో బుజాస్ మనెరో (స్పెయిన్)పై, కోకో గాఫ్ 6–4, 7–6 (7/5)తో పౌలా బదోసా (స్పెయిన్)పై, ఆండ్రీవా 6–0, 6–2తో ఇవా లిస్ (జర్మనీ)పై, అనిసిమోవా 6–3, 3–6, 6–1తో లిలీ టాగెర్ (ఆస్ట్రియా)పై నెగ్గారు.
సెమీస్లో సాత్విక్–చిరాగ్ జోడీ
షెన్జెన్: ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన పోరులో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి పైచేయి సాధించింది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 16–21, 21–18తో కిమ్ అస్ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్ముసెన్ (డెన్మార్క్) జంటను ఓడించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో భారత జంట జోరు కనబర్చగా... రెండో గేమ్లో డెన్మార్క్ జోడీ పుంజుకుంది. నిర్ణాయక మూడో గేమ్లో ఒకదశలో భారత జంట 5–9తో, 15–17తో వెనుకబడింది. కానీ భారత జోడీ ఒక్కసారిగా చెలరేగి వరుసగా 5 పాయింట్లు గెలిచి 20–17తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత డెన్మార్క్ జంటకు ఒక పాయింట్ కోల్పోయిన సాత్విక్–చిరాగ్ వెంటనే మరో పాయింట్ గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నారు. ఈ సీజన్లో సాత్విక్–చిరాగ్ ద్వయం మూడో టోర్నీలో సెమీఫైనల్ చేరుకుంది. థాయ్లాండ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన సాత్విక్–చిరాగ్... సింగపూర్ ఓపెన్లో టైటిల్ సాధించారు. నేడు జరిగే సెమీఫైనల్లో అజ్రియాన్–టాన్ వీ కియోంగ్ (మలేసియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత సీనియర్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. లీ చెయుక్ యియు (హాంకాంగ్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 16–21, 16–21తో ఓడిపోయాడు.
న్యూస్ పాడ్కాస్ట్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
కొండా సురేఖను తప్పించాల్సిందే.... కేసీ వేణుగోపాల్తో భేటీలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
Audio: బీడు పడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు... కాలువకు నీరివ్వని కూటమి సర్కార్... బోరుమంటున్న రాయలసీమ రైతులు
నేపాల్లో ఆగని మృత్యుఘోష.... 579కి చేరిన మరణాల సంఖ్య... భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
కమిషనర్ ఔట్... వేతన సవరణ కమిషన్ లేదు... ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం
కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నా కుంభకర్ణుడి నిద్ర నటిస్తారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్
బిజినెస్
డబ్బు త్వరగా చేతికి రావాలంటే?..కియోసాకి పెట్టుబడి విధానం!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాను మూడు సెకన్లలో డబ్బు సంపాదించానని పేర్కొన్నారు. అదెలాగో కూడా వివరించారు.కియోసాకి ప్రకారం.. ఒక స్టాక్ పొజిషన్ను అమ్మి, ఆ నగదును ఖాతాలో జమ చేసుకోవడానికి 3 సెకన్ల సమయం పట్టింది. స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు అంత త్వరగా అందుతుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే.. ఆస్తి విలువ పెరగడం ద్వారా సంపదను సృష్టించుకోవచ్చు. కానీ.. ఆ ఆస్తిని అమ్మాలంటే కొనుగోలుదారుడు దొరకాలి, బ్యాంక్ లోన్ ప్రక్రియ పూర్తవ్వాలి, ఇన్స్పెక్షన్, డాక్యుమెంటేషన్, క్లోజింగ్ వంటి ఎన్నో దశలు ఉంటాయి. కాబట్టి మన డబ్బు వెంటనే చేతికి రాదు.స్టాక్స్ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మార్కెట్లో కొనుగోలు చేయడం, విక్రయించడం చాలా వేగంగా జరుగుతుంది. అందుకే కియోసాకి స్టాక్స్ను తన పెట్టుబడి వ్యూహంలో ఒక భాగం అని అన్నారు.స్టాక్స్లో పెట్టుబడులకు మూడు ముఖ్యమైన ప్రయోజనాలను కియోసాకి పేర్కొన్నారు.మొదటిది అందుబాటు ధర. రియల్ ఎస్టేట్లా భారీ మొత్తంలో డబ్బు అవసరం లేకుండానే.. చిన్న మొత్తంలోనే కొన్ని స్టాక్స్ కొనుగోలు చేసుకోవచ్చన్నమాట.రెండోది లిక్విడిటీ. అవసరమైనప్పుడు స్టాక్ను విక్రయించి డబ్బును త్వరగా పొందే అవకాశం ఉంటుంది.మూడోది వేగం. పెట్టుబడుల గురించి నేర్చుకోవడానికి సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదని, కొంతకాలం నేర్చుకున్న తర్వాత చిన్న మొత్తాలతో ప్రారంభించవచ్చు.మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నిజమైన డబ్బు పెట్టుబడి పెట్టే ముందు సిమ్యులేటర్లో ప్రాక్టీస్ చేయవచ్చని కియోసాకి పేర్కొన్నారు. మార్కెట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్న తర్వాతే.. అసలు డబ్బుతో ప్రారంభించడం మంచిది. ఉద్యోగంలో ఉంటే జీతం కోసం ఒక నిర్దిష్ట తేదీ వరకు ఎదురుచూడాలి. కానీ పెట్టుబడుల ద్వారా తమ డబ్బును వివిధ మార్గాల్లో పనిచేయించుకోవచ్చని ఆయన అభిప్రాయం. తాను స్టాక్స్ ద్వారా వేగంగా క్యాష్ఫ్లో సృష్టించి, ఆ డబ్బును ఇతర పెట్టుబడులు, ఆస్తులను పెంచుకోవడానికి ఉపయోగించానని చెబుతూ.. సరైన సమయం కోసం ఎదురుచూడటం కంటే, పెట్టుబడులపై అవగాహన పెంచుకుని క్రమంగా ముందుకు సాగడం ముఖ్యమని సూచిస్తున్నారు.పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు.. తప్పకుండా కొంత అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ లాభాలు మాత్రమే కాదు, భారీ నష్టాలు కూడా ఉంటాయి. సోషల్ మీడియా కథనాలు లేదా వీడియోలు చూసి.. పెట్టుబడులు పెడితే మాత్రం నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. రూ.4600 పెరిగిన బంగారం!
అడోబ్ కొత్త సీఈఓ.. ఎవరీ అనిల్ చక్రవర్తి?
అడోబ్ సంస్థకు కొత్త సీఈఓగా అనిల్ చక్రవర్తి నియమితులయ్యారు. డిసెంబర్ 1 నుంచి ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 18 ఏళ్లుగా సంస్థకు నాయకత్వం వహించిన శంతను నారాయణ్ ఎగ్జిక్యూటివ్ చైర్గా కొనసాగనున్నారు.అనిల్ చక్రవర్తి జనవరి 2020లో అడోబ్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, దాని డిజిటల్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ జనరల్ మేనేజర్గా చేరారు. సంవత్సరం తరువాత.. అతను కంపెనీ ఉత్పత్తి పోర్ట్ఫోలియో అంతటా ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు సేవలు అందించే అడోబ్ యొక్క ప్రపంచవ్యాప్త ఫీల్డ్ కార్యకలాపాల బాధ్యతను కూడా స్వీకరించారు. డిసెంబర్ 2021లో, ఆయన డిజిటల్ ఎక్స్పీరియన్స్, ప్రపంచవ్యాప్త ఫీల్డ్ ఆపరేషన్స్ విభాగానికి అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు.అడోబ్లో చేరడానికి ముందు, చక్రవర్తి నాలుగు సంవత్సరాల పాటు ఇన్ఫర్మాటికా సీఈఓగా పనిచేశారు. ఆయన తొలుత 2013లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఈ ఎంటర్ప్రైజ్ క్లౌడ్ డేటా మేనేజ్మెంట్ కంపెనీలో చేరారు. తన కెరీర్ ప్రారంభంలో, ఆయన సిమాంటెక్ అండ్ వెరిసైన్లలో ఎగ్జిక్యూటివ్ పదవులను నిర్వహించారు. మెకిన్సీ & కంపెనీలో కూడా పనిచేశారు. దీనివల్ల ఆయనకు టెక్నాలజీ పరిశ్రమలోని వివిధ రంగాలలో అనుభవం లభించింది.చక్రవర్తి భారతదేశంలోని వారణాసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పట్టా పొందారు. ఆయన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్, పిహెచ్.డి. పట్టాలను కూడా పొందారు.
ఎప్పుడూ విమానంలో ఉంటారు.. ఎంత సంపాదిస్తారు?
విమానంలో ఉద్యోగం చాలామందికి డ్రీమ్ జాబ్. ముఖ్యంగా విమానంలో ప్రయాణికులందరినీ చిరునవ్వుతో పలకరించే క్యాబిన్ క్రూ ఉద్యోగం అంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రయాణాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, విమానయాన రంగంలో కెరీర్.. ఇలా ఎన్నో ఆకర్షణలు ఈ ఉద్యోగంలో ఉన్నాయి. దేశంలో వేగంగా విస్తరిస్తున్న విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగోలో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్నవారు ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2026లో అందుబాటులో ఉన్న పరిశ్రమ అంచనాల ప్రకారం అనుభవాన్ని బట్టి ఇండిగో క్యాబిన్ క్రూ సంపాదనలెంతో ఈ కథనంలో తెలుసుకుందాం..కొత్తగా చేరేవారికి ఇలా..ఏవియేషన్ A2Z నివేదిక ప్రకారం, ఇండిగోలో కొత్తగా క్యాబిన్ క్రూగా చేరినవారు సాధారణ ఫ్లయింగ్ డ్యూటీలు ప్రారంభించిన తర్వాత నెలకు సుమారు రూ.40,000 నుంచి రూ.55,000 వరకు సంపాదించవచ్చు. అయితే ఇది స్థిరమైన జీతంగా భావించకూడదు. ఫ్లయింగ్ గంటలు, నెలవారీ రోస్టర్, రూట్, ప్రోత్సాహకాలు, పనిచేసే బేస్ లొకేషన్ వంటి అంశాల ఆధారంగా అసలు నెలవారీ ఆదాయం మారవచ్చు.అనుభవం పెరిగితే..రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల అనుభవం, ఎక్కువ ఫ్లయింగ్ యాక్టివిటీ ఉన్న క్యాబిన్ క్రూకు ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న పరిశ్రమ అంచనాల ప్రకారం అనుభవజ్ఞులైన సిబ్బంది నెలకు రూ.60,000–రూ.85,000 వరకు సంపాదించవచ్చు. ఇందులో ఫ్లయింగ్ అలవెన్సులు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలు, రూట్ అసైన్మెంట్లు వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి నెలా వచ్చే మొత్తం ఒకేలా ఉండకపోవచ్చు.సీనియర్ స్థాయిలో రూ.1.2 లక్షల వరకు..కెరీర్లో ముందుకు వెళ్లి లీడ్ క్యాబిన్ అటెండెంట్ లేదా ఇన్ఫ్లైట్ సూపర్వైజర్ వంటి బాధ్యతలు చేపట్టినవారికి ఆదాయం మరింత ఎక్కువగా ఉండొచ్చని ఏవియేషన్ A2Z అంచనా వేసింది. బలమైన ఫ్లయింగ్ షెడ్యూల్, అధిక బాధ్యతలు ఉన్న సమయంలో వీరి నెలవారీ సంపాదన సుమారు రూ.90,000 నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండొచ్చు.జీతంతో పాటు మరిన్ని ప్రయోజనాలుక్యాబిన్ క్రూ ఆదాయం కేవలం బేసిక్ పేకు పరిమితం కాదు. ఫ్లయింగ్ అలవెన్సులు, కొన్ని సందర్భాల్లో లేఓవర్ సంబంధిత ప్రయోజనాలు, స్టాఫ్ ట్రావెల్ వంటి సదుపాయాలు మొత్తం ప్యాకేజీలో భాగం కావచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ రూట్, డ్యూటీ స్వభావం కూడా ఆదాయంపై ప్రభావం చూపే అంశంగా మారుతోంది.మూడు నెలల శిక్షణ తప్పనిసరిఇండిగో అధికారిక సమాచారం ప్రకారం, విమానంలో ఫ్లయింగ్ క్రూగా విధులు ప్రారంభించే ముందు క్యాబిన్ క్రూ సిబ్బంది మూడు నెలలపాటు ఇంటెన్సివ్ ట్రైనింగ్ పొందుతారు. ప్రయాణికుల భద్రత, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం, సేవా ప్రమాణాలు తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు.
పాత కంప్యూటర్ స్పీడ్ పెంచే జియో సర్వీస్
కంప్యూటర్ కొన్నేళ్లు వాడిన తర్వాత నెమ్మదించడం సహజమే. స్టోరేజ్ తగ్గిపోవడం, ర్యామ్ సరిపోకపోవడం, కొత్త సాఫ్ట్వేర్లు సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమయంలో.. చాలామంది కొత్త కంప్యూటర్ కొనాలని ఆలోచిస్తారు. కానీ అలాంటి వారికోసం రిలయన్స్ జియో 'జియోపీసీ' సేవలను తీసుకొచ్చింది.జియోపీసీ అనేది ఒక క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్ సర్వీస్. అంటే.. మీ దగ్గర ఉన్న పాత కంప్యూటర్లోనే క్లౌడ్ ద్వారా అదనపు ర్యామ్, స్టోరేజ్, కంప్యూటింగ్ పవర్ను ఉపయోగించుకోవచ్చు. దీంతో కంప్యూటర్ పాతదైనా కొత్త అప్లికేషన్లు, సాఫ్ట్వేర్లను ఉపయోగించే అవకాశం ఉంటుంది.గతంలో జియోపీసీ అనేది కేవలం జియోహోమ్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఏ కంపెనీకి చెందిన ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా.. ఈ సేవను తీసుకోవచ్చు. అంటే జియో సిమ్ లేదా జియో బ్రాడ్బ్యాండ్ తప్పనిసరి కాదు.రూ.1,000 నుంచే ప్లాన్స్!జియోపీసీలో ప్రస్తుతం రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. సాధారణ జియోపీసీ ప్లాన్లో 8జీబీ ర్యామ్, 500 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. జియోపీసీ అల్ట్రాలో 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ లభిస్తుంది.రెండు నెలల జియోపీసీ ప్లాన్ ధర రూ.1,000 నుంచి ప్రారంభమవుతుంది. జియోపీసీ అల్ట్రా రెండు నెలలకు రూ.1,200గా ఉంది. ఏడాదికి కావాలంటే కూడా దీనికోసం తగిన ప్లాన్ ఎంచుకోవచ్చు. దీనికోసం సంస్థ మల్టిపుల్ ప్లాన్స్ అందిస్తోంది. మూడు, నాలుగేళ్లుగా కంప్యూటర్లను వాడుతున్న వారికి జియోపీసీ చాలా ఉపయోగపడుతుంది. ఎనిమిదేళ్ల పాత కంప్యూటర్లలో కూడా జియోపీసీ ద్వారా ఏఐ ఆధారిత అప్లికేషన్లను ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఎందుకంటే.. ఎక్కువ కంప్యూటింగ్ అవసరమయ్యే పనులు క్లౌడ్లో జరుగుతాయి.పాత కంప్యూటర్ ఉపయోగించేవారు.. రిలయన్స్ జియో తీసుకొచ్చిన జియోపీసీ ఉపయోగించుకుంటే బహుశా వెంటనే కొత్త కంప్యూటర్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు, ఇళ్లలో కంప్యూటర్ వాడేవారు, చిన్న వ్యాపారాలు, ప్రొఫెషనల్స్కు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. రూ.4600 పెరిగిన బంగారం!
ఫ్యామిలీ
మీ మెదడుకు బాస్ మీరే అనుకుంటున్నారా? నిజాలు తెలిస్తే షాకే!
మీరు మీ మెదడుకు బాస్ అనుకుంటున్నారా? ΄÷ర΄ాటే! మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీకు తెలియకుండానే మీ మెదడు బోలెడన్ని పనులు చేసేస్తుంటుంది. మీరు ‘‘నేను ఆలోచించి చేశాను’’ అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అసలు ఆలోచించింది మీరు కానే కాదు మీ మెదడే!మన కళ్ల ముందు కనిపించేది, మనం గుర్తుంచుకునేది, మనకు నచ్చేది, భయపడేది..ఇలా చాలా విషయాల్లో మెదడు తనదైన గేమ్ ఆడుతుంది. అందులో కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని ‘‘అరే! ఇలానా?’’ అనిపిస్తాయి. ఇంకా మనకు తెలియకుండా మన మెదడు చేసే పనులేంటో చూసేద్దామా?1. మల్టీటాస్కింగ్మీరు ఫోన్ లో మెసేజ్ టైప్ చేస్తూనే టీవీ చూస్తూ, పక్కన ఎవరో మాట్లాడుతుంటే సమాధానం ఇస్తున్నారా? అది మీ గొప్పేం కాదు. ‘నా మల్టీటాస్కింగ్ సూపర్’ అని ఫీలవ్వకండి. చాలా సందర్భాల్లో రెండు క్లిష్టమైన పనులను ఒకేసారి చేయడం మెదడుకి వెన్నతో పెట్టిన విద్య.2. కనిపించని విషయాలను ఊహిస్తూ..మన కళ్లకు ప్రపంచం మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని అనుకుంటాం. నిజానికి మన దృష్టిలో చిన్న ప్రాంతం కూడా స్పష్టంగా కనిపించదు. దానిని మెదడు చుట్టుపక్కల సమాచారంతో అంచనా వేసి నింపేస్తుంది. దీనినే ఇమేజ్గ్రాస్పింగ్లో మెదడు చేసే ‘‘ఫిల్లింగ్–ఇన్’’గా భావిస్తారు.3. జ్ఞాపకాలను నిర్మిస్తుంది!‘‘ఆ రోజు జరిగిన ప్రతి విషయం నాకు అచ్చంగా గుర్తుంది’’ అని చెప్పేవాళ్లను కాస్త అనుమానంతో చూడొచ్చు. మన జ్ఞాపకాలు సాధారణంగా వీడియో రికార్డింగ్లా స్టోర్ అవ్వవు/. గుర్తు చేసుకునే సమయంలో మెదడు అందుబాటులో ఉన్న సమాచారంతో ఆ సంఘటనను మళ్లీ సృష్టిస్తుంది.4. కాలింగ్..కాలింగ్ఒక ΄ార్టీకి వెళ్లారు. చుట్టూ పెద్ద శబ్దం. అందరూ మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా ఎవరో మీ పేరు పిలిచారు. వెంటనే మీ చెవులు అటువైపు తిరుగుతాయి. దీనిని సాధారణంగా‘ కాక్టెయిల్ ΄ార్టీ ఎఫెక్ట్’ అంటారు. 5. బోర్ కొట్టినా...మీరు ఏ పని చేయకుండా కూర్చున్నారు. బయటకు చూస్తున్నారు. కానీ మెదడు మాత్రం షిఫ్ట్ ముగించదు. మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా మెదడులోని కొన్ని నెట్వర్క్లు చురుకుగా ఉంటాయి. 6. భయపెడుతుంది!రాత్రి ఒంటరిగా గదిలో కూర్చున్నారు. చిన్న శబ్దం వచ్చింది. వెంటనే గుండె వేగం పెరుగుతుంది. ‘‘ఎవరు?’’ అని చూస్తే.. కిటికీకి తగిలిన కొమ్మ! మెదడు ప్రమాదాన్ని గుర్తించే విషయంలో జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. 7. ముందే అర్థం చేసుకుంటుంది!మన కళ్లకు వచ్చే సమాచారాన్ని మెదడు కేవలం రిసీవ్ చేయదు. గత అనుభవాలు, సందర్భం, అంచనాలను కూడా ఉపయోగించి మనం ఏం చూస్తున్నామో అర్థం చేసుకుంటుంది. ఒకే చిత్రం లేదా ఒకే వాక్యాన్ని ఇద్దరు వ్యక్తులు కొంచెం భిన్నంగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ.8. అలవాట్లకు ఆటోపైలట్రోజూ ఒకే మార్గంలో ఆఫీసుకు వెళ్లే వ్యక్తికి మధ్యలో ఎన్నో విషయాలు గుర్తుండక΄ోవచ్చు. ఎందుకంటే పదేపదే చేసే పనుల్లో కొన్నింటిని మెదడు అలవాటుగా మార్చుకుంటుంది. దాంతో ప్రతి చిన్న చర్యను మొదటి రోజు లాగా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు.9. ఫోర్కాస్ట్‘‘రేపు ఇలా చేస్తే ఎలా ఉంటుంది?’’ అని ఊహించేటప్పుడు మెదడు ఖాళీ తెరపై సినిమా తీయదు. గత అనుభవాలు, జ్ఞాపకాలు, తెలిసిన సమాచారాన్ని ఉపయోగించి ఊహించడంలో సహాయపడుతుంది.10. మీకంటే ముందే నిర్ణయంఒక విషయం గురించి మనం ‘‘నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను’’ అనుకుంటాం. కానీ నిర్ణయ ప్రక్రియలో మనకు పూర్తిగా స్పష్టంగా తెలియనివి అనేకం పనిచేస్తుంటాయి. మన మెదడు మనకు కనిపించకుండా పనిచేసే ఒక భారీ నియంత్రణ కేంద్రం. మనం చూస్తున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం నుంచి జ్ఞాపకాలు, దృష్టి, భయం, అలవాట్లు, నిర్ణయాల వరకు.. ప్రతిచోటా దాని ΄ాత్ర ఉంటుంది. మరి మెదడు ఇంత పని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ‘అదొక అర్థం కాని ప్రశ్నలా ఉందే’ అని మళ్లీ మన మెదడే సర్దిచెప్పుకుంటుంది.- శ్రావణ్ జయఇవి కూడా చదవండి: మన దేహం విలువ కోట్లకంటే ఎక్కువ.. ఈ కథతో అర్థమవుతుంది!
మన దేహం విలువ కోట్లకంటే ఎక్కువ.. ఈ కథతో అర్థమవుతుంది!
మన శరీరంలోని కాలేయం, గుండె, ఊపిరి తిత్తులు, కళ్ళు, పళ్ళు వంటివేవైనా... కొంత చెడి పోయినా బాగు చేయించుకోవటానికి లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అన్నీ బాగుండి, ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నవారు శరీర విలువను గ్రహించక, జీవిత విలువను తెలుసుకోలేక, ఎలా జీవించాలో అలా జీవించక వెళ్ళిపోతున్నారు. మహారాజ్ జగత్ సింగ్జీ ఒక కథ చెబుతారు:ఒక వృద్ధుడు అడవిలో కట్టెలను కొట్టి, ఆ కట్టెలను కాల్చి, వచ్చిన బొగ్గును అమ్మి జీవించేవాడు. ఒకసారి అడవిలో దారితప్పిన రాజును రక్షించి, రాజనగరుకు క్షేమంగా చేర్చాడు. ఆ రాజు సంతోషించి అతనికి చందన వృక్షాలు గల అందమైన తోటను కానుకగా ఇచ్చాడు. ఆ వృక్షాల ప్రత్యేక విలువ ఆ వృద్ధునికి తెలీదు. ఆ చెట్లను కొట్టాడు, కట్టెలను కాల్చాడు, వచ్చిన బొగ్గులను అమ్మాడు, వచ్చిన కొంత డబ్బుతో ఏ పూటకు ఆ పూట గడిపాడు, దరిద్రునిగనే నిలచిపోయాడు.కొద్ది రోజుల తర్వాత రాజు వచ్చి, అతని దారిద్య్రాన్ని చూసి, విషయాన్నంతా అడిగి తెలుసుకున్నాడు. ఒక చిన్న కట్టె ఏమైనా మిగిలి ఉందా? అని ప్రశ్నించాడు. ఏదో ఒక మూలన పడివున్న బారెడు కట్టెను తెచ్చాడు వృద్ధుడు. సరే, దీన్ని ఇలాగే బజారుకు తీసుకెళ్ళి, అమ్మి పైకాన్ని తీసుకురా అన్నాడు రాజు. అది మామూలు కట్టె కాదని, చందన వృక్షపు ముక్క అని తెలిసిన వ్యక్తి వందల రూపాయలను ఇచ్చి దాన్ని కొన్నాడు.ఆ వృద్ధుడు ఆశ్చర్యంతో రాజుగారికి ఆ డబ్బును చూపించాడు. ‘ఇప్పుడు నీకు తెలిసిందా, నేను నీకు కానుకగా ఇచ్చిన తోట ఎన్ని కోట్ల విలువైనదో? నీవు అజ్ఞానంతో అమూల్యమైన సంపదను కోల్పోయావు’ అన్నాడు రాజు. (పుట 58, ఆత్మజ్ఞానము– సర్దార్ బహదుర్ జగత్ సింగ్జీ; రాధాస్వామి సత్సంగ్ బియాస్).భగవంతుడు లేక ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ మానవ దేహం రాజు గారు ఇచ్చిన చందన వృక్ష తోటకంటె ఎన్నో వందల రెట్లు విలువైనదే. ‘శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం’ అని శాస్త్రాలు ఘోషిస్తాయి. ఈ శరీర మూలంగానే జ్ఞానాన్ని ఆర్జించాలి. ఆ తర్వాత ‘పరోపకారార్థ మిదం శరీరం’ అని గుర్తెరిగి జీవించాలి.– రాచమడుగు శ్రీనివాసులు
అంకెలే ఆమె మనోబలం
‘ఉన్నది ఒక్కటే జీవితం’ అనేది సందేహం లేని సత్యం అయితే కావచ్చుగానీ.... ఒకే జీవితంలో రెండు జీవితాలు ఉంటాయి! పరాజయానికి ముందు ఒకటి... విజయం తరువాత ఒకటి... నిరాశలో ఒకటి... నిరాశను జయించిన తరువాత ఒకటి... మన దేశంలోని గణిత మేధావులలో ఒకరైన సుజాత రామ్దొరైకి కొన్ని సంవత్సరాల క్రితం మెదడు క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. దట్టంగా కమ్ముకొస్తున్న నిరాశ, నిస్పృహ అనే చీకటిని ఆమె తన మనోబలంతో తరిమికొట్టింది. ఆ మనోబలానికి మూలం...గణితంపై అమితమైన ఆసక్తి. దేశంలోని చాలా స్కూల్స్లో గణితంలో సుజాత రామ్దొరై చేసిన కృషి గురించి మాత్రమే కాదు... ‘అంతా అయిపోయింది’ అనుకునే సమయంలో కూడా ‘ఇప్పుడే మొదలైంది. సాధించాల్సింది ఎంతో ఉంది’ అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన తీరును వ్యక్తిత్వ వికాస పాఠంలా చెబుతున్నారు...చాలామందికి గణితం అంటే భయం. బెంగళూరుకు చెందిన సుజాత రామ్దొరైకి మాత్రం గణితం అంటే చిన్నప్పటి నుంచి సరదా. వాహనాల నంబర్ ప్లేట్లపై ఉన్న అంకెలను వేగంగా కూడడం అనేది ఆమెకు చిన్నప్పుడు సరదా. నంబర్ ప్లేట్లపై ఉన్న అంకెలను కూడడంలో తన సోదరుడితో పోటీ పడేది.ఈ సరదా అలవాటు కాస్తా గణితంపై సుజాతకు అమిత ఆసక్తి కలిగేలా చేసింది. ఆ ఆసక్తే ఆమెను బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీ నుండి అన్నామలై యూనివర్శిటీ వరకు వెళ్లేలా చేసింది. అక్కడి నుంచి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెండటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) వరకు తీసుకెళ్లింది. అక్కడ పీహెచ్డీ పూర్తి చేసింది. గణితంలోని అత్యంత క్లిష్టమైన ఇవాసావా సిద్ధాంతంపై పనిచేయడానికి దారితీసేలా చేసింది. బ్రిటిష్ కొలంబియా యూనివర్శిటీలో పనిచేసేలా చేసింది. అక్కడ ఆమె ్రపొఫెసర్గా పనిచేశారు. రీసెర్చ్ చైర్గా గణితశాస్త్రం పరిశోధనలో తనవంతు పాత్ర పోషించారు.షాక్: 2015... 2015లో రామ్దొరైకి మెదడు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. షాక్ నుంచి తేరుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది. ఆ సమయంలో తనకు తన విజయాలు గుర్తు రాలేదు. ఒకే ఒక సందేహం వచ్చింది. ‘నేను గతంలో మాదిరిగా గణితాన్ని ప్రేమించగలనా? అంతశక్తి, ఓపిక, ఆసక్తి ఉంటాయా?’ఆ ప్రశ్నకు తానే సమాధానం చెప్పుకుంది. ‘యస్. నేను కోలుకోగలను. కోలుకోవాలి’. నిలువెత్తు ఆశాభావం, ఆత్మవిశ్వాసం రామ్దొరైని కోలుకునేలా చేసింది. మునుపటిలా గణితాన్ని ప్రేమించేలా చేసింది.ఆర్ట్ఫుల్గా... తన అభిరుచి జాబితాలోకి మరో సబ్జెక్ట్ వచ్చి చేరింది. అదే... చిత్రలేఖనం. తనను తానూ సృజనాత్మకంగా వ్యక్తీకరించుకునే ఒక మార్గంగా ఆర్ట్ కనిపించింది. నిరాశ అనే చీకటి కొట్టుకు పోయింది. ఆమె నడిచే దారిలో వెలుతురు వచ్చి చేరింది. గణితాన్ని పిల్లలకు సులభంగా, ఆసక్తికరంగా చెప్పడానికి చిత్తూరులో ‘రామానుజన్ మuЇ’ను ఏర్పాటు చేయడంలో రామ్దొరై పాలుపంచుకున్నారు. ‘నేర్చుకోవడం అనేది భయంతో కాదు ఆసక్తితో మొదలు కావాలి’ అనేది పిల్లలకు ఆమె ఉపదేశించే తారకమంత్రం.గణితంలో రామ్దొరై కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ సంవత్సరం ఐసిటిపి రామానుజన్ బహుమతి అందుకున్నారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు సుజాత రామ్దొరై.తొలి మహిళ... ‘జ్ఞానం అనేది సామూహిక కృషి’ అంటారు రామ్దురై. పరిశోధన నుండి బోధన వరకు, ప్రచార కార్యక్రమాల నుండి అవగాహన కార్యక్రమాల వరకు తాను చేసే ప్రతి పనిలో అది కనిపిస్తుంది. ఆమె గురించి చెప్పుకోవడం అంటే, సంక్లిష్టమైన గణిత సమస్యలను అవలీలగా పరిష్కరించే మే«ధావి గురించి మాత్రమే చెప్పుకోవడం కాదు. ఆసక్తి ఉంటే ఎక్కడి వరకైనా చేరుకుంటామని చెప్పుకోవడం. నిశ్శబ్ద శక్తితో సవాళ్లను అధిగమించే ధైర్యం గురించి మాట్లాడుకోవడం. ఉపాధ్యాయుల గురువు!గ్రామీణ విద్య, వృత్తి విద్య కోసం జీవితాంతం కృషి చేసిన అధ్యాపకురాలు ఆశాదేవి. గాంధీజీ ప్రతిపాదించిన ప్రాథమిక విద్యా విధానం ‘నై తాలీమ్’ వ్యాప్తికి కృషి చేశారు. పుస్తకాల చదువు మాత్రమే కాకుండా, చేతివృత్తులు, శ్రమజీవనం, నైతిక విలువలతో కూడిన విద్యాబోధనను ప్రచారం చేశారు. వార్ధాలోని ఆశ్రమంలో వందలాది మంది ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చి గ్రామాలకు పంపించారు.ఉపాధ్యాయుడే... దేవుడై!నేపాల్లోని నువాకోట్ జిల్లాకు చెందిన పాఠశాల ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడి ఒక స్కూల్కు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. మొన్నటి ఆకస్మిక వరదల విపత్తులో రాజేంద్ర తన సమయస్ఫూర్తితో 1643 మంది పిల్లలను రక్షించారు. వరద ఉధృతి పాఠశాల వైపు దూసుకొస్తోందని రాజేంద్రకు అత్యవసర సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బెల్ని మోగించి ఉపాధ్యాయుల సహాయంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారు పాఠశాల భవనాన్ని ఖాళీ చేసిన 10 నిమిషాల వ్యవధిలోనే పాఠశాల భవన సముదాయం వరద ప్రవాహంలో పూర్తిగా కొట్టుకుపోయింది.మురికి వాడల్లో అక్షర కాంతులుచిత్రకళనే ఆయుధంగా చేసుకుని ముంబయి మురికి వాడల్లో పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సామాజిక వేత్త, ఉపాధ్యాయురాలు రూబుల్ నాగి. తరగతి గదుల నాలుగు గోడల మధ్య కాకుండా వీధుల్లోనే పాఠశాలలను ఏర్పాటు చేస్తూ లక్షలాది మంది పేద పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు.
అభిరుచులే అమితానందం
ఆయన భారతీయ వెండితెరపై ఏకైక సుదీర్ఘ కాల సూపర్ స్టార్. ఎన్ని విజయ శిఖరాలను అధిరోహించారో, అన్ని అడ్డంకులనూ అధిగమించారు. ఇంటా బయటా వ్యక్తిగతంగా వృత్తిగతంగా ఈ దిగ్గజ నటుడు ఎదుర్కొన్న ఆటుపోట్లు ఎన్నో... అయినా 80 ఏళ్ల వయసులోనూ ఎవర్గ్రీన్ స్టార్గా కొనసాగడం వెనుక... ఆయన అనన్య సామాన్య వ్యక్తిత్వం మాత్రమే కాదు ఆయనకున్న అనూహ్యమైన అభిరుచులూ శక్తి మేరకు దోహదం చేశాయని చెపొ్పచ్చు. ఐదు దశాబ్దాలకు పైగా నటుడిగా అలరిస్తున్న ఆయనకు సినిమాలతోపాటు అనేక ఆసక్తులు ఉన్నాయి.వారసత్వం... ఆ కవిత్వంఅమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ ప్రముఖ హిందీ కవి. ఆ వారసత్వం అమితాబ్పై కూడా ప్రభావం చూపింది. కవిత్వాన్ని చదవడం, రాయడం, కవితల్లోని భావాలను ఆస్వాదించడం ఆయనకు ఇష్టం. తన బ్లాగుల్లో కూడా కవితా పంక్తులు, సాహిత్యపరమైన ఆలోచనలు కనిపిస్తుంటాయి. కవిత్వానికి లోతైన అర్థం ఉంటుందని, మంచి కవిత్వం పైకి కనిపించే విషయానికి మించి మరొక భావాన్ని అందిస్తుందని ఆయన అంటారు.బచ్చన్... బ్లాగ్...అమితాబ్కు ఉన్న ఆసక్తుల్లో బ్లాగింగ్ది ప్రత్యేక స్థానం. సినిమాలు, షూటింగ్ అనుభవాలు, కుటుంబం, అభిమానులు, తన ఆలోచనలు, జీవితంపై తన అభి్రపాయాలు.. ఇలా ఎన్నో విషయాలను ఆయన స్వయంగా కవిత్వీకరిస్తుంటారు. గత 2008లో బ్లాగింగ్ ప్రారంభించిన ఆయనకు అది కేవలం సోషల్ మీడియా అలవాటుగా మిగలలేదు. అభిమానులను తన ‘ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ’గా భావించేంతగా ఆ అనుబంధం పెరిగింది. ఒకసారి తన బ్లాగ్ సైట్ పోయిందని తెలుసుకున్నప్పుడు అది తన జీవితంలోని ఒక భాగాన్ని కోల్పోయినంత బాధ కలిగించిందని కూడా రాశారు. ఆ తర్వాత కూడా ఆయన బ్లాగింగ్ను కొనసాగించారు. 2023లో తన బ్లాగ్ ప్రయాణానికి 11 ఏళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.కలం.. బలమైన ఇష్టం..అమితాబ్ బచ్చన్ హాబీల్లో అత్యంత ఆసక్తికరమైనది పెన్నుల సేకరణ. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన పెన్నులను సేకరించడం ఆయనకు చాలా ఇష్టం. యుక్త వయసు నాటినుంచే ఉన్న ఈ హాబీ వల్ల ఆయన దగ్గర కొన్ని వేల సంఖ్యలో పెన్నులు ఉండొచ్చని అంచనా. పెన్ను కనిపిస్తే దాని డిజైన్, తయారీ, ప్రత్యేకతను చెప్పగలిగేంత ఇష్టం ఆయనది. లగ్జరీ రైటింగ్ ఇన్ స్ట్రుమెంట్ బ్రాండ్ ‘ మోంట్బ్లాంక్’ నుంచి ఆయనకు ప్రతి పుట్టినరోజు నాడూ ప్రత్యేకమైన పెన్ను బహుమతిగా అందుకుంటారు.‘వాచ్’కలెక్షన్...పెన్నుల తర్వాత అమితాబ్కు అత్యంత ఇష్టమైన కలెక్షన్ గడియారాలదే. ఖరీదైన, అరుదైన, ప్రత్యేకమైన డిజైన్లతో కూడిన టైమ్పీసులపై ఆయనకు ఆసక్తి ఉంది. ఆయన వాచ్ కలెక్షన్ లో ప్రముఖ లగ్జరీ బ్రాండ్లు ఉన్నాయంటారు. గత 2016లో ముంబైలోని ఒక హైఎండ్ వాచ్ బొతిక్ ప్రారంభోత్సవానికి అమితాబ్, జయ బచ్చన్ హాజరయ్యారు. ఆ సందర్భంలోనే అమితాబ్కు లగ్జరీ వాచ్లపై ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కూడా ఈ వాచీల కలెక్షన్ హాబీ వచ్చిందని చె΄్పాడు. బచ్చన్ కుటుంబానికి మరో విచిత్రమైన వాచ్ అలవాటు కూడా ఉంది. అమితాబ్, అభిషేక్ ఇద్దరూ కొన్ని సందర్భాల్లో ఒకేసారి రెండు గడియారాలు ధరించడం కనిపిస్తుంటుంది. దీని వెనుక ఓ కథ ఉంది. అభిషేక్ స్విట్జర్లాండ్లో బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న సమయంలో రెండు దేశాల టైమ్జోన్లను తెలుసుకోవడానికి రెండు గడియారాలు ధరించే అలవాటు ఏర్పడిందిట. అదే అలవాటు తర్వాత ఆ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన స్టైల్గా మారింది.‘టెక్’ స్టార్వయసుతో సంబంధం లేకుండా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కూడా అమితాబ్ ముందుంటారు. బ్లాగింగ్, మొబైల్, కంప్యూటర్, సోషల్ మీడియా వంటి డిజిటల్ మాధ్యమాలను ఆయన చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. బ్లాగింగ్ ప్రారంభించిన తొలినాళ్లలోనే మొబైల్ ద్వారా బ్లాగ్ రాసే సదుపాయాన్ని కూడా ఉపయోగించేవారు. తన అభిమానులతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి టెక్నాలజీని ఎంతగా ఉపయోగించుకోవచ్చో అమితాబ్ యువనటులకు చేసి చూపించారు.‘హ్యామ్’ రేడియో...క్రేజ్అమెచ్యూర్ రేడియో లేదా హ్యామ్ రేడియోపై కూడా ఆయనకు ఆసక్తి ఉంది. దూర ప్రాంతాల్లోని వ్యక్తులతో రేడియో తరంగాల ద్వారా కమ్యూనికేట్ చేసే ఈ అభిరుచి కూడా ఆయన సాంకేతికతపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. అమితాబ్కు సంగీతం అన్నా అమితాసక్తి. తనకు నిద్ర పట్టని రాత్రుల గురించి బ్లాగ్లో రాసినప్పుడు, మృదువైన శాస్త్రీయ సంగీతం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని వెల్లడించారు. సితార్, స్లైడ్ గిటార్ వంటి వాద్యాలపై వినిపించే ధ్యానాత్మక సంగీతం రాత్రి నిశ్శబ్దంలో తన మనసుకు శాంతినిస్తుందని ఆయన పేర్కొన్నారు. సంగీతాన్ని ఆయన కేవలం వినోదంగా కాకుండా ఆత్మకు ఓదార్పునిచ్చే అనుభూతిగా భావిస్తారు. – సత్యబాబు, సాక్షి
అంతర్జాతీయం
డీజిల్ ధరలు ఆల్టైమ్ హై
అమెరికాలో డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా డీజిల్ సగటు ధర గ్యాలన్కు 5.85 డాలర్లకు చేరినట్లు అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ (AAA) వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో గ్యాలన్ డీజిల్ ధర సుమారు 3.71 డాలర్లుగా ఉండగా.. ఏడాది వ్యవధిలో భారీగా పెరిగింది.డీజిల్ ధరల పెరుగుదలకు అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, అంతర్జాతీయ ఇంధన సరఫరాల్లో ఏర్పడిన అంతరాయాలు ప్రధాన కారణాలుగా మారాయి. ఇరాన్ హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాపై ఆంక్షలు విధించడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది.రవాణా, వ్యవసాయ రంగాలపై ప్రభావంఅమెరికాలో ట్రక్కులు, సరుకు రవాణా వాహనాలు, వ్యవసాయ యంత్రాలు, నిర్మాణ రంగంలోని భారీ యంత్రాలకు డీజిల్ కీలక ఇంధనం. డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం క్రమంగా కిరాణా సరుకులు, దుస్తులు, ఫర్నిచర్ వంటి రోజువారీ వస్తువుల ధరలపై పడే అవకాశం ఉంది.మరోవైపు అమెరికాలో పెట్రోల్ ధర కూడా భారీగా పెరిగింది. శుక్రవారం దేశవ్యాప్తంగా గ్యాసోలిన్ సగటు ధర గ్యాలన్కు సుమారు 4.14 డాలర్లకు చేరింది.నాలుగేళ్ల రికార్డును అధిగమించిన డీజిల్ప్రస్తుత డీజిల్ ధర 2022 జూన్లో నమోదైన గత రికార్డు 5.81 డాలర్లను అధిగమించింది. అప్పట్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ఇరాన్ యుద్ధం కారణంగా మరోసారి ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరిగింది.నవంబర్లో అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన ధరల పెరుగుదల, జీవన వ్యయం పెరగడం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా సవాలుగా మారుతోంది.చదవండి: వచ్చేస్తోంది సూపర్ ఎల్నినో!
చమురు దొంగతనానికి పాల్పడుతూ 37 మంది మృతి
నైజీరియాలో ముడి చమురు దొంగతనానికి యత్నించిన ఘటనలో విషవాయువులు పీల్చుకుని కనీసం 37 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి రివర్స్ స్టేట్లోని ఓక్రికా ప్రాంతంలోని ఓకారి జెట్టీ వద్ద ఈ ఘటన జరిగినట్లు ఆ దేశ యూత్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ వెల్లడించింది.ఓ నౌకలో పెట్రోలియం ఉత్పత్తులను లోడ్ చేస్తున్న సమయంలో కొందరు అనుమానిత చమురు దొంగలు పైప్లైన్కు అక్రమంగా కనెక్షన్ ఏర్పాటు చేసి, చమురును తమ పడవల్లోకి మళ్లించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొంది.ఈ క్రమంలో వెలువడిన విషపూరిత వాయువులను పీల్చుకోవడంతో పలువురు అస్వస్థతకు గురై మరణించినట్లు సంస్థ తెలిపింది. మరికొందరు ఆచూకీ లేకుండా పోయారని, నదిలో కొన్ని మృతదేహాలు తేలుతూ కనిపించాయని వెల్లడించింది. అయితే మృతుల సంఖ్యపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.కాగా, నైజీరియాలో చమురు దొంగతనాలు జరగడం మామూలే. ఇలాంటి ఘటనలు తరచూ ప్రాణనష్టం, పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. చమురు దొంగతనాలకు పేదరికం, నిరుద్యోగం ప్రధాన కారణాలని తెలుస్తోంది. చదవండి: పాక్ ఆర్మీకి చావు దెబ్బ.. 25మంది సైనికులు హతం?
మోకాళ్ల లోతు వరదనీటిలోనే పెళ్లి.. వైరల్ వీడియో
మోకాళ్ల లోతు వరద నీటిలో కూడా ఓ జంట పెళ్లి చేసుకున్న వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక కాథలిక్ చర్చిలో ఫిలిప్పీన్స్ జంట ఇపుటు నెట్టింట హల్చల్ చేస్తున్నారు. తీవ్రమైన వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నప్పటికీ లీన్ లీజా గలాంగ్, గిల్బర్ట్ చికో అనే జంట పెళ్లి వేడుక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వినూత్న వివాహానికి ఆసక్తికర వివరాలు ఇలా ఉన్నాయి.ఫిలిప్పీన్స్లోని ఇటీవలి భారీ రుతుపవన వర్షాలు చాలా ప్రాంతాలను ప్రభావితం చేస్తున్న తరుణంలో ఈ అసాధారణ వివాహం జరిగింది. మనీలాకు ఉత్తరాన ఉన్న బులాకాన్ ప్రావిన్స్లోని హగోనోయ్ పట్టణంలో గల 'సెంట్ జాన్ ది బాప్టిస్ట్ పారిష్' చర్చిలో సెప్టెంబర్ 1న ఈ పెళ్లి జరిగింది.గత నెల రోజులుగా ఈ చర్చి ప్రాంతం నీట మునిగి ఉంది. నీటి మట్టం పెరుగుతుండటంతో పెళ్లి వాయిదా వేసుకోవాలని చర్చి వర్గాలు సూచించినప్పటికీ, ఆ జంట వెనక్కి తగ్గలేదు. వధువు తన వెడ్డింగ్ గౌన్ తడిసిపోతున్నా మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ అల్తార్ (వేదిక) వద్దకు చేరుకోవడం విశేషం.నిజానికి ఈ జంట డిసెంబర్లో పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే మిడిల్ ఈస్ట్లో ఉద్యోగం చేసే వరుడు చికో, బాస్కెట్బాల్ ఆడుతూ కాలుకి గాయం కావడంతో అను అనుకోకుండా ముందుగానే ఇంటికి తిరిగి వచ్చాడు. మళ్లీ ఉద్యోగానికి వెళ్లేలోపు పెళ్లి ముగించుకోవాలని ఈ సమయాన్ని ఎంచుకున్నారు.ఇదీ చదవండి: నిన్నగాక మొన్న ప్రేమ పెళ్లి.. వాటర్ ట్యాంక్లో శవంగా నవవధువుపెళ్లి దుస్తులు పాడవకుండా ఉండటానికి ప్రత్యేక రవాణా వాహనంలో చర్చి ప్రాంగణం వరకు వచ్చారు. అతికొద్ది మంది కేవలం 15 మందిలోపు బంధువుల సమక్షంలో ఫాదర్ ఈ వివాహాన్ని త్వరితగతిన పూర్తి చేశారు. నడుము లోతు నీళ్లలోనే ఒక చిన్నారిని ఉంగరాలను తీసుకెళ్లాడు.ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో LOVE, WATER… AND CHAOS 💍🌊One couple’s romantic wedding shoot ended with the bride and groom falling straight into the river. Another couple in the Philippines went through with their ceremony in a flooded church, wading through waist-deep water to say “I do.”#Wedding… pic.twitter.com/9NP0w4gEPy— Unit News (@Unit_News) September 3, 2026 వేడుక సమయంలో తమ పెళ్లి బట్టలు తడిసినా ఫర్వాలేదని, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తాము ఆ సందర్భానికి తగినట్లే దుస్తులు ధరించామని చికో తెలిపారు "ఎంతటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా, పరస్పర ప్రేమ ముందు వరదలు కూడా బలాదూర్" నెటిజన్లు ఈ జంటను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
బుధుడి చెంతకు ‘బెపి కొలంబో’!
బుధుడు... పరిమాణంలో మన చందమామ కంటే కొంచెం పెద్ద... సౌరవ్యవస్థలో అతి చిన్న గ్రహం... సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం కూడా... దీనికి సహజ చంద్రుళ్లు లేవు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు... ఇవి సౌరకుటుంబంలో శిలామయ అంతర గ్రహాలు. సౌరవ్యవస్థలోని ‘పాత నవగ్రహాల’ మాటకొస్తే… ప్లూటో గతంలో గ్రహం హోదా కోల్పోవడంతో అధికారికంగా అష్టగ్రహాలే మిగిలాయి. వీటిలో భూమిని తప్పిస్తే మిగతా ఏడు గ్రహాల్లో శాస్త్రవేత్తలు ఇప్పటివరకు అతి తక్కువగా అధ్యయనం చేసింది బుధుడి గురించే! అలాంటి బుధుడి సంగతేంతో తేల్చడానికి, ఆ గ్రహాన్ని జల్లెడపట్టి లోతుగా అధ్యయనం చేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) సంయుక్తంగా 2018లో ‘బెపి కొలంబో’ అంతరిక్ష మిషన్ ప్రయోగించాయి. ఇందులో భాగంగా జంట వ్యోమనౌకలు (ఉపగ్రహాలు) ఈ ఏడాది నవంబరులో బుధుడి కక్ష్యలో ప్రవేశించనున్నాయి. 1920-1984 మధ్యకాలంలో జీవించిన జూసెప్పీ బెపి కొలంబో ఇటలీకి చెందిన ఓ గణిత శాస్త్రజ్ఞుడు. బుధ, శుక్ర గ్రహాల వద్దకు తొలిసారిగా 1970వ దశకంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రయోగించిన ‘మెరైనర్-10’ మిషన్లో ఆయన పాలుపంచుకున్నారు. బెపి కొలంబో సేవలను స్మరిస్తూ తాజా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారు. అప్పట్లో బుధ, శుక్ర గ్రహాలకు సమీపంగా వెళ్లిన ‘మెరైనర్-10’ అంతరిక్ష నౌక వాటి ఫొటోలు తీసి భూమికి పంపింది. ఆ తర్వాత 2004లో నాసా ప్రయోగించిన ‘మెసెంజర్’ వ్యోమనౌక (ఆర్బిటర్) తొలిసారిగా 2011లో బుధుడి కక్ష్యలో ప్రవేశించి 2015 వరకు ఆ గ్రహాన్ని మరింత అన్వేషించింది. జూసెప్పీ బెపి కొలంబోఇవీ బుధుడి విశేషాలు...బుధ గ్రహం సూర్యుడి నుంచి సగటున 5.8 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బుధుడిపై ఒకరోజు భూమిపై 58 రోజులతో సమానం. అక్షంపై తన చుట్టూ తాను తిరగడానికి బుధుడు అంత సమయం తీసుకుంటాడు. అలాగే 88 రోజులకోసారి సూర్యుడి చుట్టూ పరిభ్రమణం పూర్తిచేస్తాడు. అంటే భూమిపై 88 రోజులు గడిస్తే బుధుడిపై ఏడాది పూర్తవుతుంది. బుధుడి ఉపరితల ఉష్ణోగ్రత పగటి వేళల్లో 430 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, రాత్రి సమయాల్లో మైనస్ 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా ఉంటాయి. ఈ గ్రహం వ్యాసం కేవలం 4,880 కిలోమీటర్లు. వాయువులతో కూడిన అతి పలుచని పొరతో అక్కడి వాతావరణం నిర్మితమైంది. బుధుడిని ‘విస్మరించిన లేదా నిర్లక్ష్యానికి గురైన’ గ్రహంగా పిలుస్తారు. కారణం- మన పొరుగు గ్రహాలైన శుక్రుడు, అంగారకుడితో పోలిస్తే బుధుడిని చేరుకోవడం, భూమి నుంచి దాన్ని అధ్యయనం చేయడం బహు కష్టం. సౌరవ్యవస్థలో సూర్యుడికి బుధుడు బాగా దగ్గరగా ఉంటాడు. సూర్యుడిది అఖండ గురుత్వ శక్తి. తన సమీపంలోని ఖగోళ వస్తువులను భానుడు అమిత వేగంతో ఆకర్షిస్తూ తనలోకి లాగేసుకుంటాడు. ఆ సౌర గురుత్వాకర్షణను దీటుగా ఎదుర్కొంటూ... దానికి వ్యతిరేకంగా తన వేగాన్ని బాగా తగ్గించుకుంటూ బుధుడిని చేరడానికి వ్యోమనౌక బోలెడు ఇంధనాన్ని మండించాలి! అందుకే ఈ ప్రయాణం సంక్లిష్టం, వ్యయభరితం. సూర్యుడి వేడికి వ్యోమనౌకలోని సైంటిఫిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ భాగాలు కాలిపోతాయి. వ్యోమనౌక భానుడికి అతి చేరువగా ఉంటుంది కనుక పగటి వేళ భూమ్మీది టెలిస్కోపులు సూర్యకాంతి ధగధగల్లో దాన్ని చూడలేవు. ఇన్ని పరిమితులున్నందునే కేవలం రెండు మిషన్లే (మెరైనర్-10, మెసెంజర్) బుధుడిని సందర్శించాయి. బుధుడి ఆవిర్భావం, తదనంతర పరిణామాలు, ఉపరితల స్వరూపం, అంతర్గత నిర్మాణం, రసాయన కూర్పు, వాతావరణం, గతిశీల-బలహీన అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేయడం ‘బెపి కొలంబో’ మిషన్ లక్ష్యం. 2018 అక్టోబరు 20న ఫ్రెంచ్ గయానాలోని కౌరూ స్పేస్ పోర్టు నుంచి ఏరియన్-5 రాకెట్ ప్రయోగించి ఇందుకు శ్రీకారం చుట్టారు. చుట్టూ తిరిగి వెళ్లే మార్గంలో భాగంగా ఈ మిషన్ ఇప్పటివరకు వెయ్యి కోట్ల కిలోమీటర్ల దూరం పైగా ప్రయాణించింది.‘మెర్కురీ హాలోస్’పై డేగ కన్ను!చివరిసారిగా 2025 జనవరి 8న బుధుడి సమీపానికి వెళ్లినప్పుడు... ఆ గ్రహంపై అగ్నిపర్వత మైదానాలు, ఉల్కలు/గ్రహశకలాలు వంటి ఖగోళ వస్తువులు ఢీకొని ఉపరితలంపై ఏర్పడిన బిలాల తాలూకు అచ్చెరువొందించే ఫొటోలు తీసింది ‘బెపి కొలంబో’ మిషన్. బుధుడి ఉపరితల శిలల్లో ముఖ్యంగా గంధకం వంటి అస్థిర ఖనిజాలు సూర్యుడి వేడికి ఉత్పతనం చెందుతున్నట్టు 1974లో ‘మెరైనర్-10’ అంతరిక్ష నౌక గమనించింది. అక్కడి సల్ఫర్ వంటి అస్థిర మూలకాలు ద్రవస్థితిలోకి మారకుండానే ఘనస్థితి నుంచి నేరుగా వాయురూపంలో ఆవిరైపోవడంతో ఆ ప్రాంతాల్లో తక్కువ లోతుతో ప్రకాశవంతమైన విలక్షణ గుంతలు ఏర్పడ్డాయి. ‘మెర్క్యురి హాలోస్’గా పిలిచే వీటిపైనా ‘బెపి కొలంబో’ ఓ కన్నేస్తుంది. సూర్యుడికి అతి సమీపంగా ఉన్న గ్రహం కనుక విపరీత వేడిమిని తట్టుకునేలా జంట వ్యోమనౌకలను రూపొందించారు. ‘బెపి కొలంబో’ మిషన్ వ్యయం 1.65 బిలియన్ యూరోలు. మన కరెన్సీలో ఇది సుమారు రూ.18,100 కోట్లు. రాకెట్ ప్రయోగ వ్యయం, ఎంపీవో, ఎంటీవోల రూపకల్పన, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి రూ.14,275 కోట్ల మేర సింహభాగాన్ని ఈఎస్ఏ భరించింది. ఎంఎంవో తయారీ సహా మిగతా ఖర్చును ‘జాక్సా’ పెట్టుకుంది.రెండు కళ్లు... మాగ్నెటోస్ఫెరిక్, ప్లానెటరీ ఆర్బిటర్స్!‘బెపి కొలంబో’ మిషన్లో ప్రధానంగా చెప్పాల్సింది రెండు వ్యోమనౌకల గురించి. ఇవి ఆర్బిటర్స్. బుధుడి కక్ష్యలో ఉపగ్రహాల్లా తిరుగుతూ ఆ గ్రహాన్ని శోధిస్తాయి. ఈ జంట వ్యోమనౌకలు... ‘మెర్క్యురీ మాగ్నెటోస్ఫెరిక్ ఆర్బిటర్’ (ఎంఎంవో), ‘మెర్క్యురీ ప్లానెటరీ ఆర్బిటర్’ (ఎంపీవో). బుధుడి అయస్కాంత వాతావరణాన్ని అధ్యయనం చేసే ఎంఎంవోను ‘జాక్సా’ రూపొందించింది. ఈ వ్యోమనౌకలో ప్లాస్మా వేవ్ ఇన్స్ట్రుమెంట్, మాగ్నెటోమీటర్, సోడియం అట్మాస్ఫియర్ స్పెక్ట్రల్ ఇమేజర్, డస్ట్ మానిటర్, ప్లాస్మా పార్టికిల్ ఎక్స్పరిమెంట్ పరికరాలు అమర్చారు. ఇవి అయాన్లు, ఎలక్ట్రాన్లను విశ్లేషించడంతోపాటు సౌరగాలి ప్రభావానికి బుధ గ్రహం ఎలా ప్రతిస్పందిస్తుందో పరిశీలిస్తాయి. ఇక బుధుడి ఉపరితలం, అంతర నిర్మాణాన్నిఅధ్యయనం చేసే పరికరాలున్న ఎంపీవోను యూరోపియన్ అంతరిక్ష సంస్థ తయారుచేసింది. ఈ వ్యోమనౌకలో బెపి కొలంబో లేజర్ ఆల్టిమీటర్, ఇమేజింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్, గామా-రే & న్యూట్రాన్ స్పెక్ట్రోమీటర్, సోలార్ ఇంటెన్సిటీ ఎక్స్-రే & పార్టికిల్ స్పెక్ట్రోమీటర్, మాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ వంటి డజను శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. ఇవి బుధుడి ధ్రువ ప్రాంతాల్లోని మంచును, ఉపరితల ద్రోణుల్ని పరిశీలించి గ్రహపు అంతర్గత క్రియాశీలతను తెలుసుకుంటాయి. ఈ జంట అంతరిక్ష నౌకలను మాతృ నౌక ‘మెర్క్యురీ ట్రాన్స్ఫర్ మాడ్యూల్’ (ఎంటీఎం) బుధుడి చెంతకు మోసుకెళ్లింది. దాదాపు ఎనిమిదేళ్లుగా కలసికట్టుగా కోట్లాది కిలోమీటర్ల దూరం సాగిన వీటి పయనం గురువారం కీలక మలుపు తీసుకుంది. ఎంటీఎం నుంచి విడిపోయి ఎంఎంవో, ఎంపీవోలు ఒకే జంటగా బుధుడికేసి ప్రయాణం ఆరంభించాయి. లక్ష్యానికి ప్రస్తుతం 33 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆర్బిటర్లు నవంబరు 21న జంటగానే బుధుడి కక్ష్యలో ప్రవేశించనున్నాయి. అనంతరం కక్ష్యలో ఈ ఏడాది డిసెంబరు 9-10 తేదీల్లో అవి రెండూ విడిపోయి వేర్వేరు ఎత్తుల నుంచి బుధ గ్రహాన్ని మ్యాపింగ్ చేస్తాయి. మెర్క్యురీ ప్లానెటరీ ఆర్బిటర్ (ఎంపీవో) బుధుడికి 480 X 1,500 కిలోమీటర్ల కక్ష్యలో, మెర్క్యురీ మాగ్నెటోస్ఫెరిక్ ఆర్బిటర్ (ఎంఎంవో) 590 X 11,640 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలోనూ ఉంటూ పరిశోధనలు చేపడతాయి.- జమ్ముల శ్రీకాంత్ (Courtesy: European Space Agency, JAXA, Forbes, The Manila Times, ‘nature’ magazine).
జాతీయం
బొమ్మను చూసి అమ్మే అనుకుని..
ఆవు బొమ్మను చూసిన ఓ లేగదూడ అమాయకంగా దాని దగ్గరకు వెళ్లింది. డెయిరీ వ్యాన్పై ఉన్న ఆవు ఫొటోలోని నిండైన పొదుగు నుంచి పాలు తాగేందుకు ప్రయత్నించింది. అది బొమ్మ అని తెలియక.. ఆకలితో, అమ్మ కోసం వెతుకుతున్నట్టుగా వ్యాన్ను అనుసరించిన దృశ్యం చూపరులను కదిలించింది. నిజం తెలియని ఆ చిన్న ప్రాణి, తల్లి కోసం పడిన తపనను చూసి కారులో ఉన్న వాళ్లు వీడియో తీశారు. ఈ వీడియో చూస్తూ చాలామంది నవ్వుతూనే.. భావోద్వేగానికి లోనయ్యారు. బంధం అంటే ఇదేనేమో.. తల్లిని వెతికే మనసు!The ancients called it physis, the nature that precedes reason! Before we learn to speak, we learn to seek.A calf saw a cow image and without knowing the illusion from reality, walked towards it seeking milk.It is what Aristotle meant by saying: " Some bonds are not taught by… pic.twitter.com/UZDizeT3Kv— WireClicks (@Wireclicks) September 4, 2026
యోగి సర్కార్కు కొత్త టెన్షన్.. అఖిలేష్-సీజేపీ భేటీపై రాజకీయ దుమారం!
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ.. ఓ కీలక భేటీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, విద్యార్థి ఉద్యమ సంస్థ సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా భేటీ కావడంతో యూపీలో కొత్త రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనా? లేక ఎన్నికల ముందు యువతను కేంద్రంగా చేసుకుని అఖిలేష్ కొత్త రాజకీయ వ్యూహానికి తెరతీశారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి.ఇక, అఖిలేష్తో సీజేపీ ప్రతినిధి సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరి మధ్య లక్నోలో జరిగిన భేటీ దాదాపు 90 నిమిషాల పాటు సాగినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. సమావేశం తర్వాత ఇరువైపుల నుంచి పెద్దగా వివరాలు బయటకు రాకపోవడంతో.. అసలు ఏం చర్చించారు? అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఎన్నికల ముందు అఖిలేష్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారా? సీజేపీ ద్వారా యూపీలో విద్యార్థి శక్తిని ఏకం చేయబోతున్నారా? ఈ భేటీ వెనుక అసలు వ్యూహం ఏమిటి? ఇప్పుడు యూపీ రాజకీయాల్లో ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇప్పటివరకు ఎస్పీ-సీజేపీ మధ్య ఎలాంటి అధికారిక రాజకీయ పొత్తు లేదా అవగాహన ప్రకటించలేదు.టార్గెట్ యూపీనా?సీజేపీ ఇటీవల విద్యార్థులు, యువతకు సంబంధించిన అంశాలపై ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. పరీక్షల వ్యవస్థ, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో లోపాలపై ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని పరిశీలించే ‘School Thik Karo’ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో అఖిలేష్తో రంకా భేటీ కావడంతో.. సీజేపీ తన విద్యార్థి ఉద్యమాన్ని యూపీలో విస్తరించేందుకు సిద్ధమవుతోందా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.యువ ఓటర్లపై అఖిలేష్ కన్ను?యూపీ రాజకీయాల్లో యువత, విద్యార్థులు కీలక ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఉద్యోగాలు, పరీక్షల నిర్వహణ, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థ వంటి అంశాలను అఖిలేష్ యాదవ్ కూడా తరచూ ప్రస్తావిస్తూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో యువతలో ప్రభావం పెంచుకుంటున్న ఓ ఉద్యమ సంస్థతో సంప్రదింపులు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదీ చదవండి: ‘విజయ్ ఫర్ పీఎం’.. కాంగ్రెస్కు టీవీకే మరో షాక్!అయితే, సీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? సమాజ్వాదీపార్టీతో కలిసి పనిచేస్తుందా? లేక కేవలం విద్యార్థి సమస్యలపై మాత్రమే సహకారం ఉంటుందా? అన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మరోవైపు.. వీరి భేటీపై బీజేపీ కూడా స్పందించింది. బీజేపీ నేత రాకేశ్ త్రిపాఠి ఈ పరిణామాన్ని విమర్శిస్తూ సీజేపీ ఉద్యమం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం ఈ రకమైన సంప్రదింపులను స్వాగతించింది. దీంతో ఈ భేటీ కేవలం విద్యార్థి సమస్యలపై చర్చకే పరిమితమా.. లేక యూపీలో కొత్త రాజకీయ కూటమికి తొలి సంకేతమా? అన్న ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారింది.
తమిళనాట బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్కు విజయ్ మరో షాక్!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అప్పుడే అధికార కూటమికి ‘2029 ఎన్నికల’ సెగ తగులుతోంది. ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలు కూడా పూర్తికాకముందే.. ‘ప్రధాని అభ్యర్థి ఎవరు?’ అన్న ప్రశ్న టీవీకే-కాంగ్రెస్ మధ్య చిచ్చు రేపుతోంది. ఒకవైపు సీఎం, టీవీకే అధినేత విజయ్ను 2029 ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తెస్తున్న ఆయన పార్టీ నేతలు.. మరోవైపు రాహుల్ గాంధీనే ప్రతిపక్ష కూటమి ప్రధాని ముఖంగా కాంగ్రెస్ పట్టుబడుతోంది. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది.ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న టీవీకే మిత్రపక్షాలతో కీలక సమావేశం నిర్వహించనుండటం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే నేతలను టీవీకే మంత్రులు సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. ఈ భేటీలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుతో పాటు కూటమి భవిష్యత్ వ్యూహంపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ సమావేశానికి కాంగ్రెస్కు ఆహ్వానం లేకపోవడం మరింత ఉత్కంఠకు తెరలేపింది.అసలు కథ మొదలైంది ఇక్కడే..టీవీకేకి చెందిన పలువురు నేతలు వరుసగా ‘విజయ్ ఫర్ పీఎం’ నినాదాన్ని తెరపైకి తీసుకురావడంతో వివాదం మొదలైంది. విజయ్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, 2029లో ప్రధాని అభ్యర్థిగా ఆయనను ముందుకు తీసుకురావాలని పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. అంతేకాదు.. విజయ్కు రాహుల్ గాంధీ మద్దతు ఇస్తారని కూడా కొందరు టీవీకే నేతలు వ్యాఖ్యానించడం కాంగ్రెస్లో మరింత అసహనానికి కారణమైంది.కాంగ్రెస్ వార్నింగ్.. రాహుల్ మా ఛాయిస్!టీవీకేనేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. 2029లో రాహుల్ గాంధీనే తమ ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నది పార్టీ విధానం కాదని.. కొందరు కొత్తగా వచ్చిన నేతల అభిమాన భావజాలం మాత్రమేనని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న రెండు పార్టీలు.. జాతీయ స్థాయిలో మాత్రం ఇద్దరు వేర్వేరు నేతలను ప్రధాని కుర్చీ కోసం ముందుకు తెస్తున్నాయి. అయితే, ఈ వివాదం మాటలకే పరిమితం కాలేదు. కాంగ్రెస్ మంత్రి ఎస్. రాజేశ్ కుమార్.. రాహుల్ గాంధీని 2029 ప్రధాని అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే కాంగ్రెస్కు చెందిన మంత్రులు పదవుల్లో కొనసాగడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు కూటమిలోని అంతర్గత ఉద్రిక్తతను మరింత బయటపెట్టాయి.మరోవైపు.. కాంగ్రెస్ నేతలు మాత్రం కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. కాగా, ముఖ్యమంత్రి విజయ్ మాత్రం ఈ వివాదంపై ఇప్పటివరకు పెద్దగా స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడంతా సెప్టెంబర్ 9 సమావేశంపైనే ఉత్కంఠ నెలకొంది. టీవీకే ఇప్పటికే మిత్రపక్షాలతో చర్చలు మొదలుపెట్టింది. ఈ సమావేశంలో కూటమి నిర్మాణం, రాజకీయ ఫ్రంట్కు పేరు, సమన్వయ వ్యవస్థ వంటి అంశాలతో పాటు విజయ్-రాహుల్ వివాదానికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా? అన్నది కీలకంగా మారింది.ఇదీ చదవండి: మంచి స్కూల్స్ అడగటం ప్రభుత్వ వ్యతిరేకమా: సీజేపీ
కారు-లారీ ఢీ.. 8 మంది బీటెక్ విద్యార్థుల దుర్మరణం
ఘోర రోడ్డు ప్రమాదంతో శుక్రవారం అర్ధరాత్రి కేరళ రహదారి నెత్తురోడింది. త్రిసూర్ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మృతులంతా తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. కైపమంగళం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గురువాయూర్ వైపు నుంచి కొడుంగల్లూర్ దిశగా వెళ్తున్న కారు.. హైవేపై నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతినడంతో అందులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అగ్నిమాపక-రక్షణ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను సహాయక చర్యలు చేపట్టి బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను త్రిసూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గురైన కారుకు తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు తమిళనాడు దిండిగల్ ఇంజినీరింగ్ విద్యార్థులుగా చెబుతున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందు అదే కారు మితిమీరిన వేగంతో రోడ్డు మీద హల్ చల్ చేసిందని తెలుస్తోంది. దీనిపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇదీ చదవండి: మంచి స్కూల్స్ అడిగితే తప్పా?
ఎన్ఆర్ఐ
అమెరికాలో ఘనంగా మనబడి తెలుగుకు పరుగు రన్4తెలుగు 2026
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని, పురస్కరించుకొని నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘తెలుగుకు పరుగు – Run4Telugu 2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది.వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, జార్జియా, ఇల్లినాయిస్, మిషిగన్, మిన్నెసోటా, మిస్సోరీ, న్యూ జెర్సీ, ఒక్లాహోమా, టెన్నెస్సీ, టెక్సాస్, వర్జీనియా తదితర రాష్ట్రాలలోని సుమారు 25 ప్రాంతాల నుంచి మూడువేల మందికి పైగా తెలుగు భాషాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశాన్ని సమాజానికి అందించాలనే లక్ష్యంతో మనబడి భాషా సైనికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ‘తెలుగుకు పరుగు’లో ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకులు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ, మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతుల గురించి వివరించారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను తెలియజేస్తూ, తెలుగు భాషను భావితరాలకు అందించడం ప్రతి తెలుగు కుటుంబం బాధ్యత అని గుర్తుచేశారు. అమెరికా, కెనడాతో పాటు వివిధ దేశాలలో మనబడి నిర్వహిస్తున్న తెలుగు తరగతులు, కార్యక్రమాల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన మనబడి అధ్యక్షులు, కులపతి చమర్తి రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగుకు పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు శుభాభినందనలు తెలిపారు. Run4Telugu పోటీలను రెండు విభాగాలలో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి మెడల్స్తో సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనబడి ధృవపత్రాలను అందజేశారు. ఆయా ప్రాంతాలలో పాల్గొన్న వారికి అల్పాహార విందును కూడా ఏర్పాటు చేశారు. అంతేగాదు “తెలుగు నేర్చుకుందాం… తెలుగు మాట్లాడుదాం… తెలుగు భాషను భావితరాలకు అందిద్దాం” అనే మనబడి సందేశాన్ని అమెరికా వ్యాప్తంగా ధ్వనింపచేసేలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. (చదవండి: స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు)
లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?
ఆరంకెల జీతం, హెచ్1-బీ వీసా కలలతో అమెరికాకు ఎగిరిపోయే భారతీయులకు ఈ కల సాకారమైనాక ఇక లైఫ్ సెట్ అనుకుంటారు. కానీ ఒక భారత సంతతి మహిళ అలా అనుకోలేదు. వాటన్నింటినీ వదులుకుని మాతృదేశానికి తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకో తెలుసా?'బిజినెస్ ఇన్సైడర్' అందించిన వివరాల ప్రకారం 28 ఏళ్ల దిశా లాంబా, 2021లో న్యూయార్క్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికాకు వెళ్లింది. అక్కడ విజయ వంతమైన కెరీర్ను నిర్మించుకుని, 2024లో CVS హెల్త్లో డేటా సైంటిస్ట్ ఉద్యోగాన్ని పొందింది. ఆరెంకల భారీ వేతనంతో కూడిన ఉద్యోగం. H-1B వీసా లాటరీ ప్రక్రియలోనూ విజయం సాధించింది. కానీ తన కుటుంబానికి దగ్గరగా ఉండటంతో పాటు,మారుతున్న పరిస్థితుల రీత్యా వాటన్నింటినీ వదులుకోవాలని నిర్ణయించుకుంది.ఒంటరితనం, అమెరికా సమయానికి అనుగుణంగా ఇండియాలోని తల్లిదండ్రులతో మాట్లాడాల్సి రావడం ఆమెను మానసికంగా ఇబ్బందికి గురి చేసినట్టు ఆమె వెల్లడించారు. H-1B వీసా పొందినప్పటికీ ఉద్యోగం మారడం, ఇతర ఆదాయ మార్గాలు (Side hustles) వెతుక్కోవడం, ప్రయాణాలు లేదా కెరీర్ గ్యాప్ తీసుకోవడం H-1B నిబంధనల వల్ల చాలా కష్టంతో కూడుకున్నవి కావడం కూడా ఆమె నిర్ణయానికి ఊతమిచ్చాయి.ఇదీ చదవండి: రూ. 15 లక్షల కారు, 70 తులాల గోల్డ్ : అయినా కట్నదాహానికి టీచర్ భువనేశ్వరి ఆహుతి2026 మేలో ఉద్యోగానికి రాజీనామా చేసి గురుగ్రామ్లోని తన తల్లిదండ్రుల వద్దకు తిరిగొచ్చేశారు. ప్రస్తుతం ఒక చిన్న కెరీర్ బ్రేక్ తీసుకుని, భారతదేశంలోనే కొత్త అవకాశాలు లేదా స్వంతంగా వ్యాపారం ప్రారంభించే యోచనలో ఉన్నారు. H-1B వీసాలపై కొత్త ప్రతిపాదనలప్రకారం, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసాలకు సంబంధించి కొన్ని కఠినమైన మార్పులను ప్రతిపాదించింది: H-1B వీసా ఫీజు పెంచే ప్రతిపాదనతోపాటు. గ్రేస్ పీరియడ్ రద్దచేయాలని భావిస్తోంది. దీంతో ఉద్యోగం కోల్పోయిన H-1B హోల్డర్లకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగిస్తారు.అలాగే H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకిచ్చే (H-4 వీసా) ఇచ్చే పని అనుమతులను రద్దు చేసే ప్రతిపాదన కూడా ఉంది. ఈ నిబంధనలు ఎక్కువ మంది భారతీయ కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
90 ఏళ్ల వయసులో మాతృదేశానికి పయనం.. డాలస్లో ఘన సత్కారం!
డాలస్, టెక్సస్: అనేక దశాబ్దాలుగా పార్క్ల్యాండ్ హాస్పిటల్, డాలస్ కౌంటీ ఫ్యామిలీ కోర్ట్ సర్వీసెస్, డాలస్ కౌంటీ చైల్డ్ వెల్ఫేర్ తదితర సంస్థల ద్వారా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బాలల సంక్షేమం, కుటుంబ న్యాయస్థాన సేవలు, గృహహింస, వృద్ధుల సంక్షేమం, డయాలసిస్ సేవలు వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందించిన ప్రముఖ సామాజిక సేవకురాలు డా. భానుమతి ఇవటూరికి డాలస్లో ఘన సత్కారం లభించింది. 90 ఏళ్ల వయస్సులో అమెరికాలో 50 సంవత్సరాలకు పైగా జీవితం గడిపిన ఆమె ఇకపై మాతృదేశంలో జీవించేందుకు పయనమవుతున్న సందర్భంగా ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, షబ్నం మాడ్గిల్, తైయాబ్ కుండావాల, సుష్మా మల్హోత్రా, సత్యన్ కళ్యాణ్ దుర్గ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (TANTEX) అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, శ్రీధర్ కోడెల, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, రామకృష్ణ నూనె; అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఉత్తరాధ్యక్షులు సతీష్ రెడ్డి; నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (NATS) పూర్వాధ్యక్షులు బాపు నూతి; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, TANA బోర్డు పూర్వ కార్యదర్శి మురళి వెన్నం; కమ్యూనిటీ నాయకులు ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, డా. జగదీశ్వరన్ పుడూర్ తదితరులు డా. భానుమతి ఇవటూరిని జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించారు.సభాధ్యక్షత వహించిన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “సమస్యకు–పరిష్కారానికి మధ్య, వివాదానికి–అవగాహనకు మధ్య, గందరగోళానికి–స్పష్టతకు మధ్య, నిరాశకు–ఆశకు మధ్య డా. భానుమతి ఒక వెలుగుదారిగా నిలిచారు. అమెరికాలో కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం అంత సులభమైన విషయం కాదు. తల్లిదండ్రులు తమతో పాటు మాతృభూమి విలువలు, సంప్రదాయాలు, ఆశలు, ఆకాంక్షలను తీసుకువస్తారు. అయితే వారి పిల్లలు మాత్రం పూర్తిగా భిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో పెరుగుతారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, పిల్లలపై ఉన్న ఆశలు అపార్థాలకు, చివరకు కుటుంబ కలహాలకు దారితీస్తాయి. ఈ సమస్యను ఎంతో లోతుగా అర్థం చేసుకున్న భానుమతి.. తల్లిదండ్రుల ఆశలు, అంచనాల కారణంగా పిల్లలనే దూరం చేసుకునే పరిస్థితి రాకూడదని చెబుతారు” అన్నారు.“జీవితంలో విజయం అంటే కేవలం డిగ్రీలు, పదవులు, బిరుదులు కాదు. మన వల్ల ఎన్ని కుటుంబాలకు సహాయం అందింది, ఎంతమంది జీవితాలు మెరుగుపడ్డాయి అనేదే నిజమైన విజయానికి కొలమానం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ డా. భానుమతి ఇవటూరి జీవితం. 50 సంవత్సరాలకు పైగా అమెరికాలో జీవితం గడిపి, తొమ్మిది పదులు దాటిన వయస్సులో మాతృదేశంలో తన భవిష్యత్ జీవితాన్ని గడపాలనుకోవడం హర్షనీయమైన విషయం. ఆమె మిగిలిన జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని డా. ప్రసాద్ తోటకూర అన్నారు.వివిధ సందర్భాల్లో డా. భానుమతి ఇవటూరితో సన్నిహితంగా పనిచేసిన ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, డా. కృష్ణబాబు చుండూరి, డా. కిశోర్ సుంకర, రాధికా కోడెల, రామకృష్ణ నూనె, డోరిస్ మార్షల్, స్యూ యాన్ రూత్, అవ్యం రమణి తదితరులు భానుమతి సామాజిక సేవలను కొనియాడారు.డా. భానుమతి ఇవటూరి మాట్లాడుతూ.. “అతి తక్కువ సమయంలో, వారాంతం కానప్పటికీ, ఇర్వింగ్లోని మైత్రీ ఇండియన్ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశానికి దాదాపు వంద మందికి పైగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు నా జీవితంలో ఒక మధురమైన రోజుగా మిగిలిపోతుంది. నా సుదీర్ఘ సామాజిక సేవా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు.ఇవీ చదవండి: 8 ఏళ్లకే చెస్లో సంచలనం.. 9/9 గెలిచిన తెలుగు బాలిక!
అమెరికాలో తెలుగు యువతి కేసులో కీలక పరిణామం
అమెరికా తెలుగు యువతి నిఖిత గోదిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రియురాలి హత్య కేసులో సాప్ట్వేర్ ఇంజనీర్ అర్జున్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని ఓ అపార్ట్మెంట్లో దాక్కున్న అర్జున్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అర్జున్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసుల సహకారంతో శంకర్ గ్రీన్ రెసిడెన్షియల్ సొసైటీలో అరెస్ట్ చేశారు.అమెరికా-భారత్ నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద తదుపరి చర్యలు చేపట్టనున్నారు. 2025 డిసెంబర్ 31న డబ్బు తిరిగి ఇస్తానంటూ నిఖితను పిలిచి హత్య చేశాడు. ఆర్థిక వివాదమే హత్యకు కారణమని అమెరికా అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని ఎల్లికాట్ సిటీలో నివసించే నిఖిత జనవరి 2న కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మేరీల్యాండ్లోని కొలంబియాలో ఉన్న ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అపార్ట్మెంట్లోనే ఆమె మృతదేహాన్ని గుర్తించారు. నిఖిత శరీరంపై కత్తిపోట్ల గాయాలు ఉన్నట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. నిఖిత నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడనే ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఏప్రిల్లో తెలంగాణలో అర్జున్పై మోసం కేసు నమోదైంది.దర్యాప్తులో భాగంగా కొన్ని కీలక ఆధారాలు లభించడంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఆగ్రాకు పంపించాం. అక్కడ ఓ ఫ్లాట్లో అర్జున్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నాం. మోసం కేసుకు సంబంధించి అతడికి నోటీసులు జారీ చేశాం. అదే సమయంలో అమెరికాలో అతడిపై కేసు ఉండటంతోపాటు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) పెండింగ్లో ఉన్న విషయం గుర్తించాం. దీంతో కేంద్ర అధికారులకు సమాచారం అందించాం’’ అని హైదరాబాద్ పోలీసు అధికారి తెలిపారు. అర్జున్ను న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది. నిఖిత గత నాలుగేళ్లు అమెరికాలో డేటా, స్ట్రాటజీ అనలిస్ట్గా పనిచేసింది.
క్రైమ్
ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం.. ప్రేమ పేరిట ఆకర్షణ.. ఇవన్నీ యువతపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయో చెప్పేందుకు ఈ ఘటన మరో ఉదాహరణ. తమకు నచ్చిన వ్యక్తి కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో కొందరు హద్దులు దాటుతున్నారు. క్షణికమైన కోరిక కోసం తీసుకునే నిర్ణయాలు.. చివరికి జీవితాన్నే మార్చే పరిణామాలకు దారితీస్తున్నాయి. తమ ప్రేమను నిరూపించుకోవాలనే తాపత్రయంలో ఓ యువతి చేసిన పని ఇప్పుడు ఆమెను కటకటాల వెనక్కి నెట్టింది.ప్రియుడి మనసులో చోటు కోసం ఓ యువతి వెంపర్లాడింది. అతనికి ఉన్న ఖరీదైన బైక్ కలను నెరవేర్చాలని అనుకుంది. ఈ క్రమంలోనే ఆ కాలేజీ విద్యార్థినిని దొంగగా మారి.. తండ్రి పరువు తీసేసింది. తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. స్థానికంగా కాలేజీ చదువుతున్న ఓ యువతి.. ఓ అబ్బాయిని ఇష్టపడుతోంది. అతను కూడా ఆమెతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఖరీదైన బైక్ ఎప్పటికైనా కొనుక్కోవాలని అతను తరచూ ఆమెకు చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఓరోజు తన తండ్రి స్నేహితుడైన హెచ్. తమిళ్సెల్వన్ ఇంటికి వెళ్లింది. అక్కడ అల్మారాలో బంగారం ఉన్న విషయం గుర్తించింది. వాళ్ల కళ్లు గప్పి.. 9 సవర్ల బంగారు నగలను చోరీ చేసింది.ఆపై ఆ నగలను స్థానిక దుకాణంలో రూ.2.5 లక్షలకు విక్రయించింది. ఆ వచ్చిన డబ్బుతో తన ప్రియుడు జనగన్ శివకు ఓ కాస్ట్లీ బైక్ కొనిచ్చింది. అంతేకాదు.. సంతోషంగా ఆ సర్ప్రైజింగ్ క్షణాలను వీడియోగా తీసి సోషల్ మీడియాలోనూ పంచుకుంది. ఇంట్లో బంగారు నగలు కనిపించకపోవడంతో తమిళ్సెల్వన్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో.. స్నేహితుడి కూతురిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. విచారణలో తానే బంగారం తీసుకున్నట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు ఆమె ప్రియుడు జనగన్ శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.ప్రియుడికి బైక్ కొనివ్వాలన్న కోరికతో మొదలైన వ్యవహారం.. చివరకు దొంగతనం, అరెస్టు వరకు వెళ్లింది. క్షణికమైన ప్రేమ, ఆకర్షణ కోసం తీసుకున్న ఓ నిర్ణయం.. ఇప్పుడు ఆ యువతి జీవితానికే చేదు అనుభవంగా మారింది. ఇప్పుడీ కేసు.. ఆమె బైక్ కొనిచ్చిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.தந்தையின் நண்பர் வீட்டில் 9 சவரன் நகையைத் திருடி விற்று காதலனுக்கு புதிய பைக் வாங்கிக்கொடுத்த கல்லூரி மாணவி..!#Gold | #GoldTheft | #Bike | #Love | #PolimerNews pic.twitter.com/gcz136ETHK— Polimer News (@polimernews) September 4, 2026VIDEO CREDITS: Polimer News
కారు-లారీ ఢీ.. 8 మంది బీటెక్ విద్యార్థుల దుర్మరణం
ఘోర రోడ్డు ప్రమాదంతో శుక్రవారం అర్ధరాత్రి కేరళ రహదారి నెత్తురోడింది. త్రిసూర్ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మృతులంతా తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. కైపమంగళం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గురువాయూర్ వైపు నుంచి కొడుంగల్లూర్ దిశగా వెళ్తున్న కారు.. హైవేపై నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతినడంతో అందులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అగ్నిమాపక-రక్షణ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను సహాయక చర్యలు చేపట్టి బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను త్రిసూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గురైన కారుకు తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు తమిళనాడు దిండిగల్ ఇంజినీరింగ్ విద్యార్థులుగా చెబుతున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందు అదే కారు మితిమీరిన వేగంతో రోడ్డు మీద హల్ చల్ చేసిందని తెలుస్తోంది. దీనిపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇదీ చదవండి: మంచి స్కూల్స్ అడిగితే తప్పా?
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
మలికిపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన అన్నదమ్ములు ముదునూరి రామభద్రరాజు (రాంబాబు రాజు) (55), అతని తమ్ముడు ముదునూరి వెంకట సుబ్బరాజు (శ్రీనివాసరాజు) (52) అక్కడిక్కడే మృతి చెందారు. తోటికోడళ్లయిన రాంబాబు రాజు భార్య విజయలక్ష్మీ మాధురి, శ్రీనివాసరాజు భార్య శారద తీవ్రంగా గాయపడగా వారిని కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరు భీమవరం నుంచి స్వగ్రామం లక్కవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాంబాబు రాజు, విజయలక్ష్మీ మాధురి భీమవరంలో బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళారు. శ్రీనివాసరాజు, శారద తమ కుమార్తెను అమెరికా పంపించేందుకు బెంగళూరులో విమానం ఎక్కించి రైలులో భీమవరం వచ్చారు. పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక రాంబాబు రాజు దంపతులు, భీమవరంలో రైలు దిగిన శ్రీనివాసరాజు దంపతులు కలిసి తెల్లవారుజామున కారులో లక్కవరం బయలుదేరారు. మరొక్క నిమిషంలో ఇంటికి చేరుకుంటారనగా.. లక్కవరం ఓఎన్జీసీ సైట్ వద్ద వీరి కారు అదుపు తప్పి ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తోటికోడళ్లిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం వేకువజామున 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవింగ్ చేస్తుండగా కునుకు రావడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధంప్రయాణికులు సురక్షితంపెద్దవడుగూరు: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. టీజీ13టీ1986 నంబరు గల బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్కు గురువారం రాత్రి 8.40 గంటలకు బయలు దేరింది. బస్సులో 33 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు. తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో పామిడి దాటిన తర్వాత కాలుతున్న వాసన రావడంతో ప్రయాణికులు, డ్రైవర్ను అప్రమత్తం చేశారు. దీంతో డ్రైవర్ కొద్దిదూరంలోని మిడుతూరు గ్రామ సమీపంలో రోడ్డు పక్కన బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దింపేశారు. అందరూ దిగేయగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగి్నమాపక వాహనం ఘటన స్థలానికి చేరుకొనేలోపే బస్సు మొత్తం కాలిపోయింది. సీఐ నరేంద్రరెడ్డి, ఎస్ఐ రాఘవేంద్రప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
లాకప్లోనే నా కుమారుడ్ని చంపేశారు
ఒంగోలు టౌన్: చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగానికి బిడ్డను పోగొట్టుకున్న మరో తల్లి కన్నీరు పెట్టుకుంది. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బి.బిట్రగుంట మండలం అల్లిమడుగు సంగం గ్రామానికి చెందిన మల్లి దివ్యతేజ తల్లి సలోమీ తన కుమారుడిని పోలీసులే పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరయింది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తమను ఏం చేసినా చెల్లుతుందన్న అహంకారంతోనే పోలీసులు దివ్యతేజను నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపారని అతని చెల్లెలు శ్రీనిధి వాపోయింది. దివ్యతేజను ప్రకాశం జిల్లా జె.పంగులూరు పోలీసులు శనివారం రాత్రి 12 గంటల సమయంలో పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి కొట్టారని, ఆ దెబ్బలకు లాకప్లోనే చనిపోయాడని, ఆ తరువాత పంట పొలాల్లో పడేశారని సలోమీ, శ్రీనిధి ఆరోపించారు. దివ్య తేజ మృతదేహం జె.పంగులూరు మండలం రేణింగవరం–కొండమూరు గ్రామాల మధ్య పొలాల్లో గురువారం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని శుక్రవారం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. అక్కడకు వచ్చి న హతుడి తల్లి సలోమీ, చెల్లెలు శ్రీనిధి మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. దివ్యతేజను పోలీసులే కొట్టి చంపారని ఆరోపించారు. దివ్యతేజ బాధితుల కథనం ప్రకారం.. మల్లి దివ్యతేజ (34) గత శనివారం రాత్రి దాబాకు వెళ్లి భోజనం చేసి వస్తానంటూ తల్లి సలోమీ వద్ద డబ్బులు తీసుకొని స్నేహితుడు సాతపాటి శశికాంత్తో కలిసి బయలుదేరాడు. రాత్రి 12 గంటలకు ప్రకాశం జిల్లా జె.పంగులూరు పోలీసులు వారిని పట్టుకెళ్లారు. శశికాంత్ను వదిలి పెట్టిన పోలీసులు దివ్యతేజ పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి అతను కనిపించలేదు. అనుమానం వచ్చి న తల్లి సలోమీ, సోదరి శ్రీనిధి నెల్లూరు జిల్లా కావలి పోలీసు స్టేషన్కు వెళ్లి సీఐకు ఫిర్యాదు చేశారు. జె.పంగులూరు తన పరిధిలో లేదు కనుక అక్కడకు వెళ్లి పోలీసులను కలవమని ఆయన సలహా ఇచ్చారు. దాంతో బాధితులు జె.పంగులూరు ఎస్సైని కలవగా.. శశికాంత్ ఒక్కడినే పట్టుకున్నామని, దివ్యతేజ సంగతి తెలియదని చెప్పారు. ఆ సమయంలో ఎస్సై కంగారుపడినట్లు వారు గమనించారు. ఈనెల 1వ తేదీ వరకు పోలీసుల నుంచి సమాచారం లేకపోవడంతో మిస్సింగ్ కేసు పెట్టారు. దివ్యతేజ ఆచూకీ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ సమాచారం తెలిసిన గంటకే పోలీసులు లాయర్కు ఫోన్ చేసి కండమూరు పొలాల్లో దివ్యతేజ మృతదేహం ఉన్నట్లు గుర్తించామని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడకు వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో దివ్యతేజ మృతదేహం పొలాల్లో పడి ఉంది. దెబ్బలతో ఒళ్లంతా కమిలిపోయి ఉన్నట్లు గమనించారు. ఇవన్నీ పోలీసులు కొట్టిన దెబ్బలేనని, తన కుమారుడిని లాకప్లో కొట్టి చంపేశారంటూ సలోమీ విలపించారు.మమ్మల్ని చూడగానే ఎస్సై కంగారుపడ్డారు: శ్రీనిధితాము హైకోర్టులో పిల్ వేయకపోతే తన అన్న మృతదేహాన్నీ పోలీసులు మాయం చేసేవారని దివ్యతేజ చెల్లెలు శ్రీనిధి కన్నీరు పెట్టుకుంది. జె.పంగులూరు పోలీసు స్టేషన్కు వెళ్లిన తమను చూడగానే ఎస్సై కంగారు పడిపోయారని, భయంభయంగా మాట్లాడడంతో ఏదో జరిగిందన్న అనుమానం వచ్చి ందని తెలిపారు. తన సోదరుడు డిగ్రీ చదివాడని, ఐటీఐ చేశాడని చెప్పారు. ఆయనకు 4, 6 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారని, భార్య చనిపోయిందని, ఆటో తోలుకుంటూ జీవిస్తున్నాడని వివరించింది. పోలీసులు తన అన్నను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని విలపించింది. కోర్టుకు వెళ్లకపోతే శవం కూడా దొరికేది కాదు: నీలం నాగేందర్ బాధితులు హై కోర్టులో పిటిషన్ వేయకపోతే దివ్యతేజ మృతదేహం కూడా దొరికేది కాదని దళిత హక్కుల సంఘం నాయకుడు నీలం నాగేందర్ చెప్పారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, దళిత నాయకులు కాకుమాను రవి, కోలా జీవరత్నం, దేవరపల్లి గోపి, ఎర్రమల శ్రీనుతో కలిసి ఆయన జీజీహెచ్ వద్ద బాధిత కుటుంబంతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..పోలీసులు దివ్యతేజను లాకప్లోనే కొట్టి చంపారని, శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బాధితులు కోర్టులో పిటిషన్ వేసే దాకా మృతదేహం ఎక్కడ ఉందో కూడ చెప్పలేదన్నారు. దివ్యతేజ కంటి మీద, వీపు మీద, పొట్టమీద గాయాలున్నాయని, కాళ్లకు తాళ్లు కట్టి ఉన్నాయని తెలిపారు. దివ్యతేజ లాకప్డెత్ కేసులో వెంటనే ఎస్సైని సస్పెండ్ చేయాలని, కేసును గుంటూరు జిల్లా పోలీసు అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.విచారణ జరుపుతున్నాం: దర్శి డీఎస్పీ గత నెల 29వ తేదీ రాత్రి జె.పంగులూరు లిమిట్స్లో నైట్ బీట్లో ఉన్న పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి తప్పించుకొని వెళ్లి పోవడానికి ప్రయత్నించడంతో అనుమానం వచ్చి వెంటపడ్డారని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ తెలిపారు. మరుసటి రోజు శశికాంత్ను పోలీసులు పట్టుకున్నారని, రెండో వ్యక్తి పారిపోయాడని తెలిపారు. గురువారం మధ్యాహ్నం కండమూరు పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని, విచారణలో అది దివ్యతేజదిగా నిర్ధారించినట్లు తెలిపారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు. బాధితుల ఆరోపణలో నిజం లేదన్నారు.
వీడియోలు
ఎట్టకేలకు పట్టుకున్నారు
ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..
ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు
నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!
సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్
దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!
బస్సును ముద్దాడిండు డ్రైవరన్న
ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర
అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే
ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

