మీ మైండ్ మీకు అబద్ధాలు చెప్తోందా?
మన మెదడు ఒక అద్భుతమైన యంత్రం, కానీ ఒక్కోసారి అది మనకే విరుద్ధంగా పనిచేస్తుంది. మనకు తెలియకుండానే, మన మనసు వాస్తవాలను వక్రీకరించి మనకు అబద్ధాలు చెప్తుంది. దీన్నే సైకాలజీలో "Cognitive Distortions" (ఆలోచనా వైకల్యాలు) అంటారు. వీటిని గుర్తించి, అదుపులో ఉంచుకోవడం అంటే.. మీ మెదడులో సాగుతున్న 'తప్పుడు కోడింగ్'ను సరిచేయడమే.చాలామందికి ఒక అలవాటు ఉంటుంది—ఒక చిన్న తప్పు జరిగితే, "నేను ఎప్పుడూ తప్పులే చేస్తాను" అని అనుకుంటారు. లేదా ఒక వ్యక్తి మిమ్మల్ని పలకరించకపోతే, "అతనికి నా మీద కోపం, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు" అని భ్రమపడతారు. ఇవన్నీ నిజాలు కావు, ఇవన్నీ మీ మెదడు సృష్టించిన భ్రమలు. ఆరోన్ బెక్ (Aaron Beck) అనే సైకాలజిస్ట్ ఈ Cognitive Distortions అనే కాన్సెప్ట్ను ప్రపంచానికి పరిచయం చేశారు.1. మన మెదడు ఆడుతున్న 3 పెద్ద అబద్ధాలుమీ మెదడు రోజువారీ జీవితంలో మిమ్మల్ని మోసం చేసే కొన్ని ముఖ్యమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:All-or-Nothing Thinking: "నేను ఒక పనిని పర్ఫెక్ట్గా చేయాలి, లేదంటే నేను ఫెయిల్యూర్" అని అనుకోవడం. అంటే, మధ్యేమార్గం (Grey area) ఉండదు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.Catastrophizing: చిన్న సమస్య జరిగినా.. "ఇక నా జీవితం అయిపోయింది, అంతా నాశనం" అని అతిగా ఊహించుకోవడం.Mind Reading: "ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసు" అని భ్రమపడటం. వాస్తవానికి, వారు మీ గురించి అస్సలు ఆలోచించడం లేదు.2. ఈ అబద్ధాలు మీ పర్సనాలిటీని ఎలా నాశనం చేస్తాయి?ఈ 'డిస్టార్షన్స్' వల్ల మీరు నిరంతరం ఒత్తిడిలో ఉంటారు.మీరు ఎప్పుడూ తప్పు చేస్తానేమోనని భయపడుతుంటారు (Anxiety).ఎదుటివారి గురించి తప్పుడు అభిప్రాయాలు పెంచుకుని రిలేషన్షిప్స్ పాడు చేసుకుంటారు.అతిగా ఆలోచించి (Overthinking) మీ శక్తిని కోల్పోతారు.3. పాజిటివ్గా ఉంటే సరిపోదుట్రైనర్స్ "అన్నీ పాజిటివ్గానే చూడు" అని చెప్తారు. కానీ, అబద్ధం చెప్పే మెదడుకు 'పాజిటివ్ థింకింగ్' కేవలం ఒక ప్లాస్టర్ లాంటిది. మార్కెట్ పాజిటివిటీని నమ్మమంటుంది.సైకాలజీ (CBT - Cognitive Behavioral Therapy) మీ మెదడు అబద్ధం చెప్తున్నప్పుడు దాన్ని పట్టుకుని, "ఇది నిజమేనా? దీనికి ఆధారం ఏంటి?" అని లాజిక్తో ప్రశ్నించమంటుంది. దీన్నే 'Reality Testing' అంటారు.4. మీ మైండ్ ని రీ-సెట్ చేసుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ డిస్టార్షన్స్ ని ఎలా అదుపు చేయాలో చూద్దాం.Step 1: అబద్ధాన్ని పట్టుకోండిమీ మైండ్ ఎప్పుడు నెగటివ్ ఆలోచనలను ఇస్తుందో, వెంటనే 'STOP' అని అనుకోండి. "నేను నా మెదడు చెప్పే అబద్ధాన్ని నమ్మను" అని గట్టిగా చెప్పండి. ఇది ఒక చిన్న 'Break'.Step 2: లాజికల్ ఛాలెంజ్మీ మైండ్ చెప్పిన నెగటివ్ ఆలోచనకు ఒక కోర్టు విచారణ పెట్టండి.* "నేను ఫెయిల్యూర్" అని మీ మెదడు చెప్తే.. "గతంలో నేను సాధించిన విజయాలు ఏంటి?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సాక్ష్యాలతో మీ మెదడు అబద్ధాన్ని ఖండించండి.Step 3: క్లారిటీ ఒక్కసారి మీ మెదడు అబద్ధాలు చెప్తోందని మీకు తెలిస్తే, మీరు ఇక వాటికి భయపడరు. మీ మైండ్ ఒక అద్దంలా మారుతుంది—అక్కడ వాస్తవాలు మాత్రమే కనిపిస్తాయి, అపోహలు కాదు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ మైండ్ చెప్పే అబద్ధాల లిస్ట్ఈ రోజు ఒక చిన్న పని చేయండి.ఈ రోజు మీకు వచ్చిన అతి పెద్ద నెగటివ్ ఆలోచనను రాసుకోండి.ఆ ఆలోచన 'Distortion' (అబద్ధం) అని మీకు అనిపిస్తోందా?ఆ ఆలోచన నిజం కాదని నిరూపించే 3 వాస్తవాలను రాయండి.మీ మెదడుకి మీరు యజమాని!బ్రో, మీ మైండ్ ఒక సర్వెంట్ లాంటిది. కానీ అది ఒక్కోసారి యజమానిలా ప్రవర్తిస్తూ మీకు తప్పుడు సమాచారం ఇస్తుంది. దాన్ని నమ్మడం మానేసి, దాని మీద నిఘా పెట్టండి. మీ మెదడు చెప్పే ప్రతిదీ నిజం కాదు, అది కేవలం ఒక ఆలోచన (Thought) మాత్రమే.గుర్తుంచుకోండి, "Don't believe everything you think."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష.. వీడియో వైరల్
కోలీవుడ్ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్, త్రిష కలిసి ఒక పెళ్లి వేడుకకు తాజాగా హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో వారిద్దరూ సరదాగ పలకరించుకున్నారు. వీరిద్దరి గురించి కొద్దిరోజుల క్రితం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముందుగా త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలని, తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కొద్దిరోజల గ్యాప్లోనే విజయ్ సతీమణి సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. విజయ్ మరో మహిళతో సాన్నిహిత్యంగా ఉన్నారని అందుకే విడాకులు కావాలంటూ పేర్కొంది. అయితే, ఈ కథలో త్రిష పేరు ప్రధానంగా వైరల్ అయింది. ఇప్పుడు విజయ్, త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక పెళ్లికి వెళ్లడంతో వీడియో వైరల్ అవుతుంది.#Thalapathy @TVKVijayHQ President #Vijay and #Trisha attend #KalpathiSSuresh - #MeenakshiSuresh 's son wedding reception @actorvijay @trishtrashers pic.twitter.com/iQOQet9Z0A— Nikil Murukan (@onlynikil) March 5, 2026
డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తన పరిధిలో లేని 1977 అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ)ను అడ్డుపెట్టుకుని విదేశాలపై విధించిన అధిక టారిఫ్ల మాటున వసూలుచేసిన 130 బిలియన్ డాలర్లను తిరిగి ఆయా కంపెనీలకే చెల్లించాలని మాన్హట్టన్ నగరంలోని ‘యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్’లో జడ్జి రిచర్డ్ ఈటన్ తీర్పు చెప్పారు.టెన్నిస్సీ రాష్ట్రంలోని నాష్విల్లే నగరంలోని అట్మాస్ ఫిల్ట్రేషన్ అనే సంస్థ వేసిన పిటిషన్ను విచారిస్తూ జడ్జి ఈ తీర్పు వెలువర్చారు. ప్రపంచదేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లు చట్టవిరుద్ధమంటూ ఫిబ్రవరి 20వ తేదీన అమెరికా దేశ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. కానీ ఆయా దేశాల కంపెనీలు చెల్లించిన అధిక టారిఫ్లను తిరిగి వాళ్లకే రీఫండ్ చేయాలని తీర్పులో ఎక్కడా పేర్కొనలేదు. అయితే గురువారం ట్రేడ్ కోర్టు ఇచ్చిన తీర్పుతో రీఫండ్ విషయంలో స్పష్టత వచి్చనట్లయింది.
ధరల మోత.. వంటనూనెలు మొదలు ఔషధాల దాకా
ఇరాన్పై అమెరికా దాడిచేస్తే బదులుగా ఇరాన్.. సౌదీ, బహ్రెయిన్, ఖతార్ సహా పలు గల్ఫ్ దేశాలపై బాంబులేస్తోంది. సుదూరంగా ఉన్న భారత్పై బాంబులు పడకపోయినా ధరల బాంబులు పడొచ్చన్న విశ్లేషణలు ఇప్పుడు సగటు భారతీయుని గుండెల్లో భయాందోళనలను పెంచేస్తున్నాయి. సముద్రమార్గంలో చమురు కూడలిగా పేరొందిన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఆగిపోవడంతో ముడిచమురు మొదలు పలురకాల వస్తూత్పత్తుల ధరలకు రెక్కలొచ్చే ఆస్కారముంది. తొలుత చమురు మంటలు యుద్ధం ఇలాగే కొనసాగితే మిగతా వినిమయ వస్తువులతో పోలిస్తే మొట్టమొదట ముడిచమురు, చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ద్రవరూప సహజవాయువు(ఎల్ఎన్జీ) సరఫరా ఇరాన్ నుంచి ఆగిపోయింది. సౌదీ అరేబియాలోని రస్ తనూరా రిఫైనరీ నుంచి భారత్కు సరఫరా భారీగా తగ్గింది. దీంతో ఫిబ్రవరి నుంచి చమురు ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. హార్మూజ్ జలసంధికి బదులు ఆఫ్రికా ఖండంలోని ‘కేప్ ఆఫ్ గుడ్హోప్’ను చుట్టేస్తూ చమురు ఉత్పత్తులను సరఫరా చేస్తే రవాణా ఖర్చులు కలుపుకుని భారత్లో ఆయిల్ ధరలు పెరగడం ఖాయం. వంటనూనె మరింత ధర.. భారత్ వంటనూనెల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. పామాయిల్ ఎక్కువగా ఇండోనేసియా, మలేసియా నుంచి వస్తోంది. అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ నూనె, రష్యా, ఉక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు నూనె దిగుమతి అవుతున్నాయి. వీటిలో కొంత సరుకు హార్మూజ్ జలసంధి గుండా వస్తోంది. రవాణా గొలుసు తెగిపోవడంతో ధరలు కట్టలు తెంచుకోవచ్చని ‘సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా చెప్పారు. ఇప్పటికే వంటనూనెల ధరలు పెరగడం ఆరంభమైంది. కేంద్రప్రభుత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం మార్చి రెండో తేదీ ధరలతో పోలిస్తే మార్చి మూడో తేదీన సన్ఫ్లవర్, సోయా, పామాయిల్ నూనెల రిటైల్ ధరలు ఒకటి నుంచి మూడు రూపాయలు పెరిగాయి. పప్పులూ మరింత ప్రియం.. పప్పుల ధరలు పెరిగే వీలుందని ‘ఆల్ ఇండియా దాల్ మిల్ అసొసియేషన్’అధ్యక్షుడు సురేశ్ అగర్వాల్ చెప్పారు. మయన్మార్, కెనడా, ఆఫ్రికాల నుంచి భారత్ ఏటా దాదాపు 60 లక్షల టన్నుల కందులు, మినుములు సహా పలు రకాల పప్పులను దిగుమతిచేసుకుంటోంది. ‘‘ఇరాన్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్ అత్తిపండు, బాదం, పిస్తా, ఖర్జూరా, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, అప్రికాట్లను దిగుమతి చేసుకుంటోంది. పాకిస్తాన్తో ఘర్షణ వాతావరణం కారణంగా ఇప్పుడు ఇరాన్, అఫ్గాన్ల నుంచి పాక్కు, అక్కడి నుంచి వాఘా సరిహద్దు గుండా భారత్కు సరుకు రావట్లేదు. సముద్రమార్గంలో వస్తోంది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు సముద్రమార్గం మూసేయడంతో డ్రై ఫ్రూట్స్ సరుకు రావడం దాదాపు ఆగిపోయినట్లే. ధరలు పెరిగే వీలుంది’’అని ‘ముంబై డ్రై ఫ్రూట్, డేట్ మర్చంట్స్ అసోసియేషన్’అధ్యక్షుడు విజయ్ భూటా చెప్పారు. ఎరువులు, సాగు ఉత్పత్తుల రాక సైతం తగ్గిపోయిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానాల రాకపోకలు తగ్గడంతో కార్గో రవాణా పరిమాణం కుచించుకుపోయింది. ఇతర దేశాల మీదుగా విమానాలు తిరిగి రావడంతో అంతర్జాతీయ ప్రయాణికులకు టికెట్ అధిక చార్జీల మోత మోగుతోంది. ప్లాస్టిక్ సైతం.. ముడిచమురు నుంచే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ను తయారుచేస్తారు. ముడిచమురు సరఫరా తగ్గడంతో గత రెండు రోజుల్లోనే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ధర 12 శాతం ఎగసింది. దీంతో ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తుల ధరలు సైతం పైపైకి పోవడం ఖాయంగా కని్పస్తోంది. ఔషధాలదీ అదే బాట... ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి సరుకులైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్(ఏపీఐ) కోసం భారత్ ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. కానీ అత్యంత ఖరీదైన కీ స్టారి్టంగ్ మెటీరియల్స్(కేఎస్ఎం) కోసం ఎక్కువగా ఐరోపా దేశాలపై ఆధారపడుతోంది. యూరప్ నుంచి కేఎస్ఎం సరుకు హార్మూజ్ ద్వారానే రావాల్సి ఉంది. ఇవి తగ్గిపోవడంతో భారత్లో సంక్లిష్ట జనరిక్ మందులతోపాటు సైడ్ ఎఫెక్ట్లను తగ్గించే ‘విలువ జోడింపు ఔషధా(వీఏఎం)’ల తయారీ ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. వీటికితోడు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి మారకం విలువ పతనమవుతుండటంతో పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు మరింత ప్రియంకానున్నాయి. ఇవన్నీ కలసి సగటు భారతీయుని జేబుకు పెద్ద చిల్లు పెడతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జీపీఎస్ దారి తప్పింది
కాషాయ కండువా కప్పుకోనున్న వీరశివా !
యుద్ధ భయం.. బీమా ప్రీమియం ప్రియం
గీతం భూ దోపిడీపై చర్చించాల్సిందే: వైఎస్సార్సీపీ
కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
T20 WC 2026: ఇంగ్లండ్పై కీలక ప్రదర్శన.. చరిత్ర సృష్టించిన బుమ్రా
Hyderabad: కొండలు కరిగించేస్తున్నారు
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
ఇరాన్తో యుద్ధం.. ఇజ్రాయెల్కు వారానికి ఎంత నష్టమంటే..!
బందరులో బరితెగింపు..
బ్లాక్బస్టర్ 'గీత గోవిందం'ను మిస్ చేసుకున్నా: హీరోయిన్
బాంబుల మోత మధ్య సౌదీ సర్కారు శుభవార్త
దుస్తులు విప్పి చూపినా సెలవు ఇవ్వలేదు..!
బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!
మొయిన్ అలీపై నిషేధం..!
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న నాయకుడి పాలనలో ఉన్నాం!
దుబాయ్ దాటని బంగారం..
T20 WC 2026: బాబర్ ఆజం ఎందుకు?.. తొలి రాజీనామా
అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు
IND vs ENG: సెమీస్లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి!
ఒకప్పుడు క్లాస్ టాపర్..కానీ ఇవాళ..!
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం.. ఐసీసీ టోర్నీ వాయిదా
పావలా శ్యామలకు అల్లు అర్జున్ సాయం
T20 WC 2026: తిరగబడ్డ పాక్ క్రికెటర్లు!.. ఇక..
విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా
ఎక్కువ ఈఎంఐతో ఇల్లు కొంటున్నారా? ఎంత రిస్కో చూడండి..
నాకంటూ పెద్దగా ఆస్తుల్లేవ్.. అద్దింట్లో ఉంటున్నా: వరలక్ష్మి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. స్థిరాస్తి లాభం
జీపీఎస్ దారి తప్పింది
కాషాయ కండువా కప్పుకోనున్న వీరశివా !
యుద్ధ భయం.. బీమా ప్రీమియం ప్రియం
గీతం భూ దోపిడీపై చర్చించాల్సిందే: వైఎస్సార్సీపీ
కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
T20 WC 2026: ఇంగ్లండ్పై కీలక ప్రదర్శన.. చరిత్ర సృష్టించిన బుమ్రా
Hyderabad: కొండలు కరిగించేస్తున్నారు
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
ఇరాన్తో యుద్ధం.. ఇజ్రాయెల్కు వారానికి ఎంత నష్టమంటే..!
బందరులో బరితెగింపు..
బ్లాక్బస్టర్ 'గీత గోవిందం'ను మిస్ చేసుకున్నా: హీరోయిన్
బాంబుల మోత మధ్య సౌదీ సర్కారు శుభవార్త
దుస్తులు విప్పి చూపినా సెలవు ఇవ్వలేదు..!
బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!
మొయిన్ అలీపై నిషేధం..!
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న నాయకుడి పాలనలో ఉన్నాం!
దుబాయ్ దాటని బంగారం..
T20 WC 2026: బాబర్ ఆజం ఎందుకు?.. తొలి రాజీనామా
అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు
IND vs ENG: సెమీస్లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి!
ఒకప్పుడు క్లాస్ టాపర్..కానీ ఇవాళ..!
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం.. ఐసీసీ టోర్నీ వాయిదా
పావలా శ్యామలకు అల్లు అర్జున్ సాయం
T20 WC 2026: తిరగబడ్డ పాక్ క్రికెటర్లు!.. ఇక..
విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా
ఎక్కువ ఈఎంఐతో ఇల్లు కొంటున్నారా? ఎంత రిస్కో చూడండి..
నాకంటూ పెద్దగా ఆస్తుల్లేవ్.. అద్దింట్లో ఉంటున్నా: వరలక్ష్మి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. స్థిరాస్తి లాభం
ఫొటోలు
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష సందడి..ఫోటోలు వైరల్
నిజామాబాద్లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్ (ఫొటోలు)
నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
వైఎస్ జగన్ ప్రొద్దుటూరు పర్యటన (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా వివాహంలో క్రికెట్, సినీ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
భద్రాచలం : రామయ్య పెళ్లి పసుపు దంచి.. తలంబ్రాలు కలిపి పెళ్లి పనులు ప్రారంభం (ఫొటోలు)
విశాఖలో వైఎస్ జగన్.. పోటెత్తిన అంతులేని అభిమానం (ఫొటోలు)
విరోష్ జంట రిసెప్షన్లో ప్రముఖుల సందడి (ఫోటోలు)
సినిమా
విరోష్ జంట రిసెప్షన్లో కనిపించని ఆ టాలీవుడ్ స్టార్స్.. అదే కారణమా?
విజయ్- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ ప్రేమజంట ఉదయ్పూర్ వేదికగా ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సందడి చేశారు. ఆ తర్వాత పెళ్లి ఫోటోలను విజయ్, రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే పెళ్లి తర్వాత విరోష్ జోడీ టాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించింది. హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు యంగ్ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.స్టార్స్ డుమ్మా..అయితే కొందరు స్టార్స్ ఈ రిసెప్షన్ వేడుకకు డుమ్మా కొట్టడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ, రామ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, నితిన్, కిరణ్ అబ్బవరం ఈ రిసెప్షన్లో ఎక్కడా కూడా కనిపించలేదు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు పెద్దగా బాండింగ్ లేకపోవడం వల్లే రాదని తెలుస్తోంది. మరోవైపు హీరో నితిన్ అందుబాటులో లేనని కొత్త జంటకు ముందే చెప్పినట్లు సమాచారం.అదే కారణమా?కొందరు టాలీవుడ్ స్టార్స్ విరోష్ రిసెప్షన్కు హాజరు కాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విజయ్- రష్మిక స్వయంగా వెళ్లి ఆహ్వానించకోవపోవడమే కారణమని తెలుస్తోంది. పీఆర్ ఎజెన్సీ ద్వారా ఆహ్వానాలు పంపడం వల్లే కొందరు రాలేదని టాక్ వినిపిస్తోంది. పర్సనల్గా ఆహ్వానించలేదనే అసంతృప్తితోనే ఈ వేడుకలో పాల్గొనలేదని తెలుస్తోంది. ఏదేమైనా టాలీవుడ్ స్టార్స్ ఈ రిసెప్షన్కు రాకపోవడం సినీ ప్రియుల్లో చర్చకు దారితీసింది.
ఇంటికెళ్లి విరోష్ జంటను కలిసిన సీఎం
విరోష్ జంటను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు. హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను విజయ్ దేవరకొండ ట్విటర్లో షేర్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి ఆశీర్వదించడం మా హృదయాన్ని కదిలించిందని విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు. మాపై ఆయన చూపించే ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్- రష్మిక గతనెల 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. పెళ్లి తర్వాత ఈనెల 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్కు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. Heartfully touched that the Hon’ble Chief Minister of Telangana, Shri. @revanth_anumula garu, took the time to visit our home this evening and bless us on our wedding. Grateful for the love and affection he always shares 🙏 pic.twitter.com/QAbp9127ad— Vijay Deverakonda (@TheDeverakonda) March 5, 2026
మృత్యుంజయ్ని ఎంజాయ్ చేస్తారు: శ్రీ విష్ణు
‘‘మృత్యుంజయ్’ మూవీ ప్రీమియర్ షోకి వచ్చిన వారి స్పందన చూశాను. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు. రాజమౌళిగారి నుంచి మా సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయింది. ఎన్టీఆర్గారు ట్రైలర్ రిలీజ్ చేశారు. నానీగారు మా మూవీ చూసి, మెచ్చుకున్నారు. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని హీరో శ్రీ విష్ణు తెలిపారు.హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన చిత్రం ‘మృత్యుంజయ్’. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా చిత్రాన్ని ప్రదర్శించారు.అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో శ్రీ విష్ణుగారు రి΄ోర్టర్గా నటించారు. రెబా మోనికా పోలీస్ ఆఫీసర్గా చేశారు’’ అని చె΄్పారు. ‘‘ఈ మూవీ కోసం మా టీమ్ నిద్రలేని రాత్రులు గడిపి, పని చేసింది. సినిమా అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు సందీప్ గుణ్ణం. ‘‘ఈ సినిమా పట్ల మేం ఎంతో గర్వంగా ఉన్నాం’’ అన్నారు రెబా మోనికా జాన్. నటీనటులు మనీషా ఎ. దత్, రమ్య, సుదర్శన్, అయ్యప్ప శర్మ, రచ్చ రవి మాట్లాడారు.
లీడర్ ప్రతీకారం
శరవణన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘లీడర్’. పాయల్ రాజ్పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. లెజెండ్ శరవణ స్టోర్స్ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కానుంది.తాజాగా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘నా కూతురితో పాటే నేనుండాలి. దాని కోసం ఈ ప్రపంచాన్నే ఎదరించమన్నా ఎదిరించి గెలుస్తాను’ వంటి సంభాషణలు టీజర్లో ఉన్నాయి. ‘‘తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే శక్తివేల్ పాత్రలో శరవణన్ నటించారు. మాస్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆలరించేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది.
క్రీడలు
పరుగుల వరదతో ఫైనల్లోకి
భారత జట్టు స్కోరు 253 పరుగులు... ఇందులో 18 ఫోర్లు, 19 సిక్స్లు.. వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టూ కూడా ఇంత లక్ష్యాన్ని ఛేదించలేదు. ఇక గెలుపు లాంఛనమే, ఫైనల్ చేరడం ఖాయమనే అనిపించింది. కానీ ఇంగ్లండ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. భారీ స్కోరును చూసి బెదిరిపోకుండా ఆ జట్టు కూడా 21 ఫోర్లు, 15 సిక్స్లతో ఆఖరి వరకూ పోరాడింది... కానీ అదృష్టవశాత్తూ టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో చివరకు 7 పరుగులతో సూర్యకుమార్ బృందం గట్టెక్కింది. గత మ్యాచ్ తరహాలోనే సంజు సామ్సన్ మరో అద్భుత ఇన్నింగ్స్తో జట్టును నడిపించగా... ఇంగ్లండ్ తరఫున జాకబ్ బెతెల్ శతకం జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. చివర్లో కట్టుదిట్టమైన మన బౌలింగ్ భారత్ను ఫైనల్కు చేర్చింది. టి20 వరల్డ్ కప్ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచేందుకు ఇక ఒకే ఒక్క విజయం భారత్కు కావాలి. ఆదివారం ఆఖరి సమరంలో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోవడమే టీమిండియాకు మిగిలింది. ముంబై: టి20 వరల్డ్ కప్ను నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత జట్టు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. వరుసగా రెండోసారి మన టీమ్ తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం వాంఖెడే మైదానంలో హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్ సమరంలో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (42 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా... శివమ్ దూబే (25 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడిపోయింది. జాకబ్ బెతెల్ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీతో పోరాడినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఆదివారం అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. భారత్, కివీస్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. పోటీ పడి సిక్సర్లు బాది... ఓపెనర్ అభిషేక్ శర్మ (9) మరోసారి విఫలమైనా... సామ్సన్, ఇషాన్ భాగస్వామ్యంతో భారత్ దూసుకుపోయింది. ఆర్చర్ తొలి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సామ్సన్ అతని రెండో ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. మరోవైపు ఇషాన్ కూడా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 67 పరుగులకు చేరింది. డాసన్ ఓవర్లో భారీ సిక్స్తో 26 బంతుల్లో సామ్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, స్యామ్ కరన్ ఓవర్లో ఇద్దరూ కలిసి 20 పరుగులు రాబట్టారు. రెండో వికెట్కు 45 బంతుల్లో 97 పరుగులు జోడించిన తర్వాత ఎట్టకేలకు ఇషాన్ను రషీద్ అవుట్ చేశాడు. అయితే స్పిన్ను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహంతో బ్యాటింగ్లో ముందుగా దూబేను పంపిన భారత్ ఫలితం రాబట్టింది. రషీద్ ఓవర్లో 2 భారీ సిక్స్లతో అతను చెలరేగాడు. ఆ తర్వాత ఆర్చర్ ఓవర్లో మరో రెండు సిక్స్లు బాదిన సామ్సన్ మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. సూర్యకుమార్ (11) ఎక్కువసేపు నిలవలేకపోగా, ఒవర్టన్ ఓవర్లో హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మూడు ఫోర్లు కొట్టాడు. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ వర్మ (7 బంతుల్లో 21; 3 సిక్స్లు) ఏకంగా మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 20వ ఓవర్లో పాండ్యా మరో 2 సిక్స్లు కొట్టడంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో భారత్ 76 పరుగులు సాధించడం విశేషం. టాపార్డర్ విఫలం... భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే ఫిల్ సాల్ట్ (5) వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ (17 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (7), టామ్ బాంటన్ (17) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే బెతెల్ మాత్రం పోరాటపటిమ కనబర్చాడు. బుమ్రా బౌలింగ్లో సిక్స్ కొట్టిన అతను వరుణ్ చక్రవర్తి ఓవర్లో వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. పాండ్యా ఓవర్లోనూ అతను వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. మరోవైపు విల్ జాక్స్ (20 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా బెతెల్కు సహకరించాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 39 బంతుల్లో 77 పరుగులు జోడించారు. జాక్స్ అవుటైన తర్వాత స్యామ్ కరన్ (18)తో కలిసి గెలిపించేందుకు బెతెల్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆఖరి 5 ఓవర్లలో 69 పరుగులు చేయాల్సిన దశలో రెండు ఓవర్లు వేసిన బుమ్రా 14 పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న బెతెల్... శివమ్ దూబే వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఆశలు కోల్పోయింది. తర్వాతి ఐదు బంతుల్లో ఆర్చర్ (19 నాటౌట్) మూడు సిక్స్లు బాదినా లాభం లేకపోయింది. 17 ఓవర్ల వరకు ఇంగ్లండ్దే పైచేయి... దాదాపు అసాధ్యమైన లక్ష్యమే అయినా ఇంగ్లండ్ పూర్తిగా తడబడలేదు. వికెట్లు పడుతున్నా పరుగుల వేగం మాత్రం తగ్గించలేదు. ఇరు జట్ల ఇన్నింగ్స్లను పోలిస్తే 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్దే పైచేయిగా ఉంది. 10 ఓవర్లలో స్కోర్లు 119, 119తో సమంగా ఉండగా 15 ఓవర్లలో 177, 185తో ఇంగ్లండ్ ముందంజలో ఉంది. 17 ఓవర్లలో 205/4, 209/5తో వారిదే పైచేయి. అయితే చివరి 3 ఓవర్లు తేడా చూపించాయి. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ కొట్టిన 3 సిక్స్లు కీలకంగా మారాయి. దూబే వేసిన ఆఖరి ఓవర్లో 30 పరుగులు కాపాడుకోవాల్సి వచ్చింది కాబట్టి భారత్ బతికిపోయింది. మరికొన్ని పరుగులు తక్కువగా ఉన్నా కష్టమయ్యేది. సామ్సన్ క్యాచ్ వదిలేసి... గత మ్యాచ్ తరహాలో ఈసారి కూడా సామ్సన్ దూకుడైన బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. అయితే అతనికి ఈసారి అదృష్టం కూడా కలిసి వచ్చింది. సామ్సన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆర్చర్ బౌలింగ్లో మిడాన్ వద్ద కెప్టెన్ బ్రూక్ అతి సునాయాస క్యాచ్ వదిలేశాడు. దానికి ఇంగ్లండ్ ఫలితం అనుభవించింది. క్యాచ్ చేజారడమే కాదు, ఈ క్షణం బౌలింగ్, ఫీల్డింగ్లో ఇంగ్లండ్ లయను బాగా దెబ్బ తీసింది. అప్పటి వరకు పరిస్థితి నియంత్రణలోనే ఉన్నా ఆ తర్వాత భారత్ పరుగుల వరద మొదలైంది. ఈ క్యాచ్ను బ్రూక్ పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. లైఫ్ లభించిన తర్వాత సామ్సన్ 36 బంతుల్లో 74 పరుగులు బాదాడు. ఆ ఒక్క ఓవర్లోనే... భారత్ ఇన్నింగ్స్లో ఆటగాళ్లంతా ఏ బౌలర్ను వదలకుండా ప్రతీ ఓవర్లో బౌండరీలతో చెలరేగారు. అయితే జాక్స్ వేసిన ఒక్క 14వ ఓవర్ మాత్రమే దీనికి మినహాయింపు. ఈ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా 7 పరుగులే ఇచ్చిన జాక్స్ తొలి బంతికే సామ్సన్ వికెట్ తీశాడు. అక్షర్ అదరహో... మైదానంలో అక్షర్ పటేల్ ఫీల్డింగ్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా సులువైన క్యాచ్ అందుకొని సాల్ట్ వెనుదిరిగేందుకు కారణమైన అక్షర్ ఆ తర్వాత అసాధారణ క్యాచ్తో బ్రూక్ను వెనక్కి పంపాడు. బుమ్రా వేసిన తొలి బంతికే బ్రూక్ షాట్ ఆడగా బంతి ఫీల్డర్లపై నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. కానీ పాయింట్ నుంచి అక్షర్ వెనుదిరిగి చాలా దూరం పరుగెత్తాడు. బంతి కిందకు పడిపోతున్న దశలో చేతులూ పూర్తిగా చాపి అందుకున్న అతను నేలపై పడినా పట్టు కోల్పోలేదు. అనంతరం కీలక దశలో బౌండరీ వద్ద పరుగెడుతూ వచ్చి జాక్స్ క్యాచ్ను అందుకున్న అతను పట్టు కోల్పోయి బౌండరీ దాటుతున్నట్లు అనిపించిన సమయంలో దూబే వైపు విసిరాడు. ఈ క్యాచ్తో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గింది.5 టి20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్న ఐదో భారత క్రికెటర్ సంజు సామ్సన్. గతంలో యువరాజ్ సింగ్ (2007లో ఆ్రస్టేలియాపై సెమీఫైనల్లో), ఇర్ఫాన్ పఠాన్ (2007లో పాకిస్తాన్పై ఫైనల్లో), విరాట్ కోహ్లి (2014లో దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో; 2024లో దక్షిణాఫ్రికాపై ఫైనల్లో), అక్షర్ పటేల్ (2024లో ఇంగ్లండ్పై సెమీఫైనల్లో) ఈ ఘనత సాధించారు.4 ఐసీసీ టోర్నీల్లో అత్యధికంగా నాలుగోసారి భారత్–న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి.4 టి20 ప్రపంచకప్లో భారత్ నాలుగోసారి ఫైనల్కు చేరింది. 2007లో, 2024లో విజేతగా నిలిచిన భారత్ 2014లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది.105 టి20 వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా బెతెల్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఫిన్ అలెన్ (100 నాటౌట్) స్కోరును బెతెల్ రెండో సెమీఫైనల్లో అధిగమించాడు.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 89; అభిషేక్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 9; ఇషాన్ కిషన్ (సి) జాక్స్ (బి) రషీద్ 39; దూబే (రనౌట్) 43; సూర్యకుమార్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 11; పాండ్యా (రనౌట్) 27; తిలక్ (బి) ఆర్చర్ 21; అక్షర్ (నాటౌట్) 2; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–20, 2–117, 3–160, 4–190, 5–212, 6–236, 7–251. బౌలింగ్: ఆర్చర్ 4–0–61–1, జాక్స్ 4–0–40–2, ఒవర్టన్ 3–0–36–0, స్యామ్ కరన్ 4–0–53–0, ఆదిల్ రషీద్ 4–0–41–2, లియామ్ డాసన్ 1–0–19–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అక్షర్ (బి) పాండ్యా 5; బట్లర్ (బి) వరుణ్ 25; హ్యారీ బ్రూక్ (సి) అక్షర్ పటేల్ (బి) బుమ్రా 7; బెతెల్ (రనౌట్) 105; బాంటన్ (బి) అక్షర్ 17; జాక్స్ (సి) శివమ్ దూబే (బి) అర్ష్ దీప్ 35; స్యామ్ కరన్ (సి) తిలక్ వర్మ (బి) హార్దిక్ పాండ్యా 18; ఒవర్టన్ (నాటౌట్) 2; ఆర్చర్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 246. వికెట్ల పతనం: 1–13, 2–38, 3–64, 4–95, 5–172, 6–222, 7–225. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–51–1, హార్దిక్ పాండ్యా 4–0–38–2, జస్ప్రీత్ బుమ్రా 4–0–33–1, వరుణ్ 4–0–64–1, అక్షర్ పటేల్ 3–0–35–1, శివమ్ దూబే 1–0–22–0.
ఏకైక ‘టెస్టు’కు భారత్ రె‘ఢీ’
పెర్త్: ఆ్రస్టేలియా పర్యటనను టి20 సిరీస్ విజయంతో మొదలుపెట్టిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్ మొదలవడంతోనే కంగారు పడింది. అన్నీ ఓడి వైట్వాష్ అయ్యింది. ఇప్పుడు హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్కు మిగిలిందల్లా ఈ ‘టెస్టే’. నాలుగు రోజులపాటు జరిగే ఏకైక డే అండ్ నైట్ పింక్బాల్ టెస్టును గెలుచుకొని అత్యంత సంతృప్తికరంగా స్వదేశం చేరవచ్చు. ఓవరాల్ చాంపియన్షిప్లో ఇరు జట్లు చెరో సిరీస్ గెలుచుకున్నాయి. అయితే పాయింట్ల పరంగా చూస్తే భారత అమ్మాయిలు బాగా వెనుకబడి ఉన్నారు. పరిమిత ఓవర్ల మ్యాచ్ విజేతకు 2 పాయింట్లు లభించడంతో ఒక టి20, అన్నీ వన్డేలు గెలుపొందిన ఆ్రస్టేలియా 8 పాయింట్లతో పైచేయిగా ఉంది. రెండు టి20 విజయాలతో భారత్ ఖాతాలో 4 పాయింట్లే ఉన్నాయి. ఇప్పుడు టెస్టు గెలిస్తేనే 4 పాయింట్లు వస్తాయి. అప్పుడే భారత్ 8–8 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్షిప్ను పంచుకుంటుంది. ఒకవేళ ‘డ్రా’ చేసుకున్నా... ఆతిథ్య జట్టుకే ట్రోఫీ దక్కుతుంది. అజేయమే కానీ... ఇక్కడి వన్డే సిరీస్ను పక్కనబెడితే సంప్రదాయ ఫార్మాట్లో హర్మన్ బృందం అజేయంగా ఉంది. 2023 నుంచి ఇప్పటివరకు ఆడిన మూడు టెస్టుల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలపై వరుసగా గెలిచింది. అయితే ఈ మూడు సొంతగడ్డపై జరిగాయి. బ్యాటింగ్లో స్మృతి మంధాన ఫామ్లో ఉంది. ప్రతీకతో కలిసి చక్కని ఆరంభం ఇవ్వగలిగితే జెమీమా, హర్మన్, షఫాలీ వర్మ మిగతా బ్యాటింగ్ భారాన్ని పంచుకుంటారు. దీప్తి, రిచా ఘోష్లు కూడా ఆతిథ్య బౌలింగ్ను దీటుగా ఎదుర్కొంటే బ్యాటింగ్లో ఏ బెంగా ఉండదు. బౌలింగే మెరుగు పడాల్సి ఉంది. క్రాంతి, స్నేహ్ రాణా, సయాలీ, కాశీ్వలు సమష్టిగా రాణించాలి. ఆత్మవిశ్వాసంతో ఆసీస్ ఓడినా, గెలిచినా... సొంతగడ్డపై ఆ్రస్టేలియా దుర్బేధ్యమైన ప్రత్యర్థి. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఇప్పటివరకు జరిగిన మూడు ‘పింక్ బాల్’ టెస్టులు ఇక్కడే జరిగాయి. డేనైట్ టెస్టులో ఈ జట్టుకున్నంత అనుభవం ఇంకే జట్టుకు లేదు. ఫోబీ లిచ్ఫీల్డ్, జార్జియా వోల్, ఎలీస్ పెరీ, కెప్టెన్ అలీసా హీలీ సొంతగడ్డపై తప్పకుండా రాణిస్తారు. తాలియా, ల్యూసీ హామిల్టన్, అలనా కింగ్, డార్సీ బ్రౌన్లతో కూడిన బౌలింగ్ దళమైతే మనకంటే ఎంతో మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్ తర్వాత అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్న అలీసా హీలీకి గెలుపు బహుమతి అందించాలని ఆసీస్ బృందం భావిస్తోంది. పిచ్, వాతావరణం ఇది పోటాపోటీ పిచ్. నాణ్యమైన బౌలింగ్కు... పాతుకుపోతే బ్యాటింగ్కు సమాన అవకాశముంది. దేశవాళీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో సీజన్ అంతా అదే జరిగింది. పచ్చికతో తొలిరోజు బౌలింగ్కు బాగా అనుకూలించడంతో బ్యాటర్లకు కష్టాలు తప్పవు. పిచ్ పాతబడే కొద్దీ స్పిన్నర్లు మాయ చేస్తారు. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, ప్రతీక, షఫాలీ, జెమీమా, దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్జోత్/సయాలీ, కాశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్. ఆ్రస్టేలియా: అలీసా హీలీ (కెప్టెన్ ), ఫోబీ లిచ్ఫీల్డ్, జార్జియా వోల్, ఎలీస్ పెరీ, అనాబెల్ సదర్లాండ్, బెత్ మూనీ, యాష్లీ గార్డ్నర్, తాలియా, అలానా కింగ్, ల్యూసీ హామిల్టన్, డార్సీ బ్రౌన్.
ఘనంగా అర్జున్ టెండూల్కర్ వివాహం
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ఒక ఇంటి వాడయ్యాడు. 26 ఏళ్ల అర్జున్ వివాహం గురువారం సానియా చందోక్తో ఘనంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన దేశంలోని ప్రముఖులంతా ఈ పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుటుంబం, భారత మాజీ క్రికెటర్లు ధోని, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, కైఫ్, జహీర్ ఖాన్, ఐసీసీ చైర్మన్ జై షా, సినీ తారలు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ తదితరులంతా అతిథులుగా పెళ్లిలో పాల్గొన్నారు. ఆల్రౌండర్ అర్జున్ దేశవాళీ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 77 మ్యాచ్లు ఆడాడు.
క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత నంబర్వన్ లక్ష్య సేన్ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ షి యుకీ (చైనా)ను బోల్తా కొట్టించిన లక్ష్య సేన్... ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 29వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 81 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–19, 21–23, 21–10తో గెలుపొందాడు. గతంలో లాంగ్ అంగుస్తో ఆడిన మూడుసార్లూ ఓడిపోయిన లక్ష్య సేన్ నాలుగో ప్రయత్నంలో విజయం అందుకోవడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)తో ఆడతాడు. టాంగ్ చున్ మన్–సె యింగ్ సుయెట్ (హాంకాంగ్)లతో జరిగిన మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో తొలి గేమ్ను 19–21తో కోల్పోయారు. రెండో గేమ్లో 8–9తో వెనుకబడిన దశలో భారత జోడీ గాయంతో వైదొలిగింది.
న్యూస్ పాడ్కాస్ట్
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్. సెమీస్లో 7 పరుగులతో ఇంగ్లండ్పై గెలుపు
హాజరైన సెలబ్రిటీలు... విరోష్ రిసెప్షన్ కు
‘లడ్డూ’పై బాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. శాసన మండలిలో చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు
స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెద్ది
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలపై ఆటవిక దాడి... మహిళా దినోత్సవ వేళ చంద్రబాబు మార్కు గిఫ్ట్
తీవ్రరూపం దాలుస్తున్న పశ్చిమాసియా యుద్ధం... ఇరాన్కు అండగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు...
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. కుటుంబ సభ్యులతోపాటు ఆర్మీ చీఫ్ ముసావీ కూడా మృతి... క్షిపణి దాడుల్లో హత్య చేసిన ఇజ్రాయెల్
భగ్గుమన్న పశ్చిమాసియా... ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు... భారీగా ప్రతిదాడులకు దిగిన ఇరాన్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు క్లీన్చిట్... కవిత, సిసోడియా సహా 23 మందీ నిర్దోషులే... ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
తిరుమల లడ్డూ ప్రసాదం, రాయలసీమ లిఫ్ట్పై ఏపీ శాసన మండలిలో చర్చించకుండా పలాయనం చిత్తగంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం
బిజినెస్
సెన్కో గోల్డ్ నుంచి షేప్ ఆఫ్ యూ ఏఐ అప్లికేషన్
కోల్కతా: ఆభరణాల ఎంపికలో కస్టమర్లకు మరింత సహాయకరంగా ఉండేలా షేప్ ఆఫ్ యూ పేరిట ఏఐ ఫీచర్, అప్లికేషన్ని ప్రవేశపెట్టినట్లు సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వెల్లడించింది. ఇది తమ అన్ని షోరూమ్లతో పాటు సెన్కో యాప్లో కూడా అందుబాటులో ఉంటుందని సంస్థ డైరెక్టర్ జోయితా సేన్ తెలిపారు. కస్టమర్లు తమ ముఖాకృతికి తగ్గట్లుగా ఉంటూ, తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఆభరణాలను ఎంపిక చేసుకునేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు మహిళా దినోత్సవం సందర్భంగా 10 గ్రా. పసిడి ఆభరణాలపై రూ. 3,000, అలాగే డైమండ్ ఆభరణాల మేకింగ్ చార్జీల్లో 75% వరకు, డైమండ్ విలువలో 15% వరకు, సిల్వర్ ఐటమ్ల మేకింగ్ చార్జీలపై 15% వరకు డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. అటు, ఆన్లైన్కి సంబంధించి మార్చి 8న (ఒక్కరోజు మాత్రమే) గోల్డ్, డైమండ్, ప్లాటినం జ్యుయలరీ మేకింగ్ చార్జీలపై 100 శాతం మినహాయింపు ఉంటుందని పేర్కొంది.
హైస్పీడ్లో వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: జీఎస్టీ క్రమబదీ్ధకరణ నేపథ్యంలో వాహన విక్రయాల జోరు ఫిబ్రవరిలోనూ కొనసాగింది. గత నెల మొత్తం వాహనాల రిటైల్ విక్రయాలు 26 శాతం పెరిగి 24,09,362 యూనిట్లకు చేరినట్లు డీలర్ల సమాఖ్య ఫాడా ఒక ప్రకటనలో వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో 19,17,934 యూనిట్లు అమ్ముడైనట్లు పేర్కొంది. దాదాపు అన్ని విభాగాల్లోనూ అమ్మకాల జోరు కొనసాగినట్లు వివరించింది. ఆరింట అయి దు కేటగిరీల్లో (టూవీలర్లు, త్రీ–వీలర్లు, ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాలు, ట్రాక్ట ర్లు) ఫిబ్రవరిలో అత్యధికంగా రిటైల్ సేల్స్ నమోదైనట్లు ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. మార్కెట్లో పటిష్టమైన డిమాండ్ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీ క్రమబదీ్ధకరణతో రేట్లు తగ్గడం, పెళ్లిళ్ల సీజన్, కొత్త మోడల్స్ రాకతో బుకింగ్స్ మెరుగ్గా ఉండటంలాంటివి పరిశ్రమకు సానుకూలంగా నిల్చినట్లు వివరించారు. పంట దిగుబడులు బాగుండి గ్రామీణ ప్రాంతాల్లో నగదు లభ్యత మెరుగుపడటం, ఆకర్షణీయమైన మార్కెటింగ్ స్కీములు కలిసి వచి్చనట్లు డీలర్లు చెప్పారు. ఇతర విశేషాలు.. → టూవీలర్లు 25%, త్రిచక్ర వాహనాలు 24%, ప్యాసింజర్ వాహనాలు 26%, కమర్షియల్ వాహనాలు 29% అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయి. → ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 3,13,015 యూనిట్ల నుంచి 3,94,768 యూనిట్లకు పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో 21 శాతం, గ్రామీణ మార్కెట్లలో 34 శాతం వృద్ధి నమోదైంది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు, యుటిలిటీ వాహనాలే ఓవరాల్గా ఈ విభాగానికి దన్నుగా నిలుస్తున్నప్పటికీ, చిన్న కార్లకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ నెలకొనడం సానుకూలాంశం. → టూవీలర్ విక్రయాలు 13,60,155 యూనిట్ల నుంచి 17,00,505 యూనిట్లకు పెరిగాయి. → వాణిజ్య వాహనాల విభాగంలో అమ్మకాలు 78,219 యూనిట్ల నుంచి 1,00,820 యూనిట్లకు పెరిగాయి. → త్రీ–వీలర్ సేల్స్ 1,17,130.. ట్రాక్టర్ల అమ్మకాలు 89,418 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఎగుమతులకు సర్చార్జీల మోత
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధంతో దేశీయంగా ఎగుమతిదారులకు షిప్పింగ్ సర్చార్జ్ల రూపంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులను సాకుగా చూపి షిప్పింగ్ కంపెనీలు అదనంగా డిమాండ్ చేస్తున్నాయి. ఎక్కువకాలం నిల్వ ఉండని ఉత్పత్తులను మోసుకెళ్లే 40 అడుగుల కంటైనర్లపై అదనంగా రూ. 4,000 మేర కంటింజెన్సీ సర్చార్జీలు ఇవ్వాలంటున్నాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడి చేయడానికి ముందే కొన్ని కన్సైన్మెంట్లు గమ్యస్థానాలకు చేరినప్పటికీ, సరుకును రిలీజ్ చేయాలంటే అదనంగా చెల్లించాల్సిందేనని షిప్పింగ్ కంపెనీలు పట్టుబట్టి కూర్చున్నాయని వివరించారు. ‘ఫిబ్రవరి 28న యుద్ధం మొదలు కావడానికి ముందే పశ్చిమాసియాలోని పోర్టులకు నౌకలు చేరుకున్నాయి. కానీ అధిక సర్చార్జీలు ఇవ్వాలంటూ, షిప్పింగ్ సంస్థలు డెలివరీ చేయడం లేదు. ఈ భారాన్ని ఎవరు భరించాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యను కేంద్ర వాణిజ్య శాఖ దృష్టికి తీసుకెళ్లాం‘ అని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. భారత్లో ఇంకా లోడ్ కాని వాటిపై చార్జీలు విధిస్తే అర్థం చేసుకోవచ్చు గానీ ఇప్పటికే గమ్యస్థానాలకు చేరిన వాటిపై కూడా విధించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. భారత ఎగుమతులపై భౌగోళికరాజకీయ పరిణామాల ప్రభావాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అంతర్ మంత్రిత్వ శాఖల బృందాన్ని ఏర్పాటు చేసింది. 2024–25 లో పశ్చిమాసియా దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు 58.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కన్సైన్మెంట్స్ నిలిపివేత .. ఓవైపు అదనపు సర్చార్జీలతోనే సతమతమవుతుంటే మరోవైపు, పశ్చిమాసియా దేశాలకు కన్సైన్మెంట్స్ను తీసుకోవడాన్ని షిప్పింగ్ సంస్థలు నిలిపివేయడం ఎగుమతిదారులకు ఇంకో సమస్యగా మారింది. నౌకలు నిల్చిపోయి కంటైనర్ల కొరత ఏర్పడటంతో సముద్ర మార్గంలో రవాణా వ్యయాలు 50 శాతం ఎగిసినట్లు ఎగుమతిదారులు చెప్పారు. అటు విమానాల ద్వారా రవాణా పెరిగినప్పటికీ ఇది ఖరీదైన వ్యవహారంగా ఉంటోంది. కోల్కతా నుంచి పశ్చిమాసియాకు వెళ్లే కొన్ని ఎయిర్లైన్స్ సరుకు రవాణా చార్జీలను కేజీకి రూ. 175 నుంచి రూ. 425కి పెంచేశాయని సహాయ్ తెలిపారు. ఈ సవాళ్ల వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో దేశీ ఉత్పత్తుల ధరలు పెరిగిపోయి, మన పోటీ సామర్థ్యాలకు ప్రతికూలంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
మార్చి 2నుంచి భారతదేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి ఇంకొంత తగ్గుముఖం పెట్టింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనయ్యాయి. ఈ కథనంలో తాజా ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,49,900 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,49,300 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,63,530 రూపాయల నుంచి రూ. 1,62,880 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,50,050 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 1,49,450 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,63,680 రూపాయల వద్ద నుంచి రూ. 1,63,030 వద్దకు చేరింది.ఇక చెన్నైలో మాత్రం.. గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 151200 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 164950 వద్దనే ఉన్నాయి.ఇదీ చదవండి: ఇంటర్ చదివి.. రూ.300 కోట్ల బిజినెస్!
ఫ్యామిలీ
రంగుల లోకపు రాణులు
భారతీయ కళా ప్రపంచంలో ప్రత్యేకంగా కనిపించే, విస్తృతంగా గుర్తింపు పొందిన లక్షణం ఏమిటంటే అత్యంత ప్రభావవంతమైన గ్యాలరీ నిర్వాహకులు, క్యురేటర్లు, కళా పరిరక్షకులలో అనేకమంది మహిళలే కావడం! భారతదేశంలోని అనేక రంగాలు ఇప్పటికీ పురుషాధిక్యంగా ఉన్నప్పటికీ, ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లోని సమకాలీన కళా వేదికలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నా సమానత్వానికి ప్రతీకలుగా నిలుస్తూ ఈ వేదికలను మహిళలు ముందుండి నడిపిస్తున్నారు. కళకు నా పరిచయం అమృతా షేర్–గిల్ చిత్రాలతో చిన్నప్పుడే మొదలైంది. కాలక్రమేణా ఆమె గురించి నా అవగాహన మారింది. విద్యార్థిగా ఆమెను ఆధునిక భారతీయ చిత్రకళలో మార్గదర్శిగా చూశాను. కానీ క్యురేటర్గా చూస్తే, ఆమె మన దృక్కోణాన్ని మార్చిన వ్యక్తి. భారతీయ మహిళలకు ఒక అంతరంగాన్ని, సజీవమైన ఉనికిని ఇచ్చిన కళాకారిణి. ఆ మార్పు నేను చిత్రకళను అర్థం చేసుకునే విధానాన్ని ప్రభావితం చేసింది. అక్కడి నుంచి ఈ పరంపర విస్తరిస్తోంది.స్త్రీ వాదం... జీవన పోరాటంమాటలకందని భావాలను, సమాజంలో జరుగుతున్న విషయాలను, రాజకీయ పరిణామాలను తనదైన శైలిలో చిత్రీకరిస్తారు అర్పితాసింగ్. నళిని మలాని పౌరాణిక కథలను, చరిత్రను, హింసను, స్త్రీవాద సమస్యలను, జీవన పోరాటాలను ‘న్యూ–మీడియా‘ ద్వారా చూపిన తొలి కళాకారిణి. మృణాలిని ముఖర్జీ సాధారణమైన అల్లిక పద్ధతికి కొత్త కోణాన్ని జోడించి వాటితో ఫైబర్ శిల్పాలను సృష్టించి, తన కళాఖండాలకు విభిన్నమైన స్థాయిని కల్పించారు. ఛాయాచిత్రాల ద్వారా గత స్మృతులు కవితాత్మకంగా ఉండవచ్చని, సేకరణ పద్ధతి కూడా స్వయంగా ఒక కళారూపమని షీబా ఛాచ్ఛి మనకు తెలియజేశారు.కళాసేవకులునేను క్యురేటోరియల్ విభాగంలోకి అడుగుపెట్టిన తరువాతే మహిళలు కేవలం కళాఖండాలను మాత్రమే కాదు, కళా వ్యవస్థలనే మలిచారని నాకు అర్థమైంది. ‘ఖోజ్’ అనే ఒక కళా–సేవా సంస్థను, వస్తువులు అమ్మే అంగడిలా కాక – సంభాషణ, ప్రయోగాల వేదికగా, వర్ధమాన కళాకారుల మేలు కోసం పూజ సూద్ మరికొంతమందితో కలిసి స్థాపించారు. వస్త్రాలు, వస్తుసంస్కృతిపై అన్నపూర్ణ గరిమెళ్ల చేసిన పరిశోధన చిత్రకళకూ హస్తకళలకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, హెచ్చుతగ్గులనూ తొలగించడంలో కీలకంగా మారింది. మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళా కళాకారులు, కేవలం కళా సృష్టిలోలోనే కాదు, బోధనలో, సంస్థల నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారు, స్వాతంత్య్ర సమరంతో పాటు సాంస్కృతిక రంగంలో కృషి చేసిన సంగం లక్ష్మీబాయి నుంచి ఆంధ్ర ఆధునిక చిత్రకళలో తనదైన శైలి చాటుకున్న దామెర్ల సత్యవాణి వరకు తరతరాల కళాకారులను తీర్చిదిద్దిన కవితా దేవుస్కర్, అంజని రెడ్డివంటి వారి నుంచి నిశ్శబ్దంగా ‘సంస్కృతి స్కూల్ ఆఫ్ ఆర్ట్’ను లాభాపేక్షలేని వేదికగా నిలబెడుతున్న ‘ప్రింట్ మేకర్’ పద్మారెడ్డి వరకు, జేఎన్ ఏఎఫ్ఏయూ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడిన నిర్మల బిలుకా నుంచి, విద్యావేత్తగా నిబద్ధతతో పనిచేస్తున్న ప్రీతి సంయుక్త వరకు, వీరందరి కృషి ఎంతోమంది చిత్రకళా విద్యార్థులను కళాకారులుగా తీర్చిదిద్దారు. అలాగే, గౌరి వేముల, ప్రియాంక ఏలే వంటి కళాకారిణులు హైదరాబాద్ చిత్రకళా స్వరాన్ని జాతీయ వేదికలపై వినిపించారు.మహిళగా ఎన్నో సవాళ్లుఎదుగుతున్న మహిళా గ్యాలరిస్ట్గా నాకు సవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నమ్మకాన్ని కాపాడుకోవడం, నిధులు సమకూర్చడం, సారూప్య భావనలు కలవారితో చర్చలు జరపడం, అందరికీ పరస్పరం ఉపయోగపడే వ్యవస్థను అలుపెరుగక నిర్మించడం లాంటివి. భారతీయ చిత్రకళలో మహిళలు చూపిన దారులు మనకెంతో ధైర్యాన్నిస్తాయి. వసతులపై ఆధారపడకుండానే వారు సంస్థలను నిర్మించారు. అంగడి లేకుండానే వ్యవస్థను సృష్టించారు. సాంస్కృతిక వేదికలు పట్టుదలతో, సహకారంతో నిర్మితమవుతాయని తెలుసుకున్నాను. ్రపాంతీయతతో ముడిపడిన దళిత, ఆదివాసీ మహిళల స్వరాల వైవిధ్యం నన్ను ఎప్పటికీ ఉత్తేజ పరుస్తుంది. ఈ మహిళా కళాకారులు ప్రకృతి, జ్ఞాపకాలు, శ్రమ ఆధారంగా సమకాలీన భారతీయ చిత్ర–హస్తకళలను పునర్నిర్మిస్తున్నారు. వారి శైలికి తగ్గట్టు, నిదానంగానూ, సహకారాత్మకంగానూ పనిచేసే క్యురేటోరియల్ విధానాలను కోరుకుంటారు; జ్ఞానమనేది కేవలం సంస్థలకే పరిమితం కాదని, వాటి బయట కూడా ఎంతో విజ్ఞానం ఉందని గుర్తుచేస్తున్నారు.ఆ పునాది పైనే!శాంతి స్వరూపిణి (శిల్పి) వరుణికా సరాఫ్ వంటి కళాకారులెందరో జాతీయ కళా వేదికపై తమదైన ముద్ర వేశారు. వీరందరి సమష్టికృషి, ఓర్పుతో, నిర్మితమైన పునాది పైనే మనమందరం నిలబడ్డాం. వీరు ‘బోధన, సృజన, సంస్థ నిర్మాణం’ అనే మూడు రంగాలపై దృష్టి సారించారు. తాత ముత్తాతల నుండి వచ్చిన స్మృతులు, కథల ద్వారా తెలుసుకున్న విషయాలను కళా రంగంలోకి వీరు తీసుకువచ్చారు. వారు పాటించిన పద్ధతులను పరిశోధించడం వలన నా ఆలోచనా విధానం కూడా ప్రభావితమయ్యింది. ప్రదర్శనలు కేవలం యాంత్రికంగా జరిగేవి కావు! అవి పరిశోధనతోనూ, బోధనతోనూ, ప్రజలతోనూ అనుసంధానాన్ని కలిగిన ప్రక్రియలు. ఆ ప్రదేశంలోకి ఎవరు వస్తున్నారు? మనం ఏ భాషలో మాట్లాడుతున్నాం? మొదటిసారి చూసే వారికి ఇది ‘తమదే’ అన్న భావన ఎలా కలిగించాలి? ఈ ప్రశ్నలే మహిళల నేతృత్వంలోని సాంస్కృతిక కృషిలో ముఖ్యమైనవి. – అన్నపూర్ణ ఎం.ఇండిపెండెంట్ ఆర్ట్ క్యూరేటర్, ఆర్టిస్ట్, ఫౌండర్, డైరెక్టర్– ఏక్చిత్రా ఆర్ట్గ్యాలరీ, హైదరాబాద్ ఆర్ట్ షో, కో–ఫౌండర్ఆ సంభాషణలే నా తొలి జ్ఞాపకంగ్యాలరీలోకి అడుగుపెట్టక ముందే చిత్రకళ గురించిన కథలు వింటూ పెరిగాను. మా నాన్నగారు ఎర్రమిల్లి రోహిణీ కుమార్ గారు చిత్రకారులవటం చేత, ఆయనకు తెలిసిన చిత్రకారుల గురించి మాట్లాడినప్పుడు, దగ్గరి బంధువుల గురించి చెప్తున్నారేమో అని అనిపించేది. రావాల్సినంత గుర్తింపు రాకపోయినా, సృజనాత్మక వేదికలను నిలబెట్టిన మహిళల గురించి నేను విన్న ఆ సంభాషణలే నా తొలి జ్ఞాపకం. వారు కేవలం చిత్రాలను గీయడంతో ఆగలేదు, శిల్పాలు మాత్రమే చెక్కి ఊరుకోలేదు. కళను ఎలా పరిశీలించాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్నలకు కార్యరూపం ఇచ్చారు. ఇప్పుడు నేనొక క్యురేటర్గా, ఎదుగుతున్న గ్యాలరిస్ట్గా వాటి గురించి ఆలోచిస్తుంటాను. భారతీయ కళలలో మహిళల పాత్ర అనేది కొత్తగా చేర్చాల్సిన విషయం కాదు, అది ఎప్పటినుంచో అంతర్లీనంగా ఉన్నదే.
ముళ్లున్న చోటే పూలు
కుటుంబం సవ్యంగా సాగుతున్నప్పుడు మధ్యలో అనుకోకుండా ఎదురయ్యే కుదుపులు సమస్యలను సృష్టిస్తాయి. వాటినుంచి బయటపడడంలోనే మన జీవన పోరాటం దాగి ఉంటుంది. నల్గొండ జిల్లా దుగ్గపల్లికి చెందిన కర్ర శశికళ జీవితంలోనూ ఇదే జరిగింది. రెండు దశాబ్దాల క్రితం భర్త ఆకస్మిక మరణంతో ఆమెను శూన్యం ఆవరించింది. కానీ, సమస్యకు ఎదురొడ్డి తను కష్టాల నుంచి బయటపడటమే కాదు, తన చుట్టూ ఉన్నవారికి ఉపాధి అవకాశాలనూ కల్పించింది. ఈ సందర్భంగా శశికళతో మాట్లాడినప్పుడు ఆమె పంచుకున్న విశేషాలు ఇవి.‘‘మనం ఒకటి అనుకుంటాం. కానీ, విధి మరొకటి తలుస్తుంది అంటారు. అందుకు నా జీవితమే ఉదాహరణ అనిపిస్తుంది. నాకు పల్లెటూరు, పొలాలు కన్నా పట్టణ జీవితం అంటేనే ఇష్టం ఉండేది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా పెళ్లయ్యింది. మా వారు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. ఇద్దరం మిర్యాలగూడ టౌన్లో ఉండేవాళ్లం. మాకు ఒక బాబు. పెళ్లయ్యాక పీజీ, తర్వాత బీఇడీ చేశాను. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి సమయంలో మా వారు వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో ఊరికి వెళ్లిపోదాం అన్నారు. కానీ, పల్లెటూరుకు వెళ్లడం నాకు అస్సలు ఇష్టం లేదు. దీంతో కొంతమంది స్నేహితులతో కలిసి వ్యాపారం మొదలుపెట్టారు. అందులో పెద్ద నష్టం. అప్పుల్లో కూరుకుపోయాం. ఇది చాలదన్నట్టు ఆయన ఆరోగ్యం క్షీణించింది. పరీక్షలు చేయిస్తే గుండె సంబంధిత వ్యాధి అని తేలింది. ఆసుపత్రులు, చెకప్లు అంటూ తిరుగుతుండగానే ఆయన వెళ్లిపోయారు. పూర్తిగా డిప్రెషన్ ఆవరించింది. ఆరునెలలైనా మామూలు మనిషిని కాలేకపోయాను. చనిపోదాం అనుకున్నాను. అలాంటి సమయంలో అమ్మనాన్నలు, తోడబుట్టినవాళ్లు అండగా నిలిచారు.నచ్చని వ్యవసాయాన్నే ఎంచుకున్నాను..నా భర్త కల వ్యవసాయం చేయాలని. కానీ, అప్పటికి మాకు ఆస్తి ఎంత ఉందో, అంతకుమించి అప్పు ఉంది. ఏం చేయాలా అనుకుంటున్న సమయంలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ‘ఉన్న ఆస్తులు అమ్మేసి అప్పు తీర్చేసి, ఉద్యోగం చేసుకుంటూ బతుకుదామా..’ అని ఆలోచించాను. కానీ, ఉద్యోగాన్నే వదులుకున్నాను. నా భర్త కల నెరవేరాలంటే వ్యవసాయమే సరైనది అనుకున్నాను. ఆ రంగంలో ఓనమాలు కూడా తెలియవు. ప్రతీది నేర్చుకుంటూ, రాణిస్తున్నాను. అగ్రికల్చర్ లోను తీసుకొని, వ్యవసాయం మొదలుపెట్టాను. వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చడం ఎలా.. అని చాలా ఆలోచించేదాన్ని. మూడు వేల రూపాయలతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారుచేసి, బత్తాయి తోటను కాపాడే ప్రయత్నం చేశాను. మంచి రిజల్ట్ వచ్చింది. కొద్ది కొద్దిగా అప్పులు తీరుస్తూ వచ్చాను. ఈ రంగంలో ఇంకా ఏమైనా చేయవచ్చా అనే ఆలోచనలు చేసినప్పుడు నర్సరీ నాకు సరైన ఎంపిక అనిపించింది.నర్సరీ ఆలోచన మేలు చేసింది.. నర్సరీలలో మొక్కల పెంపకానికి చేపడుతున్న చాలా మంది ఉత్తమమైన దిగుబడులు సాధిస్తున్నారు. ఆ వైపుగా ఆలోచించాను. నర్సరీ ఏర్పాటు చేసి, చుట్టుపక్కల ఊళ్లలో రైతులకు నాణ్యమైన మొక్కలు అందించాలనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే ఉన్న పొలంలోనే నర్సరీ ఏర్పాటు చేశాను. ఈ నర్సరీలో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, అన్ని రకాల డెకార్కు సంబంధించిన మొక్కలను పెంచుతున్నాను. దీంతో పాటు తోటలకు సంబంధించిన మామిడి, బత్తాయి, జామ, నిమ్మ మొక్కలు సైతం ఆర్డర్లపై అందిస్తున్నాను. వీటికి తోడు గోవులను పెంచుతూ, వాటి ఉత్పత్తులను పంటలకు వాడుతున్నాను. కొన్నాళ్లకు మా వారి పేరు మీదుగా శ్రీ సాయి మాధవ గో సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాను. ఈ పని నాకు చాలా మెరుగైన ఫలితాలను ఇచ్చింది. మొదట్లో ఊళ్లో అందరూ నా వెనక మాట్లాడుకున్నవారే ఇప్పుడు వ్యవసాయంలో సలహాలు, సూచనలు అడుగుతుంటారు. హార్టీ కల్చర్ షోలలోనూ పాల్గొంటుంటాను. నర్సరీ, వ్యవసాయానికి ఉపయోగించే ఆర్గానిక్ ఉత్పత్తులనూ సప్లై చేస్తుంటాను. ఈ రంగంలో ఉత్తమ మహిళా రైతు అవార్డులూ అందుకున్నాను. మా అబ్బాయిని పై చదువులకోసం విదేశాలకు పంపగలిగాను. మహిళ శక్తి ఆమెకు మొదట తెలియదు. కానీ, తలుచుకుందంటే చేసి చూపగలదు. ఆ ధైర్యం, తెగువ ఆమెలో స్వాభావికంగానే ఉంటాయి’ అని వివరించింది శశికళ. ఇన్నేళ్లుగా వ్యవసాయం రంగంలో ఉన్నాను. కానీ, ఇప్పటికీ ప్రతిరోజూ ప్రకృతితో పోరాటమే. ఎప్పుడే సమస్య వస్తుందో తెలియదు. తెల్లవారకముందే నా పనులు మొదలవుతాయి. ఒకప్పుడు ఎంతమాత్రం ఇష్టం లేని పనే ఇప్పుడు నాకు ప్రాణమైంది. పచ్చని మొక్కలు, గోవులు నా ఆత్మీయ నేస్తాలు అయ్యాయి. ప్రకృతికి ఎంత ఎక్కువగా దగ్గరవ్వగలను.. అనేదే ప్రతీక్షణం ఆలోచిస్తాను. అదే ఈ రోజు నన్ను ఇలా మార్చింది అనుకుంటాను. – కర్ర శశికళ, సేంద్రియ వ్యవసాయ రైతు– నాతి రమేష్, సాక్షి, త్రిపురారం, నల్లగొండ జిల్లా
శాంతిలాంటి వాళ్లు ఎందరో..! ఏం జరిగినా..టెన్షన్గా పనికి వచ్చేయాలి..
మార్చి నెల అనగానే మహిళా దినోత్సవం అని ఠక్కున గుర్తొస్తుంది. ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉండే..అంతగా గుర్తించని శక్తిమంతమైన మహిళలు ఎందరో ఉన్నారు. ఒక్కోక్కరిని కదిలిస్తే వాళ్ల కన్నీళ్లు ఇంకిపోయేలా పడుతున్న బాధలు, వేదనలు తెలుస్తాయి. అయినా వాటన్నింటిని పంటి బిగువున పెట్టి..పనులకు వచ్చేస్తుంటారు. ఏం కాదు, ఏం జరగలేదు అన్నట్లుగా చకచక పనులు చేసుకుపోయే ఆ మహిళామూర్తుల జీవితాలు ఎందరికో ఆదర్శం..స్త్రీ శక్తికి నిదర్శనం. అలాంటి నారీమణే ఈ శాంతి. ఎవరీమె అంటే..ఆమె నాలుగిళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ.. బతుకు బండిని లాగిస్తుంటుంది. ఆమెకు ఇంట్లో ఎంత కష్టం ఎదురైనా..తప్పక పనికి టెన్షన్గా వచ్చేయాల్సిందే. ఆమె అవసరం కష్టాలు అలాంటివి. భర్త ఓ ప్రవేటు కంపెనీలో ఉద్యోగి. కొండంత ఆశలతో కుటుంబంతో సహా మహాగనగరానికి వస్తే..దేవుడి స్క్రిప్ట్ మరోలా రాసిపెట్టి ఉందామెకు. ఆమెకు ఇద్దరు పిల్లలు, కొడుకు ఆంటిజం బాధితుడు, కాగా కూతురు ఇటీవలే పదినెలల క్రితం అనుహ్యంగా ఓ ప్రమాదంలో చనిపోయింది. కూతురు చనిపోయినా కనీసం రెండు వారాల కూడా ఇంట్లో కూర్చోకుండా పనులకు వెళ్లిపోయేది. ఎందుకంటే..కొడుకు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఇంట్లో కూర్చొంటే కష్టం. గుండెల్ని పిండేసే బాధ అయినా సరే మౌనంగా పనికి రాకపోతే..నెల వచ్చేటప్పడికీ తడిసిమోపిడి అవుతాయి ఖర్చులు. ఎందుకంటే కొడుకు తన పనులు తానుచేసుకోగలగాలి, తనే కాళ్లపై నడవగలగాలి అదే శాంతి ఆకాంక్ష. అందుకోసం ట్రీట్మెంట్ తప్పనిసరి. అతని చికిత్స సెషన్కు రూ. 13000 ఖర్చు అవుతుంది. భర్త సంపాదనలో ఎనిమిదివేలు నేరుగా ఇంటి అద్దెకు వెళ్లిపోతాయి. మిగతా డబ్బులు అతడి స్కూల్ఫీజ్, ఆహారానికి, ట్రీట్మెంట్ ఖర్చు అయిపోతుంది. ఇక్కడ శాంతి హాయిగా పనులకు వెళ్లే వెసులుబాటు కూడా లేదామెకు. ఎందుకంటే కొడుకుకి అన్నం తినిపించడం దగ్గర నుంచి అన్ని తానే చూసుకోవాలి. ఆమె ఉదయం స్కూల్లో కొడుకుని దించడం నుంచి మొదలవుతుంది ఆమె రోజు. ఆ తర్వాత పనికోసం ఇళ్లకు వెళ్లి..మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేయడానికి ఇంటికి వెళ్లి..3 గంటల కల్లా కొడుకుని స్కూల్ నుంచి తీసుకువస్తుంది. ఆ తర్వాత మళ్లీ పనికోసం ఇళ్లకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా చేరుకుంటుంది. అయితే ఆ చుట్టుపక్కల వాళ్లే కాస్తచేదుడువాదోడుగా ఉంటారు. ఆమె పనికి వెళ్లినప్పుడు కొడుకు బాగోగులు వాళ్లు చూసుకుంటారు. కానీ ఇంత కష్టాన్ని, భారాన్ని మోస్తున్నా..అవేమి ఆమె కళ్లల్లో కనిపించదు, కనీసం కన్నీటి చారను బయటకు కనపడనివ్వకుండా..చకచక పనులు చేసుకుంటూ పోతున్నా ధీశాలి ఈ శాంతి. ఒక్కసారి తరచి చూస్తే ఇలాంటి శాంతి లెందరో మన సమాజంలో ఉన్నారు. వాళ్లందరికీ జోహార్లు..ఎందుకంటే పిల్లలను కోల్పోయి..మరోవైపు కుటుంబ కోసం ఆహర్నిశలు కొవ్వుత్తిలా కరిగిపోతూ..ఇంటికి వెలుగుని పంచే ఇలాంటి మహిళామణులే అసలైన హీరోలు. ఇక్కడ ఈ శాంతి ఇవేమి కోరుకోవడం లేదు, కేవలం తన కొడుకు బాగైతే చాలు.. అదొక్కటే ఆమెను అచంచలంగా నడిపిస్తోంది. (చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!)
ఆరోగ్యం.. ఒక డైనమిక్ ప్రయాణం
స్త్రీల జీవితంలో నెలసరి మొదలైనప్పటి నుంచి, నెలసరి ఆగిపోయే వరకు, ఆ తరువాత తీసుకోవాల్సిన ఆరోగ్య రక్షణ చర్యలు, సమస్యలు, వాటి పరిష్కారాల గురించి...ప్రతి స్త్రీ జీవితంలో టీనేజ్, పునరుత్పాదక వయస్సు, మెనోపాజ్ అనే ముఖ్యమైన మూడు దశలుంటాయి. ఈ మూడు దశల్లో హార్మోన్ మార్పులు, శారీరక మార్పులు ఎక్కువ. అందుకే వీటిని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.టీనేజ్ దశలో...యుక్తవయస్సులో నెలసరి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మొదటి నెలసరి వచ్చినప్పుడే పరిశుభ్రత గురించి తెలియజెప్పాలి. శుభ్రమైన ప్యాడ్లు వాడాలి. ప్రతి నాలుగు గంటలకు మార్చాలి. వేడినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి. శరీరంలో జరిగే మార్పులను అంగీకరించేలా కౌన్సెలింగ్ అవసరం. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పాఠశాలల్లో లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా వేయించాలి. సాధారణంగా 11 నుంచి 19 సంవత్సరాల మధ్య నెలసరి సరిగా రాకపోవడం సాధారణ విషయమే. ఆ తర్వాత హార్మోన్లు సర్దుబాటుతో 18 నుంచి 19 సంవత్సరాల నాటికి నెలసరి క్రమబద్ధంగా మారుతుంది. బరువు పెరగడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. వ్యాయామం, సరైన ఆహారం, బరువు నియంత్రణ అవసరం. అవసరమైతే థైరాయిడ్ పరీక్ష చేస్తారు. అధిక రక్తస్రావం ఉన్నవారికి రక్తహీనత రాకుండా విటమిన్లు ఇస్తారు. అల్ట్రాసౌండ్ ద్వారా గడ్డలు లేదా సిస్టులు ఉన్నాయా పరిశీలిస్తారు. కొన్నిసార్లు విటమిన్లు మాత్రమే సరి΄ోతాయి.పునరుత్పాదక వయస్సులో...20 నుంచి 40 సంవత్సరాల మధ్య దశలో వివాహం, గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సంరక్షణ ముఖ్యమైనవి. వివాహం ప్లాన్ చేసుకునే ముందు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా టీకాలు వేయించుకోక΄ోతే రుబెల్లా, చికెన్ఫాక్స్, హెచ్పీవీ టీకాలు వేయించుకోవాలి. పాప్ స్మియర్ పరీక్ష, లైంగిక వ్యాధుల రక్తపరీక్షలు చేయించుకోవాలి. గర్భధారణ ప్లానింగ్కు ముందు థైరాయిడ్, బీపీ, షుగర్, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నాయో లేవో చూసుకోవాలి. కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. నెలసరి తరువాత స్తనాన్ని స్వయంగా పరీక్షించుకోవాలి. స్తనంలో గడ్డ, నొప్పి, నిపల్ నుంచి స్రావం, ఇతర మార్పులు ఉంటే వైద్యుని సంప్రదించాలి.40 సంవత్సరాల తరువాత చాలామందికి మూత్రంలో మంట, నొప్పి, జ్వరం కనిపిస్తాయి. రోజుకు 3 నుంచి 3.5 లీటర్లు నీరు తాగాలి. పరిశుభ్రత పాటించాలి. మలబద్ధకం లేకుండా పండ్లు, కూరగాయలు తినాలి. యోని లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సరిగా చికిత్స చేయక΄ోతే గర్భాశయానికి వ్యాపించి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి వస్తుంది. దీనిని స్కాన్ , రక్తపరీక్షల ద్వారా గుర్తించి చికిత్స చేస్తారు.మెనోపాజ్ దశలో...నెలసరి ఒక సంవత్సరం పాటు రాకపోతే సహజ మెనోపాజ్ అంటారు. ఈ దశలో హార్మోన్ మార్పుల వల్ల వేడి ఆవిర్లు, చిరాకు, దిగులు, నిద్రలేమి వస్తాయి. కాఫీ, మసాలా పదార్థాలు తగ్గించాలి. ప్రాణాయామం, యోగా, ధ్యానం చేయాలి.ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఎముకల బలహీనత పెరుగుతుంది. ΄ోషకాహారం తీసుకోవాలి. చర్మం, యోని పొడిబారడం ఉంటుంది. అవసరమైతే లూబ్రికెంట్లు, మాయిశ్చరైజర్లు వాడాలి. కొందరికి హార్మోన్ చికిత్స అవసరం పడుతుంది. బీపీ, షుగర్, గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. పాప్ స్మియర్, మామోగ్రఫీని డాక్టర్ సూచన మేరకు కొనసాగించాలి.మహిళల ఆరోగ్యం వయస్సు మార్పులు, హార్మోన్ మార్పులు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు పరీక్షలు, అవగాహన, సరైన జీవనశైలి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. (చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!)
అంతర్జాతీయం
అణ్వాయుధ ప్రోగ్రామ్.. అమెరికాకు ఇరాన్ కండీషన్..!
అణు కార్యక్రమాన్ని వదులుకుంటున్నట్లు వస్తున్న కథనాలపై ఇరాన్ స్పందించింది. తమకు సంతృప్తికర ప్రత్యామ్నాయ ఆఫర్ ఇస్తేనే.. అణ్వాయుధ ప్రోగ్రామ్ను ఆపేస్తామంటూ అమెరికాకు ఇరాన్ షరతు విధించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మజిద్ తఖ్త్-రవాంచి ఈ ప్రకటన చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని ఐఆర్ఎన్ఏ (IRNA) వార్తా సంస్థ వెల్లడించింది.ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు హెచ్చరికను మరోసారి పునరావృతం చేశారు. ఇరాన్పై దాడి చేయాలనే నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. పిచ్చివాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పుడు, ఇలాంటి చెడు విషయాలు జరుగుతాయంటూ మండిపడ్డారు. ఇరాన్పై ఇంకా ఆపరేషన్ ముగియలేదన్నారు.మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకర రూపు దాలుస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా నిప్పుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్లో ఇప్పటివరకు 1230 మంది మృతి చెందారు. ఇవాళ(మార్చి 5, గురువారం) ఒమన్ పోర్టుపై ఇరాన్ దాడి చేసింది. ఇద్దరు భారతీయులు అశిష్కుమార్, దిలీప్ సింగ్ మృతిచెందారు.ఇప్పటిదాకా ఇరాన్కు చెందిన 17 యుద్ధ నౌకలను పేల్చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్లో 2,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్టు అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ చీఫ్, నేవీ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ‘‘వందలాది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను నాశనం చేశాం. ఇరాన్ ఇప్పటిదాకా 500కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, 2,000కు పైగా డ్రోన్లు ప్రయోగించింది’’అని తెలిపారు.
'100 గంటల ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' : అమెరికా సంచలన ఫుటేజ్
ఇరాన్పై అమెరికా - ఇజ్రాయెల్ భీకర యుద్ధం 6వ రోజుకు చేరుకుంటుండగా, గురువారం అమెరికా '100 గంటల ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) పేరుతో మొదటి 100 గంటలకు సంబంధించిన యుద్ధ దృశ్యాలను అమెరికా సెంట్రల్ కమాండ్ గురువారం విడుదల చేసింది.ఇరాన్లోని సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న ప్రారంభమై, భారీ దాడులను కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్తో సమన్వయంతో ఇరాన్పై తన దాడులకు అమెరికా సైన్యం 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' అని పేరు పెట్టింది.అత్యంత శక్తివంతమైన ఆపరేషన్ : అమెరికా-ఇజ్రాయెల్ ద్వయం ఇరాన్లోని టెహ్రాన్ తదితర నగరాల్లో భారీ దాడులు చేపట్టింది. దాడులు మొదలు పెట్టిన తొలిరోజే ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీని మట్టు బెట్టినట్టు సమాచారం. ఇవి చరిత్రలో అత్యంత ప్రాణాంతకమైన, అత్యంత సంక్లిష్టమైన ,అత్యంత ఖచ్చితమైన వైమానిక ఆపరేషన్గా అమెరికా అభివర్ణించింది.గత అర్థ శతాబ్ద కాలంగా అమెరికన్లకు ముప్పుగా పరిణమించిన ఇరాన్ సామర్థ్యాన్ని తుడిచిపెట్టడమే దీని ఉద్దేశమని పేర్కొంది. అయితే ఈ దాడులను తీవ్రంగా ప్రతిఘటించిన ఇరాన్ పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేస్తోంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్యఈ ఆపరేషన్లో, అమెరికన్ దళాలు అనేక అధునాతన విమానాలు, ఆయుధ వ్యవస్థలను మోహరించాయి. అత్యాధునిక ఆయుధ సంపత్తిని వాడింది. వీటిల్లో B-2 స్టెల్త్ బాంబర్లు & F-35 ఫైటర్లు ఉన్నాయి. ఇవి శత్రు రాడార్లకు చిక్కకుండా లోపలికి చొచ్చుకుపోయి దాడి చేయగల సామర్థ్యం వీటి సొంతం. ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించి నాశనం చేయడానికి రూపొందించిన అధునాతన అమెరికన్ యాంటీ-బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD) కూడా అమెరికన్ దళాలు ఉపయోగించాయి. ఇదీ చదవండి: రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్అంతేకాదు ఈ యుద్ధంలో మొదటిసారిగా LUCAS (Low-cost Unmanned Combat Attack System) అనే సరికొత్త డ్రోన్లను అమెరికా ప్రయోగించింది. ఇవి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో వాడిన ఇరాన్ 'షాహెద్ 136' డ్రోన్ల నమూనాలో రూపొందించినవి.నిఘా ,ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడానికి MQ-9 రీపర్ డ్రోన్లను వినియోగించింది. ఈ ఆపరేషన్కు సంబంధించి విడుదలైన వీడియోలో "మేము ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదు... కానీ ప్రెసిడెంట్ ట్రంప్ నాయకత్వంలో మేము దీనిని ముగిస్తున్నాము" అని ఒక స్వరం, అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన దూకుడును సూచిస్తోంది. "100 Hours" of Operation Epic Fury. pic.twitter.com/XW5ZnRAJJL— U.S. Central Command (@CENTCOM) March 4, 2026
Strait of Hormuz: ఆ దేశాలకు ఇరాన్ వార్నింగ్
అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతిచ్చే దేశాలకు ఇరాన్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. సైనిక, వాణిజ్య నౌక్లను గల్ఫ్లోకి వెళ్లనివ్వమన్న ఇరాన్.. యూఎస్, ఇజ్రాయెల్కు మద్దతిచ్చే దేశాల నౌకలు కనిపిస్తే పేల్చేస్తామంటూ హెచ్చరించింది. హర్మూజ్ జలసంధిపై నియంత్రణ హక్కు మాదేనంటూ ఇరాన్ తేల్చి చెప్పింది.హర్మూజ్ జలసంధి విషయంలో కీలక ప్రకటన చేసిన ఇరాన్.. జలసంధిని నియంత్రించే అధికారం మాకుందని పేర్కొంది. మరోవైపు, అన్ని దేశాలకు చమురు నిలిపివేయడం లేదన్న ఇరాన్.. యూఎస్, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు నో ఎంట్రీ అంటూ స్పష్టం చేసింది. దీంతో ఇరాన్ ప్రకటనతో భారత్ సహా పలు దేశాలకు ఊరట లభించినట్లైంది.కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత నౌకలు పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్తోపాటు పరిసర సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హొర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీటిలో కొన్ని నౌకల్లో ముడి చమురు, సహజ వాయువు ఉన్నాయి. అవి భారత ఓడరేవులకు చేరుకోవాల్సి ఉంది.మరికొన్ని నౌకలు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేయడానికి గల్ఫ్ దేశాలకు ప్రయణిస్తుండగా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. భారత ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్’గల్ఫ్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. నౌకల్లో చిక్కుకుపోయిన భారతీయ సిబ్బందికి సహాయం అందించడానికి కేంద్ర షిప్పింగ్ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
మూడోసారి.. ప్రయోగించిన 69 సెకన్లకే పేలిపోయిన జపాన్ రాకెట్
టోక్యో: జపాన్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ వన్ మరోసారి ఘోరంగా విఫలమైంది. ఆ సంస్థకు చెందిన కైరోస్ నం.3 రాకెట్ ప్రయోగించిన 69 సెకన్ల తర్వాత గాల్లోనే పేలిపోయింది. ఇలా జరగడం వరుసగా మూడోసారి. ప్రైవేటు రంగంలో అంతరిక్ష రంగాన్ని విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్న జపాన్కు ఇది గట్టి ఎదురుదెబ్బ.కైరోస్ రాకెట్ ఘన ఇంధనంతో పని చేస్తుంది. దాని ఎత్తు 18 మీటర్లు. పశ్చిమ జపాన్లోని స్పేస్పోర్ట్ కీ అనే ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని ఇవాళ ఉదయం 7:40 గంటలకు జరిపారు.రాకెట్ నిర్వహణ బాధ్యత జపాన్ సంస్థ స్పేస్ వన్ది. ఇందులో 5 ప్రయోగాత్మక ఉపగ్రహాలు ఉన్నాయి. టోక్యోకు చెందిన ఆర్క్ ఎడ్జ్ స్పేస్ సంస్థ తయారు చేసిన పరికరాలు, తైవాన్ అంతరిక్ష సంస్థ ఉపగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి. రాకెట్ విజయవంతంగా ఎగిరినప్పటికీ కొద్ది సమయంలోనే పేలిపోయింది. అందువల్ల కక్ష్యలోకి చేరుకోలేకపోయింది. ప్రయోగం ప్రారంభమైన కొద్దిసేపటికే రాకెట్ అస్థిర మార్గంలో వెళ్లినట్లు కనిపించింది. అనంతరం పసిఫిక్ మహాసముద్రం పైభాగంలో 29 కిలోమీటర్ల ఎత్తులో దాని ప్రయాణం ఆటోమేటిక్గా ముగిసింది.స్పేస్ వన్ ఉపాధ్యక్షుడు నోబుహిరో సెకినో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రయోగం ప్రారంభించిన సమయంలో, రాకెట్ పరికరాల్లో తమకేమీ లోపాలు కనిపించలేదని తెలిపారు. అయితే, ఆటోనొమస్ టెర్మినేషన్ సిస్టమ్ వ్యవస్థలో లోపం జరిగి ఉండవచ్చని చెప్పారు.వరుసగా మూడో వైఫల్యంస్పేస్ వన్ కైరోస్ రాకెట్కు ఇది వరుసగా మూడో వైఫల్యం. ఇదే రాకెట్ 2024లో జరిగిన రెండు ప్రయోగాల్లో కూడా విఫలమైంది. స్పేస్ వన్ సంస్థ జపాన్ కంపెనీల సంయుక్త ప్రాజెక్టులను కొనసాగిస్తుంది. ఆప్టికల్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ కానన్, ఏరోస్పేస్ సంస్థ ఐహెచ్ఐ, నిర్మాణ సంస్థ షిమిజు వంటి కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి.గత ఏడాది జపాన్ మొత్తం 3 రాకెట్ ప్రయోగాలు మాత్రమే చేసింది. 2030 నుంచి ప్రతి సంవత్సరం 30 ప్రయోగాలు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే, ఆ దిశగా విజయాలు సాధించడం లేదు.రక్షణ అవసరాలు పెరుగుతున్న పరిస్థితి, చైనా అంతరిక్ష ప్రోగ్రాం వేగంగా విస్తరించటం కారణంగా జపాన్పై ఒత్తిడి పెరిగింది. దేశీయంగా రాకెట్లు అభివృద్ధి చేసి అమెరికా రాకెట్లపై ఆధారపడడాన్ని తగ్గించాలని జపాన్ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే స్పేస్ వన్ సహా దేశీయ రాకెట్ స్టార్టప్ సంస్థలకు మిలియన్ డాలర్ల సబ్సిడీలు ఇచ్చింది. ఇప్పటివరకు జపాన్లో ఏ ప్రైవేట్ సంస్థ కూడా వాణిజ్య రాకెట్ ద్వారా ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా చేయలేకపోయింది. తదుపరి ప్రయోగం ఎప్పుడు జరుగుతుందో స్పేస్ వన్ ఇంకా ప్రకటించలేదు. 🚨BREAKING! Japan's SpaceOne KAIROS Rocket Launch Ends In Failure🚨Space One’s KAIROS No. 3 rocket suffered an anomaly during first stage flight following liftoff on March 5, 2026 at 11:10 a.m. local time from the Kii Spaceport in Japan.According to the company, the vehicle… pic.twitter.com/UFrYMJ0rhg— The Launch Pad (@TLPN_Official) March 5, 2026🚨🇯🇵JAPANESE STARTUP SPACE ONE FACES SECOND ROCKET FAILURESpace One's Kairos No. 2 rocket failed midflight, marking its second consecutive setback. After a successful first-stage separation, the rocket was "discontinued" 20 minutes post-launch. The payload included satellites… pic.twitter.com/M0dsKNHMbm— Info Room (@InfoR00M) December 18, 2024
జాతీయం
రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్
చెన్నై: తమిళ స్టార్ హీరో ,టీవీకే అధినేత విజయ్ దళపతి భార్య సంగీత సోర్నలింగంతో సెటిల్మెంట్కు రెడీ అవుతున్నారా? 27 ఏళ్ల వివాహ జీవితం తర్వాత తన భర్త నుండి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారన్న వార్త అటు సినీ అభిమానుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది. ముఖ్యంగా తన భర్త విజయ్కు నటితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా విడాకులు కోరుతున్నట్టు పేర్కొనడం మరింత దిగ్బ్రాంతి రేపింది.తాజాగా విజయ్ దళపతి కేసును పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.రూ. 250 కోట్ల భరణం ఆఫర్తాజా నివేదిక ప్రకారం, విజయ్ దళపతి ఈ విషయాన్ని కోర్టులో పరిష్కరించుకోవాలని ఆలోచిస్తున్నారు. తమిళనాట తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకుంటున్న విజయ్ తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం రాకుండా ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలో సంగీతతో విడాకుల వివాదాన్ని కోర్టు బయటే చక్కదిద్దుకునే పనిలో విజయ్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సామరస్య పరిష్కారం కోసం భార్యతో దీని గురించి పలు చర్చలు మొదలు పెట్టారట. తన భార్యకు రూ. 250 కోట్ల భరణం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. సంగీత, ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషాలకు ఈ సెటిల్మెంట్ మొత్తం చెల్లించాల్సి ఉంది. విజయ్ తన కుటుంబ గౌరవాన్ని కాపాడే నిమిత్తం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని కోరుకుంటున్నాడట. ఇరు పక్షాలు పరస్పర ఒప్పందం కుదుర్చుకుంటే విడాకుల పిటిషన్ ఉపసంహరించు కోనుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్కు విడాకుల నోటీసులువిజయ్-సంగీత వైవాహిక జీవితంవిజయ్ సంగీతను మొదటిసారి 1996లో కలిశాడు. ఆమె శ్రీలంక హిందూ, బ్రిటన్లో పెరిగింది. అప్పటికే స్టార్హీరోగా పేరుతెచ్చుకున్న విజయ్కి సంగీత పెద్ద అభిమాని. ఆమె UKలోని తన ఇంటిని వదిలి చెన్నైలో తన అభిమానిని కలవడానికి వచ్చేసింది. అది ప్రేమకు దారి తీసింది. చివరకు ప్రత్యేక వివాహ చట్టం కింద వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. గత 27 ఏళ్లుగా అన్యోన్య కాపురం తరువాత సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. సంగీత విడాకుల పిటిషన్ కాపీ ప్రకారం, విజయ్ దళపతి వివాహేతర సంబంధం ఉన్న నటితో విదేశాల్లో చక్కర్లు కొట్టాడనీ, అలాగే ఆ నటి తన సోషల్ మీడియా హ్యాండిల్లో తమ విహారయాత్ర చిత్రాలను షేర్ చేస్తూనే ఉందని ఆమె పిటిషన్లో పేర్కొంది. ఇది తనకు తన పిల్లలకు తీవ్ర బాధ కలిగించిందని కూడా ఆమె పేర్కొంది. అంతేకాదు ఈ వివాదం తరువాత విజయ్ కుమారుడు సోషల్మీడియాలో ఆయనను అన్ఫాలో చేయడం కూడా వార్తల్లో నిలిచింది.ఇదీ చదవండి: మూడు రోజులు ఫ్రీ ఫుడ్ : పోటెత్తిన జనం
లొంగుబాటలో గణపతి..! కుమారుడి ఆడియో వైరల్
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయేందకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులతో టచ్లోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే నేపాల్ నుంచి గణపతి ఢిల్లీకి చేరినట్లు తెలుస్తోంది. వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గణపతి సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు సైతం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గణపతి కుమారుడు విడుదల చేసిన భావోద్వేగ ఆడియో వైరల్గా మారింది.ఆడియోలో గణపతి కుమారుడు ఏమన్నారంటే..‘‘తండ్రి ప్రేమను తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి. తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా "నాన్నా" అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని "నాన్నా" అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను. అనాలోచితంగా కానీ, అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది. ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో పన్నెండు రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి, మీ బంధాల్లో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనే అంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు...మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండి ఉండవచ్చు. నాన్నా! నా చిన్నతనం నుంచే మిమ్మల్ని చూడాలని, మీతో గడపాలని, నా కష్టసుఖాలు మీతో పంచుకోవాలని, మీ అండలో ఎదగాలని ఉండేది. మీ కోసం నా మనసు పడే ఆరాటం, నాలో ఉండే నా ఆవేదనతో నా కన్నులు ఎన్ని దిక్కులు చూసినా మీరు కనపడరు. నా హృదయ ఘోష మీకు వినపడదు. ప్రతీ కుటుంబపు చిరునవ్వు వెనుక కనబడని ఒక గొప్ప మనసున్న తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానే అయి పెంచింది నన్ను కన్న తల్లి. అమ్మా! నీకు వందనం. నాన్నా! మీ వివాహం తర్వాత అమ్మతో మీరు గడిపిన మధుర క్షణాలను అప్పుడప్పుడూ తన గుండె చప్పుడుగా నాతో పంచుకునేది...ఈ జీవితానికి ఆ మధుర క్షణాలు చాలు అనుకుంటూ బరువెక్కిన హృదయంతో ఓ నిట్టూర్పు విడిచేది. మన బంధువులు కూడా మీరు మనసున్న మనిషి అని, మితభాషి అని, అమ్మతో అన్యోన్యంగా ఉండేవారని అంటూ ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయం మీ ఇద్దరి జీవితాలను జీవితకాలానికి ఎడబాటు చేసింది. మీరెంచుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ అజ్ఞాత జీవితం ప్రారంభించాక అమ్మ ఎన్ని సంవత్సరాలు తన కన్నీటితో ఎన్ని మెత్తాలు తడిసిపోయాయో ఎవ్వరికీ తెలియదు. ఏ బట్ట కట్టిందో, ఏ తిండి తిన్నదో కూడా ఎవ్వరికీ తెలియదు. సమాజాన్ని ఎదురు పడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది...నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అమ్మ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నాన్నా! మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దీర్ఘకాలిక పోరాటం చేయడం అంటే అది ఆత్మార్పణే. విప్లవం అంటే కష్టనష్టాలతో కూడుకున్న దారి. ఎన్నో త్యాగాలు, ఎంతో మంది యోధుల వీరమరణాలు. ఎందరో తమ తల్లిదండ్రులను, తమ కుటుంబాన్ని వదిలి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ, ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే అది అసామాన్యమే.ఒకప్పటి పరిస్థితులతో పోల్చితే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉంది. సమాజ అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు. కానీ నేటితరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు. కానీ ఇది నా అభిలాష’’ అంటూ గణపతి కుమారుడు ఎమోషనల్గా మాట్లాడారు.
మూడు రోజులు ఫ్రీ ఫుడ్ : పోటెత్తిన జనం
బెంగళూరుకు చెందిన ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) ముంబై నగరంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన తొలి అవుట్లెట్ని ముంబైలోని ఈరోస్, చర్చ్గేట్లో మార్చి 2న ప్రారంభించింది ఈ సందర్భంగా ముంబై వాసుల కోసం కేఫ్ యాజమాన్యం ఒక అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది.రామేశ్వరం కేఫ్ పట్ల ఉన్న క్రేజ్తో ముంబై ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.ముంబైలో తన అరంగేట్రాన్ని పురస్కరించుకుని, రామేశ్వరం కేఫ్ నాలుగు రోజుల పాటు ఉచిత ఫుడ్ అంటూ ఇన్స్టాలో ప్రకటించింది. మార్చి 2 నుండి మార్చి 5వ తేదీవరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉచిత ఫుడ్ అందివ్వనున్నట్టు ప్రకటించారు. రుచికరమైన భోజనాన్ని ఉచితంగా ఆస్వాదించేందుకు వందలాదిమంది బారులు తీరారు. సూర్యాస్తమయం దాటిన తర్వాత కూడా ప్రజలు తమ వంతు కోసం ఓపికగా ఎదురుచూడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడిగా మారాయి.ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య Hehe…for that 1 FREE dish 😄😄😄@RameshwaramCafe u really need this & those social influencers? Really? pic.twitter.com/ro6pquBCYU— Neeta Kolhatkar (@neetakolhatkar) March 3, 2026 రామేశ్వరం కేఫ్రామేశ్వరం కేఫ్ రామేశ్వరం కేఫ్ను 2021లో బెంగళూరులో భార్యాభర్తల ద్వయం రాఘవేంద్రరావు , దివ్య రాఘవేంద్రరావు స్థాపించారు. సాంప్రదాయ వంటకాలతో ప్రజాదరణ పొందింది. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మస్థలానికి నివాళిగా, దక్షిణ భారత రుచులను , వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ కేఫ్కు "రామేశ్వరం" అని పేరు పెట్టారు. View this post on Instagram A post shared by SANJAY | The Travel Freak 🇮🇳 (@sanjay_thetravelfreak)
శబరిమలలో ‘మహిళలకు ప్రవేశం’ కేసు.. టీడీబీ ఆఫీస్ నుంచి ఫైళ్లు మాయం
తిరువనంతపురం: శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసు ఫైళ్లు.. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రధాన కార్యాలయం నుంచి మాయమైనట్లు సమాచారం. ఇటీవల సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించడానికి సిద్ధమవుతున్న సమయంలో అధికారులు పాత ఫైళ్ల కోసం వెతికిన వేళ ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు పత్రాల కాపీలు కూడా అందుబాటులో లేవని తెలియడంతో టీడీబీ అధ్యక్షుడు కె.జయకుమార్, బోర్డు ఇతర సభ్యులు షాక్ అయ్యారని తెలుస్తోంది. ఆయా రికార్డులు ఏమయ్యాయో తమకు తెలియదని అధికారులు తెలిపారు. కాగా, 2007లో శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించవచ్చని వీఎస్ అచ్యుతానందన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తమ వైఖరిని తెలిపింది.ఆ తర్వాత 2016లో ఊమెన్ చాందీ ప్రభుత్వం, ప్రయార్ గోపాలకృష్ణన్ నేతృత్వంలోని దేవస్వం బోర్డు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేశాయి. 2016 నవంబర్లో పినరయి విజయన్ ప్రభుత్వం మహిళల ఆలయ ప్రవేశానికి మద్దతు ఇస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఆ సమయంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రత్యేక అఫిడవిట్ సమర్పించలేదు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
అమెరికాలోని కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి ఉదంతం విషాదాంతమైంది. తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభ్యమైంది. పోలీసులు అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.అతని మృతదేహాన్నివీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యంత క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి, ప్రియమైనవారికి తమ హృదయపూర్వక సానుభూతిని తెలియ జేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.Consulate General of India in San Francisco is deeply concerned about the disappearance of Saketh Sreenivasaiah, an Indian post-graduate student of UC Berkeley, hailing from the State of Karnataka. The Consulate is in touch with the family and also is in contact with the…— India in San Francisco (@CGISFO) February 14, 2026 కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు.మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. తమ కొడుకు ఎలాగైనా క్షేమంగా తిరిగి వస్తాడని ఎదురు చూసిన కుటుంబీకుల్లో శ్రీనివాసయ్య మరణవార్త తీరని విషాదాన్ని మిగిల్చింది.
అమెరికాలో కర్నాటక విద్యార్థి అదృశ్యం
న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోరి్నయాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా పోయారు. కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) అమెరికాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్కిలీలో కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ పీజీ చేస్తున్నాడు. మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. సాకేత్ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆచూకీ కనుగొనే విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కర్నాటకలోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని శనివారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి సాకేత్ కనిపించకుండాపోయాడంటూ అతడి రూమ్మేట్ బనీత్ సింగ్ ఈ నెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని చోట్లా వాకబు చేసిన తను ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపినట్లు బనీత్ తెలిపాడు. ప్రభుత్వానికి సాకేత్ తండ్రి వినతి అమెరికాలో గల్లంతైన తమ కుమారుడిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందజేసినట్లు తండ్రి శ్రీనివాసయ్య తెలిపారు. చివరిసారిగా తమ కుమారుడితో ఈ నెల 9వ తేదీన ఫోన్లో మాట్లాడామన్నారు. 12వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ అతడి రూమ్మేట్ తమకు తెలిపాడన్నారు. కుమారుడి కోసం అమెరికా వెళ్లే విషయమై తాము ఆలోచిస్తున్నామన్నారు. సాకేత్ విషయంలో కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్ అధికారులు అక్కడి పోలీసులతో మాట్లాడాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కర్నాటక ప్రభుత్వం శనివారం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది.
అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం
అమెరికాలోని సియాటిల్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన గ్రాడ్యుయేట్ జాహ్నవి కందులకుటుంబానికి భారీ పరిహారం లభించనుంది. జాహ్నవి మృతి చెందిన దాదాపు మూడేళ్ల తర్వాత, ఆమె కుటుంబానికి గణనీయమైన ఆర్థిక పరిహారం అందనుంది.ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిది ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోటి కలలతో సియాటెల్లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు 2021లో అమెరికాకు వెళ్లింది.కానీ 2023, జనవరి 23వ తేదీ రాత్రి ఒక మలుపు దగ్గర రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని, కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏముంది మామూలు మనిషేగా...11 వేల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మరిచిపోయాడు. అతని మాటలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.మరోవైపు సియాటిల్లో ప్రమాదం, తమ బిడ్డ మృతిపై జాహ్నవి కుటుంబం దావా వేసింది. ఈ సంఘటన తెలుగు, భారతీయ వర్గాల నుండి మాత్రమే కాకుండా, స్థానికులు కూడా ప్రజల ఆగ్రహాన్ని వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో భారీ పరిహారంతో ఈ కేసును పరిష్కరించు కుంది. సియాటిల్ నగరం దాదాపు రూ. 262 కోట్ల (28 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి ఎటువంటి నేరారోపణలు లేకుండా, 5000 డాలర్లు జరిమానా విధించారు. అలాగే విధుల నుండి గత ఏడాది సస్పెండ్ చేశారు. సియాటెల్ ప్రకటనకందుల మరణం "హృదయ విదారకం" అని సియాటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె నష్టం ఊహించలేని బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు మరియు మా సమాజానికి కూడా జాహ్నవి కందుల జీవితం చాలా ముఖ్యమైనదే అంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని నగరం ఆ శాభావాన్ని వ్యక్తం చేసింది. కందుల దుర్మరణం జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ (ICS)తో సహా న్యాయవాద సంఘాలు విస్తృత పోలీసు సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి. 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ పోలీసు అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరికాదని, స్పష్టమైన మార్గదర్శకాలను డిమాండ్ చేస్తున్నామని IACS లలితా ఉప్పల అన్నారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!
విదేశాలకు వెళ్లడం అక్కడే స్థిరపడటం చాలామంది డ్రీమ్. 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా విదేశాల్లోని అక్కడి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం రా..రమ్మని ఆకర్షిస్తుంటుంది. తీరా వెళ్లాక గానీ తెలియదు. అక్కడి సమస్యలు..పరిస్థితులు. ఇక్కడొక భారత మహిళకు కూడా అలా అనిపించే తక్షణమే భారత్కు కుటుంబంతో సహా వచ్చి వాలిపోయింది. ఎందువల్ల తాను ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కానీ ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపదగినవిగానూ విదేశాలకు చెక్కేద్దామనే ఔత్సాహుకులకు గొప్ప పాఠాలుగానూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎందవల్ల ఇలా కుటుంబంతో సహా ఆమె భారత్కు వచ్చేసిందో తెలుసా..!?..లీబా సుబిన్ అనే మహిళ కుటుంబం దుబాయ్ నుంచి భారత్లోని తన స్వస్థలం కేరళకు వచ్చేసింది. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఆమె కారణాన్ని వివరిస్తూ..ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా చేశానని అంటోంది. ఈ నిర్ణయాన్ని సమయా పాలన, మానసిక శాంతికి సంబంధించిన విషయంగా పేర్కొంది. అదీగాక తమ ఫ్యామిలీ వీసా రెన్యువల్, అలాగే ఇంటి అద్దె రెన్యువల్ చేయాల్సి ఉండగానే.. చకచక ఈ నిర్ణయం తీసుకుని వచ్చేసినట్లు తెలిపారు. అలాగని ఏదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదని, బాగా ఆలోచించి, తన భాగస్వామితో, పిల్లలతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇలా వెనక్కి వచ్చేసి కేరళలో తమ సొంతింటిలో నివశించడం వల్ల దుబాయ్లోని అద్దె టెన్షన్ తగ్గింది, అలాగే ఇక్కడి సమాజంలో నివశించడం వల్ల సామాజిక సంబంధాలు పునరుద్ధరింపబడతాయి. పైగా ఎలాంటి అప్పులు, ఈఎంఐల బెడద లేకుడా మానసిక ప్రశాంతతో గడపొచ్చు అని చెప్పుకొచ్చిందామె. పైగా పిల్లవాడికి కేరళలో అంతర్జాతీయ స్కూల్ ఇంటికి సమీపంలోనే ఉంది పదినిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ దుబాయ్లో 90 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుందని జోడించారామె. బహుశా మాకు అనిపించింది..మీకు వర్కౌట్ కాకపోవచ్చు, పైగా మీరు విదేశాల్లోనే కంఫర్ట్ లైఫ్ని లీడ్ చేస్తుండొచ్చని, అది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ..మొత్తం కుటుబ సభ్యులు కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అన్ని విధాల శ్రేయస్కరం అంటూ తన పోస్ట్ని ముగించింది లీబా సుబిన్. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయంతో ఏకభవించారు, పైగా తిరిగి వెళ్లకూదనుకుంటున్న ఆమె నిర్ణయానికి స్వాగతం, శుభాకాంక్షలు అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by leeba (@unfilteredvoiceswithinme) (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!
క్రైమ్
కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య
కెనడాలో నివసిస్తున్న భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రేవాల్ (Nancy Grewal) దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని లాసల్లె పోలీసులు ఈ హత్యను నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగుతోంది. పంజాబీ మూలానికి చెందిన 45 ఏళ్ల నాన్సీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పంజాబ్లో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను, ముఖ్యంగా ఖలిస్తానీలను విమర్శిస్తూ పాపులర్ అయ్యారు. ప్రసిద్ధి చెందింది.ఈ హత్య కెనడాలోని భారతీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది .ఘటన వివరాలు ఇలా ఉన్నాయి మార్చి 3, 2026, రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో. కెనడాలోని లాసల్లే (LaSalle) నగరంలోని టాడ్ లేన్ (Todd Lane) ప్రాంతంలోని ఆమె నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఎసెక్స్-విండ్సర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మరణించారు.షల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. రాజకీయ అంశాలపై ఆమె చాలా నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. సోషల్ మీడియా వేదికల ద్వారా పలు వివాదాస్పద అంశాలపై స్పందించేవారు. ముఖ్యంగా భారత్-కెనడా ఉద్రిక్తతల మధ్య ఖలిస్తానీ సానుభూతి పరులను ఆమె బహిరంగంగానే ఖండించేవారు. అకాలీదళ్ నాయకత్వంపై, ముఖ్యంగా బిక్రమ్ సింగ్ మజితియాపై ఆమె తరచుగా విమర్శలు చేసేవారు. అలాగే జైలులో ఉన్న ఎంపీ అమృత్పాల్ సింగ్, డేరా బియాస్ అధిపతి గురీందర్ సింగ్ ధిల్లాన్కు వ్యతిరేకంగా కూడా ఆమె మాట్లాడారు. దీంతోపాటు 2025 జూన్లో భటిండాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన మరో ఇన్ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారి (కమల్ కౌర్ భాభి) మరణంపై కూడా ఆమె గళమెత్తారు.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్)లాసల్లే పోలీసులు ఈ కేసును యాక్టివ్ ఇన్వెస్టిగేషన్గా పరిగణిస్తున్నారు. టాడ్ లేన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. ప్రస్తుతానికి నిందితుడి ఆచూకీ ఇంకా లభించలేదు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు లేదా 'క్రైమ్ స్టాపర్స్'కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదీ చదవండి: సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా!
ఇద్దరు స్నేహితుల ఆత్మహత్యాయత్నం
నల్గొండ జిల్లా: ప్రేమ విఫలమైందని ఒకరు.. స్నేహం కోసం మరొకరు.. ఇద్దరు యువకులు కలిసి ఒకేచోట మద్యంలో గడ్డిమందు (గ్లైఫోసెట్) కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన లోడె పవన్, కోనేటి అఖిల్లిద్దరూ క్లాస్మేట్స్తోపాటు ప్రాణ స్నేహితులు కూడా. పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. నల్లగొండలో ఐటీఐ కూడా కలిసే చదివారు. ఈ క్రమంలోనే పవన్ కట్టంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ప్రేమించాడు. ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వద్దని వారించారు. ఈ క్రమంలో పవన్, ఆ బాలిక పది రోజుల కిందట ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కట్టంగూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విషయాన్ని పవన్ కుటుంబీకులకు తెలియజేయగా.. అడ్రస్ తెలుసుకొని పవన్ను, ఆ బాలికను రప్పించారు. ఆపై బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ప్రేమ విఫలమైందని పవన్ కుమిలిపోతున్నాడు. ఇద్దరూ కలిసి..: పవన్, అఖిల్ రోజు మాదిరిగానే బుధవారం కలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. గడ్డిమందు, మద్యం, కూల్డ్రింక్ కొనుగోలు చేసి వాటిని తీసుకొని పవన్ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. మద్యంలో గడ్డిమందు కలుపుకొని తాగారు. ఆ తర్వాత తమ సన్నిహితులకు ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని చెప్పారు. వారు వచ్చేసరికి ఇద్దరూ అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించగా, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.
దంతేవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్: దంతేవాడ-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలోని అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు రాజీవ్ పునేమ్ మరణించాడు. ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్, ఐఎస్ఎస్ఏఎస్ రైఫిల్స్,పిస్టల్స్తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
రెండేళ్ల చిన్నారి.. రాత్రంతా చెట్లపొదల్లోనే
హైదరాబాద్: అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తల్లిదండ్రులతో వచ్చి తప్పిపోయిన రెండేళ్ల బాలుడు మంగళవారం రాత్రంతా చెట్ల పొదల్లోనే ఉన్నాడు. వందలాది కుక్కలు అక్కడే తచ్చాడుతున్నా బాలుడికి పెద్దగా ప్రమాదం తలపెట్టలేదు. ఒకటి, రెండు కాట్లు వేసి వదిలిపెట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన నార్సింగి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గండిపేట మైసమ్మ దేవాలయానికి మంగళవారం తెల్లాపూర్నకు చెందిన వడ్డె వెంకటే‹Ù, అనూష దంపతులు కుమారుడు అభిమన్యు (2)తో కలిసి మొక్కు చెల్లించుకునేందుకు వచ్చారు. సాయంత్రం 5.50కు అభిమన్యును తీసుకుని వెంకటేష్ కుళాయి వద్దకు వెళ్లారు. కొద్ది సేపట్లోనే అభిమన్యు అదృశ్యమయ్యాడు. వెతికినా ప్రయోజనం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు ఆలయ ఆవరణలోని చెట్ల పొదల్లోనే రాత్రంతా ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. ఆలయ పరిసరాల్లో ఉండే వందల కుక్కలు బాలుడిని ఏమీ చేయకపోవడంతో గమనార్హం. ఈ సందర్భంగా ఇటీవల చిన్నారులను కుక్కలు తీవ్రంగా కరిచిన ఘటనలను గుర్తు చేసుకున్నారు.
వీడియోలు
₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
విరోష్ రిసెప్షన్లో రాజకీయ నాయకులు
చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతీసారీ తిరుమలకు కల్తీ నెయ్యి
మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి.. మేము ఆడవాళ్ళం బొమ్మలు కాదు
ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న పెద్ది రన్ టైం..!
హైదరాబాద్ టోలీచౌక్ లో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి
తిరుమల లడ్డూపై అపచారం.. నిజాల్ని చూపిస్తున్న గోవిందుడు
Jaammalamadugu: యువతి హత్య కేసు 8 నెలలు గడుస్తున్నా వీడని మిస్టరీ
అచ్చెన్నాయుడి నోటి దురుసు... భయపడకండి లడ్డూ కోసం మాట్లాడును లెండి
ట్రంప్ కు జై కొట్టిన సెనేట్ వీగిపోయిన డెమొక్రాట్ల తీర్మానం

