కేంద్ర నిధుల్లో కోత
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్నప్పటికీ నిధులను సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడంలో సీఎం చంద్రబాబు మరోసారి విఫలమయ్యారు. ఈ ఆర్థిక ఏడాది (2025–26) కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో రాబట్టలేక చేతులెత్తేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్న తరుణంలో నిధులను సకాలంలో వ్యయం చేయకపోవడంతో కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపుల్లో భారీగా కోత పడింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో రూ.4,042 కోట్ల మేర కోత విధించింది. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మునిసిపల్, పట్టణాభివృద్ధి, సెకండరీ విద్యకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు గండి పడింది. ఆ నిధులు.. ఇతర రాష్ట్రాలకు! ఈ ఆర్థిక ఏడాది కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రూ.18,662 కోట్లను కేటాయించగా చివరిలో రూ.14,620 కోట్లకు కుదించింది. అంటే రూ.4,042 కోట్ల మేర కోత పడింది. ఏ రాష్ట్రమైనా కేటాయించిన నిధులను సకాలంలో వ్యయం చేయకుంటే ఆ మేరకు కోత విధించి ఇతర రాష్ట్రాలకు అదనంగా అందజేస్తుంది. కేంద్రం కేటాయించిన నిధులను సైతం వ్యయం చేయకుండా కోత విధించే దుస్థితికి టీడీపీ కూటమి సర్కారు అసమర్థతే నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కేటాయింపులను సకాలంలో ఖర్చు చేసి అదనపు నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతారు. దీనికి భిన్నంగా చంద్రబాబు సర్కారు పాలన కొనసాగుతోంది. ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు కేటాయింపుల్లో రూ.1,026 కోట్లు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలకు రూ.832 కోట్లు, సెకండరీ విద్య కేటాయింపుల్లో రూ.620 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.389 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.236 కోట్లు, గృహ నిర్మాణ శాఖలకు కేటాయింపుల్లో రూ.154 కోట్ల మేర కేంద్రం కోత విధించింది.
మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో పైలెట్ రోహిత్రెడ్డికి రిమాండ్
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్: మొయినాబాద్ ఫార్మ్ హౌస్లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మెజిస్ట్రేట్ తీర్పు ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, రితేష్ రెడ్డి, నితిన్ శర్మలకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు దాడి చేసిన సమయంలో నితిన్ శర్మ గన్తో కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో అర్మ్స్ ఆక్ట్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను రిమాండ్కు పంపారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనతో డ్రగ్స్ కేసు మరింత సంచలనంగా మారింది. దీనిపై పూర్తి వివరాలు అధికారులు వెల్లడించనున్నారు.
‘ఇది ఆరంభం మాత్రమే’
న్యూఢిల్లీ: భారత జట్టు వచ్చే కొన్నేళ్లలో అన్ని విధాలుగా ప్రపంచ క్రికెట్ను శాసిస్తుందని బ్యాటర్ సంజు సామ్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మన జట్టు చూపిస్తున్న ప్రదర్శన అన్ని చోట్లా పునరావృతమవుతుందని అతను అన్నాడు. 321 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన సామ్సన్... భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ‘మన దేశంలో పెద్ద సంఖ్యలో అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. వీరిని చూస్తే మన విజయపరంపర కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో మరింత గొప్ప ఆటను మన క్రికెటర్ల నుంచి చూడవచ్చు. ఇటీవల వరల్డ్ కప్ విజయం ఆరంభం మాత్రమే. మున్ముందు మరిన్ని విజయాలు దక్కడం ఖాయం’ అని ఆదివారం జరిగిన బీసీసీఐ వార్షిక పురస్కారాల సందర్భంగా సామ్సన్ వ్యాఖ్యానించాడు. భారత్ తరఫున ప్రపంచకప్ సాధించాలనే తన కల నెరవేరిందని అతను ఉద్వేగంగా చెప్పాడు. ‘ఎవరికైనా పెద్ద కలలు ఉంటాయి. అయితే అవి అంత సులువుగా నిజం కావు. రెండేళ్ల క్రితమే దేశానికి ప్రపంచ కప్ను అందించాలని అనుకున్నా.నేను బలంగా కోరుకున్న సమయంలో ఒక్కసారిగా కెరీర్లో ఇబ్బందులు వచ్చాయి. మానసికంగా సమస్యల్లో ఉన్నా. కానీ జట్టుకు నేను అవసరమై పిలుపు వచ్చినట్లుగా మళ్లీ అవకాశం దక్కింది. టీమ్లో ప్రతీ ఒక్కరి నేను బాగా ఆడాలని, జట్టుకు ఉపయోగపడాలని కోరుకున్నారు. దాంతో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగా. ఇదంతా ఒక సినిమా స్క్రిప్ట్ తరహాలో సాగి నిజంగా మారింది’ అని సామ్సన్ వివరించాడు. ప్రతిభ ఫలితాలను ఇస్తోంది: ద్రవిడ్వరుసగా రెండోసారి టి20 ప్రపంచకప్ను గెలుచుకున్న భారత జట్టును మాజీ కెప్టెన్ , రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా అభినందించాడు. గత మూడు దశాబ్దాల్లో మన క్రికెట్ జట్టు ఎంతో పురోగతి సాధించి అత్యుత్తమ స్థాయికి చేరిందని అతను అభిప్రాయపడ్డాడు. మన దేశంలో ప్రతిభకు ఏనాడూ కొదవ లేదని, ఇప్పుడు అలాంటి ప్రతిభ ఫలితాలను అందించడం సంతోషంగా ఉందని ద్రవిడ్ అన్నాడు. భారత్ ఇటీవల వరుసగా సీనియర్, అండర్–19 విభాగాల్లో కలిసి ఐదు ఐసీసీ టోర్నీల్లో గెలుచుకున్న విషయాన్ని ‘ది వాల్’ గుర్తు చేశాడు. ‘మన దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను ఎప్పుడూ కొరత లేదు. మైదానం బయట వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ బోర్డు అందించింది. అత్యుత్తమ మౌలిక సౌకర్యాలతో పాటు మంచి కోచ్లు, సరైన పరిపాలకులు ఉన్నారు. జూనియర్ స్థాయిలో, దేశవాళీ క్రికెట్లో మెరుగైన వ్యవస్థ ఉంది. కానీ కొన్నిసార్లు మైదానంలో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అంతా అద్భుతంగా సాగుతోంది. ప్రతిభకు తగిన విధంగా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల టి20 వరల్డ్ కప్ను చూస్తే మన జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగింది. ఈ ఒత్తిడి, సవాళ్లను అధిగమించి విజేతగా నిలవడం అంత సులువు కాదు. కానీ సూర్యకుమార్, గంభీర్ బృందం దానిని చేసి చూపించింది’ అని ద్రవిడ్ విశ్లేషించాడు. సామ్సన్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా ద్రవిడ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ‘సామ్సన్ వరల్డ్ కప్ చివరి మూడు మ్యాచ్లలో ఆడిన తీరు అసాధారణం. సుదీర్ఘ కాలంగా అతను టీమ్లో ఉన్నాడు. కొన్నిసార్లు బాగా ఆడినా మరికొన్ని సార్లు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అలాంటి ఆటగాడు భారత్కు ఎంతో అవసరమైన కీలక సమయంలో సత్తా చాటి విజయంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని ద్రవిడ్ అన్నాడు. బీసీసీఐ లైఫ్లైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు లభించిన గొప్ప గౌరవమని అతను స్పందించాడు.
ఎఫ్డీ కన్నా బెటర్ గురూ..
ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నింటిదీ ఒడిదుడుకుల దారే. మన మార్కెట్లదీ అదే తీరు. నిన్న మొన్నటి వరకూ ట్రంప్ టారిఫ్లు రోజుకో టర్న్ తీసుకుంటూ ఇన్వెస్టర్లను స్థిమితంగా ఉండనివ్వలేదు. ఇపుడేమో పశ్చిమాసియా సంక్షోభం దావానలంలా చుట్టేస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ఆరంభించిన యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో ఇంకా స్పష్టత లేదు. దీంతో రోజురోజుకూ చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా తీవ్రంగానే ఉంటోంది. గరిష్ఠ స్థాయిల నుంచి చూస్తే మన మార్కెట్లు ఇప్పటికే దాదాపు 10 శాతం పతనమయ్యాయి. ఇది ఎక్కడ ఆగుతుందో తెలియదు. మరి ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్న మదుపరులు ఇపుడేం చేయాలి? సాధారణంగా అయితే ఇలాంటి సందర్భాల్లో మార్కెట్లు కాస్త కిందికి వచ్చాక కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లటమే మంచిదని నిపుణులు చెబుతారు. మరి అలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎక్కడుంచాలి? సేవింగ్స్ ఖాతాల్లో అయితే వడ్డీ ఏమీ రాదు. ఎఫ్డీల్లో అయితే బ్రేక్ చేస్తే వచ్చేది తక్కువ. ఇక మ్యూచ్వల్ ఫండ్స్లో అయితే స్వల్ప కాలానికి పెద్దగా రాబడులేమీ రావు. దీనికి నిపుణులు చెబుతున్న సమాధానమే ఓవర్నైట్, లిక్విడ్ మ్యూచ్వల్ ఫండ్లు. వార్షికంగా 6–7 శాతం రాబడినిస్తూ... తక్కువ ఛార్జీలతో ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు వెనక్కి తీసుకోగలిగే అవకాశం ఉండటమే వీటి ప్రత్యేకత. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటానికి వేచి చూసే వారే కాదు... స్వల్ప కాలానికి తమ డబ్బుల్ని ఎక్కడైనా ఉంచాలనుకునే వారందరికీ ఇవి అత్యుత్తమ పెట్టుబడి సాధనాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనక వీటిలో రిస్కూ తక్కువే.ఓవర్నైట్.. లిక్విడ్ ఫండ్స్.. ఈ రెండూ భిన్నమైన ఫండ్స్. ఓవర్నైట్ ఫండ్స్ కేవలం ఒక్క రోజు మెచ్యూరిటీ ఉండే డెట్ సాధనాల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఆ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో అత్యంత సురక్షితమైన కేటగిరీల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. ప్రధాన ప్రత్యేకతలేమిటంటే... వడ్డీ రేట్ల మార్పులపరంగా చాలా తక్కువ రిసు్క. అత్యధిక లిక్విడిటీ ఉంటుంది. కొద్ది రోజుల నుంచి కొన్ని వారాల వ్యవధి వరకు ఇన్వెస్ట్ చేసేందుకు ఇవి అనువుగా ఉంటాయి. ఇవి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిధిలో ఉంటాయి. ఇక లిక్విడ్ ఫండ్స్ని తీసుకుంటే ఇవి 91 రోజుల వరకు మెచ్యూరిటీలు ఉండే డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఓవర్నైట్ ఫండ్స్తో పోలిస్తే కాస్తంత ఎక్కువ రాబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే లిక్విడిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కొద్దివారాల నుంచి కొద్ది నెలల వ్యవధి వరకు షార్ట్ టర్మ్ పెట్టుబడులకు ఇవి అనువైనవి.రాబడి ఇలా.. సాధారణంగా వడ్డీ రేట్ల సైకిల్ను బట్టి రాబడులు మారుతుంటాయి. ఓవర్నైట్ ఫండ్స్ విషయం తీసుకుంటే వార్షికంగా సుమారు 5– 6 శాతం రాబడినిస్తాయి. అదే లిక్విడ్ ఫండ్స్ అయితే సుమారు 6–7 శాతం స్థాయిలో ఉంటుంది. అయితే కచి్చతంగా ఇంత రాబడులే వస్తాయని లేదు కానీ, స్వల్పకాలిక వడ్డీ రేట్లను బట్టి ఇవి ఉంటాయి. ఎవరికి అనువైనవి స్టాక్ మార్కెట్లలో మదుపు చేసేందుకు సన్నద్ధమవుతున్నవారు, ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు తమ దగ్గర ఉన్న నగదును ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే, స్వల్పకాలికంగా, కొద్ది నెలల వ్యవధిలో అవసరం పడే మిగులు డబ్బును కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎమర్జెన్సీ ఫండ్గా ఉపయోగించుకోదల్చుకునే నిధులను కూడా కొందరు ఇన్వెస్టర్లు, లిక్విడ్ ఫండ్స్లో ఉంచుతారు.ఇందులోనూ రిసు్కలు ఉంటాయి.. ఈ తరహా పెట్టుబడుల్లో రిస్కులు తక్కువగా ఉంటాయే తప్ప పూర్తి రిస్క్– ఫ్రీగా మాత్రం ఉండవు. వీటిల్లో ప్రధానంగా పొంచి ఉండే రిసు్కలను చూస్తే.. వడ్డీ రేట్లలో మార్పులు: స్వల్పకాలిక వడ్డీ రేట్లు బట్టి రాబడులు హెచ్చుతగ్గులకు లోను కావచ్చు. క్రెడిట్ రిస్కు (లిక్విండ్ ఫండ్స్లో): కొన్ని లిక్విడ్ ఫండ్స్, కార్పొరేట్ డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలాంటి వాటిలో పరిమిత స్థాయిలో క్రెడిట్ రిస్కు ఉంటుంది. ట్యాక్సేషన్: పన్నులపరంగా చూస్తే ఇన్వెస్టర్ ఆదాయ శ్లాబ్ని బట్టి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది.ఏం చేయొచ్చంటే.. ఇలాంటి ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేందుకు నిపుణులు మూడు సింపుల్ రూల్స్ సూచిస్తున్నారు. అవేంటంటే.. ⇒ రెగ్యులర్ ప్లాన్లు కాకుండా డైరెక్ట్ ప్లాన్లు తీసుకుంటే చార్జీల మోత తగ్గుతుంది. ⇒ ఇన్వెస్ట్ చేయడానికి ముందే వ్యయ నిష్పత్తిని చూసుకోవాలి. ⇒ మాటిమాటికీ ఎంట్రీ, ఎగ్జిట్ చేయకుండా ఉంటే ఎగ్జిట్ లోడ్ భారాలు తగ్గుతాయి. ⇒ అత్యంత నాణ్యమైన పోర్ట్ఫోలియో ఉండే ఫండ్స్ని ఎంచుకోవాలి. ⇒ ఇంకా ఎక్కువ ఈల్డ్పై అత్యాశతో నాసిరకం ఫండ్స్ని ఎంచుకోకూడదు. ⇒ స్వల్పకాలిక అవసరాల కోసమే ఈ సాధనాన్ని ఉపయోగించుకోవాలి. ⇒ దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలుగా పరిగణించకూడదు.ఖర్చులూ చూసుకోవాలి .. సాధారణంగా ఓవర్నైట్, లిక్విడ్ ఫండ్స్ అనేవి చౌకైన పెట్టుబడి సాధనాలే అయినప్పటికీ, కొన్ని చార్జీలు ఉంటాయని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. అవేంటంటే.. వ్యయ నిష్పత్తి: స్కీమును నిర్వహించేందుకు ఫండ్ హౌస్ వార్షికంగా విధించే ఫీజును ఎక్స్పెన్స్ రేషియోగా వ్యవహరిస్తారు. ఓవర్నైట్ ఫండ్స్లో ఇది ఏడాదికి 0.6 నుంచి 0.25 శాతం శ్రేణిలో, లిక్విడ్ ఫండ్స్లో 0.8 నుంచి 0.40 శాతంగా శ్రేణిలోను ఉంటుంది. ఈ ఫీజును ఆటోమేటిక్గా ఫండ్ రిటర్నుల్లో నుంచి డిడక్ట్ చేస్తారు కనక ఇన్వెస్టర్లు విడిగా చెల్లించనక్కర్లేదు.ఈ చార్జీలు సెబీ పరిధిలో ఉంటాయి. ఉదాహరణకు రూ. 10 లక్షలను 0.30 శాతం ఎక్స్పెన్స్ రేషియో ఉన్న లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే వార్షికంగా సుమారు రూ. 3,000 చార్జీ వర్తిస్తుంది. అయితే మనం ఎన్ని రోజులు ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ను ఉంచితే అన్ని రోజులకే చార్జీలు వర్తిస్తాయి. ఎగ్జిట్ లోడ్: పెట్టుబడులను సత్వరం రిడీమ్ చేసుకుని, వైదొలిగితే కొన్ని ఫండ్లు కొంత ఎగ్జిట్ లోడ్ని వసూలు చేస్తాయి. లిక్విడ్ ఫండ్స్ విషయాన్ని చూస్తే, మొదటి రోజు రిడీమ్ చేసుకుంటే సుమారు 0.007 శాతం, రెండో రోజైతే 0.0065 శాతం.. అలా 7 రోజుల తర్వాత జీరో స్థాయికి లోడ్ తగ్గుతుంది. చాలా మటుకు ఓవర్నైట్ ఫండ్స్లో సాధారణంగా ఎగ్జిట్ లోడ్ ఉండదు. బ్రోకరేజ్ లేదా లావాదేవీ ఫీజులు: కొన్ని ప్లాట్ఫాంలు లేదా డి్రస్టిబ్యూటర్ల ద్వారా ఫండ్స్ తీసుకుంటే కొంత ట్రాన్సాక్షన్ చార్జీలు వర్తించవచ్చు. అయితే, ప్రస్తుతం చాలా మటుకు ఆన్లైన్ ప్లాట్ఫాంలు ఇలాంటి ఫీజుల బాదరబందీ లేకుండా డైరెక్ట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. ట్యాక్సేషన్: ఈ ఫండ్స్ నుంచి రాబడులపై పన్నులు వర్తిస్తాయి. ఇటీవల పన్ను విధానాల్లో మార్పుల అనంతరం, ఇన్వెస్టర్ ఆదాయ పన్ను శ్లాబ్ బట్టి స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తోంది. స్టాక్ మార్కెట్లు ఇటీవలి కాలంలో తీవ్ర హెచ్చుతగ్గులకు, కరెక్షన్లకు లోనవుతున్నాయి. ఇప్పటికే కొంత వరకూ మార్కెట్ల నుంచి ఎగ్జిట్ అయిన వారు, ఇంకా కొంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారు ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేసి, బీపీ తెచ్చుకోవడం కంటే డబ్బును సురక్షితంగా ఉంచుకోవటానికి ప్రాధాన్యమిస్తున్నారు. అలా చేస్తే పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొచ్చని భావిస్తున్నారు. మరి బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై 2.5 – 4 శాతం వడ్డీ రేటే ఉంటోంది. అందుకే వీరు ఎంట్రీ, ఎగ్జిట్ రెండూ సులభంగా ఉండే ఓవర్నైట్, లిక్విడ్ ఫండ్స్ను ఆశ్రయించవచ్చు.
సిలిండర్లకు సంకెళ్లు.. బడిలో పానీపూరీ భోజనం
ఉరి వేసుకునేలా ప్రేరేపించింది భర్తే
రికార్డు స్థాయికి చికెన్ ధరలు
Odisha : ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. పదిమంది మృతి
కన్న తల్లి కర్కశత్వం
ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. మరో జలసంధి బంద్!
అదే అసలైన కాన్ఫిడెన్స్..!
ఇటు ఎండ.. అటు వాన!
ఇది మూడోసారి!
మెడి'కిల్'... క్లినిక్లు
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
శ్రీ పరాభవ నామ సంవత్సర (2026 – 27) రాశిఫలాలు
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
భారత యుద్ధనౌకల మోహరింపు
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
Hyderabad: మూతపడనున్న బావర్చి రెస్టారెంట్..!
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
ఏమీ తినకున్నా షుగర్ ఎందుకు పెరుగుతుంది?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
నా కూతుర్ని సినిమాల్లో ఊహించలేదు.. నాగార్జున వల్లే..
నెతన్యాహు ఎక్కడ?
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!
బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..
రూ. 60వేల పెట్టుబడి.. రూ. 25కోట్ల ఆదాయం!
ఆ మూవీ అప్పుడే తేడా కొట్టింది, కరెక్ట్ కాదన్నాను: రాశీ
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
సిలిండర్లకు సంకెళ్లు.. బడిలో పానీపూరీ భోజనం
ఉరి వేసుకునేలా ప్రేరేపించింది భర్తే
రికార్డు స్థాయికి చికెన్ ధరలు
Odisha : ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. పదిమంది మృతి
కన్న తల్లి కర్కశత్వం
ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. మరో జలసంధి బంద్!
అదే అసలైన కాన్ఫిడెన్స్..!
ఇటు ఎండ.. అటు వాన!
ఇది మూడోసారి!
మెడి'కిల్'... క్లినిక్లు
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
శ్రీ పరాభవ నామ సంవత్సర (2026 – 27) రాశిఫలాలు
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
భారత యుద్ధనౌకల మోహరింపు
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
Hyderabad: మూతపడనున్న బావర్చి రెస్టారెంట్..!
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
ఏమీ తినకున్నా షుగర్ ఎందుకు పెరుగుతుంది?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
నా కూతుర్ని సినిమాల్లో ఊహించలేదు.. నాగార్జున వల్లే..
నెతన్యాహు ఎక్కడ?
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!
బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..
రూ. 60వేల పెట్టుబడి.. రూ. 25కోట్ల ఆదాయం!
ఆ మూవీ అప్పుడే తేడా కొట్టింది, కరెక్ట్ కాదన్నాను: రాశీ
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
ఫొటోలు
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
వైట్ డ్రెస్లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
తెలంగాణ వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు (ఫొటోలు)
అల్లు సినిమాస్ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)
కూకట్పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)
ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)
‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, బన్నీ (ఫోటోలు)
సినిమా
ఓటీటీలో దూసుకెళ్తోన్న ఓజీ హీరోయిన్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు.ప్రస్తుతం ఈ మూవీపై పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కోలీవుడ్ ప్రమఖులు ముఖ్యంగా ప్రియాంక మోహన్ నటనను కొనియాడుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం ట్వీట్ చేశారు. మనసుకు నచ్చే అద్భుతమైన కథనం, దృశ్యాలు, ప్రియాంక మోహన్ పాత్రలోని అమాయకత్వం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ప్రియాంక మోహన్ చాలా అద్భుతంగా నటించారని అన్నారు. డైరెక్టర్తో పాటు చిత్రబృందానికి అభినందనలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేశారు.నంబర్వన్గా ట్రెండింగ్..ఈనెల 12న స్ట్రీమింగ్ వచ్చేసిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నంబర్వన్గా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. #MadeInKorea… Such a Warm, feel-good storytelling with lovely visuals. The small-town innocence of @priyankaamohan’s character stands out.. she delivered a beautiful performance… @Rakarthik_dir keeps it simple and engaging! Congratulations to the entire team 🫶 @NetflixIndia… pic.twitter.com/a3jKrMKep1— Naga Vamsi (@vamsi84) March 15, 2026
బిగ్బాస్ దివి గ్లామరస్ లుక్.. బ్లూ శారీలో త్రిష అందాలు..!
యోగాసనాలు చేస్తోన్న నటి పూనమ్ బజ్వా..బీచ్లో చిల్ అవుతోన్న నటాషా స్టాంకోవిచ్..ఫ్యామిలీతో అనసూయ వాకింగ్ టైమ్..బిగ్బాస్ దివి లేటేస్ట్ గ్లామరస్ లుక్..బ్లూ శారీలో హీరోయిన్ త్రిష అందాలు... View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9)
అలాంటి సీన్లు చేయమని బలవంతం..: నటి
సల్మాన ఖాన్ 'వీర్' (2010) సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది జరీన్ ఖాన్. ఆ మరుసటి ఏడాది అతడి మూవీలోనే స్పెషల్ సాంగ్లో మెరిసింది. అలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఐటం సాంగ్స్ చేసింది. అయితే హేట్ స్టోరీ 3 మూవీ చేశాక తనను అందరూ తక్కువ చేసి చూశారంటోంది జరీన్ ఖాన్.ముందో మాట చెప్పి..తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీన్ ఖాన్ మాట్లాడుతూ.. హేట్ స్టోరీ 3లో నటించాక అందరూ నన్ను చులకన చేసి మాట్లాడారు. తనకు యాక్టింగ్ రాదు కాబట్టే అలా దుస్తులు విప్పే సన్నివేశాల్లో నటించిందని కామెంట్స్ చేశారు. ఆ సమయంలో దర్శకుడు అనంత్ మహదేవన్ అక్సర్ 2 సినిమా ఆఫర్ చేశారు. అయితే ఇందులో బోల్డ్ సన్నివేశాలుండవని హామీ ఇచ్చారు. కథంతా చెప్పి ఇది హేట్ స్టోరీ మూవీలా అయితే ఉండదని నొక్కి చెప్పాడు. దాంతో సరేనన్నాను. చెప్పిందొకటి.. చేసిందొకటికానీ, సెట్కు వెళ్లాక అంతా తలకిందులైంది. ముద్దు సన్నివేశం అంటారు.. సడన్ దుస్తులు విప్పేయమంటారు. పొట్టి దుస్తులే ధరించాలంటారు! నా బాధేంటంటే.. స్క్రిప్ట్ ఒకరకంగా చెప్పి షూటింగ్ మరోరకంగా జరిపారు. అదే వాళ్లతోనూ అన్నాను.. ఇలాంటి సన్నివేశాల్లో నటించడం నాకు సమస్య కాదు.. కానీ, మీరు నాకు చెప్పిందేంటని అడిగాను. కేవలం నా గత సినిమా చూసి కావాలని ఇందులో అలాంటి సీన్లు ఇరికిస్తున్నారన్నాను.ఎంత అన్యాయం?నామాట ఎవరూ పట్టించుకోలేదు. నాకు అందరూ వ్యతిరేకంగా మారారు. నిర్మాతలు పూర్తిగా అలా రెచ్చగొట్టే సన్నివేశాలే చేయమని బలవంతపెట్టారు. అదెంత అన్యాయం! అయినా నేను సహించాను. ఇప్పుడు గొడవకు దిగి వెళ్లిపోతే వాళ్ల పెట్టుబడి అంతా వృథా అవుతుందని సినిమా పూర్తి చేశాను. కానీ, చివరకు సినిమా స్క్రీనింగ్కు కూడా నన్ను పిలవలేదు. కానీ నేను సరిగా పని చేయనని నన్ను బద్నాం చేశారు అని జరీనా ఖాన్ చెప్పుకొచ్చింది.చదవండి: నా సినిమాలన్నీ ఫ్లాప్.. నాకు లాభమే లేదు: విజయ్ సేతుపతి
తమ్ముడి బర్త్ డే.. అన్న విజయ్ దేవరకొండ స్పెషల్ విషెస్
ఆనంద్ దేవరకొండ, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఎపిక్. ఈ మూవీకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ ఆనంద్ బర్త్ డే కావడంతో చిత్ర బృందం ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. ఈ మూవీలోని ఓ వీడియోను షేర్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాకుండా అమృతం సీరియల్ టైటిల్ సాంగ్తో చేసిన వీడియో ఆనంద్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక వీడియోను అన్న విజయ్ దేవరకొండ ట్విటర్లో షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై ఫేవరేట్ బాయ్ అంటూ తమ్ముడిపై బర్త్ డే విషెస్ చెప్పాడు. అంతకుముందే రష్మిక సైతం డ్యాన్స్ చేస్తూ ఆనంద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. Happy Birthday to my fav boy ❤️May this year be EPICCCC for all of you 🤗😘#EPIC ~ First Semester#AnandDeverakonda #AdityaHasan @vamsi84 @HeshamAWMusic @Iamvaishnavi04 pic.twitter.com/kY9OfDRDhn— Vijay Deverakonda (@TheDeverakonda) March 15, 2026
క్రీడలు
అల్కరాజ్కు మెద్వెదెవ్ షాక్
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఏటీపీ–1000 మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో మూడోసారి టైటిల్ సాధించాలని ఆశించిన ప్రపంచ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 7–6 (7/3)తో టాప్ సీడ్ అల్కరాజ్ను ఓడించి ఈ టోర్నీలో మూడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ ఏడాది అల్కరాజ్కిదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఆ్రస్టేలియన్ ఓపెన్, ఖతర్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన అల్కరాజ్ ఈ ఏడాది 16 వరుస విజయాల తర్వాత తొలి పరాజయం చవిచూశాడు. 2023, 2024లలో ఈ టోర్నీ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకున్న మెద్వెదెవ్ ఈసారి టైటిల్ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ)తో తలపడతాడు.
రహానేకు మరోసారి అవకాశం!
ఐపీఎల్ 2025 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) దారుణ ప్రదర్శన కనబరిచింది. 14 మ్యాచ్ల్లో ఐదు విజయాలకు మాత్రమే పరిమితమయిన కేకేఆర్ 8వ స్థానంలో నిలిచింది. ఆ సీజన్లో కేకేఆర్ కెప్టెన్గా అజింక్యా రహానే వ్యవహరించాడు. నాయకుడిగా జట్టును నడిపించడంలో విఫలైనప్పటికీ బ్యాటర్గా మాత్రం రహానే సూపర్ సక్సెస్అయ్యాడని చెప్పొచ్చు. 37 ఏళ్ల రహానే 13 మ్యాచ్లాడి 390 పరుగులు సాధించాడు. కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా రహానేనే కావడం విశేషం. గత సీజన్లో ఎక్కువగా వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన రహానే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడడం అలవాటు చేసుకున్నాడు. తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు సాధించే స్ట్రాటజీతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. అందుకే ఈసారి కూడా రహానేకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనే కృతనిశ్చయంతో కేకేఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో 13 రోజులు సమయం ఉండడంతో ఈలోగా కేకేఆర్ కెప్టెన్ పేరును ఖరారు చేయనుంది. అయితే రహానే ఈ సీజన్లోనూ వన్డౌన్లోనే బ్యాటింగ్కు రానున్నాడు. ఐపీఎల్లో రెండు పర్యాయాలు (2012, 2014) గంభీర్ సారధ్యంలో ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన కేకేఆర్ 2024లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో మూడో టైటిల్ అందుకుంది. అయితే అనూహ్యంగా గతేడాది సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన వేలంలో శ్రేయస్ అయ్యర్ సహా పలు కీలక ఆటగాళ్లను వదులుకొని కేకేఆర్ మూల్యం చెల్లించుకుంది. కానీ ఈసారి మాత్రం ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో తమ బ్యాటింగ్ లైనప్ను బలోపేతం చేసుకుంది. ఇటీవలే టీ20 వరల్డ్కప్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఫిన్ అలెన్ సహా టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, కామెరున్ గ్రీన్లను సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికే విదేశీ కోటాలో సునీల్ నరైన్, బ్లెస్సింగ్ ముజరబాని, రోవ్మెన్ పావెల్, పతిరానా ఉన్నారు. మరి ఇంతమందిలో ఎవరికి అవకాశం వస్తుందనేది చూడాలి. ఇక పేసర్ హర్షిత్ రాణా గాయంతో ఈ సీజన్కు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. కానీ కేకేఆర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్ మార్చి 29న ముంబై ఇండియన్స్తో ఆడనుంది.చదవండి: కోహ్లీ అత్యుత్తమ టీ20 ఓపెనర్ అతడే!
కోహ్లీ అత్యుత్తమ టీ20 ఓపెనర్ అతడే!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం లండన్లోనే మకాం పెట్టాడు. మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుండడంతో కోహ్లీ తన ప్రాక్టీస్ను ఇప్పటికే మొదలెట్టిన సంగతి తెలిసిందే. ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోను కూడా ఇటీవలే తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నాడు. తాజాగా కోహ్లీ తన బెస్ట్ టీ20 ఓపెనర్గా విండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ను ఎంచుకున్నాడు. విషయంలోకి వెళితే బెస్ట్ టీ20 ఓపెనర్గా టీమిండియా నుంచి కానీ, అంతర్జాతీయ క్రికెటర్ల నుంచి ప్రస్తుత, మాజీల్లో ఎవరిని ఎన్నుకుంటారని విరాట్ కోహ్లీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రశ్న వేసింది. అయితే మొదట సచిన్, సెహ్వాగ్లలో ఎవరిని ఎన్నుకుంటారని అడగ్గా.. ‘టీ20 ఓపెనర్ కాబట్టి నా మొదటి ప్రాధాన్యత సెహ్వాగ్’ అని కోహ్లీ జవాబిచ్చాడు. ఆ తర్వాత ఫైనల్ చాయిస్లో రోహిత్ శర్మ, క్రిస్ గేల్ పేర్లు వచ్చాయి. కానీ ఇక్కడ కోహ్లీ రోహిత్ను కాదని ఆర్సీబీ మాజీ సహచర ఆటగాడు గేల్కే ఓటేశాడు. రోహిత్, సెహ్వాగ్ కూడా నా దృష్టిలో గొప్ప టీ20 ఓపెనర్లే అని పేర్కొన్నాడు. కానీ ఆర్సీబీ తరఫున ఆడేటప్పుడే ఓపెనర్గా గేల్ విధ్వంసాన్ని కళ్లారా చూశానని తెలిపాడు. ఆరంభం నుంచే బంతిని బౌండరీ లేదా సిక్సర్గా మలవాలన్న కోరిక గేల్లో బలంగా కనిపించేదదన్నాడు. అందుకే గేల్ టీ20ల్లో అత్యుత్తమ ఓపెనర్ అని చెప్పగలనని స్పష్టం చేశాడు. ఇక గతేడాది ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కోహ్లీ ఐపీఎల్లో 267 మ్యాచ్ల్లో 132 స్ట్రైక్రేట్ తో 8,661 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలున్నాయి. 2025 సీజన్లో కోహ్లీ 15 మ్యాచ్ల్లో 657 పరుగులు సాధించాడు. గతేడాది ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు జట్టు ఆరు పరుగుల తేడాతో పంజాబా్ కింగ్స్పై విజయం సాధించి తొలిసారి టైటిల్ను ముద్దాడింది.చదవండి: ‘అభిషేక్ను అందుకే వెనుకేసుకొచ్చా’
‘అభిషేక్ను అందుకే వెనుకేసుకొచ్చా’
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం పెద్ద చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టోర్నీ ఆరంభ దశ నుంచి సెమీస్ వరకు అభిషేక్ డకౌట్లు లేదా తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. అయినా కూడా కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అభిషేక్కు అవకాశాలిస్తూ అతడికి వెన్నుదన్నుగా నిలుస్తూనే వచ్చాడు. మ్యాచ్ల్లో వరుసగా విఫలమవుతున్నా జట్టులో చోటు కల్పించడంపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే గంభీర్ మాత్రం అభిషేక్పై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అభిషేక్ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి అంతకముందు తనపై వచ్చిన విమర్శలన్నింటికీ సమాధానం చెప్పాడు. ఎన్ని విమర్శలు వచ్చినా అభిషేక్ను వెనుకేసుకు రావడానికి గల కారణాన్ని కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా వెల్లడించాడు. ‘2014 ఐపీఎల్ సమయంలో నేను చాలా బ్యాడ్ఫేస్ను ఎదుర్కొన్నాను. అప్పట్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో వరుసగా మూడు డకౌట్లు కావడంతో విమర్శలు ఎదురయ్యాయి. ఒక ఆటగాడు పరుగులు చేయలేదంటే అతని స్కోర్ కంటే ఫామ్ గురించే మాట్లాడుకుంటారు. కానీ నిజానికి అభిషేక్ అక్కడ ఫామ్ కోల్పోలేదు.. కేవలం పరుగులు మాత్రమే చేయలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని అతడికి వివరించాను. అయితే అభిషేక్ క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే అతను తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలని ఆరాట పడుతుంటాడు. కానీ ఒక బ్యాటర్ 20 నుంచి 30 బంతులు ఆడినప్పుడు మాత్రమే అతని ఫామ్ను అంచనా వేయగలం. అయితే అభిషేక్ పట్టుమని 20 బంతులు కూడా ఎదుర్కోలేదు. అందుకే అవకాశమొచ్చిన ప్రతీసారి మరింత అగ్రెసివ్గా ఆడాలని చెప్పేవాడిని. అదీగాక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బంతిని గ్రౌండ్ అవతలికి పంపించాలనుకోవడం అభిషేక్ నైజం. ఇది ఒక రకంగా మంచిదే.అంతిమంగా బయట ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు.. డ్రెస్సింగ్రూమ్లో అతడి గురించి ఏమీ ఆలోచిస్తున్నారన్నదే ఇక్కడ ముఖ్యం’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీ20 ప్రపంచకప్లో మూడుసార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో మాత్రం 21 బంతుల్లో 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా కప్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: అభిషేక్ను చూసి అసూయపడేవారు!
న్యూస్ పాడ్కాస్ట్
తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ గుట్టు రట్టు... డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్గా నిర్ధారణ
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రం... ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా భీకర దాడులు
రైతులతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొండాట.. పేరుకే అన్నదాత సుఖీభవ, ఆచరణలో అంతా మోసం
విలువలు, విశ్వసనీయతకు వైఎస్సార్సీపీ మారుపేరు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఆదాయం... కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఇక్కడ బాబు, అక్కడ BR నాయుడు కోట్లల్లో భారీ స్కాం
పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు..ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
బిజినెస్
బ్రిక్స్లో ఏకాభిప్రాయ గండం!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న వివాదంపై బ్రిక్స్ కూటమిలో ఉమ్మడి వైఖరిని రూపొందించడం సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని భౌగోళిక రాజకీయ పరిణామాల్లో బ్రిక్స్ సభ్య దేశాలకు నేరుగా ప్రమేయం ఉండటమే దీనికి ప్రధాన కారణమని విదేశాంగ శాఖ వర్గాల సమాచారం.జైశంకర్తో ఇరాన్ విదేశాంగ మంత్రి చర్చలుఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో భద్రత, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో భారత్ నాయకత్వంలోని బ్రిక్స్ కూటమి చురుకైన పాత్ర పోషించాలని అరాగ్చి ఈ సందర్భంగా ఆకాంక్షించినట్లు చెప్పారు. ఈ పోన్ సంభాషణ తర్వాత జైశంకర్ స్పందిస్తూ.. పశ్చిమాసియా పరిస్థితులపై బ్రిక్స్ సభ్య దేశాలతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేశారు. అయితే, కూటమిలోని కొన్ని దేశాలు ఈ వివాదంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వాములు కావడమే ఉమ్మడి ప్రకటనకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తుంది.ఏకాభిప్రాయానికి ఆటంకాలు ఇవే..బ్రిక్స్ వేదికగా యుద్ధం పరంగా ఒకే మాట వినిపించడం ప్రస్తుతం కష్టతరంగా మారింది. దీనికి కొన్ని అంశాలు అంశాలు కారణమవుతున్నాయి. జనవరి 2024లో బ్రిక్స్లో చేరిన ఇరాన్ ఈ వివాదంలో ప్రధాన పక్షంగా ఉంది. మరో సభ్య దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా ఈ ప్రాంతీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. (2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగిన 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇరాన్తో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యూఏఈలకు సభ్యత్వం కల్పించాలని నిర్ణయించారు) సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక ప్రయోజనాలు వేర్వేరుగా ఉండటంతో ఈ సంఘర్షణపై ఒకే రకమైన వైఖరిని తీసుకోవడంలో ప్రతిష్టంభన నెలకొంది.భారత్ సారథ్యంబ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సంక్షోభ పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తోంది. సభ్య దేశాల మధ్య చర్చలను భారత్ సమన్వయం చేస్తోంది. ‘మార్చి 12న జరిగిన వర్చువల్ బ్రిక్స్ షెర్పా సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. పశ్చిమాసియాలోని సభ్య దేశాల నాయకులతో భారత అగ్రనాయకత్వం నిరంతరం టచ్లో ఉంది’ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం
గ్లోబల్ షాక్స్ను తట్టుకునే టెక్నిక్ ఇదే..
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఆర్థిక ఒడిదుడుకుల మధ్య భారత క్యాపిటల్ మార్కెట్లు బలంగా ఉన్నాయని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్మన్ తుహిన్ కాంత పాండే ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లు లోతుగా విస్తరిస్తున్నాయని, సూచీలపై ప్రపంచ పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ మార్కెట్ పునాదులు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు.స్వల్పకాలిక అలజడి.. దీర్ఘకాలిక లక్ష్యంగత రెండు వారాలుగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లకు పాండే కీలక సూచన చేశారు. ‘మార్కెట్ ఒడిదొడుకులు చూసి ఆందోళన చెందకుండా, భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండాలి. రిటైల్ పెట్టుబడిదారులు ఓపికగా ఉండటమే అత్యుత్తమ వ్యూహం. గతంలో కూడా ఇలాంటి అంతరాయాల తర్వాత మార్కెట్లు తిరిగి బలంగా కోలుకున్నాయి’ అని ఆయన గుర్తుచేశారు. గత 18 నెలలుగా బెంచ్ మార్క్ సూచీలు పరిమిత రాబడిని అందించడం వల్ల ఇన్వెస్టర్లలో కొంత నిరాశ ఉన్నప్పటికీ ఇది తాత్కాలికమేనని ఆయన విశ్లేషించారు.ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకభారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న కొద్దీ మన క్యాపిటల్ మార్కెట్లు కూడా పరిమాణం, సంక్లిష్టతలో అభివృద్ధి చెందుతున్నాయని పాండే హైలైట్ చేశారు. ‘సమర్థవంతమైన మార్కెట్లు కేవలం లాభాల కోసం మాత్రమే కాదు, అవి పారదర్శక ధరల ఆవిష్కరణకు, ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితులను గ్రహించడానికి సహాయపడతాయి. నమ్మకమే ఆర్థిక వ్యవస్థకు పునాది. అది లేకపోతే మూలధనం తగ్గిపోతుంది’ అని హెచ్చరించారు.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం
కారు కడిగేటప్పుడు చాలామంది చేసే తప్పులు
కారు అందంగా.. మిలమిల మెరిసిపోతుంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. కారు మెరిసిపోవాలంటే.. దాన్ని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు కడుగుతూ ఉండాలి. కానీ కొంతమంది కారు కడిగేటప్పుడు కూడా కొన్ని తప్పులు చేస్తుంటారు. అలాంటి తప్పుల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.తప్పుడు సాధనాల వినియోగంమనం చేతిలో పట్టుకునే స్పాంజ్ లేదా గుడ్డే.. కారు పెయింట్కు నష్టం కలిగిస్తుంది. చాలా మంది ఏ స్పాంజ్ అయినా సరిపోతుందని అనుకుంటారు. కానీ తప్పు రకం స్పాంజ్ లేదా టవల్ వాడితే కారు పెయింట్పై ఉన్న క్లియర్ కోట్పై చిన్న చిన్న గీతలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉపయోగించే పాత గుడ్డలు లేదా క్లీనింగ్ క్లాత్లు వాడకపోవడం మంచిది. బకెట్ల వినియోగం కూడా ముఖ్యమే. ఒకటి సబ్బు నీటికి, మరొకటి మిట్ను కడగడానికి ఉపయోగించాలి. ఇలా రెండు బకెట్లు వాడటం వల్ల మురికి నీరు తిరిగి కారు మీద పడకుండా ఉంటుంది.డిష్ సోప్ ఉపయోగించకూడదుకారును కడుక్కోవడానికి షాంపూ లేదా కిచెన్లో ఉన్న డిష్ సోప్ వంటివి వినియోగించుకోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇది మంచి నిర్ణయం కాదు. డిష్ సోప్ తరచుగా వాడితే కారు మీద ఉన్న వాక్స్, రక్షణ పొర తొలగిపోతాయి. దాంతో కారు పెయింట్ సూర్యరశ్మి, ఆక్సిడేషన్ వల్ల త్వరగా పోతుంది. కాబట్టి కారు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆటోమోటివ్ షాంపూ మురికిని మెల్లగా తొలగిస్తూ, పెయింట్పై ఉన్న రక్షణ పొరను కాపాడుతుంది. అందువల్ల కారు రంగు ఎక్కువకాలం నిలుస్తుంది.ఎక్కువ ప్రెషర్ కూడా ప్రమాదమేకొంతమంది హై-ప్రెషర్ హోస్ లేదా ఆటోమేటిక్ కార్ వాష్ వాడటం వేగంగా పూర్తవుతుందని అనుకుంటారు. కానీ అవి కొన్నిసార్లు నష్టాన్ని కలిగించవచ్చు. అలాగే ఎక్కువ ప్రెషర్తో నీరు చిమ్మితే కారు ట్రిమ్ లేదా పెయింట్కు నష్టం కలగవచ్చు. అందువల్ల చేతితో కడిగేటప్పుడు మోస్తరు నీటి ఒత్తిడితో, కొంచెం దూరం ఉంచి కడగడం మంచిది.ఆరబెట్టే సమయంలో జాగ్రత్తకారు బాగా కడిగిన తర్వాత దాన్ని ఆరిపోవడానికి వదిలేస్తే సరిపోతుంది అనుకుంటే పొరపాటే. ఆలా చేస్తే నీటి మరకలు పడతాయి. అప్పుడు నీటిలో ఉన్న ఖనిజాలు పెయింట్పై నిలిచిపడి గట్టిగా అతుక్కొని శాశ్వత మచ్చలుగా మారవచ్చు. అందుకే ఎప్పుడూ శుభ్రమైన మైక్రోఫైబర్ టవల్తో కారు తుడవాలి.
క్యాష్, ట్రాష్, క్రాష్.. మార్కెట్పై కియోసాకి ట్వీట్
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' క్యాష్, ట్రాష్, క్రాష్ అంటూ.. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అనే విషయాలను గురించి వివరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.క్రాష్లో క్యాష్ అంటే ట్రాష్ కాదు అని ట్వీట్ ప్రారంభించిన కియోసాకి.. ప్రపంచ ప్రసిద్ధ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ స్టాక్స్, బాండ్స్ వంటివి విక్రయించి ఎందుకు బిలియన్ల కొద్దీ నగదుతో కూర్చున్నారు? అని ప్రశ్నించారు. దీనికి కారణం ''keeping his powder dry'' అనే వ్యూహం. అంటే మార్కెట్ పడిపోయిన తర్వాత మంచి కంపెనీలు లేదా విలువైన ఆస్తులు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు వాటిని కొనడానికి చేతిలో డబ్బు ఉండాలి.నా వ్యూహం ఏమిటంటే.. నా దగ్గర ఉన్న డబ్బును మరిన్ని ఆయిల్ వెల్స్, బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి పెట్టుబడుల్లో పెట్టాను. అంటే ప్రతి వ్యక్తి లేదా పెట్టుబడిదారుడు.. తన ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే.. పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత కూడా బంగారం, వెండి, బిట్కాయిన్ ధరలు పెరిగే అవకాశం ఉందని కియోసాకి పేర్కొన్నారు. ఇప్పుడు నా ఆలోచన తప్పుగా అనిపించవచ్చు. కానీ పెట్టుబడుల్లో ఎప్పుడూ రిస్క్ ఉంటుందని వివరించారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో నష్టపోయారా?.. కియోసాకి సూచనలుమార్కెట్ పడిపోయినప్పుడు మీ వద్ద స్పష్టమైన పెట్టుబడి ప్రణాళిక లేకపోతే, ఏమీ చేయకుండా ఉండటం కూడా ఒక మంచి నిర్ణయం కావచ్చు. తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకోవడం కంటే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని కియోసాకి స్పష్టం చేశారు.CASH is not TRASH in a CRASHQ: Why has Warren Buffet sold stocks and bonds and is sitting with billions in cash?A: Because he is “keeping his powder dry” a.k.a. He is in CASH so he can buy priceless assets….after the crash and are on sale. Q: Should you follow in…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 15, 2026
ఫ్యామిలీ
శ్రీ పరాభవ నామ సంవత్సర శుభ ముహూర్తములు (2026 – 27)
చైత్ర మాసం 19/03 చైత్ర శుద్ధ పాడ్యమి గురు ఉత్తరాభాద్ర ఉగాది నూతన వస్త్రాభరణధారణ వ్యాపారాదులకు వృషభం ఉ.11:00 (దుస్పక్). మిథునోపి ప.12:01 20/03 విదియ శుక్ర రేవతీ వృషభం ఉ.10:19. మి«థునం ప.11:45 (రహితం లేదు)21/03 తదియ శని అశ్విని దం, అన్న, అక్షర, సీమంత, పుంసవన, దేవతా ప్రతిష్ఠ, నిశ్చితార్థం, వాస్తు కర్మలు, రిపేర్లు మిథునం ప.12:01 విశేషం.25/03 సప్తమి బుధ మృగశిర అన్న, అక్షర, ఉప, వ్యాపార, దేవతా ప్రతిష్ఠ, సీమంత, పుంసవన, వాస్తుకర్మలు, రిపేర్లు నిశ్చితార్థం వృషభం ఉ.గం.9:5527/03 నవమి కళ్యాణములు కర్కాటక లగ్న ప.1:00–3:12. 1:00కు తలంబ్రాలు పోసేలాగా చూసుకోండి. దశమి పుష్యమి గృప్ర ధను రా.12:30.28/03 దశమి శని పుష్యమి అన్న, అక్షర, వ్యాపార, సీమంత, పుంసవన, వాస్తు కర్మలు, రిపేర్లు, బోరింగ్, ఉపనయనం, దేవతా ప్రతిష్ఠలు వృషభం ఉ.గం.9:43. 29/03 ద్వాదశీ ఆది మఘ వివాహం వృషభం రాత్రి 11:55 నిశీధి.30/03 త్రయోదశీ సోమ మఘ వివాహం వృషభం ప.గం.ఉ.9:30 (సగ్రహ)01/04 పౌర్ణమి, బుధ, ఉత్తర, అన్న, వాస్తుకర్మలు, వివాహం, దేవతాప్రతిష్ఠ, వివాహం, సీమంత, పుంసవన, నిశ్చితార్థం వ్యాపారం వృషభం మార్తాండ రహితం ఉ.గం.9:30. హస్త ధనుస్సు రా.గం.11:45 వివాహం.02/04 పాడ్యమి గురు హస్త అన్న, వాస్తుకర్మలు, రిపేర్లు, దేవప్రతిష్ఠ, వ్యాపార, సీమంత పుంసవన, బోరింగ్, నిశ్చితార్థం, వృషభం ఉ.గం.9:23 03/04 విదియ శుక్ర, చిత్త, గృప్ర, శంకు, వాస్తు కర్మలు దేవతాప్రతిష్ఠలు అన్న, సీమంత, పుంసవన, నిశ్చితార్థం, వ్యాపారం, బోరింగ్, దం మిధునం ప.11:01 శుభాంశ. స్వాతీ ధనస్సు రా.11:35.04/04 తదియ శని స్వాతి వివాహం, అన్న, అక్షర, వ్యాపార, దేవ ప్రతిష్ఠ, వాస్తుకర్మలు, రిపేర్లు, సీమంత పుంసవన, నిశ్చితార్థం, బోరింగ్లకు వృషభం 9:16.05/04 చవితి ఆది అనురాధ వివాహం, గృప్ర, గర్భాదానం, ధనస్సు రా.గం.11:45.06/04 చవితి సోమ అనురాధ వ్యాపారం, అన్న, సీమంత, పుంసవన, గృప్ర, శంకు, దేవతాప్రతిష్ఠ, వాస్తు రిపేర్లు, బోరింగ్, నిశ్చితార్థం వృషభం ఉ.గం.9:07. మిధునోపి ఉ.11:45 (6శుక్ర)08/04 షష్ఠి బుధ మూల సమస్త శుభకర్మలు దేవతా ప్రతిష్ఠ, వ్యాపార, అన్న, శంకు, బోరింగ్ వృషభం ఉ.గం.8:59 (8చం). మి«థునోపి ఉ.గం.11:00 (7చం)10/04 నవమి శుక్ర ఉత్తరాషాఢ వివాహం, గర్భాదాన, గృప్ర, ధనస్సు రా.గం.11:45.11/04 నవమి శని ఉత్తరాషాఢ సమస్త శుభకర్మలు వాస్తు కర్మలు వ్యాపారాదులకు బోరింగ్, నిశ్చితార్థ సీమంతాదులకు వృషభం ఉ.గం.8:51. శ్రవణం మిథునం ఉ.గం.11:00. దశమి శ్రవణం వివాహం, గర్భాదానం ధనుస్సు రా.గం.11:30.12/04 దశమి ఆది శ్రవణం వివాహం, శంకు, వాస్తుకర్మలు దేవ ప్రతిష్ఠలు, బోరింగ్, అన్న, అక్షర, ఉప, వ్యాపార, సీమంత, పుంసవన, వృషభం ఉ.గం.8:42. మిథునోపి 11:00. ఏకాదశీ ధనిష్ఠ వివాహం గృప్ర, గర్బ, ధనస్సు రా.గం.11:45.13/04 ఏకాదశీ, సోమ, ధనిష్ఠ, మిథునం ప.గం.11:00.వైశాఖ మాసం18/04 పాడ్యమి శని అశ్వినీ మిథునం ప.గం.11:01. పూర్ణచంద్రుడితో కూడిన సోమవారం వివాహమునకు దోషం కాదు. 20/04 తదియ సోమ రోహిణీ వివాహం అన్న, అక్షర, ఉప, సీమంత, పుంసవన దేవతాప్రతిష్ఠ, గృప్ర, శంకు, బోరింగ్, వ్యాపారం మిథునం ఉ.గం.10:51. కర్కాటకం ప.గం.12:01. చవితి వివాహం, గృప్ర, గర్భాదానం, వృశ్చికం రా.గం.8:27.23/04 సప్తమి గురు పునర్వసు, అన్న, అక్షర, సీమంత, పుంసవన, శంకుస్థాపన, బోరింగ్, దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం, మిథునం ఉ.గం.10:49. కర్కాటకోపి ప.గం.11:46. గర్భాదానాదులకు వృశ్చికం రా.గం.8:19.24/04 అష్టమి శుక్ర పుష్యమి కర్కాటకం బోరింగ్, పుంసవనం, అత్యవసర విషయాలకు ఉ.గం.11:38. గర్భాదానం వృశ్చికం రా.గం.8:15.25/04 నవమి శని మఘ వివాహం మకరం రా.గం.12:53 (8చం. సగ్రహచంద్ర)26/04 దశమి ఆది మఘ వివాహం వృషభం ఉ.గం.7:44. మిథునోపి ఉ.గం.10:33.29/04 త్రయోదశీ బుధ హస్త అత్యవసర ఉప నయనాది శుభాలకు ఉ.గం.11:01. చతుర్దశీ వివాహం, గర్భాదానం, నిశ్చితార్థం వృశ్చికం రా.గం.9:01. బుధ/గురు చిత్త మకరం రా.గం.12:33.30/04 చతుర్దశి గురు చిత్త అన్న, శంకు, గృప్ర, ప్రతిష్ఠ, బోరింగ్, వ్యాపారం, నిశ్చితార్థం, సీమంత పుంసవన వృషభం ఉ.గం.7:30. గృప్ర వశ్చికం రా.గం.7:47.01/05 పూర్ణిమ శుక్ర స్వాతి మిథునం ఉ.గం.10:15. సమస్త శుభాలకు కర్కాటకం ఉ.గం.11:14. వివాహం గప్ర వృశ్చికం రా.గం.7:43. మకరోపి వివాహార్థం రా.గం.12:29.03/05 విదియ ఆది అనురాధ వివాహం, శంకు, గృప్ర, వ్యాపారం, బోరింగ్, నిశ్చితార్థం, దేవతాప్రతిష్ఠ, సీమంత, పుంసవన, అన్న, అక్షర, ఉప, వృషభం మార్తాండ రహితం ఉ.గం.7:22 (12ర7చం) గర్భాదానం వివాహం మకరం రా.గం.12:21.04/05 తదియ సోమ అనురాధ, అన్న, అక్షర, ఉప, శంకు, గృప్ర, నిశ్చితార్థం, వివాహం, సీమంతం, గృప్ర, దేవతాప్రతిష్ఠ, వ్యాపారం వృషభం ఉ.7:14.06/05 పంచమి బుధ మూల అన్న, సీమంత, పుంసవన, వివాహం, నిశ్చితార్థం, బోరింగ్, వాస్తుకర్మలు, దేవతాప్రతిష్ఠ వృషభం ఉ.గం.7:05.07/05 షష్ఠి గురు ఉత్తరాషాఢ వివాహం గృప్ర వృశ్చికం రా.గం.7:23.08/05 షష్ఠి శుక్ర ఉత్తరాషాఢ అన్న, అక్షర, ఉప, సీమంత, పుంసవన, శంకు, గృప్ర, వివాహ నిశ్చితార్థం దేవతాప్రతిష్ఠ, వ్యాపారం, బోరింగ్ వృషభం ఉ.గం.6:58. సప్తమి మిథునం ప.గం.9:45. కర్కాటకం ప.గం.10:42. సప్తమి శ్రవణం వివాహం. సీమంత వేడుక నిశ్చితార్థం వృశ్చికం రా.గం.7:15.09/05 సప్తమి శని శ్రవణం మిథునం ఉ.గం.8:55 విశేషం. అష్టమి శని ధనిష్ఠ మకరం రా.గం.11:45.10/05 అష్టమి ఆది ధనిష్ఠ మిథునం ఉ.గం.9:39. నవమి వృశ్చికం రా.గం.7:10.అధిక జ్యేష్ఠ మాసంక్రింద యిచ్చిన ముహూర్తములు, అత్యవసరంలో బోరింగ్కు, వాస్తు రిపేర్లకు, నిత్యంలో అన్నప్రాశన, సీమంతం, వేడుక సీమంత, పుంసవన, జాతకర్మ, నామకరణలకు మాత్రమే.18/05 విదియ సోమ రోహిణీ కర్కాటకం ఉ.గం.10:01.20/05 పంచమి బుధ పునర్వసు ధనుస్సు ఉ.గం.8:30.21/05 పంచమి గురు పునర్వసు మిథునం ఉ.గం.8:50.22/05 షష్ఠి శుక్ర పుష్యమి మిథునం ఉ.గం.7:30.25/05 దశమి సోమ ఉత్తర మి«థునం ఉ.గం.8:30. కర్కాటకం ప.గం.9:26. ధనుస్సు రా.గం.8:00.27/05 ఏకాదశీ బుధ హస్త మిథునం ఉ.గం.7:30.28/05 ద్వాదశీ గురు చిత్త మిథునం ఉ.గం.7:30. త్రయోదశీ కర్కాటక ఉ.గం.9:30. ధనుస్సు సా.గం.8:00.29/05 చతుర్దశీ శుక్ర స్వాతీ కర్కాటకం ఉ.గం.10:01.30/05 పౌర్ణమి శని అనురాధ ధనుస్సు సా.గం.8:00.31/05 పౌర్ణమి ఆది అనురాధ మిథునం ఉ.గం.7:30.04/06 చవితి గురు ఉత్తరాషాఢ మిథునం ఉ.గం.7:00. ధనస్సు రా.గం.7:30.05/06 పంచమి శుక్ర శ్రవణం ధనిష్ఠ రా.గం.7:30.06/06 షష్ఠి శని ధనిష్ఠ కర్కాటకం ఉ.గం.10:01. ధనస్సు రా.గం.7:30. సగ్రహ చంద్రక్రాంతి దోషం07/06 సప్తమి ఆది శతభిషం కర్కాటకం ఉ.గం. 10:01. ధనుస్సు రా.7:30. సగ్రహ చంద్రక్రాంతి దోషం.నిజ జ్యేష్ఠ మాసం16/06 విదియ మంగళ / బుధ పునర్వసు బోరింగ్ వృషభం తె.గం.5:26.17/06 తదియ బుధ పునర్వసు అన్న, సీమంతం, పుంసవనం కర్కాటకం ఉ.గం.9:01. పుష్యమీ గర్భాదానం రా.గం.9:25.18/06 చవితి గురు పుష్యమీ అన్న, పుంసవన, సీమంత, బోరింగ్ కర్కాటకం ఉ.గం.8:03.19/06 షష్ఠి శుక్ర మఘ వివాహం మకరం రా.గం.9:18.20/06 షష్ఠి శని మఘ వివాహం కర్కాటకం ఉ.గం.7:55.21/06 అష్టమి ఆది ఉత్తర మకరం వివాహాది రా.గం.8:45. అష్టమి ఆది/సోమ ఉత్తర వివాహం వృషభం తె.గం.4:02. విశేషం.22/06 అష్టమి సోమ ఉత్తర సమస్త శుభాలకు కర్కాటకం ఉ.గం.9:01. నవమి హస్త మకరం వివాహం గృప్ర రా.గం.9:01.23/06 దశమి మంగళ/బుధ చిత్త, గృప్ర, బోరింగ్ వృషభం తె.గం.4:02.24/06 దశమి బుధ చిత్త (అన్న, అక్షర) ఏకాదశీ స్వాతి, వివాహం, గర్భాదానం మకరం రా.గం.9:01. ఏకాదశీ బుధ / గురు స్వాతీ వివాహం మేషం రా.గం.2:23.25/06 ఏకాదశి గురు స్వాతీ అన్న, అక్షర, వివాహ, బోరింగ్ కర్కాటకం ఉ.గం.7:38.27/06 త్రయోదశీ శని అనురాధ వివాహం మకరం రా.గం.8:46.28/06 చతుర్దశీ ఆది/సోమ మూల వివాహం మేషం రా.గం.2:01 విశేషం.29/06 పౌర్ణమి సోమ మూల వివాహాది శుభాలకు కర్కాటకం మార్తాండ రహితం ఉ.గం.7:30. వివాహం మకరం రా.గం.8:38 విశేషం.01/07 విదియ బుధ ఉత్తరాషాఢ అన్న, అక్షర, సీమంత, పుంసవన, బోరింగ్, వ్యాపార, దేవతాప్రతిష్ఠ, నిశ్చితార్థం, వివాహం, కర్కాటకం ఉ.గం.7:15. మేషం రా.1:30.02/07 విదియ గురు ఉత్తరాషాఢ అన్న, అక్షర, అకాలవటు, ఉప, వివాహ, సీమంత, పుంసవన, బోరింగ్ వ్యాపారం, దేవతాప్రతిష్ట, నిశ్చితార్థం కర్కాటకం ఉ.7:11 (8రా). తదియ శ్రవణం వివాహం మకరం రా.గం.8:22. వివాహం మేషం రా.గం.1:52.03/07 తదియ శుక్ర శ్రవణం అన్న, అక్షర, బోరింగ్, వివాహ, సీమంత, పుంసవన, వ్యాపారం ప్రతిష్ఠ నిశ్చితార్థం కర్కాటకం ఉ.7:07 (8రా). చవితి ధనిష్ఠ మకరం వివాహం రా.8:18. శుక్ర/శని మేషం వివాహం రా.1:48.08/07 నవమి బుధ అశ్వినీ వివాహం మకరం మార్తాండ రహితం రా.8:01. బుధ/గురు మేషం రాత్రి 1:31.ఆషాఢ మాసంసీమంత, పుంసవన, వాస్తు తదితరాలకు అత్యవసర ముహూర్తాలు 15/07 పాడ్యమి బుధ పుష్యమీ కర్కాటకం ఉ.7:30 19/07 షష్ఠి ఆది ఉత్తర ధనుస్సు సా.6:00.20/07 సప్తమి సోమ హస్త ధనుస్సు సా.6:00.22/07 నవమి బుధ స్వాతి ధనుస్సు సా.5:30.24/07 ఏకాదశీ శుక్ర అనురాధ ధనుస్సు సా.5:30.29/07 పౌర్ణమి బుధ శ్రవణం ధనుస్సు సా.5:00.30/07 పాడ్యమి గురు శ్రవణం ధనుస్సు సా.5:00.31/07 విదియ శుక్ర ధనిష్ఠ ధనుస్సు సా.5:00.08/08 ఏకాదశీ శని మృగశిర ధనుస్సు సా.4:30.19/07 షష్ఠి ఆది ఉత్తర తుల ప.11:55.24/07 ఏకాదశీ శుక్ర అనురాధ తుల ప.11:50.30/07 పాడ్యమి గురు శ్రవణం తుల ప.11:50.31/07 విదియ శుక్ర ధనిçష్ఠ తుల ప.11:50.08/08 దశమి శని రోహిణి తుల ప.11:50.శ్రావణ మాసం15/08 తదియ శని ఉత్తర నిశ్చితార్థం, అన్న, అక్షర, వ్యాపార, సీమంత, పుంసవన, వివాహ, శంకు, బోరింగ్లకు తుల ప.గం.12:00 (12చం/శు)16/08 చవితి ఆది హస్త, అన్న, వ్యాపార, బోరింగ్, శంకు, సీమంత, పుంసవన, వివాహములకు తుల ప.గం.11:55. హస్త ఆది/సోమ వివాహం వృషభం రా.12:32.20/08 అష్టమి గురు అనురాధ తుల ప.గం.11:50. నవమి గురు/శుక్ర అనురాధ వివాహం వృషభం రా.గం.12:30 (7చం). వివాహ శంకు కర్కాటకం తె.గం.4:01.21/08 నవమి శుక్ర అనురాధ వివాహం, అన్న, అక్షర, బోరింగ్, వ్యాపారం, సీమంత, పుంసవన, నిశ్చితార్థం తుల ప.గం.11:34.22/08 ఏకాదశీ శని/ఆది మూల వివాహం శంకు కర్కాటకం తె.గం.4:30.26/08 త్రయోదశీ బుధ శ్రవణం అన్న అక్షరాది శుభాలకు తుల ప.గం.10:01. చతుర్దశి శ్రవణం వివాహం వృషభం రా.గం.11:50. వివాహం, శంకు కర్కాటకం రా.గం.4:16.27/08 పౌర్ణమి గురు ధనిష్ఠ సమస్త శుభాలకు తుల ప.గం.11:01. గృప్ర, వివాహం వృషభం రా.గం.11:50 28/08 పాడ్యమి శుక్ర శతభిషం సీమంతం వేడుకలకు నిశ్చితార్థములకు మకరం ప.గం.4:33. గృప్ర, వివాహం, వృషభం రా.గం.11:42. శుక్ర/శని వివాహ, శంకు, వ్యాపార, బోరింగ్లకు కర్కాటక తె.గం.3:20.30/08 తదియ ఆది ఉత్తరాభాద్ర తుల ఉ.గం.10:54 . వివాహం గృప్ర వృషభం రా.గం.11:34. శంకు, వివాహం, బోరింగ్ కర్కాటకం తె.గం.3:18. తె.గం.4:01. శుభాంశ.31/08 చవితి సోమ రేవతి తుల ఉ.గం.10:56. వృషభం రా.గం.11:30.01/09 పంచమి మంగళ/బుధ అశ్విని కర్కాటకం తె.గం.4:05. అద్భుతమైన ముహూర్తం.03/09 అష్టమి గురు/శుక్ర రోహిణి కర్కాటకం తె.గం.3:50.04/09 అష్టమి శుక్ర రోహిణి తుల ప.గం.10:39. నవమి శుక్ర/శని మృగశిర శంకు, బోరింగ్ తె.గం.3:50 కర్కాటకం.05/09 నవమి శని మృగశిర తుల ప.గం.10:35.06/09 ఏకాదశీ ఆది పున వృషభం రా.గం.11:11. ఆది/సోమ కర్కాటకం తె.గం.3:45 శుభాంశ.07/09 ఏకాదశీ సోమ పున తుల ప.గం.10:25.భాద్రపద మాసంఅన్నప్రాశన, జాతకర్మ, సీమంత, పుంసవన, నామకరణాదులకు ముహూర్తములు12/09 విదియ శని ఉత్తర తుల ప.గం.10:01.13/09 తదియ ఆది హస్త తుల ప.గం.10:03.14/09 చవితి సోమ చిత్త తుల ప.గం.9:50.16/09 షష్ఠి బుధ అనురాధ మేషం రా.గం.8:01.17/09 షష్ఠి గురు అనురాధ తుల ఉ.గం.9:10.21/09 దశమి సోమ ఉత్తరాషాఢ తుల ఉ.గం.9:00. ఏకాదశీ మేషం రా.8:81.24/09 త్రయోదశీ గురు ధనిష్ఠ తుల ఉ.గం.9:10. శతభిషం మేషం రా.గం.7:50.25/09 చతుర్దశీ శుక్ర శతభిషం తుల ఉ.గం.9:20.26/09 పౌర్ణిమ శని ఉ.భాద్ర మేషం రా.గం.7:55. ఆశ్వీయుజ మాసం11/10 శుద్ధ పాడ్యమి ఆది చిత్త నవరాత్రి కలశ స్థాపనలకు తుల ఉ.గం.6:40–7:00. వ్యాపారాదులకు నిశ్చితార్థం మేషం రా.7:29.12/10 విదియ సోమ స్వాతి వ్యాపారం అన్న, అక్షర, నిశ్చితార్థం తుల ఉ.గం.8:01. నిశ్చితార్థం సీమంత వేడుకలు మేషం రా.గం.7:00.14/10 చవితి బుధ అనురాధ అన్న, అక్షర, సీమంత, పుంసవన, నిశ్చితార్థం వృశ్చికం ఉ.గం.8:51. సీమంతాదులకు మేషం రా.గం.7:00.మూలా నక్షత్రం అక్షరాభ్యాస నక్షత్రాలలో లేదు తెలుసుకోండి.17/10 సప్తమి శని మూల త్రిరాత్ర దీక్ష కలశస్థాపనలకు వృశ్చికం ఉ.గం.8:30.18/10 దుర్గాష్టమీ సందర్భంగా వాహనపూజ, యంత్రపూజలకు ఉ.గం.9:30.19/10 మహానవమి సందర్భంగా వాహనపూజలు యంత్ర పూజలకు ఉ.గం.9:30.20/10 విజయదశమి సందర్భంగా వ్యాపారులకు పూజ సమయం ఉ.9:50సా.6:0021/10 దశమీ బుధ ధనిష్ఠ అన్న, సీమంత, పుంసవనలకు వృశ్చికం 8:35. ఏకాదశీ శతభిషం మేషం సా.6:30.22/10 ఏకాదశీ గురు శతభిషం అన్న సీమంత పుంసవన వృశ్చికం ఉ.గం.8:00.24/10 చతుర్దశీ శని ఉత్తరాభాద్ర మేషం రా.గం.6:50.25/10 పౌర్ణమి ఆది రేవతి మేషం రా.గం.6:50.28/10 తదియ బుధ రోహిణి వృషభం రా.గం.7:45.29/10 చవితి గురు మృగశిర వృషభం రా.గం.7:41 (వివాహ, గృప్ర, గర్భాదానం)30/10 పంచమి శుక్ర మృగశిర వృశ్చికం ఉ.7:40.01/11 సప్తమి ఆది పునర్వసు అన్న, అక్షర, శంకు, బోరింగ్, సీమంత, పుంసవన వృశ్చికం ఉ.గం.7:30.02/11 అష్టమి సోమ పుష్యమి వృశ్చికం ఉ.గం.7:30.05/11 ఏకాదశీ గురు ఉత్తర వృశ్చికం ఉ.7:30.07/11 ధ¯Œ తేరస్ పూజలకు మిథునం రా.గం.8:309:00.08/11 దీపావళి పూజలకు మిథునం రా.గం.8:35.కార్తీక మాసం11/11 విదియ బుధ అనురాధ అన్న, అక్షర, వైశ్యోపనయన, నిశ్చితార్థం, సీమంత, పుంసవన, వివాహం, బోరింగ్, శంకు, గృప్ర, వ్యాపారం వృశ్చికం ఉ.గం.7:08.12/11 చవితి గురు మూల వివాహం మిథునం రా.గం.9:31.13/11 చవితి శుక్ర మూల అన్న, అక్షర, వైశ్యోప నయన, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, వివాహం, బోరింగ్, ధనుర్లగ్న ఉ.గం.10:13.14/11 పంచమీ శని ఉత్తరాషాఢ వివాహం, నిశ్చితార్థం, వేడుక సీమంత, గృప్ర వషభం రా.గం.6:50. షష్ఠి వివాహం కర్కాటకం రా.గం.10:30. 15/11 షష్ఠి ఆది ఉత్తరాషాఢ అన్న, అక్షర, వైశ్యోప నయన, వివాహ, దేవ ప్రతిష్ఠ, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, వ్యాపార, బోరింగ్, శంకు, గృప్ర, వృశ్చికం ఉ.గం.6:52. నిశ్చితార్థం, వివాహం, గృప్ర వృషభం రా.గం.6:36. మిథునం రా.గం.9:22.16/11 సప్తమి సోమ శ్రవణం అన్న, అక్షర, వైశ్యోప నయనం, శంకు, బోరింగ్, వ్యాపార, సీమంత, ప్రతిష్ఠ వ్యాపారం వృశ్చికం ఉ.గం.6:45. వేడుక సీమంతం, వివాహం, వృషభం రా.గం.6:29. మిథునం రా.గం.9:15.18/11 నవమి బుధ శతభిషం వివాహం, గృప్ర, గర్భాదాన, నిశ్చితార్థం మిధునం రా.గం.7:55. వివాహం కర్కాటకం రా.గం.10:02.20/11 ఏకాదశీ శుక్ర, ఉత్తరాభాద్ర అన్న, అక్షర, సీమంత, పుంసవన, వైశ్యోపనయన, వివాహ, శంకు, గృప్ర, ప్రతిష్ఠ, వ్యాపారం ధనుస్సు ఉ.గం.9:39. ద్వాదశీ శుక్ర/శని రేవతీ శంకు వివాహం తుల తె.గం.5:30.21/11 ద్వాదశీ శని రేవతీ వివాహం గృప్ర మిథునం రా.గం.8:57. వివాహం కర్కాటకం రా.గం.9:47. త్రయోదశీ శని/ఆది శంకు వివాహం తుల తె.గం.5:30.22/11 త్రయోదశీ ఆది అశ్వినీ అన్న, అక్షర, వైశ్యోప నయన, సీమంత, పుంసవన, వివాహం, శంకు, బోరింగ్, వ్యాపారం, ధనుస్సు ఉ.గం.9:32. వివాహం, గృప్ర, గర్భాదానం మిథునం రా.గం.8:50.24/11 బ.పాడ్యమి మంగళ/బుధ రోహిణి వివాహం, శంకు, బోరింగ్ తుల తె.గం.5:16.25/11 పాడ్యమి బుధ రోహిణి అన్న, వివాహ, శంకు, గృప్ర, ప్రతిష్ఠ, వ్యాపార, సీమంత, పుంసవన, ధనుః ఉ.గం.9:23. వివాహ, సీమంత వేడుక, గృప్ర, మిథునం రా.గం.8:30. వివాహం కర్కాటకం రా.గం.9:31.26/11 విదియ గురు మృగశిర అన్న, అక్షర, వైశ్యోప నయన, ప్రతిష్ఠ, వివాహం, గృప్ర, మిథునం రా.గం.8:30. కర్కాటకం రా.గం.9:27.28/11 పంచమి శని/ఆది పుష్యమి శంకుస్థాపన తుల తె.గం.4:59.29/11 పంచమీ ఆది పుష్యమీ అన్న, అక్షర, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం, వైశ్యోపనయన, దేవప్రతిష్ఠ ధనుః ప.గం.9:0402/12 దశమి బుధ/గురు ఉత్తర శంకు/వివాహ, బోరింగ్, తుల తె.గం.4:44.03/12 దశమి గురు ఉత్తర అన్న, అక్షర, వైశ్యోపనయన, శంకు, గృప్ర, బోరింగ్, సీమంత, పుంసవన, నిశ్చితార్థం, వ్యాపార, దేవతాప్రతిష్ఠ, ధనుః ఉ.గం.8:53. హస్త వివాహం గర్భాదానం మిథునం రా.గం.8:01.04/12 ఏకాదశీ శుక్రవారం హస్త అన్న, అక్షర, వైశ్యోపనయనం, శంకు, ప్రతిష్ఠ, బోరింగ్, వ్యాపార, వివాహం, ధనుస్సు ఉ.గం.7:50. చిత్త గృప్ర ధనుస్సు రా.గం.9:57.మార్గశిర మాసం10/12 విదియ గురు మూల ధనుస్సు ఉ.గం.8:24. వివాహం మిథునం రా.గం.7:35.11/12 తదియ శుక్ర/శని ఉత్తరాషాఢ వివాహం బోరింగ్ తుల తె.గం.4:08.12/12 చవితి శని ఉత్తరాషాఢ వివాహం నిశ్చితార్థం గృప్ర మిథున రా.గం.7:26. శని/ఆది వివాహం శంకు తుల తె.గం.3:50.13/12 చవితి ఆది శ్రవణం ధనుస్సు ఉ.గం.7:10. పంచమి ఆది శ్రవణం వివాహం నిశ్చితార్థం మిథునం రా.గం.7:28. ఆది/సోమ వివాహం శంకు తుల తె.గం.3:50.14/12 పంచమి సోమ ధనిష్ఠ వివాహ, అన్న, అక్షర, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం, సీమంత, పుంసవన, నిశ్చితార్థం, ప్రతిష్ఠ, ధనుస్సు ఉ.గం.8:10. షష్ఠి వివాహం గృప్ర నిశ్చితార్థం మిథునం రా.గం.7:24.16/12 సప్తమి బుధ శతభిషం వివాహం, గృప్ర, శంకు, నిశ్చితార్థం, బోరింగ్, వ్యాపారం, అన్న అక్షర, సీమంత, పుంసవన, ధనుస్సు ఉ.గం.8:02.17/12 నవమి గురు/శుక్ర ఉత్తరాభాద్ర వివాహం తుల తె.గం.3:45 (6చం)18/12 దశమి శుక్ర/శని రేవతి వివాహం వృశ్చికం తె.గం.4:42.19/12 ఏకాదశీ శని/ఆది అశ్విని వివాహం వృశ్చికం తె.గం.4:38.22/12 చతుర్దశీ మంగళ/బుధ రోహిణి వివాహం గృప్ర వృశ్చికం తె.గం.4:26.25/12 తదియ శుక్ర/శని పుష్యమి గృప్ర వృశ్చికం తె.గం.4:11.27/12 పంచమి ఆది/సోమ మఘ వివాహం వృశ్చికం తె.గం.4:02.30/12 అష్టమి బుధ/గురు హస్త సమస్త శుభాలకు వృశ్చికం తె.గం.3:56.31/12 నవమి గురు/శుక్ర చిత్త సమస్త శుభాలకు వృశ్చికం తె.గం.3:53.01/01 దశమి శుక్ర/శని స్వాతి సమస్త శుభాలకు వృశ్చికం తె.గం.3:49పుష్య మాసంపగటికాల ముహూర్తములు తక్కువ ఉన్నాయి. విప్రాజ్ఞతో శిశువులకు అన్నప్రాశనలు పూర్తి చేసుకోండి. మేషలగ్నం మాత్రమే సీమంతాదులకు గ్రాహ్యం.09/01 విదియ శని శ్రవణం మేషం ప.గం.12:30.10/01 తదియ ఆది శ్రవణం మేషం ప.గం.12:30.11/01 చవితి సోమ ధనిష్ఠ మేషం ప.గం.12:20.14/01 సప్తమి గురు ఉత్తరాభాద్ర మేషం ప.గం.12:15.15/01 అష్టమి శుక్ర రేవతి మేషం ప.గం.12:15.16/01 నవమి శని అశ్విని మేషం ప.గం.12:05.22/01 పౌర్ణమి శుక్ర పుష్యమి మేషం ప.గం.12:00.27/01 షష్ఠి బుధ హస్త మేషం ప.గం.11:15.28/01 సప్తమి గురు చిత్త మేషం ప.గం.11:30.31/01 దశమి ఆది అనురాధ మేషం ప.గం.11:00.మాఘ మాసం08/02 విదియ సోమ శతభిషం అన్న, అక్షర (ఉప10ర) దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం, శంకు, బోరింగ్, సీమంత, పుంసవన మేషం ప.గం.11:28. తుల రా.గం.11:11.ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం బహుదోషం09/02 చవితి మంగళ / బుధ ఉత్తరాభాద్ర ధనుః తె.గం.4:30.10/02 చవితి బుధ ఉత్తరాభాద్ర మేషం ప.గం.11:20. తుల రా.గం.11:03. పంచమి బుధ/గురు ఉత్తరాభాద్ర వృశ్చికం రా.గం.1:08.11/02 పంచమి గురు రేవతి అన్న, అక్షర, అకాల వటు, ఉప, సీమంత, పుంసవన, నిశ్చితార్థం మేషం ప.గం.11:13. వషభం ప.గం.12:01. వివాహాదులకు తుల రాగం.12:04 నిశీధి. షష్ఠి గురు/శుక్ర రేవతీ వివాహం, గృప్ర వృశ్చికం రా.గం.1:01. అశ్విని వివాహం, బోరింగ్, శంకు ధనుస్సు తె.గం.3:13.12/02 షష్ఠి శుక్ర అశ్విని శంకు, బోరింగ్, నిశ్చితార్థం వివాహం (ఉప10ర) అన్న, అక్షర, సీమంత, పుంసవన ప్రతిష్ఠలకు మేషం ప.గం.11:13.14/02 నవమి ఆది/సోమ రోహిణి వివాహాదులకు వృశ్చికం రా.గం.2:01.15/02 నవమి సోమ రోహిణి, అన్న, అక్షర, ఉప, వివాహం, నిశ్చితార్థం, దేవతా ప్రతిష్ట, వ్యాపారం, శంకు, గృప్ర, అన్న, అక్షర మేషం ప.గం.11:01. వివాహం తుల రా.గం.11:30.17/02 ఏకాదశీ బుధ ఆర్ద్ర మేషం ప.గం.10:50. ద్వాదశీ బుధ పునర్వసు గర్భాదానం తుల రా.గం.11:43.18/02 ద్వాదశీ గురు పునర్వసు అన్న, సీమంత పుంసవన, శంకు బోరింగ్లకు వృషభం ప.గం.11:45. త్రయోదశీ పుష్యమి గృప్ర, గర్భాదానం వృశ్చికం రా.గం.12:33.19/02 చతుర్దశీ పుష్యమి శుక్ర అన్న, శంకు, బోరింగ్, సీమంత, పుంసవన, వృషభం ప.గం.11:46.20/02 పౌర్ణమి శని మఘ వివాహం తుల రా.గం.11:29.21/02 పౌర్ణమి శని మఘ వివాహం వృషభం ప.గం.12:01.22/02 విదియ సోమ ఉత్తర వివాహం తుల రా.గం.11:20. పూర్ణచంద్రుడు + సోమవారం దోషం కాదు.25/02 పంచమి గురు చిత్త అన్న, అక్షర, శంకు, గృప్ర, నిశ్చితార్థం, సీమంత, ఉప, పుంసవన ప్రతిష్ఠ, వ్యాపారం వృషభం ఉ.గం.11:52. స్వాతీ వివాహం తుల రా.గం.11:01. ధనుస్సు రా.గం.3:21. వృశ్చికం రా.గం.12:10.26/02 షష్ఠి శుక్ర స్వాతి వషభం అగ్నిపంచకం ప.గం.11:44.27/02 సప్తమి శని అనురాధ తుల అగ్నిపంచకం రా.గం.11:04. వివాహం, గృప్ర వృశ్చికం రా.గం.12:10. అష్టమి శని/ఆది అనురాధ వివాహ, గృప్ర, శంకు, ధనుః రా.తె.గం.3:13.ఫాల్గుణ మాసం 10/03 విదియ బుధ రేవతి నిశ్చితార్థం వృషభం ప.11:01. తదియ బుధ రేవతి వివాహం గర్భాదానం తుల రా.గం.10:19 వివాహ గృప్ర వృశ్చికం రా.గం.11:16.11/03 తదియ గురు రేవతి అన్న, అక్షర, వివాహ, శంకు, బోరింగ్, వ్యాపార, సీమంత, పుంసవన నిశ్చితార్థ, ప్రతిష్ఠ మేషం ఉ.గం.9:21. అశ్విని వృషభం ఉ.గం.11:30. చవితి గురు అశ్విని వివాహం తుల రా.గం.10:15. వృశ్చికం రా.గం.11:12.12/03 చవితి శుక్ర అశ్విని అన్న, వివాహ, శంకు, బోరింగ్, సీమంతం, పుంసవనం, నిశ్చితార్థం, ప్రతిష్ఠలకు వృషభం ఉ.గం.10:20 మార్తాండ రహితం.14/03 షష్టి ఆది రోహిణి వివాహ, గృప్ర, నిశ్చితార్థం, సీమంత, పుంసవన (ఉపనయన 10ర) అన్న, అక్షర, దేవతా ప్రతిష్ఠ, బోరింగ్, శంకు, వృషభం ఉ.గం.10:44. సప్తమి ఆది రోహిణి వివాహ గృప్ర రా.గం.12:12.15/03 సప్తమి సోమ మృగశిర సమస్త శుభాలకు, వాస్తు కర్మలకు ప్రతిష్ఠలకు మేషం ఉ.గం.09:01.17/03 దశమి బుధ పునర్వసు అన్న, అక్షర, అత్యవసర ఉప సీమంతం పుంసవనం, శంకు, బోరింగ్లకు మేషం ఉ.గం.8:49 వృషభం ఉ.గం.10:30.18/03 ఏకాదశీ గురు పుష్యమి అన్న, అక్షర, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, ప్రతిష్ట, శంకు, బోరింగ్, వ్యాపార, మేషం ఉ.గం.8:45. గృప్ర, గర్భాదానం వృశ్చికం రా.గం.10:40 (సగ్రహచంద్ర)20/03 త్రయోదశీ శని మఘ వివాహం వృషభం ఉ.గం.10:15. చతుర్దశీ మఘ వివాహం వృశ్చికం రా.గం.10:35.21/03 పౌర్ణమి ఆది ఉత్తర వివాహం గృప్ర వృశ్చికం రా.గం.10:30.22/03 పౌర్ణమి సోమ ఉత్తర అన్న, వివాహం, సీమంత, పుంసవన, నిశ్చితార్థ, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం మేషం ఉ.గం.8:36. వృషభం ఉ.గం.10:06. బ.పాడ్యమి సోమ హస్త తుల రా.గం.9:21. వృశ్చికం రా.గం.10:24.24/03 విదియ బుధ చిత్త అన్న, అక్షర, ఉప, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం, వషభం ఉ.గం.9:59. తదియ బుధ స్వాతి వివాహ, వృశ్చికం రా.గం.10:16.25/03 తదియ గురు స్వాతి వివాహాది మేషం ఉ.గం.8:28. వృషభం ఉ.గం.9:30.26/03 పంచమి శుక్ర అనురాధ వృశ్చికం రా.గం.10:30.27/03 పంచమి శని అనురాధ వృషభం ఉ.గం.9:51. షష్ఠి శని వృశ్చికం రా.గం.10:30.29/03 సప్తమి సోమ మూల వృషభం ఉ.గం.9:44. తుల రా.గం.8:56.31/03 నవమి బుధ ఉత్తరాషాఢ çవృషభం ఉ.గం.9:40. దశమి వృశ్చికం రా.గం.10:01.01/04 దశమి గురు శ్రవణం వృషభం ఉ.గం.9:28. వృశ్చికం రా.గం.9:45. -పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336
భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం మీనమాస పూజలు
ఆ మణికంఠుని అపార కృపాకటాక్షాలతో, అత్యంత పవిత్రమైన మీనమాస పూజలు, శబరిమల ఉత్సవం 2026 కొరకు అయ్యప్ప సన్నిధాన ద్వారాలు తెరుచుకున్నాయి. "స్వామియే శరణం అయ్యప్ప" అనే నామస్మరణతో ఆ దివ్య దర్శనానికి తరలి వెళ్దాం.మీనమాస పూజల షెడ్యూల్నడ తెరిచే సమయం: మార్చి 14, 2026 (శనివారం) సాయంత్రం 5:00 గంటలకు.నడ మూసివేత: మార్చి 19, 2026 (గురువారం) రాత్రి 10:00 గంటలకు (అత్తాజ పూజ, హరివరాసనం అనంతరం).శబరిమల ఉత్సవం, పంగుని ఉత్తరం 2026వార్షిక ఉత్సవాల నిమిత్తం మార్చి 22 సాయంత్రం 5:00 గంటలకు ఆలయ ద్వారాలు తిరిగి తెరవబడతాయి.మార్చి 23: కొడియేట్టు (ధ్వజారోహణం)మార్చి 24: ఉత్సవ బలిమార్చి 31: పళ్ళివేట (రాజవేట)ఏప్రిల్ 01: పంపా ఆరాట్టు & పంగుని ఉత్తరం – భగవాన్ అయ్యప్ప స్వామి వారి దివ్య జన్మదినోత్సవం.ముగింపు: ఏప్రిల్ 1, 2026.ఏప్రిల్ 1వ తేదీన సన్నిధానం ఉదయం 5:00 నుండి 8:00 వరకు మాత్రమే తెరవబడుతుంది. తిరిగి పంపా ఆరాట్టు ముగిసిన తర్వాత సాయంత్రం 6:00 గంటలకు తెరిచి, రాత్రి 10:00 గంటలకు మూసివేస్తారు.(చదవండి: మహిళల శబరిమల..! ఆటుకాల్ భగవతి)
వడగండ్లా... బండరాళ్లా...
పిల్లలూ...వడగండ్ల వాన అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. మన దేశంలో వేసవిలో ఎక్కువ పడుతుంటుంది. చిన్న చిన్న గోలీల వంటి వడగళ్లు (Hailstones) పడుతుంటాయి. కొన్ని చోట్ల ఇంకాస్త పెద్ద వడగండ్లు పడుతుంటాయి. వడగండ్లు ఎందుకు పడతాయి? వడగళ్ల వర్షానికి ప్రధాన కారణం వాతావరణంలో ఎత్తులో ఉండే మేఘాలు. భూమి ఎక్కువగా వేడెక్కి, ఆ వేడిగాలి తేమతో సహా బాగా ఎత్తుకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఏర్పడే మేఘాలను క్యుములోనింబస్ మేఘాలు అంటారు.అంతటి ఎత్తులో ఆ మేఘాల్లోని తేమ వల్ల చిన్న చిన్న మంచు ముక్కలతో కూడిన ఫలకాలు ఏర్పడతాయి. అక్కడ గాలులు కిందకూ, పైకి కదులుతూ ఉండటం వల్ల ఫలకాలుగా ఉన్న మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటాయి. అప్పుడు ఆ ఫలకాలు మంచు ముక్కలుగా విడిపోయి నేలపై పడతాయి. ఇలా కురిసే వాననే మనం వడగళ్ల వాన అంటాం.ఇదీ చదవండి: షాకింగ్ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్షఅయితే అమెరికాలోని ఇలినాయిస్లో ఎంత పెద్ద వడగండ్లు పడ్డాయో. ఒక్కోటి పెద్ద రాయంత ఉంది. నాలుగు అంగుళాల వెడల్పుతో ఉంది. కంకాకీలో 6 అంగుళాల వడగళ్లను గుర్తించారు. రాష్ట్రంలోనే ఒక కొత్త రికార్డు వడగండ్లుగా NWS బుధవారం తెలిపింది. అందుకే వడగండ్ల వానలో చిక్కుకుని చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఇదీ చదవండి: ఆరు వేళ్లు.. నెతన్యాహూ సేఫేనా? రూమర్లు హల్చల్(మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్)
రసభరితం : 40 రసాల మాధుర్యం
సాధారణంగా పెద్దలు మనకు నవరసాల చాతుర్యం గురించి చెబుతుంటారు. సంధ్య రాణి లింగ చెప్పే 40 రసాల మాధుర్యం గురించీ తప్పక తెలుసు కోవాల్సిందే! తెలుగు రాష్ట్రాలలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయ రసాల తయారీ గురించి ‘ఫ్రమ్ మై కిచెన్ టు యువర్స్’ బుక్ ద్వారా వివరించారు సంధ్య రాణి లింగ. ఐదు తరాల నుంచి వచ్చిన వారసత్వ వంటలు, వాటి వెనక వెనక దాగి ఉన్న సాంస్కృతిక కథనాలనూ పరిచయం చేస్తున్నారు. హైదరాబాద్ వాసి సంధ్య లింగ చెబుతున్న తెలుగింటి వారసత్వ వంటకాల పరిచయం గురించి ఆమె మాటల్లోనే... ‘‘వంట చేయడం, వడ్డించడమే కాదు కొత్త రుచులను సృష్టించడమూ చాలా ఇష్టం. పుట్టింటి–అత్తింటివారసత్వ వంటకాలను, మూలాలను మర్చిపోకుండా ముందు తరాలకు అందించాలన్నది నా ఆలోచన. ఆ ప్రయత్నమే ఇలా మీ అందరి ముందుకు వచ్చేలా చేసింది. రోజూ పండగే! రసం అనేది భోజనంలోకి ఉపయోగించే వంటకం మాత్రమే కాదు. అనారోగ్యంలో ఉపశమనం ఇచ్చే ఔషధం కూడా. రసాలు, వాటిలో ఉపయోగించే మసాలాలు కూడా విభిన్నమే. సికింద్రాబాద్లోని లింగ పేరుతో ఉండే ఉమ్మడి కుటుంబం మాది. మా మామయ్య వాళ్లు ఎనిమిది మంది అన్నదమ్ములు. అందరూ కుటుంబాలతో కలిసే ఉండేవారు. నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టేనాటికి యాభైమందికి పైగా ఉండేవాళ్లు. అందరికీ కలిపి ఒకే వంటగది. అక్కడ ఉదయం లేచింది మొదలు రోజూ పదిహేను మంది వంటల తయారీలోనే ఉండేవారు. మా అత్తగారు వారి పుట్టింటి నుంచి నేర్చుకున్న వంటకాలతోపాటు, మిగతా కోడళ్లందరమూ కలిసి వంటలలో ఎన్నో వెరైటీలు చేసేవాళ్లం. ప్రతిరోజూ పండగ వాతావరణం లాగే ఉండేది. కొబ్బరి చారు, కట్టుచారు, చుక్కకూర, బలుసాకు, పాలక్, క్యాలీఫ్లవర్, పప్పులతో రసాలు, నిమ్మ, ఉసిరి, ఉల్లి, టొమాటో ... ఇలాంటి ఒక్కోప్రత్యేక కూరగాయలు, ఆకుకూరలతో 40 రకాల రసాలు ఉంటాయి. వీటిని నేరుగా సూప్గా సేవించవచ్చు. ప్రయోగాల వంటిల్లు... పిల్లల చిన్నతనంలో ఉమ్మడి కుటుంబం నుంచి మేం విడిగా జూబ్లీహిల్స్కు వచ్చేశాం. అప్పటివరకు నేర్చుకున్నవే చేసేదాన్ని. అయితే, పిల్లలు కూరగాయలతో చేసిన వంటకాలను తినడానికి ఇష్టపడేవారు కాదు. దీంతో ప్రతి కూరగాయ, ఆకుకూరతో రసాలు చేయడం మొదలుపెట్టాను. వాటిలో మా అత్తగారు, అమ్మ చెప్పిన దినుసులను నోట్ చేసుకున్నాను. నెలలో నేను 40 రసాలు చేసేదాన్ని. పిల్లలు బాగా ఇష్టపడేవారు. దూరంగా ఉండే బంధువులు కూడా ఈ రసాల తయారీ గురించి అడిగేవారు. మా కూతురు నిఖిత ‘చాలా హెల్తీగా, కొత్తగా వంటలు చేస్తావు కదా, బుక్ తీసుకురావచ్చు కదమ్మా’ అనేది. బంధువులు కూడా చెప్పేవారు. కానీ, పిల్లలకు పెళ్లిళ్లు అయ్యి, వారి జీవితాల్లో స్థిరపడటంలో ఆ ఆలోచన పక్కకు వెళ్లిపోయింది. ఇదీ చదవండి: కోడలు వచ్చాక, తను నా వంటకాల రుచిని ఆస్వాదించడంతో పాటు వంటల బుక్ ఆలోచనను తీసుకువచ్చింది. మొత్తం రాసుకున్నాక, రెండు రోజులు ఫోటోషూట్ చేశాం. దీని నిర్వహణ అంతా ప్రియే చూసుకుంది. ఈ తరం వాళ్లకు ఇన్ని రసాలు ఉంటాయని తెలియదు. వారు స్వయంగా తెలుసుకొని, చేసుకునే విధంగా సిద్ధం చేశాం. దీనిని కిందేటేడాది తీసుకువచ్చాం.పండగకు ప్రత్యేకం... తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ఒక్కో పండగకు ఒక్కో ప్రత్యేకరసాలు, వంటకాల తయారీలు ఉంటాయి. ఇక ఊరగాయలు, రోటి పచ్చళ్లు, పులావ్, బిర్యానీలలో విభిన్న రుచులు ఉన్నాయి. అలాగే, తెలుగు ప్రాతాల్లోని మూలాల్లోకి వెళితే చాలా వైవిధ్యమైన వంటకాలు పరిచయం అవుతాయి. వాటిని అందించడానికి ప్రిపరేషన్ మొదలుపెట్టాను’’ అని వివరించారు ఈ పాకశాస్త్ర నిపుణురాలు.వంటే ఔషధంగా...‘మా అత్తమ్మ ఆలోచనలు చాలా మోడర్న్గా ఉంటాయి. తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని, వారసత్వ వంటకాలు ముందు తరాలకు పరిచయం చేస్తే బాగుంటుందనుకున్నాం. సోషల్ మీడియాలో చూస్తే చాలా వంటకాలు కనిపిస్తాయి. కానీ, వాటిలో వారసత్వ వంటకాల గురించి, వంట మెడిసిన్లా ఎలా ఉపయోగపడుతుందో అంత వివరంగా చెప్పలేక΄ోతున్నారు. అందుకే, మేం కలిసి ఈ ప్రయత్నం చేశాం. – ప్రియ, కోడలు – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
అంతర్జాతీయం
మొజ్తబా ఖమేనీ ముఖం చిద్రమైందా?
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఇరాన్ ప్రభుత్వం తెరదించింది. మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ తీవ్రంగా ఖండించారు. తాజాగా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని, ఆయన క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు.అమెరికా అనుమానం ఏంటి?అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇటీవల ఇరాన్ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్-అమెరికా జరిపిన దాడుల్లో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, అందుకే ఆయన కేవలం రాతపూర్వక సందేశాలకే పరిమితమవుతున్నారని హెగ్సెత్ ఆరోపించారు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నా, మొజ్తబా వీడియో లేదా ఆడియో సందేశం ద్వారా ప్రజల ముందుకు రాకపోవడం వెనుక ఏదో రహస్యం ఉందంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు.హోర్ముజ్ జలసంధిపై కీలక ప్రకటనఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ మరో కీలక విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ అందరికీ మూసివేయలేదని క్లారిటీ ఇచ్చారు. కేవలం తమను అటాక్ చేస్తున్న శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు మాత్రమే ప్రవేశం లేదని, మిగిలిన దేశాల నౌకలు యధావిధిగా రాకపోకలు సాగించవచ్చని స్పష్టం చేశారు.ముదురుతున్న ఉద్రిక్తతలుఒకవైపు టెహ్రాన్లో ప్రభుత్వానికి మద్దతుగా భారీ ర్యాలీలు జరుగుతుండగా, మరోవైపు ఇరాన్ తన డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్తో పాటు కొన్ని గల్ఫ్ దేశాలపై దాడులు ముమ్మరం చేసింది. ఇక లెబనాన్లో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. దక్షిణ లెబనాన్లోని ఆరోగ్య కేంద్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 12 మంది వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరంగా మారింది. ఇది కూడా చదవండి: ట్రంప్ విధ్వంసం: ‘క్రౌన్ జ్యువెల్’పై భీకర దాడి
సిగరెట్ ఫ్యాక్టరీపై మిసైల్ దాడి.. 15 మంది మృతి
టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్పై మరోసారి ఇజ్రాయెల్ భారీ అటాక్ చేసింది. ఈ దాడిలో 15 మంది కార్మికులు మృతి చెందినట్లు టెహ్రాన్ ప్రకటించింది.ఇరాన్పై యుద్ధం మెుదలై దాదాపు 15 రోజులు కావస్తుంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ దాదాపు రెండు వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు తెలిపాయి. వారిలో అత్యధిక మంది టెహ్రాన్కు చెందిన ప్రజలే. అయితే ఈ యుద్దం ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నా యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఇరాన్లోని ఇస్ఫాహాన్ నగరంపై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకపడింది. ఈ దాడిలో 15 మందికి పైగా మృతిచెందారు.ఇస్ఫాహాన్ నగరంలో రిఫ్రిజిరేటర్లు, హీటర్లు తయారుచేసే ఓ ఫ్యాక్టరీపై ఈ దాడులు జరిగినట్లు ఆ దేశ పత్రికా కథనాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో అందులో కార్మికులు విధులు నిర్వహిస్తుండడంతో పెద్దఎత్తున మరణాలు సంభవించాయని తెలిపాయి. అయితే ఇటీవల ఖర్గే ద్వీపంపై అమెరికా దాడి చేసిన తర్వాతే ఈ క్షిపణి అటాక్ జరిగింది. అయితే దీనికి ఘాటుగా బదులిస్తామని ఇరాన్ హెచ్చరించింది.అయితే పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఇప్పట్లో సద్ధుమణిగేలా కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇది వరకే ఇరాన్ రక్షణ వ్యవస్థను పూర్తిగా నిర్విర్యం చేశామని ప్రకటించారు. ఇరాన్ సైతం ఎక్కడా తగ్గట్లేదు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది.అయితే ట్రంప్ ఇటీవలే హార్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు రక్షణ కల్పించే విధంగా వివిధ దేశాలు తమ యుద్ధ నౌకలు అక్కడికి పంపించాలని కోరారు. అయితే ఇరాన్ సైతం ఎక్కడా తగ్గడం లేదు. తమ అనుమతి లేకుండా ఈ జలసంధి గుండా ప్రయాణిస్తే వాణిజ్య నౌకలు పేల్చివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యుద్ధం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత యుద్ధనౌకల మోహరింపు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ సమీపంలో భారత నావికాదళానికి చెందిన పలు యుద్ధనౌకలను మోహరించారు. అవసరమైనప్పుడు వాణిజ్య నౌకలకు సహాయం అందించేందుకు భారత నావికాదళ యుద్ధనౌకలు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.అంతకుముందు శనివారం, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) రవాణా చేస్తున్న రెండు భారత నౌకలకు ఇరాన్ అధికారులు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. వాటిలో ఒక నౌక ‘శివాలిక్’. నౌకా ట్రాఫిక్ పర్యవేక్షణ వెబ్సైట్ సమాచారం ప్రకారం, ఈ నౌక చివరిసారిగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో ఉన్నట్లు నమోదైంది. మార్చి 21 నాటికి అది తన గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సముద్ర పరిస్థితులు, అలాగే భారతీయ నావికులు, నౌకల భద్రతను నిర్ధారించేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తాజా వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 668 మంది నావికులతో 24 భారత నౌకలు ప్రయాణిస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే హోర్ముజ్ జలసంధికి తూర్పు భాగంలో ఉన్న మూడు నౌకల్లో 76 మంది భారతీయ నావికులు ఉన్నట్లు పేర్కొంది.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, నౌక యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, విదేశాల్లోని భారత మిషన్లతో సమన్వయం కొనసాగిస్తూ అన్ని భారత నౌకలు, సిబ్బందిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 24 గంటల కంట్రోల్ రూమ్ ప్రారంభించినప్పటి నుంచి డీజీ షిప్పింగ్ మొత్తం 2,425 కాల్స్, 4,441 ఈమెయిళ్లను పరిష్కరించిందని తెలిపింది. అంతేకాకుండా చిక్కుకుపోయిన 223 మందికిపైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ మధ్య హోర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలకు సురక్షిత మార్గం కల్పిస్తామని భారతదేశంలోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీ ధ్రువీకరించారు. భారత్తో ఉన్న దీర్ఘకాల స్నేహం, పరస్పర ప్రయోజనాలను ఆయన ప్రస్తావించారు.
‘ఒక్క మిసైల్తో లేపేస్తాం’.. కిమ్ వైరల్ వార్నింగ్ నిజమేనా?
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రోజురోజుకూ ఉధృతమవుతోంది. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్ వణికిపోతోంది. ఇదిలా ఉండగా ఈ యుద్ధం గురించి సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.‘డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఇరాన్తో యుద్ధం చేస్తున్నారంటే, ఆ దేశం తనకు ఎదురు నిలవలేదని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఆయన నా దేశం ఉత్తర కొరియాను కానీ, చైనా, రష్యాను కానీ రెచ్చగొట్టే ధైర్యం చేయడు, ఎందుకంటే మా శక్తి, క్షిపణుల గురించి ఆయనకు బాగా తెలుసు.ఒక్క క్షిపణితో అమెరికా మొత్తాన్ని అదృశ్యం చేయగల సామర్థ్యం మాకు ఉంది. ఏ దేశాలైతే బదులు ఇవ్వలేవని అతడు (ట్రంప్) నమ్ముతాడో ఆ దేశాలతో విభేదాలను కోరుకుంటాడు.కానీ ఇరాన్ నిజంగా అనుకుంటే, అది అమెరికాపై పెద్ద ఎత్తున బాంబు దాడి చేయగలదు. ఇది చాలా పెద్ద సంఖ్యలో అమెరికన్ పౌరుల మరణానికి కారణమవుతుందని వారు భయపడుతున్నారు. బెదిరింపులు శక్తిని నిరూపించవు. ఒక దేశం నిజమైన గొప్పతనం శాంతి, న్యాయం, మానవ జీవితం పట్ల గౌరవంలో కనిపిస్తుంది’ అని కిమ్ వ్యాఖ్యానించినట్లుగా ఆయా వార్తల్లో ఉంది.అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చేసినట్లుగా ఎలాంటి ధ్రువీకరణలు లేవు. అటు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ అయిన కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) కానీ, ఇటు ఇతర ప్రామాణిక అంతర్జాతీయ వార్తా సంస్థల నుంచి దీని గురించి ప్రస్తావన లేదు.
జాతీయం
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అక్కడి రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని తమ గూటికి చేర్చుకునేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసింది. ‘ఇండియా టుడే’ పేర్కొన్న సమాచారం ప్రకారం విజయ్ పార్టీతో బీజేపీ జరుపుతున్న చర్చలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి.బంపర్ ఆఫర్.. కానీ మెలిక!ఈ పొత్తులో భాగంగా విజయ్కి బీజేపీ కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో చేరితే విజయ్కి ఏకంగా ‘డిప్యూటీ సీఎం’ పదవితో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 80 సీట్లు కేటాయిస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ మాత్రం నేరుగా ‘ముఖ్యమంత్రి’ పీఠంపైనే కన్నేసినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు కంటే సీఎం కుర్చీ కారణంగా చర్చలు ప్రస్తుతం ఒక కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది.రంగంలోకి పొరుగు రాష్ట్ర డిప్యూటీ సీఎం..విజయ్ను ఎన్డీయే కూటమిలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా పక్క రాష్ట్రానికి చెందిన ఒక ఉప ముఖ్యమంత్రిని మధ్యవర్తిగా రంగంలోకి దింపినట్లు సమాచారం. విజయ్తో నేరుగా మంతనాలు జరిపే బాధ్యతను సదరు నేతకు అప్పగించినట్లు తెలుస్తోంది. విజయ్కి ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఎన్నికల్లో అత్యంత కీలకం కానుంది. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపోటములు మారిపోయే తమిళనాడు రాజకీయాల్లో, విజయ్ క్రేజ్ తమకు కలిసొస్తుందని బీజేపీ వ్యూహకర్తలు గట్టిగా నమ్ముతున్నారు.విజయ్ క్యాంపులో అంతర్మథనంమరోవైపు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై విజయ్ సన్నిహితుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని స్థాపించిన కొత్తలోనే ఒక జాతీయ పార్టీతో చేతులు కలిపితే, స్వతంత్ర ప్రత్యామ్నాయంగా తాము నిర్మించుకున్న ఇమేజ్ దెబ్బతింటుందని కొందరు సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ఒక కొత్త మార్గంలో మొదలుపెట్టిన తరుణంలో, ఈ కూటమి నిర్ణయం పార్టీ విశ్వసనీయతను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి ‘దళపతి’ వేసే తదుపరి అడుగు తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ట్రంప్ కోడలా మజాకా.. షాకిస్తున్న ఐదు సంచలనాలు..
ఐదు రాష్టాల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్?
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.కాగా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో సింగిల్ ఫేస్లో ఎన్నికలు జరగనుండగా పశ్చిమ బెంగాల్, అస్సాంలో పలు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఇది వరకే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్నికల కమిషన్ ప్రకటన నేపథ్యంలో దేశ రాజకీయాలు వేడెక్కనున్నాయి.
భారీ ఎన్కౌంటర్.. పాక్ ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం మరోసారి తన శౌర్యాన్ని చూపింది. బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఒక పాక్ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఆపరేషన్లో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు కలిసి ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు.అసలేం జరిగిందంటే?ఉరి సెక్టార్లోని బుచ్చార్ ప్రాంతం గుండా ఉగ్రవాదులు సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన సైన్యం, మార్చి 14-15 మధ్య రాత్రి ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో పొదల్లో నక్కిన ఉగ్రవాదుల కదలికలను గమనించిన జవాన్లు వారిని హెచ్చరించారు. భద్రతా దళాలపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా, ఎదురుకాల్పుల్లో ఒక పాక్ ఉగ్రవాది హతమయ్యాడు. ఘటనా స్థలం నుంచి ఏకే రైఫిల్, పిస్టల్స్, భారీగా మందుగుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా నక్కి ఉన్నారేమోనన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. #𝗪𝗵𝗶𝘁𝗲𝗞𝗻𝗶𝗴𝗵𝘁𝗖𝗼𝗿𝗽𝘀 | #𝗢𝗽𝗦𝗛𝗘𝗥𝗜𝗞𝗔𝗟𝗔𝗡 | #𝗦𝘂𝗽𝗿𝗲𝗺𝗲𝗦𝗮𝗰𝗿𝗶𝗳𝗶𝗰𝗲While operating in the challenging and rugged terrain during prolonged operations in the general area of Poonch, as part of Operation Sheri Kalan, today at about 2.30 pm, Subedar… pic.twitter.com/qG2fPiBhro— White Knight Corps (@Whiteknight_IA) March 14, 2026విధి నిర్వహణలో జేసీవో వీరమరణంమరోవైపు పూంచ్ జిల్లాలో చేపట్టిన ‘ఆపరేషన్ షేరీ కలాన్’లో ఒక విషాదం చోటుచేసుకుంది. అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో విధి నిర్వహణలో ఉన్న జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సుబేదార్ సందీప్ కుమార్ ధాకా ప్రమాదవశాత్తు జారి పడిపోయారు. వెంటనే ఆయనను పోతాలోని మిలిటరీ ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన వీరమరణం పొందారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ ధీర జవానుకు వైట్ నైట్ కోర్ప్స్ ఘన నివాళులు అర్పించింది.ఇది కూడా చదవండి: ‘ఆ ఇళ్లలో సిలిండర్లు కనిపిస్తే చర్యలు’
‘ఆ ఇళ్లలో సిలిండర్లు కనిపిస్తే చర్యలు’
న్యూఢిల్లీ: దేశంలోని వంటగ్యాస్ వినియోగదారులకు సంబంధించి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)కనెక్షన్ ఉన్న ఇళ్లలో డొమెస్టిక్ ఎల్పీజీ (ఎల్పీజీ)సిలిండర్లను ఉంచుకోవడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. గ్లోబల్ మార్కెట్లో ఇంధన సరఫరాలో తలెత్తుతున్న ఒడిదుడుకుల దృష్ట్యా, జాతీయ ఇంధన నిల్వలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది.సవరించిన కొత్త నిబంధనలివేలిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఉత్తర్వులను సవరిస్తూ కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పీఎన్జీ సౌకర్యం ఉన్న ఇళ్లకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వకూడదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న సిలిండర్లను రీఫిల్ చేయడంపై కూడా నిషేధం విధించారు. పీఎన్జీ వాడుతున్న వారు తమ వద్ద ఉన్న ఎల్పీజీ సిలిండర్లను తక్షణమే సంబంధిత కంపెనీలకు అప్పగించాల్సి ఉంటుంది.ఎందుకీ కఠిన నిర్ణయం?మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ వద్ద తలెత్తిన అడ్డంకులు అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ఎల్పీజీ అవసరాల కోసం దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో, దేశీయ అవసరాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పీఎన్జీ కనెక్షన్లు ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.పెట్రోల్, డీజిల్ నిల్వలపై నిఘామరోవైపు పెట్రోల్ లేదా డీజిల్ను బాటిళ్లు, డబ్బాలు వంటి అనధికారిక కంటైనర్లలో నిల్వ చేయవద్దని మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఇలా చేయడం వల్ల తీవ్రమైన భద్రతా ముప్పులు పొంచి ఉంటాయని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించి విడి డబ్బాల్లో పెట్రోల్ పోసిన తమిళనాడులోని ఒక పెట్రోల్ బంకుపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.ఆందోళన వద్దు.. నిల్వలు పుష్కలం!దేశంలో ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెంది ముందస్తుగా కొనుగోలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. గృహ అవసరాలకు, రవాణా రంగానికి 100 శాతం గ్యాస్ సరఫరాను నిర్ధారిస్తూ ‘నేచురల్ గ్యాస్ కంట్రోల్ ఆర్డర్’ జారీ చేశారు. పరిశ్రమలకు మాత్రం సరఫరాను 80 శాతానికి పరిమితం చేశారు. ప్రస్తుతం దేశం పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా ఉందని, దేశవ్యాప్తంగా ఉన్న లక్షకు పైగా రిటైల్ అవుట్లెట్లలో ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నదని ప్రభుత్వం తెలిపింది.ఇది కూడా చదవండి: ప్రయాణికులకు విజ్ఞప్తి: ‘వందేభారత్’ ఎక్కుతున్నారా?
ఎన్ఆర్ఐ
వాషింగ్టన్ డీసీలో శంకర నేత్రాలయ నిధుల సేకణ కార్యక్రమం
గతేడాది డిసెంబర్ 6. 2025న వాషింగ్టన్ డి.సి. మెట్రో ప్రాంతంలో నిర్వహించిన శంకర నేత్రాలయ (SN) నిధుల సేకరణ కార్యక్రమం విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మక నేత్ర వైద్య సంస్థ కోసం మొత్తం $150,000 నిధులు సమీకరించారు. సంస్కృతి,కరుణను ప్రతిబింబించే ఈ వేడుకకు చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రమణ రెడ్డి మడ్డికుంట CapEx సభ్యుడు తిరుమల రెడ్డి మునుకుంట్ల నాయకత్వం వహించారు.ఆ సాయంత్రం థీమ్ కరుణ ప్రతిధ్వనులు: కళ హృదయాన్ని కలిసే స్థలం (Echoes of Compassion: Where Art Meets Heart)గా నిర్వహించబడింది. శాస్త్రీయ మరియు సాంప్రదాయ నృత్య కళలతో సేవా భావాన్ని మేళవిస్తూ ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక అకాడమీలు పాల్గొని యువ వయోజన నర్తకుల అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సాంస్కృతిక బృంద సభ్యురాలు లక్ష్మి బాబు సమన్వయంతో నృత్య ప్రదర్శనలు అత్యంత కన్నులపండుగగా నిర్వహించారుఈ వేడుకకు గౌరవ అతిథిగా ఎస్. వి. ఆచార్య గారు హాజరై తమ ప్రోత్సాహకర సందేశంతో కార్యక్రమానికి మరింత గౌరవాన్ని చేకూర్చారు. అలాగే 11 మంది MESU స్పాన్సర్ల మద్దతు ఈ కార్యక్రమ విజయానికి కీలకమైంది.ఉదార హృదయంతో సహకరించిన MESU స్పాన్సర్లు:సెల్వ, ప్రతిభ జయరామన్, భువనేశ్ బూజాల, భానుమతి రామకృష్ణ, శ్రవణ్ పడూరు, కృష్ణకాంత్ కుచ్చలకంటి, ప్రవీణ్ పాల్రెడ్డి, రఘు పాల్రెడ్డి, వెంకట్ దోమా, తిరుమల మునుకుంట్ల, రఘు జువ్వాది గారు. వీరి ఆర్థిక కార్యనిర్వహణ సహకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.ఇంకా SNUSA నేషనల్ మరియు డి.సి. మెట్రో చాప్టర్ సభ్యులు విశేషంగా సహకరించారు. ముఖ్యంగా శ్రీమతి నీలిమ గడ్డమనుగు, కృష్ణ రాజ్ భట్, సౌమ్య నారాయణన్, డి.సి. చాప్టర్ నాయకులు — బాలాజీ రాధాకృష్ణన్, హరిత రెడ్డి, అర్జున్ కామిసెట్టి, దిలీరాజ్ చాంతివేలు, రూపేష్ చిన్నకంపల్లి, కార్తిక్ గౌడ్ తదితరుల కృషి ప్రశంసనీయం.SNUSA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి గారి నాయకత్వం తోపాటు బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యుల మార్గదర్శకత్వం ఈ విజయానికి బలమైన ఆధారంగా నిలిచాయి. ట్రెజరర్ మూర్తి రేకపల్లి గారు లాజిస్టిక్స్ నిర్వహణలో విశేష కృషి చేయగా, మీడియా సహకారం అందించిన శ్రీగిరి కోటగిరి సేవలు అభినందనీయం. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువ వాలంటీర్లు, మీడియా,ఫోటోగ్రఫీ బృంద సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మాస్టర్ ఆఫ్ సెరిమనీగా వ్యవహరించిన శ్రియా బాబు తన చక్కని వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని చురుకుగా, సమర్థవంతంగా ముందుకు నడిపించారు.ఈ కార్యక్రమంలో సమీకరించిన నిధులు శంకర నేత్రాలయ లక్ష్యమైన అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించేందుకు వినియోగించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ముగిసే సమయానికి సేవా భావం, ఐక్యత, సామాజిక బాధ్యత స్పష్టంగా ప్రతిఫలించాయి. ఈ వేడుక కేవలం కళలు, సంస్కృతిని మాత్రమే కాకుండా, సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరి హృదయంలో మరింత బలంగా నాటింది.(చదవండి: అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..)
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు భారత్కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్ ఎవరు? ఆ వివరాలు మీకోసం.లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలోజన్మించారు నిత్య రామన్. ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య కుటుంబం, అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కరెన్ బాస్కు గట్టి పోటీప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!
అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత
క్రైమ్
ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. యువకుడి బలి
గన్నవరం: ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. వాహన తనిఖీల పేరిట ట్రాఫిక్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురైన స్కూటీపై వెళ్తున్న సోదరుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన ఘటన వెలుగు చూసింది. వివరాలిలా.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన పలగాని శివాజీ కొడుకులు ప్రణయ్(22) కేఎల్యూలో ఇంజినీరింగ్ ఫైనలియర్, కౌషిక్ విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. కౌషిక్ను పెద్దఅవుటపల్లిలో ట్యూషన్లో వదిలేందుకు సోదరుడు ప్రణయ్ స్కూటీపై బయలుదేరారు. మార్గమధ్యలో స్థానిక శ్రీనివాస హేచరీస్ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారనే భయంతో స్కూటీని వెనక్కి తిప్పాడు. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్ వారిని పట్టుకునేందుకు వెంబడించాడు. కంగారులో ప్రణయ్ రాంగ్రూట్లో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణయ్ ఛాతీకి, తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కౌషిక్ కూడా గాయపడ్డాడు. ట్రాఫిక్ పోలీసులు ఆటోలో ప్రణయ్ను పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహమే ప్రణయ్ మృతికి కారణమంటూ పలువురు ఆరోపించారు.బాధిత కుటుంబానికి వంశీ పరామర్శ..రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన వైఎస్సార్సీపీ కేసరపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు పలగాని శివాజీని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆదివారం పరామర్శించారు. తొలుత ప్రణయ్ భౌతికకాయానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రణయ్ అంతిమయాత్రలో వంశీమోహన్తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.
అప్పుల భారంతో అన్నదాతల బలవన్మరణం
ఎమ్మిగనూరురూరల్/గుంతకల్లు రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తోంది. సకాలంలో పంట రుణాలు అందించక.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మరో వైపు రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో అప్పులు తీర్చే మార్గం లేక .. అవమానాలు భరించలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తిమ్మాపురంలో..: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురం గ్రామానికి చెందిన బీజీ అశోక్(28) నాలుగు ఎకరాల్లో పత్తి, మిరప, ఉల్లి సాగు చేశాడు. పంటలు, ఇంటి ఖర్చుల కోసం రూ. 9.50 లక్షల వరకు అప్పు చేశాడు. పంటలు సరిగ్గా పండకపోవడంతో నష్టం వచ్చింది. అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆదివారం సాయంత్రం అశోక్ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అతడికి భార్య రాధ, ఉషశ్రీ(3), సాన్విక(01) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు చెప్పారు. గుంతకల్లులో..: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం సంతోష్ నగర్లో ఉంటున్న కురుబ రామిరెడ్డి(53) వ్యవసాయం కలిసి రాక.. అప్పులు తీసుకున్న వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు...కర్నూలు జిల్లా హాలహర్నికి చెందిన కురుబ రామిరెడ్డి వ్యవసాయం కోసం దాదాపు రూ.10 లక్షల మేర అప్పు చేశారు. తీర్చే మార్గం కానరాక ఐదేళ్ల కిందట గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్కు చేరుకున్నాడు. భార్య సుజాత, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులోళ్ల నుంచి వేధింపులు పెరిగిపోవడంతో దిక్కుతోచని రామిరెడ్డి ఈ నెల 12న అర్ధరాత్రి పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రిలో చేరి్పంచగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. కసాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కన్న తల్లి కర్కశత్వం
భువనగిరి: కన్న తల్లి తన కుమార్తె, కుమారుడిపై కత్తితో దాడి చేయగా.. కుమార్తె మృతిచెందింది. కుమారుడు తప్పించుకున్నాడు. అనంతరం ఆమె కూడా ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. తుక్కాపురం గ్రామానికి చెందిన నోముల నారాయణరెడ్డి, అమృత దంపతుల కుమార్తె రత్నకళ (నీలిమ)ను 15 ఏళ్ల క్రితం బీబీనగర్ మండలం జైనపల్లికి చెందిన బెజ్జంకి నరేందర్రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమార్తె కృతిరెడ్డి (14), అక్షిత్ రెడ్డి సంతానం. కృతిరెడ్డి 8వ తరగతి, అక్షిత్రెడ్డి 6వ తరగతి చదువుతున్నారు. తన తల్లిగారి ఊరిలో గృహ ప్రవేశం ఉందని, పిల్లలకు కొత్త దుస్తులు తీసుకోవడానికి తమను తుక్కాపురం తీసుకెళ్లాలని శనివారం రత్నకళ తన భర్తను కోరింది. దీంతో నరేందర్రెడ్డి భార్యతోపాటు ఇద్దరు పిల్లలను తుక్కాపురంలో వదిలి వెళ్లాడు. కృతిరెడ్డి రాను అని వాదించినా.. ఆమెనూ వెంట తీసుకెళ్లారు. శనివారం రాత్రి రత్నకళ, ఆమె పిల్లలు తన తల్లిగారింట్లో ఓ గదిలో నిద్రించగా.. రత్నకళ తల్లిదండ్రులు హాల్లో నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రత్నకళ కత్తితో కృతిరెడ్డి మెడపై పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం కుమారుడు అక్షిత్రెడ్డిపై కూడా కత్తితో దాడికి యత్నించగా.. అతడు వెంటనే మేల్కొని గాయాలతో కేకలు వేస్తూ తలుపులు తీసి హాల్లోకి పరిగెత్తాడు. హాల్లో నిద్రిస్తున్న రత్నకళ తల్లిదండ్రులు గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వగా.. వారు వచ్చేసరికి రత్నకళ తలుపులు వేసుకుని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు తలుపులు తీసి రత్నకళతో పాటు గాయపడిన ఆమె కుమారుడిని భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. పోలీసులు గ్రామానికి చేరుకుని కృతిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆదివారం కృతిరెడ్డికి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. రత్నకళ సోదరుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. తండ్రికి దగ్గరవ్వడంతో.. రెండేళ్ల నుంచి రత్నకళ మానసికస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తరచూ యూట్యూబ్లో రీల్స్ చేస్తూ ఉంటుందని, ఈ క్రమంలో పిల్లలను సరిగా పట్టించుకోవట్లేదని, అంతేకాకుండా పిల్లలు సహజమైన ఆహారం మాత్రమే తీసుకోవాలని వారిపై ఒత్తిడి చేసేదని పేర్కొన్నారు. దీంతో పిల్లలిద్దరూ తండ్రితో ప్రేమగా ఉంటూ ఆయనకు దగ్గరయ్యారని, ఇది తట్టుకోలేని రత్నకళ మానసిక క్షోభకు గురై ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని తెలిపారు.
మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో పైలెట్ రోహిత్రెడ్డికి రిమాండ్
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్: మొయినాబాద్ ఫార్మ్ హౌస్లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మెజిస్ట్రేట్ తీర్పు ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, రితేష్ రెడ్డి, నితిన్ శర్మలకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు దాడి చేసిన సమయంలో నితిన్ శర్మ గన్తో కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో అర్మ్స్ ఆక్ట్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను రిమాండ్కు పంపారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనతో డ్రగ్స్ కేసు మరింత సంచలనంగా మారింది. దీనిపై పూర్తి వివరాలు అధికారులు వెల్లడించనున్నారు.
వీడియోలు
ఏపీ పరువు తీసిన ఏలూరు ఎంపీ.. TDP గుట్టురట్టు..
స్కూటీ హ్యాండిల్ లాగిన కానిస్టేబుల్.. బీటెక్ విద్యార్థి దుర్మరణం
మల్లారెడ్డి మల్టీ టాలెంట్.. సింగిల్ పీస్
నేను తప్పు చేయలేదు.. అడ్డంగా దొరికి బుకాయింపు
మీకోసమే.. ఆపిల్ ల్యాప్ టాప్ చౌక
మీకు తెలియని ఇరాన్ హిస్టరీ.. అమెరికాను చితక్కొడుతున్న ఎడారిదేశం
పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్
డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!
ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు
