అద్భుతం.. 320 కోట్ల ఏళ్ల నాటి చరిత్ర సాక్ష్యాలు
సాక్షి : నేడు మనం చూస్తున్న ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, ఖనిజ సంపదతో అలరారుతున్న . ఒకప్పుడు నిశ్శబ్దంగా అలలు ఎగసిపడే మహా సముద్రం అంటే నమ్మగలమా? కానీ, భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలు ఇదే నిజాన్ని రూఢీ చేస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ, సింగ్భూమ్ ప్రాంతాలు 320 కోట్ల ఏళ్ల క్రితం విశాలమైన జలరాశిలో ఉండేవని, ఆధునిక ప్రపంచానికి ఇది అత్యంత పురాతనమైన 'సాగర రహస్యం' అని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. భూమి పరిణామ క్రమంలో ఖండాలు ఎలా ఏర్పడ్డాయి అన్నది ఎప్పుడూ ఆసక్తికరమే. ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త ప్రియదర్శి చౌదరి నేతృత్వంలోని బృందం చేసిన అధ్యయనం సంచలన విషయాలను బయటపెట్టింది. సుమారు 3.2 బిలియన్ అంటే 320 కోట్ల ఏళ్ల క్రితమే సింగ్భూమ్ ప్రాంతం సముద్రం నుంచి పైకి ఉద్భవించింది. అంటే, భూమిపై ఏర్పడిన అత్యంత పురాతన ఖండాంతర భూభాగాలలో ఇది మొదటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక్కడ లభించిన 'జిర్కాన్' స్పటిక రేణువుల విశ్లేషణ ద్వారా ఆ కాలంలోనే నదులు, తీర ప్రాంతాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి.మిలియన్ల ఏళ్ల నాటి చరిత్రకు నిశ్శబ్ద సాక్షులు..రాంచీ దాని పరిసర ప్రాంతాల్లోని శిలలు మిలియన్ల ఏళ్ల నాటి చరిత్రకు నిశ్శబ్ద సాక్షులుగా నిలుస్తున్నాయి. భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్ నితీష్ ప్రియదర్శి ప్రకారం, ఇక్కడ కనిపించే ఇసుకరాయి, సున్నపురాయి, పగడపు శిలాజాలు ఈ ప్రాంతం ఒకప్పుడు సముద్ర గర్భంలో ఉండేదని స్పష్టం చేస్తున్నాయి.కాంగ్లోమరేట్లు.. నీటి ప్రవాహం వల్ల గుండ్రంగా మారిన రాళ్లతో కూడిన ఈ అవక్షేప శిలలు సముద్ర నిక్షేపణకు ప్రధాన సాక్ష్యం. పట్రాటు సమీపంలోని బెంటి బాగ్దా ప్రాంతంలో లభించే సున్నపురాయి సాధారణంగా నిస్సారమైన సముద్ర వాతావరణంలోనే ఏర్పడుతుంది. పట్రాటు నుండి బర్కగావ్ వెళ్లే దారిలోని రాళ్ల ఆకృతులు, ఒకప్పుడు అలల తాకిడికి గురై రూపుదిద్దుకున్నట్లుగా కనిపిస్తాయి.కోట్లాది ఏళ్ల క్రితం భూమి లోపల జరిగిన టెక్టోనిక్ కదలికల కారణంగా ఒకప్పుడు నీటి అడుగున ఉన్న ఈ భూభాగం నెమ్మదిగా పైకి లేచింది. భారతదేశం 'గోండ్వానా ల్యాండ్'లో భాగంగా ఉన్న కాలంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. దామోదర్ లోయ ప్రాంతం ఒకప్పుడు చిత్తడి నేలలు లేదా నిస్సార సముద్రంగా ఉండేదని, అందుకే అక్కడ నేడు భారీ స్థాయిలో బొగ్గు నిక్షేపాలు ఏర్పడ్డాయని నిపుణులు వివరిస్తున్నారు.సముద్రానికి, మానవ పరిణామానికి ఉన్న ఈ విడదీయలేని బంధాన్ని గుర్తుచేస్తూనే.. భారతదేశం ప్రతి ఏటా ఏప్రిల్ 5న 'జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని' జరుపుకుంటుంది. ప్రాచీన కాలం నుంచి సముద్ర వాణిజ్యంలో భారత్ అగ్రగామిగా ఉండటమే కాకుండా, మన నేల గర్భంలో దాగి ఉన్న ఇటువంటి భౌగోళిక రహస్యాలు భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి. నేడు మనం రాంచీ కొండలపై నిలబడి చూస్తున్న దృశ్యం వెనుక, కోట్లాది ఏళ్ల క్రితం సముద్రపు అలల సంగీతం దాగి ఉందన్నది కాదనలేని వాస్తవం.పసుపులేటి. వెంకటేశ్వరరావు
లోకేష్.. అమ్మమ్మ అంటూ ఎప్పుడైనా వచ్చావా?: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి/హైదరాబాద్: చంద్రబాబు, లోకేష్.. మీ బతుకంతా నాటకాలు, మోసాలే అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి. లోకేష్ మీ కుటుంబ చరిత్ర తెలుసుకో అంటూ హితవు పలికారు. కన్న తండ్రి ఎన్టీఆర్పై చెప్పులేసి అవమానిస్తుంటే.. మీ అమ్మ భువనేశ్వరి ఏనాడైనా మాట్లాడిందా? అని ప్రశ్నించారు. కుటుంబాలను చీల్చి మీరు ఏం సాధించలేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సూచించిన మావిగన్ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరం. మావిగన్పై కూటమి నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ ముందు నీ స్థాయి ఎంత లోకేష్?. నీ బిల్డప్ ప్రజలకు తెలియదని అనుకుంటున్నావా?. లోకేష్ ఈవీఎంల ద్వారా గెలిచారు. చంద్రబాబు, లోకేష్ మీ కుటుంబ చరిత్ర తెలుసుకోండి. చంద్రబాబు, లోకేష్ అడ్డదారుల్లో అమృతం తాగే రకం అంటూ సంచలన ఆరోపణలు చేశారు.అలాగే, లోకేష్.. ఏనాడైనా మీ మేనత్తలు మీ ఇంటికి వచ్చారా?. మీ మేనత్తలు అంటే మీ అమ్మకు ఎంతో రోత. అసలు వాళ్లు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా?. లోకేష్.. మీ కుటుంబం పట్ల.. మీకే ప్రేమాభిమానాలు లేవు. చంద్రబాబు, లోకేష్.. మీ బతుకంతా నాటకాలు, మోసాలే. లోకేష్.. ఏనాడైనా అమ్మమ్మ అంటూ నా దగ్గరికి వచ్చావా?. అసలు నా పుట్టినరోజు నీకు తెలుసా?. కన్న తండ్రిపై చెప్పులేసి అవమానిస్తుంటే.. మీ అమ్మ ఏనాడైనా మాట్లాడిందా?. కుటుంబాలను చీల్చి మీరు ఏం సాధించలేరు. కాంగ్రెస్లో మీ నాన్నే.. బీజేపీలో మీ నాన్నే ఉన్నారు కదా లోకేష్. చివరకు కమ్యూనిస్టుల్లోనూ చంద్రబాబే ఉన్నారని అన్నారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కృషి చేశారు. మహిళలకు వైఎస్ జగన్ 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు. మంచి లీడర్ అంటే వైఎస్ జగన్లా ఉండాలి. చంద్రబాబు, లోకేష్ రాజకీయాలను చూసి ప్రజలే అసహ్యించుకుంటున్నారు అని విమర్శించారు.
కేసీఆర్ నన్ను అక్కున చేర్చుకున్నారు: జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: జగిత్యాల బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి జగిత్యాల జైత్రయాత్రను తలపించేలా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ కూడా ఉండబోతోందన్నారు. రాజకీయంగా తాను విభేదించినా కేసీఆర్ మాత్రం తనను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. ఈ విషయంలో తాను ఎంతో ఆనందంగా ఉన్నట్టు జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘మేడిగడ్డ ప్రాజెక్టుతో మాత్రమే తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుంది. తుమ్మిడిహట్టి కట్టాలని నేను డిమాండ్ చేసిన మాట వాస్తవమే. కానీ, కాళేశ్వరంతో పెద్ద సంఖ్యలో రైతాంగానికి మేలవుతుంది. మళ్లీ తుమ్మిడిహట్టి నిర్మాణం కావాలన్నా కేసీఆర్ రావాల్సిందే. మేడిగడ్డ మీద ఎన్డీఎస్ఎఫ్ రిపోర్ట్ ఇచ్చి ఏడాదైతే గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా?. ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నాడు. పునరుద్ధరణ ఎప్పుడు పూర్తి అవుతుంది? అని ప్రశ్నించారు.అలాగే, నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొంతకాలం నా రాజకీయ భవిష్యత్తుపై మనస్థాపం చెందాను. రాజకీయంగా నేను విభేదించినా కేసీఆర్ పెద్ద మనసులో నన్ను అక్కున చేర్చుకున్నారు. ఇవాళ నేను సంతోషంగా ఉన్నాను. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమైన తెలంగాణా పరిస్థితులపై ఈరోజు సభ ఉండబోతోంది. జగిత్యాల బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జగిత్యాల బీఆర్ఎస్ సభపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. తనను బీఆర్ఎస్ నేతలు క్రాస్ బ్రీడ్ అని సంబోధించడంపై మండిపడ్డారు. తాజాగా సంజయ్ కుమార్ సాక్షితో మాట్లాడుతూ..‘జగిత్యాల సభతో ఒరిగేదేమీ లేదు. కేసీఆర్, కేటీఆర్ను వందల సార్లు తిట్టిన జీవన్ రెడ్డి చేరికపై ప్రజలందరికీ స్పష్టత ఉంది. బీఆర్ఎస్ సభకు నాకు ఆహ్వానం లేదు. నేను మేడిగడ్డకు ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తున్నాను. నా చివరి అంకం వరకు ఇక కాంగ్రెస్తోనే నా ప్రయాణం’ అని వ్యాఖ్యలు చేశారు.
అనుష్క పోస్ట్కి స్పందించిన ర్యాపిడో.. క్షమాపణలు
రైడ్-హైలింగ్ సేవలపై ఫిర్యాదులు పెరిగిపోతున్న రోజులివి. మరీ ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రయాణాల్లో ఎదురయ్యే చేదు అనుభవాలను తరచూ నెట్టింట చూస్తూనే ఉన్నాం. లైంగికంగా వేధించడం.. లేదంటే హయ్యర్ చార్జీలు డిమాండ్ చేస్తుండడాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తున్నారు బాధితులు. ఈ తరుణంలో తాజాగా ఓ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో ర్యాపిడో కంపెనీ స్పందించాల్సి వచ్చింది.ర్యాపిడో డ్రైవర్ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో ఘజియాబాద్కు చెందిన ఓ యువతి షేర్ చేయడంతో పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో అతను చేసిన మెసేజ్లను ఆమె స్క్రీన్ షాట్ రూపంలో ప్రదర్శించింది. ఆ యువతి పేరు అనుష్క. తనను గమ్య స్థానంలో దించి వెళ్లిపోయిన కాసేపటికి ఆ డ్రైవర్ తనకు హాయ్ అంటూ వాట్సాప్ ద్వారా సందేశం పంపాడని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. ‘‘నేనెవరో గుర్తుపట్టలేదా?. ఇందాకే కదా మిమ్మల్ని డ్రాప్ చేశాను. మీరు అందంగా ఉన్నారు. సంప్రదాయ దుస్తుల్లో మరింత బాగుంటారు. మీ వయసు ఎంత?.. ఒంటరిగా ఉంటున్నారా?.. కోపం వద్దు.. రేపు సాయంత్రం అలా బయటకు వెళ్దామా?’’ అంటూ మెసేజ్ చేశాడతను.దానికి ఆమె ‘‘నీ పని నువ్వు చేస్కో భయ్యా..’’ అంటూ బ్లాక్ చేసిందా యువతి. ఆ మొత్తం ఘటనను వీడియో రూపేణా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అంతే ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. దీంతో ర్యాపిడో కంపెనీ క్షమాపణలు చెప్పింది. View this post on Instagram A post shared by Anushka_Official☀️ (@aanu_shka3)ఆ డ్రైవర్ ప్రవర్తనను “అంగీకరించలేని చర్య”గా పేర్కొంటూ.. వినియోగదారుల గోప్యతను ఉల్లంఘించే ప్రవర్తన తమ సేవా ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రైడ్ IDని డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపాలని కోరుతూ.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.ఈ ఘటనతో వినియోగదారులు డేటా గోప్యత, వ్యక్తిగత సమాచారం వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ర్యాపిడో లాంటి ప్రముఖ కంపెనీలు రైడ్-హైలింగ్(Ride-hailing) సేవల టైంలో వినియోగదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
శశాంక్ సింగ్ పరువు తీసిన శ్రేయస్ అయ్యర్!
స్లీపర్తో శాశ్వత నిద్రే
తిరుమల పదవుల్లో అనర్హులు.. శ్రీవాణి టికెట్ 15000: భూమన
చరిత్ర సృష్టించిన జోఫ్రా ఆర్చర్
లారీని ఢీకొట్టిన కారు.. తల్లి, బిడ్డ దుర్మరణం!
ఎన్బీఎఫ్సీ శాఖల విస్తరణపై ఆర్బీఐ కొత్త రూల్స్
అనుష్క పోస్ట్కి స్పందించిన ర్యాపిడో.. క్షమాపణలు
నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారం.. పోలీసుల ఎన్కౌంటర్
వృథా కానీ ఎకానమీగా 'వెదురు'
మరోసారి తల్లి కాబోతున్న దీపిక.. ‘రాకా’ కోసం కీలక నిర్ణయం!
రేపే గ్రహకూటమి.. ఈ 5 రాశుల వారికి తిరుగులేదు
అమ్మలా మోసి.. నాన్నలా కాచి
హైదరాబాద్కు గుడ్బై.. షిఫ్ట్ అవుతున్న అల్లు అర్జున్!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. సరికొత్త ప్రపంచ రికార్డు
షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్బాస్' ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా
‘మరో జలసంధిని మూసేస్తాం.. తెరవడం ఎవ్వరితరం కాదు’
మీరు నెత్తిన పెట్టుకున్న ఈశ్వరన్ జైలుకెళ్లాడు.. సింగపూర్ ఎవరి దెబ్బకు భయపడిందో అందరికీ తెలుసు!!
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
అతని టార్గెట్ బంజారాహిల్స్ అమ్మాయిలే..!
ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తున్న థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
ట్రంప్, మునీర్ దోస్తీ.. అమెరికా నిఘా వర్గాల్లో టెన్షన్
ఓటుకు నోటు ‘బంధం’ వీడడం లేదు మరి!
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
‘ది బ్రేకింగ్ న్యూస్’ కోసం ఎదురు చూస్తున్నా : చిరంజీవి
'దేవర 2' కంటే ముందు మరో హిట్ సినిమా సీక్వెల్?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
స్టేట్ టాపర్.. అవినీతి ఉచ్చులో..!
అసలు ఓడిపోయింది నేను!
శశాంక్ సింగ్ పరువు తీసిన శ్రేయస్ అయ్యర్!
స్లీపర్తో శాశ్వత నిద్రే
తిరుమల పదవుల్లో అనర్హులు.. శ్రీవాణి టికెట్ 15000: భూమన
చరిత్ర సృష్టించిన జోఫ్రా ఆర్చర్
లారీని ఢీకొట్టిన కారు.. తల్లి, బిడ్డ దుర్మరణం!
ఎన్బీఎఫ్సీ శాఖల విస్తరణపై ఆర్బీఐ కొత్త రూల్స్
అనుష్క పోస్ట్కి స్పందించిన ర్యాపిడో.. క్షమాపణలు
నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారం.. పోలీసుల ఎన్కౌంటర్
వృథా కానీ ఎకానమీగా 'వెదురు'
మరోసారి తల్లి కాబోతున్న దీపిక.. ‘రాకా’ కోసం కీలక నిర్ణయం!
రేపే గ్రహకూటమి.. ఈ 5 రాశుల వారికి తిరుగులేదు
అమ్మలా మోసి.. నాన్నలా కాచి
హైదరాబాద్కు గుడ్బై.. షిఫ్ట్ అవుతున్న అల్లు అర్జున్!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. సరికొత్త ప్రపంచ రికార్డు
షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్బాస్' ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా
‘మరో జలసంధిని మూసేస్తాం.. తెరవడం ఎవ్వరితరం కాదు’
మీరు నెత్తిన పెట్టుకున్న ఈశ్వరన్ జైలుకెళ్లాడు.. సింగపూర్ ఎవరి దెబ్బకు భయపడిందో అందరికీ తెలుసు!!
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
అతని టార్గెట్ బంజారాహిల్స్ అమ్మాయిలే..!
ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తున్న థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
ట్రంప్, మునీర్ దోస్తీ.. అమెరికా నిఘా వర్గాల్లో టెన్షన్
ఓటుకు నోటు ‘బంధం’ వీడడం లేదు మరి!
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
‘ది బ్రేకింగ్ న్యూస్’ కోసం ఎదురు చూస్తున్నా : చిరంజీవి
'దేవర 2' కంటే ముందు మరో హిట్ సినిమా సీక్వెల్?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
స్టేట్ టాపర్.. అవినీతి ఉచ్చులో..!
అసలు ఓడిపోయింది నేను!
ఫొటోలు
ఉత్తరాంధ్ర శబరిమల (అయ్యప్ప స్వామి దేవాలయం) ఎక్కడ ఉందో తెలుసా (ఫొటోలు)
సింహాచలం అప్పన్న చందనోత్సవం..భారీగా భక్తులు (ఫొటోలు)
విశాఖపట్నం : ‘కళా సెంటినియల్ సాగా’ చిత్రకళా ప్రదర్శన (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)
చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్ (ఫొటోలు)
ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)
కంట్రీ క్లబ్లో గ్రాండ్గా ఫ్యాషన్ షో (ఫొటోలు)
సినిమా
18 రోజుల్లో రూ. 205 కోట్ల కలెక్షన్స్.. మలయాళ మూవీ సంచలనం!
ప్రస్తుతం చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు మాత్రమే కాదు నూతన నటీనటుల మూవీస్ కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే నిర్మాతలు కూడా పాన్ ఇండియా ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. కేవలం ఒక భాషలోనే కాకుండా..ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. మన తెలుగు నిర్మాతలు..మలయాళ, కన్నడ సినిమాలు చేసి అక్కడ విజయాలు అందుకుంటున్నారు. అలా తెలుగు నిర్మాత సాహు గారపాటి రూ.10 కోట్లతో నిర్మించిన మలయాళ సినిమా ఒకటి అక్కడి బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. కేవలం 18 రోజుల్లోనే రూ. 205 కోట్లను రాబట్టి రికార్డు సృష్టిస్తోంది. అదే ‘వాళా 2’. 2024లో వచ్చిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వాళా’ చిత్రానికి కొనసాగింపు ఇది. కొత్త నటీనటులతో సావిన్ ఎస్ఏ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విపిన్ దాస్ తో కలిసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 2 మలయాళంలో విడుదలై.. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయింది. ఫలితంగా 18 రోజుల్లోనే రూ. 205 కోట్ల వసూళ్లను రాబట్టి.. మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరకు ‘లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రూ.300+ కోట్ల వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ‘ఎల్2: ఎంపురాన్’, ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘తుడరుమ్’ చిత్రాలు ఉన్నాయి. వాళా 2 చిత్రాన్ని ఏప్రిల్ 24న తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. మరి ఇక్కడ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
విజయ్-సంగీత విడాకులు.. రూ. 250 కోట్లు అడిగారా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. టీవీకే పార్టీనీ స్థాపించి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవ్వగానే.. సతీమణి సంగీత విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని పిటిషన్లో పేర్కొంది. ఈ విడాకుల కేసు నేడు (ఏప్రిల్ 20) చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణకు రానుంది. అయితే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని.. ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరవుతానంటూ విజయ్ తన లాయర్తో పిటిషన్ దాఖలు చేయించాడు. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.ఇదిలా ఉంటే.. విజయ్-సంగీత జంట పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శనివారం చెన్నైలో ఇరువురి లాయర్లు కలిసి చర్చలు జరిపారు. విడిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని..సెటిట్మెంట్ కింద సుమారు రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరినట్లు వార్తలు వస్తున్నాయి. కుమారుడు, కుమార్తెలకు కూడా సెటిల్మెంట్ ఇవ్వాలని సంగీత కోరుతుందట. అయితే విజయ్ మాత్రం రూ.35 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే కుమారుడు, కుమార్తెల బాగోగులు తాను చూసుకుంటానని అంటున్నాడట. అయితే ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కోర్టు విచారణలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
నిర్మాతల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యం
సినిమా నిర్మాణాన్ని సవాల్ చేస్తున్న క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళకు (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం) చెందిన అగ్ర సినీ నిర్మాతలు, సంబంధిత ప్రతినిధులు, ప్రోడ్యూసర్స్ గిల్డ్ ప్రతినిధులు ఏకతాటి పైకి వచ్చారు. సినిమా పరిశ్రమను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా నిర్మాతల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ (ఎస్ఐఎఫ్పీఏ) ఏర్పాటైంది.ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ‘ఎస్ఐఎఫ్పీఏ’ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. సినిమా నిర్మాణ రంగంలో ఇతర స్టేక్ హోల్డర్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు. 8 వారాల తర్వాతనే ఓటీటీలో సినిమాను విడుదల చేయాలి, సినిమా రిలీజ్ల విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి (థియేట్రికల్ రెవెన్యూకు సంబంధించి పర్సెంటేజ్ అండ్ రెంటల్ వివాదాన్ని ఉద్దేశించి కావొచ్చు) అంటూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ఈ సమావేశంలో నిర్మాతలు ఖండించారు.వేలాది మంది ఉపాధి ఆధారపడి ఉన్న సినిమా నిర్మాణ వ్యవస్థలో ఆకస్మాత్తు నిర్ణయాలు తీసుకుని, రాత్రికి రాత్రి ఆటంకం కలిగించకూడదని ఈ సమావేశంలోని ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ విడుదల చేసిన నోట్లోని అంశాలు ఈ విధంగా... ‘‘నిర్మాతల ప్రయోజనాలను దీర్ఘకాలం పాటు కాపాడటానికి ‘ఎస్ఐఎఫ్పీఏ’ను ఏర్పాటు చేయడానికి నిర్మాతలందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. నాలుగు భాషలకు చెందిన దక్షిణాది నిర్మాతల మధ్య సమన్వయం కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం సభ్యులైన నిర్మాతలు తమ సినిమాల నిర్మాణం, విక్రయం, విడుదల తేదీ వంటి అంశాల విషయంలో ఏ ఇతర సంఘం నిబంధనలకు కట్టుబడకుండా తమ సొంత నిర్ణయాలతో కొనసాగాలి. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమాల విడుదల విషయంలో ఎటువంటి హామీ పత్రాలను నిర్మాతలు ఏ అసోసియేషన్కు లేదా రంగానికి ఇవ్వకూడదు. సినిమా పరిశ్రమ ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి నిబంధనలను అందరితో చర్చించి మాత్రమే నిర్ణయించుకోవాలి’’ అంటూ ‘ఎస్ఐఎఫ్పీఏ’ స్టీరింగ్ కమిటీ ఆ నోట్లో పేర్కొంది.
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న మాజీ సీఎం మనవరాలు
సినిమా, రాజకీయ రంగానికి విడదీయలేని సంబంధముంది. నటీనటులుగా రాణించిన వాళ్లు చాలామంది ప్రస్తుతం పాలిటిక్స్లోనూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మనవరాలు కూడా నటిగా అరంగేట్రం చేసేందుకు సిద్ధమైంది. ఆ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఎవరామె? ఏంటా సినిమా?(ఇదీ చదవండి: షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్బాస్' ట్రాన్స్జెండర్ తమన్నా)గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్గా చేస్తున్న ఆనందీ బెన్ పటేల్ మనవరాలు సంస్కృతి జయానా నటిగా పరచయమవుతోంది. మే 7న తెలుగులోనూ రిలీజ్ కాబోతున్న 'కృష్ణావతారం పార్ట్ 1'లో శ్రీ కృష్ణుని ప్రియురాలు సత్యభామ పాత్ర పోషించింది. ఈ చిత్రంలో కృష్ణుడిగా సిద్ధార్థ్ గుప్తా, రాధగా సుస్మితా భట్, రుక్మిణిగా నివాసిని కృష్ణన్ నటించారు. ఈ మూవీ మొత్తం సత్యభామ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఉండనుంది.ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంస్కృతి జయానా.. ఇప్పటికే పారిశ్రామికవేత్తగా రాణిస్తోంది. లండన్, అమెరికాలోని ఫ్యాషన్ మేనేజ్మెంట్ చేసిన ఈమె.. 16 ఏళ్ల వయసులోనే సొంత ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభించింది. మరోవైపు తల్లిదండ్రులతో కలిసి పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది. మరి ఇప్పుడు సత్యభామ పాత్రలో నటిగా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: యుద్ధాన్ని ముందే అంచనా వేసిన ధనుష్ సినిమా)
క్రీడలు
మరోసారి కనీళ్లు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 19) మధ్యాహ్నం జరిగిన కేకేఆర్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ భావోద్వేగాలకు వేదికైంది. సీజన్లో 6 మ్యాచ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకోవడంతో కేకేఆర్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. కొందరు ఆనందంలో ఏడ్చేసినంత పని చేశారు. మరోవైపు రాజస్థాన్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ ఓటమిని జీర్ణంచుకోలేక మైదానంలో ఓ మూలన కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్యాప్తో ముఖాన్ని దాచుకుంటూ బాధను వ్యక్తం చేశాడు. ఈ సమయంలోకేకేఆర్ సిబ్బందిలో ఒకరు అతని వద్దకు వచ్చి ఓదార్చారు. అతని పక్కన కూర్చుని కాసేపు మాట్లాడి, ఆలింగనం చేసుకొని ధైర్యం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది.Yesterday Vaibhav Sooryavanshi was spotted crying after the game… This guy is unbelievable! Whether he gets out early or the team loses, he wears his heart on his sleeve. Honestly, that’s that 15-year-old mindset I know I would’ve been doing the exact same thing at that age! 🤣… pic.twitter.com/Ug6X4gVqks— OldMonkOfCricket (@OldMonkOfCric) April 20, 2026వైభవ్ ఇలా బాధపడటం కొత్తేమీ కాదు. ఔటైనప్పుడు, జట్టు ఓడినప్పుడు తాను ప్రొఫెషనల్ క్రికెటర్ని అన్న విషయాన్ని మరిచిపోయి ఏడ్చేస్తాడు. ఇది ఓ రకంగా అభిమానులను ఆకట్టుకుంటుంది. 52, 78, 39 లాంటి స్కోర్లు చేసినా, వైభవ్ తన తప్పులను విశ్లేషించుకుంటూ బాధపడ్డ పడ్డాడు. మొత్తంగా వైభవ్ క్రికెటర్గా ఎంత పరిణితి చెందినా, అతనిలోని పిల్లాడు భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాడు.తాజాగా కేకేఆర్ చేతిలో రాజస్థాన్ ఓడిన మ్యాచ్లో వైభవ్ 28 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే మధ్య ఓవర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి అద్భుతంగా బౌలింగ్తో రాజస్థాన్ బ్యాటింగ్ను కుదిపేశారు. ఫలితంగా రాజస్థాన్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో కేకేఆర్ సైతం తడబడినా.. రింకూ సింగ్ (53 నాటౌట్), అనుకూల్ చౌదరి (29 నాటౌట్) అసాధారణ ప్రదర్శనతో తమ జట్టుకు సీజన్ తొలి విజయాన్ని అందించారు.సూపర్ ఫామ్లో వైభవ్ప్రస్తుత సీజన్లో వైభవ్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు 246 పరుగులు చేసి జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 236.54 కాగా, సగటు 41.00గా ఉంది. ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే అతను డకౌటయ్యాడు. మిగతా మ్యాచ్ల్లో స్థిరంగా రాణించాడు. ఆరెంజ్ క్యాప్ పోటీలోనూ వైభవ్ టాప్-5లో ఉన్నాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ (283 పరుగులు) వద్ద ఆరెంజ్ క్యాప్ ఉంది.
అతడు కాదా!.. నిర్ణయం మార్చుకున్న CSK?
గతేడాది కాలంగా చెన్నై సూపర్ కింగ్స్కు కలిసి రావడం లేదు. ఐపీఎల్-2025లో ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో చిట్టచివరగా పదో స్థానంలో నిలిచిన చెన్నై.. ఈ ఏడాది కూడా వైఫల్యాలు కొనసాగిస్తోంది.గాయాల బెడద ఇప్పటికి ఈ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ సేన.. కేవలం రెండు మాత్రమే గెలిచి.. నాలుగు ఓడిపోయింది. మరోవైపు.. మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లు గాయాల బెడద కూడా సీఎస్కేకు తలనొప్పిగా మారింది. దిగ్గజ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఫిట్నెస్ సమస్యల వల్ల ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.ఆయుశ్ దూరంసన్రైజర్స్ హైదరాబాద్తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా ఫామ్లో ఉన్న ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) గాయపడ్డాడు. పవర్ప్లేలో దూకుడుగా ఆడుతున్న సమయంలో ఆయుశ్ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు తదుపరి మ్యాచ్లకు దూరం కానున్నాడు. ‘ఇది చాలా బాధాకరం. ఆయుశ్ చక్కటి ఫామ్లో ఉన్నాడు. అతడు జట్టుకు దూరం కావడం చాలా ఇబ్బందికరం. అయితే గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది. ఎప్పటిలోగా కోలుకుంటాడనేది ఇప్పుడే చెప్పలేం’ అని చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఇప్పటికే స్పష్టం చేశాడు.ఇక ఆయుశ్ కంటే ముందు సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ కూడా గాయపడి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్తో అతడి స్థానం భర్తీ చేయాలని సీఎస్కే యాజమాన్యం తొలుత భావించినట్లు సమాచారం. ఇందుకోసం అతడిని ట్రయల్స్కు పిలిపించినట్లు తెలుస్తోంది.అతడు కాదా!.. నిర్ణయం మార్చుకున్న CSK?దీంతో ఆకాశ్ ఆగమనం ఫిక్సైపోయిందనే వార్తలు రాగా.. తాజా సమాచారం ప్రకారం తమ మాజీ బౌలర్ రాజవర్దన్ హంగర్గేకర్ను కూడా చెన్నై యాజమాన్యం ట్రయల్స్కు పిలిచినట్లు క్రిక్బజ్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ కంటే కూడా రాజవర్దన్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ధోని కోలుకుంటున్నాడని.. అయితే, అతడు ఎప్పుడు బరిలోకి దిగుతాడనే విషయంపై తనకు కూడా స్పష్టత లేదని సీఎస్కే కోచ్ మైక్ హస్సీ పేర్కొనడం గమనార్హం.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్
భారత ఐపీఎల్ ఆటగాళ్లకు విదేశీ అంతర్జాతీయ జట్టులో చోటు
భారత్, ఆస్ట్రేలియా దేశాలు తనకు పౌరసత్వం ఆఫర్ చేశాయని, వారి దేశాల తరఫున క్రికెట్ అవకాశాలు కూడా కల్పిస్తామని ముందుకువచ్చాయని, అయితే తాను వాటిని సున్నితంగా తిరస్కరించారని ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సంచలన విషయాలను తన పుస్తకం "Rashid Khan: From Streets to Stardom" ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై క్రికెట్ సమాజంలో చర్చలు జరుగుతుండగానే, ఐసీసీ అసోసియేట్ మెంబర్ అయిన యూఏఈ (UAE) పలువురు విదేశీ క్రికెటర్లకు పౌరసత్వం ఇచ్చి చర్చను మరింత విస్తృతం చేసింది.యూఏఈ తొలిసారి ఐదుగురు విదేశీ క్రికెటర్లకు ఒకేసారి పౌరసత్వం మంజూరు చేయడంతో పాటు తమ జాతీయ జట్టుకు ఆడే అవకాశాన్ని కూడా కల్పించి సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో విదేశీ ఆటగాళ్లు యూఏఈ క్రికెట్ జట్టుకు ఆడాలంటే మూడు సంవత్సరాల నివాసం అర్హతగా ఉండేది. తాజాగా ఆ దేశం రూల్స్ను సవరించి పౌరసత్వం ఇవ్వడంతో పాటు నేరుగా జాతీయ జట్టులోకి తీసుకొని సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది.యూఏఈ పౌరసత్వం పొంది, ఆ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లలో ఖుజైమా తన్వీర్, అజయ్ కుమార్, అదీబ్ ఉస్మానీతో పాటు ఆకాశ్దీప్ నాథ్, హర్ప్రీత్ భాటియా లాంటి ఐపీఎల్ ఆటగాళ్లు ఉన్నారు. యూఏఈ జట్టు త్వరలో నేపాల్ పర్యటనకు వెళ్లనుండగా, ఈ ఆటగాళ్లు 17 సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నారు.అక్షదీప్ నాథ్ ఐపీఎల్ సహా ఉత్తరప్రదేశ్ తరఫున 200కి పైగా మ్యాచ్లు ఆడి 6500కి పైగా పరుగులు సాధించాడు. హర్ప్రీత్ భాటియా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జట్ల తరఫున భారీ అనుభవం కలిగిన బ్యాటర్గా గుర్తింపు పొందాడు.మొత్తంగా చూస్తే, ఒకవైపు రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లు దేశం పట్ల నిబద్ధతను చూపుతుండగా, మరోవైపు యూఏఈ వంటి దేశాలు విదేశీ ప్రతిభను ఆకర్షిస్తూ తమ దేశ క్రికెట్ను బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్ దిశను ప్రభావితం చేసే అవకాశముంది.
BCCI బిగ్ప్లాన్.. 35 మంది ప్లేయర్లు.. కెప్టెన్గా అతడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా నుంచి.. వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే వరకు ఈ జాబితాలో ఉన్నారు.ఇక ఈ టోర్నీలో ఓవైపు సీనియర్లు ఫామ్ కొనసాగిస్తుండగా.. యువ ఆటగాళ్లు సైతం దుమ్మురేపుతున్నారు. దీంతో టీమిండియా సెలక్టర్లకు తల నొప్పులు తప్పడంలేదు. ఇదిలా ఉంటే.. టీమిండియా షెడ్యూల్ ఎంతగా కిక్కిరిసిపోయి ఉంటుందో తెలిసిందే. ఏడాదంతా భారత పురుషుల జట్టు బిజీబిజీగా గడుపుతుంది.పూర్తిస్థాయిలో రెండు జట్లు!ఇటీవలే అదనంగా ముందుగా షెడ్యూల్లో లేని ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు.. ఆసియా క్రీడలు- 2026 (Asian Games) టోర్నీకి కూడా జట్టును పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ రెండు టీ20 జట్లను తయారు చేస్తున్నట్లు సమాచారం.సెలక్టర్ల రాడార్లో 30-35 మంది ఆటగాళ్లుఅంతర్జాతీయ షెడ్యూల్తో ఆసియా క్రీడల షెడ్యూల్ క్లాష్ అవుతున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఒకే సమయంలో ఆసియా క్రీడలు, వెస్టిండీస్ సిరీస్కు జట్లను పంపాల్సి ఉంది. కాబట్టి ఈసారి కూడా రెండు జట్లను సిద్ధం చేస్తున్నాం.అంతర్జాతీయ క్రికెట్కు ఎంపిక చేసే క్రమంలో 30-35 మంది ఆటగాళ్ల పేర్లను పరిగణనలోకి తీసుకునే యోచనలో ఉన్నాము. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆసియా క్రీడల దాకా ఈ విధానం కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు. గతంలో ఇలా..కాగా 2023 ఆసియా క్రీడల్లో భాగంగా తొలిసారి బీసీసీఐ తమ పురుష, మహిళా జట్లను చైనాకు పంపింది. టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఈ ఈవెంట్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో పురుషుల జట్టు.. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళా జట్టు పసిడి పతకాలు గెలిచాయి. అప్పుడు టీమిండియా ద్వైపాక్షిక సిరీస్లతో బిజీగా ఉండగా.. రుతు కెప్టెన్సీలో ద్వితీయశ్రేణి జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొని గోల్డ్ మెడల్ గెలిచింది.రేసుగుర్రాలుకాగా ఈసారి నయా సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్, ప్రియాన్ష్ ఆర్య, అంగ్క్రిష్ రఘువన్షీ ఆసియా క్రీడల నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించనున్నారు. రజత్ పాటిదార్, ఆయుశ్ బదోని, అనుకుల్ రాయ్, ఖలీల్ అహ్మద్, కార్తిక్ త్యాగి తదితరులు కూడా రేసులో ఉన్నారు.కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్!ఈసారి ఆసియా క్రీడల జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అతడు టీ20 ఫార్మాట్లో దుమ్ములేపుతున్నాడు. 2024 ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలిపిన ఈ ముంబైకర్.. గతేడాది కెప్టెన్గా పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు చేర్చాడు. తాజా ఎడిషన్లోనూ సారథి, బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ హవా కొనసాగుతోంది. కాగా 2023 డిసెంబరులో చివరగా అయ్యర్ టీమిండియా తరఫున టీ20లు ఆడాడు. అయితే, ఈసారి ఆసియా క్రీడల ద్వారా రీఎంట్రీ ఇచ్చి తనను తాను మరోసారి నిరూపించుకుంటే.. టీమిండియా కెప్టెన్గానూ సూర్యకుమార్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు లేకపోలేదన్నది విశ్లేషకుల మాట.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్
న్యూస్ పాడ్కాస్ట్
రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరణ..
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న పాపం ప్రతిపక్షాలదే... భ్రూణ హత్యతో పాపం మూటగట్టుకున్నాయి... ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
లోక్సభలో గట్టెక్కని మహిళా బిల్లు... అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు... మూడింట రెండొంతుల మెజారిటీ సాధనలో మోదీ సర్కారు విఫలం
డీలిమిటేషన్ దంగల్కు రంగం సిద్ధం... మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్
మత్స్యకారుల కడుపుపై తంతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు కుట్ర... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
చట్టసభల్లో చారిత్రక మలుపు... లోక్సభ స్థానాలు 850కి పెంపు... రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం... డిమాండ్లపై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్... అణ్వాయుధాలు, హార్మూజ్పైనే పీటముడి
ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు షురూ. మరో దఫా చర్చించే అవకాశం
భారీగా పడిపోతున్న బంగారం ధరలు
బిజినెస్
పాపులర్ రీచార్జ్ ప్లాన్ రేటు మార్చేసిన ఎయిర్టెల్
ప్రముఖ టెలికం ఆపరేటర్ ఎయిర్టెల్ తన వినియోగదారులకు షాకిచ్చింది. అత్యధిక ఆదరణ పొందిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ధరను సైలెంట్గా పెంచింది. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 GB డేటాను అందించే ప్లాన్ ధరను రూ. 859 నుండి రూ. 899కి సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో ఈ దీర్ఘకాలిక ప్లాన్ ఇప్పుడు మరింత భారంగా మారింది.ఈ రూ. 899 ప్లాన్ ద్వారా వినియోగదారులకు 84 రోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ,రోమింగ్ కాల్స్తో పాటు, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డేటా విషయానికొస్తే, ప్రతిరోజూ 1.5 GB హై-స్పీడ్ డేటా అందుతుంది. అదనపు ప్రయోజనాల కింద అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం (12 నెలలు), స్పామ్ అలర్ట్లు, ఉచిత హలోట్యూన్స్ వంటి రివార్డ్స్ లభిస్తాయి. అయితే, గతంలో ఉన్న క్యాష్బ్యాక్ ప్రయోజనాలతో కూడిన 'రివార్డ్స్ మినీ' సబ్స్క్రిప్షన్ను కంపెనీ తొలగించినట్లు తెలుస్తోంది.ఈ ధర పెంపు పరిమితంగా ఉన్నప్పటికీ, దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తన సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడంతో పాటు, వినియోగదారులను క్రమంగా 5G సేవల వైపు మళ్లించేందుకు ఎయిర్టెల్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ మార్పు కేవలం ఒక ప్లాన్కే పరిమితం కావడంతో, సాధారణ వినియోగదారులపై తక్షణ ప్రభావం తక్కువగానే ఉండవచ్చు.సాధారణంగా టెలికాం రంగంలో భారీ టారిఫ్ పెంపునకు ముందు ఇలాంటి చిన్న చిన్న సర్దుబాట్లు చేయడం అరుదు. కాబట్టి, ప్రస్తుతానికి అన్ని ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం లేదని సమాచారం. కాగా, ఎయిర్టెల్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తన గ్లోబల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ధరను కూడా రూ. 4,000 నుండి రూ. 4,999కి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా 84 రోజుల ప్లాన్ ధర పెరగడంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
ఫ్లాట్గా కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు తగ్గి 24,352 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 79 పాయింట్లు ఎగబాకి 78,569 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.28బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 95.38 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.26 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.2 శాతం పెరిగింది.నాస్డాక్ 1.52 శాతం పుంజుకుంది.Today Nifty position 20-04-2026(time: 9:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
సరిగా కొంటేనే.. బంగారం!
ధర ఎంతన్నా ఉండనివ్వండి. బంగారమనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. తరతరాలుగా పుత్తడికి ప్రాధాన్యం పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. ఇంటింటా ఆభరణాల రూపంలో మురిపిస్తూనే, ఆర్థికంగా కూడా భరోసాను కల్పించే సాధనంగా పనికొస్తోంది. అయితే, అంతర్జాతీయ పరిణామాల దెబ్బతో ఒకసారి అయిదు వేలు పెరిగితే, ఇంకోసారి పదివేలు పడిపోయి.. బంగారం రేట్లు సృష్టిస్తున్న గందరగోళం అంతా ఇంతా కాదు.ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఎమోషనల్ కారణంతోనో, పెట్టుబడి కోసమో ఆభరణాలు, నాణేల రూపంలో కొనుక్కుని పెట్టుకున్న వారిలోను, కొనుక్కోవాలనుకుంటున్న వారిలోనూ ఆందోళన నెలకొంటోంది. ఈ నేపథ్యంలో క్రమంగా పుత్తడిని చూసే తీరు మారుతోంది. కేవలం ఆభరణంగానో లేదా భావోద్వేగాలతో ముడిపడిన ఆస్తిగానో చూడటం కాకుండా పెట్టుబడి కోణంలో చూసే ధోరణి పెరుగుతోంది. యువ ఇన్వెస్టర్లు తమ సౌకర్యార్థం, లిక్విడిటీ కోసం క్రమంగా ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వైపు మళ్లుతున్నారు. పుత్తడిని ఎమోషనల్గా కొనుక్కోవడం కాకుండా వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదే సరైన విధానమన్నది విశ్లేషకుల మాట.తయారీ.. తరుగుతో కోత..మార్కెట్లో మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది ఇన్వెస్టర్లు జ్యుయలరీ రూపంలో కొన్న బంగారాన్ని కూడా పెట్టుబడిగానే పరిగణిస్తుంటారు. అనుబంధం, సంప్రదాయాలపరంగా ఆభరణాలు, నాణేల రూపంలో బంగారానికి ఎంతో విలువ ఉన్నప్పటికీ, ఆర్థిక కోణంలో చూస్తే మాత్రం భౌతికరూపంలోని పసిడి కొనుగోలు విధానంలో లోటుపాట్లు ఎక్కువ. తయారీ చార్జీల కారణంగా వీటి విలువ కొనుక్కోగానే 10–15 శాతం తగ్గిపోతుంది. రూ. 1 లక్ష విలువ చేసే బంగారు ఆభరణాన్ని కొన్నప్పుడు, సాధారణంగా రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు మేకింగ్ చార్జీల కింద పోతుంది. అంటే మనం వాస్తవానికి రూ. 85,000–90,000 విలువ చేసిన బంగారమే కొన్నట్లవుతుంది. ఇక మళ్లీ రీసేల్ చేయాలంటే తరుగు అంటూ తీసేస్తారు. దీంతో సదరు బంగారు ఆభరణంపై వచ్చే రాబడి మరింత తగ్గిపోయినట్లవుతుంది. ఇదిగాకుండా వీటిని సురక్షితంగా భద్రపర్చుకోవడం మరో ఎత్తు. ఇక తిరిగి విక్రయించినప్పుడు, రేట్లు భారీగా పెరిగితే తప్ప, రీసేల్ విలువ తక్కువే వస్తుంది. ఆ రకంగా పెట్టుబడుల కోణంలో చూస్తే ఇది అంత లాభసాటి వ్యవహారంగా ఉండదు.పసిడిపై మళ్లీ ఫోకస్దేశ, విదేశ పరిణామాలతో ఇటీవలి కాలంలో పసిడికి మళ్లీ ప్రాధాన్యం పెరిగింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక అనిశి్చతి, ఈక్విటీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం, కరెన్సీ బలహీనపడుతుండటంలాంటి అంశాలు మళ్లీ బంగారంపై ఇన్వెస్టర్లలో ఆసక్తిని పెంచుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పసిడి సురక్షితమైన పెట్టుబడి సాధనం పాత్రను పోషిస్తుంది. మిగతా ఆర్థిక సాధనాలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు ఇది స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇదీ... నయా రూట్ఇలాంటివన్నీ చూశాకేనేమో... ఇపుడు పుత్తడిలో పెట్టుబడులు పెట్టే విధానంలో గణనీయంగా మార్పులొచ్చాయి. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చాయి. పసిడి ధరలకు అనుగుణంగా ఉండే ఈ ఈటీఎఫ్లను షేర్లలాగానే స్టాక్ ఎక్స్ఛేజీల్లో కొనుక్కోవచ్చు. అమ్ముకోవచ్చు. వీటిని కావాల్సినప్పుడు కొనుక్కుని, అమ్ముకునేందుకు (లిక్విడిటీ) వీలు, పారదర్శకత ఉంటుంది. భౌతికంగా భద్రపర్చుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఇంత వెసులుబాటు ఉన్నందుకే ఇన్వెస్టర్లు వీటివైపు చూడటం పెరుగుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) కూడా గతంలో వచ్చాయి. పసిడి ధరను ట్రాక్ చేసే ఈ బాండ్లపై వార్షికంగా అదనంగా 2.5 శాతం వడ్డీ కూడా ఇవ్వడంతో పాటు క్యాపిటల్ గెయిన్స్ నుంచి కూడా మినహాయింపు లభించేలా వీటిని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ విధానంలో కొన్ని మార్పులు వచి్చ, కొత్త బాండ్ల జారీ ఆగినప్పటికీ, గతంలో జారీ చేసినవి అలాగే కొనసాగుతున్నాయి. పోర్ట్ఫోలియోకి భద్రతపోర్ట్ఫోలియోను సమతూకంతో ఉంచడంలో పసిడి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పసిడి పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరిస్తే చాలా ఉపయోగకరం. ఈక్విటీల తరహాలో భారీ రిటర్నుల కోసం కాకుండా, స్థిరత్వానికి, డైవర్సిఫికేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా 10–15 శాతం పసిడికి, సుమారు 60 శాతం ఈక్విటీలకి, 25 శాతం డెట్ సాధనాలకు కేటాయిస్తే పోర్ట్ఫోలియో సమగ్రంగా ఉంటుంది. దీనివల్ల ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు రిసు్కలు తగ్గుతాయి. గోల్డ్ ఈటీఎఫ్లు లిక్విడిటీతో పాటు స్వల్పకాలిక అవసరాల కోసం, పోర్ట్ఫోలియోలో పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఉపయోగపడతాయి.నాణేలు, ఆభరణాలతో ప్రతికూలం..మేకింగ్ చార్జీల రూపంలో కొనగానే 10–15%తరుగుతో రీసేల్ విలువలోనూ కోతఆభరణం కొనుగోలు ధర: రూ. 1,00,000మేకింగ్ చార్జీలు : రూ. 10,000 15,000వాస్తవంగా బంగారం ధర: రూ.85,000-90,000పోర్ట్ఫోలియో కేటాయింపు ఇలా..ఈక్విటీ 60 శాతండెట్ 25 శాతంపసిడి 10-15 శాతంఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట!
మార్కెట్కు హార్మూజ్ టెన్షన్!
పశ్చిమాసియా యుద్ధ ఆందోళనలకు తాత్కాలికంగా తెరపడినట్లు గత వారాంతాన వెలువడిన వార్తలు ఒక్క రోజులోనే రివర్స్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఉత్సాహానికి బ్రేక్ పడనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు తిరోగమన పథం పట్టే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ముడిచమురు ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపగల యూఎస్, ఇరాన్ యుద్ధ ఆందోళనలు తిరిగి పెరగనున్నాయి. హార్మూజ్ జలాలపై యూఎస్, ఇరాన్ బలప్రయోగ వార్తలు అంతర్జాతీయంగా మరోసారి అనిశ్చితికి దారితీయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీంతో ప్రధానంగా చమురు రవాణాకు విఘాతం కలగడంతో ధరలు మళ్లీ ఊపందుకునే వీలుంది. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చమురు ధరలు, గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్కు కీలకమైన ఇరాన్, యూఎస్ యుద్ధ పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఆర్. తెలియజేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఈ నెల 22న ముగియనుంది. రిజల్ట్స్ సీజన్.. గత వారాంతాన బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐతోపాటు యస్ బ్యాంక్ క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించాయి. ఈ ప్రభావం నేడు ఆయా స్టాక్స్పై కనిపించే వీలుంది. ఇప్పటికే జోరందుకున్న జనవరి–మార్చి ఫలితాల సీజన్ మరింత ఊపందుకోనుంది. ఈ వారం పలు దిగ్గజాలు పనితీరు వెల్లడించనున్నాయి. జాబితాలో ఐటీ దిగ్గజాలు హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాసహా.. హావెల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, పీఎన్బీ హౌసింగ్, నెస్లే, పెర్సిస్టెంట్, ఒరాకిల్, ఎస్బీఐ లైఫ్, ఎల్టీ టెక్, ఎల్టీఎం, ఎల్అండ్టీ ఫైనాన్స్ తదితరాలున్నాయి. గణాంకాలు కీలకం మార్చి నెలకు నేడు(20న) ఇన్ఫ్రా ఔట్పుట్ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ బాటలో గురువారం(23న) హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసులు తదితర పీఎంఐ ఇండెక్స్ వివరాలు తెలియనున్నాయి. గత వారం వెలువడిన రిటైల్, టోకు ద్రవ్యోల్బణం ఆర్బీఐ పాలసీ నిర్ణయాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. వీటికితోడు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, చమురు ధరలు తదితర అంశాలు దేశీయంగా సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు.గత వారమిలా వరుసగా రెండో వారం దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ నికరంగా 943 పాయింట్లు(1.2 శాతం) బలపడి 78,494 వద్ద ముగిసింది. నిఫ్టీ 303 పాయింట్లు(1.3 శాతం) పుంజుకుని 24,354 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం మరింత అధికంగా 3.2 శాతం, 4.6 శాతం చొప్పున ఎగశాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్
ఫ్యామిలీ
ఈ వారం కథ: ప్రాణదాత
‘‘లే నాయనా! మరేమీ భయం లేదు’’ అన్నారు శాస్త్రిగారు. రామచంద్ర వినయంగా లేచి నిలబడ్డాడు. జేబులోంచి ఓ కాగితం తీసి ఆయన చేతిలో పెట్టాడు. మడతవిప్పి చదువుతుండగానే, ఆ ఉత్తరంలో తన తండ్రి శాస్త్రిగారికి వ్రాసిన సందేశాన్ని క్లుప్తంగా వినిపించాడు.‘‘రుణాలు దారుణంగా ఉన్నాయి స్వామీ! తొందరలో తీర్చకపోతే ఇల్లు అప్పులవాళ్ల పరమైపోతుంది. నాకేమో శిల్పాలు చెక్కడం తప్ప మరే పనీ చేతకాదు. ఈ మధ్యన చేతినిండా పని దొరకడం లేదు. డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది. డబ్బుకోసం, పని కోసం పట్టకూడని వాళ్ల కాళ్లు కూడా పట్టాను. ఈ కష్టాలకు అంతూదరీ చిక్కడం లేదు. దీనికి పరిష్కారం మీరే చూపించగలరని మా నాన్న చెప్పాడు. అన్యథా శరణం నాస్తి’’ అంటూ మళ్లీ శాస్త్రిగారి కాళ్లమీద పడ్డాడు రామచంద్ర.‘‘ఇలా మాటిమాటికీ ఇబ్బంది పెట్టకు నాయనా! ఏదీ జాతకం కాగితాలు తెచ్చావా?’’ అని అడిగారు శాస్త్రిగారు అంతకుముందు అతడిచ్చిన కాగితాన్ని పక్కన పెడుతూ... మరో కాగితాల దొంతర తీసి ఆయనకు అందించాడు రామచంద్ర. శాస్త్రిగారు పరీక్ష చేస్తున్నారు. ద్వితీయాధిపతి దశ నడుస్తోంది. అష్టమ వ్యయాధిపతులు అంతర ప్రత్యంతర దశల్లో ఉన్నారు. గోచార రీత్యా క్రూరగ్రహమైన వ్యయాధిపతి ధన స్థానంలోకి చేరబోతున్నాడు. అన్నీ అపశకునాలే కనిపిస్తుండగా శాస్త్రిగారి మనస్సు కలవరపడింది. రామచంద్ర దీనంగా ముఖంపెట్టుకుని శాస్త్రిగారినే చూస్తున్నాడు. ఆయన ఒక్కక్షణం కళ్లుమూసుకుని తన ఉపాస్యదేవతను స్మరించారు. ఆయన భృకుటియందు ఒక దృశ్యం ఆవిష్కృతమైంది.మహాకాలసర్పం ఒకటి సూర్యుణ్ణి మింగబోతుండగా, ఒకానొక త్రిశూలం దాన్ని ఎత్తి గిరవాటేసింది. శివుని జటాజూటంలో జారిపడ్డ ఆ పాము గంగలో ఈదులాడుతోంది... ఈ దృశ్యాన్ని చూసిన తరువాత నెమ్మదిగా కళ్లు తెరిచారు శాస్త్రిగారు.ప్రసన్న వదనంతో చిరునవ్వు నవ్వుతూ, ‘‘నాయనా! నీకు తళుకేశ్వరం తెలుసా?’’ అని అడిగారు. ‘‘తెలియదండి.’’‘‘ఇప్పుడు దాన్నే తడికలపూడి అంటున్నారు. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే దారిలో ఉంది. అక్కడ గాంగేశ్వరస్వామి ఆలయం ఉంది. గంగాపుత్రుడైన భీష్మపితామహుడు ప్రతిష్ఠించిన శివలింగం...’’శాస్త్రిగారు చెబుతున్నారు. రామచంద్ర వింటున్నాడు.‘‘వచ్చే అమావాస్య... సోమవారం. సోమావతీ అమావాస్య అంటారు. పవిత్రమైన రోజు. ఆ రోజు ఉదయం ఆ స్వామికి శక్తివంచన లేకుండా అభిషేకం చేయించుకో.’’‘‘స్వామీ! నా ఆర్థిక పరిస్థితి చెప్పాను కదా’’ ఆదుర్దాగా మాటకడ్డం వచ్చాడు రామచంద్ర.‘‘మరేం పరవాలేదు. శక్తివంచన లేకుండా అంటే భక్తిలోపం లేకుండా మనసు తీరా చేయమని కానీ, డబ్బు ఖర్చుపెట్టమని కాదు.’’ వివరించారు శాస్త్రిగారు. ‘‘అలాగే స్వామీ!’’‘‘ఆనాటి ఉదయం అక్కడ అభిషేకం చెయ్యి. అక్కడి నుంచి తూర్పుకు ఐదుమైళ్ల దూరంలో కుడివైపున తోటల మధ్యలో అష్టభైరవ నిర్మితమైన శివాలయం ఉంటుంది. ఆ రాత్రికి నీవు ఆ ఆలయంలో జాగారం చేయాలి. జాగ్రత్త సుమా! అసలే నిర్జన ప్రదేశం. తగిన ఏర్పాట్లతో వెళ్లు. మెలకువతో రాత్రంతా ఉండి, తెల్లవారిన తరువాత నా వద్దకు నేరుగా రా’’ అంటూ కొంత డబ్బుతీసి రామచంద్ర ముందు పెట్టారు శాస్త్రిగారు.‘‘అయ్యో! నేనివ్వాల్సింది పోయి మీరే ఎదురిస్తున్నారా?’’ మొహమాట పడ్డాడు రామచంద్ర.‘‘ఇన్నేళ్లుగా నా మొగమైనా తెలీని నిన్ను, మీ నాన్న ఇప్పుడే నా దగ్గరకు పంపాడంటే దానికేదో కారణం ఉంటుందని గ్రహించు. ఈ డబ్బు మీ నాన్న ఇచ్చిందే అనుకో’’ లాలనగా చెప్పారు శాస్త్రిగారు.రామచంద్ర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు. అది 1966వ సంవత్సరం, ఫాల్గుణమాసం. అమాసోమవారం తెల్లవారింది. ఆ వేళ ఉదయం ఎనిమిది కావస్తుండగా రామచంద్ర తడికలపూడికి చేరుకున్నాడు. ప్రధాన రహదారి నుంచి ఎడమ పక్క సందులోకి ప్రవేశించాడు. అల్లంత దూరాన వేంగీ చాళుక్యుల కాలంనాటి ఆలయ శిఖరం నీరెండ ఛాయలో మెరుస్తూ కనిపిస్తోంది. నడుచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. జనావాసాల మధ్యలోనే ఉన్న మల్లెతోటల నుంచి సువాసనలు దారంతా విరజిమ్ముతున్నాయి. జనాలంతా నీళ్లకావిళ్లతో ఎదురొస్తున్నారు. చెరువు దూరంగా ఉన్నట్లుంది. రామచంద్ర ఆలయాన్ని సమీపించాడు. ఆలయ ప్రాకారాన్ని చుట్టిరావడానికి వీలులేదు. రెండుపక్కల ఇళ్లు. అయిమూలగా దక్షిణదిక్కున ఒక రోడ్డుంది. గుడిలోకి ప్రవేశించాడు రామచంద్ర. తువ్వాలు చుట్టుకున్న ఆలయ పూజారి బలిపీఠం దగ్గర శుభ్రం చేసుకుంటున్నాడు. కుడివైపు బావి వుంది. ‘‘అయ్యా! ఆ బావిలో నీళ్లు స్నానానికి పనికొస్తాయా?’’ అడిగాడు రామచంద్ర.ఒక్కక్షణం అతణ్ణి పరకాయించి చూసి, ‘‘ఆ బావిలో నీళ్లు తోడటం నీవల్ల కాదు. స్నానానికైతే చెరువుంది’’ చెప్పాడు పూజారి.నిజమే. బావి చాలా లోతుగా ఉంది. నీళ్లు అట్టడుగున ఉన్నాయి.‘‘పేరుకి గాంగేశ్వర స్వామి వెలసిన క్షేత్రం. ఊళ్లో నీటిచుక్క ఉండదు. వేసవికాలం వస్తే ఉన్న ఒక్క చెరువూ ఎండిపోతుంది. జీవుడికి తాగునీటికి కరవు. గుళ్లో అయ్యవారి స్నానానికి కరవు’’ పూజారి తనలో తానే గొణుక్కుంటున్నాడు.రామచంద్ర ఎడమభుజం మీద సంచీని ఎగదోసుకుని ముందుకి కదిలాడు. ‘‘బాబూ! వచ్చేటప్పుడు ఆ కావిడితో నీళ్లు తెచ్చిపెట్టగలవా?’’ అడిగాడు పూజారి. ‘‘మహద్భాగ్యం’’ అంటూ కావిడిని కుడిభుజం మీదకు ఎత్తుకున్నాడు రామచంద్ర. చెరువులో స్నానం చేసి, నీళ్లు తీసుకుని వచ్చాడు. అప్పటికే అభిషేకం మొదలైనట్లుంది. పూజారితో గొంతు కలుపుతూ గాంగేశ్వరస్వామిని నమక చమకాలతో అర్చించాడు రామచంద్ర. అనంతరం కొంత దక్షిణ ఆయనకు సమర్పించాడు. ‘‘లేచిన వేళ బాగుంది’’ అనుకుంటూ దానిని అందుకున్నాడు పూజారి. ‘‘బాబూ! చాలాదూరం నుంచి వచ్చినట్లున్నావు’’ రామచంద్రని అడిగాడు ఆప్యాయంగా.‘‘అవునండీ. ఒక పని మీద వచ్చాను. ఈవేళ ఇక్కడే ఉంటాను’’ చెప్పాడు రామచంద్ర.‘‘అయితే ఈ పూటకి మా ఇంటిలో చేయి కడుక్కోవచ్చు’’ ఆదరంగా చెప్పాడు పూజారి.కృతజ్ఞతగా నమస్కరించాడు రామచంద్ర. భోజనం తరువాత, కాసేపు ఆలయ శిల్పాలను గమనిస్తూ గడిపాడు. కొద్దిసేపటికి దూరంగా ఆకాశంలో ఉరుముల సవ్వడులు వినిపించసాగాయి. ఎండ పూర్తిగా తగ్గలేదు కానీ వాతావరణం చల్లబడింది. శాస్త్రిగారు చెప్పిన గుర్తుల ప్రకారం ఆలయానికి తూర్పుముఖంగా సాగిపోయాడు రామచంద్ర. ఒక గంటన్నర వ్యవధిలో జీడిమామిడి తోటల మధ్యలో ఉన్న ఒక శిథిలాలయాన్ని కనుగొన్నాడు. మహా అయితే నాలుగడుగుల ఎత్తుంటుంది. అయిదడుగుల పొడవు, మూడడుగుల వెడల్పు ఉంటుంది. ఆ కాస్తచోటులోనే ఎనిమిదివైపులా భైరవశిల్పాలున్నాయి. ఆ శిల్పసౌందర్యం అమోఘంగా ఉంది. రామచంద్ర గుడిచుట్టూ పరికిస్తుండగా, తోట రైతు కాబోలు వచ్చాడు. ‘‘ఎవురు బాబూ! ఈయేళప్పుడు వచ్చారు? బేగ ఎల్లిపోండి. వాన పడేనాగుంది’’ అని సలహా ఇచ్చాడు. రామచంద్ర చిరునవ్వు నవ్వి, ‘‘లేదు. ఈరాత్రికి ఇక్కడే ఉండాలని వచ్చాను’’ అన్నాడు.రైతు అతడిని అయోమయంగా చూశాడు. ‘‘సూడు బాబూ! ఈడ రాత్రైతే మావే ఉండలేం. కట్టం. ఏడనుంచొస్తాయో... ఎందుకొస్తాయో తెలవదు గానీ, చీకటి పడగానే ఈడకి కుక్కలొస్తాయి. మనుషుల్ని చెండాడేస్తాయి. ఆటితో నువ్వు పడలేవు బాబూ! నా మాటిని ఎల్లిపో’’ బుజ్జగింపుగా చెప్పాడు.‘‘ఈ గుడిలో నిద్ర చేస్తానని మొక్కుకున్నాను. అంచేత ఈ రాత్రికి ఉండాల్సిందే’’ చెప్పాడు రామచంద్ర.‘‘ఈ గుడికి ఇట్టాంటి మొక్కులతో కూడా జనాలొత్తన్నారా? ఇడ్డూరంగా ఉందే. సరే బాబూ! జాగ్రత్త’’ అంటూ రైతు అక్కడినుంచి వెళ్లిపోయాడు.ఇంకా సంధ్యాసమయం కాలేదు. కానీ ఆకాశం మేఘావృతం కావడం వల్ల చీకట్లు కమ్ముకుంటున్నాయి. కనుచీకటి ఉండగానే రామచంద్ర గుళ్లో ప్రవేశించాడు. అడుగున్నర ఎత్తున్న ద్వారానికి తలుపులేమీ లేవు. వంగి పాక్కుంటూ లోపలికి వెళ్లి చూస్తే గుడికి మధ్యలో పానపట్ట రహితంగా నేలలో పాతేసినట్లుగా శివలింగం ఉంది.ఇంకు సీసా మూతకి కన్నంపెట్టి ఒత్తిని దూర్చి, లోపల కిరసనాయిల్ పోసి మూతపెడితే ఇల్లాయిబుడ్డి తయారవుతుంది. ఆ బుడ్డిలో కిరసనాయిల్ బదులుగా ఆవునెయ్యి పోసి తెచ్చాడు రామచంద్ర. దేవుడిముందు వెలిగించాడు. ఆ వెలుగులో రాత్రంతా అక్కడ కాలక్షేపం చెయ్యాలి. అందుకోసం కూడా తగిన ఏర్పాట్లు ముందే చేసుకున్నాడు. ఏవైనా బొమ్మలు గీసుకోవచ్చని కొన్ని కాయితాలు తెచ్చుకున్నాడు. ఆ గుడిని చూసేవరకు ఏం గీయాలో అనుకోలేదు. కానీ అక్కడికి వచ్చిన తరువాత, ఇదే గుడి అర ఎకరం నేలలో విశాలమైన గుడిగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించి, బొమ్మ గీయాలనిపించింది. ఆ పనే మొదలుపెట్టాడు. బయట ఉరుముల శబ్దం అంతకంతకూ ఎక్కువవుతోంది. సన్నగా చినుకు కూడా ప్రారంభమైనట్లుంది. ఇంతలో ఉన్నట్లుండి అక్కడికో కుక్క వచ్చింది. ఆ గూడులో రెండు జీవులు తలదాచుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆ కుక్క ముందరికాళ్లను బాగా ముందుకు జాపి, విశ్రాంతిగా ద్వారానికి అడ్డంగా కూచుంది.రామచంద్ర కొద్దిసేపు ఆ కుక్కని గమనించి, తన పనిలో మునిగిపోయాడు. ఆలయం బయటి దృశ్యాన్ని మొదటిబొమ్మగా గీయడం పూర్తయ్యేసరికి సుమారుగా మూడుగంటల సమయం పట్టింది. లోపలి ఆలయాన్ని గీయాలని రెండో బొమ్మ మొదలుపెట్టాడు.ఇంతలో వర్షం పూర్తిగా పెద్దదయింది. గాలి తాకిడి కూడా ఉద్ధృతంగా ఉంది. తానున్నది చిన్న గూడు కనుక గాలి లోపలికి పెద్దగా రావడం లేదు. అందువల్లనే దీపం నిలబడింది కానీ లేకపోతే కష్టమయ్యేది. మరో గంట గడిచింది. రామచంద్ర కూర్చుని ఉన్నచోట నేల చెమ్మతేరడం మొదలయ్యింది. వెంటనే పక్కన పెట్టిన సంచీని తీసి ఒళ్లో పెట్టుకున్నాడు. వర్షం ఇంకా పెద్దదయితే, నీళ్లు లోపలికి వచ్చేస్తాయి కాబోలు... అప్పుడెలా అని మథన పడసాగాడు.అతను ఊహించిందే నిజమైంది. రెండో బొమ్మ ఇంకా పూర్తి కాకుండానే గుళ్లోకి నీళ్లు రాసాగాయి. అప్పటికే రామచంద్ర కట్టుకున్న పంచె పూర్తిగా తడిసిపోయింది. గొంతుకు కూర్చుంటే చీలమండల వరకు నీళ్లు వచ్చేశాయి. ఇక అక్కడ ఉంటే క్షేమం కాదనిపించింది. లోపలినుంచి బయటికి వెళ్దామంటే కుక్క అడ్డంగా ఉంది. దానికి బయటికి పోవడం ఇష్టం లేదు కాబోలు, చేత్తో ముందుకు తోసినా కదలలేదు. కొద్దిసేపటికి రామచంద్రకు బయటకు వెళ్లడానికి తోవ ఇచ్చింది. అతడితోపాటు తాను కూడా బయటకు నడిచింది. యట అంతా గాఢాంధకారంగా ఉంది. నేలమీద పిక్కలవరకు నీళ్లున్నాయి. ‘ఇంతలోనే ఎంత వర్షం పడింది?’ అని ఆశ్చర్యపోతూనే, ఒక్క ఉదుటన ఆలయంపైకి ఎక్కి కూచున్నాడు. ఎలా ఎక్కిందో తెలియదు కానీ ఆ కుక్క కూడా ఆలయంపైకి చేరింది. అక్కడ కూచునేందుకు బాగుంది. ఎటొచ్చీ పైనుంచి కుండపోత వాన. చప్పగా తడిసిపోయాడు. కొద్దిగా ఒణుకు కూడా వస్తోంది. ఆకాశం చిల్లుపడినట్లుగా ఆ రాత్రంతా వాన పడుతూనే ఉంది. గాలి విసిరి కొడుతూనే ఉంది. మెరుపు వెలుగు పడినప్పుడల్లా నీటిమట్టం పెరుగుతున్నట్లుగా తెలుస్తూనే ఉంది. కొద్దిసేపటి తరువాత ఉన్నట్లుండి కుక్క మొరగడం ప్రారంభించింది. అది ఎందుకు మొరుగుతోందో ముందు అర్థం కాలేదు. అప్పుడే ఆకాశంలో మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో... గుడిపైకి ఒక నల్లత్రాచు వచ్చి పడగ విప్పి వుండడం రామచంద్ర కంటపడింది. గుండె గుభేలుమంది. ఆ త్రాచు కాటువేసేందుకు సన్నద్ధంగా ఉంది. రామచంద్రకి కిందికి దూకి తప్పించుకుపోయే అవకాశం లేదు. కుక్క కూడా అక్కడే ఉండి నిస్సహాయంగా చూస్తోంది. పామును నేర్పుగా పట్టుకుని విసిరేయగలిగితే బాగానే ఉంటుంది కానీ, ధైర్యం చాలలేదు. కొద్దిగా వెనక్కి జరిగాడు. వీపుకి భైరవశిల్పం తగిలింది. దాని చేతికి త్రిశూలం ఉందనే సంగతి స్ఫురణకు వచ్చింది. చేతులు రెండూ వెనక్కి పెట్టి ఆ త్రిశూలాన్ని ఊడబెరికాడు. త్రాచుపామును త్రిశూలంతో ఎత్తిపట్టి, దూరంగా విసిరేశాడు. అదికాస్తా నీళ్లలో పడి, ఎటో కొట్టుకుపోయింది. ఆ తరువాత కొద్దిసేపటికే తెల్లవారింది. కానీ గుడిమీద నుంచి కిందికి దిగే అవకాశం మాత్రం లేదు. నేలమట్టానికి నాలుగడుగుల ఎత్తులో ఉన్న ఆ ఆలయానికి దాదాపు సమానంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లలో కిందికి దిగితే తాను బయటపడగలనో లేదో తెలియని పరిస్థితి. ఎందుకైనా మంచిదని మరో భైరవశిల్పం చేతిలోని శూలాన్ని ఊడబెరికి పట్టుకున్నాడు.రాత్రి నుంచి తనతోపాటు ఉన్న కుక్క తప్ప మరో తోడు లేదు. ఇప్పట్లో ఎవరైనా వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. ఆ కుక్కకి పాపం ఆకలి వేస్తున్నట్టుంది. కానీ చేసేదిలేక దిక్కులు చూస్తూ కూచుండిపోయింది. ఆ పూట సూర్యుడు ఉదయించలేదు. మధ్యాహ్నం కావస్తుండగా వర్షం తగ్గుముఖం పట్టింది. రామచంద్రకు తాను కూచున్న ప్రదేశం నుంచి కిందికి దిగడానికి ధైర్యం చాలలేదు. అంతలోతు నీళ్లలో దిగి నడవడం కానీ, ఈదుకుంటూ వెళ్లడం కానీ మహాప్రమాదంగా తోచింది.ఇంతలో, ‘‘ఒహోయ్ పెద్దమడిసీ! మెల్లిగా దిగిరా’’ అని అల్లంత దూరంలో ఎత్తయిన గట్టుమీద నుంచి ఎవరిదో తోట రైతు అరుస్తున్నాడు.‘నువ్వే దగ్గరకు రా!’ అన్నట్లు సైగ చేశాడు రామచంద్ర. రైతు నవ్వుకుంటూ, ‘‘బయపడమాకు. అవకాడ సెరువుకి గండి కొడతన్నాం. ఓ గంటలో నీళ్లన్నీ తీసేస్తాయి. ఆనక వద్దువు గానిలే’’ అని చెప్పి వెళ్లిపోయాడు.రైతు చెప్పింది నిజమయ్యేందుకు సుమారుగా రెండుగంటల సమయం పట్టింది. సాయంత్రం నాలుగు కావస్తుండగా తోటలో నీళ్లు తగ్గి, బురదనేల బయటపడింది. రామచంద్రతో పాటు పక్కనే ఉన్న కుక్క కూడా నేలకు దిగింది. గబగబా అడుగులు వేస్తూ గట్టుమీదికి వెళ్లిపోయింది. రామచంద్ర భయంభయంగా అడుగులు వేస్తున్నాడు. చీలమండల వరకు బురద నిలిచి ఉంది కానీ, మరేమీ ప్రమాదం లేదు. ఒక్కోచోట కాలు దిగబడి పిక్కల వరకు బురద వస్తోంది. నిన్నరాత్రి నుంచి తన చేతిలోని శూలాన్ని అలాగే ఉంచుకున్నాడు. ఆ శూలాన్ని నేలలో గుచ్చుతూ, ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తరువాతే అడుగు వేస్తున్నాడు. పాతిక అడుగులు వేసేసరికి ఒకచోట శూలం బొరియలో దిగబడినట్లుగా లోపలికి పోయింది. కొద్దిగా పక్కకు జరిగి అదే చోట మళ్లీ నేలలో బలంగా గుచ్చాడు రామచంద్ర. సందేహం లేదు... అక్కడ రాళ్లున్నాయి. అందుకే శూలం కంగున మోగుతోంది.‘‘జాగర్తయ్యోవ్’’ అన్నాడు గట్టుమీదనుంచి రైతు. రామచంద్ర అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు. శూలంతో చుట్టూ గీస్తూ ఏదో పరీక్షిస్తున్నాడు. చివరకు అతడు తాను గతరాత్రి ఊహించినది నిజమే అయినందుకు సంబరపడ్డాడు. ఈ ఆలయం కిందనే పూర్వం అతిపెద్ద ఆలయమేదో ఉండేది. అది శిథిలం కాగా, ఎవరో దానిపై చిన్న ఆలయాన్ని నిర్మింప చేశారు అనే నిర్ధారణకు వచ్చాడు. ఆ లోపలి ఆలయం ఇప్పుడు ఉండి ఉంటే ఎలా ఉండేదన్న ఊహతో రాత్రి తాను గీసిన నమూనా కాయితాలన్నీ వానలో నానిపోయి, ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రామచంద్రకు మనసులో కష్టం వేసింది. కానీ ఇప్పుడు స్థిమిత పడ్డాడు. గట్టుకు వస్తూనే, ‘‘చూడు బాబూ! ఈ ప్రాంతంలో ఇదివరకు ఏదైనా పెద్దగుడి ఉండేదా?’’ అడిగాడు రైతుని రామచంద్ర.‘‘అదేమో తెలవదు. నాకు ఊహ తెలిసినప్పటినుంచి అదే గుడి’’ చెప్పాడు రైతు.‘‘కాదు. నాకు అర్థమైనంత వరకు ఇక్కడ ఓ పెద్ద గుడి ఉండేది. ఉండేది ఏమిటి ఉంది. నేను చూశాను. నువ్వొప్పుకుంటే నేను దాన్ని వెలికి తీస్తాను’’ ఉత్సాహంగా చెప్పాడు రామచంద్ర.‘‘సూడయ్యా! మమ్మల్నిలా బతకనియ్యి. ఈ తోటంతా మాదే అయినా ఆ గుడి వున్నంతమేరా సెట్టు పెట్టకుండా వదిలేసి మా పొట్ట మేం పోషించుకుంటున్నాం. ఇప్పుడు గుడీ అదీ అంటూ అల్లరి మొదలెట్టావంటే... గవర్నమెంటోళ్లతో, బత్తులతో నానా తలనొప్పులూ పడాల్సొస్తుంది. ఆనక మా తోట ఏటవుద్దో నువ్వు గేరంటీ సెప్పగలవా?! అంచేత సూసిందంతా మర్సిపో. దీనికింద పెద్దగుడి వుందని నాకూ తెలుసు. కానీ చెప్పాను కదా, ఇక్కడ పలుగు పడితే భైరవసామి ఊరుకోడు. కుక్కలొచ్చి కండలు పీకేస్తాయి. ఇగ తొవ్వడం మొదలెడితే ఇంకేం వత్తాయో సెప్పలేం. వచ్చిన పని పూర్తయింది కాబట్టి, జాయిగా ఇల్లు జేరుకో’’ అని చెప్పేసి వెళ్లిపోయాడు రైతు.రామచంద్ర అక్కడినుంచి మళ్లీ తడికలపూడి గాంగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాడు. స్వామికి నమస్కరించి బయలుదేరాడు. ఆ రాత్రికి రాత్రి నడుచుకుంటూ వెళ్లి తెల్లవారేసరికి శాస్త్రిగారి ఇంటిముందు నిలబడ్డాడు.‘‘నిన్నంతా ఏమైపోయావు? తుపానులో చిక్కుకుపోయావేమో అని కంగారు పడ్డాను’’ అడిగారు శాస్త్రిగారు అతడిని చూస్తూనే.‘‘నిజమేనండీ. మీ ఆశీస్సులు ఉండబట్టి బతికిపోయాను. లేకపోతే ఈపాటికి చనిపోయే వాడిని’’ అంటూ ముందురోజు రాత్రి తనకు ఎదురైన అనుభవాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు రామచంద్ర.‘‘హమ్మయ్య. గండం గడిచింది. ఇంక నీకేమీ భయం లేదు. నీ వృత్తిలో కూడా పైకొస్తావు. ఇదిగో ఈ ఉత్తరం తీసుకో. హైదరాబాదులో ఉన్న మా స్నేహితుడికి నీ గురించి రాశాను. అక్కడేదో గుడి కడుతున్నారట. నీకేదైనా పని దొరకచ్చు. కానీ రాతి శిల్పాలే చెక్కుతా... సిమెంటు తాపీ పట్టుకోను అంటూ పిచ్చి సిద్ధాంతాలు వల్లెవేయకు. దొరికిన పనిలో దూరిపో. రోజులు బాగుపడితే మనసుకు నచ్చిన పని దొరకచ్చు’’ అని బోధించారు శాస్త్రిగారు.ఆయనకు మరోసారి నమస్కరించి వచ్చేశాడు రామచంద్ర. ...ఇదంతా నా కథ. ఇందులోని రామచంద్రను నేనే. ఆనాడు శాస్త్రిగారి వద్దనుంచి వచ్చిన తరువాత ఎంతో జీవితాన్ని చవిచూశాను. ఎన్నెన్నో అనుభవాలను పొందాను. నాకొచ్చిన కళను నా పిల్లలకు నేర్పించాను. కానీ వారికి రాతిశిల్పాలతో పనిచేసే అవకాశం రాలేదు. ఇప్పుడు నా మనుమళ్లు రాతిశిల్పాలను కంప్యూటర్ల సాయంతో చెక్కుతున్నారని తెలిసి ఆనందంగా ఉంది. స్థాపత్య కళలో వారు సాధిస్తున్న విజయాలు చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మళ్లీ మన ఆలయాలకు పూర్వవైభవం వస్తోంది కదా అని చాలా సంతోషంగా ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ప్రాణదానం చేసిన ఆ అష్టభైరవ నిర్మిత ఆలయాన్ని మరిచిపోలేదు నేను. ఇప్పటివరకు ఆ ఆలయాన్ని మూడుసార్లు సందర్శించాను. అక్కడికి వెళ్లిన ప్రతిసారీ ఏవేవో కొత్త అనుభూతులు కలిగేవి. ప్రతిసారీ ఆ రైతును కలిసేవాడిని. పెద్దగుడిని బయటికి తీయడానికి కానీ, తోటను అమ్మడానికి కానీ అతడెప్పుడూ ఒప్పుకోలేదు. ఇప్పుడు నాకు వయసు మీరింది. బహుశా ఈపాటికి ఆ తోట రైతు మనవళ్ల పరమై ఉంటుంది. వాళ్లయినా అక్కడ తవ్వకాలకు ఒప్పుకుంటారని నేను అనుకోవడం లేదు. ఇటీవలే గాంగేశ్వర స్వామి ఆలయానికి పునరుద్ధరణ జరిగిందని తెలిసి సంతోషించాను. ఇక ఆ గుడి కూడా జీర్ణోద్ధరణ పొందితే... అది కూడా నా వంశం వారివల్ల జరిగితే నాకు కావాల్సింది అంతకంటే ఏమీ లేదు.ఇట్లురామచంద్ర అని రాసివున్న డైరీని మూడోసారి చదివి, మూసి పక్కన పెట్టాడు కిషోర్. తన తాతయ్య ప్రాణం కాపాడిన ఆ మందిరాన్ని ఒక్కసారి చూసి రావాలనిపించింది అతనికి.నేల నాలుగుచెరగులా ఎక్కడ తడిమి చూసినా శిథిలాల కింద చరిత్ర మూలుగుతూ ఉంటుంది. కొన్నింటికి మహర్దశ పడుతుంది. బయటికి వస్తాయి. రాజ్యమేలతాయి. మరికొన్నింటి భవిష్యత్తు కాలాలమీద కానీ తేలదు. ఏ స్వార్థమూ లేకుండా ఒకనాటి జ్ఞాపకాలను తవ్వితీసి మళ్లీ అందరిముందు ఠీవిగా నిలబెట్టాలని తపించేవారు నూటికో కోటికో ఒక్కరుంటారు. కొన్నిసార్లు వాళ్లు తమ ప్రయత్నంలో విజయం సాధిస్తారు కూడా.
కథాకళి: ఫటాఫట్
అతని శ్రావ్యమైన కంఠం, మెత్తని నడవడిక అతనిలోని దుర్మార్గానికి తెరలని ఆమె ఆలస్యంగా తెలుసుకుంది.ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుజీవ్ ఆమెని ఇంటర్వ్యూ చేశాడు. ఆమె అందం అతన్ని ఆకర్షించింది. పౌడర్ తప్ప మరే మేకప్ లేని, కనుబొమలని కట్ చేసుకుని దిద్దుకోని ఆమె సహజమైన అందం, ఆమె చురుకుదనం అతన్ని ఆకర్షించాయి.సుజీవ్ తండ్రి ఉద్యోగరీత్యా తూర్పు గోదావరి జిల్లాకి పోలీస్ సూపరింటెండెంట్. ఆయన అన్యాయార్జితంతో తన పేర స్థాపించిన ఫైనా¯Œ ్స కంపెనీని సుజీవ్ మేనేజ్ చేస్తున్నాడు. హైద్రాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఇరవై ఆరు అంతస్తుల భవంతిలో, టాప్ ఫ్లోర్లో ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణం గల అపార్ట్మెంట్లో సుజీవ్ ఒంటరిగా ఉంటాడు. అది సుజీవ్ తండ్రి అక్రమసంపాదనతో తన భార్య పేర కొన్న ఆస్తి.ఓరోజు ఆఫీస్లో లంచ్ చేస్తూ సుజీవ్ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించి తెలుసుకున్నాడు. ‘‘నా భార్యకి పబ్ కల్చర్ అంటే ఇష్టం. వద్దన్నానని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి బతిమాలి తెస్తానని ఎదురుచూసింది. కాని విడాకులు తీసుకుంటానని ఆమె ఊహించలేదు. నువ్వు అన్నీ ఫటాఫట్ చేసేస్తూంటావు. మన వ్యాపారానికి అది ముఖ్యం. నీకు అభ్యంతరం లేకపోతే మన పెళ్ళి గురించి మీ పెద్దలతో మాట్లాడతాను.’’ఆమె దిమ్మెరపోయింది. తను ఎక్కడ? అతను ఎక్కడ? ఆమె గాల్లో తేలుతూ ఇంటికి వెళ్ళింది. వారం తర్వాత ఆమె అర్జెంట్ కాగితాల మీద సంతకాలు తీసుకోడానికి అతని అపార్ట్మెంట్కి వచ్చింది. అతను చొరవ తీసుకుంటే ఆమె సిగ్గుగా అభ్యంతరం చెప్పింది తప్ప ఎదురు తిరగలేదు.మూడు వారాల తర్వాత ఓరోజు ఆమెకి సుజీవ్ నించి ‘నువ్వు అర్జెంట్గా నా ఇంటికి వస్తావా?’ అనే మెసేజ్ వచ్చింది. ‘మా నాన్నగారికి వడదెబ్బ కొట్టి ఇప్పుడే తేరుకుంటున్నారు. అందుకే సెలవు పెట్టాను సర్. ఆయన్ని చూసుకోవాలి’ సమాధానం పంపింది.‘‘పర్సనల్గా మాట్లాడాలి. ఓ అరగంట వచ్చి వెళ్ళలేవా?’’ ఫోన్ చేసి అడిగాడు.‘‘సరే సర్.’’ అతని కంఠంలోని అభ్యర్థనని గుర్తించి చెప్పింది.‘‘జాగ్రత్తమ్మా. నగరంలో హీట్ వేవ్తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయని టీవీలో చూపిస్తున్నారు.’’ తల్లి హెచ్చరించింది. ఆమెని చూడగానే సుజీవ్ చెప్పాడు.‘‘మా నాన్నగారు చిక్కుల్లో పడ్డారు. బయటపడటానికి ఒకరిని మంచి చేసుకోవాలి. లేదా ఆయన ఉద్యోగం ఊడొచ్చు.’’‘‘అయ్యో.’’‘‘అందుకు నువ్వో మనిషిని సంతోషపెట్టాలి.’’‘‘నాకు అర్థం కాలేదు సర్.’’ అయోమయంగా చూస్తూ చెప్పింది.‘‘అర్థం కాకపోడానికి ఏంలేదు. నన్ను సంతోషపెట్టినట్లే. అతన్ని వచ్చే బుధవారం మన ఆఫీస్ గెస్ట్ హౌస్లో కలుసుకోవచ్చు.’’ఆమె తను విన్నది నమ్మలేకపోయింది. తనని పెళ్ళి చేసుకుంటానని అడిగిన ఇతనేనా ఈ మాట అన్నది? అతను తనని పెళ్ళి చేసుకోడని ఆమెకి వెంటనే తట్టింది. ఆమె దుఃఖం కోపంగా మారడంతో కంఠం పెంచి చెప్పింది.‘‘సారీ! నేను అలాంటిదాన్ని కాదు. నేను ఇప్పుడే రాజీనామా చేస్తున్నాను.’’‘‘నీకా అవకాశం లేదు. ఆ ఏíసీబీ డైరెక్టర్ని నువ్వు తృప్తి పరచాలి.’’అతను లేప్టాప్లో వాళ్ళిద్దరి రతికేళి వీడియోని ప్లే చేసాడు.‘‘ఏమిటిది? ఏమిటీ మోసం?’’ ఆమె మరోసారి నిర్ఘాంతపోతూ గట్టిగా అరిచింది.‘‘దీన్ని మీ తల్లిదండ్రులు చూడకూడదనుకుంటే, బుధవారం ఎక్కడ పికప్ చేయటం నీకు సౌకర్యమో చెప్పు.’’తను బ్లాక్మెయిల్లో చిక్కుకుందని ఆమెకి అర్థమైంది. ఆమె కన్నీళ్ళు ఆపుకుంటూ లేచి మెట్లెక్కి టెర్రేస్లోకి వెళ్ళింది.ఆమె ఏకాంతంగా ఏడవడం కోసం పైకెళ్ళిందని సుజీవ్కి అర్థమైంది. పది నిమిషాలు గడిచినా ఆమె రాకపోవడంతో అతను టెర్రేస్లోకి వెళ్ళాడు. తలుపు వెనక పొంచి ఉన్న ఆమె చటుక్కున మెట్లమీదకి వెళ్ళి టెర్రేస్ తలుపు మూసి గడియ పెట్టింది.‘‘తలుపు తీయి. ఏమిటిది?’’ సుజీవ్ తలుపు బాదుతూ అరిచాడు.తలుపు తెరచుకోలేదు. పావుగంట తర్వాత ఇక ఆమె తలుపు తెరవదని బోధపడింది. పిట్టగోడ మీంచి దూకడానికి వీలులేకుండా లోపలివైపు ఆరడుగుల ఎత్తున గ్లాస్ వాల్ ఉండటంతో, అతను కింద రోడ్ మీద వారిని సహాయం కోరే అవకాశం లేకపోయింది. ఎక్కడా నీడ కనిపించలేదు. ఎండకి చెమటతో అతని షార్ట్స్, టీషర్ట్ తడిసిపోయాయి. టీషర్ట్ విప్పి తల మీద కప్పుకున్నాడు. అతని ఒంట్లోని నీరు చెమట రూపంలో కారిపోతూ దాహంతో నాలుక పిడచకట్టుకు పోయింది. లేప్టాప్లోని తమ వీడియోని డిలీట్ చేశాక, టీవీ చూస్తూ కాలక్షేపం చేసిన ఆమె సూర్యాస్తమయ సమయంలో పైకెళ్ళి టెర్రేస్ తలుపు తెరిచింది. ఆమె ఆశించినట్లుగా నేల మీద మగతగా పడున్న సుజీవ్కి వడదెబ్బ కొట్టింది. చక్కెర, ఉప్పు నీళ్ళు తాగించి, సెలైన్ ఎక్కిస్తే అతను జీవిస్తాడని ఆమెకి తెలుసు. అతన్ని కిందకి మోసుకెళ్ళి పక్క మీద పడుకోబెట్టింది. అతను ఏం జరుగుతోందో కూడా అర్థం కానంత అపస్మారకంలో ఉన్నాడు. ఆమెని వంచించడానికి సుజీవ్ ఏ మంచాన్ని ఆయుధంగా చేసుకున్నాడో ఆ మంచం మీదే ఆ రాత్రి ఆమె ఫటాఫట్ నిర్ణయంతో ప్రాణం వదిలాడు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి
'లివర్' అనే నేను..! జస్ట్ ఏడంగుళాల్లో..
లివర్ చాలా కీలకం. ఇది పనిచేయకపోతే మాత్రం ఏ పరికరాలూ, ఉపకరణాలూ రక్షించలేవు. అయితే లివర్ (కాలేయం) గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. లివర్ దెబ్బతిన్నప్పుడల్లా ఎప్పటికప్పుడు తనను తాను రిపేర్ చేసుకుంటూ ఉండడంతో పాటు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. నేడు వరల్డ్ లివర్ డే. ఈ సందర్భంగా కాలేయం ఎంత కీలకమైనదో, ఎంతటి వైవిధ్యమైన పనులు చేస్తుందో చెప్పడంతోపాటు ఈ ఏడాది థీమ్... సాలిడ్ హ్యాబిట్స్ – స్ట్రాంగ్ లివర్ అంటే ‘దృఢమైన అలవాట్లతో – బలమైన కాలేయ రక్షణ’ పొందడం ఎలాగో తెలుసుకుందాం.లివర్ పని సైలెంట్. కానీ దాని యాక్టివిటీస్ వైబ్రెంట్. ఎందుకంటే ఓ వ్యక్తి గోల్ఫ్ ఆడాలన్నా, బాల్ కొట్టాలన్నా, కాలు కదపాలన్నా, చెయ్యి కదిలించాలన్నా, తిన్నది అరగాలన్నా, పరుగులు తీయాలన్నా అది కాలేయం చేసే జీవక్రియల వల్లనే సాధ్యమవుతుంది. వాటిలో కొన్నింటిని చూద్దాం.ఉన్నది ఏడంగుళాల స్థలంలోనే... కానీ ఎకరాల కొద్దీ కెమికల్ ఫ్యాక్టరీలంత పని... లివర్.. జస్ట్... ఏడంగుళాల విస్తీర్ణంలోనే... ఎకరాల కొద్దీ విస్తరించి ఉండే కెమికల్ ఫ్యాక్టరీలంత సంక్లిష్టమైన పనులు చేస్తుంటుంది. చాలామంది అపోహ ఏమిటంటే... లివర్ జీర్ణక్రియలకు పనికివచ్చే ఎంజైములు విడుదల చేసి... అన్నం అరుగుదలకే పరిమితమవుతుందని. కానీ పొరబాటున ఓ వ్యక్తి వేలు తెగిందనుకోండి. అతడి రక్తస్రావం ఆగడానికి అవసరమైన రక్తం గడ్డకట్టించే ‘బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్’ వరకు అదే ఉత్పత్తి చేస్తుంది. వ్యాధులను ఎదుర్కోవడానికి కావాల్సిన యాంటీబాడీస్ పుట్టేందుకు తోడ్పడుతుంది. టాబ్లెట్ వేసుకుంటే వచ్చే సైడ్ఎఫెక్ట్లు ఇచ్చే చిరు విషాలను విరిచేయడం దగ్గర్నుంచి... మద్యం తాగేప్పుడు పుట్టే పెను విషాలను నిర్వీర్యం చేస్తుంది. గుండెకు ఓ సేఫ్టీ వాల్వ్లా పనిచేస్తూ... హెపాటిక్ వెయిన్ ద్వారా గుండెకు వెళ్లే రక్తం వెళ్లేటప్పుడు ఆరు నుంచి పది సెకండ్ల పాటు ఆ రక్తపు వేగాన్ని తగ్గించి, ఎక్సెస్ రక్తంతో గుండె ఉక్కిరిబిక్కిరి కాకుండా కానాడుతుంది.దేహంలో తగినన్ని లవణాలు ఉంచేందుకు కిడ్నీపైనుండే అడ్రినల్ గ్రంథులు ప్రయత్నిస్తున్నప్పుడు... అవి పరిమితికి మించి ఉండకుండా చూసేది లివరే. ప్రతి ఒక్కరి ఒంట్లో ప్రతి సెకండ్కూ లక్షలాది ఎర్ర రక్తకణాలు పుడతాయీ, చనిపోతుంటాయి. వాటిని పుట్టించడం, గిట్టించడం కాలేయం పనే! ఎవరూ ఊహించడానికి కూడా వీల్లేని ఇలాంటి పనులెన్నో లివర్ చేస్తుంటుంది.ఆ శక్తే వరమూ... శాపం కూడా! కాలేయంలోని 75 శాతం పనిచేయక పోయినా అది మళ్లీ రిపేర్ చేసుకుని మామూలుగా కాగలదు. ఇంకా అంతకంటే మించితే అది ప్రమాదకరం. అంటే కాలేయం సామర్థ్యం 25 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడు ప్రమాదం ఎక్కువ. లివర్లో క్యాన్సర్గడ్డ ఏదైనా వస్తే చుట్టూ చాలావరకు తొలగించాక మనిషి మళ్లీ మామూలైనొతాడు. తీసేసిన లివర్ భాగం మళ్లీ పెరుగుతుంది. కానీ అంత ఎక్కువ సామర్థ్యం ఉన్నందున ఏదైనా ప్రమాదవశాత్తూ లివర్కు సిర్రోసిస్ అనే సమస్య వచ్చి పనిచేయడం మందగిస్తుంటే, లక్షణాలేవీ కనిపించవు కాబట్టి అది ఎక్కువగా పాడయ్యేవరకూ ఆ విషయమే తెలియదు. ఇది ఒకరకంగా శాపం. లివర్లో కొవ్వుకణాలు పేరుకుపోవడం వల్ల వచ్చే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్, బాగా మద్యం తీసుకోవడం వల్ల వచ్చే ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్, సిర్రోసిస్ వంటి సమస్యలు లివర్కు వస్తుంటాయి. బాగా బరువు పెరుగుతుంటే, దాన్ని అదుపు చేసుకోవాలి. దేహంపైన రక్తనాళాలు సాలీడు ఆకృతిలో కనిపిస్తున్నా, ఆకలి లేకపోయినా, బాగా నిస్సత్తువగా అనిపిస్తున్నా, పొట్టలో విపరీతంగా నీరు పేరుకుంటున్నా, కళ్లు పసుపురంగులో కనిపిస్తున్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.డాక్టర్ ఆర్.వి. రాఘవేంద్రరావు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ –లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ (చదవండి: Summer Health tips: సమ్మర్లో హైడ్రేషన్ కోసం..! కానీ ఈ పొరపాట్లు చెయ్యొద్దు..)
‘వార్’ఇంటీ వాకిట్లో... కష్టాల చెట్లు!
అదేంటోగానీ రేలంగి మావయ్యకు అంతా మంచిగానే అనిపిస్తుంటుంది. అంతటా మంచే కనిపిస్తుంటుంది. చివరకు నిన్నమొన్నటి యుద్ధం టైమ్లో కూడా. ఆ వార్ తాలూకు కష్టాల్లోనూ మంచిని వెతుక్కుంటుంటాడు మన రేలంగి మామయ్య. ‘‘సార్... రేలంగి అంకుల్ సార్. యుద్ధమంటేనే చెడ్డది. ఆ చెడ్డదాంట్లో కూడా... ఆ యుద్ధాల వాకిట్లో... కష్టాల చెట్లనీ... చెట్లలో కూడా నీడను చూస్తున్నారంటే మీరు మామూలు వ్యక్తులు కారు సార్’’ అన్నాడు రేలంగి మామయ్యగారి వూరి వ్యక్తి ఒకాయన. ‘‘కష్టాలను చెట్టుతో పోల్చారంటే... అసలు మీకంటే గొ΄్పోడెవరుంటార్సార్. ఈ మండు వేసవికాలంలో ఆ చెట్టు నీడకు క్రమంగా అలవాటయ్యామంటే అంతకంటే చల్ల గాలి ఏముంటుందీ. అంతకంటే నేచురాలిటీ ఏముంటుందండీ’’ అంటూ వాక్రుచ్చాడు రేలంగి మామయ్య. ఈ సంభాషణకు నేపథ్యం ఏమిటంటే... ‘‘ఈ ట్రంప్ ఉన్నాడే. వాడు మా చెడ్డవాడు సార్. అనవసరంగా కెలికి లోకమంతటికీ యుద్ధం కష్టాలు తెచ్చిపెట్టాడు. వార్ చేసుకుంటున్నవారు సరే... అసలా వార్తో ఏ సమ్మంధమూ లేనివారిక్కూడా ఎందుకండీ ఈ పాట్లూ... ఈ తిప్పలూ’’ అన్నాడు అక్కడి పల్లెవాసుల్లో ఒకడు. తండ్రికి ఇరువైపులా కూర్చున్న ఆయన కొడుకులు కూడా అదేమాటన్నారు. అంతే... ఒక్కపెట్టున వాళ్లకో క్లాసు తీసుకుంటూ చెలరేగి΄ోయాడు రేలంగి మామయ్య. ఇలా తన స్పీచందుకున్నాడు. ‘‘ఈ యుద్ధం కష్టాలు చూశావా? ఇందులో సీఎన్జీ గ్యాసు దొరకని ఆటోవాడున్నాడూ. టైమ్కు ఇంటికి గ్యాసు సిలెండర్ రానివాడున్నాడూ. రెండ్రోజులపాటు పెట్రోలు బంకుల్లో వరసగా బండ్లను పెద్ద... పే...ద్ద... క్యూల్లో నిలబెట్టినవారున్నారూ. మార్కెట్కెళ్లి పచారీసామాన్ల రేట్లు చూసి గుండెలు బాదుకున్నవారున్నారూ. వీళ్లందరిదీ ఒకటే మాట. ‘దేవుడా నేను మంచోణ్ణి. నాకు గ్యాసు దొరికేలా చూడూ... దేవుడా మేము మంచోళ్లం... మా స్టవ్వుకు గ్యాస్సిలెండరు లోటు రానివ్వకుండా చూడు. మాకు యుద్ధంతో సమ్మంధం లేదు. మాకెలాంటి సరుకుల కొరతా రానివ్వకు’ అని. కానీ ట్రంపు మంచోడ్రా. ట్రంపంటేనే మంచోడు. అందరికీ సరిసమానంగా కష్టాలు తెచ్చిపెట్టాడు. ఎప్పుడో మా చిన్నతనాన కట్టెల పొయ్యి మీద వండిన టేస్టీ వంటకాల రుచి చూశామా. మళ్లీ ఇన్నాళ్లకి మనందరికీ కట్టెల పొయ్యి మీద వండిన వంటకాల కమ్మటి రుచిని పరిచయం చేశాడు. మన నాస్టాల్జియా రోజుల తాలూకు వంటల రుచి మనకు మళ్లీ చూపించాడు. అందుకు మనమంతా ట్రంపుకి రుణపడి ఉండాల్రా. బజ్జీల బండ్లకూ, టిఫెన్ హోటళ్లకు బ్లాకులో తప్ప కమర్షియల్ సిలెండర్లు దొరక్కుండా చేశాడా... దాంతో కర్రీ΄ాయింట్ల నుంచి కూరలు తెచ్చుకోకుండా, బజార్నుంచి ఏ జంకుఫుడ్డో ఇంటికి తెచ్చుకోకుండా... అందరూ హెల్దీగా హాయిగా హోమ్ఫుడ్డు మాత్రమే వండుకునేలా చేస్తున్నాడు. ఇలా మనందరి ఆరోగ్యాలూ కాపాడుతున్నాడు. అందుకే ట్రంపు మంచోడ్రా. ట్రంపంటేనే మంచోడు. ఒరేయ్... భలే తెచ్చార్రా. భలేగా కట్టెలు కొట్టుకొచ్చారు గొడ్డలితో. ఏదేమైనా... టైముకు తగ్గట్లు – సిచ్యువేషన్ కు సింకయ్యేట్లుగా అలా అందుకోవాల్రా. అన్నట్టొరేయ్... ఈ వార్ వరకే రా – ఈ కష్టాలన్నీ! తర్వాత మరో సంక్షోభమేదో వెతుక్కుంటూ వస్తుంది కదా. మళ్లీ అప్పుడీ కష్టాలు ఉండవు రా. అప్పుడొచ్చేవన్నీ మళ్లీ ఫ్రెష్షు కష్టాలూ... చాలా పెద్ద పెద్ద కష్టాలున్నూ! అష్టకష్టాల్రా అవి. ఓ రకంగా చెప్పాలంటే ముందుముందొచ్చే పెద్ద పెద్ద కష్టాలకు ప్రీవ్యూల్లాంటివి రా... ఈ ట్రైలర్ కష్టాలన్నీ. రాబోయే పాట్లు పెద్దవిగా అనిపించకూడదని... ఇప్పుడే మనకీ శిక్ష–ణ దొరికేలా చూస్తున్నాడురా ట్రంపు. అందుకే ట్రంపు మంచోడ్రా. అసలు ట్రంపంటేనే మంచోడు’’ అంటూ తన మంచితనపు ఉపదేశాన్ని మంచిమంచి మాటల్తో... మంచిగా ముగించాడు మన రేలంగి మావయ్య. ఆ స్పీచ్ విని దారిన పోతున్న ఒక దానయ్య గారికి అకస్మాత్తుగా రావు రమేశ్ పూనాడు. అప్పుడా రావు రమేశ్ పూనిన వ్యక్తి అన్న మాటేవిటో తెలుసా... ‘‘ఈలోకంలో అన్నింటికీ సూత్రాలు కనిపెట్టారుగానీ... ఈ రేలంగి మాయ్యేవిటో... ఈడి విదానాలేవిటో మనకర్దంగావడం లేదు. మావయ్యగారిని ఎవరికన్నా సూపించండ్రా. వదిలేయకండ్రా బాబు అలాగ. సూపించండ్రా’’ అంటూ సవిలెంటుగా డవిలాగు అంటూ మాయమయ్యాడు తెగ మండిపోతూ ఉన్న అపరిచితుడొకడు!– యాసీన్
అంతర్జాతీయం
చర్చలకు ఇరాన్ నో
వాషింగ్టన్: రెండో విడత చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. ఆదివారం ఈ దిశగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతాయని తొలుత ట్రంప్ ప్రకటించారు. తమ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ సోమవారం సాయంత్రంకల్లా ఇస్లామాబాద్ చేరతారన్నారు. వాటిలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాల్గొంటారని అనంతరం వైట్హోస్ పేర్కొంది. అనంతరం ఇరాన్ స్పందిస్తూ, తాము ఈ చర్చల్లో పాల్గొనబోమని స్పష్టం చేసింది. అమెరికా తమ ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగించినంత కాలం ఎలాంటి చర్చలనూ అంగీకరించబోమని కుండబద్దలు కొట్టింది. ఆ దేశ అధికార వర్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ఈ మేరకు వెల్లడించింది. శాంతి ఒప్పందానికి ఇరాన్ ముందుకు రాకపోతే ఆ దేశంలోని వంతెనలు, విద్యుదుత్పత్తి ప్లాంట్లను నామరూపాల్లేకుండా ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ గడువు ఈ నెల 22తో ముగియనుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల ఇస్లామాబాద్లోనే జరిగిన చర్చలు విఫలం కావడం తెలిసిందే. అణు కార్యక్రమాన్ని శాశ్వతంగా పక్కన పెట్టాలన్న అమెరికా డిమాండ్కు ఇరాన్ అంగీకరించలేదు. విరమణకు ఇరాన్ తూట్లు: ట్రంప్ హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఐఆర్జీసీ కాల్పులు జరపడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని మండిపడ్డారు. ‘‘మేము న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నాం. ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నా. లేదంటే ఇకపై మేం ఎంతమాత్రం మంచివాళ్లం కాదు.’’ అన్నారు.హార్మూజ్ ఉద్రిక్తంహార్మూజ్లో ఉద్రిక్తత పరిస్థితులు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. వందలాది నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. హార్మూజ్లో శనివారం భారత్ సహా పలు దేశాల నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అసంబద్ధ డిమాండ్ల వల్లే: ఇరాన్ అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది.బయటకు వెళ్లిపో!హార్మూజ్ జలసంధిలో రెండు భారత నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడం పట్ల స్పందించాలని కోరిన మహిళా విలేకరిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే బయటకు వెళ్లిపోమ్మంటూ మండిపడ్డారు. ట్రంప్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పాక్కు ట్రంప్ ప్రతినిధులు.. ఇరాన్ వెళ్లట్లేదా?
టెహ్రాన్: అమెరికా ప్రతినిధులు ఇరాన్తో చర్చల కోసం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్కు సోమవారం (ఏప్రిల్ 20) సాయంత్రం వెళ్తున్నారని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అమెరికా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగా ఇరాన్ మాత్రం కనీసం ఇస్లామాబాద్కు వెళ్తున్నామా? లేదా? అన్న విషయాన్ని కూడా చెప్పడం లేదు. ఇరాన్ ఇప్పటి వరకు పాకిస్థాన్కు చర్చల కోసం తమ టీమ్ను పంపే విషయంలో నిర్ణయం తీసుకోలేదని తస్నీమ్ వార్తా సంస్థ తెలిపింది. నౌకాదళ నిర్బంధం కొనసాగుతుండడంతో ఇస్లామాబాద్కు చర్చల బృందాన్ని పంపే నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఇరాన్ తెలిపింది. “ట్రంప్ ప్రకటించిన నౌకాదళ నిర్బంధం కొనసాగుతున్నంత వరకు ఎలాంటి చర్చలు ఉండవు అని ఇరాన్ టీమ్ స్పష్టం చేసింది” అని తస్నీమ్ ప్రతినిధి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్తో రెండో దఫా చర్చలు సోమవారం పాకిస్థాన్లో జరుగుతాయని మొదటి నుంచి చెబుతున్నారు.అమెరికా ప్రతినిధులు ఇప్పటికే ఇస్లామాబాద్ వెళ్తున్నారు. సోమవారం సాయంత్రంలోగా అక్కడికి చేరుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సీరియస్గా ఉన్నారు. ఈ రెండో దశ చర్చలు సఫలం కాకపోతే దాడులు చేస్తామని తెలిపారు. తాము చాలా న్యాయమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నామని అన్నారు. ఇరాన్ దాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నానని ట్రంప్ చెప్పారు. ఎందుకంటే అలా చేయకపోతే, ఇరాన్లో ప్రతి విద్యుత్ కేంద్రం, ప్రతి వంతెనను అమెరికా ధ్వంసం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం.. ఆఫ్రికా దేశాలకు..!
అమెరికాలోని అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం కొనసాగుతోంది. ఇందులో భాగంగా థర్డ్ కంట్రీ ప్రోగ్రామ్ కింద లాటిన్ అమెరికా దేశాలకు చెందిన వలసదారులను ఆఫ్రికా దేశమైన కాంగోకు తరలించారు. దీనిపై మానవహక్కులు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.వివాదాలకు కేరాఫ్ అడ్రసైన డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే చేసిన మెుదటి పని అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం. వీరు ఎట్టిపరిస్థితుల్లో అమెరికాలో ఉండేది లేదంటు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పలు రకాల పథకాలు ప్రవేశపెట్టి అమెరికా నుంచి వెళ్లాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న లాటిన్ అమెరికా దేశస్థుల కోసం ట్రంప్ ప్రత్యేక ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా 15 మంది వలసదారలతో కూడిన మెుదటి బృందాన్ని కాంగో రాజధాని కిన్షాసాకు తరలించారు. అక్కడ హోటళ్లలో వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. వీరికి అవసరమైన ఖర్చులను అమెరికా ప్రభుత్వమే భరించనున్నట్లు తెలిపారు. అయితే ఈ తరలింపును మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలే అంతర్యుద్ధం, మానవహక్కుల ఉల్లంఘన తరచుగా జరిగే దేశంలోకి వలసదారులను పంపడమేంటని ప్రశ్నిస్తున్నాయి. తమ సొంత దేశం కాని, ఎప్పుడూ చూడని దేశానికి వలసదారులను పంపడం వల్ల వారి భద్రతకు ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అయితే రానున్న రోజుల్లో నెలకు సుమారు 50 మంది చొప్పున మరికొంత మందిని కాంగోకు పంపే అవకాశం ఉందని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.ఏమిటి ఒప్పందం అమెరికాలోని లాటిన్ దేశాలకు చెందిన అక్రమ వలసదారులలో తమ స్వదేశాలకు తిరిగివేళ్లేందుకు కోర్టుల ద్వారా రక్షణ పొందిన వారిని తరలించడం కోసం ట్రంప్ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా కాంగోతో పాటు ఆఫ్రికాలోని ఇతర దేశాలైన ఘనా, ఉగాండా, రువాండా, దక్షిణ సూడాన్ మరియు ఎస్వాతిని లతో కూడా ఇలాంటి ఒప్పందాలను కుదుర్చుకుంది.దీనిని "థర్డ్-కంట్రీ డిపోర్టేషన్ అగ్రిమెంట్" గా పిలుస్తారు. ఈ తరలింపులో భాగంగా వలసదారుల వసతికి, భోజనానికి మరియు ఇతర ఖర్చులకు అయ్యే ప్రతి పైసాను అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. ఆశ్రయం ఇచ్చే దేశాలకు ఎటువంటి ఖర్చు ఉండదు.
‘మరో జలసంధిని మూసేస్తాం.. తెరవడం ఎవ్వరితరం కాదు’
సనా: అమెరికాకు యెమెన్ హౌతీలు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. వ్యూహాత్మక బాబ్ అల్-మండెబ్ జలసంధిని మూసివేస్తామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇతర దేశాలు.. శాంతికి అడ్డుగా ఉన్న చర్యలు, విధానాలను ఆపకపోతే తాము జలసంధిని మూసేస్తామని హెచ్చరించారు.శాంతికి ఆటంకం కలిగించే పనులను ఆపకపోతే ముఖ్యమైన సముద్ర మార్గాన్ని బ్లాక్ చేస్తామని చెప్పారు. విదేశీ శక్తుల మద్దతుతో పనిచేసే వారు (ప్రాక్సీ ఫోర్సెస్) బాబ్ అల్-మండెబ్ నియంత్రణకు ప్రయత్నిస్తే అంతర్జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని తెలిపారు.హౌతి ఉప విదేశాంగ మంత్రి హుస్సేన్ అల్-ఎజ్జీ ఎక్స్లో ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు. యెమెన్ ప్రభుత్వం ఆ జలసంధిని మూసేయాలని నిర్ణయిస్తే, ఎవరూ దాన్ని మళ్లీ తెరవలేరని తెలిపారు. అమెరికా, ఇతర దేశాలు వెంటనే తమ తీరును మార్చుకుని యెమెన్ ప్రజల హక్కులను గౌరవించాలని చెప్పారు.ప్రపంచానికి ఎంతో కీలకంఎర్ర సముద్రం నుంచి సూయజ్ కాలువ దారిలో వెళ్లే నౌకలకు చాలా ముఖ్యమైన మార్గం బాబ్ అల్-మండెబ్ జలసంధి.ఈ మార్గం చాలా సన్నగా ఉంటుంది. కేవలం 29 కిలోమీటర్ల వెడల్పు, రెండు చిన్న మార్గాల ద్వారానే నౌకలు వెళ్లాలి.ఇది ప్రపంచంలో అత్యంత బిజీ సముద్ర మార్గాల్లో ఒకటి. చమురు, ఇంధనం వంటి వస్తువులు గల్ఫ్ నుంచి యూరప్, ఆసియా దేశాలకు ఇక్కడి ద్వారానే వెళ్తాయి. ప్రపంచంలో మూడవ అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గం.ఇతర దేశాల మద్దతుతో పనిచేసే గ్రూపులు ఈ మార్గాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే ప్రపంచ భద్రతకు ముప్పు ఉంటుందని యెమెన్ సర్కారు వార్నింగ్ ఇచ్చింది.ఎర్ర సముద్రంలో సమస్యలు వస్తే ప్రపంచ వాణిజ్యం, నౌకల రాకపోకలు నేరుగా ప్రభావితం అవుతాయి.అమెరికా చర్యలకు ప్రతిగా ఇప్పటికే ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసేసింది. బాబ్ అల్-మండెబ్ జలసంధి ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గం. సుయూజ్ కాలువ ద్వారా ఆసియా-యూరప్ మధ్య నేరుగా వాణిజ్యాన్ని సాధ్యమయ్యేలా చేస్తుంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 10 శాతం ఈ మార్గం గుండా వెళ్తుంది. దీంతో దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ.ఈ జలసంధి ఎర్ర సముద్రం దక్షిణ చివరలో ఉంది. యెమెన్ జిబౌటి, ఎరిట్రియా (ఆఫ్రికా ఖండం) మధ్యలో ఉంది.గేట్ ఆఫ్ టియర్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా నౌకా ప్రమాదాలు జరిగాయి.సుయజ్ కాలువ (1869లో ప్రారంభం) తర్వాత దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఆసియా-యూరప్ వాణిజ్యం ఆఫ్రికా చుట్టూ తిరగకుండా నేరుగా ఈ మార్గం గుండా సాగుతుంది.చమురు, గ్యాస్, వాణిజ్య సరుకులు సరఫరా అవుతాయి. ప్రపంచంలో మూడవ అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గం.ఈ నేపథ్యంలోనే యెమెన్లోని హౌతీ తిరుగుబాటు దళాలు ఈ జలసంధిని మూసివేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇది జరిగితే ప్రపంచ చమురు మార్కెట్లకు పెద్ద దెబ్బ తగులుతుంది, అలాగే సుయేజ్ కాలువ ఆదాయం కూడా తగ్గిపోతుంది.ఆసియా–యూరప్ వాణిజ్యానికి ప్రధాన ద్వారం ఇదే. చమురు రవాణాలో కీలక పాత్ర దీనిది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, యూరప్ దేశాల భద్రత, ఆర్థిక వ్యవస్థలపై నేరుగా ప్రభావం చూపుతుంది. మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తుతాయి. బాబ్ అల్-మండెబ్ జలసంధి ఒక “లైఫ్లైన్” లాంటిది. ఇది మూసివేస్తే, ఆసియా-యూరప్ మధ్య వాణిజ్యం, చమురు సరఫరా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలవుతుంది.భారత్కు ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?భారత్ దిగుమతి చేసే చమురు పెద్ద భాగం గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తుంది. ఈ మార్గం మూసితే సరఫరా ఆలస్యం అవుతుంది.మార్గంలో ఆటంకాలు ఎదురైతే రవాణా ఖర్చు పెరుగుతుంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయి.యూరప్, ఆఫ్రికా దేశాలతో భారత వాణిజ్యం ఈ మార్గం ద్వారా జరుగుతుంది. దీన్ని మూస్తే సరుకు రవాణా దెబ్బతింటుంది.నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. సమయం, ఖర్చు పెరుగుతుంది.ఈ ప్రాంతంలో కాల్పులు, దాడులు ఉంటే భారత నౌకలు ప్రమాదంలో పడతాయి.భారత సముద్ర సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ మార్గాల్లో పనిచేస్తారు. వారి భద్రత సమస్యగా మారుతుంది.
జాతీయం
బైక్ యాక్సిడెంట్.. ముగ్గురు అన్నదమ్ముల దుర్మరణం
స్పీడ్ థ్రిల్స్.. బట్ ఇట్ కిల్స్.. ఎన్నోసార్లు రుజువు చేసింది. సరదా కోసం కొందరు యువకులు పని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించి.. తల్లిదండ్రులకు గుండె కోత మిగిల్చారు. మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఏప్రిల్ 14న అన్నదమ్ములైన ఉప్లక్ష్ కోల్, అమ్రిష్ కోల్, హేమరాజ్ కోల్లు ఒకే బైక్పై స్పీడ్గా ప్రయాణించారు. ఆ ముందు మరో బైక్ మీద స్నేహితులు ప్రశాంత్, ప్రదీప్ ద్వివేది వీడియో తీస్తూ ముందుకు సాగారు. వీడియోలో బైక్ చివర కూర్చున్న సోదరుడి చేతితో తుపాకీ కూడా ఉంది. రెండు బైక్లు ఒకదానిని మించి మరొకటి దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. మధ్యలో ఒక ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఇటుకలతో నిండిన ట్రాలీని ఢీ కొట్టింది. मऊगंज में एक सड़क हादसे में तीन भाइयों की मौत हो गई. इस हादसे का एक वीडियो सामने आया है, जिसमें यह साफ देखा जा सकता है कि रफ्तार का जुनून कितना खतरनाक हो सकता है. #mpnews #roadaccident pic.twitter.com/8AV0YNOXSa— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) April 19, 2026ఈ ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. వీడియో తీస్తున్న మరో బైక్పై ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా స్కిడ్ అయ్యి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తుపాకీ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. హెచ్చరిక: వేగం క్షణికానందం పంచొచ్చు.. కానీ నిర్లక్ష్యం ప్రాణాలను తీసుకుపోతుంది
మమతా బెనర్జీకి టెన్షన్.. ఏడు లక్షల కొత్త ఓటర్లు చేరిక
కోల్కతా: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో సుమారు ఏడు లక్షల మంది కొత్త ఓటర్లను ఎన్నికల సంఘం చేర్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఇప్పుడు 6,82,51,008కి చేరింది. కాగా, ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు జాబితాలో మరికొందరి పేర్లు చేరితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. కొత్త ఓటర్లలో సుమారు 3.22 లక్షల మంది మొదటి విడతలో, 3.88 లక్షల మంది రెండో విడతలో ఓటేయనున్నారు. వీరిలో తొలిసారి ఓటేస్తున్నవారు ఎందరు అనే వివరాలేవీ ఈసీ వెల్లడించలేదు. అవసరమైతే వాటిని తర్వాత పంచుకుంటామని పేర్కొంది. కాగా, కొత్త ఓటర్ల చేరికతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కొత్త టెన్షన్ మొదలైనట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సమూలంగా మార్చేసింది. ఓటర్ల జాబితా నుంచి 90.83 లక్షల మంది పేర్లను తొలగించడంతో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సర్ కారణంగా రాష్ట్రంలో ఓట్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.77 కోట్లకు తగ్గింది. 2021 నాటి పరిస్థితులకు భిన్నంగా ఈసారి తృణమూల్, బీజేపీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఓటర్ల జాబితాలో అత్యధిక కోతలు.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ఎల్లప్పుడూ సహకరించే మైనారిటీ ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. తృణమూల్కు వెన్నెముకగా నిలిచే దక్షిణ ప్రాంతంలోనూ భారీగా కోతలు పడ్డాయి. అన్నిచోట్లా పరిస్థితి ఒకేలా లేదు. తృణమూల్కు బాగా బలమున్న దక్షిణ బెంగాల్లో ఇప్పుడు పరిస్థితి ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది. ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిలుపుకొన్నట్లు కనిపిస్తున్నా మతువా ప్రాంతాల్లో ఓట్లు తగ్గడంతో కొంత ఇబ్బందిగానే కనిపిస్తోంది.తృణమూల్కు సవాలే..పశ్చిమ బెంగాల్లో తృణమూల్ లెక్కలు.. మైనారిటీలు, మహిళలు, 24 పరగణాల జిల్లాలపై ఆధారపడి ఉంటాయి. ఈ జిల్లాల్లో దెబ్బ పడటంతో కొన్ని డజన్ల నియోజకవర్గాల్లో బీజేపీ పోటీనిచ్చే అవకాశం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సర్కు ముందు రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 959 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. సర్ తర్వాత అది 950కి పడిపోయింది. దీంతో మమతకు అండగా నిలిచే మహిళల ఓట్లకు భారీగా కోతపడింది. మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఓట్ల కోతతో వారిలో అభద్రతా భావం పెరిగింది. దీనివల్ల తృణమూల్వైపు ఓట్లు మరింత ఏకపక్షంగా మళ్లే అవకాశం కనిపిస్తోంది. గతంలో మైనారిటీ ఓట్లద్వారా లబ్ధి పొందిన ఐఎస్ఎఫ్, ఏజేయూపీ, ఎంఐఎం నష్టపోయే అవకాశముంది.నదియాలో విచారణలో ఉన్న ఓటర్లలో 78శాతం పేర్లను తొలగించారు. ఇది రాష్ట్రంలోనే అత్యధిక తొలగింపు రేటు. 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్కు ఆయువుపట్టులా నిలిచిన జిల్లాలపై భారీగానే దెబ్బ పడింది. ఇందులో ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, ముర్షీదాబాద్, నదియా, మాల్దా, హూగ్లీ, హావ్డా, ఉత్తర్ దినాజ్పుర్, పూర్వ బర్ధమాన్ ఉన్నాయి. ఈ జిల్లాల్లో 66.6 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. ఈ జిల్లాల్లోనే 178 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
కోల్కతా డీసీ నివాసంపై ఈడీ దాడులు
కోల్కతా: మనీలాండరింగ్ విచారణలో భాగంగా కోల్కతా పోలీస్ డిప్యూటీ కమిషనర్ శంతను సిన్హా బిస్వాస్తో పాటు జాయ్ కామ్దార్ అనే వ్యాపారవేత్త ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ ఆదివారం దాడులు చేసింది. దాడుల సమయంలో బిస్వాస్ అందుబాటులో లేరు. కామ్దార్ను విచారణ నిమిత్తం స్థానిక ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లాక అరెస్టు చేశారు. రాష్ట్రంలో మూడు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో ఈ దాడులు, అరెస్టు చర్చనీయాంశమయ్యాయి. కేసులో ఏప్రిల్ 1న ఈడీ మొదటి విడత సోదాలు నిర్వహించింది. రూ. 1.47 కోట్ల నగదుతో పాటు రూ. 67.64 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి, ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకుంది. అల్లర్లు, హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఆయుధాల చట్ట ఉల్లంఘనల అభియోగాలతో కోల్కత్తా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది.
చార్ ధామ్ యాత్ర ప్రారంభం
డెహ్రాడూన్: ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తిరిగి తెరుచుకున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా ఆదివారం గంగోత్రి ఆలయంలో మధ్యాహ్నం 12.15 గంటలకు, యమునోత్రిలో మధ్యాహ్నం 12.35 గంటలకు పూజలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛారణల నడుమ వందలాదిగా భక్తులు దర్శించుకున్నారు. దీంతో, ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర తిరిగి మొదలైంది. ఆలయ ప్రాంగణంలో సెల్ఫోన్లను, కెమెరాలను నిషేధించారు. చార్ ధామ్లో భాగమైన కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలు ఈ నెల 22, 23వ తేదీల్లో తెరుచుకోనున్నాయి. గతేడాది చార్ ధామ్ యాత్రలో 51 లక్షల మంది పాల్గొనగా ఈ ఏడాది ఇప్పటి వరకు 19 లక్షల మంది నమోదు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు.
ఎన్ఆర్ఐ
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్లోని తెలుగు వాసులు ఈ ఏడాది ఉగాది పండుగను సంప్రదాయానికి అనుగుణంగా, ఆత్మీయంగా మరియు వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20, 2026 తేదీలలో ఈ ఉత్సవాలు చాంగీ రామర్ దేవాలయం, సెంగ్కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం మరియు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రత్యేకంగా, టీమ్ శివ ప్రసాద్ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాలయాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి మరియు ప్రసాదాన్ని పంపిణీ చేశారఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆనందం, ఐక్యత మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది.ఈ ఉత్సవాల ద్వారా సాంప్రదాయం, సంస్కృతి, భక్తి మరియు ఐక్యత మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో, సింగపూర్లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు.
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు)
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
క్రైమ్
కోడలిపై కన్నేసిన మామ.. చివరికి జైలు పాలయ్యాడు!
కర్ణాటక: అక్రమ సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించిన కోడలిని హత్య చేసిన మామకు మైసూరు ఐదవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.వివరాలు..దోషి గంటయ్య కుమారుడు చిక్కలూరియాకు కవిత అనే యువతితో వివాహమైంది. ఆమె ఒక ప్రైవేట్ కళాశాలలో స్టోర్ కీపర్గా పనిచేసేది. మామ గంటయ్య ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉంది. ఆ సంబంధం కొనసాగించేందుకు కవిత అంగీకరించలేదు. అయితే కవిత మహేష్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని గంటయ్య అనుమానించాడు. 2023 జూలై 10న తెల్లవారుజామున కవిత నిద్రలో ఉండగా గంటయ్య సుత్తితో తలపై, నుదుటిపై బాది హత్య చేశాడు. పోలీసులు గంటయ్యపై కేసు నమోదు చేసి, కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు. నేరం నిరూపణ కావడంతో గంటయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 1.5 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె. ఎన్.రూపా తీర్పు వెలువరించారు. తప్పుడు సాక్ష్యం ఇచ్చిన ప్రభుత్వ అధికారి మైఖేల్ మాథ్యూపై శాఖాపరమైన విచారణకు న్యాయమూర్తి ఆదేశించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు బి. ఇ. యోగేశ్వర్, ఏ.ఎన్. మధు వాదించారు.
మద్యం మత్తులో యువకుల ఘర్షణ
గుంటూరు: గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని నగరంపాలెం పోలీస్స్టేషన్ పరిధిలోని కంకరగుంట బ్రిడ్జి వద్ద ఓ వైన్ షాపు భవనం పైనుంచి వేలాడదీసి ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి పై దాడి చేసిన ఘటన ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అప్రమత్తమైన నగరంపాలెం సీఐ సత్యనారాయణ, ఎస్ఐ ప్రసన్న సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆకులవారితోట ప్రాంతానికి చెందిన దేవరకొండ స్వరూప్, శ్రీనివాసరావు తోట ప్రాంతానికి చెందిన దేవరకొండ శశికుమార్ సోదరులు. వీరు మద్యం తాగేందుకు కొమ్మినేని రత్తయ్యకు చెందిన నిర్మల్ వైన్ షాపు వద్దకు వచ్చారు. మద్యం తాగుతున్న సమయంలో అదే వైన్షాపులో ఉన్న మరో వ్యక్తితో వాగ్వవాదం చోటుచేసుకుంది. దీంతో సోదరులిద్దరు ఆ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మద్యం మత్తులో ఆ వ్యక్తిని వైన్ షాపు భవనం పై నుంచి కిందకు వేలాడ తీసి తీవ్రంగా దాడి చేశారు. ఇది గమనించి వాహనదారులు సెల్ఫోన్లో వీడియాలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్ది సేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇద్దరు సోదరులను వైన్షాపు నిర్వాహకులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు ఘటనా స్థలి చేరుకుని ఇద్దరు సోదరులను అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించారు. బల్లి రాజ్కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తి ఇద్దరు సోదరుల దాడికి భయపడి పారిపోవడంతో గాయపడిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని విచారించి ఇద్దరు సోదరులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ సత్యనారాయణ వెల్లడించారు.
బైక్ యాక్సిడెంట్.. ముగ్గురు అన్నదమ్ముల దుర్మరణం
స్పీడ్ థ్రిల్స్.. బట్ ఇట్ కిల్స్.. ఎన్నోసార్లు రుజువు చేసింది. సరదా కోసం కొందరు యువకులు పని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించి.. తల్లిదండ్రులకు గుండె కోత మిగిల్చారు. మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఏప్రిల్ 14న అన్నదమ్ములైన ఉప్లక్ష్ కోల్, అమ్రిష్ కోల్, హేమరాజ్ కోల్లు ఒకే బైక్పై స్పీడ్గా ప్రయాణించారు. ఆ ముందు మరో బైక్ మీద స్నేహితులు ప్రశాంత్, ప్రదీప్ ద్వివేది వీడియో తీస్తూ ముందుకు సాగారు. వీడియోలో బైక్ చివర కూర్చున్న సోదరుడి చేతితో తుపాకీ కూడా ఉంది. రెండు బైక్లు ఒకదానిని మించి మరొకటి దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. మధ్యలో ఒక ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఇటుకలతో నిండిన ట్రాలీని ఢీ కొట్టింది. मऊगंज में एक सड़क हादसे में तीन भाइयों की मौत हो गई. इस हादसे का एक वीडियो सामने आया है, जिसमें यह साफ देखा जा सकता है कि रफ्तार का जुनून कितना खतरनाक हो सकता है. #mpnews #roadaccident pic.twitter.com/8AV0YNOXSa— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) April 19, 2026ఈ ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. వీడియో తీస్తున్న మరో బైక్పై ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా స్కిడ్ అయ్యి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తుపాకీ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. హెచ్చరిక: వేగం క్షణికానందం పంచొచ్చు.. కానీ నిర్లక్ష్యం ప్రాణాలను తీసుకుపోతుంది
మీతో పని ఉంది సార్.. రాత్రి ఇంటికి రండి!
అనంతపురం జిల్లా: హనీ ట్రాప్ దందా దుమారం రేపుతోంది. సమాజంలో గౌరవంగా బతుకుతున్న అమాయకులను లక్ష్యంగా చేసుకుని రూ.కోట్లు కొల్లగొట్టారు. ఈ నయా దందాపై ‘కవ్విస్తారు.. కాటేస్తారు!’ అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో వెలువడిన కథనం ఉమ్మడి జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై బాధితులు నేరుగా ఎస్పీ జగదీష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో అనంతపురం రూరల్, నాలుగో పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు గ్యాంగ్ లీడరు లేడీబాస్తో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఇందులో పాత్రధారులు, సూత్రధారులందరిపైనా చర్యలు ఉంటాయని చెబుతున్నారు. బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదులు చేయాలని సూచిస్తున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న దందా.. వలపు వయ్యారాలతో బాధితులకు వల వేసి, వీడియో కాల్స్, వ్యక్తిగత సంభాషణలను ఆయుధాలుగా మార్చుకుని రూ.లక్షలు దోచుకుంటున్న ఈ ముఠా కార్యకలాపాలు విస్తృతంగా సాగినట్లు వెల్లడవుతోంది. ముఖ్యంగా ‘లేడీ డాన్’ ఆధ్వర్యంలో ఈ దందా నడుస్తున్నట్టు బయటపడటం కలకలం రేపుతోంది. ఐదేళ్ల కిందట తిరుపతిలో ఒక ఫారెస్ట్ అధికారిని ఇదే తరహాలో బ్లాక్మెయిల్ చేసి రూ.లక్షలు వసూలు చేసిన ఘటన కూడా ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. అప్పట్లో తిరుపతిలో కేసు కూడా నమోదైంది. అలాగే కూడేరు మండలానికి చెందిన బాధితుడు ఈ ముఠా వలలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల పలువురు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదులు చేయడం, అలాగే ముఠాలో డబ్బుల పంపకాల విషయంలో విభేదాలు రావడం వల్ల ఈ దందా వెలుగులోకి వచ్చింది. లబోదిబోమంటున్న రిటైర్డ్ ఉద్యోగి.. అనంతపురం రూరల్ ప్రాంతానికి చెందిన 70 ఏళ్లకు పైబడి ఉన్న ఓ రిటైర్డ్ ఉద్యోగి వ్యక్తిగత పనిమీద రుద్రంపేట వద్దనున్న డీమార్ట్ సమీపంలోకి వెళ్లాడు. అక్కడ ఓ మహిళ (అప్పటికే పక్కా ప్రణాళిక రచించారు) తారసపడి.. సదరు రిటైర్డ్ ఉద్యోగి చేస్తున్న పనికి సంబంధించి తమకు అవసరం ఉందని, ఇంటివద్దకు రావాలని చెప్పి ఫోన్ నంబరు తీసుకెళ్లింది. మరుసటి రోజు ఫోన్ చేసి రిటైర్డ్ ఉద్యోగిని రుద్రంపేట శివారులోని ప్రాంతానికి పిలిపించింది. అక్కడ ఇంట్లోకి రాగానే తలుపు దగ్గరగా వేసింది. ‘రండి సార్.. పర్వాలేదు’ అంటూ వలపు మాటలతో రెచ్చగొట్టింది. ఈ పరిణామంతో కంగుతిన్న బాధితుడు ‘అమ్మా...ఏంటిది’ అంటుండగానే అప్పటికే బయట సిద్ధంగా ఉన్న పాత్రధారులు రంగప్రవేశం చేశారు. రిటైర్డ్ ఉద్యోగిని న్యూడ్(నగ్నం)గా నిలబెట్టి వీడియోలు, ఫొటోల్లో బంధించారు. ఆయనతో పాటు ఉన్న మహిళపై తీవ్రస్థాయిలో చిందులేశారు. ‘నువ్వు అవసరం లేదుపో... మా కుటుంబ మర్యాద మంటగలిపావు’ అని అనడంతో ఆ వృద్ధుడికి ఏమి జరుగుతోందో తెలీక బిక్కమొహం వేశాడు. ‘నీ విషయం కూడా బయటపెడతా...ఎలా మా ఇంటికి వస్తావు. పోలీసులకు ఫిర్యాదు చేస్తా. మీ కుటుంబ సభ్యులందరికీ ఫొటోలు, వీడియోలు పంపుతా. సోషల్ మీడియాలోనూ పెడతాన’ని బెదిరించారు. దీంతో ఆయన లబోదిబోమంటూ తనకు ఏపాపమూ తెలీదని చెప్పినా వినలేదు. చివరగా రూ.10 లక్షలు ఇస్తే సమస్య ఇంతటితో ఆపేస్తామని, లేదంటే నీ బండారమంతా బయటపెడతామని చెప్పడంతో తన ఇబ్బందులన్నీ చెప్పుకుని చివరకు రూ.3 లక్షలు సమరి్పంచుకున్నాడు. ఇలాంటి బాధితులు చాలామందే ఉన్నారు. అయితే ఎక్కువగా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ధనవంతులను ఈ ముఠా లక్ష్యం చేసుకుంది.
వీడియోలు
లోకేష్.. మీ అమ్మా బాబు నీచ చరిత్ర చెప్తా విను..
న్యూడ్ గా వచ్చి.. మా మమ్మి మీద చేయి వేశాడు
క్షణాల్లో గాఢ నిద్ర పట్టాలంటే నిద్ర మాత్రలు వద్దు.. రాత్రి బాగా నిద్రపోవడానికి ఏం చేయాలి..?
24 గంటల్లో.. యుద్ధం మొదలవుతుంది KA పాల్ సంచలన వ్యాఖ్యలు
ఇన్వెస్టర్లకు కాసుల పంట.. లక్షకు 13 లక్షలు సంపాదించిపెట్టిన స్టాక్..
వైఎస్ జగన్ పులివెందుల టూర్.. పూర్తి షెడ్యూల్..!
ఢిల్లీలో చంద్రబాబు డ్రామాలు మోదీకి వెన్నుపోటు
ఎవ్వడిని వదల్లేదు, RCB పొగరు దింపిన మిల్లర్
సునామీ ముప్పు, అంతరిక్షం నుంచి హై-రిజల్యూషన్ హెచ్చరిక!
రిచ్ అమ్మాయిలే టార్గెట్..స్టైలిష్ ఫోటోలు పెట్టి 10 మందిని బోల్తా కొట్టించిన కేటుగాడు



