'పర్సనాలిటీ'కి పునాది ఎక్కడ పడుతుందంటే..!
మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు.. "అచ్చం వాళ్ళ నాన్న లాగే కోపం", "వాళ్ళ అమ్మ లాగే తెలివైనది" అని అంటుంటాం. మరికొన్ని సార్లు, "వాళ్ళ ఇంట్లో అందరూ సాఫ్ట్.. ఈయన ఒక్కడే ఇంత మొండివాడు ఏంటి?" అని ఆశ్చర్యపోతుంటాం.అసలు ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా తయారవుతుంది? అది మనం పుట్టుకతో తెచ్చుకున్నదా? లేక పెరిగిన వాతావరణం నేర్పినదా?సైకాలజీలో దీనినే Nature vs Nurture (ప్రకృతి vs పెంపకం) అంటారు. డెవలప్మెంటల్ సైకాలజీ ప్రకారం, వ్యక్తిత్వం అనేది కేవలం ఒక రోజులో వచ్చేది కాదు. ఇది గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుండి మొదలై, మన ఎదుగుదల క్రమంలో రూపుదిద్దుకుంటుంది.1. అనువంశికత (Heredity): మీ పర్సనాలిటీ బ్లూప్రింట్మనం పుట్టినప్పుడే కొన్ని లక్షణాలను మన DNAలో మోసుకొస్తాం. మీ తల్లిదండ్రుల నుండి మీకు కేవలం కళ్ళ రంగు, ఎత్తు మాత్రమే కాదు.. మీ మెదడు పనితీరు, మీ ఎమోషనల్ టెంపరమెంట్ కూడా వస్తాయి.Temperament: కొందరు పిల్లలు పుట్టగానే చాలా ప్రశాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ఇది వారి DNA లోనే ఉంటుంది. దీనినే 'బయోలాజికల్ ఫౌండేషన్' అంటారు.Intelligence: తెలివితేటలకు సంబంధించిన ప్రాథమిక సామర్థ్యం అనువంశికంగానే వస్తుంది. అయితే దాన్ని ఎలా వాడుకుంటాం అనేది తర్వాత మనం చేసే కృషిపై ఆధారపడి ఉంటుంది.Nervous System: మీ నాడీ వ్యవస్థ ఒత్తిడికి ఎలా స్పందిస్తుంది అనేది కూడా మీ జీన్స్లోనే ఉంటుంది. అందుకే కొందరు చిన్న శబ్దానికే ఉలిక్కిపడతారు, కొందరు ఎంత గొడవలో ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు.2. పరిసరాలు (Environment): శిల్పి చేతిలో ఉలిDNA మీకు ఒక పునాదిని ఇస్తే, మీ చుట్టూ ఉన్న పరిసరాలు ఆ పునాదిపై భవనాన్ని నిర్మిస్తాయి. పుట్టినప్పటి నుండి ఐదేళ్ల వరకు ఉండే వాతావరణం అత్యంత కీలకం.Early Experiences: చిన్నప్పుడు మీకు లభించిన ప్రేమ, రక్షణ లేదా ఎదురైన అవమానాలు మీ 'సెల్ఫ్-కాన్సెప్ట్'ను డిజైన్ చేస్తాయి. ఒక బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లి వెంటనే దగ్గరకు తీసుకుంటే, ఆ బిడ్డలో "ప్రపంచం సురక్షితమైనది" అనే నమ్మకం కలుగుతుంది. అదే నిర్లక్ష్యం చేస్తే, "నేను ఎవరికీ అక్కర్లేదు" అనే అభద్రతాభావం (Insecurity) మొదలవుతుంది.కుటుంబ నిర్మాణం: ఇంట్లో మీరు పెద్దవారా? చిన్నవారా? మీ తల్లిదండ్రుల మధ్య సంబంధం ఎలా ఉంది? ఇవన్నీ మీ వ్యక్తిత్వాన్ని మలుస్తాయి.సాంస్కృతిక ప్రభావం: మన తెలుగు సంస్కృతిలో పెరిగిన వ్యక్తికి, పాశ్చాత్య దేశాల్లో పెరిగిన వ్యక్తికి విలువలు, ప్రవర్తనలో చాలా తేడా ఉంటుంది.3. మోటివేషనల్ స్పీకర్లు ఇక్కడ ఎందుకు విఫలమవుతారు?సో-కాల్డ్ మోటివేషనల్ స్పీకర్లు ఏం చెప్తారంటే.. "నీ గతం నీకు అనవసరం. నువ్వు ఈ క్షణం నుంచి మారిపోవచ్చు." ఇది వినడానికి బాగుంటుంది కానీ, సైంటిఫిక్ గా అసాధ్యం.ఎందుకంటే మీ మెదడులో పడ్డ ముద్రలు (Neural Pathways) చాలా బలంగా ఉంటాయి. మీ DNA మరియు మీ చిన్ననాటి చేదు అనుభవాలను (Trauma) పట్టించుకోకుండా, పైన "పాజిటివ్ థింకింగ్" అనే పెయింట్ వేస్తే.. లోపల ఉన్న తుప్పు పోదు.ఉదాహరణకు ఒక వ్యక్తికి చిన్నప్పుడు వాళ్ళ నాన్న అథారిటేటివ్గా ఉండి, ఎప్పుడూ భయపెడుతూ పెంచారనుకుందాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఆఫీసులో బాస్ దగ్గర మాట్లాడాలన్నా భయపడతాడు. ఒక మోటివేషనల్ ట్రైనర్ వచ్చి "ధైర్యంగా ఉండు" అని చెప్తే సరిపోదు. అక్కడ సమస్య బాస్ కాదు.. ఆ వ్యక్తి సబ్-కాన్షియస్ మైండ్లో ఉన్న 'తండ్రి' అనే అథారిటీ ఫిగర్ పట్ల ఉన్న భయం. ఆ 'DNA/Past'ను అడ్రెస్ చేయకుండా పర్సనాలిటీ మారదు.4. అసలైన వ్యక్తిత్వ వికాసంనా Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ DNA మరియు పర్యావరణ ప్రభావాలను మనం ఎలా డీల్ చేయాలి?Step 1: Break (గుర్తించడం, విడగొట్టడం)మీ వ్యక్తిత్వానికి పునాది ఎక్కడ పడిందో తెలుసుకోవడమే మొదటి మెట్టు. "నాకు ఎందుకు కోపం వస్తుంది? ఇది నా DNA లో ఉందా? లేక చిన్నప్పుడు నేను చూసిన మా నాన్న ప్రవర్తనా?" అని విశ్లేషించాలి. మీ గతాన్ని మీరు తవ్వాలి. ఆ పాత ముద్రలను, భయాలను గుర్తించి వాటిని 'బ్రేక్' చేయాలి.Step 2: Build (సరైన నిర్మాణాన్ని నిర్మించడం)DNA ని మనం మార్చలేం కానీ, అది ఎలా ఎక్స్ప్రెస్ అవ్వాలి అనేదాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు (దీన్ని సైన్స్లో Epigenetics అంటారు).మీకు కోపం వచ్చే స్వభావం DNA లో ఉన్నా.. మెడిటేషన్ ద్వారా, మైండ్ఫుల్నెస్ ద్వారా దాన్ని నియంత్రించడం నేర్చుకోవచ్చు.పాత వాతావరణం మీకు నెగటివిటీని ఇచ్చి ఉంటే, ఇప్పుడు మీరు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసుకోవాలి.Step 3: Beyond (పరిమితులకు అతీతంగా)మీరు కేవలం మీ జీన్స్ కి లేదా మీ గతానికి బానిసలు కాదు. మీ 'DNA ఆఫ్ పర్సనాలిటీ'ని అర్థం చేసుకున్నప్పుడు, దాన్ని మీ అభివృద్ధికి ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. ఒక బలహీనతను బలంతో ఎలా రీప్లేస్ చేయాలో తెలిసినప్పుడే మీరు ఒక 'జీనియస్' గా ఎదుగుతారు.5. ప్రాక్టీస్ కోసం ఒక చిన్న ఎక్సర్సైజ్మీ వ్యక్తిత్వానికి పునాది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఈ మూడు ప్రశ్నలు వేసుకోండి.Heredity: నా అలవాట్లలో మా అమ్మ/నాన్న పోలికలు ఏమున్నాయి? (కోపం, ఆందోళన, తెలివితేటలు, మొండితనం?)Environment: నా చిన్నతనంలో నన్ను ఎక్కువగా బాధించిన లేదా ప్రభావితం చేసిన సంఘటన ఏది? అది ఇప్పటికీ నా నిర్ణయాలను ప్రభావితం చేస్తోందా?Realization: నేను ఇప్పటివరకు అనుకుంటున్న 'నేను' నిజమైన నేనేనా? లేక నా చుట్టూ ఉన్న పరిస్థితులు సృష్టించిన ప్రతిబింబమా?మన DNA మనకు ఒక Map ఇస్తుంది. కానీ ఎటు ప్రయాణం చేయాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మీ వ్యక్తిత్వానికి పునాది ఎక్కడ పడిందో తెలుసుకోవడం అంటే.. మిమ్మల్ని మీరు నిందించుకోవడం కాదు, మిమ్మల్ని మీరు విముక్తి (Liberate) చేసుకోవడం.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com
రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. నిర్మాత సతీష్ కిలారు ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఓటిటి మార్కెట్ డౌన్ కాకముందే డిజిటల్ హక్కుల డీల్ ఫినిష్ చేసుకోవడం నిర్మాతల అదృష్టమనే చెప్పాలి. ఆ రోజుల్లో దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) చిత్రాన్ని కోనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్.ఆడియో హక్కులు మరో 18 కోట్ల మేరకు వచ్చాయి. శాటిలైట్ హక్కులు ఇంకా ఫైనల్ కాలేదు. కానీ మంచి మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను నేరుగా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అందువల్ల హిందీ డబ్బింగ్ అవసరం లేదు. కానీ హిందీ శాటిలైట్ హక్కులు వేరుగా ఉంటాయి. నాన్-థియేట్రికల్ ఆదాయం మొత్తం కలిపి 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న 'పెద్ది' విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోందనే చెప్పాలి.
కాలిఫోర్నియాలో భారీ ప్రకృతి విపత్తు
లాస్ఏంజెల్స్: కాలిఫోర్నియా ప్రకృతి ప్రకోపం సృష్టించింది. శక్తివంతమైన భారీ హిమపాతం కాలిఫోర్నియా రాష్ట్రాన్ని ముంచెత్తింది. ఈ భారీ హిమపాతంలో చిక్కకుని 8 మంది మృత్యువాత పడగా, మరో ఆరుగురు స్కీయర్లను రెస్క్యూ టీమ్ కాపాడింది. లేక్తాహో సమీపంలోని క్యాజిల్పీక్ వద్ద భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. మృత్యువాత పడిన వారిలో ఏడుగుర మహిళలున్నారు. 1982 తర్వాత అమెరికాలో సంభవించిన అత్యంత ఘోరమైన హిమపాతంగా ఇది నమోదైంది. తీవ్ర వర్షాలు, ఉరుములు, గాలులు: లాస్ ఏంజెల్స్ కౌంటీ సహా అనేక ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. పర్వత ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది, రహదారులు మూసివేయబడ్డాయి. I-80 హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. గత సంవత్సరం అగ్నిప్రమాదాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో మట్టి ప్రవాహాలు (mudslides) వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉన్నట్ల తెలుస్తోంది.
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమా వేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.
ఆమెకు 33.. అతనికి 23..గది అద్దెకు తీసుకుని..
ఏఐ సమ్మిట్కు బిల్ గేట్స్ దూరం..!
కర్రెగుట్టలో ఆపరేషన్-2 కగార్ ప్రారంభం
ఆహారోత్పత్తిలో లోటు నుంచి మిగులుకు
T20 WC: సూపర్-8 షెడ్యూల్ ఇదే.. ఎవరు ఎవరితో ఢీ?
అల్లు అర్జున్- లోకేశ్ కనగరాజ్ సినిమా ప్రారంభం ఎప్పుడంటే..
ఐటీపై ఇన్వెస్టర్ల ఆందోళన అర్థరహితం
భారత్ పెట్టుబడులకు విశ్వసనీయ గమ్యస్థానం
అమెరికా నుంచి నాణ్యమైన బొగ్గు
టెన్షన్.. టెన్షన్.. ఇరాన్పై భారీ దాడికి అమెరికా సిద్ధం!
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
థాయ్లాండ్లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా!
గంభీర్కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్కోచ్ పదవికి గుడ్బై?
ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. 4 నెలలకు స్ట్రీమింగ్
వ్యవసాయం దండగ అని సార్ ఎప్పుడో చెప్పారుగా!
'మూడేళ్ల కష్టం.. ఈ మూవీ మాకు బాహుబలితో సమానం'
మీ పప్పులుడకవ్ అని రైస్ మిల్లర్ల ఫోన్ సార్!!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: స్టార్ హీరోయిన్
IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్
స్థానిక పరిస్థితులు సమీకరణాల ఆధారంగా జతకడుతున్న రాజకీయ పార్టీలు
రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్పై ప్రభావం..
IND vs NED: అతడిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!
ఈ రాశి వారికి స్థిరాస్తివృద్ధి.. వ్యవహారాలలో విజయం
సూపర్-8కు న్యూజిలాండ్.. మిగిలిన రెండు బెర్త్లు ఎవరివి..?
ఎవరీ ప్రత్యూష.. 2002 ఫిబ్రవరి 23న ఏం జరిగింది?
‘బిల్’కు గేట్స్ క్లోజ్!
T20 WC: అతడిని సెలక్ట్ చేయలేదు.. అనుభవించారు!
కరుగుతోన్న బంగారు కొండ..
T20 WC 2026: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
ఆమెకు 33.. అతనికి 23..గది అద్దెకు తీసుకుని..
ఏఐ సమ్మిట్కు బిల్ గేట్స్ దూరం..!
కర్రెగుట్టలో ఆపరేషన్-2 కగార్ ప్రారంభం
ఆహారోత్పత్తిలో లోటు నుంచి మిగులుకు
T20 WC: సూపర్-8 షెడ్యూల్ ఇదే.. ఎవరు ఎవరితో ఢీ?
అల్లు అర్జున్- లోకేశ్ కనగరాజ్ సినిమా ప్రారంభం ఎప్పుడంటే..
ఐటీపై ఇన్వెస్టర్ల ఆందోళన అర్థరహితం
భారత్ పెట్టుబడులకు విశ్వసనీయ గమ్యస్థానం
అమెరికా నుంచి నాణ్యమైన బొగ్గు
టెన్షన్.. టెన్షన్.. ఇరాన్పై భారీ దాడికి అమెరికా సిద్ధం!
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
థాయ్లాండ్లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా!
గంభీర్కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్కోచ్ పదవికి గుడ్బై?
ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. 4 నెలలకు స్ట్రీమింగ్
వ్యవసాయం దండగ అని సార్ ఎప్పుడో చెప్పారుగా!
'మూడేళ్ల కష్టం.. ఈ మూవీ మాకు బాహుబలితో సమానం'
మీ పప్పులుడకవ్ అని రైస్ మిల్లర్ల ఫోన్ సార్!!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: స్టార్ హీరోయిన్
IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్
స్థానిక పరిస్థితులు సమీకరణాల ఆధారంగా జతకడుతున్న రాజకీయ పార్టీలు
రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్పై ప్రభావం..
IND vs NED: అతడిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!
ఈ రాశి వారికి స్థిరాస్తివృద్ధి.. వ్యవహారాలలో విజయం
సూపర్-8కు న్యూజిలాండ్.. మిగిలిన రెండు బెర్త్లు ఎవరివి..?
ఎవరీ ప్రత్యూష.. 2002 ఫిబ్రవరి 23న ఏం జరిగింది?
‘బిల్’కు గేట్స్ క్లోజ్!
T20 WC: అతడిని సెలక్ట్ చేయలేదు.. అనుభవించారు!
కరుగుతోన్న బంగారు కొండ..
T20 WC 2026: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
ఫొటోలు
విశాఖ సాగరతీరంలో సాహస గర్జన (ఫొటోలు)
హైదరాబాద్ లో రంజాన్ శోభ (ఫొటోలు)
శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం (ఫొటోలు)
‘విష్ణు విన్యాసం’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
కోలీవుడ్ కపుల్ జంటగా మరకతమణి 2 (ఫోటోలు)
ఉంగరాల జుట్టుతో ఎపిక్ హీరోయిన్ (ఫోటోలు)
ప్రియమైన భార్యతో 12th ఫెయిల్ మూవీ హీరో (ఫోటోలు)
పెళ్లిరోజున తిరుమలలో యాంకర్ లాస్య దంపతులు (ఫోటోలు)
హీరో సత్యదేవ్ కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
హీరోయిన్ తమన్నా 'శివరాత్రి' జ్ఞాపకాలు (ఫొటోలు)
సినిమా
పింక్ శారీలో ది రాజాసాబ్ బ్యూటీ.. బ్లాక్ డ్రెస్లో సమంత పోజులు..!
వజ్రాల్లాంటి బ్లాక్ డ్రెస్లో సమంత హోయలు..హీరోయిన్ అమలాపాల్ డిఫరెంట్ లుక్..సెలయేరు వద్ద హీరోయిన్ ప్రియమణి చిల్..పింక్ డ్రెస్లో ది రాజాసాబ్ బ్యూటీ అందాలు..పట్టుశారీలో మరింత అందంగా బిగ్బాస్ సోనియా...ఎల్లో చీరలో కాయాదు లోహర్ బ్యూటీపుల్ లుక్స్.. View this post on Instagram A post shared by Soniya Yash (@soniya.yashofficial) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official)
మెగా కోడలి కొత్త సినిమా.. క్రేజీ లవ్ సాంగ్ వచ్చేసింది
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన చిత్రం సతీ లీలావతి. ఈ మూవీకి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్పై నాగ మోహన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సతీ లీలావతి మూవీ క్రేజీ లవ్ సాంగ్ విడుదలైంది.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ఈ మూవీ నుంచి మధురం అంటూ సాగే లవ్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. కార్తీక్, చారులత మణి ఆలపించారు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ పాట ఆడియన్స్ను తెగ అలరిస్తోంది. కాగా.. ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి కీలక పాత్రల్లో నటించారు.
'వారణాసి నాకు చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?':ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్
మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ అడ్వెంచరస్ సినిమా వారణాసి. ఈ సినిమా కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ప్రియాంక చోప్రా వారణాసి మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను నటించిన ది బ్లఫ్ మూవీ ప్రీమియర్ షోకు హాజరైన ప్రియాంక ఈ సినిమా గురించి మాట్లాడింది. ఎస్ఎస్ రాజమౌళి సార్ ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్ అని కొనియాడింది. ఈ మూవీ తన కెరీర్ నిర్ణయించే సినిమా అవుతుందని ప్రియాంక తెలిపింది.కాగా.. రాజమౌళి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. "#Varanasi will be a career defining movie for me" says Priyanka Chopra during the premiere of her new movie. pic.twitter.com/6AZFJZJj6S— Rick Sulgie (@Aloydinkan) February 18, 2026
హీరోకు తల్లిగా, భార్యగా, కూతురిగా నటించిన హీరోయిన్
హీరోయిన్లు కేవలం హీరోతో జోడీ కట్టడమే కాదు కొన్నిసార్లు అదే హీరోకు తల్లిగా, కూతురిగా కూడా నటించినవాళ్లూ ఉన్నారు. అలా మలయాళ స్టార్ మమ్ముట్టికి ఓ స్టార్ హీరోయిన్ తల్లిగా, కూతురిగా, భార్యగా నటించింది. ఆమె మరెవరో కాదు, అందాల తార మీనా.స్టార్ హీరోయిన్గా13 ఏళ్ల వయసుకే హీరోయిన్గా మారింది మీనా. కథానాయికగా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. దాదాపు అందరు హీరోలతో జత కట్టిన మీనా మలయాళ స్టార్ మమ్ముట్టికి మాత్రం భార్యగా, కూతురిగా, తల్లిగా నటించింది.మమ్ముట్టికి జోడీగా..ఒరు కొచ్చుకథ ఆరుం పరయత కథ మూవీలో మమ్ముట్టి కూతురిగా నటించింది. 2001లో వచ్చిన రాక్షస రాజవు మూవీలో మమ్ముట్టి ప్రేయసిగా కనిపించింది. ఆ తర్వాత కరుత పక్షికల్, కద పరయుంబల్ సినిమాల్లోనూ మమ్ముట్టితో కలిసి నటించింది. 2014లో మమ్ముట్టి ద్విపాత్రాభినయం చేసిన మూవీ బాల్యకాలసఖి. ఇందులో మమ్ముట్టి తల్లిగా, భార్యగా మీనా యాక్ట్ చేసింది. చదవండి: జీవితంలో ఒక్క పుస్తకం చదవలేదు: స్టార్ హీరో
క్రీడలు
టీమిండియా అదుర్స్.. అజేయంగా... అగ్రస్థానంతో
అహ్మదాబాద్: టి20 వరల్డ్ కప్లో లీగ్ దశను భారత జట్టు నాలుగు వరుస విజయాలతో అజేయంగా ముగించింది. గ్రూప్ ‘ఎ’లో ఆడిన అన్ని మ్యాచ్లూ గెలిచి అగ్రస్థానంతో ‘సూపర్ ఎయిట్స్’కు సిద్ధమైంది. బుధవారం జరిగిన పోరులో భారత్ 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ దూబే (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్స్లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కెపె్టన్ సూర్యకుమార్ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (27 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 30; 3 సిక్స్లు) మెరిపించారు. అనంతరం నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసి ఓడిపోయింది. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది. చివరి 5 ఓవర్లలో 75... భారత్ టాప్–3 కూడా ఎడంచేతివాటం బ్యాటర్లు కావడంతో ఆఫ్స్పిన్నర్ ఆర్యన్ దత్తో తొలి ఓవర్ వేయించి నెదర్లాండ్స్ చేసిన ప్రయోగం బాగా పని చేసింది. మూడో బంతికే అభిషేక్ శర్మ (0) బౌల్డ్ కాగా, ఇషాన్ కిషన్ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఆర్యన్ రెండో ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. మరోవైపు తిలక్ కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్ప్లేలో స్కోరు 51/2కు చేరింది. అయితే ఈ దశలో డచ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుసగా 20 బంతుల పాటు బౌండరీనే రాలేదు! వ్యక్తిగత స్కోరు 13 వద్ద లెవిట్ క్యాచ్ వదిలేయడంతో సూర్యకు లైఫ్ లభించింది. అయితే అదే ఓవర్లో తిలక్ వెనుదిరిగాడు. అనంతరం 2 పరుగుల వద్ద ఎల్బీ అప్పీల్పై ‘అంపైర్స్ కాల్’తో బతికిపోయిన దూబే ఆపై చెలరేగిపోయాడు. అకెర్మన్ ఓవర్లో అతను 2 సిక్స్లు, ఫోర్ బాదాడు. నాలుగో వికెట్కు దూబేతో 76 పరుగులు (35 బంతుల్లో) జోడించిన తర్వాత సూర్య అవుటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 118/4. ఇక్కడి నుంచి దూబే, పాండ్యా ధాటిగా ఆడటంతో చివరి 5 ఓవర్లలో భారత్ 8 సిక్స్లు, 3 ఫోర్లతో 75 పరుగులు జోడించడం విశేషం. వాన్ బీక్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ బాదిన దూబే 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టపటపా... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ బ్యాటింగ్లో ఏ దశలోనూ దూకుడు కనిపించలేదు. పవర్ప్లేలో 36/1తో ఉన్న జట్టు స్కోరు సగం ఓవర్లు ముగిసేసరికి 72/2కు చేరింది. అయితే తర్వాత 31 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 కీలక వికెట్లు కోల్పోయిన డచ్ వేగంగా ఓటమి వైపు సాగింది. కాషెట్ (26), క్రోస్ (25 నాటౌట్) చివర్లో 23 బంతుల్లో 47 పరుగులు జోడించి కొంత పోరాడినా...అప్పటికే ఆలస్యమైపోయింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (బి) దత్ 0; ఇషాన్ (బి) దత్ 18; తిలక్ (సి) మెర్వ్ (బి) వాన్ బీక్ 31; సూర్య (సి) (సబ్) గగ్టెన్ (బి) క్లీన్ 34; దూబే (సి) (సబ్) గగ్టెన్ (బి) బీక్ 66; పాండ్యా (సి) మెర్వ్ (బి) బీక్ 30; రింకూ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–0, 2–39, 3–69, 4–110, 5–186, 6–193. బౌలింగ్: ఆర్యన్ దత్ 4–0–19–2, వాన్ బీక్ 4–0–56–3, అకెర్మన్ 3–0–36–0, కైల్ క్లీన్ 4–0–38–1, డి లీడ్ 4–0–28–0, వాన్డర్ మెర్వ్ 1–0–15–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: లావిట్ (సి) సుందర్ (బి) పాండ్యా 24; డౌడ్ (బి) వరుణ్ 20; డి లీడె (సి) వరుణ్ (బి) దూబే 33; అకెర్మన్ (సి) రింకూ (బి) వరుణ్ 23; దత్ (బి) వరుణ్ 0; ఎడ్వర్డ్స్ (బి) బుమ్రా 15; కాషెట్ (సి) వాషింగ్టన్ సుందర్ (బి) దూబే 26; క్రోస్ (నాటౌట్) 25; బీక్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–35, 2–51, 3–94, 4–94, 5–112, 6–125, 7–172. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–22–0, బుమ్రా 3–0–17–1, సుందర్ 4–0–36–0, వరుణ్ 3–0–14–3, పాండ్యా 3–0–40–1, అభిషేక్ 1–0–10–0, దూబే 3–0–35–2.
సిక్సర్లతో విరుచుకుపడిన శివమ్ దూబే.. టీమిండియా భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్తో ఇవాళ (ఫిబ్రవరి 18) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.శివమ్ దూబే (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుకుపడి భారత్కు భారీ స్కోర్ అందించాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 30; 3 సిక్సర్లు) కూడా ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖరి ఓవర్లో 3 బంతులు ఎదుర్కొన్న రింకూ సింగ్ ఓ సిక్సర్ బాది అజేయంగా నిలిచాడు.అంతకుముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్), తిలక్ వర్మ (27 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) నిదానంగా ఆడి విసుగు తెప్పించారు. వారికి ముందు ఇషాన్ కిషన్ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్) తన సహజ శైలిలో మెరుపులు మెరిపించాడు. అయితే మరో భారీ షాట్కు ప్రయత్నించి ఆర్యన్ దత్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.ఈ మెగా టోర్నీలో దారుణమైన ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లోనూ ఉసూరుమనిపించాడు. వరుసగా మూడో మ్యాచ్లోనూ డకౌటై టీమిండియా అభిమానులను నిరాశపరిచాడు.నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ (4-0-56-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మను క్లీన్ బౌల్డ్ చేసిన ఆర్యన్ దత్ (4-0-19-2) కెరీర్లోనే అత్యుత్తమ స్పెల్ వేశాడు. బాస్ డి లీడ్ (4-0-28-0) పొదుపుగా బౌలింగ్ చేసి పర్వాలేదనిపించాడు. 19వ ఓవర్లో మాత్రమే 21 పరుగులిచ్చిన కైల్ క్లెయిన్ (4-0-38-1) అంతకుముందు ఓవర్లలో టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశాడు. కొలిన్ ఆకెర్మన్ (3-0-36-0), వాన్ డర్ మెర్వ్ (1-0-15-0) కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ సూపర్-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్కు సైతం ఈ మ్యాచ్ ఫలితంతో ఎలాంటి ఉపయోగం లేదు. ఈ జట్టు ఇప్పటికే ఆడిన 3 మ్యాచ్ల్లో రెండింట ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
T20 WC 2026: కొనసాగుతున్న అభిషేక్ శర్మ చెత్త ప్రదర్శన
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ చెత్త ఫామ్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో తానాడిన తొలి రెండు మ్యాచ్ల్లో (యూఎస్ఏ, పాకిస్తాన్) డకౌట్లైన అభిషేక్.. ఇవాళ (ఫిబ్రవరి 18) పసికూన నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లోనూ ఖాతా తెరవలేక హ్యాట్రిక్ డకౌట్ల అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ తన తొలి టీ20 ప్రపంచకప్లో మూడు మ్యాచ్లు ఆడినా ఖాతా తెరవలేకపోవడం శోచనీయం. అభిషేక్కు చివరి 7 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్లో ఇది ఐదో డకౌట్ కావడం మరింత శోచనీయం.ఈ మ్యాచ్లో అభిషేక్ను జెర్సీ మార్పు కూడా కాపాడలేకపోయింది. అభిషేక్ తన రెగ్యులర్ జెర్సీ కాకుండా సిరాజ్ వేసుకునే 73వ నంబర్ జెర్సీ ధరించి బరిలోకి దిగినా ఖాతా తెరవలేకపోయాడు.తాజా డకౌట్ తర్వాత అభిషేక్ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో అత్యధిక డకౌట్లైన భారత బ్యాటర్గా సంజూ శాంసన్ (2024) సరసన చేరాడు. సంజూ, అభిషేక్ ఇప్పుడు తలో ఐదు డకౌట్లతో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నెదర్లాండ్స్తో మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ కష్టాల్లో ఉంది. పవర్ ప్లేలోనే (తొలి 6 ఓవర్లలో) ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ఇషాన్ కిషన్ (18) వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 51-2గా ఉంది. తిలక్ వర్మ (26), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (7) క్రీజ్లో ఉన్నారు. టీమిండియా కోల్పోయిన రెండు వికెట్లు స్పిన్నర్ ఆర్మన్ దత్కే దక్కాయి. అభిషేక్, ఇషాన్లను దత్ క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం.
T20 WC 2026: సూపర్-8లోకి పాకిస్తాన్
టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ ఎట్టకేలకు సూపర్-8కు అర్హత సాధించింది. పసికూన నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్లో 102 పరుగుల భారీ తేడాతో గెలిచి చివరి సూపర్-8 బెర్త్ దక్కించుకుంది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాక్ ఆటగాళ్లు పసికూనలపై ప్రతాపం చూపించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెలరేగి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. పాక్ సూపర్-8కు అర్హత సాధించడంతో అప్పటిదాకా పోటీలో ఉన్న యూఎస్ఏ టోర్నీ నుంచి నిష్క్రమించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్లో షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), కెప్టెన్ సల్మాన్ అఘా (23 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్లతో రాణించగా.. సైమ్ అయూబ్ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు), ఖ్వాజా నఫాయ్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.నమీబియా బౌలర్లలో బెర్నాల్డ్ స్కోల్జ్ (4-0-33-0), రూబెన్ ట్రంపల్మెన్ (4-0-36-0) పొదుపుగా బౌలింగ్ చేయగా.. జాక్ బ్రస్సెల్ (4-0-48-2) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (3-0-25-1), జేజే స్మిట్ (3-0-28-0) పర్వాలేదనిపించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా పాక్ స్పిన్నర్ల ధాటికి చేతులెత్తేసింది. ఉస్మాన్ తారిఖ్ (3.3-1-16-4), షాదాబ్ ఖాన్ (4-0-19-3), మొహమ్మద్ నవాజ్ (4-0-22-1) దెబ్బకు 17.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సల్మాన్ మీర్జా కూడా ఓ వికెట్ తీశాడు. నమీబియా ఇన్నింగ్స్లో ఓపెనర్ లారెన్ స్టీన్కాంప్ (23), మిడిలార్డర్ బ్యాటర్ అలెగ్జాండర్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ ఓటమితో నమీబియా ఒక్క గెలుపు కూడా లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
న్యూస్ పాడ్కాస్ట్
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బాబు సర్కారు దగా... ఉప ప్రణాళిక నిధుల్లో 27 వేల కోట్ల రూపాయలు కోత
హెరిటేజ్తో ఇందాపూర్ డెయిరీ బంధంపై అట్టుడికిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి
నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచల తీర్పు.. లొంగిపోవాల్సిందే..!
ఏపీలో వ్యవసాయం.. బాబు సర్కారులో అపాయం
ఆంధ్రప్రదేశ్లో శైవక్షేత్రాల్లో భక్తుల భద్రతను గాలికొదిలేసిన బాబు సర్కారు
పన్నుల బాదుడు, అప్పుల పద్దు తప్ప సంపద సృష్టి, సూపర్ సిక్స్ అమలు జాడలేని ఏపీ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ మంటలు... విద్యార్థుల ఫీజుల కోసం చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు
ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి, ప్రజా సమస్యలపై గొంతెత్తాలి... వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం
ఏపీలో సూపర్ సిక్స్ మోసాల ఖరీదు లక్షన్నర కోట్ల రూపాయలు.. రాష్ట్ర గవర్నర్తోనూ అవే అబద్ధాలు చెప్పించిన సీఎం చంద్రబాబు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నోటీసుపై 120 మంది విపక్ష ఎంపీల సంతకాలు
బిజినెస్
ఫ్రెషర్స్కు పండగే!
ముంబై: ఈ ఏడాది ఫ్రెషర్లకు మెరుగైన ఉపాధి అవకాశాలు రానున్నాయి. 73 % సంస్థలు జనవరి–జూన్ మధ్య కాలంలో ఫ్రెషర్లను నియమించుకునే ఉద్దేశంతో ఉన్నట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ కెరీర్ అవుట్లుక్ సర్వేలో తెలిపాయి. విద్యార్హతలు ఒక్కటే కాకుండా.. అప్ప టికే ఏవైనా ప్రాజెక్టులపై పనిచేసిన అనుభవం, ఇంటర్న్íÙప్ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని సర్వేలో రిక్రూటర్లు చెప్పారు. 2025 నవంబర్ నుంచి 2026 జనవరి మధ్య వివిధ రంగాల్లోని 1,051 సంస్థల రిక్రూటర్లను సర్వే చేసి టీమ్లీజ్ ఎడ్టెక్ ఈ ఏడాది ప్రథమార్ధం లో నియామకాలు ఎలా ఉంటాయన్న దానిపై ఒక నివేదికను విడుదల చేసింది. ఈ రంగాల్లో జోరు: రిటైల్, ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్లు, తయారీలో ఈ ఏడాది ఫ్రెషర్లకు ఎక్కువ అవకాశాలు రానున్నాయి. రిటైల్ రంగంలో 91% సంస్థలు ఫ్రెషర్లను తీసుకునే ఉద్దేశంతో ఉన్నాయి. ఆ తర్వాత ఈ–కామర్స్ రంగంలో, టెక్నాలజీ స్టార్టప్ సంస్థలో 90 %, తయారీ కంపెనీల్లో 85% ఫ్రెషర్లను తీసుకోనున్నాయి. డార్క్ స్టోర్ అసిస్టెంట్ (క్విక్ కామర్స్), ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అసిస్టెంట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్లు డిజిటల్ సేల్స్ అసోసియేట్, జూనియర్ వెబ్ డెవలపర్లను నియ మించుకోవాలని అనుకుంటున్నాయి. తయారీలో ఇన్వెంటరీ, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్, బ్యాటరీ అసెంబ్లీ టెక్నీషియన్ ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది. ఆరంభ స్థాయి ఉద్యోగుల నియామకం విషయమై కంపెనీలు నమ్మకంగా ఉన్నాయని, కొన్ని రంగాల్లో నియామకాల ఉద్దేశం 2025 ద్వితీయ ఆరు నెలల కాలంలో ఉన్న 41% నుంచి, ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి 91 శాతానికి పెరిగినట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్ తెలిపారు. రవాణా రంగంలో నియామక ఉద్దేశ్యం 77 శాతానికి చేరిందని, విద్యుత్, ఇంధన రంగంలోనూ 22 % నుంచి 72 శాతానికి చేరినట్టు చెప్పారు. బెంగళూరు టాప్: ఇంటర్న్షిప్లు, ప్రాజెక్టుల అనుభవం ఉన్న వారు వేగంగా ఉపాధి అవకాశాలను పొందగలరని రూజ్ తెలిపారు. కేవలం డిగ్రీ అర్హతే కలిగిన వారు అవకాశం కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావొచ్చన్నారు. అధ్యయనమే దీనికి పరిష్కారమని సూచించారు. ఫ్రెషర్లకు అత్యధికంగా బెంగళూరులో (84 శాతం ) అవకాశాలు రానున్నాయి. టెక్నాలజీ, స్టార్టప్లకు బెంగళూరు కేంద్రంగా ఉండడం తెలిసిందే. ఇక్కడ ఐటీలో 81 శాతం, ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్ సంస్థల్లో 90 శాతం, ఇంజనీరింగ్, ఇన్ఫ్రా కంపెనీల్లో 61 శాతం ఫ్రెషర్లను తీసుకోవాలని అనుకుంటున్నాయి.
కార్పొరేట్ల గ్రీన్గేమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐక్యరాజ్య సమితి నిర్దేశిత 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)కు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, సానుకూల ప్రభావం చూపుతున్న 50 దేశీ కంపెనీల్లో హిందుస్తాన్ యూనిలీవర్ అగ్రస్థానంలో నిలి్చంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ రెండో స్థానంలో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మూడో స్థానంలో నిల్చాయి. పర్పెచ్యువల్ క్యాపిటల్, హురున్ ఇండియా 50 జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఫార్మా దిగ్గజాలు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, దివీస్ ల్యాబ్స్ కూడా లిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఎస్డీజీ లక్ష్యాలకు సంబంధించి నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా 150 కంపెనీలను వడబోసి ఈ జాబితాను రూపొందించినట్లు హురున్ ఇండియా ఫౌండర్ అనాస్ రెహా్మన్ జునైద్ గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. కంపెనీలు ఈ లక్ష్యాలను నివేదికలకు పరిమితం చేయకుండా, వ్యాపార వ్యూహాల్లో భాగంగా మార్చుకుంటున్నాయని వివరించారు. వినియోగ, వాణిజ్య, సామాజిక రంగాలపై అర్థవంతమైన ప్రభావం చూపే సంస్థలకు తాము తోడ్పాటు అందిస్తున్నామని పర్పెచ్యువల్ క్యాపిటల్ పార్ట్నర్స్ ప్రణవ్ ప్రశాంత్, అన్విత ప్రశాంత్ వివరించారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → ఎస్డీజీ లక్ష్యాల సాధన దిశగా కృషి చేస్తున్న కంపెనీల సంఖ్యకు సంబంధించి 26 సంస్థలతో ముంబై అగ్రస్థానంలో ఉండగా, పుణే, అహ్మదాబాద్ తదుపరి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ళీ మెటల్స్, మైనింగ్ రంగం నుంచి అత్యధికంగా 7 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్, ఎనర్జీ, కన్జూమర్ గూడ్స్ రంగాల నుంచి తలో మూడు కంపెనీలు ఉన్నాయి. → హిందుస్తాన్ యూనిలీవర్ 97 శాతం పునరుత్పాదక విద్యుత్ని వినియోగిస్తోంది. ళీ పర్సిస్టెంట్ సిస్టమ్స్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ ఇప్పటికే తటస్థ ఉద్గార స్థాయిని సాధించగా, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్ తదితర అయిదు దిగ్గజ కంపెనీలు ఇందుకోసం 2030ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. → కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాలపై జాబితాలోని కంపెనీలు రూ. 8,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయగా, 20 కోట్ల మందికి పైగా లబ్ధి చేకూరింది. పర్యావరణ పరిరక్షణపరమైన చర్యలకు కంపెనీలు (48 సంస్థలు) అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. → లిస్టులోని 50 కంపెనీల మొత్తం ఆదాయం రూ. 48.5 లక్షల కోట్లుగా, లాభం రూ. 4.95 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 10.7 లక్షల కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో ఉంది.
నిస్సాన్ గ్రావైట్.. మరో కొత్త 7-సీటర్ కారు వచ్చేసింది..
నిస్సాన్ (Nissan) తన కొత్త సబ్-4 మీటర్ ఎంపీవీ ‘గ్రావైట్’ (Gravite)ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) ఆధారంగా రూపొందించిన ఈ గ్రావైట్.. ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ మార్పులతో కొంత భిన్నంగా కనిపిస్తుంది. మస్క్యులర్ స్టైలింగ్, కొంచెం ప్రీమియం ఫీలింగ్ కలిగిన ఇంటీరియర్ ఈ మోడల్కు ప్రత్యేకతను ఇస్తాయి.అయితే ఇంజిన్, ఫీచర్ల పరంగా చాలా వరకు ట్రైబర్ను పోలి ఉంటుంది. భారత మార్కెట్లో తన ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు నిస్సాన్ ఈ గ్రావైట్ను కీలక మోడల్గా భావిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త ఎంపీవీకి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.వేరియంట్లు, ధరలు, బుకింగ్ వివరాలునిస్సాన్ గ్రావైట్ మొత్తం నాలుగు ప్రధాన ట్రిమ్లలో లభిస్తుంది. అవి విసియా (Visia), అసెంటా (Acenta), ఎన్-కనెక్టా (N-Connecta), టెక్నా (Tekna). ఇంట్రడక్టరీ ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి..విసియా ఎంటీ – రూ. 5.65 లక్షలుఅసెంటా ఎంటీ – రూ. 6.59 లక్షలుఎన్-కనెక్టా ఎంటీ – రూ. 7.20 లక్షలుఎన్-కనెక్టా ఏఎంటీ – రూ. 7.80 లక్షలుటెక్నా ఎంటీ – రూ. 7.91 లక్షలుటెక్నా ఏఎంటీ – రూ. 8.49 లక్షలుటెక్నా లాంచ్ ఎడిషన్ ఎంటీ – రూ. 8.35 లక్షలుటెక్నా లాంచ్ ఎడిషన్ ఏఎంటీ – రూ. 8.93 లక్షలుగ్రావైట్ బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు 2026 మార్చి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. పూర్తి వేరియంట్-వైజ్ ఫీచర్ వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.ఎక్స్టీరియర్డిజైన్ పరంగా నిస్సాన్ గ్రావైట్.. రెనాల్ట్ ట్రైబర్ ప్రాథమిక సిల్హౌట్ను కొనసాగిస్తుంది. అయితే నిస్సాన్ కొన్ని ప్రత్యేక స్టైలింగ్ ఎలిమెంట్స్ జోడించింది. ముందు భాగంలో హనీకాంబ్ ప్యాటర్న్తో కూడిన బోల్డ్ గ్రిల్, బోనెట్పై ‘GRAVITE’ లెటరింగ్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. స్లిమ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ క్రోమ్ స్ట్రిప్తో కనెక్ట్ చేయటం వలన ఫ్రంట్ లుక్ మరింత ఆధునికంగా కనిపిస్తుంది.సైడ్ ప్రొఫైల్లో రెనాల్ట్ ట్రైబర్ పోలిక స్పష్టంగా కనిపిస్తుంది. 15-అంగుళాల స్టైలిష్ స్టీల్ వీల్స్, ఎత్తైన రూఫ్లైన్, ఉప్రైట్ స్టాన్స్ వాహనానికి ప్రాక్టికల్, స్పేసియస్ లుక్ ఇస్తాయి. వెనుక భాగంలో ర్యాప్-అరౌండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ క్రోమ్ స్ట్రిప్తో కలిపి అమర్చారు. బంపర్పై C-షేప్ సిల్వర్ యాక్సెంట్స్ ముందుభాగానికి అనుసరణగా ఉన్నాయి.ఇంటీరియర్ఇంటీరియర్లో డ్యూయల్-టోన్ బ్లాక్-బేజ్ థీమ్ ఉపయోగించారు. డాష్బోర్డ్ డిజైన్ పాత ట్రైబర్ మోడల్ను గుర్తు చేస్తుంది. మధ్యలో 8-ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, దాని కింద మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ కోసం మూడు రొటరీ నాబ్స్ అమర్చారు. మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కలిపి సరళమైన, ఉపయోగకరమైన సెటప్ను అందిస్తున్నాయి.ఫీచర్లు, సేఫ్టీగ్రావైట్లో లభించే ముఖ్య ఫీచర్లు 8-ఇంచ్ టచ్స్క్రీన్ (వైర్లెస్ యాపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో), 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మాన్యువల్ ఏసీ (రియర్ వెంట్స్తో), కీ-లెస్ ఎంట్రీ & పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్.ఇక సేఫ్టీ పరంగా 6 ఎయిర్బ్యాగ్స్ (స్టాండర్డ్), ఏబీఎస్ కూడిన ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సర్లు & కెమెరా, టీపీఎంఎస్ ఉన్నాయి.ఇంజిన్, పనితీరుగ్రావైట్లో 1-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందిస్తున్నారు. ఇది 72 పీఎస్ పవర్, 96 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ MT / 5-స్పీడ్ AMT గేర్బాక్స్ ఇవ్వగా ఇంధన సామర్ 19.3 kmpl (MT), 19.6 kmpl (AMT)పోటీ మోడళ్లునిస్సాన్ గ్రావైట్ ప్రధానంగా రెనాల్ట్ ట్రైబర్తో పోటీ పడుతుంది. అలాగే మారుతి ఇర్టిగా, మారుతి ఎక్స్ఎల్6, కియా కారెన్స్, కియా కారెన్స్ క్లావిస్ లకు ఇది అందుబాటు ధరలో ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
పసిడి, వెండి పడిపోతాయా? ‘చైనా లూనార్ న్యూ ఇయర్’ ఎఫెక్ట్ ఎంత?
చైనా లూనార్ న్యూ ఇయర్ సెలవుల ప్రభావంతో ఆసియా కమోడిటీ మార్కెట్లలో లిక్విడిటీ తగ్గిపోవడంతో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు బుధవారం గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా చైనా, హాంకాంగ్లోని ఎక్స్ఛేంజీలు మూతపడటంతో మార్కెట్లో భాగస్వామ్యం సన్నగిల్లి, తాత్కాలిక అస్థిరత పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.బుధవారం ట్రేడింగ్లో ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 3.51 శాతం ఎగిసి రూ.2,36,824 వద్ద ట్రేడవగా, ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.88 శాతం పెరిగి రూ.1,52,742 వద్ద నమోదయ్యాయి.లూనార్ న్యూ ఇయర్ అంటే ఏమిటి?లూనార్ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్య జరిగే చలించే పండుగ. ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమైన ఈ సెలవులు పూర్తి వారం పాటు కొనసాగుతున్నాయి. గత సంవత్సరం ఇది జనవరి 28 నుంచి ప్రారంభమై జనవరి, ఫిబ్రవరి నెలల్లో విస్తరించింది.పండుగకు ముందు వినియోగదారులు భారీగా షాపింగ్ చేయడం, కార్మికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు కర్మాగారాలు ముందుగానే మూసివేయడం సాధారణం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో పనిదినాలు తగ్గిపోవడం, జనవరిలో పనిదినాలు పెరగడం వంటి మార్పులు కనిపిస్తాయి.బంగారం, వెండి ధరలపై ప్రభావంచైనా లూనార్ న్యూ ఇయర్ ఎఫెక్ట్ బంగారం, వెండి ధరలపై కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఛాయిస్ బ్రోకింగ్ కమోడిటీ & కరెన్సీ అనలిస్ట్ అమీర్ మక్డా ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద భౌతిక బంగారం కొనుగోలుదారులలో ఒకటైన చైనా మార్కెట్ సెలవుల కారణంగా ఆఫ్లైన్లోకి వెళ్లడం వల్ల ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గుతాయి. దీని ఫలితంగా ధరలలో అతిశయోక్తి మార్పులు, విస్తృత బిడ్-ఆస్క్ స్ప్రెడ్లు కనిపిస్తాయని ఆయన చెబుతున్నారు.చారిత్రాత్మకంగా ఈ కాలంలో ధరల దిద్దుబాట్లు చోటుచేసుకుంటాయని, పండుగకు ముందు కొనుగోలు చేసిన వ్యాపారులు లాభాలు తీసుకోవడం వల్ల వేగం తగ్గుతుందని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా వెండి ధరలు ఈ సమయంలో ఎక్కువగా ప్రభావితమవుతాయని, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పడిపోతుందని చెప్పారు. అందువల్ల ఈ సమయంలో బులియన్ ట్రేడింగ్లో జాగ్రత్త అవసరమని సూచించారు.షాంఘై, హాంకాంగ్ వంటి ప్రధాన ఆసియా ఎక్స్ఛేంజీలు మూసి ఉండటంతో మార్కెట్ కార్యకలాపాలు తగ్గిపోతాయని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ వి చెబుతున్నారు. తక్కువ భౌతిక డిమాండ్, పరిమిత మార్కెట్ మేకర్ల కారణంగా ధరలు కొన్నిసార్లు గణనీయంగా పడిపోవచ్చని తెలిపారు. అయితే ఈ పుల్బ్యాక్లు సాధారణంగా కాలానుగుణమని, ఆసియా మార్కెట్లు తిరిగి తెరుచుకున్న తర్వాత ధరలు స్థిరపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఫ్యామిలీ
టీనేజ్ వయసులో చదువుకి డుమ్మా..! కట్చేస్తే..
చదవుకునే వయసులో..చదువు అంతగా నచ్చదు, బుర్రకు ఎక్కదు కూడా. టీనేజ్ వయసులో ఎడ్యుకేషన్ అనేది అత్యంత కీలకమైన టర్నింగ్ పాయింట్. పైగా ఆ టైంలో బాగా చదువుకుంటూనే త్వరగా సెటిల్ అవ్వగలం. కానీ ఆ ఏజ్లో చదువుకి డుమ్మా చెప్పేసింది. కొన్నాళ్లుకు గానీ జ్ఞానోదయం కాలేదు..తానెంత పెద్ద తప్పు చేసింది. దాంతో మళ్లీ పుస్తకాలు కుస్తీ పట్టీ చదవడమే కాదు..పీహెచ్డీ అందుకుంది ప్రోఫెసర్గా ఉద్యోగాన్ని కూడా పొందిందామె. ఆమె కథ చదువంటే భయపడే యువతకు స్ఫూర్తి, కనువిప్పు కూడా..!.ఏ వ్యక్తికైనా చదువే మంచి గుర్తింపుని అందిస్తుంది. కానీ ఆ చదవుకే మధ్యలోనే స్వస్తి చెప్పింది జర్మన్కి చెందిన అన్నా షూత్. 17 ఏళ్ల టీనేజ్ వయసులో ఈ చదువులు నా వల్ల కాదంటూ కాలేజ్కి డుమ్మా కొట్టేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన తోటి స్నేహితులు కెరీర్లో తనకంటే ముందుకు సాగిపోవడం ఉండటం చూసి బాధకలగడం మొదలైంది అన్నాకి. ఏదైనా తప్పు చేశానా..ఇది సరైనాదేనా..అనే సందేహాలతో కొన్నాళ్లు గడిపేసింది. ఇంక లాభం లేదు..తాను మళ్లీ చదివి గుర్తింపు తెచ్చుకోవాల్సిందే అని డిసైడ్ అయ్యి..20ల టైంలో మళ్లీ కాలేజ్ పుస్తకాలు చదవడం ప్రారంభించింది. క్లాస్రూమ్లో అందరికంటే పెద్దగా.. సవాళ్లు ఎదురైనా..అన్నింటిని పక్కన పెట్టి మరి మనసుపెట్టి చదివింది. అలా ఆమె 35 ఏళ్లకు పీహెచ్డీ సంపాదించింది. 42 ఏళ్ల వయసులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగాన్ని పొందిందామె. అయితే మళ్లీ చదువుని ప్రారంభిస్తున్నప్పుడు.." ఇదివరకటిలా చదవగలనా..సైన్స్లో సీటు సంపాదించడం కుదురుతుందా అని సందేహాలు వచ్చేశాయి. గానీ..చదవడం ప్రారంచాక..ఎలాగైనా..అనుకున్నది సాధించొచ్చనే అనే నమ్మకం డెవలప్ అయ్యి..నా లక్ష్యాన్ని చేరుకోలిగానంటోంది". అన్నా. ఈ రోజు, షూత్ హెల్త్, మెడిసిన్ అండ్ లైఫ్ సైన్సెస్ ఫ్యాకల్టీలోని మాస్ట్రిక్ట్ విశ్వవిద్యాలయంలో గ్రూప్ లీడర్. ఆమె ఆంకాలజీ, అధునాతన మైక్రోస్కోపీ అండ్ బయోమెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలపై పరిశోధనలు చేస్తోంది. ఆమె ఈ శాస్త్రీయ పరిశోధనలతో పాటు, విద్యారంగంలో మానసిక ఆరోగ్య సవాళ్ల గురించి, ముఖ్యంగా STEM రంగంలోని మహిళ రాకపోవడం గురించి బహిరంగంగా మాట్లాడుతూ..చైతన్యపరుస్తుంటారామె. ఇక్కడ అన్నా తొలుత చదువు వద్దనుకున్నా..మళ్లీ చదవాలనుకుని పుస్తకాలు కుస్తీ పట్టే క్రమంలో ఎంతో భావోద్వేగాన్ని ఫేస్ చేసుంటారు. కానీ వాటిన్నంటిని అధిగమించి ఉన్నత స్థానానికి చేరుకోవడం నిజంగా ప్రశంసనీయం కదూ..!.(చదవండి: వధువుపై కోట్ల రూపాయల నగదు వర్షం..! ఎక్కడంటే..)
వధువుపై కోట్ల రూపాయల నగదు వర్షం..! ఎక్కడంటే..
కొన్ని విలాసవంతమైన పెళ్లిళ్లు తమ విలాసవంతమైన జీవితాన్ని, డాబు, దర్పం చూపిస్తున్నట్లుగా ఉంటాయి వేడుకలు. కావాలనుకుంటే..అట్టహాసంగా చేసుకోవచ్చు..అత్యంత లగ్జరీయస్గా వేడుక చేసుకోవచ్చు తప్పులేదు. కానీ డబ్బులను పూల వర్షంలా కురిపిస్తూ చేసుకోవడం అంటే..! ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించాలి. ఎందుకంటే ఆ సొమ్ము సామాజిక కార్యక్రమాలకు ఖర్చుపెడితే ప్రయోజనం, పరమార్థం ఉంటుంది. పైగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఆ నూతన దంపతుల మంచి ఆశీర్వాదాలు దక్కుతాయి, మేలు జరుగుతుంది కూడా. ఇలాంటి మంచిపనులు ఏదో ఒకనాటికి మనకు చేరిమేలు చేకూరుస్తాయనే కదా మన పురాణాలు నొక్కి చెబుతున్నాయి. కానీ కొందరు తమ స్వలాభానికి, సంతోషానికే ప్రాధాన్యత చూపిస్తూ వేడుకలు నిర్వహించి విమర్శలపాలవ్వుతారు. అలాంటి పనే చేసింది ఈ వరుడి కుటుంబం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఈ ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. పంజాబ్లో జరిగిన వివాహ వేడుక అందర్నీ విస్తుపోయేలా చేసింది.వధువుపై డబ్బులు వర్షం కురిపిస్తూ..వరడు కుటుంబం ఆహ్వానం పలికింది. మొత్తం కుటుంబసభ్యులు ఆమెపై నోట్లకట్లను కురిపించారు. మొత్తం అక్షరాల రూ. 8.5 కోట్ల నగదును కురిపించినట్లు సమాచారం. ఆ తర్వాత వరుడు ఆమె చేతిని పట్టుకుని నవ్వుతూ కనిపించాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు..అతిగా ఉందని, పేదలకు, నిస్సహాయులకు ఆ డబ్బుని ఉపయోగించి ఉంటే బాగుండేదంటూ విమర్శించారు. కానీ కొందరూ..ఈ తంతు చూస్తే..అతడి కుటుంబం ఆమెని బాగా చూసుకుంటుందని ఆశిస్తున్నా, అయినా ఇది వారి డబ్బు..కాబట్టి నచ్చినట్లు ఖర్చుపెట్టుకుంటారని సపోర్టు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by ET NOW (@etnow) (చదవండి: మోటివేషనల్ రీల్స్ చూస్తున్నారా..? అయినప్పటికీ లైఫ్..)
మాఘం మౌనమైతే.. ఫాల్గుణం పెళ్లిబాజాలు
విజయనగరం గంటస్తంభం: మాఘమాసం అంటేనే పెళ్లిళ్లు, శుభకార్యాల మాసం అని పెద్దలు చెప్పకొంటారు. కానీ, ఈ ఏడాది శుక్ర మౌఢ్యమి కారణంగా మంచి ముమూర్తాలు దొరకక చాలామంది వేచి చూడాల్సి వచ్చింది. దాదాపు 80 రోజుల విరామం తర్వాత ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియనుండటంతో వివాహాలు, శుభకార్యాలకు మళ్లీ చైతన్యం వచ్చింది. పండితులు చెబుతున్నట్టుగా ఈనెల మూడో వారం నుంచే శుభముహూర్తాలు కలసి వస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో పెళ్లిసందడి ఊపందుకోనుంది. హడావిడి మొదలు.. గ్రామాలు, పట్టణాల్లోని వధూవరుల ఇళ్లలో ఏర్పాటు హడావిడి మొదలైంది. ఇప్పటికే అనేక కుటుంబాలు మండపాలు, పురోహితులు, అలంకరణల కోసం బుకింగ్స్ పూర్తి చేసుకున్నాయి. ఏడాది పొడవునా ముహూర్తాలు అనుకూలంగా ఉన్నాయనే వార్తతో పెళ్లిళ్ల సంఖ్య వేలల్లోకి చేరనుందని అంచనా. కల్యాణ మండపాలకు భారీ డిమాండ్.. వివాహాలు, ఇతర శుభకార్యాల సీజన్ మొదలవుతుండటంతో కల్యాణ మండపాలు, హోటళ్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోని మండపాలు వరుసగా బుక్ అవుతున్నాయి. మండపం స్థాయిని బట్టి అద్దెలు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా బాజాభజంత్రీలు, షామియానా వ్యాపారులు, క్యాటరింగ్ సంస్ధలకు కూడా పని పెరిగింది. పెళ్లిళ్లకు వచ్చే బంధువుల కోసం లాడ్జీలు, హోటళ్లు ముందుగానే రిజర్వ్ అవుతున్నాయి. పూల అలంకరణల హవా... వివాహాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే పూల అలంకరణలకు ఈసారి ప్రత్యేక ఆదరణ కనిపిస్తోంది. అలంకరణ రకం, డిజైన్ను బట్టి ఖర్చులు రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియంతో పాటు చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి తాజా పూల రకాలను తెప్పిస్తున్నారు. ఫొటోగ్రాపర్లు, వీడియోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులకు కూడా బిజీ షెడ్యూల్ మొదలైంది. పురోహితులు సైతం ముందస్తుగానే బుక్ అయిపోతుండటంతో తేదీలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబాలకు సూచిస్తున్నారు. గ్రామీణ వాతావరణంలో పెళ్లి హడావిడి గ్రామల్లో అయితే పెళ్లి పనుల సందడి మరో రకంగా కనిపిస్తోంది. ఇళ్ల ముందర పందిళ్లు, ఊరంతా వెలుగులు, బంధువుల రాకపోకలు..మళ్లీ ఆ పాత హుషారు తిరిగి వస్తోందని పెద్దలు అంటున్నారు. వ్యాపార వర్గాలు కూడా ఈ సీజన్పై ఆశలు పెట్టుకున్నాయి. మొత్తం మీద శుభముహూర్తాల రాకతో ఉమ్మడి జిల్లాలో పెళ్లిసందడి పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.ముహుర్తాల కోసం ఎదురుచూపులు ముగిశాయి శుక్ర మౌఢ్యమి ఈ నెల 17తో ముగియనుండటంతో శుభకార్యాలకు ఏర్పడిన విరామం తొలగింది. ఈనెల 19 నుంచి మే రెండో వారం వరకు వరుసగా మంచి ముహూర్తాలు ఉన్నాయి. వివాహాలకు ఇది అనుకూల సమయమని సూచించారు. – జయంతి ప్రవీణ్కుమార్, సిద్ధాంతి, జగ్గాపురం
మోటివేషనల్ రీల్స్ చూస్తున్నారా..? అయినప్పటికీ..
ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, కోటు వేసుకున్న ఒక వ్యక్తి స్టేజ్ మీద అరుస్తూ, "నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు", "నీలో ఒక సింహం ఉంది", "ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి నేను తోపు అని చెప్పుకో" అంటూ డైలాగులు కొడుతుంటారు. వీటిని చూసి జనం ఇన్స్టంట్గా ఉత్తేజానికి లోనవుతారు. కానీ, ఆ వీడియో ముగిసిన అరగంటకే మళ్ళీ పాత భయాలు, పాత బలహీనతలు చుట్టుముడతాయి.ఎందుకు?ఎందుకంటే, మార్కెట్ అమ్ముతున్నది 'మోటివేషనల్ డ్రగ్'. కానీ మనకు కావాల్సింది రియల్ పర్సనాలిటీ డెవలప్మెంట్.మోటివేషన్ అనేది ఒక కప్పు కాఫీ లాంటిది. తాగినప్పుడు కిక్ ఇస్తుంది, ఆ తర్వాత నీరసం వచ్చేస్తుంది. కానీ వ్యక్తిత్వ వికాసం అనేది మన మనసులోని సాఫ్ట్వేర్ను రీ-రైట్ చేసే ఒక సుదీర్ఘ ప్రక్రియ.సో-కాల్డ్ ట్రైనర్స్ చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే... అందరికీ ఒకే మందు (One size fits all) ఇవ్వాలని చూడటం."ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి. నెగటివిటీని దరిచేరనీయకండి. అన్నీ మంచివే జరుగుతాయని నమ్మండి" అని చెప్తారు సో-కాల్డ్ ట్రైనర్స్. దీన్ని సైకాలజీలో 'Toxic Positivity' అంటారు.కోపం, భయం, అసూయ, బాధలాంటి నెగటివ్ ఎమోషన్స్ కూడా మనిషిలో ఒక భాగమే. వాటిని అణచివేస్తే అవి లోపల కుళ్ళిపోయి డిప్రెషన్ లేదా యాంగ్జైటీగా మారుతాయి.Real Personality Development అంటే నెగటివ్ ఎమోషన్స్ను అణచివేయడం కాదు, వాటిని అంగీకరించడం నేర్చుకోవాలి. నాకు భయం వేస్తోంది అని ఒప్పుకోవడం బలహీనత కాదు, ఆ భయాన్ని జయించడానికి అది మొదటి మెట్టు."నీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా ఉన్నట్టు నటించు. అది చూసి లోకం నమ్ముతుంది, మెల్లగా నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది" అంటారు ట్రైనర్స్.కానీ, ఇది మిమ్మల్ని 'Imposter Syndrome' కి గురి చేస్తుంది. లోపల డొల్లతనం ఉండి పైన మేకప్ వేసుకుంటే, ఎక్కడో ఒకచోట ఆ ముసుగు జారిపోతుందనే భయం మిమ్మల్ని మరింత ఒత్తిడికి గురి చేస్తుంది.Real Personality Development అంటే నటించడం కాదు, 'అర్హత'ను (Competence) పెంచుకోవడం. మీరు ఒక పనిలో నిష్ణాతులు అయినప్పుడు, కాన్ఫిడెన్స్ అనేది ఒక బై-ప్రొడక్ట్లా దానంతట అదే వస్తుంది.సైకాలజీ ప్రకారం వ్యక్తిత్వం అంటే 'అలవాటు' కాదు, అది ఒక 'ఆర్గనైజేషన్'. వ్యక్తిత్వం అనేది కేవలం మనం నేర్చుకునే స్కిల్స్ కాదు. అది మన అనువంశికత (Heredity), పరిసరాల (Environment) సంక్లిష్టమైన కలయిక.మోటివేషనల్ స్పీకర్లు కేవలం ఈ క్షణం గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ సైకాలజీ మీ 'బాల్యం' (Childhood) గురించి మాట్లాడుతుంది.మీ పర్సనాలిటీకి పునాది మీ ఐదేళ్ల వయసులోనే పడిపోయింది. ఆ పునాదిలో ఉన్న పగుళ్లను (Trauma/Negative conditioning) పూడ్చకుండా పైన అంతస్తులు కడితే, ఆ భవనం ఎప్పుడైనా కూలిపోవచ్చు.నేను డెవలప్ చేసిన నా "Genius Matrix" Break. Build. Beyond. మోడల్ ద్వారా ఈ సో-కాల్డ్ ట్రైనర్స్ ఎక్కడ విఫలమవుతున్నారో చూడండి:స్టెప్ 1: Break (పాత పునాదిని కూల్చడం)ట్రైనర్స్ డైరెక్ట్గా బిల్డింగ్ కట్టమంటారు. కానీ సైకాలజీ ప్రకారం, ముందు లోపల ఉన్న శిథిలాలను తొలగించాలి.చిన్నప్పుడు మీ నాన్న మిమ్మల్ని అందరిముందు తిట్టినప్పుడు "నేను దేనికీ పనికిరాను" అని మీ మనసులో పడ్డ ముద్రను చెరిపేయకుండా, పైన మీరు ఎన్ని "సక్సెస్ మంత్రాలు" చదివినా ఉపయోగం లేదు.మీ బలహీనతలు, మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కడ మొదలయ్యాయో గుర్తించి, ఆ పాత సెల్ఫ్-ఇమేజ్ను బ్రేక్ చేయడమే అసలైన వికాసం.స్టెప్ 2: Build (లోపలి నుంచి బయటికి)ఇక్కడ మనం బాహ్య ప్రదర్శనపై కాకుండా, అంతర్గత విలువలపై దృష్టి పెడతాం.ఒక వ్యక్తి తన గురించి తాను ఏమనుకుంటున్నాడు (Real Self) అనేది కీలకం. మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఒక "సక్సెస్ ఫుల్ పర్సన్" కనిపించాల్సిన అవసరం లేదు, ఒక "నిజాయితీ గల మనిషి" కనిపిస్తే చాలు.గొడవ జరిగినప్పుడు అరవకుండా ఉండటం 'కమ్యూనికేషన్ ట్రిక్' కాదు, అది మనసును కంట్రోల్ చేసే 'మెంటల్ స్ట్రెంత్'.స్టెప్ 3: Beyond (పరిమితుల ఆవల - లెగసీ నిర్మించడం)మార్కెట్ కోరుకునేది 'సక్సెస్'. సైకాలజీ కోరుకునేది 'సాటిస్ఫాక్షన్', 'గ్రోత్'.ఎదుటివారిని ఇంప్రెస్ చేయడం మానేసి, మీరు మీ కోసం బ్రతకడం మొదలుపెట్టినప్పుడు మీరు 'Beyond' స్టేజ్లోకి వెళ్తారు. ఇక్కడ మీ పర్సనాలిటీలో ఒక Depth ఉంటుంది. Abraham Maslow చెప్పిన 'Self-Actualization' అంటే ఇదే.ఉదాహరణకు ఒక వ్యక్తికి స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం (Stage Fear). "నువ్వు పులివి.. నువ్వు వెళ్ళి స్టేజ్ మీద ఊగిపో.. కేకలు వేయ్.. జనం చప్పట్లు కొడతారు" అంటాడు మోటివేషనల్ స్పీకర్. ఇది ఒకసారి వర్కౌట్ అవ్వొచ్చు, కానీ భయం పోదు.మరేం చేయాలి?ఆ వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు? విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేడా? (Perfectionism). ఎదుటివారు ఏమనుకుంటారో అనే Social Anxiety ఉందా? తన దగ్గర సరైన కంటెంట్ లేదా? అనే అంశాలను పరిశీలించాలి.ముందుగా ఆ వ్యక్తి తనలోని లోపాలను అంగీకరించేలా చేయడం.చిన్న చిన్న గ్రూప్స్ ముందు మాట్లాడించి 'ఎక్స్పోజర్' ఇవ్వడం.స్టేజ్ మీద మాట్లాడటం అంటే 'తన్ను తాను నిరూపించుకోవడం' కాదు, 'సమాచారాన్ని పంచడం' అనే మైండ్సెట్ మార్పు తేవడం.ఇది Real Personality Development.చివరగా నేను చెప్పేది ఒక్కటే... పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక మోడల్లా నడవడం కాదు, ఒక నాయకుడిలా మాట్లాడటం కాదు.మీ మనసులో ప్రశాంతత ఉందా?మీరు ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉన్నారా?కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా నిలబడుతున్నారా?మీ తప్పులను మీరు ఒప్పుకోగలుగుతున్నారా?ఇవేవీ మార్కెట్లో లభించే రెండు రోజుల వర్క్షాప్లలో దొరకవు. వీటికి లోతైన ఆత్మపరిశీలన, శాస్త్రీయ దృక్పథం అవసరం.మనం ఈ Real Personality Development సిరీస్లో మాట్లాడబోయేది ఆ లోతైన సత్యాల గురించే.ఇక్కడ సో-కాల్డ్ మోటివేషన్ ఉండదు... కేవలం సైకలాజికల్ ట్రాన్స్ఫార్మేషన్ మాత్రమే ఉంటుంది.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: ప్రెండ్స్..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!)
అంతర్జాతీయం
3 గంటల్లో ముగిసిన ఇరాన్, అమెరికా చర్చలు
జెనీవా: వివాదాస్పద అణు కార్యక్రమానికి ఇరాన్ చరమగీతం పాడాలన్న ప్రధాన డిమాండ్తో గతంలో జరిగిన తొలి దఫా పరోక్ష అణు చర్చలకు కొనసాగింపుగా మంగళవారం జెనీవాలో ఇరాన్, అమెరికాల మధ్య మరోదఫా చర్చలు జరిగాయి. జెనీవాలోని ఒమర్ దౌత్యవేత్త అధికారిక నివాసంలో ఒమన్ మధ్యవర్తులతో వేర్వేరుగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈసారి రెండో రౌండ్ చర్చలు కేవలం మూడు గంటల్లోనే ముగియడం గమనార్హం. చర్చల ఫలితాలను ఇంకా అధికారికంగా వెల్లడించలదు.అణుబాంబు తయారీ కోసం ప్రయత్నిస్తున్న ఇరాన్ను నిలువరించడంతోపాటు ఆ దేశంలో పౌర హక్కుల ఉల్లంఘనలకు స్వస్తిపలుకుతూ ప్రజారంజక పాలన అందించడం, ఖమేనీ ప్రభుత్వం గద్దె దిగడం వంటి డిమాండ్లతో అమెరికా ప్రతినిధి బృందం జనీవాకు తరలివచ్చిందని ఇప్పటికే వార్తలొచ్చాయి. రెండో రౌండ్ భేటీలో ఏఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయో తెలియరాలేదు. పరోక్ష చర్చల్లో అమెరికా తరఫున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియాలో ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్లు పాల్గొన్నారు. ఇరాన్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ముడి చమురు రవాణా నౌకల రాకపోకలను స్తంభింపజేస్తూ హార్ముజ్ జలసంధిని ఇరాన్ కొన్ని గంటలపాట మూసేసింది!
మూగబోయిన పౌరహక్కుల గళం
షికాగో: అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాన్ని దశాబ్దాల తరబడి విజయవంతంగా నడిపించిన హక్కుల యోధుడు, రాజకీయవేత్త జెస్సీ లూయిస్ జాక్సన్ (84) తీవ్ర అనారోగ్య సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మార్టీన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య తర్వాత జాక్సన్ పౌరహక్కుల ఉద్యమాన్ని తన భుజస్కంధాలకెత్తుకుని అమెరికాలో కీలక నల్లజాతి నేతగా ఎదిగారు.2017లో ఆయనకు పార్కిన్సన్ వ్యాధి సోకింది. గత నవంబర్లో మెదడులో అసమతుల్యత(ప్రోగ్రెసివ్ సుప్రాన్యూక్లియర్ పాల్సీ) కారణంగా జీవిత చరమాంకంలో మాట్లాడలేని, నడవలేని స్థితికి చేరుకున్నారని జాక్సన్ కుటుంబం ఒక ప్రకటనలో పేర్కొంది. జాన్సన్కు ఒక కుమార్తె, ఐదుగురు కుమారులు ఉన్నారు. పౌర హక్కుల కోసం పోరాడుతూనే పేదలు, ఆఫ్రికన్ అమెరికన్లు, నిరుద్యోగుల కోసం అవిశ్రాంతంగా పోరాడారు. విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల అభ్యున్నతికి పాటుపడ్డారు. కింగ్కు శిష్యుడిగా చేరి.. 1941 అక్టోబర్ 8వ తేదీన సౌత్ కరోలినా రాష్ట్రంలోని గ్రీన్విల్లే పట్టణంలో జాక్సన్ జన్మించారు. విద్యార్థి దశలో బేస్బాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ బాగా ఆడేవారు. తర్వాత ప్రొఫెషనల్ బాక్సర్గా ఎదిగారు. 1960 దశకంలో విద్యారి్థనేతగా ఎదిగారు. ప్రఖ్యాత పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టీన్ లూథర్ కింగ్ బోధనలకు ఆకర్షితుడై పాతికేళ్ల వయసులో 1965లో ఆయనకు శిష్యుడిగా చేరిపోయారు. 1968 ఏప్రిల్లో లూథర్ కింగ్ను హత్యచేసినప్పుడు ఆయన చివరిసారిగా జాక్సన్తోనే మాట్లాడారని, ఈయన చేతుల్లోనే ఆయన తుదిశ్వాస విడిచారని చెబుతుంటారు. కింగ్కు అసలైన ఉద్యమవారసుడు ఇతనే అని అప్పట్లోనే అంతా భావించారు. కింగ్ సారథ్యంలో నడిచే ‘సదరన్ క్రిస్టియన్ లీడర్షిప్ కాన్ఫెరెన్స్’కు షికాగో శాఖకు జాక్సన్ సారథ్యం వహించారు.ఆఫ్రికన్ అమెరికన్ల సర్వతోముఖాభివృద్ధి కోసం ‘ఆపరేషన్ బెŠల్డ్బాస్కెట్’కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నల్లజాతీయులకు శ్వేతజాతీయుల సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించడం, నల్లజాతీయులు తయారుచేసి వస్తూత్పత్తులను శ్వేతజాతీయుల సంస్థలతో కొనిపించడం, ఆఫ్రికన్ అమెరికన్లకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం సహా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టారు. అద్భుతమైన వాక్చాతుర్యంతో హక్కుల కార్యకర్తల్లో ఉద్యమాగి్నకి ఎగదోసేవారు. ఓవైపు ఉద్యమాల్లో పాల్గొంటూనే రాజకీయాల్లోనూ చేరారు. 1984, 1988 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీపడి విఫలమయ్యారు.ఆ తర్వాత కూడా అణగారిన వర్గాల సామాజిక న్యాయం, పౌర హక్కులు, రాజకీయ చైతన్యమే లక్ష్యంగా లాభాపేక్షలేని ‘రెయిన్బో/పుష్ కూటమి’సంస్థలను స్థాపించి విజయవంతంగా నడిపించారు. వెనుకబడిన వర్గాల కోసం సంపన్న వర్గాలు, ప్రభుత్వాలతో మధ్య వర్తిత్వం నడిపిన గొప్ప దౌత్యవేత్తగా పేరొందారు. 1999లో కువైట్ను ఇరాక్ ఆక్రమించినప్పుడు 700 మందికిపైగా విదేశీ వనితలను విడిపించడంలో ఈయన దౌత్యం గొప్పగా పనిచేసింది. శ్వేతజాతీయ పోలీస్ అధికారి నేలకు గొంతు అదిమిపట్టడంతో ఊపిరాడక చనిపోయిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానంతరం ఆయన కుటుంబాన్ని జాక్సన్ కలిసి పరామర్శించారు.ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ఆపాలని పిలుపునిచ్చారు. 2000 సంవత్సరంలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈయనకు అమెరికా అత్యున్నత పౌరపురస్కారం ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’తో సత్కరించారు. జాక్సన్ మరణంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలు ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.
పాక్కు భారత్ భారీ షాక్.. ఏప్రిల్ నుంచి నీళ్లు బంద్!
సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు మరో గట్టి షాక్ ఇచ్చేందుకు భారత్ సిద్దమైంది. రావి నది నుండి పాక్కు వెళ్లే మిగులు జలాలను పూర్తిగా అడ్డుకోవాలని భారత్ నిర్ణయించింది. రావి నదిపై నిర్మిస్తున్న షాపుర్ కండి బ్యారేజీ పనులు తుది దశకు చేరుకున్నాయి. మార్చి 31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.దీంతో ఏప్రిల్ 1 నుండి ఈ బ్యారేజీ ద్వారా పాక్కు వెళ్లే మిగులు జలాలను నిలిపివేయనున్నారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలగా సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల రావి నదిలోని అదనపు నీరు పాక్కు ప్రవహిస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఆ నీటిని ఇకపై పాక్ వెళ్లనివ్వకుండా భారత్ తన సొంత అవసరాల కోసం ఉపయోగించుకోనుంది. ఇదే విషయంపై జమ్మూ కాశ్మీర్ మంత్రి జావేద్ అహ్మద్ రానా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కతువా, సాంబ వంటి కరువు ప్రాంతాలకు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. "పాకిస్తాన్కు వెళ్లే అదనపు నీటిని కచ్చితంగా ఆపేయాల్సిందే. ఇకపై అక్కడకు ఒక్క చుక్క నీరు కూడా పోదు"అని జావేద్ పేర్కొన్నారు. కాగా 1960లో జరిగిన సింధూ జలాల ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు ఉన్నాయి. ఇప్పుడు తమ పూర్తి హక్కులను వినియోగించుకునేందుకు భారత్ సిద్దమైంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం, నీటి కొరతతో ఉన్న దాయాది దేశంకు ఇది గట్టి ఎదురు దెబ్బే. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన పాక్ పంజాబ్ ప్రావిన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.
డ్రగ్స్ బోట్లపై అమెరికా సైన్యం దాడి.. 11 మంది మృతి
డ్రగ్స్ ముఠాలను అంతమొందించేందుకు యుద్దం చేస్తున్న అమెరికా.. తమ దాడులను మరింత ఉధృతం చేసింది. లాటిన్ అమెరికా తీరప్రాంత జలాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మూడు డ్రగ్స్ స్మగ్లింగ్ నౌకలపై అమెరికా సైన్యం సోమవారం క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో 11 మంది మరణించారు. ఈ విషయాన్ని యుఎస్ సదరన్ కమాండ్ ధ్రువీకరించింది. ఈ దాడులు తూర్పు పసిఫిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రంలో జరిగాయి. పసిఫిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై జరిగిన దాడిలో ఎనిమిది మంది, కరేబియన్ సముద్రంలో ఒక నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఈ ఆపరేషన్లలో అమెరికా సైనికులకు ఎవరూ గాయపడలేదని యుఎస్ సదరన్ కమాండ్ తెలిపింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత సెప్టెంబర్ నుంచి మాదకద్రవ్యాల ముఠాలపై యుద్దాన్ని ప్రకటించారు. ఈ స్పెషల్ ఆపరేషన్స్ వల్ల ఇప్పటివరకు దాదాపు 145 మంది అనుమానిత స్మగ్లర్లు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ అపరేషన్స్పై అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ స్పందించారు. "ట్రంప్ అధ్యక్షతన డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం సురక్షితం కాదు" అని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. అయితే ఈ దాడులపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నౌకల్లో నిజంగా డ్రగ్స్ ఉన్నాయా లేదా అనే విషయంలో సైన్యం స్పష్టమైన ఆధారాలను బహిర్గతం చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి
జాతీయం
30 ఏళ్ల కృషి, ఉద్యోగులకు రూ. 20 కోట్ల లగ్జరీ కార్లు
కార్పొరేట్ కంపెనీలు భారీ బహుమతులతో ఉద్యోగులను సర్ప్రైజ్ చేస్తుంటాయి. భారీగా నగదు, కార్లు, ఇళ్లు లాంటి కానుకలతో వార్తల్లో నిలుస్తాయి. తాజాగా తన వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా తన ఉద్యోగులకు రూ. 20 కోట్ల విలువైన 47 కార్లను బహుమతిగా ఇచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.కోజికోడ్కు చెందిన కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ సిబ్బందికి భారీ బహుమతులలిచ్చి వార్షికోత్సవ సంబరాలకు మరింత వన్నె తీసుకొచ్చింది. గత మూడు దశాబ్దాలుగా కంపెనీ అభివృద్ధిలో సిబ్బంది చేసిన కృషికి గుర్తింపుగా రూ.20 కోట్ల విలువ చేసే 47 కార్లు అందించినట్టు కంపెనీ ప్రకటించింది.బిజినెస్లైన్ నివేదిక ప్రకారం ఈ కార్లలో ప్రీమియ , ప్రసిద్ధ మోడళ్ల కార్లున్నాయి. ముఖ్యంగా రేంజ్ రోవర్లు, ఆడి క్యూ8, ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్లు ఉండటం విశేషం. ఈ జాబితాలో టాటా హారియర్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కైలాక్ మోడళ్లు, ఇతర కార్లతో పాటు ఉన్నాయి. భారీ భవిష్యత్ ప్రణాళికలుహైలైట్ గ్రూప్ ఛైర్మన్ పి.సులైమాన్ ఈ సందర్బంగా భవిష్యత్ ప్రణాళికలను కూడా ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మరో పది మాల్స్ అభివృద్ధిలో ఉన్నాయని తెలిపారు. దాదాపు 10వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీ 2030 నాటికి సంస్థను విస్తరించి 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సులైమాన్ వెల్లడించారు.హైలైట్ గ్రూప్ విస్తరణహైలైట్ గ్రూప్ 1996లో కోజికోడ్లోస్థాపించబడింది. రిటైల్ అండ్ కమర్షియల్ వాణిజ్య అభివృద్ధితో ప్రారంభమై, నివాస, ఐటీ, మిశ్రమ వినియోగ ప్రాజెక్టులుగా విస్తరించింది. మూడు దశాబ్దాల ప్రయాణంలో హైలైట్ సంస్థ రిటైల్ స్పేస్ రంగంలో కేరళలో అగ్రగామిగా నిలిచింది. తరువాత కంపెనీ కోజికోడ్లో హైలైట్ మాల్, త్రిస్సూర్లోని హైలైట్ మాల్ను అభివృద్ధి చేసింది. క్రమంగా అంతర్జాతీయ వ్యాపారాలు,భాగస్వామ్యాలను ఆకర్షించే లక్ష్యంతో కోజికోడ్లో 12.5 మిలియన్ చదరపు అడుగుల వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం అంచనా వేసిన పెట్టుబడి సుమారు 680 మిలియన్ డాలర్లు (రూ. 623.06 కోట్లు) ఇదీ చదవండి: బ్లింకిట్కు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులుఇదీ చదవండి : పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్ చేస్తే!
భారతీయుడి మోసానికి రష్యా మహిళ విలవిల.. వీడియో వైరల్
ఓ భారతీయుడి నమ్మి.. ప్రేమించి.. అతడిని పెళ్లి చేసుకున్న పాపానికి తాను నరకం అనుభవిస్తున్నానని రష్యా మహిళ బోరున విలపించింది. ఇంతటి నమ్మక ద్రోహాన్ని తాను ఎక్కడా చూడలేదని.. తన జీవితంలో మరోసారి భారతీయులను నమ్మను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో తాను స్వదేశానికి(రష్యా) వెళ్లిడానికి భారత్లో వీసా విషయంలో ఉన్న లోపాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో, బాధితురాలి పోస్టుపై స్పందిస్తూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. రష్యాకు చెందిన ఒల్గా 2015లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం భారత్కి వచ్చింది. ఈ సమయంలో భారత్కు చెందిన వ్యక్తిని(భర్త పేరు చెప్పలేదు) ప్రేమించింది. వారిద్దరూ 2019లో వివాహం చేసుకున్నారు. అనంతరం, ఆమె భారత్లో శాశ్వత నివాసం ఉండాలని నిర్ణయం తీసుకుంది. అయితే, కొద్దిరోజుల తర్వాత వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో, ఒల్గా.. 2023 నవంబరులో స్పౌసల్ వీసా(భారతీయ పౌరుడు లేదా OCI కార్డ్ హోల్డర్ను వివాహం చేసుకున్న విదేశీయులకు Spousal Visa (X Visa లేదా Entry Visa) మంజూరు చేస్తారు) కోసం దరఖాస్తు చేసినప్పుడు తన భర్త ఇంటర్వ్యూకి హాజరుకాలేదు. ఈ పరిణామాలతో వారి మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఒల్గా.. రష్యా వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. ఇంతలో 2024 జనవరిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన భర్త అదృశ్యమయ్యాడు. దీంతో, ఆందోళన చెందిన ఒల్గా.. పోలీసులను సంప్రదించి. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఆరు నెలలు అయినా తన భర్త ఆచూకీ తెలియకపోవడంతో అతను చనిపోయినట్టు భావించి భయంతో కాలం వెల్లదీసింది. కుటుంబం లేకుండా, డబ్బు లేకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. వీసా సమస్యల వల్ల రష్యాకు వెళ్లలేకపోయినట్టు చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay)అయితే, ఒక రోజు ఇన్స్టాగ్రామ్లో జపాన్ పర్యాటకుడి పోస్ట్లో తన భర్త.. ఒల్గాకు కనిపించాడు. వారణాసిలో సన్యాసిలా మారిపోయి కనిపించడంతో ఆమె ఒక్కసారిగా ఖంగుతింది. దీంతో, అతడిని కలిసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భర్త మరో స్టోరీ అల్లాడు.. ఒల్గాకు క్షమాపణలు చెప్పి, తనను ప్రేమిస్తున్నట్టు నటించి నమ్మించాడు. మరోసారి ఇలా చేయనని చెప్పడంతో.. అతడి మాటలను ఒల్గా నమ్మి మళ్లీ సంబంధాన్ని కొనసాగించింది. దీంతో, ఒల్గా.. హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగం చేస్తూ, భర్తకు ఆర్థికంగా సహాయం చేసింది. ఇంతలో.. తన భర్త చేసిన మరో మోసాన్ని ఆమె తెలుసుకుంది. ఆయన మరో మహిళతో 15 కి.మీ దూరంలో సంబంధం పెట్టుకుని ఉంటున్నాడని గుర్తించింది. ఈ క్రమంలో అతడిని ప్రశ్నించలేక.. చేసేదేమీ లేక ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు రష్యాకు వెళ్లేందుకు ప్రయత్నించింది. రష్యా వెళ్తున్న సమయంలో తన భర్త ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ కారణంగా ఆమెను విమానం నుండి దింపివేశారు. ప్రస్తుతం ఆమె వీసా సమస్యలు పరిష్కరించుకోవడానికి న్యాయ సహాయం కోరుతున్నట్టు పోస్టులో వెల్లడించింది.ఈ నేపథ్యంలో ఆమె పోస్టులపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలా మంది ఆమెకు మద్దతు తెలుపుతూ, ధైర్యంగా నిలబడమని ప్రోత్సహించారు. కొంతమంది ఆమె భర్త ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా భారత వీసా చట్టాలు, విదేశీయుల హక్కులు, భార్యాభర్తల మధ్య న్యాయ పరిరక్షణలపై చర్చలు జరిగాయి.
బ్లింకిట్కు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు
క్విక్-కామర్స్ ప్లాట్ఫామ్ బ్లింకిట్కు ఎదురుదెబ్బ తగిలింది.తన ఆన్లైన్ మార్కెట్ప్లేస్ ద్వారా నిషేధిత కత్తులను అమ్మకానికి అందిస్తున్నట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు ఆయుధ చట్టం కింద ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేశారు.ది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం పశ్చిమ ఢిల్లీలోని ఖ్యాలా పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఫిర్యాదు ప్రకారం, ఖ్యాలా ప్రాంతంలో ఇటీవల జరిగిన రెండు హత్య కేసులు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కొనుగోలు చేసిన కత్తులను ఉపయోగించి జరిగాయని ఆరోపించారు. ఆ సంఘటనల తర్వాత, అధికారులు అమ్మకానికి ఉన్న కత్తులను జాబితా చేస్తూ ఇ-కామర్స్ , రాపిడ్-డెలివరీ సేవలను పరిశీలించారు.ఇందులో భాగంగానే కానిస్టేబుల్ ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 3.43 గంటలకు ఆన్లైన్ లావాదేవీ ద్వారా రూ. 710 చెల్లించి కత్తి కోసం ఆర్డర్ ఇచ్చాడు. డెలివరీ చిరునామాను ఉద్దేశపూర్వకంగా పోలీస్ స్టేషన్ అడ్రస్ ఇచ్చారు. ఆ వస్తువు అదే రోజు సాయంత్రం 4.05 గంటలకు స్టేషన్ ప్రాంగణంలో డెలివరీ అయింది. కొనుగోలుకు సంబంధించిన పన్ను ఇన్వాయిస్ విక్రేతను ఆన్లైన్ ప్లాట్ఫామ్గా గుర్తించిందని, పశ్చిమ ఢిల్లీలోని తిహార్ గ్రామంలోని చిరునామాతో ఉంది. దీని ఆధారంగా ఆయుధ చట్టంలోని సెక్షన్ 25, 54 మరియు 59 కింద కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి : పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్ చేస్తే!బ్లింకిట్ ద్వారా ఆర్డర్ తమకు డెలివరీ అయిన ‘గరారిదార్’కత్తి ప్రమాణాలునిర్ధిష్టప్రమాణాలకు మించి ( గరిష్ట బ్లేడ్ పొడవు 7.62 సెం.మీ బ్లేడ్ వెడల్పు 1.72 సెం.మీ) కంటే ఎక్కువగా ఉందని ప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (పశ్చిమ) దారాడే శరద్ భాస్కర్ తెలిపారు.కత్తి బ్లేడ్ పొడవు 8 సెం.మీ. వెడల్పు 2.5 సెం.మీ ఉది ఇది ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన చట్టవిరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రకారం, స్వాధీనం చేసుకున్న వస్తువులో స్టీల్ బ్లేడ్ ,స్టీల్ స్ట్రిప్ మెకానిజంతో అమర్చబడిన బ్లాక్ మెటల్ హ్యాండిల్ ఉన్నాయి.అనంతరం ఢిల్లీ అంతటా ప్లాట్ఫామ్కు సంబంధించిన అనేక స్టోర్లు,ఇతర అవుట్లెట్లపై దాడులు నిర్వహించిన పోలీసులు 16 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు దాడులు కొనసాగాయి. హర్యానాలోని గుర్గావ్లోని ఫరూఖ్నగర్లో ప్లాట్ఫామ్ నిర్వహిస్తున్న గిడ్డంగి నుండి 32 అదనపు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి మొత్తం 50 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఆయుధాల సోర్సింగ్, నిల్వ మరియు పంపిణీకి బాధ్యతను నిర్ణయించడానికి తదుపరి విచారణలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.ఈ పరిణామంపై బ్లింకిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఒక్కరోజే 75 ఫైల్స్ క్లియర్.. అజిత్ మృతి రోజున ఏం జరిగింది?
ముంబై: మహారాష్ట్రలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన రోజున మహారాష్ట్ర మైనారిటీ శాఖ మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, మైనార్టీ శాఖ అజిత్ పవార్ వద్దే ఉండటం గమనార్హం. దీంతో, ఈ వ్యవహారంలో మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకేరోజు ఇలా ఫైల్స్ క్లియర్ చేయడంపై అటు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జనవరి 28న విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజున మహారాష్ట్ర మైనారిటీ శాఖలో మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ అయ్యాయి. ఈ ఫైళ్లలో మైనారిటీ విద్యా సంస్థలకు గుర్తింపు, ఆమోదాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, అజిత్ పవార్ వద్దే మైనార్టీ శాఖ ఉంది. ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత దాదాపు రెండేళ్ల కాలంలో మైనార్టీ శాఖకు సంబంధించిన కొన్ని నిర్ణయాలను ఆయన పక్కన పెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా మైనార్టీ విద్యా సంస్థలకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, తాజాగా ఈ పరిణామం రాజకీయంగా, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది. ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో ఫైళ్లను అకస్మాత్తుగా క్లియర్ చేయడంలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.రాష్ట్ర పరిపాలన అజిత్ పవార్ చుట్టూ ఉన్న బ్రేకింగ్ న్యూస్తో బిజీగా ఉన్న రోజున తక్కువ వ్యవధిలో 75 ఫైళ్లను ఎలా ప్రాసెస్ చేసి సంతకం చేశారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. మరోవైపు.. ఈ సమస్య పరిపాలనా చర్యకు కూడా దారితీసింది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే మహారాష్ట్ర మైనారిటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్ను బదిలీ చేశారు. దీంతో, ఈ వ్యవహారంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాగా, ఒక ప్రముఖ రాజకీయ ఘటన(అజిత్ పవార్ మృతి) చర్చగా ఉన్న రోజున ఇంత పెద్ద పరిపాలనా కార్యక్రమం జరగడం సహజంగానే సందేహాన్ని రేకెత్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, తుది నిర్ణయాలు ప్రభుత్వ విచారణ ఫలితంపై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఈ విషయం ఇప్పుడు మహారాష్ట్రలో రాజకీయ చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ విషయంపై ప్రభుత్వం విచారణ ప్రారంభించిందని, తదుపరి చర్యలు కూడా జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇక, ప్రస్తుతం మైనార్టీ శాఖ ఆయన భార్య సునేత్రా పవార్ వద్ద ఉంది. ఆమె ఈ అనుమానాస్పద సర్టిఫికెట్లపై విచారణ ఆదేశించారు.ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కూలిపోవడంతో ప్రాణాలు విడిచారు.. అయితే, ఈ ప్రమాదంపై ఆది నుంచి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఆ ప్రాణాంతక ప్రమాదానికి కారణం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తత్కరే.. అజిత్ పవార్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీయాల్సిన అవసరాన్ని ఇద్దరూ ప్రత్యేకంగా పేర్కొన్నారు.
ఎన్ఆర్ఐ
పావురాలకు దాణా వేస్తే 2.2 లక్షల జరిమానా
సింగపూర్: భారత్లో పలు నగరాల్లో విపరీతంగా కన్పించే పావురాలను అమితంగా ఇష్టపడుతూ వాటికి జొన్నల వంటి తిండి గింజలను దాణాగా వేస్తూ పిల్లలుపెద్దలు ఎంతో ఆనందపడతారు. అచ్చం అదే పని చేసి సింగపూర్లో ఓ భారతీయ వృద్ధురాలు లక్షల రూపాయల జరిమానా కట్టాల్సి వచ్చింది. పావురాల రెట్ట, వ్యర్థాల్లో పలు రకాల శ్వాసకోశ వ్యాధికారక క్రిములు ఉంటాయి.గాలిలో ఇవి కలిశాక మనుషులు పీలిస్తే ఇబ్బందుల్లో పడతాము. దీంతో పావురాల సంతతి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవద్దనే ఉద్దేశంతో వీటికి దాణా వేసి ప్రక్రియపై సింగపూర్లో నిషేధం విధించారు. ఈ విషయం తెలీక 71 ఏల్ల షణ్ముగనాథన్ శ్యామల అనే పెద్దావిడ గత ఆరు నెలల్లో తొమ్మిదిసార్లు పావురాలకు దాణా వేశారు. విషయం తెల్సి అధికారులు ఈమెపై కేసు నమోదుచేశారు. విచారించిన కోర్టు ఈమెకు 2,518 డాలర్ల(దాదాపు రూ.2,27,753) జరిమానా విధించింది.
ఎన్నారైలకు గుడ్న్యూస్.. అంత బంగారంపై నోట్యాక్స్
భారత ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ఎన్నారైలకు బంగారంపై కలిపించిన వెసులుబాటు పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఎన్నార్లైలకు విధించిన బంగారం పరిమితి నిబంధనలను మారుస్తున్నట్లు తెలిపింది.ఇదివరకూ ప్రవాస భారతీయులు భారత్ వచ్చే సమయంలో వారి వెంట ఉన్న బంగారు ఆభరణాలకు విలువ ఆధారంగా సుంకం ఉండేది. మహిళలకు రూ. లక్షలోపు, పురుషులకు రూ. 50 వేల లోపు విలువ ఉన్న పసిడికి ఎటువంటి సుంకం ఉండేది కాదు. ఆ పైన విలువ ఉన్న వాటికి మత్రమే సుంకం చెల్లించే విధంగా నియమాలు ఉండేవి.అయితే ప్రస్తుత బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం పరిమితిపై వెసులుబాటును మార్చుతున్నట్లు ప్రకటించింది. ప్రవాస భారతీయులు స్వదేశానికి వచ్చే సమయంలో మహిళలకు 40 గ్రాములు, పురుషులకు 20 గ్రాముల బంగారాన్ని ఎటువంటి సుంకం లేకుండా తీసుకరావచ్చని పేర్కొంది. ఆ పైన ఉన్న వాటికి మాత్రమే పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదివరకూ ఉన్న ద్రవ్య విలువ ఆధారంగా రూ. లక్షకు కేవలం ఆరు గ్రాములు, రూ. 50 వేలకు మూడు గ్రాముల పరిమితే ఉంటుంది. ప్రస్తుతం అది 20 నుంచి 40 గ్రాములకు చేరుకుంది. భారత ప్రభుత్వం ఆ పరిమితిని గణనీయంగా పెంచడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అంబటి, జోగి ఇళ్లపై దాడి.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ గూండాల దాడిని వైఎస్సార్సీపీ సెంట్రల్ సౌదీ అరేబియా ఎన్ఆర్ఐ వింగ్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు ప్రజలు.. ఏపీలో జరుగుతున్న చంద్రబాబు సర్కార్ అరాచకాలను గమనిస్తున్నారని పేర్కొంది. కూటమి సర్కార్.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అభివృద్ధిని అడ్డుకుందని.. కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తోందని వైఎస్సార్సీపీ సెంట్రల్ సౌదీ అరేబియా ఎన్ఆర్ఐ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన విధ్వంసం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పార్టీ కన్వీనర్ సయ్యద్ రబ్బానీ మండిపడ్డారు. ఈ అక్రమ చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో చట్టం ముందు తప్పకుండా జవాబుదారీగా నిలబడాల్సిందేనన్నారు. న్యాయం తప్పక గెలుస్తుందని మేము దృ ఢంగా విశ్వసిస్తున్నామన్నారు. ఇవాళ వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ముందడుగు వేసి.. ఈ అన్యాయ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్ జగన్ చూపిన సంక్షేమ మార్గమే.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని.. మేమంతా ఆయన వెంటే ఉంటామని సయ్యద్ రబ్బానీ ఒక ప్రకటనలో తెలిపారు.
Operation CyStrike: నకిలీ వీసా రాకెట్.. గుట్టురట్టు చేసిన సీబీఐ
కువైట్ నకిలీ ఈ-వీసాలను సృష్లించి.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నెట్వర్క్ను భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఛేదించింది. అంతర్జాతీయ సైబర్ నేరాల అదుపులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సై-స్ట్రైక్ (Operation CyStrike)తో ముఠా ఆటకట్టించారు. జనవరి 30న ఢిల్లీతో పాటు బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కీలక సైబర్ నేరగాడిని అరెస్ట్ చేశారు. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్లు, నకిలీ వీసాలు, నకిలీ నియామక పత్రాలతో పాటు రూ. 60,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులు కువైట్ అధికారిక ఈ-వీసా వెబ్సైట్లను పోలిన నకిలీ డిజిటల్ ప్లాట్ఫారమ్లను సృష్టించారు. తద్వారా నిరుద్యోగులను ఆకర్షించి.. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా కేవలం భారతీయులనే కాకుండా అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ మరియు సింగపూర్ వంటి దేశాల్లోని వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంది. గుర్తింపు దొరక్కుండా ఉండేందుకు వీరు నకిలీ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. అధికారులు eservicemoi-kw.com అనే వెబ్సైట్ను ప్రధాన నకిలీ పోర్టల్గా గుర్తించారు.కువైట్ వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని.. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఎలక్ట్రానిక్ వీసా దరఖాస్తుల కోసం www.indianvisaonline.gov.in మాత్రమే అధికారిక పోర్టల్ అని స్పష్టం చేసింది. అనధికారిక వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
క్రైమ్
అత్తపై పెట్రోలు పోసి నిప్పంటించిన అల్లుడు
పల్నాడు జిల్లా: అత్తపై అల్లుడు పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. దాచేపల్లికి చెందిన వాసం లక్ష్మిపై ఆమె అల్లుడు శ్రీనివాసపురానికి చెందిన జక్కా రవి పెట్రోలు పోసి నిప్పంటించడంతో శరీరం కొంత మేర కాలింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... తన కుమార్తె లావణ్యకు జక్కా రవితో వివాహం చేశారు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతుంది. భర్త వేధింపులు భరించలేని లావణ్య పుట్టింటికి వచ్చింది. మంగళవారం రాత్రి దాచేపల్లిలోని అత్త ఇంటికి వచ్చిన రవి అత్త, భార్యతో గొడవ పడ్డాడు. రవి తనతోపాటు తెచ్చుకున్న పెట్రోలు అత్తపై పోసి నిప్పంటించాడు. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి రక్షించారు. దాడిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు పట్టించుకోలేదు.దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి అద్దంకి –నార్కెట్పల్లి హైవేపై బైఠాయించి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. రవి కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కూటమి నేతలు తీవ్ర ఒత్తిడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయలేకపోయారు. దీంతో బాధితురాలు ఆందోళన చేయాల్సి వచ్చింది.
శివరాత్రి రోజున చికెన్ వండనని చెప్పడంతో..
మేడ్చల్ జిల్లా: చికెన్ వండలేదని భార్యతో గొడవపడి ఓ వ్యక్తి అత్మహత్యకు పాల్పడిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విశ్రాంత ఉద్యోగి దసరాజుల ప్రకాశ్(66) భార్య పద్మతో కలిసి ప్రతాప్సింగారం లోని న్యూవెంచర్లో నివాసం ఉంటున్నాడు. ఈనెల 15 చికెన్ వండమని భార్యకు కోరగా అమె శివరాత్రి రోజున వండనని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇంటినుంచి బయటికి వెళ్లిన పద్మ కొద్దిసేపటికి తిరిగి వచ్చి చూడగా..భర్త ప్రకాశ్ సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. స్థానికుల సాయంతో కొన ఊపిరితో ఉన్న అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి అల్లుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నా భార్యను ట్రాప్ చేశాడు..
హైదరాబాద్: నా భార్యను ఓ వ్యక్తి ట్రాప్ చేసి తనవైపు తిప్పుకుని నాపైనే కేసులు పెట్టించారని, నాకు నా పిల్లలకు న్యాయం జరగాలని ఓ వ్యక్తి పురుగుల మందు తాగుతూ బెదిరింపులకు పాల్పడిన సెల్ఫీ వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే..కొత్తగూడెం జిల్లాకు చెందిన లకావత్ వెంకన్న , లక్ష్మి దేవి దంపతులు నగరానికి వలస వచ్చి యాప్రాల్లోని హరిప్రియ ఎంక్లీవ్లో నివాసముంటున్నారు. వెంకన్న డ్రైవర్గా పని చేస్తుండగా లక్ష్మి అదే అపార్ట్మెంట్లోని జైపాల్రెడ్డి, అరుణ దంపతుల ఇంట్లో పని చేసేది. ఈ క్రమంలో జైపాల్ రెడ్డి వెంకన్నకు కారు కొనుక్కునేందుకు రూ. 3.50లక్షలు అప్పుగా ఇచ్చాడు. గత ఆగస్టులో జైపాల్రెడ్డి భార్య అరుణతో కలిసి అమెరికా వెళ్లిపోయాడు. ఆ తర్వాత జైపాల్రెడ్డి డబ్బులు ఇవ్వాలని వెంకన్నను అడగగా కాలయాపన చేస్తున్నాడు. ఆ తర్వాత వెంకన్న పథకం ప్రకారం తన భార్య ఫోన్ నుంచి గత సెప్టెంబర్ లో జైపాల్రెడ్డి ఫోన్కు ‘బాగున్నావా’ అనే మెసేజ్ చేయించి వారి నుంచే డబ్బులు తీసుకోవాలని ప్లాన్ చేశాడు. అయితే వెంకన్నపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది, జైపాల్రెడ్డి భార్య అరుణ సైతం ఈ నెల 3న వెంకన్నపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపట్టారు. లక్ష్మి వాళ్ల చేతుల్లో మోసపోవద్దు.. నాపేరు లకావత్ వెంకన్న... సార్ .మేము .యాప్రాల్లో హరిప్రియ ఎన్క్లేవ్లో నివాసముంటున్నాము. నా భార్యను జైపాల్రెడ్డి తన వైపు తిప్పుకుని నాపై కేసులు పెట్టిస్తున్నాడు. జవహర్నగర్ పీఎస్లో అధికారులు వారికే సహకరిస్తున్నారు. అక్కడ నాకు న్యాయం జరగలేదని నా సొంత ఊర్లో వచ్చి కేసు పెట్టా. నాకు ఎక్కడికి పోయినా న్యాయం జరగడం లేదు.. నా పెళ్లాం పిల్లలు లేనప్పుడు , నేనెందుకు బతకాలి...నేను బతకలేను సార్.. నాకు ఎట్లా న్యాయం చేయలేకపోయారు ఎస్పీ సార్ .. కనీసం నా పిల్లలకైనా న్యాయం చేయండి.. లక్ష్మి వాళ్ల చేతుల్లో నీవు మోసపోకు , నా పిల్లలను చంపేస్తారు. అంటూ పురుగుల మందు డబ్బా పట్టుకుని చేసిన సెల్పీ వీడియో వైరల్గా మారింది.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం
సాక్షి,పాడేరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గిరిజన యువకులు మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. పాడేరు మండలం వంతరపాడు గ్రామానికి చెందిన గెమ్మెలి రమేష్(25), హుకుంపేట మండలం గొందిరాపకు చెందిన రేగం సూర్యప్రకాష్(28), తడిగిరి పంచాయతీ ముల్లుమెట్ట గ్రామానికి చెందిన సీదరి పౌలు(18) సోమవారం మత్స్యగుండం జాతరకు వెళ్లారు. తిరిగి ముగ్గురు బైక్పై బయలుదేరారు. రమేష్ వాహనాన్ని నడుపుతుండగా మిగిలిన ఇద్దరు వెనుక కూర్చున్నారు. గుత్తులపుట్టు సంతబయలు దగ్గరలోని మలుపు వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పి దూసుకుపోయి విద్యుత్ స్తంభాల ప్రాంతంలో ప్రహరీని ఢీకొట్టింది. ఈ ఘటనలో రేగం సూర్యప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ఇద్దరూ తీవ్రగాయాలతో రోడ్డుపై పడి ఉన్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన యువకులు 108కు సమాచారం ఇవ్వగా క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా..గెమ్మెలి రమేష్ మృతి చెందాడు. సీదరి పౌలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పాపినాయుడు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు.
వీడియోలు
అంబటి ఇంటి దగ్గర సంబరాలు
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
తలశిల రఘురాం తండ్రి పాడె మోసిన పేర్ని నాని
ప్రజా బలం దైవబలం కలిసి.. అంబటి విడుదలపై కూతురు రియాక్షన్
మరో రెండు రోజుల్లో అటాక్.. హింట్ ఇచ్చిన ట్రంప్
దేవుడి దెబ్బ అదుర్స్.. హెరిటేజ్ షేర్లు ఢమాల్..
లైవ్ లో హెరిటేజ్ బండారం బయట పెట్టిన నాగార్జున యాదవ్
నా దగ్గరికి రావే అంటూ.. అత్తపై అల్లుడి వేధింపులు
మహిళను నరికి చంపిన మాజీ భర్త
కాపు టైగర్ ఈజ్ బ్యాక్

