Top Stories
ప్రధాన వార్తలు
చట్టాన్ని గౌరవించటం తప్పా?
కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా పెట్టిన కేసులున్నాయి. ఏడాదిన్నర జైల్లో ఉండి బెయిలుపై బయటకు వచ్చారాయన. పైపెచ్చు ఆ కంపెనీల ఆస్తులన్నీ ఈడీ, సీబీఐ జప్తులో ఉన్నాయి. ఆ ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలూ జరపకూడదని హైకోర్టు ఇచ్చిన ‘స్టే’ ఉత్తర్వులూ ఉన్నాయి. మరి ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఏమవుతుంది? దీనికి సమాధానమివ్వటానికి న్యాయనిపుణులే అక్కర్లేదు. కాస్త చదువు, ఇంకాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరైనా చాలు. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే దాని ప్రభావం బెయిలుపైనా పడే ప్రమాదముంటుంది! ఇదిగో... సరస్వతీ పవర్ షేర్ల బదిలీ వ్యవహారంలో ఇదే జరిగింది. వైఎస్ జగన్కు తెలియకుండా ఆయన పేరిట ఉన్న షేర్లను తల్లి పేరిట సోదరి షర్మిలే దగ్గరుండి మార్పించేశారు. షేరు హోల్డరైన జగన్కు కనీసం సమాచారమూ ఇవ్వలేదు. కోర్టు స్టే ఉత్తర్వులున్నా... కనీసం కోర్టుకూ చెప్పలేదు. పెద్ద మనుషుల ఒప్పందం మాదిరి తల్లి పేరిట రాసిన అన్ రిజిస్టర్డ్ గిఫ్ట్డీడ్ను ఉపయోగించుకుని షేర్లను తల్లి పేర మార్పించేశారామె. దీంతో కంపెనీ యాజమాన్యం పూర్తిగా తల్లి చేతికి వచ్చినట్లవుతుంది. మరి ఇది కోర్టు ఉల్లంఘనే కదా? జగన్కు తెలియకుండా జరిగినా... కోర్టు దృష్టిలో తప్పే కదా? మరి ఈ తప్పును కోర్టు దృష్టికి తేవాల్సిన అవసరం జగన్కు లేదా? ఈ లావాదేవీని కోర్టు దృష్టికి తెచ్చి... రద్దు చేయమంటూ కోరటం తప్పెలా అవుతుంది? తనకు తెలియకుండా తన పేరిట చెల్లెలు చేసిన తప్పును సరిదిద్దడానికి ఆయన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను (ఎన్సీఎల్టీని) ఆశ్రయించటాన్ని చంద్రబాబు కూటమి ఎందుకంత ఘోరమైన తప్పిదం మాదిరి ప్రచారం చేస్తోంది? దాన్ని తల్లిపై కేసు వేసినట్లుగా ఎందుకు చూడాలి? న్యాయపరంగా రక్షించుకోవటానికి జగన్ ఎన్సీఎల్టీకి వెళ్లటం తప్పెలా అవుతుంది? ఆలోగా చేయటం చట్టవిరుద్ధం కాబట్టే..సొంత అన్న న్యాయపరంగా ఇబ్బంది పడతాడని తెలిసి కూడా షర్మిల ఇలా చేయటానికి అసలు కారణం... చంద్రబాబు నాయుడు. బాబు పన్నిన లోతైన కుట్రలో షర్మిల భాగం. అంతా కలిసే జగన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. అందుకే రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. వీటిని పసిగట్టి జగన్ వెంటనే కోర్టును ఆశ్రయించటంతో... తమ పన్నాగం బెడిసికొట్టిందని గ్రహించి దీనికి ‘తల్లిపై వేసిన కేసు’గా కలర్ ఇస్తున్నారు. ఆస్తుల కోసం జగన్ తన కుటుంబీకులతోనే పోరాడుతున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు సరస్వతీ పవర్లో 100 శాతాన్ని షర్మిలకు ఇచ్చేస్తానని చెప్పాక... అప్పటికే 49 శాతం తల్లిపేరిట మార్పించి... తన మాటపై మరింత భరోసా కలిగేలా మిగిలిన 51 శాతాన్ని కూడా గిఫ్ట్గా ఇస్తానని రాసేశారంటే ఏమిటర్థం? ఆ ఆస్తిని పూర్తిగా వదులుకున్నట్లేగా? కాకపోతే కేసులున్నాయి కనక... అవన్నీ పూర్తిగా తొలగిపోయాకే ఆ షేర్లను చట్టబద్ధంగా షర్మిల పేరిట బదిలీ చేస్తానన్నారు.ఆలోగా చేయటం చట్టవిరుద్ధం కనక తాను చేయనన్నారు. అందుకే ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు తనవద్దే ఉంచుకున్నారు. కానీ షేర్ సర్టిఫికెట్లు పోయాయనే అబద్ధాలతో తల్లి ద్వారా షర్మిల అలాంటి చట్టవిరుద్ధమైన పని చేసేయటంతో... విధిలేక కోర్టును ఆశ్రయించారు. ఇదీ నిజం. ఇదే నిజం.
టీమిండియాకు ఏమైంది..? 12 ఏళ్ల తర్వాత తొలిసారి! కారణాలు ఇవే?
సొంతగడ్డపై తిరుగులేని టీమిండియాకు న్యూజిలాండ్ భయాన్ని పరిచయం చేసింది. గత 12 ఏళ్లగా టెస్టు క్రికెట్లో స్వదేశంలో ఏక ఛత్రాధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్ దూకుడుకు కివీస్ కళ్లెం వేసింది. పుణే వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో భారత్ కోల్పోయింది.స్వదేశంలో చివరగా 2012లో ఇంగ్లండ్పై టెస్టు సిరీస్ను కోల్పోయిన టీమిండియా.. మళ్లీ ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత రెడ్ బాల్ సిరీస్ను ప్రత్యర్ధికి సమర్పించుకుంది. ఈ సిరీస్ ఓటమితో టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్కు చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో సొంత గడ్డపై ప్రత్యర్ధులను చిత్తుచేసే భారత్కు ఇప్పుడు ఏమైందన్న చర్చ క్రీడావర్గాల్లో మొదలైంది. పుష్కర కాలం తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ టీమిండియా కోల్పోవడానికి గల కారణాలను ఓ సారి పరిశీలిద్దాం. ఓటమి కారణాలు ఇవే..బ్యాటింగ్ ఫెయిల్..టీమిండియా సిరీస్ను కోల్పోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫలమ్యనే చెప్పుకోవాలి. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో ఒక్క సర్ఫరాజ్ ఖాన్,రిషబ్ పంత్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇప్పుడు పుణే టెస్టులో కూడా అదే పరిస్థితి. రెండు ఇన్నింగ్స్లలో యశస్వీ జైశ్వాల్ మినహా కనీసం హాఫ్ సెంచరీ మార్క్ను అందుకులేకపోయారు.మొదటి టెస్టులో కివీస్ పేసర్ల దాటికి 46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టులో స్పిన్నర్ల ముందు బ్యాట్లెత్తేశారు. న్యూజిలాండ్ స్పిన్నర్ల వలలో చిక్కుకుని భారత్ విల్లాడింది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు సైతం చెత్త షాట్లు ఆడి తమ వికెట్లను కోల్పోయారు. కనీసం ఒక్కరు కూడా కివీస్ బౌలర్లను అడ్డుకుని భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలోనే మొదటి ఇన్నింగ్స్లో 156 పరుగులకు కుప్పకూలిన భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్లో 245 పరుగులకు ఆలౌటైంది. కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 13 వికెట్లు పడగొట్టి టీమిండియా ఓటమిని శాసించాడు.నో డిఫెన్స్, ఓన్లీ హిట్టింగ్..ముఖ్యంగా ప్రస్తుత భాత జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఒక్కరికి కూడా టెస్టు క్రికెట్ ఆడే సహనం లేదు. ఒకప్పుడు సంప్రదాయ క్రికెట్ అంటే రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్, పుజారా వంటి ఆటగాళ్లు గంటల కొద్దీ క్రీజులో పాతుకుపోయేవారు. వారిని పెవిలియన్కు పంపేందుకు ప్రత్యర్థి బౌలర్లు తీవ్రంగా శ్రమించే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. క్రీజులోకి వచ్చామా వన్డే, టీ20 తరహాలో ఆడామా అన్నట్లు భారత బ్యాటర్ల తీరు ఉంది. హిట్టింగ్ చేసే ప్రయత్నంలో తమ వికెట్లను కోల్పోతున్నారు. అంతేకాకుండా భారత బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడానికి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో టెస్టు క్రికెట్లో రాణించాలంటే భారత జట్టు కచ్చితంగా స్పిన్ బలహీనతను అధిగిమించాలి.కొంపముంచిన పిచ్..పుణే టెస్టులో భారత్ ఓటమికి మరో కారణం పిచ్. సాధారణంగా పుణే పిచ్ అటు పేస్ బౌలింగ్కు, స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కానీ భారత జట్టు మెనెజ్మెంట్ కివీస్పై పూర్తిగా స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించాలని చూసింది. పుణే వికెట్ను స్పిన్కు అనుకూలించేలా తయారు చేశారు.కానీ భారత్ అనుకున్నది ఒక్కటి.. అయింది ఒక్కటి. కివీస్ను స్పిన్తో దెబ్బకొట్టాలని భావించిన టీమిండియా.. అదే స్పిన్ ట్రాప్లో చిక్కుకుని విల్లవిల్లాడింది. భారత బ్యాటర్లకంటే న్యూజిలాండ్ ప్లేయర్లే స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఫలితంగా భారత గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయాన్ని కివీస్ అందుకుంది.
చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు చేతిలో వైఎస్ షర్మిల కీలు బొమ్మలా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. షర్మిల మాటలు వైఎస్సార్ కుమార్తెల లేవని విమర్శించారు.సొంత అన్న అనే అనుబంధం లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో కలిసి షర్మిల చేసే కుట్రలు చూసి, స్వర్గంలో వైఎస్సార్ కూడా బాధపడతారని అన్నారు. షర్మిలలో అడుగడుగునా స్వార్థం కనిపిస్తుందని దుయ్యబట్టారు.చంద్రబాబు అడుగుజాడల్లో షర్మిల నడుస్తున్నారని అన్నారు వరుదు కళ్యాణి. ఈడీ కేసుల్లో భారతి ఆస్తులు కూడా జప్తు చేశారని చెప్పారు. నాడు కేసుల్లో వైఎస్సార్ పేరును కాంగ్రెస్ పార్టీ చేర్చిందని.. అయితే ఆనాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా పోరాడి వైఎస్సార్ పేరును తొలగించారని ప్రస్తావించారు. తప్పుడు మార్గంలో షేర్లు బదిలీ చేశారని జగన్ కోర్టుకు వెళ్ళారని, షర్మిల అండ్ కో చేసే కీడు నుంచి తప్పించుకోడానికి మాత్రమే ఆయన కోర్టుకు వెళ్లారని స్పష్టం చేశారు.చదవండి:షర్మిలకు మానవత్వం ఉందా..?: టీజేఆర్ సుధాకర్బాబు‘జగన్ బెయిల్ రద్దు అయితే లక్షల కుటుంబాలు రోడ్డున పడేవి. సొంత అన్న కోసం ఇంత దారుణంగా ఎవరైనా మాట్లాడుతారా? రక్తం పంచుకొని పుట్టిన అన్న కోసం ఇలా మాట్లాడటం దుర్మార్గం. మహిళలను గొప్పగా చూసే వ్యక్తి వైఎస్ జగన్. షర్మిల చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఎవరూ నమ్మరు. 2019లో షర్మిల అధికారంలోకి తీసుకొస్తే.. 2014లో ఎందుకు అధికారానికి దూరం అయ్యాం. షర్మిల ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు కనుసన్నల్లో నడవడం దుర్మాగం. వైఎస్సార్ వారసత్వన్ని నిలబెట్టిన వ్యక్తి జగన్. పుట్టింటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత షర్మిలపై ఉంది. షర్మిల చంద్రబాబు కబంద హస్తాల నుంచి బయటకు రావాలి’ అని వరుదు కళ్యాణి తెలిపారు.
అంబానీ అల్లుడితో సమానంగా బాధ్యతలు.. ఎవరీ నందిని?
భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ.. తన కుమార్తె 'ఇషా అంబానీ'కి వ్యాపార రంగానికి చెందిన అజయ్ పిరమల్ కుమారుడు 'ఆనంద్ పిరమిల్'తో వివాహం జరిపించారు. ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న పిరమల్ వ్యాపార సామ్రాజ్యంలో 'నందిని పిరమల్' కీలకమైన వ్యక్తి. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె నెట్వర్త్ ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ నందిని పిరమల్?నందిని పిరమల్ అజయ్ పిరమల్ కుమార్తె. ఈమె పిరమల్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలు. నందిని తన తల్లిదండ్రులు అజయ్, డాక్టర్ స్వాతి పిరమల్.. సోదరుడు ఆనంద్ పిరమల్తో కలిసి కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ప్రస్తుతం పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, పిరమల్ ఫార్మా చైర్పర్సన్గా ఉన్నారు. ఓవర్-ది-కౌంటర్ (OTC) వ్యాపార విభాగాన్ని పర్యవేక్షించడం ఆమె ప్రధాన పాత్ర వహిస్తోంది.నందిని పిరమల్ నాయకత్వంలో ఓటీసీ విభాగం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటిగా మారింది. దీని అనేక ఉత్పత్తులు వాటి సంబంధిత విభాగాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. అంతే కాకుండా ఆమె పిరమల్ గ్రూప్లో హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అధిపతిగా ఉంది.2010లో నందిని కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయి. ఆమె పిరమల్ గ్రూపుకు చెందిన దేశీయ ఫార్ములేషన్స్ వ్యాపారాన్ని అబాట్ లాబొరేటరీస్కు విక్రయించడంలో కీలక పాత్ర పోషించింది. 3.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 31,638 కోట్లు) విలువైన ఈ డీల్ ఆ సమయంలో భారతీయ ఔషధ రంగంలో అతిపెద్ద లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగునందిని పిరమల్ కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్, ఫిలాసఫీ, ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది. చదువు పూర్తయిన తరువాత మెకిన్సే & కంపెనీలో బిజినెస్ అనలిస్ట్గా పనిచేసింది. ఆ తరువాత 2006లో కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టింది.ఇదీ చదవండి: దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్2009 మార్చిలో నందిని.. పీటర్ డీ యంగ్ను వివాహం చేసుకుంది. పీటర్ పిరమల్ గ్లోబల్ ఫార్మా సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇతడు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలోనే చదువుకున్నాడు. ఆ తరువాత మెకిన్సే & కంపెనీలో పనిచేసారు. నందిని పిరమల్ నెట్వర్త్ గురించి అధికారిక వివరాలు అందుబాటులో లేదు. కానీ ఈమె తండ్రి అజయ్ పిరమల్ నికర విలువ 2.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 23,307 కోట్లు). 2023 ఆర్ధిక సంవత్సరంలో పిరమల్ గ్రూప్ రూ. 9087 కోట్ల ఆదాయాన్ని గడించింది.
Chandrababu: ఏమిటో.. అవన్నీ సిగ్గుపడాల్సిన విషయాలు కావట!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరే వేరుగా ఉంటుంది. అసత్యాలను సమర్ధంగా, అలవోకగా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అని ఎవరైనా ఒప్పుకోవల్సిందే. 2024 ఎన్నికలలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలను మాయ చేసిన చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న అత్యాచారాలు, హత్యలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నా, వాటి గురించి ప్రస్తావించడం లేదు .పలు గ్రామాలలో డయేరియా వ్యాపిస్తున్నా, దానిపై ఆయన సీరియస్గా స్పందించడం లేదు. ప్రస్తుతం ఆయనకు మెయిన్ సబ్జెక్ట్ ఏమిటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆయన సోదరి షర్మిల మధ్య జరుగుతున్న పరిణామాలు వివాదంగా కనిపిస్తుంది. తనకు సంబంధం లేదంటూనే ఆయన చేయవలసిన విమర్శలన్నీ చేశారు. పైగా అన్నిటిని మించి జగన్కు సమాధానం చెప్పవలసి రావడం ఆయనకు సిగ్గు అనిపిస్తోందట. తల్లి, చెల్లిని జగన్ రోడ్డుపైకి లాగారట. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో చూడండి. షర్మిల తన సోదరుడు జగన్ బెయిల్ రద్దు అయినా ఫర్వాలదన్నట్లుగా వ్యవహరిస్తుంటే, ఆమెకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు. సడన్గా షర్మిల మీద ఆయనకు సానుభూతి ఏర్పడింది. ఆమె తన రాజకీయ ట్రాప్లో నుంచి జారి పోకుండా, ఆమెను అడ్డం పెట్టుకుని కధ నడిపిస్తూ, ఇతర ముఖ్యమైన అంశాలను డైవర్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. మాజీ మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాదానాలు చెప్పగలిగితే , అవి కన్విన్సింగ్గా ఉంటే కచ్చితంగా చంద్రబాబు ఎవరికి సిగ్గుపడనవసరం లేదు. ఒకవైపు జగన్పై కుట్రలు చేస్తూ, ఇంకో వైపు ఏమీ ఎరగనట్లుగా నటించడం చంద్రబాబు అర్ట్గా చెప్పాలి. ఆయన చేసిన ఒక వ్యాఖ్యను గమనించండి. ఆస్తి ఇవ్వడానికి తల్లి, చెల్లికి కండిషన్లు పెట్టే జగన్, ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి షరతులు పెడతారో అని ఆయన అన్నారని టీడీపీ మీడియా పేర్కొంది. ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తానని ఊహించలేదు. ఇవేం చిల్లర రాజకీయాలు? అలాంటి వారికి సమాధానం చెప్పడానికి సిగ్గు అనిపిస్తోందని ఆయన అంటున్నారు.సిగ్గుపడాల్సిన విషయం కాదటఅసలు ఎవరికి అర్దం కాని విషయం ఏమిటంటే సొంత కుటుంబంలో గత నాలుగు దశాబ్దాలుగా సాగిన ఉదంతాలపై సిగ్గు పడకుండా, జగన్ కుటుంబంలో వివాదాలపై చంద్రబాబు సిగ్గుపడడం ఏమిటో ఎవరికి అర్దం కాదు. సూపర్ సిక్స్ హామీలు అంటూ చేసిన హామీలను అమలు చేయలేకపోవడం సిగ్గుపడాల్సిన పని కాదట. మహిళాశక్తి అంటూ ప్రతి మహిళకు 1500 ఇస్తానని చెప్పి మహిళా లోకానికి ఆశపెట్టి ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం విషయమే కాదట. తల్లికి వందనం పేరుతో, నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ చిన్నపిల్ల్ని సైతం చాక్లెట్ల మాదిరి ఊరించి చివరకు ఇవ్వకుండా మోసం చేయడం సిగ్గుపడాల్సిన విషయం కాదట. షర్మిలకు జగన్ అదనంగా ఇస్తానని చెప్పిన ఆస్తులు ఇవ్వలేదని చంద్రబాబు సిగ్గుపడతారట. ఒక పక్క తానిచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు షరతులు పెడుతూ ప్రజలకు సేవ చేయడానికి జగన్ ఎలాంటి షరతులు పెడతారో అంటూ ఈయన సిగ్గు పడుతున్నారట. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను జగన్ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేసిన విషయాన్ని కప్పిపుచ్చడానికి బాబు ఎలాంటి డ్రామా ఆడుతున్నారో. చంద్రబాబు సుద్దులు చెబుతున్నారు..జగన్వి చిల్లర రాజకీయాలట. ప్రతిపక్షంలో ఉన్నా , అధికారపక్షంలో ఉన్నా చిల్లర విషయాల్ని సైతం తన రాజకీయాలకు వాడుకునే చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. సరే! జగన్, షర్మిల మధ్య ఏదో వివాదం నడుస్తోంది. మరి చంద్రబాబు కుటుంబంలో అసలు వివాదాలే జరగలేదా! ఆయన చేసినవి చాలా నాణ్యమైన రాజకీయాలా? లేక నాసిరకం రాజకీయాలా? అన్నవి ఆయన గత చరిత్ర చూస్తేనే తెలిసిపోతుంది కదా. 1978 కాంగ్రెస్ టికెట్ పొంది గెలిచిన తర్వాత కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు నడపడం, పార్టీనుంచి సస్పెండ్ అవ్వడం, మామ ఎన్టీఆర్ మీదనే పోటీచేస్తానని తొడకొట్టి సవాల్ చేయడం, ఆ తర్వాత తుస్సుమని జారుకోవడం ఆయన దృష్టిలో ఇవేవీ చిల్లర రాజకీయాలు కాకపోవచ్చు. 1983లో కాంగ్రెస్ అభ్యర్దిగా ఘోర పరాజయం తర్వాత తన భార్యను అడ్డంపెట్టుకొని మామ ఎన్టీఆర్పై ఒత్తిడి తెచ్చి టీడీపీలో చేరడానికి నానా తంటాలు పడడం, విలువలతో కూడిన రాజకీయమని చంద్రబాబు భావన కావచ్చు. పార్టీలోకి వచ్చాక టీడీపీలో ఒక వర్గాన్ని నడిపి చివరకు తన మామ ఎన్టీఆర్ సీఎం కుర్చీకే ఎసరు పెట్టడం అత్యంత విలువైన రాజకీయమని ఆయన ఉద్దేశ్యం. ఇందుకోసం వైస్రాయ్ హోటల్ను వేదికగా చేసుకోవడం, అక్కడకు తన భార్య లక్ష్మీపార్వతితో కలిసి వచ్చిన ఎన్టీఆర్పై చెప్పులు వేయడం చాలా ఆప్యాయతతో కూడిన రాజకీయమన్నమాట. ఇలాంటి అల్లుడిని రాజకీయంగా ఆదరిస్తానని ఎన్టీఆర్ ఊహించలేకపోయారు. ఆ విషయాన్ని ఆయనే వెల్లడిస్తూ చంద్రబాబును ఎంత ఘోరంగా దూషించారో వినడానికి సిగ్గేసింది కానీ, చంద్రబాబు రాజకీయం ప్రకారం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అప్పట్లో లక్ష్మీపార్వతిపై అభూత కల్పనలు, వదంతులు సృష్టించడం, ఎన్టీఆర్కు నైతిక విలువలు లేవని చెప్పడం ఆయన మరణం తర్వాత తానే ఎన్టీఆర్ కు అసలైన వారసుడినని అంటూ చెప్పుకొని తిరగడానికి ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన భావించి ఉండాలి. తన బావమరిది హరికృష్ణతో జరిగిన గొడవలేవీ కుటుంబ తగాదా కాదు. హరికృష్ణను ఈయన రోడ్డు పైకి లాగలేదు. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని చంద్రబాబును విమర్శించలేదు. ఇన్ని జరిగినా చంద్రబాబు మాత్రం నీతులు చెప్పగల సమర్థుడు. చెత్త రాజకీయాలు ప్రజలను కాపాడలేవని చంద్రబాబు సెలవిచ్చారు. నాలుగు నెలల్లో ఎన్ని ఘోరాలు!మంచిదే! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోజూ చెత్తరాజకీయాలు చేయడానికి ఎక్కడా సిగ్గుపడకపోయినా ఇప్పుడు జగన్ కేవలం ప్రజాసమస్యలనే మాట్లాడుతున్నా, వాటిని చెత్త రాజకీయాలు అని ప్రచారం చేస్తున్నారు. విలువల్లేని మనుషులు సమాజానికి చేటు, కనీసం విలువలు ఉండాలి, ''బురద వేస్తాను. మీరు తుడుచుకోండి అన్నట్టుగా'' జగన్ వ్యవహరిస్తున్నారట. ఇంతకంటే అన్యాయమైన ఆరోపణ ఏమైనా ఉంటుందా? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ఈవీఎంల మాయో, మరో విధంగానో అధికారంలోకి వచ్చాక ఈ నాలుగు నెలల్లో జరిగినన్ని ఘోరాలు ఇంకెప్పుడైనా జరిగాయా? తిరుమల లడ్డూలో వాడిన నేతిలో జంతుకొవ్వు కలిసిందని దారుణైమన అబద్దపు ఆరోపణ చేయడం, ఆ తర్వాత నాలుక కరుచుకోవడం మంచి రాజకీయమవుతుందా? విలువలతో కూడిన రాజకీయమవుతుందా? చెత్త రాజకీయమవుతుందా? వరదల సమయంలో సమర్థంగా పని చేయలేక ప్రకాశం బ్యారేజ్ వద్దకు కొట్టుకొచ్చిన బోట్లను కుట్రగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం విలువలతో కూడిన రాజకీయం అవుతుందా? చెత్త రాజకీయం అవుతుందా? ఈ అంశాల్లో జగన్పై చంద్రబాబు వేసింది బురదగా చూడాలా? పన్నీరుగా చూడాలా? గాజు అద్దాల మేడలో కూర్చొని ఎదుటివాళ్లపై రాళ్లు వేసి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిని అడ్డం పెట్టుకొని ఎంతసేపూ రాజకీయ ప్రత్యర్ధులపై బురద చల్లడం , డైవర్షన్ రాజకీయాలు చేయడం ఇవన్నీ నీచ రాజకీయాల కిందకు వస్తాయా? లేక స్వచ్ఛమైన రాజకీయాల కిందకు వస్తాయా ? అనేది చంద్రబాబే ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. కానీ ఆత్మతో సంబంధం లేకుండా ఎలాంటి రాజకీయాలనైనా నడపగలిగిన చంద్రబాబునుంచి విలువలతో కూడిన రాజకీయాలను ఆశించడమంటే ఇసుకనుంచి తైలం తీసినట్టే అవతుందేమో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
సినిమా ఛాన్సులు పోయినా పర్వాలేదు ప్రశ్నిస్తా: ప్రకాష్ రాజ్
సౌత్ ఇండియాలో పాపులర్ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన తన కుటుంబంతో పాటు సినిమా ఛాన్స్ల విషయం గురించి కూడా మాట్లాడారు. తన జీవితంలో ఎక్కువగా బాధించిన ఘటనలు రెండు ఉన్నాయని ఆయన అన్నారు. తన కుమారుడి మరణమంతో పాటు స్నేహితురాలు గౌరీ (గౌరీ లంకేష్) మరణం అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నాడు.ప్రకాశ్ రాజ్- లలిత పెద్ద కుమారుడు సిద్ధు (5) 2004లో మృతి చెందాడు. మేడపై గాలిపటాన్ని ఎగురవేస్తున్న సమయంలో ఒక స్టూల్ నుంచి జారిపడి కన్నుమూశాడు. ఆ సమయం నుంచి ప్రకాష్ రాజ్, లలిత మధ్య విభేదాలు పెరిగాయి. అలా చివరికి 2009లో లలితకు ప్రకాష్ రాజ్ విడాకులు ఇచ్చారు. అనంతరం 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను ఆయన రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, కుమారుడి మరణం తీవ్రంగా బాధపెట్టిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ పంచుకున్నారు. కానీ, అలాగే బాధలో ఉండిపోతే ఎలా..? అని ముందుకు సాగానంటూ పంచుకున్నారు. 'ఆ సంఘటనతో నేను స్వార్థపరుడిగా మారలేను. నాకు కుమార్తెలు ఉన్నారు, నాకు కుటుంబం ఉంది, నాకు వృత్తి ఉంది, నాకు మనుషులు ఉన్నారు. నేనూ ఒక మనిషి, నాకు జీవితం ఉంది, నాపై ఆధారపడి ఉన్న వాళ్లకు నేను చేయాల్సింది చాలా ఉంది. అందుకే తిరిగి నిలబడ్డాను.' అని ఆయన అన్నారు.ప్రశ్నించడం ఆపనుఇండస్ట్రీలో బాలచందర్, కృష్ణవంశీ, మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులు ఇచ్చిన అవకాశాలే తనను ఇంతటి స్థాయికి చేర్చాయని ప్రకాష్రాజ్ గుర్తుచేసుకున్నారు. కథ బాగుంటే ఎలాంటి సినిమానైనా చేస్తానని ఆయన తెలిపారు. తనకు ఉన్న టాలెంట్కు ప్రజల నుంచి ఆదరణ, ప్రేమ వల్లే ఇక్కడ తాను నటుడిగా కొనసాగుతోన్నానని చెప్పారు. నేటి సమాజంలో గళం వినిపించలేని ప్రజలకు గొంతుకగా ఉంటానని ఆయన అన్నారు. సమాజంలో జరిగే తప్పులను చూస్తూ నోరు మెదపకుండా ఉండలేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు సినిమా అవకాశాలు కోల్పోయినా ప్రశ్నించడం మాత్రం ఆపనని బలంగా చెప్పారు. ఇప్పటి వరకు తనపై ఎన్ని కుట్రలు పన్నినా తట్టుకొని నిలబడ్డానని ఆయన గుర్తుచేసుకున్నారు. భవిష్యత్లో కూడా అంతే స్థాయిలో నిలబడతానని ప్రకాష్ రాజ్ అన్నారు.
తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ శనివారం(అక్టోబర్ 26) సాయంత్రం సమావేశమైంది. భేటీ ఇంకా కొనసాగుతోంది. కేబినెట్లో పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ములుగులో సమ్మక్క సారలమ్మ వర్శిటీకి భూ కేటాయింపుతో పాటు హన్మకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ కీలక నిర్ణయాలు..మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ఎల్బీనగర్ టు శంషాబాద్ ఎయిర్పోర్టు, నాగోల్ టు ఎల్బీనగర్ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేందద్రాల ఏర్పాటునకు ఆమోదంఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణానికి గోషామహల్ గ్రౌండ్స్ భూమి బదలాయింపుకొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్రేరాలో 54 పోస్టుల భర్తీకి నిర్ణయంములుగులో సమ్మక్కసారక్క గిరిజన యూనివర్సిటీ నిర్ణయానికి భూ కేటాయింపులుఎకరా రూ.250 చొప్పున భూమి కేటాయింపు ఇదీ చదవండి: ఆ నిర్మాణాలపై ‘హైడ్రా’ కొరడా తప్పదు: భట్టి
వీడియో షేర్ చేస్తూ 'సాయి పల్లవి'ని టార్గెట్ చేస్తుందెవరు..?
శివ కార్తికేయన్- సాయిపల్లవి జోడిగా నటించిన 'అమరన్' తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 31న విడుదలవుతోంది. మేజర్ ముకుందన్ జీవితంలోని కొన్ని సంఘటనలను తీసుకుని ఈ చిత్రాన్ని పూర్తి ఆర్మీ బ్యాక్డ్రాప్లో దర్శకుడు రాజ్కుమార్ పెరియస్వామి తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమా విడుదల నేపథ్యంలో కొందరు సాయిపల్లవిని టార్గెట్ చేస్తూ నెట్టింట తప్పుడు ప్రచారం చేస్తున్నారు.సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. అయితే, ఆ సమయంలో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నుంచి కొంత భాగాన్ని కట్ చేసి కొందరు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి ఆమె ఇలా చెప్పారు. 'పాకిస్తాన్లో ఉన్న వాళ్లు.. మన జవాన్లు టెర్రరిస్ట్లు అని అనుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. వాళ్లకు ఏమైనా హాని చేస్తామని భావిస్తారు. అదే సమయంలో మనకు కూడా వాళ్లు అలానే కనిపిస్తారు. ఈ రెండింటి మధ్య మనం చూసే విధానం మారిపోతుంది. ఇందులో ఎవరు రైట్..? ఎవరు రాంగ్..? అని నేను చెప్పలేను.’ అని ఆమె అన్నారు. ఇప్పుడు ఈ వీడియోను కొందరు పనికట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మన జవాన్లను టెర్రరిస్ట్లతో పోల్చిందంటూ ఆమెను తప్పు పడుతున్నారు.బాలీవుడ్ వాళ్లే టార్గెట్ చేస్తున్నారా..?'అమరన్' మూవీ ప్రమోషన్స్లో భాగంగా రీసెంట్గా సాయి పల్లవి మాట్లాడుతూ.. బాలీవుడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చి తన ఇమేజ్ను మరింత పెంచుతామంటూ పీఆర్ ఏజెన్సీ వారు సంప్రదించారని తెలిపింది. అయితే, దానిని తాను రిజక్ట్ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. ‘రామాయణ’ సినిమాతో బాలీవుడ్కి ఆమె ఎంట్రీ ఇస్తున్నారు. కొందరు ఈ వీడియోను షేర్ చేస్తూ.. సీత పాత్రలో సాయి పల్లవిని తొలగించాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా కావాలనే బాలీవుడ్ పీఆర్ టీమ్ వాళ్లు సాయి పల్లవిని టార్గెట్ చేశారని తెలుస్తోంది.The whole hatred towards #SaiPallavi is due to bad subtitle by the TV channel.She clearly says “Pakistan people will think our Soldiers as Terrorists bacause they think we are harming, Likewise for us too…May be perspective I am not sure…”pic.twitter.com/GH9V4LTxAa— Sathyamoorthy V (@sathyaonX) October 26, 2024
యమునలో మునకేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్.. ఆస్పత్రిలో చికిత్స
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ పెద్ద సాహసమే చేశారు. కాలుష్య కాసారంగా మారి విషపు నురగలు కక్కుతున్న యమునా నదిలో సచ్దేవ మునిగారు. నదిలో మునిగిన మూడు రోజుల తర్వాత సచ్దేవపై యమున కాలుష్యం ఎఫెక్ట్ పడింది.చర్మంపై దురదలు రావడంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సచ్దేవను శనివారం(అక్టోబర్ 26) ఆస్పత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నట్లు బీజేపీ పార్టీ సోషల్మీడియా వెల్లడించింది. యమునలో కాలుష్యం ఇంతగా పెరగడానికి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాలే కారణమని బీజేపీ విమర్శించింది. కాగా, ఢిల్లీలో కాలుష్య నివారణకు కేటాయించాల్సిన నిధులను ఆప్ ప్రభుత్వం దారి మళ్లించిందని నిరసన తెలపడంలో భాగంగా సచ్దేవ గురువారం యమునలో మునిగారు. అయితే సచ్దేవ యమునలో మునగడంపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్రాయ్ విమర్శలు గుప్పించారు. అదంతా ఒక పెద్ద డ్రామా అని కొట్టిపారేశారు.ఇదీ చదవండి: అక్కడ కనిపించని దీపావళి వేడుకలు.. కారణమిదే
కాళేశ్వరం కమిషన్ విచారణ.. మూడుసార్లు హరీష్ రావు పేరు ప్రస్తావన
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి శనివారం హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల టెండర్లపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆయన్ను విచారించింది. విచారణలో భాగంగా మాజీ జలవనరులశాఖ మంత్రి హరీష్ రావు పేరును సుధాకర్ రెడ్డి మూడుసార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టు కోసం చేసిన టెస్టుల రిపోర్టులను వ్యాప్కోస్ సంస్థకు ఇవ్వనని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా.. ఆ సమయంలో హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని, ఆయనే ఆదేశించారని తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టింది అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలోనేనని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో 40 వేల కోట్ల నుంచి 127 వేల కోట్లకు పెంచారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేవలం అదనంగా రెండు లక్షల ఎకరాల కోసమా?: కమిషన్డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్కు డబ్బులు ఇచ్చాం-సుధాకర్ రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ టెండర్ల ప్రాసెస్ జరిగిందా? కమిషన్టెండరింగ్ ప్రాసెస్ జరగలేదు. నామినేషన్ ప్రాసెస్ ద్వారా వ్యాప్కొస్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు- సుధాకర్ రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ ప్రాసెస్ ఎందుకు చేయలేదు చెయ్యొద్దు అని ఎవరు ఆదేశించారు?- కమిషన్బ్యారేజీ పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఏ సమయంలో ఇస్తారు?- కమిషన్దాదాపు 90 శాతం పనులు పూర్తయితే సబ్ స్టాన్షల్ సర్టిఫికేట్ విడుదల చేస్తారు?- సుధాకర్ రెడ్డిపనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చేముందు ఫీల్డ్ విజిట్ లేదా డాక్యుమెంట్స్ చెక్ చేశారా?- కమిషన్ఫీల్డ్ విసిట్, డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఎలా ఇస్తారు?- కమిషన్42.2b క్లాజ్ ఉపయోగించి సర్టిఫికెట్ను రిజెక్ట్ చేసే అర్హత ఉన్నప్పటికీ ఎందుకు ఆపలేదు?- కమిషన్సర్టిఫికెట్ ఇచ్చేముందు అసలు నిజాలు చూడకుండా ఎలా గుడ్డిగా సంతకాలు పెడుతారు?- కమిషన్కాపర్ డ్యాం నిర్మాణం తొలగింపు కోసం అదనంగా ఖర్చు చేసే నిధులు ప్రభుత్వానికి నష్టమే కదా?- కమిషన్మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులు ఆలస్యం ఎందుకు అయ్యాయి? - కమిషన్అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులను నిర్మాణ సంస్థలు ఇచ్చాయి,.మేడిగడ్డ బ్యారేజీ ఫైనల్ బిల్లులు ఇంకా సబ్మిట్ చేయలేదు.- సుధాకర్ రెడ్డిబిల్లుల చెల్లింపుల అంశంలో కాళేశ్వరం కార్పొరేషన్ ప్రస్తావన..కాళేశ్వరం కార్పొరేషన్ ఎవరు పెట్టారు? పెట్టమని ఎవరు ఆదేశించారు;- కమిషన్కాళేశ్వరం కార్పొరేషన్ ప్రభుత్వం పెట్టింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగింది. సుధాకర్ రెడ్డిమేడిగడ్డ బ్యారేజీ కింద బొగ్గు గనుల ఆనవాళ్లు ఉన్నట్లు జోధాపూర్ యూనివర్సిటీ సర్దార్ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చింది. సుధాకర్ రెడ్డిబ్యారేజీలలో నీళ్లు స్టోరేజ్ చేయొచ్చా చేస్తే ఎంత చేయొచ్చు?- కమిషన్మేడిగడ్డ బ్యారేజీలో 100 మీటర్ల లెవెల్ వరకు స్టోర్ చేయొచ్చు.- సుధాకర్ రెడ్డిచేసుకున్న అగ్రిమెంట్ కంటే ఎక్కువ నిధులు ఏజెన్సీకి పే చేస్తే అది ప్రభుత్వానికి నష్టమే కదా- కమిషన్డిజైన్లలో లోపాల వల్ల బ్యారేజీల వద్ద డ్యామేజ్ జరిగింది నిజమేనా? - కమిషన్మేడిగడ్డ బ్యారేజీ లోని బ్లాక్ లలో లెన్త్ అండ్ విడ్త్ డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్లే డ్యామేజి జరిగింది- సుధాకర్ రెడ్డి వరద వేగాన్ని అంచనా వేయకపోవడం వల్లే బ్లాకులు దెబ్బతిన్నాయి-సుధాకర్ రెడ్డి.
బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియాపై కేంద్రం సీరియస్
బిగ్బాస్ 8: నయని పావని ఎలిమినేట్!
ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ బైకులు: ధర లక్ష కంటే తక్కువే..
TG: రేపటి నుంచి ఆర్టీసీ కార్గో హోం డెలివరీ సేవలు
చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: వరుదు కళ్యాణి
కోపంతో ఊగిపోయిన విరాట్ కోహ్లి! బ్యాట్తో ఏమి చేశాడంటే? వీడియో
ఆ.. చుట్టమల్లే పాట వీడియో సాంగ్ వచ్చేసింది..
అంబానీ అల్లుడితో సమానంగా బాధ్యతలు.. ఎవరీ నందిని?
షర్మిలకు మానవత్వం ఉందా..?: టీజేఆర్ సుధాకర్బాబు
సినిమా ఛాన్సులు పోయినా పర్వాలేదు ప్రశ్నిస్తా: ప్రకాష్ రాజ్
నిజమే సార్! ఉప ఎన్నికల్లో కూడా సీట్లు అడిగితే ఇస్తారో..ఇవ్వరో.. మంచి పని చేశారు!
ఈ రాశివారికి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు
ట్రూడోకు సొంత పార్టీలోనే వ్యతిరేకత
మార్కెట్ నిండా ఉల్లి.. రైతులకు కష్టాల లొల్లి
సాఫ్ట్వేర్ ఉద్యోగులు వద్దు
ఆదాయం తగ్గింది.. మార్చి దాకా అడగొద్దు: సీఎం రేవంత్
చరిత్ర సృష్టించిన మహ్మద్ రిజ్వాన్..
బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వపై కేసు!
సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్కి మరో కారు గిఫ్ట్
బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియాపై కేంద్రం సీరియస్
బిగ్బాస్ 8: నయని పావని ఎలిమినేట్!
ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ బైకులు: ధర లక్ష కంటే తక్కువే..
TG: రేపటి నుంచి ఆర్టీసీ కార్గో హోం డెలివరీ సేవలు
చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: వరుదు కళ్యాణి
కోపంతో ఊగిపోయిన విరాట్ కోహ్లి! బ్యాట్తో ఏమి చేశాడంటే? వీడియో
ఆ.. చుట్టమల్లే పాట వీడియో సాంగ్ వచ్చేసింది..
అంబానీ అల్లుడితో సమానంగా బాధ్యతలు.. ఎవరీ నందిని?
షర్మిలకు మానవత్వం ఉందా..?: టీజేఆర్ సుధాకర్బాబు
సినిమా ఛాన్సులు పోయినా పర్వాలేదు ప్రశ్నిస్తా: ప్రకాష్ రాజ్
నిజమే సార్! ఉప ఎన్నికల్లో కూడా సీట్లు అడిగితే ఇస్తారో..ఇవ్వరో.. మంచి పని చేశారు!
ఈ రాశివారికి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు
ట్రూడోకు సొంత పార్టీలోనే వ్యతిరేకత
మార్కెట్ నిండా ఉల్లి.. రైతులకు కష్టాల లొల్లి
సాఫ్ట్వేర్ ఉద్యోగులు వద్దు
ఆదాయం తగ్గింది.. మార్చి దాకా అడగొద్దు: సీఎం రేవంత్
చరిత్ర సృష్టించిన మహ్మద్ రిజ్వాన్..
బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వపై కేసు!
సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్కి మరో కారు గిఫ్ట్
సినిమా
పృథ్వీకి నాగ్ క్లాస్.. సూర్య కోసం బయటకు వచ్చేస్తానన్న కంటెస్టెంట్
చేసేదంతా చేస్తారు.. అంతా అయిపోయాక మాత్రం తన ఉద్దేశం అది కాదని యూటర్న్ తీసుకుంటారు. సోనియా, యష్మి, తేజ, విష్ణుప్రియ, ప్రేరణ, నాగమణికంఠ.. ఇలా బిగ్బాస్ కంటెస్టెంట్లలో చాలామంది ఇదే కోవలోకి వస్తారు. ఈవారం పృథ్వీ.. రోహిణిని కింది నుంచి పైకి చూస్తూ చులకనగా మాట్లాడాడు.. దీని గురించి నాగ్ ప్రస్తావించగా బాడీ షేమింగ్ చేయాలన్న ఉద్దేశం తనది కాదని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో నాగ్ క్లాస్ పీకాడు. ఇక యష్మి ఇండివిడ్యువల్ గేమ్ కనిపించడం లేదంటూ ఆమె ఫోటో ఉన్న కుండ పగలగొట్టాడు.స్పెషల్ గెస్ట్గా సూర్యఇకపోతే ఈరోజు ఎపిసోడ్లో హీరో సూర్య అతిథిగా విచ్చేయనున్నాడు. కంగువా సినిమా ప్రమోషన్స్లో భాగంగా స్టేజీపైకి వచ్చాడు. అతడిని చూసి సూర్య అభిమానురాలు నయని పావని తెగ సంతోషపడిపోయింది. అతడి కోసం 5 నిమిషాలు హౌస్లో నుంచి బయటకు వస్తావా? అంటే వచ్చేస్తానని తలూపింది. మళ్లీ హౌస్లోకి పంపించను అని నాగ్ తిరకాసు పెట్టినప్పటికీ సూర్య కోసం బయటకు వచ్చేందుకు రెడీ అని చెప్పింది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రెండు చేతులు చాచి ఆహ్వానం పలుకుతున్నా అంటూ విజయ్ లేఖ
దళపతి విజయ్ కొన్ని గంటల్లో తన అభిమానులను కలవనున్నాడు. తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన తర్వాత తను తొలిసారి భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నాడు. దీంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్న దేశ ప్రజలు అందరూ ఆయన ఏం మాట్లాడనున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలైలో విజయ్ పార్టీ తొలి మహానాడు కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచం కీర్తించే రీతిలో వీసాలైలో పార్టీ ఆవిర్భావం, సిద్ధాంతాల వేడుకను జరుపుకుందామని కేడర్కు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ పిలుపునిచ్చారు. మహానాడుకు కొంత సమయం మాత్రమే ఉండడంతో కేడర్కు పిలుపునిస్తూ విజయ్ లేఖ రాశారు. రేపు జరిగే మహానాడు ప్రపంచమే కీర్తించే వేడుకగా నిలవబోతోందని, ఆమేరకు వేడుక జరుపుకుందామని కేడర్కు సూచించారు. పార్టీ జెండాలతో తరలిరావాలని, వీసాలైలలో అందరికీ ఆహ్వానం పలికేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. బ్రహ్మాండ ఏర్పాట్లు జరిగాయని, ఈ సిద్ధాంతాల వేడుకకు తన గుండెల్లో గూడు కట్టుకున్న ప్రతి అభిమాని, కేడర్ను సగర్వంగా ఆహ్వానిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.తొలి మహానాడులో అందర్నీ తాను నేరుగా కలవనున్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఇది సిద్ధాంతాల విజయపు వేడుక అని, రెండు చేతులు చాచి ఆహ్వానం పలుకుతున్నానని ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, భద్రత, సురక్షితంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. హృదయం అనే తలుపును వీసాలై సరిహద్దుల్లో తెరచి ఉంచి ఆహ్వానిస్తుంటానని, మహానాడులో కలుద్దాం..తమిళ మట్టి గెలుపు కోసం శ్రమిద్దాం...2026 మన లక్ష్యం అని ముగించారు. కాగా, ఈ మహానాడు కోసం చేసిన ఏర్పాట్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. జాతీయ రహదారి వెంబడి ఫ్లెక్సీలు, హోర్డింగ్లు హోరెత్తించడంతో వాటిని తొలగించే విధంగా హుకుం జారీ చేశారు. అలాగే, కోయంబత్తూరులో అయితే విజయ్, అన్నాడీఎంకే దివంగత నేత ఎంజీఆర్ చిత్ర పటాలతో ఫొటోలు, ఫ్లెక్సీలు వెలిశాయి.
RRRను దాటేసిన పుష్ప.. రిలీజ్కు ముందే ఆ రికార్డ్ క్లోజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప2: ది రూల్' పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక థియేటర్స్లో రిలీజ్ కానున్న చిత్రంగా పుష్ప2 రికార్డులకెక్కింది. ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉండంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా ఈ చిత్రం విడుదల కానుంది. 'పుష్ప: ది రైజ్'కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.RRRను బీట్ చేసిన పుష్పఐకాన్ స్టార్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ సినిమాలకు ఓవర్సీస్లో భారీ మార్కెట్ పెరిగింది. మాలీవుడ్లో అయితే ఏకంగా తమ హీరోగా వారు అభిమానిస్తారు. ఇప్పుడు బెంగాలీలు కూడా బన్నీకి ఫ్యాన్స్ అయిపోయారు. పుష్ప తర్వాత యూట్యూబ్లలో ఆయన నటించిన గత సినిమాలు చూసిన వారు ఫిదా అయిపోయారు. అలా మొదటిసారి బెంగాలీలో కూడా పుష్ప2 విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో 11,500 స్క్రీన్స్లలో పుష్ప2 చిత్రం విడుదల కానుంది. ఇండియాలో 6,500, ఓవర్సీస్లో 5000 స్క్రీన్స్లలో గ్రాండ్గా ఈ మూవీ విడుదల కానుంది. ఇంతటి భారీ సంఖ్యలో విడుదల అవుతున్న భారతీయ ఏకైక సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఇంతటి స్థాయిలో విడుదల కాలేదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆర్ఆర్ఆర్ పేరుతో ఇప్పటి వరకు ఉన్న 10,200 స్క్రీన్స్ల రికార్డు పుష్పతో తుడిచిపెట్టుకుపోయింది. బాహుబలి2 8500 స్క్రీన్స్లలో రిలీజ్ కాగా కల్కి 8400 స్క్రీన్స్లలో సందడి చేసింది.
ప్రెస్మీట్లో ఫైర్ అయిన తెలుగు నటుడు
ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఉన్నారు. ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు చాలావరకు ఆచితూచి మాట్లాడుతుంటారు. కొందరు మాత్రం కనీసం ఏం మాట్లాడుతున్నామో అనే సోయి లేకుండా నోటికొచ్చినట్లు వాగుతుంటారు. ఇంకా చెప్పాలంటే వీళ్లకి కామన్ సెన్స్ ఉండదు. వయసులో పెద్దోళ్లే కానీ ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేశాడు. రివ్యూ రైటర్లని దారుణంగా తిట్టాడు.ఈ శుక్రవారం 'పొట్టేల్' సినిమా రిలీజైంది. 1980ల్లో తెలంగాణలోని పల్లెల్లో పటేళ్ల ఆగడాలు, మూఢ నమ్మకాలు, చదువు ప్రాముఖ్యం లాంటి అంశాలతో తెరకెక్కించారు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కొన్ని సీన్లు సాగతీతగా అనిపించాయి. ఇదే విషయాన్ని పలువురు రివ్యూయర్లు వ్యక్తపరిచారు. శనివారం సక్సెస్ మీట్ జరగ్గా.. దర్శకుడు సాహిత్ని అదే మీడియా పలు ప్రశ్నలు అడిగితే వాటికి ఈయన ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఇక్కడివరకు బాగానే ఉంది.(ఇదీ చదవండి: స్టార్ హీరోతో నిశ్చితార్థం రూమర్స్.. హీరోయిన్ ప్రియాంక మోహన్ ఏమందంటే?)సక్సెస్ మీట్ చివరలో అక్కడికి వచ్చిన నటుడు శ్రీకాంత్ అయ్యంగర్.. రివ్యూయర్లని దారుణమైన పదజాలంతో తిట్టాడు. 'డ్రాగ్డ్గా ఉందన్నారు. షార్ట్ ఫిల్మ్ తీయడం కూడా రాని నా కొడుకులు వచ్చి రివ్యూ రాస్తారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా కూడా లేని నా కొడుకులు. ప్రజలున్నారు. ప్రేక్షక దేవుళ్లు ఉంటారు. సినిమాని ముందుకు తీసుకెళ్తారు. శ్రమించి, కష్టపడి, చెమటోడ్చి సినిమాలు తీస్తూనే ఉంటాం' అని అన్నాడు.రివ్యూ వ్యక్తిగత అభిప్రాయం. డబ్బులు పెట్టి టికెట్ కొని చూసే ప్రతి ప్రేక్షకుడు రివ్యూయరే. సినిమా బాగుంటే బాగుందని చెబుతాడు. లేదంటే లేదని అంటాడు. సాగతీతగా అనిపిస్తే అదే బయటపెడతాడు. అలా కాదు మేం తీసింది కళాఖండం, మీకు బుర్రలేదు అని ఏకంగా రివ్యూయర్లనే తిడితే.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. శ్రీకాంత్ అయ్యంగర్ తీరు చూస్తే అలానే ఫీల్ అవుతున్నట్లు ఉన్నాడు. సినిమా తీసిన దర్శకుడే నీట్గా ఒక్కో ప్రశ్నకు సమాధానమిచ్చాడు. చివరలో పుడింగిలా వచ్చిన శ్రీకాంత్ అయ్యంగర్ మాత్రం నోటిదురుసుతో మాట్లాడాడు. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే యాక్టింగ్ వస్తే సరిపోదు. మాట్లాడటం కూడా ఇతడికి రావాలేమో?(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్కి మరో కారు గిఫ్ట్)
న్యూస్ పాడ్కాస్ట్
హైదరాబాద్ను ఫినిష్ చేసే కుట్ర జరుగుతోంది... బీజేపీ, బీఆర్ఎస్పై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మండిపాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
అమరావతి రైల్వే లైన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. నంబూరు నుంచి అమరావతి మీదుగా ఎర్రుపాలెం వరకు 57 కిలోమీటర్ల మేర నిర్మాణం.. ఇంకా ఇతర అప్డేట్స్
మహిళల రక్షణను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి అన్నివిధాలా సహకరిస్తాం. పుతిన్కు స్పష్టం చేసిన మోదీ. బ్రిక్స్ సదస్సు కోసం రష్యాలో మొదలైన మోదీ పర్యటన.. ఇంకా ఇతర అప్డేట్స్
విద్యుత్ చార్జీల పెంపుతో తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కుంటుబడుతుందన్న కేటీఆర్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఫామ్హౌస్లు కాపాడుకోవడానికే మూసీ ప్రస్తావన తెస్తున్నారు... బీఆర్ఎస్ నాయకులపై రేవంత్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో మాఫియా సామ్రాజ్యం... కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
మూసీ నది సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో మోత మోగుతున్న మద్యం ధరలు... సీఎం చంద్రబాబుపై మద్యం ప్రియుల ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రీడలు
అస్సలు ఊహించలేదు.. ఓటమికి ఏ ఒక్కరినో నిందించను: రోహిత్
న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ పరాభవంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ ఓటమి తాము అస్సలు ఊహించలేదని విచారం వ్యక్తం చేశాడు. కివీస్ జట్టు విసిరిన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయామని.. అందుకే పరాజయం పాలయ్యామని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ తమ కంటే మెరుగ్గా ఆడిందని.. వాళ్లు విజయానికి అర్హులేనన్నాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో భాగంగా భారత్ సొంతగడ్డపై కివీస్తో మూడు మ్యాచ్లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇందుకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో పుణె వేదికగా గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది.భారత బౌలర్లు రాణించినాఅయితే, ఈ మ్యాచ్లో భారత బౌలర్లు రాణించినా బ్యాటర్లు విఫలమయ్యారు. ఫలితంగా మరోసారి టీమిండియాకు కివీస్ చేతిలో ఓటమి తప్పలేదు. పుణెలో శనివారం నాటి మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 113 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... ‘‘ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. మేము ఇది అస్సలు ఊహించలేదు. మా కంటే న్యూజిలాండ్ బాగా ఆడింది. మాకు గెలిచే అవకాశం వచ్చినా.. దానిని ఒడిసిపట్టలేకపోయాం. సవాళ్లకు ఎదురీదలేకపోయాం.అందుకే ఈరోజు ఇక్కడ ఇలాంటి విపత్కరపరిస్థితిలో ఉండాల్సి వచ్చింది. మా బ్యాటింగ్ బాగాలేదని అనుకోవడం లేదు. నిజానికి 20 వికెట్లు తీస్తే గెలిచే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. అయితే, బ్యాటింగ్ సమయంలోనూ మేము పట్టుదలగా పోరాడాము.ఓటమికి ఏ ఒక్కరినో నిందించనుకానీ గెలిచేందుకు ఆ పోరాటం సరిపోలేదు. ఇందులో పిచ్ను నిందించడానికి ఏమీ లేదు. ఇది సమిష్టి వైఫల్యం. బ్యాటర్లు లేదంటే బౌలర్లలో ఎవరో ఒకరిని మాత్రమే తప్పుబట్టి.. ఓటమికి వారినే బాధ్యులను చేసే రకం కాదు నేను! కచ్చితంగా మరింత స్ట్రాంగ్గా తిరిగివస్తాం. వాంఖడేలో గెలిచేందుకు ప్రయత్నిస్తాం’’ అని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్లో కాస్త పోరాడి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని రోహిత్ శర్మ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు(అక్టోబరు 24- 28)వేదిక: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణెటాస్: న్యూజిలాండ్.. మొదట బ్యాటింగ్న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 259టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 156న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 255టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 245ఫలితం: 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపుచదవండి: IND vs NZ: పుణె టెస్టులో ఓటమి.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?
IND vs NZ: టీమిండియా ఘోర ఓటమి.. సిరీస్ కివీస్ సొంతం
స్వదేశంలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. పుణే వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్ కోల్పోయింది.359 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 245 పరుగులకే ఆలౌటైంది. మరోసారి కివీస్ స్పిన్నర్లు భారత్కు చుక్కలు చూపించారు. ముఖ్యంగా మిచెల్ శాంట్నర్ రెండో ఇన్నింగ్స్లో కూడా 6 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు.అతడితో పాటు అజాజ్ పటేల్ 2 వికెట్లు, ఫిలిప్స్ ఒక్క వికెట్ సాధించాడు. భారత బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్ 77 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు కివీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 232 పరుగులకు ఆలౌటైంది. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ టామ్ లాథమ్(86) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో లభించిన 103 పరుగుల ఆధిక్యాన్ని జోడించి భారత్ ముందు 359 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఉంచింది. ఈ భారీ టార్గెట్ చేధించడంలో రోహిత్ సేన చతికలపడింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్ల దారుణ ప్రదర్శన కనబరిచారు. మొదటి ఇన్నింగ్స్లో కివీస్ స్పిన్నర్ల దాటికి టీమిండియా కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో శాంట్నర్ 7 వికెట్లతో సత్తాచాటాడు. ఓవరాల్గా పుణే టెస్టులో 13 వికెట్లు పడగొట్టిన శాంట్నర్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు నవంబర్ 1 నుంచి వాంఖడే వేదికగా జరగనుంది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు(అక్టోబరు 24- 28)వేదిక: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణెటాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 259టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 156న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 255భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 245ఫలితం: 113 పరుగుల తేడాతో భారత్ ఓటమి
చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్..
పుణే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓటమి ముగింట నిలిచింది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ మరోసారి భారత్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు తీసిన శాంట్నర్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో కూడా 5 వికెట్లతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ,సర్ఫరాజ్, గిల్, జైశ్వాల్ వంటి కీలక వికెట్లు పడగొట్టి భారత్ను దెబ్బ తీశాడు.ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సాంట్నర్ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్తో టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలోనూ 5 వికెట్ల హాల్ సాధించిన తొలి కివీ స్పిన్నర్గా సాంట్నర్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ న్యూజిలాండ్ స్పిన్నర్ కూడా భారత్పై ఈ ఫీట్ నమోదు చేయలేకపోయారు. ఓవరాల్గా ఒకే టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలోనూ 5 వికెట్ల ఘనత సాధించిన రెండో కివీస్ స్పిన్నర్గా సాంట్నర్ రికార్డులకెక్కాడు. సాంట్నర్ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి రెండు సార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆస్ట్రేలియా,బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో వెట్టోరి ఈ ఘనత సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో ఓవరాల్గా రెండు ఇన్నింగ్స్లు కలిపి 13 వికెట్లు పడగొట్టాడు.చదవండి: విరాట్ కోహ్లి వల్లే ఇదంతా?.. ఫ్యాన్స్ ఫైర్
విరాట్ కోహ్లి వల్లే ఇదంతా?.. ఫ్యాన్స్ ఫైర్
పుణె టెస్టులో భారత బ్యాటర్ల ఆట తీరుపై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ లక్ష్యం ముందున్నా చెత్త షాట్లు ఆడి వికెట్ పారేసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రిషభ్ పంత్ రనౌట్ అయిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.తప్పు ఎవరిది? పంత్ అవుట్ కావడానికి విరాట్ కోహ్లినే కారణమని కొందరు.. పంత్ స్వీయ తప్పిదం వల్లే ఇలా జరిగిందని మరికొందరు సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ప్రేమికులు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కాగా న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుపెట్టింది.ఈ క్రమంలో కివీస్ను తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులకు కట్టడి చేయగలిగిన భారత్.. బ్యాటింగ్లో మాత్రం తేలిపోయింది. తమ మొదటి ఇన్నింగ్స్లో 156 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 103 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్.. 255 పరుగులు చేసింది. ఫలితంగా టీమిండియా ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.అయితే, టార్గెట్ ఛేదనలో టీమిండియా ఆరంభం నుంచే తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ 8 పరుగులకే నిష్క్రమించగా.. శుబ్మన్ గిల్ 23 రన్స్ చేశాడు. ఈ క్రమంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్(77).. విరాట్ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ మిచెల్ సాంట్నర్ ఈ జోడీని విడగొట్టాడు. జైస్వాల్ను అతడు అవుట్ చేయడంతో.. రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు.ఈ క్రమంలో కోహ్లితో కలిసి పంత్ భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టెక్కిస్తారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే, కోహ్లి- పంత్ తొందరపాటు చర్య వల్ల టీమిండియా భారీ మూల్యమే చెల్లించింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో 23వ ఓవర్లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్ వేశాడు.మెరుపు వేగంతో బాల్ విసరడంతోఅప్పటికి క్రీజులో ఉన్న కోహ్లి బంతిని లెఫ్ట్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా గట్టిగా బాదాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో బంతిని అందుకున్న ఫీల్డర్ మిచెల్ సాంట్నర్ .. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ వైపు వేగంగా విసిరాడు. అప్పటికే సింగిల్ కోసం పంత్ నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి ముందుకు రాగా.. కోహ్లి కూడా పరుగుకు వెళ్లాడు. అయితే, అంతలోనే సాంట్నర్ మెరుపు వేగంతో బంతిని విసరడం.. బ్లండెల్ వికెట్లకు గిరాటేయడం జరిగిపోయింది.అప్పటికి పంత్ డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు డకౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో టీమిండియా 245 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 113 పరుగుల భారీ తేడాతో ఓడి కివీస్కు సిరీస్ను 0-2తో సమర్పించుకుంది.చదవండి: దంచికొట్టిన యశస్వి జైస్వాల్.. సొంతగడ్డపై అరుదైన రికార్డుTrust me bro Kohli ran pant out 😭 pic.twitter.com/0qmNYdZhYh— M. (@IconicKohIi) October 26, 2024Kohli saw pant is running thn he Ran .. clearly pant' call.. and lazy lazy running from him #INDvsNZ pic.twitter.com/Tv5lJm89Gj— भाई साहब (@Bhai_saheb) October 26, 2024
బిజినెస్
ఆనంద్ గ్రూప్ ఫౌండర్ కన్నుమూత
ఆనంద్ గ్రూప్ వ్యవస్థాపకుడు దీప్ సి ఆనంద్ కన్నుమూశారు. 91 ఏళ్ల వయసులో శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. అక్టోబరు 27న హౌజ్ ఖాస్లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో అంతిమ ప్రార్థనలు నిర్వహించనున్నారు.ఆనంద్ సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో చదువుకున్నారు. యూకేలోని చిపెన్హామ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. ముంబైలోని మహీంద్రా అండ్ మహీంద్రాలో ప్లాంట్ మేనేజర్గా 1954లో తన కెరీర్ను ప్రారంభించారు. ఆనంద్ 27 ఏళ్ళ వయసులో తన మొదటి వ్యాపార వెంచర్, గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ గాబ్రియేల్ ఇండియాను ప్రారంభించారు. షాక్ అబ్జార్బర్లను తయారు చేసే ఈ కంపెనీని అమెరికాకు చెందిన మేర్మాంట్ కార్పొరేషన్తో కలిసి ఆయన స్థాపించారు.తరువాతి దశాబ్దాలలో వివిధ దేశాలకు చెందిన అగ్ర ఆటోమోటివ్ సంస్థలు ఎన్నింటితోనో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆనంద్ గ్రూప్ భారతదేశంలోని అనేక సంస్థలకు విస్తృత శ్రేణి ఆటోమోటివ్ భాగాలను సరఫరా చేస్తుంది. అలాగే తమ ఉత్పత్తులలో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంది. 2017లో ఆనంద్ గ్రూప్ టర్నోవర్ రూ. 9,000 కోట్లు.
ఫిట్నెస్ కోసం హోం జిమ్!
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో వివిధ అంశాలపై స్పందిస్తూ నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తుంటారు. ఫిజికల్ ఫిట్నెస్కు చాలామంది ప్రాధాన్యం ఇస్తారు. అందుకు జిమ్కు వెళ్లాలని అనుకుంటారు. కానీ ప్రత్యేకంగా జిమ్కు వెళ్లకుండా ఒకే పరికరంతో ఇంట్లోనే ఆ అనుభూతిని పొందుతూ ఫిట్గా ఉండొచ్చంటూ మహీంద్రా తెలిపారు. అందుకు సంబంధించి ఇటీవల ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అరొలీప్ అనే సంస్థ ద్వారా ఈ పరికరాన్ని నలుగురు ఐఐటీ విద్యార్థులు తయారు చేసినట్లు మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.Home gym created by 4 IIT grads. No rocket science here.But a clever convergence of mechanics & physical therapy principles to design a product that has global potential. In small apartments & even in Business Hotel rooms! Bravo! pic.twitter.com/Tz1vm1rIYN— anand mahindra (@anandmahindra) October 24, 2024ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్న్యూస్‘ఈ హోమ్ జిమ్ పరికరాన్ని నలుగురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు తయారు చేశారు. ఇదేమంతా రాకెట్ సైన్స్ కాదు. ఈ పరికరాన్ని చిన్న అపార్ట్మెంట్లు, హోటల్ రూమ్ల్లో, చిన్న ఇళ్లల్లోనూ వినియోగించేలా ఏర్పాటు చేశారు. మెకానిక్స్, ఫిజికల్ థెరపీను అనుసందానిస్తూ దీన్ని తయారు చేయడం నిజంగా గొప్ప విషయం’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ కంపెనీలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా ఇన్వెస్ట్ చేసినట్లు వీడియో ద్వారా తెలిసింది. ఇందులో ఏఐ ఆధారిత ట్రెయినింగ్ సెషన్లు కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
వామ్మో.. పసిడి దడ! నేడు ఎంతలా ఎగిసిందంటే..
Gold Price Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వరుసగా రెండో రోజూ దడ పుట్టించేలా ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు నేడు (అక్టోబర్ 26) భారీగా ఎగిశాయి. ఈరోజు ఎక్కడెక్కడ ఎంత మేర రేట్లు పెరిగాయన్నది ఇక్కడ తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో నేడు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర అమాంతం రూ.650 పెరిగి రూ.73,600 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.710 ఎగిసి రూ. 80,290 లను తాకింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదేవిధంగా ధరలు భగ్గుమన్నాయి.ఇదీ చదవండి: బంగారంపై పండుగ ఆఫర్లుదేశ రాజధాని అయిన ఢిల్లిలో కూడా ఈరోజు బంగారం ధరలు భారీగా ఎగిశాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.650 పెరిగి రూ.73,750 లను తాకగా, 24 క్యారెట్ల బంగారం కూడా రూ.710 పెరిగి రూ.80,440 వద్దకు ఎగిసింది.Silver Price Today: దేశంలో వెండి ధరలు శనివారం నిలకడగా ఉన్నాయి. క్రితం రోజున భారీగా కేజీపై రూ.3000 క్షీణించిన వెండి నేడు స్థిరంగా ఉంది. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్న్యూస్
దేశంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడేళ్ల తర్వాత తన మదుపర్లకు శుభవార్త చెప్పింది. ఈ దీపావళి పండగ నేపథ్యంలో ధన్తేరాస్కు ముందు అక్టోబర్ 28న బోనస్ షేర్ల రికార్డు తేదీని ప్రకటించింది. గత ఏడేళ్ల నుంచి కంపెనీ ఎలాంటి బోనస్ షేర్లను ప్రకటించకపోవడంతో మదుపర్లు కొంత నిరాశతో ఉన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఇటీవల భారీగా పడిపోయింది. కేవలం ఈ కంపెనీ అనే కాదు, మార్కెట్ సూచీలు భారీగా నష్టాల బాటపట్టాయి. అక్టోబర్ 25తో ముగిసిన ట్రేడింగ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.2,655.45గా ఉంది. తాజాగా కంపెనీ 1:1 బోనస్ ప్రకటించింది. అంటే డీమ్యాట్లో ఒక షేర్ ఉంటే అదనంగా మరో షేర్ జమ అవుతుంది. అందుకు అనుగుణంగా షేర్ ధర కూడా సమానంగా డివైడ్ అవుతుంది. ఫలితంగా ధర తగ్గినట్లు కనిపిస్తుంది. ఈ బోనస్కు అక్టోబర్ 28ను రికార్డు తేదీగా నిర్ణయించారు. ఆ తేదీలోపు డీమ్యాట్ ఖాతాలో కంపెనీ షేర్లు ఉంటే ఈ బోనస్కు అర్హులుగా పరిగణిస్తారు.ఇదీ చదవండి: గ్రామీణ బ్రాడ్బ్యాండ్ విస్తరణకు ఏం చేయాలంటే..రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫార్చ్యూన్ 500 కంపెనీ(అధిక రెవెన్యూ సంపాదిస్తూ అంతర్జాతీయంగా సర్వీసులు అందించే కంపెనీలకు ఇచ్చే గుర్తింపు). ఇది ఎనర్జీ, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, పునరుత్పాదక ఇంధనం, ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా వంటి విభిన్న రంగాల్లో సేవలిందిస్తోంది. 2023-24లో రూ.80 వేలకోట్ల ఆదాయం సంపాదించింది. 2024 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.17,55,986 కోట్లుగా ఉంది.
ఫ్యామిలీ
భోజనం చేస్తుండగా సడెన్గా కోతి ఎంట్రీ..ఐతే ఆ తర్వాత..!
ఒక్కోసారి జంతువులు మనతో ప్రవర్తించే తీరు భయబ్రాంతులకు, ఆశ్చర్యానికి లోను చేస్తాయి. ఆ క్షణంలో చాలామంది భయంతో హడావిడి చేస్తే..కొందరు మాత్రం చాలా కూల్గా వ్యవహరిస్తారు. నిజానికి ఆ జంతువుల సడెన్ ఎంట్రీ కంటే.. వాటితో కొందరు వ్యక్తులు వ్యవహరించే తీరు అత్యంత ఆశ్చర్యానికి గురి చేస్తాయి. పైగా ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానీ అయోమయానికి గురవ్వుతాం కూడా. అచ్చం అలాంటి సందర్భమే ఇక్కడ చోటు చేసుకుంది. మనం ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో భోజనం చేస్తుండగా సడెన్గా ఓ కోతి నేరుగా మనవద్దకు వస్తే ఏం చేస్తాం చెప్పండి. భయంతో వణికిపోతాం. దాన్ని పొమ్మనే ప్రయత్నమే లేక మనమే పక్కకు తప్పుకునే యత్నమో చేస్తాం కదా..!. కానీ ఈ పెద్దాయన మాత్రం అలా చేయలేదు తాను భోజనం చేస్తుండగా వచ్చిన కోతిని చూసి భయపడ లేదు కదా..!. దాన్ని చూసి ఛీత్కరించనూ లేదు. ఆ కోతి తన పళ్లెంలోనే తింటున్న ఏం అనలేదు. పైగా దాన్ని తినమని ప్రోత్సహిస్తూ.. ఆయన కూల్గా భోజనం చేశారూ. అంతేగాదు అక్కడ వడ్డించేవాళ్లు ఆ కోతికి అంతరాయం కలగకుండా చూడటమే కాకుండా..బెదురు లేకుండా తినేలా ఆ కోతికి పెద్దాయన భరోసా ఇవ్వడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న చుట్టుపక్కల వాళ్లు కూడా ఒకింత ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ పెద్దాయన చేసిన పనికి మెచ్చుకోవడమే గాక హనుమాన్ జీ మీతో విందుని పంచుకోవాలనుకున్నారు కాబోలు అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by shalu Sharma (@shalu_weightlifter) (చదవండి: నగదు రహిత చెల్లింపుల్లో అంతకుమించి..!వాట్ ఏ టెక్నాలజీ..?)
ఆనంద్ మహీంద్రా మెచ్చే వంటకాలివే..! శాకాహారుల..
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా అంటూ మంచి ఆసక్తికర విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. ఆయన ఇతరుల టాలెంట్ని, గమ్మత్తైన విషయాలను షేర్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తుంటారు. అలాంటి మహింద్రా ఈసారి తన కిష్టమైన వంటకాలు గురించి చెప్పుకొచ్చారు. తాను కూడా మంచి ఆహారప్రియుడేనని చెప్పకనే చెప్పారు. ఇంతకీ ఆయన మెచ్చే వంటకాలేంటంటే..ఆనంద్ మహీంద్రా తాజాగా సోషల్ మీడియాలో శాకాహార పంజాబీ వంటకాల పోస్ట్తో నెటిజన్లను ఆకర్షించారు. వంటకాల్లో మాంసాహార వంటకాల రుచే అగ్ర స్థానం అయినా ఆయన శాకాహార వంటకాలకే ప్రాధాన్యాత ఇచ్చారు. అంతేగాదు పంజాబ్ వంటకాలను శాకాహారుల స్వర్గంగా అభివర్ణించారు. ఎప్పుడైన సరదాగా పంజాబ్ నడిబొడ్డున తప్పనిసరిగా ఘుమఘుమలాడే ఈ ఏడు రకాల పంజాబీ వంటకాలను ట్రై చేయాల్సిందే అంటూ వాటి గురించి సవివరంగా వివరించారు.షాహి పనీర్పర్ఫెక్ట్ రుచి కోసం క్రీమీ గ్రేవీతో ఉంటే పనీర్ క్యూబ్స్ వంటకం బెస్ట్. ఇది తేలికపాటి సుగంధద్రవ్యాలు, పెరుగుతో రుచికరంగానూ, ఆకర్షణీయంగా ఉంటుంది. దీన్ని పరాఠాతో ఆస్వాదిస్తే ఆ రుచే వేరు అని చెబుతున్నారు మహీంద్రా. రాజ్మా చావల్గ్లూటెన్ ఫ్రీ మీల్ కోసం ట్రై చేయాలనుకుంటే..రాజ్మా డిష్ని తినాల్సిందే. చక్కగా ఉల్లిపాయలు, టమోటాలు, కొద్దిపాటి సుగంధద్రవ్యాలతో చేసే వంటకం లంచ్లో కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీన్ని రైతా, ఊరగాయలతో తింటే టేస్ట్ అదుర్స్.పాలక్ పనీర్పంజాబీ-స్టైల్ పాలక్ పనీర్ను ఆస్వాదించాలంటే ముందుగా పాలక్ని మెత్తని పేస్ట్గా చేయాలి. ఆ మిశ్రమన్ని ఉల్లిపాయాలు, టమాటాల మిశ్రమంలో వేసి ఉడికించి చివరగా క్యూబ్డ్ పనీర్లతో ఉడికించి తింటే అబ్బబ్బా..! ఆ రచే వేరేలెవెల్..!దాల్ మఖానీకిడ్నీ బీన్స్తో తయారు చేసే వంటకం. దీన్ని వెన్నతో తయారు చేసే క్రీమ్ లాంటి గ్రేవీతో కూడిన వంటకం. ఉత్తర భారతీయుల వంటకాల్లో అత్యంత టేస్టీ వంటకం ఇదే. తప్పక రుచి చూడాల్సిందే.పనీర్ టిక్కామంచి ఆకలితో ఉన్నవారికి తక్షణమే శక్తినిచ్చి సంతృప్తినిచ్చే మంచి వంటకం. చక్కగా మెరినేషన్ చేసిన క్యూబ్డ్ పనీర్ని బంగారు రంగులో వేయించి వివిధ కూరగాయలతో సర్వ్ చేస్తారు. ఇది ప్రతి వేడుకలో ఉండే అద్భుతమైన వంకటం. పుదీనా చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. చోలే భాతురేశెనగలతో చేసే కర్రీ. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వండే రుచికరమైన వంటకం. పూరీ, పరాఠాలలో అదిరిపోతుంది. దీనిలో ఉల్లిపాయలు, ఊరగాయ వేసుకుని చాట్ మాదిరిగా తిన్నా ఆ టేస్ట్ ఓ రేంజ్లో ఉంటుంది. మక్కీ డి రోటీ విత్ సర్సన్ డా సాగ్సార్సన్ డా సాగ్ అనేది సుగంధ ద్రవ్యాలు, ఆవపిండితో చేసే కర్రీ. మక్కీ డి రోటీ అంటే మొక్కజొన్న పిండితో చేసే ఒకవిధమైన రోటీ. వీటిని పెనంపై కాల్చరు. బోగ్గుల మీద లేదా వేడి గ్రిడిల్పై నేరుగా కాల్చుతారు. ఇంకెందుకు ఆలస్యం ఆనంద్ మహీంద్రా మెచ్చే ఈ వంటకాలను ఓసారి ట్రై చేయండి మరీ..!.(చదవండి: యువరాజా ఇదేం అవేర్నెస్ క్యాంపెయిన్..? ఏంటీ తీరు..?)
మెరిసే మేని చాయను కాపాడుకోడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య మేని ఛాయను కాపాడుకోవడం చాలాకష్టం. కాలుష్యం, సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షణ పొందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవేంటో చూద్దామా! తక్షణ తాజాదనం కోసం రోజ్ వాటర్ లేదా దోసకాయ రసంతో మేనికి మర్దనా చేసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. పచ్చి పాలను కాటన్ బాల్తో అద్దుకొని, ముఖానికి రాయాలి. 10 నిమిషాలపాటు అలాగే ఉంచి కడిగేయాలి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మాన్ని సున్నితంగా ఉంచడంతోపాటు శుభ్రపరుస్తుంది.చర్మంపై నుంచి సహజ నూనెలను ΄ోకుండా ఉండటానికి చర్మతత్వానికి సరి΄ోయే తేలిక΄ాటి, క్లెన్సర్ని ఉపయోగించాలి. ఓట్మీల్లో తేనె, కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్ చేయాలి. మృత చర్మ కణాలను తొలగించడానికి, పోర్స్ను శుభ్రం చేయడానికి సున్నితంగా స్క్రబ్ చేయాలి.ప్రతిరోజూ కలబంద జెల్ను రాసి, మృదువుగా మర్దనా చేయాలి. దీని వల్ల చర్మం నునుపుగా, తేమగా ఉంటుంది. టేబుల్ స్పూన్ తేనెను, టేబుల్ స్పూన్ పెరుగుతో కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది.సగం అరటిపండును మెత్తగా చేసి, టీస్పూన్ తేనెతో కలపాలి. చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.కొద్దిగా గ్రీన్ టీని కాచి, చల్లబరచాలి. ఈ నీటిని దూదితో అద్దుకుంటూ, మేనికి పట్టించాలి. ఎండకు కమిలిన చర్మం తాజాగా మారుతుంది.
సాహసమే ఊపిరిగా..! ఏకంగా 14 పర్వతాలను ..!
అభిరుచి, అంకితభావం, పట్టుదల ఒక దగ్గర చేరితే ఏమవుతుంది? అపురూప విజయం అవుతుంది. ఆడ్రియానా బ్రౌన్లీ సాధించిన చారిత్రక విజయం అవుతుంది. ప్రపంచంలోని 14 ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా 23 ఏళ్ల ఆడ్రియానా బ్రౌన్లీ రికార్డ్ సృష్టించింది. లండన్లో పుట్టి పెరిగిన బ్రౌన్లీకి చిన్నప్పటి నుంచి ఎత్తైన పర్వతాలను అధిరోహించిన వారి గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. నాన్న పర్వతారోహకుడు. పర్వతారోహణకు సంబంధించి ఆయన చెప్పే ఒళ్లు గగుర్పొడిచే విషయాలను వినడం అంటే ఇష్టం.ఎనిమిదేళ్ల వయసులో పర్వతారోహకుడైన తండ్రి నుంచి ప్రేరణ ΄పొందింది బ్రౌన్లీ. పెద్ద పర్వతాలు అధిరోహించి పెద్ద పేరు తెచ్చుకోవాలని కలలు కనేది. ఇరవై ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో ఆ కల సాకారం అయింది. ఆక్సిజన్ లేకుండా గాషెర్బ్రమ్ 1కు చేరుకున్న అతి పిన్న వయస్కురాలిగా, కే2 శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది.చైనాలోని 8,000 మీటర్ల ఎత్తులో ఉన్న పిషాపాంగ్మా పర్వతాన్ని అధిరోహించడం ద్వారా 14 శిఖరాల అధిరోహణను పూర్తి చేసింది. నిర్మలమైన ఆకాశం సాక్షిగా, సూర్యోదయం వెలుగులో పిషాపాంగ్మా పర్వతం దగ్గరకు చేరుకోగానే బ్రౌన్లీ భావోద్వేగానికి గురైంది. ‘శిఖరానికి చేరుకోకముందే నా లక్ష్యం నెరవేరబోతుంది అనే ఆనందంలో ఏడ్వడం మొదలు పెట్టాను’ అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకుంది. బ్రౌన్లీ సాధించిన చారిత్రక విజయం కేవలం సంఖ్యకు సంబంధించినది కాదు. అంకితభావాన్ని, నిబద్దతను ప్రతిఫలించే అపురూప విజయం అది. పర్వతారోహణ అనేది అభిరుచి మాత్రమే కాదు త్యాగాల సమాహారం. పర్వతారోహణపై దృష్టి పెట్టిన బ్రౌన్లీ టీనేజ్ సంతోషాలకు దూరమైంది. తన కలను సాకారం చేసుకోవడానికి యూనివర్శిటీకి దూరమైంది. వ్యక్తిగత విజయాలపై మాత్రమే బ్రౌన్లీ దృష్టి పెట్టలేదు. పర్వతారోహణ విషయంలో యువతను ప్రోత్సహించడానికి, వారు తమ కలలను సాకారం చేసుకునే విషయంలో సహకరించడానికి నడుం కట్టింది.‘సాహసం మంచిదేగానీ దుస్సాహాసం తగదు’ అంటున్న బ్రౌన్లీ ఎంతోమంది పర్వతారోహకులను దగ్గర నుంచి చూసింది. వారిలో ఉత్సాహమే కనిపిస్తుంది. శిక్షణ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ‘సాహసాల పేరుతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం నాకు తెలుసు. పర్వతారోహణ పేరుతో సాహసాలకు దిగే కొద్దిమందికి ప్రాథమిక విషయాల్లో కూడా అవగాహన లేదని తెలుసుకున్నాను. ఉత్సాహమే కాదు శిక్షణ కూడా చాలా ముఖ్యం. అనుభవం లేని పర్వతారోహకులను ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి అనుమతించరాదు. వారు తమ ప్రాణాల తోపాటు ఇతరులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి ప్రయత్నించే పర్వతారోహకులు ముందుగా చిన్న పర్వతాలను అధిరోహించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అంటుంది బ్రౌన్లీ. ‘ఎప్పుడు పర్వతాల గోలేనా’ అని బ్రౌన్లీని స్నేహితులు వెక్కిరించేవారు. అయితే ఆమె అలాంటి వెక్కిరింపులను ఎప్పుడూ పట్టించుకోలేదు.‘జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆ లక్ష్యం మీకు ప్రత్యేకమైనది కావచ్చు. ఇతరులకు వింతగా అనిపించవచ్చు’ అంటుంది బ్రౌన్లీ. ఒక పర్వతానికి మరో పర్వతానికి సంబంధం ఉండదు. ప్రతి పర్వతం తనదైన సవాళ్లు విసురుతుంటుంది. ‘ప్రతి సవాలు విలువైనదే’ అంటున్న ఆడ్రియానా బ్రౌన్లీ మరిన్ని సాహసాలకు సిద్ధం అవుతుంది.(చదవండి: తాటి ఆకుల కళ..! 75 ఏళ్ల బామ్మ..)
ఫొటోలు
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు ఇవే.. ధర తెలిస్తే షాకవుతారు! (ఫోటోలు)
గ్లామర్లో హీరోయిన్లకు పోటీ.. టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
12 ఏళ్ల తర్వాత తొలిసారి.. టీమిండియాకు ఘోర పరాభవం (ఫోటోలు)
ఈ ‘టీమిండియా క్రికెటర్’ ప్రముఖ నటి రాధికా శరత్కుమార్ అల్లుడు (ఫొటోలు)
భారత్లో ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. షిల్లాంగ్ తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)
తెలుగమ్మాయే కానీ తమిళంలో ఫేమస్.. రీసెంట్గా ప్రియుడితో పెళ్లి (ఫొటోలు)
లక్ అంటే మీనాక్షిదే.. నెల గ్యాప్లో మూడు సినిమాలు (ఫొటోలు)
వదినా.. సుధీర్ బ్రోని కలిసేదెప్పుడు..రష్మి పోస్ట్పై నెటిజన్ కామెంట్ (ఫొటోలు)
గ్లామర్ డోస్ పెంచిన పొలిమేర-2 హీరోయిన్ 'కామాక్షి భాస్కర్ల' (ఫొటోలు)
హీరోయిన్ అమలాపాల్ కొడుకు ఎంత క్యూట్గా ఉన్నాడో.. చూడండి (ఫొటోలు)
National View all
బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియాపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఇటీవల దేశీయ విమానాలతోపాటు అంతర్జాతీయ విమానాలకు న
Maharashtra: బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగను
‘నన్ను క్షమించండి’.. జేఈఈ పరీక్ష ఫెయిల్ అవ్వడంతో..!
న్యూఢిల్లీ: చిన్న చిన్న కారణాలతోనే విలువైన ప్రాణాలు బలి తీసు
రెండు చేతులు చాచి ఆహ్వానం పలుకుతున్నా అంటూ విజయ్ లేఖ
దళపతి విజయ్ కొన్ని గంటల్లో తన అభిమానులను కలవనున్నాడు.
యమునలో మునకేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్.. ఆస్పత్రిలో చికిత్స
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి
International View all
ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు ఇరాన్ సైనికులు మృతి
టెహ్రాన్: ఇజ్రాయెల్ తమ దేశంపై జరిపిన దాడుల్లో ఇద్దరు సైనికు
ఇరాన్పై దాడి.. మూడు దేశాల గగనతలం మూసివేత
టెహ్రాన్:తమపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇ
ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం
ఏకంగా 70 అంతస్తుల భవనం అంత ఎత్తున్న భారీ గ్రహశకలం ఈ నెల 28న భూమికి సమీపానికి రాబోతోంది.
ట్రంప్, హారిస్ ప్రచారంపై చైనా హ్యాకర్ల టార్గెట్!
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.
ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు
జెరూసలేం: ఇరాన్కు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా శనివారం
NRI View all
కెనడా డ్రీమ్స్ : వాక్-ఇన్ ఓవెన్లో శవమై తేలిన వాల్మార్ట్ ఉద్యోగి
కెనడాలోని హాలిఫాక్స్లోని వాల్మార్ట్ వాక్-ఇన్ బేకరీ ఓవెన్లో వాల్మా
హెచ్1బీ వీసా రెన్యువల్ కోసం తిప్పలు!
అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న మనోళ్లకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి.
చికాగో ఫ్యాన్స్ మీట్లో శృతిహాసన్ సందడి
శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
న్యూజెర్సీలో బ్రెస్ట్ కేన్సర్పై నాట్స్ వాక్ అండ్ టాక్ ఈవెంట్
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో బ్రెస్ట్ కే
డల్లాస్లో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్ టోర్నీ
అమెరికాలో తెలుగు వారిని ఒక్కటి చేసే విధంగా నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
క్రైమ్
లింక్ క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ
నాలుగు రోజుల కిందట పలమనేరుకు చెందిన రాము అనే వ్యక్తి సెల్ఫోన్లోని వాట్సాప్కు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు పేరిట ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. దానిపై క్లిక్ చేయడంతో కొన్ని క్షణాలు సెల్ఫోన్ హ్యాంగ్ అయినట్లు అనిపించింది. కొద్దిసేపటి తర్వాత అతను ఒక దుకాణంలో సరుకులు కొనుగోలు చేసి గూగుల్ పే ద్వారా రూ.300 చెల్లించాడు. ఆ వెంటనే అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.6వేలను విత్ డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో కంగుతిన్న రాము బ్యాంక్కు వెళ్లి ఆరా తీస్తే విదేశాల నుంచి వాట్సాప్కు హ్యాకర్లు పంపిన ఏపీకే ఫైల్పై క్లిక్ చేయడంతో ఫోన్ హ్యాక్ చేసి గూగుల్ పే వాడినప్పుడు పాస్వర్డ్ను సేకరించి డబ్బులు స్వాహా చేశారని తేలింది. ఇదే తరహాలో కొద్దిరోజులుగా పలమనేరు ప్రాంతంలో వందలాది మందికి జాతీయ బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైల్స్, యాప్ లింక్లు వస్తున్నాయి.హ్యాకర్లు ఇటీవల బ్యాంకుల పేరిట ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వివిధ రకాల బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైళ్లు, యాప్ల లింక్లను వాట్సాప్కు పంపిస్తున్నారు. వాటిపై క్లిక్ చేసినవారి సెల్ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నారు. ఆ ఫోన్ను తమ ఆ«దీనంలోకి తీసుకుంటున్నారు. మనతో సంబంధం లేకుండా మన మొబైల్ను మిర్రర్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను లూటీ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా మన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న సభ్యులకు మన ఫోన్ నుంచే ఒకేసారి ఏపీకే, బగ్ యాప్ లింకులను పంపిస్తున్నారు. మనపై ఉన్న నమ్మకంతో స్నేహితులు, బంధువులు, తెలిసినవారిలో ఎవరైనా ఆ యాప్ల కింద ఉన్న బగ్ లింక్ను టచ్ చేస్తే వాళ్ల ఫోన్లను కూడా హ్యాకింగ్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును లూటీ చేస్తున్నారు. – పలమనేరుఎక్కువగా గ్రూపులకు... మన మొబైల్ నంబర్కు సాధారణంగా దేశం కోడ్ +91గా ముందుంటుంది. కానీ హ్యాకర్లు మన నంబర్ను హ్యాక్ చేసి దాని ముందు +44 పెట్టి ఇంటర్నెట్, డార్క్నెట్ ఆధారంగా వాట్సాప్లో మోసపూరిత బగ్స్, లింకులు పంపిస్తున్నారు. ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఈ తరహా మెసేజ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. మెసేజ్ పంపిన మొబైల్ నంబర్ తెలిసిన వారిదిలాగే కనిపిస్తుంది. కానీ ఇందులో ఇంటర్నేషనల్ కోడ్ మాత్రం మార్పు ఉంటుంది. ఈ విషయం తెలియని వాట్సాప్ గ్రూపుల్లోని సభ్యులు మనవాళ్లే మెసేజ్ పంపారని ధైర్యంగా ఆ లింకును ఓపెన్ చేసి మోసపోతున్నారు. అదేవిధంగా గూగుల్, జూమ్ మీటింగ్లలో ఎక్కువ మంది పాల్గొన్నప్పుడు డార్క్నెట్ ద్వారా ఆ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఒకరి నంబరు హ్యాక్ చేసి, అతని నంబరు ద్వారా మిగిలిన సభ్యులు అందరికీ మోసపూరిత యాప్లు, బగ్స్ లింక్లను కొన్ని నిమిషాల్లోనే పంపిస్తున్నారు. వారు కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ వీటిపై క్లిక్ చేస్తే సులభంగా హ్యాకింగ్ చేస్తున్నారు. ఇలా చేస్తే మేలు... మన సెల్ఫోన్ ఒక్కసారిగా హ్యాంగ్ అయితే వెంటనే హ్యాక్ అయ్యిందేమోనని అనుమానించాలి. గత కొన్ని రోజులుగా ఏమైనా కొత్త లింక్లపై క్లిక్ చేశారా.. అనేది చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా మోసపూరిత లింక్, ఫైల్పై క్లిక్ చేసినట్లు గుర్తిస్తే వెంటనే ఫోన్ను రీసెట్ కొట్టాలి. ఫోన్లోని ఈ–మెయిల్, పాస్వర్డ్లు అన్ని మార్చివేయడం మంచింది. హ్యాకింగ్ అనుమానం వస్తే ఫోన్పే, గూగుల్ పే, మొబైల్ బ్యాంకింగ్ వంటివి పూర్తిగా నిలిపివేయాలి. ఫోన్పే, గూగుల్ పే, పే టీఎం వంటి పేమెంట్ యాప్లు అన్ ఇన్స్టాల్ చేయాలి. కాగా, బ్యాంకుల నుంచి వాట్సాప్కు ఎటువంటి మెసేజ్లు, లింక్లు పంపించరని బ్యాంకర్లు చెబుతున్నారు. ఏదైనా బ్యాంకు పేరుతో మెసేజ్ వస్తే వెంటనే సమీపంలోని బ్రాంచ్లో గానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
ఒకే ఆస్పత్రిలో తండ్రి మరణం.. కొడుకు జననం
రాజోళి: విధి ఆ కుటుంబంతో వింత నాటకమాడింది. భర్త చనిపో యాడని బాధపడాలో.. అతనికి ప్రతిరూపంగా జన్మించిన కొడుకు ను చూసి సంబరపడాలో తెలియని దయనీయస్థితి ఏర్పడింది ఆ తల్లి కి. జోగుళాంబ గద్వాల జిల్లా రాజో ళి మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన శివ (28)కు ఏపీ లోని ఉమ్మడి కర్నూలు జిల్లా బల పాలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మితో ఏడాది క్రితం వివాహమైంది. కాగా మంగళవారం శివ తుమ్మలపల్లె నుంచి రాజోళికి వెళ్తున్న క్ర మంలో బైక్ అదుపు తప్పి కిందపడగా తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న శివ భార్య లక్ష్మితో పాటు కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున శివ మృతి చెందగా, తర్వాత గంట సమయంలోనే పురిటి నొప్పు లతో శివ భార్య అదే ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఒకవైపు భర్త చనిపోయాడనే బాధ.. మరోవైపు కొడుకు రూపంలో మళ్లీ జన్మించాడనే నమ్మకంతో ఆమె పడిన వేదన వర్ణనాతీతం. పుట్టిన బిడ్డను చూసుకునే భాగ్యం తండ్రికి లేదని, బిడ్డకు తండ్రిని చూపించే అదృష్టం తల్లికి లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
తొమ్మిదో అంతస్తు నుంచి దూకి టెకీ ఆత్మహత్య
సాక్షి,హైదరాబాద్:సాఫ్ట్వేర్ ఉద్యోగిని హరిత హైదరాబాద్ నగరం ఉప్పల్లోని బహుళ అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం(అక్టోబర్21) అర్ధరాత్రి ఉప్పల్ డీఎస్ఎల్ మాల్ పక్కన ఉన్న ఐటీ కంపెనీ భవనం తొమ్మిదవ అంతస్తు నుంచి దూకడంతో ఆమెను చికిత్స కోసం రామంతాపూర్లోని మ్యాట్రిక్స్ ఆస్పత్రికి తరలించారు.అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే హరిత మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. ఐటీ ఉద్యోగిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: పెళ్లి చేయడం లేదని తండ్రి హత్య
బైక్ కొనలేదని విద్యార్థి ఆత్మహత్య
పీఎంపాలెం: పుట్టిన రోజు నాడు విషాద సంఘటన చోటుచేసుకుంది. తండ్రి బైక్ కొనలేదని కోపంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ప్రాణస్నేహితులను దుఃఖ సాగరంలో ముంచెత్తాడు. పీఎంపాలెం గాయత్రీనగర్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సోమవారం జరిగిన సంఘటనకు సంబంధించిన సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. పేరిశెట్టి సూర్యనారాయణ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామం నుంచి సుమారు ఆరేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. ప్రస్తుతం ఓ కళాశాలలో హాస్టల్ కుక్గా పనిచేస్తూ పీఎంపాలెం గాయత్రీనగర్లో భార్య గంగ, పెద్ద కుమారుడు గణేష్ , 9వ తరగతి చదువుతున్న చిన్న కుమారుడు లోకేష్తో కలిసి నివసిస్తున్నాడు. పెద్ద కుమారుడు నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం పుట్టిన రోజు కావడంతో సాయంత్రం కేక్ కట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో ఇంటి తలుపులు వేసుకుని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. అనుకోని పరిణామంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు వేలాడుతున్న గణేష్ను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు.బైక్ కొనమని తండ్రితో గొడవవిద్యార్థి గణేష్ ఎప్పటి నుంచో బైక్ కొనమని తల్లిదండ్రులను వేడుకుంటున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. బైక్ కొనే స్థోమత ఆ కుటుంబానికి లేదు. ఇదే విషయం తల్లిదండ్రులు గణేష్ నచ్చచెప్పినప్పటికీ వినేవాడు కాదు. ఈ విషయంపైనే తండ్రితో గొడవ పడినట్టు స్థానికులు చెబుతున్నారు. బైక్ కొనే స్థోమత లేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వీడియోలు
తెలంగాణ కాబినెట్ కీలక నిర్ణయాలు
హైదరాబాద్ లో సింథటిక్ డ్రగ్స్
నమ్మించి మోసం చేసిన కూటమి కరెంటు బిల్లులు బాదుడే బాదుడు..
ఆత్మహత్యకు యత్నించిన మహిళను పరామర్శించిన కన్నబాబు
పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం
సనాతన ధర్మం గురించి నాతో చర్చించే దమ్ముందా..?
బాబుగారు మనం ఫెయిల్.. లైవ్ లో షాక్ ఇచ్చిన కార్యకర్త
IND vs NZ: రెండో టెస్టులో భారత్ ఓటమి..
తిరుపతిలో హోటల్సు కు బాంబు బెదిరింపు..
బోనస్ దేవుడెరుగు.. మద్దతు ధరకే దిక్కులేదు: కేటీఆర్