వస్తున్నాయ్ కొత్త కార్లు.. ఈ నెలలో లాంచ్ అయ్యే మోడల్స్ ఇవే!
సాధారణంగా ఎవరైనా కొత్త కార్లు కొనాలంటే.. జనవరి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. అయితే ఈసారి జనవరి కంటే ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే కొత్త కార్ల సంఖ్య ఎక్కువగా ఉంది.నిస్సాన్ టెక్టెన్: నిస్సాన్ కంపెనీ తన ఫ్లాగ్షిప్ మోడళ్లలో ఒకటైన టెక్టెన్ను ఈ నెల 4న (ఫిబ్రవరి 4) ఆవిష్కరించింది. మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగానికి చెందిన ఈ కారు.. అమ్మకాల్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడుతుంది. ఇది రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఒకటి 100 బీహెచ్పీ పవర్ అందించే.. 1.0 లీటర్ త్రీ లీటర్ టర్బో పెట్రోల్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ DCTతో లభిస్తుంది. మరొకటి 163 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఎంజీ మెజెస్టర్: భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన.. ఎంజీ మోటార్ ఇండియా కూడా ఈ నెల 12 (ఫిబ్రవరి 12) మెజెస్టర్ కారును ఆవిష్కరించనుంది. కంపెనీ ఈ కారును మొదటిసారి 2025 ఆటోఎక్స్పోలో ప్రదర్శించింది. దీని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న గ్లోస్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొన్ని తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంజిన్లో కూడా ఎటువంటి మార్పు లేదు. గ్లోస్టర్ కారులోని అదే 2.0-లీటర్ డీజిల్ ట్విన్-టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఫెసిలిటీలు ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎక్స్-3 30 ఎక్స్డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో: బీఎండబ్ల్యూ కూడా ఈ నెల 16న.. ఎక్స్-3 విభాగంలో 30 ఎక్స్డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో లాంచ్ చేయనుంది. ఇది సాధారణ స్పోర్ట్స్ వేరియంట్ మాదిరిగానే.. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది. అయితే ఈ వేరియంట్లో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ను కొనసాగించారు. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్ ఉంటుంది. 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ కారు.. 14.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.మారుతి సుజుకి ఈ-విటారా: మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో మారుతి సుజుకి.. ఎలక్ట్రిక్ కారు ఈ విటారా, ఈ నెలలోనే లాంచ్ అవుతుంది. ఇది మహీంద్రా బీఈ6, హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, విన్ఫాస్ట్ వీఎఫ్6 వంటి మొదళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 543 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. రియల్ వరల్డ్ రేంజ్ అనేది కొంత తగ్గుతుంది.ఫోక్స్వ్యాగన్ టైరోన్: ఫోక్స్వ్యాగన్ టైరోన్ కూడా ఈ నెలలోనే విడుదలవుతుంది. ఇది 204 బీహెచ్పీ పవర్ అందించే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం ఉంటుంది. ఇందులో 15 ఇంచెస్ సెంట్రల్ టచ్స్క్రీన్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ, హీటింగ్, వెంటిలేషన్ అండ్ మసాజ్ ఫంక్షన్లతో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్గేట్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.టాటా సియెర్రా ఈవీ: ఇప్పటికే పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో అందుబాటులో ఉన్న టాటా సియెర్రా.. ఈ నెలలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుంది. దీని డిజైన్.. సాధారణ కారు కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ప్రధానంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కొంత ప్రత్యేకంగా ఉంటుంది. హారియర్ ఈవీ ప్లాట్ఫామ్పై నిర్మితమైన ఈ కారు.. ఆల్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది.
‘సర్’పై కమల్ హాసన్ ఏమన్నారంటే..
ఢిల్లీ: కమల్ హాసన్ రాజ్యసభలో చేసిన తొలి ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడులో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR)పై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ వల్ల అర్హులైన సుమారు కోటి మంది ఓటర్లు చనిపోయిన వారి జాబితాలో చేరే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా తన తొలి ప్రసంగంలోనే ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్పై విమర్శలు గుప్పించారు. ఆయన దీన్ని ఒక వ్యాధిగా అభివర్ణిస్తూ, ఇది ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీసే చర్య అని అన్నారు.సవరణ ప్రక్రియలో తప్పుగా పేర్లు తొలగించబడే అవకాశం ఎక్కువగా ఉంది. ఫలితంగా, నిజంగా జీవించి ఉన్న ఓటర్లు కూడా జాబితాలో లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఎన్నికల సంఘం ఈ విధమైన చర్యల ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని కమల్ హాసన్ ఆరోపించారు. ప్రజలకు ఉన్న ఓటు హక్కును కాపాడటం ప్రభుత్వాల బాధ్యత అని, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతత్వం కోసం ప్రయత్నించకూడదని ఆయన స్పష్టం చేశారు.తమిళనాడులో ఇటీవల జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో 97.4 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 6.41 కోట్ల నుంచి 5.43 కోట్లకు తగ్గింది. ఈ తొలగింపులపై ఇప్పటికే వివాదం చెలరేగింది.తన ప్రసంగంలో కమల్ హాసన్ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, ప్రజల హక్కులను గౌరవించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. “ప్రజాస్వామ్యం శాశ్వతం, కానీ ప్రభుత్వాలు తాత్కాలికం. ప్రజల హక్కులను దెబ్బతీయడం ఎప్పటికీ అంగీకారయోగ్యం కాదు’అని వ్యాఖ్యానించారు.కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజల హక్కుల పరిరక్షణపై ఆయన చేసిన ఆందోళన, భవిష్యత్తులో రాజకీయ వేదికపై మరింత చర్చకు దారితీయనుంది.
దారీ తెన్నూ లేని జెన్–జీ తుపాను
బంగ్లాదేశ్లో ఈ నెల 12న, నేపాల్లో వచ్చే నెల 5న పార్లమెంటు ఎన్నికలు జరగనుండగా, అక్కడ తిరుగుబాట్లు చేసి ప్రభుత్వాలను కూలదోసిన జెన్–జీ ఉద్యమాలు దారీ తెన్నూ లేకుండా పోయాయి. ఆ రెండు తిరుగుబాట్లు చేసిన యువతరానికి అందుకు తగిన కారణాలైతే ఉన్నాయి. కొన్ని లక్ష్యాలనూ ప్రకటించారు. కానీ, రోజులు గడిచేకొద్దీ తమ సిద్ధాంతాలు ఏమిటో తెలియక, తగిన రాజకీయ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేక, నాయకులను ఎంపిక చేసుకోలేక అన్ని విధాలా అయోమయాలకు గురయ్యారు. చివరకు ఎన్నికలు ప్రకటించే వేళకు అనేక గ్రూపులుగా మారి ఎవరి దారి వారిదయింది. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సమాజాలు ఈ సరికే నిరాశకు గురైన స్థితిలో, ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాతి పరిపాలనలు ఏ విధంగా ఉండేదీ అర్థంకాని పరిస్థితి కనిపిస్తున్నది.స్పష్టత లేని బంగ్లా యువతబంగ్లాదేశ్ విద్యార్థి–యువజనుల తిరుగుబాటు 2024 జూన్లో మొదలైంది. అప్పటి ప్రధాని షేక్ హసీనా సాగించిన అణచివేతను తట్టుకుని మరింత తీవ్రంగా మారింది. రెండు నెలల పాటు జరిగిన ఉద్యమాన్ని పరిష్కరించలేక షేక్ హసీనా రాజీనామా చేసి భారత దేశానికి పారిపోయి వచ్చారు. ఆ దరిమిలా, నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనుస్ ప్రధాన సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆయన పార్లమెంట్ను రద్దు చేసి కొత్త ఎన్నికలు ప్రకటించారు.అప్పటి నుంచి నెలలు గడుస్తున్నా, తిరుగుబాటుతరం ఏమి చేయగలదీ స్పష్టత రాలేదు. వారిలో పలు గ్రూపులు తయారు కాగా, కనీసం కొందరు ముఖ్యులతో కలిపి ఒక నాయకత్వాన్ని ఎంపిక చేసుకోలేక పోయారు. చివరకు కొద్దిమంది కలిసి ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ పేరిట ఒక పార్టీని రిజిస్టర్ చేశారు. కానీ అందులో ఐక్యత లేక పోయింది. అంతకన్నా ముఖ్యంగా, తమ సిద్ధాంతం ఫలానా అని నిర్ణయించుకుని దేశానికి తెలియజెప్పలేక పోయారు. నమ్మకం కోల్పోయిన తిరుగుబాటుతిరుగుబాటులో వారికి మద్దతుగా నిలిచిన ప్రజలు కోరుకున్నది నిర్దిష్టమైన నాయకత్వం, సిద్ధాంతాలు గల ఒక ప్రత్యామ్నాయ పార్టీని! విద్యార్థులు, యువకులు దేనికి నిరసనగా,ఏ లక్ష్యాలతో తిరుగుబాటు జరిపారో వాటి నుంచి, పాత పార్టీలకు భిన్నమైన ఒక కొత్త పార్టీని!! కానీ, తిరుగుబాటు రోజుల నుంచి సుమారు సంవత్సర కాలం గడిచినా ఇవేవీ జరగలేదు.షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ఇక రంగంలో ఉండదని తేలిపోగా, మిగిలిన రెండు ప్రధానమైనవి ఖలీదా జియా మరణం తర్వాత ఆమె కుమారుడు తారిఖ్ రహమాన్ నాయకత్వాన గల‘బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ’, ‘జమాతే ఇస్లామీ పార్టీ’లు. విద్యార్థుల తీరు వల్ల వారి పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లగా, ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బీఎన్పీ,జమాతే అగ్రస్థానంలో నిలిచాయి. విద్యార్థుల పార్టీ ఎక్కడో వెనుకబడి పోయింది. దానితో ఆందోళన చెందిన ఆ పార్టీ నాయకత్వం జమాతేతో పొత్తు కలవగా, ఒక మతతత్వ పార్టీతో ఐక్య సంఘటనను నిరసిస్తూ పలువురు విద్యార్థి నాయకులు బయటకు పోయారు. బయటి సమాజంలోనూ తీవ్రమైన విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో జరగనున్న ఎన్నికలలో విద్యార్థుల పార్టీ నుంచి గెలిచేది ఎందరనే ప్రశ్న ఎట్లున్నా, వారి ఉద్యమం ఈ రోజున ఎక్కడ మిగిలింది, తమ లక్ష్యాలను ఏ మేరకు సాధించనున్నది, తమపై ఆశలు పెట్టుకుని బలపరచిన ప్రజలకు ఏమి చెప్పగలదన్నది మౌలికమైన ప్రశ్న. అందులో విఫలమైన పక్షంలో, ఇకభవిష్యత్తులోనూ అవే పాత పార్టీలు అధికారానికి రాగల అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నందున, ఆ నాయకత్వాలు తామేదో మారామని బయటకు చెప్తున్నా అటువంటి ఆశలు ఎవరికీ లేని స్థితిలో, ఉద్యమ ప్రభావాలు శూన్యంగా మిగల నున్నాయంటే పొరపాటు ఉండబోదు. మునుముందు మరొక మారు తిరుగుబాటు తలెత్తితే ప్రజలు విశ్వసించటం తేలిక కాబోదు.చీలిన నేపాల్ గ్రూపులునేపాల్ను గమనించినా పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. అక్కడి జెన్–జీ ఉద్యమం నిరుడు సెప్టెంబర్లో ఒకేమారు అగ్నిపర్వతం వలె పేలి కేవలం రెండు రోజులలో ప్రభుత్వాన్ని కూలదోసి, పార్లమెంటును రద్దు చేయించింది. వారి నిరసనలు కూడా బంగ్లాదేశ్లో వలె అవినీతి, నిరుద్యోగం, అసమానతలు, బంధుప్రీతి, ఆర్థిక సమస్యలు, అసమర్థ పాలనకు సంబంధించినవే. అక్కడి ప్రజలు వారిని పూర్తిగా బలపరచి, వారి నాయకత్వాన ప్రత్యామ్నాయ రాజకీయ, పరిపాలనా వ్యవస్థలు ఏర్పడగలవని ఆశించారు. తిరుగుబాటు ఆకస్మికం అయినందున దేశమంతటా ఎక్కడికక్కడ కలిపి మొత్తం సుమారు 60 జెన్–జీ గ్రూపులు ఉనికిలోకి రాగా, వాటిలో కనీసం కొన్ని ముఖ్యమైనవి ఒక్కటై ప్రత్యామ్నాయాన్ని సృష్టించగలవనుకున్నారు.కానీ, నెలలు గడిచిపోతున్నా అది జరగకపోగా అనేక గ్రూపులు తమ గత కాలపు సిద్ధాంతాలు, వ్యక్తిగత అనుబంధాలను బట్టి, లేదా టికెట్లు ఆశించి ప్రధానమైన అయిదు పాత పార్టీలతో చేరాయి. రెండు మూడు గ్రూపులు సొంత పార్టీలు ఏర్పాటు చేశాయి గానీ అవి బలహీనంగా మిగిలిపోయాయి. ఉద్యమకారులకు, ప్రజలకు కూడా తగినంత అభిమానం ఉన్నట్లు భావించే మాజీ ఉపప్రధాని రవి లమిఛానే, ఖాట్మండు మాజీ మేయర్ బాలేన్ షా, జాతీయ విద్యుత్ సంస్థ మాజీ ఎం.డి. ఘీషింగ్ కలిసి ఏర్పాటు చేసిన పార్టీ కొన్ని ఆశలు రేకెత్తించింది గానీ, మొదలైన వారం రోజులకే చీలిపోయింది. విచిత్రం ఏమిటంటే, ఇంతటి తిరుగుబాటు జరిగి, దాని నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని నేపాలీ కాంగ్రెస్, మాజీ ప్రధానులు ఓలీ పార్టీ, ప్రచండ పార్టీ, బాబూరాం భట్టరాయ్ పార్టీ, మాజీ ఉపప్రధాని లమిఛానే పార్టీలు ప్రకటించినా, ఆ పాఠాలు ఏమిటో, భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటో వివరిస్తూ మేనిఫెస్టోలను ఏ ఒక్కరూ ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారాలు మొదలు పెట్టారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు హతాశులై మిగిలారు.గత రెండేళ్ళలో బంగ్లాదేశ్, నేపాల్లోనే కాదు. మరొక డజను దేశాలలోనూ జెన్–జీ తిరుగుబాట్లు జరిగాయి. ఒకటి రెండు చోట్ల కొన్ని రాయితీలు సాధించినా ప్రత్యామ్నాయాలన్నవి ఎక్కడా ఏర్పడ లేదు. ప్రతిచోటా వెనుకటి పార్టీల రాజ్యమే కొనసాగుతున్నది. ఇందులో ఆశ్చర్యం లేదు. ఉద్యమాలు తగినంత కాలం సాగి, తమ వైన సిద్ధాంతాలు, నాయకత్వాలతో ఒక రూపానికి వచ్చి, ప్రజలను మెప్పిస్తే తప్ప, ప్రత్యామ్నాయాలు సిద్ధించవు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
మణిపుర్ చక్కబడేనా!
రెండున్నరేళ్లపాటు కనీవినీ ఎరుగని హింసతో అట్టుడికి, నిరుడు ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలనలో కొచ్చిన మణిపుర్లో ఎట్టకేలకు బుధవారం ముమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కుకీ, నాగా తెగలకు చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే మెయితీ తెగకు చెందినవారే అయినా ఖేమ్చంద్కు మధ్యేవాదిగా ముద్ర ఉంది. మణిపుర్ సమాజంలో తీవ్రస్థాయి విద్వేషాలు ప్రబలిన వర్తమానంలో ఆగ్రహావేశాలు అంత త్వరగా సమసిపోవు. అందుకే కుకీ–జో తెగలకు చెందిన పదిమంది ఎమ్మెల్యేల్లో ఎవరూ ‘మెయితీ ప్రభుత్వం’లో చేరొద్దంటూ ఆ తెగలకు చెందిన సంస్థలు హెచ్చరించాయి. దాన్ని బేఖాతరు చేసి, ఢిల్లీలోని మణిపుర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ వేదికగా ప్రమాణం చేసిన మహిళా ఎమ్మెల్యే నెమ్చా కిప్జెన్పై నిప్పులు చెరిగారు. రాజధాని ఇంఫాల్లో ఆమె ప్రమాణం చేయలేకపోవటానికి రెండు కారణాలున్నాయి. మెయితీల ఆధిక్యత గల ఇంఫాల్ మణిపుర్ లోయలో ఉంది. వారినుంచి సమస్య ఎదురయ్యే అవకాశం ఉండటంతోపాటు, కుకీలు కూడా దాడిచేసే ప్రమాదం ఉంటుంది. సమస్య ఎంత జటిలంగా మారిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ వ్యవహార శైలి మెరుగ్గావుంటే, ఇలాంటి సమస్యలు త్వరలోనే సర్దుకుంటాయి. అయితే సమాజంలో సామరస్యతకు ముందు సొంతింటిని చక్కదిద్దుకోవటానికి బీజేపీ కృషి చేయాల్సి ఉంది. అధిష్ఠానం మాటవినే సంస్కృతికి భిన్నంగా అప్పటి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇష్టారాజ్యం సాగించారు. పరిస్థితి క్షీణిస్తోందని ఢిల్లీ పెద్దలు హెచ్చరిస్తున్నా ధోరణి మార్చుకోలేదు. రాజీనామా చేయమని ఆదేశిస్తే శిరసావహించి నట్టు కనబడి, పెద్ద డ్రామా సృష్టించి జనం అడ్డుకున్నారని ఆగిపోయారు. ఎట్టకేలకు నిరుడు ఫిబ్రవరి 9న ఆయనతో రాజీనామా చేయించి, రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. అప్పటికే ఆయన తప్పు మీద తప్పు చేస్తూ వచ్చారు. ఏకపక్షంగా వ్యవహరించి కుకీల్లో అసంతృప్తి రెచ్చగొట్టారు. వారితో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం నుంచి తప్పుకొని ఆగ్రహావేశాలను పెంచారు. వారిని గంజాయి పండించేవారిగా, మాదకద్రవ్య పంపిణీదార్లుగా, అక్రమ వలసదారులకు ఆశ్రయమిచ్చేవారిగా చిత్రించారు. మణిపుర్లో హింస చెలరేగే నాటికే అక్కడ ఇరుపక్షాల్లోనూ ప్రభుత్వంపై అవిశ్వాసం ఏర్పడింది. 2023 మే నుంచి హత్యలు, లూటీలు, గృహదహనాలు, పార్థనా స్థలాలకు నిప్పెట్టడ యథేచ్ఛగా కొనసాగాయి. 260 మంది హత్యకు గురయ్యారని, 1,000 మంది గాయపడ్డారని, 32 మంది అదృశ్యమయ్యారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 60,000 మందికి పునరావాస శిబిరాలే శాశ్వత చిరునామాలయ్యాయి. అంతా సవ్యంగా ఉన్నందువల్లే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిందని అనుకోనవసరం లేదు. రాష్ట్రపతి పాలన ఏడాదికి మించి పొడిగిస్తే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. అందుకే ప్రభుత్వ ఏర్పాటు తప్పలేదు. ఇప్పటికీ మెయితీలు, కుకీ–జోలు ఒకరి ప్రాంతంలోకి మరొకరు పోయే పరిస్థితి లేదు. తమ ప్రాంతాలకు స్వయంపాలన హక్కు ఇచ్చేందుకు అంగీకరించి, అందుకు నిర్దిష్ట కాల పరిమితిని లిఖిత పూర్వకంగా ప్రకటిస్తేనే ప్రస్తుతానికి ప్రభుత్వంలో పాలుపంచు కునేందుకు సిద్ధపడతామని కుకీ–జో తెగలు ఇప్పటికే తెలిపాయి. ఆ విషయంలో ఏమీ తేల్చి చెప్పలేదన్న ఆగ్రహంతోనే కొత్త సర్కారులో ఎవరూ భాగస్వామ్యం తీసుకోవద్దని వారు పిలుపునిచ్చారు. ఆ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికే కేంద్రం విడిచిపెట్టదల్చుకున్నదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఆ నిర్ణయం సంగతలా ఉంచి ముందు సంయమనం పాటించటం, అందరినీ కలుపుకొని వెళ్లటం వంటివి అవసరమని ఖేమ్చంద్ తెలుసుకోవాలి. ఎన్నికైన ప్రభుత్వం వస్తే కనీసం సమస్యలు చెప్పుకునే వీలుంటుందని జనం అనుకుంటారు. అలాగని ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్షణ పరిష్కారాలపై పెద్ద ఆశలేమీ ఉండవు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్న విశ్వాసమైతే కలగాలి. ఆ విశ్వాసాన్ని ఖేమ్చంద్ ప్రభుత్వం పొంద గలిగితే కొంతమేర విజయం సాధించినట్టే!
ఓయూ ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు పరీక్ష 22న
ముగ్గురు ఎమ్మెల్యేలపై కుకీల సామాజిక బహిష్కరణ
అప్పు.. తప్పు అని నిరూపించగలరా?
ఎంపీగా సిగ్గుతో తలదించుకుంటున్నా
200 భారత వెబ్సైట్లను సీజ్ చేసిన అమెరికా
గ్రూప్–1 పారదర్శకమే..
మైనార్టీలకు 4 శాతం కోటా అమలుకు కృషి చేస్తా
కశ్చిరీలకు మద్దతుగా పాక్లో ర్యాలీలు
ఢిల్లీ, గుజరాత్లలో ‘భారత్ ట్యాక్సీ’
రేవంత్ సర్టిఫికెట్ను వెనక్కి తీసుకోండి
పసిడి, వెండి గుడ్న్యూస్.. రేట్లు రివర్స్!!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
పాక్తో ఉద్రిక్తతల నడుమ ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం
ఈ మధ్య అదే రాజ్యమేలుతోంది!!
IND vs PAK: పాక్కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్!
చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు
ఏపీలో జంగిల్రాజ్
పాస్పోర్ట్ కొత్త రూల్స్.. పది రోజుల్లో అమల్లోకి!
ఈ రాశి వారికి నూతనోత్సాహం.. ఆర్థిక ప్రగతి
అక్కడ బీఆర్ఎస్తో ఇక్కడ బీజేపీతో ఎక్కువ చోట్ల మనవాళ్లతోనే పోటీ సార్!
యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ
భారత్తో జరగాల్సిన మ్యాచ్కు జట్టును ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు
వరల్డ్కప్ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్!
అందుకే పిల్లలు వద్దనుకున్నా: నటి
అంతసేపు పని చేయడం నావల్ల కావట్లేదు!
T20 WC: పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి..
సోనమ్ను మించిన ఖతర్నాక్ అంజూ.. ఈ హనీమూన్ కథలో ట్విస్టులెన్నో!
ఓటీటీలో 'పరాశక్తి.. తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్
వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు!
భారత్ను పదోసారి ఫైనల్కు చేర్చిన ఈ 'ఆరోన్ జార్జ్' ఎవరు..?
ఓయూ ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు పరీక్ష 22న
ముగ్గురు ఎమ్మెల్యేలపై కుకీల సామాజిక బహిష్కరణ
అప్పు.. తప్పు అని నిరూపించగలరా?
ఎంపీగా సిగ్గుతో తలదించుకుంటున్నా
200 భారత వెబ్సైట్లను సీజ్ చేసిన అమెరికా
గ్రూప్–1 పారదర్శకమే..
మైనార్టీలకు 4 శాతం కోటా అమలుకు కృషి చేస్తా
కశ్చిరీలకు మద్దతుగా పాక్లో ర్యాలీలు
ఢిల్లీ, గుజరాత్లలో ‘భారత్ ట్యాక్సీ’
రేవంత్ సర్టిఫికెట్ను వెనక్కి తీసుకోండి
పసిడి, వెండి గుడ్న్యూస్.. రేట్లు రివర్స్!!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
పాక్తో ఉద్రిక్తతల నడుమ ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం
ఈ మధ్య అదే రాజ్యమేలుతోంది!!
IND vs PAK: పాక్కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్!
చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు
ఏపీలో జంగిల్రాజ్
పాస్పోర్ట్ కొత్త రూల్స్.. పది రోజుల్లో అమల్లోకి!
ఈ రాశి వారికి నూతనోత్సాహం.. ఆర్థిక ప్రగతి
అక్కడ బీఆర్ఎస్తో ఇక్కడ బీజేపీతో ఎక్కువ చోట్ల మనవాళ్లతోనే పోటీ సార్!
యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ
భారత్తో జరగాల్సిన మ్యాచ్కు జట్టును ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు
వరల్డ్కప్ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్!
అందుకే పిల్లలు వద్దనుకున్నా: నటి
అంతసేపు పని చేయడం నావల్ల కావట్లేదు!
T20 WC: పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి..
సోనమ్ను మించిన ఖతర్నాక్ అంజూ.. ఈ హనీమూన్ కథలో ట్విస్టులెన్నో!
ఓటీటీలో 'పరాశక్తి.. తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్
వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు!
భారత్ను పదోసారి ఫైనల్కు చేర్చిన ఈ 'ఆరోన్ జార్జ్' ఎవరు..?
ఫొటోలు
బ్లూ డ్రెస్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)
ఈయనే నా కెప్టెన్: శేఖర్ కమ్ముల కూతురు (ఫోటోలు)
ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)
ఫ్యామిలీతో వండర్ పార్క్లో లహరి (ఫోటోలు)
బర్త్డే బ్యూటీ 'స్వాతిరెడ్డి'.. ట్రెండింగ్లో ఫోటోలు
‘శ్రీ చిదంబరంగారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ ‘మారెమ్మ’ మూవీ టీజర్ ఈవెంట్ (ఫొటోలు)
మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)
నేను తప్పు చేసినా సహించావ్.. సంఘవి ఎమోషనల్ (ఫోటోలు)
అంబటి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
సినిమా
పెద్ది, డకాయిట్.. ఇక ది ప్యారడైజ్ వంతు..!
ఇటీవల కొద్దికాలంగా టాలీవుడ్ సినిమా పరిస్థితి కాస్తా అయోమయానికి గురి చేస్తోంది. పెద్ద హీరోల చిత్రాల రిలీజ్ డేట్లను ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుందనేది పక్కాగా ముందే చెప్పేస్తున్నారు. ఆ రోజే గ్రాండ్ రిలీజ్ అంటూ పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. తీరా డేట్ దగ్గరికొచ్చేసరికి వాయిదా వేసుకుంటూ పోతున్నారు. భారీ బడ్జెట్, స్టార్ హీరో ఉన్నా సరే విడుదలకు వెనకాడుతున్నారు. తాజాగా టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. ఏకంగా ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. గ్లోబల్ స్టార్ చెర్రీ- బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ వాయిదా పడడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఈ మార్చిలో పెద్ది చూడాలనుకున్న సినీ ప్రియులకు కూడా ఈ నిరాశే మిగిల్చింది.అంతేకాకుండా అడివి శేష్ డకాయిట్ సైతం మరోసారి వాయిదా పడింది. గతంలో చాలాసార్లు వాయిదా పడినా.. ఈ ఏడాది మార్చి 19న వస్తామని ప్రకటించారు. అంతలోనే డకాయిట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఇక మార్చిలో వస్తోన్న టాలీవుడ్ మూవీ ది ప్యారడైజ్. నాని హీరోగా వస్తోన్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అదే రోజు ఉస్తాగ్ భగత్ సింగ్ విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో నాని మూవీ కూడా దాదాపు వాయిదా పడిందనే వార్తలొస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. దీంతో ఈ చిత్రాలన్నీ సమ్మర్కు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.దురంధర్-3 దెబ్బకేనా?ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వాయిదా వేయడం అభిమానుల్లో నిరాశ పెంచుతోంది. తమ అభిమాన హీరోల చిత్రాలు పోస్ట్పోన్ కావడం వల్ల ఫ్యాన్స్లో ఉన్న క్యూరియాసిటీ తగ్గుతోంది. అయితే ఇలా వరుసగా టాలీవుడ్ సినిమాలు వాయిదా పడడానికి ప్రధాన కారణం ఆ ఒక్క సినిమానేనా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మార్చి 19న రానున్న దురంధర్-2 దెబ్బకేనని సగటు సినీ ప్రియుడు భావిస్తున్నారు. లేదంటే నిజంగానే షూటింగ్ పెండింగ్ వల్ల వాయిదా వేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. వరుసగా మూడు టాలీవుడ్ చిత్రాలు వాయిదా పడడంతో సినీ ప్రియుల్లో అసలేం జరుగుతోందనే డౌటానుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యానిమల్ సినిమా.. ఒప్పుకోవాలంటే భయమేసింది: హీరో
సందీప్రెడ్డి వంగా సత్తా ఉన్న దర్శకుడు. అర్జున్రెడ్డి సినిమాతోనే తన టాలెంట్ చూపించాడు. అదే సినిమాను హిందీలో కబీర్సింగ్గా తెరకెక్కించి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత అతడు తెరకెక్కించిన మూవీ యానిమల్. రణ్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా 2023 డిసెంబర్లో విడుదలై అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ జపాన్లో ఫిబ్రవరి 13న విడుదల కానుంది.భయపడ్డా..ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్లో రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణ్బీర్ మాట్లాడుతూ.. గతంలో నేను ఎక్కువగా లవర్ బాయ్ ఇమేజ్ పాత్రలే చేశాను. యానిమల్ కథ చెప్పగానే నా పాత్ర గురించి విని భయపడ్డాను. కానీ సందీప్రెడ్డి నాపై పెట్టుకున్న నమ్మకంతో ధైర్యాన్ని కూడదీసుకున్నాను. సినిమాలో నేను పోషించిన రణ్విజయ్ పాత్ర భయంకరంగా ఉంటుంది. అది బాగా నచ్చిందికాకపోతే అతడిలో చాలా భావోద్వేగాలుంటాయి. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. ఈ పాయింట్ ప్రపంచంలో ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. తండ్రీకొడుకుల మధ్య అనుబంధం పైకి కనిపించదు. నా జనరేషన్లోని అందరి ఇంట్లో ఇదే పరిస్థితి ఉంటుంది. తల్లితో ఉన్నంత క్లోజ్గా తండ్రితో ఉండం. దూరాన్ని మెయింటైన్ చేస్తాం. అదే ఈ సినిమాలో నాకు బాగా కనెక్ట్ అయింది అని చెప్పుకొచ్చాడు.ఎప్పుడో ఫిక్సయ్యా..సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. రణ్బీర్కు అంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది కొత్త. అందువల్ల కథ చెప్పగానే తాను చేయగలనా? లేదా? అని భయపడిపోయాడు. కథ చెప్పిన తర్వాత స్క్రిప్ట్ అతడి చేతికిచ్చాను. కొంత టైం తీసుకున్నాకే ఓకే చెప్పాడు. అయితే ఈ కథ రాసుకుంటున్నప్పుడే నేను రణ్బీర్ను ఫిక్సయిపోయాను అని తెలిపాడు. ఇకపోతే యానిమల్కు సీక్వెల్గా యానిమల్ పార్కింగ్ 2028లో రానుంది.
మళ్లీ యాక్ట్ చేస్తాననుకోలేదు: రియా ఎమోషనల్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి కెరీర్, జీవితం చిన్నాభిన్నమైంది. సుశాంత్ మృతి, డ్రగ్స్ కేసులో రియా అరెస్టయి జైలు జీవితం కూడా గడిపొచ్చింది. 5 ఏళ్లపాటు ఎన్నో నిందలు మోసింది. చివరకు సుశాంత్ మృతి కేసుకు, రియాకు ఎటువంటి సంబంధం లేదని 2025లో సీబీఐ కేసు క్లోజ్ చేయడంతో ఆమెకు ఉపశమనం లభించింది. రీఎంట్రీకానీ సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. ఇక తన కెరీర్ క్లోజ్ అయినట్లేనని రియా ఎంతో దిగులుచెందింది. అలాంటి సమయంలో నెట్ఫ్లిక్స్ నుంచి పిలుపొచ్చింది. ఫ్యామిలీ బిజినెస్ వెబ్ సిరీస్లో నటించే అవకాశం అందుకుంది. రెండు రోజుల క్రితమే సిరీస్ టీజర్ వదిలారు. తన రీఎంట్రీ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రియా. 7 ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. నిజంగా నమ్మలేకపోతున్నాను.కెరీర్ ముగిసిందనుకున్నా అంతా ఒక కలలా ఉంది. మళ్లీ నటిస్తానని అస్సలు ఊహించలేదు. యాక్టర్ అవ్వాలని 17 ఏళ్ల వయసులో బలంగా అనుకున్నాను. నా జర్నీ మొదలుపెట్టాను, కానీ మధ్యలోనే ఆగిపోయింది. అవకాశాలు రావడం పూర్తిగా ఆగిపోయాయి. నటనకు చరమగీతం పాడక తప్పదనుకున్నాను. ఇంతలోనే మళ్లీ యాక్ట్ చేసే అవకాశం.. ఈ మధ్యకాలంలో ఎన్నో మార్పులు. అయినా ఇదెంత బాగుందో అని చెప్పుకొచ్చింది.నా జీవితంలో రెండో చాప్టర్ ఈ వీడియోకు సెట్కు వెళ్లి ఏడేళ్లవుతోంది. నటి అవ్వాలన్న కోరికతో 17 ఏళ్ల వయసులో ముంబైలో అడుగుపెట్టినప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఇది నా జీవితంలో ఇది రెండో చాప్టర్. నా ప్లాన్స్లో నేనుంటే జీవితం నన్నిలా సర్ప్రైజ్ చేసింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కంగ్రాచ్యులేషన్స్, నీకు అంతా శుభమే జరగాలి అని కామెంట్లు చేస్తున్నారు.సినిమారియా చక్రవర్తి వీడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టింది. తూనీగ తూనీగ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మేరే డాడ్కీ మారుతి, సోనాలి కేబుల్, బ్యాంక్ చోర్, హాఫ్ గర్ల్ఫ్రెండ్, జిలేబి వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. రియా చివరగా 2019లో వచ్చిన చెహ్రె మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) చదవండి: రాత్రంతా నిద్ర పట్టలేదు.. ఏడ్చేసిన భూమిక
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం శ్రీ చిదంబరం గారు, సుమతీ శతకం, యూఫోరియా, బరాబర్ ప్రేమిస్తా లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో సుమతీ శతకం, యూఫోరియా లాంటి సినిమాలపై కాస్తా బజ్ ఉంది. పెద్ద సినిమాలేవీ ఈ ఫ్రైడే బాక్సాఫీస్ బరిలో లేకపోవడంతో సినీ ప్రియులు కాస్తా నిరాశకు గురవుతున్నారు.ఇక ఈ శుక్రవారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే సంక్రాంతి మూవీ సందడి చేయనుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఈ ఫ్రైడ్ ఓటీటీకి వస్తోంది. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. అయితే అనుకున్నంత స్థాయిలో ఈ మూవీ రాణించలేకపోయింది. ఈ మూవీతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ ఫ్రైడే ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 06 సాల్వడార్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 06 ట్రాన్స్ఫార్మర్స్ వన్(యానిమేటేడ్ మూవీ)- ఫిబ్రవరి 06 యో బెస్టీ(హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 06అమెజాన్ ప్రైమ్ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 06 ఎల్ఓఎల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 06 వయోలెంట్ ఎండ్స్(హాలీవుడ్ మూవీ)-ఫిబ్రవరి 06జియో హాట్స్టార్ ది రాజాసాబ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06జీ5 షాబాద్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06 పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 07సన్ నెక్స్ట్ నీలకంఠ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06సోనీ లివ్ జాజ్ సిటీ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06టెంట్ కోట్టాకోంబుసివీ(తమిళ సినిమా)- ఫిబ్రవరి 06హెచ్బీవో మ్యాక్స్బాయ్స్ గో టూ జూపిటర్(యానిమేషన్ చిత్రం)- ఫిబ్రవరి 06ముబీ..లా గ్రేజియా(హాలీవుడ్)- ఫిబ్రవరి 06హులు..స్పిట్స్విల్లే(హాలీవుడ్)- ఫిబ్రవరి 06
క్రీడలు
ఫైనల్లో ఢిల్లీ ఓటమి.. డబ్ల్యూపీఎల్-2026 విజేతగా ఆర్సీబీ
RCB vs DC Women Final live updates and highlights: డబ్ల్యూపీఎల్-2026 ఛాంపియన్స్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఆర్సీబీకి ఇది రెండో డబ్ల్యూపీఎల్ టైటిల్. ఢిల్లీ విధించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ త్వరగా ఔటైనప్పటికి కెప్టెన్ స్మృతి మంధాన(41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 87),జార్జియా వోల్ (53 బంతుల్లో 79) విధ్వంసం సృష్టించారు. ఆఖరిలో రాదా యాదవ్(5 బంతల్లో 12) కీలక ఇన్నింగ్స్ ఆడింది.వాల్ అవుట్174 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 79 పరుగులు చేసిన వాల్.. మిన్ను మణి బౌలింగ్లో పెవిలియన్కు చేరింది. ఆర్సీబీ విజయానికి 18 బంతుల్లో 27 పరుగులు కావాలి.13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 135/113 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. జార్జియా వాల్(67), కెప్టెన్ మంధాన(56) దూకుడుగా ఆడుతున్నారు.దంచి కొడుతున్న వాల్, మంధాన9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో వాల్(46), స్మతి మంధాన(32) ఉన్నారు. ఆర్సీబీ విజయానికి 66 బంతుల్లో 113 పరుగులు కావాలి.దూకుడుగా ఆడుతున్న వాల్4 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. క్రీజులో వాల్(17), మంధాన(5) ఉన్నారు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. 9 పరుగులు చేసిన గ్రేస్ హ్యారిస్.. హెన్రీ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యారు.ఢిల్లీ బ్యాటర్ల జోరు.. ఆర్సీబీ టార్గెట్ 204 పరుగులుఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్( 57)టాప్ స్కోరర్గా నిలవగా.. లారా వోల్వడర్ట్(44), లీ(37), హెన్రీ(35) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో నడైన్ డిక్లార్క్, సత్ఘరే , అరుంధతి రెడ్డి తలా వికెట్ సాధించారు.రోడ్రిగ్స్ ఔట్148 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం 37 బంతుల్లో 57 పరుగులు చేసిన కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్.. సత్ఘరే బౌలింగ్లో ఔటైంది. క్రీజులో లారా వోల్వర్డ్(30), హెన్రీ(2) ఉన్నారు. 17 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 155/3రోడ్రిగ్స్ దూకుడు..12 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(20 బంతుల్లో 34) దూకుడుగా ఆడుతోంది.లీ ఔట్..72 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన లెజ్లీ.. నడైన్ డిక్లార్క్ బౌలింగ్లో ఔటైంది. 8 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 74/2తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ49 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన షెఫాలీ వర్మ.. అరుంధతి రెడ్డి బౌలింగ్లో పెవిలియన్కు చేరింది. 6 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 53/14 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 29/04 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. క్రీజులో లీ(17), షెఫాలీ వర్మ(6) ఉన్నారు.మహిళల ప్రీమియర్ లీగ్-2026లో తుది పోరుకు తెరలేచింది. వడోదర వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు గత మ్యాచ్లో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్తోనే బరిలోకి దిగాయి. ఇక వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈసారి ఎలాగైనా జెమిమా రోడ్రిగ్స్ కెప్టెన్సీలో కప్పు కొట్టాలని పట్టుదలతో ఉంది. మరోవైపు డబ్ల్యూపీఎల్-2024 ఫైనల్ నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.తుది జట్లుఆర్సీబీ: స్మృతి మంధాన (కెప్టెన్), గ్రేస్ హారిస్, జార్జియా వోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, నడైన్ డి క్లెర్క్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్, సయాలీ సత్ఘరే.ఢిల్లీ క్యాపిటల్స్: లిజెల్ లీ, షెఫాలీ వర్మ, లారా వోల్వార్డ్, జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మరిజన్ కాప్, షినెల్ హెన్రీ, నికి ప్రసాద్,స్నేహ రాణా, మిన్ను మణి, నందిని శర్మ, శ్రీ చరణి,
'కప్పు గెలవడమే మా లక్ష్యం'.. ప్రత్యర్థులకు రషీద్ ఖాన్ వార్నింగ్
టీ20 ప్రపంచకప్-2026కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ నుంచి షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా కెప్టెన్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. "ఈ ప్రపంచకప్లో అఫ్గానిస్తాన్ ఏ జట్టును ఓడిస్తే అది సంచలనం అవుతుంది?" అని విలేకరులు ప్రశ్నించారు.రషీద్ వెంటనే తడబడకుండా "ఫైనల్కు ఎవరు వచ్చినా, వారిని ఓడించడమే మా లక్ష్యం" అని బదులిచ్చాడు. అంటే ఈ మెగా ఈవెంట్లో అఫ్గానిస్తాన్ కచ్చితంగా ఫైనల్ చేరుతుందాన్న థీమాతో రషీద్ ఉన్నాడు. గత కొంతకాలంగా అఫ్గానిస్తాన్ ప్రపంచ మేటి జట్లకు గట్టి పోటీ ఇస్తోంది. టీ20 ప్రపంచకప్-2024లో అఫ్గానిస్తాన్ అద్బుతాలు చేసింది.పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లను ఓడించి అఫ్గాన్కు సెమీస్కు చేరింది. కానీ దురదృష్టవశాత్తూ సెమీస్లో రషీద్ సేన బోల్తా పడింది. అయితే ఈసారి ఎలాగైనా ఫైనల్కు చేరి టైటిల్ గెలవడమే అఫ్గాన్ పట్టుదలతో ఉంది. అప్గాన్ జట్టులో అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. అఫ్గాన్ ఈసారి గ్రూప్-డిలో ఉంది. ఈ గ్రూపులో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి వరల్డ్క్లాస్ జట్లు ఉన్నాయి.
T20 WC 2026: జింబాబ్వేకు షాకిచ్చిన పసికూన!
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఒమన్ జట్టు జోరు కనబరుస్తోంది. ఇటీవల శ్రీలంక-‘ఎ’ జట్టును చిత్తు చేసిన ఒమన్.. తాజాగా జింబాబ్వేకు షాకిచ్చింది. ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్లో తమకంటే మెరుగైన స్థితిలో ఉన్న జింబాబ్వేతో ఒమన్ గురువారం తలపడింది.బెనెట్, ముసేకివా హాఫ్ సెంచరీలుకొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన వార్మప్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఒమన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్లలో బ్రియాన్ బెనెట్ (28 బంతుల్లో 56) మెరుపు అర్ధ శతకం బాదగా... బ్రెండన్ టేలర్ (20 బంతుల్లో 26) రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు.వన్డౌన్లో వచ్చిన డియాన్ మేయర్స్ 26 పరుగులు చేయగా.. ర్యాన్ బర్ల్ (1), టోనీ మున్యోంగ (0), క్లైవ్ మండాడే (0) పెవిలియన్కు క్యూ కట్టారు. లోయర్ ఆర్డర్లో తషింగ ముసేకివా (28 బంతుల్లో 54 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. ఇక ఒమన్ బౌలర్లలో సూఫియాన్ మెహమూద్ మూడు వికెట్లు తీయగా.. నదీం ఖాన్ రెండు, షా ఫైజల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. జింబాబ్వే విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఒమన్ 19.2 ఓవర్లలో పూర్తి చేసింది. జతిందర్, రామనంది ధనాధన్ఓపెనర్లలో ఆమిర్ కలీమ్ (23) ఫర్వాలేదనిపించగా.. జతిందర్ సింగ్ హాఫ్ సెంచరీ (33 బంతుల్లో 55) చేసి రిటైర్డ్ అవుట్ అయ్యాడు. మిగిలిన వాళ్లలో హమాద్ మీర్జా (35), జితేన్ రామనంది (18 బంతుల్లో 34 నాటౌట్) ధనాధన్ దంచికొట్టారు. ఈ క్రమంలో ఆరు వికెట్లు నష్టపోయి ఒమన్ 188 పరుగులు సాధించింది. ఫలితంగా జింబాబ్వేపై నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో జింబాబ్వే పన్నెండో స్థానంలో ఉండగా.. ఒమన్ది ఇరవయ్యవ ర్యాంకు. కాగా ఫిబ్రవరి 7 నుంచి భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఐసీసీ ఈవెంట్లో ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో కలిసి ఒమన్ గ్రూప్-బిలో ఉంది.చదవండి: పాక్తో మ్యాచ్.. కుండబద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్ పొమ్మంది.. పీఎస్ఎల్ రమ్మంది! ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?
ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో లాహోర్ ఖలందర్స్ తరపున ముస్తాఫిజుర్ ఆడనున్నాడు. పీఎస్ఎల్ వేలానికి ముందు అతడిని రూ. 2.08 కోట్లకు (పీకేర్ 6.44 కోట్లు) లాహోర్ ఒప్పందం కుదుర్చుకుంది.ఈ విషయాన్ని లాహోర్ ఖలందర్స్ ఓనర్ సమీన్ రానా ధ్రువీకరించాడు. "ముస్తాఫిజుర్ లాహోర్ ఖలందర్స్ ఫ్యామిలీలో ఎల్లప్పుడూ భాగమే. అతడు తిరిగి మా జట్టులో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని" సమీన్ రానా పేర్కొన్నాడు. ఈ ఫ్రాంచైజీకి ముస్తాఫిజుర్ ప్రాతినిథ్యం వహించడం ఇదే మూడవసారి కావడం గమనార్హం. రూ. 7.12 కోట్ల నష్టంకాగా ఐపీఎల్-2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ను కోల్కతా నైట్ రైడర్స్ (KKR) రూ. 9.20 కోట్లకు దక్కించుకుంది. అయితే బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడుల నేపథ్యంలో అతడిని జనవరి 3న బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ జట్టు నుంచి విడుదల చేసింది. దీంతో అప్పటి నుంచి బంగ్లా-భారత్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి.భద్రతా కారణాలను సాకుగా చూపుతూ టీ20 వరల్డ్కప్ కోసం భారత్లో పర్యటించేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. దీంతో రంగంలోకి దిగిన ఐసీసీ.. బంగ్లా క్రికెట్ బోర్డును ఒప్పించేందుకు ప్రయత్నించింది. కానీ బీసీబీ మాత్రం తమ పట్టును వీడలేదు. ఫలితంగా ఐసీసీ బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తప్పించి, వారి స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ఏదేమైనప్పటికి రెండు దేశాల ఉద్రిక్తలకు ముస్తాఫిజుర్ బలైపోయాడు. అతడు ఐపీఎల్లో ఆడి ఉంటే రూ. 9.20 కోట్లు దక్కేవి. కానీ ఇప్పుడు పీఎస్ఎల్ ఒప్పందం కారణంగా ముస్తాఫిజుర్కు కేవలం రూ. 2.08 కోట్లు లభించనున్నాయి. దీంతో అతడు దాదాపు రూ. 7.12 కోట్లను కోల్పోవాల్సి వచ్చింది. కాగా ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది.
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ... చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
రెడ్బుక్కే రాజ్యాంగం, చంద్రబాబే ‘సుప్రీం’... తిరుమల శ్రీవారి లడ్డూపై సొంత విచారణ చేపట్టాలని ఏపీ సీఏం నిర్ణయం
కొలిక్కివచ్చిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం. అమెరికా టారిఫ్లు 18 శాతానికి తగ్గింపు
దేశానికి వికసిత విజన్... 2026-27 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్లో గూండారాజ్... పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. శనివారం రాత్రి అరెస్టు
జీవీఎంసీలో రౌడీ రాజ్యం... గీతం కబ్జాకు పచ్చజెండా... కనీస చర్చ లేకుండానే భూముల క్రమబద్దీకరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో రీ సర్వే సూపర్. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన భూ, మార్కెట్ సంస్కరణలు భేష్ అని పొగిడిన కేంద్ర ఆర్థిక సర్వే
YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు
తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు... సీబీఐ దర్యాప్తులో వెల్లడి... బెడిసికొట్టిన చంద్రబాబు కుతంత్రం
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు
బిజినెస్
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 514.66 పాయింట్ల లాభంతో.. 83,303.02 వద్ద, నిఫ్టీ 135.30 పాయింట్ల లాభంతో 25,640.70 వద్ద నిలిచాయి.మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, బార్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్, టిజారియా పాలీపైప్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సరళ పెర్ఫార్మెన్స్ ఫైబర్స్ లిమిటెడ్, బయోఫిల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జువారీ ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
‘ఏంటి మేడమ్ ఇది.. పసిడి పన్ను న్యాయమేనా?’
దేశ ప్రజలను భౌతిక బంగారం నుంచి పేపర్ గోల్డ్ వైపు మళ్లించేందుకు ఒకప్పుడు ఫ్లాగ్షిప్ పథకంగా నిలిచిన సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఇప్పుడు ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన కొత్త పన్ను మార్పుల నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. సంవత్సరాల తరబడి పన్ను-సమర్థ పెట్టుబడిగా ప్రచారం చేసిన ఈ బాండ్లపై ఇప్పుడు ప్రభుత్వ విధాన స్థిరత్వమే ప్రశ్నార్థకంగా మారిందని విమర్శకులు అంటున్నారు.ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల అసంతృప్తికి స్వరం ఇచ్చారు చార్టర్డ్ అకౌంటెంట్ కరణ్ భాల్. ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. “వావ్! ఇప్పుడు PPF, EPF ఉపసంహరణల్లో కూడా ప్రభుత్వానికి వాటా కావాలా? NPS లాభాలపై కూడా పన్నా? ‘నువ్వు డబ్బు సంపాదిస్తే, నాకూ వాటా ఎందుకు వద్దు?’ అనడం ఇది ఏం లాజిక్ మేడమ్? (ఆర్థిక మంత్రి నిర్మిలా సీతారామన్), ఎలాంటి పన్ను సమస్యలు లేకుండా గోల్డ్ బాండ్లు కొనాలని మీ ప్రభుత్వమే చెప్పింది. పెట్టుబడిదారులు లాభపడితే విధానాలనే మార్చేస్తారా?” అంటూ భాల్ మండిపడ్డారు.గోల్డ్ బాండ్ కొత్త ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. ఇకపై సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను విధానం ఇన్వెస్టర్ దాన్ని ఎప్పుడు, ఎలా కొనుగోలు చేశారు, ఎప్పుడు నిష్క్రమించారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. లాంచ్ సమయంలో చందా పొంది, పూర్తి 8 సంవత్సరాల మెచ్యూరిటీ వరకు ఉన్నవారికి మాత్రమే ఇప్పటికీ మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఉంటుంది.అదే సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసినవారికి మూలధన లాభాలపై పన్ను వర్తిస్తుంది. అలాగే, అసలు చందాదారులు ఐదేళ్ల తర్వాత కానీ ఎనిమిదేళ్లకు ముందే కానీ రీడీమ్ చేస్తే వారికి కూడా పన్ను వర్తిస్తుంది.2015లో ప్రారంభమైన సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ఇప్పటివరకు 67 విడతల్లో సుమారు 147 టన్నుల బంగారానికి బాండ్లు జారీ చేసింది. అయితే బంగారం ధరలు పెరగడంతో, 2024 తర్వాత కొత్తగా వీటి జారీని నిలిపేసింది. దీంతో సెకండరీ మార్కెట్లో లావాదేవీలు పెరిగాయి. అవే ఇప్పుడు పన్నుల వలలో చిక్కాయి.మరోవైపు రిస్క్ తీసుకున్నప్పటికీ తమ మొత్తం పోర్ట్ఫోలియో XIRRలు (ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్) ఇప్పటికీ ప్రారంభ రెండంకెల్లోనే ఉన్నాయని, ఈటీఎఫ్లతో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్లకు సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ సమస్యలు ఎక్కువ అని సీఏ కరణ్ భాల్ వాదిస్తున్నారు.WOW!The government will deserve its share of your PPF, EPF withdrawals too.It'll deserve its share of your NPS gains too.And what logic is this? "If you are making a killing, why shouldn't I get something?"Madam, your government only told us to go ahead and buy SGBs… pic.twitter.com/8KYhZ2Kxx9— Kanan Bahl (@BahlKanan) February 4, 2026
ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఆదాయం విషయంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీనిపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు.''మా సంస్థకు సంబంధించిన 2025 ఆర్ధిక సంవత్సరం నాలుగవ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు మా ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచాయి. మా భాగస్వాములు & ఉద్యోగుల అంకితభావం, కృషి వల్ల ఈ త్రైమాసికం విజయవంతంగా ముగిసింది. ముఖ్యంగా.. మా వార్షిక ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్లను అధిగమించడం.. గర్వించదగ్గ విషయం'' అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.సుందర్ పిచాయ్ పోస్టుపై స్పందించిన ఎలాన్ మస్క్..'వెల్ డన్' అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.2025 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో.. సెర్చ్ & ఇతర యాడ్స్ విభాగం 17 శాతం వృద్ధిని సాధించింది. జెమిని యాప్ నెలకు 750 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. 2025లో యూట్యూబ్ యాడ్స్ & సబ్స్క్రిప్షన్ ద్వారా 60 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇలా విభాగాల వారీగా గూగుల్ కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది.Well done— Elon Musk (@elonmusk) February 5, 2026
ఆర్బీఐ మానిటరీ పాలసీ.. వడ్డీ రేట్లు యథాతథం?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, మారుతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు, దేశీయ బాండ్ మార్కెట్ ఒత్తిళ్ల మధ్య ఆర్బీఐ తన ఫిబ్రవరి పాలసీలో వడ్డీ రేట్లను మార్చకపోవచ్చని తెలుస్తోంది. గతేడాది నుంచి దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు జరిగే ఆర్బీఐ మానిటరీ సమావేశంలోని అంశాలు రేపు ఉదయం వెలువడనున్నాయి.అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలుగత పాలసీ సమావేశం తర్వాత జరిగిన అతిపెద్ద పరిణామం భారత్-అమెరికా, భారత్-యూరప్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలు. దీని ఫలితంగా భారతీయ వస్తువులపై సుంకాలు గతంలో ఉన్న 50% నుంచి 18%కి గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం ఆసియా దేశాల్లోనే అతి తక్కువ టారిఫ్ రేట్లు కలిగిన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ఇది మన ఎగుమతిదారుల పోటీతత్వాన్ని భారీగా పెంచనుంది.ప్రపంచ ఆర్థిక అనిశ్చితిఅంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి. ‘జియో-ఎకనామిక్స్ స్ట్రెస్ ఇండెక్స్’ ప్రకారం అంతర్జాతీయ అనిశ్చితి పెరిగిన 3-4 నెలల తర్వాత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కనిపిస్తుంది. మరోవైపు గత వారం భారీ పతనాన్ని చూసిన లోహాల ధరలు తిరిగి కోలుకోవడం గమనార్హం.అమెరికా ఫెడ్ రేట్ల కోత సంకేతాలుఅమెరికాలో లేబర్ మార్కెట్ మందగించడం, వాస్తవ ఆదాయం స్థిరంగా ఉండటం, ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గడంతో.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఇది ప్రపంచ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.రూపాయి ఒడిదుడుకులుగత రెండు నెలలుగా రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రూ.89-92 మధ్య ఊగిసలాడుతోంది. ఏప్రిల్ 2025లో అమెరికా సుంకాలను పెంచినప్పటి నుంచి రూపాయి 5.8% మేర క్షీణించింది. అయితే ఇటీవలి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత రూపాయి విలువ కోలుకోవడం సానుకూలాంశం.ద్రవ్యోల్బణంద్రవ్యోల్బణ గణనలో భాగంగా కొత్త సీపీఐ వెయిటేజీలను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సాధారణ సమయంలో ద్రవ్యోల్బణం 20-30 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉండగా.. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న నెలల్లో మాత్రం కొత్త లెక్కల ప్రకారం సీపీఐ 20-30 బేసిస్ పాయింట్లు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.పైన పేర్కొన్న మిశ్రమ పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ ప్రస్తుతానికి కీలక వడ్డీరేట్ల మార్పులపై వేచి చూసే ధోరణిని అవలంబిస్తుదని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం
ఫ్యామిలీ
స్మార్ట్ గ్లాసెస్... సో డేంజర్!
సరికొత్త సాంకేతికతలో స్మార్ట్ గ్లాసెస్ ట్రెండ్ ఒకటి. హ్యాండ్స్–ఫ్రీ సెల్ఫీల నుంచి ఇన్స్టంట్ ట్రాన్సాక్షన్స్ వరకు స్మార్ట్ గ్లాసెస్ ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాల మాట ఎలా ఉన్నా... మహిళల ప్రైవసీకి సంబంధించి స్మార్ట్ గ్లాసెస్ బ్యాడ్ గ్లాసెస్గా తయారయ్యాయి. స్మార్ట్గ్లాసెస్తో మహిళల వీడియోలు తీసి వివిధ సైట్లలో అప్లోడ్ చేస్తున్నారు. మహిళలకు తెలియకుండా స్మార్ట్గ్లాసెస్ కెమెరాతో వీడియోలు తీయడం అనేది యూఎస్, యూకేలలో ప్రమాదకరమైన ట్రెండ్గా మారింది...బస్స్టాప్లో నిలబడినప్పుడో, ఏ షాపింగ్ మాల్లోనో ఉన్నప్పుడో స్మార్ట్గ్లాసెస్ ధరించిన వ్యక్తి మీ దగ్గరకి వచ్చి... ‘హాయ్ అండీ... మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది’ అని మాట కలిపి చాలాసేపు మాట్లాడవచ్చు.చివరికి... ‘ఒకరి పోలికలతో ఒకరు ఉండడం సహజమే కదండీ. నేను పొరబడ్డాను...సారీ...’ అంటాడు. ‘భలేవారండీ, ఈ మాత్రం దానికి సారీ ఎందుకు!’ అని మనం అంటాం.→ కట్ చేస్తే...కొన్ని రోజుల తరువాత మీ వీడియో ఇన్స్టాగ్రామ్లోనో, టిక్టాక్లోనో కనిపించవచ్చు. షాక్కు గురి చేయవచ్చు. అభ్యంతరకరమైన సైట్స్లోనూ కనిపించి మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు. ‘అసలు.. నా వీడియో ఈ సైట్లోకి ఎలా వచ్చింది!’ అని ఆలోచిస్తుండగా మీతో మాట్లాడిన వ్యక్తి గుర్తుకు వస్తాడు.‘నాతో మాట్లాడింది నిజమేగానీ. అతడి చేతిలో సెల్ఫోన్లాంటిదేమీ కనిపించలేదే!’ అని అతడికి క్లీన్ సర్టిఫికెట్ ఇస్తారు. నిజాకి ఆ వీడియో సృష్టికర్త అతడే!అతను పెట్టుకున్న స్మార్ట్గ్లాసెస్ కేవలం గ్లాసెస్ మాత్రమే కాదు. అందులో కెమెరా కూడా ఉంటుంది.యూఎస్, యూకేలలో ‘స్మార్ట్ గ్లాసెస్ బాధితులు’ ఎంతోమంది ఉన్నారు. సాంకేతికతలో మరో ముందుడుగుగా ‘స్మార్ట్ గ్లాసెస్’ వచ్చాయి. హ్యాండ్స్–ఫ్రీ సెల్ఫీలు, ఇన్స్టంట్ ట్రాన్సాక్షన్స్, వాయిస్–యాక్టివేటెడ్ అసిస్టెంట్స్లాంటి సదుపాయాల మాట ఎలా ఉన్నా కొన్ని సందర్భాలలో ఇవి మహిళల పాలిట పీడకలగా మారుతున్నాయి.→ భయపడవద్దుగత నెల ఇంగ్లాండ్లో ఓ నలభై ఏడేళ్ల మహిళ ఒక వ్యక్తిని కోర్టుకు లాగింది. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన నేరం ఏమిటి? ఒక హోటల్లో ఆమెకు తెలియకుండా తన స్మార్ట్గ్లాసెస్తో అభ్యంతరకరమైన రీతిలో వీడియో తీయడానికి ప్రయత్నిస్తుంటే ఆమెకు అనుమానం వచ్చి, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టుకు లాగింది. కొద్దిమంది బాధితులు మాత్రం ‘నలుగురికి తెలిస్తే పరువు పోతుంది’ అనుకుంటూ బ్లాక్మెయిల్ చేసే వారి బెదిరింపులకు లొంగిపోతున్నారు. వారు ఎంత డిమాండ్ చేస్తే అంత సొమ్ము ఇచ్చేస్తున్నారు.సూపర్ మార్కెట్కు వెళ్లిన తనను అపరిచితుడు ఎవరో రే–బాన్ మెటా స్మార్ట్ గాసెస్తో అభ్యంతర కరమైన రీతిలో వీడియో తీశాడని ఒక మహిళ ఆన్లైన్లో కన్నీరు మున్నీరు అయింది. ‘ఎవరో చేసిన దుర్మార్గమైన పనికి మానసికంగానే కాదు, శారీరకంగా కూడా బలహీన పడిపోయాను’ అని ‘ఎక్స్’లో చేసిన పోస్ట్లో వెల్లడించింది ఆ బాధిత మహిళ.→ ఆ లైట్ వెలగక పోవచ్చు కూడా!సార్ట్ఫోన్ కెమెరా తో ఎవరైనా షూట్ చేస్తుంటే వెంటనే గమనించి అడ్డుకోవచ్చు. అయితే స్మార్ట్ గ్లాసెస్తో రికార్డ్ చేస్తున్న విషయం తెలియకపోవడం వల్ల ప్రమాదాన్ని పసిగట్టలేము. స్మార్ట్ గ్లాసెస్ విషయానికి వస్తే, ఉదాహరణకు మెటా ప్రాడక్ట్ రే–బాన్ స్మార్ట్ గ్లాసెస్ను తీసుకుంటే...రికార్డింగ్ చేస్తున్నప్పుడు గ్లాసెస్లోని తెల్లటి చిన్న ఎల్ఈడి ఇండికేటర్ వెలుగుతుంది. ఈ లైట్ ఆధారంగా వీడియో రికార్డింగ్ జరుగుతున్న విషయం తెలుసుకోవచ్చు. అయితే ఈ లైట్ పగటి వెలుగులో, ప్రకాశవంతమైన పరిసరాలలో అంతగా కనిపించదు. కొందరు ఈ లైట్ కనిపించకుండా కూడా మ్యానేజ్ చేస్తున్నారు.కొన్ని గ్లాసెస్కు రికార్డింగ్ ఇండికేటర్ లేకపోవడం వల్ల అక్రమంగా వీడియో తీస్తున్నవారి పని మరింత సులువు అవుతుంది. ముఖ్యంగా తక్కువ ధరల్లో వచ్చే చైనీస్ మోడల్స్లో ఈ ఫీచర్ కనిపించడం లేదు.స్మార్ట్ గ్లాసెస్లోని ఎల్ఈడి లైట్ ఎందుకు వెలుగుతుందనేది చాలామందికి తెలియక పోవడం వల్ల అనుమానం రావడం లేదు. యూఎస్, యూకేలలో ప్రైవసీ చట్టాలు రకరకాలుగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో వీడియోలు తీయడం నేరం కాదు. మనకు తెలియకుండానే కేఫ్, మెట్రోస్టేషన్, పార్క్, ఆలయం సమీపంలో ఎవరైనా వీడియో షూట్ చేసి ఉండవచ్చు. ఆ వీడియోలో మనం ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి, ఫుటేజి తీసివేయాలని డిమాండ్ చేయడానికి చట్టపరమైన అధికారం లేదు. అయితే ఇతరులు అభ్యంతరం చెప్పినప్పుడు రికార్డింగ్ నిలిపివేయాలని టెక్ కంపెనీలు చెప్పవచ్చు. యూఎస్, యూకేలలోనే కాదు మన దేశంలోనూ స్మార్ట్గ్లాసెస్ దుర్వినియోగానికి సంబంధించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.→ పరిష్కారం లేదా?‘అవగాహన, అప్రమత్తతే సమస్యకు పరిష్కారం’ అంటున్నారు టెక్ నిపుణులు. ‘సందేహంతో ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. అనుమానంగా అనిపిస్తే సమాచారం ఇవ్వాలి’ అని కూడా చెబుతున్నారు. కెమెరాలు ఉన్న అన్ని స్మార్ట్గ్లాసులలోనూ స్పష్టమైన లైట్లు, సంకేతాలు ఉండవనే విషయం తెలుసుకోవాలి. డేంజర్ ట్రెండ్!యూఎస్. యూకేలలో స్మార్ట్ గ్లాసెస్ కెమెరాలను ఉపయోగించి మహిళలకు తెలియకుండా వారి వీడియోలు తీసి. వివిధ సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం అనేది ప్రమాదకరమైన ధోరణిగా మారింది. వీడియో ఫుటేజీని సైకలాజికల్ మేనిప్యులేషన్ కోసం ఉపయోగించే ప్రమాదకరమైన «ధోరణి పెరిగింది.‘నాకు తెలియకుండానే నా వీడియోను చిత్రీకరించి, ఏదో సైట్లో పోస్ట్ చేశారు. ఆ తరువాత నేను పడిన ఇబ్బందులు ఇన్నీ అన్నీ కావు. ఎంత దారుణం ఇది!’ అంటూ న్యూయార్క్లో ఉండే కెసీ జనంజని కళ్లనీళ్ల పర్యంతం అయింది. ‘ఈ పని వారు యాదృచ్ఛికంగా, సరదా కోసం చేశారనుకోవడం లేదు. విషపూరిత ఆలోచనలతోనే చేస్తున్నారు’ అంటుంది కెసీ.
నీరు రుచి చూసి మార్కులేస్తుంది...
మామూలు నీళ్లు ఎవరైనా తాగుతారు. ఖరీదైన నీళ్లు తాగే వాళ్లనే ‘పెద్దవాళ్లు’ అంటారు. దేశంలో లీటరు 100 నుంచి 1500 వరకూ పలికే మినరల్ వాటర్ బాటిళ్ల వ్యాపారం జోరు మీద ఉంది. సంవత్సరానికి 400 కోట్ల రూపాయల ప్రీమియం వాటర్ బాటిళ్లు అమ్ముడవుతున్నాయి. దాంతో ‘వాటర్ టేస్టర్ల’ కు గిరాకీ పెరిగింది. నీటి రుచి చూసి మినరల్స్ను అంచనా కట్టడం వీరిని ‘వాటర్ సొమెలియర్’ అంటారు. ఈ నైపుణ్యంతో వాసికెక్కిన 32 ఏళ్ల అవంతి మెహతా (avanti mehta) చెప్తున్న నీటి సంగతులు...‘మన దేశంలో హిమాలయాల చెంత దొరికే నీటిదొక రుచి, ఆరావళి పర్వతాల వద్ద దొరికే నీళ్లదొక రుచి, సెలయేళ్ల నుంచి, కొండ వాగుల నుంచి, రాతి నేలల నుంచి ఇలా ఒక్కోచోట నుంచి సేకరించే నీటిది ఒక్కో రుచి. అంతేకాదు స్థలాన్ని బట్టి మినరల్స్ శాతం మారుతూ ఉంటుంది. పాకేజ్డ్ వాటర్ కూ మినరల్ వాటర్కూ వ్యత్యాసం నీళ్లలోని ఖనిజాల శాతమే తేలుస్తుంది. మన దేశంలో 6000 సంస్థలకు పాకేజ్డ్ వాటర్ లైసెన్స్ ఉంటే కేవలం 30 సంస్థలకు మాత్రమే మినరల్ వాటర్ లైసెన్స్ ఉంది. శుద్ధి చేసిన నీరు పాకేజ్డ్ వాటర్లో ఉంటే రక్షిత పరిసరాలలోని నీటి వనరుల నుంచి సేకరించిన నీరు మినరల్ వాటర్ బాటిల్స్లో ఉంటుంది’ అంటుంది అవంతి మెహతా.ఈమె మన దేశంలో ప్రస్తుతం ‘వాటర్ సొమెలియర్’గా (water sommelier) గుర్తింపు పొందుతోంది. వాటర్ సొమెలియర్ అంటే నీటి రుచి నిపుణురాలు. నీళ్లను తాగి ఆ నీటి స్వచ్ఛత, నాణ్యత తెలియచేస్తారు. వైన్ రుచి, టీ రుచికి టేస్టర్స్ ఉండటం తెలిసిందే. కాని నీళ్ల రుచి చూసే ‘వాటర్ సొమెలియర్’లు ఇప్పుడు ఉనికిలోకి వస్తున్నారు.‘నేను ఫ్యాషన్ రంగంలో ఈ–కామర్స్ విభాగంలో పని చేసే దాన్ని. అయితే ‘ఆవా’ అనే మినరల్ వాటర్ బ్రాండ్ మా కుటుంబానికి ఉంది. దేశంలో బాటిల్డ్ వాటర్కు పెరుగుతున్న గిరాకీని గమనించాక మా సొంత బిజినెస్లోకి రావాలని అనుకున్నాను. దేశంలో 70 శాతం నీళ్లు కలుషితంగా ఉన్నాయని ప్రజలు భావించే స్థితి వచ్చింది. మున్సిపల్ ట్యాప్స్ నుంచి వచ్చే నీళ్లను ఎవరూ నమ్మడం లేదు. అందుకే బాటిల్డ్ వాటర్ వ్యాపారం పెరిగింది. అయితే పాకేజ్డ్ వాటర్నే మనదేశంలో మినరల్ వాటర్ అనుకుంటూ ఉంటారు. రెండూ వేరు వేరు. అంతెందుకు ఫిల్టర్డ్ వాటర్కూ, ప్యూరిఫై చేసిన వాటర్కూ తేడా ఉంటుంది. నేచురల్ మినరల్ వాటరంటే సహజసిద్ధంగా సేకరించిందని అర్థం. ఇవన్నీ కూడా వాటర్ సొమెలియర్ కోర్సులో మాకు నేర్పుతారు. ప్రస్తుతం ప్రపంచంలో సౌత్ కొరియాలో, ఇటలీలో వాటర్ సొమెలియర్ కోర్సులు ఇచ్చే సంస్థలు ఉన్నాయి. నేను ఇటలీలో కోర్సు చేసి సర్టిఫికెట్ పొందాను. ఈ కోర్సులో నీటి మూలాలు, నీటి సైకిల్స్, నీటి పరిరక్షణ, వాటిలోని పోషకాల గుర్తింపు ఇవన్నీ నేర్పుతారు’ అని తెలిపింది అవంతి మెహతా.‘మన శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. అయినా చాలామంది ఏం తింటున్నామన్న దాని మీద తప్ప ఏం తాగుతున్నాం అనే దాని మీద శ్రద్ధ పెట్టరు. చైనా, అమెరికాలో పాకేజ్డ్ నీటి వ్యాపారం ఒకో దేశంలో 3000 కోట్లకు చేరిందంటే కారణం సరైన నీరు తాగాలనే చైతన్యం వల్లనే. సహజ ఖనిజాలు ఉన్న నీరు శరీరాన్ని తాజాగా, ఉత్సాహంగా ఉంచుతుంది. మన దేశంలో ఇటలీ, ఫ్రాన్స్ దేశాల మంచి నీటి బ్రాండ్లు ప్రీమియమ్ బాటిల్డ్ వాటర్ను అమ్ముతున్నాయి. మా ‘ఆవా’ కూడా ప్రీమియమ్ బ్రాండే. మన దేశంలో కొన్ని కొండవాగుల, ఇసుక పాయల నుంచి సేకరించే నీటికి డిమాండ్ ఉంది. మంచు ఫలకాల నుంచి సేకరించే నీటిని ‘వింటేజ్ వాటర్’ అంటారు– ఆ ఫలకాల వయసును బట్టి. కొన్ని మినరల్ వాటర్స్ను కొన్ని రకాల ఆహారాలకు పెయిర్ చేస్తూ రెస్టరెంట్లు ఫుడ్ బిజినెస్ చేస్తున్నాయి. వెల్నెస్ క్రేజ్ పెరగడం వల్ల ఖరీదైనా సరే మంచిగా ఉన్న నీళ్లు తాగాలని చూస్తున్నారు’ అందామె.‘నీటి వ్యాపారం సాగుతున్న ఈ కాలంలో నా ప్రయత్నమంతా సహజ నీటి వనరులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియచెప్పడమే. కలుషితాలు చేరకుండా చూస్తే స్థానిక చెరువులు, కుంటల్లోని స్వచ్ఛమైన నీరు గొప్ప శక్తిదాయినిగా మారుతుంది. నీరే భవిష్యత్తులో ఏ దేశానికైనా ఐశ్వర్యం కాగలదు’ అని ముగించింది అవంతి మెహతా. చదవండి: అవాంఛిత రోమాలు.. కారణాలు, పరిష్కారాలు
ఓ వైపు రీల్స్ చేస్తూ.. మరోవైపు చిల్..
హైదరాబాద్ నగరం మరోసారి తన ట్రెండ్ సెట్టర్ హోదాను నిరూపిస్తోంది. ఒకప్పుడు చార్మినార్, హుస్సేన్ సాగర్ ప్రాంతాలకే పరిమితమైన ఈ గుర్తింపు, ఇప్పుడు రీల్స్, రిహార్సల్స్ కల్చర్, సోషల్ మీడియా లైఫ్స్టైల్ ద్వారా కొత్త మలుపు తిరుగుతోంది. 2026 ప్రారంభంలోనే కొన్ని ప్రాంతాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, లక్షల్లో వ్యూయర్స్, లైకులతో హైదరాబాద్ను డిజిటల్ హబ్గా మార్చుతున్నాయి. ఇటీవల వైరల్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది..! నేటి యువత జీవనశైలిలో భారీ మార్పు కనిపిస్తోంది. రీల్స్ ట్రెండ్ (Reels Trend) అనే కల్చర్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా.. విస్తృత స్థాయిలో వేదికలను ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుతోంది. వీళ్లందరికీ నగరం అంటే ఓ లొకేషన్ కాదు, ఒక అనుభూతి, ఒక స్టోరీ, ఒక షేర్ చేయదగిన క్షణం..నగరం దీనికి అనుగుణంగా మారుతూ.. వారికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వరకు టీ హబ్ నుంచి నీలోఫర్, దుర్గం చెరువు వరకు నగరంలోని ప్రతి ప్రాంతమూ ఒక రీల్ స్పాట్ నుంచి రియల్ హబ్గా మారుస్తోంది. ఇక్కడికి వచ్చే యువత ప్రతి రీల్నీ ఒక లైఫ్స్టైల్ స్టేట్మెంట్గా భావిస్తున్నారు.రీల్స్కు కొత్త అడ్రస్.. జూబ్లీహిల్స్ అంటే ఒకప్పుడు కేఫ్లు, లగ్జరీ రెస్టారెంట్లు, సెలబ్రిటీ నివాసాలు అనే గుర్తింపు. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారింది. స్ట్రీట్ లైఫ్, నేచురల్ లైటింగ్, మోడర్న్ ఆర్కిటెక్చర్, మినిమల్ వైబ్స్.. ఇవన్నీ కలగలిసిన స్పాట్స్ యువతను ఓ సరికొత్త ప్రపంచం వైపు లాగుతున్నాయి. రోడ్డు పక్కన చిన్న టీ స్టాల్స్ దగ్గర నుంచి, డిజైన్ ఉన్న భవనాల వరకు ప్రతి మూల ఒక రీల్ ఫ్రేమ్లా మారుతోంది. ప్రత్యేకంగా సాయంత్రం, రాత్రి వేళ, సాఫ్ట్ సన్లైట్తో జూబ్లీహిల్స్ రోడ్లు ఆర్గానిక్ రీల్స్కి పర్ఫెక్ట్ బ్యాక్డ్రాప్గా మారుతున్నాయి.కార్పొరేట్ నుంచి క్రియేటివ్ వైపు..ఐటీ ఉద్యోగాలతోనే గుర్తింపు పొందిన హైటెక్ సిటీ, ఇప్పుడు మరో అవతారం ఎత్తుతోంది. గ్లాస్ బిల్డింగ్స్, స్కై వాక్స్, మెట్రో పిల్లర్స్, అర్బన్ మోషన్.. ఇవన్నీ కలిపి ఫ్యూచరిస్టిక్ రీల్స్కు సరైన స్పేస్గా మారాయి. ఉద్యోగ సమయం తర్వాత, బ్యాగ్ పక్కన పెట్టి, ఫోన్ చేతిలో పట్టుకుని యువత రీల్స్ చేయడం ఇక్కడ సాధారణ విషయం. ‘ఆఫీస్ అయిపోయాక రీల్స్ తప్పనిసరి’ అన్నట్టుగా మారింది ఈ తరం లైఫ్ స్టైల్.టీ హబ్ టు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్..టీ హబ్ అంటే కేవలం స్టార్టప్లకే పరిమితం కాదు. ఇది ఒక సోషల్ స్టేట్మెంట్ స్పాట్గా మారుతోంది. ఇక్కడ రీల్స్ అంటే డ్యాన్స్ కాదు వాక్ అండ్ టాక్ రీల్స్, మోటివేషనల్ వాయిస్ ఓవర్స్, డే ఇన్ మై లైఫ్, హైదరాబాద్ గ్రోత్ స్టోరీస్ వంటి వైవిధ్యమైన కంటెంట్కు కేంద్రంగా మారుతోంది. నగర యువత కేవలం వ్యూస్ కోసం కాదు, తమ ఆలోచనల్ని కూడా రీల్స్లో చూపిస్తోంది.రుచికి రీచ్.. నీలోఫర్ కేఫ్.. 2026లో నీలోఫర్ కేఫ్ మరోసారి వైరల్ అవుతోంది.. అయితే ఈసారి లైఫ్ స్టైల్ రీల్స్ వల్ల అనే విషయాన్ని తప్పక గ్రహించాలి. చాయ్ గ్లాస్, ఇరానీ చాయ్ ఆవిరి, రాత్రి పూట జిగేల్మనే లైట్స్, జనాల హడావుడి.. ఇవన్నీ కలిసి ఒక ఎమోషనల్ హైదరాబాద్ వైబ్ సృష్టిస్తున్నాయి. ఇక్కడ తీసిన రీల్ అంటే, అది కేవలం వీడియో కాదు.. నగరంతో కనెక్ట్ అయ్యే అనుభూతి.అర్బన్ నేచర్ హాట్స్పాట్.. దుర్గం చెరువు ఫ్లైఓవర్, లేక్ వ్యూ, నైట్ లైట్స్.. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఫ్రేమ్స్. నేచర్ ప్లస్ సిటీ ఈక్వల్స్ టు రీల్ అండ్ రియల్ మ్యాజిక్.. ఇక్కడ సన్సెట్ టైమ్లో తీసిన రీల్స్ లక్షల్లో వ్యూస్, లైక్స్ అందుకుంటున్నాయి. హైదరాబాద్ (Hyderabad) అందాలను, పర్యాటకాన్ని మరో కోణంలో ప్రపంచానికి చాటిచెప్పే మాధ్యమాలుగా ఇన్స్టా, ఫేస్బుక్ వంటివి నిలుస్తున్నాయన్నది వాస్తవం.నగరంలో బెంగళూరియన్స్ రీల్స్? ఇది ఆశ్చర్యంగా అనిపించినా నమ్మదగిన వాస్తవం. సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం, బెంగళూరు నుంచి వచ్చిన కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ నగరంలోని ప్రముఖ స్పాట్స్లో రీల్స్ (Reels) షూట్ చేస్తున్నారు. తక్కువ ట్రాఫిక్, విశాలమైన రోడ్లు, క్లీనర్ బ్యాక్డ్రాప్స్, నాచురల్ లైటింగ్, కల్చర్ ప్లస్ మోడర్నిటీ మిక్స్.. వంటివి దీనికి కారణమని స్పష్టమవుతోంది. ఈ కారణంగా హైదరాబాద్ సౌత్ ఇండియాలో కొత్త రీల్ క్యాపిటల్గా మారుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.చదవండి: అలాంటి డైట్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి: నటి ఊర్మిళ
అలాంటి డైట్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి..!: నటి ఊర్మిళ
ముంబై భామ ఊర్మిళ మాతోండ్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్, టాలీవుడ్లో తనదైన అభినయం, అందంతో విమర్శకులు ప్రశంలందుకున్న ప్రముఖ నటిగా పేరుతెచ్చుకున్నారు. అంతేగాదు యువ హీరోయిన్లకు తీసిపోనివిధంగా గ్లామరస్గా కనిపిస్తుంటారామె. నాజుకైన దేహంతో పదహారణాల అమ్మాయిల కనిపిస్తుంటుంది. ఇవాళ ఫిబ్రవరి 4తో 52వ పుట్టిరోజులోకి అడుగుపెడుతున్న అలనాటి ముద్దుగుమ్మ ఈతరం యువతరానికి హెల్దీగా ఉండటంపై సలహాలు సూచనలు ఇచ్చారు. అవేంటో చూద్దామా..!.ముఖ్యంగా 2008లో సైజ్ జీరో ఫ్యాషన్ క్రేజ్ ఎలా ఉందో తెలిసిందే. ఆ టైంలో యువత ఆ ట్రెండ్తో ఉర్రూతలూగుతున్నప్పుడూ కూడా నటి ఊర్మిళ యువతకు చాలా చక్కటి పిలుపునిచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. నాజుకైన శరీరం కంటే..ఆరోగ్యం ముఖ్యం అనే విషయాన్ని గుర్తుచేస్తూ ఆలోచింపచేసేలా మాట్లాడారామె. 50 ప్లస్లో కూడా ఇంతలా స్లిమ్గా బాడీ మెయింటైన్ చేస్తున్న ఊర్మిళ యువతకు ఇస్తున్న సలహా ఏంటేంటే..ఆరోగ్యం పట్ల తానెప్పుడూ ట్రెండీ పోకడల జోలికి పోనంటున్నారామె. మన పూర్వీకులు ఫాలో అయ్యే ఆరోగ్యకరమైన అలవాట్లకే ప్రాధాన్యత ఇస్తానని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారామె. క్రాష్ డైట్లంటూ పొట్ట మాడ్చుకోనని కూడా చెప్పారు. దయచేసి యువత ట్రెండీ డైట్లు, షార్ట్కట్లో బరువు తగ్గే విధానాల జోలికిపోయి..ఆరోగ్యాన్ని చేజేతులారా పాడుచేసుకోవద్దని హితవు పలికారు. ఇటీవల కాలంలో వెయిట్లాస్ అవ్వడం ఓ ట్రెండీగా మారింది. ముఖ్యంగా స్లిమ్గా ఉంటేనే మనుషులు అనేలా పరిస్థితి మారిపోయింది. ఇవన్నీ ఎలా ఉన్నా..ఆరోగ్యంగా ఉండటమే అన్నింట్లకంటే ముఖ్యమని నొక్కి చెప్పారు. నాజుకైన శరీరం కోసం..తాన నాజుకైన శరీరం కోసం క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తానే తప్ప ఆహారం మానేయడం వల్ల కాదని అన్నారు. క్రాష్ డైట్ల జోలికి పోనని కూడా అన్నారామె. దేవుడు తనకు ఇచ్చిన మంచి జీన్స్ విషయమై సదా కృతజ్ఞతలు చెబుతుంటానని అన్నారు. యువత ఎక్కువగా ఉపవాస డైట్లు పాటిస్తూ..శరీరాన్ని పాడుచేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారామె. దానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం ఆస్వాదిస్తూ..వ్యాయామాలు చేయండి చాలు అని పిలుపునిచ్చారామె. ఫిట్నెస్ సీక్రెట్..చాలామంది సెలబ్రిటీలు తమ ఫిట్నెస్కి విదేశీ సూపర్ ఫుడ్స్కి క్రెడిట్ ఇస్తే..సాంప్రదాయ భారతీయ వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారామె. తన మెరుగైన జీవక్రియకు, శక్తికి అవే మహారాష్ట్ర సంప్రదాయ ఆహారమేనని నొక్కి చెబుతారామె. ఫిట్గా ఉండాలంటే..పోషకాహారం, ఇంట్లో వండిన వంట్లకే కట్టుబడి ఉండటం అని చెబుతున్నారు. తాను ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇలా స్లిమ్గా ఉన్నానని నమ్మకంగా చెప్పారామె. కాబట్టి..ఇంకెందుకు ఆలస్యం హాయిగా నచ్చిన పోషకాహారం తింటూ..వర్కౌట్లు చేస్తూ హెల్దీగా ఉందాం మరి..!.(చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!)
అంతర్జాతీయం
పెన్నీ.. విన్నర్
న్యూయార్క్: అమెరికాలో పెంపుడు శునకాల క్రమ శిక్షణ, అద్భుత నైపుణ్యాల ప్రదర్శనకు పెట్టింది పేరైన వెస్ట్మినిస్టర్ షోలో నాలు గేళ్ల నలుపు డామర్మాన్ శునకం ‘పెన్నీ’ విజేతగా నిలబడి అందరి మదినీ దోచేసింది. దీని వయసు కేవలం నాలుగేళ్లే. బెస్ట్ ఇన్ షో టైటిల్ నెగ్గడంతో దీని పెంపకందారు పెద్దాయన యాండీ లిన్టన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత పెన్నీ ద్వారా తనకు గుర్తింపు దక్కిందని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. 200 జాతులకు చెందిన మొత్తం 2,500 శునకాల నుంచి గట్టి పోటీ ఎదురైనాసరే పెన్నీ తన ఆట నైపుణ్యం, తెలివితేటలతో విజయకేతనం ఎగురవేసింది. ‘‘నాకింకా ఎన్నో విజయాలను వరించాలని ఉంది. కానీ ఈ 150వ వెస్ట్మినిస్టర్ కెన్నెల్ క్లబ్ డాగ్ షోను గెలవడం ఎంతో ప్రత్యేకం. పెన్నీ నిజంగా ఎంతో మంచి డాబర్మాన్. ఇలాంటి శునకాన్ని ఎన్నడూ చూడలేదు’’ అని యాండీ లిన్టన్ అన్నారు. ఈసారి విజేతలు చరిత్రలో నిలిచిపోతారని పోటీలకు న్యాయమూర్తి డేవిడ్ ఫిజ్ప్యాట్రిక్ వ్యాఖ్యానించారు. పెన్నీ గత ఏడాదిసైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజేత శునకాలలకు ట్రోఫీతోపాటు రిబ్బన్, బ్రాగింగ్ హక్కులను కల్పిస్తారు. బ్రాగింగ్ రైట్స్తో శునకాల సంరక్షకులు వాటి పెంపకానికి అత్యధిక ఫీజులు వసూలుచేస్తారు. శునకం జాతికీ సమాజంలో అత్యధిక విలువ దక్కుతుంది.
అంతరిక్ష సంక్షేమం కోసం స్టార్గేజ్
ఇతరుల బాగు కోరే వారే మంచి మనిషి అని శతాబ్దాలుగా వింటున్నాం. ఇప్పుడీ మంచి పనిని అంతరిక్ష వేదిగా ఆచరించి చూపుతా మని ప్రపంచ కుబేరుడు ఎలాన్మస్క్కు చెందిన ‘స్పేస్ఎక్స్’ సంస్థ శనివారం ప్రకటించింది. అంతరిక్షంలో వందల కిలోమీటర్ల ఎత్తులో వేర్వేరు కక్ష్యల్లో తిరిగే కృత్రిమ ఉపగ్రహాలు హఠాత్తుగా స్థానచలనం చెందిన విపత్కర సందర్భాల్లో సమీప ఉపగ్రహాల ఆపరేటర్లను అప్రమత్తంచేసే అత్యాధునిక ఆన్లైన్ టూల్ ‘స్టార్గేజ్’ను అందుబాటులోకి తెచ్చినట్లుస్పేస్ఎక్స్ ప్రకటించింది. దీనిని స్పేస్ సిట్యూవేషనల్ అవేర్నెస్ సిస్టమ్ అని కూడా పిలుస్తున్నారు.ఏమిటీ స్టార్గేజ్?ఇదొక అప్రమత్త వ్యవస్థ. ఉపగ్రహాల ఇంధనం ఖాళీ అవడం, లేదా ఉపగ్రహం విఫలమై దిగువ కక్ష్యలోకి జారిపోవడం లేదా స్వేచ్ఛగా ఇష్టమొచ్చినట్లు తిరిగే సందర్భాల్లో అవి అంతరిక్ష బాంబుల్లా మారిపోతాయి. సమీప ఉపగ్రహాలకు ఢీకొట్టి సర్వనాశనం చేస్తాయి. తర్వాత ఇది శృంఖల చర్యలా విశృంఖలంగా జరిగి వందల ఉపగ్రహాలు ధ్వంసమయ్యే పెను ప్రమాదముంది. ఈ అంతరిక్ష ప్రమాదాన్ని మొగ్గదశలోనే తుంచేసే శక్తి ఈ స్టార్గేజ్కు ఉంది. అస్తవ్యస్తంగా కదులుతున్న ఉపగ్రహాల జాడ, లొకేషన్ను ఇతర ఆపరేటర్లకు ఉచితంగా స్పేస్ఎక్స్ అందిస్తుంది. దాంతో తమ ఉపగ్రహాలను ఆ ప్రమాదకర ఉపగ్రహం నుంచి దూరంగా తీసుకెళ్లడమో, దిగువ కక్ష్యలోకి సురక్షితంగా మార్చడమో సాధ్యమవుతుంది. దీంతో ఉపగ్రహాల యాక్సిడెంట్ను నివారించవచ్చు. కేవలం ఉపగ్రహాలు మాత్రమేకాకుండా హఠాత్తుగా దూసుకొచ్చిన చిన్నపాటి గ్రహశకలాల లొకేషన్నూ ఆపరేటర్లకు స్టార్గేజ్ అందిస్తుంది. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సమాచారం ఇవ్వడం స్టార్గేజ్ ప్రత్యేకత. అత్యాధుని సెన్సార్లు, సంక్టిష్లమైన సాఫ్ట్వేర్ సాయంతో పాత ఉపగ్రహాల శకలాలనూ స్టార్గేజ్ గుర్తించి వాటి జాడను ఆపరేటర్లకు అందజేస్తుంది. ఒకచోట పొగుబడిన శకలాల ప్రాంతాలను గుర్తించి అప్రమత్తంచేస్తుంది. ఉపగ్రహాలు ఢీకొట్టే అవకాశాలు గణనీయంగా తగ్గించి తద్వారా అంతరిక్ష చెత్త పోగుబడకుండా, ఆ ప్రాంతంలో మరో కొత్త ఉపగ్రహం వచ్చి చేరేందుకు మార్గం సుగమం చేస్తుంది. పౌర, సౌనిక, నిఘా, వాతావరణ ఉపగ్రహాల ప్రయోగాలతో దిగువ భూకక్ష్యల్లో కొత్త ఉపగ్రహాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీనికితోడు వేలాది ఉపగ్రహాల కూటమి స్టార్లింక్తో ఉపగ్రహాల సంఖ్య వేలాదిగా ఎక్కువైంది. ఈ తరుణంలో అంతరిక్షం సైతం ఒక రద్దీ అయిన రహదారిలో మారింది. రోడ్డుపై వాహనాలను క్రమబద్ధీకరించే ట్రాఫిక్ కానిస్టేబుల్ తరహా వ్యవస్థ తక్షణావసరమైంది. ఈ అవసరాన్ని స్టార్గేజ్ తీర్చనుంది.అదనంగా కంజంక్షన్ స్క్రీనింగ్ సర్వీస్..ఇప్పుడున్న ఉపగ్రహాలు కొన్ని గంటల తర్వాత ఏ దిశగా ఎంత దూరం కదులుతాయి అనే వివరాలను స్టార్గేజ్ ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఉపగ్రహాల ఆపరేటర్లకు ఉచితంగా అందివ్వనుంది. దీంతో తోటి ఉపగ్రహాలతోపాటు ఖగోళ వస్తువులు, స్పేస్ చెత్త ఎక్కడున్నాయో ఇట్టే తెల్సిపోతుంది. వీటికి అనుగు ణంగా ఆపరేటర్లు తమ భవిష్యత్ ఉ పగ్రహాల ప్రయోగాల తేదీలను సవరించుకోవ చ్చు. దీని వల్ల అత్యంత విలువైన సమయం, ప్రయోగాల ఖర్చు కలిసివస్తాయి. స్టార్గేజ్ అందించనున్న అత్యంత విలువైన డేటా షేరింగ్ సమాచారాన్ని నాసా, ఇతర అంతర్జాతీయ ఉపగ్రహ ఆపరేటర్లు ఎప్పట్నుంచో కోరుతుండగా ఇన్నేళ్లకు ఇది సాకారమైంది. గత ఏడాది డిసెంబర్లో స్టార్లింక్ ఉపగ్రహ కూటమికి అత్యంత సమీపంగా చైనా ఉపగ్రహం దూసుకొచ్చింది. అవి ఢీకొట్టే పెనువినాశనం సంభవించేది. దీంతో భయపడిన స్టార్లింక్ ఏకంగా తమ 4,400 ఉపగ్రహాలను వెనువెంటనే 480 కిలోమీటర్ల దిగువ కక్ష్యలోకి తీసుకురావాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దనే సదుద్దేశంతో ఉచితంగా ఈ సేవలను స్టార్లింక్ అంతర్జాతీయంగా అన్ని దేశాలకు అందుబాటులోకి తెచ్చింది. కంజంక్షన్ డేటా మెసేజెస్(సీడీఎం)లను ఎప్పటికప్పుడు స్టార్గేజ్ పంపనుంది. కంజంక్షన్ స్క్రీనింగ్ సర్వీస్ ద్వారా గంటల తర్వాత రావాల్సిన డేటాను కేవలం నిమిషాల్లోనే సీడీఎంల రూపంలో ఆపరేటర్లు పొందొచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్
పుతిన్, ట్రంప్తో జిన్పింగ్ మాటామంతి
బీజింగ్: చైనా అధినేత జిన్పింగ్ బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిన కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్తో సంభాషించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా, రష్యా సంబంధాలపై పుతిన్తో జిన్పింగ్ విస్తృతంగా చర్చించారు. ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక ‘గ్రాండ్ ప్లాన్’ను పుతిన్ ప్రతిపాదించారు. గత ఏడాది నవంబర్ తర్వాత జిన్పింగ్, పుతిన్ ఫోన్లో మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. ఇటీవలి కాలంలో చైనా, జపాన్ సంబంధాలు దెబ్బతింటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్తో సంభాషణ చర్చనీయాంశంగా మారింది. పుతిన్తో, ట్రంప్తో జిన్పింగ్ ఒకేరోజు మాట్లాడడం అత్యంత అరుదైన ఘటన. అయితే, ట్రంప్తో ఏం చర్చించారన్నది తెలియరాలేదు. దీనిపై చైనా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. రష్యా, అమెరికాల మధ్య 2010లో కుదిరిన అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందం గడువు గురువారం ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కొత్త ఒప్పందాన్ని ప్రతిపాదించారు. ఇందులో చైనా భాగస్వామిగా మారాలని కోరుతున్నారు. అందుకు చైనా అంగీకరించడం లేదు.
UAEలో భగ్గుమంటున్న ఇంటి అద్దె.. ఆందోళనలో భారతీయులు
అబుదాబిలో అద్దెలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్నాయి. విల్లాలతో పాటు సాధారణ ప్లాట్ల అద్దెని ఒకేసారి రెట్టింపు చేయడంతో చాలా మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. సంపాదించిన దాంట్లో అగ్రభాగం ఇంటి అద్దెలకే చెల్లించాల్సి వస్తుందని అక్కడి భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.యూఏఈ అబుదాబిలో అక్కడి ప్రాపర్టీ మేనేజర్లు అధికంగా డబ్బులు అర్జించే లక్షంతో కొత్త నిబంధనలు తీసుకవచ్చారు. ఉన్న ఫలంగా అద్దెలను రెట్టింపు చేశారు. అక్కడి గృహా చట్టాల ప్రకారం ఒక విల్లాలో ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు ఉండడం నిషిద్ధం. అయితే అక్కడి అద్దెల రీత్యా చాలా మంది విల్లాలలను షేర్ చేసుకొని అద్దెకు తీసుకుంటారు. కాగా ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలలో నివాసమున్న వారిని వెంటనే ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో చట్టపరంగా అది విరుద్ధం కావడంతో చేసేదేం లేక వారు ఖాళీ చేస్తున్నారు.విల్లాలతో పాటు ఫ్యామిలీలు అధికంగా నివసించే ప్రాంతాలకు కరెంట్ కట్ చేసి మూడు రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో వారు ఎటువెళ్లాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉంటున్న వారిని బలవంతంగా ఖాళీ చేయించి అదే వాటిని కొత్త వారికి అధిక ధరలకు ఇస్తున్నారని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.గతంలో 24,000 దిర్హామ్లు ఉండే విల్లాల అద్దె ప్రస్తుతం 40,000 దిర్హామ్లు చేరుకుంది.
జాతీయం
సోనమ్ను మించిన ఖతర్నాక్ అంజూ.. ఈ హనీమూన్ కథలో ట్విస్టులెన్నో!
ఆ దంపతులకు పెళ్లయి అప్పటికే మూడు నెలలే అయ్యింది. కొత్త కాపురంలో ఎంతో అన్యోన్యంగా మెలిగారు వాళ్లు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో.. ఓ సరదా సాయంత్రం ఇద్దరూ హైవేపై వాకింగ్కని బయల్దేరారు. ఇంతలో ఓ వాహనం హఠాత్తుగా దూసుకొచ్చి ఇద్దరినీ ఢీ కొట్టింది. భర్త అశీష్కు వాహనం బలంగా తగలడంతో స్పాట్లోనే చనిపోయాడు. భార్య అంజూ అపస్మాకర స్థితిలో రోడ్డ పక్కన పడిపోయింది. కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు వాళ్లను గమనించి వాళ్లను ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. అశీశ్ మృతదేహం స్ట్రెచ్చర్ మీద ఉంది. తన ప్రియాతిప్రియమైన భర్త ఇక లేడని తెలిసి గుండెలు అవిసెలా రోదిస్తున్న అంజూను చూసి అంతా ‘‘అయ్యో పాపం’’ అనుకున్నారు. ఈ ఘటనను తొలుత హిట్ అండ్ రన్ కేసుగా పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. అయితే విచారణలో అంజూ తడబడింది. పైగా తన బంగారు చెవి పొగులు కనిపించడం లేదని.. ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటారని చెప్పింది. దీంతో విచారణను పోలీసులు పలు కోణాల్లో జరపగా.. ఈ కేసు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది.హనీమూన్ పేరిట భర్తను రాష్ట్రంకాని రాష్ట్రానికి తీసుకెళ్లి.. నిర్మానుష్య ప్రాంతంలో ప్రియుడితో కలిసి హత్య చేయించింది మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన సోనమ్. ఆపై ఎలాంటి అనుమానాలు రాకుండా పెద్ద కథే నడిపించింది. హనీమూన్ మర్డర్ కేసుగా మేఘాలయాలో జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. సరిగ్గా ఈ ఘటన జరిగిన నెల వ్యవధిలో.. తెలంగాణలోని గద్వాల జిల్లాలో సర్వేయర్గా పని చేసే తేజేశ్వర్ను అతని భార్య ఐశ్వర్య ఖతర్నాక్ స్కెచ్తో మర్డర్ చేయించింది. ఈ రెండు ఘటనలు ఆ జంటకు పెళ్లైన స్వల్పకాలంలో జరగడంతో.. సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చే నడిచింది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఘటనే.. రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లాలో మరో హనీమూన్ మర్డర్ కేసు బయటపడింది. పెళ్లైన కొన్నాళ్లకే తన భర్త అశీశ్ను ప్రియుడి&కోతో కలిసి కిరాతకంగా హత్య చేయించింది భార్య అంజూ. అంతేకాదు.. కేసును హిట్ అండ్ రన్ కేసుగా క్లోజ్ చేయించేందుకు శతవిధాల ప్రయత్నించింది. జనవరి 30వ తేదీ సాయంత్రం జరిగింది ఇదే.. అశీష్-అంజూలు జంటగా.. సాయంత్రం షికారు పేరుతో వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో వెనక నుంచి వచ్చిన సంజూ(అంజూ ప్రియుడు) అశీశ్పై బలంగా దాడి చేశాడు. కింద పడిపోయిన అశీల్ను రాకీ (రోహిత్), బాదల్ (సిద్ధార్థ్) గట్టిగా పట్టుకోగా.. సంజూ-అంజూలు ఊపిరి ఆగేదాకా గొంతు నులిమారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. అశీష్ మృతదేహాన్ని తమ వాహనంతో బలంగా ఢీ కొట్టి దూరం పడిపోయేలా చేశారు. ఆపై తన ఒంటిపై ఉన్న నగలను ప్రియుడికి అప్పగించి.. రోడ్డుకు ఓ పక్కన పడిపోయినట్లు నటించింది అంజూ. అక్కడే దొరికింది.. అయితే వాంగ్మూలాల సమయంలో ఒక్కోసారి ఒక్కోలా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్.. ఆమెను అడ్డంగా దొరికిపోయేలా చేసింది. అనుమానంతో అంజూ ఫోన్ రికార్డులు పరిశీలించగా.. అందులో సంజూ అనే వ్యక్తితో తరచూ ఆమె మాట్లాడినట్లు తేలింది. అంతేకాదు.. అశీశ్ కలిశాక ఆ కాల్స్ మరింత ఎక్కువ అయ్యాయని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో తమదైన శైలిలో ప్రశ్నించగా.. అంజూ-సంజూలు నిజం ఒప్పేసుకున్నారు. అశీశ్తో తనకు వివాహం ఇష్టం లేదని.. పెద్దల బలవంతం మేరకే చేసుకున్నానని.. పెళ్లి తర్వాత ఓరోజు సంజూ ఇంటికి వెళ్లి తన భర్తను అడ్డు తొలగించుకోవడం గురించి మాట్లాడుకున్నామని.. ఈ ప్లాన్ను సంజూ తన స్నేహితులతో అమలు చేశాడని వాంగ్మూలం ఇచ్చింది. ఆపై దొంగతనం జరిగినట్లు నాటకం ఆడాలని ప్రయత్నిస్తే.. పోలీసులే హిట్ అండ్ రన్గా కేసు నమోదు చేసుకోవడంతో తన పని తేలిక అయ్యిందని భావించానని.. కానీ, పోలీసుల విచారణలో కంగారులో తడబడ్డానని అంజూ చెప్పుకొచ్చింది. దీంతో.. కేసును హత్య కేసుగా మార్చుకున్న పోలీసులు అశీశ్ భార్య అంజు, ఆమె ప్రియడు సంజు, సంజూ స్నేహితులు రాకీ, బాదల్ను అరెస్టు చేశారు. సోనమ్ కూడా..కిందటి ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన హనీమూన్ హత్య కేసు గుర్తుండే ఉంటుంంది. సోనమ్ తన తండ్రి దగ్గర పని చేసే రాజ్ కుష్వాహా అనే వ్యక్తిని ప్రేమించి.. ఆపై భర్త రాజా రఘువంశీని ఇష్టంలేని పెళ్లి చేసుకుని.. మంచిగా నటిస్తూ హనీమూన్ పేరిట భర్తను మేఘాలయాకు తీసుకెళ్లి అక్కడ ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేయించిది. ఆపై ఏం ఎరగనట్లు కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి.. ఆపై రోడ్డుపై ఓ దాబాకు దీనావస్థలో(డ్రామా) చేరి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.
Odisha: ఒక్కసారిగా పట్టాలు తప్పిన మూడు బోగీలు..
జాజ్పూర్: ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. జఖపురా రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై సెంట్రల్ - న్యూ జల్పాయ్గురి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలులోని మూడు బోగీలు ఒక్కసారిగా ట్రాక్ పైనుంచి పక్కకు జరిగాయి. భువనేశ్వర్ నుండి కోల్కతా మీదుగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారిక వర్గాలు తెలిపాయి.ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. ఉదయం 8:51 గంటలకు ప్రమాదం జరగగా, భువనేశ్వర్, ఖుర్దా రోడ్ నుండి ప్రమాద సహాయక రైళ్లు ఘటనా స్థలానికి బయలుదేరాయి. వీటితో పాటు ఖుర్దా రోడ్ నుండి అత్యాధునిక వైద్య పరికరాల బృందాన్ని కూడా పంపించారు. భద్రక్ నుంచి వచ్చిన ప్రత్యేక సహాయక బృందం కూడా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను వేగవంతం చేసింది.ప్రస్తుతం యుద్ధప్రతిపాదికన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. భద్రక్ నుండి వచ్చిన ఇంజనీరింగ్ బృందాలు పట్టాలను సరిచేసి, రైలు రాకపోకలను పునరుద్ధరించేందుకు శ్రమిస్తున్నాయి. సీనియర్ రైల్వే అధికారులు ఘటనా స్థలంలో ఉండి పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని నిర్ధారించారు. కాగా, ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్లోని మథురలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఢిల్లీ-ముంబై మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని సమాచారం.ఇది కూడా చదవండి: ఉత్తరాదిపై పన్నీర్సెల్వం వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తరాదిపై పన్నీర్సెల్వం వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాట మరోమారు భాషా వివాదం రాజుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల సమయం మాత్రమే ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్కె పన్నీర్సెల్వం భాషా వివాదాన్ని తట్టి లేపారు. ఉత్తరాది రాష్ట్రాల నుండి వలస వచ్చే కార్మికులపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.ఉత్తరాది వారికి కేవలం హిందీ మాత్రమే తెలియడం వల్ల వారికి తక్కువ అవకాశాలు లభిస్తున్నాయని, అందుకే వారు తమిళనాడుకు వచ్చి టేబుళ్లు శుభ్రం చేయడం, నిర్మాణ రంగంలో పని చేయడం లేదా పానీపూరీ అమ్ముకోవడం వంటి పనులు చేసుకుంటున్నారని పన్నీర్సెల్వం వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న ద్విభాషా విధానంతో కలిగే ప్రయోజనాలను మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. తమిళనాడు విద్యార్థులు తమ మాతృభాషతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల లండన్, అమెరికా తదితర దేశాలకు వెళ్లి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని అన్నారు.ఇదే సమయంలో పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా స్పందిస్తూ రాష్ట్రంలో హిందీ మాట్లాడటాన్ని ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకోలేదని, జర్మన్, జపనీస్ వంటి విదేశీయులే ఇక్కడ సంతోషంగా ఉంటున్నప్పుడు, హిందీ మిత్రులకు ఇబ్బందేమిటని ఆయన ప్రశ్నించారు. కాగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ‘భాష’ ప్రధానాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తుండగా, ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి దీనిని సవాలు చేస్తోంది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1930లు, 1960ల కాలంలో జరిగిన భాషా ఉద్యమాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఇది కూడా చదవండి: రంజాన్ 2026: సౌదీ అరేబియా కీలక ప్రకటన
లోక్సభ వాయిదా.. రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం పార్లమెంట్ ఉభయ సభలు తీవ్ర వాదోపవాదాలతో అట్టుడికాయి. లోక్సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మంగళవారం నాటి ఘటనలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముఖ్యంగా లడఖ్ సరిహద్దు అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించడాన్ని అధికార పక్షం తీవ్రంగా తప్పుపట్టింది.రాజ్యసభలో ఖర్గే వర్సెస్ రిజిజురాజ్యసభలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, లోక్సభలో రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. సభ ఎవరి ఇష్టానుసారమో నడవదని, నిబంధనల ప్రకారమే సాగుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి స్పీకర్ 40 నిమిషాల సమయం ఇచ్చారని, అయినప్పటికీ ఆయన నిబంధనలు అతిక్రమించి మాట్లాడారని రిజిజు ఎదురుదాడి చేశారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ స్పీకర్ ఆదేశాలను గౌరవించకుండా ప్రసంగాన్ని కొనసాగించారని, ఇది సభా మర్యాదలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. తాను దేశానికి తెలియని అనేక రహస్య పత్రాలను, పుస్తకాలను సభ ముందు ఉంచుతున్నానని దూబే తెలిపారు.జెపి నడ్డా మాట్లాడుతూ ప్రధాని మోదీ లోక్సభలో సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, ప్రతిపక్షాలు సభను సాగనీయడం లేదని మండిపడ్డారు. నిర్మలా సీతారామన్ సైతం ఖర్గే చేసిన ‘లించింగ్’ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పాత ఘటనలను గుర్తుచేశారు. సభలో ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలోనే మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ‘ఇండియా’ కూటమి నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మరోవైపు లోక్సభలో ప్రధాని ప్రసంగానికి ఆటంకం కలగడంతో, ఆయన నేడు సాయంత్రం 5 గంటలకు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు. అంతకుముందు ప్రధాని మోదీ, అమిత్ షా పార్లమెంట్కు చేరుకుని కీలక నేతలతో చర్చలు జరిపారు. సభలో చోటుచేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి.
ఎన్ఆర్ఐ
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే వలస కార్మికుల ఉచిత వీసాల కోసం అక్కడి ఏడీఎన్హెచ్ సంస్థ, తెలంగాణలోని జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నాలుగు చోట్ల ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. క్లీనింగ్ విభాగంలో పనిచేసేందుకు ఉచితంగా వీసాలను జారీ చేసి, ఉచిత విమాన టికెట్, వసతి, భోజన సదుపాయం కల్పించి.. మన కరెన్సీలో రూ.23 వేల వరకు వేతనాలను చెల్లించనున్నారు. వచ్చే నెల 6న జగిత్యాల, సిరిసిల్లలో, 7న నిజామాబా ద్, ఆర్మూర్లలోని జీటీఎం సంస్థ కార్యాలయాలలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. వివ రాల కోసం ఆర్మూర్ (8332062299), నిజామాబాద్ (8686860999), జగిత్యాల (83320422 99), సిరిసిల్ల (9391661522) నంబర్లలో సంప్రదించవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దళారుల్ని నమ్మొద్దు ఈనెల 9, 10 తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరైన వంద మందిని రెండు మూడు రోజుల్లో యూఏఈకి పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దళారులను నమ్మి మోసపోవద్దు. – చీటీ సతీశ్రావు, చైర్మన్, జీటీఎం ఇంటర్నేషనల్ (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!)
వైభవంగా తానా మిడ్-అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలను చూడటానికి వచ్చిన జనసందోహం, మరోవైపు తమ ఆట, పాటలతో మైమరపింపజేసిన చిన్నారులతో తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సూపర్ హిట్టయింది. వెస్ట్ చెస్టర్ లో జనవరి 17వ తేదీన జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దాదాపు 1500మందికిపైగా వచ్చిన జనసందోహం నిర్వాహకులకు, కళాకారులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికితోడు సంక్రాంతి థీమ్ ను ప్రతిబింబించేలా చేసిన కార్యక్రమాలు, పోటీలు అందరిలోనూ పాల్గొనేలా చేశాయి.తానా మిడ్ అట్లాంటిక్ కు చెందిన బోర్డ్ డైరెక్టర్ రవిపొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు చిన్నారులు పాడిన సినిమా పాటలు ఎంతోమందిని అలరింపజేశాయి. యాంకర్లు శ్వేత కొమ్మోజి, మనీషా మేక కూడా కార్యక్రమాల విజయానికి తమవంతుగా వ్యాఖానాలను జోడించి ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. సాంప్రదాయ భోగిపళ్లు కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు వారిపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు, కిడ్స్ విలేజ్ థీమ్ కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారిని తానా నాయకులు అభినందించారు. ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకుల కోసం 7,000 పౌండ్లకు పైగా ఆహారాన్ని విరాళంగా సేకరించడంలో ప్రతిభ కనబరిచిన యువ వలంటీర్లను ఈ సంక్రాంతి వేడుకల్లో సత్కరించడం హైలైట్ గా నిలిచింది. వెస్ట్ వైట్ ల్యాండ్ టౌన్ షిప్ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ వైస్-ఛైర్ మిస్టర్ రాజేష్ కుంభార్దరే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి వలంటీర్లను సత్కరించారు.తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తదితరులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ను అభినందించారు. ఈవెంట్ కోఆర్డినేటర్లు సురేష్ యలమంచిలి, కృష్ణ నందమూరితోపాటు మిడ్ అట్లాంటిక్ టీమ్ నాయకులు, వలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన క్రాస్ రోడ్స్, గోల్డెన్ స్పాన్సర్స్ గా ఉన్న శ్రీధర్ అంచూరి మరియు సురేష్ బందుగులకు, కమలం ది డెకర్ కంపనీకి, అతిథులకు, వలంటీర్లకు కమ్యూనిటీ నాయకులకు, ఈ వేడుకకు సహకరించిన అందరికీ తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.తానా మిడ్ అట్లాంటిక్ టీమ్`సరోజ పావులూరి, దీప్తి కోక, మనీషామేక, శైలజ కస్తూరి, సునీత వాగ్వాల, మైత్రి నూకల, బిందు ఆలపాటి, రమ్య మాలెంపాటి, ఇందు సందడి, రాణి తుమ్మల, భవానీ క్రొత్తపల్లి, అనుపమ యలమంచి, భవానీమామిడి, నీలిమ వోలేటి, రవీన తుమ్మల, శ్రావణి రాయలతోపాటు, విశ్వనాథ్ కోగంటి, శ్రీధర్ సాధినేని, శ్రీకాంత్ గూడురు, గోపి వాగ్వాల, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, వెంకట్ ముప్పా, రమేష్ గుట్ట, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి, ప్రసాద్ కస్తూరి, రంజిత్ కోమటి, రంజిత్ మామిడి, మూర్తి నూతనపాటి, చందు భాతుస్కర్, సంతోష్ రౌతు, సత్య పొన్నగంటి, రాజు గుండాల, రాధాకృష్ణ మూల్పూరి, నాయుడమ్మ యలవర్తి, చలం పావులూరి, మోహన్ మల్ల ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు.
భార్యను, బంధువులను కాల్చి చంపాడు!
న్యూయార్క్: అమెరికాలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ భారత సంతతి వ్యక్తి క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. భార్య, ఆమె తరఫు ముగ్గురు బంధువులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్లముందే జరిగిన దారుణం చూసి బెంబేలెత్తిపోయిన అతని 12 ఏళ్ల కొడుకు, బంధువుల తాలూకు మరో ఇద్దరు పిల్లలు వెంటనే ఓ గదిలోకి దూరి గడియ పెట్టుకుని బతికిపోయారు. కొడుకు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే పారిపోయిన నిందితున్ని కొద్ది దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం అందరినీ కలచివేస్తోంది. నిందితున్ని విజయ్కుమార్ (51)గా, మృతులను అతని భార్య మీమూ డోగ్రా (43), మిగతా వారిని గౌరవ్ కుమార్ (33), నిధీ చందర్ (37), హరీశ్ చందర్ (38)గా గుర్తించారు. ఇది మాటలకందని ఘోరమని అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది. బాధిత కుటుంబానికి అన్నివిధాల సాయమూ అందిస్తున్నట్టు పేర్కొంది. గదిలో దాక్కున్న పిల్లలు విజయ్కుమార్ దంపతులు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నివసిస్తుండేవారు. శుక్రవారం అర్ధరాత్రి ఏదో విషయమై ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఘర్షణ నడుమే కొడుకుతో కలిసి శివారు నగరమైన లారెన్స్విలేలోని బ్రూక్స్ ఐవీ కోర్ట్లో ఉంటున్న డోగ్రా తాలూకు బంధువులు గౌరవ్, నిధి, హరీశ్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఘర్షణ శ్రుతిమించి కాల్పులకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవకు దారితీసిన కారణమేమిటో తెలియాల్సి ఉందని చెప్పారు. ‘‘విజయ్ దంపతుల 12 ఏళ్ల కొడుకు తెల్లవారుజాము 2:30 ప్రాంతంలో మాకు కాల్ చేసి దారుణం గురించి చెప్పాడు. రాపిడ్ రెస్పాన్స్ బృందం నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది. నలుగురు వ్యక్తు లు ఇంట్లో తూటా గాయాలతో పడిపోయి కన్పించారు. ముగ్గురు పిల్లలు సకాలంలో స్పందించి పక్క గదిలోకి పరుగెత్తి దాక్కోవడంతో దాడి నుంచి బయ ట పడ్డట్టున్నారు’’అని పోలీసులు వివరించారు.
TPAD అధ్యక్షురాలిగా వరుసగా మూడోసారీ మహిళకే పట్టం
డల్లాస్, టెక్సాస్లో శక్తివంతమైన, ప్రభావవంతమైన తెలుగు సంస్థగా అక్కడి తెలుగు ప్రజల మన్ననలు పొందుతున్న “డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (TPAD)”.. 2026 సంవత్సరానికి గాను తన నూతన కార్యవర్గ బృందానికి బాధ్యతలు అప్పగించింది. గత 12 ఏళ్లలో టీప్యాడ్, డల్లాస్లోని తెలుగు సమాజంలో స్వచ్ఛంద సేవకులు, కమ్యూనిటీ సభ్యులను విస్తృతంగా ఆకర్షిస్తూ అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. బలమైన సంస్థాగత నిర్మాణం ద్వారా అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దింది.సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణతో పాటు మంచి నాయకులను తీర్చిదిద్దడంలో అద్భుతమైన చరిత్ర కలిగిన టీప్యాడ్, ఫ్రిస్కో, టెక్సాస్లోని ఎలిగెన్స్ బాల్రూమ్లో స్థానిక కమ్యూనిటీ నాయకులు, మద్దతుదారుల సమక్షంలో తన 13 వ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో ప్రమాణస్వీకారం చేయించింది. టీప్యాడ్ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహిళలే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. మహిళా సాధికారతకు, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి టీప్యాడ్ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం.టీప్యాడ్ చరిత్ర, నేపథ్యంపై విస్తృత అవగాహన కలిగిన వీణా యలమంచిలి కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించారు. సీనియర్ టీప్యాడ్ నాయకులు మరియు ఫౌండేషన్ కమిటీ సభ్యుడు రావు కల్వాల — రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్)లతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీప్యాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు సుధాకర్ కలసాని — కార్యవర్గ సభ్యులు మరియు పదాధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు.కొత్త కమిటీ సభ్యులు లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), శ్రీనివాస్ అన్నమనేని (ఉపాధ్యక్షుడు), గాయత్రి గిరి (కార్యదర్శి), శివ కొడిత్యాల (సహ కార్యదర్శి), ఆదిత్య రెడ్డి (ఖజాంచీ), దీపిక దీపికా రెడ్డి (సహ ఖజాంచీ) .నూతన ఈసీ సభ్యులు:బాల గణపవరపు, మాధవి ఓంకార్, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, తిలక్ కుమార్ వన్నంపుల.రవికాంత్ మామిడి, అశోక్ పొద్దుటూరి, రోజా అడెపు, మాధవి సుంకిరెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండాల, పాండురంగ రెడ్డి పల్వాయి, బుచ్చి రెడ్డి గోలితో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రవికాంత్ మామిడి (BOT ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్)లకు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకార అనంతరం మాట్లాడిన FC ఛైర్ రఘువీర్ బండారు, BOT ఛైర్ రవికాంత్ మామిడి, అధ్యక్షురాలు లక్ష్మి పోరెడ్డి, కోఆర్డినేటర్ లింగా రెడ్డి ఆల్వా, BOT వైస్ ఛైర్ రోజా అడెపు-రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక వేడుకల నిర్వహణ, బతుకమ్మ, దసరా సంబరాలను డీఎఫ్డబ్ల్యూ తెలుగు సమాజం ఆశించే స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు నూతన బృందం కట్టుబడి ఉందని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా టీప్యాడ్కు నిరంతర మద్దతు అందిస్తున్న సపోర్టర్లు, స్పాన్సర్లకు టీప్యాడ్ నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.టీప్యాడ్ 2026 కార్యవర్గం:ఎగ్జిక్యూటివ్ కమిటీ:లక్ష్మి పోరెడ్డి (President), అనురాధ మేకల (Past President), శ్రీనివాస్ అన్నమనేని (Vice President), గాయత్రి గిరి (Secretary), శివ కొడిత్యాల (Joint Secretary), ఆదిత్య రెడ్డి (Treasurer), దీపిక దీపికా రెడ్డి (Joint Treasurer), స్వప్న తుమ్మపాల, నిఖిల్ కందుకూరి, ప్రశాంత్ నిమ్మని, మాధవి ఓంకార్, స్నేహా రెడ్డి, సంతోష్ రెగొండ, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, తిలక్ కుమార్ వన్నంపుల, రత్న వుప్పల, బాల గణపవరపు.బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్:రవికాంత్ మామిడి (BOT ఛైర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), మాధవి సుంకిరెడ్డి, రమణ లష్కర్, పాండురంగ రెడ్డి పల్వాయి, రామ్ అన్నాడి, బుచ్చి రెడ్డి గోలి, అశోక్ కొండాల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, అశోక్ పొద్దుటూరి.ఫౌండేషన్ కమిటీ:రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్), జనకిరామ్ మండాది, ఉపేందర్ తెలుగు, రాజ్ గోంధి, మహేందర్ కమిరెడ్డి
క్రైమ్
బ్లాక్మెయిల్తో బలవన్మరణం
చిక్కడపల్లి (హైదరాబాద్): ఆన్లైన్ లోన్ యాప్ల అరాచకాలు సామాన్యుల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. కేవలం మూడు వేల రూపాయల స్వల్ప రుణం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యాప్ ఏజెంట్ల అసభ్యకర బెదిరింపులు, మానసిక వేధింపులు తాళలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం ఇన్స్పెక్టర్ మల్లేశం తెలిపిన వివరాలివి.ముంబై నుంచి వచ్చి.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారావి, శాస్త్రిచౌక్కు చెందిన ప్రేమ్ కుమార్ రాజు బర్ల (30) బతుకుతెరువు కోసం ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్కు వలస వచ్చారు. చిక్కడపల్లి రిసాల అంబేడ్కర్నగర్లో తన భార్య నాగమణితో కలిసి నివసిస్తున్నారు. వీరికి వివాహమై రెండేళ్లు అవుతోంది. దంపతులిద్దరూ కలిసి ఇటీవల ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీకర హాస్పిటల్లో ఒక క్యాంటీన్ను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.చిన్న మొత్తం.. పెద్ద శాపమై.. గతంలో తన అవసరాల నిమిత్తం ఓ లోన్ యాప్ ద్వారా ప్రేమ్ కుమార్ రూ.3 వేల రుణం తీసుకున్నారు. అయితే, సకాలంలో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు మొదలయ్యాయి. ఇటీవల మేడారం జాతరకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రేమ్ కుమార్కు ఏజెంట్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. రుణం చెల్లించడంలో జాప్యం జరిగితే, ప్రేమ్ కుమార్తో పాటు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి, న్యూడ్ ఫొటోలుగా మారుస్తామని ఏజెంట్లు హెచ్చరించారు. వాటిని కుటుంబ సభ్యులకు పంపడమే కాకుండా, సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామని అత్యంత దారుణంగా బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. వరుస కాల్స్తో నిరంతరం మానసిక ఒత్తిడికి గురైన ప్రేమ్ కుమార్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. దీంతో ప్రేమ్కుమార్ మంగళవారం రాత్రి తన అద్దె ఇంట్లోని ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఫోన్లోని కాల్ డేటా, లోన్ యాప్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని ఇన్స్పెక్టర్ మల్లేశం, ఎస్ఐ అభిలాష్లు సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
కన్నతల్లి చూస్తుండగానే చెల్లిని చంపిన అన్న
మొయినాబాద్ రూరల్: భూ పంపకం విషయంలో అన్నాచెల్లి మధ్య నెలకొన్న మనస్పర్థలు.. చెల్లి హత్యకు కారణమయ్యాయి. రక్తం పంచుకుపుట్టిన సొంతచెల్లిని అన్న దారుణంగా చంపేశాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎస్ పరిధిలోని కేతిరెడ్డిపల్లిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సత్తయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మల్లమ్మకు సంతానం లేకపోవడంతో వెంకటమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు కొడుకు రాజు, కూతుళ్లు సరస్వతి, స్వప్న ఉన్నారు. సరస్వతికి వివాహం కాగా, స్వప్న (34) న్యాయవాదిగా కొనసాగుతున్నారు. నెల రోజుల్లో ఆమె వివాహం జరగనుంది. వెంకటమ్మకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఆరెకరాలు రాజుకు, నాలుగెకరాలు స్వప్నకు ఇవ్వాలంటూ గతంలోనే తీర్మానం చేసుకున్నారు. దీంతో ప్రైవేటు ఓ సర్వేయర్ను రప్పించిన స్వప్న బుధవారం ఉదయం 9 గంటలకు తల్లి వెంకటమ్మతో కలిసి భూమి కొలుస్తున్నారు. అక్కడే ఉన్న రాజు, మరో వ్యక్తితో కలిసి వచ్చి చెల్లి తలపై రాయితో కొట్టాడు. కన్నతల్లి చూస్తుండగానే కత్తితో గొంతుకోసి ఇద్దరూ పరారయ్యారు. చుట్టు పక్కల వారి సాయంతో స్వప్నను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. నిందితుడు రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.న్యాయవాదుల ఆందోళనజూనియర్ న్యాయవాది స్వప్న హత్యకు గురైందనే విషయం తెలుసుకున్న పలువురు న్యాయవాదులు వివరాలు తెలుసుకునేందుకు మొయినాబాద్ పీఎస్కు వెళ్లారు. ఈ సమయంలో పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై వారు ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ జామ్ కావడంతో డీసీపీ యోగేశ్ గౌతమ్ న్యాయవాదులతో మాట్లాడి శాంతింపజేశారు. అనంతరం సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీసీపీకి వినతిపత్రం అందజేశారు.
మోస్ట్ వాంటెడ్ నిందితులను పట్టిచ్చిన ‘రోబో’
విశాఖపట్నం: రైల్వే స్టేషన్ అంటేనే నిత్యం వేలాది మందితో కిటకిటలాడే ఒక జనసముద్రం. ఆ రద్దీలో సామాన్య ప్రయాణికులను, మారువేషంలో తిరిగే నేరగాళ్లను వేరు చేసి చూడటం మానవమాత్రులకు కత్తిమీద సామే. కానీ.. ఆధునిక సాంకేతికత తోడైతే అసాధ్యం సుసాధ్యమని ‘రైల్ రోబోకాప్ – ఏఎస్సీ అర్జున్’ నిరూపించింది. సోమవారం నిశ్శబ్దంగా సాగిపోతున్న రాత్రి వేళ, ప్లాట్ఫారంపై తన గస్తీని కొనసాగిస్తున్న ఈ రోబో రూపంలోని కృత్రిమ మేధస్సు ఒక్కసారిగా అప్రమత్తమైంది. దాని డిజిటల్ కళ్లు రద్దీలో ఉన్న ప్రతి ముఖాన్ని నిశితంగా స్కాన్ చేస్తుండగా, ఇద్దరి వ్యక్తుల ముఖకవళికలు తన డేటాబేస్లోని ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాతో సరిపోలాయి. కనురెప్పపాటు కాలంలోనే ఆ రోబో తన విశ్లేషణను పూర్తి చేసి, కంట్రోల్ రూమ్కు ప్రమాద హెచ్చరికలను పంపింది. అప్పటివరకూ సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రోబో పంపిన నిక్కచ్చి సమాచారంతో ఆరీ్పఎఫ్ ఎస్ఐ వి. కీర్తిరెడ్డి నేతృత్వంలోని బృందం, క్రైమ్ ప్రివెన్షన్ డిటెన్షన్ స్క్వాడ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. ఎటు నుంచి ముప్పు వస్తుందో ఊహించలేక ఆ ఇద్దరు అనుమానితులు తచ్చాడుతుండగానే, పోలీసులు వారిని చుట్టుముట్టారు. ప్రాథమిక తనిఖీలో వారి వద్ద కనీసం టికెట్లు కూడా లేకపోవడం అధికారుల అనుమానాన్ని బలపరిచింది.అయితే అసలు సంచలనం వారి గతాన్నితవ్వినప్పుడు బయటపడింది. పట్టుబడిన హడప శివ, జె. బంగారు సాధారణ దొంగలు కాదని, రాయగడ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు, దోపిడీలు, దాడులు, డకాయిటీలతో భీభత్సం సృష్టించిన గజదొంగలని తేలింది. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఈ నేరగాళ్ల ఆటను ‘ఏఎస్సీ అర్జున్’ తన ఏఐ మేధస్సుతో కట్టిపడేసింది. ఈ చారిత్రాత్మక విజయంపై డీఆర్ఎం లలిత్ బోరా స్పందిస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో భద్రతను పర్యవేక్షించడంలో ఏఐ సాంకేతికత ఒక తిరుగులేని ఆయుధమని ప్రశంసించారు.
జ్యోతిషునితో వివాహేతర సంబంధం
బెంగుళూరు: జ్యోతిషునితో మహిళ ఆక్రమ సంబంధం ఒకరి హత్యకు దారి తీసింది. ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపురలో ఈ సంఘటన జరిగింది. శివమొగ్గకు చెందిన జోతిష్యుడు కమలాకర భట్ గురూజీ, అతని ప్రియురాలు, మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. గురూజీ వద్ద సుచిత్ర అనే మహిళ పనిచేస్తూ ఇద్దరికీ అక్రమ సంబంధం ఏర్పడింది.సిద్ధాపుర తాలూకా అవరగుప్పవాసి మహేశ్ నాయక్ భార్య ఈమె. సుచిత్ర ఇద్దరు కూతుళ్లతో కలిసి శివమొగ్గలోనే గురూజీ వద్ద ఉంటోంది. తల్లి తీరు నచ్చక ఓ కూతురు సిద్ధాపురలోని తమ గ్రామానికి వెళ్లి తండ్రి మహేశ్ నాయక, చిన్నాన్న వసంత నాయక (41)కు విషయం చెప్పింది. సోమవారం మధ్యాహ్నం కూతురిని వెతుక్కుంటూ సుచిత్ర కారులో కొందరు యువకులను తీసుకుని వచ్చింది. ఈ సమయంలో సుచిత్రా, భర్త మహేశ్ల మధ్య వాదులాట జరిగింది. ఇరువర్గాల దాడులు చేసుకున్నాయి. మహేశ్, వసంత్ నాయక, కుమార్ని సుచిత్ర అనుచరులు కత్తితో పొడిచారు. గాయాలైన వసంత్ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. మిగతా ఇద్దరూ శివమొగ్గ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హతుని భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదుతో గురూజీ, సుచిత్ర, ఐదుమంది యువకులపై సిద్ధాపుర పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఘటనా స్థలిని ఎస్పీ దీపన్ పరిశీలించారు.
వీడియోలు
చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు
లోక్ సభలో మోదీపై దాడి? బయటపడ్డ సంచలన వీడియో..
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో.. ఈ సారి ఏకంగా కారులో
అంబటి చాలా వీక్ గా ఉన్నారు.. చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తున్నారు
ధురంధర్ దెబ్బకి వెనక్కి తగ్గిన పెద్ది..
చంద్రబాబుపై బైరెడ్డి వేటగాడు కథ.. నవ్వులే నవ్వులు
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్
ఫిలిప్పీన్స్ లో అగ్నిప్రమాదం.. 5 వేల మందికి పైగా..!
మీకు రోజులు దగ్గరపడ్డాయి.. అంబటి రాంబాబు చిన్న కూతురు మాస్ వార్నింగ్

