తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు నగరాన్ని కమ్మేశాయి. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్, ఖమ్మం, మెదక్, మేడ్చల్కు ఆరెంజ్ అలర్ట్.. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. సిద్ధిపేట్, జగిత్యాల, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ ప్రకటించింది.హైదరాబాద్లోని కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఇబ్రహీంపట్నం, ఆదిభట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. సదాశివపేటలో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి శంషాబాద్ అతలాకుతలమైంది. శంషాబాద్ ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. బస్టాప్ సెల్లార్లోకి వరద నీరు చేరింది. శంషాబాద్లో భారీవర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 16 తేదీ నుంచి అధిక వర్షాపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. వరుసగా మూడు రోజులు తమ ప్రాంతంలో వర్షాలు కురిస్తేనే రైతులు విత్తనాలు వేసుకోవాలని ఆమె సూచించారు. హైదరాబాద్లో 17,18 తేదీలలో భారీ వర్ష సూచన ఉందని.. ఎల్నీలో ఎఫెక్ట్ ఆగస్ట్,సెప్టెంబర్లో ఉంటుందన్నారు. ఎల్నీలో ప్రభావంతో చలికాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయని.. ఎండాకాలం ఉండాల్సిన వేడి కంటే ఎక్కువ నమోదు అవుతుందని తెలిపారు.
ఆ సినిమాను ఇంత లేట్గా చూడడం నా తప్పే!
మూడున్నర గంటల నిడివి.. బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే ఓ ఊరి కథ. యాక్షన్ మాస్ మసాలా ఐటెం సాంగుల్లాంటి హంగులేమీ లేవు. పైగా సస్పెన్స్ థ్రిల్లరో, హారర్ జానరో కూడా కాదు. ఇవన్నీ తెలిసిన తర్వాత చాలామంది “అబ్బో” అంటూ ఆ సినిమాను పక్కన పెట్టేయడం సహజమే. కానీ ఒక్కసారి చూడడం మొదలుపెట్టాక ప్రతి సన్నివేశం మనల్ని లోపలికి లాగేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగిపోతుంది. మధ్యలో ఆపేయాలన్న ఆలోచనే రానీయకుండా చివరి వరకు కూర్చోబెడుతుంది. 1893లోని చంపానేర్ గ్రామం, వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు, బ్రిటిష్ అధికారుల అహంకారం.. ఇవన్నీ మొదటి నుంచే కథలోకి లాగేస్తాయి. ఘనన్ ఘనన్ పాట వినిపించిన క్షణం నుంచి ప్రేక్షకుడు కూడా ఆ గ్రామస్థులతో కలిసి ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఎదురుచూస్తాడు. రాధా కైసే నా జలే, ఓ పాలన్ హారే వంటి పాటలు కథను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా పాత్రల భావోద్వేగాలను మనసుకు హత్తుకునేలా చేస్తాయి.క్రికెట్ చుట్టూ తిరిగే స్క్రీన్ప్లే.. లగాన్ సినిమా గొప్పతనం కేవలం క్రికెట్లో లేదు. కులవివక్ష, మత సామరస్యం, ఐక్యత, ఆత్మగౌరవం వంటి అంశాలను ఎంతో సహజంగా కథలో కలిపేసింది. ముఖ్యంగా దళితుడైన కచ్రాను జట్టులో చేర్చే సన్నివేశం ఇప్పటికీ గుండెను తాకుతుంది. కాలం మారినా.. సమాజంలోని కొన్ని వాస్తవాలు మాత్రం మారలేదనే ఆలోచన కలిగిస్తుంది.క్రికెట్ మ్యాచ్కు ముందు గ్రామస్తులు ప్రాక్టీస్ చేసే సన్నివేశాలు నవ్విస్తాయి.. ఆలోచింపజేస్తాయి. మొదట ఒకరిపై ఒకరికి అనుమానాలు ఉన్న వాళ్లు.. చివరకు ఒక లక్ష్యం కోసం ఒక్కటిగా నిలబడటం ప్రేక్షకుడిలోనూ ఓ అనుబంధాన్ని కలిగిస్తుంది. మ్యాచ్ మొదలయ్యాక ప్రతి బంతి ఉత్కంఠను పెంచుతుంది. ప్రతి వికెట్తో గుండె వేగం పెరుగుతుంది. చివరి ఓవర్లలో ప్రేక్షకుడు కూడా చంపానేర్ జట్టులో భాగమైనట్టే ఫీలవుతాడు.వర్షం కురిసే క్లైమాక్స్ కేవలం ఒక విజయానికి గుర్తు కాదు. అవమానాన్ని, ఆకలిని, అన్యాయాన్ని ఎదుర్కొన్న ప్రజల ఆశలకు దక్కిన ప్రతిఫలం. అందుకే లగాన్ దేశభక్తి సినిమా కంటే చాలా పెద్దది. అది మనుషుల గురించి, వారి కలల గురించి, కలిసి పోరాడితే అసాధ్యం కూడా సాధ్యమేనని చెప్పే కథ.ఓ కల నుంచి ఆస్కార్ దాకా!దర్శకుడు అశుతోష్ గోవారికర్ Ashutosh Gowariker మనసులో పుట్టిన ఓ విభిన్న ఆలోచనే ఈ చిత్రానికి బీజం. బ్రిటిష్ పాలనలో ఉన్న ఓ గ్రామం.. కరువు, పన్నుల భారం, ఆ దౌర్జన్యానికి వ్యతిరేకంగా క్రికెట్ మ్యాచ్ ద్వారా పోరాడే రైతులు.. ఈ కథను మొదట వినగానే చాలామంది నిర్మాతలు రిస్క్గా భావించారు. పీరియడ్ డ్రామా, గ్రామీణ నేపథ్యం, క్రికెట్, మూడున్నర గంటల నిడివి.. ఇవన్నీ కలిసి కమర్షియల్గా పనిచేయవని అనుకున్నారు.అలాంటి సమయంలో హీరో అమీర్ ఖాన్ Aamir Khan కథపై నమ్మకం ఉంచారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ముందుకొచ్చి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సినిమాను నిర్మించారు. భువన్ పాత్రను అమీర్ పోషించగా, గౌరి పాత్రకు గ్రేసీ సింగ్ను తీసుకున్నారు. చంపానేర్కు సాయం చేసే బ్రిటిష్ యువతి ఎలిజబెత్ పాత్రలో రాచెల్ షెల్లీ నటించారు. గ్రామస్థుల పాత్రల కోసం దేశవ్యాప్తంగా ఆడిషన్లు నిర్వహించి నటులను ఎంపిక చేశారు.రఘుబీర్ యాదవ్ (భూరా), ఆదిత్య లఖియా (కచ్రా), యశ్పాల్ శర్మ (లఖా), అఖిలేంద్ర మిశ్రా (అర్జున్), దయాశంకర్ పాండే (గోలి), రాజ్ జుత్షి (ఇస్మాయిల్), ప్రదీప్ రావత్ (దేవా సింగ్ సోధి), అమీన్ హాజీ (బఘా), రాజేష్ వివేక్ (గురన్) గా వీరు అందరూ కలిసి చంపానేర్ గ్రామ జట్టుకు ప్రాణం పోశారు. లగాన్ సమయంలో మాత్రం వీరిలో చాలామంది మధ్యస్థాయి లేదా కొత్త నటులే. అందుకే ఆ ఊరు నిజంగా మన కళ్ల ముందున్నట్టుగా అనిపించింది. ఇదే సినిమా సహజత్వానికి పెద్ద కారణంగా చెప్పొచ్చు.చిత్రీకరణ ప్రధానంగా గుజరాత్లోని భుజ్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. మండే ఎండల్లో నెలల తరబడి షూటింగ్ సాగింది. గ్రామం మొత్తం ప్రత్యేకంగా నిర్మించారు. సినిమాలో కనిపించే క్రికెట్ మ్యాచ్ కోసం నటులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు సినిమాకు ప్రాణంగా నిలిచాయి.. ఇప్పటికీ అవి చిరస్మరణీయంగా నిలిచాయి.2001 జూన్ 15న విడుదలైంది లగాన్. మొదట్లో ఒక ప్రయోగాత్మక చిత్రంలా కనిపించినా.. కొద్ది రోజుల్లోనే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందింది. బ్రిటిష్ పాలన, కుల వివక్ష, మత సామరస్యం, గ్రామీణ ఐక్యత వంటి అంశాలను వినోదాత్మకంగా చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయంతో లగాన్ అంతర్జాతీయ వేదికల దృష్టిని ఆకర్షించింది. 2002లో జరిగిన 74వ అకాడమీ అవార్డ్స్లో (ఆస్కార్) ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో నామినేషన్ పొందింది. ఆస్కార్కు నామినేట్ అయిన మూడో భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. చివరకు అవార్డు దక్కకపోయినా.. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకొచ్చింది. ఆస్కార్ వేదికపై లగాన్ పేరు వినిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా గర్వకారణంగా మారింది.లగాన్.. కేవలం క్రికెట్ కథ కాదు.. ఆత్మగౌరవం కోసం మట్టిమనుషులు చేసిన పోరాటం. సినిమా వచ్చి పాతికేళ్లు అవుతున్నా.. ఆ సినిమాలోని మేజిక్ తగ్గలేదు. మూడు గంటలకుపైగా నిడివి ఉన్నా.. నేటి రీల్ జనరేషన్ను కూడా స్క్రీన్కు అతుక్కుపోయేలా చేస్తోందా కథాకథనం. భారతీయ సినీ చరిత్రలో అత్యుత్తమ చిత్రాల జాబితాలో ఈ చిత్రం ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉండటానికి అదే కారణం కూడా. అందుకే లగాన్ ఒక సినిమా కాదు.. తరాలు మారినా నిలిచే క్లాసిక్. (భాషతో అక్కర్లేదు అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది):::ఓ సినీ ప్రేమికుడు
డ్రైవర్గా మారిన సీఎం విజయ్.. 130 కిలోమీటర్లు స్వయంగా డ్రైవింగ్!
తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చాడు స్టార్ హీరో విజయ్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైనశైలీలో పరిపాలన సాగిస్తున్నాడు. హీరోగా ఉన్నప్పుడే ఆయన చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేసేవాడు. స్టార్ అనే గర్వం ఎక్కడ చూపించేవాడు కాదు. ఇక సీఎం అయిన తర్వాత ఆయనలో మరింత మార్పు వచ్చింది. ఎక్కడ కూడా అధికార గర్వం కనిపించడం లేదు. ప్రజలకు మరింత చేరువయ్యేలా ఆయన ప్రణాళికలు ఉంటున్నాయి. తాజాగా ఆయన కర్ణాటక కొల్లూరులోని శ్రీ మూకాంబికా అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అయితే ఈ పర్యటన సందర్భంగా విజయ్ చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత విజయ్ ఒక్కసారిగా డ్రైవర్ అవతారం ఎత్తాడు. ఆలయం నుంచి మంగళూరు విమానాశ్రయం వరకు దాదాపు 130 కిలోమీటర్లు కాన్వాయ్లో తాను ప్రయాణించే కారును స్వయంగా డ్రైవ్ చేశారు.సీఎం విజయ్ కారు నడుపుతుండగా, భద్రతా సిబ్బందికి చెందిన కాన్వాయ్ వాహనాలు ఆయనను అనుసరించాయి. ఈ ప్రయాణంలో భాగంగా ఒక టోల్ గేట్ వద్ద కారు ఆగినప్పుడు, పక్కనే ఉన్న అభిమానులను గమనించిన విజయ్.. ఎంతో నమ్మకంతో, చిరునవ్వుతో వారికి చేయి ఊపుతూ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. He Himself drives His own convoy for more than 130+KM's From Kollur to Mangaluru Airport🥶🙌🫡🔥🦁@CMOTamilnadu Na Loves Driving❤️#Jananayagan @TVKVijayHQ pic.twitter.com/PkyyYU2OIW— MR.BK👺 (@_kishore__vj) June 12, 2026Most Valuable Driver 🔥🔥🔥#CMJosephVijay #TVKVijay pic.twitter.com/eAPer8fCvQ— Swara TVK ❤️💛 (@SwaraVijay_) June 12, 2026
నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్! భావోద్వేగంలో ఓ నాన్న..
ఇటీవల కాలంలో లేఆఫ్స్ ఎంత కామన్గా అయిపోయాయో తెలిసిందే. ఉద్యోగ భద్రత కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పరిస్థితులు ఇవి. అలాంటి స్థితిని ఎలా హ్యాండిల్ చేసి..సులభంగా మన కెరీర్ని పునర్నిర్మించుకోగలమో చెప్పే కథ ఇది. అందుకు కుటుంబ మద్దతు తోడైతే తిరుగే ఉండదంటున్నాడు ఈ వ్యక్తి. అంతేగాదు తన బంగారు తల్లే ఈ సమస్య నుంచి బటయపడేలా కొండంత స్టైర్యాన్ని ఇచ్చింది అంటున్నాడు ఈ నాన్న. అందుకు సంబంధించిన విషయం నెట్టింట వైరల్గా మారింది. హిమాన్షు ఝా అనే పారిశ్రామిక వేత్త తన జాబ్ పోయి ఏడాది అయిన సందర్భంగా.. నాటి తన పరిస్థితి గురించి వివరించాడు. తన కెరీర్లోని అత్యంత గడ్డుపరిస్థితిని ఆ ఏడాదిలో చవిచూశానంటూ..నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నాడు. ఆకస్మికంగా చక్కటి కార్పొరేట్ ఉద్యోగం కోల్పోవడంతో.. ఒక్కసారిగా తన పరిస్థితి తలకిందులైనట్లు అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఏం చేయాలో దిక్కుతోచని ఆ స్థితిలో తన భార్య, కూతురు ఎలా తన మద్దతుగా నిలిచారో చెబుతూ వారిని ప్రశంసలతో ముంచెత్తాడు. ఆ కష్ట సమయంలో మన స్నేహితులు, బంధువులు ఎలా దూరమవుతారో, అలాగే మనకెంతో ప్రియమైన వారు ఎలా అండగా నిలబడతారో మనకు తెలుస్తుంది. అంతేగాదు ఉద్యోగం కోల్పోవడంతో ఐదు పాఠాలను నేర్చుకున్నానంటున్నాడు. ఆ సమయంలో తన కుమార్తెతో గడుపుతూ ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడూ.. ఆమె ఇక ఇప్పుడు మీకు నచ్చింది చేయండి నాన్న అంది. అప్పుడే అర్థమైంది జాబ్ పోవడం అంతం కాదు, కెరీర్లో ఎదురయ్యే ఎదురుదెబ్బ అంతిమం కాదని తెలుసుకోగలిగనంటున్నాడు. ఏ వయసులోనేనా మళ్లీ తిరిగి ప్రారంభించి నిలదొక్కుకోవచ్చు..అందుకు గుండె నిండా ధైర్యం కావాలి. అది ఉంటే చాలు..చతికిల పడినా..రాకెట్లా తిరిగి దూసుకుపోగలమని అవగతమైందని చెప్పుకొచ్చాడు హిమాన్షు. ఇది అప్పటి వరకు ఉన్న సౌకర్యవంతమైన స్థితి నుంచి బయటకు నెట్టి..స్ట్రాంగ్గా మరింత బలంగా నిలబడేందుకు అంకురార్పణ అవుతోందంటున్నాడు. తన కూతురు చెప్పినట్లుగా 44 ఏళ్ల వయసులో నా కలను అనుసరించి స్టార్టప్ ప్రారంభించి, వ్యవస్థాపకుడిగా మారానని చెప్పాడు. నచ్చిన పనిచేయి నాన్న అంటూ మాట్లాడిన మాటలు..చాలా సాధారణమైనవిగా కనిపిస్తున్నా..ధైర్యాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చించిందామె. ఈ పరిస్థితి.. ఎవరు మనకు ఆప్తులు..ఎవరు శత్రువులో కూడా తెలియజేస్తుంది. అలాగే దీంతోపాటు..అతిపెద్ద ఆస్తి ఆరోగ్యం అని దానిపై సదా దృష్టిపెట్టమని కోరాడు. ఏళ్ల తరబడి కార్పొరేట్ లైప్ బిజీలో, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని తెలుసుకున్నా..అంతర్గత శాంతికి ప్రయత్నించి మరీ.. నిలదొక్కుకునే ప్రయత్నం చేశానని రాసుకొచ్చాడు. అలాగే ఎక్కువగా భయపడే ఉద్యోగ తొలగింపు భయం..ఒక్కోసారి మిమ్మల్ని స్ట్రాంగ్గా మార్చే అధ్యయంగా కూడా మారుతుందని నమ్మకంగా చెబుతూ..తన పోస్ట్ని ముగించాడు హిమాన్షు. నెటిజన్లు కూడా ఆయన మాటలకు మద్దతు తెలుపుతూ..ముందుకు సాగకుండా..రాబోయేదాన్ని స్వీకరించకుండా, గతాన్ని పట్టుకుని వేళాడటమే తప్పు..మీకు అంతా మంచే జరుగుతుంది సార్ అని అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్న వారు ఈ వ్యక్తి స్ఫూర్తినే తీసుకుంటూ...ముందుకు సాగండని హితవు పలుకుతున్నాడు హిమాన్షు.(చదవండి: ఆటో డ్రైవర్ నుంచి రూ. 900 కోట్ల కంపెనీ రేంజ్కి..! జస్ట్ దేశీ బ్రాండ్తోనే.)
ఏఐతో ఉద్యోగాలు పోతాయా? హమ్మయ్య అనిపిస్తున్న తాజా నివేదిక!
పంజాబ్లో ముందస్తు ఎన్నికలు.. సీఎం అభ్యర్థి మాత్రం..!
భారత్ తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్
‘వర్క్ ఫ్రమ్ బైక్’ ఇదే కాబోలు..
చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్ సిస్టర్స్
బీజేపీకి బై చెప్పి.. టీవీకేలో చేరిన బీజేపీ నాయకురాలు
లిక్విడ్ నైట్రోజన్తో కూడిన ఆహారం సురక్షితమేనా?
‘అతడు వంద టెస్టుల గురించి ఆలోచించలేదు’
పురుషుల ప్రైవేట్ పార్ట్స్పై ప్రేలాపనలు : సేజల్ పవార్కు భారీ షాక్
‘పెద్ది’ వివాదం.. కంగనా ఇచ్చే సలహా ఇదే!
శివాలెత్తిన శివమ్ దూబే.. సిక్సర్ల వర్షం
మాతో పెట్టుకుంటే ఖబడ్దార్!
స్పోర్ట్స్ సర్టిఫికెట్ల దుకాణం.. టీడీపీ ఆఫీసు
IND vs AFG ODI: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు
ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు!
విజయ్ ఎఫెక్ట్.. స్టాలిన్ కళ్లు తెరిపించిన నివేదిక
సన్రైజర్స్ ఆల్రౌండర్ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనే
సాక్షి కార్టూన్ 13-06-2026
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
IND vs AFG: భారత్కు భారీ షాక్.. అఫ్గన్ అనూహ్య విజయం
ప్రపంచ దేశాలకు షాకిచ్చిన ఇరాన్
‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’
చరిత్రలో ఇలాంటి చిత్రం రాలేదు..!
ఈ రాశి వారికి మిత్రుల నుంచి ధనలబ్ధి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
బంగ్లా ప్లేయర్పై కన్నెర్ర చేసిన ఐసీసీ
ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. ఒక్క రోజే 21 సినిమాలు స్ట్రీమింగ్..!
మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం
తల్లికి వందనం పథకానికి పంగనామాలు
ఏఐతో ఉద్యోగాలు పోతాయా? హమ్మయ్య అనిపిస్తున్న తాజా నివేదిక!
పంజాబ్లో ముందస్తు ఎన్నికలు.. సీఎం అభ్యర్థి మాత్రం..!
భారత్ తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్
‘వర్క్ ఫ్రమ్ బైక్’ ఇదే కాబోలు..
చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్ సిస్టర్స్
బీజేపీకి బై చెప్పి.. టీవీకేలో చేరిన బీజేపీ నాయకురాలు
లిక్విడ్ నైట్రోజన్తో కూడిన ఆహారం సురక్షితమేనా?
‘అతడు వంద టెస్టుల గురించి ఆలోచించలేదు’
పురుషుల ప్రైవేట్ పార్ట్స్పై ప్రేలాపనలు : సేజల్ పవార్కు భారీ షాక్
‘పెద్ది’ వివాదం.. కంగనా ఇచ్చే సలహా ఇదే!
శివాలెత్తిన శివమ్ దూబే.. సిక్సర్ల వర్షం
మాతో పెట్టుకుంటే ఖబడ్దార్!
స్పోర్ట్స్ సర్టిఫికెట్ల దుకాణం.. టీడీపీ ఆఫీసు
IND vs AFG ODI: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు
ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు!
విజయ్ ఎఫెక్ట్.. స్టాలిన్ కళ్లు తెరిపించిన నివేదిక
సన్రైజర్స్ ఆల్రౌండర్ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనే
సాక్షి కార్టూన్ 13-06-2026
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
IND vs AFG: భారత్కు భారీ షాక్.. అఫ్గన్ అనూహ్య విజయం
ప్రపంచ దేశాలకు షాకిచ్చిన ఇరాన్
‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’
చరిత్రలో ఇలాంటి చిత్రం రాలేదు..!
ఈ రాశి వారికి మిత్రుల నుంచి ధనలబ్ధి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
బంగ్లా ప్లేయర్పై కన్నెర్ర చేసిన ఐసీసీ
ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. ఒక్క రోజే 21 సినిమాలు స్ట్రీమింగ్..!
మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం
తల్లికి వందనం పథకానికి పంగనామాలు
ఫొటోలు
సముద్రంలో స్వర్గం.. దూరం కాదు, మన పక్కనే! (ఫొటోలు)
'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
'కాక్టెయిల్ 2' మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్నా సందడి (ఫొటోలు)
‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
ఫిఫా ప్రపంచకప్ 2026 : అందరి కళ్లు వీరిపైనే..(ఫొటోలు)
వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
హైలైఫ్ ఎగ్జిబిషన్ లో...అందమైన భామలు లేత మెరుపు తీగలు (ఫొటోలు)
హైదరాబాద్ : నగరంలో పలుచోట్ల భారీ వర్షం (ఫొటోలు)
నా ప్రాణానికి అప్పుడే రెండేళ్లు.. కుమారుడితో అమలాపాల్ (ఫోటోలు)
మూడు ముళ్ల బంధానికి ఆరేళ్లు.. సతీమణికి నవీన్ చంద్ర విషెస్ (ఫోటోలు)
సినిమా
వడ్డే నవీన్ ఎంత పవర్ఫుల్ అంటే.. వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు
వడ్డే నవీన్.. 90వ దశకంలో ఆయన స్టార్ హీరో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి ఫేవరేట్ హీరో ఇతనే. 2000వ సంవత్సరం వరకు వరుస సినిమాలతో అలరించాడు. ఆ తర్వాత యంగ్ హీరోలు రావడంతో ఈ ఫ్యామిలీ హీరో వెనక్కి తగ్గాడు. చివరగా ఆర్జీవీ ఎటాక్ (2016) సినిమాలో నటించాడు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు త్రిమూర్తులు అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ఈ ఈవెంట్కి స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నవీన్ గురించి ఆయన ఆసక్తికర విషయాలు పంచుకుంటూ..ఆయన ఎంత పవర్ఫుల్లో వివరించాడు.నవీన్ హీరోగా చేసిన ఒక సినిమాకు వినాయక్ అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడట. ఆయన ప్రోత్సాహంతోనే డైరెక్టర్ని ఆయ్యానని..ఆది సినిమాకు నాంది నవీనే అంటున్నాడు. ‘నవీన్తో కలిసి ఒకే ఒక్క సినిమాకు అసిస్టెంట్గా పని చేశా కానీ, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన చేసిన సినిమాల్లో 90శాతం కంటే ఎక్కువగా ఇష్టం లేకుండానే చేసేశాడు. ఓ సారి నేను ఓ సీన్ రాశా..అది చూసి ఇది ఎవరు రాశారని అడిగారు. నేను డైరెక్షన్ టీమ్ అని చెప్తా.. కానీ నేనే రాశానని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి భోజనానికి పిలిచాడు. అప్పుడే ఇక అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం ఆపేసి..డైరెక్షన్ చేయమని చెప్పాడు. నీకు నేను తోడుగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే డైరెక్టర్గా ప్రయత్నాలు మొదలుపెట్టా. ఆయన సినిమాకు అసిస్టెంట్గా పని చేస్తున్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ను స్విట్జర్లాండ్లో కలిశా. అలా ఆది సినిమాకు నవీన్ సినిమా నాందిగా నిలిచింది’ అని వినాయక్ చెప్పాడు.ఇక నవీన్ ఎంతపవర్ఫుల్లో వివరిస్తూ.. ‘ఆయన సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విమానంలో స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకు వస్తుంటే ఒక కాస్ట్యూమర్ సిగరేట్ కాల్చారు. అది భద్రతా సిబ్బందికి తెలిసి..చెన్నైలో అడుగుపెట్టగానే ఏకే 47 గన్లతో వచ్చి ఆ కాస్ట్యూమర్ను అరెస్ట్ చేశారు. ఈ విషయం నవీన్ దగ్గరకు వెళ్లగానే.. ఒక ఫోన్ కాల్ చేసి నిమిషాల్లో విడిపించాడు. అప్పుడు ఈయన అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడా, ఇంత పవర్ ఫుల్లా అని ఆశ్చర్యపోయాను’ అని వినాయక్ అన్నాడు.
‘ధమాల్ 4’ ట్రైలర్.. నవ్వులే నవ్వులు
బాలీవుడ్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలో ‘ధమాల్’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా సినిమా ‘ధమాల్ 4’. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ అడ్వెంచరస్ కామెడీ ఎంటర్టైనర్కి ఇంద్రకుమార్ దర్శకుడు. అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, అశోక్ థాకేరియా, ఇంద్రకుమార్, ఆనంద్ పండిట్, కుమార్ మంగత్ పాఠక్ నిర్మించిన ఈ మూవీ జూలై 10న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ‘హెల్ప్ చేయండి’..., ‘సైతాన్ సింగ్ నిధికి చెందిన చిరునామాను కాస్త గట్టిగా చెప్పండి’, ‘అరె.., నిధికి సంబంధించిన మ్యాప్ దొరికింది’ అని తెలుగు అర్థం వచ్చే హిందీ డైలాగ్స్ ‘ధమాల్ 4’ ట్రైలర్లో ఉన్నాయి. ‘ధమాల్ 4’లో నాలుగింతల వినోదం ఉంటుందని ఇటీవల అజయ్ దేవగన్ పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లుగానే ట్రైలర్లో కామెడీ సీన్స్ కనిపిస్తున్నాయి.
తగ్గేదేలే అంటున్న త్రిష.. ఏకంగా రూ.12 కోట్లు!
ఇటీవల ట్రెండింగ్లో ఉన్న పేరు త్రిష అటు రాజకీయ రంగంలోనూ, ఇటు సినీ రంగంలోనూ సంచలనం సృష్టించిన నటి ఈ బ్యూటీ. వయసును అస్సలు పట్టించుకోని అతి కొద్ది మంది కథానాయికల్లో ఈ భామ ఒకరు. పాన్ ఇండియా కథానాయకిగా పేరు గాంచిన గత త్రిష రెండు దశాబ్దాలకు పైగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈమెకు అపజయాలు పలకరించిన వెంటనే విజయాలు పులకరింప చేస్తాయి. అయితే ఫ్లాపులు ఎదురైనప్పుడు సైలెంట్గా ఉండే ఈ భామ విజయాలు వరించినప్పుడు మాత్రం చాలా మంది నటీమణుల మాదిరిగానే పారితోషికం పెంచేస్తుంటారు. పొన్నియిన్ సెల్వన్ చిత్రం విజయంతో ఫుల్ ఫామ్లోకి వచ్చిన త్రిషకు ఆ తరువాత సరైన హిట్ రాలేదు సరికదా అజిత్ సరసన నటించిన విడాముయర్చి, కమలహాసన్తో కలిసి నటించిన థగ్లైఫ్ చిత్రాలతో విమర్శలను ఎదుర్కొన్నారు. ముందే చెప్పినట్టు ఒకటి రెండు ఫ్లాపులు తరువాత ఈ సంచలన నటికి హిట్స్ వెతుక్కుంటూ వస్తాయి. అలా కరుప్పు చిత్రం రూపంలో తాజాగా సూపర్ హిట్ వచ్చింది. అంతే ఇప్పుడు త్రిష తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఒక తమిళ చిత్రంలో త్రిషను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ చిత్రానికి ఆమె రూ.12 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కరుప్పు చిత్రానికి ఎక్కువ మొత్తంలోనే పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగినా, ఇప్పుడు దాని కంటే ఇంకా అధికంగా డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో త్రిష పారితోషికం తగ్గించే విధంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో నిజం ఎంతో తెలియ దు కానీ త్రిష పారి తోషికం విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారనేది వైరల్ అవుతోంది.
‘సింగ్ గీతం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: సింగ్ గీతంనటీనటులు: అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి, తులసి, బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ తదితరులునిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమానిర్మాత: నాగ్ అశ్విన్దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావుసంగీతం: దేవిశ్రీ ప్రసాద్విడుదల తేది: జూన్ 12, 2026ట్రెండ్కి భిన్నంగా ఆలోచించే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. అన్ని జానర్లో సినిమా తీయడమేకాదు.. అందులో కొత్త ప్రయోగాలు చేసి విజయం సాధించాడు. ఆదిత్య 369, విచిత్ర సోదరులు, భైరవద్వీపం, మైఖెల్ మదన కామ రాజు.. ఇలా అప్పట్లోనే ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి మెప్పించాడు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఫోన్ చేతపట్టి ‘సింగ్ గీతం’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి కూడా మరో కొత్త ప్రయోగమే. మాటలనే పాటగా మార్చి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. మరి 94 ఏళ్లు యువకుడు తీసిన చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కుబేర పురం అనే ఒక ఫిక్షనల్ విలేజ్ చుట్టూ ఈ సినిమా కథనం తిరుగుతుంది. ఆ ఊరంతా బంగారమే ఉంటుంది. దాన్ని దోచుకోవడానికి రేణూ (షాలిని కొండేపూడి), ఆమె తండ్రి మైనింగ్ సాగిస్తుంటారు. ఆ మైనింగ్ను ఓ విదేశీ వ్యాపారాస్తుడికి అమ్మేయడానికి ప్లాన్ చేస్తారు. అదే సమయంలో తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములు అక్కడ ఉన్నాయని తెలుసుకుని ప్రతాప్ (అయాన్) ఆ ఊరికి వస్తాడు. తన భూమిలో బంగారు గనులున్నాయని తెలుసుకొని రేణూతో చేతులు కలుపుతాడు. బంగారాన్ని దోచుకోవడానికి ఆ ఊర్లో ఉన్న ఆఖరి చెట్టుని కూడా నరికేస్తారు. ఆ చెట్టుని తన తల్లిలా భావించి గౌరి(అహల్య) వద్దని అడ్డుకున్నా ఆ చెట్టుని తొలగిస్తారు. దీంతో ఆ ఊరి దేవుడు కుబేరుడికి కోపం వస్తుంది. ఆ ఊరికి ఓ శాపం ఇస్తాడు. ఎవరి నోట్లోంచి మాటే రాదు. కేవలం పాట మాత్రమే వస్తుంది. ఏం మాట్లాడాలన్నా పాట రూపంలోనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంతేకాదు నిజాలు మాత్రమే బయటకు వస్తుంటాయి. మరి ఈ పాటల వల్ల, వాళ్లు చెబుతున్న నిజాల వల్ల వారి జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే.. మాటలు లేకుండా పాటలతో సినిమా చేయడం.. వినడానికి ఇప్పటికీ విచిత్రంగా ఉంది కదా? కానీ 40 ఏళ్ల కిందటే సింగీతం శ్రీనివాసరావు ఈ ఆలోచన చేశాడు. ఇలాంటివి పేపర్పై రాసుకోవడానికి బాగుంటాయి. కానీ ఆచరణలో పెట్టడమే చాలా కష్టం. ప్రతి మాట.. ఎమోషన్ని పాట రూపంలో చెప్పడం అంత ఈజీ కాదు. కానీ సింగీతం అది చేసి చూపించాడు. 40 ఏళ్ల కింద రాసుకున్న కథ అయినప్పటికీ.. నేటికీ నవ్యత లోపించలేదు. నేటితరానికి ఇవ్వాల్సిన మంచి సందేశం ఈ కథలో ఉంది. ప్రకృతి ఎంత గొప్పదో చెబుతూనే.. మనిషి అత్యాశతో పర్యావరణాన్ని ఎలా నాశనం చేస్తున్నాడో ఇందులో చూపించాడు. అయితే ఈ సినిమా మొత్తం పాటలే ఉన్నాయా? మాటలు లేవా? అంటే ఉన్నాయి. సినిమా ప్రారంభం నుంచి తొలి 20 నిమిషాలు మూములుగానే కథనం సాగుతుంది. సాధారణ సినిమాల్లోలాగే మాటలు ఉంటాయి. ప్రతాప్ కుబేరపురం రావడం.. ఆ ఊరి ప్రజల పరిచయం.. మైనింగ్ మాఫియా నేపథ్యం అంతా రొటీన్గానే సాగుతుంది. ఎప్పుడైనే ఊరికి శాపం తగులుతుందో అప్పటి నుంచి మాటలు కాస్త పాటలుగా మారుతాయి.‘ఏమయ్యింది.. ఏమయ్యింది..’ అంటూ ఊరంతా పాడుకోవడం నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. పాట వరకు సరదాగే సాగినా.. ఆ తర్వాత మాటలు కూడా పాటలుగా రావడం బోరింగ్గా అనిపిస్తుంది. దానికి తోడు ఆయా సన్నివేశాలన్నీ సినిమాటిక్గానే అనిపిస్తాయి తప్ప ఎక్కడ సహజంగా అనిపించదు. ఇంటర్వెల్ వరకు ఇలానే సాగుతుంది. ఇక సెండాఫ్లో మాత్రం దర్శకుడు కథపై ఫోకస్ పెట్టాడు. ద్వితియార్థంలో బలమైన కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ హృదయాలను హత్తుకుంటుంది. ఆ తర్వాత ప్రతాప్ మారిపోవడం.. ఆస్తిపై కీలక నిర్ణయం తీసుకోవడం, ఈ తర్వాత నడిచే డ్రామా ఆకట్టుకుంటుంది. ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సింగీతం మరోసారి తన మార్క్ చూపించాడు. ఇక చివరిలో విజయ్ దేవరొకండ ఎంట్రీ సర్ప్రైజ్ చేస్తుంది. పార్ట్ 2 ఉంటుందన్నట్లుగా విజయ్ ఈ గెస్ట్ ఎప్పీరియన్స్ ఉంది. మరి సీక్వెల్ ఉంటుందా లేదా? అనేది చూడాలి. ఎవరెలా చేశారంటే..సినిమాలో ప్రధాన పాత్రలు పోషించినవారంతా కొత్తవాళ్లే అయినా చక్కగా నటించారు. చెట్టులో తల్లిని చూసుకునే గౌరి పాత్రలో అహల్య ఒదిగిపోయింది. అయితే ఆమె డబ్బింగ్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. నెగెటివ్ షేడ్స్ ఉండే ప్రతాప్ పాత్రలో అయాన్, రేణూ పాత్రలో షాలిని తమదైన సహజ నటనతో మెప్పించారు. రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. సినిమాకు వాళ్ల పాత్రలే చాలా కీలకం. సీనియర్ నటి తులసికి ఈ సినిమాలో మంచి పాత్ర లభించింది. అతిథి పాత్రలు చేసిన అనుదీప్, విజయ్ దేవరకొండతో పాటు మిగిలినవారు కూడా తమ పాత్రల పరిధిమేర బాగానే చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమా మొత్తం పాటలే ఉంటాయి. మాటలను కూడా పాటలుగా ట్యూన్ చేసిన తీరు బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఆయన కెరీర్లో ఇదొక డిఫరెంట్ చిత్రంగా నిలుస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగోలేదు. ఊరుతో పాటు సినిమాలో వేసిన ప్రతి సెట్.. ఆర్టిఫియల్గానే కనిపిస్తాయి తప్ప.. ఎక్కడ కూడా సహజంగా కనిపించవు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
క్రీడలు
మూడో స్థానం.. ఆ ముగ్గురికి అవకాశం: టీమిండియా కోచ్
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఫిట్నెస్కు మారుపేరైన ఈ రన్మెషీన్.. ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అఫ్గన్తో సిరీస్కు అతడు పూర్తిగా దూరమయ్యాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే ప్రకటించింది.వన్డే జట్టులోకి జైస్వాల్ కోహ్లి స్థానంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్ను ఎంపిక చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఇషాన్ కిషన్కు కూడా అఫ్గన్తో వన్డే సిరీస్లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో కోహ్లి గైర్హాజరీలో వన్డౌన్లో ఎవరు ఆడతారన్న చర్చ నడుస్తోంది.ఓపెనర్లుగా జైసూ, ఇషాన్కు అనుభవం ఉంది. ఇక ఇషాన్ వన్డౌన్లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ ఈ జార్ఖండ్ డైనమైట్ వైపే మొగ్గుచూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆ ముగ్గురికీ అవకాశంఈ విషయంపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. అఫ్గనిస్తాన్తో శనివారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశం. కోహ్లికి బదులు ఇషాన్ లేదా కేఎల్ రాహుల్.. లేదంటే యశస్వి జైస్వాల్ ఎవరైనా ఆడవచ్చు.వాళ్లకు ఇదొక మంచి అవకాశం. మాకు మూడు వన్డేలు ఉన్నాయి. కాబట్టి వివిధ ఆప్షన్లు ప్రయత్నించడానికి అవకాశం దొరికింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టు కూర్పు దెబ్బతినకుండా ఉండేలా విభిన్నమైన ప్లేయర్లను ప్రయత్నించేందుకు ఇదో చక్కటి అవకాశం’’ అని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యా లేదని.. అతడు మ్యాచ్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మోర్నీ మోర్కెల్ తెలిపాడు.చదవండి: వైభవ్ తమ్ముడి సూపర్ సెంచరీ
రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్
క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత హైవోల్టేజ్ మ్యాచ్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఆదివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. రాజకీయ కారణాల వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగకపోవడంతో ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీలతో పాటు ఏసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి.దీంతో చిరకాల ప్రత్యర్థులు ఎప్పుడు తలపడతారా? ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ను గెలుచుకుని అద్భుతమైన ఫామ్లో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ సేన.. అదే జోరుతో ఈ టీ20 ప్రపంచ కప్లోనూ బోణీ కొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇరు జట్లు బలాబాలాలపై ఓ లుక్కేద్దాం.డేంజరస్ బ్యాటింగ్ లైనప్దాయాది పాకిస్తాన్తో పోలిస్తే భారత జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా కనిపిస్తోంది. ముఖ్యంగా భారత బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్లతో టాప్, మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. భారతి ఫుల్మాలి వంటి ఫినిషర్ కూడా ఉండడం జట్టుకు కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. ఈ టోర్నీకి ముందు జరిగిన వార్మాప్ మ్యాచ్లలో ఫుల్మాలి దుమ్ములేపింది. అంతేకాకుండా అనుభవజ్ఞురాలైన దీప్తి శర్మ జట్టుకు అదనపు బలాన్ని చేకూరుస్తోంది.బ్యాటింగ్ పరంగా భారత్ బలంగా ఉన్నప్పటికి బౌలింగ్లో మాత్రం కాస్త బలహీనంగా ఉందనే చెప్పాలి. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత బౌలర్లు తేలిపోయారు. వార్మాప్ మ్యాచ్లలో కూడా తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. కానీ ప్రధాన టోర్నీలో మాత్రం తమ బౌలర్లు మెరుగ్గా రాణిస్తారని భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది.మరోవైపు జట్టులోని నలుగురు ఆటగాళ్లు (భారతి ఫుల్మాలి, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్) మొదటిసారిగా టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో ఆడుతున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026లో అద్భుతంగా రాణించినప్పటికి, ప్రపంచకప్ వంటి ఈవెంట్లో ఒత్తిడిని తట్టుకుని ఎలా రాణిస్తారో వేచి చూడాలి. శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, శ్రీ చరణిల త్రయంతో పాటు దీప్తి శర్మ వంటి అద్బుతమైన స్పిన్నర్లు కూడా జట్టులో ఉన్నారు. వీరు మాత్రం బంతిని తిప్పితే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. పేస్ బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్తో పాటు నందని శర్మ, అరుంధతి రెడ్డి యువ పేసర్లు ఉన్నారు.ఫామ్లో లేని పాక్పాకిస్తాన్ మహిళల జట్టు ప్రస్తుతం వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ టోర్నీకి ముందు ఐర్లాండ్ వేదికగా జరిగిన ట్రైసిరీస్లో పాక్ ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత వార్మాప్ మ్యాచ్లు రెండింటిలోనూ ఉమెన్ ఇన్ గ్రీన్ ఓటమి పాలైంది. ఇప్పుడు తొలి మ్యాచ్లోనే పటిష్టమైన భారత్తో తలపడనుంది. ప్రస్తుతం పరిస్థితుల బట్టి చూస్తే భారత్ చేతిలో పాక్కు మరో ఓటమి ఖాయమన్పిస్తోంది.పాక్ జట్టులో ఓపెనర్లు మునీబా ఆలీ, గుల్ ఫెరోజా, కెప్టెన్ ఫాతిమా సనా మినహా మిగితా ప్లేయర్లు ఎవరు ఫామ్లో లేరు. బౌలింగ్ విభాగంలో డయానా బేగ్, నష్రా సంధు, రమీన్ షమీ, సాదియా ఇక్బాల్ వంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నప్పటికి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు.భారత్దే పై చేయిమహిళల టీ20 క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 16 సార్లు తలపడ్డాయి. భారత్ 16 మ్యాచ్లు విజయం సాధించగా.. పాక్ కేవలం మూడింట మాత్రమే గెలుపొందింది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ 'మహిళల ఆసియా కప్ 2024'లో జరిగింది.
IND vs AFG: తొలి వన్డే.. టాస్ గెలిచిన టీమిండియా
ధర్మశాల వేదికగా టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డే అప్డేట్స్👉టాస్ గెలిచిన టీమిండియా.. తొలుత బౌలింగ్👉టీమిండియా తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ అరంగేట్రంశుభవార్తవర్షం తగ్గుముఖం పట్టింది. సూర్యుడు మేఘాల మాటు నుంచి బయటకు వచ్చాడు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీసేసి మాప్ చేస్తున్నారు. 5.45 నిమిషాలకు మ్యాచ్ మొదలుకానుంది. ఈ వన్డే మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ పవర్ప్లే ఐదు ఓవర్లు ఉంటుంది. ఐదుగురు బౌలర్లు తలా ఐదు ఓవర్లు బౌల్ చేస్తారు. 👉4.45PM: తగ్గుముఖం పట్టిన వాన.. మైదానంలోకి వచ్చిన గ్రౌండ్ సిబ్బంది.👉కొనసాగుతున్న చిరుజల్లులు👉మరోసారి భారీగా కురుస్తున్న వర్షం. 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహణకు కటాఫ్ టైమ్ సాయంత్రం 6.32 గంటలు.మ్యాచ్ జరిగేనా?👉తగ్గుముఖం పట్టిన వానవరుణుడు కరుణిస్తాడా?👉కొనసాగుతున్న జల్లులు👉మైదానంలోకి వచ్చి పరిశీలించిన హెడ్ క్యూరేటర్.. వాన తెరిపినిస్తేనే కవర్లు ఎత్తివేసే అవకాశంవాన మొదలు👉🌧️ధర్మశాలలో మొదలైన వాన👉రన్-అప్ ఏరియాపై కవర్లు కప్పిన సిబ్బందిటాస్ ఆలస్యంక్రికెట్ అభిమానులకు చేదు వార్త. టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ధర్మశాలలో వాతావరణం మేఘావృతం కావడంతో టాస్ ఆలస్యం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. ధర్మశాలలో వాన పడేందుకు 60- 70 శాతం అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తుదిజట్ల అంచనాభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్/యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్/ప్రిన్స్ యాదవ్.అఫ్గనిస్తాన్రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదీకుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇక్రమ్ అలికిల్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, బిలామ్ సమీ/మహ్మద్ సలీం.
FIFA WC 2026: బ్రెజిల్కు భారీ షాక్
బ్రెజిల్ ఫుట్బాల్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఫిఫా వరల్డ్కప్-2026 టోర్నీలో బ్రెజిల్ ఆరంభ మ్యాచ్కు దిగ్గజ ఆటగాడు నెయ్మార్ దూరమయ్యాడు. గ్రూప్ స్టేజీ మ్యాచ్లు పూర్తయ్యే సరికి కూడా అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సాకర్ సమరం శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) అంగరంగ వైభవంగా ఆరంభమైన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్లో ఆతిథ్య మెక్సికో సౌతాఫ్రికాపై గెలుపొందగా.. రెండో మ్యాచ్లో దక్షిణ కొరియా చెక్ రిపబ్లిక్పై ఉత్కంఠ విజయం సాధించింది.గాయపడ్డ దిగ్గజంఇక బ్రెజిల్ ఆదివారం వేకువజామున (భారత కాలమానం ప్రకారం) తమ తొలి మ్యాచ్లో మొరాకోను ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలాటి నెయ్మార్ పిక్కల్లో గాయం కారణంగా బాధపడుతున్నట్లు తెలిపాడు. ‘‘అతడు ఫిట్గా మారేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. వచ్చే వారం నాటికి అతడు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాం’’ అని తెలిపాడు.నిరాశలో అభిమానులుకాగా ఐదుసార్లు ప్రపంచకప్ గెలిచిన బ్రెజిల్ జట్టులో నెయ్మార్ కీలక సభ్యుడే గాక.. ప్రధాన ఆకర్షణ ఉన్న ఆటగాడు. తొలి మ్యాచ్కే అతడు లేడని తెలిసి అభిమానులు ఉసూరుమంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చాంపియన్ జట్టుకు తొలి బ్రెజిలేతర మేనేజర్గా కార్లో వచ్చాడు. అతడి మార్గదర్శనంలో వరల్డ్కప్లో జట్టు ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాల్సి ఉంది.ఇక 48 జట్లు పాల్గొంటున్న ఈ మెగా ఫుట్బాల్ టోర్నీలో.. టీమ్లను పన్నెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్- ‘C’లో ఉన్న బ్రెజిల్.. మొరాకో (జూన్ 14), హైతీ (జూన్ 19), స్కాట్లాండ్ (జూన్ 24) జట్లతో అమీతుమీ తేల్చుకోనుంది.చదవండి: వైభవ్ తమ్ముడు వచ్చేశాడు!.. సూపర్ సెంచరీ
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీలో చంద్రబాబు దగా పాలనపై ప్రజా ఉద్యమం... ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ ర్యాలీల్లో ఉప్పొంగిన జనహోరు
దగా ‘డీఎస్సీ’.. ‘మెగా’ స్కామ్!. చంద్రబాబు సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్...
నేడు విశాఖకు వైఎస్ జగన్మోహన్రెడ్డి... స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి... ఆరుగురికి తీవ్ర గాయాలు
విష ప్రచారం చేయడం దుర్మార్గం.. మేం రైతులం కాదా?... సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న అక్రమాల రాకెట్
మనోడే.. ఇచ్చేద్దాం. ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్్సకు పోలవరం పనులు
ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
బిజినెస్
మధ్యతరగతిపై ధరల భారం
సాధారణ మధ్యతరగతి కుటుంబానికి నెలవారీ బడ్జెట్ను నిర్వహించడం సవాలుగా మారింది. వచ్చే ఆదాయానికి, అయ్యే ఖర్చులకు పొంతన కుదర్చడానికి సామాన్యుడు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే కిరాణా సామాగ్రి, ఇంధన ధరలు, పిల్లల పాఠశాల ఫీజులు, ఈఎంఐలు, కరెంట్ బిల్లులు లాంటి యుటిలిటీ బిల్లులు గృహ ఆదాయంలో అత్యధిక భాగాన్ని మింగేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఊహించని ఖర్చుల కోసం రూపాయి దాచుకుందామన్నా సాధ్యపడటం లేదు.ఈక్రమంలో తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు సామాన్యుడు మరింత ఆందోళన చెందేలా ఉన్నాయి. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో నమోదైన 3.48 శాతం నుంచి మే నెల నాటికి 3.93కి పెరిగింది. ప్రధానంగా ఆహార పదార్థాలు, ఇంధన ధరలు పెరగడమే ఇందుకు కారణం. కాగితంపై ఈ పెరుగుదల స్వల్పంగానే కనిపించవచ్చు. అలాగే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశిత పరిమితిలోనే ఉండవచ్చు. కానీ, ఒక స్థిరమైన జీతంపై ఆధారపడే కుటుంబాలకు మాత్రం రాబోయే రోజుల్లో నిత్యావసరాలు మరింత ప్రియం కానున్నాయా అనే ఆందోళన మొదలైంది.మళ్లీ పెరిగిన ఆహారం, ఇంధనం మంట!సాధారణ వినియోగదారుడికి ద్రవ్యోల్బణం లెక్కలు, ఆర్థిక అంచనాలతో పెద్దగా పనిలేదు. మార్కెట్కు వెళ్తే కూరగాయలు, వంటనూనె ఎంతకు వస్తున్నాయి, బండిలో పెట్రోల్ కొట్టించడానికి ఎంతవుతోంది అనేదే వారి లెక్క. ఏప్రిల్లో 4.20 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం, మే నెలలో 4.78కు ఎగబాకింది. రవాణా ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 0.01గా ఉన్న ఉంటే మే నాటికి ఏకంగా 1.75 శాతానికి పెరిగింది.ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నెలలోనే నాలుగు సార్లు ఇంధన ధరలను సవరించడం దీనికి ప్రధాన కారణం. రవాణా ఖర్చులు పెరిగినప్పుడు ఆ భారాన్ని వ్యాపారాలు వినియోగదారులపైకే నెట్టేస్తాయి. ఫలితంగా అన్ని రకాల వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతాయి. ‘మే నెలలో రిటైల్ వినియోగదారులు టోకు ద్రవ్యోల్బణ తీవ్రత నుంచి కొంతవరకు తప్పించుకున్నప్పటికీ.. రెస్టారెంట్లు, వంట గ్యాస్, రవాణా వంటి రంగాలలో అప్పుడే ధరల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది’ అని పిరమల్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ దేబోపమ్ చౌధురి అన్నారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఇది పట్టణ మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని హరిస్తూ మార్కెట్లో డిమాండ్ను తగ్గిస్తోంది.భవిష్యత్తు మరింత భారమేనా?ప్రస్తుత ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు లోబడే ఉన్నప్పటికీ ధరల ఒత్తిడి మాత్రం పెరుగుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలారా క్యాపిటల్ డిప్యూటీ హెడ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎకనామిస్ట్ గరిమా కపూర్ మాట్లాడుతూ.. ‘ఇంధనం, ఆహార ధరల ప్రభావం ఉన్నప్పటికీ మే నెల సీపీఐ ద్రవ్యోల్బణం అంచనాల కంటే కొంచెం తక్కువగానే నమోదైంది. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారం దిశగా అడుగులు పడటం, ఆర్బీఐ-ప్రభుత్వ చర్యల వల్ల స్థూల ఆర్థిక నేపథ్యం ప్రస్తుతం కాస్త అనుకూలంగా మారింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిని అదుపు చేయడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లను మరో 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది’ అని విశ్లేషించారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో..
స్పేస్ఎక్స్ బ్లాక్బస్టర్.. మస్క్ తొలి ట్రిలియనీర్!
3.. 2.. 1.. లిఫ్ట్ ఆఫ్ పచ్చని డాలర్లను చిమ్ముకుంటూ స్పేస్ఎక్స్ మార్కెట్ ‘స్పేస్‘లోకి దూసుకెళ్లింది. అంతరిక్ష, శాటిలైట్ టెక్నాలజీ రంగంలో సంచలనాలు రేపుతున్న స్పేస్ఎక్స్.. స్టాక్ మార్కెట్ అరంగేట్రంలోనూ రికార్డులు బ్రేక్ చేసి ఇన్వెస్టర్ల పంట పండించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బ్లాక్బస్టర్ ఐపీఓగా... లిస్టింగ్లో 2.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అధిగమించి ప్రభంజనం సృష్టించింది. స్పేస్ఎక్స్ కెప్టెన్ ఎలాన్ మస్క్ .. సంపద విలువ కూడా స్పేస్ షిప్లా దూసుకుపోయింది. దీంతో ఈ అపర కుబేరుడు.. ప్రపంచపు మొట్టమొదటి ట్రిలియనీర్గా అవతరించి సరికొత్త చరిత్ర లిఖించాడు. అటు టెస్లా ఎలక్ట్రిక్ కార్లు.. ఇటు స్పేస్ఎక్స్ రాకెట్లతో నింగీ నేలా నాదే అంటూ సంపదలో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.ట్రిలియన్ డాలర్ల సంపద అంటే.. → స్పేస్ఎక్స్ లిస్టింగ్తో ప్రత్యర్థులు మస్క్ దరిదాపుల్లో కూడా లేకుండాపోయారు. మస్క్ తర్వాత టాప్–5లో ఉన్న గూగుల్ లారీ పేజ్ (270 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (249 బి.డాలర్లు), అమెజాన్ జెఫ్ బెజోస్ (235 బిలియన్ డాలర్లు), మెటా మార్క్ జుకర్బర్గ్ (229 బి. డాలర్లు) సంపద మొత్తం 970 బిలియన్ డాలర్లు కలిపినా కూడా ట్రిలియన్ డాలర్ల లోపే ఉండటం విశేషం!→ 100 డాలర్ల నోట్లుగా కట్టలు కడితే 10,000 టన్నులవుతుంది. ఒకదానిపై ఒక నోటు పెట్టుకుంటూ పోతే 1,000 కిలోమీటర్లు ఎత్తుకు ఎదుగుతుంది → 1 డాలరు నోట్లను పరుచుకుంటూ పోతే 1,09,220 కిలోమీటర్ల దూరం వెళ్లొచ్చు. అంటే 2.75 సార్లు భూమధ్య రేఖను చుట్టేయొచ్చన్నమాట! → అమెరికాలో దిగ్గజ స్పోర్ట్స్ టీమ్లు, టాప్ యూరోపియన్ సాకర్ క్లబ్లన్నింటినీ కొనేయగలడు. → ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర 4,200 డాలర్లుగా ఉంది. దీని ప్రకారం ఎలాన్ సంపదతో సుమారు 7,500 టన్నుల బంగారం వస్తుంది. అంటే అమెరికా సెంట్రల్ బ్యాంక్ వద్దనున్న (8,133 టన్నులు) మొత్తం గోల్డ్తో సరితూగుతుంది. → ట్రిలియన్ డాలర్లను సెకనుకు 1 డాలరు చొప్పున ఖర్చు పెడితే మొత్తం సంపద కరిగిపోవడానికి 31,710 ఏళ్లు పడుతుంది! గంటకు 10,000 డాలర్లు చొప్పున అయితే 11,407 ఏళ్లు అవుతుంది.→ బోయింగ్ 787 డ్రీమ్లైనర్ బ్రాండ్ న్యూ విమానాలు దాదాపు 3,500 కొనేయొచ్చు. → ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా కట్డడానికి అయిన ఖర్చు 1.5 బిలియన్ డాలర్లు. దీని ప్రకారం 660 బుర్జ్ ఖలీఫా టవర్లను కట్టొచ్చు. → కోకాకోలా మార్కెట్ విలువ సుమారు 350 బిలియన్ డాలర్లు. అంటే మస్క్ తలచుకుంటే మూడు కోకాకోలా సైజు కంపెనీలను కొనేయగలడు. → ప్రపంచంలో 1 ట్రిలియన్ డాలర్ల జీడీపీ గల దేశాల సంఖ్య సుమారు 20. అంటే 170 దేశాకు పైగా జీడీపీల కంటే ఒక్క మస్క్ సంపదే ఎక్కువ! తైవాన్, ఐర్లాండ్, స్వీడన్, సింగపూర్ వంటి దేశాల జీడీపీలను మించిపోయాడు. → 10 మంది ముకేశ్ అంబానీల (ప్రస్తుత సంపద సుమారు 105 బిలియన్ డాలర్లు)తో సమానం. → భారత్లో మొత్తం 229 మంది బిలియనీర్లు ఉండగా.. వారి మొత్తం సంపద అంతా కలిపినా ఎలాన్ ముందు దిగదుడుపే!సంపద పెరిగిందిలా.. ఇంతింతై ‘మస్క్ ’ అంతై అన్నట్లుగా.. కుబేరుడికే కన్ను కుట్టేలా... ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా అవతరించి సంచలనం సృష్టించాడు. టెస్లాలో 12 శాతం వాటాతో పాటు స్టాక్ ఆప్షన్లను కలిపితే ప్రస్తుత సంపద విలువ 273 బిలియన్ డాలర్లు. ఇక స్పేస్ఎక్స్లో 41 శాతం వాటా విలువ 927 బిలియన్ డాలర్లుగా లెక్క. అంటే మొత్తం మస్క్ సంపద 1.2 ట్రిలియన్ డాలర్ల పైమాటే! ట్రిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్ల డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకుంటే దాదాపు రూ.95 లక్షల కోట్లు. → ప్రస్తుతం ఎలాన్ సంపద విలువంతా దాదాపు స్పేస్ఎక్స్, టెస్లా వాటాలదే. ఇవి కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్(గతంలో ట్విటర్ – దీన్ని 44 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి కొన్నాడు), ఎక్స్ఏఐ (గతేడాది ఎక్స్లో విలీనమైంది), టన్నెల్ ఇన్ఫ్రా సంస్థ బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్ తదితర వ్యాపారాలున్నాయి. → 2002లో ఫైనాన్షియల్ టెక్ దిగ్గజం పేపాల్ను విక్రయించడం ద్వారా (తనకున్న 11.7% వాటాకు 180 మిలియన్ డాలర్లు లభించాయి) తొలిసారి 100 మిలియన్ డాలర్లను అధిగమించాడు. → 2011 చివర్లో మొట్టమొదటిసారిగా ఎలాన్ వెల్త్ బిలియన్ డాలర్ల మార్కును దాటింది. → 2012లో తొలిసారిగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. → 2020లో ఆరంభంలో ఎలాన్ సంపద సుమారు 30 బిలియన్ డాలర్లు ఉండగా.. టెస్లా షేరు జోరుతో ఏడాది చివరికల్లా తొలిసారి 100 బిలియన్ డాలర్ల మార్కును దాటేశాడు. తొలిసారి టాప్–10లోకి ఎక్కాడు. → 2021 జనవరిలో 185 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ను వెనక్కినెట్టి తొలిసారి ప్రపంచ అపర కుబేరుడిగా ‘టాప్’లేపాడు. అదే ఏడాది చివరికి 300 బిలియన్ డాలర్లకు మస్క్ సంపద దూసుకెళ్లింది. అప్పటి నుంచీ (2022లో కొంత కాలం మినహా) ప్రపంచ నంబర్వన్ ప్లేస్ మస్క్ దే! → 2025 నవంబర్లో టెస్లా కంపెనీ బోర్డు కార్పొరేట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సీఈఓ ఎలాన్ మస్క్ కు 1 ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఆమోదించింది. టెస్లా నిర్దిష్ట లక్ష్యాలను అందుకుంటే 10 ఏళ్లకు పైగా కాలంలో ఆయనకు ఈ ప్యాకేజీ లభిస్తుంది.స్పేస్ఎక్స్ను ప్రారంభించేటప్పుడు అది విజయవంతమయ్యే అవకాశం 10 శాతం మాత్రమే అనుకున్నాను. కానీ ప్రయత్నమే చేయకపోతే నేడు అంతరిక్షంలో ప్రయాణించే స్థాయికి ఎప్పటికీ ఎదగలేమని ,ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా స్పేస్ ఎక్స్ను ముందుకు నడిపించాను. నేడు ప్రపంచ అంతరిక్ష రంగాన్ని శాసిస్తూ మానవాళిని బహుళ గ్రహాలపై నివసించే భవిష్యత్తు వైపు నడిపిస్తోంది. – ఎలాన్ మస్క్
భారత్ మార్కెట్పై ఎల్జీ ఫోకస్
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎల్రక్టానిక్స్ తన భవిష్యత్ వ్యాపార వృద్ధికి భారత్ను కీలక కేంద్రంగా చూస్తోంది. భారత్తోపాటు సౌదీ అరేబియా, బ్రెజిల్ మార్కెట్ల నుంచి ఆదాయాన్ని 2030 నాటికి రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సంస్థ సీఈవో ల్యూ జే చియోల్ తెలిపారు. ముఖ్యంగా భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండడం, అతిపెద్ద వినియోగ మార్కెట్ కూడా కావడంతో.. ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) వినియోగం ఇంకా విస్తృతంగా పెరిగే అవకాశం ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. దీంతో ఎల్జీ బ్రాండ్కు ఉన్న ఆదరణ దృష్ట్యా తన మార్కెట్ను మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత గృహోపకరణాల విస్తరణపై ఎల్జీ దృష్టి సారించింది. వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్లు, ఎయిర్ కండీషనర్లు, కిచెన్ ఉత్పత్తుల్లో ఏఐతోపాటు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఎగుమతులకూ ప్రాధాన్యం.. 2025లో భారత్, సౌదీ అరేబియా, బ్రెజిల్ దేశాల నుంచి ఎల్జీకి 6.2 ట్రిలియన్ కొరియన్ వోన్ల ఆదాయం లభించగా, 2023తో పోలిస్తే ఇది 20 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. గతేడాది సంస్థ మొత్తం ఆదాయం 89.2 ట్రిలియన్ వోన్ల్లో 8 శాతానికి సమానం. ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీ సంస్థ సాధించిన వృద్ధితో పోలి్చతే ఇది రెండింతలకుపైగా కావడం విశేషం. ఇంత భారీ వృద్ధి అవకాశాల నేపథ్యంలో భారత్ను ‘గ్లోబల్ సౌత్’ వ్యూహానికి కేంద్రబిందువుగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించినట్టు ఎల్జీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ సంస్థకు ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా, మహారాష్ట్రలోని పుణేలో ప్లాంట్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో మూడో తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇది 2026 చివరినాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులను పెంచుకోవాలని చూస్తున్నట్టు తెలిపింది. భవిష్యత్తులో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు సైతం భారత్లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్టు పేర్కొంది. యూకే, ఈయూతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోగా, వీటిని అనుకూలంగా చేసుకోవడాన్ని పరిశీలించనున్నట్టు తెలిపింది. ప్రీమియం ఉత్పత్తులపై దృష్టిప్రస్తుతం భారత్లో మధ్యస్థ, తక్కువ ధరల ఉత్పత్తుల తయారీపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన ఎల్జీ, ఇకపై నాలుగు డోర్ల ఫ్రిజ్లు, ఫ్రెంచ్ డోర్ ఫ్రిజ్లు వంటి ప్రీమియం ఉత్పత్తుల తయారీని పెంచనున్నట్టు వెల్లడించింది. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడం, నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకోవడం, స్థానిక సంస్థలను కొనుగోలు చేయడం లేదా విలీన అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు పేర్కొంది. హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ (హెచ్వీఏసీ) విభాగంలోకీ విస్తరించనున్నట్టు ప్రకటించింది. భారత వినియోగదారులు సాధారణ ఉత్పత్తుల కంటే ఇంటెలిజెంట్, కనెక్టెడ్ (ఒకదానితో ఒకటి అనుసంధానిత) గృహోపకరణాల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధస్సు ఆధారిత గృహోపకరణాలు, వాటిని అనుసంధానించే స్మార్ట్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్టు వెల్లడించింది.
మేలోనూ ధరల మంటే!
న్యూఢిల్లీ: రిటైల్ ధరలు మే నెలలో మరికొంత ఎగిశాయి. వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ/రిటైల్ ద్రవ్యోల్బణం) ఏప్రిల్లో ఉన్న 3.48 శాతం నుంచి 3.93 శాతానికి పెరిగింది. ఆహార ధరలు, ఇంధన ధరలు ఈ పెరుగుదలకు దోహదం చేసినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్త్నుాయి. → ఆహార విభాగంలో సీపీఐ ఏప్రిల్లో 4.2 శాతంగా ఉంటే, మేలో 4.78 శాతానికి పెరిగింది. → మేలో పసిడి, వెండి ఆభరణాలు, టమాటోలు, అల్లం, కిస్మిస్ ధరలు అధికంగా పెరిగాయి. → ఆలుగడ్డలు, బఠానీ, మోటారు కార్లు, జీలకర్ర, మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలు తగ్గాయి. → మే నుంచి చూస్తే పెట్రోల్ ధర 7.4 శాతం, డీజిల్ ధర రూ.8.4 శాతం చొప్పున పెరగడం తెలిసిందే. → పట్టణాల్లో ద్రవ్యోల్బణం తక్కువగా 3.93 శాతంగా ఉంటే, పల్లెల్లో 4.25 శాతంగా నమోదైంది. → దేశంలో అత్యధికంగా తెలంగాణలోనే 6.15 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. మిజోరంలో అత్యల్పంగా 1.03 శాతం ఉంది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా ఉండొచ్చంటూ ఆర్బీఐ ఎంపీసీ ఇటీవలి సమీక్ష అనంతరం ప్రకటించడం తెలిసిందే. ఆహారంతోపాటు, ఆహారేతర వస్తువుల ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించినట్టు క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త దీప్తి దేశ్పాండే తెలిపారు. ‘‘తయారీదారులకు ముడిసరుకుల ధరలు ప్రియంగా మారాయి. టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 8.3 శాతానికి చేరడం ఇదే సూచిస్తోంది. ఇప్పుడు ఈ భారం రిటైల్ ధరలపైనా క్రమంగా ప్రతిఫలిస్తోంది’’అని చెప్పారు. రానున్న రోజుల్లో ఆర్బీఐ లకి‡్ష్యత పరిధిలోనే (2–6 శాతం) ద్రవ్యోల్బణం ఉండొచ్చని అసోచామ్ ప్రెసిడెంట్ నిర్మల్ కే మిండా అంచనా వేశారు.
ఫ్యామిలీ
అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల వయసులో ఆమె ..
చాలామంది యువకులు సైతం ప్రయత్నించడానికి సంకోచించే డేరింగ్ ఫీట్ ఇది. నేర్చుకోవాలనుకున్నా లేదా ఏదైనా సాహసం చేయాలన్న వయసు ఎన్నటికీ అడ్డంకి కాదు అనే చెప్పే సంఘటన ఇది. ఓ కూతురు తల్లి కలను నెరవేర్చి ఆమె కళ్లలో ఉబికి వచ్చిన ఆనందం చూసి ఉప్పొంగింది. వాళ్లను బాగా కేర్గా చూసుకోవడం కాదు..వాళ్ల కలలను కూడా నెరవేర్చే ప్రయత్నం చేయండి అంతకన్న ఇంకేం ఆశించరు అన్న అంశాన్ని నొక్కి చెప్పింది ఈ ఘటన. అందుకు సంబంధించిన వీడియోని రూపాలి జన్బంధు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో ఆమె 53 ఏళ్ల తల్లి తన కూతురుతో కలిసి ఒక స్కైడైవింగ్ క్లిప్ని చూస్తూ..కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె కూతురితో తాను కూడా ప్రయత్నించొచ్చా అని సరదాగా అడుగుతుంది. ఏదో సరదాగా అన్న ఆమాటను కూతురు నిజం చేస్తుందని ఆ క్షణం ఆమె అనుకోలేదు. కానీ ఆ తర్వాత కూతురు ఆ సాహసాన్నే తల్లికి ఊహించని సర్ప్రైజ్ గిప్ట్లా ఇచ్చింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ చాలా ఉత్సాహంతో ఎప్పడెప్పుడు ఆకాశంలోకి ఎగిరిపోతానో అన్నట్లుగా స్కైడైవింగ్ దుస్తులతో ఆత్రుగా ఉందామె. ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా ఎగరడానికి సిద్ధం అన్నట్లుగా డేరింగ్ చేసింది ఆ స్టంట్. పైగా ఆ స్కైడైవింగ్ని ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్న ఆమెను చూస్తే..ఎవ్వరికైన జీవితాన్ని అందంగా ఆస్వాదించేలా తప్ప వయసు, భయాలను అడ్డంకిగా చేసుకోకూడదనిపిస్తుంది. అంతేగాదు ఈ వీడియోకి కూతురు రూపాలి..“73 ఏళ్లకే ఎగరడానికి సిద్ధం. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది అమ్మా” అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా ప్రేమిస్తున్నా అని చెప్పే బదులు..వారి కలలను నెరవేర్చేలా చూడండి..ఉన్నది ఒక్కటే జీవితం..హాయిగా జీవించనివ్వండి అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Rupali Janbandhu (@nofussfitness_rup) (చదవండి: అందుకే అంత లావు..! భావోద్వేగంలో నటుడు అనుపమ్ ఖేర్)
ప్లీజ్ రూపాన్ని చూసి అంచనా వేయొద్దు..!: అనుపమ్ ఖేర్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గోవా నుంచి ముంబై వెళ్లే విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ ఘటన నెట్టింట హాట్టాపిక్గా మారింది. తప్పు చేయడం సహజమే అయినా..దాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం తోపాటు తనలా చేయొద్దని హితవు పలకడానికి చాలా ధైర్యం కావాలి. ఇక్కడ నటుడు అనుపమ్ సరిగ్గా అలాంటి పనే చేశారు అసలేం జరిగిందంటే..గోవా నుంచి ముంబై వెళ్లే విమానంలో ఓ అధిక బరువు ఉన్న వ్యక్తితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ..అతడితో తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు అనుపమ్ ఖేర్. ఆ విమానంలో డేవిడ్ అనే వ్యక్తి పెద్ద మొత్తంలో చాక్లెట్లు, స్వీట్లు పట్టుకుని రావడం చూస్తారు. నిజానికి డేవిడ్ విమానంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే ప్రయాణికుల అందరి చూపులు అతని మీదే ఉంటాయి. నటుడు అనుపమ్ కూడా పక్క వ్యక్తివైపు చూస్తూ అతను అంతలా స్వీట్లు, చాక్లెట్లు తినకూడదని అంటాడు. అది కూడా కేవలం ఒక శ్రేయోభిలాషిలానే చెప్పినట్లు తెలిపారు ఖేర్. దానికి ఆ వ్యక్తి నవ్వి..బహుశా అందుకే అతడు అంతలా కనిపిస్తున్నాడేమో అని సమాధానమిచ్చారని రాసుకొచ్చారు సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో. అయితే కాసేపటి తర్వాత డేవిడ్ తిరిగి వచ్చి ఆ స్వీట్లన్నింటిని తీసుకుని క్యాబిన్ సిబ్బందికి ఇచ్చాడు. అది చూసి తాను ఆశ్చర్యపోయానంటూ రాసుకొచ్చారు ఖేర్. వెంటనే ఆ తర్వాత తాను ఆ చాక్లెట్లన్నీ చూసి మీరు తింటారనుకున్నా, అందుకే ఇంత అధిక బరువు ఉన్నారని అనుకున్నా అంటూ అసలు విషయం చెప్పాడు ఖేర్. అందుకు డేవివ్ నవ్వి, తనకు అనారోగ్య సమస్య ఉందని, అందువల్లే ఇలా లావుగా కనిపిస్తున్నట్లు తెలిపాడు. తాను గతంలో ఎయిర్లైన్లో పనిచేశానని, ప్రయాణికులకు సేవ చేయడానికి క్యాబిన్ సిబ్బంది ఎంతలా కష్టపడతారో తనకు బాగా తెలుసునని అన్నారు. అందుకే వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇలా ప్రయాణించిన ప్రతిసారీ వారికి ఏదైన తీపి పదార్థాన్ని ఇవ్వడం ఒక అలవాటుగా మార్చుకున్నానని అన్నాడు. ఒక్కసారిగా ఖేర్ ఇతడు ఎంత గొప్ప మనిషి, నాకెంత గొప్ప పాఠం నేర్పాడు అని ఆశ్చర్యపోయానంటూ ఆ సంఘటన గురించి వివరించారు ఖేర్. ఈ ఘటన ఇతరుల రూపాన్ని బట్టి ఒక అంచనాకు రావడం ఎంత ప్రమాదకరమైందో తెలియజేసిందన్నారు. ఒక్కసారిగా రూపంబట్టి చాలా సులభంగా అంచనా వేసి, కథలు అల్లేస్తుంటాం..వాళ్లు ఆ మార్గంలో పయనించడానికి దాని వెనుకున్న కారణం, వారి జీవితాల గురించి ఏమి తెలియకుండానే తేలిగ్గా అంచనాకు వచ్చేస్తాం అన్నారు. దయచేసి తనలా అలా చేయొద్దు అని చెబుతూ డేవిడ్తో ఒక సెల్ఫీ కూడా దిగినట్లు తెలిపారు. అలాగే అతడికి ఇంత మంచి జీవిత పాఠం నేర్పినందుకు ధన్యవాదాలు చెప్పినట్లు రాసుకొచ్చారు పోస్ట్లో. అయితే నెటిజన్లు ఖేర్ మీరు చాలాగ్రేట్ తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, అలాగే బాహ్య రూపం బట్టి అంచనాకు రాకూడదనే లోతైన జీవిత పాఠం ఇది అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఈ ఘటన "డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్" అనే సామెతకు అసలైన అర్థం కదూ..!.THANK YOU DAVID FOR THE LESSON! 🥹❤️Life is full of lessons. Last week, on a flight from Goa to Mumbai, I learned one.In the picture is David.When David boarded the flight, many people looked at him because he was overweight. He came and sat across the aisle from me. In the… pic.twitter.com/Yw7rjm4qcu— Anupam Kher (@AnupamPKher) June 11, 2026 (చదవండి: పిల్లలను మానసికంగా స్ట్రాంగ్గా మార్చే ‘10-10-10’ రూల్..!)
గృహిణి సేవలకు ‘సుప్రీం’ విలువ!
ఇంటికి దీపం అని భావించే ఇల్లాలి సేవల విలువ ఎంత? భార్య రోడ్డు ప్రమాదంలో మరణిస్తే భర్తకు జరిగే లోటును ఎంత మొత్తంతో భర్తీ చేయవచ్చు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం సమాధానమిచ్చింది. మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద చెల్లించే నష్ట పరిహారంలో భార్య అందించే కుటుంబ సేవలకు వేరుగా విలువకట్టి చెల్లించాలని చెప్పింది. ఈ మొత్తం నెలకు రూ.30,000గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు ప్రమాద కేసుల్లో ఏడాది లోగా నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కే సింగ్లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు పూర్వాపరాలు...రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే నష్టపరిహారం విషయంలో 2017 నాటి సుప్రీంకోర్టు తీర్పు (ప్రణయ్ సేథీ తీర్పుగా పిలుస్తారు) మార్గదర్శకాలకు ఇది అదనం అని తెలిపింది. ‘‘ప్రణయ్ సేథీ కేసు విషయంలో చెప్పిన వాటికి భార్య మరణం వల్ల కుటుంబ సేవలకు కలిగే నష్టాన్ని అదనంగా చేరుస్తున్నాం. గృహిణికి ఇప్పుడైనా నేషన్ బిల్డర్ హోదా లభిస్తుందని నమ్ముతున్నాం’’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని రాష్ట్ర హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కూడా మోటార్ వెహికల్ యాక్ట్ కేసుల ప్రగతిని పర్యవేక్షించాలని సత్వర న్యాయం దక్కేలా చేయాలని కోరింది.సెక్షన్ 169 కింద ఇచ్చిన సమ్మరీ ప్రోసీజర్ను కచ్చితంగా అనుసరించడం ద్వారా బాధిత కుటుంబాలు సుదీర్ఘ న్యాయ పోరాటం నుంచి ఉపశమనం పొందవచ్చునని తెలిపింది. నష్ట పరిహారానికి సంబంధించిన మార్గదర్శకాలను అక్షర, భావ స్ఫూర్తితో అనుసరించాలని కోరింది. హోం మేకర్ అనగానే అందరికీ ఓ మహిళ రూపం కళ్ల ముందు మెదులుతుందని అయితే ఇది అన్ని సందర్భాలకూ వర్తించక పోవచ్చునని సుప్రీంకోర్టు బెంచ్ తన తీర్పులో పేర్కొంది. కొన్ని అసాధారణ పరిస్థితుల్లోనో, దురదృష్టవశాత్తో పురుషుడు కూడా హోం మేకర్ పాత్ర పోషించే అవకాశాలు లేక పోలేదని తెలిపింది. వీరికి దక్కాల్సిన గౌరవం ఇస్తూనే ప్రస్తుత కేసులో మాత్రం భార్య అందించే కుటుంబ సేవలకు మాత్రమే విలువ కట్టామని వివరించింది.ప్రణయ్ సేథీ తీర్పు ప్రకారం...రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నష్ట పరిహారం చెల్లింపు విషయంలో 2017 నాటి ప్రణయ్ సేథీ కేసు తీర్పు నిర్ణయాత్మకమైంది. ఈ కేసులో జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడం బీమా కంపెనీలకు తప్పనిసరిగా మారింది ఈ తీర్పుతోనే. చని పోయిన వారు భవిష్యత్తులో ఎంత ఆదాయం సంపాదించగలరు అన్నదాన్ని ఎలా లెక్కించాలో ఈ తీర్పులో స్పష్టంగా వివరించారు. ఏ ఏ విషయాల్లో నష్టపరిహారం చెల్లించాలి, వేటిని మినహాయించాలి అన్నది కూడా ఈ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ.కే.సేక్రీ, జస్టిస్ ఏ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ డాక్టర్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు ప్రకారం...⇒ నలభై ఏళ్ల లోపు వయసుండి శాశ్వత ఉద్యోగం కలిగి ఉన్న వారైతే...నష్టపరిహారంలో వారి వేతనంలో సగాన్ని ఆదాయంగా పరిగణించాలి (వేతనమంటే అన్ని రకాల పన్నులు మినహాయించిన తరువాతి మొత్తం)⇒ నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్కులైతే వేతనంలో 30 శాతాన్ని, యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య వయసు వారైతే 15 శాతాన్ని ఆదాయంగా పరిగణించాలి. ⇒ స్థిరమైన వేతనంతో సొంతంగా ఉద్యోగం కలిగి ఉండి నలభై ఏళ్ల కంటే తక్కువ వయసు ఉంటే వేతనంలో 40 శాతాన్ని ఆదాయానికి జోడించాలి. ⇒ 2009 నాటి సరళ వర్మ, డీటీసీ కేసు మార్గదర్శకాల ప్రకారం నష్ట పరిహారం నుంచి వ్యక్తిగత ఖర్చులను మినహాయిస్తారు. ⇒ లాస్ ఆఫ్ ఎసెట్స్ (బతికి ఉంటే సంపాదించే అవకాశమున్న ఆస్తులు, ఆదాయం) కింద రూ.15,000, అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కింద రూ.15,000, భార్య/భర్త సాంగత్యాన్ని కోల్పోయినందుకు రూ.40,000 కూడా చెల్లించాల్సిన నష్టపరిహారాల జాబితాలోకి చేరుతుంది.⇒ ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ప్రతి మూడేళ్ల కాలానికి పది శాతం చొప్పున పరిహారం పెరగాలి.శిశుపాల్ వర్సెస్ సుర్జీత్మోటారు వాహన ప్రమాద పరిహారానికి సంబంధించిన ‘శిశుపాల్ వర్సెస్ సుర్జీత్’ కేసులో దాఖలైన అప్పీలును సుప్రీంకోర్టు విచారించింది. ప్రమాదాల్లో గృహిణులు మృతి చెందినప్పుడు లేదా వికలాంగులుగా మారినప్పుడు వారి సేవలకు తగిన ఆర్థిక విలువ కట్టడం లేదన్న వాదనలు న్యాయస్థానం ముందుకొచ్చాయి. గృహిణులకు ఎలాంటి ప్రత్యక్ష ఆదాయం లేనందున కింది కోర్టులు, ట్రిబ్యునళ్లు పరిహారం చెల్లింపుల్లో తక్కువ మొత్తాలను ఖరారు చేస్తున్న తీరును కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీనిపై స్పందించిన న్యాయస్థానం... గృహిణుల సేవలకు కచ్చితమైన, గౌరవప్రదమైన విలువను ఆపాదించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.పరిహారం లెక్కింపుపై స్పష్టమైన తీర్పు బాధిత కుటుంబం కోల్పోయే ‘గృహ సంరక్షణ’ను ఇకపై ఒక స్వతంత్ర ప్రాతిపదికగా పరిగణించి పరిహారం లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతంలో ప్రణయ్ సేథీ కేసులో ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన పరిహారాలకు అదనంగా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే, ప్రమాద పరిహార క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 169 ప్రకారం సత్వర చర్యలు తీసుకోవాలని, దీనిని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించింది. పరిహార కేసుల విచారణలు సకాలంలో పూర్తయ్యేలా, తీర్పులోని సూత్రాలు అమలయ్యేలా అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పర్యవేక్షించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. – సాక్షి, న్యూఢిల్లీపాతికేళ్ల క్రితం నాటి కేసు...2001లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఈ కేసులో చివరకు 2026 జూన్ నెలలో తీర్పు వెలువడింది. జీపులు రెండు ఢీకొన్న ప్రమాదంలో కక్షిదారు భార్య మరణించింది. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు 2024లో తీర్పునిస్తూ... బాధితుడికి, ముగ్గురు పిల్లలకు ఎనిమిది లక్షల రూపాయల పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అయితే బాధితుడు ఈ తీర్పును సవాలు చేస్తూ గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
భర్త వదిలేసిన తర్వాత... నా మనసు ఒక తోడు కోరుకుంది..!
నా వయస్సు 30 సంవత్సరాలు. నాకు 15 ఏళ్లకే పెళ్లి చేశారు. 16 ఏళ్లకు మొదటి సంతానం, ఆ తర్వాత రెండేళ్లకు మరో పాప పుట్టారు. నాకు 25 ఏళ్లన్నా రాకముందే నా భర్త నన్ను వదిలేసి ఇంకొకామెతో వెళ్లిపోయాడు. అయితే నేను మా పుట్టింటికి వెళ్లకుండా, కష్టపడిౖ టెలరింగ్ చేస్తూ పిల్లలను పెంచుతున్నాను. పిల్లలు బాగానే చదువుకుంటున్నారు. అయితే, పిల్లలకోసం నిరంతరం కష్టపడుతూ నేను చాలా అలసిపోయాను. మా ఇంట్లో వాళ్లు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు. కానీ నాకు పెళ్లి అనే వ్యవస్థపై నమ్మకం పోయింది. అలాగని జీవితాంతం పూర్తిగా ఒంటరిగా ఉండటం కూడా కష్టం అనిపిస్తోంది. అందుకే ఒక మంచి స్నేహితుడిలా నా బాధలను అర్థం చేసుకునే వ్యక్తిలా, నాకు తోడుగా ఉండే వ్యక్తి కావాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని నేను మా ఇంట్లో వాళ్లతో చెబితే, ‘నీకు బుద్ధిలేదా? ‘పెళ్లిచేసుకో, లేకపోతే ఇలాగే ఉండు’ అని అంటున్నారు. నేను ఆలోచిస్తున్నది తప్పే అయితే నాకు మంచి సలహా ఇవ్వగలరా? – సీత, రాజమహేంద్రవరం.మీరు పడుతున్న సంఘర్షణ నాకు అర్థమైంది. మొదటగా...15 ఏళ్ల వయసులోనే పెళ్లి... ఇద్దరు పిల్లలకు తల్లి కావడం, పాతికేళ్లు కూడా రాక ముందే భర్త వదిలేసి వెళ్ళిపోవడం... ఒక స్త్రీగా మీ మానసిక వేదన సామాన్యం కాదు. అయినా కుంగిపోకుండా, మీ కాళ్ళ మీద మీరు నిలబడి, ఇద్దరు పిల్లలని ఒంటరిగా పెంచి పెద్దచేసి చదివిస్తున్న మీలోని ఆత్మవిశ్వాసానికి, పట్టుదల అభినందనీయం. ఇక మీరు అడిగిన ప్రశ్నకు మీ వైపు నుంచి ఆలోచిస్తే మీరు కోరుకునేదాంట్లో తప్పేం లేదు. గతంలో పెళ్లి అనే వ్యవస్థ వల్ల మీరు చాలా వేదన అనుభవించారు. కాబట్టి ఆ వ్యవస్థపై మీకు నమ్మకం లేకపోవడం, పెళ్లి అంటేనే భయపడటం పరిగణనీయం. అలాగే తనకంటూ ఒక తోడు కావాలని కోరుకోవడం సహజం. అయితే, మీ తల్లిదండ్రుల వైపు నుంచి, సామాజిక కోణం నుంచి ఆలోచిస్తే.. మన సమాజంలో ‘పెళ్లి’ అనే బంధానికి మాత్రమే సామాజిక, చట్టపరమైన గుర్తింపు ఉంది. పెళ్లి కాకుండా ఒక పురుషుడితో స్నేహం లేదా సహజీవనం చేస్తుంటే చుట్టుపక్కలవాళ్ళు, బంధువులు మాట్లాడే మాటలను తట్టుకునే ధైర్యం మీ అమ్మనాన్నలకు లేకపోవచ్చు. అలాగే మీ పిల్లలు సమాజం నుంచి వచ్చే ఇలాంటి మాటలను భరించగలుగుతారా? అంతేకాదు, చట్టబద్ధమైన బంధం లేనప్పుడు... మీరు స్నేహితుడు అనుకునే వ్యక్తి రేపు మిమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. అందువల్ల మీరు కోరుకుంటున్నట్లుగా కేవలం నిస్వార్థంగా స్నేహితుడిగా ఉండే పురుషుడు దొరకడం అంత సులువు కాదు. ఎవరినైనా మీ జీవితంలోకి రానిచ్చే ముందు, వారిలో ఎలాంటి స్వార్థం లేదని నమ్మకం కుదిరే వరకు వేచి చూడండి. మీకు తోడు కావాలంటే మీ బంధువులు, అలాగే తోటి మహిళలతో కూడా మీ కష్టసుఖాలను పంచుకోవచ్చు. మీకంటూ ఒక నమ్మకమైన ‘స్నేహవలయాన్ని’ తయారు చేసుకొని, వాళ్లతో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది మీ ఒంటరితనాన్ని కొంత తగ్గిస్తుంది. భవిష్యత్తులో మీరు కోరుకున్న మంచి లక్షణాలతో ఎవరైనా పురుషుడు ఎదురైతే... ముందు కేవలం ఒక స్నేహితుడిగానే ఉండండి. కాలక్రమేణా ఆ బంధం పటిష్టంగా మారి, మీ ఇంట్లో వాళ్లకు, మీ పిల్లలకు కూడా అతనిపై నమ్మకం కుదిరితే... అప్పుడు సమాజం కోసం కాకపోయినా, మీ రక్షణ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ బంధాన్ని ఒక ‘రిజిస్టర్ మ్యారేజ్’ లాంటి చట్టపరమైన రూపంలోకి మార్చుకునే వీలుందేమో ఆలోచించండి. అప్పటి వరకు తొందర పడకుండా, ముందు మీ పిల్లల ఎదుగుదలపై, మీ టైలరింగ్ వృత్తిపైనే పూర్తి దృష్టిపెట్టండి. మీ ధైర్యమే మీకు తోడు! ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
అంతర్జాతీయం
మందుల్లేకుండా కేన్సర్ చికిత్స!
మందుల్లేకుండా కేన్సర్ను నయం చేస్తానని ఎవరైనా చెప్పారనుకోండి.. అస్సలు నమ్మబుద్ధి కాదు. అయితే ఇప్పటికిప్పుడు కాదు కానీ.. భవిష్యత్తులో ఈ అద్భుతం సాధ్యమే అంటోంది టెక్నియాన్ విశ్వవిద్యాలయం. ఇజ్రాయెల్లోని ఈ సంస్థ ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలిచ్చాయి. నానో స్థాయి గుళికలతో ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో కఠినమైన ట్రిపుల్ నెగటివ్ రొమ్ము కేన్సర్ కణితి పెరుగుదల మందగించినట్లు స్పష్టమైంది. కేన్సర్ బారిన పడితే మరణం తథ్యమన్న కాలం ఎప్పుడో పోయింది. కానీ.. పూర్తిస్థాయి చికిత్స కూడా ఇప్పటివరకూ అందుబాటులో లేదు. కీమోథెరపీ, శస్త్రచికిత్స, రేడియేషన్ వంటి సంప్రదాయ పద్ధతులతో మనిషి జీవితకాలాన్ని గణనీయంగా పెంచుకునే వీలైతే ఉంది. కానీ.. వీటితో దు్రష్పభావాలు చాలా ఎక్కువ. టెక్నియాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు ఈ పరిస్థితిని సమూలంగా మార్చేయగల సామర్థ్యమున్నవి. అత్యాధునిక నానో కణాలను తయారు చేసిన వీరు చుక్క మందు కూడా ఇవ్వకుండానే ట్రిపుల్ నెగటివ్ రొమ్ము కేన్సర్ కణితి పెరుగుదలను నిలిపివేయగలిగారు. ఇదెలా సాధ్యమో తెలుసుకోవాలంటే కేన్సర్ కణాలు మన రోగ నిరోధక వ్యవస్థను ఏమార్చేందుకు వేసే ఎత్తుల గురించి అర్థం చేసుకోవాలి. శరీరంలోకి చేరే హానికారక సూక్ష్మజీవులతోపాటు అదుపు తప్పిన కణాలను కూడా ఏరి వేసేందుకు రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని రకాల కణాలు నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. వీటిని టీ–సెల్స్ అంటారు. కేన్సర్ కణాలు రోగ నిరోధక వ్యవస్థ కళ్ల నుంచి తప్పించుకునేందుకు రకరకాల వ్యూహాలను అనుసరిస్తూంటుంది. ఇందులో భాగంగా కొన్ని రకాల తెల్ల రక్త కణాలను హైజాక్ చేసి కణితి పెరిగేందుకు ఉపయోగించుకుంటాయి. అంతేకాకుండా... రోగ నిరోధక వ్యవస్థ కేన్సర్ కణాలను గుర్తించకుండా చేస్తుంటాయి. టెక్నియాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ హైజాకింగ్ను లక్ష్యంగా చేసుకుని తమ చికిత్స పద్ధతిని అభివృద్ధి చేశారు. కణితి చుట్టూ రక్షణ కవచంగా... టెక్నియాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేసిన నానో కణాలను ఎంపీసోమ్స్ అని పిలుస్తున్నారు. కణితిని అతుక్కునేందుకు ఇవి కేన్సర్ కణాలు హైజాక్ చేసిన తెల్ల రక్త కణాలతో పోటీపడతాయి. తద్వారా కణితికి ఒక రక్షణ కవచంగా ఏర్పడి అది మరింత పెరగకుండా నిరోధిస్తాయి. కేన్సర్ కణాలపై, ప్రీ క్లినికల్ మౌస్ మోడళ్లలోనూ ఈ నానో కణాలను వాడినప్పుడు అవి కణితి చుట్టూ అసాధారణ స్థాయిలో గుమికూడినట్లు, పెరుగుదలను నిరోధించినట్లు స్పష్టమైంది. ఈ ఎంపీసోమ్స్ను సులువుగా తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. నిమిషానికి 20 మిల్లీలీటర్ల నానో కణాలను అంటే గంటకు సుమారు 1.2 లీటర్లు తయారు చేయగలమని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన ఓఫ్రీ విజెన్బ్లిట్ తెలిపారు. పైగా వీటి తయారీకి వాడిన పదార్థాలు సురక్షితమైనవని ఎఫ్డీఏ సైతం ‘జనరలీ రికగ్నైజ్డ్ యాస్ సేఫ్’గా గుర్తించినవి కావడం గమనార్హం. ట్రిపుల్ నెగటివ్ రొమ్ము కేన్సర్ సంప్రదాయ చికత్స పద్ధతులకు సులువుగా లొంగదని, ఎంపీసోమ్స్తో తాము కణితి పెరుగుదలను నిరోధించడం కేన్సర్ చికిత్సలో చాలా పెద్ద మార్పు అని చెప్పారు. పరిశోధన ఫలితాలు ఏసీఎస్ నానో జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
30 దేశాలు.. 120 బయోల్యాబ్స్ - అమెరికా ఫండింగ్?
అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా 30కిపైగా దేశాల్లో ఉన్న 120కు పైగా బయోలాజికల్ ల్యాబొరేటరీలకు ఆర్థిక సహాయం అందించిందని అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) తులసి గబ్బార్డ్ వెల్లడించారు. ఈ సమాచారం తాజాగా డీక్లాసిఫై చేసిన డాక్యుమెంట్స్ ఆధారంగా బయటకు వచ్చింది. ఈ ప్రకటన అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది.ఈ బయోల్యాబ్స్లో అనేక ప్రమాదకరమైన, అత్యంత సంక్రమణ వ్యాధులు కలిగించే వైరస్లు, బ్యాక్టీరియాలపై పరిశోధనలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా 'గైన్-ఆఫ్-ఫంక్షన్' అనే రకం పరిశోధనలు తక్కువ పర్యవేక్షణలో జరిగాయని DNI కార్యాలయం పేర్కొంది. ఈ రకమైన పరిశోధనలు వైరస్లను మరింత శక్తివంతంగా లేదా ప్రమాదకరంగా మార్చే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.తులసి గబ్బార్డ్ ప్రకారం.. అమెరికా ప్రభుత్వం ఈ ల్యాబ్స్ ఉన్న ప్రదేశాలు, అక్కడ ఉన్న రోగకారకాలు, అలాగే జరుగుతున్న పరిశోధనలను గుర్తించి వాటిపై కఠిన నియంత్రణ తీసుకోవాలని పేర్కొన్నారు. ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే పరిశోధనలను ఆపేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.డీక్లాసిఫై చేసిన పత్రాల్లో ఉక్రెయిన్లో ఉన్న 40కు పైగా ల్యాబ్స్ సోవియట్ కాలం నాటి బయోలాజికల్ వెపన్స్కు సంబంధించిన రోగకారకాలపై పని చేశాయని పేర్కొన్నారు. వీటిలో ఆంథ్రాక్స్, ఈబోలా, MERS, SARS, ప్లేగ్ వంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వాలు, కొంతమంది ఆరోగ్య నిపుణులు ఈ బయోల్యాబ్స్ గురించి ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వలేదని తులసి గబ్బార్డ్ ఆరోపించారు. ఈ అంశాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసిన వారిని కూడా అడ్డుకున్నారని ఆమె పేర్కొన్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గైన్-ఆఫ్-ఫంక్షన్ పరిశోధనలకు ఇచ్చే ఫెడరల్ నిధులను ప్రపంచవ్యాప్తంగా నిలిపివేసినట్లు సమాచారం. ఇది భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర పరిశోధనలను నియంత్రించడానికి కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.
టెక్సాస్లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి!
అమెరికాలోని టెక్సాస్లోని మిడ్ల్యాండ్లో ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.పోలీసుల సమాచారం ప్రకారం, ఈ కాల్పులు ఉదయం సుమారు 8 గంటల సమయంలో నగరంలోని ఒక ప్రాంతంలో ప్రారంభమయ్యాయి. తరువాత ఘటన మరింత విస్తరించి ఒక వెటర్నరీ హాస్పిటల్ సమీపానికి చేరుకుంది. పరిస్థితి తీవ్రమవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వెంటనే చర్యలు ప్రారంభించారు.🚨 UPDATE: Midland Texas shooter contained. 11 Injured, 1 killed. pic.twitter.com/U0sjuiyFPJ— Juanita Broaddrick (@atensnut) June 12, 2026ఈ ఘటన సమయంలో కనీసం 40 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయని సమీపంలోని ఒక ఆటోమొబైల్ బాడీ షాప్లో పనిచేసే ఆండ్రియా మెండియాస్ తెలిపారు. ఆమె తీసిన వీడియోల్లో ఆర్మర్డ్ పోలీస్ వాహనాల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు బయటకు వస్తున్న దృశ్యాలు కనిపించాయి. అలాగే డ్రోన్లు, రోబోట్లు కూడా ఘటన స్థలంలో ప్రవేశపెట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.మిడ్ల్యాండ్ మెమోరియల్ హాస్పిటల్ ప్రకారం, గాయపడిన తొమ్మిది మందిలో నలుగురు ఆపరేషన్ థియేటర్లో చికిత్స పొందుతుండగా, మిగతా ఐదుగురు స్థిరమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ ఘటనతో నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తుది దశలో కీలక ఒప్పందం.. ఇరాన్ విదేశాంగ మంత్రి పోస్ట్!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను ముగించడానికి అమెరికా - ఇరాన్ దేశాలు ఒక కీలక ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి (Abbas Araghchi) ప్రకటించారు. ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.అరాఘ్చీ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో, 'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' గతంలో ఎప్పుడూ లేనంతగా తుది దశకు చేరుకుందని తెలిపారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడే వరకు మీడియా సంయమనం పాటించాలని, ఊహించి చెప్పవద్దని పేర్కొన్నారు.The Islamabad Memorandum of Understanding has never been closer. Pending its finalization, the media should refrain from entering speculation about its content. In line with our responsible and transparent approach, all details will be shared with the public in due course.— Seyed Abbas Araghchi (@araghchi) June 12, 2026ఇటీవల కొన్ని ఇరానియన్ మీడియా సంస్థలు ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను ప్రచురించాయి. దీనిపై స్పందించిన అరాఘ్చీ, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, ఒప్పందం ఖరారైన తర్వాత అన్ని వివరాలను ప్రజలకు వెల్లడిస్తామని చెప్పారు.ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ అంశంపై స్పందించారు. అరాఘ్చీ చేసిన పోస్టును తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేస్తూ.. మీడియాలో వస్తున్న లీకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ మీడియాలో ప్రచురితమైన వివరాలు సరైనవి కావని ఆయన స్పష్టం చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఇంకా కొన్ని విభేదాలు, చర్చించాల్సిన అంశాలు మిగిలి ఉన్నాయని సమాచారం. అయినప్పటికీ, ఇరు దేశాలు ఒక ఒప్పందం దిశగా ముందుకు సాగడం ప్రపంచ శాంతి, మధ్యప్రాచ్య స్థిరత్వానికి సానుకూల సంకేతం అని చెబుతున్నారు.
జాతీయం
చుక్కలు చూపిస్తున్న సువేందు.. అభిషేక్ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. సోదాల పేరుతో పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు.. అభిషేక్ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు టీఎంసీ వర్గాలు ఆరోపించాయి. ఈ విషయం తెలుసుకున్న మమతా బెనర్జీ.. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాళీఘాట్లోని అభిషేక్ బెనర్జీ నివాసంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో దర్యాప్తు నిమిత్తం ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించాయి. ఈ సందర్బంగా సల్బోని ప్రాంతంలోని ఓ భూమికి సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత సహాయకుడు సుమిత్ రాయ్ కోసం తాము గాలిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అభిషేక్ నివాసంలో నాలుగు గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. అయితే, పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలు కూడా తనిఖీల్లో పాల్గొనడంతో టీఎంసీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన తెలిపారు.Kolkata, West Bengal: Security is heightened at the residence of TMC MP Abhishek Banerjee, with officers from Kolkata Police's Kalighat Police Station and Shalboni Police Station deployed at the premises alongside central security forces pic.twitter.com/qUQehyrh7E— IANS (@ians_india) June 13, 2026ఈ విషయం తెలుసుకున్న వెంటనే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. అభిషేక్ ఇంటికి చేరుకున్నారు. ఆమె రాకతో అక్కడ రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. టీఎంసీ నేతలు ఈ సోదాలను రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు. సోదాల అనంతరం మీడియాతో మాట్లాడిన అభిషేక్ బెనర్జీ.. పోలీసులు అతిగా వ్యవహరించారని ఆరోపించారు. తన నివాసంలోకి గేటు తాళాలు బద్దలు కొట్టి ప్రవేశించారని అన్నారు. తాను ఏమైనా దాచిపెట్టానా? అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తగిన న్యాయపరమైన చర్యలు పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు.మరోవైపు.. బెంగాల్లో మున్సిపాలిటీ నియామకాల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు టీఎంసీ ఎమ్మెల్యే మదన్మిత్ర నివాసంపై దాడులు చేశారు. సోదాలు నిర్వహిస్తుండగా అతడి మంచం కింద నగదు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ పరిణామాలన్నీ 2026 బెంగాల్ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. ఒకవైపు దర్యాప్తు సంస్థల చర్యలు, మరోవైపు టీఎంసీ చేస్తున్న రాజకీయ కక్షసాధింపు ఆరోపణల మధ్య ఈ వ్యవహారం ఎటువైపు మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.ABHISHEK BANERJEE ON THE 2 AM KNOCK"My whole residence has been searched , whether I have kept him or not go and ask investigative agency..." pic.twitter.com/oEgSC11Y9n— Rahul Shivshankar (@RShivshankar) June 13, 2026
సీఎం సెక్యూరిటీపై తాగుబోతు ఆరా.. తెల్లారేసరికి..
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో శనివారం ఉదయం తీవ్ర కలకలం చెలరేగింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను అంతమొందిస్తానంటూ ఒక వ్యక్తి నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్కే ఫోన్ చేసి, బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు నిందితుడిని ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు.అర్ధరాత్రి వచ్చిన ఆ అజ్ఞాత కాల్పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో తిరువనంతపురం సిటీ డిస్ట్రిక్ట్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు ఒక అజ్ఞాత ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ముఖ్యమంత్రి వీడీ సతీశన్తో పాటు ఆయన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న అధికారి కారణం అడగగా, ‘నాకు సతీషన్ అంటే నచ్చదు, అందుకే చంపుతా’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.పోలీసులకే సవాల్.. భద్రతపై ఆరాఅంతటితో ఆగకుండా, సదరు నిందితుడు కేవలం మూడు నిమిషాల వ్యవధిలో, అంటే సాయంత్రం 6:53 గంటలకు మరోసారి ఫోన్ చేసి, మళ్లీ బెదిరించాడు. కాల్ మాట్లాడిన పోలీస్ అధికారిని అసభ్య పదజాలంతో దూషించాడు. పైగా, ‘ముఖ్యమంత్రికి మీరు సరైన రక్షణ ఏర్పాట్లు చేశారా లేదా?’ అంటూ పోలీసులను అడిగాడు.మద్యం మత్తులో నిందితుడుఈ ఘటనపై కంటోన్మెంట్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని అట్టింగల్కు చెందిన సోనీ థామస్గా గుర్తించారు. శనివారం ఉదయం నిందితుడిని పోలీసులు పట్టుకుని కస్టడీలోకి తీసుకున్నారు. ఫోన్ చేసే సమయంలో నిందితుడు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అతడిని రిమాండ్ నిమిత్తం త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
మొన్న ప్రణీత్, ఇపుడు మధుర్ విర్లీ : వీడియో వైరల్
స్టాండప్ కామెడీ పేరుతో మహిళలపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో మరో స్టాండప్ కమెడియన్ మధుర్ విర్లీ విచక్షణ మరిచి రెచ్చిపోయిన వైనంపై వివాదం చెలరేగింది. అత్యాచారాలు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తులు ఆ తర్వాత హత్యలకు ఎందుకు పాల్పడతారో తెలుపుతూ గతంలో ఒక షోలో చేసిన అసభ్యకర వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్గా మారింది. కమెడియన్ ప్రణీత్ మోరే వివాదం (Rs 370 Ki Biryani) ముగియక ముందే, మధుర్ విర్లీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట పడాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రణీత్ తర్వాత ఇప్పుడు మధుర్ విర్లీ బాధితులపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. డ్యాంక్ కామెడీ పేరుతో బాధితులను అత్యంత దారుణంగా అవమానిస్తూ అత్యాచారానికి సంబంధించిన అంశాలపై నోటికొచ్చినట్టు రెచ్చిపోయాడు. అత్యాచార నిందితులు ఆ తర్వాత ఎందుకు హత్యలకు పాల్పడతారనే విషయంపై ఆయన జోకులు పేల్చడం తీవ్ర దుమారం రేపుతోంది.2024 నాటి షో 'లవ్ & లేటెక్స్'కు చెందిన వీడియోలో పది అత్యాచార, హత్యాచార కేసులలో తొమ్మిది కేవలం అత్యాచారానికి సంబంధించినవే అంటూ మరింత అభ్యంతరకర రీతిలో జోకులు వేశాడు. Meet Madhur Virli:Since when did rape jokes become normal? If you can't make people laugh without joking about someone's worst trauma, maybe comedy isn't for you.Find an honest job instead of using pain and suffering for cheap laughs.What is even more disgusting is that the… pic.twitter.com/ZxZ9c3vJwm— Sachya (@sachya2002) June 12, 2026మండిపడుతున్న నెటిజన్లుఈ వ్యాఖ్యలు అత్యంత సున్నిత రహితంగా, అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. మొన్న ప్రణీత్, ఇప్పుడు మధుర్ విర్లీ. బాధితులపై డార్క్ కామెడీ/డ్యాంక్ కామెడీ పేరుతో ఇంత దారుణ వ్యాఖ్యలా? వీళ్లంతా విద్యావంతులమని చెప్పుకునే ఉదారవాదులు. నవ్వుతున్న వారిలో స్త్రీపురుషులిద్దరూ ఉన్నారు. ఒకవేళ ఇలాంటివే వారి కుటుంబాల్లో జరిగితే? అప్పుడు కూడా ఇలాగే ఎగతాళి చేస్తారా? అని ఒకరు ప్రశ్నించారు. మధుర్ విర్లీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్యం పేరుతో ఏదైనా, ఎంతైనా మాట్లాడటం సరికాదు, విజ్ఞత, విచక్షణ ఉండాలని సూచిస్తున్నారు. బాధితుల కోలుకోలేని గాయాలను, మానసిక క్షోభను, బాధలను హాస్యాస్పదం చేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు జాతీయ మహిళా కమిషన్ (@NCWIndia)ను ట్యాగ్ చేస్తూ, ఈ విషయంలో జోక్యం చేసుకుని అతడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. టికెట్లు కొనుక్కుని మరీ ఇలాంటి సున్నితమైన అంశాలపై వచ్చే జోకులకు నవ్వుతున్న ప్రేక్షకులను కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు.మరోవైపు తన వీడియోపై సోషల్ మీడియాలో విమర్శలు తీవ్రమవ్వడంతో మధుర్ విర్లీ తన సోషల్ మీడియా ఖాతాను డీయాక్టివేట్ చేసుకున్నారు. అయితే, ఈ వివాదంపై ఆయన ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ప్రకటన లేదా క్షమాపణలు చెప్పలేదు. కాగా ఇప్పటికే ప్రణీత్ మోరే "370 బిర్యానీ" వివాదంలో చిక్కుకుని విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలోనే ఈ రెండో ఘటన వెలుగుచూసింది. ప్రణీత్ మోరేపై కేసు కూడా నమోదైనట్లు సమాచారం. అయితే తాజాగా ఈ వివాదంపై ప్రణీత్ క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశాడు.
భారత వాయుసేన విమాన ప్రమాదం.. ఐదుగురు మృతి
ఢిల్లీ: దేశంలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అస్సాంలో శనివారం ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎఎన్-32 ట్రాన్స్పోర్ట్ విమానం కూలిపోయింది. ల్యాండింగ్ చేస్తుండగా ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానం క్రాష్ అయిన తర్వాత మంటలు చెలరేగాయి. జోర్హాట్ ఎయిర్ బేస్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు అధికారులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడటంతో అతడికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంపై భారత వాయుసేన అధికారికంగా స్పందిస్తూ.. దర్యాప్తునకు ఆదేశించామని, పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మరిన్ని వివరాలు అందిస్తామని తెలిపింది. An AN-32 transport aircraft of the Indian Air Force has met with an accident at the Jorhat Air Force station in Assam. More details are awaited: Indian Air Force pic.twitter.com/eeF23GDFEM— ANI (@ANI) June 13, 2026
ఎన్ఆర్ఐ
23 ఏళ్ల పోరాటం.. రూ.85 కోట్లు.. అసలేంటి ఈ కథ?
యూకేలో భారతీయ సంతతి మహిళ 23 ఏళ్ల విడాకుల పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. యూకేలోనే అత్యంత అరుదైన.. సుదీర్ఘమైన విడాకుల పోరాటంలో భారత సంతతికి చెందిన వర్షా గోహిల్ ఏకంగా 6.6 మిలియన్ పౌండ్ల(సుమారు రూ. 85 కోట్లు) పరిహారాన్ని సాధించారు. ఈ కేసు 2002లో ప్రారంభమైంది. తన భర్త భద్రేష్ గోహిల్ వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని.. అతని ప్రవర్తన సరిగ్గా లేదని వర్షా గోహిల్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఆనాటికి ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అప్పట్లో వీరిద్దరి మధ్య ఆర్థిక సెటిల్మెంట్ చాలా సాదాసీదాగా ముగిసినట్లు కనిపించింది. వర్షా దాదాపు 2,70,000 పౌండ్లు (సుమారు రూ. 3.5 కోట్లు) నగదుతో పాటు కుటుంబానికి చెందిన ప్యుజో (Peugeot) కారును తీసుకోవడానికి అంగీకరించారు. కానీ, తన భర్త తన ఆస్తులన్నింటినీ నిజాయితీగా వెల్లడించలేదని ఆమె పేర్కొంది.నైజీరియా మాజీ గవర్నర్ జేమ్స్ ఇబోరి అనుచరులతో ముడిపడి ఉన్న భారీ మనీలాండరింగ్ (అక్రమ ద్రవ్య చలామణి) కేసులో భద్రేష్ గోహిల్ ప్రధాన నిందితుడిగా అధికారులు విచారణ చేపట్టారు. దీంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆఫ్షోర్ కంపెనీలు, క్లయింట్ ఖాతాల ద్వారా భద్రేష్ మిలియన్ల కొద్దీ పౌండ్లను అక్రమంగా బదిలీ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. సుదీర్ఘ విచారణ అనంతరం మనీలాండరింగ్, ఫోర్జరీ, మోసపూరిత కుట్రకు పాల్పడినట్లు రుజువు కావడంతో 2011లో భద్రేష్ గోహిల్ 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.విచారణలో మొదటి విడాకుల కేసు సమయంలో బయటపడని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వివిధ దేశాల్లో విస్తరించి ఉన్న నెట్వర్క్ కంపెనీల ద్వారా భద్రేష్ దాదాపు 28 మిలియన్ పౌండ్లను దాచాడనే కారణంగా అధికారులు ఆ ఆస్తులను ఫ్రీజ్ చేశారు. ఈ కొత్త ఆధారాలు వర్షా గోహిల్కు తన పాత విడాకుల సెటిల్మెంట్ను తిరిగి సవాలు చేయడానికి కొండంత బలాన్ని ఇచ్చాయి.ఈ కేసు చివరకు యూకే కోర్టుకు చేరింది. భర్తకు చెందిన జప్తు చేసిన ఆస్తుల నుంచి తనకు మరింత భరణాన్ని ఇవ్వలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. జప్తు చేసిన మొత్తం యావత్తూ అక్రమార్జన కాదని.. అందులో కష్టపడి సంపాదించిన మొత్తం కూడా ఉందని ఆమె కోర్టుకు తెలిపారు. దీంతో వర్షా గోహిల్ వాదనతో అంగీకరించిన కోర్టు.. జప్తు చేసిన మొత్తంలో 66 లక్షల పౌండ్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఇకపై ఎలాంటి అప్పీళ్లకు అవకాశం లేదని కోర్టు స్పష్టం చేయడంతో ఈ 23 ఏళ్ల సుదీర్ఘ సమరానికి ఎట్టకేలకు తెరపడింది.
న్యూజిల్యాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరంలో న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ప్రముఖ గాయని దాసరి మేఘన నాయుడు, యువ గాయకుడు సుస్వర తరంగ్ పాల్గొని తెలంగాణ ఉద్యమ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రవాస తెలుగు ప్రజలను ఉర్రూతలూగించారు. అసోసియేషన్ అధ్యక్షులు కోడూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ మోహన్ కుమార్ సేథి ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో, రాష్ట్ర సాధనలో అమరులైన ఉద్యమ వీరులను త్యాగాలను స్మరించుకుని తెలుగు ప్రజల ఐక్యత గొప్పతనాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కి ఇంతకాలం నుంచి మద్దతు అందిస్తున్న ట్రాన్స్ పసిఫిక్ డైరెక్టర్ తమ్మినేని రోహిత్ రెడ్డిని సన్మానించారు. గాయని గాయకులు వందేమాతరం శ్రీనివాస్, దాసరి మేఘన నాయుడు, సుస్వర తరంగ్ని ఘనంగా సత్కరించారు.ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు పట్లోళ్ల నరేందర్ రెడ్డితో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన రోహిత్ తమ్మినేని, దయానంద్ కటకం, జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల, విజేత యాచమనేని, మధు ఎర్ర, వర్ష పట్లోళ్ల, స్వాతి మేకల,కావ్యా మాశెట్టి, కిరణ్మయి పద్మ, విశ్వనాథ్ అవిటి, మహమ్మద్ బిలాలుద్దీన్, హరీష్ గోపాల్, మనోహర్ కన్నం, శ్రీనివాస్ పందిళ్ళ, రమేష్ రెడ్డి రామిండ్ల, శ్రీరామ్ విజయ్, శ్రీనివాస్ గాజుల, ప్రమోద్ ఇరుగు, అనిల్ మెరుగు, రమేష్ ఆడెపు, రవి కుమార్ వట్టం, మారుతి జెల్ల, మహేందర్ రెడ్డి ద్యావ, శ్రీనివాస్ కలకోట తదితరులు హాజరయ్యారు.
భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!
భారత సంతతి విద్యార్థి అవని అహుజాకి ప్రతిష్టాత్మక హెన్నీ ఫోర్డ్II స్కాలర్ అవార్డుని గెలుచుకుంది. ఎంఐటీలో అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ఈ అవార్డుని సాధించిన ఎన్నారైగా ఘనత సృష్టించింది. అసాధారణమైన విద్యా ప్రతిభ, ఇంజనీరింగ్లలో బలమైన నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించే సీనియర్ అండర్ గ్రాడ్యుయేట్లకు ఈ పురస్కారన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డుతో ప్రతిష్టాత్మక ఎంఐటీ విద్యార్థుల ప్రత్యేక బృందంలో చేరారు. ఈ పురస్కారం ఇటీవల కోడే రీసెర్చ్ గ్రూప్లో ఆమె చేసి వర్క్ కెపాసిటివ్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ పరిశోధనకు గానూ లభించింది. ఈ సాంకేతికతను భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వైర్లెస్గా ఛార్జ్ చేయడానికి, శరీరంలో అమర్చే వైద్య పరికరాలకు శక్తిని అందించడానికి ఉపయోగించవచ్చు. ఈ మేరకు అవని మాట్లాడుతూ.."ఈ అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా, ఆనందంగా ఉంది. ముఖ్యంగా డీన్ హామండ్ను కలవడం ఒక గొప్ప గౌరవం." అని అన్నారామె. నిజానికి హెల్త్కేర్ టెక్నాలజీలు, రోబోటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లలో పనిచేయగల సామర్థ్యమే, ఆమెను ఎంఐటీ అత్యంత ప్రతిభావంతులైన అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధకులలో ఒకరిగా నిలబెట్టింది. అలాగే అవనికి అత్యంత ఆసక్తి ఉన్న రంగాలలో మహిళల ఆరోగ్య పరిశోధన ఒకటి. అంతేగాదు ఆమె రొమ్ము కేన్సర్ స్క్రీనింగ్ను మరింత సులభతరం చేయడానికి రూపొందించిన, ధరించగలిగే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ ప్యాచ్కు సంబంధించిన పరిశోధనలలో కూడా కీలకపాత్ర పోషించారామె. తాను పీహెచ్డీ పూర్తి అయిన వెంటనే మహిళల ఆరోగ్య పరిశోధన రంగంలో పవర్ ఎలక్ట్రానిక్స్ను అన్వయించాలని చూస్తున్నట్లు తెలిపారు.(చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!)
NRI : అమెరికాలో రోడ్డు ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సతీమణి డాక్టర్ సుచియాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగనయాష్కీని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్కు వస్తుండగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని, ఈ ప్రమాదంలో డాక్టర్ సుచియాష్కీకి పక్కటెముకలు విరిగిపోయాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కాగా, మధుయాష్కీ కూడా అమెరికాలోనే ఉన్నారు. చిన్న కుమార్తె డాక్టర్ గగన న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్కు హాజరయ్యేందుకు యాష్కీ దంపతులు అమెరికా వెళ్లారు.కుమార్తెను ఎండీ కోర్సులో జాయిన్ చేసి వచ్చే సమయంలో సుచి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వేరే కారులో మధుయాష్కీ కూడా ఉన్నారని, భార్యకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో గురువారం ఇండియాకు రావాల్సిన యాష్కీ, అక్కడే ఉండిపోయారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ ఫోన్లో మధుయాష్కీని పరామర్శించారు.
క్రైమ్
ఎనిమిది నెలల క్రితమే హత్యకు కుట్ర..
సాక్షి, సిటీబ్యూరో: హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డ్ ప్యానెల్ సభ్యుడు ఖాజా మొయిజుద్దీన్ హత్యకేసులో ముజాహిద్ ఆలంఖాన్తో పాటు కీలక నిందితులు కిషన్ సింగ్, అభిజీత్లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం నుంచి మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించగా... రెండు రోజుల విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. మరోపక్క పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు హసన్, మునీర్లపై నగర పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు.ముజాహిద్ ఆలంఖాన్ గతంలోనూ ఖాజా మొయిజుద్దీన్పై దాడి చేయాలంటూ పలుమార్లు కిషన్ సింగ్కు చెప్పాడు. అయితే అది సాధ్యం కాలేదు. ఓ దశలో ముజాహిద్ ఆలంఖాన్ ఓ మహిళ ద్వారా ఖాజా మొయిజుద్దీన్పై దాడి చేయించారు. ఆయన్ను తీవ్రంగా భయపెట్టాలనే ఈ పని చేయించారు. అబిడ్స్ పోలీసుల వరకు వెళ్లిన ఈ విషయం ఠాణాలో సెటిల్ అయింది.ఏడాది క్రితం ముజాహిద్, మహబూబ్ ఆలంఖాన్లు కిషన్ను పిలిచి ఖాజా మొయిజుద్దీన్తో మాట్లాడాలని, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించాలని కోరారు. న్యాయవాది హత్య జరగడానికి దాదాపు ఎనిమిది నెలల ముందు కిషన్ సింగ్ను ఆలంఖాన్లు తమ కార్యాలయానికి పిలిచారు. ఖాజా మొయిజుద్దీన్ను హత్య చేయాలని, అయితే అది రోడ్డు ప్రమాదంలా కనిపించాలని చెప్పారు. అందుకు అవసరమైన డబ్బుతో పాటు పని పూర్తి అయిన తర్వాత కిషన్ సింగ్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆలంఖాన్లు హామీ ఇచ్చారు.ఖాజా మొయిజుద్దీన్ హత్య కుట్ర అమలును పర్యవేక్షించే బాధ్యతల్ని ముజాహిద్ ఆలంఖాన్ తన వద్ద పని చేసే హసన్ అలీతో పాటు మునీర్కు అప్పగించారు. హత్య చేయడానికి స్కార్పియో వాహనం కావాలంటూ కిషన్ గత ఏడాది డిసెంబర్లో ముజాహిద్కు చెప్పాడు. దీంతో ఆ వాహనం ఖరీదు చేయడానికి హసన్, మునీర్ ద్వారా రూ.2 లక్షలు కిషన్కు పంపారు.మలక్పేటలో ఉన్న పది వేల గజాల వక్ఫ్ భూమి కొత్త కమిటీ గత ఏడాది డిసెంబర్లో ఆటో ఫిన్ కంపెనీకి లీజుకు ఇచి్చంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆలంఖాన్లు సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనికి కొనసాగింపుగా ఏప్రిల్లో ఆటోఫిన్ కంపెనీ యజమాని గౌతం చాంద్జైన్పై ఆలంఖాన్లు కేసు పెట్టగా... ఆ కంపెనీ మేనేజర్ ఎన్.నర్సింగ్రావు వీరి పైన కేసు పెట్టారు. ఈ కేసును ముజాహిద్ ఆలంఖాన్ కోర్టులో సవాల్ చేశారు. దీని విచారణ సందర్భంలో నర్సింగ్రావు తరఫున ఖాజా మొయిజుద్దీన్ హాజరుకావడాన్ని ఆలంఖాన్లు జీరి్ణంచుకోలేకపోయారు. దీంతో ఆయన హత్య కుట్ర అమలును వేగవంతం చేశారు.అప్పటికే స్కారి్పయో వాహనాన్ని అభిజిత్ తాకట్టు పెట్టగా దాన్ని వినిపించడానికి కిషన్ సింగ్ రూ.లక్ష ఇచ్చారు. న్యాయవాది ఖాజా మెహిజుద్దీన్ను మే 23 తెల్లవారుజామున హత్య చేయగా.. దానికి ఒక రోజు ముందే అభిజీత్, వినయ్, మణిదీ్వప్లు స్కారి్పయో వాహనం నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేశారు. దీనికోసం దానిపై గ్రేజు, మట్టి పూశారు. ఈ వాహనాన్ని వినియోగించే అభిజీత్ మే 23న ఖాజా మొయిజుద్దీన్ను ఆయన ఇంటి వద్దే ఢీ కొట్టి చంపాడు.ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న హసన్, మునీర్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్న పోలీసులు విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా ఎల్ఓసీ జారీ చేశారు. దీని ప్రతుల్ని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు పంపారు. ముజాహిద్, కిషన్, అభిజీత్ పోలీసు కస్టడీ గడువు ముగియనుండటంతో వీరిని శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు.
కుక్కే క్లూ అనుకున్నారు.. కానీ!
రెండేళ్ల చిన్నారి. పెంపుడు కుక్కతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ వారమైనా తిరిగి రాలేదు. తల్లిదండ్రుల కన్నీళ్లు, బంధవులు.. గ్రామస్తుల ఆందోళన, పోలీసుల విస్తృత గాలింపు.. ఏదీ ఇప్పటివరకు జ్ఞానేశ్వరి ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. పెంపుడు కుక్క తిరిగి వచ్చినా.. దానికి హైటైక్ టెక్నాలజీ తగిలించి ఆచూకీ కనిపెట్టాలని ప్రయత్నించినా.. పాప జాడ మాత్రం దొరక్కపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ వారమైనా చిక్కలేదు. తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు..చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే 10 పోలీసు టీంలు, 40 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందం.. మరికొందరు అధికారులు పాప కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో భాగమయ్యారు. అడవులు, కొండలు, గ్రామాలన్నీ నిర్విర్వామంగా జల్లెడ పడుతున్నారు. దీంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించింది.ఈ నెల 6న ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైంది. పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఈ కేసులో పెంపుడు కుక్క కీలక ఆధారంగా మారొచ్చని పోలీసులు భావించారు. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత కుక్క గ్రామానికి తిరిగి వచ్చింది. అయితే ఇంటి వద్ద ఉన్న హడావుడి చూసి మళ్లీ పారిపోయింది. ఈ క్రమంలో అది పలువురిపై దాడి చేసింది. అనంతరం డాగ్ క్యాచర్ సాయంతో అతికష్టం మీద దానిని పట్టుకుని ఇంటికి తీసుకువచ్చారు. ఓ తాడుతో కట్టేసి.. దానికి పోలీసును కాపలా ఉంచారు. నీరసంగా ఉన్న దానికి.. వెటర్నరీ సిబ్బంది వైద్య సేవలు అందించి కోలుకున్న తర్వాత పోలీసులు ప్రత్యేక చర్యలకు దిగారు.పెద్దాపురం డీఎస్పీ తిలక్ పర్యవేక్షణలో పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, ఏఎన్ఎస్, క్యూఆర్టీ బృందాలు విస్తృత గాలింపు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీపీఎస్ ట్రాకర్ను కుక్కకు అమర్చి వదిలారు. ట్రాకర్ ద్వారా కుక్క సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎక్కడా ఏ క్లూ లభించలేదు!.ఇక చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్లను వినియోగిస్తున్నారు. జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే చిన్నారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ టవర్ డంప్ డేటా, కాల్ డిటైల్ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు సన్నిహితులైన వ్యక్తులతో పాటు చుట్టుపక్కలకు కొత్తగా వచ్చిన వ్యక్తులు, గంజాయి అలవాటు ఉన్న వారిపై కూడా నిఘా పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగుతోంది.ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి క్షేమంగా తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా స్పందిస్తూ, జ్ఞానేశ్వరి ఆయురారోగ్యాలతో ఇంటికి చేరాలని ఆకాంక్షించారు.
మాజీ ప్రియుడు బ్లాక్మెయిల్.. యువతిని వెంబడిస్తూ.. వేధిస్తూ
శ్రీనగర్కాలనీ: యువతితో సన్నిహితంగా దిగిన ఫొటోలు, వీడియోలతో మాజీ ప్రియుడు బ్లాక్మెయిల్ చేసిన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. విజయవాడ కృష్ణలంకకు చెందిన యువతి టెలీకాలర్గా పనిచేస్తూ రహమత్నగర్లో నివాసముంటోంది.ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకుంటానని జహీర్ అబ్బాస్ అనే యువకుడు నమ్మించి ఆమెకు దగ్గరయ్యాడు. పెళ్ళికి యువతి కుంటుంబీకులు అంగీకరించారు. మరో యువతితో నిశ్చితార్ధం జరిగిన విషయాన్ని తెలుసుకున్న యువతి జహీర్ను దూరం పెట్టింది. అయితే జహీర్ యువతిని వెంబడిస్తూ.. వేధిస్తూ గతంలో సన్నిహితంగా దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్మీడియాలో పోస్ట్చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. ఆమెకు తెలిసిన వారికి ఫొన్ చేసి, మెసేజులు పంపి దుష్ప్రచారం చేశాడు. దీంతో యువతి తనకు ప్రాణహాని ఉందని మదురానగర్ పోలీసులకు పిర్యాదుచేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాటేదాన్లో.. అస్థి పంజరం కలకలం!
మైలార్దేవ్పల్లి: మైలార్దేవ్పల్లి ఠాణా పరిధిలోని కాటేదాన్ ఓల్డ్ కర్నూలు రోడ్డులో శుక్రవారం అస్థిపంజరం కలకలం సృష్టించింది. జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్హోల్స్ శుభ్రపరుస్తుండగా కుళ్లిపోయిన స్థితిలో అస్థి పంజరం కనిపించింది.దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సమాచారం అందించడంతో మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అస్థిపంజరాన్ని పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహం పురుషుడిదా, మహిళదా? అనే విషయం ఫోరెన్సిక్ పరీక్షలు, దర్యాప్తు తర్వాత తేలుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
వీడియోలు
రెండు రోజులు హైదరాబాద్ లో భారీ వర్షాలు
కుక్క మృతి.. అసలు దానికి ఏమైందంటే? ట్విస్ట్..
నిజం బయటపడుతుందనే కుక్కను చంపేశారా ?
15 లక్షలు ఇస్తే జాబ్ మీ చెల్లికే.. సంచలన ఆడియోతో బయటపడ్డ లోకేష్ బండారం
మంత్రి సంధ్యారాణికి బిగ్ షాక్ YSRCPలో చేరిన 320 TDP కుటుంబాలు
ప్రత్తిపాడు లో పోలీసులు ఓవర్ యాక్షన్.. కాలుతున్న కర్రను పట్టుకుని
దమ్ముంటే ఇప్పుడు బయటికి రండి.. మీ కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటూ
తిరుపతి సభ సాక్షిగా చేతులెత్తేసిన బాబు
ఏం పీ*** సంబరాలు... సిగ్గులేకుండా..! కారుమూరి మాస్ ర్యాగింగ్
DSC పేపర్ లీక్కు ఇదే సాక్ష్యం..ఆధారాలతో బయటపెట్టిన YS జగన్

