బంగ్లాదేశ్లో హసీనా అడుగుపెట్టగానే జరిగేది ఇదే: బంగ్లా మంత్రి
ఢాకా: భారత్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే, నేరుగా కోర్టు ముందు లొంగిపోయే అవకాశం రాకముందే మాజీ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను అరెస్టు చేసే అవకాశం ఉందని బంగ్లాదేశ్ న్యాయ మంత్రి ఎం.అసదుజ్జామాన్ గురువారం చెప్పారు. ప్రాణాలకు ముప్పు ఉందనే భయం ఉన్నప్పటికీ డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్కు తిరిగి రావాలనే సంకల్పంతో ఉన్నానని హసీనా చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.హసీనా ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ.. "నన్ను చంపేయవచ్చు. నన్ను అరెస్టు చేయవచ్చు. నన్ను జైలుకు పంపవచ్చు. నా భవితవ్యం నాకు పూర్తిగా తెలుసు. అయినా నేను తిరిగి వెళ్లాలనుకుంటున్నా. ఎందుకంటే నా ప్రజలు నన్ను పిలుస్తున్నారు" అని చెప్పారు. ఈ నెల ప్రారంభంలో కూడా ఆమె పార్టీ సహచరులతో ఈ ఏడాది చివరి నాటికి బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లే అవకాశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.హసీనాకు తిరిగి వచ్చే హక్కు ఉందని అసదుజ్జామాన్ చెప్పారు. అయితే "చట్టం తన పని తాను చేస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించే పని మేం ఏదీ చేయం" అని అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. "మరణ శిక్ష పడిన వ్యక్తి అయినప్పటికీ, బంగ్లాదేశ్ పౌరురాలిగా చట్టాన్ని గౌరవిస్తూ స్వదేశానికి వచ్చి లొంగిపోవాలనుకుంటే, అలా చేసే అవకాశం రాకముందే ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉంది. చట్టం మాకు ఇచ్చిన అధికారాన్ని వినియోగిస్తాం" అని చెప్పారు.తాత్కాలిక ప్రభుత్వం ఆమె పాస్పోర్ట్ను రద్దు చేసిన తర్వాత ఆమె ఎలా తిరిగి వస్తారని అడగగా, మంత్రి స్పందిస్తూ "అది ఆమె సమస్య, నాది కాదు" అని చెప్పారు. "అయితే ఆమె మా భూభాగంలోకి ప్రవేశించిన క్షణం, చట్టం నాకు అప్పగించిన అధికారాన్ని అమలు చేస్తా" అని అన్నారు.బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన హింసాత్మక వీధి నిరసనల తర్వాత 2024 ఆగస్టులో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆమె భారత్కు వెళ్లిపోయారు. తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఉగ్రవాద నిరోధక చట్టం కింద జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుతో ఆమె పార్టీ అవామీ లీగ్ను ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది. 2025 నవంబర్లో, 2024 విద్యార్థి నిరసనలను అణచివేసిన ఘటనలో ఆమె దోషిగా తేలడంతో, అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఆమెకు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ ఈ విచారణలను "లోపభూయిష్టం" అని పేర్కొన్నాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం వాటి న్యాయబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తింది.
‘కంగ్రాట్స్ జింక్స్.. నువ్వు నా ఫెవరెట్ బ్యాటింగ్ పార్టనర్’
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అజింక్య రహానేకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అభినందనలు తెలిపాడు. సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించిన అతడి కెరీర్ గొప్పగా సాగిందని పేర్కొన్న విరాట్.. ఇకపై కూడా అతడికి అంతా మంచే జరగాలని ఆకాంక్షించాడు. ఎన్నో ఏళ్లు తామిద్దరం కలిసి దేశానికి ఆడామని, జింక్స్ తన పార్టనర్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని కోహ్లి తెలిపాడు. ‘జింక్స్.. నీ క్రికెట్ కెరీర్ గొప్పగా సాగినందుకు అభినందనలు. భారత క్రికెటర్గా నువ్వు అద్భుతాలు చేశావు. నీ ఈ ప్రయాణం పట్ల నువ్వు చాలా గర్వపడాలి. స్లిప్లో నీ చేతులు చాలా సురక్షితమైనవి. టెస్టుల్లో నాకు ఇష్టమైన భాగస్వామివి నువ్వే. నువ్వు ఎల్లప్పుడూ బాగుండాలి. దేవుడి ఆశీర్వాదం నీకు ఉంటుంది’ అని కోహ్లీ తన పోస్ట్లో వెల్లడించాడు.కోహ్లి హయాంలోనే స్టార్ హోదా..ఇక కోహ్లీ కెప్టెన్సీలోనే రహానే కెరీర్ గొప్పగా సాగింది. కోహ్లి హయాంలోనే అతడు వైస్ కెప్టెన్గా, మిడిలార్డర్ బ్యాటర్గానూ స్థిరంగా రాణించాడు. కోహ్లి, రహానేలు కలిసి టీమిండియా తరఫున 67 టెస్టుల్లో ఆడారు. వీరిద్దరు కలిసి 3,661 పరుగులు జోడించారు. ఇందులో 10 శతక భాగస్వామ్యాలున్నాయి. ఈ ఇద్దరి మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం 2016లో న్యూజిలాండ్తో టెస్టులో (365 పరుగులు) నమోదయ్యింది. ఇక ఇద్దరు కలిసి 33 వన్డేలు ఆడి 1717 పరుగులు జోడించారు. ఇందులో ఆరు శతక భాగస్వామ్యాలున్నాయి. అయితే మూడేళ్ల క్రితం వరకు కోహ్లి, పుజారా, రహానే, రోహిత్.. వీళ్లు లేని భారత టెస్టు జట్టును ఊహించలేం. ఎందుకంటే.. సుదీర్గ అనుభమున్న ఈ నలుగురికి కష్ట సమయంలో ఇన్నింగ్స్ నిర్మించడం, ప్రత్యర్ధి బౌలర్లను విసిగించడం ఎలాగో బాగా తెలుసు. టీమిండియా వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరడంలో ఈ నలుగురు కీలక పాత్ర పోషించారు. అంతేకాదు టెస్టుల్లో రోహిత్ సేన అగ్రస్థానంలో నిలవడంలో వీళ్ల పాత్ర మరువలేనిది.ఫస్ట్ క్లాస్లో నిలకడగా రాణించిన రహానే 2013లో ఆస్ట్రేలియాపై మ్యాచ్తో టెస్టులో అరంగేట్రం చేశాడు. తన డిఫెన్స్, నిబద్ధతో రహానే అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో రహానే 85 టెస్టుల్లో 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలున్నాయి. ఇక 90 వన్డే మ్యాచ్ల్లో 2,962 పరుగులు సాధించిన రహానే ఖాతాలో మూడు సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్లో 20 మ్యాచ్లాడిన రహానే 375 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫిఫ్టీ ఉంది. Jinks, congratulations on a great career, buddy. You’ve done wonders for Indian cricket, and you can be very proud of your journey. The safest pair of hands in the slips and my favourite Test batting partner. Wishing you well always. God bless. 🤝🇮🇳@ajinkyarahane88 pic.twitter.com/bHGaas41gO— Virat Kohli (@imVkohli) July 30, 2026
ఉద్యోగం కోల్పోవడం, మూడుసార్లు వ్యాపారంలో నష్టం..చివరికి ఏకంగా రూ. 100 కోట్లు..
ఎడతెగని వైఫల్యాలు మరింత బలోపేతం కావడానికే...పదేపదే ఓటమి పలకరిస్తోందంటే ఎవ్వరూ ఊహించనంత ఎవరెస్ట్ అంత ఎత్తుకు వెళ్తున్నామని అర్థం... ఇక్కడ కావాల్సింది ఒక్కటే బలహీనమవుతున్న మనసుని స్ట్రాంగ్గా మార్చుకుని ధైర్యంగా ముందుకు సాగడం. అది తెలిసినవాడిని ఓటమి మట్టికరింపించలేదు..ఎందుకంటే అచంచలమైన పట్టుదల ముందు ఆకాశమంత గెలుపుని తలవంచాల్సిందే. అందుకు ఉదాహరణ ఈ మహిళ. ఆమె తాను ఎదుర్కొన్న సవాళ్లను, కష్టాలను ఎంతో నిజాయితిగా సోషల్మీడియా పోస్ట్లో వివరించి, నెటిజన్ల మనసును దోచడమే కాదు..గెలుపు పోరాటంపై అద్భుతమైన పాఠం నేర్పించింది.ఆ మహిళే సింగపూర్కి చెందిన పారిశ్రామికవేత్త మిజా నజిలి. ఆమె సోషల్మీడియా వేదకగా వ్యాపార ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, కష్టాల గురించి వివరించి వైరల్గా మారింది. ఆమె ఆ పోస్ట్లో ప్రస్తుతం అందరూ తన సక్సెస్ని మాత్రమే చూస్తారు తప్ప ఆ మార్గంలో తనకు ఎదురైన ఎదురుదెబ్బలు, త్యాగాలు పెద్దగా ఎవ్వరూ గమనించారు అంటూ తన సక్సెస్ జర్నీని వివరించింది ఇలా. ఒకప్పుడు తాను పూర్తికాలపు ఉద్యోగం నుంచి తొలగించబడినట్లు తెలిపారు. ఆ తర్వాత చేసిన మూడు వ్యాపారాల్లోనూ తీవ్ర నష్టం చవిచూసినట్లు వెల్లడించింది. ఒకానొక సమయంలో బ్యాంక్ బ్యాలెన్స్ సైతం రూ. 2 వేలుకి మించి లేదని ఆవేదనగా చెప్పారు. అంతేగాదు వ్యాపారాల్లో నష్టం కారణంగా సుమారు రూ. 70 లక్షలదాక అప్పులుపాలైనట్లు తెలిపారు. తన వ్యాపారం ప్రారంభ దశలో మెరుగైన లాజిస్టిక్స్ మద్దతును పొందలేకపోయినందున, సరుకును తీసుకెళ్లడానికి దాదాపు ప్రతిరోజూ జోహోర్ బహ్రూకు ప్రయాణించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రిటైల్ అవకాశాలను పొందడానికి ప్రయత్నించినప్పుడు మరో సవాలు ఎదురైందంటూ ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఒక ప్రముఖ రిటైలర్కు తన ఉత్పత్తులను మొదటిసారిగా అందించినప్పుడు, ఎలా తిరస్కరించారో ఇప్పటికీ మర్చిపోనన్నారు. కానీ ఇవాళ తన ప్రొడక్ట్స్ వందకు పైగా వాట్సన్స్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయని గర్వంగా చెప్పారామె. కేవలం పట్టువదలని ప్రయత్నంతో తన వ్యాపారాన్ని నిలబెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె పోర్ట్ఫోలియోలో 5 వివిధ బ్రాండ్లు ఉన్నాయని, వాటి నుంచి ఏడాదికి ఏకంగా దాదాపు రూ. 100 కోట్లుపైనే ఆర్జిస్తానని చెప్పారు. అంతేగాదు రెండు భవనాల్లో ఆరు అంతస్థుల ప్రధాన కార్యాలయాన్ని నిర్మించానని కూడా అన్నారు. అలాగే ఇటీవలే తానొక కొత్త పోర్షే కారుని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తనను అందరూ బహుళ బ్రాండ్లను నడుపుతున్న ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్గా చూస్తున్నారని, ఒకప్పుడు తల్లిదండ్రులు సైతం చిరాకుపడ్డ అమ్మాయిగా కానీ, చదువు మధ్యలోనే మానేసిన మొద్దుదానిలా గానీ చూడరని చెప్పుకొచ్చింది. ఇదంతా గెలుపు గొప్పతనం అంటూ తన పోస్ట్ని ముగించింది. అంతేగాదు ఆమె ప్రతి ఒక్కరిని ఇతరుల విజయాలతో పోల్చుకుని అస్సలు చూసుకోవద్దని అది మనల్ని వెనక్కి లాగేస్తుందని అన్నారు. అలాగే తాను ఇన్ని ఎడతెగని ఓటములు చవిచూసినా ఎన్నడూ భయపడలేదని, ఎందుకంటే ఓటమి భయం కంటే పేదరికంలో ఉండిపోతానన్న భయమే ఎక్కువ అంటూ సరికొత్త గెలుపు పాఠాన్ని చెప్పింది మిజా నజిలి. View this post on Instagram A post shared by Miza Nazili (@mizanazili) (చదవండి: నో ఐఐటీ/ఎన్ఐటీ, 27 యూనివర్సిటీల నుంచి తిరస్కరణ..కట్చేస్తే..)
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.విదియ రా.9.14 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: ధనిష్ఠ రా.7.20 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: రా.2.49 నుండి 4.29 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.07 వరకు, తదుపరి ప.12.32 నుండి 1.23 వరకు, అమృత ఘడియలు: ఉ.8.19 నుండి 10.01 వరకు.సూర్యోదయం : 5.41సూర్యాస్తమయం : 6.31రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకుమేషం: శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. కళాకారులకు సన్మానయోగం.వృషభం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.మిథునం: కుటుంబ సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కర్కాటకం: శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. అప్రయత్న కార్యసిద్ధి. దూరపు బంధువుల కలయిక. భూవివాదాలు పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.సింహం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి. విందువినోదాలు..కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. మిత్రులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. తుల: ఆరోగ్యసమస్యలు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. ఆలయ దర్శనాలు.ధనుస్సు: కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి, ఉద్యోగాలలో చికాకులు.మకరం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.కుంభం: చేపట్టిన పనుల్లో కొద్దిపాటి అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరాశ. దైవచింతన.మీనం: మిత్రులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వాహన, గృహయోగాలు.
లెనిన్ @ వంద కోట్లు
రాకా రెండు భాగాలుగా రాక?
హీరోగా స్టార్ డైరెక్టర్.. రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
నాలుగు రాస్తే.. ఇచ్చేది రెండే
'పేపర్ లీక్ గ్యాంగ్లను వదిలే ప్రసక్తే లేదు'.. పీఎం మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
థియేటర్లలో శ్రీనివాస మంగాపురం.. ఓటీటీల్లో ఒక్క రోజే 14 సిినిమాలు
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్
ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు తెలంగాణ సిద్ధం
హాలీవుడ్ స్టార్ ముందు భారత గౌరవాన్ని నిలబెట్టిన శివాజీ గణేశన్!
‘గూగుల్లో వెతికా.. ఎంత పనికిమాలినోడివో!’
మాజీ బస్ డ్రైవర్ ఇంట్లో 15 కేజీల బంగారం
విజయ్ సర్కార్ ఆంక్షలు.. ఏపీ సహా మూడు రాష్ట్రాలకు సరఫరా బంద్!
రైతు కాళ్ల కిందే కర్మాగారం
సీజేపీ ఆందోళన.. ప్రధాన్ రాజీనామా.. డీఎస్సీ.. లోకేష్
ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ స్కాం
‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’
సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని చెప్పేశా : త్రిష
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
‘శ్రీనివాస మంగాపురం’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సాక్షి కార్టూన్: 30-07-2026
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి
టీమిండియా జెర్సీని కాషాయం రంగులోకి మార్చడంపై మాజీ కెప్టెన్ ఫైర్
IND vs SL: అతడిని ఎలా ఎంపిక చేశారు: డివిలియర్స్
ఐపీఎస్ లేఔట్లో రేవ్ పార్టీ.. 12 మంది అమ్మాయిలు..!
వైస్ కెప్టెన్గా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ
జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం
రైల్వే తత్కాల్ బుకింగ్లో మార్పులు
అమిత్ షా రాజీనామా చేయాలి: ‘సీజేపీ’ అభిజీత్ దిప్కే
రేషన్ కావాలా.. ఈ కేవైసీ తప్పనిసరి
లెనిన్ @ వంద కోట్లు
రాకా రెండు భాగాలుగా రాక?
హీరోగా స్టార్ డైరెక్టర్.. రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
నాలుగు రాస్తే.. ఇచ్చేది రెండే
'పేపర్ లీక్ గ్యాంగ్లను వదిలే ప్రసక్తే లేదు'.. పీఎం మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
థియేటర్లలో శ్రీనివాస మంగాపురం.. ఓటీటీల్లో ఒక్క రోజే 14 సిినిమాలు
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్
ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు తెలంగాణ సిద్ధం
హాలీవుడ్ స్టార్ ముందు భారత గౌరవాన్ని నిలబెట్టిన శివాజీ గణేశన్!
‘గూగుల్లో వెతికా.. ఎంత పనికిమాలినోడివో!’
మాజీ బస్ డ్రైవర్ ఇంట్లో 15 కేజీల బంగారం
విజయ్ సర్కార్ ఆంక్షలు.. ఏపీ సహా మూడు రాష్ట్రాలకు సరఫరా బంద్!
రైతు కాళ్ల కిందే కర్మాగారం
సీజేపీ ఆందోళన.. ప్రధాన్ రాజీనామా.. డీఎస్సీ.. లోకేష్
ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ స్కాం
‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’
సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని చెప్పేశా : త్రిష
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
‘శ్రీనివాస మంగాపురం’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సాక్షి కార్టూన్: 30-07-2026
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి
టీమిండియా జెర్సీని కాషాయం రంగులోకి మార్చడంపై మాజీ కెప్టెన్ ఫైర్
IND vs SL: అతడిని ఎలా ఎంపిక చేశారు: డివిలియర్స్
ఐపీఎస్ లేఔట్లో రేవ్ పార్టీ.. 12 మంది అమ్మాయిలు..!
వైస్ కెప్టెన్గా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ
జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం
రైల్వే తత్కాల్ బుకింగ్లో మార్పులు
అమిత్ షా రాజీనామా చేయాలి: ‘సీజేపీ’ అభిజీత్ దిప్కే
రేషన్ కావాలా.. ఈ కేవైసీ తప్పనిసరి
ఫొటోలు
పారిస్ ట్రిప్లో ‘సర్జా సిస్టర్స్’.. అర్జున్ చిన్న కూతురు ఫోటోలు వైరల్
వైఎస్ జగన్ రాకతో ఉత్తరాంధ్ర జనసంద్రం (ఫొటోలు)
ఒక శకం ముగిసింది.. అంతర్జాతీయ క్రికెట్కు రహానే గుడ్బై..(ఫొటోలు)
ఈ చిన్నారే.. ఇప్పుడు ట్రెండింగ్ స్టార్! వెంకీ మామ కూతురి క్యూట్ (ఫొటోలు)
చిరునవ్వుతో అభిమానులను ఫిదా చేసిన అనుపమ పరమేశ్వరన్ (ఫొటోలు)
రణ్బీర్ కపూర్, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్
ట్రెడిషనల్ లుక్లో కట్టిపడేసిన అందాల భామ రజిష విజయన్ (ఫొటోలు)
అప్సరసలా దివ్యమైన రూపంతో మెరిసిన శోభిత ధూళిపాళ (ఫొటోలు)
హైదరాబాద్ : రవీంద్రభారతిలో ఇది.. అందెల రవళి (ఫొటోలు)
హైదరాబాద్ : అంతర్జాతీయ పులుల దినోత్సవం...అదిగో పులి (ఫొటోలు)
సినిమా
రిషబ్ శెట్టితో నిర్మాత నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. అందుకే ఆగిపోయిందా?
కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీస్ చేయనున్నారు. తాజాగా రిషబ్ శెట్టికి సంబంధించిన ఓ టాక్ వైరల్గా మారింది. టాలీవుడ్ నిర్మాత నాగవంశీ నిర్మాణంలో ఓ భారీ మూవీ ప్లాన్ చేశారని టాక్. అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో భారీ హిస్టారికల్ యాక్షన్ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారట. కానీ ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.ఈ మూవీ ఆగిపోవడానికి రిషబ్ శెట్టి పారితోషికమే కారణమని తెలుస్తోంది. కాంతార తర్వాత అనూహ్యంగా రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ పెరిగిపోయింది. దీంతో నిర్మాత నాగవంశీకి.. రిషబ్కు రెమ్యునరేషన్ విషయంలో వచ్చిన అభిప్రాయ భేదాలే వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పక్కనబెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే లేదు.
మా సినిమాను మహేశ్ బాబు మెచ్చుకున్నారు: అజయ్ భూపతి
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. రాషా తడానీ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో మంచు మోహన్బాబు విలన్ పాత్ర పోషించారు. సి. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రదర్శకుడు అజయ్ భూపతి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.అజయ్ భూపతి మాట్లాడుతూ.. 'సూపర్ స్టార్ కృష్ణగారి కుటుంబం నుంచి ఒక హీరోని పరిచయం చేయడం అంటే కచ్చితంగా బాధ్యత, ఒత్తిడి ఉంటుంది. అయితే నేను మొదట్లో ఆ విషయాన్ని పట్టించుకోలేదు. నిజానికి నేనెప్పుడూ నా శైలిలోనే సినిమాలు చేసుకుంటూ వెళ్తాను. ఆ సినిమాలకు సంబంధించిన వాళ్లు కూడా నా స్టైల్కే వదిలేశారు. కాకపోతే ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ కోసం జై కృష్ణతో నా ప్రయాణం మొదలైన తర్వాత తను నాకు వ్యక్తిగతంగా చాలా నచ్చాడు. కృష్ణగారంటే నాకు చాలా అభిమానం. ఆయన వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని దగ్గరుండి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకున్నానని' దర్శకుడు తెలిపారు.ఇంకా మాట్లాడుతూ..'నిర్మాత కిరణ్గారికి నేను ఓ సినిమా చేయాలి. శ్రీనివాస మంగాపురం సినిమా అనుకున్నప్పుడు అశ్వినీదత్గారిని కలిశాను. ఆ తర్వాత జై కృష్ణను రెండు, మూడు సార్లు కలిశాను. తనపై నమ్మకం వచ్చిన తర్వాత ఈ మూవీ ఆరంభించాం. ‘శ్రీనివాస మంగాపురం’ టైటిల్తోనే కథ రాసుకున్నాను. ఈ కథ బ్యాక్డ్రాప్, క్యారెక్టర్ల పేర్లు, వాళ్ల లవ్ స్టోరీ... వీటన్నింటికీ ఈ టైటిల్ సరిపోతుంది. ఇది ఫిక్షన్ కథ అయినప్పటికీ నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగానూ కొన్ని సన్నివేశాలు రాశాను. ఈ సినిమా మొదలైన తర్వాత ప్రేక్షకులు కథతో, రాత్రులతో లీనమైపోతారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఇది కంప్లీట్ ఎమోషనల్ లవ్స్టోరీ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా. గత 20 ఏళ్లుగా మోహన్ బాబుగారిని ఇంత ఎమోషనల్ పాత్రలో ఆడియన్స్ చూసి ఉండరు. జై కృష్ణ, మోహన్బాబుగారు, రాషా మధ్య వచ్చే సన్నివేశాలు హత్తుకుంటాయి. జీవీ ప్రకాశ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటాయి' అని అన్నారు.మహేశ్ బాబు మా సినిమా చూసి అదిరిపోయింది... జై కృష్ణ, రాషా తడానీ జోడీ బాగుందన్నారు. సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి అని మెసేజ్ పెట్టారు. ప్రభాస్గారు కూడా మా సినిమాని ప్రోత్సహించడం హ్యాపీగా అనిపించింది. దాదాపుగా నా కథలను సమాజం నుంచే తీసుకుంటాను. నా ఫిల్మోగ్రఫీలో శ్రీనివాస మంగాపురం ఫస్ట్ ప్లేస్లోకి వెళ్లాలని కోరుకుంటున్నాను. నా తర్వాతి సినిమా ‘మంగళవారం 2’ త్వరలోనే మొదలవుతుందని దర్శకుడు వెల్లడించారు.
17 ఏళ్ల కెరీర్లో శృతి నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఇదే!
కథానాయకల్లో శృతిహాసన్ వేరయ్య అని పేర్కొనవచ్చు. అంత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటి ఈమె. తనకు నచ్చింది చేయడంలోనూ, దానిని బహిరంగంగా వ్యక్తం చేయడంలోనూ ఈమె రూటే వేరు. ఇది ఆమెకు వారసత్వంగా అబ్బింది కావచ్చు. సకల కళా వల్లభుడు కమల్ హాసన్ వారసురాలు ఈమె అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నటిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా, ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో సత్తా చాటుకుంటున్న నటి శృతిహాసన్. నటిగానే కాకుండా సంగీత దర్శకురాలు ,గాయనీగా కూడా తన ప్రతిభను చాటుకుంటున్న ఈ బ్యూటీ తమిళంలో విజయ్ సేతుపతి సరసన నటించిన ట్రైన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా 2009లో లక్ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ నట పయనం 17 ఏళ్లుగా అప్రహతంగా కొనసాగుతోంది. దీంతో తన సినీ ప్రస్థానం గురించి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ‘‘ ఈ పయనం నాకు నా గురించి ,నా వృత్తి గురించి ,మనుషుల గురించి చాలా నేర్పించింది. ఒక చిత్రం జయాపజయాలను మించి దాన్ని రూపొందించడానికి పెద్ద బృందం సమష్టి ప్రయత్నం చాలా అవసరమని తెలిసేలా చేసింది. ఈ 17 ఏళ్లలో చిత్తప్రశ్రమ నాకు చాలా నేర్పించింది . అంతకు మించి పెద్ద పాఠం కూడా చెప్పింది. శక్తివంతంగాను, మానస జక ధృఢత్వంగాను మార్చింది. ఎలాంటి విమర్శలైనా, సవాళ్లనైనా ఎదుర్కొనే మానసిక పరిపక్వతం పెంపొందించింది ‘‘ అని నటి శృతిహాసన్ పేర్కొన్నారు.
రజనీకాంత్ బయోపిక్ రానుందా?
హీరో రజనీకాంత్ జీవితం వెండితెరపైకి వచ్చే అవకాశం ఉందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. కొంత కాలంగా రజనీకాంత్ తన ఆటోబయోగ్రఫీ రాస్తున్నారట. ఇందులో బస్ కండక్టర్ నుంచి వెండితెరపై సూపర్ స్టార్గా ఎదిగిన తన జీవిత విశేషాలు, తన జర్నీలోని ఒడిదొడుకులు, మధుర జ్ఞాపకాలు, భావోద్వేగభరిత పరిస్థితులను గురించి ప్రస్తావించనున్నారట రజనీకాంత్. అంతేకాదు...తన జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన సంగతులను ఈ పుస్తకం ద్వారా తెలియజేయాలని రజనీకాంత్ భావిస్తున్నారట.ఈ పుస్తకం ఆధారంగా ఓ సినిమా తీయాలని, ఈ బయోపిక్ను తెరకెక్కించాల్సి వస్తే ఎవరు దర్శకత్వం వహించాలి? వెండితెరపై తన పాత్రలో ఎవరు నటించాలి? అన్న అంశాలపై కూడా రజనీకాంత్ తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారని కోలీవుడ్ భోగట్టా. మరి... రజనీకాంత్ బయోపిక్ వెండితెరపైకి వస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు ప్రస్తుతం దర్శకుడు అశ్వత్ మారిముత్తుతో ‘ధర్మన్’ సినిమా చేస్తున్నారు రజనీకాంత్.ఈ చిత్రం తర్వాత నెల్సన్ దర్శకత్వం వహించనున్న మల్టీస్టారర్ మూవీ షూట్లో పాల్గొంటారు. ఈ చిత్రంలో కమల్హాసన్ కూడా నటిస్తున్నారు. అలాగే నెల్సన్ డైరెక్షన్లో రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్ 2’ చిత్రం అక్టోబరు 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
క్రీడలు
సూపర్ కింగ్స్ కొత్త కోచ్గా ఆల్బీ మోర్కెల్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20) ఫ్రాంచైజీ జోబర్గ్ సూపర్ కింగ్స్ తమ కొత్త ప్రధాన కోచ్గా మాజీ ఆల్రౌండర్ ఆల్బీ మోర్కెల్ను నియమించింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమానం ఇవాళ అధికారికంగా ప్రకటించింది.ఆల్బీ మోర్కెల్ గత సీజన్లలో జోబర్గ్ సూపర్ కింగ్స్కు సహాయ కోచ్, బ్యాటింగ్ కోచ్గా సేవలందించాడు. జట్టు వ్యవస్థపై పూర్తి అవగాహనతో పాటు ఆటగాళ్లతో సన్నిహితంగా పనిచేసిన అనుభవం ఉండటంతో అతనికి ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించారు.చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో విజయవంతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న మోర్కెల్కు సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో చాలా కాలంగా అనుబంధం ఉంది. ఆటగాడిగా సాధించిన విజయాల అనంతరం కోచ్గా కూడా అదే వ్యవస్థలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. 46 ఏళ్ల ఆల్బీ ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న మోర్నీ మోర్కెల్కు సోదరుడు (పెద్దవాడు).ఆల్బీ మోర్కెల్ కెరీర్ విశేషాలుఆల్బీ తన హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్, వేగవంతమైన బౌలింగ్తో అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఎడమచేతి బ్యాటింగ్, కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేసే ఆల్బీ.. సౌతాఫ్రికా తరఫున 58 టెస్ట్లు, 117 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. టెస్ట్ల్లో 1,300కు పైగా పరుగులు, 50 వికెట్లు.. వన్డేల్లో 1,500కు పైగా పరుగులు, 100కు పైగా వికెట్లు.. టీ20ల్లో 500కు పైగా పరుగులు, 26 వికెట్లు సాధించాడు.ఐపీఎల్ కెరీర్* 2008 నుంచి 2013 వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.* అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్), రైజింగ్ పుణే సూపర్జెయింట్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.* ఐపీఎల్లో అత్యుత్తమ ఫినిషర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.గుర్తుండిపోయే ఘనత2012 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో విరాట్ కోహ్లీ బౌలింగ్లో వరుసగా భారీ సిక్సర్లు బాది చెన్నై సూపర్ కింగ్స్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆ ఇన్నింగ్స్ అతని కెరీర్లో అత్యంత గుర్తుండిపోయే ప్రదర్శనగా నిలిచింది.కోచింగ్ ప్రయాణం* ఆటకు వీడ్కోలు అనంతరం కోచింగ్లోకి అడుగుపెట్టాడు.* జోబర్గ్ సూపర్ కింగ్స్కు సహాయ కోచ్, బ్యాటింగ్ కోచ్గా పనిచేశాడు.* 2026లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్గా నియమితుడయ్యాడు.* సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో ఆటగాడిగా ప్రారంభమైన అనుబంధాన్ని కోచ్గా కూడా విజయవంతంగా కొనసాగిస్తున్నాడు.
ఫైనల్కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా
భారత స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్-2026 జావెలిన్ త్రో క్వాలిఫయింగ్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదోస్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. కాగా స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్ నిర్వహించారు. నీరజ్ చోప్రాతో పాటు భారత్కే చెందిన రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఈటెను 76.28 మీటర్ల దూరం విసిరాడు.12 మందికి అర్హతఇక రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 79.61 మీటర్ల దూరం ఈటెను విసిరి ఐదో స్థానం దక్కించుకున్నాడు. కాగా మొత్తంగా 18 మంది జావెలిన్ త్రోయర్లు క్వాలిఫయింగ్లో పోటీపడ్డారు. అయితే, ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది మాత్రమే ఫైనల్కు అర్హత సాధిస్తారు. నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ కూడా టాప్-12లో నిలిచి ఫైనల్లో అడుగుపెట్టారు.రోహిత్ యాదవ్ అత్యుత్తమంగా ఈటెను 78.37 మీటర్ల దూరం విసరగా.. యశ్వీర్ సింగ్ 78.36 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో వీరిద్దరు తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు. అగ్రస్థానం అతడిదేఇక శ్రీలంకకు చెందిన రుమేశ్ తరంగ పతిరగే 82.84 మీటర్ల దూరం ఈటెను విసిరి తొలి స్థానం దక్కించుకున్నాడు. మరోవైపు.. పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ 78.63 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి టాప్-7లో నిలిచాడు. కాగా భారత కాలమానం ప్రకారం ఆగష్టు 1న ఉదయం 12.45 గంటలకు జావెలిన్ త్రో ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
జూనియర్ ఏబీ విధ్వంసం.. బంతిని చూడకుండానే!
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో లండన్ స్పిరిట్ తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఎంఐ లండన్తో జరిగిన మ్యాచ్లో లండన్ స్పిరిట్స్ 7 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. మ్యాచ్లో ప్రిటోరియస్ సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ప్రిటోరియస్తో పాటు జూనియర్ డివిలియర్స్ డెవాల్డ్ బ్రెవిడ్ ఇన్నింగ్స్ కూడా మ్యాచ్లో హైలైట్ అని చెప్పొచ్చు.18 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచిన బ్రెవిస్ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఇన్నింగ్స్లో డెవాల్డ్ బ్రెవిస్ కొట్టిన నో-లుక్ సిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్నింగ్స్ 68వ బంతికి ఈ అద్భుతం చోటుచేసకుంది. ఓలీ స్టోన్ వేసిన బంతిని ముందే అంచనా వేసిన డెవాల్డ్ బ్రెవిస్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఈ క్రమంలో బంతి స్టాండ్స్ దిశగా వెళ్తున్న సమయంలో డెవాల్డ్ బ్రెవిస్ ఒక్కసారి కూడా తాను కొట్టిన షాట్ను చూడకుండా గ్రౌండ్నే చూడడం హైలైట్గా మారింది. ఇది చూసిన అభిమానులు @నీ కాన్ఫిడెన్స్కు సలాం.. బ్రెవిస్*, ఇదెక్కడి మాస్ రా మావ.. అని కామెంట్లు పెట్టేశారు. ఇంకెందుకు ఆలస్యం బ్రెవిస్ నో లుక్ సిక్స్ను మీరు కూడా వీక్షించండి. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విల్ జాక్స్ (44 బంతుల్లో 65), రూథర్ఫోర్డ్ (19 బంతుల్లో 41) ధాటిగా ఆడారు. లండన్ స్పిరిట్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు తీయగా, ఆండ్రూ టై, జేమ్స్ కోల్స్ చెరొక వికెట్ తీశారు.అనంతరం లండన్ స్పిరిట్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ప్రిటోరియస్ (28 బంతుల్లో 64), బ్రెవిస్ (18 బంతుల్లో 37 నాటౌట్) భారీ ఇన్నింగ్స్లతో జట్టుకు విజయాన్ని అందించారు. Simply sensational from Dewald Brevis 🤯Watch his head position as he hits the ball...#TheHundred pic.twitter.com/eWOtOJlVXo— The Hundred (@thehundred) July 29, 2026Dewald Brevis. No-look six. Enjoy. 🥶 pic.twitter.com/qgQoBKwvkz— Lord's Cricket Ground (@HomeOfCricket) July 29, 2026Read: రహానే రిటైర్మెంట్పై బీసీసీఐ తొలి స్పందన
IND vs BAN: ‘బంగ్లాదేశ్ సేఫ్ కంట్రీ.. ప్లీజ్ రండి’
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఇంకా ఆమోదం రాలేదని తెలిపాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందు భారత్- బంగ్లా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.నాటి ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా..ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ను బీసీసీఐ తొలగించింది. దీంతో వరల్డ్కప్ ఆడేందుకు తాము భారత్కు రాబోమని బీసీబీ భీష్మించుకుని కూర్చుంది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగి డెడ్లైన్ విధించగా.. బీసీబీ మాత్రం భారత్లో తమకు భద్రత ఉండదంటూ ఆరోపించింది. ఈ క్రమంలో టోర్నీ నుంచే నిష్క్రమించింది.అయితే, నాటి బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం చర్యల కారణంగా ఈ మేరకు బీసీబీ- బీసీసీఐ మధ్య విభేదాలు తలెత్తగా.. బంగ్లా టూర్ను బీసీసీఐ రద్దు చేసుకుంది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం రాగానే బీసీబీ అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ పదవి చేపట్టాడు.నాటి నుంచి బీసీబీ- బీసీసీఐ మధ్య సంబంధాల పునరుద్ధరణ కోసం తమీమ్ ఇక్బాల్ కృషి చేస్తోంది. ఈ విషయంపై తాజాగా స్పందిస్తూ.. ‘‘దురదృష్టవశాత్తూ భారత్- బంగ్లాదేశ్ సిరీస్ గురించి ఇంతవరకు నా వద్ద ఎలాంటి అధికారిక సమాచారం లేదు. బీసీసీఐతో మేము చర్చలు కొనసాగిస్తున్నాము. ఇరు బోర్డు అధికారుల మధ్య ఇ-మెయిళ్ల మార్పిడి జరుగుతోంది.అత్యంత భద్రమైన దేశంటీమిండియా- బంగ్లాదేశ్ సిరీస్ అంటే.. అన్ని వర్గాల నుంచి ఆదరణ ఉంటుంది. బంగ్లాదేశ్ అత్యంత భద్రమైన దేశం. టీమిండియా మా దేశ పర్యటనకు వస్తుందని నమ్ముతున్నా. అందుకోసం మా వైపు నుంచి ఏం చేయాలో అన్నీ చేస్తాం. అయితే, బీసీబీ అధ్యక్షుడిగా నాకంటూ కొన్ని పరిధులు ఉంటాయి. నేను వాటిని దాటకూడదు. త్వరలోనే టీమిండియాతో సిరీస్ ఉంటుందని ఆశిస్తున్నా’’ అని తమీమ్ ఇక్బాల్ చెప్పుకొచ్చాడు. చదవండి: గిల్ సంచలన నిర్ణయం!
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ కుంభకోణంపై జెన్జీ వార్...
ఏపీలో డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ పదవి నుంచి తప్పుకోవాల్సిందే...
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అక్రమాలపై విచారణ. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రెండేళ్ల బాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తం... ‘కాగ్’ గణాంకాల సాక్షిగా వాస్తవాలు బహిర్గతం
ప్రశ్నపత్రాల లీకేజీ దోషులకు పదేళ్ల జైలుశిక్ష.. పది కోట్ల రూపాయల జరిమానా... ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
కృష్ణా, గోదావరి డెల్టాలో వరి వేయొద్దని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
చంద్రబాబు సర్కారును నిద్ర లేపుతాం... పొగాకు రైతుల సమస్యలపై గట్టిగా పోరాడుతాం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన
ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించిన ప్రతిపక్షాలు..
ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
రామాయపట్నంలో భారీ స్కామ్... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
బిజినెస్
గూగుల్ పేలో SBI కొత్త క్రెడిట్ కార్డు..
డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో కీలక అడుగు పడింది. గూగుల్ పే, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ‘గూగుల్ పే ఫ్లెక్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు’ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా ప్రారంభమైన ఈ కో-బ్రాండెడ్ కార్డు ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులు, యూపీఐ లావాదేవీలు, రివార్డులను ఒకే డిజిటల్ వేదికలో నిర్వహించుకునే అవకాశం లభిస్తుంది.కార్డు కోసం దరఖాస్తు చేయడం నుంచి ఖాతా నిర్వహణ, లావాదేవీలను పరిశీలించడం, చెల్లింపులు చేయడం, కొన్ని సందర్భాల్లో బకాయిలను ఈఎంఐగా మార్చుకోవడం వరకు అనేక సేవలను గూగుల్ పే యాప్ నుంచే పొందవచ్చు. ఎస్బీఐ కార్డు నిబంధనల ప్రకారం, గూగుల్ పే ఫ్లెక్స్ కార్డుదారులకు ‘Pay in EMI’ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఇందులో అర్హత ఉన్న రిటైల్ లావాదేవీలను కనీసం రూ.2,500 నుంచి 3, 6, 9, 12, 18, 24, 36 నెలల కాలవ్యవధులకు ఈఎంఐగా మార్చుకోవచ్చు.‘స్టార్స్’ రూపంలో రివార్డులుఈ కార్డులో ప్రత్యేక ఆకర్షణ ‘స్టార్స్’ రివార్డ్ ప్రోగ్రామ్. ఇందులో ఒక స్టార్ విలువ రూ.1గా ఉంటుంది. అర్హత కలిగిన కొనుగోళ్లపై కస్టమర్లు స్టార్స్ను సంపాదించి, గూగుల్ పేలో అందుబాటులో ఉన్న ఎంపిక చేసిన వోచర్లు లేదా చెల్లింపుల సమయంలో వాటిని వినియోగించుకోవచ్చు.కిరాణా, యుటిలిటీ బిల్లులు, షాపింగ్, ప్రయాణం వంటి రోజువారీ ఖర్చులపై రివార్డులు పొందేలా ఈ కార్డును రూపొందించారు. ఖర్చు స్థాయిని బట్టి రివార్డ్ ప్రయోజనాలు మారేలా నిర్మాణం ఉంటుంది. ప్రాథమిక రివార్డ్ నిర్మాణంలో ఏడాదికి గరిష్ఠంగా 18,000 స్టార్స్ వరకు సంపాదించే అవకాశం ఉంటుంది.కొత్త కస్టమర్లకు రూ.1,000 వరకు వెల్కమ్ బెనిఫిట్ కూడా అందిస్తోంది. మొదటి గూగుల్ పే చెల్లింపు, జాయినింగ్ ఫీజు చెల్లింపు, ప్రారంభ ఖర్చు మైలురాళ్లకు అనుసంధానమైన ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.రూ.1 లక్ష ఖర్చు చేస్తే ఫీజు మాఫీగూగుల్ పే ఫ్లెక్స్ ఎస్బీఐ కార్డుకు జాయినింగ్, వార్షిక రెన్యువల్ ఫీజు రూ.499గా ఉంది. దీనికి వర్తించే పన్నులు అదనం. అయితే కార్డుదారుడు ఏడాదిలో రూ.1 లక్ష ఖర్చు చేస్తే ఈ వార్షిక ఫీజును మాఫీ చేస్తారు. ఈ కార్డు వీసా, రూపే నెట్వర్క్లలో అందుబాటులోకి వచ్చింది. రూపే వేరియంట్ను యూపీఐకి లింక్ చేసుకుని, యూపీఐకి అనుకూలమైన వ్యాపారుల వద్ద క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ట్యాప్-టు-పే లావాదేవీల కోసం గూగుల్ పే టోకెనైజేషన్ వంటి డిజిటల్ చెల్లింపు సదుపాయాలకు కూడా మద్దతు ఉంది.అయితే యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు వినియోగం ప్రధానంగా వ్యాపార చెల్లింపులకే వర్తిస్తుంది. వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ, కొన్ని ప్రత్యేక కేటగిరీల చెల్లింపులకు రూపే క్రెడిట్ కార్డు-ఆన్-యూపీఐ సదుపాయం వర్తించదు.
సరికొత్త టయోటా హైలక్స్: ధర ఎంతంటే?
టయోటా భారతదేశంలో తొమ్మిదవ తరం హైలక్స్ను లాంచ్ చేసింది. ఈ పికప్ ట్రక్ జీఎక్స్ 4x2 ఏటీ, జీఎక్స్ 4x4 ఏటీ, వీఎక్స్ 4x4 ఏటీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు రూ. 31.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.టయోటా హైలక్స్ సరికొత్త మోడల్ IMV ప్లాట్ఫామ్పై ఆధారపడి ఉంది. దీని మునుపటి మోడల్కు ఆధారమైన అదే బాడీ-ఆన్-ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ ఇది. భారతదేశంలో డబుల్ క్యాబ్ బాడీ స్టైల్లో లభిస్తుంది. ఈ పికప్ ట్రక్ ముందు భాగంలో హనీకోంబ్ గ్రిల్, బ్లాక్ ట్రిమ్తో సన్నని ఎల్ఈడీ హెడ్ల్యాంప్లు ఉన్నాయి. కార్గో బెడ్ 500 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.హైలక్స్ పికప్ ట్రక్ కొత్త డాష్బోర్డ్తో వస్తుంది. ఇందులో 12.3 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. 3-స్పోక్ స్టీరింగ్ వీల్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి మాత్రమే కాకుండా.. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ ఛార్జర్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, టెర్రైన్ మోడ్లు, ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 201 Bhp పవర్, 500 Nm టార్క్ ఉత్పత్తి చేసే 2.8-లీటర్, 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికలో లభిస్తుంది. ఇది రియర్ వీల్ డ్రైవ్ లేదా ఫోర్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. కాగా ఇది సల్ఫర్ మెటాలిక్, ప్లాటినం పెర్ల్ వైట్ మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్, యాష్, ఎమోషనల్ రెడ్, సూపర్ వైట్ వంటి ఆరు రంగుల్లో లభిస్తుంది.ఇదీ చదవండి: సీఎన్జీ కార్లకు ఫుల్ డిమాండ్: కారణం ఇదే!
ఆగస్టులో హాలిడేస్: ఈ తేదీల్లో బ్యాంకులు పనిచేయవు!
భారతదేశంలోని బ్యాంకులకు జాతీయ సెలవులతో పాటు రాష్ట్రాల వారీగా స్థానిక పండుగలు, సాంస్కృతిక వేడుకలు, ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా కూడా సెలవులు ఉంటాయి. వీటికి అదనంగా ప్రతి నెల రెండో శనివారం, నాలుగో శనివారం, అన్ని ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. అందువల్ల బ్యాంకుకు సంబంధించిన పనులు ముందుగానే ప్రణాళిక చేసుకోవడం మంచిది. ఈ కథనంలో 2026 ఆగస్టులో బ్యాంక్ హాలిడేస్ గురించి తెలుసుకుందాం.ఆగస్టు 8: టెండోంగ్ రో రమ్ ఫాత్ - ఈ పండుగ సందర్భంగా సిక్కిం రాష్ట్రంలోని బ్యాంకులు మూసివేయబడతాయి. ఇది సిక్కిం ప్రజలకు చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన పండుగ.ఆగస్టు 13: పేట్రియాట్ డే - మణిపూర్ రాష్ట్రంలో ఈ రోజు వీరమరణం పొందిన దేశభక్తులను స్మరించుకుంటారు. ఈ సందర్భంగా మణిపూర్లోని బ్యాంకులు సెలవు పాటిస్తాయి.ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం - భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.ఆగస్టు 16: పార్సీ నూతన సంవత్సరం - పార్సీ సమాజం నూతన సంవత్సరాన్ని జరుపుకునే సందర్భంగా డామన్ & డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని బ్యాంకులు సెలవు పాటిస్తాయి.ఆగస్టు 25: ఈద్-ఎ-మిలాద్ - ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే అండమాన్ & నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, పంజాబ్, సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి.ఆగస్టు 26: ఓణం -కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పండుగ అయిన ఓణం సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు.ఆగస్టు 27: ఝూలన్ యాత్ర - ఒడిశా రాష్ట్రంలో జరుపుకునే ఝూలన్ యాత్ర సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు ఉంటుంది.ఆగస్టు 28: రక్షా బంధన్ - అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ప్రేమకు ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్ సందర్భంగా ఛత్తీస్గఢ్, డామన్ & డయ్యూ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.ఈ సెలవుల కారణంగా బ్యాంక్ బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉండకపోయినా, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం కొనసాగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు, అలాగే ఏటీఎం సేవలు సాధారణంగా పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ సూచించింది.
ప్రయాణికుడి కేసు.. రైల్వేకు రూ.25 వేల జరిమానా
రైలులో ప్రయాణికులకు అందించాల్సిన బెడ్రోల్ విషయంలో రైల్వేకు వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆర్ఏసీ టికెట్పై ప్రయాణిస్తున్న ఇద్దరు అపరిచితులకు ఒకే దుప్పటి, దిండు ఇచ్చిన ఘటనలో సేవాలోపం జరిగిందని తేల్చిన ఢిల్లీ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. ప్రయాణికుడు పడిన మానసిక వేధన, శారీరక అసౌకర్యానికి రూ.20,000, వ్యాజ్య ఖర్చుల కింద మరో రూ.5,000 మొత్తం రూ.25,000 పరిహారం చెల్లించాలని నార్తెర్న్ రైల్వేను ఆదేశించింది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా రైల్వే ఈ మొత్తాన్ని చెల్లించాలి. గడువులోగా చెల్లించకపోతే, ఉత్తర్వు తేదీ నుంచి మొత్తాన్ని వసూలు చేసే వరకు 7 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.అసలేం జరిగింది?2022 అక్టోబర్ 28న ప్రయాగ్రాజ్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు ఆర్ఏసీ టికెట్ బుక్ చేసుకున్నాడు. రైలులో మరో ప్రయాణికుడితో ఉమ్మడి సీటును పంచుకోవాల్సి వచ్చింది. అయితే.. ఇద్దరికీ కలిపి ఒకటే దుప్పటి, దిండు, రెండు బెడ్షీట్లు మాత్రమే అందించారని అతను కమిషన్ను ఆశ్రయించాడు. అపరిచితుడితో ఒకే దుప్పటి పంచుకోవడం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని ప్రయాణికుడు విన్నవించాడు. అదనపు దుప్పటి, దిండు ఇవ్వాలని కోచ్ అటెండెంట్ను కోరినా స్పందన లేదని తెలిపాడు. రైల్వే అధికారులకు, టీటీఈకి ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నాడు.రైల్వే వాదన ఏంటి?తమ నిబంధనల ప్రకారం ప్రయాణికులకు బెడ్రోల్ అందిస్తామని ఉత్తర రైల్వే కమిషన్కు తెలిపింది. అదనపు దుప్పటి అవసరం, డిమాండ్, అందుబాటుపై ఆధారపడి ఇవ్వవచ్చని వాదించింది. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత రైల్వే అధికారుల పరిధిలో విచారణ జరుగుతోందని పేర్కొంది.అయితే.. బెడ్రోల్ అందించే కాంట్రాక్టర్పై రూ.1,000 జరిమానా విధించినట్లు రైల్వే అంతర్గత సమాచారంలో వెల్లడైంది. కానీ ఆ చర్యను ఫిర్యాదుదారుడికి తెలియజేయలేదని కమిషన్ గుర్తించింది. అంతేకాకుండా, ప్రయాణికుడికి ప్రత్యేక బెడ్రోల్ అందించామని రైల్వే పేర్కొన్నప్పటికీ, దానికి సరైన ఆధారాలను సమర్పించలేకపోయిందని పేర్కొంది.2009 సర్క్యులర్ కీలకంఈ కేసులో 2009 సెప్టెంబర్ 23న జారీ చేసిన ప్రభుత్వ సర్క్యులర్ను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఆర్ఏసీ ప్రయాణికులకు బెడ్రోల్ సదుపాయం కల్పించవచ్చని, బెడ్రోల్ ఛార్జీలు ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఛార్జీల్లోనే భాగంగా ఉన్నాయని కమిషన్ గమనించింది. అందువల్ల ప్రయాణికుడికి వాగ్దానం చేసిన సదుపాయాన్ని అందించకపోవడం సేవలో లోపం కిందకు వస్తుందని తేల్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు ప్రయాగ్రాజ్ నుంచి ఢిల్లీకి ప్రయాణించాడని, ఆర్ఏసీ సీటులో అపరిచితుడితో ప్రయాణాన్ని పంచుకున్నాడని ఇరుపక్షాలు అంగీకరించినట్లు కమిషన్ పేర్కొంది.
ఫ్యామిలీ
తల్లి కోసం ఏఐలో వెతికాడు... చెల్లెల్ని కలుసుకున్నాడు!
మనమెంత కావాలనుకున్నా కొన్ని బంధాలు దరిచేరవు. ఏ బంధం లేనివారికి కూడా ఉండేది పేగు పంచిన తల్లి బంధం మాత్రమే. ఆ బంధం కూడా లేనప్పుడు మనిషి నిజంగా అనాథగా మిగిలిపోతాడు. ఇలాంటి కథలు మన మధ్యే కాదు.. ఖండాంతరాలలో కూడా జరుగుతాయి. అలాంటిదే ఈ అవతార్ సింగ్ కథ. పంజాబ్లోని అమృత్సర్లో సరిగ్గా 66 ఏళ్ల కిందట అవతార్ సింగ్ జన్మించాడు. బాల్యమంతా ఇరుగుపొరుగు బంధువుల మధ్య హాయిగా సాగింది. కాని ప్రతిసారి ఎవరో అనేవారు ‘మీ అమ్మ ఇక్కడ లేదు..వేరే దేశంలో ఉంది.’ అని... అయితే చిన్న వయసులో అవతార్కి ఆ మాట అర్థమయ్యేది కాదు. కాని ఊహ తెలిశాక తెలిసిందేంటంటే... తనని పెంచింది తల్లిదండ్రులు కాదు అమ్మమ్మ, తాతయ్యలని... అవతార్ తల్లి పేరు సవీందర్..తండ్రి పేరు మోహన్ సింగ్..చిన్న వయసులో పెళ్లి చేసుకున్న సవీందర్కు అవతార్ పుట్టిన కొద్ది రోజులకే మోహన్సింగ్ మరణించాడు. కొన్నేళ్లకు సవీందర్ వేరొకరిని పెళ్లి చేసుకుని కెన్యా వెళ్లిపోయింది. ఇదంతా తెలుసుకున్న అవతార్ తన తల్లికోసం వెతికాడు. ఉత్తరాలు రాశాడు. తెలిసిన వాళ్లతో తల్లి జాడ కోసం గాలించాడు. కాని ఆ రోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ అంతంత మాత్రమే. అదే నిరాశలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. కొన్నేళ్ల తర్వాత ఉద్యోగం కోసం అవతార్ కెనడా వెళ్లిపోయాడు. కెనడా వెళ్లినా, ఉద్యోగంలో స్థిరపడినా..పెళ్లి చేసుకున్నా..అవతార్ను మాత్రం కలచివేసేది ఒక్కటే... తల్లి జాడ తెలుసుకోలేకపోయానని.. ప్రస్తుతం తనకి 66 ఏళ్లు.. భార్యతో కలిసి ఇటీవల ఫ్రాన్స్కి విహారయాత్రకు వచ్చాడు. ఎందుకో తెలియదు గాని ఓసారి ప్రయత్నించి చూద్దామని తల్లిజాడ కోసం చాట్ జీపీటీలో తనకి తెలిసిన కొన్ని వివరాలను ఇచ్చాడు. వెంటనే ఏఐ బ్రిటన్లో నివసిస్తున్న నిక్కీ ధాము అనే మహిళ రాసిన స్మృతి వ్యాసాన్ని అవతార్ ముందు ఉంచింది. అందులోని వివరాలు తన సొంత గ్రామానికి, కుటుంబ సభ్యుల పేర్లకు సారూప్యత ఉండడంతో అవతార్ మెయిల్ ద్వారా నిక్కీకి మెసేజ్ పంపాడు. కాసేపటికే అతడి కళ్లు చమర్చాయ్.. నిక్కీ ధాము ఎవరో కాదు అవతార్ సింగ్కి సవతి చెల్లెలు. అంటే సవీందర్ రెండో భర్త కూతురు. సవీందర్ తన భర్తతో కలిసి 1973లో కెన్యా నుంచి బ్రిటన్కు వలస వచ్చేసింది. కానీ విషాదమేంటంటే అవతార్ తల్లి సవీందర్ 2024 డిసెంబర్లోనే మరణించింది. ఆ వార్త అతడిని కలచివేసింది. అవతార్ ఫ్రాన్స్ నుంచి బయలుదేరి బ్రిటన్లోని నిక్కీ ఇంటికి వెళ్లాడు. తాను అమ్మ కోసం వెతికినట్టే, సవీందర్ కూడా తనకు ఒక కొడుకున్నాడని పదేపదే తన పేరు చెప్పి పరితపించేదని నిక్కీ చెప్పడంతో అవతార్ కన్నీరు మున్నీరయ్యాడు. కాని తల్లిని కలుసుకోలేకపోయినా చెల్లెల్ని కలుసుకున్న సంతృప్తి అవతార్కు మిగిలింది. (చదవండి: నటి సోనాలి ఫిట్నెస్ సీక్రెట్..! ఆటోఫాగీ అంటే..)
నో ఐఐటీ/ఎన్ఐటీ, 27 యూనివర్సిటీల నుంచి తిరస్కరణ..కట్చేస్తే..
తిరస్కరణలనేవి మనిషి జీవితంలో కామన్. వాటిని దాటుకుని వెళ్తేనే జీవితం. అంటుంటారు సైకాలజీ నిపుణులు. నిజానికి మనం ఒక్క రిజెక్ట్ వస్తేనే కుదేలైపోతాం. కానీ ఈ టెకీకి అడగడుగున తిరస్కరణలే. కనీసం ఏది కూడా పదికి పైగా రిజెక్ట్లు ఎదుర్కొంటే గానీ సక్సెస్ పలకరించలేదు. ఇవాళ ఆ వ్యక్తి మెటా ఆర్టిఫియల్ ఇంటెలిజిన్స్లో కీలక పాత్రపోషించే స్థాయికి చేరుకున్నాడు.అతడే తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన టెకీ సౌమిత్ చింతల. ఐఐటీ లేదా ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక కాలేజ్లో చదవలేదు. కనీసం ఇంట్లో కంప్యూటర్ కూడా లేకుండా పెరిగాడు. ఆయన 2009లో విట్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత యూఎస్ ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే..పదే పదే తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి తిరస్కరణ ఎదుర్కొన్నాడు. చివరికి న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం సంపాదించాడు. అక్కడ లెర్నింగ్ పరిశోధకుడు యాన్ లెకన్ వద్ద పనిచేశాడు. ఈ అనుభవం అతనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడింది. ఆ స్కిల్తో 2014లో, మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన విభాగంలో చేరాడు. ఆ కంపెనీలో ఉన్న సమయంలో, అతను పైటార్చ్ (PyTorch) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. పైటార్చ్ అనేది ఒక ఓపెన్-సోర్స్ మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్, ఇది AI పరిశోధన, అభివృద్ధిలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీలు , అధునాతన కంప్యూటింగ్ సిస్టమ్లపై పనిచేస్తున్న కంపెనీలతో సహా, ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, డెవలపర్లు, సంస్థలు ఇప్పుడు పైటార్చ్ను ఉపయోగిస్తున్నాయి.రాబోయే ఎనిమిది సంవత్సరాలలో, పైటార్చ్ను ఒక అంతర్గత పరిశోధనా ప్రాజెక్ట్ నుంచి అత్యంత విస్తృతంగా ఆమోదించబడిన AI ఫ్రేమ్వర్క్లలో ఒకటిగా ఎదగడంలో చింతల కీలక పాత్ర పోషించారు. ఈ ప్లాట్ఫారమ్ ప్రపంచవ్యాప్తంగా మెషిన్ లెర్నింగ్ పరిశోధకులకు ,డెవలపర్లకు ఒక ప్రధాన సాధనంగా మారింది.మెటాలో సుమారు 11 ఏళ్ల పదవీకాలంలో, సౌమిత్ ఎల్4 సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్థాయి నుంచి కంపెనీలో ఒక సీనియర్ టెక్నికల్ లీడర్షిప్ పదవి అయిన వైస్ ప్రెసిడెంట్ అండ్ మెటా ఫెలోగా ఎదిగారు. ఆ తర్వాత ఆయన మెటాను విడిచిపెట్టి, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన థింకింగ్ మెషీన్స్ ల్యాబ్లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా చేరారు.(చదవండి:
నటి సోనాలీ బింద్రే ఫిట్నెస్ సీక్రెట్..! ఆటోఫాగీ అంటే..
సినీ తారలు ఏం చేసినా ట్రెండే! వారు పాటించే ఆరోగ్య సూత్రాలు, తినడమూ, నిద్రించడమూ, వ్యాయామం ప్రతీదీ ఆసక్తిగొలిపే అంశమే. తాజాగా బాలీవుడ్ నటి సొనాలీ బింద్రే తన ఫిట్నెస్ రహస్యాన్ని బయటపెడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వెల్నెస్ ప్రపంచంలో పెద్ద చర్చను లేవనెత్తాయి. తాను రోజులో ఏకంగా 18 నుంచి 20 గంటల పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తాననీ, శరీరంలో ఆటోఫాగీ అనే కణాల రీసైక్లింగ్ ప్రక్రియను ప్రేరేపించడానికే ఈ కఠిన నియమం అని సోనాలీ చెప్పుకొచ్చారు.సోనాలి బింద్రే చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియా అంతా ఇపుడు ఆటోఫాగీ చర్చ నడుస్తోంది. 20 గంటలపాటు కడుపు మాడ్చుకుంటే కణాలు రీసైకిల్ అయి నిజంగానే యవ్వనంగా మారిపోతారా అనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.ఆటో ఫాగీ( Autophagy) అంటే?మన ఇంట్లో పాత వస్తువులు, చెత్త పేరుకుపోతే ఏం చేస్తాం? బయట పడేస్తాం లేదా రీసైక్లింగ్కు పంపుతాం కదా! సరిగ్గా మన శరీరం కూడా కణాల స్థాయిలో ఇదే పని చేస్తుంది. దాన్నే సైంటిఫిక్ పరిభాషలో ‘ఆటోఫాగీ’ అంటారు. కణాల్లో దెబ్బతిన్న ప్రోటీన్లు, పాతబడిపోయిన భాగాలు, పనికిరాని వ్యర్థాలను గుర్తించి, వాటిని విచ్ఛిన్నం చేసి, మళ్ళీ కొత్త శక్తిగా మార్చుకునే సహజ సిద్ధమైన, అద్భుతమైన ప్రక్రియ ఇది. ఈప్రక్రియ వల్ల వృద్ధాప్య ఛాయలు ఆలస్యమవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుందని, నరాల బలహీనత వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని కొందరు పరిశోధకులు చెబుతున్నారు.ఈ ఫాస్టింగ్ భ్రమేనా!ఖచ్చితంగా కాదు! కాకపోతే దీన్ని అర్థం చేసుకునే విధానంలోనే తేడా ఉంది. అధిక బరువుతో బాధపడేవారు, ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ సమస్యలు, బిపి ఉన్నవారికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కొంతమేరకు పని చేస్తుందని కొన్ని పరిశోధనలలో తేలింది. అయితే, దీనికోసం 20 గంటలపాటు కడుపు మాడ్చుకోకుండారోజులో 8 నుంచి 10 గంటల వ్యవధి సరిపోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆటోఫాగీ అనేది జీవశాస్త్రంలో ఒక అద్భుతమే అయినప్పటికీ.. అది ఆరోగ్యానికి, యవ్వనానికి ఒక్కరోజులో దొరికే షార్ట్కట్ మాత్రం కాదు. ఎక్కువ గంటలు పస్తులుండటం కంటే... క్రమం తప్పని వ్యాయామం, 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర, ఒత్తిడి లేకుండా చూసుకోవడం, సమతుల ఆహారం వంటి రోజువారీ అలవాట్లే మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. సినీ తారలు, సెలబ్రిటీల ట్రెండ్స్ చూడటానికి, వినడానికి బాగానే ఉన్నా శరీరం మనది.. ఆరోగ్యం మనది. అందువల్ల నిపుణుల సలహాలు లేకుండా ఎటువంటి ప్రయోగాలు చేయకపోవడమే ఉత్తమం!ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్.. ట్రెండా.. సైన్సా..ఇరవై గంటల పాటు ఉపవాసం ఉండగానే శరీరంలో ఆటోఫాగీ స్విచ్ ఆన్ అయి΄ోతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, డాక్టర్లు మాత్రం ఇది అందరికీ శ్రేయస్కరం కాదని, తొందరపడవద్దని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వెల్నెస్ ట్రెండ్స్కు, సైంటిఫిక్ నిరూపణలకు మధ్య చాలా వ్యత్యాసాలుంటాయని సూచిస్తున్నారు. సరిగ్గా ఇన్ని గంటలు ఉపవాసం ఉంటేనే ఆటోఫాగీ మొదలవుతుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవని చెబుతున్నారు. ప్రతి ఒక్కరి వయస్సు, జీవక్రియ, జన్యువులు, శారీరక శ్రమ, ఉపవాసానికి ముందు తిన్న ఆహారాన్ని బట్టి ఈ ప్రక్రియ మారుతుందనీ.. అందరికీ ఒకే రకమైన టైమర్ పనిచేయదని అంటున్నారు.
నందన్-రోహిణి నీలేకనిల ప్రేమ కథ: అలా మొదలైంది..!
గత రెండు రోజులుగా నందన్ నీలేకని పేరు వార్తల్లో హాట్టాపిక్గా మారింది. యూఐడీఏఐ (ఆధార్) వ్యవస్థాపక ఛైర్మన్ అయిన నందన్ నీలేకని నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడంతో ఆయన పేరు వార్తలో మారుమ్రోగిపోతోంది. ఈ కమిటీ పోటీ పరీక్షలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు పలు సిఫార్సులు చేయనుంది. ఈ నేపథ్యంలో ఆయనెవరు..ఆయన వ్యక్తిగత జీవితం గురించి సర్వత్ర చర్చలు మొదలయ్యాలయి. ఆయన భార్య సైతం దాతృత్వంలో మేటీ అని, పర్యావరణం, నీరు, విద్య కోసం పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చే గొప్య వ్యక్తి అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంతేగాదు వారిద్దరి క్యూట్ లవ్ స్టోరీ కూడా తెరపైకి వచ్చింది. ఆయనే స్వయంగా ఒక పాడ్కాస్ట్లో వెల్లడించిన స్టోరీ వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా మారింది. మరి ఆ దంపతుల అందమైన ప్రేమ కథేంటో చూసేద్దామా.!.నందన్ నీలేకని నీలేకని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడుచ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కూడా. ఆయన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) - ఆధార్ వ్యవస్థకు మాజీ ఛైర్మన్, రూపకర్తగా ప్రసిద్ధి చెందారు. ఆయన 'పీపుల్ బై WTF' అనే పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తన భార్యను ఎలా కలిశాను, ఎలా తమ మధ్య ప్రేమ మొదలైందో పంచుకున్నారు. తాను 1977లో జరిగిన ఒక క్విజ్ పోటీలో రోహిణిని మొదటిసారి కలిసినట్లు తెలిపారు. ఆ పోటీలో ఆయన తన కళాశాల ఐఐటి బొంబాయికి, రోహిణి ఎల్ఫిన్స్టోన్ కాలేజీకి ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. అయితే ఆ క్విజ్లో తాను గెలిచాను కానే హృదయాన్ని కోల్పోయానని నవ్వుతూ చెప్పారు. ఆ తర్వాత తాము కొంతకాలం ప్రేమించుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నామని అన్నారు. ఇక తన భార్య రచయిత్రి, అత్యంత పరోపకారి అని చెప్పారు. ఆమె 2001లో అర్ఘ్యం ఫౌండేషన్ను స్థాపించిందని, అది నీరు, పారిశుధ్య సమస్యలపై పనిచస్తుందని అన్నారు. అలాగే అన్కామన్ గ్రౌండ్ (2011), ది హంగ్రీ లిటిల్ స్కై మాన్స్టర్ (2020), సమాజ్, సర్కార్, బజార్: ఎ సిటిజన్-ఫస్ట్ అప్రోచ్ (2022) వంటి అనేక పుస్తకాలను రాసినట్లు తెలిపారు. అయితే భావాల పరంగా తామిద్దరం పరస్పరం వ్యతిరేకంగా ఉంటామన్నారు. తనకూ, తన భార్యకూ మధ్య ఉన్న తేడాలు ఎంత భిన్నంగా ఉంటాయో కూడా వివరించారు. తననుతాను బోరింగ్ వ్యక్తిగా అభివర్ణించుకోగా, రోహిణి మ్రాతం ఆవేశపూరితమైన భావోద్వేగభరిత చంచల స్వభావం గల వ్యక్తి అని అన్నారు. అంతేగాదు ఆమె గురించి ఇంకా చెబుతూ..2017లో తనతో పాటు గివింగ్ ప్లెడ్జ్పై సంతకం చేయడం సహా, భారతదేశపు అతిపెద్ద పర్యావరణ దాతలలో ఆమె ఒకరని కూడా పేర్కొన్నారు.కాగా, భారతదేశ పరీక్షా విధానాన్ని సమూలంగా మార్చేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ప్రకటించారు. దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నాయకత్వం వహించనున్నట్లు తెలిపారు మోదీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. (చదవండి: నిశబ్ద నిస్వార్థ వీరుడు..! అతడి సాయానికి సెల్యూట్ చెప్పాల్సిందే..)
అంతర్జాతీయం
థాయిలాండ్ పర్యటన పేరుతో మోసం
బ్యాంకాక్: తక్కువ ఖర్చుతో కూడిన పర్యటన ఆశ చూపి కొన్ని అంతర్జాతీయ ముఠాలు పర్యాటకులను మోసం చేస్తున్నాయి. తాజాగా, చౌకగా థాయిలాండ్ పర్యటించొచ్చనుకున్న ముగ్గురు భారతీయులకు విహారయాత్ర కాస్త పీడకలగా మారింది. కిడ్నాప్కు గురైన ముగ్గురు వారం రోజుల పాటు నరకం చూశారు. భారత్, పాకిస్తానీలతో కూడిన ఒక ముఠా టూర్ ప్యాకేజీతో వారిని థాయిలాండ్కు రప్పించింది. వారిని చిత్రహింసలకు గురి చేసి కుటుంబాల నుంచి డబ్బు డిమాండ్ చేసింది. ఎట్టకేలకు థాయ్ పోలీసులు వారిని దాచిన ప్రదేశాన్ని గుర్తించి, ముగ్గురు భారతీయులను కాపాడారు. ఐదుగురు భారతీయ కిడ్నాపర్లను అరెస్టు చేశారు. ఈ వివరాలను థాయిలాండ్ దినపత్రిక ‘బ్యాంకాక్ పోస్ట్’ ప్రచురించింది. ఈ ముఠా, తక్కువ ఖర్చుతో ఏడు రోజుల టూర్ ప్యాకేజీని ఆశ చూపి ముగ్గురు యువకులను థాయ్లాండ్కు రప్పించింది. టూర్ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు దాదాపు రూ.2లక్షలు చెల్లించారు. జులై 21న బ్యాంకాక్లోని సువర్ణభూమి విమానాశ్రయంలో దిగారు. పట్టాయాకు వెళ్లిన ఒక భారతీయ వ్యక్తి వారిని మోటార్సైకిల్పై ఒక అద్దె ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ నలుగురు పాకిస్తానీలు, మరో భారతీయుడు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల పాటు బందీలుగా ప్రతిరోజూ చిత్రహింసలకు గురిచేశారు. తలకిందులుగా వేలాడదీశారు. చీలమండలపై కొట్టారు. తిండిపెట్టలేదు. కనీస సౌకర్యాలు లేవు. డబ్బుకోసం భారత్లోని వారికి కుటుంబాలకు ఫోన్ చేయాలని బలవంతం చేశారు. ఫోన్ చేయడానికి యూఏఈలో రిజిస్టర్ అయిన నంబర్ను ఉపయోగించారు. తీవ్ర రక్తస్రావం అయినట్లు వీడియో కాల్స్లో కనిపించడానికి ఒకరికి ఎర్ర రంగు పూశారు. భారత్లోని కుటుంబ సభ్యులు సహాయం కోసం థాయ్ పోలీసులను సంప్రదించారు. దీంతో థాయ్లాండ్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులు చేరుకోవడానికి కొద్దిసేపటి ముందే అనుమానిత కిడ్నాపర్లు ఆ ఇంటినుంచి మోటార్సైకిళ్లపై తప్పించుకున్నారు. థాయ్లాండ్ నుంచి పారిపోవడానికి సిద్ధమైన ఐదుగురు కిడ్నాపర్లను పోలీసులు మంగళవారం విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అరెస్టయిన వారందరూ భారతీయులుగా కాగా, ఈ నేరంలో పాల్గొన్న పాకిస్తానీలను ఇంకా పట్టుకోవాల్సి ఉంది.అయితే, నెల రోజుల కిందట ఒక యాప్ ద్వారా దుబాయ్లో నివసిస్తున్న ఓ పాకిస్తానీ ఈ ముగ్గురిని కిడ్నాప్ చేయమని తమకు సూచించినట్లు వారు దర్యాప్తు అధికారులకు తెలిపారు. కిడ్నాప్ తర్వాత, కొంతనగదు, థాయ్లాండ్ నుంచి పారిపోవడానికి విమాన టిక్కెట్లు ఇస్తానని తమకు వాగ్దానం చేశాడని పోలీసులకు నిందితులు వెల్లడించారు. ఇటీవల భారత్ నుంచి పర్యాటకులు తగ్గిన నేపథ్యంలో, దానిని పునరుద్ధరించే లక్ష్యంతో థాయిలాండ్ భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత ప్రవేశాన్ని పునరుద్ధరించింది. ఈ చర్యలు తీసుకున్న కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగింది. కొన్ని అంతర్జాతీయ ముఠాలు తక్కువ ఖర్చుతో కూడిన పర్యటనల ఆశ చూపి పర్యాటకులను బందీలుగా మార్చుకుంటున్నాయని, చౌక ప్యాకేజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇరాన్ మిలిటెంట్లపై అమెరికా–సౌదీ దాడి
కైరో: పశ్చిమాసియాలో దాడుల పరంపర ఆగడం లేదు. ఇరాక్ భూభాగంలో ఇరాన్ మద్దతుగల మిలిటెంట్లపై సౌదీ అరేబియాతో కలిసి మంగళవారం అర్ధరాత్రి తర్వాత అమెరికా దాడి చేయగా.. బుధవారం తెల్లవారుజామున ఇరాన్ సైన్యం గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా బలగాలపై క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా–సౌదీ అరేబియా దాడిలో కనీసం 20 మంది మరణించారు. 32 మంది గాయపడ్డారు. ఈ దాడిలో ఆరుగురు ఇరాన్ సలహాదారులు మరణించారని ఇరాకీ మిలీíÙయా సిబ్బంది తెలిపారు. మరణించిన 20 మందిలో ఈ సలహాదారులు కూడా ఉన్నారా లేదా అనేది తెలియరాలేదు. పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరగడం చూస్తూ మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు అమెరికా వద్ద అత్యాధునిక ఆయుధ నిల్వలు ఇప్పటికే తగ్గిపోయినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా తమ చమురు కేంద్రాలపై ఇరాకీ మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేశాయని సౌదీ అరేబియా ఆరోపించింది. సౌదీ అరేబియాపై జరిగినట్లు చెబుతున్న డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా, తమ యుద్ధ విమానాలు తూర్పు ఇరాక్లోని పలు రవాణా, ఆయుధ స్థావరాలపై దాడి చేశాయని అమెరికా సైన్యం తేల్చిచెప్పింది. జోర్డాన్లోని అమెరికా సైనిక కేంద్రమైన మువఫాక్ సాల్టి వైమానిక స్థావరంపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ ఇస్లామిక్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్ వెల్లడించింది. మరోవైపు ఐదు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు జోర్డాన్ సైన్యం స్పష్టంచేసింది. ఇరాన్కు చావుదెబ్బలు తప్పవు: ట్రంప్ పశ్చిమాసియాలో తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడం, బాలిస్టిక్ క్షిపణులు పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గట్టిగా స్పందిస్తామని, ఇరాన్ను తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇరాన్కు చావుదెబ్బలు తప్పవని బుధవారం ప్రతిజ్ఞ చేశారు. జోర్డాన్లోని అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అనంతరం దీనిపై ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ గట్టిగా విరుచుకుపడతామని, మర్చిపోలేని రీతితో దెబ్బకొడతామని స్పష్టంచేశారు.
రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడులు
కీవ్: రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణుల దాడిని కొనసాగిస్తోంది. అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయిన కొన్నిగంటలకే రష్యాపై ఉక్రెయిన్ దాడులను ఉధృతంచేయడం గమనార్హం. రష్యాలోని పెర్మ్ రీజియన్లోని లూక్ఆయిల్ రిఫైనరీ, రియాజన్లోని మరో చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ దాడులు చేసింది. ఈ రెండు రిఫైనరీల ఉమ్మడి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 3 కోట్ల టన్నులుకావడం గమనార్హం. ఇంతటి భారీ రిఫైనరీలపై దాడి చేసి ఇన్నాళ్లూ యుద్ధంలో రష్యా సాయుధరంగ ఇంధన అవసరాలు, దేశ ఖజానాకు నష్టం చేకూర్చామని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్, జనరల్ స్టాఫ్ విభాగం ప్రకటించింది. అయితే తమ రిఫైనరీలకు ఎలాంటి నష్టం జరగలేదని, పారిశ్రామిక వాడల్లో డ్రోన్ల దాడుల్లో గాయపడిన ఆరుగురికి ఆస్పత్రుల్లో చేరి్పంచామని రష్యాలోని రియాజన్ గవర్నర్ పావెల్ మాల్కోవ్ తెలిపారు.
వాళ్లంతా భారత్లాగే మాకు శత్రువులు
ఇస్లామాబాద్: మెరుగైన జీవనం, పాలన, అవకాశాలు కోరుతూ ఉద్యమిస్తున్న పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉద్యమకారులపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఇస్లామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పాక్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వాళ్లంతా భారత్లాగే మాకు బద్ద శత్రువులు. ఉద్యమకారులతో చర్చలకు కూర్చునే ప్రసక్తే లేదు.వాళ్లంతా పాకిస్తాన్కు విరోధులే’’అని అన్నారు. గత రెండ్రోజుల్లో పాక్ భద్రతా బలగాలు ఏకంగా 37 మంది ఉద్యమకారులను పొట్టనబెట్టుకున్నాయని ఉద్యమసంఘాల కూటమి ‘జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ(జేఏఏసీ)’బుధవారం ప్రకటించిన వేళ ఆసిఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఓవైపు జేఏఏసీ బృందం తమతో చర్చలు జరిపిందని, 38 డిమాండ్లను తమ ఎదుట ఉంచిందని ప్రధానమంత్రి సలహాదారు రాణా సనావుల్లా ప్రకటించగా అందుకు భిన్నంగా రక్షణమంత్రి మాట్లాడటం గమనార్హం. పీఓకే శాసనసభ తొలి దశ ఎన్నికలు జరిగిన సోమవారం రోజు రావలకోట్ నుంచి ముజఫరాబాద్కు శాంతియుత ర్యాలీ చేస్తున్న తమపై పోలీసులు కాల్పులు జరిపి చిన్నారులు, మహిళలు సహా 37 మందిని చంపేశారని జేఏఏసీ తెలిపింది. ‘‘ఉద్రిక్తతకు దారి తీసిన ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు. గతంలో ప్రభుత్వం నుంచి సాయుధ శిక్షణ పొందిన పీఓకే వాసులు ఇప్పుడు ప్రభుత్వం మీదకు తుపాకీ గురిపెట్టారు’’అని ప్రధానమంత్రి సలహాదారు రాణా సనావుల్లా వ్యాఖ్యానించారు.
జాతీయం
బెల్జియంలో గర్బా : పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా స్పందన
ఇటీవలికాలంలో విదేశాల్లో భారతీయులు చేసే కొన్ని నృత్యాల చుట్టూ జరుగుతున్న వివాదాలు రేగుతున్నాయి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో జనాలకు ఇబ్బంది కలిగించే ప్రదేశాలలో ‘గర్బా’ డ్యాన్స్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పౌర స్పృహ (Civic sense) పాటించడం లేదనే దుమారం రేగింది. అయితే 'గెంట్స్ ఫీస్టెన్ 2026' (Gentse Feesten 2026) పండుగ వేడుకలపై పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఎక్స్ వేదికగా ఒక ఇంట్రస్టింగ్ వీడియోను పంచుకున్నారు.జూలై 26న బెల్జియంలో జరిగిన ఈ ఈవెంట్ భిన్నంగా నిలిచింది. ఈ వీడియోలో భారతీయులతో పాటు స్థానిక విదేశీయులు కూడా ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా కలిసి గర్బా అడుగులు వేశారు అంటూ దీనికి సంబంధించిన వీడియోను గోయోంకా షేర్ చేశారు. గర్బా డ్యాన్స్పై నెట్టింట వెల్లువెత్తిన విమర్శల మధ్య ఐక్యత, సంబరం, కమ్యూనిటీ స్పిరిట్కు నిజమైన ప్రతీక గర్బా అని గుర్తుచేసే చక్కటి సంఘటన ఇది అని పేర్కొన్నారు.నెటిజన్ల స్పందనలుఈవీడియోపై కూడా నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. సంగీతంలో దమ్ముంటే విమర్శకులు కూడా సర్కిల్లో వచ్చి డ్యాన్స్ చేయాల్సిందే అని కొందరు వ్యాఖ్యానించారు. సార్వజనిక సాధారణ జీవితానికి ఆటంకం కలిగించనంత వరకు ఇది మంచిదే. ఎయిర్పోర్టులు, హైవేలపై డ్యాన్సులు చేయడం మాత్రం సరికాదు అని కొందరు సూచించారు. ఏ పనికైనా ఒక సమయం, సందర్భం ఉంటాయి అన్నారు మరికొందరు. బెల్జియంలో గర్బా ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాకపోయినా, ఇటీవల భారతీయుల పబ్లిక్ ప్రవర్తనపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ ఘటన భారతీయ సంస్కృతిని విదేశాల్లో ఎంతో అందంగా చాటిచెప్పేలా నిలిచింది.Amid the flood of Garba criticism online, here’s a heartwarming reminder that the true spirit of Garba is inclusion, celebration, and community. pic.twitter.com/CIlDcQrhEP— Harsh Goenka (@hvgoenka) July 29, 2026ఇదీ చదవండి: చెఫ్ అవుదామనుకుని స్టార్ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులుగతంలో విమర్శలకు దారితీసిన ఘటనలునిలిపి ఉంచిన విమానం పక్కన టార్మాక్పై ప్రయాణికులు గర్బా డ్యాన్స్ చేయడం.చైనాలోని చారిత్రాత్మక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వద్ద ప్రదేశంలో నృత్యం చేసిన ఘటనకొండచరియలు విరిగిపడి ఒకవైపు వాహనాలు నిలిచిపోయి ఒక వైపు జనం ఇబ్బందులు పడుతోంటే, మరోవైపు రోడ్డుపై డ్యాన్స్ చేయడం విమర్శలకు తావిచ్చింది. అలాగే కొచ్చి వాటర్లో కదులుతున్న ఫెర్రీ బోటులో గర్బా చేయడంపై కూడా విమర్శలు చెలరేగాయి.ఇదీ చదవండి : భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలు
ఇష్టారీతిగా ఉద్యోగం వదిలేస్తానంటే కుదరదు
న్యూఢిల్లీ: అనుక్షణం సర్వసన్నద్ధంగా ఉండాల్సిన భారత వాయుసేనలో పనిచేసే ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగం మానేసి ఇతర సివిల్ పోస్టుల్లోకి చేరిపోతామంటే కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఏడేళ్లపాటు భారతవాయుసేనలో కార్పోరల్గా ఉద్యోగం చేసిన నఖత్సింగ్ అనే వ్యక్తి ఎయిర్ఫోర్స్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేరతానంటే ఒప్పుకునేది లేదు అని జస్టిస్ ఉజ్జల్భూయాన్, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ల ధర్మాసనం తేల్చిచెప్పింది. దేశభద్రత దృష్ట్యా వాయుసేనలో అన్ని స్థాయిల్లో ఉద్యోగులు అనుక్షణం అందుబాటులో ఉండటం అత్యావశ్యకం. వేరే ఉద్యోగం, వృత్తిలో చేరాలనుకుంటే వాయుసేన నుంచి తొలి దశలోనే ముందస్తు అనుమతిపొందాలి. ఆర్పీఎస్సీకి 2020లో దరఖాస్తు చేసి, పరీక్ష రాసి, ఉద్యోగం పొందాక తీరిగ్గా నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ), డిశ్చార్జ్ ఆర్డర్ కావాలని వస్తే కుదరదు అని కోర్టు తేల్చిచెప్పింది. గతంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యూనల్ తర్వాత ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయ్యాక సుప్రీంకోర్టు తలుపుతట్టినా నఖత్ సింగ్కు నిరాశ ఎదురైంది.
మోదీ మంచి ఇన్ఫ్లుయెన్సర్.. కంగనా లైట్: అభిజిత్ దీప్కే
ప్రధాని నరేంద్ర మోదీపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ మాంచి ఇన్ఫ్లుయెన్సర్ అంటూ ప్రశంసలు గుప్పించారు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై జరిగిన ఆందోళనలు, కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంతో.. దీప్కే సెటైరిక్ వ్యాఖ్యలే చేశారు.రాజకీయ నేతగా కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా బాగా రాణిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ.. ప్రధాని పదవి నుంచి తప్పుకుని ఆ రంగంలో కొనసాగాలంటూ వ్యంగ్యంగా సూచించారు. ఢిల్లీ నిరసనలు, అనారోగ్యం నుంచి కోలుకున్నాక తన స్వస్థలమైన మహారాష్ట్రకు తిరిగి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన దీప్కే.. ప్రధాని మోదీ మంచి ఇన్ఫ్లూయెన్సర్గా పని చేస్తున్నారని, అయితే దేశ పాలన బాధ్యతలను మరొకరికి అప్పగించాలని వ్యాఖ్యానించారు.🚨 BREAKING 🚨Abhijeet Dipke asks PM Modi to resign, & become full-time INFLUENCER 🤯🗣️"He is doing good as an influencer— I think he should STEP DOWN, & someone else should take over governance." pic.twitter.com/o2r8hoG9x0— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) July 29, 2026"మోదీ ఇప్పుడు ఇన్ఫ్లూయెన్సర్గా మారాలి. ఆ పని ఆయన చాలా బాగా చేస్తున్నారు. ప్రధాని పదవి వదిలి ఇంకొక నాయకుడు దేశాన్ని నడిపే అవకాశం ఇవ్వాలి" అని అన్నారు. నీట్ ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించినప్పటికీ.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు గుర్తించి వేధిస్తున్నాయని దీప్కే ఆరోపించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టడం వెంటనే ఆపాలని, లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారని గుర్తుచేసిన దీప్కే.. అయితే మొదటి విచారణకే సీబీఐ న్యాయవాది హాజరు కాకపోవడంతో కేసు వాయిదా పడిందని ఎద్దేవా చేశారు. మాటలకు, చేతలకు పొంతన ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.అదే నిజమైతే హోం మంత్రి ఫెయిల్ అయినట్లే!పెల్లెట్ గన్స్ వాడడం నా కళ్లారా చూశా. చాలా మంది కళ్లు పోయాయి. బిహార్లో ఏకంగా ఏకే47 ఎక్కుపెట్టారు. కసబ్లాంటి ఉగ్రవాదులపై ఎక్కుపెట్టాల్సిన ఏకే-47ను విద్యార్థులపై గురి పెట్టారు. బీజేపీలోకి రమ్మని నన్ను బెదిరిస్తున్నారు. అమిత్ షా చెప్పడం వల్లే పెల్లెట్ గన్స్ వాడి ఉండొచ్చు. ఢిల్లీ పోలీసులు అమిత్షాకే రిపోర్ట్ చేస్తారు. ఇది అమిత్ షాకు తెలియదంటే హోం మంత్రిగా ఆయన ఫెయిల్ అయినట్లే!. 'ఆగ్రహం ఇంకా చల్లారలేదు'కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా.. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉన్న ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదని దీప్కే అన్నారు. ఆగ్రహం వ్యక్తిగతంగా మంత్రి మీద కాదని, ప్రభుత్వ వైఖరిపైనేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం యువత మనోభావాలను అర్థం చేసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. విద్యార్థులపై వేధింపులు కొనసాగితే ఉద్యమం మరింత పెద్ద ఎత్తున తిరిగి ప్రారంభిస్తామని దీప్కే స్పష్టం చేశారు. "ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. దేశ భవిష్యత్తు. భవిష్యత్తును ఇలా ఇబ్బంది పెడితే.. అవసరమైతే ఈ ప్రభుత్వాన్నే మార్చే స్థాయిలో ఉద్యమం చేస్తాం" అని హెచ్చరించారు.పెల్లెట్ గన్స్.. చర్యలు తీసుకోవాలిజంతర్మంతర్ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించిన ఘటనపై కూడా దీప్కే స్పందించారు. ఆదేశాలు ఇచ్చింది ఎవరైనా సరే.. అది కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయినా, మరెవరైనా అయినా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రధాన్కు సన్మానం చేయడంపై.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పార్లమెంట్లో ఆయనకు బీజేపీ సభ్యులు సన్మానం చేయడాన్ని కూడా దీప్కే తప్పుబట్టారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో రాజీనామా చేసిన మంత్రిని సత్కరించడం సరికాదని వ్యాఖ్యానించారు.కంగనా.. లైట్నీట్ ఉద్యమంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన దీప్కే.. ఆమెను "పార్ట్టైమ్ రాజకీయ నాయకురాలు"గా అభివర్ణించారు. తాను సీరియస్ రాజకీయ నాయకుల వ్యాఖ్యలకే స్పందిస్తానని చెప్పి ఆమె విమర్శలను తేలికగా కొట్టిపారేశారు.
భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలు
ఆధునిక జీవితంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే తప్ప ఒక సాధారణ కుటుంబం సౌకర్యవంతంగా జీవించలేని పరిస్థితి. అందులో ఎంతో శ్రమ, ఓర్పు, సహనం దాగి ఉంటుంది. అలాంటిది ఒక స్టార్టప్ను విజయవంతంగా నడపాలంటే ఇద్దరూ వ్యక్తిగత జీవితంలో చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అలా ఇద్దరు భాగస్వాములు ఒక స్టార్టప్ను నిర్మించడంలో పూర్తిగా నిమగ్నమై నప్పుడు జీవితం ఎలా ఉంటుందో వివరిస్తూ ఒక స్టార్టప్ ఫౌండర్ తన భార్యతో గడిపే క్షణాల గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. జస్ట్ కొన్ని సెకన్ల పాటు విమానాశ్రయంలో తన భార్యను కలిసిన చిత్రాన్ని పంచుకుంటూ లింక్డ్ఇన్ (LinkedIn) పోస్ట్ ద్వారా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతపై కొత్త చర్చను రేకెత్తించారు.ఢిల్లీకి చెందిన, అట్-హోమ్బ్యూటీ, వెల్నెస్ ప్లాట్ఫామ్ (YesMadam) సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ ఆదిత్య ఆర్య, (భార్య గరిమా శర్మ) తన పోస్ట్ ద్వారా వ్యక్తిగత జీవిత విశేషాలను షేర్ చేశారు. కలిసి గడపడానికి చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ, ఆ కొన్ని క్షణాలను అర్థవంతంగా మార్చుకోవడానికి ప్రయత్నించామంటూ చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: కంగనా రనౌత్లా మారిన సాయోని ఘోష్ : ఏకిపారేస్తున్న నెటిజన్లుబహుశా ఎవరూ వివాహాన్ని ఇలా ప్లాన్ చేసుకోరు. మాలో ఒకరం ల్యాండ్ అవుతున్నాం మరొకరం బయలు దేరుతున్నాం," అని ఆదిత్య ఆర్య తెలిపారు. అయినా, తామిద్దరం ఒకే గేట్ వద్ద 90 సెకన్ల పాటు చేతులు పట్టుకుని, ప్రపంచంలో ఉన్న సమయమంతా మాకే ఉన్నంత గొప్పగా ఫీలయ్యామని తెలిపారు. కేవలం ఈ ఒకటిన్నర భేటీలో తీసుకున్న ఒక పిక్ను షేర్ చేశారు. అంతేకాదు విమానాశ్రయంలో తన భార్యను ఇలా అనుకోకుండా కలవడం ఇది మొదటిసారి కాదని ఆయన పేర్కొన్నారు. నిజానికి, చాలా జంటలు డేట్లకు వెళ్తుంటే, తాము మాత్రం "లేఓవర్లు" (విమాన ప్రయాణాల్లో మధ్యలో ఆగడం) చేస్తుంటామని చెప్పారు.ఇది సంస్థ నేర్పిన పాఠం నిజానికి ఎవరూ తన దాంప్యత జీవితాన్ని ఇలా ప్లాన్ చేసుకోరు. కానీ కలిసి ఒక వ్యాపారాన్ని లేదా సంస్థను నిర్మిస్తున్నప్పుడు మీ జీవితం ఆటోమేటిక్గా ఈ రూపాన్ని సంతరించుకుంటుంది. తక్కువ సమయాన్ని కూడా గరిష్టంగా ఎలా ఉపయోగించుకోవాలో ‘యస్ మేడమ్’ మాకు నేర్పింది. ఫౌండర్లుగా ఉన్నవారి వివాహ బంధానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని తొమ్మిదేళ్ల వైవాహిక జీవితంపై ఆదిత్య వెల్లడించారు.గరిమా శర్మ స్పందనఆదిత్య ఆర్య భార్య కంపెనీ గరిమా శర్మ డైరెక్టర్గా ఉన్నారు. ఆమె తన భర్త పోస్ట్పై స్పందిస్తూ, ఇతరులకు విచిత్రంగా అనిపించేది తమకు లభించే రొమాన్స్ అని పేర్కొన్నారు. ఒక కంపెనీని నిర్మించడం, ఉపాధిని సృష్టించడం, తామిద్దరం నమ్మే ఆశయం కోసం జీవించడం... మాటలతో మాత్రమే కాకుండా అవకాశాలను సృష్టించడం ద్వారా దేశానికి సేవ చేయవచ్చని తమ పిల్లలకు చూపించడమే తమ లక్ష్యమని ఆమె చెప్పారు. కొందరు ఎయిర్పోర్ట్లో పక్క పక్కనుంచి వెళుతున్న సాధారణ ప్రయాణీకులా తమని చూడొచ్చు. కానీ తాము మాత్రం ఒకేడ్రీమ్ వైపు అడుగులు వేస్తున్న ఇద్దరిని చూశాం అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: చెఫ్ అవుదామనుకుని స్టార్ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులు
ఎన్ఆర్ఐ
రెస్ట్ రూంలో కెమెరా : భారతీయ సంతతి వైద్యుడికి జైలు
అమెరికాలో వైద్య వృత్తిలో ఉంటూ భారతీయ సంతతికి చెందిన వైద్యుడు తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. ఆసుపత్రిలోని విశ్రాంతి గది (Restroom)లో రహస్యంగా కెమెరా అమర్చి, రికార్డ్ చేసి, పైశాచిక ఆనందం పొందేవాడు. చివరికి కటకటాల వెనక్కి వెళ్లాడు. ఈ కేసులో వైద్యుడికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.నేరస్తుడు అద్వైత్ దేశ్ముఖ్ (Advait Deshmukh) టోలెడో యూనివర్విటీలో ఎండోయూరాలజీ, యూరోలాజిక్ ఆంకాలజీ విభాగంలో మూడో సంవత్సరం మెడికల్ రెసిడెంట్గా పనిచేసేవారు. జూన్ 2025లో ఓహియోలోని ప్రోమెడికా టోలెడో ఆసుపత్రిలోని ఒక యూనిసెక్స్ విశ్రాంతి గదిలో దాచి ఉంచిన ఒక సెల్ఫోన్ను ఒక ఉద్యోగి గుర్తించారు. ఆమె దాన్ని తీయడానికి ప్రయత్నించినప్పుడు, దేశ్ముఖ్ దానిని లాక్కొని అది తనదేనని చెప్పాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ప్రోమెడికా, టోలెడో పోలీసు బృందం సంయుక్తంగా దర్యాప్తు చేపట్టింది.ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్వీరి విచారణలో ఆ ఫోన్లో 2025 ఫిబ్రవరి - మే మధ్య తీసిన 80కి పైగా ఫోటోలు, వీడియోలు లభించాయి. కనీసం ఆరుగురు బాధితులను పోలీసులు గుర్తించారు. ఇతగాడి పైశాచికం 2018 నుంచే జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ఇంకా ఎక్కువ మందే ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే విశ్వవిద్యాలయం దేశ్ముఖ్ను సస్పెండ్ చేసింది. అనంతరం ఆయన మెడికల్ రెసిడెన్సీని రద్దు చేసింది. అయితే అంతర్గత విచారణ అనంతరం రెసిడెన్సీ నియామకాన్ని పునరుద్ధరించ లేదని వెల్లడించింది. కోర్టులో శిక్ష ఖరారయ్యే ముందు దేశ్ముఖ్ బాధితులకు క్షమాపణలు చెప్పాడు.టోలెడో ఆసుపత్రి ఉద్యోగి బాధితుల్లో ఒకరైన లిండ్సే ఈ సంఘటన తనను ఎంత కుంగదీసిందో వివరించారు. తాను ఇప్పటికీ బాత్రూమ్లలో రహస్య కెమెరాల కోసం తనిఖీ చేస్తానని, ఆ చిత్రాలు ఎక్కడికి చేరాయోనన్న ఆందోళనన తనను వెంటాడుతూనే ఉందంటూకోర్టు ముందు ఆవేదన వ్యక్తంచేశారు. సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిన ఒక అభియోగం, రహస్యంగా వీడియో తీసిన ఏడు అభియోగాలను అంగీకరించిన తర్వాత, దేశ్ముఖ్కు జూన్లో కోర్టు ఈయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు మూడేళ్ల ప్రొబేషన్ విధించింది. అంతేకాకుండా 15 ఏళ్ల పాటు 'సెక్స్ అఫెండర్' (లైంగిక నేరస్థుడిగా) నమోదు చేసుకోవాలని, మానసిక ఆరోగ్య చికిత్స పొందాలని ఆదేశించింది.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి
సాక్షి,హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిన ఈ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం.కాలిఫోర్నియాలోని ఓ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు హైదరాబాద్ వాసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని స్థానిక అత్యవసర సేవల సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగం కారణమా? లేక మరో వాహనం ఢీకొట్టిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న కాలిఫోర్నియా పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై హైదరాబాద్లోని బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారి ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది.
జర్మనీలో ఘనంగా బోనాల సంబురాలు
తెలంగాణ అసోసియేషన్ ఎన్ఆర్ఐ హ్యాంబర్గ్ (TANH) ఆధ్వర్యంలో జర్మనీలోని హ్యాంబర్గ్ నగరంలో తొలిసారిగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనం సమర్పణ, డప్పు వాయిద్యాలు, లాస్య నృత్యాలు తదితర సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించగా, తెలంగాణ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ అధ్యక్షులు డాక్టర్ రఘు చాలిగంటి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లోని తెలంగాణ సంఘాలు కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అందించడంతో పాటు, జర్మనీకి వచ్చే తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగార్థులకు మార్గదర్శకత్వం, వృత్తిపరమైన సహకారం అందించాలని సూచించారు.హ్యాంబర్గ్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు అందించిన ఆత్మీయ ఆతిథ్యాన్ని ఆయన అభినందిస్తూ, జర్మనీలోని అన్ని నగరాల్లో ఇలాంటి బోనాల వేడుకలు నిర్వహించాలని, అలాగే ప్రతి ఏడాది ఒక నగరంలో తెలంగాణ కుటుంబాల కోసం “Meet & Greet” కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీనివాస్ బసవరాజు నాయకత్వాన్ని అభినందించిన ఆయన, హ్యాంబర్గ్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటుకు కృషి చేసిన అంపన్న రెడ్డి వుటుకూరి, రాహుల్ తుల, ఉదయ్ రెడ్డి కుడుముల, వినీత్ రెడ్డి, సత్యనారాయణ, రామ్ తదితర నిర్వాహకులు, వాలంటీర్ల సేవలను ప్రశంసించారు.(చదవండి: సాధారణ బైక్ నుంచి బీఎండబ్ల్యూ రేంజ్కి..! వైరల్గా ఎన్నారై పోస్ట్)
వీడియో కాల్స్లో కాదు : ఆరేళ్ల కెనడా జీవితాన్ని వీడి ఇండియాకు
ఉన్నత చదువులకోసం విదేశాలకు ఎగిరిపోవడం, వేల డాలర్లు సంపాదిస్తూ అక్కడే సెటిల్ అయిపోవడం సర్వసాధారణం. అలాగే వృద్ధులైన తల్లి దండ్రులను సైతం పట్టించుకోకుండా, వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించడం లాంటి హృదయవిదారకమైన కథనాలను చాలా చదివాం. కానీ విదేశాల్లోని సౌకర్యవంతమైన జీవితం కంటే, తల్లిదండ్రులకు భౌతికంగా దగ్గరగా ఉండటమే ముఖ్యం అని భావించి, కెనడా నుంచి బెంగళూరుకు తిరిగి వచ్చిన కొడుకు గురించి విన్నారా?పదండి వివరాలు తెలుసుకుందాం ఈ కథనంలో. కెనడాలో ఉన్నత ఉద్యోగాన్ని వీడి, వయోవృద్ధులైన తన తల్లిదండ్రులను చూసుకునేందుకు భారత్కు తిరిగి వచ్చేశారు టెకీ రమేష్ ఎన్.ఎన్. ఈయన ప్రస్తుతం బెంగళూరులోని 'కోర్సెంట్రిక్' (Corcentric) ఐటీ సంస్థలో ఇంజనీరింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వేల కిలోమీటర్లు దూరంలో ఉంటూ వీడియో కాల్స్ ద్వారా చూస్తూ కాలం గడపడం కంటే, కుటుంబంతో రోజూ గడిపే క్షణాలు ఎంతో విలువైనవని, కుటుంబంతో గడిపే సమయాన్ని ఎప్పటికీ వాయిదా వేయలేమని ఆయన తన లింక్డ్ఇన్ (LinkedIn) పోస్ట్లో పంచుకున్నారు. దీంతో ఇది సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. విదేశాలలోని సౌకర్యాలు, ఊహించదగిన జీవితం వదులుకోవడం, ఇక్కడి మౌలిక వసతులకు మళ్లీ అలవాటు పడటం కొంత కష్టంగా అనిపించినా, కుటుంబం ఇచ్చే తృప్తి ముందు అవేవీ పెద్ద కష్టంగా అనిపించలేదని రమేష్ చెప్పుకొచ్చారు. అలాగే భారత్కు రావడం కెరీర్కు ఎటువంటి ఆటంకం కలిగించలేదని, పైగా బెంగళూరులోని టెక్నాలజీ, స్టార్టప్ వాతావరణం, ప్రతిభా వంతులైన నెట్వర్క్ తనకు మరింత ఉత్తేజాన్నిచ్చాయని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలిఈ పోస్ట్పై సోషల్ మీడియాలో నెటిజన్లు విశేషంగా స్పందించారు. విదేశాల్లో జీవితం, సంపాదన కాదు, మనం కుటుంబంతో పెంచుకునే అనుబంధాలే నిజమైన విజయానికి నిర్వచనమని నెటిజన్లు వ్యాఖ్యానించారు. మొదటి ఏడాది సర్దుబాటు కావడం కష్టంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఇక్కడి జీవితంతో చాలా ప్రశాంతత లభించిందని 2015లో అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన మరొక టెకీ స్పందించడం విశేషం.ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్10 వేల మెట్లు, నలుగురు మనుషులు : భారీ కాయుడి డోలీ వీడియో వైరల్
క్రైమ్
వయసులో చిన్నోడని నమ్మితే.. రెండుసార్లు గర్భవతిని చేసి..!
మేడ్చల్ జిల్లా: పెళ్లి పేరిట ఓ యువతిని నమ్మించి మోసగించి, మరొకరితో నిశ్చితార్థం చేసుకున్న యువకుడిపై కేసు నమోదైంది. మేడిపల్లి పోలీసుల వివరాలు... సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాధితురాలు(34) బోడుప్పల్ మల్లికార్జున నగర్లో నివాసముంటూ ప్రైవేట్ జాబ్ చేస్తోంది. 8 నెలల క్రితం మ్యాట్రిమొనీ వెబ్సైట్లో ప్రొఫైల్ నమోదు చేసుకోగా, ప్రవీణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తనకంటే వయసులో చిన్నవాడైనా పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో ఆమె రెండుసార్లు గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. ఇటీవల బాధితురాలు పెళ్లి గురించి నిలదీయగా ప్రవీణ్ స్పందించడం మానేశాడు. అతడికి మరో యువతితో నిశ్చితార్థం జరిగిన విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. కేసు దర్యాప్తులో ఉంది.
ఐపీఎస్ లేఔట్లో రేవ్ పార్టీ.. 12 మంది అమ్మాయిలు..!
బనశంకరి: బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్ 6 వ సెక్టార్లోని ఐపీఎస్ లేఔట్ సర్వీస్ విల్లాలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు అడ్డుకుని నలుగురిని అరెస్ట్చేశారు. ఆ విల్లాను రోజుకు రూ.20 వేలకు అద్దెకు తీసుకున్న నిర్వాహకులు అమిగోస్ అనే యాప్ ద్వారా రేవ్ పార్టీకి యువతీ యువకులను ఆహ్వానించువారు. యువకుల నుంచి రూ.1,099, అమ్మాయిల నుంచి రూ.499 ఫీజు వసూలు చేసేవారు. రాత్రంతా మద్యం, మ్యూజిక్తో మజా చేసేవారు. హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఎక్కువమంది ఐపీఎస్ల నివాసాలు ఉన్నాయి. ఇక్కడైతే పోలీసులు రైడ్ చేయరని నిర్వాహకులు భావించారు. మంగళవారం అర్ధరాత్రి పోలీసులు దాడులు చేసి హుక్కాలు, ఈ–సిగరెట్లు, భారీగా మద్యం సీజ్ చేశారు. పార్టీలో 12 మంది యువతులు, 17 మంది యువకులు ఉన్నారు. నిర్వాహకులు దీక్షత్, వేదాంత్ పండిత్, వరుణ్, శంకర్ను అరెస్ట్ చేశారు. విల్లా యజమానిపై కేసు నమోదైంది. వయసులో చిన్నోడని నమ్మింతే.. రెండుసార్లు గర్భవతిని చేసి..!
ఓడలో బంగారం వస్తుందన్నాడు.. చివరికి
సాక్షి, హైదరాబాద్: విదేశీ బంగారం వ్యాపారాలతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించుకుని, తక్కువ ధరకు బంగారాన్ని ఓడల్లో తెప్పిస్తానంటూ చెప్పి నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.2 కోట్లు కాజేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే పంథాలో మరికొందరిని మోసం చేసినట్లు, గతంలో ఆరు కేసులు ఉన్నట్లు తేలడంతో వ్యవస్థీకృత నేరగాడిగా పరిగణిస్తున్నట్లు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ బు«ధవారం ప్రకటించారు.సనత్నగర్కు చెందిన రాకేష్ బలరాం గౌడ్కు లక్ష్మీకాంత్ రెడ్డితో పరిచయం ఉంది. తనకు విదేశీ బంగారం వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని, వారి నుంచి తక్కువ ధరకు పసిడి ఖరీదు చేస్తుంటానని చెప్పాడు. 2024 జూన్ 14న రాకేష్ ఇంటికి వెళ్లిన లక్ష్మీకాంత్ దుబాయ్ నుంచి శ్రీలంక మీదుగా ముంబైకి ఓడలో బంగారం దిగుమతి చేస్తున్నానని చెప్పాడు. మొబైల్లో బంగారు బిస్కెట్ల వీడియోలు చూపించి, అతి తక్కువ ధరకు 24 క్యారెట్ల బంగారం మూడు కిలోలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. 20 రోజుల్లో బంగారం అందజేస్తానని నమ్మించి మొత్తం రూ.2 కోట్లను తీసుకున్నాడు. ఇందులో రూ.1.86 కోట్లు అప్పుగా తెచ్చిన రాకేష్ ఇతడికి చెల్లించాడు. నెల రోజుల తర్వాత సంప్రదించిన లక్ష్మీకాంత్ శ్రీలంకలో 10 కిలోల బంగారంతో పోలీసులకు చిక్కానని చెప్పి పసిడి ఇవ్వలేనన్నాడు. అనంతరం మరో 500 గ్రాముల బంగారం రూ.25 లక్షలకు ఇప్పిస్తానని చెప్పి, 2024 డిసెంబర్ 15న రూ.5 లక్షలు, డిసెంబర్ 17న రూ.16 లక్షలు తీసుకున్నాడు. అనుమానం రావడంతో నగదు ఇస్తున్న సమయంలో బాధితుడు వీడియో రికార్డింగ్ చేశాడు.ఆ తర్వాత లక్ష్మీకాంత్ రెడ్డి తన ఫోన్ కాల్స్, సందేశాలకు స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ మల్లికార్జున చౌదరి ఎస్సై గోపికిరణ్ రెడ్డి దర్యాప్తు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీని అతడి స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లా అయ్యవారిపల్లిలో గుర్తించారు. అక్కడే అతడిని పట్టుకున్న సీసీఎస్ పోలీసులు రిమాండ్కు తరలించారు. నిందితుడిపై గతంలో మహంకాళి, రాయదుర్గం, కేపీహెచ్బీ, మాదాపూర్లతో పాటు కోయిల్కొండ, ఏపీలోని పెందుర్తి ఠాణాల్లో కేసులు ఉన్నట్లు గుర్తించారు.
6 రోజులు అలరించాడు.. ఏడో రోజు సమాధి అయ్యాడు!
ప్రేక్షకుల నుంచి చప్పట్లు అందుకోవాలని చేసిన ఓ సాహస విన్యాసం.. ఓ యువ కళాకారుడి జీవితాన్నే ముగించింది. ఆరు రోజుల పాటు తన సైకిల్ స్టంట్లతో జనాలను అలరించిన 27 ఏళ్ల దీపక్.. ఏడో రోజు చేసిన ‘లైవ్ బరియల్’ (సజీవ సమాధి) స్టంట్లో మృతి చెందాడు. అయితే కేవలం ఏడు వేల రూపాయల కోసం నిర్వాహకులే అతని ప్రాణాలను బలిగొన్నారనే ఆరోపణలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి.హరియాణాలోని నూహ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. తావుడు ప్రాంతంలోని ఖోరీ కలాన్ గ్రామంలో ఓ ట్రావెలింగ్ సైకిల్ సర్కస్ నిర్వహిస్తున్నారు. దాదాపు వారం రోజులుగా సాగుతున్న ఈ ప్రదర్శనలో ఫరీదాబాద్ జిల్లా గౌంచి గ్రామానికి చెందిన దీపక్ కీలక పాత్ర పోషించాడు. సైకిల్పై ప్రమాదకర విన్యాసాలు చేయడంలో అతడికి మంచి పేరు ఉంది. కళ్లకు గంతలు కట్టుకుని నడపడం, హ్యాండిల్పై నిలబడి బ్యాలెన్స్ చేయడం, కదులుతున్న సైకిల్పై నిలుచుని ప్రదర్శనలు ఇవ్వడం వంటి స్టంట్లతో ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు.అయితే సర్కస్ చివరి రోజు దీపక్ ఓ ప్రత్యేక విన్యాసం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా అతడిని ఓ సంచిలో ఉంచి, ప్రత్యేకంగా తవ్విన ఓ గోతిలోకి దించారు. 24 గంటల తర్వాత అతడిని సజీవంగా బయటకు తీస్తామని నిర్వాహకులు ప్రేక్షకులకు ప్రకటించారు. అయితే చెప్పిన సమయానికి దీపక్ను బయటకు తీయలేదు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. అతడు దాదాపు 36 గంటల పాటు భూమిలోనే ఉన్నాడు. ఫలితంగా అతని ప్రాణం పోయింది. రూ.7,100 కోసం ఆలస్యమైందా?ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి సంచిత్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. దీపక్ను బయటకు తీయాలంటే రూ.7,100 సేకరించాల్సి ఉందని నిర్వాహకులు ప్రేక్షకులకు చెప్పినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని సేకరించే ప్రక్రియలోనే ఆలస్యం జరిగిందని భావిస్తున్నారు. చివరకు గోతిని తెరిచి దీపక్ను బయటకు తీసిన సమయంలో అతడు మృతిచెంది ఉన్నాడు. ఎక్కువ సమయం భూగర్భంలో ఉండటం వల్ల ఊపిరాడక మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.ఘటనపై ఆగ్రహం.. భద్రతపై అనుమానాలుదీపక్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా ఇలాంటి ప్రమాదకర స్టంట్లను నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చేసే ఇలాంటి విన్యాసాల్లో కళాకారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దీపక్ కుటుంబం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది.పోలీసుల దర్యాప్తుదీపక్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతడిని ఎందుకు సకాలంలో బయటకు తీయలేదు? నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందా? స్టంట్ నిర్వహణలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారనే అంశాలపై విచారణ జరుపుతున్నారు. నూహ్ జిల్లా పోలీసు ప్రతినిధి కృష్ణ కుమార్ ఘటనను ధ్రువీకరించారు. అసహజ మరణం కింద సెక్షన్ 174 ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఆరు రోజుల పాటు తన సాహసాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దీపక్.. ఏడో రోజు అదే సాహసం కారణంగా ప్రాణాలు కోల్పోవడం విషాదకరంగా మారింది. చప్పట్ల కోసం చేసిన విన్యాసం.. చివరకు అతడి జీవితానికి ముగింపు పలికింది.
వీడియోలు
BIG Question: ఉప్పొంగిన ఉత్తరాంధ్ర.. జనసంద్రం పోటెత్తితే ఎలా ఉంటుందో తెలుసా?
పాతపట్నం MLA కారు యాక్సిడెంట్ కేసులో మీరు ఏం చేశారు..
BCCI నుంచి వైభవ్కు బిగ్ గిఫ్ట్.. వైస్ కెప్టెన్గా ప్రమోషన్!
YS జగన్ శ్రీకాకుళం టూర్ పై పబ్లిక్ రియాక్షన్
బుర్ర పనిచేస్తుందా బాబు? CPR ఎందుకు చేస్తాడు.. బాబుకు జగన్ కౌంటర్
వెళ్తూ.. వెళ్తూ.. చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్
సీదిరి అప్పలరాజుని నాశనం చేయడం కోసం... జగన్ సంచలన కామెంట్స్
సీదిరి అక్రమ అరెస్ట్ పై YS జగన్ రియాక్షన్
జగన్ కీలక ప్రెస్ మీట్ @శ్రీకాకుళం
అంపోలు జైలు వద్ద YS జగన్ ప్రెస్ మీట్


