వరసిద్ధి వినాయక పూజ.. విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు
(శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవి)ప్రతి ఏడాది వచ్చే వినాయకచవితి పర్వదిన శుభసందర్భంగా ప్రతి గృహంలోను, సంస్థల్లోనూ ప్రత్యేకంగా పూజాదికార్యక్రమాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పూజలో ఉపయోగించే పూజాద్రవ్యాలతో పాటుగా, స్వామివారిని పూజించే పత్రిది కూడా ప్రథమస్థానం. అందువల్ల ఈ పూజకు సమకూర్చుకోవలసిన అన్ని రకాల పూజాద్రవ్యాలు, పత్రి తదితరాలన్నీ మీకోసారి జ్ఞప్తికి తీసుకురావాలని ఈ క్రింద ఇస్తున్నాం. ఇవి నూతన గృహస్థులకు మరింత ఉపయోగపడగలవని ఆశిస్తున్నాం.పూజా ద్రవ్యములు: వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు.పూజా వస్తువులు: దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశంమీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం/తువ్వాలు, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడాకుల తోరణాలు, దేవునికి తగిన పీఠము.నైవేద్యం: ఉండ్రాళ్లు, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి రకానికి 21 చొప్పున.పూజాపత్రి: గరిక, మాచి, బలురక్కసి లేక ములకీ, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగు పత్రిని సంపాదించి ఆయా మంత్రాలతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపం కలిగినా భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.పాలవెల్లి పూజ: శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో తోచినవిధంగా శోభాయమానంగా అలంకరించుకోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.పూజా మందిరంలో: విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు, ఇతర వృత్తులలో వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడంæ శుభఫలదాయకం.గణేశుని పూజ (పూజకు ఏర్పాట్లు)ముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపుకుంకుమతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి.ఓం శ్రీ మహాగణాధిపతయే నమఃదీపారాధన: (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.)శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‘యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ‘‘దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘పరిశుద్ధి: (పంచపాత్రలోని నీటిని చెంచాతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి)అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా!యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిఃపుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమఃశ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తువిఘ్నేశ్వరుని వ్రతకల్పముశ్రీ గణేశాయ నమః శ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘø్నపశాన్తయే ‘‘అగజానన పద్మార్కం గజానన మహర్నిశంఅనేక దన్తం భక్తానాం ఏకదన్త ముపాస్మహే ‘‘శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాఃశ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకఃలంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననఃవక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజఃషోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపిఃవిద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా,సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘ఆచమనంఓం కేశవాయ స్వాహానారాయణాయ స్వాహామాధవాయ స్వాహా (అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి.గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమఃత్రివిక్రమాయ నమః వామనాయ నమఃశ్రీధరాయ నమః హృషీకేశాయ నమఃపద్మనాభాయ నమః దామోదరాయ నమఃసంకర్షణాయ నమః వాసుదేవాయ నమఃప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమఃపురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమఃనారసింహాయ నమః అచ్యుతాయ నమఃజనార్దనాయ నమః ఉపేంద్రాయ నమఃహరయే నమః శ్రీ కృష్ణాయ నమః(రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను)శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాఃయేతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే!(ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.)ప్రాణాయామంఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జపఃఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్యధీమహి ధియోయోనః ప్రచోదయాత్‘‘ ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‘‘సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య .............. ప్రదేశే .............. – ............. నదీ మధ్యప్రదేశే (మీ ప్రస్తుత నివాస ప్రాంతం ఏ జీవనదుల మధ్య వున్నదో ఆ నదుల పేర్లు చెప్పుకోండి) స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమ వసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతాబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, ఇందువాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ............................... (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధన కనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్థ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే‘‘(కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)తదంగ కలశపూజాం కరిష్యేః(మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)కలశపూజ: (కలశాన్ని గంధం, పుష్పములు, అక్షతలతో పూజించి కలశముపై కుడిచేతిని ఉంచి, క్రింది శ్లోకము చెప్పుకొనవలెను)శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితఃమూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాఃకుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా!ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణఃఅంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాఃగంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ!నర్మదే సింధు కావేరీ జలేస్మిం సన్నిధింకురు ‘‘అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానంచ సంప్రోక్ష్యః(పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని క్రింది విధంగా పూజించాలి)శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను)గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాంఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పతఆనఃశృణ్వన్నూతిభిస్సీదసాదనంఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను)పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ముఖే ఆచమనీయం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను)స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి)గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)కుంకుమం సమర్పయామిగంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను)స్వామికి పుష్పాలతో పూజ (ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను)ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి (పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను)ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను)దీపం దర్శయామి (దీపమును చూపవలెను)నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి)ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‘‘ సత్యం త్వరేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని త్రిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడి చేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్పుకోవలెను).ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహాశ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి)మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)హస్తప్రోక్షయామి, పాదౌ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి)తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి)శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి(గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.)శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి)వరసిద్ధి వినాయక పూజా ప్రారంభంస్వామిన్, సర్వజగన్నాథ యావత్పూజావసానగా ఃతావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురుధ్యానం: స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) ఓం భవసంచిత పాపౌçఘ విధ్వంసన విచక్షణం‘‘విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‘‘ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘ భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్ ‘‘ ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి. (వినాయకుని ధ్యానించండి...) ప్రాణ ప్రతిష్ఠ: (స్వామి వారికి ప్రాణం పోయుట)ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః‘ పునః ప్రాణ మిహనో దేహి భోగమ్‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత‘ మనుమతే మృడయాన స్వస్తి అమృతం నై ప్రాణాః అమృత మాపః‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వయతే ‘‘ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీద‘‘ఆవాహనమ్: స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి‘‘ఆసనమ్: స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి).మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి‘‘పాద్యమ్: స్వామి వారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి)శ్లో‘‘ సర్వతీర్థ సముద్భూతం ‘‘ పాద్యం గంగాది సంయుతం‘‘ విఘ్నరాజ! గృహాణేదం‘‘ భగవన్భక్త వత్సల‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి‘‘అర్ఘ్యమ్: స్వామి వారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర! నమస్తేస్తు శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘ఆచమనీయమ్: స్వామివారి నోటికి నీళ్ళు అందించడం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘మధుపర్కం: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామి వారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం ‘‘ మధుపర్కం గృహాణేదం గణనా«థం నమోస్తుతే‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానమ్ : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ క్రింది చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి)పాలు: ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమ వృష్ణి యం‘ భవా వాజన్య సంగథే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘పెరుగు: ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‘ ప్రణ ఆయూగ్ంషి తారిషత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘నేయి: ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘తేనె: ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్ం రజః‘ మధుద్యైరస్తునః పితా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘పంచదార: ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్ం ఆదాభ్యః‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘ (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదకమ్ : (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి) యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘‘ శుద్ధోదకమ్ : మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ క్రింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకం చేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సరస్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.) వస్త్రమ్ : (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ క్రింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘యజ్ఞోపవీతమ్ : (పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్నిగాని, పుష్పాక్షతలనుగాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘గంధం: (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః గంధాన్ ధారయామి.అక్షతలు: (అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం తండులాన్ శుభాన్‘ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి‘‘సిందూరం: శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సింధూరం సమర్పయామి‘‘మాల్యం: శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘ పుష్పమ్ : (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అ«థాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు).సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘అధాంగ పూజ: (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట)గణేశాయ నమః పాదౌ పూజయామి‘ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘కామారిసూనవే నమః జంఘే పూజయామి‘అఖువాహనాయ నమః ఊరూ పూజయామి‘హేరంబాయ నమః కటిం పూజయామి‘లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘గణనాథాయ నమః హృదయం పూజయామి‘స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి‘విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘ఏకవింశతి పత్ర పూజఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి. దూర్వాయుగ్మ పూజా సందర్భంలో గరికతో పూజించాలి. లేని పక్షంలో అక్షతలతో పూజించాలి)⇒ ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు)⇒ ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక)⇒ ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు)⇒ ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు)⇒ ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు)⇒ ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు)⇒ ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి)⇒ ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి)⇒ ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు)⇒ ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు)⇒ ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణు క్రాంతం)⇒ ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ)⇒ ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు)⇒ ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘ (మరువం)⇒ ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు)⇒ ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు)⇒ ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం)⇒ ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు)⇒ ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు)⇒ ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్ది)ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు)ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి‘‘ (21 రకముల ఆకులను కలిపి వేసి నమస్కారము చేయవలెను)ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ(రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి)గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి!అఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి!బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి!మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురశ్రేష్ఠాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిత్థఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి!స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామిశ్రీ గణపతి అష్టోత్తర శతనామావళిఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నరాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్వైమాతురాయ నమఃఓం ద్విముఖాయ నమఃఓం ప్రముఖాయ నమఃఓం సుముఖాయ నమఃఓం కృతినే నమఃఓం సుప్రదీపాయ నమఃఓం సుఖనిధయే నమఃఓం సురాధ్యక్షాయ నమఃఓం సురారిఘ్నాయ నమఃఓం మహాగణపతయే నమఃఓం మాన్యాయ నమఃఓం మహాకాలాయ నమఃఓం మహాబలాయ నమఃఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమఃఓం హ్రస్వగ్రీవాయ నమఃఓం మహోదరాయ నమఃఓం మహోత్కటాయ నమఃఓం మహావీరాయ నమఃఓం మంత్రిణే నమఃఓం మంగళస్వరూపాయ నమఃఓం ప్రమధాయ నమఃఓం ప్రథమాయ నమఃఓం ప్రాజ్ఞాయ నమఃఓం విఘ్నకర్త్రే నమఃఓం విఘ్నహంత్రే నమఃఓం విశ్వనేత్రే నమఃఓం విరాటత్పయే నమఃఓం శ్రీపతయే నమఃఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమఃఓం శివప్రియాయ నమఃఓం శీఘ్రకారిణే నమఃఓం శాశ్వతాయ నమఃఓం బలాయ నమఃఓం బలోత్థితాయ నమఃఓం భవాత్మజాయ నమఃఓం పురాణ పురుషాయ నమఃఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమఃఓం అగ్రగణ్యాయ నమఃఓం అగ్రపూజ్యాయ నమఃఓం అగ్రగామినే నమఃఓం మంత్రకృతే నమఃఓం చామీకరప్రభాయ నమఃఓం సర్వాయ నమఃఓం సర్వోపన్యాసాయ నమఃఓం సర్వకర్త్రే నమఃఓం సర్వనేత్రే నమఃఓం సర్వసిద్ధిప్రదాయ నమఃఓం సర్వసిద్ధయే నమఃఓం పంచహస్తాయ నమఃఓం పార్వతీనందనాయ నమఃఓం ప్రభవే నమఃఓం కుమార గురవే నమఃఓం అక్షోభ్యాయ నమఃఓం కుంజరాసుర భంజనాయ నమఃఓం ప్రమోదాయ నమఃఓం మోదకప్రియాయ నమఃఓం కాంతిమతే నమఃఓం ధృతిమతే నమఃఓం కామినే నమఃఓం కపిత్థ పనసప్రియాయ నమఃఓం బ్రహ్మచారిణే నమఃఓం బ్రహ్మరూపిణే నమఃఓం బ్రహ్మవిద్యాధిపాయ నమఃఓం విష్ణవే నమఃఓం విష్ణుప్రియాయ నమఃఓం భక్తజీవితాయ నమఃఓం జితమన్మథాయ నమఃఓం ఐశ్వర్యకారణాయ నమఃఓం జ్యాయనే నమఃఓం యక్షకిన్నరసేవితాయ నమఃఓం గంగాసుతాయ నమఃఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమఃఓం వటవే నమఃఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమఃఓం భక్తనిధయే నమఃఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమఃఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమఃఓం సత్యధర్మిణే నమఃఓం సఖ్యే నమఃఓం సరసాంబునిధయే నమఃఓం మహేశాయ నమఃఓం దివ్యాంగాయ నమఃఓం మణికింకిణీ మేఖలాయ నమఃఓం సమస్తదేవతామూర్తయే నమఃఓం సహిష్ణవే నమఃఓం సతతోత్థితాయ నమఃఓం విఘాతకారిణే నమఃఓం విశ్వక్దృశే నమఃఓం విశ్వరక్షాకృతే నమఃఓం కళ్యాణ గురవే నమఃఓం ఉన్మత్తవేషాయ నమఃఓం అపరాజితే నమఃఓం సమస్త జగదాధారాయ నమఃఓం సర్వైశ్వర్యప్రదాయ నమఃఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమఃఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమఃశ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.బిల్వం : శ్లో‘‘ త్రిదళం త్రిగుణాకరం‘‘ త్రినేత్రంచ త్రియాయుధం‘‘ త్రిజన్మ పాప సంహారం‘‘ఏకబిల్వం శివార్పణం ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః బిల్వపత్రం సమర్పయామి.ధూపమ్ : (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు)దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం‘‘ ఉమా సుత నమస్తుభ్యం గృçహాణవరదో భవ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి.దీపమ్ : (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా‘ గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి‘‘నైవేద్యమ్ : (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్లెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ క్రింది మంత్రంతో నీళ్ళు చల్లాలి)ఓమ్ భూర్భువస్సువః ‘ ఓం తత్సవితుర్వరేణ్యంభర్గోదేవస్య ధీమహి ‘ ధియోయనః ప్రచోదయాత్ ‘‘(పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి)ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి‘‘ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి‘‘ సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవగణముదై్గః ప్రకల్పితాన్‘ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ‘ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్లెంలో విడిచిపెట్టాలి)ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి‘‘(అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడి చేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా‘ ఓమ్ అపానాయ స్వాహా‘ ఓమ్ వ్యానాయ స్వాహా‘ ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా‘‘ (తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి‘ అమృతాపి« దానమసి ఉత్తరాపోశనం సమర్పయామి‘హస్తౌ ప్రక్షాళయామి‘ పాదౌప్రక్షాళయామి‘ శుద్ధాచమనీయం సమర్పయామి‘‘తాంబూలమ్ : (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం‘ కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి‘‘శ్రీ గణేష ప్రార్థనతొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జౖయె యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‘తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప‘ లోకనాయకా!తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా దలచితినే హేరంబుని దలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్ ∙∙ అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్నిటలాక్షు నగ్రసుతునకుపటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్శ్రీ వినాయకుని దండకము శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటిపండున్ మరిన్మంచివౌ ఇక్షుఖండంబులు, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముంబంచనీ రానంబున్ నమస్కారముల్జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ యో భక్తమందారయో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణీ లోకరక్షామణీ బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ శ్రీ దొంత రాజన్వయుండ రామాభిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్జూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా!ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే.. నమస్తే...నమః నీరాజనమ్ : (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా‘ నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ‘‘ సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీరాష్ట్ర్య యాముఖే తయామా సగ్ం సృజామసి‘‘ సంతత శ్రీరస్తు‘ సమస్త సన్మంగళానిభవంతు‘ నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం దర్శయామి‘‘ నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి‘‘ (అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి)మంత్రపుష్పమ్ : (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి)గణాధిప నమస్తేస్తుఉమాపుత్రా విఘ్ననాశన‘వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక‘‘ఏకదంతైక వదన తథా మూషికవాహన‘కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్‘‘తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి‘తన్నోదంతిః ప్రచోదయాత్‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.ఆత్మప్రదక్షిణ నమస్కారమ్ : (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేగాని తనచుట్టూ తాను తిరగకూడదు)ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ‘ నమస్తే విఘ్నరాజాయ‘ నమస్తే విఘ్ననాశన‘‘యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ‘తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే‘పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాపసంభవఃత్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల‘అన్యాధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ‘తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామిప్రార్థన(పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిని గణపతి పాదాల వద్ద ఉంచాలి)నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన‘ ఈప్సితంమే వరందేహి పరత్రచ పరాంగతిమ్‘‘ వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ‘ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా‘‘ అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమఃప్రార్థన నమస్కారాన్ సమర్పయామి‘‘సాష్టాంగ నమస్కారమ్ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా‘ పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి‘‘ శ్లో‘‘ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితంమయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతిసుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు.(నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము.అపరాధ ప్రార్థన: అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశంమయా‘ దాసోయమితి మాంమత్వా క్షమస్వ గణనాయక‘‘ ఆవాహనం నజానామి నజానామి విసర్జనం‘ పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక‘‘ శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి‘‘ (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి).(ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని నీటితో పళ్లెంలో విడిచిపెట్టాలి)అనేన మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు.విఘ్నేశ్వరుని కథా ప్రారంభం(కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి)సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, దాని నివారణను ఇలా చెప్పెను.పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపస్సు చేసెను. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమనగా, అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా యుదరమందు నివసించియుండమని కోరెను. భక్త సులభుండగు నా పరమేశ్వరుండు అతని కోర్కెదీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించెను.కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశములలో అన్వేషించుచూ కొంత కాలమునకు గజాసురుని గర్భంలో వున్నాడని తెలుసుకొని రప్పించుకొను మార్గం తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపిస్తుండగా, శ్రీహరి పార్వతిదేవిని ఓదార్చి ధైర్యము చెప్పి పంపెను. అంత హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే సరియైనదిగా నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా ముస్తాబుచేసి, బ్రహ్మాది దేవతలందరిచేత తలొక వాద్యమును ధరింపజేసి, తానును కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా, గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరెను. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుకోండి’’ ఇచ్చెదను అనిన పిదప, విష్ణుమూర్తి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకై వచ్చెను. కావున శివునొసంగు’’ అనెను.ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గ్రహించి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని ‘‘నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’మని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారము తెలిపి నందిని ప్రేరేపించెను. నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసురగర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు... ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్ళెను. పిదప శివుడు నంది నెక్కి కైలాసమునకు వేగంగా బయలుదేరెను.వినాయకోత్పత్తికైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగతసన్నాహానికై అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై వుంచిన నలుగుపిండితో ఒక ప్రతిమను చేయగా అది చూడముచ్చటైన బాలుని రూపముగా వుండెను. ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంతకుపూర్వం తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను. ఆ దివ్యస్వరూపుడైన బాలుడ్ని వాకిటముందు కాపుగా వుంచి ఎవ్వరినీ లోనికి రానీయవద్దని చెప్పెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండెను. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించెను. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తన మందిరమున తనకే ధిక్కరింపా అని రౌద్రరూపంలో తన త్రిశూలముతో బాలుని కంఠంబు తొలగించి లోపలికి వెళ్ళెను. అంత పార్వతీదేవి భర్తను చూసి, ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులచే పూజించె, వారిరువురును పరమానందమున ప్రియసంభాషణములు ముచ్చటించుకొనుచుండగా ద్వారం దగ్గరవున్న బాలుని ప్రస్తావన వచ్చెను. అంత ఆ మహేశ్వరుండు తాను చేసిన పనికి చింతించి, గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణంబు ప్రసాదించి ‘‘గజాననుడు’’ అని పేరుపెట్టి, అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జనియించెను. అతడు మహాబలశాలి. అతని వాహనరాజము నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను. విఘ్నేశాధిపత్యముఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలుగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరిరి. గజాననుడు తాను పెద్దవాడు గనుక అయ్యాధిపత్యము ఇవ్వమని కోరెను. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనుక అయ్యాధిపత్యము తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకొన్నాడు.సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూచి, ‘‘మీలో ఎవ్వరు ముల్లోకములలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో, వారికి యీ ఆధిపత్యం ఇచ్చెదను’’ అని మహేశ్వరుడు తెలిపిన వెంటనే కుమారస్వామి నెమలి వాహనము ఎక్కి వాయు వేగముగా వెళ్ళెను. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా! నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయయు తెలిపి రక్షింపవే’’ యని ప్రార్థించగా మహేశ్వరుడు దయతో, కుమారా! ఒకసారి ‘‘నారాయణ మంత్రం పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించెను.‘‘సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’ అంత గజాననుడు సంతోషించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపించుచూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణములు చేయుచూ కైలాసమున వుండెను. ఆ మంత్ర ప్రభావముతో∙అంతకు పూర్వము గంగానదికి స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తన కెదురుగా వస్తున్నట్లుగా కనిపించెను. ఆ విధముగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూచి ఆశ్చర్యపడుచూ, కైలాసమునకు వెళ్ళి తండ్రి సమీపంలోవున్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలమును నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియకట్లంటిని క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వుము’’ అని ప్రార్థించెను. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింపబడుచున్నాడు.ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి, కొన్ని చేత ధరించి భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారము చేయబోగా ఉదరము భూమికి ఆని, చేతులు భూమికి అందవయ్యే, ఈ విధంగా ప్రణామము చేయుటకు శ్రమించుచుండగా శివుని శిరంబున వెలసివున్న చంద్రుడు జూచి వికటంబుగ నవ్వెను. అంత ‘రాజదృష్టి’ సోకిన రాలు కూడ నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరము పగిలి అందున్న కుడుములు తదితరములన్నియు బయటకు దొర్లిపోయి అతడు మృతుండయ్యెను. పార్వతి శోకించుచు చంద్రుని జూచి,‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున, నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’’ అని శపించెను. చంద్రునికి కలిగిన శాపము లోకానికి కూడా శాపమైంది.ఋషీపత్నులకు నీలాపనిందలుఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్నిప్రదక్షిణము చేయుచున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూచి మోహించాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడెను. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేసెను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో వున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారికట్టి నీలాపనింద కలిగినది.ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకొన్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య(స్వాహాదేవి)యే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలియపరచి సప్త ఋషులను సమాధానపరచెను. వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె.అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీ దేవి! నీవిచ్చిన శాపము వలన లోకములకెల్ల కీడు వాటిల్లుచున్నది. దానిని ఉపసంహరింపు’’మని ప్రార్థించగా, పార్వతీదేవి అంగీకరించి, ‘‘ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ రోజున చంద్రుని చూడరాదు’’ అని శాపమునకు ఉపశమనము చెప్పెను. అంత బ్రహ్మాదులు సంతోషించి తమ గృహములకేగి, భాద్రపద శుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని చూడకుండ జాగ్రత వహించి సుఖముగా ఉండిరి.శమంతకోపాఖ్యానముయదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. అది విని సూర్యభగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించును. ఆ మణియున్న దేశమున అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కానీ అశుచిౖయె ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయములను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణదర్శనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము శ్రీ కృష్ణునకు తెలియజేసిరి. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పింప సంకల్పించెను. అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునకిచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్ళెను. కొంత సమయమునకు శరీరశోధన కారణంగా ప్రసేనుడు అశౌచమును పొందెను. ఈ కారణముచే ప్రసేనుడు సింహం దాడిలో మరణించెను. ఆ సింహాన్ని జాంబవంతుడను భల్లూకము సంహరించి మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు.ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీకృష్ణుడు కూడా వేటకై వెళ్ళివుండెను. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై అడవిలో శ్రీకృష్ణుడు వెదుకుచూ తలెత్తి చూడగ ఆకాశమున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనపడెను. చీకట్లుబాగుగా ముసురుకున్న కారణముచే శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత, అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించెనని సత్రాజిత్తు, పౌరులు భావించిరి. అంతట ఆ అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో వెదుకగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు రాత్రి వేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును తిని యుండునని నిష్టూరముగా పలికిరి.ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను.కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యువతి ఊయలలో పడుకున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తనతండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భయపడి, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను.శ్లో‘‘ సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతాహతాః సుకుమారక మారోధీః తవ హ్యేష శ్యమంతకః(తా‘‘ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా! ఈ మణి నీకే ఏడవకుము.)అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై వచ్చెనని శంకించి శ్రీకృష్ణునితో ద్వంద్వ యుద్ధమునకు తలపడెను.ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగనమొనర్చుకొనవలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్ధమొనర్చెను. క్రమముగా జాంబవంతుని బలము క్షీణించసాగెను. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి దేవాదిదేవా! ఆర్తజనరక్షకా! నిన్ను త్రేతాయుగంలో భక్తజనపాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మంలో నీవు నామీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందుముందు నా కోరిక తీరుతుందన్నావు. అప్పటినుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నా. నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామీ! నా అపచారమును మన్నించి నన్ను కాపాడుమని పలువిధాల అభ్యర్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీమంతా తన చేతితో నిమిరి జాంబవంతా! శ్యమంతకమణి అపహరించానన్న నింద నాపై వచ్చినది. దాని రూపుమాపుకొనుటకు వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళివస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపెను.ద్వారకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొనిరి. శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన (కుమార్తె) సత్యభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను.శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే తిరిగి ఇచ్చివేసెను. ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ, కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖులుండెడివారు.సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్దానమొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం జరిపెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయెను, ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురము నుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయల్దేరెను. గుర్రంపై పారిపోవుచున్న శతధన్వుడు, అది అలసి పడిపోగా, దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి ద్వంద్వ యుద్ధంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతడు కృçష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయెను.బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికంగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనఃశాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును ధైవకార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా వుండెను.ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటాయని విచారవదనంతో ఆలోచించుచుండగా నారదుడు ప్రతక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి వేటకై అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయేయని, ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పెను.శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోదరుడు, అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను. చంద్రకాంతి లేమిచే ఓషధులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయెను. దీనిచే దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయము కొరకు ప్రార్థించిరి. అంతట బ్రహ్మ బాద్రపద శుక్ల చవితినాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, (ఉండ్రాళ్ళు), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు, నివేదన మొనరింపవలెనని, సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను.అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రబింబము చూచుటవలన జరిగిన విపరీతములను స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగుననీ, కావున లోకమంతటినీ అనుగ్రహింపమని కోరెను. భాద్రపద శుక్ల చవితినాడు ఉదయం తనను ఫూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్నా, చంద్రుని చూచిననూ ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను.ఈ వృత్తాంతంలో దేవతలు, మహర్షులు, ప్రజలెల్లరు వినాయకుని యథాశక్తి పూజించి, కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖముగా వున్నారని సూతమహాముని శౌనకాదిమునులతో ఈ వృత్తాంతం తెలిపెను. దీనిలో ఏ మాత్రం ఏమరుపాటు తగదని శ్యమంతకోపాఖ్యానములో శ్రీకృష్ణపరమ్మాత వృత్తాంతం ద్వారా స్పష్టమైనది. అందువలన ఈ శ్యమంతోకాపాఖ్యానమును అనగా అందులో హితబోధను చెప్పుకొని గణేశతత్వంపట్ల భక్తి, వినయములతో శిరమున అక్షతలు ధరించిన యెడల చవితి చంద్రుని చూచిననూ నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరము ఇచ్చినారు. అది మొదలు శ్యమంతోకాపాఖ్యానము గాథను చదువుట, వినుట సాంప్రదాయమైనది. ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మహా భక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి, శ్రీ కృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికి శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుని పై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట, శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపరలిచ్చుచుండెను.‘‘మంగళం మహత్’’ చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత కొన్ని వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను.– కథ సమాప్తం –పునఃపూజ ఛత్రమాచ్ఛాదయామి‘ చామరేణ వీచయామి‘ నృత్యం దర్శయామి‘ గీతం శ్రావయామి‘ ఆందోళికా నారోహయామి‘ గజానారోహయామి‘ అశ్వానారోహ యామి‘ సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి‘‘ (స్వామిపై పుష్పాక్షతలు వేయాలి)విఘ్నేశ్వరుని మంగళహారతులుశ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం!నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణి వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ‘‘జయ‘‘సురుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిçపుడు ‘‘ జయ‘‘ పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ‘‘ జయ‘‘ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ‘‘ జయ ‘‘ వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ‘‘ జయ ‘‘పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ‘‘ జయ ‘‘కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మి దానిమ్మపువ్వు గరిక మాచీపత్రి మంచి మొలక ‘‘ జయ ‘‘అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ‘‘ జయ ‘‘పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ‘‘ జయ ‘‘బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ‘‘ జయ ‘‘పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ‘‘ జయ ‘‘మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారము లను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ‘‘ జయ ‘‘దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు. భవ్యుడగు దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ‘‘ జయ ‘‘మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ‘‘ జయ ‘‘ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోను మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర జయమంగళం నిత్య శుభమంగళం! ‘‘ జయ ‘‘వాయనదానముశ్లో‘‘ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను) మంత్రము – దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దదా!(ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)ఉద్వాసన మంత్రము : (ఈ క్రింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః‘ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‘‘ తేహనాకం మహిమానస్యచంతే‘ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి‘‘ పూజా విధానం సంపూర్ణమ్.(వ్రతకల్ప పూజా విధానం సమాప్తం)ఇదీ చదవండి: శ్రీనాథ విరచిత వినాయక దండకం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం....కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చేపట్టిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు అన్ని విధాలా సానుకూలమైన సమయం. వారం చివరిలో మానసిక వేదన, అనారోగ్య సూచనలు. మిత్ర విరోధాలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, అన్నపూర్ణాష్టకం పఠించండి.వృషభం...పనుల్లో మరింత అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో బంధువుల నుండి ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఎరుపు, చాక్లెట్ రంగులు, లక్ష్మీస్తోత్రాలు పఠించండి.మిథునం...ముఖ్యమైన వ్యవహారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగాలలో కొంత పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. కళారంగం వారికి కొన్ని సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక ఆందోళన. తెలుపు, చాక్లెట్æరంగులు, రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.కర్కాటకం...కొత్త పనులు ప్రారంభించేందుకు అనువైన కాలం. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు మీలో మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు తీరి ఒడ్డునపడతారు. రాజకీయవర్గాలకు ఈతిబాధలు తొలగుతాయి. వారం మధ్యలో బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు, గణేశ్ స్తోత్రాలు పఠించండి.సింహం....ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మనస్పర్థలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని వ్యవహారాలు మధ్యలో విరమిస్తారు. విద్యార్థుల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగాలలో అదనపు పనిభారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహన, గృహయోగం. నీలం, తెలుపు రంగులు, . గణేశ్ను పూజించండి.కన్య...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. భూవివాదాల నుండి గట్టెక్కుతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు అనుకున్న మేరకు లాభిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు రావచ్చు. వారం చివరిలో మానసిక ఆందోళన. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. ఆకుపచ్చ,,లేత గులాబీరంగు, కనకధారా స్తోత్రం పఠించండి.తుల...ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే, సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, గులాబీ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.వృశ్చికం..ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో మనస్పర్థలు తీరి ఉపశమనం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో మరింత గౌరవం పొందుతారు. గృహం కొనుగోలు యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు సకాలంలో విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. రాజకీయవర్గాలకు కార్యసిద్ధి. వారం చివరిలో మానసిక అశాంతి. అనారోగ్యం. తెలుపు, చాక్లెట్ రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులకు వరంగా మారనుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. కళారంగం వారికి యోగదాయకమైన కాలం. వారం చివరిలో సోదరులతో కలహాలు. బా«ధ్యతలు పెరుగుతాయి. గులాబీ, పసుపు రంగులు, శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.మకరం...ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగి సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గి కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటన అవకాశాలు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, తెలుపురంగులు, శివాలయ దర్శనం మంచిది.కుంభం...అనుకున్న పనులు మరింత వేగవంతంగా సాగుతాయి. మీపై వచ్చిన ఆరోపణల నుండి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. గృహ, వాహనయోగాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు కొన్ని ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. నీలం, లేత పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.మీనం...కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. భూ వివాదాల ఎట్టకేలకు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు, సంభాషణలు సాగిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.
ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలతో పాటు యానాంలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో వేకువజాము నుంచి దాదాపు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపుల ధాటికి బెజవాడ వాసులు బెంబేలెత్తిపోయారు. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.ముఖ్యంగా బెంజిసర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ స్థాయిలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఏలూరు రోడ్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనూ శనివారం వేకువజామున భారీ వర్షం కురిసింది. ఉ.8 గంటల వరకు జిల్లాలో సగటున 37.4 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది.పి.గన్నవరంలో అత్యధికంగా 60.0 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా, ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా దారకొండ పంచాయతీ గంగవరం వద్ద గిరిజనులు నిర్మించుకున్న తాత్కాలిక తూరల వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. ఒడిశా వైపు వెళ్లే మార్గంలో సుమారు 30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.ఇదీ చదవండి: చవితి పూట.. ధరల మంట
కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది?
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రమే వారు హనుమకొండలోని రాంనగర్ నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని కొండా మురళి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రానున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.కీలక బాధ్యత అప్పగిస్తారా?సమావేశం అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈపర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే ఢిల్లీ పర్యటన పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందేనని నాయకులు అంటున్నారు.రాజకీయ వర్గాల్లో ఉత్కంఠఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా దంపతులతో మాట్లాడారు. ఈనేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, కొండా దంపతుల రాజకీయ పాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచే సురేఖకు పార్టీపరంగా కొత్త బాధ్యత దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు, కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో ఉన్న రాజకీయ ప్రభావాన్ని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోందని వారి అనుచరులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు, కేడర్ను సమన్వయం చేసేందుకు సురేఖ సేవలను వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేనని, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని నాయకులు చెబుతున్నారు. దీంతో ఆదివారం రాంనగర్లో జరగనున్న కార్యకర్తల సమావేశం, అనంతరం కొండా సురేఖ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సమావేశంలో కొండా దంపతులు చేసే వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనపై వెల్లడించే వివరాలు, పార్టీ అధిష్టానంతో జరిగే చర్చలపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు!
లాడెన్ హిట్లిస్ట్లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు
చేజారిన టైటిల్.. కోపంతో రాకెట్ విరగ్గొట్టిన సబలెంకా! వీడియో
సముద్రం అడుగున బంగారు ఖజానా.. చైనా సంచలన అన్వేషణ!
ట్రంప్ చిన్ననాటి ఇంటికి భారీ ధర!
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
నా అందానికి సీక్రెట్ అదే: హీరోయిన్ శ్రియ
ఓ బొజ్జ గణపయ్యా... ఉండ్రాళ్లు పెట్టలేమయ్యా..
కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది?
అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు!
తెలంగాణలో గట్టి వానలు.. ఈ జిల్లాలకు అలర్ట్
ఒక్కసారే అన్ని కహానీలు ఎందుకు చెప్పార్సార్!!
వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!
నా భర్త జీవితం సర్వనాశనమైంది : సుమంత్ భార్య
ఎన్నికల్లో మీకు సరైన లెక్క నేను చెబుతా..
ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు
అలాగే ఓ బాంబు, నెత్తిన అప్పు కూడా ఇద్దాం సార్!
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
వైభవ్కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో వీడిన మిస్టరీ
‘పండుగప్ప’ కోసం పోటీ.. వేలంలో దక్కించుకున్న మహిళ
బిగ్బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు
రాత్రికి రాత్రే 23 కి.మీ వెనక్కి సముద్రం.. ఏం జరగబోతుంది?
ఇజ్రాయెల్పై యుద్ధంలో ఇరాన్కు బిగ్ షాక్
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి
ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే?
ఇరుముడి నాకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది: రవితేజ
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
లాడెన్ హిట్లిస్ట్లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు
చేజారిన టైటిల్.. కోపంతో రాకెట్ విరగ్గొట్టిన సబలెంకా! వీడియో
సముద్రం అడుగున బంగారు ఖజానా.. చైనా సంచలన అన్వేషణ!
ట్రంప్ చిన్ననాటి ఇంటికి భారీ ధర!
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
నా అందానికి సీక్రెట్ అదే: హీరోయిన్ శ్రియ
ఓ బొజ్జ గణపయ్యా... ఉండ్రాళ్లు పెట్టలేమయ్యా..
కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది?
అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు!
తెలంగాణలో గట్టి వానలు.. ఈ జిల్లాలకు అలర్ట్
ఒక్కసారే అన్ని కహానీలు ఎందుకు చెప్పార్సార్!!
వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!
నా భర్త జీవితం సర్వనాశనమైంది : సుమంత్ భార్య
ఎన్నికల్లో మీకు సరైన లెక్క నేను చెబుతా..
ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు
అలాగే ఓ బాంబు, నెత్తిన అప్పు కూడా ఇద్దాం సార్!
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
వైభవ్కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో వీడిన మిస్టరీ
‘పండుగప్ప’ కోసం పోటీ.. వేలంలో దక్కించుకున్న మహిళ
బిగ్బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు
రాత్రికి రాత్రే 23 కి.మీ వెనక్కి సముద్రం.. ఏం జరగబోతుంది?
ఇజ్రాయెల్పై యుద్ధంలో ఇరాన్కు బిగ్ షాక్
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి
ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే?
ఇరుముడి నాకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది: రవితేజ
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
ఫొటోలు
'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)
విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)
వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)
బేబీ బంప్తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)
'ఎపిక్' షూటింగ్లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)
వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)
సమంత స్టన్నింగ్ లుక్స్ అదుర్స్ (ఫొటోలు)
ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)
‘ది ప్యారడైజ్’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
సినిమా
దేవుడు వరమందిస్తే...!
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం మైథాలజీ , డివోషనల్ బ్యాక్డ్రాప్ సినిమాల ట్రెండ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన తెలుగు సినిమా ‘ఇరుముడి’, సూర్య తమిళ సినిమా ‘కరుప్పు’, బాలీవుడ్ సినిమా ‘హను మాన్ అంశ్’, యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహా’ చిత్రాల సక్సెస్ను నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మైథలాజీ అండ్ డివోషనల్ బ్యాక్డ్రాప్ సినిమాలు ఏంటి? దేవుడు వరం అందిస్తే... తమకు హిట్ కావాలన్నట్లుగా ఏయే హీరోలు ఈ జానర్లో సినిమాలు చేస్తున్నారు? అన్న అంశాలపై మీరూ ఓ లుక్ వేయండి.భూలోకం టు సత్యలోకం బ్రహ్మదేవుడి సత్యలోకం ఎలా ఉండబోతుందనేది వెండితెరపై ‘విశ్వంభర’ సినిమాలో చూడొచ్చు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘విశ్వంభర’. ఈ మైథాలజీ అంశాలతో కూడిన ఈ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్గా నటించారు. కథ రీత్యా... పధ్నాలుగు లోకాలు దాటుకుని సత్యలోకంలో ఉన్న హీరోయిన్ను హీరో ఎలా భూలోకానికి తిరిగి తీసుకు వస్తాడు? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఇక ఈ చిత్రంలో దొరబాబు అనే పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని, కథలో భాగంగా దొరబాబు పాత్రకు ఐదుగురు సిస్టర్స్ ఉంటారనే ప్రచారం సాగుతోంది. సురభి, రమ్య పసుపులేటి వంటి నటీమణులు ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించారని తెలిసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇక వీఎఫ్ఎక్స్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఈ పనులు కూడా తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఈ ఏడాది అక్టోబరులో దసరా సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం సాగింది. కానీ ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్ కాకపోవచ్చని, వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి తొలి వారంలో (జనవరి 9న విడుదల అని ఫిల్మ్నగర్ టాక్) తెరకు రావొచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే వచ్చే సంక్రాంతికి చిరంజీవి హీరోగా నటిస్తున్న మరో సినిమా ‘కాకా’ జనవరి 13న రిలీజ్కి షెడ్యూల్ అయ్యింది. దీంతో వచ్చే సంక్రాంతికి ‘విశ్వంభర’ సినిమా రిలీజ్ అవుతుందా? లేక ముందుగా అనుకున్నట్లుగా ‘కాకా’నే సంక్రాంతికి థియేటర్స్లో సందడి చేస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. రామాయణం ఆధారంగా వారణాసి మహేశ్బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ అడ్వెంచరస్ యాక్షన్ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 80 శాతానికి పైగా పూర్తయిందని ఈ చిత్రదర్శకుడు రాజమౌళి ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ‘వారణాసి’ సినిమా ప్రధాన కథాంశం తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. కానీ ఈ సినిమా కథనంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్, మైథాలజీ అంశాలు ఉన్నాయి. ఈ సినిమాలోని ఓ 30 నిమిషాల సీక్వెన్స్లో రాముడు పాత్రలో మహేశ్బాబు కనిపించనున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణంలోని ఓ ప్రధాన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ సీక్వెన్స్ను తెరకెక్కించినట్లుగా రాజమౌళి అండ్ టీమ్ ఆల్రెడీ పేర్కొంది. దీంతో రాముడి గెటప్లో మహేశ్బాబు ఎలా ఉండబోతున్నారు? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఇంకా ఈ మైథాలజీ సీక్వెన్స్ ‘వారణాసి’ సినిమాకు ఎంత హైలైట్గా ఉండబోతుంది? అన్న అంచనాలు కూడా ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మహేశ్బాబు క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని తెలిసింది. రుద్రగా, రాముడిగా మహేశ్బాబు కనిపించనున్నారు. ఈ రెండు పాత్రల్లోనే కాకుండా మరో మూడు డిఫరెంట్ గెటప్స్లో మహేశ్బాబు కనిపిస్తారని, థియేటర్స్లో ఇవి ఆడియన్స్ను సర్ప్రైజ్ చేస్తాయని ఫిల్మ్నగర్ సమాచారం. ఇంకా ఈ చిత్రంలోని మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా నటిస్తుండగా, విలన్ కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శివభక్తుడి పాత్రలో ప్రకాష్రాజ్ నటిస్తున్నారని తెలిసింది. ఇక ప్రపంచ సంరక్షణ కోసం కాలాతీతంగా సాహసోపేతమైన ప్రయాణం చేసే ఓ వ్యక్తి ప్రయాణం నేపథ్యంలో ‘వారణాసి’ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. తొలిసారిగా... ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలోని ఓ సన్నివేశంలో విజయ్ దేవరకొండ అర్జునుడు పాత్రలో కనిపిస్తే, ఆయన ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలయ్యారు. అలాంటి విజయ్ దేవరకొండనే మెయిన్ హీరోగా ఓ మైథాలజీ డ్రామా వస్తే ఆయన అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. అందుకే ఈ తరహా సినిమాను త్వరలోనే సెట్స్కు తీసుకుని వెళ్లనున్నారు విజయ్ దేవరకొండ. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ సినిమా బ్యాక్డ్రాప్పై సరైన స్పష్టత రావాల్సి ఉంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ చిత్రాలతో బిజీగా ఉన్నారు విజయ్. ఈ సినిమాల రిలీజ్ తర్వాత శౌర్యువ్ సినిమాను విజయ్ సెట్స్కు తీసుకువెళ్తారని ఊహించవచ్చు. ఇటు జై హనుమాన్ – అటు మహాకాళి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో (పీవీసీయూ) భాగంగా రూపొందిన ‘హను–మాన్’ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో తేజ సజ్జా హీరోగా నటించారు. ఈ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో సినిమా ‘జై హను మాన్’. ‘కాంతార’ ఫేమ్ కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కథనం ప్రధానంగా లార్డ్ హనుమాన్ నేపథ్యంలో సాగుతుందని, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇందులో రానా, బాలీవుడ్ నటి వామికా గబ్బి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. అలాగే ఈ చిత్రంలోని రాముడు పాత్రలో ఓ టాప్ టాలీవుడ్ స్టార్ నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ ‘జై హనుమాన్’ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్లో రిలీజ్ కానుంది. అలాగే ఈ ‘పీవీసీయూ’ యూనివర్స్లో భాగంగా రూపొందుతున్న మరో మైథాలజీ బ్యాక్డ్రాప్ సినిమా ‘మహాకాళి’. ‘ది ఎండ్ బిగిన్స్’ అనేది ఈ సినిమా క్యాప్షన్. భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రేయా రెడ్డి, రోహిత్ సరాఫ్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ‘శుక్రాచార్య వార్ క్రై’ పేరిట ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అసురుల గురువు శుక్రాచార్యుడి నాయకత్వంలో జరిగే ఈ పోరాటం మరింత పెద్ద యుద్ధానికి దారి తీస్తున్నట్లు గ్లింప్స్లో చూపించారు. ప్రశాంత్ వర్మ క్రియేటర్గా, పూజ అపర్ణ కొల్లూరు దర్శ కత్వంలో ఆర్కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై రివాజ్ దుగ్గల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శుక్రాచార్యుడి పాత్రలో అక్షయ్ ఖన్నా, అమ్మవారి పాత్రలో శ్రియా రెడ్డి నటిస్తున్నారని ఇటీవల విడుదలైన, గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ఈ ‘మహాకాళి’ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వడ్డీ కాసులవాడు మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న డివోషనల్ ఫిల్మ్ ‘వడ్డీ కాసులవాడ’. ఈ చిత్రంలో రవి మోహన్ (‘జయం’ రవి) వెంకటేశ్వర స్వామి పాత్రలో నటిస్తున్నారు. తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఓ మధ్యతరగతి యువకుడి పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నారు. అనిల్ సుంకర ఏటీవీ సమర్పణలో కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర, దయా పన్నెం ఈ సినిమాకు సహ–నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇలా మైథాలజీ అండ్ డివోషనల్ అంశాలు మిళితమైన మరికొన్ని సినిమాలు సెట్స్పై ఉన్నాయి.దేవ సేనాపతి ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి యాక్షన్ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రెండోసారి సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. లార్డ్ కుమారస్వామి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఈ సినిమా అనౌన్స్మెంట్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. కొంత కాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లోని ‘డ్రాగన్’ సినిమాతో ఇటు ఎన్టీఆర్, వెంకటేశ్ హీరోగా చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో అటు త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు.‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబరు నెలలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్తో తాను చేయబోయే సినిమాతో త్రివిక్రమ్ మరింత బిజీ అవుతారని ఊహించవచ్చు. అంతే కాదు... ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కోసం ‘దేవ సేనాపతి’, ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్స్ను రిజిస్టర్ చేయించిందట యూనిట్. ఈ చిత్రం 2028లో థియేటర్స్లోకి రావొచ్చనే ఊహాగానాలు కూడా ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.భక్తి నేపథ్యంలో కూడిన సినిమాలకు ఇటీవలి కాలంలో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోందని తెలుస్తోంది. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుముడి’ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందినప్పటికీ ఈ సినిమాకు కాస్త డివోషనల్ టచ్ ఉంది. అయ్యప్పస్వామి బ్యాక్డ్రాప్ని కథలో కన్విన్సింగ్గా మిళితం చేయడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. దీంతో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని యూనిట్ పేర్కొంది. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతోంది. ⇒ సూర్య హీరోగా నటించిన తమిళ సినిమా ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’గా రిలీజైంది). ఈ సినిమా వీరభద్రుడి స్వామి బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ఈ చిత్రం రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ⇒ జస్ట్ రూ. 2 కోట్లతో తీసిన హిందీ సినిమా ‘హనుమాన్ అంశ్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించి, ట్రేడ్ వర్గీయులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోగ్రాఫికల్ డివోషనల్ సినిమాకు డా. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. శోభిత్ శ్రీవాత్సవ, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ షెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. రాగిణి ఎస్, నమ్రత జి. సింగ్, అనుప్రియ ఎ. నగర్, డా. విశాల్ చతుర్వేది నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలైంది. త్రివిక్రమ్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంస్థ ఈ సినిమాను తెలుగులో ఈ నెల 18న రిలీజ్ చేస్తోంది.⇒ నయనతార నటించిన మైథాలజీ అండ్ డివోషనల్ ఫిల్మ్ ‘ముక్కుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘మహాదేవి’) ఈ దీపావళికి రిలీజ్ కానుందనే ప్రచారం సాగుతోంది. సుందర్.సి ఈ సినిమాకు దర్శకుడు. ఈ కోవలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి.మైథాలజీ, భక్తి నేపథ్యంలో లైవ్ యాక్షన్ సినిమాలే కాకుండా, యానిమేషన్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ను సాధిస్తున్నాయి. ‘మహావతార్ సినిమాటిక్’ యూనివర్స్ నుంచి ఇప్పటికే వచ్చిన యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహా’ 2025లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ యూనివర్స్ నుంచి రెండో భాగంగా ‘మహావతార్ పరశురామ్’ 2027లో థియేటర్స్లో రిలీజ్ కానుంది. మొత్తం ఏడు సినిమాలు ఈ యూనివర్స్ నుంచి రిలీజ్ కానున్నాయి. అశ్విన్ కుమార్ ఈ యానిమేషన్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. రెండు సంవత్సరాలకొకసారి ఈ యూనివర్స్ నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుందని, అప్పట్లో మేకర్స్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ⇒ ‘బాహుబలి’ ఎంతటి బ్లాక్బస్టర్ సినిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అనే యూనిమేషన్ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం వచ్చే ఏడాది రానుంది. స్వర్గలోకాధిపతి ఇంద్రుడికి, బాహుబలికి మధ్య వైరం ఎలా మొదలైంది? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఇలా ‘బాహుబలి’ని మైథాలజీ వరల్డ్లోకి రాజమౌళి తీసుకువచ్చారు. రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ యానిమేషన్ సినిమాను నిర్మిస్తుండగా, ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యూనిమేషన్ మూవీలోని బాహుబలి పాత్రకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వనుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ⇒ ‘కార్తికేయ’, ‘కార్తికేయ 2’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు చందు మొండేటి డైరెక్షన్లో ‘వాయుపుత్ర’ అనే యానిమేషన్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. లార్డ్ హనుమాన్ ఆధారంగా ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై మరోమారు సరైన అప్డేట్ రావాల్సి ఉంది. ⇒ భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ యానిమేషన్ సినిమాను తీస్తున్నారని, కేవీఎన్ ప్రొడక్షన్స్ పై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారని, త్వరలోనే ఈ అంశంపై ఓ అప్డేట్ రానుందనే ప్రచారం సాగుతోంది. ఇలా మైథాలజీ, భక్తిభావంతో కూడిన మరికొన్ని యూనిమేషన్ సినిమాల రూపకల్పనకు తెలుగు దర్శక– నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. – ముసిమి శివాంజనేయులు
తలా అజిత్తో సీఎం విజయ్.. ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ట్రీట్!
తమిళనాడు సీఎం, హీరో విజయ్.. స్టార్ హీరో అజిత్ కుమార్ను లండన్లోని సిల్వర్స్టోన్ రేసింగ్ ట్రాక్లో కలిశారు. ప్రస్తుతం ‘మిచెలిన్ లీ మ్యాన్స్ కప్’లో పాల్గొంటున్న అజిత్ను విజయ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. విజయ్ సినిమాల్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీ ఉండేది. వీరిద్దరి అభిమానుల మధ్య రైవల్రీ కూడా ఉన్నప్పటికీ.. వీరి తాజా భేటీ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ముఖ్యమంత్రిగా విజయ్ తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా లండన్ వెళ్లగా.. అక్కడే అజిత్తో ఈ అరుదైన కలయిక చోటుచేసుకుంది. ఒకరిని ఒకరు చూసిన వెంటనే ఆనందంతో విజయ్ పరుగెడుతూ వెళ్లి అజిత్ను ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకరు రాజకీయ నాయకుడిగా, మరొకరు సినీ రంగంతో పాటు మోటార్ స్పోర్ట్స్లో రాణిస్తున్నారు. ఇలా ఇద్దరూ తమ తమ రంగాల్లో సరికొత్త ప్రయాణం సాగిస్తున్న వేళ జరిగిన ఈ భేటీపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.The way Thalapathy Vijay Hugged Ajith Kumar & AK welcomed @actorvijay ❤️ What an incredible Moment !!! An WHOLESOME Video !!! https://t.co/5IxWCYarp0— Let's X OTT GLOBAL (@LetsXOtt) September 12, 2026
సినిమాల్లో అవకాశం అంటూ మోసం.. రోడ్డెక్కిన బాధితులు
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.లక్షల్లో వసూలు చేసి మోసానికి ఒడిగట్టిన ఘటన హైదరాబాద్లో కలకలం సృష్టించింది. ఈమేరకు తమకు న్యాయం చేయాలంటూ భాదితులు అంబర్పేట్ శివం రోడ్డులోని సినిమా డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొంతమేర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.సినిమాలో అవకాశం ఇప్పిస్తామంటూ తమ దగ్గర రూ.లక్షల్లో డబ్బులు వసూళు చేసినట్లు బాధితులు తెలిపారు. తీరా అడిగే సరికి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారని వారంతా వాపోయారు. ఎలాగైనా తమకు న్యాయం చేసిన డబ్బులు వెంటనే తిరిగి ఇప్పించాలని వారంతా కోరారు. శివకుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: డీ10 విన్నర్ రాజు పై కేసు.. Victims protest at the residence of film distributor Shivakumar Goud.They alleged that Shivakumar had collected lakhs of rupees from several individuals by promising to secure film offers for them. pic.twitter.com/sQCOa6f0IC— Shakeel Yasar Ullah (@yasarullah) September 12, 2026
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
'బేబి' సినిమాతో మూడేళ్ల క్రితం హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ ప్రేమకథా మూవీ 'ఎపిక్'. గతంలో వచ్చిన #90స్ వెబ్ సిరీస్లోని పిల్లాడి పాత్రని తీసుకుని వాడి పెరిగి పెద్దయిన తర్వాత ప్రేమలో పడితే అనే స్టోరీతో దీన్ని తీశారు. నిన్న(సెప్టెంబరు 11) థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి చాలావరకు నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం తొలిరోజు బాగానే వచ్చాయి.ఇదీ చదవండి: బిగ్బాస్ 10: చైత్ర షాకింగ్ ఎలిమినేషన్.. అసలేంటి ట్విస్టులు?విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన 'ఎపిక్' సినిమాకు తొలిరోజు(ప్రీమియర్లతో కలిపి) మన దేశంలో రూ.2.10 కోట్ల నెట్ వసూళ్లు రాగా ఓవర్సీస్తో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.3.45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్తో కలిపి మొత్తగా రూ. 5 కోట్ల వరకు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే తొలిరోజు టాక్ నెగిటివ్గా ఉన్న నేపథ్యంలో వీకెండ్ అయ్యేసరికి ఎలాంటి ఫలితం అందుకుంటుందనేది చూడాలి?పైచదువుల కోసం యూకే వెళ్లిన ఓ తెలంగాణ పల్లెటూరి కుర్రాడు.. ఓ మోడ్రన్ తెలుగమ్మాయితో ప్రేమలో పడితే వాళ్లు ఎంతవరకు హద్దులు దాటేశారు. ఈ క్రమంలోనే ఏమేం తెలుసుకున్నారు? తదితర అంశాలతో ఈ సినిమా తీశారు. అయితే ఎమోషన్స్ గానీ అటు లవ్ యాంగిల్ గానీ సరిగా వర్కౌట్ కాలేదని టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. మరికొందరు మాత్రం తమకు నచ్చిందని అంటున్నారు. ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మించారు.ఇదీ చదవండి: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ
క్రీడలు
టైటిల్కు అడుగు దూరంలో...
హో చి మిన్హ్ సిటీ (వియత్నాం): భారత యువ షట్లర్ ఇషారాణి బారువా వియత్నాం ఓపెన్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ ఇషారాణి 21–10, 21–18తో భారత్కే చెందిన ఆరో సీడ్ రక్షితశ్రీపై విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్, భారత యువ షట్లర్ తన్వీ శర్మ 19–21, 20–22తో సరునాక్ వితిద్సర్ణ్ (థాయ్లాండ్) చేతిలో ఓడింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో సరునాక్తో ఇషారాణి తలపడనుంది. మరోవైపు పురుషుల సెమీఫైనల్లో ప్రణయ్ 13–21, 8–21తో జియా హెంగ్ చేతిలో ఓడాడు.
టి20ల్లో జోరు కొనసాగించేందుకు...
ఒక వైపు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ప్రాధాన్యత నేపథ్యంలో వరుసగా టెస్టు మ్యాచ్లు... ఏడాది కాలంలో వన్డే వరల్డ్ కప్ ఉండటంతో జట్టు కూర్పు, ఆటగాళ్ల ఎంపికపై వ్యూహాలు... వీటి మధ్య ఇప్పుడు కాస్త ఆటవిడుపుగా భారత జట్టు టి20 మ్యాచ్లకు సన్నద్ధమైంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వేలలో టి20 సిరీస్లు ఆడి వచ్చిన భారత్ ఇప్పుడు స్వదేశంలో అఫ్గానిస్తాన్తో పోరుకు సై అంటోంది. అయితే మూడు మ్యాచ్లకు వేదిక భారత రాజధాని అయినా... అధికారికంగా ఈ సిరీస్కు అఫ్గానిస్తాన్ బోర్డు ఆతిథ్యం ఇస్తోంది. న్యూఢిల్లీ: భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు ఫిరోజ్షా కోట్లా మైదానంలో తొలి పోరుకు రంగం సిద్ధమైంది. బలాబలాలను బట్టి చూస్తే ప్రత్యర్థికంటే భారత్ అన్ని విధాలా పటిష్టంగా ఉంది. కెప్టెన్గా రెండు సిరీస్లు కోల్పోయిన తర్వాత జింబాబ్వేతో సిరీస్ విజయాన్ని అందుకున్న శ్రేయస్ అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. అన్నింటికి మించి హార్దిక్ పాండ్యా మినహా టీమిండియా రెగ్యులర్ ఆటగాళ్లతో పూర్తి స్థాయి జట్టుగా బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా గాయంనుంచి కోలుకొని పునరాగమనం చేస్తున్న బుమ్రాపై అందరి దృష్టీ నిలిచింది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడు సంచలనాలతో సత్తా చాటిన అఫ్గాన్ టీమ్ ఇక్కడా తమదైన ముద్ర చూపించాలని పట్టుదలగా ఉంది. పలువురు ఐపీఎల్ ఆటగాళ్లు తమ జట్టులో ఉండటం కూడా అఫ్గాన్కు కొంత సానుకూలాంశం. ఈ సిరీస్లో ఆడుతున్న భారత జట్టే జపాన్లో జరిగే ఆసియా క్రీడలకు కూడా వెళుతుంది. రెండో ఓపెనర్ ఎవరు? ఈ సిరీస్లో ఒకే ఒక ప్రశ్న ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్ ముందు నిలిచింది. అభిషేక్ శర్మతో పాటు రెండో ఓపెనర్గా సంజు సామ్సన్, వైభవ్ సూర్యవంశీలలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఐర్లాండ్తో సామ్సన్ 2 మ్యాచ్లు, ఇంగ్లండ్పై తొలి మ్యాచ్ ఆడిన తర్వాత అతడిని తప్పించి వరుసగా మూడు మ్యాచ్లలో వైభవ్ను ఆడించారు. ఆపై చివరి మ్యాచ్కు మళ్లీ సామ్సన్ జట్టులోకి రాగా... జింబాబ్వేతో సామ్సన్ లేకపోవడంతో వైభవ్ మూడు మ్యాచ్లూ ఆడాడు.ఇప్పుడు ఇద్దరు అందుబాటులో ఉన్నారు.దులీప్ ట్రోఫీలో చెలరేగిన ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఫార్మాట్కు తగినట్లుగా తమ బ్యాటింగ్ శైలిని మార్చుకొని చెలరేగేందుకు ఉత్సాహంగా ఉన్నారు. బ్యాటింగ్పరంగా జింబాబ్వేలో ఆశించిన ప్రభావం చూపలేకపోయిన కెప్టెన్ అయ్యర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు రెగ్యులర్ పేసర్లతో బరిలోకి దిగనుండగా, పేస్ ఆల్రౌండర్గా నితీశ్కుమార్ రెడ్డి అందుబాటులో ఉన్నాడు. రషీద్పై ఆశలు... భారత గడ్డపై ఆడటం అఫ్గానిస్తాన్ ఆటగాళ్లకు కొత్త కాదు. ఇక్కడి పరిస్థితులపై వారికి మంచి అంచనా ఉంది. ముఖ్యంగా రషీద్ ఖాన్ ఐపీఎల్లో చూపించిన ప్రభావం అసాధారణం. వన్డేల్లో రషీద్ బౌలింగ్లో పదును కనిపించకపోయినా, టి20ల్లో అతను ఎప్పుడైనా ప్రమాదకారి. గుర్బాజ్, నబీ, అజ్మతుల్లా, ముజీబ్, నూర్, నవీన్, ఫారుఖీ వంటి ఐపీఎల్ ఆటగాళ్లతో జట్టు నిండి ఉంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్పై ఉదాసీనత ప్రదర్శిస్తే టీమిండియాకు ఇబ్బంది ఎదురు కావచ్చు. కొత్త కెప్టెన్ ఇబ్రహీమ్ నాయకత్వంలో టీమ్ ఈ సిరీస్కు సిద్ధమైంది.9 భారత్, అఫ్గానిస్తాన్ మధ్య 9 టి20లు జరగ్గా... భారత్ 7 గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’ కాగా, మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. అఫ్గాన్ ఇప్పటి వరకు ఓడించని పెద్ద జట్లు భారత్ మాత్రమే.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: శ్రేయస్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్/ వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్, అక్షర్, సుందర్, నితీశ్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్. అఫ్గానిస్తాన్: ఇబ్రహీమ్ (కెప్టెన్), గుర్బాజ్, నైబ్, సాదిఖుల్లా, రసూలీ, అజ్మతుల్లా, నబీ, రషీద్, ముజీబ్, నూర్, ఫారూఖీ/ నవీన్.
మహిళల ఆసియాకప్ ఫైనల్లో నేడు శ్రీలంకతో భారత్ ఢీ
దుబాయ్: మహిళల ఆసియాకప్ టి20 టోర్నమెంట్లో ఎదురులేకుండా సాగుతున్న భారత జట్టు... నేడు శ్రీలంకతో ఫైనల్కు సిద్ధమైంది. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఈ టోర్నీ నిర్వహించగా... అందులో ఏడుసార్లు ట్రోఫీ చేజిక్కించుకున్న టీమిండియా... ఎనిమిదో టైటిల్పై గురి పెట్టింది. గత ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకున్న టీమిండియా... ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి... సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. మరోవైపు శ్రీలంక కూడా గ్రూప్ దశలో అన్నీ మ్యాచ్లు నెగ్గి సెమీస్లో పాకిస్తాన్ను ఓడించి ఫైనల్ చేరింది. ఫామ్పరంగా చూసుకుంటే ఈ టోర్నమెంట్లో తొలిసారి భారత జట్టుకు కాస్త ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలున్నాయి. స్మృతి మంధాన, షఫాలీ వర్మ రూపంలో భారత జట్టుకు బలమైన ఓపెనింగ్ జోడీ ఉంది. స్మృతి ఇప్పటికే ఈ టోర్నీలో ‘శత’క్కొట్టగా... షఫాలీ 168 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతోంది. స్పిన్కు సహకరిస్తున్న దుబాయ్ పిచ్పై ఈ జంట జట్టుకు ఎలాంటి ఆరంభం ఇస్తుందనేదే కీలకం కానుంది. వన్డౌన్లో బ్యాటింగ్ చేస్తున్న ప్రతీకా రావల్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉండగా... హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్, భారతి ఫూల్మాలితో భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. బౌలింగ్లో సీనియర్ ఆల్రౌండర్ దీప్తి శర్మ కీలకం కానుంది. ఈ టోర్నీలో 11 వికెట్లు తీసి శ్రీలంక సారథి చమరి ఆటపట్టుతో కలిసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్న దీప్తి ఫైనల్లోనూ రాణించాల్సిన అవసరముంది. ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి తన స్పిన్తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతుండగా... పేసర్లు నందని శర్మ, క్రాంతి గౌడ్ ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే భారత జట్టుకు ఫీల్డింగ్లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు శ్రీలంక జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో సారథి చమరి ఆటపట్టుపైనే ఎక్కువ ఆధారపడుతోంది.
జ్వెరెవ్ X షెల్టన్
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో కొత్త విజేత ఎవరో నేడు తేలనుంది. తొలి టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉన్న టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), 8వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) నేడు జరిగే ఫైనల్ పోరులో తలపడనున్నారు. జ్వెరెవ్ ఫైనల్ చేరడం ఇది రెండో సారి. 2020లో ఆఖరి మెట్టుపై అతని డొమినిక్ థీమ్ చేతిలో ఓడి రన్నరప్గా నిలవగా, షెల్టన్ ఫైనల్కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి, వింబుల్డన్ ఫైనల్లో ఓడిన జ్వెరెవ్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి సెమీఫైనల్లో జ్వెరెవ్ 6–3, 7–6 (9/7), 7–6 (8/6) స్కోరుతో కరెన్ ఖచనోవ్ (రష్యా)పై విజయం సాధించాడు. ఆ తర్వాత జరిగిన రెండో సెమీస్లో షెల్టన్ 4–6, 6–3, 6–3, 7–5తో అమెరికాకే చెందిన ఫ్రాన్సిస్ టియాఫోను ఓడించాడు. సెమీస్ మ్యాచ్కు ముందు ఖచనోవ్తో ఆడిన 9 మ్యాచ్లలో 6–3తో ఆధిక్యంలో ఉన్న జ్వెరెన్ ఈ సారి కూడా తన పైచేయిని ప్రదర్శించాడు. తొలి సెట్లో 3–3 తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకున్న జ్వెరెవ్ ఆ తర్వాత ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసి 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మరో గేమ్ కూడా అలవోకగా జ్వెరెవ్ ఖాతాలో చేరింది. తర్వాతి రెండు సెట్లలో మాత్రం టాప్ సీడ్కు గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరూ హోరాహోరీగా పోరాడటంతో స్కోరు టైబ్రేక్కు చేరింది. ఈ దశలో ఖచనోవ్ పైచేయి సాధించినా దానిని నిలబెట్టుకోలేకపోయాడు. మూడో సెట్ కూడా దాదాపు ఇదే తరహాలో సాగింది. టైబ్రేక్లో 2–5తో వెనుకబడినా జ్వెరెవ్ పట్టుదలగా తన స్థాయికి తగ్గ ఆటతీరుతో మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. జ్వెరెవ్ 15 ఏస్లతో విరుచుకుపడటం విశేషం. టియాఫోతో జరిగిన రెండో సెమీస్లో షెల్టన్ తొలి సెట్ చేజార్చుకున్నా... కోలుకొని ఆ తర్వాత ప్రత్యర్థిపై చెలరేగుతూ దూసుకుపోయాడు. ఈ సెట్లో ఏకంగా 14 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేసిన షెల్టన్ సహచర అమెరికన్కు అవకాశం కల్పించాడు. రెండో సెట్లో ఎనిమిదో గేమ్ను బ్రేక్ చేసి ముందంజ వేసిన షెల్టన్ సునాయాసంగా సెట్ను ముగించాడు. మూడో సెట్ కూడా అతని నియంత్రణలోనే సాగింది. ఈ సెట్లోనే అతను 12 విన్నర్స్ కొట్టడం షెల్టన్ ఆధిపత్యాన్ని చూపించింది. 1972 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన తొలి నల్లజాతి అమెరికన్గా షెల్టన్ గుర్తింపు పొందాడు. అతను గెలిస్తే ఆండీ రాడిక్ (2003) తర్వాత గ్రాండ్స్లామ్ నెగ్గిన మొదటి అమెరికా ఆటగాడిగా నిలుస్తాడు.
న్యూస్ పాడ్కాస్ట్
ప్రపంచ పరిపాలనకు రూల్స్ మనమే రూపొందించాలి.... బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
బిజినెస్
ఊహకందని బంగారం ధరలు.. వారం రోజుల్లో ఇలా..
భారతదేశంలో బంగారం ధరలు ఊహకందని రీతిలో మారిపోతున్నాయి. ఉదయం భారీగా తగ్గిన రేటు, సాయంత్రానికి పెరిగిపోతోంది. దీంతో పసిడి ప్రియులలో ఒకింత ఆందోళన మొదలైపోయింది. ఈ కథనంలో వారం (సెప్టెంబర్ 6 నుంచి 12 వరకు) రోజుల్లో బంగారం ధరల్లో జరిగిన మార్పులు ఏమిటి?, ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సెప్టెంబర్ 06న హైదరాబాద్, విజయవాడలలో రూ.1,54,800 వద్ద ఉన్న 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రేటు, సెప్టెంబర్ 12న రూ.1,54,580 వద్దకు చేరింది. అంటే.. వారం రోజుల్లో గోల్డ్ రేటు పెరుగుతూ తగ్గుతూ రూ.16 వేలకు చేరువవుతోందని తెలుస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,900 నుంచి రూ.1,41,700 వద్దకు చేరింది.చెన్నైలో గత ఆదివారం (సెప్టెంబర్ 06) రూ.1,54,800 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం, శనివారం (సెప్టెంబర్ 12) నాటికి 1,54,580 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ. 1,41,900 నుంచి రూ.141700 వద్దకు చేరింది. వారం మధ్యలో ధరల్లో చాలా మార్పు వచ్చినప్పటికీ.. వారాంతం నాటికి కొంత పెరిగినట్లు తెలుస్తోంది.ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పు వచ్చాయి. వారం ప్రారంభంలో రూ.1,54,950 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, వారాంతానికి 1,54,730 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,050 నుంచి రూ.1,41,850 వద్దకు చేరింది.ఇదీ చదవండి: ఒకేరోజు 20 లక్షల ట్రైన్ టికెట్స్ బుకింగ్!
AI రేసులో భారత్.. పెట్టుబడుల్లో భారీ వృద్ధి!
భారతదేశంలో ఏఐ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో.. పలు కంపెనీలు ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. సర్వీస్నౌ విడుదల చేసిన ఎంటర్ప్రైజ్ ఏఐ మెచ్యూరిటీ ఇండెక్స్ 2026 ప్రకారం.. దేశీయ సంస్థల్లో AIపై పెట్టుబడులు ఒక్క సంవత్సరంలోనే 119 శాతం పెరిగాయని తెలుస్తోంది.2027 నాటికి 21.3 శాతం!ప్రస్తుతం ఇండియన్ కంపెనీలు తమ ఐటీ బడ్జెట్లో సగటున 16.6 శాతం ఏఐ కోసం ఖర్చు చేస్తున్నాయి. 2027 నాటికి ఇది 21.3 శాతానికి చేరుతుందని అంచనా. దీనివల్ల భారతదేశం ఏఐ రంగంలో ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో అర్థమవుతుంది.ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ.. దానిని సురక్షితంగా నిర్వహించడానికి అవసరమైన గవర్నెన్స్ మాత్రం ఆ స్థాయిలో లేదు. భారతదేశంలోని కేవలం 22 శాతం సంస్థలకే ఏఐ టెస్టింగ్, ఆడిటింగ్, రిస్క్ అసెస్మెంట్ వంటి విధానాలు ఉన్నాయి. 54 శాతం సంస్థలు ఏఐ ఏజెంట్ను ఉపయోగిస్తున్నప్పటికీ, కేవలం 11 శాతం మాత్రమే అటానమస్ వర్క్ఫ్లోను అమలు చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏఐ వల్ల వచ్చే సమస్యలపై సంస్థలకు ఉన్న ఆందోళనలు. కాబట్టి ఏఐను వేగంగా ఉపయోగించడం మాత్రమే కాకుండా, దాన్ని బాధ్యతాయుతంగా నియంత్రించడం కూడా చాలా అవసరం.ఏఐ విజయవంతంగా పనిచేయాలంటే..ఏఐ విజయవంతంగా పనిచేయాలంటే మంచి డేటా, సిస్టమ్స్ అవసరం. అయితే.. భారతీయ సంస్థల్లో ఇది ఇంకా ఒక పెద్ద సవాలుగానే ఉంది. 74 శాతం కంపెనీలు.. డేటా అక్యురసీ, యాక్సెస్, మేనేజ్మెంట్ వంటి వాటిన మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి.కాగా మరో 56 శాతం సంస్థలు లెగసీ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ప్రధాన సమస్యగా గుర్తించాయి. కేవలం 18 శాతం కంపెనీలు మాత్రమే విడివిడిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్స్కు భర్తీ చేశాయి. వివిధ విభాగాల డేటా ఒకదానితో ఒకటి కనెక్ట్ కాకపోతే ఏఐకు పూర్తి సమాచారం అందదు. అందువల్ల ఏఐ అభివృద్ధితో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా బలోపేతం చేయాలి.ప్రభుత్వం చర్యలుఏఐ విషయంలో భారత ప్రభుత్వం కూడా కొన్ని ముఖ్యమైన చర్యలు చేపడుతోంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ యాక్ట్, డీపీడీపీ రూల్స్, ఏఐ గవర్నెన్స్ గైడ్లైన్స్, ఇండియాఏఐ మిషన్, ఇండియాఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ వంటి కార్యక్రమాలు ఏఐ ఇన్నోవేషన్తో పాటు ప్రైవసీ, సేఫ్టీ, అకౌంటబిలిటీ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తోంది.ఇదే విధంగా సంస్థలు కూడా తమ ఇంటర్నల్ గవర్నెన్స్ సిస్టంను బలపరచాలి. ముఖ్యంగా ఏఐ ఏజెంట్లకు ఎంతవరకు డేటా, సిస్టమ్స్ యాక్సెస్ ఇవ్వాలి, ఎక్కడ హ్యూమన్ సూపర్ విజన్ అవసరం అనే విషయాలను స్పష్టంగా నిర్ణయించాలి. ఏఐపై ప్రజలకు, సంస్థలకు నమ్మకం ఏర్పడాలంటే ఈ గవర్నెన్స్ చాలా కీలకం. మొత్తం మీద.. భారతదేశం ఏఐలో పెట్టుబడులు పెట్టడంలో వేగంగా ముందుకు సాగుతోంది, కానీ గవర్నెన్స్ విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.ఇదీ చదవండి: బంగారంలో పెట్టుబడి.. రూ.1 లక్షకు రూ.3.64 లక్షలు!
మొబైల్ డేటాపై పన్నుకు బ్రేక్!
దేశంలో మొబైల్ డేటా వినియోగంపై ప్రత్యేక పన్ను (డేటా టాక్స్) విధించాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవడానికి కేంద్ర టెలికాం శాఖ (డాట్) సన్నాహాలు చేస్తోంది. ఈ పన్ను అమలులో ఎదురయ్యే సాంకేతిక చిక్కులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణపై పడే ప్రతికూల ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం.నేపథ్యం.. ప్రతిపాదనప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో భాగంగా డేటా వినియోగం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో పాటు చిన్నారుల్లో పెరుగుతున్న డిజిటల్ వ్యసనాన్ని తగ్గించడమే లక్ష్యంగా డేటాపై పన్ను ప్రతిపాదనను పరిశీలించాలని డాట్ని ఆదేశించారు. గిగాబైట్కు(జీబీ) రూ.1 చొప్పున పన్ను విధించే మోడల్ను సెప్టెంబర్ 30 నాటికి రూపొందించాలని తొలుత భావించారు.ఎదురైన సవాళ్లుడేటా పన్ను అమల్లో ప్రాథమికంగా కొన్ని సమస్యలు గుర్తించారు. ప్రతి వినియోగదారుడి డేటా వాడకాన్ని సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షించడం ఆచరణాత్మకంగా అసాధ్యం. ఒకవేళ రీఛార్జ్ ప్యాక్లపై నేరుగా పన్ను వేస్తే తక్కువగా వినియోగించే వారికి కూడా అదనపు భారం పడుతుంది. యూపీఐ చెల్లింపులు, ఆన్లైన్ విద్య, ఆరోగ్య సేవలు, ఈ-కామర్స్ వంటి నిత్య జీవితంలో డేటా అత్యవసరంగా మారింది. ఉత్పత్తికి ఉపయోగపడే డేటా, ఎంటర్టైన్మెంట్ డేటాను వేరు చేయడం వీలుపడదు. ఇప్పటికే రీఛార్జ్లపై 18% జీఎస్టీ చెల్లిస్తున్న వినియోగదారులపై మరింత భారం మోపడం డిజిటల్ ఇండియా ఆశయాలకు విఘాతం కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.డేటా వినియోగ గణాంకాలుడాట్ అధికారిక డేటా ప్రకారం, భారతదేశంలో మొబైల్ డేటా వాడకం భారీగా పెరిగింది. ఆర్థిక సంవత్సరం 2025లోని 229 బిలియన్ జీబీతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం 2026 నాటికి డేటా వినియోగం 24.5% పెరిగి 285 బిలియన్ జీబీకి చేరుకుంది. డిజిటల్ వ్యసనం, చిన్నారుల్లో స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు పన్నులు విధించడం సరికాదని నిపుణులు స్పష్టం చేశారు. వయస్సు నిర్ధారణ ప్రక్రియ, పేరెంటల్ కంట్రోల్స్, కంటెంట్ నియంత్రణ వంటి సాంకేతిక చర్యల ద్వారా మాత్రమే ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: బోణీ కొట్టిన ‘గణేష్’ ఎకానమీ
భారత రోడ్లపై పుతిన్ కారు.. ప్రత్యేకతలు ఇవే!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన మరోసారి ఆయన ప్రత్యేక భద్రతా ఏర్పాట్లపై ఆసక్తిని పెంచింది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి చేరుకున్న పుతిన్ వెంట భారీ భద్రతా కాన్వాయ్ కూడా వచ్చింది. ఆయన ప్రయాణించే ప్రత్యేక అధ్యక్ష విమానంతో పాటు, అత్యంత భద్రతతో కూడిన ఆరస్ సెనాట్ (Aurus Senat) లిమోసిన్ కూడా విదేశీ పర్యటనలకు తరలించడం రష్యా అధ్యక్షుడి భద్రతా వ్యవస్థలో కీలక భాగంగా మారింది.ప్రపంచ దేశాల అధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు స్థానికంగా ఏర్పాటు చేసిన అధికారిక వాహనాలను ఉపయోగించడం సాధారణం. అయితే పుతిన్ మాత్రం విదేశీ పర్యటనల్లోనూ తన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆరస్ సెనాట్ వాహనాన్నే వినియోగిస్తారు. అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో కూడిన ఈ లిమోసిన్ను అందుకే ‘ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్’గా అభివర్ణిస్తుంటారు.పుతిన్ కారు ప్రత్యేకత ఏంటి?పుతిన్ కాన్వాయ్లో సాధారణంగా భారీ సంఖ్యలో వాహనాలు ఉంటాయి. విదేశీ పర్యటనల సమయంలో మాత్రం ఆయన ప్రయాణించే ఆరస్ సెనాట్కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్, పేలుళ్లను తట్టుకునే సామర్థ్యం వంటి రక్షణ వ్యవస్థలతో ఈ కారును రూపొందించినట్లు తెలుస్తోంది.ఆరస్ సెనాట్ను రష్యాకు చెందిన ఆరస్ మోటార్స్ అభివృద్ధి చేసింది. రష్యన్ స్టేట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నామి, సోలర్స్ జేఎస్సీ, యూఏఈకి చెందిన తవాజున్ హోల్డింగ్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. రష్యా ప్రభుత్వం దేశీయంగా అత్యాధునిక లగ్జరీ, రక్షణ వాహనాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ‘కోర్టెజ్’ ప్రాజెక్టులో భాగంగా సెనాట్ రూపొందింది. 2018లో ఈ మోడల్ను పరిచయం చేశారు. దీని డిజైన్కు సోవియట్ కాలం నాటి ZIS-110 లిమోసిన్ నుంచి స్ఫూర్తి పొందినట్లు చెబుతారు.ఇంజిన్.. వేగంపుతిన్ ఉపయోగించే ఆరస్ సెనాట్లో 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్, హైబ్రిడ్ వ్యవస్థతో కలిపి పనిచేస్తుంది. ఇది సుమారు 598 హార్స్పవర్, 880 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో ఈ కారు పనిచేస్తుంది.సెనాట్ పొడవు సుమారు 5,630 మిల్లీమీటర్లు, వెడల్పు 2,000 మిల్లీమీటర్లు, ఎత్తు 1,700 మిల్లీమీటర్లుగా ఉంటుంది. గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ లిమోసిన్.. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని సుమారు 9 సెకన్లలో చేరగలదని సమాచారం.భద్రతకు పెద్దపీటరష్యా అధ్యక్షుడి కోసం రూపొందించిన ఈ ప్రత్యేక వాహనంలో అత్యున్నత స్థాయి భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ రక్షణతో పాటు పేలుళ్ల నుంచి రక్షణ కల్పించేలా దీన్ని రూపొందించినట్లు సమాచారం. యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, అధునాతన బ్రేకింగ్ వ్యవస్థలు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.భద్రతతో పాటు సౌకర్యాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అధిక నాణ్యత కలిగిన లెదర్, వుడ్ ట్రిమ్, ఆధునిక ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థలతో కారు ఇంటీరియర్ను రూపొందించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా ఈ వాహనాన్ని తీర్చిదిద్దినట్లు సమాచారం.మూమూలు ప్రజలూ వాడొచ్చు!ఆరస్ సెనాట్కు సాధారణ పౌరుల కోసం ప్రత్యేక వెర్షన్ కూడా ఉంది. అయితే దీని ఉత్పత్తిని పరిమిత సంఖ్యలోనే చేపడుతున్నట్లు సమాచారం. పౌర వెర్షన్ ధర సుమారు 18 మిలియన్ రూబిళ్లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.2.5 కోట్లు.అయితే పుతిన్ ఉపయోగించే ప్రత్యేక అధ్యక్ష వెర్షన్ ధర, రక్షణ స్థాయి వంటి వివరాలు సాధారణంగా బహిరంగంగా వెల్లడించరు.గత ఏడాది చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్తో కలిసి ఇదే ఆరస్ సెనాట్లో ప్రయాణించడం కూడా అప్పట్లో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. దీంతో రష్యా అధ్యక్షుడి ప్రత్యేక లిమోసిన్పై ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆసక్తి పెరిగింది.
ఫ్యామిలీ
విఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడు
మొట్టమొదటి పూజలందుకోవలసిన దైవం.. వినాయకుడేవిఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడుఆది దంపతులకు మానసపుత్రుడు.. ఓంకార స్వరూపుడు...జ్ఞానానికి, వివేకానికి ప్రతీక.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు..కార్యసిద్ధిని ప్రసాదించే సిద్ధివినాయకుడు..భక్తుల కోరికలను ఆలకించే మన గణపయ్య!ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం మన సంప్రదాయం. తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా, విజయవంతంగా సాగాలంటే విఘ్ననాయకుడైన శ్రీగణేశుని అనుగ్రహం కావాల్సిందే. అందుకే దైవారాధనలో, పూజా కార్యక్రమాల్లో, సర్వశుభకార్యాల ప్రారంభంలో తొలి పూజలందుకునే దైవం వినాయకుడే.విఘ్నేశ్వరుని ఆరాధన కేవలం విఘ్నాలను తొలగించమని కోరడం మాత్రమే కాదు. మనలోని అజ్ఞానం, అహంకారం, అసహనం, తొందరపాటు వంటి అంతర్గత విఘ్నాలను తొలగించి, మంచి ఆలోచన, వివేకం, ఏకాగ్రత, ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థించడం కూడా.పసుపు గణపతి – పవిత్రతకు ప్రతీకపార్వతీమాత చేతుల మీదుగా పసుపు ముద్దతో అవతరించి, మన ఇళ్లలో ‘‘పసుపు గణపతి’’గా తొలి పూజలందుకుంటున్న గణపతి స్వామి విఘ్ననివారకుడే కాక, విద్య, బుద్ధి, జ్ఞానాలను ప్రసాదించే జ్ఞానప్రదాతగా కూడా ఆరాధించబడుతున్నాడు.అందుకే, ‘కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ... ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!’ అంటూ మనం గణేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం.వినాయక చవితి – భక్తి, ఆనందాల పర్వదినంభాద్రపద శుద్ధ చవితి అనగానే ప్రతి ఇంటా వినాయక చవితి పండుగ సందడి కనిపిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా నిలుస్తుంది. పండుగల ద్వారా మనం కేవలం ఆచారాలను మాత్రమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను కూడా తరువాత తరాలకు అందిస్తాం. అందుకే పిల్లలను పూజలో భాగస్వాములను చేసి, గణపతి తత్వాన్ని వారికి పరిచయం చేయడం, వినాయకుని కథ చదివించడం లేదా చదివి వినిపించడం ఎంతో ముఖ్యం.వినాయక వ్రతం – మనలోని మంచి గుణాలకు నాంది సకల విఘ్నాలకు అధిపతియైన విఘ్నేశ్వరుడిని భాద్రపద శుద్ధ చవితి పర్వదినాన కుటుంబసమేతంగా భక్తిశ్రద్ధలతో కొలుస్తాం. తలపెట్టిన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏడాది పొడవునా విజయవంతంగా సాగాలని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని స్వామిని ప్రార్థిస్తాం.అయితే భక్తితో కొలుస్తూ మనం కోరేది కేవలం కోరికల నెరవేర్పు మాత్రమే కాదు, మంచి ఆలోచన ఇవ్వమని.. వివేకంతో నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవ్వమని.. ఎదురయ్యే విఘ్నాలను ధైర్యంగా అధిగమించే శక్తి ఇవ్వమని.. కుటుంబంలో సుఖశాంతులు కలిగించమని.. సమాజంలో ఐకమత్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని.. మనస్ఫూర్తిగా ప్రార్థించాలి.ఇదే వినాయకవ్రతంలో అంతర్లీనంగా ఉన్న పరమార్థం.విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. బుద్ధిని ప్రసాదించే బుద్ధిప్రదాత..విజయాన్ని అందించే సిద్ధివినాయకుడు.. మంగళాలను చేకూర్చే మంగళమూర్తి..శ్రీ గణనాథుని కృపాకటాక్షాలు ప్రతి ఇంటిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ... శ్రీ గణేశాయ నమః! శ్రీ సిద్ధివినాయకాయ నమః! శ్రీ విఘ్నేశ్వరాయ నమఃఇదీ చదవండి: వినాయక పూజకు సన్నద్ధత
వినాయక పూజకు సన్నద్ధత
వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంటికీ భక్తిశ్రద్ధలతో నిండే పర్వదినం. పూజకు ముందుగా ఇంటిని శుభ్రపరుచుకోవడం, పూజా వేదికను సిద్ధం చేసుకోవడం, పూజకు అవసరమైన ద్రవ్యాలు, పత్రి, పుష్పాలు, నైవేద్యాలు సమకూర్చుకోవడం మన సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి, పరిశుభ్రమైన వస్త్రాన్ని ధరించి పూజకు సిద్ధమవుతాం. ఇంటి ప్రధాన గుమ్మాన్ని మామిడి తోరణాలతో, పుష్పాలతో అలంకరించి, పూజా మండపాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుతాం. మండపం పైభాగంలో పాలవెల్లి ద్రాక్షలు చేసి మండపం లోపల స్వస్తిక్, పద్మం వంటి శుభచిహ్నాలను లిఖించి, హరిద్రా గణపతి (పసుపు గణపతి), మట్టి వినాయక ప్రతిమలను భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి, దీపారాధనతో స్వామివారిని ఆహ్వానిస్తాం. పూజ ప్రారంభానికి ముందే అవసరమైన పూజాద్రవ్యాలు, పత్రి, పుష్పాలు, నైవేద్య సామగ్రితో పాటు పిండివంటలు, ప్రసాదాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం వల్ల పూజను ప్రశాంతంగా, ఎటువంటి ఆటంకం లేకుండా సంపూర్ణంగా నిర్వహించుకోవచ్చు. పూజకు చేసే సన్నద్ధత శరీరానికే కాదు.. మనసుకూ.... పరిశుభ్రమైన ఇంటితో పాటు పవిత్రమైన మనసుతో గణనాథుని ఆరాధించినప్పుడే పూజ పరిపూర్ణమవుతుంది. భక్తిశ్రద్ధలతో గణనాథుని కొలిచి, ఆయన అనుగ్రహంతో ప్రతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ప్రారంభిద్దాం..ఇదీ చదవండి: విఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడు
గణనాథుడికి...ఘనమైన ఆసనం
గణేష్ వేడుకలలో ప్రధానంగా కనిపించేది అలంకరణ. గణనాథుడి ప్రతిమతో పాటు ఆసనం, బ్యాక్గ్రౌండ్, చుట్టూ రంగురంగుల పువ్వులు, కాంతులీనే లైట్లు... కనువిందు చేస్తుంటాయి. మండపాల వద్ద సరే, ఇళ్లలోనూ ఈ విధమైన అలంకరణ సందడి కనిపించాలంటే..?ఎక్కువ హంగామా లేకుండా అలంకరణ ఆకట్టుకునేలా ఉండేలా భిన్నమైన ఆసనాల స్టాండ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఈవెంట్ ప్లానర్స్ వీటిని మరింత అందంగా రూపుకట్టి మన ముందుకు తీసుకు వస్తున్నారు. ముత్యాలు, రత్నాలు, జరీ, వెల్వెట్, మిర్రర్ వర్క్ వంటి వాటితో రూపొందించే ఈ ఆసనాలు చిన్న వినాయక విగ్రహాలకు చక్కగా అమరుతున్నాయి. ముఖ్యంగా తక్కువ స్థలంలో పూజ చేసుకునే వారికి ఇవి ఉపయుక్తం కూడా. అందమైన పువ్వులు... ఆర్టిఫిషియల్ రోజాలు, మల్లెలు, చామంతులు, పచ్చని ఆకులతో తయారు చేసిన ఆసనం వినాయకుడి చుట్టూ పూల వేదికలా కనిపిస్తుంది. పండుగ తర్వాత ఈ ఆసనం సెట్ను స్టోర్ చేసుకుంటే ఇతర పూజ లు లేదా ఇంటి అలంకరణ ల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ ఆసనాలు కానుక గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి.స్థలానికి తగ్గట్టు ... ఫ్లాట్లు, అపార్ట్మెంట్లలో స్థలం పరిమితంగా ఉంటుంది. అందుకు తగినట్టు అలంకరణ చేయాలన్నా అందరికీ కుదరదు. అందుకని, చిన్న సైజు ఆసనాలు మార్కెట్లోకి వచ్చాయి. టేబుల్, షెల్ఫ్ లేదా చిన్న పూజా స్థలంలో కూడా వీటిని సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.సంప్రదాయం.. ఆధునికత... గోల్డ్ లేదా కాపర్ ఫినిష్తో ఉండే ఆర్టిఫిషియల్ ఆసనాలు గణేషుడి ప్రతిమకు రాజసాన్ని జోడిస్తాయి. మరోవైపు వుడ్, జూట్, పేస్టెల్ పూలతో రూపొందించిన ఆసనాలు మినిమల్ హోమ్ డెకార్ను ఇష్టపడేవారికి నచ్చుతాయి. అయితే ఆసనం ఎంచుకునేటప్పుడు విగ్రహం పరిమాణానికి తగిన సైజు ఉండేలా చూసుకోవాలి. ప్రతిమ ఎంత అందంగా ఉన్నా, దానికి తగిన ఆసనం ఆ అలంకరణకు మరింత ప్రత్యేకతను, ఇంటికి స్పెషల్ లుక్ తీసుకొస్తుంది. సులభంగా అలంకరణకృష్ణాష్టమి, గణేష్ చతుర్ధి, వరలక్ష్మి.. వంటి సంప్రదాయ వేడుకలలో ప్రతిమలకు ఈ డెకార్ ఆసనాలు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి పూర్తిగా చేతితో తయారు చేసినవి. సులభంగా అమర్చుకోవచ్చు, విడదీసి స్టోర్ చేసుకోవచ్చు. పండగ శోభ కోసం తయారు చేసిన ఈ అలంకరణలలో పూసలు, లేసులు, కుందన్స్, మఖమల్ క్లాత్తో పాటు ఖరీదైన స్టోన్స్ కూడా ఉపయోగించి డిజైన్ చేస్తున్నాం. – లక్ష్మి సింగ్లా, డెకార్ క్రియేషన్స్ – నిర్మలారెడ్డి
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
‘‘మా ‘అత్తమ్మ’, మా ‘నాన్న’... మా ఇంటికి పిల్లర్స్’’ అంటున్నారు రష్మికా మందన్నా. మామగారిని నాన్న అని పిలుస్తారామె. ‘దేవరకొండ’ ఇంటి కోడలిగా రష్మిక తొలి వినాయక చవితి పండగని జరుపుకోనున్నారు. మరి... పండగ ప్లాన్ ఏంటి? అంటే... ‘‘మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలను కుంటున్నాను’’ అన్నారు రష్మిక. ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన పలు వేడుకల్లో రష్మిక పాల్గొన్నారు. ఇప్పుడు ‘దేవరకొండ రష్మిక’గా పండగ చేసుకోవడం ఓ స్పెషల్ ఫీలింగ్ అన్నారామె. వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ‘దేవరకొండ రష్మిక’ చెప్పిన విశేషాలు...→ మీ ఇంట్లో పండగ ప్లాన్లో ఎవరి భాగం ఎక్కువ?అంతా మా అత్తమ్మే. ఇంట్లో ప్రతిదీ తనే ప్లాన్ చేస్తారు. నేను ఆమె చేసేవన్నీ జస్ట్ అలా ఎంజాయ్ చేస్తాను. నేననే కాదు... ఇంట్లో మేం అందరం బాధ్యత అంతా పూర్తిగా అత్తమ్మకే వదిలేస్తాం. అయితే డైట్ విషయంలో మేమంతా చాలా జాగ్రత్తగా ఉంటాం. బహుశా పండగ రోజు కూడా డైట్ నియమాలను పాటిస్తామేమో. మేం డైట్ పాటించినా, పాటించకపోయినా, ఇంట్లో ఏం చేసినా చేయకపోయినా... ఇంట్లో ఏమేం చేయాలో అన్నీ మా అత్తమ్మే చూసుకుంటారు. → మీరు, మీ భర్త... మీ ఇద్దరిలో ఎవరికి భక్తి ఎక్కువ? ఇద్దరికీ... నేను ప్రతి రోజూ ఇంటి నుంచి బయటకు వర్క్ మీద వెళ్లేటప్పుడు పూజ చేసుకుని వెళతాను. విజయ్ కూడా చేస్తుంటారు. మేం ఇద్దరం గుడికి కూడా బాగా వెళుతుంటాం. భక్తి తాలూకు ఆ అనుభూతిని ఇద్దరం ఆస్వాదిస్తాం. → పండగకు ఇంటిని అలంకరించే విషయం కూడా మీ అత్తమ్మ చెప్పినట్లేనా? అంతే... ఇంట్లో ఎలాంటి సందడి నెలకొన్నా మా అత్తమ్మకే థ్యాంక్స్ చె΄్పాలి. మా అత్తమ్మ మా ఇంటికి ‘సూర్య రశ్మి’లాంటివారు. ఇంటిని అలంకరించడం, పిండి వంటలు చేయడం నుంచి పూజ చేయడం వరకూ అన్నీ ఆమే చేస్తారు. ఇంతకు ముందు చెప్పినట్లు మేం ఎంజాయ్ చేస్తాం. → మరి... పండగ వేడుకల్లో మీ మామయ్యగారు, మరిది (ఆనంద్ దేవరకొండ) భాగస్వామ్యమో? విజ్జు (విజయ్ దేవరకొండ), నాన్న, నా, ఆనంద్... మా అందరి భాగస్వామ్యం ఈక్వల్గా ఉంటుంది.. అయితే ఇంటి సారథి మాత్రం కచ్చితంగా అత్తమ్మే. మేం నలుగురం ఆమె మాట వింటాం... చెప్పినది చెప్పినట్లు నిజాయితీగా చేస్తాం. ఎందుకంటే మేం మా పనుల్లో మునిగిపోతాం... ఎప్పుడూ పరుగులు పెడుతూ ఉంటాం. సో... ఇంట్లో మమ్మల్ని నిలకడగా ఉంచేది మా అత్తమ్మే. అసలు ఆవిడ పనులను ఎంత బాగా చేస్తారంటే... మెచ్చుకోవాలనిపిస్తుంటుంది. అంత బాధ్యతగా ఇంటిని పట్టించుకుంటారు కాబట్టే అత్తమ్మ ఏం చెబితే అది నమ్మి చేసేస్తాం. → ఇప్పుడు దేవరకొండ ఇంటి కోడలిగా పండగలో పాలుపంచుకోబోతున్నారు... ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు ఆ ఇంటి పూజల్లో పాల్గొన్నారా? పండగలప్పుడు, పూజలప్పుడు మా అత్తమ్మ దగ్గరవాళ్లందర్నీ పిలుస్తారు. ఈ ఇంటి ఆనవాయితీ అది. అలా నన్ను కూడా పిలిచేవారు. నన్ను సొంత మనిషిలా అనుకునేవారు. సో... ‘రష్మిక’లా ఈ ఇంటి వేడుకల్లో నేను చాలాసార్లు పాల్గొన్నాను. → ‘మిస్ రష్మిక’గా వెళ్లినప్పుడు ఇప్పుడు ‘మిసెస్ విజయ్’గా ఆ ఇంట్లో ఉంటున్న మీకు కనిపించిన తేడా? నిజాయితీగా చె΄్పాలంటే... ఏ తేడా లేదు. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా ఏమీ మారలేదు. ఒప్పుడు ఓ ఫ్రెండ్లా నన్ను ఇంటికి పిలిచేవారు. ఇప్పుడు విజ్జు భార్యగా ఆ ఇంట్లో ఉన్నాను. వ్యక్తులుగా మాలో ఏ మార్పూ లేదు. అయితే ఒక్క విషయం ఏంటంటే... ఆ కుటుంబ సభ్యురాలిగా ఉండటం అనే అనుభూతి వేరు. ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవడంలో దక్కే ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం.→ ఎప్పుడైనా వినాయకుడి బొమ్మను గీశారా?నాకు బొమ్మలు గీయడం అస్సలు రాదు, కానీ రంగులు వేయడం అంటే చాలా ఇష్టం. వినాయకుడి బొమ్మ గీసే అవకాశం ఎప్పుడూ రాలేదు. నాక్కూడా గీయాలనిపించలేదు. ఎందుకంటే నేను ఆ రూపానికి న్యాయం చేయలేనని నా ఫీలింగ్. అందుకే అసలు ప్రయత్నం కూడా చేయకూడదనుకున్నాను. కానీ రెండు సంవత్సరాల క్రితం ఎవరో నన్ను మట్టితో వినాయకుణ్ణి తయారు చేయమని అడిగితే కాదన లేక ప్రయత్నం చేశాను. నాకు చేతనైనంతలో బాగానే చేశాను.→ పెళ్లి వేడుకల్లో మీరు కట్టుకున్న చీరలన్నీ బాగున్నాయి... మరి... పండగ రోజు ఏం ప్లాన్ చేస్తున్నారు? కచ్చితంగా చీర కట్టుకుంటాను. ఈ పండగ జరుపుకోవడానికి వర్క్ నుంచి నాకు కొన్ని గంటలైనా బ్రేక్ దొరికితే బాగుండు అను కుంటున్నాను. ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ మెటీరియల్ శారీ కట్టుకోవాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. చాలా ఉన్నాయి... అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది కట్టుకుంటాను.→ ఇటీవల విజయ్ ‘సీడ్ గణేశా’కి ప్రాధాన్యం ఇవ్వాలంటూ మట్టి వినాయకుడితో దిగిన ఫొటో బయటకు వచ్చింది... అవును... మా ఇంట్లో మేం పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాం. రాబోయే తరాలకు సుర క్షితమైన పర్యావరణం ఉండాలి కదా. అందుకు మా వంతు కృషి చేస్తాం. అందుకే ‘ఎకో ఫ్రెండ్లీ’ వినాయకుడిని ఇంటికి తీసుకు వస్తున్నాం. మేమే కాదు... అందరం ఎకో ఫ్రెండ్లీగా పండగ చేసుకుందాం.– డి.జి. భవాని
అంతర్జాతీయం
ఐర్లాండ్ విలీనం అగ్గి రాజేసిన ట్రంప్
డబ్లిన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరతీశారు. ఐర్లాండ్, ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్లో భాగంగా ఉన్న నార్తర్న్ ఐర్లాండ్లు విలీనమై ఒక్కటైతే బాగుంటుందని వ్యాఖ్యానించి శతాబ్ధకాలం నాటి వివాదానికి ఆజ్యం పోశారు. ఐర్లాండ్ తీరంలోని డూన్బెగ్లో ఉన్న తన గోల్ఫ్కో ర్సును సందర్శించిన ట్రంప్ శనివారం ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో ఆ దేశ ప్రధాని మేకేల్ మార్టిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ‘‘ఏ రకమైన సమస్య సృష్టించే ఉద్దేశం లేదు కానీ.. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, యూకేకు చెందిన నార్తర్న్ ఐర్లాండ్ కలిసిపోతే చూడాలని ఉంది. ఏదో ఒక రోజు ఇది తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు కూడా సాధ్యం కావచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ఐర్లాండ్ల ఏకత అద్భు తంగా ఉంటుందని, ఈ విషయంపై సహజంగానే యూకే ఏదో ఒకటి చెబుతుంది అని విమర్శించారు. నార్తర్న్ ఐర్లాండ్కు సంబంధించి బ్రిటన్లో దశాబ్దాల కాలం ఉద్య మాలు, హింస చెలరేగిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. నార్తర్న్ ఐర్లాండ్ యూకేతో కలిసి ఉండాలని ఒక వర్గం, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్తో కలిసిపోవాలని ఇంకోవర్గం మధ్య జరిగిన ఈ పోరులో సుమారు 3600 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగానే అమెరికా పూర్వపు అధ్యక్షులు ఎవరూ సున్ని తమైన ఐర్లాండ్ అంశంపై ఏ రకమై వ్యాఖ్యా చేసే వారు కాదు. మాజీ అధ్యక్షుడు జో బైడె న్ తల్లివైపు వారు ఐర్లాండ్ వారు అయినప్ప టికీ, ‘ఐరిష్– అమెరికన్’ను నేనని ఆయన స్వయంగా చెప్పుకున్నా ఐ ర్లాండ్ల ఏకీకరణ విషయంలో ఆయన పల్లెత్తు మాట అనకపోవడం గమ నా ర్హం. సుమారు వందేళ్ల క్రితం బ్రిటన్ పెత్త నం నుంచి బయటపడుతూ ఐర్లాండ్ రోమ న్ కేథలిక్లు ఎక్కువగా ఉన్న స్వతంత్ర దేశంగా అవతరిస్తే... ప్రొటె స్టెంట్లు ఎక్కువగా ఉన్న ఆరు కౌంటీ ప్రాంతాలు యునైటెడ్ కింగ్డమ్లోనే ఉండిపోయాయి. నార్తర్న్ ఐర్లాండ్లోని రెండు వర్గాల మధ్య 30 ఏళ్లపాటు హింస, సాయుధ పోరు నడిచింది. చివరకు 1998లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు వర్గాల మధ్య శాంతి ఒప్పందం ఒకటి కుదిరింది.ఐర్లాండ్ అధ్యక్షుడితోనూ మంతనాలుట్రంప్ తన గోల్ఫ్ కోర్సు సందర్శన సందర్భంలోనే శని వా రం ఐర్లాండ్ అధ్యక్షులు కేథరీన్ కనోలీతోనూ సమావేశమ య్యా రు. డబ్లిన్లోని అమెరికా దౌత్యవేత్త అధికార నివాసంలో ఇరుదే శాల వాణిజ్యవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు కూడా. ఆ తరువాత గోల్ఫ్ కోర్సులో జరగనున్న ఐరిష్ ఓపెన్ టోర్నీ ని వీక్షించనున్నారు. 2019లో ట్రంప్ ఐర్లాండ్ను సందర్శించినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో కేథరీన్ ఒకరు. ఆ తరువాత అధ్య క్షులుగా ఎన్నికయ్యారు. పాలస్తీనాకు మద్దతుగా నిలిచే వామపక్ష భావాలున్న వ్యక్తి. మధ్యప్రాచ్యంలో అమెరికా వైఖ రిని తప్పు పట్టి.. ట్రంప్ ఒక పెత్తందారీ పోకడలు కలిగిన వ్యక్తి అని కూడా విమర్శించారు. అటువంటి కేథరీన్ తాజాగా తన అధికార నివా సంలో ట్రంప్కు స్వాగతం పలడకం గమనార్హం. వీరిద్దరూ శనివారం కొద్దిసేపు రహస్యంగా మంతనాలు జరిపారు కూడా. ఇదిలా ఉంటే.. ట్రంప్ రాకను డబ్లిన్ వాసులు కొందరు వ్యతిరేకించారు. నగరంలోని ఫీనిక్స్ పార్క్లో ట్రంప్, కేథరీన్ల సమావేశం సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంపై నగరవా సులు అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచం అతలాకు తలమవుతూంటే ట్రంప్ గోల్ఫ్ అడుతున్నాడు అని క్రిస్టోఫర్ ఫాక్స్ అనే ట్యాక్సీ డ్రైవర్ విమర్శించారు. మహిళలు, వలసదారులు, మైనార్టీలపై ట్రంప్ వైఖరి గర్హనీయమని ఓ విద్యార్థి వ్యాఖ్యానించారు.
ఐర్లాండ్ ఏకీకరణపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐర్లాండ్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఐర్లాండ్, ఉత్తర ఐర్లాండ్ కలసి ఒకే దేశంగా మారాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. సాధారణంగా ఇతర దేశాల నేతలతో సమావేశాలు, పర్యటనల్లో ట్రంప్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ముందుగా ఊహించడం కష్టంగా ఉంటుంది. అయితే ఐర్లాండ్లో పర్యటన మొదటి రోజే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆ దేశంతోపాటు బ్రిటన్లోనూ ప్రకంపనలు సృష్టించాయి.అయితే ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన మార్పునకు సంకేతమా? లేక విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన అప్పటికప్పుడు ఇచ్చిన సమాధానమా? అనే చర్చ మొదలైంది. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఉత్తర ఐర్లాండ్కు ప్రత్యేక రాయబారిగా పనిచేసిన మాజీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మిక్ మల్వానీ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. అమెరికా ఇప్పటికీ ఉత్తర ఐర్లాండ్లో శాంతిని నెలకొల్పేందుకు 1998లో కుదిరిన గుడ్ ఫ్రైడే శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు బ్రెండన్ బాయిల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఐర్లాండ్, ఉత్తర ఐర్లాండ్ భవిష్యత్తులో ఎప్పుడో ఒకరోజు ఏకమయ్యే అవకాశం ఉందని ట్రంప్ చెప్పడంలో తప్పేమీ లేదని ఇద్దరు నేతలు భావించారు. అయితే దాని కోసం అమెరికా ఇప్పుడే ప్రత్యేకంగా ప్రయత్నాలు ప్రారంభిస్తుందని మాత్రం వారు భావించడం లేదు. విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇవ్వడం ఒక విషయమైతే.. కొద్దిసేపటికే అమెరికా రాయబారి నివాసంలో జరిగిన కార్యక్రమంలోనూ ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఈ విషయంలో ట్రంప్ ఉద్దేశం ఏమిటన్న దానిపై మరింత ఆసక్తి పెరిగింది.అలాగే, ట్రంప్ అక్కడి వ్యాపారవేత్తలు, ఐరిష్-అమెరికన్ ప్రముఖులను ఉద్దేశించి చేసిన ప్రసంగం కూడా ఆసక్తికరంగా సాగింది. దీంతో సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడతారని భావించినా.. ఆయన మాత్రం అంతకన్న ఎక్కవ సమయమే ప్రసంగించారు. ఐర్లాండ్కు సంబంధించిన అంశాల కంటే అమెరికాలోని రాజకీయ పరిస్థితులు, తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించే ఎక్కువగా మాట్లాడారు. అలాగే, అక్రమ వలసలను అడ్డుకోవడం, వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం, రక్షణ రంగ ఉత్పత్తులను పెంచడం వంటి అంశాలను తన విజయాలుగా పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక చర్యకు బ్రిటన్ తగినంత మద్దతు ఇవ్వలేదంటూ మరోసారి విమర్శలు చేశారు. అయితే ట్రంప్ అసలు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.డబ్లిన్లో ఆయన ముందు ఉన్న వ్యాపారవేత్తలే లక్ష్యమా? లేక అమెరికాలో తెల్లవారుజామున ఆయన ప్రసంగాన్ని చూస్తున్న ఐరిష్-అమెరికన్లా? అనే చర్చ జరుగుతోంది. అమెరికాలో నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్లోని ఒకటి లేదా రెండు సభలపై పార్టీ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అమెరికా జనాభాలో దాదాపు పదో వంతు మంది తమకు ఐరిష్ మూలాలు ఉన్నాయని చెబుతారు. వారిలో కొందరు ఐర్లాండ్ ఏకీకరణకు మద్దతు ఇస్తుండటంతో.. అలాంటి ఓటర్లను ఆకర్షించేందుకు ట్రంప్ ఈ అంశాన్ని ప్రస్తావించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.గతంలోనూ ఐరిష్-అమెరికన్ ఓటర్ల మద్దతు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారింది. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఐర్లాండ్ శాంతి ప్రక్రియలో అమెరికా చురుకుగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చి ఐరిష్-అమెరికన్ల మద్దతు పొందారు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన హామీ మేరకు శాంతి ప్రక్రియలో అమెరికా కీలక పాత్ర పోషించింది. దాని ఫలితంగానే గుడ్ ఫ్రైడే ఒప్పందానికి మార్గం సుగమమైంది. అయితే ఇప్పుడు అమెరికా రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ విభజనలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఎంతవరకు ఎన్నికల వ్యూహంలో భాగమో స్పష్టంగా తెలియదు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు చర్చకు దారితీసినప్పటికీ.. ఐర్లాండ్ రాజకీయ వర్గాల్లో మాత్రం మరుసటి రోజు జరగనున్న గోల్ఫ్ మ్యాచ్ గురించే ప్రధానంగా చర్చ సాగుతుండటం గమనార్హం.ఇదీ చదవండి: ఏఐ భయాలు నిజమేనా? సిలికాన్ వ్యాలీలో భిన్న వాదనలు!
పళ్లు గడగడలాడుతున్నా.. ప్రాణాల కోసం పోరాటం ఆపలేదు!
అలాస్కాలోని బెరింగ్ సముద్రంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. చుట్టూ గడ్డకట్టేంత చలి ఉన్న సముద్రం.. తినడానికి ఆహారం, తాగడానికి నీరు లేకపోయినా 15 ఏళ్ల బాలుడు రెండు రోజుల పాటు బోల్తాపడిన చేపల వేట పడవపైనే ఉండి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో బాలుడి అన్న, మరో బంధువు మృతి చెందారు. బాధిత బాలుడిని డెరిక్ పార్కర్ అఘ్నాంగా గా గుర్తించారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. డెరిక్, అతడి అన్న, మరో బంధువు కలిసి చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు.అమెరికా కోస్ట్గార్డ్ వివరాల ప్రకారం.. డెరిక్ కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 4న సెయింట్ లారెన్స్ ద్వీపం నుంచి 18 అడుగుల చేపల వేట పడవలో బయలుదేరారు. అయితే, ఆదివారం మధ్యాహ్నానికి తిరిగి రావాల్సి ఉండగా వారు ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే కోస్ట్గార్డ్ సిబ్బంది సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం గాలింపు కొనసాగుతుండగా బోల్తాపడిన పడవపై కూర్చున్న డెరిక్ వారికి కనిపించాడు.ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలో ఉన్న మరో చేపల వేట పడవ సిబ్బంది అతడి వద్దకు చేరుకుంది. అతడిని సురక్షితంగా తమ పడవలోకి తీసుకున్నారు. అదే సమయంలో సముద్రంలో గాలింపు కొనసాగించగా డెరిక్ అన్న, మరో బంధువు మృతదేహాలు లభించాయి. ఈ రెండు రోజుల పాటు చల్లటి సముద్రంలో ఉండటంతో డెరిక్ శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయింది. హైపోథెర్మియా లక్షణాలు కనిపించినట్లు కోస్ట్గార్డ్ అధికారులు తెలిపారు. సముద్రంలోని నీటి ఉష్ణోగ్రత సుమారు 10 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉన్నట్లు రక్షించిన పడవ కెప్టెన్ ఆడమ్ వైట్ చెప్పారు.అలా.. డెరిక్ చీకట్లో కూడా బోల్తాపడిన పడవను గట్టిగా పట్టుకుని ఉన్నాడని కెప్టెన్ ఆడమ్ వైట్ తెలిపారు. చలికి అతడి పళ్లు గడగడలాడుతున్నప్పటికీ తన అన్న పడవ కింద చిక్కుకుని ఉన్నాడని చెప్పినట్లు వివరించారు. అయితే, అంతకుముందు రాత్రి తన మరో బంధువు కూడా నీటిలో జారిపోయినట్లు డెరిక్ చెప్పాడన్నారు. ఇంతటి ప్రమాదంలోనూ అతడు ధైర్యంగా ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాడని, డెరిక్ చాలా ధైర్యవంతుడని కెప్టెన్ ప్రశంసించారు.డెరిక్, అతడి అన్నకు చేపలు పట్టడం అంటే ఎంతో ఇష్టమని వారి తల్లి వీనా కులోవియి తెలిపారు. అలాగే, స్థానిక దుకాణాల్లో మాంసం కొనలేని కుటుంబాలకు ఆహారం అందించేందుకు వారు చేపలు పట్టేవారని చెప్పారు. సెయింట్ లారెన్స్ ద్వీపంలోని సవూంగా గ్రామంలో సుమారు 800 మంది నివసిస్తున్నారు. అక్కడ ఎక్కువగా సైబీరియన్ యుపిక్ ప్రజలు ఉంటారు. వేటాడి ఆహారం సంపాదించడం, అవసరమైన వారికి దాన్ని పంచుకోవడం తమ కుటుంబంలో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయమని వీనా ఈ సందర్భంగా తెలిపారు.ప్రస్తుతం డెరిక్ ఇంటికి చేరుకుని కోలుకుంటున్నాడని అతడి తల్లి చెప్పారు. సముద్రంలో ఉన్నంతసేపూ తన కుమారుడు ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడని తెలిపారు. ‘‘నా కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి కథ అద్భుతం. ఇంతసేపూ అతడు భయపడలేదు’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై అమెరికా కోస్ట్గార్డ్ ఆర్కిటిక్ జిల్లా కమాండర్ రియర్ అడ్మిరల్ బాబ్ లిటిల్ స్పందిస్తూ.. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి కుటుంబాలు, స్నేహితులు, వారి సమాజానికి సానుభూతి తెలిపారు.ఇదీ చదవండి: ఆరేళ్ల తర్వాత స్టేజ్పై సెలిన్ డియోన్.. అభిమానుల్లో పండగ!
ఆరేళ్ల తర్వాత స్టేజ్పై సెలిన్ డియోన్.. అభిమానుల్లో పండగ!
పారిస్: ప్రముఖ గాయని సెలిన్ డియోన్ ఆరేళ్ల తర్వాత మళ్లీ వేదికపైకి వచ్చారు. ఫ్రాన్స్లోని పారిస్లో జరిగిన భారీ సంగీత కార్యక్రమంలో ఆమె అభిమానులను అలరించారు. దాదాపు 30 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 1990ల నాటి ఫ్రెంచ్ పాట ‘On ne change pas’తో తన ప్రదర్శనను ప్రారంభించారు.అయితే, చాలా కాలం తర్వాత స్టేజ్పైకి వచ్చిన సెలిన్ డియోన్ కొద్దిసేపు భావోద్వేగానికి గురయ్యారు. దీంతో అభిమానులు ఆమె పేరును గట్టిగా నినదిస్తూ ఉత్సాహపరిచారు. ‘చివరికి మనమంతా కలిసి ఉన్నాం’ అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, ఇంతకాలం తర్వాత అభిమానుల ముందు పాడటం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోందని చెప్పారు.అనారోగ్యంతో దూరంసెలిన్ డియోన్ కొన్నేళ్లుగా అరుదైన స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె కొన్ని సందర్భాల్లో అభిమానులతో పంచుకున్నారు. ఈ సమస్యతో శరీరంలోని కండరాలు ఒక్కసారిగా బిగుసుకుపోవడం, తీవ్రమైన నొప్పి, కండరాల్లో పట్టేయడం వంటి ఇబ్బందులు వస్తాయి. దీంతో ఆమె పలు సంగీత కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మళ్లీ స్టేజ్పై పాడగలనా అనే అనుమానం కూడా ఒక దశలో ఆమెకు కలిగింది.ఆశను వదల్లేదుతన ప్రయాణం అనుకున్నదానికంటే చాలా కష్టంగా సాగిందని సెలిన్ డియోన్ చెప్పారు. అయినా ఆశను మాత్రం వదులుకోలేదని అన్నారు. చిన్న వెలుగురేఖ కనిపించినా దానినే పట్టుకుని ముందుకు సాగినట్లు చెప్పారు. అభిమానుల కోసం, తన కోసం, జీవితాన్ని ఆస్వాదించేందుకు మళ్లీ పాటలు పాడాలని కోరుకున్నట్లు తెలిపారు.ప్రపంచం నలుమూలల నుంచి..ఈ కార్యక్రమానికి పారిస్తో పాటు ప్రపంచంలోని పలు దేశాల నుంచి అభిమానులు వచ్చారు. కెనడా, బ్రెజిల్, బ్రిటన్, టహీటి తదితర ప్రాంతాల నుంచి కూడా పలువురు తరలివచ్చారు. సెలిన్ డియోన్ ఫొటోలు, పేర్లతో ఉన్న టీషర్టులు ధరించి అభిమానులు సందడి చేశారు. ఆమెను మళ్లీ ప్రత్యక్షంగా చూస్తామని అనుకోలేదని కొందరు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.పారిస్లో ప్రత్యేక సందడి2024 పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఈఫిల్ టవర్ వద్ద ‘Hymn to Love’ పాటతో సెలిన్ డియోన్ చేసిన ప్రదర్శన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె కచేరీల సందర్భంగా పారిస్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభిమానుల కోసం పాటలు, కరోకే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె పేరును గుర్తు చేసేలా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.నాలుగు దశాబ్దాల సంగీత ప్రస్థానంసెలిన్ డియోన్ నాలుగు దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో కొనసాగుతున్నారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో ఆమె పాటలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. దీంతో ‘It’s All Coming Back to Me Now’, ‘Because You Loved Me’ వంటి పాటలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చాయి. అయితే, 2022లో తనకు స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ ఉన్నట్లు సెలిన్ డియోన్ చెప్పారు. ఈ సమస్యతో తీవ్రమైన కండరాల నొప్పులు, పట్టేయడం వంటి ఇబ్బందులు వస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో నొప్పి కారణంగా పక్కటెముకలు కూడా విరిగిన సందర్భాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: ఏఐ భయాలు నిజమేనా? సిలికాన్ వ్యాలీలో భిన్న వాదనలు!
జాతీయం
రష్యా పోలీసులు చిత్రహింసలు పెట్టారు
కాన్పూర్: రష్యా రాజధాని మాస్కోలో పోలీసులు తనను అనవసరంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేశారని యూపీలోని కాన్పూర్కు చెందిన చందన్ గుప్తా(45) ఆరోపించారు. నోయిడాలోని యూఫ్లెక్స్ అనే కంపెనీ తరఫున 2023 నుంచి భార్య, కుమారుడితోపాటు మాస్కోలో ఉంటున్నట్లు చందన్ చెప్పారు. రష్యా పోలీసుల కస్టడీలో దాదాపు 48 గంటలు గడిపిన తర్వాత మాస్కో నుంచి తిరిగి స్వదేశానికి వచ్చేశానన్నారు. అక్కడి పోలీసులు తనను, తన స్నేహితుడిని దుర్భాషలాడటంతోపాటు, బెదిరించి, చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఈ సంఘటన తనను ఎంతో వేదనకు గురిచేసిందని, ఇకపై రష్యా ఒక్కటే కాదు, విదేశాలలో ఎన్నడూ పనిచేయరాదని నిర్ణయించుకున్నట్లు శనివారం చెప్పారు. ‘ఈ నెల 5వ తేదీ రాత్రి మిత్రుడు ఆశిష్తో కలిసి మాస్కోలోని కిటే గొరోడ్ మెట్రో స్టేషన్కు, హాంగింగ్ బ్రిడ్జి, అటు నుంచి రెడ్ స్క్వేర్ వైపు నడిచి వెళ్తుండగా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. తాము మద్యం మత్తులో ఉన్నట్లు, అంబులెన్సు కిటికీ అద్దాన్ని పగులగొట్టామని ఆరోపిస్తూ చిత్రహింసలకు గురిచేశారు. ఏవో పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. కుటుంబసభ్యులు, మిత్రులను కూడా కలవనివ్వలేదు. మా కంపెనీ లాయర్ల జోక్యంతో దాదాపు 48 గంటల తర్వాత విడిచిపెట్టారు’అని ఆరోపించారు. రెండు రోజుల క్రితం చందన్ గుప్తా భార్య స్నేహ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తన భర్తను విడిపించేందుకు సాయం చేయాలంటూ యూపీ సీఎం యోగిని అందులో కోరారు. మాస్కోలోని భారత ఎంబసీ తమకు ఎటువంటి సాయం చేయలేదని, రష్యా పోలీసులు చేసిన ఆరోపణలనే వినిపించిందన్నారు.
బ్రిక్స్ ఎఫెక్ట్..! దేశ రాజధానిలో హోటళ్లకు ఫుల్ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు హోటల్ పరిశ్రమకు భారీ డిమాండ్ను తీసుకొచ్చింది. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జరుగుతున్న ఈ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు, దౌత్యవేత్తలు, మంత్రులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో, ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో హోటల్ గదులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సుమారు 3 వేల గదులు బుక్కయినట్లు సమాచారం. హోటల్ గది అద్దెలు కూడా భారీగానే పెరిగాయి. రూ.80 వేల నుంచి రూ.2.3 లక్షల దాకాసాధారణ రోజుల్లో ఫైవ్స్టార్ హోటళ్లలో రూ.10వేల నుంచి రూ.18 వేల వరకు ఉండే లగ్జరీ హోటల్ గది అద్దె ప్రస్తుతం రూ.80 వేలు, అంతకంటే ఎక్కువకు చేరినట్లు హాస్పిటాలిటీ రంగ వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని ఫైవ్స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో రోజుకు రూ.18వేల నుంచి రూ.25 వేల వరకు అద్దె వసూలు చేసే హోటళ్లు ఇప్పుడు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. హోటల్ ఐటీసీ మౌర్యాలో గదికి 11, 12వ తేదీల్లో కేవలం ఒకే ఒక్క రాత్రికిగాను ఏకంగా రూ.2.30 లక్షల బిల్లు వేయడం గమనార్హం. కొన్ని హోటళ్లలో గదులు పూర్తిగా బుక్ కాగా, మరికొన్ని చోట్ల గదులు అందుబాటులో లేకుండా పోయాయి. సదస్సు ముగిసిన తర్వాత కూడా కొంతకాలం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, దాదాపు సెప్టెంబర్ 20 వరకు టారిఫ్లు అధికంగానే ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హోటల్ ‘ఐటీసీ మౌర్య’లో రష్యా అధ్యక్షుడు పుతిన్ బస చేస్తున్న క్రమంలో ఆయన దృష్టిని ఆకర్షించేందుకు వారం రోజుల ముందే దేశంలోని సంపన్న వర్గాలకు చెందిన వారు సైతం ఆ హోటల్లో ప్రైవేటు గదులను బుక్ చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బస చేసిన తాజ్ ప్యాలెస్లోని గదులకూ డిమాండ్ ఆకాశాన్నంటింది.సెంట్రల్ ఢిల్లీకే పరిమితం కాని డిమాండ్బ్రిక్స్ శిఖరాగ్రం ప్రభావం కేవలం సెంట్రల్ ఢిల్లీలోని ఒబెరాయ్, తాజ్ ప్యాలెస్, లీలా ప్యాలెస్ వంటి ఫైవ్స్టార్ హోటళ్లకే పరిమితం కాలేదు. ఏరోసిటీ, గురుగ్రామ్, నోయిడా ప్రాంతాల్లోని హోటళ్లకూ భారీగా బుకింగ్స్ వచ్చాయి. అనేక హోటళ్లలో గదుల లభ్యత దాదాపు లేనట్లు సమాచారం. ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ సభ్యుడు రాజన్ సెహగల్ మాట్లాడుతూ.. బ్రిక్స్ సదస్సు భారత్ ఆతిథ్య, పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించే గొప్ప అవకాశమని అన్నారు. ప్రపంచ దేశాల అధినేతలు, భారీ ప్రతినిధి బృందాలతో భారత్కు వస్తున్నప్పుడు హోటళ్లలో డిమాండ్ పెరగడం సహజమేనని తెలిపారు. ల్యూటెన్స్ ఢిల్లీతో పాటు ఎన్సీఆర్లోని హోటళ్లు కూడా భారీ బుకింగ్స్తో కళకళలాడుతున్నాయని చెప్పారు.అధినేతల కోసం అత్యున్నత స్థాయి గదులుదేశాధినేతలు, మంత్రులు, సీనియర్ దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు సాధారణంగా హోటళ్లలో అత్యున్నత కేటగిరీ గదులనే ఎంచుకుంటారని కేంద్ర అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దీంతో పరిమిత సంఖ్యలో ఉన్న ప్రీమియం గదులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగి అద్దెలు భారీగా పెరిగాయి. భారత ఆతిథ్యానికి ప్రపంచ వేదికబ్రిక్స్ సదస్సు కేవలం హోటల్ రంగానికి వ్యాపార అవకాశాలను కల్పించడమే కాకుండా.. ప్రపంచానికి భారతీయ సంçస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, సంగీతం, నృత్యాలు, ఆతిథ్యాన్ని పరిచయం చేసేందుకు గొప్ప అవకాశమని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్ ఇప్పటికే జీ20, ఏఐ సదస్సు వంటి అంతర్జాతీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని గుర్తుచేస్తూ.. బ్రిక్స్ సదస్సుతో కూడా దేశ పర్యాటక రంగానికి మరింత అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని అంటున్నాయి.ప్రాంతీయ వంటకాలు.. సాంస్కృతిక కార్యక్రమాలుబ్రిక్స్ ప్రతినిధులకు మన దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలు, వంటకాలను పరిచయం చేస్తున్నట్లు ఢిల్లీ హోటల్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ మురళీమణి మీడియాకు తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేకమైన సంçస్కృతి, ఆహార వైవిధ్యం ఉందని, అందుకు అనుగుణంగా వివిధ రకాల వంటకాలను హోటళ్లలో అందిస్తున్నట్లు చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. బడ్జెట్ హోటళ్లలోనూ ప్రాంతీయ వంటకాలను అందించేలా హోటల్ యాజమాన్యాలకు కేంద్రం ముందుగానే సూచనలు చేసినట్లు తెలిసింది.
భారత్ ఇన్నోవేషన్కు ప్రపంచ దేశాలు ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ: 18వ ‘బ్రిక్స్’శిఖరాగ్ర సద స్సు వేదికగా భారత్ తన సాంకేతిక, పరిశోధ నా, స్టార్టప్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్లు, ల్యాబొరేట రీలు, రీసెర్చ్ పార్క్ల నుంచి వెలువడిన అత్యాధునిక డీప్టెక్ ఆవిష్కరణలను ఈ వేదికపై ప్రదర్శించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో ‘బ్రిక్స్’లో ప్రదర్శన ప్రపంచ దేశాలను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో దేశానికి చెందిన 37 అత్యాధునిక డీప్టెక్ ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజారోగ్యం, వైద్యం, పునరుత్పాదక ఇంధనం, సముద్ర సాంకేతికత, విద్యుత్ వాహనాలు, మాతా–శిశు ఆరో గ్యం వంటి విభిన్న రంగాలకు చెందిన సాంకేతిక పరిష్కారాలను ఇందులో ప్రదర్శించారు. వాటిలో ము ఖ్యంగా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యవస్థ, నీటిపై ఏర్పాటు చేసే ఫ్లోటింగ్ సోలార్ పీవీ సాంకేతికత, మెరైన్ రోబోటిక్స్, అరుదైన ఖనిజాల అవసరం లేని రేర్ ఎర్త్ ఫ్రీ ఈ–పవర్ట్రెయిన్లు, ఏఐ ఆధారిత తల్లి– గర్భస్థ శిశువు ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ వంటి వినూత్న పరిష్కారాలను ప్రదర్శించారు. భారత్ ఉన్నత విద్యా వ్యవస్థలో రూపుదిద్దు కుంటున్న ఆవిష్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కేంద్రం పే ర్కొంది. దేశంలోని స్టార్టప్లు, ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రయోగ శాలలు, రీసెర్చ్ పార్క్లను ప్రపంచంలోని కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, విశ్వవిద్యాల యాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వాలు, విదేశాల్లోని భారతీయ పూర్వ విద్యార్థుల నెట్వర్క్తో అనుసంధానం చేయడానికి ఇది ఉపయోగపడనున్నట్లు వేదిక సందర్భంగా కేంద్రం పేర్కొంది. ఈ వేదిక ద్వారా భారత ఆవిష్కర్తలకు కేవలం తమ సాంకేతికతను ప్రదర్శించే అవకాశమే కాకుండా పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, వ్యాపార ఒప్పందాలు, అంతర్జాతీయ విపణిలోకి ప్రవేశం వంటి అవకాశాలు లభించనున్నాయి.‘బ్రిక్స్’ బిజినెస్ ఫోరంతో..శుక్ర, శనివారాల్లో జరిగిన ‘బ్రిక్స్’ బిజినెస్ ఫోరం కార్యక్రమంతో ఈ ప్రదర్శనను అను సంధానం చేశారు. దీంతో ‘బ్రిక్స్’ సభ్య దేశాలకు చెందిన సీఈఓలు, పెట్టుబడి దారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, పరిశ్రమ ప్రతినిధులతో భారతీయ స్టార్టప్లు నేరుగా పరిచయం ఏర్పరుచుకునే అవకాశం లభించింది. బిజినెస్–టు–బిజినెస్(బీ2బీ) సమావేశాలు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, పెట్టుబడి చర్చలు, వ్యాపార సంబంధాల ఏర్పాటు అంశాలకు ఈ వేదిక దోహదపడిందని కేంద్రం పేర్కొంది. భారత్ 2026 ‘బ్రిక్స్’ అధ్యక్షతన నిర్దేశించిన ‘బిల్డింగ్ ఫర్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టెయినబి లిటీ’ అనే థీమ్కు అనుగుణంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు. బిక్స్ ఎడ్యుకేషన్ ట్రాక్లో గుర్తించిన ఐదు ప్రాధాన్య రంగాల్లో ఒకటైన ‘పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్లను బలోపేతం చేయడం’ లక్ష్యాన్ని ఈ ప్రదర్శన ముందుకు తీసుకెళ్తుందని కేంద్రం తెలిపింది. 2026లో భారత డీప్టెక్ స్టార్టప్ల కోసం నిర్వహిస్తున్న ప్రధాన ఎక్స్పోజిషన్లలో ఇది రెండోది. తొలి ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమాన్ని ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జూన్ 14 నుంచి 16 వరకు నిర్వహించారు. తాజాగా బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఈ రెండో ఎడిషన్ ద్వారా భారత ఆవిష్క రణలను ‘బ్రిక్స్’ దేశాల నాయకులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల దృష్టికి తీసికెళ్లడం గమనార్హం.ఆవిష్కర్తలతో విద్యాశాఖ మంత్రి ముచ్చటకేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రల్హాద్ జోషి భారత్ మండపంలోని ఎక్స్ పోజిషన్ను సందర్శించి డీప్టెక్ స్టార్టప్లు, ఆవిష్కర్తలతో మాట్లా డారు. వివిధ రంగాల్లో భారతీయ యువ ఆవిష్కర్తలు రూపొందించిన అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను ఆయన పరిశీలించారు. భారత ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని డీప్టెక్ స్టార్టప్లకు అంతర్జాతీయ స్థాయి వేదిక లభిస్తోందని జోషి పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనే ప్రపంచ నాయకుల ముందు భారతీయ స్టార్టప్లు తమ ప్రతిభ, సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ వేదిక ప్రత్యేక అవకాశాన్ని కల్పించిందని వ్యాఖ్యానించారు.
2 దశాబ్దాల బ్రిక్స్ స్మారక స్టాంప్
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా రెండు స్మారక తపాలా బిళ్లలను పోస్టల్ శాఖ శనివారం విడుదలచేసింది. ఢిల్లీలో 18వ సమావేశంలో ఈ రెండు పోస్టల్ స్టాంప్లను విడుదలచేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ రెండు తపాలా బిళ్లలపై ‘బ్రిక్స్: రెండు దశాబ్దాల సహకారం, 2006–2026’ అని ఇంగ్లిష్, హిందీలో ముద్రించారు. పరస్పర విశ్వాసానికి ప్రతీకగా తొలి స్టాంప్ను, భారత్ అధ్యక్షత సమావేశాలు, కూటమి దార్శనికత, లోగోను గుర్తుచేస్తూ మరో స్టాంప్ను విడుదలచేశారు.
ఎన్ఆర్ఐ
వైఎస్సార్ చెస్ టోర్నమెంట్లో విజేతగా శిబి శ్రీనివాస్ చెమికల
మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ జర్మనీ విభాగం కన్వీనర్ కృష్ణ తేజా రెడ్డి గడ్డం ఆధ్వర్యంలో మ్యూనిక్ నగరంలో వైఎస్సార్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో విజేతగా నిలిచిన డార్మ్ స్టడ్ అప్లయిడ్ సైన్సెస్ యూనివర్సిటీ విద్యార్ధి శిబి శ్రీనివాస్ చెమికలకు వైఎస్సార్ సీపీ ఐటీ విభాగ కోర్డినేటర్ విష్ణు వర్ధన్ రెడ్డి మార్తల ట్రోఫీని అందజేశారు. జర్మనీ వైఎస్సార్ సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయి సూర్య చౌదరి నేలకుర్తి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.(చదవండి: జర్మనీలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి)
కువైట్లో భారీ డీజిల్ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్!
కువైట్ సిటీ: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన వాహనాల నుంచి డీజిల్ దొంగిలించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం పట్టుకుంది. ఈ కేసులో ఓ కువైట్ పౌరుడితో పాటు భారతీయులు సహా 40 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న కొందరు బస్సులు, లారీలను ‘అంగర్’ ప్రాంతంలోని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి డీజిల్ చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇలా సేకరించిన డీజిల్ను ఇతర ట్యాంకర్లలోకి తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ అక్రమ దందా కోసం ట్యాంకర్లను నెలకు 1,600 కువైటీ దినార్లకు అద్దెకు ఇచ్చింది అరెస్టైన కువైట్ పౌరుడేనని విచారణలో తేలింది. చాలాకాలంగా నిఘా పెట్టిన అధికారులు డీజిల్ చోరీ చేస్తున్న సమయంలో ప్రధాన నిందితులను పట్టుకున్నారు. అనంతరం దొంగిలించిన డీజిల్ కొనుగోలు చేసేందుకు వచ్చిన మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.అయితే, డీజిల్ దొంగతనం, విక్రయం, కొనుగోలులో భాగమైన మొత్తం 41 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ముఠా ఉపయోగించిన 38 ట్రక్కులు, బస్సులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలు, ఆర్థిక నష్టాన్ని అరికట్టడంలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇవీ చదవండి: లెబనాన్పై విరుచుకపడ్డ ఇజ్రాయెల్.. 11 మంది మృతి
పౌరసత్వం రద్దయిన వారికి కువైట్ గుడ్న్యూస్
కువైట్ సిటీ: కువైట్లో పౌరసత్వాన్ని కోల్పోయిన వారికి దేశంలో కొనసాగేందుకు కొత్త నివాస అనుమతి నిబంధనను తీసుకురావడానికి ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో పౌరసత్వం రద్దు చేసినా లేదా వెనక్కి తీసుకున్నా, కొన్ని షరతులతో గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు కువైట్లో నివసించేందుకు అనుమతి లభించనుంది.పౌరసత్వం కోల్పోయిన తర్వాత తమ పాత విదేశీ పౌరసత్వాన్ని తిరిగి పొందిన వారు లేదా మరో దేశ పౌరసత్వం పొందిన వారు ఈ కొత్త నిబంధన కింద సాధారణ నివాస అనుమతికి అర్హులవుతారు. అయితే ఈ అనుమతి గరిష్ఠంగా 10 సంవత్సరాల కాలానికి మాత్రమే ఉండనుందని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.అయితే, నివాస అనుమతి మంజూరు చేయడం, దాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలు, నియంత్రణలను రెసిడెన్సీ అఫైర్స్ విభాగం డైరెక్టర్ జనరల్ నిర్ణయించనున్నారు. ఈ నిబంధనల ప్రకారం నివాస అనుమతి పొందిన వారు కువైట్లో ఉద్యోగం చేసేందుకు పాటించాల్సిన నిబంధనలను కూడా అధికారులు నిర్ణయించనున్నారు.అలాగే, సవరించిన నిబంధనలను అధికారిక గెజిట్లో ప్రచురించిన తర్వాత ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. దీంతో పౌరసత్వం కోల్పోయినప్పటికీ ఇతర దేశ పౌరసత్వం పొందిన వారికి కువైట్లో చట్టబద్ధంగా నివసించే అవకాశం లభించనుంది.ఇవి కూడా చదవండి: ప్రయాణికులకు గుడ్న్యూస్.. బహ్రెయిన్-సౌదీ మధ్య కొత్త సౌకర్యం!
ప్రయాణికులకు గుడ్న్యూస్.. బహ్రెయిన్-సౌదీ మధ్య కొత్త సౌకర్యం!
మనామా: బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు కొత్త రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కింగ్ ఫహద్ కాజ్వే మీదుగా లైసెన్స్ పొందిన ట్యాక్సీలు నేరుగా ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగించేందుకు అనుమతి లభించింది. కొత్త నిబంధనల ప్రకారం ఈ సేవలు తాజాగా అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.బహ్రెయిన్, సౌదీ అరేబియా రవాణా అధికారులు పరస్పర సమన్వయంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇరు దేశాల పౌరులు, నివాసితులు, పర్యాటకులు ఇకపై సొంత వాహనాలపై ఆధారపడకుండా ట్యాక్సీల ద్వారా నేరుగా ప్రయాణించే అవకాశం ఏర్పడింది. అలాగే, రెండు దేశాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు.అయితే కాజ్వే మీదుగా నడిచే ట్యాక్సీలకు కొన్ని నిబంధనలు విధించారు. నిర్దేశించిన సాంకేతిక, భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించే లైసెన్స్ పొందిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ట్యాక్సీ వాహనం ఐదేళ్లకు మించి పాతది కాకూడదనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే, కొత్త సేవలు అందుబాటులోకి రావడంతో కింగ్ ఫహద్ కాజ్వేపై ప్రయాణికుల రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది. దీంతో రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం, ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.ఇరు దేశాల మధ్య ట్యాక్సీ రాకపోకలు పెరగడం వల్ల వాణిజ్యం, రిటైల్ వ్యాపారం, పర్యాటకం, ఎగ్జిబిషన్ రంగాలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని బహ్రెయిన్ వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా సొంత వాహనం లేని వారు బహ్రెయిన్ నుంచి సౌదీకి, అక్కడి నుంచి తిరిగి బహ్రెయిన్కు సులభంగా ప్రయాణించేందుకు ఈ సౌకర్యం ఉపయోగపడనుంది.
క్రైమ్
బార్బెక్యూలో బీఫ్ : కెనడాలో చిక్కుల్లో భారతీయ మహిళ
కెనడాలో ఒక ప్రవాస భారతీయ మహిళ ఓవర్ యాక్షన్ నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తన ఇంట్లో అద్దెకి ఉంటున్న వ్యక్తిపై అనుచితంగా ప్రవర్తించిన వైనం కలకలం రేపింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కెనడాలోని సరీ నగరంలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది అంటే.కెనడాలో నివసిస్తున్న రాజ్ తివానా అనే భారతీయ మహిళ, తన అద్దెదారుడితో వాగ్వాదానికి దిగింది. ఆ ఇంట్లోని తోటలో తన స్నేహితుడితో కలిసి బార్బెక్యూలో బీఫ్ వండడాన్ని తివానా అభ్యంతరం చెప్పడంతో వివాదం షురూ అయింది. తన ఇంటిని, గోడల్ని పాడు చేస్తున్నారని ఆరోపిస్తూ వారితో గొడవకు దిగింది. అక్కడితో ఆగలేదు ఒక కర్ర ముక్కను తీసుకుని గ్రిల్ పైనుంచి ఆహారాన్ని తోసేసింది. ఆ తరువాత ఇంట్లోకి చొరబడి మరీ ఆమె రాయితో దాడిచేసింది. మస్కిటో బ్యాట్తోనూ ఎటాక్ చేసింది. తన యూనిట్ నుంచి వెళ్లిపోమని పదేపదే దూషించడం, అతడిపై ఎటాక్ చేయడం లాంటివి వీడియోలు రికార్డైనాయి. దీంతో బాధితుడు తన యజమానురాలు పదేపదే వేధిస్తోందని, తన పనుల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ వరుస వీడియోలను పోస్ట్ చేశాడు. ఇదీ చదవండి: జొమాటో కస్టమర్ల నెత్తిన పిడుగు, భారీ షాకిచ్చిందిగా! An Indian woman in Canada clashed with her tenant after objecting to him using a barbecue in the garden with a friend on her property. After a video of their altercation went viral, the man shared a series of clips alleging that the incident was part of a larger pattern of… pic.twitter.com/vGMtZnVSmZ— Hate Detector 🔍 (@HateDetectors) September 12, 2026తన గదిని ఖాళీ చేసి వెళ్లాలని వేడుకుంటున్నావినలేదంటూ మరో వీడియో షేర్ చేశాడు. ముందస్తు సమాచారం లేకుండానే లోపలికి వచ్చి తాళాలు మార్చేయడమే కాకుండా, చివరకు అతని ఇంటి ప్రధాన తలుపునే పూర్తిగా తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకో వీడియోలో కొంతమంది పురుషులు ఆ ప్రాంగణంలోకి ప్రవేశించడం, ఘర్షణ పడటం కూడా రికార్డైంది. అతని ఫిర్యాదు మేరకు ఈ సంఘటనకు సంబంధించి తివానాను అరెస్టు చేసినట్టు కూడా ఈ వీడియోల ద్వారా తెలుస్తోంది.ఇదీ చదవండి: నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్Landlord and tenant disputes in Canada are rampant specifically in Punjabi dominated areas and properties; however this incident between Raj Tiwana and her tenant has turned the conversation exceedingly factional; entire incident is being seen from a highly racists point of view… pic.twitter.com/YKQnx07R0v— Arshdeep Singh Saini (@the_lama_singh) September 12, 2026అయితే ఈ ఘటనలో అసలు వివాదానికి కారణాలపై స్పష్టత లేదు. అలాగే దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసులు నమోదు చేసిన అభియోగాలు తదితర అంశాలపై క్లారిటీ లేదు. ఇదీ చదవండి : రూ. 250లతో చెట్టు కింద ఉచిత స్కూలు: KBC 18 కంటెస్టెంట్ ఇంట్రస్టింగ్ స్టోరీ
ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చుపెట్టిన 'డ్రెస్'!
ముంబై: ఇతరుల డ్రెస్ వేసుకోవడం, వారి వస్తువులను వాడుకోవడమంటే కొందరికి చెడ్డ చిరాకు. అలాగే, చెప్పకుండానే ఇతరులు తమ డ్రెస్ను వేసుకోవడాన్ని, వస్తువులు వాడుకోవడాన్ని ఏమాత్రం సహించలేరు. ముంబైలోని గోరెగావ్ ప్రాంతంలో సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ఇది ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చుపెట్టింది. ఆగ్రహంతో కొట్లాడుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.సూరజ్ శంకర్ ధోలె(26), బాబా సాహెబ్ అలియాస్ సుబోధ్ భీమ్రావ్ వాంఘ్మారేలు గోరెగావ్లోని ఓ పెట్ కేర్ సెంటర్లో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నారు. అయితే, ధోలె తరచుగా వాంఘ్మారే డ్రెస్లు వేసుకోవడం, అతడి వస్తువులను వాడుకోవడం చేస్తున్నాడు. ఇది వాంఘ్మారేకు ఏమాత్రం నచ్చడం లేదు.తన అనుమతి లేకుండానే ధోలె ఇలా చేయడంపై వాంఘ్మారేకు కోపంగా ఉంది. దీనిపై శుక్రవారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో వాంఘ్మారే చేతిలో ధోలె ప్రాణాలు కోల్పోయాడు. ధోలె తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు..పరారీలో ఉన్న వాంఘ్మారే కోసం గాలింపు చేపట్టారు.ఇదీ చదవండి: గుజరాత్కు ఎందుకు తరలించారు?
నాలుగేళ్లుగా ప్రైవేట్ హోటల్స్లో గడిపారు!
హైదరాబాద్: స్నాప్చాట్లో పరిచయం ప్రేమగా మారింది. ఏకాంతంగా నాలుగేళ్లుగా ప్రైవేట్ హోటల్స్లో గడిపారు. పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తేవడంతో అతను ముఖం చాటేశాడు. ఈ ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. నాగాపూర్కు చెందిన యువతి(22) హైదరాబాద్ శాలిబండకు చెందిన యువకుడితో(24) స్నాప్ చాట్ 2022వ సంవత్సరంలో పరిచయమయ్యారు.పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ప్రేమించిన యువకుడి కోసం నాగాపూర్ నుంచి యువతి అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుండేది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ రెసిడెన్షియల్లో గదిని అద్దెకు తీసుకొని గడిపేవారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో యువకుడు ముఖం చాటేశాడు. మరొక అమ్మాయిని ప్రేమించానంటూ బాధిత యువతిని మోసం చేశాడు. దీంతో బాధితురాలు గురువారం నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: చంపి ముక్కలు చేసి.. అడవిలో పడేసి
నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్
సాక్షి,ముంబై : బాలీవుడ్ నటి అమీషా పటేల్ కుటుంబానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమీషా పటేల్ తల్లిదండ్రుల చర్చిగేట్ (ముంబై) నివాసం నుండి , బంగారు, వజ్రాల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇంటి పనిమనిషే ఈ చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నటి తల్లి ఆశా పటేల్ ఫిర్యాదు మేరకు నిందితురాలు సీమా ఘాటేను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.పోలీసుల కథనం ప్రకారం జనవరి 2026లో ఒక గాజు చోరీకి గురైంది. దీనిపై సీమాను అనుమానించిన ఆశా పటేల్, తప్పు ఒప్పుకుని, పోయిన ఆభరణాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆమె కోరారు.అయితే, ఆ గాజును తిరిగి ఇవ్వకపోవడంతో, ఆశా పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు.దీంతో పాలఘర్కు చెందిన 40 ఏళ్ల సీమా ఘాటే అనే ఇంటి పనిమనిషిని మెరైన్ డ్రైవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ 5 లక్షలకు పైమాటే. వీటిల్లో డైమండ్గాజులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో గృహ కార్మికురాలిగా పని చేస్తోంది.ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్దీనిపై అమీషా పటేల్ తల్లి ఆశా పటేల్, పనిమనిషి ఘాటేపై అనుమానం వ్యక్తం చేస్తూ మెరైన్ డ్రైవ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు విరార్లో ఘాటేను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి ఎలాంటి రికవరీ చేయలేదు.నిందితురాలు సీమ నేర చరిత్ర, సహచరులు ప్రాతను పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. మరోవైపు ఆమెకు సెప్టెంబర్ 15 వరకు మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..!
వీడియోలు
నాతో పెట్టుకోకు వైభవ్ కు చుక్కలు చూపించిన బుమ్రా
నీకే డబ్బులు పడలేదా.. అందరి ముందు TDP నేత పరువు తీసిన కేతిరెడ్డి
అందుకే కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారు బాబుపై TJR సుధాకర్ బాబు షాకింగ్ కామెంట్స్
ప్రభుత్వ ఉద్యోగులంటే మీకెందుకు ఇంత చిన్న చూపు
జగన్ వెంట లక్షలాది సైనికులు.. YSRCPని ఎవరూ కదిలించలేరు
ధరణి పేరుతో ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు
లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
50 ఏళ్ల MAPను ఎందుకు మార్చారు? మనం చూసిన వరల్డ్ మ్యాప్ నిజం కాదా?
వైస్ కెప్టెన్ పదవి వచ్చినా హ్యాపీగా లేను.. తిలక్ వర్మ షాకింగ్ కామెంట్స్
భారీగా పెరిగిన బంగారం ధరలు

