ఇదీ పరిస్థితి.. అమరావతిలో.. సీఎం, సీఎస్ వెళ్లే దారిలోనే..!
విజయవాడ: ఏపీలో నిబంధనలను తుంగలో తొక్కి బార్ అండ్ రెస్టారెంట్ను టెంట్ల్లో అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చిన ఘటన మరొకటి వెలుగుచూసింది. అమరావతిలో బార్ అండ్ రెస్టారెంట్కు టెంట్ వేసి మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చారు. దాంతో బరితెగించి ఓపెన్ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. అది కూడా అసెంబ్లీ, సచివాలయంకి వెళ్లే దారిలో కొత్త బార్ అండ్ రెస్టారెంట్ వెలిసింది. సీఎం, సీఎస్లు వెళ్లే దారిలో నిబంధనలకు విరుద్ధంగా ఇది ఏర్పాటు చేయడం లిక్కర్ అమ్మకాల పాలసీని ఎలా పక్కదోవ పట్టిస్తున్నారో అనే దానికి అద్దం పడుతోంది. రేకుల షెడ్డు, టెంట్ కిందే బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ మంత్రి ఊర్లో రూల్స్ గీల్స్ జాన్తా నై..!
మ్యాచ్ మధ్యలో ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
దక్షిణాఫ్రికా దేశవాలీ క్రికెట్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. లయన్స్ అనే ఫ్రాంచైజీ తమ ఆల్రౌండర్ బేయర్స్ స్వానెపోల్ను సస్పెండ్ చేసింది. ఓ టోర్నీ ఫైనల్ మ్యాచ్ మధ్యలో వేదికను వదిలి వెళ్లిపోయినందుకు లయన్స్ యాజమాన్యం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తొలుత బేయర్స్ గాయం కారణంగా మైదానాన్ని వీడాడని అంతా అనుకున్నారు. చివరికి అతను ఏకంగా వేదికనే వీడి యూకే విమానం ఎక్కినట్లు తెలిసింది. విషయం తెలిసి రిఫరి 10 మందితోనే మ్యాచ్ కొనసాగించాలని లయన్స్ను ఆజ్ఞాపించాడు. బేయర్స్ మైదానం వీడే సమయానికి మ్యాచ్ నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది. బేయర్స్ గైర్హాజరీలో లయన్స్ 10 మందితోనే మ్యాచ్ కొనసాగించలేక, చివరి బంతి వరకు పోరాడి ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో బేయర్స్ ఉండి ఉంటే, ఫలితం లయన్స్కు అనుకూలంగా వచ్చేది. ఆ మ్యాచ్లో బేయర్స్ బంతితో అద్భుతంగా రాణించి (3-44) లయన్స్ను మ్యాచ్లో నిలిపాడు. అయితే కీలక తరుణంలో హ్యాండ్ ఇచ్చి లయన్స్ ఓటమికి కారకుడయ్యాడు. ఇంతకీ బేయర్స్ అంత అర్జెంట్గా విమానం ఎక్కి యూకేకు ఎందుకు వెళ్లాడని ఆరా తీయగా.. అతను వోర్సెస్టర్షైర్ కౌంటీతో ఒప్పందంలో భాగంగా అలా చేశాడని తెలిసింది. ఆ విమానం మిస్ అయితే వోర్సెస్టర్షైర్తో ఒప్పందం ఉల్లంఘన జరుగుతుందని అలా చేసినట్లు బేయర్స్ స్వయంగా చెప్పాడు.బేయర్స్ చర్యను చాలా సిరీయస్గా తీసుకున్న లయన్స్ యాజమాన్యం అతని కాంట్రాక్ట్ను రద్దు చేసింది. బేయర్స్ అంత సాహసం ఎందుకు చేశాడని ఆరా తీయగా మరో సంచలన విషయం కూడా బయటపడింది. అతను క్రికెట్ సౌతాఫ్రికా నుంచి ఎన్వోసీ కూడా లేకుండానే యూకేకు పయనమైనట్లు తెలిసింది. ఈ చర్య వల్ల బేయర్స్ సౌతాఫ్రికా జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం కూడా కోల్పోతాడు. బేయర్స్ కౌంటీ ఛాన్స్ కోసం చూసుకొని ఫ్రాంచైజీతో పాటు క్రికెట్ సౌతాఫ్రికా ఆగ్రహానికి గురయ్యాడు.ఈ మొత్తం ఉదంతంపై బేయర్స్ స్పందించాడు. లయన్స్ యాజమాన్యానికి, అభిమానులకు, క్రికెట్ సౌతాఫ్రికాకు క్షమాపణులు చెప్పాడు. ఈ కౌంటీ సీజన్ నాకు చాలా ప్రత్యేకం. అందుకే అలా చేయక తప్పలేదని వివరణ ఇచ్చాడు.
మధుమేహం, అధిక బరువు : బ్రయాన్ జాన్సన్ చిట్కా
యాంటీ-ఏజింగ్ ఇన్ఫ్లుయెన్సర్ బ్రయాన్ జాన్సన్ గుర్తున్నాడా? మరణాన్ని జయించాలని చూస్తున్న అమెరికా టెక్ వ్యాపారవేత్త బ్రయాన్ మరో సరికొత్త చిట్కాను పంచుకున్నాడు. భోజనం తర్వాత 30 నిమిషాల నడక కంటే 10 స్క్వాట్లు చేయడం మేలంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ కోసం భోజనం తర్వాత నడవడం చాలా మంచిదని పలువురు వైద్యులు, నిపుణులు చెబుతున్న మాట. అయితే అనేక ప్రయోగాలు, మందులు, ఆహార అలవాట్లతో యువకుడిగా మారిన బ్రయాన్ జాన్సన్ వాకింగ్ కంటే 10 స్క్వాట్లు ఉత్తమమని చెబుతున్నాడు. స్క్వాట్లతో చాలా తక్కువ టైంలోనే చక్కటి జీవక్రియ ప్రయోజనాలను అందిస్తుందని జాన్సన్ వాదన."30 నిమిషాల నడక కంటే రక్తంలో చక్కెర నియంత్రణ కోసం, ప్రతి 45 నిమిషాలకు 10 స్క్వాట్లు చేయడం అనేది, కేవలం 30 నిమిషాల నడక కంటే 14 శాతం ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుంది," అని జాన్సన్ పేర్కొన్నాడు.. "అధిక బరువు మరియు ఊబకాయం ఉన్న పురుషులలో, మధ్యమధ్యలో కూర్చోవడం వల్ల కండరాల కదలిక పెరిగి గ్లైసెమిక్ నియంత్రణ మెరుగుపడుతుంది" అనే శీర్షికతో ఉన్న 2024 అధ్యయనాన్ని ఆయన ఉటంకించం గమనార్హం. శరీరంలో క్వాడ్స్ (తొడ కండరాలు), గ్లూట్స్ (పిరుదుల కండరాలు) అతిపెద్ద 'గ్లూకోజ్ స్పాంజ్లు' అని, స్క్వాట్లు చేయడం వల్ల అవి సమర్థవంతంగా ఉత్తేజితమవుతాయని జాన్సన్ వివరించారు. (నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!)10 squats beats a 30 min walk.For blood sugar control after a meal, doing 10 squats every 45 minutes outperforms a dedicated 30 min walk by 14%.The mechanism: your quadriceps and glutes are the largest glucose sponge in your body. Activating them repeatedly clears more… pic.twitter.com/OMmfVGqRUY— Bryan Johnson (@bryan_johnson) April 9, 2026 క్వాడ్రిసెప్స్, గ్లూట్స్ శరీరంలో అతిపెద్ద గ్లూకోజ్ స్పాంజ్లు. వీటిని తరచుగా ఉత్తేజపరచడం ద్వారా ఒకేసారి చేసే ప్రయత్నంలో కంటే ఎక్కువ గ్లూకోజ్ తొలగించబడుతుంది. 30 నిమిషాల నడక తప్పు కాదు, కానీ అది అంత సమర్థవంతమైనది కాదని బ్రయాన్ తెలిపాడు. అంతేకాదులో పనిలో లేదా కార్యాలయంలో ఎక్కువ గంటలు కూర్చునే అలవాటును విడనాడటం వల్ల ఈ 14 శాతం ప్రయోజనం లభించిందని జాన్సన్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?ఖచ్చితంగా చెప్పాలంటే, ఎక్కువసేపు కూర్చున్న తర్వాత ఒకేసారి నడవడంతో పోలిస్తే, అధిక బరువు మరియు ఊబకాయం ఉన్న పురుషులలో చిన్నపాటి నడక లేదా స్క్వాటింగ్ విరామాలు గ్లైసెమిక్ నియంత్రణను సమర్థవంతంగా మెరుగుపరుస్తాయని 2024 అధ్యయనం వెల్లడించింది. ఆ 14 శాతం ప్రయోజనం ప్రతి 45 నిమిషాలకు కూర్చోవడాన్ని విరామం ఇవ్వడం వల్ల వచ్చింది, అంతేగానీ ప్రత్యేకంగా స్క్వాట్స్ చేయడం వల్ల కాదు. ప్రతి 45 నిమిషాలకు కొద్దిసేపు నడవడం కూడా స్క్వాట్స్తో సమానంగా పని చేస్తుందని ఈ స్టడీ తెలిపింది.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో, ఈ విధానంపై దాదాపు అందరూ సానుకూల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భోజనం తర్వాత నడవడానికి తగినంత సమయం లేని వారు ఇప్పుడు కేవలం స్క్వాట్స్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సోషల్ మీడియా వినియోగదారులు సూచించారు."చాలా సులభం, అయినా అద్భుతంగా ప్రభావవంతమైనది," అని ఒకరు,"భోజనం చేసిన వెంటనే నడవడానికి సమయం లేకపోతే, ఇది మంచి పద్ధతు అని మరొకరు వ్యాఖ్యనించారు. "అవును, నిజమే. రోజుకు ఒకసారి 30 నిమిషాలు నడిచి, మిగిలిన 8 గంటలు కూర్చోవడం మీ జీవక్రియను పూర్తిగా కాపాడదు. దానికి బదులుగా, భోజనం తర్వాత ప్రతి గంటకు మీ కుర్చీలోంచి లేచి 10 స్క్వాట్స్ చేయడం రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కమెంట్ చేశారు.
‘డెకాయిట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: డెకాయిట్ నటీనటులు: అడివి శేష్,మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల తదితరులునిర్మాత: సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్కథ, స్క్రీన్ప్లే: అడివి శేష్ దర్శకత్వం: షానియల్ డియోసంగీతం: భీమ్స్ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్విడుదల తేది: ఏప్రిల్ 10, 2026అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన చిత్రం ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. టీజర్, ట్రైలర్తో అంచనాలు పెంచేసిన ఈ టీం మరి ఆడియెన్స్ని మెప్పించిందా? లేదా? అన్నది చూద్దాం.కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ.ఎలా తీశారంటే?..ప్రేమ కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రేమ కథల్ని ఎంత కొత్తగా, ఎంత అట్రాక్టివ్గా చెప్పామన్నదే విజయంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఆ విషయంలో డెకాయిట్ కొంత వరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రేమకు కులం అడ్డు అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇందులోనే అదే పాయింట్ను చూపించారు. కానీ ఇందులోని ప్రేమ కథను, ప్రేమికుల్ని కాస్త కొత్తగా, భిన్న శైలిలో చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రేయసి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు హీరో. ఇద్దరూ కలిసి దొంగ తనాలు కూడా చేస్తుంటారు. ఇంటర్వెల్కు ఓ చిన్న పాటి ట్విస్ట్లాంటిది ఇస్తారు.ఇక సెకండాఫ్లో హీరోకి అసలు విషయం తెలియడం, గతానికి సంబంధించిన నిజం, తన కోసం ప్రేయసి చేసిన త్యాగం ఇవన్నీ తెలుస్తాయి. ఇక ప్రేయసికి ఉన్న ఇబ్బందిని తీర్చేందుకు ప్రియుడు చేసే త్యాగంతో క్లైమాక్స్ కాస్త బరువెక్కినట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ ట్విస్ట్ కూడా ఆడియెన్స్ ముందే పసిగట్టేస్తారు. కాబట్టి చివరకు అదేదో పెద్ద ట్విస్ట్, త్యాగంలా అనిపించదు. పైగా ఇది వరకు సినిమాల్లో చూసేసి ఉండటంతో ఇక్కడ ఆ ట్విస్ట్ అంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు.అయితే ఈ చిత్రంలో కరోనా సమయంలో హాస్పిటల్స్ చేసిన దోపిడి, వ్యవహరించిన తీరుని మాత్రం బాగానే చూపించారు. ఈ సినిమాలో చాలా వరకు కరోనా నాటి పరిస్థితులు, అప్పటి వైద్య వ్యవస్థ గురించే చర్చించారు. ఆ పార్ట్ వరకు డెకాయిట్ ఆడియెన్స్ని మెప్పించే ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు.ఎలా చేశారంటే?అడివి శేష్ ఈ సారి కాస్త కొత్తగా కనిపించాడు. యాసలోనూ చాలా వరకు మాడ్యులేషన్ చూపించాడు. ఆ యాస వల్లే కొన్ని డైలాగ్స్ కూడా అర్థం కాకపోవచ్చు. లుక్స్, యాక్షన్ పరంగా అడివి శేష్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. ఇక మృణాల్కి మరోసారి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. సరస్వతి అలియాస్ జూలియట్గా మృణాళ్ ఆడియెన్స్ మరోసారి మెస్మరైజ్ చేస్తుంది. ఇక అనురాగ్ కశ్యప్ పాత్ర ఇంపాక్ట్ చూపిస్తుంది. సునీల్, ప్రకాష్ రాజ్ కారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. ఆర్ఆర్ సైతం సరికొత్తగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అయితే విజువల్స్ గురించి చెప్పుకోవాలి. కెమెరా వర్క్ టాప్ నాచ్లో ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా అనిపిస్తాయి. ప్రతీ పైసాకి తగ్గ వర్క్ తెరపై కనిపిస్తుంది.
దురంధర్-2 వసూళ్లు.. 22 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై 12 జట్లతో!
ఏ యుద్ధమైనా బలయ్యేది వాళ్లే..!
IPL 2026: సునీల్ నరైన్ ప్రపంచ రికార్డు
‘చంద్రబాబు.. అన్ని రూ. లక్షల కోట్లు ఎందుకు?’
రాకా మూవీ.. హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
'సమోసా' ఎక్కడి వంటకమో తెలుసా..?!
'యాప్లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓ
మధురలో నీట మునిగిన పడవ.. 12 మంది మృతి
పాకిస్తాన్ లీగ్ ఆడుతుండగానే మరో లీగ్తో ఒప్పందం చేసుకున్న స్టీవ్ స్మిత్
అవన్నీ పీరియడ్స్లో ఉండగానే చేశా: శ్రీలీల
రష్మిక ఊర్లో రిసెప్షన్.. మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తండ్రి
ఇది మా చారిత్రక విజయం.. మా లక్ష్యాలు ఇవే..: ఇరాన్
విజయ్కు షాక్.. పోటీ చేయకముందే ఓటమి
నా దగ్గర పైసలు లేవు. అమరావతి అని పదిసార్లు అనుకో! పో!
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
చంద్రబాబు సర్కార్ మళ్లీ అప్పు
ఆంటీ అనకూడదు
రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సీజ్ఫైర్ ప్రకటన
అంతకాలం సీఎంగా ఉండి ఆమె ఇంకేం పనిచేసినట్లు సార్!
కీర్తి సురేశ్కు మందు అలవాటు లేదు కానీ..: సమంత
PSL: పాక్ క్రికెట్ బోర్డు పరువు తీసిన ఆసీస్ స్టార్!
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
‘చిరయ్యా’ రివ్యూ : ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్ ఇది!
బంగారం ధరలు రివర్స్.. కొనేవారికి గుడ్న్యూస్
అనుష్క శెట్టి.. నమ్మశక్యం కాని రూమర్
సముద్ర గర్భంలో రష్యా దుష్ట కార్యక్రమాలు
‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’
'విశ్వంభర' విడుదల తేదీ వైరల్
పిట్ట ముట్టడం లేదని.. చెట్టును పెంచాడు!
దురంధర్-2 వసూళ్లు.. 22 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై 12 జట్లతో!
ఏ యుద్ధమైనా బలయ్యేది వాళ్లే..!
IPL 2026: సునీల్ నరైన్ ప్రపంచ రికార్డు
‘చంద్రబాబు.. అన్ని రూ. లక్షల కోట్లు ఎందుకు?’
రాకా మూవీ.. హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
'సమోసా' ఎక్కడి వంటకమో తెలుసా..?!
'యాప్లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓ
మధురలో నీట మునిగిన పడవ.. 12 మంది మృతి
పాకిస్తాన్ లీగ్ ఆడుతుండగానే మరో లీగ్తో ఒప్పందం చేసుకున్న స్టీవ్ స్మిత్
అవన్నీ పీరియడ్స్లో ఉండగానే చేశా: శ్రీలీల
రష్మిక ఊర్లో రిసెప్షన్.. మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తండ్రి
ఇది మా చారిత్రక విజయం.. మా లక్ష్యాలు ఇవే..: ఇరాన్
విజయ్కు షాక్.. పోటీ చేయకముందే ఓటమి
నా దగ్గర పైసలు లేవు. అమరావతి అని పదిసార్లు అనుకో! పో!
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
చంద్రబాబు సర్కార్ మళ్లీ అప్పు
ఆంటీ అనకూడదు
రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సీజ్ఫైర్ ప్రకటన
అంతకాలం సీఎంగా ఉండి ఆమె ఇంకేం పనిచేసినట్లు సార్!
కీర్తి సురేశ్కు మందు అలవాటు లేదు కానీ..: సమంత
PSL: పాక్ క్రికెట్ బోర్డు పరువు తీసిన ఆసీస్ స్టార్!
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
‘చిరయ్యా’ రివ్యూ : ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్ ఇది!
బంగారం ధరలు రివర్స్.. కొనేవారికి గుడ్న్యూస్
అనుష్క శెట్టి.. నమ్మశక్యం కాని రూమర్
సముద్ర గర్భంలో రష్యా దుష్ట కార్యక్రమాలు
‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’
'విశ్వంభర' విడుదల తేదీ వైరల్
పిట్ట ముట్టడం లేదని.. చెట్టును పెంచాడు!
ఫొటోలు
గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ (ఫొటోలు)
సీతామహాలక్ష్మిలా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)
తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
మిస్ తెలుగు యూఎస్ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)
తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)
గ్రాండ్గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)
సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)
సినిమా
చిన్న సినిమా ఘన విజయం.. వారం రోజుల్లోనే సెంచరీ
మలయాళంలో రెండేళ్ల క్రితం సంచలన విజయం సాధించిన చిత్రాల్లో "వాళా" ఒకటి. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.40 కోట్లు వసూలు చేసింది. వాళా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. అలాగే పనీపాటా లేకుండా తిరిగే సోమరులని కూడా అదే పేరుతో పిలుస్తారు. వాళా చిత్రానికి 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్' అనేది ట్యాగ్లైన్ ఇచ్చారు.మలయాళంలో హిట్ కొట్టిన తెలుగు డైరెక్టర్2024లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్ దాస్ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నాడు. సెంచరీ కొట్టిన వాళా 2ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం ఏకంగా సెంచరీ కొట్టింది. కేవలం వారం రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోవడం విశేషం. ఈ ఏడాది మన శంకరవరప్రసాద్గారుతో హిట్ అందుకున్న సాహు గారపాటి.. మూడు నెలల్లో వాళా 2తో మరో బ్లాక్బస్టర్ అందుకున్నాడు. కాగా వాళా మొదటి భాగం హాట్స్టార్లో మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. View this post on Instagram A post shared by Vaazha-2 Movie (@vaazhamovie) చదవండి: గాయపర్చుకున్న హీరో.. కదల్లేని స్థితిలో ఉంటే..
నీ పెళ్లాన్ని సన్నగా చేయ్ అని ట్రోలింగ్.. ఆ వ్యాధి వల్లే..: విశ్వ
నటుడు విశ్వ సీరియల్స్లో, సినిమాల్లో యాక్ట్ చేశాడు. తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలం క్రితమే విశ్వ ఫిట్నెస్ క్లబ్ ఓపెన్ చేసి జిమ్ ట్రైనర్గానూ మారాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టాడు. విశ్వ మాట్లాడుతూ.. 'నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 24 ఏళ్లవుతోంది. 10వ తరగతి అయిపోగానే పరిశ్రమలో అడుగుపెట్టాను. పెళ్లికోసం, విద్యార్థి వంటి పలు చిత్రాల్లో నటించాను. తర్వాత సీరియల్స్ చేశాను. తొక్కేశారుకొంతకాలంగా సీరియల్స్కు దూరంగా ఉన్నాను. ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్నాను. అయితే ఒకానొక సమయంలో నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా తొక్కేశారు. అప్పుడు నా తమ్ముడి సంపాదనపైనే బతికాను. ఆరునెలలపాటు వాడే ఇంటిని నడిపించాడు. అలాగే నాన్నకు వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు ఫాస్ట్ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాం. ఎప్పుడైనా పనివాళ్లు రాకపోతే నేను గిన్నెలు కడిగేవాడిని. రేషన్ బియ్యం తిన్న రోజులున్నాయి అన్నాడు.నా అభిమానిశ్రద్ధతో తన లవ్స్టోరీ గురించి చెప్తూ.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో శ్రద్ధ నన్ను చూసి ఇష్టపడింది. అప్పటికి నేను బ్రేకప్ బాధలో ఉన్నాను. నిజమైన ప్రేమ లేదని తెగ బాధపడిపోతూ ఉన్నాను. ఆ సమయంలో శ్రద్ధ మెసేజ్ చేయడంతో టైంపాస్ చేద్దామని నా నెంబర్ ఇచ్చాను. తనకు చాలా కనెక్ట్ అయిపోయాను. వారం రోజులకే తను ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పింది. వాళ్లు మొదట ఒప్పుకోలేదు. నా గురించి పూర్తిగా ఆరా తీశాకే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ట్రోల్స్ఆమెను దేవుడు నాకోసం పంపిన ఏంజెల్ అని భావిస్తాను. విశ్వ ఫిట్నెస్ క్లబ్లో శ్రద్ధ డైట్ ప్లాన్, ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటుంది. నేనేమో ఎక్సర్సైజ్ చేయిస్తాను. అయితే మేమిద్దరం కలిసి సోషల్ మీడియాలో ఏదైనా వీడియో పెడితే చాలు.. ముందు నీ పెళ్లాన్ని సన్నగా చేయు, వేరేవాళ్లకు నీతులు చెప్పడం కాదు, ఇంట్లో సక్కగ చూసుకో అని ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్లు అన్నదాంట్లో తప్పు లేదనుకోండి.ఆ వ్యాధి వల్లే..అయితే రెండోసారి కొడుకు పుట్టిన తర్వాత హార్మోన్ల అసమతుల్యత కారణంగా శ్రద్ధ విపరీతంగా బరువు పెరిగిపోయింది. కొన్ని నెలలకు ఎక్సర్సైజ్ మొదలుపెట్టాం. కానీ తనకు కార్పెల్ టన్నెల్ అనే అరుదైన వ్యాధి వచ్చింది. దానివల్ల చేతులు బలహీనంగా మారిపోయాయి. పిల్లాడికి షర్ట్ బటన్ కూడా పెట్టేంత శక్తి లేకపోయింది. అంటే.. తన పనులు తను చేసుకోలేదు. ఆ వ్యాధి వల్ల ఎక్సర్సైజ్ ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ కోలుకుంది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఎక్సర్సైజ్ మొదలుపెట్టింది' అని విశ్వ చెప్పుకొచ్చాడు.చదవండి: లోక సినిమా.. నన్ను మోసం చేశారు: మమ్ముట్టి
‘డెకాయిట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: డెకాయిట్ నటీనటులు: అడివి శేష్,మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల తదితరులునిర్మాత: సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్కథ, స్క్రీన్ప్లే: అడివి శేష్ దర్శకత్వం: షానియల్ డియోసంగీతం: భీమ్స్ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్విడుదల తేది: ఏప్రిల్ 10, 2026అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన చిత్రం ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. టీజర్, ట్రైలర్తో అంచనాలు పెంచేసిన ఈ టీం మరి ఆడియెన్స్ని మెప్పించిందా? లేదా? అన్నది చూద్దాం.కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ.ఎలా తీశారంటే?..ప్రేమ కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రేమ కథల్ని ఎంత కొత్తగా, ఎంత అట్రాక్టివ్గా చెప్పామన్నదే విజయంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఆ విషయంలో డెకాయిట్ కొంత వరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రేమకు కులం అడ్డు అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇందులోనే అదే పాయింట్ను చూపించారు. కానీ ఇందులోని ప్రేమ కథను, ప్రేమికుల్ని కాస్త కొత్తగా, భిన్న శైలిలో చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రేయసి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు హీరో. ఇద్దరూ కలిసి దొంగ తనాలు కూడా చేస్తుంటారు. ఇంటర్వెల్కు ఓ చిన్న పాటి ట్విస్ట్లాంటిది ఇస్తారు.ఇక సెకండాఫ్లో హీరోకి అసలు విషయం తెలియడం, గతానికి సంబంధించిన నిజం, తన కోసం ప్రేయసి చేసిన త్యాగం ఇవన్నీ తెలుస్తాయి. ఇక ప్రేయసికి ఉన్న ఇబ్బందిని తీర్చేందుకు ప్రియుడు చేసే త్యాగంతో క్లైమాక్స్ కాస్త బరువెక్కినట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ ట్విస్ట్ కూడా ఆడియెన్స్ ముందే పసిగట్టేస్తారు. కాబట్టి చివరకు అదేదో పెద్ద ట్విస్ట్, త్యాగంలా అనిపించదు. పైగా ఇది వరకు సినిమాల్లో చూసేసి ఉండటంతో ఇక్కడ ఆ ట్విస్ట్ అంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు.అయితే ఈ చిత్రంలో కరోనా సమయంలో హాస్పిటల్స్ చేసిన దోపిడి, వ్యవహరించిన తీరుని మాత్రం బాగానే చూపించారు. ఈ సినిమాలో చాలా వరకు కరోనా నాటి పరిస్థితులు, అప్పటి వైద్య వ్యవస్థ గురించే చర్చించారు. ఆ పార్ట్ వరకు డెకాయిట్ ఆడియెన్స్ని మెప్పించే ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు.ఎలా చేశారంటే?అడివి శేష్ ఈ సారి కాస్త కొత్తగా కనిపించాడు. యాసలోనూ చాలా వరకు మాడ్యులేషన్ చూపించాడు. ఆ యాస వల్లే కొన్ని డైలాగ్స్ కూడా అర్థం కాకపోవచ్చు. లుక్స్, యాక్షన్ పరంగా అడివి శేష్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. ఇక మృణాల్కి మరోసారి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. సరస్వతి అలియాస్ జూలియట్గా మృణాళ్ ఆడియెన్స్ మరోసారి మెస్మరైజ్ చేస్తుంది. ఇక అనురాగ్ కశ్యప్ పాత్ర ఇంపాక్ట్ చూపిస్తుంది. సునీల్, ప్రకాష్ రాజ్ కారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. ఆర్ఆర్ సైతం సరికొత్తగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అయితే విజువల్స్ గురించి చెప్పుకోవాలి. కెమెరా వర్క్ టాప్ నాచ్లో ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా అనిపిస్తాయి. ప్రతీ పైసాకి తగ్గ వర్క్ తెరపై కనిపిస్తుంది.
'కుంభమేళా' మోనాలిసాకు బిగ్ షాక్.. భర్తపై పోక్సో కేసు!
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ ఫేమస్ అయిన మోనాలిసా భోంస్లే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 11న కేరళలోని అరుణ్మనూర్లోని శ్రీ నారాయణ గురు ఆలయంలో ఆమె ప్రియుడు ఫర్మాన్ ఖాన్ని వివాహం చేసుకుంది. అయితే పెళ్లి రోజుకి మోనాలిసా ఇంకా మైనరే అని..ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమేననే ఆరోపణలు వచ్చాయి. దీనికి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) విచారణ జరపగా..అది నిజమేనని తేలింది. దీంతో మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది?మహాకుంభమేళాలో తన అందం, అభినయంతో నెటిజన్ల మనసు గెలుచుకున్న మోనాలిసా.. పెద్దలను ఎదురించి, ఫేస్బుక్ ద్వారా పరిచమైన ఫర్మాన్ ఖాన్ని పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికి ఆమె మైనర్ అని, ఫర్మాన్ ఆమెను ప్రలోభపెట్టి వివాహం చేసుకున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం సాగింది. మోనాలిసా మైనర్ అని, ఈ వివాహం చెల్లదంటూ విశ్వహిందూ పరిషత్ (VHP) కేరళ విభాగం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ రంగంలోకి దిగి లోతుగా విచారణ చేపట్టింది. కమిషన్ జరిపిన విచారణలో మోనాలిసా వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువని, ఆమె మైనర్ అని ఆధారాలతో సహా తేలింది. పెళ్లి రోజుకు ఆమె వయసు 16 సంవత్సరరాల 2 నెలల,12 రోజులు మాత్రమేనని తేలడంతో భర్త ఫర్మాన్పై మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
క్రీడలు
లక్నో జట్టులోకి సౌతాఫ్రికా సూపర్ స్టార్
ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఫస్ట్ హాఫ్ సీజన్ తర్వాత హసరంగ జట్టుతో చేరుతాడని లక్నో మేనెజ్మెంట్ భావించింది. కానీ అతడు తన మోకాలి గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో హసరంగ ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 19వ సీజన్ నుంచి హసరంగా వైదొలిగాడు. ఈ విషయాన్ని లక్నో జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ ధ్రువీకరించాడు. అయితే హసరంగ స్ధానాన్ని సౌతాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ జార్జ్ లిండేతో లక్నో భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే లిండేతో లక్నో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీనిపై తదుపరి 24 నుంచి 48 గంటల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రోటీస్ ఆల్రౌండర్కు ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్లలో ఆడిన అనుభవం ఉంది. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ 250 పైగా టీ20 మ్యాచ్ల్లో 218 వికెట్లు పడగొట్టాడు. లిండేకు లోయార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా కూడా ఉంది. లక్నో జట్టులో ఇప్పటికే షాబాజ్ అహ్మద్, ఎం. సిద్ధార్థ్ వంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు. కానీ హసరంగ లాంటి స్టార్ ఆల్రౌండర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు లక్నో మొగ్గు చూపుతోంది. కాగా ఈ ఏడాది సీజన్లో లక్నో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి రెండింట విజయం సాధించింది.చదవండి: నాపై కోపంతో చెత్తబుట్టలో పడేశాడు.. అతడి తండ్రి వచ్చి..: యువీ
మ్యాచ్ మధ్యలో ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
దక్షిణాఫ్రికా దేశవాలీ క్రికెట్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. లయన్స్ అనే ఫ్రాంచైజీ తమ ఆల్రౌండర్ బేయర్స్ స్వానెపోల్ను సస్పెండ్ చేసింది. ఓ టోర్నీ ఫైనల్ మ్యాచ్ మధ్యలో వేదికను వదిలి వెళ్లిపోయినందుకు లయన్స్ యాజమాన్యం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తొలుత బేయర్స్ గాయం కారణంగా మైదానాన్ని వీడాడని అంతా అనుకున్నారు. చివరికి అతను ఏకంగా వేదికనే వీడి యూకే విమానం ఎక్కినట్లు తెలిసింది. విషయం తెలిసి రిఫరి 10 మందితోనే మ్యాచ్ కొనసాగించాలని లయన్స్ను ఆజ్ఞాపించాడు. బేయర్స్ మైదానం వీడే సమయానికి మ్యాచ్ నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది. బేయర్స్ గైర్హాజరీలో లయన్స్ 10 మందితోనే మ్యాచ్ కొనసాగించలేక, చివరి బంతి వరకు పోరాడి ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో బేయర్స్ ఉండి ఉంటే, ఫలితం లయన్స్కు అనుకూలంగా వచ్చేది. ఆ మ్యాచ్లో బేయర్స్ బంతితో అద్భుతంగా రాణించి (3-44) లయన్స్ను మ్యాచ్లో నిలిపాడు. అయితే కీలక తరుణంలో హ్యాండ్ ఇచ్చి లయన్స్ ఓటమికి కారకుడయ్యాడు. ఇంతకీ బేయర్స్ అంత అర్జెంట్గా విమానం ఎక్కి యూకేకు ఎందుకు వెళ్లాడని ఆరా తీయగా.. అతను వోర్సెస్టర్షైర్ కౌంటీతో ఒప్పందంలో భాగంగా అలా చేశాడని తెలిసింది. ఆ విమానం మిస్ అయితే వోర్సెస్టర్షైర్తో ఒప్పందం ఉల్లంఘన జరుగుతుందని అలా చేసినట్లు బేయర్స్ స్వయంగా చెప్పాడు.బేయర్స్ చర్యను చాలా సిరీయస్గా తీసుకున్న లయన్స్ యాజమాన్యం అతని కాంట్రాక్ట్ను రద్దు చేసింది. బేయర్స్ అంత సాహసం ఎందుకు చేశాడని ఆరా తీయగా మరో సంచలన విషయం కూడా బయటపడింది. అతను క్రికెట్ సౌతాఫ్రికా నుంచి ఎన్వోసీ కూడా లేకుండానే యూకేకు పయనమైనట్లు తెలిసింది. ఈ చర్య వల్ల బేయర్స్ సౌతాఫ్రికా జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం కూడా కోల్పోతాడు. బేయర్స్ కౌంటీ ఛాన్స్ కోసం చూసుకొని ఫ్రాంచైజీతో పాటు క్రికెట్ సౌతాఫ్రికా ఆగ్రహానికి గురయ్యాడు.ఈ మొత్తం ఉదంతంపై బేయర్స్ స్పందించాడు. లయన్స్ యాజమాన్యానికి, అభిమానులకు, క్రికెట్ సౌతాఫ్రికాకు క్షమాపణులు చెప్పాడు. ఈ కౌంటీ సీజన్ నాకు చాలా ప్రత్యేకం. అందుకే అలా చేయక తప్పలేదని వివరణ ఇచ్చాడు.
బుమ్రా, హార్దిక్లను గుర్తించింది అతడే.. చెన్నైకి ఎవరున్నారు?
చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సరైన ఆటగాళ్లను ఎంచుకోవడంలో సీఎస్కే విఫలమైందని విమర్శించాడు. గతేడాది నుంచి సీఎస్కే వైఫల్యాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఐపీఎల్-2025 సీజన్లో పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగే గెలిచి పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది చెన్నై. తమ చరిత్రలో ఇంతటి ఘోర పరాభవం పొందడం ఇదే తొలిసారి. ఇక తాజాగా ఐపీఎల్-2026లో ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్లలోనూ ఓటమిపాలైంది. ఒక్కొక్కరికి రూ. 14 కోట్లా?ఇదిలా ఉంటే.. మినీ వేలంలో భాగంగా ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలకు ఒక్కొక్కరికి రూ. 14 కోట్లకు పైగా చొప్పున సీఎస్కే ఖర్చు చేసింది. వీరి ప్రదర్శన మాత్రం ధరకు తగ్గట్లుగా లేదు. వీరిద్దరు ఇప్పటికే అరంగేట్రం చేసినా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇక సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది.ఈ నేపథ్యంలో సుబ్రమణ్యం బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ కోసం ఆటగాళ్లను వెదికేందుకు హేమంగ్ బదానీ, వేణుగోపాల్ రావు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లీగ్లలో ప్రతి మ్యాచ్ చూస్తూ ఆటగాళ్లను వెలికి తీస్తారు.సీఎస్కే కోసం ఈ పని చేసేందుకు ఎవరున్నారు? ఎవరో ఇచ్చిన సలహాలను పాటించి ఒక్కొక్కరికి రూ. 14 కోట్ల చొప్పున ఇద్దరు ఆటగాళ్ల కోసం డబ్బంతా ధారపోశారు. ప్రతిభావంతులైన ఆటగాళ్ల కోసం సీఎస్కే అసలు ప్రయత్నిస్తోందా?’’ అని చెన్నై మేనేజ్మెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.బుమ్రా, హార్దిక్లను గుర్తించింది అతడేఈ సందర్భంగా టీమిండియా స్టార్, దిగ్గజ పేస్ బౌలర్గా ఎదిగిన జస్ప్రీత్ బుమ్రా గురించి సుబ్రమణ్యం బద్రీనాథ్ ప్రస్తావించాడు. ‘‘అన్ని జట్లకు మంచి స్కౌట్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్కు మహేళ జయవర్దనే, రిక్కీ పాంటింగ్ కోచ్లుగా ఉన్నా.. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాల ప్రతిభను గుర్తించింది మాత్రం జాన్ రైట్. ఇలాంటి విషయాల్లో సీఎస్కు చాలా వెనుకబడి ఉంది. స్కౌటింగ్ విషయంలో వాళ్లకు అసలు సరైన విధానమే లేదు’’ అని సుబ్రమణ్యం బద్రీనాథ్ విమర్శించాడు.చదవండి: చారిత్రక ద్వైపాక్షిక సిరీస్ను ప్రకటించిన పాకిస్తాన్
ఐపీఎల్ నిరాకరణ తర్వాత పీఎస్ఎల్లో చరిత్ర
బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ IPL 2026లో చోటు కోల్పోయిన తర్వాత, పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఓ భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. దాయాది లీగ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ లాహోర్ ఖలందర్స్కు ఆడుతున్న ముస్తాఫిజుర్.. నిన్న (ఏప్రిల్ 9) ఇస్లామాబాద్ యునైటెడ్తో జరిగిన మ్యాచ్లో 2 డాట్ బాల్స్ వేయడంతో పొట్టి క్రికెట్లో అత్యంత అరుదైన 3000 డాట్ బాల్స్ మైలురాయిని అధిగమించాడు. తద్వారా పొట్టి క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్గా చరిత్రకెక్కాడు. ముస్తాఫిజుర్కు ముందు డ్వేన్ బ్రావో (3681), మొహమ్మద్ ఆమిర్ (3348), ఆండ్రీ రస్సెల్ (3213), సోహైల్ తన్వీర్ (3046) మాత్రమే ఈ ఘనత సాధించారు.ముస్తాఫిజుర్ 3000 డాట్ బాల్స్ మైలురాయిని తాకిన మ్యాచ్లో అతని జట్టు లాహోర్ ఖలందర్స్ ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ 18.3 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. ఇస్లామాబాద్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఖలందర్స్ను కుప్పకూల్చారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను ఇస్లామాబాద్ 10.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతుపాడుతూ ఛేదించింది. డెవాన్ కాన్వే (59) అజేయ అర్ద సెంచరీతో ఇస్లామాబాద్ను విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే, ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి అత్యంత సున్నితమైన పరిణామాల మధ్య తొలగించారు. 2026 సీజన్ కోసం జరిగిన వేలంలో అతన్ని కేకేఆర్ రూ. 9.2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకోగా.. భారత్-బంగ్లాదేశ్ మధ్య జియో పొలిటిలక్ ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ అతని ఐపీఎల్ కాంట్రాక్ట్ను రద్దు చేసింది. దీంతో ముస్తాఫిజుర్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో లాహోర్ ఖలందర్స్తో ఒప్పందం చేసుకున్నాడు.
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో ‘సీఎంఆర్ఎఫ్’ నిధులు స్వాహా... టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి సీఎంవో వరకూ వసూళ్ల పర్వం
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మావిగన్.. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు: వైఎస్ జగన్
ఇరాన్ను తుడిచిపెట్టేస్తాం, వారి నాగరికతను నాశనం చేస్తాం. తీవ్రంగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
మళ్లీ పెరిగిన వెండి, బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీకి దినదిన గండం... ఐదో రోజూ స్తంభించిన ఓపీ, అత్యవసర వైద్యసేవలు
లోక్సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ... రెండు ఫైటర్ జెట్లను కూల్చివేసిన ఇరాన్
వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా చర్చ...
అవినీతి కోసమే అమరావతి... కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం..
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల కోట్ల రూపాయల బకాయిలు రాకపోవడంతో...
బిజినెస్
ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి దారి దొరికిందా?
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ విక్రయ చర్యలలో భాగంగా ప్రభుత్వం ఇద్దరు కొనుగోలుదారులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తద్వారా బ్యాంక్లో మెజారిటీ వాటా విక్రయానికి నిర్ణయించిన రిజర్వ్ ధరకంటే తక్కువకు దాఖలు చేసిన బిడ్స్ సవరణను కోరే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంక్లో వ్యూహాత్మక వాటా విక్రయంపై ప్రస్తుతం సాంకేతిక మదింపు జరుగుతున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్, అసెట్ మానిటైజేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ అనిశి్చతుల ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థకు రక్షణగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు వివరించారు. తద్వారా ద్రవ్యపరమైన దన్నుకు దారి ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలియజేశారు. మూడేళ్ల ప్రయత్నాల తదుపరి ఐడీబీఐ బ్యాంక్లో మెజారిటీ వాటా విక్రయ చర్యలు ఫైనాన్షియల్ బిడ్ స్థాయికి చేరిన విషయం విదితమే. వెరసి ప్రభుత్వం మళ్లీ తొలి నుంచీ మొదలుపెట్టేందుకు సిద్ధంగా లేదని ప్రభుత్వ అధికారి వెల్లడించారు.ఇది బ్యాంక్ విక్రయాన్ని మరింత ఆలస్యం చేసే వీలుండటంతో తాజా యోచనకు తెరతీస్తున్నట్లు పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వ వాటా 45.48 శాతంకాగా.. పీఎస్యూ బీమా దిగ్గజం ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. దీంతో ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా 60.72 శాతం వాటా విక్రయించేందుకు 2022 అక్టోబర్లో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ)కు ఆహ్వానం పలికాయి. ప్రేమ్వత్సా సంస్థ ఫెయిర్ఫాక్స్, ఎమిరేట్స్ ఎన్బీడీ ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలు చేశాయి. బ్యాంక్లో ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం చొప్పున వాటా విక్రయించనున్నాయి.
బంగారం అమ్మేసుకుంటున్న దేశాలు..
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్ధ మేఘాలు దేశాల పసిడి నిల్వలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఒకప్పుడు సురక్షితమైన పెట్టుబడిగా భావించిన బంగారాన్ని ఇప్పుడు కొన్ని దేశాలు తమ ఆర్థిక అవసరాల కోసం, ముఖ్యంగా యుద్ధ వ్యయాల కోసం విక్రయిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వివిధ దేశాల పసిడి నిల్వల తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం..యుద్ధం తెచ్చిన మార్పులేంటి?ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు సాధారణంగా తమ విదేశీ మారక ద్రవ్య నిల్వలను పటిష్టం చేసుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. అయితే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. భారత్, చైనా వంటి దేశాలు పసిడి నిల్వలను పెంచుకుంటుంటే, యుద్ధంలో చిక్కుకున్న కొన్ని దేశాలు మాత్రం నిల్వలను అమ్ముకుంటున్నాయి.బంగారం అమ్ముతున్న దేశాలు ఇవే..ఇటీవలి నివేదికల ప్రకారం.. మూడు ప్రధాన దేశాలు తమ పసిడి నిల్వలను విక్రయించడం లేదా తగ్గించుకోవడం చేస్తున్నాయి.రష్యా: ఉక్రెయిన్తో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యా తన పసిడి నిల్వలను విక్రయించక తప్పడం లేదు. యుద్ధ వ్యయాలను భరించడానికి, పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి బయటపడటానికి రష్యా 2025 నుండి నిరంతరంగా బంగారాన్ని విక్రయిస్తోంది. ఫిబ్రవరి 2026 నాటికి రష్యా పసిడి నిల్వలు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి (సుమారు 2,327 టన్నులకు) పడిపోయినట్లు తెలుస్తోంది.టర్కీ: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో తన కరెన్సీ 'లిరా' విలువ పడిపోకుండా కాపాడుకోవడానికి టర్కీ సుమారు 60 టన్నుల బంగారాన్ని విక్రయించినట్లు సమాచారం. దీని విలువ దాదాపు 8 బిలియన్ డాలర్లు.పోలాండ్: గతంలో పసిడి కొనుగోళ్లలో అగ్రస్థానంలో ఉన్న పోలాండ్, ఇప్పుడు తన రక్షణ బడ్జెట్ కోసం నిల్వలను వినియోగించుకోవాలని యోచిస్తోంది.భారత్ పరిస్థితి ఇలా..ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మాత్రం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటోంది. భారత రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రస్తుతం 880.18 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. దీని విలువ ఫిబ్రవరి 2026 నాటికి రికార్డు స్థాయిలో 131.63 బిలియన్ డాలర్లకు చేరింది.ర్యాంకుదేశంనిల్వలు (టన్నుల్లో)నిల్వల విలువ (బిలియన్ డాలర్లలో)1అమెరికా81331,250+2జర్మనీ33505623ఇటలీ24524204ఫ్రాన్స్24374085రష్యా23273806చైనా23073877స్విట్జర్లాండ్10401758జపాన్8461429భారత్88013110నెదర్లాండ్స్612102
ఎలక్ట్రిక్ బుల్లెట్ వచ్చేసింది..!
ఐషర్ మోటార్స్ గ్రూప్నకు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్.. ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ విభాగంలోకి అడుగుపెట్టింది. తొలి ఎలక్ట్రిక్ బైక్ ‘ఫ్లయింగ్ ఫ్లీ సీ6’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పట్టణ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ను రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండేలా డిజైన్ చేశారు.ఎక్స్ షోరూం ధర రూ.2.79 లక్షలు. కాగా, ‘బ్యాటరీ–యాజ్–ఎ–సర్వీస్’ ఆప్షన్తో ధరను రూ.1.99 లక్షలు కంపెనీ నిర్ణయించింది. డెలివరీలు మే చివరి నుంచి ప్రారంభం కానున్నాయి.‘‘కంపెనీ 125వ ఏడాదిలో ‘ఫ్లయింగ్ ఫ్లీ సీ6’ ద్వారా ఎలక్ట్రిక్ బైక్ల రంగంలోకి అడుగుపెడుతోంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ మార్పు మాత్రమే కాదు, నగర ప్రయాణాలకు సరికొత్త విధానాన్ని సృష్టించడం. రాయల్ ఎన్ఫీల్డ్ వందేళ్లకు పైగా మంచి రైడింగ్ అనుభవం ఇవ్వడంపైనే దృష్టి పెట్టింది. ఇప్పుడు ‘ఫ్లయింగ్ ఫ్లీ’తో అదే అనుభవాన్ని ఎలక్ట్రిక్ బైక్లలో కొనసాగిస్తోంది’’ అని ఐషర్ మోటార్స్ ఎండీ, సీఈవో బి. గోవిందరాజన్ పేర్కొన్నారు.
ఆన్లైన్ పేమెంట్ అలర్ట్.. గంట తర్వాతే చెల్లింపులు!
డిజిటల్ లావాదేవీల్లో పెరుగుతున్న మోసాలను తగ్గించేందుకు ఆర్బీఐ కీలక చర్యలు ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ఒక చర్చాపత్రం విడుదల చేసింది. డిజిటల్ లావాదేవీ రూ.10,000 కంటే ఎక్కువ ఉంటే ఒక గంట తర్వాతే దాన్ని అమలు చేసే విధానం (ల్యాగ్) ఉండాలని ప్రతిపాదన తెచ్చింది.వద్దనుకుంటే గంటలోపు విజయవంతం కాకముందే దాన్ని రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల సైబర్ నేరస్థులు డెబిట్ చేసుకునేట్టు అయితే ఆ లావాదేవీల సమాచారం కస్టమర్లకు ముందే తెలుస్తుంది. అలాగే, మ్యూల్ ఖాతాలకు చెక్ పెట్టేందుకు ఒక ఖాతాలోకి వచ్చే మొత్తం జమలపై పరిమితులను ప్రతిపాదించింది. మెరుగైన శ్రద్ధ లేని ఖాతాలకు వార్షిక క్రెడిట్లను సుమారు రూ .25 లక్షలకు పరిమితం చేయాలని సూచించింది.ఒకే క్లిక్తో అన్ని డిజిటల్ చెల్లింపులను నిలిపివేసే (కిల్ స్విచ్) విధానాన్ని పేర్కొంది. ఇక 70 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులను మోసపుచ్చి పెద్ద మొత్తాల్లో డబ్బులు ఖాతా నుంచి మళ్లించకుండా, ఆయా లావాదేవీలకు విశ్వసనీయమైన వ్యక్తి ద్వారా అదనపు ధ్రువీకరణను తీసుకువచ్చే ప్రతిపాదనను చేసింది. రూ .50,000 లకు మించిన లావాదేవీల విషయంలో వినియోగదారులకు నిధులను బదిలీ చేయడానికి ముందు నామినేటెడ్ వ్యక్తి నుండి అనుమతి అవసరం.
ఫ్యామిలీ
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎలా, ఎపుడు చేసుకోవాలి? ఈ లాభాలు తెలుసా?
ఇచ్ఛాపురం: ఇటీవల సీజన్లో పెళ్లిళ్లు జోరుగా జరిగాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన కొత్త జంటలు వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీరి జీవితం కొత్తగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రభుత్వం పథకాలు రావాలన్నా, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయించాలన్నా, పాస్పోర్టు, భూములకు సంబంధించిన మ్యుటేషన్లు ఇతరత్రా అవసరాలు ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పటికప్పుడు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతూ చివరికి సర్టిఫికెట్ల కోసం బ్రోకర్లపై ఆధారపడి ఎక్కువ మొత్తంలో సొమ్ములు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను కొత్త జంట ముందుగానే గుర్తించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ పొందితే వారికే మంచిది.సర్టిఫికెట్ వల్ల ఉపయోగాలు పాస్పోర్టు అప్లికేషన్, బ్యాంక్ జాయింట్ అకౌంట్, కేంద్ర, రాష్ట్ర రక్షణ బలగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సర్వీస్ రికార్డుల్లో పేరు చేర్చుకునేందుకు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి వీసాప్రాసెస్, వీటితో పాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నవ వధూవరులు పెళ్లి చేసుకొనే ప్రదేశం ఆధారంగా గ్రామం ఐతే గ్రామ సచివాలయం లేదా పంచా యతీ కార్యాలయం, పట్టణం ఐతే వార్డు సచివాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం వివాహ శుభలేఖ, జీలకర్ర బెల్లం తలపై పెట్టుకున్న వధూవరుల ఫొటో, మంగళసూత్రం కట్టేటప్పుడు ఫొటో, పూల దండలు మార్చుకున్నప్పుడు ఫొటోలు ఉండాలి. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుల జిరాక్సులను జతచేయాలి. నవవధూవరుల తరఫున ఇద్దరు సాక్షులు, వారి ఆధార్ కార్డుల జిరాక్సు లను గ్రామ/వార్డు సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయంలోగానీ మున్సిపల్ కార్యాలయంకు గానీ అందజేయాలి. జత చేసిన ధ్రువీకరణ పత్రాలను జనన, మరణ రిజి్రస్టేషన్ అధికారి పరిశీలించి సర్టిఫికెట్ని జారీ చేస్తారు. ఆలయాల్లో వివాహం చేసుకుంటే దేవదాయ శాఖకు మందస్తుగానే రుసుం చెల్లిస్తే అధికారులు రశీదులు ఇస్తారు. వాటి ఆధారంగానే వివాహానికి సంబంధించిన ఇతర పత్రాలు ఫొటోలు సాక్షుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇళ్లు, కల్యాణ మండపాల్లో సంప్రదాయంగా వివాహం చేసుకుంటే అందుకు తగ్గ అన్ని రకాలు పత్రాలు సమర్పించి దరఖాస్తులు చేసుకోవాలి. ఇదీ చదవండి: ఆడబిడ్డ పుట్టిందని, అంతులేని సంబరం : వీడియో వైరల్90 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పెళ్లి జరిగిన 30 రోజుల్లో మున్సిపల్, పంచాయతీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొంటే తక్కువ ఫీజు ఉంటుంది. సాధారణంగా ఫీజు రూ.100 నుంచి రూ.500 వరకు మాత్రమే ఉంటుంది. వివాహం జరిగి 90రోజులు దాటితే సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఇందుకు ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి. యు.ఉపేంద్ర, జనన, మరణ, రిజిస్ట్రేషన్ అధికారి, ఇచ్ఛాపురం మున్సిపాలిటి
'బుజ్జి ఫొటోగ్రాఫర్'..! జస్ట్ 18 నెలల వయసుకే..
కొందరు చిన్నారులు వయసు పెరిగే కొద్ది తమలోని అసాధారణ ప్రతిభను కనబరుస్తారు. ఇంకొందరు బైబర్త్ నైపుణ్యం పెంపొందించుకుంటారు. వయసుకి వారి ప్రదర్శించే ప్రతిభకు పొంతనలేని వారి సామర్థ్యం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసేలా కట్టిపడేస్తుంది. అలాంటి కోవకు చెందిందే కేరళలోని పాలక్కాడ్కు చెందిన నాలుగేళ్ల పిహు. ఆమె పిట్ట కుంచెం కుత ఘనం అన్నట్లుగా ఫోటోగ్రఫీలో అసామాన్య ప్రజ్ఞతో ఆకట్టుకుంటోంది. ఆమె ఏ వయసులో కెమెరా పట్టుకుని క్లిక్ మనిపించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేరళలోని పాలక్కాడ్ నగరానికి చెందిన నాలుగేళ్ల పిహు వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన తండ్రి విపిన్దాస్, తల్లి శ్రీ హేమ శ్రీధరన్ దంపుతుల పెద్ద కుమార్తె. తన వయసు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే ఆమె మాత్రం తన చిట్టి చేతులతో కెమెరాతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఈ చిన్నారి కెమెరాల పట్ల అసాధారణమైన ఆసక్తిని కనబరుస్తోంది. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అయిన తండ్రి విపిన్ దాస్ అడుగుజాడల్లో నడిచేస్తోంది. అంత చిన్న వయసులోనే ఆ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడం విశేషం. పైగా తన టాలెంట్తో ఆ అభిరుచి తన డీఎన్ఏలోనే ఉంది అని చెప్పకనే చెబుతోంది పిహు. కేవలం 18 నెలల వయసులోనే బొమ్మ కెమరా కాకుండా, ఒరిజనల్ కెమెరాను పట్టుకుంది. ఆ పరికరం తన బరువులో దాదాపు సగం బరువు అయినా..ఆమె దానిని జాగ్రత్తగా ఎత్తి తనకు ఇష్టమైన ఏనుగు బొమ్మ ఫోటోని తీసింది. అది చూసిన తల్లిదండ్రులు ఓ చిన్న పసిపాప తీసిన ఫోటోనేనా..? అని విస్తుపోయారు. పైగా అంత చిన్నవయసులోనే కెమెరాలోని రకారకాల లెన్స్లు, గింబల్ వంటి వాటిపై ఆకస్తి చూపించేది. ప్రతి బటన్ ఎలా పనిచేస్తుందనేది తల్లిదండ్రులను అడిగి తెలుసుకునేది. అయితే తల్లిదండ్రులు అంత చిన్నవయసుకు కెమెరా ఎందుకని బొమ్మ కెమెరా ఇచ్చేందుకు యత్నిస్తే అస్సలు ఒప్పుకునేది కాదని చెప్పుకొచ్చారు. ఎలా నేర్చుకుందంటే..పిహు ఫొటోలు అందంగా తీయడం ఎలా నేర్చుకుందంటే..తన స్నేహితుడి బిడ్డ పుట్టినరోజు వేడుకలో సదరాగా ఇచ్చిన చిన్న కెమెరాను ప్రోఫెషనల్ కెమెరా మ్యాన్లు పట్టుకున్నట్లుగా పట్టుకుని ఫొటోలు తీసిందని చెబుతున్నారు ఆమె తండ్రి విపిన్ దాస్. అక్కడే తీస్తున్న ఇతర ఫొటోగ్రాఫర్లను పరిశీలిస్తూ తీయడం నేర్చుకుందని, పైగా ఆ వేడుకలో తీసిన పది ఫొటోలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలా అప్పటి నుంచి పిహు తండ్రి తోపాటు అవుట్డోర్ ఫొటోషూట్లకు వెళ్లడం ప్రారంభించింది. అలాగే తన తల్లి శ్రీహేమ రెండోసారి గర్భవతి అయినప్పుడు తల్లికి ఆ చిన్నారి వ్యక్తిగత ఫొటోగ్రాఫర్గా మారింది. నేచురల్ వెలుగులో అద్భుతమైన పోర్ట్రెయిట్లను తీసింది ఆ చిన్నారి. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) ఆ చిన్నారికి పేరొచ్చింది అప్పుడే..గతేడాది నవంబర్లో రాజకీయ నాయకుడు, ఎంపీ షఫీ పరంబిల్ ఆమె వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో పిహు పేరు మారుమ్రోగిపోయింది. ఆ వీడియోలో పిహు ఎంపీకి సంబంధించిన కొన్ని ఫొటోలు క్లిక్మనిపించింది. అంత ఎవరా ఆ చిన్నారి అంటూ తెలుసుకోవడం ప్రారంభించారు. ఇక తన కూతురుకి ఏ యాంగిల్ ఫోటోలు తీస్తే బాగా వస్తాయనే దానిపై మంచి పట్టుందని చెబుతున్నారు విపిన్ దాస్. View this post on Instagram A post shared by Shafi Parambil (@shafi_parambil) ఇవేగాక ఆమె ఇటీవలే, పాలక్కాడ్లోని శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగే పదిరోజుల వార్షిక రథోత్సవమైన ప్రసిద్ధ కల్పతి రథోత్సవంలో సైతం అద్భుతంగా ఫొటోలు తీసిందన్నారు. అక్కడ కమనీయ దృశ్యాలను చాలా అద్భుతంగా కెమెరాలో బంధించిందని చెప్పారు. అంతేకాదండోయో ఈ చిన్నారి పిహుకి 'cam_girl_pihu' అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది. దానిని ఆమె తల్లిదండ్రులే నిర్వహిస్తున్నారు.(చదవండి: నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్చేస్తే..)
నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్చేస్తే..
ఏ వ్యాపారమైన ప్రారంభంలో ఒడిదుడుకులు సాధారణం. ఇక్కడ వాటిని అధిగమిస్తు ముందుకు సాగేవారు ఏదో ఒకరోజు తప్పక గెలుస్తారు. అందుకు ఉదాహరణ ఈ వ్యక్తి. ఒకప్పుడు సాదాసీదా తోపుడు బండిపై పండ్ల వ్యాపారం. ఒక్కోసారి ఒక్కటి కూడా అమ్ముడు అవ్వక వద్దురా ఈ వ్యాపారం అనేలా నిరాశను కలుగజేసింది. అయినా ఎలాగైనా ఏదో సాధించాలన్న కసి, పట్టుదల మళ్లీ మళ్లీ అదే వ్యాపారం చేసి నిలదొక్కుకోవడమే గాక పదిమందికి ఉపాధి ఇచ్చే స్థాయికి చేరాడు, పైగా కోట్లలో లాభాలు ఆర్జించడం మొదలైంది. ఎలా ఆ వ్యక్తి ఆ స్థాయిలో పండ్ల వ్యాపారంలో సక్సెస్ని అందుకున్నాడంటే..ఆ వ్యక్తే మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్కి చెందిన అబ్దుల్ రైస్. దాదాపు 30 ఏళ్ల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఒక సాధారణ బండిపై పండ్లు అమ్ముతూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రారంభరోజుల్లో అతడి వ్యాపారం ఎంత దారుణంగా ఉండేదంటే..సరిగా అమ్మకాలు సాగాక రోజంతా వేచి చూడాల్సి వచ్చేది. ఆ తోపుడు బండి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోక ఇక వదిలేద్దాం రా బాబు అని అనుకునేవాడు. మరోవైపు వర్షాకాలంలో ఆ కొద్దిపాటి అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయేవి. ఈ ఇబ్బందులతో ఆయన ఛీ ఈ వ్యాపారం నాకొద్దు అంటూ విలపించేవాడు. అయితే బంధువులు, కుటుంబ సభ్యుల మద్దతుతో అబ్దుల్ సుమారు రూ. 5 లక్షల రుణం తీసుకుని మళ్లీ అదే వ్యాపారం ప్రారంభించారు. ఈసారి ఆయనకు గతంలో చూసిన సవాళ్లు అన్ని పాఠాలుగా మారి, ఎలా వ్యాపారం నిర్వహించాలో తెలిసొచ్చింది. నిరంతర శ్రమ, పట్టుదలతో లాభాల పట్టేంచేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆ చిన్న వ్యాపారం కాస్త కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. కాలక్రమేణ తన చిన్న తోపుడు బండి వ్యాపారం ఒక అభివృద్ధి చెందుతున్న సంస్థగా మారింది. అలా అతని సంస్థ ఏకంగా రూ. 3 కోట్ల వార్షిక టర్నోవర్తో దూసుకుపోవడమే గాక దాదాపు 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఒకప్పుడు మనుగడ కోసం పడిన పోరాటం ఇప్పుడు చాలామందికి ఉపాధి అందించే రేంజ్కు చేరడం విశేషం. అతడి సంస్థ బుర్హాన్పూర్లో నీలం ఫ్రూట్’గా ప్రసిద్ధి చెందింది. నాణ్యత, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి అక్కడందరి మన్ననలకు అందుకుంది. అతడి దుకాణం నుంచి పండ్లు కొనడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం గమనార్షం. అతడి సంస్థ వద్దకు సుమారు రెండు నుంచి మూడు వాహానాలు వస్తాయట. చిల్లర వినియోగదారులే కాకుండా, చాలా మంది చిరు వ్యాపారులు కూడా అతని వద్ద పండ్లు కొని స్థానిక మార్కెట్లలో అమ్ముతారు. తద్వారా అతడి వ్యాపార విస్తరణ మరింత పెరుగుతూ వచ్చింది. పట్లుదల, నిరంతర కృషి ఉంటే ఎంతటి భయాంకరమైన సవాళ్లనైనా దాటగలుగతాం, విజయం సాధించగలం అని అబ్దుల్ రైస్.(చదవండి: కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నీతా..! గులాబీ కుర్తా..)
వధువు కావలెను
అమ్మాయికి వంట వచ్చా.. అనే ప్రశ్న బదులు.. అబ్బాయి సంపాదన ఎంత అనే క్వశ్చన్ బాగా వినిపిస్తోంది. అమ్మాయి చదువుకుందా.. అని ఆరా తీయడం బదులు.. అబ్బాయి బుద్ధిమంతుడా కాదా అన్న ఎంక్వైరీలు మొదలయ్యాయి. కట్నం ఎంత ఇస్తారు.. అన్న మాట వినిపిస్తున్నా.. కట్నం ఇవ్వకపోయినా పర్లేదు అన్న అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. జిల్లాలో పురుష పుంగవులకు వివాహ రేఖలు కనిపించడం లేదు. 30 దాటినా పెళ్లి కాని వారి మగవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. శ్రీకాకుళం కల్చరల్, శ్రీకాకుళం రూరల్: జిల్లాలో పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నారు. ఇదివరకు అబ్బాయి ఓకే అంటే అమ్మాయి తరఫు వారు హమ్మయ్య అంటూ గెంతులు వేసే వారు. కానీ ఇప్పుడు ఓకే చెప్పే అధికారం పూర్తిగా అమ్మాయి తరఫు వారికే మళ్లిపోయినట్టు ఉంది. ఫలితంగా వయసు ముదురుతున్నా పెళ్లి కాక ఎంతో మంది యువకులు మిగిలిపోతున్నారు. ఒకప్పటిలా తల్లిదండ్రులు చూపించిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పుడు తక్కువైపోయారు. అబ్బాయిలు రాజీ పడుతున్నా అమ్మాయిలు నో అంటున్నారు. పెరిగిన అడ్డుగోడలు.. ప్రస్తుతం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫలానా విధంగా ఉండాలని అమ్మాయిలు చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు. సంపాదన ఒక్కటే చూడకుండా ప్రొఫెషన్ను కూడా గమనిస్తున్నారు. తక్కువ సంపాదన ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వాళ్లకి తక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద స్థాయిలో జీతాలు ఉండి ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగాల సంబంధాలను కూడా వదిలేసుకోవడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తుండడంతో ఉన్నత ఉద్యోగులకు అందునా ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటిలాగానే డిమాండ్ ఉంది. పెళ్లికి అమ్మాయిల అనుమతి రోజులు మారాయి. అమ్మాయి కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి నేను నచ్చానో లేదో ఒకసారి అడగండి అని అబ్బాయిలే అంటున్నారు. అవసరమైతే కట్నం లేకుండా చేసుకుంటామంటున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బిఎస్సీ అగ్రికల్చరల్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజినీరింగ్ వంటి కోర్సులను చదివే వారి సంఖ్య తక్కువగా ఉండేది. ఈ అర్హతలు చెబితే చాలు ఇట్టే పెళ్లయిపోయేది. కానీ ఇప్పుడా పప్పులు ఉడకడం లేదు. పెరిగిన వివాహం వయసు ఒకప్పుడు అమ్మాయికి పెళ్లీడు రాగానే పెళ్లి చేసే వారు. ఇప్పుడు 25 ఏళ్ల వరకు వివాహ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఒకప్పుడు అబ్బాయిలు కూడా 20 ఏళ్లకు పెళ్లి చేసుకునే వారు. కానీ వారు కూడా 30 ఏళ్లు దాకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆ తర్వాత అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది. గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే సరైన వయసులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాలలో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెపుతున్నారు. అంతా 30 ఏళ్లు పైబడినవారే జాతకాల కోసం ముహుర్తాల కోసం వచ్చేవారు అధికంగా 30ఏళ్లు పైబడినవారే. చాలా మంది తల్లిదండ్రులు వారి అబ్బాయిలకు తగిన అమ్మాయిలు దొరకడం లేదని బాధ వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలను ఎంచుకునే అవకాశం అమ్మాయిలకు లభిస్తుండడం గమనిస్తున్నాం. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం, గుడివీధి యువత ఆలోచనలో మార్పు యువత ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పే ఒక కారణమైతే, అమ్మాయిలు తక్కువగా ఉండ డం మరో కారణం. పెళ్లి కోసం అమ్మాయిలను వెతుక్కోవడానికే సరిపోతుంది. – వేదుల విజయభాస్కరశర్మ, పురోహితులు
అంతర్జాతీయం
నాటో తీరుపై ట్రంప్ మళ్లీ విమర్శలు
నాటో వ్యహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మనల్ని నిరాశపరిచే నాటో కూటమితో పాటు మిత్ర దేశాలకు, ఒత్తిడి పెట్టకపోతే సమస్యలేవి అర్థం కావు అని అన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ పెట్టారు. ఇరాన్తో యుద్ధం చేసే విషయంలో, హర్మూజ్ని దక్కించుకునే విషయంలో నాటో కలిసి రానందుకు ఇప్పటికే నాటో దేశాలని ఇప్పటికే ట్రంప్ విమర్శిస్తున్నారు.మరోవైపు మంగళవారం రాత్రికే ఇరాన్ నాగరికతని అంతం చేస్తానని హెచ్చరికలు ఇచ్చిన ట్రంప్.. సరిగ్గా గంటన్నర ముందు కాల్పుల విరమణ ప్రకటించారు. రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పాక్ మధ్యవర్తిత్వం చేయగా.. ఇప్పుడు ఆ దేశంలోని ఇస్లామాబాద్లోనే అమెరికా-ఇరాన్ చర్చలకు సిద్ధమయ్యాయి. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఇరు దేశాల ప్రతినిధులు.. ఇస్లామాబాద్ చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకోసం పాక్ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. చర్చల కోసం వచ్చే బృందాలకు పూర్తి సహకారం అందిస్తామని పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అయితే సీజ్ ఫైర్ కొనసాగుతుండగానే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అన్నారు.
హర్మూజ్పై ఇరాన్ సంచలన ప్రకటన
అమెరికాతో ఇరాన్ చర్చలకు అంగీకరించిన నేపథ్యంలో హర్మూజ్ జలసంధిపై ఇప్పటివరకూ కొనసాగిన హీట్ కాస్త చల్లారింది. హర్మూజ్ జలసంధిని తెరవడానికి తాత్కాలికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇరాన్.. తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధిని దాటే నౌకలు తమను తప్పకుండా సంప్రదించాలని స్పష్టం చేసింది. హర్మూజ్లో వాటర్ మైన్స్ ముప్పు పొంచి ఉందని, ఎలా పడితే అలా నౌకలు ఆ జలసంధిని దాటే ప్రయత్నం చేయద్దొన హెచ్చరించింది. నౌకల రాకపోకలపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)తో సమన్వయం చేసుకున్న తర్వాతే ముందుకు సాగాలని తెలిపింది. రోజుకు 15 నౌకలకు మాత్రమే అనుమతి..రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హోర్ముజ్ జలసంధిని దాటడానికి ఇరాన్ రోజుకు 15 నౌకల మాత్రమే అనుమతిస్తుంది. ఈ జలమార్గాన్ని దాటడానికి ఆ నౌకలకు ఇరాన్ అధికారుల నుండి ముందస్తు అనుమతి కూడా అవసరం. ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, పది కంటే తక్కువ నౌకలు మాత్రమే హోర్ముజ్ జలసంధిని దాటడానికి అనుమతిస్తున్నాయి.సీజ్ఫైర్ ఒప్పందం ప్రకారం.. ‘ హోర్ముజ్ జలసంధి గుండా రోజుకు 15కు మించి నౌకలు మించి ప్రయాణించడానికి లేదు. ఈ రాకపోకలు ఇరాన్ ఆమోదం, ఒక నిర్దిష్ట నియమావళి అమలుపై మాత్రమే ఆధారపడి ఉంటాయి’ అని ఒక సీనియర్ ఇరాన్ అధికారి చెప్పినట్లు రష్యన్ వార్తా సంస్థ TASS పేర్కొంది.యుద్ధానికి ముందున్న యథాస్థితికి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని, కొత్త హోర్ముజ్ నియంత్రణ చట్రాన్ని సంబంధించి ప్రాంతీయ పక్షాలకు తెలియజేయడం జరిగిందని ఇరాన్ వర్గాల సమాచారం.
మన భవిష్యత్తు ఏంటి?
మనం రోజూ ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో వనరులను వాడుతున్నాం. స్విచ్ వేస్తే వెలిగే కరెంట్, కుళాయి తిప్పితే వచ్చే నీరు, మనం కొనే బట్టలు, వాడే ప్లాస్టిక్.. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మనం వాడుతున్న ఈ వనరులు భూమి మీద శాశ్వతంగా ఉంటాయా? రీసెంట్ గా జరిగిన ఒక భయంకరమైన స్టడీ మనల్ని హెచ్చరిస్తోంది. మనం గడుపుతున్న ఈ విలాసవంతమైన జీవనశైలి ఇలాగే కొనసాగితే, మన అవసరాలు తీరడానికి ఒక భూమి సరిపోదు.. మనకి ఇంకో భూమి కావాలి! అవును, మీరు విన్నది నిజం. "వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఎర్త్". అసలు ఈ స్టడీ ఏం చెబుతోంది? మన భవిష్యత్తు ఏంటి? శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, భూమి తన వనరులను తిరిగి ఉత్పత్తి చేసే వేగం కంటే, మనం వాటిని వాడే వేగం చాలా రెట్లు ఎక్కువగా ఉంది. దీనినే 'ఎకలాజికల్ ఫుట్ ప్రింట్' అంటారు. మనం ఏటా భూమి మనకి ఇచ్చే కోటాను ఆగస్టు నెల నాటికే వాడేస్తున్నాం. మిగిలిన నాలుగు నెలలు మనం భవిష్యత్తు తరాలకు చెందాల్సిన వనరులను అప్పుగా వాడుకుంటున్నాం. మనం వాడే నీరు, మనం పారవేసే వ్యర్థాలు, గాలిలోకి వదులుతున్న కార్బన్.. ఇవన్నీ కలిసి ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్, ఇంట్లో ఏసీ, బయట కారు.. ఉంటున్నాయి. ఇవి మనకి సౌకర్యాలే కానీ, భూమికి మాత్రం భారాలు. ఒక్క ఐఫోన్ తయారీకి ఎన్ని వనరులు కావాలో తెలుసా? మనం వాడే ఫాస్ట్ ఫ్యాషన్ బట్టల వల్ల ఎన్ని కోట్ల లీటర్ల నీరు వృధా అవుతుందో ఊహించగలరా? ఈ రిపోర్ట్ ఏం చెబుతుందంటే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా అంతా అమెరికా లేదా యూరోపియన్ దేశాల స్థాయి జీవనశైలిని పాటిస్తే, మనకు కనీసం రెండున్నర గ్రహాలు అవసరమవుతాయి. కానీ మన దగ్గర ఉన్నది ఒకే ఒక్క గ్రహం.. మన భూమి! వనరుల తరుగుదల అంటే కేవలం నీరు, ఆహారం అయిపోవడం మాత్రమే కాదు. దీని వల్ల వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయి. అడవుల నరికివేత వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగి, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. దీనివల్ల సముద్ర మట్టాలు పెరిగి భవిష్యత్తులో ముంబై, న్యూయార్క్ లాంటి తీర ప్రాంత నగరాలు నీట మునిగే ప్రమాదం ఉంది. అకాల వర్షాలు, భయంకరమైన కరువులు ఇవన్నీ ప్రకృతి మనకు ఇస్తున్న ముందస్తు హెచ్చరికలు. మనం భూమిని రక్షించకపోతే, భూమి మనల్ని శిక్షించడం మొదలుపెడుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం ఆదిమానవుల్లా అడవుల్లోకి వెళ్ళిపోవాలా? అవసరం లేదు. కానీ మన అలవాట్లను మార్చుకోవాలి. వాటిలో ప్రధానంగా అవసరమైన దానికంటే ఎక్కువ వనరులను వాడటం ఆపేయాలి. 'నీరు' , 'విద్యుత్తు' విషయంలో పొదుపుగా ఉండాలి. అలాగే వాడి పారేసే సంస్కృతి నుండి వస్తువులను మళ్ళీ మళ్ళీ వాడే అలవాటు చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అంతేకాదు విదేశీ వస్తువుల కంటే స్థానికంగా దొరికే ఆహారం, వస్తువులను ప్రోత్సహించడం వల్ల ట్రాన్స్పోర్ట్ వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వీటన్నిటికన్నా ప్రధానంగా కనీసం మన వంతుగా మొక్కలు నాటడం, ప్రకృతిని గౌరవించడం నేర్చుకోవాలి..మనకి నివసించడానికి 'ప్లాన్ బి' లేదు. ఎందుకంటే మనకి ఇంకో గ్రహం లేదు. మార్స్ మీద ఇల్లు కట్టుకోవచ్చని మనం కలలు కనవచ్చు కానీ, కోట్లాది మంది సామాన్యులకు ఈ భూమే ఆధారం. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి కేవలం డబ్బు మాత్రమే కాదు.. వారు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి, తాగడానికి స్వచ్ఛమైన నీరు. ఆ బాధ్యత మనందరిదీ.ఈ రోజే మీ జీవనశైలిలో ఒక చిన్న మార్పు చేయండి. భూమిని రక్షించండి.. అది మనల్ని రక్షిస్తుంది.
ట్రంప్ తదుపరి అడుగు ఎటువైపు..?
డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షునిగా కాసేపు యుద్ధం అంటారు.. మరి కాసేపు శాంతి గెలిచింది అంటారు. అమెరికా పరిపాలన బాధ్యతలు రెండోసారి చేపట్టిన తర్వాత ప్రతీ అంశంలోనూ ఏదొక వివాదం లేకుండా ఆయనకు పూట ముందుకెళ్లడం లేదు. అమెరికాతో యుద్ధంలో భాగంగా చర్చలకు ఇరాన్ సిద్ధమవ్వగానే ప్రపంచ శాంతి గెలిచిందంటూ ఒక గంభీరమైన ప్రకటన ఇచ్చేశారు. ఇరాన్ చర్చలకు ఒప్పుకున్న మాట అత్యంత సంకట స్థితిలో ఉన్న ట్రంప్కు ఊపిరినిచ్చినట్లయ్యింది. అంతకుముందు వరకూ ఇరాన్ను అది చేస్తాం. ఇది చేస్తాం అన్న ట్రంప్ నోట శాంతి మాట వినిపించింది.అయితే అది కేవలం శాంతి చర్చలకు మాత్రమే ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అంటే ఇక్కడ యుద్ధానికి బ్రేక్ మాత్రమే వచ్చింది.. పూర్తిగా యుద్ధాన్ని ముగించేందుకు కాదనే విషయం ఇరానే తెలపడం ద్వారా చర్చలు తర్వాతే అసలు విషయం ఏమిటన్నది తెలుస్తుందని చెప్పేసింది. చర్చల్లో లెబనానే హాట్ టాపిక్..?ఇజ్రాయెల్ బుధవారం 100 మిస్సైళ్లను ప్రయోగించడంతో లెబనాన్లో 250 వరకూ మరణించారు. ఇది ఇరాన్ అత్యంత అసహనం తెప్పించింది. ఒకవైపు పాకిస్తాన్ వేదికగా ఇరు దేశాలు చర్చలకు సిద్ధమైన తరుణంలో ఇజ్రాయెల్ మాత్రం ఇంకా లెబనాన్పై దాడులు చేస్తూనే ఉండటం ఏంటని ప్రశ్నించింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై యుద్ధం చేస్తున్న సమయంలో ఆ దేశానికి సాయం చేసిన వారిలో హెజ్బుల్లా దళం ఒకటి. మరి వారిపై దాడులు చేస్తే ఇరాన్ ఊరుకుంటుందా?, తమతో చర్చలు అంటూ తమకు మద్దతిచ్చిన వారిపై దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తే ఉండదు.సీజ్ఫైర్ అనేది కేవలం అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య మాత్రమేనని అది లెబనాన్ విషయంలో కాదని అంటున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని కూడా ఇదే మాట అంటున్నారు. ఒకవేళ లెబనాన్ను సీజ్ఫైర్ అంశంలో చేర్చకపోతే ఇరాన్ ఒప్పుకుంటుందా? అనేదే ఇప్పుడు ట్రంప్ ముందున్న ప్రశ్న. అలా జరగని పక్షంలో ట్రంప్ ముందున్నది ఏమిటి అనే చర్చ మొదలైంది. ఇరాన్ పెట్టే ఈ షరతకు ఒప్పుకోవాలంటే.. అందుకు ముందుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను ట్రంప్ ఒప్పించాలి. మరి నెతన్యాహూ ఇందుకు ఒప్పుకుంటారా? అనేది మరో ప్రశ్న. నెతన్యాహూపై ఒత్తిడి తేగలరా?లెబనాన్పై యుద్ధాన్ని ఆపమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూపై ట్రంప్ ఒత్తిడి తీసుకు రావాల్సి ఉంటుంది. లెబనాన్పై దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్.. ఆ దాడిని ఆపాలని చర్చలకు ముందే చెప్పింది. వాటిపై అమెరికా-ఇజ్రాయెల్ పెద్దలు నో అంటున్నారు. శాంతి చర్చల్లో కూడా అదే మాట అంటే మాత్రం.. అదే సమయంలో ‘‘లెబనాన్పై దాడులు ఆపకపోతే చర్చలు లేవు.. ఏమీ లేవు’’ అని ఇరాన్ అంటే మాత్రం ట్రంప్ నోట్లో వెలక్కాయపడినట్లే. ఆ సమయంలో ట్రంప్ ముందున్నది మళ్లీ యుద్ధానికి దిగడమే. అంటే ఇక్కడ పూర్తిగా శాంతియుత వాతావరణం రావాలని కోరుకుంటే మాత్రం నెతాన్యాహూను ముందుగా ఒప్పించాలి ట్రంప్. పాక్కు జేడీ వాన్స్..!ఇరాన్ చర్చలకు వచ్చినా తాము పెట్టే ఆంక్షలకు ఒప్పుకోదనే నేరుగా అమెరికా ఉపాధ్యక్షుడే.. రేపు(శుక్రవారం) పాకిస్తాన్కు వస్తున్నారు. పాకిస్తాన్ వేదికగా ఈ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి.. కచ్చితంగా అమెరికా పెద్ద తలకాయలు ఉండాల్సిందేనని ఇరాన్ పట్టుబట్టిన నేపథ్యంలో జేడీ వాన్స్ను పాకిస్తాన్ పర్యటన దాదాపు ఖరారైంది. తమతో చర్చల్లో భాగంగా అమెరికా పరిపాలన విభాగంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థాయి తప్పితే మరే అధికారులు తమకు అవరసం లేదని ఇరాన్ పంతం పట్టుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ నమ్మదగిన జేడీ వాన్స్ ను పాక్కు పంపించబోతున్నారనే టాక్ నడుస్తోంది.మరి జేడీ వాన్స్.. ఇరాన్ను ఎంతవరకూ ఒప్పిస్తారనేది చూడాలి. లెబనాన్ను పక్కకు పెట్టి ఈ శాంతి చర్చలు సాగుతాయా?, ఇరాన్ పెట్టే పలు కండిషన్స్కు అమెరికా ఊ కొడుతుందా? అనేది చూడాలి. కొసమెరుపు ఎలా ఉండబోతుంది..?ఇరాన్తో కచ్చితంగా అమెరికా సుదీర్ఘ చర్చలే జరపనుంది. ఇప్పటివరకూ యుద్ధంలో అమెరికాకు ఇరాన్ అంతు చిక్కకపోవడం ఒకటైతే.. ఈ యుద్ధంలో అమెరికాలో ప్రజల నుంచి ట్రంప్పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ తరుణంలో ఇరాన్తో చర్చల ద్వారానే వారిపై గెలవాలనే భావనలో ఉన్నారు ట్రంప్. జేడీ వాన్స్ చర్చల తర్వాత ‘ ప్రపంచ శాంతి వెల్లివిరిసింది’ అంటూ ట్రంప్ మళ్లీ తనదైన శైలిలో ఓ ప్రకటన ఇవ్వనున్నారా?.. .. లేక ‘‘ఇరాన్కు చుక్కలు చూపించబోతున్నాం’’ అనే మాట ట్రంప్ నోట మళ్లీ వినబడుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి.
జాతీయం
బిహార్ కొత్త సీఎం ఆయనే.. బ్యాక్ గ్రౌండ్ ఇదే!
పట్నా: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టనున్నారు. జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీలో బీజేపీ ముఖ్య నాయకులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి పేరును ఖరారు చేయనున్నారు.ఏప్రిల్ 14వ తేదీన బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేస్తారు. అనంతరం కొత్త సీఎం పేరును అధికారికంగా ప్రకటిస్తారు. ఏప్రిల్ 15న సామ్రాట్ చౌదరి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతుండడం బిహార్ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడం వల్ల నామమాత్రపు నాయకుడిగా మిగిలిపోతారని, రాష్ట్రంలో ఆయన పార్టీ ప్రభావం తగ్గిపోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి.. 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్బత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. ఆయన 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్గా నియమితులయ్యారు.2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్(యూ)లో చేరి 2 జూన్ 2014న పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సామ్రాట్ చౌదరి 2018లో భారతీయ జనతా పార్టీలో చేరి బీహార్ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా, 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024 జనవరి 28న నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సామ్రాట్ చౌదరి.. బీహార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచే కొత్త రూల్
ఢిల్లీ: టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు ఇవాళ నుంచి(ఏప్రిల్ 10, శుక్రవారం) బంద్ కానున్నాయి. ఫాస్టాగ్ లేని వాహనాలకు 1.25 రెట్ల అధిక రుసుము చెల్సించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయరహదారులపై టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపేయనుంది. కేవలం ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులను పూర్తిచేయాల్సి ఉంటుంది.ఒకవేళ వాహనాలకు ఫాస్టాగ్ను అతికించకపోతే యూపీఐ విధానం ద్వారా టోల్ రుసుమును చెల్లించవచ్చు. కానీ వాస్తవిక రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా టోల్ చార్జీని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ.. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ను జారీచేసింది.ఫాస్టాగ్ విధానంలో మాత్రమే టోల్ప్లాజా గేట్ల వద్ద ఎలాంటి క్యూ సమస్యలు తలెత్తబోవని, అందుకే ఫాస్టాగ్ను ప్రోత్సహిస్తున్నామని మంత్రిత్వశాఖ చెబుతోంది. వ్యాలిడిటీ దాటిపోయిన ఫాస్టాగ్లతో వచ్చే వాహనాల టోల్చార్జీలను యూపీఐ విధానంలో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. ఫాస్టాగ్ లేదా యూపీఐ విధానంలోనూ చెల్లింపులు జరపని వాహనాలను 14వ నిబంధన మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
ఓటెత్తిన కేరళ
తిరువనంతపురం: కేరళ 16వ అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 78.12% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటేసిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ నేత సతీశన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, బీజేపీ రాష్ట్ర చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ తదితరులున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) రతన్ యూ కేల్కర్ తెలిపారు. అక్కడక్కడా సాంకేతిక లోపాలు తలెత్తాయన్నారు. రెండు పోలింగ్ బూత్లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. ప్రస్తుత సరళిని బట్టి చూస్తే 90 శాతం వరకు ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 74.06 శాతం మంది ఓటేయగా, ఈసారి అంతకుమించి తరలిరావడం విశేషం. అసెంబ్లీలోని మొత్తం 140 నియోజకవర్గాల్లో 2.71 కోట్ల ఓటర్లున్నారు. 1987 ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 80.54 శాతం ఓటింగ్ నమోదైంది. మరోసారి భారీగా ఓటింగ్ నమోదు కావడంపై వివిధ పార్టీలు తమకు అనుకూలమైన విశ్లేషణలు విన్పిస్తున్నాయి. సర్ ప్రక్రియ వల్లే ఈ స్థాయిలో ఓటర్లు తరలివచ్చారని సీపీఎం నేత మోహనన్ పేర్కొన్నారు. గతంలో ఓటింగ్ శాతాలు భారీగా ఉన్నప్పుడు ఫలితాలు యూడీఎఫ్కే అనుకూలంగా వచ్చాయని కాంగ్రెస్ నేత దీప్తి మేరీ వర్గీస్ గుర్తు చేశారు. అయితే, ఈ దఫా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం వల్లే ఓటింగ్ శాతం పెరిగినట్లు బీజేపీ నేత షైజు విశ్లేషించారు. ఇది తమ పారీ్టకి అనుకూల అంశమన్నారు.పుదుచ్చేరిలో 89.87%పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి గురువారం జరిగిన పోలింగ్లో ఏకంగా 89.87 శాతం పోలింగ్ నమోదైంది. 1964లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొంది, భారత్లో విలీనమయ్యాక పుదుచ్చేరిలో దాదాపు 90 శాతం మంది ఓటర్లు తరలివచ్చి ఓటేయడం ఇదే మొదటిసారి. గతంలో ఇక్కడ జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలన్నిటిలోనూ ఇదే రికార్డని చీఫ్ ఎలక్టోరల్ అధికారి పి.జవహర్ తెలిపారు. ఇది చరిత్రాత్మకం, అసాధారణమని ఆయన పేర్కొన్నారు. ఒక్క స్వల్ప ఘటన మినహా పుదుచ్చేరి, కారైకాల్ మొత్తమ్మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రారంభమైన ఉదయం 7 గంటలకే జనం పోలింగ్ బూత్ల వద్దకు చేరుకున్నారు. ఎండలు మండిపోతున్నా లెక్కచేయలేదు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అవకాశమి చ్చారు. సీఎం ఎన్.రంగస్వామి, లోక్సభ ఎంపీ వీ వైతిలింగం, డీఎంకే నేత ఆర్.శివ, హోంమంత్రి నమశ్శివాయం ఓటు వేసిన వారిలో ఉన్నారు. అస్సాంలో 85% మైనారిటీల ప్రాబల్యమున్న చోట్ల 90 శాతంపైనే గువాహటి: అస్సాం అసెంబ్లీకి గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల నాటికి 85.64 శాతం మంది ఓటేశారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 126 స్థానాలకు ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గత 2021లో జరిగిన ఎన్నికల్లో 82.04 శాతం ఓటింగ్ నమోదైంది. 2016 శాతం అత్యధికంగా 84.72 మంది ఓటేయడం రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర ప్రజలు ఈదఫా గత రికార్డును తిరగరాయడం విశేషం. ఓ వైపు వర్షం కురుస్తున్నా జనం లెక్క చేయలేదు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఈసీ పేర్కొంది. దాల్గావ్ నియోజకవర్గంలో అత్యధికంగా 95.83 శాతం మంది ఓటేయగా, అత్యల్పంగా న్యూ గువాహటిలో 72.10 మంది ఓటేశారు. మైనారిటీల ప్రాబల్యమున్న 19 నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. 2023లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలివి. గురువారం సీఎం హిమంత బిశ్వ శర్మ, భార్య, పిల్లలతో కలిసి వచ్చి కామ్రూప్ (మెట్రో) గారాల్ బునియాదీ స్కూల్ బూత్లో ఓటేశారు. జోర్హాత్లోని డీసీబీ స్కూల్ బూత్లో కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఓటేశారు. ఓటేసిన మరికొందరు ప్రముఖుల్లో కేంద్ర మంత్రి పబిత్రా మర్ఘరెటా, ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా తదితరులున్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావడంపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును, నయా అస్సాంను కోరుకుంటున్నారనేందుకు ఇదే సంకేతమని విశ్లేషించారు. ఓటరు శాతం భారీగా నమోదు కావడాన్ని చారిత్రక పరిణామంగా సీఎం హిమంత అభివరి్ణంచారు. ఫలితం ఇప్పటికే నిర్ణయమైపోయిందని వ్యాఖ్యానించారు. తమ పాలన పట్ల ప్రజలు సంతృప్తి, సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పోలింగ్ సంబంధిత ఘర్షణల్లో 30 మంది గాయపడినట్లు ఐజీ అఖిలేశ్ కుమార్ తెలిపారు.
ఓటర్లను పలకరించిన ‘నీల’
పుదుచ్చేరి: ఓటర్లలో ఉత్సాహం కల్గించేందుకు ఎన్నికల అధికారులు ఓ వినూత్న ప్రయోగం చేపట్టారు. రోబోను రంగంలోకి దించారు. నీలం అనే పేరుగల ఈ రోబో లంగా ఓణీతో పూలున్న ప్లేట్ను చేతులతో పట్టుకుని క్యూలో నిలబడ్డ ఓటర్లకు ఆహ్వానం పలుకుతూ, వారిని పలకరిస్తూ పోలింగ్ బూత్ వరండాలో ముందుకు సాగింది. ఓటుహక్కు వినియోగించుకోవాలని, వంద శాతం ఓటింగ్ నమోదు చేయాలని కోరింది. పుదుచ్చేరిలోని రాజ్భవన్ నియోజకవర్గంలో వీవోసీ ప్రభుత్వ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన బూత్ వద్ద గురువారం ఈ రోబో అందరినీ ఆకర్షించింది. స్కూల్లో ఏర్పాటైన మోడల్ బూత్లో చెన్నై నుంచి తెప్పించిన రోబో ‘నీల’తో తాము చేపట్టిన ప్రయోగం విజయవంతమైందని జిల్లా ఎన్నికల అధికారి కుళోత్తుంగన్ చెప్పారు. ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’
అల్ఫారెట్టా, జార్జియా: స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి-2026’ అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు.ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. నాలుగేళ్ల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ(యూఎస్ఏ) సేవా సంస్థలకు అందజేయనున్నారు.ఈ వేడుకల్లో బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి (శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రతినిధులు), గిరిధర్ కొటగిరి (ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు), జ్యోత్స్న పాలకుర్తి (గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ చైర్మన్), రమణ గంద్ర (గేట్స్ అధ్యక్షులు), సునీత పోట్నూరు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు), ఆది శ్రీనివాసన్ (ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు), శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ (ప్రెసిడెంట్ అండ్ సీఈఓ), జనార్ధన్ పన్నెల (శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధి) పాల్గొన్నారు.
న్యూయార్క్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయుల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్టర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరంలోని ఇండియా హౌస్లో ఘనంగా నిర్వహించారు.గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వ్యాపారం, మీడియా, ఫైనాన్స్, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అమెరికాలో భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు.FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తమ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు.కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో', 'ఉజ్వల యోజన' వంటి పథకాల ద్వారా భారత్ మహిళా సాధికారతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అలాగే 100 మిలియన్ కుటుంబాలను మహిళల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థికంగా శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరఫున గుర్తింపు సర్టిఫికెట్లు, FIA శాలువాలు, ట్రోఫీలు అందజేశారు.నార్త్స్టార్ స్ట్రాటజీస్ COO జోడి లిన్ హెర్క్లోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల్ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాన్సుల్ జనరల్ సతీమణి మోనాలిసా శువదర్షిణి ప్రధాన్ కూడా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్ మాట్లాడుతూ, కమ్యూనిటీ నిర్మాణంలో FIA పాత్రను కొనియాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అమెరికన్ నటి రేష్మా శెట్టి.. మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ తానియా కిన్సెల్లా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం ఇస్తూ.. అడ్డంకులను అధిగమించిన వైనాన్ని వివరించారు.కార్యక్రమ ప్రారంభంలో దివంగత అవార్డు గ్రహీత రాధా సుబ్రమణ్యం జ్ఞాపకార్థం మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం ముగింపులో FIA ప్రధాన కార్యదర్శి సృష్టి కౌల్ నరులా ధన్యవాదాలు తెలిపారు. FIA జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల వందన సమర్పణతో వేడుకలను ముగిశాయి.ఎఫ్ఐఏ సంస్థ 1970 నుండి భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారతీయ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఇండో–అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తోంది.
సింగపూర్లో ఘనంగా ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి తనయులు కే నాగేంద్రనాథ్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం 43, బర్గండీ క్రిసెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 70 మంది దర్శకుడు కె. విశ్వనాథ్ అభిమానులు హాజరయ్యారు.సంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ, కె. నాగేంద్రనాథ్తో తనకు దాదాపు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తెలిపారు. సామవేదం షణ్ముఖ శర్మ 2017లో సింగపూర్ విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన శివపదం కార్యక్రమానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో సందేశాలు అందించిన పుస్తక రచయిత, ప్రముఖ దర్శకులు సీనియర్ డైరెక్టర్ వంశీకి, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయులు ఏడిద రాజాకి ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్య అతిథి కె. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ శంకరాభరణం’ చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం అప్పట్లో తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందిందని తెలిపారు. ప్రస్తుతం పుస్తక రచయిత వంశీని సంప్రదించి పునర్ముద్రణ చేయించామని చెప్పారు. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న హైదరాబాద్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామని, దానికి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలు, విశేషాలు వినిపించడంతో ఇది ఒక అచ్చ తెలుగు పండుగలా అనిపించిందని తెలిపారు.ఈ సందర్భంగా తొలి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినసంస్కార భారతి అధ్యక్షులు రమణమూర్తి కి, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు బి.వి.ఆర్. చౌదరి దంపతులకు, తంగిరాల రాజశేఖర్, సౌభాగ్యలక్ష్మి దంపతులకు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు.కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి ఆలపించగా, శేషశ్రీ వీణపై ఒక గీతాన్ని వాయించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ప్రేక్షకులతో పంచుకోగా, చిత్ర మరియు పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం రాజశేఖర్–సౌభాగ్యలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో భోజనాన్ని సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లలో శ్రీలలిత, మాధవి పాలకుర్తితోపాటు, సుబ్బు పాలకుర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ్, సత్య జాస్తి, రాజ్ కుమార్ తదితరులు సహాయ సహకారాలను అందించారు.
క్రైమ్
ప్రాణం తీసిన స్నానం సరదా
సాక్షి, పాడేరు: సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలో దిగిన ముగ్గురు గిరిజన యువతులు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతిచెందారు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. హుకుంపేట మండలం మారుమూల బూర్జ పంచాయతీ జంబువలస గ్రామానికి చెందిన గిరిజన యువతులు సాలెపు త్రిష (17), సాలెపు పవిత్ర (16), సాలెపు రత్నకుమారి(16) అంజలి కలిసి అనంతగిరి మండలం వాలాసి పంచాయతీలోని ములగుమ్మి జలపాతం వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. గ్రామంలో ఇటుకల పండుగ కావడంతో నలుగురు యువతులు జలపాతం వద్ద ఉత్సాహంగా గడిపారు. త్రిష, పవిత్ర, రత్నకుమారి జలపాతంలోకి దిగి స్నానాలు చేస్తుండగా, అంజలి ఒడ్డున పెద్ద బండరాయిపై నిల్చుని సెల్ఫోన్లో వారిని ఫొటోలు తీస్తోంది. అయితే, త్రిష, పవిత్ర, రత్నకుమారి ప్రమాదవశాత్తూ జారి జలపాతంలో పడిపోయారు. ముగ్గురూ నీటిలో మునిగి మృతిచెందారు. వారు మునిగిపోయారనే కంగారులో అంజలి బండరాయి నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న జంబువలస గ్రామానికి చెందిన గిరిజనులంతా జలపాతం వద్దకు చేరుకుని ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన అంజలిని అనంతగిరి మండలంలోని లుంగపర్తి పీహెచ్సీకి తరలించారు. మృతిచెందిన త్రిష హుకుంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. రత్నకుమారి అనంతగిరి మండలం బీంపోల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షలు రాసి ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది. ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన ముగ్గురు గిరిజన యువతులు మృతిచెందడంతో జంబువలస గ్రామంలో విషాదం నెలకొంది.వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతంలో ప్రమాదవశాత్తూ పడిపోయి ముగ్గురు యువతులు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముగ్గురు యువతుల మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవలే ఇంటర్మీడియెట్, టెన్త్ పరీక్షలు రాసి మంచి భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్థినులు ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
రేప్ చేసి ఉరివేశారు?
రాయపర్తి/వర్ధన్నపేట: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ తండాలో గురువారం గ్యాంగ్రేప్ కలకలం రేపింది. తల్లిదండ్రులు, బంధువుల కథనం ప్రకారం.. ఓ తండాకు చెందిన గిరిజన దంపతులకు కుమారుడు, కూతురు (21) ఉన్నారు. తల్లిదండ్రులు బతుకుదెరువుకోసం హైదరాబాద్లో ఉంటుండగా కుమారుడు మధ్యప్రదేశ్లో పోస్టుమ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. యువతి తన ఇంట్లో ఉంటోంది. పక్కనే పెద్దనాన్న ఇల్లు ఉండగా ఏదైనా అవసరం ఉంటే ఆ కుటుంబ సభ్యులతో చెప్పేది. నర్సంపేటలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆ యువతి నర్సు(ఏఎన్ఎం)గా శిక్షణ పొందుతోంది.తండానుంచి నర్సంపేటకు వస్తూ పోతున్న క్రమంలో పర్వతగిరి మండలం రావూరు తండాకు చెందిన కొంతమంది యువకులు తరుచూ వెంటపడుతుండేవారని తన పెద్దనాన్న కుటుంబ సభ్యులతో సదరు యువతి చెప్పేది. బుధవారం రాత్రి యువతి పెద్దనాన్న ఇంట్లో కాకుండా తన ఇంట్లో పడుకుంది, ఉదయం చూడగా ఉరేసుకుని కనిపించింది. ఈ క్రమంలో తల్లిదండ్రులతోపాటు బంధువులు సదరు యువతిని పక్కనే ఉన్న మొక్కజొన్న చేనులో రావూరుకు చెందిన నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసి ఇంట్లో ఉరివేసి వెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన.. పోలీసులు యువతి మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం వర్ధన్నపేటకు తీసుకురాగా కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. యువతిపై గ్యాంగ్ రేప్ చేయడం వల్లనే మృతిచెందిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సాయిబాబు ఆందోళనకారులను నచ్చచెప్పి న్యాయం చేస్తామనిచెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీస్ శాఖలో భారీగా జీతాల కుంభకోణం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సంచలనాత్మకంగా వెలుగులోకి వచ్చిన జీతాల కుంభకోణం కలకలం రేపుతోంది. మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ నిధులను అక్రమంగా వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు రూ.1 కోటి 40 లక్షల రూపాయల మేర నిధులు కాజేయబడినట్లు టాస్క్ ఫోర్స్ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో ఒక పోలీసు ఉద్యోగిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో ఆర్థిక వ్యవహారాలపై పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పార్కింగ్ కోసం తల నరికేస్తే : బంధువులు అతడిని కొట్టి చంపేశారు
బిహార్లో జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేపాయి. ఒక చిన్న పార్కింగ్ వివాదం రెండు హింసాత్మక ఘటనలకు దారి తీసింది. రోడ్డు పక్కన వ్యాపారి ఒక పికప్ డ్రైవర్ను తల నరికాడు, ఆ తర్వాత మృతుడి కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట నిందితుడిని హతమార్చిన కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం, అరేరియా జిల్లాలోని ఫోర్బ్స్గంజ్ పట్టణంలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడైన డ్రైవర్ను అరేరియాలోని జోగ్బాని పట్టణానికి చెందిన అలీ హుస్సేన్గా గుర్తించారు. ప్రతీకారంగా హత్యకు గురైన రోడ్డు పక్కన వ్యాపారిని రవి చౌహాన్గా గుర్తించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫోర్బ్స్గంజ్ పట్టణంలో ఒక చిన్న పార్కింగ్ సమస్యపై 'సత్తు' అమ్మే చౌహాన్, హుస్సేన్పై దాడి చేసి, అతని తల నరికి, అందరి ముందూ వీరంగం సృష్టించాడు. ఆ తర్వాత నిందితుడు మృతదేహాన్ని, నరికిన తలను సంఘటనా స్థలంలోనే వదిలిపెట్టి అక్కడినుంచివెళ్లి పోయాడు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?ఇది చూసి మృతుడి బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. హుస్సేన్ బంధువులతోపాటు, స్థానికులు కూడా ఇంటి దగ్గర దాక్కున్న నిందితుడిని సంఘటనా స్థలానికి లాక్కొచ్చి, కర్రలతో, రాడ్లతో కొట్టి, పోలీసుల కళ్లెదుటే చంపేశారు. ఈ జంట హత్యల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులకు, ఆగ్రహించిన గుంపుకు మధ్య ఘర్షణ జరిగింది. సంఘటనా స్థలం చుట్టూ ప్రజలు గుమిగూడటం ప్రారంభించడంతో, అదనపు పోలీసు బలగాలు మెహరించాయి. ఈ రెండు ఘటనల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ, పోలీసులు ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే!
వీడియోలు
ఎర్రంనాయుడు మరణంలో నీ హస్తం లేదా? అచ్చెన్న పై తమ్మినేని సీతారాం షాకింగ్ నిజాలు
చంద్రబాబు చెప్పే రాజధాని 30 నుంచి 40 ఏళ్ళైనా పూర్తికాదు
జననాయగన్ కు దెబ్బ మీద దెబ్బ
భార్యను, కొడుకుని చిటర్స్ అని కేసుపెట్టిన నువ్వు పెద్ద యూజ్ లెస్ ఫెలో
ఎప్టోస్టీన్ ఫైల్స్ పై ట్రంప్ వైఫ్ షాకింగ్ రియాక్షన్
లొంగిపోయిన 42 మావోయిస్టులు
ఓటు వేసినందుకు చేతిలో చిప్ప పెట్టారు
టీమిండియాలో దక్కని చోటు..!వైభవ్, ఆయుష్ మాత్రే కు షాకిచ్చిన BCCI
అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది..వాన్ని ఉరితీయండి తండ్రి ఆవేదన
ఒళ్లు దగ్గర పెట్టుకో బ్రోకర్ రాధాకృష్ణ ఖబడ్డార్


