పాక్ హెచ్చరికలను తిప్పికొట్టిన భారత్
ఢిల్లీ: పాక్ బెదిరింపుల వేళ.. సింధు జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదని పాకిస్థాన్కు భారత్ తెగేసి చెప్పింది. సింధు జలాల ఒప్పందంపై భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూ.. పొరుగు దేశం.. ఉగ్రవాదానికి పూర్తిగా స్వస్తి చెప్పేంత వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలన్న తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భారత్ తేల్చి చెప్పింది. ఒప్పందం ఇప్పటికీ అమలులోనే ఉందని.. నీళ్లను ఆయుధంగా మార్చవద్దంటూ పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సహా ఇతర మంత్రులు చేసిన హెచ్చరికలను భారత్ తిప్పికొట్టింది.గత ఏడాది (2025) ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన తర్వాతే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, నాటి నుంచి పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు అబద్ధాలు చెప్తోంది. సరిహద్దు నదులను పంచుకునే ఇతర దేశాలకు భారత్ నిర్ణయం ఒక ప్రమాదకరమైన ఉదాహరణగా మారుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనికి సమాధానంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నేడు పాకిస్తాన్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపనంత వరకు ఏదీ మారదని తేల్చిచెప్పింది.సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరి స్థిరంగా ఉంది. పాకిస్తాన్ నిరంతరం సాగిస్తున్న సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఈ ఒప్పందం ప్రస్తుతం నిలిపివేయబడింది. పాకిస్తాన్ నమ్మదగిన విధంగా శాశ్వతంగా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపాలంటూ రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదానికి సురక్షిత స్థావరంగా మారిన పాకిస్తాన్, సింధు జలాల విషయంలో తానే తవ్వుకున్న గోతిలో పడి విలవిలలాడుతోందని.. కానీ ఆ విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న ఈ దేశం, ఇప్పటికీ భారత్పై, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్పై దాడులు చేయడానికి ఉగ్రవాదులకు తన భూభాగాన్ని వాడుకునేలా అనుమతిస్తూనే ఉంది’’ అంటూ రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు.1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు ఉండగా.. సింధు, జీలం, చెనాబ్ నదుల జలాల్లో ఎక్కువ భాగం పాకిస్థాన్కు కేటాయించారు. అయితే 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమని చెబుతున్న భారత్.. సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై వైఎస్ జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సజ్జన్ జిందాల్, జేఎస్ డబ్ల్యు స్టీల్ బృందానికి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించిన ఫోటోతో ఎక్స్లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. రాయలసీమ పారిశ్రామిక అభివృద్దికి ఈ ప్రాజెక్టు కీలకమైన మైలురాయి. యువతకు ఉపాధి అవకాశాలు లభించటం ద్వారా ఎన్నో కుటుంబాలకు మేలు చేకూరుతుందని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘‘ఎన్నో సంవత్సరాల కృషి, ప్లానింగ్ అనే పునాదుల మీద ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మితమవుతాయి. మా ప్రభుత్వ హయాంలో జేఎస్ డబ్ల్యూ ప్రాజెక్టు రూపుదిద్దుకోవటానికి కీలకమైన పునాదులు వేశాం. పర్యావరణ అనుమతులు పొందేందుకు సహకరించాం. నీటి కేటాయింపులూ మా హయాంలోనే చేశాం. భూ కేటాయింపు, రోడ్ల అనుసంధానం, ఇతరత్రా మౌళిక సదుపాయాల కోసం అవసరమైన భూమిని కూడా అందించాం. అలాగే ప్రాజెక్టు ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టాం. ఆ కారణంగానే ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు కదిలాయి. కానీ దురదృష్టవశాత్తూ గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయిHeartiest congratulations to Shri @sajjanjindal Garu and the entire @jswsteel team on the restart of the steel plant project in Kadapa. This is a significant milestone for the industrial development of Rayalaseema and a moment of hope for the youth and families aspiring for… pic.twitter.com/pI0CJVhV7e— YS Jagan Mohan Reddy (@ysjagan) July 3, 2026 ..ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టు ఆలస్యమయింది. ఇప్పుడైనా పనులు తిరిగి ప్రారంభం కావటం సంతోషకరం. కడప ప్రజలు చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇక ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. కడప నా సొంత జిల్లా కావటంతో ఈ ప్రాజెక్టుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా అక్కడి యువతకు మంచి భవిష్యత్తు లభించాలని నేను కోరుకుంటున్నాను. అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతంగా నిరంతరం కొనసాగే ప్రక్రియ..ఇప్పటికే జరిగిన పనులను కొనసాగిస్తూ, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఏ ప్రభుత్వానికైనా ప్రాజెక్టుల పూర్తికి సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి, కడపతో పాటు మొత్తం రాయలసీమ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలి. పారిశ్రామికాభివృద్ధి, సమగ్ర అభివృద్ధి ఫలాలను అందించడంలో జేఎస్డబ్ల్యూకు సంపూర్ణ విజయం చేకూరాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
హమ్మయ్యా.. ఎట్టకేలకు ముగిసిన హంటా వైరస్ టెన్షన్
ప్రపంచాన్ని కొద్ది రోజులుగా ఆందోళనకు గురి చేసిన క్రూయిజ్ నౌక హంటావైరస్ వ్యాప్తి ఎట్టకేలకు ముగిసింది. చివరిగా వైరస్ బారినపడిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి కూడా 42 రోజుల పర్యవేక్షణను పూర్తి చేసి, పరీక్షల్లో నెగెటివ్గా తేలడంతో ఈ వ్యాధి వ్యాప్తి అధికారికంగా ముగిసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. దీంతో రెండు నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది.ఈ ఘటన ఎంవీ హోండియస్ క్రూయిజ్ నౌకలో జరిగింది. ఈ నౌక ఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి అంటార్కిటికా పర్యటనకు బయలుదేరింది. ప్రయాణం మధ్యలో కొందరు ప్రయాణికులు తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. పరీక్షలు చేయగా, వారికి ఆండీస్ హంటా వైరస్ అనే అరుదైన వైరస్ సోకినట్లు తేలింది. ఈ వైరస్ సాధారణంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఈ రకమైన వైరస్ అరుదుగా ఒక మనిషి నుంచి మరో మనిషికి కూడా సోకే అవకాశం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తత పెరిగింది.ఈ వ్యాప్తిలో మొత్తం 13 మంది వైరస్ బారిన పడగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. అలాగే భారత్కు చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ఈ నౌకలో పనిచేశారు. అయితే వారికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, ముందుజాగ్రత్తగా పర్యవేక్షణలో ఉంచినట్లు భారత ఆరోగ్య అధికారులు అప్పట్లో వెల్లడించారు. దేశానికి ఎలాంటి తక్షణ ముప్పు లేదని కూడా స్పష్టం చేశారు.వైరస్ వ్యాప్తి గుర్తించిన వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ, పలు దేశాల ప్రభుత్వాలు కలిసి చర్యలు చేపట్టాయి. నౌకలో ఉన్న ప్రయాణికులను వారి వారి దేశాలకు ప్రత్యేక ఏర్పాట్లతో పంపించి, 42 రోజుల పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 33 దేశాల్లో వందలాది మంది కాంటాక్టులను గుర్తించి పర్యవేక్షించారు. చివరకు చివరి వ్యక్తి కూడా ఆరోగ్యంగా బయటపడటంతో వైరస్ వ్యాప్తి గొలుసు పూర్తిగా తెగిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.నిపుణుల ప్రకారం, హాంటావైరస్ సాధారణంగా మనుషుల మధ్య సులభంగా వ్యాపించదు. ఎక్కువగా ఎలుకల మూత్రం, విసర్జన, వాటి ద్వారా కలుషితమైన ప్రదేశాల వల్ల సోకుతుంది. అయితే ఈ ఘటనకు కారణమైన ఆండీస్ హాంటావైరస్ మాత్రం అరుదుగా మనిషి నుంచి మనిషికి వ్యాపించే లక్షణం కలిగి ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించింది. ఈ ఘటన ముగియడం ప్రపంచానికి ఊరటనిచ్చినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి వ్యాధులు వ్యాపించినప్పుడు దేశాల మధ్య వేగవంతమైన సమాచారం, తక్షణ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ వంటి చర్యలు ఎంత ముఖ్యమో మరోసారి ఈ సంఘటన గుర్తు చేసిందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
చైనాకే చుక్కలు చూపిస్తున్న కిమ్.. డ్రాగన్కు డబుల్ డోస్..
అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. అలాగని శాశ్వత మిత్రులూ ఉండరు. కేవలం స్వార్థ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. దీనికి చక్కటి ఉదాహరణగా.. ఇప్పుడు తూర్పు ఆసియాలో నడుస్తున్న హైడ్రామాను చెప్పుకోవచ్చు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. ఇటీవల హఠాత్తుగా ఉత్తర కొరియాలో ల్యాండ్ అయ్యారు. ప్రపంచ మీడియా అంతా ఇప్పుడు ప్యాంగ్యాంగ్ వైపే చూస్తోంది. ఎందుకంటే, నిన్న మొన్నటి వరకు ఉత్తర కొరియా అంటే చైనాకు ఒక చిన్న ‘తోక దేశం’ లాంటిది. బీజింగ్ గీసిన గీతను కిమ్ సామ్రాజ్యం దాటదు అనేది ఒక అంచనా. కానీ.. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కథ పూర్తిగా రివర్స్ అయింది!చైనా చేతిలో రిమోట్ పనిచేయట్లేదా?ఒకప్పుడు చైనా చేతిలో రిమోట్ కంట్రోల్లా ఉన్న ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్.. ఇప్పుడు ఏకంగా చైనాకే ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అటు రష్యాతో గుట్టుగా నడిపిన ఆయుధాల బేరం.. ఇటు అమెరికాను ముప్పుతిప్పలు పెడుతున్న వైనం.. వీటన్నిటి మధ్య చైనా అసహనం..! అసలు కిమ్ జోంగ్ ఉన్ ఆడుతున్న ఈ గ్లోబల్ మైండ్ గేమ్ ఏంటి? చైనా-రష్యాల మధ్య ఉత్తర కొరియా ఎలా నలిగిపోతోంది? లేక ఇద్దరినీ వాడుకుంటోందా? అనే ప్రశ్నలు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి.జుచే నుంచి హత్యల వరకు..ఈ గ్లోబల్ ఈక్వేషన్ అర్థం కావాలంటే.. మనం కొంచెం చరిత్ర పేజీల్లో వెనక్కి వెళ్లాలి. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, కిమ్ జోంగ్ ఉన్ తాత అయిన కిమ్ ఇల్ సంగ్.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్తో పోరాడిన గట్టి మిలిటరీ లీడర్. ఆయన దేశాన్ని ఏర్పాటు చేశాక 'జుచే' (Juche) అనే ఒక వింత సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. జుచే అంటే.. ‘స్వయం సమృద్ధి’ అని అర్థం. అంటే.. ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా బతకడం, అభివృద్ధి చెందడం. దాంతో.. ప్రపంచమంతా ఇండస్ట్రియల్ ఏజ్లో దూసుకుపోతుంటే.. ఉత్తర కొరియా మాత్రం ఒక చీకటి సామ్రాజ్యంగా మిగిలిపోయింది. ఎంతలా అంటే, రాజధాని ప్యాంగ్యాంగ్ మినహా దేశంలో దశాబ్దాల పాటు కరెంట్ కూడా లేని పరిస్థితి.కట్ చేస్తే.. 1990ల్లో సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది. అప్పటివరకు రష్యా నుంచి కొరియాకు వస్తున్న సాయం ఆగిపోయింది. ఈ పరిణామాలతో కిమ్ ఇల్ సంగ్ ఒక ప్రాక్టికల్ నిర్ణయం తీసుకున్నారు. 'జుచే' వర్కవుట్ కాదని గ్రహించి, దక్షిణ కొరియాతో విలీనం కోసం చర్చలకు సిద్ధపడ్డారు. కానీ, అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ విలీనం జరిగితే తమ పదవులు ఊడిపోతాయని భయపడిన అక్కడి మిలిటరీ జనరల్స్.. కిమ్ ఇల్ సంగ్ను రహస్యంగా అంతమొందించారు. ఆ తర్వాత వచ్చిన కిమ్ జోంగ్ ఇల్.. కరడుగట్టిన కమ్యూనిస్ట్ భావజాలంతో బతికారు. ఆయన తెచ్చిన అనాలోచిత అగ్రికల్చర్ సంస్కరణల వల్ల దేశంలో ఏకంగా 20 లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోయారు. కిమ్ హత్యాకాండ..!దేశాన్ని నాశనం చేస్తున్న కిమ్ జోంగ్ ఇల్ను చూసి మిలిటరీ జనరల్స్ అలర్ట్ అయ్యారు. తర్వాతి తరం అయినా ప్రపంచాన్ని చూసి నేర్చుకోవాలని.. అప్పట్లో చిన్న పిల్లోడైన కిమ్ జోంగ్ ఉన్ను స్విట్జర్లాండ్కు పంపించి చదివించారు. కానీ, అనుకోకుండా కిమ్ జోంగ్ ఇల్ చనిపోవడంతో.. కేవలం 20 ఏళ్ల చిరు ప్రాయంలోనే కిమ్ జోంగ్ ఉన్ దేశాధినేత అయ్యాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మిలిటరీ జనరల్స్ తన తాతను, తండ్రిని ఎలా వాడుకున్నారో కిమ్కు బాగా తెలుసు. అందుకే పవర్లోకి రాగానే.. తన తండ్రి కాలం నాటి పాత తరం జనరల్స్ను ఒక్కొక్కరినీ లేపేయడం మొదలుపెట్టాడు. సింగపూర్లో ఒకరిని చంపించాడు. రైల్వే మినిస్టర్ను ఏకంగా రైలు కిందే వేయించాడు. డిఫెన్స్ అటాచీని యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్తో షూట్ చేయించాడు. ఇలా భయోత్పాతం సృష్టించి.. టోటల్ పవర్ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు కిమ్.ఉత్తర కొరియాపై చైనా పెత్తనం కిమ్ అంతర్గతంగా పవర్ స్ట్రాంగ్ చేసుకున్నా.. ఎక్స్టర్నల్గా చైనా ఆధిపత్యం ఎక్కువైంది. 2017 సమయంలో.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. కిమ్ను బీజింగ్ పిలిపించుకుని తాతలా క్లాసులు పీకేవారు. చైనా మీడియా కూడా కిమ్ను ఒక చిన్న ప్రావిన్స్ లీడర్లా తక్కువ చేసి చూపించేది. ఇది ఈ యంగ్ డిక్టేటర్కు అస్సలు నచ్చలేదు. చైనా అహాన్ని దెబ్బకొట్టడానికి.. కిమ్ నేరుగా అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో చేతులు కలిపాడు. సింగపూర్, వియత్నాంలలో సమ్మిట్స్ జరిగాయి. అయితే, ట్రంప్ స్టేట్ డిపార్ట్మెంట్ బ్రీఫింగ్స్ సరిగ్గా చదవకపోవడం వల్ల.. ఆ చర్చలు ఫలించలేదు. అమెరికా చాప్టర్ క్లోజ్ అయింది.కలిసొచ్చిన ఉక్రెయిన్ యుద్ధంచైనా ఒత్తిడి పెరుగుతోంది. మరి కిమ్ ఏం చేయాలి? సరిగ్గా అప్పుడే వచ్చింది ఉక్రెయిన్ యుద్ధం! 2022లో ఉక్రెయిన్పై యుద్ధం వల్ల రష్యా ఒంటరైంది. ఆయుధాల కొరత వచ్చింది. ఇదే అదనుగా కిమ్ రంగంలోకి దిగాడు. దశాబ్దాలుగా దాచి ఉంచిన కోట్ల కొద్దీ ఆర్టిలరీ షాట్స్ను రష్యాకు ట్రైన్ల ద్వారా పంపాడు. ఎంతలా అంటే, యుద్ధంలో రష్యా వాడిన ఆయుధాల్లో మూడింట ఒక వంతు ఉత్తర కొరియా అందజేసినవే..! అంతేకాదు.. ఏకంగా 10,000 మంది కొరియన్ సైనికులను రష్యా బోర్డర్లో రష్యా తరఫున యుద్ధం చేయడానికి పంపాడు. దీనికి ప్రతిఫలంగా రష్యా నుంచి కిమ్ ఏం తీసుకున్నాడో తెలుసా? అత్యాధునిక స్పేస్ టెక్నాలజీ..! ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ సాంకేతికత! దీనివల్ల ఇప్పుడు ఉత్తర కొరియా అమెరికాలోని ఏ మూలనైనా న్యూక్లియర్ మిసైల్తో కొట్టగల సామర్థ్యం సంపాదించింది. అంటే, కిమ్కు కావాల్సిన డబ్బు, ఎనర్జీ, టెక్నాలజీ అన్నీ ఇప్పుడు రష్యా ఇస్తోంది. దీంతో చైనా మీద ఆధారపడాల్సిన అవసరం కిమ్కు పూర్తిగా తప్పిపోయింది!నో విలీనం..ఇదీ అసలు మ్యాటర్. ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్యాంగ్యాంగ్ ఎందుకు వెళ్లారంటే.. తమ చేతుల్లోంచి జారిపోయి రష్యా గూటికి చేరిన కిమ్ను మళ్లీ లొంగదీసుకోవడానికి. కానీ కిమ్ మాత్రం ‘తగ్గేదే లే’ అంటున్నాడు. ఎలాంటి షరతులు లేకుండా సాయం చేస్తేనే ఓకే అని.. లేదంటే పొమ్మని నిర్మొహమాటంగా చెబుతున్నాడు. ఎందుకంటే కిమ్ ఈ ఏడాది ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమ రాజ్యాంగాన్ని మార్చేసి, "ఇకపై దక్షిణ కొరియాతో విలీనం అనే ముచ్చటే లేదు.. మాది విడిగా ఉండే ఒక స్వతంత్ర అణు దేశం" అని డిక్లేర్ చేసేశాడు. చైనా లాంటి ఒక గ్లోబల్ సూపర్ పవర్కే చుక్కలు చూపిస్తున్న కిమ్ జోంగ్ ఉన్.. రాబోయే రోజుల్లో ఆసియా పసిఫిక్ రీజియన్లో, ముఖ్యంగా గ్లోబల్ ఎకానమీలో ఎలాంటి అలజడి సృష్టిస్తాడో అని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు
పాక్ హెచ్చరికలను తిప్పికొట్టిన భారత్
భారత్తో రెండో టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! యువ ప్లేయర్కు చోటు
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై రచ్చ.. స్పందించిన బీసీసీఐ
విజయ్ దేవరకొండతో వివాదం.. స్పందించిన దర్శకుడు
భారత్ vs అమెరికా: భారీ ధర తేడాపై చర్చ!
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. ఎప్పుడంటే?
‘సర్’ ఎఫెక్ట్: 15 లక్షల ‘ప్రవాస’ ఓట్లు గల్లంతు!
సాయి సుదర్శన్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
పాలమూరు స్ట్రైకర్స్ వర్సెస్ వరంగల్ తుది జట్లు ఇవే
అమెరికా డాలర్ కుప్పకూలుతుందా?: పీటర్ షిఫ్ హెచ్చరిక!
ఎన్నికల ముందు మరొకసారి చేశారంటే ముచ్చటగా మూడు సార్లు భూమి పూజ చేసినట్లు అవుతుంది సార్!!
అలాగే ‘సర్’!
అప్పులకు బ్రాండ్ అంబాసిడర్నని కాదయ్యా..! అభివృద్ధికి అన్నారు!!
కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్
మిమ్మల్ని గెలిపించుకున్నందుకు చెప్పుతో కొట్టుకోవాలి
‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభ సూచనలు
సాక్షి కార్టూన్ : నేను చెప్పిన మందులు డౌన్లోడ్ చేసుకోండి!
విఫలమైన భారత బౌలర్లు.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక
హీరోయిన్గా మాజీ డీజీపీ కూతురు.. సినిమా రెడీ
‘అపార్ట్మెంట్ కొన్నాను.. చింతిస్తున్నాను’
ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. రిలీజైన 8 నెలలకు..!
రిషబ్ పంత్ కీలక నిర్ణయం
సాక్షి కార్టూన్ : 03-07-2026
ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ
పెను సంచలనం.. సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రూ.35 కోట్ల కుట్ర..
‘స్పెషల్ క్లాస్’ వద్దు ‘సేఫ్ క్లాస్’ చాలు
అమరావతి నిర్మాణంలో కీలక అధికారి రాజీనామా
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
‘ఇసకపట్నం’ వెబ్సిరీస్ రివ్యూ
పాక్ హెచ్చరికలను తిప్పికొట్టిన భారత్
భారత్తో రెండో టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! యువ ప్లేయర్కు చోటు
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై రచ్చ.. స్పందించిన బీసీసీఐ
విజయ్ దేవరకొండతో వివాదం.. స్పందించిన దర్శకుడు
భారత్ vs అమెరికా: భారీ ధర తేడాపై చర్చ!
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. ఎప్పుడంటే?
‘సర్’ ఎఫెక్ట్: 15 లక్షల ‘ప్రవాస’ ఓట్లు గల్లంతు!
సాయి సుదర్శన్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
పాలమూరు స్ట్రైకర్స్ వర్సెస్ వరంగల్ తుది జట్లు ఇవే
అమెరికా డాలర్ కుప్పకూలుతుందా?: పీటర్ షిఫ్ హెచ్చరిక!
ఎన్నికల ముందు మరొకసారి చేశారంటే ముచ్చటగా మూడు సార్లు భూమి పూజ చేసినట్లు అవుతుంది సార్!!
అలాగే ‘సర్’!
అప్పులకు బ్రాండ్ అంబాసిడర్నని కాదయ్యా..! అభివృద్ధికి అన్నారు!!
కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్
మిమ్మల్ని గెలిపించుకున్నందుకు చెప్పుతో కొట్టుకోవాలి
‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభ సూచనలు
సాక్షి కార్టూన్ : నేను చెప్పిన మందులు డౌన్లోడ్ చేసుకోండి!
విఫలమైన భారత బౌలర్లు.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక
హీరోయిన్గా మాజీ డీజీపీ కూతురు.. సినిమా రెడీ
‘అపార్ట్మెంట్ కొన్నాను.. చింతిస్తున్నాను’
ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. రిలీజైన 8 నెలలకు..!
రిషబ్ పంత్ కీలక నిర్ణయం
సాక్షి కార్టూన్ : 03-07-2026
ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ
పెను సంచలనం.. సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రూ.35 కోట్ల కుట్ర..
‘స్పెషల్ క్లాస్’ వద్దు ‘సేఫ్ క్లాస్’ చాలు
అమరావతి నిర్మాణంలో కీలక అధికారి రాజీనామా
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
‘ఇసకపట్నం’ వెబ్సిరీస్ రివ్యూ
ఫొటోలు
కోలీవుడ్ నటుడు అరవింద్ ఆకాశ్ గ్రాండ్ వెడ్డింగ్ (ఫొటోలు)
హైదరాబాద్లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి (ఫొటోలు)
మా ఇంటి బంగారం జ్ఞాపకాల్లో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ మెహరీన్ (ఫొటోలు)
ఇదంతా అద్భుతమైన కథలా ఉంది.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)
హైదరాబాద్ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)
హైదరాబాద్ : రుచులు.. అద్భుతం : ఫుడ్– ఎ–ఫెయిర్– 2026 (ఫొటోలు)
సీఎం విజయ్ తండ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
బుల్లితెర డాక్టర్ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు)
మాన్సూన్ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
సినిమా
'రావు బహదూర్' సినిమా రివ్యూ
'వారణాసి'తో బిజీగా ఉన్న మహేశ్ బాబు.. ఓ నిర్మాతగా చేసిన సినిమా 'రావు బహదూర్'. సత్యదేవ్ హీరోగా నటించగా.. 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వం వహించాడు. ప్రమోషన్లు, సత్యదేవ్ లుక్స్ కారణంగా ఈ చిత్రంపై కాస్తంత బజ్ ఏర్పడింది. అలా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)కథేంటి?అది 1991. భువన వంశానికి చెందిన రామప్పరావు బహదూర్ అలియాస్ రాముడు(సత్యదేవ్) లివర్ క్యాన్సర్ బారిన పడతాడు. నాలుగు నెలలకు మించి బతకడని ఓ డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు గానీ ఏడాది దాటిపోయినా సరే రామప్ప అలానే ఉంటాడు. పైపెచ్చు రోజూ తాగుతూ బతికేస్తుంటాడు. నిద్రలో నుంచి లేచి అప్పుడప్పుడు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఇలా జరగడానికి కారణం ఎప్పుడో చనిపోయిన రామప్ప చిన్న కొడుకు కుసుమప్ప. వీడు తనకు పుట్టలేదని రామప్ప 'అనుమానం'. ఇదే విషయాన్ని చెబుతూ తన స్నేహితుడు, డాక్టర్ ఆచారి(వికాస్ ముప్పల) బుర్ర తినేస్తూ ఉంటాడు. మరి రావు బహదూర్ అనుమానం నిజమేనా? కుసుమప్ప ఎందుకు ఎలా చనిపోయాడు? ఈ కథలో రామప్ప భార్య రేణుక (దీపా థామస్) సంగతేంటి? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఎలాంటి కథ తీసుకున్నా చివరకు ఎలాంటి ట్విస్టులు పెట్టినా ప్రెజెంటేషన్ ఎలా ఉందనేది కూడా కీలకం. ఎందుకంటే అద్భుతమైన ట్విస్టులు పెట్టినా సరే దానికి తగ్గ కథకథానాలు లేదంటే క్లైమాక్స్లో పెద్దగా ఇంపాక్ట్ అనిపించదు. 'రావు బహదూర్' విషయంలో సరిగ్గా అదే జరిగింది. తెర నిండా భారీతనం, సత్యదేవ్ చేసే డిఫరెంట్ యాక్టింగ్ బాగున్నప్పటికీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా లేకపోవడం దీనికి పెద్ద మైనస్.ఓ ఫొటో ఫ్రేమ్ నుంచి బయటకొచ్చిన ఓ పిల్లాడు వేగంగా పరుగెత్తే సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. తర్వాత కాసేపటికే ప్రధాన పాత్రధారి రావు బహదూర్ ఎంటర్ అవుతాడు. ఇంతకీ అతడెవరు? అతడి ప్రపంచం ఏంటి? అని మెల్లగా చూపిస్తూ వెళ్తారు. తన జీవితాన్ని చెబితే రెండు భాగాల సినిమా అవుతుందని కూడా అంటాడు. కట్ చేస్తే రామప్ప యుక్త వయసుకి కథ వెళ్తుంది. దేశాలు పట్టుకు తిరుగుతున్న రామప్ప.. తండ్రి అనారోగ్యం కారణంగా ఇంటికి వస్తాడు. అదే టైంలో తండ్రిని చూసుకోవడానికి వచ్చిన నర్స్ రేణుకతో ప్రేమలో పడతాడు. తర్వాత వీళ్ల పెళ్లి, వైవాహిక జీవితం ఎలా సాగింది? రావు బహదూర్కి వచ్చిన అనుమానం.. పెనుభూతంలా మారి అతడి జీవితాన్ని ఎలా నాశనం చేసిందనేది మిగతా స్టోరీ.ఫస్టాప్ చాలా అంటే చాలా నెమ్మదిగా నిదానంగా సాగుతూ ఉంటుంది. డ్రామా మరీ ఎక్కువైపోయింది. ఏదో జరుగుతుంది అని తెలుస్తూ ఉంటుంది గానీ అసలు సంగతి ఏంటనేది మాత్రం అంతుపట్టదు. చెప్పాలంటే సహనాన్ని చాలా పరీక్షిస్తుంది. సెకండాఫ్కి వచ్చేసరికి ఫస్టాప్తో పోలిస్తే కాస్త బెటర్ అనిపిస్తుంది. సెటైరికల్ కామెడీ కొన్నిచోట్ల వర్కౌట్ కూడా అయింది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు? ఏం చూపించాలనుకున్నాడో ఇంటర్వెల్ తర్వాతే తెలుస్తుంది. చివరికొచ్చేసరికి ఊహించని ట్విస్టులతో ముగుస్తుంది.అయితే ఇదే దర్శకుడు గతంలో 'కేరాఫ్ కంచరపాలెం' తీశాడు. ఇందులో సినిమా అంతా సరదసరదాగా ఉంటూ చివరలో షాకిచ్చే ట్విస్ట్ వస్తుంది. ఇందులో కూడా అదే పద్ధతి ఫాలో అయ్యారు. కాకపోతే క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా గానీ అప్పటివరకు ఉంటే స్టోరీ అంతా సోసోగా ఉంటుంది. పెద్దగా ఎంటర్టైన్ చేయదు. నిడివి కూడా చాలా ఎక్కువ. పేరుకే 2 గంటల 50 నిమిషాల నిడివి కానీ ఏదో నాలుగైదు గంటల మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ లాంటివి బాగున్నప్పటికీ ఎమోషన్ సరిగా పండకపోవడం పెద్ద మైనస్. రావు బహదూర్ పాత్రతో పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేకపోతాం.అయితే ఈ మూవీలో ఏదైనా మెచ్చుకోవాల్సిన విషయం ఉందంటే అది సత్యదేవ్ నటన. ఎందుకంటే చూస్తున్నంతసేపు రావు బహదూర్ పాత్రకు జీవం పోశాడా అనిపిస్తుంది. చిత్రమైన హావభావాలు, అప్పటికప్పుడు మార్చే ఎమోషన్స్ వెరైటీగా అనిపిస్తాయి. ఇతడి ఇంట్లో పనిమనిషిగా చేసిన మహిళ పాత్ర నవ్విస్తుంది. ఫ్రెండ్ ఆచారిగా చేసిన వికాస్ ముప్పల ఆకట్టుకున్నారు. రావు బహదూర్ భార్య రేణుకగా చేసిన దీపా థామస్.. ఫస్టాప్లో కనిపిస్తుంది. ఇంప్రెసివ్గాా అనిపిస్తుంది. కానీ మళ్లీ క్లైమాక్స్లో దర్శనమిస్తుంది. మధ్యలో అస్సలు కనిపించదు.ఇక రైటర్, డైరెక్టర్ వెంకటేశ్ మహా విషయానికొస్తే.. తెలుగులో ఇప్పటివరకు రానటువంటి డిఫరెంట్ యాక్టింగ్, విజువల్తో మెస్మరైజ్ చేద్దామనుకున్నాడు. అందుకు తగ్గట్లే చాలానే కష్టపడ్డాడు కూడా. కానీ ఎందుకనో అది పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదనిపించింది. ఇందులో రావు బహదూర్ ముత్తాత తాతకు తాత పాత్రలో వెంకటేశ్ మహా.. చిన్నపాటి అతిథి పాత్రలోనూ కనిపిస్తాడు. స్టెప్పులు కూడా వేస్తాడు. ఓవరాల్గా చూసుకుంటే 'రావు బహదూర్' చాలా కష్టపడి తీసిన సినిమా, కాకపోతే 'ఓకే' అనిపించే దగ్గరే ఆగిపోయింది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ)
నాని చేతికి గాయం.. తగ్గేదేలే అంటోన్న హీరో!
నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దసరాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరోసారి వస్తోన్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 1940-1970 బ్యాక్డ్రాప్లో సాగే ఒక పవర్ఫుల్ అండర్వరల్డ్ మాఫియా స్టోరీగా రూపొందిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే షూట్కు ప్యాకప్ చెప్పనున్నారు. ఇదిలా ఉండగా హీరో నాని సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ హాట్ టాపిక్గా మారాయి. ఈ ఫోటోల్లో వింటేజ్ లుక్తో వింటేజ్ హెయిర్ లుక్లో సరికొత్త అవతారంలో కనిపించాడు. అయితే ఈ ఫోటోల్లో నాని ఎడమచేతికి బ్యాండేజ్తో కనిపించారు. అదే ఇప్పుడు చర్చకు దారితీసింది.తన ఫోటోలకు హిందీలో క్యాప్షన్ రాసుకొచ్చారు. 'నేను గాయపడ్డా… అందుకే మరింత ప్రమాదకరంగా మారా' అంటూ ధురందర్ డైలాగ్తో క్లారిటీ ఇచ్చారు. అయితే ప్యారడైజ్ మూవీ షూట్లోనే నానికి గాయమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా కోసం నాని డూప్స్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడం వల్లే ఈ గాయాలైనట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తనకు దెబ్బ తగిలినప్పటికీ.. రాబోయే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారని టాక్. ఈ ఫోటోలు చూస్తుంటే త్వరలోనే షూటింగ్ పూర్తి చేయాలనే కసి నానిలో కనిపిస్తోందని.. ప్రాజెక్ట్ కోసం ఆయన ఎంతలా ప్రాణం పెట్టి నటిస్తున్నారో అర్థమవుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Nani (@nameisnani)
వజ్రాల హారం చోరీ కేసులో హీరో జయం రవి డ్రైవర్ అరెస్ట్
ప్రముఖ తమిళ నటుడు రవి మోహన్ (జయం రవి) ఇంట్లో జరిగిన వజ్రాల హారం చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ దొంగతనానికి సంబంధించి జయం రవి వ్యక్తిగత డ్రైవర్ రాజేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు.కొద్దిరోజుల క్రితం నటుడి నివాసం నుండి విలువైన వజ్రాల హారం మాయమవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఇంట్లో పనిచేసే సిబ్బందిని, డ్రైవర్లను ఒక్కొక్కరిగా పిలిపించి విచారించారు.ఈ విచారణ సమయంలో డ్రైవర్ రాజేష్ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో అతడిని మరింత లోతుగా ప్రశ్నించగా, జయం రవి ఇంట్లో దొంగతనం చేసినట్లు రాజేష్ అంగీకరించాడు. నటుడి నివాసం నుండి ₹2.5 లక్షల నగదును తానే చోరీ చేసినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, వజ్రాల హారం రికవరీపై మరింత విచారణ జరుపుతున్నారు.
ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ
ఓటీటీలు చూసే చాలామందికి సినిమాలతో పాటు సిరీస్లు కూడా అలవాటే. కాకపోతే హారర్ లేదా థ్రిల్లర్ జానర్లో ఎక్కువగా చూస్తుంటారు. అయితే సెక్స్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఆధారంగా చాలా తక్కువ చిత్రాలు వచ్చాయి. అలాంటి సున్నితమైన అంశాన్ని ఆధారంగా చేసుకుని తీసిన తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బు'. సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. నెట్ఫ్లిక్లో తాజాగా స్ట్రీమింగ్లోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతి ఏంటి? ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)కథేంటి?సుబ్రమణ్యం అలియాస్ సుబ్బు(సందీప్ కిషన్).. సికింద్రాబాద్లోని గవర్నమెంటు స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్గా కాంట్రాక్ పద్ధతిలో పనిచేస్తుంటాడు. ఇతడి నాన్న కుక్కుటేశ్వరరావు(మురళి శర్మ).. హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అవుతాడు. అయితే తండ్రి దృష్టిలో సుబ్బు ఓ పనికిరాని వెధవ. కొన్ని కారణాల వల్ల సుబ్బు.. ఆదిలాబాద్లోని మాకిపూర్ అనే పల్లెటూరికి సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్గా వెళ్లాల్సి వస్తుంది. ఈ విషయం ఇంట్లో వాళ్లకి, పెళ్లి చేసుకోబోయే దివ్య(మానస చౌదరి)కి తెలియకుండా దాచిపెడతాడు. అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే తెలియని పల్లెటూరి జనానికి.. సుబ్బు ఇవన్నీ చెప్పగలిగడా? సుబ్బు ఇంట్లో వాళ్ళకు ఇదంతా ఎప్పుడు తెలిసింది? సుబ్బుని ప్రేమించిన స్వాతి(మిథిలా పాల్కర్)ఎవరు? చివరకు ఏమైంది అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?హస్త ప్రయోగం, కండోమ్, యోని, ఫ్యామిలీ ప్లానింగ్, వేసక్టమీ, శానిటరీ ప్యాడ్, పునరుత్పత్తి వ్యవస్థ, ఎయిడ్స్ గురించి, ఆడపిల్లలు-మగపిల్లలు పుట్టడం, నెలసరి.. ఈ పదాలు వినగానే అవేదో బూతు అన్నట్టు ఇప్పటికీ చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం. బయటకు ఇదంతా మాట్లాడుకూడదు అనే అనుకుంటారు. కానీ ఇప్పుడిప్పుడే నగరాల్లో వీటన్నింటిపై అందరికీ అవగాహన పెరుగుతోంది. కానీ పల్లెటూళ్లలో మాత్రం ఇప్పటికీ వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం పెద్దగా చేయరు. అలాంటి సెన్సిటివ్ అంశం గురించి చెబుతూ తీసిన సిరీస్ ఇది.సెక్స్ ఎడ్యుకేషన్ అన్నాం కదా అని ఇందులో మొత్తం అవే ఉంటాయి అని మాత్రం అనుకోవద్దు. తొలి రెండు ఎపిసోడ్స్లోనే ఇవన్నీ చూపించారు. మిగతా అంతా ఆ పల్లెటూరిలో సుబ్బు ఎలాంటి కష్టాలు పడ్డాడు? అక్కడి మగవాళ్ళు ఇతడిని ఎలా ఇబ్బంది పెట్టారు అని సాగుతుంది. కానీ సిరీస్ ఆద్యంతం ఫుల్ కామెడీగా తీశారు. కాన్సెప్ట్కి తగ్గట్టే కంప్యూటర్, పెన్ డ్రైవ్ లాంటి పదాలతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొన్నిచోట్ల వినిపిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో బూతు లేకుండానూ చెప్పే ప్రయత్నం చేశారు.ఓ సీన్లో మగపిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? అని ఊరి ఆడవాళ్లు.. సుబ్బు పాత్రని అడుగుతారు. వారికి 'ఎక్స్' క్రోమోజోములు, 'వై' క్రోమోజోములు అని సిటీలో చెప్పినట్టుగా చెబితే అర్థం కాదు. అలాంటి విషయాన్ని రెండు పూల కుండీలను తీసుకుని ఇందులో ఉన్నది ఒకటే మట్టి కానీ ఒక దాంట్లో ఒక పూల చెట్టు ఇంకో దాంట్లో ఇంకో పూల చెట్టు ఉంది ఎందుకు? అని అడుగుతాడు. ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం మొలకెత్తుతుంది అని మహిళలంతా చెబుతారు. మరి మట్టిని తిడితే ఏం లాభం ఉంటుంది అని అందరికీ అర్థమయ్యేలా సుబ్బు చెబుతాడు.మొత్తం ఏడు ఎపిసోడ్స్గా తీసిన ఈ సిరీస్లో కాన్సెప్ట్ వినగానే అసభ్యంగా అనిపిస్తుంది గానీ ఎక్కడ ఆ ఛాయలు లేకుండా చాలా జాగ్రత్తగా తీశారు. పల్లెటూరు, అందులో ఉండే మనుషులు.. సెక్స్ అనే దాని పట్ల వాళ్ళకు ఉండే అవగాహన.. మగ పిల్లాడు కోసం పిల్లల్ని కంటూనే ఉండటం, కండోమ్ వాడటం అంటే ఏదో మహాపాపం అన్నట్టు ఫీల్ అయిపోవడం. ఆడవాళ్లకి కూడా దీనిపై కనీస అవగాహన లేకపోవడం లాంటి ఆసక్తికర విషయాలని కామెడీగా చూపించడం బాగుంది. బాగా ప్రెజంట్ చేశారు కూడా. కాకపోతే సుబ్బు పాత్రకు తప్పితే మిగతా ఎవరికీ కనెక్ట్ అవ్వం. ఎందుకో ఆయా పాత్రలతో ఎందుకో ఎమోషన్ ఫీల్ కాలేకపోతాం. ఇక చివరి ఎపిసోడ్స్లో కథ కాస్త నెమ్మదించడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం చిన్న మైనస్.ఓ సీన్ లో సుబ్బు.. అనుకోకుండా ఆ ఊరిలో వుండే రజినీ అనే వేశ్య ఇంటి వెళ్తాడు. ఆమెతో తన పరిస్థితి అంతా చెబుతాడు. ఆ టైమ్లో ఆమె.. 'నేను చేసే పని బూతు అంటారు కానీ అందులో నేను పని వెతుక్కుంటున్నా.. మీరేమో మీరు చేస్తున్న పనిలో బూతుని చూస్తున్నారు' అనే చెప్పే డైలాగ్ కానీ.. ఓసారి ఊరిలో ఆడవాళ్ళకి క్లాస్ చెప్తూ.. 'అందరికీ జన్మస్థానమైన ప్రదేశం శుభ్రంగా ఉంచుకోవడానికి సిగ్గు ఎందుకు అమ్మా' అని శానిటరీ ప్యాడ్స్ ఉపయోగం గురించి చెప్పే డైలాగ్ గానీ సీన్కి తగ్గట్లు అనిపిస్తాయి.సుబ్బు జీవితంలోకి మొదట వచ్చే దివ్య క్యారెక్టర్లో స్వార్ధం ఉంటే.. తర్వాత వచ్చే అమ్మాయి క్యారెక్టర్లో ట్విస్టులు బాగుంటాయి. స్వాతి క్యారెక్టర్ అయితే సబ్బుతో ప్రేమలో పడి, కలిసి ఒక్కటయ్యేవరకు వెళ్తుంది. ఈమె పాత్రలో క్యూట్నెస్, ఇన్నోసెన్స్, డేరింగ్ లాంటివి కనిపిస్తాయి. అయితే సుబ్బుని జీవితాంతం ప్రతి దానికి భయపెడుతూ, ఒక నిస్సహాయుడుగా చేసేస్తాడు అతడి తండ్రి. చివరకు దాన్ని ఎలా అధిగమించాడనేది ఇందులో ఉంటుంది. ఈ సీన్స్ చాలామంది కుర్రాళ్లకి కనెక్ట్ అవుతాయి.ఎవరెలా చేశారు?యాక్టింగ్ విషయానికి వస్తే సుబ్బుగా సందీప్ కిషన్ అదరగొట్టేశాడు. ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు. చాలా సహజంగా అనిపిస్తుంది. మురళీ శర్మ చేసిన కుక్కుటేశ్వరరావు పాత్ర ఇరిటేషన్ తెప్పిస్తుంది. దివ్య చేసిన మానస చౌదరి ఓకే. స్వాతిగా చేసిన మిథిలా పాల్కర్ మాత్రం చాలా నచ్చేస్తుంది. సంపూర్ణేష్ బాబు ఉన్నాడు. ఉన్నంతలో కామెడీ సీన్స్తో ఆకట్టుకున్నాడు. హీరో పక్కనే ఉండే గెటప్ శ్రీను పాత్ర కూడా పర్లేదు. బ్రహ్మానందం రెండు మూడు సీన్స్లో కనిపించారు. వేశ్యగా దివ్య పిళ్ళై కనిపించేది కాసేపు అయినా ఇంపాక్ట్ చూపిస్తుంది.రైటర్-డైరెక్టర్ మల్లిక్ రామ్.. సెక్స్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ తీసుకున్నప్పటికీ దాన్ని లైట్ హార్టెడ్ కామెడీగా చూపించి చెప్పడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీకి తగ్గట్టు ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. ఓటీటీలో ఏదైనా కామెడీగా చూద్దామనుకుంటే ఈ సిరీస్ ట్రై చేయండి. అసభ్యకర సీన్స్ ఏం లేవు గాని అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వినిపిస్తాయి. ఇదంతా 18 ప్లస్ కంటెంట్ కాబట్టి ఒంటరిగానే చూడండి.-చందు డొంకాన (ఇదీ చదవండి: ‘ఇసకపట్నం’ వెబ్సిరీస్ రివ్యూ)
క్రీడలు
భారత్తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! స్టార్లు వచ్చేశారు
టీమిండియాతో స్వదేశంలో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్కు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. జోస్ బట్లర్, సామ్ కరన్, జో రూట్, ఆదిల్ రషీద్ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.అంతేకాకుండా దాదాపు ఎనిమిదిల నెలల తర్వాత స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లండ్ వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్కు ఆర్చర్ దూరమయ్యాడు. ఇప్పుడు అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో వన్డేలకు కూడా అతడిని ఎంపిక చేశారు. ఆర్చర్తో పాటు శ్రీలంక టూర్కు దూరమైన ఫాస్ట్ బౌలర్లు గుస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్లు కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. అలాగే ఈ జట్టులో 22 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జేమ్స్ కోల్స్కు చోటు దక్కింది. లిస్ట్-ఎ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండడంతో సీనియర్ జట్టుకు అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ ససెక్స్ యువ ఆటగాడు టీ20 జట్టులో కూడా సభ్యునిగా ఉన్నాడు. ఈ మూడు వన్డేల సిరీస్ జూలై 14 నుండి జూలై 19 వరకు జరగనుంది. భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.వన్డే సిరీస్ షెడ్యూల్ వివరాలు:మొదటి వన్డే: జూలై 14 – ఎడ్జ్బాస్టన్ (బర్మింగ్హామ్)రెండవ వన్డే: జూలై 16 – సోఫియా గార్డెన్స్ (కార్డిఫ్)మూడవ వన్డే: జూలై 19 – లార్డ్స్ (లండన్)ఇంగ్లండ్ వన్డే జట్టు:హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, జో రూట్, జోష్ టంగ్.
తీరు మారని మెదక్.. నల్గొండ చేతిలో ఘోర ఓటమి
తెలంగాణ టీ20 లీగ్-2026లో మెదక్ ఫాల్కన్స్ తీరు ఏ మాత్రం మారలేదు. ఈ టోర్నీలో మెదక్ వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. శుక్రవారం ఉప్పల్ మైదానం వేదికగా నల్గొండ నైట్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో మెదక్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మెదక్ బ్యాటర్లలో విక్రమ్ నాయక్(48) టాప్ స్కోరర్గా నిలవగా.. వరుణ్ యర్రం(44), రవితేజ(33), శ్రుంజిత్ రెడ్డి(30) రాణించారు. నల్గొండ బౌలర్లలో చింతల రక్షణ్, అనికేత్ రెడ్డి, ఇలియాన్ సతాని తలా వికెట్ సాధించారు.అనంతరం మెదక్ ఫాల్కన్స్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని అనురాగ్ నల్గొండ నైట్స్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. నల్గొండ ఓపెనర్ గౌరవ్ రెడ్డి(47 బంతుల్లో 101 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు జశ్వంత్(34) రాణించాడు. మెదక్ బౌలర్లలో మధుకర్, అర్జున్ మాత్రమే తలా వికెట్ పడగొట్టారు. మెదక్ జట్టులో కెప్టెన్ తిలక్ వర్మ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మెదక్ జట్టు కేవలం తొలి మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. ఫాల్కన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.చదవండి: IND vs ENG: 'వైభవ్ సూర్యవంశీ వద్దు.. అతడినే జట్టులో కొనసాగించాలి'
టీమిండియాకు బ్యాడ్ న్యూస్..! ఇంగ్లండ్ జట్టులోకి స్పీడ్ గన్ ఎంట్రీ?
మాంచెస్టర్ వేదికగా శనివారం ఇంగ్లండ్తో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్కు ముందు శ్రేయస్ అయ్యర్ సేనకు ఓ బ్యాడ్ న్యూస్. తొలి టీ20కు దూరంగా ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్.. ఇప్పుడు రెండో మ్యాచ్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జట్టుతో కలిసిన అతడు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో చివరి రెండు మ్యాచ్ల్లో అవిరామంగా బౌలింగ్ చేయడంతో, ఆర్చర్కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మొదటి టీ20 నుంచి తప్పించింది. అయితే మిగిలిన నాలుగు టీ20ల్లో జోఫ్రా ఆడనున్నాడు. శనివారం నాటి మ్యాచ్లో అతడు లూక్ వుడ్ లేదా లియామ్ డాసన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్చర్ పునరాగమనం చేస్తే ఇంగ్లీష్ జట్టు బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. పవర్ప్లేలో ఈ రాజస్తాన్ స్పీడ్ స్టార్ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఐపీఎల్లో అత్యధిక సార్లు తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి తన శుభారంభాన్ని అందించేవాడు. కొత్త బంతితో అతడు అద్భుతాలు చేస్తాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో ఆర్చర్ దిట్ట. మరి భారత టాపార్డర్ బ్యాటర్లు ఆర్చర్ను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత ఆర్చర్ ఆడుతున్న మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.భారత్తో రెండో టీ20కు ఇంగ్లండ్ తుది జట్టు(అంచనా)ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో సౌతాఫ్రికా పోరాటం ముగిసింది. దక్షిణాఫ్రికా అమ్మాయిల జట్టు మరోసారి నాకౌట్స్ గండాన్ని దాటలేకపోయింది. ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో 40 పరుగుల తేడాతో ప్రోటీస్ జట్టు ఓటమి పాలైంది. 170 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక లారా వాల్వార్ట్ సేన చతకిల పడింది. అయితే సౌతాఫ్రికా ఫైనల్కు చేరకపోయినప్పటికి.. ఆ జట్టు సీనియర్ పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ మాత్రం అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నారు. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే 50 వికెట్ల మార్కును అందుకున్న మొట్టమొదటి బౌలర్గా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు.ఇంగ్లండ్ ఓపెనర్ అమీ జోన్స్ వికెట్తో ఇస్మాయిల్ ఈ ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నారు. 37 ఏళ్ల ఇస్మాయిల్ ప్రస్తుతం సౌతాఫ్రికా మహిళల జట్టు తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా కొనసాగుతున్నారు. 127 వన్డేల్లో 191 వికెట్లు పడగొట్టిన ఈ ముంబై ఇండియన్స్ పేసర్.. టీ20ల్లో ఇప్పటివరకు 131 వికెట్లు సాధించారు.మహిళల ప్రీమియర్ లీగ్లో ఆమె ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా గతేడాదే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఇస్మాయిల్, టీ20 ప్రపంచకప్ కోసం తన నిర్ణయాన్ని వెనక్కి మార్చుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ తన జట్టును ఛాంపియన్గా నిలపలేకపోయారు.మహిళల టీ20 ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు వీరే51 - షబ్నిమ్ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా)48 - మేగాన్ షట్ (ఆస్ట్రేలియా)44 - ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా)41 - అన్య ష్రుబ్సోల్ (ఇంగ్లండ్)39 - మారిజానే కాప్(దక్షిణాఫ్రికా)
న్యూస్ పాడ్కాస్ట్
రాజధానిలో ఒకే నెలలో జరిగిన రెండు మరణాల వెనుక పెద్ద కుట్ర...
చంద్రబాబు సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
రగిలిన రైతన్నలు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు దగాపై దద్ధరిల్లిన విజయవాడ ధర్నాచౌక్
తెలంగాణలో వానల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతన్నలు. పలు జిల్లాల్లో లోటు వర్షపాతం
విత్తనం నుంచి బీమా వరకు అన్నింటా సమస్యలే... ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆందోళనలో అన్నదాతలు
ఏపీ రాజధానిలో గూండారాజ్... రైతుల ఆహ్వానం మేరకు భూములను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కోడిగుడ్లతో తెలుగుదేశం మూకల దాడి
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ ‘అప్పుల క్యాలెండర్’ విడుదల... నెలకు 7 వేల 266 కోట్ల రూపాయల చొప్పున అప్పు చేయబోతున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో యూరియా కోసం సీజన్లో రైతన్నల అగచాట్లు. యాప్లో ఓటీపీలు రాక.. వేలిముద్రలు మ్యాచ్ కాక తిప్పలు
ప్రభుత్వ హత్య.. పెద్దలను కాపాడే కుట్ర... కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు... కీలక అంశాలు లేకుండానే ‘సిట్’ రిమాండ్ నివేదిక
పులివెందులలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన.. ఇవాళ మహిమాన్విత ఆలయానికి కలశస్థాపన చేయనున్న YSRCP అధినేత..
బిజినెస్
ఇంట్లో బంగారం ఉందా.. ఈ స్కీమ్తో భారీ లాభం!
భారతదేశంలో బంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మన దేశ ప్రజలు బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా.. భవిష్యత్తు కోసం భద్రమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు. కాబట్టి ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అయితే.. ఇళ్లలోని బంగారం, దేశ ఆర్థిక వ్యవస్థలో ఉపయోగపడకుండా అలాగే ఉండిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (Gold Monetisation Scheme)ను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కొత్త రూపంలో తీసుకురావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం.. ప్రజలు తమ ఇళ్లలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగించేలా చేయడం. బంగారం డిపాజిట్ చేసిన వారికి ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లించేది. గడువు పూర్తయిన తర్వాత వారు బంగారం రూపంలో గానీ, దానికి సమానమైన నగదు రూపంలో గానీ తిరిగి పొందే అవకాశం ఉండేది. అయితే ఈ స్కీమ్ అనుకున్నంత సక్సెస్ కాలేదు.ఈ పథకం ఎందుకు విఫలమైంది?దాదాపు పది సంవత్సరాల కాలంలో ఈ పథకం ద్వారా కేవలం 38 టన్నుల బంగారం మాత్రమే సేకరించారు. కానీ భారతీయుల వద్ద సుమారు 25,000 టన్నుల బంగారం ఉందని అంచనా. దీన్నిబట్టి చూస్తే.. ఈ పథకం ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదని తెలుస్తోంది.➤భారతీయ కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి వచ్చిన లేదా భావోద్వేగ విలువ కలిగిన నగలను డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపలేదు.➤పన్ను సంబంధిత విచారణలు వస్తాయనే భయం ప్రజల్లో ఉంది.➤బ్యాంకులకు ఈ పథకం ద్వారా పెద్దగా లాభం లేకపోవడంతో వారు దీనిని ప్రోత్సహించలేదు.➤ప్రభుత్వం వడ్డీతో పాటు బంగారం ధర పెరిగితే ఆ అదనపు మొత్తాన్ని కూడా చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగింది.కొత్త మార్పులు ఏమిటి?గోల్డ్ మానిటైజేషన్ స్కీములో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలర్లు (బంగారు నగల వ్యాపారులు) కూడా కలెక్షన్ పార్ట్నర్లుగా పనిచేసే అవకాశం కల్పించడం.అంటే.. ఇప్పటి వరకు బంగారాన్ని కేవలం బ్యాంకుల ద్వారానే మాత్రమే డిపాజిట్ చేయాల్సి వచ్చేది. ఇకపై ప్రజలు తమకు దగ్గరలో ఉన్న విశ్వసనీయ జ్యువెలర్ల వద్ద కూడా బంగారాన్ని ఇచ్చే అవకాశం ఉండవచ్చు. దీనివల్ల ప్రజలకు సౌకర్యం పెరుగుతుంది, అలాగే మరింత బంగారం ఈ పథకంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు➤ఇళ్లలో ఉపయోగం లేకుండా ఉన్న బంగారం దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది.➤విదేశాల నుంచి బంగారం దిగుమతుల అవసరం తగ్గుతుంది.➤డాలర్లపై భారతదేశం ఆధారపడటం తగ్గుతుంది.➤రూపాయి విలువ బలపడే అవకాశం ఉంటుంది.➤దేశంలో బంగారం ఆధారిత వ్యాపారాలు మరింత పారదర్శకంగా మారతాయి.➤దిగుమతులు తగ్గడం వల్ల, బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. భారతీయుల వద్ద ఉన్న బంగారంలో కేవలం 5 శాతం మాత్రమే ఈ పథకం ద్వారా సమీకరించినా, సుమారు 1,250 టన్నుల బంగారం లేదా 80-90 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తి దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. ఇది దాదాపు రెండేళ్ల పాటు బంగారం దిగుమతుల అవసరాన్ని తగ్గించే స్థాయిలో ఉంటుంది.ప్రధానమంత్రి పిలుపుఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఒక సంవత్సరం పాటు కొత్త బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని కోరారు. దీనివల్ల దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 261.79 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 77,763.91 వద్ద, నిఫ్టీ 95.15 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 24,270.85 వద్ద నిలిచాయి.డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఏషియన్ హోటల్స్ (నార్త్) లిమిటెడ్, సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్, సోలార్వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మోడరన్ థ్రెడ్స్ (ఇండియా) లిమిటెడ్, వీల్స్ ఇండియా లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, సిమెన్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, టీడీ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
E20తో మైలేజ్ తగ్గుతుందా?: కేంద్ర మంత్రి క్లారిటీ!
ఈ20 ఫ్యూయెల్ గురించి సోషల్ మీడియాలో అనేక విమర్శలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా E20 ఇంధనం వాడితే వాహనం మైలేజ్ తగ్గుతుందని, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు తిరస్కరణకు గురవుతాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ అంశాలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. అంతే కాకుండా.. మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన ధరలపై కూడా ఆయన స్పందించారు.E20 ఫ్యూయెల్ అంటే?E20 ఫ్యూయెల్ అంటే.. 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపిన ఇంధనం. ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటల నుంచి తయారయ్యే జీవ ఇంధనం (Biofuel). దీని వినియోగం వల్ల దిగుమతి చేసుకునే ముడి చమురు అవసరం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా కొంత మేర తగ్గుతుంది.ఈ20 ఇంధనం వల్ల మైలేజ్ తగ్గుతుందా?ఈ20 ఫ్యూయెల్ వాడితే మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి అంగీకరించారు. అయితే.. ఆ తగ్గుదల చాలా స్వల్పమని, అది వాహనం పరిస్థితి, డ్రైవింగ్ విధానం, రోడ్డు పరిస్థితులు వంటి అనేక అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందని తెలిపారు.ఇన్సూరెన్స్ క్లెయిమ్లపై స్పష్టతఈ20 ఫ్యూయల్ వాడితే వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు తిరస్కరణకు గురవుతాయని వస్తున్న వార్తలను మంత్రి పూర్తిగా ఖండించారు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చాయి. కాబట్టి ఈ20 పెట్రోల్ ఉపయోగించడం వల్ల ఇన్సూరెన్స్ రద్దు అవుతుందనే ప్రచారం నిజం కాదని చెప్పారు.ప్రస్తుతం దేశంలో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) అమలులో ఉంది. భవిష్యత్తులో 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమం (E25, E27, E30) ప్రవేశపెట్టే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. అయితే అందుకు ముందు అవసరమైన అన్ని సాంకేతిక పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికే 22 శాతం, 25 శాతం, 27 శాతం, 30 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్కు సంబంధించిన BIS ప్రమాణాలను రూపొందించింది. అలాగే ఈ ఇంధనాలకు ఎక్సైజ్ సుంకంలో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. అయితే ఇవి కేవలం నియంత్రణ పరమైన చర్యలేనని, వెంటనే అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టే ఉద్దేశం కాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం ఈ80 ఫ్యూయెల్ వినియోగించడానికి అనుకూలమైన కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్లో జీతాలు ఎక్కువ.. జాబ్లు తక్కువ!
సాక్షి, సిటీబ్యూరో: అన్నీ ఉన్నా నిరుద్యోగుల ముంగిట శని అన్నట్టుగా ఉంది హైదరాబాద్ నగర పరిస్థితి. ఓ వైపు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతూ, ఉద్యోగులకు అత్యధిక జీతాలు అందించే సిటీ ఉపాధి కల్పనలో మాత్రం చేతులెత్తేస్తోంది. ఈ వైరుధ్యాన్ని వెల్లడించాయి కేంద్ర గణాంకాల శాఖ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తొలి ‘నగర స్థాయి కారి్మక మార్కెట్ నివేదిక’ వెల్లడించింది. 46 నగరాలతో పోలిస్తే.. దాదాపు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న దేశంలోని 46 నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ ఉద్యోగాల నాణ్యత, వేతనాలు, ఉత్పాదకతలో ముందంజలో ఉంది. ఆశించిన స్థాయిలో నిరుద్యోగ నిర్మూలన జరగలేదని యువత ఉపాధి సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయని తేల్చింది. హైదరాబాద్లో ప్రస్తుతం నిరుద్యోగ రేటు 6.8 శాతంగా నమోదైంది. ఇది మిలియన్ ప్లస్ నగరాల సగటు 4.9 శాతం కంటే ఎక్కువ. బెంగళూరు (2.8%), సూరత్ (1%), హౌరా (0.8%), రాజ్కోట్ (0.3%) వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో నిరుద్యోగం చాలా అధికంగా ఉంది. ఉద్యోగ నాణ్యతలో మేటి.. ఉద్యోగాల నాణ్యత పరంగా హైదరాబాద్కు మంచి స్థానం దక్కింది. నగరంలోని ఉద్యోగుల్లో 62.1 శాతం మంది రెగ్యులర్ వేతన ఉద్యోగాల్లో ఉండగా, మిలియన్ ప్లస్ నగరాల సగటు 58.5 శాతంగా ఉంది. ఇది హైదరాబాద్లో స్థిరమైన ఉద్యోగాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. రెగ్యులర్ వేతన ఉద్యోగుల సగటు నెలవారీ ఆదాయం రూ.31,153 కాగా, మిగిలిన నగరాల సగటు రూ.28,808 మాత్రమే. స్వయం ఉపాధి పొందుతున్న వారి సగటు నెలవారీ ఆదాయం రూ.30,075, రోజువారీ కూలీల సగటు వేతనం రూ.784గా నమోదైంది. ఉపాధి.. ఏదీ..? లేబర్ ఫోర్స్ పారి్టసిపేషన్ రేట్ హైదరాబాద్లో 55.5 శాతంగా నమోదై, మిగతా నగరాల సగటు 52.4 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంటే ఉద్యోగాల కోసం ప్రయతి్నంచేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, అందరికీ ఉపాధి లభించడం లేదని నివేదిక పేర్కొంది. యువత పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. 15 నుంచి 29 ఏళ్ల వయసు యువతలో 25.1 శాతం మంది ఉద్యోగంలో కానీ విద్యార్జనలో గానీ లేరు. ఇందులో యువతుల శాతం 37.3 ఉండగా, యువకుల శాతం 12.6 మాత్రమే ఉండటం గమనార్హం.
ఫ్యామిలీ
‘స్పెషల్ క్లాస్’ వద్దు ‘సేఫ్ క్లాస్’ చాలు
‘నువ్వు తెలివైనదానివి, ఒక్కదానివే ట్యూషన్ కి రా’ అన్నాడు సార్. 9వ తరగతి పాపకి అది మెచ్చుకోలులా అనిపించింది. తల్లికి మాత్రం గుండె ఆగినంత పనైంది. కో–ఎడ్ స్కూల్, ట్యూషన్, కోచింగ్... అందరూ మంచివారే ఉంటారు. కాని ఒక్క చెడ్డ వ్యక్తి చాలు పిల్లల భవిష్యత్తు పాడు కావడానికి. గర్ల్ స్టూడెంట్స్కు చెప్పాల్సిందేమిటి? మనం చేయాల్సిందేమిటి?కేస్ స్టడీ...రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ హైస్కూల్లో అనూష 8వ తరగతి. మ్యాథ్స్ సార్ ‘నువ్వు బాగా ట్రై చేస్తే టాపర్ అవుతావు. స్కూల్ అయ్యాక స్టాఫ్రూమ్కి రా, డౌట్స్ చె΄్తా’ అన్నాడు. మొదటి రెండు రోజులు పాఠమే చెప్పాడు. మూడో రోజు భుజం మీద చెయ్యి వేశాడు. ‘ఇది మనిద్దరి సీక్రెట్. అమ్మకు చెప్తే అపార్థం చేసుకుంటుంది’ అన్నాడు. అనూష ఇంటికెళ్లి ఏడ్చింది. తల్లి ‘సార్ అలాంటోడు కాదు, నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావ్’ అని కొట్టింది. పాప మూడురోజులు స్కూల్ మానేసింది. తర్వాత నానమ్మ ధైర్యం చెప్పి, అనూషతో మాట్లాడించి విషయం హెడ్మాస్టర్కి చెప్పింది. పేరెంట్స్ గొడవ చేయడంతో డీఈఓ విచారణ జరిపి ఆ టీచర్ని సస్పెండ్ చేశారు. పిల్లలకు బయట జరిగేవి తెలియదు. తల్లిదండ్రులుగా మనం చెప్పాల్సినవి సరిగా చెప్పం. మనం కూడా అన్నింటినీ నమ్మేస్తుంటాం... ‘సార్ చాలా మంచోడు, మా పాపని బాగా చూసుకుంటాడు’ అని. కానీ ‘మంచితనం’ ముసుగులో ‘పర్సనల్ అటెన్షన్’ పేరుతో పాపతో చాటింగ్, ‘నీ డ్రెస్ బాగుంది’ అనే కామెంట్, ‘స్కూల్ అయ్యాక కలవమని’ పిలుపు... ఇవన్నీ మొదలైతే?ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకూ చదివే ఆడపిల్లలకు మంచి–చెడు మధ్య గీత తెలీదు. ‘సార్ అంటే దేవుడు’ అని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని లైన్ దాటే ఒక్కరున్నా చాలు. ప్రమాదం. కాలేజీలో అయితే ఒక గమనింపు ఉంటుంది. కాలేజీ వయసు పిల్లలకు కాçస్త పరిణితి ఉంటుంది. హైస్కూల్లో? అందుకే పేరెంట్గా మనం మేలుకోవాలి. టీచర్ని అనుమానించమని కాదు. పాపని అప్రమత్తం చేయమని. టీచర్æ అంటే పాఠం చెప్పాలి. మార్కులు ఇవ్వాలి. అంతే. కానీ ఈ గీత దాటితే డేంజర్.పేరెంట్ డ్యూటీ⇒ పాప ఫోన్ ఒక్కసారి చెక్ చేయండి. ‘సార్తో చాటింగ్’ ఉంటే వెంటనే ఆపండి. స్కూల్కి వెళ్లి హెడ్మాస్టర్తో మాట్లాడండి. ‘మా పాపకి మీరు క్లాస్లోనే డౌట్స్ క్లియర్ చేయండి’ అని తేల్చి చెప్పండి ∙స్కూల్లో ‘కంప్లైంట్ బాక్స్’ లేదా? అదే మొదటి ఫెయిల్యూర్. హైస్కూల్లో ‘ పోక్సో’ కమిటీ ఉండాలి. ‘చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ’ అని బోర్డ్ ఉండాలి. అందులో లేడీ టీచర్, పేరెంట్, పోలీస్ నుంచి ఒకరు మెంబర్గా ఉండాలి.పాపకి ‘నో’ చెప్పడం నేర్పండిమనం ఆడపిల్లలకి ‘బస్లో జాగ్రత్త, అపరిచితులతో మాట్లాడకు’ అని చె΄్తాం. కానీ ‘టీచర్ లైన్ దాటితే నో చెప్పు’ అని చెప్పం. ఎందుకంటే ‘టీచర్ని ఎదిరించకూడదు’ అని మనమే నేర్పించాం. టీచర్ అయినా సరే ఇబ్బందిగా వ్యవహరిస్తూ ఉంటే ‘నో చెప్పాలి’ అని నేర్పించాలి.ఇంట్లో చేయాల్సిన 3 పనులుపని 1: ‘బాడీ రూల్’... ‘నీ బాడీ నీ ఇష్టం. ఎవరు అసౌకర్యంగా టచ్ చేసినా ‘వద్దు’ అని గట్టిగా చెప్పు. సార్ అయినా, బాబాయ్ అయినా సరే’ అని చెప్పండి.పని 2: ‘సీక్రెట్ వద్దు’... ‘సార్ నీకు చాక్లెట్ ఇచ్చి ఎవరికీ చె΄÷్పద్దు అన్నాడా? అలాంటి సీక్రెట్స్ అమ్మకు చె΄÷్పచ్చు. సార్తో సీక్రెట్స్ వద్దు’ అని క్లియర్గా చెప్పండి.పని 3: ‘నమ్మకం’... పాప వచ్చి ‘అమ్మా, సార్ ఇలా చేశాడు’ అంటే ‘ఛీ, అలా అనకూడదు, సార్ అలాంటోడు కాదు’ అని తిట్టకండి. ముందు కౌగిలించుకుని ‘నాకు చెప్పినందుకు థాంక్స్ తల్లీ. నేను చూసుకుంటా’ అని భరోసా ఇవ్వండి. పాప మళ్లీ మీతో ఏ విషయమైనా షేర్ చేస్తుంది.ఎనిమిదవ తరగతి పాప బ్యాగ్లో బుక్స్ మోయాలి. ‘భయం’ కూడా మోయకూడదు. ‘సార్ ఏమంటాడో’ అని వణుకుతూ స్కూల్కి వెళ్లకూడదు. 99 మంది టీచర్లు దేవుళ్లే. కాని ఆ ఒక్కడు రాక్షసుడు అయితే వాడిని గుర్తుపట్టే కళ్లు మనకి ఉండాలి. పాపకీ ఉండాలి. స్కూల్ కాం΄ûండ్ వాల్ ఎంత ఎత్తు ఉన్నా, పాప మనసులో ‘భరోసా’ అనే వాల్ కట్టక పోతే వేస్ట్. రేపు పీటీఎంకి వెళ్లినప్పుడు మార్కుల కార్డ్ కాదు, ముందు స్కూల్ సేఫ్టీ కార్డ్ అడగండి. ఎందుకంటే పాస్ అవడం కంటే క్షేమంగా ఇంటికి రావడం ముఖ్యం. బడులు తెరిచి హుషారుగా పాఠాలు సాగుతున్నాయి. పిల్లలకు ఈ ‘ముందు జాగ్రత్త’ పాఠం తప్పనిసరిగా చెప్పి, పంపండి.మీరు చేయాల్సిందిపేరెంట్స్–టీచర్ మీటింగ్కి వెళ్లినప్పుడు ‘సార్... మన స్కూల్లో పోక్సో కమిటీ ఎవరు? వాళ్ల నంబర్ నోటీస్ బోర్డ్లో ఉందా?’ అని గట్టిగా అడగండి. లేక పోతే డి.ఇ.ఓ.కి కంప్లైంట్ ఇవ్వొచ్చు. ప్రైవేట్ స్కూల్ అయితే టీసీ తీసుకుంటాం అని భయపెట్టండి. పాప సేఫ్టీ కంటే టీసీ ఎక్కువ కాదు.‘మంచి సార్’ ముసుగులో దాగే 3 రెడ్ ఫ్లాగ్స్రెడ్ ఫ్లాగ్ 1: ‘ఒక్కదానివే రా’.... ‘డౌట్స్ క్లాస్ ఉంది, నువ్వొక్కదానివే రా’ అని స్కూల్ టైం అయ్యాక పిలవడం. గ్రూప్గా పిలవొచ్చు కదా? ఎందుకు ఒక్కదాన్నే?రెడ్ ఫ్లాగ్ 2: ‘పర్సనల్ గిఫ్ట్’... బర్త్డేకి చాక్లెట్, పెన్, గాజులు ఇవ్వడం. క్లాస్ మొత్తానికి ఇవ్వకుండా ఒక్క పాపకే ఇవ్వడం. ‘నువ్వు స్పెషల్’ అనే ఫీలింగ్ కలిగించడం.రెడ్ ఫ్లాగ్ 3: ‘ఫోన్ ఛాటింగ్’... ‘హోంవర్క్ డౌట్’ అని స్టార్ట్ చేసి, ‘భోజనం చేశావా?’, ‘ఏం డ్రెస్ వేసుకున్నావ్?’ అని పర్సనల్ మెసేజ్లకి దిగడం. టీచర్కి పిల్లలతో వాట్సాప్ చాట్ ఏంటి?రియాలిటీ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్స్లో 90 శాతం ఈ బోర్డ్ ఉండదు. ఉన్నా, ఎక్కడ పెట్టారో ఎవరికీ తెలీదు. పాపకి ఏదైనా ఇబ్బంది అయితే ఎవరికి చెప్పాలో తెలీదు. హెడ్మాస్టర్కి చెప్తే ‘సార్ మంచోడే, నువ్వే అపార్థం చేసుకున్నావ్’ అని మందలిస్తాడు. – కె.
తల్లిగానే కాదు... సీఈవోగానూ గెలిచింది!
సవాళ్లు, సమస్యలు అందరి జీవితాల్లో సహజం. కానీ, కొందరు మాత్రమే వాటిని తమ విజయానికి పునాదులుగా మార్చుకుంటారు. సరిగ్గా అదే పని చేసి చూపించారు హరిణి శివకుమార్. ఆరోగ్యం బాగోలేని తన బాబు కోసం బ్యాంకింగ్ కెరీర్ని వదులుకున్న హరిణి.. తిరిగి అదే బాబు సంరక్షణ కోసం వచ్చిన ఆలోచనతో పర్సనల్ కేర్ రంగంలో ‘ఎర్త్ రిథమ్’ అనే బ్రాండ్ను సృష్టించి రూ. 200 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి సక్సెస్ఫుల్ సీఈవోగా నిలిచారు.దక్షిణ భారతదేశంలోని ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన హరిణికి.. బ్యాంకు ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని కోరికగా ఉండేది. ఆ ఆకాంక్షకు తగ్గట్టుగానే కష్టపడి చదువుకుని, నార్తాంప్టన్ విశ్వవిద్యాలయం నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎంఏ పూర్తి చేసింది. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగం కూడా సంపాదించింది. జీవితం అంతా సాఫీగా సాగి పోతున్న సమయంలో, 22 ఏళ్ల వయస్సులో ఆమెకు వివాహం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ బాబు ‘డౌన్స్ సిండ్రోమ్’ అనే ఆరోగ్య సమస్యతో జన్మించడం వల్ల.. తన బిడ్డను చూసుకోవడం కోసం హరిణి చేస్తున్న బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది.బాబు కోసం మొదలైన అన్వేషణ.. హరిణి తన బాబుకు సురక్షితమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను అందించాలని భావించారు. అయితే మార్కెట్లో లభించే కెమికల్స్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులు ఆమెకు సంతృప్తినివ్వలేదు. సహజసిద్ధమైన ప్రొడక్ట్స్ కోసం ఆమె చేసిన అన్వేషణే ఆమెలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. తానే స్వయంగా ఇలాంటి సురక్షితమైన ఉత్పత్తులను ఎందుకు తయారు చేయకూడదు? అనే ప్రశ్న ఆమెను వ్యాపార రంగం వైపు నడిపించింది.ఎర్త్ రిథమ్కు నాంది..ముందుగా హరిణి తన ఇంట్లోనే తయారు చేసిన ప్రొడక్ట్స్తో గేటెడ్ కమ్యూనిటీలు, చిన్నపాటి ఎగ్జిబిషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఆ తరువాత తన ఇంటి నుంచే సోప్వర్క్స్ ఇండియా అనే పేరుతో చిన్నగా వ్యాపారాన్ని అధికారికంగా ప్రారంభించారు. తయారీ, ΄్యాకింగ్, డెలివరీ.. ఇలా అన్ని పనులనూ ఆమె ఒక్కరే చూసుకునేవారు. ఆ తరువాత తన తండ్రి సహకారంతో వ్యాపారాన్ని పెద్ద ఎత్తున విస్తరించడానికి ప్రణాళికలు వేశారు. తండ్రీకూతుళ్లు కలిసి పర్యావరణ హితమైన బ్రాండ్గా మార్చాలనే ఉద్దేశంతో కంపెనీని ఎర్త్ రిథమ్గా రీబ్రాండ్ చేశారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించి, గుర్గావ్లో సొంత ప్రొడక్షన్ యూనిట్ను కూడా ఏర్పాటు చేశారు. అలా కేవలం 8 మంది మహిళలతో ఒక చిన్న ఆఫీసులో ప్రారంభమైన ఈ సంస్థ, నేడు వందలాది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. అంతేకాదు ఈ సంస్థలో వెనుకబడిన వర్గాల మహిళలకు, వైకల్యాలున్న వారికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.రూ. 200 కోట్ల సామ్రాజ్యం..2022 నాటికి ఎర్త్ రిథమ్ కస్టమర్ల సంఖ్య ఏకంగా 10 రెట్లు పెరిగింది. వ్యాపారం కూడా 500 రెట్లు విస్తరించింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ వెబ్సైట్ ద్వారా దాదాపు 160కి పైగా ప్రొడక్ట్స్ విక్రయిస్తున్నారు. ఇందులో ΄్లాస్టిక్ రహిత ΄్యాకేజింగ్తో వచ్చే షాంపూ బార్ అత్యంత ప్రజాదరణ తెచ్చిపెట్టింది. సమస్యలను చూసి కుంగి పోకుండా, దాన్నే ఒక అవకాశంగా మార్చుకుని అద్భుతాలు సృష్టించిన హరిణి శివకుమార్ ప్రయాణం.. ప్రతి ఒక్క మహిళకూ ఒక గొప్ప ఇన్స్పిరేషన్!మీరూ సాధించవచ్చు!చాలా కాలం పాటు ఇల్లు దాటని, ఎటువంటి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేని నాలాంటి ఒక సాధారణ మహిళే రూ. 200 కోట్ల బ్రాండ్ను విజయవంతంగా నడపగలిగినప్పుడు.. మీరెందుకు సాధించలేరు? అందుకు కావాల్సినవి అచంచలమైన విశ్వాసం, పట్టువదలని ప్రయత్నమే. మీపై మీకు నమ్మకం ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా దాటవచ్చు.– హరిణి శివకుమార్
'వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు..! ఎప్పుడంటే..
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఆధ్యాత్మిక ఉత్సవం. జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర దేవీలకు అంకితమైన ఈ పవిత్ర వేడుకను ప్రతి ఏటా ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథి నాడు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రథయాత్రను శ్రీ గుండిచా యాత్ర అని కూడా పిలుస్తారు. ఈ ఆధ్యాత్మిక రథ యాత్ర ప్రధాన జగన్నాథ ఆలయం నుంచి గుండిచా దేవి మందిరం వరకు సాగుతుంది. అలాంటి పరవమ పవిత్రమైన ఈ రథయాత్ర ఎప్పుడు జరగనుందంటే..ఆ రోజు నుంచి ప్రారంభం..ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర 2026 జూలై 16, గురువారం నుంచి ప్రారంభం కానుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు జూలై 24న ముగుస్తాయి. చివరి రోజున స్వామివారు తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. దీనినే బహుదా యాత్ర లేదా తిరుగు రథయాత్ర అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు పూరీ క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంది.ఎందుకింత ప్రాముఖ్యత అంటే..రథయాత్ర దర్శనానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. "రథంపై ఉన్న జగన్నాథుడిని దర్శించుకుంటే సర్వపాపాలు నశించి, మరణానంతరం మోక్షం లభిస్తుంది," అని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ జగన్నాథుడి రథాన్ని లాగే వారికి అక్షయ పుణ్యం లభిస్తుందనేది భక్తుల నమ్మకం. అలాగే ఆలయానికి రాలేని భక్తులను కలుసుకోవడానికి స్వయంగా స్వామివారే వీధుల్లోకి వస్తారనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో కుల, మత, వర్ణ భేదాలు లేకుండా లక్షలాది మంది భక్తులు పాల్గొని ఈ రథాలను లాగడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.(చదవండి: సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! ఆఖరికి విజయ్ సైతం..)
జస్ట్ ఉద్యోగంతోనే రూ. 15 కోట్లు..!
కోట్లాధికారి కావాలంటే..తాతల ఆస్తి లేదా ఏదైనా సైడ్ ఆదాయం ఉండాలని అనుకుంటారు. కాదు ఎంత సంపాదించినా..ఖర్చులు అదుపులో ఉండాలంటున్నాడు ఈ వ్యక్తి. డబ్బు పెరిగే కొద్ది జీవనశైలి నార్మల్గా ఉంటే..చాలు ఎవ్వరైనా ధనవంతులవ్వగలరు, దర్జాగా బతికేలా పదవీవిరణమను ప్లాన్ చేసుకోవచ్చని అంటున్నాడు. అదెలాగంటే..ఈ అమూల్యమైన ఆర్థిక పాఠాలు చెబుతోంది. మాజీ ఐటీ ఉద్యోగి వివేక్ వామన్. విప్రో, పీడబ్ల్యూసీ వంటి సంస్థలలోఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 24 ఏళ్లు పనిచేసి కోట్లు కూడబెట్టాడు. అంతేగాదు 47 ఏళ్ల వయసులో అంటే రిటైర్మెంట్ ఏజ్ కంటే కాస్త చిన్న వయసులో పదవీ విరణమ చేశారు. ఆయన ఇటీవల '1% క్లబ్' పాడ్కాస్ట్లో పాల్గొన్నప్పడు ఈ విషయాలను వెల్లడించారు. ఆయన పాడ్కాస్ట్ హోస్ట్ శ్రేయ హెగ్డేతో ప్రస్తుతం తన కుటుంబం మొత్తం నికర ఆస్తి విలువ(net worth) రూ. 15 కోట్లకు చేరిందని వెల్లడించారు. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ మొత్తం రూ. 20 కోట్లకు పైగా పెరిగింది. ఆయన ఇదంతా కేవలం 9 టు 5 జాబ్తోనే కూడబెట్టారు. పైగా ఆయనకు ఎలాంటి తాతముత్తాతల ఆస్తి, వ్యాపారం గానీ లేవన్నారు. తాను 2021లో ఆర్థిక స్వేచ్ఛను సాధించానని గ్రహించిన తర్వాత, తక్షణమే ఉద్యోగాన్ని వదిలి సొంతంగా ఆర్థిక సేవల వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అంత సొమ్ముని ఎలా కూడబెట్టారంటే..2021లో వివేక్ వామన్ రూ. 15 కోట్ల నికర ఆస్తితో ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. అప్పుడు ఆయన వయసు కేవలం 47 ఏళ్లు మాత్రమే; అంటే భారతదేశంలో సాధారణ పదవీ విరమణ వయసు కంటే చాలా ముందే ఆయన రిటైర్ అయ్యారు. రిజైన్కు ముందుకు వరకు ఆయన జీతం రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్యలో ఉండేది. ఆయన తొలి జీతం మాత్రం రూ. 12 వేలు మాత్రమే. ఆయన పొదుపు ప్రారంభించడానికి ఏ జీతమూ తక్కువ కాదంటారు. తాను ఇంత మొత్తాన్ని నిలకడగా పెట్టుబడులు పెట్టడం వల్ల సంపాదించగలిగానన్నారు. దీర్ఘకాలిక పెట్టుబడి అంటే సరిగ్గా అలాగే ఉండాలన్నారు. ఇది సాధ్యమేనా..కేవలం జీతంతోనే ఒక వ్యక్తి త్వరగా పదవీ విరమణ చేసి సంపదను కూడబెట్టడం అనేది పెద్ద విషయం కాదని అంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసి..జీతం తీసుకునే ఉద్యోగి, వారి ఆదాయంతో సంబంధం లేకుండా, త్వరగా పెట్టుబడులు ప్రారంభించేలా క్రమశిక్షణతో ఉంటే సులభంగా ఆర్థిక స్వేచ్ఛను పొందగలరని అన్నారు. యువ ఉద్యోగులు తమ కెరీర్ మొత్తంలో నేర్చుకుంటూ ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. అలాగే జీవనశైలి ఖర్చులు తక్కువుగా ఉంచాలని సూచించారు. ఉద్యోగాలు ప్రారంభించినప్పుడే కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ..ఆదాయాలను పెంచుకునే అవకాశానికి మార్గం సుగమం అవుతుంది. ఇక్కడ ఆదాయం పెరిగినా..ఖర్చులను అదే నిష్పత్తిలో ఉంచొద్దు. మూడోది లక్ష్య-ఆధారిత ఆర్థిక ప్రణాళికను రూపొందించడానికి ఒక మంచి సలహాదారుడితో కలిసి పనిచేయండి. చివరగా చక్రవడ్డీకి అంతరాయం కలిగించవద్దు. డబ్బును విలాసవంతమైన కొనుగోళ్లతో సమానం చేసినప్పటికీ.. ఆర్థిక స్వాతంత్ర్యం అంతకుమించి విలువైనదని అంటున్నారు వామన్. అంతేగాదు సంపదను కూడబెట్టాక..డబ్బు మీకు ఇచ్చే అతిపెద్ద విలాసం మానసిక స్వేచ్ఛ, 'వద్దు' అని చెప్పగల సామర్థ్యం. ఇక్కడ డబ్బుని డబ్బుతో కాకుండా సమయంతో కొలవాలని ఆయన అన్నారు. డబ్బు అనంతమైనది. మీరు ఎంత సంపదను సృష్టించినా, మీ కంటే ధనవంతులు ఎప్పుడూ ఉంటారు. అయితే డబ్బుతో ఆనందాన్ని కొనలేము, కానీ సమయాన్ని కొనవచ్చు. మీ డబ్బుతో మీరు సమయాన్ని కొనగలిగితే, మీ జీవితంలో మీరు కోరుకునే ఆనందానికి మరింత చేరువవుతున్నట్లేనని అన్నారు. (చదవండి: డీఎస్పీగా రైల్వే గేట్మ్యాన్..! 12 గంటలు పనిచేస్తూనే..)
అంతర్జాతీయం
సూర్యతాపానికి తుంపర్లతో చెక్
భానుడి భగభగలకు చైనీయులు అత్యంత వేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే షాన్జీ ప్రావిన్స్లోని యూన్చెంగ్ నగరంలోని ఇరుగుపొరుగు ఎత్తయిన భవనాల్లోని స్థానికులు మాత్రం ఈ సూర్యతాపానికి విరుగుడు కనిపెట్టాలనే కృతనిశ్చయంతో ముందడుగువేసి సఫలీకృతమయ్యారు. బిందుసేద్యం తరహాలో పైపులతో పెద్ద ఎత్తున సూక్ష్మస్థాయిలో తుంపర్ల వర్షం పడేలా ఒక ప్రత్యేక ఏర్పాటుచేశారు.ఇది చూసి అటుగా వెళ్లే వాళ్లు ఔరా అని మెచ్చుకుంటున్నారు. సంబంధిత వీడియోలు ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆరేడు భవనాల మిద్దె మీద అన్ని వైపులా ఏకరీతిగా తుంపర్లు చాలా దూరందాకా పడేలా పైపింగ్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. దీంతో సూర్యుడు నడినెత్తిన ఉండి ఉష్ణోగ్రతను పెంచేసినప్పుడు ఈ మిస్టింగ్ సిస్టమ్ను ఆన్ చేస్తారు. దీంతో అత్యధిక పీడనంతో నీరు ఆ నాజిల్ల గుండా బయటికొచ్చి సూక్ష్మాతిసూక్ష్మమైన నీటి బిందువులుగా నలువైపులా పరుచుకుంటుంది. అప్పటికే బయట ఉన్న వేడికి ఈ తుంపర్లు వెంటనే ఆవిరైపోతాయి.అవి ఆవిరవుతూ చుట్టూతా ఉన్న వేడిని తగ్గిస్తాయి. దీంతో ఆయా అపార్ట్మెంట్ వాసులతోపాటు కింద నేల మీద, అక్కడి చెట్లు, పాదచారుల బాటలనూ ఒక్కసారిగా చల్లబరుస్తాయి. ఈ మిస్టింగ్ సిస్టమ్ను ఆరంభించిన నాటి నుంచి ఈ తుంపర్ల చల్లదనాన్ని ఆస్వాదించేందుకు ఎంతో మంది ఎగబడుతున్నారు. అటుగా వెళ్లేవాళ్లు సైతం వీటిని చూసి వర్షపు జలపాతాలుగా వర్ణిస్తున్నారు.తుంపర్ల మీద నుంచి పరావర్తనం చెందే సూర్యకిరణాలతో అక్కడ తరచూ ఇంద్రధనస్సు ఏర్పడుతుండటం చూపరులనూ ఆకట్టుకుంటోంది. బయటి ఉష్ణోగ్రత 38 డిగ్రీ సెల్సియస్ ఉన్న సమయంలో మిస్టింగ్ సిస్టమ్ను ఆన్ చేసినప్పుడు దీని కారణంగా ఒకేసారి ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతోందని ఈ వ్యవస్థ నిర్వాహకులు చెబుతున్నారు. సంప్రదాయక ఎయిర్కండీషన్ వ్యవస్థలతో పోలిస్తే భౌతికశాస్త్ర సూత్రాలపై పనిచేసే ఈ వ్యవస్థతో విద్యుత్ వినియోగం సైతం చాలా తక్కువ. కేవలం అత్యధిక పీడన నాజిళ్లు, పైపులు, నీళ్లు సరిపోతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
శిథిలాల నుంచి 8 రోజుల తర్వాత సజీవంగా..
లా గుయేరా: విపరీత ప్రకంపనలతో విరుచుకుపడిన భూకంపం తర్వాత మూడ్రోజులైనా శిథిలాలను పూర్తిస్థాయిలో తొలగించకపోతే వాటి కింద చిక్కుకున్న వారిపై ఆశలు వదిలేసుకోవడం తప్ప మరేం చేయలేమని రెస్క్యూ బృందాలే చెబుతుంటాయి. అలాంటిది ఏకంగా 8 రోజుల తర్వాత మృత్యువును జయించి సజీవంగా బయటపడిన వ్యక్తిని చూసి సహాయక, అన్వేషణ సిబ్బంది సైతం ఆశ్చర్యపోయారు. ఈ అసాధారణ ఘటనకు వెనెజువెలాలో భూకంపపీడిత లా గుయేరా నగరంలోని 9 అంతస్తుల భవన శిథిలాలు వేదికగా నిలిచాయి. భూకంపం ధాటికి 9 అంతస్తుల భవంతి 29 అడుగుల శిథిలాల కుప్పగా తయారైంది.వీటిని నెమ్మదిగా తొలగిస్తుండగా ఐదో రోజున శిథిలాల అడుగున చేతి వేళ్లు కదులుతూ కని్పంచాయి. చిన్నపాటి రెస్క్యూ కెమెరాలో రికార్డయిన దృశ్యంతో శిథిలాల కింద ఒకరు బతికే ఉన్నారని రూఢీ చేసుకుని సహాయక బృందాలు జాగ్రత్తగా శిథిలాలను తొలగించడం మొదలెట్టారు. అయినాసరే శిథిలాలు మళ్లీమళ్లీ జారిపడుతూ రెస్క్యూ కార్యక్రమాలకు అవరోధంగా నిలిచాయి. శిథిలాలను తొలగించేలోపు అతడికి ఆహారంగా ద్రవాహారం, నీటిని సిరంజీ, సన్నటి పైప్ ద్వారా పంపి ఆకలిని తీర్చారు. 70 గంటలపాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమవడంతో 44 ఏళ్ల హెర్నాన్ ఆల్బెర్టో గిల్ ఫ్లోరెస్ నిక్షేపంగా బయటపడ్డాడు.అయితే అతని తలకు, ఎడమ కంటికి మాత్రం చిన్నపాటి గాయాలయ్యాయి. వెంటనే అతడిని రెడ్క్రాస్ అంబులెన్స్ ఎక్కించి సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పుడతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని ఐక్యరాజ్యసమితి విపత్తు మదింపు, సమన్వయ విభాగాధికారి సెబాస్టియన్ ప్రకటించారు. హెర్నాన్ ఆల్బెర్టో కూలిన ఆ భవనం గ్రౌండ్ఫ్లోర్ పార్కింగ్ ఏరియాలో సెక్యూరిటీగార్డ్గా పనిచేసేవాడు. భర్త జాడ గల్లంతవడంతో అతను చనిపోయాడనుకుని భార్య గత వారంరోజులుగా ఏడుస్తున్నారు. భర్త బతికొచ్చేసరికి భార్య, పిల్లల ప్రాణాలు లేచొచ్చాయి.వారం తర్వాత మా జీవితాల్లోకి ఆశాకిరణం వచి్చందని భార్య గుస్బిమార్ గోంజాలెస్ ఆనందబాష్పాలు రాల్చారు. 8 రోజుల తర్వాత వ్యక్తి నిక్షేపంగా బయటపడటంతో దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిజ్ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘రెస్క్యూ ఆపరేషన్ కోసం శ్రమను, సమయాన్ని వెచ్చిస్తూ అంకితభావంతో పనిచేస్తున్న దేశ,విదేశాల రెస్క్యూ బృందాలకు సెల్యూట్’అని ఆమె కొనియాడారు. మరోవైపు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం నాటికి భూకంప మరణాల సంఖ్య 2,295కు పెరిగింది. 11వేల మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటిదాకా శిథిలాల నుంచి 6,481 మందిని కాపాడారు.
భూకంప విలయం.. వెనెజువెలాలో ఆకలి కేకలు
జంట భూకంపాలతో అల్లాడిపోయిన వెనెజువెలాలోని లా గువైరా ప్రాంతంలో ప్రస్తుతం ఆకలి కేకల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. జూన్ 24న సంభవించిన విపత్తు కారణంగా కాటియా లామార్లో ఏడు అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. ఇక నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ జార్జ్ రోడ్రిగ్జ్ ప్రకారం జంట భూకంపాల్లో కనీసం 2,295 మంది ప్రాణాలు కోల్పోగా, 11 వేల మందికి పైగా గాయపడ్డారు. అయితే పదివేల మంది ఆచూకీ ఇప్పటికీ గల్లంతులోనే ఉంది. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం సుమారు 50,000 మంది ఆచూకీ తెలియకుండా పోగా, దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారు. భూకంపం ధాటికి అత్యంత తీవ్రంగా ప్రభావితమైన లా గువైరా నగరంలో, చాలా మంది నివాసితులు ఇప్పుడు ఆహారం, నీటి కోసం గంటల తరబడి క్యూలో నిలబడిన దృశ్యాలు కలచివేస్తున్నాయి.
సిరియా రాజధాని డమాస్కస్లో పేలుడు.. ఆరుగురు మృత్యువాత
సిరియా రాజధాని డమాస్కస్లోని ఒక కేఫ్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం ఆరుగురు మృతి చెందగా, 22 మంది గాయపడినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం మధ్యాహ్నం 3.24 గంటల సమయంలో అల్-మర్జా జిల్లాలోని ప్యాలెస్ ఆఫ్ జస్టిన్ అనే న్యాయభవనానికి సమీపంలో ఉన్న అల్-నాసన్ వీధిలోని కేఫ్లో పేలుడు జరిగినట్లు సమాచారం అందింది. పేలుడు పరికరం కారణంగానే ఈ ఘటన సంభవించినట్లు పోలీసులు తెలిపారు. పేలుడుకు సంబంధించి విచారణ జరపనున్నట్లు సిరియా అధికార ప్రతినిధి మిలాద్ ఫద్ తెలిపారు. కేఫ్ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. పేలుడుకు బాధ్యులు ఎవరన్నది కనిపెడతామని పేర్కొన్నారు. కేఫ్కు 40 మీటర్ల దూరంలోనే న్యాయస్థాన భవనం ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ వారంలో సిరాయా మాజీ గ్రాండ్ ముఫ్తీ అహ్మద్ బదర్ అల్-అల్దీవ్ హస్సౌన్ ప్యాలెస్ ఆఫ్ జస్టిస్లో విచారణకు హాజరయ్యారు. అయితే గత కొన్ని నెలలుగా సిరియా రాజధాని డమాస్కస్లో భద్రతా పరిస్థితి మెరుగుపడిందని, సంపూర్ణ స్థిరత్వాన్ని నెలకొల్పడానికి సిరియా ప్రభుత్వానికి సమయం పడుతుందని డమాస్కస్ గవర్నర్ మహెర్ మర్వాన్ తెలిపారు.చదవండి: అలీ ఖమేనీ అంత్యక్రియలకు కొడుకు మొజ్తబా ఖమేనీ గైర్హాజరు!
జాతీయం
టోల్గేట్పై దూసుకొచ్చిన ఎల్పీజీ ట్యాంకర్ : నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి)లోడ్తో వెళ్తున్న ఒక ట్యాంకర్ టోల్ బూత్ను ఢీకొట్టి పేలిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. జూన్ 26న ఉదయం 6:40 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగు చూడటంతో వైరల్గా మారింది.24 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో, రెండు ట్యాంకర్లు టోల్ బూత్ వైపు వస్తుండగా, వాటిలో ఒకటి అకస్మాత్తుగా అదుపుతప్పి, డివైడర్ను ఢీకొట్టి టోల్ ప్లాజాలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ట్యాంకర్ నుండి గ్యాస్ లీక్ అవ్వడంతో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో కొద్ది క్షణాలకే, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. మంటలు సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.మంటలను అదుపులోకి తీసుకు రావడానికి జిల్లాలోని అన్ని అగ్నిమాపక దళాల యూనిట్లతో పాటు సివిల్ పోలీసు సిబ్బందిని కూడా రంగంలోకి దించినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.Remember the horrific fire at Sihori Toll Plaza on 26 June 2026?Four people lost their lives. Many others were left critically injured and are still battling for recovery.The CCTV footage now confirms the LPG tanker slammed into the divider, overturned, and only then… pic.twitter.com/m9ens5h2xx— ज़िद्दी नागरिक (@ZiddiNaagrik) July 3, 2026 ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీఈ ఘటనలో ధర్మేంద్ర దుబే (40) డ్రైవర్, అలోక్ అనే టోల్ ప్లాజా ఉద్యోగి అక్కడికక్కడే మరణించారు. టోల్ ప్లాజాలోని పలువురు ఇతర కార్మికులు కూడా తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు తర్వాత మరణించారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి వాహనాలను టోల్ ప్లాజా గుండా ఉచితంగా వెళ్ళడానికి కొద్దిసేపు అనుమతించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ఒక టెక్నికల్ టీంను ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: 16 పత్రాలిచ్చినా; సిటిజెన్షిప్పై గౌహతి కోర్టు సంచలన తీర్పు
సోనమ్ బెయిల్పై సుప్రీం కోర్టు అనుమానాలు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. అయితే ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రాథమికంగా తమకు అభ్యంతరాలు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ శీల్ నాగు ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రతివాదులకు(సోనమ్కు, ఇతరులకు) నోటీసులు జారీ చేసింది.మేఘాలయ ప్రభుత్వం వాదన ఇదే..మేఘాలయ ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇది ముందే పథకం ప్రకారం జరిగిన హత్య అని, సోనం రఘువంశీ తన ప్రియుడు రాజ్ కుష్వాహా.. మరో ముగ్గురితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసి లోయలో పడేశారని కోర్టుకు తెలిపారు. హత్య అనంతరం సోనం పరారై ఉత్తరప్రదేశ్లో అరెస్టయ్యిందని వివరించారు.అయితే, హత్య కేసుకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) (హత్యకు శిక్ష)కు బదులుగా పొరపాటున సెక్షన్ 403(1)గా అరెస్ట్ మెమోలో టైప్ చేయడాన్ని ఆధారంగా తీసుకుని ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిందని.. అలాగే హైకోర్టు కూడా ఆ బెయిల్ను సమర్థించిందని కోర్టుకు నివేదించారు. అది కేవలం టైపింగ్ పొరపాటు మాత్రమేనని, ఈ ఒక్క కారణంతో బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించారు.సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై తమకు ప్రాథమికంగా కొన్ని సందేహాలు ఉన్నాయని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. నిందితురాలిపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని.. బెయిల్ విషయంలో మేఘాలయా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారాయన. అలాగే అరెస్టు కారణాలను నిందితురాలికి వివరించారని రికార్డుల్లో ఉందని, గతంలో దాఖలైన బెయిల్ పిటిషన్లలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదని బెంచ్ ప్రస్తావించింది. కేవలం తప్పుగా సెక్షన్ పేర్కొన్నందుకే బెయిల్ ఇవ్వడం సరైందేనా? అని ప్రశ్నించింది.అయితే, సోనమ్ ఇప్పటికే జైలు నుంచి విడుదలైనందున ఈ దశలో బెయిల్పై స్టే విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. ‘‘బెయిల్ రద్దు విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. ఆమె విడుదల కాకపోయి ఉంటే.. బెయిల్పై కచ్చితంగా స్టే విధించేవాళ్లం’’ అని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో, బెయిల్ ఉత్తర్వుపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని, తదుపరి విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది.హనీమూన్ కేసులో జరిగింది ఇదే.. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనం రఘువంశీ 2025 మేలో వివాహం చేసుకున్నారు. అనంతరం హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఈ జంట మే 23న అదృశ్యమైంది. జూన్ 2న ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని వైసాడాంగ్ జలపాతం సమీపంలోని లోయలో రాజా మృతదేహం లభించింది. కొద్ది రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో సోనం రఘువంశీ కనిపించగా, అనంతరం పలు అనుమానాల నడుమ ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.దర్యాప్తులో భర్త హత్యకు సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కుట్ర పన్నిందని, ఇందుకోసం కిరాయి హంతకులను నియమించిందని మేఘాలయ పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో సోనం, రాజ్ కుష్వాహాతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి 700కు పైగా పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు.ఈ ఏడాది ఏప్రిల్ 27న ట్రయల్ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వగా.. జూన్ 29న మేఘాలయ హైకోర్టు సోనం రఘువంశీకి బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ పత్రాల్లో సెక్షన్ను తప్పుగా నమోదు చేయడం సాధారణ టైపింగ్ పొరపాటు కాదని, దర్యాప్తు ప్రక్రియలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టు బెయిల్ను సమర్థించింది. ఇప్పుడు ఆ బెయిల్ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, బెయిల్పై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించినప్పటికీ, హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి విచారణ కొనసాగించేందుకు అంగీకరించింది.
16 పత్రాలిచ్చినా; సిటిజెన్షిప్పై గౌహతి కోర్టు సంచలన తీర్పు
భారతీయ పౌరసత్వ నిరూపణ పత్రాలకు సంబంధించి తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో గౌహతి హైకోర్టు తీర్పు సంచలనంగా మారింది. తాజా చారిత్రాత్మక తీర్పులో, గౌహతి హైకోర్టు ఒక రిట్ పిటిషన్పై విచారణ జరుపుతూ, పిటిషనర్ తన పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి 16 పత్రాలను సమర్పించినప్పటికీ, తాను భారత పౌరుడినని నిరూపించుకోలేకపోయారని పేర్కొంది.జస్టిస్ కల్యాణ్ రాయ్ సురానా, జస్టిస్ షమీమా జహాన్ లతో కూడిన ధర్మాసనం జూన్ 30న ఈ ఉత్తర్వులను జారీ చేసింది.ఒక రిట్ పిటిషన్ను విచారించిన గౌహతి హైకోర్టు ఈ కీలక తీర్పునిచ్చింది. పిటిషనర్ తన పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి 16 పత్రాలను కోర్టుకు సమర్పించినప్పటికీ, తాను భారతీయ పౌరుడినని నిరూపించడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. ఫారినర్స్ యాక్ట్, 1964 లోని సెక్షన్ 9 ప్రకారం... పిటిషనర్ సమర్పించిన 16 పత్రాలు అతను విదేశీయుడు కాదని, భారతీయ పౌరుడేనని నిరూపించడానికి ఎంతమాత్రం సహాయపడటం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఒక వ్యక్తి విదేశీయుడా కాదా అనే ప్రశ్న తలెత్తినప్పుడు, తాను భారతీయ పౌరుడినని నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఆ వ్యక్తిపైనే ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.కేసు నేపథ్యంగౌహతికి చెందిన అమీనుల్ హక్ అనే వ్యక్తి, తనను విదేశీయుడిగా ప్రకటిస్తూ ఫారినర్స్ ట్రిబ్యునల్ 2019 ఫిబ్రవరి 28న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబం తరతరాలుగా అసోంలోనే నివసిస్తోందని ఆయన వాదించారు.పిటిషనర్ సమర్పించిన 16 పత్రాలు1951 నాటి జాతీయ పౌర పట్టిక (NRC) ప్రతులు (ఇందులో అతని తాత, తండ్రి పేర్లు ఉన్నాయి).1966 నుండి 2017 వరకు తన తల్లిదండ్రుల మరియు తన పేరు ఉన్న ఓటర్ల జాబితాల ధృవీకృత ప్రతులు.1973 నాటి భూమి కొనుగోలు పత్రాలు.పాన్ కార్డ్ (PAN).ఓటరు గుర్తింపు కార్డులు (Voter IDs).స్కూల్ సర్టిఫికేట్.అంతేకాదు తండ్రి సాక్ష్యం సరిపోదని కూడా తెలిపింది. పిటిషనర్ తండ్రి స్వయంగా కోర్టుకు హాజరై అమీనుల్ హక్ తన కుమారుడేనని గుర్తించారు. అయితే, సరైన రాతపూర్వక/డాక్యుమెంటరీ ఆధారాలు లేకుండా కేవలం నోటి మాటల ద్వారా చెప్పే సాక్ష్యం ఇద్దరి మధ్య బంధాన్ని నిరూపించడానికి సరిపోదని కోర్టు పేర్కొంది.పిటిషనర్ తండ్రి పేరు వేర్వేరు పత్రాల్లో మొహీరుద్దీన్ షేక్, మహ్రుద్దీన్ షేక్, మొహీరుద్దీన్, మోహిర్ ఉద్దీన్ అని వేర్వేరు స్పెల్లింగులతో ఉంది. ఈ తప్పులను కోర్టు పెద్దగా పరిగణించనప్పటికీ... పిటిషనర్ కుటుంబం దోబాకురా, ఘుగుదోబా, హష్దోబా అనే మూడు గ్రామాల్లో నిరంతరంగా కలిసి ఉన్నట్లు ఓటర్ల జాబితా ద్వారా నిరూపించడంలో విఫలమయ్యారని కోర్టు తెలిపింది. ఈ మూడు గ్రామాల ఓటర్ల జాబితాలన్నింటిలో పిటిషనర్తో పాటు కుటుంబంలోని సభ్యులుగా చూపబడిన పాసన్ అలీ, మోహిరుద్దీన్ లేదా అమీనుల్ హోక్ పత్రాల్లోని ఖాళీలను పూరించడానికే ఓటర్ల జాబితాలను వాడుకున్నారని, కుటుంబం ఒక గ్రామం నుండి మరో గ్రామానికి మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.స్కూల్ సర్టిఫికేట్ చెల్లదు: హష్దోబా ఆంచలిక్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు 2017లో ఇచ్చిన స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ను పిటిషనర్ సమర్పించారు (అతను 1999లో పాఠశాల వదిలి వెళ్ళినట్లు అందులో ఉంది). అయితే, ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వ్యక్తి (హెడ్మాస్టర్) కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పనందున దానికి విలువ లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ
అయోధ్య విరాళాల కేసు.. కౌంటింగ్ రూమ్లో నిందితుల తొలి ఫొటోలు లీక్!
అయోధ్య: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రధాన నిందితులు అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రాలకు సంబంధించిన ఫొటోలు తాజాగా వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది.రామ మందిర భవనంలో అధికారుల సమక్షంలో భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. అయితే, సిబ్బంది విరాళాల్ని లెక్కిస్తున్న సమయంలోనే అవినాష్, అనుకల్ప్ ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు ఇప్పుడు బయటకు రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించేందుకు ట్రస్ట్ అధికారులు ఆలయ ప్రాంగణంలో రెండు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి లెక్కింపు కేంద్రం ‘పిల్గ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్’ కాగా, రెండవదాన్ని ఒక పోలీస్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ రెండవ కౌంటింగ్ సెంటర్లోనే కానుకలు లెక్కించే బాధ్యతలను ప్రధాన నిందితుడు అనుకల్ప్ మిశ్రా చూసేవాడు. అక్కడ నుంచే అతను ఈ అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. కుంభమేళా అనంతరం భక్తుల రద్దీ, కానుకల సమర్పణ విపరీతంగా పెరగడంతో, లెక్కింపును వేగవంతం చేయడానికి ట్రస్ట్ అధికారులు ఆలయ ఆవరణలోని ఒక పోలీస్ పోస్ట్ వద్ద రెండవ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది మార్చి నెలలో నగదు లెక్కింపు కోసం కొత్తగా రిక్రూట్ చేసిన 10 మంది సిబ్బందిని ఈ పోలీస్ పోస్ట్ వద్ద ఉన్న రెండవ కేంద్రానికే కేటాయించారు. వీరిలో ప్రధాన నిందితుడు అనుకల్ప్ మిశ్రాతో పాటు అవినాష్ శుక్లా, కరుణేష్ పాండే, లవకుష్ మిశ్రా ఉన్నారు.అనుకల్ప్ మిశ్రా నేరుగా విరాళాల వోచర్లు తయారు చేసే బాధ్యతను చూసేవాడు. అతను తన బావ అయిన లవకుష్ మిశ్రాతో కలిసి బ్యాంకుకు వెళ్లే క్యాష్ బండిల్స్లో అదనపు నోట్లను చేర్చేవాడు. బ్యాంకు అధికారులు బండిల్స్ సంఖ్యను మాత్రమే లెక్కించి డిపాజిట్ రశీదులు ఇచ్చే లోపాన్ని ఆసరాగా చేసుకుని, ఆలయం నుండి బ్యాంకుకు సొమ్ము తరలించే లోపే ఆ అదనపు నగదును వీరు రహస్యంగా నొక్కేసేవారని దర్యాప్తులో తేలింది.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. విరాళాల లెక్కింపు సమయంలో సీసీటీవీ కంట్రోల్ రూమ్ను అధికారులు సరిగ్గా పర్యవేక్షించడం లేదనే విషయాన్ని నిందితులు గమనించారు. మొదట్లో కెమెరాలకు చిక్కకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించిన నిందితుడు అనుకల్ప్ మిశ్రా, ఆ తర్వాత నిఘా లోపాన్ని ఆసరాగా చేసుకుని కెమెరాల ముందే బహిరంగంగా నగదును పక్కదారి పట్టించాడు.ఆలయం నుంచి నిందితుడు అత్యంత చాకచక్యంగా నగదును తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాల ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నెలకు కేవలం రూ. 15,000 నుండి రూ. 18,000 జీతం తీసుకునే అనుకల్ప్ మిశ్రా పేరు మీద అయోధ్యలో రూ. 65 లక్షల విలువైన ఇల్లు, కొత్తగా నిర్మిస్తున్న ఫామ్హౌస్, రూ. లక్షకు పైగా విలువైన బైక్, మహీంద్రా స్కార్పియో ఎస్యూవీ బుకింగ్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఈ కేసులో మనీలాండరింగ్, నిధుల మళ్లింపు కోణాన్ని మరింత లోతుగా విచారించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ సహాయం కూడా కోరనున్నారు.దేవుడు చూస్తున్నాడురిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి, నిందితుడైన సుభాష్ శ్రీవాస్తవ లెక్కింపు ప్రక్రియకు ఇన్చార్జ్గా ఉన్నారు. విరాళాల పెట్టెల నుండి నగదును బయటకు తీసి, దానిని లెక్కింపు గదికి పంపి, చివరకు ఎస్బిఐకి అప్పగించడం అతని బాధ్యత. ఆభరణాలకు సంబంధించి సరైన రికార్డు ఉండేది కాదు.దీనివల్ల విరాళాల దుర్వినియోగం జరిగేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి విరాళాలు పక్కదారి మళ్లుతన్నాయనే విషయం తొలిసారి వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. లెక్కింపు బృందంలోని ఒక సభ్యుడు, లెక్కింపు సమయంలో పలువురు డబ్బును కాజేస్తున్నారని ఇన్చార్జ్ సుభాష్ శ్రీవాస్తవకు తెలియజేశారు. దీనికి శ్రీవాస్తవ..‘దేవుడు చూస్తున్నాడు. ఇది నీ ఇంట్లో నుంచో నా ఇంట్లో నుంచో పోయేది కాదు కదా’అని బదులిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఎన్ఆర్ఐ
గల్ఫ్లో పర్యటించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత
హైదరాబాద్: గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల ఓటు హక్కుల పరిరక్షణపై మంత్రి పొన్నం ప్రభాకర్తో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ ప్రతినిధులు ఆదివారం చర్చించారు. తెలంగాణ రాష్ట్ర 'గల్ఫ్ కాంగ్రెస్' ప్రతినిధి సుతారి సత్యనారాయణ పటేల్, తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ఆదివారం హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశారు. సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం వేళ.. విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగింపునకు తీసుకోవాల్సిన చర్యలపై పొన్నం ప్రభాకర్ తో వారు చర్చించారు.ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ ఓటరు నమోదును కొనసాగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆన్లైన్ జూమ్ సమావేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ ప్రతిపాదనలను మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్వీకరించినట్లు వారు తెలిపారు. అలాగే తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు, గల్ఫ్ కార్మికులతో ప్రత్యక్షంగా మమేకమయ్యేందుకు గల్ఫ్ దేశాల్లో పర్యటించాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. స్వయంగా గల్ఫ్ దేశాల్లో పర్యటించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర ఎంతో కీలకమని, వారి సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
వయసు 39, రూ. 46 కోట్లు ఆస్తి.. రిటైర్మెంట్ తీసుకోవచ్చా?
సోషల్ మీడియా పుణ్యమా అని తమకెదురైన ప్రతి సమస్యను షేర్ చేసుకుంటూ సలహాలు సూచనలు పొందడం ఓ ట్రెండ్గా మారింది. ఒకరకంగా దీనివల్ల ఇతరుల ఎంత పెద్ద సమస్యలు ఫేస్ చేస్తున్నారో తెలియడమేగాక, వ్యక్తిగతంగా ఒక సమస్యకు ఎలా సంయమనంగా ఓపిగ్గా ఉండాల్లో తెలుసుకునే వీలు లభించడం విశేషం. అలానే ఈసారి నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఎన్నారై రెడిట్ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు ఆలోచింప చేస్తోంది. ఇంతకీ అందులో ఏముందంటే..ఆ ఎన్నారై రెడిట్ పోస్ట్లో ఇలా ఉంది. తన వయసు 39 ఏళ్లు అని, తాను దాదాపు 15 ఏళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్నట్లు పోస్టులో రాసుకొచ్చాడు. తాను ప్రేమించి పెళ్లి చూసుకున్నానని, తామిద్దరం ఉద్యోగాల్లో మంచి ఉన్నతిని సాధించామని, సుమారు 46 కోట్లు ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఇటీవల తన భార్య కేన్సర్ బారిన పడిందని, ప్రస్తుతం ఆ వ్యాధి మరింతగా ముదిరిందని రాసుకొచ్చారు. తమకు పిల్లలు కూడా లేరని అన్నారు.దాదాపు ఐదేళ్లుగా తర భార్య కేన్సర్తో పోరాడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఒకవేళ ఆమె ఆరోగ్యం క్షీణించి.. దాంతో మానసికంగా అలిసిపోయి ఇక పనిచేయకూడదు రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకుంటే.. భారత్లో జీవించడానికి తన వద్ద ఉన్న ఆ రూ. 46 కోట్ల ఆస్తి సరిపోతుందా అని ప్రశ్నించాడు. అందుకు నెటిజన్ల నుంచి ఆచరణాత్మక ఆర్థిక సలహాలతో పాటు వ్యక్తిగత ధైర్యాన్ని నింపే సలహాలు సూచనలు కూడా అందించారు.వినడానికి బాధగా ఉన్నా.. తక్షణమే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆమె చెంతే ఉండండి. మంచి వైద్యం అందించేలా ప్రముఖ వైద్యులను కలిసి సలహాలు సూచనలు తీసుకోండి. భారత్లో మెట్రో నగరాల్లో జీవించాలనుకున్నా అంత మొత్తం సరిపోతుందని అన్నారు. అంతేగాదు మీ భార్య కోసం చేయగలిగిందంతా ఇప్పుడే చేయండి. ఇది ఆర్థిక భద్రతకు సంబంధించింది కాదు.. అంతకుమించిన బంధానికి, భావోద్వేగానికి సంబంధించిందంటూ పోస్టులు పెట్టడం గమనార్హం.చదవండి: జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని..
న్యూయార్క్ టూర్ విషాదం : తల్లిని కాపాడబోయి యువకుడు దుర్మరణం
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ సెంట్రల్ పార్క్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుర్రపు బగ్గీ నుండి కింద పడి పోయిన తల్లిని రక్షించే ప్రయత్నంలో ఒక భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గుర్రం అదుపు తప్పి ఒక్కసారిగా వేగంగా పరిగెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది.'ది న్యూయార్క్ టైమ్స్' ప్రకారం కుటుంబంతో కలిసి న్యూయార్క్కు మొదటిసారి విహారయాత్రకు వచ్చిన 18 ఏళ్ల రోమాంచ్ మహాజన్కు బుధవారం జీవితంలోని మర్చిపోలేని శోకాన్ని మిగిల్చింది. కుటుంబ ఫోటో తీసుకోవడానికి డ్రైవర్ బండిని ఆపిన వెంటనే, గుర్రం ఒక్కసారిగా అదుపు తప్పి పరిగెత్తడం మొదలుపెట్టింది. అది వేగంగా దూసుకెళ్లి ఫుట్పాత్ ఎక్కి, గడ్డి ఉన్న ప్రదేశంలోకి దూసుకెళ్లింది. ‘‘రక్షించండి, రక్షించండి’’ అని అరుస్తూనే ఉన్నామని రోమాంచ్ తండ్రి దీపక్ మహాజన్ వాపోయారు. అందరమూ ఒకర్నొకరు గట్టిగా పట్టుకున్నప్పటికీ తన భార్య ప్రియ బగ్గీ నుండి కింద పడి పోవడంతో, ఆమెను రక్షించడానికి రోమాంచ్ కిందకు దూకి చనిపోయాడని కన్నీటి పర్యంతమయ్యాడు.కిందకు దూకిన రోమాంచ్ తల నేలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. బుధవారం రాత్రి న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ వీల్ కార్నెల్ మెడికల్ సెంటర్లో చికిత్సపొందుతూ చని పోయాడు. రోమాంచ్ తండ్రి తల్లి , తమ్ముడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టావెర్న్ ఆన్ ది గ్రీన్ అనే హోటల్లో పనిచేసే టాటియానా బ్రెస్లర్ న్యూయార్క్ పోస్ట్తో మాట్లాడుతూ, గుర్రం భయంతో చాలా వేగంగా పరుగెత్తిందని, వెంటనే తాము 911కి ఫోన్ చేశారు. బగ్గీ బోల్తా పడకముందే ఒక ప్రత్యక్ష సాక్షి ఆ గుర్రాన్ని కట్టడి చేశాడని బ్రెస్లర్ తెలిపారు.ఇదీ చదవండి : 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీగుర్రపు బగ్గీలతో జరుగుతున్న వరుస ప్రమాదాల్లో ఇది తాజాది. ఈ ప్రమాదంతో పార్కులో గుర్రపు బగ్గీలను నిషేధించాలనే డిమాండ్లు మళ్లీ ఊపందుకున్నాయి. బగ్గీ డ్రైవర్ల యూనియన్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. గత ఏడాది మే నుండి పార్క్ లేదా దాని పరిసరాల్లో గుర్రాలకు సంబంధించిన ప్రమాదాలు ఎనిమిది జరిగాయని, గత నెలలో కూడా ఒక గుర్రం మరో బగ్గీని ఢీకొట్టడంతో అది బోల్తా పడిందని పార్క్ కన్సర్వెన్సీ తెలిపింది. సదరు డ్రైవర్ను యజమాని నిరవధికంగా సస్పెండ్ చేశారు.ఇదీ చదవండి: మాస్కోపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ : తీవ్ర ఉద్రిక్తత
ఫిన్లాండ్లో విద్యార్థి మణిదీప్ రెడ్డి మిస్సింగ్
ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్కు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ హైదరాబాద్కు చెందిన మణిదీప్ అనే యువకుడు దాదాపు నెలరోజులకు పైగా కనిపించకుండా పోయాడు. అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించినా సరైన సమాధానం లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్కు చెందిన మణిదీప్ రెడ్డి గుజ్జా ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్కు వెళ్లాడు. లాహ్టి (Lahti) నగరంలో ఉన్న ఎల్యూటీ యూనివర్సిటిలో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే మే నెల 5వ తేదీ నుంచి కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోయినట్లు తెలుస్తోంది. ఫోన్, సోషల్ మీడియా సహా ఏ మార్గంలోనూ అతనితో సంప్రదింపులు జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.మణిదీప్ అదృశ్యమైన విషయం గురించి కాలేజీ యాజమాన్యాన్ని, సిబ్బందిని పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి గల్లంతైన విషయంపై కాలేజీ నుంచి కూడా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని వారు చెబుతున్నారు.ఇప్పటికే పలు మార్గాల్లో అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్న కుటుంబ సభ్యులు, భారత విదేశాంగ శాఖతో పాటు ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీనే హైదరాబాద్కు చెందిన ఓ లాయర్ మణిదీప్ మిస్సింగ్ మీద ఓ ట్వీట్ చేయడం గమనార్హం.. 🚨 MISSING IN FINLAND 🇫🇮Manideep Reddy Gujja has been missing in Finland.Family and friends are urgently seeking any information regarding his whereabouts.📍 Last Contacted: May 5, 2026🎓 University: LUT University📍 City: Lahti, FinlandContact +91 78932 87099— Nipun Tulsyan (@NipunTulsyan) June 12, 2026
క్రైమ్
టోల్గేట్పై దూసుకొచ్చిన ఎల్పీజీ ట్యాంకర్ : నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి)లోడ్తో వెళ్తున్న ఒక ట్యాంకర్ టోల్ బూత్ను ఢీకొట్టి పేలిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. జూన్ 26న ఉదయం 6:40 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగు చూడటంతో వైరల్గా మారింది.24 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో, రెండు ట్యాంకర్లు టోల్ బూత్ వైపు వస్తుండగా, వాటిలో ఒకటి అకస్మాత్తుగా అదుపుతప్పి, డివైడర్ను ఢీకొట్టి టోల్ ప్లాజాలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ట్యాంకర్ నుండి గ్యాస్ లీక్ అవ్వడంతో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో కొద్ది క్షణాలకే, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. మంటలు సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.మంటలను అదుపులోకి తీసుకు రావడానికి జిల్లాలోని అన్ని అగ్నిమాపక దళాల యూనిట్లతో పాటు సివిల్ పోలీసు సిబ్బందిని కూడా రంగంలోకి దించినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.Remember the horrific fire at Sihori Toll Plaza on 26 June 2026?Four people lost their lives. Many others were left critically injured and are still battling for recovery.The CCTV footage now confirms the LPG tanker slammed into the divider, overturned, and only then… pic.twitter.com/m9ens5h2xx— ज़िद्दी नागरिक (@ZiddiNaagrik) July 3, 2026 ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీఈ ఘటనలో ధర్మేంద్ర దుబే (40) డ్రైవర్, అలోక్ అనే టోల్ ప్లాజా ఉద్యోగి అక్కడికక్కడే మరణించారు. టోల్ ప్లాజాలోని పలువురు ఇతర కార్మికులు కూడా తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు తర్వాత మరణించారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి వాహనాలను టోల్ ప్లాజా గుండా ఉచితంగా వెళ్ళడానికి కొద్దిసేపు అనుమతించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ఒక టెక్నికల్ టీంను ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: 16 పత్రాలిచ్చినా; సిటిజెన్షిప్పై గౌహతి కోర్టు సంచలన తీర్పు
సోనమ్ బెయిల్పై సుప్రీం కోర్టు అనుమానాలు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. అయితే ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రాథమికంగా తమకు అభ్యంతరాలు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ శీల్ నాగు ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రతివాదులకు(సోనమ్కు, ఇతరులకు) నోటీసులు జారీ చేసింది.మేఘాలయ ప్రభుత్వం వాదన ఇదే..మేఘాలయ ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇది ముందే పథకం ప్రకారం జరిగిన హత్య అని, సోనం రఘువంశీ తన ప్రియుడు రాజ్ కుష్వాహా.. మరో ముగ్గురితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసి లోయలో పడేశారని కోర్టుకు తెలిపారు. హత్య అనంతరం సోనం పరారై ఉత్తరప్రదేశ్లో అరెస్టయ్యిందని వివరించారు.అయితే, హత్య కేసుకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) (హత్యకు శిక్ష)కు బదులుగా పొరపాటున సెక్షన్ 403(1)గా అరెస్ట్ మెమోలో టైప్ చేయడాన్ని ఆధారంగా తీసుకుని ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిందని.. అలాగే హైకోర్టు కూడా ఆ బెయిల్ను సమర్థించిందని కోర్టుకు నివేదించారు. అది కేవలం టైపింగ్ పొరపాటు మాత్రమేనని, ఈ ఒక్క కారణంతో బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించారు.సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై తమకు ప్రాథమికంగా కొన్ని సందేహాలు ఉన్నాయని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. నిందితురాలిపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని.. బెయిల్ విషయంలో మేఘాలయా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారాయన. అలాగే అరెస్టు కారణాలను నిందితురాలికి వివరించారని రికార్డుల్లో ఉందని, గతంలో దాఖలైన బెయిల్ పిటిషన్లలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదని బెంచ్ ప్రస్తావించింది. కేవలం తప్పుగా సెక్షన్ పేర్కొన్నందుకే బెయిల్ ఇవ్వడం సరైందేనా? అని ప్రశ్నించింది.అయితే, సోనమ్ ఇప్పటికే జైలు నుంచి విడుదలైనందున ఈ దశలో బెయిల్పై స్టే విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. ‘‘బెయిల్ రద్దు విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. ఆమె విడుదల కాకపోయి ఉంటే.. బెయిల్పై కచ్చితంగా స్టే విధించేవాళ్లం’’ అని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో, బెయిల్ ఉత్తర్వుపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని, తదుపరి విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది.హనీమూన్ కేసులో జరిగింది ఇదే.. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనం రఘువంశీ 2025 మేలో వివాహం చేసుకున్నారు. అనంతరం హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఈ జంట మే 23న అదృశ్యమైంది. జూన్ 2న ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని వైసాడాంగ్ జలపాతం సమీపంలోని లోయలో రాజా మృతదేహం లభించింది. కొద్ది రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో సోనం రఘువంశీ కనిపించగా, అనంతరం పలు అనుమానాల నడుమ ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.దర్యాప్తులో భర్త హత్యకు సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కుట్ర పన్నిందని, ఇందుకోసం కిరాయి హంతకులను నియమించిందని మేఘాలయ పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో సోనం, రాజ్ కుష్వాహాతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి 700కు పైగా పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు.ఈ ఏడాది ఏప్రిల్ 27న ట్రయల్ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వగా.. జూన్ 29న మేఘాలయ హైకోర్టు సోనం రఘువంశీకి బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ పత్రాల్లో సెక్షన్ను తప్పుగా నమోదు చేయడం సాధారణ టైపింగ్ పొరపాటు కాదని, దర్యాప్తు ప్రక్రియలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టు బెయిల్ను సమర్థించింది. ఇప్పుడు ఆ బెయిల్ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, బెయిల్పై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించినప్పటికీ, హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి విచారణ కొనసాగించేందుకు అంగీకరించింది.
లాడ్జ్లో యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్ ప్రాంతంలోని ఒక లాడ్జిలో రేణుక (28) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం, అల్వాల్కు చెందిన రేణుకకు గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫారుక్తో పరిచయం ఉంది. ఇద్దరూ నిన్న రాత్రి లాడ్జిలోని రూమ్ నం.1611 బుక్ చేసుకుని అక్కడికి వెళ్లారు. తాను కొంతసేపు బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి రేణుక గదిలో ఉరివేసుకుని కనిపించిందని ఫారుక్ పోలీసులకు తెలిపాడు.అయితే, మృతురాలి కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్య కాదని, హత్యే అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫారుక్పై అనుమానం వ్యక్తం చేస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.లంగర్హౌస్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఫారుక్ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాల తర్వాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయని పోలీసులు తెలిపారు.
పెళ్లి చేసుకోకు.. పురుగు మందు తాగి చచ్చిపో..!
చీపురుపల్లిరూరల్(గరివిడి): భవిష్యత్తు గురించి ఎన్నో కలలు..ఆశలతో పెళ్లిపీటలు ఎక్కి ఏడడుగులు నడవాల్సిన యువతి ప్రేమపేరుతో మోసపోయింది. చివరకు కసాయి ప్రియుడి బెదిరింపులు, బ్లాక్మెయిల్తో ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన గరివిడి మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహితుడై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తి ఆ యువతితో సన్నిహితంగా మెలిగి, అనంతరం ఆమెకు వివాహం కుదరడంతో పెళ్లిని అడ్డుకునేందుకు తీవ్ర వేధింపులకు గురి చేశాడు. కసాయి ప్రియుడి బెదిరింపులు, బ్లాక్ మెయిల్ను తట్టుకోలేక యువతి పురుగు మందు తాగేయడంతో కుటుంబసభ్యులు గమనించి విజయనగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించి గరివిడి ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు గరివిడి మండలంలోని తోండ్రంగి గ్రామానికి చెందిన యువతి బలగం అఖిలకు ఇటీవల కుటుంబసభ్యులు వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మాజీ ప్రియుడు కోరాడ రామునాయుడు ఆమెను ఫోన్లో పదేపదే సంప్రదిస్తూ పెళ్లి చేసుకోకు..పురుగు మందు తాగి చచ్చిపో..నేను పురుగు మందు పంపిస్తున్నా, తీసుకుని తాగు అంటూ తీవ్రంగా మానసికంగా వేధించాడు. అంతటితో ఆగకుండా పొరపాటున పెళ్లిపీటలు ఎక్కితే మన ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్మెయిల్ చేశాడు. ఈ బెదిరింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి మంగళవారం ప్రియుడు పంపించిన పురుగు మందు తాగేసి అపస్మాకర స్థితికి చేరుకుంది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా కీ చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. మృతురాలి తండ్రి బలగం రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు
రిటైర్డ్ జడ్జిపై పులివర్తి నాని బూతు పురాణం.. తిరుపతి అడ్వకేట్స్ స్ట్రాంగ్ రియాక్షన్
బ్రేకప్ పై ఒక్క పోస్ట్ తో క్లారిటీ..!
ఎముకలు బూడిద... సాయి కృష్ణ డెడ్ బాడీ దొరికింది..?
తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన
తిరుపతిలో కిలాడీ లేడి.. బయటకొస్తున్న ఉషారాణి లీలలు
పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
జ్ఞానేశ్వరి కేసులో కీలక పరిణామం ఒడిశా వైపు అనుమానాలు !
జగన్ MAVIGUN విజనే కరెక్ట్..
పెద్ది ఎఫెక్ట్ టాలీవుడ్ కు జాన్వీ గుడ్ బై..?
బారు గేట్లు తోసుకుంటూ రావణపై జనసేన నేతల దాడులు


