ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు)
హర్మూజ్ జలసంధిలో కూలిన హెలికాఫ్టర్.. 14 మంది దుర్మరణం
రియాద్ : హర్మూజ్ జలసంధి సమీపంలో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది సౌదీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సౌదీ ప్రభుత్వ మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకారం.. పర్షియన్ గల్ఫ్ పశ్చిమ తీరాన ఉన్న ప్రపంచ చమురు మార్కెట్ కీలక కేంద్రం ‘రాస్ తనూరా’లో సౌదీ అరామ్కోకు చెందిన హెలికాఫ్టర్ కుప్పకూలింది.ప్రమాద సమయంలో హెలికాఫ్టర్లో ప్రయాణిస్తున్న 14 మంది సిబ్బంది అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనపై సౌదీ అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.అమెరికా-ఇరాన్ వివాదం కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు రాస్ తనూరా కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతి టెర్మినల్ అయిన రాస్ తనూరా నుండి సౌదీ అరామ్కో సంస్థ శుక్రవారం ముడి చమురు లోడింగ్ ప్రక్రియను పునఃప్రారంభించింది. చమురు రవాణా మళ్లీ మొదలైన రెండు రోజులకే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.‘సౌదీ అరామ్కోకు చెందిన హెలికాప్టర్ ఆదివారం (జూన్ 28) ఉదయం సుమారు 6:00 గంటలకు రాస్ తానూరాలో కూలిపోయిందని ఇంధన మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 14 మంది అమరులయ్యారు. వారందరూ సౌదీ జాతీయులే’ అని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. ‘హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడానికి, సంబంధిత అధికారుల సమక్షంలో దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది.
ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం
విక్టోరియా: సముద్ర పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ అనుకూల వృద్ధి (గ్రీన్ గ్రోత్), సముద్ర వనరుల బాధ్యతాయుత నిర్వహణలో ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ సెషెల్స్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హరైజన్’ అవార్డును ప్రధానికి ప్రదానం చేసింది.ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రెసిడెన్షియల్ సైటేషన్లో ప్రధాని మోదీ సుస్థిర ఆర్థిక వృద్ధి, బ్లూ ఎకానమీ (సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ) పట్ల చూపిన నిబద్ధతను సెషెల్స్ ప్రభుత్వం కొనియాడింది. ముఖ్యంగా చిన్న ద్వీప దేశాలకు భారత్ అందిస్తున్న మద్దతును, వాతావరణ ప్రతిఘటన శక్తిని పెంపొందించడంలో, అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించడంలో మోదీ పోషించిన పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించింది.ఈ పురస్కారం భారత్-సెషెల్స్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని సెషెల్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తనకు లభించిన ఈ ప్రతిష్టాత్మక గౌరవంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. సెషెల్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడంపై గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటూ, పర్యావరణ పరిరక్షణను తమ భవిష్యత్ తరాల పట్ల బాధ్యతగా భావిస్తున్న ప్రపంచంలోని అన్ని దేశాలకు దీనిని అంకితం చేస్తున్నాను’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.పర్యావరణం, వ్యవసాయ రంగాలలో ప్రధాని మోదీ అంతర్జాతీయంగా అందుకున్న అవార్డుల పరంపరలో ఇది తాజా చేరింది. కాగా, ఈ ఏడాది మేలో ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రధానికి ‘అగ్రికోలా మెడల్’ అందజేసింది. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, ఆధునిక వ్యవసాయ మార్పులు తీసుకురావడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం లభించింది.
మనవడి కోసం.. బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా 75 ఏళ్ల వృద్ధుడు!
మనవడి కోసం ఓ తాత బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు. అతడి ప్రాణాలను కాపాడుకోవడం కోసం సామాజిక మాధ్యమంలో లైవ్ వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తూ డబ్బులు కూడబెడుతున్నాడు ఈ 75 ఏళ్ల తాత. అంతేగాదు ఫిజెయోథెరపీ కోసం తానే స్వయంగా ఎలాగో నేర్చుకుని మనవడికి మసాజ్ చేస్తూ..అతడు కోలుకోవాలని వెయ్యి కన్నులతో ఎదురుచూస్తున్నాడు ఆ ముసలి తాత. ఆ వయసులో అంత పెద్ద బాధ్యతను టీవీల్లోని కార్టూన్ పాత్రల్లో చూసే సూపర్మ్యాన్లా నిర్వర్తిస్తుండటం విశేషం. ఇంతకీ ఎవరా తాతా? ఏమా కథ అంటే..చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్కి చెందిన ఝూ యున్చాంగ్ అనే 75 ఏళ్ల తాతన తన తొమ్మిదేళ్ల మనవడు కావో జింగ్వాన్ కోసం కష్టపడుతున్నారు. అతుడు అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) వ్యాధితో బాధపడుతున్నాడు. అతడికి ఆరు నెలల వయసున్నప్పుడు ఈ అరుదైన జన్యు వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఈ వ్యాధి వెన్నుపాములోని మోటార్ న్యూరాన్లను దెబ్బతీసి, క్రమంగా కండరాల బలహీనత, శ్వాసకోస సమస్యలకు దారితీసుకుంది. చైనాలో ఇలాంటి కేసులు ప్రస్తుతం 30 వేల ఎస్ఎంఏ కేసులు ఉన్నాయి. ప్రతి ఏడాది కొత్తగా సుమారు 12 వేల కేసులు నమోదవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక్క ఈ చిన్నారి జింగ్వాన్కు SMA టైప్ 1 ఉంది. ఇది ఈ అరుదైన వ్యాధి తీవ్రమైన రూపం. అంతేగాదు అతడికి సకాలంలో చికిత్స అందకపోతే కేవలం 18 నెలలు మాత్రమే జీవిస్తాడని వైద్యులు తేల్చి చెప్పారు. ఆ వార్త ఆ చిన్నారి తల్లి జూవెయ్ని కుంగదీసింది. జువెయ్ ఈ ముసిలా తాత ఒక్కగానొక్క కూతురు. తన కూమార్తెకి వచ్చిన కష్టం చూసి చలించిపోయినా ఆ వృద్ధుడి తన మనవడిని ఎలాగైన కాపాడాలని ముఖానికి రంగులు వేసుకుంటూ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు. ప్రత్యక్ష మేకప్ వీడియో ప్రసారాలతో అశేష ప్రేక్షక ఆదరాభిమానాలను పొందాడు. అంతేగాదు కూతురు కూడా తనకంటే తన తండ్రే బాగా మేకప్ వేయగలడని చెప్పడం విశేషం. అలా ఇన్ఫ్లుయెన్సర్గా ఆర్జించిన సొమ్ముని మనవడి చికిత్స కోసం ఉపయోగిస్తున్నాడు. అంతేగాదు మంచానికే పరిమితమైన మనవుడు లేచి నిలబడేలా చేసేందకు ఫిజియోథెరపీ కూడా నేర్చుకుని మరి చికిత్సలు అందిస్తున్నాడు. తనకు బాగాలేకపోతే తగిన సంరక్షక జాగ్రత్తలు తీసుకుని మరి మసాజ్లు చేస్తుంటాడట. అయితే 2019లో, ఈ వ్యాధికి సంబంధించిన 'నుసినెర్సెన్' అనే మందుని కనిపెట్టారు. ఇది మనుగడ రేట్లను గణనీయంగా పెంచి, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని నిర్థారణ అయ్యింది. అయితే ఒక్కో ఇంజెక్షన్కు 700,000 యువాన్ల (భారత కరెన్సీ ప్రకారం రూ. 97 లక్షలు)ఖర్చవుతుంది. ఇక ఈ చిన్నారి జింగ్యాన్కు ప్రతి ఏడాదికి రెండు ఇంజెక్షన్లు ఇప్పించాల్సి ఉంది. ఈ చికిత్స కోసం ఈ తాతగారు తన ఫ్లాట్ని అమ్మేశాడు. అలాగే బంధువుల నుంచి కొంత అప్పు తీసుకున్నాడు. బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గానే ఎందుకంటే..ఇక అతని కుమార్తె పగటిపూట పనిచేసి సాయంత్రాలలో లైవ్-స్ట్రీమింగ్ చేసేది. ఈ 70 ఏళ్లు పైబడిన తాత గారిని ఏఉత్పత్తులకు ప్రచారం చేయడానికి ఏ కంపెనీ కూడా నియమించకోదు. దాంతో ఆయన కుమార్తె కొనుగోలు చేసిన సౌందర్య ఉత్పత్తులతో లైవ్-స్ట్రీమింగ్ చేసేందుకు బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా అవతారమెత్తాడు. అలా వచ్చిన ఆదాయన్ని మనవుడి చికిత్స కోసం వెచ్చిస్తున్నాడు. అలాగే అతడి కష్టానికి చైనా ప్రభుత్వం కూడా వైద్యబీమా రూపంలో సాయం అందించింది. 2021లో ఈ వ్యాధికి సంబంధించిన మందుల ఖర్చును చైనా వైద్య బీమా పరిధిలోకి తీసుకురావడంతో ఒక్కో ఇంజెక్షన్ ధర రూ. 4 లక్షలు తగ్గి..ఆ తాతకు కొంత ఉపశమనం లభించింది . ఇప్పుడు ఆయన మనవడికి తొమ్మిదేళ్లు నిండాయి. ఆరోగ్యం బాగున్న రోజుల్లో పాఠశాలకు వెళ్లి చుదువుకోవడం తోపాటు ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటాడని ఆనందంగా చెబుతున్నాడు. ఆయన కుమార్తె తన తండ్రిని.. తన కుమారుడి ఇంజెక్షన్ల భారాన్ని మోస్తున్న సూపర్మ్యాన్.. సూపర్ డాడ్.. సూపర్ తాత.. అని సగర్వంగా చెబుతోంది. కానీ ఆ తాత ఝూ మాత్రం తన మనవడు స్వతంత్రంగా తన కాళ్లపై లేచి నిలబడితే చాలని భావోద్వేగంగా చెబుతున్నాడు.(చదవండి: హాట్ వర్సెస్ ఐస్ ప్యాక్: ఎలాంటప్పుడు మంచిదంటే..)
రేవంత్ ఫెయిల్యూర్ సీఎం
ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఇదేనా?
కొత్త బీఎండబ్ల్యూ కారు: ధర ఎంతంటే?
నాకసలు వినపడనే లేదు!.. వదిలెయ్!
బుల్లిరాజు.. రోజుకు రూ.లక్ష?
వారి ఓట్లు తొలిగించాల్సిందే.. కిషన్ రెడ్డి
ఐర్లాండ్తో రెండో టీ20.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఫ్రాన్స్లో వడగాలుల బీభత్సం.. వెయ్యి మంది మృతి
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు!
'ఆలోచన' ఫస్ట్ లుక్ విడుదల చేసిన మురళి మోహన్
నేనే మీకు నిజం చెబుతాను.. కమెడియన్ షాకింగ్ వీడియో
35 వేల డాలర్లకు గోల్డ్?: కియోసాకి ట్వీట్
సార్.. నన్ను విసిగించకండి ప్లీజ్! నా దగ్గర డబ్బుల్లేవ్!!
'ఎవరివి' తీసేయాలో మాకు బాగా తెలుసు
నటుడిని వరించిన లాటరీ.. సరదాగా టికెట్స్ కొంటే
ఈత చెట్టు.. కల్లు, పండ్లకే కాకుండా విలువాధారిత..
అమరావతిని అంతర్జాతీయపటంలో చూపిస్తా, క్వాంటం టెక్నాలజీని తెస్తా అని.. వైద్య పరీక్షలకు హైదరాబాద్ వెళ్లడమేంటి సార్!!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభం
‘ఇడుపు కాయితం’ వివాదం.. ట్రెండింగ్లో తెలంగాణ పిల్ల
కొండ దిగుతున్న కనకం
ఈ రాశి వారికి ధనలాభం.. వ్యాపారాలు లాభిస్తాయి
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్.. 'ఇసకపట్నం' కొత్త ట్రైలర్
బెంగళూరులో 130 ఏళ్ల ఇల్లు.. భలే మార్చిన ఐటీ దంపతులు
పసిడి పరుగు ఆగేలా లేదు: కియోసాకి
నయా ట్రెండ్.. పెట్రోల్+ఎలక్ట్రిక్!
టోక్యో: సిగ్నల్ పడలేదు.. ఎర్ర చీర చూసి ఆగిపోయారంతే!
జానూ కేసులో ట్విస్ట్కి తెర!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు
ఆగని పసిడి పరుగులు.. నేడు కొత్త ధరలు
మొన్ననే కలిసి జోకులు వేసుకున్నాం.. నమ్మలేకపోతున్నా : చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
రేవంత్ ఫెయిల్యూర్ సీఎం
ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఇదేనా?
కొత్త బీఎండబ్ల్యూ కారు: ధర ఎంతంటే?
నాకసలు వినపడనే లేదు!.. వదిలెయ్!
బుల్లిరాజు.. రోజుకు రూ.లక్ష?
వారి ఓట్లు తొలిగించాల్సిందే.. కిషన్ రెడ్డి
ఐర్లాండ్తో రెండో టీ20.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఫ్రాన్స్లో వడగాలుల బీభత్సం.. వెయ్యి మంది మృతి
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు!
'ఆలోచన' ఫస్ట్ లుక్ విడుదల చేసిన మురళి మోహన్
నేనే మీకు నిజం చెబుతాను.. కమెడియన్ షాకింగ్ వీడియో
35 వేల డాలర్లకు గోల్డ్?: కియోసాకి ట్వీట్
సార్.. నన్ను విసిగించకండి ప్లీజ్! నా దగ్గర డబ్బుల్లేవ్!!
'ఎవరివి' తీసేయాలో మాకు బాగా తెలుసు
నటుడిని వరించిన లాటరీ.. సరదాగా టికెట్స్ కొంటే
ఈత చెట్టు.. కల్లు, పండ్లకే కాకుండా విలువాధారిత..
అమరావతిని అంతర్జాతీయపటంలో చూపిస్తా, క్వాంటం టెక్నాలజీని తెస్తా అని.. వైద్య పరీక్షలకు హైదరాబాద్ వెళ్లడమేంటి సార్!!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభం
‘ఇడుపు కాయితం’ వివాదం.. ట్రెండింగ్లో తెలంగాణ పిల్ల
కొండ దిగుతున్న కనకం
ఈ రాశి వారికి ధనలాభం.. వ్యాపారాలు లాభిస్తాయి
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్.. 'ఇసకపట్నం' కొత్త ట్రైలర్
బెంగళూరులో 130 ఏళ్ల ఇల్లు.. భలే మార్చిన ఐటీ దంపతులు
పసిడి పరుగు ఆగేలా లేదు: కియోసాకి
నయా ట్రెండ్.. పెట్రోల్+ఎలక్ట్రిక్!
టోక్యో: సిగ్నల్ పడలేదు.. ఎర్ర చీర చూసి ఆగిపోయారంతే!
జానూ కేసులో ట్విస్ట్కి తెర!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు
ఆగని పసిడి పరుగులు.. నేడు కొత్త ధరలు
మొన్ననే కలిసి జోకులు వేసుకున్నాం.. నమ్మలేకపోతున్నా : చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
ఫొటోలు
టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు)
'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు)
చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు)
భక్తజన సంద్రంగా తిరుమల (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 28 - జూలై 05)
నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)
భాగ్యరాజ్కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
తెరపై నవ్వు.. తెర వెనుక విజన్.. భాగ్యరాజ్ అరుదైన (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)
సినిమా
'పెద్ది' సంగతి సరే.. బుచ్చిబాబు నెక్స్ట్ ఏంటి?
'పెద్ది' సినిమా రన్ దాదాపు ముగిసింది. మరోవారంలో ఓటీటీలోకి వచ్చేయొచ్చు. ఈ మూవీతో రామ్ చరణ్ యాక్టింగ్ పరంగా బాగానే చేశాడు. అందుకు తగ్గట్లే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించుకున్నారు. అలా అని సినిమా బ్లాక్బస్టర్ అయిందా అంటే లేదు. పోని ఫ్లాప్ అయిందా అంటే కాదు. మధ్యలోనే అలా ఉండిపోయింది. ఈ సంగతి కాసేపు పక్కనబెడితే 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు నెక్స్ట్ ఏంటి? ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్)'పెద్ది' సినిమా బాక్సాఫీస్ లెక్కలు చూసుకుంటే వసూళ్లలో దాదాపు డబ్బులన్నీ తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి. కర్ణాటకలో పర్లేదనిపించగా.. తమిళనాడు, కేరళలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఉత్తరాదిలోనూ జస్ట్ ఓకే అనిపించుకుంది. విదేశాల్లో అయితే పెద్దగా వసూళ్లు రాలేదు. ఓవరాల్గా చూసుకుంటే రూ.400 కోట్ల వసూళ్లు వచ్చినప్పటికీ జాన్వీ కపూర్, పలు సన్నివేశాల కారణంగా యావరేజ్ దగ్గర ఆగిపోయింది. కానీ రామ్ చరణ్కి మాత్రం కెరీర్ పరంగా ప్లస్ అయిందని చెప్పొచ్చు.'పెద్ది'.. ఎక్కువ కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. చాలా ఏళ్ల తర్వాత సోలోగా వచ్చిన రామ్ చరణ్ బాక్సాఫీస్ మార్కెట్పై మళ్లీ నమ్మకాన్ని పెంచింది. ఇకపోతే దర్శకుడు బుచ్చిబాబు తన తొలి మూవీ 'ఉప్పెన'తో సంచలన విజయాన్ని అందుకున్నాడు. తర్వాత ఎన్టీఆర్కు ఒక కథ చెప్పినా అది వర్కౌట్ కాలేదు. అనంతరం రామ్ చరణ్ని ఒప్పించి 'పెద్ది' తీశాడు. ఇది వసూళ్లు సాధించినప్పటికీ, దర్శకుడిగా బుచ్చిబాబుకు ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు. పైపెచ్చు జాన్వీ సీన్ల కారణంగా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.ఇక బుచ్చిబాబుకి నెక్స్ట్ ఎవరు అవకాశమిస్తారు అనే విషయానికొస్తే.. మహేశ్ బాబు పేరు వినిపించింది గానీ అది అవుతుందా లేదా చెప్పలేం! మరోవైపు తెలుగులో స్టార్ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ తదితరులు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వీళ్ల డేట్లు దొరకడం కష్టం. రామ్ చరణ్ మరో సినిమా చేస్తానని బుచ్చిబాబుకి మాటిచ్చారు కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే మరో రెండు మూడేళ్లయినా ఆగాలి. అప్పటివరకు ఆగుతాడా? లేదంటే యంగ్ హీరోలతో సింపుల్ బడ్జెట్ మూవీ చేస్తాడా అనేది చూడాలి? (ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్)
శ్రద్ధాకపూర్ లేటేస్ట్ మూవీ.. టైటిల్పై తీవ్ర అభ్యంతరం..!
శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో వస్తోన్న హిస్టారికల్ బయోపిక్ ఈథ. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా.. ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ప్రముఖ జానపద కళాకారణి విఠాబాయి నారాయణ్గావ్కర్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఛావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్తోనే అంచనాలు పెరిగాయి. ఈ బయోపిక్లో రణదీప్ హూడా, మహమ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న 'ఈథ ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది.టైటిల్పై వివాదం..ఈ మూవీని ప్రముఖ కళాకారిణి విఠాబాయి జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఆమె అత్యంత గౌరవరప్రదమైన జానపద కళాకారిణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ఆమె జీవితంపై వస్తోన్న మూవీ టైటిల్ ఈథ అని పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ టైటిల్ను మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. బయోపిక్కు విఠాబాయి పేరు ఎందుకు పెట్టలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేకర్స్ ప్రశ్నించింది.తాజాగా విఠాబాయి వారసులు సైతం ఈథ టైటిల్ను వ్యతిరేకిస్తున్నారు. ఆమె కుమారులు కైలాష్, రాజేష్ నారాయణ్గావ్కర్, మనవడు మోహిత్ నారాయణ్గావ్కర్ సైతం టైటిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టైటిల్పై చిత్ర నిర్మాతలు తమ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతున్నారు. ఆమె జీవిత చరిత్రకు ఆమె పేరునే పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం సినిమా పేరుకు సంబంధించిన విషయం కాదని... మహారాష్ట్రలో గొప్పగా భావించే లావణి, తమాషా సంప్రదాయాన్ని తీర్చిదిద్దడంలో సహాయపడిన విఠాబాయికి తగిన గుర్తింపునివ్వాలని కోరుతున్నారు. 'విఠా' లేదా 'విఠాబాయి' అని ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వివాదంపై దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కానీ.. మ్యాడాక్ ఫిల్మ్స్ గానీ స్పందించలేదు.విఠాబాయి నారాయణ్గావ్కర్ ఎవరు?విఠాబాయి నారాయణ్గావ్కర్ మహారాష్ట్రకు చెందిన జానపద కళాకారిణి. ఆమె స్థానిక లావణి, తమాషా సంప్రదాయ కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నరాు. ఆమె తన కెరీర్లో అత్యంత గౌరవనీయమైన జానపద కళాకారిణులలో ఒకరిగా నిలిచి తరతరాలకు స్ఫూర్తిగా నిలిచారు. భారతీయ జానపద కళలకు ఆమె చేసిన సేవలను భారత రాష్ట్రపతి 1957, 1990లో గుర్తించారు. కానీ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ.. విఠాబాయి చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో పోరాడారు.
'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్
తెలుగు సినిమా దశాదిశా మార్చిన సినిమా 'బాహుబలి'. దీని గురించి కొత్తగా ఏం చెబుతాం. రెండు భాగాల్ని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు వందలసార్లు చూశారు. టీవీ, మొబైల్లో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. అయితే మూవీస్ వచ్చి దాదాపు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 'బాహుబలి ద టార్చ్ బేరర్' పేరిట ఓ డాక్యుమెంటరీ తీశారు. మూడురోజుల క్రితం నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. తెర వెనక సంగతుల్ని మూవీ టీమ్ అంతా పంచుకున్నారు. ఇంతకీ ఈ డాక్యుమెంటరీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)డాక్యుమెంటరీ అనగానే హా ఏముంది, కూర్చుని మాట్లాడుతుంటారు.. ఏం చూస్తాంలే అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. 'బాహుబలి ద టార్చ్ బేరర్' గురించి ప్రకటన వచ్చినప్పుడు చాలామంది ఇలానే అనుకున్నారు. కానీ ఈ డాక్యుమెంటరీని చూస్తుంటే సినిమాకు ఏం తక్కువ కాదని అనిపించింది. ఎందుకంటే 123 నిమిషాల నిడివితో నాలుగు ఎపిసోడ్లుగా దీన్ని ప్రెజెంట్ చేశారు. ద డ్రీమ్, బిల్డింగ్ ద డ్రీమ్, బియాండ్ డ్రీమ్స్, ద టార్చ్ బేరర్ పేరిట ఎపిసోడ్స్ ఉన్నాయి.అసలు 'బాహుబలి' చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎలా రూపుదిద్దుకుంది? ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్.. ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు? కొంత బడ్జెట్ అనుకున్నది కాస్త రోజురోజుకి ఎలా పెరిగిపోయింది? ఒక భాగం అనుకున్నది కాస్త రెండు భాగాల సినిమాగా ఎలా మారింది? అప్పట్లో వందల కోట్ల బడ్జెట్ పెట్టడం అనేది ఎంత కష్టమైంది? అనే విషయాల్ని నిర్మాతలు చెబుతూ, అప్పటి ఫుటేజీ చూపించడం క్రేజీగా అనిపించింది.మరీ ముఖ్యంగా రెండో ఎపిసోడ్ చివరలో 'బాహుబలి'కి తెలుగులో ఫ్లాప్ టాక్ రావడంతో రాజమౌళి, మూవీ టీమ్ అంతా ఎంతలా భయపడ్డారు? మానసికంగా ఎలాంటి దారుణమైన పరిస్థితిని అనుభవించారు. రమ రాజమౌళి అయితే సినిమా నష్టాల్ని కవర్ చేసేందుకు తనకు మణికొండలో ఉన్న స్థలాన్ని అమ్మేద్దామని డిసైడ్ కావడం లాంటి కామెంట్స్ ఆసక్తికరంగా అనిపించాయి. ఈ డాక్యుమెంటరీలో నటీనటుల కష్టం దగ్గర నుంచి రాజమౌళి విజన్ వరకు, దాన్ని ప్రతి ఒక్కరూ రియాలిటీలో తీసుకొచ్చేందుకు ఎంతలా కష్టపడ్డారు అనేది డీటైల్డ్గా చూపించారు.సాధారణంగా సినిమాల్లో ఉన్నట్లే ఈ డాక్యుమెంటరీలోనూ హై మూమెంట్స్ ఉన్నాయండోయ్. 'బాహుబలి' ప్రభావం ప్రపంచంలోని లక్షల జనాభా ఉండే చిన్న చిన్న దేశాల వరకు ఎలా పాకింది అనేది కూడా చెప్పారు. ఓసారి బ్యాంకాక్లో డాక్టర్ అపాయింట్మెంట్ కోసం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వెళ్తే.. గంటసేపు వెయిట్ చేయమని చెప్పారని, తాను ఇలా 'బాహుబలి' ఫ్రెండ్ అని చెప్పగానే సదరు డాక్టర్ వెంటనే పూరీకి ట్రీట్మెంట్ ఇచ్చేశాడని ప్రభాస్ చెప్పడం.. ఈ సినిమాలో కుమార వర్మ పాత్ర, జపాన్లో తనకు అద్భుతమైన ఫ్యాన్ బేస్ సంపాదించి పెట్టడం గురించి నటుడు సుబ్బరాజు చెప్పడం, అలానే జపాన్లోని ఓ మహిళా అభిమాని చనిపోతే ఆమె భర్త వచ్చి తనన కలవడం గురించి సుబ్బరాజు చెప్పినప్పుడు ఎమోషనల్ అనిపించింది.'బాహుబలి' రెండో భాగం కోసం ఎదురుచూడటం, ఇదొచ్చేలోపు చనిపోతానేమో భయపడ్డానని తన వదినతో ఓ క్యాన్సర్ పేషెంట్ చెప్పడం లాంటి సంగతుల్ని రాజమౌళి పంచుకున్నారు. ఇక చివరలో 'మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం? సాహో అని ప్రపంచము! తానూ నమ్మిన నమ్మకమే తన ఆయుధమై పోరాడుతుంటే, తలొంచదా విధి సైతం! జై మహిష్మతి!' అని రాజమౌళి చెప్పి ముగించడం క్రేజీగా అనిపించాయి. 'బాహుబలి'కి మూడో భాగం కూడా ఉంటుందని ప్రభాస్-రానా-అనుష్క హింట్ ఇవ్వడంతో ఈ డాక్యుమెంటరీని ముగించారు.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే?)
గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ శుభవార్త చెప్పేశాడు. తాను మరోసారి తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన భార్య ప్రియాంక ప్రెగ్నెన్సీతో ఉన్న ఫొటోని పంచుకున్నాడు. దీంతో పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: సీఎం విజయ్.. నెలకు 20 రోజులు మాత్రమే)'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. ఈ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలోనే నిర్మాత అశ్వనీదత్ కూతురు ప్రియాంకతో ప్రేమలో పడ్డాడు. అలా పెద్దల్ని ఒప్పించి 2015లో నాగ్ అశ్విన్-ప్రియాంక పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు 2017లో కొడుకు పుట్టాడు. అయితే తన తొలి మూవీలో విజయ్ దేవరకొండ పాత్రకు పెట్టిన రిషి అనే పేరుని నాగ్ అశ్విన్ తన కొడుక్కి పెట్టాడు.2018లో 'మహానటి' సినిమాతో అద్భుతమైన బ్లాక్ బస్టర్ కొట్టిన నాగ్ అశ్విన్.. తర్వాత ప్రభాస్ హీరోగా 'కల్కి 2898ఏడీ' సినిమా తీశాడు. 2024లో ఇది రిలీజై హిట్ కొట్టింది. ప్రస్తుతం దీని సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నాడు. స్వతహాగా దర్శకుడి అయినప్పటికీ జాతిరత్నాలు, రీసెంట్గా వచ్చిన 'సింగ్ గీతం' చిత్రాలని నాగ్ అశ్విన్ నిర్మించాడు. ఇప్పుడు మరోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం' ఇదే) View this post on Instagram A post shared by nagi (@nag_ashwin)
క్రీడలు
ఐర్లాండ్తో రెండో టీ20.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఐర్లాండ్తో రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా బౌలర్లు మెరుగ్గా రాణించారు. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకే పరిమితం చేయగలిగారు. కాగా రెండు టీ20 మ్యాచ్లు ఆడేందుకు భారత జట్టు ఐర్లాండ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా బెల్ఫాస్ట్ వేదికగా తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ సేన అనూహ్య రీతిలో ఓటమి పాలైంది. ఆతిథ్య జట్టు చేతిలో 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో తాజాగా అదే వేదికపై మళ్లీ టాస్ గెలిచిన భారత్.. మరోసారి తొలుత బౌలింగ్నే ఎంచుకుంది.హ్యారీ టెక్టార్ అర్ధ శతకంకెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని నిజం చేస్తూ పేసర్ హర్షిత్ రాణా తొలి ఓవర్లోనే ఐరిష్ ఓపెనర్ టిమ్ టెక్టార్ (5)ను వెనక్కి పంపాడు. ఇక అర్ష్దీప్ సింగ్ మరో ఓపెనర్ రాస్ అడైర్ (16)ను పెవిలియన్కు చేర్చాడు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ హ్యారీ టెక్టార్ అర్ధ శతకం (53)తో రాణించగా.. బెంజమిన్ కాలిట్జ్ (37) అతడికి తోడుగా నిలబడ్డాడు.మిగిలిన వారిలో గెరెత్ డెలానీ డకౌట్ కాగా.. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ 15 జార్జ్ డాక్రెల్ 19 పరుగులు చేసి వెనుదిరిగారు. ఆఖరి ఓవర్లో ప్రిన్స్ యాదవ్ హ్యారీ టెక్టార్, లియామ్ మెక్కార్తీ (2)లను పెవిలియన్కు పంపాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. తద్వారా టీమిండియాకు 156 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఇకభారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, శివం దూబే చెరో రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ పడగొట్టారు.
IND vs AUS: భారత్ అవుట్.. సెమీస్కు ఆ రెండు జట్లు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడింది. లార్డ్స్ వేదికగా టాస్ గెలిచిన హర్మన్ సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అర్ద శతకం (56) సాధించగా.. ఓపెనర్లు స్మృతి మంధాన (38), షఫాలీ వర్మ (34) రాణించారు. వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 34 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగింది. ఆసీస్ లక్ష్య ఛేదనకు దిగింది. ఆదిలోనే ఓపెనర్ జార్జియా వోల్ (4) అవుటైనా.. బెత్ మూనీ (22), ఫోబీ లిచిఫీల్డ్ (22) ఫర్వాలేదనిపించారు. ఎలిస్ పెర్రీ (56), ఆష్లే గార్డ్నర్ (53 నాటౌట్) అద్భుత అర్ధ శతకాలతో రాణించి జట్టును గెలిపించారు. ఈ క్రమంలో 19 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి ఆసీస్ జయభేరి మోగించింది. తమతో పాటు గ్రూప్-ఎ నుంచి సౌతాఫ్రికాను సెమీస్కు తీసుకువెళ్లింది.*******************************************మూడో వికెట్ డౌన్9.1: దీప్తి శర్మ బౌలింగ్లో రాధా యాదవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన బెత్ మూనీ (22). ఆష్ గార్డ్నర్ క్రీజులోకి రాగా.. పెర్రి 11 పరుగులతో ఉంది.రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్6.6: శ్రీచరణి బౌలింగ్లో లిచిఫీల్డ్ (24) స్మృతి మంధానాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఎలిస్ పెర్రి క్రీజులోకి వచ్చింది. మూనీ 20 పరుగులతో ఉంది. స్కోరు: 55-2(7.2).పవర్ ప్లేలో ఆస్ట్రేలియా స్కోరు: 49-1 (6)మూనీ 17, లిచిఫీల్డ్ 22 పరుగులతో ఉన్నారు.నాలుగు ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 25-1మూనీ 5, లిచిఫీల్డ్ 12 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా0.2: రేణుకా సింగ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయిన జార్జియా వోల్ (4). ఫోబీ లిచిఫోల్డ్ క్రీజులోకి రాగా.. బెత్ మూనీ సున్నా పరుగులతో ఉంది. స్కోరు: 4-1(0.3).భారత్ స్కోరు: 170-4(20)హర్మన్ అవుట్19.5: సోఫీ మోలినెక్స్ బౌలింగ్లో ఎలిస్ పెర్రీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హర్మన్ (27 బంతుల్లో 56).హర్మన్ హాఫ్ సెంచరీ25 బంతుల్లో అర్ద శతకం పూర్తి చేసుకున్న హర్మన్ప్రీత్ కౌర్జెమీమా రిటైర్డ్ అవుట్రిచా ఘోష్ క్రీజులోకి వచ్చింది. స్కోరు: 147-3 (19)అర్ధ శతక భాగస్వామ్యం18 ఓవర్లు ముగిసేసరికి జెమీమా 26, హర్మన్ 33 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి యాభై పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. స్కోరు: 134-2.14 ఓవర్లలో భారత్ స్కోరు: 102-2జెమీమా 13, హర్మన్ ప్రీత్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.స్మృతి రనౌట్11.3: జార్జ్ వారేహామ్ బౌలింగ్లో జెమీమా షాట్ ఆడేందుకు విఫలయత్నం చేసింది. అంతలోనే మరో ఎండ్ నుంచి ముందుకు వచ్చిన స్మృతి రనౌట్ అయింది. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోగా.. హర్మన్ప్రీత్ కౌర్ క్రీజులోకి వచ్చింది. స్కోరు: 85-2 (12).తొలి వికెట్ కోల్పోయిన భారత్9.1: మోలినెక్స్ బౌలింగ్లో షఫాలీ వర్మ బౌల్డ్ (26 బంతుల్లో 34). జెమీమా రోడ్రిగ్స్ క్రీజులోకి రాగా.. స్మృతి 30 పరుగులతో ఉంది. స్కోరు: 68-1(9.2).పవర్ ప్లేలో భారత్ స్కోరు 43-0(6)స్మృతి 22 బంతుల్లో 22, షఫాలీ 14 బంతుల్లో 20 పరుగులతో ఉన్నారు. నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు: 29-0స్మృతి 15, షఫాలీ 14 పరుగులతో ఉన్నారు.రెండు ఫోర్లు బాదిన స్మృతికిమ్ గార్త్ బౌలింగ్లో రెండు, మూడో బంతికి వరుసగా ఫోర్లు బాదిన స్మృతి. స్కోరు: 11-0 (2).తొలి ఓవర్లో మూడు పరుగులుస్మృతి రెండు, షఫాలీ వర్మ ఒక పరుగుతో ఉన్నారు.ఒక్కో మార్పుఈ మ్యాచ్ సందర్భంగా తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు హర్మన్ తెలిపింది. నందిని శర్మ స్థానంలో క్రాంతి గౌడ్ ఆడుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు.. ఆసీస్ తుదిజట్టులో ఫీబ్స్ అలనా కింగ్ స్థానాన్ని భర్తీ చేసినట్లు సారథి మోలినెక్స్ తెలిపింది.కాగా గ్రూప్-ఎ నుంచి ఇప్పటికే ఆసీస్ అనధికారికంగా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. మరోవైపు.. సౌతాఫ్రికా తాజాగా బంగ్లాదేశ్ను ఓడించి ఎనిమిది పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. దీంతో ఆరు పాయింట్లతో ఉన్న భారత్ తప్పక గెలిస్తేనే సెమీస్లో అడుగుపెట్టగలదు.తుదిజట్లుభారత్స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్ఆస్ట్రేలియాబెత్ మూనీ(వికెట్ కీపర్), జార్జియా వోల్, ఫోబ్ లిచ్ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, యాష్లీ గార్డనర్, జార్జియా వేర్హామ్, అన్నాబెల్ సదర్లాండ్, నికోలా కేరీ, సోఫీ మోలినెక్స్(కెప్టెన్), కిమ్ గార్త్, లూసీ హామిల్టన్
నరాలు తెగే ఉత్కంఠ.. బోణీ కొట్టిన కరీంనగర్
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో కరీంనగర్ డైమండ్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. వరంగల్ వారియర్స్తో ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో.. రెండు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 209 పరుగులు స్కోరు చేసింది.తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకంకరీంనగర్ బ్యాటర్లలో ఓపెనర్, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అద్భుత రీతిలో రాణించాడు. 52 బంతుల్లోనే వంద పరుగులు చేసుకున్న తన్మయ్.. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొని పదిహేను ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు. కిరణ్ బౌలింగ్లో LBW కావడంతో తన్మయ్ మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది. Simply outstanding! 🤩A ton to savour for Tanmay, standing up and leading the fight for his side! 💥What a time to do it for the Diamonds! ⚡️#WWvKD #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/b3Cc3pqvEr— tg20official (@tg20official) June 28, 2026మిగిలిన వారిలో వన్డౌన్ బ్యాటర్ హెచ్కే సింహ (24) ఫర్వాలేదనిపించాడు. వరంగల్ బౌలర్లలో ముదస్సర్ రెండు వికెట్లు తీయగా.. ఆది మణి కిరణ్, శౌనక్ కులకర్ణి, మురుగన్ అభిషేక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వరంగల్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులకు పరిమితమైంది.గెలుపు ఆశలపై నీళ్లుఓపెనర్లు హర్షిత్ చౌదరి (31), కెప్టెన్ అమన్ రావు (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. వన్డౌన్ బ్యాటర్ రిషికేత్ సిసోడియా అర్ధ శతకం (31 బంతుల్లో 65)తో రాణించాడు. మిగిలిన వారిలో భవేశ్ సేత్ కూడా హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 53 నాటౌట్) బాదాడు. శౌనక్ (6 బంతుల్లో 14) దూకుడుగా ఆడగా.. ఆఖరి ఓవర్లలో మూడు సిక్సర్లు బాది భవేశ్ గెలుపు ఆశలు రేపాడు. కానీ విజయ లాంఛనం పూర్తి చేయలేకపోయాడు. దీంతో రెండు పరుగుల తేడాతో వరంగల్ ఓటమిపాలైంది.కరీంనగర్ బౌలర్లలో సతీశ్ కుమార్ రెండు... శుభం శర్మ, రత్లావత్ దినేశ్, హరీశ్ ఠాకూర్, ఆశిష్ శ్రీవాస్తవ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా ఇప్పటికి కరీంనగర్ మూడు మ్యాచ్లు ఆడగా ఇదే తొలి గెలుపు.తుదిజట్లుకరీంనగర్ డైమండ్స్సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్కే సింహా , రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్వరంగల్ వారియర్స్హర్షిత్ చౌదరి, అమన్ రావు పేరాల (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్, పల్లెపాటి క్రాంతి.
IND vs IRE: టీమిండియా తరఫున ఆ ఇద్దరి అరంగేట్రం
ఐర్లాండ్తో రెండో టీ20 సందర్భంగా భారత యువ ఆటగాడు సూర్యాంశ్ షెడ్గే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్ కూడా టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు.అయితే, సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ పదిహేనేళ్ల పిల్లాడి అరంగేట్రం వాయిదా పడింది. కాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తరఫున 16 మ్యాచ్లలో 776 పరుగులు సాధించాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఫలితంగా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకుని.. ఏకంగా టీమిండియాలోస్థానం సంపాదించాడు. కానీ అరంగేట్రం కోసం వేచి చూడాల్సి వస్తోంది.విధ్వంసకర బ్యాటర్ఇక టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. సూర్యాంశ్పై ప్రశంసలు కురిపించాడు. అతడొక శక్తిమంతమైన, విధ్వంసకర బ్యాటర్ అని ప్రశంసించాడు. ముంబై తరఫున దేశీ క్రికెట్లో, ఐపీఎల్లోనూ సత్తా చాటాడని పేర్కొన్నాడు. ఇటీవల భారత్- ‘ఎ’ తరఫునా దుమ్ములేపాడని.. అయితే, టీమిండియా తరఫున ఇదే తొలి మ్యాచ్ కాబట్టి ఇప్పుడు అతడిపై ఒత్తిడి పెట్టబోమని తెలిపాడు.పొట్టి ఫార్మాట్లోనూమరోవైపు.. ప్రిన్స్ యాదవ్ ఇటీవలే సొంతగడ్డపై అఫ్గానిస్తాన్తో వన్డేల సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్లలో కలిపి మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. తాజాగా ఐర్లాండ్తో రెండో టీ20 సందర్భంగా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లోనూ ఈ పేస్ బౌలర్ అడుగుపెట్టాడు.టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ రెండో టీ20 తుదిజట్లుటీమిండియాఅభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.ఐర్లాండ్టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(కెప్టెన్, వికెట్ కీపర్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై ముంద్రా, మాథ్యూ హోలార్డ్.
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీ రాజధానిలో గూండారాజ్... రైతుల ఆహ్వానం మేరకు భూములను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కోడిగుడ్లతో తెలుగుదేశం మూకల దాడి
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ ‘అప్పుల క్యాలెండర్’ విడుదల... నెలకు 7 వేల 266 కోట్ల రూపాయల చొప్పున అప్పు చేయబోతున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో యూరియా కోసం సీజన్లో రైతన్నల అగచాట్లు. యాప్లో ఓటీపీలు రాక.. వేలిముద్రలు మ్యాచ్ కాక తిప్పలు
ప్రభుత్వ హత్య.. పెద్దలను కాపాడే కుట్ర... కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు... కీలక అంశాలు లేకుండానే ‘సిట్’ రిమాండ్ నివేదిక
పులివెందులలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన.. ఇవాళ మహిమాన్విత ఆలయానికి కలశస్థాపన చేయనున్న YSRCP అధినేత..
చంద్రబాబు ప్రేమ ముమ్మాటికీ బూటకం... రైతులకు చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో భీతావహ పాలన... పోలీసులంటేనే ప్రజలు భయపడిపోతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే... గిగ్ వర్కర్ సాయికృష్ణ లాకప్డెత్ ఘటనలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
తలెగరేస్తే మళ్లీ బాంబులేస్తాం... ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
‘సర్’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. వైఎస్సార్సీపీ నేతలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం
బిజినెస్
డెడ్లైన్ అలర్ట్: ఈ-కేవైసీ, ఐటీ రిటర్న్.. ఇంకా..
జూన్ నెల ముగింపునకు వచ్చేసింది. జూన్ 30 పలు కీలక విషయాలకు గడువు తేదీ. ఎల్పీజీ సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారుల ఈ-కేవైసీ నుంచి ఆదాయపు పన్ను శాఖ పరిశీలన (స్క్రూటినీ) నోటీసుల వరకు, అలాగే త్రైమాసిక ముగింపు నేపథ్యంలో వ్యాపారాల జీఎస్టీ, టీడీఎస్ సంబంధిత సన్నాహాల వరకు పలు ముఖ్యమైన గడువులు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక నష్టాలు లేదా పరిపాలనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఎల్పీజీ సబ్సిడీ నిలిచిపోయే అవకాశంప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ప్రతి సంవత్సరం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటివరకు ధ్రువీకరణ పూర్తి చేయని ఇతర ఎల్పీజీ సబ్సిడీ లబ్ధిదారులు కూడా జూన్ 30లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేనిపక్షంలో వారి బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ జమ కావడం తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్పై ఎలాంటి ప్రభావం ఉండదు. పూర్తి ధర చెల్లించి సిలిండర్ పొందవచ్చు. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ-కేవైసీ పూర్తి చేసిన లేదా సబ్సిడీకి అర్హులు కాని వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు.ఐటీఆర్ స్క్రూటినీ నోటీసులకు కీలకం2025-26 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన ఆదాయపు పన్ను రిటర్నులపై సెక్షన్ 143(2) కింద స్క్రూటినీ నోటీసులు జారీ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు జూన్ 30 చివరి గడువు. ఇది పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేయాల్సిన గడువు కాదు. కేవలం ఇప్పటికే దాఖలైన రిటర్నులను పరిశీలనకు ఎంపిక చేస్తే నోటీసులు పంపేందుకు శాఖకు ఉన్న చట్టబద్ధమైన చివరి తేదీ మాత్రమే. రిటర్నులో చూపిన వివరాలు, ఫారం 26AS, AIS, TIS, బ్యాంకు లావాదేవీలు లేదా అధిక విలువ గల ఆర్థిక లావాదేవీల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తే స్క్రూటినీకి ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) కూడా జూన్ 30నే ఈ గడువుగా స్పష్టం చేసింది.వ్యాపారాలకు త్రైమాసిక ముగింపుజూన్ 30తో 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ముగియనుంది. దీంతో కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఖాతాల పుస్తకాలు, టీడీఎస్, టీసీఎస్ నమోదులు, జీఎస్టీ రికార్డులు, ఇతర చట్టబద్ధమైన లెక్కలను నవీకరించుకోవాల్సి ఉంటుంది. తద్వారా జూలైలో దాఖలు చేయాల్సిన జీఎస్టీ రిటర్నులు, టీడీఎస్/టీసీఎస్ స్టేట్మెంట్లను సకాలంలో సమర్పించేందుకు వీలు కలుగుతుంది.ఈ గడువులను చివరి నిమిషానికి వాయిదా వేయకుండా ముందుగానే పూర్తి చేస్తే అనవసరమైన జరిమానాలు, సబ్సిడీ జాప్యాలు, పన్ను సంబంధిత ఇబ్బందులను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం, వెండి ధరలు ఇప్పుడిలా..
దేశంలో రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
150 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు షాక్.. అందరూ లేఆఫ్
అమెరికాకు చెందిన రిటైల్ టెక్నాలజీ సంస్థ హై-వీ (Hy-Vee) భారత్లోని తన ఇంజినీరింగ్ సెంటర్ను ఆకస్మికంగా మూసివేయడంతో సుమారు 150 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఒక్కరాత్రిలోనే ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగులను రాత్రి 9 గంటలకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ వీడియో కాల్కు ఆహ్వానించిన సంస్థ, రీస్ట్రక్చరింగ్లో భాగంగా భారత ఇంజినీరింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే వారి కార్పొరేట్ యాక్సెస్ కూడా నిలిపివేయబడింది.ఈ ఘటనపై మాజీ ఉద్యోగి ఒకరు రెడ్డిట్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఇంటర్న్గా చేరి దాదాపు రెండేళ్లలో పూర్తి స్థాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఎదిగిన తాను, "ఒక్క సమావేశంతో అంతా ముగిసిపోయింది" అని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా సంస్థ నుంచి సెవరెన్స్ ప్యాకేజీ లేదా ఎటువంటి ఆర్థిక పరిహారం కూడా అందలేదని పేర్కొన్నాడు. రియాక్ట్, నోడ్ జేఎస్, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ వంటి టెక్నాలజీల్లో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ, ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోవడం తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని తెలిపాడు.ఈ అకస్మాత్తు తొలగింపులపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. ఉద్యోగులకు కనీస నోటీసు లేకుండా మొత్తం టీమ్ను తొలగించడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. కొందరు ఉద్యోగుల ఆరోపణల ప్రకారం, తొలగింపుల అనంతరం సంస్థ భారత విభాగానికి సంబంధించిన లింక్డ్ఇన్ పేజీతో పాటు పలు పోస్టులను కూడా తొలగించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై సంస్థ అధికారికంగా స్పందించలేదు.ఇదిలా ఉండగా, హై-వీ ఇండియా ఇంజినీరింగ్ డైరెక్టర్ అమిత్ గోయల్ లింక్డ్ఇన్లో స్పందిస్తూ, భారత ఇంజినీరింగ్ కేంద్రాన్ని మూసేసినట్లు ధ్రువీకరించారు. ప్రభావితమైన ఇంజినీర్లు అత్యుత్తమ ప్రతిభ కలిగినవారని, వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సహకరించాలని తన పరిచయ వర్గాలను కోరారు. అయితే ఉద్యోగుల ఆరోపణల్లో పేర్కొన్న సెవరెన్స్ ప్యాకేజీ, నోటీసు వంటి అంశాలపై సంస్థ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదివారా? ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా?
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ దుర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి, దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. అలాగే శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.అనంత్ అంబానీ అంతకుముందు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు వెల్లడించారు. ఆ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల జీతభత్యాలు కూడా తామే భరిస్తామన్నారు.ఈ 25 ఎలక్ట్రిక్ బస్సులను నడిపే 50 మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలు చెల్లించడంతో పాటు, తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. గుజరాత్లోని వంతారా తహరాలో టీటీడీ గోశాలను ఆధునికీకరించేందుకు అంగీకారం తెలినట్లుగా తెలుస్తోంది.
ఫ్యామిలీ
మన పనస ఘనత..
వేసవి ఫలాల్లో మామిడి తర్వాత చెప్పుకోదగినది పనసపండు. పనసపండు వేసవి ముగిసిన తర్వాత కూడా దొరుకుతుంది. మన దేశంలో మార్చి నుంచి ఆగస్టు వరకు పనసపండ్లు దొరుకుతాయి. పనస పుట్టినిల్లు ఏ దేశమో సరైన సమాచారం లేదు గాని, ఇది తూర్పు ఆసియా దేశాల నుంచి పాశ్చాత్య దేశాలకు పాకినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.పదహారో శతాబ్దంలో కాలికట్ రేవులో అడుగుపెట్టిన పోర్చుగీసు నావికుడు గార్షియా డి ఓర్టా కేరళ ప్రాంతంలో విరివిగా పండే పనసపండ్లను చూసి ఆశ్చర్యపోయాడు. మలయాళీలు వీటిని ‘చక్కా’ అనేవారు. దీని ఆధారంగా ఓర్టా పోర్చుగీసు భాషలో ‘జాకా’ అని రాసుకున్నాడు. ‘జాకా’ పదం ఆధారంగా ఇంగ్లిష్లో పనసపండుకు ‘జాక్ఫ్రూట్’ అనే పేరువచ్చింది. మామిడి పండ్లతో పాటు పనసపండ్ల ఉత్పాదనలో కూడా మన భారతదేశం చాలాకాలంగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. మన పనస ఘనతకు గణాంకాల్లో తెలుసుకుందాం.పనసపండు పోషకాల గని. ఇందులో శక్తినిచ్చే పిండి పదార్థాలు, చక్కెరలు, ఆరోగ్యానికి మేలు చేసే పీచు పదార్థాలతో పాటు విలువైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పనసపండులో ఉండే పోషకాలు ఇవీ...పనసపండ్ల ఉత్పాదనలో మన దేశం అగ్రస్థానంలోనే ఉన్నా, ఇక్కడి ఉత్పాదనలో ఎక్కువ భాగం ఇక్కడే వినియోగం అయిపోతోంది. అందువల్ల పనస ఎగుమతుల్లో మన దేశం ఐదో స్థానానికి పరిమితమై ఉంది. ప్రపంచవ్యాప్తంగా పనస ఎగుమతుల విలువ ఏటా 150 మిలియన్ డాలర్ల వరకు ఉంటోంది. పనస ఎగుమతుల్లో మొదటి పది దేశాల వివరాలను గణాంకాలలో తెలుసుకుందాం.
తీపి రికార్డు! ‘ఇంత తేనె ఎలా తిన్నాడు?'
తేనె అంటే చాలామందికి ఇష్టం. కానీ, జర్మనీకి చెందిన ఆండ్రే ఆర్టోల్ఫ్ మాత్రం పిచ్చి! ఎంతంటే, ఒక నిమిషంలో ఏకంగా కిలోకు పైగా తేనె తినేసేంత.అవును, ప్రపంచ రికార్డు కోసం బకెట్ నిండా తేనె ముందు పెట్టుకుని కేవలం 60 సెకన్లలోనే 1,273 గ్రాముల తేనెను గుటకలేసేశాడు. అంటే దాదాపు ఒక పెద్ద తేనె సీసా మొత్తాన్ని నిమిషంలో ఖాళీ చేశాడు. నీళ్లు తాగినట్టు తేనె తాగడం అంత ఈజీ కాదు. అది చిక్కగా ఉండటంతో గొంతులోకి వెళ్లడమే పెద్ద టాస్క్.అయినా ఆండ్రే మాత్రం స్పూన్ తర్వాత స్పూన్ వేగంగా తింటూ కొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వైరల్ అవుతోన్న అతని వీడియో చూస్తే ‘ఇంత తేనె ఎలా తిన్నాడు?‘ అనిపించక మానదు. అయితే ఇది ఒక్కరోజులో వచ్చిన విజయం కాదు. విచిత్రమైన తినే చాలెంజ్లలో ఇప్పటికే అనుభవం ఉన్న ఆండ్రే, తన వేగం, పట్టుదలతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాడు.
సిమెంట్ సమాధులు..
ఆకాశహర్మ్యాల మధ్య ’స్వర్ణ విహార్’ అపార్ట్మెంట్ ఒక ఆధునిక కోటలా నిలబడి ఉంది. ‘బొయ్...’మంటూ సైరన్ మోగుతూ అపార్ట్మెంట్ గేటు ముందు ఆగింది అంబులెన్స్. స్ట్రెచర్ మీద డెబ్బై ఏళ్ల రామారావు నిర్జీవ శరీరం నిశ్చలంగా నిద్రపోతున్నట్టుగా ఉంది. తన కష్టం, సుఖం, బాధ, భయం, కోపం, దుఃఖం అన్నిటికీ వేదిక అయిన తన ఇంటిని కడసారి చూసుకోడానికా అన్నట్టు... పూర్తిగా మూసుకుపోకుండా అరమోడ్పులుగా ఉన్నాయి ఆయన కనులు.కన్నీళ్లు తుడుచుకుంటూ అంబులెన్స్ దిగాడు రవి– రామారావు గారి కొడుకు. అతనితో పాటు ప్రాణంలేని బొమ్మలా నీళ్ళింకిపోయిన కళ్ళతో రామారావు గారి భార్య, మరో ఇద్దరు బంధువులు, అంబులెన్స్ సిబ్బంది కలిసి రామారావు దేహాన్ని అపార్ట్మెంట్ గేట్ లోపలకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉండగానే, వీళ్ళ కోసమే కాచుకొని ఉన్నట్టు గబగబా ఎదురొచ్చాడు సెక్యూరిటీ గార్డు.‘‘సార్... అది... అయ్యగారి శవాన్ని లోపలకు తీసుకురానివ్వద్దని కమిటీ వాళ్ళు చెప్పారండి’’ నెమ్మదిగా అన్నాడు.మొదట అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు రవికి. అర్థమైన తరువాత నోట మాట రాలేదు. అతని కూడా వచ్చిన బంధువులే తేరుకొని, ‘‘అదేంటయ్యా! ఇదెక్కడి విడ్డూరం! అతని బాడీని అతనింటికి తీసుకురాకుండా ఎక్కడకు తీసుకెళ్ళమంటారు?’’ అన్నారు.‘‘ఏమో సార్! ప్రెసిడెంట్ గారు చెప్పమన్నదే చెప్పాను...’’ అన్నాడు గార్డ్.ఇంతలోనే అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజశేఖర్, మరికొందరు సభ్యులు కలిసి వచ్చారు.‘‘చూడు రవి, మాకు విషయం తెలిసింది. బాడీని లోపలికి తీసుకురావడానికి వీల్లేదు.’’ కచ్చితంగా చెప్పారు.‘‘ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది నా ఇల్లు. నా తండ్రి పార్ధివ దేహాన్ని నా ఇంట్లోకి తీసుకురావడానికి మీరెందుకు అడ్డం పెడుతున్నారు?’’ బాధ, కోపం, ఉక్రోషం, నిస్సహాయత కలగలిసిన గొంతుతో అన్నాడు రవి.‘‘ఇది నీ ఒక్కడి ఇల్లు కాదు రవి. ఈ కాంపౌండ్ లో ఇరవై కుటుంబాలు ఉన్నాయి. ఇంతమంది ఉన్న దగ్గర శవాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చే పోయే వాళ్ళందరికీ అపశకునంగా, ఆశుభంగా, సెంటిమెంట్గా భావిస్తారు’’ అన్నారు వాళ్ళు.అందేంటి సార్ అలా మాట్లాడతారు!? ఇన్నేళ్ళు మీతో కలిసి, మెలిసి తిరిగిన మనిషి. ఇప్పుడు ప్రాణం పోయేసరికి అతని శరీరం అంత భయంకరం, అపశకునం అయిపోయిందా? అన్నారు బంధువులు.‘‘ఏమోనండి! అవన్నీ మీరడక్కూడదు. మా అపార్ట్మెంట్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారం నడుచుకోవలసిందే. సెంటిమెంట్లు పక్కన పెట్టినా, ఇళ్ళ మధ్యలో ఇలాంటివి జరిగితే ఇంటి విలువ పడిపోతుంది. అసలే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఇళ్ళను అమ్ముకోడానికి బేరం పెట్టుకున్నారు. ఈ సమయంలో ఇలాంటివి ఇక్కడ జరిగితే ఆశుభంగా భావించి ఆ ఇళ్ళు చెల్లుబాటు కావు. పైగా వచ్చే నెలలో ఇక్కడ ముగ్గురు పెళ్లిళ్లు పెట్టుకున్నారు. వాళ్లకు కూడా అపశకునంగా ఉంటుంది...’’ మానవత్వం అన్నది ఏ కోశానా లేకుండా అన్నారు వాళ్ళు.‘‘మరీ అలా మాట్లాడకండి సార్. సెల్లార్లో ఒక పక్కన కాస్త టెంట్ అడ్డంగా కట్టేసి, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా బాడీని పెట్టుకుంటే తప్పేంటి? ఇంత పెద్ద సెల్లార్లో ఇటు చివర బాడీని పెట్టుకుంటాం. జనమంతా అటు పక్కనుంచి తిరుగుతారు. దానివలన ఎవరికేం ఇబ్బంది కలుగుతుంది. అపశకునం కలుగుతుంది? వచ్చే బంధువులందరికీ చివరి చూపయినా దక్కాలి కదా. పోయినాయనకు కాస్త స్నానం, పూజలాంటి కార్యక్రమాలు, ఆచారాలు నిర్వహించాలి కదా!’’ వాదనకు దిగారు చనిపోయినాయన బంధువులు.‘‘ఏమో... అదంతా మాకు తెలీదండి. కావాలంటే గేట్ లోపలకు తీసుకురాకుండా ఈ బిల్డింగ్ ముందే రోడ్డు మీద టెంట్ వేసి పెట్టుకోండి. లేదంటే పక్కనే ఉన్న ఖాళీ స్థలం ఉంది కదా అందులోనో లేదా శ్మశానం షెడ్డులోనో ఉంచండి. అంతేగాని గేట్ లోపలి తీసుకురావడానికి మాత్రం కుదరదు’’ మూర్ఖత్వానికి పరాకాష్ఠగా అన్నారు కమిటీ వాళ్ళతో పాటు మరో ముగ్గురు నలుగురు.‘‘అన్యాయంగా మాట్లాడకండి. శవాన్ని గేట్ బయట పెట్టడమేంటి? ఉన్నప్పుడు సంబంధాలు కొనసాగించడమే కాదు. పోయిన తరువాత ఆ నిర్జీవ శరీరాన్ని కూడా అంతే గౌరవంగా పంపించాలని చెబుతున్నాయి మన శాస్త్రాలు. పవిత్రత గురించి, శకునాల గురించి, ఆచారాల గురించి ఇంతలా చెబుతున్నారు. మీకు ఆ మాత్రం తెలీదా? ఒక శవానికి జరగవలసిన సంస్కారాలు, ఆచారాలు జరగనివ్వకపోతే ఆ పాపం కూడా చుట్టుకుంటుంది.’’ చివరి అస్త్రంగా అన్నారు బంధువులు. ఈ చివరి మాటతో కాస్త తగ్గారు బిల్డింగ్ పెద్దలు. కాని తాము పట్టిన పట్టు మాత్రం వదల్లేదు.ఇక్కడిలా వాదన జరుగుతుంటే, అప్పటికే తమకు ఆలస్యమవుతుందని విసుక్కుంటున్న అంబులెన్స్ వాళ్ళు,‘‘సార్! ఈ గొడవ ఎప్పుడు తేలుతుందో... మేం వెళ్ళాలి సార్!’’ అని చెప్పి, ఒకప్పుడు ఆ పరిసరాలన్నీ యథేచ్ఛగా తిరిగి, గార్డెన్లో ఎక్కడ ఏ మొక్క వంగినా, వాలినా దానిని సరిచేసి; ఎక్కడ ఏ గోడకి, గచ్చుకి చిన్న పెచ్చూడినా వెంటనే సరిచేసి, తీర్చిదిద్దిన రామారావుగారి దేహాన్ని అక్కడే రోడ్డు మీద దించేసి వెళ్ళిపోయారు.‘‘నాన్నా.. నన్ను క్షమించు నాన్నా... బ్రతికి ఉన్నంత కాలం,నువ్వు అద్దంలా తీర్చిదిద్దిన ఈ భూమ్మీద నీ చివరి స్పర్శ ఇవ్వలేకపోతున్నాను’’ అని రవి ఏడుస్తుంటే... అపార్ట్మెంట్ ఇళ్ళలోంచి వస్తున్న టీవీల శబ్దాలు, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్న హడావిడిలో నిశ్శబ్దంగా కలిసిపోయింది రవి ఆక్రోశం.‘అయ్యో! బతికున్నంతకాలం హాయిగా అందరితో ఎంతో ఆత్మీయంగా బతికిన నీకు, ప్రాణం పోయిన తరువాత ఈ అవమానమేంటయ్యా! ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారంటూ నీ కాళ్ళంటి ఆశీర్వాదాలడిగిన వీళ్ళకు నీ నిర్జీవ శరీరం అపశకునం అయిపోయిందా!? భగవంతుడా... ఏంటీ ఘోరం!’ నిశ్శబ్దంగా కుమిలిపోతోంది రామారావు గారి భార్య.ఇంతలో... జరుగుతున్న ఘోరం చూడలేని ప్రకృతి విలపిస్తున్నట్టు భోరుమని వర్షం మొదలయింది. బంధువులు రామారావు శరీరాన్ని ఎలాగైనా లోపలకు తీసుకువెళ్లాలని పట్టుదలగా బిల్డింగ్ కమిటీవాళ్ళతో వాదిస్తూనే ఉన్నారు. జరుగుతున్న రగడతో తనకెలాంటి సంబంధం లేదన్నట్టు నిర్జీవంగా, గేటు బయట, రోడ్డు మీద, ఒక బల్ల మీద పడి ఉంది రామారావు శరీరం. ఎవరో ఒక దుప్పటి తీసుకొచ్చి కప్పారు శరీరం మీద వర్షానికి తడవకుండా ఉండడం కోసం. జోరున కురుస్తున్న వర్షంలో తడుస్తూ, తండ్రి దేహాన్ని హత్తుకుని భోరున ఏడుస్తున్నాడు రవి.‘ఒరేయ్... మనుషుల్లా బతకడం నేర్చుకోండిరా! ఈ రోజు నా తండ్రిని బయట పెట్టారు. రేపు మీరు కూడా ఇదే గేటు దాటి బయటికి రావాలి. అప్పుడు మీ ఆత్మలకి శాంతి దొరుకుతుందా? సిమెంట్తో కట్టుకున్నది ఇల్లు కాదురా... ప్రేమని పంచుకునేది ఇల్లు. ఇంత పెద్ద స్థలంలో ఇంత పటిష్ఠంగా మీరు కట్టుకున్నది ఇళ్లను కాదు... శ్మశానాలను కట్టుకున్నారు! శ్మశానాలను...’ ఈ మాటలు బయటకు అనలేదతను. మౌనంగా మనసులోనే అనుకుంటూ ఆక్రోశిస్తోందతని హృదయం.జోరున వర్షం కురుస్తోంది. అపార్ట్మెంట్ గేటు బయట ఒకవైపు, శవం పక్కన విలపిస్తూ దిక్కుతోచని స్థితిలో అతని భార్యా, బిడ్డలు. మరోవైపు అపార్ట్మెంట్ వాసులు ‘లోపలికి రానివ్వం’ అని భీష్మించుకుని కూర్చున్నారు. గొడవ పెద్దదవుతోంది. ఇక ఆగలేకపోయారు ఆ అపార్ట్మెంట్లోనే ఉండే రిటైర్డ్ ప్రొఫెసర్ మూర్తిగారు. అంతవరకు సామరస్యంగా సమసిపోతుందని ఎదురుచూసిన గొడవ ఇంకా ముదురుతుండేసరికి, గంభీరంగా ముందుకు వచ్చారు. ఆయన మాటలకి ఆ ప్రాంతంలో ఒక గౌరవం ఉంది.‘‘చాలిక ఆపండి ఈ అమానుషాన్ని! ఏం చేస్తున్నారు మీరు? అందరూ చదువుకున్న వాళ్లేగా! లేక రాతి యుగంలో మనుషులా? బాధలో ఉన్నవారికి నీ కష్టంలో మేమూ తోడుంటాం అని భుజం తట్టి ఓదార్పునివ్వడం పోయి, వాళ్ళని మరింత బాధల్లోకి నెట్టేస్తారా!? ఇదేనా మానవత్వం?’’ అన్నారు గట్టిగా మూర్తిగారు.‘‘మూర్తిగారు, మీకు తెలియంది కాదు. ఈ బిల్డింగ్లో పెళ్లిళ్లు ఉన్నాయి, ఇప్పుడీ శవాన్ని లోపలకు తీసుకువస్తే బిల్డింగ్ మైల పడుతుంది. దోషం చుట్టుకుంటుంది. ఇది మా ఒక్కరి అభిప్రాయం కాదు. చాలామంది ఇలాగే అభిప్రాయపడుతున్నారు. అందరి క్షేమం కోసమే కదా మేమూ వద్దంటున్నది.’’ తనూ తీవ్రంగానే అన్నాడు ప్రెసిడెంట్. డూడూ బసవన్నల్లా అతనికి వంత పాడారు మరికొందరు.‘‘దోషమా? ఏ శాస్త్రం చెప్పింది రాజశేఖర్ గారు. ఆపదలో ఉన్న పొరుగువాడికి సాయం చేయకపోవడం కంటే పెద్ద దోషం ఇంకోటి ఉంటుందా? మీ ఇంట్లో పెళ్లిళ్లు ఉన్నాయి సరే, ఎప్పుడో నెల రోజుల తరువాత పెళ్లి ఉందని ఇప్పుడు ఆయన శరీరాన్ని లోపలికి తెస్తే బిల్డింగ్ మొత్తం మైల పడిపోతుందా? అయినా ఇక్కడ సెల్లార్లో బాడీని పెడితే మీ ఇంట్లో పెళ్ళికి మైల ఎలా అంటుకుపోతుందండీ? ఇది చాదస్తమనుకోవాలా? మూఢనమ్మకాలు అనుకోవాలా? మూర్ఖత్వం అనుకోవాలా? ఇదంతా వదిలేయండి... ఆ మాట నేననకూడదు గాని, రేపు మీ ఇళ్ళల్లో ఎవరికైనా ఇలాంటి కష్టం వస్తే అప్పుడు కూడా ఇలాగే రోడ్డు మీద పడేయమంటారా?’’ ఆవేశంగా అన్నారు మూర్తిగారు.ఆయన ఆవేశానికి, ఆ సమాధానంలేని ప్రశ్నలకు చుట్టూ ఉన్నవాళ్లు సమాధానం చెప్పలేక ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. ఆయన మాటలకు వత్తాసుగా కొందరు తలలూపడం మొదలుపెట్టారు. అప్పటివరకు జరుగుతున్న తతంగం నచ్చకపోయినా, వాళ్ళ పెత్తనానికి మారు మాట్లాడలేక నోరుమూసుకు ఊరుకున్న మరి కొందరయితే,‘‘నిజమే కదా! ఈ ప్రెసిడెంట్, సెక్రెటరీలు మరీ మూర్ఖులు.’’‘‘అవును... అంతా వీళ్ళ ఇష్టమే అయిపోతోంది. వాళ్ళేం చెప్తే అదే రూల్... బిల్డింగ్ అంతా వీళ్ళదే అన్నట్టు చెలరేగిపోతున్నారు. అడిగేవాళ్ళు లేక...’’‘‘అదే కదా! పాపం ఆ కుటుంబాన్ని చూడండి వీళ్ళ ఆగడాలకు ఎలా కుమిలిపోతున్నారో... ఇంట్లో మనిషి పోయి వాళ్లేడుస్తుంటే, వీళ్ళిలా అవమానించి ఏడిపిస్తున్నారు’’ అంటూ గుసగుసలు మొదలుపెట్టారు.‘‘రామారావుగారు ఈ అపార్ట్మెంట్లో పదేళ్ల నుంచి ఉన్నారు. మీ పిల్లలు కింద పడితే లేవనెత్తిన చేతులు ఆయనవి. ఎవరికే కష్టం వచ్చినా భుజం తట్టి తోడుగా నిలిచి, మానవత్వం చూపిన మనిషి. పండుగ వస్తే అందరికీ స్వీట్లు పంచి, అందరం కలిసిమెలిసి ఉందామన్న తియ్యటి మనసు ఆయనది. అలాంటి ఆయన ప్రాణం పోయాక ఒక ‘వస్తువు’ అయిపోయారా? ఆయన దేహం అపవిత్రం అయిపోయిందా? బాబాయ్ గారూ... మామయ్యగారూ... అన్నయ్యగారూ... తాతయ్యా... మీరు ఆశీర్వదిస్తే మాకు ‘శుభం’ అంటూ ఆయనతో ఎవరెవరు... ఎన్నిసార్లు అన్నారో గుర్తు చేసుకోండి. అలాంటిది ఆయన ప్రాణం పోయేసరికి అశుభంగా మారిపోయారా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి... మీరు చేస్తున్నదేంటో మీకే తెలుస్తుంది.చూడండి... మనం కట్టుకున్న ఈ గోడలు మనల్ని విడదీయకూడదు. ఈ రోజు మనం ఈ గేటు తీయకపోతే, రేపు ఈ అపార్ట్మెంట్ కేవలం ఒక ‘సిమెంట్ సమాధి’లా మిగిలిపోతుంది. ఇందులో మనుషులు ఉండరు, కేవలం భయం మాత్రమే ఉంటుంది. మన పిల్లలకి మనం నేర్పించే సంస్కారం ఇదేనా? చనిపోయిన మనిషికి గౌరవం ఇవ్వలేని మనం, బతికున్న వారికి ఏం విలువ ఇస్తాం?’’ కొట్టినట్టే అన్నారు మూర్తిగారు.ఆయన మాటల్లోని నిజాయితీ, ఆవేదన అక్కడున్న వారి గుండెల్లో గుచ్చుకుంది. కొందరు తలలు దించుకున్నారు. ప్రెసిడెంట్, సెక్రెటరీ అండ్ గ్రూప్ మౌనంగా ఉండిపోయారు.స్థిర నిశ్చయంతో ముందుకు కదిలారు మూర్తిగారు. ‘‘నేను వెళ్తున్నాను. నేనే స్వయంగా నా చేతులతో రామారావు గారిని లోపలికి తీసుకొస్తాను. నాతో పాటు మానవత్వం ఉన్నవాళ్లు ఎవరైనా ఉంటే రండి. అడ్డుపడేవాళ్లు ఉంటే... రేపు మీరు కూడా ఒంటరిగా ఇలాగే రోడ్డు మీద నిలబడతారని గుర్తుంచుకోండి.’’ అంటూనే మూర్తిగారు ఒక్క అడుగు ముందుకు వేయగానే, మొదట ఒక యువకుడు, ఆ తర్వాత మరో ఇద్దరు మహిళలు ముందుకు వచ్చారు. అలా మెల్లగా ఒక్కొక్కరుగా అందరూ రవి దగ్గరకు వెళ్లారు.‘‘క్షమించు రవి... భయం, మూఢనమ్మకాలు, ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వం మమ్మల్ని గుడ్డివాళ్లను చేసింది. రామారావుగారు మన పెద్దాయన. ఆయన్ని సగౌరవంగా లోపలికి తీసుకెళ్దాం. అన్నీ మేమే దగ్గరుండి జరిపిస్తాం.’’ అంటూ తనే ముందు రామారావుగారి పార్థివ శరీరాన్ని పైకెత్తడానికి కదిలాడు రాజశేఖరం.అందరూ కలిసి రోడ్డు మీద అనాథలాగా పడి ఉన్న రామారావుగారి శరీరాన్ని గౌరవంగా పైకెత్తారు. గేట్లు బార్లా తెరుచుకున్నాయి. వర్షం వెలిసింది. నిముషాల్లో సెల్లార్లో ఓ పక్కన అంతా ఖాళీ చేసి, రామారావుగారి దేహాన్ని పెట్టడానికి అన్ని ఏర్పాట్లూ చకచకా చేసేశారు. అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి పూలు తెచ్చారు, దీపాలు వెలిగించారు. రవి కుటుంబం ఒంటరిది కాదు అని నిరూపించారు అందరూ. రామారావుగారికి జరగాల్సిన ఆచారాలన్నీ సజావుగా, గౌరవప్రదంగా జరిగాయి. అందరూ కలిసి రామారావు గారిని చివరి ప్రయాణానికి సగౌరవంగా సాగనంపారు. బిల్డింగ్లో ‘దోషం’ పోయి ‘ప్రేమ’ వెల్లివిరిసింది. - మావూరు విజయలక్ష్మి
హాట్ వర్సెస్ ఐస్ ప్యాక్: ఎలాంటప్పుడు మంచిదంటే..
దేహంలో ఎక్కడైనా వాపుగానీ నొప్పిగానీ వస్తే కాపడం పెట్టడం చాలా సాధారణం. ఇలా కాపడం పెట్టడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందడం ఎప్పటినుంచో అనుసరిస్తున్న ప్రక్రియ. అయితే ఏయే సందర్భాల్లో ఐస్ ప్యాక్ (ఐస్ కాపడం) పెట్టాలో... మరే సందర్భంలో వేడి కాపడం అవసరమవుతుందో చూద్దాం. ఐస్ప్యాక్ ఎప్పుడంటే... గాయం తగిలిన చోట ఐస్తో అద్దడం వల్ల ఉపశమనం కలగడం అన్నది తాజాగాయాల విషయంలోనే ఎక్కువ. దెబ్బతగిలినప్పుడు ఆ ప్రాంతం ఎర్రబడుతుంది. వాపు వచ్చి ఆ ప్రదేశం కాస్త వేడిగా అనిపిస్తుంటుంది. అప్పుడు అక్కడ ఐస్ పెట్టడం వల్ల అక్కడి (లోకల్) ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆ ప్రాంతంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. కొద్ది నిమిషాల తర్వాత అవే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఇలా రక్తనాళాల సంకోచ–వ్యాకోచాలను ‘లూయీస్–హంటింగ్ చర్య’ అంటారు. దీనివల్ల చిన్న రక్తనాళాలు వ్యాకోచించగానే దెబ్బతగిలినప్పుడు ఏర్పడ్డ మలిన పదార్థాలన్నీ రక్తంలో ఒక్కసారిగా కలిసి పలచ బారిపోతాయి. దాంతో వాపు తగ్గుతుంది. ఐస్ పెట్టడం వల్ల కోల్డ్ రిసెప్టార్స్ ఉత్తేజం చెంది ఎండార్ఫిన్స్, ఎన్కెఫలిన్స్ అనే ఉత్ప్రేరకాలు విడుదల అవుతాయి. దాంతో నొప్పి తగ్గుతుంది. ఐస్ వల్ల నరాల నుంచి వెళ్లే సంకేతాల వేగం (నర్వ్ కండక్షన్ వెలాసిటీ) తగ్గుతుంది. కండరాల బిగుతు కూడా తగ్గుతుంది. ఐస్ప్యిక్ అన్నది కనీసం 10–15 నిమిషాలు పెట్టాలి. ఐస్ క్యూబ్స్ను నేరుగా అద్దడం కంటే... టవల్లోగాని, లేదా ఏదైనా కవర్లోగాని పెట్టి ఐస్ప్యిక్ పెట్టవచ్చు. ఎప్పుడెప్పుడు మంచిదంటే... : ఆర్థరైటిస్ ఉన్నప్పుడు / వాపు, మంట వచ్చిన చోట (టెండర్పాయింట్స్లో) / తాజా గాయాలు (ఫ్రెష్ ఇంజరీస్) అయినప్పుడు. హాట్ ప్యాక్ (వేడికాపడం) ఎప్పుడంటే... సాధారణంగా దీర్ఘకాలికంగా వచ్చే నొప్పులూ, అలాగే నొప్పి ఒక చోటి నుంచి మరోచోటికి పాకుతున్నప్పుడు వేడికాపడం ద్వారా మంచి ఉపశమనం దొరుకుతుంది. ఈ వెచ్చదనం ప్రభావం చర్మం పైపొరలకే పరిమితం కాకుండా, కండరాల మీద కూడా ప్రభావం చూపుతుంది. వేడికాపడం వల్ల ఆ పరిసరాల్లో రక్తప్రసరణ వేగవంతమవుతుంది. దాంతో అక్కడ జీవక్రియల వేగం (మెటబాలిక్ రేట్) కూడా పెరుగుతుంది. వేడికాపడంతో కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ చర్యలన్నింటి వల్ల ఉపశమనం కలుగుతుంది. వేడికాపడం అన్నది కాస్త కాస్తగా కాపడం పెడుతూ 10–15 నిమిషాలు కొనసాగించాలి. వేడికాపడం బట్టను వేడి చేయడం ద్వారాగానీ, హాట్ వాటర్ బ్యాగ్తోగాని, ఎలక్ట్రిక్ హీట్ప్యాక్ పెట్టవచ్చు. ఎప్పుడెప్పుడు మంచిదంటే... : నడుమునొప్పి / ఏదైనా పనిచేయడం ద్వారా వచ్చిన వెన్ను నొప్పి (మెకానికల్ బ్యాక్పెయిన్) / డిస్క్ప్లాప్స్ / సయాటికా.
అంతర్జాతీయం
పాక్ పారా మిలటరీ హెడ్డాఫీసుపై ఉగ్ర దాడి
కరాచీలోని పారా మిలటరీ విభాగం పాకిస్తాన్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై శనివారం రాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గులిస్తాన్–ఇ– జౌహార్ ప్రాంతంలోని ఈ కార్యాలయం గేట్ను వాహనంతో ఢీకొట్టిన సాయుధులు లోపలికి వస్తూనే కాల్పులకు దిగారని అధికారులు తెలిపారు. బలగాలు వెంటనే ధీటుగా స్పందించాయన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ముగ్గురు భద్రతా సిబ్బంది చనిపోయినట్లు తెలిసిందన్నారు. రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్(TTP) నుండి విడిపోయిన ఉగ్రవాద ముఠా 'జమాత్-ఉల్-అహ్రార్' ప్రకటించుకుంది. 'ఖులాఫా-ఎ-రషీదీన్ ఇష్తిషాదీ బ్రిగేడ్' అనే ఆత్మాహుతి దళం ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపింది. పాకిస్తాన్లో ఇటీవల పోలీసులు, భద్రతా బలగాలను లక్ష్యంగా ఉగ్రవాద దాడులు భారీగా పెరిగాయి. పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఉగ్రదాడిపై దర్యాప్తును ప్రారంభించాయి. కంట్రోల్ రూమ్, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఉగ్రవాదులు లోపలికి ఎలా ప్రవేశించారనే కోణంలో విచారణ చేపట్టారు. కరాచీలో హై అలర్ట్స్ ప్రకటించారు.
1,430కి పెరిగిన మరణాలు
లా గువేరా: జంట భూకంపాలు వెనెజువెలాను చివురుటాకులా వణికించిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం 920గా ఉన్న మరణాల సంఖ్య శనివారం నాటికి ఏకంగా 1,430 దాటేసింది. మరణాల సంఖ్య విపరీతంగా పెరిగే ఆస్కారముందని సహాయక బృందాలు అంచనావేస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపడుతున్నారు. భూకంప ఘటనలో 3,238 మంది గాయపడ్డారు. కుప్పకూలిన ఒక భవనం నుంచి ఒక నవజాత శిశువును సహాయక బృందాలు విజయవంతంగా కాపాడాయి. తర్వాత శిశువు తల్లినీ జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. అడుగంటుతున్న ఆశలుభూకంపాల ధాటికి బాధితులుగా మారిన వారి ఆచూకీపై గంట గంటకూ ఆశలు సన్నగిల్లుతున్నాయి. బుధవారం వెనెజువెలాలోని లా గువేరా నగరంలో సంభవించిన భూకంపం ధాటికి భారీస్థాయిలో భవనాలు ధ్వంసంకాగా వాటి శిథిలాల్లో పెద్ద సంఖ్యలో స్థానికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. శిథిలాల తొలగింపు ప్రక్రియకు తాజాగా అవరోధాలు ఎక్కువయ్యాయి. మళ్లీ భూకంపం రావొచ్చనే భయం స్థానికుల్లో పెరగడంతో ఎక్కువ మంది జనం ఇతర ప్రాంతాలకు తరలిపోవడం, రోజువారీ ట్రాఫిక్ పెరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. కూలిన భవనాల నుంచి వేగంగా బాధితుల జాడ కనిపెట్టే అన్వేషణ, సహాయక చర్యలకు సరిపడా సిబ్బంది కరువయ్యారు. దీంతో తమ వారి జాడ కోసం బంధువులు, కుటుంబసభ్యులు ఉత్త చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్నారు. స్థానికులు సుత్తి, డ్రిల్లింగ్ మెషీన్లతో సిమెంట్ శ్లాబులను పగలగొట్టి పక్కకు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా 68,900 మంది జాడ గల్లంతైందని బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ పెనువిలయానికి భారీస్థాయిలో బలై ఉంటారనివార్తలొస్తున్నాయి. భూకంపం తర్వాత శిథిలాల కింద ఉన్న వారిని 48 నుంచి 72 గంటల్లోపు రక్షించగలిగితేనే వారు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గాయపడి, రక్తమోడుతూ సాయం కోసం ఆర్తనాదాలు చేసే వాళ్లకు ఎలాగోలా కనీసం ఆహారం, నీరు అందివ్వగలిగితే బతికే అకాశాలు పెరుగుతాయని సహాయక బృందాలు చెబుతున్నాయి. మెక్సికో, అమెరికా, ఎల్ సాల్వెడార్, స్విట్జర్లాండ్, కొలంబియా తదితర దేశాల నుంచి వలంటీర్లు వచ్చి అన్వేషణ, సహాయక బృందాలకు సాయపడుతున్నారు.
సెషెల్స్ భద్రతకు భరోసా
విక్టోరియా: ద్వీప దేశమైన సెషెల్స్ సముద్ర భద్రతా సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భారత్ సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన శనివారం సెషెల్స్ దేశానికి చేరుకున్నారు. ‘మేడ్ ఇన్ ఇండియా’నిఘా నౌకను సీషెల్స్ కోస్ట్గార్డుకు లాంఛనంగా అందజేశారు. రక్షణ, సముద్ర భద్రత రంగాల్లో భారత్–సెషెల్స్ మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. భారత్లో తయారైన నిఘా నౌకను సెషెల్స్కు అందజేయడం ఇరుదేశాల మధ్య సంబంధాల్లోమరో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోందని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అలాగే ఆరు అంబులెన్స్లు, పది యుటిలిటీ వాహనాలు, ఐదు లేజర్ రేడియల్ బోట్లను కూడా సెషెల్స్కు అందజేశారు. అంతకుముందు భారత్ నుంచి సెషెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మోదీకి దేశాధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ ఘన స్వాగతం పలికారు. మోదీకి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. కళాకారులు నాట్య ప్రదర్శనలతో మోదీని స్వాగతించారు. మోదీ కోసం సెషెల్స్లోని భారతీయులు తరలివచ్చారు. వారితో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. భారతదేశం పట్ల వారికున్న ప్రగాఢమైన అభిమానం, సెషెల్స్ పురోగతికి వారు అందిస్తున్న నిరంతర సహకారం నిజంగా ప్రశంసనీయమని పేర్కొ న్నారు. భారతీయ ప్రవాసులు చాలాకాలంగా మన రెండు దేశాల మధ్య ఒక శక్తివంతమైన వారధిగా పనిచేస్తూ, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తూ, మన ఉమ్మడి ప్రయాణాన్ని సుసంపన్నం చేస్తున్నారని కొనియాడారు. ఈ పర్యటనలో భాగంగా ప్యాట్రిక్ హెర్మినీతో మోదీ సమావేశం కాబోతున్నారు. ద్వైపాక్షిక అంశాలపై వారిద్దరూ చర్చిస్తారు. సెషెల్స్ నేషనల్ డే స్వర్ణోత్సవాలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. నేషనల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. హిందూ మహాసముద్రంలో సెషెల్స్ ఒక విలువైన సముద్ర భాగస్వామి, సన్నిహిత మిత్రదేశమని మోదీ వివరించారు. రెండు దేశాల ప్రజలకు లబ్ధి చేకూరేలా సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. కూర్మ రాజును సందర్శించిన మోదీ ప్రధాని మోదీ శనివారం అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో కలిసి సెషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్లోని భారీ తాబేళ్ల ఆవరణను సందర్శించారు. ఇక్కడ అల్డాబ్రా వృద్ధ తాబేలుకు ఆహారం తినిపించారు. సీషెల్స్కు చెందిన అల్దాబ్రా భారీ తాబేళ్లు భూమిపై అత్యంత పెద్దవి, అత్యధిక కాలం జీవించే జీవజాతుల్లో ఒకటి. వీటిలో కొన్ని తాబేళ్లు రెండు శతాబ్దాలకు పైగా చరిత్రకు సాక్షిగా నిలిచాయి. ‘‘అల్డాబ్రా తాబేళ్లకు భారత్, సీషెల్స్ మధ్యనున్న ప్రత్యేక స్నేహంతో అనుబంధం ఉంది. 2014లో రెండు తాబేళ్లను కోల్కతాలోని అలీపూర్ జంతు పదర్శన శాలకు బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత కొన్నేళ్లకు సెషెల్స్ మరికొన్ని తాబేళ్లను హైదరాబాద్ జూకు బహుమతిగా అందించింది’’అని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ పట్ల రెండు దేశాలకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను చాటిచెబుతూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సెషెల్స్కు మాత్రమే ప్రత్యేకమైన ‘కోకో డి మెర్’అనే మొక్కను మోదీ నాటారు. కోకో డి మెర్కు సీషెల్స్లో విస్తృతమైన గౌరవం ఉందని, అది ఆ దేశ జాతీయ చిహ్నంపై కూడా ఉంటుందని మోదీ వివరించారు. అత్యంత పెద్ద విత్తనాలు, అత్యంత బరువైన పండ్లను ఉత్పత్తి చేయడంలో ఈ జాతి ప్రసిద్ధి చెందిందని తెలిపారు.
మరోసారి మిసైళ్ల మోత.. ఇరాన్లోని కీలక స్థావరాలపై బాంబుల వర్షం
ఫ్లోరిడా: ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులు చేసింది. ఆదివారం తెల్లవారుజామున మిసైళ్లతో విరుచుకుపడింది. ఎం/వి ఎవర్ లవ్లీ వాణిజ్య సరుకు రవాణా నౌకపై ఇరాన్ దాడికి ప్రతిగా శుక్రవారం అర్ధరాత్రి దాటాక అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత, కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశాన్ని ఇరాన్కు అమెరికా ఇచ్చింది. అయితే, ఇరాన్ దాన్ని లెక్క చేయకుండా డ్రోన్ను ప్రయోగించి ఎం/టి కికు నౌకను ఢీకొట్టింది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఆ ట్యాంకర్, 2 మిలియన్లకు పైగా బ్యారెళ్ల ముడి చమురుతో హార్మూజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ఓ ప్రకటనలో తెలిపింది.ఏయే ప్రాంతాల్లో దాడులు? వాణిజ్య నౌకలపై ఇరాన్ కొనసాగిస్తున్న దూకుడుకు నేరుగా ప్రతిగా సెంట్కామ్ దళాలు దాడులు చేపట్టాయి. అమెరికా సైనిక విమానాలు ఇరాన్ సైనిక నిఘా వ్యవస్థలు, సమాచార ప్రసార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లేయర్ కెపాబిలటీస్ లక్ష్యంగా దాడులు చేశాయి. కాగా, హార్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని, అమెరికా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని సెంట్కామ్ తెలిపింది. https://t.co/9JgYDCZXuB— U.S. Central Command (@CENTCOM) June 27, 2026మా సహనం నశించింది: ఇరాన్ ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రాహీం అల్ఫిఖర్ ఎక్స్లో వరుస పోస్టులు చేశారు. "మీరు మా సార్వభౌమాధికారంపై దాడి చేశారు. ఇక పరిస్థితుల్ని మార్చే కార్యాచరణకు సిద్ధంగా ఉండండి. మీరు తప్పుగా అంచనా వేశారు. మా సహనం నశించింది. కాళరాత్రిని చూడడానికి సిద్ధంగా ఉండండి. మీరు అన్ని హద్దులు దాటారు. మా నిర్ణయం మాటలకే పరిమితం కాదు.. కొన్ని గంటల్లో మా శక్తిని చూపిస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఇరాన్ సైన్యంలోని అత్యున్నత ఉమ్మడి యుద్ధ కమాండ్కు చెందిన అధికార ప్రతినిధి. మరోవైపు, బహ్రెయిన్ శనివారం ఇరాన్ తమ భూభాగంపై పలు డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించింది. ఈ దాడి తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిందని, శాంతిని కాపాడే ప్రయత్నాలకు ముప్పు తెచ్చిందని తెలిపింది.You miscalculated, and our patience has run out... so prepare for a long, endless night.— العميد إبراهيم ذو الفقاري (@Ibrahim_alFiqar) June 27, 2026
జాతీయం
త్రిషకు డిప్యూటీ సీఎం ఇచ్చినా ఆశ్చర్యం లేదు!
సాక్షి, చెన్నై: సొంత స్నేహాలు, సినిమా సంబంధాల కోసమే ప్రభుత్వ పదవులను పంచుతున్న సీఎం జోసఫ్ విజయ్, రానున్న రోజుల్లో నటి త్రిషకు డిప్యూటీ సీఎం పదవిని ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన అవశ్యం లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఓ వీడియో రికార్డింగ్ సందేశం విడుదల చేస్తూ, సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.సినిమా వాళ్లకే అధికార కేంద్రాలా? ప్రభుత్వ పదవుల నియామకాలపై ఉదయకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళనాడులోని 8 కోట్ల మంది ప్రజల హక్కులను ఢిల్లీలో పరిరక్షించేందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అనే ప్రతిష్టాత్మక పదవి ఉందన్నారు. తమిళనాడులో అర్హులైన వారెవరూ ఈ పదవికి దొరకలేదా అని ప్రశ్నిస్తూ, తనతో సినిమాలు తీసిన వారికి, తన చిత్రాల్లో నటించిన వారికి, తన పర్సనల్ మేనేజర్లు జగదీష్ పళనిస్వామి, జాన్ ఆరోగ్యస్వామి, విష్ణురెడ్డి, రాధన్ పండిట్, వెంకట్ నారాయణ వంటి వారికే సీఎం విజయ్ ప్రభుత్వ పదవులు ఇచ్చుకుంటూ పోతున్నారని ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే త్వరలోనే త్రిషను కూడా ఉప ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన ప్రకటించవచ్చని ఎద్దేవా చేశారు.అన్నాడీఎంకే వర్గాలకు పదవులు మరోవైపు.. ప్రస్తుతం తిరుక్కళుక్కున్రం తూర్పు యూనియన్ కార్యదర్శిగా ఉన్న చెంగల్పట్టు తూర్పు జిల్లా ఎంజీఆర్ జి.కె.బాబు, అసోసియేషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈమేరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుక్కళుకుండ్రం వెస్ట్ యూనియన్ లీగ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె.ఆర్.సెల్వంను ఆ పదవి నుంచి తొలగిస్తున్నారు. ప్రస్తుతం యూనియన్ లీగ్ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న పి. ముకుందన్, తిరుక్కలకుండ్రం వెస్ట్ యూనియన్ లీగ్ సెక్రటరీగా, చెంగల్పట్టు తూర్పు జిల్లా మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శిగా మధురాంతకం పంచాయతీ యూనియన్ కమిటీ అధ్యక్షురాలు గీత, అజయ్ మోహన్కుమార్ తిరుపోరూర్ ఉత్తర యూనియన్ కార్యదర్శిగా నియమితులయ్యారని తెలిపారు.
మేడం నా క్యాబ్లో బీరు తాగొద్దు..
బెంగళూరు: క్యాబ్లో ప్రయాణికురాలు జ్యూస్ తాగుతుండగా, బీరు తాగుతున్నావంటూ డ్రైవరు ఆమెతో గొడవకు దిగాడు. ఈ ఘటన బెంగళూరు అశోక్నగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఈ నెల 21న రాత్రి మహిళ కోరమంగళ రెస్టారెంట్ నుంచి తన ఇంటికి ఉబర్ కారును బుక్ చేసుకొంది. కారు ఎక్కగానే జ్యూస్ బాటిల్ తీసి తాగుతుండగా, కారులో బీరు తాగవద్దంటూ డ్రైవరు ఆమెను దబాయించాడు. ఇది బీరు కాదు, జ్యూస్ అని చెప్పినా అతడు వినిపించుకోలేదు. కారులో నుంచి బయటకు తోసేందుకు ప్రయత్నించాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పోలీసులకు వచ్చిన ఫిర్యాదులో తెలిపింది. డ్రైవర్ దౌర్జన్యంగా మాట్లాడటంతో మహిళ కారును, నిలిపి తన ట్రిప్ను రద్దు చేయాలని పదేపదే కోరింది. అయినా కారును నిలపకపోవడంతో అతికష్టం మీద డోర్ను తెరిచి కిందకు దూకేసింది. డ్రైవర్ కారుతో వెళ్లిపోయాడని తెలిపింది. పోలీసులు డ్రైవరు కోసం గాలింపు చేపట్టారు.
రమ్య నాతో రాకపోతే చంపేస్తా..!
బెంగళూరు: ప్రియురాలిని కిడ్నాప్ చేసి. కారులో తీసుకెళ్తున్న ప్రియుడు ఆమెను కత్తితో పొడిచి, తాను కారులోనే బాంబు పేల్చుకుని సజీవ దహనం చేసుకున్నాడు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని శిరా తాలూకాలోని జోగిహళ్లి సమీపంలో జాతీయ రహదారి 48లో శనివారంనాడు జరిగింది. వివరాలు.. బెంగళూరులో నివసించే నాగేంద్ర (30), అక్కడే జయనగరలో నివసిస్తున్న ఉత్తరకన్నడ అంకోలా వాసి అయిన రమ్య (23)తో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఓటి టెక్నీషియన్గా పనిచేసేవారు. అక్కడ పరిచయమయ్యారు. అతని ధోరణి నచ్చక ఆమె దూరంగా ఉంటోంది. శనివారం, తెల్లవారుజామున ఆస్పత్రిలోనే నాగేంద్ర రమ్యను కలిసి ‘వెళ్లి పెళ్లి చేసుకుందాం‘ అని చెబుతూ ఆమెతో గొడవకు దిగాడు. ఈ సమయంలో, రమ్య స్నేహితురాలు అతన్ని అడ్డుకుంది. నాతో రాకపోతే చంపేస్తానని రమ్యను బెదిరించి, ఒక ఉబర్ క్యాబ్ను బుక్ చేసి, ఉదయం సుమారు 11 గంటలకు అంకోలా వైపు వెళ్లసాగాడు. డ్రైవర్కు పోలీసుల ఫోన్...రమ్య స్నేహితురాలు కిడ్నాప్ గురించి పోలీసులకు తెలియజేసింది. వారు క్యాబ్ డ్రైవర్ ప్రవీణ్కు ఫోన్ చేసి, మీ కారులో ఒక యువతిని అపహరిస్తున్నారని, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లాలని చెప్పారు. ఈ సమయంలో రమ్య, ‘అవును, నాగేంద్ర నన్ను చంపేస్తాడు, అతని దగ్గర బాంబు ఉంది, దాన్ని కారు పక్కన ఆపండి’ అని కేకలు వేసింది. ఇంతలోనే దుండగుడు ఆమె తల, చేతిపైన కత్తితో పొడిచాడు, రమ్య ప్రాణభయంతో కారు తలుపు తెరిచి కిందకు దూకింది. కారు డ్రైవర్ ప్రవీణ్ కారును ఆపి, ఆ యువతిని కాపాడటానికి వెళ్ళాడు. కారులో ఉన్న నాగేంద్ర, కారును లాక్ చేసుకుని తన వద్దనున్న పెట్రోల్, ఇతర పేలుడువస్తువులతో కూడిన బాంబును పేల్చడంతో మంటలు ఎగసిపడ్డాయి. కారుతో పాటు అతడు సజీవ దహనమయ్యారు. కళ్లంబెల్ల పోలీసులు చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అప్పు చేసి కారును కొని డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నానని, కళ్ల ముందే కాలిపోయిందని యజమాని ప్రవీణ్ విలపించాడు.
ప్రియుడి మోజులో భర్త, పిల్లలను వదిలేసి..!
బెంగళూరు: దారి తప్పిన ప్రేమ విషాదాంతమైంది. వివాహిత మహిళతో ప్రేమాయణం నడిపి, ఆమెతో పరారైన వ్యక్తి.. చివరికి ఆమెను హతమార్చాడు. ఈ ఘోర సంఘటన బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలూకా జిగణిలో జరిగింది. బాగల్కోట జిల్లా ఇళకల్కు చెందిన అక్షత (30)ను ఆమె ప్రియుడు నానా సాహెబ్ బలిగొన్నాడు. ఈ నెల 20న జిగణి పటాలమ్మ లేఔట్లోని ఇంటిలో దుర్వాసన వచ్చింది. ఇంటి యజమాని కిటికిలోంచి చూడగా అక్షత శవం కనిపించగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్లు రిపోర్టులో తెలిపారు. బాడుగ ఇల్లు తీసుకుని.. 2014లో అక్షత, కృష్ణ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి కూతురు, కొడుకు ఉన్నారు. భర్త కార్పెంటర్గా పనిచేసేవాడు. ఆమెకు చేనేత కార్మికుడు నానా సాహెబ్తో పరిచయమై అనైతిక సంబంధం ఏర్పడింది. ఇతడు అవివాహితుడు అని సమాచారం. అతని మోజులో పడిన అక్షత భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ఇటీవల ప్రియునితో కలిసి ఇళకల్ నుంచి బెంగళూరుకు వచ్చేసింది. తామిద్దం భార్యాభర్తలమని చెప్పి బాడుగ ఇంటిలో చేరారు. అయితే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నానాసాహెబ్ ఆమెను చంపి ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయాడు. హంతకుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఎన్ఆర్ఐ
మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదం ఘటనలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. అమెరికాలోని మిస్సోరి (Missouri) రాష్ట్రంలో స్కైడైవింగ్ విమానం కుప్పకూలిన ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి కార్తీక్ వర్మ దాట్ల కూడా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన మొత్తం 12 మందిలో ఆయన ఒక్కరే భారతీయుడు.ఆంధ్రప్రదేశ్కు చెందిన సాయి కార్తీక్ వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ 'యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి' నుండి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, కాన్సాస్ సిటీలో హెల్త్కేర్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నారు. గతంలో కాప్జెమినీ (Capgemini) లో పనిచేసిన ఆయన, ప్రస్తుతం అడ్వెంట్హెల్త్ (AdventHealth) సంస్థలో క్లౌడ్ మైగ్రేషన్, ఆటోమేషన్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్కాన్సాస్ సిటీకి దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉన్న బట్లర్ మెమోరియల్ ఎయిర్పోర్ట్ నుండి ఆదివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయ్యింది. పైలట్తో పాటు 11 మంది స్కైడైవర్లతో ప్రయాణిస్తున్న 'పసిఫిక్ ఏరోస్పేస్ 750XL' విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. విమానం భూమికి దాదాపు 100 అడుగుల (30 మీటర్లు) ఎత్తులో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎడమవైపునకు తిరిగి, పొలాల్లో కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. విమానంలో ఇంజన్ పవర్ తగ్గిపోవడం వల్లే పైలట్ హైవేపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని ఎయిర్పోర్ట్ మేనేజర్ అభిప్రాయపడ్డారు. దీంతో విమానంలోవారందరూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అమెరికా పారాచూట్ అసోసియేషన్ టెక్నాలజీ డైరెక్టర్ జెన్ షార్ప్ కూడా ఉన్నారు.ఇదీ చదవండి: ఒక్క రీల్కు రూ. 76 లక్షలు, లంచ్కి 20 లక్షలు : ఎలా?సాధారణ కమర్షియల్ విమానాల్లో ఉండేలాంటి 'బ్లాక్ బాక్స్' (డేటా రికార్డర్) ఈ చిన్న విమానంలో లభ్యం కాలేదు. దీంతో ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఇతర డిజిటల్ పరికరాలు, సాక్షుల ప్రకటనలు, వీడియోలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గురైన పసిఫిక్ ఏరోస్పేస్ 750XL అనేది సింగిల్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం. ఇది స్కైడైవింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ విమానం ప్రమాదానికి ముందు కూడా తొమ్మిదిసార్లు విజయవంతంగా ప్రయాణించిందని విమాన ట్రాకింగ్ సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: NEET UG Re-Exam 2026 మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది!
అబుదాబిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అబుదాబి భారత రాయబార కార్యాలయంలో జూన్ 13, 2026న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సాంస్కృతిక శోభతో నిర్వహించారు. ఈ వేడుకలో తెలుగువారి ఐక్యత, తెలంగాణ సంస్కృతి, జానపద వైభవం, చిన్నారుల ప్రతిభ—అన్నీ ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జార్జీ జార్జ్ , గౌరవ అతిథిగా వి. ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. వివిధ భారతీయ సంఘాల ప్రముఖులు.. ఇండియా సోషల్ సెంటర్ నుంచి బిజీ థామస్, లింసన్, బీహార్, జార్కండ్ సమాజ్ దివాకర్, ఉత్తర ప్రదేశ్ సమాజ్ వివేక్, తెలుగు అసోసియెషన్ రమేష్, ఐఎఫ్సీఏ నుంచి వినాయక్ అవాటె, మహారాష్ట్ర మండల్ నుంచి సంజయ్, ఇటిసిఏ నుంచి కిరణ్ కుమార్, సంస్కృతీ నుంచి రాజశేఖర్, తల్లిదండ్రులు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం తెలంగాణ డప్పుల స్వాగతంతో ప్రారంభమై, దీపప్రజ్వలన, అరబిక్, భారత జాతీయ గీతాలు, తెలంగాణ రాష్ట్ర గీతంతో కొనసాగింది. అనంతరం డా. అందె శ్రీ, తెలంగాణ ఉద్యమ అమరులకు ఒక నిమిషం మౌనం పాటించారు.తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా స్వాగత ప్రసంగం అందిస్తూ ప్రవాస తెలంగాణవాసుల ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, యువతలో నాయకత్వ వికాసం వంటి అంశాలపై ప్రేరణాత్మకంగా మాట్లాడారు. చివరగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: న్యూజిల్యాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు)
యూట్యూబర్ నందు కేసులో విస్తుపోయే అంశాలు
సాక్షి, హైదరాబాద్: జాగర్లమూడి మధుకర్, రమానందన వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేసి సీవోఎస్లు ఇవ్వడం జాగర్లమూడి కపుల్కు వెన్నతో పెట్టిన విద్య అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు నందు దంపతులు వసూలు చేశారు. యూకేలో వీసా, జాబ్స్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు.యూకేలో సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన నందు దంపతులపై చట్టపరంగా పోరాటానికి రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్తో రమానందన మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇచ్చే అర్హతను నందూస్ వరల్డ్ కిచెన్ కోల్పోయింది. జాగర్లమూడి కంపెనీలకు యూకే సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇవ్వకుండా బ్రేక్ పడింది.యూకే వీసా కేసులో నందూస్ వరల్డ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీసా కేసులో బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. నేరం రుజువైతే రమానందన, మధుకర్కు యూకేలో పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. జైలు శిక్ష తర్వాత పాస్పోర్టు రద్దు చేసి ఇండియాకు పంపే అవకాశాలు ఉన్నాయి.
కెనడాలో భారత పౌరులకు హెచ్చరికలు
కెనడాలోని భారత పౌరులకు అక్కడి అధికార యంత్రాంగం కీలక అడ్వైజరీ జారీ చేసింది. వీసా, ఇమిగ్రేషన్ హోదా, శాశ్వత నివాసం, ఉద్యోగాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాన్సులేట్ అధికారులు లేదంటే ఇమిగ్రేషన్ విభాగం పేరుతో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.కెనడాలో నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాము కాన్సులేట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వీసా స్టేటస్ సమస్యలు ఉన్నాయని, ఇమిగ్రేషన్ పత్రాలు అప్డేట్ చేయాలని లేదంటే తక్షణమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని భయపెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు హెచ్చరించారు.ఈ తరహా కాల్స్లో కొందరు మోసగాళ్లు ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ రెసిడెన్సీ ప్రాసెసింగ్, లేదా డిపోర్టేషన్ బెదిరింపులు వంటి విషయాలను ప్రస్తావిస్తూ ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. అధికారికంగా అయితే ఎటువంటి ప్రభుత్వ సంస్థలు ఫోన్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయవని స్పష్టం చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో కెనడా అధికారులు, భారత కాన్సులేట్ కార్యాలయాలు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశాయి. అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే ఎలాంటి వ్యక్తిగత సమాచారం, పాస్పోర్ట్ వివరాలు, బ్యాంక్ డేటా లేదంటే ఓటీపీలు పంచుకోవద్దని గట్టిగా హెచ్చరించారు. అలాగే తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దని, అధికారిక వెబ్సైట్ లేదంటే నేరుగా కాన్సులేట్ను సంప్రదించాలని సూచించారు.కెనడాలోని భారతీయులు ఈ తరహా మోసాలకు బలవకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని కెనడా ప్రభుత్వం, టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా “మీ వీసా రద్దు అవుతుంది”, “తక్షణంగా ఫైన్ చెల్లించాలి”, “ఇమిగ్రేషన్ సమస్య ఉంది” వంటి మాటలు వినిపిస్తే అది మోసపూరిత కాల్గా భావించాలని సూచించారు.అధికారులు చెబుతున్నదాని ప్రకారం, ఇలాంటి కాల్స్కి స్పందించకుండా వెంటనే బ్లాక్ చేయడం, స్థానిక పోలీసులకు లేదంటే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు. కెనడాలో భారతీయ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరించారు.
క్రైమ్
అరుంధతి.. ఆ వీడియో బయటకు రాకుండా చూడు ప్లీజ్..!
చెన్నై: విల్లుపురం జిల్లా, దిండివనానికి చెందిన 20 ఏళ్ల యువతి అక్కడి ఒక కళాశాలలో చదువుతోంది. అదే ప్రాంతంలో నివశించే అరుంధతి అనే నర్సు వారిద్దరూ స్నేహితులు. వారిద్దరూ తరచుగా సెంజి సమీపంలోని అనంతమంగళం శివాలయాన్ని సందర్శిస్తుంటారు. కొన్ని నెలల క్రితం వారు అక్కడికి వెళ్లినప్పుడు, వారిద్దరూ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన ఆది(20) ద్వారా చంద్రు(20) తో పరిచయం ఏర్పడింది. చంద్రు, కళశాల విద్యార్థిని ఒకరినొకరు ప్రేమించుకున్నారని తెలుస్తుంది. యువ జంట అనంతమంగళంలోని గుడి దగ్గర ఒక ముళ్లపొదల్లో ఏకాంతంగా కలుసుకుని మాట్లాడుకున్నారు. తరువాత ఆ విద్యార్థిని చంద్రుతో తనకున్న సాన్నిహిత్యం గురించి తన స్నేహితురాలు అరుంధతికి చెప్పింది. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు ఆది, చంద్రు వీడియో తీశారని అరుంధతి, దానిని సోషల్ మీడియాలో ప్రచురిస్తామని వారు బెదిరించారు. దీంతో తాను వారికి డబ్బు చెల్లించి, అంతా సరిచేస్తానని చెప్పింది. ఈ మాటలకు దిగ్భ్రాంతి చెందిన ఆ విద్యార్థిని, తన అమ్మమ్మ ఇంట్లో ఉంచిన రూ.3.5 లక్షలను దొంగిలించి అరుంధతికి ఇచ్చి ఆ వీడియో బయటకు రాకుండా చూడమని చెప్పింది. ఈ స్థితిలో క్యాష్ కౌంటర్లో ఉన్న డబ్బు గురించి కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో నిజం దాచలేనేమోనన్న భయంతో ఆ విద్యార్థిని అధిక మోతాదులో బీపీ మాత్రలు మింగి ఆత్మహత్యకుప్రయత్నించింది. ఇది చూసి దిగ్భ్రాంతికి గురైన బంధువులు వెంటనే ఆమెను రక్షించి, చికిత్స కోసం పుదుచ్చేరిలోని జిప్మర్ అస్పత్రిలో చేర్పించారు.ఈ సమాచారం అందుకున్న, పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి విద్యార్థినితో ప్రాథమిక విచారణ జరిపారు. ఆ విద్యార్థిని నుంచి బ్లాక్మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడైంది. దీని తర్వాత, బాధితురాలైన కళాశాల విద్యార్థిని నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు, మనీలాండరింగ్కు పాల్పడిన ఆరోపణలపై ఆమె స్నేహితురాలు అరుంధతి, ఆమె ప్రియుడు చంద్రు, ఆది, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అనంతరం, వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు.
అమెరికాలో హైదరాబాద్ మహిళా ఇంజినీర్కు భారీ షాక్..!
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–2లో నివసించే మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్కు అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తామని సిగ్నా ఎల్ఎల్సీ సంస్థతో పాటు అలీ బాఖురి, శ్రీతి కర్మాకర్, హుస్సేన్ బాఖురి, తరుణ్ వీసా ప్రాసెసింగ్ కోసం రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.3.95 లక్షలు వసూలు చేశారు. నకిలీ ఉపాధి పత్రాలను ఇచ్చారు. ఆమె అమెరికా వెళ్లగా.. అధికారులు పత్రాలను పరిశీలించగా నకిలీవని తేలింది. ఆమె వీసాను రద్దు చేసి ఐదేళ్ల పాటు అమెరికా రాకుండా నిషేధం విధిస్తూ తిప్పి పంపారు. బాధితురాలు నగరానికి వచ్చాక నిందితులను నిలదీయగా సెటిల్మెంట్ పత్రంపై సంతకం చేయించుకుని రూ.4 లక్షలు చెల్లించారు. ఈ మోసం కారణంగా ఉద్యోగం పోవడంతో పాటు ఖర్చులు, ఇతర రూపాల్లో మొత్తం రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లింది. మిగిలిన నష్టపరిహారాన్ని చెల్లించకపోవడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేను బాలికని, నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు
బెంగళూరు: ‘నేను బాలికని, నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. సహాయం చేయండి’ అని బాలల సహాయ కేంద్రానికి ఫోన్ చేసిన ఒక బాలికను అధికారులు రక్షించారు. ఈ సంఘటన చామరాజనగర జిల్లా, గుండ్లుపేట తాలూకాలోని శివపుర గ్రామంలో జరిగింది. మలవల్లి గ్రామానికి చెందిన ఒక బాలికకు శివపుర గ్రామానికి చెందిన యువకునితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఆ బాలికను ఏడు రోజులుగా ఆ యువకుని ఫామ్హౌస్లో ఉంచారు. ఈ సమయంలో బాలిక బాలల సహాయ కేంద్రానికి ఫోన్ చేసి, ‘నేను మైనర్ని, ఇక్కడ నేను సమస్యలను ఎదుర్కొంటున్నాను‘ అని చెప్పింది. శివపుర గ్రామ పంచాయతీ పీడీఓ శిల్ప ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు స్థానిక అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి ఫామ్హౌస్కు వెళ్లి బాలికను రక్షించారు. తల్లిదండ్రుల వద్ద ఉంచితే ప్రమాదమని శిశుగృహానికి తరలించినట్లు తెలిపారు.
రమ్య నాతో రాకపోతే చంపేస్తా..!
బెంగళూరు: ప్రియురాలిని కిడ్నాప్ చేసి. కారులో తీసుకెళ్తున్న ప్రియుడు ఆమెను కత్తితో పొడిచి, తాను కారులోనే బాంబు పేల్చుకుని సజీవ దహనం చేసుకున్నాడు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని శిరా తాలూకాలోని జోగిహళ్లి సమీపంలో జాతీయ రహదారి 48లో శనివారంనాడు జరిగింది. వివరాలు.. బెంగళూరులో నివసించే నాగేంద్ర (30), అక్కడే జయనగరలో నివసిస్తున్న ఉత్తరకన్నడ అంకోలా వాసి అయిన రమ్య (23)తో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఓటి టెక్నీషియన్గా పనిచేసేవారు. అక్కడ పరిచయమయ్యారు. అతని ధోరణి నచ్చక ఆమె దూరంగా ఉంటోంది. శనివారం, తెల్లవారుజామున ఆస్పత్రిలోనే నాగేంద్ర రమ్యను కలిసి ‘వెళ్లి పెళ్లి చేసుకుందాం‘ అని చెబుతూ ఆమెతో గొడవకు దిగాడు. ఈ సమయంలో, రమ్య స్నేహితురాలు అతన్ని అడ్డుకుంది. నాతో రాకపోతే చంపేస్తానని రమ్యను బెదిరించి, ఒక ఉబర్ క్యాబ్ను బుక్ చేసి, ఉదయం సుమారు 11 గంటలకు అంకోలా వైపు వెళ్లసాగాడు. డ్రైవర్కు పోలీసుల ఫోన్...రమ్య స్నేహితురాలు కిడ్నాప్ గురించి పోలీసులకు తెలియజేసింది. వారు క్యాబ్ డ్రైవర్ ప్రవీణ్కు ఫోన్ చేసి, మీ కారులో ఒక యువతిని అపహరిస్తున్నారని, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లాలని చెప్పారు. ఈ సమయంలో రమ్య, ‘అవును, నాగేంద్ర నన్ను చంపేస్తాడు, అతని దగ్గర బాంబు ఉంది, దాన్ని కారు పక్కన ఆపండి’ అని కేకలు వేసింది. ఇంతలోనే దుండగుడు ఆమె తల, చేతిపైన కత్తితో పొడిచాడు, రమ్య ప్రాణభయంతో కారు తలుపు తెరిచి కిందకు దూకింది. కారు డ్రైవర్ ప్రవీణ్ కారును ఆపి, ఆ యువతిని కాపాడటానికి వెళ్ళాడు. కారులో ఉన్న నాగేంద్ర, కారును లాక్ చేసుకుని తన వద్దనున్న పెట్రోల్, ఇతర పేలుడువస్తువులతో కూడిన బాంబును పేల్చడంతో మంటలు ఎగసిపడ్డాయి. కారుతో పాటు అతడు సజీవ దహనమయ్యారు. కళ్లంబెల్ల పోలీసులు చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అప్పు చేసి కారును కొని డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నానని, కళ్ల ముందే కాలిపోయిందని యజమాని ప్రవీణ్ విలపించాడు.
వీడియోలు
మా పైనే కేసులు పెడతారా.. టీడీపీ గుండాల దాడి పై అంబటి రాంబాబు ప్రెస్ మీట్
YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి
కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం
రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్స్ ..
బాహుబలి, RRR రేంజ్ లో రావు బహదూర్..
మా భూములు లాక్కోవడానికి నువ్వు ఎవడివి..? చంద్రబాబుపై పెనుమాక రైతుల ఆగ్రహం
పంతం బూతులకు పవన్ మద్దతు
ఓటర్లకు కొత్త టెన్షన్.. SIR వెనుక అసలు నిజం?
ఇంటి గృహప్రవేశం నాడే 40 మంది దుండగులు దాడి
రేయ్ JC... నా జోలికి రాకు! ఈసారి మాటలతో చెప్పను...


