బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్!
టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో పెద్ద బాంబు పేల్చాడు. కోచ్గా గంభీర్ను తొలగిస్తే టీమిండియాలో విపత్తు తప్పదంటూ బీసీసీఐని హెచ్చరించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్కు టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే గంభీర్ సారథ్యంలో భారత జట్టు మిశ్రమ ఫలితాలను అందుకుంది. చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టీ20 ప్రపంచకప్లు భారత్ గంభీర్ కోచ్గా ఉన్న సమయంలోనే వచ్చాయి. అయితే ఇదే సమయంలో జట్టులో సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం వెనుక గంభీర్ పాత్ర ఉందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. వన్డే, టీ20 ఫార్మాట్లో గంభీర్ కోచ్గా పర్వాలేదనిపించినప్పటికీ టెస్టు ఫార్మాట్లో దారుణంగా విఫలమవ్వడంతో అతన్ని కోచ్గా తప్పించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మునాఫ్ పటేల్ గంభీర్కు అండగా నిలిచాడు. మునాఫ్ పటేల్ మాట్లాడుతూ.. ‘గంభీర్ వంటి నిఖార్సైన వ్యక్తిని కోచ్ పదవి నుంచి తొలగిస్తే, భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లను మేనేజ్ చేయడం ఎవరికైనా చాలా కష్టమవుతుంది. గంభీర్ అత్యంత నిజాయితీ గల వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడే అతని తత్వాన్ని అందరూ ఇష్టపడరు. కానీ జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలనైనా తీసుకోవడానికి వెనుకాడరు. ముఖ్యంగా జట్టులో క్రమశిక్షణ తప్పినా లేదా ఆటగాళ్లు సరిగ్గా రాణించకపోయినా, వారిని జట్టు నుంచి తప్పించే ధైర్యం గంభీరకు ఉంది. విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లకు 'నో' చెప్పడం అంత తేలికైన విషయం కాదు. తన కఠిన నిర్ణయాలతో శత్రువులను కూడా పెంచుకున్నాడు. అయితే కోచ్గా తన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని మాత్రం బలంగా చెప్పగలను.’ అని మునాఫ్ వెల్లడించాడు. ఎన్సీఏ క్రికెట్ అకాడమీలో సౌకర్యాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోందని మునాఫ్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రాక్టీస్, రీహాబిలిటేషన్ సెంటర్ సహా ఇతర కార్యక్రమాలకు వినియోగించే ఎన్సీఏ అకాడమీలో ప్రస్తుతం బలమైన వ్యవస్థ కనిపించడం లేదని తెలిపాడు. వెంటనే ఎన్సీఏ అకాడమీని పటిష్టపరిచేందుకు బీసీసీఐ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఫిజియోథెరపిస్టులు, కోచ్లు, సరైన శిక్షణ వంటి ప్రాథమిక సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని మునాఫ్ వెల్లడించాడు. కాగా దేశ వ్యాప్తంగా క్రికెట్ ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో బీసీసీఐ 2000 సంవత్సరంలో బెంగళూరు కేంద్రంగా ఎన్సీఏ అకాడమీని స్థాపించింది. ప్రస్తుతం మునాఫ్ పటేల్ ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, నాలుగు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: సంచలన నిర్ణయం.. 32 ఏళ్లకే రిటైర్మెంట్!
కుప్పం పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, చిత్తూరు జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కుప్పం పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టు నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే కుప్పం డీఎస్పీ పార్ధసారధి అనుమతి ఇవ్వకపోవడంతో మోహిత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పూడి శ్రీహరి గారు ఎలా ఉన్నారో చూడాలని అడిగితే అనుమతి ఇవ్వడం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి మాకు ఆందోళన కలిగిస్తోంది. పబ్లిక్ సర్వెంట్ ఇలా మాట్లాడటం బాధాకరం. తిరుచానూరు ఘటనపై కోర్టు ఇప్పటికే పోలీసు అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. చంద్రబాబు మానవ హక్కుల గురించి మాట్లాడుతారు. కానీ కుప్పం మీ ఇలాకాలో జరుగుతున్నది ఏంటి? వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు ఆపాలి. లేని పక్షంలో కుప్పం నుంచే ఆందోళన చేస్తామని మోహిత్ రెడ్డి హెచ్చరించారు.
అందుకు చైనా అంగీకరించింది.. ట్రంప్ ఆసక్తికర పోస్ట్
హర్మూజ్ జలసంధి దిగ్బంధనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ను శాశ్వతంగా తెరిచి ఉంచుతాం.. దీంతో చైనాతో పాటు ప్రపంచమంతా లాభపడుతుంది. మా నిర్ణయం పట్ల చైనా సంతోషంగా ఉంది. ఇరాన్కు ఆయుధాలు ఇవ్వబోమని చైనా చెప్పింది.’’ అంటూ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ కీలకమైన జలసంధి ఇకపై ఎన్నడూ మూతపడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అయితే, తాము ఇరాన్కు ఎలాంటి సైనిక సహకారం అందించడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గత కొన్ని రోజులుగా పదేపదే ఖండిస్తోన్న సంగతి తెలిసిందే. చైనా చాలా కాలంగా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్కు మద్దతు ఇస్తోందని.. క్షిపణుల తయారీలో ఉపయోగపడే ద్వంద్వ-వినియోగ పారిశ్రామిక భాగాలను సరఫరా చేయడం ద్వారా ఇరాన్ను ప్రోత్సహిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా దౌత్యపరమైన జోక్యాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తాజాగా నాలుగు అంశాల ప్రణాళికను ప్రతిపాదించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చైనా ఈ ప్రతిపాదన చేసింది.మరోవైపు, రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఇరాన్తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని.. త్వరలోనే ముగుస్తుందని నేను భావిస్తున్నాన్నారు. అయితే, ఇరాన్తో సంఘర్షణలో అమెరికా పని ఇంకా ముగియలేదు...కానీ, యుద్ధం కారణంగా ఇరాన్ భారీగా నష్టపోయింది. నేను వెళ్లిపోతే ఇరాన్ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు సమయం పడుతుంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే వారిని సర్ అని పిలవాల్సి వచ్చేంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. వారు ఒక ఒప్పందం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.
డీలిమిటేషన్పై కేంద్రం క్లారిటీ
ఢిల్లీ: డీలిమిటేషన్పై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ఉన్న సీట్లకు 50 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. బిల్లులో ఈ విషయం స్పష్టంగా ఉందన్న సమాచార శాఖ.. పార్లమెంట్ చర్చ సందర్భంగా మరింత క్లారిటీ ఇస్తామని తెలిపింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఢిలిమిటేషన్ ఉంటుందన్న అపోహలను కేంద్రం కొట్టిపారేసింది. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.తమిళనాడులో 58కి, కేరళంలో 30కి పెరుగుతాయన్న కేంద్రం.. డీలిమిటేషన్తో దక్షిణాదిలో సీట్లు తగ్గవని తెలిపింది. రాష్ట్రాలకు చట్టబద్ద రక్షణ ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బిల్లులోని అంశాలను ముక్కలుగా చదవి విశ్లేషించొద్దని కేంద్రం పేర్కొంది. 2029 లోక్సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, అందుకోసం లోక్సభ స్థానాలను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.డీలిమిటేషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజాగా జరుగుతున్న జనగణన ప్రాతిపదికన జరగాలని ఆప్, ఆర్జేడీ వంటి పార్టీలు డిమండ్ చేస్తున్నాయి. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు విపక్షాల మద్దుతు మోదీ ప్రభుత్వానికి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.రేపటి (ఏప్రిల్ 16, గురువారం) నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే మోదీ సర్కారు హడావుడిగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలను తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. మరోవైపు డీలిమిటేషన్తో తమకు తీవ్ర అన్యాయం జరగనుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ఈ ప్రక్రియను పార్లమెంటులోనే సవాలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి.
కుప్పం పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ ఆందోళన
విరాట్ కోహ్లి అరుదైన ఫీట్!
కోహ్లి, రసిక్ సలామ్ మెరుపులు.. ఆర్సీబీ ఘన విజయం
మిచెల్ మార్ష్ కళ్లు చెదిరే సిక్సర్!
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల.. ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల..!
స్కూల్లో కాల్పులు.. 9 మంది మృతి
ఇరాన్పై చరిత్రలోనే క్లిష్టమైన సైనిక ఆపరేషన్కు ట్రంప్ భారీ ప్లాన్?
దుబాయ్లో అక్షయ తృతీయ.. బంగారంపై భారీ ఆఫర్లు!
హాజిల్వుడ్ దెబ్బ.. పంత్ అబ్బ!
న్యాయం కోసం 12 గంటలపాటు నిరసన దీక్ష: అంబటి
న్యాయం చేయండి.. తప్పు చేస్తే శిక్షించండి.. సజ్జనార్తో మంగ్లీ
కీలక పదవి దక్కిన వెంటనే ఈడీ రైడ్స్!
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
సూర్యకుమార్ యాదవ్పై వేటు!
వార్డుల్లో పోటీ చేయడానికే అభ్యర్థులు దొరక్కపోతే రేపు ఎమ్మెల్యే ఎన్నికల్లో మన పరిస్థితి ఏంటి సార్!!
రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!
సుపరిపాలనపై ఏపీ మంత్రులకు సింగపూర్లో శిక్షణ
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
‘నూకలు’ చెల్లిన కలుపు!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు!
ఈ నెలలోనే ఆర్టీసీ సమ్మె సైరన్
అసంతృప్తిలో వైభవ్
తినడానికి కూడా లేనప్పుడే నా చేయి పట్టుకుంది: కిరణ్ అబ్బవరం
బంగారం ధరలు సలసల!
యుద్ధం వేళ మోదీకి ట్రంప్ ఫోన్.. ఏకంగా 40 నిమిషాలు..
PSL: పీసీబీ పరువు తీసిన పాకిస్తాన్ క్రికెటర్
కంజూస్ డాక్టర్
హైదరాబాద్ – తిరుపతి... విమానయానం సామాన్యుడికి గగనమే
ఓటీటీలో ఇన్వెస్టిగేటివ్ కోర్ట్రూమ్ డ్రామా సినిమా
కుప్పం పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ ఆందోళన
విరాట్ కోహ్లి అరుదైన ఫీట్!
కోహ్లి, రసిక్ సలామ్ మెరుపులు.. ఆర్సీబీ ఘన విజయం
మిచెల్ మార్ష్ కళ్లు చెదిరే సిక్సర్!
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల.. ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల..!
స్కూల్లో కాల్పులు.. 9 మంది మృతి
ఇరాన్పై చరిత్రలోనే క్లిష్టమైన సైనిక ఆపరేషన్కు ట్రంప్ భారీ ప్లాన్?
దుబాయ్లో అక్షయ తృతీయ.. బంగారంపై భారీ ఆఫర్లు!
హాజిల్వుడ్ దెబ్బ.. పంత్ అబ్బ!
న్యాయం కోసం 12 గంటలపాటు నిరసన దీక్ష: అంబటి
న్యాయం చేయండి.. తప్పు చేస్తే శిక్షించండి.. సజ్జనార్తో మంగ్లీ
కీలక పదవి దక్కిన వెంటనే ఈడీ రైడ్స్!
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
సూర్యకుమార్ యాదవ్పై వేటు!
వార్డుల్లో పోటీ చేయడానికే అభ్యర్థులు దొరక్కపోతే రేపు ఎమ్మెల్యే ఎన్నికల్లో మన పరిస్థితి ఏంటి సార్!!
రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!
సుపరిపాలనపై ఏపీ మంత్రులకు సింగపూర్లో శిక్షణ
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
‘నూకలు’ చెల్లిన కలుపు!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు!
ఈ నెలలోనే ఆర్టీసీ సమ్మె సైరన్
అసంతృప్తిలో వైభవ్
తినడానికి కూడా లేనప్పుడే నా చేయి పట్టుకుంది: కిరణ్ అబ్బవరం
బంగారం ధరలు సలసల!
యుద్ధం వేళ మోదీకి ట్రంప్ ఫోన్.. ఏకంగా 40 నిమిషాలు..
PSL: పీసీబీ పరువు తీసిన పాకిస్తాన్ క్రికెటర్
కంజూస్ డాక్టర్
హైదరాబాద్ – తిరుపతి... విమానయానం సామాన్యుడికి గగనమే
ఓటీటీలో ఇన్వెస్టిగేటివ్ కోర్ట్రూమ్ డ్రామా సినిమా
ఫొటోలు
అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)
మత్స్యకారులతో వైఎస్ జగన్ మమేకం (ఫొటోలు)
తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)
'తిమ్మరాజుపల్లి టీవీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
మెరిసిపోతున్న నభా నటేశ్ (ఫొటోలు)
బ్లాక్ శారీలో మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)
హైదరాబాద్ : నెహ్రూ జూ పార్కులోని మూగజీవులకు వేసవి తాపం (ఫొటోలు)
హైదరాబాద్ : అమీర్పేటలో ఉత్సాహంగా విశాల్ దివస్ (ఫొటోలు)
సూపర్ స్టార్ బాటలో మహేశ్ బాబు.. ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్స్ (ఫోటోలు)
సినిమా
రావు బహదూర్ మూవీ.. ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ హీరో సత్యదేవ్ నటిస్తోన్న తాజా చిత్రం రావు బహదూర్. ఈ సినిమాలో దీపా థామస్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని సైకలాజికల్ థ్రిల్లర్గా తెరెకెక్కిస్తున్నారు. ఈ మూవీకి వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో సూపర్ హిట్స్గా నిలిచాయి. ఈ చిత్రాన్ని మహేశ్బాబు, నమ్రాతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో.. ఏప్లస్ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఓ సుందరి అంటూ సాగే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. ఈ పాటకు రెహమాన్ లిరిక్స్ అందిచగా.. విజయ్ యేసుదాస్ ఆలపించారు. ఈ పాటను స్మరణ్ సాయి కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రావు బహదూర్ చిత్రం ఈ ఏడాది సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల.. ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల..!
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల హోయలు..డెకాయిట్ మూడ్లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్..ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల అందాలు..కర్లింగ్ జుట్టుతో మంజరి ఫడ్నవీస్ బ్యూటీఫుల్ లుక్..సాగర తీరాన బాలీవుడ్ భామ సన్నీ లియోన్ చిల్..బాలీవుడ్ భామ సురభి జ్యోతి బేబీ బంప్ ఫోజులు.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur)
మలయాళ బ్లాక్బస్టర్.. తెలుగులోనూ రిలీజ్
మలయాళ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ ఇప్పటికే ది గోట్ లైఫ్ ఆల్ టైమ్ వసూళ్లు అధిగమించింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో టాప్-6 ప్లేస్లో నిలిచింది. ఏప్రిల్ 2న రిలీజైన ఈ సినిమా రూ. 180 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి టాలీవుడ్ నిర్మాత సాహు గారపాటి కూడా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నట్లు షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ ఏప్రిల్ 24న తెలుగులో విడుదల కానుందని వాళా-2 పోస్టర్ను రిలీజ్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, బిజు కుట్టన్, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్, అమీన్, ఏంజెల్ కీలక పాత్రల్లో నటించారు.వాళాకు సీక్వెల్..2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు విపిన్ దాస్ కథ అందించారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. వాళా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థమట. ఏ పని లేకుండా సోమరిగా తిరిగేవాళ్లను ఇదే పేరుతో పిలుస్తారట. The laughter, the chaos, the brotherhood… now in Telugu.After emerging as the biggest Malayalam blockbuster of 2026, #Vaazha2 is all set to arrive for the Telugu audience on April 24th ❤️🔥Get ready to experience this sensational blockbuster on the big screens 🎬… pic.twitter.com/NpJ0R4gfMC— Shine Screens (@Shine_Screens) April 15, 2026
పళ్లి చట్టంబి రిలీజ్ వాయిదా.. కారణమదే..!
మలయాళ హీరో టొవినో థామస్ నటించిన తాజా చిత్రం పళ్లి చట్టంబి. ఈ మూవీలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ముందుగా చెప్పిన ప్రకారం ఈ రోజే సినిమా విడుదల కావాల్సి ఉంది.మలయాళంలో మాత్రం ఈ రోజే విడుదల చేసిన మేకర్స్.. తెలుగు విడుదల వాయిదా వేశారు. టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఈ నెల 17న రానుంది. సాంకేతిక సమస్యస కారణంగానే ఈ మూవీ తెలుగు రిలీజ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బన్ని వాస్ వర్క్స్ పతాకంపై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 17న విడుదల చేస్తామని తాజాగా ప్రకటించారు.కాగా.. ఈ చిత్రంలో విజయ్ రాఘవన్, సుధీర్, బాబురాజ్ కీలకపాత్రలు పోషించారు. 1950-60ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
క్రీడలు
‘ఏ క్షణమైనా బ్రెయిన్స్ట్రోక్.. సిగరెట్లు అడుక్కుంటున్నాడు’
వినోద్ కాంబ్లి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 90వ దశకంలో భారత క్రికెట్ వర్గాల్లో అతడి పేరు మారుమ్రోగిపోయింది. అతడి చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండుల్కర్కు కాంబ్లీని పోటీగా భావించేవారు.అయితే, సచిన్ అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా దిగ్గజంగా నీరాజనాలు అందుకునే స్థాయికి చేరుకోగా.. చెడు వ్యసనాల వల్ల కాంబ్లీ కెరీర్ నాశనమైంది. ముఖ్యంగా మితిమీరిన స్థాయిలో మద్యం తాగడం అతడి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి.మూత్రనాళ ఇన్ఫెక్షన్ఈ క్రమంలో 2024 డిసెంబరులో వినోద్ కాంబ్లీ మూత్రనాళ ఇన్ఫెక్షన్తో థానెలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. వైద్యానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో.. 1983లో టీమిండియాకు తొలిసారి వరల్డ్కప్ అందించిన భారత క్రికెటర్ల బృందం అతడికి ఆర్థికంగా సాయం చేసింది. కాంబ్లీ స్థానిక స్నేహితులు సైతం అతడికి అండగా నిలిచారు.ఆర్థిక సాయం అందిస్తున్నాంఅయితే, కాంబ్లీ ఇంత వరకు పూర్తి స్థాయిలో కోలుకోనేలేదు. ఈ నేపథ్యంలో వినోద్ కాంబ్లీ స్నేహితుడు మార్కస్ కౌటో తాజాగా షాకింగ్ విషయం వెల్లడించాడు. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘మా స్నేహితులందరినీ ఒక్క చోట చేర్చేలా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. అందులో చాలా మంది క్రికెటర్లే ఉన్నారు. కాంబ్లీకి మేమంతా ఆర్థికంగా సాయం అందిస్తున్నాం.గత ఆరు నెలలుగా కాంబ్లీ జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గిపోయింది. రోజురోజుకీ తన పరిస్థితి దిగజారిపోతోంది. వినోద్ మెదడులో రక్తం గడ్డ కట్టింది. అయితే, ఇప్పుడు ఆ గడ్డను తీసేస్తే ప్రాణాలకే ప్రమాదం అట. అతడు ముందుజాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి సర్జరీ కష్టం అన్నారు.ఏ క్షణాన్నైనా బ్రెయిన్స్ట్రోక్ దాని వల్ల ఏ క్షణాన్నైనా వినోద్కు బ్రెయిన్స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. అయితే, అతడి మనో సంకల్పం వల్ల ఇప్పటికైతే పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. వినోద్ ఇప్పటికే మద్యం మానేశాడు.సిగరెట్లు అడుక్కుంటున్నాడుఅయితే, సిగరెట్ తాగే అలవాటు మానుకోలేక సతమతమవుతున్నాడు. ఆటో డ్రైవర్లను కూడా సిగరెట్లు అడుగుతున్నారు. వాళ్లు కూడా సరేనని.. వినోద్ కాంబ్లీతో మాట్లాడే అవకాశం వచ్చిందని సంబరపడుతున్నారు. కానీ.. తమ వల్ల అతడి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసుకోలేకపోతున్నారు’’ అని మార్కస్ చెప్పుకొచ్చాడు. చదవండి: సూర్యకు బైబై!.. భారత టీ20 కెప్టెన్.. టాప్-5 ప్లేయర్లు వీరే!
ధోని ఆగమనం.. అతడిపై వేటు తప్పదా!
ఐపీఎల్ 2026 సీజన్లో రెండు వరుస విజయాలతో జోష్ మీద కనిపిస్తున్న చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తన్న ధోని ఎంట్రీకి సంబంధించి సీఎస్కే యాజమాన్యం కీలక అప్డేట్ ఇచ్చింది. తాజా సమాచారం మేరకు అనుకున్నదానికంటే ముందుగానే ధోని సీఎస్కే జట్టుతో జాయిన్ అవ్వనున్నాడు. ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్తో జరగనున్న మ్యాచ్లో ధోని బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కండరాల గాయంతో టోర్నీలో సీఎస్కే ఆడిన తొలి మూడు మ్యాచ్లకు దూరంగా ఉన్న ధోని కేకేఆర్తో జరిగిన నాలుగో మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని అంతా భావించారు. ధోని ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా బయటికి వచ్చాయి. కానీ ధోని కేకేఆర్తో మ్యాచ్లో ఆడలేదు. కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ధోని ఏప్రిల్ 18న సన్రైజర్స్తో మ్యాచ్లో ఆడతాడా లేదా అన్నది స్పష్టంగా తెలియదు. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్కు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడైపోయాయి. అయితే ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో మాత్రం కచ్చితంగా బరిలోకి దిగనున్నాడు.సర్ఫరాజ్ స్థానానికి ఎసరు?అయితే ధోని జట్టులోకి రానుండడంతో ఎవరు తమ స్థానాన్ని త్యాగం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. శాంసన్, ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబేలను పక్కనబెట్టే సాహసం చేయకపోవచ్చు. కాబట్టి సీఎస్కే ముందున్న ఆప్షన్ సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే. ఈ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. పరుగులు సాధిస్తున్నప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. దీంతో ధోని జట్టులోకి వస్తే సర్ఫరాజ్ ఖాన్పై వేటు పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సీఎస్కే సీజన్లో ఐదు మ్యాచ్లాడి రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.చదవండి: బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్!
IPL 2026: లక్నోపై ఆర్సీబీ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోరర్గా నిలవగా, పటిదార్ (27), జితేశ్ శర్మ (23) రాణించారు. మధ్యలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినప్పటికీ చివర్లో టిమ్ డేవిడ్ (14 నాటౌట్), షెపర్డ్ (14 నాటౌట్)_ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, అవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు. లక్నోతో మ్యాచ్లో ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన జితేశ్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ముకుల్ చౌదరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అంతకముందు 49 పరుగులు చేసిన కోహ్లి అవేశ్ ఖాన్ బౌలింగ్లో పూరన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పడిక్కల్ (10) రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. అవేశ్ఖాన్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన పడిక్కల్ హిమ్మత్ సింగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. కోహ్లి (45), పటిదార్ (7) క్రీజులో ఉన్నారు.కోహ్లి దూకుడు..లక్నోతో మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి దంచికొడుతున్నాడు. బౌండరీల వర్షం కురిపిస్తున్న కోహ్లి 20 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 40 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.147 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఫిల్ సాల్ట్ (7) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో సాల్ట్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. కోహ్లి (12), పడిక్కల్ (5) క్రీజులో ఉన్నారు.ఆర్సీబీ టార్గెట్ 147 పరుగులుఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (40) టాప్ స్కోరర్గా నిలవగా.. ముకుల్ చౌదరీ (39), ఆయుశ్ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్ సలామ్ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. కాగా లక్నోతో మ్యాచ్లో కృనాల్ ఐపీఎల్లో వంద వికెట్ల మార్క్ను చేరుకున్నాడు.పంత్ ఔట్..లక్నో సూపర్జెయింట్స్ ఆరో వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన పంత్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో సాల్ట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 17 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. 16 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ముకుల్ రాయ్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. హాజిల్వుడ్ బౌలింగ్లో గాయపడిన పంత్ మరోసారి బ్యాటింగ్కు వచ్చాడు.నాలుగు వికెట్లు డౌన్ లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో రజత్ పటీదార్కు క్యాచ్ ఇచ్చుకుని అబ్దుల్ సమద్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం స్కోరు 12 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 90గా ఉంది. లక్నో మూడో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో మిచెల్ మార్ష్ బౌల్డ్ అయ్యాడు. 35 బాల్స్ ఆడిన కృనాల్ పాండ్యా 2 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 40 పరులుగు బాదాడు. ప్రస్తుతం స్కోరు 10 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 75గా ఉంది. లక్నో సూపర్జెయింట్స్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో పూరన్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం లక్నో 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది.ఆర్సీబీతో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ కెప్టెన్ పంత్ గాయానికి గురయ్యాడు. హాజిల్వుడ్ వేసిన బంతి పంత్ మోచేతిని బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్ను ఫిజియో పరీక్షించాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మైదానం వీడాడు. ప్రస్తుతం లక్నో 6 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది.తొలి వికెట్ కోల్పోయిన లక్నోఆర్సీబీతో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మార్కరమ్ రషీక్ సలామ్ బౌలింగ్లో పడిక్కల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టపోయి 32 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), లక్నో సూపర్జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్లో ఆర్సీబీ, లక్నోలు ఇప్పటివరకు ముఖాముఖి పోరులో 6 సార్లు తలపడగా.. నాలుగుసార్లు ఆర్సీబీ, రెండుసార్లు లక్నో సూపర్జెయింట్స్ విజయాలు సాధించాయి. అయితే చిన్నస్వామి స్టేడియంలో తలపడిన రెండు సందర్భాల్లో ఇరుజట్లు చెరొక మ్యాచ్ నెగ్గాయి.ఆర్సీబీ తుదిజట్టు: ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ.లక్నో తుది జట్టు: మార్కరమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.
సూర్యకు బైబై!.. భారత టీ20 కెప్టెన్గా ఎవరంటే?!
సొంతగడ్డపై టీమిండియాకు ఇటీవల టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అయితే, అతడి భవితవ్యంపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా సారథిగా సూపర్ హిట్ అవుతున్నా.. బ్యాటర్గా మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు.ఈ నేపథ్యంలో సెలక్టర్లు సైతం సూర్యను కొనసాగించాలా వద్దా? అన్న అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ ముగిసిన వెంటనే జరిగే ఐర్లాండ్, ఇంగ్లండ్తో సిరీస్లలో అతడి ప్రదర్శనను పరిశీలించిన అనంతరమే వారు అంతిమ నిర్ణయానికి రానున్నారు.వచ్చే రెండేళ్లలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ (2028)తో పాటు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (2028) జరగనున్నాయి. వీటికి సూర్యకుమార్ సారథ్యంలోనే సిద్ధం కావాలా లేక కొత్త నాయకుడిని ఎంపిక చేయాలా అనే విషయంపై సెలక్టర్లు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనతో ఒక అవగాహనకు రానున్నారు.విషమ పరీక్షఈ టూర్లో అటు సారథిగా, ఇటు ప్లేయర్గా సూర్యకుమార్కు విషమ పరీక్ష కానుంది. గౌతమ్ గంభీర్ 2028 ఒలింపిక్స్ వరకు టీమిండియా హెడ్కోచ్గా కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో... సూర్యకుమార్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం 35వ పడిలో ఉన్న సూర్యకుమార్ ఒలింపిక్స్ సమయానికి ఫిట్గా ఉంటాడా అనేది అనుమానమే.‘సూర్యకుమార్ ప్రస్తుతం జట్టును నడిపిస్తున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు అతడే కెప్టెన్ అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది అందులో అతడి ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.గతేడాది పేలవ ఆటతీరు కనబర్చిన సూర్యకుమార్ కనీసం ఒక్క హాఫ్సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఈ ఏడాది ఫర్వాలేదినిపించిన ఈ ముంబైకర్... వరల్డ్కప్ ఆరంభంలో ఆకట్టుకున్నా... కీలక మ్యాచ్ల్లో మాత్రం విఫలమయ్యాడు. సౌతాఫ్రికాపై 18 పరుగులు, వెస్టిండీస్పై 18 పరుగులు, ఇంగ్లండ్పై 11 పరుగులు చేసిన సూర్యకుమార్... న్యూజిలాండ్తో ఫైనల్లో డకౌటయ్యాడు. ఒకవేళ సూర్యను సెలక్టర్లు తప్పిస్తే.. అతడి స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్ కాగల అర్హత ఉన్న టాప్-5 ఆటగాళ్లు ఎవరో తెలుసా?శుబ్మన్ గిల్ఇప్పటికే టీమిండియా టెస్టు, వన్డే పగ్గాలు చేపట్టాడు శుబ్మన్ గిల్. అయితే, టీ20 జట్టు కెప్టెన్సీ విషయంలో మాత్రం బీసీసీఐ గిల్ గురించి వెంటనే నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఆసియా కప్-2025తో టీ20 జట్టులో పునరాగమనం చేసిన అతడు వరుసగా విఫలం కావడం ఇందుకు కారణం.అయితే, ఐపీఎల్-2026లో గనుక బ్యాటర్గా గిల్ సత్తా చాటితే అతడి ఎంపిక లాంఛనమే అవుతుంది. కాగా ఫామ్లేమి కారణంగా గిల్ను టీ20 ప్రపంచకప్-2026 జట్టు నుంచి సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే.హార్దిక్ పాండ్యానిజానికి 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ ఫార్మాట్కు గుడ్బై చెప్పిన తర్వాత కెప్టెన్ కావాల్సింది హార్దిక్ పాండ్యానే. అయితే, అనూహ్యంగా యాజమాన్యం సూర్యకు పగ్గాలు అప్పగించింది.ఆ సమయంలో.. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాపై అధిక భారం పడకుండా.. తాము ఈ నిర్ణయం తీసుకున్నటుట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. కాబట్టి సూర్య స్థానంలో హార్దిక్ను సారథిగా ఎంపిక చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశం. ఐపీఎల్లో కెప్టెన్గా అతడికి అనుభవం ఉంది.సంజూ శాంసన్జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయిన సంజూ శాంసన్... టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించి హీరో అయ్యాడు. సూపర్-8 నాకౌట్ మ్యాచ్లో వెస్టిండీస్పై 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ కేరళ వికెట్ బ్యాటర్.. ఇంగ్లండ్తో సెమీస్లో 89, న్యూజిలాండ్తో ఫైనల్లో 89 రన్స్తో దుమ్ములేపాడు.ఇక ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు సుదీర్ఘకాలం కెప్టెన్గా పనిచేసిన అనుభవం సంజూకు ఉంది. కేరళ జట్టుకు కూడా గతంలో అతడు సారథ్యం వహించాడు.అక్షర్ పటేల్టీ20 వరల్డ్కప్-2026లో టీమిండియా వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు ఆల్రౌండర్ అక్షర్ పటేల్. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున సారథిగానూ అతడు సత్తా చాటుతున్నాడు. సూర్య వారసుడిగా అక్షర్ ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు.శ్రేయస్ అయ్యర్ముంబై సారథిగా, ఐపీఎల్లో వివిధ జట్ల కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు అపార అనుభవం ఉంది. 2024లో అతడి సారథ్యంలోనే కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలిచింది. గతేడాది పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా, బ్యాటర్గా ఇరగదీసి ఫైనల్కు చేర్చాడు. అయితే, 2023 డిసెంబరు తర్వాత ఇంత వరకు అతడు భారత టీ20 జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా త్వరలోనే జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.చదవండి: PSL: అక్కడ వద్దంటేనే ఇక్కడికి: పీసీబీ పరువు తీసిన పాక్ క్రికెటర్
న్యూస్ పాడ్కాస్ట్
చట్టసభల్లో చారిత్రక మలుపు... లోక్సభ స్థానాలు 850కి పెంపు... రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం... డిమాండ్లపై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్... అణ్వాయుధాలు, హార్మూజ్పైనే పీటముడి
ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు షురూ. మరో దఫా చర్చించే అవకాశం
భారీగా పడిపోతున్న బంగారం ధరలు
అమరావతిలో నీకింత.. నాకింత... ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన ‘బీఎస్సార్’కు రాజధానిలో భారీగా పనుల అప్పగింత
ఆంధ్రప్రదేశ్లో ‘సీఎంఆర్ఎఫ్’ నిధులు స్వాహా... టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి సీఎంవో వరకూ వసూళ్ల పర్వం
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మావిగన్.. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు: వైఎస్ జగన్
ఇరాన్ను తుడిచిపెట్టేస్తాం, వారి నాగరికతను నాశనం చేస్తాం. తీవ్రంగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
మళ్లీ పెరిగిన వెండి, బంగారం ధరలు
బిజినెస్
మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 517 కి.మీ. రేంజ్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్లోకి తన మూడవ మోడల్ ‘వీఎఫ్ ఎంపీవీ 7’ (VF MPV 7)ను అధికారికంగా విడుదల చేసింది. వినూత్న ఫీచర్లు, శక్తివంతమైన రేంజ్తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధరను రూ. 24.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా సంస్థ నిర్ణయించింది. ప్రధానంగా ఫ్లీట్ (Commercial) ఆపరేటర్లను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు.బుకింగ్స్ ప్రారంభంవిన్ఫాస్ట్ ‘వీఎఫ్ ఎంపీవీ 7’ కారు అమ్మకాలకు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కారు కొనే ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ. 21,000 టోకెన్ మొత్తంతో బుకింగ్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది చివర్లో 'లిమో గ్రీన్' పేరుతో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి కమర్షియల్ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది.డిజైన్‘వీఎఫ్ ఎంపీవీ 7’ మోడల్ అధునాతన డిజైన్ లాంగ్వేజ్తో ఆకట్టుకుంటోంది. దీని కొలతలు చూస్తే 4,740 మిమీ పొడవు, 1,872 మిమీ వెడల్పు, 1,734 మిమీ ఎత్తు ఉంటుంది. ఏకంగా 1,240 లీటర్ల భారీ స్టోరేజ్ సామర్థ్యం(బూట్ స్పేస్) ఇచ్చారు.ఎక్స్టీరియర్ముందు భాగంలో విన్ఫాస్ట్ సిగ్నేచర్ "V" లోగోతో కూడిన ఎల్ఈడీ డీఆర్ఎల్లు, నిలువుగా ఉండే హెడ్ ల్యాంప్స్ దీనికి ప్రత్యేక లుక్ని ఇస్తాయి. 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక వైపు కారు వెడల్పు పొడవునా ఉండే టెయిల్ లైట్లు దీని ప్రధాన ఆకర్షణ.ఇంటీరియర్, ఫీచర్లుక్యాబిన్ లోపల ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతికతను జోడించారు. 10.1-అంగుళాల భారీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, లెథరెట్ ఇంటీరియర్, USB-A, USB-C ఛార్జింగ్ పోర్ట్లు ఇచ్చారు. ఇక ఆల్-డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆటో హోల్డ్ ఫీచర్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయి.పవర్ట్రైన్, పర్ఫార్మెన్స్ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీలో 60.1 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 517 కిలోమీటర్ల (ARAI గుర్తింపు పొందిన) ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. 201 హెచ్పీ శక్తిని, 280 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 9 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. ఇది మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్ ఆప్షన్లతో లభిస్తుంది.
పాటలు వింటూ రైలులో ప్రయాణిస్తున్నారా? జాగ్రత్త!
రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ, ఫోన్లో గట్టిగా మాట్లాడుతూ పాటలు వినే అలవాటు మీకు ఉందా? అయితే ఇకపై మీ పద్ధతి మార్చుకోవాల్సిందే. లేదంటే మీరు భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే తన నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రధానంగా రాత్రి సమయాల్లో ప్రయాణికుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు.. క్వైట్ అవర్స్రైల్వే శాఖ ఉత్తర్వుల ప్రకారం, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కింది నిబంధనలు అమల్లో ఉంటాయి.మొబైల్ ఫోన్లలో పాటలు వినాలన్నా లేదా వీడియోలు చూడాలన్నా కచ్చితంగా ఇయర్ఫోన్స్ లేదా హెడ్ఫోన్స్ వాడాలి. లౌడ్ స్పీకర్ ఆన్ చేయడం నిషిద్ధం.ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు పక్కవారికి ఇబ్బంది కలగకుండా తక్కువ స్వరంతో మాట్లాడాలి. గట్టిగా అరుస్తూ మాట్లాడితే రైల్వే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు.వ్యక్తిగత బెర్త్ లైట్లు మినహా కోచ్లోని మిగిలిన అన్ని లైట్లు ఆపివేయాలి. తద్వారా తోటి ప్రయాణికులకు నిద్రాభంగం కలగకుండా చూడాలి.ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలుఈ నిబంధనలు రిజర్వ్డ్ కోచ్ల్లో ప్రయాణించే అందరికీ వర్తిస్తాయి. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే బాధిత ప్రయాణికులు వెంటనే రైలులో అందుబాటులో ఉండే ఆర్పీఎస్ఎఫ్/ ఆర్పీఎఫ్ సిబ్బందికి లేదా టికెట్ కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చు. ‘ప్రయాణికుల ఫిర్యాదులపై సిబ్బంది తక్షణమే స్పందించాలి. నిబంధనలు అతిక్రమించే వారిపై రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు’ అని రైల్వే ఉన్నతాధికారుల ప్రకటనలో తెలిపారు.రైలు ప్రయాణాన్ని సుఖమయం చేయడంలో తోటి ప్రయాణికుల సహకారం ఎంతో అవసరం. కాబట్టి ప్రయాణికులు ఈ నియమాలను పాటించి చిక్కుల్లో పడకుండా జాగ్రత్త వహించాలని రైల్వే శాఖ కోరుతోంది. రాబోయే రోజుల్లో ఈ నిబంధనల అమలుపై మరింత నిఘా పెంచనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: బంగారం ధరలు సలసల!
ఎన్ఎస్ఈలో రికార్డు స్థాయిలో తగ్గిన యాక్టివ్ ఇన్వెస్టర్లు
స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో క్రియాశీల పెట్టుబడిదారుల (యాక్టివ్ ఇన్వెస్టర్లు) సంఖ్య రికార్డు స్థాయిలో పడిపోయింది. గడిచిన ఏడాది కాలంలో దాదాపు 35 లక్షల మంది ఇన్వెస్టర్లు ట్రేడింగ్కు దూరమయ్యారు. మూడేళ్ల తర్వాత ఇన్వెస్టర్ల బేస్లో తగ్గుదల నమోదు కావడం గమనార్హం.గణనీయంగా తగ్గిన క్లయింట్లుఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో 4.92 కోట్లుగా ఉన్న క్రియాశీల ఇన్వెస్టర్ల సంఖ్య 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి 7 శాతం క్షీణించి 4.58 కోట్లకు చేరుకుంది. ఈ పతనంలో దేశంలోని అగ్రశ్రేణి డిస్కౌంట్ బ్రోకర్లదే ప్రధాన వాటా కావడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం తగ్గుదలలో 70 శాతం వాటా కేవలం మూడు బ్రోకర్ల నుంచే ఉంది.జెరోధా.. అత్యధికంగా 9.95 లక్షల మంది యాక్టివ్ క్లయింట్లను కోల్పోయింది (మొత్తం పతనంలో 29%).ఏంజెల్ వన్.. 8.15 లక్షల మంది ఖాతాదారులు తగ్గారు (23%).అప్ స్టాక్స్.. 7.6 లక్షల మంది ఇన్వెస్టర్లు ట్రేడింగ్కు స్వస్తి చెప్పారు (22%).సాంప్రదాయ బ్రోకరేజీలైన హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, షేర్ఖాన్, మోతీలాల్ ఓస్వాల్ వంటి సంస్థలు కూడా లక్షకు పైగా క్లయింట్లను కోల్పోయాయి.పెట్టుబడిదారుల నిరాశకు కారణాలుయూఎస్-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు, ప్రపంచ వాణిజ్య వివాదాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి.ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటడం ద్రవ్యోల్బణ భయాలను పెంచింది.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) నిరంతరాయంగా నిధులను వెనక్కి తీసుకోవడం మార్కెట్ స్థిరత్వాన్ని దెబ్బతీసింది.కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోకపోవడం, అధిక వాల్యుయేషన్లు ఇన్వెస్టర్లను భయపెట్టాయి.ప్రాథమిక మార్కెట్లో (ఐపీఓ) వచ్చిన కంపెనీలు ఆశించిన స్థాయిలో రిటర్న్స్ ఇవ్వకపోవడంతో కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారు.గ్లోబల్ బ్రోకరేజీల ప్రతికూల రేటింగ్భారత ఈక్విటీ మార్కెట్లపై నోమురా, గోల్డ్మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ వంటి అంతర్జాతీయ సంస్థలు తమ రేటింగ్ను ‘తటస్థ’ (న్యూట్రల్) లేదా ‘అండర్ వెయిట్’కు తగ్గించాయి.
ఏప్రిల్ 20 నుంచి యూఎస్ టారిఫ్ రీఫండ్లు!
అమెరికా దిగుమతిదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గతంలో అక్రమంగా వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించేందుకు ఏప్రిల్ 20 (వచ్చే సోమవారం) నుంచి సరికొత్త వ్యవస్థను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సుమారు 166 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని దిగుమతిదారులకు వాపసు ఇచ్చే ప్రక్రియ వేగవంతం కానుంది.‘కేప్’ వ్యవస్థతో వేగంగా చెల్లింపులుయూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఈ రీఫండ్ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ‘కేప్’ అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన కోర్టు ఫైలింగ్లో ఏజెన్సీ అధికారి బ్రాండన్ లార్డ్ వివరాలను వెల్లడించారు. గతంలోలాగే ప్రతి ఎంట్రీకి విడివిడిగా కాకుండా, దిగుమతిదారులందరికీ వర్తించే వడ్డీతో కలిపి ఒకేసారి ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిధులు జమ చేస్తారు. ఈ వ్యవస్థను తొలుత దిగుమతి చేసుకున్న వస్తువులు, ఎటువంటి సాంకేతిక చిక్కులు లేని ఎంట్రీల కోసం వినియోగిస్తారు. సుమారు 2.9 బిలియన్ డాలర్ల విలువైన కొన్ని క్లిష్టమైన ఎంట్రీలకు మాన్యువల్ ప్రాసెసింగ్ అవసరమని, దీనివల్ల సిబ్బందిపై పనిభారం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం1977 నాటి ‘ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్’ను అడ్డుపెట్టుకుని ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జాతీయ అత్యవసర పరిస్థితుల పేరుతో అధ్యక్షుడు తన పరిధిని మించి వ్యవహరించారని కోర్టు తప్పుబట్టింది. చట్టబద్ధమైన పరిధిని దాటి విధించిన సుంకాలను తక్షణమే తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.కోర్టు పత్రాల ప్రకారం ఈ వ్యవహారంలో మొత్తం దిగుమతిదారులు 3.30 లక్షల మందికి పైగా ఉన్నారు. 53 మిలియన్ల దిగుమతి షిప్మెంట్లపై సుంకాలు వసూలు చేశారు. ఏప్రిల్ 9 నాటికి సుమారు 56,497 మంది దిగుమతిదారులు ఎలక్ట్రానిక్ వాపసు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. వీరి వాటా విలువ దాదాపు 127 బిలియన్ డాలర్లు.ఇదీ చదవండి: బంగారం ధరలు సలసల!
ఫ్యామిలీ
వాత్స్యాయన కామసూత్రాలకు కూచిపూడి నృత్యభాష్యం
లైంగిక అంశాలపై సమాజంలో అందరికీ ఆసక్తే. కానీ, లైంగిక విజ్ఞానమంటే పచ్చి బూతు, పరమ రోత అనుకొనే చిత్రమైన కుహనా విలువలతో కూడిన వ్యవస్థ మనది. విచిత్రం ఏమిటంటే, అసలు భారతీయ సమాజంలో లైంగిక విజ్ఞానం అనేక శతాబ్దాల క్రితం నుంచే ఓ అవిభాజ్యమైన భాగం. ధర్మ, అర్థ, కామములనే త్రివర్గాల ద్వారానే నాలుగో పురుషార్థమైన మోక్షాన్ని సాధించగలమని నమ్మిన సనాతన భారతీయ ధర్మం మనది. ధర్మ మార్గంలో అర్థాన్ని (ధనాన్ని) సంపాదించాలనీ, ఆ ధర్మబద్ధమైన అర్థం ద్వారా కామాన్ని (కోరికలను) తీర్చుకోవాలనీ, వెరసి ఆ త్రివర్గ సాధనే... మోక్షానికి మార్గమనీ మన ఋషిసత్తముల మాట. అలా క్రీ.శ. మూడో శతాబ్ద కాలంలోనే వాత్స్యాయనుడు ‘కామసూత్ర’ గ్రంథాన్ని అందించిన నేల మనది. అలాంటి కామసూత్ర విశేషాలను వేదికపై సంప్రదాయ కూచిపూడి నృత్య శైలిలో ప్రదర్శించే సాహసం చేస్తే?నాట్య, యోగశాస్త్రాల మేలు కలయికగా...హైదరాబాద్ రవీంద్రభారతి వేదికగా ఏప్రిల్ 13, సోమవారం సాయంత్రం అదే జరిగింది. ప్రసిద్ధ కూచిపూడి నాట్య కళాకారిణి, నాట్య గురువు స్వాతీ సోమనాథ్ తన శిష్య బృందంతో ‘అర్ధనారీశ్వరమ్’ (Ardhanareeswaram) పేరిట ఆ విలక్షణ సాహస ప్రయోగం చేశారు. ‘పద్మభూషణ్’ సుచిత్రా ఎల్లా, బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీ బి.పి. రావు, ‘సులభ్ ఇంటర్నేషనల్’ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, కళాపోషకురాలు ప్రవీణా యజ్ఞంభట్, ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు భాగవతుల సేతురామ్, ‘యక్షగాన కంఠీరవ’ పసుమర్తి శేషుబాబు, దేవదాసీ సంప్రదాయ నాట్యంలో దిట్ట యశోదా ఠాకూర్, కేంద్ర సంగీత – నాటక అకాడెమీ అవార్డు గ్రహీత దీర్ఘాసి విజయభాస్కర్, ప్రముఖ జర్నలిస్ట్ మహమ్మద్ రఫీ సహా వివిధ రంగాలలోని పలువురు ప్రముఖులు ఈ ప్రదర్శనకు హాజరై, ప్రశంసించారు.ఆనందమయ జీవితం గడపాలంటే, లైంగిక జీవితం ఆహ్లాదంగా సాగాలన్నది మొదటి మెట్టు. అయితే, ఆ కోరికను సైతం ధర్మబద్ధమైన మార్గంలో తీర్చుకోవడమే అసలు కీలకం. ఆ విషయాన్నే వివరిస్తూ... స్త్రీ పురుషులు ప్రకృతి – పరమేశ్వరులకు ప్రతీకలని గుర్తు చేస్తూ, వారి సంయోగం అర్ధనారీశ్వర తత్త్వానికి ప్రతిబింబమంటూ సాగిన అపురూప కూచిపూడి నృత్య రూపకం ‘అర్ధనారీశ్వరమ్’. భరతుని ‘నాట్యశాస్త్రం’లోని నృత్తాన్ని ఆసరాగా చేసుకొని, అటు ‘వాత్స్యాయన కామసూత్రాల’లోని కొన్ని ప్రధానాంశాలనూ, ఇటు ‘పతంజలి యోగశాస్త్రం’లోని యోగ భంగిమలనూ సమ్మిళితం చేసి, భారతీయ శాస్త్రీయ సంగీతంలోని సప్తస్వరాలు ఆలంబనగా, కూచిపూడి నృత్య శైలిలో ఎంతో శ్రమించి, స్వాతీ సోమనాథ్ ఈ డ్యాన్స్ బ్యాలేను రూపొందించారు.రెంటాల వారి ఆ ప్రామాణిక రచనే ఆధారంగా...వాత్స్యాయన కామసూత్రాలంటే ((Vatsayana Kamasutra) అదో అశ్లీల గ్రంథంగా పొరబడుతుంటారు. లైంగిక విజ్ఞానాన్ని శాస్త్రీయంగా అందించిన ఆ ప్రాచీన కామశాస్త్రానికి ఉన్నవీ లేనివీ చేర్చి, చౌకబారు నకిలీ అనుకరణలతో వచ్చిన చిల్లర పుస్తకాలే ఆ అపప్రథకు కారణం. “ప్రముఖ అభ్యుదయ కవి, ద్విశతాధిక గ్రంథకర్త, జర్నలిస్టు స్వర్గీయ రెంటాల గోపాలకృష్ణ (1920 – 1995) మాత్రం వాత్స్యాయనుడు రాసిన సంస్కృత సూత్రాలను యథాతథంగా అందిస్తూ, సులభంగా అందరికీ అర్థమయ్యేలా 1980లలోనే ఈ కామశాస్త్ర గ్రంథాన్ని తేటతెలుగులో ‘వాత్స్సాయన కామసూత్రాలు’ పేరిట అందించారు. ఈ నాట్య రూపక రచనకు ప్రామాణికమైన ఆ రచననే ఆధారంగా చేసుకున్నాం. ప్రఖ్యాత రచయిత – చిత్రకారుడు బ్నిమ్ (Bnim) గారు అలా ఈ నృత్య రూపక రచన చేశారు” అని నృత్య దర్శకురాలైన స్వాతీ సోమనాథ్ వివరించారు.“సృష్టికి మూలం సంయోగ భోగం... ప్రకృతీ పురుషుల మధుర సంగమం” అని బ్నిమ్ అందంగా చెప్పిన ఈ సాహసోపేత ప్రయోగానికి గరిమెళ్ళ గోపాలకృష్ణ సంగీతం అందించగా, ఎన్. సురేశ్ ప్రసాద్ సంగీత సారథ్యం వహించారు.కూచిపూడి నాట్య కళాకారిణిగా స్వాతీ సోమనాథ్ (Swathy Somanath) మొదటి నుంచి రంగస్థలంపై ఓ అగ్గిబరాటా. ‘ద్రౌపది’, ‘ఆది శంకరాచార్య’ లాంటి వైవిధ్యభరితమైన అంశాలను ఎంచుకొని, ఎప్పటికప్పుడు ప్రేక్షకులలో ఆలోచన రేపాలనుకోవడం ఆమె శైలి. నిజానికి, ఇప్పటికి 23 ఏళ్ళ క్రితం 2003లోనే ఆమె తొలిసారిగా ఈ వాత్స్యాయన కామసూత్రాలను సశాస్త్రీయంగా, సంప్రదాయబద్ధంగా, కూచిపూడి నృత్యశైలిలో వేదిక మీదకు తెచ్చారు. ఆ ‘కామసూత్ర’ నృత్య రూపకం అప్పట్లో ఓ సంచలనం. ఇలాంటి శృంగారభరిత అంశాలను రంగస్థలంపై నర్తించవచ్చా, అది కళకూ – సమాజానికీ ఏ రకంగా మేలు చేస్తుందంటూ విమర్శలూ వెల్లువెత్తాయి. అయితే, అసభ్యతకు తావివ్వని తన నృత్య రూపకంతోనే ఆ విమర్శలకు దీటుగా బదులిస్తూ, దేశ విదేశాల్లో అనేక చోట్ల స్వాతి ఆ ‘కామసూత్ర’ను ప్రదర్శించారు. “అప్పట్లో ఈ నాటకానికి సుశిక్షితులైన కూచిపూడి పురుష కళాకారులు నాకు అందుబాటులో లేరు. దాంతో, సినీ – టీవీ నటులు జె.ఎల్. శ్రీనివాస్, హీరో జాకీ లాంటి వారితో ప్రదర్శించి, రక్తి కట్టించాం. ఇప్పుడు దానికే కొద్దిగా మార్పులు, చేర్పులు చేసి, మరింత అందంగా తీర్చిదిద్ది, అందరూ సుశిక్షితులైన కూచిపూడి కళాకారులతోనే ‘అర్ధనారీశ్వరమ్’ పేరిట అందించాం. శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పిన మా ‘సంప్రదాయం’ కూచిపూడి గురుకులం ట్రస్ట్లో నా వద్ద ఎనిమిదేళ్ళుగా శిక్షణ పొందిన యువ శిష్య బృందంతోనే ఈ డ్యాన్స్ బ్యాలేను ప్రదర్శించాం” అని స్వాతి వివరించారు.మద్రాసుకు నాటి ‘కళాక్షేత్ర’... మనకు నేటి ‘సంప్రదాయం’దక్షిణాదిన వివిధ రాష్ట్రాల్లో సంప్రదాయ లలిత కళా శిక్షణకు విశిష్ట కేంద్రాలున్నాయి. మన తెలుగు నాట అలాంటివి కొంత అరుదే. అయితే, తమిళనాట మద్రాసు (నేటి చెన్నై)లోని రుక్మిణీ అరండేల్ ‘కళాక్షేత్ర’, కేరళలోని ‘కళామండలం’ లాగా కొన్నేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న అపురూప లలితకళా కేంద్రం ‘సంప్రదాయం’. శ్రీకాకుళంలోని కళ్ళేపల్లి గ్రామం వద్ద బంగాళాఖాతానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో, 12 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉంటుందీ గురుకుల శిక్షణ సంస్థ. ప్రపంచంలో గురుకుల పద్ధతిలో కొనసాగుతున్న ఏకైక కూచిపూడి నృత్య శిక్షణ కేంద్రం ఇది. జిల్లా కలెక్టరే చైర్మన్గా, తిరుమల తిరుపతి దేవస్థానమ్ కార్యనిర్వహణాధికారి సహా పలువురు ట్రస్టీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. 2015 నుంచి సాగుతున్న ఈ యజ్ఞంలో భాగంగా శిక్షణ పొందిన తొలి బ్యాచ్ విద్యార్థినీ విద్యార్థులే ఇప్పుడీ ‘అర్ధనారీశ్వరమ్’ రూపకాన్ని ప్రదర్శించారు. వారంతా అరకు, సీతంపేట సహా చుట్టుపక్కలి ప్రాంతాల్లో ఉండే గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన బాలబాలికలే. దిగువ మధ్యతరగతికి చెందిన తల్లితండ్రులు ఎంతో నమ్మకంతో అప్పగించిన ఆ పిల్లల్ని చాలీచాలని నిధులు, పేరుకుపోయిన బకాయిల మధ్యనే ఆ కేంద్రం అద్భుతంగా తీర్చిదిద్దింది. సామాన్య స్థాయి నుంచి వచ్చి మెరికల్లా తయారైన ఆ పిల్లలు ఇప్పుడు కూచిపూడిలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగారు.ఆలుమగలను ఆనందతీరాలు చేర్చే సూత్రాలుఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఆ యువ కళాకారులు తాజాగా హైదరాబాద్లో సోమవారం చూపిన నృత్య కౌశల ప్రదర్శనే అందుకు సజీవ సాక్ష్యం. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులతో నిండిన రవీంద్రభారతి ప్రాంగణం ఈ యువ కళాకారుల ‘అర్ధనారీశ్వరమ్’ ప్రదర్శనను ఆద్యంతం కరతాళ ధ్వనులతో అభినందించింది. “దాంపత్య ధర్మ నిర్దేశనం కామసూత్ర కథనం” అని పేర్కొంటూ, “ఇహమందు మోక్షమునిచ్చే సూత్రము... కామసూత్రమ”ని ఈ రూపకం ద్వారా రచయిత – నృత్య దర్శకులు ఢంకా బజాయించారు. “అధోగతికి చేర్చు వ్యామోహం ఇదే కదా” అంటూ వాత్స్యాయన మహర్షితో రాజు విభేదించి, కామశాస్త్ర అవసరమేమిటని సంవాదించినట్టుగా ఈ రూపకాన్ని మొదలుపెట్టారు. ధర్మం తప్పి కామంతో చరించిన రావణాసురుడు, కీచకుడు లాంటివారికి పట్టిన దుర్గతిని కళ్ళకు కడుతూ, సాక్షాత్తూ జగద్గురు ఆదిశంకరులు సైతం ఆధ్యాత్మిక జ్ఞానంలో ఓ భాగంగా కామాన్ని గుర్తించిన తీరును బ్యాలేలో ప్రస్తావించారు. “ఏమిది మైకము... ఏమిది తమకము... ఏదో తెలియని వ్యామోహము” అంటూ తృతీయ పురుషార్థ ప్రతిపాదన చేశారు. ఈ ధర్మార్థానంతర పురుషార్థ సాధనలో “ఆలుమగలను ఆనంద తీరాలు చేర్చే సూత్రాలు” కామసూత్రాలు అన్నది నిర్ద్వంద్వంగా స్పష్టం చేశారు. సమయ, సందర్భోచితంగా ‘భర్తృహరి శృంగార శతకం’లోని అంశాలను సైతం రూపకంలో చేర్చారు.“చంద్రహారాలు... ప్రేమ కలాపపు ప్రియచిహ్నాలు... మగని తలపించు తీయని గురుతులు”గా నఖ క్షతాలు, అలాగే దంత క్షతాలు, ఆలింగనాలు, సంయోగ భంగిమలను యువ కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ‘ఉత్సాహానికి ఉత్పలకం’, ‘విశృంఖలతకు విజృంభితకం’, ‘ఇష్టరాగమునకు ఇంద్రాణికం’ తదితర సంక్లిష్టమైన సంభోగ బంధనాలను అంతే సమర్థంగా నర్తకులు చూపడం విశేషం. ఎక్కడా అసభ్యత, అశ్లీలం అనిపించకుండా ఇలాంటి సంక్లిష్టమైన అంశాలను ప్రేక్షకుల ముందుకు తేవడం కత్తి మీద సామే! దాన్ని ఓ సవాలుగా తీసుకొని, సంప్రదాయ శైలి నృత్య ముద్రలు, దరువులతో... నృత్య సంయోజనం చేయడంలో నాట్యాచారిణిగా స్వాతి తన అసమాన ప్రతిభ కనబరిచారు. అందరినీ మంత్రముగ్ధులను చేశారు. వాత్స్యాయనుడిగా రవితేజ, రాజుగా – శివుడిగా మెహర్ ప్రభాకర్, పార్వతిగా దూసి వైష్ణవి, సూత్రధారిణులుగా హేమాంజలి, శ్రుతి కొంజర్ల, గీతిక, యశస్విని, కవలలైన అక్కాచెల్లెళ్ళు భానుశ్రీ – భవ్యశ్రీ, తదితరులు ఉత్తమ ప్రదర్శన అందించారు.ఒక హీరో... ఇద్దరు హీరోయిన్లు... అద్భుత సమన్వయంముఖ్యంగా కథానాయకుడిగా అరకు ప్రాంతానికి చెందిన గిరిజన యువకుడు కొర్రా బలరామ్ అలుపూ సొలుపూ లేకుండా గంటన్నర పైగా ఈ అపురూప నాట్యవిన్యాసాలను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ రూపకానికి మూలస్తంభంగా నిలిచారు. ఇంగ్లీషులో సాగిన నేపథ్య వ్యాఖ్యానం, రూపకంలో అడుగడుగునా సందర్భోచిత వాద్య సంగీతం, గాత్ర మాధుర్యం, వేణునాదం సహా పలు వాద్య పరికరాల వినియోగం... ప్రదర్శనను ఆసక్తిగా మలిచి, ఆహ్లాదభరితం చేశాయి.చదవండి: మనకు తెలియని మన భీముడి కోణంలో భారతం“సిగ్గే సుదతికి సింగారం... అది చెలికానికి ఆకర్షణం” అనే అంశంలో తొలి కథానాయికగా సీతంపేటకి చెందిన నిమ్మల అంజలి ముద్దరాలి సిగ్గును అభినయించిన తీరు ఆకట్టుకుంది. నాయికను ప్రేరేపించే సఖిగా లిఖిత అభినయం అంశానికి నిండుదనం తెచ్చింది. ఇక, ఈ రూపకంలో ద్వితీయ కథానాయికగా చేరడేసి కళ్ళు, చెరగని చిరునగవు మోముతో, అణువణువునా అభినయం నింపుకొని నర్తించిన యామినీ కసిరెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి తీరాలి. నృత్యపరిశోధనకు పీహెచ్డీ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచి, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్ పొందిన యామిని రానున్న రోజుల్లో నర్తకిగా మరింత రాణించడం ఖాయం.ఆద్యంతం లోపరహితంగా, అత్యంత సమన్వయంతో, అతి ప్రసన్న వదనంతో సాగిన ఈ నాయకా, నాయికల ముగ్గురి ప్రదర్శన నిస్సందేహంగా వారి పట్టుదల, కఠోరశ్రమ, నిత్యం గంటలకొద్దీ వారు చేసిన నిరంతర సాధన ఫలితమే. గూఢకమ్, బిందుమాల, ప్రవాళమణి, మణిమాల లాంటి పలు వాత్స్యాయన ప్రయోగాల ప్రదర్శన చూసి, ప్రేక్షకులు అచ్చెరువొందారంటే అతిశయోక్తి కాదు. నాట్య బృందమంతా కేవలం వేదికపై నటిస్తున్నట్టు కాకుండా, ఆ పాత్రలు తామే అయినట్టుగా ఇహం మరిచి ఆ క్షణంలో జీవించి, రససిద్ధి కలిగించడం ఈ ప్రదర్శనకు పంచప్రాణాలైంది. ఇలా ఈ శిష్యులందరినీ తీర్చిదిద్దడానికి సమస్త శక్తియుక్తులూ ధారపోసిన స్వాతీ సోమనాథ్ అంకితభావానికి పదే పదే వినిపించిన సభికుల హర్షధ్వానాలు తరగని కితాబులుగా నిలిచాయి.దాదాపు పాతికేళ్ళ క్రితమే... స్వాతి సంచలన ప్రయోగంఒకప్పుడు 1980లో రవీంద్రభారతి వేదికపైనే అరంగేట్రం చేసి, 2003లో తాను స్వయంగా అదే వేదికపై ‘కామసూత్ర’ డ్యాన్స్ బ్యాలే ప్రదర్శనతో సంచలనం రేపి, మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు తన శిష్యులతో దాన్నే ‘అర్ధనారీశ్వరమ్’గా అందించిన కళాకారిణి స్వాతీ సోమనాథ్కు ఇది అక్షరాలా ఓ ప్రత్యేకమైన సందర్భం. జీవితంలో మరపురాని అపురూప జ్ఞాపకం. “ఈ పిల్లల కౌశలం వెనుక ఎనిమిదేళ్ళ నిరంతర కృషి, సుదీర్ఘ సాధన దీని వెనక ఉంది. నిజానికి, ఈ ‘సంప్రదాయం’ ఏర్పాటుకు ముందు స్వాతి వేరు. తరువాతి స్వాతి వేరు. నా జీవితమే మొత్తం మారిపోయింది. పన్నెండేళ్ళుగా శ్రీకాకుళానికే పరిమితయ్యాను. అపరిమిత అవకాశాలకు కేంద్రమైన హైదరాబాద్ నగరాన్నీ, కుటుంబాన్నీ వదిలి శ్రీకాకుళానికి వెళ్ళి పనిచేయడం కష్టమే. ‘సంప్రదాయం’ ట్రస్ట్ వ్యవస్థాపనకు ప్రభుత్వ కృషిలో భాగమై, నాట్యగురువుగా అక్కడ జీతానికి పనిచేస్తున్నఇన్నేళ్ళుగా ఎన్నో అవస్థలు పడ్డాను. వ్యక్తిగతంగా మరెన్నో త్యాగాలూ చేశాను. కానీ, ఇవాళ అద్భుతంగా తయారై, నాట్యంలో పీహెచ్డీ చేసే స్థాయికి ఎదిగిన ఈ నవతరం పిల్లల్ని చూసినప్పుడు ఆ కష్టాలన్నీ మర్చిపోతుంటాను. కళాజీవితంలో నా కృషికి అర్థం, పరమార్థం సిద్ధించినట్టు భావిస్తుంటాను” అని నీళ్ళు నిండిన కళ్ళను అదుపు చేసుకుంటూ స్వాతీ సోమనాథ్ వ్యాఖ్యానించారు.అభివృద్ధిలో వెనుక.. అసమాన ప్రతిభలో ముందు... అర్ధనారీశ్వర స్తోత్రంతో నర్తకీ నర్తకులు ప్రస్తుతించగా, శివపార్వతుల కేళీ విలాసంతో ముగిసిన తాజా ‘అర్ధనారీశ్వరమ్’ నృత్యరూపక ప్రదర్శనను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగళూరు, ఢిల్లీ నుంచి కూడా ప్రేక్షకులు రావడం ప్రత్యేకించి గమనార్హం. ముఖ్య అతిథిగా హాజరైన ‘భారత్ బయోటెక్’ మేనేజింగ్ డైరెక్టర్ ‘పద్మభూషణ్’ సుచిత్రా ఎల్లా (Suchitra Ella) తదితర ప్రముఖులు కళాకారులను అభినందించారు. తమిళనాట నైవేలిలో పుట్టి పెరిగి, మద్రాసులో చదువుకున్న తనకు బాల్యం నుంచి సంగీతం, నాట్యం తదితర లలితకళలతో ఉన్న అనుబంధాన్ని సుచిత్ర పంచుకున్నారు. “మా ఊరికి కేవలం గంట ప్రయాణంలో చిదంబరం పట్టణం, ప్రపంచానికి కేంద్రబిందువుగా భావించే చిదంబరం నటరాజస్వామి ఆలయం ఉంటాయి. ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళితే చిదంబరం దర్శిస్తుంటాను” అని ఆమె తెలిపారు. ఇలాంటి నృత్యరూపక ప్రదర్శనలు ప్రాచీన భారతీయ విజ్ఞానం, సంస్కృతి ఘనతను ప్రపంచానికి చాటతాయని అభిప్రాయపడ్డారు.ఇక, స్వాతి సమకాలికురాలు – కూచిపూడి శిక్షణలో ఒకప్పటి సహాధ్యాయి అయిన యశోదా ఠాకూర్, “పదం, జావళీలతో దేవదాసీ నృత్యం ద్వారా స్వయంగా శృంగార రసాభినయాన్ని విద్యార్థులకు బోధిస్తున్న నేను స్వాతికి వీరాభిమానిని. సాహసించి, ఎన్నో ప్రయోగాలు చేసే ఆమె నాకు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నిత్యస్ఫూర్తి” అని అభినందించారు. “ఆద్యంతం కళ్ళకూ, చెవులకూ విందు”గా బి.పి. రావు అభివర్ణించిన ఈ రూపకానికి మూలస్తంభాలుగా నిలిచిన వారంతా శ్రీకాకుళం ప్రాంత వాసులే కావడం విశేషం. స్వయానా శ్రీకాకుళం ప్రాంతమే పురిటిగడ్డ అయిన స్వాతీ సోమనాథ్తో పాటు ఆమె శిష్యబృందం, బ్యాలే ప్రదర్శనకు లైటింగ్, కాస్ట్యూమ్స్, సంగీతం అందించిన అందరూ ఆ ప్రాంతానికి చెందినవారే. అభివృద్ధిలోనే తప్ప అసమాన ప్రతిభలో ఉత్తరాంధ్ర వెనుకబడలేదనడానికి ఇది నిదర్శనమని అతిథులు అభిప్రాయపడ్డారు.కూచిపుడి నాట్యచరిత్రలో కొత్త అధ్యాయంస్వాతీ సోమనాథ్ తొలి గురువైన భాగవతుల రామకోటయ్య కుమారుడూ – కూచిపూడి సంప్రదాయంలోనే పుట్టి పెరిగి, స్వయంగా నాట్యాచార్యుడైన భాగవతుల సేతురామ్ అన్నట్టు, “కూచిపూడి నాట్యచరిత్రలో ఇది ఓ కొత్త అధ్యాయం”. సాహిత్యం, సంగీతం, నృత్యసంయోజనం త్రివేణీ సంగమమై, వేదికను రసప్లావితం చేసిన అరుదైన ఘట్టం. అదీ ఎక్కడో మారుమూల ఉత్తరాంధ్ర నుంచి, వెనుకబడిన ప్రాంతంగా భావించే చోట నుంచి, వెనుకబడిన గిరిజన వర్గాల నుంచి ఇలాంటి అపురూప ప్రతిభావంతులైన యువ కళాకారులు పైకి రావడం అపూర్వం. సముద్రపుటొడ్డున శాంతినికేతనంలా ఉండే ‘సంప్రదాయం’ కూచిపూడి గురుకుల ట్రస్ట్ చేసిన ఓ అద్భుతం. ఇలాంటి ప్రతిభా సుమాలు మరిన్ని పల్లవించాలంటే, ఆర్థికంగా ఇప్పటికీ అస్తుబిస్తుగా ఉన్న ‘సంప్రదాయం’కి ప్రభుత్వంతో పాటు కళాభిమానులు, దాతలు కాపుగా నిలవాలి. ‘అర్ధనారీశ్వరమ్’ లాంటి ప్రదర్శనలు ఊరూరా, ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతటా అన్ని దేశాల్లో ప్రదర్శించాలి. సుచిత్రా ఎల్లా తదితరులు పేర్కొన్నట్టు, ‘మన తెలుగువారి కూచిపూడి ఘనతనూ, మన భారతీయ కళా, సాంస్కృతిక ప్రాభవాన్నీ ప్రపంచానికి చాటడానికి’ అదే సరైన మార్గం!- రెంటాల జయదేవ
ఫిట్నెస్పై ఇంత క్రేజా?!
పట్టణాల్లో, నగరాల్లో మారథాన్, అధిక ఫోర్స్తో చేసే వర్కౌట్లు వంటి ఫిట్నెస్ ఈవెంట్ల పట్ల ప్రజల ఆదరణ ఏ రేంజ్లో ఉందో తెలిస్తే షాకవ్వుతారు. వాటిపై పెడుతున్న ఖర్చులకు మాటలు రావ్. అందుకు ఉదాహరణ బెంగుళూరు ఫిట్నెస్ సెంటర్ ఈవెంటే. ఏం జరిగిందంటే..బెంగళూరులో హైరాక్స్ ఫిట్నెస్ ఈవెంట్ ధరలు చూస్తూ కళ్లు బైర్లుకమ్ముతాయ్. అందుకు సంబంధించిన పోస్ట్ని అంకిత్ కేడియా అనే యూజర్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్ ప్రకారం..అక్కడ జరిగిన ఫిట్నెస్ ఈవెంట్లో దాదాపు తొమ్మిది వేల మంది దాక పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రూ. 9 వేలు చొప్పున ప్రవేశ రుసుము చెల్లించారు. అంటే ఒక్క రోజుల్లోనే సుమారుగా రూ. 8.1 కోట్లు వచ్చాయ్. మారథాన్లో కూడా ఇదో ధోరణి కనిపిస్తోంది. కేవలం ఒక రోజు పరుగుతీయడానికే రూ. 3 వేలు నుంచి రూ. 5 వేలు ఛార్జ్ చేస్తున్నారంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు కేడియా. ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు ఇదంతా ఫిట్నెస్ కోసం కాదని, కేవలం గుర్తింపు కోసం జరుగుతున్న ఆరాటం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఫిట్నెస్ అనేది ఒకరోజు ప్రదర్శన కాదు, అది జీవితాంతం కొనసాగే ప్రయాణం అని అబివర్ణిస్తున్నారు కొందరు ఫిట్నెస్ ప్రియులు. HYROX fitness event in Bengaluru saw around 9,000 participants.They charged ₹9,000 per person to participate, which comes to roughly ₹8.1 crore made in a single day.Same trend is showing up in marathons. People are paying ₹3,000–₹5,000 just to run for a day.Being fit is…— Ankit Kedia (@Ankittskedia) April 13, 2026 (చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!)
చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!
భారతీయ కళలు గురించి ఈ తరానికి ఎన్ని తెలుసు అని అడిగితే కచ్చితంగా నీళ్లు నములుతారు. మహా అయితే ఒకటో, రెండో చెబుతారు అంతే. కానీ ఈ చిన్నారి అంత చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచించి..చేస్తున్న మహత్తర కార్యం గురించి తెలిస్తే..శెభాష్ అని అభినందించకుండా ఉండరు. ఎందుకంటే జస్ట్ నాల్గో తరగతికే ఆ చిన్ని మనసు ఎంతో బాధ్యతగా ఆలోచించ విధానం..అందుకోసం పడుతున్న తపన ప్రతి ఒక్కర్ని కదలిస్తుంది. రేపు ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా ఆ చిన్నారి కళా వారసత్వం కోసం చేస్తున్న కృషి గురించి సవివరంగా చూద్దామా.ఆ అమ్మాయే మన భాగ్యనగరం బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న శ్రేష్ట అక్షయ్. పిల్లలందరికి నచ్చినట్లుగానే అక్షయ్కు కూడా రంగురంగుల పెన్సిళ్లు అంటే మహా ఇష్టం. ఆ ఇష్టంతోనే కొత్త కార్టూన్ డిజైన్ల పెన్సిళ్ల కోసం తెగ వెతికేది. ఒక రోజు అమ్మని అడిగింది ఇతర దేశాల్లో తయారైన పెన్సిళ్లు, ఇతర దేశాల కార్టూన్లతో ఉండే పెన్సిళ్లను ఎందుకు వాడుతున్నాం అని అమాయకంగా ప్రశ్నించింది. ఆ సందేహమే తనను విలక్షణమైన చిన్నారిగా అందరిచేత ప్రశంసలందుకునేలా చేస్తుందని అక్షయ్గానీ, ఆమె తల్లిగానీ ఆరోజు ఊహించలేదు. ఆ ప్రశ్నతో మొదలైన ఆ చిన్నారి అక్షయ్ ఆలోచన..మన కళా రూపాలపై ఆసక్తిని పెంచుకునేందుకు దారితీసింది. మనదేశంలో ఉన్న ప్రముఖమైన కళా రూపాలతో పెన్సిళ్లు ఎందుకు ఉండకూడదు అనుకుంది. అంతేగాదు తానే ఎందుకు అలాంటి పెన్సిళ్లను తీసుకురాకూడదు అనుకుంది. దీనివల్ల తనలాంటి పిల్లలందరికి మన భారతదేశ కళలు, వాటి గొప్పదనం గురించి తెలుస్తుంది కదా అని అనుకుంది. అంతేగాదు మన అందమైన కళారూపాలైన..మధుబని కళ, గోండ్ కళ, పైట్కర్ కళ, పిథోరా కళ, వార్లీ కళ వంటి కళల పేర్లను పెన్సిళ్లపై రాస్తే, అవి ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా, మన గొప్ప వారసత్వం గురించి తెలుసుకోగలుగుతారని భావించింది అక్షయ్. ఆ నేపథ్యంలోనే తల్లిదండ్రుల సహాయం తీసుకుని మరి బీహార్కు చెందిన మధుబని కళ, మహారాష్ట్రకు చెందిన వార్లీ కళ, రాజస్థాన్కు చెందిన పిచ్వాయి కళ, కర్ణాటకకు చెందిన కావి కళ, రాజస్థాన్కు చెందిన బ్లూ పాటరీ కళ, మధ్యప్రదేశ్కు చెందిన గోండ్ కళ, గుజరాత్కు చెందిన పిథోరా కళ, ఆంధ్రప్రదేశ్కు చెందిన కలంకారి కళ, తెలంగాణకు చెందిన చెరియల్ కళ, తదితర భారతీయ కళారూపాలను పెన్సిళ్లపైకి తీసుకువచ్చే పనిలో పడింది. ఆ క్రమంలో డిజైనింగ్, క్రాపింగ్, ప్రింటింగ్ ఎలా చేస్తారు, వాటిని ఇంట్లో, ప్రింటింగ్ షాపుల్లో ఎలా చేస్తారు వంటి చాలా విషయాలు నేర్చుకుంది. అలా తన పేరెంట్స్ సాయంతో సొంతంగా కళారూపాలతో కూడిన పెన్సిల్ బ్రాండ్ “ఆరా పెన్సిల్స్” ఏర్పాటు చేసి, దానికో www.aurapencils.com. అనే వెబ్సైట్ని కూడా క్రియేట్ చేసింది. అక్కడ ఆన్లైన్లో కళారూపల పెన్సిళ్లు ఆర్డర్ పెట్టుకుని కొనుగోలు చెయ్యొచ్చట. తన ఆలోచన గురించి తన స్నేహితులకు కూడా చెప్పాను వాళ్లంతా కూడా మెచ్చుకున్నారని సంతోషంగా చెబుతోంది. అంతేకాదండోయ్ మన భారతీయ కళారూపాల గురించి తెలుసుకునేలా చేయడమే కాకుండా భారతదేశంలో తయారై పెన్సిళ్లనే కొనుగోలు చేసేలా ప్రోత్సహించడమే తన లక్ష్యం అంటోంది ఈ చిన్నారి అక్షయ్.(చదవండి: ఆ గాయం ఆమె లైఫ్నే టర్న్ తిప్పింది..! డాక్టర్లే ఆశ్చర్యపోయేలా..)
ఆ గాయం ఆమె లైఫ్నే టర్న్ తిప్పింది..! డాక్టర్లే ఆశ్చర్యపోయేలా..
ఏదైనా అనారోగ్యం లేదా గాయల పాలైతే భయపడిపోకుండా ధైర్యం కూడగట్టుకుని చికిత్స తీసుకోవాలి. అవసరమైతే స్నేహితులు, సన్నిహితుల మద్దతు తీసుకోవాలి. కానీ కొన్ని గాయాలు మనల్ని ఎంతగా కుంగదీస్తాయంటే..ఇక అయిపోయింది లైఫ్ అన్నట్లుగా ఉంటాయి. డాక్టర్లు కూడా చేతులెత్తేస్తారు. అలాంటి సమయంలో కూడా తెగువతో బతికిచూపడమే గాక..విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకుంటోంది ఈ ధీర వనిత.ఆ ధైర్యవంతురాలే పల్లవి కుమార్ అగర్వాల్గా పిలిచే మీరా. ఆమె జీవితం ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు చవిచూసింది. మీరా పాట్నాకి చెందిన మహిళ. ఆమె ఎక్కువగా విదేశాల్లో పర్యటిస్తుంటుంది. ఆ సమయంలో పూర్తి స్థాయి మాంసాహారి. ఫిట్నెస్, వ్యాయామాలపై విపరీతమై ఆసక్తి కూడా. ఆమె పెద్ద కార్పొరేషన్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా డిజైన్ అండ్ ప్రొడక్ట్ హెడ్గా అత్యంత ఒత్తిడితో కూడిన షెడ్యూల్ని నిర్వహిస్తూనే మారథాన్లలో పరిగెత్తేవారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించేవారు. కానీ ఆ రోజు ఆమె మోకాలికి అయిన గాయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ఓ మలుపు తిప్పింది. ఆ మోకాలి గాయం ఆమెను మళ్లీ జీవితంలో నడవనివ్వకుండా చేసింది. డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. కొన్ని రకాల వ్యాయామాలు, మందులతో రెండు అడుగులు వేయొచ్చు అంతే తప్ప సరిగ్గా నడవడం గానీ పరిగెత్తడం వంటివి చేయలేవని తేల్చేశారు. దాంతో మీరా ఆ గాయం క్యూర్ అయ్యేలా పలు రకాల చికిత్సల కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టింది, లెక్కలేనన్ని మందుల మింగింది. అప్పడు మీరా తీవ్ర నిరాశ నిస్ప్రుహలకు గురయ్యింది. జీవితమంతా వ్యాయామాలు చేసి ఎంతో హెల్దీగా ఉండే మీరాకి నడవలేవని చెబుతున్న మాటలను జీర్ణించుకోలేకపోయింది. అప్పుడే ఆమె తనలా తీవ్రమైన గాయాల బారినపడి తిరిగి అథ్లెట్లుగా దూసుకొచ్చిన మహిళల ఉదంతాలు చదవడం ప్రారంభించింది. అంతేగాదు ఆ మహిళల జీవితాలు, వారి లైఫ్స్టైల్ గురించి క్షణ్ణంగా చదివేది. 'ది గేమ్ ఛేంజర్స్' అనే నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ మీరాని ఎంతగానో ప్రభావితం చేసింది. దాంతో మీరా ఇదివరికటిలా యాక్టివ్గా మారింది. అంతేగాదు పాలు, మాంస ఉత్పత్తులను పూర్తిగా మానేసి..పూర్తిగా సాంప్రదాయ భారతీయ ఆహారానికి మారింది. తన భోజనంలో రాగి, కొబ్బరి, చిరుధాన్యాలు, పప్పులను చేర్చుకోవడం ప్రారంభించిది. చెప్పాలంటే పూర్తి శాకాహారిగా మారిపోయింది. అలాగే రకరకాల వంటకాలప ప్రయోగాలు ప్రారంభించి సొంతంగా రాగిపాలు, కొబ్బరి మజ్జిగను తయారు చేయడం ప్రారంభించింది. ఈ కొబ్బరి పానీయాన్ని తన కుటుంబసభ్యులు కూడా ఇష్టపడతారని అంటోంది. అంతేగాదు ఇవి క్రమం తప్పకుండా తీసుకుంటే రక్త పరీక్ష ఫలితాల్లో అద్భుతాన్నే చూడొచ్చని అంటోంది. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని అంటోంది. వీటితోపాటు ఆహారంలో హలీమ్ లడ్డూలు, నట్స్, వివిధ సీడ్స్ వంటివి కూడా ఆహారంలో భాగం చేసుకుంది. అయితే బేకరీ స్వీట్లు, కేక్లు, కుకీలకు దూరమైపోయింది. ఆమెకు కాఫీ తోపాటు వాటిని తినే అలవాటు ఉండటంతో..మళ్లీ బేకరీ ఉత్పత్తులను హెల్దీగా చేయడంపై దృష్టి సారించి పలు రకాల వంటకాలు చేసింది. అవన్నీ పాలు, వెన్నకు బదులు, నట్ బటర్లు, కోల్డ్ప్రెస్ నూనెలు, శాకాహార పాలతోనే చేసేది. పైగా ఆమె వంటకాల రుచికి ఫిదా అవ్వతూ స్నేహితులు, బంధువులు బేకరీని ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా 'ఇడున్' అనే బేకరీని ప్రారంభించింది. అయితే ఆమె ఏమి చెఫ్ స్పెషలిస్ట్ కాదు. అయినప్పటికీ కుకీలను ఎంతో రుచికరంగా, పోషకమైనవిగా తయారు చేయడం ఆమె స్పెషాల్టీ. అలాగే ఆయుర్వేదం చక్కెరను చెడ్డదిగా చెప్పదని, తీసుకోవాల్సిన విధంగా మితంగా తీసుకుంటే మంచిదేనని అంటోంది మీరా. ఆమె ఆయుర్వేద సూత్రాలు పాటిస్తూ..తిరిగి హెల్దీగా ఉండేలా కేర్ తీసుంటోంది కూడా. అంతేగాదు అక్కడితో మీరా ప్రస్థానం ఆగిపోలేదు. తిరిగి నడవలేవు అన్న డాక్టర్లే ఆశ్చర్యపోయేలా లడఖ్ మారథాన్లో పాల్గొని నిర్దేశించిన సమయాని కంటే ముందుగానే పూర్తి చేసి శెభాష్ అనిపించుకుంది. తన అవరోధాన్ని, పరిమితులను ధిక్కరించేలా ఎవరెస్టు బేస్ క్యాంప్లకు ట్రెక్కింగ్ చేయడం, ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉన్న యూనం పర్వతాన్ని అధిరోహించడం, ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఫ్రెండ్షిప్ పీక్ను జయించడం వంటివి చేసింది. కష్టాలు, గాయాలు మనల్ని కోలుకోనీయకుండా చేయొచ్చేమో గానీ మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదు, తిరిగి విధికే ఛాలెంజ్ విసిరేలా నిలదొక్కుకోవాలనే సారాంశం మీరా స్టోరీ చెబుతోంది కదూ..!.(చదవండి: అరుదైన 'కొడాలి కరుప్పూర్ చీర'లో కంగనా రనౌత్..! ఆ శారీ ప్రత్యేకతలివే..)
అంతర్జాతీయం
సముద్రంలో ఘోర ప్రమాదం : 250 మంది గల్లంతు
అండమాన్ సముద్రంలో భారీ నౌక ప్రమాదం ఆందోళన రేపుతోంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ జాతీయులతో ప్రయాణిస్తున్న ఒక ట్రాలర్ (చేపల వేట పడవ) బోల్తా పడింది. దక్షిణ బంగ్లాదేశ్లోని టేక్నాఫ్ (Teknaf) ప్రాంతం నుండి బయలుదేరిన ఈ నౌకలో మహిళలు, పిల్లలతో సహా సుమారు 280 మంది ప్రయాణిస్తున్నారు . ఇది ఏప్రిల్ 4న బంగ్లాదేశ్ నుంచి బయలుదేరింది. దీంతో 250 మంది ఆచూకీపై ఆందోళన నెలకొంది.ప్రాథమిక సమాచారం ప్రకారం, అధికలోడు, బలమైన గాలులు, తుఫాను కారణంగా నౌక మునిగిపోయినట్టు తెటలుస్తోంది. ఈ విషాదంపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ (యూఎన్హెచ్సీఆర్) స్పందించింది. దక్షిణ బంగ్లాదేశ్లోని టెక్నాఫ్ నుంచి బయలుదేరి మలేషియాకు వెళ్తున్న ట్రాలర్, బలమైన గాలులు, సముద్రంలో అల్లకల్లోల పరిస్థితి, అధిక రద్దీ మునిగిపోయి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. రోహింగ్యాలు దీర్ఘకాలంగా నిరాశ్రయులుగా ఉండటం, దీనికి శాశ్వత పరిష్కారం లేకపోవడం వల్ల కలిగే తీవ్ర పరిణామాలకు నిదర్శనమని యూఎన్హెచ్సీఆర్ ఆవేదన వ్యక్తం చేసింది.మయన్మార్లో ప్రజల స్థానభ్రంశానికి గల మూలకారణాలను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను, అలాగే రోహింగ్యా శరణార్థులు స్వచ్ఛందంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా తమ ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు వీలు కల్పించే పరిస్థితులను కల్పించాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తుచేసిందని పేర్కొంది.సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.గాలింపు, సహాయక బృందాలు ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి ఆచూకీ లభించకపోవడంతో ఇంతవరకు ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు అనే విషయంపై స్పష్టత లేదు. అందరూ మరణించి ఉంటారని భయపడుతున్నారు. అధికారులు ఇంకా మృతుల కచ్చితమైన సంఖ్యను ధృవీకరించలేదు. గంటలు గడుస్తున్నా కచ్చిమైన సమాచారం రాకపోవడంతో ఆందోళన పెరుగుతోంది. కాగా బంగాళాఖాతం, అండమాన్ సముద్రం గుండా జరిగే ఇటువంటి ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాల గురించి మానవతా సంస్థలు పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నాయి.అయినా భద్రత, మెరుగైన జీవన పరిస్థితులకోసం వారుప్రాణాలకి తెగించి ప్రాణాలను పోగొట్టుకున్న వైనం విచారకరం.
‘నోరు అదుపులో పెట్టుకో’.. ట్రంప్కు ఇటలీ స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇటలీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే ఇటలీ అధికార, ప్రతిపక్ష పార్టీలు ట్రంప్ వ్యాఖ్యల దెబ్బకు ఒక్కటయ్యాయి. తమ దేశ ప్రధాని జార్జియా మెలోనికి మద్దతుగా నిలుస్తూ, ట్రంప్ తీరుపై ఇటలీ ప్రతిపక్ష నేత ఎల్లీ ష్లీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ట్రంప్ నోటి దురుసు.. మండిపడ్డ ప్రతిపక్షంఇరాన్పై అమెరికా దాడులకు మద్దతు ఇవ్వనందుకు ప్రధాని మెలోనికి ధైర్యం లేదు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇటలీ తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదంపై స్పందించిన ప్రతిపక్ష నేత ష్లీన్ పార్లమెంట్లో మాట్లాడుతూ.. ‘ట్రంప్.. మా దేశంపై, మా ప్రధానిపై నీ నోటి దురుసుతో చేసే దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం’ అని ఘాటుగా హెచ్చరించారు. వెంటనే సభ కరతాళ ధ్వనులతో మార్మోగింది. ఏ విదేశీ అధినేతకు కూడా తమ దేశాన్ని అవమానించే హక్కు లేదని ఆమె తేల్చి చెప్పారు. BREAKING: Italy SHOCKED world 🔥🔥Schlein, the leader of the opposition DEFENDS Meloni against Trump’s attacks 🔥🔥🇮🇹She said : “Listen Trump Even as political opponents, We Italians will not accept any attacks against our country especially from your bad mouth."What a… pic.twitter.com/EKQI8TwJlE— InfoGram (@_InfoGram_) April 14, 2026పోప్పై వ్యాఖ్యలతో ముదిరిన వివాదంక్యాథలిక్ చర్చి అధిపతి పోప్ లియో శాంతి కోసం చేసే పిలుపులను ట్రంప్ విమర్శించడంపై ప్రధాని మెలోని అభ్యంతరం వ్యక్తం చేశారు. మత పెద్దలు రాజకీయ నాయకుల మాట వినాలనడం సరికాదని, ట్రంప్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు అని ఆమె తేల్చి చెప్పారు. దీనికి ప్రతిగా ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ అణ్వాయుధాలతో ఇటలీని పేల్చేస్తామని ప్రకటించినా మెలోనికి పట్టింపు లేదని విమర్శించారు. అయితే అమెరికా తమ వ్యూహాత్మక మిత్రదేశమే అయినప్పటికీ, విభేదాలు ఉన్నప్పుడు కుండబద్దలు కొట్టినట్లు చెప్పే ధైర్యం ఉందని మెలోని స్పష్టం చేశారు.ఇజ్రాయెల్తో రక్షణ ఒప్పందం నిలిపివేతఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్తో ప్రతి ఐదేళ్లకోసారి చేసుకునే రక్షణ ఒప్పందాన్ని ఇటలీ తాత్కాలికంగా నిలిపివేసింది. లెబనాన్లోని తమ ఐరాస శాంతి పరిరక్షక దళాల కాన్వాయ్పై ఇజ్రాయెల్ దళాలు హెచ్చరిక కాల్పులు జరపడంతో ఇటలీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కాల్పుల ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ఇజ్రాయెల్ దాడులను ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ అసహనం వ్యక్తం చేస్తూ, ఇటలీ రాయబారికి సమన్లు జారీ చేసింది.ఇది కూడా చదవండి: ట్రంప్ పెట్టిన చిచ్చు: భగ్గుమంటున్న వెనెజువెలా
మెలోనీతో స్నేహానికి బీటలు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహ బంధానికి బీటలు వారుతోంది. ఇరాన్ యుద్ధంలో అగ్రరాజ్యానికి ఇటలీ మద్దతు ఇవ్వకపోవడం ఒక కారణం కాగా.. పోప్ లియో వ్యవహారంలో ఆమె స్పందించిన తీరు వాళ్లిద్దరి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మద్దతు ప్రకటించాలని ట్రంప్ ఇటలీపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఆ దేశ ప్రధాని మెలోనీ అందుకు తలొగ్గలేదు. ఇటలీని ఈ యుద్ధంలోకి లాగడం తన దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ఆమె భావించారు. ఇరాన్ యుద్ధంలో తమ దేశం పాల్గొనబోదని.. ఇది ప్రపంచంలోనే పెద్ద సంక్షోభమని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ఏప్రిల్ 14న ఇజ్రాయెల్తో తమ దేశానికి ఉన్న రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.ఈలోపు పోప్ లియో XIV ఇరాన్ యుద్ధంపై స్పందించడం.. ఆయనకు ట్రంప్ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఇరాన్ యుద్ధంపై పోప్ మాట్లాడటం తగదని, ఆయనకు పరిస్థితులు అర్థం కావడం లేదని ట్రంప్ ఘాటుగా విమర్శించారు. అయితే ట్రంప్ పోప్పై చేసిన వ్యాఖ్యలను మెలోనీ తీవ్రంగా ఖండించారు. ఈ రెండు పరిణామాలు ట్రంప్నకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇరాన్ యుద్ధం, మధ్యధరా ప్రాంతంలో ఇంధన భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య మెలోనీ ఏమాత్రం ధైర్యం చూపడం లేదని.. ఇటలీని రక్షించడంలో ఆమె విఫలమవుతున్నారని ట్రంప్ ఆరోపించారు. ‘‘ఇరాన్కు అవకాశం వస్తే ఇటలీని రెండు నిమిషాల్లో పేల్చేస్తుంది. ఇటలీకి హర్ముజ్ జలసంధి ద్వారా చమురు వస్తున్నా.. యుద్ధంలో పాల్గొనడానికి ఆమె నిరాకరించడం ఆశ్చర్యం కలిగించింది’’ అని వ్యాఖ్యానించారాయన. ఇక మీదట యూరోపియన్ దేశాలు తమ ఇంధన అవసరాలను తామే చూసుకోవాలని.. అమెరికా సైన్యం ఇతరుల కోసం పోరాడబోదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో.. పోప్ లియో XIVపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని మెలోనీ అనడంపై స్పందిస్తూ.. వాస్తవానికి పోప్ కాదు మెలోనీనే కరెక్ట్ పర్సన్ కాదంటూ ట్రంప్ ఓ కామెంట్ చేశారు. జార్జియా మెలోనీ 2022 అక్టోబర్ నుండి ఇటలీ ప్రధానిగా కొనసాగుతున్నారు. అమెరికా–యూరప్ మధ్య వారధిగా ఆమెకంటూ ఓ పేరు ముద్రపడింది. పైగా ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. ఆమె ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆ మధ్య ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం వేళ ఆమెను పొగడ్తలతోనూ ముంచెత్తారు. అయితే పశ్చిమాసియా సంక్షోభం ఇప్పుడు వీళ్ల మధ్య చిచ్చు రాజేసినట్లైంది.
ఇరాన్ ప్రతినిధుల బృందంపై క్షిపణి దాడి ప్లాన్?
ఇటీవల ఇస్లామాబాద్లో ఇరాన్-పాక్ మధ్య శాంతి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ హెలెవల్ డెలిగేషన్ మీటింగ్ అత్యంత పటిష్టమైన భద్రత మధ్య జరిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మరాండీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు జరిగి వెళ్లే సమయంలో తమ విమానంపై అటాక్ జరుగుతోందని తీవ్రమైన బెదిరింపులు వచ్చాయన్నారు.అమెరికా- ఇరాన్ మధ్య రేపు( గురువారం) రెండో సారి శాంతి చర్చలు జరగనున్నాయి. ఇస్లామాబాద్లో మెుదటగా జరిగిన చర్చలలో ఎటువంటి సానూకూల ఫలితాలు రాకపోవడంతో మరో దఫా చర్చలకు రెండే దేశాలు సమాయాత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రొఫెసర్ మారాండీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు ముగించి తిరుగు ప్రయాణంలో వారి విమానానికి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయన్నారు.ప్రొఫెసర్ మారాండీ మాట్లాడుతూ " పాక్లో చర్చలు ముగించుకొని వెళుతున్న సమయంలో ఫ్లైట్లో అబ్బాస్ అరాఘ్చీ, స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్తో ఇతర కీలక నేతలు ఉన్నారు. ఆ సమయంలో హఠాత్తుగా మా విమానం క్షిపణి దాడికి గురువుతుందని బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ప్రత్యామ్నయ మార్గం ద్వారా తరలించాం. వాస్తవానికి టెహ్రాన్లో దిగాల్సి ఉండగా అత్యవసరంగా ఇరాన్ నగరం మషద్ నగరంలో ఫ్లైట్ ల్యాండ్ చేసి కార్లు, ట్రైన్ల ద్వారా టెహ్రాన్ నగరం చేరుకున్నాం".అని అన్నారు.అమెరికా జిత్తులమారని తమకు తెలుసని అందుకే ఆ దేశాన్ని ఎప్పుడు నమ్మదలుచుకోలేదని ప్రొఫెసర్ అన్నారు. మాతో చర్చలు జరుపుతూనే మరోవైపు తమ మిలటరీ బేస్లను మరింత బలపరుచుకుంటుందన్నారు. అయితే చర్చల సమయంలో పాకిస్థాన్ ఇరాన్కు అత్యంత పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. ఆదేశానికి చెందిన అత్యాధునికి విమానాలు ఇరాన్ ప్రతినిధుల బృందం ఉన్న విమానానికి ఎస్కార్ట్గా వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రొఫెసర్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
జాతీయం
దక్షిణ రాష్ట్రాలకు ఇదేనా ప్రతిఫలం?
చెన్నై: మోదీ సర్కారు తలపెట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి ఫైర్ అయ్యారు. డీలిమిటేషన్పై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలు ఎగురవేయాలని తమిళనాడు ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించబోమని మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఈ మేరకు ఎక్స్లో వీడియో సందేశం విడుదల చేశారు."నల్ల జెండాలు ఎగరనివ్వండి! భారతదేశ ప్రగతికి దోహదపడినందుకు మాకు శిక్ష విధిస్తారా? తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు ఇదేనా ప్రతిఫలం? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లు.. తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక భారీ చారిత్రక అన్యాయం. డీలిమిటేషన్కు నిరసనగా రేపు తమిళనాడు వ్యాప్తంగా ఇళ్లపైనా, బహిరంగ ప్రదేశాల్లోనూ నల్ల జెండాలు ఎగురుతాయి. తమిళనాడు గళాన్ని గౌరవించి వెనక్కి తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తే, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. డీఎంకే అధ్యక్షుడిగా, అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మగౌరవం గల తమిళుడిగా ఇది నా హెచ్చరిక'' అని స్టాలిన్ తన సందేశంలో పేర్కొన్నారు.ఎంపీలతో అత్యవసర భేటీనియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్లో చర్చకు రానున్న నేపథ్యంలో డీఎంకే ఎంపీలతో స్టాలిన్ ఈ రోజు ఉదయం అత్యవసర భేటీ నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఎంపీలతో ఆయన చర్చించారు. కాగా, గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్టాలిన్కు ఓటమి భయం: అన్నామలైస్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు అన్నామలై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో స్టాలిన్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదం చేస్తున్నారని ఆరోపించారు. కోయంబత్తూరులో అన్నామలై మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ వీలైనంత త్వరగా అమలు చేయాలని తమిళనాడు మహిళలు కోరుకుంటున్నారని చెప్పారు. తమిళనాడులో ఈసారి భారీ మెజారిటీతో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, డీఎంకే ప్రభుత్వం పోవాలని భావిస్తున్నారని చెప్పారు. భారీ మెజారిటీతో ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. உயரட்டும் கருப்புக்கொடி!தமிழ்நாடு போராடும்! தமிழ்நாடு வெல்லும்!இந்தியாவின் வளர்ச்சிக்காகப் பாடுபட்ட குற்றத்துக்காக தமிழ்நாடு உள்ளிட்ட தென்மாநிலங்களுக்குத் தண்டனையா? ஒன்றிய பா.ஜ.க. அரசு நாளை நாடாளுமன்றத்தில் கொண்டுவரவுள்ள #Delimitation சட்டத்திருத்தம் தமிழ்நாட்டுக்கும்,… pic.twitter.com/6gbEAHvNn4— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 15, 2026 చదవండి: గెలిస్తే ఏఐ యూనివర్సిటీ, మంత్రిత్వ శాఖ
‘నేను చేసిన పాపం ఏంటి?’.. వడోదర విద్యార్థిని కన్నీరు
వడోదర: కళాశాల వేదికపై ఒక విద్యార్థిని చేసిన డ్యాన్స్ వివాదానికి దారితీసింది. బాలీవుడ్ పాట‘ధక్ ధక్ కర్నే లగా’ పాటకు చీరకట్టులో ఓ విద్యార్థిని చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గుజరాత్లోని వడోదరలో ఉన్న మహారాజా సాయాజీరావు యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యూనివర్సిటీలోని సీసీ మెహతా ఆడిటోరియంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ‘సంస్కార్ సంగమం’ అనే కార్యక్రమం జరిగింది. ఇందులో ఓ విద్యార్థిని బాలీవుడ్ పాటకు చీరకట్టులో డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో విపరీతంగా ట్రోల్ కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది.అనంతరం కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియోను విడుదల చేసిన ఆ విద్యార్థిని తాను కేవలం వేదికపై డ్యాన్స్ మాత్రమే చేశానని, అందులో ఎలాంటి అసభ్యత లేదని తెలిపింది. అయితే పాట ఎంపిక తన పొరపాటే కావొచ్చని అంగీకరిస్తూ, అందరికీ క్షమాపణలు తెలియజేసింది. ఈ వివాదం తన మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని వాపోయింది. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే జరుగుతోందని ఆరోపించింది.నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) సభ్యులే ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోను వైరల్ చేశారని, తన వాదన వినిపించిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాను సస్పెండ్ చేయించారని ఆమె విమర్శించింది. వడోదర సంస్కృతికి తాను ఎలాంటి భంగం కలిగించలేదని, అసలైన సమస్యలను గాలికి వదిలేసి, తనలాంటి ఓ సాధారణ విద్యార్థినిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె సూటిగా ప్రశ్నించింది.ఈ క్యాంపస్ డ్యాన్స్ వివాదం కాస్తా ఏబీవీపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చగా మారింది. విద్యార్థిని అనుమతి లేకుండా ఆమె గౌరవానికి భంగం కలిగించేలా వీడియోను సర్క్యులేట్ చేసినందుకు కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఏబీవీపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవాన్ష్ బ్రహ్మభట్ డిమాండ్ చేశారు. దీనిపై గుజరాత్ కాంగ్రెస్ ప్రతినిధి నిశాంత్ రావల్ స్పందిస్తూ.. ఏబీవీపీ నిర్వహించిన కార్యక్రమంలోనే ఈ డ్యాన్స్ జరిగినప్పుడు, పాట సరికాదని భావిస్తే వారు అప్పుడే ఎందుకు ఆపలేదని ఆయన ప్రశ్నించారు.ఇది కూడా చదవండి: విజయ్ ర్యాలీలో ఉద్రిక్తత: స్పృహ కోల్పోయిన టీవీకే అభ్యర్థి
రైలు పట్టాలపై సిలిండర్, స్టవ్
బెంగళూరు: రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్, స్టవ్ కనిపించడంతో పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. మద్దూరు–చెన్నపట్టణ రైల్వే మార్గంలో ఇది జరిగింది. సోమవారం ఉదయం ఖాళీ గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్, కొన్ని బట్టలు కలిగిన మూట ఒకటి రైలు పట్టాల ఉంది. మైసూరు నుంచి బెంగళూరు వస్తున్న మంగళ ఎక్స్ప్రెస్ రైలు లోకోపైలట్ వాటిని చూసి రైలును నిలిపివేశాడు. రైలులో ప్రయాణికులు తీసుకువెళ్తున్న ఈ వస్తువులు అనుకోకుండా జారిపడి ఉంటాయని అనుమానిస్తున్నారు. లేదా ఎవరైనా కావాలనే సిలిండర్ను పట్టాలపై ఉంచారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వల్ల కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
విజయ్ ర్యాలీలో ఉద్రిక్తత: స్పృహ కోల్పోయిన టీవీకే అభ్యర్థి
తిరుప్పూర్: టీవీకే అధినేత దళపతి విజయ్ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎండల తీవ్రత, కిక్కిరిసిన జనసందోహం మధ్య గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తమిళనాడులోని తిరుప్పూర్కు వచ్చిన తమ అభిమాన నాయకుడిని చూడాలని ఆశగా ఎదురుచూసిన అభిమానులు, పార్టీ శ్రేణులు భానుడి భగభగలకు విలవిలలాడారు. ఎండ దెబ్బకు తట్టుకోలేక ఏడుగురు మహిళలు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి స్పృహతప్పి పడిపోయారు.ఎండకు అల్లాడిన జనంతమిళనాడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ విజయ్ చెన్నై నుంచి కోయంబత్తూర్ మీదుగా తిరుప్పూర్ బయలుదేరారు. విజయ్ను చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఎండ తీవ్రత విపరీతంగా పెరగడం, మరోవైపు జనసందోహం అదుపు తప్పడంతో అక్కడివారికి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. దాహంతో అలమటిస్తున్న జనాలకు నిర్వాహకులు నీరు అందించినప్పటికీ, వడగాల్పుల తీవ్రతకు ఏడుగురు మహిళలు స్పృహ కోల్పోయారు. వారిని వెంటనే అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు.స్పృహ కోల్పోయిన సులూరు అభ్యర్థి సుకుమార్ పార్టీ ముఖ్య నేతలకు కూడా ఈ ఎండల సెగ తప్పలేదు. కోయంబత్తూరులోని సులూరు నియోజకవర్గ టీవీకే అభ్యర్థి సుకుమార్, కనియూర్ టోల్ ప్లాజా వద్ద విజయ్కు స్వాగతం పలికేందుకు తన మద్దతుదారులతో కలిసి వేచి ఉన్నారు. విపరీతమైన ఎండ కారణంగా ఆయన అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అనుచరులు ఆయనకు ప్రథమ చికిత్స అందించి కోలుకునేలా చేశారు.తిరుప్పూర్లో విజయ్ సుడిగాలి పర్యటనఈ పరిస్థితుల నడుమ, కొచ్చిన్-సేలం జాతీయ రహదారి మీదుగా విజయ్ తన ప్రచార రథంపై తిరుప్పూర్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో (తిరుప్పూర్ నార్త్, తిరుప్పూర్ సౌత్, అవినాషి, పల్లడం, కంగేయం, ధారాపురం, ఉడుమలై, మడతుకులం) పోటీ చేస్తున్న టీవీకే అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఒకే రోజు ఇంత మంది వడదెబ్బకు గురవడం పలు ఆందోళనలకు తావిస్తోంది.
ఎన్ఆర్ఐ
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు)
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’
అల్ఫారెట్టా, జార్జియా: స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి-2026’ అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు.ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. నాలుగేళ్ల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ(యూఎస్ఏ) సేవా సంస్థలకు అందజేయనున్నారు.ఈ వేడుకల్లో బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి (శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రతినిధులు), గిరిధర్ కొటగిరి (ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు), జ్యోత్స్న పాలకుర్తి (గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ చైర్మన్), రమణ గంద్ర (గేట్స్ అధ్యక్షులు), సునీత పోట్నూరు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు), ఆది శ్రీనివాసన్ (ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు), శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ (ప్రెసిడెంట్ అండ్ సీఈఓ), జనార్ధన్ పన్నెల (శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధి) పాల్గొన్నారు.
క్రైమ్
ఔటర్పై రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా: ఔటర్ రింగ్రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి వచి్చన కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తితోపాటు రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ హనుమకొండకు చెందిన వేద ప్రకాష్ రెడ్డి (37) భార్య హిమబిందు, కుమారుడు అర్జున్ (2)తోపాటు బ«ంధువైన దుర్గాప్రసాద్రెడ్డి, అతని భార్య శ్రీజతో కలిసి మంగళవారం హనుమకొండ నుంచి కారులో హైదరాబాద్లోని బొంగ్లూర్కు బయలుదేరారు. ఈ క్రమంలో ఘట్కేసర్లో ఔటర్ రింగ్రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న వీరి కారు సాయంత్రం 4గంటల సమయంలో పెద్దఅంబర్పేట టోల్ గేటు దాటి కొంత దూరంగా వెళ్లగానే అప్పటికే డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి ఢీ కొట్టారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న వేద ప్రకాశ్రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, అతని కుమారుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య హిమబిందు, బంధువైన దుర్గాప్రసాద్రెడ్డి, శ్రీజకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సంతో‹Ùనగర్లోని డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
పోలిక లేదని సొంత కొడుకును చంపిన తండ్రి
సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లాలో ఘోర దురంతం చోటు చేసుకుంది. తన పోలిక లేదనే అనుమానంతో సొంత కొడుకును నదిలోకి తీసుకెళ్లి ఓ తండ్రి నీటిలో ముంచి దారుణంగా చంపిన ఘటన జిల్లాలోని నాగఠాణ గ్రామంలో చోటు చేసుకుంది. నాగఠాణకు చెందిన సిద్ధార్థ (6) హత్యకు గురైన చిన్నారి. బాలుడు తండ్రి మల్లికార్జున అరకేరిని పలువురు మీ కుమారుడు సిద్ధార్థ చూడటానికి నీలాగా లేడని ఎద్దేవా చేసేవారు. దీన్ని రోజు వింటున్న మల్లికార్జున అక్కసుతో సొంత బిడ్డను నదిలో ముంచి చంపాడు. మహారాష్ట్రలోని కరాడ్ జిల్లా వడోలి వద్ద కృష్ణా నదిలోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మార్చి 16న కుమారుడిని సదరు నదిలోకి తీసుకెళ్లి ముంచి చంపి తిరిగి ఊరికి వచ్చిన మల్లికార్జునను కొడుకు గురించి ఆరా తీయగా సింధగి వద్ద స్కూల్లో చేరి్పంచి హాస్టల్లో పెట్టానని నాటకమాడాడు. ఇక మే 1న సిద్ధార్థ్ పుట్టిన రోజు ఉంది. తీసుకొని రమ్మని తల్లి భాగ్యశ్రీ పట్టుబట్టింది. కొడుకు ఏడి? అని నిలదీయగా నిందితుడు మల్లికార్జున పరారయ్యాడు. దీంతో తల్లి భాగ్యశ్రీ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కుమారుడిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు తానే హత్య చేసినట్లు అంగీకరించాడని, దీంతో మల్లికార్జునను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
కన్న కూతురినే కడతేర్చిన తల్లి… ఆపై ఆత్మహత్య
బెంగళూరు: ఏం కష్టం వచ్చిందో గానీ కూతురిని చంపి, ఆపై తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఎంత ఆపద వచ్చినా పిల్లలను కాపాడుకోవాల్సిన అమ్మ గుండె రాతిగా మారింది. ఈ దుర్ఘటన సిలికాన్ సిటీలో వైట్ఫీల్డ్ ఠాణా పరిధిలోని ఇమ్మడిహళ్లిలో మంగళవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాలు.. సువర్ణ (40), ఆమె కుమార్తె కారుణ్య (14) మృతులు. ఓ ఇంటిలో సువర్ణ కుటుంబం నివసిస్తోంది. మొదట కుమార్తెను గొంతుపిసికి చంపింది, ఆపై ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నుంచి ఇంట్లో అలికిడి లేకపోవడంతో ఇరుగు పొరుగుకు అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఏదో జరిగినట్లు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి చూడగా తల్లీ కూతురు శవాలు కనిపించాయి. క్లూస్ టీంతో ఆధారాల కోసం గాలించారు. అక్కడ ఎలాంటి డెత్నోట్ దొరకలేదని సమాచారం. కారణాలపై సందిగ్ధం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారణాలపై బంధుమిత్రులను విచారిస్తున్నారు. కుటుంబ సమస్యలా, ఆర్థిక ఇబ్బందులా, లేక మరేమైనా ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది. ఈ దుర్ఘటనతో ఇమ్మడిహళ్లిలో విషాదం నెలకొంది.
ప్రియుడికి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేందుకు..
హైదరాబాద్: ప్రియుడికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చేందుకు చోరీ బాట పట్టింది ఓ ప్రియురాలు. సీసీ ఫుటేజీకి చిక్కి అరెస్టయింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి (26) బీటెక్ చదివింది. నగరానికి వచ్చి ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తూ హాస్టల్లో ఉంటోంది. ఇదే జిల్లాకు చెందిన ప్రైవేటు ఉద్యోగి కొత్త మురళీధర్గౌడ్ (29)తో కొంతకాలంగా ప్రేమలో ఉంది. మూడు రోజుల క్రితం ప్రియుడి బర్త్డేకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చేందుకు మురళీధర్ గౌడ్ కారులో జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–36లోని రమేష్ వాచ్ కంపెనీకి వచి్చంది. మురళీధర్ను కారులోనే కూర్చోమని షోరూంలోకి వెళ్లింది. వాచీలను చూపించాలని సేల్స్మన్ను అటూ ఇటూ తిప్పుతూ అప్పటికే అక్కడ ఉంచిన ఒక్కొక్కటి రూ.లక్ష ఖరీదు చేసే రెండు టిస్సాట్ వాచీలను చాకచాక్యంగా బ్యాగ్లో వేసుకుంది. వాచీలు నచ్చలేదంటూ బయటకు వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత సేల్స్మన్ గమనించగా అక్కడ రెండు వాచీలు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీ ఫుటేజీలను పరిశీలించగా యువతి రెండు వాచీలను హ్యాండ్బ్యాగ్లో వేసుకున్నట్లు కనిపించింది. కారు నంబర్ ఆధారంగా పోలీసులు ఖమ్మంలో యువతిని అరెస్టు చేశారు. యువతి దొంగతనంతో ప్రియుడిపైనా కేసు నమోదైంది. ఇద్దరినీ అరెస్టు చేశారు.
వీడియోలు
పెద్ది మరోసారి వాయిదా...రామ్ చరణ్ అనుకున్నదే జరిగింది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
Oracle ఉద్యోగాల ఊచకోత వెనుక అసలు కథ
5 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్ పెడితే... ఓపెన్ చేసి చూస్తే షాక్
శ్రీహరినే బయపెట్టాలనుకుంటున్నారా అరెస్ట్ అంబటి రియాక్షన్
జెడ శ్రవణిను కలిసిన అంబటి రాంబాబు
పెట్రోల్, డీజిల్ ధరల పెంచేందుకు కేంద్రం ముహూర్తం ఫిక్స్..!
అజయ్ కోపం చూసి షాక్ అయిన మంచు లక్ష్మి
జగనన్న కోసం వస్తే పోలీసులు కర్రలతో కొడుతున్నారు
సత్యసాయి జిల్లా పేలుడు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి


