విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ AIADMK (అన్నాడీఎంకే) చీలిక దిశగా వెళ్తుండటంతో, ఆ పార్టీకి చెందిన రెబల్ వర్గం ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. బుధవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించు కోవాల్సి ఉన్న తరుణంలో సీఎం విజయ్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో CV షణ్ముగం, SP వేలుమణిలతో భేటీ కావడంతో తమిళనాట రాజికీయాలు మరింత వేడెక్కాయి.ముఖ్యమంత్రి విజయ్, టీవీకే కూటమికి మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే కీలక నేతలతో సమావేశ మయ్యారు. ఎడప్పాడి పళనిస్వామి (EPS) ప్రతిపాదనపై వ్యతిరేకత కారణంగా అన్నాడీఎంకేకు చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఈ రెబల్ క్యాంపులో ఉన్నట్లు సమాచారం. ఇది తమ ఎమ్మెల్యేలలో అత్యధికుల నిర్ణయమని షణ్ముగం మంగళవారం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.కొత్త నాయకత్వంరెబల్ వర్గం తమ సొంత నాయకత్వాన్ని ఎన్నుకుంది:శాసనసభాపక్ష నేతగా ఎస్.పి. వేలుమణిని, డిప్యూటీ లీడర్గా జి. హరిని ఎన్నుకోవడం సంచలనం రేపింది.విజయ్తో అన్నాడీఎంకే రెబల్ నేతల భేటీఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కేవలం 47 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి, బద్ధశత్రువైన DMK (డీఎంకే) మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని భావించడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని షణ్ముగం తెలిపారు.డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే మనుగడకే ముప్పు అని మెజారిటీ ఎమ్మెల్యేలు భావించారు. 53 ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగానే తమ రాజకీయం ఉందని, అందుకే విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నాడీఎంకేలో మరో చీలిక తమకు ఇష్టం లేదని ఎస్.పి. వేలుమణి పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పళనిస్వామిని కోరారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో టీవీకే (108 సీట్లు) అతిపెద్ద పార్టీగా అవతరించగా, డీఎంకే 59 సీట్లు, అన్నాడీఎంకే 47 సీట్లు గెలుచుకున్నాయి. ఇప్పుడు అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతుతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతం కానుంది.
జ్యోతిష్కుడి జోస్యం నిజమైంది.. సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ తన పరిపాలనా దక్షతతో దూసుకుపోతున్నారు. ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. పాఠశాలల సమీపంలోని 717 వైన్ షాపులను మూసివేయాలని సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రజలు, సామాజిక వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ చర్యను చాలా మంది స్వాగతిస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం విజయ్ తీసుకున్న మరో నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రికి రాజకీయ వ్యూహాలపై సలహా ఇచ్చే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(OSD)గా ప్రముఖ జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ను నియమించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి రీటా హరీష్ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు.రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ ఎవరు? గత 40 ఏళ్లుగా ఆయన వేద జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, ధ్యానం ఆధారిత మార్గదర్శకత్వం చేస్తున్నారు. దేశంలో అత్యంత ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్కులు, రాజకీయ జ్యోతిష్కులులో ఒకరిగా గుర్తింపు పొందారు. 2008లో తమిళనాడు నుంచి ముంబైకి మకాం మార్చి రాధన్ పండిట్ అనే పేరుతో జ్యోతిష్యం చెబుతున్నారు. పలు మీడియా నివేదికల ప్రకారం, ఆయనకు దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, ఏఐడీఎంకే నేతలు క్లయింట్లుగా ఉన్నారు.విజయ్తో సంబంధం ఎన్నికలకు ముందు విజయ్ టీవీకే పార్టీకి బహిరంగంగా మద్దతు పలికిన ప్రముఖుల్లో వెట్రివేల్ ఒకరు. గతంలో విజయ్ జాతక చక్రం బలంగా ఉందని, రాజకీయాల్లో విజయ్ సునామీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.తమిళనాడులో విజయ్ 150కి పైగా సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అవుతారని, ఆయన నాయకత్వంలో దేవాలయాలు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని కూడా పేర్కొన్నారు. 2024లో విజయ్ రాజకీయాల్లో విజయం సాధించే కారణాలను ఆయన తన యూట్యూబ్ వీడియోలో వివరించారు. ఆ తర్వాత విజయ్ ఆయనను టీవీకే అధికారిక ప్రతినిధిగా నియమించుకున్నారు. రాధన్ జోస్యం నిజం కావడంతో తన రాజకీయ సలహాదారుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.అయితే, విజయ్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోత్యుష్కుడి ప్రభుత్వ పదవి విరిచేవారు లేకపోలేదు. మరి ఈ విమర్శల్ని విజయ్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.
ఎదుటివారికి చెప్పేటందుకేనా ప్రధాని నీతులు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికి అంతా ఊహిస్తున్న సందేశం ఇచ్చేశారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత మోదీ కొన్ని చర్యలు చేపడతారని ,అవి ప్రజలపై భారం మోపేవిగా ఉండక తప్పదని భావించారు. హైదరాబాద్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో ఆయన పలు అంశాలు ప్రస్తావించి అసలు సమస్య కూడా చెప్పేశారు. ఆయన చెప్పినవి సూచనలుగా తీసుకుంటారా? లేక జరగబోయే పరిణామాలుగా తీసుకుంటారా అన్నది ప్రజల ఇష్టం.ఒక ఏడాదిపాటు బంగారం కొనవద్దని చెప్పడం నిజంగా సంచలనమైన సంగతే. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని చెప్పడం అసాధారణమేమీ కాకపోయినా, భవిష్యత్తులో వీటి ధరలు పెంచుతారన్న సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, యూరియా వాడకం నియంత్రించాలని ఇలా తొమ్మిది పాయింట్లపై ప్రజలకు సలహాలు ఇచ్చారు. విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం ఈ చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.వీటన్నిటిని దేశ భక్తితో ముడిపెట్టడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దేశం ఎదుర్కుంటున్న సమస్యలను ప్రజలకు వివరించడం తప్పు కాదు. కాని ఆయన కూడా సాధారణ రాజకీయ నేత మాదిరే వ్యవహరిస్తున్నారన్నదే బాధ. ఇంతకాలంగా ప్రధానమంత్రిగా ఉంటూ దేశ ప్రజల అభిమానం చూరగొంటున్న నేతగా ఆయన రాజనీతిజ్ఞుడుగా ఉంటే సంతోషంగా ఉంటుంది. కాని ఆలా చేయలేకపోతున్నారే అన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడుతోంది.దాదాపు మూడు నెలలుగా గల్ఫ్ లో యుద్ద వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు, ఇరాన్ కు మద్య సాగుతున్న ఘర్షణల ప్రభావం ప్రపంచం అంతటా పడుతోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని మూసివేయడం, ఇతరత్రా అంతర్జాయతీయ పరిణామాలు అందరిని కలవరపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే కమర్షియల్ వంట గ్యాస్ ధరను అమాంతం పెంచాల్సి వచ్చింది. అప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని ఊహించారు.కాని శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు ఆ ఊసు ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు. కేంద్రం తరపున అధికారులు ఎప్పటికప్పుడు ఆయిల్ ధరలు పెరగవని చెబుతూ వచ్చారు. కానీ.. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెల్లడైన వారం రోజులకే అసలు రంగు బయటపడింది. ప్రధాన మంత్రే ఆర్థిక సంక్షోభం గురించి స్వయంగా వివరించారు. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరగవచ్చన్నది ఎక్కువ మంది అంచనాగా ఉంది.ఇక ఈ పొదుపు సూత్రాలు చెప్పడానికి ఆయన ఎంపిక చేసుకున్న వేదిక సరైనదేనా అన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. పెట్రోల్ ,డీజిల్ వాడకం తగ్గించుకోండని, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని చెప్పారు. సొంత వాహనాలను వదలి మెట్రో,బస్ లను వాడాలని చెప్పారు. ఆక్షేపణ లేదు. ఈ సమస్య గురించి ఆయనకు ముందుగానే తెలుసు కదా! అలాంటప్పుడు ఇంత భారీ సభను నిర్వహించడం ఎంతవరకు సరి? లక్షల మందిని సమీకరించి, వారందరిని వాహనాలలో తీసుకురావడానికి ఎంత పెట్రోల్, డీజిల్ అవసరం అవుతాయో ఆయనకు తెలియదా?ప్రజలకు పొదుపు మంత్రం చెప్పి, తామేమో ఇలా జనాన్ని పోగు చేయడానికి చమురును వాడవచ్చా! రెండున్నరేళ్ల తర్వాత జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికలకోసమో, లేక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల కోసమో ఈ సభ పెట్టినట్లు లేదా? అలాగే తెలంగాణలో ఆయన పలు శంకుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేశారు. అది కూడా హైదరాబాద్ నుంచి రిమోట్ ద్వారానే జరిపారు. ఆ పని ఢిల్లీ నుంచి కూడా చేసి ఉండవచ్చు కదా అన్న సందేహానికి అవకాశం ఇచ్చారు. దేశంలోని ఆయా నగరాలలో ప్రజా రవాణా అంత మెరుగ్గా లేదన్న సంగతి ఆయనకు తెలుసు కదా!ముందుగా దానిని మెరుగు చేయకుండా బస్సుల్లో వెళ్లండి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది. మోదీ చెప్పిన సూత్రాలలో బంగారం కొనుగోలు చేయవద్దని చాలా ముఖ్యమైన ప్రకటనగా కనిపిస్తుంది. ఇది మహిళల సెంటిమెంట్కు వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రత్యేకించి హిందూమతం అంటూ నిత్యం జపం చేసే బీజేపీ ఈ ప్రతిపాదన చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. దీని ప్రభావం దేశ వ్యాప్తంగా బంగారం షాపులపై ఉంటుంది. నిజంగానే ప్రజలు బంగారం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం మానివేస్తే దాని విపరిణామాలు కూడా గణనీయంగానే ఉంటాయి. కొన్నివేల గోల్డ్ షాపులు దెబ్బతింటాయి.వేలాది మంది ఉద్యోగాలకు గండం ఏర్పడుతుంది. ఇన్నేళ్లుగా ఆత్మనిర్భర్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న విధానాలు పెద్దగా ఫలించడం లేదని ఆయన చెప్పినట్లుగా ఉంది. గోల్డ్ బాండ్ల పేరుతో ప్రజల నుంచి నిధుల సేకరణ కూడా ఫలితం ఇవ్వలేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలని అన్నారు. బాగానే ఉంది. కాని తమ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో ఎన్నివేల కోట్ల అప్పు చేస్తున్నది మోదీకి తెలియదా? అక్కడ నిర్మాణాల కోసం ఈ మధ్య కొన్ని కోట్ల లీటర్ల డీజిల్ ను మళ్లించే యత్నం చేయడంపై కేంద్రం అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టి, పొదుపుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పి ఉంటే బాగుండేది కదా!హైదరాబాద్లో స్వయంగా చంద్రబాబు ఇంటికి ప్రధాని వెళ్లారు కదా! ఆ సందర్భంగా ఏపీలో జరుగుతున్న దుబారా గురించి కూడా సలహా ఇచ్చి ఉంటే బాగుండేదేమో! చదరపు అడుగుకు రూ.18 వేల వరకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వంగా ఏపీ రికార్డు సాధిస్తోంది.ఈ నిర్మాణాలలో ఎన్ని రకాల సరుకులను విదేశాల నుంచి తెప్పిస్తోందో తెలియదు. ఒక్క అద్దాలకే రూ.2540 కోట్లు వెచ్చించబోతున్నారే. అవన్ని ఇండియాలో తయారయ్యేవా? లేక దిగుమతి చేసుకోవల్సి ఉంటుందా? వంట నూనెలు తగ్గించుకోవాలని కూడా మోడీ సలహా ఇచ్చారు.ఇన్నేళ్ల పాలనలో వంట నూనెల విషయంలో కూడా దేశం స్వయం సమృద్ధి సాధించలేకపోవడం అవమానమే. రైతులు యూరియా వాడకం తగ్గించాలని అన్నారు. ఉక్రెయిన్,రష్యా యుద్దం మూడేళ్లుగా జరుగుతోంది. త్వరలో ముగుస్తుందని చెబుతున్నారు. ఈ దశలో యూరియా గురించి మోడీ జాగ్రత్తలు చెబుతున్నారు. సేంద్రీయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువులు అందుబాటులో ఉంటే రైతులు తప్పనిసరిగా మార్చుతారు. అది చేయకుండా యూరియా వాడవద్దంటే, పంటలు సరిగా పండకపోతే రైతులకు కలిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు? ప్రజలు విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని ప్రధాని సలహా ఇచ్చారు. ఇదేదో ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి ఉండాల్సింది. ఈ మధ్య కాలంలో చిత్రమైన శిక్షణల పేరుతో మంత్రులు, అధికారులను బృందాలుగా సింగపూర్ పంపుతున్నారు. దీనివల్ల ఏపీకి కలిసి వచ్చేది ఏమి ఉందో ఎవరికి తెలియడం లేదు.ప్రభుత్వ ఖజానా పై కోట్ల భారం పడుతోంది.వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగుల గురించి కూడా ప్రధాని సూచన చేశారు. ఇప్పటికే అలాంటివి జరుగుతున్నాయి. కాని వాటివల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మామూలు రోజుల్లో ప్రధాని ప్రజలకు ఇలాంటి సలహాలు ఇచ్చి ఉంటే తప్పక చిత్తశుద్ది అర్ధం అవుతుంది.కాని ఎన్నికల సమయంలో ఒక రకంగా ,ఆ తర్వాత మరో రకంగా వ్యవహరిస్తుండడమే విమర్శలకు దారి తీస్తుంది.గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు డాలర్తో రూపాయి విలువను పోల్చి విమర్శలు చేసిన మోడీ, అప్పటికన్నా విలువ దాదాపు రెండు రెట్లు తగ్గినా ఇంతవరకు మాట్లాడలేదు.ప్రధాని చెప్పిన నవ సూత్రాలపై లోక్ సభ లో విపక్ష నేత రాహోల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యం అని, ప్రధాని అయిన 12 ఏళ్లకు ఈ స్థితికి దేశాన్ని దిగజార్చారని వ్యాఖ్యానించారు. ఎప్పుడో 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు పాక్ యుద్దం, కరువు పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు వారానికి ఒక పూట ఉపవాసం చేయాలని విజ్ఞప్తి చేశారు. దానిని ఆయన తొలుత తన కుటుంబం నుంచే ఆచరించి చూపారు.తద్వారా దేశభక్తి అంటే ఏమిటో తెలియచేశారు. అలాగే ముందుగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు దేశభక్తిని నిజమైన రీతిలో ఆచరించి,అప్పుడు ప్రజలకు చెబితే ఆదర్శవంతంగా ఉంటుంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
నో వీసా, నో సిటిజన్షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?
లండన్: విద్యాభ్యాసం కోసం స్టూడెంట్ వీసాపై స్కాట్లాండ్కు వచ్చిన తమిళనాడు విద్యార్థి క్యూ మణివణ్ణన్ రాజకీయపథంలో పయనించి పార్లమెంట్లో అడుగుపెట్టడం ఇప్పుడు అక్కడ సరికొత్త చర్చకు దారితీసింది. విదేశీ విద్యార్థులు విదేశీగడ్డపై చదువుకుని ఉన్నతస్థాయిలో స్థిరపడాల్సిందిపోయి విదేశీ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గతేడాది తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో విదేశీ విద్యార్థులూ ఎన్నికల రణక్షేత్రంలో పోటీపడేందుకు అవకాశం చిక్కింది. ఈ సువర్ణావకాశాన్ని మణివణ్ణన్ అందిపుచ్చుకుని స్కాటిష్ గ్రీన్పార్టీ తరఫున ఎడిన్బర్గ్ అండ్ లూథియన్స్ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. దీంతో మెంబర్ ఆఫ్ స్కాటిష్ పార్లమెంట్(ఎంఎస్పీ) సభ్యుడయ్యాడు. తాత్కాలిక వీసాపై వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన తొలి విదేశీ అభ్యర్థిగా మణివణ్ణన్ చరిత్రసృష్టించాడు. తమిళనాడులో పుట్టిన ఇతను 2021లో స్కాట్లాండ్కు వచ్చాడు. ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు కోర్సులో పీహెచ్డీ విద్యారి్థగా చేరాడు. కనీసం మూడేళ్లుగా బ్రిటన్లో ఉంటున్న, శాశ్వత స్థిరనివాస హోదా లేని విదేశీ పీహెచ్డీ విద్యార్థులూ స్కాట్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయొచ్చని గతేడాది చట్టసవరణ తీసుకొచ్చారు. దీంతో పరిపాలనలో వైవిధ్యం చూపేందుకు తానూ ఎన్నికల యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టానని ట్రాన్స్జెండర్ అయిన మణివణ్ణన్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. గ్రీన్స్ పార్టీ పాలస్తీనా సంఘీభావ విభాగానికి కో–కన్వీనర్గా పనిచేశాడు. గతంలో ఐక్యరాజ్యసమితి ఆరోగ్య, దివ్యాంగ కార్యకర్తగా పనిచేశాడు. తానో తమిళ వలసదారుడినని ప్రచారం చేసుకున్నాడు. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనువిదేశీయుడు మనకు ఎలా ప్రాతినిథ్యం వహించగలడని ప్రత్యర్థి పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా కాలపరిమితి ముగిసేలోపే అతని వీసా గడువు ముగిస్తే బ్రిటన్ గడ్డపై ఉండేందుకు అతను అర్హత కోల్పోతాడు. అప్పుడు అతను స్కాట్లాండ్ను వీడక తప్పదు. అప్పుడు ఎడిన్బర్గ్, లూథియన్స్ ప్రాంతవాసుల బాగోగులను ఎవరు పట్టించుకుంటారు? ఎంపీ లేకుండా ఒక నియోజకవర్గం అలా నిస్సహాయంగా మిగిలిపోవాలా? దీనిని పరిష్కారం ఏంటి? స్కాట్లాండ్ స్థానిక ప్రజల సంస్కృతి, సంప్ర దాయాలు, అవసరాలకు అనుగుణంగా జరిగే చట్టాలు, విధాన నిర్ణయాల్లో మణివణ్ణన్ మేరకు క్రియాశీలక పాత్ర పోషించగలడు? అంటూ ప్రశ్నల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. విదేశీ విద్యార్థుల మార్గదర్శకంలో నడవడమేంటి? అంటూ వలసల వ్యతిరేక యూకే విభాగ షాడో చాన్స్లర్, మాజీ ఎంపీ రాబర్ట్ జెన్రిక్ అన్నారు. అయితే ఈ అంశంలో మణివణ్ణన్కు గ్రీన్స్ పార్టీ అండగా నిలిచింది. అతని వీసా ఖచి్చతంగా రెన్యూవల్అయ్యేలా చూస్తామని పార్టీ నేత గిలియన్ మెకే తెలిపారు. వామపక్ష భావాలున్న గ్రీన్స్ పార్టీ తాజా ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఇదీ చదవండి: విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం
రానున్న రోజుల్లో.. చమురు ధరలు ఇలా!
పాక్కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. 24 ఏళ్లలో ఇదే తొలిసారి
కోట్లాది మందిని ఏలిన పార్టీలు ఇప్పుడు ముక్కలు
ఏడాది పాటు పసిడి కొనొద్దు.. పరిష్కారం ఇదిగో
స్టాక్ మార్కెట్ క్రాష్: రూ.10 లక్షల కోట్లు ఆవిరి!
విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం
క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు!
సీఎంగా విజయ్.. మరి కోలీవుడ్ దళపతి ఎవరు?
నీట్గా ఉందాం..ఆ మొక్కల చిక్కులొద్దు!
డియర్ విజయ్ హ్యాట్సాఫ్ : హీరో విశాల్ ప్రశంసలు
కోటి రూపాయల శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!
విజయ్ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పేసిన మంత్రి కీర్తన
ఎలాగూ మోస్తున్నావుగా.. ఇది కూడా భరించు !!
ఫ్రాంచైజీని కొనేసిన రాహుల్ ద్రవిడ్
'రష్మిక బాటలో మరో హీరోయిన్.. నాకు తెలుగబ్బాయే కావాలి'
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
టీ ఇలా చేయాలి.. అలా కాదు!
తమిళనాడు సీఎం విజయ్ బిగ్ సర్ప్రైజ్
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్!
జాక్ పాట్ కొట్టేసిన త్రిష.. రూ. 12 కోట్లు ఆఫర్!
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు
బెల్లంకొండ సతీమణి ఆదాయం నెలకు రూ.90 లక్షలా.. ఏం చేస్తారంటే?
అక్రమ నిర్మాణంలో ఉంటూ.. అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశాలివ్వడం భలే బాగుంది సార్!!
డాక్టర్ తమిళిసై (బీజేపీ) రాయని డైరీ
రేంజ్ రోవర్ గిఫ్ట్.. ప్రభాస్లా ఎవరూ చేయరు : ‘బుజ్జిగాడు’ నటి
ముంబై ఇండియన్స్ కొంపముంచిన సూర్యకుమార్
ఒకప్పుడు ఫ్రెండ్స్.. కానీ ఇప్పుడు మారిపోయిన సీన్
సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్: చక్రం తిప్పనున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు!
ఇంటి అద్దె రూ.56 వేలు.. ఖర్చు రూ.1.3 లక్షలు
బ్లాక్ బ్లేజర్లో సీఎం విజయ్... బ్లూ కాంజీవరంలో త్రిష
రానున్న రోజుల్లో.. చమురు ధరలు ఇలా!
పాక్కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. 24 ఏళ్లలో ఇదే తొలిసారి
కోట్లాది మందిని ఏలిన పార్టీలు ఇప్పుడు ముక్కలు
ఏడాది పాటు పసిడి కొనొద్దు.. పరిష్కారం ఇదిగో
స్టాక్ మార్కెట్ క్రాష్: రూ.10 లక్షల కోట్లు ఆవిరి!
విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం
క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు!
సీఎంగా విజయ్.. మరి కోలీవుడ్ దళపతి ఎవరు?
నీట్గా ఉందాం..ఆ మొక్కల చిక్కులొద్దు!
డియర్ విజయ్ హ్యాట్సాఫ్ : హీరో విశాల్ ప్రశంసలు
కోటి రూపాయల శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!
విజయ్ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పేసిన మంత్రి కీర్తన
ఎలాగూ మోస్తున్నావుగా.. ఇది కూడా భరించు !!
ఫ్రాంచైజీని కొనేసిన రాహుల్ ద్రవిడ్
'రష్మిక బాటలో మరో హీరోయిన్.. నాకు తెలుగబ్బాయే కావాలి'
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
టీ ఇలా చేయాలి.. అలా కాదు!
తమిళనాడు సీఎం విజయ్ బిగ్ సర్ప్రైజ్
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్!
జాక్ పాట్ కొట్టేసిన త్రిష.. రూ. 12 కోట్లు ఆఫర్!
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు
బెల్లంకొండ సతీమణి ఆదాయం నెలకు రూ.90 లక్షలా.. ఏం చేస్తారంటే?
అక్రమ నిర్మాణంలో ఉంటూ.. అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశాలివ్వడం భలే బాగుంది సార్!!
డాక్టర్ తమిళిసై (బీజేపీ) రాయని డైరీ
రేంజ్ రోవర్ గిఫ్ట్.. ప్రభాస్లా ఎవరూ చేయరు : ‘బుజ్జిగాడు’ నటి
ముంబై ఇండియన్స్ కొంపముంచిన సూర్యకుమార్
ఒకప్పుడు ఫ్రెండ్స్.. కానీ ఇప్పుడు మారిపోయిన సీన్
సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్: చక్రం తిప్పనున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు!
ఇంటి అద్దె రూ.56 వేలు.. ఖర్చు రూ.1.3 లక్షలు
బ్లాక్ బ్లేజర్లో సీఎం విజయ్... బ్లూ కాంజీవరంలో త్రిష
ఫొటోలు
హనుమాన్ జయంతి... భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు (ఫొటోలు)
అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన (ఫొటోలు)
తిరుపతి గంగమ్మ జాతర...'బైరాగి వేషంలో మొక్క చెల్లించుకున్న భక్తులు (ఫొటోలు)
సూర్య 'వీరభద్రుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో రాజశేఖర్ కుటుంబం (ఫొటోలు)
నారా రోహిత్ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
సీఎం విజయ్ కోసం త్రిష రెడీ అయిందిలా (ఫొటోలు)
కొత్త బిజినెస్ ప్రారంభించిన బిగ్బాస్ బ్యూటీ శోభా శెట్టి (ఫొటోలు)
కొత్తింట్లోకి అడుగుపెట్టిన యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
మోదీ సభ.. కదం తొక్కిన కాషాయ దళం (ఫొటోలు)
సినిమా
మరో ప్రముఖ హీరోయిన్ విడాకులు?
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి అనేది ఎంత సాధారణమో.. విడాకులు అంతే కామన్గా కనిపిస్తుంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొందరు హీరో లేదా హీరోయిన్లు.. పట్టుమని కొన్నేళ్లయినా సంసార బంధాన్ని నిలుపుకోలేకపోతున్నారు. ఇప్పుడు అలానే బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటుడు)'నాగిని' సీరియల్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మౌనీరాయ్.. హిందీ, పంజాబీ భాషల్లో హీరోయిన్, విలనీ పాత్రలు చేస్తూ వస్తోంది. లేటెస్ట్గా అయితే చిరంజీవి 'విశ్వంభర'లోనూ ఐటమ్ సాంగ్ చేసింది. ఓ హిందీ మూవీ కూడా రిలీజ్కి రెడీగా ఉంది. కెరీర్ పరంగా కాస్తోకూస్తో బిజీగా ఉన్న ఈమెనే ఇప్పుడు విడాకులు తీసుకోబోతుందని మాట్లాడుకుంటున్నారు. భర్తని ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడమే ఈ రూమర్స్కి కారణం.సూరజ్ నంబియార్ అనే దుబాయికి చెందిన బిజినెస్మ్యాన్ని 2022 జనవరిలో మౌనీరాయ్ పెళ్లి చేసుకుంది. మలయాళీ, బెంగాలీ సంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహం జరిగింది. మరి ఏమైందో ఏమో ఇప్పుడు ఒకరిని ఒకరు ఇన్ స్టాలో అన్ ఫాలో చేసుకున్నారు. మౌనీ రాయ్ స్నేహితురాలు, హీరోయిన్ దిశా పటానీ కూడా సూరజ్ని అన్ ఫాలో చేసింది. పెళ్లి ఫొటోలని సూరజ్ తన అకౌంట్ నుంచి తీసేసినప్పటికీ.. మౌనీ రాయ్ మాత్రం అలానే ఉంచింది. ఈ విషయంపై మౌనీ క్లారిటీ ఇస్తే నిజాలు బయటకు రావు.(ఇదీ చదవండి: 'లవ్ టుడే' నటి ప్రేమ వివాహం.. దర్శకుడితో ఏడడుగులు)
రూ.200-300 కోట్ల కలెక్షన్స్ వస్తాయనుకున్నా.. కానీ
ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాంటి భావననే దర్శకుడు విఘ్నేశ్ శివన్ వ్యక్తం చేశాడు. నయనతార భర్త అయిన ఇతడు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (ఎల్ఐకే). ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా నటించారు. ఎస్జే.సూర్య విలన్. నయనతార రౌడీ పిక్చర్స్, సెవన్ స్క్రీన్ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించాడు. కాగా గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫ్లాప్ అయింది. ప్రదీప్ రంగనాథన్ చేసిన గత చిత్రాలన్నీ రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. ఇది కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎల్ఐకే ఆ దరిదాపులకు కూడా వెళ్లలేదు. ఈ క్రమంలోనే చిత్ర ఫలితంపై విఘ్నేశ్ తాజాగా స్పందించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)నేను ఓ డ్రీమ్తో వచ్చాను. అది చిన్నది కాదు. ఈ మూవీ స్టోరీ కోట్ల థియేటర్లలో అదిరిపోతుందని నమ్మాను. ప్రేక్షకుల చప్పట్ల ధ్వని మారుమోగుతుందని భావించాను. ఎంటర్టైన్ చేసినప్పటికీ రూ.100 కోట్ల క్లబ్లోకి చేరలేదు. నిజం చెప్పాలంటే అంతకంటే రెండు రెట్లు వసుళ్లూ సాధిస్తుందని భావించాను. అయితే ఏదో సరిగా సెట్ అవ్వలేదు. ఫలితం బాధ కలిగించినా, నేను సంతోషంగా, సంతృప్తిగానే ఉన్నాను. ఎందుకంటే ముందు చెప్పినట్లుగానే ఇది విడుదలవ్వడమే పెద్ద బ్లాక్బ్టస్టర్. ప్రశంసలు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చినా, నేను ఇంకా నిలబడే ఉన్నాను. ఈ చిత్రం వెనుక ఎవరూ చూడని పలు ఇబ్బందులున్నాయి. అయినా నిజాయితీని, శ్రమను సంపాదించి పెట్టిందీ మూవీ అని దర్శకుడు విఘ్నేశ్ శివన్ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా)
విజయ్ సీఎం.. జన నాయగన్కు ఫుల్ డిమాండ్..!
రాజకీయాల్లో ఎంట్రీకి ముందు దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ సెన్సార్ సమస్యలతో రిలీజ్ కాలేదు. ప్రస్తుతం విజయ్ తమిళనాడు సీఎం కావడంతో ఈ సినిమా త్వరలోనే విడుదల అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్టబొమ్మ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ గతంలో రద్దైనట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా జన నాయగన్ డీల్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ నిర్మాతలను సంప్రదించినట్లు లేటేస్ట్ టాక్. ఓటీటీ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్తో చర్చలు జరుపుతోందని కోలీవుడ్లో టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ డీల్పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
గతంలో తెలుగు సినిమాలని అవమానించి ఇప్పుడేమో!
తెలుగు ప్రేక్షకులకు మన తన అని భేదముండదు. బాగుండాలే గానీ ఏ భాష సినిమా అయినా చూసేస్తుంటారు. మిగతా భాషలతో పోలిస్తే తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులో డబ్బింగ్ అవుతుంటాయి. అలా సూర్య 'కరుప్పు'.. 'వీరభద్రుడు'గా ఈ వారం థియేటర్లలోకి రానుంది. దీనిపై పెద్దగా బజ్ ఏం లేదు. ట్రైలర్ కూడా పర్లేదనిపించింది. కానీ ఈ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీపై తెలుగు నెటిజన్లు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. గతంలో ఇతడు టాలీవుడ్ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)గతంలో ఓ అవార్డ్ షోలో మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో హీరో కచ్చితంగా హీరోయిన్ వెంట పడతాడు అని చెప్పుకొచ్చాడు. 'యానిమల్' గురించి మరో సందర్భంలో మాట్లాడుతూ హింసను, మహిళలను అగౌరవపరిచే సన్నివేశాలని ప్రజలు ఆస్వాదించడం చూసి తాను బాధపడ్డానని, అందుకే ఆ సినిమాను థియేటర్లో చూడలేదని అన్నాడు.తీరా చూస్తే ఇప్పుడు ఇతడు తీసిన సినిమాలో మరీ 'యానిమల్' అంత హింస కాకపోయినా కొంతమేర యాక్షన్ ఉంది. అలానే తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందేందుకు మెగా హీరోలైన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లని ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కుదిరితే రామ్ చరణ్తో సినిమా చేస్తానని అన్నాడు. అప్పుడేమో తెలుగు సినిమాల్ని అవమానించి.. ఇప్పుడు తన సినిమా కోసం తెలుగు హీరోల అభిమానుల్ని కాకా పట్టేస్తున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పాత వీడియోలు ట్విటర్(ఎక్స్)లో వైరల్ అవుతున్నాయి.గతంలో తెలుగు సినిమాల్ని కించపరిచి ఇప్పుడు అదే మార్కెట్ నుంచి కలెక్షన్స్ ఆశించడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు నటుడు-దర్శకుడు ఆర్జే బాలాజీపై వస్తున్నాయి. ఇతడిపై పెరుగుతున్న నెగిటివిటీ.. సూర్య 'వీరభద్రుడు' ఓపెనింగ్స్పై ప్రభావం చూపిస్తుందా అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సూర్యకు తెలుగులో మార్కెట్ ఉంది కానీ దర్శకుడిపై వస్తున్న ట్రోల్స్ ఏం చేస్తాయనేది చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్)5 years ago an absolute clown called #RJBalaji used a platform like this to mock and ridicule Telugu films to prove a point and today his next film as a director is shamelessly releasing in Telugu again. Have some shame maybe @RJ_Balaji ?? Care to apologise?? pic.twitter.com/0m6kxP5Hbb— Meher Kilaru (@Kilaruness) May 11, 2026
క్రీడలు
'చపాతీల కంటే బౌలర్లను ఉతకడం మేలు'
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. జట్టు వరుస ఓటములు చవిచూస్తున్నప్పటికీ వైభవ్ మాత్రం ప్రతీ మ్యాచ్లో దనాధన్ ఆటను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్ ఆరంభంలోనే గట్టి పునాది వేస్తున్నాడు. ప్రస్తుతం సూర్యవంశీ 11 మ్యాచ్ల్లో 440 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచిన రాజస్తాన్ క్రమంగా ఓటములు ఎదుర్కొంది. 11 మ్యాచ్ల్లో 6 విజయాలు, 5 ఓటములతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. రాజస్తాన్ తన తర్వాతి మ్యాచ్ మే 17న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. మ్యాచ్కు వారం రోజులు గ్యాప్ రావడంతో రాజస్తాన్ ఆటగాళ్లు బ్రేక్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ యాజమాన్యం తాజాగా ఆటగాళ్లకు సంబంధించి ఫన్నీ వీడియోలను తమ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. దీనిలో భాగంగా వైభవ్ సూర్యవంశీ చపాతీలు కాలుస్తున్న వీడియోనూ పంచుకుంది. ఆ వీడియోలో వైభవ్ మాస్టర్ చెఫ్ అవతారంలో చపాతీలు కాలుస్తూ కనిపించాడు.'నేను చేసే చపాతీలతో పోలిస్తే మా అమ్మ చేసే చపాతీలు భిన్నంగా ఉంటాయి. చపాతీలు కాల్చడం కంటే బౌలర్లను ఉతకడం మేలు' అని నవ్వుతూ పేర్కొన్నాడు. వైభవ్ చపాతీలు కాలుస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది.𝘔𝘶𝘮𝘮𝘺 𝘬𝘦 𝘳𝘰𝘵𝘪 𝘴𝘦 𝘻𝘺𝘢𝘥𝘢 𝘨𝘰𝘭 𝘳𝘰𝘵𝘪 𝘩𝘢𝘪 😂💗 pic.twitter.com/qOqthFPWXU— Rajasthan Royals (@rajasthanroyals) May 12, 2026చదవండి: ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం కన్నుమూత!
పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు!
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్పటికే టెస్టుల్లో 400 వికెట్ల మార్క్తో షాహిన్ అఫ్రిది కొత్త రికార్డు నెలకొల్పగా.. తాజాగా పాకిస్తాన్ స్పిన్నర్ నోమన్ అలీ టెస్టులో వంద వికెట్ల మార్క్ను సాధించాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 69.1 ఓవర్లో మెహదీ హసన్ మిరాజ్ను పెవిలియన్ చేర్చడం ద్వారా నోమన్ అలీ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్లో వంద వికెట్ల మార్క్ సాధించిన పెద్ద వయస్కుడిగా నోమన్ అలీ నిలిచాడు. 22 టెస్టుల్లో వంద వికెట్ల మార్క్ అందుకున్న నోమన్ అలీ ప్రస్తుత వయస్సు 39 ఏళ్ల 213 రోజులు. నోమన్ అలీ కంటే ముందు ఈ రికార్డు బాబీ పీల్ (39 ఏళ్ల 180 రోజులు) పేరిట ఉండేది. రే విల్లింగ్టన్ (39 ఏళ్ల 30 రోజులు), క్లారీ గ్రిమ్మెట్ (39 ఏళ్ల 22 రోజులు), సిడ్నీ బార్న్స్ (38 ఏళ్ల 310 రోజులు) కూడా పెద్ద వయసులోనే వంద వికెట్ల మార్క్ సాధించారు. అంతేకాదు పాక్ తరఫున తక్కువ టెస్టుల్లో వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్న నోమన్ అలీ ఆ జట్టు మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ రికార్డును సవరించాడు. 2021లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నోమన్ అలీ 100 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన తర్వాత కానీ అతడికి తొలి మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. 2024లో సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ను 1-0తో పాకిస్తాన్ గెలవడంలో నోమన్ అలీ పాత్ర కీలకం. 22 మ్యాచ్ల్లో 101 వికెట్లు సాధించిన నోమన్ అలీ 9 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇందులో మూడు మ్యాచ్ల్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి పది వికెట్ల ఫీట్ను అందుకున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే చివరి రోజు ఆటలో పాకిస్తాన్ విజయం కోసం కష్టపడుతోంది. బంగ్లా విధించిన 268 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో తడబడుతున్న పాకిస్తాన్ ప్రస్తుతం 38 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులతో ఆడుతోంది. సాద్ షకీల్ (10), రిజ్వాన్ (7) క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి మరో 128 పరుగులు అవసరం.చదవండి: ‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’
ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం కన్నుమూత!
ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మాల్ అండర్సన్ (91) కన్నుమూశాడు. అనారోగ్య సమస్యలతో సోమవారం తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచాడు. ఆస్ట్రేలియా తరఫున యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ నెగ్గిన తొలి అన్సీడెడ్ ప్లేయర్గా మాల్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. వ్యవసాయక్షేత్రంలోని మట్టికోర్టుపై ప్రాక్టీస్ను ఆరంభించిన అండర్సన్ ఆ తర్వాత టెన్నిస్లో దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 1957లో యూఎస్ క్రౌన్ టైటిల్ నెగ్గిన అండర్సన్, మూడు డబుల్స్ టైటిల్స్ కూడా సాదించాడు. యునైటెడ్ స్టేట్స్ చాంపియన్షిప్ సాధించిన అన్సీడెడ్ క్రీడాకారుడిగా అండర్సన్ నిలిచాడు. ఇక ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్ను కూడా అండర్సన్ రెండుసార్లు సాధించి చరిత్ర సృష్టించాడు.ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అండర్సన్, ప్రపంచ నంబర్ వన్గా ఎదిగిన పాట్ రాఫ్టర్ సహా ఎంతోమంది యువ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేశాడు. మాల్ అండర్సన్ మరణంపై పాట్ రాఫ్టర్ స్పందించాడు. మాల్ మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. నా కెరీర్ ప్రారంభంలో టెన్నిస్లో మెళుకువలు తీర్చిదిద్దడంలో మాల్ అండర్సన్ ఎంతగానో సహాయపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా" అని పాట్ రాఫ్టర్ పేర్కొన్నాడు.
‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. 200 పరుగులకు పైగా టార్గెట్ నిర్దేశించి కూడా పంజాబ్ ఓడిపోవడంపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే ధర్మశాల పిచ్పై పంజాబ్ కెప్టెన్ అయ్యర్ ఒక్క ఓవర్ కూడా స్పిన్నర్లతో వేయించకపోవడం ఆ జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. మరోవైపు ఢిల్లీ కూడా ఒక్క స్పిన్నర్తోనై బౌలింగ్ చేయించకపోవడం గమనార్హం. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. ‘ధర్మశాల వంటి ఫ్లాట్ పిచ్పై 210 పరుగుల లక్ష్యం చాలా ఎక్కువ. కానీ సీమర్లకు అనుకూలిస్తున్న పిచ్పై మరో 20 నుంచి 30 పరుగులు చేసి ఉంటే బాగుండేదేమో. చాహల్తో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం వెనుక ఒకటే కారణం. బంతి సీమర్లకు బాగా అనుకూలిస్తుందని భావించాను. కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చినప్పుడు హార్డ్ లెంగ్త్లో బౌలింగ్ చేయడం ఉత్తమం. అక్కడ నిలకడగా బౌలింగ్ చేస్తే కనీసం ఒక్క బంతయినా మిస్-హిట్ అయ్యి వికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మా సీమర్లు లైన్ అండ్ లెంగ్త్తో బంతులు విసరడంలో విఫలమయ్యారు. మా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు ఫీల్డింగ్లో లోపాలు మా కొంపముంచాయి. మా ప్రణాళికలన్నీ ఆచరణలో దారుణంగా విఫలమయ్యాయి.’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఈ ఓటమితో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోగా, ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.చదవండి: ‘ఐసీసీ మాట వినలేదు.. మాకు ఇది జరగాల్సిందే’
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
నేడు తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం... మెజార్టీ దక్కడంతో ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్సిగ్నల్
తమిళనాట ప్రతిష్టంభనలో విజయ్ ప్రమాణ స్వీకారం... మద్దతు ప్రకటించినా అధికారికంగా లేఖ ఇవ్వని వీసీకే
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ మరోసారి అభ్యర్థించిన విజయ్.. మళ్లీ వెనక్కి పంపేసిన గవర్నర్
తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పొత్తు వార్తలతో వేడెక్కిన పాలిటిక్స్.
సీఎంగా రాజీనామా ప్రసక్తే లేదు. తెగేసి చెప్పిన మమతా బెనర్జీ
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది.
అందరి చూపు బెంగాల్ పైనే.. పశ్చిమ బెంగాల్ సహా తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో నేడే ఓట్ల లెక్కింపు
సింగిల్ బిడ్కే సై.. ఏపీలో అస్మదీయ సంస్థకు పదేళ్లపాటు జీజీహెచ్ల్లో క్యాథ్ల్యాబ్ పీపీపీ సేవల కాంట్రాక్టు
బిజినెస్
ఈసారి రేట్ల పెంపు తప్పదా?
భారత ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణ సెగ తగలనుందా? రాబోయే కాలంలో సామాన్యుడిపై వడ్డీ భారాలు మరింత పెరగనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా ఆర్థిక విశ్లేషణలు. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ఇంధన ధరలు, అస్థిరంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల (ఎల్ నినో) నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ హెచ్ఎస్బీసీ వెల్లడించింది. 2027 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రెండు దఫాలుగా వడ్డీ రేట్లను పెంచవచ్చని ఈ నివేదిక స్పష్టం చేసింది.ద్రవ్యోల్బణం గుప్పిట్లో వృద్ధి రేటుద్రవ్యోల్బణ భయాలు గడిచిన కొద్దికాలంగా మార్కెట్లను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఇంధన ధరలు, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అంతరాయాలు ఆర్థిక వృద్ధిని మందగింపజేస్తాయని నివేదిక పేర్కొంది. ‘2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్ నినో వాతావరణ పరిస్థితుల వల్ల ఆహార ద్రవ్యోల్బణానికి అదనంగా 0.5% (50 బేసిస్ పాయింట్లు) తోడయ్యే ప్రమాదం ఉంది’ అని తెలిపింది.‘శక్తి వనరులు, ఎల్ నినో షాక్ల కలయిక వల్ల 2027 ఆర్థిక సంవత్సరం సవాలుగా మారనుంది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ 2026-27 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను పెంచి రెపో రేటును 5.75 శాతానికి(ప్రస్తుతం 5.25గా ఉంది) చేర్చే అవకాశం ఉంది’ అని హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది.ఆహార భద్రత - వాతావరణ సవాళ్లుగత పదేళ్ల సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే రాబోయే కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగితే అది నేరుగా పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. 2026 తర్వాత ఎల్ నినో పరిస్థితులు బలపడితే ఆ ప్రభావం 2027లో ఆహార ధరల పెరుగుదలకు దారితీస్తుంది. అయితే, ప్రస్తుతం భారత ప్రభుత్వ గిడ్డంగుల్లో ఉన్న అధిక ఆహార ధాన్యాల నిల్వలు కొంతవరకు ఉపశమనాన్ని కలిగించవచ్చని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది.విధాన రూపకర్తలకు పరీక్షఆర్బీఐ ఒకవైపు పెరుగుతున్న ధరలను అదుపు చేయాలి. మరోవైపు మందగిస్తున్న వృద్ధిని పరుగులు పెట్టించాలి. గ్రామీణ గృహాలు, చిన్న వ్యాపారాలపై ఈ ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉండనుంది.వృద్ధి మందగిస్తున్న సమయంలో వడ్డీ రేట్లు పెంచడం వల్ల పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ, ద్రవ్యోల్బణం నియంత్రణకే ఆర్బీఐ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!
వీఐపీ సంస్కృతిపై నిరసన
పెరుగుతున్నచమురు ధరలు, రవాణా కష్టాల నేపథ్యంలో సామాన్య పౌరుడి అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఒకవైపు చమురు వినియోగాన్ని తగ్గించాలని, విలాసాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో సామాన్యులు కనీస ప్రయాణ సౌకర్యాల కోసం పశువుల్లా కొట్టుకోవాల్సి వస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఈ చర్చను మరోసారి తీవ్రతరం చేసింది.‘మేము ఇంధనాన్ని వృధా చేయడం లేదు'సోషల్ మీడియా వేదిక ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా అనురాధ తివారీ అనే యూజర్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది. కిక్కిరిసిన రైలులోకి ప్రవేశించడానికి ప్రయాణికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న దృశ్యాలను ఆమె పోస్ట్ చేశారు. ‘సామాన్య ప్రజలు ఇంధనాన్ని వృధా చేయడం లేదు. ఎన్నికల ర్యాలీలు, కిలోమీటర్ల పొడవున వీఐపీ కాన్వాయ్ల్లో, వందలాది కార్లతో ఇంధనాన్ని వృధా చేసేది రాజకీయ నాయకులే. ఈ వీఐపీ సంస్కృతికి స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ఆమె ఘాటుగా స్పందించారు.ప్రజల అసహనంచమురు దిగుమతులను తగ్గించి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే క్రమంలో.. ప్రజలు ఇంధనాన్ని పొదుపు చేయాలని, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. అయితే, ప్రభుత్వ విజ్ఞప్తులు కేవలం సామాన్యులకేనా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియా స్పందనలు‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే మన దేశంలో సామాన్యులను పశువుల్లాగా, ఉన్నత వర్గాలను రాజుల్లా చూస్తున్నారు’ అని ఒక యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను ప్రత్యక్ష, పరోక్ష పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నాను. ప్రతిఫలంగా నా కుటుంబంతో ఇలాంటి నరకప్రాయమైన ప్రయాణం చేయాలా?’ అని మరొకరు నిలదీశారు. వీఐపీ సంస్కృతిని రద్దు చేయడంతోపాటు రాజకీయ నాయకులను సేవకులుగా చూసేలా ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు రావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.Common people are not the ones wasting fuel. They are struggling just to survive.It’s politicians who waste fuel with hundreds of cars in election rallies & long VIP convoys.Time to end this entire VIP culture ! pic.twitter.com/XesgTlZa39— Anuradha Tiwari (@talk2anuradha) May 11, 2026వాస్తవ పరిస్థితులు - సవాళ్లువార్తా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దేశంలో ప్రజా రవాణా వ్యవస్థపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా భారతీయ రైల్వేలో జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల సంఖ్య తగ్గిపోవడం, రద్దీ పెరగడం సామాన్యులకు శాపంగా మారింది. అభివృద్ధి చెందిన దేశాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు సైతం సామాన్య ప్రజలతో కలిసి రైళ్లలో ప్రయాణించే సంప్రదాయం ఉంది. మన దేశంలో మాత్రం వీఐపీ అంటేనే ప్రత్యేకమైన ప్రోటోకాల్, సామాన్యులకు ఇబ్బంది కలిగించే ట్రాఫిక్ ఆంక్షలుగా మారిపోయింది. ఇంధన పొదుపు మంత్రం కేవలం సామాన్యుడికే కాకుండా, పాలకులకు కూడా వర్తించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నది మేధావులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!
నిధుల సమీకరణే మార్గం
భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, వనరులను సమర్థవంతంగా పునర్నిర్మించడానికి మెరుగైన బాండ్ మార్కెట్ అభివృద్ధి అత్యవసరమని 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ప్రెసిడెంట్ ఎన్కే సింగ్ స్పష్టం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ వృద్ధి పథంలో బ్యాంకింగ్ రంగం పోషించాల్సిన పాత్ర, మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన నిధుల సమీకరణపై విశ్లేషణ చేశారు.మౌలిక సదుపాయాల రంగానికి ఊతంప్రస్తుతం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన భారీ నిధుల కోసం ప్రధానంగా వాణిజ్య బ్యాంకులపైనే భారం పడుతున్నారు. దీనివల్ల బ్యాంకుల వద్ద ఉండాల్సిన నగదు నిల్వలు దీర్ఘకాలిక ప్రాజెక్టులలో చిక్కుకుపోతున్నాయి. మెరుగైన బాండ్ మార్కెట్ అందుబాటులోకి వస్తే మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ అక్కడి నుంచే లభిస్తుందని సింగ్ చెప్పారు. దీనివల్ల వాణిజ్య బ్యాంకులు తమ వనరులను ఇతర ప్రాధాన్యత కలిగిన బ్యాంకింగ్ కార్యకలాపాలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలకు మళ్లించే వీలుంటుందన్నారు.‘మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి బాండ్ మార్కెట్ను ఉపయోగించుకోవాలి. అప్పుడే వాణిజ్య బ్యాంకులు తమ ప్రధాన బ్యాంకింగ్ రుణ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించగలవు’ అని ఎన్కే సింగ్ పేర్కొన్నారు.బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలుకేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించిన కొత్త బ్యాంకింగ్ కమిటీ ఏర్పాటును సింగ్ స్వాగతించారు. భారత ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు కేవలం రుణదాతలుగానే కాకుండా ఆర్థిక మధ్యవర్తులుగా కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి, సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని పాత నిబంధనల వల్ల భారీగా నిధులు స్తంభించిపోతున్నాయి. వీటిని కమిటీ పునసమీక్షించాలి’ అని సూచించారు.ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!
సాయంత్రం 6 దాటితే అపరాధ భావం
ఆఫీసు పని అయిపోయింది.. గడియారం ఆరు దాటింది.. కానీ సీటులోంచి లేవాలంటే ఏదో తెలియని భయం. ‘అప్పుడే వెళ్లిపోతున్నావా?’ అని బాస్ అడుగుతాడేమో అన్న సందేహం. రోజంతా కష్టపడి పని చేసినా, ఉదయం ఆఫీస్కు త్వరగా వచ్చినా.. సమయానికి ఇంటికి బయలుదేరితే ‘హాఫ్ డేనా?’ అంటూ సెటైర్లు. ఇదీ సగటు భారతీయ ఉద్యోగి నిత్యం ఎదుర్కొనే మానసిక ఒత్తిడి. సరిగ్గా ఇదే అంశంపై ‘24 నార్త్ స్టార్’ వ్యవస్థాపకురాలు నిస్తా త్రిపాఠి చేసిన లింక్డ్ఇన్ పోస్ట్ ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.యూరప్లో.. భారత్లో..నిస్తా త్రిపాఠి తన పోస్ట్లో భారత్, యూరప్ దేశాల పని సంస్కృతి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపారు. ఆమె విశ్లేషణ ప్రకారం..యూరోపియన్ స్టైల్: యూరప్ దేశాల్లోని ఆఫీస్ ఉద్యోగులు సాయంత్రం 5 గంటలకే ఎటువంటి సంకోచం లేకుండా ‘రేపు కలుద్దాం’ అని సిస్టమ్స్ లాగ్ ఆఫ్ చేస్తారు. గడువులోగా పనులు పూర్తి చేయడంలో వారు ఏమాత్రం వెనుకబడరు. కానీ పని గంటల తర్వాత వ్యక్తిగత జీవితానికి ప్రాముఖ్యత ఇస్తారు.భారతీయ విధానం: ఇక్కడ ఉద్యోగి ఎంత సామర్థ్యంతో పని చేశాడనే దానికంటే, ఎన్ని గంటలు ఆఫీసులో కూర్చున్నారనే దాన్ని బట్టే వారి అంకితభావాన్ని కొలుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.పెరుగుతున్న అసహనంభారతీయ బహుళజాతి కంపెనీల్లో (ఎంఎన్సీ) పనిచేసే వారు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య టైమ్ జోన్. అమెరికా, యూరప్ క్లయింట్ల కోసం భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు కూడా మీటింగ్లకు హాజరుకావాల్సి వస్తోంది. దీనివల్ల ఉద్యోగుల వ్యక్తిగత సమయం హరించుకుపోతోందని, 24/7 అందుబాటులో ఉండటం వల్ల ఉత్పాదకత పెరగకపోగా ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోందని త్రిపాఠి పేర్కొన్నారు. ‘కంపెనీలు తమ సమయాన్ని, శక్తిని కాపాడుకునే వ్యక్తులను గౌరవించడం నేర్చుకోవాలి’ అని చెప్పారు.ఏం చేయాలంటే..కొత్త తరం ఉద్యోగులు ఇప్పుడు స్మార్ట్ వర్క్ వైపు మొగ్గు చూపుతున్నారు. సంస్థలు తమ పని సంస్కృతిని మార్చుకోకపోతే మేధో వలసలు పెరిగే ప్రమాదం ఉందని ఈ చర్చ హెచ్చరిస్తోంది. ఒక ఉద్యోగి సంతోషంగా ఇంటికి వెళ్లినప్పుడే, మరుసటి రోజు రెట్టింపు ఉత్సాహంతో పని చేయగలడని కార్పొరేట్ దిగ్గజాలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!
ఫ్యామిలీ
అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే?
వెనిస్ బినాలే (Venice Biennale) ప్రారంభోత్సవ వేడుకల్లో అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ స్టైలిష్ లుక్ విశేష ఆకర్షణగా నిలిస్తోంది. ఆడ్రీ హెప్బర్న్ - జాక్వెలిన్ కెన్నెడీల శైలిని అనుకరిస్తూ, గివెన్చీ రూపొందించిన టాగో చీర గౌనులో మెరిసారు రాధికా మర్చంట్వెనిస్ బినాలే ప్రారంభోత్సవ గాలాలో రిలయన్స్ అధినేత అంబానీ కోడలు, రిలయన్స్ వారసుడు వ్యాపారవేత్త అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్ పాత-హాలీవుడ్ గ్లామర్ మేళవింపుతో ప్రత్యేకమైన గివెన్చీ కౌచర్ దుస్తుల్లో స్పెషల్ లుక్లో ఆకట్టుకున్నారు. ఒపెరా గ్లోవ్స్, వజ్రాలు, సున్నితమైన రెట్రో బ్యూటీ స్టైలింగ్తో కూడిన ఈ లేత నీలి రంగు దుస్తులు, ఐకానిక్ ఆడ్రీ హెప్బర్న్ సిల్హౌట్లను గుర్తుచేస్తూ, అతిపెద్ద ఫ్యాషన్ హైలైట్లలో ఒకటిగా నిలిచాయి. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor)stify"> ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను రాధికా మర్చంట్ 'ఆడ్రీ హెప్బర్న్' ఇన్స్పైర్డ్ లుక్ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ గివెంచి (Givenchy) రూపొందించిన ప్రత్యేకమైన గౌన్లో ఆమె మెరిశారు. ఇది పౌడర్ బ్లూ (Powder blue) రంగులో భారతీయ చీర కట్టును (Saree drape) పోలి ఉండేలా ఆధునిక హొయలతో రూపొందించారు. ఒకప్పుడు దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్ హ్యూబర్ట్ డి గివెన్చీ, లెజెండరీ నటి ఆడ్రీ హెప్బర్న్ కోసం రూపొందించిన ఐకానిక్ చీర తరహా గౌన్ల నుండి స్పూర్తితో దీన్ని డిజైన్ చేశారు. ఈ గౌన్కు మ్యాచింగ్గా 'ఒపెరా గ్లోవ్స్' ధరించారు. ఇది పాతకాలపు హాలీవుడ్ గ్లామర్ను గుర్తుకు తెచ్చింది. ఇక ఆభరణాల విషయానికి వస్తే డైమండ్ రింగ్, మెరిసే ఆర్మ్ యాక్సెసరీతో తన లుక్ను మరింత రిచ్గా మార్చుకున్నారు.ఇదీ చదవండి: బిగ్ బాస్ మనీషా రాణి డ్రీమ్ హౌస్ : ధర తెలిస్తే ఫిదానేమేకప్ , హెయిర్ స్టైల్వింగ్డ్ ఐలైనర్, గ్లోసీ న్యూడ్ లిప్స్,సున్నితమైన గ్లోయింగ్ స్కిన్తో 'సాఫ్ట్ గ్లామ్' మేకప్ను ఎంచుకున్నారు. రెట్రో స్టైల్లో ఉండే సాఫ్ట్ వేవ్స్ (Polished waves) ఆమె వింటేజ్ మూడ్కు సంపూర్ణంగా సరిపోయింది. పారిసియన్ ఎలిగెన్స్ మరియు భారతీయ సంప్రదాయ కట్టు కలబోతగా ఉన్న ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాతకాలపు హాలీవుడ్ స్టైల్ను ఆధునిక పద్ధతిలో ప్రదర్శించి రాధికా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?
జేఈఈలో రెండుసార్లు ఫెయిల్, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్..! చివరికి..
జీవితమంతా వైఫల్యాలు అడగడుగున పలికరిస్తూనే ఉన్నా వదలిపెట్టని ధీరుడి కథ. అదేంటి అన్ని పెయిల్యూర్స్ ఎదుర్కొటే ధీరుడు, శూరుడు అంటారేంటి అనుకోకండి. ఎందుకంటే గెలిస్తే వాట్ నెక్స్ట్ అంటూ సాగిపోతావు..అదే ఆపకుండా ఓటమి హగ్ ఇస్తూ ఉంటే..పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడాలంటే అజేయమైన ఓర్పు, ఆత్మ విశ్వాసం కావాలి. ముఖ్యంగా చుట్టూ ఉన్నవాళ్లలో కొందరు జాలిచూపులతో సానుభూతి చూపితే, మరికొందరు నీ వల్ల కాదు అన్న విమర్శల బాణాలు.. అయినా సరే డోంట్ కేర్ అంటూ ముందుకు సాగాలంటే ఆకాశమంత ధైర్యం కావలి. అందుకు ఉదాహరణ ఈ టెకీ. అతడి కథ వింటే..ఫెయిల్యూర్లు, రిజెక్ట్లు చూసినోళ్లే గొప్పోళ్లు అని కచ్చితంగా అంటారు. మరి అతడి కథేంటో చకచక చదివేద్దామా..!.చాలామంది విద్యార్థులకు పోటీ పరీక్షలు ప్రారంభ విద్యా మైలురాళ్లలా విజయానికి అంతిమ కొలమానంగా ఉంటే..హర్యానాలోని రోహ్తక్కు చెందిన రిజుల్ సింగ్ మాలిక్ విషయంలో మాత్రం అలా కాదు. ఎడతెగని ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో అందుకున్న గొప్ప గెలుపు రికార్డు అతడిది. అతడు పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. రిజుల్ తన పాఠశాల విద్యను ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వసంత్ కుంజ్లో పూర్తి చేశాడు.ఆ తర్వాత అందరిలానే ఇంటర్ పూర్తి అయిన తర్వాత ఐఐటీ జేఈఈకి ప్రిపేరయ్యాడు. మొదటిసారి ఓటమి ఎదుర్కొనడంతో మరోసారి ప్రయత్నించాడు. ఈ సారి హోమ్ ట్యూటర్, ఒక ఏడాది వృధా చేసుకుని లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుని మరి ప్రిపేరయ్యాడు. అయినప్పటికీ ఓటమిని ఎదుర్కొనక తప్పలేదు. కానీ ఇంతలా ప్రిపేరైనా..కనీసం కటాఫ్ మార్కులు కూడా సాధించలేకపోయాడు రిజుల్. పైగా ఒక ఏడాది వృధా చేసుకోవడం బంధువులు, మిత్రులు అంతా ఒకటే విమర్శించడం ప్రారంభించారు. పాపం రిజుల్ ఆ అవమానం తట్టుకోవడం సాధ్యం కాక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు కూడా. అయితే 18 ఏళ్ల వయసులో రాసే ప్రవేశ పరీక్ష కెరీర్లో రాబోయే 40 ఏళ్లను నిర్దేశించదని గ్రహించి బీటెక్ ఐటీ చేరి విజయవంతంగా పూర్తి చేశాడు. అయినప్పటికీ ఆ జేఈఈ ఫెయిల్యూర్ తలుచుకున్నప్పుడల్లా అతడిని బాగా మెలిపెడుతుండేది. ప్రతీదాంట్లో.. రెండు మూడు సార్లు వైఫల్యమేఅయితే 2019లో జరిగిన బర్కిలీ సమ్మర్ స్కూల్ అతని జీవితంలో ఒక ప్రధాన మలుపు. అక్కడ అతనికి డేటా సైన్స్తో మొదటిసారిగా గట్టి పరిచయం ఏర్పడింది. అలా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్ (UC Irvine లేదా UCI)అమెరికాలో అకడమిక్ ప్రొబేషన్) ప్రవేశం పొందడం అతడి లక్ష్యంగా మారింది. అందుకోసం జీఆర్ఈఈకి సన్నద్ధమయ్యాడు. అయితే అది కూడా రిజుల్కు చుక్కలు చూపించింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు ఆ పరీక్షనురాశాడు. మొదటి ప్రయత్నంలో 303, రెండవ ప్రయత్నంలో 305, మూడవ ప్రయత్నంలో 307 దాటి, చివరకు నాల్గవ ప్రయత్నంలో 308 స్కోర్ చేశాడు. అన్నిసార్లు రాయడంతో మరోసారి జీఆర్ఈకి రెడీ అవుతున్నా అని చెప్పాలంటే భయపడేవాడు. అయితే అనుకోకుండా యూసీ ఇర్విన్ నుండి అంగీకారం రావడంతో ఇది నిజమేనా అని నమ్మలేకపోయాడు. అయితే అక్కడి అధికారి స్కోరు నిజమైన విజయం కాదని, నువ్వు పట్టువదలకుండా రాయడమే అసలైన గెలుపు అని బదులిచ్చాడు. పాపం యూసీ ఇర్విన్లోని ఎంఎస్ ప్రోగ్రామ్ నుంచి కూడా మళ్లీ సవాళ్లు మొదలయ్యాయి. సరిగ్గా అమ్మ పుట్టిన రోజు అని భారత్కు వస్తే..తన GPA (Grade Point Average) అకడమిక్ ప్రతిభ 2.8కి పడిపోవడంతో, ఆ అకడమిక్ ప్రొబేషన్లో ఉంచేశామని, మెరుగుపడకపోతే తదుపరి చర్యలు ఎదుర్కొనక తప్పదని మెయిల్ వచ్చింది. దాంతో ఆనందంగా గడుపుదామని వచ్చిన ఉత్సాహం కాస్తా ఉసురుమంది గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చా అటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. పైగా అందరు ఉత్తీర్ణులయ్యారు, తానొక్కడినే పరాజితుడిగా ఉండిపోయానంటూ నాటి సంఘటనను తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అదీగాక అమెరికాలో జాతివివక్ష వంటి పలు సవాళ్లు కూడా తోడవ్వడంతో తనపై ఒత్తిడి ఎక్కువగా ఉండేదని చెప్పుకొచ్చారు. చివరికి తన జీపీఏను మెరుగుపరుచుకుని విజయవంతంగా తన అకడమిక్ని పూర్తి చేశాడు. ఇక తక్షణమే ఉద్యోగ వేట అందరి కంటే ముందు మొదలు పెట్టాను గానీ, ప్రతిది రిజెక్ట్ అయ్యేదని చెప్పుకొచ్చారు. ఎంతో కష్టపడగా చివరికి ఓ ఇంటర్న్షిప్కి అర్హత లబించినట్లు తెలిపాడు. అలా ఈవై, వాల్మార్కట్ కంపెనీల్లో పనిచేశాడు. అక్కడ పనిసంస్కృతి గొప్ప పాఠాలే నేర్పాయి. తన సహోద్యోగులు, మేనేజర్ నుంచి చాలా తక్కవుమద్దతే లభించేదని పేర్కొన్నాడు. ఒక సందర్భంలో, తాను సహాయం కోసం ఒక సీనియర్ను సంప్రదించగా, ఆ విషయాన్ని తన మేనేజర్ వరకు తీసుకెళ్లి చివాట్లు, నిందలు పడేలా చేశాడంటూ నాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. గూగుల్లో జాబ్ కొట్టడం కోసం..ఆ అనుభవం భవిష్యత్ కార్యాలయాల పట్ల ఎలా ఉంటే బెస్ట్ అనేది తెలుసుకోగలిగానని న్నారు. దాంతో మంచి పనిసంస్కృతి ఉండే ఉద్యోగ కోసం అన్వేషించే పనిలో పడ్డట్లు తెలిపాడు. ఆ క్రమంలోనే గూగుల్లో జాబ్ కొట్టాలని లక్ష్యం పెట్టుకున్నాడట అందుకోసం ఏ పదో, 20 కాదు ఏకంగా 520 సార్లకు పైగా తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. అయితే ఆ సమయంలో తనని ప్రోత్సహించింది మాత్రం తన కాబోయే ప్రియురాలు, తల్లిదండ్రులేని అంటున్నాడు. వాళ్లిచ్చిన అండదండలతో వెనక్కి తగ్గకుండా గుగుల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లు వివరించాడు. అలా ఓ రోజు మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో, తన వాల్మార్ట్ ఆఫీస్ నుంచి బయటకు వస్తుండగా ఆఫర్ లెటర్ పంపబడుతోందని ఫోన్ కాల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. దాంతో తన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు. గూగుల్లో జాబ్ రాగానే తన కాబోయే భార్య ఖుషీకే ఫోన్ చేశానని, ఆ తర్వాత అమ్మనాన్నలకు చేసినట్లు తెలిపాడు. ఎందుకంటే అన్ని రిజెక్షన్లు రావడంతో నాకే ఎందుకు జరుగుతోందంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే రిజుల్ ప్రియురాలు ఏంకాదు, కచ్చితంగా గెలుస్తావ్, ఆఫర్ లెటర్ అందుకుంటావ్ అంటూ ధైర్యం చెబుతూనే ఉండేది, ఒక్కసారి కూడా పోనీలే వదిలేయ్ అన్న మాట తన నోటినుంచి రాలేదంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. ఇతడి కథ చూస్తుంటే హాలీవుడ్ మూవీలోని ఒక కొటేషన్ గుర్తొస్తోంది. జీవితం అంటే "ఎంత బలంగా కొట్టావన్నది కాదు, ఎన్ని ఎదురదెబ్బలు తగలినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగడమే" అన్న వాక్యానికి నిలువెత్తు నిదర్శనం కదూ. ఎన్ని వైఫల్యాలు రానీ పట్టుదలతో సాగేవాడి ఎదురేలేదు, పైగా ఏదో ఒకనాటికి విజయం తథ్యం అనేది జగమెరిగిన సత్యం. View this post on Instagram A post shared by Rijul (@rijulsinghmalik_) (చదవండి: కోటి రూపాయలు శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!)
భర్త లేకపోయినా.. బాధ్యత నెరవేర్చింది
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్రెడ్డి. కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా, లావణ్య భర్త భూపాల్రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందాడు. అయినప్పటికీ, తల్లి లావణ్య మనోస్థైర్యంతో తన పిల్ల లను చదివించింది. అపూర్వ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు.
నిరంత అలసట, జుట్టురాలడం ఆ వ్యాధికి సంకేతం కావొచ్చు..!
చాలామంది అలిసిపోడం, జుట్టు రాలడాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. కొందరిలో కీళ్ల నొప్పులు, నోటి పూతలు తరుచుగా వస్తుంటాయి. అయితే ఇలాంటి వాటిని అస్సలు తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పైకి సాధారణంగా కనిపించే ఈ లక్షణాలు ఆ వ్యాధికి సంకేతం కావొచ్చని హెచ్చరిస్తున్నారు. పైగా ఇలాంటి సమస్యలు ఎక్కుగా 20 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళల్లోనే అధికం అని అంటున్నారు. ఇంతకీ ఆ వ్యాధి ఏంటంటే..బాగా అలసిపోవడం, జుట్టురాలిపోవడం, తరుచుగా నోటిపూతలు, కీళ్ల నొప్పులు..ఒక వారానికి పైగా ఉండటం, లేదా మళ్లీ మళ్లీ అదేపనిగా ఈ సమస్యలు రావడం వంటివి జరిగితే అది లూపస్ వ్యాధికి సంకేతం కావొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే యువతులలో తరుచుగా ఈ వ్యాధి నిర్ధారణ కాకుండానే ఉండిపోతోందని అంటున్నారు. ఈ సమస్య తీవ్రమైన లక్షణాలతో మొదలవుతుందని అనుకుంటారు. కానీ ఇది నిరంతర అలసట, కీళ్ల నొప్పులు, కారణం తెలియని జుట్టు రాలడం, నోటి పూతలు, స్వల్ప జ్వరం, ఎండ తగిలిన దద్దుర్లు వంటి వాటితో ప్రారంభమవుతుందని అన్నారు. ఇది రోజువారి చిన్నపాటి సమస్యలతో పోలి ఉండటంతో చాలామంది యువతులు ఈ సమస్యలను తేలిగ్గా కొట్టిపారేస్తుంటారని అంటున్నారు. ఎందుకు వస్తుందంటే..మహిళలు కెరీర్ని నిర్మించుకునే క్రమంలో గర్భధారణ ప్లాన్స్ వేసుకోవడం, లేదా గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి చేస్తుంటారు. అదీగాక కొందరు హర్మోన్ల మార్పులతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్లలో ఈ లూపస్ వ్యాధి మరింత సమస్యాత్మకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎక్స్ క్రోమోజోమ్లతో ముడిపడి ఉన్న రోగ నిరోధక సంబంధింత జన్యువుల కారణంగా పురుషుల కంటే మహిళలకు సహజంగానే బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలు ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు. ఈ బలమైన రోగనిరోధక వ్యవస్థ తరచుగా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడినప్పటికీ, కొన్నిసార్లు అది అతి చురుకుగా మారి పొరపాటున శరీరం సొంత కణజాలాలపై దాడి చేస్తుందట. దీన్నే లూపాస్ వ్యాధి అంటారట. ఇదొక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది చాలామటుకు ఒకే కారకం వల్ల అరుదుగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. కానీ ఒక్కోసారి ఈ క్రింది వాటి కలయిక వల్ల మరింత వేగవంతమవుతుందంటుననారు.జన్యుపరమైన సున్నితత్వంహార్మోన్ల మార్పులుసూర్యరశ్మికి గురవ్వడం(ఎండకు బహర్గతమవ్వడం)ఇన్ఫెక్షన్లుమానసిక లేదా శారీరక ఒత్తిడిలక్షణాలు:నిరంతర అలసటకీళ్ల నొప్పి లేదా వాపుజుట్టు రాలడంనోటి పూతలుస్వల్ప జ్వరంఎండ తగిలిన తర్వాత చర్మంపై దద్దుర్లుకండరాల నొప్పిమెదడు మసకబారడంకారణం తెలియని బలహీనతఈ లక్షణాలు ఒత్తిడి, రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత లేదా సరైన జీవనశైలి అలవాట్లు లేకపోవడం వంటి వచ్చే సమస్యల్లా కనిపించడంతో చాలామంది మహిళలు తేలికగా తీసుకుంటారట. దాంతో తక్షణ వైద్య సహాయం ఆలస్యమవుతోందని చెబుతున్నారు.లూపస్ కేవలం హార్మోన్ల వల్ల వచ్చే వ్యాధి కాదు, కానీ ఈస్ట్రోజెన్ రోగనిరోధక ప్రతిస్పందనలను పెంచుతుంది. జన్యుపరంగా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్నవారిలో, ఆ అదనపు రోగనిరోధక ప్రేరణ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులులూపస్ని ప్రభావితం చేసేవి..ఋతుచక్రాలు, గర్భధారణ, ప్రసవానంతర కోలుకోవడం, గర్భనిరోధకం సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు కొంతమంది రోగులలో లూపస్ తీవ్రతను ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో లూపస్పై కేర్ తీసుకుంటారట వైద్యులు. లేకపోతే తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. సరైన పర్యవేక్షణ మరియు చికిత్సతో, లూపస్ ఉన్న చాలా మంది మహిళలు ఆరోగ్యకరమైన గర్భధారణను కలిగి ఉండగలరని నిపుణులు నొక్కి చెబుతున్నారు.సకాలంలో చికిత్స తీసుకోకపోతే..కీళ్ళుచర్మంమూత్రపిండాలుఊపిరితిత్తులుగుండెనాడీ వ్యవస్థ తదితరాలను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలసట, జుట్టురాలడం, కీళ్లనొప్పులు, జ్వరం వంటివి తరుచుగా వస్తే తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముందుగానే ఈ సమస్యను గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి అదుపులో ఉంటుంది లేదా నివారించొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.మరిన్ని వివరాలకు ఈ వీడియోపై క్లిక్ చేయండి గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..!)
అంతర్జాతీయం
మోదీ చెప్పినట్లే.. ఆ దేశంలో జరుగుతోందా?
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సికింద్రాబాద్ బహిరంగ సభ నుంచి దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాజకీయ విమర్శలు-ప్రతివిమర్శలు ఒకవైపు.. ఆర్థిక, ఇతర రంగాల నిపుణుల విశ్లేషణలు మరోవైపు.. ఇంకోవైపు సోషల్ మీడియా ఈ అంశంతో ఊగిపోతోంది. ఈ దరిమిలా మోదీ చెప్పినట్లే ఆ దేశంలో జరుగుతోందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. చమురు ఆదాపై మోదీ ఏమన్నారు.. దేశంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ సమస్యలను వివిధ దేశాలతో మాట్లాడి అధిగమిస్తాం. దీర్ఘకాలంలో చమురు వినియోగాన్ని మనం తగ్గించుకోవాలి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను(EV) ప్రోత్సహిస్తున్నాం. రైల్వే రంగంలో డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాం. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ అవసరం మనకు భారీగా తగ్గుతుంది. వర్క్ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగులు మళ్లీ పెరగాలి. వ్యక్తిగత వాహనాలు తగ్గించి.. ప్రజా రవాణా వినియోగం పెంచాలి. చమురు వాడకం తగ్గితే.. విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది.అక్కడ ఏం జరుగుతోంది?ఇండోనేషియా రాజధాని జకార్తాలో కార్ ఫ్రీ డే అని ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రతీ ఆదివారం ఉదయం రోడ్లపై కార్లు, ఇతర వాహనాలకు కనిపించవు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ మాత్రమే ఒక లేన్లో తిరుగుతాయి. మరో లేన్లో ప్రజలు ఉత్సాహంగా జాగింగ్, సైక్లింగ్, యోగా, సామాజిక కార్యక్రమాలతో వీధులన్నీ నిండిపోతాయి. దీని వెనుక ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం. ఇది స్థానిక ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన చర్యలో భాగమైంది.2001లో సెప్టెంబర్ 22న జకార్తాలో కార్ ఫ్రీ డే మొదలైంది. నెదర్లాండ్స్ నుంచి ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఇది ఆదివారం ఉదయం 6 నుంచి 11 గంటల దాకా నడుస్తోంది. జూన్ నుంచి ఉదయం 5.30గం. నుంచి 10గం. దాకా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. మోదీ తాజా సూచన కూడా దాదాపు ఇంచుమించుగా ఇక్కడ అమలవుతున్న పాలసీ తరహాలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఇక్కడో తేడా ఉంది. The turnout for Jakarta’s weekly car-free day is incredible! pic.twitter.com/PuTLkpMLbf— Chris Kost (@chriskost) May 10, 2026మోదీ సూచనతో కంపేర్ చేస్తే..జకార్తా కార్ ఫ్రీ డేలో వారానికి ఒకసారి జరిగే.. అదీ కొన్నిగంటలు ఆచరించే పాలసీ నిర్ణయం కాగా, మోదీ సూచనలు భారత దేశంలో ప్రజల నిత్యజీవనంలో పాటించాల్సిన మార్గదర్శకాలుగా ఉన్నాయి. అక్కడి పాలసీ ప్రజలకు ఒక సానుకూల అనుభవం, ఒక ఉత్సవంలా మారింది. ప్రతీ ఆదివారం ఉత్సాహంగా పాల్గొంటారువాళ్లు. ఆ రోజున ఏదైనా ఇతర కార్యక్రమాలు ఉంటే.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారు. కానీ, మోదీ సూచనలు మాత్రం ప్రజల సంగతి పక్కనపెడితే ప్రతిపక్షాల దృష్టిలో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిన పిలుపుగా నిలిచాయి. ఇంధన వినియోగం తగ్గించాలనే లక్ష్యం ఒకటే అయినా.. జకార్తా కారు ఫ్రీ డే ప్రజల భాగస్వామ్యంతో, ఆనందకరమైన వాతావరణంలో జరుగుతుంది. మోదీ సూచనలు మాత్రం ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల త్యాగాన్ని కోరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిన్పింగ్ ఆహ్వానం.. రంగంలోకి ట్రంప్.. టార్గెట్ ఏంటి?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు సిద్ధమయ్యారు. అత్యంత ఆసక్తి రేపుతున్న ఈ పర్యటన మే 13 నుంచి 15 వరకు జరగనుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు బీజింగ్ వెళ్తున్న ట్రంప్.. పశ్చిమాసియా సంక్షోభం, వాణిజ్య సంబంధాలతో పాటు పలు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరపనున్నారు.ఇరాన్, రష్యా కేంద్రంగా వ్యూహాలుఈ చారిత్రక భేటీలో ప్రధానంగా ఇరాన్, రష్యా అంశాలు కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఆ రెండు దేశాలకు చైనా అందిస్తున్న ఆర్థిక సహకారం, విడిభాగాలు, ఆయుధ ఎగుమతుల సామర్థ్యంపై ఉభయ దేశాల అధినేతలు ఇప్పటికే పలుమార్లు చర్చించినట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఈ పర్యటనలో అమెరికా-చైనా బోర్డ్ ఆఫ్ ట్రేడ్, బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనల్లో పురోగతిపై చర్చలు జరగనున్నాయి. ఏరోస్పేస్, వ్యవసాయం, ఇంధన రంగాలకు సంబంధించిన కీలక ఒప్పందాలకు ప్రాధాన్యత దక్కనుంది. వాణిజ్యంలో ఉమ్మడి ప్రాధాన్యతలను గుర్తించడమే లక్ష్యంగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఈ పర్యటన అనంతరం ఈ ఏడాది చివర్లో షీ జిన్పింగ్ దంపతులకు వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.తైవాన్, ఇరాన్ ఆంక్షల వేళ ఉత్కంఠఈ అగ్ర దేశాల చర్చల్లో తైవాన్ అంశం ప్రస్తావనకు రానున్నప్పటికీ, అమెరికా విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ ఇంధన, ఆర్థిక రంగాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా ఇటీవల విధించిన తాజా ఆంక్షలు టెహ్రాన్, చైనా వాణిజ్య నెట్వర్క్లపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. ‘ఎకనామిక్ ఫ్యూరీ’ పేరుతో ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రకటించిన ఈ కఠిన ఆంక్షల నడుమ ట్రంప్ పర్యటన అత్యంత ఉత్కంఠ రేపుతోంది.ఇది కూడా చదవండి: ‘యూపీఐ పేమెంట్’తో సువేందు పీఏ హంతకుల పట్టివేత
థాయ్లాండ్ పాలిటిక్స్: జైలు నుంచి ‘కింగ్ మేకర్’ విడుదల
బ్యాంకాక్: థాయ్లాండ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దేశ మాజీ ప్రధాని, 76 ఏళ్ల టెలికాం బిలియనీర్ థాక్సిన్ షినవత్రా సోమవారం బ్యాంకాక్ జైలు నుంచి ముందస్తుగా విడుదలయ్యారు. అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్న ఈ రాజకీయ దిగ్గజం మళ్లీ తెరపైకి రావడం థాయ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.షరతులతో కూడిన స్వేచ్ఛఅవినీతి ఆరోపణలపై గత సెప్టెంబర్ నుంచి ఏడాది జైలు శిక్ష అనుభవిస్తున్న థాక్సిన్ వయసును పరిగణనలోకి తీసుకుని ముందస్తుగా విడుదల మంజూరు చేశారు. అయితే నాలుగు నెలల ప్రొబేషన్ పీరియడ్లో ఆయన తప్పనిసరిగా కాలికి ఎలక్ట్రానిక్ మానిటర్ ధరించాల్సి ఉంటుంది. జైలు వెలుపల తన కుటుంబ సభ్యులను కౌగిలించుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తమ అభిమాన నేత రాకతో అక్కడికి చేరుకున్న వందలాది ‘రెడ్ షర్ట్’ మద్దతుదారులు థాక్సిన్కు అనుకూలంగా నినాదాలు చేశారు.వివాదాలు.. తగ్గని మద్దతు2023 ఆగస్టులో ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన థాక్సిన్కు మొదట ఎనిమిదేళ్ల శిక్ష పడినా, రాజ క్షమాభిక్షతో అది ఏడాదికి తగ్గింది. అయితే జైలుకు బదులుగా ఆసుపత్రిలో గడపడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన కుటుంబానికి చెందిన ‘ఫ్యూ థాయ్’ పార్టీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఫిబ్రవరి ఎన్నికల్లో పార్టీ మూడో స్థానానికి పడిపోయినప్పటికీ, ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం థాక్సిన్ పునరాగమనానికి మార్గం సుగమం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా?థాక్సిన్ విడుదల ఆయన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన కొంతకాలం దూరంగా ఉన్నా, రాజకీయాలను విడిచిపెట్టరని మద్దతుదారులు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు సంప్రదాయవాదులు, థాక్సిన్ వ్యతిరేకులు ఆయన తదుపరి అడుగులపై నిశితంగా దృష్టి పెట్టారు. అయితే ఆయన కూతురు, మాజీ ప్రధాని పీటాంగ్టార్న్ షినవత్రా మాత్రం జైలులో తమ తండ్రితో కేవలం కుటుంబ విషయాలే మాట్లాడామని, రాజకీయాలు చర్చించలేదన్నారు. ఏది ఏమైనా థాక్సిన్ తాజా విడుదల థాయ్లాండ్లో కొత్త రాజకీయ సమీకరణలకు తెరతీస్తోంది.ఇది కూడా చదవండి: సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్: చక్రం తిప్పనున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు!
పాక్ మునీర్ నోటి దురుసు.. భారత్పై అనుచిత వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్.. మరోసారి భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఒకరి తర్వాత ఒకరు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఓవరాక్షన్ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్తో జరిగిన పోరాటం సాధారణ యుద్ధం కాదని, అది రెండు సిద్ధాంతాల మధ్య జరిగిన యుద్ధమని పేర్కొన్నారు. భారత్పై మరోసారి పలు ఆరోపణలు చేశారు.ఆసిమ్ మునీర్ రావల్పిండిలోని జనరల్ హెడ్క్వార్టర్స్లో జరిగిన కార్యక్రమంలో సైనికాధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా మునీర్.. ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన తెచ్చారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్.. పాకిస్తాన్ భౌగోళిక సమగ్రతను ఉల్లంఘించిందని ఆరోపించారు. దీనికి పాకిస్థాన్ జాతీయ ఐక్యతతో, పూర్తి సైనిక శక్తితో సమాధానం ఇచ్చిందన్నారు. మార్కా-ఎ-హక్ కేవలం రెండు దేశాల మధ్య జరిగిన సంప్రదాయ యుద్ధం కాదని, అది రెండు భిన్న సిద్ధాంతాల మధ్య జరిగిన నిర్ణాయక పోరాటమని వ్యాఖ్యానించారు. ఘర్షణ సమయంలో పాకిస్తాన్ 26 లక్ష్యాలపై దాడులు నిర్వహించిందని మునీర్ తెలిపారు.అయితే ఆ దాడులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. అలాగే యుద్ధ విరమణ కోసం అమెరికా ద్వారా భారత్ ముందుకొచ్చిందని కూడా ఆరోపించారు. శాంతి ప్రయోజనాల దృష్ట్యా పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిందని అన్నారు. భవిష్యత్ యుద్ధాల స్వరూపం పూర్తిగా మారబోతుంది. భూమి, గగనం, సముద్రం, సైబర్, అంతరిక్ష రంగాలను కలుపుకుని మల్టీ డొమైన్ వార్ఫేర్ రూపంలో యుద్ధాలు సాగుతాయని చెప్పారు. అందుకే పాక్ సైన్యం సాంకేతికత, ఆధునిక ఆయుధాలు, శిక్షణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పాకిస్థాన్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, హంగోర్ క్లాస్ జలాంతర్గాములు, కొత్త రాకెట్ ఫోర్స్, ఆధునిక యుద్ధవిమానాల కొనుగోళ్ల ద్వారా సైనిక సామర్థ్యాన్ని పెంచుతున్నామని మునీర్ తెలిపారు.మరోవైపు భారత్ మాత్రం ఆ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండిస్తోంది. కాల్పుల విరమణపై ఎలాంటి మూడో దేశం జోక్యం లేదని, రెండు దేశాల సైనికాధికారుల మధ్య నేరుగా జరిగిన చర్చల ద్వారానే అవగాహన కుదిరిందని భారత ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తన హక్కును వినియోగించుకుందని, సరిహద్దు దాటి జరిగే ఉగ్రచర్యలను ఇక సహించబోమని కూడా భారత్ పునరుద్ఘాటిస్తోంది. ఇక, భారత్ కూడా.. ఆపరేషన్ సిందూర్కు ఏడాది పూర్తయిన సందర్భంగా ఉగ్రవాదంపై తన వైఖరిని ఇటీవల మరోసారి స్పష్టం చేసింది. పాక్ మద్దతుతో జరుగుతున్న సరిహద్దు ఉగ్ర చర్యలకు తగిన సమాధానం ఇస్తామని, అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని భారత్ పేర్కొంది.
జాతీయం
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్గా జేసీడీ ప్రభాకర్
చెన్నై: తమిళనాడు 17వ శాసనసభ సభాపతి (స్పీకర్)గా టీవీకే సీనియర్ నాయకుడు జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో సీఎం విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. స్పీకర్ పదవికి ప్రభాకర్ మే 11న నామినేషన్ దాఖలు చేయగా.. ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీ పడకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.కాగా, జేసీడీ. ప్రభాకర్కు శాసనసభ నిబంధనలు, సంప్రదాయాలపై అపారమైన అనుభవం ఉంది. 2011లో విల్లివాక్కం నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. అన్నాడీఎంకేలో సీనియర్ నేతగా ఇది వరకు ఉన్న జేసీడీ ప్రభాకర్ ప్రస్తుతం టీవీకే తరపున థౌజండ్ లైట్స్ నుంచి గెలిచారు. సీఎం విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగం తరపున సీనియర్ నాయకుడు, థౌజండ్ లైట్స్ ఎమ్మెల్యే జే.సీ.డీ. ప్రభాకర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం విజయ్, మంత్రులతో కలిసి ఆయన ఈ నామినేషన్ను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఇవాళ ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం
గౌహతి: అస్సాం రాజకీయాల్లో మరో అధ్యాయం మొదలయ్యింది. గౌహతిలోని ఖానాపరా పశువైద్య కళాశాల ప్రాంగణం ఈ అద్భుత ఘట్టానికి వేదికైంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేత హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుక యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. మంగళవారం ఉదయం 11:40 గంటలకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సమక్షంలో హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాం రాజకీయాల్లో కాంగ్రెసేతర నాయకుడెవరూ వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించలేదు. 57 ఏళ్ల శర్మ ఆ రికార్డును తిరగరాశారు. గతంలో ప్రఫుల్ల కుమార్ మహంత రెండుసార్లు సీఎంగా పనిచేసినప్పటికీ, ఆ పదవీకాలాల మధ్య విరామం ఉంది. తద్వారా వరుసగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా శర్మ రికార్డు సృష్టించారు. #WATCH | Guwahati: BJP's Himanta Biswa Sarma takes oath as the Chief Minister of Assam for the second consecutive term at Veterinary College ground in Khanapara pic.twitter.com/K5sGEN7jVF— ANI (@ANI) May 12, 2026హేమాహేమీల సమక్షంలో..ఈ చారిత్రక ఘట్టానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎన్డీయే పాలిత 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. విదేశీ ప్రతినిధులు, ముఖ్యంగా భారతదేశానికి అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అస్సాంలోని 17 వైష్ణవ మఠాల మఠాధిపతుల ఆశీర్వచనాల మధ్య శర్మ ప్రమాణం చేశారు. లక్షలాది మంది ప్రజలు ఈ వేడుకను వీక్షించడానికి తరలిరావడంతో గౌహతి జనసంద్రమైంది. మంత్రుల ప్రమాణంశర్మతో పాటు అజంతా నియోగ్, రామేశ్వర్ తేలి, అతుల్ బోరా (ఏజీపీ), చరణ్ బోరో (బీపీఎఫ్)లు మంత్రులుగా ప్రమాణం చేశారు. రంజిత్ దాస్ను స్పీకర్గా ఎంపిక చేయనున్నారు. 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో ఎన్డీయే కూటమి ఏకంగా 102 సీట్లను కైవసం చేసుకుని, తిరుగులేని మెజారిటీని సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితం కావడంతో, ఈసారి అసెంబ్లీలో అధికారిక ప్రతిపక్ష నేత హోదా పొందే అవకాశం కూడా ఏ పార్టీకి లభించకపోవచ్చు.
పుచ్చకాయ చావులు: ముంబై ఘటన మరవకముందే..
జాంజ్గిర్-చంపా: వేసవి తాపం నుండి ఉపశమనం పొందాలని పుచ్చకాయ తింటే, అది కాస్తా ప్రాణాలు తీసే యమపాశంలా మారుతోంది. గత నెలలో ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పుచ్చకాయ తిని మృత్యువాత పడిన ఘటన మరువక ముందే ఛత్తీస్గఢ్లో ఇదే తరహాలో మరో విషాదం చోటుచేసుకుంది. వేసవిలో అమృతంలా భావించే ఈ పండు, ఇప్పుడు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.సరదాగా తిన్నారు.. శవమై తేలాడుఛత్తీస్గఢ్లోని జాంజ్గిర్-చంపా జిల్లా ఘుర్కోట్ గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. మేనమామ ఇంటికి వచ్చిన పిల్లలు ఆదివారం సాయంత్రం పుచ్చకాయ తిన్నారు. తిన్న కొద్దిసేపటికే 15 ఏళ్ల అఖిలేష్ ధివర్కు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. అఖిలేష్తో పాటు పండు తిన్న శ్రీ(4), పింటూ(12), హితేష్(13) అనే ముగ్గురు పిల్లలు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.బలితీసుకుంటున్న ‘జింక్ ఫాస్ఫైడ్’గత ఏప్రిల్ 25న ముంబైలోని పైధోనీ ప్రాంతంలోనూ అబ్దుల్లా దొకాడియా కుటుంబంలోని నలుగురు సభ్యులు పుచ్చకాయ తిని మృత్యువాత పడ్డారు. అయితే వీరి ఫోరెన్సిక్ పరీక్షల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వారి శరీర నమూనాల్లో ‘జింక్ ఫాస్ఫైడ్’ అనే ప్రమాదకరమైన రసాయనం ఉన్నట్లు తేలింది. సాధారణంగా ఎలుకల నివారణకు వాడే ఈ రసాయనం పండ్ల ద్వారా మనిషి శరీరంలోకి చేరి ప్రమాదకరంగా పరిణమిస్తోందిఅజాగ్రత్తే ప్రాణసంకటమా?ఛత్తీస్గఢ్ ఘటనలో ప్రాథమికంగా ‘ఫుడ్ పాయిజనింగ్’ కారణమని వైద్యులు అనుమానిస్తున్నారు. ఉదయం కోసిన పుచ్చకాయను చాలా గంటల పాటు గాలికి వదిలేసి, సాయంత్రం తినడమే విషంగా మారి ఉండొచ్చని డాక్టర్ ఎస్.కుజుర్ తెలిపారు. పండ్లపై రసాయనాల వాడకం లేదా నిల్వ ఉంచడంలో చేసే చిన్న అజాగ్రత్తే నిండు ప్రాణాలను బలితీసుకుంటోంది. అందుకే పండ్లు కొనేటప్పుడు, తినేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్!
తమిళనాడులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మిత్రపక్షం అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. టీవీకే విజయ్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే టీవీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూడా అదే ప్రకటన చేసింది. ‘‘డీఎంకేతో చేతులు కలిపి సీఎం కావాలని పళనిస్వామి కుట్ర చేశారు. పార్టీ సిద్దాంతాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నాం. ఇకపై ఎన్డీయే కూటమికి.. మాకు సంబంధం లేదు. మాదే అసలైన అన్నాడీఎంకే. విజయ్ ప్రజల సీఎం. అందుకే మా మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని అన్నాడీఎంకే రెబల్ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం ప్రకటించారు. ఆ వెంటనే.. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(AMMK) ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీ అధినేత టీవీవీ దినకరన్ హైడ్రామా నడిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న టీవీకేకు తొలుత కామరాజ్ మద్దతుగా సంతకం చేశారు. అయితే తమ ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దినకరన్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ విషయంపై గవర్నర్కు, పోలీసులు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. తమ మిత్రపక్షం అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధంగా ఉందని.. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. అయితే.. టీవీకే ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసింది. అయినా కూడా దినకరన్ తన ఆరోపణలను కొనసాగించారు. ఈ తరుణంలో.. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటన చేయడం గమనార్హం. అయితే తన ఎమ్మెల్యే కామరాజ్ దినకరన్ సూచన మేరకే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటన చేశారా?.. లేదంటే రెబల్గా సంతకం చేశారా? ఎన్డీయే కూటమి నుంచి దినకరన్ పార్టీ కూడా బయటకు వచ్చేసినట్లేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి మొత్తం 234 స్థానాలకుగానూ.. 223 స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో అన్నాడీఎంకే 178 స్థానాల్లో పోటీ చేసి 47 గెల్చుకుంది. బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు నెగ్గింది. ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో గెలిచింది. పట్టాలి మక్కల్ కట్చి(PMK) 18 స్థానాల్లో పోటీ చేసి 4 సీట్లు గెలిచింది. ఫలితంగా, ఈ కూటమి మొత్తం 53 స్థానాలు గెలుచుకుంది.ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఎన్డీయే కూటమిలో.. లుకలుకలు బయటపడ్డాయి. మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు (24-30) మంది కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కు మద్దతు ప్రకటించారు. ఇటు దినకరన్ ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో పళని వర్గ ఎమ్మెల్యేలు, పీఎంకే 4 ఎమ్మెల్యేలు, బీజేపీ ఏకైక ఎమ్మెల్యే మాత్రమే మిగిలినట్లైంది!.
ఎన్ఆర్ఐ
అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.చదవండి: మలి విడత చర్చలు.. పాక్కు వెళ్లని జేడీ వాన్స్!
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు
న్యూయార్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న 2026న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో స్మారక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నైతికతపై దార్శనికత మరియు బహుపాక్షికవాదానికి దాని ప్రాసంగికత’ అనే థీమ్తో ఈ ఈవెంట్ను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి,అంబాసిడర్ హరీష్ పార్వతనేని స్వాగతోపన్యాసం చేశారు. భారత పౌరులలో రాజ్యాంగ నైతికత స్ఫూర్తిని నింపడంలో డాక్టర్ అంబేద్కర్ కృషి చాలా ముఖ్యమైందన్నారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్కు మధ్య ఉన్న ఉమ్మడి అంశాలను వివరించారు. రాజకీయ విభజన, నిరంతర సంఘర్షణలతో కూడిన ఈ క్లిష్ట సమయాల్లో రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాలన్న డాక్టర్ అంబేద్కర్ పిలుపు ఎంతో సందర్భోచితమైనదని, ఇది బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడానికి, ఐక్యరాజ్యసమితిలో సమర్థవంతమైన సంస్కరణలు తీసుకురావడానికి, దాని ప్రధాన విభాగాలకు పునరుజ్జీవం పోయడానికి, ఐక్యరాజ్యసమితిని దాని ఉద్దేశ్యానికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుందని రాయబారి హరీష్ చెప్పారు.ప్రముఖ సివిల్ సర్వెంట్, ప్రముఖ అంబేద్కర్ పండితుడు అయిన డాక్టర్ రాజా శేఖర్ వుండ్రు కీలకోపన్యాసం చేశారు. రెండు ప్రపంచ యుద్ధాలను, ఐక్యరాజ్యసమితి ఏర్పాటును ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, డాక్టర్ అంబేద్కర్ బహుపాక్షికవాదం ప్రాముఖ్యతను గుర్తించారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం యొక్క కేంద్ర సూత్రాలను రూపొందించడంలో డాక్టర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్లో పొందుపరిచిన అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అనే ప్రాథమిక స్ఫూర్తి భారత రాజ్యాంగంలో కూడా ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ అంబేద్కర్ నొక్కిచెప్పారని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో, బహుపాక్షికవాదం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా అంతర్జాతీయ రాజ్యాంగ నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని రాజా శేఖర్ వుండ్రు అన్నారు.డాక్టర్ అంబేద్కర్ జీవితం ఒక నైతిక నిదర్శనమని, అందులో ఆయన కేవలం బాధ నుండి తప్పించుకోవడమే కాకుండా, దానిని రూపాంతరం చెందించి, ఆ గాయాన్ని జ్ఞానంగా మార్చారని హార్వర్డ్ డివినిటీ స్కూల్ విజిటింగ్ ప్రొఫెసర్, అతిథి వక్త డాక్టర్ సంతోష్ రౌత్, అభిప్రాయపడ్డారు. నేటి ప్రపంచంలో, ముఖ్యంగా బహుపాక్షికత (multilateralism) విషయంలో, డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆదర్శాల గాఢమైన ఔచిత్యాన్ని డాక్టర్ రౌత్ విశదీకరించారు. ఐక్యరాజ్యసమితి ఛార్టర్ వంటి లిఖితపూర్వక గ్రంథాల స్ఫూర్తిని ఆచరణలో పెట్టడానికి దోహదపడే శక్తిగా ఆయన నైతికతను అభివర్ణించారు.వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరయ్యారు.
తానా మిడ్ అట్లాంటిక్ నిర్వహణలో ఈస్టర్ ఎగ్ హంట్
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం చిన్న పిల్లలకోసం ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 12వతేదీన కాలేజ్విల్లేలోని ఎవాన్స్బర్గ్ స్టేట్ పార్క్లో విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వేర్వేరుచోట్ల నివసిస్తున్న తెలుగువాళ్లు తమ కుటుంబాలతో ఈ వేడుకల్లో పాల్గొని తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ వేడుక తెలుగువాళ్ళను ఒక వేదికపైకి తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఫుడ్, ఫన్, గేమ్స్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలోనే పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు.తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మద్దతుతో తానా మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు సమన్వయంతో మిడ్ అట్లాంటిక్ తానా నాయకులు, కమ్యూనిటీ లీడర్లు, వలంటీర్ల సహకారంతో విజయవంతంగా జరిగింది.ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ పిల్లల ఈస్టర్ ఎగ్ హంట్. రంగురంగుల గుడ్లు, ప్రత్యేక ‘గోల్డెన్ ఎగ్స’ కోసం పిల్లలు ఎంతో ఉత్సాహంగా వెతికారు. వారి నవ్వులు, కేరింతలు వేడుకల్లో అసలైన పండుగ వాతావరణాన్ని తలపింపజేసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరికీ పిజ్జా వడ్డించారు, ఇది వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపింది.ఈవెంట్ కోఆర్డినేటర్లు దీప్తి కోకా, భవాని మామిడి అద్భుతమైన ప్రణాళికతో ఈ ఆటలను నిర్వహించి, కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. వీరు పెద్దలకు, పిల్లలకు నిర్వహించిన ఆటలు అందరినీ అలరించాయి.మిడ్-అట్లాంటిక్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్లబ్ వారు అందించిన సహకారం మరువలేనిది. ఫుడ్ స్టాల్స్, నిధుల సేకరణ కోసం ఆటలను నిర్వహించడంలో వీరి ఉత్సాహం మరియు టీమ్ వర్క్ ప్రశంసనీయమని తానా నాయకులు అన్నారు. వాలంటీర్లు, పాల్గొనేవారి చెక్-ఇన్, చెక్-అవుట్ ప్రక్రియను సురేష్ యలమంచి ఎంతో సులభతరం చేశారు. అలాగే ఎంసీ గా తన వ్యాఖ్యానంతో అందరినీ ఉత్తేజపరిచారు. విశ్వనాథ్ కోగంటి ఈ వేడుకలోని మధుర క్షణాలను తన కెమెరాలో ఎంతో చక్కగా బంధించారు. తానా ఈస్టర్ బన్నీతో పిల్లలు ఫోటోలు దిగుతూ, ఆడుకుంటూ గడిపిన సమయం కుటుంబాలకు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లందరికీ వారి నిరంతర కృషికి గుర్తింపుగా ‘వాలంటీర్ అవర్ సర్టిఫికేట్లు’ అందజేశారు.ఈ కార్యక్రమంలో బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు కేవలం ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా, సమాజంతో మన సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనవిజయం చేసిన తానా ఫిలడెల్ఫియా టీమ్ కు వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సేవ, సంతోషం మరియు సంఘీభావంతో మనం కలిaసి ముందుకు సాగుదామని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ తానా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.
క్రైమ్
పెళ్లి చేసుకుందామనుకున్నా.. నా మరదలినే ప్రేమిస్తావా..!
హైదరాబాద్: చిలకలగూడలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని తేలచ్చారు. సోమవారం అంబర్పేటలో డీసీపీ రక్షిత కె మూర్తి వివరాలు వెల్లడించారు. నామలగుండుకు చెందిన యవన్(21) చిలకలగూడకు చెందిన యువతి పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ఇటీవల జవహార్నగర్లో డబుల్బెడ్రూం కేటాయించడంతో అక్కడికి కుటుంబాన్ని మార్చారు. అయితే యవన్ సోదరి కుటుంబం నామలగుండు ప్రాంతంలో ఉండడంతో వస్తూ పాత స్నేహితులతో పాటు యువతితో సైతం సంప్రదిస్తున్నాడు. యువతి బావ అల్లాబోయిన సాయికిరణ్ సైతం వరసకు యువతి మరదలు కావడంతో పెళ్లి చేసుకుందమని భావించాడు. అప్పటికే సాయికిరణ్ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో రౌడిïÙటర్. దీంతో ప్రేమ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి కుటుంబ సభ్యులతో చర్చించారు. యవన్ను హత్య చేయడమే పరిష్కారమని భావించి పథకం వేశారు. ఈ నెల 7న స్నేహితుడు సుబ్బు ఇంటికి యవన్ వచ్చినట్లు తెలుసుకున్నారు. యవన్ను బయటకు పిలిచి దాడి చేశారు. పెళ్లి చేసుకుందామనుకుంటున్న నా మరదలిని ప్రేమిస్తావా అంటూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. పోలీసులు విచారణ జరిపి యవన్ హత్యకు కారణమైన యువతి బావ అల్లబోయిన సాకిరణ్(27), తండ్రి రాజం నర్సింహాయాదవ్, బాబాయ్లు రాజం శ్రీశైలం యాదవ్(48), రాజం మల్లేశ్యాదవ్(48), సోదరులు రాజం పరేమేశ్ యాదవ్(19, రాజం వంశీకృష్ణ(19, రాజం మనీష్(21), వీరి స్నేహితులు సిరిగిరి రాహుల్(22), కుచ్చుల శివనందన్యాదవ్(20)తో పాటు మరో మైనర్ బాలున్ని అరెస్టు చేశారు.
భర్తను చంపిన కేసులో భార్య, ప్రియునికి ఉరిశిక్ష..14 లక్షల జరిమానా..!
బెంగళూరు: అనైతిక బంధానికి ఒడిగట్టిన భార్య చివరకు హత్యకూ వెనుకాడలేదు, ఫలితంగా కఠిన శిక్షకు గురైంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కోపంతో హత్య చేసిన కేసులో భార్య, ఆమె ప్రియునికి శివమొగ్గ జిల్లా భద్రావతి కోర్టు మరణశిక్షతో పాటు రూ. 14 లక్షల జరిమానా విధించింది. మత్తు మందు ఇచ్చి.. వివరాలు... 2020 జనవరి 15న, భద్రావతిలోని పేపర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురగీ టాప్కు చెందిన ఫ్లోరా నాన్సీ అనే మహిళ, తన ప్రియుడు రాజశేఖరయ్యతో కలిసి భర్త ప్రకాష బాబుకు మత్తుమందు ఇచ్చి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పటి కేసు దర్యాప్తు అధికారి, సీఐ మంజునాథ్.. దర్యాప్తును పూర్తి చేసి కోర్టుకు ఛార్జిషిట్ సమర్పించారు. భద్రావతిలోని 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగింది. ప్రభుత్వ ప్రాసిక్యూటర్ రత్నమ్మ వాదనలు వినిపించారు. ఫ్లోరా నాన్సీ, ప్రియునికి ఉరే సరైన శిక్ష అని వాదిస్తూ ఆధారాలను సమర్పించారు. నేరం రుజువు కావడంతో జడ్జి ఇందిరా మైలస్వామి చెట్టియార్.. ఇద్దరు దోషులకు ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పడంతో పాటు రూ.14 లక్షల జరిమానా విధించారు. మృతుని తల్లిదండ్రులకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
ఆంటీతో యువకుడి వివాహేతర సంబంధం..!
బనశంకరి(బెంగళూరు): సహజీవన బంధాలు ఎక్కువగా విషాదంతోనే ముగుస్తున్నాయి. అలాంటి ఉదంతమే ఇది. మహిళతో కలిసి జీవిస్తున్న యువకుడు ఉరివేసుకున్న రీతిలో శవమయ్యాడు, బెంగళూరు రాజగోపాలనగర పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలు.. చిత్రదుర్గకు చెందిన తిప్పేస్వామి(28), దావణగెరె (35) మహిళ ఒకే గార్మెంట్స్లో పనిచేస్తూ ఇన్స్టా ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. భర్త , పిల్లలను వదిలిపెట్టి తిప్పేస్వామితో వచ్చేసింది. రెండునెలల క్రితం బెంగళూరు శ్రీగంధనగరలో బాడుగ ఇల్లు తీసుకుని భార్యాభర్తలం అని చెప్పి జీవిస్తున్నారు. కొంతకాలంగా మహిళ గొంతెమ్మ కోర్కెలతో తిప్పేస్వామిని ఇబ్బంది పెడుతోంది. దీంతో విరక్తి చెందిన అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళ పరారైంది. యువకుని సంబంధీకుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
ఎస్బీఐ బ్యాంకులో భారీగా డబ్బు మాయం..!
హైదరాబాద్: యూసుఫ్గూడ ఎస్బీఐలో రూ.23 లక్షలు మాయమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. యూసుఫ్గూడ ఎస్బీఐలో క్యాష్ ఇన్చార్జ్గా అబ్బిరెడ్డి యాదగిరిరెడ్డి పని చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 7న యూసుఫ్గూడ బ్రాంచిలోని పాత ఏటీఎం స్ధానంలో ఎస్పీఆర్ మిషన్ను ఏర్పాటు చేయాలని బ్యాంకు నిర్ణయించింది. బ్యాంకు రికార్డులో రూ 27.5 లక్షలు ఎంట్రీ చేశారు. బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీయకుండానే తీసినట్లుగా బోగస్ ఎంట్రీలు సృష్టించారు. మరుసటి రోజు యాదగిరి రెడ్డి ఇతర సిబ్బందితో కలిసి ఏటీఎంలోని డబ్బు పెట్టెలను బ్యాంకు స్ట్రాంగ్ రూంకు తరలించారు. బ్యాంకు అధికారులు డబ్బు పెట్టెలను లెక్కించి చూడగా.. నగదులో తేడా వచి్చంది. రూ23 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. సీసీ టీవీ కెమెరాలు పరిశీలించగా.. యాదగిరి రెడ్డి ఉద్దేశపూర్వకంగానే మోసానికి పాల్పడి, డబ్బును కాజేసినట్లు బ్యాంకు అదికారులు నిర్ధారించారు. ఈ మేరకు ఎస్బీఐ చీఫ్ మేనేజర్ కిరణ్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు
ఆ తండ్రీకొడుకులకు టైమ్ దగ్గర పడింది!
తాను చనిపోయి 5 మందికి ప్రాణదానం
ఎప్పటికీ యంగ్ గా ఉండాలా? ఈ విషపూరిత ఆహారాలను మానేయండి!
దయచేసి హాస్పిటల్ కి రావద్దు .విదేశాలకు వెళ్తున్న వైరల్ డాక్టర్ ...
అపార్ట్మెంట్లో పేలిన ఏసీ
బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయండి
కొలికపూడి శ్రీనివాసరావు వాట్సప్ పోస్ట్ వైరల్
అసలు జరిగింది ఏంటంటే..?
నేను విజయ్ ఒకటే కాలేజ్ అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్
ఆమ్మో ఇదేం బావి అవాక్ అవుతున్న కాలనీ వాసులు


