Top Stories
ప్రధాన వార్తలు

సొంత గ్రూపులకే ‘ఉపాధి’
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నాడు.. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో రికార్డు స్థాయిలో కోట్ల పని దినాలు కల్పించడం ద్వారా పేదరికాన్ని తొలగించే దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. నేడు.. టీడీపీ కూటమి సర్కారు ‘గ్రూపు’ రాజకీయాలను ప్రోత్సహిస్తూ పల్లెల్లో చిచ్చు రాజేస్తోంది! దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రూపుల వ్యవస్థను ఏపీలో ప్రవేశపెట్టి శ్రమశక్తి సంఘాల (ఎస్ఎస్ఎస్) పేరుతో గ్రామాల్లో ప్రతి 50 మందికి ఓ గ్రూపు చొప్పున ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ క్రమంలో ఉపాధి పనుల్లో ఆధిపత్యం కోసం ఏలూరు జిల్లాలో సోమవారం రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. మే్రస్తిగా ఉన్నవారు తమ వర్గం వారికి అనుకూలంగా మస్తర్లు వేస్తున్నట్లు ఘర్షణకు దిగడంతో ఎనిమిది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో కోవిడ్ వేళ సైతం ఉపాధి హామీ ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించి ఆదుకుంటే.. కూటమి సర్కారు మాత్రం నచి్చన వారికే ఉపాధి కల్పిస్తోంది. కూలీలు ఓ గ్రూపుగా ఏర్పడి పని కావాలని దరఖాస్తు చేసుకుంటేనే ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కేటాయిస్తోంది. ఒక గ్రూపులో చేరిన కూలీలు అందులో నుంచి బయటకొచ్చి కొత్త దాంట్లో చేరేందుకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది. అసలు గ్రూపులతో సంబంధం లేకుండా ఏదైనా కుటుంబం వ్యక్తిగతంగా పని కావాలని కోరినా కేటాయించే అవకాశమే ఉండదు. గ్రూపులతో గ్రామాల్లో చిచ్చు.. ఒకసారి శ్రమశక్తి సంఘం ఏర్పాటయ్యాక సంవత్సరం వరకు ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రతి సంఘానికి లీడర్గా ‘మేట్’ ఉంటారు. కూలీలను సమీకరించడం మేట్ ప్రధాన బాధ్యత. కూలీల కుటుంబాలు ఒకసారి ఏదైనా గ్రూపులో చేరితే కనీసం ఏడాదిపాటు ఆ మేట్ సమక్షంలో పనిచేయక తప్పుదు. ఏ పరిస్థితుల్లోనైనా మేట్తో విభేదాలు తలెత్తితే ఆ కుటుంబానికి పని దక్కకుండా చేసే అవకాశం ఉంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ఉపాధి పనుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఏ పనులైనా తమకు అనుకూలంగా ఉండేవారికే కేటాయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పలువురు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి తమ వర్గీయులను నియమించుకున్నారు. ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లతో తాజాగా కర్నూలు జిల్లాలో ఓ ఫీల్డు అసిస్టెంట్ దారుణ హత్యకు గురయ్యాడు. అడ్డగోలుగా తొలగింపులు..రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తూ తమ అనుచరులకు చోటు కల్పిస్తున్నారు. వారి ఆగడాలు తట్టుకోలేక కొందరు స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు 115 మందికి పైగా తొలగించారు. అదేమంటే స్వచ్ఛందంగా రాజీనామా చేశారని ఏపీఓలు అంటున్నారు. మిగిలిన వారినీ తొలగించేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లావ్యాప్తంగా 435 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. టీడీపీ ప్రభుత్వం పలువురు తప్పుకున్నారు. 40 మంది మేట్లను కూడా తొలగించారు. రాజీనామా చేయని ఫీల్డ్ అసిస్టెంట్లకు డ్వామా అధికారులు నోటీసులిస్తూ వేధిస్తున్నారు. బాపట్ల జిల్లాలో ఇప్పటివరకు 134 మందిని ఇంటికి పంపించగా నెల్లూరు జిల్లాలోని 430 పంచాయతీల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. ప్రకాశం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 721 మందికి గానూ 485 మందిని తప్పించి టీడీపీ సానుభూతిపరులను నియమించుకున్నారు. ఏలూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం రాగానే ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ తప్పుకోవాలని హెచ్చరించడంతో 350 మంది వైదొలిగారు. కోనసీమ, కాకినాడ జిల్లాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కాగానే వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 32 మందిని సస్పెండ్ చేయగా, 45 మందిని ఇంటికి పంపించారు. హోంమంత్రి అనిత నియోజకవర్గంలో ఆరుగు ఫీల్డ్ అసిస్టెంట్లు, ముగ్గురు మేట్లను తొలగించారు. శ్రీసత్యసాయి జిల్లాలో 520 మంది ఫీల్డ్ అసిస్టెంట్లనూ మార్చేశారు. అనంతపురం జిల్లాలో 90 శాతం ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చారు. కర్నూలు జిల్లాలో ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించి పలువురిని తొలగించారు.పని దినాల కల్పనలో నాడు రికార్డువైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఏ కుటుంబం వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నా పని కల్పించే విధానాన్ని అమలు చేసింది. ఎవరి వద్దకూ వెళ్లాల్సిన అవసరం లేకుండా కోరిన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా పనులను కేటాయించింది. పనులు కోరిన వారందరికీ జాబ్ కార్డులు జారీ చేసింది. దేశమంతా కోవిడ్తో కకావికలమైన వేళ.. గ్రామాలకు పెద్ద ఎత్తున తరలివచి్చన వారందరికీ భరోసానిచ్చి పనులు కల్పించి ఆదుకుంది. పని దినాల కల్పనలోనూ రికార్డు సృష్టించింది. ఐదేళ్లలో ఏకంగా 114.82 కోట్ల పని దినాలను కల్పించి రికార్డు సృష్టించింది. ⇒ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ పేద కూలీలకు ‘ఉపాధి’లో భారీగా కోతపడింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద పనుల కల్పన బాగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో జూన్–జనవరి మధ్య కల్పించిన పని దినాలను ఈ ఆర్ధిక సంవత్సరం(2024–25)లోని జూన్–జనవరి మధ్య కల్పించిన పనిదినాలతో పోలిస్తే ఏకంగా 2.69 కోట్ల పనిదినాలు తగ్గాయి. దీనివల్ల గ్రామీణ పేదలు వేతనాల రూపంలో రూ.700 కోట్ల మేర నష్టపోయారు. దీనిలో ఎక్కువగా నష్టపోయింది ఎస్టీ, ఎస్టీలే. ఈ విషయాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ⇒ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 2023 జూన్ నుంచి 2024 జనవరి మధ్య గ్రామీణ పేదలకు 10.87 కోట్ల పని దినాలపాటు పనులు కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు కేవలం 7.18 కోట్ల పనిదినాలు మాత్రమే పనులు కల్పించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి హామీ పథకం అమలులో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్లే పేదలకు పనుల కల్పన తగ్గిపోయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

NAKSHA Pilot Project: పట్టణాల్లో ప్రాపర్టీ కార్డ్!
సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించేందుకు.. ఇళ్లు, స్థలాల వివాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నక్ష’ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. మున్సిపాలిటీల్లో విస్తృత స్థాయిలో సర్వే చేసి.. ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాల వివరాలన్నీ తేల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్ను వివరాలు, ఆస్తి విస్తీర్ణం, సర్వే నంబర్, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్.. ఇలా సమస్త వివరాలతో ప్రాపర్టీ కార్డుల జారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణాలు, నగరాల్లోని అణువణువు ఇకపై డిజిటల్ రూపంలో నిక్షిప్తం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మాడరై్నజేషన్ ప్రోగ్రాం (డీఐఎల్ఆర్ఎంపీ)లో భాగంగా ‘నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (నక్ష)’ కార్యక్రమాన్ని చేపట్టింది. మంగళవారం దేశవ్యాప్తంగా రెండు లక్షల వరకు జనాభా ఉన్న 152 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ పట్టణాల్లో ఏడాదిపాటు పైలట్ ప్రాజెక్టును అమలు చేసిన తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా మార్పు, చేర్పులు చేస్తారు. అనంతరం మొదటి దశ కింద దేశవ్యాప్తంగా 1,000 మున్సిపాలిటీల్లో, ఆ తర్వాత దేశంలోని 4,912 పట్టణాలు, నగరాల్లో ‘నక్ష’ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ మాదిరిగా ప్రాపర్టీ కార్డ్.. పట్టణాలు, నగరాల్లోని భూముల సర్వే నంబర్లు, ఇళ్లను ‘నక్ష’ కార్యక్రమం ద్వారా అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం పౌరులందరికీ ఆధార్ ఇస్తున్నట్టుగానే.. ప్రతీ గృహ యజమానికి ప్రాపర్టీ కార్డును విశిష్ట గుర్తింపు సంఖ్యతో ఇవ్వనున్నట్టు పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ఈ కార్డుపై ‘క్యూఆర్’ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే పూర్తి వివరాలు లభిస్తాయని తెలిపారు. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్ను వివరాలు, ఆస్తి విస్తీర్ణం, సర్వే నంబర్, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్ ఇలా సమస్త సమాచారం అందులో ఉంటుందని వెల్లడించారు. లైడార్ సర్వే మాదిరిగా ఇది ఉంటుందని, పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో ఏడాదిపాటు పూర్తి స్థాయిలో ఈ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ఈ మున్సిపాలిటీల్లోని ప్రతి ఇంటిని త్రీడ్రీ కెమెరాలతో మ్యాపింగ్ చేస్తారని, ఇందుకోసం మూడు రకాల కెమెరాలను ఉపయోగిస్తారని వెల్లడించారు. ఈ సర్వే పూర్తయితే.. ఆస్తిపన్ను మదింపు పారదర్శకంగా జరుగుతుందని, స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలవుతుందని వివరించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, భవిష్యత్తులో జీఐఎస్ మాస్టర్ ప్లాన్ల రూపకల్పన సులభతరం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. పట్టణాల్లోని రెవెన్యూ సర్వే నంబర్లు ఎన్ని సబ్ డివిజన్లుగా మారాయన్న వివరాలను కూడా నమోదు చేయనున్నట్టు తెలిపారు. అర్బన్ ల్యాండ్ రికార్డులు నాలుగు రాష్ట్రాల్లోనే.. దేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో మాత్రమే పట్టణ భూముల రికార్డులను పక్కాగా నిర్వహిస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో వాటి నిర్వహణ సరిగా లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే ‘నక్ష’ ప్రాజెక్టును చేపట్టినట్టు చెబుతోంది. రెవెన్యూ, మున్సిపాలిటీలు, సర్వే ఆఫ్ ఇండియా, ఎంపీ స్టేట్ ఎల్రక్టానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ), సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లు సంయుక్తంగా ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. పట్టణాలు, నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ సర్వే కీలకమని కేంద్రం తెలిపింది. భూముల విలువలు వేగంగా పెరుగుతున్నందున వివాదాలకు చెక్ పెట్టేలా ఇది ఉంటుందని, న్యాయపరమైన అంశాల్లోనూ ఉపయోగపడుతుందని వెల్లడించింది. అదే సమయంలో ఈ సర్వే డిజిటైజేషన్తో ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు వీలుంటుందని పేర్కొంది. ఆయా ఆస్తుల యజమానులు రుణాలు తీసుకోవడానికి ఈ సర్వే అనంతరం జారీ చేసే ప్రాపర్టీ కార్డు ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. 3 పద్ధతుల్లో ఏరియల్ సర్వే.. రాష్ట్రంలో ఎంపిక చేసిన మున్సిపాలిటీలివే.. జడ్చర్ల, హుస్నాబాద్, కొడంగల్, వర్ధన్నపేట, యాదగిరిగుట్ట, మహబూబాబాద్, వేములవాడ, మిర్యాలగూడ, జగిత్యాల, మణుగూరు మున్సిపాలిటీలను ‘నక్ష’ పైలట్ ప్రాజెక్టు కోసం రాష్ట్రం నుంచి ఎంపిక చేశారు. రాష్ట్రంలోని మొత్తం 155 పట్టణాలు, 29 పట్టణాభివృద్ధి సంస్థల్లో కూడా భవిష్యత్తులో ఈ సర్వే నిర్వహించేందుకు అవసరమైన నిధులు దాదాపు రూ.700 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుందని తెలిసింది.

ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తి వివాదాలు పరిష్కారం
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.షష్ఠి తె.4.44 వరకు (తెల్లవారితే బుధవారం) తదుపరి సప్తమి, నక్షత్రం: స్వాతి పూర్తి (24 గంటలు), వర్జ్యం: ఉ.11.53 నుండి 1.37 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.48 నుండి 9.36 వరకు, తదుపరి రా.11.02 నుండి 11.50 వరకు, అమృత ఘడియలు: రా.10.27 నుండి 12.12 వరకు, అమృత ఘడియలు: ప.12.28 నుండి 2.03 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.30, సూర్యాస్తమయం: 5.55. మేషం... పరిచయాలు విస్తృతమవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.వృషభం.... నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్యనిర్ణయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.మిథునం... శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళపెట్టవచ్చు.కర్కాటకం... అనుకోని ప్రయాణాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో విరోధాలు. కష్టానికి ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.సింహం... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.కన్య.... సన్నిహితులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాల విస్తరణ లో చికాకులు. ఉద్యోగమార్పులు.తుల... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.వృశ్చికం.... పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.ధనుస్సు... పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. నూతన ఉద్యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.మకరం.... ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.విలువైన వస్తువులు కొంటారు. భూవివాదాలు పరిష్కారం. కీలక నిర్ణయాలు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.కుంభం... బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.మీనం... కుటుంబంలో చికాకులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

వెంటనే కొత్త రేషన్కార్డులు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్కార్డులు ఇవ్వాల్సిందేనని, ఈ మేరకు కొత్త రేషన్కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలసి రేషన్కార్డుల జారీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. కొత్త రేషన్కార్డుల కోసం ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, రేషన్కార్డుల్లో కొత్తగా పేర్ల చేర్పు, తొలగింపు కోసం వచ్చిన విజ్ఞప్తులపై ఆరా తీశారు. ప్రజాపాలన అర్జీలు, కులగణనతోపాటు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మళ్లీ దరఖాస్తులు అవసరం లేదు..: ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశం ఇచ్చినా.. మీసేవ కేంద్రాల వద్ద రేషన్ దరఖాస్తుల కోసం రద్దీ ఎందుకు ఉంటోందని సీఎం ఆరా తీశారు. అయితే దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్లీ చేస్తున్నాయని, అందుకే రద్దీ ఉంటోందని అధికారులు వివరణ ఇచ్చారు. వెంటనే కార్డులు జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ఆలస్యం చేయకుండా కొత్త రేషన్కార్డులు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే కార్డుల కోసం దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో వెంటనే షురూ.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఆ కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ మొదలుపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. కోడ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో కొత్త కార్డులు ఇవ్వాలని సూచించారు. కొత్త కార్డులకు సంబంధించి పౌర సరఫరాల విభాగం తయారు చేసిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బెదిరించారు.. బరితెగించారు
అసలు బలమే లేని మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు చంద్రబాబు సర్కారు సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, కాకినాడ జిల్లా తుని, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవుల కోసం టీడీపీ అధికార బలంతో బరితెగించింది. సంఖ్యా బలం లేకపోయినా వాటిని బలవంతంగా తమ ఖాతాలో వేసుకునేందుకు కుయుక్తులు పన్నింది.పిడుగురాళ్ల మున్సి పాల్టీ లో టీడీపీ తరఫున ఒక్క కౌన్సిలర్ కూడా గెలవకపోయినా సోమవారం జరిగిన ఎన్నికలో వైస్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుందంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసైగ మేరకు పోలీసులు, రెవిన్యూ అధికారులు వేధించి, భయపెట్టి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు బలవంతంగా పచ్చ కండువా కప్పి.. మాదే మెజార్టీ అని నిస్సిగ్గుగా ప్రకటించడం విస్తుగొలుపుతోంది. తుని, పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవులను కూడా అదే రీతిలో సొంతం చేసుకునేందుకు ప్రయత్నిం చినా వైఎస్సార్సీపీ అడ్డుకోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.సాక్షి, నరసరావుపేట/తుని/పాలకొండ: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి అరాచకం çసృష్టించారు. పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని మరచి ఎమ్మెల్యే ఆదేశాలతో కౌన్సిలర్లను భయాందోళనకు గురిచేసి టీడీపీ గూటికి వెళ్లేలా తమవంతు సాయం చేశారు. వైస్ చైర్మన్ ఎన్నికకు పోటీ చేయడానికి టీడీపీ తరఫున కనీసం ఒక్క కౌన్సిలర్ సైతం లేకపోయినా పోటీలో నిలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.కౌన్సిలర్లను భయపెట్టి, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువా కప్పి తెలుగుదేశంలో చేర్చుకున్నట్లు ప్రకటించి.. యరపతినేని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 33 స్థానాలకు 33 స్థానాలు వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. వైస్ చైర్మన్గా ముక్కంటి అనే వ్యక్తిని ఎన్నుకోగా ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్ని ఎంపిక చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా వైఎస్సార్సీపీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుపడటంతో మరుసటి రోజు.. అంటే ఈ నెల 4వ తేదీకి ఎన్నికను వాయిదా పడింది. అయితే రాత్రికి రాత్రే యరపతినేని ఆదేశాలతో పోలీసులు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పాత కేసులు పేరిట వేధించి ఎన్నికకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఎన్నికల కమిషన్ ఈ నెల 17న సోమవారం మరోసారి వైస్ చైర్మన్ ఎన్నికలకు అవకాశం కల్పించింది. నాలుగో తేదీ నుంచి 17 వ తేదీ వరకు సుమారు రెండు వారాలు సమయం ఉండటంతో టీడీపీ నేతలు.. పోలీసు, రెవెన్యూ అధికారులను ఉపయోగించి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను వేధించడం మొదలుపెట్టారు. తునిలోనూ టీడీపీ బల ప్రయోగం కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మూడోసారి టీడీపీ అడ్డుకోవడంతో వాయిదా పడింది. టీడీపీ లొంగదీసుకున్న కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి అనుమతించి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను 30 మందీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. మిగిలిన 28 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. టీడీపీ ముందస్తు వ్యూహంలో భాగంగా కౌన్సిల్ హాల్లోకి చొరబడి ఎన్నికను అడ్డుకుంది.మరుసటి రోజూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్ కాసే సుమతి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక జరగాల్సి ఉన్నా, టీడీపీ దౌర్జన్యం వల్ల మళ్లీ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్వో రవికుమార్ తెలిపారు. కాగా, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం చైర్పర్సన్ సుధారాణి నివాసం వద్ద నుంచి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువెళ్లేందుకు టీడీపీ నాయకులు యత్నిం చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అడ్డుకున్నారు.దీంతో టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావులు రాజాపై దాడికి దిగారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడ నుంచి బయటకు పంపించి వేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను పంపించేస్తే ఓటింగ్కు వస్తామని కౌన్సిలర్లు చెప్పారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లక పోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. టీడీపీకి సొంతంగా ఒక్క సీటు లేకపోయినా అధికార మదంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను లొంగదీసుకోవాలని చూస్తోందని, సంతలో పశువుల్లా కొనాలనుకుంటోందని మండిపడ్డారు. అయినా మెజార్టీ లేకపోవడంతో పోలీసులను వినియోగించారన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి భర్త, కో ఆప్షన్ సభ్యుడు ఏలూరి బాలును హౌస్ అరెస్ట్ చేశారని, మరికొందరి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి భయాందోళనలు సృష్టించారన్నారు.మహిళా కౌన్సిలర్లలో గర్భిణులు ఉన్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు టీడీపీ గూండాలు, రౌడీ షీటర్లకు సహకరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం చలో తుని కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని రాజా పిలుపునిచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు.బెదిరింపుల పర్వం... వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్లకు పోలీసులను పంపించి స్టేషన్కు రావాలని పిలిపించి టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని బెదిరింపులకు దిగారు. మరికొంతమందికి కాంట్రాక్టులు, బిల్లుల పేరుతో తాయిలాలు ఆశచూపే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు రోజూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు ఫోన్ చేసి కచ్చితంగా మీరు పార్టీ మారాల్సిందేనని ఒత్తిడి చేశారు. యరపతినేని శ్రీనివాసరావు నిర్ణయించిన వైస్ చైర్మన్ అభ్యర్థికే మీరు ఓటు వేయాలంటూ బెదిరించారు. తెలుగుదేశం రౌడీల బెదిరింపులతో కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.దీంతో పోలీసుల సహకారంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల బంధువులను బెదిరించి భయపెట్టి వాళ్ల శిబిరంలోకి బలవంతంగా తీసుకువెళ్లారు. ఇలా సుమారు 17 మందిని టీడీపీ వైపు లాగేశారు. వారితో వైస్ చైర్మన్ పదవిని దౌర్జన్యంగా లాగేసుకున్నారు. 30వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు వ్యాపారాలను అడ్డుకుంటామని బెదిరించి పార్టీ మారేలా చేశారని పట్టణంలోని ఆర్య వైశ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పిడుగురాళ్ల 29వ వార్డు కౌన్సిలర్ మునీరా దంపతులు తెలుగుదేశం నాయకుల బెదిరింపులకు లొంగక పోవడంతో నిర్మాణంలో ఉన్న వాళ్ల ఇళ్లను పొక్లెయినర్తో నేలమట్టం చేశారు. ఇలా బెదిరించి బరితెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.పాలకొండలోనూ అదే తీరు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ కుర్చీ కోసం కూటమి నాయకులు వేస్తున్న ఎత్తులు పారడం లేదు. ముచ్చటగా మూడోసారి సోమవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో పదవి దక్కించుకోవాలని కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ యశ్వంత్కుమార్ రెడ్డితో పాటు జేసీ శోభిక ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. కూటమికి చెందిన ముగ్గురు సభ్యులు, బలవంతంగా తీసుకెళ్లిన ఇద్దరు వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరంలేక ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.కాగా, పాలకొండ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో 17 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 19వ వార్డు కౌన్సిలర్ ఉద్యోగ రీత్యా తన పదవికి రాజీనామా చేశారు. మరో ఇద్దరు కౌన్సిలర్లను టీడీపీ నేతలు బలవంతంగా వారి వైపు తిప్పుకున్నారు. ఈ లెక్కన టీడీపీ బలం ఐదుకు చేరిందనుకున్నా, వైఎస్సార్సీపీ బలం 14గా ఉంది. ఎలాగైనా సరే గెలవాలని మంత్రి సంధ్యారాణి ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచి్చనప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి.

German elections 2025: జర్మనీ విజేత ఎవరు?
జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో అనివార్యమైన ఎన్నికలు ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్యూ) కూటమి ఈసారి హాట్ ఫేవరెట్గా బరిలో దిగుతోంది. ఈసారి ఈ కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలొచ్చాయి. మరోవైపు 2010 దశకంలో జర్మనీలోకి వలసలు పోటెత్తడంతో ఉద్యమంగా మొదలై ఇప్పుడు అతివాద పార్టీగా ఎదిగిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్డీ) పార్టీ సైతం మళ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. జర్మనీలోకి పోటెత్తుతున్న అక్రమ వలసలకు అడ్డుకట్టవేయడం, ఆర్థికవ్యవస్థను పరుగులెత్తించే సత్తా ఉన్న పార్టీకే ఈసారి ఓటర్లు పట్టంకట్టనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీన జరగనున్న ఎన్నికల్లో వలసలు, ఆర్థిక వ్యవస్థ మాత్రమే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. బండేస్టాగ్(జర్మనీ పార్లమెంట్)లో అధికార పీఠంపై కూర్చునేది ఎవరనే అంశం ఇప్పుడు జర్మనీ అంతటా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈసారి ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం?ఎన్నడూలేనంతగా జర్మనీలో జనసమ్మర్థ ప్రదేశాల్లో దాడి ఘటనలు ఎక్కువయ్యాయి. అక్రమ వలసదారులే ఈ దాడులకు పాల్పడుతున్నారన్న ఆగ్రహావేశాలు స్థానికుల్లో పెరిగాయి. దీంతో అక్రమ వలసదారుల కట్టడి, శరణార్థులుగా గుర్తింపునకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేయడం వంటి డిమాండ్లు ఓటర్లలో ఎక్కువయ్యాయి. మాన్హైమ్, జోలింగన్, మాగ్డీబర్గ్, అషాఫన్బర్గ్ నగరాల్లో దాడి ఘటనలతో అక్రమవలస ఇప్పుడు∙కీలకాంశమైంది. ఇటీవల మ్యూనిక్లో అఫ్గాన్ పౌరుడు వేగంగా కారు పోనివ్వడంతో జర్మనీ జాతీయురాలు, ఆమె రెండేళ్ల కూతురు తీవ్రంగా గాయపడిన ఘటనతో అక్రమ వలసదారుల కట్టడి అంశాన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నాయి. ఈసారి ఐదుగురు ఛాన్స్లర్ పదవి కోసం పోటీపడుతున్నారు.ఫ్రిడిష్ మెర్జ్..క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ) అధినేత ఫ్రిడిష్ మెర్జ్ వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గుచూపే వీలుంది. ఆరున్నర అడుగుల ఎత్తు 69 ఏళ్ల వయస్సున్న మెర్జ్ 2002 ఏడాదిలో ఏంజెలా మెర్కల్ ప్రభుత్వంలో పనిచేశారు. తర్వాత రాజకీయాలు వదిలేసి పలు పెట్టుబడుల బ్యాంకుల బోర్డుల్లో సేవలందించారు. తర్వాత మళ్లీ సీడీయూ పార్టీలో చేరి పార్టీ నాయకత్వ పోరులో 2018లో మెర్కెల్, 2021లో ఆర్మిన్ లాషెట్ చేతిలో ఓటమిని చవిచూశారు. ఈసారి ‘‘ జర్మనీలో ఉన్నందుకు మరోసారి గర్వపడదాం’’ నినాదంతో సీడీయూ చీఫ్గా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ‘‘దేశ సరిహద్దులను పటిష్టంచేస్తా. వలసలను కట్టడిచేసేలా శరణార్థి నిబంధనలను కఠినతరం చేస్తా. పన్నులు తగ్గిస్తా. సంక్షేమ పథకాల కోసం 50 బిలియన్ యూరోలను ఖర్చుచేస్తా’’ అని హామీలు గుప్పించారు.ఒలాఫ్ షోల్జ్..సోషల్ డెమొక్రటిక్ పార్టీ నేత అయిన ఒలాఫ్ షోల్జ్ ఇప్పటికే మూడేళ్లకు పైగా దేశ చాన్స్లర్గా సేవలందించారు. అయితే కూటమి సర్కార్ను నిలబెట్టుకోలేకపోయారు. రెండు నెలల క్రితం బలపరీక్షలో ఓడిపోయారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రత్యక్షంగా జర్మనీ ఆర్థికవ్యవస్థపై విపరిణామాలు చూపడంతో ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింది. అది చివరకు ప్రభుత్వం కూలడానికి కారణమైంది. గత ఏడాది జరిగిన విశ్వాస పరీక్షలో 733 మంది సభ్యులున్న సభలో కేవలం 207 ఓట్లు సాధించడం తెల్సిందే. దీంతో అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ పార్లమెంట్ను రద్దుచేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు.ఎలీస్ వీడెల్..2013లో ఏఎఫ్డీ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీ తరఫున చాన్స్లర్ పదవి కోసం 46 ఏళ్ల నాయ కురాలు ఎలీస్ వీడెల్ పోటీపడుతున్నారు. ఈమెకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల మ్యూనిక్కు వచ్చిన ప్పుడు ఈమెతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈమె కు యువతలో పెద్ద క్రేజ్ ఉంది. ‘‘వలసలు.. ఇమ్మిగేషన్కు విరుగుడుగా రిమిగ్రేషన్(తిరిగి పంపేయడం) తీసుకొస్తా. జర్మనీపై రష్యా ఆంక్షలను ఎత్తేసేలా కృషిచేస్తా. ధ్వంసమైన నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్ను పునరుద్ధరిస్తా’’ అని ఎలీస్ పలు ఎన్నికల హామీ గుప్పించారు. రాబర్ట్ హబెక్..మూడు దశాబ్దాల క్రితం పర్యావరణ ఉద్యమంగా మొదలైన రాజకీయ పార్టీగా అవతరించిన ‘ది గ్రీన్స్/అలయన్స్ 90’ పార్టీకి సారథ్యం వహిస్తున్న 55 ఏళ్ల రాబర్ట్ హబెక్ సైతం చాన్స్లర్ రేసులో నిలిచారు. షోల్జ్ ప్రభుత్వంలో ఈయన వైస్ ఛాన్స్లర్గా, ఆర్థికశాఖ మంత్రిగా సేవలందించారు. ‘‘పునరుత్పాదక ఇంధన విధానాలకు పట్టం కడతా. అధికారంలోకి వస్తే ఉక్రెయిన్కు సాయం కొనసాగిస్తా. అణువిద్యుత్ శక్తి ఉత్పత్తిని తగ్గిస్తా. పవన విద్యుత్కు పాతరేస్తా’’ అని ఎన్నికల హామీ ఇచ్చారు. సారా వాగెన్ కనెక్ట్రష్యాకు మద్దతు పలుకుతూ తూర్పు జర్మనీలో బలమైన ఓటు బ్యాంక్ను సాధించిన ‘ది సారా వాగెన్ కనెక్ట్ –రీజన్ అండ్ జస్టిస్ పార్టీ(బీఎస్డబ్ల్యూ)’ సైతం చాన్స్లర్ పదవిపై కన్నేసింది. బీఎస్డబ్ల్యూ సహ వ్యవస్థాపకురాలు సారా వాగెన్ కనెక్ట్ తమ పార్టీ.. ఏఎఫ్డీకి అసలైన ప్రత్యామ్నాయ పార్టీ అని చెబుతున్నారు. ఏఎఫ్డీ తరహాలోనే అక్రమ వలసలపై బీఎస్డబ్ల్యూ పార్టీ ఉద్యమిస్తోంది. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అనుకూలంగా మాట్లాడుతుండటంతో ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కష్టమని అంచనాలు వెలువడ్డాయి. ఓటింగ్ ఎలా చేపడతారు?18 ఏళ్లు దాటిన వారంతా ఓటేయొచ్చు. అయితే ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 299 పార్లమెంట్ నియోజకవర్గాల కోసం ఒక ఓటు వేయాలి. దేశంలో 16 రాష్ట్రాలు ఉండగా ఓటరు తన సొంత రాష్ట్రం కోసం మరో ఓటు వేయాల్సి ఉంటుంది. రెండో ఓటులో కనీసం 5 శాతం ఓట్లను సాధించిన పార్టీ సభ్యులకు నేరుగా పార్లమెంట్లో సభ్యత్వం కోరే అర్హత ఉంటుంది. సంస్కరించిన పోలింగ్ విధానాన్ని తొలిసారిగా ఈ ఏడాది నుంచే అమలుచేయనున్నారు. దీంతో పార్లమెంట్లో ఇన్నాళ్లూ ఉన్న 733 సీట్లు తగ్గిపోయి 630కి చేరుకోనున్నాయి. అత్యధిక సీట్లను సాధించిన పార్టీ లేదా కూటమి నుంచి చాన్స్లర్ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం తాత్కాలికంగా అధికారంలో ఉంది. ఈసారి సీడీయూ, సీఎస్యూ కూటమి విజయం సాధించవచ్చని ఎన్నికల పండితులు విశ్లేషిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్

గాల్లో దీపంలా పేదల ప్రాణాలు
టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలోని పేదల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అత్యవసర చికిత్సకు మందులు కరువయ్యాయి. కొద్దిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జీబీఎస్ కేసుల నమోదు పెరిగింది. దీంతోపాటు మరికొన్ని ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో వాడే ఇమ్యూనోగ్లోబిలిన్స్ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలోని పేదల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అత్యవసర చికిత్సకు మందులు కరువయ్యాయి. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా గులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) కేసుల నమోదు పెరిగింది. దీంతోపాటు మరికొన్ని ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో వాడే ఇమ్యూనో గ్లోబిలిన్స్ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు. సోమవారం నాటికి కర్నూలు, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, తిరుపతి, నంద్యాల, విజయనగరం, పాడేరు, మరికొన్ని జీజీహెచ్ల్లో ఇమ్యునో గ్లోబులిన్ ఇంజెక్షన్ల నిల్వలు “సున్నా’గా ఉన్నాయి. గడిచిన ఐదు, ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొందని ఆయా ఆస్పత్రుల్లోని వైద్యాధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) నుంచి సరఫరా నిలిచిపోయిందని ప్రభుత్వానికి పలుమార్లు తెలియజేశామని చెబుతున్నారు. రాష్ట్రంలో జీబీఎస్ కేసులు క్రమంగా పెరుగుతుయని, ఈ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పలుమార్లు చెప్పడంతో ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్న రెండు, మూడు ఆస్పత్రుల నుంచి మిగిలిన వాటికి చాలీచాలనట్టుగా సర్దుబాటు చేసే పనిలో వైద్య శాఖ నిమగ్నమైంది.కేసులన్నీ రిఫర్ ప్రతి వెయ్యి మందిలో ఒకరు ఆటో ఇమ్యూన్ డిసీజెస్కు గురవుతారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. జీబీఎస్ బారినపడిన వారిలోను స్వీయ రోగనిరోధక శక్తి దెబ్బతిని ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడం కోసం చికిత్స సమయంలో ఇమ్యూనో గ్లోబులిన్స్ థెరపీ ఇస్తుంటారు. ప్రైవేట్లో ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ.40 వేల వరకు ఉంటోంది. ఇంత ఖరీదైన ఇంజెక్షన్లను కొనుగోలు చేసి, చికిత్స చేయించుకోవడం పేద, మధ్యతరగతి ప్రజలకు స్తోమతకు మించిన వ్యవహారం. ఇక జీబీఎస్తో పాటు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్తో బాధపడే చిన్న పిల్లలు... బోధనాస్పత్రుల్లో చేరిన సందర్భాల్లో చికిత్సకు ఇమ్యూనో గ్లోబులిన్స్ అందుబాటులో లేక ఆ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్న ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. కేవలం ఈ కారణంతో గడిచిన ఐదారు నెలలుగా అనేక కేసులను విజయవాడ, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, మచిలీపట్నం ఆస్పత్రుల నుంచి గుంటూరు జీజీహెచ్కు రిఫర్ చేసినట్టు వెల్లడైంది. ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు ఆస్పత్రుల నుంచి విశాఖకు, కర్నూలు ఆస్పత్రికి అనంతపురం, కడప తదితరాల నుంచి రిఫరల్ కేసులు పెరగడంతో ఈ ఆస్పత్రుల్లో ఇంజెక్షన్ల కొరత నెలకొన్నట్టు తెలుస్తోంది. ప్రాణాలతో చెలగాటంవైద్యశాఖలో ఏఐ వినియోగం పెరగాలి.. రోగులకు వైద్య సేవలు మరింత చేరువవ్వాలి... అంటూ సీఎం చంద్రబాబు ఊదరగొడుతుంటారు. అయితే, ఆయన చెబుతున్న మాటలకు.. చేతలకు అస్సలు పొంతన కుదరట్లేదు. అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రులకు వెళితే కనీసం మందులు కూడా అందుబాటులో లేని దీనావస్థలో ఆస్పత్రులను నెట్టేశారు. మెరుగైన వైద్యం కోసం కాకుండా.. కేవలం ఇంజెక్షన్లు, మందులు లేవన్న కారణంతో రోగులను ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి రిఫరల్ పేరిట ప్రభుత్వమే బంతాట ఆడుతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. దీంతో చికిత్సల్లో కాలయాపన జరుగుతోంది. వెరసి రోగులు ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. మరోవైపు సకాలంలో చికిత్సలు అందక అమాయకులు మృత్యువాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.నెట్వర్క్ ఆస్పత్రులు ఆ ఇంజక్షన్ ఇవ్వడంలేదుగులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) అంటువ్యాధి కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. సోమవారం జీబీఎస్పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జనవరిలో 43 కేసులు నమోదు కాగా వారిలో 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో 749 ఇమ్యూనో గ్లోబులిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.అయితే ఎన్టీఆర్ వైద్యసేవ కింద నెట్ వర్క్ ఆస్పత్రులు ఈ ఇంజక్షన్ను ఇవ్వడానికి ముందుకురావడంలేదన్నారు. గత ఏడాది 10 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 301 కేసులు నమోదు కాగా, వీటిలో అధిక మొత్తంలో 115 కేసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదయ్యామని వెల్లడించారు.

గరుడుడి రెక్కలు తొడిగిన ఇస్రో!
అంతరిక్ష రంగంలో స్వావలంబన సాధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. భారత్ సొంతంగా తయారు చేసుకున్న క్రయోజెనిక్ ఇంజిన్ సీఈ–20ని తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న పరిశోధన శాలలో విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షంలోని శూన్య పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి జరిపిన ఈ ప్రయోగం క్రయోజెనిక్ టెక్నాలజీ ప్రస్థానంలో ముఖ్యమైంది. దాని ప్రాముఖ్యం తెలుసుకునేందుకు చిన్న పోలికను చూద్దాం. వాహనం నడిపేటప్పుడు... వాలుగా ఉన్న రహదారి కనిపించిన వెంటనే చాలామంది మోటర్ను ఆఫ్ చేస్తూంటారు. గురుత్వాకర్షణ శక్తి ఆధారంగానే వాహనం వేగం పుంజుకుంటుంది. వాలు మొత్తం పూర్తయిన తరువాతే మళ్లీ మోటర్ను ఆన్ చేయడం కద్దు. అచ్చం ఇలాగే ఉపగ్రహాలను అంతరిక్షంలో వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టేందుకు ఇంజిన్ను ఆన్/ఆఫ్ చేయాల్సి వస్తూంటుంది. అంగారక గ్రహం పైకి ఇస్రో ప్రయోగించిన ‘మంగళ్యాన్’నే ఉదాహరణగా తీసుకుంటే... ప్రయోగం తరువాత దీని ఇంజిన్ను సుమారు పది నెలల విరామం తరువాత ఆన్ చేశారు. ఇలా ఎప్పుడు కావాలిస్తే అప్పుడు ఆన్/ఆఫ్ చేసుకోగల ఇంజిన్ ఇస్రో వద్ద ప్రస్తుతానికి ఒక్కటే ఉంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి ఏడున జరిగిన ప్రయోగానికి ప్రాధాన్యం ఏర్పడుతుంది. సీఈ–20యూ ఇంజిన్ ప్రయోగంలో... అనుకున్నట్టుగానే పనిచేసింది. రీ స్టార్ట్ చేయాల్సినప్పుడు ఇంధన ట్యాంకుపై ఉండే పీడన పరిస్థితులను అనుకరించి మరీ ప్రయోగం నిర్వహించారు. మరిన్ని ప్రయోగాలు చేపట్టిన తరువాత మాత్రమే దీన్ని ఉపగ్రహ ప్రయోగ రాకెట్లలో ఉపయోగిస్తారు.బాగా పీడనానికి గురిచేసిన గాలిని ఒక్కసారిగా వదిలామను కోండి... న్యూటన్ మూడో సూత్రం ప్రకారం గాలి ఉన్న ట్యాంకు వ్యతిరేక దిశగా వేగమందుకుంటుంది. ఇదే పద్ధతిలో వేడి వాయువును ఉత్పత్తి చేసి ఒక చిన్న నాజిల్ గుండా విడుదల చేయడం ద్వారా వాహనాన్ని నడిపించవచ్చు. మండించేందుకు ఇంధనంతో పాటు ఆక్సిజన్ అవసరం ఉంటుంది. వీటినే మనం ఇంగ్లీషులో ‘ప్రొపెల్లంట్స్’ అని పిలుస్తూంటాం. రాకెట్ ప్రొపెల్లంట్స్ ప్రధానంగా ఘన, ద్రవ, వాయు అని మూడు రకాలు. ఘన ఇంధనం స్థానంలో కిరోసిన్ను, దీనికి సరిపోయే ఆక్సిడైజర్ ఒకదాన్నీ వాడుకోవచ్చు. సీఈ–20 ద్రవ ఇంధనంతో నడిచే రాకెట్. వాయువులతో పోలిస్తే ఘన, ద్రవ ఇంధనాలు రెండూ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి.ద్రవంగా ఉన్నప్పటి కంటే నీరు వాయువుగా ఉన్నప్పుడు పదహారు రెట్లు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఈ కారణంగానే క్రయోజెనిక్ ఇంజిన్లలో వాడే ఇంధనాన్ని బాగా చల్లబరుస్తారు. సైన్స్ పరిభాషలో మైనస్ 153 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత (మీథేన్ వాయువు మరిగే ఉష్ణోగ్రత)ను ‘క్రయో’ అని పిలుస్తారు. ‘క్రయో జెనిక్’ ఇంధనంగా వాడే ద్రవ హైడ్రోజన్ ‘–253 డిగ్రీల’ ఉష్ణోగ్రతల్లో ఉంటుంది. ద్రవ ఆక్సిజన్ ‘–183 డిగ్రీల’. ఈ రెండూ కలిసినప్పుడు రసాయనిక చర్య జరిగి ఆవిరి ఉత్పత్తి అవుతుంది. ఈ వాయువు ఎంత తేలికగా ఉంటే... వేగం పెరగడం అంత ఎక్కువగా ఉంటుంది. హైడ్రోజన్ అత్యంత తేలికైన మూలకం కాబట్టి ఇది సమర్థమైన క్రయోజెనిక్ ఇంధనం. కాబట్టే దీన్ని అంతరిక్ష ప్రయోగాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూంటారు. జాబిల్లి లేదా సుదూర గ్రహాలను అందుకునేందుకు ఈ క్రయోజెనిక్ ఇంజిన్లు, ఇంధనాలు బాగా ఉపయోగపడతాయి. భూ వాతావరణానికి అవతల మాత్రమే ఉపయోగించే ఈ క్రయోజెనిక్ ఇంజిన్లతో పనిచేసిన అనుభవం ప్రస్తుతానికి అమెరికా, రష్యా, జపాన్, భారత్, ఫ్రాన్స్, చైనాలకు మాత్రమే ఉంది. భూమి నుంచి వంద కిలోమీటర్లకు అవతల ఉన్న ప్రాంతాన్ని అంతరిక్షం అంటాం. క్రయోజెనిక్ ఇంజిన్లు బాగా సమర్థ మంతమైన వే అయినప్పటికీ వీటిని భూమ్మీది నుంచే వాడుకోవడం కష్టతరమవుతుంది. ఎందుకంటే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తిని అధిగ మించేందుకు చాలా ఎక్కువ బలం కావాలి.ట్రాఫిక్సిగ్నల్లో పచ్చలైట్ పడిన వెంటనే మనం ఏం చేస్తాం? వీలైనంత వేగంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాం. ఇందుకు మంచి పికప్ ఉన్న ఇంధనం అవసరం. అదే మీరు హైవేపై దూరం వెళుతున్నారనుకోండి... బాగా మైలేజీ ఇచ్చే ఇంజిన్ కావాలి. పెట్రోలు వాహనాలకు పికప్ బాగుంటే... డీజిల్ ఇంజిన్కు మైలేజీ ఎక్కువన్నది మనకు తెలుసు. ఇదే మాదిరిగా అంతరిక్ష ప్రయోగాల మొదట్లో జడత్వాన్ని అధిగమించి ఆకాశంలోకి ఎగబాకగలిగే, గురుత్వాకర్షణతో పోటీపడి ముందుకు దూసుకెళ్లే... వాతావరణం తాలూకూ ప్రభావాన్ని అధిగమించగలిగే ఇంజిన్ అవసరం. వీటన్నింటికీ ఘన లేదా ద్రవ ఇంధనాలు బాగుంటాయి. అయితే అంతరిక్షంలోకి చేరిన తరువాత మాత్రం మైలేజీ బాగా ఉండే ఇంజిన్ కావాలి. గతంలో సోవియట్ యూనియన్, అమెరికాలు రెండూ అత్యంత శక్తిమంతమైన లాంచ్ వెహికల్స్ తయారీలో పోటీపడ్డాయి. ఆ క్రమంలోనే జాబిల్లిని కూడా అందుకున్నాయి. గ్రహాలను దాటగల అంతరిక్ష వాహనాలను సిద్ధం చేయగలిగాయి. 1963లో తొలి క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ ‘ఆర్ఎల్–10’ ప్రయోగం జరిగింది. ఈ క్రయో జెనిక్ను అమెరికా ఇప్పటికీ ఉపయోగిస్తోంది. సోవియట్ విషయానికి వస్తే... ఇది ‘ఆర్డీ–56’ లేదా ‘11డీ–56’ అనే క్రయోజెనిక్ ఇంజిన్ను 1964లో తయారు చేసింది. తరువాతి కాలంలో సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ తయారీపై రష్యా దృష్టి పెట్టింది. ఫలితంగా అత్యంత శక్తిమంతమైన, కిరోసిన్, ఆక్సిజన్లను ఇంధనంగా వాడుకోగల ఆర్డీ–18 ఇంజిన్ తయారైంది. దీంతోపాటే తయారైన మరో మెరుగైన డిజైన్ కలిగిన క్రయోజెనిక్ ఇంజిన్ ‘కేవీడీ–1’ రష్యా మనకు అమ్మింది. 1990ల నాటికి ఇస్రో కూడా క్రయోజెనిక్ టెక్నాలజీకై ప్రయత్నాలు మొదలుపెట్టింది. జపాన్, అమెరికాలను ఇవ్వమని కోరింది కూడా. అయితే ఇంజిన్లు అమ్మడంతోపాటు తయారీ టెక్నాలజీని కూడా అందించేందుకు సోవియట్ ముందుకు రావడంతో ఇస్రో దానిని అందిపుచ్చుకుంది. కొంత కాలానికే సోవియట్ కాస్తా ముక్కలయింది. రష్యాపై అమెరికా ఒత్తిడి తీసుకొచ్చి భారత్కు క్రయోజెనిక్ టెక్నాలజీ ఇవ్వరాదని కట్టడి చేసింది. ఈ టెక్నాలజీతో భారత్ అణ్వాస్త్రాలు తయారు చేస్తుందన్నది అమెరికా భయం. అయితే ఈ వాదన చాలా అసంబద్ధమైంది. ఎందుకంటే క్షిపణులను అవసరమైనప్పుడు క్షణాల్లో ప్రయోగించేలా ఉండాలి. కానీ ఒక క్రయోజెనిక్ ఇంజిన్ను ఆన్ చేయాలంటే కనీసం 24 గంటల ముందు నుంచి దాంట్లో ఇంధనం నింపాల్సి ఉంటుంది. అంతేకాదు... కొన్ని నెలల క్రితమే అధిక ధరలకు ఈ ఇంజిన్లను అమ్మేందుకు అమెరికానే ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రష్యా తనపై అమెరికా ఒత్తిడిని కాదని ఆరు ఇంజి న్లను మనకు అప్పగించింది. కానీ.. టెక్నాలజీని ఇవ్వలేకపోయింది.ఈ సమయంలోనే ఇస్రోపై కూడా అమెరికా నిషేధం విధించింది. ఆ పరిస్థితుల్లో ఇస్రో తన వద్ద ఉన్న ఆరు ఇంజిన్లను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా సీఈ–20ని తయారు చేసింది. ఈ డిజైన్ రష్యా ఇంజిన్కు నకలు కాకపోవడం విశేషం. ఎందుకంటే రష్యా ఇచ్చిన ఇంజిన్లో ఇంధనం మండటం అన్నది దశలవారీగా జరుగుతుంది. సీఈ–20 మాత్రం దీనికి భిన్నం. ఇది గ్యాస్ జనరేటర్ తరహాలో పనిచేస్తుంది. ఏళ్లపాటు కష్టపడి తయారు చేసిన ఈ సీఈ–20ని మొదటిసారి 2017 జూన్ 5న∙జీశాట్–19 ప్రయో గంలో ఉపయోగించారు. అలాగే చంద్రయాన్–2, 3 లాంచ్ వెహికల్స్లోనూ అమర్చారు. తాజా ప్రయోగాల ద్వారా దీన్ని అవసరమైనప్పుడు ఆన్/ఆఫ్ చేసే సామర్థ్యం అందడంతో భవిష్యత్తులో ఈ ఇంజిన్ను గ్రహాంతర ప్రయాణాలకూ వాడుకునే వీలు ఏర్పడింది.టీవీ వెంకటేశ్వరన్ వ్యాసకర్త విజిటింగ్ ప్రొఫెసర్, ఐసర్ – మొహాలీ

వంశీ అరెస్ట్ ముందస్తు వ్యూహమే
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను అరెస్ట్ ముందస్తు వ్యూహమే. ఆయన్ని∙అరెస్టు చేయాలని, జైల్లో పెట్టాలని ముందుగానే కొందరు తీసుకున్న నిర్ణయాన్ని విజయవాడ పోలీసులు అమలు చేశారు. వంశీపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ చేయకుండానే కేసులు పెట్టారు. ఇదంతా ఆయన్ని ఉద్దేశపూర్వకంగా కేసుల్లో ఇరికించేందుకు పన్నిన కుట్ర మాత్రమే.వీటన్నింటినీ పరిశీలించి బెయిల్ మంజూరు చేయండి’ అని వంశీ తరపున దాఖలు చేసిన బెయిల్పిటిషన్లో న్యాయవాది తానికొండ చిరంజీవి కోరారు. ‘రెండేళ్ల క్రితం గన్నవరంలో జరిగిన ఓ ఘటనపై సత్యవర్ధన్ అనే వ్యక్తి వల్లభనేని వంశీమోహన్, మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదును ఈ నెల పదో తేదీన న్యాయమూర్తి ఎదుట వాపసు తీసుకున్నాడు. అతన్ని వంశీ బెదిరించి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేశాడంటూ అతని సోదరుడు కిరణ్ ఈ నెల 12న పటమట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదు చేసిన కిరణ్ను, బాధితుడిగా అందులో పేర్కొన్న సత్యవర్ధన్ను విచారించకుండానే అదే రోజు హడావుడిగా కిడ్నాప్, ఎక్స్ట్రాక్షన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం విజయవాడ పోలీసులకే చెల్లింది. అదే రోజు (12వ తేదీ) రాత్రే విజయవాడ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. వంశీ ఇంటి వద్ద రాత్రంతా పహారా కాసి 13వ తేదీ తెల్లవారుజామునే బెడ్రూంలో ఉన్న ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్కు తెచ్చారు. అక్కడి నుంచి కృష్ణలంక పోలీసు స్టేషన్కు తీసుకొచ్చి రాత్రి 9 గంటల వరకు విచారణ పేరుతో కూర్చోబెట్టారు. ఆ తరువాత న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఇదంతా కొందరు పెద్దల మెప్పు కోసం పోలీసులు పడిన ఆరాటం మాత్రమే.పోలీసుల అభియోగంలో ఎలాంటి వాస్తవం లేదు. సత్యవర్థన్తో పోలీసులు బలవంతంగా సెకండ్ ఏసీఎంఎం కోర్టులో వాంగ్మూలం చెప్పించినట్లు అనుమానాలు ఉన్నాయి. సత్యవర్ధన్ను బెదిరించేందుకు వంశీ, అతని అనుచరులు ఓ వ్యక్తిని పురమాయించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అదే నిజమైతే అసలైన ఆ నిందితుడు ఎక్కడున్నాడు? ఈ కేసు పూర్తిగా కల్పితమనడానికి ఇదే నిదర్శనం. కొన్నేళ్లుగా వంశీ అనారోగ్యంతో, టెయిల్ బోన్ గాయంతో బాధపడుతున్నారు.కరోనా సమయం నుంచి బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయి. నేలపై కూర్చోవడం, పడుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందువల్ల ఆయనకు వెంటనే బెయిల్ ఇవ్వండి’ అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈలోగా ఆయనకు టాయిలెట్, బెడ్, ఇంటి నుంచి ఆహారం, మందుల సౌకర్యం కల్పించాలని కోరారు. జైల్లోని బ్యారక్లో వంశీని ఒంటరిగా ఉంచి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, రూమ్లో అసిస్టెంట్ను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.పది రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ జ్యుడిíÙయల్ రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీమోహన్ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ పోలీసులు కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వంశీ, అతని అనుచరుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టాల్సి ఉందని, పది రోజులు కస్టడీకి అప్పగించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.

ఈఎంఐలు.. ఇప్పట్లో తగ్గేనా?
ఆర్బీఐ చాలా కాలం తర్వాత కీలకమైన రెపో రేటు ను 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో హమ్మయ్య రుణ రేట్లు తగ్గుతాయని, నెలవారీ ఈఎంఐ చెల్లింపుల భారం దిగొస్తుందని ఆశపడే వారు.. కొంత కాలం పాటు వేచి చూడక తప్పేలా లేదు. రెపో రేటు కోత ప్రభావం రుణాలు, డిపాజిట్లపై పూర్తిగా ప్రతిఫలించేందుకు కొన్ని నెలల సమయం తీసుకోవచ్చని విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ద్రవ్య లభ్యత కొరత (లిక్విడిటీ) ఉండడాన్ని, డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంక్ల మధ్య నెలకొన్న తీవ్ర పోటీని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఆధారంగా మంజూరయ్యే రుణాలతోపాటు, డిపాజిట్లపై రేటు తగ్గింపు వెంటనే అమల్లోకి రాకపోవచ్చని.. అదే సమయంలో రెపో ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపు వేగంగా బదిలీ అవుతుందని చెబుతున్నారు. కొంత సమయం తర్వాతే.. ‘‘తాజా రేటు తగ్గింపు ప్రయోజనం కొత్త రుణాలపై అమలయ్యేందుకు కొంత సమయం తీసుకోవచ్చు. ఎందుకంటే డిపాజిట్ల కోసం పోటీ కారణంగా నిధులపై బ్యాంకులు అధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు. ఫ్లోటింగ్ రేటు రుణాలపై ఆర్బీఐ రేటు తగ్గింపు వేగంగా అమల్లోకి వస్తుందన్నారు. బ్యాంకు రుణాల్లో 40 శాతం మేర రెపో ఆధారిత రుణాలు ఉన్నట్టు చెప్పారు. ఆర్బీఐ నిర్ణయంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగిరావడం తెలిసిందే. మరోవైపు సమీప భవిష్యత్లో లిక్విడిటీ పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిక్విడిటీ పెంచే అదనపు చర్యలను ఆర్బీఐ తీసుకోకపోతే మార్చి నాటికి వ్యవస్థ వ్యాప్తంగా రూ.2.5 లక్షల కోట్ల లోటు ఏర్పడొచ్చని అంటున్నారు. అప్పుడు ఆర్బీఐ రేట్ల తగ్గింపు బదిలీకి మరింత సమయం పట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపునకు రెండు త్రైమాసికాల సమయం తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఈ రుణాల రేట్లను బ్యాంక్లు ఆర్నెళ్లకోసారి సమీక్షించడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. దీంతో బ్యాంక్లు జూలై లేదా వచ్చే డిసెంబర్లో ఈ రుణాల రేట్లను సవరించే అవకాశం ఉంటుంది.డిపాజిట్లపై.. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి తాజా రేటు తగ్గింపుతో ఎలాంటి ప్రభా వం పడదు. కొత్తగా డిపాజిట్ చేసే వారికి రేటు తగ్గే అవకాశాలున్నాయి. కాకపోతే వెంటనే కాకుండా క్రమంగా డిపాజిట్లపై ఈ మార్పు కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిపాజిట్ల కోసం బ్యాంక్ల మధ్య పోటీ ఉన్నందున రేట్లను వెంటనే తగ్గించకుండా, ఆర్బీఐ చర్యలతో లిక్విడిటీ మెరుగయ్యాకే డిపాజిట్లపై రేట్లు తగ్గించొచ్చని భావిస్తున్నారు. ‘‘ఎక్స్టర్నల్ బెంచ్మార్క్స్ అనుసంధానిత రుణాలపై రేట్ల మార్పు ప్రభావం వెంటనే అమల్లోకి రావచ్చు. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై అమలు కావడానికి కొంత సమయం తీసుకోవచ్చు. మానిటరీ పాలసీ రేట్ల ప్రభావం డిపాజిట్లపై ప్రతిఫలించేందుకు కూడా రెండు త్రైమాసికాలు పట్టొచ్చు’’అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ పేర్కొనడం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్
జనం ప్రాణాలంటే విలువేది?
పారిశ్రామిక పాలసీల సవరణ
German elections 2025: జర్మనీ విజేత ఎవరు?
తాగునీరే కాదు... తప్పుడు సమాచారమూ సవాలే!
నేడు వంశీని పరామర్శించనున్న వైఎస్ జగన్
గరుడుడి రెక్కలు తొడిగిన ఇస్రో!
ఎంజీ సెలెక్ట్ డీలర్గా ఐకానిక్ ఆటోమొబైల్స్
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతి
లాభాల స్వీకరణకే ఎఫ్ఐఐల అమ్మకాలు
‘మండే’ కాలం.!
ఇప్పటివరకూ అక్రమ వలసదారులే టార్గెట్ అనుకున్నాం.. మనల్ని చేస్తారనుకోలేదు!!
నాడు డబుల్.. నేడు సింగిల్! తేలికవుతున్న ఐటీ జీతాలు
మస్తాన్ సాయి విచారణలో విస్తుపోయే నిజాలు
పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు.. కూటమి ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం
Software Engineer: ప్రవళిక ఎందుకమ్మా ఇలా చేశావు..!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తి వివాదాలు పరిష్కారం
ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు/ సిరీస్లు రిలీజ్
తెలుగమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వకూడదు: ఎస్కేఎన్
మొదటి రోజే రూ.8,472 కోట్ల బుకింగ్లు
డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ తిని బతికాడు.. ఇప్పుడు అతడే..: నీతా అంబానీ
జనం ప్రాణాలంటే విలువేది?
పారిశ్రామిక పాలసీల సవరణ
German elections 2025: జర్మనీ విజేత ఎవరు?
తాగునీరే కాదు... తప్పుడు సమాచారమూ సవాలే!
నేడు వంశీని పరామర్శించనున్న వైఎస్ జగన్
గరుడుడి రెక్కలు తొడిగిన ఇస్రో!
ఎంజీ సెలెక్ట్ డీలర్గా ఐకానిక్ ఆటోమొబైల్స్
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతి
లాభాల స్వీకరణకే ఎఫ్ఐఐల అమ్మకాలు
‘మండే’ కాలం.!
ఇప్పటివరకూ అక్రమ వలసదారులే టార్గెట్ అనుకున్నాం.. మనల్ని చేస్తారనుకోలేదు!!
నాడు డబుల్.. నేడు సింగిల్! తేలికవుతున్న ఐటీ జీతాలు
మస్తాన్ సాయి విచారణలో విస్తుపోయే నిజాలు
పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు.. కూటమి ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం
Software Engineer: ప్రవళిక ఎందుకమ్మా ఇలా చేశావు..!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తి వివాదాలు పరిష్కారం
ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు/ సిరీస్లు రిలీజ్
తెలుగమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వకూడదు: ఎస్కేఎన్
మొదటి రోజే రూ.8,472 కోట్ల బుకింగ్లు
డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ తిని బతికాడు.. ఇప్పుడు అతడే..: నీతా అంబానీ
సినిమా

సాఫ్ట్వేర్ ఇంజినీర్ను పెళ్లాడిన టాలీవుడ్ బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి మాన్షి జోషి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. గతేడాది అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవ్ను పెళ్లాడింది. బెంగళూరులోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, సన్నిహితులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాన్షికి అభినందనలు చెబుతున్నారు.కన్నడలో పలు సీరియల్స్లో నటించిన మాన్షి జోషి.. తెలుగులో దేవత అనే సీరియల్లో కనిపించింది. ఈ సీరియల్లో అర్జున్ అంబటి, చంటిగాడు హీరోయిన్ సుహాసిని కీలక పాత్రల్లో నటించారు. అంతేకాకుండా కన్నడలో పారు సీరియల్తో ఫేమ్ తెచ్చుకుంది. రాధ రమణ, అంబుదాన్ ఖుషీ, గీతాంజలి, రాధ రాఘవ్ లాంటి సీరియల్స్తో మెప్పించింది.

ఓయ్.. బుజ్జి, బంగారం కాకుండా జింగిలేంటి?: హీరోయిన్
'క' మూవీతో భారీ హిట్ కొట్టిన హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ప్రస్తుతం దిల్రూబా మూవీ చేస్తున్నాడు. ఇందులో రుక్సర్ ధిల్లాన్ (Rukshar Dhillon) కథానాయికగా నటిస్తోంది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించారు. మొన్నటి వాలంటైన్స్ డేకు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం మార్చి 14వ తేదీకి వాయిదా పడింది.జింగిలి బాగుంటదిలే..ఇకపోతే దిల్రూబా సినిమా (Dilruba Movie) నుంచి హే జింగిలి పాటను ఫిబ్రవరి 18న సాయంత్రం 5.01 గంటకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై రుక్సర్ స్పందిస్తూ.. ఓయ్ కిరణ్ అబ్బవరం.. ఇంకేం దొరకనట్టు, బుజ్జి, బంగారం కాకుండా ఈ జింగిలి జింగిలి ఏంటి? అని ప్రశ్నించింది. అందుకు కిరణ్ అబ్బవరం.. ఈ మధ్య జనాలు పిల్చుకునే కూకీ, వైఫుల కన్నా జింగిలి చాలా బాగుంటది లే అన్నాడు. అదంతా కాదు, ఈ జింగిలి అంటే ఏంటి? ముందు అది చెప్పు అని హీరోయిన్ ప్రశ్నించింది. రేపటిదాకా ఆగాల్సిందేఅందుకు హీరో.. జింగిలి (Jingili) అంటే J అంటే జాన్, I అంటే ఇర్రెస్టిబుల్, N అంటే నెక్స్ట్ లెవల్, G అంటే గార్జియస్, I అంటే ఇర్రీప్లేసబుల్, L అంటే లైఫ్లైన్.. అంటూనే చివర్లో I అంటే ఇవ్వేవీ కాదన్నాడు. రేపు రిలీజయ్యే హేయ్ జింగిలి పాట వింటే నీకే తెలుస్తుందన్నాడు. అయితే మరీ అంతగా వెయిట్ చేయించకుండా హేయ్ జింగిలి ప్రోమోను రిలీజ్ చేశాడు. ప్రోమోలో అయితే పాట మరీ స్లోగా ఉంది. మరి ఫుల్ సాంగ్ వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి. Ee madhya janaalu pilchukunne pookie, cookie, Waifu lu kanna JINGILI chaala baguntaadhi le.#HeyJingili https://t.co/9FEXgMjd27— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 17, 2025Jingili ante!J - JaanI - Irresistible N - Next LevelG - Gorgeous I - Irreplaceable L - LifelineI - Ivvevi kaadhuRepu #HeyJingili song vachaka vinnu.Feb 18th 5:01 ki. https://t.co/JA25iVHaQt— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 17, 2025Tomorrow 5:01pm ❤️#HeyJingili #Dilruba pic.twitter.com/kNSlBWmLTv— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 17, 2025 చదవండి: తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వనన్న నిర్మాతపై ట్రోలింగ్.. ఆయన రిప్లై ఇదే!

మూడేళ్లు డేటింగ్.. ప్రియుడిని పెళ్లాడిన రానా నాయుడు హీరోయిన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్.. తన చిన్ననాటి స్నేహితురాలు, రానా నాయుడు వెబ్ సిరీస్ నటి ప్రియా బెనర్జీని ఆయన పెళ్లాడారు. ముంబయిలోని బాంద్రాలో జరిగిన వీరి పెళ్లి వేడుకలో సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. దివంగత నటి స్మితా పాటిల్ కుమారుడే ప్రతీక్ బాబర్. తాజాగా తన వివాహానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ప్రతీక్. ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఫిబ్రవరి 14న శుక్రవారం జరిగింది. ఫిబ్రవరి 12న మొదలైన హల్దీ, మెహందీ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగాయి.దాదాపు మూడు సంవత్సరాల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ నవంబర్ 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రియా పుట్టినరోజున నవంబర్ 28న ఓ రెస్టారెంట్లో ప్రపోజ్ చేసినట్లు ప్రతీక్ వెల్లడించాడు. ఆ తర్వాత వీరు తమ రిలేషన్ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. అయితే పలు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ తరహా పాత్రలు చేస్తున్న ప్రతీక్ బాబర్.. గతంలో హీరోయిన్ అమీ జాకన్స్తో డేటింగ్ చేసినట్లు టాక్. 2019లో సన్యా సాగర్ అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు.'రానా నాయుడు' వెబ్ సిరీస్లో మెప్పించిన ప్రియా బెనర్జీ. ఈ సిరీస్లో రానాని టెంప్ట్ చేసే అమ్మాయి పాత్రలో నటించింది. కానీ అంతకు ముందే కిస్, జోరు, అసుర తదితర సినిమాలు చేసిన ప్రియా బెనర్జీకి తెలుగులో పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్కి చెక్కేసింది. ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. తాజాగా నటుడు ప్రతీక్ బాబర్ను పెళ్లాడింది. ప్రతీక్ బాబర్ హిందీలో జానే తు యా జానేనా, దమ్ మారో దమ్, ఏక్ దీవానా తా వంటి పలు సినిమాల్లో నటించాడు. View this post on Instagram A post shared by Priya Banerjee (@priyabanerjee)

తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వనన్న నిర్మాతపై ట్రోలింగ్.. ఆయన రిప్లై ఇదే!
'టాలీవుడ్లో తెలుగు వచ్చిన అమ్మాయిలకన్నా తెలుగురాని అమ్మాయిలనే ఎక్కువగా ప్రేమిస్తుంటాం. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తర్వాత తెలిసింది. అందుకని ఇక మీదట తెలుగురానివారిని ఎంకరేజ్ చేయాలని నేను, డైరెక్టర్ సాయి రాజేశ్ (Sai Rajesh) నిర్ణయించుకున్నాం' అంటూ నిర్మాత ఎస్కేఎన్ (Producer SKN) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన చివరిగా నిర్మించిన సినిమా బేబీ. అందులో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యను హీరోయిన్గా పరిచయం చేయడంతో.. ఆమెకు బేబీ టీమ్కు మధ్య విభేదాలు వచ్చాయా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.ఆరుగురు తెలుగమ్మాయిలను..నిజానికి ఎస్కేఎన్ దాదాపు ఆరుగురు తెలుగమ్మాయిలను హీరోయిన్స్గా మార్చాడు. 'ఈ రోజుల్లో' సినిమాతో రేష్మ రాథోడ్, ఆనంది, 'రొమాన్స్'తో మానస, 'టాక్సీవాలా'తో ప్రియాంక జవాల్కర్ (దీనికంటే ముందు కల వరం ఆయే సినిమా చేసింది కానీ గుర్తింపు రాలేదు), 'బేబి'తో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)ను హీరోయిన్గా వెండితెరకు పరిచయం చేశాడు. సంతోశ్ శోభన్తో తీస్తున్న సినిమాలో దేత్తడి హారికను కూడా కథానాయికగా పరిచయం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ.. ఎస్కేఎన్.. చాలామంది తెలుగు హీరోయిన్లకు తెరకు పరిచయం చేశారు. కవర్ డ్రైవ్ఫన్ కోసమో, ఫ్లోలోనో వివాదానికి దారితీసేలా స్టేట్మెంట్ పడేశారు. కానీ దాన్ని హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ముడిపెట్టి చూడటం సరికాదేమో? అని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఎస్కేఎన్ స్పందిస్తూ.. హహ్హహ్హ.. ఈ మధ్య చాలామంది వినోదం కన్నా వివాదానికే మొగ్గు చూపుతున్నారు గురూజీ.. ఏం చేస్తాం చెప్పండి! అని రిప్లై ఇచ్చాడు. కాంట్రవర్సీ మీరే చేసి ఇప్పుడు కవరింగ్ దేనికో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: లాజిక్ లేకపోయినా రాజమౌళి సినిమాలు సూపర్హిట్టు: కరణ్ జోహార్
న్యూస్ పాడ్కాస్ట్

మేము ఒక తప్పు చేయాలంటే, ఒకటేంటి సార్ మూడు చేద్దామంటున్నారు... అధికారుల వ్యవహార శైలిపై సంతోషంగా లేను... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలకు కప్పం కడితేనే మైనింగ్... రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన గనుల తవ్వకాలు

మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే... రామోజీరావు మరణించినంత మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు.. తెలంగాణ హైకోర్టుకు నివేదించిన ఆర్బీఐ

ఏపీ సీఎం చంద్రబాబుతో సీఐడీ బంధం... ‘కరకట్ట బంగ్లా’ కేసులో అటాచ్మెంట్ పొడిగింపు కోరని దర్యాప్తు సంస్థ

చంద్రబాబు నాయుడు మోసకారి కాదా? ప్రజలను మోసం చేసినందుకు 420 కేసు పెట్టకూడదా?... వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

జేఈఈ మెయిన్ తొలి సెషన్ ఫలితాలు విడుదల.. 14 మంది విద్యార్థులకు 100 పర్సంటేజ్

ఆంధ్రప్రదేశ్లో ‘మద్యం మార్జిన్’ మాటున మహా దోపిడీ. ఇక మద్యం ధరలు భారీగా పెంపు. 3 కేటగిరీల మీద 10-20 శాతం ధరల పెంచుతూ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్నదాత సుఖీభవ ఈ ఏడాది లేనట్టే... ప్రతి రైతుకు 20 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ... ఇంకా మార్గదర్శకాలు కూడా రూపొందించని చంద్రబాబు కూటమి సర్కారు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం... 70 స్థానాలకు గాను బీజేపీకి 48, ఆమ్ ఆదీ పార్టీకి 22 స్థానాలు.. వరుసగా మూడోసారీ సున్నా చుట్టిన కాంగ్రెస్

మార్గదర్శి కేసులో కాలయాపన సరికాదు, కౌంటర్లు వేయడానికి ప్రతీసారి వాయిదాలు కోరడం సమంజసం కాదు... ఆర్బీఐ తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి
క్రీడలు

చాహల్ భార్యకు భరణం రూ.60 కోట్లు!?
టీమిండియా స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ తన కెరీర్తో పాటు.. తన వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యాడని గత కొంత కాలంగా ప్రచారం జరగుతోంది.ఇటీవల కాలంలో చాహల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్లు సైతం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో కూడా చేశారు. చాహల్ అయితే ఏకంగా ఆమె ఫోటోలను కూడా డిలీట్ చేశాడు. దీంతో చాహల్-ధనశ్రీ జంట త్వరలోనే విడాకులు తీసుకోనున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.ధనశ్రీకి రూ. 60 కోట్లు..?ఈ క్రమంలో తాజాగా వారిద్దరి విడాకులకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర కొడుతోంది. ధనశ్రీకి భరణంగా రూ.60 కోట్లు చెల్లించేందుకు చాహల్ సిద్దమయ్యాడని ఆ వార్త సారాంశం. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా చాహల్ 2020లో కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జోడీ ఎప్పటికప్పుడు వీడియోలు, డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను అలరించేవారు. కానీ ఇటీవల కాలంలో ఎవరి జీవితం వారిదే అన్నట్లు ముందుకు వెళ్తున్నారు. కాగా వీరి విడాకులపై వార్తలు రావడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు వారిద్దరూ విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ వాటిని చాహల్-ధనశ్రీ తీవ్రంగా ఖండిచారు. కానీ ఈసారి మాత్రం వారిద్దరూ విడిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.తాజాగా ఈ వార్తలపై స్పందించిన ధనశ్రీ.. కొన్ని రోజులుగా ఆధారాలు లేని వార్తలు, ఫేస్ పోస్టులతో తన గౌరవాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారు. నా మౌనం నా బలహీనతే కాదు అదే నా బలం. కొన్నేళ్లుగా తాను సంపాదించుకున్న పేరును నెగిటివిటీతో తీసేస్తున్నారు. కానీ నిజానికి విలువెక్కువ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. చాహల్ స్పందిస్తూ తమ ప్రైవసీని గౌరవించాలని.. బయటకొస్తున్న వార్తలు నిజాలు కావచ్చు, కాకపోవచ్చు అని చెప్పుకొచ్చాడు.చదవండి: సౌతాఫ్రికా దిగ్గజం సంచలన నిర్ణయం.. 13 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు

సౌతాఫ్రికా దిగ్గజం సంచలన నిర్ణయం.. 13 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమిని, అతడి భార్య స్యూ విడాకులు తీసుకున్నారు. తమ 13 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు వారిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గత కొంత కాలంగా వీరిద్దరి రిలేషన్షిప్పై వస్తున్న ఊహాగానాలకు ఎట్టుకేలకు తెరపడింది.గతేడాది నవంబర్ నుంచి డుమిని, స్యూ విడిపోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేయడంతో వారి విడాకుల విషయం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను ఒకొకరు తమ సోషల్ మీడియా ఖాతాలో తొలిగించారు.అన్నీ ఆలోచించాకే మేము ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా 12 ఏళ్ల వైవాహిక బంధంలో ఎన్నో మరుపురాని క్షణాలను ఆస్వాదించాము. అంతకమించి మా బంధానికి గుర్తుగా ఇద్దరు కుమార్తెలు జన్మించడం మా అదృష్టం. మా నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ గౌరవిస్తారని ఆశిస్తున్నాము.దయచేసి మా ప్రైవసీకి భంగం కలిగించకండి. మేము ఇద్దరం భార్యాభర్తలుగా విడిపోయినప్పటికి, మంచి స్నేహితులగా కొనసాగుతాము. ఈ సమయంలో మాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇట్లు మీ జేపీ అండ్ సూ అని ఇద్దరూ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. జేపీ డుమిని,స్యూ 2011 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఇటీవలే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. మార్చి 2023లో వైట్ బాల్ ఫార్మాట్లలో ప్రోటీస్ బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన డుమినీ.. 20 నెలల పాటు ఆ పదవిలో కొనసాగాడు.డుమిని నేతృత్వంలోనే దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్కప్-2024 ఫైనల్కు చేరింది. ఇక కాగా డుమిని 2004- 2019 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. డుమిని తన అంతర్జాతీయ కెరీర్లో 9,154 పరుగులు చేశాడు.చదవండి: ‘జట్టు నుంచి తప్పించారు.. అతడు మాట్లాడేందుకు సిద్ధంగా లేడు.. అందుకే’ View this post on Instagram A post shared by JP Duminy (@jpduminy)

‘జట్టు నుంచి తప్పించారు.. అతడు మాట్లాడేందుకు సిద్ధంగా లేడు.. అందుకే’
తాను అవకాశాల కోసం అడిగే వ్యక్తిని కాదని టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) అన్నాడు. తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారో తెలియదని.. ఈ విషయం గురించి మేనేజ్మెంట్ నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా తనకు పిలుపునిస్తారని ఆశగా ఎదురుచూశానని.. అయితే, సెలక్టర్లు మరోసారి మొండిచేయే చూపారని ఆవేదన వ్యక్తం చేశాడు.జట్టులో అవకాశాలు కరువుకాగా ఒకప్పుడు టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్(Vice Captain)గా వెలుగొందిన అజింక్య రహానే.. తాత్కాలిక సారథిగా ఆస్ట్రేలియా గడ్డపై భారత్కు విజయం అందించాడు. విదేశాల్లోనూ మెరుగైన రికార్డు కలిగి ఉన్న ఈ ముంబై బ్యాటర్కు గత కొన్నేళ్లుగా జట్టులో అవకాశాలు కరువయ్యాయి. అయితే, దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి.. ఐపీఎల్లోనూ తనను తాను నిరూపించుకున్న రహానే.. అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC)-2023 ఫైనల్(ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా)కు ఎంపికయ్యాడు.అనంతరం వెస్టిండీస్ పర్యటనలో టెస్టు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ పొందాడు. కానీ ఆ టూర్లో వైఫల్యం తర్వాత రహానేకు మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపురాలేదు. ఈ క్రమంలో దేశీ క్రికెట్పై దృష్టి సారించిన అతడు.. ముంబై కెప్టెన్గా గతేడాది రంజీ ట్రోఫీ టైటిల్ అందుకున్నాడు. టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటాడు.ఇక ప్రస్తుతం రంజీ సెమీ ఫైనల్స్తో బిజీగా ఉన్న అజింక్య రహానే టీమిండియా పునరాగమనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘జట్టు నుంచి నన్ను ఎందుకు తప్పించారని ప్రశ్నించే రకం కాదు. అసలు మేనేజ్మెంట్తో నాకు కమ్యూనికేషన్ లేదు. చాలా మంది వెళ్లి మాట్లాడమని చెప్పారు.అతడికి మాట్లాడే ఉద్దేశం లేనప్పుడుఅందుకు నేను సిద్ధంగా ఉన్నా.. ఎదుటి వ్యక్తి కూడా అందుకు సుముఖంగా ఉండాలి కదా!.. ఒకవేళ అతడికి మాట్లాడే ఉద్దేశం లేనప్పుడు నేను పోరాడటంలో అర్థం ఉండదు. నేను నేరుగా అతడితోనే మాట్లాడాలనుకున్నా. అందుకే మెసేజ్లు చేయలేదు. ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది’’ అంటూ టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.అదే విధంగా.. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత నన్ను జట్టు నుంచి తప్పించడం బాధ కలిగించింది. తదుపరి సిరీస్లలో నన్ను ఆడిస్తారని అనుకున్నా. కానీ నా చేతుల్లో ఏం లేదు కదా! ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాను. ఐపీఎల్లో కూడా ఆడితే మళ్లీ నన్ను పిలుస్తారేమో.రీఎంట్రీ ఇస్తాఅయితే, సౌతాఫ్రికాలో పరిస్థితులు కఠినంగా ఉంటాయి. అందుకే టెస్టు సిరీస్కు నన్ను పిలుస్తారని ఆశించా. కానీ ఆ జట్టులో నాకు స్థానం దక్కలేదు. చాలా బాధగా అనిపించింది. అయినా.. ఇప్పుడు ఏం అనుకుని ఏం లాభం. అయితే, ఏదో ఒకరోజు తప్పకుండా మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాననే నమ్మకం ఉంది’’ అని అజింక్య రహానే ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రహానేను కొనుగోలు చేసింది. రూ. కోటి యాభై లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో టీమిండియా 3-1తో ఓడిపోయింది. తదుపరి టెస్టు సిరీస్లో ఇంగ్లండ్తో తలపడనున్న రోహిత్ సేన ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ టోర్నీతో బిజీగా ఉంది.చదవండి: డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ

మా జట్టుకు గట్టి పోటీ తప్పదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: పాక్ మాజీ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్ దశలో తమ జట్టుకు గట్టిపోటీ తప్పదంటున్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed). టీమిండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ల జట్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుందని పేర్కొన్నాడు. అయితే, సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీలో పాకిస్తాన్(Pakistan) తప్పకుండా సెమీ ఫైనల్కు మాత్రం చేరుతుందని సర్ఫరాజ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశాడు.కాగా 2017లో చివరగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్లో పాక్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. నాడు సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో లండన్ వేదికగా జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఎనిమిదేళ్ల అనంతరంఇక ఇప్పుడు.. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం ఈ మెగా టోర్నీ మరోసారి జరుగనుండగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.ఇక ఈ ఐసీసీ ఈవెంట్కు పాకిస్తాన్తో పాటు వన్డే వరల్డ్కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి.ఈ క్రమంలో ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ , ఇంగ్లండ్ను చేర్చారు. ఇక పాక్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడనుంది.సెమీ ఫైనల్స్లో ఆ నాలుగేఈ నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సెమీస్ చేరే జట్లపై తన అంచనా తెలియజేశాడు. ‘‘పాకిస్తాన్ ఉన్న గ్రూపులో జట్ల నుంచి గట్టి పోటీ తప్పదు. అయితే, నా అభిప్రాయం ప్రకారం... ఈసారి పాకిస్తాన్, ఇండియా, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా బలమైన జట్లుగా కనిపిస్తున్నాయి. సెమీ ఫైనల్స్ ఈ నాలుగే చేరతాయి’’ అని సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు.ఇక తమ జట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ టీమ్ పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై టోర్నీ ఆడనుండటం అతిపెద్ద సానుకూలాంశం. సొంత మైదానాల్లో ఎలా ఆడాలన్న అంశంపై ప్రతి ఒక్క ఆటగాడికి అవగాహన ఉంది. 2017లో ట్రోఫీ గెలిచిన జట్టుతో పోలిస్తే.. ప్రస్తుత జట్టు మరింత స్ట్రాంగ్గా కనిపిస్తోంది.ప్రధాన బలం వారేబాబర్ ఆజం రూపంలో జట్టులో వరల్డ్క్లాస్ ప్లేయర్ ఉన్నాడు. ఫఖర్ జమాన్ ఆనాడు కొత్తగా జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు అనుభవం కలిగిన ఆటగాడిగాబరిలోకి దిగబోతున్నాడు. వీళ్దిద్దరు పాకిస్తాన్ జట్టుకు ప్రధాన బలం’’ అని సర్ఫరాజ్ అహ్మద్ చెప్పుకొచ్చాడు.కాగా 2017లో చివరగా ఐసీసీ టైటిల్ గెలిచిన పాకిస్తాన్ ఇప్పటివరకు మళ్లీ మెగా ఈవెంట్లలో గెలుపు రుచిచూడలేదు. 2023 వన్డే వరల్డ్కప్, టీ20 ప్రపంచకప్-2024లో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇప్పుడు స్వదేశంలోనైనా.. గత చేదు అనుభవాలను మరిపించేలా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇటీవల వన్డే సిరీస్లలో వరుస విజయాలతో జోరు మీదున్న పాక్ జట్టుకు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో పరాభవం ఎదురైంది.మహ్మద్ రిజ్వాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ విజయం సాధించిన పాక్.. సౌతాఫ్రికాలో 3-0తో క్లీన్స్వీప్ చేసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. అయితే, తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్తో జరిగిన ట్రై సిరీస్లో ఫైనల్ చేరుకున్న రిజ్వాన్ బృందం కివీస్ చేతిలో ఓటమిపాలైంది.చదవండి: డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ
బిజినెస్

ఫోన్పేలో కొత్త ఫీచర్.. ఇక ప్రతిసారీ కార్డు వివరాలు అక్కర్లేదు
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్పే (PhonePe) కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్ను ప్రారంభించింది. వినియోగదారులు ఇప్పుడు ఫోన్పే యాప్లో తమ కార్డులను టోకనైజ్ చేసుకుని బిల్లు చెల్లింపులు, రీఛార్జ్లు, ప్రయాణ బుకింగ్లు, బీమా కొనుగోళ్లతోపాటు పిన్కోడ్, ఫోన్పే పేమెంట్ గేట్వేను ఉపయోగించి చేసే చెల్లింపులు వంటి వివిధ సేవలలో ఉపయోగించవచ్చు.ఈ కొత్త ఫీచర్తో వినియోగదారులు మెరుగైన భద్రత, సౌలభ్యం నుండి ప్రయోజనం పొందుతారు. ఇకపై మర్చంట్ ప్లాట్ఫామ్లలో కార్డ్ వివరాలను సేవ్ చేయాల్సిన అవసరం లేదు లేదా ప్రతి లావాదేవీకి సీవీవీని నమోదు చేయాల్సిన అవసరం లేదని ఫోన్పే తెలిపింది. టోకెనైజ్డ్ కార్డులు కార్డ్ వివరాలను ఫోన్లకు సురక్షితంగా లింక్ చేయడం ద్వారా మోసాల ప్రమాదాలను తగ్గిస్తాయి. ఇది ఆన్లైన్ చెల్లింపులపై వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రారంభంలో వినియోగదారులు వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను టోకెనైజ్ చేయవచ్చు.ఈ ఫీచర్ నుండి వ్యాపారులు కూడా ప్రయోజనం పొందుతారు. టోకెనైజ్డ్ కార్డులు వేగవంతమైన లావాదేవీలను, అధిక మార్పిడి రేట్లను అనుమతిస్తాయి. ఎక్కువ మంది వినియోగదారులు ఈ పద్ధతిని అవలంబించడంతో, వ్యాపారాలు మెరుగైన కస్టమర్ నిలుపుదల, సున్నితమైన చెక్అవుట్ అనుభవాన్ని పొందుతాయి. ఫోన్పే పేమెంట్ గేట్వే ఉపయోగించే వ్యాపారులకు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ డిజిటల్ చెల్లింపు భద్రత, సౌలభ్యాన్ని పెంచుతుందని ఫోన్పే సహ వ్యవస్థాపకుడు, సీటీవో రాహుల్ చారి అన్నారు. ఈ సర్వీస్ను మరిన్ని కార్డ్ నెట్వర్క్లతో అనుసంధానించాలని, ఫోన్పే పేమెంట్ గేట్వే వ్యాపారులందరికీ విస్తరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

ఒక్కో ఉద్యోగికి రూ.4 లక్షల బోనస్..
ఉద్యోగుల శ్రమను దోపిడీ చేసి ఆదాయాలను పెంచుకునే కంపెనీలనే చూస్తుంటాం. కానీ మంచి లాభాలు వచ్చినప్పుడు దాన్ని ఉద్యోగులకు పంచే యాజమాన్యాలు కూడా కొన్ని ఉంటాయి. పారిస్కు చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్ హెర్మేస్ (Hermes) గత సంవత్సరం అసాధారణమైన లాభాలు సాధించింది. పరిశ్రమలోనూ దాని స్థానం మెరుగైంది. దీంతో ఉద్యోగులకు బోనస్ (bonus) ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. 2025 ప్రారంభంలో తమ సంస్థలో పనిచేసే ఒక్కో ఉద్యోగికి రూ. 4 లక్షలు (4,500 యూరోలు) బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది.ఈ ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ ఏకీకృత ఆదాయం 2024 లో 15.2 బిలియన్ యూరోలను తాకింది. 2023 తో పోలిస్తే స్థిరమైన మారకపు రేట్లలో 15 శాతం, ప్రస్తుత మారకపు రేట్ల వద్ద 13 శాతం పెరుగుదల. హెర్మేస్ దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహం, లోతుగా పాతుకుపోయిన వారసత్వ కళలు కంపెనీని ఇంత దూరం నడిపించాయి. ఈ లగ్జరీ లెజెండ్ ప్రపంచవ్యాప్తంగా తన పంపిణీ నెట్వర్క్ను బలోపేతం చేసుకుంటూ నమ్మకమైన కస్టమర్ బేస్ సంపాదించుకుంటూ అంతర్జాతీయంగా తన బ్రాండ్ను విస్తరించింది.వ్యాపారం పెరుగుతుండటంతో ఈ ఫ్యాషన్ బ్రాండ్ స్థిరమైన అభివృద్ధితోపాటు శ్రామిక శక్తిని బలోపేతం చేయడంపైనా దృష్టి పెట్టింది. హెర్మేస్ గ్రూప్ 2024 సంవత్సరంలో ఫ్రాన్స్లో 1,300 మందితో సహా మొత్తం 2,300 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. దీంతో దాని మొత్తం శ్రామిక శక్తి 25,000 మందికి చేరుకుంది. ఫ్యాషన్ యునైటెడ్ నివేదిక ప్రకారం.. సామాజిక నిబద్ధత విధానంలో భాగంగా గ్రూప్ ఉద్యోగులందరికీ ఒక్కొక్కరికి రూ.4 లక్షలు (4,500 యూరోలు) చొప్పున బోనస్ను ఆర్థికేడాది ప్రారంభంలోనే కంపెనీ చెల్లించనుంది.ఇది చదివారా? బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. దాదాపు 2 నెలలు అన్లిమిటెడ్జపాన్ మినహా హెర్మేస్ ఈ సంవత్సరంలో 7 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది. ఒక్క నాల్గవ త్రైమాసికంలోనే 9 శాతం పెరిగింది. బీజింగ్, షెన్జెన్లలో అనేక స్టోర్లు తెరిచినట్లు ఫ్యాషన్ యునైటెడ్ నివేదించింది. ఫ్రాన్స్ కాకుండానే యూరప్లో గరిష్ట వృద్ధి కనిపించింది. స్థానిక డిమాండ్, ఈ ప్రాంతంలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో 19 శాతం వృద్ధి కనిపించింది. లిల్లే, నేపుల్స్లో కొత్త బోటిక్లను ప్రారంభించడం ఫ్యాషన్ బ్రాండ్ వృద్ధికి, విస్తరణకు తోడ్పడింది.

ఎన్ఎక్స్200 vs ఎక్స్పల్స్ 200 4వీ: ఏది బెస్ట్ బైక్?
భారతదేశంలో ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ అయిన.. హోండా మోటార్సైకిల్ (Honda Motorcycle) తన సీబీ200ఎక్స్ స్థానంలో 'ఎన్ఎక్స్200'ను లాంచ్ చేసింది. కంపెనీ దీనిని అడ్వెంచర్ టూరర్ అని పిలిచింది. ఈ బైక్ టూరింగ్ కోసం ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నప్పటికీ.. ఇది హీరో ఎక్స్పల్స్ 200 4Vకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రెండు బైకుల మధ్య వ్యత్యాసం ఏంటో ఇక్కడ చూద్దాం.ధర: హోండా ఎన్ఎక్స్200 ఒక వేరియంట్లో మాత్రమే రూ. 1.68 లక్షలకు అందుబాటులో ఉంది. కాగా హీరో ఎక్స్పల్స్ 200 4వీ స్టాండర్డ్, ప్రో, ప్రో డాకర్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు రూ. 1.51 లక్షల నుంచి రూ. 1.67 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.ఫీచర్స్: హోండా ఎన్ఎక్స్200.. హీరో ఎక్స్పల్స్ 200 4వీ రెండూ కూడా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడీ హెడ్లైట్, టెయిల్లైట్, టర్న్ ఇండికేటర్లు, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటిని పొందుతాయి. ఎక్స్పల్స్ 200 4వీ టర్న్-బై-టర్న్ నావిగేషన్ పొందుతుంది, ఎన్ఎక్స్200 ట్రాక్షన్ కంట్రోల్ పొందుతుంది.ఇదీ చదవండి: బీవైడీ సీలియన్ 7 వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?హీరో ఎక్స్పల్స్ 200 4వీ, హోండా ఎన్ఎక్స్200 కంటే ఎత్తుగా, పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. డిజైన్ కూడా భిన్నంగా ఉంటుంది. హోండా ముందు భాగంలో అప్సైడ్డౌన్ ఫోర్కే పొందుతుంది. కానీ హీరో దాని సస్పెన్షన్ సెటప్ కోసం ఫుల్లీ అడ్జస్టబుల్ పొందుతుంది.పవర్ట్రెయిన్: హీరో ఎక్స్పల్స్ 200 4వీ.. 199.6 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ - కూల్డ్ ఇంజిన్ కలిగి 8,500 rpm వద్ద 18.9 Bhp & 6,500 rpm వద్ద 17.35 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇక హోండా ఎన్ఎక్స్200 బైక్ 184.4 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ద్వారా 17.03 bhp పవర్, 15.9 Nm టార్క్ అందిస్తుంది. ఇందులో కూడా 5-స్పీడ్ గేర్బాక్స్ ఉంటుంది. రెండూ కూడా ఉత్తమ పనితీరును అందిస్తాయి.

'ఉచితంగా పనిచేస్తా.. ఉద్యోగమివ్వండి': టెకీ పోస్ట్ వైరల్
చదువు పూర్తయిన తరువాత మంచి జాబ్ తెచ్చుకోవాలని, ఎక్కువ ప్యాకేజ్ పొందాలని అనుకుంటారు. కానీ ఇటీవల ఒక టెకీ 'ఉద్యోగం ఇవ్వండి, ఉచితంగానే పని చేస్తా' అని అంటున్నాడు. అతని రెజ్యూమ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్.. తాను 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని, కానీ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కూడా సమయం ఉద్యోగం పొందలేకపోయానని చెప్పాడు. ఉద్యోగం సంపాదించాలనే తపనతో, ఉచితంగా పనిచేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.నా రెజ్యూమ్ను కాల్చండి.. కానీ దయచేసి సహాయం చేయండి. సమీపంలో ఉద్యోగం దొరికితే ఉచితంగానే చేస్తాను. ఉద్యోగం కోసం వేచి చూస్తున్నాను.. అని ఆ యూజర్ రెడ్డిట్లో రాశారు. “నేను జావా, పైథాన్, డెవ్ఆప్స్ (DevOps), క్లౌడ్ కంప్యూటింగ్,మెషిన్ లెర్నింగ్ వంటి వాటిలో ప్రావీణ్యం పొందాను. సీఐ/సీడీ పైప్లైన్లు, డాకర్, కుబెర్నెట్స్, ఏపీఐ డెవలప్మెంట్తో పనిచేసిన అనుభవం కూడా ఉందని.. రెజ్యూమ్లో పేర్కొన్నాడు.ఇదీ చదవండి: జీతాల పెంపుపై టీసీఎస్ ప్రకటన.. ఈ సారి ఎంతంటే?కాలేజీలో చదువు పూర్తయిన తరువాత.. ఫుల్ టైమ్ జాబ్ పొందలేకపోయాను. ఇప్పటికే రెండు కంపెనీలలో ఒక్కో నెల ఇంటర్న్గా పనిచేశాను. ఇంటర్న్షిప్లు, ఫ్రీలాన్స్ గిగ్లు లేదా ఓపెన్-సోర్స్ ప్రాజెక్ట్లు వంటి ఏవైనా అవకాశాల గురించి ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండని టెకీ తన పోస్టులో పేర్కొన్నాడు.నేను ప్రొడక్ట్ ఇంజనీర్ ఇంటర్న్, టెక్నికల్ ఇంటర్న్గా ఇంటర్న్షిప్లు చేస్తున్నప్పుడు.. వెబ్ క్రాలర్లు, ఏపీఐ టెస్టింగ్, ఎంఎల్ సిస్టమ్లపై పనిచేశాను. ఐఈఈఈలో రీసర్చ్ పేపర్ కూడా సబ్మిట్ చేశాను. డీప్ లెర్నింగ్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లో ప్రాజెక్టులను నిర్మించాను" అని టెకీ చెప్పారు.Burn my resume but please help. Desperate & Ready to Work for Free Remotely – 23' Grad Looking for a Job ASAPbyu/employed-un inIndianWorkplace
ఫ్యామిలీ

Parisha Pe Charcha: విక్రాంత్ మాస్సే, భూమి పడ్నేకర్ అమూల్యమైన సలహాలు..!
బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో సంభాషించే వార్షిక కార్యక్రమం ప్రధాని మోదీ 'పరీక్ష పే చర్చ' చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈసారి కార్యక్రమం ఢిల్లీలోని ఐకానిక్ సుందర్ నర్సరీలో జరుగుతోంది. ఈ ఈవెంట్ ద్వారా విద్యార్థులకు పరీక్షలో ఒత్తిడిని ఎలా జయించాలి, పోషకాహారం ప్రాముఖ్యత తదితర వాటి గురించి ప్రధాని మోదీ తోపాటు పలువురు ప్రముఖులు సూచనలు ఇస్తారు. ఈ ఆదివారం ప్రసారమైన పరీక్షపై చర్చలో బాలీవుడ్ నటులు, విక్రాంత్ మూస్సే, నటి భూమి పడ్నేకర్ తమ అనుభవాలను షేర్ చేసుకోవడమే గాక విద్యార్థులకు అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు. అవేంటో చూద్దామా..!2023లో విడుదలైన 12th ఫెయిల్ చిత్రంతో విక్రాంత్ మాస్సే ఒక్కసారిగా సెలబ్రిటీ స్టార్గా మారిపోయారు. ఆ మూవీ విజయంతో విక్రాంత్ మాస్సే పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. అప్పటి వరకు టెలివిజన్లో చిన్నపాత్రలతో పరిచయమైన వ్యక్తి ఒక్కసారిగా తనలోని విలక్షణమైన నటుడుని పరిచయం చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఆయన ఈ పరీక్ష పే చర్చలో విద్యార్థులను విజువలైజేషన్ పవర్పై సాధన చేయమని కోరారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు వంటి వాటిని దృశ్యమాన రూపంలో ఊహించడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులభతరమవుతుందన్నారు. అలాగే మంచి మార్కులు తెచ్చుకున్నామనే గర్వాన్ని తలకెక్కించుకోవద్దు, ఆలోచనలను మాత్రం ఉన్నతంగా ఉంచుకోండి అని సూచించారు. కేవలం పరీక్షల కోసమే కాదు జీవితంలో ఉత్తీర్ణత సాధించడానికి చదవుకోండని చెప్పారు.అంచనాలను అందుకోలేకపోతే మరోసారి ప్రయత్నించి సాధించండి అని ప్రోత్సహించారు. ఇక మాస్సే తన అనుభవాలను షేర్ చేస్తూ..తాను మరీ ఇంటిలిజెంట్ విద్యార్థి కాకపోయినా.. మెరుగ్గానే చదివేవాడనని అన్నారు. తనకు ఆటలంటే మహా ఇష్టమని చెప్పారు. పరీక్షలకు కొన్ని రోజుల ముందే పుస్తకాలు తీసే వాడినని, ఆ టైంలో ఇంట్లో కేబుల్ కూడా డిస్కనెక్ట్ అయ్యేదని అన్నారు. దురదృష్టం ఏంటంటే నేటితరానికి ఆటల కంటే ఎక్కువ కాలక్షేపం మొబైల్ ఫోనే అంటూ విచారం వ్యక్తం చేశారు. అలాగే మన దేశానికి అత్యంత ఇష్టమైన క్రీడ క్రికెట్. దానికోసం ఒకరూ ఉండాలి అని అన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ సంభాషిస్తూ.. వర్తమానం అనేది భగవంతుడు ఇచ్చిన మంచి బహుమతి దాన్ని వదులుకోకూడదు అని చెప్పారు. అలాగే విక్రాంత్ విద్యార్థులను మీ డ్రీమ్ ఏంటన్నది తల్లిదండ్రులతో పంచుకోవాలని చెప్పారు. మొదట్లో అంగీకరించకపోయినా..వెనకడుగు వేయకుండా మీకు అదే ఎందుకు ఇష్టం అనేది చేతల ద్వారా అందులోని మీ స్కిల్ని, అభిరుచుని వ్యక్తపరిచమని సూచించారు. అప్పుడు తల్లిదండ్రులే తప్పక ఒప్పుకుంటారని అన్నారు. ఇక పరీక్షలకు ప్రిపేరయ్యేటప్పుడూ యోధుడిలా బాగా తినండి, బాగా విశ్రాంతి తీసుకోండి, మెరుగుపెట్టుకోండి(బాగా చదవడం) వంటి మూడు టెక్నిక్లు గుర్తించుకోండని అన్నారు. ఇక బాలీవుడ్ ప్రముఖ నటి భూమి పడ్నేకర్ తన అనుభవాన్ని షేర్ చేసుకుంటూ..తన తండ్రిని కోల్పోయిన ఘటనను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ వయసులో దాన్ని అర్థం చేసుకునే పరిణితి తనకు లేదని అన్నారు. అలాంటి క్లిష్టమైన సమయంలో మనలోని బలాన్ని గుర్తించాలి, నేర్చుకోవడానికి మార్గాను అన్వేషించాలని చెప్పుకొచ్చింది. అలాగే తాను ఎప్పుడు ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్ని కాదని, చదువుకు సంబంధంలేని యాక్టివిటీస్లో చురుకుగా ఉండేదాన్ని అన్నారు. ఆ టైంలోనే తాను నటిని కావాలని ఫిక్స్ అయ్యానని, అలాగే తల్లిలదండ్రులు సంతోషంగా గర్వంగా ఉండేలా తన నటన ఉండాలని భావించినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఆమె పరీక్షల సమయంలో 'విరామం' ప్రాముఖ్యతను చెబుతూ ఆ టైంలో మనకు నచ్చింది ఏదైనా చెయ్యమని చెప్పారు. అలాగే ఆ సమయంలో నాణ్యమైన నిద్ర కూడా ఉండాలని అన్నారు. ఇక పరీక్షల ఒత్తిడిని జయించేలా యోధుడిలా ఉండడి తప్ప చింతించే వ్యక్తిగా ఉండొద్దని చెప్పారామె. యోగా వంటి వాటితో ఏకాగ్రతను పెంపొందించడమే కాకుండా సులభంగా ఒత్తిడిని జయించగలుగుతారని అన్నారు. కాగా ఇంతకుమునుపు సెషన్లో బాక్సర్ మేరీ కోమ్, ఆధ్యాత్మికవేత్త సద్గురు, బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే వంటి ప్రముఖులు కూడా విద్యార్థులతో తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు.(చదవండి: ఆ జంటకి వివాహమై 84 ఏళ్లు..వంద మందికి పైగా మనవరాళ్లు..)

ఆ జంటకి వివాహమై 84 ఏళ్లు..!
వివాహమై 40 ఏళ్లు లేదా 60 ఏళ్లు అవ్వొచ్చు. మరీ ఎక్కువ కాలం ఇరువురు బతికుంటే దగ్గర దగ్గర 66 ఏళ్లు కూడా అవ్వొచ్చు. అంతేగానీ అన్నేళ్లు ఇరువురి జీవనయానం సాగించడం అంత ఈజీ కాదు. మధ్యలో ఎవరో ఒకరు కాలం చెందడం సర్వసాధారణం. అందులోనూ నేటి యువత పెళ్లై పట్టుమని రెండేళ్లు కూడా కలిసి ఉండటం లేదు. అలాంటి జంటల సంఖ్య వేళ్లతో లెక్కించలేనంత మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో..దగ్గర దగ్గర సెంచరీకి సమీపం వరకు అన్నేళ్లు కలిసి సహచర్యం చేసిన జంటగా రికార్డు దక్కించుకుంది ఈ వృద్ధ జంట. వారిక ఏకంగా వందమంది పైగా మనవరాళ్లు, మనవళ్లు ఉన్నారు. ఇక ఆ వృద్ధ దంపతుల వయసు ఎంత ఉండొచ్చు, పెళ్లి ఎప్పుడైంది వంటి విశేషాల గురించి తెలుసుకుందామా..!.పెళ్లై 84 ఏళ్లు గడిచిన వృద్ధులుగా ఈ బ్రెజిలియన్ జంట నిలిచింది. సుదీర్ఘ కాలం అన్యోన్య దాంపత్య జీవితం గడిపిన జంటగా రికార్డు సృష్టించింది. ఆ దంపతుల పేర్లు మనోయల్ ఏంజెలిమ్ డినో, మరియా డి సౌసౌ డినో. వారి ప్రేమ కథ అత్యంత విచిత్రంగా జరిగింది. ఇద్దరు తమ కుటుంబాల పోషణ కోసం వ్యవసాయం చేస్తుండేవారు. ఇరువురు ఆ వ్యవసాయ వృత్తి ద్వారానే ఇరువురికి పరిచయం ఏర్పడింది. అయితే మళ్లీ విధి అనుకోకుండా మరోసారి ఎదురపడేలా చేసింది. ఇక అప్పుడే ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఇక మనోయల్ కూడా తన మనసులోని మాటను మరియాకి చెప్పేశాడు. అందుకు సుమఖత వ్యక్తం చేసింది. అలా ఇద్దరు 1940లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరూ పోగాకు చుట్టడాన్ని జీవనోపాధిగా చేసుకుని బతుకు సాగించేవారు. ఇప్పుడు మనోయల్ వయసు 105 ఏళ్ల, మరియాకి 101 ఏళ్లు. ప్రస్తుతం ఇరువురు విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. ఇన్నాళ్లు తమ వైవాహిక జీవితంలో ఇంతలా కలిసి ఉండటానికి కారణం ఒక్కటే ప్రేమ. అది తమ ఇద్దరి మధ్య మరొకరు వచ్చి అగాథం సృష్టించ లేనంత నమ్మకం, ప్రేమ వంటివి స్ట్రాంగ్ ఉన్నాయని చెబుతోంది ఈ జంట. "ఇరువురం అనుకోకుండా భార్యభర్తలమయ్యాం. మంచో చెడో వివాహ బంధంతో ఒక్కటయ్యాం. కడదాక నిలుపుకోవాలనుకున్నాం. మా ఇరువరి మధ్య ఉన్న విడదీయరాని ప్రేమ కారణంగా సుదీర్ఘకాలం అన్యోన్యంగా ఉండగలగాం." అని అంటున్నారు ఈ దంపతులు. అంతేగాదు ఎలాంటి పొరపాటు, తప్పు జరిగినా దాన్ని లేవనెత్తడం, ఆరోపణలు చేసుకోవడం వంటి వాటికి తావివ్వకోపోడం వల్లే తమ బంధం దృఢంగా ఉందని అన్నారు. అదే తమ సుదీర్ఘకాల ఆరోగ్య రహస్యానికి కారణం కూడా అని చెబుతోంది ఈ వృద్ధ జంట. నిజమే కాదు వ్యక్తిగత జీవితం ఆహ్లాదంగా ఏంటేనే కదా..మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండేది.

పాతబస్తీ కుర్రాడు సైక్లింగ్లో ఇంటర్నేషనల్ లెవెల్..!
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్.. ఇటీవల వచ్చిన ఓ సినిమాలోని సూపర్హిట్ డైలాగ్.. అలాగే హైదరాబాద్ చార్మినార్లోని పాతబస్తీకి చెందిన ఓ విద్యార్థి పారా సైక్లింగ్లో నేషనల్ లెవెల్ దాటుకొని ఇంటర్నేషనల్కు చేరాడు. చిన్ననాటి నుంచి చదువుతో పాటు సమయం దొరికినప్పుడల్లా క్రీడలపై మక్కువ చూపుతుండేవాడు. జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించి ప్రస్తుతం థాయిలాండ్లో జరుగుతున్న 13వ ఏషియన్ పారా రోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నాడు శాలిబండ సైక్లింగ్ క్లబ్ విద్యార్థి ఆశీర్వాద్ సక్సేనా.. పాతబస్తీ బేలా కాలనీకి చెందిన ఆశీర్వాద్ సక్సేనా కుటుంబం వ్యాపార రంగంలో ఉండగా చిన్ననాటి నుంచి క్రీడలంటే ఇష్టం ఉండటంతో కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. ఎప్పుటికప్పుడు తన కోచ్ల ద్వారా మెళకువలు నేర్చుకుంటూ సైక్లింగ్లో ప్రతిభ కనబర్చాడు. మెల్బోర్న్లోని డాకిన్ యూనివర్సిటీలో ఎక్సైర్సైజ్ అండ్ స్పోర్ట్స్ సైన్స్లో డిగ్రీ విద్యాభ్యాసం చేస్తూనే సైక్లింగ్లో రాణిస్తున్నారు. దేశ, విదేశాల్లో జరిగే సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఓవైపు విద్యాభ్యాసం.. మరోవైపు సైక్లింగ్లో పాల్గొంటూ పతకాల వేట కొనసాగిస్తున్నాడు. థాయిలాండ్లో కొనసాగుతున్న 13వ ఏషియన్ పారారోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్–2025లో పాల్గొనేందుకు నగరం నుంచి తన కోచ్లతో కలిసి వెళ్లాడు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు, రివార్డులు సాధించిన ఆశీర్వాద్ సక్సేనా థాయిలాండ్లో మెడల్ సాధిస్తాడని పలువురు క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 38వ జాతీయ ఆటల పోటీలలో..ఉత్తరాఖాండ్లో నిర్వహించిన 38వ జాతీయ పోటీల్లో 120 కిలోమీటర్ల మాస్ స్టార్ట్ రోడ్ రేస్ పోటీలో కాంస్యం గెలుచుకున్నారు. ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ ఆఫ్ హైదరాబాద్గా.. రాష్ట్రం తరఫున కాంస్యం సాధించిన ఆశీర్వాద్ సక్సేనాను తెలంగాణ స్టేట్ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.విజయ్కాంత్రావు, కార్యనిర్వాహక కార్యదర్శి కె.దత్తాత్రేయ తదితరులు అభినందించారు. ఆశీర్వాద్ సక్సేనాను ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ ఆఫ్ హైదరాబాద్గా పిలుస్తున్నామని కె.దత్తాత్రేయ పేర్కొన్నారు. యువ క్రీడాకారులకు రోల్ మోడల్గా.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాలని నా కోరిక. విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా ఓ వైపు ఉన్నత విద్యాభ్యాసం చేస్తూనే.. మరోవైపు ఇష్టమైన సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నాను అని చెబుతున్నాడు ఆశీర్వాద్ సక్సేనాసాధించిన మెడల్స్..2019లో మహారాష్ట్రలో జరిగిన ఇండియన్ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలో కాంస్యం 2021లో జైపూర్లో ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో వెండి, కాంస్య పతకాలు 2022లో గౌహతిలో ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో రెండు వెండి పతకాలతో పాటు రెండు కాంస్య పతకాలు 2022లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా ట్రాక్ ఛాంపియన్షిప్లో కాంస్యం 2024లో మెల్బోర్న్లో అండర్–23 విభాగంలో క్రిటేరియం సైక్లింగ్ రేస్లో కాంస్యం 2024లో కర్ణాటకలో జరిగిన నేషనల్ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం 2024లో చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో రెండు బంగారు పతకాలతో పాటు వెండి పతకం సాధించారు. (చదవండి: భారత నారీమణుల మరో అరుదైన సాహసం..ప్రమాదాలకు కేరాఫ్ అయినా..!)

భారత నారీమణుల మరో అరుదైన సాహసం..ప్రమాదాలకు కేరాఫ్ అయినా..!
సాహాసయాత్రలకు కేరాఫ్గా అడ్రస్గా నిలుస్తున్న మహిళా నేవి అధికారులు మరో అరుదైన సాహసాన్ని నమోదు చేశారు. సాహసమే ఊపిరిగా సాగిపోతున్న లెఫ్టినెంట్ కమాండర్(Lieutenant Commander) దిల్నా కే లెఫ్టినెంట్ కమాండర్ రూప ఏ చారిత్రాత్మక విజయ పరంపరను కొనగిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు నేవి అధికారులు నావికా సాగర్ పరిక్రమ II యాత్ర మూడవ దశలో భాగంగా శనివారం ఐఎన్ ఎస్ తరణిలో(INSV Tarini) దక్షిణ అమెరికా దక్షిణ కొన వద్ద ఉన్న కేప్ హార్న్(Cape Horn)ను దాటారని భారత నౌకాదళ ప్రకటించింది. ఆ ప్రాంతం చేరుకోవడానికి ఇద్దరు మహిళా నావిక అధికారులు డ్రేక్ సముద్ర మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి దక్షిణ అమెరికాకు దక్షిణంగా బహిరంగ సముద్ర మార్గం ఉనికిని నిర్థారించిన ఇంగ్లిష్ అన్వేషకుడు సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ పేరు మీదగా ఆ మార్గానికి పేరు పెట్టారు. ఈ ప్రాంతం తీవ్రమైన గాలులు, ఎత్తైన అలలతో కూడిన అనూహ్య వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. పైగా ప్రమాదకరమైన జలమార్గం కూడా. ఇలాంటి ప్రదేశాన్ని అలవొకగా దాటి మరో విజయ ఢంకా మోగించారు. ఈ కేఫ్ హార్న్ అంటార్కిటికా నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచు ఖండానికి దగ్గరగా ఉన్న భూభాగాల్లో ఒకటి ఇది. ఈ ప్రాంతం గుండా ప్రయాణించాలంటే అసాధారణమైన నావిగేషన్ నైపుణ్యం తోపాటు దక్షిణ మహాసముద్రంలో ఉండే కఠిన పరిస్థితులను తట్టుకునే శక్తి కూడా ఉండాలి. కాగా, ఈ నావికా సాగర్ పరిక్రమ II అనేది శాస్త్రీయ అన్వేషణ, సహకారానికి మద్దతు ఇవ్వడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల కొనసాగింపును ఇది. అలాగే మహిళా నేవి అధికారులు తమ ప్రయాణాన్ని కొనసాగించడమే కాకుండా తదుపరి గమ్యస్థానం వైపు పురోగమిస్తారు. అంతేగాక ఈ మిషన్ లక్ష్యాలను కూడా మరింత ముందుకు తీసుకువెళ్తారు. ఈ అధికారులు సాహసయాత్ర విజయవంతంగా పూర్తి అయ్యినట్లయితే ప్రపంచంలో తొలిసారిగా ఇద్దరు మహిళా నావికా అధికారులు ప్రపంచ ప్రదక్షిణ యాత్రను పూర్తి చేసిన వ్యక్తులుగా నిలుస్తారు. In persistent rains, Sea State 5, winds of 40kns (~75 kmph) and waves more than 5 metres, Lt Cdr Dilna K & Lt Cdr Roopa A, recorded their names in the annals of history by successfully crossing the #CapeHorn located at the southern tip of #SouthAmerica, while sailing on the third… pic.twitter.com/N1isyvHGMA— SpokespersonNavy (@indiannavy) February 15, 2025 (చదవండి: ఇంజెంక్షన్ ఫోబియా: నాకిప్పుడు ఐదో నెల మరి ఎలా..?)
ఫొటోలు
పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు.. కూటమి ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం


మెహిందీ ఫంక్షన్ మస్టర్డ్ ఎల్లో ఘాగ్రాలో అప్సరసలా!


యాదమ్మరాజు కూతురి ఊయల ఫంక్షన్.. స్టెల్లా భావోద్వేగం (ఫోటోలు)


ఒర చూపుతో కవ్విస్తోన్న 'కన్నప్ప' హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఫొటోలు


అందచందాలతో కుర్రకారు గుండెల్లో అలజడి రేపుతున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)


రెడ్ శారీలో అలేఖ్య హారిక స్టన్నింగ్ లుక్స్.. (ఫోటోలు)


చూపులతోనే గమ్మత్తు చేస్తున్న అవికా గోర్... చిన్నారి పెళ్లికూతురు కాదిక:


అగరం కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో సూర్య-జ్యోతిక (చిత్రాలు)


డ్రాగన్ మూవీలో నటి కాయాదు లోహర్ గ్లామరస్ (ఫొటోలు)


అమెరికాలో నీతా అంబానీకి అరుదైన గౌరవం (ఫోటోలు)
National View all

టోటలైజర్ విధానం తేవాలి
న్యూఢిల్లీ: ఓటరు గోప్యతను కాపాడేందుకు టోటలైజర్ విధానాన్ని త

నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్

ఇది ఏనుగు... కానీ కాదు!
కేరళ త్రిసూర్లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయంలో ఒక ఏనుగు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

NAKSHA Pilot Project: పట్టణాల్లో ప్రాపర్టీ కార్డ్!
సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించేందుకు..

నేమ్ ప్లేట్: ఇంటిపేరు ఆడపిల్ల
మన దేశంలో ఇంటి పేరు, ఇంటి వాకిలి పేరు నాన్నదే ఉంటుంది.
International View all

German elections 2025: జర్మనీ విజేత ఎవరు?
జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో అనివార్యమైన ఎన్నికలు ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ట

టొరంటో విమానాశ్రయంలో అదుపుతప్పిన విమానం
టొరంటో: కెనడాలో సోమవారం ఓ విమానం అదుపుతప్పింది.

బర్డ్ఫ్లూ ఎఫెక్ట్.. అమెరికాలో కొండెక్కిన కోడిగుడ్డు
వాషింగ్టన్:బర్డ్ఫ్లూ ఇక్కడే కాదు అగ్రదేశం అమెరికానూ భయపెడు

నిజమవుతున్న నోస్ట్రాడమస్, బాబా వంగా హెచ్చరికలు?
న్యూఢిల్లీ: భూకంపం..

అమెరికాలో భారీ వర్షాలు.. కార్ల నీట మునిగి పలువురు మృతి
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో భారీ వర్షాలు కురుస్తున్నా
NRI View all

MATA అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి
డల్లాస్, టెక్సాస్: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం 'మన అమెర

ఇజ్రాయెల్లో తెలుగువారి ఇక్కట్లు
ఆర్మూర్: తెలంగాణ ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రవేశపెట్టిన టామ్కామ్ (TOMCOM) ద్వారా ఇజ్రాయెల్ (Israel)

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ దశాబ్ద వేడుకలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) దశాబ్ద వేడుకలు డిసెంబర్లో జరగనున్నాయి.

USA: ‘మాట’ నూతన కార్యవర్గం ఎన్నిక
డల్లాస్: మాట (మన అమెరికన్ తెలుగు అసోసియేషన్) బోర్డు మీటిం

ప్రధాని మోదీతో మస్క్-శివోన్ పిల్లల అల్లరి
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటనలో
క్రైమ్

Jagtial: మొన్న తల్లి.. నేడు పిల్లలు
పెగడపల్లి (జగిత్యాల జిల్లా) : ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి.. తానూ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన విషాదాంతంగా ముగిసింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ తల్లి శుక్రవారం మృతిచెందగా.. పిల్లలు కృష్ణంత్ (10), మయాంతలక్ష్మి (8) ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఆస్పత్రిలో కన్నుమూశారు. పిల్లల మృతదేహాలను స్వగ్రామమైన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి తరలించారు. కాగా, తమ అల్లుడు తిరుపతి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు అదనంగా కట్నం తేవాలని వేధించినందుకే తమ కూతురు ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుందని హారిక తల్లిదండ్రులు అల్లెం మల్లయ్య, పోచవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఆందోళన..పిల్లల మృతదేహాలను ఆదివారం మధ్యాహ్నం మద్దులపల్లికి తీసుకొచ్చారు. అప్పటికే హారిక కుటుంబ సభ్యులు, బంధువులు మద్దులపల్లికి తరలివచ్చారు. హారికతోపాటు పిల్లల మృతికి తిరుపతే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని హారిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. అప్పటివరకు పిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు చేయమని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ అక్కడికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రవి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య పిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగి..

Software Engineer: ప్రవళిక ఎందుకమ్మా ఇలా చేశావు..!
కీసర(హైదరాబాదు): ఉరివేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం కీసర పోలీస్స్టేషన్(Keesara Police Station) పరిధిలోని కీసర దాయరలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి కీసర దాయరకు చెందిన ప్రవళిక(23) నగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా(Software Engineer) పని చేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఆమె తల్లిదండ్రులతో పాటు, సోదరుడు బయటికి వెళ్లారు.సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ప్రవళిక(Pravallika) ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

ఆన్లైన్ గేమ్లో పరిచయం.. ఆపై అత్యాచారం..
ఫిలింనగర్: ఆన్లైన్ గేమ్ నగరానికి చెందిన ఓ బాలిక పాలిట శాపంగా మారింది. ఆన్లైన్ గేమ్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలతో ఆ చిన్నారిని లొంగదీసుకున్నాడు. ఆన్లైన్ చాటింగ్లో తియ్యటి కబుర్లతో ఆమెను ఆకట్టుకుని ఫొటోలు షేర్ చేయించుకున్నాడు. అందులో బాలిక నగ్న ఫొటోలు కూడా ఉండడంతో తల్లిదండ్రులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి పూణే నుంచి హైదరాబాద్ వచ్చి తన వాంఛను తీర్చుకుని వెళ్లేవాడు. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని షేక్పేట్ ప్రాంతానికి చెందిన బాలిక 2021లో ఏడో తరగతి చదివే సమయంలో ప్రతిరోజూ సాయంత్రం ‘ఎమాంగ్ అజ్’ యాప్లో ఆన్లైన్ గేమ్ ఆడుతుండేది. ఈ క్రమంలోనే ‘రూథ్లెస్’ పేరిట ప్రొఫైల్ ఉన్న ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అతని ద్వారా పూణె ఎంఐటీ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతున్న ఖుష్ డేవ్ (21) సదరు బాలికకు పరిచయం అయ్యాడు. వారు యాప్ ద్వారా చాట్ చేయడం ప్రారంభించారు. మొదట్లో ఒకరికొకరు స్నేహితుల్లా ఉండేవారు. ఆ తర్వాత 2023లో ఆమెకు టెలిగ్రామ్ లింక్ షేర్ చేసి ఆ యాప్ ద్వారా చాట్ చేయమని అడిగాడు. దీంతో టెలిగ్రామ్ ద్వారా చాట్ చేసుకునేవారు. చాట్ చేసే క్రమంలో బాలిక ఫొటోలను షేర్ చేయాల్సిందిగా ఖుష్డేవ్ అడగ్గా ఆమె నిరాకరించింది. రోజంతా ఆమెను బలవంతం చేయడంతో ఆమె తన ఫొటోలను, వీడియోలను పంపింది. నగ్న ఫొటోలతో బెదిరింపులు.. వాటిలో నగ్న ఫొటోలు కూడా ఉండటంతో అప్పటి నుంచి ఆ ఫొటోలను ఆమె తల్లిదండ్రులు, బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. తనను కలవాల్సిందిగా బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో గత ఏడాది అక్టోబర్ 6న టోలిచౌకీలోని ఓ పార్కులో కలిసింది. అప్పటి నుంచి ప్రతిరోజూ తనను కలవాల్సిందిగా డిమాండ్ చేస్తూ వచ్చాడు. తల్లిదండ్రులు తనను బయటకు పంపడం లేదని చెప్పినా రాత్రిపూట అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పాడు. అర్ధరాత్రి అత్యాచారం.. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 24న బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా, 25న తెల్లవారుజామున అక్కడికి వచ్చిన ఖుష్డేవ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో కలుసుకున్నారు. ఇదే అదునుగా మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడానికి బాలిక భయపడింది. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితురాలికి చెప్పడంతో ఆమె టీచర్ దృష్టికి తీసుకెళ్లింది. టీచర్ ద్వారా ప్రిన్సిపాల్కు, ఆమె ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలియగా వారు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు ఖుష్డేవ్పై బీఎన్ఎస్ సెక్షన్ 65(1), 351 (2), సెక్షన్ 5 రెడత్ విత్ 6, పోక్సో చట్టం–2012, సెక్షన్ 67 ఐటీ చట్టం–2008 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Medchal: నడి రోడ్డుపై అన్నను హత్య చేసిన తమ్ముళ్లు
మేడ్చల్/ మేడ్చల్ రూరల్: అది జాతీయ రహదారి.. ఆదివారం సాయంత్రం కావస్తోంది.. జన సంచారం.. వందలాది వాహనాలు వస్తూ పోతున్నాయి. ఓ వ్యక్తి ప్రాణ భయంతో పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. అతడిని కొందరు వ్యక్తులు వెంబడించారు. అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ దారుణాన్ని అక్కడున్న వారు ఆపే ప్రయత్నం చేయకపోగా.. తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు గుగులోతు గన్యా మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉమేష్ (25), రాకేష్ ఉన్నారు. వీరు మేడ్చల్ ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్నారు. పెద్ద కుమారుడు ఉమేష్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్య ప్రియాంకను, సోదరుడు రాకేష్ను, ఇంట్లోని పిల్లలను వేధింపులకు గురి చేస్తుండేవాడు. దురలవాట్లకు బానిసైన అతడిని దుబాయ్కి పంపించే ఏర్పాట్లు చేస్తుండగా.. వాటిని కూడా చెడగొట్టాడు. ఈ క్రమంలో ఆదివారం సైతం మద్యం తాగి ఇంటికి వచ్చిన ఉమేష్.. కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగాడు. అందరినీ చంపేస్తానంటూ బెదిరించాడు. ఇంట్లోనే ఉన్న సోదరుడు రాకేష్తో, చిన్నాన్న కుమారుడు లక్ష్మణ్లతో ఉమేష్ వాగ్వాదానికి దిగాడు. వారిని బీరు సీసాతో బెదిరించాడు. రాకేష్ లక్ష్మణ్లు అతడిని ప్రతిఘటించారు. దీంతో ఉమేష్ సమీపంలోని జాతీయ రహదారి వైపు పరుగెత్తాడు. రాకేష్ లక్ష్మణ్లు బస్టాండ్ సమీపంలో ఉమేష్ను పట్టుకుని రోడ్డుపై పడుకోబెట్టి కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉమేష్ మృతదేహంపై 12 కత్తిపోట్లు ఉన్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. మృతుడికి భార్య ప్రియాంక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. హత్య ఘటన వీడియోల్లో ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నా.. మొత్తం ఐదుగురు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రాకేష్ లక్ష్మణ్తో పాటు వీరి కుటుంబ సభ్యులు నవీన్, నరేష్ సురేష్లు ఉన్నట్లు సమాచారం. ఉమేష్ను కత్తులతో దారుణంగా పొడుస్తున్నా.. అక్కడున్నవారు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. తమ మొబైల్ ఫోన్లలో హత్య చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తోటి మనిషి కత్తి పోట్లకు గురవుతున్నా.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా.. ఎవరూ స్పందించకపోవడం మానవత్వం కనుమరుగవుతోందనడానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.
వీడియోలు


వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు


అవును నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది: Kiran Royal


రాహుల్ గాంధీపై బీజేపీ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఆగ్రహం


సినిమా వేదికలపై రాజకీయ ప్రసంగాలు దేనికి ?


ఓసీడీ ఉన్నట్లు ఉంది.. ట్రైన్ క్లీనింగ్ పెట్టుకున్నాడు!


మరోసారి తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా


బాయ్ కాట్ లైలా.. ఆ సినిమాపై చూపిన ప్రభావం ఎంత ?


వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై కీలక అంశాలు


రేపు ఎన్నికలలో టీడీపీ తోక జాడిస్తే.. వైస్సార్సీపీ పవరేంటో చూస్తారు!


ఫ్యామిలి మ్యాన్ కోహ్లికి.. బీసీసీఐ భారీ షాక్