Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Extends Yoga Day Wishes1
‘యోగా’ మన జీవితంలో భాగం కావాలి: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుందని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘యోగా అనేది మన శరీరం, ఆత్మ రెండింటిపైన పని చేస్తుంది. ప్రశాంతతను పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాంటి యోగాను.. మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం’ అని తెలిపారు.Working on both body and spirit, Yoga helps develop strength and tranquility. On this #InternationalYogaDay, let us commit to making this timeless practice a part of our daily lives.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2025

minister Bandi Sanjay Sensational Comments On Phone Tapping2
‘సిరిసిల్ల అడ్డగా ఫోన్‌ ట్యాపింగ్‌.. ప్రభాకర్‌ రావు కారణంగానే అరెస్ట్‌ అయ్యా’

సాక్షి, కరీంనగర్: హైదరాబాదు, సిరిసిల్ల కేంద్రంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. ప్రభాకర్ రావు చాలామంది‌ సంసారాలు నాశనం చేశారు.. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు.ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణలో భాగంగా సిట్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పందించారు. తాజాగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘అందరికంటే ఎక్కువ ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు చేసింది నేనే. హైదరాబాదు, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు అనేక‌ మంది ఉసురు పోసుకున్నారు. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పజెప్పాలి. పెద్దాయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌కి ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదు?. ఫోన్ ట్యాపింగ్‌కు కారణం కేసీఆర్, కేటీఆరే. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ అయ్యింది.ప్రభాకర్ రావు‌ సీఎంవో ఆఫీసుని అడ్డాగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆయనకు రాచమర్యాదలు చేయడం బంద్ చేయండి. అందరి జీవితాలు నాశనం చేసిందే ప్రభాకర్ రావు. నన్ను పేపర్ లీక్ అయ్యిందని ప్రభాకర్ రావు అదేశాల మేరకే అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్ రావు అండ్ కో వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణను సర్వనాశనం చేసిందే కేసీఆర్ ఫ్యామిలీ. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు పోయారు?. కేటీఆర్ అమెరికా పోయి ప్రభాకర్ రావుతో మాట్లాడిన తర్వాతనే ఆయన ఇండియాకు వచ్చాడు. నాకు‌ సిట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. విచారణకు హాజరవుతాను’ అని స్పష్టం చేశారు.

Omar Abdullah on Trump Munir Lunch3
ట్రంప్‌-మునీర్ భేటీపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

శ్రీనగర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- పాక్‌ సైన్యాధ్యక్షుడు అసిఫ్‌ మునీర్‌ల లంచ్‌ భేటీపై దుమారం చెలరేగుతోంది. ఈ అంశంపై తాజాగా జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా తన ప్రయోజనాలను పొందేవరకు మాత్రమే ఇతర దేశాలతో స్నేహం చేస్తుందని, వాషింగ్టన్ తనను తాను కాపాడుకునేందుకు ఏదైనా చేస్తుందని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు వైట్ హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.‘అమెరికా అధ్యక్షుడు తన ఇష్టాలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఎవరిని విందుకు ఆహ్వానించాలో, ఎవరిని ఆహ్వానించకూడదో మనం ఆయనకు చెప్పగలమా? అమెరికా అధ్యక్షుడు మనకు ప్రత్యేకమైన స్నేహితుడు అని మనం భావిస్తుంటాం. ఆయన మన స్నేహాన్ని గౌరవిస్తారా లేదా అనేది వేరే విషయం. అమెరికా తన స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది. అవసరం లేనప్పుడు మరే ఇతర దేశాన్ని పట్టించుకోదు’ అని శ్రీనగర్ రైల్వే స్టేషన్‌లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విలేకరులతో అన్నారు. ఆయన తన తండ్రి ఫరూక్ అబ్దుల్లాతో కలిసి వందే భారత్ రైలులో జమ్మూకు వెళ్లారు. ఈ రైలు సేవలను ఆయన కొనియాడారు.ఇది కూడా చదవండి: International Yoga Day: యోగాభ్యాసంపై కింగ్ చార్లెస్ ఏమన్నారంటే..

Yashasvi Jaiswal Breaks Bradman Record Becomes 1st Player In World To4
యశస్వి జైస్వాల్‌ ప్రపంచ రికార్డు.. బ్రాడ్‌మన్‌నే అధిగమించాడు!

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiwal) అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌ జట్టుపై టెస్టు ఫార్మాట్లో అత్యధిక సగటు నమోదు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ (Don Bradman)ని జైసూ అధిగమించాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 సీజన్‌లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్‌ 20) తొలి టెస్టు మొదలైంది. లీడ్స్‌ వేదికగా టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌ ఎంచుకుని.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.భారత్‌ బ్యాటింగ్‌ అదుర్స్‌.. జైసూ, గిల్‌ సెంచరీలుఇక ఆది నుంచే జోరు కనబరిచిన భారత్‌ మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది. ఆద్యంతం ఆకట్టుకుని తొలి రోజు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (42) స్వల్ప స్కోరుకు వెనుదిరిగినా.. మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ శతకంతో కదం తొక్కాడు.మరో సెంచరీ వీరుడు, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొన్న జైసూ.. 16 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 101 పరుగులు చేసి.. స్టోక్స్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.బ్రాడ్‌మన్‌ రికార్డు బద్దలుఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ గడ్డ మీద జైసూకు ఇదే తొలి సెంచరీ కాగా.. ఓవరాల్‌గా పది ఇన్నింగ్స్‌లో కలిపి 813 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఏకంగా 90.33 సగటుతో ఈ మేర రన్స్‌ రాబట్టాడు. ఈ క్రమంలోనే బ్రాడ్‌మన్‌ రికార్డును జైస్వాల్‌ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌ మీద టెస్టుల్లో అత్యధిక సగటుతో పరుగులు రాబట్టిన ఆటగాడిగా నిలిచాడు.ఇక శుక్రవారం నాటి తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి గిల్‌ 127 పరుగులతో.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు.. అరంగేట్ర బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ మాత్రం నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు.ఇంగ్లండ్‌ జట్టుపై అత్యధిక టెస్టు యావరేజ్‌ కలిగిన బ్యాటర్లు🏏యశస్వి జైస్వాల్‌- 90.33🏏డాన్‌ బ్రాడ్‌మన్‌- 89.78🏏స్టీవీ డెంప్‌స్టర్‌- 88.42🏏లారెన్స్‌ రోవ్‌- 74.20🏏జార్స్‌ హెడ్లీ- 71.23 చదవండి: వాళ్లని మెచ్చుకోవడంలో తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్‌!𝐓𝐎𝐍 🆙𝐓𝐀𝐈𝐋𝐒 🆙Yashasvi Jaiswal leads Team India from the front. #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #DhaakadIndia #TeamIndia | @ybj_19 pic.twitter.com/QX4kdlTBu4— Sony Sports Network (@SonySportsNetwk) June 20, 2025

BRS MLA Kaushik Reddy Arrest5
తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్‌.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎ‍మ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక గ్రానైట్ వ్యాపారిని బెదిరించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కౌశిక్‌రెడ్డిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేశారు. దీంతో, తెలంగాణ రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. గ్రానైట్‌ వ్యాపారి మనోజ్ రెడ్డి అనే వ్యక్తిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. మనోజ్ రెడ్డి కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్నారు. తమను రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్‌ రెడ్డి బెదిరించారని ఫిర్యాదు పేర్కొన్నారు. మనోజ్ భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్‌లో కౌశిక్‌ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు.. శనివారం తెల్లవారుజామున కౌశిక్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు.పాడి కౌశిక్‌ రెడ్డిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 308(2), 308(4) మరియు 352 కింద ఆయనపై అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కౌశిక్‌ రెడ్డి.. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కక్షపూరితంగానే తనను అరెస్ట్‌ చేస్తున్నట్టు ఘాటు విమర్శలు చేశారు. ఇక, ఈరోజు ఉదయం కౌశిక్‌ రెడ్డిని పోలీసులు.. కోర్టులో హాజరు పరుచునున్నారు.🛑 కుట్రలు - అక్రమ కేసులు ఎన్ని పెట్టినా… నిజాయితీ తలవంచదు!కౌశిక్ అన్నను శంషాబాద్‌లో అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానం!రేవంత్ రెడ్డి గారు,మీ కుట్రలు, అక్రమ కేసులతో కౌశిక్ అన్న ను ఆపగలం అనుకోవడం…మీ మూర్ఖత్వాన్ని, మీరు పాలిస్తున్న అక్రమ రాజకీయంని చాటుతోంది. pic.twitter.com/PB1Dgcxtft— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) June 20, 2025

Kubera Movie Remuneration Details6
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?

'కుబేర' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కాస్త కళకళలాడుతున్నాయి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన స్టైల్ కంటే ఈ మూవీని కాస్త డిఫరెంట్‌గా తీశాడు. నిడివి విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ఓవరాల్ టాక్ మాత్రం బాగుంది. చూస్తుంటే ఈ వీకెండ్ విన్నర్ ఈ మూవీనే అవుతుందేమో అనిపిస్తుంది. మరి ఈ సినిమాలో కనిపించిన స్టార్స్‌కి ఎవరికెంత రెమ్యునరేషన్ ఇచ్చారు?తమిళ నటుడు ధనుష్.. 'కుబేర'లో హీరోగా నటించాడు. ఇందులో ఇతడిది బిచ్చగాడి పాత్ర. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇతడి నటనకు ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే అంత సహజంగా నటించాడని అంటున్నారు. ఈ చిత్రంలో నటించినందుకుగానూ రూ.30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇదే మూవీలో మరో కీలక పాత్ర పోషించిన నాగార్జున.. రూ.14 కోట్ల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్.. అధికారిక ప్రకటన)ఇదే సినిమాలో హీరోయిన్‌గా చేసిన రష్మిక రూ.4 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకుందని, మ్యూజిక్‌తో ఆకట్టుకున్న దేవిశ్రీ ప్రసాద్ రూ.3 కోట్ల పారితోషికం తీసుకున్నాడని అంటున్నారు. ఇక కెప్టెన్ ఆఫ్ ద షిప్ శేఖర్ కమ్ముల అయితే రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా స్టార్ కాస్ట్ ఎక్కువ కావడంతో రూ.100 కోట్ల కంటే ఎక్కువగానే బడ్జెట్ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న టాక్ బట్టి చూస్తే నిర్మాతలు పెట్టిన మొత్తం రిటర్న్ రావొచ్చు అనిపిస్తుంది.'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్‌ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సడన్‌గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా)

Pak nominates Donald Trump for 2026 Nobel Peace Prize7
అమెరికాతో పాక్‌ ‘దోస్తానా’.. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ పేరు ప్రతిపాదన

ఇస్లామాబాద్‌: అగ్రరాజ్యం అమెరికా, దాయాది దేశం పాకిస్తాన్‌ మధ్య ఉన్న అనుబంధం మరోసారి బహిర్గతమైంది. ట్రంప్‌ విషయంలో పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ పేరు పాక్‌ ప్రతిపాదించింది. దీంతో, ఈ విషయంలో హాట్‌ టాపిక్‌గా మారింది.వివరాల ప్రకారం.. 2026 నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేరును పాకిస్తాన్‌ ప్రతిపాదించింది. ఈ సందర్బంగా పాకిస్తాన్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ట్రంప్‌ కుదిర్చారని తెలిపింది. ఆయన వల్లే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రశంసలు కురిపించింది. భారత్‌ మాత్రం పాకిస్తాన్‌పై దాడికి పాల్పడి ప్రాణ నష్టానికి కారణమైందని ఆరోపించింది. ట్రంప్‌ దౌత్యం వల్లే యుద్దం ముగిసిందని చెప్పుకొచ్చింది.🇵🇰 BREAKING: Pakistan nominates Donald Trump for Nobel Peace Prize! 🏆Because obviously, “ceasefire magic” happened just on Trump’s request 🙃No military diplomacy, no DGMOs, no backchannel talks - just one phone call from The Donald, and India-Pakistan hugged it out! 💥📞🕊️… pic.twitter.com/BQSkJt936b— Raksha Samachar | रक्षा समाचार 🇮🇳 (@RakshaSamachar) June 21, 2025రెండు దేశాల మధ్య జోక్యం నిజమైన శాంతి స్థాపకుడిగా అధ్యక్షుడు ట్రంప్ పాత్రను స్పష్టం చేసింది. చర్చల ద్వారానే వివాదాలను పరిష్కరించాలనే ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనం అని కీర్తించింది. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ పదే పదే చేసిన ప్రతిపాదనలకు ఇస్లామాబాద్ కూడా ప్రశంసించింది. ఆయన ప్రమేయంతో దక్షిణాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని పేర్కొంది. చివరగా.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం కశ్మీర్ వివాదం పరిష్కారం కాకుండా.. ఈ ప్రాంతంలో ఎప్పటికీ శాంతి నెలకొనదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.JUST ANNOUNCED: Pakistan nominates President Donald Trump for 2026 Nobel Peace Prize 🇺🇸PEACEMAKER-IN-CHIEF TRUMP! 🇺🇸 pic.twitter.com/ihGlDz1iZp— Ape𝕏 (@CubanOnlyTrump) June 20, 2025అయితే, ట్రంప్‌ పేరును ప్రతిపాదించిన సందర్భంగా భారత్‌ విషయాలు, కశ్మీర్‌ అంశంపై ప్రస్తావించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ట్రంప్‌.. కశ్మీర్‌ అంశమై పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాక్‌ మధ్య కశ్మీర్‌ వివాదంపై తాను మధ్యవర్తిత్వం కూడా తీసుకుంటాని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు, తాజాగా పాక్‌ సైతం ఇదే ప్రస్తావన తేవడంతో కొత్త ప్లాన్‌ ఉన్నట్టు అర్థమవుతోంది. ఇక, ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కశ్మీర్‌, పీఓకే విషయంలో భారత్ పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ట్రంప్‌కు నోబెల్‌ అంటే ఎంత ఇష్టమంటే.. అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్‌ అవార్డుపై ఎప్పటినుంచో ఆసక్తిగా ఉన్నారు. పలుమార్లు తనకు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి దీనికోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్‌ అధినేత నెతన్యాహుతో సమావేశం సందర్భంగా వాళ్లు నాకు ఎప్పటికీ నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వరు. అది ఏమాత్రం బాగోలేదు. నేను అర్హుడను అని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు మాజీ అధ్యక్షుడు ఒబామాకు దీనిని ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతూ వచ్చారు. ఈ క్రమంలో ప్రపంచంలోని పలు వివాదాల సమయంలో తానే సంధి కుదిర్చానని చెప్పుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. దీనిని పాక్‌ బాగానే గమనించింది. ఇటీవల ఫీల్డ్‌ మార్షల్‌ అసిం మునీర్‌ మాట్లాడుతూ భారత్‌-పాక్‌ మధ్య అణుయుద్ధాన్ని ఆపిన ట్రంప్‌ నోబెల్‌ ప్రైజ్‌కు పూర్తిగా అర్హుడంటూ ఓ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆ తర్వాత ఆయనకు శ్వేతసౌధం నుంచి భోజనానికి ఆహ్వానం అందింది.

PM Modi And Others Parcipated Yoga Celebrations AT Visaka8
యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది: మోదీ

సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆర్కే బీచ్‌ నుంచి భోగాపురం వరకు పలువురు యోగాసనాలు వేశారు. యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌.. వన్‌ హెల్త్‌ నినాదంతో కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు. యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవన శైలిని మార్చింది. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు. గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది. యోగాకు వయసుతో పనిలేదు.. యోగాకు హద్దులు లేవు. వ్యక్తిగత క్రమశిక్షణకు యోగా అద్భుతమైన సాధనం.యోగాతో వ్యతిగత క్రమశిక్షణ అలవడుతుంది. ప్రపంచంతో మన అనుసంధానం కావడానికి యోగా ఉపయోగపడుతుంది. అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదే. యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది. ప్రజల భాగస్వామ్యానికి ఇదొక స్పూర్తిగా నిలిచింది. యోగా ప్రక్రియతో చికిత్స చేసే విధానాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌ అభివృద్ధి చేస్తోంది. యోగా గురించి మన్‌ కీ బాత్‌లో కూడా చర్చించాను’ అని చెప్పుకొచ్చారు.

Iran Opens its Airspace for Operation Sindhu9
తెరుచుకున్న ఇరాన్‌ గగనతలం.. ఢిల్లీకి మరో 290 మంది విద్యార్థులు

న్యూఢిల్లీ: ఇరాన్‌లో యుద్ధమేఘాలు కమ్ముకున్న దరిమిలా అప్రమత్తమైన భారత్‌ అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను ‘ఆపరేషన్‌ సింధు’ పేరుతో స్వదేశానికి తరలిస్తోంది. తాజాగా ఇరాన్ తన గగనతల ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత, 290 మంది భారతీయ విద్యార్థులను ప్రభుత్వం ఢిల్లీకి తీసుకువచ్చింది. వీరంతా జమ్ముకశ్మీర్‌కు చెందినవారు. ఇరాన్‌ తాజాగా వెయ్యిమంది భారతీయులను తరలించడానికి తన గగనతలాన్ని తెరిచింది. దీంతో భారత్‌ మూడు విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడుల తరువాత భారతీయులను రక్షణకోసం టెహ్రాన్(ఇరాన్‌) నుండి మషద్‌కు తరలించారు. భారతీయుల తరలింపు విమానాలను ఇరానియన్ ఎయిర్‌లైన్ మహాన్ నడుపుతుండగా, న్యూఢిల్లీ వాటిని ఏర్పాటు చేసింది.‘సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను స్వదేశానికి తరలిస్తున్నందుకు భారత ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు, సంబంధిత అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు. తమ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇది ఉపశమనం అని జమ్ముకశ్మీర్ విద్యార్థుల సంఘం పేర్కొంది. గురువారం ‘ఆపరేషన్‌ సింధు’లో భాగంగా 110 మంది భారత విద్యార్థులను ఢిల్లీకి తీసుకువచ్చారు. వీరిని అర్మేనియా, దోహాల మీదుగా భారత్‌ తరలించారు.ఇది కూడా చదవండి: ఇరాన్‌ నుంచి భారత్‌కు చేరుకున్న 110 మంది విద్యార్థులు

Chhattisgarh ready for maximum utilization of Godavari tributary waters10
ఇంద్రావతికి కట్టడి!

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న గోదావరి నదికి ప్రాణహిత తర్వాత ప్రధాన ఉప నది అయిన ఇంద్రావతి నీటిని పూర్తిగా కట్టడి చేసేలా ఛత్తీస్‌గఢ్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంద్రావతిలో లభ్యతగా ఉన్న నీటిలో మెజా రిటీ జలాలను వినియోగించుకునేలా బోద్‌ఘాట్‌ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు అంకురార్పణ చేస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతినిచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి ప్రకటించారు. ఇంద్రావతి నీటినే నమ్ముకొని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులు చేపడుతుండటం గమనార్హం. కాగా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ తెరపైకి తెచ్చిన ఈ ప్రాజెక్టుతో దిగువ గోదావరిలో జలాల లభ్యత తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ వినియోగించని జలాలనే ఆధారంగా చేసుకుని కేంద్రం గోదావరి–కావేరి అనుసంధానాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఎగువ నీళ్లకు ఎగువనే అడ్డుకట్ట.. ఇంద్రావతిలో ప్రతి ఏటా సుమారు 600–800 టీఎంసీల మేర లభ్యత ఉంటుందని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. ఇది ఛత్తీస్‌గఢ్‌లో 264 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మేడిగడ్డ దిగువన, సమ్మక్క–సారక్క బరాజ్‌ ఎగువన గోదావరిలో కలుస్తుంది. దంతెవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్, కాంకేర్‌ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఆయా జిల్లాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఇంద్రావతి నీళ్లు కలిశాకే గోదావరి దిగువన ప్రవాహాలు మరింత ఉధృతంగా ఉంటాయి. కాగా ఇంద్రావతి నది గోదావరిలో కలిసే ప్రాంతానికి దిగువన, గరిష్ట నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ.. దేవాదుల (38 టీఎంసీలు), సీతారామ (70 టీఎంసీలు), సమ్మక్క–సారక్క (50 టీఎంసీలు మొత్తంగా 158 టీఎంసీలు) ప్రాజెక్టులు చేపట్టింది. ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఇలావుండగా ఇంద్రావతిలో లభ్యత నీటిని ఛత్తీస్‌గఢ్‌ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోవడంతో.. ఈ నీటిని మిగులు జలాలుగా గుర్తించిన కేంద్రం.. నదుల అనుసంధాన ప్రతిపాదనలు చేసింది. ఇంద్రావతి బేసిన్‌లో ఛత్తీస్‌గఢ్‌ (అప్పటి మధ్యప్రదేశ్‌)కు గోదావరి ట్రిబ్యునల్‌ కేటాయించిన నీటిలో వాడుకోని 141.4 టీఎంసీలకు మరో 106 టీఎంసీల వరద జలాలను జతచేసి మొత్తం 247 టీఎంసీలను ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్‌–సోమశిల మీదుగా కావేరి గ్రాండ్‌ ఆనకట్ట వరకు తరలించేలా నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే గోదావరిలో మిగులు, వరద జలాల నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చేవరకు అనుసంధానం పక్కన పెట్టాలని తెలంగాణ, ఏపీలు డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. దీంతో తొలిదశ కింద ఛత్తీస్‌గఢ్‌ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలనే గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆవిరి, ప్రవాహ నష్టాలు పోను ఏపీకి 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ప్రతిపాదించింది. దీనిపై ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది. చెప్పినట్టే చేస్తున్న ఛత్తీస్‌గఢ్‌ తమకు హక్కుగా సంక్రమించిన నీటిని తరలించుకు పోతామంటే ఒప్పుకునేది లేదని, భవిష్యత్తులో ఈ నీటిని వినియోగించుకునేలా తాము ప్రాజెక్టులు చేపడతామని ఛత్తీస్‌గఢ్‌ తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం బోద్‌ఘాట్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం ముందుంచింది. ఈ ప్రాజెక్టు కింద ఇందావ్రతి నీటిని ఒడిసిపట్టేలా రూ.29 వేల కోట్లతో బోద్‌ఘాట్‌ ఆనకట్టని, అదనంగా మరో రూ.20 వేల కోట్లతో మహానది–ఇంద్రావతి లింక్‌ను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 300 మెగావాట్ల విద్యుదుత్పత్తితో పాటు దంతెవాడ, సుక్మా, బీజాపూర్‌ జిల్లాల్లోని 359 గ్రామాల పరిధిలోని 3.78 లక్షల హెక్టార్లకు (9.45 లక్షల ఎకరాలకు) సాగునీటిని అందించాలని నిర్ణయించింది. అదనంగా తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని ఇచ్చేలా ప్రణాళికలు ఉన్నాయి. గోదావరి–కావేరి అనుసంధానం కూడా ప్రశ్నార్థకమే..! ఇంద్రావతి మెజారిటీ జలాలను ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకునే పక్షంలో గోదావరి నుంచి తెలంగాణ, ఏపీ ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గడం ఖాయమని నీటి పారుదల నిపుణులు అంటున్నారు. అలాగే కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని చెబుతున్నారు. కాగా దీనిపై తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement