Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Supreme Court Telangana BRS MLAs Defection Case March 25th Updates1
‘ఫిరాయింపు​‍’లపై ప్రారంభమైన విచారణ

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ల ధర్మాసనం మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు తామేం పార్టీ ఫిరాయించలేదంటూ అఫిడవిట్లలో పేర్కొన్నారు. తాజాగా.. పిటిషనర్ల ఉద్దేశాలను తప్పుబడుతూ స్పీకర్‌ తరఫున కౌంటర్‌ను అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేశారు.‘‘రీజనబుల్ టైం అంటే గరిష్టంగా మూడు నెలలే అని అర్థం కాదు. ఒక్కో కేసు విచారణకు ఒక్కో రకమైన సమయం అవసరం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. కానీ, స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టుకు వెళ్లారు. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే.. న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. .. అనర్హత పిటిషన్ లను విచారించి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం స్పీకర్ కే ఉంది. గత సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే....పిటీషనర్లే దురుద్దేశపూర్వకంగా కోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపులపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం లేదన్నది సరికాదని.. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని.. కాబట్టి ఈ పిటిషన్లను డిస్మిస్‌ చేయాలి’’ అని కోరారు. దీంతో ఇవాళ జరగబోయే విచారణపై ఆసక్తి నెలకొంది. 👉కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party) జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లపై స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (SLP) దాఖలు అయ్యింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరికెపూడి గాంధీలపై రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది సుప్రీం కోర్టు(Supreme Court). కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతర బీఆర్‌ఎస్‌ నేతలు ఈ పిటిషన్లు వేశారు. అయితే.. 👉పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించి నెలలు గడుస్తున్నా స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది. ఈ క్రమంలో.. గత విచారణ సందర్భంగా స్పీకర్, స్పీకర్‌ కార్యదర్శి, ప్రభుత్వం, ఎన్నికల సంఘం, 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. మార్చి 22వ తేదీలోపు దీనిపై రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. కొద్దిరోజుల క్రితం మహిపాల్‌రెడ్డి, తాజాగా బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అఫిడవిట్‌లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సీఎంను కలిశామని తెలిపారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్‌కు తాము రాజీనామా చేయ‌లేదని.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేర‌లేదని.. మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌లో నిజం లేదని.. కాబట్టి ఈ అన‌ర్హ‌త పిటీష‌న్ల‌కు విచార‌ణ అర్హ‌త లేదని వాటిల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తో ఉన్న ఫొటోలు, పోస్ట‌ర్ల‌ను, తమ ఫొటోలతో కూడిన పార్టీ ఫ్లెక్సీల ఫొటోలనూ అఫిడ‌విట్‌లో జ‌త చేశారు. తాజాగా.. సోమవారం(మార్చి 24) స్పీకర్‌ తరఫున అసెంబ్లీ కార్యదర్శి కూడా అఫిడవిట్‌ వేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యా‍యస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. గతంలో తెలంగాణ స్పీకర్​పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తగినంత సమయం అంటే ఎంతో చెప్పాలని కోరింది. గత విచారణలో.. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదన్న పేర్కొంది. ఈ నేపథ్యంలో.. తాజా పరిణామాల దృష్ట్యా సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందనేది చూడాలి.

Not Against Law to Poke Fun at our Leader Kunal Kamra Responds to Row over Joke on Eknath Shinde2
చట్టం అందరికీ సమానమేనా?: స్టూడియో విధ్వంసంపై కునాల్ కమ్రా

న్యూఢిల్లీ: ముంబైలోని హాబిటాట్ స్టూడియోను కూల్చివేయడంపై స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా(Stand-up comedian Kunal Kamra) ఘాటుగా స్పందించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కమ్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన దరిమిలా, జరిగిన పరిణామాల నేపధ్యంలో ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టూడియో కూల్చివేతలకు ఉపక్రమించింది. దీనిని కునాల్ కమ్రా ఖండించారు. శివసేన కార్యకర్తలు స్టూడియోపై దాడిచేయడం, ఆ తరువాత ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేతలకు పాల్పడటం తగదని, చట్టం అందరికీ సమానంగా వర్తించదా? అని కమ్రా ప్రశ్నించారు.స్టూడియోను కూల్చివేయడం అర్థరహితంసోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో కునాల్‌ కమ్రా స్పందిస్తూ వినోద వేదిక అనేది వినోదించడానికి మాత్రమే ఉందని, దానిని నియంత్రించే హక్కు ఎవరికీ లేదని, దీనికి ప్రతిగా స్టూడియోను కూల్చివేయడం అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ వెన్యూ(Entertainment venue) అనేది అన్ని రకాల ప్రదర్శనలకు కేటాయించిన స్థలమని, తాను చేసే కామెడీకి స్టూడియో బాధ్యత వహించదన్నారు. ఒక హాస్యనటుడి మాటలకు స్పందిస్తూ స్టూడియోపై దాడి చేయడం అనేది.. టమోటాలతో వెళుతున్న లారీని బోల్తా కొట్టించినంత తెలివితక్కువ పని అని, తాను వడ్డించిన బటర్ చికెన్ వారికి నచ్చకపోవడం తన తప్పుకాదని కమ్రా పేర్కొన్నారు.పోలీసులకు, కోర్టుకు సహకరించడానికి సిద్ధంకొందరు రాజకీయ నేతలు తనను బెదిరిస్తున్నారని, అయితే వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ధనవంతుల మీద అభిమానం పెంచుకోవడానికి మాత్రమే లేదన్నారు. రాజకీయ నేతపై వేసిన జోక్‌ను వారు తీసుకోలేకపోవడం అనేది తన స్వభావాన్ని మార్చబోదన్నారు. తనకు తెలిసినంతవరకు నేతలను, లేదా సర్కస్‌గా మారిన రాజకీయ వ్యవస్థను ఎగతాళి చేయడం చట్ట విరుద్ధం కాదని కుమ్రా అన్నారు. తనపై తీసుకునే చట్టబద్ధమైన చర్య విషయంలో పోలీసులకు, కోర్టులకు సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఒక జోక్‌కు మనస్తాపం చెంది, విధ్వంసానికి దిగడం సరైన ప్రతిస్పందన కాదన్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా స్టూడియోను కూల్చివేసినవారి విషయంలోనూ చట్టం సమానంగా వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. ఆదివారం రాత్రి శివసేన కార్యకర్తలు హాబిటాట్ స్టూడియో(Habitat Studio), యూనికాంటినెంటల్ హోటల్‌పై దాడికి దిగిన తరువాత బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) స్టూడియో కూల్చివేతలు చేపట్టింది. హోటల్ బేస్‌మెంట్‌లో నిర్మించిన తాత్కాలిక షెడ్ , ఇతర నిర్మాణాలను కూల్చివేసినట్లు బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు.‘తమిళనాడుకు రండి’: శివసేన మద్దతుదారునితో కమ్రామహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగుతున్న తరుణంలో శివసేన మద్దతుదారుడొకరు ఆయనను హెచ్చరిస్తున్నట్లు ఉన్న ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్‌గా మారింది. 53 సెకన్ల ఈ ఆడియో క్లిప్‌లో కాల్ చేసిన వ్యక్తి కమెడియన్‌ కమ్రాను దూషిస్తూ, ముంబైలోని స్టూడియోకు జరిగినట్లే మీకూ జరుగుతుందని హెచ్చరించడం వినిపిస్తుంది.ఫోన్‌ చేసిన వ్యక్తి తనను తాను జగదీశ్‌ శర్మ(Jagdish Sharma)గా పరిచయం చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ తాము ముంబైలోని హోటల్, స్టూడియోలపై ఏమి చేసామో చూడండి. మీరు ఎక్కడ కనిపించినా మీకు కూడా ఇలాంటి గతి పడుతుంది అని హెచ్చరించాడు. దీనికి స్పందించిన కమ్రా తాను ప్రస్తుతం తమిళనాడులో ఉన్నానని జగదీశ్‌ శర్మకు తెలిపారు. వెంటనే అతను ఆ దక్షిణ రాష్ట్రాన్ని సందర్శించి కొడతానని మరోమారు హెచ్చరించాడు. తరువాత అతను ‘ఎక్కడికి రావాలి?’ అని అడగగా, కమ్రా తాను తమిళనాడులో ఉన్నానని పునరుద్ఘాటించారు. తరువాత అతను ‘మా సార్‌తో ఒక్క నిమిషం మాట్లాడండి’ అని అంటాడు. ఆ తర్వాత కాల్ డిస్‌కనెక్ట్ అవుతుంది. ఇది కూడా చదవండి: అస్సలు పశ్చాత్తాప పడను: షిండే వ్యాఖ్యల కేసులో కునాల్‌ కమ్రా

IPL 2025: LSG Captain Rishabh Pant Comments After Losing Match To Delhi3
DC Vs LSG: అదృష్టం కూడా కలిసి రావాలి.. విప్రాజ్‌ మా నుంచి మ్యాచ్‌ లాగేసుకున్నాడు: పంత్‌

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా నిన్న (మార్చి 24) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ తేడాతో గెలుపొందింది. లక్నో నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన ఢిల్లీని ఆశుతోష్‌ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విప్రాజ్‌ నిగమ్‌ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. మిచెల్‌ మార్ష్‌ (36 బంతుల్లో 72; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (30 బంతుల్లో 75; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మార్ష్‌, పూరన్‌ మినహా లక్నో ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. వీరిద్దరూ బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు లక్నో 250 పైచిలుకు పరుగులు సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే మార్ష్‌, పూరన్‌ ఔటయ్యాక ఆ జట్టు​ మిడిలార్డర్‌ అనూహ్యంగా కుప్పకూలింది. రిషబ్‌ పంత్‌ 6 బంతుల్లో​ డకౌట్‌ కాగా.. ఆయుశ్‌ బదోని 4, శార్దూల్‌ ఠాకూర్‌ 0, షాబాజ్‌ అహ్మద్‌ 9, బిష్ణోయ్‌ 0 పరుగులకు ఔటయ్యారు. చివరి ఓవర్‌లో డేవిడ్‌ మిల్లర్‌ (19 బంతుల్లో 27 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) రెండు సిక్సర్లు బాదడంతో లక్నో 200 పరుగుల మార్కును దాటింది. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్‌ 3, కుల్దీప్‌ 2, విప్రాజ్‌, ముకేశ్‌ కుమార్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకుంది. ఈ దశలో అశుతోష్‌ అద్భుతం చేశాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (22 బంతుల్లో 34; ఫోర్‌, 3 సిక్సర్లు), విప్రాజ్‌ నిగమ్‌ సాయంతో ఢిల్లీకి ఊహించని విజయాన్నందించాడు. చివరి ఓవర్‌ మూడో బంతికి సిక్సర్‌ కొట్టి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్‌ (29), అక్షర్‌ పటేల్‌ (22) రెండంకెల స్కోర్లు చేయగా, మిగతా వారంతా సింగిల్‌ డిజిట్లకే పరిమితమయ్యారు. లక్నో బౌలరల్లో శార్దూల్‌ ఠాకూర్‌, మణిమారన్‌ సిద్దార్థ్‌, దిగ్వేశ్‌ రతీ, రవి బిష్ణోయ్‌ తలో రెండు వికెట్లు తీశారు.కాగా, ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఆ జట్టు ఓటమికి ప్రత్యక్ష కారకుడయ్యాడు. తొలుత బ్యాటింగ్‌లో 6 బంతులు ఆడి డకౌటైన పంత్‌.. ఛేదనలో (ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయిన దశలో) చివరి ఓవర్‌ తొలి బంతికి స్టంపింగ్‌ మిస్‌ చేసి లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్‌ను వదిలేశాడు. పంత్‌ ఈ స్టంపింగ్‌ చేసుంటే లక్నో మ్యాచ్‌ గెలిచేది.మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ పంత్‌ ఇలా అన్నాడు. మా టాపార్డర్ బ్యాటర్లు చాలా బాగా ఆడారు. ఈ వికెట్‌పై ఇది చాలా మంచి స్కోర్‌. దురదృష్టవశాత్తు మేము ఆ స్కోర్‌ను కాపాడుకోలేకపోయాము. మేము ప్రారంభంలో వికెట్లు తీసినప్పటికీ.. ఇది బ్యాటింగ్ చేయడానికి మంచి వికెట్ అని తెలుసు. వారు (ఢిల్లీ) రెండు మంచి భాగస్వామ్యాలు (స్టబ్స్‌తో, విప్రాజ్‌ నిగమ్‌తో అశుతోష్‌) నెలకొల్పారు. విప్రాజ్‌ నిగమ్ చాలా బాగా ఆడాడు. అతడే మా నుంచి మ్యాచ్‌ను దూరం చేశాడు.బౌలర్లకు ఈ పిచ్‌పై తగినంత ఉంది. కానీ మేము కొన్ని బేసిక్స్‌ మిస్‌ అయ్యాము. చివర్లో ఒత్తిడికి లోనయ్యాము. ఇది ఇంకా తొలి మ్యాచే. ఓటమిని అధిగమించి ట్రాక్‌లో పడతాము. ఈ మ్యాచ్ నుండి తీసుకోవలసిన సానుకూల అంశాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఆటలో అదృష్టం కీలక పాత్ర పోషిస్తుంది. స్టంపింగ్‌ మిస్‌పై స్పందిస్తూ.. బంతి మోహిత్ ప్యాడ్‌లకు తాకకపోయుంటే స్టంపింగ్‌కు అవకాశం ఉండేది. క్రికెట్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటినే పట్టించుకుంటూ పోతే ఆటపై దృష్టి పెట్టలేము.

Congress Raise Justice Yashwant Varma Issue Reached Parliament Updates4
పార్లమెంట్‌కు చేరిన ‘నోట్ల కట్టల జడ్జి’ వ్యవహారం

న్యూఢిల్లీ, సాక్షి: అధికారిక బంగ్లాలో కాలిపోయిన నోట్ల కట్టలతో వార్తల్లోకి ఎక్కిన జస్టిస్‌ యశ్వంత్‌ శర్మ వ్యవహారం పార్లమెంట్‌కు చేరింది. ఈ అంశంపై చర్చ జరగాలంటూ లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ ఘటన న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు కలిగించడంతో పాటు ఆ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్న ఆయన.. సంబంధిత న్యాయ శాఖ మంత్రి నుంచి ఈ వ్యవహారంపై వివరణ ఇప్పించాలని స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు లోక్‌సభ కార్యదర్శికి సోమవారమే లేఖ రాశారాయన. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో భారీఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో.. తీవ్ర అభ్యంతరాల నడుమే ఆయన్ని అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు కొలిజీయం. అయితే జస్టిస్‌ వర్మను హైకోర్టులోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటామని అలహాబాద్‌ బార్‌ అసోషియేషన్‌ నిరసనకు సిద్ధమైంది. నివారమే ఈ వ్యవహారంపై ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజేఐ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువంటూ లేని ఈ కమిటీ విచారణ.. సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కానుంది.హోలీ రోజు జడ్జి బంగ్లాలో అగ్నిప్రమాదం జరగ్గా.. ఓ గదిలో కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ వీడియోను పోలీస్‌ కమిషనర్‌ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ ఉపాధ్యాయకు సమర్పించగా.. ఆయన దానిని తన నివేదికలో పొందుపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు అందించారు. దీనిపై సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి నివేదిక మొత్తాన్ని ఫొటోలు, వీడియోలతో సహా తన వెబ్‌సైట్‌లో పెట్టింది. వెబ్‌సైట్‌లో పెట్టిన ఆ వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు.. జస్టిస్ వర్మ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా దీనిని పేర్కొన్నారు.

Hyderabad MMTS Incident: Police  Arrest Accused5
ఎంఎంటీఎస్‌ ఘటన: నిందితుడి గుర్తించిన బాధితురాలు

హైదరాబాద్, సాక్షి: ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్నం కేసును పోలీసులు చేధించారు. నిందితుడిని మేడ్చల్‌ జిల్లాకు చెందిన ఓ యువకుడిగా నిర్ధారించారు. బాధితురాలు గుర్తించడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన యువకుడు.. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో గంజాయికి బానిసై నేరాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్‌ రైల్లో వెళ్తున్న ఒంటరి యువతిపై అఘాయిత్యానికి యత్నించినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు.. నిందితుడిని ఫొటో ద్వారా గుర్తు పట్టింది. ఆ తర్వాతే పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. గంజాయి మత్తులోనే ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్‌ఫోన్‌ రిపేర్‌ చేయించుకుని సికింద్రాబాద్‌ నుంచి ఎంఎంటీఎస్‌లో మేడ్చల్‌కు బయలుదేరింది. అయితే మహిళల కోచ్‌లో ఆమె యువతి ఒక్కతే ఉండగా నిందితుడు (25) ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని రైల్వే ఎస్పీ చందనా దీప్తి పరామర్శించారు. మరోవైపు ఈ ఘటన రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు సంకేతమంటూ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ విరుకుపడుతోంది.

How White House Officials Accidentally Shared Yemen War Plan With Journalist6
White House: ముందే లీక్‌.. మరీ ఇంత నిర్లక్ష్యమా?

వాషింగ్టన్‌: వైట్‌హౌజ్‌లో అధికారుల నిర్లక్ష్యం బయటపడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరపాటున యెమెన్‌ యుద్ధ ప్రణాళికను ఓ జర్నలిస్టుతో పంచుకున్నారు. అదీ.. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ప్రకటన చేయకమునుపే కావడం ఇక్కడ గమనార్హం. అమెరికా రక్షణశాఖమంత్రి పీట్‌ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు ఉన్న గ్రూప్‌లోకి ఓ యూఎస్‌ జర్నలిస్టుకు ప్రవేశం కల్పించారు. ఆ గ్రూప్‌లో అతనున్నాడనే విషయం కూడా హౌతీ రెబల్స్‌పై యుద్ధానికి సమాచారం పోస్ట్‌ చేశారు. ‘ద అట్లాంటిక్‌’ మ్యాగజైన్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ జెఫ్రీ గోల్డ్‌బర్గ్‌ స్వయంగా ఈ విషయం తెలియజేశారు. మార్చి 15వ తేదీన యెమెన్‌పై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కానీ, అంతకంటే ముందే సిగ్నల్‌లోని గ్రూప్‌చాట్ ద్వారా తనకు నోటీసు అందిందని తెలిపారు. ఈ ఘటన జరిగిన రెండ్రోజుల ముందే ఆయన్ని ఆ గ్రూప్‌లో యాడ్‌ చేశారట!. అయితే అవకాశం ఉన్నా.. ఆయన ఆ సమాచారాన్ని పబ్లిష్‌ చేయలేదు. జెఫ్రీ ప్రకటన తర్వాత విషయం ధృవీకరించుకున్న వైట్‌హౌజ్‌ అధికారులు నాలిక కర్చుకున్నారు. ఈ విషయంలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని సోమవారం వైట్‌హౌజ్‌ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఎలాంటి దాడులు జరపుతామనే ప్రణాళిక అందులో ప్రస్తావించలేదని పేర్కొన్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. ముమ్మాటికీ ఇది భద్రతా లోపమేనంటున్న డెమోక్రట్లు.. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక జాతీయ భద్రతకు సంబంధించిన నిర్లక్ష్యపూరిత వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. అమెరికా నౌకలు, విమానాలపై యెమెన్‌ హౌతీలు దాడులు జరపడాన్ని ఖండిస్తూ.. ట్రంప్‌ సర్కారు సైనిక చర్యను మొదలుపెట్టింది. ‘‘హౌతీలు మీ సమయం ఆసన్నమైంది. మీ దాడులు వెంటనే ఆపేయాలి. ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ముందుగానే ట్రంప్‌ హెచ్చరించారు. ఈ క్రమంలో హౌతీలకు మద్ధతుగా ఉన్న ఇరాన్‌ను హెచ్చరించారాయన. మార్చి15-16 నుంచి మొదలైన దాడులు.. యెమెన్‌ రాజధాని సనా, సదా, అల్‌ బైదా, రాడాలే లక్ష్యంగా జరుగుతున్నాయి. అయితే.. అగ్రరాజ్య దాడులను హూతీ పొలిటికల్‌ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్‌ దళాలు ధీటుగానే అమెరికా సైనిక చర్యకు స్పందిస్తున్నాయి.

Gold and silver rates today on market in Telugu states7
దిగొస్తున్న బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర మంగళవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు రోజున గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.81,850 (22 క్యారెట్స్), రూ.89,290 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.300, రూ.330 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.300, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.330 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.81,850 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,290 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.300 దిగి రూ.82,000కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.330 తగ్గి రూ.89,440 వద్దకు చేరింది.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?వెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినా వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,10,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Pooja Hegde Comments For Social Media Issues8
నన్ను దెబ్బ కొట్టేందుకు వాళ్లు కోట్లు ఖర్చు పెట్టారు: పూజా హెగ్డే

హిందీ, తెలుగు, తమిళం అంటూ అన్ని ఇండస్ట్రీలలో పరుగులు పెడుతున్న స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే( Pooja Hegde). మొదట్లో మాతృభాషలో నటించడం ప్రారంభించిన ఈ మరాఠీ బ్యూటీ ఆ తరువాత హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా కథానాయకిగా రాణిస్తున్నారు. అయితే ప్రతి విజయం వెనుక కఠిన శ్రమ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఎన్నో అవమానాలు, బాధలు, మనస్థాపం వంటి చేదు అనుభవాలు ఉంటాయి. ఇందుకు నటి పూజా హెగ్డే అతీతం కాదు. తెలుగులో ప్రభాస్‌, అల్లు అర్జున్‌, మహేష్‌ బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్‌తో బీస్ట్‌ చిత్రంలో జత కట్టారు. ప్రస్తుతం నటుడు సూర్య సరసన నటించిన రెట్రో చిత్రం మే 1వ తేదీన తెరపైకి రానుంది. కాగా తాజాగా విజయ్‌కి జంటగా మరోసారి జననాయకన్‌ చిత్రంలో నటిస్తున్నారు. నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌కు జంటగా కాంచన 4 లో నటిస్తున్నారు.కాగా అగ్ర కథానాయకి రాణిస్తున్న పూజా హెగ్డే తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. తన గురించి సామాజిక మాధ్యమాల్లో ఎన్నో రకాలుగా ట్రోలింగ్స్‌ చేశారన్నారు. అవి తన కుటుంబాన్ని చాలా బాధించాయని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంకో విషయం ఏమిటంటే నటిగా తన ఎదుగుదలను దెబ్బ కొట్టాలని కొందరు కోట్ల రూపాయలు ఇచ్చి ట్రోలింగ్స్‌ చేయించారని అర్ధం అయ్యిందన్నారు. అయితే, తనపై వచ్చిన ట్రోలింగ్ చూసి తల్లిదండ్రులు బాధపడినట్లు ఆమె చెప్పారు. ఆ ట్రోలింగ్‌ ఆపేయాలన్నా డబ్బు చెల్లించాలని తనను కొందరు కోరారని ఆమె తెలిపారు. అయితే, తానెవరికీ ఎలాంటి చెడు చేయలేదని, అయినా తనపై ఎందుకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. అయితే కొంత కాలం తర్వాత అలాంటి ట్రోలింగ్స్‌ను పట్టించుకోవడం వదిలేశానని పూజా హెగ్డే చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల పైనేనని నటి పూజా హెగ్డే పేర్కొన్నారు.

Network hospitals to discontinue cashless services under Arogyasri Seva from April 7 in Andhra Pradesh9
7 నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్‌

సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో ఏప్రిల్‌ 7 నుంచి సేవలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆషా) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందచేసినట్లు అసోసియేషన్‌ తెలిపింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ 26 సార్లు ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు సీఈఓను, వైద్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీని, ఐటీ శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని కలిసి తమ ఇబ్బందులను వివరించినట్లు తెలిపారు.అయినప్పటికీ తమ సమస్యలపట్ల సానుకూల స్పందన కొరవడటంతో, ఆస్పత్రులు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయి నిర్వహించలేని దయనీయ స్థితిలో ఉన్నందున.. వచ్చేనెల 7 నుంచి పూర్తిగా సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆషా అధ్యక్షుడు డాక్టర్‌ కె. విజయ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం తక్షణమే రూ.1,500 కోట్లు రిలీజ్‌ చేయడంతో పాటు, అనంతరం చెల్లింపులపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తేగానీ ఆరోగ్యశ్రీని నిర్వహించలేని స్థితిలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఏకంగా రూ.3,500 కోట్ల మేర ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉందని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ చెబుతోంది.వివిధ రూపాల్లో నిరసనలుఏప్రిల్‌ 7 వరకూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విజయ్‌కుమార్‌ వివరించారు. అందులో భాగంగా.. మార్చి 25న జిల్లా కలెక్టర్‌లు, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్స్, డీఎంహెచ్‌ఓలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. అంతేకాక.. తమ ఇబ్బందులను మీడియాకు వివరించనున్నట్లు తెలిపారు. మార్చి 27న ఎంఎల్‌ఏలు, ఎంపీలు, జిల్లా ఇన్‌ఛార్జిలను కలిసి వినతిపత్రాలు అందించనున్నట్లు తెలిపారు. 29న నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమాలు.. ఏప్రిల్‌ 3న కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ హెడ్స్, ఆషా ప్రతినిధులు విజయవాడ, విశాఖపట్నంలలో ప్రెస్‌మీట్‌ల నిర్వహణకు కార్యాచరణను రూపొందించినట్లు ఆషా ప్రతినిధులు తెలిపారు.నగదు రహిత వైద్యం అందించలేంనిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 నెలల్లో 26 సార్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ బకాయిలపై ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయినప్పటికీ సర్కారు నుంచి సరైన స్పందనలేదు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓ ఆమోదించిన బిల్లులు రూ.1,300 కోట్లు, సీఈఓ ఆమోదించనివి రూ.1,700 కోట్లు ఉన్నాయి. ఇక ఆస్పత్రులు అప్‌లోడ్‌ చేయాల్సిన బిల్స్‌ మరో రూ.500 కోట్ల మేర ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పెద్దఎత్తున బిల్లులు నిలిచిపోవడంతో గతేడాది నుంచే చాలావరకూ ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవల కల్పనకు వెనుకడుగు వేస్తున్నాయి. పేదలు చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తే.. ‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదు. నగదు రహిత వైద్యసేవలు అందించలేం’ అని యాజమాన్యాలు చెబుతున్నాయి.

Oscar winning Palestinian filmmaker detained by Israeli military10
ఆస్కార్‌ దర్శకుడిపై దాడి.. ఆచూకీ కూడా గల్లంతు

అస్కార్‌ అవార్డ్‌ గ్రహిత దర్శకుడు హమ్దాన్ బల్లాల్‌పై ఇజ్రాయెల్ స్థిరనివాసులు దాడి చేశారు. 'నో అదర్ ల్యాండ్' డాక్యుమెంటరీ చిత్రానికి ఆయన కో-డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ చిత్రం విడుదల సమయంలో ఇజ్రాయెల్‌తో పాటు చాలా విదేశాల్లో ఉన్న ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. పాలస్తీనాకు చెందిన బల్లాల్‌ ఈ సినిమాలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చూపారు. దీనిని వారు జీర్ణించుకోలేకపోయారు. ఆయనపై దాడి చేస్తామని గతంలోనే వారు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కొన్నేళ్లుగా హింస జరుగుతున్న నేపథ్యంలో 'నో అదర్ ల్యాండ్' అనే డాక్యుమెంటరీతో దర్శకుడు హమ్దాన్ బల్లాల్‌ సంచలనం రేపాడు. దీంతో ఆగ్రహం చెందిన ఇజ్రాయెల్‌లోని వలసదారులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. కారులో వెళ్తున్న బల్లాల్‌ను అడ్డగించిన ఇజ్రాయెల్ స్థిరనివాసులు సుమారు 20 మంది ముసుగులు ధరించి రాళ్ళు, కర్రలతో దాడి చేశారు. ఆపై ఇజ్రాయెల్ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుందని సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు చెప్పినట్లు ఆయన మిత్రుడు యువల్ అబ్రహం తెలిపారు. తీవ్రంగా గాయపడిన బల్లాల్ తల నుంచి అధిక రక్తస్రావం అవుతుందని ఆయన పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు అతని ఆచూకి ఎక్కడ ఉందో తెలియదని ఆయన చెప్పుకొచ్చాడు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement