Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Andhra pradesh: Heavy rain destroys banana crop in YSR and Anantapur1
అకాల వర్షం.. అపార నష్టం.. నేడు పరిశీలించనున్న వైఎస్‌ జగన్‌

ఇది నిన్నటి దృశ్యం.పచ్చటి అరటి తోటలు.. బారెడు గెలలతో కోతకు సిద్ధమయ్యాయి.. తమ ఆశలు పండించేలా ఉన్న తోటల్ని చూసి రైతు కళ్లల్లో ఆనందం తాండవించింది. ఇక అప్పులన్నీ తీరతాయని ధైర్యం వచ్చింది. ఇది నేటి పరిస్థితి.ఎటు చూసినా విరిగిన అరటి చెట్లు.. నేలవాలిన తోటలు. చేతికందే దశలో పంట నేలపాలై కంట నీరు పెట్టుకుంటున్న రైతులు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని దీనస్థితి. అమరావతి/లింగాల/అనంతపురం అగ్రికల్చర్‌: అకాల వర్షాలకు వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. పెద్దకుడాల గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. 3 ఎకరాల్లో యాలకి (సుగంధాలు) అరటి సాగు చేయగా.. పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగ­న­మల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. గోరుచుట్టుపై రోకలి పోటులా.. గోరుచుట్టుపై రోకలి పోటులా అకాల వర్షం వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోని అరటి రైతులను దెబ్బతీసింది. గత నెలలో టన్ను అరటి ధర రూ.23 వేల నుంచి రూ.25 వేలు ఉండేది. ఇప్పుడు ధరలు పడిపోవడంతో పెట్టుబడులు దక్కుతాయో లేదోనని అరటి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు చేసి పంటల్ని సాగుచేస్తే చేతికందాల్సిన పంట నేలనంటిందని వాపోతున్నారు. పురుగు మందులు, ఎరువుల ధరలు ఏటా పెరుగుతుంటే.. పంట సాగుచేసిన తమకు గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటల్ని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. రైతుల్ని ఆదుకుంటాం: సీఎం అకాల వర్షాలు ఈదురు గాలులకు పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పంటలు దెబ్బతిన్న జిల్లాల కలెక్టర్లతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయి అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లికి చెందిన ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై సీఎం ఆరా తీశారు. ఆ ఇద్దరు రైతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.ప్రభుత్వం ఆదుకోవాలికోటి ఆశలతో అప్పులు చేసి అరటి పంటను సాగు చేస్తే అకాల వర్షం, ఈదురు గాలులు కోలు­కోలేని దెబ్బతీ­శాయి. ఈ వర్షానికి తీవ్రంగా నష్టపోయాం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – శ్రీనివాసులరెడ్డి, అరటి రైతు, ఎగువపల్లెఈ స్థితి వస్తుందనుకోలేదుఏటా ఏప్రిల్, మే నెలల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురి­సేవి. ఆలోగా రైతులు అరటి పంట దిగుబడి చేతికందేది. ఈ ఏడాది ముందుగానే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో తీవ్రంగా నష్టపోయాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. – రామాంజనేయరెడ్డి, అరటి రైతు, పెద్దకుడాలనేడు వైఎస్‌ జగన్‌ పర్యటన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలంలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించేందుకు వైఎస్‌ జగన్‌ వస్తున్నారని వైఎస్సార్‌సీపీ మండల కన్వినర్‌ బాబురెడ్డి తెలిపారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిన అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారన్నారు.

Kunal Kamra Controversy Comments On Eknath Shinde2
డిప్యూటీ సీఎం షిండేపై అనుచిత వ్యాఖ్యలు.. శివసేన కార్యకర్తల దాడి

ముంబై: మహారాష్ట్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కమెడియన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో, ఆగ్రహానికి లోనైన శివసేన కార్యకర్తలు ఓ క్లబ్‌పై దాడి చేశారు. సదరు కమెడియన్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని శివసేన కార్యకర్తలు డిమాండ్‌ చేస్తూ భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ఖార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ‘ది యూనికాంటినెంటల్‌ క్లబ్‌’ లో స్టాండప్‌ కమెడియన్‌ కునాల్ కమ్రా షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమెడియన్‌ కునాల్ కమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం, శివసేన నాయకులు ఏక్‌నాథ్‌ షిండేను టార్గెట్‌ చేశారు. ఈ క్రమంలోనే ఏక్‌నాథ్ షిండేను దేశద్రోహిగా అభివర్ణించారు. షోలో కునాల్‌.. ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే హిందీ పాటను మార్చి పాడారు. 2022లో ఉద్దవ్‌ థాక్రేకు వెన్నుపోటుకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో, శివసేన కార్యకర్తలు ెద్ద సంఖ్యలో ‘ది యూనికాంటినెంటల్‌ క్లబ్‌’ వద్దకు చేరుకున్నారు. అనంతరం, క్లబ్‌పై దాడి చేశారు.అనంతరం, కమెడియన్‌ కునాల్‌ కమ్రాను అరెస్ట్‌ చేయాలని శివసేన కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే కునాల్‌పై ఫిర్యాదు చేయడానికి పార్టీ సభ్యులు ఖార్ పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా శివసేన నేతలు మాట్లాడుతూ.. ఉద్దవ్‌ థాక్రే నుంచి డబ్బులు తీసుకుని కునాల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.Kunal Kamra's stage where he performed has been vandalised by Eknath Shinde's men. His MP is threatening Kunal Kamra. FIRs will be filed on him soonReason : This Video. Please don't watch & make it viral, Eknath Shinde won't not like it. pic.twitter.com/r6oyuV770C— Roshan Rai (@RoshanKrRaii) March 23, 2025మరోవైపు.. ఈ ఘటనపై మాజీ మంత్రి, ఉద్దవ్‌థాక్రే కుమారుడు ఆధిత్య థాక్రే స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ఆధిత్య థాక్రే.. కునాల్‌ కమ్రాపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. ఏక్‌నాథ్‌ షిండేపై అతడు చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజం. అభద్రతాభావం ఉన్న వ్యక్తులే, పిరికివాళ్లు మాత్రమే ఇలాంటి దాడులు చేస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో తెలుసా?. ముఖ్యమంత్రి, హోంమంత్రిని అణగదొక్కడానికి ఏక్‌నాథ్ షిండే చేసిన మరో ప్రయత్నం ఇది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.Mindhe’s coward gang breaks the comedy show stage where comedian @kunalkamra88 put out a song on eknath mindhe which was 100% true.Only an insecure coward would react to a song by someone. Btw law and order in the state? Another attempt to undermine the CM and Home Minister…— Aaditya Thackeray (@AUThackeray) March 23, 2025

IPL 2025: MI Captain Surya Kumar Yadav Comments After Losing To CSK In First Match3
IPL 2025: మా పోరాటం ప్రశంసనీయం.. రుతురాజ్‌ మ్యాచ్‌ను లాగేసుకున్నాడు: సూర్యకుమార్‌

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయే ఆనవాయితీని ముంబై ఇండియన్స్‌ కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై తమ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ముంబైపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ తడబడింది. సీఎస్‌కే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్‌ శర్మ డకౌటై నిరాశపరిచగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్‌ (13), విల్‌ జాక్స్‌ (11), తాత్కాలిక కెప్టెన్‌ సూర్యకుమార్‌ (29), తిలక్‌ వర్మ (31) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. అరంగేట్రం ఆటగాడు రాబిన్‌ మి​ంజ్‌ (3) తేలిపోయాడు. నమన్‌ ధిర్‌ 17, సాంట్నర్‌ 11 పరుగులు చేయగా.. ఆఖర్లో దీపక్‌ చాహర్‌ (15 బంతుల్లో 28 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు. సీఎస్‌కే బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ (4-0-18-4) ఐపీఎల్‌ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఖలీల్‌ అహ్మద్‌ (4-0-29-3) సత్తా చాటాడు. వెటరన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, నాథన్‌ ఇల్లిస్‌ తలో వికెట్‌ తీశారు.స్లో ట్రాక్‌పై ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. దీపక్‌ చాహర్‌ ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠిని 2 పరుగులకే ఔట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. రుతు 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి మ్యాచ్‌ను ముంబై చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. మరో ఎండ్‌లో రచిన్‌ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడి చివరి వరకు క్రీజ్‌లో ఉన్నాడు. సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. రుతురాజ్‌ ఔటయ్యాక సీఎస్‌కే కాస్త తడబడింది. అరంగేట్రం స్పిన్నర్‌ విజ్ఞేశ్ పుథుర్‌ వరుసగా తన మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ముంబైని తిరిగి మ్యాచ్‌లోకి తెచ్చినట్లు కనిపించాడు. ఈ దశలో విల్‌ జాక్స్‌, నమన్‌ ధిర్‌ కూడా అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. సీఎస్‌కే ఆటగాళ్లను కట్టడి చేసి పరుగులు రానివ్వకుండా చేశారు. అయితే అప్పటిదాకా అద్బుతంగా బౌలింగ్‌ చేసిన విజ్ఞేశ్‌ పుథుర్‌ను 18వ ఓవర్‌లో బౌలింగ్‌కు దించి ముంబై కెప్టెన్‌ స్కై పెద్ద తప్పు చేశాడు. ఆ ఓవర్‌లో రచిన్‌ చెలరేగిపోయి 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్‌లోనే ముంబై ఓటమి ఖరారైపోయింది. 19వ ఓవర్‌లో నమన్‌ ధిర్‌ జడ్డూ వికెట్‌ తీసి కేవలం 2 పరుగులే ఇచ్చినా చివరి ఓవర్‌ తొలి బంతికే సిక్సర్‌ బాది రచిన్‌ సీఎస్‌కేను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ధోని సూర్యకుమార్‌ను మెరుపు స్టంపింగ్‌ చేసి వింటేజ్‌ ధోనిని గుర్తు చేశాడు.మ్యాచ్‌ అనంతరం సూర్యకుమార్‌ స్పందిస్తూ.. మేము 15-20 పరుగులు తక్కువ చేశాం. అయినా మా కుర్రాళ్ల పోరాటం ప్రశంసనీయం. యువకులకు అవకాశాలు ఇవ్వడంలో ముంబై ఇండియన్స్‌ ప్రసిద్ధి చెందింది . ఎంఐ స్కౌట్స్ ఏడాదిలో 10 నెలలు టాలెంట్‌ను వెతికే పనిలో ఉంటారు. విజ్ఞేశ్‌ పుథుర్‌ దాని ఫలితమే. తొలి మ్యాచ్‌లోనే విజ్ఞేశ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. తన తొలి 3 ఓవర్లలో 3 వికెట్లు తీసి తిరిగి తమను మ్యాచ్‌లోకి తెచ్చాడు. ఆట లోతుగా సాగితే అతని కోసమని ఓ ఓవర్‌ను స్పేర్‌గా ఉంచాను. అది మిస్‌ ఫైర్‌ అయ్యింది. 18వ ఓవర్ విజ్ఞేశ్‌కు ఇచ్చి తప్పు చేశాను. మ్యాచ్‌ జరుగుతుండగా మంచు ప్రభావం లేదు. కానీ కాస్త జిగటగా ఉండింది. రుతురాజ్ బ్యాటింగ్ చేసిన విధానం మ్యాచ్‌ను మా నుండి దూరం చేసింది. ఇది తొలి మ్యాచే. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నాడు. కాగా, ముంబై తమ రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ మార్చి 29న అహ్మదాబాద్‌లో జరుగనుంది.

Stampede Like Situation at New Delhi Railway Station Huge Rush of Passengers due to Delay in Several Trains4
New Delhi: తృటిలో తప్పిన తొక్కిసలాట

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌(New Delhi Railway Station)లో మరోసారి భారీ రద్దీ ఏ‍ర్పడింది. దీంతో తొక్కిసలాట జరిగిందనే వదంతులు వ్యాపించాయి. స్టేషన్‌లోని 12,13 ప్లాట్‌ఫారమ్‌లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైళ్ల కోసం వేచివుండగా, తొక్కిసలాటను తలపించే పరిస్థితి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.శివగంగా ఎక్స్‌ప్రెస్, స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్(Swatantra Senani Express), జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్, లక్నో మెయిల్, మగధ్ ఎక్స్‌ప్రెస్‌లు బయలుదేరడంలో ఆలస్యం కావడంతో ఇటువంటి పరిస్థితి ఏ‍ర్పడింది. ప్రయాణికుల రద్దీని గమనించిన ఢిల్లీ పోలీసులు వెంటనే అప్రమత్తమై, తమ బృందాలను మోహరించారు. ప్టేషన్‌లో ప్రస్తుతానికి ఎవరూ గాయపడినట్లు వార్తలు లేవు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్టేషన్‌లోని రెండు ప్లాట్‌ఫారాలపై ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది.గతంలో మహా కుంభమేళా సమయంలో కనిపించిన రద్దీ మరోమారు ఎదురయ్యింది. ఈ నేపధ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అన్ని చర్యలు చేపడుతున్నారు. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో అధిక రద్దీ ఏర్పడిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు. ఈ రద్దీపై రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ ఏర్పడింది. అయితే తొక్కిసలాట లాంటి పరిస్థితి ఎదురుకాలేదు’ అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెలలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఉదంతంలో రైల్వేశాఖ ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. తొక్కిసలాట కేసుపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది.ఇది కూడా చదవండి: ఇండియా గేట్‌, రాష్ట్రపతి భవన్‌.. అంతటా అంథకారం.. కారణమిదే..

Producer Ravi Reveal Pushpa Special Song Samantha Not Our First Choice5
'పుష్ప' ఫస్ట్‌ ఛాయిస్‌ సమంత కాదు.. సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత

‘ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ’ సాంగ్‌ టాలీవుడ్‌లో ఇప్పటికీ కూడా ప్రత్యేకమే.. సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప (2021) చిత్రంలో ఈ పాట పాన్‌ ఇండియా రేంజ్‌లో క్లిక్‌ అయిపోయింది. సమంత స్టెప్పులకు దేవిశ్రీ ప్రసాద్‌ తనదైన మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. పుష్ప2లో కిస్సిక్‌ సాంగ్‌ కంటే కూడా సమంత పాటనే సూపర్‌ హిట్‌ అనేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఈ సాంగ్‌లో స్టెప్పులేసే ఫస్ట్‌ ఛాయిస్‌ సమంత కాదని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాత రవి తాజాగా చెప్పారు.మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers) పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘రాబిన్ హుడ్‌’.. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రీలీజ్‌ ఈవెంట్‌లో నిర్మాత రవిశంకర్‌ మాట్లాడుతూ సమంత స్టెప్పులు వేసిన పుష్ప సాంగ్‌ గురించి ఇలా చెప్పుకొచ్చారు. '‘రాబిన్ హుడ్‌’ స్పెషల్‌ సాంగ్‌ కోసం కేతిక శర్మను సంప్రదించగానే ఆమె ఒప్పుకున్నారు. పుష్ప-1 సమయంలో సమంతతో చర్చలు జరపకముందే కేతిక శర్మను తీసుకోవాలని అనుకున్నాం. అప్పుడు ఆ ఛాన్స్‌ లేకుండా పోయింది.. మళ్లీ ఈ సినిమాలో (రాబిన్ హుడ్‌) కుదిరింది. మేము అడగంగానే కేతిక ఒప్పకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నాను.' అని రవి చెప్పుకొచ్చారు.రాబిన్‌హుడ్‌లో 'అది దా సర్ప్రైజ్' అంటూ కేతిక శర్మ వేసిన స్టెప్పులకు ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు. నెట్టింట ఈ సాంగ్‌ వైరల్‌ అవుతుంది. ఇప్పటికే లెక్కలేనన్ని రీల్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఈ పాట ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Hyderabad MMTS Train Incidents Details6
HYD: MMTSలో యువతిపై లైంగిక దాడి యత్నం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న ఎంఎంటీఎస్‌(MMTS) రైలులో ఓ దుండగుడు.. యువతిపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో, భయాందోళనకు గురైన సదరు యువతి.. రైలులో నుంచి బయటకు దూకేసింది.వివరాల ప్రకారం.. ఎంఎంటీఎస్‌(MMTS)లో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. ఎంఎంటీఎస్‌ ప్రయాణంలో ఉండగా.. ఓ యువతిపై దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ వెళ్తున్న ఎంఎంటీఎస్‌ రైలు బోగీలో యువతి ఒక్కరే ఉన్నారు. ఈ క్రమంలో బోగీలోకి ఎక్కిన దుండగుడు.. కొంపల్లి వద్ద ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న రైలులో నుంచి కిందకు దూకేసింది.దీంతో, బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

Taxman smells scam in dubious agricultural income declaration7
నిజంగానే వ్యవసాయ ఆదాయం ఉందా? లేక...

మీ అందరికీ తెలిసిందే. వ్యవసాయం మీద ఆదాయం చేతికొస్తే, ఎటువంటి పన్ను భారం లేదు. ఈ వెసులుబాటు 1961 నుంచి అమల్లో ఉంది. చట్టంలో నిర్వచించిన ప్రకారం వ్యవసాయ భూమి ఉంటే, అటువంటి భూమి మీద ఆదాయం/రాబడికి ఆదాయపు పన్ను లేదు. కేవలం వ్యవసాయం మీదే ఆధారపడి ఎటువంటి ఏ ఇతర ఆదాయం లేకపోతే, వచ్చిన ఆదాయం ఎటువంటి పరిమితులు, ఆంక్షలు లేకుండా మినహాయింపులోనే ఉంటుంది. ఎటువంటి పన్నుకి గురి కాదు. భూమి, ఆదాయం ఈ రెండూ, తూ.చా. తప్పకుండా ఆదాయపు పన్ను చట్టంలో నిర్వచించిన ప్రకారం ఉండాలి. ఎటువంటి తేడాలు ఉండకూడదు. అలాంటప్పుడు మాత్రమే మినహాయింపు ఇస్తారు.కొంత మందికి అటు వ్యవసాయ ఆదాయం, ఇటు వ్యవసాయేతర ఆదాయం రెండూ ఉండొచ్చు. వారు రిటర్న్‌ వేసేటప్పుడు రెండు ఆదాయాలను జోడించి వేయాలి. దానికి అనుగుణంగా ఆ ఆదాయాలపై పన్ను లెక్కించి, అందులో మినహాయింపులు ఇవ్వడమనేది .. ఇదంతా ఒక రూలు. దాని ప్రకారం లెక్క చెప్తే పన్నుభారం పూర్తిగా సమసిపోదు కానీ ఎక్కువ శాతం రిలీఫ్‌ దొరుకుతుంది. పై రెండు కారణాల వల్ల, రెండు ఉపశమనాల వల్ల ట్యాక్స్‌ ఎగవేసే వారు.. ఎప్పుడూ ఎలా ఎగవేయాలనే ఆలోచిస్తుంటారు. ట్యాక్స్‌ ప్లానింగ్‌లో ప్రతి ఒక్కరికి అనువుగా దొరికేది వ్యసాయ ఆదాయం. అక్రమంగా ఎంతో ఆర్జించి, దాని మీద ట్యాక్స్‌ కట్టకుండా బైటపడే మార్గంలో అందరూ ఎంచుకునే ఆయుధం ‘వ్యవసాయ ఆదాయం’. దీన్ని ఎలా చూపిస్తారంటే..👉 తమ పేరు మీదున్న పోరంబోకు జాగా, 👉 ఎందుకు పనికిరాని జాగా. 👉 వ్యవసాయ భూమి కాని జాగా 👉 సాగుబడి చేయని జాగా 👉 తమ పేరు మీద లేకపోయినా చూపెట్టడం 👉 కౌలుకి తీసుకోకపోయినా దొంగ కౌలు చూపడం 👉 కుటుంబంలో తాత, ముత్తాతల పొలాలను తమ పేరు మీద చూపెట్టుకోవడం 👉 బహుమతులు, ఇనాముల ద్వారా వచ్చిన జాగా 👉 దురాక్రమణ చేసి స్వాధీనపర్చుకోవడం మరికొందరు నేల మీదే లేని జాగాని చూపెడతారు. ఇలా చేసి ఈ జాగా.. చక్కని మాగణి అని.. బంగారం పండుతుందని బొంకుతారు. కొంత మంది సంవత్సరానికి రూ. 50,00,000 ఆదాయం వస్తుందంటే ఇంకొందరు ఎకరానికి రూ. 5,00,000 రాబడి వస్తుందని చెప్పారు. ఈ మేరకు లేని ఆదాయాన్ని చూపించి, పూర్తిగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఈ ధోరణి అన్ని రాష్ట్రాల్లోకి పాకింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా కొనసాగింది. హైదరాబాద్, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భూముల మీద లెక్కలేనంత ఆదాయం చూపించారు. అధికారులు, మామూలుగానే, వారి ఆఫీసు రూమ్‌లో అసెస్‌మెంట్‌ చేస్తేనే అసెస్సీలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అధికారులు అడిగే ప్రశ్నలకు, ఆరా తీసే తీరుకు కళ్లు బైర్లు కమ్ముతాయి. అలాంటిది, ఈసారి అధికారులు శాటిలైట్‌ చిత్రాల ద్వారా వారు చెప్పిన జాగాలకు వెళ్లారు. అబద్ధపు సర్వే నంబర్లు, లేని జాగాలు, బీడు భూములు, అడవులు, చౌడు భూములు, దొంగ పంటలు, దొంగ కౌళ్లు, లేని మనుషులు, దొంగ అగ్రిమెంట్లు.. ఇలా ఎన్నో కనిపించాయి. ఇక ఊరుకుంటారా.. వ్యసాయ ఆదాయాన్ని మామూలు ఆదాయంగా భావించి, అన్ని లెక్కలూ వేశారు. ఇరుగు–పొరుగువారు ఎన్నో పనికిమాలిన సలహాలు ఇస్తారు. వినకండి. ఫాలో అవ్వకండి. ఒకవేళ ఫాలో అయినా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎగవేతకు ఒక మార్గమే ఉంది. కానీ ఇప్పుడు ఎగవేతలను ఏరివేసి, సరిచేసి, పన్నులు వసూలు చేసే మార్గాలు వందలాది ఉన్నాయి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌ పంపించగలరు.

Transfer of IPS officers with TDP Leaders Red Book Govt8
‘రెడ్‌బుక్‌’కు సహకరించని వారిపై బదిలీ వేటు!

సాక్షి, అమరావతి: రెడ్‌బుక్‌ కుట్రలకు సహకరించని పోలీస్‌ అధికారులకు పొగబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడుతోంది. విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ, సీఐడీ విభాగంలో ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌లను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసేందుకు సిద్ధపడుతోంది. దీర్ఘకాలిక సెలవు నుంచి తిరిగొచ్చిన డీజీ ఎన్‌. బాలసుబ్రహ్మణ్యంను కీలక పోస్టులో నియమించాలని భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగియడంతో రాష్ట్రంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల బదిలీకి ప్రభుత్వం ఉపక్రమించింది. ఐజీ నుంచి డీజీ స్థాయి అధికారుల బదిలీ ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో భాగంగా.. ⇒ విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ శంఖబత్ర బాగ్చీని బదిలీచేయాలని ప్రభుత్వం సూత్ర­ప్రాయంగా నిర్ణయించింది. ఆయనపట్ల టీడీపీ ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విశాఖపట్నం వంటి కీలక నగరంలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్‌ వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకోవాలని అమరావతిలోని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. కానీ, అందుకు శంఖబత్ర బాగ్చీ సహకరించడంలేదని ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని బదిలీ చేయాలని ప్రభుత్వ పెద్దలు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో విశాఖపట్నం సీపీగా ప్రస్తుత గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అక్రమాలకు ఆయన ఏకపక్షంగా కొమ్ముకాసిన విషయం తెలిసిందే. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం ఆపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన వివాదంపై దర్యాప్తు కోసం నియమించిన సిట్‌లో ఆయన్నే సభ్యునిగా చేర్చారు. ఈ నేపథ్యంలో.. నిబంధనలతో నిమిత్తం లేకుండా టీడీపీ పెద్దల ఆదేశాలను అమలుచేస్తారనే నమ్మకంతోనే సర్వశ్రేష్ఠ త్రిపాఠిని విశాఖ పోలీస్‌ కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ అలాగే, నిబంధనల మేరకు మాత్రమే పనిచేసే అధికారిగా గుర్తింపు పొందిన సీఐడీ విభాగంలో ఐజీగా ఉన్న వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను కూడా బదిలీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెడ్‌బుక్‌ కుట్రలో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా అంటూ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్‌ ఇన్‌చార్జ్‌గా ఈయన ఉన్నారు. దర్యాప్తుతో నిమిత్తం లేకుండా తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడికి ఆయన ఏమాత్రం లొంగలేదు. నిబంధనల మేరకు దర్యాప్తు చేస్తా.. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోతానని వినీత్‌ స్పష్టంచేసి సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో.. అప్పటికప్పుడు ఆయన్ను బదిలీచేస్తే అభాసుపాలవుతామని ప్రభుత్వ పెద్దలు వెనుకంజ వేశారు. అందుకే ప్రస్తుతం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల బదిలీ పేరుతో ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి అప్రాధాన్య పోస్టుకు పరిమితం చేయాలని చూస్తున్నారు. ⇒ ఇక దీర్ఘకాలిక సెలవు ముగించుకుని వచ్చిన డీజీ ఎన్‌. బాలసుబ్రహ్మణ్యంను ప్రభుత్వం కీలక పోస్టులో నియమించనుంది. ఆయనకు పోలీసు శాఖలో పోస్టు ఇస్తారా లేదా ఇతర శాఖలో ముఖ్య కార్యదర్శిగా నియమిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఐటీ శాఖలో ఆయన్ను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ మరోవైపు.. తెలంగాణ కేడర్‌ నుంచి ఏపీకి కేటాయించిన డీజీ స్థాయి అధికారులు అంజనీకుమార్, అభిలాష్‌ బిస్త్‌ ఇంకా రాష్ట్రంలో రిపోర్టు చేయలేదు. మరో ఐపీఎస్‌ అభిషేక్‌ మహంతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారు ఏపీలో రిపోర్ట్‌ చేసిన అనంతరం వారిని ఏ పోస్టుల్లో నియమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారులను కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను ఈ వారంలోనే బదిలీ చేసే అవకాశాలున్నాయని పోలీసుశాఖ వర్గాలు చెబుతున్నాయి.

Kenya special documentary on the scarface lion9
‘స్టార్‌’ లయన్‌

‘అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవికి రాజు సింహం’.. ఎన్నో తరాలుగా పిల్లలకు చెప్పే కథే ఇది! ఇక్కడ కూడా అడవిలో రారాజుగా వెలుగొందిన ఓ మృగరాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యాన్ని, బలగాన్ని విస్తరించి, తన రాజ్యాన్ని 14 ఏళ్ల పాటు ఆఫ్రికా ఖండంలోనే ఓ పెద్ద అడవిని ఏక ఛత్రాధిపత్యంతో ఏలింది ఈ సింహం. కుడి కంటిపై గాటుతో భయంకరంగా కనిపించే ఈ సింహం 2021 జూన్‌ 11న వృద్ధాప్యంతో ప్రాణాలు విడిచింది. ఈ గాటు వల్లనే దానికి ‘స్కార్‌ ఫేస్‌ లయన్‌’గా పేరుపొందింది. ఐదేళ్ల క్రితం ఓ సింహం గడ్డిలో పొర్లాడుతూ భయంకరమైన గర్జన చేస్తూ చనిపోయిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. అది ఎక్కడ జరిగిందో అని చాలా మంది ఆరా తీయగా.. కెన్యాలోని మసాయి మారా నేషనల్‌ పార్కులోదిగా తేల్చారు. అప్పుడే ఈ లయన్‌ కింగ్‌ ప్రత్యేకత తెలిసింది. అడవుల్లో సింహాలు గరిష్టంగా 12 ఏళ్లు బతికితే.. ఇది మాత్రం 14 సంవత్సరాలు జీవించింది. ఇదేం పెద్ద గొప్పకాకున్నా..బతికినంత కాలం రారాజుగానే ఉండి, సహజ మరణం పొందడమే విశేషం. ఈ లయన్‌ కింగ్‌ జీవితం, పోరాటాలు, సాహసాలపై కెన్యా ప్రభుత్వం పలు సందర్భాల్లో వీడియోలు తీసి, ఓ డాక్యుమెంటరీగా రూపొందించింది. అందులోని కొన్ని భాగాలు ఇప్పుడు మనదాకా వచ్చాయి. ఈ ‘స్టార్‌ లయన్‌ కింగ్‌’ ప్రత్యేకత ఏంటంటే.. – సాక్షి, అమరావతిపుట్టింది - 2007మరణం - 2021 జూన్‌ 11 వేట - 130 మగ సింహాల మరణం 400 హైనాలు ఒక హిప్పోపోటమస్లెక్కలేనన్ని అలిగేటర్స్‌ (మొసళ్లు)సొంత కుటుంబం - 120 సింహాలుజీవించిన కాలం - 14 సంవత్సరాలుఆఫ్రికాలోనే అత్యంత సెలబ్రిటీ లయన్‌గాగుర్తింపుమరో సింహానికి అవకాశం ఇవ్వకుండా..ఆఫ్రికా ఖండంలో అతి పెద్ద నేషనల్‌ పార్కుల్లో ఒకటి కెన్యాలోని మసాయి మారా నేషనల్‌ పార్కు. 400 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఈ అరణ్యంలో 2007లో పుట్టిందీ సింహం. మూడేళ్లకే అరివీర భయంకరిగా మారింది. అడవుల్లో సహజంగా మగ సింహాల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. ఈ పోరులో గెలిచిన సింహం శత్రు గుంపులోని ఆడ సింహాలను, ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకుంటుంది. ఇంత పెద్ద అడవిలో ఈ లయన్‌ మరో మగ సింహానికి అలాంటి అవకాశమే ఇవ్వలేదు. ప్రతి యుద్ధంలో గెలిచింది. ఆడ సింహాలన్నింటినీ సొంతం చేసుకుంది. 14 ఏళ్ల జీవిత కాలంలో 130 మగ సింహాలను హతమార్చింది. 400కు పైగా హైనాలను హతమార్చింది. ఖడ్గమృగాలు, బలీయమైన మొసళ్లను చంపేసింది. సాధారణంగా సింహాలు హిప్పో (నీటి ఏనుగు)ల జోలికి పోవు. కానీ ఈ స్కార్‌ ఫేస్‌ లయన్‌ ఓ మగ హిప్పోతో ఒంటరిగా పోరాడి గెలిచింది. ఇవి అధికారికంగా అటవీ సంరక్షకులు గుర్తించిన సంఖ్య మాత్రమే.120 సింహాల గుంపునకు నాయకత్వంకంటిపై గాటుతో కనిపించే ఈ మృగరాజు జీవితాంతం సవాళ్లతో పోరాడింది. స్థానిక సింహాలనే కాదు.. వేటగాళ్ల దాడులను సైతం దీటుగా ఎదుర్కొంది.ఎదురే లేని రారాజుగా నిలిచిందని అటవీ పరిరక్షకులు చెబుతుంటారు. పోరాటాల్లో తగిలిన తీవ్రమైన గాయాల నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు ప్రతికూల పరిస్థితుల్లోనూ గర్వంగా నిలబడింది. అడవిలో ఓర్పుకు చిహ్నంగా మారింది. సాధారణంగా సింహాల గుంపులో 5 నుంచి 20 వరకు ఉంటాయి. కానీ ఈ మృగరాజు మాత్రం 120 సింహాలతో కూడిన పెద్ద గుంపుతో తిరిగేది. అందుకే మసాయి మారాలోని ఇతర జీవులకు ఈ కింగ్‌ అంటే హడల్‌. ‘స్కార్‌ ఫేస్‌ లయన్‌’గా మారింది ఇలా..2012లో ఓ గుంపులోని ఆల్ఫా లయన్‌తో జరిగిన పోరాటంలో కుడి కంటికి, దాని పైభాగంలో లోతైన గాయమైంది. అదే పెద్ద గాటుగా మారిపోయింది. దాంతో దానికి‘స్కార్‌ ఫేస్‌ లయన్‌’గా సందర్శకులు పేరు పెట్టారు. ఈ సింహం 2021 జూన్‌ 11న వృద్ధాప్యంతో మరణించింది. మసాయి మారా రిజర్వ్‌ ఫారెస్ట్‌ సందర్శనకు వచ్చే వారికి ఈ స్కార్‌ ఫేస్‌ లయన్‌ డాక్యుమెంటరీని చూపిస్తారంటే దాని ప్రత్యేకతను అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మృగరాజు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Rasi Phalalu: Daily Horoscope On 24-03-2025 In Telugu10
ఈ రాశి వారికి బాకీలు వసూలవుతాయి.. ఆస్తిలాభం

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.దశమి రా.12.33 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.12.25 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.8.07 నుండి 9.44 వరకు, తిరిగి తె.4.24 నుండి 5.58 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.19 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.44 వరకు, అమృతఘడియలు: సా.5.53 నుండి 7.30 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.05, సూర్యాస్తమయం: 6.07. మేషం.. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆస్తిలాభం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు.వృషభం.... శ్రమ పెరుగుతుంది. బంధువిరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు.పనులు ముందుకు సాగవు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు. అనారోగ్యం.మిథునం... మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు.కర్కాటకం... మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తి ఒప్పందాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.సింహం.... ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.కన్య.... చిన్ననాటి మిత్రుల కలయిక. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు.తుల.... వ్యవహారాలలో ఆటంకాలు. రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.వృశ్చికం... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పదోన్నతులు.ధనుస్సు... మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.మకరం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.కుంభం.. దూరపు బంధువుల కలయిక. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.మీనం... మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సజావుగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement