ఈ రాశి వారికి సంఘంలో గౌరవమర్యాదలు.. వస్తులాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తిక మాసం, తిథి: బ.తదియ ప.12.09 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: మృగశిర రా.3.47 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: ప.10.34 నుండి 12.04 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.57 నుండి 7.38 వరకు, అమృత ఘడియలు: రా.7.34 నుండి 9.04 వరకు, సంకటహరచతుర్ధి.సూర్యోదయం : 6.02సూర్యాస్తమయం : 5.27రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా వ్యతిరేకత. ధనవ్యయం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం.వృషభం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.మిథునం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. పాతమిత్రుల కలయిక. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.సింహం: మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.కన్య: పనుల్లో అవాంతరాలు. కొత్తరుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.తుల: కుటుంబసమస్యలు. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో కొత్త చిక్కులు. ఉద్యోగాలలో పనిభారం.వృశ్చికం: ఆకస్మిక ధనలాభం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి.ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో విజయం. సోదరుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలత.మకరం: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు.కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆత్మీయులతో విభేదాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.మీనం: సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
అక్కడా మన వైద్యులే!
అభివృద్ధి చెందిన దేశాల్లోని వైద్య రంగంలో మన భారతీయ వైద్యులు, నర్సులు వెన్నెముకగా నిలిచారు. ఈ దేశాల్లో పనిచేస్తున్న వైద్యుల సంఖ్య పరంగా తొలి స్థానంలో, నర్సుల సంఖ్యలో రెండవ స్థానంలో నిలిచి భారత్ తన హవాను కొనసాగిస్తోంది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో భారతీయుల సత్తా ప్రపంచానికి తెలియనిది కాదు. ఒక్క ఐటీ నిపుణులే కాదు.. మన వైద్య నిపుణులకూ ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థలకు భారతీయ వైద్య నిపుణులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్–2025 నివేదిక వెల్లడించింది. అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియాతో సహా 38 ఓఈసీడీ సభ్య దేశాలు ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం ఇతర దేశాలపై ఆధారపడటం పెరుగుతోందని తెలిపింది. మనమే టాప్ఓఈసీడీ సభ్య దేశాల్లో ఇతర దేశాలకు చెందిన 8.30 లక్షల మంది వైద్యులు, 17.5 లక్షల మంది నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారు. 38 ఓఈసీడీ సభ్య దేశాల్లోని మొత్తం వైద్యుల్లో 25 శాతం, నర్సుల్లో ఆరింట ఒక వంతు ఇతర దేశాలకు చెందినవారు. వైద్యుల్లో 40%, నర్సుల్లో 37% మంది ఆసియాకు చెందినవారు కావడం విశేషం. ఓఈసీడీ దేశాల్లో సేవలు అందిస్తున్న వైద్యుల విషయంలో సంఖ్య పరంగా భారత్, జర్మనీ, చైనా టాప్–3లో నిలి^éయి. ఇక నర్సుల విషయంలో ఫిలిప్పీన్స్, భారత్, పోలాండ్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఐదుగురు వైద్యులు, నర్సులలో ఒకరు యూరోపియన్ ఎకనామిక్ ఏరియాకు (ఈఈఏ) చెందినవారు.ఆ నాలుగు దేశాలేవిశ్వవిద్యాలయాలు, కళాశాలలు, వృత్తిపరమైన ఉన్నత విద్యా కార్యక్రమాలలో 18 లక్షల నూతన విద్యార్థులకు 2024లో ఓఈసీడీ దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ 3.90 లక్షలు, యునైటెడ్ కింగ్డమ్ 3.84 లక్షల మంది విద్యార్థులకు అనుమతులను జారీచేసి అగ్రగామిగా నిలిచాయి. కెనడా 2.13 లక్షలు, ఆస్ట్రేలియా 1.82 లక్షల మంది విద్యార్థులతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.ప్రధాన దేశంగా..చాలా కాలంగా ఓఈసీడీ దేశాలకు వలస వెళ్తున్నవారిలో అత్యధికులు భారత్, చైనాకు చెందినవారే. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ప్రధాన దేశంగా ఉన్న చైనాను అధిగమించి 2023 వరకు కూడా భారత్ ఆధిక్యంలో కొనసాగింది. ఆ ఏడాది దాదాపు 6,00,000 మంది భారతీయ పౌరులు ఓఈసీడీ సభ్య దేశాలకు వలస వెళ్లారు. 2022తో పోలిస్తే ఈ సంఖ్య 8% పెరిగింది.నలుగురిలో ఒకరు బ్రిటన్కు2023లో భారత్ నుంచి వలసదారులలో దాదాపు నలుగురిలో ఒకరు యునైటెడ్ కింగ్డమ్ను (1,44,000) ఎంచుకున్నారు. ఇందులో 97,000 మంది ఆరోగ్య, సంరక్షణ కార్మిక వీసాలపై వెళ్లారు. కెనడాలో 2023లో 1,40,000 మంది అడుగుపెట్టారు. యునైటెడ్ స్టేట్స్కు 68,000 మంది భారతీయులు ఉపాధి కోసం వలస వెళ్లారు.75వేల డాక్టర్లు మనవాళ్లే2021–23 మధ్య.. ఓఈసీడీ సభ్య దేశాల్లో పనిచేస్తున్న 6.06 లక్షల మంది విదేశీ వైద్యుల్లో 12 శాతం (75,000) మంది భారతీయ డాక్టర్లు. అలాగే 7.33 లక్షల మంది విదేశీ నర్సుల్లో 17 శాతం మంది (1.22 లక్షలు) భారతీయ నర్సులు కావడం విశేషం. అత్యధిక డాక్టర్లు యూకేలో, అత్యధిక నర్సులు యూఎస్లో ఉన్నారు.
దానగుణ సంపన్నులు
మనదేశంలో అగ్రశ్రేణి సంపన్నులు.. సంపాదనపైనే కాదు, సేవా కార్యక్రమాలపైనా దృష్టిపెడుతున్నారు. వీరు విద్య, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ ఏడాది వెచ్చించింది రూ.10 వేల కోట్లకు పైగానే! ‘ఎడెల్గివ్ హురున్ ఇండియా’ తాజాగా విడుదల చేసిన దాతృత్వ సంపన్నుల జాబితాలో ఈ ఏడాది కూడా నాడార్ కుటుంబమే అగ్రస్థానంలో ఉంది. 2024–25లో శివ్ నాడార్ ఫౌండేషన్ అత్యధికంగా రూ.2,708 కోట్ల విరాళాలు ఇచ్చింది. తరవాతి స్థానాల్లో ముకేష్, అంబానీ, బజాజ్ కుటుంబం ఉన్నాయి.‘ఎడెల్గివ్ హురున్ ఇండియా’ జాబితా ప్రకారం.. హెచ్.సి.ఎల్. టెక్నాలజీస్ వ్యవస్థాపకుడైన శివ్ నాడార్, ఆయన కుటుంబం గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు సుమారు రూ.7.4 కోట్లు సేవా కార్యక్రమాలకు వినియోగించింది. మొత్తంగా వారి విరాళాలు 2023–24తో పోలిస్తే 26 శాతం పెరిగాయి. రెండో స్థానంలో ఉన్న రిలయ¯Œ ్స ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, ఆయన కుటుంబం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 54 శాతం ఎక్కువగా రూ. 626 కోట్ల సేవా కార్యక్రమాలకు వెచ్చించింది. బజాజ్ కుటుంబం 27 శాతం ఎక్కువగా రూ. 446 కోట్ల విరాళాలతో మూడో స్థానంలో నిలిచింది.వ్యక్తులు తగ్గి... విరాళం పెరిగిహురున్ ఇండియా తాజా జాబితాలో ఈసారి మొత్తం 191 మంది చోటు దక్కించుకున్నారు. నిరుడు 203 మందికి స్థానం లభించింది. అయితే, సగటు విరాళం గతంతో పోలిస్తే రూ.43 కోట్ల నుంచి రూ. 54 కోట్లు పెరిగింది. కాగా, తాజా జాబితాలోని దాతలు ఇచ్చిన విరాళం మొత్తం రూ.10,380 కోట్లు అని నివేదిక వెల్లడించింది.మనం ప్రపంచానికే ఆదర్శం!చైనాతో పోలిస్తే ఇండియా ఎక్కువ దాతృత్వ గుణం కలిగి ఉందని హురూన్ నివేదిక పేర్కొంది. చైనా జీడీపీ దాదాపు 20 ట్రిలియన్ డాలర్లు కాగా, ఇండియా జీడీపీ 4 ట్రిలియన్ డాలర్ల మాత్రమే. కానీ, మనం దాతృత్వంలో చైనాతో సరితూగుతున్నామని, భవిష్యత్తులో దాతృత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా ఉంటుందని నివేదిక ప్రశంసించింది.టాప్ –10 దాన కర్ణులు1 శివ్ నాడార్ రూ.2,708 కోట్లు విరాళాలరంగాలు: విద్య, కళలు, సామాజిక అభివృద్ధి2 ముకేశ్ అంబానీ రూ.626 కోట్లురంగాలు: ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి3 బజాజ్ రూ.446 కోట్లు రంగాలు: గ్రామీణాభివృద్ధి, సామాజిక కార్యక్రమాలు4 కుమార మంగళం బిర్లా రూ.440 కోట్లురంగాలు: ఆరోగ్య సంరక్షణ, విద్య5 గౌతమ్ అదానీ రూ.386 కోట్లురంగాలు: విద్య, నైపుణ్యాభివృద్ధి6 నందన్ నీలేకని రూ.365 కోట్లురంగాలు: ప్రజారోగ్యం, డిజిటల్ డెవలప్మెంట్7 హిందూజా రూ.298 కోట్లురంగాలు: ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ఆరోగ్యం8 రోహిణీ నీలేకని రూ.204 కోట్లురంగాలు: పర్యావరణం, పాలన, సామాజిక సమానత్వం9 సుధీర్–సమీర్ మెహతా రూ.189 కోట్లురంగాలు: సామాజిక అభివృద్ధి10 సైరస్ పూనావాలా రూ.183 కోట్లురంగాలు: బడుల్లో మౌలిక సదుపాయాలు
అమ్మ సినిమాలు వాస్తవం తెలిపాయి
ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక అమ్మ ఉంటుంది. న్యూయార్క్ మేయర్గా గెలిచి చరిత్ర సృష్టించిన జొహ్రాన్ మమ్దానీ తన ఆలోచనా విధానం, వ్యక్తిత్వం ద్వారానే ఓటర్లను ఆకట్టుకున్నాడు. ‘మా అమ్మ మీరా నాయర్ సినిమాలే నా ఆలోచనలను తీర్చిదిద్దాయి’ అన్నారాయన. మీరా నాయర్ ప్రపంచ సినిమాలో భారతీయ ప్రతిభను చాటిన దర్శకురాలు.‘ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే’ అంటుంటారు. ఇప్పుడు కాస్త మార్చి ‘న్యూయార్క్కు మేయర్ అయినా..అమ్మకు కొడుకే’ అనాలేమో. అవును! 400 ఏళ్ల చరిత్ర ఉన్న న్యూయార్క్ మహా నగరానికి మేయర్గా ఎన్నికైన దక్షిణాసియా తొలి వ్యక్తిగా జోహ్రాన్ మమ్దానీ (34) తాను వార్తలలో ఉండటమే కాదు తల్లి మీరా నాయర్ను కూడా వార్తలలోకి ఎక్కించారు. మేయర్గా గెలిచినందుకు మమ్దానీ ఎంత గర్వపడుతున్నారో అతణ్ణి చూసి మీరా నాయర్ కూడా అంతే గర్వపడుతున్నారు. మమ్దానీ కోసం ఆమె స్వయంగా ప్రచారం చేశారు కూడా. సంచలన సినీ దర్శకురాలిగా పేరు తెచ్చుకుని ఆస్కార్కు నామినేట్ అయిన మీరా ప్రత్యక్షంగా పరోక్షంగా కుమారుణ్ణి ప్రభావితం చేశారు. ప్రత్యక్షంగా పెంపకం ద్వారా అయితే పరోక్షంగా తన సినిమాల ద్వారా. ‘ఎల్ల లోకము ఒక్క ఇల్లై’న్యూయార్క్ మేయర్ ఎలక్షన్ ప్రచారం మొదలైనప్పుడు గెలుపు అవకాశం ఉన్న వ్యక్తుల జాబితాలో పదవ స్థానంలో ఉన్న మమ్దానీ ఒకటవ స్థానానికి ఎగబాకి విజయం సాధించడం సినిమాటిక్గా అనిపించవచ్చు. కాని అతని గెలుపు సినిమాటిక్ కాదు. మమ్దాని ఇచ్చిన నినాదం ‘న్యూయార్క్ వలసవాదుల నగరంగానే ఉంటుంది’ అనేది యాదృచ్చికంగా రాలేదు. తల్లి మీరా నాయర్ సినిమాల ప్రభావంతో అంది పుచ్చుకున్నది. మీరా నాయర్ తీసిన ‘సలాం బాంబే’, ‘మిసిసిపి మసాలా’ పరాయి దేశాల్లో, పరాయి నగరాల్లో తమ స్థాయి, స్థానం కోసం పెనుగులాడే వలసజీవుల కథలు. ‘మీరు మావాళ్లు కాదు వెళ్లిపోండి’ అంటే మానవ పరిణామక్రమం, వలసతో వికసించిన నాగరికతలను నిరాకరించడమే. అందుకే మమ్దాని వలసవాదుల కోసం గట్టిగా నిలబడ్డారు. అలాగే నగరంలో సగటు వ్యక్తి జీవించగలిగేలా, అన్ని సంస్కృతులను ఇనుమడించేలా చూస్తానని మమ్దాని హామీ ఇవ్వడం మీరా నాయర్ ప్రభావమే. యువకుడిగా ఉన్నప్పుడు ఆమె సినిమా సెట్లలో పని చేసేవారు మమ్దాని. స్వతహాగా అతను రాప్ సింగర్ కూడా.వాస్తవ ప్రపంచం‘అమ్మ సినిమాలు చూడటం అంటే వాస్తవ ప్రపంచంలో ఉండటమే’ అంటారు మమ్దాని. వాస్తవికవాద సినిమాలనే మీరానాయర్ తీశారు. ఆమె తీసిన ‘మాన్సూన్ వెడ్డింగ్’ భారతీయ సంపన్న కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న బోలుతనాన్ని చూపితే, ‘నేమ్సేక్’ వలస జీవనంతో భారతీయులు తమ సాంస్కృతిక అస్తిత్వం కోసం చేసే అన్వేషణను చూపుతుంది. మీరా చిత్రాల్లో స్త్రీవాదం ఉంటుంది. అయితే ఆమె మహిళా కథానాయకులు బాధితులు కారు, ఆ బాధల్లోంచి బయటపడాలని భావించేవారు, అందుకు తగ్గ పోరాటాలు చేసేవారు. ఇప్పుడు మమ్దాని ఏ న్యూయార్క్ నగరానికైతే మేయర్ అయ్యారో అదే నగరంపై జరిగిన 9/11 దాడి నేపథ్యంలో మీరానాయర్ ‘ది రిలక్టెంట్ ఫండమెంటలిస్ట్’ సినిమా తీశారు. తల్లికి ఉన్న ఈ బలమైన దృష్టికోణం, వ్యక్తిత్వం, సత్యం వైపు నిలబడే ధీమత్వం తనకు దిశా నిర్దేశం చేసిందంటారు మమ్దాని. తండ్రి మహమూద్ మమ్దానీ కొలంబియా యూనివర్సిటీలో ్ర΄÷ఫెసర్ మాత్రమే కాదు సామ్రాజ్యవాద రాజకీయాల నిపుణుడు కావడం జొహ్రాన్ మమ్దానీకి లాభించింది.మమ్దాని సలహా– మీరా ‘ది నేమ్సేక్’తన జీవితంలోని అతి ముఖ్యమైన నిర్ణయాల్లో తన కుమారుడి సలహా ఉందని మీరా నాయర్ అంటారు. అందుకు ఒక ఉదాహరణ చెబుతారు. ‘ది నేమ్సేక్’ సినిమా తీద్దామనుకుంటున్న సమయంలో ‘హ్యారీ పోటర్–4’కు దర్శకత్వం వహించే అవకాశం మీరాకు వచ్చింది. వార్నర్ బ్రదర్స్ సంస్థ నుంచి వచ్చిన ఆఫర్, ప్రపంచ ప్రఖ్యాత నవల, బోలెడంత డబ్బు, పేరు. కానీ అప్పటికే ‘ది నేమ్సేక్’ పనుల్లో ఆమె నిమగ్నమయ్యారు. ఆ సమయంలో మమ్దానీకి 14 ఏళ్లు. ఇప్పుడేం చేయాలని కొడుకును అడగ్గా, ’అమ్మా! హ్యారీ పోటర్ తీయడానికి చాలామంది దర్శకులున్నారు. కానీ ‘ది నేమ్సేక్’ సినిమా నువ్వే తీయగలవు’ అని చె΄్పాడు. అది చాలా స్వేచ్ఛాయుతమైన, స్పష్టమైన ప్రకటన అని, అందుకే తాను ‘హ్యారీపోటర్’ అవకాశం వదులుకున్నానని ఆమె వివరించారు. ‘నేను ముగింపును నమ్మను, ప్రారంభాలను నమ్ముతాను.‘ అంటారు మీరా నాయర్. ఆ లెక్కన మమ్దానీకి ఇది ప్రారంభం. మేయర్గా ఆయన ఎదుర్కోవాల్సిన సమస్యలు బోలెడున్నాయి. ఎల్లప్పుడూ తల్లి పంచే స్ఫూర్తి ఆయనకు తోడుగా ఉంటుంది.
విజయ్ సేతుపతి, రుక్మిణిలతో ప్రేమకథ
‘ప్రాణం పోసుకున్న’ పెద్దాయన!
113 జెట్ ఇంజిన్ల కొనుగోలుకు జీఈతో హాల్ ఒప్పందం
‘హిల్స్’లో అమీతుమీ
బిహార్లో ఎక్కడా రీపోలింగ్ లేదు: ఈసీ
కేసుల వివరాలు వెల్లడించకపోతే ఎన్నికైన అభ్యర్థిపైనా అనర్హత వేటు: సుప్రీం
క్రికెట్ బెట్టింగ్.. ఖాకీల ‘బ్యాటింగ్’!
దానగుణ సంపన్నులు
ఢిల్లీ ఎయిర్పోర్టులో గందరగోళం
ఆ ప్రాంగణాల్లో కుక్కలు కనపడొద్దు!
ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా పటేలా..
నూయార్క్ మేయర్గా మమ్దానీ - ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
తమిళ సినిమాలో అనసూయ రొమాంటిక్ సాంగ్
దద్దరిల్లుతున్న పెద్ది సాంగ్ ప్రోమో.. దుమ్మురేపుతున్న రామ్ చరణ్ డాన్స్
కొత్తింట్లోకి కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్
అంతలా విసిగించకు.. కావాలంటే నీకు మలిదశలో ఓటేస్తాలే!!
ఒక్క బ్రెజిల్ మోడల్కే ఇస్తే ఎలాగయ్యా! మిగత దేశాల మోడల్స్ గొడవ చేస్తే ఎలా? వారికి కూడా ఇచ్చేయండి!
అఫ్గానిస్తాన్ సంచలనం.. 6 ఓవర్లలో 148 పరుగులు
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ
వారిద్దరూ అద్భుతం.. గంభీర్, నేను ఒక్కటే: సూర్య కుమార్
బంగారం, వెండి, బిట్కాయిన్.. కియోసాకి మరో హెచ్చరిక!
టీమిండియాకు భారీ షాక్..
గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్
నకిలీ మద్యం కేసు.. హోంశాఖకు కొత్త టెన్షన్!
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కష్టాల్లో టీమిండియా
టీసీఎస్ షాకింగ్ శాలరీ.. నెలకు రూ.422 పెరిగితే..
శుక్రవారం సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 17 చిత్రాలు!
విజయ్ సేతుపతి, రుక్మిణిలతో ప్రేమకథ
‘ప్రాణం పోసుకున్న’ పెద్దాయన!
113 జెట్ ఇంజిన్ల కొనుగోలుకు జీఈతో హాల్ ఒప్పందం
‘హిల్స్’లో అమీతుమీ
బిహార్లో ఎక్కడా రీపోలింగ్ లేదు: ఈసీ
కేసుల వివరాలు వెల్లడించకపోతే ఎన్నికైన అభ్యర్థిపైనా అనర్హత వేటు: సుప్రీం
క్రికెట్ బెట్టింగ్.. ఖాకీల ‘బ్యాటింగ్’!
దానగుణ సంపన్నులు
ఢిల్లీ ఎయిర్పోర్టులో గందరగోళం
ఆ ప్రాంగణాల్లో కుక్కలు కనపడొద్దు!
ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా పటేలా..
నూయార్క్ మేయర్గా మమ్దానీ - ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
తమిళ సినిమాలో అనసూయ రొమాంటిక్ సాంగ్
కొత్తింట్లోకి కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్
అంతలా విసిగించకు.. కావాలంటే నీకు మలిదశలో ఓటేస్తాలే!!
అఫ్గానిస్తాన్ సంచలనం.. 6 ఓవర్లలో 148 పరుగులు
ఒక్క బ్రెజిల్ మోడల్కే ఇస్తే ఎలాగయ్యా! మిగత దేశాల మోడల్స్ గొడవ చేస్తే ఎలా? వారికి కూడా ఇచ్చేయండి!
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ
వారిద్దరూ అద్భుతం.. గంభీర్, నేను ఒక్కటే: సూర్య కుమార్
బంగారం, వెండి, బిట్కాయిన్.. కియోసాకి మరో హెచ్చరిక!
టీమిండియాకు భారీ షాక్..
గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్
నకిలీ మద్యం కేసు.. హోంశాఖకు కొత్త టెన్షన్!
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కష్టాల్లో టీమిండియా
టీసీఎస్ షాకింగ్ శాలరీ.. నెలకు రూ.422 పెరిగితే..
శుక్రవారం సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 17 చిత్రాలు!
బంగారం కొనబోతే.. పసిడి ప్రియులకు నిరాశ
సినిమా
కిచ్చా సుదీప్ యాక్షన్ మూవీ.. టీజర్ వచ్చేసింది!
కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటిస్తోన్న తాజా చిత్రం మార్క్. ఈ యాక్షన్ ఓరియంటెడ్ మూవీకి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సత్యజ్యోతి ఫిల్మ్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మార్క్ ఇంట్రో పేరుతో పవర్ఫుల్ యాక్షన్ టీజర్ విడుదల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కిచ్చా సుదీప్ యాక్షన్, ఫైట్స్ అభిమానలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీతో సుదీప్ సరికొత్త మార్క్ క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. కాగా.. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. Here it is,, The Teaser,, a small sneek peek into the world of#MarkTheFilm.This Christmas. https://t.co/bLprnhCXL7 @VKartikeyaa @AJANEESHB @iampriya06 @shekarchandra71 @ganeshbaabu21 @shivakumarart @kevinkumarrrr @subbu6panchu @iYogiBabu @Naveenc212 @gurusoms…— Kichcha Sudeepa (@KicchaSudeep) November 7, 2025
లెజెండ్ హీరోయిన్ పవర్ఫుల్ రోల్.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్!
లెజెండ్ హీరోయిన్ రాధికా ఆప్టే(Radhika Apte) లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం సాలీ మొహబ్బత్. ఈ మూవీలో మరోసారి పవర్ఫుల్ రోల్లో కనిపించనుంది. ఈ సినిమాకు టిస్కా చోప్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. గతేడాది రిలీజవుతుందని ప్రకటించిన ఈ మూవీ ఇప్పటి వరకు థియేటర్లకు రాలేదు.తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. సాలీ మొహబ్బత్ను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మూవీని త్వరలోనే జీ5 వేదికగా మీ ముందుకు రానుందని ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనేది మాత్రం వెల్లడించలేదు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించారు. ఈ సినిమాను జియో స్టూడియోస్ సమర్పణలో స్టేజ్5 ప్రొడక్షన్ బ్యానర్లో జ్యోతి దేశ్పాండే, దినేశ్ మల్హోత్రా, మనీశ్ మల్హోత్రా నిర్మించారు. Kabhi dard, toh kabhi sukoon deti hai..Yeh Saali Mohabbat na jaane kya kya karwati hai!#SaaliMohabbat, coming soon on #ZEE5#SaaliMohabbatOnZEE5@radhika_apte @divyenndu @anuragkashyap72 @anshumaanpushk1 #SauraseniMaitra #SharatSaxena @tiscatime #JyotiDeshpande… pic.twitter.com/WCnR9Sc9vg— Jio Studios (@jiostudios) November 7, 2025
'ఓజీ' సుజీత్ డైరెక్షన్లో సచిన్.. ఫొటోలు వైరల్
రెండు నెలల క్రితం 'ఓజీ' సినిమాతో సక్సెస్ అందుకున్న తెలుగు దర్శకుడు సుజీత్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ ఫొటోలు పోస్ట్ చేశాడు. ఏకంగా దిగ్గజ సచిన్తో తాను పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. అలా అన్నీ కలిసొచ్చాయని రాసుకొచ్చాడు. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: 'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?)రన్ రాజా రన్, సాహో, ఓజీ సినిమాలతో టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకడిగా మారిపోయాడు. ప్రస్తుతం నానితో ఓ డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ తీస్తున్నాడు. చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు గానీ కొన్నిరోజుల క్రితమే అధికారికంగా పూజా కార్యక్రమంతో లాంచ్ చేశారు. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్' చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత సుజీత్ దర్శకత్వంలో నటిస్తాడు.మరి అంతలోపు ఖాళీగా ఉండటం ఎందుకు అనుకున్నాడేమో గానీ సుజీత్.. కమర్షియల్ యాడ్ షూట్ తీశాడు. ఓ పెయిటింగ్ సంస్థకు సంబంధించిన యాడ్ ఇది కాగా.. ఇందులో దిగ్గజ సచిన్ టెండూల్కర్ యాక్ట్ చేశారు. గతవారం విదేశాల్లో దీన్ని చిత్రీకరించారు. ఆ షూటింగ్ జ్ఞాపకాలని సుజీత్ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
సమంత గ్లామర్.. పాతకాలం హీరోయిన్లా రుక్మిణి
ఓ రేంజు గ్లామర్ చూపించేస్తున్న సమంతపాతకాలం హీరోయిన్లా రుక్మిణి వసంత్మోడ్రన్ డ్రస్సులో మాయ చేసేలా రకుల్ ప్రీత్రష్మిక మందాన 'ద గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాలుకాంత ప్రమోషన్లలో అందంగా భాగ్యశ్రీ బోర్సేబెంజ్ కారుపై రొమాంటిక్ పోజులతో అషూరెడ్డి View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Prem Jacob (@premtheactor) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14)
న్యూస్ పాడ్కాస్ట్
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
ఏపీ సీఎం చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి... ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం సాగిస్తాం... మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి.
కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం
Chevella Bus Incident: రెప్పపాటులో ప్రమాదం అతివేగం వల్లే జరిగింది
మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట... తొమ్మిది మంది భక్తులు మృతి... 20 మందికి పైగా గాయాలు
ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకంలో భారీ కోత... ఈ ఏడాది 13 శాతానికిపైగా తగ్గిన పనుల కల్పన
క్రీడలు
అర్జున్, హరికృష్ణ విజయం
పనాజీ: ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్లో భారత నంబర్వన్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్... చెక్ రిపబ్లిక్లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ... తమిళనాడుకు చెందిన ప్రణవ్ శుభారంభం చేశారు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ తొలి గేమ్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ అర్జున్ 30 ఎత్తుల్లోషమ్సిదిన్ వొఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, ప్రపంచ 36వ ర్యాంకర్ హరికృష్ణ 25 ఎత్తుల్లో డేనియల్ దర్ధా (బెల్జియం)పై... ప్రపంచ 86వ ర్యాంకర్ ప్రణవ్ 102 ఎత్తుల్లో టిటాస్ స్ట్రెమావిసియస్ (లిథువేనియా)పై విజయం సాధించారు. నేడు జరిగే రెండో గేమ్ను అర్జున్, హరికృష్ణ, ప్రణవ్‘డ్రా’ చేసుకుంటే నాలుగో రౌండ్కు అర్హత సాధిస్తారు. మరోవైపు భారత్కే చెందిన క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద, ప్రాణేశ్, దీప్తాయన్ ఘోష్, ఎస్ఎల్ నారాయణన్, విదిత్ సంతోష్ గుజరాతి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ మూడో రౌండ్లో తమ తొలి గేమ్లను ‘డ్రా’ చేసుకున్నారు. గుకేశ్–ఫ్రెడరిక్ స్వెన్ (జర్మనీ) గేమ్ 34 ఎత్తుల్లో... ప్రజ్ఞానంద–రాబర్ట్ హోవ్నిసియాన్ (అర్మేనియా) గేమ్ 30 ఎత్తుల్లో... ప్రాణేశ్–విన్సెంట్ కీమర్ (జర్మనీ) గేమ్ 85 ఎత్తుల్లో... దీప్తాయన్–గాబ్రియేల్ సర్గాసియన్ (అర్మేనియా) గేమ్ 60 ఎత్తుల్లో... నారాయణన్–యు యాంగీ (చైనా) గేమ్ 117 ఎత్తుల్లో... విదిత్–స్యామ్ షాంక్లాండ్ (అమెరికా) గేమ్ 32 ఎత్తుల్లో... కార్తీక్ వెంకటరామన్–డేనియల్ బొగ్డాన్ (రొమేనియా) గేమ్ 65 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. నేడు వీరి మధ్య జరిగే గేమ్లో గెలిచిన వారు నాలుగో రౌండ్కు చేరుకుంటారు. గేమ్లు ‘డ్రా’ అయితే ఆదివారం టైబ్రేక్ ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.
AP: ఎంఎస్కే ప్రసాద్కు ఘోర అవమానం
టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్, ఆంధ్రప్రదేశ్ మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్కు ఘోర అవమానం జరిగింది. మహిళల వన్డే ప్రపంచకప్-2025 విన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణికి స్వాగతం పలికేందుకు ఎంఎస్కే ఇవాళ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లగా.. అక్కడి ప్రోటోకాల్ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. జాబితాలో పేరు లేదని బయటికి పంపించారు.ఎయిర్పోర్ట్లో తనకు జరిగిన అవమానాన్ని సీరియస్గా తీసుకున్న ఎంఎస్కే సీఎంఓలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లోని (ఏసీఏ) కొందరు ముఖ్యులపై బీసీసీఐకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. భారత సీనియర్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్గా వ్యవహరించిన తనకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం శ్రీచరణి అభినందన కార్యక్రమానికి కూడా ఎంఎస్కే హాజరు కాలేదు. విమానాశ్రయం నుంచి జరిగిన ర్యాలీ లో కూడా కనిపించలేదు. సీఎం చంద్రబాబు, లోకేష్తో శ్రీచరణి భేటికి కూడా వెళ్లలేదు.కాగా, విమానాశ్రయంలోని ఎంట్రీ లాంజ్లోకి చాలామంది రాజకీయ నాయకులను అనుమతిచ్చిన ప్రోటోకాల్ సిబ్బంది.. టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ అయిన ఎంఎస్కే ప్రసాద్ను మాత్రం అనుమతించలేదు.
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న బుమ్రా
టీమిండియా స్టార్ పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో రేపు (నవంబర్ 8) జరుగబోయే ఐదో టీ20లో (India vs Australia) ఓ వికెట్ తీస్తే.. టీ20 ఫార్మాట్లో 100 వికెట్లు పూర్తి చేసుకోవడంతో పాటు మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా రికార్డు నెలకొల్పుతాడు. ఇప్పటివరకు ఏ భారత బౌలర్ మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీయలేదు. టీ20ల్లో అర్షదీప్ సింగ్ మాత్రమే ఇప్పటివరకు 100 వికెట్లు పూర్తి చేశాడు. రేపటి మ్యాచ్లో బుమ్రా ఓ వికెట్ తీస్తే.. టీ20ల్లో సెంచరీ కొట్టిన రెండో భారత బౌలర్గా నిలుస్తాడు.ప్రస్తుతం బుమ్రా 79 టీ20ల్లో 99 వికెట్లు తీశాడు. అర్షదీప్ 67 మ్యాచ్ల్లో 105 వికెట్లు తీశాడు. ఓవరాల్గా టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ 108 టీ20ల్లో 182 వికెట్లు తీసి, ప్రస్తుత తరం బౌలర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.అరుదైన మైలురాయికి చేరువలో అభిషేక్, తిలక్రేపటి మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ కూడా ఓ అరుదైన మైలురాయిపై కన్నేశారు. అభిషేక్ 11, తిలక్ 4 పరుగులు చేస్తే టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుంటారు. రేపటి మ్యాచ్లో ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లు కూడా ఓ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. స్టోయినిస్, మ్యాక్స్వెల్ తలో వికెట్ తీస్తే టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకుంటారు.ఇదిలా ఉంటే, భారత్-ఆసీస్ మధ్య రేపు జరుగబోయే మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని తేలుస్తుంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ వరుసగా మూడు, నాలుగు మ్యాచ్లు గెలిచి 2-1 ఆధిక్యంలో ఉంది. రేపటి మ్యాచ్లోనూ గెలిస్తే టీమిండియా హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో పాటు సిరీస్ కైవసం చేసుకుంటుంది. తద్వారా ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించిన ఘనతను సొంతం చేసుకుంటుంది. బ్రిస్బేన్ వేదికగా జరుగబోయే రేపటి మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు మొదలవుతుంది.తుది జట్లు (అంచనా)..ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (సి), మాథ్యూ షార్ట్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ (డబ్ల్యుకె), జోష్ ఫిలిప్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్లెట్, ఆడమ్ జంపాభారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (సి), జితేష్ శర్మ (WK), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిచదవండి: పాక్ బౌలర్ ఓవరాక్షన్.. టీమిండియా ప్లేయర్ల పట్ల అనుచిత ప్రవర్తన
పెళ్లైన తర్వాత కోహ్లి పూర్తిగా మారిపోయాడు.. అప్పుడు అన్నా అంటే..
టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ బ్యాటర్ మొహమ్మద్ కైఫ్ (Mohammed Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెళ్లైన తర్వాత కోహ్లి పూర్తిగా మారిపోయాడని తెలిపాడు. ఇక తండ్రిగా ప్రమోషన్ పొందిన తర్వాత విరాట్ తన దూకుడు స్వభావానికి విరుద్ధంగా పూర్తిగా నెమ్మదస్తుడైపోయాడని వెల్లడించాడు.పెళ్లైన తర్వాత కోహ్లి పూర్తిగా మారిపోయాడుయూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో కైఫ్నకు కోహ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. విరాట్ కోహ్లి మారిపోయాడు. ఇప్పుడు కాస్త నెమ్మదస్తుడు అయ్యాడు. అతడు ఒక తండ్రి.పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత కోహ్లిలో చాలా మార్పు వచ్చింది. ఐపీఎల్లో ఆర్సీబీ- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఇటీవల అతడిని కలిశాను. ఇద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం.కగిసో రబడ బౌలింగ్లో ఆరోజు కోహ్లి ఫోర్ బాదాడు. ఆ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు. నిజంగా కోహ్లి చాలా కామ్గా ఉన్నాడు. ఒకవేళ తాను ముందుగానే రబడపై బ్యాట్తో విరుచుకుపడకపోతే.. అతడు తనను పరుగులు రాబట్టనివ్వడని చెప్పాడు.అందుకే తొలి బంతి నుంచే అటాకింగ్ మొదలుపెట్టానని అన్నాడు. ప్రస్తుత ఆటగాళ్లలో అభిషేక్ శర్మ ఇలాగే ఆడుతున్నాడు. కోహ్లి అద్భుతమైన క్రికెటర్. రోజురోజుకీ తన ఆటను మెరుగుపరచుకుంటున్నాడు. హడావుడి లేకుండా నెమ్మదిగా తన పని తాను చేసుకుపోతున్నాడు.అప్పుడు అన్నా అంటే..ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవం, రికార్డుల తర్వాత కూడా తను నాతో వ్యవహరించే విధానంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. అపుడు నన్ను అన్నా అని పిలిస్తే.. ఇప్పుడు కూడా అలాగే పిలుస్తున్నాడు. తనతో కలిసి ఆడిన వాళ్లకు తగిన గౌరవం ఇస్తాడు. ఎంత ఎదిగినా ఇతరులతో వ్యవహరించే తీరులో మాత్రం అతడు మారలేదు. అయితే, మునుపటి కంటే కాస్త నెమ్మదస్తుడు అయ్యాడని చెప్తాను’’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు.ముచ్చటైన కుటుంబంకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి.. 2017, డిసెంబరు 11న ఆమెను పెళ్లాడాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. గోప్యత దృష్ట్యా ఇంతవరకు తమ పిల్లల ముఖాలను విరుష్క జోడీ బయటి ప్రపంచానికి చూపించనేలేదు. వీరు ప్రస్తుతం లండన్లోనే ఎక్కువగా నివాసం ఉంటున్నారు.ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో డకౌట్ అయిన కింగ్.. మూడో వన్డేలో హాఫ్ సెంచరీ (74 నాటౌట్) బాది ఫామ్లోకి వచ్చాడు. తదుపరి సొంతగడ్డపై సౌతాఫ్రికాతో సిరీస్తో కోహ్లి రీఎంట్రీ ఇస్తాడు.చదవండి: ఈ క్రికెటర్ని గుర్తుపట్టారా?.. అప్పుడేమో బొద్దుగా.. ఇప్పుడు ఇలా..
బిజినెస్
ఏమిటి ఈ వైబ్కోడింగ్.. ఉపయోగాలేమిటి?
ఇటీవలి కాలంలో ‘వైబ్కోడింగ్’ అనే మాట బాగా పాపులర్ అయింది. డిక్షనరీలలో కూడా చేరింది. కంప్యూటర్ సైంటిస్ట్, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ ఏఐ కోఫౌండర్ ఆండ్రెజ్ కర్పతి (Andrej Karpathy) ద్వారా ‘వైబ్కోడింగ్’ అనేది ప్రాచుర్యం పొందింది. కోడర్ల నుంచి సామాన్యుల వరకు ‘వైబ్కోడింగ్’ చేస్తున్నారు.ఇంతకీ ఏమిటి ఈ వైబ్కోడింగ్? సాఫ్ట్వేర్ను సృష్టించడానికి చాట్బాట్ ఆధారిత విధానాన్ని అనుసరించడమే వైబ్కోడింగ్. ఇందులో డెవలపర్ ఒక ప్రాజెక్ట్ లేదా పనికి సంబంధించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం)కు వివరిస్తారు. ఇది ప్రాంప్ట్ ఆధారంగా కోడ్ను జనరేట్ చేస్తుంది. అయితే డెవలపర్ కోడ్ను ఎడిట్, రివ్యూ చేయడంలాంటివేమీ చేయడు. మార్పులు చేర్పులు చేసి మరింత మెరుగు పరచాలనుకుంటే ‘ఎల్ఎల్ఎం’ని అడుగుతాడు. స్థూలంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో విస్తృత శిక్షణ. నైపుణ్యం లేని అమెచ్యూర్ ప్రోగ్రామర్స్ కూడా వైబ్కోడింగ్ ద్వారా సాఫ్ట్వేర్ సృష్టించవచ్చు. ‘న్యూయార్క్ టైమ్స్’ జర్నలిస్ట్ కెవిన్ రూస్ ‘వైబ్కోడింగ్’ మెథడ్ను ఉపయోగించి ఎన్నో స్మాల్ స్కేల్ అప్లికేషన్లను రూపొందించాడు.‘మెనుజెన్’లాంటి ప్రోటోటైప్లను నిర్మించడానికి ‘వైబ్కోడింగ్’ మెథడ్ను ఉపయోగించాడు. ఏదైనా ఎర్రర్ కనిపించినప్పుడు ఆ ఎర్రర్ మెసేజెస్ను కామెంట్ లేకుండానే సిస్టమ్లో కాపీ, పేస్ట్ చేసేవాడు. దీనితో జరిగిన లోపాలను ఏఐ సవరిస్తుంది. వైబ్ మార్కెటింగ్, వైబ్ డిజైనింగ్, వైబ్ అనలిటిక్స్, వైబ్ వర్కింగ్...ఇలా రకరకాలుగా ‘వైబ్కోడింగ్’ పాపులర్ అయింది.‘వైబ్కోడింగ్’లో సానుకూల విషయాలు ఉన్నా విమర్శలు కూడా ఉన్నాయి. ‘జవాబుదారీతనం లోపిస్తుంది’ ‘భద్రతా సమస్యలు ఏర్పడతాయి’ ‘కార్యాచరణ పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఏఐ సృష్టించిన కోడ్ను ఉపయోగించడం వల్ల గుర్తించబడని బగ్లు, లో΄ాలు, భద్రతాపరమైన సమస్యలు ఏర్పడతాయి’...అనేవి ఆ విమర్శల్లో కొన్ని. ప్రోగ్రామర్లు కానివారిని కూడా ఫంక్షనల్ సాఫ్ట్వేర్ను రూపొందించడానికి ‘వైబ్కోడింగ్’ వీలు కల్పిస్తున్నప్పటికీ ఈ మెథడ్ ద్వారా ‘వందశాతం కరెక్టే’ అనుకోవడానికి లేదు. ఊహించినంత ఫలితాలు రాకపోవచ్చు. ఊహించింది ఒకటి అయితే ఫలితం మరోలా ఉండవచ్చు.‘లవబుల్’ అనేది స్వీడీష్ వైబ్ కోడింగ్ యాప్. ఈ యాప్ కోసం రూపొందించిన కోడ్లో భద్రతా లోపాలు ఉన్నాయని, లవబుల్ వెబ్అప్లికేషన్లలో వ్యక్తిగత సమాచారాన్ని ఎవరైనా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉందని...ఇలా ఎన్నో లోపాలు బయటపడ్డాయి. ఒక ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లో ఫేక్ రివ్యూలు సృష్టించడానికి ఈ మెథడ్ను ఉపయోగించుకున్నారు. వైబ్కోడింగ్ గురించి ‘ఐ జస్ట్ సీ థింగ్స్, సే థింగ్స్, రన్ థింగ్స్, అండ్ కాపీ థింగ్స్’ అని కాస్త గొప్పగా చెప్పిన ఆండ్రేజ్ కూడా ఈ మెథడ్లోని పరిమితుల గురించి ఎన్నో సందర్భాలలో చెప్పాడు. కొన్ని బగ్స్ రిపేర్కు సంబంధించి టూల్స్ విఫలమయ్యాయి అనేది అందులో ఒకటి.
బంగారం vs రియల్ ఎస్టేట్: ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ బెస్ట్?
డబ్బు ఉంటే.. పెట్టుబడి పెట్టడానికి లెక్కలేనన్ని మార్గాలు కనిపిస్తాయి. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ వద్దనుకునేవారిలో చాలామంది.. బంగారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. ఇంతకీ ఇన్వెస్ట్ చేయడానికి బంగారం ఉత్తమమైనదా?, లేక రియల్ ఎస్టేట్ మంచి మార్గమా? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.బంగారంబంగారంపై పెట్టుబడి సురక్షితమైన మార్గాల్లో ఒకటిగా భావిస్తారు. దీనికి కారణం.. చిన్న మొత్తంలో గోల్డ్ ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు, అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు. దీనికి ప్రత్యేకించి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు.సావరిన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయడం ద్వారా కూడా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. వీటిని రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) ద్వారా.. భారత ప్రభుత్వం తరఫున జారీ చేస్తారు. ప్రస్తుతం ఇవి అందుబాటులో లేదు. కానీ ఇందులో పెట్టే పెట్టుబడి భారీ లాభాలను అందిస్తుంది. ఇవి కాకుండా గోల్డ్ ETFలను కొనుగోలు చేయవచ్చు.బంగారంపై మీరు పెట్టే పెట్టుబడు.. ధరల కదలికపై ఆధారపడి ఉంటుంది. అంటే గోల్డ్ రేటు పెరిగితే లాభాలను పొందుతారు. గోల్డ్ రేటు తగ్గితే.. గోల్డ్ విక్రయించేటప్పుడు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. పసిడిపై పెట్టే పెట్టుబడి నష్టాలను కలిగించే అవకాశం లేదని స్పష్టమవుతోంది.రియల్ ఎస్టేట్రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. ఈ కారణంగానే కొందరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. భూములు, ఇళ్లు మొదలైనవాటిపై పెట్టే పెట్టుబడి కొన్ని రోజులకు రెట్టింపు లాభాన్ని తీసుకొస్తుంది. అయితే లాభం కోసం కొన్ని రోజులు వేచి చూడాలి.భూములపై పెట్టుబడిపెట్టే సమయంలో.. వాటికి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేదా అని చూసుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగ్గా లేకుంటే.. ఊహకందని నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అయితే.. బంగారం అమ్మినట్లు, భూమిని వెంటనే అమ్ముకోలేరు. అమ్ముకోవడానికి కూడా కొంత సమయం వేచి చూడాలి. అప్పుడే మీరు మంచి లాభాలను పొందవచ్చు. దీనికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, జీఎస్టీ, బ్రోకరేజ్ వంటి ఖర్చులు కూడా ఉంటాయి.ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ బెస్ట్?నిజానికి బంగారం, రియల్ ఎస్టేట్ రంగాలలో పెట్టె పెట్టుబడి మంచిదే. అయితే పెట్టుబడి పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారం ఆభరణాల రూపంలో కొనాలా.., బిస్కెట్లు, కడ్డీల రూపంలో కొనుగోలు చేయాలా? అనే విషయాలను ముందుగానే తెలుసుకోవాలి.రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా.. ఎక్కడ కొనుగోలు చేయాలి, వాటికి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా? అనే విషయాలతోపాటు.. మీ బడ్జెట్ ఎంత? అనే విషయాలను ముందుగానే బేరీజు వేసుకుని ముందడుగు వేయాలి. పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఏ రంగంలో అయినా నష్టాలను చవిచూడక తప్పదు. అవసరమైన కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు తీసుకోవాలి.ఇదీ చదవండి: ఇల్లు కొనడానికి ఈఎంఐ: టెకీ సలహా..
షుగర్ ఉన్నోళ్లకు నో వీసా!.. ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వీసాల విషయంలో సంచనల ప్రకటన చేశారు. షుగర్, ఒబెసిటీ ఉన్నవాళ్లకు యూఎస్ వీసా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఈమేరకు కొత్త గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ నిబంధనలు వెంటనే అమలు చేయాలని ఎంబసీలు, కాన్యులర్ కార్యాలయాలకు ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినట్లు.. అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.అమెరికా వీసా కోసం అప్లై చేసుకునే దరఖాస్తుదారుల ఆరోగ్య పరిస్థితిని.. ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలించేవారు. స్క్రీనింగ్ టెస్టుల ద్వారా టీబీ వంటి అంటువ్యాధులు ఉన్నాయా? లేదా?, అనే చెక్ చేసేవారు. ఇప్పుడు తాజాగా.. డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే.. అలాంటి వారికి కూడా వీసా ఇచ్చే అవకాశం లేదు.దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిని అమెరికాలోకి ఆహ్వానిస్తే.. భవిష్యత్తులో కొన్ని సమస్యలు తలెత్తుతాయని, ఆ సమస్యలు ప్రభుత్వ ఖజానాపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. కాబట్టి కొన్ని వ్యాధులున్న దరఖాస్తుదారులు అమెరికాలోకి రానివ్వకపోతే సమస్యలకు చెక్ పెట్టినట్లే అవవుతుంది. ఇలాంటివన్నీ ఆలోచించే.. డయాబెటిస్, ఊబకాయం ఉండే వారికి అమెరికా వీసా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.షుగర్, ఒబెసిటీ వంటి వ్యాధులకు దీర్ఘకాలిక చికిత్స అవసరమవుతుంది. దీనికోసం లక్షల డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కుటుంబ సభ్యులపై ఎక్కువ ఆర్ధిక భారం మోపుతోంది. దీనికి ప్రభుత్వం ఏమైనా సాయం అందించాలా?, లేకుంటే ప్రభుత్వం సహాయం లేకుండా.. కుటుంబ సభ్యులే సొంతంగా ఖర్చును భరించగలరా? అనే విషయం మీద స్పష్టత ఏర్పరచుకోవాలి. వలసదారుల వల్ల.. అమెరికాలో ఇబ్బందులు తలెత్తకూడదని ట్రంప్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంది.ఇప్పటి వరకు అనేక కారణాల వల్ల వీసాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలానే ఇన్నాయి. కానీ.. ఇప్పుడు మధుమేహం, ఊబకాయం ఉంటే కూడా అమెరికా వీసా పొందలేరు. దీన్నిబట్టి చూస్తే.. వీసాలను మరింత పరిమితం చేయడానికి ట్రంప్ కంకణం కట్టుకున్నట్లు అర్థమవుతోంది.ఇదీ చదవండి: టయోటా కీలక నిర్ణయం: 10 లక్షల కార్లపై ప్రభావం!
అందరూ తెలుసుకోవాల్సిన EPFO కొత్త రూల్స్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అంటే తెలియని ప్రైవేటు ఉద్యోగులు ఉండరు. దీని పరిధిలో సుమారు 8 కోట్ల మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు. ఇది కేవలం పదవీ విరమణ పొదుపు సాధనంగానే కాకుండా ఉద్యోగులకు తొలి దీర్ఘకాలిక పెట్టుబడి కూడా. సభ్యులకు సేవలను సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ నిబంధనలలో అనేక మార్పులు చేసింది.ఉద్యోగ మార్పుల సమయంలో పీఎఫ్ నిధుల బదిలీ ప్రక్రియలో సమస్యలు ఎక్కువగా ఉండటంతో, ఈపీఎఫ్వో ఇటీవల భారీ మార్పులు చేసింది. ఇప్పుడు బదిలీలు వేగంగా, సులభంగా, ఆటోమేటిక్ జరుగుతున్నాయి. ఇంతకీ పీఎఫ్ ట్రాన్స్ఫర్కు సంబంధించి చేసిన తాజా మార్పులు ఏంటో ఈ కింద చూద్దాం..ఇవి ప్రధాన మార్పులుఆటోమేటిక్ బదిలీఇంతకు ముందు ఉద్యోగులు ఫారం 13 ద్వారా మాన్యువల్గా బదిలీకి దరఖాస్తు చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఉద్యోగి కొత్త సంస్థలో చేరిన వెంటనే, కొత్త యజమాన్యం చేరిన తేదీని అప్డేట్ చేసిన తర్వాత, ఈపీఎఫ్ బదిలీ ఆటోమేటిక్గా ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో కంపెనీ యాజమాన్యం ప్రమేయం అవసరం లేదు.ఒకే యూఏఎన్ఇప్పటి నుంచి ఒక ఉద్యోగికి ఒక్క యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మాత్రమే ఉంటుంది. ఆధార్ ఆధారిత ధృవీకరణతో కొత్త యూఏఎన్ను సృష్టించేందుకు వీలుండదు. దీంతో పాత, కొత్త పీఎఫ్ ఖాతాలు ఆటోమేటిక్ ఒకే యూఏఎన్కు లింక్ అవుతాయి. తద్వారా ఎక్కువ ఖాతాల విలీనం అవసరం తగ్గుతుంది.వేగవంతమైన ధృవీకరణఈపీఎఫ్ఓ ఆధార్ ఆధారిత ఈ-సైన్, ఏపీఐ ఇంటిగ్రేషన్ ద్వారా కంపెనీ యాజమాన్యాల ధృవీకరణను వేగవంతం చేసింది. ఇంతకుముందు 30–45 రోజులు పట్టిన బదిలీలు ఇప్పుడు 7–10 రోజుల్లో పూర్తవుతున్నాయి.పాస్బుక్లో కంబైన్డ్ బ్యాలెన్స్బదిలీ పూర్తయిన తర్వాత పాత ఖాతా “జీరో బ్యాలెన్స్” చూపుతుంది. కొత్త పాస్బుక్లో పాతది కొత్తది మొత్తం బ్యాలెన్స్ కనిపిస్తుంది. దీంతో ఉద్యోగులు తమ ఖాతాల్లో ఎంత మొత్తం ఉన్నది సులభంగా ట్రాక్ చేయగలరు.నిష్క్రమణ తేదీ తప్పనిసరిమునుపటి కంపెనీ యాజమాన్యం ఉద్యోగి నిష్క్రమణ తేదీని అప్డేట్ చేయకపోవడం వల్ల బదిలీలు ఆలస్యం కావడం సాధారణం. ఇప్పుడు ఇది తప్పనిసరి. యాజమాన్యం అప్డేట్ చేయకపోతే, ఉద్యోగి ఆధార్ ఓటీపీ ద్వారా తన నిష్క్రమణ తేదీని స్వయంగా ప్రకటించవచ్చు.బదిలీ సమయంలోనూ వడ్డీఇంతకు ముందు బదిలీ సమయంలో పాత ఖాతాలో ఉన్న మొత్తంపై వడ్డీ ఆగిపోయేది. ఇప్పుడు బదిలీ పూర్తయ్యే వరకు కూడా వడ్డీ కొనసాగుతుందని ఈపీఎఫ్వో స్పష్టం చేసింది.ఈ మార్పులతో ఈపీఎఫ్ బదిలీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా, సులభంగా మారింది. తమ సంస్థల యాజమాన్యాలపై ఆధారపడకుండా ఉద్యోగులు స్వతంత్రంగా తమ పీఎఫ్ నిధులను నిర్వహించగలుగుతున్నారు. ఇది ఉద్యోగ మార్పుల సమయంలో సమయం, ఆందోళన రెండింటినీ తగ్గించి, ఈపీఎఫ్ వ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది.
ఫ్యామిలీ
అలా చేస్తేనే విజయం తథ్యం..! ఐఏఎస్ పారి బిష్ణోయ్ సక్సెస్ స్టోరీ
యూపీఎస్సీ ప్రయాణంలో ఎన్నో ప్రతికూలతలు, ఎదురుదెబ్బలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిశ్శబ్ద పోరాటంతో ఐఏఎస్ సాధించింది పారి బిష్ణోయ్(Pari Bishnoi ). ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తాను ఎదుర్కొన్న ఒత్తిడి, తన ప్రయాణంలో అత్యంత కష్టమైన దశ గురించి వివరించింది. యూపీఎస్సీలో మొదటి ప్రయత్నంలో విఫలం అయినప్పుడు రాజస్థాన్లోని తన స్వస్థలానికి వెళ్లింది పారి. ప్రపంచం నుండి తనను తాను దూరం చేసుకొని ఒంటరి ప్రపంచంలోకి వెళ్లిపోయింది. తట్టుకోలేని ఒత్తిడిలో బాగా తినేది. దీంతో 30 కిలోలకు పైగా బరువు పెరిగింది! మానసిక భారంతో పాటు శారీరక భారం కూడా తనను భయపెట్టింది. దీంతో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. పొద్దుటే లేచి వ్యాయామాలు చేసి బరువు తగ్గింది. మనసు తేలిక పడింది. తేలిక పడిన మనసు తిరిగి లక్ష్యం వైపు దృష్టి సారించింది.‘ఈసారి ఎలాగైనా సాధించాల్సిందే’ అని తనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. పరీక్ష ప్రిపరేషన్కు సంబంధించిన వ్యూహాన్ని మెరుగుపరుచుకుంది. దృఢనిశ్చయంతో అనుకున్నది సాధించింది.పారి బిష్ణోయ్ షేర్ చేసిన వీడియో ఇప్పటికే పది లక్షల లైక్లను దాటింది. View this post on Instagram A post shared by Pari Bishnoi (@pari.bishnoii) (చదవండి: మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!)
బాడీషేమింగ్ చేస్తే తక్షణ శిక్ష తప్పదు!
మామూలుగానైతే భార్య మొబైల్ నంబరును సేవ్ చేసుకోడానికి ‘జానూ’, ‘సోనా’ అనో లేదా ‘బంగారం’ అనో... ఇలా రకరకాల ముద్దు పేర్లు పెట్టుకుంటుంటారు. మరికొందరు శిరీషకు ‘సిరి’ అనీ, దీపికకు ‘దీపూ’ అంటూ షార్ట్కట్లో షార్ట్ పేర్లూ పెట్టుకోవడం మనకు తెలిసిన విషయమే. కాపురంలో కొద్దికాలం గడిచాక ఆమెలో నచ్చని అంశాలేవైనా కనిపించినా సదరు ముద్దుపేర్లకు బదులుగా తన కోపాన్నీ, కసినీ సైలెంటుగా వెల్లడించుకునేలా ‘దెయ్యం’ అనో, ‘రాక్షసి’ అంటూ వయొలెంటు పేర్లు పెట్టుకోవాలనుకున్నా అలా చేయకపోవడమే మంచిదంటూ టర్కీలో జరిగిన ఓ ఉదంతం తెలుపుతోంది. టర్కీలో ఓ ప్రబుద్ధుడికి భార్య మీద కోపం వచ్చింది. ఆమె కాస్తంత లావుగా ఉండటంతో ఆమె పేరును ‘టాంబిక్’ అంటూ సేవ్ చేసుకున్నాడు ఆ మహానుభావుడు. అంతే... ఆ అంశం మీద అతడికి జరిమానా విధిస్తూ... అతడి వల్ల తన భార్యకు కలిగిన మనోవేదనకు గాను పరిహారం, విడాకులూ మంజూరయ్యాయి. ఇంతకీ ‘టాంబిక్’ అంటే టర్కీలో స్థూలకాయాన్ని (ఛబ్బీ) తెలిపే పదం. ఇది కేవలం స్థూలకాయాన్ని సూచించే పదం మాత్రమే కాదు... ఏ ‘బండ’దనో, ‘మొద్దు’దనో, ‘లడ్డు’దనో... ఇలా కాస్తంత దురర్థమో, నిందార్థమో ఇచ్చేలాంటి వాడుక మాట కావడంతో... అలా సేవ్ చేసుకున్న ఆ భర్తకు కోర్టులో మొట్టికాయలు తప్పలేదు. పైగా ఓ అమ్మాయి స్థూలకాయాన్ని ఎగతాళి చేసేలా ఆమె పేరును అభ్యంతరకరమైన పదాలతో సేవ్ చేసుకున్నందుకు ఆ భర్తకు భారీ జరిమానా విధించింది అక్కడి కోర్టు. అంతేకాదు.. పరోక్ష దూషణే అయినా... ఫోన్లో అలాంటి అభ్యంతరకరమైన మాటతో భార్యపేరు సేవ్ చేసుకున్నందున ఆమెకు కలిగిన మనోవేదనను పరిగణనలోకి తీసుకుని వెంటనే విడాకులు సైతం మంజూరు చేసింది టర్కీ కోర్టు. (చదవండి: మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!)
మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!
మా పెళ్లయి ఆరు సంవత్సరాలయింది. ఇద్దరు పిల్లలు. మాది అన్యోన్య దాంపత్యమే. అయితే. ఇటీవలే ఆయనకు ఒకావిడతో పరిచయం అయింది. అప్పటినుంచి నన్నూ, పిల్లలనీ పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావడం, వెళ్లడం.... అదేమని అడిగితే, నా ఇష్టం అని సమాధానం చెబుతారు. నామీద ఎంతో ఇష్టంతో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా నాతో ఉన్నాయన ఈ మధ్య నాకు క్రమేపీ దూరమై మరో మహిళకు దగ్గరవుతున్నారు. మా బంధువులు ఇది తెలుసుకుని ఆయనకు ఆమె మందుపెట్టి తనవైపు తిప్పుకున్నదని, అందుకే ఆమె వ్యామోహంలో పడిపోయి ఉంటాడని చెబితే రెండుసార్లు మందు కూడా కక్కించాం. అయినా ఆయనలో ఎలాంటి మార్పూ రాలేదు. మళ్లీ ఇంకోసారి మందు కక్కించమంటున్నారు. అసలు నిజంగా ఒక వ్యక్తిని మందుపెట్టి ఇలా లోబరచుకోవడం జరుగుతుందా? మేము ఎన్నిసార్లు కక్కించాలి?– స్వరాజ్యలక్ష్మి, తణుకుమందుపెట్టడం, మందు కక్కించడం రెండూ ఫార్సే! అనాదిగా మనలో నాటుకు΄ోయిన మూఢనమ్మకాలకు ఇది నిదర్శనం తప్ప వీటిలో ఏమాత్రం నిజం లేదు. విషప్రయోగం చే సి, ఒక వ్యక్తిని హత్య చేయవచ్చేమోగాని, ఒక వ్యక్తిని లొంగదీసుకోవడానికి మనసు మార్చి మరొకరివైపు మళ్లించడానికి మందులంటూ ఏమీ లేవు. ఉండవు. మనకున్న కొన్ని నమ్మకాల వల్ల మందు పెట్టడం, మంత్రం వేయడం, చేతబడి చేయించడం లాంటివి ఉన్నాయని మన పూర్వీకులు మనకు నూరి΄ోశారు. ఈ మూఢనమ్మకాలను ఆధారం చేసుకుని మందు పెట్టే వారు కొందరు, ఆ పెట్టిన మందును కక్కించే స్పెషలిస్టులు కొందరూ తయారయ్యారు. ఎప్పుడో కొన్ని రోజుల కిందట పెట్టిన మందులు మాకులూ ఇన్నాళ్లు కడుపులో ఉందే అవకాశమే లేదు. అది జీర్ణమైనా అవాలి లేదా విరేచనం ద్వారా రెండు రోజుల్లో బయటపడాలే తప్ప అన్నేసి రోజులు అలాగే లోపల అంటిపెట్టుకుని΄ోయే అవకాశమే లేదు. శాస్త్రీయమైన ఇలాంటి నిజాలు తెలియక చాలామంది అవన్నీ నిజమని మీలాగా అ΄ోహపడుతుంటారు. ఇప్పటికయినా మీరు ఆ పెట్టని మందును కక్కించే ప్రయత్నాలు విరమించి, మీ ఆయన ఎందుకలా మూడోవ్యక్తి వైపు ఆకర్షితులవుతున్నారో ఆలోచించండి. మీలో నచ్చనిది, ఆవిడలో నచ్చినది ఏదైనా ఉందేమో మీకు మీరుగా ఆలోచించండి లేదా ఓర్పుగా నేర్పుగా ఆయన నుంచి తెలుసుకుని నిదానంగా ఆయనను మళ్లీ మీవైపు తిప్పుకునే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు మీలో ఎలాంటి నెగటివ్స్ లేకపోయినా, కొందరు మగవారు మనస్తత్వరీత్యా ఇలా ఇతరులవైపు ఆకర్షితులవుతారు. అదే నిజమైతే, మీరు ఇద్దరూ కలిసి మానసిక నిపుణులను సంప్రదిస్తే, వారు మరింత లోతుగా పరిశీలించి ఇరువురికీ కౌన్సెలింగ్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.( మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి:
అడవి – ఆమె
చిన్నప్పుడు ‘అనగనగా ఒక అడవి ఉంది’ లాంటి కథలు మాత్రమే కాదు... అడవులు పర్యావరణానికి ఎంత ప్రాణప్రదమో చెప్పే కథలెన్నో విన్నది రీటా. కట్ చేస్తే... రీటా బెనర్జీ ఇప్పుడు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వైల్డ్లైఫ్ ఫిల్మ్మేకర్. ‘అదిగో...అడవి మాట్లాడుతోంది వినండి’ అంటాయి ఆమె చిత్రాలు. గ్రీన్ ఆస్కార్ (పాండా అవార్డ్)లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్లు అందుకుంది.రీటా బెనర్జీకి అడవి చిరకాల నేస్తం. వైల్డ్లైఫ్ ఫిల్మ్మేకర్గా మూడు దశాబ్దాల ప్రయాణంలో అడవితో ఆమెకు ఎంతో అనుబంధం ఉంది. అడవి లోతుపాతులు తెలిసిన సూక్ష్మగ్రాహి. ది టర్టిల్ డైరీస్, ది వైల్డ్ మీట్ ట్రయల్, ది అమూర్ ఫాల్కన్ స్టోరీ, ఏ షాల్ టు డైఫర్... మొదలైన చిత్రాలలో అడవి సూక్ష్మరూపం నుంచి విశ్వరూపం వరకు చూపించింది.ఎ షాల్ టు డై ఫర్టిబెటన్ జింకకు ముప్పు పొంచి ఉంది. ఈ జింక ఉన్నిని కోసి షాతుష్ శాలువాలు నేస్తారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. షాతుష్ శాలువాల వ్యాపారం నిషేధించినప్పటికీ చాటుమాటుగా జరుగుతూనే ఉంది. వైల్డ్లైఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ కశ్మీర్లోయలో నిర్వహించిన సర్వేలో షాతుష్ శాలువాల తయారీలో 14,293 మంది వరకు పాల్గొంటున్నారని తేలింది. జమ్మూ కశ్మీర్ వణ్య్రపాణుల సంరక్షణ చట్టంలోని లొసుగులు ఉపయోగించుకొని అక్రమంగా షాతుష్ శాలువాలు నేస్తున్నారు. ఈ అక్రమాలు ఎందుకు కొనసాగుతున్నాయి అనేదాని గురించి ‘ఎ షాల్ టు డై ఫర్’ చిత్రాన్ని తీసింది రీటా బెనర్జీ.పర్యావరణం, వన్య్రపాణుల చిత్రాలకు సంబంధించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సీఎంఎస్లో ఈ చిత్రం ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో టెక్నికల్ ఎక్స్లెన్స్ అవార్డ్ గెలుచుకుంది.శక్తిమంతమై దృశ్యభాషపంచ్ డైలాగ్లకు కాదు ‘పవర్ ఆఫ్ విజువల్ వొకాబులరీ’కి అధిక ప్రాధాన్యత ఇస్తుంది రీటా. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రొఫెసర్లు. ప్రకృతి ప్రేమికులు. చిన్న వయసు నుంచి పర్యావరణ హిత విషయాలను పిల్లలకు చెబుతుండేవారు. ప్రమాదంలో ఉన్న పాములను రక్షించేవాడు తండ్రి. వారి ఇంటి వెలుపల ఉన్న గుల్మొహర్ చెట్టుకు పక్షిగూళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. కాలేజీ రోజుల్లో రీటాకు పాత ఆగ్ఫా అనలాగ్ కెమెరాను బహుమతిగా ఇచ్చాడు తండ్రి. ఆ కెమెరా తనకు కొత్తదారిని చూపించింది. ఫిల్మ్మేకింగ్లోకి రావడానికి ఆ పాత కెమెరా తొలి మెట్టు అయింది. డిగ్రీ పూర్తయిన తరువాత ‘రివర్బ్యాంక్ స్టూడియోస్’లో చేరింది. ప్రముఖ పర్యావరణవేత్త మైక్ పాండే నడుపుతున్న స్టూడియో అది.కెమెరా లెన్స్లో నుంచి ప్రతిసారీ రీటాకు కొత్త ప్రపంచం కనిపించేది.గ్రీన్హబ్ నెట్వర్క్అస్సాంలోని తేజ్పూర్లో ‘గ్రీన్హబ్ నెట్వర్క్’ ప్రారంభించిన రీటా, ఈశాన్య భారతంలోని మారుమూల గ్రామాల యువత పర్యావరణ అంశాలను డాక్యుమెంట్ చేసేలా తీర్చిదిద్దింది. ‘అడవి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవడానికి ఫిల్మ్మేకింగ్ ఉపకరిస్తుంది. చెట్టు నుంచి పుట్ట వరకు ప్రతిదీ అడవికి తమ వంతుగా సహాయపడుతుంది. అవి అడవితో పాటు వృద్ధి చెందుతాయి. ఈ సమష్టి వృద్ధి అందమైనది. ఎన్నో విషయాలు నేర్చుకోదగినది’ అంటుంది రీటా.అరుణాచల్ప్రదేశ్లోని నైషీ తెగ ప్రజలకు జంతువులతో అనుబంధం ఉన్నప్పటికీ, మాంసం కోసం వాటిని వేటాడుతారు. వాటి ఈకలు, ఎముకలను అమ్ముకుంటారు. ఇలాంటి విషయాలెన్నో ‘ది వైల్డ్ మీట్ ట్రయల్’ చిత్రం ద్వారా చూపించింది రీటా. ఈ చిత్రం పాండా అవార్డ్ గెలుచుకుంది. ‘వేట అనేది పరిశ్రమ స్థాయికి చేరి రాష్ట్రాల సరిహద్దులను దాటింది. వన్య ప్రాణులకు వేట ఎలా ముప్పుగా మారిందో మా చిత్రం ద్వారా చూపాం’ అంటుంది రీటా.నేషనల్ జాగ్రఫిక్ అశోకా అవార్డ్, సీఎంఎస్ పృథ్వీరత్న అవార్డ్, ఆర్బీఎస్ ఎర్త్ హీరోలాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులతో పాటు మూడు గ్రీన్ ఆస్కార్ అవార్డ్లు అందుకుంది రీటా బెనర్జీ.వెలగాలి ఆశాదీపాలుఏమాత్రం ఇక ఆశ లేదు అని మనం ఆగిపోతే నిజంగానే ఏమీ జరగదు. ఆశాదీపాలు వెలిగితేనే ఆ వెలుగులో సమస్యలకు పరిష్కారాలు చూపే కొత్త దారులు కనిపిస్తాయి. ఒక లక్ష్యం అంటూ ఏర్పాటు చేసుకొని పనిచేస్తుంటే ఎక్కడో ఒకచోట తప్పకుండా ఫలితం దక్కుతుంది. అపనమ్మకాలతో కాకుండా ఏదీ చేసినా గట్టి విశ్వాసంతో చేయాలి. సమస్యలలాగే వాటి పరిష్కారాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. అయితే ఆ పరిష్కారాల వైపు మనం దృష్టి పెడుతున్నామా లేదా అనేది అసలు సమస్య. ఉదాహరణకు... తీ ర్రపాంతాలలో నివసించే ప్రజల మాట మనం నిజంగా వింటున్నామా? వారితో కలిసి పనిచేస్తున్నామా? ఆ అనుభవాల నేపథ్యంలో సరిౖయెన నిర్ణయాలు తీసుకుంటున్నామా లేదా అనేది ఆలోచించాలి.– రీటా బెనర్జీ
ఫొటోలు
టీమిండియా టీ20 మ్యాచ్లో కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)
ముద్దమందారం అంతా క్యూట్గా బ్రిగిడ (ఫొటోలు)
రష్మిక 'ద గర్ల్ఫ్రెండ్' సినిమా (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో నటి దివి (ఫొటోలు)
Kamal Haasan: బార్బర్ షాపులో పనిచేసి.. విశ్వనటుడిగా ఎదిగి.. (ఫోటోలు)
చీరలో చందమామే.. అందరి చూపులు తనపైనే! (ఫోటోలు)
'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్ ఈవెంట్లో సినీ ప్రముఖులు (ఫోటోలు)
కాంత ట్రైలర్ లాంచ్.. ఒకే వేదికపై దుల్కర్, రానా (ఫోటోలు)
ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)
#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
అంతర్జాతీయం
మమ్దాని ఎవరైతే నాకేంటి?
న్యూయార్క్: అమెరికాలో పెద్ద నగరమైన న్యూ యార్క్ మేయర్గా ఎన్నికైన డెమొక్రటిక్ సోషలిస్ట్, భారతీయ అమెరికన్ యువకుడు జొహ్రాన్ మమ్దా నిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అతడి పేరు ఎదైనా కావొచ్చు, అతడు ఎవరైతే నాకేంటి? అని హేళన చేశారు. అమెరికా ప్రజలు కమ్యూనిజం కావాలో లేక కామన్సెన్స్ కావాలో తేల్చుకొనే సమయం వచ్చిందని అన్నారు. మియామీలో అమెరికా బిజినెస్ ఫోరమ్లో ట్రంప్ ప్రసంగించారు. గత ఏడాది నవంబర్ 5న అమెరికా ప్రజలు తనను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకు న్నారని, తద్వారా దేశ సార్వభౌమత్వాన్ని పునరుద్ధ రించారని చెప్పారు. కానీ, మంగళవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో సార్వభౌమత్వాన్ని కొంత కోల్పో యినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇకపై ఏదైనా జరిగితే తాను చూసుకుంటానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. న్యూయార్క్లో జరిగింది నిజానికి భయానక ఘటన అని అభివర్ణించారు. అలా జరగకూడదని తాను కోరుకున్నానని.. కానీ, జరిగిపోయిందని చెప్పారు. ‘‘న్యూయార్క్లో ఉన్న వ్యక్తి పేరు (మమ్దాని) ఏదైనా కావొచ్చు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతడు ఎవరైతే నాకేంటి? మహిళల క్రీడల్లో పురుషులు ఆడడం ఎలా ఉంటుందో ఆలోచించండి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. డెమొక్రటిక్ పార్టీ న్యూయార్క్లో ఒక కమ్యూనిస్ట్ని మేయర్గా ప్రతిష్టించిందని ట్రంప్ మండిపడ్డారు. అమెరికాలో కమ్యూనిజం ఏనాడూ పనిచేయలేదని గుర్తుచేశారు. సోషలిస్ట్ను కాదను కొని అదేస్థానంలో కమ్యూనిస్ట్ను తలకెత్తు కోవడం ఏమిటని ప్రశ్నించారు. అమెరికాను కమ్యూనిస్ట్ క్యూబాగా, సోషలిస్ట్ వెనుజులా మార్చడానికి తమ ప్రత్యర్థులు కుట్రలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. క్యూబా, వెనుజులాలో ఏం జరుగుతోందో చూస్తూనే ఉన్నామని చెప్పారు. డెమొక్రాట్లు అతివాదులుగా మారుతున్నారని ఆరోపించారు. కమ్యూనిజం పాలనలో ఉన్న న్యూయార్క్ నుంచి వచ్చేవారితో మియామీ శరణార్థి శిబిరంగా మారిపోతుందేమోనని డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తంచేశారు. కమ్యూనిస్ట్లు, మార్క్సిస్ట్లు, సోష లిస్ట్లు, గ్లోబలిస్ట్లతో విధ్వంసమే తప్ప ఒరిగిదేమీ ఉండదని తేల్చిచెప్పారు. తాను అధికా రంలో ఉన్నంత కాలం అమెరికా ఎట్టిపరిస్థితుల్లో కమ్యూ నిస్ట్ దేశంగా మారబోదని ట్రంప్ పేర్కొన్నారు.
New York: ‘మోమోస్’తో మమ్దానీ.. లంచ్ మీట్ స్పెషల్
న్యూయార్క్: న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించి, సరికొత్త రికార్డులు నెలకొల్పారు. అమెరికాలోని ప్రముఖ నగరానికి సారధ్యం వహించే తొలి ముస్లిం నేతగా, ఈ పదవిని చేపట్టిన మొదటి దక్షిణాసియా వ్యక్తిగా, అత్యంత పిన్నవయస్కుడు(34)అయిన మేయర్గా గుర్తింపు పొందారు.న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ తొలిరోజున డెమొక్రాట్ ఫైర్బ్రాండ్ అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్తో పాటు లంచ్ మీట్లో భారతీయ భోజనం చేశారు. భారత సంతతికి చెందిన మమ్దానీ తన మొదటి రోజు షెడ్యూల్ ఇంటర్వ్యూలు, సమావేశాలతో గడిచింది. అయితే ‘జాక్సన్ హైట్స్లోని లాలిగురాస్ బిస్ట్రోలో మా కాంగ్రెస్ మహిళా నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్తో కలసి భోజనం చేయడం ఎంతో ప్రత్యేకమైనది’ అని జోహ్రాన్ మమ్దానీ తన ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు. A busy first day as your Mayor-elect: early morning interviews, transition announcements and meetings. More to say on all of it tomorrow. But a highlight was lunch with my Congresswoman @AOC at Laliguras Bistro in Jackson Heights. pic.twitter.com/vKWpNyrI09— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) November 6, 2025దీనికి సంబంధించిన ఫొటోలో భారతీయ వంటకాలైన మోమోలు, దమ్ ఆలూ, పనీర్ టిక్కాతోపాటు టీని వారు ఆస్వాదించినట్లు తెలుస్తోంది. ఇది అతని దక్షిణాసియా వారసత్వానికి గుర్తుగా కనిపిస్తోంది. లాలిగురాస్ బిస్ట్రో అనేది జాక్సన్ హైట్స్లోని ఒక భారతీయ- నేపాలీ రెస్టారెంట్. కాగా మమ్దానీ మేయర్ పదవికి పోటీ పడేందుకు మద్దతు పలికిన కొద్దిమంది డెమొక్రాట్లలో ఒకాసియో-కోర్టెజ్ కూడా ఉన్నారు. మమ్దానీ తన తొలి ప్రసంగంలో భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసిద్ధ ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగంలోని వాక్యాలను గుర్తుచేశారు. మేయర్ విజయోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘ధూమ్’ సినిమా బీట్స్ వినిపించాయి.ఇది కూడా చదవండి: ‘పిచ్చి పని’.. రాహుల్ ‘ఫొటో’పై కంగుతిన్న మోడల్
‘పిచ్చి పని’.. కంగుతిన్న మోడల్
న్యూఢిల్లీ: హార్యానా ‘ఓట్ చోరీ’ ఆరోపణల సందర్భంగా రాహుల్ గాంధీ చూపిన ఫొటోపై బ్రెజిలియన్ మోడల్ లారెస్సా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఈ మోడల్ ఫొటోతో ఏకంగా 22 పేర్లు నమోదై ఉన్నాయని రాహుల్ గాంధీ బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ ఎన్నికల జాబితాలో ఓ బ్రెజిలియన్ మోడల్ ఫొటో ఉండటం ఏమిటని ఆయన ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో లారెస్సా ఎక్స్ వేదికపై స్పందించారు. రాహుల్ ఆరోపణలపై బ్రెజిలియన్ మోడల్ లారిస్సా స్పందిస్తూ ఇది నమ్మశక్యంగా లేదని అన్నారు. తన వాదనను ఆమె ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్టు చేస్తూ వివరించారు. భారతదేశంలో ఎన్నికల ప్రయోజనాల కోసం తన చిత్రాన్ని దుర్వినియోగం చేయడంపై ఆమె ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఆమె పోర్చుగీస్ భాషలో మాట్లాడుతూ ‘గైస్, నేను మీకు ఒక జోక్ చెబుతాను... ఇది చాలా విచ్రితమైనది.. వారు నా పాత ఫొటోను ఉపయోగించారు. అది నా చిన్నప్పటిది. భారతదేశంలో ఓటు వేయడానికి నా ఫొటోను వాడారు. ఒకరితో ఒకరు పోరాడేందుకు నన్ను భారతీయురాలిగా చిత్రీకరించారు. ఎంత పిచ్చి పనో చూడండి’ అని అన్నారు. The name of the Brazilian Model seen in @RahulGandhi's press conference is Larissa. Here's her reaction after her old photograph went viral. pic.twitter.com/K4xSibA2OP— Mohammed Zubair (@zoo_bear) November 5, 2025ఈ వీడియోలో లారిస్సా.. ఒక రిపోర్టర్ ఇన్స్టాగ్రామ్లో తనను భారతదేశ ఎన్నికల్లో ఓటు వేయడం గురించి అడిగారని వెల్లడించారు. ఇదేవిధంగా తన స్నేహితుడొకరు ఇదే ఫొటోను పంపారన్నారు. ఇది ‘నమ్మశక్యం కానిది’, ‘వింతైనది’ అని ఆమె పేర్కొన్నారు. కాగా బ్రెజిలియన్ మోడల్ లారిస్సా పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. LIVE: #VoteChori Press Conference - The H Files https://t.co/IXFaH9fEfr— Rahul Gandhi (@RahulGandhi) November 5, 2025ఇది కూడా చదవండి: ‘ఏడు కాదు ఎనిమిది’.. ట్రంప్ సరికొత్త వాదన
‘ఏడు కాదు ఎనిమిది’.. ట్రంప్ సరికొత్త వాదన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్-పాక్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చానంటూ పాడినపాటే పాడారు. అలాగే భారత్-పాకిస్తాన్ వివాదంలో ఏడు విమానాలు కూలిపోయాయనే నిరాధార వాదనను మళ్లీ వినిపించారు. అయితే ఈసారి విమానాల సంఖ్యను పెంచడం విశేషం. ఆ రెండు అణ్వాయుధ దేశాలతో తాము వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని బెదిరించిన తర్వాతనే అవి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయని ట్రంప్ అన్నారు.మయామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో మాట్లాడిన ట్రంప్ తాను.. భారత్- పాక్ మధ్య శాంతి నెలకొనేందుకు మధ్యవర్తిత్వం వహించానని మరోమారు అన్నారు. ‘నాడు నేను భారత్- పాకిస్తాన్లతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నాను. ఇంతలో ఒక వార్తాపత్రిక మొదటి పేజీలో.. వారు యుద్ధానికి దిగుతున్నారని చదివాను. ఏడు విమానాలు తగలబడ్డాయి. ఎనిమిదవది చాలావరకూ ధ్వంసం అయ్యింది. మొత్తం ఎనిమిది విమానాలు కాలిపోయాయి..’ అవి రెండూ అణ్వాయుధ దేశాలు. ‘మీరు శాంతికి అంగీకరిస్తే తప్ప నేను మీతో ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోను’ అని నేను వారికి చెప్పాను’ అని ట్రంప్ అన్నారు.అయితే ఢిల్లీ- ఇస్లామాబాద్లు యుద్ధం ముప్పును వ్యతిరేకించాయి. ఈ ఘర్షణకు వాణిజ్య ఒప్పందాలతో సంబంధం లేదని తెలిపాయని ట్రంప్ పేర్కొన్నారు. వెంటనే తాను స్పందిస్తూ ‘మీరు అణ్వాయుధ శక్తులు. నేను మీతో వ్యాపారం చేయడం లేదు. మీరు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగినప్పుడు మేము మీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోవడం లేదు’ అని స్పష్టం చేశానని ట్రంప్ పేర్కొన్నారు. ఆ మర్నాడే ఆ రెండు దేశాలు శాంతి ఒప్పందం చేసుకున్నాయని తనకు ఫోన్ వచ్చిందని ట్రంప్ తెలిపారు. దీంతో తాను వారితో ‘ధన్యవాదాలు.. వాణిజ్యం చేద్దాం’ అని చెప్పానన్నారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదనను భారత్ తిరస్కరించింది. పాకిస్తాన్ కమాండర్లు ఈ దాడిని ఆపాలంటూ భారత సైన్యాన్ని వేడుకున్న దరిమిలా, మే 10న కాల్పుల విరమణ జరిగిందని భారత్ స్పష్టం చేసింది. అయితే ట్రంప్.. అమెరికా మధ్యవర్తిత్వ చర్చల తర్వాతనే భారత్- పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇప్పటివరకూ 60 సార్లు చెప్పారని చేశారని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది పౌరులను దారుణంగా హతమార్చిన దరిమిలా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. ఈ నేపధ్యంలోనే భారత్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది.ఇది కూడా చదవండి: ‘ఇక మొదలెడదాం’.. తొలి పోస్టులో మమ్దానీ
జాతీయం
ఒక మంత్రం.. ఒక శక్తి..స్ఫూర్తి
న్యూఢిల్లీ: వందేమాతరం... ఒక మంత్రం, ఒక శక్తి, ఒక స్వప్నం, ఒక సంకల్పం అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వందేమాతరం గేయం తరతరాలుగా మనకు నూతన స్ఫూర్తిని, శక్తిని ఇస్తూనే ఉందని అన్నారు. ప్రఖ్యాత బెంగాలీ సాహితీవేత్త బంకించంద్ర చటర్జీ రచించిన జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాబోయే ఏడాది పాటు దేశవ్యాప్తంగా జరిగే స్మారకోత్సవాలను ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్, నాణేన్ని విడుదల చేశారు. సామూహిక గేయాలాపనలో పాల్గొన్నారు. భారత స్వాతంత్య్ర సమరానికి వందేమాతరం బలమైన గళంగా నిలిచిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ప్రతి భారతీయుడి మనసులోని భావాలను వ్యక్తీకరించిందని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తూ 1937లో వందేమాతరం గేయంలోని ముఖ్యమైన చరణాలను తొలగించారని తప్పుపట్టారు. గేయానికి అసలైన ఆత్మలాంటి చరణాలు కనిపించకుండాపోయాయని అన్నారు. వందేమాతరం గేయానికి చేసిన గాయం చివరకు దేశ విభజనకు బీజం వేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ నిర్మాణానికి చోదకశక్తి అయిన ఈ మహామంత్రానికి అన్యాయం ఎందుకు జరిగిందో ఈనాటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆ విభజన ఆలోచనా విధానం ఈనాటికీ మన దేశానికి సవాలు విసురుతోందని వ్యాఖ్యానించారు. దుర్గామాతగా మారగలం మన జాతీయ గేయం ప్రతి తరానికీ సమకాలీనమేనని ప్రధాని మోదీ వివరించారు. ఆపరేషన్ సిందూర్ను ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశ భద్రత, గౌరవంపై దాడికి దిగిన ముష్కరులకు తిరుగులేని గుణపాఠం నేరి్పంచామని చెప్పారు. నూతన భారతదేశంలో మానవాళికి సేవ చేసే ‘కమల, విమల స్ఫూర్తి’తోపాటు అవసరమైతే దుర్గామాతగా మారడం కూడా మనకు తెలుసని స్పష్టంచేశారు. పది రకాల ఆయుధాలు చేతబూని ఉగ్రవాదులను అంతం చేయగలమని పేర్కొన్నారు. ముష్కరులు మరోసారి మనవైపు కన్నెత్తి చూసే సాహసం చేస్తే ప్రాణాలతో వదిలిపెట్టబోమని పరోక్షంగా హెచ్చరించారు. మళ్లీ స్వర్ణయుగంలోకి.. విజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పునాదులపై మన దేశాన్ని గొప్పగా నిర్మించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారతదేశ సౌభాగ్యం గురించి ప్రపంచం కొన్ని శతాబ్దాలుగా వింటోందని అన్నారు. కేవలం కొన్ని శతాబ్దాల క్రితం ప్రపంచ జీడీపీలో మన జీడీపీ నాలుగింట ఒక వంతు ఉండేదని తెలిపారు. బంకించంద్ర చటర్జీ వందేమాతర గేయాన్ని రచిస్తున్న సమయంలో దేశం స్వర్ణయుగాన్ని కోల్పోయిందని అన్నారు. విదేశీ దండయాత్రలు, దోపిడీ, దౌర్జన్యాలు, అరాచకాలు, వలసవాద విధానాలు మనదేశాన్ని పీల్చిపిప్చి చేశాయని, పేదరికం, ఆకలితో దేశం అల్లాడిపోయిందని గుర్తుచేశారు. భారతదేశం ఎప్పటికైనా పునరై్వభవం సాధించాలని బంకించంద్ర చటర్జీ కలలుగన్నారని చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా మళ్లీ స్వర్ణయుగంలోకి ప్రవేశించాలంటూ బోధించారని తెలిపారు. ఆ దిశగా వందేమాతరం అనే మహోన్నతమైన పిలుపును ఇచ్చారని ప్రధానమంత్రి శ్లాఘించారు. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవాలి బ్రిటిష్ వలసవాదులు వారి దుష్ట పాలనను సమర్థించుకోవడానికి భారత్ను వెనుకబడిన దేశంగా, తక్కువ స్థాయి కలిగిన దేశంగా చిత్రీకరించారని ప్రధాని మోదీ ఆక్షేపించారు. వందేమాతరం గేయం ఆ తప్పుడు ప్రచారాన్ని ఫటాపంచలు చేసిందని అన్నారు. దేశం అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం అని భావించేవారిని.. ఈ గేయం దేశాన్ని ఒక తల్లిగా అభివరి్ణంచడం చాలా ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. మన దృష్టిలో తల్లి అంటే జన్మనిచి్చ, పోషించడమే కాకుండా బిడ్డ ప్రమాదంలో ఉంటే కాపాడుకొనే గొప్ప వ్యక్తి, దుషు్టలను దునుమాడే శక్తి అని వెల్లడించారు. వందేమాతరం అసలైన స్వప్నాన్ని సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ విజయం సాధిస్తోందన్నారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్య సాధన దిశగా దేశం వేగంగా పరుగులు తీస్తోందని పేర్కొన్నారు. మనం ప్రతిసారీ ఒక కొత్త ఘనత సాధించినప్పుడు దేశమంతటా వందేమాతరం ప్రతిధ్వనిస్తోందని హర్షం వ్యక్తంచేశారు. మన ఆడబిడ్డలు కీలక రంగాల్లో విజయాలు సొంతం చేసుకున్నప్పుడు దేశ ప్రజలంతా వందేమాతరం అంటున్నారని తెలియజేశారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ పథకానికి 11 ఏళ్లు పూర్తయ్యాయని ప్రధానమంత్రి వివరించారు. ఉగ్రవాదం, నక్సలిజం, మావోయిస్టు తీవ్రవాదాన్ని ఓడించినప్పుడల్లా మన సైనిక దళాలు వందేమాతరం అని నినదిస్తున్నాయని చెప్పారు. వందేమాతరం స్మారకోత్సవాలు 2026 నవంబర్ 7వ తేదీదాకా కొనసాగుతాయి. ఈ గేయాన్ని బంకించంద్ర చటర్జీ 1875 నవంబర్ 7న అక్షయ నవమి సందర్భంగా రచించారు. అనంతరం ఆయన రాసిన ఆనంద్మఠ్ నవలలో ఈ గేయాన్ని చేర్చారు.
అక్కడా మన వైద్యులే!
అభివృద్ధి చెందిన దేశాల్లోని వైద్య రంగంలో మన భారతీయ వైద్యులు, నర్సులు వెన్నెముకగా నిలిచారు. ఈ దేశాల్లో పనిచేస్తున్న వైద్యుల సంఖ్య పరంగా తొలి స్థానంలో, నర్సుల సంఖ్యలో రెండవ స్థానంలో నిలిచి భారత్ తన హవాను కొనసాగిస్తోంది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో భారతీయుల సత్తా ప్రపంచానికి తెలియనిది కాదు. ఒక్క ఐటీ నిపుణులే కాదు.. మన వైద్య నిపుణులకూ ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థలకు భారతీయ వైద్య నిపుణులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్–2025 నివేదిక వెల్లడించింది. అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియాతో సహా 38 ఓఈసీడీ సభ్య దేశాలు ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం ఇతర దేశాలపై ఆధారపడటం పెరుగుతోందని తెలిపింది. మనమే టాప్ఓఈసీడీ సభ్య దేశాల్లో ఇతర దేశాలకు చెందిన 8.30 లక్షల మంది వైద్యులు, 17.5 లక్షల మంది నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారు. 38 ఓఈసీడీ సభ్య దేశాల్లోని మొత్తం వైద్యుల్లో 25 శాతం, నర్సుల్లో ఆరింట ఒక వంతు ఇతర దేశాలకు చెందినవారు. వైద్యుల్లో 40%, నర్సుల్లో 37% మంది ఆసియాకు చెందినవారు కావడం విశేషం. ఓఈసీడీ దేశాల్లో సేవలు అందిస్తున్న వైద్యుల విషయంలో సంఖ్య పరంగా భారత్, జర్మనీ, చైనా టాప్–3లో నిలి^éయి. ఇక నర్సుల విషయంలో ఫిలిప్పీన్స్, భారత్, పోలాండ్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఐదుగురు వైద్యులు, నర్సులలో ఒకరు యూరోపియన్ ఎకనామిక్ ఏరియాకు (ఈఈఏ) చెందినవారు.ఆ నాలుగు దేశాలేవిశ్వవిద్యాలయాలు, కళాశాలలు, వృత్తిపరమైన ఉన్నత విద్యా కార్యక్రమాలలో 18 లక్షల నూతన విద్యార్థులకు 2024లో ఓఈసీడీ దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ 3.90 లక్షలు, యునైటెడ్ కింగ్డమ్ 3.84 లక్షల మంది విద్యార్థులకు అనుమతులను జారీచేసి అగ్రగామిగా నిలిచాయి. కెనడా 2.13 లక్షలు, ఆస్ట్రేలియా 1.82 లక్షల మంది విద్యార్థులతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.ప్రధాన దేశంగా..చాలా కాలంగా ఓఈసీడీ దేశాలకు వలస వెళ్తున్నవారిలో అత్యధికులు భారత్, చైనాకు చెందినవారే. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ప్రధాన దేశంగా ఉన్న చైనాను అధిగమించి 2023 వరకు కూడా భారత్ ఆధిక్యంలో కొనసాగింది. ఆ ఏడాది దాదాపు 6,00,000 మంది భారతీయ పౌరులు ఓఈసీడీ సభ్య దేశాలకు వలస వెళ్లారు. 2022తో పోలిస్తే ఈ సంఖ్య 8% పెరిగింది.నలుగురిలో ఒకరు బ్రిటన్కు2023లో భారత్ నుంచి వలసదారులలో దాదాపు నలుగురిలో ఒకరు యునైటెడ్ కింగ్డమ్ను (1,44,000) ఎంచుకున్నారు. ఇందులో 97,000 మంది ఆరోగ్య, సంరక్షణ కార్మిక వీసాలపై వెళ్లారు. కెనడాలో 2023లో 1,40,000 మంది అడుగుపెట్టారు. యునైటెడ్ స్టేట్స్కు 68,000 మంది భారతీయులు ఉపాధి కోసం వలస వెళ్లారు.75వేల డాక్టర్లు మనవాళ్లే2021–23 మధ్య.. ఓఈసీడీ సభ్య దేశాల్లో పనిచేస్తున్న 6.06 లక్షల మంది విదేశీ వైద్యుల్లో 12 శాతం (75,000) మంది భారతీయ డాక్టర్లు. అలాగే 7.33 లక్షల మంది విదేశీ నర్సుల్లో 17 శాతం మంది (1.22 లక్షలు) భారతీయ నర్సులు కావడం విశేషం. అత్యధిక డాక్టర్లు యూకేలో, అత్యధిక నర్సులు యూఎస్లో ఉన్నారు.
శబరిమలలో ప్లాస్టిక్ షాంపూ, సబ్బులపై నిషేధం
తిరువనంతపురం: శబరిమలలో ప్లాస్టిక్ , షాంపూ సాచెట్లను విక్రయించడంతో ఉపయోగించడాన్ని హైకోర్టు నిషేధించింది. పంబ నదితో సహా పంబ నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్న తీవ్రమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డివిజన్ బెంచ్ ఈ చర్య తీసుకుంది. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డును హైకోర్టు దేవస్వం బెంచ్ ఆదేశించింది.షాంపూ సాచెట్లతో పాటు , పంబ , సన్నిధానం మరియు ఎరుమేలిలలో రసాయన కుంకుమ అమ్మకాలను కూడా నిషేధించారు. ఈ ఉత్పత్తులు పర్యావరణానికి హానికరం అనే కారణంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మండల - మకరవిళక్కు సీజన్ 16 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. అప్పట్నుంచి హైకోర్టు ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఘన వ్యర్థాలను పారవేయకుండా నిరోధించడానికి కఠినమైన తనిఖీలు నిర్వహించాలని ఎరుమేలి గ్రామ పంచాయతీని సైతం కోర్టు ఆదేశించింది.
ఢిల్లీ ఏటీసీలో సాంకేతిక లోపం.. 500 విమానాలకు పైగా ఆలస్యం
ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్పోర్టులో విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఎయిర్పోర్టు ఏటీసీ సిస్టమ్లో సాంకేతిక లోపం కారణంగా 500పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల ఆలస్యంతో ఢిల్లీ ఎయిర్పోర్టులో రద్దీ పెరిగింది. సాంకేతిక సమస్యను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ చేసిన విమానాలు రద్దు చేశారు.ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టం పనిచేయడం లేదు. మాన్యువల్ డేటాతో విమాన రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ఢిల్లీ నుంచి ప్రతిరోజూ 1500 విమానాల రాకపోకలు సాగిస్తుంటాయి. సైబర్ దాడి జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సైబర్ అటాక్ వార్తలను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ధ్రువీకరించలేదు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో భార్యకు వేధింపులు ఎన్నారై భర్త అరెస్టు
భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఎన్జీవో ప్రతినిధి తరుణి పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఎన్ఆర్ఐ కుటుంబాలలో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణం
చిన్న వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్లో భారతీయ విద్యార్థి (Indian Student) ఒకరు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. దీపావళి వేడుకల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు స్థానిక మీడియా 'గల్ఫ్ న్యూస్' వెల్లడించింది. మృతుడు కేరళకు చెందిన వైష్ణవ్ కృష్ణకుమార్ (18)గా గుర్తించారు. దుబాయ్లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం బీబీఏ మార్కెటింగ్ చదువుతున్నాడు. అతడికి యూఏఈ గోల్డెన్ వీసా (Golden Visa) ఉందని సమాచారం.దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీలో మంగళవారం జరిగిన దీపావళి వేడుకల్లో వైష్ణవ్ పాల్గొన్నాడు. సంబరాల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటు కారణంగా మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే వైష్ణవ్కు ఎటువంటి గుండె సమస్యలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తదుపరి దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.వైష్ణవ్ మృతదేహాన్ని కేరళకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని అతడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు తాను చూసుకుంటున్నట్టు దుబాయ్లోని వైష్ణవ్ బంధువు నితీశ్ 'ఖలీజ్ టైమ్స్'తో చెప్పారు. శుక్రవారం నాటికి వైష్ణవ్ మృతదేహం కేరళకు చేరుకుంటుందని భావిస్తున్నారు.రెండేళ్ల క్రితం స్వస్థలానికి..అలప్పుజ జిల్లా చెన్నితల పంచాయతిలోని కరాజ్మా ప్రాంతానికి చెందిన వైష్ణవ్ కుటుంబంలో దుబాయ్లో సెటిలయింది. వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 ఏళ్లుపైగా దుబాయ్లోని ఉద్యోగం చేస్తున్నారు. వైష్ణవ్, అతడి చెల్లెలు దుబాయ్లోనే పుట్టిపెరిగారని వారి బంధువు గోపి కర్ణవర్ తెలిపారు. అలప్పుజలో ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. వైష్ణవ్ చాలా తెలివైన కుర్రాడని చెప్పారు. వైష్ణవ్ కుటుంబం చాలా అరుదుగా స్వస్థలానికి వస్తుందని, రెండేళ్ల క్రితం వారు కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుక కోసం చివరిసారిగా ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!సంతాప ప్రకటనవైష్ణవ్ కృష్ణకుమార్ మరణం పట్ల మిడిల్సెక్స్ యూనివర్సిటీ సంతాపం తెలిపింది. చిన్న వయసులోనే అతడు చనిపోవడం ఎంతో కలచివేసిందని సంతాప ప్రకటనలో పేర్కొంది. వైష్ణవ్ చదువుకున్న జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ కూడా సంతాపం ప్రకటించింది. వైష్ణవ్ ప్రతిభావంతుడైన విద్యార్థి అని కొనియాడింది. వైష్ణవ్ మరణంతో అతడి తండ్రి కృష్ణకుమార్, తల్లి విధు, చెల్లెలు వృష్టి విషాదంలో మునిగిపోయారు.
జార్జియాలో అద్భుతంగా 'చెంచు లక్ష్మి' నృత్య నాటిక
విద్యా సేవ కోసం సంస్కృతి పండుగ, హృదయాలను తాకిన “చెంచు లక్ష్మి” 2025 అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం, జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్ ఒక అద్భుతమైన సాంస్కృతిక వేదికగా మారింది. నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ నిర్వహించిన “చెంచు లక్ష్మి” నృత్య నాటిక, కళా పరిమళాలను విరజిమ్ముతూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ సౌత్ ఫోర్సిత్ కౌంటీ తోడ్పాటు అందించింది. కళను విద్యా సేవతో మిళితం చేస్తూ, సమీకరించిన నిధులను ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (FCEF) కు అందజేశారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు కాంతివంతమైన మార్గం వేస్తుందనే సంకేతంగా నిలిచింది. వేదికపై దీపాల కాంతి, పూజా మంత్రాల నినాదం మధ్య వేడుక ప్రారంభమైంది. మంచినీటి వంటి స్వరంతో హర్షిణి చుండి మరియు శ్రీలేఖ ఆదుసుమిల్లి సమన్వయకర్తలుగా ప్రవేశించి కార్యక్రమాన్ని నడిపారు.మాలతి నాగభైరవ ఒక అందమైన వీడియో ద్వారా ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రేరణను వివరించారు — “కళ మనసును మేల్కొలుపుతుంది, విద్య భవిష్యత్తును వెలిగిస్తుంది” అనే మంత్రాన్ని ప్రతిధ్వనిస్తూ. తర్వాత దీపప్రజ్వలన కార్యక్రమంలో, ఫోర్సిత్ కౌంటీకి చెందిన ఎన్నో ప్రముఖులు ఒకచోట చేరారు రాన్ ఫ్రీమన్ (షెరీఫ్), విలియం ఫించ్ (సొలిసిటర్ జనరల్), ఆల్ఫ్రెడ్ జాన్ (బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ చైర్మన్),మైఖేల్ బారన్ (ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్), రినీ వెల్చ్ (రోటరీ క్లబ్ డైరెక్టర్), కళ్యాణి చుండి (HC Robotics – డైమండ్ స్పాన్సర్), భారత్ గోవింద (Assure Guru CEO), నీలిమ గడ్డమనుగు (నటరాజ నట్యాంజలి), శ్రీరామ్ రొయ్యాల (Zoning Board చైర్మన్).దీప కాంతుల జ్యోతి విరజిమ్మగా, వేదిక ఒక ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. “చెంచు లక్ష్మి” — ప్రేమ, పరమాత్మకత, ప్రకృతి గాథకథ — దేవుడు నరసింహ స్వామి, భక్తి రూపిణి లక్ష్మి, మరియు అరణ్యాల గుండెల్లో పుట్టిన చెంచు లక్ష్మి మధ్య ఆధ్యాత్మిక ప్రేమగాథ.నల్లమల అడవుల సౌందర్యం, మనసుని తాకే సంగీతం, భక్తి పుష్టి తో నిండిన నాట్యరూపాలు — అన్నీ కలగలసిన ఆ అద్భుత నాటిక.నీలిమ గడ్డమనుగు దర్శకత్వంలో కళాకారులు నృత్యం, భావం, సంగీతం, కవిత్వం అన్నింటినీ మేళవించారు. తాళం, లయ, అభినయం — ప్రతి క్షణం కళా కాంతుల విరిసిన పుష్పంలా అనిపించింది.ఈ వేడుకకు 500 మందికి పైగా కళాభిమానులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.రాష్ట్ర ప్రతినిధులు టాడ్ జోన్స్ (District 25) మరియు కార్టర్ బారెట్ (District 24) ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. HC Robotics, Assure Guru వంటి సంస్థలు ప్రధాన స్పాన్సర్లుగా నిలిచి, విద్యా సేవకు తోడ్పాటును అందించాయి.వేదికపై సత్కారాలు, పుష్పగుచ్ఛాలు, ప్రశంసా ఫలకాలు అందజేయబడ్డాయి. ByteGraph వంటి సాంకేతిక బృందాలు కార్యక్రమాన్ని మల్టీమీడియా అద్భుతంగా మలిచాయి. నిర్వాహకుడు శ్రీరామ్ రొయ్యాల ,టాడ్ జోన్స్ ఈకార్యక్రమం విజయవంతంపై సంతోషం వ్యక్తం చేశారు.
Russia: హైదరాబాదీని రక్షించే ప్రయత్నాల్లో కేంద్రం
ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం రష్యా వెళ్లిన భారతీయులు.. బలవంతంగా సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అలా హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. అతన్ని రక్షించాలంటూ భాదిత కుటుంబం కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అహ్మద్(37) ఈ ఏడాది ఏప్రిల్లో రష్యాకు వెళ్లాడు. ఓ నిర్మాణ సంస్థలో భాగంగా పని ఉందంటూ ఏజెంట్ నమ్మబలికి అతన్ని అక్కడికి పంపించాడు. అయితే నెలపాటు అహ్మద్ ఏపని లేకుండా ఖాళీగా ఉన్నాడు. అడిగితే.. రేపో మాపో పని చెబుతామంటూ నిర్వాహకులు చెప్పసాగారు. ఈలోపు.. అహ్మద్లా ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం 30 మందిని జమ చేసి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ బలవంతంగా వాళ్లకు ఆయుధ శిక్షణ ఇప్పించి.. యుద్ధంలోకి దింపారు. వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఇదే అదనుగా అహ్మద్ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతని కాలికి గాయం కావడంతో రష్యా సైన్యానికి చిక్కాడు. యుద్ధం చేయాల్సిందేనని, లేకుంటే తామే చంపేసి డ్రోన్ దాడుల్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తామని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో అహ్మద్ పాల్గొంటున్నాడు. అయితే తన దగ్గర ఉన్న ఫోన్తో జరిగిందంతా ఓ సెల్ఫీ వీడియోగా తీసి భార్య అఫ్షా బేగంకు పంపాడు. అందులో.. తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వివరించాడు. Russia mein phanse Hyderabad ke Mohammad Ahmad aur Haryana wa Rajasthan ke Anoop Kumar, Manoj Kumar aur Sumit Kumar ko jald se jald Bharat wapas laane ke liye AIMIM Party ki musalsal koshish. pic.twitter.com/U2dg1OJuez— Asaduddin Owaisi (@asadowaisi) October 22, 2025నాతో పాటు ఉన్న 26 మంది మేం యుద్ధంలో పాల్గొనమని చెప్పాం. అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. వాళ్లు నా మెడపై తుపాకీ పెట్టి.. యుద్ధం చేస్తావా? చస్తావా? అని బెదిరించారు. నా కాలికి గాయమైనా కనికరించకుండా హింసించారు. ఇప్పటికే 17 మంది మరణించారు. అందులో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. ఉద్యోగాల పేరిట బలవంతంగా ఈ నరకంలోకి మమ్మల్ని లాగారు. ఎట్టిపరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడకు పంపిన ఏజెంట్ను(ముంబైకి చెందిన కన్సల్టెన్సీ) వదలొద్దు అని అహ్మద్ ఆ వీడియోలో చెప్పాడు.ఈ వీడియో ఆధారంగా అహ్మద్ భార్య అఫ్షా బేగం కేంద్ర విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. తన భర్త తమ కుటుంబానికి ఆధారమని, ఆయన్ని రక్షించాలని విదేశాంగ మంత్రి జై శంకర్ను ఉద్దేశిస్తూ వేడుకుంది. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సైతం కలిసి సాయం చేయాలని కోరింది. దీంతో.. ఆయన అహ్మద్ను వెనక్కి రప్పించాలంటూ కేంద్రానికి, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అహ్మద్ భార్య, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ విజ్ఞప్తులతో కేంద్రం కదిలింది. అహ్మద్ గురించి వివరాలు సేకరించి విడిపించే ప్రయత్నం చేస్తామని మాస్కోలోని భారత రాయబార సిబ్బంది తడు మాము(Tadu Mamu) హామీ ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని, వాళ్ల కుటుంబాలతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతోంది.
క్రైమ్
బెట్టింగ్ యాప్స్ శిఖర్ ధావన్, రైనాపై సజ్జనార్ ఆగ్రహం
Betting App Case బెట్టింగ్ మహామ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ మరోసారి ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లలో పాల్గొంటున్న సెలబ్రిటీలపై మండిపడ్డారు. వీళ్లేం సెలబ్రిటీలు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ నెట్టింట సంచలనంగా మారింది.ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో సజ్జనార్ స్పందించారు. #SayNoToBettingAppsవీళ్లేం సెలబ్రిటీలు?అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని… pic.twitter.com/GWJIvSK7uF— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 7, 2025 (గుండెలు పగిలేలా ఏడ్చారు.. పోరాడి గెలిచారు!) ట్వీట్లో సజ్జనార్ ఏమన్నారంటే..వీళ్లేం సెలబ్రిటీలు?అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు?బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా?సమాజ మేలు కోసం, యువత ఉన్నతస్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పండి.. అంతేకానీ మిమ్ముల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండి.’’ అంటూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదీ చదవండి: నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : సిగ్గుచేటంటూ నెటిజన్లు ఫైర్
ప్రియుడు చెబితే.. కెమెరా పెట్టాను
సాక్షి, హోసూరు: కర్ణాటకలోని హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్ కంపెనీ మహిళా సిబ్బంది ఉండే హాస్టల్లోని బాత్రూంలో రహస్య కెమెరా ఎపిసోడ్లో సంచలన విషయం బయటకు వచ్చింది. తన ప్రియుడు చెబితేనే బాత్రూంలో తాను సీక్రెట్ కెమెరా అమర్చినట్టు నిందితురాలు చెబుతోంది. ఇక, ఈ ఘటనలో కెమెరా అమర్చిన ఉద్యోగినిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. హోసూరు సమీపంలోని నాగమంగలం వద్ద టాటా ఎలక్ట్రానిక్ పరిశ్రమలో 20 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళా కార్మికుల కోసం హాస్టల్ వసతి కల్పించింది. ఉద్దనపల్లి సమీపంలో ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన 6 వేల మందికి పైగా మహిళా కార్మికులు హాస్టళ్లలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ హాస్టల్లోని బాత్రూంలో ఒడిశాకు చెందిన నీలాకుమారి గుప్తా (23) అనే కార్మికురాలు రహస్య కెమెరా ఏర్పాటు చేసి ఇతర మహిళల వీడియోలను రికార్డు చేసి తన ప్రియుడు సంతోష్కి పంపిస్తోంది.బెంగళూరులో అరెస్టు చేసి..అతడు వాటిని ఇంటర్నెట్లో పోస్టు చేయసాగాడు. తమ స్నానాల వీడియోలు వైరల్ అయినట్లు తెలిసి వేలాది మంది మహిళలు పరిశ్రమ యంత్రాంగం దృష్టికి తీసుకెళితే పట్టించుకోలేదు. దీంతో మంగళవారం రాత్రి నుంచి హాస్టల్ ముందు ధర్నా చేయసాగారు. పలువురు నేతలు మహిళలకు మద్దతు తెలిపారు. ఉద్దనపల్లి పోలీసులు దర్యాప్తు జరిపి నిందితురాలు నీలాకుమారి గుప్తాని అరెస్ట్ చేశారు. ప్రియుడు సంతోష్కుమార్ సూచనల మేరకు రహస్య కెమెరా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపింది. బెంగళూరులో దాగి ఉన్న నిందితున్ని గురువారం అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇతడు కూడా ఒడిశా వాసి కాగా బెంగళూరులో పనిచేసుకునేవాడు. వారిద్దరినీ తీవ్ర విచారణ జరుపుతున్నారు. తమ వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని, హాస్టళ్లలో భద్రత కల్పించాలని మహిళా సిబ్బంది డిమాండ్ చేశారు.
పూజిత ఆత్మహత్యాయత్నం.. ఫోన్లో మాట్లాడింది ఎవరు?
సాక్షి, ఘట్కేసర్: ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఓ ప్రైవేటు కళాశాలలో బీస్సీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది. కళాశాల యాజమాన్యం, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన మల్లి పూజిత పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో ఉంటూ ఘట్కేసర్ మున్సిపాలిటీ అవుషాపూర్ నీలిమా నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది.ఆమెకు జ్వరంగా ఉండడంతో స్నేహితులతో కలిసి ఆటోలో కళాశాలకు వచ్చి మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. చాలాసేపు ఫోన్లో మాట్లాడిన అనంతరం మూడో అంతస్తు రెయిలింగ్పై ఫోన్ పెట్టి కిందికి దూకింది. గమనించిన స్నేహితులు కళాశాల సిబ్బందితో కలిసి జోడిమెట్లలోని నీలిమా ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలు పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఆమె స్నేహి తులను అడిగి తెలుసుకున్నారు.జర్వం రావడంతో మాత్ర వేసుకొని కళాశాలకు ఆటోలో వచ్చిందని వారు తెలిపారు. పూజిత తన ఫోన్ స్టేటస్లో బుధవారం సాయంత్రం ‘ద ఎండ్’ అని పెట్టుకుందని పోలీసులు తెలిపారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పూజిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూజిత ఆత్మహత్యా యత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఫోన్లో ఎవరితో మాట్లాడింది, మరేదైనా కారణం ఉందా? కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో విద్యార్థినిపై అధ్యాపకుడి వేధింపులు
నర్సీపట్నం : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థినిపై గెస్ట్ లెక్చరర్ వేధింపుల ఉదంతం వెలుగుచూసింది. ఈ కళాశాలలో రెండేళ్లుగా మండల కేంద్రమైన గొలుగొండకు చెందిన కోనా నారాయణరావు గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తూ జనసేన పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. పార్టీ పదవి కోసం ఈయన పేరును ఇటీవల స్థానిక నాయకత్వం సిఫారసు కూడా చేసినట్లు తెలిసింది. అయితే, ఇటీవలే డిగ్రీ ఫస్టియర్లో చేరిన ఓ విద్యార్థినిని నారాయణరావు ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. నిజానికి.. వివాహితుడైన నారాయణరావుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.తాను గతంలో ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని, ఆమె అచ్చు నీలాగే ఉంటుందని అతను ఆ విద్యార్థినికి చెప్పుకొచ్చాడు. నువ్వు అంగీకరిస్తే నిన్ను చదివించి అన్ని విధాలా చూసుకుంటానంటూ లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ విద్యార్థిని ఈ విషయాన్ని సహచర విద్యార్థులకు చెప్పింది. ఈ విషయం విద్యార్థి సంఘాల నాయకుల వరకు వెళ్లడంతో గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగి కళాశాల ముందు బైఠాయించారు. ఆ అధ్యాపకుడిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అంతవరకు తరగతులకు హాజరుకాబోమని భీష్మించారు.భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని ప్రిన్సిపాల్ ఎస్.రాజు, ఇతర అధ్యాపకులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తప్పును సరిదిద్దేందుకు అవకాశం ఇవ్వాలని విద్యార్థినులను కోరారు. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. దీంతో చేసేదిలేక ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది నారాయణరావుతో రాజీనామా చేయించారు. నారాయణరావు గతంలో యలమంచిలి, అరకులలో కూడా పనిచేశాడు. అక్కడ కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నట్లు తెలిసింది.
వీడియోలు
విద్యార్థినికి జనసేన నాయకుడు నారాయణరావు వేధింపులు
జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ.. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు
Asifabad District: ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం
దేశవ్యాప్తంగా 1,800 విమానాలు రద్దు
నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్
Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు
విద్యుత్ ఉద్యోగిపై TDP నేత రంగారెడ్డి బూతులు
Tirupati: అంధకారంలో గ్రామాలు వరదలో కొట్టుకుపోయిన పశువులు
జగన్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాల్సిందే
KSR Live Show: క్రెడిట్ దొంగ

