Top Stories
ప్రధాన వార్తలు

వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యర్రం పిచ్చమ్మ(85) ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. కాగా, పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి. పిచ్చమ్మ పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు.

తమిళనాడులో ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్
చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి(liquor scandal) వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఏఎస్ఎంఏసీ) సారధ్యంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తును కోరుతూ, నిరసనకు దిగబోతున్నామని ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వం సహా తమిళనాడు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రాష్ట్ర బీజేపీ నేతలు(BJP leaders) సోమవారం ఉదయం 11 గంటలకు నిరసన చేపట్టనున్న తరుణంలో అందుకు ముందుగానే పోలీసులు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొందరు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత సౌందరరాజన్ తన నిర్బంధం గురించి మాట్లాడుతూ ‘వారు మమ్మల్ని ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వడం లేదు. మా కార్యకర్తలలో మూడు వందల మందిని ఒక కల్యాణ మండపంలో నిర్బంధించారు. టీఏఎస్ఎంఏసీలో జరిగిన వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నామని’ అన్నారు.Many Tamil Nadu BJP leaders have been arrested by Tamil Nadu Police for organizing a protest against TASMAC scam worth 1000 cr by DMK gang.This is the same scam they want to cover up by diverting attention to the language issue.This is what real dictatorship looks like!! pic.twitter.com/L14GjJE54f— Mr Sinha (@MrSinha_) March 17, 2025రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై(State BJP chief Annamalai) ఈ నిర్బంధాలను ఖండించారు. డీఎంకే ప్రభుత్వం భయంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘ఎక్స్’ పోస్ట్ లో ఆయన ఇలా రాశారు..‘డీఎంకే ప్రభుత్వం భయంతో వణికిపోతోంది. అందుకే బీజేపీ నేతలైన తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వన్ రాష్ట్ర జిల్లా నిర్వాహకులను గృహ నిర్బంధంలో ఉంచింది. వారు నిరసనలో పాల్గొనకుండా నిర్బంధించింది. తేదీ ప్రకటించకుండా అకస్మాత్తుగా నిరసన ప్రారంభిస్తే ఏమి చేయగలరు?’ అని అన్నామలై ప్రశ్నించారు. కాగా డీఎంకే ప్రభుత్వం బీజేపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్షం నేతృత్వంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని, కేంద్ర సంస్థలు పనిచేస్తున్నాయని డీఎంకే నేతలు ఆరోపించారు.Unlawful arrest by Dictator CM @mkstalin! You looted Tamil Nadu, and now you want to silence BJP. We will not back down!We have been arrested along with Sr Leader Thiru @PonnaarrBJP anna.DMK Liquor Scam 😡 1000 Crores Corruption. @annamalai_k @blsanthosh pic.twitter.com/INhAFM5Vsh— Amar Prasad Reddy (@amarprasadreddy) March 17, 2025ఇది కూడా చదవండి: పాక్లో మరో హత్య: జమీయత్ ఉలేమా నేత ముఫ్తీ అబ్దుల్ హతం

IPL 2025: ఓపెనర్లుగా కోహ్లి, సాల్ట్.. ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే..?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ ఎడిషన్ మరో 5 రోజుల్లో (మార్చి 22) ప్రారంభం కానుంది. లీగ్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించని ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో జరుగనుంది.అన్ని సీజన్లకు ముందు లాగే ఈ సారి కూడా ఆర్సీబీ 'ఈ సాలా కప్ నమ్మదే' అన్న నినాదంతో బరిలోకి దిగుతుంది. 17 సీజన్లలో ఒక్క సారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ ఈసారి ఎలాగైనా తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తుంది. ఈ సారి ఓ అంశం ఆర్సీబీ టైటిల్ కలను సాకారం చేసేలా సూచిస్తుంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి జెర్సీ నంబర్.. ఈ సారి ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య మ్యాచ్ అవుతున్నాయి. విరాట్ జెర్సీ నంబర్ 18 కాగా.. ఈ యేడు ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య కూడా పద్దెనిమిదే. ఇలాగైనా విరాట్ లక్కీ నంబర్ 18 ఆర్సీబీకి టైటిల్ సాధించిపెడుతుందేమో చూడాలి.ఇదిలా ఉంటే, గత సీజన్లతో పోలిస్తే ఆర్సీబీ ఈ సీజన్లో కాస్త ఫ్రెష్గా కనిపిస్తుంది. కొత్త కెప్టెన్ (రజత్ పాటిదార్), కొత్త ఆటగాళ్లతో బెంగళూరు ఫ్రాంచైజీ ఉరకలేస్తుంది. మెగా వేలానికి ముందు విరాట్ (21 కోట్లు), రజత్ పాటిదార్ (11 కోట్లు), యశ్ దయాల్ను (5 కోట్లు) మాత్రమే అట్టిపెట్టుకున్న ఆర్సీబీ.. మ్యాక్స్వెల్, డుప్లెసిస్, సిరాజ్ లాంటి స్టార్లను వదిలేసింది.మెగా వేలంలో ఆర్సీబీకి 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కేవలం 22 మందితోనే సరిపెట్టుకుంది. వేలంలో ఆర్సీబీ ఫిల్ సాల్ట్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ లాంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లను.. హాజిల్వుడ్, ఎంగిడి లాంటి స్టార్ విదేశీ పేసర్లను కొనుగోలు చేసింది. దేశీయ స్టార్లు జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, దేవ్దత్ పడిక్కల్, కృనాల్ పాండ్యాపై కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ నమ్మకముంచింది.ఈ సీజన్ కోసం ఆర్సీబీ ఎంపిక చేసుకున్న జట్టును చూస్తే.. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ను ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా ధృవీకరించాడు. వన్డౌన్లో కెప్టెన్ రజత్ పాటిదార్.. నాలుగో స్థానంలో లివింగ్స్టోన్, ఐదో స్థానంలో జితేశ్ శర్మ, ఆరో ప్లేస్లో టిమ్ డేవిడ్, ఏడో స్థానంలో కృనాల్ పాండ్యా, బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.ఆర్సీబీ మొత్తం జట్టు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, జితేశ్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా, లియామ్ లివింగ్స్టోన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్ భాండగే, జాకబ్ బెథెల్, జోష్ హాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాం దార్, సుయశ్ శర్మ, నువాన్ తుషారా, లుంగి ఇన్గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రతీ, యశ్ దయాల్.

‘తెలంగాణలో జనసేన, టీడీపీతో పొత్తు బీజేపీకే నష్టం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన, టీడీపీతో పొత్తు కడితే బీజేపీకి నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతుందన్నారు. ఇదే సమయంలో రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలకు పాత ఇనుప సామాను అంటే ఎవరో బాగా తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ సమావేశాల సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియాతో చిట్బాట్ మాట్లాడుతూ.. తెలంగాణలో కూటమి గురించి బీజేపీ హైకమాండ్ ఆలోచన చేయవద్దు. జనసేన, టీడీపీతో కలిసి వెళ్తే బీజేపీ నష్టం జరుగుతుంది. అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఇబ్బంది అవుతుంది. బీఆర్ఎస్ లాంటి పార్టీలకు లబ్ధి జరుగుతోంది. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతోందన్నారు.రాజాసింగ్ కామెంట్స్ స్పందిస్తూ..‘తెలంగాణ ప్రజలకు పాత ఇనుప సామాను అంటే అందరికీ తెలుసు. పార్టీ అంతర్గత వ్యవహారాలు వేదికలపై కాకుండా ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. రాజాసింగ్ తెలంగాణ బీజేపీకి ఆస్తి వంటి నాయకులు. ప్రధాని మోదీకి ఇక్కడ ఏం జరుగుతుందో పిన్ టూ పిన్ రిపోర్ట్ వెళ్తుంది. అధిష్ఠానం అంతా గమనిస్తోంది. పార్టీకి మంచి జరిగేది నలుగురిలో చెప్పాలి.. చెడు జరిగేది అధిష్ఠానం చెవిలో చెప్పాలి.పార్టీ ప్రెసిడెంట్గా ఈటల, అరవింద్, రామచందర్ రావు, డీకే అరుణ, రఘునందన్ రావు ఎవరో ఒకరు అవుతారు. అధ్యక్షుడితో పాటు ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు పెడితే బాగుంటుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేకంగా ఇంచార్జ్లను పెట్టాలి. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రక్షాళన చేస్తారని వినిపిస్తోంది. అదే జరిగితే కొండా సురేఖ, తుమ్మల, జూపల్లి మంత్రి పదవులు పోతాయి అంటున్నారు అని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రన్యా రావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
బెంగళూరు: కన్నడ నటి రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె తన ప్రైవేటు భాగాల్లో బంగారం దాచిపెట్టి స్మగ్లింగ్ చేసిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో మంత్రుల ప్రమేయం కూడా ఉందని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.బీజాపూర్ బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రన్యారావు తన శరీరమంతా బంగారంతో కప్పేసింది. ఆమె తన శరీరంలో ఏయే చోట్ల బంగారం దాచుకుని వచ్చిందో నాకు తెలుసు. ఆమె తన ప్రైవేటు భాగాల్లో బంగారం దాచిపెట్టి స్మగ్లింగ్ చేసింది. బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో మంత్రులకు కూడా ప్రమేయం ఉంది. ఈ విషయాలు అన్నీ నాకు తెలుసు. శాససభ సమావేశాల్లో ఒక్కొక్కరి బండారం బయటపెడతాను. ప్రతి పాయింట్ అసెంబ్లీలో వివరిస్తాను. రన్యా రావుతో పరిచయం ఉన్న ఇద్దరు మంత్రుల పేర్లను సభలో చెబుతాను. నేను ఇప్పుడు మీడియా ముందు దాని గురించి మాట్లాడను. ఆమెకు ప్రోటోకాల్ ఇచ్చిన వారి గురించి మేము సమాచారాన్ని సేకరించాం. వాళ్ళకి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి కోసం తెచ్చారో నాకు తెలుసు. ఎవరు తప్పు చేసినా, అది తప్పే. కస్టమ్స్ అధికారులు తప్పు చేస్తే, మేం వారిని సమర్థించడం లేదు’ అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మరోవైపు కస్టడీలో తనను టార్చర్ చేస్తున్నారంటూ రన్యా రావు కోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే. తెల్ల కాగితంపై తన సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. కనీసం నిద్ర పోనివ్వకుండా, తిండి కూడా తిననివ్వడం లేదంటూ ఫిర్యాదు చేశారు. కాగా, రన్యా రావు కేసు విషయంలో ఎయిర్ పోర్టులో ప్రోటోకాల్ ఉల్లంఘన వెనుక ఆమె సవితి తండ్రి, ఐపీఎస్ అధికారి రామచంద్రరావు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, ఆయన పాత్రపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. Karnataka BJP MLA Basangouda Patil Yatnal-"I will name all Ministers involved in Ranta Rao gold smuggling case in Assembly session. I have complete information about her relationships and how the gold was brought in.She had gold all over her body and smuggled it in." pic.twitter.com/6xd4dy5Tne— News Arena India (@NewsArenaIndia) March 17, 2025ఇదిలా ఉండగా.. బంగారం స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్టులో రూ.12 కోట్ల విలువైన బంగారంతో రన్యా రావు పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో, రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఎవరీ తారా ప్రసాద్..? ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..
విల్లులా శరీరాన్ని వంచుతు చేసే సాహస క్రీడ స్కేటింగ్. అలాంటి స్కేటింగ్కి న్యత్యం జత చేసి మంచుపై అలవోకగా చేసే.. ఈ ఫిగర్ స్కేటింగ్ అంతకుమించిన సాహస క్రీడ. అలాంటి కష్టతరమైన సాహస క్రీడలో సత్తా చాటుతూ..మీడియా దృష్టిని ఆకర్షించింది ఈ భారత సంతతి టీనేజర్. ఆమె భారత్ తరఫున ఆడి గెలవడం కోసం తన అమెరికా పౌరసత్వాన్ని తృణప్రాయంగా వదులకుంది. పుట్టి పెరిగిన అమెరికా కంటే భారతవనే తన మాతృదేశం అంటూ..విశ్వ వేదిక మూడు రంగుల జెండాను రెపరెపలాడిస్తోంది. ఈ పాతికేళ్ల యువకెరటం పేరు తారా ప్రసాద్. ఈ అమ్మాయి సాధించిన విజయాల గురించి వివరిస్తూ..మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్లో మహీంద్రా తారను అభినందనలతో ముంచెత్తారు. దీంతో ఒక్కసారిగా ఎవరీ అమ్మాయి అంటూ ఇంటర్నెట్లో సర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ ఈ టెక్ దిగ్గజం ఆనంద్ మెచ్చిన ఆ యువ తార ఎవరో చూద్దామా..!ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయకమైన కథలు పంచుకుంటూ ఉండే ఆనంద్ మహీంద్రా ఈసారి ఫిగర్ స్కేటర్ తారా ప్రసాద్ని ప్రశంసిస్తూ పోస్టు పెట్టారు. దానికి తారా చేసిన ఫిగర్ స్కేటింగ్ వీడియోని కూడా జత చేశారు. ఆ ఫిగర్ స్కేటింగ్ చూస్తే.. ఎవ్వరైనా కళ్లు ఆర్పడం మర్చిపోతారు. అంతలా ఒళ్లు జల్లుమనేలా ఉంటుంది ఈ క్రీడ. అందువల్లే ఈ బిజినెస్ దిగ్గజం మహీంద్రా ఆమె అద్భుత ప్రతిభను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మహీంద్రా పోస్ట్లో.."ఇటీవల తన స్నేహితుడొకరు ఈ అమ్మాయి స్కేటింగ్ ప్రతిభకు సంబంధించిన వీడియో పంపించేంత వకు ఆమె గురించి నాకు తెలియదు. ఓ వైపు నృత్యం చేస్తూ..మరోవైపు గాలలో ఎగురుతూ.. చేస్తున్నా ఆమె ఫిగర్ స్కేటింగ్కి విస్తుపోయే. ఆమె అద్భుత ప్రతిభ నన్ను ఎంతగానో కట్టిపడేసింది.అంతేగాదు ఆమె భారత్కి ప్రాతినిథ్యం వహించాలన్న ఉద్దేశ్యంతో 2019లో అమెరికా పౌరసత్వాన్ని భారతీయ పౌరసత్వంగా మార్చుకుంది. ఏకంగా మూడుసార్లు జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో గెలుపొందింది. గతేడాది వింటర్ ఒలింపిక్స్లో మీరు తృటిలో స్థానం కోల్పోయినా..వచ్చే ఏడాది జరగనున్న వింటర్ ఒలింపిక్స్లో తప్పక విజయం సాధిస్తారు. ఆ విశ్వక్రీడలపై దృష్టిపెట్టి ఒలింపిక్స్ పతక కలను సాకారం చేసుకో తల్లి." అని ఆశ్వీరదీస్తూ మహీంద్రా పోస్ట్లో రాసుకొచ్చారు.తారా ప్రసాద్ ఎవరు?ఫిబ్రవరి 24, 2000లో అమెరికాలో జన్మించింది తారా ప్రసాద్. ఆమె కుటుంబం తమిళనాడు నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడింది. అయితే ఆమె అక్కడే పుట్టి పురిగినా..తన మాతృదేశంపై మమకారం వదులుకోలేదు. అందుకు కారణం తన తల్లిదండ్రులే అని సగర్వంగా చెబుతోంది తార. చిన్నప్పుడు స్కేటింగ్ షూస్ కట్టుకుని మంచుగడ్డలపై ఆడుకునేది. అయితే పెద్దయ్యాక దాన్నే ఆమె కెరియర్ ఎంచుకుంటుందని ఆమె కుటుంబసభ్యులెవ్వరూ అనుకోలేదట.ఏమాత్రం పట్టు తప్పిన ప్రమాదాలు జరిగే క్లిష్టమైన ఫిగర్ స్కేటింగ్ క్రీడను ఎంచుకుంది తార. ఇది ఒక కష్టసాధ్యమైన కళాత్మక క్రీడ. చెప్పాలంటే నృత్యం, స్కేటింగ్ మిళితం చేసే ఒక అద్భుత ప్రదర్శన. అలాంటి క్రీడలో కఠోర సాధనతో నైపుణ్యం సాధించింది. భారత్ తరుఫున ప్రాతినిథ్యం వహంచింది..2016లో 'Basic Novice' పోటీల్లో (14 ఏళ్ల లోపు వారు పోటీ పడే కాంపిటీషన్స్) పాల్గొనడంతో మొదలుపెట్టి.. క్రమంగా 'Intermediate Novice' పోటీలు (16 ఏళ్ల లోపు వారు).. ఆపై 'Advanced Novice' (10-16 ఏళ్ల లోపు అమ్మాయిలు) పోటీల్లో సత్తా చాటింది. 2020 నుంచి సీనియర్ విభాగంలో.. భారత్ తరపున బరిలోకి దిగింది. ఆవిధంగా తార 2022, 2023, 2025 సంవత్సరాల్లో భారత జాతీయ ఛాంపియన్షిప్లను గెలుచుకుంది. అయితే.. సియోల్లో ఇటీవలే ముగిసిన 'ఫోర్ కాంటినెంట్స్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్స్ 2025లో 16వ స్థానంతో సరిపెట్టుకుందీ ఈ టీనేజర్. భారత్లో క్రికెట్కి ఉన్నంత ఆదరణను పిగర్ స్కేటింగ్కి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నానంటోంది తార. వచ్చే ఏడాది జరగనున్న 'వింటర్ ఒలింపిక్స్'పై దృష్టి సారించి విజయం సాధించడమే తన లక్ష్యం అని చెబుతోంది. మరీ ఆ యువతారకి ఆల్ద బెట్ చెప్పి.. మరిన్ని విజయాలను సొంతం చేసుకుని మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుకుందాం.Hadn’t heard about Tara Prasad’s accomplishments till a friend recently sent me this clip. Apparently Tara switched her U.S citizenship to an Indian one in 2019 and has since been our national skating champ three times. Well done, Tara. I hope you are in the vanguard of… pic.twitter.com/GK4iL4VrVh— anand mahindra (@anandmahindra) March 11, 2025(చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..)

క్లోజ్ అవుతున్న పోస్టాఫీస్ స్కీమ్..
ప్రజల్లో ఆర్థిక పొదుపును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పోస్టాఫీసుల ద్వారా వీటిని అమలు చేస్తోంది. అలాంటి మంచి స్కీముల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్సీ) పథకం ఒకటి.మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఇక చాలా తక్కువ రోజులే సమయం ఉంది. పోస్టాఫీస్ కింద నిర్వహించే ఎంఎస్ఎస్సీ పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్లో పెట్టుబడి సమయాన్ని ప్రభుత్వం ఇంకా పొడిగించలేదు. ఇప్పటి వరకు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయని మహిళలకు కొన్ని రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..మహిళలకు ప్రత్యేకంస్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్ కింద భారత ప్రభుత్వం 2023 మార్చి 31న మహిళలు, బాలికల కోసం ఎంఎస్ఎస్సీ (మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్) పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇది రెండు సంవత్సరాల కాలానికి అమలు చేస్తున్న స్వల్పకాలిక డిపాజిట్ స్కీమ్. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం లక్ష్యం.ఎంత వడ్డీ లభిస్తుంది?దేశంలోని ఏ మహిళ అయినా ఈ పథకంలో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ కింద ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది. ఎంఎస్ఎస్సీ స్కీమ్పై 7.5% వార్షిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఇది బ్యాంకులలో 2 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ కంటే ఎక్కువ. ఇది సురక్షితమైన పథకం ఎందుకంటే ఇది ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దీని కింద పోస్టాఫీస్ లేదా రిజిస్టర్డ్ బ్యాంకుల్లో సులభంగా ఖాతా తెరవవచ్చు.పెట్టుబడి ఎంత పెట్టవచ్చు?మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం కింద దేశంలో నివసించే ఏ మహిళ అయినా కనీసం రూ .1,000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 2 సంవత్సరాల వ్యవధి తర్వాత, అసలు, వడ్డీ మొత్తం చెల్లిస్తారు. ఏదైనా అవసరం పడితే ఒక సంవత్సరం తరువాత డిపాజిట్ మొత్తంలో 40% వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. తీవ్రమైన అనారోగ్యం లేదా ఖాతాదారు మరణం వంటి పరిస్థితులలో ఖాతాను ముందస్తుగా మూసివేయవచ్చు. డిపాజిటర్ 6 నెలల తర్వాత ఖాతాను మూసివేస్తే వడ్డీ రేటు తగ్గవచ్చు.

తెలంగాణ అసెంబ్లీ ముందుకు ఐదు కీలక బిల్లులు..
Telangana Assembly Session Updates..తెలంగాణ వచ్చాక వర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం: సీఎం రేవంత్శాసనసభలో సీఎం రేవంత్ కామెంట్స్..కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు పేర్లు పెట్టుకున్నాంతెలుగు వర్సిటీ పేరును మారుస్తున్నాంపొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదుఏపీలో కూడా ఇదే పేరుతో యూనివర్సిటీ ఉంది.అందుకే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకున్నాం.తెలుగు వర్సిటీ ఆయన పేరు పెట్టాలని గత శాసనసభలోనే నిర్ణయించాం.రాజకీయాలు కలుషితం అయ్యాయో.. ఆలోచనలు కలుషితం అయ్యాయో తెలియదు.బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు పెడతాం.తెలంగాణ వచ్చాక ఆర్టీసీ పేరును కూడా మార్చుకున్నాం. ఐదు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వంబిల్లులను ప్రవేశపెట్టేముందుకు స్పీకర్ అనుమతి కోరిన మంత్రి శ్రీధర్బాబుఅసెంబ్లీ ముందుకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లుఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనర్సింహబీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం 👉తెలంగాణ శాసన సభలో ముగిసిన ప్రశ్నోతాలు.👉మొదలైన జీరో అవర్..👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.శాసనసభ నుంచి ఎంఐఎం వాకౌట్..శాసనసభ నడపడంలో ప్రభుత్వం విఫలమైందిశాసనసభ గాంధీ భవన్ కాదు.తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం.ప్రశ్నోత్తరాల సమయం గంట మాత్రమే తీసుకోవడం ఏంటని ప్రశ్నించిన అక్బరుద్దీన్.ప్రశ్నోత్తరాల సమయంలో మిగిలిన ప్రశ్నలపై సమాధానం చెప్పకుండా ఎలా జీరో అవర్ ప్రారంభిస్తారు?నిన్న రాత్రి 10 గంటలకు ఎజెండా మాకు అందింది.. మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి?.శాసనసభలో కొత్త సాంప్రదాయం ఏంటి?తమ ప్రశ్నను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని, మంత్రి ఎందుకు ప్రశ్న చదవడం లేదని ఆగ్రహం.సభ జరిగే తీరుపై అసహనం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ.మేము అడిగిన ప్రశ్నను సమాధానం ఇవ్వడం లేదు.శాసనసభ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా నడవడం లేదు.శాసనసభలో నిబంధనలు పాటించడం లేదు.నిబంధనల ప్రకారం శాసనసభ నడవడం లేదని వాకౌట్ చేసిన ఎంఐఎం20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం: భట్టి2030 నాటికి 20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంసౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్పై ప్రభుత్వం ఫోకస్పునరుత్పాదక ఇంధన వనరుల పెంపునకు క్లీన్ ఎనర్జీ పాలసీ2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంపెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించడానికి పాలసీ తెచ్చాంరాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుందిప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సౌరఫలకాలు ఏర్పాటు చేస్తున్నాంకాంగ్రెస్పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్..బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కామెంట్స్..ఏం తెచ్చారు ఏం ఇచ్చారు అని ప్రభుత్వం నన్ను ప్రశ్నిస్తుంది..నాకు కాంగ్రెస్ ఏం ఇచ్చింది?గత ఏడాది బడ్జెట్ నుంచి కేవలం 90 లక్షలు మాత్రమే ఇచ్చింది.కొడంగల్కు 1000 కోట్లు తీసుకుపోయారు.శాసన సభకే అవమానం.శాసనసభలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు సమానమే.అసెంబ్లీలో కేటీఆర్ చిట్చాట్.. రేవంత్పై సంచలన వ్యాఖ్యలుసీఎం రేవంత్ టార్గెట్గా కేటీఆర్ కామెంట్స్..తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందిరేవంత్ రెడ్డి అప్రూవర్గా మారి.. తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పాడు71వేల కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడు2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవిపిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారు?నిండు సభలో బట్టలు విప్పి కొడాతమని రేవంత్ బజారు భాష మాట్లాడారుమెదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదుకాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడుసంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదురాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే.. తెలంగాణ పెరుగుతుందా?కేంద్రంతో సఖ్యతగా ఉండి.. నిధులు సాధిస్తానని ఎంత తెచ్చాడుకేసీఆర్పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నాడుగాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి గవర్నరెన్స్ పై దృష్టి పెట్టాలి కుటుంబాలు మాకు లేవా?. పిల్లలు మాకు లేరా? రేవంత్కే ఉన్నారా?నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు బయట పెట్టాలా? మంత్రి సీతక్క వర్సెస్ గంగుల.. 👉విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాం: మంత్రి సీతక్కగత ప్రభుత్వంతో పోలిస్తే విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాం8-10 తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540 డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నాంఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు రూ.2,100 డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నాంవిద్యార్థుల డైట్ ఛార్జీలకు రూ.499.51 కోట్లు ఖర్చు చేశాం: మంత్రి సీతక్కవిద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దు.విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే.. బీఆర్ఎస్ ఓర్వలేక పోతుంది.నేను గంగుల కమలాకర్ లెక్క చదువుకోలేకపోవచ్చు.నేను సమాజాన్ని చదివాను.గవర్నమెంట్ స్కూళ్లలో చదివినం. గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాం..సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే నైజం మాదిమా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్య కోసం 167 కోట్లు చెల్లించాముపిల్లలను సరిగా పర్యవేక్షించని సిబ్బంది అధికారులపై చర్యలు ఉంటాయివిద్యార్థులకు స్కాలర్షిపులు ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే బాగుండు అని బీఆర్ఎస్ భావిస్తోందిమేము స్కాలర్షిప్లు ఇవ్వకపోతే రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ చూస్తోందికానీ మేము బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వము..విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు, విదేశీ విద్యానిధి పూర్తిగా చెల్లిస్తున్నాము👉విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి: గంగుల కమలాకర్విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి2016లో కేసీఆర్ హయాంలో విదేశీ విద్యా పథకం అమలు చేశారుగతంలో ఏటా 300 మంది విద్యార్థులను పథకం కింద ఎంపిక చేశారుప్రస్తుత ప్రభుత్వం బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకు పథకం కింద ఇచ్చింది గుండు సున్నాజనవరిలో కేవలం 105 మంది ఎస్సీలను పథకం కింద ఎంపిక చేశారుగతంలో 1,050 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విదేశాలకు పంపారుగతంలో రూ.439 కోట్లతో 2,751 మంది మైనార్టీలకు విదేశీ విద్య అందించారు.

ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్
బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు వెన్నులో వణుకు మొదలైంది. సామాన్యుల జీవితాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న సుప్రిత, రీతూ చౌదరి వంటి సెలబ్రిటీలు మెట్టు దిగొచ్చి క్షమాపణలు చెప్తున్నారు. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామని, జనాలు వాటిని నమ్మొద్దని కోరుతున్నారు.బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా ఉద్యమంఎలాగైనా సరే ఈ బెట్టింగ్ భూతం నుంచి యువతను, పేద కుటుంబాలను కాపాడాలని పూనుకున్నారు హైదరాబాద్ మాజీ అడిషనల్ డీజీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ఈ ఉద్యమం (#SayNoToBettingApps)లో యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సైతం భాగమయ్యాడు. బెట్టింగ్ యాప్స్ హానికరం అని చెప్తూ.. వాటిని ప్రమోట్ చేసినవాళ్లను ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)ను సైతం ఏకిపారేశాడు. అతడు గతంలో క్రికెట్ బెట్టింగ్ యాప్ గురించి చేసిన వీడియోను రిలీజ్ చేశాడు. రైతుబిడ్డ అంటేనే అసహ్యం: అన్వేష్అనంతరం అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ప్రపంచంలో నేను ఎక్కువ అసహ్యించుకునేది పల్లవి ప్రశాంత్నే! రైతుబిడ్డ.. రైతుబిడ్డ అంటూ సానుభూతితో గెలిచాడు. ప్రైజ్మనీ రైతులకు ఇస్తానన్నాడు.. కానీ ఇచ్చాడా? పోనీ.. దేశానికి రైతు వెన్నుముక అన్నవాడు ఏనాడైనా సేంద్రీయ వ్యవసాయం గురించో, రైతుల కష్టాల గురిందో వీడియోలు చేశాడా? లేదు.. డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తనను నమ్మి గెలిపించిన జనాలకు నమ్మకద్రోహం చేశాడు.ముష్టివాడిలా అడుక్కున్నాడు.. కోట్లకు పడగలెత్తాడురైతు పేరు వాడుకుని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఈ వెధవ అందర్నీ మోసం చేశాడు. రైతు అంటేనే ఛీ అనేలా చేశాడు. నాకు రైతు అంటే ఎంతో గౌరవం. వారికోసం వీడియోలు కూడా చేశాను. కానీ వీడిని చూస్తేనే అసహ్యం. బిగ్బాస్కు వెళ్లేముందు దేహి అంటూ ముష్టివాడిలా అడుక్కున్నాడు. బయటకు వచ్చాక సూటు, బ్యాడ్జి.. ఆరుగురు సెక్యురిటీగార్డులు.., కార్లు! వీడికంత అవసరమా? బెట్టింగ్ యాప్స్తో ఒక్కొక్కరూ కోట్లకు పడగలెత్తారు. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్..ఈ ఇన్ఫ్లూయెన్సర్ల వల్ల నష్టపోయినవాళ్లందరూ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరం. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి నష్టపరిహారం తీసుకోండి. ఇలా చేస్తేకానీ ఎవరికీ సిగ్గు రాదు. ఆడేవాడు చచ్చిపోతుంటే ఆడించేవారు మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు అని నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ మండిపడ్డాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగానూ లోకల్ బాయ్ నాని, సన్నీయాదవ్, హర్షసాయిపై కేసులు నమోదయ్యాయి. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్దే అన్న టాక్ వినిపిస్తోంది.చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్లు

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణవాసులు ముగ్గురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం తెల్లవారుజామున 3:30 గంటకు(భారత కాలమానం ప్రకారం) రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి మృతిచెందారు. మృతులను ప్రగతి రెడ్డి (35), ఆమె కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56)గా గుర్తించారు. వీరంతా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లోని టేకులపల్లి వాసులుగా తెలుస్తోంది. మృతులు మాజీ సర్పంచ్ మోహన్రెడ్డి కుమార్తె కుటుంబీకులని సమాచారం. వీరి మరణ వార్త తెలియడంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసులమంటూ ఫోన్.. ముసలావిడ దగ్గర రూ.20 కోట్లు స్వాహ
చట్టసభలు ఒక్కరివి ఎలా అవుతాయి?
ఛాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. పాక్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్ల్లో భారీ కోత
60 ఏళ్ల స్టార్ హీరోతో ప్రేమాయణం.. అందుకే ప్రేమించానన్న ప్రియురాలు
వాళ్లు వాళ్లు బాగానే ఉంటారు.. ఫ్యాన్స్ మాత్రం!?
భర్తతో విడిపోయి ఒంటరిగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
‘తెలంగాణలో జనసేన, టీడీపీతో పొత్తు బీజేపీకే నష్టం’
Bihar: మళ్లీ పోలీసులపై దాడి
అమ్మకు ఖరీదైన కారు గిఫ్ట్..
చిన్నారులకు చిప్స్ ప్యాకెట్లు కొనిస్తున్నారా..?
కేంద్రం, తమిళనాడుల మద్య రూపాయి లొల్లి
హీరోయిన్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
వచ్చే సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం: అనిల్ రావిపూడి
గెలుపే లక్ష్యం.. అలుపెరగని పోరాటం
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
బంగారం పంట పండింది
వెంకటేష్తో హిట్ సినిమా.. జైలుకు వెళ్లడంతో ఆమె కెరీర్ క్లోజ్
బోట్వాలాకు ఐటీ నోటీసులు, 45 రోజుల్లో 30 కోట్ల సంపాదన ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్కు ఘోర అవమానం
తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..
పోలీసులమంటూ ఫోన్.. ముసలావిడ దగ్గర రూ.20 కోట్లు స్వాహ
చట్టసభలు ఒక్కరివి ఎలా అవుతాయి?
ఛాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. పాక్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్ల్లో భారీ కోత
60 ఏళ్ల స్టార్ హీరోతో ప్రేమాయణం.. అందుకే ప్రేమించానన్న ప్రియురాలు
వాళ్లు వాళ్లు బాగానే ఉంటారు.. ఫ్యాన్స్ మాత్రం!?
భర్తతో విడిపోయి ఒంటరిగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
‘తెలంగాణలో జనసేన, టీడీపీతో పొత్తు బీజేపీకే నష్టం’
Bihar: మళ్లీ పోలీసులపై దాడి
అమ్మకు ఖరీదైన కారు గిఫ్ట్..
చిన్నారులకు చిప్స్ ప్యాకెట్లు కొనిస్తున్నారా..?
కేంద్రం, తమిళనాడుల మద్య రూపాయి లొల్లి
హీరోయిన్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
వచ్చే సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం: అనిల్ రావిపూడి
గెలుపే లక్ష్యం.. అలుపెరగని పోరాటం
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
బంగారం పంట పండింది
వెంకటేష్తో హిట్ సినిమా.. జైలుకు వెళ్లడంతో ఆమె కెరీర్ క్లోజ్
బోట్వాలాకు ఐటీ నోటీసులు, 45 రోజుల్లో 30 కోట్ల సంపాదన ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్కు ఘోర అవమానం
తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..
సినిమా

ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్
బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు వెన్నులో వణుకు మొదలైంది. సామాన్యుల జీవితాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న సుప్రిత, రీతూ చౌదరి వంటి సెలబ్రిటీలు మెట్టు దిగొచ్చి క్షమాపణలు చెప్తున్నారు. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామని, జనాలు వాటిని నమ్మొద్దని కోరుతున్నారు.బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా ఉద్యమంఎలాగైనా సరే ఈ బెట్టింగ్ భూతం నుంచి యువతను, పేద కుటుంబాలను కాపాడాలని పూనుకున్నారు హైదరాబాద్ మాజీ అడిషనల్ డీజీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ఈ ఉద్యమం (#SayNoToBettingApps)లో యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సైతం భాగమయ్యాడు. బెట్టింగ్ యాప్స్ హానికరం అని చెప్తూ.. వాటిని ప్రమోట్ చేసినవాళ్లను ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)ను సైతం ఏకిపారేశాడు. అతడు గతంలో క్రికెట్ బెట్టింగ్ యాప్ గురించి చేసిన వీడియోను రిలీజ్ చేశాడు. రైతుబిడ్డ అంటేనే అసహ్యం: అన్వేష్అనంతరం అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ప్రపంచంలో నేను ఎక్కువ అసహ్యించుకునేది పల్లవి ప్రశాంత్నే! రైతుబిడ్డ.. రైతుబిడ్డ అంటూ సానుభూతితో గెలిచాడు. ప్రైజ్మనీ రైతులకు ఇస్తానన్నాడు.. కానీ ఇచ్చాడా? పోనీ.. దేశానికి రైతు వెన్నుముక అన్నవాడు ఏనాడైనా సేంద్రీయ వ్యవసాయం గురించో, రైతుల కష్టాల గురిందో వీడియోలు చేశాడా? లేదు.. డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తనను నమ్మి గెలిపించిన జనాలకు నమ్మకద్రోహం చేశాడు.ముష్టివాడిలా అడుక్కున్నాడు.. కోట్లకు పడగలెత్తాడురైతు పేరు వాడుకుని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఈ వెధవ అందర్నీ మోసం చేశాడు. రైతు అంటేనే ఛీ అనేలా చేశాడు. నాకు రైతు అంటే ఎంతో గౌరవం. వారికోసం వీడియోలు కూడా చేశాను. కానీ వీడిని చూస్తేనే అసహ్యం. బిగ్బాస్కు వెళ్లేముందు దేహి అంటూ ముష్టివాడిలా అడుక్కున్నాడు. బయటకు వచ్చాక సూటు, బ్యాడ్జి.. ఆరుగురు సెక్యురిటీగార్డులు.., కార్లు! వీడికంత అవసరమా? బెట్టింగ్ యాప్స్తో ఒక్కొక్కరూ కోట్లకు పడగలెత్తారు. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్..ఈ ఇన్ఫ్లూయెన్సర్ల వల్ల నష్టపోయినవాళ్లందరూ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరం. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి నష్టపరిహారం తీసుకోండి. ఇలా చేస్తేకానీ ఎవరికీ సిగ్గు రాదు. ఆడేవాడు చచ్చిపోతుంటే ఆడించేవారు మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు అని నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ మండిపడ్డాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగానూ లోకల్ బాయ్ నాని, సన్నీయాదవ్, హర్షసాయిపై కేసులు నమోదయ్యాయి. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్దే అన్న టాక్ వినిపిస్తోంది.చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్లు

'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' యాక్షన్–ప్యాక్డ్ టీజర్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ టీజర్ వచ్చేసింది. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న విజయశాంతి పవర్ఫుల్ డైలాగ్స్తో ప్రారంభం అవుతుంది. యాక్షన్–ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా టీజర్ ఉంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్ పాత్రలో కల్యాణ్ రామ్, వైజయంతి పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు.‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ తల్లీకొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ ఫిల్మ్ అని తెలుస్తోంది. సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ‘యానిమల్’ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం అజనీష్ లోక్నాథ్ అందించారు.

థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్లు
థియేటర్లలో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. గతవారం కోర్ట్, దిల్రూబా సినిమాలు రిలీజవ్వగా ఈవారం మరికొన్ని చిన్న సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అటు ఓటీటీలోనూ హిట్ చిత్రాలు, సిరీస్లు రిలీజయ్యేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వారం (మార్చి 17 నుంచి 23 వరకు) అటు థియేటర్లో, ఇటు ఓటీటీ (OTT)లో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో రిలీజయ్యే సినిమల జాబితా..🎥 షణ్ముఖ - మార్చి 21🎥 పెళ్లి కాని ప్రసాద్ - మార్చి 21🎥 కిస్ కిస్ కిస్సిక్ - మార్చి 21🎥 టుక్ టుక్ - మార్చి 21🎥 అనగనగా ఆస్ట్రేలియాలో - మార్చి 21🎥 ఆర్టిస్ట్ - మార్చి 21🎥 ది సస్పెక్ట్ - మార్చి 21ఇవే కాకుండా రెండు సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. మార్చి 21న ప్రభాస్ 'సలార్: సీజ్ ఫైర్', నాని, విజయ దేవరకొండల 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రాలు ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి.ఓటీటీ విషయానికి వస్తే..నెట్ఫ్లిక్స్విమెన్ ఆఫ్ ది డెడ్ 2 (వెబ్ సిరీస్) - మార్చి 19ఆఫీసర్ ఆన్ డ్యూటీ - మార్చి 20బెట్ యువర్ లైఫ్ (వెబ్ సిరీస్) - మార్చి 20ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ (వెబ్ సిరీస్) - మార్చి 20ది రెసిడెన్స్ (వెబ్ సిరీస్)- మార్చి 20లిటిల్ సైబీరియా - మార్చి 21రివిలేషన్స్ - మార్చి 21జియో హాట్స్టార్అనోరా (ఆస్కార్ విన్నింగ్ మూవీ) - మార్చి 17గుడ్ అమెరికన్ ఫ్యామిలీ (వెబ్ సిరీస్) - మార్చి 19కన్నెడ (వెబ్ సిరీస్) - మార్చి 21విక్డ్ - మార్చి 22ఆహాబ్రహ్మా ఆనందం - మార్చి 20అమెజాన్ ప్రైమ్డూప్లిసిటీ - మార్చి 20స్కై ఫోర్స్ - మార్చి 21అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్లూట్ కాంట్ (వెబ్ సిరీస్) - మార్చి 20చదవండి: అనారోగ్యంతో నటి 'బిందు' మృతి.. చివరిరోజుల్లో..

17 ఏళ్లకే వాడిలో అలాంటి ఆలోచనలా: అదితి
మహారాష్ట్రకు చెందిన అదితి పోహంకర్.. షీ,ఆశ్రమం అనే వెబ్ సిరీస్లతో పాపులర్ అయింది. ఆపై క్యాడ్బరీ మంచ్, గోద్రెజ్, ఎయిర్టెల్, లెన్స్కార్ట్, శామ్సంగ్తో సహా ఇరవైకి పైగా ప్రముఖ కంపెనీలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలలో నటించింది. ది టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్లో 2020లో 47వ ర్యాంక్ని పొందింది. అయితే, తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో చిన్నతనంలో తను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఆమె చెప్పుకొచ్చింది.ఒకరోజు తన అమ్మతో స్కూల్కు వెళ్తుండగా జరిగిన సంఘటనను ఆదితి పోహంకర్ ఇలా చెప్పింది. 'అమ్మ, సీఏఐసీడబ్ల్యూఏ టీచర్గా ఉన్నప్పుడు.. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇద్దరం కలిసి బస్సులో వెళుతుండగా ఓ ప్రయాణికుడు నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. సీట్ లేకపోవడంతో నేను నిల్చోనే ఉన్నాను. ఆ సమయంలో అతను నాపై చేయి వేయడం గమనించాను. వెంటనే అమ్మతో చెప్పాను. అతను భయంతో వెళ్తున్న క్రమంలో నన్ను బలంగా పక్కకు లాగేశాడు. దీంతో నేను కింద పడిపోయాను. ఆ గాయం ఇప్పటికీ ఉంది.' అని చెప్పింది.'నేను సినిమా ఛాన్స్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ముంబై రైలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. నేను లేడీస్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్నాను. కానీ, అందులో 18 ఏళ్ల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులు ఎవరైనా సరే ప్రయాణించవచ్చని నిబంధన ఉంది. ఆ రోజు 17 ఏళ్ల విద్యార్థి అకస్మాత్తుగా నా ఛాతీని బలంగా టచ్ చేశాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాను. అప్పుడు నాకేమీ అర్థం కావడం లేదు. నేను గట్టిగా అరిచిన కూడా అక్కడున్న వారెవరూ పట్టించుకోలేదు. అప్పుడు మరోస్టాప్ రాగానే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇంతలో ఆ అబ్బాయి వెళ్లిపోయాడు. పోలీసులు పట్టించుకోలేదని వారిని నిలదీశాను. దీంతో తిరిగి నాపైనే కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. అతను మీపై చేయి వేశాడని రుజువు ఏంటి అంటూ ప్రశ్నించారు. కానీ, అంత చిన్న వయసులోనే వాడి చెడు ఆలోచన నన్ను బాగా కలిచివేసింది.' అని ఆమె గుర్తుచేసుకుంది.షీ వెబ్ సిరీస్లో కానిస్టేబుల్ భూమిగా నటించిన అదితి, బోహంకర్ నాయక్ అనే డ్రగ్ కింగ్పిన్ను పట్టుకోవడానికి రెడ్ లైట్ ఏరియా అమ్మాయిగా రహస్యంగా వెళ్తుంది. ఈ సిరీస్లో ఆమె చాలావరకు మితిమీరిన గ్లామర్ పాత్రలోనే కనిపిస్తుంది. విజయ్ వర్మతో కొన్ని ఇంటిమేట్ సీన్లు కూడా చేస్తుంది. బాబీ డియోల్ నటించిన ఆశ్రమ్ వెబ్సిరీస్లో కూడా ఆమె చాలా రొమాన్స్ సన్నివేశాలలో నటించింది. అశ్లీల సన్నివేశాల్లో నటించాలంటే నటీమణుల కంటే నటులే ఎక్కువ భయపడతారని ఆమె చెప్పుకొచ్చింది.
న్యూస్ పాడ్కాస్ట్

‘విద్య’లో గందరగోళం.. లక్ష్యం బడికి తాళం. ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యను భ్రష్టు పట్టిస్తోన్న కూటమి ప్రభుత్వం

బీఆర్ఎస్ నాయకుల స్టేచర్ గుండుసున్నా.. కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా, ప్రతిపక్ష నేతగా ఉండాలి, నేను సీఎంగా ఉండాలి ..రేవంత్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులను దగా చేసిన కూటమి ప్రభుత్వం... నష్టానికే పంట అమ్ముకుంటున్న రైతులు

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి సస్పెన్షన్... ‘ఈ సభ నీ సొంతం కాదు’ అన్నందుకు బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ నయవంచనపై తిరుగుబాటు... వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో ‘యువత పోరు’లో కదంతొక్కిన విద్యార్థులు, తల్లితండ్రులు, నిరుద్యోగులు

భారతదేశ కుటుంబంలో మారిషస్ ఒక అంతర్భాగం... ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ

కేసీఆర్ను గద్దె దింపిందీ నేనే. నాది సీఎం స్థాయి.. ఆయనది మాజీ సీఎం స్థాయి. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్లో పాడి రైతుకు కూటమి సర్కారు దగా... ప్రైవేటు డెయిరీలు చెప్పిందే ధర, ఇష్టం వచ్చినంతే కొనుగోలు... లీటర్కు 25 రూపాయల దాకా నష్టపోతున్న రైతులు

వైఎస్ వివేకా కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కూటమి సర్కారు కుతంత్రం. రంగన్న మరణాన్నీ వాడేసుకుంటున్న వైనం

ఆంధ్రప్రదేశ్లో కోటి మంది డ్వాక్రా మహిళలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ద్రోహం... స్త్రీనిధి సంస్థ నిధులకు ఎసరు
క్రీడలు

IPL 2025: సన్రైజర్స్ ఆల్రౌండర్ రేర్ టాలెంట్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు గత సీజన్ రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్ కఠోరంగా శ్రమిస్తుంది. ఈ సీజన్ కోసం చాలా రోజుల కిందటే ప్రాక్టీస్ షూరూ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. ప్రస్తుతం ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లతో బిజీగా ఉంది. నిన్న జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్లో సన్రైజర్స్ ఆల్రౌండర్ కమిందు మెండిస్లోని ఓ రేర్ టాలెంట్ బయటపడింది. కమిందు రెండు చేతులతో బౌలింగ్ చేసి వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి రెండు బంతులను కుడి చేతితో వేసిన కమిందు.. ఆతర్వాత బంతిని ఎడమ చేతితో బౌలింగ్ చేశాడు. కమిందు కుడి చేతితో బౌలింగ్ చేస్తూ అప్పటికే బౌండరీ బాది జోష్ మీదున్న ఇషాన్ కిషన్ను ఔట్ చేశాడు. ఆ తర్వాత బంతికి అభినవ్ మనోహర్ క్రీజ్లోకి రాగా.. అతనికి తన ఎడమ చేతి వాటాన్ని రుచి చూపించాడు. కమిందు రెండు చేతులతో బౌలింగ్ చేస్తూ ప్రదర్శించిన వైవిధ్యాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సోషల్మీడియాలో షేర్ చేయగా.. అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది. రేర్ టాలెంట్ అంటూ ఫ్యాన్స్ కమిందును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. శ్రీలంక నయా సంచలనం కమిందును ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ మెగా వేలంలో రూ. 75 లక్షల బేస్ ప్రైజ్కు కొనుగోలు చేసింది.కాగా, ఐపీఎల్-2025లో సన్రైజర్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న ఆడుతుంది. ఈ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది. కేకేఆర్ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరుగనుంది.ఇదిలా ఉంటే, ఈ సీజన్ మెగా వేలానికి ముందు సన్రైజర్స్ ఎయిడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి విధ్వంకర బ్యాటర్లను వదిలేసి ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్ లాంటి లోకల్ టాలెంట్ను అక్కున చేర్చుకుంది. మెగా వేలానికి ముందు సన్రైజర్స్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లాంటి నాణ్యమైన పేసర్లను కూడా వదిలేసింది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ, గత సీజన్ అత్యధిక వికెట్ల వీరుడు హర్షల్ పటేల్, ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా, శ్రీలంక ఆల్రౌండర్ కమిందు మెండిస్ కొత్తగా జట్టులోకి చేరారు. 2025 ఐపీఎల్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్

వయసు పెరుగుతున్నా అదే టెంపర్.. విండీస్ ఆటగాడితో కయ్యానికి కాలు దువ్విన యువరాజ్ సింగ్
వయసు పెరుగుతున్నా టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్లో టెంపర్ ఏమాత్రం తగ్గలేదు. ఆటగాడిగా ఉన్న రోజుల్లో ఎలా దూకుడుగా ఉండే వాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (దిగ్గజ క్రికెటర్లు పాల్గొన్న టోర్నీ) ఫైనల్లో యువీ తన పాత రోజులను గుర్తు చేశాడు. విండీస్ ఆటగాడు టీనో బెస్ట్పై తనదైన పంధాలో విరుచుకుపడ్డాడు. pic.twitter.com/y2iHtEPyCr— Cricket Heroics (@CricHeroics786) March 16, 2025అసలేం జరిగిందంటే.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ ఫైనల్లో భారత మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ విజేతగా నిలిచి టైటిల్ను ఎగరేసుకుపోయింది. తొలుత బౌలింగ్లో వినయ్ కుమార్ (3-0-26-3), షాబాజ్ నదీం (4-1-12-2).. ఆతర్వాత బ్యాటింగ్లో అంబటి రాయుడు (50 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటి భారత్ను గెలిపించారు.అయితే ఈ మ్యాచ్ మధ్యలో ఓ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. విండీస్ ఆటగాడు టీనో బెస్ట్, భారత స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ గొడవ పడ్డారు. విండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత మాస్టర్స్ ఛేదిస్తుండగా (14వ ఓవర్ తొలి బంతి తర్వాత).. యువీ టీనో బెస్ట్పై తన సహజ శైలిలో వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. బెస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా యువీకి తిరుగు సమాధానం చెప్పాడు. దీంతో గొడవ పెద్దదైంది. ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు. ఇద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. అంపైర్ బిల్లీ బౌడెన్, క్రీజ్లో ఉన్న అంబటి రాయుడు, విండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా సర్ది చెప్పడంతో ఇద్దరూ వెనక్కు తగ్గారు. ఆతర్వాత ఆట సజావుగా సాగి భారత్ విజేతగా నిలిచింది. యువీ-బెస్ట్ గొడవకు ముందు రాయుడు ఆష్లే నర్స్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదాడు. అంతకుముందు బెస్ట్ వేసిన ఓవర్లో రాయుడు, యువీ కలిసి 12 పరుగులు పిండుకున్నారు. రాయుడు సిక్సర్ కొట్టిన అనందంలో యువీ బెస్ట్ను కవ్వించగా.. అతను కూడా తగ్గేదేలేదంటూ సమాధానం చెప్పాడు. యువీకి ఇలాంటి గొడవలు కొత్తేమీ కాదు. ఆటగాడి ఉన్న రోజుల్లో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్తో జరిగిన ఫైట్ భారత క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తుంటుంది. మొత్తానికి మాస్టర్స్ లీగ్ ఫైనల్లో యువీ చర్యను కొందరు సమర్దిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. దిగ్గజాల కోసం నిర్వహించిన టోర్నీలో హుందాగా ఉండాల్సింది పోయి, గొడవలు పడటమేంటని చురకలంటిస్తున్నారు. యువీనే తొలుత బెస్ట్ను కవ్వించాడని మ్యాచ్ను చూసిన వాళ్లు అంటున్నారు. ఏది ఏమైనా సప్పగా సాగుతున్న మాస్టర్స్ లీగ్.. ఫైనల్లో యువీ చర్య వల్ల రక్తి కట్టింది. ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయిన (ఆస్ట్రేలియా చేతిలో) భారత్.. ఫైనల్లో విండీస్పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్ను చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో భారత్ సచిన్ టెండూల్కర్ నాయకత్వంలో అద్భుత విజయాలు సాధించింది. భారత మాస్టర్స్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు పూర్వపు రోజులు గుర్తు చేశారు. లజెండ్స్ లీగ్ పోటీలు చాలా జరుగుతుండటంతో ఈ టోర్నీ ఫెయిల్ అవుతుందని అంతా అనుకున్నారు. అయితే భారత్, విండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజాలు అద్భుత ప్రదర్శనలు చేసి ఈ టోర్నీని సక్సెస్ చేశారు. ఈ టోర్నీలో ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్ ఏకంగా మూడు సెంచరీలు చేయడం హైలైట్. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. భారత్ మరో 17 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ ఇన్నింగ్స్లో డ్వేన్ స్మిత్ (45), లెండిల్ సిమన్స్ (57) మాత్రమే రాణించగా.. దిగ్గజం లారా (6) నిరాశపరిచాడు.

IPL 2025: కేకేఆర్కు బిగ్ షాక్.. స్టార్ పేసర్కు గాయం
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్కు (కేకేఆర్) భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సీజన్ మొత్తనికి దూరమ్యాడు. దీంతో అతనికి రీ ప్లేస్మెంట్గా 27 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ చేతన్ సకారియాను ఎంపిక చేసుకుంది కేకేఆర్ మేనేజ్మెంట్. మాలిక్ను కేకేఆర్ ఈ సీజన్ మెగా వేలంలో రూ. 75 లక్షలకు దక్కించుకుంది. మాలిక్ కేకేఆర్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వైదొలిగాడు. జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్గా ప్రసిద్ది చెందిన మాలిక్ 2021లో సన్రైజర్స్ తరఫున అరంగేట్రం చేసి గత సీజన్ వరకు అదే జట్టుకు ఆడాడు. మూడు సీజన్లలో అద్బుతమైన ప్రదర్శనలు చేసిన మాలిక్.. ఎస్ఆర్హెచ్ తరఫున 26 మ్యాచ్లు ఆడి 29 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనల కారణంగా మాలిక్ టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన మాలిక్ భారత్ తరఫున 10 వన్డేలు, 8 టీ20లు ఆడి 24 వికెట్లు తీశాడు. సకారియా విషయానికొస్తే.. గుజరాత్లో పుట్టి దేశవాలీ క్రికెట్లో సౌరాష్ట్రకు ఆడే సకారియా గత సీజన్లో కేకేఆర్తో పాటే ఉన్నాడు. అయితే ఆ సీజన్లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన సకారియా ఆతర్వాత రెండు సీజన్ల పాటు (2022, 2023) రాజస్థాన్ రాయల్స్కు ఆడాడు. సకారియా తన ఐపీఎల్ కెరీర్లో 19 మ్యాచ్లు ఆడి 8.43 ఎకానమీతో 20 వికెట్లు తీశాడు. ఐపీఎల్ ప్రదర్శనల కారణంగా సకారియా భారత జట్టుకు ఆడే అవకాశం కూడా దక్కించుకున్నాడు. 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సకారియా ఓ వన్డే, 2 టీ20లు ఆడి 3 వికెట్లు తీశాడు. ఓవరాల్గా 46 టీ20లు ఆడిన సకారియా 65 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం కేకేఆర్ సకారియాను రూ. 75 లక్షల బేస్ ధరకు దక్కించుకుంది.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025లో కేకేఆర్ ప్రయాణం సీజన్ ఆరంభ మ్యాచ్తోనే మొదలవుతుంది. మార్చి 22న జరిగే మ్యాచ్లో కేకేఆర్ ఆర్సీబీని ఢీకొంటుంది. ఈ సీజన్లో కేకేఆర్కు కొత్త కెప్టెన్ వచ్చాడు. గత సీజన్లో టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ను వెళ్లడంతో కేకేఆర్ మేనేజ్మెంట్ అజింక్య రహానేను నూతన కెప్టెన్గా ఎంపిక చేసుకుంది. రహానేకు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వెంకటేశ్ అయ్యర్ ఎంపికయ్యాడు.2025 ఐపీఎల్ సీజన్ కోసం కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్ (వైస్ కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, రమన్దీప్ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, లవ్నిత్ సిసోడియా, రహ్మానుల్లా గుర్బాజ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జే, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్

వారెవ్వా నోరిస్...
మెల్బోర్న్: గత సీజన్ను విజయంతో ముగించిన మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్ కొత్త సీజన్ను కూడా విజయంతో ప్రారంభించాడు. 2025 ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రిలో బ్రిటన్కు చెందిన 25 ఏళ్ల లాండో నోరిస్ చాంపియన్గా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన నోరిస్ నిర్ణీత 57 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 42 నిమిషాల 06.304 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గత నాలుగేళ్లుగా ప్రపంచ టైటిల్ సాధిస్తున్న వెర్స్టాపెన్ రెండో స్థానంలో నిలిచాడు. వెర్స్టాపెన్ రేసును 1 గంట 42 నిమిషాల 07.199 సెకన్లలో ముగించాడు. మెర్సిడెస్ డ్రైవర్ జార్జి రసెల్ మూడో స్థానాన్ని పొందాడు. 1987లో ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రి మొదలుకాగా ఈ రేసుకంటే ముందు వరకు ఫెరారీ జట్టు డ్రైవర్లు అత్యధికంగా 11 సార్లు విజేతగా నిలిచారు. అయితే ఈసారి ఫెరారీ జట్టుకు ఈ రేసు కలిసిరాలేదు. తొలిసారి ఫెరారీ జట్టు తరఫున బరిలోకి దిగిన మాజీ వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 10వ స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ 8వ స్థానాన్ని సంపాదించాడు. 2010 తర్వాత తొలిసారి ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రికి వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా ఈ రేసుకు మూడుసార్లు అంతరాయం కలిగింది. మూడుసార్లు ట్రాక్పై సేఫ్టీ కార్లు వచ్చాయి. తొలి ల్యాప్ పూర్తికాకముందే ముగ్గురు డ్రైవర్లు కార్లోస్ సెయింజ్ (విలియమ్స్), జాక్ దూహాన్ (ఆలై్పన్), ఐజాక్ హద్జార్ (రేసింగ్ బుల్స్) రేసు నుంచి వైదొలిగారు. ఫార్మేషన్ ల్యాప్లో హద్జార్ తప్పుకోగా... తొలి ల్యాప్లో పరస్పరం ఢీకొట్టుకోవడంతో గత ఏడాది ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రిలో విజేతగా నిలిచిన సెయింజ్తోపాటు దూహాన్ నిష్క్రమించారు. ఆ తర్వాత అలోన్సో (ఆస్టన్ మార్టిన్) 32వ ల్యాప్లో, గాబ్రియేల్ బొర్టోలెటో (కిక్ సాబెర్) 45వ ల్యాప్లో, లియామ్ లాసన్ (రెడ్బుల్) 46వ ల్యాప్లో తప్పుకున్నారు. ఓవరాల్గా 20 మంది డ్రైవర్లలో 14 మంది రేసును పూర్తి చేశారు. 24 రేసులతో కూడిన 2025 సీజన్లో తదుపరి రెండో రేసు చైనా గ్రాండ్ప్రి ఈనెల 23న జరుగుతుంది.
బిజినెస్

క్లోజ్ అవుతున్న పోస్టాఫీస్ స్కీమ్..
ప్రజల్లో ఆర్థిక పొదుపును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పోస్టాఫీసుల ద్వారా వీటిని అమలు చేస్తోంది. అలాంటి మంచి స్కీముల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్సీ) పథకం ఒకటి.మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఇక చాలా తక్కువ రోజులే సమయం ఉంది. పోస్టాఫీస్ కింద నిర్వహించే ఎంఎస్ఎస్సీ పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్లో పెట్టుబడి సమయాన్ని ప్రభుత్వం ఇంకా పొడిగించలేదు. ఇప్పటి వరకు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయని మహిళలకు కొన్ని రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..మహిళలకు ప్రత్యేకంస్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్ కింద భారత ప్రభుత్వం 2023 మార్చి 31న మహిళలు, బాలికల కోసం ఎంఎస్ఎస్సీ (మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్) పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇది రెండు సంవత్సరాల కాలానికి అమలు చేస్తున్న స్వల్పకాలిక డిపాజిట్ స్కీమ్. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం లక్ష్యం.ఎంత వడ్డీ లభిస్తుంది?దేశంలోని ఏ మహిళ అయినా ఈ పథకంలో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ కింద ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది. ఎంఎస్ఎస్సీ స్కీమ్పై 7.5% వార్షిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఇది బ్యాంకులలో 2 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ కంటే ఎక్కువ. ఇది సురక్షితమైన పథకం ఎందుకంటే ఇది ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దీని కింద పోస్టాఫీస్ లేదా రిజిస్టర్డ్ బ్యాంకుల్లో సులభంగా ఖాతా తెరవవచ్చు.పెట్టుబడి ఎంత పెట్టవచ్చు?మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం కింద దేశంలో నివసించే ఏ మహిళ అయినా కనీసం రూ .1,000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 2 సంవత్సరాల వ్యవధి తర్వాత, అసలు, వడ్డీ మొత్తం చెల్లిస్తారు. ఏదైనా అవసరం పడితే ఒక సంవత్సరం తరువాత డిపాజిట్ మొత్తంలో 40% వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. తీవ్రమైన అనారోగ్యం లేదా ఖాతాదారు మరణం వంటి పరిస్థితులలో ఖాతాను ముందస్తుగా మూసివేయవచ్చు. డిపాజిటర్ 6 నెలల తర్వాత ఖాతాను మూసివేస్తే వడ్డీ రేటు తగ్గవచ్చు.

భారత్కు నిజమైన బహుమతి!: అదానీ ట్వీట్
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూన్లో ప్రారంభించనున్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' (Gautam Adani) ప్రకటించారు. దీనిని ఏప్రిల్ 17న ప్రారంభించాలని మొదట అనుకున్నప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ (AAHL), సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర (CIDCO) భాగస్వామ్యంతో జరుగుతోంది. 2018 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టుకు పునాదిరాయి వేసారు. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 16,700 కోట్లు అవుతుందని అంచనా.ఇప్పటికే ముంబైలోని ప్రధాన విమానాశ్రయంలో రద్దీని తగ్గించడానికి.. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ విమానాశ్రయాన్ని సందర్శించిన సందర్భంగా.. ఈరోజు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ స్థలాన్ని సందర్శించాను. ప్రపంచ స్థాయి విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. ఇది జూన్లో ప్రారంభోత్సవానికి సిద్దమవుతుంది. అంతే కాకుండా ఇది భారతదేశానికి నిజమైన బహుమతి!. అని అదానీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!రెండు రన్వేలు, నాలుగు టెర్మినల్స్తో రూపొందించబడిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, ఐదు దశల్లో పూర్తయిన తర్వాత ఏటా 90 మిలియన్ల మంది ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయిన తరువాత ముంబైలోని ప్రధాన విమానాశ్రయంలో రద్దీ తగ్గుతుంది.A glimpse into India’s aviation future! ✈️Visited the Navi Mumbai International Airport site today—a world-class airport taking shape. Set for inauguration this June, it will redefine connectivity & growth. A true gift to India!Kudos to the Adani Airports team & partners for… pic.twitter.com/2TCWcSnr6c— Gautam Adani (@gautam_adani) March 16, 2025

తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..
దేశంలో బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,560 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.110 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,560 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 89,710 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఈ రోజు (మార్చి 16) కేజీ సిల్వర్ రేటు రూ. 1,11,900 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,02,900 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న ఇండస్ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రశాంతంగా ప్రారంభమైన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీలు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 73,830 వద్ద ప్రారంభమైంది. తరువాత ఆటో, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుంది.ఉదయం 9.25 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 412 పాయింట్ల లాభంతో 72,245 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 135 పాయింట్లు లాభపడి 22,533 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్ 30 షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 5 శాతం లాభపడింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా 2 - 3 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు నెస్లే ఇండియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. విస్తృత మార్కెట్లో, బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ సోమవారం ఇంట్రాడేలో 0.5 శాతం పెరిగింది.
ఫ్యామిలీ

ఏది శాశ్వతం? ఏదశాశ్వతం
ఒక మహారాజు ప్రపంచంలో ఎవరూ కట్టించని అద్భుతమైన భవనాన్ని నిర్మింప జేయాలను కున్నాడు. లెక్కలేనంత ధనాన్ని ఖర్చు చేసి, దేశం నలుమూలల నుంచి గొప్ప గొప్ప శిల్పులను పిలిపించి కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో పనిచేయించి గొప్ప భవనాన్ని నిర్మింపజేశాడు. ఆ భవనం విశాలమైన గదులు, ధగ ధగ మెరుస్తున్న కాంతులతో, బంగారు తాపడాల గోడలతో, మంచి శిల్ప నైపుణ్యంతో దేవేంద్ర వైభవాన్ని తలపిస్తూ ఉంది. ఒక రోజు రాజు గృహ ప్రవేశ కార్యక్రమానికిఘనంగా ఏర్పాటు చేసి, దేశం లోని రాజ ప్రముఖులను, విద్వాంసులను, వ్యాపారవేత్తలను, వాస్తు శాస్త్రజ్ఞులను ఆహ్వానించాడు. గృహ ప్రవేశం అయ్యాక, రాజు సభ ఏర్పాటు చేసి, వారితో... ‘ఈ గొప్ప భవనాన్ని ఎంతో ఖర్చు చేసి కట్టించాను. ప్రపంచంలో ఇంత సర్వాంగ సుందరమైన భవనం ఇంకోటి ఉండకూడదు. అందుకని, మీలో ఎందరో ప్రతిభా వంతులు ఉన్నారు. మీరు ఈ భవనాన్ని సమగ్రంగా పరిశీలించి, ఇందులో లోపాలు, దోషాలు ఏమైనా ఉంటే చెప్పండి. సవరణలు చేయిస్తాను. ఇప్పుడే తెలపండి’ అన్నాడు.రాజు మాటలు విని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్య పోయారు. ఇంత అందమైన కట్టడంలో లోపాలా? అనుకున్నారు. అయినా, రాజు మాట కాదనలేక, వారిలో శిల్పులు, వాస్తు శాస్త్రజ్ఞులు భవనమంతా చూసి ఏ లోపం లేదని నిర్ధరించారు. రాజు చాలా సంతోషించాడు. అంతలో, సభాసదులలో నుంచి ఒక సాధువు లేచి నిల్చున్నాడు. ‘రాజా! ఈ భవనంలో రెండు దోషాలున్నాయి’ అన్నాడు. రాజు వినయంగా అవేమిటో తెలపమన్నాడు. అప్పుడా సాధువు, ‘ఈ భవనాన్ని కట్టించినవారు ఎప్పటికైనా చనిపోతారు. ఇది ఒక దోషం. ఈ భవనం కాలగర్భంలో ఎప్పటికైనా కలిసిపోతుంది. ఇది ఇంకో దోషం’ అన్నాడు. అప్పుడు రాజుకు వివేకం ఉదయించింది. ‘ఈ లోకంలో ప్రతిదీ నశించి పోయేదే. నశ్వరమైన భౌతిక సంపదల కోసం, తక్షణఆనందం కోసం ఇంత ఖర్చు చేసి ఇన్ని సంవత్సరాల సమయం వృథా చేశాను కదా. శాశ్వతమైనది దైవం ఒక్కడే! ఆ దైవం ముందు ఇవన్నీ నశ్వరాలే’ అని తెలుసుకున్నాడు. రాజుతో పాటు అందరం తెలుసుకోవలసింది ఇదే! దైవ అనుగ్రహానికే మనిషి పాటుపడాల్సింది. – డా. చెంగల్వ రామలక్ష్మి

ప్యాలెస్లో ప్రయాణం రాజస్థాన్ విహారం
ప్యాలెస్ ఆన్ వీల్స్లో వారం రోజుల ప్రయాణం. ఇది ప్రయాణం మాత్రమే కాదు... ఒక అనుభూతి. రాజస్థాన్ కోటలను చూడాలి... థార్ ఎడారిలో విహరించాలి. రాజపుత్రులు మెచ్చిన జానపద కళల ప్రదర్శనలను ఆస్వాదించాలి.ఇవన్నీ మామూలుగా కాదు... సకల మర్యాదలతో రాజసంగా ఉండాలి.పర్యటన ఆద్యంతం కాలు కింద పెట్టకుండా సౌకర్యంగా ఉండాలి. రాజస్థాన్ టూరిజం... సామాన్యులకు రాజలాంఛనాలను అందిస్తోంది. ఇందుకోసం ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ పేరుతో ఒక రైలునే సిద్ధం చేసింది. ఇది టూర్ మాత్రమే కాదు... ఇది ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియెన్స్.ఇంకెందుకాలస్యం... ట్రైన్ నంబర్ 123456... ప్లాట్ మీదకు వస్తోంది... లగేజ్తో సిద్ధంగా ఉండండి.రాజస్థాన్ పర్యాటకం రాజసంగా ఉంటుంది. సాధారణ ప్యాకేజ్లు క్లస్టర్లుగా కొన్ని ప్రదేశాలనే కవర్ చేస్తుంటాయి. పింక్సిటీ, బ్లూ సిటీ, గోల్డెన్ సిటీ, లేక్ సిటీలన్నింటినీ కవర్ చేయాలంటే ప్యాలెస్ ఆన్ వీల్స్ సౌకర్యంగా ఉంటుంది. 7 రాత్రులు 8 రోజుల ప్యాకేజ్లో రైలు న్యూఢిల్లీ సఫ్దర్ గంజ్ స్టేషన్లో మొదటి రోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరుతుంది. 8 రోజు ఉదయం ఏడున్నరకు అదే స్టేషన్లో దించుతుంది.ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తయ్యే ఈ ప్యాకేజ్లో జయ్పూర్, సవాయ్ మాధోపూర్, చిత్తోర్ఘర్, ఉదయ్పూర్, జై సల్మీర్, జో«ద్పూర్, భరత్పూర్, ఆగ్రాలు కవర్ అవుతాయి. ఈ పర్యాటక రైలు 1982, జనవరి 26 నుంచి నడుస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలో టూరిజమ్ ప్రమోషన్ కోసం ఇండియన్ రైల్వేస్– రాజస్థాన్ టూరిజమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ టూర్ విదేశీయులే ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు మనవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో పర్యటిస్తున్నారు.తొలిరోజు: ఢిల్లీ టూ జయ్పూర్పర్యాటకులకు రాజపుత్రుల సంప్రదాయ రాచమర్యాదలందిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు రైల్వే స్టేషన్కి చేరగానే రెడ్కార్పెట్ స్వాగతం పలుకుతారు. పూలమాల వేసి, బొట్టు పెట్టి, గంధం రాస్తారు. షెహనాయ్ రాగం, కచ్చీఘోదీ నాట్యం, ఏనుగు అంబారీల మధ్య రిఫ్రెష్ డ్రింక్ (సాఫ్ట్ డ్రింకులు, బార్) తో వెల్కమ్ చెబుతారు. పర్యాటకులు ఎవరికి కేటాయించిన గదిలోకి వాళ్లు వెళ్లిన తర్వాత ఆరున్నరకు రైలు ఢిల్లీ స్టేషన్ నుంచి పింక్సిటీ జయ్పూర్కు బయలుదేరుతుంది. రాత్రి ఎనిమిది గంటలకు రైల్లో విందు భోజనం ఇస్తారు.రెండవ రోజు: జయ్పూర్ టూ సవాయ్ మాధోపూర్అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు ట్రైన్ జయ్పూర్కి చేరుతుంది. పర్యాటకులు నిద్రలేచి రిఫ్రెష్ అయిన తర్వాత ఏడు గంటలకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. ఎనిమిది గంటలకు రైలు దిగి (లగేజ్ రైల్లోనే ఉంటుంది) సైట్ సీయింగ్ కోసం ఏర్పాటు చేసిన వాహనాల్లోకి మారాలి. నగరంలో ఆల్బర్ట్ హాల్, హవామహల్, సిటీ ప్యాలెస్, జంతర్మంతర్ (ఖగోళ పరిశోధనాలయం)ని చూడడం. మధ్యాహ్నం లోహగర్ ఫోర్ట్లోని రిసార్ట్కు తీసుకెళ్తారు. లంచ్ అక్కడే. ఆ తర్వాత సూర్యాస్తమయంలోపు అమేర్ ఫోర్ట్ విజిట్, షాపింగ్ పూర్తి చేసుకుని ఆరు గంటలకు ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. ఏడు గంటల తర్వాత రాజస్థాన్ సంప్రదాయ వంటకాలతో డిన్నర్. ప్రయాణం సవాయ్ మాధోపూర్కు సాగుతుంది.మూడవ రోజు: మాధోపూర్ టూ చిత్తోర్ఘర్తెల్లవారు జామున ఐదు గంటల లోపు సవాయ్ మాధోపూర్ చేరుతుంది. రిఫ్రెష్ అయి ఆరు గంటలకు రైలు దిగి రణతంబోర్ నేషనల్ పార్క్, రణతంబోర్ ఫోర్ట్ విజిట్కి వెళ్లాలి. నేషనల్ పార్క్ పర్యటన పూర్తి చేసుకుని పదింటికి ట్రైన్ ఎక్కాలి. అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. రైలు చిత్తోర్ఘర్ వైపు సాగిపోతుంది. లంచ్ రైల్లోనే. సాయంత్రం నాలుగు గంటలకు చిత్తోర్ఘర్ చేరుతుంది. రైలు దిగి సైట్ సీయింగ్కి వెళ్లాలి. ఆరు గంటలకు కోట లోపల టీ తాగి, లైట్ అండ్ సౌండ్ షో ను ఆస్వాదించి ఏడున్నరకు రైలెక్కాలి. ఎనిమిది గంటలకు రైల్లోనే డిన్నర్.నాలుగవ రోజు: చిత్తోర్ఘర్ టూ జై సల్మీర్ వయా ఉదయ్పూర్రెండు గంటలకు చిత్తోర్ఘర్ నుంచి బయలుదేరుతుంది. ఉదయం ఏడున్నరకు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకున్న తర్వాత ఎనిమిదిన్నరకు లేక్సిటీ ఉదయ్పూర్ చేరుతుంది. రైలు దిగి తొమ్మిదింటికి వాహనంలోకి మారి సైట్సీయింగ్, షాపింగ్ చేసుకోవాలి. మధ్యాహ్నం ఒకటిన్నరకు బోట్ రైడ్, ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం. మూడు గంటలకు తిరిగి ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. నాలుగు గంటలకు జై సల్మీర్కు ప్రయాణం. రాత్రి భోజనం రైల్లోనే ఎనిమిది గంటలకు.ఐదవ రోజు: జై సల్మీర్ టూ జోద్పూర్రైలు ఉదయం తొమ్మిదిన్నరకు జై సల్మీర్కి చేరుతుంది. రైలు దిగి గడిసిసార్ సరస్సు. జై సల్మీర్ కోట, నగరంలోని హవేలీలు చూసుకుని షాపింగ్ చేసుకుని తిరిగి రైలెక్కాలి. భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత నాలుగు గంటలకు రైలు దిగి ఎడారిలో విహారం, క్యామెల్ రైడ్ ఆస్వాదించాలి. రాజస్థాన్ సంప్రదాయ జానపద నృత్యాలు, సంగీత కార్యక్రమాల వినోదం, రాత్రి భోజనం కూడా అక్కడే చేసుకుని రాత్రి పది గంటలకు రైలెక్కాలి. పన్నెండు గంటలలోపు రైలు జై సల్మీర్ నుంచి బ్లూ సిటీ జో«ద్పూర్కు బయలుదేరుతుంది.ఆరవ రోజు: జో«ద్పూర్ టూ భరత్పూర్రైలు ఉదయం ఏడు గంటలకు జో«ద్పూర్కు చేరుతుంది. ఏడున్నరకు బ్రేక్ఫాస్ట్ చేసి ఎనిమిదిన్నరకు సైట్ సీయింగ్ కోసం రైలు దిగాలి. మెహరాన్ఘర్ ఫోర్ట్, జస్వంత్ థాడా, ఉమైద్ భవన్ ప్యాలెస్ మ్యూజియం చూసుకున్న తర్వాత షాపింగ్. ఒకటిన్నరకు బాల్ సమంద్ లేక్ ప్యాలెస్లో రాజలాంఛనాలతో విందు భోజనం చేసిన తర్వాత ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. నాలుగన్నరకు రైలు జో«ద్పూర్ నుంచి భరత్పూర్కు బయలుదేరుతుంది. రాత్రి భోజనం రైల్లోనే.ఏడవ రోజు: భరత్పూర్ టూ ఆగ్రారైలు ఉదయం ఆరు గంటలకు భరత్పూర్కి చేరుతుంది. వెంటనే సైట్ సీయింగ్కి బయలుదేరాలి. ఘనా బర్డ్ సాంక్చురీ విజిట్ తర్వాత ఎనిమిది గంటలకు మహల్ ఖాజ్ ప్యాలెస్లో బ్రేక్ఫాస్ట్ చేసి రైలెక్కాలి. పది గంటలకు రైలు ఆగ్రాకు బయలుదేరుతుంది. పదకొండు గంటలకు ఆగ్రా రెడ్ ఫోర్ట్ చూసుకుని ఫైవ్ స్టార్ హోటల్లో లంచ్ తర్వాత మూడు గంటలకు తాజ్మహల్ వీక్షణం. ఐదున్నర నుంచి షాపింగ్, ఏడున్నరకు రైలెక్కి డిన్నర్ తర్వాత ఎనిమిది ముప్పావుకి ఢిల్లీకి బయలుదేరాలి.ఎనిమిదవ రోజు: ఆగ్రా టూ ఢిల్లీఉదయానికి రైలు ఢిల్లీకి చేరుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసి, లగేజ్ సర్దుకుని ఏడున్నరకు దిగి ప్యాలెస్ ఆన్ వీల్స్కి వీడ్కోలు పలకాలి.తరగతుల వారీగా ట్రైన్ టికెట్ వివరాలు:⇒ ప్రెసిడెన్షియల్ సూట్లో క్యాబిన్కి... 2,67,509 రూపాయలు⇒ సూపర్ డీలక్స్లో క్యాబిన్కి... 2,18,207 రూపాయలు⇒ డీలక్స్ క్యాబిన్ సింగిల్ ఆక్యుపెన్సీ... 1,10,224 రూపాయలు⇒ డీలక్స్ క్యాబిన్ డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి... 71,712 రూపాయలు⇒ ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచితం. పన్నెండేళ్ల లోపు పిల్లలకు సగం చార్జ్.⇒ ఒక క్యాబిన్లో ఇద్దరికి అనుమతి. పిల్లలను పేరెంట్స్తోపాటు అదే క్యాబిన్లో అనుమతిస్తారు.ప్యాలెస్ ఆన్ వీల్స్ మరిన్ని వివరాల కోసం...Email : palaceonwheels.rtdc@rajasthan.gov.in Website: Palaceonwheels.rajasthan.gov.inపులి కనిపించిందా!ఈ టూర్లో రాజస్థాన్ సంప్రదాయ సంగీతం, స్థానిక ఘూమర్, కల్బేలియా జానపద నృత్యాలను ఆస్వాదిస్తూ సాగే కామెల్ సఫారీ, డెజర్ట్ సఫారీలు, క్యాంప్ఫైర్ వెలుగులో ఇసుక తిన్నెల మీద రాత్రి భోజనాలను ఆస్వాదించవచ్చు. భరత్పూర్లోని కెలాడియా నేషనల్ పార్క్కి సైబీరియా నుంచి వచ్చిన కొంగలను చూడవచ్చు. ఈ పక్షులు ఏటా సైబీరియా నుంచి ఏడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నవంబర్లో ఇక్కడికి వలస వస్తాయి.మార్చి వరకు ఇక్కడ ఉండి ఏప్రిల్ నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెడతాయి. ఈ కొంగలతోపాటు వందల రకాల పక్షులుంటాయి. రణతంబోర్ నేషనల్ పార్క్కు వెళ్లి జీప్ సఫారీ లేదా ఎలిఫెంట్ సఫారీ చేస్తూ పులి కనిపిస్తుందేమోనని రెప్పవేయకుండా కళ్లు విప్పార్చి బైనాక్యులర్లో చూసి చూసి... దూరంగా ఎక్కడో పులి అలికిడి కనిపించగానే భయంతో కూడిన థ్రిల్తో బిగుసుకు పోవచ్చు.ఏడు హెరిటేజ్ సైట్లను చూడవచ్చుప్యాలెస్ ఆన్ వీల్స్ ప్యాకేజ్లో యునెస్కో గుర్తించిన ఏడు వరల్డ్ హెరిటేజ్ సైట్లు కవర్ అవుతాయి. అవేంటంటే... జయ్పూర్లోని జంతర్ మంతర్, రణతంబోర్లో రణతంబోర్ కోట, చిత్తోర్ఘర్లో చిత్తోర్ఘర్ కోట, జై సల్మీర్లో జై సల్మీర్ కోటతోపాటు థార్ ఎడారి, భరత్పూర్ కెలాడియో నేషనల్ పార్క్, ఆగ్రాలో తాజ్ మహల్. ఇవన్నీ యునెస్కో గుర్తింపు పొందిన హెరిటేజ్ సైట్లు. ఈ గౌరవంతోపాటు తాజ్మహల్కి ప్రపంచంలోని ఏడు వింతల జాబితాలో కూడా స్థానం ఉంది.

'వాకింగ్ యోగా': జస్ట్ ఒకే వ్యాయామంతో..!
నడక, యోగా రెండూ దేనికవే ప్రత్యేకం. ఆరోగ్యకరమైన వ్యాయామ మార్గాలు. ప్రస్తుతం ఈ రెంటినీ మిళితం చేసిన సరి కొత్త వ్యాయామంగా అందుబాటులోకి వచ్చింది వాకింగ్ యోగా. అటు నడక ద్వారా లభించే ప్రయోజనాలతో పాటు.. ఇటు యోగా ఫలితాలను ఒకే వ్యాయామం ద్వారా అందుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో అనేక మందిని ఆకట్టుకుంటున్న ఈ వాకింగ్ యోగా విశేషాలివి..నడక మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ నడక– యోగా ఆ ప్రయోజనాలను మరింత ముందడుగు వేయిస్తుంది. ఆధునిక సౌకర్యాలు, పని విధానాల వల్ల చలన రహితంగా మారుతున్న శరీరాన్ని చురుకుగా కదపడానికి విభిన్న రకాలుగా సాగదీయడానికి, సరైన రీతిలో శ్వాస పీల్చుకోడానికి వీలుగా ఈ వాకింగ్ యోగా రూపుదిద్దుకుంది. ఇది నడిచేటప్పుడు మన శరీర భంగిమను మెరుగుపరచడానికి, నడకను మరింత ప్రయోజనకరంగా మార్చడానికి సహకరిస్తుంది. ఏదో నడిచాం అన్నట్టుగా కాకుండా అవగాహనతో నడవడం నేర్పిస్తుంది. ఇందులో ప్రతి అడుగు లోతైన శ్వాస, సున్నితమైన స్ట్రెచ్లతో కలిపి ఉంటుంది. భంగిమకు మేలు.. మనలో చాలా మంది మన శరీర భంగిమ ఎలా ఉంటుందో పట్టించుకోకుండా నడుస్తూ ఉంటారు. తద్వారా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతుంటారు. వాకింగ్ యోగా భంగిమను మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్లు, మెడ.. వీటిని సరైన రీతిలో ఉంచేలా సహాయపడుతుంది. నిటారుగా నిలిచేలా, నడుము భాగం, వీపుతో నడకను అనుసంధానిస్తుంది. కండరాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొందరికి అననుకూలం.. ఒక వ్యక్తి తమ నడకను మరింత విశ్రాంతిగా అదే సమయంలో మరింత ఉపయుక్తంగా మార్చే నడక యోగా టీనేజర్స్తో సహా అన్ని వయసుల వారికీ ఉపయుక్తమే. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇది అందరికీ అనుకూలం కాకపోవచ్చు. వేగవంతమైన నడక లేదా తీవ్రమైన వ్యాయామాలను ఇష్టపడే వ్యక్తులకు నప్పకపోవచ్చు. అలాగే, దీనికి ఏకాగ్రత, ఎక్కువ సహనం అవసరం. అది లేనివారు దీన్ని సాధన చేయడం కష్టం. నప్పుతుందో లేదో తెలుసుకోడానికి ఒక వారం పాటు దీనిని ప్రయత్నించి పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మానసికంగానూ ఎంతో మేలు.. నడక యోగా ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతిని అందించడానికి ఒక గొప్ప మార్గం. ఇది నడుస్తున్నప్పుడు లోతుగా శ్వాస తీసుకోవడం అలవాటు చేస్తుంది. తద్వారా ఆందోళనను, ప్రతికూల ఆలోచనలను తగ్గించి మనసును ప్రశాంతపరుస్తుంది. ఇది చురుకుగా ఉంటూనే మెదడుకు రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేయడం లాంటిదని చెప్పొచ్చు. మనసు శరీరానికి క్రమబద్ధమైన అభ్యాసం ఇది. ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని, ఏకాగ్రతను పెంచడానికి శరీరంపై అవగాహనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజుకు 5 నిమిషాలతో.. బాగా పరిచయం ఉన్న కాస్త ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో రోజుకు ఐదు నిమిషాలతో ఈ వాకింగ్ యోగాని ప్రారంభించాలి. రోజుకు క్రమంగా ఐదు నిమిషాల చప్పున పెంచుకోవచ్చు. తద్వారా రొటీన్ వ్యవహారాలకు, వ్యాయామాలతో సర్దుబాటు కావడానికి కండరాలకు సమయాన్ని ఇవ్వాలి. ‘రోజుకు 20 నిమిషాలు వచ్చే వరకూ ఈ విధంగా పెంచుతూపోవాలి. ప్రతిరోజూ 20 నిమిషాలు కేటాయించలేకపోతే.. కనీసం వారానికి మూడు రోజులు 30 నిమిషాలు చేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. 50 ఏళ్ల క్రితమే.. మైండ్ఫుల్ వాకింగ్ అనే ప్రక్రియను యోగా శిక్షకురాలు, యోగా ఫర్ పెయిన్ యాప్ సృష్టికర్త, లండన్కు చెందిన సోఫియా డ్రోజ్డ్ వ్యాప్తిలోకి తెచ్చారు. అయితే ఇదేమీ కొత్తది కాదని, దాదాపు 50 ఏళ్ల క్రితం.. అంటే 1970 ప్రాంతంలోనే రోజువారీ కార్యకలాపాలతో యోగా, బ్రీత్వర్క్లను కలిపే సాధనంగా ఇది ప్రప్రథమంగా వినియోగంలోకి వచ్చిందని డ్రోజ్డ్ అంటున్నారు. ప్రకృతితో మమేకం.. మైండ్ ఫుల్ వాక్.. దృష్టిని పూర్తిగా శ్వాస మీదే కేంద్రీకరిస్తూ.. ఆలోచనలు మరే విషయం మీదకూ మళ్లించకుండా శరీరాన్ని కదిలించడమే మైండ్ ఫుల్ నెస్. నడిచే సమయంలో ఈ ప్రక్రియను సాధన చేస్తే.. అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. అది కూడా ప్రకృతిలో మమేకమవుతూ చేయడం మరింత ప్రయోజనకరం. నడకను, యోగాను మేళవించడమే వాకింగ్ యోగా. మైండ్ ఫుల్ బ్రీతింగ్, మైండ్ ఫుల్ నేచర్ వాక్, పచ్చని గడ్డి మీద నడిచే బేర్ ఫుట్ వాక్, క్లౌడ్ గేజింగ్.. వంటివన్నీ ఇందులో భాగంగానే చెప్పవచ్చు. నగరంలో పలువురు వాకింగ్ యోగాను సాధన చేస్తున్నారు. – రీనా హిందోచా, యోగా శిక్షకురాలు (చదవండి: క్షణాల్లో తయారయ్యే ఈ మ్యాగీ నూడుల్స్ రెసిపీని కనిపెట్టిందెవరంటే..)

క్షణాల్లో తయారయ్యే ఈ మ్యాగీ నూడుల్స్ రెసిపీని కనిపెట్టిందెవరంటే..
నూడుల్స్ని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే వంటకం ఇది. భారతీయుల వంటకాల జాబితాలో ప్రస్తుతం ఇదే అగ్ర స్థానంలో నిలుస్తోంది. ఈజీగా అయిపోయే వంటకం కావడంతో అంతా దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా బిజీగా ఉండే వర్కింగ్ మహిళలకు ఇది ఎంతో తేలిగ్గా చేసే వంటకం. అయితే ఈ రెసిపీ తయారీని ఎవరు కనిపెట్టారు..? ఎలా ప్రజలకు ఇష్టమైన వంటకంగా మారింది తదితరాల గురించి చూద్దామా..!.క్షణాల్లో తయారు చేసే వంటకం ఏదన్నా ఉందంటే అది మ్యాగీ నూడుల్సే. భారతీయ సంస్కృతిలో కూడా అంతర్భాగమైపోయింది. అంతలా ప్రజాదరణ చూరగొన్న ఈ వంటకం తయారీ ఎవరు కనుగొన్నారంటే..ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని చూరగొన్న ఈ వంటకం విజయవంతమైన బ్రాండ్గా నిలిచి అందరి మన్ననలకు అందుకుంటోంది. ఈ మ్యాగీ వంటకం పుట్టింది 19వ శతాబ్దంలో స్విట్జర్లాండ్లోని కెంప్తాల్ అనే సుందరమైన పట్టణంలో జరిగింది. 1884లో యువ ఔత్సాహిక వ్యవస్థాపకుడు జూలియస్ మ్యాగీ అనే వ్యక్తి ఈ మ్యాగీ నూడుల్స్ ఒక బ్రాండ్లా తీసుకొచ్చాడు. తక్కువ సమయంలో మంచి పోషకాలతో రుచికరమైన వంటకం చేయాలనే సంకల్పంతో జనించిన వంటకం ఇది. అయితే మొదట్లో ఇది ఉప్పు, మిరియాలతో తయారైంది. అనాతికాలంలోనే దీని ఉత్పత్తులకు తర్వగా ప్రపంవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దాంతో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, యూఎస్ వంటి ఇతర దేశాల్లో కూడా దాని శాఖలు తెరిచే స్థాయికి చేరుకుంది. 1900 సంవత్సరంలో, జూలియస్ ఉత్పత్తులు స్విట్జర్లాండ్ వంటి అనేక దేశాలకు విస్తరించాయి. ఇక జూలియస్ మొత్తం 18 రకాల వెరైటీ ఫ్లేవర్డ్ నూడిల్స్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈమ్యాగీ ప్యాకేజ్ ఉత్పత్తులను ఈజీxe ఐడెంటిఫై చేయగలం. కానీ ఆకాలంలో ఇవి ఎరుపు, పసుపు, నలుపు రంగుల ప్యాకింగ్ల ద్వారా మాత్రమే గుర్తించేవారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ని నెస్లే కొనుగులు చేసి చౌక ధరల్లో నాణ్యతతో కూడిన పోషకాహారాన్ని అందించాలనే ఆకాంక్షను నెరవేర్చుకుంది. అలాగే నెస్లే నివేదిక ప్రకారం.. "ప్రతి సెకనుకు, ప్రపంచవ్యాప్తంగా 21000 కంటే ఎక్కువ ఆహారాలు మాగీ ఉత్పత్తులతో తయారైనవే." సంవత్సరాలుగా, ఈ బ్రాండ్ చాలా మంది హృదయాల్లో మంచి స్థానాన్ని ఏర్పరుచుకుంది. చకచక తయారై ఈ వంటకం ఆల్-టైమ్ సొల్యూషన్తో వచ్చిన రెసిపీ. ఎప్పటికీ మహిళలకు, బ్యాచిలర్లకు, నిమిషాల్లో ఎలాంటి శ్రమ లేకుండా క్షణాల్లో తయారై వంటకంగా పేరు తెచ్చుకుంది.(చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..)
ఫొటోలు


కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తున్న నేహా శెట్టి.. వైరల్ అవుతున్న ఫోటోస్


కొండాపూర్ లో సందడి చేసిన వైష్ణవి చైతన్య ,దిల్ రాజు సతీమణి వైగారెడ్డి (ఫొటోలు)


‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)


విశాఖపట్నం : సాగరతీరంలో..సరదాగా.. (ఫొటోలు)


విజయవాడలో పర్యటించిన మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ (ఫొటోలు)


హైదరాబాద్ : చార్మినార్కు రంజాన్ శోభ (ఫొటోలు)


నెల్లూరులో వైభవంగా శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి రథోత్సవం (ఫొటోలు)


‘షణ్ముఖ’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)


సొగసు చూడతరమా అంటున్న సంయుక్త మీనన్ ... (ఫోటోలు)


నిర్మాతగా సమంత తొలి సినిమా.. ఫోటోలు షేర్ చేసిన సామ్
National View all

పోలీసులమంటూ ఫోన్.. ముసలావిడ దగ్గర రూ.20 కోట్లు స్వాహ
దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు ఈ సైబర్ మోసగాళ్ల వలలో పడిపోవద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు.

ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు?
తమిళనాడు: ప్రియురాలిని బావిలో తోసి ప్రియుడు కడతేర్చాడు.

Amritsar: ఆలయంపై గ్రనేడ్ విసిరిన వ్యక్తి ఎన్కౌంటర్
అమృత్సర్: పంజాబ్లోని అమృత్సర్(

రన్యా రావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
బెంగళూరు: కన్నడ నటి రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యా

తమిళనాడులో ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్
చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి(
National View all

Bihar: మళ్లీ పోలీసులపై దాడి
బీహార్: బీహార్లో పోలీసులపై దాడులు ఆగడం లేదు.

అప్పుడే మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: దేశంలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి.

బోడో ఒప్పందంతో శాంతి, అభివృద్ధి
గౌహతి/కొక్రాఝర్: బోడో ఒప్పందాన్ని అమలు చేసి ఈ ప్రాంతంలో శాంతిని, అభివృద్ధిని సుసాధ్యం

మిజోరాం ‘వండర్ కిడ్’కు గిటార్
ఐజ్వాల్: ‘మా తుఝే సలాం’ పాటతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన

నేటి నుంచి రైసినా డైలాగ్
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయాలు, ఆర్థికాంశాలపై భారత్ ప్రతిష్ట
NRI View all

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణవాసులు ముగ్గురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది.

పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా

గ్రీన్కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్.. అమెరికా పౌరసత్వం కట్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసార

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!
ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
International View all

పాక్లో మరో హత్య: జమీయత్ ఉలేమా నేత ముఫ్తీ అబ్దుల్ హతం
క్వెట్టా: పాకిస్తాన్లో మరో దారుణం చోటుచేసుకుంది.

Kalpana Chawla: రెండు పుట్టిన రోజుల వ్యోమగామి
కల్పనా చావ్లా(

త్వరలో ట్రంప్-పుతిన్ చర్చలు.. కాల్పుల విరమణపై నిర్ణయం?
వాషింగ్టన్ డీసీ: రష్యా- ఉక్రెయిన్(

అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్కు ఘోర అవమానం
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టాక దేశంలో పలు ఆంక్షలు అమల

నడి సముద్రంలో 95 రోజులు
పది రోజుల చేపల వేటకని ఆయన బయలుదేరాడు. తుఫాను దారిని మళ్లించింది.
International View all

మరికొన్ని గంటల్లో భూమి మీదకు సునీత విలియమ్స్.. టైమ్ ఎప్పుడంటే?
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ ఎట్టకేలకు

తిట్టుకు తిట్టుతోనే బదులు!
వాషింగ్టన్: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్కు చెంది ఎస్ఏఐ చాట్

చైనాలో మేడిన్ రష్యా
బీజింగ్/హాంకాంగ్: మన దేశంలోని అనేక వస్తువులపై మేడిన్ చైనా

37 కిలోలు, రూ.75 కోట్లు!
న్యూఢిల్లీ/బనశంకరి: కర్నాటక పోలీసులు 37 కిలోల ఎండీఎంఏ (మెథిల

ఐఎస్ఎస్లోకి స్వాగతం
కేప్ కనావెరాల్: తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్,
NRI View all

కెనడా కొత్త కేబినెట్లో ఇద్దరు భారతీయులు
ఒట్టావా: కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్ క

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్లో ఏం జరిగింది?
వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ
క్రైమ్

వృద్ధ దంపతులను మోసం చేసిన బ్యాంకు మేనేజర్ మేఘన
యశవంతపుర(కర్ణాటక): వృద్ధురాలిని మోసం చేసిన గిరినగరకు చెందిన ప్రైవేటు బ్యాంకు మేనేజర్ మేఘన, ఆమె భర్త శివప్రసాద్, స్నేహితులు వరదరాజు, అన్వర్ఘోష్లను గిరినగర పోలీసులు అరెస్ట్ చేశారు. గిరినగరలోని ఒక ప్రైవేట్ బ్యాంక్లో వృద్ధ దంపతులు జాయింట్ అకౌంట్ తెరిచారు. కొంతమొత్తం డిపాజిట్ చేశారు. బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ మేఘనా పరిచయం ఉండటంతో వృద్ధ దంపతులు తమ కష్టాలు ఆమె వద్ద చెప్పుకునేవారు. ఇటీవల ఇంటిని కూడా విక్రయిం కోటి రూపాయిలు బ్యాంకులో జమా చేశారు. ఆ నగదుపై మేఘనా కన్ను పడింది. బాండ్ అవధి ముగిసిందని, కొత్తగా డిపాజిట్ చేసేందుకు చెక్ అవసరమని మభ్య పెట్టి కొన్నిపత్రాలపై సంతకాలు చేయించుకుంది. అనంతరం రూ.50 లక్షలను తన అకౌంట్కు బదిలీ చేయించుకుంది. వృద్ధ దంపతుల కుమారుడు బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా నగదు తక్కువగా కనిపించింది. బ్యాంకుకు వెళ్లి మేఘనాను ప్రశ్నించారు.మీరు చెప్పిన ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు మేఘనా దబాయించింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా మేఘనా వంచన బయట పడింది. మేఘనతోపాటు ఆమె భర్త శివప్రసాద్, స్నేహితులు వరదరాజు, అన్వర్ఘోష్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

మానవత్వం మంటగలిసేలా భార్యపై దాడి
మైసూరు: భార్య పోలీసు స్టేషన్లో కేసు పెట్టిందనే కోపంతో భర్త, అతని బంధువులు కలిసి వివాహితను రోడ్డుపై అర్ధనగ్నంగా చేసి దాడికి పాల్పడ్డారు. మైసూరు నగరంలోని విజయనగర పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. వివరాలు.. మహేష్కు బాధిత యువతి (24)తో పెళ్లయింది. మరింత కట్నం తేవాలని తరచూ వేధించడంతో ఆమె భర్త, మామ మల్లయ్య, బావ శివు పైన కేసు వేసింది. ఇది ఫ్యామిలీ కోర్టులో సాగుతోంది. ఆమె పుట్టింట్లో ఉంటోంది. కొన్ని రోజుల క్రితం భార్యను కలిసిన మహేష్ .. కలిసి ఉందామని నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు. రెండు రోజులకే మళ్లీ సతాయించడం మొదలుపెట్టాడు. తమపై పోలీసు స్టేషన్లో, కోర్టులో పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలని భర్త, మామ తదితరులు ఆమెతో గొడవకు దిగారు. ఆమె ఒప్పుకోకపోవడంతో కొట్టుకుంటూ బయటకు తీసుకువచ్చారు. చీరను లాగేసి దాడి చేశారు. ఇరుగుపొరుగు అడ్డుకోబోతే వారిని బెదిరించారు. బాధితురాలు విజయనగర ఠాణాలో ఫిర్యాదు చేయగా ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

‘దేవుడా మాకిక దిక్కెవరు, మేము చేసిన పాపమేమి’
అన్నమయ్య: ‘అమ్మ చిన్నప్పుడు నిన్ను, మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా.. తల్లి లేని లోటు లేకుండా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు. రేపటి నుంచి జరిగే పది పరీక్షలకు వెంట తీసుకెళతాను అన్నావు కదా లేనాన్న’.. అంటూ తండ్రి మృతదేహం వద్ద ఆ బాలిక వెక్కివెక్కి ఏడ్చటం చూపరులను కంట తడి పెట్టించింది. ఈ విషాద సంఘటన మండలంలోని కందుకూరు పంచాయతీ గొడుగువారిపల్లిలో చోటు చేసుకుంది. గొడుగువారిపల్లికి చెందిన కొత్తోళ్ళ వెంకటరమణ (55)కు గణేష్ (20), గిరిజ (15)లు సంతానం. వెంకటరమణ భార్య 10 ఏళ్ల క్రితమే భర్త, పిల్లలను వదిలి ఎటో వెళ్లిపోయింది. అప్పటి నుంచి కూలి పని చేస్తూ పిల్లలను పోషించేవాడు. కుమారుడు గణేష్ చిన్నా, చితకా పనులు చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కుమార్తె కందుకూరు జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదివి రేపటి నుంచి జరిగే పబ్లిక్ పరీక్షలకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రామంలోని చింతచెట్టు ఎక్కి కాయలు కోసే క్రమంలో.. వెంకటరమణ చెట్టు కొమ్మల పట్టు తప్పి ప్రమాదవశాత్తు కింద పడి గాయాల పాలై స్పృహ కోల్పోయాడు. ఆయనను గ్రామస్తులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడ్డాడు. ‘దేవుడా మాకిక దిక్కెవరు, మేము చేసిన పాపమేమి’ అంటూ ఆ పిల్లల రోదనలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా మూగబోయి విషాదంతో నిండిపోయింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

నిన్న హత్య.. నేడు అంత్యక్రియలు
జగిత్యాలక్రైం: క్షణికావేశంలో ఇంటిపెద్దను భార్య, కొడుకులు, కూతురు, అల్లుడు హత్య చేశారు. క్షణికావేశం నుంచి తేరుకున్నాక తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకులు, కూతురు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల వివరాలు.. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్ (58)పై మొదటి భార్య జమున, పెద్ద కొడుకు చిరంజీవి, చిన్న కొడుకు రంజిత్, కూతురు శిరీష, అల్లుడు శోభన్ కలిసి క్షణికావేశంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో చికిత్స పొందుతూ కమలాకర్ మృతిచెందగా అతడి బంధువులు, గ్రామస్తులు మృతదేహాన్ని చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. దీంతో ఆదివారం కొంత మంది సన్నిహితుల మధ్య పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేయించి మృతదేహాన్ని పొలాసకు తరలించారు. దీంతో హత్యలో ప్రమేయం ఉన్న వారంతా పోలీస్స్టేషన్లో ఉండటంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మానవత్వం చాటిన పోలీసులు ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య మొదటి భార్య జమున, కొడుకులు చిరంజీవి, రంజిత్, కుమార్తె శిరీష, అల్లుడు శోభన్ను పొలాసకు తీసుకెళ్లారు. దీంతో వారంతా కమలాకర్ మృతదేహంపై పడి రోదించడంతో స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి చితికి నిప్పంటించాడు. అంత్యక్రియల అనంతరం నిందితులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. మృతుడి ఇంట్లో ఆయుధాలుకుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురైన పడాల కమలాకర్ ఇంట్లో ఆదివారం పోలీసులు పరిశీలించగా భారీ ఆయుధాలు లభ్యమయ్యాయి. తల్వార్లతో పాటు కత్తులు, రాడ్లు కన్పించడంతో పోలీసులు బిత్తరపోయారు. కమలాకర్ పక్కా ప్రణాళికతోనే కొన్నేళ్లుగా మారణాయుధాలు వెంట ఉంచుకుంటూ తిరిగాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. నిందితుల రిమాండ్జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్ (58)పై పెట్రోల్ పోసి నిప్పంటించి మృతికి కారణమైన ఐదుగురిని ఆది వారం రిమాండ్కు తరలించినట్లు సీఐ కృష్ణారెడ్డి తెలి పారు. కుటుంబ కలహాలతో మొదటి భార్య జమున, పెద్ద కొడుకు చిరంజీవి, చిన్న కొడుకు రంజిత్, కుమార్తె శిరిష, అల్లుడు శోభన్బాబు కలిసి కమలాకర్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందగా అతడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదయింది. సమావేశంలో రూరల్ ఎస్సై సధాకర్ పాల్గొన్నారు.
వీడియోలు


కూటమి తెచ్చిన మార్పుకు ఉదాహరణగా నిలుస్తున్న చిన్నారి


YV సుబ్బారెడ్డి ఇంట విషాదం


పుష్ప 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసిన ఛావా..


కల్కి 2పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన అమితాబ్


AP Volunteers: ఇవాళ వాలంటీర్ల రాష్ట్ర వ్యాప్త ధర్నా


అమెరికాలో రోడ్డుప్రమాదం తెలంగాణ వాసులు దుర్మరణం


Anakapalle: క్వారీ లారీ ఢీకొని రైల్వే ట్రాక్ ధ్వంసం


జనసైనికుల సాక్షిగా బయటపడ్డ 2 లక్షల పుస్తకాల బాగోతం


సీఎం రేవంత్ రెడ్డి కి కేసీఆర్ ఫీవర్ పట్టుకుంది: కవిత


AP: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు