Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

PM Narendra Modi Pauses Speech To Check On Unwell BJP Worker1
అతనికి కాస్త నీళ్లు ఇవ్వండి: మోదీ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Delhi Assembly Elections 2025) బీజేపీ భారీ విజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi).. ఢిల్లీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లోని ఏర్పాటు చేసిన పార్టీ సంబరాల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా, ఒక బీజేపీ కార్యకర్త అనారోగ్యంగా ఉండటాన్ని గమనించారు. మోదీ ప్రసంగిస్తున్న వేదికకు అతి దగ్గరగా ఉన్న ఆ కార్యకర్త.. కదలికల్ని మోదీ పసిగట్టారు. అతనికి ఆరోగ్యం బాలేదన్న విషయం మోదీకి అర్థమైంది. దాంతో ప్రసంగాన్ని మధ్యలో ఆపేసిన మోదీ.. ఆ కార్యకర్తకు కాస్త నీళ్లు ఇమ్మని బీజేపీ శ్రేణులకు సూచించారు. అంతేకాకుండా అక్కడున్న డాక్టర్లు.. అతన్నిఒకసారి పరీక్షించాలని కూడా మోదీ కోరారు.‘ఆ బీజేపీ కార్యకర్తకు కళ్లు మూతలు పడుతున్నాయి. చాలా అన్‌ఈజీగా ఉన్నాడు. ముందు అతనికి కాస్త మంచి నీళ్లు ఇవ్వండి. ఇక్కడ డాక్టర్‌ ఎవరైతే ఉన్నారో ఒకసారి అతని పరీక్షించండి’ అని మోదీ సూచించారు.Such is his aura ♾During his victory speech, PM Modi noticed a person feeling unwell and immediately paused to ensure they received medical help!#दिल्ली_के_दिल_में_मोदी#AmitShah #DelhiElections2025 pic.twitter.com/VG16Yv1qw1— PoliticsSolitics (@IamPolSol) February 8, 2025 అటు తర్వాత మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఢిల్లీ ప్రజలకు ఈరోజు పండుగ లాంటిదని,ఆప్‌ నుంచి వారికి విముక్తి లభించిందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మాట్లాడుతూ బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.‘ ఈ విజయంతో ఢిల్లీలో చరిత్ర సృష్టించాం. హర్యానా,మహారాష్ట్రలో గెలిచి రికార్డు సృష్టించాం. ఢిల్లీని ఇక అభివృద్ధి బాటలో నడిపిస్తాం.మీ ప్రేమను అభివృద్ధిలో చూపిస్తాం.ఢిల్లీ ప్రజల అభివృద్ధికి మోదీ గ్యారెంటీ. ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను అనేక రెట్లు వారికి తిరిగి ఇస్తాం. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలే విజేతలుగా నిలిచారు.మీ విశ్వాసాన్ని అభివృద్ధిలో తీసుకొస్తాం.ఢిల్లీ అనేది మినీ ఇండియా. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో ఢిల్లీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. షాట్‌కట్‌ రాజకీయాలకు ప్రజలు షాకిచ్చారు. నేను పూర్వాంచల్‌ నుంచి ఎంపీగా ఉన్నందుకు గర్వపడుతున్నా. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం చూపిస్తున్నారు. చాలా స్టేట్‌లలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందిఅవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఆమ్‌ఆద్మీపార్టీ నేతలు అవినీతిలో మునిగిపోయారు. కాంగ్రెస్‌ పార్టీ అయితే వరుసగా మూడోసారి సున్నా సాధించింది. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలను మిత్రులు కూడా గమనించింది. యమునా నదిని కాలుష్య కోరల నుంచి రక్షిస్తాం. ఢిల్లీ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాగ్‌ రిపోర్టు బయటపెడతాం. కాంగ్రెస్‌కు ఓటములలో మెడల్‌ ఇవ్వొచ్చు. కాంగ్రెస్‌ నిజ స్వరూపం ఇండియా కూటమి పార్టీలకు అర్థమైంది’అని మోదీ పేర్కొన్నారు.

Pm Modi Speech After Bjp Victory In Delhi Assembly Elections2
‘ఆప్‌’కు ఢిల్లీ ప్రజల షాక్‌: ప్రధాని మోదీ

సాక్షి,న్యూఢిల్లీ:ఢిల్లీ ప్రజలకు ఈరోజు పండుగ లాంటిదని,ఆప్‌ నుంచి వారికి విముక్తి లభించిందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా శనివారం(ఫిబ్రవరి 8) సాయంత్రం బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన సంబరాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.‘ఈ విజయంతో ఢిల్లీలో చరిత్ర సృష్టించాం. హర్యానా,మహారాష్ట్రలో గెలిచి రికార్డు సృష్టించాం. ఢిల్లీని ఇక అభివృద్ధి బాటలో నడిపిస్తాం.మీ ప్రేమను అభివృద్ధిలో చూపిస్తాం.ఢిల్లీ ప్రజల అభివృద్ధికి మోదీ గ్యారెంటీ. ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను అనేక రెట్లు వారికి తిరిగి ఇస్తాం. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలే విజేతలుగా నిలిచారు. మీ విశ్వాసాన్ని అభివృద్ధిలో తీసుకొస్తాం.ఢిల్లీ అనేది మినీ ఇండియా. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో ఢిల్లీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. షాట్‌కట్‌ రాజకీయాలకు ప్రజలు షాకిచ్చారు. నేను పూర్వాంచల్‌ నుంచి ఎంపీగా ఉన్నందుకు గర్వపడుతున్నా. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం చూపిస్తున్నారు. చాలా స్టేట్‌లలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందిఅవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఆమ్‌ఆద్మీపార్టీ నేతలు అవినీతిలో మునిగిపోయారు. కాంగ్రెస్‌ పార్టీ అయితే వరుసగా మూడోసారి సున్నా సాధించింది. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలను మిత్రులు కూడా గమనించింది. యమునా నదిని కాలుష్య కోరల నుంచి రక్షిస్తాం. ఢిల్లీ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాగ్‌ రిపోర్టు బయటపెడతాం. కాంగ్రెస్‌కు ఓటములలో మెడల్‌ ఇవ్వొచ్చు. కాంగ్రెస్‌ నిజ స్వరూపం ఇండియా కూటమి పార్టీలకు అర్థమైంది. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఎంతో పోరాడారు. ఆప్‌ ఓటమితో అన్నా హజారే కూడా ఎంతో సంతోషిస్తున్నారు’అని మోదీ పేర్కొన్నారు.

Weekly Horoscope Telugu 09-02-2025 To 15-02-20253
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. పరిచయాలు పెరుగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే సంతృప్తినిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యతిరేక పరిస్థితులను సానుకూలపర్చుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. చిరకాల స్వప్నం ఫలిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు. కళారంగం వారికి ఆహ్వానాలు, పిలుపులు అందుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. పార్వతీదేవికి కుంకుమార్చన చేయండి.వృషభం...ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. రుణాల కోసం యత్నిస్తారు. ఆలోచనలు కలసిరావు.బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత నత్తనడకన సాగినా చివరిలో స్వల్ప లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఇష్టం లేకున్నా మార్పులు తప్పవు. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి. వారం మధ్యలో వాహన యోగం. స్థిరాస్తివృద్ధి. శుభవార్తలు. నీలం, పసుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.మిథునం....ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి అప్పులు తీరుస్తారు. సన్నిహితులతో మరింత ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా పూర్తి చేస్తారు. మీ సత్తా పదిమందీ గుర్తిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనయోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహయత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాల యత్నాలు సఫలం. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.కర్కాటకం....ఉత్సాహంగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువుల్లో ఆదరణ పెరుగుతుంది. అనుకున్న విధంగా సమయానికి డబ్బు అందుతుంది. ఊహించని∙ఆహ్వానాలు రాగలవు. ప్రముఖులతో పరిచయాలు మీలో ధైర్యాన్ని నింపుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కొత్త పెట్టుబడులు సమీకరిస్తారు. ఉద్యోగాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు సంస్థల ఏర్పాటులో వివాదాలు పరిష్కారం. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.సింహం....చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంతమేర మెరుగ్గా ఉంటుంది. సోదరులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు తీరతాయి. ఒక ప్రకటన విద్యార్థులను సంతోషపరుస్తుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖ వ్యక్తులు ఊహించని రీతిలో సహకరిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం. వ్యాపారాలలో లాభాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. గులాబీ, నీలం రంగులు. సూర్యారాధన మంచిది..కన్య....నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. రుణబాధలు తొలగుతాయి.. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై పెద్దలతో సంభాషిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఊహించని విధంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.. రాజకీయవర్గాలకు మరింత గుర్తింపు లభిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఎరుపు, తెలుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.తుల....ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. . వ్యాపారాలు గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాలకు కాస్త ఊరట లభిస్తుంది. వారం ప్రారంభంలో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...దూరప్రాంతాల నుంచి ఊహించని శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహంగా కొనసాగుతాయి. ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు కాస్త అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. మీఖ్యాతి పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు ఆశించిన విధంగా పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి..ధనుస్సు...ఆర్థిక లావాదేవీలో మరింత పురోగతి కనిపిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగయత్నాలు కాస్త అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి «వస్తులాభాలు. ఆశ్చర్యకరమైన∙ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గే సూచనలు. రాజకీయవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. సోదరులతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు.. శివాష్టకం పఠించండి.మకరం...ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. పాతమిత్రులతో సరదాగా గడుపుతారు. కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు చాలావరకూ తగ్గుతాయి. రాజకీయవర్గాలకు వ్యవహారాలలో విజయం. వారం చివరిలో బంధువులతో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కుంభం....ఆర్థిక విషయాలు క్రమేపీ అనుకూలించి అవసరాలు తీరతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. నిరుద్యోగులకు నూతనోత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు సంస్థలో ఏర్పాటులో అనుకూలత. వారం చివరిలో శ్రమాధిక్యం. బంధువుల నుంచి మాటపడతారు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.మీనం....కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.. పాతబాకీలు కొన్ని వసూలై అవసరాలు తీరతాయి. సంఘంలో విశేషమైన గౌరవప్రతిష్ఠలు పొందుతారు. సన్నిహితులు, సోదరులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పైస్థాయి నుంచి సంతోషకరమైన వార్తలు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఎరుపు, పసుపు రంగులు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

A Woman From Tirupati Release Selfie Video Over Janasena Incharge Kiran Royal4
తిరుపతి జనసేన ఇన్‌చార్జ్‌ కిరణ్‌ రాయల్‌ అక్రమాలు.. మహిళ ఆత్మహత్యాయత్నం

తిరుపతి: తిరుపతి జనసేన ఇన్‌చార్జ్‌ కిరణ్‌ రాయల్‌ అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిందో మహిళ. తన వద్ద కోటి రూపాయిలకు పైగా అప్పు తీసుకోవడమే కాకుండా తనను బెదిరిస్తున్నాడని లక్ష్మీ అనే మహిళ పేర్కొంది. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తాను అప్పు చేసి నగలు తాకట్టు పెట్టి ఆ మొత్తాన్ని ఇచ్చానని స్పష్టం చేసింది.‘నావద్ద నుంచి తిరుపతి జనసేన ఇన్‌చార్జ్‌గా ఉన్న కిరణ్‌ రాయల​్‌ అనే వ్యక్తి కోటి 20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ీతీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. నేను కూడా అప్పు చేయడమే కాకుండా ఉన్న నగల్ని తాకట్టు పెట్టి ఆ డబ్బును తెచ్చాను. రూ. 30 లక్షలు ఇచ్చేందుకు ాబాండ్స్‌, ెచెక్‌ రాసిచ్చాడు. నన్ను బెదిరించి, భయపెట్టి వీడియో తీసుకున్నారు. నాకు అప్పులు ఇచ్చిన వాళ్ల వద్ద నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయి. నాకు చావే శరణ్యం’ అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది లక్ష్మి అనే మహిళ. తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాసేపటికే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమెకు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని సీఐపై భార్య ఫిర్యాదు

Memes Poured In Socia Media In Support Of Mp Swati Maliwal5
‘ఆప్‌’ ఓటమి వేళ..స్వాతి మలివాల్‌కు ‘మీమ్స్‌’ మద్దతు

న్యూఢిల్లీ:ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ, స్వయంగా ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓటమి పాలయ్యారు.ఈ ఓటమి అంశం బీజేపీ నేతలకు అంతులేని ఆనందాన్నిచ్చింది. వారి సంబరాలకు కారణమైంది.ఎందుకంటే ఆప్‌పై గెలిచింది వారే.అయితే ఆప్‌తో ఎన్నికల్లో తలపడకుండా ఆప్‌ ఓటమి పట్ల బీజేపీ తర్వాత అంత సంతోషించింది ఒక్కరే. ఆమే..ఆప్‌ నుంచి సస్పెండైన రాజ్యసభ ఎంపీ స్వాతిమలివాల్‌. ఢి​లీ ఎన్నికల్లో ఆప్‌ ఓటమి నిర్ధారణ అయిన వెంటనే స్వాతి మలివాల్‌ తన ఎక్స్‌(ట్విటర్‌)ఖాతాలో తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేస్తూ మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం పోస్టు పెట్టారు. pic.twitter.com/kig39RQYmD— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కాగా, గతేడాది మేలో లిక్కర్‌ కేసులో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చారు.ఈ సమయంలో కేజ్రీవాల్‌ను కలవడానికి స్వాతి ఆయన నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత కొద్ది సేపట్టికి స్వాతి అక్కడి నుంచే పోలీసులకు ఫోన్‌ చేసిన తనపై కేజజ్రీవాల్‌ ఇంట్లో దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు.కేజ్రీవాల్‌‌ అనుచరుడు బిభవ్‌కుమార్‌ తనను కొట్టాడని కేసు పెట్టారు. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను అరెస్టు చేశారు.స్వాతి మలివాల్‌ జరిగిన దాడిని తొలుత ఖండించిన ఆప్‌ ఆ తర్వాత స్వాతి మలివాల్‌ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆరోపించింది. దీంతో స్వాతి మలివాల్‌ ఆప్‌, కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు.తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆప్‌ వ్యతిరేకంగా పలు చోట్ల ప్రచారం కూడా చేశారు. స్వాతిమలివాల్‌కు మద్దతుగా ఆప్‌ ఓటమిపై శనివారం మీమ్స్‌, పోస్టులు సోషల్‌మీడియాను ముంచెత్తాయి.

Meta Mass Layoffs Fire Over 3000 Employees6
టెక్ కంపెనీ భారీ లేఆఫ్స్: ఒకేసారి 3000 మంది బయటకు!

ఇన్ఫోసిస్ కంపెనీ ఫ్రెషర్లను తొలగించిన వార్తలు ఇంకా మార్చచిపోక ముందే.. టెక్ దిగ్గజం మెటా (Meta) భారీగా ఉద్యోగులను తొలగించడానికి సన్నద్ధమవుతోంది. ఇంతకీ మెటా ఎందుకు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది? ఎంతమందిని తొలగించనుంది? అనే విషయాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ కంపెనీల మాతృ సంస్థ మెటా, ఫిబ్రవరి 10 (సోమవారం) నుంచి ప్రపంచవ్యాప్తంగా తొలగింపులను నిర్వహించనున్నట్లు సమాచారం. అదే రోజు అమెరికాతో సహా చాలా దేశాలలో సోమవారం స్థానిక సమయం ఉదయం 5 గంటల నుంచి ఉద్యోగాలు కోల్పోయే ఉద్యోగులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది..జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్‌లోని ఉద్యోగులకు స్థానిక నిబంధనల కారణంగా కోతల నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే యూరప్, ఆసియా, ఆఫ్రికా అంతటా సుమారు 12 దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ఉండనుంది. కంపెనీ తొలగింపు ప్రక్రియ కింది సుమారు 3600 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సమాచారం.పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులను తొలగించనున్నట్లు మెటా ఇప్పటికే వెల్లడించింది. ఇప్పుడు చెప్పినట్లుగానే తొలగింపులకు శ్రీకారం చుట్టింది. అయితే కంపెనీ ఏ విభాగంలో ఎంతమంది ఉద్యోగులను తొలగించనుంది అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు: ఎక్కడో తెలుసా?సెప్టెంబర్ 2024 నాటికి సుమారు 72,000 మందికి ఉపాధి కల్పించిన మెటా, ఉద్యోగుల తొలగింపు మొదలు పెడితే ఆ ప్రభావము 5 శాతం లేదా సుమారు 3600 మంది మీద పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లేఆఫ్స్‌ కారణంతో ఉద్యోగాలు కోల్పోయేవారికి సెవెరెన్స్ ప్యాకేజీ అందిస్తామని జూకర్ బర్గ్ ఇప్పటికే హామీ ఇచ్చారు.

Kadapa MP YS Avinash Reddy Comments On Alliance Government In AP7
ఓటరు దేవుడా..అని దండం పెట్టి మోసం చేశారు: వైఎస్‌ అవినాష్‌రెడ్డి

సాక్షి,వైఎస్సార్‌జిల్లా: కూటమి ప్రభుత్వం అన్ని విధాల విఫలం అవుతోందని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. శనివారం(ఫిబ్రవరి8) వైఎస్సార్‌ జిల్లా జెడ్పీ మీటింగ్‌ అనంతరం అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రైతులకు రూ.20వేలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఇచ్చింది లేదు. మా అధినేత వైఎస్‌ జగన్‌ 9 గంటల విద్యుత్‌ సరఫరా ఇస్తే దాన్ని 7 గంటలకు కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే రోడ్లెక్కుతాం.రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం.రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. పంటల బీమా లేదు. కనీసం బీమా ప్రీమియం కూడా రైతులే కట్టుకోవాల్సి వస్తోంది. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ దరఖాస్తులు వేలల్లో పెండింగులో ఉన్నాయి. వాటినీ మంజూరు చేయడం లేదు. గతంలో ఉన్న పథకాలూ అమలు చేయడం లేదు. గొప్పలు చెప్పుకున్న సూపర్‌ సిక్స్‌ అమలు అంతకన్నా లేదు.కానీ ఈ 9 నెలల్లో 1.40లక్షల కోట్లు అప్పు మాత్రం తెచ్చారు..ఎక్కడ ఖర్చు చేశారో తెలియదు. చంద్రబాబు అనుభవం ఉన్న ఆర్థిక వేత్త అని చెప్పుకుంటారు. ఆయన కచ్చితంగా సూపర్‌ సిక్స్‌ అమలు చేసి తీరాల్సిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే ఆనాడు హామీలు ఇచ్చారు కదా. హామీలు అమలు చేయాల్సిన బాధ్యత వారిదే. ఆనాడు అలవిగాని హామీలు ఇచ్చి..ఓటరు దేవుడా అంటూ దండాలు పెట్టి ఇప్పుడు ఘోరంగా మోసం చేస్తున్నారు.ప్రభుత్వ పథకాలు లేక ప్రజల చేతుల్లో డబ్బు లేక వారి కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయింది. ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా పరిషత్‌ సమావేశానికి కూటమి ప్రజాప్రతినిధులు కాదు..చివరికి కలెక్టర్,జేసీలు కూడా హాజరు కాలేదు. మేం అభ్యంతరం తెలిపితే అరగంట తర్వాత జేసీ వచ్చారు. ఇది తీవ్రమైన బాధ్యతారాహిత్యం. ఒక జిల్లా అత్యున్నతస్థాయి సమావేశానికి మంత్రులు సరే..కనీసం కలెక్టర్‌ కూడా రాలేదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నా’అని అవినాష్‌రెడ్డి అన్నారు.

Bollywood iconic Actress Vimi Tragic story Stardom to Heartbreaking End8
సిల్వర్ స్క్రీన్ క్వీన్ : తోపుడు బండిపై అనాథ శవంలా!

జీవితం పట్ల అవగాహన, క్రమశిక్షణ లేకపోతే మన సంపాదించిన కీర్తి ప్రతిష్టలు, వేల కోట్ల సంపద అన్నీ హారతి కర్పూరంలా కరిగిపోతాయి. సక్సెస్‌ ఒక్కటే సరిపోదు. జీవితం పట్ల స్పష్టత ఉండాలి. కీర్తి ప్రతిష్టలైనా, కోట్ల రూపాయల సంపద అయినా చివరిదాకా నిలుపుకునే కనీస అవగాహన, సత్తా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు, సినీతారల విషయంలో ఇది చాలా అవసరం. ఎదురు దెబ్బలు, అవమానాలు తప్పవు. మరీ ముఖ్యంగా మహిళలైతే అప్రమత్తంగా లేకపోతే పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోతుంది. ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి, విలాసవంతమైన జీవితాన్ని గడిపి, చివరికి అనాథలా మిగిలిన ఒక తార జీవితం గురించి తెలుసుకుందాం.ఆమె ఒక గ్లామర్‌ హీరోయిన్‌. అద్భుతమైన అందం, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్ చక్కని నటన. తన అందం అభినయంతో, సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుని సిల్వర్ స్క్రీన్ క్వీన్ గా ఒక పేరు దక్కించుకుంది. నటిగా అనేక విజయాలు, కోట్ల ఆస్తి కట్‌ చేస్తే 34 ఏళ్ల వయసులోనే అనాథలా ఈ ప్రపంచం నుంచి సెలవు తీసుకుంది. ఆమె బాలీవుడ్ నటి విమ్మీ (Vimi). 1943లో సిక్కు కుటుంబంలో జన్మించింది. చదువుకుంటున్న రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు కూడా పాడేది.ముంబైలో సోఫియా కాలేజీలో సైకాలజీ చదివింది. బీఆర్ చోప్రా హాజరవుతారని తెలిసి, రవి తన కొడుకు పుట్టినరోజు పార్టీకి విమ్మీని, ఆమె భర్తను ఆహ్వానించాడు. ఈ పార్టీలో విమ్మీని చూసిన ప్రఖ్యాత ప్రముఖ నిర్మాత బీఆర్‌ చోప్రా ఆమెను బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. 1967లో తీసిన హమ్‌రాజ్‌ చిత్రంలో ఆనాటి ఇద్దరు అగ్ర తారలు సునీల్ దత్ ,రాజ్ కుమార్ సరసన కొత్త హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రమే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. చాలా తక్కువ సమయంలో విమ్మీ పాపులారీటీ సాధించింది. ఆబ్రూలో అశోక్ కుమార్, పతంగాలో శశి కపూర్ వంటి అగ్ర తారలతో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. 1960లలో ఒక పెద్ద స్టార్ హీరోయిన్‌ నిలిచింది. ఒకానొక దశలో బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా నిలిచింది. మరోవైపు ముంబైలాంటి వంటి విశ్వనగరంలో పుట్టి పెరిగినప్పటికీ,పాశ్చాత్య దుస్తులు ధరించడం , మేకప్ వేసుకొని విమ్మీ సినిమాల్లోకి రావడం ఇరుకుటుంబాలకీ నచ్చలేదు. దీనికి హమారాజ్‌సినిమా సమయంలో భర్తతో గొడవలు ఇది విమికి భారీగా నష్టం కలిగించింది.ఆమెతో మళ్ళీ పనిచేయడానికి నిరాకరించడం ఆమెకు భారీగా నష్టం కలిగించింది. అలాగే ఆమె భర్త అగర్వాల్‌ జోక్యంకారణంగా దర్శక నిర్మాతలు దూరంగా ఉండేవారు. క్రమంగా ఆమె స్టార్‌డమ్ తగ్గడం ప్రారంభమైంది. అలా పదేళ్ల కాలంలోనే ఆమె జీవితం తారుమారైపోయింది. 1970ల ప్రారంభం నాటికి, విమ్మీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పేలవంగా నిలిచాయి. దీంతో చిన్న చిన్న అతిధి పాత్రలు గుర్తింపు లేని నృత్య ప్రదర్శనలకు పరిమితమైపోయింది.విమ్మీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే సమయానికే ఒక పారిశ్రామికవేత్త కుమారుడు శివ్ అగర్వాల్‌ (Shiv Agarwal)తో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక పక్క వృత్తి జీవితం చాలా హ్యాపీగా సాగుతుండగా, వ్యక్తిగత జీవితం మాత్రం చాలా బాధాకరంగా పరిణమించింది. తీవ్రమైన గృహహింను ఎదుర్కొంది. దీంతో భర్తనుంచి విడాకులు తీసుకుంది. నమ్మిన మరో మనిషి దారుణంగా మోసం చేయడంతో దయనీయ పరిస్థితులలోకి జారిపోయింది. జాలీ అనే చిన్న నిర్మాతతో సంబంధంలోకి ప్రవేశించింది. కానీ ఇది మరో పీడకలగా మారుతుందని ఊహించలేకపోయింది. బాధలో ఉన్న విమ్మీని అక్కున చేర్చుకోలేదు సరికదా అనేక రకాలుగా వేధింపులకు గురిచేశాడు. ఆర్థికంగా దోచుకున్నాడు. విమ్మీ సొమ్మునంతా వాడుకోవడం మాత్రమే కాదు ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడనే వార్తలు కూడా వినిపించాయి అప్పట్లో.చదవండి: భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్‌ అయ్యిందిలా!విషాదకరమైన ముగింపుఅయితే తన జీవితాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నంలో, విమ్మీ కోల్‌కతాలో విమి టెక్సటైల్‌ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించింది. దురదృష్టవశాత్తూ అదీ విఫలమైంది. నష్టాలతో దివాలా తీసింది. మరోవైపు అప్పలు ముంచుకొచ్చాయి. ఇక లాభం లేక దాన్ని అమ్మేయవలసి వచ్చింది. ఈ అవమాన భారంతో మానసికంగా దెబ్బతింది. మద్యానికి అలవాటు పడింది. ఇదే ఆమె ఆరోగ్యాన్ని నాశనం చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో 1977న ఆగస్టు 22న అతి చిన్న వయసులో, విమ్మీ కాలేయ సమస్యలలో తనువు చాలించింది. దహన సంస్కారాలు నిర్వహించే దిక్కులేదు వెండి వెలుగుల్లో అకాల కీర్తి, దాని స్వభావాన్ని విషాదాంతాన్ని గుర్తు చేసిన మరో ఉదంతం ఏమింటే..ఆమె చనిపోయిన తర్వాత ఆమె భౌతిక కాయాన్ని ఒక తోపుడు బండిపై తరలించాల్సి రావడం. ఇదీ చదవండి: Birthright Citizenship మరోసారి బ్రేక్‌: భారతీయులకు భారీ ఊరట

Rohit Sharma should spend some time alone, figure out what his habits were: Sanjay bangar9
రోహిత్ ప్రాక్టీస్ ఆపేయ్‌.. ఫస్ట్ ఆ పనిచేయు: భారత మాజీ క్రికెటర్‌

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత రోహిత్ శర్మ ఆటతీరు పేలవంగా మారిపోయింది. టెస్టులు, వన్డేల్లో హిట్‌మ్యాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలమైన రోహిత్‌.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అదే తీరును కనబరుస్తున్నాడు.నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్‌ పిచ్‌ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్‌.. ఇప్పుడు అదే బంతులకు ఔట్ అవుతుండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ తన ఫామ్‌ను అందుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్‌కు భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక సూచనలు చేశాడు. రోహిత్ శర్మ తన రిథమ్‌ను తిరిగి పొందడానికి గతంలో తను ఆడిన వీడియోలు చూడాలని బంగర్ అభిప్రాయపడ్డాడు."రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తన కెరీర్‌లో పరుగులు చేయని దశను అనుభవిస్తున్నాడు. అయితే అతడు తన ఫామ్‌ను తిరిగి అందుకోవడానికి ఎక్కువగా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా సాధన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అతడు ఒంటరిగా ఉండి బ్యాటర్‌గా తన గత విజయాలను గుర్తు చేసుకోవాలి. గతంలో తన బ్యాటింగ్ చేసిన వీడియోలను చూడాలి. ప్ర‌స్తుతం ఎక్కడ తప్పు జరుగుతుందో గుర్తించి సరిదిద్దుకోవాలి. కొన్ని సార్లు ఇలా చేయడం ఫలితాన్ని ఇస్తోంది. ఒక్కసారి రిథమ్‌ను అందుకొంటే చాలు. అంతేకానీ ఎక్కువగా ఆలోచించి నిరాశలో కూరుకుపోకూడదు" అని బంగర్‌ పేర్కొన్నాడు. కాగా కటక్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్‌ తన బ్యాట్‌కు పనిచేబుతాడో లేదో చూడాలి. కాగా ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి అందుబాటులో ఉండ‌నున్నాడు. గాయం కార‌ణంగా తొలి వ‌న్డేకు దూర‌మైన కోహ్లి.. ఇప్పుడు త‌న ఫిట్‌నెస్‌ను తిరిగిపొందాడు . ఈ విష‌యాన్ని భార‌త బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ధ్రువీక‌రించాడు. కింగ్ ఎంట్రీతో య‌శస్వి జైశ్వాల్‌పై వేటు ప‌డే ఛాన్స్ ఉంది. రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్ (వైస్ కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్చదవండి: SL vs AUS: సూపర్ మేన్ స్మిత్‌.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌! వీడియో వైరల్‌

Delhi Elections 2025: Narendra Modi Sarkar Master Stroke To Arvind Kejriwal10
మోదీ రెండాకులు ఎక్కువే చదివారు.. అందుకే కేజ్రీవాల్‌కు మాస్టర్‌ స్ట్రోక్‌!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ సారథి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) హ్యాట్రిక్‌ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు నిశ్చయించుకున్న బీజేపీ వ్యూహాలు పని చేశాయి. దేశరాజకీయాల్లో అత్యంత అనుభవం ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తన ‘బాణాన్ని’ ప్రచారం చివరి దశలో గురి చేసి వదిలారు. ఆ దెబ్బకే కేజ్రీవాల్‌ సర్కారు ఓటమి దాదాపు ఖరారై పోయింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. ఇది మోదీ వదిలిన తురుపు ముక్కగా గత వారమే విశ్లేషకులు అభివర్ణించారు.గత వారం.. సరిగ్గా శనివారం నాడే కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్‌ శిబిరంలో ప్రకంపనలు సృష్టించింది. . ఇది నిజంగా మోదీ మాస్టర్‌స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇది కచ్చితంగా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనా నేడు(శనివారం) అక్షరాలా నిజమైంది.మాస్టర్‌ స్ట్రోక్‌! ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP), బీజేపీ(BJP) మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారిన సంగతి తెలిసిందే. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్‌ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది.దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పార్టీలు శాయశక్తులా ప్రయత్నించాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్‌ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమైంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్‌క్లాస్‌పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది.ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్‌ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది.ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసింది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు బదులు కాంగ్రెస్‌కు పడ్డాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇది బీజేపీకి బాగా అనుకూలంగా మారిందని, అందుచేతే ఆప్‌కు గట్టి దెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు.ఆప్‌తో పాటు దాని సారథి కేజ్రీవాల్‌ కూడా ఓటమి పాలవ్వడం ఆ పార్టీ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి కేజ్రీవాల్‌ ఓటమి చెందారు.ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్‌ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. ఇది కేజ్రీవాల్‌కు మైనస్‌గా మారింది.అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్‌కు తల బొప్పి కట్టించాయి. . వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరిచారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్‌ సీనియర్‌ షీలా దీక్షిత్‌నే మట్టికరిపించారు కేజ్రీవాల్‌.నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్‌సింగ్‌ వర్మ కుమారుడు పర్వేశ్‌ వర్మ, కాంగ్రెస్‌ నుంచి షీలా కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసిరారు. కేజ్రీ ఓట్లకు సందీప్‌ భారీగా గండి కొట్టగా, ఇది బీజేపీ అభ్యర్థి పర్వేష్‌కు వరంలా మారింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement