జోగి రమేష్పై మరో అక్రమ కేసు
విజయవాడ: వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటనను సక్సెస్ కావడాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్పై మరో అక్రమ కేసు నమోదు చేయడమే ఇందుకు ఉదాహరణ. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని, జన సమూహాన్ని పోగు చేశారంటూ సెక్షన్ 30 యాక్ట్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పీఎస్లో జోగి రమేష్పై కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నంకు జన సందోహం స్వచ్ఛదంగా తరలివచ్చింది. వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చి వైఎస్ జగన్ ఘనమైన సంఘీభావం తెలిపారు. చివరి నిమిషంలో వైఎస్ జగన్ పర్యటన రూట్ మ్యాప్ మార్చి కూటమి ప్రభుత్వం కుట్రలు చేసినా.. అది ప్రజాభిమానం ముందు నిలవలేకపోయింది. వైఎస్ జగన్ పర్యటన సక్సెస్ కావడంతో అది కూటమి ప్రభుత్వానికి రుచించడం లేదు. దీనిలో భాగంగా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్పై అక్రమ కేసు బనాయించింది. జన సమీకరణ చేశారంటూ ఏవో కథలు చెబుతూ అక్రమ కేసును నమోదు చేయించింది. ఇవీ చదవండి:YS Jagan: రూటు మారినా తగ్గని జన సునామీలడ్డూపై దుష్ప్రచారం ఆపి.. క్షమాపణలు చెప్పాలి
‘మేక్ ఇన్ ఇండియా’కు గ్లోబల్ బూస్ట్: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారతదేశం- అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీలో ఈ కీలక పరిణామాన్ని ప్రకటించిన ఆయన ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, బంధానికి ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిస్తున్న చొరవను, నిబద్ధతను మోదీ ఈ సందర్భంగా కొనియాడారు.ఈ వాణిజ్య ఒప్పందం భారతీయ ఆర్థిక వ్యవస్థకు, ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి మరింత ఊతాన్నిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు లభించడంతో స్థానిక పరిశ్రమలు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయంగా తయారయ్యే వస్తువులకు అంతర్జాతీయ గుర్తింపు లభించడమే కాకుండా, విదేశీ ఎగుమతులు పెరుగుతాయన్నారు. ఈ నూతన ఒప్పందం ద్వారా రైతులకు, పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ ఆవిష్కర్తలకు భారీ ప్రయోజనం చేకూరనుందని ప్రధాని పేర్కొన్నారు. Great news for India and USA! We have agreed on a framework for an Interim Trade Agreement between our two great nations. I thank President Trump for his personal commitment to robust ties between our countries.This framework reflects the growing depth, trust and dynamism of… https://t.co/zs1ZLzamhd— Narendra Modi (@narendramodi) February 7, 2026అమెరికాతో సులభతర వాణిజ్యం వల్ల గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడమే కాకుండా, చిన్న తరహా పరిశ్రమలు తమ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా, దేశంలో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా దేశంలోని యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి మార్గాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు దోహదపడుతుందని అన్నారు. ఇది చారిత్రక ఒప్పందం: పీయూష్ గోయల్భారతదేశం- అమెరికా మధ్య కుదిరిన తాజా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక సంబంధాల్లో మైలురాయిగా నిలవనుందని, ప్రధాని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఈ ఒప్పంద ముసాయిదా ఖరారైనట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ స్థాయిలో అపారమైన అవకాశాలు లభించనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గంజాయి బ్యాచ్ గ్యాంగ్రేప్
కోవూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. గంజాయి బ్యాచ్ అరాచకానికి ఓ బాలిక బలైపోయింది. ఇద్దరు మృగాళ్లు కలిసి ఓ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. బాధితురాలి పరిస్థితి విషమించగా వారం రోజులపాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరికి శుక్రవారం ప్రాణాలు విడిచింది. అయితే, నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి అరెస్టుచేసిన పోలీసులు.. బాధిత కుటుంబం ఇంటికి వైఎస్సార్సీపీ నేతలు వస్తున్నారన్న సమాచారంతో బాలిక మృతి ఘటన ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని వారు కేసు తారుమారుకు యత్నాలు ప్రారంభించారు. బాలిక తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి వారితో మరో రకంగా ఫిర్యాదు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ప్రేమ వ్యవహారం అంటగట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసుల తీరుతో అర్ధమవుతోంది. జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలు.. ఏం జరిగిందంటే.. కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్లదిబ్బ కొత్తకాలనీకి చెందిన ఎస్కే రసూల్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అరీఫా (12) గత నెల 30వ తేదీ (శుక్రవారం) రాత్రి దుకాణానికి వెళ్లొస్తుండగా, గంజాయికి బానిసలైన అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురు ఆమెపై కన్నేశారు. బాలికను సమీపంలోని చెట్ల పొదల్లోకి బలవంతంగా లాక్కెళ్లి వైట్నర్ కలిపిన నీటిని బలవంతంగా తాగించారు. బాలిక స్పృహ కోల్పోగానే వారు విచక్షణ మరిచి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. స్పృహలోకి వచి్చన తర్వాత ఆ చిన్నారి జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివరించింది. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో తొలుత కోవూరు ప్రభుత్వాస్పత్రికి అక్కడ నుంచి నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా ఐసీయూలో మృత్యువుతో పోరాడిన ఆ బాలిక చివరికి శుక్రవారం ప్రాణాలు విడిచింది. తమ బిడ్డకు మత్తు ద్రావణం తాగించి దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు తారుమారుకు పోలీసుల యత్నం బాలిక మృతి చెందడంతో చెన్నైలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అనంతరం శనివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి, మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి వాకబు చేసినట్లు సమాచారం. అయితే, బాలిక స్వగ్రామానికి కాకాణి శనివారం వెళ్లనున్నారనే సమాచారంతో పోలీసులు కేసు తారుమారు చేసేందుకు ప్రయతి్నస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా బాలిక కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆమెకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా కథలు అల్లుతున్నట్లు తెలుస్తోంది. పోక్సో కేసు నమోదు.. రేప్ జరగలేదంటూ బుకాయింపు.. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు, ఘటనా స్థలాన్ని సైతం పరిశీలించారు. అక్కడ కొన్ని ఆధారాలు సేకరించి, మైనర్లు అయిన ఇద్దరు నిందితులపై పోక్సో కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. అయితే, గంజాయి బ్యాచ్ అరాచకాల విషయంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకే అవకాశం ఉండడం వల్ల కూడా వారు కేసు తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చలవిడిగా గంజాయి ఆగడాలు.. మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి రవాణా, విక్రయాలు, అరాచకాలు, ఆగడాలు మితిమీరాయి. అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు, ఎక్సైజ్ శాఖలు అవినీతి మత్తులో జోగుతున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరులో గంజాయి నిరోధక ఉద్యమకారుడు పెంచలయ్యను ఇటీవలే గంజాయి విక్రేతలు దారికాచి తరిమితరిమి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షితోపాటు ఆమె సోదరుడు, అనుచరులు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇక గంజాయి విక్రయ మూలాలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారనడానికి తరచూ భారీస్థాయిలో పట్టుబడుతున్న గంజాయే నిదర్శనం. నిజానికి.. నెల్లూరు నగరానికి పక్కనే ఉన్న కోవూరు అడ్డాగా గంజాయి విక్రయాల దందా జరుగుతోంది. ఒడిశా నుంచి రైళ్లల్లో, బస్సుల్లో తెస్తూ.. పడుగుపాడు, ఇనమడుగు ప్రాంతాల్లో విక్రేతలు పాగా వేసి విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం.ఆ ఇద్దరే కారణం.. మా బిడ్డకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదు. అభం శుభం తెలియని మా బిడ్డపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చిన్న బిడ్డకు ప్రేమ వ్యవహారం అంటకట్టడం చాలా పాపం. అవన్నీ తప్పుడు ప్రచారం. మా బిడ్డను కొందరు బలవంతంగా తీసుకెళ్లి ఇబ్బందికి గురిచేసిన విషయం నిజమే. అందుకే కోవూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మా బిడ్డ చనిపోవడానికి కారణం ఆ ఇద్దరు పిల్లలే. వారిని కఠినంగా శిక్షించాలి. – ఎస్కే రసూల్, బాలిక తండ్రి మా బిడ్డకు ఇలా జరగడం దారుణం.. పోయిన శుక్రవారం ఏదైనా కొనుక్కుంటానంటే నేనే రూ.10 ఇచ్చి పంపాను. దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు పిల్లలు బలవంతంగా తీసుకెళ్లి మత్తు నీళ్లు తాగించడంతో చెట్ల పొదల మధ్యన పడిపోయింది. గంటసేపైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెంది అంతా వెతికాం. ఇంతలో ఇద్దరు పిల్లలు అక్కడ కూర్చొని ఉంటే అడిగాం. ముందు చూపిస్తామని, ఆ తర్వాత మాకు తెలియదని చెప్పారు. చివరకు చెట్ల పొదల్లో చూడగా అక్కడ మా బిడ్డ స్పృహలేకుండా పడిపోయి ఉంది. అప్పుడు కోవూరు ఆస్పత్రికి తీసుకెళ్లాం. పరిస్థితి ఇబ్బందిగా ఉంటే.. నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ కూడా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో చెన్నైకు తీసుకెళ్లమన్నారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. మా కళ్ల ముందు ఆడుకుంటున్న బిడ్డకు ఇలా జరగడం దారుణం. – బాలిక పిన్ని అంతా అబద్ధంగుమ్మళ్లదిబ్బలో బాలికపై అసలు అత్యాచారమే జరగలేదు. అదంతా అబద్ధం. ఆ బాలికకు బాలుడితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆ బాలిక తన స్నేహితులతో ఉంటూ పొద్దుపోయే వరకు ఇంటికి వెళ్లకపోవడంతో ఇంట్లో వాళ్లు తిడతారేమోనని సమీపంలో ఉన్న గుర్తుతెలియని లిక్విడ్ తాగింది. ఆ కారణంగానే చనిపోయింది. – సుధాకర్రెడ్డి, కోవూరు సీఐరాష్ట్రం గంజాయికి అడ్డాగా మారింది.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. మా ప్రభుత్వ హయాంలో గంజాయి, అక్రమ మద్యాన్ని ఉక్కుపాదంతో అణిచివేశాం. కానీ, నేడు చంద్రబాబు కనుసన్నల్లో రాష్ట్రమంతా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఈ మత్తు పదార్థాలవల్ల పసిబిడ్డల ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోతుంటే ఈ ప్రభుత్వానికి కనికరంలేదు. కూటమి ప్రభుత్వ అక్రమాలకు కొందరు పోలీసులు వంతపాడటం సిగ్గుచేటు. బాలిక అత్యాచారం కేసును పక్కదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయతి్నస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మాజీమంత్రి
ఈ రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.. ధనలబ్ధి పొందుతారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.షష్ఠి రా.3.57 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: చిత్త రా.3.48 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.10.41 నుండి 12.24 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.34 నుండి 8.07 వరకు, అమృత ఘడియలు: రా.8.56 నుండి 10.38 వరకు.సూర్యోదయం : 6.35సూర్యాస్తమయం : 5.54రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ధనలాభం. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.వృషభం: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. మిత్రుల నుండి ఒత్తిడులు. వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ.మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.కర్కాటకం: పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు..సింహం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. విద్యార్థులకు నిరాశ. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటుంది.కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.తుల: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.వృశ్చికం: శుభవార్తలు వింటారు. బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని వివాదాల పరిష్కారమవుతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.ధనుస్సు: ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తివిషయంలో ఒప్పందాలు. ఆర్థిక లాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.మకరం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు.. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.మీనం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
'జన నాయగన్' రిలీజ్కు గ్రీన్ సిగ్నల్..?
శంషాబాద్కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్!
బస్సులో చెలరేగిన మంటలు.. కీసర వద్ద తప్పిన ఘోర బస్సు ప్రమాదం
‘మేక్ ఇన్ ఇండియా’కు గ్లోబల్ బూస్ట్: ప్రధాని మోదీ
అంతరిక్షానికి నిచ్చెనౌతాను!
పాక్లో ఆరని చిచ్చు.. బలూచ్ విముక్తి సాధ్యమయ్యేనా?
చలో గుంటూరు కార్యక్రమం.. అంబటి ఇంటికి కాపు నేతలు
వైభవ్ సూర్యవంశీ అరెస్ట్కు డిమాండ్
చాలామంది మోసం చేశారు.. నా బుర్రకే ఎక్కలేదు: అర్జున్
వచ్చే నెలలో ఆడి కొత్త స్పోర్ట్స్ కార్
పసిడి, వెండి గుడ్న్యూస్.. రేట్లు రివర్స్!!
ఉద్యోగుల జీతాల చెల్లింపు.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం!
పాక్తో ఉద్రిక్తతల నడుమ ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం
IND vs PAK: పాక్కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్!
బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..
50వ పుట్టినరోజు: రూమర్స్కు చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్
మన వాళ్లు నిఘా విభాగం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నార్సార్!
IND vs PAK: పాకిస్తాన్కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ
భారత్తో జరగాల్సిన మ్యాచ్కు జట్టును ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు
ఏపీలో జంగిల్రాజ్
చర్లపల్లి కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. తల్లికి ఫోన్ చేసి..
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
వరల్డ్కప్ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్!
ఈ రాశి వారికి నూతనోత్సాహం.. ఆర్థిక ప్రగతి
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
అక్కడ బీఆర్ఎస్తో ఇక్కడ బీజేపీతో ఎక్కువ చోట్ల మనవాళ్లతోనే పోటీ సార్!
అంతసేపు పని చేయడం నావల్ల కావట్లేదు!
క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి
వాళ్లు మా సోదరులు: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్
ఓటీటీలో 'పరాశక్తి.. తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్
'జన నాయగన్' రిలీజ్కు గ్రీన్ సిగ్నల్..?
శంషాబాద్కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్!
బస్సులో చెలరేగిన మంటలు.. కీసర వద్ద తప్పిన ఘోర బస్సు ప్రమాదం
‘మేక్ ఇన్ ఇండియా’కు గ్లోబల్ బూస్ట్: ప్రధాని మోదీ
అంతరిక్షానికి నిచ్చెనౌతాను!
పాక్లో ఆరని చిచ్చు.. బలూచ్ విముక్తి సాధ్యమయ్యేనా?
చలో గుంటూరు కార్యక్రమం.. అంబటి ఇంటికి కాపు నేతలు
వైభవ్ సూర్యవంశీ అరెస్ట్కు డిమాండ్
చాలామంది మోసం చేశారు.. నా బుర్రకే ఎక్కలేదు: అర్జున్
వచ్చే నెలలో ఆడి కొత్త స్పోర్ట్స్ కార్
పసిడి, వెండి గుడ్న్యూస్.. రేట్లు రివర్స్!!
ఉద్యోగుల జీతాల చెల్లింపు.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం!
పాక్తో ఉద్రిక్తతల నడుమ ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం
IND vs PAK: పాక్కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్!
బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..
50వ పుట్టినరోజు: రూమర్స్కు చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్
మన వాళ్లు నిఘా విభాగం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నార్సార్!
IND vs PAK: పాకిస్తాన్కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ
భారత్తో జరగాల్సిన మ్యాచ్కు జట్టును ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు
ఏపీలో జంగిల్రాజ్
చర్లపల్లి కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. తల్లికి ఫోన్ చేసి..
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
వరల్డ్కప్ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్!
ఈ రాశి వారికి నూతనోత్సాహం.. ఆర్థిక ప్రగతి
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
అక్కడ బీఆర్ఎస్తో ఇక్కడ బీజేపీతో ఎక్కువ చోట్ల మనవాళ్లతోనే పోటీ సార్!
అంతసేపు పని చేయడం నావల్ల కావట్లేదు!
క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి
వాళ్లు మా సోదరులు: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్
ఓటీటీలో 'పరాశక్తి.. తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్
ఫొటోలు
జగన్ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)
హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)
హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)
#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్మనీ (ఫొటోలు)
బంజారాహిల్స్ : సజ్జనర్ సార్.. నేనూ పోలీసింగ్ చేస్తా.. (ఫొటోలు)
‘యుఫోరియా’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ (ఫొటోలు)
బ్లూ డ్రెస్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)
ఈయనే నా కెప్టెన్: శేఖర్ కమ్ముల కూతురు (ఫోటోలు)
ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)
సినిమా
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా రాజాసాబ్, పరాశక్తి, నీలకంఠ తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. వీటితో పాటు మరో రెండు తెలుగు మూవీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. గతేడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలు ఇప్పుడు ఎందులో చూడొచ్చు? అసలు వాటి సంగతేంటి? అనేది చూద్దాం.తెలుగులో పలు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్.. 'మాతృ' అనే సినిమా చేశాడు. గతేడాది ఆగస్టులో రిలీజైంది. పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎవరికీ తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి వచ్చేసింది. ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది. 'మాతృ' విషయానికొస్తే.. ఓ నగరంలో అమ్మాయిలు, అబ్బాయిలు కిడ్నాప్కి గురవుతుంటారు. దీని వెనక ఎవరున్నారా అని పోలీసులు తెగ వెతుకుతుంటారు. అయితే ఈ కిడ్నాప్లకి ఓ ప్రొఫెసర్కి సంబంధముంటుంది. అమ్మ అనే పిలుపు వినగానే ఆ ప్రొఫెసర్ ఎందుకు అదోలా మారిపోతున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఇకపోతే గతేడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'వైభవం'. రుత్విక్ హీరో కాగా సాత్విక్ దర్శకుడు. అందరూ కొత్తవాళ్లు కావడంతో ఇదో మూవీ ఉందనే సంగతి కూడా తెలియనంతగా ఉండిపోయింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ విషయానికొస్తే.. వైభవ్ అనే కుర్రాడు తన ఉద్యోగం వదులుకొని సొంతంగా ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నప్పుడు.. తన బాల్య మిత్రులు తనకు తిరిగి కనిపిస్తారు. తన స్నేహితుడికి వచ్చిన ఒక పెద్ద సమస్యని వైభవ్, అతడి మిత్రులు తమదైన శైలిలో ఎలా ఎదుర్కున్నారు అనేది స్టోరీ.
హారర్ థ్రిల్లర్ ‘హనీ’ మూవీ రివ్యూ
టైటిల్: హనీనటీనటులు: నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, దివి, రాజా రవీందర్, జయన్ని, జయత్రినిర్మాతలు: రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డిరచన, దర్శకత్వం: కరుణ కుమార్సంగీతం: అజయ్ అరసాడసినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్ఎడిటింగ్: మర్తాండ్ కె వెంకటేశ్విడుదల తేది: ఫిబ్రవరి 6, 2025కథేంటంటే..ఆనంద్(నవీన్ చంద్ర)కు మూఢనమ్మకాల పిచ్చి. ఆ నమ్మకాల కారణంగా అతని ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అయినా కూడా క్షుద్ర పూజలు, అఘోర విశ్వాసాలను వదలడు. భార్య లలిత (దివ్య పిళ్లై), కూతురు మీరా(జయన్ని) భయబ్రాంతులకు గురవుతున్నా.. ఆయన క్షుద్ర పూజలు చేస్తూనే ఉంటాడు. ఊరికి దూరంగా ఓ బంగ్లాకి తన ఫ్యామిలీని తరలిస్తాడు. అక్కడ క్షుద్ర పూజలు చేస్తే..తన కోరిక నెరవేరుతుందని, అందుకుగాను కూతురు మీరా తన మాట వినాలని చెబుతాడు. మొదట లలిత.. భర్త నిర్ణయాన్ని తిరస్కరించినా.. కొన్ని పరిస్థితుల కారణంగా తర్వాత ఆమె కూడా ఒప్పుకుంటుంది. కూతురు మీరాతో ఆనంద్ ఏ పని చేయించాడు? అతని క్షుద్రపూజలు నిజంగానే ఫలించాయా? ఆనంద్ కారణంగా తల్లి-కూతుళ్లు ఎదుర్కొన్న భయంకర అనుభవాలు ఏంటి? ఈ కథలో రవణ(దివి), సారంగపాణి(రాజా రవీంద్ర) పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలపై విశ్వాసంతో దుర్మార్గపు, అమానవీయ చర్యలకు పాల్పడే మనుషులు ఉన్నారు. క్షుద్రపూజల కోసం సొంత మనుషులనే చంపుకున్న సంఘటనలు ఉన్నాయి. అలాంటి కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమే ‘హనీ’. .‘పలాస’తో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు కరుణ కుమార్, ఈసారి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. మూఢనమ్మకాల పిచ్చితో కట్టుకున్న భార్యని, కన్న కూతురిని చిత్రహింసలకు గురిచేసే ఓ చీకటి మనిషి కథ ఇది. ఈ తరహా కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. అయితే ఇందులో టచ్ చేసిన పిల్లి మాయ కాన్సెప్ట్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు మదనపల్లె సహా పలు నిజ జీవిత క్షుద్ర పూజల సంఘటనల్ని గుర్తొస్తాయి. ఎక్కడా అనవసరమైన భయపెట్టే సీన్స్ లేకుండా, సిచ్యుయేషన్స్ ద్వారానే టెన్షన్ క్రియేట్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత.కొండగుహలో ఓ తెగ క్షుద్ర దేవతను ఆరాధించే ఆసక్తికర సన్నివేశంతో కథను ప్రారంభించాడు దర్శకుడు. అలాంటి క్షుద్రపూజలే హీరో ఆఫీస్లో చేయడంతో అతన్ని చితక్కొట్టి.. బయటకు పంపిస్తారు. ఆ తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది. అతనికున్న పిచ్చితో కూతురు, భార్య పడే ఇబ్బందులు ఎమోషనల్కు గురి చేస్తాయి. ఇక ఫ్యామిలీతో కలిసి ఊరి బయట ఉన్న ఇంట్లోకి వెళ్లిన తర్వాత.. కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. పిల్లి మాయ సేకరణ సీన్ థ్రిల్లింగ్కు గురి చేస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదించిన ఫీలింగ్ ఇచ్చినా, క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ద్వితియార్థం కథని మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే..ఆనంద్ పాత్రలో నవీన్ చంద్ర ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల కంటి చూపుతోనే భయపెట్టాడు. లలిత పాత్రలో దివ్య పిళ్లై అద్భుతంగా నటించింది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆమె నటన హృదయాలను హత్తుకుంటుంది. మీరా పాత్రలో కనిపించిన చిన్నారి సహజ నటనతో ఆకట్టుకుంది. రమణగా దివి చేసిన బోల్డ్ రోల్ సినిమాకు ఇంకో డార్క్ షేడ్ ఇచ్చింది. సారంగపాణిగా రాజా రవీంద్ర తనదైన ముద్ర వేశాడు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అజయ్ అరసాడ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. కెమెరా వర్క్ బాగుంది. డైలాగ్స్ కథకు బలంగా నిలుస్తాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.- రేటింగ్: 3/5
‘సుమతీ శతకం’ మూవీ రివ్యూ
బిగ్బాస్ షో తర్వాత బుల్లితెర హీరో అమర్దీప్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పలు టీవీ షోలతో పాటు సినిమా చాన్స్లు కూడా వస్తున్నాయి. బుల్లితెరపై ఓ మార్క్ వేసిన అమర్ దీప్ ఇప్పుడు హీరోగా ‘సుమతీ శతకం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..తూర్పు గోదావరి జిల్లాలోని వైకుంఠపురం గ్రామానికి చెందిన కృష్ణ (అమర్ దీప్)కి పెళ్లిపై చాలా ఆశలు ఉంటాయి. ఊర్లోనే ఉంటూ కిరాణ కొట్టు నడుపుతుండడంతో అతనికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. ఊర్లో జరిగే జాతరలో అందరి సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకుంటానంటూ నాన్నమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టలేకపోతోన్నందుకు కృష్ణ బాధపడుతుంటాడు. అలాంటి సమయంలో పక్క గ్రామానికి అంగన్వాడీ టీచర్గా వచ్చిన సుమతి(శైలి చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మరి కిరాణం కొట్టు నడిపే కృష్ణతో సుమతీ ఎలా ప్రేమలో పడింది? పెళ్లికి ఆమె పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు కృష్ణ పెళ్లి జరిగిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఈ విలేజ్ లవ్స్టోరీకి భక్తి, సందేశాత్మక అంశాలు మేళవించి కమర్షియల్ పంథాలో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎంఎం నాయుడు. ప్రారంభంలో కాస్త కథ ట్రాక్ తప్పినట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్కి కథలో లీనమయ్యేలా ప్రేక్షకుడ్ని కట్టి పడేస్తారు. అయితే ఇందులో ట్విస్ట్స్ పెద్దగా లేకపోవడం, ఊహకందేలా సాగడం, విలనిజం కూడా గట్టిగా పండకపోవడంతో ఈ సినిమాకు మైనస్.అయితే ఎమోషనల్ సన్నివేశాలతో ఆ లోపాలను కొంతమేర కప్పిపుచ్చారు.పెళ్లి చుట్టూ రాసుకున్న కథ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, ఎమోషన్ ఇలా అన్నింటినీ సమపాళ్లలో చూపించారు. కానీ ముందుగా చెప్పినట్లుగా ఊహకందేలా కథనం సాగడంతో కథనం రక్తి కట్టించదు. సరదాగా, సాఫీగా సాగే గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మక కథలు ఇష్టపడే ప్రేక్షకులను ఈ చిత్రం నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే.. కృష్ణ పాత్రకు అమర్దీప్ న్యాయం చేశాడు. పల్లెటూరి యువకుడిగా కృష్ణ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ను పండించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ శైలి చౌదరి నటన పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఊరి ప్రెసిడెంట్గా మహేష్ విట్టా, హీరో స్నేహితుడిగా టేస్టీ తేజ కొన్ని సీన్లలో నవ్వులు పూయించారు. మిగతా ఆర్టిస్టులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కెమెరా వర్క్ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని ఎంతో అందంగా చూపించారు. ఈ చిత్రంలోని చాలా విజువల్స్ బాగుంటాయి. రూరల్ బ్యాక్డ్రాప్ను సినిమాటోగ్రాఫర్ ఎస్ హాలేష్ బాగా క్యాప్చర్ చేశారు. సుభాష్ ఆనంద్ ఇచ్చిన పాటల్లో పల్లెటూరి ఫీల్ వచ్చింది. నిర్మాత సాయి సుధాకర్ కొమ్మాలపాటి ఖర్చు విషయంలో రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. రేటింగ్: 2.75/3
ఓటీటీలో దురంధర్.. పాక్, బంగ్లాతో సహా ఏకంగా 22 దేశాల్లో..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజై ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ చిత్రాల జాబితాలో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.టాప్లో ట్రెండింగ్..థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఓటీటీలో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. గతంలో పలు అరబ్ దేశాలు ఈ మూవీపై నిషేధం విధించాయి. కానీ ఇప్పుడు అదే దేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు సౌదీ, యూఏఈ సహా ఏకంగా 22 దేశాల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. ఈ జోరు చూస్తుంటే దురంధర్ దెబ్బ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.తాజాగా నెట్ఫ్లిక్స్ ఇండియా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దురంధర్ ప్రభంజనం 22 దేశాల్లో కొనసాగుతోందని ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. ఇండియాతో పాటు కెనడా, యునైటెడ్ కింగ్డమ్, మొరాకో, మారిషస్, నైజీరియా, బంగ్లాదేశ్, బహ్రెయిన్, హాంకాంగ్, జోర్డాన్, కువైట్, లెబనాన్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాప్లో కొనసాగుతోంది. దురంధర్ ఓటీటీకి వచ్చేసిన కేవలం 48 గంటల్లోనే గ్లోబల్గా టాప్-10లో అడుగుపెట్టేసింది. ప్రస్తుతం 32 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా అడ్డుకున్న దేశాల్లో దురంధర్ టాప్లో కొనసాగడం విశేషం.కాగా.. ధురంధర్లో రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్ హంజా అలీ మజారి పాత్రలో కనిపించారు. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. Taking 22 countries by storm 🔥 Dhurandhar trends at #1 globally!#DhurandharOnNetflix pic.twitter.com/fZeVoSqqcw— Netflix India (@NetflixIndia) February 4, 2026
క్రీడలు
క్వార్టర్ ఫైనల్లో కథ ముగిసె!
కింగ్డావ్ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్ నుంచి భారత పురుషుల, మహిళల జట్లు రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. కనీసం కాంస్య పతకం ఖరారు కావాలంటే దాటాల్సిన క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో భారత జట్లు విఫలమయ్యాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు 0–3తో చైనా జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 1–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయాయి. 2024లో తొలిసారి ఆసియా చాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు ఈసారి మాత్రం పీవీ సింధు గైర్హాజరీలో నిరాశాజనక ప్రదర్శన చేసింది. చైనాతో జరిగిన పోరులో తొలి మ్యాచ్లో ప్రపంచ 42వ ర్యాంకర్ తన్వీ శర్మ 9–21, 9–21తో ప్రపంచ పదో ర్యాంకర్ గావో ఫాంగ్ జియె చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 22–24, 18–21తో జియా యి ఫాన్–జాంగ్ షు జియాన్ జంట చేతిలో ఓటమి పాలైంది. మూడో మ్యాచ్లో రక్షిత శ్రీ 14–21, 21–15, 17–21తో జు వెన్ జింగ్ చేతిలో పరాజయం చవిచూసింది. లక్ష్య సేన్, సాత్విక్ లేకుండా... దక్షిణ కొరియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్స్ లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్– బరిలోకి దిగలేదు. లక్ష్య సేన్ వెన్నునొప్పితో బాధపడుతుండగా... తన తండ్రి సంవత్సరీకం కారణంగా సాత్విక్ స్వదేశానికి వెళ్లిపోయాడు. తొలి మ్యాచ్లో ఆయుశ్ శెట్టి 21–18, 14–21, 24–26తో యూ టే బిన్ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్లో హరిహరన్–చిరాగ్ శెట్టి ద్వయం 11–21, 13–21తో సాంగ్ హున్ చో–కిమ్ వన్ హో జంట చేతిలో ఓటమి పాలైంది. మూడో మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ 21–15, 21–16తో చోయ్ జిహూన్పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్లో పృథ్వీ–సాయిప్రతీక్ జోడీ 11–21, 16–21తో జిన్ యోంగ్–కి డాంగ్ జు ద్వయం చేతిలో పరాజయం పాలైంది. ఫలితం తేలిపోవడంతో ఐదో మ్యాచ్ను నిర్వహించలేదు. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో చైనా 3–1తో చైనీస్ తైపీపై; జపాన్ 3–0తో మలేసియాపై, ఇండోనేసియా 3–2తో థాయ్లాండ్ జట్టుపై గెలిచి సెమీఫైనల్ చేరుకున్నాయి.
రెజ్లర్ సుశీల్కు బెయిల్ తిరస్కృతి
న్యూఢిల్లీ: వివాదాస్పద రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. హత్యానేరంపై అతను ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మాజీ జాతీయ జూనియర్ చాంపియన్ సాగర్ ధన్కర్ను హత్య చేసిన కేసులో సుశీల్ ప్రధాన నిందితుడు. తన అనుచరులు, సన్నిహితులతో కలిసి ఛత్రశాల్ స్టేడియంలో 2021లో యువ రెజ్లర్ సాగర్ ధన్కర్ను హాకీ స్టిక్స్, బేస్బాల్ బ్యాట్లతో తీవ్రంగా కొట్టి చంపాడు. అడ్డువచ్చిన సాగర్ స్నేహితులను సైతం సుశీల్ బృందం విచక్షణ రహితంగా కొట్టడంతో కొందరు గాయపడ్డారు. ఈ కేసులో సుశీల్ ఏ1గా తేలడంతో ఢిల్లీ పోలీసులు 2021 మేలో అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మోకాలు శస్త్ర చికిత్స కోసమని 2023, జూలైలో సెషన్స్ కోర్టు వారం రోజుల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అనంతరం మళ్లీ ఒలింపియన్ రెజ్లర్ను జైలుకు తరలించారు. తాజాగా మరోసారి బెయిల్కు ప్రయత్నించగా ఢిల్లీ కోర్టు నిర్ద్వందంగా సుశీల్ పిటీషన్ను తిరస్కరించింది.
'పది'oతల విధ్వంసానికి ‘సై’
హార్దిక్ పాండ్యా బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్... సిక్స్గా మారిందనుకున్న క్షణాన వైడ్ లాంగాన్ నుంచి అనూహ్యంగా దూసుకొచ్చిన సూర్యకుమార్ యాదవ్... అసాధారణ రీతిలో బౌండరీ గీత అంచున గాల్లోకి ఎగిరి అందుకున్న క్యాచ్ భారత్ను విశ్వవిజేతగా నిలబెట్టింది... ఈ ఘట్టం ఇంకా సగటు అభిమానుల కళ్లల్లో మెదులుతుండగానే మరో టి20 ప్రపంచ కప్ వచ్చేసింది... నాడు హీరోగా నిలిచిన సూర్యకుమార్ నేడు నాయకుడిగా జట్టును నడిపిస్తున్నాడు... జూన్ 29, 2024 గత టి20 ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలిచిన రోజు... కాగా ఫిబ్రవరి 7, 2026న తాజా టి20 ప్రపంచకప్లో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్ల మధ్య విరామం 588 రోజులు... ఇన్ని రోజుల్లో తేదీ మాత్రమే మారింది... భారత్ ఆటలో దూకుడు, గెలుపు బాట ఏమాత్రం మారకుండా సేమ్ టు సేమ్... అద్భుత ఫామ్తో టైటిల్ నిలబెట్టుకొని చరిత్ర సృష్టించేందుకు, సొంతగడ్డపై సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమైంది.రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ఇరవై నెలలకే మళ్లీ ‘ప్రపంచకప్’ రావడం కొంత ఆసక్తిని తగ్గించడం సహజమే అయినా పోటీ విషయంలో ఏ జట్టూ తక్కువ కాదు అంటూ సమరానికి ‘సై అంటున్నాయి. బిగ్బాష్లో చెలరేగిన కుర్రాళ్లతో ఆ్రస్టేలియా రెండో టైటిల్ కోసం సన్నద్ధమై రాగా, టి20 స్పెషలిస్ట్లతో ఇంగ్లండ్ తమ మూడో ట్రోఫీని అందుకోవాలని పట్టుదలగా ఉంది. మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్ కూడా మూడో టైటిల్ అందుకొని ఈ ఫార్మాట్లోనైనా తమ స్థాయిని ప్రదర్శించాలని భావిస్తుండగా, సహ ఆతిథ్య జట్టుగా దక్కిన అవకాశాన్ని వాడుకోవాలని శ్రీలంక ఆశిస్తోంది. వివాదాల పాకిస్తాన్ రెండో ట్రోఫీని అందుకోగలదా అనే చర్చ సాగుతుండగా, ఒక్క వరల్డ్ కప్ వేటలో న్యూజిలాండ్ తమ పోరాటాన్ని కొనసాగించాలని సన్నద్ధమైంది. క్రితంసారి చేజారిన ట్రోఫీని ఈసారైనా దక్షిణాఫ్రికా గెలుచుకోగలదా చూడాలి. బంగ్లాదేశ్ నిష్క్రమించిన చోట ఇతర చిన్న జట్లు ఏమాత్రం ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరం. ముంబై: టి20 ఫార్మాట్లో పదో ప్రపంచ కప్కు సమయం ఆసన్నమైంది. భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి నేడు తెర లేవనుంది. తొలి రోజు మూడు వేర్వేరు వేదికల్లో మూడు మ్యాచ్లు జరుగుతాయి. గత టోర్నీ తరహాలోనే 20 జట్లు ఇందులో బరిలోకి దిగుతున్నాయి. 30 రోజుల్లో 55 మ్యాచ్ల పాటు ఈ ధనాధన్ వినోదం సాగుతుంది. ఇటలీ జట్టు తొలిసారి అర్హత సాధించగా... భద్రతా కారణాలరీత్యా భారత్లో ఆడలేమంటూ బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలిగింది. మార్చి 8న అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. భారత్లో ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై వరల్డ్ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. శ్రీలంకలో కొలంబో, పల్లెకెలె వేదికలుగా ఉన్నాయి. మొత్తం జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్ నుంచి టాప్–2 టీమ్లు ‘సూపర్–8’ దశకు క్వాలిఫై అవుతాయి. ‘సూపర్–8’లోని రెండు గ్రూప్ల నుంచి రెండేసి జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది. తొలి రోజు మూడు మ్యాచ్లు జరుగుతాయి. కొలంబోలో నెదర్లాండ్స్తో పాకిస్తాన్ (ఉదయం 11 గంటల నుంచి), కోల్కతాలో వెస్టిండీస్తో స్కాట్లాండ్ (మధ్యాహ్నం 3 గంటల నుంచి) తలపడతాయి. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లేదు! ఐసీసీ టోర్నీలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఈసారి లీగ్ దశలో ఉండటం లేదు. భారత్తో మ్యాచ్ ఆడరాదని పాక్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ తేదీ సమయానికి ఏదైనా అనూహ్యం సంభవిస్తే తప్ప మ్యాచ్ జరిగే అవకాశం లేదు. ఈ రెండు టీమ్లు నాకౌట్లో ఆడాల్సి వస్తే ఏమిటనేది కూడా ఆసక్తికరం. టి20 వరల్డ్ కప్లో 2009, 2010 మినహా... 2007లో రెండు మ్యాచ్లతో పాటు గత ఆరు వరుస వరల్డ్ కప్లలో ఇరు జట్లు తలపడ్డాయి. భారీ విజయంపై భారత్ దృష్టినేడు అమెరికాతో తొలి పోరుముంబై: ఆడిన 41 మ్యాచ్లలో 31 విజయాలు, 6 పరాజయాలు మాత్రమే... 2 మ్యాచ్లు ‘టై’ కాగా వాటిలో కూడా ‘సూపర్ ఓవర్’ గెలుపుతో కలిపి మొత్తం విజయాల సంఖ్య చూస్తే 33.. మొత్తం 9 సిరీస్లు ఆడితే అన్నింటిలోనూ విజేత... గత టి20 వరల్డ్ కప్లో విజయం సాధించిన తర్వాత భారత జట్టు అసాధారణ రికార్డు ఇది. ఇలాంటి స్థితిలో డిఫెండింగ్ చాంపియన్గా టీమిండియా మళ్లీ తమ జైత్రయాత్రకు సిద్ధమైంది. వాంఖెడే మైదానంలో జరిగే తమ తొలి పోరులో అమెరికాతో భారత్ తలపడనుంది. బలాబలాలపరంగా ఇరు జట్ల మధ్య ఉన్న అంతరాన్ని చూస్తే ఫలితం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మ్యాచ్ విన్నర్లతో నిండిన సూర్యకుమార్ బృందం తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే సునాయాస విజయం ఖాయం. గత టోర్నీలో పాక్ను ఓడించి సంచలనం సృష్టించిన అమెరికా ఈ సారి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. 2024లో భారత్ 7 వికెట్ల తేడాతో అమెరికాను అలవోకగా ఓడించింది. గాయంతో భారత బౌలర్ హర్షిత్ రాణా టోర్నీకి దూరం కాగా... అతని స్థానంలో హైదరాబాద్ స్పీడ్స్టర్ మొహమ్మద్ సిరాజ్కు భారత జట్టులో చోటు దక్కింది.ఏ గ్రూప్లో ఎవరెవరు...గ్రూప్ ‘ఎ’: భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏ. గ్రూప్ ‘బి’: ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్. గ్రూప్ ‘సి’: ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ. గ్రూప్ ‘డి’: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ. సూపర్–8 గ్రూప్, సీడింగ్స్ వివరాలు గ్రూప్–1: భారత్ (ఎక్స్1), ఆస్ట్రేలియా (ఎక్స్2), వెస్టిండీస్ (ఎక్స్3), దక్షిణాఫ్రికా (ఎక్స్4). గ్రూప్–2: ఇంగ్లండ్ (వై1), న్యూజిలాండ్ (వై2), పాకిస్తాన్ (వై3), శ్రీలంక (వై4).
యువ భారత్ 'సిక్సర్'
అంతర్జాతీయ క్రికెట్ వేదికపై భారత కుర్రాళ్లు మళ్లీ అదరగొట్టారు. అద్భుత ఆటతో అండర్–19 ప్రపంచ కప్ను సొంతం చేసుకున్నారు. సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీతో పాటు కెప్టెన్ ఆయుశ్ మాత్రే రాణించడంతో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ యువ జట్టును ఓడించింది. భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311పరుగులకు ఆలౌటైంది. ఫాల్క్నర్ సెంచరీ సాధించాడు. భారత్ అండర్–19 ప్రపంచ కప్ గెలుచుకోవడం ఇది ఆరో సారి కావడం విశేషం. ఈ టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్లలోనూ గెలిచిన భారత్ అజేయంగాముగించింది. గతంలో భారత్కు అండర్–19 వరల్డ్ కప్ అందించిన కెపె్టన్లు కైఫ్ (2000), కోహ్లి (2008), ఉన్ముక్త్ చంద్ (2012), పృథ్వీ షా (2018), యశ్ ధుల్ (2022) సరసన ఆయుశ్ మాత్రే నిలిచాడు. స్థాయి ఎలాంటిదైనా, వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా తనకు తెలిసింది మైదానంలో బ్యాట్తో విధ్వంసం సృష్టించడమే అని వైభవ్ సూర్యవంశీ మరోసారి నిరూపించాడు. ఈ పాలబుగ్గల కుర్రాడు సునామీ ఆటతో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోయాడు. ఆ షాట్లలో పవర్, పదును, ఎక్కడా తడబాటు కనిపించకుండా పూర్తి సాధికారతతో ఆడిన వైనం నిజంగా అసాధారణం. విశేషణాలతో వర్ణించలేని గొప్ప ఇన్నింగ్స్ను వైభవ్ క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. పాయింట్, కవర్స్, మిడ్ వికెట్, ఫైన్ లెగ్, లాంగాఫ్, లాంగాన్... ఇలా ప్రతీ దిశలో అత్యద్భుత షాట్లతో పరుగుల సునామీ సృష్టించిన వైభవ్ ఏకంగా 15 ఫోర్లు, 15 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.బౌండరీల ద్వారానే 150 పరుగులు రాబట్టిన అతని ఆట ముందు అండర్–19 వరల్డ్ కప్ దాసోహమంటూ భారత యువ జట్టును ఆరోసారి విశ్వ విజేతను చేసింది. వైభవ్ మెరుపులతో 400పైగా పరుగులు చేసి సవాల్ విసిరిన భారత్ ముందు ఇంగ్లండ్ నిలవలేకపోయింది. కొంత పోరాడినా లక్ష్యానికి సుదూరంగానే ఆగిపోవడంతో భారత కుర్రాళ్లు ప్రపంచ చాంపియన్లుగా సగర్వంగా నిలిచారు. హరారే: ఐసీసీ అండర్–19 ప్రపంచకప్లో భారత్ మరోసారి విజేతగా నిలిచింది. మొత్తం 16 సార్లు టోర్నీని నిర్వహించగా... భారత్ టైటిల్ సాధించడం ఇది ఆరోసారి కావడం విశేషం. శుక్రవారం ఇక్కడ జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత యువ జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ అండర్–19 టీమ్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వైభవ్ సూర్యవంశీ (80 బంతుల్లో 175; 15 ఫోర్లు, 15 సిక్స్లు) అసాధారణ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (51 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీతో అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్కు 90 బంతుల్లోనే 142 పరుగులు జోడించారు. అనంతరం ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. కాలెబ్ ఫాల్క్నర్ (67 బంతుల్లో 115; 9 ఫోర్లు, 7 సిక్స్లు) శతకం నమోదు చేయగా, బెన్ డాకిన్స్ (56 బంతుల్లో 66; 7 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. టోర్నీలో 7 ఇన్నింగ్స్లలో కలిపి ఏకంగా 169.49 స్ట్రయిక్రేట్తో మొత్తం 439 పరుగులు సాధించిన వైభవ్ సూర్యవంశీకే ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దక్కింది. రాణించిన కెప్టెన్ గత మ్యాచ్లో చెలరేగిన హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (9) ఫైనల్లో విఫలమైన అనంతరం వైభవ్, ఆయుశ్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. ధాటిగా ఆడిన కెప్టెన్ 50 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి బంతికే అతను అవుట్ కాగా, 51 పరుగులు జత చేసిన వేదాంత్ త్రివేది (36 బంతుల్లో 32; 2 ఫోర్లు), విహాన్ మల్హోత్రా (36 బంతుల్లో 30; 2 ఫోర్లు) ఆరు పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. అభిజ్ఞాన్ కుందు (31 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్), చివర్లో కనిష్క్ చౌహాన్ (20 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు ప్రదర్శించడంతో స్కోరు 400 దాటింది. తొలి 25 ఓవర్లలో 250 పరుగులు చేసిన భారత్ తర్వాతి 25 ఓవర్లలో 161 పరుగులు సాధించింది.ఫాల్క్ నర్ మినహా... భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బాగా తడబడింది. డాకిన్స్, బెన్ మాయెస్ (28 బంతుల్లో 45; 7 ఫోర్లు, 2 సిక్స్లు) రెండో వికెట్కు 74 పరుగులు జోడించి మెరుగైన స్థితిలో నిలిపినా ఆ తర్వాత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి 22 ఓవర్లలో 177/7 వద్ద ఓటమికి చేరువైంది. ఈ దశలో జేమ్స్ మింటో (28)తో కలిసి ఫాల్్కనర్ కొద్దిగా పోరాడాడు. భారీ షాట్లు ఆడిన ఫాల్్కనర్ అంబ్రిష్ ఓవర్లో 3 సిక్స్లు బాది 63 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే తర్వాతి ఓవర్లోనే ఖిలాన్ చక్కటి క్యాచ్తో అతను చివరి వికెట్గా అవుట్ కావడంతో భారత్ సంబరాల్లో మునిగిపోయింది. విధ్వంసాన్ని సృష్టిస్తూ... తొలి మూడు బంతుల్లో పరుగు తీయలేదు, నాలుగో బంతికి ఫోర్తో స్కోర్ మొదలైంది. అవతలి వైపు తొలి వికెట్ పడే సమయానికి 13 బంతుల్లో 10 పరుగులే. అయితే ఈ కొద్దిసేపు మాత్రమే వైభవ్ కాస్త ప్రశాంతంగా కనిపించాడు. పాయింట్ దిశగా కొట్టిన మొదటి సిక్స్తో జోరు షురూ చేసిన అతను అనంతరం ఎక్కడా తగ్గలేదు. ఆ తర్వాతా ఇదే మోత కొనసాగుతూ మరో 14 సిక్సర్లు అతని ఖాతాలో చేరాయి! మింటో ఓవర్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టిన వైభవ్ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఆఫ్ స్పిన్నర్ ఫర్హాన్ ఓవర్లో 2 సిక్స్లు బాదిన అనంతరం అతని తర్వాతి ఓవర్లో వైభవ్ మరింత చెలరేగిపోయాడు. వరుసగా 6, 6, 4, 6తో బంతిని చితక్కొట్టాడు. ఆల్బర్ట్ ఓవర్లో ఆఫ్ సైడ్ దిశగా సింగిల్ తీయడంతో 55 బంతుల్లో వైభవ్ శతకం పూర్తయింది. ఆ వెంటనే గ్రీన్ ఓవర్లో కూడా మరో 2 సిక్స్లు కొట్టిన అనంతరం ఆల్బర్ట్ వేసిన ఇన్నింగ్స్ 23వ ఓవర్లో మరింత పండగ చేసుకున్నాడు. వైభవ్ వరుసగా 2, 4, 6, 6, 4, 4 బాదగా వైడ్తో కలిసి మొత్తం 27 పరుగులు వచ్చాయి. 71 బంతుల్లో అతను 150 పరుగుల మార్క్ను చేరుకున్నాడు. అర్ధసెంచరీ నుంచి సెంచరీ చేరేందుకు 23 బంతులు తీసుకున్న అతనికి సెంచరీనుంచి 150కు చేరేందుకు 16 బంతులు సరిపోయాయి. మోర్గాన్ ఓవర్లో కూడా 2 సిక్స్లు, 2 ఫోర్లు కొట్టిన అతను డబుల్ సెంచరీ దిశగా నడిచాడు. అయితే పుల్–సూ్కప్ షాట్కు ప్రయత్నించి కీపర్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ అసాధారణ ఇన్నింగ్స్ ముగిసింది.175 సీనియర్ వరల్డ్ కప్, మహిళల వరల్డ్ కప్తో సహా ఏదైనా ఐసీసీ టోర్నీ ఫైనల్లో అత్యధిక స్కోరు (175) సాధించిన బ్యాటర్గా వైభవ్ నిలిచాడు. అండర్–19 స్థాయిలో వైభవ్ కొత్త రికార్డులిలా... 1 భారత్ తరఫున వరల్డ్ కప్లో అత్యధిక స్కోరు 2 ఓవరాల్గా భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరు (తొలి స్థానంలో అంబటి రాయుడు 177 నాటౌట్) 15 ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు 30 అత్యధిక బౌండరీలు 150 బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు 5 ఐదో వేగవంతమైన సెంచరీ (55 బంతుల్లో) 30 ప్రపంచకప్లో అత్యధిక సిక్స్లు 439 ఒకే వరల్డ్ కప్లో భారత్ తరఫున చేసిన పరుగుల్లో శిఖర్ ధావన్ (505) తర్వాత రెండో స్థానం. స్కోరు వివరాలు భారత అండర్–19 ఇన్నింగ్స్: ఆరోన్ జార్జ్ (సి) మాయెస్ (బి) గ్రీన్ 9; వైభవ్ (సి) ర్యూ (బి) లమ్స్డెన్ 175; ఆయుశ్ (సి) మాయెస్ (బి) గ్రీన్ 53; వేదాంత్ (సి) మాయెస్ (బి) మింటో 32; విహాన్ (సి) డాకిన్స్ (బి) మింటో 30; అభిజ్ఞాన్ (సి) ఆల్బర్ట్ (బి) మోర్గాన్ 40; అంబ్రిష్ (బి) మింటో 18; కనిష్క్ (నాటౌట్) 37; ఖిలాన్ (సి) మూర్స్ (బి) మోర్గాన్ 3; హెనిల్ (రనౌట్) 5; దీపేశ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 411. వికెట్ల పతనం: 1–20, 2–162, 3–251, 4–302, 5–308, 6–359, 7–367, 8–375, 9–393. బౌలింగ్: మోర్గాన్ 9–0–74–2, గ్రీన్ 5–0–49–2, లమ్స్డెన్ 8–0–81–1, మింటో 8–0–63–3, ఫర్హాన్ 10–0–77–0, ఆల్బర్ట్ 10–0–66–0. ఇంగ్లండ్ అండర్–19 ఇన్నింగ్స్: డాకిన్స్ (సి) ఖిలాన్ (బి) ఆయుశ్ 66; మూర్స్ (బి) అంబ్రిష్ 17; మాయెస్ (సి) హెనిల్ (బి) ఖిలాన్ 45; థామస్ ర్యూ (సి) ఆయుశ్ (బి) కనిష్క్ 31; ఫాల్క్నర్ (సి) ఖిలాన్ (బి) కనిష్క్ 115; ఆల్బర్ట్ (రనౌట్) 0; ఫర్హాన్ (సి) అభిజ్ఞాన్ (బి) దీపేశ్ 1; మోర్గాన్ (సి) అండ్ (బి) దీపేశ్ 0; మింటో (సి) (సబ్) ఇనాన్ (బి) అంబ్రిష్ 28; లమ్స్డెన్ (సి) వేదాంత్ (బి) అంబ్రిష్ 3; గ్రీన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (40.2 ఓవర్లలో ఆలౌట్) 311. వికెట్ల పతనం: 1–19, 2–93, 3–142, 4–174, 5–174, 6–177, 7–177, 8–269, 9–281, 10–311. బౌలింగ్: అంబ్రిష్ 9–1–56–3, హెనిల్ 4–2–28–0, దీపేశ్ 6–0–64–2, ఖిలాన్ 8–0–66–1, కనిష్క్ 8.2–0–63–2, ఆయుశ్ 5–0–31–1.
న్యూస్ పాడ్కాస్ట్
జంగిల్రాజ్పై ప్రశ్నిస్తున్నందుకే గూండా దాడులు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు అరాచకాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
‘లిఫ్ట్’ తాకట్టుపై రాయలసీమ కన్నెర్ర... ఆపిన పనులు రెండు నెలల్లో మళ్లీ మొదలుపెట్టాలని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ... చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
రెడ్బుక్కే రాజ్యాంగం, చంద్రబాబే ‘సుప్రీం’... తిరుమల శ్రీవారి లడ్డూపై సొంత విచారణ చేపట్టాలని ఏపీ సీఏం నిర్ణయం
కొలిక్కివచ్చిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం. అమెరికా టారిఫ్లు 18 శాతానికి తగ్గింపు
దేశానికి వికసిత విజన్... 2026-27 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్లో గూండారాజ్... పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. శనివారం రాత్రి అరెస్టు
జీవీఎంసీలో రౌడీ రాజ్యం... గీతం కబ్జాకు పచ్చజెండా... కనీస చర్చ లేకుండానే భూముల క్రమబద్దీకరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో రీ సర్వే సూపర్. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన భూ, మార్కెట్ సంస్కరణలు భేష్ అని పొగిడిన కేంద్ర ఆర్థిక సర్వే
YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు
బిజినెస్
ఆర్బీఐ కీలక నిర్ణయం.. వారికి పరిహారంగా రూ.25 వేలు!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి బ్యాంకులు ప్రజలలో అవగాహన పెంచుతున్నాయి. దీనికోసం బ్యాంకింగ్ సంస్థలు ప్రత్యేకంగా సైబర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ కూడా తీసుకొస్తున్నాయి. సైబర్ ఇన్యూరెన్స్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. సైబర్ మోసాలకు బాధితులవుతున్న వారికి అండగా నిలిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముగింపు రోజున ఈ ప్రకటన చేశారు.వినియోగదారుల రక్షణలో భాగంగా.. డిజిటల్ మోసాల వల్ల నష్టపోయిన కస్టమర్లకు తక్షణ ఆర్థిక సాయంగా గరిష్టంగా రూ.25,000 వరకు పరిహారం చెల్లించనున్నట్లు ఆర్బీఐ ప్రతిపాదించింది. త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయనున్నారు. డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో, ఇలాంటి చర్యలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇలాంటి సమయాల్లో పరిహారం..బ్యాంకింగ్ సంస్థల నిర్లక్ష్యం లేదా సిస్టం లోపల వల్ల ప్రజలు సైబర్ నేరాలకు గురైతే.. రిజర్వ్ బ్యాంక్ పరిహారం అందించనుంది. అంతే కాకుండా.. చిన్న మొత్తంలో నష్టపోయినవారికి మాత్రమే ఈ పరిహారం అందించడం జరుగుతుంది. భారీ మొత్తంలో సైబర్ మోసాలకు గురైనప్పుడు.. ఈ పరిహారం లభించదు.ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీఎల్ఎస్ ఈ సర్వీసెస్ సీఎఫ్ఓ రాహుల్ శర్మ.. చిన్న మోసాల వల్ల కలిగే నష్టాలకు ఈ పరిహారం కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆన్నారు. వెల్స్ ఫార్గో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ గ్లోబల్ బ్యాంకింగ్ లీడర్ సంతాను సెంగుప్తా కూడా ఈ నిర్ణయాన్ని డిజిటల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్లో విశ్వాసాన్ని పెంచుతుందని వెల్లడించారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్: పెరిగిన ఇళ్ల ధరలు
భారతదేశ గృహ రియల్ ఎస్టేట్ రంగంలో 2025లో ధరల పెరుగుదల గణనీయంగా మందగించింది. దేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో ఇళ్ల సగటు ధరలు 2025లో కేవలం 6 శాతం మాత్రమే పెరిగాయి. కాగా 2024లో ఈ వృద్ధి 17 శాతంగా నమోదైంది. ఈ విషయాన్ని ప్రాప్టైగర్ విడుదల చేసిన ‘రియల్ ఇన్సైట్ – రెసిడెన్షియల్ CY 2025’ నివేదిక వెల్లడించింది.అయితే, అమ్మకాలు తగ్గినప్పటికీ, సరఫరాపై నియంత్రణ, ధరల స్థిరత్వం కారణంగా గృహ మార్కెట్ బలహీనపడలేదని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలు డిమాండ్ను నిలుపుకొంటూ స్థిరమైన ప్రదర్శన చూపించాయి.హైదరాబాద్లో 8 శాతం ధరల వృద్ధి2025లో హైదరాబాద్లో గృహాల సగటు ధరలు 8 శాతం పెరిగాయి. ఇది బెంగళూరుతో కలిసి దేశంలోనే మెరుగైన పనితీరు చూపిన మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ను నిలిపింది. ఐటీ, సేవా రంగాల ఆధారంగా ఉన్న ఎండ్-యూజర్ డిమాండ్ హైదరాబాద్ మార్కెట్కు ప్రధాన బలం అని నివేదిక తెలిపింది.ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ధరలు ఇంకా అందుబాటులో ఉండటం, మెరుగవుతున్న రహదారి మౌలిక సదుపాయాలు, కొత్త నివాస కారిడార్ల అభివృద్ధి కూడా డిమాండ్ను నిలబెట్టిన కీలక కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. స్పెక్యులేటివ్ కొనుగోళ్ల కంటే స్వయంగా నివసించేందుకు కొనుగోలు చేసే వారి వాటా ఎక్కువగా ఉండటం మార్కెట్కు స్థిరత్వాన్ని ఇచ్చింది.బెంగళూరు ముందంజదేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో బెంగళూరు 13 శాతం ధరల పెరుగుదలతో అగ్రస్థానంలో నిలిచింది. 2025 చివరి త్రైమాసికానికి బెంగళూరులో చదరపు అడుగుకు సగటు ధర రూ.9,500కు చేరి, ఢిల్లీ-ఎన్సీఆర్ (రూ.9,167)ను దాటి దేశంలో రెండో అత్యంత ఖరీదైన గృహ మార్కెట్గా అవతరించింది. మొదటి స్థానంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (రూ.14,000) ఉంది.ఇతర నగరాల్లో ధరల వృద్ధి పరిమితంగానే నమోదైంది. ముంబై ఎంఎంఆర్లో 4 శాతం, ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్కతాల్లో 6 శాతం, అహ్మదాబాద్లో 8 శాతం పెరుగుదల కనిపించింది. పుణేలో కేవలం 1 శాతం, చెన్నైలో ఎలాంటి పెరుగుదల లేకపోవడం గమనార్హం.అమ్మకాలు, సరఫరాలో తగ్గుదల2025లో దేశవ్యాప్తంగా గృహ అమ్మకాలు 12 శాతం తగ్గి 3.86 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇది 2022 తర్వాత నమోదైన కనిష్ట స్థాయి. కొత్త గృహ ప్రాజెక్టుల ప్రారంభాలు కూడా 6 శాతం తగ్గి 3.61 లక్షల యూనిట్లకు చేరాయి.అయితే, 2025 చివరి త్రైమాసికంలో సరఫరా స్వల్పంగా మెరుగుపడింది. Q4లో కొత్త లాంచ్లు 4 శాతం పెరగడం డెవలపర్లలో మెల్లగా విశ్వాసం పెరుగుతున్న సంకేతంగా నివేదిక పేర్కొంది. హైదరాబాద్లో సరఫరా నియంత్రితంగా ఉండటంతో ఇన్వెంటరీ ఒత్తిడి తక్కువగానే కొనసాగింది.2026పై అంచనాలుప్రాప్టైగర్ నివేదిక ప్రకారం, హైదరాబాద్, బెంగళూరు వంటి ఎండ్-యూజర్ ఆధారిత నగరాలు 2026లోనూ స్థిరమైన ప్రదర్శన కొనసాగించే అవకాశముంది. పరిమిత సరఫరా, నియంత్రిత ఇన్వెంటరీతో గృహ రంగం ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “అమ్మకాలు తగ్గినప్పటికీ ధరల స్థిరత్వం కొనసాగుతోంది. డెవలపర్లు స్వయంనియంత్రిత సరఫరాతో ధరల సమగ్రతను కాపాడుతున్నారు” అని ఆరమ్ ప్రాప్టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓంకార్ షెట్టి పేర్కొన్నారు.
బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..
“రిచ్ డాడ్ పూర్ డాడ్” రచయిత రాబర్ట్ కియోసాకి, ధరలు కొత్త మార్కెట్ దిగువ స్థాయికి చేరుకునే వరకు బిట్కాయిన్ (BTC), బంగారం, వెండిని మరింతగా కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లకు అసలైన ప్రమాదం ధరల ఊగిసలాట కంటే, పెరుగుతున్న అమెరికా రుణ భారం అని ఆయన అభిప్రాయపడ్డారు.‘ఎక్స్’(ట్విట్టర్)లో చేసిన పోస్ట్లో, అమెరికా ఆర్థిక పరిస్థితిని పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న “అత్యంత పెద్ద సమస్య”గా కియోసాకి అభివర్ణించారు. అమెరికా జాతీయ రుణం సుమారు 38 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పథకాలతో సంబంధం ఉన్న భవిష్యత్ బాధ్యతలను కలిపితే మొత్తం భారం 250 ట్రిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. “ఫెడ్, అసమర్థ నాయకులు, నకిలీ డాలర్లతో ప్రజలను దోచుకునే క్రిమినల్ బ్యాంకర్లే అసలైన సమస్య” అని కియోసాకి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడే కొనేది లేదువెండి ధర 60 డాలర్లు, బిట్కాయిన్ 6,000 డాలర్లు, బంగారం 300 డాలర్లు వద్ద ఉన్నప్పటి నుంచి తాను కొనుగోలు చేయడం ఆపేశానని కియోసాకి తెలిపారు. “నేను కొన్ని బిట్కాయిన్లు, కొంత బంగారం విక్రయించాను. కానీ నాకు అమ్మడం నచ్చదు ఎందుకంటే మూలధన లాభాల పన్ను చెల్లించడం నాకు ఇష్టం లేదు” అని చెప్పారు. కొత్తగా పెట్టుబడి పెట్టే ముందు, ఈ రెండు ఆస్తుల్లోనూ కొత్త దిగువ స్థాయిల కోసం “ఓపికగా వేచి చూస్తున్నాను” అని అన్నారు.గురువారం సెషన్లో బిట్కాయిన్ ధర 60,100 డాలర్ల వరకు పడిపోయి, రాత్రికి 65,600 డాలర్లకు చేరింది. అయినప్పటికీ, గత 24 గంటల్లో ఇది ఇంకా 6.6% తగ్గుదలలోనే ఉంది. స్టాక్ట్విట్స్ ప్రకారం.. బిట్కాయిన్పై రిటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఏడాది కనిష్టానికి చేరి ‘అత్యంత బేరిష్’ జోన్లోకి వెళ్లింది. చర్చల స్థాయి మాత్రం ‘అత్యధికం’గా ఉంది.బంగారం, వెండి మార్కెట్ పరిస్థితిగురువారం రాత్రి బంగారం ఔన్స్కు సుమారు 4,400 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ, గత రోజుతో పోలిస్తే 1.95% లాభపడింది. అయితే, స్పైడర్ గోల్డ్ షేర్స్ ఈటీఎఫ్ (GLD) రెగ్యులర్ ట్రేడింగ్లో 2.66% పడిపోయిన తర్వాత, ఆఫ్టర్ అవర్స్లో మరో 0.92% తగ్గింది. స్టాక్ట్విట్స్లో పసిడిపై సెంటిమెంట్ ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి తగ్గింది.ఇదీ చదవండి: క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండిఇక వెండి ధరలు గురువారం రాత్రి 4.4% పెరిగి 73.8 డాలర్లకు చేరుకున్నాయి. రెగ్యులర్ సెషన్లో 15.77% పతనం తర్వాత, ఐషేర్స్ సిల్వర్ ట్రస్ట్ (SLV) ఆఫ్టర్ అవర్స్లో మరో 4.63% తగ్గింది. వెండి చుట్టూ రిటైల్ సెంటిమెంట్ కూడా ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి దిగింది. చర్చల తీవ్రత ‘చాలా ఎక్కువ’ నుంచి ‘ఎక్కువ’కు తగ్గింది.సమయం, సహనం కీలకంధరలు తక్కువ స్థాయికి చేరేవరకు వేచి ఉండాలని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. వెండి ధర 74 డాలర్లకి, బంగారం 4,000 డాలర్లకు పడితే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తన పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం తగినంత ఎథీరియం ఉందని, భవిష్యత్తులో ఆ వాటాను పెంచుకోవడాన్ని పరిశీలిస్తానని తెలిపారు.“లాభం మీరు కొనుగోలు చేసినప్పుడు వస్తుంది… అమ్మినప్పుడు కాదు,” అని రిచ్ డాడ్ నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాన్ని ఆయన గుర్తు చేశారు. తాను మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినప్పుడు బహిరంగంగా ప్రకటిస్తానని, ధరల ర్యాలీలను వెంబడించవద్దని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. చివరగా, ఆయన తరచూ చెప్పే “పందులు లావవుతాయి… కానీ అత్యాశ పందులు మాంసంగా మారుతాయి” అన్న మాటను మరోసారి గుర్తుచేశారు.AS I POSTED on X earlier. I stopped buying silver at $60.I stopped buying Bitcoin at $6000.I stopped buying gold at $300.I have sold some Bitcoin and some gold. I hate selling because I hate paying capital gain taxes.Today…. I wait patiently for new bottoms for gold…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 6, 2026
హైదరాబాద్లో మరో కొత్త జీసీసీ.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్: దిగ్గజ వెల్ మేనేజ్మెంట్ ఎల్పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ హైదరాబాద్లో ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. అలాగే కొత్త కార్యకలాపాలకు హెడ్గా రమేష్ కాజాను నియమించుకున్నట్లు తెలిపింది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ తమ టెక్నాలజీ, కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఆర్థిక సేవల్లో విస్తృతంగా ప్రతిభావంతుల లభ్యత, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, వ్యాపారాన్ని కొనసాగించేందుకు సంబంధించిన సానుకూలాంశాలు ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంది.భారీగా ఉద్యోగావకాశాలువచ్చే మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో టెక్నాలజీ, ఆపరేషన్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, డేటా అండ్ అనలిటిక్స్, రిస్క్ మేనేజ్మెంట్ విభాగాలకు సంబంధించి హైదరాబాద్లో ఎల్పీఎల్ వందల కొద్దీ ఉద్యోగాలను కల్పించనుంది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రస్తుతం తమ టీమ్ కోసం ప్రతిభావంతులను నియమించుకునే ప్రక్రియలో ఉంది. నెట్వర్క్ సెక్యూరిటీ, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ ఇంజినీరింగ్, డేటా ప్లాట్ఫామ్స్, మిడిల్వేర్ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్వ్యాప్తంగా నిపుణులైన ఇంజినీర్లు, టెక్నాలజిస్టులు వీరిలో ఉండనున్నారు.భారత్లోని ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లో ఉద్యోగావకాశాల కోసం ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లింక్డ్ఇన్ (LinkedIn) పేజీ, ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కెరియర్స్ సైట్ని సందర్శించాలని కంపెనీ సూచించింది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గురించి..ఫార్చూన్ 500 కంపెనీ అయిన ఎల్పీఎల్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (Nasdaq: LPLA) అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వెల్త్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఒకటి. 32,000 మందికి పైగా ఫైనాన్షియల్ అడ్వైజర్లకు, 1,200కు పైగా ఆర్థిక సంస్థల వెల్త్ మేనేజ్మెంట్ విధానాలకు సపోర్ట్ అందిస్తూ దాదాపు 80 లక్షల మందికి సంబంధించి 2.4 ట్రిలియన్ డాలర్ల నిధులను నిర్వహిస్తోంది.అధునాతన ఫైనాన్షియల్ టెక్నాలజీ సాధనాలు, అప్లికేషన్ల వినూత్న ప్లాట్ఫాం దన్నుతో, ఆర్థిక సలహాదారులు తమ క్లయింట్లకు వ్యక్తిగతీకరించిన ఆర్థిక ప్రణాళికలను అందించడానికి ఉపయోగించే ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ , వెల్త్ మేనేజ్మెంట్ ప్రోడక్టులను ఎల్పీఎల్ ఫైనాన్షియల్ అందిస్తోంది.
ఫ్యామిలీ
ఇంట్లో కొరియన్ భూతాలు
పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండాలి. ఫోన్లు వారిని ఏ మూలకు నెడుతున్నాయో గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలతో చేసే స్నేహం, సంభాషణ, చర్చ మాత్రమే వారిని మంచి దారిలో పెట్టగలదు. ఢిల్లీలో ముగ్గురు ఆడపిల్లలు ‘కొరియన్ గేమ్స్’లో పడి ప్రాణాలు తీసుకున్నారు. మన దేశంలో టీనేజ్ పిల్లలు కె–పాప్ కోసం వెర్రెత్తడం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇళ్లల్లోని ప్రేమ, స్నేహాల కొరత వల్లేమోనని చెక్ చేసుకోవడం అవసరం. ఇంతకు కొరియన్ లవ్ గేమ్స్ అంటే ఏమిటి? పిల్లలకు వీటి గురించి ఎలా జాగ్రత్త చెప్పాలి?‘వాస్తవంలో ఏదీ దొరకకపోతే ఊహలనే వాస్తవం అనుకోవాల్సి ఉంటుంది’ఇది నిపుణుల మాట.నిజజీవితంలో తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితులు, ఆటలు, హాబీలు, స్కూల్లో క్లాస్మేట్లతో అనుబంధం, టీచర్ల నుంచి వాత్సల్యం... వీటిలో ఏవీ లేని పిల్లలు... టీనేజ్లో వచ్చిన వారు ఊహల్లో కాకుండా వేటిలో సాంత్వన వెతుక్కుంటారు.ఇవాళ దేశాన్నే కాదు... ప్రపంచంలోని యువతను కొరియన్ డ్రామాలు, కొరియన్ పాప్ సంగీతం, సినిమాలు, గేమ్స్ ఆకర్షిస్తున్నాయంటే కారణం... అక్కడ ఊహలు చాలా అందంగా ఉంటాయి. అబ్బాయిలు రాకుమారుల్లా ఉంటారు. అమ్మాయిలు రాకుమార్తెలుగా ఉంటారు. వారి మధ్య ప్రేమ అద్భుతంగా ఉంటుంది. అబ్బాయి అమ్మాయిని కాలు కందకుండా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ల జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది... ఈ అద్భుత ప్రపంచం చూసే కొద్దీ టీనేజ్లోని అమాయకత్వం, ఆకర్షణ వల్ల యువతీ యువకులు తాము అలాగే ఉన్నట్టూ, తమకూ అలాంటి లోకం కావాలన్నట్టు ఉంటుంది.మానసిక నిపుణులు ఏమంటున్నారంటే కొరియన్ ప్రపంచాన్ని ఇష్టపడే వారు ఎక్కువగా భ్రమాజనిత ప్రపంచంలో ఉంటున్నారు... వాస్తవిక ప్రపంచంతో సంబంధాలు తెగదెంపులు చేసుకుంటున్నారు అని. దీనికి తార్కాణం తాజాగా ఢిల్లీలో జరిగింది.ఢిల్లీ విషాదం...ఢిల్లీలో ముగ్గురు అమ్మాయిలు (ఇద్దరు ఒక తల్లికి, మరొకరు మరో తల్లికి జన్మించారు– తండ్రి ఒకడే) కరోనా సమయం నుంచి కొరియన్ డ్రామాలకు, గేమ్స్కు, పాప్కు అలవాటు పడ్డారు. సోషల్ మీడియాలో వారి ఐడెంటిటీలు కొరియన్ పేర్లతోనే పెట్టుకున్నారు. వాళ్లలో మధ్య అమ్మాయిని గేమ్స్లోలానే ‘లీడర్’గా ఎంచుకున్నారు. మధ్య అమ్మాయి అన్నం తినకపోతే వారు తినరు. మధ్య అమ్మాయి స్కూలుకు వెళ్లొద్దంటే వాళ్లు వెళ్లరు. తండ్రి, అతని ఇద్దరు భార్యలు కలిసి ఒకే ఫ్లాట్ ఈ పిల్లలతో ఉండగా ఈ ముగ్గురూ ఒక జట్టు, కొడుకు ఒక జట్టుగా మిగిలారు. ‘మా సోదరుడంటే మాకు ఇష్టం లేదు’ అని ఆ అమ్మాయిలు అనడం మొదలుపెట్టారు. తల్లిదండ్రుల పూర్తి నిర్లక్ష్యం వల్ల ఈ ముగ్గురు ఆడపిల్లలు రెండేళ్లుగా స్కూల్లు వెళ్లకుండా పూర్తిగా భ్రమల్లోకి వెళ్లిపోయారు. ఏనాటికైనా కొరియా వెళ్లి అక్కడ జీవించాలని వారి కోరికట. ‘మమ్మల్ని కొరియాకు వెళ్లకుండా ఆపగలరా’ అని రాసి తాము నివాసం ఉంటున్న తొమ్మిదో అంతస్తు నుంచి దూకి మరణించారు.కొరియన్ లవ్ గేమ్స్...కొరియన్ ఆన్లైన్ గేమ్స్ కేవలం బయట ఉండి ఆడేవి కావు. ఆటగాళ్లు ఆ గేమ్లో భాగం అవుతారు. ఆ ఆటగాళ్లకు కొరియన్ నేమ్స్ ఇవ్వబడతాయి. అలాగే గేమ్లోని ఒక వర్చువల్ (కృత్రిమ) యువకుడు లేదా యువతి గేమ్ ఆడే నిజమైన అమ్మాయి లేదా అబ్బాయికి సోల్ మేట్స్ అవుతారు. ఈ సోల్మేట్స్ ఈ నిజమైన అమ్మాయిని అబ్బాయిని చాలా పేంపర్ చేస్తారు. వాట్సాప్ మెసేజ్ల్లో పలకరిస్తారు. రహస్యంగా కబుర్లు చెబుతారు. వీరి మాయలో పడ్డ టీనేజ్ యువతీ యువకులు ఇక మెల్లగా తల్లిదండ్రులకు, స్నేహితులకు దూరమవుతారు. ఆ తర్వాత ఈ వర్చువల్ యువకుడు లేదా యువతి నిజ యువకుడు యువతికి టాస్క్లు ఇవ్వడం మొదలెడతారు. ఫలానా టైమ్లో మేల్కోమని, ఫలానా టైమ్లో చాట్లో రమ్మని, ఫలానా విధంగా డ్రస్సు వేసుకొని ఫోటోలు పెట్టమని... ఇలా నెమ్మదిగా బానిసలుగా మార్చి స్క్రీన్ టైమ్ను దారుణంగా పెంచేస్తారు. పిల్లలు ఇలా ఫోన్కు అతుక్కుని పోవడం ఎప్పటికైనా తల్లిదండ్రులకు తెలుస్తుంది. వారు మందలించి ఫోన్ లాగగానే ఒక్కసారిగా భ్రమాత్మక ప్రపంచం మాయమై, డ్రగ్స్ అందని అడిక్ట్స్లాగా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఆత్మహత్యలకు పూనుకుంటారు. ఢిల్లీలో జరిగింది ఇదే. మరో విధంగా చెప్పాలంటే ఈ గేమ్స్లోని వర్చువల్ పాత్రలు కూడా ఆత్మహత్యలకు పురిగొల్పవచ్చు.బ్లూవేల్ తర్వాత...గతంలో బ్లూవేల్ గేమ్ ఆత్మహత్యలకు పురిగొల్పి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత పరోక్షంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ యువతను దివాలా తీయించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఇప్పుడు కొరియన్ ప్రపంచం వారిని అతలాకుతలం చేస్తోంది. వాస్తవానికి కొరియాలో శారీరక కరెక్షన్స్ ఒక తప్పనిసరి. వారు సన్నగా ఉండటానికి అందంగా కనిపించడానికి అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. అందుకు ‘బ్యూటీ లోన్స్’ ఇచ్చే బ్యాంకులూ ఉంటాయి. పాప్ సింగర్లను సన్నగా కనిపించడం కోసం స్కూల్ వయసు నుంచే ఎంచుకుని ఆహారం ఇవ్వకుండా మాడుస్తారు. దాంతో యుక్తవయసులోనే చనిపోయిన సింగర్స్ ఉన్నారు. ఇన్ని తెర వెనుక వ్యవహారాలుండగా తెర మీద అందంగా కనిపిస్తూ కొరియన్ అబ్బాయిలు, అమ్మాయిలు భారత దేశ టీనేజ్ పిల్లలను పూర్తి భ్రమాత్మక ప్రపంచంలోకి ఈడుస్తున్నారు.తల్లిదండ్రులూ జాగ్రత్త...1. పిల్లలతో పదే పదే మాట్లాడండి. 2. జరుగుతున్న విషాదాలను మెల్లగా వివరించండి.3. ఎవరు చెప్తే వింటారో వారితో చెప్పించండి.4. కౌన్సిలర్ల సాయంతో వారిని మెల్లగా ఫోన్ నుంచి భ్రమాత్మక జగత్తు నుంచి బయట పడేయండి.5. విపరీతమైన ప్రేమ, స్నేహితులు, ఆటపాటలు, సొంత ఊర్లూ పరిసరాలు ఇవి వారిని వాస్తవిక ప్రపంచంలోకి తెచ్చేలా చేస్తాయి. ఓపికగా పిల్లలను మార్చుకోండి.– ఫ్యామిలీ డెస్క్
'కొలీగ్పై ఫీలింగ్స్ వస్తున్నాయి.. మా ఆయనకు చెబితే..'
డాక్టర్గారూ నాదొక చిత్రమైన సమస్య. అసలు ఇది సమస్య అవునో కాదో కూడా తెలియడం లేదు. మీరే దీనికి పరిష్కారం చెప్పాలి. నేను ఒక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నాను. నాది చాలా కలివిడి స్వభావం. అందరితో స్నేహంగా ఉంటాను. ఎవరినీ నొప్పించను. నా మూలాన ఎవరూ బాధపడకూడదనుకునే స్వభావం వల్ల చాలాసార్లు నేను పరిస్థితులతో రాజీపడుతూ వచ్చాను. ఈ లక్షణాన్ని ఆసరాగా తీసుకుని చాలామంది నన్ను మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి.కొన్ని సంవత్సరాలుగా నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను. మా మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చి బ్రేకప్ అవుతూ మళ్లీ కలిసిపోతూ ఉండటం కామన్. మేం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నాం. అతను కూడా బ్యాంక్ ఉద్యోగే. ప్రస్తుతం అతనికి వేరే రాష్ట్రంలో పోస్టింగ్ రావడం వల్ల నెలకు ఒకసారి మాత్రమే కలుసుకుంటున్నాం. ఆరునెలల క్రితం ఒకబ్బాయి నేను పని చేసే బ్యాంకులో ప్రొబేషన్ కోసం జాయిన్ అయ్యాడు. అనుకోకుండా అతనికీ నాకూ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కలిసి సినిమాలకు వెళ్లినా మేమెప్పుడూ హద్దులు దాటలేదు. అయితే నాకు ఇటీవల కొంతకాలంగా అతనిపై ఫీలింగ్స్ వస్తున్నాయి.ఈ విషయం గురించి నా భర్తకు చెబితే మేమిద్దరం దూరంగా ఉండటం వల్లే అలా వస్తూ ఉండి ఉండచ్చని, అందువల్ల నేను ఉద్యోగం మానేసి అతని దగ్గరకు వెళ్లడం గానీ లేదా తనే ఉద్యోగం మానేసి ఇక్కడకు వచ్చి వేరే ఏదైనా ఉద్యోగం చూసుకోవడం మంచిదనీ అన్నాడు. నాకు నా భర్తను వదిలేయాలన్న ఉద్దేశ్యం లేదు. అలాగని ఆ అబ్బాయి మీద ఫీలింగ్స్ను చంపుకోలేకపోతున్నాను. అతనికీ నేనంటే చాలా ఇష్టం. ఈ విషయం నా భర్తకు కూడా తెలిసింది. ఒకవేళ నాకు తనతో ఉండటం ఇష్టం లేకపోతే ఆ అబ్బాయితోనే ఉండమని కూడా అన్నాడు. దీంతో నేను చాలా గందరగోళంలో ఉన్నాను. దయచేసి నేను ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. – ఓ సోదరి, విశాఖపట్నంమీ ఉత్తరం చదివాక నాకు అర్థం అయిందేమంటే మీరు చెడ్డవారు కానే కాదు, ఇతరుల కోసం మీ అవసరాలను కూడా వెనక్కినెట్టే మనిషని. ఇది చాలామంది మహిళల్లో కనిపించే గుడ్ గర్ల్ సిండ్రోమ్ (Good Girl Syndrome). చిన్న వయసులోనే ఎవరినీ బాధ పెట్టకూడదు, అందరినీ నచ్చాలి. మనవల్ల ఎవరికైనా కష్టం వస్తే అది మన తప్పే అనే భావనతో పెరిగారు. ఇలాంటివారు పెద్దయ్యాక కూడా ఇదే అలవాటును కొన సాగిస్తారు. అది రిలేషన్షిప్కు కూడా వర్తింపచేసుకోవడం వల్ల ఎప్పుడూ ఇతరుల కోసం అడ్జస్ట్ అవుతూ ఉండటంతోనే సరిపోతుంది. మీ గత రిలేషన్షిప్ అన్నింటిలోనూ ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. మీరు ఎదుటి వారికి నచ్చినట్టుగా ఉన్నంత కాలం మీ బంధం బాగుంటుంది. మీరు మీ అప్రాయం చెప్పినప్పుడో, మీరు అవసరాలు ఉన్నాయని గుర్తు చేసినప్పుడో ఆ బంధం కూలిపోతుంది. దీనివల్ల మీరు మరింత ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారు. నాలాగా నేను ఉంటే నన్ను వదిలేస్తారేమో... ఒంటరి అవుతాననే భయం మిమ్మల్ని పదే పదే కాంప్రమైజ్ అయ్యేలా నడిపించింది.ఇక మీ ప్రస్తుత సమస్య విషయానికొస్తే మీ ఎమోషనల్ సైకిల్ మీ వివాహ బంధంలో కూడా కొనసాగింది. అయితే మీ భర్త మెచ్యూరిటీ వల్ల మీ రిలేషన్షిప్లో ఒక స్థిరత్వం ఏర్పడింది. అదే సమయంలో తను మీకు దూరంగా ఉండటం మీలో ఒక శూన్యాన్ని తీసుకొచ్చింది. ఆ ఖాళీని పూడ్చుకోవడం కోసం మీకు ఆఫీసులో పరిచయం అయిన అబ్బాయికి దగ్గరయ్యారు. ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఎమోషనల్గా ఆధారడపడటం అనే మీ గుణం వల్ల మీరు అతనికి ఆకర్షితులయ్యారు. కాని అది నిజమైన ప్రేమ కాకపోవచ్చు. మీలో బార్డర్లైన్ పర్సనాలిటీ లక్షణాలు పుష్కలంగా కనపడుతున్నాయి. మీలో చిన్న వయసు నుంచి ఎప్పుడూ ఒక రకమైన ఎమోషనల్ ఎంప్టీనెస్ ఉంది. దీన్ని ఎవరోఒకరి తో భర్తీ చేస్తున్నారు. దీనికోసం ఎవరో ఒకర్ని ఎన్నుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఎన్నుకున్నారా అనేది ప్రశ్న! మీ మనసు ఇప్పుడు ఒక అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలా ఉంది.ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, తర్వాత పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. సమస్య నుంచి బయటపడే మార్గం వెతకండి. వెంటనే ఒక మంచి సైకియాట్రిస్ట్ని, ఒక క్లినికల్ సైకాలజిస్టును కలిస్తే మీలోని ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలో నేర్పిస్తారు. మీ జీవితం మీద ఒక స్పష్టత వచ్చేలా సహాయపడతారు. విష్ యు ఆల్ ది బెస్ట్!- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
పాలల్లో యూరియా.. ఐస్క్రీమ్లో డిటర్జెంట్!
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా రాజ్యసభలో ఆహారకల్తీపై ధ్వజమెత్తారు. భారతదేశంలో అతిపెద్ద అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం: ఆహార కల్తీనే అంటూ మండిపడ్డారు. పాలు దగ్గర నుంచి సుగంధ ద్రవ్యాలు, వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, పానీయాల్లో హానికరమైన రసాయనాలు, అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులు, చక్కెర లేదా ఉప్పు వంటివి ఉన్నాయని అన్నారు. అవి అనారోగ్య కారకాలని, పైగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. పైగా దాన్ని స్వచ్ఛత ముసుగులో ఉన్న నకిలీగా అభివర్ణించారు. మార్కెట్లోకి విషాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాదు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కల్తీకి సంబంధించిన వాటిని జాబితా చేశారు కూడా.పాలలో యూరియాకూరగాయలలో ఆక్సిటోసిన్పనీర్లో కాస్టిక్ సోడాసుగంధ ద్రవ్యాలలో ఇటుక పొడితేనెలో పసుపు రంగుపౌల్ట్రీలో స్టెరాయిడ్లుఐస్క్రీమ్లో డిటర్జెంట్పార్లమెంటులో పాలకల్తీ సమస్యను లేవనెత్తుతూ..చద్దా ఇలా అన్నారు. పరిశోధనల ప్రకారం పాల నమూనాలలో 71% యూరియా, 64 శాతం సోడియం బైకార్బోనేట్ వంటి న్యూట్రలైజర్లు ఉన్నాయి. ఈ దేశంలో అమ్ముడవుతున్నంత పరిమాణంలో పాలు ఉత్పత్తి కావడం లేదు.ఆక్సిటోసిన్ ఒక హానికరమైన రసాయనమని, ఇది తలతిరగడం, తలనొప్పి, గుండె వైఫల్యం, వంధ్యత్వం, క్యాన్సర్కు కారణమవుతుందని అన్నారు.పరీక్షించిన ప్రతి నాలుగు ఆహార నమూనాలలో ఒకటి కల్తీ అయినట్లు తేలింది2014-15 నుంచి 2026 వరకు, పరీక్షించిన అన్ని నమూనాల్లో 25 శాతం కల్తీ ఉన్నట్లు తేలిందని చెప్పారు . అంటే ప్రతి నాలుగు నమూనాలలో ఒకటి కల్తీకి గురవ్వుతుందని అర్థం. దీనివల్ల చాలా మంది అనారోగ్యానికి గురవ్వడమే కాదు ప్రాణాలు కూడా కోల్పోతున్నారంటూ ఆందోళన వ్యకం చేశారు చద్దా.అంతేగాదు చద్దా అంతర్జాతీయంగా నిషేధించిన భారతీయ ఆహార ఉత్పత్తుల గురించి ప్రస్తావిస్తూ.. ఈ దేశంలోని రెండు అతిపెద్ద గరం మసాలా కంపెనీలను అమెరికా, యూకే, యూరప్ అంతటా నిషేధించారు. ఎందుకంటే వాటిలో కేన్సర్కు కారణమయ్యే పురుగులమందులు ఉన్నాయి. కానీ అవే సుగంధ ద్రవ్యాలు భారతదేశంలో ఇప్పటికీ పెద్ద మొత్తంలో అమ్ముడవుతుండటం బాధకరం అని అన్నారు.రాఘవ్ చద్దా దిద్దుబాటు చర్యలను కూడా సూచించారుప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని కోరుతూ, ఆమ్ఆద్మీపార్టీ ఎంపీ ఈ చర్యలను సిఫార్సు చేశారు:1. మానవశక్తిని పెంచి..ప్రయోగశాల పరీక్షా సౌకర్యాలను అప్గ్రేడ్ చేయడం ద్వారా భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI)ని బలోపేతం చేయడం.2. నేరస్థులను అరికట్టడానికి కఠినమైన జరిమానాలను ప్రవేశపెట్టడం.3. కల్తీ ఉత్పత్తుల పేర్లు, బహిరంగంగా వెల్లడించడం మార్కెట్ నుంచి తక్షణమే తొలగించేలా చర్చలు తీసుకోవడం వంటివి చేయాలి. Biggest Health Crisis in India 🚨FOOD ADULTERATION - खाने में मिलावट👉Urea in Milk👉Oxytocin in Vegetables👉Caustic Soda in Paneer👉Brick powder in Spices👉 Yellow dye in Honey 👉 Steroids in Poultry👉 Detergent in ice creamWe all are consuming slow poison!Raised… pic.twitter.com/LxWi1nIcP0— Raghav Chadha (@raghav_chadha) February 4, 2026 (చదవండి: 70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు)
Parliament session: స్టైలిష్ సిల్క్ చీరలో మెరిసిన కంగనా..!
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ యాక్టింగ్ పరంగా విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి వేలాది అభిమానులను సొంతం చేసుకున్న అందాల నటి. ఫ్యాషన్ పరంగాను ఆమె సాటిలేరవ్వరూ అన్నంతగా హుందాగా, స్టైలిష్గా ఉంటారామె. ఈనెల ఫిబ్రవరి 04న జరిగిన పార్లమెంట్ సమావేశం అనంతరం బయటకు వచ్చిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఒక్కసారిగా ఆమె అభిమానులు రాజకీయనాయకురాలిగా హుందాగా కనిపించడంలో నీకు సాటిరావెవ్వరూ అని ప్రశంసిస్తూ పోస్టులు ముంచెత్తారు. ఆమె ఆధునిక మహిళలా బ్రోకెడ్ ఎంబ్రాయిడరీతో కూడిన పట్టు చీర విత్ ట్రెంచ్ కోట్-శైలి జాకెట్తో అత్యంత అందంగా కనిపించారామె. అచ్చం సాంప్రదాయ శైలి చీర కట్టుతో చక్కగా మడత పెట్టిన పల్లు, ఫుల్హ్యాండ్స్ జాకెట్తో పార్లమెంట్ రేంజ్కి తగినట్లుగా అత్యంత హుందాగా ఉంది ఆమె ఆహార్యం. అలాగే లైట్ మేకప్, బ్యాక్సన్గ్లాస్, చేతిలో హెర్మెస్ బ్యాగ్తో అత్యంత ముగ్దమనోహరంగా ఉందామె. సింపుల్గా చెప్పాలంటే ఆత్మవిశ్వాసంతో కూడిన రాజకీయ నాయకురాలిలా అందరి దృష్టిని ఆకర్షించేలా ప్రత్యేకంగా కనిపించారామె. View this post on Instagram A post shared by Ecnopolis India (@ecnopolis.india) (చదవండి: 70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు)
అంతర్జాతీయం
న్యూస్టార్ట్ ముగింపు.. తీవ్ర ఒత్తిడిలో భారత్!
ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల పోటీ మళ్లీ పెరగనుందా?. అమెరికా-రష్యా మధ్య న్యూస్టార్ట్ ఒప్పందం ముగియడం ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే అదనుగా.. ఇటు పాక్-చైనాలు పరస్పర అణు సహకారంతో భారత్కు సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు. అయితే.. ఇదంతా ఇండియా మంచికే అంటున్నారు నిపుణులు. అమెరికా–రష్యా మధ్య ఉన్న New START అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం గడువు 2026 ఫిబ్రవరి 5వ తేదీతో ముగిసింది. ఒప్పందం పునరుద్ధరణ ప్రస్తావనే లేకపోవడంతో.. ఈ రెండు దేశాల మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేకుండా పోయాయి. ఇప్పుడు అమెరికా, రష్యా తమ అణు శక్తిని ఇష్టానుసారం పెంచుకునే అవకాశం పొందాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న అణు శక్తి దేశాలపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది. అమెరికా–రష్యా పరిమితులు తొలగిపోవడంతో కొత్త ఆయుధ పోటీ మొదలయ్యే అవకాశం ఉంది. పెద్ద శక్తులే ఆయుధాలను పెంచుకుంటే.. మనం ఎందుకు నియంత్రించుకోవాలి? అని ఇతర దేశాలు భావించొచ్చు. ఇదే అదనుగా.. తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకునే దిశగా అడుగులు వేయవచ్చు. అదే గనుక జరిగితే.. అణ్వాయుధాల వ్యాప్తిని నియంత్రించడానికి 1970లో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ ఒప్పందం ఎన్పీటీ (Non-Proliferation Treaty) కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎన్పీటీ అంటే.. • కొత్త దేశాలు అణు ఆయుధాలు తయారు చేయకుండా నిరోధించడం.• ఇప్పటికే అణు శక్తి కలిగిన దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్) ఆయుధాలను తగ్గించడం.• అణు శక్తిని శాంతి ప్రయోజనాల కోసం (ఉదా: విద్యుత్ ఉత్పత్తి) ఉపయోగించడానికి సహకారం అందించడం.భారత్పై ప్రత్యక్ష ప్రభావంభారత్ ఇప్పటిదాకా క్రెడిబుల్ మినిమమ్ డిటర్రెన్స్ అనే అణు వ్యూహాన్ని పాటిస్తోంది. దీని ప్రకారం.. శత్రువు దాడి చేయకుండా నిరోధించడానికి, భారత్ వద్ద ఉన్న అణు శక్తి నమ్మదగినది (credible)గా ఉండాలి. అది శత్రువుకు నమ్మదగిన నిరోధక శక్తిగా (deterrent) పనిచేయాలి. అవసరానికి మించి పెద్ద అణు నిల్వలు కాకుండా.. తన భద్రతకు అవసరమైన కనీస అణు ఆయుధ శక్తిని మాత్రమే కలిగి ఉంటే చాలూ(Minimum). అలాగే.. భారత్ అణు ఆయుధాలను మొదటగా వాడకూడదు(No First Use-NFU). కానీ దాడి జరిగితే తప్పనిసరిగా ప్రతిదాడి చేయొచ్చు. శత్రువు మొదట దాడి చేసినా, భారత్ వద్ద ప్రతిదాడి చేసే సామర్థ్యం ఉండాలి( Second Strike Capability). 1999లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ‘‘డ్రాఫ్ట్ న్యూక్లియర్ డాక్ట్రైన్’’లో సీడీఎం అనే సూత్రాన్ని ప్రకటించింది. ఆపై 2003లో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఏర్పాటుతో ఎన్ఎఫ్యూలో కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పుల ప్రకారం.. బయోలాజికల్ లేదంటే కెమికల్ దాడి జరిగినా అణు ప్రతిదాడి చేసే అవకాశం కల్పించారు. మొత్తంగా భారత అణువిధానం.. అణ్వాయుధాలను రక్షణ కోసం మాత్రమే దాడి కోసం కాదు అని పాటిస్తూ వస్తోంది. అయితే.. భారమే అయినా..న్యూస్టార్ట్స్ గడువు ముగిసింది. అణ్వాయుధ పోటీలో భాగంగా చైనా తన అణు శక్తిని పెంచే అవకాశం లేకపోలేదు. అలాగే పాకిస్తాన్తో అణు సహకారం పెంచుకోవచ్చు కూడా. అణ్వాయుధ పోటీ వల్ల ఈ రెండు దేశాలు మరింత శక్తివంతమైన వ్యూహాలను అవలంబించే అవకాశం ఉంది. అదే జరిగితే.. భారత్ కూడా తన నిరోధక శక్తిని పునఃపరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. భారత్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, సబ్మేరిన్ ఆధారిత అణు నిరోధక శక్తిను బలోపేతం చేయాల్సి ఉంటుంది. అణు ఆయుధాల అభివృద్ధి, నిర్వహణ ఖర్చులు భారత్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచొచ్చు. అలాగే.. రక్షణ బడ్జెట్లో మరింత పెంపు అవసరం పడుతుంది. అంటే ఆర్థిక, భద్రతా, రాజనీతిక సవాళ్లు పెరుగుతాయన్నమాట. మరోవైపు.. అమెరికా–రష్యా పోటీ వల్ల కొత్త మల్టిలేటరల్ చర్చలు అవసరం అవుతాయి. జీ20, బ్రిక్స్ సదస్సులతో పాటు ఐక్యరాజ్య సమితి లాంటివి అందుకు వేదికలు అవుతాయి. ఇందులో భారత్కు కచ్చితంగా ప్రాధాన్యత లభించవచ్చు. ఎన్పీటీలో సభ్యత్వం లేని భారత్ ఇదే అదనుగా అంతర్జాతీయ వేదికలపై పారదర్శకత, నియంత్రణ చర్యలు కోరవచ్చు. ఇది భారత్కు గ్లోబల్ లీడర్షిప్ అవకాశాన్ని కలిగిస్తుంది. నో ఫస్ట్ యూజ్ విధానం కొనసాగిస్తున్న భారత్.. తన నైతిక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఏంటీ న్యూస్టార్ట్? న్యూస్టార్ట్ (New Strategic Arms Reduction Treaty) అనేది.. అమెరికా–రష్యా మధ్య 2010లో కుదిరిన అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం. పూర్తి పేరు: Treaty between the United States of America and the Russian Federation on Measures for the Further Reduction and Limitation of Strategic Offensive Arms. దీని ప్రధాన ఉద్దేశ్యం రెండు దేశాల వద్ద ఉన్న వ్యూహాత్మక అణు ఆయుధాలను పరిమితం చేసి, ప్రపంచ భద్రతను బలోపేతం చేయడం.కోల్డ్ వార్ తర్వాత అమెరికా, రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వాయుధ నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధ ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో 2010 ఏప్రిల్ 8న, ప్రాగ్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ సంతకం చేశారు. 2011 ఫిబ్రవరి 5 నుంచి అమల్లోకి వచ్చింది. తరువాత 2021లో 5 సంవత్సరాలు పొడిగించబడింది. ఇందులో భాగంగా.. అణు ఆయుధాల విషయంలో ప్రపంచంలో శక్తివంతమైన దేశాలైన అమెరికా, రష్యాలు పరిమితంగా ఉండాలి. ఒకదానికొకటి లెక్కలు చెప్పుకోవాలి. అలాగే అణు ఆయుధాల నియంత్రణ ద్వారా ఇతర దేశాలకు కూడా భద్రతా హామీ ఇవ్వాలి. కానీ, 2026 ఫిబ్రవరి 5న గడువు ముగిసింది. ఇప్పుడు అమెరికా–రష్యా మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేవు.:::వెబ్డెస్క్ ప్రత్యేకం
అమెరికా, బంగ్లా మధ్య సీక్రెట్ డీల్.. భారత్ కారణమా?
భారత్ పొరుగు దేశంలో బంగ్లాదేశ్లో ఎన్నికల వేళ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై దాడుల కారణంగా భారత్, బంగ్లా మధ్య ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులు ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరోవైపు.. భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్.. యూనస్ ప్రభుత్వాన్ని టెన్షన్కు గురిచేస్తోంది. ఈ డీల్తో బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ దేశంలో ప్రత్యేకంగా టెక్స్టైల్, రెడీమేడ్ గార్మెంట్స్ రంగంపై ఈ ప్రభావం చూపించడమే ఇందుకు కారణం. ఇలాంటి తరుణంలో యూనస్ సర్కార్.. అమెరికాతో చేసుకున్న సీక్రెట్ డీల్ ఇప్పుడు బంగ్లాలో హాట్ టాపిక్గా మారింది.అయితే, ఎన్నికల ముందు, తమ పదవీకాలం ముగియబోతున్న సమయంలో యూనస్ సర్కార్ ట్రంప్తో సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. బంగ్లాదేశ్లోని ప్రముఖ పత్రిక ‘ప్రథమ్ ఆలో’ ప్రకారం.. బంగ్లా, అమెరికా మధ్య ఒప్పందం గురించి బహిరంగంగా ఏ సమాచారం బయటకు రాలేదు. యూనస్ ప్రభుత్వం ఇప్పటికే అమెరికాతో ఒక నాన్-డిస్క్లోజర్ ఒప్పందం సైన్ చేసింది. అందుకే ఈ ట్రేడ్ డీల్ ముసాయిదా ప్రజలకు తెలియడం లేదు. అంటే ప్రభావితమయ్యే పరిశ్రమలకు కూడా అసలు షరతులు ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ డీల్లో అసలు ఇందులో ఏముంది? ఎవరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నారు? అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. యూనస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకోలేదు. ఇది తాత్కాలిక ప్రభుత్వం. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ఇలాంటి కీలక ఒప్పందం చేసే నైతిక హక్కు ఉందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.కాగా, ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ కేవలం మూడు రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 9న అమెరికా–బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్పై సంతకాలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. యూనస్ ప్రభుత్వం ఇంత తొందరగా అమెరికాతో ఒప్పందం ఎందుకు చేయాలనుకుంటోంది? అనే ప్రశ్న ఎదురైంది. కాగా, 2025 ఏప్రిల్లో ట్రంప్ 100 దేశాలపై టారిఫ్ ప్రకటించినప్పుడు, బంగ్లాదేశ్పై 37 శాతం సుంకాలు విధించారు. అనంతరం, జూన్లో నాన్-డిస్క్లోజర్ ఒప్పందం సైన్ చేయడంతో చర్చలు రహస్యమయ్యాయి. జూలైలో టారిఫ్ 35 శాతానికి, ఆగస్టులో 20 శాతానికి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్టు బంగ్లాదేశ్ వాణిజ్య శాఖ చెబుతోంది.ఈ నేపథ్యంలో యూనస్ ప్రభుత్వం సీక్రెట్ ఒప్పందంపై టెక్స్టైల్, గార్మెంట్ తయారీదారులు, సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ ప్రక్రియ సాగుతుండటం ఆందోళనకు గురి చేస్తోందని గార్మెంట్ తయారీదారుల సంఘం నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి ఒప్పందాలు చేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యలు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో 90 శాతానికి పైగా ఇదే రంగం ఆధారంగా ఉంది. ఇప్పటికే ట్రంప్ విధించిన భారీ టారిఫ్ల వల్ల వస్త్ర పరిశ్రమ నష్టపోయింది. ఇప్పుడు మరోసారి అమెరికాతో ఏవో షరతులతో ఒప్పందం జరిగితే, లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే ఈ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో అమెరికా చేతిలో బంగ్లాదేశ్ జుట్టు అంటూ ఆ దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.మరోవైపు.. సీక్రెట్ ఒప్పందంపై బంగ్లాదేశ్ ప్రముఖ ఆర్థికవేత్త అనూ మహమ్మద్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ముందు పోర్టులను లీజుకు ఇవ్వడం, ఆయుధాలు దిగుమతి చేయడం, అమెరికాతో తలవంచే ఒప్పందాలు చేసుకోవడం ఇవన్నీ ఎందుకు ఇంత తొందరగా ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ ఒప్పందాలు పారదర్శకంగా లేవని, అవాస్తవంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. విదేశీ లాబీలు యూనస్ ప్రభుత్వంలోకి ప్రవేశించి, ఎలాగైనా ఈ ఒప్పందాలు జరిగేలా చూస్తున్నాయని బాంబు పేల్చారు. అయితే, ఈ డీల్పై ఇటీవల వచ్చిన కొన్ని నివేదికలు ఈ అనుమానాలకు మరింత బలం ఇస్తున్నాయి. 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన పరిణామాల వెనుక ఇస్లామిక్ శక్తులతో పాటు అమెరికా ‘డీప్ స్టేట్’ మద్దతు ఉందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఆ తర్వాతే యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం చేయబోతుండటంతో అనుమానాలు పెరుగుతున్నాయి.వివాదాస్పద అంశాలు..పారదర్శకత లోపం: ఒప్పందం వివరాలు ప్రజలకు, పార్లమెంట్కు తెలియజేయలేదు.అనుమానాలు : ఎన్నికల ముందు తాత్కాలిక ప్రభుత్వం దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఆర్థిక ప్రభావం: ఎగుమతిదారులు, ఆర్థిక నిపుణులు దీని వల్ల బంగ్లాదేశ్ దీర్ఘకాలికంగా అమెరికా వాణిజ్య విధానాలకు బంధించబడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వస్త్ర పరిశ్రమపై ప్రభావం..అమెరికా మార్కెట్ ఆధారపడటం: బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 90% వస్త్రాలు, అందులో ఎక్కువ భాగం అమెరికాకు వెళ్తుంది. కొత్త ఒప్పందం వల్ల 20% టారిఫ్ స్థిరపడింది. ఇది భారతదేశం (25%), వియత్నాం (21%), పాకిస్తాన్ (19%)తో పోలిస్తే పోటీ స్థాయిలో ఉంది.పోటీ సామర్థ్యం: టారిఫ్ తగ్గడం వల్ల అమెరికా మార్కెట్లో బంగ్లాదేశ్ వస్త్రాలు మరింత పోటీగా నిలుస్తాయి.ఉద్యోగ భద్రత: అమెరికా మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగవచ్చు.వేతన ఒత్తిడి: తక్కువ ధరల పోటీ కొనసాగించడానికి తక్కువ వేతనాలు, ఎక్కువ పని గంటలు కొనసాగవచ్చు.సామాజిక ప్రభావం: కార్మికుల హక్కులు, భద్రతా ప్రమాణాలు అంతర్జాతీయ ఒత్తిడితో మెరుగుపడే అవకాశం ఉంది. కానీ తాత్కాలికంగా ఉత్పత్తి ఒత్తిడి పెరుగుతుంది. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ అమెరికా మార్కెట్లో దీర్ఘకాలికంగా స్థిరపడే అవకాశం ఉంది.
ఎయిర్ ఫోర్స్ వన్లో నిద్రపోను.. నవ్వులు పూయించిన ట్రంప్
ఎయిర్ ఫోర్స్ వన్ ప్రయాణాలపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్లో నేను నిద్రపోను. కిటికీలోంచి క్షిపణుల కోసం చూడటమే నా పని. క్షిపణులొస్తున్నాయేమో గమనిస్తానని ట్రంప్ అన్నారు. ‘నేషనల్ బ్రేక్ఫాస్ట్ ప్రేయర్' కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.20 గంటల సుదీర్ఘ ప్రయాణంలో కూడా తాను అసలు నిద్రపోనంటూ చెప్పుకొచ్చారు. "నేను కిటికీలోంచి బయటకు చూస్తూ క్షిపణులు(missiles), శత్రువుల కోసం వెతుకుతుంటానంటూ ఆయన వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి. నిద్ర తక్కువ.. కబుర్లు ఎక్కువడొనాల్డ్ ట్రంప్ తనకు నిద్ర చాలా తక్కువని గతంలో కూడా చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. 2016 ఎన్నికల ప్రచారంలో తాను రోజుకు కేవలం 3 నుండి 4 గంటలు మాత్రమే నిద్రపోతానని, ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉంటానని చెప్పారు.అలాగే.. 2019లో ఒక వైట్ హౌస్ అధికారి సీఎన్ఎన్తో మాట్లాడుతూ.. అధ్యక్షుడితో ప్రయాణించడం అంటే ‘బందీగా ఉండటం’ లాంటిదని వ్యాఖ్యానించారు. ట్రంప్ నిద్రపోవడానికి బదులుగా.. గంటల తరబడి సిబ్బందితో కబుర్లు చెబుతుంటారని, ప్రభుత్వ విషయాలే కాకుండా క్రీడల గురించి కూడా చర్చిస్తారని ఆయన తెలిపారు.ఎయిర్ఫోర్స్ వన్.. ప్రత్యేకత ఏంటంటే..అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఏ విమాన్నయినా ఎయిర్ఫోర్స్ 1 అనే పిలుస్తారు. ఈ విమానానికి ఎలాంటి అణుబాంబులనైనా తట్టుకునే సామర్థ్యం ఉంది. దాడి జరిగే అవకాశం ఉందని ఉప్పందితే చాలు మొబైల్ కమాండ్ సెంటర్గా మారుతుంది. నాలుగు జెట్ ఇంజిన్స్తో ఈ విమానం నడుస్తుంది. గంటకి వెయ్యి కి.మీ కంటే అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 70 మంది వరకు ప్రయాణించవచ్చు. గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సౌకర్యం ఈ విమానానికి ఉండడం ప్రత్యేకత. దీంతో ఎంతసేపైనా ప్రపంచం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చుట్టేయగలదు.విమానం లోపల విస్తీర్ణం 4 వేల చదరపు అడుగులు ఉంటుంది. మూడు అంతస్తుల్లో ఈ –విమానాన్ని తయారు చేశారు. వైట్ హౌస్లో ఉన్న సదుపాయాలన్నీ ఇందులో ఉంటాయి. అధ్యక్ష కార్యాలయం, జిమ్, కాన్ఫరెన్స్ గది, డైనింగ్ రూమ్, అత్యాధునిక సమాచార వ్యవస్థ, సిబ్బంది ఉండేందుకు లాంజ్ సహా సకల సౌకర్యాలు ఉంటాయి. ఒకేసారి 100 మందికి వంట చేసే సదుపాయం కూడా ఉంది. ప్రయాణ సమయంలో ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే అధునాతన వైద్య పరికరాలతో మినీ ఆస్పత్రి, అందుబాటులో వైద్యుడు ఉంటారు.
అమెరికా పవర్ఫుల్ కంట్రీ.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా రక్షణ రంగాన్ని ఎప్పుడూ లేని స్థాయిలో బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో న్యూ స్టార్ట్ అణు ఆయుధ నియంత్రణ ఒప్పందంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సోషల్ మీడియా ట్రుత్ వేదికగా స్పందిస్తూ..‘అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం. నా ఫస్ట్ టర్మ్లోనే మిలిటరీని పూర్తిగా అత్యున్నతంగా తీర్చి దిద్దాను. కొత్త అణ్వాయుధాలు అభివృద్ధి చేశాం. పాత వాటిని రీఫర్బిష్ చేశాం. దేశ రక్షణ రంగాన్ని ఎప్పుడూ లేని స్థాయిలో బలోపేతం చేస్తున్నామన్నారు. అమెరికా సైనిక శక్తి, అణ్వాయుధ సామర్థ్యం గొప్పది. అమెరికా స్పేస్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం మా ప్రభుత్వ పెద్ద నిర్ణయం. అంతరిక్ష భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ చర్య అమెరికా రక్షణ వ్యవస్థను మరింత బలపరిచింది. భవిష్యత్ యుద్ధాలు భూమి మీదే కాకుండా అంతరిక్షంలోనూ జరుగుతాయని, అందుకే స్పేస్ ఫోర్స్ కీలకం’ అని పేర్కొన్నారు.యూఎస్ నౌకా దళంపై..నౌకాదళ విభాగంపై కూడా ట్రంప్ ప్రత్యేకంగా మాట్లాడారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సేవలందించిన ఐవా, మిస్సోరీ, అలబామా వంటి యుద్ధనౌకల కంటే 100 రెట్లు శక్తిమంతమైన ఆధునిక బ్యాటిల్షిప్లను నిర్మిస్తున్నామని తెలిపారు. సముద్ర రక్షణను మరింత పటిష్టం చేయడమే తమ లక్ష్యమన్నారు.భారత్, పాక్పై పాత పాటే.. ఇక అణు యుద్ధాల అంశంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేకెత్తించాయి. భారత్-పాకిస్తాన్, ఇరాన్ ఇజ్రాయెల్, రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యే సమయంలో అణు ఘర్షణలు తలెత్తకుండా తానే జోక్యం చేసుకుని ఆపానని తెలిపారు. అయితే యుద్ధాలకు సంబంధించి స్పష్టమైన వివరాలు మాత్రం ఇవ్వలేదు. అదేవిధంగా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా ట్రంప్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా మధ్యవర్తిత్వం చేసిందని చెప్పారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు గత ఏడాది నుంచి కృషి చేస్తున్నానని, అర్మేనియా- అజర్బైజాన్ మధ్య దీర్ఘకాల ఘర్షణను కూడా పరిష్కరించానని పేర్కొన్నారు.అణు నియంత్రణపై.. ఇక న్యూ స్టార్ట్ అణు ఆయుధ నియంత్రణ ఒప్పందంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం సరైన విధంగా చర్చించకుండా కుదిరిందని, అమెరికాకు అనుకూలంగా లేదని విమర్శించారు. అంతేకాకుండా ఇది ఉల్లంఘనలకు గురవుతోందని ఆరోపించారు. దీనిని పొడిగించడానికి బదులుగా కొత్త, మెరుగైన, ఆధునిక ఒప్పందాన్ని రూపొందించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా అణు నిపుణులు కలిసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఒప్పందం రూపొందించాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక భద్రతను కల్పించే విధంగా సమగ్ర అణు నియంత్రణ వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు.
జాతీయం
మరో 19 మంది మావోయిస్టుల లొంగుబాటు
భువనేశ్వర్: మావోయిస్టులు లొంగిపోవడానికి కేంద్రం విధించిన గడువు దగ్గర పడటంతో వారు లొంగుబాట పడుతున్నారు. తాజాగా మరో 19 మంది మావోయిస్టులు లొంగిప్యోఆరు. ఒడిశాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఒడిశా డీజీఏపీ ఎదుట 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల పేరిట రూ. 1.1 కోట్ల రివార్డ్ ఉంది. కాగా, మార్చి నెల మావోయిస్టుల లొంగిపోవడానికి కేంద్రం విధించిన గడువు. ఈ క్రమంలోనే ఇప్పటికే భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మరికొంతమంది ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. ఆపరేషన్ కగార్ వంటి ఆపరేషన్లతో కేంద్ర ప్రభుత్వం.. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోతున్నారు. అడవుల్లో మావోయిస్టులు.. వాటిని వదిలి జనావాసంలోకి వస్తున్నారు. పలువురు మాత్రం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ వంటి చర్యలకు ఎదురెళ్లి ప్రాణాలు సైతం కోల్పోయిన వారు ఉన్నారు.
బైకర్పై దూకి.. లాక్కెల్లి చంపిన పెద్దపులి
అరుణాచల్ ప్రదేశ్లో అరుదైన విషాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్పై పెద్దపులి దాడి చేసి ప్రాణం తీసింది. అయితే ఈ ఘటన జరిగిన రెండ్రోజులకే ఓ పులి అనూహ్యంగా తుపాకీ తూటా గాయంతో చనిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో ఇది కానిస్టేబుల్ మరణానికి ప్రతీకార దాడినా? లేదంటే వేటగాళ్ల పనా? అనే అనుమానాలు తలెత్తాయి. అరుణాచల్ ప్రదేశ్ పోలీస్ విభాగంలో చిక్సెంగ్ మాన్పుంగ్ రేడియో ఆపరేటర్గా విధులు నిర్వహించాడు. లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లా మయోడియాలో ఆయన డ్యూటీ నిర్వహించేవాడు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం అనిని నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో.. రోయింగ్ రహదారిపై ఘోరం జరిగింది. బైక్పై వెళ్తున్న టైంలో ఓ పెద్దపులి హఠాత్తుగా ఆయనపై దాడి చేసింది. ఆ దారిన వెళ్లే వాహనదారులు.. రోడ్డు పక్కన బైక్ పడి ఉండడం చూసి యాక్సిడెంట్ కావొచ్చని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. తెల్లవారి అటుగా వెళ్లిన వాళ్లకు.. పక్కన పొదల్లో రక్తపు మడుగులో ఆయన మృతదేహం కనిపించింది. వాళ్లు పోలీసులకు సమాచారం అందించగా.. అది పెద్దపులి చేసిన దాడిగా నిర్ధారించుకున్నారు. చిక్సెంగ్ మరణంతో పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ ఆడపులి మూడు కూనలతో ఆ ప్రాంతంలో సంచరిస్తుందని గుర్తించారు. కూనల్ని రక్షించుకునే క్రమంలోనే అది దాడి చేసి చంపి ఉంటుందని భావించారు. అరుణాచల్ ప్రదేశ్లో మనుషులపై పులులు దాడులు చేయడం అత్యంత అరుదు. దీంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించింది. A female tiger was found unalive with a gunshot injury near Mayudia in Arunachal Pradesh’s Lower Dibang Valley, just two days after a police head constable was attacked and lost his life on the Roing–Anini road. Authorities are probing who shot the tiger, why it was harmed and… pic.twitter.com/EIQWPpSf7W— The Sentinel (@Sentinel_Assam) February 6, 2026 ఈ ఘటనతో మయోడియా ప్రాంతంలో రాత్రి పూట ద్విచక్ర ప్రయాణాలపై నిషేధం విధించారు. అయితే.. రెండు రోజుల తర్వాత అదే ప్రాంతంలో ఒక పులి మృతదేహం తుపాకీ గాయాలతో కనుగొన్నారు. ఇది ప్రతీకార చర్య కావచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అదే సమయంలో వేటగాళ్ల దాడి అయ్యి ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.ఈ మధ్యకాలంలో మయోడియా–మెహావో వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం పరిసరాల్లో పులుల సంచారం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే.. చిక్సెంగ్ మాన్పుంగ్ను చంపింది చనిపోయిన పులినేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. సోషల్ మీడియాలో రోడ్డు మీద పులులు రాత్రి పూట సంచరించడం, వాహనాలను వెంబడించడం వైరల్ అవుతోంది. బైకర్ల మీదకు పులి దూకిన వీడియోను చిక్సెంగ్ మాన్పుంగ్ దాడి వీడియో అంటూ వైరల్ చేస్తున్నారు. అటుగా ఓ వాహనంలో వెళ్లే వాళ్లు ఆ వీడియో తీసినట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారులు ఇవేం అధికారిక వీడియోలు అని చెప్పడం లేదు. వైరల్ అవుతున్న పులి వీడియోలు ఏఐవి కావని.. వేరే సందర్భాల్లో తీసినవని తెలుస్తోంది. ⚠️ Stay Alert, Stay Alive 🐅Suspected tiger attack claims life ofpolice constable in Arunachal Pradesh. pic.twitter.com/7Dg4DA0CaV— अक्स (@Vickyaarya007_) February 6, 2026
ఆప్ నేత దారుణ హత్య.. సీసీటీవీ విజువల్స్
చండీఘడ్: పంజాబ్లో దారుణం జరిగింది. ఆమ్ ఆద్మీపార్టీ నేత ఒబెరాయ్ దారుణహత్యకు గురయ్యారు. జలంధర్ ప్రాంతంలో దుండగులు బ్లాక్ హూడీ ధరించి, ఓబెరాయ్ వాహనం దగ్గరికి వచ్చి 10 సెకన్లలో ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన ఒబెరాయ్ ప్రాణాలు వదిలారు. కాల్పుల కలకలంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గురుద్వారాలోని మోడల్ టౌన్ ప్రాంతంలో జీప్లో ఉండగా బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన జలందర్ కారులోనే కుప్పకూలారు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దర్యాప్తులో ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. నిందితులు బ్లాక్ హుడీ ధరించిన దృశ్యాలు కనిపించాయి. వాటి ఆధారంగా నిందితుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, గతంలో ఒబెరాయి సతీమణి అక్కడి మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ టికెట్పై పోటీచేసి ఓడిపోయింది. जालंधर में AAP नेता लक्की ओबरॉय की गोली मारकर हत्या। CCTV फुटेज में गोली मारते दिखा हमलावर।#punjab #AAP @AamAadmiParty pic.twitter.com/kZzrzbCX44— ANews Office (@AnewsOffice) February 6, 2026
జమ్మూలో పర్యటిస్తున్న అమిత్షా
కేంద్ర హోం మంత్రి జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూ వెళ్లిన ఆయన భద్రతాబలగాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలతో సమీక్ష నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అమిత్షా పర్యటనకు కొద్ది గంటల ముందే జమ్మూ ప్రాంతంలో భద్రతా బలగాలు ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టడం కలకలం రేపిందిఅమిత్షాకు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్అబ్దుల్లా ఇతర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం హీరానగర్ సెక్టార్లోని గుర్నామ్, బోబియాన్ పోస్టులను సందర్శించారు. BSF బలగాలకు సంబంధించిన ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రారంభించారు. అనంతరం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి భద్రతా పరిస్థితులపై ఆరా తీశారు. అదేవిధంగా గతేడాది వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాన్ని అమిత్ సందర్శించారు.రేపు జమ్మూలోని లోక్భవన్లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్సిన్హాతో పాటు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. జమ్ము ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తెలుసుకుంటారు. ఉగ్రవాదుల ఎరివేతకు వారు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రికి అధికారులు వివరించనున్నారు. అనంతరం ఇటీవల ఉగ్రవాదుల దాడుల్లో అమరులైన జవాన్ల కుటుంబాలతో అమిత్షా ప్రత్యేకంగా భేటీ అయి వారికి పరిహారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.కాగా అమిత్షా పర్యటనకు కొద్దిగంటల ముందు కిష్త్వార్, ఉదంపూర్ జిల్లాలలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో పాకిస్థాన్కు చెందిన ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
ఎన్ఆర్ఐ
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే వలస కార్మికుల ఉచిత వీసాల కోసం అక్కడి ఏడీఎన్హెచ్ సంస్థ, తెలంగాణలోని జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నాలుగు చోట్ల ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. క్లీనింగ్ విభాగంలో పనిచేసేందుకు ఉచితంగా వీసాలను జారీ చేసి, ఉచిత విమాన టికెట్, వసతి, భోజన సదుపాయం కల్పించి.. మన కరెన్సీలో రూ.23 వేల వరకు వేతనాలను చెల్లించనున్నారు. వచ్చే నెల 6న జగిత్యాల, సిరిసిల్లలో, 7న నిజామాబా ద్, ఆర్మూర్లలోని జీటీఎం సంస్థ కార్యాలయాలలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. వివ రాల కోసం ఆర్మూర్ (8332062299), నిజామాబాద్ (8686860999), జగిత్యాల (83320422 99), సిరిసిల్ల (9391661522) నంబర్లలో సంప్రదించవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దళారుల్ని నమ్మొద్దు ఈనెల 9, 10 తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరైన వంద మందిని రెండు మూడు రోజుల్లో యూఏఈకి పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దళారులను నమ్మి మోసపోవద్దు. – చీటీ సతీశ్రావు, చైర్మన్, జీటీఎం ఇంటర్నేషనల్ (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!)
వైభవంగా తానా మిడ్-అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలను చూడటానికి వచ్చిన జనసందోహం, మరోవైపు తమ ఆట, పాటలతో మైమరపింపజేసిన చిన్నారులతో తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సూపర్ హిట్టయింది. వెస్ట్ చెస్టర్ లో జనవరి 17వ తేదీన జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దాదాపు 1500మందికిపైగా వచ్చిన జనసందోహం నిర్వాహకులకు, కళాకారులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికితోడు సంక్రాంతి థీమ్ ను ప్రతిబింబించేలా చేసిన కార్యక్రమాలు, పోటీలు అందరిలోనూ పాల్గొనేలా చేశాయి.తానా మిడ్ అట్లాంటిక్ కు చెందిన బోర్డ్ డైరెక్టర్ రవిపొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు చిన్నారులు పాడిన సినిమా పాటలు ఎంతోమందిని అలరింపజేశాయి. యాంకర్లు శ్వేత కొమ్మోజి, మనీషా మేక కూడా కార్యక్రమాల విజయానికి తమవంతుగా వ్యాఖానాలను జోడించి ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. సాంప్రదాయ భోగిపళ్లు కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు వారిపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు, కిడ్స్ విలేజ్ థీమ్ కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారిని తానా నాయకులు అభినందించారు. ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకుల కోసం 7,000 పౌండ్లకు పైగా ఆహారాన్ని విరాళంగా సేకరించడంలో ప్రతిభ కనబరిచిన యువ వలంటీర్లను ఈ సంక్రాంతి వేడుకల్లో సత్కరించడం హైలైట్ గా నిలిచింది. వెస్ట్ వైట్ ల్యాండ్ టౌన్ షిప్ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ వైస్-ఛైర్ మిస్టర్ రాజేష్ కుంభార్దరే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి వలంటీర్లను సత్కరించారు.తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తదితరులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ను అభినందించారు. ఈవెంట్ కోఆర్డినేటర్లు సురేష్ యలమంచిలి, కృష్ణ నందమూరితోపాటు మిడ్ అట్లాంటిక్ టీమ్ నాయకులు, వలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన క్రాస్ రోడ్స్, గోల్డెన్ స్పాన్సర్స్ గా ఉన్న శ్రీధర్ అంచూరి మరియు సురేష్ బందుగులకు, కమలం ది డెకర్ కంపనీకి, అతిథులకు, వలంటీర్లకు కమ్యూనిటీ నాయకులకు, ఈ వేడుకకు సహకరించిన అందరికీ తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.తానా మిడ్ అట్లాంటిక్ టీమ్`సరోజ పావులూరి, దీప్తి కోక, మనీషామేక, శైలజ కస్తూరి, సునీత వాగ్వాల, మైత్రి నూకల, బిందు ఆలపాటి, రమ్య మాలెంపాటి, ఇందు సందడి, రాణి తుమ్మల, భవానీ క్రొత్తపల్లి, అనుపమ యలమంచి, భవానీమామిడి, నీలిమ వోలేటి, రవీన తుమ్మల, శ్రావణి రాయలతోపాటు, విశ్వనాథ్ కోగంటి, శ్రీధర్ సాధినేని, శ్రీకాంత్ గూడురు, గోపి వాగ్వాల, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, వెంకట్ ముప్పా, రమేష్ గుట్ట, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి, ప్రసాద్ కస్తూరి, రంజిత్ కోమటి, రంజిత్ మామిడి, మూర్తి నూతనపాటి, చందు భాతుస్కర్, సంతోష్ రౌతు, సత్య పొన్నగంటి, రాజు గుండాల, రాధాకృష్ణ మూల్పూరి, నాయుడమ్మ యలవర్తి, చలం పావులూరి, మోహన్ మల్ల ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు.
భార్యను, బంధువులను కాల్చి చంపాడు!
న్యూయార్క్: అమెరికాలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ భారత సంతతి వ్యక్తి క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. భార్య, ఆమె తరఫు ముగ్గురు బంధువులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్లముందే జరిగిన దారుణం చూసి బెంబేలెత్తిపోయిన అతని 12 ఏళ్ల కొడుకు, బంధువుల తాలూకు మరో ఇద్దరు పిల్లలు వెంటనే ఓ గదిలోకి దూరి గడియ పెట్టుకుని బతికిపోయారు. కొడుకు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే పారిపోయిన నిందితున్ని కొద్ది దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం అందరినీ కలచివేస్తోంది. నిందితున్ని విజయ్కుమార్ (51)గా, మృతులను అతని భార్య మీమూ డోగ్రా (43), మిగతా వారిని గౌరవ్ కుమార్ (33), నిధీ చందర్ (37), హరీశ్ చందర్ (38)గా గుర్తించారు. ఇది మాటలకందని ఘోరమని అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది. బాధిత కుటుంబానికి అన్నివిధాల సాయమూ అందిస్తున్నట్టు పేర్కొంది. గదిలో దాక్కున్న పిల్లలు విజయ్కుమార్ దంపతులు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నివసిస్తుండేవారు. శుక్రవారం అర్ధరాత్రి ఏదో విషయమై ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఘర్షణ నడుమే కొడుకుతో కలిసి శివారు నగరమైన లారెన్స్విలేలోని బ్రూక్స్ ఐవీ కోర్ట్లో ఉంటున్న డోగ్రా తాలూకు బంధువులు గౌరవ్, నిధి, హరీశ్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఘర్షణ శ్రుతిమించి కాల్పులకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవకు దారితీసిన కారణమేమిటో తెలియాల్సి ఉందని చెప్పారు. ‘‘విజయ్ దంపతుల 12 ఏళ్ల కొడుకు తెల్లవారుజాము 2:30 ప్రాంతంలో మాకు కాల్ చేసి దారుణం గురించి చెప్పాడు. రాపిడ్ రెస్పాన్స్ బృందం నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది. నలుగురు వ్యక్తు లు ఇంట్లో తూటా గాయాలతో పడిపోయి కన్పించారు. ముగ్గురు పిల్లలు సకాలంలో స్పందించి పక్క గదిలోకి పరుగెత్తి దాక్కోవడంతో దాడి నుంచి బయ ట పడ్డట్టున్నారు’’అని పోలీసులు వివరించారు.
TPAD అధ్యక్షురాలిగా వరుసగా మూడోసారీ మహిళకే పట్టం
డల్లాస్, టెక్సాస్లో శక్తివంతమైన, ప్రభావవంతమైన తెలుగు సంస్థగా అక్కడి తెలుగు ప్రజల మన్ననలు పొందుతున్న “డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (TPAD)”.. 2026 సంవత్సరానికి గాను తన నూతన కార్యవర్గ బృందానికి బాధ్యతలు అప్పగించింది. గత 12 ఏళ్లలో టీప్యాడ్, డల్లాస్లోని తెలుగు సమాజంలో స్వచ్ఛంద సేవకులు, కమ్యూనిటీ సభ్యులను విస్తృతంగా ఆకర్షిస్తూ అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. బలమైన సంస్థాగత నిర్మాణం ద్వారా అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దింది.సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణతో పాటు మంచి నాయకులను తీర్చిదిద్దడంలో అద్భుతమైన చరిత్ర కలిగిన టీప్యాడ్, ఫ్రిస్కో, టెక్సాస్లోని ఎలిగెన్స్ బాల్రూమ్లో స్థానిక కమ్యూనిటీ నాయకులు, మద్దతుదారుల సమక్షంలో తన 13 వ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో ప్రమాణస్వీకారం చేయించింది. టీప్యాడ్ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహిళలే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. మహిళా సాధికారతకు, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి టీప్యాడ్ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం.టీప్యాడ్ చరిత్ర, నేపథ్యంపై విస్తృత అవగాహన కలిగిన వీణా యలమంచిలి కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించారు. సీనియర్ టీప్యాడ్ నాయకులు మరియు ఫౌండేషన్ కమిటీ సభ్యుడు రావు కల్వాల — రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్)లతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీప్యాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు సుధాకర్ కలసాని — కార్యవర్గ సభ్యులు మరియు పదాధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు.కొత్త కమిటీ సభ్యులు లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), శ్రీనివాస్ అన్నమనేని (ఉపాధ్యక్షుడు), గాయత్రి గిరి (కార్యదర్శి), శివ కొడిత్యాల (సహ కార్యదర్శి), ఆదిత్య రెడ్డి (ఖజాంచీ), దీపిక దీపికా రెడ్డి (సహ ఖజాంచీ) .నూతన ఈసీ సభ్యులు:బాల గణపవరపు, మాధవి ఓంకార్, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, తిలక్ కుమార్ వన్నంపుల.రవికాంత్ మామిడి, అశోక్ పొద్దుటూరి, రోజా అడెపు, మాధవి సుంకిరెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండాల, పాండురంగ రెడ్డి పల్వాయి, బుచ్చి రెడ్డి గోలితో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రవికాంత్ మామిడి (BOT ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్)లకు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకార అనంతరం మాట్లాడిన FC ఛైర్ రఘువీర్ బండారు, BOT ఛైర్ రవికాంత్ మామిడి, అధ్యక్షురాలు లక్ష్మి పోరెడ్డి, కోఆర్డినేటర్ లింగా రెడ్డి ఆల్వా, BOT వైస్ ఛైర్ రోజా అడెపు-రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక వేడుకల నిర్వహణ, బతుకమ్మ, దసరా సంబరాలను డీఎఫ్డబ్ల్యూ తెలుగు సమాజం ఆశించే స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు నూతన బృందం కట్టుబడి ఉందని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా టీప్యాడ్కు నిరంతర మద్దతు అందిస్తున్న సపోర్టర్లు, స్పాన్సర్లకు టీప్యాడ్ నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.టీప్యాడ్ 2026 కార్యవర్గం:ఎగ్జిక్యూటివ్ కమిటీ:లక్ష్మి పోరెడ్డి (President), అనురాధ మేకల (Past President), శ్రీనివాస్ అన్నమనేని (Vice President), గాయత్రి గిరి (Secretary), శివ కొడిత్యాల (Joint Secretary), ఆదిత్య రెడ్డి (Treasurer), దీపిక దీపికా రెడ్డి (Joint Treasurer), స్వప్న తుమ్మపాల, నిఖిల్ కందుకూరి, ప్రశాంత్ నిమ్మని, మాధవి ఓంకార్, స్నేహా రెడ్డి, సంతోష్ రెగొండ, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, తిలక్ కుమార్ వన్నంపుల, రత్న వుప్పల, బాల గణపవరపు.బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్:రవికాంత్ మామిడి (BOT ఛైర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), మాధవి సుంకిరెడ్డి, రమణ లష్కర్, పాండురంగ రెడ్డి పల్వాయి, రామ్ అన్నాడి, బుచ్చి రెడ్డి గోలి, అశోక్ కొండాల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, అశోక్ పొద్దుటూరి.ఫౌండేషన్ కమిటీ:రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్), జనకిరామ్ మండాది, ఉపేందర్ తెలుగు, రాజ్ గోంధి, మహేందర్ కమిరెడ్డి
క్రైమ్
గంజాయి బ్యాచ్ గ్యాంగ్రేప్
కోవూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. గంజాయి బ్యాచ్ అరాచకానికి ఓ బాలిక బలైపోయింది. ఇద్దరు మృగాళ్లు కలిసి ఓ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. బాధితురాలి పరిస్థితి విషమించగా వారం రోజులపాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరికి శుక్రవారం ప్రాణాలు విడిచింది. అయితే, నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి అరెస్టుచేసిన పోలీసులు.. బాధిత కుటుంబం ఇంటికి వైఎస్సార్సీపీ నేతలు వస్తున్నారన్న సమాచారంతో బాలిక మృతి ఘటన ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని వారు కేసు తారుమారుకు యత్నాలు ప్రారంభించారు. బాలిక తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి వారితో మరో రకంగా ఫిర్యాదు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ప్రేమ వ్యవహారం అంటగట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసుల తీరుతో అర్ధమవుతోంది. జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలు.. ఏం జరిగిందంటే.. కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్లదిబ్బ కొత్తకాలనీకి చెందిన ఎస్కే రసూల్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అరీఫా (12) గత నెల 30వ తేదీ (శుక్రవారం) రాత్రి దుకాణానికి వెళ్లొస్తుండగా, గంజాయికి బానిసలైన అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురు ఆమెపై కన్నేశారు. బాలికను సమీపంలోని చెట్ల పొదల్లోకి బలవంతంగా లాక్కెళ్లి వైట్నర్ కలిపిన నీటిని బలవంతంగా తాగించారు. బాలిక స్పృహ కోల్పోగానే వారు విచక్షణ మరిచి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. స్పృహలోకి వచి్చన తర్వాత ఆ చిన్నారి జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివరించింది. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో తొలుత కోవూరు ప్రభుత్వాస్పత్రికి అక్కడ నుంచి నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా ఐసీయూలో మృత్యువుతో పోరాడిన ఆ బాలిక చివరికి శుక్రవారం ప్రాణాలు విడిచింది. తమ బిడ్డకు మత్తు ద్రావణం తాగించి దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు తారుమారుకు పోలీసుల యత్నం బాలిక మృతి చెందడంతో చెన్నైలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అనంతరం శనివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి, మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి వాకబు చేసినట్లు సమాచారం. అయితే, బాలిక స్వగ్రామానికి కాకాణి శనివారం వెళ్లనున్నారనే సమాచారంతో పోలీసులు కేసు తారుమారు చేసేందుకు ప్రయతి్నస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా బాలిక కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆమెకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా కథలు అల్లుతున్నట్లు తెలుస్తోంది. పోక్సో కేసు నమోదు.. రేప్ జరగలేదంటూ బుకాయింపు.. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు, ఘటనా స్థలాన్ని సైతం పరిశీలించారు. అక్కడ కొన్ని ఆధారాలు సేకరించి, మైనర్లు అయిన ఇద్దరు నిందితులపై పోక్సో కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. అయితే, గంజాయి బ్యాచ్ అరాచకాల విషయంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకే అవకాశం ఉండడం వల్ల కూడా వారు కేసు తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చలవిడిగా గంజాయి ఆగడాలు.. మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి రవాణా, విక్రయాలు, అరాచకాలు, ఆగడాలు మితిమీరాయి. అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు, ఎక్సైజ్ శాఖలు అవినీతి మత్తులో జోగుతున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరులో గంజాయి నిరోధక ఉద్యమకారుడు పెంచలయ్యను ఇటీవలే గంజాయి విక్రేతలు దారికాచి తరిమితరిమి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షితోపాటు ఆమె సోదరుడు, అనుచరులు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇక గంజాయి విక్రయ మూలాలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారనడానికి తరచూ భారీస్థాయిలో పట్టుబడుతున్న గంజాయే నిదర్శనం. నిజానికి.. నెల్లూరు నగరానికి పక్కనే ఉన్న కోవూరు అడ్డాగా గంజాయి విక్రయాల దందా జరుగుతోంది. ఒడిశా నుంచి రైళ్లల్లో, బస్సుల్లో తెస్తూ.. పడుగుపాడు, ఇనమడుగు ప్రాంతాల్లో విక్రేతలు పాగా వేసి విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం.ఆ ఇద్దరే కారణం.. మా బిడ్డకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదు. అభం శుభం తెలియని మా బిడ్డపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చిన్న బిడ్డకు ప్రేమ వ్యవహారం అంటకట్టడం చాలా పాపం. అవన్నీ తప్పుడు ప్రచారం. మా బిడ్డను కొందరు బలవంతంగా తీసుకెళ్లి ఇబ్బందికి గురిచేసిన విషయం నిజమే. అందుకే కోవూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మా బిడ్డ చనిపోవడానికి కారణం ఆ ఇద్దరు పిల్లలే. వారిని కఠినంగా శిక్షించాలి. – ఎస్కే రసూల్, బాలిక తండ్రి మా బిడ్డకు ఇలా జరగడం దారుణం.. పోయిన శుక్రవారం ఏదైనా కొనుక్కుంటానంటే నేనే రూ.10 ఇచ్చి పంపాను. దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు పిల్లలు బలవంతంగా తీసుకెళ్లి మత్తు నీళ్లు తాగించడంతో చెట్ల పొదల మధ్యన పడిపోయింది. గంటసేపైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెంది అంతా వెతికాం. ఇంతలో ఇద్దరు పిల్లలు అక్కడ కూర్చొని ఉంటే అడిగాం. ముందు చూపిస్తామని, ఆ తర్వాత మాకు తెలియదని చెప్పారు. చివరకు చెట్ల పొదల్లో చూడగా అక్కడ మా బిడ్డ స్పృహలేకుండా పడిపోయి ఉంది. అప్పుడు కోవూరు ఆస్పత్రికి తీసుకెళ్లాం. పరిస్థితి ఇబ్బందిగా ఉంటే.. నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ కూడా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో చెన్నైకు తీసుకెళ్లమన్నారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. మా కళ్ల ముందు ఆడుకుంటున్న బిడ్డకు ఇలా జరగడం దారుణం. – బాలిక పిన్ని అంతా అబద్ధంగుమ్మళ్లదిబ్బలో బాలికపై అసలు అత్యాచారమే జరగలేదు. అదంతా అబద్ధం. ఆ బాలికకు బాలుడితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆ బాలిక తన స్నేహితులతో ఉంటూ పొద్దుపోయే వరకు ఇంటికి వెళ్లకపోవడంతో ఇంట్లో వాళ్లు తిడతారేమోనని సమీపంలో ఉన్న గుర్తుతెలియని లిక్విడ్ తాగింది. ఆ కారణంగానే చనిపోయింది. – సుధాకర్రెడ్డి, కోవూరు సీఐరాష్ట్రం గంజాయికి అడ్డాగా మారింది.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. మా ప్రభుత్వ హయాంలో గంజాయి, అక్రమ మద్యాన్ని ఉక్కుపాదంతో అణిచివేశాం. కానీ, నేడు చంద్రబాబు కనుసన్నల్లో రాష్ట్రమంతా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఈ మత్తు పదార్థాలవల్ల పసిబిడ్డల ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోతుంటే ఈ ప్రభుత్వానికి కనికరంలేదు. కూటమి ప్రభుత్వ అక్రమాలకు కొందరు పోలీసులు వంతపాడటం సిగ్గుచేటు. బాలిక అత్యాచారం కేసును పక్కదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయతి్నస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మాజీమంత్రి
బైక్ కోసం తండ్రిని చంపిన కొడుకు
రేగోడ్ (మెదక్): బైక్ కొనివ్వాలని గొడవ పడి.. ఓ కొడుకు తండ్రిని హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా రేగోడ్ పోలీస్స్టే షన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై పోచయ్య కథనం మేరకు.. రేగోడ్ గ్రామానికి చెందిన షకీర్ (51) కూరగాయలు అమ్ముతూ జీవనం సాగి స్తున్నాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమా రుడు ఉన్నారు. కుమారుడు మహమ్మద్ హుస్సేన్ కొంతకాలం ట్రాక్టర్ డ్రైవర్గా పని చేశాడు.అయితే ఏడాది నుంచి పని చేయకుండా ఇంట్లో నే ఉంటున్నాడు. ఈ క్రమంలో బైక్ కొనివ్వా ల ని, భూమి అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించసాగాడు. నెల క్రితం డబ్బుల కోసం తండ్రిపై దాడి చేయగా అతని తలకు గా యమైంది. గ్రామ పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కు దిర్చారు. కాగా, గురువారం రాత్రి ఇంట్లో నిద్ర పోతున్న షకీర్ను, కుమారుడు బయటకు లాక్కొ చ్చి కొట్టడంతో తలకు బలంగా గాయాలై షకీర్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఘటనా స్థలా న్ని అల్గాదుర్గం సీఐ రేణుకారెడ్డి సందర్శించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
యువతుల మిస్సింగ్ ఎపిసోడ్లో ట్విస్ట్
ఆపరేషన్ మిలాప్.. కనిపించకుండా పోయిన వాళ్లను గుర్తించి వాళ్ల ఇళ్లకు చేర్చేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్. కిందటి ఏడాది ఈ ఆపరేషన్ ద్వారా 1,303 మంది జాడను గుర్తించగలిగారు. అందులో చిన్నపిల్లలు, అమ్మాయిల ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు కేవలం 15 రోజుల్లోనే వందల మంది ఆచూకీ లేకుండా పోయింది. వాళ్లను ట్రేస్ చేయడంలో పోలీసులు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఇలా అనుకుంటున్నలోపే పోలీసులు పెద్ద ట్విస్టే ఇచ్చారు.దేశ రాజధాని రీజియన్లో మిస్సింగ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని.. అందులో అమ్మాయిల సంఖ్యే అధికంగా ఉంటోందన్న కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటి ఆధారంగా ఇటు మీడియా సంస్థలూ వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు ఈ వార్తలను ఖండించారు. దీని వెనుక పెయిడ్ ప్రమోషన్ ముఠా ఉందని తేల్చేశారు.జనవరి 1 నుంచి 15వ తేదీల మధ్య ఏకంగా 800 కనిపించకుండా పోయారన్నది ఆ ప్రచార సారాంశం. వీటి ఆధారంగా కొన్ని ఇండిపెండెంట్ మీడియా సంస్థలు.. వాటి ఆధారంగా ప్రధాన వార్తా సంస్థలూ కథనాలు ప్రచురించాయి. అందులో.. ఢిల్లీలో మొత్తం 807 మంది కనిపించకుండా పోయారు. వీళ్లలో 509 మంది మహిళలు, అమ్మాయిలు.. 298 మంది పురుషులు ఉన్నారు. మొత్తంలో 191 మంది మైనర్లు, 616 మంది పెద్దలు ఉన్నారని తెలిపాయి. జనవరి 1 నుండి 27 వరకు 235 మందిని పోలీసులు గుర్తించగా, 572 మంది ఇంకా కనిపించలేదని.. రోజుకు సగటున 27 మంది మిస్సింగ్గా రిపోర్ట్ అవుతుండగా, 9 మందిని మాత్రమే పోలీసులు కనిపెడుతున్నారని మీడియా డాటా తెలిపింది. ఈ డాటా ఆధారంగా ప్రతిపక్ష ఆప్.. అధికార బీజేపీపై విరుచుకుపడింది.అయితే.. ఈ కథనాలతో ఆశ్చర్యపోయిన ఢిల్లీ పోలీసులు విచారణను లోతుగా దర్యాప్తు చేశారు. అందులో.. మిస్సింగ్ గర్ల్స్ సంఖ్య పెరిగిందన్న ప్రచారం స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా వైరల్ అయ్యిందని గుర్తించారు. డబ్బు కోసం భయాన్ని సృష్టించడం సహించబోమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ పోలీసులు ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఇలాంటి వదంతులను నమ్మొద్దని.. నిర్ధారణ లేని సోషల్ మీడియా పోస్టులను పట్టించుకోవద్దని.. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ వాసులకు చెబుతున్నారు.After following a few leads, we discovered that the hype around the surge in missing girls in Delhi is being pushed through paid promotion. Creating panic for monetary gains won't be tolerated, and we'll take strict action against such individuals.— Delhi Police (@DelhiPolice) February 6, 2026గత సంవత్సరం గణాంకాలతో పోలిస్తే మిస్సింగ్ కేసులు పెరగలేదు. ఈ జనవరిలో కేసులు తగ్గాయి అని జాయింట్ కమిషనర్ సంజయ్ త్యాగి తెలిపారు. కాబట్టి నెట్టింట జరిగే ప్రచారం కేవలం వదంతులు మాత్రమేనని ఆయన అన్నారు.గత సంవత్సరం ఢిల్లీ పోలీసులు “ఆపరేషన్ మిలాప్” కింద మొత్తం 1,303 మంది కనిపించకుండా పోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలతో మళ్లీ కలిపారు. వీరిలో 434 మంది పిల్లలు, 869 మంది పెద్దలు ఉన్నారు. ఒక్క డిసెంబర్లోనే 102 మంది ఆచూకీకి గుర్తించగలిగారు.
పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఓ యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. విధి నిర్వహణలో ఉన్న ఆమె ఆపరేషన్ థియేటర్లోనే కుప్పకూలి మరణించారు. అనంతపురానికి చెందిన డాక్టర్ బత్తుల దీపిక(26) అక్కడి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎనస్థీషియా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఆమె బుధవారం ప్రభుత్వాస్పత్రి ‘సీ’ బ్లాక్లోని జనరల్ సర్జరీ ఆపరేషన్ థియేటర్లో మరో పీజీ వైద్య విద్యార్థినితో కలిసి నైట్ డ్యూటీలో ఉన్నారు. ఆమె రాత్రి పది గంటలకు సహచర విద్యార్థితో క్యాంటీన్ నుంచి ఆహారం తెప్పించుకుని తిన్నారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో డాక్టర్ దీపిక నలతగా ఉందని, వాంతులు అయ్యేట్లు ఉన్నాయని చెప్పడంతో సహచర పీజీ విద్యార్థి ఆమె చేతికి కాన్సులా పెట్టి జోఫర్ ఇంజక్షన్ చేసినట్లు చెబుతున్నారు. అనంతరం డాక్టర్ దీపిక ఆపరేషన్ థియేటర్ చాంబర్లోని రూమ్లో ఉండగా, మరో విద్యార్థి 1.10 గంటల సమయంలో సర్జరీకి కేసును తీసుకొచ్చేందుకు వెళ్లారు. ఆమె తిరిగి 1.40 గంటలకు ఆపరేషన్ థియేటర్ చాంబర్కు వచ్చి చూడగా, డాక్టర్ దీపిక కనిపించలేదు. సర్జరీ చేసే థియేటర్కు వెళ్లగా, డాక్టర్ దీపిక ఒక మూలన కుప్పకూలి ఉంది. దీంతో ఇతర సిబ్బందిని పిలిచి పరిశీలించగా, అప్పటికే శ్వాస తీసుకోవడం లేదని గ్రహించి వెంటనే ఆర్ఐసీయూకు తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించింది. కాగా, డాక్టర్ దీపిక తండ్రి బత్తుల కోదండరామిరెడ్డితోపాటు తల్లి భారతి కూడా వైద్యశాఖలో పని చేస్తున్నారు. సోదరి డాక్టర్ మౌనిక హైదరాబాద్లో గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మృతికి తెలియని కారణం తొలుత హార్ట్ అరెస్ట్ కారణంగా డాక్టర్ దీపిక మృతిచెంది ఉండవచ్చని సహచరులు, వైద్యులు భావించారు. ఆ తర్వాత ఇంజక్షన్ విషయం బయటకు వచ్చింది. దీంతో ఇంజక్షన్ వికటించి మరణించిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఐవీ ఇచ్చినప్పుడు హార్ట్ అరెస్ట్ కావడం చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు. కాగా, డాక్టర్ దీపిక నోటి వెంట నురగ రావడం, చేతికి కాన్సులా పెట్టి ఉండటం, మరోచోట బ్యాండెడ్ వేసి ఉండటంతో ఆమె ఇంకా వేరే ఇంజక్షన్ ఏమైనా చేసుకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆమెకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు లేవని కుటుంబ సభ్యులతోపాటు సహచర విద్యార్థులు చెబుతున్నారు. రాత్రి 1.10 గంటల వరకు బాగానే ఉన్న తమ కుమార్తె 30 నిమిషాల్లోనే మరణించడంపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. డాక్టర్ మౌనిక ఫిర్యాదు మేరకు విజయవాడ మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. గురువారం పోలీసులు మృతురాలి తల్లిదండ్రులు వచ్చి ఆపరేషన్ థియేటర్కు సంబంధించిన సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బుధవారం రాత్రి వైద్యులు మినహా బయటి వ్యక్తులు ఎవరూ ఆపరేషన్ థియేటర్కు వెళ్లలేదని నిర్ధారణకు వచ్చారు. డాక్టర్ దీపిక తన రూమ్ నుంచి థియేటర్కు వెళ్తున్న దృశ్యాలు కూడా రికార్డు అయ్యాయి. డాక్టర్ దీపిక మృతికి కచ్చితమైన కారణం తెలియడం లేదని, పోస్టుమార్టం నివేదికలో తేలుతుందని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు తెలిపారు.
వీడియోలు
2026లో ప్రపంచం అంతమేనా.. బాబా వంగా అంచనాల వెనుక!!
బాబు హయాంలోనే కల్తీ.. కూటమికి షాకిచ్చిన CBI
నారా బాబా 9 దొంగలు..! పుణ్యశీల అదిరిపోయే సెటైర్లు
చంద్రబాబుకు వణుకు పుట్టేలా 300 కార్లతో అంబటి ఇంటికి కాపు నేతలు
భారత్, అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు
అనితకు పాషా కౌంటర్.. కొడుకు కోసం పవన్ బలి
చరిత్ర సృష్టించిన యంగిండియా
వైభవ్ సూర్యవంశీ ఊచకోత
చంద్రబాబుకు కాపుల రిటర్న్ గిఫ్ట్..
కాన్వాయ్ దారి మళ్లింపు.. 45 కిమీ తిప్పించారు

