అల్లు అర్జున్ ఇంటికి విజయ్, రష్మిక జోడీ (ఫోటోలు)
గల్ఫ్ దేశాల నేతలతో ప్రధాని మోదీ సంప్రదింపులు
న్యూఢిల్లీ: అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల నేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరుపుతున్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొన్న తరుణంలో ప్రధాని మోదీ.. ఆ దేశాల నేతలకు ఫోన్లు చేసి చర్చిస్తున్నారు. ఈ యుద్ధం సెగ గల్ఫ్ దేశాలపై తీవ్రంగా ఉంది. ప్రధానంగా ఎనిమిది అరబ్ దేశాలపై పడింది. అమెరికా దళాలకు ఆశ్రయం కల్పించిన అరబ్ దేశాలను టార్గెట చేస్తూ ఇరాన్ దాడులను ఉధృతం చేసింది. ఇది అమెరికాపై ప్రత్యక్ష ప్రభావం కంటే గల్ఫ్ దేశాలు అత్యంత ప్రభావితమవుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాను యుద్ధం నుంచి ఉపసంహరించుకోవడానికి ఇరాన్ వేసిన ఎత్తుగడగా ఈ దాడులు జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.. వారి మాటల్ని బట్టి ఇప్పుడు ప్రభావితమయ్యే గల్ప్ దేశాలన్నీ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మొరపెట్టుకుని యుద్ధం ఆపేలా చేయాలనేది ఇరాన్ వ్యూహంగా కనబడుతోంది. దీనిలో భాగంగా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది ఇరాన్. దాంతో గల్ఫ్ దేశాల్లో విదేశీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ ముప్పు పొంచి ఉందో అర్థం కాకండా ఉంది వారి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆయా దేశాధినేతలతో ఫోన్లలో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే పరిస్థితిపై చర్చిస్తున్నారు.
T20 WC 2026: అదే జరిగితే భారత్కు చుక్కెదురే..!
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.ఈ మ్యాచ్లకు వరుణుడు నుంచి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. ఏదైనా కారణం చేత రద్దైతే పరిస్థితి ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఈ నాకౌట్ మ్యాచ్లకు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. షెడ్యూలైన రోజు మ్యాచ్ జరుగకపోయినా లేక పాక్షికంగా జరిగి ఆగిపోయినా, ఆగిన చోటి నుంచి మరుసటి రోజు మ్యాచ్ను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం సూపర్-8 దశలో మెరుగైన ఫలితాలు సాధించిన జట్టు ఫైనల్స్కు చేరుకుంటుంది.ఈ లెక్కన తొలి సెమీఫైనల్ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్-8లో గ్రూప్-1 టాపర్గా ఉన్న సౌతాఫ్రికా ఫైనల్కు వెళ్తుంది. న్యూజిలాండ్ ఇంటిముఖం పడుతుంది. రెండో సెమీఫైనల్ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్-8లో గ్రూప్-2 టాపర్గా ఉన్న ఇంగ్లండ్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి, ఏ కారణంగా కూడా సెమీస్ రద్దు కాకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.
లారీ డ్రైవర్తో పెళ్లి : లివింగ్ పార్టనర్ని దారుణంగా హత్య చేసిన టీవీ నటి
బెంగళూరులోదారుణం చోటు చేసుకుంది. టీవీ నటి పార్టీ పేరుతో పిలిచి ప్రియుడిని హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరులోని మంజునాథనగర్లో ఫిబ్రవరి 18న జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన హత్య దాదాపు 12 రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది.గత కొన్ని రోజులుగా టీవీ నటి నటి ఊర్మిళ అలియాస్ బిందు, మోహన్ కృష్ణా రావు (40) కొంత కాలంగా 'లివ్-ఇన్' రిలేషన్షిప్లో ఉన్నారు. తాజాగా లారీ డ్రైవర్ వినయ్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే దీన్ని మోహన్ రావు వ్యతిరేకించడంతో అతని హత్యకు పూనుకున్నారని నార్త్-వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) డీల్ నాగేష్ తెలిపారు.ఇదీ చదవండి: న్యూక్లియర్ వాచ్ డాగ్ వార్నింగ్, స్పందించని ఇరాన్దీంతో తన పెళ్లికి అడ్డుగా ఉన్నాడన్న కారణంగా మోహన్ రావును వదిలించుకోవడానికి ప్లాన్ వేసింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం బిందు, మోహన్ కలిసి ఉంటున్న ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశారు. ఫుల్గా మద్యం సేవించిన తర్వాత, వినయ్ తన స్నేహితుడు ధనుష్తో కలిసి మోహన్ రావుపై ఎటాక్ చేశాడు. కాళ్లు చేతులు కట్టేసి, నోటికి, ముక్కు టేపులు వేసి మరీ మోహన్ రావును పలుమార్లు కత్తితో పొడిచారు. దీంతో ఊపిరి ఆడకపోవడంతో మోహన్ రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.అయితే హత్య జరిగిన 12 రోజుల తర్వాత, ఆ ఇంటి నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో మోహన్ రావు మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, ఈ క్రైమ్లో ఎవరి పాత్ర ఎంత ఉందనే దానిపై విచారణ జరుపుతున్నారు. బిందు 'భజరంగి', 'పోలీస్ క్వార్టర్స్', 'కాలభైరవ' వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది.
ఇరాన్పై మరిన్ని దాడులు.. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
అందరికీ ధన్యవాదాలు.. మేము క్షేమంగానే ఉన్నాం: మంచు విష్ణు
ఇరాన్ సుప్రీం ఖమేనీ భార్య 'మన్సూరే' మృతి
రైరై రారా అంటోన్న రామ్ చరణ్.. పెద్ది సాంగ్ రిలీజ్
ఐజీ సునీల్ నాయక్కు.. హైకోర్టు ఊరట
పెట్టుబడులకు చక్కని వైవిధ్యం
గ్రాండ్గా అల్లు శిరీష్-నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్.. ఫొటోలు, వీడియోలు
టీమిండియాలో ఆందోళన.. తప్పు జరిగిందా, చరిత్ర హీనులవుతారు..!
యంగ్ హీరోలని డామినేట్ చేసిన డీ గ్లామర్ బామ్మ
గంటల వ్యవధిలో.. తారుమారైన గోల్డ్ రేటు!
వరల్డ్కప్ నుంచి నిష్క్రమించిన కొద్ది గంటల్లోనే పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం
మూసీ మురిసేలా మహాత్ముడు
‘బాబా వంగ’ భవిష్యవాణిపై ఊపందుకున్న చర్చలు
ఇరాన్పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్
అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు' వేడుక.. ఫొటోలు, వీడియో వైరల్
అమెరికా-ఇరాన్ యుద్దం.. క్రికెట్ సిరీస్ రద్దు
సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్
ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందుకిచ్చార్సార్! చూడండి.. ఎన్టీఆర్ నుంచి ఆడబిడ్డ వరకూ మీ మోసాల చిట్టా విప్పాడు!
స్టాక్ మార్కెట్ సెలవులు.. ట్రేడింగ్ బంద్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఆయతుల్లా ఖమేనీ.. ఆస్తులు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే?
బంగారం లాంటి న్యూస్! పసిడి ధరలు రివర్స్!!
ఏపీ మద్యం కేసుకూ ఇదే పరిస్థితి వస్తుందేమో!
'మనశంకర వరప్రసాద్గారు'కి 50రోజులు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
చలో హైదరాబాద్
స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్ ఫైర్
భగ్గుమన్న బంగారం.. కియోసాకి ‘బ్లాస్ట్ ఆఫ్’ ట్వీట్
దుబాయ్లో చిక్కుకుపోయా.. నన్ను భారత్కు తీసుకురండి!
కేకేలైన్ చేజారింది.. అరకు వెళ్లిపోయింది
ఆశ్చర్యపరుస్తున్న'ధురంధర్ 2' రన్టైమ్..!
ఇరాన్పై మరిన్ని దాడులు.. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
అందరికీ ధన్యవాదాలు.. మేము క్షేమంగానే ఉన్నాం: మంచు విష్ణు
ఇరాన్ సుప్రీం ఖమేనీ భార్య 'మన్సూరే' మృతి
రైరై రారా అంటోన్న రామ్ చరణ్.. పెద్ది సాంగ్ రిలీజ్
ఐజీ సునీల్ నాయక్కు.. హైకోర్టు ఊరట
పెట్టుబడులకు చక్కని వైవిధ్యం
గ్రాండ్గా అల్లు శిరీష్-నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్.. ఫొటోలు, వీడియోలు
టీమిండియాలో ఆందోళన.. తప్పు జరిగిందా, చరిత్ర హీనులవుతారు..!
యంగ్ హీరోలని డామినేట్ చేసిన డీ గ్లామర్ బామ్మ
గంటల వ్యవధిలో.. తారుమారైన గోల్డ్ రేటు!
వరల్డ్కప్ నుంచి నిష్క్రమించిన కొద్ది గంటల్లోనే పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం
మూసీ మురిసేలా మహాత్ముడు
‘బాబా వంగ’ భవిష్యవాణిపై ఊపందుకున్న చర్చలు
ఇరాన్పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్
అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు' వేడుక.. ఫొటోలు, వీడియో వైరల్
అమెరికా-ఇరాన్ యుద్దం.. క్రికెట్ సిరీస్ రద్దు
సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్
ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందుకిచ్చార్సార్! చూడండి.. ఎన్టీఆర్ నుంచి ఆడబిడ్డ వరకూ మీ మోసాల చిట్టా విప్పాడు!
స్టాక్ మార్కెట్ సెలవులు.. ట్రేడింగ్ బంద్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఆయతుల్లా ఖమేనీ.. ఆస్తులు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే?
బంగారం లాంటి న్యూస్! పసిడి ధరలు రివర్స్!!
ఏపీ మద్యం కేసుకూ ఇదే పరిస్థితి వస్తుందేమో!
'మనశంకర వరప్రసాద్గారు'కి 50రోజులు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
చలో హైదరాబాద్
స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్ ఫైర్
భగ్గుమన్న బంగారం.. కియోసాకి ‘బ్లాస్ట్ ఆఫ్’ ట్వీట్
దుబాయ్లో చిక్కుకుపోయా.. నన్ను భారత్కు తీసుకురండి!
కేకేలైన్ చేజారింది.. అరకు వెళ్లిపోయింది
ఆశ్చర్యపరుస్తున్న'ధురంధర్ 2' రన్టైమ్..!
ఫొటోలు
జీ సినీ అవార్డ్స్ 2026లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
వరలక్ష్మీ శరత్కుమార్ ‘సరస్వతి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
హైదరాబాద్ : నాలెడ్జి సిటీలో వింటేజ్ వెహికల్స్ సందడి (ఫొటోలు)
సంగీత్ శోభన్ 'రాకాస' మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
అల్లు అర్జున్ ఇంటికి విజయ్, రష్మిక జోడీ (ఫోటోలు)
సంజూ భాయ్ ఆట... సెమీస్ బాట... అంతేగా.. అంతేగా (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న, జెనీలియా, శ్రీవిష్ణు, బోయపాటి (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో బ్రహ్మానందం కొడుకు (ఫొటోలు)
హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక (ఫొటోలు)
శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్-స్నేహ (ఫొటోలు)
సినిమా
పెళ్లికి ముందు సహజీవనం.. నాకు ఛాన్స్ ఇచ్చుంటే..
ఒకప్పుడు హీరోయిన్గా సినిమాలు చేసిన లయ.. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిలైంది. దాంతో సినిమాలకు దూరమైంది. కాకపోతే 2018లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనిలో అతిథి పాత్రలో మెరిసింది. గతేడాది వచ్చిన తమ్ముడు చిత్రంతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. త్వరలో హాట్స్టార్లో రాబోతున్న మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో జడ్జిగా కనిపించనుంది.నాకు ఛాన్స్ ఇచ్చుంటే..ఈ షోలో పెళ్లయిన దంపతులతో పాటు ప్రేమలో ఉన్న జంటలు, సహజీవనం చేస్తున్న జంటలు కూడా పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో లవ్- మ్యారేజ్- సహజీవనంపై లయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మా జనరేషన్లో లివింగ్ రిలేషన్షిప్ అన్న ప్రస్తావనే లేదు. నిజం చెప్పాలంటే మీరు ఛాన్స్ ఇచ్చినా సరే నేనైతే ఆ పని చేయలేను. మారుతున్న కాలం ప్రకారం.. ఇప్పటి జనరేషన్వాళ్లు ఒకరి గురించి మరొకరు ముందే తెలుసుకున్నాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇది కొత్తగా వస్తున్న కాన్సెప్ట్.తప్పుపట్టనుఅంతకుముందు పెళ్లిలో ఇలాంటి విధానాలు లేవు. విడాకులు కూడా ఎక్కువగా ఉండేవి కావు. కానీ, అన్నీ మారుతున్నాయి. కాబట్టి ఏది ఒప్పు? ఏది తప్పు? అని నేను చెప్పలేను. సహజీవనం చేస్తున్నవారిని నేను తప్పుపట్టలేను. వారి బంధం ధృడంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి పెళ్లికి ముందు కలిసుంటున్నారు. అది వారి వ్యక్తిగత విషయం అని లయ చెప్పుకొచ్చింది. 10 జంటలతో రియాలిటీ షోమ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ విషయానికి వస్తే.. ఇందులో పది జంటలు పాల్గొననున్నాయి. వారిలో వాసంతి కృష్ణన్- పవన్ కల్యాణ్, ప్రియాంక జైన్-శివకుమార్, బిగ్బాస్ ఫేమ్ మాస్క్ మ్యాన్- హరిత, అంజలి - పవన్, సాండ్రా- మహేశ్, నటరాజ్ మాస్టర్ - నీతూ, సోనియా, శుభ శ్రీ, నూకరాజు జంటలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక విల్లాలో పది జంటల్ని పది వారాలు పెట్టి షో కొనసాగించనున్నారు. మరి ఇదెప్పుడు మొదలవుతుందో చూడాలి!చదవండి: లగ్జరీ కారులో సంపూర్ణేశ్ షికారు.. ఈ కార్ ధరెంతంటే?
'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ
హీరోయిన్ రష్మికని పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ.. సోమవారం తన సొంతూరు అయిన తుమ్మనపేటకు వచ్చాడు. ఈ గ్రామం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలో ఉంది. సొంతూరిలోని ఫామ్ హౌస్లో నూతన వధూవరులిద్దరూ సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రజలందరికీ వెజ్-నాన్ వెజ్ భోజనాలు కూడా పెట్టారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్)సొంతూరితో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఊర్లో పొలం కొందాం వ్యవసాయం చేసుకుందాం ఇల్లు కట్టుకుందామని నాన్న ఎప్పుడూ అడిగేవాడు. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది . ఊరిలో ఇల్లు కట్టుకోవడం పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడంతో హ్యాపీ. ఇకనుంచి గ్రామానికి రెగ్యులర్గా వస్తాం. తమ్ముడు ఆనంద్ పెళ్లి గ్రామంలోని అందరి సమక్షంలో చేస్తాం. ఊరికి చేసేది చాలా ఉంది. అందరం కలిసి ఊరిని అభివృద్ధి చేసుకుందాం. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తాం అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.ఇకపోతే నిన్న అనగా ఆదివారం.. దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభిమానుల కోసం 'విరోష్' జంట అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల స్వీట్ల పంపిణీ కూడా చేశారు. ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్లో రిసెప్షన్ జరగనుంది. దీనికి టాలీవుడ్కి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరు కానున్నారు. (ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)విరోష్ పెళ్లికానుక.. విద్యార్థులకు విజయ్ దేవరకొండ శుభవార్తవిజయ్ దేవరకొండ తన 'విరోష్' పెళ్లికానుకగా విద్యార్థులకు భారీ శుభవార్త చెప్పారు. తమ ట్రస్ట్ ద్వారా మొదట అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతి ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు అందజేయనున్నారు. భవిష్యత్తులో ఈ… pic.twitter.com/nwMlm0M7sI— ChotaNews App (@ChotaNewsApp) March 2, 2026
లగ్జరీ కారులో సంపూర్ణేశ్బాబు.. ధరెంతో తెలుసా?
హృదయకాలేయం (2014) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు సంపూర్ణేశ్బాబు. మొదటి సినిమాతోనే ఫుల్ వైరల్ అయిపోయాడు. ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేశాడు. మధ్యలో బిగ్బాస్ షోలోనూ పాల్గొన్నాడు. కానీ, పట్టుమని పది రోజులు కూడా ఉండలేకపోయాడు. నావల్ల కాదు నేనొచ్చేస్తానంటూ స్వతాహాగా బయటకు వచ్చేశాడు.స్పోర్ట్స్ కారులో తిరిగిన సంపూఅయితే ఇటీవల ప్యారడైజ్లో సంపూ లుక్ రిలీజ్ చేయగా మరోసారి నెట్టింట వైరల్ అయిపోయాడు. చింపిరి జుట్టు, మాసిన గడ్డంతో గొడ్డలి పట్టుకుని రౌడీ అవతార్లో కనిపించాడు. తాజాగా సంపూర్ణేశ్బాబు స్పోర్ట్స్ కారులో కనిపించాడు. హైదరాబాద్ రోడ్లపై రెడ్ కలర్ స్పోర్ట్స్ కారు వేసుకుని తిరిగాడు. ఇది చూసిన అభిమానులు సంపూ ఈ కారెప్పుడు కొన్నాడని ఆశ్చర్యపోతున్నారు. ఆ డబ్బుతోనే కొన్నాడా?ఈ కారు ఎంజీ సైబర్స్టర్ బ్రాండ్కు చెందినది అని తెలుస్తోంది. దీని ధర రూ.75 లక్షలపైనే ఉంటుంది. ఏదేమైనా ఒకప్పుడు సైకిల్ మీద తిరిగే నటుడు ఇప్పుడు లగ్జరీ కారు నడుపుతుండటంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్యారడైజ్ సినిమాకు ఇచ్చిన రెమ్యునరేషన్తోనే ఈ కారు కొని ఉండొచ్చని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రెండో మూవీ ఇది! సినిమాగతంలో వీరిద్దరూ దసరా చిత్రంతో బాక్సాఫీస్పై వసూళ్ల వర్షం కురిపించారు. ఈ సారి వినూత్న కాన్సెప్ట్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాని జడల్ పాత్రలో నటిస్తుండగా మోహన్బాబు విలన్గా శికంజ మాలిక్గా, సంపూర్ణేశ్ బిర్యానీ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్, సాంగ్ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. View this post on Instagram A post shared by Celebrity Paps📸 (@celebritypaps_) చదవండి: దుబాయ్లో మెగా డాటర్ శ్రీజ
నా సినిమాని పట్టుకుని 'తెరి' చేశారు.. హరీశ్ శంకర్ కామెంట్స్
మార్చి నెలాఖరులో టాలీవుడ్ నుంచి రాబోతున్న ఒకేఒక్క పెద్ద సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటివరకు అనుకున్నంతగా బజ్ లేదు. ఎందుకో రావట్లేదు కూడా. దానికి చాలానే కారణాలు. ప్రాజెక్ట్ మొదలైనప్పుడే ఇది రీమేక్ అనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. ఈ మూవీకి రైటర్గా పనిచేసిన ఒకప్పటి దర్శకుడు దశరథ్.. ఇది 'తెరి' రీమేక్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇదంతా మొదలైంది. ఇప్పటికే అదే నిజమని చాలామంది ప్రేక్షకులు నమ్ముతున్నారు.మూవీ టీమ్ గానీ దర్శకుడు హరీశ్ శంకర్ గానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' దేనికి రీమేక్ కాదని గతంలో చెప్పారు. తాజాగా పలువురు జర్నలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలోనూ హరీశ్ శంకర్.. మరోసారి రీమేక్ గురించి స్పష్టత ఇచ్చాడు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే ఆసక్తికరంగా అనిపించాయి.(ఇదీ చదవండి: భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్)'తెరి మూవీలో ట్వింకిల్ ట్వింకిల్ అంటూ పాడే ఓ సీన్ ఉంటుంది. అది నా 'గబ్బర్ సింగ్' మూవీలోని అంత్యాక్షరి ఎపిసోడ్ని స్పూర్తిగా తీసుకుని తీశారు. నా సినిమాని పట్టుకుని తెరి చేస్తే.. నువ్వు 'తెరి' రీమేక్ చేస్తున్నావంటే నేను ఏం సమాధానం చెప్పాలో నాకర్థం కావట్లేదు' అని హరీశ్ శంకర్ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దాని దిగువన కామెంట్స్ చాలావరకు ఈ దర్శకుడికి వ్యతిరేకంగానే వస్తుండటం విచిత్రం.కెరీర్లో చాలా సినిమాలు చేసిన హరీశ్ శంకర్.. 'గబ్బర్ సింగ్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కానీ తర్వాత నుంచి ఒక్కటీ సరైన సినిమా తీయలేకపోతున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేశ్ లాంటి ఒకటి రెండు మూవీస్ ఆకట్టుకున్నప్పటికీ మరీ సూపర్ హిట్ కాలేకపోయాయి. హరీశ్ శంకర్ గత చిత్రం 'మిస్టర్ బచ్చన్' అయితే ఘోరమైన డిజాస్టర్. చూడాలి మరి హరీశ్ శంకర్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
క్రీడలు
యుద్ధ ప్రభావం.. అక్కడే ఇరుక్కుపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో ఇరుక్కుపోయింది. సౌతాఫ్రికాలో వైట్ బాల్ సిరీస్ ముగించుకున్న పాకిస్తాన్ జట్టు ఇవాళ (మార్చి 2) రాత్రి డర్బన్ నుంచి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉంది. అయితే, యుద్ధం కారణంగా దుబాయ్ విమానాశ్రయం మూసివేయడటంతో ఈ ప్రయాణం నిలిచిపోయింది. దీంతో పాక్ జట్టు డర్బన్లోనే ఆగిపోయింది. తిరుగు ప్రయాణంపై స్పష్టత లేకపోవడంతో పాక్ బృందం ఆందోళన చెందుతుంది. తమను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని పీసీబీకి విజ్ఞప్తులు చేస్తుంది.యుద్ధం కారణంగా అబుదాబీలో జరగాల్సిన పాకిస్తాన్ షాహీన్స్-ఇంగ్లండ్ లయన్స్ వన్డే సిరీస్ కూడా రద్దైంది. ఇక్కడే ఏర్పాటు చేసిన ఇంగ్లండ్ మహిళల జట్టు శిక్షణ కార్యక్రమం కూడా వాయిదా పడింది. యుద్ద ప్రభావం యావత్ క్రికెట్ ప్రపంచంపై పడే అవకాశం ఉంది. త్వరలో దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కూడా సందిగ్దంలో పడింది.ఇదిలా ఉంటే, పాక్ మహిళల క్రికెట్ జట్టు 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించింది. ఈ రెండు సిరీస్లను సౌతాఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే చివరిదైన మూడో టీ20లో గెలిచి పాక్ ఊరట పొందింది. డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాక్ 119 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది.
బీసీసీఐలో చేరిన హర్భజన్ సింగ్
భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐలో చేరాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, యువ స్పిన్నర్లకు మార్గదర్శకత్వం చేయనున్నాడు. ఇప్పటికే మరో భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ఫాస్ట్ బౌలర్లతో పని చేస్తున్నాడు. తాజాగా హర్భజన్ సింగ్ ఈ జాబితాలో చేరాడు.బీసీసీఐ మార్చి మొదటి వారంలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రాంలో రెడ్ బాల్ స్పెషలైజ్డ్ క్యాంపులు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ శిబిరాలు అండర్-19 మరియు ఇండియా A జట్లలో ప్రతిభ చూపిన ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. వీరిని త్వరలోనే సీనియర్ జట్టులోకి తీసుకురావడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. మరో దిగ్గజం కూడా..!యువ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత మాజీలు క్యూ కడుతున్నారు. జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ ఇప్పటికే రంగంలోకి దిగగా.. మరో దిగ్గజ బౌలర్ కూడా తన స్పెషలైజేషన్లో యువ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్టైమ్ గ్రేట్ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రిస్ట్ స్పిన్నర్ల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం కార్యక్రమాన్ని మరో భారత దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సమన్వయం చేస్తున్నారు. ఇతర మాజీ ఆటగాళ్లను కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి అతను సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, బీసీసీఐలో ఇలాంటి శిక్షణా శిబిరాలు కొత్తవి కావు. జగ్మోహన్ దాల్మియా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మాజీ ఆటగాళ్లను యువ క్రికెటర్లకు మార్గదర్శకులుగా ఆహ్వానించే పద్ధతి ప్రారంభమైంది. అప్పట్లో చందు బోర్డే, ఎరపల్లి ప్రసన్న, సయ్యద్ కిర్మాణి వంటి ప్రముఖులు జోనల్ అకాడమీ శిబిరాల్లో శిక్షణ ఇచ్చారు.
T20 WC 2026: చరిత్ర సృష్టించిన టీమిండియా
భారత పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఈవెంట్లలో 20 సార్లు సెమీఫైనల్స్కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టీ20 ప్రపంచకప్ 2026లో సెమీస్కు చేరడంతో ఈ ఘనత సాధించింది. భారత్ తర్వాత అత్యధిక సార్లు ఐసీసీ ఈవెంట్లలో సెమీస్కు చేరిన జట్లుగా ఆస్ట్రేలియా (18), న్యూజిలాండ్ (18) ఉన్నాయి. ఆతర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ (16), పాకిస్తాన్ (16), సౌతాఫ్రికా (15), శ్రీలంక (11), వెస్టిండీస్ (11), ఆఫ్ఘనిస్తాన్ (1), బంగ్లాదేశ్ (1), కెన్యా (1) జట్లు ఉన్నాయి.ఐసీసీ ఈవెంట్లలో భారత్ సెమీస్కు చేరిన సందర్భాలు..వన్డే వరల్డ్కప్- 8 సార్లు (1983, 1987, 1996, 2003, 2011, 2015, 2019, 2023)టీ20 వరల్డ్కప్- 6 సార్లు (1998, 2000, 2002, 2013, 2017, 2025)ఛాంపియన్స్ ట్రోఫీ- 6 సార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026*)కాగా, టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (మార్చి 1) జరిగిన సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్పై విజయం సాధించడంతో భారత్ సెమీస్కు అర్హత సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ (97 నాటౌట్) చారిత్రక ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా శాంసన్ సహనం కోల్పోకుండా కడదాకా క్రీజ్లో ఉండి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. మార్చి 4న జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్ 1 టాపర్ సౌతాఫ్రికా, గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడతాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి.
Abhishek Sharma: పరుగులు చేయకుంటే.. అవుటైపో!
టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. గ్రూప్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లతో మ్యాచ్లలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ డకౌట్ అయ్యాడు. ఇక నమీబియాతో మ్యాచ్కు అనారోగ్యం వల్ల దూరం అయ్యాడు.జింబాబ్వేతో మ్యాచ్లో మాత్రంఅనంతరం సూపర్-8 మ్యాచ్లో సౌతాఫ్రికాతో పోరులోనూ అభిషేక్ (Abhishek Sharma) విఫలమయ్యాడు. కేవలం 15 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఆ తర్వాత పసికూన జింబాబ్వేతో మ్యాచ్లో మాత్రం అర్ధ శతకం (30 బంతుల్లో 55) చేయగలిగాడు. అయితే, తాజాగా వెస్టిండీస్తో కీలక మ్యాచ్లో మాత్రం మరోసారి అభిషేక్ తేలిపోయాడు.అవుటైపోవడం బెటర్ఈ ఓపెనింగ్ బ్యాటర్ 11 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేసి నిష్క్రమించాడు. అకీల్ హొసేన్ బౌలింగ్లో షిమ్రన్ హెట్మైర్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ అభిషేక్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఓపెనర్ ఎంత వేగంగా ఆడితే అంత మంచింది.తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలి. అయితే, విండీస్తో మ్యాచ్లో అభిషేక్ ఆ పని చేయలేకపోయాడు. ఒకవేళ పరుగులు రాబట్టడంలో విఫలమైతే అవుటైపోవడం బెటర్. టీ20 క్రికెట్లో ఇది కీలకం.పవర్ప్లే అయ్యాక అతడు అవుటయ్యాడుపరుగులు తీయలేక ఇబ్బంది పడుతున్న బ్యాటర్ అవుటైతే వేరొకరికి అవకాశం వస్తుంది. నిజానికి వెస్టిండీస్ ఓపెనర్ షాయీ హోప్ ఈ నియమాన్ని పాటించకుండా పవర్ ప్లేలో మొత్తం క్రీజులో ఉండి జట్టును వెనుకపడేశాడు. పవర్ప్లే అయ్యాక అతడు అవుటయ్యాడు.ఇక అభిషేక్ శర్మ తొమ్మిది బంతుల్లో తొమ్మిది పరుగులే చేసి.. ఆ తర్వాత మరీ వెనుకబడ్డాడు. ఆ వెంటనే అవుటైపోయాడు. జట్టు ప్రయోజనాల కోసం అతడు రిస్క్ తీసుకునే సాహసం చేయలేదు’’ అని అభిషేక్ నాయర్.. అభిషేక్ శర్మ ఆట తీరును విశ్లేషించాడు.కాగా వెస్టిండీస్తో మ్యాచ్లో సంజూ శాంసన్ (50 బంతుల్లో 97 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో రాణించి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే.. విండీస్ కెప్టెన్, ఓపెనర్ షాయీ హోప్ 33 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అతడి స్లో బ్యాటింగ్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ మ్యాచ్లో విండీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. భారత్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్ ఫైర్
న్యూస్ పాడ్కాస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. కుటుంబ సభ్యులతోపాటు ఆర్మీ చీఫ్ ముసావీ కూడా మృతి... క్షిపణి దాడుల్లో హత్య చేసిన ఇజ్రాయెల్
భగ్గుమన్న పశ్చిమాసియా... ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు... భారీగా ప్రతిదాడులకు దిగిన ఇరాన్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు క్లీన్చిట్... కవిత, సిసోడియా సహా 23 మందీ నిర్దోషులే... ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
తిరుమల లడ్డూ ప్రసాదం, రాయలసీమ లిఫ్ట్పై ఏపీ శాసన మండలిలో చర్చించకుండా పలాయనం చిత్తగంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం
హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం... చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల హెచ్చరిక
మహాపచారం మీదే చంద్రబాబూ..! కల్తీనెయ్యి వివాదంలో చంద్రబాబు పాత నిర్ణయాలు వెలుగులోకి
ఏపీలో మరణ మృదంగం మోగిస్తున్న ‘పాల’కూట విషం. ఐదుకు చేరిన మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ కుంభకోణం.. అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ
తాత్కాలిక సుంకాలు 10 శాతం నుంచి 15 శాతానికి పెంపు... వెంటనే అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు చెల్లవ్... పన్ను విధింపు కాంగ్రెస్ అధికారం మాత్రమే... అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
బిజినెస్
రూ.3 లక్షలు దాటేసిన వెండి: కారణాలు ఇవే!
బంగారం ధరలు అమాంతం పెరుగుతూ.. పసిడి ప్రియులకు షాకిస్తున్న వేళ, వెండి రేటు కూడా కొండెక్కుతోంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ రేటు ఎలా ఉంది?, వెండి ధర పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటనేది ఇక్కడ, ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి ధర రూ. 3.15 లక్షలకు చేరుకుంది. ముంబై, బెంగళూరు, చెన్నైలలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.దేశంలోనిఇతర ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. సాధారణంగా ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా కేజీ సిల్వర్ ధర రూ. 3.15 లక్షలకు చేరుకుంది.వెండి ధరలు పెరగడానికి కారణాలు➤ప్రస్తుతం సిల్వర్ ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం.➤యుద్ధం కారణంగా.. పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి లోహాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.➤యుద్ధం కాకుండా.. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ యాక్ససరీస్ వంటి రంగాల్లో వెండికి భారీ డిమాండ్ ఉంది.➤డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో.. దానికి తగిన విధంగా సరఫరా ఉండాలి. సరఫరా తగ్గితే.. ధరలు తప్పకుండా పెరుగుదల దిశగా పరుగులు పెడతాయి.రాజకీయ, భౌగోళిక కారణాల వల్ల భారీగా పెరుగుతున్న వెండి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే సామాన్యులకు వెండి దూరమైపోతుంది.
విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు
దేశీయ విద్యుత్ రంగాన్ని ఆధునీకరించడమే కాకుండా, మార్కెట్ ఆధారిత వ్యవస్థగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ (ఎన్ఈపీ) 2026’ ముసాయిదాలో పొందుపరిచిన అంశాలు ఈ రంగాన్ని సమూలంగా మార్చనున్నాయి. జనవరిలో విడుదలైన ఈ ముసాయిదాపై మార్చి 19 వరకు ప్రజలు, నిపుణుల అభిప్రాయాలను కోరారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న వినూత్న పద్ధతులను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రవేశపెట్టడమే దీని ప్రధాన ఉద్దేశం.ప్రస్తుతం మన దేశంలో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్) తాము ఒప్పందం చేసుకున్న ప్లాంట్ల నుంచే విద్యుత్ పొందుతున్నాయి. కానీ కొత్త విధానం ప్రకారం, మార్కెట్ బేస్డ్ ఎకనామిక్ డెస్పాచ్ (ఎంబీఈడీ) అమలులోకి రానుంది. దీని ప్రకారం.. దేశంలోని విద్యుత్ ఉత్పత్తి అంతా ఒకే పూల్కు చేరుతుంది. అత్యంత తక్కువ ధరకు విద్యుత్ అందించే ప్లాంట్లకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గుతుంది.ఈ క్రమంలో వచ్చే ఆర్థిక లావాదేవీల చిక్కులను పరిష్కరించేందుకు ‘బైలేటరల్ కాంట్రాక్ట్ సెటిల్మెంట్’(బీసీఎస్)ను ప్రతిపాదించారు. ఉదాహరణకు, ఒక డిస్కమ్ యూనిట్కు రూ.4 చొప్పున ఒప్పందం చేసుకున్నా మార్కెట్ ధర రూ.3 ఉంటే.. డిస్కమ్ మార్కెట్ పూల్కు రూ.3 చెల్లించి మిగిలిన రూ.1 ఒప్పందం ప్రకారం సదరు ఉత్పత్తి సంస్థకు చెల్లిస్తుంది.కెపాసిటీ మార్కెట్స్తో నిరంతర సరఫరాసౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులు ప్రకృతిపై ఆధారపడతాయి. ఒకవేళ గాలి తగ్గినా లేదా ఎండ లేకపోయినా విద్యుత్ కొరత రాకుండా బ్యాకప్గా ఉండే ప్లాంట్లను సిద్ధం చేయడమే ‘కెపాసిటీ మార్కెట్స్’ ఉద్దేశం. ఎనర్జీ మార్కెట్లో సరఫరా చేసిన విద్యుత్తుకు డబ్బులు చెల్లిస్తే, కెపాసిటీ మార్కెట్లో విద్యుత్ అందుబాటును అనుసరించి రిటైనర్ ఫీజు తరహాలో చెల్లింపులు జరుగుతాయి. భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ను తట్టుకోవడానికి, గ్రిడ్ స్థిరత్వం దెబ్బతినకుండా ఉండటానికి ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.క్లౌడ్ ఎనర్జీ స్టోరేజ్ఇప్పటివరకు విద్యుత్ నిల్వ అనేది కేవలం పెద్ద కంపెనీలకు, భారీ ప్రాజెక్టులకే పరిమితం. కానీ ఎన్ఈపీ 2026 ముసాయిదా క్లౌడ్ ఎనర్జీ స్టోరేజ్ అనే విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇది ‘స్టోరేజ్-యాజ్-ఏ-సర్వీస్’ తరహాలో పనిచేస్తుంది. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే చిన్న వినియోగదారులు కూడా తమ వద్ద ఉన్న అదనపు విద్యుత్తును ఈ క్లౌడ్ వ్యవస్థలో నిల్వ చేసుకోవచ్చు లేదా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇది రిటైల్ స్థాయిలో నిల్వ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుంది.పీర్-టు-పీర్ ట్రేడింగ్మీ ఇంటి సోలార్ ప్యానెల్ ద్వారా తయారైన విద్యుత్తును పక్కింటి వారికో లేదా దగ్గర్లోని చిన్న దుకాణానికో నేరుగా అమ్ముకునే వీలు కల్పించడమే పీర్-టు-పీర్ ట్రేడింగ్. ఈ లావాదేవీల కోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ప్రోటోకాల్ను ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనివల్ల గరిష్ట డిమాండ్ ఉన్న సమయంలో గ్రిడ్పై ఒత్తిడి తగ్గుతుంది.ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే విద్యుత్ రంగం కేవలం ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థగా కాకుండా ఒక డైనమిక్ మార్కెట్గా మారుతుంది. ఇది వినియోగదారులకు చౌకగా విద్యుత్ అందించడంతో పాటు దేశ ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది.ఇదీ చదవండి: భారత చమురు మార్కెట్పై ‘యుద్ధ’ సెగ
భగ్గుమన్న బంగారం.. కియోసాకి ‘బ్లాస్ట్ ఆఫ్’ ట్వీట్
ప్రసిద్ధ ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి సాంప్రదాయ కరెన్సీలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బంగారం, వెండి, బిట్కాయిన్పై ఆశావాద వ్యాఖ్యలు చేశారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత అయిన కియోసాకి తన తాజా సోషల్ మీడియా పోస్టులో బంగారం ఒకే రోజులో 128 డాలర్లు పెరిగిందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో వెండి (Silver), బిట్కాయిన్ (Bitcoin) త్వరలో భారీగా ఎగిసిపడతాయని (బ్లాస్ట్ ఆఫ్) అభిప్రాయపడ్డారు.బంగారం ధరలుబంగారం ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరగడం మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇలాంటి పెరుగుదలలు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీ రేట్ల మార్పులు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత వంటి కారణాలతో చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మళ్లడం సాధారణం.వెండి, బిట్కాయిన్పై..కియోసాకి ప్రకారం వెండి కూడా బంగారం తరహాలోనే వేగంగా పెరిగే అవకాశం ఉంది. వెండి పారిశ్రామిక వినియోగం, విలువ నిల్వ అనే రెండు కోణాల్లో ప్రాధాన్యం కలిగి ఉండటంతో, మార్కెట్ చలనం సమయంలో ఎక్కువ ఒడిదుడుకులు చూపుతుంది. అలాగే బిట్కాయిన్ను డిజిటల్ గోల్డ్గా పేర్కొంటూ, కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థలపై అనిశ్చితి పెరిగితే క్రిప్టోకరెన్సీలకు మద్దతు పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.GOLD booms $128 in one day.Better news is silver and Bitcoin to blast off.Hang on.— Robert Kiyosaki (@theRealKiyosaki) March 2, 2026
దుబాయ్పై దాడులు.. బుర్జ్ ఖలీఫాకు ఇన్సూరెన్స్ ఉందా?
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ తారస్థాయికి చేరాయి. ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల నేపథ్యంలో (#IranWar) దుబాయ్ (Dubai) సహా యూఏఈలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ప్రధానంగా అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నప్పటికీ, పౌర ప్రాంతాలపైనా ప్రభావం పడుతోంది.ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) వద్ద అత్యవసర చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల రీత్యా టవర్ను ఖాళీ చేయించారు. ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు బుర్జ్ ఖలీఫా సమీపంగా వచ్చినప్పటికీ భవనం నేరుగా దెబ్బతినలేదని తెలుస్తోంది.బుర్జ్ ఖలీఫాకు బీమా ఉందా?ప్రస్తుతం జనంలో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఇదే. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించే ఈ ప్రతిష్టాత్మక నిర్మాణం వెనుక బలమైన బీమా వ్యవస్థ ఉందని తెలుస్తోంది.బుర్జ్ ఖలీఫా డెవలపర్ అయిన ఎమ్మార్ ప్రాపర్టీస్ కోసం సమగ్ర ‘ఆల్ రిస్క్’ ప్రాపర్టీ పాలసీని రూపొందించారు. ఈ కోర్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ను ఓమన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేయగా, ప్రధాన రీఇన్సూరెర్గా మ్యూనిచ్ రీ వ్యవహరించినట్లు సమాచారం.ఈ పాలసీ ద్వారా సుమారు 1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల వరకు (సుమారు రూ. 13,722 కోట్లు) నిర్మాణ వ్యయాన్ని కవర్ చేసినట్లు తెలుస్తోంది. భవనం యాజమాన్యానికి ఇది వర్తించగా, టవర్లోని అపార్ట్మెంట్లు, హోటల్ ఇంటీరియర్స్, కార్యాలయాలు వంటి వాటికి ఆయా యజమానులు వేర్వేరుగా బీమా తీసుకుంటారు.యుద్ధ ప్రమాదాలకు వర్తిస్తుందా? దుబాయ్లోని ఎమ్మార్ యాజమాన్యంలోని ప్రధాన ఆస్తులు సాధారణంగా రాజకీయ హింస, ఉగ్రవాదం, అల్లర్లు, పౌర గందరగోళం, దండయాత్ర, శత్రుత్వం (యుద్ధం ప్రకటించినా, లేకపోయినా), అంతర్యుద్ధం వంటి ప్రమాదాలకు బీమా రక్షణ కలిగి ఉంటాయని బీమా వర్గాల సమాచారం.అయితే పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితులు చాలాసార్లు పాలసీల్లో మినహాయింపులుగా ఉండే అవకాశముంది. క్షిపణి దాడి వంటి ఘటనలు ‘ఉగ్రవాదం’ లేదా ‘రాజకీయ హింస’ కింద పరిగణిస్తారా? లేక ‘యుద్ధ ప్రమాదం’ కింద వస్తాయా? అనేది పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.బుర్జ్ ఖలీఫా నిర్మాణ వ్యయం సుమారు 1.4 నుంచి 1.5 బిలియన్ డాలర్లుగా అంచనా. ప్రస్తుత కాలంలో ఆ ఖర్చు 3.5 బిలియన్ డాలర్ల వరకు (సుమారు రూ.32 వేల కోట్లు) ఉండవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాదు, ఈ టవర్ ఆధారంగా అభివృద్ధి చెందిన డౌన్టౌన్ దుబాయ్ ప్రాజెక్ట్ మొత్తం విలువ 20 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: ఆ యుద్ధం అందుకే.. కియోసాకి సంచలన ట్వీట్
ఫ్యామిలీ
బతుకు కోసం కాదు..గుర్తింపు కోసం చేసిన పోరాటం..!
‘నేను జీవించే’ ఉన్నాను.. నమ్మండి..‘దెయ్యాన్ని’ కాదు.. మీలా మనిషినే.. అంటూ ఓ వ్యక్తి ‘తన ఉనికి’ కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు సాగించాడు.. గుర్తింపు కోసం అభ్యర్థించాడు... ఛీత్కారాలు.. చీదరింపులకు గురయ్యాడు. అయినా తన పోరాటం.. ఆపలేదు. కోర్టు మెట్లెక్కాడు.. చివరికి తాను బతికే ఉన్నానని నిరూపించుకున్నాడు. వ్యవస్థలో లోపాల్ని లోకానికి ఎలుగెత్తి చాటాడు.. డబ్బులకు కక్కుర్తిపడి కొంతమంది ఉద్యోగులు బతికున్నోడ్ని ‘కాగితాల్లో’ ఎలా చంపేస్తున్నారో బహిర్గతం చేశాడు.. ఇది బతుకు కోసం చేసిన పోరాటం కాదు. ‘నేను బతికే ’ ఉన్నానని ఓ వ్యక్తి రెండు దశాబ్దాల పాటు సాగించిన ‘గుర్తింపు’ పోరాటం. అతడే లాల్ బిహారి. ఉత్తర్ప్రదేశ్లోని ఖలీలాబాద్కు చెందిన లాల్ బిహారి సన్నకారు రైతు. వారసత్వంగా వచ్చిన అతని భూమిని కొట్టేసేందుకు బంధువులు అతడు చనిపోయినట్టు రికార్డులు సృష్టించారు. అవినీతి అధికారులు వారికి సహకరించారు. డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో బిహారి ‘లీగల్’గా చనిపోయాడు. ఎలా బయటపడిందిఅంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలనుకున్నాడు లాల్ బిహారి. 1976లో తన 22వ ఏట ఓ చిరు వ్యాపారం కోసం బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకున్నాడు. నివాస ధ్రువపత్రం కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాడు. అప్పుడే అతనికి ‘తాను చనిపోయాననే ‘చావు కబురు ’ తెలిసింది. అధికారి చెప్పిన ఆ మాట విని గుడ్లు తేలేశాడు.. భయం.. భయంగాబిహారి ‘చనిపోయాడనే’ వార్త ఊరంతా వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల వారు అతన్నో దెయ్యంలా, బతికే ఉన్నాడా.. అనే అనుమానపు చూపులతో వేధించేవారు. చిన్న పిల్లలు సైతం ఆట పట్టించేవారు. బంధువులు అతన్ని దూరం పెట్టారు. న్యాయ పోరాటం తాను బతికే ఉన్నట్టు నిరూపించుకునేందుకు లాల్ బిహారి ప్రయత్నాలు ప్రారంభించాడు. స్థానిక అధికారిని కలిసి రికార్డులు సరిచేయాలని కోరాడు. తమ తప్పును సరిదిద్దేందుకు వారు ససేమిరా అన్నారు. తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో రికార్డులను సరి చేయాలని, తాను జీవించే ఉన్నానని అధికారికంగా ప్రకటించాలని కోర్టు మెట్లెక్కాడు. కేసు వాయిదాలు పడుతూనే ఉంది. ఏళ్లు గడిచినా ఎటూ తేలకపోవడంతో ఉద్యమ బాట పట్టాడు. అధికారుల తీరుకు నిరసనగా తన పేరు చివరిలో ‘మృతక్’ (చనిపోయిన) అని తగిలించుకున్నాడు. అప్పటి నుంచి ‘లాల్ బిహారి మృతక్’ అని పిలవడం మొదలు పెట్టారు. తాను చనిపోయాను కాబట్టి తన భార్యకు వితంతు పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన సమస్యను వెలుగులోకి తెచ్చేందుకు మాజీ ప్రధానులు రాజీవ్గాంధీ, వీపీ సింగ్లపై ఎన్నికల్లో పోటీకి సైతం దిగాడు. ఇలా అయినా తన ‘బతుకు’ పోరాటం చర్చనీయాంశం అవుతుందని భావించాడు. ‘మృతక్’ సంఘం ఆవిర్భావంఇది తనొక్కడి సమస్యే కాదని, ఉత్తరప్రదేశ్లోని కొంతమంది అవినీతి అధికారుల కారణంగా తనలాంటి అనేకమంది ‘రికార్డుల్లో’ చనిపోయారని అతనికి తెలిసింది. దీంతో ‘మృతక్ సంఘం’(అసోసియేషన్ ఆఫ్ ది డెడ్) ఏర్పాటు చేశాడు. బతికే ఉన్నా, రికార్డుల్లో చనిపోయిన వారి హక్కుల కోసం ఈ సంఘం పోరాటం ప్రారంభించింది. వందలాది మంది ఈ సంఘంలో చేరారు. జాతీయ/అంతర్జాతీయ మీడియా సైతం ఈ వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. మీడియాలో వార్తలు.. మానవహక్కుల సంఘాల ఆందోళనలు.. ఇలా అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అలుపెరగని అతని పోరాటం చివరికి ఫలించింది. ‘అతడు బతికే ఉన్నాడు’ అని 1994లో ప్రభుత్వం గుర్తించింది. ‘లైవ్’ సర్టిఫికెట్ జారీ చేసింది. కోర్టు తీర్పు కూడా అనుకూలంగా వచ్చింది. ఇది అతనొక్కడి విజయం కాదు, తనలా పోరాటం చేస్తున్న అనేక మందికి ఆ విజయం దక్కింది. అయితే బిహారి తన పోరాటాన్ని ఇంతటితో ముగించలేదు. తనలా నష్టపోయిన వారికి అండగా పోరాటాన్ని కొనసాగించాడు. లాల్ బిహారి కేసు ఓ వ్యక్తి బతుకు పోరాటంగా మాత్రమే మనం చూడకూడదు. సమాజంలో వేళ్లూనుకున్న అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, కోర్టుల్లో కేసుల సాగదీత.. న్యాయం కోసం ఏళ్లతరబడి ఎదురుచూపులు.. వంటి వైకల్యాల్ని తేటతెల్లం చేస్తోంది. అవమానాలు..అడ్డంకులు, ప్రతికూలతలు ఎదురైనా న్యాయం కోసం ఓ సామాన్యుడు సాగించిన పోరాటం, సాధించిన విజయం బాధితులకు, సమాజానికి స్ఫూర్తిదాయకం.తెరకెక్కిన ‘కాగజ్’లాల్ బిహారి కేసు ఎంతోమందిని ఆకర్షించింది. పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఎంతోమందికి అతని పోరాట గాథను కథలుగా మలిచారు. డాక్యుమెంటరీలు రూపొందించారు. సతీష్ కౌశిక్ అనే బాలీవుడ్ దర్శకుడు ‘కాగజ్’ పేరుతో 2021తో బిహారి పోరాటగాథను వెండి తెరకెక్కించారు. దిలీప్ మాదిరెడ్డి (చదవండి: సామాన్యురాలిలా కనిపించే అసామాన్య 'సువర్ణ'..! ఆమె ఆత్మవిశ్వాసానికి సలాం కొట్టాల్సిందే..)
కథాకళి: నల్లని వెన్నెల
సన్నగా తెల్లగా ఉండే ఇరవై ఆరేళ్ళ సప్తపర్ణి ఎప్పుడూ తెల్ల నూలు చీరలే కడుతుంది. నల్లటి స్టికర్ బొట్టు పెట్టుకుంటుంది. ఆ రోజు ప్రభంజన్ లంచ్ అవర్లో తన బ్రేకప్ గురించి చెప్పాడు.‘‘బ్రేకప్, నల్లటి వెన్నెల. అవి రెండు రంగులూ కలిసి ఉంటాయి.’’‘‘అవును. మనిద్దరి బ్రేకప్లు ఒకే రోజు జరిగాయి!’’ ఆమె చెప్పింది.‘‘అమ్మ నన్ను పెళ్ళి చేసుకోమని పోరుతోంది. మీ అమ్మ కూడా నిన్ను పోరుతూండచ్చు. కలిసి ప్రయాణించినా, కలిసి ఉన్నా ఓ మనిషి గురించి ఇంకో మనిషి ఎక్కువగా అర్థం చేసుకోగలడు. మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. పాంజిమ్కి వెళ్దాం. అక్కడ ఒకరి ముందు మరొకరం లోదుస్తులని మాత్రం విప్పద్దు.’’ఆమె సరే అనడానికి కొన్ని రోజులు తీసుకుంది.సెలవులు రాగానే ఇద్దరూ ప్రయాణమయ్యారు. మాలాలోని ఏర్ బీఎన్బీకి చేరుకున్నాక, అతని ఐడీని చెక్ చేసి, స్టుడియోని హేండ్ ఓవర్ చేశారు. ఆమె మొహం కడుక్కోగానే పెర్క్లేటర్లో కాఫీ కలిపి ఇచ్చాడు. ఆమె స్నానం చేశాక చెప్పాడు.‘‘కూరగాయలు తెచ్చాను. ఇద్దరం కలిసి వంట చేద్దాం. నేను సాంబార్ మాస్టర్ని.’’సైట్ సీయింగ్ నుంచి తిరిగి వచ్చాక సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశారు. అతను యూట్యూబ్లో రాజేష్ ఖన్నా ఇన్స్ట్రుమెంటల్ మెలోడీస్ పెట్టాడు. ‘ఓ మెరే దిల్ కె చెయిన్’... ‘రూప్ తెరా మస్తానా’...‘‘ఇఫ్ యు డోంట్ మైండ్...’’ కొద్దిసేపాగి చెప్పాడు.ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని ఆమె మెళ్ళోని బంగారు గొలుసుతో ఆడుకోసాగాడు. ఆ ఆడియో అయ్యాక ‘జెంటిల్మేన్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ పెట్టి, ఆమె పొత్తి కడుపుకి తలని ఆనించి, ఆమె నడుం చుట్టూ చేతులు వేసి చెప్పాడు.‘‘బద్ధకపు బ్రహ్మ! నేను పుట్టిన రోజే నువ్వు మా పక్కింట్లో పుడితే, ఇంతకాలం నిన్ను మిస్ అయ్యేవాడిని కానుగా.’’ఇద్దరూ రాత్రి ‘ఎయిటీన్ జూన్’లోని ‘యాంగ్రీ సర్దార్జీ’ హోటల్లో భోజనం చేశారు. తను వంట ఎందుకు నేర్చుకుంది, ఏడాది పెద్దయిన అన్నయ్యతో సమష్టిగా నీవి, నావి అనే తేడా లేకుండా బట్టలు వాడటం... చాలా చెప్పాడు. ఆ రాత్రి ఆపిల్ని నిలువు ముక్కలు కోసి ఆమె నోటికి అందించాడు.‘‘నువ్వు నాకు కావాలి డకీ.’’ మంచం మీద చేరాక చెప్పాడు.అతను కుడిచేతి చూపుడువేలితో ఆమె జుట్టుని, కనుబొమలని, కళ్ళని, చెంపలని, ముక్కుని, చెవుల్ని, చిటికెన వేలుతో చెవుల్లోని భాగాన్ని, గడ్డాన్ని మృదువుగా మిల్లీమీటర్ మిస్ అవకుండా స్పర్శించాక అడిగాడు.‘‘నోరు తెరు.’’ ఆమె తెరిస్తే, వేలితో నాలికని, నాలిక కింద భాగాన్ని, దవడ లోపలి, పై భాగాన్ని స్పర్శించాక, ఆమె చేతుల్ని, చేతివేళ్ళ మధ్య భాగాన్ని, మెడ, నడుము, కాలి వేళ్ళ మధ్యని... అరిపాదాల దాకా స్పర్శిస్తూంటే ఆమె దాన్ని అనుభవించింది. వేలిని తన నాలికతో నాకి చెప్పాడు.‘‘చేదనేదే లేదు. అంతా తీపే. ఓ చోట చక్కెర, ఇంకోచోట తేనే, మరోచోట మకరందం. చిన్నప్పుడు పూలని కోసి కాడని నోట్లో ఉంచుకుని తాగిన మకరందం.’’ఆ రాత్రి సప్తపర్ణి తన బాల్యం గురించి చెప్పింది. ఆమె కాసేపటికి అటు తిరగగానే చెప్పాడు.‘‘ఇటు తిరుగు డకీ. నువ్వు అటువైపు తిరిగితే నాకు దూరమయ్యావు అనిపిస్తోంది.’’ఆమె మళ్ళీ అతనివైపు తిరిగాక, ఆమె నడుము మీద చేతిని, ఆమె కాలు మీద తన కాలుని వేసి, కళ్ళు మూసుకుని చెప్పాడు.‘‘ఇప్పుడు ఎంతో భద్రంగా ఫీల్ అవుతున్నాను.’’ఒకవైపే తిరిగి పడుకోవటం అసౌకర్యంగా ఉండటంతో అతను నిద్రపోయాక, అతని నుదుటి మీద చుంబించి, అవతలివైపుకి తిరిగి పడుకుంది. ‘డకీ’ అంటే ‘ప్రియమైన, ముద్దుల’ అని గూగుల్ చేసి తెలుసుకుంది.‘‘ఇది నీ మొహానికి నప్పుతుంది. బ్లాక్ స్టికర్ బాలేదు.’’ప్రభంజన్ మర్నాడు ఎడమ చేత్తో ఆమె చుబుకం పట్టుకొని, తనతో తెచ్చిన సింగార్ ఎర్ర తిలకం ట్యూబ్లోంచి పుల్లని తీసి, చిన్న పిల్లలు కదలకుండా అటెన్షన్ కోసం ‘ళో, ళో, ళో’ అన్నట్లుగా అంటూ ధనియం గింజంత బొట్టుని దిద్ది జుట్టుని దువ్వాడు.లంచ్లో కేబిన్లో ్రౖఫై డ్ రైస్, మష్రూమ్ కర్రీని ఆమెకి స్పూన్తో తినిపించాడు. ఆమె మనసు తడైంది. తన తాత తర్వాత మొక్కజొన్న గింజలని వొలిచి ఇచ్చింది, జడవేసింది, బొట్టు పెట్టింది, నోటికి తినిపించింది ఇతనే అనుకుంది.ఆ మూడు రోజులు అతను తన స్పర్శని వదలలేకపోవడం గుర్తించింది. ఇంట్లో జుట్టు కొసలని నిమురుతూ, భుజానికి తన తలని ఆనించి, తన నడుం చుట్టూ, లేదా భుజం మీద చేతిని వేసి, బయట చేతిని పట్టుకునే ఉంటాడు.ఆ రాత్రి మెలకువ వచ్చిన ప్రభంజన్ చేత్తో తడిమితే ఆమె ఒళ్ళు తగల్లేదు. కళ్ళు తెరిచి చూస్తే, కాళ్ళు మడిచి, మోకాళ్ళల్లో తల ఉంచుకొని ఏదో ఆలోచించే ఆమె కనిపించింది. అతను నిద్రమత్తులో ఆమె తలని తన ఛాతీ మీదకి జరిపి ‘పడుకో’ అని ఆమె వీపు మీద చిచ్చి కొడుతూ నిద్రపోయాడు.రైలు కాచిగూడ స్టేషన్కి చేరుకోడానికి ముందు సప్తపర్ణి అతనితో చెప్పింది.‘‘ప్రభూ. ఈ మూడు రోజుల్లో నన్ను నేను తెలుసుకున్నాను. ఈ మూడు రోజులూ నీ ప్రేమని అనుభవిస్తూంటే నా మనసు ఉక్కిరిబిక్కిరైంది. నీలో మా తాతని, ప్రేమికుడిని, తల్లి దూరమైపోతుందని భయపడే పిల్లవాడిని చూశాను. నిన్ను కోల్పోతే, తాతని కోల్పోయి నేను అనుభవించిన క్షోభకి ఎన్నో రెట్లు... అది తట్టుకోలేను. సామాన్య ప్రేమని తప్ప నువ్విచ్చిన లాంటి ప్రేమని కోల్పోవడం తట్టుకో... నన్ను నీలా ఎవరూ ప్రేమించలేరు. మనం పెళ్ళి చేసుకోవద్దు.’’అతను ఆమెవైపు విభ్రాంతిగా చూశాడు. ఇద్దరూ ఒకరి కన్నీటిని మరొకరు తుడిచారు. స్టేషన్లోంచి బయటికి వచ్చాక, చెరో ఆటో ఎక్కేముందు ప్రభంజన్ ఆమె చేతిలో ఎర్ర తిలకం ట్యూబ్ని ఉంచాడు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి
అయ్యో... అత్తరికం!
ఉదయం 5 గంటలు.. పేపర్ బాయ్ ప్రతి ఇంటి గుమ్మానికి పేపర్ వేసుకుంటూ సైకిల్ మీద వెళ్తుంటే, మరోపక్క ఒక ఫేమస్ కోచింగ్ సెంటర్ బయట పెద్ద లైన్స్ . ఆ లైన్స్ లో వయసుపైబడిన వందలాది మంది ఆడవాళ్లు.తలపై బట్టలు కట్టుకుని, చేతిలో ఫైళ్లు పట్టుకుని, కళ్లల్లో పిల్లలు పరీక్ష రాసేటప్పుడు ఉండే టెన్షన్స్ తో నిల్చున్నారు! ఆ లైన్స్ మధ్యలో యాభై ఐదేళ్ల ఇన్నోసెంట్ మామ్ టైప్ మహిళ లలిత. మిగతా వాళ్లంతా భయంతో, టెన్షన్స్ తో ఉంటే, ఆమె మాత్రం కూల్గా, ఎగ్జామ్ పేపర్ ముందే తెలిసిన స్టూడెంట్లా కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. ఆ నవ్వులు చిందిస్తున్న ముఖాన్ని గమనించిన వెనుక నిల్చున్న మహిళ ఓపిక పట్టలేక అడిగింది: ‘‘నువ్వెన్నిసార్లు ఈ ఎగ్జామ్ రాశావు?’’లలిత నవ్వుతూ ‘‘ఇదే ఫస్ట్ టైమ్!’’ అంటే, వెంటనే ఆమె వంకరగా నవ్వుతూ ‘‘ఓహో! అందుకేనా, ఇంత కాన్ఫిడెన్స్.నాకిది పదోసారి!’’లలిత ఆశ్చర్యంగా ‘‘ఏమయ్యింది? ఎందుకు అన్నిసార్లు ఫెయిల్ అయ్యావు?’’అంటే ఆమె ‘‘నా పేరు సూర్యకాంతం.’’లలిత ఒక్కసారిగా ‘‘అయ్యో! అందుకేనా పాస్ కాకుండా ఉన్నావు? నా పేరు లలిత. నేను చాలా మంచి అత్తను అబ్బా! అందుకే నాకు ఇంత కాన్ఫిడెన్స్. పైగా మా మేనకోడలు కూడా నన్ను మెచ్చుకుంది. ఈ కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికెట్ తీసుకుంటే, ఇక పెళ్లికి ఏ అభ్యంతరం లేదని చెప్పింది!’’సూర్యకాంతం బాధగా ‘‘నా పేరు చెప్పగానే, నన్ను ‘గయ్యాళి అత్త’ లిస్ట్లో పెడతారు. వచ్చిన సంబంధాల్లో సగం ఇంటివరకు కూడా రాకుండానే ఆగిపోతుంటాయి. వచ్చినవి కూడా నేను సమాధానం సరిగా చెప్పలేదని పోతున్నాయి.’’లలిత నవ్వుతూ ‘‘ఏం చేస్తాం! ఇంతకాలం పెళ్లి చూపుల్లో అత్తలే ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడు కోడళ్ల రాజ్యం కదా! అందుకే కోడళ్లే అత్తలను ప్రశ్నలు అడుగుతున్నారు!’’అది విని సూర్యకాంతం తన గోడు చెప్పుకోవడం మొదలుపెట్టింది. ‘‘ఇప్పుడున్న కోడళ్లు ప్రతి ఒక్కరు పరీక్షలు, షరతులు, రౌండ్స్. ఇలా వచ్చిన సంబంధాలన్నింట్లోనూ నేను ఫెయిల్. అందుకే మా వాడు ఈ ‘ఉత్తమ అత్త ట్రైనింగ్ సెంటర్’లో చేర్పించాడు. ఇక్కడ పెళ్లి చూపుల్లో పాస్ అయ్యేలా ట్రైనింగ్ ఇస్తారట!’’లలిత ‘‘అంటే ఇప్పటివరకు ఎంతమంది కోడళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పావ్?’’సూర్యకాంతం తల పట్టుకుని ‘‘మొదట సైలెంట్ కోడలు. ఆ అమ్మాయికి మాట్లాడటం ఇష్టం లేదు. నన్ను ఐదు నిమిషాలు నోరు మూసుకోమంది. నేను కిచెన్స్ లో మాడు వాసన వచ్చిందని, ‘పొయ్యి మీద ఏదో పెట్టి మర్చిపోయావమ్మా?’ అన్నా. అంతే, ఆ సంబంధం క్యాన్సిల్!’’లలిత ‘‘ఆహా! రెండోసారి?’’‘‘రెండోసారి మోడ్రన్స్ కోడలు. ‘నా పుట్టినరోజుకి ఏఐ యానిమేటెడ్ వీడియో చేసి రీల్ పెడతావా?’ అంది. నాకు అవి రాదనగానే ఆ సంబంధం కూడా ఫెయిల్.’’ఇంతలో లైన్ ముందుకు కదిలింది. ఇద్దరూ కూడా నడుస్తూనే మాటలు. సూర్యకాంతం ఎమోషనల్ ఫ్లోలో చెప్తూ.. ‘‘మూడోసారి వచ్చిన కోడలైతే వరుస ప్రశ్నలు:మీకు కొడుకు, కోడలును విడదీసే ప్లాన్స్ ్స ఏమైనా ఉన్నాయా?మీకు కాళ్లు చేతులు బాగానే పనిచేస్తున్నాయా? లేదా కోడలు వచ్చాక మంచాన పడతారా?మీకు చాడీలు చెప్పే అలవాటు ఉందా? మీ కూతురుతో నన్ను కంపేర్ చేస్తారా?నేను సంతోషంగా ఉంటే మీ మూతి వంకరపోతుందా? మీకు పెళ్లి అయిన రెండో నెలలోనే కోడలికి కడుపు రావాలని కోరుకుంటారా? మీ పని మీరు చూసుకుంటారా? లేదా అన్ని పనులూ మీరు చెప్పినట్లే చేయాలని అంటారా? మీ కోడలు బంగారం, కారు లేదా ఖరీదైన వస్తువులు ఏమైనా కొంటే, మీ బీపీ పెరిగిపోతుందా?మీ కూతురుకి పుట్టిన పిల్లలు అబ్దుల్ కలాంలానూ, కోడలికి పుట్టిన పిల్లలు ఆవారాగానూ కావాలనే కోరికలు ఏమైనా ఉన్నాయా? అని వరుస ప్రశ్నలతో నన్ను ఆసుపత్రికి పంపించింది!’’సూర్యకాంతం ఇవన్నీ చెప్తుంటే, లలిత ముఖం చిన్నబోయింది.‘‘ఇన్ని అడుగుతారా?’’ అంటూ ఆశ్చర్యంగా అడిగింది.సూర్యకాంతం ‘‘ఇంకా ఏం! ఫిజికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారు! అత్తమామలకు షుగర్, బీపీ ఉంటే ముందే రిజెక్ట్ చేస్తారు. నాకు షుగర్ లేదు కానీ బీపీ ఉంది!’’ అనగానే లలిత నవ్వు ఆపుకోలేకపోయింది.వెంటనే, సూర్యకాంతం ‘‘ఇప్పుడు వచ్చిన సంబంధం చాలా బాగుంది. మా వాడు ఎలాగైనా పాస్ అవ్వమ్మా అని రోజూ బతిమాలుతున్నాడు. ఆ సంబంధానికి మూడు రౌండ్ల పరీక్ష మెయిన్స్ ్స, ఇంటర్వ్యూ, ప్రాక్టికల్స్ అంట!’’లలిత ‘‘ఏంటీ ప్రాక్టికల్స్?’’సూర్యకాంతం ‘‘పెళ్లికూతురు రెండు రోజులు మా ఇంటికి వచ్చి నన్ను గమనిస్తుందట!’’పక్కనే మరో మహిళ వచ్చి ‘‘అప్పుడు నువ్వు ఉదయం లేవగానే ‘గుడ్ మార్నింగ్’ అంటూ టీ ఇచ్చేసి మచ్చిక చేసుకో! సెట్టయిపోతుంది!’’ వారిద్దరూ నవ్వుకున్నారు.సూర్యకాంతం మరోసారి విషయానికి వచ్చి ‘‘పాతకాలంలో అత్తలు చేసిన పెత్తనం ఫలితమే ఇదంతా, ఇప్పుడది తిరిగి మనకు శాపంగా మారి కోడళ్ల రాజ్యం వచ్చేలా చేసింది. వాళ్లే బాగుండి ఉంటే మనకు ఈ బాధ ఉండేదే కాదు.’’వెంటనే, వెనుక నిల్చున్న రాధ స్పందిస్తూ, ‘‘అవునమ్మా! మా అత్త నన్ను పెళ్లి చూపుల్లోనే నడవమని చెప్పి, ఇంట్లో పనులకు బాగా పనికి వస్తానా లేదా చెక్ చేసుకుంది! ఇక పెళ్లి తర్వాత అయితే, కూర్చోవడం నుంచి ఎలా నవ్వాలో, ఏడ్వాలో కూడా డైరెక్షన్స్ ఇచ్చేది!’’వెంటనే మరో మహిళ ‘‘ఇక ఏ రోజు అయినా, నేను కాస్త ఆరోగ్యం బాగోలేక మంచం మీద వాలితే చాలు, మా అత్త ఆసుపత్రిలో అడ్మిట్ అవుతుండేది. ‘ఈ కోడల్ని నేనే చూసుకోవాలేమో!’ అన్న భయంతో!’’మళ్లీ మరో మహిళ వాయిస్– ‘‘మా అత్త అయితే, మా ఆడపడుచుతో ఫోన్స్ మాట్లాడేటప్పుడు సిగ్నల్ బాగోలేదంటే నా దగ్గరే అన్స్ లిమిటెడ్ కాల్ రీచార్జ్ చేయించుకునేది!’’సూర్యకాంతం నవ్వుతూ ‘‘అదేమిటి! సీరియల్స్ చూసి స్ట్రాటజీలు నేర్చుకోవడానికి అన్స్ లిమిటెడ్ నెట్, డిష్ రీచార్జ్లు కూడా నీతోనే చేయించుకునేదని మర్చిపోయావా?’’వెంటనే అందరి దగ్గర నవ్వులు ‘‘అవునవునూ’’ అని అందరూ ఒకటేసారి రెచ్చిపోయారు.మరొక మహిళ ‘‘ఇంతకు ముందు అత్తలు కట్నాల కోసం మాత్రమే కష్టపెట్టేవారు. మన అత్తలు కట్నాలతో పాటు కోడళ్ల జీతాలు అడిగితే లోకం మారదూ!’’సూర్యకాంతం కాస్త ఊపిరి వదిలి ‘‘అందుకే పాత అత్తల వేషాలు చూసి అప్పటి కోడళ్లు అమ్మాయిలనే కనేసి ఈ బాధను రివర్స్ చేశారు.’’లలిత ‘‘కాని, ఇప్పుడు కూడా బాధితులం మనమే అయ్యాం కదా!’’సూర్యకాంతం పెదవి తిప్పేస్తూ, ‘‘అవును, కాని, మేం కూడా బాధితులమే. అయినా మేం మా అత్తల్లాగా చేయం. కావాలంటే ఏ వృద్ధాశ్రమంలో అయినా చేరుతాం. కావాలంటే సపరేట్గానైనా ఉంటామని చెప్పినా కూడా ‘పరీక్ష పాస్ అయితేనే పెళ్లి!’ అని పెళ్లికూతుళ్లు, వాళ్ల తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చెప్తున్నారు.’’లలిత ‘‘అంటే అప్పుడు, ఇప్పుడు కూడా కష్టాలు పడాల్సింది మనమేనా?’’సూర్యకాంతం ‘‘అవునమ్మా, నాకు అబ్బాయి పుట్టిన రోజు.. ఎంత ఊపిరి పీల్చుకున్నానో! నాకు కూతురు పుట్టలేదు, హమ్మయ్య అని. పైగా అబ్బాయి పుట్టినందుకు శివయ్యకు వెయ్యి టెంకాయలు కొట్టి, మొక్కు చెల్లించుకున్నా.’’వెంటనే వెనక ఉన్న మరో ఫెమినిస్ట్ బామ్మ యాంగ్రీ బర్డ్ ఫేస్ పెట్టి.. ‘‘అదేంటీ? అమ్మాయి పుట్టకూడదని అనుకున్నావా? ’’ అని కాస్త గట్టిగానే అడిగింది. పాత కాలంలో అత్తలు చేసిన పెత్తనం ఫలితమే ఇదంతా, ఇప్పుడది తిరిగి మనకు శాపంగా మారి కోడళ్ల రాజ్యం వచ్చేలా చేసింది. వాళ్లే బాగుండి ఉంటే మనకు ఈ బాధ ఉండేదే కాదు. అందరూ ఒక క్షణం అయిష్టంగా చూడగా.. సూర్యకాంతం చాలా శాంతంగా ‘‘నువ్వు కాస్త ఆగుతావా.. మొదట మా అత్త వేసే వేషాలు చూసి, నా మాదిరే మా కూతురు కూడా కష్టపడి చదువుకొని, సంపాదించి చివరికి ఇంట్లో ఇలా ప్రతిక్షణం పరీక్షలు రాసుకుంటూ బతకాలి అనిపించి. అలా అనుకున్నానమ్మా!’’ అదంటూనే క్యూలో ఉన్న అత్తలందరూ సేమ్ ఫీలింగ్తో తల ఊపారు.‘‘ఇప్పుడిలా అమ్మాయిల జీవితాలు స్మార్ట్గా, స్వేచ్ఛగా మారి, అబ్బాయిల తల్లులకే ఇలాంటి శిక్షలు వస్తాయని తెలిసుంటే, అప్పుడే ఆ టెంకాయలన్నీ నా తల మీదే కొట్టుకునేదాన్ని!’’అని సూర్యకాంతం ముఖం చిట్లించగానే, మొత్తం క్యూలో నిల్చున్న అత్తలందరూ, ‘సాడ్ ఫేస్’ పెట్టుకున్నారు. అప్పుడే పక్కన ‘‘సమోసాలమ్మా! సమోసాలు!’’ అని ఓ అబ్బాయి అటుగా వెళ్తుంటే, సూర్యకాంతం అతన్ని ఆపి, ‘‘ఓ బాబు, నాలుగు సమోసాలు పెట్టమ్మా. కాస్త కడుపు నింపుకుందాం.’’ అని డబ్బు అతని చేతికి ఇచ్చింది. అతను కూడా ఓ పేపర్లో సమోసాలు ఇచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సూర్యకాంతం ఒకటి గబగబా కొరికేసి, పేపర్ వైపు చూసింది.‘‘అయ్యో! ఇది ఇవాళ్టి పేపరే కదా? అప్పుడే ఉదయం పేపర్, బజ్జీల బండికి వచ్చేసిందా?’’ అని తలపైకెత్తి చూస్తూ, ‘‘ఏంటీ? నా బాధ చెప్పేలోపే సాయంత్రం అయిపోయిందా?’’ అని కోచింగ్ సెంటర్ గేట్ దగ్గరకు పరుగులు తీసింది. ఇంతలో ఒక సెక్యూరిటీ గార్డు క్లోజింగ్ బోర్డ్ గేటుకు తగిలిస్తూ.. ‘‘ఇవాళ్టి అడ్మిషన్స్ అయిపోయాయి! రేపు ఉదయం మళ్లీ ట్రై చేయండి! ’’ అని చెప్పి, సూర్యకాంతం బ్యాచ్ను అక్కడి నుంచి పంపించేశాడు. సూర్యకాంతం మూడు సమోసాలు చేతిలో, నాల్గోది నోట్లో పెట్టుకుని నడుస్తూ ‘‘అమ్మో! ఈ కోచింగ్ సెంటర్ అడ్మిషన్స్ దక్కలేదంటే నా కొడుకు ఎంత ఫీల్ అవుతాడో! పాపం!’’అంటూ కాస్త భయంగా, ఇంకాస్త సంతోషంగా ఇంటికి బయలుదేరింది. ఇంటికి చేరుకున్న వెంటనే, సూర్యకాంతం ఎదుట అప్పటికే ఒక గ్లాస్ ‘ఎమోషనల్ జ్యూస్’ను కళ్లల్లోంచే కార్చేసిన కొడుకు కనిపించాడు. కొడుకు చేతులు జోడించి ‘‘అమ్మా, ప్లీజ్! పెళ్లికూతురి తల్లి సర్టిఫికేట్ తప్పకుండా కావాలంది. లేకపోతే పెళ్లి కాదు!’’ అన్నాక, సూర్యకాంతం ఏం మాట్లాడకుండా, కళ్లతోనే ‘‘రేపు తప్పకుండా సాధిస్తా’’అనే భరోసా ఇచ్చి, నిద్రపోవడానికి గదిలోకి వెళ్లిపోయింది.కోడళ్ల పుట్టింటి ఇష్యూస్ చాలా సెన్సిటివ్.. పుట్టింటిపై అమ్మాయికి విపరీతమైన ప్రేమ ఉంటే, వెంటనే ‘తిరిగి రమ్మని’ చెప్పకూడదు. అమ్మను తిట్టలేక, మరీ మరీ బతిమాలలేక, కొడుకు కూడా గదిలోకి వెళ్లిపోయాడు.తర్వాతి రోజు ఉదయం 5 గంటలు.. ఈసారీ అందరికంటే ముందే సూర్యకాంతంతో పాటు లలిత, రాధ, జానకి, విశాలాక్షి అలా ఆమె మొత్తం ‘అత్తల బ్యాచ్’ క్యూలో ఫస్ట్లోనే నిలబడ్డారు.ఉదయం ఎనిమిది గంటలకు అడ్మిషన్స్ తీసుకుని, తొమ్మిదికల్లా క్లాస్లోకి బ్లాక్బస్టర్ ఎంట్రీ ఇచ్చేశారు!తర్వాత ఫుల్ జోష్తో ఆ ఒక నెల కోర్సు: కోడళ్ల సైకాలజీ,ఫ్యామిలీ రిలేషన్స్ మేనేజ్మెంట్,కోడళ్ల మూడ్ స్వింగ్స్ డీకోడ్ టెక్నాలజీ,అత్తగా నడుచుకోవాల్సిన విధానాలు, అత్త ఎప్పుడెప్పడు మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడకూడదు?ఏ పనులు మాత్రమే అత్త చేయాలి, ఏ పనులు అసలు చేయకూడదు! ఇలాంటివన్నీ బాగా నేర్చుకుని, ప్రాక్టీస్ చేసి, చివరికి మొత్తం బ్యాచ్ ‘సర్టిఫైయిడ్ అత్తగార్లుగా’ బయటికి వచ్చేశారు.సరిగ్గా ఒక నెల తర్వాత సూర్యకాంతం ఎగ్జామ్ డే వచ్చేసింది. ఆ రోజు సూర్యకాంతం అలారం పెట్టుకుని, ఉదయం త్వరగా లేచింది. కోచింగ్లో నేర్పించిన పాఠాలన్నీ రివైజ్ చేసి, ‘ముఖ్యమైన ప్రశ్నల’ సమాధానాలను బట్టీకొట్టి రెడీ అయింది. ‘‘పట్టుచీర కట్టుకుంటే, పెళ్లికూతురు ఫీల్ అవుతుందేమో’’ అని అనుకుంటూ, తన ఫేవరెట్, అన్నయ్య కొనిచ్చిన సెంటిమెంట్ చీర కట్టుకుంది. దేవుడికి దండం పెట్టుకుని, ఫ్యామిలీతో కలిసి కొడుకు పెళ్లిచూపులకు బయలుదేరింది. సూర్యకాంతం మాత్రం టెన్షన్స్ తో వణుకుతుండగా, ఆమె కోచింగ్ బ్యాచ్ ఫ్రెండ్స్ సైలెంట్ సపోర్ట్గా పక్కనే కూర్చున్నారు. టేబుల్పై టీ గ్లాసులు, పూలదండలు, కొబ్బరికాయలు ఇలా సంప్రదాయ పెళ్లిచూపుల ఆంబియన్స్తో పెళ్లి సంబంధం వాళ్ల ఇల్లు ఉంది. పక్క గదిలోనే, అమ్మాయితో పాటు, ప్రశ్నపత్రం తీసుకొచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు కూడా సిద్ధంగా కూర్చున్నారు. అమ్మాయి నెమ్మదిగా హాల్లోకి వచ్చి కూర్చుంది.సూర్యకాంతాన్ని చూసి ‘‘మీరు సిద్ధంగా ఉన్నారా?’’ అని అడిగింది. సూర్యకాంతం భయంతో తల ఊపింది.అమ్మాయి చిన్నగా నవ్వుతూ, ఆమె తల్లి చేతిలోని పేపర్ తీసుకుని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టింది. మొదటి ప్రశ్న: ‘‘ఉదయం మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్లిన తర్వాత, మీరు ఎంతసేపు నాకు ‘తలనొప్పి ఉంది’ అని చెప్పి, గదిలోకి వెళ్లకుండా ఉండగలరు?’’సూర్యకాంతం కంగారు పడుతూ ‘‘చాలాసేపు ప్రయత్నిస్తా!’’ అని చెప్పింది.రెండో ప్రశ్న: ‘‘కోడలు చేసిన చపాతీ రౌండ్గా లేకపోతే ఏం చేస్తారు?’’ సూర్యకాంతం ‘‘వాట్ ఏన్ అమీబా చపాతీ! అనుకుంటూ తినేస్తా!’’ వెంటనే, సూర్యకాంతం ఫ్రెండ్స్ క్లాప్స్ కొట్టి ధైర్యం నింపారు. మూడో ప్రశ్న: ‘‘కోడలు పుట్టింటికి వెళ్తే ఎన్ని రోజులకు మీరు ఫోన్స్ చేస్తారు?’’ ఈ ప్రశ్నకు సూర్యకాంతం చాలాసేపు ఆలోచించింది.ఇది ఒక ట్రికీ ప్రశ్న అని వెంటనే గ్రహించి, కోచింగ్ సెంటర్లో నేర్పిన ‘క్రిటికల్ థింకింగ్ మోడ్’ని యాక్టివేట్ చేసింది.అమ్మాయి ఇంటిని ఒక్కసారి పూర్తిగా గమనించింది. ‘కోడళ్ల పుట్టింటి ఇష్యూస్ చాలా సెన్సిటివ్... పుట్టింటిపై అమ్మాయికి విపరీతమైన ప్రేమ ఉంటే, వెంటనే ‘తిరిగి రమ్మని’ చెప్పకూడదు. ‘అదే పుట్టింటి కంటే అత్తింట్లోనే ఆ అమ్మాయికి బాగుంటే వెంటనే పిలవాలి.’ అని తనలో తాను అనుకుంది. అలా కోచింగ్లో నేర్పినట్లే సిచ్యుయేషన్స్ ను అంచనా వేసి, చాలా తెలివిగా ‘‘ఒక గంటకే ఫోన్స్ చేస్తా. జాగ్రత్తగా చేరావా? అని తెలుసుకుంటా. తర్వాత తీరిక దొరికినప్పుడు నిన్నే తిరిగి కాల్ చేయమని చెప్తా.’’ అని సమాధానం చెప్పింది.అది విన్న వెంటనే సూర్యకాంతం ఫ్రెండ్స్ కళ్లతోనే ‘‘అద్భుతం! టాప్ ఆన్సర్!’’ అని అభినందనలు కురిపించారు.అప్పుడే అమ్మాయి లేచి, అత్తగారిని హత్తుకుంది. అబ్బాయి సగం ఆనందంతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే, అందరూ చప్పట్లతో పెళ్లి గంటలు మోగించారు.సూర్యకాంతం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నానని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నెల తిరగకముందే నిశ్చితార్థం, పెళ్లి, అన్ని పనులూ చకచకా పూర్తి చేసి, వారిద్దరినీ హనీమూన్స్ కి పంపించేసింది. నూతన దంపతులను హనీమూన్స్ కి పంపిన వెంటనే, సూర్యకాంతం కూడా ‘‘నాకు కూడా కాస్త బ్రేక్ కావాలి!’’ అంటూ, తన ఫ్రెండ్స్ అందరితో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిపోయింది.అలా దేవుడిని దర్శించుకుంటూ, కొంచెం మానసిక ప్రశాంతత, కొంచెం స్వేచ్ఛ, కొంచెం ఆనందం ఇవన్నీ ఆస్వాదిస్తూ, రెండు నెలల తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంది.ఇంటికి వచ్చిన వెంటనే కోడలు ఆప్యాయంగా పలకరిస్తూ ‘‘అత్తగారూ, ఒక గుడ్ న్యూస్! మీరు వెంటనే ‘ఉత్తమ నాన్నమ్మగా మార్చే కోచింగ్ సెంటర్’లో జాయిన్స్ కావాలి. నేను తల్లి కాబోతున్నా!’’ అని చెప్పగానే, సూర్యకాంతం అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.‘‘అయ్యో దేవుడా! ఇప్పుడే అత్త పరీక్ష పాస్ అయ్యా, ఇప్పుడు మళ్లీ నాన్నమ్మ పరీక్షా?!’’ అని ఏడుస్తూ దేవుడిని ప్రశ్నించింది. ఆమె వెనకనే వచ్చిన కోడలి తల్లి సత్య, సూర్యకాంతాన్ని చూస్తూ, ‘‘నీకు బాగా అయ్యింది!’’ అంటూ పకపకా నవ్వుతూనే ఉంది.ఇంతలో ఒక మహిళ వాయిస్, ‘‘అమ్మాయి సత్యా, సత్యా.. నిద్ర లేయ్! ఎందుకలా నిద్రలోనే నవ్వుకుంటున్నావ్?’’ అని గట్టిగా పిలిచింది.సత్యా ఒక్కసారిగా నిద్రలేచి చూసింది. ఎదురుగా ఆమె అత్తగారు. ఆమె చేతులు నడుముపై పెట్టుకుని ‘‘అమ్మాయి సత్యా! నీకు ఆఫీస్కి టైమ్ అవుతోంది. వెళ్లి త్వరగా నాకు టీ పెట్టి, లంచ్ చేసుకుని, ఆఫీస్కి రెడీ అవ్వు!’’ అంటూ సత్యను కిచెన్ వైపు పంపింది. సత్యా మనసులో ‘‘అయ్యో! ఇదంతా కలా?’’ అనుకుంటూనే, తన స్నేహితురాలు సూర్యకు ఫోన్స్ చేసింది. ‘‘ఓసేయ్ సూర్య! నిన్న నన్ను ‘నీకు ఇద్దరూ ఆడపిల్లలేనా?’ నేను ఎంత అదృష్టవంతురాలినో! నాకు అబ్బాయి పుట్టాడు! అని నన్ను అవమానించావుగా.. ఒక ఇరవై ఏళ్లు ఆగు. ఎవరి అదృష్టం ఏంటో అప్పుడు తెలుస్తుంది!’’ అని చెప్పి ఫోన్స్ కట్ చేసింది.ఫోన్స్ అవతల సూర్యా ఇంకా అయోమయంలో ఉండగా, ఇవతల సత్య మాత్రం శ్రీకృష్ణుడి భార్య సత్యభామ కంటే ఎక్కువ గర్వంతో, చిన్న చిరునవ్వుతో తన రోజును ప్రారంభించింది. -దీపిక కొండి
పిల్లలకు భిక్షం వెయ్యని కుబేరులు!
ఆస్తులు పంచడం పాత పద్ధతి. ఆశయాలు పంచడం కొత్త ఒరవడి. పిల్లలకి ఆస్తులు ఇస్తే వాళ్లు సోమరిపోతులు అవుతారని, అదే, కష్టపడే తత్వాన్ని ఇస్తే ప్రపంచాన్నే జయిస్తారని నమ్మిన కొందరు బిలియనీర్ తల్లిదండ్రులు తమ సంపదను సంతానానికి కాకుండా, సమాజానికి రాసిచ్చేస్తున్నారు! ‘‘మీ బతుకు మీరు బతకండి’’ అని పిల్లలకు చేయూతకు బదులుగా ‘చెయ్యి’స్తున్నారు.అమ్మానాన్న కోటీశ్వరులైతే ఇక వాళ్ల పిల్లల లైఫ్ (వాళ్లింకా లైఫ్లోకి అడుగుపెట్టక ముందే) సెటిలైపోయినట్లే. కాని, కొంతమంది సెలబ్రిటీ కుబేరుల కథ ఇందుకు భిన్నంగా ఉంది. కోట్ల ఆస్తులున్నా.. కష్టపడితేనే డబ్బు విలువ తెలుస్తుందని, సామాన్యుల్లాగే తమ పిల్లలు కూడా జీవించాలని వారి ఆకాంక్ష. అందుకే, ఆస్తులన్నీ ట్రస్టులకో, మంచి పనులకో రాసిచ్చేసి.. ‘వారసత్వ ఆస్తి’ అనే పాత పద్ధతికి నీళ్లొదులుతున్నారు. ఈ జాబితాలో బిల్ గేట్స్, జాకీ చాన్, మెకెంజీ స్కాట్ వంటి మహామహులు ఉన్నారు.ఒక్క డాలరూ ఇవ్వలేదు!బిల్ గేట్స్ ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ బాస్. వరల్డ్ నెంబర్ వన్ రిచ్ డాడ్! ఆయన, మాజీ భార్య మెలిందా కలిసి టెక్ ప్రపంచాన్నే సమృద్ధం చేశారు. మరి వీళ్ల ముగ్గురు పిల్లల (కొడుకు, ఇద్దరు కూతుళ్లు) భవిష్యత్తు ఇంకెంత సమృద్ధిగా ఉండాలి? కానీ, అలా ఏం లేదు! రూ. 8,78,800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నా.. వారత్వంగా ఒక్క డాలరు కూడా ఇచ్చేది లేదని పిల్లలకి వాళ్ల చిన్నప్పుడే క్లారిటీ ఇచ్చేశారు. ఆ డబ్బును ప్రపంచంలోని పేదరికాన్ని, రోగాల్ని తరిమికొట్టేందుకు ఉదారంగా ఇచ్చేస్తున్నారు. అలాగని మరీ ఖాళీ చేతులు చూపకుండా ముగ్గురు పిల్లలకీ తలా రూ.3 కోట్లు పాకెట్ మనీ రాసిచ్చారు! ‘‘పిల్లలకి కొండంత ఆస్తిని ఇచ్చేయటం వాళ్లకు చేసే మేలు కాదు.. అది వాళ్ల సొంత ఎదుగుదలకి అడ్డుగోడ అవుతుంది’’ – బిల్ గేట్స్ఆస్తి మొత్తం చారిటీకే!వారెన్ బఫెట్ పేరు వింటేనే ఇన్వెస్ట్మెంట్ ప్రపంచం గౌరవంతో లేచి నిలుచుంటుంది. సుమారు రూ. 13,37,430 కోట్ల ఆస్తి ఉన్నా, ఈయన లైఫ్ స్టెయిల్ మాత్రం బొత్తిగా మిడిల్ క్లాస్లో ఉంటుంది. 1958లో కేవలం 31,500 డాలర్లకు (రూపాయలలో ఆనాటి ధర రూ. 1 లక్షా 50 వేలు) కొన్న పాత ఇంట్లోనే ఇప్పటికీ ఆయన నివసిస్తున్నారంటే ఆయన సింప్లిసిటీ ఎంత ‘ఆడంబరంగా’ ఉందో అర్థం చేసుకోండి. తన ముగ్గురు పిల్లలకి (ఇద్దరు కొడుకులు, ఒక కూతురు) తలో రూ. 200 కోట్లు ఇచ్చేసి, మిగిలిన 99 శాతం ఆస్తిని చారిటీకి రాసిచ్చేస్తానని ఆయన ఎప్పుడో చెప్పేశారు. ‘‘నేను బతికున్నప్పుడైనా, చనిపోయాకైనా సంపద అంతా సమాజానికే’’ అని ప్రకటించారు. ‘‘నా పిల్లలకి ఇప్పటికే కావాల్సినంత ఇచ్చాను. వాళ్ల లైఫ్ వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇక ఈ అదనపు కోట్లు నాకెందుకు?’’ – వారెన్ బఫెట్ బాండ్ పేల్చిన బాంబ్సినిమాల్లో మాదిరిగానే ఖరీదైన కార్లు, అదిరిపోయే సూట్లు వేసుకుని తిరిగే ‘జేమ్స్ బాండ్’ డేనియల్ క్రెయిగ్, తన పిల్లలకి (ఇద్దరూ కూతుళ్లే) మాత్రం తన ఆస్తిని ఇచ్చే ప్రసక్తే లేదని గన్షాట్గా చెప్పేస్తున్నారు. సుమారు రూ. 1,450 కోట్ల ఆస్తి ఉన్నా సరే, ‘‘నేను పోయేలోపు నా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసేస్తా.. లేదంటే దానం చేసేస్తా’’ అని వారసులపైనే బాంబు పేల్చారు మన బాండ్. కనుక ఆయన కూతుళ్లిద్దరికీ ఈ భారీ ఆస్తి దక్కే అవకాశం లేదు. పిల్లలు తమ సొంత కాళ్ల మీద నిలబడి సక్సెస్ అవ్వాలన్నదే క్రెయిగ్ తాపత్రయం. అందుకు తగ్గట్లుగానే ఆయన కూతురు ఎల్లా అప్పుడే మోడలింగ్లో తన మార్క్ చూపిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్డ్ మోడల్స్ ఏజెన్సీలో చేరి, పెద్ద పెద్ద ఫ్యాషన్ మ్యాగజైన్ల కవర్ పేజీల మీద మెరిసిపోతోంది. ‘‘నాన్న నాకు బాట వేయకపోయినా.. నా దారి నేనే వేసుకుంటున్నా’’ అంటోంది. ‘‘వారసత్వంగా యావదాస్తినీ ముందే ఇచ్చేయటం నాకు నచ్చదు. వెళ్లేటప్పుడే అంతా ఇచ్చేయాలి లేదా అసలే ఇవ్వకుండా మానేయాలి’’ – డేనియల్ క్రెయిగ్కష్టపడితేనే కిక్కు‘స్టింగ్’ అనగానే మ్యూజిక్ అభిమానులకు ‘ఎవ్రీ బ్రీత్ యూ టేక్’ లాంటి అదిరిపోయే సాంగ్స్ గుర్తొస్తాయి. ఆయన అసలు పేరు మేథ్యూ థామస్ సమ్మర్. సుమారు రూ. 4,987 కోట్ల ఆస్తి వెనకేసిన ఈ మ్యూజిక్ లెజెండ్ వెనుక కనాకష్టంగా సాగిన ఒక గతం ఉంది. సెలబ్రిటీ అవ్వకముందు ఈయన బస్సు కండక్టర్గా, కూలీగా, ట్యాక్స్ క్లర్క్గా, టీచర్గా... ఇలా రకరకాల పనులు చేశారు. తన ఆరుగురు పిల్లలకి (నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు) కూడా కష్టమంటే ఏమిటో తెలియాలని వారసత్వంగా ఒక్క డాలర్ కూడా ఇవ్వకూడదని తీర్మానించుకున్నారు. సంతోషం ఏమిటంటే, స్టింగ్ పిల్లలు కూడా తండ్రి దగ్గర చేయి చాచకుండా, తమ సొంత కాళ్ల మీద నిలబడ్డారు. కూతురు మిక్కీ నటిగా రాణిస్తుంటే, కొడుకులు ఇలియట్, జో తండ్రి బాటలోనే మ్యూజిక్ ప్రపంచంలో దూసుకుపోతున్నారు. ‘‘కష్టపడితేనే సక్సెస్లో కిక్కు ఉంటుంది’’ అని అంటున్న ఈ ఫ్యామిలీ ఎంతైనా ‘రాకింగ్’ కదా!‘‘మా పిల్లలకి ముందే చెప్పేశా.. నేను చనిపోయే నాటికి పెద్దగా ఆస్తి ఏమీ మిగలదని. ఎందుకంటే ఉన్నదంతా నేనే ఖర్చు పెట్టేస్తున్నానని. అలాగే, వాళ్ల భుజాలపై ట్రస్ట్ ఫండ్స్ అనే భారాన్ని వేయడం నాకు ఇష్టం లేదు’’– ‘స్టింగ్’నాకు ప్రపంచం ముఖ్యంసుమారు రూ.5,14,600 కోట్ల ఆస్తితో ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్న జుకర్బర్గ్, తన భార్య ప్రిసిల్లా చాన్తో కలిసి ఒక భారీ నిర్ణయం తీసుకున్నారు. 2015లో తన మొదటి కూతురు మాక్స్ పుట్టినప్పుడే.. ‘‘మా దగ్గర ఉన్న ఫేస్బుక్ షేర్లలో 99 శాతం (సుమారు రూ. 3,75,000 కోట్లు) విరాళంగా ఇచ్చేస్తాం’’ అని ప్రకటించారు. జుకర్బర్గ్ ఫిలాసఫీ కొంచెం ఎమోషనల్, కొంచెం టెక్నికల్! ‘‘మా పిల్లలు (ముగ్గురూ కూతుళ్లే) ఎదిగే లోపు ఈ ప్రపంచాన్ని ఇప్పుడున్న దానికంటే ఇంకా బెటర్గా మార్చాలి’’ అన్నది ఆయన తాపత్రయం. అందుకే ‘చాన్–జుకర్బర్గ్ ఇనీషియేటివ్’ ద్వారా 2100 కల్లా ప్రపంచంలో ఉన్న అన్ని రోగాలకి చెక్ పెట్టాలని ఈ దంపతులు కంకణం కట్టుకున్నారు. తన కూతురికి రాసిన ఓపెన్ లెటర్లో జుకర్బర్గ్ ఒక మాట చెప్పారు: ‘‘మేము నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి నీకు మాత్రమే కాదు.. రేపటి తరం పిల్లలందరికీ ఒక మంచి ప్రపంచాన్ని ఇవ్వడం మా బాధ్యత కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని. ‘‘మా పిల్లలకి వేల కోట్లు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును సెటిల్ చేయడం కంటే, అందరికీ సమానమైన అవకాశాలు ఉన్న ప్రపంచాన్ని సృష్టించటమే మా ధ్యేయం’’? – జుకర్బర్గ్ఎవరి దారి వారే వేసుకోవాలిమార్షల్ ఆర్ట్స్ కింగ్.. జాకీ చాన్. ‘రష్ అవర్’, ‘కరాటే కిడ్’ లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ని సంపాదించుకున్న ఈ లెజెండ్ దగ్గర సుమారు రూ. 3,627 కోట్ల ఆస్తి ఉంది. కానీ, ఈ కుంగ్ఫూ మాస్టర్ తన పిల్లలకు (కూతురు, కొడుకు) చిల్లి డాలర్ కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. 2011లోనే జాకీ చాన్ ఒక సంచలన ప్రకటన చేశారు: ‘‘నా ఆస్తిలో నా కొడుక్కి ఒక్క డాలర్ కూడా ఇవ్వను! దమ్మున్నవాడు తన దారి తనే వెతుక్కుంటాడు’’ అన్నారు. అందుకే తన ఆస్తినంతా చారిటీకే ఇచ్చేస్తున్నారు. ‘‘వాడికి (కొడుకు) గనుక సత్తా ఉంటే, వాడే సొంతంగా సంపాదించుకుంటాడు. ఒకవేళ వాడికి ఆ సత్తా లేకపోతే.. నేను ఇచ్చే డబ్బుని కూడా వాడు వృథాగా తగలేస్తాడు!’ – జాకీ చాన్ఇచ్చేదే లేదు..‘యాపిల్’ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ కన్నుమూశాక, ఆ భారీ ఆస్తి అంతా ఆయన భార్య లారె¯Œ కు దక్కింది. ప్రస్తుతం సుమారు రూ. 1,21,498 కోట్ల ఆస్తిపరురాలు ఆమె. కానీ, లారెన్ మాత్రం ఆ కోట్లను దాచుకోవడం కంటే, సమాజానికి పంచడానికే మొగ్గు చూపుతున్నారు. ‘ఎమర్సన్ కలెక్టివ్’ అనే సంస్థ ద్వారా విద్య, ఆరోగ్యం, పర్యావరణం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పుల మీద పోరాడటానికి ఏకంగా రూ. 29,050 కోట్లను కేటాయించారు. అయితే, తన ముగ్గురు (ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు) పిల్లలకి ఆస్తి ఇచ్చే విషయంలో ఆమె ఒక స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు... ఇవ్వకూడదని! ‘‘నా భర్తకి ఆస్తులు కూడబెట్టడం అస్సలు ఇష్టం లేదు. అందుకే ఈ వారసత్వ ఆస్తుల మీద నాకు కూడా ఆసక్తి లేదు. ఆ విషయం నా పిల్లలకి కూడా తెలుసు. ఒకవేళ నేను సరిపడా కాలం బతికితే గనుక.. ఈ ఆస్తి ప్రవాహం నా దగ్గరే ఆగిపోతుంది. నా తర్వాతి తరానికి దీన్ని మోసుకెళ్లనివ్వను’’ – లారెన్ పావెల్ జాబ్స్చిన్న చిన్న సంస్థలకు ఇస్తా..లాకర్ ఖాళీ అయ్యే వరకు ఇచ్చేస్తూనే ఉంటా అంటున్నారు మెకెంజీ స్కాట్. జెఫ్ బెజోస్తో విడాకుల తర్వాత అమెజాన్ షేర్లలో పాతిక శాతం మెకెంజీకి దక్కాయి. ఆ లెక్కన చూస్తే ఈమె ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ సుమారు రూ.2,80,170 కోట్లు. ఆమెకు నలుగురు పిల్లలు (ముగ్గురు కొడుకులు, ఒక కూతురు) ఉన్నా, వాళ్లకు వారసత్వంగా ఆస్తి ఇచ్చే విషయంలో ఆమె ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి! 2019లో జెఫ్ బెజోస్కు విడాకులు అవ్వగానే ఆమె ఒక లెటర్ రాశారు. ‘‘నా దగ్గర అవసరానికి మించి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు ఉంది. ఆ డబ్బుని అందరితో పంచుకుంటాను. నా దగ్గర ఉన్న లాకర్ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు నేను దానిని ఇచ్చేస్తూనే ఉంటా..’’ అని ఆ లెటర్ సారాంశం. 2021లోనే ఆమె దాదాపు రూ. 24,843 కోట్లను ఎవరూ పట్టించుకోని చిన్న చిన్న సంస్థలకు దానం చేసి తన ఉదారతను చాటుకున్నారు.‘‘పిల్లలకి గుట్టల కొద్దీ ఆస్తిని దాచిపెట్టడం కంటే, ఆ డబ్బుతో సమాజంలోని లోటుపాట్లను సరిదిద్దడమే నాకు ముఖ్యం’’ – మెకెంజీ స్కాట్ మొత్తానికి ఈ కుబేరులందరూ చెప్పే నీతి ఒక్కటే, ‘పిల్లలకి ఆస్తిని ఇవ్వడం కంటే, ఆ ఆస్తిని సంపాదించే తెలివితేటల్ని ఇవ్వడమే అసలైన గిఫ్ట్!’ అని. నిజమే కదా, వారసత్వం అనేది బ్యాంక్ అకౌంట్లోంచి ఏటీఎం ద్వారా ప్రవహించకూడదు. కష్టించి పని చేసే గుణంగా సంక్రమించాలి. సాక్షి స్పెషల్ డెస్క్ (చదవండి: ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..)
అంతర్జాతీయం
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు: సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా
న్యూఢిల్లీ: మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న అస్థిరత, తీవ్ర ఉద్రిక్తతల కారణంగా, విద్యార్థుల భద్రతను కాంక్షిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం( మార్చి 2)న జరగాల్సిన పదో తరగతి, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బోర్డు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం రాత్రి బోర్డు ప్రధాన కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది.గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లలో ఉన్న సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలన్నింటికీ ఈ వాయిదా వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై నిరంతరం సమీక్షిస్తున్నామని, సోమవారం నాడు పరీక్షల నిర్వహణ సాధ్యం కానందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బోర్డు పేర్కొంది. వాయిదా పడిన సబ్జెక్టులకు సంబంధించిన తదుపరి పరీక్షా తేదీలను పరిస్థితులు కుదుటపడిన తర్వాత అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడిస్తామని బోర్డు స్పష్టం చేసింది.మార్చి 5వ తేదీ నుండి జరగాల్సిన తదుపరి పరీక్షల నిర్వహణపై మార్చి 3వ తేదీన నిర్వహించే అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నామని సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా మిడిల్ఈస్ట్ దేశాల్లోని భారతీయ పాఠశాలల నుండి వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తమ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని బోర్డు విజ్ఞప్తి చేసింది.ఇది కూడా చదవండి: 91శాతం వైద్యుల షాకింగ్ డెసిషన్!
తాలిబన్ల దెబ్బ అదుర్స్.. దాడుల్లో పాకిస్తాన్కు కొత్త కష్టాలు!
ఇస్లామాబాద్: ప్రపంచమంతా ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అటు ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుండగా.. ఇరాన్ సైతం ఇజ్రాయెల్, దుబాయ్, బహ్రెయిన్ వంటి పలు దేశాలపై విరుచుకుపడుతోంది. మరోవైపు.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. తాజాగా ఆప్ఘన్ సైన్యం.. పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్బేస్పై దాడి చేసింది. దాడి సంబంధించిన వీడియోలను రిలీజ్ చేసింది.పాకిస్తాన్పై ఆప్ఘనిస్తాన్ సైన్యం విరుచుకుపడుతోంది. తాజాగా పాకిస్తాన్లోని రావల్పిండి, పాక్ కీలక ఎయిన్బేస్ నూర్ఖాన్ ఎయిర్బేస్పై డ్రోన్ దాడి చేసింది. ఈ మేరకు ఆప్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ట్విట్టర్ వేదికగా..‘ఆప్ఘనిస్తాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ వైమానిక దళం పాకిస్తాన్లోని కీలకమైన సైనిక స్థావరాలపై ఖచ్చితమైన, సమన్వయంతో కూడిన వైమానిక దాడులను నిర్వహించింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్, క్వెట్టా (బలూచిస్తాన్)లోని 12వ డివిజన్ ప్రధాన కార్యాలయం దాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మొహమ్మద్ ఏజెన్సీలోని ఖ్వాజాయ్ క్యాంప్, అలాగే అనేక ఇతర ముఖ్యమైన పాకిస్తాన్ సైనిక స్థావరాలు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి’ అని తెలిపింది. ఈ మేరకు దాడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను విడుదల చేసింది.Afghanistan attacked Pakistan's Nur Khan Airbase in Rawalpindi. Local people are completely shocked by this attack.#nurkhanairbase pic.twitter.com/FzxI8BkjJu— PakTrolls (@PakTrolls_) March 2, 2026ఇదిలా ఉండగా.. రెండు దేశాల మధ్య పెద్ద ఎత్తున సరిహద్దు ఘర్షణల మధ్య ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు, తూర్పు ఆఫ్ఘన్ నగరమైన జలాలాబాద్లో పాకిస్తాన్ ఫైటర్ జెట్ను కూల్చివేసినట్లు తాలిబాన్ అధికారులు పేర్కొన్నారు. విమానం నుండి పారాచూట్ చేసిన తర్వాత పైలట్ను సజీవంగా పట్టుకున్నట్లు వార్తా సంస్థ AFP నివేదించింది. పైలట్ దిగిన కొద్దిసేపటికే అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక నివాసితులు AFPకి తెలిపారు.Good morning, Islamabad! While the city wakes up for Sehri, the map is being redrawn. 🌙☕️The Afghan Taliban aren't just holding their ground; they are taking the fight to those who challenged them. From striking Nur Khan Airbase to the Quetta HQs, Kabul is proving it can… pic.twitter.com/TlLTcqfpZA— Summitsoldier (@Summitsoldier) March 2, 2026ఇక, పాకిస్తాన్ శుక్రవారం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్, తాలిబాన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుండ్జాదా కేంద్రంగా ఉన్న దక్షిణ నగరం కాందహార్పై వైమానిక దాడులు ప్రారంభించింది. 133 మంది తాలిబాన్ యోధులు మరణించారని, 200 మందికి పైగా గాయపడ్డారని, అనేక పోస్టులు ధ్వంసమయ్యాయని పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, పాక్ దాడులకు ప్రతిస్పందనగా సరిహద్దు దాడులను తాము నిర్వహించామని తాలిబాన్ అధికారులు పేర్కొన్నారు. కనీసం 55 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు చెప్పుకొచ్చారు.
వైమానిక దాడి.. ఇరాన్ మాజీ అధ్యక్షుడు నెజాద్ మృతి
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు, కరుడుగట్టిన సిద్ధాంతకర్త మహముద్ అహ్మదీ నెజాద్ ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ మీడియా సంస్థ ‘మారీవ్’ కథనాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. గత కొంతకాలంగా అహ్మదీ నెజాద్ గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయన నివాసమే లక్ష్యంగా జరిగిన ఈ క్షిపణి దాడిలో నెజాద్ మృతి చెందారు.ఇరాన్ ఆరో అధ్యక్షుడిగా 2005 నుండి 2013 వరకు బాధ్యతలు నిర్వర్తించిన అహ్మదీ నెజాద్.. ప్రపంచ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేతగా పేరుగాంచారు. టెహ్రాన్ మేయర్ స్థాయి నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 2005లో అప్పటి అగ్రనేత అక్బర్ హషీమీ రఫ్సంజానీని ఓడించి, అనూహ్యంగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. తన పదవీ కాలంలో ఇరాన్ అణు కార్యక్రమాల విషయంలో పశ్చిమ దేశాలకు సవాలు విసురుతూ, అంతర్జాతీయంగా ఇరాన్ను తీవ్ర ఘర్షణ పూరిత వాతావరణంలోకి నెట్టారని చెబుతుంటారు. ఆయన తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు దేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవడమే కాకుండా, ఇరాన్ దౌత్యపరంగా ఏకాకి కావడానికి దారితీశాయని విశ్లేషకులు అంటుంటారు.2023లో అమెరికన్ల అక్రమ నిర్బంధం కేసులో ప్రమేయం ఉన్నందుకు గాన అమెరికా ప్రభుత్వం ఆయనపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఉనికిపై నెజాద్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. 2005లో జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్ను ‘క్యాన్సర్ గడ్డ’గా అభివర్ణించడమే కాకుండా, ప్రపంచ పటం నుండి ఆ దేశాన్ని తుడిచివేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైనప్పటికీ, అహ్మదీ నెజాద్ తన మొండి వైఖరిని వీడలేదు. 2007లో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో నెజాద్ ప్రసంగిస్తూ ఇరాన్లో అసలు స్వలింగ సంపర్కులే లేరని ఆయన చేసిన ప్రకటన అంతర్జాతీయ వేదికలపై విమర్శలకు గురైంది. ఇది కూడా చదవండి: ‘ప్రాణభయంతో పరుగులు’.. వణుకుతూ వివరించిన ‘ఏంజెల్’
‘ప్రాణభయంతో పరుగులు’.. వణుకుతూ వివరించిన ‘ఏంజెల్’
దుబాయ్: ‘అది ఒక పీడకల.. కళ్లముందే క్షిపణులు పేలుతుంటే ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో బేస్మెంట్కు పరుగులు తీశాం’ అంటూ బ్రిటన్ పర్యాటకురాలు జేడ్ ఏంజెల్ బీన్స్ తన భయానక అనుభవాన్ని వివరించారు. దుబాయ్లోని విలాసవంతమైన 'రిక్సోస్ ది పామ్' హోటల్లో బస చేస్తున్న ఆమెకు ఆదివారం ఉదయం వినిపించిన సైరన్ల మోత దడపుట్టించింది. వరుస పేలుళ్ల ధాటికి హోటల్ గదులు కంపించాయని, తోటి పర్యాటకులు భయంతో వాంతులు చేసుకోవడం, స్పృహ తప్పి పడిపోవడం లాంటి దృశ్యాలు అక్కడ కనిపించాయని ఆమె కన్నీటి పర్యంతమవుతూ మీడియాకు తెలిపారు.ఇరాన్ క్షిపణుల దాడులతో పర్యాటక స్వర్గధామం దుబాయ్ ఒక్కసారిగా వణికిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలకు ప్రతిగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను గాలిలోనే అడ్డుకుంటున్న తరుణంలో సంభవిస్తున్న భారీ పేలుళ్లతో నగరం దద్దరిల్లిపోతోంది. అత్యంత సురక్షితమైన ప్రాంతాలుగా భావించే ఫైవ్ స్టార్ హోటళ్లు సైతం ఈ దాడుల ప్రభావానికి లోనవడంతో వేలాది మంది పర్యాటకులు హోటల్ బేస్మెంట్లలో తలదాచుకోవాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది.దుబాయ్లోని మానవ నిర్మిత ద్వీపం ‘పామ్ జుమేరా’లో యుద్ధ భీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న ప్రఖ్యాత ‘ఫెయిర్మాంట్ ది పామ్’ హోటల్ క్షిపణి తాకిడికి గురికాగా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘బుర్జ్ అల్ అరబ్’ సమీపంలో డ్రోన్ శిథిలాలు పడి అగ్నిప్రమాదం సంభవించింది. బిల్లింగ్హేకు చెందిన మిక్ బ్రోమెల్ అనే మరో పర్యాటకుడు మాట్లాడుతూ.. తాము ఉంటున్న హోటల్ వెనుక భాగంలోనే క్షిపణులు పేలడం చూశామని, ఇది ఏదో యుద్ధ సినిమా చూస్తున్నట్లుగా ఉందని, ప్రాణాలతో స్వదేశానికి చేరుకుంటే చాలని అనుకుంటున్నామన్నారు.ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్, టెల్ అవీవ్, దోహా తదితర నగరాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటికే తమ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేస్తూ.. అత్యవసరమైతే తప్ప యూఏఈ, కతార్, కువైట్ వంటి దేశాలకు వెళ్లవద్దని సూచించింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ అస్థిరతతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, ప్రపంచ దేశాలు ఈ యుద్ధ పరిణామాలను ఆందోళనతో గమనిస్తున్నాయి.ఇది కూడా చదవండి: ‘మమ్మల్ని కెలకొద్దు’.. లెబనాన్ ప్రధాని సీరియస్ వార్నింగ్!
జాతీయం
ప్రయాణికులకు అలర్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా పలు దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్లకు వెళ్లే అన్ని విమానాల సస్పెన్షన్ను ఎయిర్ ఇండియా సోమవారం(మార్చి 2) రాత్రి 11.59 గంటల వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రయాణీకులకు సూచనలు చేసింది.ఈ క్రమంలో ఢిల్లీ, ముంబై, తిరుచిరాపల్లి సహా పలు విమానాశ్రయాల నుంచి వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. అంతర్జాతీయ ఎయిర్లైన్స్ ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్ వంటి సంస్థలు కూడా తాత్కాలికంగా వాటి సర్వీసులను నిలిపివేశాయి. దీంతో, యూరప్ వెళ్లే విమానాలు సైతం నిలిచిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో ఆదివారం దేశవ్యాప్తంగా వందలాది విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.దాడులు, గగనతల పరిమితులు, భద్రత దృష్ట్యా భారత్ నుంచి వెళ్లాల్సిన దాదాపు 400కు పైగా విదేశీ విమానాలు రద్దయినట్లు కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ వెల్లడించింది. పశ్చిమాసియా గగనతలాన్ని ఉపయోగించుకొనే విమాన సర్వీసులను సోమవారం రాత్రి 11.59 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ‘ఇండిగో’ తెలిపింది. పశ్చిమాసియాకు వెళ్లే దాదాపు 184 అంతర్జాతీయ విమానాలను పాకిస్థాన్ రద్దు చేసింది. అటు పశ్చిమాసియా దేశాల్లోనూ 1,800కు పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికుల భద్రత, కార్యాచరణ నిబంధనలను కచ్చితంగా పాటించేలా విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) వెల్లడించింది.మరోవైపు.. ఆదివారం కువైట్, అబుదాబీ, మస్కట్, షార్జా, బహ్రెయిన్, రియాద్, దమ్మామ్, జెడ్డా, మదీనా, దోహా, దుబాయ్ నగరాల నుంచి హైదరాబాద్కు రావాల్సిన 26 అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆయా విమానాశ్రయాల్లోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగిస్తున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు, వాహనాల రద్దీ బాగా తగ్గింది.
సీసీఎస్ అత్యవసర సమావేశం.. నెతన్యాహుకు మోదీ ఫోన్
ఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుత దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని మోదీ.. నెతన్యాహుకు సూచించినట్టు చెప్పుకొచ్చారు.ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడితోనూ మాట్లాడినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సందర్బంగా మోదీ.. ఇరాన్తో యుద్ధం, తాజా పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. పౌరుల భద్రతే ప్రాధాన్యమని స్పష్టం చేశారు. శాంతి దిశగా చర్యలు చేపట్టాని నెతన్యాహుకు సూచించినట్టు తెలిపారు. అలాగే, యూఏఈపై దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ దాడుల్లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. యూఏఈకి భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తామని.. శత్రుత్వాలను త్వరగా నిలిపివేయాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తుందని మోదీ చెప్పుకొచ్చారు.Had a telephone call with PM Benjamin Netanyahu to discuss the current regional situation. Conveyed India's concerns over recent developments and emphasised the safety of civilians as a priority. India reiterates the need for an early cessation of hostilities.@netanyahu— Narendra Modi (@narendramodi) March 1, 2026సీసీఎస్ అత్యవసర సమావేశం.. అయితే.. భద్రత, వ్యూహాత్మక వ్యవహారాలపై భారతదేశ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన కొన్ని గంటల తర్వాత ఈ సమాచారం వచ్చింది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలలో రెండు రోజుల పర్యటన నుండి ఆయన న్యూఢిల్లీకి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత చమురు దిగుమతులకు కీలకమైన షిప్పింగ్ మార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల కలిగే ప్రభావాన్ని కూడా CCS అంచనా వేసినట్టు తెలుస్తోంది.మధ్యప్రాచ్యంలోని భారతీయ పౌరుల భద్రత, వివాదం మరింత తీవ్రమైతే అత్యవసర ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. దాదాపు 10,000 మంది భారతీయులు ఇరాన్లో, 40,000 మందికి పైగా ఇజ్రాయెల్లో, పశ్చిమాసియా మరియు గల్ఫ్లో సుమారు తొమ్మిది మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నట్టు సమాచారం. తాజా దాడుల నేపథ్యంలో వారి భద్రతపై ఆందోళన నెలకొంది.
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల మూడో తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఆ రోజు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుందని తెలిపింది. చంద్రగహణాన్ని వీక్షించే అవకాశం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా గ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకే ప్రారంభమైనప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాతే ప్రభావం కనిపిస్తుంది. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని వీక్షించే అవకాశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉంటుందని తెలిపింది. మళ్లీ ఇలాంటి చంద్ర గ్రహణం 2028, జూలై 6న ఏర్పడుతుందని వెల్లడించింది. రాష్ట్రంలోని వివిధ నగరాల్లో గ్రహణ సమయంవివరాలు ఇలా..⇒ విజయవాడ నగరంలో సాయంత్రం 6.14 గంటలకు చంద్రోదయం కానుంది. గ్రహణం సాయంత్రం 6.48 గంటలకు విడుస్తుంది. సుమారు 34నివిుషాలు గ్రహణ ఛాయలు కనిపించనున్నాయి.⇒ రాజమహేంద్రవరంలో 6.07గంటలకు చంద్రోదయం అవుతుంది. 6.48గంటలకు గ్రహణం ముగుస్తుంది. సుమారు 41 నిమిషాల పాటు గ్రహణం కనిపిస్తుంది. ⇒ నెల్లూరులో సాయంత్రం 6.18 గంటలకు చంద్రోదయం జరుగుతుంది. గ్రహణం ముగిసే సమయం 6.48 గంటలు. నెల్లూరు వాసులు సరిగ్గా 30 నిమిషాల పాటు ఈ ఖగోళ వింతను చూడవచ్చు.
డీఎంకే సర్కార్ అవినీతిమయం: ప్రధాని మోదీ
సాక్షి, చెన్నై/పుదుచ్చేరి: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. డీఎంకే మంత్రులు అవినీతిలో పరస్పరం పోటీపడుతున్నారని విమర్శించారు. డీఎంకే సర్కారు అవినీతికి పాల్పడడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. పేదలు, రైతులు, యువతను దోచుకుందని ధ్వజమెత్తారు. ఈ అవినీతి ప్రభుత్వానికి ఇకపై అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని తేలి్చచెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం తమిళనాడులో పర్యటించారు. రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. అనంతరం మదురైలో బహిరంగ సభలో ప్రసంగించారు. అవినీతి, అసమర్థ పాలనతో తమిళనాడు ప్రజలు విసుగెత్తిపోయారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కచ్చతీవులను శ్రీలంకకు అప్పగించి తమిళనాడుపై కక్ష తీర్చుకుందన్నారు. తమకు అధికారం అప్పగిస్తే తమిళనాడును అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి, ఏఎంఎంకే వ్యవస్థాపకుడు టీటీవీ దినకరన్, పీఎంకే నేత అన్బుమణి రాందాస్ సభలో పాల్గొన్నారు.పుదుచ్చేరిని ఏటీఎంగా మార్చుకున్న కాంగ్రెస్ పుదుచ్చేరిని గతంలో ఢిల్లీలోని ఒక కుటుంబానికి ఏటీఎంగా కాంగ్రెస్ మార్చేసిందని మోదీ నిప్పులు చెరిగారు. ఆదివారం అక్కడ రూ.2,714 కోట్ల ప్రాజెక్టులకు ఆయన ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తర్వాత సభలో మాట్లాడారు. పుదుచ్చేరి అభివృద్ధికి ఆ కాంగ్రెస్, డీఎంకే స్పీడ్ బ్రేకర్గా మారాన్నారు. బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ డబుల్ ఇంజిన్ పాలనలో పుదుచ్చేరి ప్రగతి పథంలో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ ఆదివారం తమిళనాడులో తిరుప్పరకుండ్రంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శంచుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మోదీ దోతీ, కుర్తా ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణచేశారు. పూజల్లో పాల్గొన్నారు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం
అమెరికాలోని సియాటిల్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన గ్రాడ్యుయేట్ జాహ్నవి కందులకుటుంబానికి భారీ పరిహారం లభించనుంది. జాహ్నవి మృతి చెందిన దాదాపు మూడేళ్ల తర్వాత, ఆమె కుటుంబానికి గణనీయమైన ఆర్థిక పరిహారం అందనుంది.ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిది ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోటి కలలతో సియాటెల్లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు 2021లో అమెరికాకు వెళ్లింది.కానీ 2023, జనవరి 23వ తేదీ రాత్రి ఒక మలుపు దగ్గర రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని, కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏముంది మామూలు మనిషేగా...11 వేల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మరిచిపోయాడు. అతని మాటలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.మరోవైపు సియాటిల్లో ప్రమాదం, తమ బిడ్డ మృతిపై జాహ్నవి కుటుంబం దావా వేసింది. ఈ సంఘటన తెలుగు, భారతీయ వర్గాల నుండి మాత్రమే కాకుండా, స్థానికులు కూడా ప్రజల ఆగ్రహాన్ని వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో భారీ పరిహారంతో ఈ కేసును పరిష్కరించు కుంది. సియాటిల్ నగరం దాదాపు రూ. 262 కోట్ల (28 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి ఎటువంటి నేరారోపణలు లేకుండా, 5000 డాలర్లు జరిమానా విధించారు. అలాగే విధుల నుండి గత ఏడాది సస్పెండ్ చేశారు. సియాటెల్ ప్రకటనకందుల మరణం "హృదయ విదారకం" అని సియాటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె నష్టం ఊహించలేని బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు మరియు మా సమాజానికి కూడా జాహ్నవి కందుల జీవితం చాలా ముఖ్యమైనదే అంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని నగరం ఆ శాభావాన్ని వ్యక్తం చేసింది. కందుల దుర్మరణం జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ (ICS)తో సహా న్యాయవాద సంఘాలు విస్తృత పోలీసు సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి. 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ పోలీసు అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరికాదని, స్పష్టమైన మార్గదర్శకాలను డిమాండ్ చేస్తున్నామని IACS లలితా ఉప్పల అన్నారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!
విదేశాలకు వెళ్లడం అక్కడే స్థిరపడటం చాలామంది డ్రీమ్. 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా విదేశాల్లోని అక్కడి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం రా..రమ్మని ఆకర్షిస్తుంటుంది. తీరా వెళ్లాక గానీ తెలియదు. అక్కడి సమస్యలు..పరిస్థితులు. ఇక్కడొక భారత మహిళకు కూడా అలా అనిపించే తక్షణమే భారత్కు కుటుంబంతో సహా వచ్చి వాలిపోయింది. ఎందువల్ల తాను ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కానీ ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపదగినవిగానూ విదేశాలకు చెక్కేద్దామనే ఔత్సాహుకులకు గొప్ప పాఠాలుగానూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎందవల్ల ఇలా కుటుంబంతో సహా ఆమె భారత్కు వచ్చేసిందో తెలుసా..!?..లీబా సుబిన్ అనే మహిళ కుటుంబం దుబాయ్ నుంచి భారత్లోని తన స్వస్థలం కేరళకు వచ్చేసింది. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఆమె కారణాన్ని వివరిస్తూ..ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా చేశానని అంటోంది. ఈ నిర్ణయాన్ని సమయా పాలన, మానసిక శాంతికి సంబంధించిన విషయంగా పేర్కొంది. అదీగాక తమ ఫ్యామిలీ వీసా రెన్యువల్, అలాగే ఇంటి అద్దె రెన్యువల్ చేయాల్సి ఉండగానే.. చకచక ఈ నిర్ణయం తీసుకుని వచ్చేసినట్లు తెలిపారు. అలాగని ఏదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదని, బాగా ఆలోచించి, తన భాగస్వామితో, పిల్లలతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇలా వెనక్కి వచ్చేసి కేరళలో తమ సొంతింటిలో నివశించడం వల్ల దుబాయ్లోని అద్దె టెన్షన్ తగ్గింది, అలాగే ఇక్కడి సమాజంలో నివశించడం వల్ల సామాజిక సంబంధాలు పునరుద్ధరింపబడతాయి. పైగా ఎలాంటి అప్పులు, ఈఎంఐల బెడద లేకుడా మానసిక ప్రశాంతతో గడపొచ్చు అని చెప్పుకొచ్చిందామె. పైగా పిల్లవాడికి కేరళలో అంతర్జాతీయ స్కూల్ ఇంటికి సమీపంలోనే ఉంది పదినిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ దుబాయ్లో 90 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుందని జోడించారామె. బహుశా మాకు అనిపించింది..మీకు వర్కౌట్ కాకపోవచ్చు, పైగా మీరు విదేశాల్లోనే కంఫర్ట్ లైఫ్ని లీడ్ చేస్తుండొచ్చని, అది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ..మొత్తం కుటుబ సభ్యులు కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అన్ని విధాల శ్రేయస్కరం అంటూ తన పోస్ట్ని ముగించింది లీబా సుబిన్. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయంతో ఏకభవించారు, పైగా తిరిగి వెళ్లకూదనుకుంటున్న ఆమె నిర్ణయానికి స్వాగతం, శుభాకాంక్షలు అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by leeba (@unfilteredvoiceswithinme) (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!
ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
అమెరికాలోని జార్జియాలో ఉండే భారతీయ అమెరికన్కి చేదు అనుభవం ఎదురైంది. చేయని నేరానికి ఆరు వారాల జైలు శిక్ష అనుభవించారు. కానీ విచారణలో కోర్టు ఈ కేసు కొట్టి వేసింది. దీంతో ఆయన న్యాయాపోరాటానికి సిద్ధపడ్డారు. జార్జియాలోని వాల్మార్ట్ స్టోర్లో ఒక చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడనే తప్పుడు ఆరోపణతో ఆరు వారాల పాటు జైలు శిక్ష అనుభవించిన భారతీయ అమెరికన్ 57 ఏళ్ల మహేంద్ర పటేల్ ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.జార్జియాలోని అక్వర్త్లోని వాల్మార్ట్లోతన కొడుకును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించా డని రెండేళ్ల బాలుడి తల్లి కరోలిన్ మిల్లర్ ఆరోపించింది. ఈ సంఘటనను వాల్మార్ట్ ఉద్యోగికి, తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 57 ఏళ్ల మహేంద్ర పటేల్ను 2025, మార్చి 24న అరెస్టు చేశారు. ఈ విషయంలో తనకి, పటేల్కి మధ్య బాబు కోసం "టగ్ ఆఫ్ వార్" జరిగిందని కూడా పేర్కొంది. అయితే తాను నిరపరాధి నని మొదటినుంచి గట్టిగా వాదించారు మహేంద్ర పటేల్. 2025 మార్చి 18న, తాను వాల్మార్ట్లో షాపింగ్ చేస్తున్నప్పుడు, టైలెనాల్ (టాబ్లెట్స్) ఎక్కడ ఉన్నాయోమిల్లర్ను దిశానిర్దేశం చేయమని అడిగానని పటేల్ చెప్పాడు. అప్పుడు ఆమె కొడుకు బ్యాలెన్స్ కోల్పోతున్నాడని గమనించి, అతను పడిపోకుండా ఉండటానికి చేయి చాచానని చెప్పుకొచ్చాడు.SHOCKING & SAD !! Mahendra Patel has filed a federal civil rights lawsuit after being jailed for 47 days over a Walmart incident.He was arrested after a shopper accused him of trying to kidnap her child. Police video later showed no force, no injury, and no kidnapping… pic.twitter.com/cRlPZfwvEH— M9 USA🇺🇸 (@M9USA_) February 11, 2026 తప్పుడు ఆరోపణల వల్ల పటేల్ 46 రోజుల పాటు కాబ్ కౌంటీ జైలులో గడపాల్సి వచ్చింది. ఆరు వారాల తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. చివరికి ఆగస్టు 2025లో జిల్లా అటార్నీ కార్యాలయం ఈ కేసును కొట్టివేసింది. రెండు పార్టీలు ఒక పరిష్కారానికి వచ్చాయని కోబ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ చెప్పింది.నిజం నిరూపించిన సీసీటీవీ ఫుటేజ్అతను బిడ్డను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించలేదని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిరూపితమైంది.పటేల్ చాలా ప్రశాంతంగా ఆమె పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లడం, ఆమె అతనికి 'థంబ్స్ అప్' చూపించడం స్పష్టంగా కనిపించింది. అలాగే మిల్లర్ చెప్పినట్లుగా అక్కడ ఎలాంటి పెనుగులాట జరగలేదు. ఇదీ చదవండి: రైల్లో శాండ్విచ్...నెటిజన్ల రియాక్షన్స్ వైరల్ వీడియో మానసిక వేదన, వ్యాపార నష్టం ఈ అనుభవాన్ని "పీడకల"గా అభివర్ణించారు. ఈ దారుణమైన అనుభవం తనను మానసికంగా కుంగ దీసిందనీ, ఆర్థికంగా దెబ్బతీసిందని పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. "టైలెనాల్ కోసం వెళ్తే, నా జీవితంలోనే అతిపెద్ద తలనొప్పి ఎదురైంది" అని ఆయన పేర్కొన్నారు. తన కుటుంబం కూడా నరకం చూసిందన్నారు. ఒకవేళ వాల్మార్ట్ వీడియో లేకపోయి ఉంటే. ఆమె మాట వర్సెస్ నా మాటగా మారింది. నేనిక జైల్లో మగ్గిపోవాల్సి వచ్చేదన్నారు. ఆ ఫుటేజ్అక్షరాలా తన ప్రాణాన్ని కాపాడిందన్నారు.సుమారు రూ. 210 కోట్లుతాను అనుభవించిన మానసిక క్షోభకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆయన దావా వేశారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన ఆక్వర్త్ నగరంపై, తప్పుడు ఫిర్యాదు చేసిన మిల్లర్పై , పోలీసులపై 25 మిలియన్ల డాలర్లు ( సుమారు (రూ.210 కోట్లు) నష్టపరిహారం కోరుతూ ఆయన దావా వేశారు.ఇదీ చదవండి: ఇండియన్ ఫోటోగ్రాఫర్కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతంసీసీటీవీ ఫుటేజ్లో ఎలాంటి తప్పు కనిపించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం అధికార దుర్వినియోగమేనని పటేల్ తరపు న్యాయవాది మార్క్ గ్రాస్మన్ అన్నారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియో
టీడీపీది రాక్షసానందం.. జగనన్న మాకు ధైర్యం చెప్పారు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల దాడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శ్రీజ.. జగనన్న తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని.. మా తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ‘‘టీడీపీ వాళ్లు మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. కానీ నిన్న వేలమంది అభిమానంతో మా ఇంటికి వచ్చారు. మా నాన్న చెప్పినట్టే మాకు అండగా వెంకటేశ్వరస్వామి ఉన్నారు’’ అని శ్రీజ పేర్కొన్నారు.‘‘దేవుడి అండ ఉన్నంతవరకు మాపై వేసే ప్రతీ రాయి పువ్వుగా మారుతుంది. ఆయనే మాకు ఓ రక్షణ కవచంలా ఉంటారు. మా ఇంటిపై అత్యంత దారుణంగా అటాక్ చేశారు. 9 గంటల పాటు తండోపతండాలుగా జనం దాడి చేశారు. ఉదయం గుడికి వెళ్లిన నాన్నపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేశారు. టీడీపీ మహిళలు బూతులతో ఆయనను తిట్టారు. ఆ సమయంలోనే మా నాన్న అలా మాట్లాడారు. దానికి ఆయన రియలైజ్ అయ్యి ఆ మాట అనకూడదన్నారు. లీగల్గా ఎదుర్కొంటానని కూడా చెప్పారు..కానీ మా ఇంట్లో ఆడవాళ్లని దారుణంగా తిడుతూ అటాక్ చేశారు. కాపు కులంకి బూతులు జోడించి తిట్టారు. ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి దీనిని నడిపించడం దారుణం. ఆయన మేథస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోంది. అంబటి రాంబాబుని నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం దారుణం. ఆయనను వేధించి రాక్షసానందం పొందారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలుసుకొవాలి. దాడి చేసిన దానికంటే.. నాలుగు రెట్ల జనం అభిమానంతో వచ్చారు’’ అని శ్రీజ చెప్పారు.
క్రైమ్
ప్రియుని చేతిలో వివాహిత హత్య
కర్నాటక: ఇద్దరు పిల్లలు ఉన్న మహిళతో అక్రమ సంభందం పెట్టుకొన్న సందీప్ అనే దుండగుడు తేజస్విని (32) అనే మహిళను పొడిచి చంపాడు. ఇది చిక్కబళ్లాపురం నగరంలో జరిగింది. వివరాలు.. భర్తతో విడిపోయిన తేజస్విని ఓ హోటల్లో పని చేస్తూ అందులోనే ఓ గదిలో నివాసముంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సందీప్ (26) అనే యువకుడు ఆమెకు పరిచయమై వేరే ఇల్లు తీసుకుని సహజీవనం ప్రారంభించారు. తేజస్విని తన స్నేహితురాలు అరుణను ఇంటికి తీసుకొచ్చింది. ఇది నచ్చని సందీప్ తాగి గలాటా చేశాడు. అదే మత్తులో కత్తితో తేజస్వినిపై దాడి చేశాడు. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక తేజస్విని చనిపోయింది. నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. తల్లి దూరమై ఆమె పిల్లలు అనాథలయ్యారు.
కాటికి చేరిన నవ దంపతులు
ఇంకా పెళ్లి బట్టలు కూడా మాసిపోలేదు. గోరింటాకు చెదిరిపోలేదు. పెళ్లింట బంధువుల సందడి అలాగే ఉంది. నవ దంపతులు చిలకా గోరింకల్లా చూడ ముచ్చటగా ఉన్నారని ఊరంతా సంబరపడ్డారు. కానీ విధికి మాత్రం కన్నుకుట్టింది. పట్టుమని 15 రోజులకే కొత్త దంపతులు మరణించారు. కలిసి జీవిస్తామని బాసలు చేసినవారు కలిసే చనిపోయారని అందరూ కన్నీరు పెట్టారు.బెంగళూరు: నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలని బంధుమిత్రులు చేసిన దీవెనలు ఫలించలేదు. ఆదివారం తెల్లవారుజామున 5:30 సమయంలో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం చెందారు. ఈ దుస్సంఘటన హావేరి జిల్లా శిగ్గావ్ తాలూకా కడహళ్లి గ్రామం సమీపంలోని 48వ జాతీయ రహదారిపై జరిగింది. ఆలయానికి వెళ్లి వస్తుండగా.. వివరాలు.. శిగ్గావ్ నివాసులు కార్తీక్ హుగార్ (34), ఐశ్వర్య (30)కు 15 రోజుల క్రితమే ఆడంబరంగా వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ బంధువులతో కలిసి గదగ్ జిల్లా నవలగుందలోని కామణ్ణ ఆలయ దర్శనానికి కారులో వెళ్లి తిరిగివస్తున్నారు. ఘటనాస్థలిలో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొన్నారు. దంపతులు గాయాలతో అక్కడే కన్నుమూయగా, మల్లికార్జున, వినాయక అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు కలిసి నుజ్జయిన కారులో నుంచి శవాలను, క్షతగాత్రులను బయటకు తీసి శిగ్గావ్ ఆస్పత్రికి తరలించారు. శోకసంద్రం.. ఇంటికి వస్తున్నామని చెప్పిన నవ దంపతులు కాటికి చేరారని తెలిసి ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆస్పత్రి బంధువుల రోదనలతో మార్మోగింది. ఘటనాస్థలిని జిల్లా ఎస్పీ యశోద వంటగోడి పరిశీలించారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తుకు గురవడం వల్లనే ఘోరం జరిగిందని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
నెల్లూరు జీజీహెచ్లో మంటలు
నెల్లూరు (అర్బన్): నెల్లూరులోని సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) ఎమ్సీహెచ్ బ్లాక్లోని హెచ్డీ వార్డులో ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు ఏసీలు పేలిపోయాయి. అక్కడే డ్యూటీలో ఉన్న డాక్టర్ మాధురి సిబ్బంది సాయంతో అద్దాలు పగులగొట్టారు. సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఒక్కసారిగా ఆస్పత్రిలో చీకట్లు అలుముకున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని భయంతో అరుస్తూ చీకట్లోనే బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది ఫైరింజన్ వచ్చేలోపు అగి్నమాపక పరికరాల సాయంతో మంటలను ఆర్పేశారు. అప్పటికే రెండు బెడ్లకు మంటలు అంటుకోగా, వాటినీ అదుపుచేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రి అధికారులు డాక్టర్ సుశీల్, డాక్టర్ కళారాణి పిల్లలను ట్రామా వార్డులోకి మార్చి వైద్యసేవలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టారు. ఎస్పీ అజిత, ఆర్డీఓ అనూష, విద్యుత్ శాఖ ఈఈ శ్రీధర్, డీఈఈ అశోక్ తదితరులు పరిశీలించారు.
హాహాకారాలు.. ఆర్తనాదాలు
పిఠాపురం: తల ఒకచోట.. మొండెం మరోచోట.. కాలు ఒకచోట.. చెయ్యి మరోచోట.. ఇలా ఏ అవయవం ఎక్కడుందో.. అది ఎవరిదో తెలీనంత అతి దారుణంగా బాణాసంచా పేలుడులో మృతుల శరీరాలు ఛిద్రమయ్యాయి. ఏది ఎవరి అవయవమో కూడా తెలీనంతగా కాలిపోయాయి. తమ వారి మృతదేహం ఎక్కడుందో తెలుసుకోడానికి మృతుల బంధువులు పడుతున్న వేదన.. చేస్తున్న ఆర్తనాదాలు అంతాఇంతా కాదు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం సంభవించిన బాణసంచా పేలుడు ఘటనలో అసలు అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు.. ఎంతమంది చనిపోయారు అనేది కూడా చెప్పడానికి ఎవరు లేకపోవడంతో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది.మా వాళ్లు బతికుండేలా చూడు దేవుడా..సంఘటన స్థలానికి చేరుకున్న మృతుల బంధువులు తమ వాళ్లు బతికున్నారో చనిపోయారో తెలీక ‘మా వాళ్లు బతికుండేలా చూడు దేవుడా’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఒకపక్క అధికారులు, సిబ్బంది మృతదేహాల భాగాలను పోగుచేస్తుంటే.. ఆ పోగులో తమ వారెవరైనా ఉన్నారా అంటూ వెతుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. బాణసంచా తయారీ పనికి వెళ్లిన వారి బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని తమ వారి జాడకోసం కాలువలు, చెట్లు, పుట్టలు, పొలాల్లో వెతుక్కుంటూ కనిపించారు. సంఘటన స్థలానికి దూరంగా ఉన్న కాలువల్లోనూ మృతదేహాల భాగాలు దొరకడంతో ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు గాలింపు చేపట్టారు. మొత్తం మీద 20 మృతదేహాలను గుర్తించినట్లు అధికారికంగా వెల్లడించగా.. తమవారి ఆచూకీ తెలీలేదంటూ కొందరు అధికారులకు సమాచారం ఇస్తున్నారు.అప్పుడు తప్పించుకుని.. ఇప్పుడు కాలిపోయాడు..గతంలో గ్రామంలో జరిగిన కొట్లాటలో గంపల నాగరాజు (55)ను కత్తులతో చంపడానికి కొందరు ప్రయత్నించగా అతను ఎలాగోలా తప్పించుకున్నాడు. బతుకు జీవుడా అంటూ మళ్లీ తన బతుకు తాను బతుకుతుంటే మృత్యువు పేలుడు రూపంలో అతడ్ని దహించేసిందని నాగరాజు బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన గంపల నాగరాజు, గంపల మంగ భార్యాభర్తలు. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో వీరు పనిచేస్తున్నారు. శనివారం జరిగిన విస్ఫోటంలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. అంత పెద్ద గొడవలోనూ బతికి బయటపడ్డాడనుకుంటే ఇప్పుడు మంటల్లో ఆహుతయ్యాడని.. తండ్రితో పాటు తల్లి కూడా కానరాని లోకాలకు వెళ్లిపోయిందని.. ఇక తమకు పెద్ద దిక్కెవరంటూ నాగరాజు కుమారుడు వెంకటన్న రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.నా మాట వినుంటే అల్లుడు బతికేవాడు..ఆ పని ప్రమాదకరమైంది.. ఆ పనిలోకి వెళ్లొద్దని ఎంత మొత్తుకున్నా వినకుండా బాణసంచా తయారీకి వెళ్లి చివరకు మృత్యువాతపడ్డాడని.. తన మాట వినుంటే తన అల్లుడు బతికేవాడని బాణసంచా ప్రమాదంలో మృతిచెందిన వల్లూరి రవి అత్త ముప్పిడి భద్రమ్మ కన్నీరుమున్నీరవుతోంది. పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన భద్రమ్మ కుమార్తె లక్ష్మికి, వేట్లపాలేనికి చెందిన రవితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె సోఫియా ఉంది. రోదిస్తున్న మృతుడు రవి అత్త భద్రమ్మ అయితే, మృతుడు రవికి కుట్టు మెషీన్, పెయిటింగ్ వంటి పనులు వచ్చు. కానీ, ఆ పనులు చేయకుండా బాణసంచా తయారీకి మాత్రమే వెళ్లేవాడు. దీంతో, ఆ పనికి వెళ్లొద్దంటూ తాను చాలాసార్లు వారించానని భద్రమ్మ రోదిస్తూ చెప్పింది. కావాలంటే కొత్త మెషీన్ కొనిస్తానని, దానిని కుట్టుకుని బతకమని ఎన్నోసార్లు చెప్పానని, అయినా తన మాట వినకుండా ఆ పనిలోకి వెళ్లి, తన అల్లుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడని, ఇక తన కూతురుకు మనవరాలికి దిక్కెవరంటూ భద్రమ్మ గుండెలవిసేలా రోదిస్తుంటే ఆపడం ఎవ్వరి తరం కాలేదు.మా అమ్మను చూపించండి..‘మా అమ్మ మందుగుండు సామగ్రి తయారుచేయడానికి వెళ్లింది. అందరూ చనిపోయారంటున్నారు.. మా అమ్మ కనిపిస్తే చూపించండి’.. అంటూ ఈ దుర్ఘటనలో అసువులు బాసిన వేట్లపాలేనికి చెందిన దూకెళ్ల దేవి కుమార్తె చంద్రకళ శోకతప్త హృదయంతో దీనంగా అడుగుతోంది. దీంతో ఏం చెప్పాలో తెలీక ఆమె బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు.. పేలుడులో మృతిచెందిన దేవి మృతదేహాన్ని సామర్లకోట ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచడంతో అక్కడ తన తల్లిని చూపించడంటూ చంద్రకళ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.
వీడియోలు
వేట్లపాలెం ఘటనపై బాబు, పవన్ కు శ్రవణ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్
యుద్ధ నేపథ్యంలో ప్రవాసాంధ్రుల రక్షణ కోరుతూ YS జగన్ ట్వీట్
మిసైల్ బ్లాస్ట్ లైవ్ వీడియో.. దెబ్బకు ఎగిరిపడ్డ మహిళ
టాలీవుడ్ లో విక్రమ్ ఫైనల్ చేసిన నాలుగు కథలు ఇవే..
షార్జా ఎయిర్ పోర్టుపై బాంబుల వర్షం.. భయంతో వణుకుతున్న భారతీయులు
కాలిపోతున్న కువైట్.. ఇరాన్ భీకర దాడులు
BR నాయుడు బాధితురాలు చంద్రబాబుకి సంచలన లేఖ.. బయటపెట్టిన భూమన
ఇరాన్ విధ్వంసం.. దుబాయ్ అతలాకుతలం
విజయ్-రష్మిక.. సత్యనారాయణ స్వామి వ్రతం
కేంద్రం హెచ్చరిక.. భారత్ లో హింస జరిగే అవకాశం..

