ప్రభుత్వ టీచర్లపై నారా లోకేష్ రెడ్బుక్ కక్ష
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ టీచర్ల పై నారా లోకేష్ రెడ్ బుక్ కక్ష సాధింపులకు దిగింది. ముగ్గురు టీచర్లను చంద్రబాబు సర్కార్ సస్పెండ్ చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోసం పోరాడినందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులపై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసినందుకు టీచర్లను బాబు సర్కార్ సస్పెండ్ చేసింది.లక్షలాదిమంది ఉపాధ్యాయుల సమస్యపై కేంద్రమంత్రికి విన్నవించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే, వారితో వెళ్లారని ముగ్గురు ఉపాధ్యాయులను చంద్రబాబు ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది. సంగమేశ్వర రెడ్డి, అమరనాథ రెడ్డి, వెంకటనాథ్ రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కడప డీఈవో.. తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేశారు. డీఎస్సీ అక్రమాల ర్యాలీలో పాల్గొన్నారంటూ తప్పుడు అభియోగాలతో సస్పెన్షన్ చేశారు. విద్యాశాఖలో టీచర్లపై రెడ్ బుక్ ప్రయోగించడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
'కొంచెమైనా సిగ్గుండాలి.. కూతురి వయసున్న అమ్మాయితో'
బాలీవుడ్ నటుడు గోవిందా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇన్నాళ్లు గోవిందాను వెనకేసుకొచ్చిన సునీత.. ఈ సారి మాత్రం గట్టిగానే కడిగేస్తోంది. ఇటీవల గోవిందా నటి కోమల్ రాణి స్వర్ణకర్తో కనిపించడంతో సునీత ఫైరవుతోంది. తన కూతురు వయసున్న అమ్మాయితో తిరుగుతున్నాడు.. గోవిందాకు కొంచెమైనా సిగ్గుండాలని ప్రశ్నించింది.ఇటీవల ముంబయి విమానాశ్రయంలో గోవిందాతో పాటు నటి కోమల్ రాణి స్వర్ణకర్ జంటగా కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా? అంటూ నెట్టింట చర్చ మొదలైంది. ఇది చూసిన కొందరు గోవిందా భార్య సునీత అహుజాను ప్రశ్నించారు. దీంతో ఆమె తనదైన శైలిలో స్పందించింది. అసలు వీళ్లిద్దరు సినిమా తీయకుండానే ప్రమోషన్స్ చేస్తున్నారా? అంటూ మండిపడింది. అతను తన కూతురి వయస్సులో ఉన్న అమ్మాయితో తిరుగుతున్నాడు... కనీసం కొంచెమైన సిగ్గుండాలి కదా సునీత నిలదీసింది.కోమల్ రాణి స్వర్ణకర్ ఎవరు?కోమల్ రాణి స్వర్ణకర్ బాలీవుడ్లో ఎంట్రీకి సిద్ధమైంది. గోవింద ఇటీవలే 'రూపా', 'దునియాదారి' చిత్రాలను ప్రకటించారు. వీటిలో 'రూపా' చిత్రంలో రాణి స్వర్ణకర్ను కథానాయికగా పరిచయం చేశారు. ఈ ప్రాజెక్టులను గోవిందానే నిర్మిస్తున్నారు. దీంతో గోవింద రాబోయే రెండు ప్రాజెక్టులలోనూ ఆమె భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒకనాటి జెండా పండగ మువ్వన్నెలూ పిల్లల ముఖాల్లోనే...
ఆగస్టు పదిహేనంటే ముందు దేశభక్తి గీతాల అడావిడి. క్లాసులో ఎవరికీ సరిగా పాడటం రాదు. కాని అందరూ చేతులెత్తేవారే. ఊరి హైస్కూల్లో... ఏ హైస్కూల్లో అయినా నలుగురైదుగురు టీచరమ్మలు ఉంటారు. ఒక ఐవోరుకి పాటల గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. అంతో ఇంతో పాడేవాడై కూడా ఉంటాడు. వీళ్లకు హెడ్మాస్టర్ పుణ్యమా అని ఈ దేశభక్తి పాటల డ్యూటీ. ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్ వాళ్లను వెతికి గ్రూపులు చేసి పాడించడం. మరి టెన్త్క్లాస్ వాళ్లో? వాళ్లకు పబ్లిక్ ఎగ్జామ్స్ కదా. చదువుకోవాలి. ఈ ఆపరేషన్కు దూరంగా ఉంచాలి. అయితే ఒక సర్దా ఉందండోయ్. రిహార్సల్స్ పేరు చెప్పి పీరియడ్స్ ఎగ్గొట్టొచ్చు. ఐవోర్ల స్టాఫ్రూమ్లో రిహార్సల్స్. ప్రతిసారీ అవే పాటలు. బ్యాచ్లు మారతాయంతే.‘వందేమాతరం.. సుజలాం.. సుఫలాం.. మలయజశీతలాం’..‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా’...‘పాడవోయి భారతీయుడా ఆడిపాడవోయి విజయగీతికా’...‘సారే జహాసే అచ్ఛా హిందూసితా హమారా’...‘జయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి’...‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’....అదేంటోగాని ఆగస్టు పదిహేనుకు ఫండు పిల్లలే తేవాలి. రంగు కాగితాలకీ, చార్ట్లకీ, పురికొసలకీ. ఇంట్లో అడగాలి. ఎంత? పావలా... అర్ధరూపాయి... అమ్మో అన్ని డబ్బులే. మరి 1985–86ల్లో అవి పెద్ద డబ్బులే. కొందరు తెచ్చేవారు. కొందరు మెదలకుండా ఉండేవాళ్లు. క్లాసులో ఎవడైతే పరమ బేవార్సు స్టూడెంట్గా ఉంటాడో వాడికి రంగు కాగితాలు కట్ చేయడంలో, రంగురంగుల త్రికోణాలు పురికొసకు అంటించి వేళ్లాడగట్టడంలో తోట తరణి అంత అనుభవం ఉంటుంది. వాడికి సేకరించి ఐదురూపాయల పావలా ఇస్తే తుర్రున బుక్స్టోర్కు పరిగెత్తి రంగు కాగితాలూ కత్తెర కొని ఒక టీమ్తో మైదా పిండి ఉడకబెట్టించి ఆ పనిలో ఉంటాడు. బోర్డును నీటుగా కడిగి, తడిపిన రంగు చాక్పీస్లతో ‘స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అని అందంగా రాసే స్టూడెంట్లు ప్రతి క్లాస్లో ఒకరో ఇద్దరో ఉంటారు. వీరు మ్యాథ్స్లో వీక్... డ్రాయింగ్లో ఫస్ట్. ఈ డ్యూటీ వారిది.అయితే ప్రతి సెక్షన్ వారికీ ఈ ఆగస్టు 15న కాస్త కుళ్లు ఉండేది ఒకే ఒక వ్యక్తి మీద. వాడు ఎస్.పి.ఎల్. ఆ రోజు వాడి డాబు, దర్పాన్ని ఆపేవాడుండదు. అందరూ యూనిఫామ్ వేసుకుంటే వాడు ఎన్సిసి డ్రస్సు లాంటిది వేసుకొని ఎర్రబంతి వేళ్లాడే ఖాకీ క్యాప్ పెట్టుకొని ఏ పోలీస్ ఆఫీసరులానో ఉంటాడు. వాడు ‘అటెన్షన్’ అంటే అటెన్షన్. వాడు ‘స్టాండ్ ఎట్ ఈజ్’... అంటే తెరిపి. జెండా ఎగరేయడానికి వీడు మార్చింగ్ చేస్తూ హెడ్మాస్టర్ని, చీఫ్గెస్టునీ తీసుకొస్తాడు. జెండా ఎగరేశాక వీడు సెల్యూట్ కొడితే హెడ్మాస్టర్ వీడికి సెల్యూట్ కొడతారు. మిగిలిన పిల్లలకి ఈ చాన్స్ ఎక్కడా? అందుకే వాడంటే కొంచెం ఇది.ఆగస్టు పదిహేనుకు పూలు తెచ్చి జెండాలో పెట్టే పని టీచరమ్మలది. పూలున్న జెండాను పొట్లంలా చుట్టి జెండాకర్ర కొసాకు పంపించడం, తాడు లాగినప్పుడు జెండా విడివడి పూలు అందరి మీద పడేలా కట్టడం అందరికీ వచ్చనుకుంటున్నారా? రాదు. దానికి పీఈటీ వోరు ఎక్స్పర్ట్. ఆయనే అది చేయాలి. మనం చేస్తే తాడు లాగితే జెండా ఊడదు. పరువు పోతుంది. అందుకని ప్రతి ఆగస్టు 15న తాడు లాగితే జెండా ఎగరుతుందా లేదా అని అదో టెన్షన్.ప్రతి స్టూడెంట్ బాగా ఉతికిన యూనిఫామ్ ఇస్త్రీ చేయించుకొని మరీ ఆ రోజున వేసుకోవాలి. చెంబిస్త్రీ, చేటిస్త్రీ తప్పదు. పాపం హాస్టల్ పిల్లలు శుభ్రమైన బట్టలు వేసుకొచ్చినా వారికి ఇస్త్రీ వీలు లేకపోవడంతో చిన్నబుచ్చుకునేవారు. ఫ్రెండ్సు వారితో చేరి ‘ఏం పర్లేదు లేరా. మీ చొక్కాలే మా చొక్కాల కంటే తెల్లగా ఉన్నాయి’ అని ఉత్సాహపరిచేవారు. వారు నూనె రాసుకున్న తలలతో తెల్లగా నవ్వేవారు.రోజూ స్కూలు ఉదయం తొమ్మిదికైతే ఆ రోజున ఎనిమిదికే సిద్ధం. గ్రౌండ్లో సుద్దపొడి వేసి లైన్లు కొట్టి ఒక్కో సెక్షన్ ఒక్కో లైన్లో నిలబడేలా చేసేవారు. జెండా కర్ర దగ్గర స్టేజ్. ఊరి ఆర్డివోనో తాసిల్దారో రిటైరై వెళ్లిపోయిన హెడ్మాస్టరో చీఫ్ గెస్టు. టిఫిన్ చేసొచ్చిన పిల్లలూ... చేయకుండా వచ్చిన పిల్లలూ... చాక్లెట్లు ఎన్ని పంచొచ్చో ఎక్స్పెక్టేషన్స్లో ఉన్న పిల్లలూ... వీళ్లు మళ్లీ ఇంట్లో తోబుట్టువులకు హామీ ఇచ్చి వచ్చి ఉంటారు... చాక్లెట్లు తెచ్చిస్తా అని. అదొక టెన్షన్. హెడ్మాస్టర్ మూడ్ బాగుంటే రెండు పెద్ద పెద్ద పళ్లేలు తెప్పించి మూడు నాలుగు రకాల చాక్లెట్లు పోయించి, నయాపైసాకు ఒకటి వచ్చే బ్రిటానియా రౌండ్ బిస్కెట్లు వాటిలో కలిపి, మిశ్రీ ముక్కలు కూడా మిక్స్ చేసి గుప్పెడు గుప్పెడు పంచితే అదీ కిక్కు. పాపం కొన్ని వీధి బడుల్లో బొరుగుల్లో బెల్లం ముక్కలు కలిపి పంచేవారు. ఆ స్కూళ్ల ఆగస్టు 15కు పిల్లలు వెళ్లేవాళ్లు కాదు.అయితే చాక్లెట్లు, బిస్కెట్లు అంత సులువుగా రావు. ఎండ వాయకొడుతున్నా లెక్కచేయకుండా జెండా వందనం చేయించి, దేశభక్తి గీతాలు పాడించి, గెస్టు స్పీచు, హెడ్మాస్టరు స్పెషలు స్పీచు ఇచ్చి... దేశం తాలుకు బాధ్యతలన్నీ ఆ పూట ఎదురుగా నిలుచున్న పిట్ల ప్రాణాలకే అప్పజెప్పేసేవారు. నేటి బాలలే రేపటి పౌరులు అనేసేవారు. ఆ బాలలేమో స్కూల్లేదు కదా... మధ్యాహ్నం మేట్నీకి డబ్బులెలా అనే మనాదిలో ఉంటారు.ఇన్నింటి మధ్య కూడా ఆగస్టు పదిహేను బాగుండేది. స్కూల్లోని ప్రతి క్లాసు రంగు కాగితాలతో రెపరెపలాడేది. ప్రతి గుండె మీద త్రివర్ణపతాకం గుండు పిన్నుతో అంటుకుపోయేది. ప్రతి పెదవి మీద గాంధీ నెహ్రూ సుభాసుబోసు భగత్సింగుల పేరు పలికేది. ‘హమ్ బుల్బులేహై ఇస్కే ఏ గుల్సితా హమారా’... ఈ దేశపు గువ్వపిట్టలం... రెక్కలు సాచి ఎగురతాం అని పాడుతూ ప్రతి చిన్నారి హృదయం ఆకాంక్ష చేసేది. పొందికైన బట్టల్లో టీచర్లు, ఉపాధ్యాయులు హుందాగా కనిపించేవారు. ప్రతి పీరియడ్కూ బెల్లు కొట్టే ప్యూన్ ఆ రోజు చాక్లెట్లు పంచుతూ చక్కగా నవ్వేవాడు. క్లాసులు చిమ్మే ఆయమ్మ కొప్పులో చామంతులు పెట్టుకొని కొత్తగా కనిపించేది. అందరం పెద్దయ్యి దేశం కోసం ఏదో ఒకటి చేయాలని కాసేపైనా గట్టిగా అనిపించేది. ఇక రోజూ చేసే ప్రతిజ్ఞ ఆ రోజు మరింత ప్రత్యేకంగా ఉండేది. ‘నేను నా సహోదరులను ప్రేమించుచున్నాను’.... ఈ ఒక్కలైను భవిష్యత్తు సమాజాన్ని నిర్మించేది. ‘ఈ దేశ సంపదకు అర్హుడనవ్వడానికి సదా కృషి చేస్తాను’ ఈ లైనూ ముఖ్యమే.మనం అర్హులమై ఉండాలి. మనం మన సమాజాన్ని ప్రేమించడానికి. మనల్ని మన దేశం ప్రేమించడానికి. పాఠశాల మరో తల్లి గర్భం. అక్కడ పొందే జవసత్వాలు, బుద్ధి కుశలతలు, చదువూ సంస్కారాలు... ఇవే నిజమైన దేశభక్తి. ఇవే నిజమైన ఆగస్టు 15. ప్రతి తరాన్ని ‘అర్హులైన తరం’గా మలచగలినంత కాలం మన దేశ ఖ్యాతికీ, దీప్తికీ ఢోకా లేదు. అలా జరిగినంత కాలం విశ్వానికి మనమే ‘భాగ్య విధాతలం’. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి... భరతమాతకు ప్రతిరూపమే. ఏ తల్లిబిడ్డలైనా అందరూ భరతమాత బిడ్డలే.జెండా ఊంచా రహేగా హమారా.భారతమాతాకీ జై. జైహింద్!విదేశీ గడ్డపై మన జెండా!జర్మనీలోని స్టట్గార్డ్లో 1907లో జరిగిన ఒక విప్లవ సమావేశంలో భారతదేశ స్వాతంత్య్ర ఆకాంక్షలను చాటి చెప్పేలా డిజైన్ చేసిన ఒక జెండా (ఇప్పటి జాతీయ జెండా కాదు)ను ఎగరేశారు భికాజీ కామా. విదేశీ గడ్డపై మన జెండా ఎగరేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.గాంధీ గారి రేడియోనానిక్ మోత్వానీ అనే వ్యాపారవేత్త అమెరికా, ఇంగ్లాండ్ల నుంచి రివర్స్–ఇంజినీర్ యాంప్లిఫయర్స్, మైక్రోఫోన్స్, లౌడ్స్పీకర్లను దిగుమతి చేసుకొని ‘చికాగో రేడియో’ ప్రారంభించారు. ఈ రేడియో మహాత్మాగాంధీ ప్రసంగాలను విస్తృతంగా ప్రసారం చేసేది. స్వాతంత్య్ర సమరయోధులు రహస్య, భూగర్భ నెట్వర్క్లను నడపడంలో మోత్వానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సాంకేతిక పరికరాలు ఉపయోగపడ్డాయి.క్యాట్ ఆర్మీస్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వారిపై నిరసన కార్యక్రమాలు సృజనాత్మకంగా, ఆకట్టుకునేలా రూపొందించేవారు. శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో సూరత్లో క్యాట్ ఆర్మీ(మంజరి సేన) అనే సంఘంలోని మహిళలు జాతీయజెండా రంగులలో ముంచిన ఖాదీ వస్త్రాలు ధరించి బ్రిటిష్ అధికారులను ధిక్కరించారు. ∙సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసనలు జరిగినప్పుడు లక్నోలాంటి నగరాల్లో ‘సైమన్ గో బ్యాక్’ అని రాసి ఉన్న గాలిపటాలను ఎగరేశారు.అసామాన్య మహిళలుకొత్తగా వెలుగులోకి వచ్చిన బీబీసి వారి ఫొటో ఆర్కైవ్లో.... ఉప్పు సత్యాగ్రహంలో సామాన్య మహిళలు ఎంత ధైర్యసాహసాలు, అంకితభావంతో పాల్గొన్నారో, శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎలా నడిపించారో కళ్లకు కట్టే ఫొటోలు ఉన్నాయి. పోలీసులను బహిరంగంగా సవాలు చేశారు, మాటకు మాట బదులిచ్చారు మహిళా స్వాతంత్య్ర సమరయోధులు.నివేదిత వజ్ర ఫ్లాగ్సిస్టర్ నివేదిత 1904లో భారత జాతీయ జెండాకు రూపకల్పన చేశారు. ‘నివేదిత వజ్ర ఫ్లాగ్’ అని పిలిచే ఈ జెండాలో ఎరుపు, పసుపు రంగుల నేపథ్యం, తెల్లని తామరపువ్వుతో కూడిన వజ్రం చిహ్నం, వందేమాతరం నినాదం కనిపిస్తాయి.దండి యాత్రలో అతి పిన్న వయస్కుడుఉప్పుపై పన్నును వ్యతిరేకిస్తూ సబర్మతి ఆశ్రమం నుండి ‘దండి యాత్ర’ ప్రారంభించారు గాంధీజీ. భారతదేశంలో వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ మార్చ్లో పాల్గొన్న వారిలో అత్యంత పిన్న వయస్కుడు పదహారేళ్ల విఠల్ లీలాధర్ ఠక్కర్.
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.తదియ రా.7.31 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: పుబ్బ ఉ.6.25 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: ప.1.36 నుండి 3.12 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.46 నుండి 7.26 వరకు, అమృత ఘడియలు: రా.12.10 నుండి 1.44 వరకు.సూర్యోదయం : 5.46సూర్యాస్తమయం : 6.24రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకుమేషం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకోని మార్పులు.వృషభం: కుటుంబంలో కొన్ని సమస్యలు తప్పవు. అనారోగ్యం. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.మిథునం: నూతన ఉద్యోగాలు లాభిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.కర్కాటకం: వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.సింహం: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.కన్య: రుణదాతల ఒత్తిడులు. పనుల్లో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.తుల: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. విద్యార్థులకు కార్యసిద్ధి. వృత్తి, వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి.వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. కొత్త వ్యక్తుల పరిచయం. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.ధనుస్సు: మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.మకరం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.కుంభం: రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. నిరుద్యోగులకు అనుకూలం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
‘గోదావరి పుష్కరాలు-2027’ నిర్వహణపై మంత్రి దుద్దిళ్ల సమీక్ష
పేదలకు ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
ఒకనాటి జెండా పండగ మువ్వన్నెలూ పిల్లల ముఖాల్లోనే...
‘నన్నే ఆపుతావా?’.. పోలీసు అధికారిణిపై ఎమ్మెల్యే కుమార్తె దాడి
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. మరో టీజర్ వచ్చేసింది
TG: ప్రజలకు గవర్నర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
అభిషేక్ పోరెల్కు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరించిన కోర్టు
కేవలం ఒక్క రూపాయి.. 24 రోజుల వ్యాలిడిటీ!
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
అబ్బే! ఆయన అడిగేది క్రికెట్ స్కోరు కాద్సార్.. మన రోజువారీ అప్పు
చంద్రబాబు వస్తే వర్షాలు రావంటున్నారు - టీడీపీ నేత జేసీ
ఫోన్కు బానిసై, ఆస్పత్రిలో చేరిన షకీలా.. నరకయాతన!
విమానం కాదు! మన సారే సీక్రెట్గా వెళ్తున్నారు!
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
మళ్లీ మీకు ఇబ్బంది లేకుండా ఇంటి ముందే ఆఫీసు తెరిచార్సార్!
బాబు రాయబారం ఫెయిల్.. ఝలక్ ఇచ్చిన పవన్!
అఫ్గానిస్తాన్ ఓపెనర్ వరల్డ్ రికార్డ్
ఆరాధ్య బచ్చన్ కేసు: ‘ఇంటి పేరు ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా’
'అగధ' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓవరాక్షన్ వద్దు.. ఆట కంటే గొప్పోడివా?: స్మిత్పై ఫైర్
ఈ రాశి వారు వాహనాలు, ఆభరణాలు కొంటారు
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
విశ్వనాథ్ అండ్ సన్స్.. ఎవరికెంత రెమ్యునరేషన్?
ఇకపై రోడ్డుపై పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లే!
బీజేపీకి వార్నింగ్ బెల్స్.. సీఎం కుర్చీకే ముప్పు?
రూ.50 కూలీ.. రూ.4,000 కోట్ల బడ్జెట్ సినిమాకు స్టార్ హీరో
12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
‘గోదావరి పుష్కరాలు-2027’ నిర్వహణపై మంత్రి దుద్దిళ్ల సమీక్ష
పేదలకు ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
ఒకనాటి జెండా పండగ మువ్వన్నెలూ పిల్లల ముఖాల్లోనే...
‘నన్నే ఆపుతావా?’.. పోలీసు అధికారిణిపై ఎమ్మెల్యే కుమార్తె దాడి
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. మరో టీజర్ వచ్చేసింది
TG: ప్రజలకు గవర్నర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
అభిషేక్ పోరెల్కు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరించిన కోర్టు
కేవలం ఒక్క రూపాయి.. 24 రోజుల వ్యాలిడిటీ!
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
అబ్బే! ఆయన అడిగేది క్రికెట్ స్కోరు కాద్సార్.. మన రోజువారీ అప్పు
చంద్రబాబు వస్తే వర్షాలు రావంటున్నారు - టీడీపీ నేత జేసీ
ఫోన్కు బానిసై, ఆస్పత్రిలో చేరిన షకీలా.. నరకయాతన!
విమానం కాదు! మన సారే సీక్రెట్గా వెళ్తున్నారు!
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
మళ్లీ మీకు ఇబ్బంది లేకుండా ఇంటి ముందే ఆఫీసు తెరిచార్సార్!
బాబు రాయబారం ఫెయిల్.. ఝలక్ ఇచ్చిన పవన్!
అఫ్గానిస్తాన్ ఓపెనర్ వరల్డ్ రికార్డ్
ఆరాధ్య బచ్చన్ కేసు: ‘ఇంటి పేరు ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా’
'అగధ' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓవరాక్షన్ వద్దు.. ఆట కంటే గొప్పోడివా?: స్మిత్పై ఫైర్
ఈ రాశి వారు వాహనాలు, ఆభరణాలు కొంటారు
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
విశ్వనాథ్ అండ్ సన్స్.. ఎవరికెంత రెమ్యునరేషన్?
ఇకపై రోడ్డుపై పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లే!
బీజేపీకి వార్నింగ్ బెల్స్.. సీఎం కుర్చీకే ముప్పు?
రూ.50 కూలీ.. రూ.4,000 కోట్ల బడ్జెట్ సినిమాకు స్టార్ హీరో
12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్
ఫొటోలు
అఖిల్ రాజ్, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
వెకేషన్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)
'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)
మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)
హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)
'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)
'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
కర్నూలులో వైఎస్ జగన్కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)
'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్ (ఫొటోలు)
సినిమా
యాక్టర్ రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం..
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీ(La trobe University) ఆమెకు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ పట్టాను ప్రదానం చేసింది. మెల్బోర్న్లో ఆగస్టు 14న జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.దాదాపు మూడు దశాబ్దాలుగా భారతీయ సినీ పరిశ్రమకు అందించిన సేవలు, మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషిని గుర్తించి దీనిని అందజేశారు. అంతకముందు 2019లో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. దీంతో ఇప్పుడీమె ఈ డాక్టరేట్ అందుకున్న రెండో భారతీయ సినీ ప్రముఖరాలిగా నిలిచింది.రాణి మాట్లాడుతూ సినిమానే నా కలను నిజం చేసే మార్గం అయిందన్నారు. కాగా ఈమె నటించిన ‘బ్లాక్’, ‘నో వన్ కిల్డ్ జెస్సికా’, ‘ హిచ్చి’, ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ చిత్రాలు మహిళా సాధికారత, సామాజిక మార్పు వంటి అంశాలను ప్రతిబింబించాయి.
కాంతార హీరోకు ప్రతిష్టాత్మక అవార్డ్
కాంతార హీరో రిషబ్ శెట్టి మరో ఘనత సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ అందుకున్నారు. కాంతార ఏ లెజెండ్ చాప్టర్-1 మూవీకి గానూ బెస్ట్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. అంతేకాకుండా లీడర్షిప్ ఇన్ సినిమా అవార్డు కూడా దక్కించుకున్నారు.ఈ అవార్డుల వేడుక ఆస్ట్రేలియా వేదికగా జరిగింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్-17 అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ప్రముఖ దిగ్గజ నటి రేఖ ఎక్స్లెన్స్ ఇన్ సినిమా పురస్కారానికి ఎంపికయ్యారు. ఇండస్ట్రీలో 30 వసంతాలు పూర్తి చేసుకున్న బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీకి ప్రత్యేక గుర్తింపునిస్తూ సన్మానించారు. మరోవైపు దుల్కర్ సల్మాన్ , కీర్తి కుల్హరి, విజయ్ వర్మ, రసికా దుగల్ ఉత్తమ నటీనటులుగా అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. ఈ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా కొత్త లోకా చాప్టర్-1 నిలిచింది.
'అభిమాని అంత్యక్రియలు.. నేనలా చేయడం కరెక్ట్ కాదు'
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్- ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ బోల్డ్ అండ్ వయొలెంట్గా అనిపించింది. ఈ యాక్షన్ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు.టాక్సిక్ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు యశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఓ అభిమాని అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. తాను వెళ్తే అభిమానుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. అందుకే తన అభిమాని అంత్యక్రియలకు వెళ్లలేదని స్పష్టం చేశారు. అతని మరణం నన్ను బాధించిందని.. కానీ నేను వెళ్తే మిగతా అభిమానులు కూడా అదే పని చేస్తారని యశ్ తెలిపారు.కాగా.. 2021 ఫిబ్రవరిలో కర్ణాటకలోని మాండ్యా జిల్లా కొడిదొడ్డి గ్రామానికి చెందిన 25 ఏళ్ల యశ్ అభిమాని రామకృష్ణ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తన అంత్యక్రియలకు యశ్, రాజకీయ నాయకుడు సిద్దరామయ్య హాజరు కావాలని కోరుతూ ఒక లేఖను రాశాడు. ఇది చూసి సిద్దరామయ్య అంత్యక్రియలకు హాజరయ్యారు. కానీ యశ్ హాజరు కాలేదు. తాజాగా తాను అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. అలాంటి వాటిని ప్రోత్సహిస్తే.. మిగతా ఫ్యాన్స్ కూడా అలానే చేస్తారని.. ఆ ఆలోచనా విధానమే తప్పని యశ్ స్పష్టం చేశారు.
'కొందరు కావాలనే నాపై కుట్ర': అనసూయ
టాలీవుడ్ నటి అనసూయ పేరు మరోసారి తెరపైకొచ్చింది. కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న అనసూయ వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి సినిమా వివాదాలతో కాదు. సనాతన ధర్మంపై ఆమె చేసిన కామెంట్స్తో హాట్ టాపిక్గా నిలిచింది. అనసూయ సనాతన ధర్మాన్ని అవమానించేలా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నేపథ్యంలోనే అనసూయ తన కామెంట్స్పై క్లారిటీ ఇచ్చింది. కొందరు తన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని పేర్కొంది. తాను ఏ మత విశ్వాసాలనూ కించపర్చేలా మాట్లాడలేదని వివరణ ఇచ్చింది. తాను మాట్లాడింది కేవలం కొందరి గురించి మాత్రమేనని తెలిపింది. తనపై వల్గర్ కామెంట్స్.. పర్సనల్ ఎటాక్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడే వాళ్ల గురించి అని తన పోస్ట్లో వెల్లడించింది. అందుకే తాను వివరణ ఇవ్వాల్సి వచ్చిందని అనసూయ రాసుకొచ్చింది.అనసూయ తన పోస్ట్లో రాస్తూ..'కొందరు కావాలనే నా మాటలను వక్రీకరిస్తున్నారు. అందుకే నేను వివరణ ఇవ్వాల్సి వస్తోంది. నేను కొందరి గురించి మాత్రమే మాట్లాడా. నాపై అభ్యంతర కామెంట్లు చేస్తూ, వ్యక్తిగత దాడులు, బెదిరింపులకు దిగే వాళ్ల గురించి మాత్రమే చెప్పా. అది ఏ మతాన్ని గానీ, వర్గాన్ని గానీ కించపరచలేదు. నన్ను టార్గెట్ చేస్తున్న వాళ్లకు స్పష్టంగా చెప్పాలనుకుటున్నా. నేను సనాతన ధర్మాన్ని పాటించే హిందువుని. నా ధర్మం, విలువలు, విశ్వాసాల పట్ల నాకు ఎలాంటి చింత లేదు. ధైర్యంగా ఉండటం.. నిజం వైపు నిలబడటం, తప్పును తప్పు అని చెప్పడం, ఎదుటివారిని మనిషిగా గౌరవించడం.. ఇవన్నీ నాకు ధర్మమే నేర్పింది. నన్ను నేను హనుమాన్ జీ కుమార్తెగా భావిస్తా. ఆయన బలమే నాకు స్ఫూర్తి' అంటూ పోస్ట్ చేసింది. అంతేకాకుండా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకుండా ఉండటం నా నైజం కాదని తెలిపింది. నా మాటల్లో అసలు విషయం పక్కనపెట్టి.. సనాతన ధర్మాన్ని అవమానించినట్లుగా వక్రీకరించినట్లు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికింది. మతం ఆధారంగా నేను ఎవరిపైనా ఓ నిర్ణయానికి రాను. నన్ను వేధించే వాళ్లను మాత్రమే ప్రశ్నిస్తానని రాసుకొచ్చింది. అందువల్ల ఎడిట్ చేసిన క్లిప్లు, సగం సగం కథనాలు చూసి మోసపోవద్దని సుదీర్ఘ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)
క్రీడలు
వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలి? హర్భజన్ సమాధానమిదే
టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే వరల్డ్ క్లాస్ బౌలర్లను అతడు ఎదుర్కొంటున్న తీరు నిజంగా ఒక అద్భుతం.మైదానంలో సూర్యవంశీని అడ్డుకోవడం ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వైభవ్ను కట్టడి చేసేందుకు ఒకే ఒక్క మార్గం ఉందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అతడికి డిఫెన్సివ్గా బౌలింగ్ చేయడం కంటే, వికెట్ పడగొట్టేందుకు ప్రయత్నించడమే బెటర్ అని భజ్జీ తెలిపాడు. "వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్. కేవలం 14-15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ను శాసించే ఆటగాడిని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. వరల్డ్ క్లాస్ బౌలర్లు సైతం అతడికి బౌలింగ్ చేయడానికి భయపడుతున్నారు.అయితే అతడిని ఔట్ చేయాలంటే ఒకే మార్గం ఉంది. అతడిని పరుగులు సాధించకుండా ఉండేలా బౌలింగ్ చేస్తే మీరు అతడిని ఔట్ చేయలేరు. వికెట్ గురుంచే ప్రయత్నం చేయాలి. షాట్ ఆడేందుకు ఆఫర్ చేయాలి. ఇది ప్రతిసారీ వర్కవుట్ కాకపోవచ్చు. కొన్ని సార్లు ఆ బంతులు సిక్సర్లగా కూడి వెళ్లవచ్చు. ఇదంతా ఆటలో భాగమే. ఏదేమైనప్పటికి వైభవ్ ఒక అసాధరణ ప్లేయర్ అని మనం అంగీకరించాలి" అని ఓ ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు.
ఇదేం బ్యాటింగ్.. ముసలోళ్ల జట్టు: ఆసీస్పై పాంటింగ్ ఫైర్
బంగ్లాదేశ్తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆట తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త బ్యాటింగ్తో తొలిరోజే ప్రత్యర్థి ముందు తలవంచారని మండిపడ్డాడు. కాగా దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ అనూహ్య ప్రదర్శనతో చెలరేగింది. డార్విన్లోని మరారా స్టేడియంలో బలహీన ప్రత్యర్థిపై బరిలోకి దిగిన కంగారూ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.బంగ్లాదేశ్ పేస్ బౌలర్లు చెలరేగడంతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఆసీస్ 53 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆలౌటైంది. ఒంటరి పోరాటం చేసిన స్టీవ్ స్మిత్ (109 బంతుల్లో 71; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ (6/55) ఆరు వికెట్లతో కంగారూలను పడగొట్టగా... మరో ఇద్దరు పేసర్లు ఇబాదత్ హుసేన్, తస్కీన్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు.ఇదేం బ్యాటింగ్?ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ ఆస్ట్రేలియా బ్యాటర్లను విమర్శించాడు. ‘‘తొలి సెషన్లో పిచ్ కాస్త భిన్నంగా ఉందని ఒప్పుకొంటాను. అయినా సరే ఆసీస్ బ్యాటర్లు స్థాయికి తగ్గట్లు ఆడలేదు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు టెక్నికల్గా ఎన్నో తప్పులు చేశారు.ఇందుకు వారికి క్షమాపణే లేదు. ఏదేమైనా ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై 54 పరుగుల తేడాతో గట్టెక్కిన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు.ముందుగా ఆసీస్ బౌలింగ్ చేస్తే పరిస్థితి వేరుగా ఉండేది’’ అని రిక్కీ పాంటింగ్ విమర్శించాడు.ముసలోళ్ల జట్టుఅదే విధంగా.. ఆసీస్ ప్రస్తుత జట్టుపై స్పందిస్తూ.. ‘‘నాకు తెలిసి 1928 తర్వాత బంగ్లాదేశ్తో తొలి టెస్టులో ఆడిన జట్టే అత్యధిక మంది ‘వృద్ధుల’తో నిండిన జట్టు అనుకుంటా. కామెరాన్ గ్రీన్ (27 ఏళ్లు) తప్ప మిగిలిన వారంతా 30 ఏళ్లు పైబడిన వారే. జట్టు పునర్నిర్మాణంలో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో యువ బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. అయినా సరే వారికి అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని పాంటింగ్ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.తేలిపోయిన బ్యాటర్లుకాగా గురువారం నాటి తొలిరోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఆసీస్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. పరిస్థితులు సీమ్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతో పాటు దాదాపు ఎనిమిది నెలల తర్వాత టెస్టు ఆడుతున్న జట్టులో ఆ ప్రభావం కనిపించింది. తొలి సెషన్లోనే వెదరాల్డ్ (23), హెడ్ (22), లబుషేన్ (1), గ్రీన్ (13) వెనుదిరిగారు. లంచ్ తర్వాత స్మిత్, కేరీ (19) ఐదో వికెట్కు 55 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.అయితే తక్కువ వ్యవధిలో కేరీతో పాటు వెబ్స్టర్ (12), కమిన్స్ (9), స్టార్క్ (1) అవుటయ్యారు. మరో ఎండ్లో 76 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్ ఆ తర్వాత వేగంగా ఆడే ప్రయత్నంలో 9వ వికెట్గా పెవిలియన్ చేరగా, కొద్ది సేపటికే లయన్ (7) అవుట్తో ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో పేసర్లే 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే.ఆధిక్యంలో బంగ్లాదేశ్ఇదిలా ఉంటే.. తొలిరోజు వికెట్ నష్టానికి 96 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. రెండోరోజూ జోరు కొనసాగించింది. శుక్రవారం నాటి రెండో రోజు పూర్తయ్యేసరికి 110 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ కంటే 153 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చదవండి: ముందు బయటకు నడువ్: స్టార్క్ ఆగ్రహం
తుది జట్టులో అతడికి నో ఛాన్స్! బిగ్ హింట్ ఇచ్చిన గిల్
భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత ప్లేయింగ్ ఎలెవన్కు సంబంధించి కెప్టెన్ శుభ్మన్ గిల్ బిగ్ హింట్ ఇచ్చాడు. తొలి టెస్ట్లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో పాటు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశముంది.రవీంద్ర జడేజా, మానవ్ సుత్తార్, కుల్దీప్ యాదవ్ పేర్లు స్పిన్నర్లగా ఖారారైనట్లు సమాచారం. అదేవిధంగా పేస్ బౌలింగ్ విభాగంలో సీనియర్ బౌలర్ మహ్మద్ సిరాజ్తో కర్ణాటక స్పీడ్ స్టార్ ప్రసిద్ద్ కృష్ణ బంతిని పంచుకోనున్నట్లు గిల్ సంకేతాలు ఇచ్చాడు. దీంతో గుర్నూర్ బ్రార్, జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ అకిబ్ నబీలు బెంచ్కే పరిమితమయ్యే అవకాశముంది."గుర్నూర్ బ్రార్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. పాత బంతితో కూడా అతడు బౌన్స్ రాబట్టగలడు. అయితే మరోవైపు ప్రసిద్ద్ కృష్ణ కూడా గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రసిద్ధ్ ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్లో సత్తాచాటాడు. అందుకే వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవడం నిజంగా కష్టమైన నిర్ణయమే. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ప్రసిద్ద్, బ్రార్ వంటి పేస్ బౌలర్లకు తమ సత్తా చాటుకునేందుకు ఈ సిరీస్ ఒక మంచి అవకాశం" అని గిల్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో తన టాలెంట్ను నిరూపించుకోవడంతో గుర్నూర్ బ్రార్ను శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు కూడా ఎంపిక చేశారు. కానీ శ్రీలంక కండీషన్స్ కారణంగా అతడికి తుది జట్టులో చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. లంక పిచ్లు ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ముగ్గురు ఫుల్ టైమ్ స్పిన్నర్లతో బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది.భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవద్ పడిక్కల్, గిల్ (కెప్టెన్), పంత్ ( వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ
కెప్టెన్గా నేను ఓకే.. WTC ఫైనల్ చేరతాం: శుబ్మన్ గిల్
శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్కు టీమిండియా సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ ఈ సిరీస్లో ఆతిథ్య జట్టును 2-0తో వైట్వాష్ చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తొలి టెస్టు ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు.కెప్టెన్గా నేను ఓకే.. WTC ఫైనల్ చేరతాం‘‘కెప్టెన్గా నా పాత్రలో నేను ఎంతో సౌకర్యవంతంగానే ఉన్నాను. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవడమే మా లక్ష్యం. అందుకోసం మేము ఆరు నుంచి ఏడు టెస్టులు గెలవాల్సి ఉంది. కాబట్టి శ్రీలంక నుంచే ఆ పని మొదలుపెడతాము’’ అని గిల్ పేర్కొన్నాడు.నాకు దక్కిన గొప్ప గౌరవంఅదే విధంగా.. ‘‘చారిత్రక 600వ టెస్టులో నాయకుడిగా టీమిండియాను ముందుకు నడిపించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అది కూడా స్వాతంత్ర్య దినోత్సవం రోజు కావడం మరింత విశేషం’’ అని గిల్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక.మా జట్టుతో సంతృప్తిగానే ఉన్నాంకాగా శ్రీలంకతో టెస్టు సిరీస్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ సాయి సుదర్శన్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)పై వస్తున్న విమర్శలపై గిల్ స్పందించాడు.‘‘మేము CoEతో తరచూ చర్చలు జరుపుతూనే ఉన్నాము. ఆటగాళ్ల గాయాల గురించి అప్డేట్లు తెలుసుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ సాయి సుదర్శన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి అతడిని టెస్టు మ్యాచ్లో ఆడించి రిస్క్ తీసుకోలేము. మా జట్టులో ఉన్న పదిహేను మంది సభ్యులతో ప్రస్తుతం సంతృప్తిగానే ఉన్నాము’’ అని గిల్ పేర్కొన్నాడు.డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..ఇదిలా ఉంటే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. తాజా సీజన్లో మిగిలిన తొమ్మిది మ్యాచ్లలో కనీసం ఆరు మ్యాచ్లు తప్పక గెలవాల్సిందే. ఇందులో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కాస్త ఈజీ టార్గెట్. ఆ తర్వాత, న్యూజిలాండ్తో రెండు, ఆస్ట్రేలియా గడ్డ మీద ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది.వీటిలో కనీసం ఆరు గెలవడంతో పాటు రెండు డ్రా చేసుకోవాలి. లేదంటే కచ్చితంగా ఏడు టెస్టులు గెలవాలి. ఇక ఈ సీజన్లో ఇప్పటికి టీమిండియా తొమ్మిది టెస్టులు పూర్తి చేసుకుని.. నాలుగు గెలిచి.. నాలుగు ఓడిపోయి.. ఒకటి డ్రా చేసుకుంది. తద్వారా పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.
న్యూస్ పాడ్కాస్ట్
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్య
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
చంద్రబాబు పాలన రైతులకు హానికరం... చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ... వైఎస్ జగన్ ఆగ్రహం
అసత్య ప్రచారంలో ఆరితేరిన ఏపీ సీఎం చంద్రబాబు... రెండు మినహా హామీలన్నీ అమలు చేశానంటూ బుకాయింపు...
బీసీ నేతలపై రెడ్బుక్!. బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అక్రమ అరెస్టులు
బిజినెస్
‘జీరో’ నుంచి రూ .1.4 కోట్ల జీతానికి.. టెకీ సక్సెస్ స్టోరీ వైరల్
కెరీర్ ప్రారంభంలో జీతం లేకుండా పనిచేసిన ఓ టెక్ ప్రొఫెషనల్.. 14 ఏళ్లకు పైగా అనుభవంతో ప్రస్తుతం ఏడాదికి దాదాపు రూ.1.4 కోట్ల సమానమైన వేతనం అందుకుంటున్నానని వెల్లడించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ 35 ఏళ్ల క్లౌడ్, డెవ్ఆప్స్ ప్రొఫెషనల్ తన జీతం ఎలా దశలవారీగా పెరిగిందో సోషల్ ప్లాట్ఫామ్ రెడిట్లో పంచుకున్నారు.రెడిట్లోని r/IndianWorkplaceలో ‘DevOpsHumbleFool’ పేరుతో ఉన్న యూజర్ తన కెరీర్ ప్రయాణాన్ని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ టెక్నికల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ‘సగటు కంటే తక్కువ’ కాలేజీ నుంచి చదువు పూర్తి చేశానని, తన కెరీర్ను ఢిల్లీలో జీతం లేని ఉద్యోగంతో ప్రారంభించానని చెప్పారు. ఆ పని ఏడాదిలోపే ముగిసిందని, అనంతరం బెంగళూరులో రూ.6 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగంలో చేరి రెండేళ్లు పనిచేసినట్లు రాసుకొచ్చారు.ఆ తర్వాత మరో సంస్థలో రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు వేతనం పెరిగింది. అక్కడ దాదాపు 4.7 సంవత్సరాలు పనిచేశారు. తదుపరి బెంగళూరు సంస్థలో రూ.17 లక్షల ప్యాకేజీతో చేరి, ఐదేళ్లలో దాన్ని రూ.35 లక్షలకు పెంచుకున్నారు. ఈ దశలో మరో సంస్థ నుంచి రూ.70 లక్షల ఆఫర్ వచ్చినప్పటికీ, తాను ఆ ఉద్యోగంలో చేరలేదని చెప్పారు. అయితే ఆ ఆఫర్ తన మార్కెట్ విలువను అర్థం చేసుకునేలా చేసిందని పేర్కొన్నారు.రూ.35 లక్షల నుంచి విదేశీ క్లయింట్ల వరకు..కెరీర్లో కీలక మలుపు విదేశీ క్లయింట్లతో పనిచేయడం ద్వారా వచ్చిందని ఆయన వివరించారు. ‘క్లయింట్ A’తో సుమారు రెండేళ్లు పనిచేసిన సమయంలో ఏడాదికి రూ.1.15 కోట్ల సమానమైన ఆదాయం వచ్చినట్లు, ప్రస్తుతం ‘క్లయింట్ B’తో ఏడాదికి రూ.1.40 కోట్ల స్థాయిలో సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తాలు అమెరికా డాలర్లలో అందుతున్నాయని, తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని ఆయన కామెంట్లలో స్పష్టం చేశారు. క్లయింట్ A రిమోట్ రోల్ కాగా, క్లయింట్ B పాత్ర ఆన్సైట్ అని తెలిపారు.సైడ్ గిగ్స్తో అదనపు ఆదాయంప్రధాన ఉద్యోగంతో పాటు కెరీర్లో సైడ్ గిగ్స్ కూడా చేశానని ఆయన వెల్లడించారు. అలా తనకు నెలకు సుమారు రూ.15,000 నుంచి రూ.65,000 వరకు అదనపు ఆదాయం వచ్చేదని చెప్పారు. యూట్యూబ్, పెయిడ్ ఇంటర్వ్యూలు, చిన్న ప్రాజెక్టులు, టెక్నికల్ కన్సల్టేషన్స్, ఫోన్ ద్వారా టెక్నికల్ సహాయం వంటి పనులు చేసేవాడినని వివరించారు. తన యూట్యూబ్ కంటెంట్ కారణంగా లింక్డ్ఇన్లో గుర్తింపు పెరిగి, అక్కడి నుంచే చాలా సైడ్ గిగ్ అవకాశాలు వచ్చాయని తెలిపారు. అయితే ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో ఉద్యోగం, వీసా నిబంధనల నేపథ్యంలో సైడ్ గిగ్స్ పూర్తిగా నిలిపివేశానని చెప్పారు.డిగ్రీ కంటే నైపుణ్యాలకే ప్రాధాన్యంతన విద్యా నేపథ్యం గొప్పది కాకపోయినా, DevOps, Cloud టెక్నాలజీలపై విస్తృత నైపుణ్యాలు తన కెరీర్ ఎదుగుదలకు ప్రధాన కారణమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. జావా డెవలపర్గా కెరీర్ ప్రారంభించి, బిల్డ్ & రిలీజ్ ఇంజినీరింగ్ నుంచి డెవాప్స్, ఆ తర్వాత క్లౌడ్ విభాగంలోకి మారినట్లు వివరించారు. ప్రస్తుతం తన పనిలో కోడింగ్ భాగం సుమారు 10 శాతం మాత్రమేనని చెప్పారు. AI తన పనిని ఇప్పటివరకు దెబ్బతీయలేదని, అయితే తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి AI సాధనాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నానని తెలిపారు.30ల్లోనూ విదేశీ అవకాశాలు సాధ్యమేనంటూ..తాను 30లలోనే అమెరికాకు వెళ్లానని, 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉండటం వల్ల విదేశీ అవకాశాలు మరింత అందుబాటులోకి వచ్చాయని ఆయన చెప్పారు. తొలుత రిమోట్ అవకాశాన్ని పొందిన తర్వాత వర్క్ వీసా ద్వారా అమెరికాకు వెళ్లినట్లు, ప్రస్తుతం H-1Bపై ఉన్నట్లు కామెంట్లలో వెల్లడించారు. తనకు తెలిసిన ఓ సీనియర్ 42 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్లారని కూడా పేర్కొన్నారు.అయితే అధిక జీతంతో పాటు విదేశీ ఉద్యోగ జీవితంలోని సవాళ్లను కూడా ఆయన ప్రస్తావించారు. కుటుంబానికి దూరంగా ఉండటం, ఒంటరితనం, వీసాపై ఆధారపడటం, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి వంటి అంశాలు అమెరికాలోని జీవితంలో ప్రతికూలతలుగా పేర్కొన్నారు.ఈ పోస్టుపై వందలాది మంది స్పందించారు. ముఖ్యంగా తక్కువ జీతాలతో కెరీర్ ప్రారంభిస్తున్న యువత తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు డెవాప్స్, క్లౌడ్ వంటి నైపుణ్యాల్లోకి ఎలా మారాలి, సైడ్ గిగ్స్ ఎలా సంపాదించాలి, AI వల్ల టెక్ ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది వంటి ప్రశ్నలు అడిగారు. టెకీ మాత్రం నైపుణ్యంతో పాటు ఆన్లైన్ ప్రొఫెషనల్ ప్రెజెన్స్ను పెంచుకోవడం తన కెరీర్లో కీలకంగా పనిచేసిందని సూచించారు.
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 70.71 పాయింట్లు లేదా 0.091 శాతం నష్టంతో 78,009.25 వద్ద, నిఫ్టీ 29.85 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 24,366.00 వద్ద నిలిచాయి.జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సమ్మాన్ క్యాపిటల్ లిమిటెడ్, ఓలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్, ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
కియోసాకి ప్రశ్న.. ఘాటుగా స్పందించిన నెటిజన్లు!
తరచుగా పెట్టుబడులకు సంబంధించిన విషయాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి, తాజాగా ఉద్యోగ జీవితం గురించి చెప్పారు. ''జీవితం అంటే కేవలం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పని చేసి, నెలాఖరులో జీతం తీసుకోవడమేనా?'' అని ప్రశ్నించారు.చాలామంది చిన్నప్పటి నుంచి ఒకే విధమైన మార్గంలో వెళ్తుంటారు. చదువు.. ఉద్యోగం.. జీతం.. ఖర్చులు.. మళ్లీ ఉద్యోగం. ఇలా సంవత్సరాలు గడిచిపోతాయి. మనం డబ్బు సంపాదిస్తున్నాం, కుటుంబాన్ని చూసుకుంటున్నాం, బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. కానీ ఒక సమయంలో మనల్ని మనమే ''నేను అసలు ఎందుకు ఇలా జీవిస్తున్నాను? నా జీవితానికి అర్థం ఏమిటి?'' అని బహుశా ఆలోచించకపోవచ్చు.ఇదే విషయాన్ని కియోసాకి చెబుతూ.. నేను పని చేస్తున్నానంటే, అది ''కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రం కాదు. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి చేస్తున్నా'' అని పేర్కొన్నారు. అంటే మనం చేసే పని మనకు డబ్బు మాత్రమే కాకుండా, ఒక సంతృప్తిని, ఒక ఉద్దేశ్యాన్ని కూడా ఇవ్వాలని ఆయన ఉద్దేశ్యం.కియోసాకి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. కొందరు ఆయన మాటలతో ఏకీభవించినప్పటికీ.. మరికొందరు వ్యతిరేకించారు.చాలామంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించడం, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అని అన్నారు. జీవిత లక్ష్యం అంటే ఏదో పెద్ద విజయం సాధించడంలో దొరకదు. కొన్నిసార్లు, ఒక సాధారణ పనిని నిలకడగా, చక్కగా చేయడంలో కూడా అది లభిస్తుందని ఇంకొందరు అన్నారు.9 to 5 for just $?Found it interesting my last X had so few loves relative to number of views.My previous X was dedicated to working to fulfill your spirit’s mission…your life’s purpose….for the gift of life.Working 9 to 5 just for $…seems to me…. to be an empty life.…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 14, 2026
ఏఐ జగత్తులో టాలెంట్ వార్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారతీయ శాస్త్రవేత్త ప్రాభవం అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాలను విస్మయానికి గురిచేస్తోంది. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి, ప్రముఖ ఏఐ పరిశోధకుడు త్రపిత్ బన్సల్ను తమ వైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా రూ.800 కోట్ల (100 మిలియన్ డాలర్లు) భారీ వేతన ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు వెలువడిన నివేదికలు సిలికాన్ వ్యాలీలో చర్చనీయాంశమయ్యాయి. ఒక ఏఐ పరిశోధకుడికి ఈ స్థాయిలో పారితోషికం దక్కడం అంతర్జాతీయ సాంకేతిక చరిత్రలో అరుదైన ఘట్టం.ఎవరీ త్రపిత్ బన్సల్?త్రపిత్ బన్సల్ విజయం రాత్రికి రాత్రే సాధ్యమైంది కాదు; ఇది దశాబ్దానికి పైగా సాగిన కఠోర సాధన, నాణ్యమైన పరిశోధనల ఫలితం. 2007-2012 మధ్య ఐఐటీ కాన్పూర్ నుంచి మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పూర్తి చేసిన బన్సల్, అనంతరం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశారు. తరువాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ పట్టా పొందారు.తన పరిశోధనా కాలంలో ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ సంస్థల్లో ఇంటర్న్షిప్లు చేస్తూ డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) రంగాల్లో విశేష అనుభవాన్ని గడించారు. 2022లో ఓపెన్ఏఐలో చేరిన బన్సల్.. సంస్థ సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుత్సకెవర్తో కలిసి పనిచేశారు. ముఖ్యంగా ఓపెన్ఏఐ అత్యంత సాంకేతిక సంక్లిష్టమైన రీజనింగ్ మోడల్ ‘ఓ1’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి గ్లోబల్ ఏఐ వర్గాల్లో గుర్తింపు పొందారు.మెటా ఎందుకింత భారీ ఆఫర్ ఇచ్చింది?ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్’ (ఏజీఐ), సూపర్ ఇంటెలిజెన్స్ సాధించేందుకు గూగుల్, మెటా, ఓపెన్ఏఐల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని మెటా, తమ 'సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్'ను బలోపేతం చేసేందుకు అత్యుత్తమ మేధావులను ఆకర్షిస్తోంది. బన్సల్కు ఉన్న మ్యాథమెటికల్ పునాది, అడ్వాన్స్డ్ ఏఐ రీజనింగ్ మోడళ్లపై ఉన్న అసాధారణ పట్టు మెటా వ్యూహాలకు కీలకంగా మారుతాయని కంపెనీ భావిస్తోంది.యువతకు సందేశంకోడింగ్ షార్ట్కట్లు, స్వల్పకాలిక కోర్సులతో కొన్ని విజయాలు సాధించాలనుకునే ఈ డిజిటల్ యుగంలో.. సుదీర్ఘ అధ్యయనం, ప్రాథమిక విజ్ఞానం, నిరంతర పరిశోధన మాత్రమే అత్యున్నత శిఖరాలకు చేరుస్తాయని త్రపిత్ ప్రయాణం నిరూపిస్తోంది. సబ్జెక్టుపై తిరుగులేని నైపుణ్యం ఉంటే ప్రపంచమే మన కోసం వస్తుందని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు..
ఫ్యామిలీ
‘డల్’ కాదు మోడల్!
ఊహ తెలిసినప్పటి నుంచి ఒక అమ్మాయికి మోడల్ కావాలన్న ఆశ. కాని పుట్టుకతోనే గుండె లోపం. ఈ లోపం ఉంటే సహజంగానే పిల్లలు యాక్టివ్గా కనిపించడం చాలా కష్టం. అయితే ఆరోగ్య సమస్య అడుగడుగునా ఆమెను ఇబ్బంది పెడుతున్నా, ఊపిరి తీసుకునే ప్రతిసారి గుండె లయ తనని వెక్కిరిస్తున్నా, మోడల్ కావాలన్న ధ్యాస మాత్రం మారలేదు.. ర్యాంప్ వాక్ చేసేవరకు ఆమె గమనం ఆగలేదు... పోర్టోరికోకి చెందిన సోఫియా పుట్టుకతోనే డౌన్స్ సిండ్రోమ్తో పుట్టింది. డౌన్ సిండ్రోమ్ అంటే గుండె లోపం. పిల్లల ఎదుగుదల సరిగా లేకపోవడం, మాటలు రాకపోవడం, నేర్చుకోవడం ఆలస్యమవడం, శారీరక ఎదుగుదల సవ్యంగా జరగకపోవడం వంటివి ఈ సిండ్రోమ్ తాలూకు లక్షణాలు.. సహజంగా ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్లు అంత ఉత్సాహంగా ఉండరు. క్లాస్లో డల్ స్టూడెంట్స్లా కనిపిస్తారు. కాని సోఫియా మాత్రం తన లోపానికి ఏరోజూ తలొగ్గలేదు. ప్రతిసారీ తనని తాను మరింత మెరుగుపరుచుకుంది. సోఫియాకి 17వ ఏట గుండెకు శస్త్ర చికిత్స చేశారు. తరచూ ఆమె హాస్పిటల్కు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకునేది... అనేక వైద్యసవాళ్లు ఎదుర్కొన్నా ఆమె మాత్రం కుంగిపోలేదు... మోడలింగ్ వైపు అడుగులేసింది. 2019లో 23వ ఏట ్ర΄÷ఫెషనల్ మోడలింగ్ ప్రారంభించింది. ‘ఐ లవ్ ఇట్’ పేరిట ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించింది. 2020లో న్యూయర్క్ ఫ్యాషన్ వీక్లో రన్ వేపై నడిచింది. ఆమె ప్రయాణంలో అతి పెద్ద మలుపు 2022లో వచ్చింది. ‘విక్టోరియాస్ సీక్రెట్ లవ్ క్లాడ్ కలెక్షన్’ ప్రచారంలో పాల్గొన్న తొలి డౌన్స్ సిండ్రోమ్ మహిళగా సోఫియా చరిత్ర సృష్టించింది. తనలా డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్నవారికి ధైర్యాన్నిచ్చేందుకు క్యాంపెయిన్ను మొదలుపెట్టింది. అలా మోడల్గా, వ్యాపారవేత్తగా, మోటివేషనల్ స్పీకర్గా కొనసాగుతున్న సోఫియా జీవితం మనకిచ్చే సందేశం ఒక్కటే.. అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టకూడదు అని.
ఫోన్ వల్లే ఇదంతా... మీ పిల్లలు జాగ్రత్త!
‘అవసరానికి మించి మొబైల్ వాడకండి. పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు, వాళ్లు మాట వినకుండా మారాం చేసేటప్పుడు ఫోన్ మాత్రం వాళ్లకు ఇవ్వకండి... అనుభవంతో చెబుతున్నా.. మొబైల్ వల్ల నరకం చూశా.’ అని ప్రముఖ నటి షకీల సోషల్ మీడియాలో తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. కొన్ని వందల సినిమాల్లో నటించిన షకీల సౌత్ ఇండియా సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు.. అయితే గంటల తరబడి ఫోన్ చూడడం, ముఖ్యంగా నిద్రకు ఉపక్రమించేముందు ఫోన్ పక్కకు ఉంచి దానినే చూస్తూ పడుకోవడం వల్ల ఆమె ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డారు. ఇటీవలే ఆమె మెడకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకుని డిచార్జ్ అయ్యారు. ఈ ఆపరేషన్కు లక్షల ఖర్చయిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఆమె నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గేమ్స్ ఆడడం, రీల్స్ చూడడం, యూట్యూబ్ కంటెంట్తో కాలక్షేపం చేయడం, అవసరం లేకున్నా ఏదో ఒకటి సర్ఫ్ చేస్తూ ఉండడం వల్లే ఈ వ్యాధి సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. మొబైల్ వాడకం అవసరమే.. కాని అవసరానికి మించి వాడడం వల్లే తనకీ దుస్థితి వచ్చిందని షకీల పేర్కొన్నారు. విపరీతమైన మెడనొప్పి వల్ల తీవ్రమైన బాధను అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని, మొబైల్కి వారిని దూరంగా ఉంచండంటూ షకీలసోషల్ మీడియాలో పిల్లల తల్లిదండ్రులను కోరారు.
ఆయ్...యమలోకంలో
భూలోకాన్ని స్పీడ్గా ఆక్రమించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) చాలా ఆలస్యంగా యమలోకానికి చేరింది. ‘యమలోకం ఇప్పుడు ఏఐ మయం’ అనే భారీ హెడ్లైన్తో నరకలోక పత్రిక ‘హెల్ పోస్ట్’ మొదటి పేజీలో పెద్దవార్త ప్రచురితమైంది. యమలోకంలో ఏఐ టెక్నాలజీ ప్రారంభమైన తొలి రోజు: ‘పాపిని ప్రవేశ పెట్టండి’ అని అరిచారు ఇన్వెస్టిగేషన్ అధికారవర్యులు. బోన్లోకి ఒక వ్యక్తిని ప్రవేశపెట్టారు రక్షణకారులు. ‘అయ్యా... వీరి పేరు కారప్పన్. భూలోకంలో ఎక్కడ కారం ఉన్నా దొంగిలిస్తాడు. అలా టన్నుల కొద్ది కారాన్ని దొంగిలించి కోట్లకు పడగెత్తాడు. కారం అంటే పడి చస్తాడు. అలా చచ్చి ఇక్కడికి వచ్చాడు. ఇతడిపై భూలోక పోలీసు ఠాణాల యందు మిక్కిలి కేసులు ఉన్నవి. చిత్రగుప్తుల వారి చిట్టా కూడా ఇతడు కరుడు గట్టిన కారం దొంగ అని చెప్పుచున్నది’ అన్నాడు ఆ.అ (ఆరోపణ అధికారి)‘కారప్పన్... నువ్వు నరకలోక న్యాయస్థానానికి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నావా?’ అడిగారు ఇ. అధికారవర్యులు.‘అయ్యా, ఆరోపణ అధికారి చెప్పినదానిలో మిరప గింజంత నిజం కూడా లేదు. నా పేరు కారప్పన్ అయినంత మాత్రాన కారం దొంగగా ముద్ర వేయడం శోచనీయం, గర్హనీయం. చిత్రగుప్తుల వారి చిట్టా ఎప్పుడో అవుట్డేట్ అయింది. దాన్ని నమ్మొద్దు’ అన్నాడు కారప్పన్.కట్ చేస్తే....నరక లోకరక్షణ అధికారులు కారప్పన్ను ఏఐ చాట్బాట్ ‘యమహో...అదరహో’ దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ చాట్బాట్లో కారప్పన్ పూర్తి వివరాలు అప్లోడ్ చేసి...‘వీరిపై ఎన్నో ఆరోణలు ఉన్నాయి. అవి నిజమా కాదా?’ అని ప్రాంప్ట్ ఇచ్చారు.‘ఒక్కటి కూడా నిజం కాదు. కారప్పన్కు కారం అంటే చిన్నప్పటి నుంచి విరక్తి. అతడు తినే భోజనంలో రవ్వంత కారం కూడా ఉండదు. కాకికి కూడా హాని చేయని కారంజన్ముడు!’ అని చెప్పింది ఏఐ చాట్బాట్.విచిత్రం ఏమిటంటే... కారప్పన్ మాత్రమే కాదు ఆ తరువాత బోన్లో ప్రవేశ పెట్టిన 120 మంది కరుడు గట్టిన నేరస్థులను కూడా ‘ఉత్తములు, ఆదర్శనీయులు’ అని తేల్చేసింది ఏఐ చాట్ బాట్. దీంతో ఇన్వెస్టిగేషన్ అధికారీవర్యులకు ఏ.ఐ చాట్బాట్పై అనుమానం వచ్చింది.‘గది సంఖ్య ఆరువందల రెండులో ఉన్న ప్రసిద్ధ గంధపు చెక్కల మహా దొంగ వీరప్పన్ను ఏ.ఐ. చాట్బాట్ దగ్గరకు తీసుకురండి’ అని అరిచారు ఇన్వెస్టిగేషన్ అధికారవర్యులు. మీసాలు తిప్పుతూ ‘తిప్పరా మీసం...కొట్టరా చందనం’ అని పాడుతూ ఏ.ఐ. చాట్బాట్ దగ్గరికి వచ్చాడు వీరప్పన్.‘వీరప్పన్ వ్యక్తిత్వం గురించి తెలియజేయండి’ అని ఏఐ చాట్బాట్కు ప్రాంప్ట్ ఇచ్చారు అధికారులు.‘చాలా ఉత్తముడు. గంధపు చెక్కలను జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదు. హింసకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం. చీమకు కూడా హాని తలపెట్టని మహోన్నతుడు. మానవతావాది...’ ఇలా జవాబు ఇచ్చింది ఏఐ చాట్బాట్.‘ఈ యంత్రమును అత్యవసరముగా భాగ్యనగరంలోని మూసీలో విసిరేయండి’ అని ఆజ్ఞాపించారు ఇన్వెస్టిగేషన్ అధికారవర్యులు.అసలు విషయం‘నరక లోక ఏఐ స్కామ్’లో టెక్ అప్పలరాజును దోషిగా తేల్చారు నరకలోక దర్యాప్తు అధికారులు. నెలక్రితం జరిగిన ఘోర యాక్సిడెంట్లో చనిపోయిన టెక్ రాజు నరకానికి వచ్చాడు. యమలోకంలో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన బాధ్యతలను టెక్ రాజుకు అప్పగించారు అధికారులు. ఇదే అదనునుగా తనలాంటి కరుడు గట్టిన క్రిమినల్స్ను ఆదుకోవడానికి ‘యమహో... అదరహో’ ఏ.ఐ. చాట్బాట్లో తన టెక్ తెలితేటలతో మార్పులు చేశాడు. ఏ.ఐ. చాట్బాట్ అన్నీ అబద్ధాలే చెప్పేలా ఫాల్స్ ఫ్యాక్ట్స్ ప్రాసెసింగ్ (ఎఫ్ఎఫ్పీ) చేశాడు. అసలు విషయం ఇదన్నమాట!– యాకుబ్ పాషా
రుద్రవీణ నిర్ణిద్ర గానం
సితార్, వీణ గురించి తెలిసినంతగా చాలామందికి ‘రుద్రవీణ’ వాద్యం గురించి తెలియదు. నేర్చుకునేవారు చా...లా తక్కువగా ఉంటారు. ‘రుద్రవీణ’ నేర్చుకునే వారికి మంచి జరగదు’ అనే అపోహ, మూఢనమ్మకాలే దీనికి కారణం. ఆ అపోహల అడ్డుగోడలను కాలదన్ని ‘రుద్రవీణ’లో ప్రావీణ్యం సాధించిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు బెంగళూరుకు చెందిన జ్యోతి హెగ్డే. గురుకులం ఏర్పాటు చేసి రుద్రవీణలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రుద్రవీణ కళాకారిణిగా సంగీత నాటక అకాడమీ అవార్డ్ అందుకున్నారు...‘సంగీత నాటక అకాడమీ పురస్కారం వల్ల నాకు వ్యక్తిగత సంతోషం కంటే రుద్రవీణకు ఈ గుర్తింపు లభించింది అనే సంతోషమే ఎక్కువగా ఉంది’ అంటారు జ్యోతి హెగ్డే.సితార్, వీణలాంటి తంత్రి వాద్యాలతో పోలిస్తే ‘రుద్రవీణ’లో ప్రావీణ్యం సాధించిన కళాకారులు చాలా తక్కువ. ఈ వాద్యంలో ప్రావీణ్యం సాధించిన మొదటి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు జ్యోతి హెగ్డే. అయితే ఆ గుర్తింపును సున్నితంగా తిరస్కరిస్తారు హెగ్డే.హంపీ శిల్పాల్లో రుద్రవీణ‘అజంతా, ఎల్లోరా గుహలు, హంపీ శిల్పాలను చూసినప్పుడు మహిళల చేతుల్లో రుద్రవీణ కనిపిస్తుంది. సరస్వతీదేవి, పార్వతీదేవి కూడా రుద్రవీణ వాయిస్తున్న చిత్రాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో నుంచి చూసినప్పుడు రుద్రవీణ వాయించిన మొదటి మహిళను నేను ఎలా అవుతాను... అనిపిస్తుంది. అయితే ఇప్పటికాలంలో రుద్రవీణను ఎంచుకున్న మొదటి మహిళను మాత్రం నేనే’ అంటారు హెగ్డే.ఆ ధ్వనిలో ఆధ్యాత్మిక పరిమళంకాలేజీ రోజుల్లో జ్యోతి హెగ్డే సితార్ తీగల మీద సాధన చేస్తుండేవారు. ఈ క్రమంలో ‘సమ్థింగ్ స్పెషల్’ లాంటి సంగీత పరికరం ‘రుద్రవీణ’ పరిచయం అయింది. ఆ పరిచయం తనను వీనుల విందైన రుద్రవీణ ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ‘రుద్రవీణ ధ్వనిలో ఆధ్యాత్మిక పరిమళం ఉంది. తీగలను మీటుతూ స్వరాలను పలికిస్తున్నప్పుడు ఆ ధ్వని నాలో ప్రతిధ్వనిస్తుంది. ఆ ధ్వని, రాగాలను నాలో లీనం చేసుకుంటాను. నా అంతర్గత ఆధ్యాత్మిక స్థితిని తెలియజేయడానికి ఇది నాకు తోడ్పడుతుంది’ అంటారు హెగ్డే.అది మూఢనమ్మకం మాత్రమే...‘బరువైన రుద్రవీణ వాయిద్యాన్ని వాయించడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది’ అనే అపోహ, మూఢనమ్మకం ఉండడం వల్ల ఆ వాద్యానికి దగ్గరైన వారి సంఖ్య తక్కువ. ‘ఎన్నో అపోహలు ఉన్నప్పటికీ నేను రుద్రవీణ వైపు ఆకర్షితం కావడానికి కారణం... బహుశా ప్రశాంతత, ధ్యానం పట్ల ఇష్టం ఉండడం కావచ్చు. ముగ్గురు గురువుల దగ్గర శిక్షణ పొందాను. మొదట్లో వారు, నువ్వు అమ్మాయివి కదా రుద్రవీణ వాయించడం కష్టం అన్నారు. రుద్రవీణను ఎత్తి, వాయించగల శారీరక బలం నాలో ఉంది అని వారితో చె΄్పాను. ఇతరులు మూడు గంటల సాధన చేస్తే నన్ను నేను నిరూపించుకోవడానికి పది గంటలు సాధన చేసేదాన్ని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు హెగ్డే. ‘రుద్రవీణ వాయించడానికి మహిళలు శారీరకంగా, మానసికంగా సరిపోతారు. కావాల్సిందల్లా నేర్చుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం మాత్రమే’ అంటున్న హెగ్డే, తన గురుకులంలో అరవైమందికి పైగా విద్యార్థులకు రుద్రవీణలో శిక్షణ ఇస్తున్నారు.గురువు దగ్గరే పరిపూర్ణతకళాకారులను తయారుచేయడానికి, వారిని తీర్చిదిద్దడానికి ఆన్లైన్ తరగతులు, నెలకొకసారి జరిగే క్లాసులు సరిపోవని కోవిడ్ కాలంలో గ్రహించాను. శిష్యులు గురువుకు దగ్గరగా ఉన్నప్పుడే, నేర్చుకోవడంలో వారికి పరిపూర్ణత వస్తుంది. ఇది మాత్రమే కాకుండా గురువు జీవనశైలి, ఆలోచనా విధానం, అంకితభావం, కళాత్మక వ్యక్తిత్వాన్ని గ్రహించే అవకాశం లభిస్తుంది.– జ్యోతి హెగ్డే
అంతర్జాతీయం
UK: రైలు ప్రమాదం.. బోల్తా పడిన మూడు బోగీలు
లండన్ : దక్షిణ ఇంగ్లాండ్లో రైలు ప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి మూడు భోగీలు బోల్తా పడ్డాయి. లండన్లోని విక్టోరియా స్టేషన్ నుండి ఈస్ట్బోర్న్ వెళ్తున్న సదరన్ రైలు పర్యాటక ప్రాంతమైన లూయిస్ సమీపంలో ఈ ప్రమాదానికి గురైంది.రైలు వేగం పుంజుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుదుపులకు గురైందని, తాము ప్రయాణిస్తున్న బోగీ పైకి లేచి ఆకస్మికంగా బ్రేకులు పడ్డాయని ప్రయాణికుడు రాబ్ బ్రాడ్లీ తెలిపారు. ల్యాప్టాప్లు, లగేజీతోపాటు అందరూ ముందుకు పడిపోయారని, రైలు కొంతదూరం అలాగే జారిన తర్వాత ఆగిపోయిందని వివరించారు.ఆ తర్వాత తాము వెనక్కి తిరిగి చూసేసరికి వెనుక ఉన్న బోగీలు పూర్తిగా తెరుచుకుని, దట్టమైన పొగ, ధూళి కమ్ముకున్నాయని, ఒక బోగీ పక్కకు తిరిగి ఎంబ్యాంక్మెంట్ నుంచి కింది పొలంలోకి పడిపోయిందని ఆయన చెప్పారు.ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పారామెడిక్స్, ఆంబులెన్స్లతో పాటు మూడు హెలికాప్టర్లు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై రవాణా మంత్రి హీడీ అలెగ్జాండర్ ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
రష్యాలోని అతిపెద్ద రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి
రష్యాలోని ఓ ప్రధాన రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. మాస్కో ప్రధాన చమురు రంగాన్ని దెబ్బతీయడానికి కీవ్ గత కొన్ని నెలలుగా దాడులు చేస్తోంది. గత మూడు రోజుల్లో జరిగిన నాలుగో దాడి ఇది. సరిహద్దుకు 800 మైళ్ల దూరంలో ఉన్న చమురు క్షేత్రాన్ని కీవ్ టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో రిఫైనరీ ధ్వంసమవ్వగా.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన ఉత్పాదక దేశాలలో ఒకటి. ఉక్రెయిన్పై తన సైనిక చర్యను కొనసాగించడానికి చమురు పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయమే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. ఈ దాడుల కారణంగా రష్యా రిఫైనరీ సామర్థ్యం తగ్గి.. గ్యాస్ స్టేషన్లలో ఇంధన కొరత ఏర్పడుతోంది. ఈ దాడుల ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను శాంతి ఒప్పందానికి అంగీకరించేలా ఒత్తిడి చేయడమే తమ లక్ష్యమని కీవ్ అధికారులు చెబుతున్నారు.రష్యాలోని బాష్కోర్టోస్తాన్ రిపబ్లిక్లో ఉన్న 'గాజ్ప్రోమ్ నెఫ్తెఖిమ్ సలావత్' చమురు శుద్ధి, పెట్రోకెమికల్ కాంప్లెక్స్పై తమ బలగాలు రాత్రి సమయంలో దాడి చేశాయి. దీంతో ఆ కేంద్రంలో భారీ మంటలు చెలరేగాయని ఉక్రెయిన్ తెలిపింది. మాస్కోకు ఆగ్నేయంగా.. ఉక్రెయిన్ సరిహద్దు నుండి దాదాపు 1,300 కిలోమీటర్ల (800 మైళ్ళు) దూరంలో ఉన్న ఈ కాంప్లెక్స్ రష్యాలోని అతిపెద్ద చమురు శుద్ధి, పెట్రోకెమికల్ కేంద్రాలలో ఒకటని.. జనరల్ స్టాఫ్ టెలిగ్రామ్ పోస్ట్లో పేర్కొంది. ఈ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి 74 మిలియన్ బ్యారెళ్ల చమురును శుద్ధి చేసి, పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుందని వెల్లడించింది.ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని ఓర్స్క్ రిఫైనరీ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో దెబ్బతిన్న విదేశీ పరికరాలను మరమ్మతు చేయడానికి ఆరు నెలల వరకు సమయం పట్టవచ్చని ఒరెన్బర్గ్ ప్రాంత గవర్నర్ యెవ్జెనీ సోల్ంట్సేవ్ తెలిపారు. ఇటీవల ఉక్రెయిన్పై రష్యా జరిపిన డ్రోన్ దాడుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మంది గాయపడ్డారు.ఒడెసా ప్రాంతంలో ప్రయాణికుల రైలుపై షాహెద్ డ్రోన్ దాడి చేయడంతో ఇంజనీర్, అతని సహాయకుడు మృతి చెందారు. రష్యా బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు అమెరికా తయారీ పాట్రియాట్ ఇంటర్సెప్టర్ క్షిపణులు అత్యవసరం. అయితే, ఇరాన్ యుద్ధం కారణంగా వీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
మనం ఫ్రెండ్స్ కాదు.. సొంత అక్కాచెల్లెళ్లం.. ఇప్పుడే ఇలా తెలిసింది..
భారత్లో పుట్టిన మీనా, మినాల్ చిన్న వయసులోనే వేర్వేరు డచ్ కుటుంబాలకు దత్తతగా వెళ్లారు. 1996లో దత్తత పిల్లల కోసం నిర్వహించిన ఒక కార్యక్రమంలో వారు తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో వారు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో నివసించేవారు. మొదటి పరిచయంతోనే ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది. వారి రూపురేఖలు, స్వభావంలో ఉన్న పోలికలు చూసి స్నేహితులు కూడా ఆశ్చర్యపోయారు. తర్వాత వారు స్నేహితులుగా మారి చిరునామాలు ఇచ్చిపుచ్చుకున్నారు.కొన్ని ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయింది. దాదాపు 15 ఏళ్ల పాటు ఒకరి గురించి మరొకరికి సమాచారం లేకపోయింది. అనంతరం మీనా డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని నిర్ణయించుకుంది. అలాగే, వేరే ప్రాంతంలో మినాల్ కూడా డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంది. ‘‘మైహెరిటేజ్’’ డీఎన్ఏ పరీక్ష ఫలితాల్లో మీనా, మినాల్ మధ్య 100% సరిపోలిక కనిపించింది. దీంతో వారు కేవలం స్నేహితులు మాత్రమే కాదని, నిజానికి రక్తసంబంధం ఉన్న అక్కాచెల్లెళ్లు అని బయటపడింది.ఈ విషయం తెలిసిన తర్వాత ఇద్దరూ నెదర్లాండ్స్లో మళ్లీ కలుసుకున్నారు. ఎంతో భావోద్వేగభరితంగా మాట్లాడుకున్నారు. చాలా ఏళ్లుగా తన హృదయంలో ఏదో వెలితి ఉన్నట్టుగా అనిపించేదని మీనా చెప్పింది. ఇప్పుడు తప్పిపోయిన పజిల్ ముక్క దొరికినట్టుగా ఉందని ఆమె పేర్కొంది. తన సోదరిని చూసి “నిన్ను చూస్తే ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది” అని చెప్పింది.ప్రస్తుతం 43 ఏళ్ల మీనా ముగ్గురు పిల్లల తల్లి. 44 ఏళ్ల మినాల్ ప్రేమాభిమానాలతో నిండిన డచ్ కుటుంబంలో తోబుట్టువుల మధ్య పెరిగింది. “మేము సోదరీమణులు కావడానికి ముందే స్నేహితులం. నిజానికి మేము ఎప్పటినుంచో అక్కాచెల్లెళ్లమే, కానీ ఆ విషయం మాకు తెలియదు” అని మినాల్ తెలిపింది.కాగా, మైహెరిటేజ్ అనేది కుటుంబ వంశవృక్షం, పూర్వీకుల వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ ఆన్లైన్ సంస్థ. ఈ సంస్థ నిర్వహించే డీఎన్ఏ పరీక్ష జన్యు సమాచారాన్ని విశ్లేషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తమ డేటాబేస్లో ఉన్న ఇతర వ్యక్తుల డీఎన్ఏతో పోల్చుతుంది. మీకు తెలియని బంధువులను గుర్తించే అవకాశం ఇస్తుంది. మీ కుటుంబ మూలాలు, పూర్వీకులు ఏ ప్రాంతాలకు చెందినవారో తెలుసుకునే సమాచారం అందిస్తుంది.
ఐక్యరాజ్యసమితి సిబ్బందిని అరెస్టు చేసిన తాలిబాన్
కాబూల్: అఫ్గానిస్థాన్లోని ఐక్యరాజ్యసమితి రాజకీయ మిషన్ (యూఎన్ఏఎంఏ)కు చెందిన ఇద్దరు అఫ్గాన్ సిబ్బందిని తాలిబాన్ పాలకులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా ప్రకటించింది. తాలిబాన్కు చెందిన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విభాగం, పశ్చిమ ఆఫ్గానిస్థాన్లోని హెరాత్ నగరంలో ఈ ఇద్దరు సిబ్బందిని ఆదివారం అరెస్టు చేసినట్టు ఐక్యరాజ్యసమితి డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ విలేకరులకు తెలిపారు. వీరిపై మోపిన ఆరోపణలు ఏమిటో తమకు తెలియజేయలేదని, వారిని కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని హక్ వెల్లడించారు. తమ సిబ్బందికి, అధికారులకు ఉండాల్సిన ప్రత్యేక హక్కులను గౌరవించాలని తాలిబాన్ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్యసమితి కోరింది. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఐక్యరాజ్యసమితి సిబ్బందికి లభించే భద్రతను తాలిబాన్ పాటించాలని మిషన్ డిమాండ్ చేసింది.కాగా, అఫ్గాన్లో తాలిబాన్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని వేడుకలు జరగనున్నాయి. 2021 ఆగస్టు 15న అమెరికా, నాటో బలగాలు ఆఫ్గాన్ నుంచి రెండు దశాబ్దాల యుద్ధం తర్వాత వైదొలగడంతో తాలిబాన్ దేశాధికారాన్ని చేజిక్కించుకుంది.అధికారం చేపట్టిన వెంటనే తాలిబాన్ ప్రభుత్వం బాలికలను మాధ్యమిక పాఠశాలలకు వెళ్లకుండా నిషేధించింది. ఆ తర్వాత ఈ ఆంక్షలను ఉన్నత విద్య, ఉద్యోగాలు, మరిన్ని రంగాలకు విస్తరించింది. దీనితో మహిళలు, బాలికలను బహిరంగ జీవితం నుంచి పూర్తిగా వెలివేశారని అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి.ఇదే వారంలో మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్, తాలిబాన్ నిర్బంధంలో ఉన్న ఐక్యరాజ్యసమితి, స్వచ్ఛంద సంస్థల సిబ్బందిని వెంటనే విడుదల చేయాలని పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదేశం ప్రకారం, యూఎన్ఏఎంఏ మిషన్ అఫ్గానిస్థాన్లో మానవతా సహాయాన్ని ప్రోత్సహించడం, మానవ హక్కులను పరిరక్షించడం, మహిళలు-బాలికల సమానత్వం, సమ్మిళిత పాలన, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలపై పనిచేస్తోంది.
జాతీయం
స్టాండప్ కమెడియన్కు భారీ ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు
సాక్షి,న్యూఢిల్లీ: దివ్యాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో హాస్యనటుడు సమయ్ రైనాకు సుప్రీంకోర్టు భారీ ఊరట నిచ్చింది. సమయ్తో పాటుమరో నలుగురిపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ స సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ జె.వి. మోహనలతో కూడిన ధర్మాసనం, రైనాతదితరులు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడాన్ని గమనించి, వారిపై ఉన్న అన్ని కేసులను కొట్టి వేసింది.ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోలో చేసిన వ్యాఖ్యలక గాను, రైనాతో పాటు మరో నలుగురిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అసభ్యకరమైన జోకులపై గతంలోనే రైనాను మందలించిన కోర్టు, దివ్యాంగుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, నిధులు సేకరించాలని రైనాను ఆదేశించింది. గత విచారణ సందర్భంగా, చేసిన తప్పులను సరిదిద్దుకుంటామని ఇచ్చిన హామీలను పాటించకుండా రైనా కోర్టును మోసం చేశారంటూ కోర్టు రైనా, మరో నలుగురిపై రూ. 3 లక్షల జరిమానా విధించింది.ఇదీ చదవండి: 10 ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్స్టా, నెటిజన్ల స్పందన వైరల్కాగా ఈ షోలో స్పైనల్ మస్కులర్ అట్రోఫీ చికిత్సకు అయ్యే అధిక ఖర్చుపై రైనా సున్నితత్వం లేని వ్యాఖ్యలు చేశారని, అలాగే అటువంటి వైకల్యం ఉన్న వ్యక్తిని ఎగతాళి చేశారని ఆరోపిస్తూ క్యూర్ SMA ఇండియా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించిన రైనాతో పాటు, ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లైన విపున్ గోయల్, బల్ రాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్, సోనాలి థక్కర్ , నిశాంత్ జగదీష్ తన్వర్లు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఈ పిటిషన్లో ప్రస్తావించారు.ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ : ఖలిస్తాన్ బెదిరింపుల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీ 80వస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఢిల్లీలోని ప్రధాన ప్రదేశాలకు బాంబు బెదరింపు కలకలం రేపింది. శుక్రవారం నాడు ఢిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా అనేక ఇతర ప్రదేశాలకు ఖలిస్తాన్ పేరుతో బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఢిల్లీని ఖలిస్తాన్గా మారుస్తామని ఆ బెదిరింపు ఇమెయిల్లో పేర్కొన్నారు.సిక్కుల కోసం ఖలిస్తాన్ అనే పేరుతో ఒక స్వతంత్ర సార్వభౌమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకునే వేర్పాటువాద ఉద్యమ ఖలిస్తాన్ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారని ఆ ఇమెయిల్లో పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 2:11 గంటలకు ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుతుంది, ఆ తర్వాత గంటకే జిల్లా కోర్టులలో పేలుళ్లు జరుగుతాయి. ఢిల్లీ కోర్టులు సిక్కులకు వ్యతిరేకంగా ఉన్న కేసులను మాత్రమే వింటాయంటా విమర్శలు గుప్పించడం గమనార్హం. జామ్నగర్ హౌస్, ఝండేవలన్ భవనం, సాకేత్ కార్యాలయం, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) టెర్మినల్ 3, ఢిల్లీ కంటోన్మెంట్లోని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) కార్యాలయంతో సహా మరో ఆరు ప్రదేశాలకు కూడా బెదిరింపులొచ్చినట్టు సమాచారం. ఢిల్లీ మెట్రో, అంబాలా వెళ్లే రైళ్లను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారును భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని ప్రాంతాలకు అగ్నిమాపక వాహనాలను పంపారు. అయితే ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్
సీజేపీకి బార్ కౌన్సిల్ చైర్మన్ చురక!
నల్సర్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ వివాదంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెనకడుగు వేసినా.. వేడి ఇప్పుట్లో చల్లారేలా కనిపించడం లేదు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ మిశ్రా రాజీనామాకు కాక్రోచ్ జనతా పార్టీ పట్టబడుతోంది. అవసరమైతే ధర్నాలకు దిగుతామని హెచ్చరిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై, సీజేపీ ఆరోపణలపై మనన్ మిశ్రా కాస్త భిన్నంగా స్పందించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై విమర్శలు చేసిన వాళ్లకు ఆయన సమాధానం ఇచ్చారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ విషయంలో తమ లక్ష్యం కూడా అదే అని స్పష్టం చేశారు. ‘‘అభిజీత్ దీప్కే అయినా, సౌరవ్ దాస్ అయినా.. వారికి చెప్పదలచుకున్నది ఒక్కటే. విద్యార్థుల హక్కులను కాపాడటమే మా ఉద్దేశం. ఈ విషయంలో మా ప్రయోజనాలు, వారి లక్ష్యం ఒకటే’’ అని మనన్ మిశ్రా తెలిపారు.వివాదానికి కారణం ఇదేహైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యే ప్రతిపాదనపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం నేపథ్యంలో బీసీఐ.. 2026లో నాల్సార్ నుంచి న్యాయ విద్య పూర్తి చేసే విద్యార్థుల ఎన్రోల్మెంట్పై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు విద్యార్థుల చర్యలకు మొత్తం బ్యాచ్ను బాధ్యులను చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.‘‘తొందరపాటులో నిర్ణయం తీసుకున్నాం’’తొలుత ఇచ్చిన ఆదేశాలపై మనన్ మిశ్రా వివరణ ఇచ్చారు. విద్యార్థులకు నష్టం కలిగించాలనే ఉద్దేశం తమకు ఎప్పుడూ లేదన్నారు. ‘‘ఆ నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్నదే. విషయం కౌన్సిల్ దృష్టికి వచ్చిన వెంటనే నిలిపివేశాం. సీనియర్ సభ్యులతో చర్చించిన తర్వాత పూర్తిగా ఉపసంహరించుకున్నాం. దీనిపై ఎలాంటి విచారణ అవసరం లేదు’’ అని తెలిపారు.‘‘బీసీఐకి, సీజేపీకి ఘర్షణ లేదు’’విద్యార్థుల ప్రయోజనాల విషయంలో బీసీఐ, సీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మనన్ మిశ్రా స్పష్టం చేశారు. ‘‘ఎవరైనా అపార్థంలో ఉంటే స్పష్టం చేయాలనుకుంటున్నాను. దేశ యువత ప్రయోజనాలను కాపాడటం మనందరి బాధ్యత. అభిజీత్ దీప్కే కోరేది కూడా అదే.. మేము కోరేది కూడా అదే. కాబట్టి ఎలాంటి ఘర్షణ లేదు’’ అని పేర్కొన్నారు.రూ.14 కోట్ల ఆరోపణలపై స్పందనబీసీఐ సమావేశాలు, సదస్సుల కోసం రూ.14 కోట్లు ఖర్చు చేసిందన్న సౌరవ్ దాస్ ఆరోపణలపైనా మనన్ మిశ్రా స్పందించారు. ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని, అలాంటి భారీ ఖర్చులు ఏవీ జరగలేదని చెప్పారు. బీసీఐ వివిధ అంశాలపై సెమినార్లు నిర్వహిస్తుందని, వాటిని రూ.14 కోట్ల వ్యయంతో నిర్వహించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.సీజేపీ మాత్రం విజయంగా..బీసీఐ ఆదేశాల ఉపసంహరణను సీజేపీ నేతలు తమ విజయంగా అభివర్ణించారు. సౌరవ్ దాస్ సోషల్ మీడియాలో ‘‘ఇట్స్ డన్ బ్రో’’ అంటూ స్పందించారు. గతంలో తమ ఉద్యమ సమయంలో వైరల్గా మారిన నినాదాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు. అయితే మనన్ మిశ్రా రాజీనామా కోసం ఉద్యమిస్తామని ప్రకటించారు.సుప్రీం నోటీసులుఇదిలా ఉంటే.. ఇది పూర్తిగా సీజేఐకి, విద్యార్థులకు సంబంధించిన అంశమని సుప్రీం కోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్.. విద్యార్థులు తప్పు చేసినా, నిరసన తెలిపే హక్కు వాళ్లకు ఉంటుందని చెప్పింది. బార్ కౌన్సిల్ జోక్యం అనవసరమని వ్యాఖ్యానించింది. అసలు అలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ బీసీఐకు నోటీసులు పంపింది. మరోవైపు.. నిరసన తెలిపిన విద్యార్థులను విచారించాలంటూ గత ఆదేశాల్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించడంపైనా నల్సార్ స్పందించింది. అది తమకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది.
12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్
ఒక సాదాసీదా దోశ వ్యాపారాన్ని కోట్ల రూపాయల స్థాయికి చేర్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఫుడ్ బిజినెస్లో కోట్ల రూపాయలు సంపాదించాలంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. వడ్డించే వంటకాన్ని సరిగ్గా, పరిశుభ్రంగా అందిస్తే వ్యాపారం విజయవంతం కావచ్చని ముంబైలోని బెన్నె దోస రెస్టారెంట్ నిరూపించిందని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా అంటున్నారు. బెన్నె దోశ లేదా వెన్న దోశ విజయ రహస్యాన్ని విశ్లేషిస్తూ దాని సక్సెస్ స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.ముంబైలోని బాంద్రాలో కేవలం 12 సీట్ల సామర్థ్యంతో ప్రారంభమైన ‘బెన్నె’ (Benne) దోశ కేఫ్, ప్రస్తుతం రూ. 350 కోట్ల విలువైన బ్రాండ్గా ఎదిగి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకాను ఆకర్షించింది. ప్రముఖ దోశల చైన్ అయిన 'బెన్నె' ఇంత భారీ విజయం సాధించడానికి కారణమని తాను నమ్మే విషయాలను గోయెంకా విశ్లేషించారు. ఒక నిర్దిష్టమైన మెనూ, తెలివైన నిర్వహణ, అందుబాటు ధరలు, అన్నింటికన్నా ముఖ్యంగా, ఆ బ్రాండ్ చుట్టూ అల్లుకున్న ఎమోషన్ లాంటి అంశాలను ఆయన పేర్కొన్నారు.దావణగెరె-శైలి బెన్నె (వెన్న) దోశ స్పెషల్ : చాలా మందికి అలవాటైన పెద్ద, పలుచని, కరకరలాడే దోశలలా కాకుండా, ఈ కర్ణాటక స్టైల్ దోశ విభిన్నంగా ఉంటుంది. చిన్నగా, లోపల మెత్తగా ఉండి, వెన్నతో నిండుగా ఉంటుంది. ఈ విలక్షణమైన శైలే బెన్నెకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది.Why has ‘Benne’ succeeded so spectacularly?- One hero product: Davangere-style butter dosa- Small menu, easy to perfect and replicate- Electronic self order + self service creates engagement - Affordable enough to become a habit- Long queues created social media buzz-… pic.twitter.com/VcpMCEX2lB— Harsh Goenka (@hvgoenka) August 9, 2026 అఖిల్ అయ్యర్, శ్రియా నారాయణ్ అనే భార్యాభర్తలు ప్రారంభించిన ఈ స్టార్టప్, దేశంలోని ప్రముఖ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) బ్రాండ్లకు గట్టి పోటీనిస్తోంది. ముంబైలో అథెంటిక్ కర్ణాటక/బెంగళూరు శైలి దావణగెరె బెన్నె దోశ దొరకకపోవడంతో, ఈ రుచిని అందరికీ అందించాలనే ఆశయంతో ఈ జంట స్వయంగా కేఫ్ పెట్టాలనుకున్నారు. 2024 లో ముంబైలోని బాంద్రాలో కేవలం 12 మంది కూర్చునే చిన్న అవుట్లెట్తో ప్రయాణం మొదలైంది. సాంప్రదాయ దక్షిణ భారత శైలి హోటల్ అయిన దానికి వారు 'బటర్' అని పేరు పెట్టారు.ఇదీ చదవండి: 10 ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్స్టా, నెటిజన్ల స్పందన వైరల్ దీని విజయానికి గల ప్రధాన కారణాలలో ఒకటి, వారు దావణగెరె శైలి వెన్న దోశను తమ కాన్సెప్ట్గా చేసుకోవడమే అంటారు హర్ష గోయెంకా. సాధారణ రెస్టారెంట్లలా వంద రకాల మెనూ కాకుండా, కేవలం 'దావణగెరె స్టైల్ బెన్నె దోశ'పైనే పూర్తి ఫోకస్ పెట్టారు. అంతేకాదు సరైన చట్నీ రుచి కోసం ఎన్నో ప్రయోగాలు చేశారు, సాంప్రదాయ రుచి కోసం ప్రత్యేకంగా కర్ణాటక నుండి కాస్ట్ ఐరన్ పెనాలను తెప్పించారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, వ్యాపారం పెరిగేకొద్దీ అదే పద్ధతిని, రుచిని అందించేలా జాగ్రత్త వహించారు. క్విక్-సర్వీస్ రెస్టారెంట్కు, ఆ సరళత మరో పెద్ద ప్రయోజనం. ఫలితం ఈ కేఫ్ రోజుకు 800 పైగా దోసలు విక్రయిస్తూ, నెలకు రూ.1 కోటి రాబడిని అందుకుంటోంది.ఇక బెన్నే ఎలక్ట్రానిక్ సెల్ఫ్-ఆర్డరింగ్, సెల్ఫ్-సర్వీస్ను ఉపయోగిస్తుంది, దీనివల్ల విస్తృతమైన టేబుల్ సర్వీస్ అవసరం తగ్గడమే కాకుండా, కస్టమర్లను కూడా ఈ ప్రక్రియలో పాలుపంచుకునేలా చేస్తుంది. తద్వారా క్యూలో నిల్చునే కష్టాలు లేకుండా, రెస్టారెంట్కు ప్రజలకు త్వరగా సేవ చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. అయినా ఈ రెస్టారెంట్ వద్ద ఆహార ప్రియులు బారులు తీరిన వైనం ఈ వెన్న దోశ క్రేజ్కు అద్దం పట్టాయి. అంతేనా దీపికా పడుకోన్, రణవీర్ సింగ్ వంటి సెలబ్రిటీలు రెస్టారెంట్ను సందర్శించడం, సోషల్ మీడియా పోస్టులు ఆసక్తిని మరింత పెంచాయి. ఇపుడీ బెన్నె దోశ ఖ్యాతి ముంబైలో అనేక శాఖలతో పాటు, ఢిల్లీలోని బ్రాంచ్లో కూడా వెలుగొందుతోంది.
ఎన్ఆర్ఐ
హైదరాబాద్కు శ్రీపతి దీపారెడ్డి పార్థీవదేహం
హైదరాబాద్: చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీకి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) అమెరికా న్యూజెర్సీలో గతనెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దీపారెడ్డి 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.గత నెల 28న భర్త రామకృష్ణారెడ్డిని కారులో కార్యాలయంలో దించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న దీపారెడ్డి కారును, ఓ మెడికల్ విద్యార్థి కారుతో ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆమె అవయవాలను మెడికల్ విద్యార్థులకు అందజేస్తానని అంగీకరించడంతో ఆమె అవయవాలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. సంబరపడే లోపే..రెండు రోజుల్లో మాదాపూర్లో ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ గృహప్రవేశానికి వస్తుందని సంబరపడ్డాం.. అన్ని ఏర్పాట్లు చేశాం, ఈవిధంగా వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టారు. నేడు చంపాపేటలో అంత్యక్రియలు దీపారెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం నగరానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంపాపేటలోని రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు.
అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్
సాక్షి,హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ 19వ మహసభలు శనివారం అమెరికాలోని బాల్టిమోర్లో ఘనంగా ప్రారంభమైయ్యాయి. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారితో పాటు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ల నుండి భారీ ఎత్తున వివిధ రంగాల ప్రముఖులు తొలి రోజు ఆరంభవేడుకలకు హాజరైయ్యారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎంఎల్ఎలు సినీ,సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరైయ్యారు.దాదాపు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు తెలుగు సంస్కృతిని చాటిచెప్పే కళాప్రదర్శనలు నిర్వహించారు.వివిధ రంగాల్లో విశేషసేవ చేసిన 15 మంది ప్రముఖులను ఆటా అవార్డులతో సత్కరించారు. అవార్డులు అందుకున్న వారిలో ఆర్.రవికాంత్రెడ్డి(జర్నలిజం) డాక్టర్ రవీందర్(వైద్యం), కిరణ్ చుక్కపల్లి(ఇండస్ట్రీ) తదితరులను ఆటా మాజీ అధ్యక్షులు పారిశ్రామికవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి సత్కరించారు.
ఎన్ఆర్ఐలు పార్టీకి సేవలు అందించాలి
సాక్షి, అమరావతి: అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో గురువారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, టెక్నాలజీ, కంటెంట్, డేటా, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఎన్ఆర్ఐలు తమ సేవలను పార్టీకి అందించాలని కోరారు. కేవలం పోస్టులు, లైకులు, షేర్లకు పరిమితం కాకుండా, స్పష్టమైన లక్ష్యాలు, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఉన్న ప్రజాభిప్రాయాన్ని వాస్తవాలు, సానుకూల కమ్యూనికేషన్, టెక్నాలజీ, సృజనాత్మక కంటెంట్ను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్ సమావేశంలో పాల్గొన్న ఆలూరు సాంబశివారెడి, తదితరులు
అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్!
అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.అమెరికాలో F-1 విద్యార్థి వీసాపై చదివే విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం అక్కడే ఉండి తమ విద్యకు సంబంధించిన రంగంలో ఉద్యోగం చేసే అవకాశం OPT ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు OPT కింద పనిచేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు చేసిన వారికి ఈ గడువు మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ఉద్యోగ అనుభవం సంపాదించడంతో పాటు, తర్వాత H-1B వర్క్ వీసా పొందేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఈ అవకాశానికి ఏకంగా 100,000 డాలర్ల ఫీజు విధించే ఆలోచన ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల మార్గం మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా తుది ప్రకటన వెలువడలేదు.ఎవరిపై భారం పడనుంది?ప్రతిపాదిత ఫీజును విద్యార్థులే చెల్లించాలా? లేక వారిని ఉద్యోగంలోకి తీసుకునే కంపెనీలే చెల్లించాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులే చెల్లించాల్సి వస్తే.. చాలా మందికి ఇది అందనంత భారంగా మారే అవకాశం ఉంది. కంపెనీలు చెల్లించాల్సి వస్తే.. విదేశీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంపై సంస్థలు వెనుకడుగు వేసే పరిస్థితి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికన్ విద్యార్థులకు ప్రాధాన్యం పెరిగి, అంతర్జాతీయ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.భారతీయ విద్యార్థులపై ప్రభావం ఎంత?అమెరికా ఉన్నత విద్యకు భారతీయ విద్యార్థులు ప్రధాన వర్గంగా ఉన్నారు. ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే కాకుండా.. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేసి అంతర్జాతీయ అనుభవం పొందాలనే లక్ష్యంతో అమెరికాకు వెళ్తున్నారు.అమెరికా విద్య కోసం కుటుంబాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో.. OPTపై భారీ ఫీజు ప్రతిపాదన విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.నాలుగేళ్ల వీసా పరిమితి కూడా!OPT ఫీజు ప్రతిపాదనతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనల్లో మరో కీలక మార్పు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు విదేశీ విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” విధానంలో అమెరికాలో ఉండేవారు. అంటే.. వారు తమ కోర్సును నిబంధనల ప్రకారం కొనసాగిస్తున్నంత కాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది.తాజా ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే ఉండే అనుమతి ఇవ్వాలనే ఆలోచన ఉంది. అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న కారణంఅమెరికా వలస విధానాన్ని మరింత పర్యవేక్షించడం, చట్టబద్ధమైన వలస వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ భద్రతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే విద్యా రంగ నిపుణులు మాత్రం.. ఇలాంటి నిబంధనలు అమెరికాను అంతర్జాతీయ విద్యార్థులకు తక్కువ ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికిప్పుడు ఆందోళన అవసరం లేదా?$100,000 OPT ఫీజు ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే అమెరికా వలస విధానంలో క్రమంగా కఠినమైన మార్పులు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసి అక్కడే కెరీర్ నిర్మించుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై మార్గం మరింత ఖరీదైనదిగా, నిబంధనలతో కూడుకున్నదిగా మారే అవకాశం ఉంది.
క్రైమ్
తిరుగు ప్రయాణంలో విషాదం.. అన్నదమ్ముల పిల్లలు మృత్యు ఒడికి!
హైదరాబాద్, మోతీనగర్: మూడు కుటుంబాలు కలిసి దైవ దర్శనం చేసుకున్నాయి. తిరుగు పయనంలో నగరానికి బయలుదేరాయి. ఈ క్రమంలో వీరు వస్తున్న వాహనం అదుపుతప్పడంతో ఇద్దరు బాలురు మృతి చెందిన విషాదకర ఘటన షోలాపూర్లో చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి.. కూకట్పల్లి పరిధి గాయత్రీనగర్ డివిజన్ శ్రీ వివేకానంద నగర్లోని మూడు కుటుంబాలకు చెందిన సుమారు 15 మంది బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని తుల్జా భవానీ మాత దర్శనానికి వెళ్లి ఇదేరోజు తిరిగి నగరానికి వస్తుండగా.. షోలాపూర్ ఉమగ్రా వద్ద ఉదయం 10.30 గంటలకు వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఉజ్వల్ చౌదరి (12), దివేష్ చౌదరి (11) మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా, ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇంటర్ విద్యార్థిని డింపుల్ (17) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.మూలమలుపు కారణంగా వాహనాలు సరిగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన చిన్నారులు ఉజ్వల్, దివేష్ వరుసకు అన్నదమ్ములు. 6వ తరగతి చదువుతున్నారు. ఉజ్వల్ చౌదరి తండ్రి గణేష్, తల్లి రేఖ. దివేష్ చౌదరి తండ్రి చోగారాం, తల్లి చంపాదేవి. వీరు ఇరువురు కూడా వరుసకు అన్నదమ్ములే. వీరంతా బంగారం వ్యాపారం చేస్తుంటారు. మృతులకు గురువారం వి.రామారావు నగర్లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. బాధిత కుటుంబ సభ్యులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు పరామర్శించారు.
ఇన్స్టాగ్రామ్లో ప్రేమ.. స్టేషన్లో పెళ్లి.. గంటలోనే విషాదం!
ఇన్స్టాగ్రామ్లో మొదలైన పరిచయం.. ప్రేమగా మారింది. ఆ ప్రేమ కోసం కుటుంబాన్ని ఎదిరించింది. ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. చివరకు రైల్వే స్టేషన్లోనే అతడి చేత సింధూరం పెట్టించుకుంది. కొత్త జీవితంపై ఎన్నో కలలు కంటూ.. ఆ పెళ్లి ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. పెళ్లైన కొన్ని గంటల్లోనే ఆమె జీవితం విషాదంగా ముగిసింది.బీహార్లోని పూర్ణియా జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 19 ఏళ్ల మానిషా కుమారి బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. దిల్ఖుష్ కుమార్ అనే 20 ఏళ్ల యువకుడితో ఆమెకు ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ ప్రేమకు కుటుంబం నుంచి అంగీకారం లభించలేదు. మానిషాకు మరో యువకుడితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో తనకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న మానిషా.. ప్రియుడు దిల్ఖుష్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.ఆగస్టు 10న దిల్ఖుష్ మానిషాను అరారియా నుంచి తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ పూర్ణియా జంక్షన్కు చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు లేరు.. బంధువులు లేరు.. పెళ్లి సందడి లేదు. అయినా తమ ప్రేమే తమకు అండగా భావించిన ఆ జంట.. రైల్వే స్టేషన్ పరిసరాల్లోనే పెళ్లి చేసుకున్నారు. దిల్ఖుష్ మానిషా పాపిట్లో సింధూరం పెట్టాడు. ఇద్దరూ భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ ఆనంద క్షణాలను కెమెరాలో బంధించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. కానీ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించిన కొద్దిసేపటికే కథ ఒక్కసారిగా మారిపోయింది.పెళ్లి తర్వాత ఇద్దరూ రాంబాగ్ నుంచి సిటీ కాళీ ఆలయానికి కాలినడకన బయలుదేరారు. ఎండ తీవ్రంగా ఉంది. మార్గమధ్యంలో మానిషాకు ఒక్కసారిగా కళ్లు తిరిగాయి. దీంతో, ఆమెను హుటాహుటిన పూర్ణియా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు చికిత్స ప్రారంభించారు. మరోవైపు.. కుటుంబ సభ్యులు తమ కూతురి కోసం వెతుకుతున్నారు. ఇంతలో ఆసుపత్రిలో విషాద వార్త వినిపించింది. చికిత్స పొందుతూనే మానిషా మృతి చెందింది. కొన్ని గంటల క్రితం భర్త పక్కన నిలబడి సింధూరంతో పెళ్లి ఫొటో దిగిన యువతి.. అదే రోజు విగతజీవిగా మారింది. మానిషా కుటుంబ సభ్యులు ఆమె ఇన్స్టాగ్రామ్ ఫొటోలు చూసి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎక్కడుందో తెలుసుకునేలోపే.. ఆమె మరణవార్త కుటుంబానికి చేరింది.మానిషాకు అకస్మాత్తుగా ఏమైంది?ఎండ కారణంగానే ఆమె అస్వస్థతకు గురైందా? లేక ఆమె మరణం వెనుక మరేదైనా కారణం ఉందా? యువతి ఆకస్మిక మరణం అనుమానాలకు తావివ్వడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేహాట్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. మానిషా భర్త దిల్ఖుష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరారియా నుంచి బయలుదేరినప్పటి నుంచి.. స్టేషన్లో జరిగిన పెళ్లి.. ఆలయానికి వెళ్తున్న సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడం.. ఆసుపత్రిలో మృతి చెందడం వరకు జరిగిన మొత్తం పరిణామాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మానిషా మృతికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు నిజం బయటపడనుంది. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో మొదలైన ప్రేమ.. చివరకు రైల్వే స్టేషన్లో పెళ్లిగా మారింది. ఆ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో మెరిసిన కొన్ని గంటల్లోనే.. అదే కథ విషాదంగా ముగిసింది.
స్నేహితుడిగా వచ్చి.. హంతకుడిగా మారి!
వెల్దండ: ఆరేళ్లుగా అన్యోన్యంగా సాగుతున్న దాంపత్య జీవితంలోకి ఓ స్నేహితుడి ప్రవేశం చిచ్చురేపింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసి.. చివరకు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కొట్ర గ్రామానికి చెందిన నారమల్ల చెన్నయ్య, కావటి అనూష(25) ఆరేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అనూష కల్వకుర్తిలోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో చెన్నయ్యకు సన్నిహితుడైన శ్యాంపూరి రాములు ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత అనూషతో రాములుకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. బుధవారం సాయంత్రం పని ముగించుకున్న అనూష గ్రామానికి వెళ్లేందుకు కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాకు వచ్చింది. భర్తకు ఫోన్ చేసి ఆటో కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. రాత్రి 7 గంటల సమయంలో గ్రామానికి వెళ్తున్నానంటూ వచ్చిన రాములు తన బైక్పై ఆమెను తీసుకెళ్లాడు. భార్య ఎంతకూ ఇంటికి రాకపోవడంతో చెన్నయ్య ఆమెకు ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ రావడంతో కల్వకుర్తి వెళ్లి అనూష పనిచేసే దుకాణంలో ఆరా తీశాడు. అప్పటికే ఆమె వెళ్లిపోయిందని చెప్పడంతో పోలీసులను ఆశ్రయించాడు. హతమార్చేందుకు ముందుగానే పథకం అనూష కొంతకాలంగా తనను దూరం పెడుతోందని రాములు భావించాడు. తనతో మాట్లాడాలని, కలవాలని కోరినా ఆమె నిరాకరించడంతో అతడిలో కక్ష పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను హతమార్చేందుకు పథకం వేశాడు. ఇందుకోసం ఆదివారం రోజే కట్టెలను సమకూర్చుకుని.. పట్టణ శివారులోని వడ్డోనీరాళ్ల వద్ద చితిని సైతం సిద్ధం చేసుకున్నాడు. హత్య చేసిన తర్వాత అక్కడే తగలబెట్టాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు.బుధవారం రాత్రి ఆటో కోసం ఎదురుచూస్తున్న అనూషను రాములు బైక్పై తీసుకెళ్లి కొట్రగేట్–హైదరాబాద్ రోడ్డులోని ఓ మామిడితోట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అదే గ్రామానికి చెందిన అల్లుడు వరుసయ్యే నాయిని శ్రీనుకు సమాచారం ఇచ్చి సంఘటనా స్థలానికి పిలిపించుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని వడ్డోనిరాళ్ల వద్ద ఏర్పాటు చేసుకున్న చితివద్దకు తీసుకెళ్లి డీజిల్ పోసి తగలబెట్టి తిరిగి వచ్చేశారు. హత్య అనంతరం రాములు గ్రామంలో కొంతసేపు తిరిగాడు. చెన్నయ్య భార్య కోసం వెతుకుతున్న విషయం తెలిసి.. భయాందోళనకు గురైన రాములు బుధవారం అర్ధరాత్రి వెల్దండ పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. తానే అనూషను హత్య చేసినట్లు చెప్పడంతో నిందితుడు ఇచ్చిన సమాచారంతో వెల్దండ సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ యుగంధర్రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు సమక్షంలో ఘటనాస్థలంలోనే మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం చేపట్టారు. అక్కడ లభించిన ఎముకలు, ఇతర వస్తువులను మృతురాలి భర్త చెన్నయ్యకు అప్పగించారు.
చాట్బాట్ల 'వలపు' వల
సాక్షి, హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంమానవ జీవితాన్ని ఎంతగా సులభతరం చేస్తోందో, అంతేస్థాయిలో నేరగాళ్లకు కొత్త ఆయుధంగా మారుతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్లో జరిగే మోసాలు ఇప్పుడు మరింత ప్రమాదకరమైన మలుపు తిరిగాయి. ఇప్పటివరకు కేవలం మనుషులు మాత్రమే చేసే ఆన్లైన్ ప్రేమ మోసాల్లోకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశించింది. చాట్జీపీటీ, జెమినై, క్లాడ్ వంటి ఆధునిక చాట్బాట్లు మనుషుల కంటే అత్యంత ప్రభావవంతంగా బాధితుల నమ్మకాన్ని చూరగొంటుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏఐకే రేటింగ్స్భారత్కు చెందిన అమృత విశ్వవిద్యాపీఠం, ఇటలీకి చెందిన ఫోస్కారి విశ్వవిద్యాలయం, ఆ్రస్టేలియాలోని మెల్బోర్న్ వర్సిటీ, ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. సాధారణ మనుషులకు, కృత్రిమ మేధ చాట్బాట్లకు మధ్య ఒక నియంత్రిత పోటీని ఏర్పాటు చేశారు. ఈ సంభాషణల్లో పాల్గొన్న బాధితులకు తాము ఒక యంత్రంతో మాట్లాడుతున్నామా లేదా మనిషితో మాట్లాడుతున్నామా అనే విషయం తెలియదు.చివరకు ఫలితాలను విశ్లేషించగా మానవ నేరగాళ్ల కంటే ఏఐ చాట్బాట్లు అత్యంత ప్రతిభావంతంగా మనుషులను అనుకరిస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకున్నట్లు తేలింది. సాధారణంగా ఒక మానవ నేరగాడు చాట్ చేసిన తర్వాత ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని కోరితే 18 శాతం మంది మాత్రమే అంగీకరించారు. కానీ అదే అభ్యర్థన ఏఐ చాట్బాట్ నుంచి వచ్చినప్పుడు 50 శాతం మంది అంగీకరించి ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిని బట్టి మనుషుల కంటే ఎక్కువగా కృత్రిమ మేధకే ప్రజలు నమ్మకపు రేటింగులు ఇచ్చారని పరిశోధకులు గుర్తించారు. విస్తరిస్తున్న మోసాల నెట్వర్క్ సాధారణంగా ప్రేమ మోసాలు అనేవి చాలాకాలం నుంచి సాగుతున్న నేరాలు. నేరగాళ్లు నకిలీ ఖాతాలను సృష్టించి, వారాలు లేదా నెలల తరబడి రోజూ బాధితులతో మాట్లాడుతూ నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆ తర్వాత ఏదైనా అత్యవసర పరిస్థితి అని చెప్పి లేదా నకిలీ డిజిటల్ కరెన్సీ పెట్టుబడుల పేరుతో డబ్బులు గుంజుతారు. అయితే మానవ నేరగాళ్లకు సమయం, శ్రమ పరిమితులు ఉంటాయి. కానీ ఏఐకి అటువంటి పరిమితులు ఏవీ లేవు. ఏఐ సహాయంతో నేరగాళ్ల నెట్వర్క్లు ఒకే సమయంలో వేలాది మంది బాధితులతో సంభాషణలు సాగించగలవు. ఇవి ఏమాత్రం అలసట లేకుండా, నిరంతరాయంగా స్పందించగలవు. సంభాషణల శైలి చాలా సహజంగా ఉండటం వల్ల ప్రస్తుత భద్రతా వ్యవస్థలు కూడా వీటిని గుర్తించలేకపోతున్నాయి. కేవలం చివరి దశలో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసే సమయంలో మాత్రమే మానవ నేరగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. ఇది నేరగాళ్లకు తమ మోసాలను ప్రపంచవ్యాప్తంగా భారీగా విస్తరించడానికి వీలు కల్పిస్తోంది.మానవ అక్రమ రవాణా.. ఈ సాంకేతికత కేవలం ఆర్థిక మోసాలకే పరిమితం కాలేదు. అంతర్జాతీయంగా జరిగే మానవ అక్రమ రవాణాకు కూడా సాధనంగా మారుతోంది. విదేశాల్లో భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ ప్రకటనల వెనుక పెద్ద ముఠాలు ఉంటున్నాయి. ఇవి కూడా కృత్రిమ మేధను ఉపయోగించి వివిధ భాషల్లో ఆకర్షణీయ సందేశాలను తయారు చేస్తున్నాయి. ఈ మాయలో పడి ఏటా లక్షలాది మంది మోసపోతున్నారు.జాగ్రత్త పడటం ఎలా? తక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగాలకు అసాధారణ రీతిలో భారీ జీతాలు ఆఫర్ చేయడం, ఉద్యోగ వివరాలు స్పష్టంగా లేకపోవడం, వెంటనే చేరాలని ఒత్తిడి చేయడం వంటివి మోసాలకు ప్రధాన సంకేతాలు. తెలియని వ్యక్తులతో ఆన్లైన్ సంభాషణలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా తక్కువ సమయంలోనే ఎక్కువ నమ్మకాన్ని కలిగిస్తూ, ఆ తర్వాత ఆర్థిక సహాయం, పెట్టుబడుల గురించి మాట్లాడితే అనుమానించాలి.
వీడియోలు
రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ
సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ
ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్
నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్
నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...
మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం
కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్
విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..
నోరు అదుపులో పెట్టుకో కోమటి రెడ్డిపై కాంగ్రెస్ సీరియస్


