రూ.13 కోట్ల కారులో వచ్చిన 26 ఏళ్ల మహిళా ఎమ్మెల్యే
పట్నా: బిహార్ ఎమ్మెల్యే, ప్రముఖ గాయని మైథిలీ ఠాకూర్ (26) ముంబైలోని ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా మండపాన్ని సందర్శించారు. గణేశుడిని దర్శించుకున్న ఆమె.. నీలిరంగు రోల్స్ రాయిస్ కలినన్లో మండపానికి రావడం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె రాకకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.చౌఫర్ నడిపిస్తున్న ఈ విలాసవంతమైన కారులో వెనుక సీట్లో మైథిలీ ఠాకూర్ కూర్చున్నారు. లాల్బాగ్చా రాజా మండపం చుట్టూ భారీగా భక్తులు ఉండటంతో కారు నెమ్మదిగా ముందుకు కదిలింది. ఈ సమయంలో ఆమె అక్కడున్న వారితో మాట్లాడటం, ఫొటోలకు పోజులివ్వడం కనిపించింది. మండపం ప్రధాన ద్వారం వద్దకు చేరుకునే సమయంలో కూడా ఆమె ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు.అయితే ఈ రోల్స్ రాయిస్ కారు మైథిలీ ఠాకూర్దేనా అనే విషయం స్పష్టంగా తెలియలేదు. వాహన నంబర్ ప్లేట్ ప్రకారం అది ముంబై సమీపంలోని వాషి ఆర్టీఓలో నమోదైన వాహనంగా తెలుస్తోంది. ఆమెకు సొంతంగా ఈ కారు ఉందా? అద్దెకు తీసుకున్నారా? లేదా ప్రత్యేక ఏర్పాటులో భాగంగా ఆమె కోసం వాహనాన్ని సమకూర్చారా? అనే దానిపై అధికారిక సమాచారం లేదు.దర్శనం సందర్భంగా మైథిలీ ఠాకూర్ గణేశుడి విగ్రహం ముందు తల వంచి ప్రార్థనలు చేశారు. అనంతరం లాల్బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండల్ ప్రతినిధులు ఆమెను సత్కరించారు. మండపానికి వచ్చిన సమయంలో అభిమానులు ఆమెతో ఫొటోలు దిగారు.మైథిలీ ఠాకూర్ వచ్చిన రోల్స్ రాయిస్ కలినన్ ప్రపంచంలోని ఖరీదైన విలాసవంతమైన ఎస్యూవీల్లో ఒకటిగా పేరుంది. దీని ఎక్స్షోరూమ్ ధర సుమారు రూ.10.50 కోట్లుగా ఉంది. ముంబైలో పన్నులు, బీమా, ఇతర ఛార్జీలు, వేరియంట్ను బట్టి ఆన్రోడ్ ధర సుమారు రూ.13.11 కోట్ల నుంచి రూ.15.30 కోట్ల వరకు ఉండొచ్చు. ఇందులో కలినన్ సిరీస్ 2, బ్లాక్ బ్యాడ్జ్ సిరీస్ 2 వేరియంట్లు ఉన్నాయి.లాల్బాగ్చా రాజా దర్శనానికి ఒక రోజు ముందు మైథిలీ ఠాకూర్ ముంబైలోని అంబానీ కుటుంబ నివాసం యాంటీలియాలో జరిగిన గణేశ్ చతుర్థి వేడుకలకు కూడా హాజరయ్యారు. అక్కడ ఈషా అంబానీ ఆమె గానాన్ని ప్రశంసిస్తూ, తమ పిల్లలు ఆమె పాటలను తరచూ వింటారని చెప్పినట్లు మైథిలీ షేర్ చేసిన వీడియోలో కనిపించింది. మైథిలీ ఠాకూర్ లాల్బాగ్చా రాజా దర్శనం, ఆమె విలాసవంతమైన కారులో వచ్చిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా కొనసాగుతున్నాయి. View this post on Instagram A post shared by C.N.M. (@c.n.m.786)
హడలెత్తిన రైడ్.. వెంటపడ్డ వాహనాలు.. రెండు గంటల భయానక జర్నీ!
వెనకాలే వస్తున్న వాహనాలు.. చుట్టూ వింత చూపులు.. రాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్న ఢిల్లీ రోడ్లు.. స్కూటర్పై ఒంటరి ప్రయాణం.. వెనుక నుంచి వస్తున్న వాహనాలు.. చీకటిలో తనవైపు నిలిచిపోయిన చూపులు.. మొదట ఇదంతా ఓ సాధారణ రాత్రి రైడ్లానే అనిపించింది. కానీ కొన్ని నిమిషాలు గడిచేసరికి పరిస్థితి మారిపోయింది. ఒకటి తర్వాత మరొకటి ఎదురైన ఘటనలతో ఆ ప్రయాణం చివరకు భయానక అనుభవంగా మారింది.రాత్రివేళ మహిళలు ఎదుర్కొనే పరిస్థితులను స్వయంగా తెలుసుకోవాలనుకున్న ఓ కంటెంట్ క్రియేటర్ ఈ ప్రయోగం చేశాడు. BeJaintle పేరుతో ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ చేసే అతడు.. ఇంట్లోనే మహిళ మాదిరిగా కనిపించే మేకప్ వేసుకుని, డ్రెస్ ధరించి, తలకు దుపట్టా కప్పుకున్నాడు. ఆ తర్వాత స్కూటర్ తీసుకుని ఢిల్లీ రోడ్లపైకి బయలుదేరాడు.మొదట చూపులు.. ఆ తర్వాత వెంటపడటం!రోడ్డుపైకి వచ్చిన కొద్దిసేపటికే తనవైపు పలువురు చూస్తున్నారని క్రియేటర్ గుర్తించాడు. ఎక్కడికి వెళ్లినా ఆ చూపులు తనను వెంబడిస్తున్నట్లు అనిపించాయని అతడు వీడియోలో పేర్కొన్నాడు. ఒక దశలో ఇద్దరు వ్యక్తులు తనను గమనిస్తూ స్కూటర్ను అనుసరించారని అతడు ఆరోపించాడు. మొదట దూరంగా కనిపించిన వారు.. క్రమంగా తనకు దగ్గరగా రావడానికి ప్రయత్నించారని చెప్పాడు. మరో సందర్భంలో స్కూటర్ నడుపుతుండగానే ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి మాట్లాడటం ప్రారంభించాడని తెలిపాడు.చీకటి రోడ్డుపై ఆటోలు.. అసలు టెన్షన్ అక్కడితో ఆగలేదు. ప్రయాణంలో రెండు ఆటోలు తన స్కూటర్ మార్గంలోకి పదేపదే వచ్చినట్లు క్రియేటర్ చెప్పాడు. ఓ ఆటో డ్రైవర్ తన స్నేహితులు వీడియో తీస్తున్నారని గుర్తించిన తర్వాత ఆగిపోయాడని అతడు తెలిపాడు. మరో డ్రైవర్ మాత్రం తన స్కూటర్ వైపు పలుమార్లు వాహనాన్ని మళ్లించినట్లు ఆరోపించాడు. ఆ వాహనం చివరకు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నానని చెప్పాడు.‘ఇక చాలు..’ అంటూ ముగింపురెండు గంటలు గడిచేసరికి అతడి ఉత్సాహం మొత్తం భయంగా మారిపోయింది. పదేపదే ఎదురైన చూపులు, అనుసరిస్తున్నట్లు అనిపించిన వ్యక్తులు, తన దారిలోకి వస్తున్న వాహనాలతో తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని చెప్పాడు. గత రెండు గంటల్లో నాకు చాలా అసహ్యంగా అనిపించింది. ఆటోవాళ్లు, సైకిల్ వాళ్లు.. అందరూ చూస్తూనే ఉన్నారు. రాత్రివేళ అమ్మాయిలు ఒంటరిగా బయటకు రావడం నిజంగా సురక్షితం కాదనిపించింది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు. చివరకు ఆ ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేశాడు. మహిళ వేషంలో చేసిన ఆ రాత్రి ప్రయాణం.. కేవలం సోషల్ మీడియా ప్రయోగంగా మొదలై, తనకు భయాన్ని మిగిల్చిన అనుభవంగా మారింది.ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మహిళలు రాత్రివేళ ఒంటరిగా ప్రయాణించే సమయంలో ఎదుర్కొనే అవాంఛిత చూపులు, అనుసరణ, వేధింపులపై పలువురు స్పందించారు. అయితే ఒక్క వ్యక్తి చేసిన ఈ ప్రయోగాన్ని ఆధారంగా చేసుకుని ఢిల్లీలో మహిళల భద్రతపై విస్తృతమైన నిర్ధారణకు రావడం సరికాదని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. He Dressed as a Woman and Rode Through Delhi at Night. What He Experienced in 2 Hours Is Now Raising Questions About Women’s Safety.A Delhi-based content creator conducted a social experiment by dressing as a woman and riding a scooty through the capital after dark.His… pic.twitter.com/5eVM92jtLp— News Insider 24x7 (@newsinsider24x7) September 19, 2026ఇదీ చదవండి: గణేశ్ మండపం వద్ద కరెంట్ షాక్.. మహిళ, బాలిక మృతి
మోస్ట్ వాంటెడ్.. బ్రిజేష్ గంజూ కథ ముగిసింది!
న్యూఢిల్లీ: బ్రిజేష్ గంజూ.. ఒకప్పుడు గ్రామానికి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్. ఆ తర్వాత నిషేధిత మావోయిస్టు సంస్థ టీఎస్పీసీ (తృతీయ సమ్మేళన్ ప్రెజెంటేషన్ కమిటీ) అగ్రనేతగా ఎదిగాడు. అనంతరం రూ.30 లక్షల రివార్డు ఉన్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా మారి.. చివరకు ఉత్తర్ప్రదేశ్ ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) ఎన్కౌంటర్లో హతమయ్యాడు. జార్ఖండ్లో దాదాపు రెండు దశాబ్దాలుగా మావోయిస్టులకు సమాంతరంగా టీఎస్పీసీ కార్యకలాపాలు సాగించడంలో అతడు కీలకంగా వ్యవహరించాడు.2004లో ప్రత్యేక సంస్థ ఏర్పాటుబ్రిజేష్ సింగ్ గంజూ అలియాస్ గోపాల్ సింగ్ భోక్తా, దులార్చంద్ గంజూ, రంజన్, ఫుల్చంద్ గంజూ తదితర పేర్లతోనూ చలామణి అయ్యాడు. జార్ఖండ్లోని చత్రా జిల్లా లావాలౌంగ్ పోలీస్ స్టేషన్ పరిధి లుట్టూ సోహావన్ గ్రామం అతడి స్వస్థలం. 2004లో నిషేధిత సీపీఐ (మావోయిస్టు)కి వ్యతిరేకంగా సమాంతర సంస్థను ఏర్పాటు చేశాడు. అదే తర్వాత టీఎస్పీసీగా విస్తరించింది.మావోయిస్టులతో సుదీర్ఘ ఆధిపత్య పోరుచత్రాతోపాటు రాంచీ, హజారీబాగ్, రామ్గఢ్, పలామూ, లాతేహార్ జిల్లాలతో పాటు బిహార్లోని కొన్ని ప్రాంతాల్లో టీఎస్పీసీ కార్యకలాపాలు పెరిగాయి. మావోయిస్టులతో ఆధిపత్యం కోసం రెండు దశాబ్దాలపాటు ఘర్షణలు కొనసాగాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మావోయిస్టులతోపాటు పలువురు గ్రామీణులు, ఇతరులు ప్రాణాలు కోల్పోయారు.మావోయిస్టు కార్యకలాపాలతోపాటు ‘ముఖియా’టీఎస్పీసీకి నాయకత్వం వహిస్తున్న సమయంలోనే బ్రిజేష్ గంజూ రాజకీయంగానూ గ్రామస్థాయిలో గుర్తింపు పొందాడు. 2010లో లావాలౌంగ్ పంచాయతీకి ఏకగ్రీవంగా ముఖియాగా ఎన్నికయ్యాడు. అయితే ఆ తర్వాత కూడా అతడి పేరు మావోయిస్టుల జాబితాలో చేరింది. భద్రతా బలగాల నిఘా పెరగడంతో చాలాకాలంగా పరారీలో ఉన్నాడు.రూ.30 లక్షల రివార్డుబ్రిజేష్ గంజూపై జార్ఖండ్ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో రూ.5 లక్షల రివార్డు పెట్టింది. దీంతో అతడిపై మొత్తం రూ.30 లక్షల రివార్డు ఉంది.రామనగర్లో ఎన్కౌంటర్బనారస్లోని రామనగర్ ప్రాంతంలోని టెంగ్రా మోడ్ లంకా మైదానంలో ఆదివారం ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ఝార్ఖండ్ పోలీసులు తెలిపారు. బైక్పై బ్రిజేష్ గంజూ వెళ్తున్న సమాచారంతో యూపీ ఏటీఎస్ అక్కడ మోహరించింది. ఉదయం సుమారు 5 గంటలకు అతడిని అడ్డుకోగా, కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ప్రతిగా ఏటీఎస్ జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు మృతిచెందినట్లు ప్రకటించారు. ఈ ఘటనలో ఏటీఎస్ డీఎస్పీ విపిన్ రాయ్, హవల్దార్ నితేంద్ర కృష్ణ బుల్లెట్ప్రూఫ్ జాకెట్లకు కూడా తూటాలు తగిలాయి. ప్రమాదం నుంచి వారు సురక్షితంగా బయపడ్డారు.ఇదీ చదవండి: నేపాల్ వరదలు.. 40 పిరమిడ్లు కట్టేంత శిథిలాలు
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రొఫెసర్పై కేసు
ముంబై: ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుల వివక్ష, వేధింపులే తన కుమారుడి మరణానికి కారణమని సాహిల్ తండ్రి రవీంద్ర చక్రధర్ వాకోడే ఆరోపిస్తున్నారు.ఇటీవల ఐఐటీ బాంబే నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థి సాహిల్ వాకోడే మొబైల్ ఫోన్ ఉపయోగించి, సమాధానాలు వెతికేందుకు ప్రశ్నాపత్రాన్ని చాట్జీపీటీలో అప్లోడ్ చేసి కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. ఇన్విజిలేటర్కు దొరికిపోవడంతో మనస్తాపం చెంది అతను తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడని ఐఐటీ బాంబే అధికారికంగా ప్రకటించింది.అయితే, తన కుమారుడి మరణానికి కుల వేధింపులే కారణమని బాధిత విద్యార్థి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ బి. కేదారే ఆదేశాల మేరకే ప్రొఫెసర్ సూర్యనారాయణన్ దూళ్ల తనను వేధించారని సాహిల్ తనతో చెప్పినట్లు ఆయన తండ్రి ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.మహారాష్ట్రలోని యవత్మాల్కు చెందిన సాహిల్, 12వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. ఆ తర్వాత ఐఐటీ బాంబేలో ప్రవేశం పొందాడు. కాలేజీ మొదటి సంవత్సరం సజావుగా సాగినప్పటికీ, రెండవ సంవత్సరంలో అతనికి సమస్యలు మొదలయ్యాయి. గత మూడు నెలలుగా సాహిల్ తీవ్రమైన మానసిక వేధింపులకు, కుల దూషణలకు గురయ్యాని వాకోడే ఆరోపించారు.సాహిల్ కాపీ కొడుతూ పట్టుబడిన పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్గా వ్యవహరించిన ప్రొఫెసర్ సూర్యనారాయణన్ దూళ్ల పేరిట ఈ ఫిర్యాదును నమోదు చేశారు. డైరెక్టర్ శిరీష్ బి. కేదారే ఆదేశాల మేరకు ఆయన కులపరమైన దూషణలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాను 'తక్కువ కులానికి' చెందినవాడిని కాబట్టి, తనపై సులభంగా తప్పుడు కేసు బనాయించగలనని ప్రొఫెసర్ దుల్లా బెదిరించినట్లు సాహిల్ తన తండ్రికి తెలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినందుకు ప్రొఫెసర్ దుల్లాను బాధ్యుడిగా పేర్కొంటూ, ఆయనతో పాటు ఇతర ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాకోడే డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఐఐటీ బాంబే ప్రొఫెసర్ సూర్యనారాయణన్ దూళ్లపై ఆత్మహత్యకు ప్రేరేపణ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రొఫెసర్ రాజీనామాకు డిమాండ్మరోవైపు, క్యాంపస్లో ఎలాంటి కుల వివక్ష లేదని ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ బి. కేదారే తీవ్రంగా ఖండించారు. సాహిల్ ఎప్పుడూ ఎస్సీ, ఎస్టీ సెల్కు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కళాశాల వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదంతం నేపథ్యంలో ఐఐటీ బాంబే విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేపట్టి, డైరెక్టర్, సంబంధిత ప్రొఫెసర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.సాహిల్ వాకోడే ఐఐటీలోని ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంఎస్సీ రెండవ సంవత్సరం విద్యార్థి. శుక్రవారం సాయంత్రం ఐఐటీ బాంబే పవాయ్ క్యాంపస్లోని తన హాస్టల్ గదిలో అతను విగతజీవిగా కనిపించాడు.ఐఐటీ బొంబాయి వివరాల ప్రకారం.. సాహిల్ ఆ రోజు అంతకుముందు పరీక్షా హాలులో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ, సమాధానాల కోసం ప్రశ్నపత్రాన్ని చాట్జీపీటీలో అప్లోడ్ చేస్తూ పట్టుబడ్డాడు. అయినప్పటికీ, అతనిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని, బదులుగా అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి, అతని కెరీర్కు ఎలాంటి హాని జరగదని హామీ ఇచ్చామని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: ప్రాణం తీసిన చాట్జీపీటీ : ఐఐటీ బొంబాయి బెదిరింపులు?
అందం కోసం సరికొత్త టెక్నాలజీ.. పూర్వీకుల పద్ధతులు కూడా భలే!
ఏడు కెమెరాలు, ఏడుగురు డైరెక్టర్లతో.. బాబు డ్రామా పీక్స్: కేకే రాజు ఫైర్
షఫాలీ సెంచరీ, బౌలర్ల విజృంభణ.. ఫైనల్స్కు టీమిండియా
ఎగరలేని రామచిలుక కోసం.. యజమాని ఐడియా ఇప్పుడు వైరల్!
అప్పు.. అప్పుతోనే చెల్లు! ఇదే ‘రిచ్ డాడ్’ సీక్రెట్!!
లంచ్ లేదా స్నాక్.. ఈ నాలుగు రెసిపీల్లో ఏది చేసినా టేస్టే!
వినాయక నిమజ్జనంలో దిల్ రాజు సతీమణి మాస్ డ్యాన్స్..వీడియో వైరల్
Uttarakhand: నకిలీ పత్రాలతో ఎంబీబీఎస్ అడ్మిషన్లు?
హడలెత్తిన రైడ్.. వెంటపడ్డ వాహనాలు.. రెండు గంటల భయానక జర్నీ!
రాహుల్ సమక్షంలో మోదీ మిమిక్రీ.. రగిలిపోతున్న బీజేపీ!
రూ.13 కోట్ల కారులో వచ్చిన 26 ఏళ్ల మహిళా ఎమ్మెల్యే
ఏదో రకంగా ఒక కూలర్ పెట్టించండి స్వామీ! మీకు పుణ్యముంటుంది!!
సాక్షి కార్టూన్ 19-09-2026
కత్రినాపై బాడీ షేమింగ్.. పాకిస్తాన్ నటుడు మద్దతు
బట్లర్ ప్రపంచ రికార్డు.. రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం
‘అభిషేక్ ఒక అద్భుతం.. వాళ్ల ఆటతీరు ప్రశంసనీయం’
ఆడమ్ జంపా 'డబుల్ సెంచరీ'.. జింబాబ్వేను చిత్తు చేసిన ఆసీస్
‘ఇరుముడి’.. ఇంకాస్త ఆగితే బాగుండేది!
బిగ్బాస్ తొలి కెప్టెన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ
నేను ఎదుర్కొన్న కఠినమైన భారత బ్యాటర్ అతడే: కమిన్స్
అవన్నీ ‘కొవ్వెక్కిన’ మాటలు! ఇప్పుడు తేలిపోయిందిగా!!
క్లాస్ పీకిన సుప్రీంకోర్టు.. వెనక్కి తగ్గని విజయ్ సర్కార్
డబ్బు సమస్యలు తగ్గాలంటే?: కియోసాకి చెప్పిన సీక్రెట్
ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
పెద్ది, ఇరుముడి కాదు.. ఆస్కార్ బరిలో ఊహించని సినిమా..!
మోదీ టీచర్ వయసు.. ఇదిగో క్లారిటీ!
సంజూను పక్కనపెట్టాను.. వైభవ్ వేచి చూడాల్సిందే: గంభీర్
పుల్లను తీపి చేసే... మిరాకిల్ ఫ్రూట్!
ఈ రాశి వారికి గృహయోగం
అందం కోసం సరికొత్త టెక్నాలజీ.. పూర్వీకుల పద్ధతులు కూడా భలే!
ఏడు కెమెరాలు, ఏడుగురు డైరెక్టర్లతో.. బాబు డ్రామా పీక్స్: కేకే రాజు ఫైర్
షఫాలీ సెంచరీ, బౌలర్ల విజృంభణ.. ఫైనల్స్కు టీమిండియా
ఎగరలేని రామచిలుక కోసం.. యజమాని ఐడియా ఇప్పుడు వైరల్!
అప్పు.. అప్పుతోనే చెల్లు! ఇదే ‘రిచ్ డాడ్’ సీక్రెట్!!
లంచ్ లేదా స్నాక్.. ఈ నాలుగు రెసిపీల్లో ఏది చేసినా టేస్టే!
వినాయక నిమజ్జనంలో దిల్ రాజు సతీమణి మాస్ డ్యాన్స్..వీడియో వైరల్
Uttarakhand: నకిలీ పత్రాలతో ఎంబీబీఎస్ అడ్మిషన్లు?
హడలెత్తిన రైడ్.. వెంటపడ్డ వాహనాలు.. రెండు గంటల భయానక జర్నీ!
రాహుల్ సమక్షంలో మోదీ మిమిక్రీ.. రగిలిపోతున్న బీజేపీ!
రూ.13 కోట్ల కారులో వచ్చిన 26 ఏళ్ల మహిళా ఎమ్మెల్యే
ఏదో రకంగా ఒక కూలర్ పెట్టించండి స్వామీ! మీకు పుణ్యముంటుంది!!
సాక్షి కార్టూన్ 19-09-2026
కత్రినాపై బాడీ షేమింగ్.. పాకిస్తాన్ నటుడు మద్దతు
బట్లర్ ప్రపంచ రికార్డు.. రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం
‘అభిషేక్ ఒక అద్భుతం.. వాళ్ల ఆటతీరు ప్రశంసనీయం’
ఆడమ్ జంపా 'డబుల్ సెంచరీ'.. జింబాబ్వేను చిత్తు చేసిన ఆసీస్
‘ఇరుముడి’.. ఇంకాస్త ఆగితే బాగుండేది!
బిగ్బాస్ తొలి కెప్టెన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ
నేను ఎదుర్కొన్న కఠినమైన భారత బ్యాటర్ అతడే: కమిన్స్
అవన్నీ ‘కొవ్వెక్కిన’ మాటలు! ఇప్పుడు తేలిపోయిందిగా!!
క్లాస్ పీకిన సుప్రీంకోర్టు.. వెనక్కి తగ్గని విజయ్ సర్కార్
డబ్బు సమస్యలు తగ్గాలంటే?: కియోసాకి చెప్పిన సీక్రెట్
ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
పెద్ది, ఇరుముడి కాదు.. ఆస్కార్ బరిలో ఊహించని సినిమా..!
మోదీ టీచర్ వయసు.. ఇదిగో క్లారిటీ!
సంజూను పక్కనపెట్టాను.. వైభవ్ వేచి చూడాల్సిందే: గంభీర్
పుల్లను తీపి చేసే... మిరాకిల్ ఫ్రూట్!
ఈ రాశి వారికి గృహయోగం
ఫొటోలు
గణేశుడి సన్నిధిలో విజయ్ దేవరకొండ..(ఫోటోలు)
అందాల అషు.. (ఫోటోలు)
కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)
ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)
గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు
అమ్మతో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ఫారిన్ ట్రిప్.. (ఫోటోలు)
టాలీవుడ్ను ఊపేస్తున్న మలయాళ బ్యూటీ లేటెస్ట్ (ఫోటోలు)
బ్లాక్ డ్రెస్లో మరింత బ్యూటిఫుల్గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)
నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)
తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)
సినిమా
పాండా అంటూ ట్రోలింగ్.. వినాయకుడు ఎలిమినేట్..?
బిగ్బాస్ సీజన్ 10లో ఎలిమినేషన్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే చైత్ర హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. ఇప్పుడు తదుపరి ఎలిమినేషన్పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి కృష్ణుడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో చైత్ర తర్వాత కృష్ణుడే బయటకు వెళ్తాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కృష్ణుడి ఆటపై అసంతృప్తి..నిన్నటి ఎపిసోడ్లో బిగ్బాస్ కృష్ణుడు, సృష్టిల ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత వీకెండ్లో వారు ఎలా ఆడారో ప్రేక్షకుల్లా కూర్చొని చూడాలని చెబుతూ ఇద్దరినీ స్టోర్ రూంలో కూర్చోబెట్టాడు. దీంతో పాటు ప్రేక్షకులు సైతం కృష్ణుడుని అన్ సేఫ్లోనే ఉంచారు. దీంతో కృష్ణుడి ఆటతీరుపై బిగ్బాస్ కూడా ఫోకస్ పెట్టాడనే చర్చ మొదలైంది.నెటిజన్లు మీమ్ వీడియోలు..మరోవైపు హౌస్లో కృష్ణుడి ఆట కూడా పెద్దగా హైలైట్ కావడం లేదనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో దేబ్జానీ.. కృష్ణుడిని పాండాతో పోలుస్తూ చేసిన కామెంట్ కూడా వైరల్గా మారింది. ఆ మాటను ఆధారంగా చేసుకుని నెటిజన్లు మీమ్ వీడియోలు రూపొందిస్తున్నారు. దీంతో కృష్ణుడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా కనిపిస్తోంది.వినాయకుడి నిమార్జనానికి వేళైంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.గతంలో చైత్ర విషయంలోనూ..గతంలో చైత్ర విషయంలోనూ ఇలాంటి చర్చే మొదలై.. చివరకు ఆమె ఎలిమినేట్ అయింది. ఇప్పుడు అదే తరహాలో కృష్ణుడి పేరు వినిపిస్తుండటంతో ఈసారి ఏం జరుగుతుందన్న ఆసక్తి పెరిగింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చ నిజమైన ఎలిమినేషన్ ఫలితమా? లేక కేవలం ప్రేక్షకుల అంచనా మాత్రమేనా? అనేది తెలియాలంటే ఎలిమినేషన్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.(ఇదీ చదవండి: ఒకేసారి రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్.. డోంట్ మిస్)#Debjani ee #Krishnudu konchem #Panda laaga unnadu 🤣🤣🤣#BiggBossTelugu10 pic.twitter.com/gOlYGi5I9n— Naresh Bandari (@BiggBossAddict) September 10, 2026
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్.. డోంట్ మిస్
ఓటీటీ ప్రియులకు మరో హారర్ థ్రిల్లర్ సిద్ధమైంది. ‘జబర్దస్త్’ షోతో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన ‘అదిరే అభి’ తెరకెక్కించిన మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ ‘కర్మాఖ్య’. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్గా స్ట్రీమింగ్ ప్రారంభమైంది.జులై 31న థియేటర్లలో విడుదలై..జులై 31న థియేటర్లలో విడుదలైన ‘కర్మాఖ్య’ మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు నిన్న (శనివారం) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్స్టార్లో తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో చూడొచ్చు.‘కర్మాఖ్య’కు అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వం వహించారు. సమైరా, సముద్రఖని, ఆనంద్, అభిరామి, శరణ్య ప్రదీప్, మధునందన్, ధనరాజ్, గడ్డం నవీన్, వైష్ణవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మై ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వడ్డేపల్లి వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్, మిస్టరీ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులు ఇప్పుడు ‘కర్మాఖ్య’ను ఇంట్లోనే చూసేయొచ్చు.ఇదీ చదవండి: బన్నీ ‘రాకా’.. ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే..
సమవర్తి మా టీమ్కి ఓ సాహసం: సత్యదేవ్
‘‘నేను ఇప్పటిదాకా ఎవర్నీ చాన్స్ ఇవ్వమని అడగలేదు. అందుకు నా మొహమాటమే కారణం. అయితే మోహమాటాన్ని వదలిపెట్టి నాతో సినిమా చేయమని నేను అడిగిన తొలి వ్యక్తి దర్శకుడు అజయ్’’ అని సత్యదేవ్ అన్నారు. సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘సమవర్తి’. గానవి లక్ష్మణ్ హీరోయిన్గా నటించారు. అజయ్ నాగ్. వి దర్శకత్వంలో శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘నేను డ్రీమ్గా భావించిన షాట్స్, సీన్స్ను నాతో అజయ్ చేయించాడు. దక్షిణ భారతదేశంలో ఎన్ని అడవులున్నాయో అన్నింట్లో మేం షూటింగ్ చేశాం. మాకు ఇదొక గ్రేట్ అడ్వెంచర్ అనిపించింది. థియేటర్స్లో మీకూ అదే ఫీల్ కలిగిస్తుంది’’ అన్నారు.‘‘ఈ చిత్రంలో స్పెషల్ క్యారెక్టర్ చేశాను’’ అని తెలిపారు శ్రీకాంత్. ‘‘నా ఆరంభం’ సినిమా తర్వాత సత్యదేవ్ అన్న పిలిచి మరీ ‘సమవర్తి’కి చాన్స్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. షూటింగ్లో గాయపడ్డారు కూడా. శ్రీకాంత్గారు చేసిన క్యారెక్టర్తోనే సినిమా ్రపారంభం అవుతుంది’’ అని చెప్పారు అజయ్ నాగ్ .వి.‘‘తెలుగు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మార్చే చిత్రం ఇది’’ అన్నారు శశిధర్. ‘‘ఈ టీమ్లోని ప్రతి ఒక్కరి కెరీర్లో గుర్తుండిపోయే విజయం లభిస్తుంది’’ అని తెలిపారు శివచరణ్ రెడ్డి.
ప్రచారంలో ఉన్నట్లు రీషూట్స్ చేయలేదు: దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
‘‘నేను అనుకున్న షాట్ వచ్చేంతవరకు వందసార్లైనా తీస్తాను. ఈ విషయంలో మా ప్యారడైజ్’ టీమ్ను ఇబ్బంది పెట్టాను (నవ్వుతూ). కానీ ఒకసారి ఓకే అయిన తర్వాత రీషూట్ జోలికి వెళ్లను’’ అని శ్రీకాంత్ ఓదెల చెప్పారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ ఓదెల చెప్పిన సంగతులు.. ⇒ ‘దసరా’తో నాకు దర్శకుడిగా జీవితం ఇచ్చిన వ్యక్తి నానీగారు. ఆ సినిమా రిలీజ్కు ముందే రిజల్ట్తో సంబంధం లేకుండా మరో మూవీ చేద్దామని నానీగారు అన్నారు. ‘ది ప్యారడైజ్’లో జడల్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. నానీగారికి జడలు వేద్దామని నా టీమ్తో అంటే వద్దన్నారు. కానీ కథని, క్యారెక్టర్ని నమ్మి నానీగారు ఒప్పుకున్నారు. మోహన్బాబుగారు ఇందులో మెయిన్ విలన్. ఆయన, నానిమధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. ⇒ ‘ది ప్యారడైజ్’ని 171 రోజులు షూట్ చేశాం. నేను అనుకున్నట్లు సినిమా తీయడానికి, టార్గెట్ రీచ్ కావడానికి కాస్త ఆలస్యమైంది. దీంతో యూనిట్ అందరి కాల్షీట్స్ మళ్లీ సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అంతేకానీ ప్రచారంలో ఉన్నట్లు రీ షూట్స్ చేయలేదు. బౌండ్ స్క్రిప్ట్లో మార్పులు చేయలేదు. షూటింగ్ ప్లాన్ బాగానే ఉన్నా, ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యానేమో అనిపించింది. నెక్ట్స్ టైమ్ ఇచ్చిన మాటపై నిలబడాలనుకుంటున్నాను.. అంటే చెప్పిన టైమ్కి సినిమాను రిలీజ్ చేయడం, అనుకున్న టైమ్లో షూట్ పూర్తి చేయడం వంటివి. ⇒ ‘ది ప్యారడైజ్’లో బిట్ సాంగ్స్తో కలిపి ఆరు పాటలున్నాయి. నా చిన్నప్పుడు ఆటోలో వెళ్తున్నప్పుడు ‘ఏషనాగుల..’ పాట వినేవాడిని. ‘దసరా’ చిత్రానికే ఈ పాట పెడదామనుకున్నా. ‘ది ప్యారడైజ్’కు కుదిరింది. ⇒ నా దర్శకత్వంలో ఓ లవ్స్టోరీ చేయాలని ఉంది. అలాగే చిరంజీవిగారితో సినిమా కచ్చితంగా ఉంటుంది. ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత మా ఫ్యామిలీతో టైమ్ గడపాలి. ఆ తర్వాత నా నెక్ట్స్ మూవీ గురించి చెబుతాను.
క్రీడలు
Asian Games 2026: షూటింగ్ 'సిల్వర్'తో ఖాతా తెరిచిన భారత్
జపాన్లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్లో భారత్ పతకాల వేట ప్రారంభమైంది. క్రీడల తొలి రోజే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఎలావెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్సా వినోద్ రజత పతకం సాధించారు. ఈ ఈవెంట్లో చైనా స్వర్ణం సాధించగా.. ఆతిథ్య జపాన్ కాంస్యంతో సరిపెట్టుకుంది.మరో పతకం ఖాయంమహిళల ట్రెడిషనల్ MMA (మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్) 60 కేజీల విభాగంలో సుచికా తరియాల్ సెమీఫైనల్కు చేరుకోవడంతో భారత్కు మరో పతకం ఖాయమైంది.హాకీ జట్టుకూ అదిరిపోయే ఆరంభంభారత మహిళల హాకీ జట్టుకు అదిరిపోయే అరంభం లభించింది. ఉజ్బెకిస్తాన్పై టీమిండియా 19-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. దీపిక 9 గోల్స్తో చెలరేగగా.. ఇషిక హ్యాట్రిక్ సాధించింది.టేబుల్ టెన్నిస్లోనూ ఘనంగా బోణీమహిళల టేబుల్ టెన్నిస్ ఈవెంట్లోనూ భారత్ ఘనంగా బోణీ కొట్టింది. ఆకుల శ్రీజ, సుతిర్థ ముఖర్జీ, సిండ్రెల దాస్ జోడీ ఇండోనేషియా జోడీపై 3-0తో విజయం సాధించింది.నేడు భారత్ కీలక ఈవెంట్లుమహిళల క్రికెట్: బంగ్లాదేశ్తో సెమీఫైనల్పురుషుల హాకీ: ఇండోనేషియాతో తొలి మ్యాచ్షూటింగ్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్బ్యాడ్మింటన్: కజకిస్థాన్తో మహిళల టీమ్ మ్యాచ్వుషు: భారత్ ఆటగాళ్లకు నాకౌట్ పోటీలుఇదీ చదవండి: మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు
Asian Games Cricket: ఫైనల్స్కు దూసుకెళ్లిన శ్రీలంక
ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన తొలి సెమీస్లో పాకిస్తాన్ను 8 వికెట్ల తేడాతో చిత్త చేసి, తుది బెర్త్ దక్కించుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అయేషా జాఫర్ (71), షవాల్ జుల్ఫికర్ (54) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మిగతా ప్లేయర్లలో గుల్ ఫెరోజా డకౌట్ కాగా.. సైరా జబీన్ 17, కెప్టెన్ ఫాతిమా సనా 20 (నాటౌట్), ఎయ్మాన్ ఫాతిమా 5 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో కావ్యా కవిండి, కెప్టెన్ చమారీ ఆటపట్టు, సుగంధిక కుమారి తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు రెచ్చిపోయారు. చమారీ ఆటపట్టు (50 బంతుల్లో 83 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆమెకు హాసిని పెరీరా (42), ఇమేషా దులానీ (27), హర్షిత సమరవిక్రమ (20 నాటౌట్) సహకరించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, నష్రా సంధుకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో ఓడినా, పాక్ జట్టు బ్రాంజ్ మెడల్ మ్యాచ్కు అర్హత సాధించింది. ఇవాళే భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో ఓడిన జట్టుతో పాక్ సెప్టెంబర్ 22న బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఆడుతుంది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ విజేత సెప్టెంబర్ 22నే జరిగే ఫైనల్లో శ్రీలంకను ఢీకొంటుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు స్వర్ణ పతకం సాధిస్తుంది. ఓడిన జట్టు రజతంతో సరిపెట్టుకుంటుంది. ఇదీ చదవండి: మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు
మ్యాక్స్వెల్ ఆల్రౌండ్ షో
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) 2026లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బెల్ఫాస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతడు, ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీస్తున్నాడు. తాజాగా అమ్స్టర్డామ్ ఫ్లేమ్స్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి, తన జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు.ఈ మ్యాచ్లో తొలుత బంతితో అదరగొట్టిన అతడు.. ఆతర్వాత బ్యాటింగ్లోనూ చెలరేగిపోయాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అమ్స్టర్డామ్ను మ్యాక్స్వెల్ తన స్పిన్ మాయాజాలంతో (4-0-18-4) 133 పరుగులకే కుప్పకూల్చాడు. అతడికి మాథ్యూ హంఫ్రేస్ (4-0-22-3) సహకరించాడు. అమ్స్టర్డామ్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (45) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బెల్ఫాస్ట్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖర్లో మ్యాక్స్వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి లోర్కన్ టక్కర్ (34 నాటౌట్), డెవాన్ కాన్వే (35) సహకరించారు. ఇవాళ జరిగే తుదిపోరులో బెల్ఫాస్ట్ వోల్వ్స్.. ఎడిన్బర్గ్ క్యాజిల్ రాకర్స్తో తలపడనుంది. ఇదీ చదవండి: టీమిండియాతో సిరీస్కు వెస్టిండీస్ జట్ల ప్రకటన
టీమిండియాతో సిరీస్కు వెస్టిండీస్ జట్ల ప్రకటన
త్వరలో భారత్తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ల కోసం వెస్టిండీస్ క్రికెట్ జట్లను నిన్న ప్రకటించారు. రెండు జట్లకు కెప్టెన్గా షాయ్ హోప్ను ఎంపిక చేశారు.విధ్వంసకర బ్యాటర్ షిమ్రోన్ హెట్మైర్ వన్డేలకు దూరం కాగా.. టీ20 జట్టుకు అందుబాటులో ఉన్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026 తర్వాత రిఫ్రెష్ అయ్యేందుకు అతడికి విశ్రాంతి ఇచ్చారు. దీంతో నేరుగా టీ20 సిరీస్లో జట్టుతో చేరతాడు.మరోవైపు, ఆగస్టులో శస్త్రచికిత్స చేయించుకున్న అకీమ్ అగస్టే ఇంకా పునరావాస చికిత్స పొందుతున్నాడు. దీంతో అతడికి వన్డే జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో టాప్, మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయగల జువెల్ ఆండ్రూను ఎంపిక చేశారు. ఇవి మినహా జట్టులో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.వెస్టిండీస్ జట్టు సెప్టెంబర్ 27 నుంచి భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత మూడు వన్డేలు, ఆతర్వాత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. తొలి వన్డే తిరువనంతపురం వేదికగా సెప్టెంబర్ 27న జరుగనుండగా.. రెండో వన్డే సెప్టెంబర్ 30న గువాహటిలో, మూడో వన్డే అక్టోబర్ 3న న్యూ చండీగఢ్లో జరగనున్నాయి.భారత్తో వన్డే సిరీస్కు వెస్టిండీస్ జట్టుషాయ్ హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, జాన్ క్యాంప్బెల్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, విటెల్ లాస్, గుడాకేశ్ మోటీ, కీమో పాల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, జేడెన్ సీల్స్.అక్టోబర్ 6 నుంచి టీ20 సిరీస్వన్డే సిరీస్ అనంతరం అక్టోబర్ 6 నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టుకు కూడా షాయ్ హోప్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో యువ ఓపెనర్ కమిల్ పూరన్కు చోటు దక్కింది. CPL 2026లో పూరన్ అద్భుతంగా (8 ఇన్నింగ్స్ల్లో 159.64 స్ట్రైక్రేట్తో 273 పరుగులు) రాణించాడు. ఈ ప్రదర్శనతో అతడికి జాతీయ జట్టులో తొలిసారి అవకాశం లభించింది.2026 టీ20 ప్రపంచకప్లో ఆడిన క్వెంటిన్ సాంప్సన్కు కూడా జట్టులో చోటు కల్పించారు. మరోవైపు, స్టార్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్కు విశ్రాంతి ఇచ్చారు.భారత్తో టీ20 సిరీస్కు వెస్టిండీస్ జట్టుషాయ్ హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రోన్ హెట్మయర్, అకీల్ హొసేన్, షమర్ జోసెఫ్, గుడాకేశ్ మోటీ, కీమో పాల్, కమిల్ పూరన్, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, రొమారియో షెఫర్డ్, షమర్ స్ప్రింగర్.కాగా, 2022 తర్వాత వెస్టిండీస్ జట్టు తొలిసారి ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత్లో పర్యటించనుంది. ఈ జట్టు టీమిండియాతో ఆడిన గత ఐదు వన్డేల్లోనూ ఓటమి చవిచూసింది. చివరిసారిగా 2019లో భారత్పై వన్డే విజయం సాధించింది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్లో పదో స్థానంలో ఉన్న విండీస్.. 2027 వన్డే ప్రపంచకప్ అర్హత టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు ఈ సిరీస్ను ఉపయోగించుకోనుంది.టీ20 సిరీస్ విషయానికొస్తే.. 2023లో భారత్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను వెస్టిండీస్ 3-2తో గెలుచుకుంది. మూడు సంవత్సరాల తర్వాత విండీస్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్కు ఈ సిరీస్ ద్వారా అవకాశం లభించనుంది. ఇదీ చదవండి: మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు
న్యూస్ పాడ్కాస్ట్
మద్యం అక్రమ కేసులో కొత్త నాటకం... సత్యప్రసాద్ చేత విజయవాడ ఏసీబీ కోర్టు ముందు తప్పుడు వాంగ్మూలం
తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేసిన హైకోర్టు... ఆయన పార్టీ ఫిరాయించినట్లు నిర్ధారణ
ఏపీలో ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్... సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఏపీలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో ‘పోలీసింగ్’... మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
డీఎస్సీ అక్రమాలపై పోరాటం ఉధృతం.. 21న భారీ నిరసనకు YSRCP పిలుపు..
డీఎస్సీ స్కాంకు బాధ్యత వహిస్తారా? లేదా?... చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
ఇదేనా నిష్పాక్షిక, పారదర్శక నియామకం... మెగా డీఎస్సీ వ్యవహారంపై చంద్రబాబు బాధ్యత వహించాలి... వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
ప్రపంచ పరిపాలనకు రూల్స్ మనమే రూపొందించాలి.... బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
బిజినెస్
వచ్చేవారం.. బ్యాంక్ హాలిడేస్ ఇవే!
బ్యాంకులకు సెలవులు ఎప్పటికప్పుడు.. రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. సాధారణంగా రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో పాటు జాతీయ, రాష్ట్ర పండుగలు, ఇతర ప్రాంతీయ పండుగల రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. అందుకే బ్యాంకు బ్రాంచ్లో ఏదైనా పని ఉంటే.. సెలవుల జాబితాను ముందుగానే తెలుసుకోవడం మంచిది.సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు వచ్చే వారం కూడా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం ఏ రోజుల్లో, ఏయే ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయో చూద్దాం.సెప్టెంబర్ 21 - సోమవారం: శ్రీమంత శంకరదేవ, శ్రీ నారాయణ గురు సమాధి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 21న గౌహతి, కొచ్చి, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు.సెప్టెంబర్ 22 - మంగళవారం: కర్మ పూజ సందర్భంగా సెప్టెంబర్ 22న రాంచీలోని బ్యాంకు శాఖలకు సెలవు ఉంటుంది.సెప్టెంబర్ 23 - బుధవారం: మహారాజా హరి సింగ్ జీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 23న జమ్మూ, శ్రీనగర్లో బ్యాంకులు మూసి ఉంటాయి.సెప్టెంబర్ 25 - శుక్రవారం: ఇంద్రజాతర సందర్భంగా సెప్టెంబర్ 25న గాంగ్టక్లోని బ్యాంకు శాఖలు పనిచేయవు.సెప్టెంబర్ 26 - శనివారం: సెప్టెంబర్ 26 నాలుగో శనివారం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలకు సెలవు ఉంటుంది.సెప్టెంబర్ 27 - ఆదివారం: సెప్టెంబర్ 27 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.అందుబాటులో బ్యాంకింగ్ సేవలుబ్యాంకు సెలవు ఉన్నప్పటికీ.. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చాలా లావాదేవీలు చేసుకోవచ్చు. యూపీఐ చెల్లింపులు కూడా కొనసాగుతాయి. అవసరమైతే ఏటీఎం ద్వారా నగదు తీసుకోవచ్చు. అయితే.. బ్యాంకు బ్రాంచ్కు నేరుగా వెళ్లి చేయాల్సిన పనులు మాత్రం సెలవు రోజుల్లో జరగవు. చెక్కుల క్లియరెన్స్, బ్రాంచ్లో చేయాల్సిన కొన్ని లావాదేవీలు వాయిదా పడవచ్చు.కాబట్టి బ్యాంకు బ్రాంచ్లో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే.. సెలవు రోజులను ముందుగానే చూసుకుని మీ పనిని ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే మీ ప్రాంతంలోని బ్రాంచ్కు సెలవు వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని బ్యాంకు అధికారిక మార్గాల ద్వారా ఒకసారి నిర్ధారించుకోవచ్చు.ఇదీ చదవండి: డబ్బు సమస్యలు తగ్గాలంటే?: కియోసాకి చెప్పిన సీక్రెట్
డబ్బు సమస్యలు తగ్గాలంటే?: కియోసాకి చెప్పిన సీక్రెట్
పెట్టుబడుల గురించి చెప్పే రాబర్ట్ కియోసాకి.. డబ్బు వల్ల వచ్చే సమస్యల గురించి వివరించారు. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.1973లో రిచ్ డాడ్ ఒక ప్రశ్న అడిగారని, దాన్ని తాను ఇప్పటికీ మర్చిపోలేదని చెబుతూ.. 'డబ్బుకు సంబంధించిన సమస్యలు రెండు రకాలు మాత్రమే ఉంటాయి' అని అన్నారు. ఒకటి 'డబ్బు సరిపోకపోవడం', మరొకటి 'డబ్బు మరీ ఎక్కువగా ఉండటం'. నేను రెండింటినీ చూస్తూ పెరిగానని కియోసాకి పేర్కొన్నారు.పూర్ డాడ్ ఎప్పుడూ సరిపడా డబ్బు లేదనే బాధతో ఉండేవారు. రిచ్ డాడ్ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం.చాలామంది జీవితంలో డబ్బు సరిపోకపోవడమే పెద్ద సమస్యగా ఉంటుంది. నెలవారీ ఖర్చులు, అప్పులు, పిల్లల చదువు, వైద్యం, ఇంటి అవసరాలు.. ఇలా ఎన్నో ఖర్చుల మధ్య సంపాదించిన డబ్బు సరిపోదని బాధపడుతుంటారు. కానీ మరోవైపు డబ్బు ఎక్కువగా ఉన్నవారికి దాన్ని ఎలా నిర్వహించాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా మరింత పెంచుకోవాలి అనే సమస్యలు ఉంటాయి. అంటే సమస్య ఇద్దరికీ ఉంది. కానీ సమస్య స్వభావం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.మన ఆలోచనలే ఆర్థిక ప్రపంచం!అయితే కియోసాకి మాత్రమే.. మన ఆలోచనలే మన ఆర్థిక ప్రపంచాన్ని నిర్మిస్తాయని అంటారు. అంటే మనం డబ్బును ఎలా చూస్తామో, దాని ఆధారంగానే మన నిర్ణయాలు మారుతాయి. ఎప్పుడూ నా దగ్గర డబ్బు లేదు, నాకు ఇది సాధ్యం కాదు, నా సంపాదనతో ఇవన్నీ చేయలేను అని ఆలోచించే వ్యక్తి అవకాశాల కంటే సమస్యలనే ఎక్కువగా చూస్తాడు. డబ్బు కొరతే తన జీవితంలో సహజమైన పరిస్థితి అని భావిస్తాడు.అదే వ్యక్తి.. నేను దీన్ని ఎలా సాధించగలను?, ఇంకా ఎక్కువ సంపాదించడానికి ఏం చేయాలి?, నా డబ్బును ఎలా పెంచుకోవాలి? అని ఆలోచించడం ప్రారంభిస్తే.. అతని దృష్టి సమస్య నుంచి పరిష్కారం వైపు మళ్లుతుంది. నాకు సాధ్యం కాదు అనే ఆలోచనకు బదులు ‘ఎలా సాధ్యం?’ అని ఆలోచిస్తే.. సమస్యలు తగ్గుతాయంటారు కియోసాకి.పోటీ ప్రపంచం..మన చుట్టూ ఉన్న ప్రపంచంలో పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. మంచి ఉద్యోగం కోసం పోటీ, ప్రమోషన్ కోసం పోటీ, మంచి మార్కుల కోసం పోటీ.. ఇలా ప్రతి దశలోనూ ఇతరులతో పోల్చుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఆలోచన మారాలి. అంటే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇతరులు పొందితే మనకు దక్కదని భావించకూడదు. ఒక అవకాశం దక్కకపోతే మరో అవకాశం ఉంటుందని, కొత్త మార్గాలను సృష్టించుకోవచ్చని ఆలోచించాలి.నిజమైన సంపదనిజమైన సంపద అనేది కేవలం బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుతోనే నిర్ణయించబడదు. మనకు వచ్చే ఆదాయాన్ని ఎలా నిర్వహిస్తున్నాం? ఎంత పొదుపు చేస్తున్నాం? ఎలా పెట్టుబడి పెడుతున్నాం? కొత్త ఆదాయ మార్గాలను ఎలా సృష్టించుకుంటున్నాం? వంటి అంశాలు కూడా ముఖ్యమే. అందుకే ఈ మొత్తం ఆలోచనలో ప్రధాన సందేశం.. బయటి ఆర్థిక పరిస్థితులను మార్చాలంటే ముందుగా డబ్బుపై మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. అయితే కేవలం సానుకూలంగా ఆలోచించడం వల్లే సంపద ఏర్పడదు. ఆలోచనతో పాటు ఆర్థిక జ్ఞానం, క్రమశిక్షణ, పొదుపు, సరైన పెట్టుబడులు, రిస్క్ను అర్థం చేసుకోవడం, నైపుణ్యాల అభివృద్ధి కూడా అవసరం.
హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ విషయాలు తెలుసుకోకపోతే జేబుకు చిల్లే!
ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరంగా మారింది. అనారోగ్య సమస్యలు, ఆసుపత్రి ఖర్చులు ఎప్పుడు ఎదురవుతాయో చెప్పలేని పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ఆర్థికంగా కొంత భరోసా ఇస్తుంది. అయితే పాలసీ తీసుకునే సమయంలో కేవలం ప్రీమియం ఎంత? అనే విషయాన్ని మాత్రమే కాకుండా.. పాలసీలో ఉన్న కొన్ని ముఖ్యమైన నిబంధనలను కూడా పరిశీలించాలి. నిపుణుల సూచనల ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవే..కో-పేమెంట్ ఉందా? లేదా?హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు కో-పేమెంట్ నిబంధన ఉందా లేదా అనేది తప్పకుండా చెక్ చేయాలి. కొన్ని పాలసీల్లో చికిత్స ఖర్చులో 10 శాతం, 15 శాతం లేదా నిర్ణయించిన కొంత మొత్తాన్ని పాలసీదారుడే చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే కో-పేమెంట్ అంటారు. కొన్ని బీమా సంస్థలు జీరో కో-పేమెంట్ ఆప్షన్ను కూడా అందిస్తున్నాయి. కాబట్టి పాలసీ తీసుకునే ముందు ఈ నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం.రూమ్ రెంట్పై పరిమితి ఉందా?పాలసీలో రూమ్ రెంట్ క్యాపింగ్ ఉందా లేదా అనేది కూడా పరిశీలించాలి. కొన్ని పాలసీల్లో రోజువారీ గది అద్దెకు పరిమితి ఉంటుంది. ఉదాహరణకు పాలసీలో రోజుకు రూ.5,000 వరకు మాత్రమే రూమ్ రెంట్ కవర్ చేస్తే.. అంతకంటే ఎక్కువ ఖర్చయ్యే గదిని ఎంచుకున్నప్పుడు అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది. అందుకే వీలైతే నో రూమ్ రెంట్ క్యాపింగ్ ఉన్న పాలసీని పరిశీలించడం ఉపయోగకరంగా ఉంటుంది.మోడ్రన్ ట్రీట్మెంట్స్ కవరేజ్వైద్య రంగంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. రోబోటిక్ సర్జరీలు, ఆధునిక చికిత్సా విధానాలు వంటి వాటి వినియోగం కూడా పెరుగుతోంది. అందువల్ల పాలసీలో మోడ్రన్ ట్రీట్మెంట్స్కు కవరేజ్ ఉందా లేదా అనేది ముందుగానే తెలుసుకోవాలి. పాలసీలో ఈ కవరేజ్ లేకపోతే.. ఆధునిక చికిత్సలు చేయించుకున్న సమయంలో వాటి ఖర్చులో కొంత భాగాన్ని మనమే భరించాల్సి రావచ్చు.వెయిటింగ్ పీరియడ్ ఎంత?పాలసీ తీసుకునే ముందు వెయిటింగ్ పీరియడ్ను కూడా తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా ముందుగా ఉన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ నిబంధన చాలా ముఖ్యమైనది.కొన్ని పాలసీల్లో నిర్దిష్ట వ్యాధులకు కవరేజ్ లభించడానికి కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి వివిధ పాలసీల వెయిటింగ్ పీరియడ్ను పోల్చి చూసి, నిబంధనలు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి.ఏ ఆసుపత్రుల్లో కవరేజ్ ఉంది?మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏయే ఆసుపత్రుల్లో క్యాష్లెస్ చికిత్సకు అవకాశం కల్పిస్తుందో కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ ఇంటికి సమీపంలో ఉన్న ప్రముఖ ఆసుపత్రులు పాలసీ నెట్వర్క్లో ఉన్నాయా లేదా అనేది ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది.క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోబీమా సంస్థను ఎంచుకునే సమయంలో క్లెయిమ్ సెటిల్మెంట్కు సంబంధించిన వివరాలను కూడా పరిశీలించాలి. అంటే పాలసీదారులు చేసిన క్లెయిమ్లలో ఎంత శాతం పరిష్కరించారో తెలుసుకోవాలి.అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఒక్కటే ఆధారంగా కంపెనీని ఎంచుకోకుండా.. పాలసీ నిబంధనలు, కవరేజ్, మినహాయింపులు, క్లెయిమ్ ప్రక్రియ వంటి ఇతర అంశాలను కూడా పరిశీలించడం అవసరం.కంపెనీపై ఫిర్యాదులుపాలసీ తీసుకునే ముందు సంబంధిత బీమా సంస్థపై వచ్చిన ఫిర్యాదులు, కస్టమర్ల అనుభవాలు, క్లెయిమ్లకు సంబంధించిన సమస్యలు వంటి అంశాలను కూడా తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా క్లెయిమ్ సమయంలో కంపెనీ సేవలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి.ఏజెంట్ ద్వారా తీసుకోవాలా?హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని నేరుగా ఆన్లైన్లో తీసుకోవడం లేదా ఏజెంట్ ద్వారా తీసుకోవడం అనేది వ్యక్తిగత నిర్ణయం. అయితే.. ఏ మార్గంలో తీసుకున్నా పాలసీ డాక్యుమెంట్లోని నిబంధనలు, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్, కవరేజ్ వంటి వివరాలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి.ఏజెంట్ ద్వారా పాలసీ తీసుకుంటే.. భవిష్యత్తులో పాలసీకి సంబంధించిన సందేహాలు లేదా క్లెయిమ్ ప్రక్రియలో సహాయం అవసరమైనప్పుడు సంప్రదించడానికి ఒక వ్యక్తి ఉండే అవకాశం ఉంటుంది.Health insurance తీసుకునే ముందు తెలుసుకోండి ఇవి, Dr.GuttaLokesh గారి మాటల్లో 👌@HiHyderabad @ApnaSecbad pic.twitter.com/k6hycFF3Jo— Savoir Vivre (@InterferonEi) September 18, 2026
తెలుగు ప్రజల పెట్టుబడులు.. రూ.2.95 లక్షల కోట్లు!
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు పెట్టుబడులపై అవగాహన బాగా పెరుగుతోంది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, సిప్ల వైపు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తాజాగా విడుదలైన అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా గణాంకాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కలిపి దాదాపు రూ.2.95 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్ ఆస్తులను కలిగి ఉన్నాయి.మ్యూచువల్ ఫండ్స్జూలై 2026 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల విలువ రూ.2.12 లక్షల కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం జూలైతో పోలిస్తే ఇది దాదాపు 19 శాతం ఎక్కువ. దీంతో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ రాష్ట్రం 8వ స్థానంలో ఉంది. తెలంగాణలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంది. రాష్ట్రంలోని మొత్తం మ్యూచువల్ ఫండ్ ఆస్తుల్లో దాదాపు 87 శాతం హైదరాబాద్ నుంచే వస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్లో కూడా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. జూలై 2026 నాటికి రాష్ట్రంలో మ్యూచువల్ ఫండ్ AUM రూ.82,409 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 23 శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. విశాఖపట్నంలో సుమారు రూ.16,614 కోట్ల AUM ఉండగా, విజయవాడలో రూ.8,337 కోట్ల AUM ఉంది. దీన్నిబట్టి చూస్తే.. పెట్టుబడుల సంస్కృతి ఒక్క నగరానికే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తోందని తెలుస్తోంది.SIPకు పెరిగిన ఆదరణరెండు రాష్ట్రాల్లోనూ సిప్లకు కూడా ఆదరణ పెరుగుతోంది. సిప్ అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టకుండా, ప్రతి నెలా మనకు సాధ్యమైనంత మొత్తాన్ని క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి చేయడం. తెలంగాణలో సిప్ల ద్వారా సుమారు రూ.47,975 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ మొత్తం రూ.26,820 కోట్లు అని తెలుస్తోంది. అంటే ప్రజలు మార్కెట్ పరిస్థితులను ప్రతిరోజూ గమనించి పెట్టుబడులు పెట్టడం కంటే, క్రమంగా.. దీర్ఘకాలికంగా పెట్టుబడి చేయడానికి ఆసక్తి చూపుతున్నారని స్పష్టమవుతోంది.ఇక పెట్టుబడిదారుల్లో మహిళలు కూడా భాగస్వాములవుతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రత్యేక పెట్టుబడిదారుల్లో సుమారు 24.42 శాతం మహిళలు కాగా, ఆంధ్రప్రదేశ్లో ఈ సంఖ్య 23.60 శాతంగా ఉంది. అంటే మహిళలు కూడా తమ పొదుపులను పెట్టుబడులుగా మార్చుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా ఈ పెట్టుబడుల పెరుగుదలకు ఒక ముఖ్యమైన కారణంగా కనిపిస్తోంది. 2025-26లో తెలంగాణ జీడీపీ సుమారు రూ.17.82 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ జీడీపీ సుమారు రూ.17.62 లక్షల కోట్లుగా ఉంది. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ.. ప్రజల ఆదాయాలు, పొదుపులు, పెట్టుబడులపై అవగాహన కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మ్యూచువల్ ఫండ్స్పై ప్రజల ఆసక్తి క్రమంగా పెరుగుతోందని స్పష్టంగా అర్థమైపోతోంది.ఇదీ చదవండి: బంపరాఫర్.. ఐఫోన్ కొనుగోలుపై రూ.43 వేలు తగ్గింపు!
ఫ్యామిలీ
ది మైక్రో స్పై: సీల్ చెక్కుచెదరలేదు.. అయినా లీక్!
డీజీపీ చాంబర్...మేజర్ సూరజ్ మెహతా మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.ఎదురుగా క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు.‘దేశ సరిహద్దు రక్షణకు సంబంధించిన అత్యంత రహస్యమైన డ్రోన్ ఆటోమేషన్ బ్లూప్రింట్స్– కీలకమైన డిఫెన్స్ డాక్యుమెంట్స్ ఉన్న కవరును తీసుకుని ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చారు. మేజర్ సూరజ్ మెహతా– ఆ పత్రాలను ఐటీ కారిడార్లోని డిఫెన్ ్స రీసెర్చ్ విభాగానికి అందజేయాల్సి ఉంది.‘మేజర్ సూరజ్ మెహతా నిన్న రాత్రి బంజారాహిల్స్లోని ఒక లగ్జరీ హోటల్లో బస చేశారు. రాత్రి ఆయన భద్రంగా దాచుకున్న ఆ రహస్య కవరు ఉదయం చూసేసరికి మాయమైంది. ప్రభుత్వ అధికారిక లక్క ముద్ర ఉన్న ఆ కవరు పోవడం చాలా ప్రమాదకరం...’ డీజీపీ గంభీరంగా చెప్పాడు.‘అవును మిస్టర్ అభిమన్యు! ఎన్ ఐఏ, సీబీఐ ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగే పరిస్థితి లేదు. చాలా కాన్ఫిడెన్షియల్... మీ ప్రతిభ గురించి విన్నాం... మీరే ఈ కేసును సాల్వ్ చేయాలి.’ మేజర్ మెహతా అన్నాడు.‘డోంట్ వర్రీ... దేశ రక్షణ మన బాధ్యత, మీరు నిశ్చింతగా వుండండి.’ చెప్పి బయటకు నడిచాడు అభిమన్యు.అతడిని అనుసరించాడు మేజర్ సూరజ్ మెహతా.అభిమన్యు వెంటనే మేజర్ సూరజ్ మెహతాతో కలిసి హోటల్ రూమ్ నంబర్ 404కి చేరుకున్నాడు. రూమ్లో ఎలాంటి గొడవ జరిగిన ఆధారాలు లేవు. లాకర్ తాళాలు మేజర్ సూరజ్ పాకెట్లోనే ఉన్నాయి. ‘రాత్రి నేను గది తాళం వేసుకుని పడుకున్నాను. కిటికీలు కూడా లోపలి నుంచే బంధించి ఉన్నాయి. మరి కవరు ఎలా మాయమైంది?’హోటల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న అభిమన్యుకు గ్రౌండ్ ఫ్లోర్లో డస్ట్ బిన్లను తీసుకువెళ్తున్న రూమ్ బాయ్ కనిపించాడు. ఆ డస్ట్ బిన్లలో ఉన్న చెత్తను ఇంకా మునిసిపల్ వ్యాన్లో తరలించలేదు. వెంటనే ఆ చెత్తలో వెతికితే కవర్ దొరికింది.‘కవర్ దొరికింది. కానీ డస్ట్ బిన్లోకి ఎలా వెళ్ళింది?’ తనలో తానే గొణుక్కుంటున్నట్టు అన్నాడు మేజర్ సూరజ్ ఆ కవర్ వంక చూసి.ఇన్స్పెక్టర్ అభిమన్యు తన ట్రెంచ్ కోట్ జేబులోంచి భూతద్దం తీసి ఆ కవర్ను పరిశీలించాడు. ‘లక్క ముద్ర అలాగే ఉంది కానీ, లోపల ఉన్న దేశ రహస్యాలు ఇప్పటికే లీక్ అయిపోయాయి!’ అభిమన్యు అన్నాడు.మేజర్ సూరజ్ షాకింగ్గా చూస్తూ వుండిపోయాడు ‘ ఇప్పుడెలా? అతని గొంతులో ఆందోళన.‘లీకైన రహస్యాలు బయటకు పొక్కకముందే లాక్ అవుతాయి.’ అభిమన్యు చెప్పాడు. అప్పటికే అతని బ్రెయిన్ మ్యాప్ పనిచేస్తోంది.అభిమన్యు వెంటనే హోటల్లో బస చేసిన వారి రికార్డులను పరిశీలించాడు. అదే ఫ్లోర్లో ఉన్న ఒక విదేశీ ప్లాస్టిక్ సర్జన్ ప్రొఫైల్ అతని దృష్టికి వచ్చింది.వెంటనే డూప్లికేట్ కీతో గది ఓపెన్ చేశాడు.∙∙ ఫెడరిక్ మాస్టర్ కీతో గది తలుపు తెరిచి షాకయ్యాడు. అతనిలో ఏదో అనుమానం.‘హలో మిస్టర్ ఫ్రెడరిక్ అమెరికా ఎఫ్బీఐకి కూడా దొరక్కుండా మా దేశానికి ఎందుకు వచ్చావ్? ఆ మాటలు విని ఆ స్పై సర్జన్ ఫెడరిక్ జేబులో నుంచి రివాల్వర్ తీయబోయాడు. అప్పటికే అతని వెనుక రివాల్వర్తో అభిమన్యు.∙∙ ‘ఫెడరిక్ మిమ్మల్ని ఢిల్లీ నుంచి ఫాలో అవుతూ వచ్చాడు. ఒక ప్రొఫెషనల్ మాత్రమే ఇలా చేయగలడు. అతని గురించి ఆరా తీస్తే డొంక కదిలింది. ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో వున్నాడు.కవరు సీల్ పాడవకుండా ఉండటానికి, దాని అంచున ఒక చిన్న సూదితో రంధ్రం చేశాడు. ఆ రంధ్రం గుండా 0.5 ఎంఎం వ్యాసం కలిగిన అత్యంత సన్నని ఆప్టికల్ ఫైబర్ ఎండోస్కోపీ స్పై కెమెరా కేబుల్ను కవరు లోపలికి చొప్పించాడు. వైద్య రంగంలో శరీర భాగాలను పరీక్షించడానికి వాడే ఈ సాంకేతికతను, నేరగాళ్లు మన దేశ రహస్యాలను దొంగిలించడానికి వాడారు. లోపల ఉన్న పేపర్ల మడతలను, అందులోని అక్షరాలను ఆ కెమెరాకు ఉన్న మైక్రో–లైట్ సాయంతో స్పష్టంగా స్కాన్ చేశాడు. ఆ డేటా మొత్తం వై–ఫై ద్వారా వాళ్ల సర్వర్కు సెకన్ల వ్యవధిలో చేరిపోయింది. పని పూర్తయ్యాక, కెమెరాను బయటకు తీసి, ఆ రంధ్రం ఎవరికీ కనపడకుండా ఒక ప్రత్యేకమైన బూడిద రంగు గ్లూతో మూసేసి, కవరును డస్ట్బిన్ లో పడేశాడు. కవర్ దొరికిందని మీరు అనుకుంటారు. కానీ రహస్యాలు వెళ్లిపోతాయి.’ఫెడరిక్ లగేజీని తనిఖీ చేయగా, అందులో ఫెడరిక్ వాడిన మైక్రో–ఎండోస్కోపీ పరికరం ల్యాప్టాప్ దొరికాయి. ల్యాప్టాప్ను పరిశీలించగా, డిఫెన్ ్స పేపర్ల డిజిటల్ కాపీలు అందులో ఉన్నాయి. వాటిని ఇంకా వేరే సర్వర్కు అప్లోడ్ చేయలేదు. మన దేశ రక్షణకు ఏ సమస్యా లేదు. ఇతడిని ఎఫ్బీఐకి అప్పగించండి.ఒక చిన్న సూది రంధ్రం వెనుక ఉన్న అంతర్జాతీయ సాంకేతిక నేరాన్ని ఇన్స్పెక్టర్ అభిమన్యు ఎనలైజ్ చేస్తూ చెప్పాడు.‘థాంక్యూ మిస్టర్ అభిమన్యు. మీ మేలు మర్చిపోలేను... మీరు జీనియస్.. బుద్ధిబలం, భుజబలం, మీ సొత్తు. మీ శక్తియుక్తులు రెండు రాష్ట్రాలకే కాదు మొత్తం దేశానికే అవసరం. మా ఆర్మీ మీ కోసం ఎదురు చూస్తుంది.’ అంటూ కరచాలనం చేస్తూ వీడ్కోలు తీసుకున్నాడు సూరజ్ మెహతా.అవును... అభిమన్యుకు ఏదో రోజు దేశ రక్షణకు పిలుపు వస్తుంది.- శ్రీసుధామయిఇదీ చదవండి: కూతురి కోసం తండ్రి మొక్కు.. 75 ఏళ్లుగా దేశానికే పండుగ!
అహం బ్రహ్మాస్మి: గడ్డిపరక ప్రశ్నకు.. సింహం సమాధానం ఏంటి?
తెలుగు సినిమాలు, తెలుగు రాజకీయాలు బాగా ఫాలో అవుతుందేమో, సింహం అద్దం ముందు నిలబడి గడ్డం సవరించుకుంటూ దరహాసంతో ‘నేను సింహంలాంటి దాన్ని’ అనుకుంది.వెంటనే, ‘ఛ... ఛ... నేను సింహంలాంటి దాన్నేమిటీ? నేనే సింహాన్ని’ ఆలోచనను సవరించుకుంది. ‘ఈ అడవికి రాజును. ఏనుగు నుంచి ఎలుకపిల్ల వరకు, మహావృక్షం నుంచి గడ్డిపరక వరకు, పక్షి నుంచి పారాడే పురుగు వరకు ప్రతిదీ నా అదుపాజ్ఞల్లో ఉండాల్సిందే!’ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని, గుహ బయటికి రావటానికి సమాయత్తమవుతుంటే, మనసుకు ఏదో సంకేతం అందుతున్నట్టు అనిపించింది.ఏమిటది?కొత్త ఉపద్రవమా?అడవుల్లో వుండే జంతువులకి, పక్షులకి, ఇతర జీవచరాలకీ దినదినగండం నూరేళ్ళ ఆయుష్షు జీవితమే! ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి సెకనూ ఉపద్రవమే! క్రూర జంతువుల రూపంలో, వేటగాళ్ల రూపంలో. అయినా తను ఈ అడవికి రారాజు. తనకి ఎవరివల్ల ఉపద్రవం ఉంటుంది? తనే మిగిలిన జంతుజాలానికి ఉపద్రవం కాని. తనని తాను సమాధానపరచుకుంది సింహం.ఆలోచిస్తూ గుహ బయటికి వచ్చి బోర విరుచుకు నిలబడి చుట్టూ ఒకసారి తేరిపార చూసింది. ఎదురుగా కుక్క, నక్క!పుట్టుకతో బద్ధశత్రువులైన రెండూ అక్కడ ఒకదాని పక్క మరోటి నిలబడి వున్నాయి– అదీ పెళ్లి చేసుకున్న ఆనవాళ్లతో, అలంకరణలతో...సింహాన్ని చూసి కుక్క అంది ‘మహారాజా, కొత్తగా పెళ్లి చేసుకున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి.’సింహం తన కళ్ళని తానే నమ్మలేక పోయింది.‘పెళ్లా? మీరా?’ అన్నది పైకి.‘చరిత్రలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఇలాంటిది జరిగిందా? పరస్పరం కలహించుకునే రెండు జాతులు పెళ్లి చేసుకోవటం ఉపద్రవం కాక మరేమిటీ?’ మనసులో అనుకుంది.‘అవును మహారాజా. ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకున్నాం. ఆశీర్వదించండి’ ఈసారి నక్క అంది వినయంగా. దాని వినయం తెలుస్తూనే వుంది.‘మీ ఇళ్లల్లో ఒప్పుకున్నారా ఈ పెళ్ళికి?’‘లేదు మహారాజా. విభిన్న జాతుల మధ్య ప్రేమను సమాజం ఎప్పుడూ సులభంగా అంగీకరించలేదు. అయినా మేము ఒకరినొకరం ఎంచుకున్నాం. మా అభిప్రాయాలు కలిశాయి. మేము పెళ్లి చేసుకున్నాము. ఇతరులతో మాకు పనేముంది మహారాజా?’ అంది కుక్క.‘అభిప్రాయాలు కలవటమా? అసలు మీ జాతులే వేరైనప్పుడు, అలవాట్లే వేరైనప్పుడు, అభిప్రాయాలు కలవటం వింతగా వుంది.’‘అభిప్రాయాలు కలవటానికి, జాతులు వేరవటానికి సంబంధమేమిటి మహారాజా. ఆ మాటకొస్తే ఎన్ని సినిమాల్లో చూళ్ళేదూ హీరో హీరోయిన్లు దెబ్బలాడుకుంటూనే ప్రేమలో పడటం. ఇదీ అంతే అనిపించింది.’‘మనుషుల గురించి వదిలెయ్యండి. సృష్టిలో వాళ్ళని మించిన నమ్మక ద్రోహులు, స్వార్థపరులు మరెవరూ వుండరు. ఒక పని చేస్తే కొంత లాభం వస్తుందనుకుంటే స్వంత వాళ్లనే వదులుకోవడానికి సిద్ధపడతారు. అలాంటి నీతి, జాతి లేని వాళ్ళతో– మనకి పోలికేమిటి?’ సింహం గర్జించింది.ఆ అరుపుకు కుక్క, నక్క గాభరా పడ్డాయి.‘అవసరం కోసం మనుషులు ఎంతకిందికైనా దిగజారతారు. డబ్బుకోసం నానా గడ్డీ కరుస్తారు. అలాంటి వాళ్ళు అంతకంటే మంచి సినిమాలు తియ్యలేరులే. అయినా– సినిమాలు చూసే మీరు ఇవన్నీ చేశారా?’ సింహం అడిగింది.‘అవును, కాదు’ల మధ్యగా రెండూ తల ఊపాయి.‘అయినా ఒక విషయం అడుగుతాను. సూటిగా సమాధానం చెప్పండి. రేపు మీ పిల్లల్ని తోటి సమాజం సంకర జాతి అని హేళన చెయ్యదా?’రెండూ తలలు వంచుకున్నాయి– తప్పు చేసిన వాళ్ళలా.‘దానికంటే ముఖ్యంగా’ సింహం కుక్కని చూసి, ‘విశ్వాసానికి ప్రతీకగా నిన్నూ’ అని నక్క వైపు చూసి, ‘వంచనకు, అతి వినయానికి గుర్తుగా నిన్నూ చెప్తారు కదా. రేపెప్పుడైనా ఈ అడవిలో మిగిలిన జంతువులు మిమ్మల్ని ఒకరి గురించి మరొకరి ముందు అలా అవహేళన చేస్తే మీరు తట్టుకోగలరా?’సమాధానం ఏం చెప్పాలో తెలీక కుక్కా, నక్కా రెండూ మౌనంగా ఉండిపోయాయి.సింహమే అంది ‘రేపు మీ పిల్లలకి మీ అసలు బుద్దులు తారుమారై.. నక్క విశ్వాసం, కుక్క వినయం వస్తే, మిగిలినవి వాటిని ఎగతాళి చేస్తే వాటి చిన్ని మనసుకు గాయం అవ్వదా?’‘మహారాజా, క్షమించండి. దాని గురించి మేము ఇంకా ఆలోచించలేదు కానీ, విషయం అంతదాకా వస్తే, మా పిల్లలు ఈ అడవిలోనే, ఈ జంతువుల మద్యే ఉండాలన్న నియమమేమీ లేదు కదా. రేపు మా పిల్లలు మెరుగైన జీవితం కోసం, దేశంలోని ఇంకో అడవికో, మరోదేశానికో వలస పోవచ్చు. మనుషులు కూడా అలానే దేశాంతరం వెళుతున్నారు కదా?’ ప్రశ్నించింది నక్క.సింహానికి ఇది వాదనలతో తెగే వ్యవహారంలా అనిపించలేదు. ‘మూర్ఖులతో వాదించటమంత మూర్ఖత్వం లేదు’ అనుకుంది.చివరగా అంది ‘సరే అయిందేదో అయింది. ఇద్దరూ కుటుంబ సమస్యలతో వీధికెక్కకుండా నడుచుకోండి. ఇప్పటి ఏకాభిప్రాయాలు రేపటి అభిప్రాయభేదాలు కానివ్వకండి. అలాటిదేదైనా ఉంటే, ఇద్దరూ సామరస్యంగా చర్చించి పరిష్కరించుకోండి. జంతు సమాజం మొత్తం కళ్లన్నీ మీమీదే ఉంటాయి. రేపేదైనా జరిగితే మీ బతుకు ఎగతాళి అవుతుంది. జాగ్రత్తగా మసలుకోండి. నా అవసరం మీకు రాకూడదనే కోరుకుంటున్నా. ఒక వేళ వస్తే మాత్రం నాకు కబురుపెట్టి కలవండి.’దీవించినట్టు చెయ్యెత్తింది సింహం. కుక్క, నక్క కృతఙ్ఞతలు చెప్పి బయలుదేరాయి. ఆ ఇద్దరూ వెళ్లిపోయాక అడవి మళ్లీ నిశ్శబ్దమైంది.కానీ ఆ నిశ్శబ్దంలో ఒక గడ్డిపరక మాత్రమే వంగి నిలబడింది. ఏడురోజులుగా అది నీటిని తాకలేదు; సూర్యరశ్మిని కూడా స్వీకరించలేదు. బాగా వడలిపోయివుంది. దాని సమస్యేమిటో ఎవ్వరికీ తెలీదు. తన సమస్య ఎవరితో చెప్పుకోవాలో తెలీక అది కూడా సతమతమవుతోంది. ఈ విషయం ఆకాశంలో ఎగురుతున్న పాలపిట్ట ఒకటి గమనించింది. దాన్ని రారాజు సింహం వేగుగా నియమించుకుంది. రాజ్యంలోని క్షేమసమాచారాల్ని రాజుకు విన్నవించటమే దాని పని. సరిగ్గా– రెండురోజుల తర్వాత సింహం నుంచి గడ్డిపరకకు పిలుపొచ్చింది. గడ్డి భయంభయంగానే రాజు దగ్గిరకి పయనమయ్యింది.∙∙ పులులు, సింహాలు, ఏనుగులు, గుర్రాలు, గాడిదలు, కుందేళ్లు, నక్కలు, జింకలు, పాములు, పక్షులు, చెట్టు, పుట్ట సహా అడవిలోని ప్రతి ప్రాణి, జీవి ఈ సమావేశానికి హాజరు కావలసిందే అని సింహం హుకుం జారీచేసింది. అన్నీ వచ్చి ఆసీనులయ్యాయి.సమావేశం ప్రారంభమయింది. క్షేమసమాచారాలయ్యాక– సింహం గడ్డిపరకని ఎగాదిగా చూసి ‘ఏమిటి నీ సమస్య?’ అడిగింది.‘వ్యక్తిగతంగా అయితే నాకు ఏ సమస్యా లేదు మహారాజా. ఇది మా సమూహం మొత్తం సమస్య. సమస్యలు ఎవరూ తమ దృష్టికి తీసుకురావటంలేదు అంటే దానర్థం సమస్యల్లేవని కాదు మహారాజా. పరిష్కారం లభిస్తుందో లేదోనని’ అర్ధోక్తిలో ఆపుచేసింది గడ్డిపరక.‘పరిష్కారం లేని సమస్యలేమీ వుండవు. కాకపోతే, చిత్తశుద్ధే కావాలి. ముందసలు నీ సమస్యేమిటో చెప్పు, పరిష్కరించ టానికి ప్రయత్నిస్తా’ అంది సింహం.‘మహారాజా, మా సమస్యలు రెండు. ఒకటి ఆత్మగౌరవం. రెండు సామాజికం.’సింహం ఆశ్చర్యంగా చూసింది.గడ్డిపరక చెప్పటం మొదలెట్టింది.‘అవును మహారాజా, అందరూ... ముఖ్యంగా మనుషులు మమ్మల్ని ‘గడ్డిపరక’ అంటూ హేళనగా మాట్లాడతారు. మేము వారికి ఎంత సేవ చేస్తామో, ఎంతగా ఉపయోగపడతామో తమకు మాత్రం తెలీదా? అందరూ పలుచన చేస్తున్నట్టు మేమంతా విడివిడిగా పరకలమే కావొచ్చు కానీ, ఐకమత్యంగా ఏనుగునే బంధించిన మా చరిత్ర గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకోవటం వింత కాదు, కొత్త కూడా కాదు.’గడ్డిపరక గతవారం రోజుల్నించి ఆహారంగా కనీసం నీటిని కూడా పీల్చుకోకపోవటాన వచ్చిన నీరసంతో ఆగింది. క్షణం తర్వాత తిరిగి కొనసాగించింది.‘సమస్త భూమండలంలో మనుషులకి, పక్షులకి, జంతువులకి మాత్రమే కాదు, మాకు కూడా ప్రాణం ఉంటుంది మహారాజా. ఆ మాటకొస్తే అన్నిటికంటే అల్పప్రాణులం మేమే. ఈ సృష్టిలో మిగతా ఎవ్వరికీ అపకారం తలపెట్టని జాతి అంటే మాదే. మనుషులు ప్రకృతిని, మిగిలిన ప్రాణుల్ని నాశనం చేస్తారు. కొన్ని క్రూర జంతువులు వేటాడి మరీ అవతలివాటిని చంపుతాయి. ప్రకృతి సిద్ధమైన నీరు ఇళ్లనీ, ఊళ్ళనీ ముంచేస్తుంది. నిప్పు దేన్నయినా తగలబెడుతుంది. గాలి ఎంతటి దాన్నయినా చెదరగొడుతుంది. మేమొక్కళ్ళమే– కేవలం మేమొక్కళ్ళమే ఎవరికీ ఏ హానీ తలపెట్టకుండా మా బతుకేదో మేం బతుకుతుంటాము. అలాంటిది మమ్మల్ని బతకనీయకుండా చేస్తున్నారు మహారాజా.ఏనుగుల్లాంటి బలమైన జంతువులు ఒకసారి మా మీద కాలేస్తే అధఃపాతాళానికి వెళ్ళిపోతాము. కొన్ని కొన్నిసార్లు పునర్జన్మ అంటూ కూడా ఉండదు. మేకలు, గొర్రెలు, కుందేళ్లు తమతమ కోర పళ్లతో కొరికి పరపరా నములుతుంటే మా బాధ వర్ణనాతీతం. అదైనా పర్లేదు మహారాజా, పుట్టి నాల్రోజులు కూడా కాని పచ్చటి పసికందు పసరికల్ని కూడా వదలకుండా అలానే తింటుంటే, మా కళ్ళముందే అవి నిర్జీవమై పోతుంటే, మా గోడు ఎవరికి చెప్పుకోవాలి మహారాజా. తలచుకుంటుంటేనే కడుపు తరుక్కుపోతుంది.’ గడ్డిపరక కన్నీరు పెట్టుకుంది.సింహానికి జాలేసింది. కానీ, దాని బాధ విచిత్రంగా అనిపించింది. ఏనుగులాంటివి నడుస్తుంటే గడ్డి నలగదా? కుందేళ్ళ ఆహారమే పసిరిక ఐతే వాటిని తినకూడదా? మరి జంతువులు నడవకూడదా? మేకలు పస్తులుండాలా? సృష్టిలోని ప్రతి జీవి మనుగడకి ప్రకృతి కొన్ని దిశానిర్దేశాలు చేసింది కదా. అది కాకూడదంటే ఎలా? ఆ మాటే గడ్డిపరకతో అంది.‘గడ్డీ! నీ కోరికెందుకో విచిత్రంగా అన్పిస్తుంది. ప్రకృతి ధర్మం ప్రకారం పులులు, సింహాలకి మిగిలిన జంతువులే ఆహారం.గద్దలకి కోడిపిల్లలు ఆహారం. పాములకు కప్పలు ఆహారం. అలాగే నువ్వూ కొన్నిటికి ఆహారం. పెద్దపెద్ద జంతువులు నడుస్తుంటే నువ్వే కాదు, కొన్ని వేల జీవరాశులు కంటికి కనిపించనివి మరణిస్తుంటాయి. అంత మాత్రం చేత అవన్నీ నిషిద్ధమైతే ఎలా? అయినా– నీ బాధేమిటో నాకు స్పష్టంగా అర్థం కావటం లేదు. ఇంకొంచం వివరంగా చెప్పు.’‘అదే మహారాజా, నేనూ అక్కడికే వస్తున్నా. ప్రకృతి ధర్మం ఎప్పుడూ బలవంతుల వైపే ఉంటుంది. ఎందుకంటే– అది తయారుచేసేది బలవంతులు, అధికారం ఉన్నవాళ్ళే కదా. అల్పప్రాణులమైన మాలాంటి వాళ్ళు వాటిని కచ్చితంగా పాటించాల్సిందే. అంతెందుకు మహారాజా, ఒక ప్రశ్న అడుగుతాను. నిజాయితీగా సమాధానం చెప్పండి. ఒక మనిషి కారులో వెళుతున్నాడనుకోండి. ఒక సైకిలో, స్కూటరో తెలిసో, తెలియకో ఆ కారుకి అడ్డంగా వస్తే అతడెంత కోప్పడతాడు? వీలైతే ఒకసారి తొక్కిస్తే, జీవితంలో ఇంకెప్పుడూ ఇలా ఎవరికీ అడ్డుపడకూడదనే గుణపాఠం నేర్పించాలనుకుంటాడా లేదా? మరి అదే మనిషి కారుకి ఏ లారీనో, బస్సో ఎదురుగా వస్తే ఏమనుకుంటాడు? మనసులో వాళ్ళను తిట్టుకున్నా ‘వాడితో మనకెందుకులే గొడవ? పక్కకి జరిగి వెళితే మనకే మంచిది’ అనుకుంటాడు కదా.ఒకే మనిషి ఒకే సందర్భంలో రెండు రకాలుగా ఎందుకు ఆలోచించాడు? తనకంటే బలహీనమైన సైకిలువాణ్ణి చూస్తే ఎందుకు కొట్టాలనిపించింది? బలవంతుణ్ణి చూస్తే శాంతం దానంతట అదే ఎందుకు, ఎలా వచ్చింది? అంటే – మనిషి ఆలోచన, ధర్మం.. సందర్భాన్ని బట్టి మారాయి తప్ప ప్రకృతి నిర్దేశించిన నియమాల ప్రకారం కాదు కదా? ఐతే – ఇక్కడ నేను మనిషి ఆలోచనా విధానం గురించి ఎందుకు చెప్పానంటే, మనలో చాలామంది ఇప్పుడు మానవుల్లాగే ఆలోచిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు చెప్పండి మహారాజా, నా ప్రశ్న న్యాయమైనదా కాదా? పరిష్కరించవలసిందా కాదా?’అన్ని ప్రాణులు ఆశ్చర్యంగా చూస్తుంటే, గడ్డిపరక చేతులు జోడించి ‘మహారాజా, ఇప్పుడు మీరు చెప్పబోయే పరిష్కారం భవిష్యత్ తరాలకు, మాలాంటి అల్ప జీవులకు ఒక వేదం కావాలి. దయచేసి అన్నీ అలోచించి నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయమే మాకు శిరోధార్యం’ వినమ్రంగా అంది.మిగిలిన జంతువులు, పక్షులు అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్నాయి. ఇన్నాళ్లూ తాము ఎప్పుడూ ఈ కోణంలోంచి ఆలోచించలేదు. ఏదో పుట్టాం... తింటున్నాం... బతుకుతున్నాం... అనుకుంటున్నామే గానీ, మొదలేదో తుదియేదో తెలీని అంత అల్పప్రాణి గడ్డిపోచలో ఇంత ఆలోచన ఉందా? దాని గుండెల్లో ఇంత విషాదం గూడుకట్టుకుని ఉందా?రాజైన సింహం దానికి ఏం సమాధానం చెప్పబోతుందో అని జంతువులు, పక్షులు, మిగిలిన జీవజాలం అన్నీ చెవులు రిక్కించి వినటానికి సిద్ధంగా వున్నాయి. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరీ అందుకోసం ఎదురుచూస్తున్నాయి.ఇప్పుడు సింహం చెప్పబోయే సమాధానం భవిష్యత్ తరాలకు ఒక మార్గనిర్దేశనం అవుతుంది. చరిత్ర పుస్తకంలో అది ఒక పాఠమవుతుంది. ఎన్నో ఒడిదుడుకులు చూసి, జీవితాన్ని కాచి వడబోసిన సింహం దీనికి ఏం సమాధానం చెబుతుంది?ఇన్ని రోజులూ ఒకెత్తు! ఇక మీదట మరోఎత్తు! సృష్టిలో ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంటుంది. అవతలి వాళ్ళని బాధపెట్టి, వారి బలహీనతల్ని సోపానాలుగా మార్చుకుని పైకెదిగే, ఎదగాలనుకునే వాళ్ళ ఆలోచనలకు ఇపుడు సింహం ఇవ్వబోయే తీర్పు ఒక చెంపపెట్టు కావాలి. అన్నీ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. సింహం కూడా ఆలోచనలో పడింది. ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని కోణం ఇది. ఎప్పుడూ ఎదుర్కోని ప్రశ్న. ప్రశ్న చాలా చిన్నదే. కానీ, జవాబు చాలా పెద్ద చిక్కే. ఏం సమాధానం చెప్పాలి? ఎదో ఒక తీర్పయితే చెప్పొచ్చు, కానీ అది ఎవ్వరినీ నొప్పించకూడదు. అందరినీ ఒప్పించగలగాలి. చరిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోయేటప్పుడు అన్ని విషయాలూ కూలంకషంగా ఆలోచించాలి.తప్పొప్పుల్ని బేరీజు వేసుకోవాలి. సమస్యను అన్ని వైపులనించీ నిశితంగా పరిశీలించాలి. రేప్పొద్దున ఎవరూ తనని గాని, తానిచ్చిన తీర్పుని గాని వేలెత్తి చూపకూడదు. దానికి గానూ, సింహానికి తనకున్న అనుభవం చాలదనిపించింది. దీని గురించి తన మంత్రులతో, న్యాయ కోవిదులతో, మేధావులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకు గానూ కొంత సమయం పడుతుంది.ఆ మాటే చెప్పింది ‘ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గడ్డిపరక చిన్నదే కానీ, అదడిగిన ప్రశ్న భూమండలమంత పెద్దది. అంతపెద్ద సమస్యకి సమాధానం ఒక నిమిషంలో వెల్లడించతరం కాదు. దానికిగానూ నాక్కొంత సమయం కావాలి. నాలుగోరోజు ఉదయం తిరిగీ మనందరం ఇక్కడే కలుద్దాం. అప్పటికి నేను దీనికి ఒక న్యాయసమ్మతమైన పరిష్కారం కనుగొనగలనని భావిస్తున్నాను. అందరూ సహకరించగలరని విజ్ఞప్తి.’సింహం లేచింది. అన్ని జంతువులూ అక్కణ్ణించి నిష్క్రమించాయి. ఆ రాత్రి అడవిలో ప్రతి జీవి ఒకే ప్రశ్నతో నిద్రపోయింది– గడ్డిపరకకు న్యాయం జరుగుతుందా?∙∙ అయితే– రేపు తీర్పు అనగా, ముందురోజు రాత్రి. చిన్నగా ప్రారంభమైన వర్షం పెనుతుఫానుగా మారింది. చెట్లు నేల కూలాయి, రాళ్లు విరిగి పడ్డాయి, కొండలమీది నుంచి ప్రవహించిన నీరు అడ్డొచ్చిన ప్రతి ఊరునీ, వాడనీ తనలో కలిపేసుకుని సముద్రంలో లీనమైంది. అడవిలోని జంతువులు చెల్లాచెదురయ్యాయి. మిగిలిన జీవరాశులు కకావికలమయ్యాయి. ఎన్ని బతికాయో, ఎన్ని చనిపోయాయో ఎవరికీ తెలీదు. సింహం గుహ మొత్తం కూలబడింది. ఆ అర్ధరాత్రిలో, ఆ నిశీధిలో ఎవరు ఎటువైపు వెళ్లాలో తెలీక పక్షుల అరుపులు, జంతువుల రోదనలు, హాహాకారాలు... వెరసి అదొక శ్మశానాన్ని తలపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా – నేనే బలవంతుడినని గర్వపడిన ఏనుగుల్లేవు.రాజునని అహంకరించిన సింహాల్లేవు. పరులని మోసగించే నక్కల్లేవు. పక్షులకి గూళ్ళులేవు. పాములకు బొరియల్లేవు.పులులూ, అడవి దున్నలూ, జింకలూ, కొమ్ములు విసిరే ఎద్దులూ– ఏవీ లేవు. దేని జాడా తెలియటం లేదు. ఉన్నదల్లా నిర్జనమైన అడవి, నిర్వీర్యమైన ప్రకృతి, శ్మశాన నిశ్శబ్దం!అప్పడు, ఆ దృశ్యం ‘ఎంతటి బలవంతుడైన ప్రకతి ముందు దిగదుడుపే’ అన్న జీవిత సత్యాన్ని చెబుతుంది.తెలుసుకున్న వాళ్లకి తెలుసుకున్నంత.తెల్లవారింది.ఆ నిర్జనారణ్యంలో, ఆ శ్మశాన సమాధుల్లో, అల్లకల్లోలాల మధ్యలో... కొండాకోనల వెనకనించి దిక్కుల్ని చీల్చుకుంటూ వస్తున్న ప్రభాత సూర్యకిరణాలు.! భూమి బద్దలైనా, ఆకాశం తలక్రిందులైనా, సముద్రాలు ఉప్పొంగినా... అలుపెరగని సైనికుడిలా, నిద్రావస్థ నుంచి ప్రపంచాన్ని జాగృతం చేయటానికి అప్పుడప్పుడే భూమిపైకి వస్తున్న తొలి రవికిరణాలు! వాటినే చూడటానికన్నట్టు ధీటుగా నిలబడ్డ గడ్డిపోచ ఒకటి! నడుము మీద చెయ్యేసి, రొమ్ము విరగదీసి సూర్యుడికి అభిముఖంగా, దమ్ము చూపిస్తూ నిటారుగా నిలబడ్డ ఆ గడ్డి పరక... ఏం పాఠం చెబుతుంది?కొన్నిసార్లు తగ్గటమే– నెగ్గటం – ప్రపంచంలో అయినా, జీవితంలో అయినా!‘ప్రకృతికి, పరమాత్ముడికి ఎంతటి వీరుడైనా, ధీరుడైనా తలవంచాల్సిందే’ అర్థం చేసుకున్నోళ్లకి అర్థం చేసుకున్నంత!!తనను తాను బ్రహ్మంగా భావించిన సింహం కనుమరుగైంది. బ్రహ్మంలో తానొక భాగమని తెలుసుకున్న గడ్డిపరక మాత్రం నిలిచింది.అహం బ్రహ్మాస్మి!! సడ్డా సుబ్బారెడ్డిఇదీ చదవండి: ‘అమ్మా.. నా ఇంటికి నన్ను తీసుకెళ్లు!’ బాలుడి మాటలలో మిస్టరీ!
కూతురి కోసం తండ్రి మొక్కు.. 75 ఏళ్లుగా దేశానికే పండుగ!
కొన్ని పండుగల వెనుక సంస్కృతీ సంప్రదాయాల చరిత్ర ఉంటే, మరికొన్ని పండుగలు భావోద్వేగాలు, విశ్వాసాలతో ముడిపడి ఉంటాయి. అలాంటి అరుదైన పండుగే ‘నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లా మెజొరానా’. పనామాలోని గ్వరారేలో ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో ఈ వేడుకలను నిర్వహిస్తారు. పనామా ప్రజల గ్రామీణ సంస్కృతి, సంగీతం, నృత్యం, సంప్రదాయ దుస్తులు, రైతుల జీవన విధానాన్ని ప్రతిబింబించే ఈ ఉత్సవం 1949లో ప్రారంభమైంది.ఈ మెజొరానా పండుగ ప్రారంభం వెనుక ఓ తండ్రి వేదన ఉంది. ఈ పండుగ నిర్వాహకులలో ఒకరైన మాన్యుయెల్ ఫెర్నాండో జారాతె కుమార్తె లుకీమియాతో బాధపడేది. దీంతో జారాతె ‘వర్జిన్ డి లాస్ మెర్సిడెస్’ అమ్మవారిని వేడుకున్నాడు. తన కుమార్తె ఆరోగ్యం బాగుపడితే, అమ్మవారి దయకు కృతజ్ఞతగా ప్రతి ఏడాది జానపద సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తానని మొక్కుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ బాలిక కోలుకోవడంతో– ఇచ్చిన మాట ప్రకారం 1949లో మొదటిసారి ఈ జానపద సంబరాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా సెప్టెంబర్లో నిర్వహించే ఈ వేడుకలకు వేలాదిమంది భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తరలివస్తారు. ఈ ఏడాది ఈ వేడుకలను సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు.పనామా గ్రామీణ సంప్రదాయాలను కాపాడటమే ఈ మెజొరానా పండుగ లక్ష్యం. ముఖ్యంగా రైతుల జీవన విధానం, వారి పాటలు, సంగీతం, నృత్యాలు, దుస్తులు, చేతివృత్తులు, స్థానిక కళలను తరువాతి తరాలకు అందించాలనుకున్నారు. అందులో ప్రధాన పాత్రను ‘మెజొరానా’ అనే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ సంగీత వాయిద్యానికి ఇచ్చారు. పరిమాణంలో చిన్నదిగా కనిపించినా దాని శబ్దానికి ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పనామా గ్రామీణ కవులు పాడే ‘దెసిమా’ పాటలకు ఇది సంగీత సహకారం అందిస్తుంది. సెడార్, బాల్సో, వోలడార్ వంటి స్థానిక కలపతో ఈ మెజొరానాలను తయారు చేస్తారు. గతంలో వీటి తంత్రుల కోసం కోడి పేగులను ఉపయోగించేవారు, ప్రస్తుతం నైలాన్ తీగలను ఉపయోగిస్తున్నారు.కారెటాస్ పరేడ్ మరో ప్రత్యేకత అలంకరించిన ఎద్దుల బండ్ల ఊరేగింపు. పండుగ ముగింపు వేడుకల్లో ఈ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.‘ఫెస్టివల్ ఆఫ్ మెజొరానా’ కేవలం ఒక సంగీత వేడుక కాదు. అనేక సంప్రదాయ కళలకు వేదిక. దాదాపు 75 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఈ వేడుక ప్రాంతీయ అస్తిత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యానికి కూడా వేదిక కల్పిస్తోంది. ఒక కుటుంబం మొక్కుకున్న మొక్కు ఓ దేశానికి పండుగగా మారి, జానపద సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.పాటల్లో పలికే రైతు జీవితం..ఈ ఉత్సవంలోని ‘దెసిమా’ పాటలు ప్రత్యేక ఆకర్షణ. గ్రామీణ జీవితం, రైతుల కష్టాలు, ప్రేమ, ప్రకృతి వంటి ఎన్నో విషయాలను పాటల రూపంలో చెప్పే సంప్రదాయం ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పోటీల్లో పాల్గొంటారు.- రమా జంబులఇదీ చదవండి: శాపంతో చెట్లుగా మారిన దంపతులు.. వినాయక పూజలో దాగిన కథ!
శాపంతో చెట్లుగా మారిన దంపతులు.. వినాయక పూజలో దాగిన కథ!
పూర్వం మాళవదేశంలో ఔరవుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు వేదవేదాంగవేత్త, పండితుడు, మేధావి. అతడి భార్య సుమేధ. భర్తకు తగిన ఇల్లాలు. ఆ దంపతులకు ఒక బాలిక జన్మించింది. వారు ఆమెకు శమీక అని నామకరణం చేసి, అల్లారుముద్దుగా పెంచసాగారు.శమీకకు ఎనిమిదేళ్లు వచ్చాక ఔరవుడు కుమార్తె కోసం వరాన్వేషణ ప్రారంభించాడు. ధౌమ్యుడి పుత్రడు, శౌనక మహర్షి శిష్యుడు, గురుసేవాతత్పరుడు అయిన మందారుడు అనే బాలుడి గురించి విన్నాడు. ధౌమ్య శౌనకులతో తన ఇంటికి సకుటుంబ సపరివారంగా ఆహ్వానించి, మందారుడితో తన కుమార్తె శమీక వివాహాన్ని జరిపించాడు. వివాహం తర్వాత మందారుడు తన గురుకులానికి వెళ్లిపోయాడు.కొంతకాలానికి శమీక వ్యక్తురాలైంది. ఈ సంగతి తెలుసుకుని, మందారుడు అత్తవారింటికి వచ్చాడు. ఔరవుడు అతడికి మృష్టాన్న భోజనం పెట్టి, అల్లుడి మర్యాదలన్నీ చేశాడు. ధన కనక రాశులతో కుమార్తెను అప్పగించాడు. ‘విప్రపుత్రా! నా కుమార్తెను విధి విధానంగా నీకు అప్పగిస్తున్నాను. ఆమెను అత్యంత ప్రేమగా చూసుకుంటూ, జాగ్రత్తగా దాంపత్యం చేయాలి’ అని పరిపరి విధాలుగా జాగ్రత్తలు చెప్పి, సాగనంపాడు. శమీక మందారులు వెంటనే ఆశ్రమానికి వెళ్లక వనంలోనే సల్లాపాలాడుతూ గడపసాగారు. కొద్ది రోజులకు వారు ఉంటున్న వనానికి భృశుండి మహర్షి వచ్చాడు. దీర్ఘతపస్సు ఆచరించడం వల్ల ఆయన భ్రూమధ్యంలో తొండం అంకురించింది. నుదుట తొండం ఉన్న ఆ మహర్షి రూపాన్ని చూసి, శమీక మందారులు యవ్వన చాపల్యంతో పరిహసించారు.వారి పరిహాసానికి భృంశుడికి కోపం వచ్చింది. ‘మూర్ఖులారా! మీరు నన్ను పరిహసించి నవ్వారు. అందువల్ల మీరు సర్వప్రాణులూ వర్జించే వృక్షాలుగా మారిపోండి’ అని శపించారు. భృంశుడి శాపానికి శమీక మందారులు భయంతో వణికిపోయారు. వెంటనే క్షమించమంటూ ఆయన పాదాల ముందు మోకరిల్లారు.‘మీరు నా నుదుటనున్న తొండాన్ని చూసి నవ్వారు. అందువల్ల తొండమున్న దేవుడైన వినాయకుడు మిమ్మల్ని కటాక్షించినప్పుడు మీకు మీ నిజరూపాలు తిరిగి వస్తాయి’ అని చెప్పి, వెళ్లిపోయాడు. శమీక శమీవృక్షంగా, మందారుడు మందారవృక్షంగా మారిపోయారు. అత్తవారింటికి వెళ్లిన శిష్యుడు ఎన్నాళ్లయినా తిరిగి రాకపోవడంతో శౌనకుడు శిష్య సమేతంగా ఔరవుని ఇంటికి వెళ్లి, మందారుడి గురించి అడిగాడు. తాను కూతురితో సహా అల్లుడిని చాలారోజుల కిందటే పంపానని ఔరవుడు బదులిచ్చాడు. పిల్లలు జాడలేకుండా పోవడంతో శౌనకుడు, ఔరవుడు– ఇద్దరూ చింతాక్రాంతులయ్యారు. అడవిమార్గంలో వారిని ఏ క్రూరమృగాలైనా చంపేసి ఉంటాయేమోనని లేదా చోరుల బారినపడి హతమైపోయి ఉంటారేమోనని భయపడ్డారు. చివరకు ఇద్దరూ కలసి శమీక మందారులను వెదకడానికి అడవిలోకి వెళ్లారు. అటవీమార్గంలో వారి పాదచిహ్నాలను గుర్తించారు. అలసిపోవడంతో ఔరవ శౌనకులు అడవిలోని కొలనులో స్నానం చేసి, ధ్యానమగ్నులయ్యారు. ధ్యానంలో వారికి జరిగినదంతా తెలిసింది.‘మందారుడిని చదువు కోసం అతడి తండ్రి నా గురుకులంలో వదిలి వెళ్లాడు. అతడికి నేనిప్పుడు ఏమని బదులివ్వాలి?’ అని శౌనకుడు శోకతప్తుడయ్యాడు. ఔరవుడిదీ అదే పరిస్థితి. గణేశుడిని ఆరాధించి, వీరి శాపవిమోచనను కోరుకుందాం అని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే వారు ఒంటికాలిపై నిలబడి గణేశుని కోసం తపస్సు ప్రారంభించారు. నిరాహారులై వారు ఒంటికాలిపై ఏకధాటిగా సాగిస్తున్న తపస్సుకు గణేశుడు ప్రసన్నుడయ్యాడు. వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఏకదంతుడు కళ్లముందు నిలిచే సరికి శౌనక ఔరవులు భక్తిపారవశ్యంతో అతడిని స్తుతించారు.‘భక్తులారా! మీ తపస్సుకు మెచ్చాను. మీ మనోభీష్టమేమిటో చెప్పండి, నెరవేరుస్తాను’ అని పలికాడు గజాననుడు. శౌనక ఔరవులు శమీక మందారుల వృత్తాంతాన్ని చెప్పి, వారికి శాపవిమోచనం కలిగించాలని కోరారు. గణేశుడు ‘తథాస్తు’ అని పలికాడు.‘నేను ఎల్లప్పుడూ మందారవృక్ష మూలంలో నిలిచి ఉంటాను. శమీవృక్షంలోనూ కొలువై ఉంటాను. నాకు దూర్వాంకురాలే కాకుండా శమీపత్రాలు కూడా ప్రీతిపాత్రమవుతాయి. దూర్వాంకురాలు, మందార పత్రాలు లభించనప్పుడు శమీపత్రాలతో పూజిస్తే, నేను ప్రసన్నుడనవుతాను. దూర్వాంకుర, మందారపత్ర, శమీపత్రాలతో నన్ను పూజించేవారికి మనోవాంఛిత సిద్ధి, మోక్షప్రాప్తి కలుగుతాయి’ అని పలికి గణపతి అంతర్ధానమయ్యాడు.పురావిశేషం..ఇది దేశంలోనే అత్యంత అరుదైన ఆలయం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లా కుమావూ కొండల ప్రాంతంలో చితాయి గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని స్థానికులు ‘గోలూ దేవతా’ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడి మూలవిరాట్టు ‘చితాయీ గోలూ దేవత’ శివుడి అవతారమైన గౌరభైరవుడు. గౌరభైరవుడు సత్వరన్యాయం చేస్తాడని భక్తుల విశ్వాసం. న్యాయం కోరుతూ రాసే విజ్ఞాపనపత్రాలను భక్తులు ఈ ఆలయంలో వేలాడదీస్తారు. తమకు న్యాయం జరిగితే, ఆలయానికి తిరిగి వచ్చి కంచు లేదా రాగి లేదా ఇత్తడి లోహాలతో తయారు చేసిన గంటలను వేలాడదీస్తారు. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా, అసంఖ్యాకంగా గంటలు, భక్తులు వేలాడదీసే విజ్ఞాపనపత్రాల కాగితాలు కనిపిస్తాయి.- సాంఖ్యాయనఇదీ చదవండి: కృష్ణాష్టమి తెలిసిందే.. ‘రాధాష్టమి’ ఎంతమందికి తెలుసు?
అంతర్జాతీయం
భారత్కు టారిఫ్ ముప్పు!
వాషింగ్టన్: రష్యా ఆంక్షల బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసి చట్టంగా మార్చారు. ఈ పరిణామంతో రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించడానికి అధ్యక్షుడికి అధికారం లభించింది. తద్వారా భారత్, చైనాలకు అమెరికా సుంకాల ముప్పు పొంచి ఉన్నట్లే. ‘లిండ్సే ఓ.గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ అనే ఈ బిల్లును రిపబ్లికన్ల మద్దతుతో అమెరికా ప్రతినిధుల సభ 262–159 ఓట్ల తేడాతో ఆమోదించిన సంగతి తెలిసిందే. చట్టసభలో బిల్లు ఆమోదం పొందిన రెండు రోజుల తర్వాత ట్రంప్ దీనిపై సంతకం చేశారు. → ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి ఆర్థిక వనరులను తగ్గించడమే ఈ కొత్త చట్టం అసలు లక్ష్యం. → ఇది రష్యా అధికారులు, బ్యాంకులు, ఇంధన సంస్థలు, మాస్కో సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న విదేశీ సంస్థలపై గురిపెట్టింది. → రష్యాకు చెందిన చమురు, గ్యాస్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు విధించే అధికారాన్ని ఈ చట్టం అధ్యక్షుడికి కల్పిస్తుంది. → హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీ ప్రకారం ఈ చట్టం రష్యన్ ఉత్పత్తులపై 500 శాతం వరకు సుంకాలు విధించడానికి వీలు విధిస్తుంది. రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు నిబంధనల పరిధిలోకి వచ్చే దేశాల ఉత్పత్తులపై 100 శాతం వరకు సుంకాలు విధించవచ్చు. → రష్యా అధ్యక్షుడు పుతిన్తోపాటు రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపైనా ఆంక్షలు విధించడానికి ఆస్కారం ఉంది. → 100% వరకు సుంకాలు విధించడానికి అర్హమైన దేశాలుగా చైనా, భారత్, యూఏఈ, టర్కీ, సింగపూర్, అజర్బైజాన్, కజకిస్తాన్, హంగేరీ, కిర్గిజిస్తాన్, స్లోవేకియా పేర్లను స్పష్టంగా పేర్కొనాలని బిల్లులో ఒక సవరణ ద్వారా ప్రతిపాదించారు. ఈ బిల్లు భారత్పై 100% సుంకాలు విధించాలని నేరుగా చెప్పలేదు. → అధ్యక్షుడు ట్రంప్ తన అధికారాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకుంటే భారత్పై 100 శాతం వరకు సుంకాలు విధించవచ్చు. → బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల ఎగుమతులను అడ్డుకోవడంలో విఫలమైనందుకు భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా ప్రస్తుతం 10 శాతం సుంకం వసూలు చేస్తోంది. ఒకవేళ ట్రంప్ 100 శాతం సుంకం విధిస్తే అది ఇప్పుడున్న 10 శాతం సుంకానికి అదనం అవుతుంది. → అమెరికా సుంకం రేట్లను ప్రకటించిన తర్వాతే భారతీయ ఎగుమతులపై కొత్త సుంకాల ప్రభావం ఎంతవరకు ఉంటుందో చెప్పగలమని నిపుణులు అంటున్నారు.
సౌదీలో మోగిన హెచ్చరిక సైరన్లు
దుబాయ్: శత్రువు నుంచి వైమానిక దాడి జరిగే ప్రమాదముందంటూ ప్రజలను హెచ్చరిస్తూ శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం సౌదీ అరేబియా వ్యాప్తంగా సైరన్లు మోగాయి. హౌతీల దాడులు మొదలైన తర్వాత రాజధాని రియాద్లో ఇలాంటి సైరన్లు మోగడం ఇదే మొదటిసారి. రియాద్ విమానాశ్రయానికి సమీపంలో పేలుడు సంభవించిందని, విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిందని వార్తలు వచ్చాయి. అయితే, ఎవరూ మరణించలేదని, ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పేలుళ్లకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. యెమెన్లోని హౌతీ రెబెల్స్ పొరుగుదేశాలకు హెచ్చరికలు చేయడం, దాడులకు పాల్పడటాన్ని శుక్రవారం ఐరాస భద్రతామండలి ఖండించింది. ఇలాంటి పరిణామాలు ప్రాంతీయ భద్రతకు, అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర విఘాతం కల్గిస్తాయని పేర్కొంది. హౌతీలకు సైనికపరమైన ఎలాంటి సాయం అందకుండా చేసేందుకు సంబంధిత దేశాల మధ్య ఆచరణాత్మక సహకారం అవసరమని పేర్కొంది.
యుద్ధానికి మూల్యం చెల్లిస్తున్నారు
దుబాయ్: అమెరికా ఆంక్షలు, ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న యుద్ధాలకు మూల్యాన్ని ఇరాన్ ప్రజలు చెల్లిస్తున్నారని ఆ దేశానికి చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారిణి, నోబెల్ గ్రహీత నర్గీస్ మహ్మదీ(54) వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందులు, బలగాల అణచివేత కారణంగా సామాన్యులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నారు. ‘ఒక్కసారి ఇరాన్ వీధుల్లోకి వెళ్లి చూడండి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏమిటో మీకు అర్థమవుతుంది. వారిప్పుడు మేల్కొన్నారు. హక్కుల కోసం పోరాడాలని తీర్మానించుకున్నారు’ అని మహ్మదీ అన్నారు. ‘నేటి ఇరాన్ యువతలో హక్కుల పట్ల అవగాహన ఉంది. ఈ విషయంలో వారికి స్పష్టత ఉంది. వారే మాకు ఆశ, శ్వాస’అని ఆమె పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన నర్గీస్ మహ్మదీని ఇరాన్ ప్రభుత్వం జైలు నుంచి తాత్కాలికంగా విడుదల చేసింది. శుక్రవారం ఆమె అసోసియేటెడ్ ప్రెస్కు ఇచి్చన వర్చువల్ ఇంటర్వ్యూలో తన నిర్బంధానికి సంబంధించిన వివిధ అంశాలను ఆమె వివరించారు. బాల్యంతోపాటు జైలులో ఉన్న సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి రాసిన ‘ఎ ఉమన్ నెవర్ స్టాప్స్ ఫైటింగ్’ పుస్తకం ఫ్రెంచి, జర్మన్, తదితర 9 భాషల్లో ఈ నెలలో విడుదల కానుంది. ఇంగ్లి‹Ù, పార్సీ ఎడిషన్లు వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. అమెరికాతో కొనసాగుతున్న యుద్ధం, ముదిరిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఇరాన్ ప్రజలు పలు రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారని, భారీ మూల్యం చెల్లిస్తున్నారని మహ్మదీ పేర్కొన్నారు. తమ పాలకులపై ఇరాన్ వాసుల్లో నిశ్శబ్దంగా తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందంటూ ఆమె ఇస్లాం డ్రెస్ కోడ్ను ఉల్లంఘించిన కారణంగా 22 ఏళ్ల మహ్సా అమీనిని అధికారులు నిర్బంధించడం, అనంతరం ఆమె ఆస్పత్రిలో చనిపోవడంతో మొదలైన అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో కొనసాగిన విషయాన్ని ప్రస్తావించారు. అమీనిని స్మరించుకుంటూ ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నామన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న నర్గీస్ మహ్మదీకి ఇరాన్ ప్రభుత్వం వివిధ ఆరోపణలు మోపి మొత్తం 44 ఏళ్ల జైలు శిక్షలు విధించిన సంగతి తెలిసిందే.
లక్ష డాలర్ల ఫీజు ఇంకో ఏడాది
వాషింగ్టన్: కొత్త హెచ్1–బీ వీసా దరఖాస్తులపై ఇంకో ఏడాది లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు వైట్హౌస్ ప్రకటించింది. ప్రభుత్వ విభాగాలు మరింత సమన్వయంతో పనిచేయడం ద్వారా హెచ్1–బీ వీసాల దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని ట్రంప్ మరో ఉత్తర్వు ద్వారా ఆదేశించారు. 2025లో మొదటిసారి లక్ష డాలర్ల ఫీజును ప్రవేశపెట్టాక ఐటీ ఔట్సోర్సింగ్ కంపెనీల నుంచి వచ్చే హెచ్1–బీ వీసా దరఖాస్తులు 92 శాతం వరకూ తగ్గాయని ట్రంప్ తాజా ఉత్తర్వుల్లో తెలిపారు. అమెరికా ఆర్థిక, భద్రతపరమైన ప్రయోజనాలను కాపాడేందుకు గత ఏడాది నాటి ఈ ఉత్తర్వులను పొడిగించడం అవసరమైందని స్పష్టం చేశారు. అమెరికన్ ఉద్యోగులు, పట్టభద్రుల ఉద్యోగ అవకాశాలకు, కంపెనీలు అత్యధిక నైపుణ్యం అవసరమైన విదేశీయులను మాత్రమే నియమించుకునేలా చేసేందుకు ఈ ఉత్తర్వులు ఉపయోగపడతాయని వివరించారు. హెచ్1– బీ వీసాల లబ్ధి అత్యధికంగా పొందుతున్నది భారతీయ టెకీలన్న విషయం తెలిసిందే. 2025లో ట్రంప్ హెచ్1–బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినప్పుడు కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. రెండు ఫెడరల్ కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. నాటి ఉత్తర్వుల కాలపరిమితి ఈ నెలతో ముగియనుండగా తాజా ఆదేశాలు వెలువడటం గమనార్హం. అయితే ఈ లక్ష డాలర్ల ఫీజు అనేది అమెరికాలో విద్యార్థి వీసాలపై ఉన్న వారికి, ప్రస్తుతం హెచ్1–బీ వీసాపై ఉన్న వారి రెన్యువల్కూ వర్తించదు. ఈ వీసాదారుల వేతనాలు, పని నిబంధనలకు సంబంధించి కంపెనీ ఇప్పటికే సమర్పించిన లేబర్ కండిషన్ అప్లికేషన్ల సమాచారాన్ని 30 రోజుల్లో సమీక్షించాలని, అనంతరం స్పాన్సర్ చేసే సంస్థలపై మరిన్ని చర్యలు అవసరమా? లేదా? అన్నది నిర్ణయించాలని ట్రంప్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
జాతీయం
గణేశ్ మండపం వద్ద కరెంట్ షాక్.. మహిళ, బాలిక మృతి
ముంబై: గణేశ్ ఉత్సవాల వేళ ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాలాచౌకీ ప్రాంతంలోని మహాగణపతి ఉత్సవ మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ, ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 12 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాలాచౌకీ ప్రాంతంలోని మహాగణపతి ఉత్సవ మండపం వద్ద ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మంచినీటి స్టాల్ వద్ద విద్యుత్ ప్రవాహం ఉన్నట్లు ముంబై ఫైర్ బ్రిగేడ్ అధికారులు గుర్తించారు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని మూసివేశారు. గణపతి మండపం వద్ద విద్యుత్ షాక్ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రభావితమయ్యారు. వారిలో సుజాత (33), ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందగా.. కిరణ్ అక్బర్ నాయక్ (19), తన్వి నరేశ్ హండే (19), సాహిల్ సందీప్ తారే (19) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 12 ఏళ్ల బాలిక తీవ్ర పరిస్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.భారీ రద్దీతో వెనక్కి వచ్చిన కుటుంబంమృతిచెందిన చిన్నారి బంధువు కిష్మతి యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులు ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనానికి వెళ్లకుండా వెనక్కి వచ్చారు. రద్దీ తగ్గే వరకు వేచి ఉండాలని భావించి మండపం పక్కనే ఉన్న దుకాణం వద్ద ఆగారు. మండపం సమీపంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారని, భారీగా భక్తులు వస్తున్నప్పటికీ తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన కవరింగ్ నుంచి నీరు పడటంతో విద్యుత్ లైట్ కూడా సమీపంలోని వారిపై పడిందని, దీంతో విద్యుత్ షాక్ తగిలిందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనలో తన పిల్లలు కల్పన, నేహా విద్యుత్ ప్రవాహానికి గురయ్యారని తెలిపారు.VIDEO | Maharashtra: Two persons, including an eight-year-old girl, were killed and several others injured in an electrocution incident near a Ganapati pandal in Mumbai's Lalbaug area early Sunday.The incident occurred near the Kalachowki Vibhag Sarvajanik Ustav Mandal on… pic.twitter.com/Tn1n7kpcxi— Press Trust of India (@PTI_News) September 20, 2026తన పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించినప్పుడు తానూ విద్యుత్ షాక్కు గురైనట్లు కిష్మతి యాదవ్ చెప్పారు. మండపం నిర్వాహకులు, సంబంధిత అధికారులు భద్రతా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారని ఆమె ఆరోపించారు. ఈ ఘటన అనంతరం గణేశ్ ఉత్సవాల వేళ తాత్కాలిక విద్యుత్ ఏర్పాట్ల భద్రతపై ఆందోళన నెలకొంది. విద్యుత్ షాక్కు ఖచ్చితమైన కారణం, బాధ్యులపై తదుపరి చర్యలపై అధికారుల దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది.మండపాల వద్ద భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..1. విద్యుత్ తీగలు, స్విచ్బోర్డులకు దూరంగా ఉండండి. బయటకు కనిపించే వైర్లు, తెగిన తీగలు, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లను తాకవద్దు. పిల్లలను వాటి దగ్గరకు వెళ్లనివ్వకండి.2. నీరు నిలిచిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి. వర్షపు నీరు నిలిచిన చోట్ల, విద్యుత్ పరికరాలు లేదా వైర్లు ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లవద్దు. తడిసిన వైర్లు, లోహపు స్తంభాలను తాకవద్దు.3. రద్దీ ఎక్కువగా ఉంటే వేచి ఉండండి. మండపంలోకి వెళ్లేందుకు తొందరపడవద్దు. తోపులాట చేయకుండా, నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్యూల్లోనే వెళ్లండి. రద్దీ పెరిగితే కొంతసేపు దూరంగా ఉండండి.4. అత్యవసర మార్గాలను ముందే గుర్తించండి. మండపంలోకి వెళ్లినప్పుడు బయటకు వెళ్లే మార్గాలు, అత్యవసర ద్వారాలు ఎక్కడున్నాయో గమనించండి. ప్రవేశ ద్వారాల వద్ద గుమిగూడవద్దు.5. విద్యుత్ ప్రమాదం కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి. తీగలు కిందపడటం, స్పార్కులు రావడం లేదా విద్యుత్ షాక్ తగిలినట్లు కనిపిస్తే వాటిని స్వయంగా సరిచేయడానికి ప్రయత్నించవద్దు. నిర్వాహకులు, విద్యుత్ సిబ్బంది లేదా అత్యవసర సేవలకు వెంటనే తెలియజేయండి.ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలితే ఏం చేయాలి?విద్యుత్ సరఫరా నిలిపివేసే వరకు బాధితుడిని నేరుగా తాకవద్దు. తడిగా ఉన్న నేలపై నిలబడి బాధితుడిని లాగేందుకు ప్రయత్నించవద్దు. విద్యుత్ సరఫరా నిలిపివేయాలని వెంటనే విద్యుత్ సిబ్బందికి, అత్యవసర సేవలకు సమాచారం ఇవ్వండి. విద్యుత్ సంబంధం పూర్తిగా తెగిందని నిర్ధారించిన తర్వాతే సురక్షితంగా సహాయం చేయాలి. బాధితుడికి వెంటనే వైద్య సహాయం అందించాలి. శ్వాస లేకపోతే, శిక్షణ ఉన్నవారు అత్యవసర సహాయం CPR ప్రారంభించాలి.
Mumbai: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు.. గణపతి మండపం వద్ద ఇద్దరు మృతి!
ముంబై: ముంబైలోని కోస్టల్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి వంతెన పైనుంచి కిందకు పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ముంబై పోలీసుల సమాచారం మేరకు.. మెరైన్ డ్రైవ్ నుంచి హాజీ అలీ వైపు కోస్టల్ రోడ్డు మీదుగా బీఎండబ్ల్యూ కారు అత్యంత వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో లాలా కాలేజీ ఎదురుగా, లోటస్ జెట్టీ సమీపంలోకి రాగానే వాహనం అదుపుతప్పి వంతెన పైనుంచి ఒక్కసారిగా కిందకు దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 5:20 గంటల ప్రాంతంలో కోస్టల్ రోడ్డు కంట్రోల్ రూమ్కు ఈ ప్రమాదంపై సమాచారం అందింది.ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జవగా, ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించారు. మృతుల్లో 21 ఏళ్ల షనాయ్ గజ్జల్, 17 ఏళ్ల ధిర్యా సేఠ్తో పాటు 25 ఏళ్ల గుర్తుతెలియని యువకుడు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో 20 ఏళ్ల గుర్తుతెలియని యువకుడిని సమీపంలోని ఆసుపత్రిలోని ట్రామా వార్డుకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. VIDEO | Maharashtra: Early Sunday, two individuals including an eight-year-old girl—lost their lives and several others sustained injuries after being electrocuted near a Ganapati pandal in Mumbai's Lalbaug area.Morning Visuals from Spot.(Full video available on PTI Videos -… pic.twitter.com/sOe36jnlVl— Press Trust of India (@PTI_News) September 20, 2026మరో ఘటనలో విద్యుదాఘాతంతో ఇద్దరి మృతిముంబైలోని కాలాచౌకీ ప్రాంతంలో ఆదివారం వేకువజామున మరో విషాదం చోటుచేసుకుంది. దత్తారామ్ లాడ్ మార్గ్లోని మహాగణపతి ఉత్సవ మండపం ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక తాగునీటి స్టాల్లో విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల బాలిక రాగిణి ఘనశ్యామ్ యాదవ్తో పాటు మరో వ్యక్తి మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.ఇదీ చదవండి: వైష్ణోదేవి హెలిపాడ్లో మంటలు.. తప్పిన ముప్పు
వైష్ణోదేవి హెలిపాడ్లో మంటలు.. తప్పిన ముప్పు
రియాసీ: జమ్ముకశ్మీర్లోని రియాసీ జిల్లా, త్రికూట పర్వతాలపై కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాతా వైష్ణోదేవి బేస్ క్యాంప్ కత్రాలోని హెలిపాడ్ టెర్మినల్లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో టెర్మినల్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఆ సమయంలో టెర్మినల్ మూసివేసి ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఆలయ సిబ్బంది, భద్రతా బలగాలు, అగ్నిమాపక అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగి సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో టికెట్ కౌంటర్లోని కొన్ని కంప్యూటర్లతో పాటు సమీపంలోని ఓ కాఫీ షాప్ అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు పేర్కొన్నారు. వైష్ణోదేవి రవాణా కేంద్రంలో జరిగిన ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: మోదీ జన్మదిన వేడుకలకు డుమ్మా.. విద్యార్థులకు నోటీసులు
దారుణంగా ఏఎస్ఐ హత్య.. ఎన్కౌంటర్లో నిందితుడు హతం
అమృత్సర్: పంజాబ్లో పోలీస్ ఏఎస్ఐ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI) హర్జిత్ సింగ్ను కాల్చిచంపిన కేసులో నిందితుడిగా ఉన్న దీపక్ సింగ్ పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈ కేసులో అతడికి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదితో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.అమృత్సర్లోని ముల్చక్కు చెందిన దీపక్ సింగ్ మరో వ్యక్తితో కలిసి శుక్రవారం ఏఎస్ఐ హర్జిత్ సింగ్ను వెంబడించి కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో హర్జిత్ సింగ్తో ఉన్న మరో వ్యక్తి కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, టవర్ డంప్ విశ్లేషణ, స్థానిక నిఘా ద్వారా సమాచారం సేకరించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి సుమారు 9.45 గంటలకు స్కూటర్పై వెళ్తున్న ఇద్దరు అనుమానితులను పోలీస్ చెక్పోస్టు వద్ద ఆపేందుకు ప్రయత్నించారు.అయితే వారు పోలీసులపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు ఆత్మరక్షణలో ఎదురుకాల్పులు జరిపారని, ఈ ఘటనలో దీపక్ సింగ్కు బుల్లెట్ గాయాలయ్యాయని చెప్పారు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.మరో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. కాల్పుల అనంతరం, పోలీసులు నిందితుల వద్ద నుంచి ఒక బోర్ పిస్టల్, రెండు మ్యాగజైన్లు, ఎనిమిది లైవ్ కార్ట్రిడ్జ్లు, మొబైల్ ఫోన్, నేరానికి ఉపయోగించినట్లు భావిస్తున్న హోండా యాక్టివా స్కూటర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.పాకిస్తాన్ ఉగ్రవాదితో లింకులపై దర్యాప్తుఈ హత్య వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదికి సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తులో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. పాకిస్తాన్లో ఉన్న ఓ ఉగ్రవాది నిందితులకు డబ్బు ఆఫర్ చేసి ఈ దాడికి పాల్పడేలా ప్రేరేపించినట్లు అనుమానిస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ అంశంపై పూర్తి ఆధారాలు, ఉగ్రవాది వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.ఇదీ చదవండి: భారత్కు భారీ ముప్పు.. 180 మంది శాస్త్రవేత్తల హెచ్చరిక
ఎన్ఆర్ఐ
భద్రతా కారణాలతో విజయ్ లండన్ కార్యక్రమం రద్దు
తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ కోసం లండన్లో భారీగా తరలివచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. లండన్లోని ప్రముఖ ‘ది షార్డ్’ భవనం వద్ద విజయ్ పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని భద్రతా కారణాలతో అధికారులు రద్దు చేశారు. వందలాది మంది అభిమానులు గంటల తరబడి వేచి చూసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.విజయ్ ప్రస్తుతం తమిళనాడుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో అధికారిక పర్యటనలో భాగంగా యూకేలో ఉన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు మంగళవారం ‘ది షార్డ్’ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పలువురు అభిమానులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి అక్కడే నిరీక్షించారు. అయితే భారీగా జనసమీకరణ జరగడంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.‘అనుమతి రాలేదు.. కార్యక్రమం రద్దు’భద్రతా కారణాలతో కార్యక్రమానికి అవసరమైన అనుమతి లభించలేదని విజయ్ బృందం ప్రకటించింది. లౌడ్స్పీకర్ ద్వారా అభిమానులకు సమాచారం అందిస్తూ.. ప్రజల భద్రత దృష్ట్యా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో విజయ్ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు అభిమానులు గంటల తరబడి ఎదురు చూసినట్లు పీటీఐ తెలిపింది.VIDEO | UK: Vijay fan greeting event in London called off due to 'health and safety' reasons after large number of people gather to see Tamil Nadu CM.Announcement was made by the authorities outside CM Vijay's hotel at the Shard in London on Tuesday.(Full video available on… pic.twitter.com/l4GDVUL6Fk— Press Trust of India (@PTI_News) September 15, 2026తలా-దళపతి.. విమర్శలకు టీవీకే కౌంటర్ఇదిలా ఉండగా.. విజయ్ లండన్ పర్యటనపై డీఎంకే విమర్శలు గుప్పించింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి లండన్ వెళ్లినట్లు చెబుతున్న విజయ్.. తన స్నేహితుడు, నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న కార్ రేసును వీక్షించడంపై డీఎంకే నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. పెట్టుబడుల పర్యటన పేరుతో వెళ్లి రేసు కార్యక్రమానికి హాజరయ్యారని విమర్శించారు. దీనిపై టీవీకే నేతలు స్పందిస్తూ.. విజయ్ అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ అజిత్ను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అంతేకాకుండా అంతర్జాతీయ రేసింగ్లో అజిత్కు ఉన్న గుర్తింపును తమిళనాడు బ్రాండ్ ప్రమోషన్కు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.పెట్టుబడుల కోసం విజయ్ యూకే పర్యటనఇదిలా ఉండగా విజయ్ యూకే పర్యటన ప్రధానంగా తమిళనాడుకు భారీ పెట్టుబడులను తీసుకురావడంపైనే సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో సుమారు రూ.12,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వీటి ద్వారా రాష్ట్రంలో 9,400కు పైగా హై-వాల్యూ ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తమిళనాడును ఆసియాలో అధునాతన తయారీ, సాంకేతిక రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పెట్టుబడుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విజయ్ తన యూకే పర్యటనను ముగించుకుని బుధవారం భారత్కు తిరిగి రానున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: విజయ్పై అనుచిత కామెంట్ల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
పట్టాలపై ప్రియుడితో ఎన్నారై యువతి.. క్షణాల్లో ఘోరం!
న్యూయార్క్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై కూర్చున్న ఓ జంటను రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన మలైకా చిత్రే (24)తో పాటు నేపాలీ-అమెరికన్ నవమ్ కౌల్ (24) ఉన్నారు. బలవన్మరణమా? లేదంటే మత్తులో అక్కడికి చేరారా?.. వీళ్లు పట్టాలపై ఎందుకు కూర్చున్నారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.లోయర్ మన్హాటన్లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సౌత్ వింగ్ వైపు వెళ్తున్న నంబర్ 4 రైలు పట్టాలపై ఉన్న ఇద్దరినీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటన తర్వాత రైలులో ఉన్న సుమారు 100 మంది ప్రయాణికులను బయటకు తరలించారు.ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో..మలైకా చిత్రే న్యూజెర్సీలోని డేటన్కు చెందినవారు. అకాడియా ఫార్మాస్యూటికల్స్లో ఆపరేషన్స్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నారు. నవమ్ కౌల్ సైరేవిల్లేకు చెందినవారు కాగా.. బ్లూమ్బర్గ్లో ఫైనాన్షియల్ డేటా అనలిస్ట్గా పనిచేస్తున్నారు. ఇద్దరూ రట్జర్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులే. దాదాపు ఒకే సమయంలో అక్కడి నుంచి పట్టాలు పొందారు.ఈ విషాదంతో వాళ్ల సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నవమ్ ఎంతో స్నేహపూర్వకంగా, సరదాగా ఉండేవాడని స్నేహితులు గుర్తుచేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు దాదాపు మూడు దశాబ్దాల క్రితం నేపాల్ నుంచి అమెరికాకు వలస వచ్చినట్లు తెలిపారు. మలైకా తెలివైన, చురుకైన విద్యార్థినిగా తమకు తెలుసని ఆమె కుటుంబానికి సమీపంలోని పొరుగువారు చెప్పారు. ఇంత చిన్న వయసులో ఇద్దరూ ఇలా ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.A tragic situation in Manhattan. Recent Rutgers graduates Navam Kaul and Malaika Chitre were killed after being struck by a southbound 4 train at Spring Street around 3:15 a.m. Sunday.Reports say Kaul went onto the tracks first and Chitre climbed down after him, apparently…— Shadab Chow 🇺🇸 (@tonyinmycity97) September 15, 2026వైరల్గా మారిన వీడియో..ఈ ఘటనకు ముందు ఓ వ్యక్తి తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్గా మారింది. అందులో మలైకా, నవమ్ ఇద్దరూ పట్టాలపై ప్రశాంతంగా కూర్చున్నట్లు కనిపిస్తోంది. రైలు వస్తున్న సమయంలోనూ వారు అక్కడే ఉన్నారు. అయితే రైలు డ్రైవర్ మాత్రం.. మలైకా నవమ్ను తన వైపునకు లాగుతున్నట్లు, ఆమె నవ్వుతున్నట్లు కనిపించిందని చెప్పినట్లు సమాచారం.ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. వారిలో ఒకరు ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయి ఉండొచ్చని, ఆమెను కాపాడేందుకు మరొకరు పట్టాలపైకి వెళ్లి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రైలు డ్రైవర్ వారిని గమనించి అత్యవసర బ్రేకులు వేసినా.. అప్పటికే రైలు సమీపంలోకి రావడంతో ఆపడం సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు.మత్తులో ఉన్నారా?ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు మద్యం లేదంటే ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉండి ప్రమాదాన్ని గుర్తించలేకపోయారా? అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే ఆత్మహత్య కోణాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేదని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఆ యాక్సిడెంట్తో స్పాట్లోనే చనిపోయేదాన్ని!
620 కోట్ల కుంభకోణం.. భారత్లో తలదాచుకున్న నిందితుడు!
అమెరికాలో సుమారు రూ. 620 కోట్ల విలువైన భారీ మెడికేర్ కుంభకోణానికి పాల్పడి, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఓ భారతీయ వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్లో తలదాచుకున్నట్లు తెలిసింది. మహమ్మద్ ఖదీర్ ఖాన్ అనే ఈ నిందితుడు నగరంలోనే ఉన్నాడని అమెరికా పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక అధికారులు అతడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.టెక్సాస్లోని రిచర్డ్సన్లో ఖదీర్ ఖాన్ 'అమెరికన్ ప్రీమియర్ ల్యాబ్స్' పేరుతో ఒక జెనెటిక్ టెస్టింగ్ ల్యాబొరేటరీని నిర్వహించేవాడు. 2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబర్ మధ్య కాలంలో, అమెరికా ప్రభుత్వ మెడికేర్ పథకం కింద సుమారు 93 మిలియన్ డాలర్ల విలువైన నకిలీ క్లెయిమ్లను అతడు సృష్టించాడు. వీటి ద్వారా ప్రభుత్వం నుంచి 65 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 620 కోట్లు) అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో తేలింది. వైద్యుల వివరాలు, సంతకాలను ఫోర్జరీ చేసి ఈ భారీ మోసానికి పాల్పడినట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్బీఐ, ఆరోగ్య శాఖల సంయుక్త విచారణలో వెల్లడైంది.ఈ కుంభకోణం బయటపడటంతో అధికారులు ఖాన్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి, అతడిని 'మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్'గా ప్రకటించారు. అయితే, అప్పటికే అతను అమెరికా నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఖాన్ హైదరాబాద్లోనే ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో, శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల జాబితాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరవ్యాప్తంగా గాలిస్తున్నారు.ఇదీ చదవండి: జేడీయూ యూటర్న్.. షాక్లో బీజేపీ!
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో అంతర్జాలంలో గూగుల్ మీట్ ద్వారా 14-Sep-2026 ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొన్నారు. సకల విఘ్నాలు తొలిగి అందరి పై వినాయకుని ఆశీస్సులు ఉండాలని వినాయకుడిని కోరారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ గారు అంతర్జాలం ద్వారా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు మరియు విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు , శివ ప్రసాద్ ఆవుల మరియు కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్ , యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం మరియు సుకేందర్ నీలం మొదలగు వారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అందరి పై శ్రీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియ జేశారు.ఈ వేడుకలకు సహకారం అందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏ వి ఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (కూల్ టైమ్ ఎయిర్కాన్ ఇన్స్టాలేషన్ & సర్వీస్), కామాక్షి సిల్వర్,గోల్డ్ & డైమండ్ , బులియన్ కింగ్ గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
మొదటి భార్యతో రిలేషన్ : కొడుకు, ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది!
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్త మొదటి భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడనే ఆగ్రహంతో తన ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య ఉదంతం కలకలం రేపింది. రామ్కిశోర్ వాల్మీకిగా గుర్తించిన బాధితుడి మృతదేహం సెప్టెంబర్ 17న భావఖేడ కాలువ సమీపంలోని ఒక బాక్సు (ట్రంక్)లో లభ్యం కావడంతో ఈ విషయం వెలుగు చూసింది.నిందితురాలు సుఫియా బానోకు రామ్కిశోర్తో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లైన రామ్కిశోర్ భార్యకు దూరంగా ఉంటున్నాడు. దీంతో రెండేళ్ల క్రితం ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సుఫియాకు మున్నా అలియాస్ ముచ్ఛద్ (52) అనే వ్యక్తితో సంబంధం ఉన్నట్లు రామ్కిశోర్కు తెలిసిపోయింది. దీనిపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీనికితోడు రామ్కిశోర్ తన మొదటి భార్య కవితా దేవిని మళ్లీ కలుసుకోవడం, ఆర్థిక సాయం చేయడం మొదలుపెట్టాడు. దీన్ని సుఫియా వ్యతిరేకించింది. ఫలితంగా వివాదం మరింత ముదిరింది.హత్యకు పథకం మొదటి భార్యతో రామ్కిశోర్ సాన్నిహిత్యాన్ని సహించలేని సుఫియా.. తన ప్రియుడు మున్నా, అతని సహచరుడు ఇక్బాల్తో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. సెప్టెంబర్ 14-15 మధ్య రాత్రి సమయంలో తన ప్రియుడు మున్నాను, అతని సహచరుడు ఇక్బాల్ను తన ఇంటికి ఆహ్వానించి, తలుపు గడియ పెట్టకుండా వదిలేసింది. నిద్రపోతున్న రామ్కిశోర్పైకి ఎటాక్ చేసిన దుండగులు అతనిని కత్తితో పొడిచి చంపారు.హత్య తర్వాత నేల మీద అంటిన రక్తపు మరకలను ప్లాస్టరింగ్ చేసి, రక్తంతో ఉన్న చీపురు, బాధితుడి దుస్తులు, కత్తిని దాచిపెట్టారు. ఆ తర్వాత తన 16 ఏళ్ల కుమారుడి సహాయంతో మృతదేహాన్ని మంచం కింద ఉన్న చెక్క పెట్టెలో దాచారు. మరుసటి రోజు రాత్రి ఆ మృతదేహాన్ని ఈ-రిక్షాలో తీసుకెళ్లి కాలువ వంతెన కింద పడవేశారు. ఇదీ చదవండి: పూణె వ్యాపారి కిడ్నాప్ కేసు ట్విస్ట్ : మలేషియా ట్రిప్ అని చెప్పి!సెప్టెంబర్ 17న రామ్కిశోర్ మొదటి భార్య కవితా దేవి మోహన్లాల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అదే రోజు మృతదేహాన్ని కనుగొన్నారు. సుమారు 180 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఈ-రిక్షా ఆధారంగా కేసు చేధించారు.నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పూణె వ్యాపారి కిడ్నాప్ కేసు ట్విస్ట్ : మలేషియా ట్రిప్ అని చెప్పి!
ప్రియురాలితో కలిసి మలేషియా టూర్ ఎంజాయ్ చేసొద్దామని భావించిన ఒక వ్యాపారవేత్తకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పూణెకు చెందిన ఒక వ్యాపారవేత్త, తాను బిజినెస్ ట్రిప్ అని చెప్పి మరో మహిళతో కలిసి మలేషియా వెళ్లాలని ప్లాన్ వేశాడు. కట్ చేస్తే...వ్యాపార పర్యటన నిమిత్తం తాను మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తున్నట్లు తన భార్యకు చెప్పాడు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత కనిపించడం లేదంటూ భార్య కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే, తాను మరో మహిళా స్నేహితురాలితో కలిసి ప్రయాణిస్తున్న నిజం బయటపడకుండా ఉండేందుకే ఆయన ఇమ్మిగ్రేషన్ సమస్యలంటూ అబద్ధం ఆడినట్లు పోలీసులు తెలిపారు.లాండ్రీ వ్యాపారం చేసే 46 ఏళ్ల ఆ వ్యాపారి, బిజినెస్ ట్రిప్ పేరుతో సెప్టెంబర్ 14న ఒక మహిళా స్నేహితురాలితో కలిసి కౌలాలంపూర్ వెళ్లాలని ప్లాన్ చేశారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో ఆ మహిళ గతంలో పోగొట్టుకున్నట్లు ప్రకటించిన పాత పాస్పోర్ట్తో ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆమెను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఇదీ చదవండి: కాటేసిన పాముతో ఆసుపత్రికి : పాము హల్చల్, వణికిన రోగులుభార్యకు అబద్దం చెప్పి..!చట్టపరమైన చిక్కులు రావడం, మరో మహిళతో ప్రయాణిస్తున్న విషయం భార్యకు తెలిసిపోతుందనే భయంతో ఇమ్మిగ్రేషన్ సమస్యలంటూ కట్టుకథ చెప్పాడు. అక్కడితో ఆగలేదు విమానాశ్రయం ల్యాండ్లైన్ నుంచి భార్యకు ఫోన్ చేసి, ఇమ్మిగ్రేషన్ సమస్యల వల్ల తన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారని అబద్ధం చెప్పాడు. మళ్లీ మరుసటి రోజు వాట్సాప్ వీడియో కాల్లో కూడా సేమ్ స్టోరీ రిపీట్ చేశాడు. ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. దీంతో ఆందోళన చెందిన భార్య బుధవారం పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కిడ్నాప్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.తనపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి బుధవారం రాత్రి సాహర్ పోలీస్ స్టేషన్కు వచ్చి తానే అబద్ధం ఆడినట్లు అంగీకరించారు. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల్లో కోర్టులో "సి సమ్మరీ" (C Summary) క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి : గంటలో 106 పుల్-అప్స్ : చీరకట్టుతో నటి ఫిట్నెస్ ఫీట్
హఫీజ్పేట్ హోంగార్డ్ ఎపిసోడ్లో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై హోంగార్డ్ దాడి చేసిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా హోంగార్డ్ ఆనంద్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించిన అనంతరం రిమాండ్కు తరలించినట్లు వీడియోను రిలీజ్ చేశారు.వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మహిళపై సదరు హోంగార్డు విచక్షణారహితంగా దాడి చేశాడు. తనతో వాగ్వాదానికి దిగడంతో మహిళపై హోంగార్డు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా, అతడు హఫీజ్పేట్ రైల్వే స్టేషన్లో డిప్యూటేషన్పై అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటన అనంతరం హోంగార్డును తిరిగి తెలంగాణ పోలీస్ శాఖకు రైల్వే అధికారులు పంపించేశారు. అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సైతం తెలిపారు.https://t.co/NEZsAOdnPg pic.twitter.com/iIuyboVgfB— CV Anand IPS (@CVAnandIPS) September 19, 2026డీజీపీ సీరియస్..మరోవైపు ఈ ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. వెంటనే హోంగార్డ్ ఆనంద్పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది ఏ స్థాయి వారైనా.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఇలాంటి ప్రవర్తనను క్షమించలేమన్నారు. ఇది శిక్షణ, ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు. మహిళ పట్ల హోంగార్డు ప్రవర్తన ఖండించదగినదని డీజీపీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు.. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండ్ కేటీఆర్ కూడా స్పందించారు. ఎక్స్ వేదికగా కేటీఆర్.. పోలీసుల ప్రవర్తన అత్యంత దారుణంగా ఉందని మండిపడ్డారు. డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వీడియోను కూడా కేటీఆర్ షేర్ చేశారు. This is atrocious behaviour by Telangana police Hope you will act @TelanganaDGP https://t.co/CFA6SWxDUe— KTR (@KTRBRS) September 19, 2026
స్పాల్లోకి వెళ్లిన పోలీసులు.. లోపల సీన్ చూసి షాక్!
స్పా సెంటర్ల మాటున చీకటి దందాలు జరగడం కొత్తేమీ కాదు. అయితే పోలీసుల తనిఖీల్లో సైతం బయటపడకుండా కొందరు నిర్వాహకులు పక్కా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఇలాంటి నేపథ్యంలో ఓ ప్రముఖ మాల్లోని స్పా సెంటర్లపై పోలీసులు చడీచప్పుడు లేకుండా మెరుపుదాడులు నిర్వహించారు. ఒకటి కాదు.. ఏకంగా 18 స్పాల్లో ఒకేసారి సోదాలు చేశారు. అయితే అక్కడ లోపల కనిపించిన సీన్లు, అక్కడ లభించిన వస్తువులు చూసి పోలీసులే అవాక్కయ్యారు.హరియాణాలోని గురుగ్రామ్లో గత రాత్రి జరిగిన స్పా సెంటర్లపై గురుగ్రామ్ పోలీసులు, హరియాణా రాష్ట్ర మహిళా కమిషన్ జాయింట్గా నిర్వహించిన తనిఖీలు.. ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీశాయి. ఆ సమయంలో తలుపులు తీయకుండా నిర్వాహకులు ప్రయత్నించగా.. వెల్డింగ్ మెషీన్లతో తెరిపించి బలవంతంగా పోలీసులు లోపలికి వెళ్లారు. Gurugram में आधी रात 18 मसाज पार्लरों पर चला ग्राइंडर, 100 पुलिसकर्मियों ने मारे छापे, 40 युवक युवतियां मिली, एक ही मॉल में चल रहे थे सभी स्पा सेंटर, मसाज की आड़ में देहव्यापार का काला कारोबार#SpaCentre #SapphireMall #GurugramNews #GurgaonNews #SexRacket pic.twitter.com/TcYpsHu2Q3— Gurugram News गुरुग्राम न्यूज़ (@TheGurugramNews) September 19, 2026లోపల మరో ప్రపంచమే!సెక్టార్-90లో ఉన్న సఫైర్ 90 మాల్లో గత అర్ధరాత్రి ఈ భారీ ఆపరేషన్ జరిగింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సుమారు ఐదు గంటలపాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉషా ప్రియదర్శిని, ఆమె బృందం, డ్యూటీ మేజిస్ట్రేట్ సమక్షంలో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. స్పా సెంటర్ల కోసం ఏర్పాటు చేసిన బోర్డుల వెనుక.. ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. ఆ తలుపులు తెరిచి లోపలికి వెళ్లగా.. లోపల దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. అలాగే కొన్ని స్పా కేంద్రాలకు బయట నుంచి తాళాలు వేసి ఉండగా.. తెరిచి లోపలికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. లోపల ప్రత్యేక గదులతో పాటు సెక్స్ టాయ్స్, కొన్ని వస్తువులు కనిపించాయి. అలాగే 30 మంది మహిళలు, 20 మంది పురుషులు అభ్యంతరకర పరిస్థితుల్లో కనిపించారు. వాళ్లలో కొందరు వీడియోలు తీయొద్దంటూ పోలీసులను వేడుకున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. కొందరు నిర్వాహకులు అందులోని వస్తువుల్ని డస్ట్ బిన్లలో పడేసి దాక్కునే ప్రయత్నం చేశారు. తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ సోదాలు కొనసాగగా.. దాదాపు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. ఆ సెంటర్ల నుంచి ఎలక్ట్రానిక్, డిజిటల్ పరికరాలతో పాటు ఇతర వస్తువులు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాళ్లందరినీ స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ జరుపుతున్నారు. అసలు.. అంత పెద్ద మాల్లో చీకటి కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి? వాటి వెనుక ఎవరున్నారు? ఎవరైనా పెద్దల పాత్ర ఉందా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.#WATCH | Gurugram, Haryana: The Haryana Women’s Commission and Gurugram Police conducted a joint operation at a Sector 90 mall, raiding 18 spa centres. Several objectionable items and suspected narcotic substances were also recovered. (18.09) pic.twitter.com/9NpIoOqhCB— ANI (@ANI) September 19, 2026
వీడియోలు
గన్నవరం CI లంచావతారం.. నడి రోడ్డుపై నిలదీసిన MLA
మళ్లీ ఖాకీ చొక్కాలో సూర్య.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే.!
ఫటా ఫటా ఫ్లెక్సీలు మార్చినట్టు కండువా మార్చేశాడు.. జగన్ వస్తే నీ పరిస్థితి ఏంటో నీ ఊహకే వదిలేస్తున్నా!
ఏపీకి 5 రోజులు భారీ వర్షాలు
వైష్ణవి కేసులో సంతోష్ అరెస్ట్
ఫ్లైఓవర్ పై నుంచి పడిన BMW.. కారు తుక్కు తుక్కు
టీమిండియాకు మరో తలనొప్పి.. ఆసియా గేమ్స్ లో నఖ్వీ ఎంట్రీ...
వెయ్యేళ్ల ప్రళయం.. ముంచెత్తబోతున్న రాకాసి జలపాతం!
కాకా కేక పెట్టిస్తాది..! విశ్వంభర గురించి చెప్పలేను
ఆ బూత్ బంగ్లా నుంచి డెడ్ బాడీ.. సాయి కృష్ణ కేసుపై అడ్వకేట్ రజిని షాకింగ్ నిజాలు
