ఈ వయసులో ఇలాంటి డ్రామా చేయడం సిగ్గుచేటు!
సంచలనాలకు కేరాఫ్ నటి త్రిష అంటే అతిశయోక్తి కాదు. మోడలింగ్ రంగం నుంచి సినీ రంగంలోకి ఎంట్రి ఇచ్చిన ఈ మిస్ చెన్నై.. జోడి అనే చిత్రంలో నటి సిమ్రాన్కు స్నేహితురాలిగా ఒకటి రెండు సన్నివేశాల్లో మెరిసి మాయమైయ్యారు. అలాంటి త్రిష ఇండియన్ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికిగా వెలిగి పోతాలని బహుశా ఆమే ఊహించి ఉండరు. ఆ తర్వాత తమిళం,తెలుగు చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. కెరీర్ పరంగా రెండు దశాబ్దాలను అధిగమించినా ఇప్పటికీ ఎవర్గ్రీన్ హీరోయిన్గా సత్తా చాటుతున్నారు. తాజాగా సూర్య సరసన నటించిన కరుప్పు చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో మరోసారి వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలోనే కార్తీకి జంటగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఇటీవల సినీ, రాజకీయ వర్గాల్లో పలు వివాదాల్లో చిక్కుకుని త్రిష వార్తల్లో నానుతున్నారు. అయినా తగ్గేదేలేదు అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో తన భావాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అలా తాజాగా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఆమె ఏమన్నారంటే ‘‘ ఈ వయసులోనూ ఇంత నాటకం సిగ్గు చేటు. పోయి డబ్బు సంపాదించి ప్రశాంతంగా జీవించండి’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. త్రిష మాటల్లో అర్థం ఏంటి? ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? అనే ప్రశ్నలను సంధిస్తున్నారు నెటిజన్లు.
AUG 15 SPECIAL : దేశభక్తిని రగిలించిన తెలుగు గీతాలివే.. ఎవరు పాడారంటే!
స్వాతంత్ర్య దినోత్సవం వచ్చిందంటే దేశమంతా త్రివర్ణ పతాకాలతో కళకళలాడుతుంది. మరోవైపు దేశభక్తి గీతాలు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో వచ్చిన కొన్ని పాటలు తరతరాలుగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ, దేశం పట్ల ప్రేమను పెంచుతూ వచ్చిన అలాంటి కొన్ని సినీ గీతాలను ఓసారి గుర్తు చేసుకుందాం.'తెలుగు వీర లేవరా' - అల్లూరి సీతారామరాజుసూపర్స్టార్ కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు' చిత్రంలోని ఈ పాట దేశభక్తి గీతాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఘంటసాల ఆలపించిన ఈ గీతం నేటికీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తప్పకుండా వినిపిస్తుంది.'పుణ్యభూమి నా దేశం' - మేజర్ చంద్రకాంత్సీనియర్ ఎన్టీఆర్ చివరి చిత్రంగా గుర్తింపు పొందిన 'మేజర్ చంద్రకాంత్' సినిమాలోని ఈ పాట తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జాలాది రాజారావు సాహిత్యం అందించిన ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికీ జాతీయ పండుగల సందర్భంగా మారుమోగుతూనే ఉంటుంది.'సైనికా' - నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాఅల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలోని 'సైనికా' పాట భారత సైనికుల త్యాగాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని జవాన్ల జీవితాన్ని ఈ పాట అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ పాటను విశాల్ దడ్లానీ ఆలపించగా, విశాల్-శేఖర్ సంగీతం అందించారు. రామ్జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని రాశారు.'దేశమంటే' - ఝుమ్మంది నాదంమంచు మనోజ్ హీరోగా నటించిన 'ఝుమ్మంది నాదం' చిత్రంలోని ఈ పాట దేశం పట్ల ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ పాటను ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం, చిన్ని చరణ్, విజయ్ యేసుదాస్ ఆలపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూర్చారు.'వందేమాతరం'- మహాత్మాశ్రీకాంత్ హీరోగా నటించిన 'మహాత్మా' చిత్రంలోని 'వందేమాతరం' పాట దేశభక్తిని ఆధునిక కోణంలో ఆవిష్కరించింది. ఈ పాటను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. విజయ్ ఆంటోనీ సంగీతం అందించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని రాశారు.'ఓ బాపూ నువ్వే రావాలి' - శంకర్ దాదా జిందాబాద్మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంలోని ఈ పాటలో మహాత్మా గాంధీ సిద్ధాంతాలను గుర్తు చేశారు. ఈ పాటను సాగర్, దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని రాశారు.'వందే మాతరం' - లీడర్రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన 'లీడర్' చిత్రంలోని ఈ పాట యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దేశం అంటే కేవలం నేల మాత్రమే కాదని, ప్రజలే దేశమనే సందేశాన్ని ఈ పాట బలంగా వినిపించింది.
వెలుగునీడల ‘స్వాతంత్య్రం’
స్వతంత్ర భారతం నేటితో ఎనభయ్యో వసంతంలోకి అడుగుపెడుతోంది. దేశం ఈ 21వ శతాబ్దిలో ఎటు పయనిస్తున్నదని తరచి చూసుకుని, చక్కదిద్దుకోవాల్సిన సందర్భం ఇది. 1947 ఆగస్టు 15 నాటికి ఈ దేశం 565 సంస్థానాలుగా ఉంది. వలస పాలకులు చెప్పి నట్టల్లా ఆడి, ఇక్కడి సంపదను సంస్థానాధీశులు దోచిపెట్టడంతో ఆసేతుహిమాచలం దారిద్య్రం తాండవిస్తున్నది. తలసరి ఆదాయంలో ప్రపంచంలోనే అట్టడుగునున్నాం. ఆహార ధాన్యాల కొరత అంతా ఇంతా కాదు. వీటిని అధిగమించి పురోగమించటం ఎలా అన్న సంశయం అందరినీ పట్టిపీడిస్తున్నవేళ గోరు చుట్టుపై రోకటిపోటులా మతకల్లో లాలు వచ్చిపడ్డాయి. వేలాదిమంది నెత్తుటి తర్పణంతో ఈ గడ్డ తడిసి ముద్దయింది.హిందూ–ముస్లిం ఐక్యత కోసం స్వాతంత్య్రోద్యమ సారథి గాంధీజీ తన ప్రాణాలనే బలిపెట్టాల్సివచ్చింది. ఆ పరిస్థితుల్ని చూసినవారు ఈ దేశం సమైక్యంగా మనుగడ సాధించగలదా అన్న సందేహంలో పడిపోయారు. భిన్న భాషలు, మతాలు, సంప్ర దాయాలు, సంస్కృతిగల ఈ గడ్డ పురోగతి సాధించటం అసాధ్యమని సంశయపడ్డ వారున్నారు. కానీ భిన్నత్వంలో ఏకత్వాన్ని, వైవిధ్యతలో విశ్వాసాన్ని దర్శించగలిగిన సామాన్య జనమే ఈ దేశాన్ని నడిసంద్రంనుంచి తీరానికి చేర్చారు. మరి ఇప్పుడో... బహుళ రంగాల్లో పురోగమించాం. ఆహార ధాన్యాల దిగుమతి స్థాయినుంచి ఎగుమతి చేసే స్థాయికెదిగాం. ప్రపంచంలో అతి వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం కూడా ఒకటి. అతిపెద్ద స్టార్టప్ నెట్వర్క్లో ప్రపంచంలో మనది మూడో స్థానం. జనగణన పూర్తికాకపోవటంతో తాజా పరిస్థితిపై సాధికారకమైన గణాంకాలు లేకున్నా అక్షరాస్యత 77.7–80 శాతం మధ్య ఉందంటు న్నారు. స్వాతంత్య్రానికి పూర్వం మహిళల్లో అక్షరాస్యత దాదాపు 9 శాతమైతే, ఇప్పుడది 70.3 శాతానికి చేరింది. గతంతో పోలిస్తే మెరుగైన వైద్య సదుపాయాలు సామాన్యులకు అందుబాటులోకి రావటంతో సగటు ఆయుఃప్రమాణం 71.5 సంవత్సరాలకు చేరుకుంది. నవజాత శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. 1951 నాటికి వెయ్యి శిశువులకూ 146 మరణాలు నమోదుకాగా, ఇప్పుడది 17. ప్రపంచంలోనే అత్యధిక పోలియో కేసులున్న దేశంగా ముద్రపడిన భారత్ ఇప్పుడు ఆ వ్యాధిని పూర్తిగా తరమ గలిగింది. ఒకనాడు పేదరికం 60 శాతం ఉండగా, ఇప్పుడది 12 శాతం లోపు. కానీ గణాంకాలు వాటికవే వాస్తవ స్థితిని ప్రతిబింబించలేవు. చివరి వ్యక్తికి సైతం సంక్షేమం అందటమే నిజమైన అభివృద్ధికి కొలమానమని గాంధీజీ ఎప్పుడో చెప్పారు. ఆ విషయంలో సాధించాల్సిందెంతో ఉంది. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావటంవల్ల ధనిక–పేద తారతమ్యం పెరిగింది. పేరుకు డిగ్రీలున్నా మన యువతలో నైపుణ్యాల కొరతవల్ల వారికి సరైన ఉపాధి లభించటం లేదు. అసలు విద్యారంగమే పేద, ధనిక వ్యత్యాసాలతో నిండింది. ప్రామాణికమైన విద్య ఖరీదైంది కావటంతో అత్యధికులు దాన్ని అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వాలు ప్రైవేటు మోజులోపడి విద్యావ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దేశంలో మొదటిసారి నెలకొల్పిన కొఠారి కమిషన్(1964–66) మొదలుకొని 2020 నాటి జాతీయ విద్యావిధానం వరకూ విద్యకు జీడీపీలో 6 శాతం కేటాయించాలని సిఫార్సు చేస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పుడూ అది 4 శాతానికి మించటంలేదు. వైద్యరంగానికీ అంతే. అది ఎప్పుడూ 2.5 శాతం మించదు. మహిళా సాధికారత పెరిగిందనీ, వారు సైతం భిన్న రంగాల్లో నాయకత్వ పాత్ర పోషిస్తున్నారనీ సంబర పడటమే తప్ప మహిళలపై నేరాలను అరికట్టడంలో, జెండర్ వివక్షను నిర్మూలించటంలో ఇంకా వెనకబడే ఉన్నాం. సామాజిక మాధ్యమాల ఆసరాతో మహిళలపై వివక్ష, భావోద్వేగాలు రెచ్చగొట్టడం మరింత పెరిగింది. ఏ పార్టీకీ, సిద్ధాంతానికీ చెందని జెన్ జీ యువత ఇక్కడంతా సవ్యంగా ఉన్నదన్న భ్రమల్ని బద్దలుకొట్టింది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ జంతర్మంతర్ ఉద్యమానికి తక్షణసందర్భం కావొచ్చుగానీ... నాసిరకం విద్య, నిరుద్యోగం, అగమ్యగోచర భవిష్యత్తు వారిని నిరాశానిస్పృహల్లోకి నెట్టాయి. కష్టించే స్వభావమూ, కలల్ని సాకారం చేసుకునే పట్టుదల గల యువత కోసం ఇంకేమి చేయాలో గ్రహించగలిగే వివేకం పాలకుల్లో కలిగినప్పుడే దేశం నిజమైన పురోగతి సాధించగలుగుతుంది.
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.తదియ రా.7.31 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: పుబ్బ ఉ.6.25 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: ప.1.36 నుండి 3.12 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.46 నుండి 7.26 వరకు, అమృత ఘడియలు: రా.12.10 నుండి 1.44 వరకు.సూర్యోదయం : 5.46సూర్యాస్తమయం : 6.24రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకుమేషం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకోని మార్పులు.వృషభం: కుటుంబంలో కొన్ని సమస్యలు తప్పవు. అనారోగ్యం. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.మిథునం: నూతన ఉద్యోగాలు లాభిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.కర్కాటకం: వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.సింహం: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.కన్య: రుణదాతల ఒత్తిడులు. పనుల్లో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.తుల: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. విద్యార్థులకు కార్యసిద్ధి. వృత్తి, వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి.వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. కొత్త వ్యక్తుల పరిచయం. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.ధనుస్సు: మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.మకరం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.కుంభం: రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. నిరుద్యోగులకు అనుకూలం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
స్వాతంత్ర్య వేడుకలకు రెండోసారి రాహుల్ డుమ్మా.. కారణం అదేనా?
ఓ లుక్కేయండి..? టాయిలెట్లోనే ఐడియాలు ఎందుకు వస్తాయి?
లైవ్ మ్యాచ్లో ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్.. లక్ష జరిమానా!
పల్లెటూరి యువకుడి నుంచి నాసాతో ఒప్పందం వరకు..
జెన్ జీ: ఎవరి గోల వద్దు.. నా లైఫ్ నాదే!
అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే..
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ సందేశం
బావిలో విషవాయువు.. క్షణాల్లో నలుగురి మృతి
రోజూ కనిపించే సమస్య.. ఇప్పుడు పెద్ద బిజినెస్!
ఈ వయసులో ఇలాంటి డ్రామా చేయడం సిగ్గుచేటు!
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
అబ్బే! ఆయన అడిగేది క్రికెట్ స్కోరు కాద్సార్.. మన రోజువారీ అప్పు
చంద్రబాబు వస్తే వర్షాలు రావంటున్నారు - టీడీపీ నేత జేసీ
ఫోన్కు బానిసై, ఆస్పత్రిలో చేరిన షకీలా.. నరకయాతన!
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఆరాధ్య బచ్చన్ కేసు: ‘ఇంటి పేరు ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా’
మళ్లీ మీకు ఇబ్బంది లేకుండా ఇంటి ముందే ఆఫీసు తెరిచార్సార్!
విమానం కాదు! మన సారే సీక్రెట్గా వెళ్తున్నారు!
బాబు రాయబారం ఫెయిల్.. ఝలక్ ఇచ్చిన పవన్!
అఫ్గానిస్తాన్ ఓపెనర్ వరల్డ్ రికార్డ్
'అగధ' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓవరాక్షన్ వద్దు.. ఆట కంటే గొప్పోడివా?: స్మిత్పై ఫైర్
ఈ రాశి వారు వాహనాలు, ఆభరణాలు కొంటారు
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
విశ్వనాథ్ అండ్ సన్స్.. ఎవరికెంత రెమ్యునరేషన్?
ఇకపై రోడ్డుపై పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లే!
కార్మికశాఖ దగ్గరకు ఐటీ ఉద్యోగులు.. స్పందించిన విప్రో
బీజేపీకి వార్నింగ్ బెల్స్.. సీఎం కుర్చీకే ముప్పు?
రూ.50 కూలీ.. రూ.4,000 కోట్ల బడ్జెట్ సినిమాకు స్టార్ హీరో
స్వాతంత్ర్య వేడుకలకు రెండోసారి రాహుల్ డుమ్మా.. కారణం అదేనా?
ఓ లుక్కేయండి..? టాయిలెట్లోనే ఐడియాలు ఎందుకు వస్తాయి?
లైవ్ మ్యాచ్లో ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్.. లక్ష జరిమానా!
పల్లెటూరి యువకుడి నుంచి నాసాతో ఒప్పందం వరకు..
జెన్ జీ: ఎవరి గోల వద్దు.. నా లైఫ్ నాదే!
అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే..
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ సందేశం
బావిలో విషవాయువు.. క్షణాల్లో నలుగురి మృతి
రోజూ కనిపించే సమస్య.. ఇప్పుడు పెద్ద బిజినెస్!
ఈ వయసులో ఇలాంటి డ్రామా చేయడం సిగ్గుచేటు!
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
అబ్బే! ఆయన అడిగేది క్రికెట్ స్కోరు కాద్సార్.. మన రోజువారీ అప్పు
చంద్రబాబు వస్తే వర్షాలు రావంటున్నారు - టీడీపీ నేత జేసీ
ఫోన్కు బానిసై, ఆస్పత్రిలో చేరిన షకీలా.. నరకయాతన!
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఆరాధ్య బచ్చన్ కేసు: ‘ఇంటి పేరు ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా’
మళ్లీ మీకు ఇబ్బంది లేకుండా ఇంటి ముందే ఆఫీసు తెరిచార్సార్!
విమానం కాదు! మన సారే సీక్రెట్గా వెళ్తున్నారు!
బాబు రాయబారం ఫెయిల్.. ఝలక్ ఇచ్చిన పవన్!
అఫ్గానిస్తాన్ ఓపెనర్ వరల్డ్ రికార్డ్
'అగధ' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓవరాక్షన్ వద్దు.. ఆట కంటే గొప్పోడివా?: స్మిత్పై ఫైర్
ఈ రాశి వారు వాహనాలు, ఆభరణాలు కొంటారు
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
విశ్వనాథ్ అండ్ సన్స్.. ఎవరికెంత రెమ్యునరేషన్?
ఇకపై రోడ్డుపై పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లే!
కార్మికశాఖ దగ్గరకు ఐటీ ఉద్యోగులు.. స్పందించిన విప్రో
బీజేపీకి వార్నింగ్ బెల్స్.. సీఎం కుర్చీకే ముప్పు?
రూ.50 కూలీ.. రూ.4,000 కోట్ల బడ్జెట్ సినిమాకు స్టార్ హీరో
ఫొటోలు
అఖిల్ రాజ్, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
వెకేషన్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)
'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)
మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)
హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)
'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)
'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
కర్నూలులో వైఎస్ జగన్కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)
'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్ (ఫొటోలు)
సినిమా
‘సినిమా అంటే వంద కుటుంబాల సమూహం’
కన్నడ నటుడు భార్గవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. ఈ చిత్రంలో మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే తెలుగు, కన్నడ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మేరకు పూజా కార్యక్రమాల్ని శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బండి నాగరాజు నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఎమోషనల్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందనుంది. జైభార్గవ్, మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్, కాదంబరి కిరణ్, కిల్లి క్రాంతి, అనంత ప్రభు, టేస్టీ తేజ, సాయి కిషోర్, నితిన్, తదితరులు నటించనున్నారు.హీరో, డైరెక్టర్ భార్గవ్ మాట్లాడుతూ ‘ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు పాటలో ఎంత వైబ్ ఉందో ఈ సినిమాలోనూ అలాంటి ఫీల్ ఉంటుంది. ఈ చిత్రంతో తెలుగులో సినీ ప్రయాణం మొదలు పెట్టడం సంతోషంగా ఉంది. సినిమా అంటే వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. నాగరాజు సినిమా పట్ల ప్యాషన్ ఉన్న నిర్మాత. మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. రోహిత్ సూపర్ హిట్ సాంగ్స్ అందించారు’ అని అన్నారు.
'కొంచెమైనా సిగ్గుండాలి.. కూతురి వయసున్న అమ్మాయితో'
బాలీవుడ్ నటుడు గోవిందా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇన్నాళ్లు గోవిందాను వెనకేసుకొచ్చిన సునీత.. ఈ సారి మాత్రం గట్టిగానే కడిగేస్తోంది. ఇటీవల గోవిందా నటి కోమల్ రాణి స్వర్ణకర్తో కనిపించడంతో సునీత ఫైరవుతోంది. తన కూతురు వయసున్న అమ్మాయితో తిరుగుతున్నాడు.. గోవిందాకు కొంచెమైనా సిగ్గుండాలని ప్రశ్నించింది.ఇటీవల ముంబయి విమానాశ్రయంలో గోవిందాతో పాటు నటి కోమల్ రాణి స్వర్ణకర్ జంటగా కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా? అంటూ నెట్టింట చర్చ మొదలైంది. ఇది చూసిన కొందరు గోవిందా భార్య సునీత అహుజాను ప్రశ్నించారు. దీంతో ఆమె తనదైన శైలిలో స్పందించింది. అసలు వీళ్లిద్దరు సినిమా తీయకుండానే ప్రమోషన్స్ చేస్తున్నారా? అంటూ మండిపడింది. అతను తన కూతురి వయస్సులో ఉన్న అమ్మాయితో తిరుగుతున్నాడు... కనీసం కొంచెమైన సిగ్గుండాలి కదా సునీత నిలదీసింది.కోమల్ రాణి స్వర్ణకర్ ఎవరు?కోమల్ రాణి స్వర్ణకర్ బాలీవుడ్లో ఎంట్రీకి సిద్ధమైంది. గోవింద ఇటీవలే 'రూపా', 'దునియాదారి' చిత్రాలను ప్రకటించారు. వీటిలో 'రూపా' చిత్రంలో రాణి స్వర్ణకర్ను కథానాయికగా పరిచయం చేశారు. ఈ ప్రాజెక్టులను గోవిందానే నిర్మిస్తున్నారు. దీంతో గోవింద రాబోయే రెండు ప్రాజెక్టులలోనూ ఆమె భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
‘హుషారు పిట్టలు’ మూవీ రివ్యూ
అన్షు, వాసవి గణేషన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించారు. బిక్షు దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ షో వేశారు మేకర్స్. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..తెలంగాణలో ఓ గ్రామానికి చెందిన రవి(అన్షు) టెన్త్ క్లాస్ టాపర్. చదవు తప్ప ఇంకేమి తెలియదు. అలాంటి వాడికి ఆ ఊర్లో ఉండే రవి బ్యాచ్ బలవంతంగా అశ్లీల వీడియోలు చూపించి.. అతనిని వాటికి అడిక్ట్ అయ్యేలా చేస్తాడు. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన పుట్ట చిట్టి(వాసవి గణేశన్)... స్కూల్ టాపర్ అయిన రవికి ఆకర్షితురాలవుతుంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన ఆకర్షణ కాస్తా... ఇద్దరూ ఒక్కటయ్యేంత వరకూ వెళుతుంది. దాంతో రవి చదువు పక్కదారి పడుతుంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన టీనేజ్ ఆకర్షణ... చివరకు కడుపు తెచ్చుకునే దాకా వెళ్తుంది. దాంతో వీరిద్దరు వివాహం చేసుకోవాలనుకుంటారు. అందుకు పెద్దలు అంగీకరించారా? వీరి టీనేజ్ లవ్ స్టోరీ చివరకు ఎలాంటి మలుపులు తిరిగింది? అసలు పుట్ట చిట్టి అంత చిన్న వయసులోనే శారీరక వాంఛలకు ఎందుకు ఆకర్షితురాలైంది? తెలిసి తెలియని వయసులో చేసిన తప్పు వీరిద్దరి జీవితంలో ఎలాంటి మలుపులు తీసుకొచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. నేటి 5జీ ప్రపంచంలో సెల్ఫోన్ పిల్లల చేతిలో ఓ సాధారణ వస్తువుగా మారిపోయింది. అరచేతిలోనే ప్రపంచాన్ని చూసే అవకాశం రావడంతో మంచి విషయాలతో పాటు, వయసుకు మించిన కంటెంట్ కూడా వారి ముందుకు సులభంగా వస్తోంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలపై నీలి చిత్రాలు, సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుంది? ఆ ప్రభావం వారి ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను ఎలా మార్చుతుంది? తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను వినోదంతో పాటు సందేశాత్మకంగా చూపించే ప్రయత్నమే ఈ ‘హుషారు పిట్టలు’.సినిమాలో రసూల్ యాదవ్ అనే చిన్నారి స్కూల్లో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి గల కారణాలను చూపించిన విధానం ఆలోచింపజేస్తుంది. పిల్లల ప్రవర్తన వెనుక తల్లిదండ్రుల వ్యక్తిగత జీవితం, ఇంట్లో వారు మాట్లాడే విధానం, పిల్లలు చూసే కంటెంట్ ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో దర్శకుడు బిక్షు చక్కగా ప్రస్తావించారు.అలాగే పసితనంలో ఓ టీనేజ్ అమ్మాయి తన బాయ్ఫ్రెండ్తో హద్దులు మీరి ప్రవర్తించడం, ఆ సంఘటనలను చూసిన చిన్నారి పెరిగి టీనేజ్లోకి వచ్చిన తర్వాత తాను కూడా అలాగే ప్రవర్తించాలని భావించడం వంటి అంశాలను ‘పుట్ట చిట్టి’ క్యారెక్టర్ ద్వారా చూపించారు. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? వారి ఎదుగుదలలో ఎలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి? అనే విషయాలను దర్శకుడు సందేశాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు.సినిమా ఫస్టాఫ్ మొత్తం రొమాంటిక్, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుంది. అయితే రొమాన్స్ని పదే పదే చూపించడంతో కథలు అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండాఫ్లో అసలు కథను తెరపైకి తీసుకువచ్చి ప్రేక్షకులను కథతో కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. గతంలో ఇలాంటి అంశాలతో కొన్ని సినిమాలు వచ్చినా.. తల్లిదండ్రులను ఆలోచింపజేసే స్థాయిలో ఈ సినిమాలో సందేశాన్ని అందించే ప్రయత్నం కనిపిస్తుంది.ముఖ్యంగా నేటి 5జీ నెట్వర్క్ ప్రపంచంలో పిల్లలు తమ తల్లిదండ్రులకు తెలియకుండా సెల్ఫోన్లో ఏం చేస్తున్నారు? ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు? సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారు? అనే విషయాలను తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరాన్ని కూడా సినిమాలో చూపించారు. అయితే కొన్ని రొమాటిక్ సన్నివేశాలతో పాటు డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్కి ఇబ్బందికరం. యాత్ మాత్రం ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. రవి పాత్రలో అన్హు బాగా నటించాడు. కామెడీ, రొమాన్స్, సంభాషణలు అన్నింటిలోనూ తన ఈజ్ ను చూపించారు. అలాగే వాసవి గణేశన్ కూడా తన క్యూట్ నెస్ అండ్ గార్జియస్ లుక్స్ తో యూత్ ను మెస్మరైజ్ చేస్తుంది. హీరోయిన్ తండ్రిగా నటించిన గోవర్ధన్... అతని తండ్రిగా నటించిన వృద్ధుడు కూడా బాగా నటించారు. అలాగే హీరో తండ్రి పాత్రలో నటించిన రమేష్ నకిరే కంటి... అతని భార్య కూడా నిత్యం కలహాలతో ఉండే భార్య భర్తలుగా ఆకట్టుకుంటారు. వీరి చిన్న కుమారుడిగా నటించిన రసూల్ యాదవ్ పాత్ర కూడా కథలో భాగమైంది. కుర్రాడు తన పాత్రకు న్యాయం చేశాడు. మిగతా పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి.సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
యాక్టర్ రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం..
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీ(La trobe University) ఆమెకు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ పట్టాను ప్రదానం చేసింది. మెల్బోర్న్లో ఆగస్టు 14న జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.దాదాపు మూడు దశాబ్దాలుగా భారతీయ సినీ పరిశ్రమకు అందించిన సేవలు, మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషిని గుర్తించి దీనిని అందజేశారు. అంతకముందు 2019లో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. దీంతో ఇప్పుడీమె ఈ డాక్టరేట్ అందుకున్న రెండో భారతీయ సినీ ప్రముఖరాలిగా నిలిచింది.రాణి మాట్లాడుతూ సినిమానే నా కలను నిజం చేసే మార్గం అయిందన్నారు. కాగా ఈమె నటించిన ‘బ్లాక్’, ‘నో వన్ కిల్డ్ జెస్సికా’, ‘ హిచ్చి’, ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ చిత్రాలు మహిళా సాధికారత, సామాజిక మార్పు వంటి అంశాలను ప్రతిబింబించాయి.
క్రీడలు
విజయాల వేటకు వేళాయె
అమ్స్టెల్విన్ (నెదర్లాండ్స్): ఐదు దశాబ్దాల పతక నిరీక్షణకు తెర దించాలనే లక్ష్యంతో భారత పురుషుల హాకీ జట్టు మరోసారి ప్రపంచకప్ సమరానికి సిద్ధమైంది. నేడు మొదలయ్యే 16వ ప్రపంచకప్ హాకీ టోర్నీ తొలి లీగ్ మ్యాచ్లో వేల్స్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలో టీమిండియా భారీ విజయంతో బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది. గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలతో మెరిసిన భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్లో మాత్రం నిరాశపరుస్తోంది. 1975లో ఏకైకసారి ప్రపంచకప్ టైటిల్ సాధించిన భారత జట్టు ఆ తర్వాత మరోసారి ఈ మెగా టోరీ్నలో కనీసం సెమీఫైనల్కు కూడా అర్హత సాధించలేకపోయింది. ‘ప్రపంచకప్లో పతకం సాధించాలన్న ఒత్తిడి మాపై లేదు. పతకం గెలవడం మా బాధ్యత’ అని హర్మన్ప్రీత్ వ్యాఖ్యానించాడు. ఈసారి తొలి దశ లీగ్ మ్యాచ్ల పాయింట్లను రెండో దశ మ్యాచ్లకు ఫార్వర్డ్ చేయనున్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. వేల్స్ జట్టుపై సాధ్యమైనన్ని గోల్స్ సాధించి భారీ తేడాతో గెలవాలని భారత్ భావిస్తోంది. 417 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవమున్న మన్ప్రీత్ సింగ్తోపాటు హార్దిక్ సింగ్ మిడ్ఫీల్డ్లో... అభిషేక్, మన్దీప్ ఫార్వర్డ్ శ్రేణిలో మెరిపించేందుకు రెడీగా ఉన్నారు. వేల్స్తో మ్యాచ్ అనంతరం భారత జట్టు 17న ఇంగ్లండ్తో, 19న పాకిస్తాన్తో ఆడుతుంది. మరోవైపు భారత మహిళల జట్టు ఆదివారం తమ తొలి మ్యాచ్లో చైనా జట్టుతో తలపడుతుంది. 1974లో నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల జట్టు ఆ తర్వాత మరోసారి ఈ టోర్నీలో సెమీఫైనల్కు చేరుకోలేకపోయింది.
సుదీర్ఘ సమరానికి సై
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత జట్టు... శ్రీలంకతో టెస్టు సిరీస్కు సిద్ధమైంది. సొంతగడ్డపై వరుస సిరీస్ పరాజయాల నుంచి కోలుకొని టీమిండియా సత్తా చాటాలని భావిస్తుంటే... శ్రీలంక స్పిన్తో ప్రత్యరి్థని దెబ్బతీయాలని ప్రణాళికలు రచిస్తోంది. భారత జట్టుకు ఇది 600వ టెస్టు మ్యాచ్ కావడం మరో విశేషం. గాలె: సుదీర్ఘ విరామం అనంతరం భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడనుంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. 1932లో తొలి టెస్టు ఆడిన టీమిండియాకు ఇది 600వ మ్యాచ్ కానుండగా... మైలురాయి మ్యాచ్లో విజయం సాధించాలని శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు టీమిండియా 9 టెస్టులు ఆడనుంది. ఇందులో ఏడింట గెలిస్తే భారత్ నేరుగా తుదిపోరుకు అర్హత సాధించనుంది. దీంతో విజయమే లక్ష్యంగా గిల్ సేన బరిలోకి దిగనుంది. గౌతమ్ గంభీర్ కోచింగ్లో టి20 ప్రపంచకప్, ఆసియాకప్, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా... సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో గంభీర్పై కూడా అదనపు ఒత్తిడి ఉంది. స్పిన్కు ఎదురొడ్డితేనే... 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలో లంకలో పర్యటించిన భారత జట్టు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. ఆ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్లతో దట్టంగా ఉండగా... ఇప్పుడు అలాంటి అనుభవజు్ఞలు కరువయ్యారు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా... దేవదత్ పడిక్కల్ వన్డౌన్లో బ్యాటింగ్కు రానున్నాడు. కెపె్టన్ గిల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనుండగా... ఆ తర్వాత పంత్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తారు. సర్ఫరాజ్ ఖాన్కు తుది జట్టులో చోటు కష్టమే. ఒకప్పుడు స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొంటారనే పేరున్న భారత ప్లేయర్లు... ఇటీవలి కాలంలో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. లంక జట్టులో ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగడం ఖాయమే కాగా... సిరాజ్తో పాటు ప్రసిధ్ కొత్త బంతిని పంచుకోనున్నాడు. జడేజా, కుల్దీప్, మానవ్ స్పిన్ భారం మోస్తారు. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రాహుల్, జైస్వాల్, పడిక్కల్, పంత్, జురేల్, జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్, సిరాజ్, ప్రసిధ్. శ్రీలంక: ధనంజయ డిసిల్వా (కెపె్టన్), లహిరు, నిషాన్, దినేశ్, కమిందు, డిక్వెల్లా, సోనల్, ప్రభాత్, రమేశ్, అషిత ఫెర్నాండో, లహిరు కుమార.పిచ్, వాతావరణం గాలె పిచ్ గతంలో మాదిరిగా పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించకపోవచ్చని శ్రీలంక కెప్టెన్ ధనంజయ్ పేర్కన్నాడు. పిచ్పై తేమ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్కే మొగ్గుచూపనుంది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి.
అభిషేక్ పోరెల్కు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరించిన కోర్టు
అత్యాచారం, బెదిరింపులు కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్-బ్యాటర్, బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్కు కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. 23 ఏళ్ల పోరెల్కు పశ్చిమ బెంగాల్లోని చిన్సురా కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో శుక్రవారం అతడిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కర్ణాటకకు చెందిన ఒక వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోరెల్పై జూన్ 23న కేసులు నమోదు చేశారు. గత మూడేన్నరేళ్లుగా తమ మధ్య పరిచయం ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు పేర్కొంది. గత ఏడాదిన్నరగా మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని పోరెల్ బెదిరింపులకు దిగాడని ఆరోపించింది. అయితే జూన్లో ఫిర్యాదు అనంతరం పోరెల్ను విచారించడానికి పోలీసులు పలుమార్లు ప్రయత్నించినా అతడు అందుబాటులోకి రాలేదు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు అతడిని మంగళవారం పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది.
భారత ఆల్రౌండర్కు ఊహించని అవకాశం
రాజస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహిపాల్ లామ్రోర్కు ఊహించని అవకాశం వచ్చింది. కౌంటీ చాంపియన్షిప్లో ఆడేందుకు సర్రే జట్టు నుంచి అతడికి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో ఈ ఆర్సీబీ మాజీ ఆల్రౌండర్ ఆదివారం ఇంగ్లండ్కు చేరుకోనున్నాడు.ఈ నేపథ్యంలో మహిపాల్ లామ్రోర్ సంతోషం వ్యక్తం చేశాడు. స్పోర్ట్స్టార్తో మాట్లాడుతూ.. ‘ఏ క్రికెటర్కైనా కౌంటీ చాంపియన్షిప్లో ఆడటం అనేది గొప్ప అవకాశం. సీనియర్ ఆటగాళ్లతో కలిసి సర్రేకు ఆడటం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా’’ అని 26 ఏళ్ల లామ్రోర్ పేర్కొన్నాడు.కాగా సర్రే జట్టు.. మిడిలార్డర్లో ఆడగల, లెఫ్టార్మ్ స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగల బ్యాటర్ కోసం చూస్తోంది. ఈ క్రమంలోనే సర్రే మెన్స్ క్రికెట్ డైరెక్టర్ అలెక్ స్టెవర్ట్ మహిపాల్ లామ్రోర్ పేరును పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.కాగా మహిపాల్ లామ్రోర్ 63 ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడి.. 3836 పరుగులు సాధించాడు. ఇందులో పది శతకాలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దేశీ సీజన్ 2024-25లో లామ్రోర్ ఉత్తరాఖండ్పై ట్రిపుల్ సెంచరీ కూడా బాదాడు.ఇదిలా ఉంటే.. డివిజన్ వన్ పాయింట్ల పట్టికలో సర్రే ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్లు పూర్తి కాగా.. ఇంకా ఆరు మిగిలి ఉన్నాయి. ఆగష్టు 20న ది ఓవల్ వేదికగా నాటింగ్హామ్షైర్తో మ్యాచ్తో తాజా సైకిల్ను సర్రే మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఊహించని రీతిలో లామ్రోర్కు అవకాశం రావడం విశేషం. కాగా టీమిండియా క్రికెటర్ రాహుల్ చహర్ ఇప్పటికే సర్రే జట్టుకు ఆడుతున్నాడు.
న్యూస్ పాడ్కాస్ట్
దేశ భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే... పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్య
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
చంద్రబాబు పాలన రైతులకు హానికరం... చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ... వైఎస్ జగన్ ఆగ్రహం
అసత్య ప్రచారంలో ఆరితేరిన ఏపీ సీఎం చంద్రబాబు... రెండు మినహా హామీలన్నీ అమలు చేశానంటూ బుకాయింపు...
బిజినెస్
పెళ్లి బాజాలు ఇక లంకలో..
భారతీయుల డెస్టినేషన్ వెడ్డింగ్ మార్కెట్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు దుబాయ్, ఒమన్, టర్కీ వంటి పశ్చిమాసియా దేశాలు సంపన్న భారతీయ కుటుంబాల పెళ్లిళ్లకు ప్రధాన వేదికలుగా ఉండగా. ఇప్పుడు ఆ స్థానాన్ని శ్రీలంక, వియత్నాం,థాయ్లాండ్, ఇండోనేషియా దేశాలు వేగంగా ఆక్రమిస్తున్నాయి. భారత్కు దగ్గరగా ఉండడం, ప్రయాణ సౌలభ్యం, విలాసవంతమైన హోటళ్లు, తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ అనుభూతి లభించడం వంటి కారణాలతో 2025లో భారతీయుల పెళ్లిళ్లకు ఆగ్నేయాసియా దేశాలు అత్యంత వేగంగా ఎదుగుతున్న విదేశీ వెడ్డింగ్ డెస్టినేషన్ల గమ్య స్థానంగా మారినట్లు వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థ ’వెడ్ మి గుడ్’ నివేదిక వెల్లడించింది. 2025లో ఒక్క శ్రీలంకలో భారతీయ డెస్టినేషన్ వెడ్డింగ్స్కు డిమాండ్ 25% పెరిగిందని వచ్చే కొన్నేళ్ల పాటు ప్రతి ఏడాది 20–25% వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధవాతావరణం కారణంగా అక్కడి వెడ్డింగ్ మార్కెట్పై కొంత ప్రభావం కనిపించినప్పటికి విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనే భారతీయుల ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్కి శ్రీలంక, ఇతర దేశాలు వేగంగా ఎదుగుతున్నప్పటికీ పర్యాటకంగా భారతీయుల తొలి ఎంపిక మాత్రం థాయ్లాండే. 2025లో దాదాపు 25 లక్షల మంది భారతీయులు థాయ్లాండ్ను సందర్శించారు. ఏడాది ప్రాతిపదికన 16% పెరుగుదల నమోదైంది. పెళ్లితోపాటు అనుభవం కూడా ముఖ్యం. ఇప్పటి తరం జంటలు పెళ్లి కేవలం వేడుక కోసం కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మరుపురాని అనుభవాన్ని సృష్టించేందుకు డెస్టినేషన్ వెడ్డింగ్స్కు ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే పెళ్లి వేడుకులు కూడా గతంతో పోలిస్తే ఎక్కువ రోజులు కొనసాగుతున్నాయి. కరోనాకు ముందు సగటున 1–2 రోజులు జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇప్పుడు మూడు, నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. భారీగా పెరిగిన బడ్జెట్ డెస్టినేషన్ వెడ్డింగ్స్కు భారతీయులు చేసే ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. దేశీ డెస్టినేషన్ వెడ్డింగ్స్కు సగటు బడ్జెట్ రూ.58 లక్షలు అయితే విదేశీ డెస్టినేషన్ వెడ్డింగ్ సగటు బడ్జెట్ రూ.1.5 కోట్లు పైమాటే. అయినా లగ్జరీ పెళ్లిళ్ల మార్కెట్ మరింత విస్తరిస్తోందని ముందు ముందు ఇది మరింత పెరుగుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది.సంక్షోభంతో మారుతున్న ఎంపిక పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నెలకొన్న భద్రతా పరిస్థితులు, విమాన చార్జీలు పెరుగుదల, హోటళ్ల టారిఫ్లు అమాంతం పెరిగిపోవడం కూడా భారతీయుల పెళ్ళి ప్రణాళికలను ప్రభావితం చేశాయి. అయితే విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని మాత్రం భారతీయ సంపన్న కుటుంబాలు మార్చుకోవడం లేదని కేవలం దేశాన్నే మార్చుకుంటున్నాయి. భద్రత, ప్రయాణ సౌలభ్యం, అతి«థులకు కూడా సులభమైన వీసా విధానం ఉన్న శ్రీలంక, ఇండోనేíÙయా దేశాలపై ఇప్పుడు ఎక్కువ మంది దృష్టి పెడుతున్నాయి.టాప్ విదేశీ వెడ్డింగ్ గమ్యస్థానాలు థాయ్లాండ్, బాలి (ఇండోనేషియా) వియత్నాం, మలేషియా ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్, పోర్చుగల్ భారత్లో ఇవీ... దేశీ డెస్టినేషన్ వెడ్డింగ్స్లో డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్, సిమ్లా, జిమ్ కార్బెట్ తొలి ఐదు స్థానాల్లో ఉండగా, ఉదయ్పూర్,జైపూర్,జైసల్మేర్,జో«ద్పూర్, గోవా కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. శ్రీలంకకు భారతీయుల వెల్లువ శ్రీలంక టూరిజం డెవలప్మెంట్ అథారిటీ గణాంకాల ప్రకారం 2023లో 3 లక్షల మంది భారతీయ పర్యాటకులు ఆదేశాన్ని సందర్శించగా 2024లో 4.17 లక్షలు, 2025లో అది 5.30 లక్షలు దాటింది. భారత్ ప్రస్తుతం శ్రీలంకకు అతిపెద్ద విదేశీ పర్యాటక మార్కెట్. ఈ పెరుగుతున్న పర్యాటక ప్రవాహమే డెస్టినేషన్ వెడ్డింగ్ రంగానికి ఊతమిస్తోంది. ఇది లగ్జరీ హోటళ్లు, విమానయాన సంస్థలు, ట్రావెల్ కంపెనీలు, డెకరేషన్, ఫొటోగ్రఫీ, ఫ్యాషన్, క్యాటరింగ్, టూరిజం రంగాలకు కూడా కోట్లాది వ్యాపారాన్ని సృష్టిస్తున్న భారీ పరిశ్రమగా మారుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్
కేవలం ఒక్క రూపాయి.. 24 రోజుల వ్యాలిడిటీ!
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ఫ్రీడమ్ 2.0 పథకం కింద 2026 స్వాతంత్య్ర దినోత్సవం కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్లో భాగంగా.. వినియోగదారులు కేవలం రూ.1కే కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును పొందవచ్చు.ఈ ఆఫర్ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త వినియోగదారులు రోజూ 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాలింగ్ను కూడా పొందుతారు. వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే. కొత్త సిమ్ కనెక్షన్ కోసం అధిక మొత్తం చెల్లించకుండా బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రయత్నించాలనుకునే వినియోగదారులకు ఈ ఆఫర్ ఉపయోగకరంగా ఉంటుంది.This Independence Day, why not start something better?Your first step towards a better connection is here.#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife #IndiaOnline #BSNLServices #SmartIndia #EverydayConnectivity #IndependenceOffer #FRC1 @CMDBSNL @robertravi21 pic.twitter.com/HObE4inHxD— BSNL India (@BSNLCorporate) August 12, 2026రూ.2,399 ప్లాన్!బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కూడా కేవలం సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.నిజానికి చాలా కంపెనీలు యాన్యువల్ ప్లాన్ కింద 365 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తాయి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం మరో 47 రోజుల వ్యాలిడిటీని అదనంగా అందిస్తుంది. అంటే ఏడాది పూర్తయినా ఇంకా కొన్ని రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
79 ఏళ్లలో మారిపోయిన భారతీయుల ఖర్చు తీరు!
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశం ముందు పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత, తక్కువ పారిశ్రామిక సామర్థ్యం వంటి అనేక సవాళ్లు ఉన్నాయి. అప్పట్లో.. సాధారణ కుటుంబానికి స్వాతంత్య్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు.. కనీస అవసరాలు తీరే మంచి జీవితం రావాలనే ఆశ కూడా.చారిత్రక అంచనాల ప్రకారం.. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారతదేశంలో పేదరికం చాలా ఎక్కువగా ఉండేది. అందుకే తొలి దశాబ్దాల్లో దేశ ఆర్థిక ప్రయాణం ప్రధానంగా ప్రజలను కనీస జీవన ప్రమాణాల వైపు తీసుకెళ్లడంపైనే సాగింది. కానీ.. ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది. ఒకప్పుడు కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనడం పెద్ద లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు ఏ బ్రాండ్ కొనాలి, ఎలాంటి కారు తీసుకోవాలి, వెకేషన్కు ఎక్కడికి వెళ్లాలి అనే స్థాయికి భారతీయుల ఆలోచనలు మారాయి.ఈ మార్పు మన ఇళ్లలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు టీవీ కొనడం పెద్ద విషయం. ఆ తర్వాత ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, స్కూటర్, కారు వంటివి కుటుంబాల అవసరాల జాబితాలోకి చేరాయి. ఇప్పుడు మాత్రం సాధారణ కారు సరిపోతుందా? SUV కొనాలా? ఎలక్ట్రిక్ కారు తీసుకోవాలా? అనే స్థాయికి వినియోగదారుల ఆలోచన చేరింది.ఏం కొనాలి నుంచి..పొదుపు విషయంలోనూ మార్పు వచ్చింది. గతంలో బ్యాంక్ డిపాజిట్లు, బంగారం, స్థిరాస్తులే ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, సిప్, ఇన్సూరెన్స్ వంటి పెట్టుబడులు కూడా సాధారణ కుటుంబాలకు పరిచయం అయ్యాయి. అంటే.. భారతీయుల కథ ''ఏం కొనాలి?'' అనే స్థాయి నుంచి ''ఏది నాకు ఎక్కువ విలువ ఇస్తుంది?'' అనే స్థాయికి మారుతోంది.కుటుంబాల ఖర్చుల్లో కూడా ఈ మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా.. గ్రామీణ, పట్టణ వినియోగ వ్యత్యాసం కూడా క్రమంగా తగ్గుతోంది. గతంలో పట్టణ కుటుంబాలు గ్రామీణ కుటుంబాల కంటే చాలా ఎక్కువ ఖర్చు చేసేవి. ఇప్పుడు చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా ఆదాయం, డిజిటల్ సేవలు, క్రెడిట్ సౌకర్యాలు, ఆన్లైన్ షాపింగ్ పెరగడంతో వినియోగ అవకాశాలు విస్తరిస్తున్నాయి. గతంలో ''కూడు, గూడు, గుడ్డ'' ప్రధాన అవసరాలైతే.. ఇప్పుడు ఏ ఫుడ్ తినాలి, ఏ బ్రాండ్ దుస్తులు ధరించాలి, ఏ ప్రాంతంలో నివసించాలి అనే ఎంపికలు కూడా వినియోగంలో భాగమవుతున్నాయి.ఎలక్ట్రానిక్స్ విషయంలో..కారు, మొబైల్, ప్రయాణం వంటి రంగాల్లో ఈ ప్రీమియమైజేషన్ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు చిన్న హ్యాచ్బ్యాక్ కారు కొనడం పెద్ద కల. ఇప్పుడు SUVలపై భారతీయుల ఆసక్తి భారీగా పెరిగింది. కొత్త కారు కొనలేని వారు కూడా మంచి ఫీచర్లు ఉన్న ప్రీమియం సెకండ్హ్యాండ్ కార్ల వైపు చూస్తున్నారు.ఇదే విధంగా రూ.30 వేలకుపైగా ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల మార్కెట్ వాటా కూడా గణనీయంగా పెరిగింది. వినియోగదారులు ప్రతి వస్తువుపై ఎక్కువ ఖర్చు చేయడం లేదు. తమకు ముఖ్యమైన వస్తువుల విషయంలో మాత్రం ఎక్కువ డబ్బు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఇక ప్రయాణాల విషయంలోనూ మార్పు వచ్చింది. విదేశీ పర్యటనలు ఒకప్పుడు కొద్దిమంది సంపన్నులకు మాత్రమే సాధ్యమైన విషయం. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో కూడా విదేశీ ట్రిప్ ఒక సాధారణ ఆశగా మారుతోంది. 2025లో భారతీయులు రికార్డు స్థాయిలో 3.28 కోట్లకు పైగా విదేశీ ప్రయాణాలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.పొదుపు నుంచి సంపద సృష్టిఇక మరో పెద్ద మార్పు పొదుపు నుంచి సంపద సృష్టి వైపు వచ్చింది. గతంలో భవిష్యత్ భద్రత కోసం డబ్బును బ్యాంకులో దాచుకోవడం, బంగారం కొనడం లేదా స్థలం తీసుకోవడం సాధారణం. ఇప్పుడు యువతతో పాటు మధ్యతరగతి కుటుంబాలు కూడా సిప్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నాయి. వార్షిక గృహ ఆర్థిక పొదుపుల్లో ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ వాటా FY12లో కేవలం 2 శాతం ఉండగా, FY25 నాటికి 15 శాతానికి పైగా పెరిగింది. సిప్ పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. అంటే భారతీయుల ఆర్థిక ఆశయం కూడా మారుతోంది. 'డబ్బు దాచుకోవాలి అనే ఆలోచన నుంచి 'డబ్బుతో మరింత సంపద సృష్టించాలి' అనే ఆలోచనకు ప్రజలు వస్తున్నారు.
ఐదేళ్లుగా వింత ప్రయోగం.. దొంగతనం కాలేదన్న సీఈఓ!
భారత్ అగ్రి వ్యవస్థాపకుడు, సీఈఓ 'సిద్ధార్థ్ డయలాని' బెంగళూరులో చేసిన ఓ చిన్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్యతో కలిసి గత ఐదేళ్లుగా ఆయన ఈ ప్రయోగం చేస్తున్నారట. ఎక్కడికి వెళ్లినా బైక్ను పార్క్ చేసినప్పుడు హెల్మెట్కు ఎలాంటి లాక్ వేయకుండా సీటుపైనో, సైడ్ మిర్రర్పైనో పెట్టి వెళ్తున్నారు. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఒక్క హెల్మెట్ కూడా దొంగతనం కాలేదని ఆయన చెప్పడంతో నెట్టింట చర్చ మొదలైంది.బెంగళూరులో ప్రజలు ఒకరినొకరు ఎంతవరకు నమ్మవచ్చో తెలుసుకోవడాని ఈ ప్రయోగం చేస్తున్నట్లు సిద్ధార్థ్ డయలాని పేర్కొన్నారు. దీనికోసం పెద్దగా పెట్టుబడి పెట్టకుండా.. హెల్మెట్ ప్రయోగం స్టార్ట్ చేశారు. ఐదేళ్లుగా హెల్మెట్లు సురక్షితంగా ఉండటంతో.. బెంగళూరు ఒక హై-ట్రస్ట్ సిటీ అని చెప్పవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే.. ఈ ప్రయోగానికి వారు ఒక కండిషన్ కూడా పెట్టుకున్నారు. ఏ రోజు తమ హెల్మెట్ దొంగతనానికి గురవుతుందో.. తరువాత ఆ ప్రాంతానికి వెళ్లడం మానేస్తామని సిద్ధార్థ్ చెప్పారు. అంటే.. ఒక్క హెల్మెట్ పోవడం ద్వారా ఆ ప్రాంతంలోని ప్రజలపై తమ నమ్మకం పోయినట్లే అన్నమాట. ఈ విషయం కొంతమంది నెటిజన్లను ఆకట్టుకుంది. చాలామంది తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.కొందరు సిద్ధార్థ్ డయలాని చేసిన పనిని మెచ్చుకున్నారు. మరికొందరు విమర్శించారు. ''హెల్మెట్ రేటు తక్కువగా ఉండటం వల్ల ఎవరూ పట్టించుకోకపోయి ఉండొచ్చు.. ఖరీదైనది పెట్టి చూడండి, అప్పుడు అసలు విషయం తెలుస్తుంది'' అంటూ కామెంట్ చేశారు. మరికొందరు కొన్ని ప్రాంతాల్లో మాత్రం బైక్, హెల్మెట్ రెండూ సురక్షితంగా ఉండకపోవచ్చని హెచ్చరించారు. దీంతో బెంగళూరు మొత్తం ఒకేలా ఉండదని, ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు.Me and my wife have been running a social experiment in Bangalore. Whenever we park our two wheeler in any area, we don't lock our helmets. We just keep it on the side mirror or on the seat. It's a low cost experiment to know if Bangalore is a high trust city or not.It has…— Siddharth Dialani (@siddharth_iitm) August 13, 2026
ఫ్యామిలీ
ఎవరీ యాల్డా మోయిరీ..? ఏకంగా 15 ఏళ్లు..
పాత్రికేయ రంగం అంటేనే సంఘర్షణలతో ముడిపడి ఉంటుంది. ఏది పడితే అది రాసే అవకాశం ఉండదు. అధికారులకు అననుకూలంగా రాసామో అంతే సంగతులు. అలాంటి రక్షణలేని వృత్తి ఇది. ఎప్పుడు మీడియా గొంతును నొక్కేసేలా దాడులు, కక్ష సాధింపు చర్యలు ఉంటూనే ఉంటాయి. కానీ తొలిసారిగా మహిళల హక్కులు, ప్రకృతి విపత్తుల కోసం చాలా చురుకుగా ప్రపంచానికి తెలియజేసే ఓ ఫోటో జర్నలిస్ట్ జైలు పాలవ్వడమే కాదు ఎన్నే ఏళ్లు జైలు శిక్ష విధించారో తెలిస్తే కంగుతింటారు. పైగా పాత్రికేయరంగంలో ఇన్ని సవాళ్లు ఉంటాయా అనిపిస్తుంది. మంచి జరగాలని ప్రయత్నిస్తే మొత్తానికి వాళ్ల కథే ముగిసిపోతుంది అనేలా అయ్యింది ఈ జర్నలిస్ట్ పరిస్థితి.ఇరాన్ దేశల్లో నిరసనలు, మహిళలు జీవితాలను డాక్యుమెంట్ చేయడంలో పేరుగాంచిన ఫోటో జర్నలిస్ట్కి జైలుపాలవ్వడమే కాదు ఏకంగా 15 ఏళ్లు జైలు శిక్ష విధించారు. 2025లో ఇరాన్ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం ఈ శిక్షణు విధించింది. ఇది గూఢచర్యం, శత్రుదేశాల సహకారాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన చట్టం. ఆమెపై జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేశారనే ఆరోపణలతో టెహ్రాన్ కోర్టు ఈ శిక్ష విధించింది. ఆమె ఇరాన్ అధికారులకు ప్రతికూలంగా ఉండే మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారని, యూఎస్ ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న సంస్థలకు ఫోటోలు అందించారని ఆరోపణలతో ఆమెకు ఈ శిక్ష విధించినట్లు ఇరాన్ అంతరంగిక వర్గాల సమాచారం. అంతేగాదు ఇంటెలిజెన్స్ వింగ్ సభ్యులు ఆమె ఇంటిపై దాడిచేసి, ల్యాప్టాప్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. కనీసం ఆమె కేసుకి సంబంధించిన కాఫీలు కూడా ఇవ్వకుండా కోర్టు ముందుంచి ఈ శిక్ష విధించడం గమనార్హం. ఇదిలా ఉండగా మోయిరీ ఇరాన్లో వైమానిక దాడుల వల్ల జరిగిన నష్టాన్ని చూపించే ఫోటోల తోపాటు తన పనికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇలా మోయిరీపై ఇరాన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ఇదేమి ఆమెకు మొదటి జైలు శిక్ష కాదు, గతంలో ఘర్చక్ జైలులో రెండేళ్లు శిక్షఅనుభవించింది. అలాగే 2022లో, పోలీసు కస్టడీలో మహ్సా అమినీ మరణించిన తర్వాత దేశవ్యాప్తంగా "స్త్రీ, జీవితం, స్వేచ్ఛ" నిరసనలను కవర్ చేసినందుకు గానూ ఏకంగా ఎనిమిది నెలలు జైలు శిక్ష విధించగా మూడేళ్లు శిక్ష అనుభవించి క్షమాభిక్ష అనంతరం విడుదలైంది. తాజాగా మరోసారి సుదీర్ఘ జైలు శిక్షను ఎదుర్కొంటుండటం గమనార్హం. (చదవండి: అచ్చం నీలాంబరి మూవీ రమ్యకృష్ణలా రక్తంతో ఫేషియల్..! అందం కోసం ఇంత పెయిన్ తప్పదా?)
అచ్చం నీలాంబరి మూవీ రమ్యకృష్ణలా.. అలాంటి ఫేషియల్..!
అందం అంటే శుభ్రంగా తినడం, ఖరీదైన చర్మ సంరక్షణ, వేలకు వేలు బ్యూటీపార్లర్ ఖర్చులు మాత్రమే కాదండోయ్. ప్రముఖ డెర్మటాలజీ చికిత్సలు కూడా ఉంటాయి. అదే సెలబ్రిటీల నవయవ్వన రహస్యం. అయితే దాని వెనుక నొప్పి కూడా భరించాల్సిందే. కేవలం మొటిమలు, లేజర్ ట్రీట్మెంట్, వంటి కాస్మెటిక్ చికిత్సలు గురించి విన్నాం. ఇంకాస్తా ముందడుగు వేస్తే..చిన్న చిన్న సూదుల చికిత్సతో వృద్ధాప్యాన్ని నివారించే వాటి గురించి విన్నాం, చూశాం కూడా. అయితే ఇదే ఏకంగా వాటిన్నిటిని మించిన షేషియల్ చికిత్స. సింపుల్గా చెప్పాలంటే మీ రక్తంతోటే మిరుమిట్లు గొలిపే అందం. వాట్ ఇందేంటి. అనుకోకండి. అదెలా చేస్తారు, ఎలా ఉంటుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.సౌందర్యానికి సంబంధించి..వైద్య క్లినిక్స్లో హైడ్రా ఫేషియల్స్, ఆక్సిజన్ ఫేషియల్స్, కెమికల్ పీల్స్, LED థెరపీ ఫేషియల్స్, వైరల్ వాంపైర్ ఫేషియల్ వంటివి ఎంచుకుంటారు. ఇవే కాకుండా రక్తపిశాచి లాంటి ఒక చికిత్స ఉంది. అది అచ్చం నీలాంబరి మూవీలో అందంకోసం రమ్మకృష్ణ అందమైన యువకుల రక్తం ఎక్కించుకుంటే..అత్యంత అందంగా మారిపోతుందే అలాంటి చికిత్స ఇది. అయితే ఇందులో వేరేవాళ్ల రక్తం కాకుండా మన నుంచి తీసుకున్న బ్లడ్తోనే చేస్తారట.ఎలాగంటే..ఒక ప్రొఫెషనల్ వైద్యుడు సాధారణ రక్త పరీక్ష వలె చేయి నుంచి కొంత రక్తాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరు చేసే యంత్రంలో సీనాని పెడతారు. ఆ తర్వత ముఖం అంతట చిన్న సూదులు అమర్చిన పరికరంతో ముఖంపై ఒకవైపు అంతా అప్లై చేస్తారు. చూడటానికి ఇది చాలా నొప్పిగా ఉంటుంది. కానీ అంత నొప్పి ఏ మాత్రం ఉండదట. లాస్ట్లో ఆ రక్తంలోని ప్లాస్మానికి ముఖానికి అంతటా అప్లై చేస్తాడు. చిన్న సూదుల గుండా ముఖంలోకి చొప్పిస్తాడు. ఆ తర్వాత ముఖం చూస్తే నిజంగా రక్తపిశాచి మాదిరిగా భయానకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వైపు అంత ఎర్రగా కందిపోయి ఉంటుంది. అయితే ఎరుపు రంగు సాయంత్రం కల్లా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ చికిత్స చేసిన ముఖం వైపు కన్ను చాలా మెరుగ్గా కనిపిస్తుందట. ఇది ఎలాంటిదంటే మన నుంచి రక్తం తీసుకుని వెయ్యిసార్లు ముఖంపై పొడిచి సౌందర్య చికిత్స అట. దీని గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు నటి షెహ్నాజ్ ట్రెజరీ. ఆమె ఎంటీవీ వీజేగా కెరీర్ ప్రారంభించి తెలుగు, హిందీ తోపాటు కొన్ని హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించిందామె. View this post on Instagram A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury) (చదవండి: 51 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు..!1992లోనే..)
51 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు..!1992లోనే..
చదువుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉన్నవారికి వయసు ఎన్నడూ అడ్డంకి కాదని పలువురు నిరూపిస్తున్న ఘట్టాలు చూశాం. అంతేగాదు క్షణికావేశంలో కోరుకున్న కోర్సు చదవలేకపోయామనో, అనుకున్నది సాధించలేకపోయామనో జీవితాలను అంతం చేసుకునే యువతకు కనవిప్పు కలిగించేలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా అలాంటి కోవలోకి చెన్నైవాసి చేరారు. పైగా ఆయన దివ్యాంగుడు, చక్కగా మరో రంగంలో కెరీర్ నిర్మించుకుని రిటైర్మెంట్ తీసుకునే వయసుకి వచ్చేశారు. అయినా తన చిరకాల కోరికను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తూ..యువతకు స్ఫూర్తిని రగిల్చారు. ఆయనే చెన్నైకి చెందిన 51 ఏళ్ల సురేష్ కుమార్. తమిళనాడులోని నాగపట్నం జిల్లా వేలంకన్ని నివాసి అయిన సురేష్ 1992లో 12వ తరగతి పూర్తి చేశారు . అప్పటి నుంచి ఆయనకు మెడిసిన్ చదవాలనే కోరిక ప్రబలంగా ఉండేది. అయితే అప్పట్లో మెడిసిన్ సీటు దక్కించుకోలేకపోయాడు. అదీగా కుటుంబ ఆర్థిక పరిస్థితి రీత్యా ఫార్మకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేశాడు. ఆ తర్వాత ఎంబీఏ, రెండు పీహెచ్చ్డీలు పూర్తిచేసి డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన డయాగ్నోస్టిక్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. నీట్లో సీటు సాధించాడు ఇలా..2022లో, సుప్రీంకోర్టు మెడికల్ అడ్మిషన్ల వయోపరిమితిని తొలగించిన తర్వాత కుమార్ నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యాడు. కానీ దానిని చేధించలేకపోయాడు. అయితే 2026లో 18 నెలల ప్రిపరేషన్ తర్వాత మళ్లీ మెడికల్ ప్రవేశ పరీక్షకు ప్రయత్నించాడు. ఈసారి 192 మార్కుల సాధించి పీడబ్ల్యూడీ కోటా కింద చెన్నైలో నాగపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించాడు. పూర్తి సమయం పని చేస్తూనే, సురేష్ కుమార్ మెడికల్ ప్రవేశ పరీక్షకు ప్రిపరేషన్ కొనసాగించాడు. అతను తరచుగా రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి వరకు ప్రిపరేషన్ సాగించినట్లు తెలిపాడు. తనకు అర్థంకానీ జీవశాస్త్రాన్ని కొడుకు అర్థమయ్యేలా బోధించినట్లు వివరించారు. అలాగే గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేసి తన ప్రిపరేషన్ సామర్థ్యాన్ని ట్రాక్ చేసుకున్నట్లు వెల్లడించారు. తనకు జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగానే వైద్య విద్య అభ్యసించాలనే కోరిక మరింత పెరిగిందని అన్నారు. పదవీవిరమణ వయసులో ఇలా కాలేజ్కి వెళ్లి చదువుకోవాలన్న తన ఆశయానికి భార్య దుర్గ, కుటుంబం పూర్తి మద్దతు ఇచ్చిందని చెప్పారు. తన భార్య ఉపాధ్యాయురాలని చెప్పారు. ఇక తనకు ఎనిమిది, పది చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను తన 72 ఏళ్ల తల్లితో కలిసి జీవించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. తనకు సీటు కేటాయించిన మెడికల్ కాలేజ్ ఏడు కి.మీల దూరంలో ఉందని అందుకని సైకిల్పై వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించింది. అందులో స్పోర్ట్స్ కేటగిరీ కింద 15 సీట్లు, మాజీ సైనికుల పిల్లలకు 11, పీడబ్ల్యూడీ కేటగిరీ కింద 224, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5% కోటా కింద 614 సీట్లతో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది.(చదవండి: పాట పాడినందుకు విధుల నుంచి తొలగించారు..! ఇవాళ ఏకంగా..)
ఈ 3జీ కటింగ్తో.. ఒక్క మొక్క 3 రెట్లు దిగుబడి!
మిద్దె తోటల్లో మొక్కలు గుబురుగా పెరిగి, ఎక్కువ దిగుబడి రావటానికి చేసే ఒక ముఖ్యమైన పద్ధతే 3జీ కటింగ్. ప్రధానంగా తీగ జాతి మొక్కలైన సొర, కాకర, దోస, బీర వంటి పంటలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.1. మొక్క మొదటి తరాన్ని 1జీ అని, దాని నుంచి వచ్చే కొమ్మలను 2జీ అని, ఆ కొమ్మల నుంచి వచ్చే మరిన్ని కొమ్మలను 3జీ అని అంటారు. మొక్కకు కేవలం మగ పూలు కాకుండా, ఎక్కువ ఆడ పూలు (కాయలుగా మారేవి) రావటానికి ఈ పద్ధతిని వాడతారు.2. మొదటి తరం (1G -1st Generation) : మొక్క పెరగడం ప్రారంభించినప్పుడు, ప్రధాన కాండం సుమారు 7–8 అడుగుల పొడవు పెరిగే వరకు ఉంచాలి. ఆ తర్వాత, ఆ ప్రధాన కాండం చివరను (కొనను) కత్తిరించాలి. దీన్నే 1జీ కటింగ్ అంటారు.3. రెండో తరం (2G -2nd Generation) : ప్రధాన కాండం కత్తిరించిన తర్వాత ఆకు మూలల నుంచి కొత్తగా 2–3 కొమ్మలు వస్తాయి. వీటిని 2జీ కొమ్మలు అంటారు. ఈ 2జీ కొమ్మలు కూడా 2–3 అడుగులు పెరిగిన తర్వాత, వాటి చివరలను కూడా కత్తిరించాలి.4. మూడో తరం(3G -3rd Generation) : ఇప్పుడు 2జీ కొమ్మల నుంచి మరిన్ని కొత్త కొమ్మలు (3జీ) వస్తాయి.ఈ 3జీ కొమ్మలపైనే అత్యధికంగా ఆడ పూలు వస్తాయి, ఫలితంగా కాయలు ఎక్కువగా కాస్తాయి.5. మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు, కనీసం 10–12 ఆకులు ఉన్నప్పుడే కటింగ్ ప్రారంభించాలి.6. పొద జాతి మొక్కలకు (మిరప, టమోటా, మందార, మల్లె వంటివి) మనం చేసే కటింగ్ను సాధారణంగా ‘పించింగ్’ అని కూడా అంటారు. మొక్క 10–12 ఆకులతో ఒక అడుగు ఎత్తు పెరిగినప్పుడు, పై భాగంలోని లేత చిగురును తుంచేయాలి.7. చిగురు తుంచిన చోట నుండి రెండు, మూడు కొత్త కొమ్మలు వస్తాయి. అవి కొంచెం పెరిగిన తర్వాత వాటి చిగుర్లను కూడా తుంచితే, మొక్క మరింత గుబురుగా మారి ఎక్కువ పూలు, మొగ్గలు వస్తాయి.8. గోరుచిక్కుడు మొక్కకు సాధారణంగా 3జీ కటింగ్ అవసరం ఉండదు, ఎందుకంటే ఇది సహజంగానే కొమ్మలతో పెరుగుతుంది. అయితే మరీ పొడవుగా పెరుగుతుంటే పైభాగాన్ని తుంచవచ్చు.9. టమాటాలో 3జీ కటింగ్ కంటే సక్కర్స్ తొలగించటం, ప్రూనింగ్ చేయటం దిగుబడి పెంచడానికి బాగా పనిచేస్తుంది.10. టమాటాలో ΄ాకే రకాలు ఉంటాయి. ఇవి చాలా ఎత్తు పెరుగుతాయి. వీటి చివరలను కట్ చేస్తే పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి, సాధారణంగా వీటి కాండం పక్కల నుండి వచ్చే అనవసరమైన చిన్న రెమ్మలను తీసేయాలి. 11. పొద రకం టమాటా మొక్కలు కొంత ఎత్తు పెరిగి ఆగిపోతాయి. వీటిని ఎక్కువగా కత్తిరించాల్సిన అవసరం లేదు, కేవలం కింద నేలకు తగిలే ఆకులను తీసేస్తే సరిపోతుంది.12. టమాటా మొక్కలు లో అనవసరమైన కొమ్మలను లేదా చివరలను కత్తిరించడం వల్ల మొక్క తన శక్తిని పండ్లు పెద్దవిగా పెరగడానికి, త్వరగా పక్వానికి రావడానికి ఉపయోగిస్తుంది. సీజన్ చివరలో మొక్క చివరలను కత్తిరించడం వల్ల కొత్తగా పూలు పూయడం ఆగి, అప్పటికే ఉన్న కాయలు త్వరగా పండుతాయి.13. కటింగ్ చేసిన వెంటనే మొక్కకు లిక్విడ్ ఫెర్టిలైజర్ (జీవామృతం లేదా బియ్యం కడిగిన నీళ్లు) లేదా వర్మీ కంపోస్ట్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఎందుకంటే కొత్త కొమ్మలు రావడానికి మొక్కకు శక్తి కావాలి. ఆవు పేడ, మూత్రం, బెల్లం, శనగపిండితో తయారుచేసే జీవామృతం మొక్కకు అమృతంలా పనిచేస్తుంది. ఇది వారానికి ఒకసారి. పోయవచ్చు.14. గోళ్లతో తుంచడం కంటే పదునైన కత్తెర వాడటం మేలు. కత్తిరించిన భాగం వద్ద కొంచెం పసుపు రాస్తే ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. 15. కటింగ్ తరువాత మొక్క పైన నీరు చల్లకుండా, మొదట్లో మాత్రమే పోయాలి. 16. తీగ జాతి మొక్కలలో (సొర, బీర, కాకర వంటివి) పూత, పిందె దశలో ఉన్నప్పుడు 3జీ కటింగ్ చేయడం సరైన పద్ధతి కాదు. 3జీ కటింగ్ ప్రక్రియను మొక్క చిన్నగా ఉన్నప్పుడే (సుమారు 1 మీటర్ లేదా 6–8 ఆకులు ఉన్నప్పుడు) ప్రారంభించాలి. దీని ఉద్దేశ్యం కొత్త రెమ్మలను (2జీ, 3జీ కొమ్మలను) పుట్టించి, వాటిపై ఎక్కువ ఆడ పూలను వచ్చేలా చేయడం.17. పూత, పిందె దశలో కొమ్మలను కత్తిరించడం వల్ల ఇప్పటికే ఉన్న పూలు, పిందెలు రాలిపోయే అవకాశం ఉంది. అలాగే, మొక్క తన శక్తిని కొత్త కొమ్మల ఉత్పత్తికి మళ్లిస్తుంది, దీనివల్ల ఉన్న కాయలు సరిగ్గా పెరగవు. తగినంత ఎరువులు, నీరు అందిస్తే కాయలు నాణ్యంగా పెరుగుతాయి.18. ఒకవేళ మొక్క కేవలం మగ పూలనే పూస్తూ, అసలు పిందెలు పడకపోతే, అప్పుడు చివరి రెమ్మలను కొద్దిగా తుంచవచ్చు (పించింగ్). కానీ పద్ధతి ప్రకారం చేసే 3జీ కటింగ్ మాత్రం పంట ప్రారంభ దశలోనే పూర్తి చేయాలి. 19. 3ఎ కటింగ్ ద్వారా ఒకే మొక్క నుండి సాధారణం కంటే 2 నుండి 3 రెట్లు ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు.20. మొక్కకు నత్రజని ఎక్కువగా అందడం వల్ల ఆకులు, మగ పూలు విపరీతంగా వస్తాయి. బూడిద లేదా అరటిపండు తొక్కల పొడి వంటివి వేయడం ద్వారా పొటాషియం, ఫాస్పరస్ అంది, ఆడ పూల సంఖ్య పెరుగుతుంది. అరటిపండు తొక్కలను 2–3 రోజులు నీటిలో నానబెట్టి, ఆ నీటిని మొక్కలకు పోయడం వల్ల పొటాషియం అందుతుంది.21. ఇంట్లో వాడిన కోడిగుడ్డు పెంకులను పడేయకుండా, వాటిని పొడి చేసి మట్టిలో కలపడం లేదా నీటిలో వేసి మరిగించి ఆ నీటిని చల్లార్చి మొక్కలకు పోయటం ద్వారా కాల్షియం అంది పిందెలు కుళ్ళిపోకుండా ఉంటాయి. పూత రాలకుండా బలంగా ఉంటుంది.22. హ్యాండ్ ΄ాలినేషన్ చేయాలి. ఒకవేళ తోటలో తేనెటీగలు లేకపోయినా లేదా ఆడ పూలు తక్కువగా ఉన్నా పిందెలు కాయలుగా మారవు. అప్పుడు మనమే స్వయంగా పరాగ సంపర్కం చేయవచ్చు. బాగా వికసించిన మగ పూవును కోసి, దాని రేకులను తీసివేసి ఆ మగ పూవు మధ్యలో ఉండే పరాగ రేణువులను ఆడ పూవు (పువ్వు కింద చిన్న పిందె ఉండేది) మధ్య భాగంలో మెల్లగా తాకించాలి.. ఈ పనిని ఉదయం 6 నుండి 9 గంటల లోపు చేస్తే ఫలితం బాగుంటుంది.23. బాగా పులిసిన మజ్జిగలో కొద్దిగా ఇంగువ కలిపి ఒక లీటరుకు 10 లీటర్ల నీరు కలిపి మొక్క అంతా తడిచేలా పిచికారీ చేయడం వల్ల పూత బాగా వస్తుంది. ఇది ‘మిరకిల్ లిక్విడ్’ లాగా పనిచేస్తుంది. ఇంగువను పిచికారీ చేయటం వల్ల పూత రాలదు. మగ పూల కంటే ఆడ పూలు వచ్చే అవకాశం పెరుగుతుంది.24. మట్టి ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. కానీ నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మగ పూలు పెరిగే అవకాశం ఉంటుంది.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం. మొబైల్: 94906 02366
అంతర్జాతీయం
మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతలు.. రంగంలోకి జార్జ్ వాషింగ్టన్ నౌక
టెహ్రాన్: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఎంతో కాలంగా సముద్రంలోనే ఉండి అమెరికాకు సేవలంధిస్తున్న అబ్రహం లింకన్ యుద్ధ నౌక స్థానంలో యుఎస్ మరో వార్షిప్ను మోహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరొక శక్తివంతమైన నౌక యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ ను మధ్యప్రాచ్యానికి పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. అయితే, ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేనని, లింకన్ నౌక సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలకు దీనికి సంబంధం లేదని అధికారులు తెలిపారు.ఎంతోకాలంగా అరేబియా సముద్రంలో మోహరించిన అబ్రహం లింకన్ నౌకలో సుమారు 5,000 మంది నావికులు, మెరైన్లు విధులు నిర్వహిస్తున్నారు. గత నవంబర్ 21న శాన్ డియాగో నుంచి పసిఫిక్ ప్రాంతం కోసం బయలుదేరిన ఈ నౌక, ఫిబ్రవరి 28న ఇరాన్తో యుద్ధం ప్రారంభం కావడంతో మధ్యప్రాచ్యానికి దారి మళ్లించబడింది. ఎలాంటి పోర్ట్ కాల్ (ఓడరేవు సందర్శన) లేకుండానే ఈ నౌక ఏకంగా 200 రోజులకు పైగా సముద్రంలోనే గడపడం సిబ్బందికి అత్యంత క్లిష్టమైన పరీక్షగా మారింది. గత 250 రోజులకు పైగా సాగుతున్న ఈ ప్రయాణంతో నావికుల్లో తీవ్రమైన అలసట, మానసిక క్షోభ నెలకొన్నాయి.సిబ్బంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఆత్మహత్య ఆలోచనలు మరియు కొందరు సిబ్బంది ఓడ నుంచి దూకే ప్రయత్నాలు చేశారన్న వార్తలు కుటుంబ సభ్యులు, చట్టసభ సభ్యుల్లో ఆందోళన రేకెత్తించాయి. మరోవైపు, ఆహార కొరత, నీటి కాలుష్యం, మరుగుదొడ్ల సమస్యలు, బూజు పట్టడం, మెయిల్ వ్యవస్థ దెబ్బతినడం వంటి దుర్భర పరిస్థితులను కుటుంబ సభ్యులు ఎత్తిచూపారు. శాన్ డియాగోలో జరిగిన సమావేశంలో బాధ్యుల తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.ఈ ఆరోపణలను అమెరికా నావికాదళం రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తోసిపుచ్చారు. ఆత్మహత్యాయత్నాలు పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, సిబ్బందికి కౌన్సెలర్లు, శుద్ధి చేసిన నీరు, భోజనం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే, యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా కేంద్రాలు దెబ్బతినడం వల్ల ఆహారం, పరిశుభ్రతా వస్తువుల అందజేతలో కొన్ని అంతరాయాలు ఏర్పడినట్లు నావీ అంగీకరించింది. ఇరాన్తో జరుగుతున్న ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే స్పష్టత లేకపోవడం, నావికులు మానసికంగా మరింత కుంగిపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అబ్రహం లింకన్కు విధుల నుంచి విరామం ఇవ్వడానికి జార్జ్ వాషింగ్టన్ను పంపుతున్నట్లు తెలుస్తోంది. జార్జ్ వాషింగ్టన్ ప్రస్తుతం వియత్నాంలోని డానాంగ్ నుంచి బయలుదేరిన ఈ నౌక సింగపూర్ జలసంధి మీదుగా హిందూ మహాసముద్రం వైపు ప్రయాణిస్తున్నట్లు యూఎస్ నావీ అధికారులు తెలిపారు.
అమెరికాకు చుక్కలు చూపించిన ఉక్రెయిన్
వాషింగ్టన్ డీసీ: అమెరికా ఆయుధ సంపత్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద వైమానిక దళంతో పాటు ఆధునిక యుద్ధ నౌకలు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల సైనిక స్థావరాలతో ఆ దేశం ఎంతో స్ట్రాంగ్గా ఉంది. అయితే శత్రుదుర్బేద్యంగా కనిపించే వాషింగ్టన్.. ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం చేతిలో చతికిలపడాల్సి వచ్చింది. అవును ఇది అక్షరాల నిజం ఇటీవల జర్మనీలో జరిగిన "కంబైన్డ్ రిజాల్వ్" సైనిక విన్యాసంలో ఉక్రెయిన్ డ్రోన్లు అమెరికా దళాలను ముప్పుతిప్పలు పెట్టాయి. వాల్ స్ట్రీట్ జనరల్ కథనం ప్రకారం.. జర్మనీలో జరిగిన 'కంబైన్డ్ రిజాల్వ్' సైనిక విన్యాసాలలో ఉక్రెయిన్ డ్రోన్ ఆపరేటర్లు అమెరికా బలగాలను, వారి సాయుధ వాహనాలను పదేపదే గుర్తించి మరీ 'నాశనం' చేశారని తెలిపింది. ఒక దశలో ఉక్రెయిన్ డ్రోన్ బృందాలు ఏకంగా ఒక పూర్తి అమెరికన్ ఆర్మర్డ్ బ్రిగేడ్ (సాయుధ దళాన్ని) తుడిచిపెట్టేశాయని అమెరికా అధికారులే స్వయంగా వెల్లడించినట్లు పేర్కొంది. రష్యాతో గత నాలుగున్నర ఏళ్లుగా సాగుతున్న యుద్ధ అనుభవం ఉక్రెయిన్కు డ్రోన్ల వినియోగంలో అపారమైన నైపుణ్యాన్ని ఇచ్చింది. ఈ రకమైన ఆధునిక యుద్ధ పద్ధతులను నేర్చుకోవడానికి అమెరికా సైన్యం ఇంకా ప్రయత్నిస్తూనే ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలిపింది.అయితే ఈ విన్యాసంలో నేరుగా మందుగుండు సామాగ్రి ఉపయోగించరు. డ్రోన్లు వాహనాలపై నుండి లేదా వాటికి అత్యంత సమీపంగా ప్రయాణించినప్పుడు, పరిశీలకులు ఆ వాహనం వర్చువల్గా 'నాశనమైంది' అని ప్రకటిస్తారు. ఉక్రెయిన్ దళాలు ఎంత వేగంగా అమెరికా వాహనాలను కూల్చేసాయంటే, కొన్ని వాహనాలను నాశనమైనట్లు ప్రకటించి మళ్లీ బతికించి కొత్త యూనిట్లుగా విన్యాసాల్లోకి పంపాల్సి వచ్చింది. అయితే రెండు వారాల పాటు సాగిన ఈ డ్రిల్ తర్వాత అమెరికా సైనికులు క్రమంగా పరిస్థితులకు అలవాటు పడ్డారు. వారు తమ దళాలను విడదీయడం, కదలికలను దాచడం మరియు శత్రువుల కంటికి పడకుండా ఉండటానికి 'ఎలక్ట్రానిక్ వార్ఫేర్' పద్ధతులను ఉపయోగించడం నేర్చుకున్నట్లు అధికారులు ప్రకటించారు.అనంతరం ఉక్రెయిన్ దళాలు అమెరికన్లకు డ్రోన్లను ఆఫెన్సివ్గా (దాడి చేయడానికి) ఎలా వాడాలో శిక్షణ కూడా ఇచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ఈ విధమైన శిక్షణ అమెరికాలో దొరకదని '"ఇలాంటి అద్భుతమైన శిక్షణ అమెరికాలో దొరకడం అసాధ్యం" అని నాటో సైనికదళం నాయకుడు ఎయిర్ ఫోర్స్ జనరల్ అలెక్సస్ గ్రింకెవిచ్ వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఉక్రెయిన్ దళాలతో శిక్షణ పొందిన తర్వాత నాటో సైన్యంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ఆయన అన్నారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డ్రోన్ల వినియోగంలో ఉక్రెయిన్ ముందంజఉక్రెయిన్ కేవలం డ్రోన్లను ఎగరేయడమే కాకుండా, యుద్ధ రంగంలో అవి నిరంతరం పనిచేసేలా చూసుకోవడం, వాటిని రిపేర్ చేయడం మరియు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయడంలో నైపుణ్యం సాధించింది. కానీ, అమెరికా సైనికులకు యుద్ధ రంగంలో దాడి జరుగుతున్నప్పుడు డ్రోన్లను రిపేర్ చేయడం లేదా ఆయుధాలను అమర్చడంలో అనుభవం చాలా తక్కువగా ఉంది. డ్రోన్ల కోసం అమెరికా బిలియన్ల ఖర్చు.. కానీ మారిన వ్యూహంసుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రోన్ల సాంకేతికతను ఆధునిక యుద్ధాలలో చేర్చడంలో వాషింగ్టన్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నాయి.పెంటగాన్ కొత్త డ్రోన్లు మరియు కౌంటర్-డ్రోన్ వ్యవస్థల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేసింది. కానీ ప్రస్తుతం యుద్ధ రంగం మారిపోయింది. ఇప్పుడు సమస్యలు సృష్టిస్తోంది అమెరికా తయారు చేసిన ఖరీదైన, అధునాతన లాంగ్-రేంజ్ డ్రోన్లు కావు. చిన్నవి, చౌకైన ఫ్రంట్లైన్ డ్రోన్లను పెద్ద సంఖ్యలో వాడుతూ, యుద్ధ నిఘా సమాచారంతో కలిపితే ఎంతటి విధ్వంసం సృష్టించవచ్చో ఉక్రెయిన్ నిరూపించింది. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ డ్రోన్ల దాడులను తిప్పికొట్టడానికి అమెరికా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ దాడుల్లో అమెరికా సైనికులు మరణించడమే కాకుండా, ఆయుధాలు, విమానాలు కూడా ధ్వంసమయ్యాయి.కాగా ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే. గత ఆరు నెలలుగా అమెరికా ఇరాన్పై దాడి చేస్తున్నా యుద్ధం కొలిక్కి రాలేదు. వారంలోనే యుద్ధాన్ని ముగిస్తానని బింకాలు పలికిన ట్రంప్ యుద్ధం ఎలా ముగించాలో తెలియక తల పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికా ఆధునాతన డ్రోన్ల వినియోగంలో అమెరికా వైఫల్యం మరోసారి తేటతెల్లమైంది. ఈ ఆపరేషన్ ఏంటి?అమెరికా వాహనాలను ముప్పతిప్పలు పెట్టిన డ్రోన్లు'కంబైన్డ్ రిజాల్వ్' అనేది మైదాన ప్రాంత యుద్ధాలపై ఆధారపడిన భారీ స్థాయి ఆర్మీ విన్యాసం. ఇందులో అమెరికా దళాలు సాయుధ వాహనాలు, పదాతి దళం, హెలికాప్టర్లు మరియు డ్రోన్లతో పాల్గొంటాయి. అయితే, ఉక్రెయిన్ డ్రోన్ బృందాలు చాలా వేగంగా వీటిని ముక్కలు ముక్కలుగా చేసి పారేశాయి. ఇలాంటి విన్యాసాల్లో నిజమైన మందుగుండు సామగ్రిని ఉపయోగించరు. ఈ విన్యాసాలు వాస్తవ యుద్ధ పరిస్థితులలో లోపాలను గుర్తించడానికి నిర్వహించబడ్డాయి.
‘ఆయనకేం.. చెత్తబుట్టలో కూడా దాక్కుంటారు!’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించిన రహస్య ఆపరేషన్ అంతర్జాతీయ చర్చకు దారితీసింది. టర్కీలోని అంకారాలో నాటో సదస్సు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆయన్ని మరో చిన్న విమానంలోకి మార్చిన ఘటనపై విశ్లేషణలు నడుస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇరాన్ మీడియా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ ఘటన అమెరికా అధ్యక్షుడి భద్రతా ఆందోళనలను బయటపెట్టిందంటూ వ్యాఖ్యానించింది.నాటో సదస్సు కోసం టర్కీ వెళ్లిన ట్రంప్ తిరుగు ప్రయాణం సందర్భంగా ఎయిర్ఫోర్స్ వన్పై క్షిపణి (shoulder-fired missile) దాడి ముప్పు ఉందన్న సమాచారంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమైంది. ముప్పు నమ్మదగినదిగా, తక్షణ చర్య అవసరమయ్యే స్థాయిలో ఉందని భావించి ఈ రహస్య మార్పిడి చేపట్టినట్లు సమాచారం.ఇరాన్ మీడియా వ్యంగ్యంఈ ఘటనను ఇరాన్ ప్రభుత్వ మీడియా తమ ప్రచారానికి ఉపయోగించుకుంది. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ సైనిక శక్తికి భయపడుతున్నారనే సంకేతంగా ఈ విమాన మార్పిడిని చిత్రీకరించింది. ట్రంప్ తాజా “స్కాండల్”గా అభివర్ణిస్తూ.. ఇది ఆయనకు అవమానకర పరిస్థితి అని ఇరాన్ టీవీ వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఇరాన్ దక్షిణాఫ్రికా రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్రంప్ను కేటరింగ్ బాక్స్లో దాచినట్లు చూపించే మీమ్ను కూడా షేర్ చేసింది. “త్వరలో చెత్త బుట్టలో దాచాల్సి వస్తుంది” అనే వ్యాఖ్యను జోడించింది.He will be hidden in a trash can before long. pic.twitter.com/ZTkAahNIKw— Iran Embassy SA (@IraninSA) August 11, 2026Brave American hero, or a coward hiding in a catering truck? pic.twitter.com/t1vcmrdcHw— Iran Embassy SA (@IraninSA) August 12, 2026కేటరింగ్ వాహనంలో రహస్య తరలింపుజూలై 8న అంకారా నుంచి బ్రిటన్కు బయలుదేరే సమయంలో ట్రంప్, ఆయనతో ఉన్న కొద్దిమంది సిబ్బందిని కేటరింగ్ ట్రక్కు ద్వారా పెద్ద విమానం నుంచి చిన్న ప్రభుత్వ విమానం C-32Aలోకి మార్చినట్లు నివేదికలు వెల్లడించాయి. అదే సమయంలో అసలు ఎయిర్ఫోర్స్ వన్ వేరుగా బయలుదేరింది. అందులో సీనియర్ అధికారులు, వైట్హౌస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఉన్నారు.ఈ ఆపరేషన్ వివరాలను తొలుత వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ట్రంప్ ప్రయాణ వివరాలు, ఆయన అంకారాలో ఉన్న హోటల్ అంతస్తు వరకు ఇరాన్కు తెలిసినట్లు అమెరికా అధికారులు ఆందోళన చెందారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అలాగే ఇలాంటి డీకాయ్ ఆపరేషన్లు(మోసపూరిత భద్రతా వ్యూహం) సర్వసాధారణమేనని వ్యాఖ్యానించింది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఘటనఅమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్పై గతంలోనూ దాడి కుట్ర ఆరోపణలు వచ్చాయి. 2024లో ట్రంప్ అప్పటి అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ఆయన హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా న్యాయశాఖ ఓ ఇరానియన్పై కేసు నమోదు చేసింది. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ ఖండించింది.ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్-అమెరికా.. ఇరాన్ల యుద్ధం మొదలైంది. అయితే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులకు శాశ్వత ముగింపు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటికీ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విమాన మార్పిడి ఘటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.భద్రతా చర్యా? రాజకీయ ప్రచారమా?అమెరికా వర్గాల ప్రకారం ఇది అధ్యక్షుడి భద్రత కోసం తీసుకున్న ముందస్తు జాగ్రత్త మాత్రమే. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన సమాచారంతోనే డీకాయ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే కేవలం ఒక ఏజెన్సీ సమాచారంతోనే.. అదీ ధృవీకరణ చేసుకోకుండానే అమెరికా భద్రతా బలగాలు ట్రంప్ను అలా తరలించారని తర్వాత తెలిసింది. ఏది ఏమైనా.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇరాన్ మాత్రం దీన్ని అమెరికా బలహీనతకు సంకేతంగా చూపిస్తూ ప్రచారం చేస్తోంది. ట్రంప్ను రక్షించేందుకు చేపట్టిన అత్యంత రహస్య ఆపరేషన్ ఇప్పుడు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి కొత్త కారణంగా మారింది.
ట్రంప్ ప్రెస్ సెక్రటరీ లెవిట్ రాజీనామా
వాషింగ్టన్: వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా చేశారు. ఆగస్టు నెలాఖరులో పదవి నుంచి వైదొలగనున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బయటినుంచి సలహాదారుగా కొనసాగుతారు. తన ఇద్దరు పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి వైట్హౌస్లోని ఈ ఒత్తిడితో కూడిన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత స్థాయి పదవిని చేపట్టిన వారిలో అత్యంత చిన్న వయస్సు వ్యక్తైన లెవిట్, తన 18 నెలల పదవీకాలంలో ట్రంప్కు గట్టి విధేయురాలిగా పేరు సంపాదించారు. వైట్హౌస్ బ్రీఫింగ్ సమయంలో విలేకరులతో తీవ్ర వాగ్వాదాలకు దిగి నిత్యం వార్తల్లో నిలిచారు. 28 ఏళ్ల లెవిట్.. మే నెలలో తన రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ప్రసూతి సెలవు తర్వాత ఇటీవలే వైట్హౌస్కు తిరిగి వచ్చారు. అయితే, కష్టమైన ఉద్యోగమైన ప్రెస్సెక్రటరీగా, తల్లిగా తన బాధ్యతలను సమతుల్యం చేసుకోవడం కష్టంగా మారిందని రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రెండు బాధ్యతలకు సంపూర్ణంగా న్యాయం చేయలేనని గ్రహించానన్నారు. ప్రెస్ సెక్రటరీ పదవి తన జీవితంలో లభించిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు. అయితే, లెవిట్ వైట్హౌస్ నుంచి నిష్క్రమించినా రాజకీయ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారని, బయటి కమ్యూనికేషన్స్ సలహాదారుగా పనిచేస్తారని, ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ ఉద్యమంతో కలిసి పనిచేస్తారని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. లెవిట్ పనితీరును ప్రశంసిస్తూ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఆమెను వైట్ హౌస్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రెస్ సెక్రటరీల్లో ఒకరిగా అభివర్ణించారు. 2018 నుంచి 2024 ఎన్నికల ప్రచారం వరకు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ఇదిలా ఉండగా, జులైలో టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ట్రంప్ భద్రతా చర్యలు మీడియాకు తెలిసిన సమయంలో లెవిట్ నిష్క్రమణ చర్చనీయాంశమవుతోంది. అధ్యక్షుడితో ప్రయాణించే జర్నలిస్టులకు ఆయన కదలికల గురించి తెలిసేలా చూసుకునే సాధారణ పద్ధతికి విరుద్ధంగా జరగడం ఆమె నిష్క్రమణకు కారణమైందనే చర్చ జరుగుతోంది.అతి పిన్న వయస్కురాలైన ప్రెస్ సెక్రటరీ2025 జనవరిలో 26 ఏళ్లవయసులో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమితులైన అతి చిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు. వార్తా మాధ్యమాలతో వైట్ హౌస్ సంబంధాలను పునర్వ్యవస్థీకరించారు. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్తో కలిసి పనిచేస్తూ, ఏ జర్నలిస్టులకు అధ్యక్షుడిని కలిసే అవకాశం ఇవ్వాలనే నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడంలో సహాయపడ్డారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ రొటేటింగ్ ప్రెస్ పూల్ను నిర్ణయించే సాంప్రదాయ వ్యవస్థనుంచి తొలగించారు. బదులుగా, పరిపాలన పాడ్కాస్ట్లు, న్యూస్లెటర్లు, కొత్త డిజిటల్ మాధ్యమాలకు ఎక్కువ పాధాన్యత ఇచ్చారు. బ్రీఫింగ్ గదిలో ప్రత్యేకంగా న్యూ మీడియా సీటును సృష్టించారు. అయితే, ఈ కొత్త వ్యవస్థ సానుభూతి కవరేజీ మాధ్యమాలకు అనుకూలంగా వ్యవహరించే పరిపాలనకు అవకాశం కల్పిస్తుందని విమర్శించారు.
జాతీయం
చమోలీ సొరంగ ప్రమాదంలో ఏడుగురు మృతి
గోపేశ్వర్: ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగ మార్గంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొండచరియలు విరిగిపడటం, భూమి కుంగిపోవడంతో మాయాపూర్ (పిపల్కోటి) వద్ద హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ (హెచ్సీసీ) నిర్మిస్తున్న సొరంగంలోకి గురువారం రాత్రి 7 గంటల సమయంలో అకస్మాత్తుగా భారీగా శిథిలాలు, నీరు ప్రవేశించాయి. సొరంగాన్ని సగం వరకు కప్పేశాయి. ఆ సమయంలో సొరంగంలో 22 మంది కార్మికులున్నారు. తక్షణమే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్, స్థానిక పోలీసులతోపాటు సాంకేతిక, ప్రత్యేక నిపుణుల బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వీరు గురువారం రాత్రంతా శ్రమించి 19 మందిని బయటకు తీసుకురాగలిగారు. ఇందులో ఏడుగురు చనిపోగా, తీవ్రంగా గాయపడిన 12 మందిని ఆస్పత్రులకు తరలించారు.మిగతా ముగ్గురు సొరంగంలో 1.8 కిలోమీటర్ల లోపల చిక్కుకుపోయినట్లు గుర్తించారు. వీరి కోసం సహాయక బృందాలు యంత్రాలను ఉపయోగించి శిథిలాలను తొలగించి, పంపులతో నీటిని తోడివేస్తున్నారు. విడవకుండా వర్షం కురుస్తున్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, బాధితుల్లో ఉత్తరాఖండ్తోపాటు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వాసులున్నారు. బిహార్కు చెందిన రోహిత్ పాండే పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనగర్లోని ఆర్మీ బేస్ హాస్పిటల్కు తరలించారు. లోపల చిక్కుబడి పోయిన వారిని జార్ఖండ్కు చెందిన లుకాస్ టొప్నో, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన చేతన్ పోయమ్, దేవ్నాథ్లుగా గుర్తించారు. వీరున్న ప్రాంతాన్ని గుర్తించి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని గఢ్వాల్ రేంజ్ ఐజీపీ రాజీవ్ స్వరూప్ చెప్పారు. కాగా, విష్ణుగఢ్–పీపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టులో భాగంగా తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ సొరంగ నిర్మాణం చేపట్టింది. 2023లో ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సిల్్కయారా–బార్కోట్ సొరంగంలోని ఒక భాగం కూలిపోవడంతో 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలతోపాటు అంతర్జాతీయ నిపుణుల సాయంతో 17 రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగించి, వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం తెల్సిందే.
78 మందికి శౌర్య పురస్కారాలు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందిలో 78 మందికి శౌర్య పురస్కారాలు ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు. వీటిలో 13 మరణానంతర పురస్కారాలు ఉన్నాయి. 9 కీర్తిచక్రలు, 19 శౌర్యచక్రలు, 5 బార్ టు సేనా మెడల్స్(గ్యాలంట్రీ), 36 సేనా మెడల్స్(గ్యాలంట్రీ)తోపాటు మరికొన్ని అవార్డులను ప్రభుత్వం ప్రదానం చేయనుంది. అశోక చక్ర తర్వాత ప్రదానం చేసే భారతదేశపు రెండో అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తిచక్ర. శౌర్యచక్ర అనేది మూడో అత్యున్నత శౌర్య పురస్కారం. కీర్తిచక్ర అవార్డు గ్రహీతలు 21 పారా (స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ మనోజ్ ఫ్రాన్సిస్, 2 పారా (స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన మేజర్ జితేంద్ర రాఠీ. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హవల్దార్ గజేంద్ర సింగ్, హెడ్ కానిస్టేబుళ్లు జగ్బీర్ సింగ్, బషీర్ అహ్మద్, కానిస్టేబుళ్లు జశ్వంత్ సింగ్, బల్వీందర్ సింగ్, తారిఖ్ హుస్సేన్, ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్కు కూడా కీర్తిచక్ర పురస్కారాలను ప్రకటించారు. మేజర్ పరమ్వీర్, మేజర్ తరుణ్ వాసుదేవన్, మనోజ్ కేశవ్ కుమార్, మేజర్ గౌరవ్ సింగ్ బ్రిజ్వాల్, మేజర్ విపీన్ కుమార్, నాయబ్ సుబేదార్ శంకర్ రామ్, నాయబ్ సుబేదార్ దబ్బాల్ సింగ్ బిష్త్ తదితరులకు శౌర్యచక్ర పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
సెన్సస్–2027 ప్రశ్నావళి మీ కులం ఏమిటి?
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత్లో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఇందుకు సంబంధించిన 40 ప్రశ్నలను అధికారికంగా నోటిఫై చేసింది. మొట్టమొదటిసారి కులంతోపాటు కోవిడ్ టీకా వేయించుకున్న ప్రదేశం వివరాలను కూడా సేకరించనున్నారు. జమ్మూ కశ్మీర్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని మంచుతో కూడిన ప్రాంతాల్లో వచ్చే సెపె్టంబరు ఒకటవ తేదీ నుంచే పాపులేషన్ ఎన్యూమరేషన్ దశ మొదలవుతుందని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు స్పష్టం చేసింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ సారి జనాభా లెక్కల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర కులాల వివరాలు తెలుసుకోనున్నారు. ప్రజలు తమంతట తామే వివరాలు సమరి్పంచేందుకు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ఆగస్టు 17 నుంచి 31 వరకు అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జనాభా లెక్కింపు (పీఈ) వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. తాజా జనాభా లెక్కల్లో భాగంగా తొలిసారి కులం వివరాలు సేకరిస్తున్నప్పటికీ అడిగే ప్రశ్నల్లో కులాల జాబితా ఏదీ ఉండే అవకాశం లేదు. ప్రజలు ఇచ్చే సమాధానాన్ని నేరుగా నమోదు చేస్తారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. గత ఏడాది ఏప్రిల్ 30న కులాల వారీ జనాభా వివరాలు సేకరించాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ సమావేశం తీర్మానించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న సెన్సస్–2027కు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇళ్ల జాబితా, లెక్కల సేకరణ కోసం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపారు. ఎన్యూమరేటర్లు అన్ని రకాల ఇళ్లు, నిర్మాణాల వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంలోనే అధికారులు ఒక్కో ఇల్లు/భవనాన్ని సందర్శించి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. పదేళ్లకు ఒకసారి జరిపే జనాభా లెక్కలు వాస్తవానికి 2021లోనే మొదలు కావాల్సి ఉన్నా అప్పట్లో కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం సెన్సస్–2027 కోసం రూ.11,718 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ ఉద్దేశాలపై అనుమానాలు: కాంగ్రెస్ జనాభా లెక్కల్లో భాగంగా కులాల వివరాలు కూడా సేకరించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆక్షేపణ తెలిపింది. కులాల జాబితా ఆధారంగా కాకుండా స్పందనలను మాత్రమే నమోదు చేయడం అనుమానాలు రేకెత్తిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఈ అంశంపై అధికార పక్షం ఏ రాజకీయ పారీ్టతోనూ చర్చించలేదని ఆరోపించింది. బిహార్, తెలంగాణల్లో మాదిరిగానే సిద్ధంగా ఉన్న కులాల జాబితా సాయంతో జనాభా లెక్కలు నిర్వహిస్తారని ఆశించామని అందుకు భిన్నంగా జరుగుతూండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా గత ఏడాది ప్రధాని మోదీకి రాసిన లేఖలో తెలంగాణ మోడల్ను అనుసరించాలని, అన్ని రాజకీయ పారీ్టలతో చర్చించాలని కోరారని, ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదని విమర్శించారు. ఇవీ ప్రశ్నలు.. → వ్యక్తిగత, జనాభా వివరాలు వ్యక్తి పేరు ఇంటి యజమాని స్త్రీ లేదా పురుషుడు? పుట్టిన తేదీ, వయసు (పూర్తయిన సంవత్సరాల్లో) ప్రస్తుత వైవాహిక స్థితి వివాహమై ఎంత సమయం? (పూర్తయిన సంవత్సరాల్లో) భార్య/భర్త పేరు జాతీయత (ప్రకటించిన విధంగా) మతం షెడ్యూల్డ్ కులం (ఎస్సీ)/షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)/కులం తండ్రి వివరాలు తల్లి వివరాలు వైకల్యం స్థితి (ఏదైనా ఉంటే) మాతృభాష, తెలిసిన ఇతర భాషలు→ విద్య అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత స్థితి విద్యాసంస్థలో హాజరు (ప్రస్తుత స్థితి) సాధించిన అత్యున్నత విద్యా స్థాయి విద్యా శాఖ/విభాగం→ ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలు గత ఏడాదిలో ఏ సమయంలోనైనా పనిచేశారా ఆర్థిక కార్యకలాపాల వర్గం వృత్తి పరిశ్రమ/వ్యాపారం/సేవల స్వభావం కారి్మక వర్గం ఆర్థికేతర కార్యకలాపం (మార్జినల్, సెమీ మార్జినల్, నాన్వర్కింగ్) పని కోసం చూస్తున్నారా?/అందుబాటులో ఉన్నారా (మార్జినల్, సెమీ మార్జినల్, నాన్వర్కింగ్) పని చేసే చోటికి ప్రయాణం అవసరమా?→ వలసలు, నివాసం పుట్టిన స్థలం చివరి నివాస ప్రదేశం వలసకు కారణం ప్రస్తుత గ్రామం/పట్టణంలో ఉన్న కాలం శాశ్వత నివాస చిరునామా→ సంతాన సాఫల్యం, కుటుంబం (మహిళలకు) ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య ఇప్పటి వరకు పుట్టిన మొత్తం పిల్లల సంఖ్య (వివాహిత, వితంతువు, విడాకులు తీసుకున్న, వేరుపడిన మహిళలకు) గత ఏడాదిలో జని్మంచిన శిశువుల సంఖ్య (వివాహిత మహిళలకు మాత్రమే)→ ఆరోగ్యం, గుర్తింపు కోవిడ్–19 టీకా వేయించుకున్న ప్రదేశం మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య మొబైల్ నంబర్ (ఉంటే) ఆధార్ నంబర్ (ఉంటే) ఓటర్ ఐడీ నంబర్ (ఉంటే) పాస్పోర్ట్ నంబర్ (భారత పాస్పోర్ట్ ఉంటే), డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా?
‘నన్నే ఆపుతావా?’.. పోలీసు అధికారిణిపై ఎమ్మెల్యే కుమార్తె దాడి
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే బి. సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య, శ్రీరంగపట్టణంలోని ప్రసిద్ధ ఆరతి ఉక్కడ ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిణిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. భీమన అమావాస్య సందర్భంగా చోటుచేసుకుంది.ఆగస్టు 12న భీమన అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరంగపట్టణంలోని ఆరతి ఉక్కడ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో తీవ్రమైన రద్దీ నెలకొన్న తరుణంలో గర్భాలయంలోకి ప్రవేశించడానికి అందరూ నిబంధనల ప్రకారం కొంత సమయం వేచి ఉండాలని అధికారులు సూచించారు.ఈ క్రమంలో ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే కుమార్తె ఐశ్వర్యను నిబంధనల ప్రకారం వేచి ఉండాలని అక్కడ విధి నిర్వహణలో ఉన్న మహిళా పీఎస్ఐ సవిత కోరారు. ఒక్కసారిగా అందరినీ లోపలికి అనుమతిస్తే భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని ఆమె వివరించడానికి ప్రయత్నించారు.అయితే, దీనిపై ఐశ్వర్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే కుమార్తెనని చెబుతూ పోలీస్ అధికారిణితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, అనుచిత పదజాలం ఉపయోగించినట్లు పీఎస్ఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విధులు నిర్వర్తిస్తున్న తనను అడ్డుకుంటున్నారనే కోపంతో ఐశ్వర్య పీఎస్ఐ సవితను చెంపదెబ్బ కొట్టారని, అంతేకాకుండా ఆమె కెరీర్ను నాశనం చేస్తానని బెదిరించారని సమాచారం.పోలీసుల కేసు నమోదు ఈ ఘటనపై బాధితురాలైన పీఎస్ఐ సవిత మాండ్య మహిళా పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా యాతనహళ్ళి పోలీస్ స్టేషన్లో ఐశ్వర్యపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రతిస్పందించిన ఐశ్వర్య కూడా పోలీస్ అధికారిణి తనతో అసభ్యంగా,దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులకు తిరుగు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యురాలు పోలీసులపై దాడి చేశారనే ఆరోపణలు రావడంతో ఈ ఉదంతం కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
ఎన్ఆర్ఐ
హైదరాబాద్కు శ్రీపతి దీపారెడ్డి పార్థీవదేహం
హైదరాబాద్: చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీకి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) అమెరికా న్యూజెర్సీలో గతనెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దీపారెడ్డి 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.గత నెల 28న భర్త రామకృష్ణారెడ్డిని కారులో కార్యాలయంలో దించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న దీపారెడ్డి కారును, ఓ మెడికల్ విద్యార్థి కారుతో ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆమె అవయవాలను మెడికల్ విద్యార్థులకు అందజేస్తానని అంగీకరించడంతో ఆమె అవయవాలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. సంబరపడే లోపే..రెండు రోజుల్లో మాదాపూర్లో ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ గృహప్రవేశానికి వస్తుందని సంబరపడ్డాం.. అన్ని ఏర్పాట్లు చేశాం, ఈవిధంగా వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టారు. నేడు చంపాపేటలో అంత్యక్రియలు దీపారెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం నగరానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంపాపేటలోని రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు.
అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్
సాక్షి,హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ 19వ మహసభలు శనివారం అమెరికాలోని బాల్టిమోర్లో ఘనంగా ప్రారంభమైయ్యాయి. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారితో పాటు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ల నుండి భారీ ఎత్తున వివిధ రంగాల ప్రముఖులు తొలి రోజు ఆరంభవేడుకలకు హాజరైయ్యారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎంఎల్ఎలు సినీ,సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరైయ్యారు.దాదాపు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు తెలుగు సంస్కృతిని చాటిచెప్పే కళాప్రదర్శనలు నిర్వహించారు.వివిధ రంగాల్లో విశేషసేవ చేసిన 15 మంది ప్రముఖులను ఆటా అవార్డులతో సత్కరించారు. అవార్డులు అందుకున్న వారిలో ఆర్.రవికాంత్రెడ్డి(జర్నలిజం) డాక్టర్ రవీందర్(వైద్యం), కిరణ్ చుక్కపల్లి(ఇండస్ట్రీ) తదితరులను ఆటా మాజీ అధ్యక్షులు పారిశ్రామికవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి సత్కరించారు.
ఎన్ఆర్ఐలు పార్టీకి సేవలు అందించాలి
సాక్షి, అమరావతి: అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో గురువారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, టెక్నాలజీ, కంటెంట్, డేటా, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఎన్ఆర్ఐలు తమ సేవలను పార్టీకి అందించాలని కోరారు. కేవలం పోస్టులు, లైకులు, షేర్లకు పరిమితం కాకుండా, స్పష్టమైన లక్ష్యాలు, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఉన్న ప్రజాభిప్రాయాన్ని వాస్తవాలు, సానుకూల కమ్యూనికేషన్, టెక్నాలజీ, సృజనాత్మక కంటెంట్ను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్ సమావేశంలో పాల్గొన్న ఆలూరు సాంబశివారెడి, తదితరులు
అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్!
అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.అమెరికాలో F-1 విద్యార్థి వీసాపై చదివే విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం అక్కడే ఉండి తమ విద్యకు సంబంధించిన రంగంలో ఉద్యోగం చేసే అవకాశం OPT ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు OPT కింద పనిచేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు చేసిన వారికి ఈ గడువు మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ఉద్యోగ అనుభవం సంపాదించడంతో పాటు, తర్వాత H-1B వర్క్ వీసా పొందేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఈ అవకాశానికి ఏకంగా 100,000 డాలర్ల ఫీజు విధించే ఆలోచన ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల మార్గం మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా తుది ప్రకటన వెలువడలేదు.ఎవరిపై భారం పడనుంది?ప్రతిపాదిత ఫీజును విద్యార్థులే చెల్లించాలా? లేక వారిని ఉద్యోగంలోకి తీసుకునే కంపెనీలే చెల్లించాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులే చెల్లించాల్సి వస్తే.. చాలా మందికి ఇది అందనంత భారంగా మారే అవకాశం ఉంది. కంపెనీలు చెల్లించాల్సి వస్తే.. విదేశీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంపై సంస్థలు వెనుకడుగు వేసే పరిస్థితి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికన్ విద్యార్థులకు ప్రాధాన్యం పెరిగి, అంతర్జాతీయ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.భారతీయ విద్యార్థులపై ప్రభావం ఎంత?అమెరికా ఉన్నత విద్యకు భారతీయ విద్యార్థులు ప్రధాన వర్గంగా ఉన్నారు. ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే కాకుండా.. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేసి అంతర్జాతీయ అనుభవం పొందాలనే లక్ష్యంతో అమెరికాకు వెళ్తున్నారు.అమెరికా విద్య కోసం కుటుంబాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో.. OPTపై భారీ ఫీజు ప్రతిపాదన విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.నాలుగేళ్ల వీసా పరిమితి కూడా!OPT ఫీజు ప్రతిపాదనతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనల్లో మరో కీలక మార్పు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు విదేశీ విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” విధానంలో అమెరికాలో ఉండేవారు. అంటే.. వారు తమ కోర్సును నిబంధనల ప్రకారం కొనసాగిస్తున్నంత కాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది.తాజా ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే ఉండే అనుమతి ఇవ్వాలనే ఆలోచన ఉంది. అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న కారణంఅమెరికా వలస విధానాన్ని మరింత పర్యవేక్షించడం, చట్టబద్ధమైన వలస వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ భద్రతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే విద్యా రంగ నిపుణులు మాత్రం.. ఇలాంటి నిబంధనలు అమెరికాను అంతర్జాతీయ విద్యార్థులకు తక్కువ ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికిప్పుడు ఆందోళన అవసరం లేదా?$100,000 OPT ఫీజు ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే అమెరికా వలస విధానంలో క్రమంగా కఠినమైన మార్పులు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసి అక్కడే కెరీర్ నిర్మించుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై మార్గం మరింత ఖరీదైనదిగా, నిబంధనలతో కూడుకున్నదిగా మారే అవకాశం ఉంది.
క్రైమ్
గుప్తనిధులకై తండ్రికి వల.. బాలికతో నగ్న పూజలు!
ఆంధ్రప్రదేశ్, కడప: క్షుద్ర పూజలకు అడ్డుపడుతున్నాడనే వల్లూరులో బీటెక్ విద్యార్థి కిడ్నాప్, హత్యాయత్నానికి నిందితులు ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. బీటెక్ విద్యార్థి కిడ్నాప్, హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులను వల్లూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన కారు, వేటకత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కడప ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, కమలాపురం సీఐ మోహన్, వల్లూరు ఎస్సై శివనాగిరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వారి కథనం ప్రకారం..డబ్బు ఆశ చూపి బాలికతో నగ్న పూజలుచిత్తూరు జిల్లా పులిచెర్లకు చెందిన కాణిపాకం విజయ్కుమార్ అలియాస్ విజయ్, చిత్తూరు టౌన్ దుర్గానగర్కు చెందిన కర్ణం బాల హేమనాథ్ అలియాస్ హేమంత్, అదే ప్రాంతానికి చెందిన కర్ణం హేమనాథ్ బాల సుబ్రహ్మణ్యం ఒక ముఠాగా ఏర్పడ్డారు. గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేయాలని నిర్ణయించారు. వీరు అనంతపురం జిల్లా శెట్టూరు ప్రాంతానికి చెందిన ఓ బాలిక తండ్రితో పరిచయం చేసుకుని డబ్బు ఆశ చూపి నగ్న క్షుద్ర పూజలు నిర్వహించారు.అనంతరం గుప్తనిధుల విషయమై కడపకు చెందిన వెంకటేష్ యాదవ్ను సంప్రదించగా, మరోసారి పూజలు చేయాలని బాలికను కడపకు తీసుకురావాలని సూచించాడు. ఈ క్రమంలో ఈ నెల 9న కారులో బాలికను, ఆమె తల్లిని కడపకు తీసుకొచ్చారు. అయితే వెంకటేష్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో బాలికను, ఆమె తల్లిని వల్లూరులోని విజయ్కుమార్ స్నేహితురాలు భాగ్యలక్ష్మి ఇంటికి తీసుకెళ్లారు. అయితే భాగ్యలక్ష్మి కొడుకు నాగ సాయి ప్రణవ్కు వీరిపై అనుమానం వచ్చింది. తన తల్లితో విజయ్కుమార్ సన్నిహితంగా ఉండటంతో అసలు వచ్చినవారెవరని ఆరా తీశాడు.దీంతో క్షుద్రపూజలకు ప్రణవ్ అడ్డుగా ఉన్నాడని నిందితులు ఈ నెల 10న అతడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. సాధ్యం కాకపోవడంతో హతమార్చేందుకు దాడి చేశారు. అయితే ప్రణవ్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. నిందితులు పరారయ్యారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులు విజయ్కుమార్, హేమంత్, సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే అనంతపురంలో నిర్వహించిన క్షుద్రపూజలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ కేసును అనంతపురానికి బదిలీ చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఈ కేసులో భాగ్యలక్ష్మి, వెంకటేష్ యాదవ్ పాత్రలపై లోతుగా దర్యాప్తు సాగిస్తున్నట్టు పేర్కొన్నారు.
కారు ప్రమాదం.. దురుసుగా మాట్లాడిన నిర్మాత మురళి
హైదరాబాద్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను సినీ నిర్మాత బొమ్మకు మురళికి చెందిన కారు ఢీ కొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన బుధవారం రాత్రి అబిడ్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పరుశురామ్ తెలిపిన మేరకు.. నాంపల్లి ఆండాలమ్మబాడ ప్రాంతానికి చెందిన సునీత గన్ఫౌండ్రీలోని ఎస్బీఐలో హౌస్ కీపింగ్గా పనిచేస్తోంది.బుధవారం రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా అబిడ్స్ చాపల్ రోడ్డు వద్ద ఎదురుగా రోడ్డుపై నిలిచి ఉన్న కారు ఒక్కసారిగా అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ మహానందను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.డ్రైవర్ను చంపుకోండి: నిర్మాత మురళి బాధితురాలి వైద్యానికి అవసరమైన ఖర్చు భరించాలని స్థానికులు డ్రైవర్ను కోరారు. అయితే తాను కేవలం డ్రైవర్మాత్రమేనని.. యజమాని అయిన ప్రొడ్యూసర్ బొమ్మకు మురళితో మాట్లాడాలని సమాధానం చెప్పాడు. దీంతో వారు నిర్మాతతో మాట్లాడారు. అయితే అతను.. డ్రైవర్నే డబ్బులు అడగాలని, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు చెప్పకుండా కారు బయటకు తీసుకెళ్లాడని.. కావాలంటే మీరు చంపుకోండి.. పోలీస్ కేసు పెట్టుకోండి అని అన్నారు. తాను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని దురుసుగా మాట్లాడాడు.ఇదిలా ఉండగా నిర్మాత భార్యను షాపింగ్ కోసం తీసుకువచ్చి కారును రోడ్డుపైనే ఆపి నిద్రపోయాడు. ప్రొడ్యూసర్ భార్య డ్రైవర్కు ఫోన్ చేయడంతో ఒక్కసారిగా నిద్రలేచి కారును స్టార్ట్ చేయగా మహిళను ఢీకొట్టినట్లు విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ పరశురామ్ తెలిపారు.
తల్లి మార్కెట్కు రానివ్వలేదని.. కూతురు విషాద నిర్ణయం!
హైదరాబాద్: తల్లి మందలించడంతో కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ బ్యాంక్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఉత్తర ప్రదేశ్కు చెందిన మీనాదేవికుటుంబం మల్లాపూర్ బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. బుధవారం తల్లి కూరగాయల మార్కెట్కు వెళ్తుండగా తను కూడా వస్తానని కూతురు ఖుషి చౌహాన్ (14) అడిగింది. దీంతో తల్లి వద్దని చెప్పి వెళ్లింది. మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మార్కెట్ నుంచి వచ్చిన తల్లి చూసేసరికి కుమార్తె ఆత్మహత్య చేసుకుంది.ముఖ్య గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com
తిరుగు ప్రయాణంలో విషాదం.. అన్నదమ్ముల పిల్లలు మృత్యు ఒడికి!
హైదరాబాద్, మోతీనగర్: మూడు కుటుంబాలు కలిసి దైవ దర్శనం చేసుకున్నాయి. తిరుగు పయనంలో నగరానికి బయలుదేరాయి. ఈ క్రమంలో వీరు వస్తున్న వాహనం అదుపుతప్పడంతో ఇద్దరు బాలురు మృతి చెందిన విషాదకర ఘటన షోలాపూర్లో చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి.. కూకట్పల్లి పరిధి గాయత్రీనగర్ డివిజన్ శ్రీ వివేకానంద నగర్లోని మూడు కుటుంబాలకు చెందిన సుమారు 15 మంది బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని తుల్జా భవానీ మాత దర్శనానికి వెళ్లి ఇదేరోజు తిరిగి నగరానికి వస్తుండగా.. షోలాపూర్ ఉమగ్రా వద్ద ఉదయం 10.30 గంటలకు వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఉజ్వల్ చౌదరి (12), దివేష్ చౌదరి (11) మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా, ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇంటర్ విద్యార్థిని డింపుల్ (17) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.మూలమలుపు కారణంగా వాహనాలు సరిగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన చిన్నారులు ఉజ్వల్, దివేష్ వరుసకు అన్నదమ్ములు. 6వ తరగతి చదువుతున్నారు. ఉజ్వల్ చౌదరి తండ్రి గణేష్, తల్లి రేఖ. దివేష్ చౌదరి తండ్రి చోగారాం, తల్లి చంపాదేవి. వీరు ఇరువురు కూడా వరుసకు అన్నదమ్ములే. వీరంతా బంగారం వ్యాపారం చేస్తుంటారు. మృతులకు గురువారం వి.రామారావు నగర్లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. బాధిత కుటుంబ సభ్యులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు పరామర్శించారు.
వీడియోలు
రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ
సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ
ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్
నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్
నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...
మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం
కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్
విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..
నోరు అదుపులో పెట్టుకో కోమటి రెడ్డిపై కాంగ్రెస్ సీరియస్


