భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్ మూమెంట్స్ (ఫొటోలు)
జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా పార్టీ శ్రేణులు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం, అక్రమ కేసులు, అరెస్టులు వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. బుధవారం పర్చూరు నియోజకవర్గ పార్టీ కేడర్తో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడారు. స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వెనుక ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉద్దేశం ఉందని వ్యాఖ్యానించారు. ఆ రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసని, దానిని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘రేపు జరిగేది కురుక్షేత్ర సంగ్రామం. స్థానిక ఎన్నికల్లో జరిగే అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి వచ్చే సాధారణ ఎన్నికల్లో కనిపించాలి’’ అని అన్నారు. ఓట్లపై కూడా అనుమానాలు..ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపైనా జగన్ ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా సజావుగా జరుగుతాయా? అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. “ఎన్నికలు సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీదే విజయం. సాఫీగా జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడదాం. స్థానిక ఎన్నికల్లో మీరు గట్టిగా నిలబడాలి” అని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రోజుకో డ్రామా.. డైవర్షన్ పాలిటిక్స్చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నికలు సాఫీగా సాగే అవకాశం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైలుకు పంపడం జరుగుతోందని ఆరోపించారు. ‘‘రోజుకో డ్రామా.. రోజుకో నటన.. డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.స్థానిక ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించినవి కావని, అవి ప్రధానంగా కార్యకర్తల ఎన్నికలని జగన్ అన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు కార్యకర్తలే అండగా ఉంటారని, అలాంటి కార్యకర్తలకు పార్టీ కూడా అండగా నిలవాలని సూచించారు. దౌర్జన్యంతో ఎప్పటికీ పాలకులు రాజ్యం చేయలేరని వ్యాఖ్యానించారు.నంద్యాల ఉప ఎన్నికను గుర్తుచేస్తూ..పర్చూర్ కేడర్ వద్ద తన గత రాజకీయ అనుభవాలను కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు. 2017లో తాను పాదయాత్ర ప్రారంభించడానికి ముందు నంద్యాల ఉప ఎన్నిక జరిగిందని గుర్తుచేశారు. తీవ్ర అధికార దుర్వినియోగం కారణంగా వైఎస్సార్సీపీ 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని అన్నారు. 2014–19 మధ్య తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారని జగన్ ఆరోపించారు. ఆ తర్వాత తాను పాదయాత్ర చేపట్టానని, ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. నాడు తమ పార్టీ నుంచి తీసుకెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల సంఖ్యకే చంద్రబాబు పార్టీ పరిమితమైందని వ్యాఖ్యానించారు.మంచి చేసి ఓటు అడగాలి..పాలకులు ప్రజలకు మంచి చేసి, ఆ పనులను చూపించి ఓట్లు అడగాలని జగన్ అన్నారు. అలా చేసినప్పుడే దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరణ లభిస్తాయని పేర్కొన్నారు. ఎల్లవేళలా అబద్ధాలు, దౌర్జన్యాలను ప్రజలు హర్షించబోరని అన్నారు. ‘‘జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం. ఆ సంగ్రామంలో మీరంతా ప్రజలకు తోడుగా నిలబడాలి.. పోరాడాలి’’ అని వైఎస్సార్సీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: అర్హతే లేనివారికి టీచర్ పోస్టులా?
ఇజ్రాయెల్లో సంచలన నివేదిక.. నెతన్యాహు ఇరుక్కున్నారా?
‘నెతన్యాహు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదు!’.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై విపక్ష నేతల ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడికి కొద్ది రోజుల ముందే యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ నెతన్యాహును హెచ్చరించారన్న సంచలన నివేదిక వెలుగులోకి రావడంతో.. దాడి ముప్పు ముందే తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.హారెట్జ్ కథనం ప్రకారం.. ఇజ్రాయెల్పై 2023 అక్టోబర్ 7 దాడికి సుమారు వారం, పది రోజుల ముందు యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్.. నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. హమాస్ భారీ స్థాయిలో ఓ ఆపరేషన్కు సిద్ధమవుతోందని ఆయన హెచ్చరించినట్లు కథనం పేర్కొంది. అప్పటి హమాస్ నేత యాహ్యా సిన్వార్ ఓ మాజీ పాలస్తీనా అధికారికి తమ సంస్థ భయంకరమైన ఆపరేషన్కు సిద్ధమవుతోందని చెప్పినట్లు పేర్కొంది. దాన్ని ఆ మాజీ అధికారి యూఏఈ సలహాదారుకు చేరవేశారు. ఆ సలహాదారు ఈ సమాచారాన్ని యూఏఈ అధ్యక్షుడికి చెప్పడంతో.. ఆయన నేరుగా నెతన్యాహును సంప్రదించినట్లు కథనం చెబుతోంది. అంతేకాదు.. హమాస్ నుంచి వచ్చే ముప్పుపై ఇజ్రాయెల్కు ఇతర మార్గాల్లోనూ హెచ్చరికలు వచ్చినట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. గాజా సరిహద్దులో ఉన్న మరో దేశం ఈజిప్ట్కు చెందిన నిఘా అధికారులు కూడా దాడికి కొద్దికాలం ముందు ‘ఏదో పెద్ద విషయం జరగబోతోంది’ అంటూ ఇజ్రాయెల్ను హెచ్చరించినట్లు గత ఏడాది ఓ ఇజ్రాయెల్ పత్రిక వెల్లడించింది.పొలిటికల్ దుమారం.. ఈ నేపథ్యంలో నెతన్యాహుపై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మాజీ సైనిక కమాండర్ గాడి ఐసెన్కాట్.. నెతన్యాహుకు డజన్ల కొద్దీ హెచ్చరికలు వచ్చినా పట్టించుకోలేదని, భద్రతా వైఫల్యాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ కూడా నెతన్యాహు ఇక పదవిలో కొనసాగకూడదని వ్యాఖ్యానించారు. మరో మాజీ ప్రధాని, ఎన్నికల బరిలో ఉన్న నఫ్తాలీ బెన్నెట్ కూడా నెతన్యాహుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నెతన్యాహు ఇక ఒక్క నిమిషం కూడా తన పదవిలో కొనసాగకూడదు’ అని అన్నారు. అయితే ఈ ఆరోపణలను నెతన్యాహు కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అక్టోబర్ 7కు ముందు యూఏఈ నుంచి ప్రధానికి ఎలాంటి హెచ్చరిక అందలేదని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం నిజమేనా? హెచ్చరిక అందిందా? అందితే దానిపై నెతన్యాహు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అనే అంశాలపై రాజకీయ దుమారం మొదలైంది.ఇక, 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై భారీ దాడికి దిగింది. పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమంపైనా దాడి జరగడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. అధికారిక ఇజ్రాయెల్ గణాంకాల ఆధారంగా ఈ దాడిలో 1,221 మంది మరణించారు. మరో 251 మందిని హమాస్ బందీలుగా గాజాకు తీసుకెళ్లింది. వారిలో 44 మంది ఇప్పటికే మరణించినట్లు సమాచారం. ఈ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై భారీ సైనిక చర్య చేపట్టింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంలో గాజాలో విపరీతమైన ప్రాణనష్టం, విధ్వంసం చోటుచేసుకుంది.ఎన్నికలపై ఎఫెక్ట్?అక్టోబర్ 7 దాడిని అడ్డుకోవడంలో విఫలమైన భద్రతా వ్యవస్థపై ఇజ్రాయెల్లో చాలాకాలంగా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు యూఏఈ హెచ్చరికకు సంబంధించిన తాజా నివేదిక ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. హమాస్ దాడి ముప్పు ముందే తెలిసిందా? తెలిసి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందా? లేక తాజా ఆరోపణలు రాజకీయ ప్రత్యర్థుల ప్రచారమేనా? అన్నదానిపై ఇజ్రాయెల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అక్టోబర్ 27న జరగనున్న ఎన్నికలకు ముందు ఈ అంశం నెతన్యాహు రాజకీయ భవితవ్యంపై ఎంత ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఇరాన్కు దిమ్మతిరిగే షాక్.. భారీ దెబ్బకొట్టిన అమెరికా
వెయిటర్ నుంచి.. 8 వేల కోట్లు టర్నోవర్ చేసే కంపెనీ సీఈఓగా!!
ఎక్కడో పుట్టి మరో దేశంలో వెయిటర్ స్థాయి నుంచి సముద్ర టూరిజాన్నే శాసించే స్థాయికి చేరుకోవడం అంటే మాములు విషయం కాదు. పైగా ఆ దేశ సంస్కృతిని మెచ్చి వారిలా జీవించడం మరింత విశేషం. అయినప్పటికీ తను ఎక్కడ నుంచి వచ్చాను అన్న మూలాన్ని మర్చిపోకుండా ఆదర్శంగా జీవిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచాడు ఈ వ్యక్తి. అతడే ప్రముఖ లగ్జరీ క్రూయిజ్ అధినేత జుర్గెన్ బైలోమ్(Jurgen Bailom). కంటెంట్ క్రియేటర్ నవన్ జైస్వాల్ అతడితో జరిపిన సంభాషణలో తన ప్రస్థానం గురించి వివరించాడు. అందకు సంబంధించిన విషయం నెట్టింట షేర్ చేయడంతో బైలోమ్ కథ వైరల్గా మారింది. ఆ సంభాషణలో బైలోమ్ భారతదేశంలో తన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నారు. జుర్గెన్ బైలోమ్ తాను ఒక ఓడలో వెయిటర్గా జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. శక్తిమంతంగా పనిచేస్తూ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. అయినా ఈ రేంజ్కి ఎలా చేరుకోగలిగారు అని జైస్వాల్ ప్రశ్నించగా..చేయగలనన్న దృక్పథంతో చకచక నేర్చుకోవడం, మార్కెట్ని, ప్రజలను, సంస్కృతిని అర్థం చేసుకోవడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. అలాగే ఆర్థికంగా విజయం సాధించడం గురించి కూడా మాట్లాడారు. "అవసరం లేకపోతే ఖర్చు చేయవద్దు." అనే విషయాన్ని బలంగా నమ్ముతానని చెప్పారు. అప్పుడు డబ్బు కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు, అలాగే ఏం చేయాలనే దానిపై అవగాహన ఉంటే.. డబ్బే మీ వెంట పడుతుంది." అని బైలోమ్ నొక్కి చెబుతున్నారు. ఆస్ట్రియాలో జన్మించిన ఆయన హాస్పిటాలిటీ పరిశ్రమలోకి ఒక వెయిటర్గా భారత్లో అడుగుపెట్టానంటూ తన 40 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. అలా కార్డెలియో అనే ప్రముఖ లగ్జరీ క్రూయిజ్ సంస్థని పర్యవేక్షించే స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ కంపెనీకి ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా. ఇది భారత సముద్ర పర్యాటక రంగంలో తన ఆధిపత్యాన్ని స్థాపించుకుందని చెప్పారు. తన బ్రాండ్ భారత క్రూయిజ్ వ్యాపారంలో 99% మార్కెట్ వాటాను కలిగి ఉందని తెలిపారు. అలాగే తన వ్యాపారం రూ. 8 వేలు కోట్లు టర్నోవర్ ఆర్జిస్తుందని చెప్పారు.ప్రస్తుతం తాను ఒకే నౌకను నడుపుతున్నప్పటికీ..ఇది ఏడాదికి సుమారు 600 నుంచి 700 కోట్ల టర్నోవర్ చేస్తుందని అన్నారు. తాను భారతదేశానికి చెందనప్పటికీ..ఇక్కడ ప్రపంచ స్థాయి క్రూయిజ్ లైన్ నిర్మించగలిగే విస్తారమైన తీరప్రాంతాన్ని గుర్తించానని అన్నారు. ఇక్కడ క్రూయిజ్ వ్యాపారం చేయడం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదంటున్నారాయన. ఇది ప్రపంచంలోని మూడో అతిపెద్ద తీరం అని అన్నారు. తాను 2018లో భారత్కి వచ్చినట్లు తెలిపారు. అలాగే ఇక్కడ సంస్కృతి నచ్చిందన్నారు. ముంబైలో ప్రతి ఒక్కరు కష్టపడతారని, ఉపాధి కోసం నిత్యం ఏదో ఒక పనిచేస్తుంటారని కొనియాడారు. భారతీయుల సంప్రదాయాలు, సెంటిమెంట్లపై అవగాహన ఉందని, తను కూడా వాటిని అనుసరిస్తానని చెప్పారు. తన ఆఫీసులో కూడా క్రమం తప్పకుండా పూజలు నిర్వహిస్తామని, ఫర్నీచర్ వంటి తదితరాలు వాస్తుపరంగా ఉండాల్సిన దిశలో ఉండేలా చూసుకుంటానని చెప్పారు. ఆర్థికంగా బాగానే ఉన్నామా అని పర్యవేక్షిస్తుంటానని, ఒకవేళ ఆధ్యాత్మిక పరంగా ఏవైన మార్పులు, చేర్పులు ఉంటే చేస్తానని కూడా చెప్పారు బైలోమ్. View this post on Instagram A post shared by Navan Jaiswal (@navan.jaiswal) (చదవండి: ప్రిన్సిపాల్ ఉద్యోగాన్ని వదిలి మరి మిల్లెట్ వ్యాపారం! ఇవాళ ఏకంగా..)
300 పరుగులు పూర్తి చేసిన ఇషాన్ కిషన్
అదేగనక జరిగితే లోకేశ్ జైలుకే: వరుదు కల్యాణి
ముంచుకొస్తోంది ముప్పు.. భూతాపం భగ భగ!
ఆండ్రాయిడ్ డివైస్ ఆర్డర్ చేస్తే.. ఆవు పేడ వచ్చింది!
బిగ్బాస్లో రాంప్రసాద్, చరణ్లకు షాక్! ఎలిమినేట్ అవుతారా?
కూటమి పాలనలో ‘ధరల’ పిడుగు.. ఇదేనా చంద్రబాబు, పవన్ల సంపద సృష్టి?
తాడిపత్రిలో టీడీపీ నేతల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ ఆఫీసుకి తాళం
గిల్ట్ వదిలేయ్.. గెలుపు ఓన్చేసుకో!
9/11 వేళ.. గాల్లోకి లేచిన ఒకేఒక్క విమానం!
అల్కరాజ్కు ఊహించని షాక్.. సెమీస్ చేరకుండానే అవుట్
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సాక్షి కార్టూన్ 07-09-2026
నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..
ఆ మాత్రం దానికే కరువు ప్రాంతంగా ప్రకటించ లేను!
ఇవ్వడానికి ఏమీ లేదంటే కుదరదు.. ఉన్నదివ్వాల్సిందే!!
ఎంత వెతికినా నీటి జాడ దొరకదు కానీ.. ఇక పైకి రండి
ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైను మించిపోతున్న ఆ నగరం
యూకే వీసా స్కామ్.. ‘మాస్టర్ మైండ్ అతడే’ : యూట్యూబర్ నందన
25 ఎకరాల్లో కొత్త సచివాలయం.. రూ.1,200 కోట్లతో నిర్మాణం
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
రూ. 17.40 కోట్ల బంగారం స్వాధీనం
నష్రా సంధుకు 6 వికెట్లు.. సెమీఫైనల్లో పాకిస్తాన్
ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు
జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్: రెండు ఆప్షన్స్!
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
ఈ రాశి వారికి పనుల్లో విజయం.. ఆస్తులు కొంటారు
శుభ్మన్ గిల్ మెరుపులు.. ఒక్క పరుగు తేడాతో విజయం
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
300 పరుగులు పూర్తి చేసిన ఇషాన్ కిషన్
అదేగనక జరిగితే లోకేశ్ జైలుకే: వరుదు కల్యాణి
ముంచుకొస్తోంది ముప్పు.. భూతాపం భగ భగ!
ఆండ్రాయిడ్ డివైస్ ఆర్డర్ చేస్తే.. ఆవు పేడ వచ్చింది!
బిగ్బాస్లో రాంప్రసాద్, చరణ్లకు షాక్! ఎలిమినేట్ అవుతారా?
కూటమి పాలనలో ‘ధరల’ పిడుగు.. ఇదేనా చంద్రబాబు, పవన్ల సంపద సృష్టి?
తాడిపత్రిలో టీడీపీ నేతల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ ఆఫీసుకి తాళం
గిల్ట్ వదిలేయ్.. గెలుపు ఓన్చేసుకో!
9/11 వేళ.. గాల్లోకి లేచిన ఒకేఒక్క విమానం!
అల్కరాజ్కు ఊహించని షాక్.. సెమీస్ చేరకుండానే అవుట్
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సాక్షి కార్టూన్ 07-09-2026
నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..
ఆ మాత్రం దానికే కరువు ప్రాంతంగా ప్రకటించ లేను!
ఇవ్వడానికి ఏమీ లేదంటే కుదరదు.. ఉన్నదివ్వాల్సిందే!!
ఎంత వెతికినా నీటి జాడ దొరకదు కానీ.. ఇక పైకి రండి
ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైను మించిపోతున్న ఆ నగరం
యూకే వీసా స్కామ్.. ‘మాస్టర్ మైండ్ అతడే’ : యూట్యూబర్ నందన
25 ఎకరాల్లో కొత్త సచివాలయం.. రూ.1,200 కోట్లతో నిర్మాణం
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
రూ. 17.40 కోట్ల బంగారం స్వాధీనం
నష్రా సంధుకు 6 వికెట్లు.. సెమీఫైనల్లో పాకిస్తాన్
ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు
జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్: రెండు ఆప్షన్స్!
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
ఈ రాశి వారికి పనుల్లో విజయం.. ఆస్తులు కొంటారు
శుభ్మన్ గిల్ మెరుపులు.. ఒక్క పరుగు తేడాతో విజయం
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
ఫొటోలు
భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్లో అదిరిపోయే.. (ఫొటోలు)
సింపుల్ లుక్లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)
రష్మిక పాత ఫొటోలు.. క్యూట్నెస్కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)
భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్ మూమెంట్స్ (ఫొటోలు)
ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)
‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)
దువాతో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె.. వైరల్గా ఫ్యామిలీ (ఫొటోలు)
అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)
అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)
‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
సినిమా
హబ్లో జోరు.. హుషారు
కథ డిమాండ్ చేస్తే చాలు.. తమ సినిమాల షూటింగ్స్ కోసం దేశ విదేశాలు చుట్టేస్తుంటారు మేకర్స్. పైగా తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా పరిధి దాటి అంతర్జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటుతోంది. అందుకే కాబోలు స్వదేశంతో పాటు బడ్జెట్ ఎక్కువ అయినా విదేశాల్లోనూ షూటింగ్స్కి ఏమాత్రం వెనకాడటం లేదు. పలు సినిమాల చిత్రీకరణలు మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరుగుతుంటే మరికొన్ని మూవీస్ షూటింగ్స్ విదేశాల్లోనూ జరుగుతున్నాయి.అయితే మెజారిటీ సినిమాలు మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమ హబ్గా చెప్పుకునే హైదరాబాద్లోనే జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో పలు సినిమా షూటింగ్లు జోరుగా, హుషారుగా సాగుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, మహేశ్బాబు, గోపీచంద్, శర్వానంద్, శ్రీ విష్ణు... వంటి పలువురు హీరోలు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారు. మరి... ఆ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం. కాలేజ్లో కాకా... చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. ఈ సినిమాకి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా ఇది. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాలో నివేతా పేతురాజ్, అనశ్వర రాజన్, సునీల్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని సిటీ కాలేజ్లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ బాబీ. చిరంజీవిని ఇప్పటి వరకు చూడని సరికొత్త తరహా పాత్రలో చూపించనున్నారట ఆయన. ‘‘చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేసిన ‘కాకా’ టైటిల్ గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రకటన నుంచే ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ గ్లింప్స్ స్టైల్, యాక్షన్, మాస్ అప్పీల్తో ఆ అంచనాలను మరింత పెంచింది. చిరంజీవిని రెండు విభిన్నమైన లుక్స్లో చూపించిన విధానం, పవర్ఫుల్ విజువల్స్, మ్యూజిక్, యాక్షన్ కలిసి గ్లింప్స్ను ఆసక్తికరంగా మార్చాయి. మిడిల్ క్లాస్ అవతార్లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్తో కనిపించగా, యంగ్ వెర్షన్లో ఆయన యాటిట్యూడ్, ఎనర్జీ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ తన డైనమిక్ విజువల్స్తో గ్లింప్స్ను మరింత ఆసక్తికరంగా మలిచారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లేలా ఉంటాయి. ‘గ్యాంగ్ లీడర్’ మూవీలోని ఐకానిక్ ‘గ్యాంగ్ గ్యాంగ్...’ పాటను రీమిక్స్ చేసి ఉపయోగించడం నోస్టాల్జియాతో పాటు చిరంజీవి స్టైల్కు మరింత స్వాగ్ను జోడించింది. సంక్రాంతి సందర్భంగా ‘కాకా’ సినిమాని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అజీజ్ నగర్లో... వరుస పాన్ ఇండియన్ మూవీస్తో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఏకకాలంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నారాయన. ఓ వైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం చేస్తున్న ప్రభాస్.. మరోవైపు ‘ఫౌజీ’ మూవీలో నటిస్తున్నారు. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ప్రభాస్తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. ‘‘భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీగా ‘ఫౌజీ’ని రూపొందిస్తున్నాం. ఇప్పటివరకూ ఎప్పుడూ కనిపించని రగ్డ్, ఎమోషనల్ లుక్లో కనిపించనున్నారు ప్రభాస్. డిసెంబరు 3న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, విడుదల చేసిన ప్రభాస్ సరికొత్త పోస్టర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఓ యోధుడిలా, రక్తంతో తడిసిన దుస్తులు, శరీరమంతా గాయాలతో, చుట్టూ నేలకూలిన సైనికుల మధ్య తుపాకీని పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చున్న ప్రభాస్ లుక్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. 2026లో అత్యంత భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా డిసెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంషాబాద్లో... మహేశ్బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో మహేశ్బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. ‘‘సూపర్స్టార్ మహేశ్బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ‘వారణాసి’ నుంచి మహేశ్ రెండు స్పెషల్ స్టిల్స్ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రెండు స్టిల్స్ చూస్తే ‘వారణాసి’ సినిమా సోల్, రుద్ర పాత్ర తీరు అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. శతాబ్దాలను దాటి ప్రపంచాన్ని చుట్టివచ్చే ఓ వ్యక్తి ప్రయాణంగా సాగే ఇతిహాసం ఇది. ఇందులో ఒక వ్యక్తి అసాధారణ ప్రయాణం అతడిని భారతదేశంలోని పవిత్ర జలాల నుంచి భూమి మారుమూల ప్రాంతాలకు తీసుకువెళుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు, 120 దేశాల్లో విడుదల చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ‘వారణాసి’లో శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు మహేశ్. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్లో విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. ఈ చిత్రం ద్వారా ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనార్కలి నజర్ హీరోయిన్గా తెలుగులో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. గోపీచంద్తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ‘‘విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ ‘సింగ’ వంటి భారీ ప్రాజెక్ట్తో ముందుకొస్తోంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 12న ‘సింగ’ టైటిల్తో పాటు ఆయన లుక్ను రివీల్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్ఫుల్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. గోపీచంద్ను కొత్త కోణంలో చూపించేలా వెంకట్ ఒక గ్రిప్పింగ్ కథని సిద్ధం చేశారు. ఈ మూవీ నుంచి గడ్డం, మీసం, చెవిపోగు, రక్తం, చెమటతో కనిపించే రగ్డ్ అవతార్లో రిలీజ్ చేసిన గోపీచంద్ లుక్ ఆయన అభిమానులకు పర్ఫెక్ట్ బర్త్డే ట్రీట్గా నిలిచింది. టైటిల్ టీజర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో రూపొందింది. ఫైట్ మాస్టర్గా సక్సెస్ అందుకున్న వెంకట్ దర్శకుడిగా హీరోను ఎంత పవర్ఫుల్ మాస్ లుక్లో చూపించారో ఈ గ్లింప్స్తోనే నిరూపించారు. ఈ సినిమా కోసం గోపీచంద్ ట్రాన్స్ఫర్మేషన్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. కెమెరామెన్ షామ్దత్. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో గ్రాండ్గా తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు అద్భుతమైన సినీ అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ముచ్చింతల్లో... శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఆరంభం అయింది. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతో పాటు ముఖ్యమైన నటీనటులు పాల్గొంటున్నారట. ‘‘పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘భోగి’. శర్వానంద్–సంపత్ నందిల కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన, లెన్తీ యాక్షన్ షెడ్యూల్ను రంపచోడవరం అడవుల్లోని కఠినమైన, సవాల్తో కూడిన ప్రదేశాల్లో తెరకెక్కించాం. దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో రూపొందించిన ఈ పోరాట సన్నివేశాలు సినిమాకి హైలెట్గా నిలుస్తాయి. ఈ చిత్రంలోని శర్వానంద్ రగ్డ్, గ్రాండ్ స్కేల్ విజన్కు ప్రశంసలు లభించాయి. పల్లెటూరి యువతిగా కథానాయిక అనుపమా పరమేశ్వరన్ కనిపించిన ఫస్ట్ లుక్కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాని ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ వాయిదా పడింది. శంకర్పల్లిలో... హీరో శ్రీ విష్ణు–డైరెక్టర్ రామ్ అబ్బరాజులది హిట్æ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘సామజ వరగమన’. ఈ మూవీలో రెబ్బా మోనికా జాన్ హీరోయిన్గా నటించారు. అనిల్ సుంకర, రాజేష్ దండ నిర్మించిన ఈ మూవీ 2023 జూన్ 28న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులకు పూర్తి వినోదాలు అందించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టింది.‘సామజ వరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘వెన్నెల’ కిషోర్, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెకక్కిస్తున్నారట రామ్ అబ్బరాజు. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపిస్తుందని యూనిట్ పేర్కొంది. ఆర్ఎఫ్సీలో... తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్కుమార్, సముద్ర ఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషించారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024 జనవరి 12న విడుదలైన బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆంజనేయస్వామి పాత్రను ‘కాంతారా’ మూవీ ఫేమ్ రిషభ్ శెట్టి పోషిస్తున్నారు.‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ హంపీలోని అంజనాద్రి బెట్టలో ఆరంభం అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... ‘జై హనుమాన్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ వర్మ. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు? అన్న నేపథ్యంలో ‘జై హనుమాన్’ రూపొందుతోంది. ‘హనుమాన్’లో హనుమంత్గా నటించిన తేజ సజ్జా ‘జై హనుమాన్’లోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. హీరో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్ర పోషించనున్నారట.సంబరాల జోరు ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. సాయిదుర్గా తేజ్తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలు రూపొందిస్తున్నారట రోహిత్ కేపీ. ‘‘ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది’’ అని యూనిట్ పేర్కొంది.ఇదిలా ఉంటే... పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని సినిమాల చిత్రీకరణలు కూడా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్
ఎపిక్తో బిగ్ బ్లాక్బస్టర్ కొడుతున్నాం: విజయ్ దేవరకొండ
‘‘ఆదిత్య హాసన్ తీసిన ‘90స్’ వెబ్ సిరీస్ చూశాక తను సినిమా చేస్తే కచ్చితంగా చూడాలనిపించింది. తన దర్శకత్వంలో ‘ఎపిక్’ మూవీలో నటించడం ఆనంద్ అదృష్టం. ఆనంద్ సినిమాల ఎంపిక, కెరీర్ పట్ల చాలా గర్వపడుతున్నాను. ఆనంద్ ఫిల్మోగ్రఫీలో ‘ఎపిక్’ లాంటి మరో మంచి చిత్రం చేరుతుంది. వైష్ణవి బ్రిలియంట్ పెర్ఫార్మర్. సెప్టెంబరు 11న ‘ఎపిక్’తో బిగ్ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం’’ అని హీరో విజయ్ దేవరకొండ చెప్పారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటించిన చిత్రం ‘ఎపిక్–ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘సెప్టెంబరు 11న ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ ఉంది. అక్టోబరు 16న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమా ఉంది. నవంబరులో దేవరకొండ రష్మిక ‘మైసా’ ఉంది... కాబట్టి నాన్స్టాప్గా మిమ్మల్ని (ఫ్యాన్స్) కలుస్తూనే ఉంటాను. తెలుగు సినిమాకి ఇది గొప్ప సంవత్సరం. నాన్స్టాప్గా ఫిల్మ్స్ వస్తున్నాయి... ప్రేక్షకులు చూస్తున్నారు.. హిట్స్ అవుతున్నాయి. రెండు రోజుల్లో ‘ఎపిక్’ వస్తుంది. ఆ తర్వాత నాని ‘ది ప్యారడైజ్’, ఆ తర్వాత ‘రణబాలి, మైసా’, తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది 2’ మూవీస్ వస్తున్నాయి. డిసెంబరులో ‘ఫౌజి’ మూవీ, బాలయ్యగారి ‘దాదా’ వస్తున్నాయి. ఈ ఏడాది ముగింపు సాలిడ్గా ఉండబోతోంది. రవితేజ అన్న ‘ఇరుముడి’ సూపర్గా ఉంది’’ అని చెప్పారు. మరో ముఖ్య అతిథి సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ – ‘‘అర్జున్ రెడ్డి’ టైమ్లో నేను, విజయ్ కాలిఫోర్నియా వెళ్లాం. అప్పుడు ఆనంద్ ‘అర్జున్ రెడ్డి’ చర్చల్లో పాల్గొన్నాడు. ఐటీ జాబ్ చేస్తున్నాడు కానీ సినిమా అంటే మాకు ఉన్నంత పిచ్చి ఉందేంటీ అనుకున్నాను. సడన్గా ‘దొరసాని’ సినిమాతో హీరో అయ్యాడు. ‘ఎపిక్’ టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘కింగ్డమ్’ మూవీలో ‘అన్నా అంటే నేæ...’ పాట మా అన్న విజయ్, నా బంధానికి సరి΄ోయేలా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీలో ఒకరు ఆ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళుతుంటారు. మా ఫ్యామిలీలో విజయ్ అన్న అలాగ. ఇక ‘ఎపిక్’ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అని చెప్పారు.మనల్ని మనం నమ్మాలి: వైష్ణవీ చైతన్యమంగళవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ‘ఎపిక్’ మూవీ గురించి వైష్ణవీ చైతన్య మాట్లాడుతూ– ‘‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’లో కడలి అనే పాత్ర చేశాను. తన జీవితంలో ఉన్న సమస్యను డీల్ చేస్తూనే, తన జీవితాన్ని కడలి ఎలా ముందుకు నడిపించింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పాత్ర ద్వారా మంచి సందేశం కూడా ఉంటుంది. గతంలో నేను ఏదైనా విషయం బయటకు మాట్లాడాలంటే కాస్త భయపడేదాన్ని. అయితే కడలి పాత్ర ద్వారా ముందు మనల్ని మనం నమ్మాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మనల్ని మనం నమ్మినప్పుడే ఇతరులు మనల్ని నమ్ముతారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో సమయంలో వారి కోసం వారు నిలబడాలని నేర్చుకున్నాను. ఈ సినిమా పరంగా పెద్ద చాలెంజ్ ఏంటంటే నేను కర్లీ హెయిర్తో కనిపించడమే. షూటింగ్ ఉందంటే... అందరికంటే ముందుగానే నేను నా హెయిర్ని సెట్ చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం సితార బ్యానర్లో నితిన్గారితో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే, తమిళంలో రెండు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు.
ఒకే జానర్కు ఫిక్స్ కాలేదు: సుమంత్
‘‘ఒక నటుడిగా ఇప్పటివరకూ విభిన్నమైన జానర్స్లో డిఫరెంట్ పాత్రలు చేశాను. ఒకే జానర్లో సినిమాలు చేయాలని ఎప్పుడూ ఫిక్స్ కాలేదు. హీరో పాత్రలు చేయడంతో పాటు బలమైన సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ కూడా చేశాను. ఇప్పుడు కూడా విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే ఆ క్యారెక్టర్స్లో డెప్త్ ఉండాలి’’ అని సుమంత్ చెప్పారు. సుమంత్, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్లో సిద్ధు జొన్నలగడ్డ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కాలిపు మధు, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో సుమంత్ చెప్పిన విశేషాలు...⇒ ‘మహేంద్రగిరి వారాహి’లో యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మూఢనమ్మకాల గురించి చర్చించే క్యారెక్టర్లో నటించాను. ఇదొక డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అయినప్పటికీ ఇందులో ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ సీక్వెన్స్, వాణిజ్యపరమైన అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. ఒక వంశంలోని వ్యక్తులు 33 ఏళ్ల వయసు దాటిన తర్వాత చనిపోవడం అనే పాయింట్ మా సినిమా ట్రైలర్లో కనిపించింది. ఈ పాయింట్ ‘మురారి’ సినిమాను కూడా గుర్తు చేస్తున్నప్పటికీ మా ‘మహేంద్రగిరి వారాహి’ కథ, స్క్రీన్ప్లే చాలా భిన్నంగా ఉంటాయి.⇒ దర్శకుడు సంతోష్ ఈ సినిమా కంటే ముందు నాకు వేరే కథ చెప్పాడు. కానీ ఆ కథ నచ్చలేదు. ఆ తర్వాత ‘మహేంద్రగిరి వారాహి’ కథ చెప్పగా నచ్చింది. వేదాలు, పురాణాల పట్ల మంచి అవగాహన ఉన్న సంతోష్కి ఇది సరైన సబ్జెక్ట్ అనిపించింది. ఈ చిత్రం ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయి. ముందు ఈ సినిమాను ఇంత బిగ్ స్కేల్లో తీస్తారని అనుకోలేదు. షూటింగ్ 60 శాతం పూర్తయిన తర్వాత నిర్మాత లక్ష్మణ్గారు మాకు తోడయ్యారు. ఈ సినిమాలోని ఓ సీరియస్ కీ రోల్ను సిద్ధు జొన్నలగడ్డ చేశాడు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గారి రీ–రికార్డింగ్, మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.⇒ ప్రస్తుతం మైథాలజీ ట్రెండ్ నడుస్తోందని ఈ సినిమా చేయలేదు. ‘కార్తికేయ 2, ‘కాంతార’ సినిమాల కంటే ముందే ఈ సినిమా టైటిల్ను రిజిస్టర్ చేయించాం. కాకపోతే ఆ సమయంలో మా సినిమా మేకింగ్కు సరైన నిర్మాత సహకారం లేదు. ఏడాది ఆ తర్వాత మధుగారు, ఆ తర్వాత లక్ష్మణ్గారు ఈ సినిమా ప్రాజెక్ట్లో భాగమయ్యారు. ⇒ ఇటీవల జరిగిన మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అఖిల్ గురించి సరదాగా మాట్లాడాను. తనని అయ్యగారు అని పిలుస్తుంటారట. అక్కినేనిగారి అందరి మనవళ్లలో నేనే పెద్దవాడిని. పెద్దవాడిని కాబట్టి అయ్యగారు అంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో సరదాగా అన్నాను. అది ట్రెండ్ అయ్యిందని మా వాళ్ళు నాకు చెప్పారు.
రంగ్–ఎ–సినిమా ప్రారంభం
జమ్ము కశ్మీర్లో తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. సెప్టెంబరు 7 నుంచి సెప్టెంబరు 10 వరకు నాలుగు రోజుల పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ జమ్ము కశ్మీర్ (ఐఎఫ్ఎఫ్జేకే) వేడుక జరుగుతుంది. సెప్టెంబరు 7న జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ చిత్రోత్సవాలను శ్రీనగర్లో ప్రారంభించారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ) సహకారంతో జమ్ము కాశ్మీర్ ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (డీఐపీఆర్) విభాగం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహిస్తోంది. ‘రంగ్–ఎ–సినిమా’ అనేది ఈ ఫిల్మ్ ఫెస్టివల్ థీమ్. ఉత్తమ చిత్రానికి రూ. 25లక్షల రివార్డు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధానంగా తొమ్మిది అవార్డులను అందించనున్నారు. ఈ అవార్డుల కోసం రూ. 96 లక్షల ప్రైజ్ మనీని కేటాయించగా, ఉత్తమ చిత్రానికి రూ. 25 లక్షల నగదును అందించనున్నారు నిర్వాహకులు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్–డైరెక్టర్ సంతోష్ శివన్ జ్యూరీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘‘దాదాపు 80కి పైగా దేశాలకు చెందిన 1100 సినిమాలను పరిశీలించి, 41 దేశాలకు సంబంధించిన 135 చిత్రాలను ఈ ఫిల్మ్ ఫెస్టివల్కు షార్ట్ లిస్ట్ చేశాం. భారతదేశం నుంచి 64 సినిమాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. టర్కీ, జర్మనీ, రష్యా, సౌత్ కొరియా, తైవాన్ వంటి విదేశీ చిత్రాలను కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తాం’’ అని ఫిల్మ్ఫెస్టివల్ నిర్వాహక ప్రతినిధుల్లో ఒకరు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ పనోరమా, భారత్ పనోరమా, సినిమా ఆఫ్ ది వరల్డ్... ఇలా ఏడు విభాగాల్లో ఈ 135 సినిమాలను ప్రదర్శించనున్నారు. జమ్ము కశ్మీర్లోని అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని, పర్యాటక రంగ ప్రాధాన్యతను ప్రపంచ దేశాల చలనచిత్ర నిర్మాతలకు ఈ ఫిల్మ్ ఫెస్టివల్తో పరిచయం చేయడం ద్వారా ఫిల్మ్ టూరిజంను ప్రోత్సహించడం అనేది ఈ ఫిల్మ్ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. డెడ్ డాగ్తో ప్రారంభం లెబనాన్ దేశానికి చెందిన ‘డెడ్ డాగ్’ సినిమాతో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. లేడీ డైరెక్టర్ సారా ఫ్రాన్సిస్ తెరకెక్కించిన ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఐదా, వాలిద్ భార్యాభర్తలు. వృత్తి రీత్యా వాలిద్ విదేశాల్లో ఉంటాడు. భార్య తన సొంతూరులో ఉంటుంది. అయితే వాలిద్ ఎవరికీ చెప్పకుండా స్వదేశంలోని తన పాత ఇంటికి వస్తాడు. కానీ అక్కడికి వెళ్లి తన భర్త వాలిద్కు ఐదా సర్ప్రైజ్ ఇస్తుంది. ఆ తర్వాత ఈ దంపతులు ఆ ఇంట్లోనే నాలుగు రోజులు ఉండాల్సి వస్తుంది. కానీ సుదీర్ఘకాలం దూరంగా ఉండటం వల్ల ఈ దంపతుల మధ్య ఏర్పడిన భావోద్వేగ దూరం, ఒకరిపై ఒకరికి ఉన్న అపనమ్మకాలు ఈ నాలుగు రోజుల్లో ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని వాలిద్ తన భార్యకు చెప్పడు. తాము ఎంతో ప్రేమగా పెంచుకున్న ‘పెట్ డాగ్’ చని΄ోయిందనే నిజాన్ని ఐదా తన భర్తకు చెప్పకుండా దాచడానికి ప్రయత్నిస్తుంది. మరి... ఆ తర్వాత ఏం జరిగింది? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇక తొలి రోజు ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్, నటుడు తహా షా బదు షా, దర్శకుడు విధు వినోద్ చోప్రా తదితర ప్రముఖులు చిత్రోత్సవాలకు హాజరయ్యారు.
క్రీడలు
ఇదేమి బ్యాటింగ్ బ్రో.. 25 బంతులాడి డకౌటా?
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2లో డర్హమ్ తరపున ఆడుతున్న భారత వెటరన్ మయాంక్ అగర్వాల్ అంతంతమాత్రంగానే రాణిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా మిడిలెక్స్తో జరుగుతున్న మ్యాచ్లో మయాంక్ తీవ్ర నిరాశపరిచాడు. సెకెండ్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన అగర్వాల్.. ప్రత్యర్ధి బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందిపడ్డాడు. 25 బంతులు ఎదుర్కొన్న ఈ కర్ణాటక బ్యాటర్.. తన ఇన్నింగ్స్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. 19 ఏళ్ల మిడిలెక్స్ బౌలర్ సెబాస్టియన్ మోర్గాన్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి మయాంక్ ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 35 ఏళ్ల మయాంక్ అగర్వాల్ చివరిగా 2022లో శ్రీలంకపై చివరి మ్యాచ్ ఆడాడు. మొత్తంగా అతడు భారత జట్టుకు 21 టెస్టు మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 36 ఇన్నింగ్స్లలో అగర్వాల్ 41.33 సగటుతో 1,488 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ధశతకాలు, నాలుగు సెంచరీలు ఉన్నాయి. అతడి కెరీర్ బెస్ట్ స్కోర్ 243 పరుగులగా ఉంది.ఈ డబుల్ సెంచరీని 2019లో హోల్కర్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్పై సాధించాడు. ఐపీఎల్-2026లో కూడా అతడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అంతకుముందు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అగర్వాల్ ఆడాడు.చదవండి: పాపం తిలక్ వర్మ.. ఒక్క పరుగు చేసి ఉంటే?
‘పూటుగా తాగి పీడకలనుకొని మరిచిపోతా’
యూఎస్ ఓపెన్లో చెక్ రిపబ్లిక్ స్టార్ ప్లేయర్, ఆరో సీడ్ లిండా నొస్కోవా పోరాటం క్వార్టర్ ఫైనల్స్తోనే ముగిసింది. మహిళల సింగిల్స్లో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో సబలెంకా చేతిలో 7–6 (7/1), 4–6, 7–6 (10/7)తో ‘సూపర్ టైబ్రేక్’లో నొస్కోవా ఓటమి చవిచూసింది. ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టైటిల్ నెగ్గిన నొస్కోవా యూఎస్ ఓపెన్ కూడా గెలిచి రెండో గ్రాండ్స్లామ్ను అందుకోవాలని చూసింది. కానీ ఆమె కల నెరవేరలేదు. మ్యాచ్ ఓటమి అనంతరం నొస్కోవా మాట్లాడుతూ.. ‘ఒక మూడు రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా దూరంగా ఉంటాను. ఈ మూడు రోజులు పీకలదాకా మందు తాగి జరిగింది ఒక పీడకలలా మరిచిపోవాలనుకుంటున్నా. 21 ఏళ్లు కావడంతో నాకు మందు తాగేందుకు అనుమతి ఉందని నేను అనుకుంటున్నా’ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.Photo Credit: Twitter‘న్యూయార్క్ అంటే చాలా ఇష్టం. ఎలాగూ యూఎస్ ఓపెన్లో నా ప్రయాణం ముగిసింది కాబట్టి ఇక్కడి ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నా. నాకు ఇక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారు. వాళ్లు చూపించే ప్రేమ, ఆప్యాయతతో రాబోయే కొన్ని గంటల్లోనే ఓటమి బాధను మరిచిపోతాననుకుంటా’ అని వెల్లడించింది.ఇక వరుసగా ఆరో ఏడాది యూఎస్ ఓపెన్లో సబలెంకా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 2024, 2025లలో యూఎస్ ఓపెన్లో విజేతగా నిలిచిన సబలెంకా 2023లో ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది. 2022, 2021లలో ఆమె సెమీఫైనల్లో నిష్క్రమించింది. కానీ నొస్కోవాతో పోరులో సబలెంకాకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చివరకు సబలెంకా 2 గంటల 22 నిమిషాల పోరాటం తర్వాత విజయాన్ని అందుకుంది. Photo Credit: Twitterనిర్ణయాత్మక మూడో సెట్లో సబలెంకా 2–4తో వెనుకబడి ఓటమి దిశగా సాగింది. అయితే కెరీర్లో నాలుగు గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచిన అనుభవం సబలెంకాకు ఉపయోగపడింది. వెనుకంజలో ఉన్నా ఆందోళన చెందకుండా ఆడిన సబలెంకా ఏడో గేమ్లో నొస్కావా సర్వీస్ను బ్రేక్ చేసి, ఎనిమిదో గేమ్లో తన సర్వీస్ను కాపాడుకొని స్కోరును 4–4తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. దాంతో విజేతను తేల్చేందుకు ‘సూపర్ టైబ్రేక్’ అనివార్యమైంది. ‘సూపర్ టైబ్రేక్’లో తొలుత పది పాయింట్లు సాధించిన ప్లేయర్ విజేత అవుతారు. సూపర్ టైబ్రేక్ ఆరంభంలో ఇద్దరు 3–3తో సమంగా నిలిచాక... సబలెంకా వరుసగా మూడు పాయింట్లు గెలిచి 6–3తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని చివరకు 10–7తో ‘సూపర్ టైబ్రేక్ను సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. 11 straight wins at Grand Slam level.Linda Noskova had a summer to remember 👏 pic.twitter.com/OLjo0spg6f— US Open Tennis (@usopen) September 8, 2026Linda Noskova after her loss with Sabalenka:"I will do something. I'm going to stay for, like, three more days. I'm going to get drunk and forget about this, I guess (laughter). I'm old enough to do that, thankfully."BTW, great personality!#tennis #usopen26…— Carlo Galati (@CarloGalati) September 8, 2026చదవండి: ఆఫ్గన్తో టీ20 సిరీస్.. టీమిండియాకు బ్యాడ్న్యూస్!
708 పరుగులు.. అయినా నో డిక్లరేషన్.. తెలివిలేదా?
దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో అతి భారీ స్కోరు సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సౌత్ జోన్తో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టైటిల్ పోరులో.. ఇషాన్ కిషన్ సేన సమిష్టిగా రాణించింది.ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందిస్తే.. వన్డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) భారీ స్కోరు దిశగా పునాది వేశాడు. నాలుగో స్థానంలో వచ్చిన సుదీప్ కుమార్ ఘరామీ (6) విఫలమైనప్పటికీ.. కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం పట్టుదలగా ముందుకు సాగాడు.270 పరుగులుఈ క్రమంలో ద్విశతకం పూర్తి చేసుకున్న తర్వాత ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగినప్పటికీ.. ఆఖర్లో మళ్లీ బ్యాటింగ్కు వచ్చాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న లెఫ్టాండర్ బ్యాటర్.. 30 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 270 పరుగులు సాధించాడు. ఇషాన్కు తోడుగా కుమార్ కుశాగ్రా శతకం (101)తో చెలరేగాడు.I.C.Y.M.I2️⃣7️⃣0️⃣ runs3️⃣3️⃣4️⃣ balls3️⃣0️⃣ fours7️⃣ sixes8️⃣0️⃣.8️⃣3️⃣ SRWatch 🎥 highlights of Ishan Kishan's marathon knock 👌👌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/An6sT09tfu— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2026708 పరుగులు చేసి ఆలౌట్మిగిలిన వారిలో అనుకూల్ రాయ్ (45) ఎండీ కౌనేన్ ఖురేషి (40) రాణించగా.. టెయిలెండర్ మహ్మద్ షమీ 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్ ఈ మేరకు సమిష్టిగా రాణించి రెండు రోజులు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసింది. మొత్తంగా మొదటి ఇన్నింగ్స్లో ఈస్ట్ జోన్ 163 ఓవర్లు ఆడి 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.తెలివిలేదా?.. నిజానికి రెడ్బాల్ మ్యాచ్లో ఫలితం తేలాలంటే.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఈ స్థాయి భారీ స్కోరు సాధించడం కంటే.. కాస్త ముందుగానే డిక్లేర్ చేసి.. ఫలితం సాధించే దిశగా ముందుకు వెళ్తుంది. కానీ ఇషాన్ కిషన్ మాత్రం జట్టు ఆలౌట్ అయ్యేంత వరకు బ్యాటింగ్ చేయించాడు. ఇందుకు రెండు రోజులు తీసుకున్నాడు.నిబంధనల ప్రకారమే తెలివిగానిజానికి ఇలా చేయడం ద్వారా మ్యాచ్ డ్రా అవుతుందే తప్ప ఫలితం తేలదు. అయినా ఇషాన్ ఎందుకిలా చేశాడు?.. ఇషాన్ మాత్రమే కాదు.. ఆ స్థానంలో ఏ కెప్టెన్ ఉన్నా ఇలాగే చేస్తాడు. ఎందుకంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రెడ్బాల్ క్రికెట్ నిబంధనల ప్రకారం..రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఫైనల్ మ్యాచ్ కోసం టెస్టు మాదిరే ఐదు రోజులు కేటాయిస్తారు. అయితే, ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే గనుక తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. అందుకే ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసేందుకే మొగ్గుచూపింది.336 పరుగులకే ఆలౌట్.. ఈస్ట్ జోన్ గెలుపు లాంఛనమేఇక సౌత్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 709 పరుగులు చేస్తేనే మ్యాచ్పై ఆశలు సజీవంగా ఉంటాయి. కానీ తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్ ఈ విషయంలో దారుణంగా విఫలమైంది. బుధవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా తొలి ఇన్నింగ్స్లో కేవలం 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఫలితంగా ఈస్ట్ జోన్కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక బుధవారం ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. గురువారం ఒక్కరోజు మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో ఈస్ట్ జోన్ ఫాలో ఆన్ ఆడించకుండా డ్రా చేసుకునేందుకే మొగ్గుచూపే అవకాశం ఉంది. కాబట్టి దులిప్ ట్రోఫీ-2026 విజేతగా ఈస్ట్ జోన్ గెలుపు లాంఛనమే అని చెప్పవచ్చు.చదవండి: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే?
పాపం తిలక్ వర్మ.. ఒక్క పరుగు చేసి ఉంటే?
ఈస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్జోన్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి విధించిన ఫాలో-ఆన్ మార్కును సౌత్జోన్ అందుకోలేకపోయింది. ఫాలో-ఆన్కు 173 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్జోన్ జట్టుకు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.పాపం తిలక్ వర్మఈ తుది పోరులో సౌత్జోన్ కెప్టెన్ తిలక్ వర్మ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు సహచర బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కడుతున్నా.. తిలక్ మాత్రం బాధ్యతాయుతమైన నాక్తో జట్టును ముందుకు నడిపించాడు. అయితే దురదృష్టవశాత్తూ తిలక్ తన 9వ ఫస్ట్క్లాస్ సెంచరీకి అడుగు దూరంలో నిలిచిపోయాడు. ఈ హైదరాబాదీ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కౌనైన్ ఖురైషీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.అతడితో పాటు దేవ్దత్త్ పడిక్కల్(62), సీవీ మిలింద్(43), జగదీశన్(32) రాణించారు. ఈస్ట్జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్ మూడు, ఖురేషీ, మహ్మద్ షమీ, శిఖర్ మోహన్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఈస్ట్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(270) భారీ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ డ్రా అయితే ఏ జట్టుకు అయితే తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం లభిస్తుందో ఆ టీమ్నే విజేతగా నిర్ణయిస్తారు.చదవండి: వెస్టిండీస్తో సిరీస్.. టీమిండియాలోకి ఆర్సీబీ కెప్టెన్?
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
కొండా సురేఖను తప్పించాల్సిందే.... కేసీ వేణుగోపాల్తో భేటీలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
బిజినెస్
దూసుకుపోతున్న చీతాలు
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో యూనికార్న్లుగా ఎదిగే సత్తా ఉన్న సంస్థల సంఖ్య గత ఐదేళ్లలో రెట్టింపయ్యింది. ఆస్క్ ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా ’చీతా’ ఇండెక్స్ ప్రకారం 2021లో ఈ సంఖ్య 54గా ఉండగా, 2026లో 110కి చేరింది. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులకష్టకాలంలోనూ భారత్లో సంస్థల వ్యవస్థాపకులు పట్టు వదలకుండా ముందుకెళ్తున్నారని హురున్ ఇండియా ఫౌండర్ అనాస్ రెహ్మన్ జునైద్ తెలిపారు. ఇందుకు తమ ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్సే నిదర్శనమని చెప్పారు. రిపోర్ట్ కోసం హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వేల్యుయేషన్ని బట్టి అంకురాలను చీతా, గెజెల్, యూనికార్న్ కోహర్ట్స్ అని మూడు సెగ్మెంట్లుగా వర్గీకరిస్తుంది. 2000 సంవత్సరంలో లేదా ఆ తర్వాత ఏర్పాటైన అన్లిస్టెడ్ అంకురాలను ఈ చీతా ఇండెక్స్లో పరిగణనలోకి తీసుకుంటారు. వేల్యుయేషన్ 200 మిలియన్ డాలర్ల నుంచి 500 మి.డాలర్లుగా ఉండి, వచ్చే ఐదేళ్లలో యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ) హోదా దక్కించుకోగలవని భావించే సంస్థలకు ఇందులో చోటు దక్కుతుంది. వచ్చే మూడేళ్లలో యూనికార్న్కాగల వాటిని గెజెల్ కేటగిరీ కింద, 1 బిలియన్ డాలర్లు వేల్యుయేషన్ని ఇప్పటికే దక్కించుకున్న ప్రైవేట్ అంకురాలను యూనికార్న్ కోహర్ట్లుగా వ్యవహరిస్తారు. 2021లో ఆరంభమైన సూచీ ఏటా 15 శాతం వృద్ధితో ఐదేళ్లలో 104 శాతం పెరిగింది. ⇒ 2026 చీతా ఇండెక్స్లో మూడో వంతు సంస్థలు ఈసారి చోటు దక్కించుకున్నవే. ఏకంగా 43 అంకురాలు కొత్తగా లిస్టులోకి వచ్చాయి. ⇒ క్లీన్ మొబిలిటీ (బ్లూ ఎనర్జీ మోటార్స్, మ్యాటర్, పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ, రివర్ మొబిలిటీ), ఏరోస్పేస్..డిఫెన్స్ (సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్, ధృవ స్పేస్, దిగంతర), ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (సింప్లీస్మార్ట్ రాకెట్, క్యూపైఏఐ, ఫ్లామ్, ఫ్రీహ్యాండ్), సర్వి సెస్ (స్నాబిట్, ప్రోంటో, ఆల్హోమ్) తదితర రంగాల నుంచి అత్యధికంగా కొత్త సంస్థలు ఉన్నాయి. ⇒ 2023లో ఏరోస్పెస్, డిఫెన్స్ నుంచి ఒకే ఒక్క చీతా ఉండగా, 2026లో ఇది 5కి పెరిగింది. ఈవీల విభాగంలో 4 నుంచి 8కి, క్లీన్టెక్లో 3 నుంచి 5కి పెరిగాయి. ⇒ ఫిన్టెక్ రంగంలో అత్యధికంగా 17 చీతాలు ఉన్నాయి. సాస్ (16), ఈ–కామర్స్ (12 సంస్థలు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, హెల్త్టెక్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలు 8 చొప్పున నాలుగో స్థానంలో ఉన్నాయి. ఫుడ్ అండ్ బెవరెజెస్, కన్జూమర్ గూడ్స్ రంగాల్లో ఏడు చొప్పున ఉన్నాయి. ⇒ బెంగళూరులో అత్యధికంగా 36, ఎన్సీఆర్లో 25, ముంబైలో 16 చీతాలు ఉన్నాయి. ⇒ ఏడాది వ్యవధిలో 43 కొత్త చీతాలు రాగా, 10 అంకురాలు గెజెల్ స్థాయికి, 3 నేరుగా యూనికార్న్ల స్థాయికి చేరాయి. 6 సంస్థలు మార్కెట్లో లిస్టయ్యాయి. ⇒ యాక్సెల్, పీక్ ఫిఫ్టీన్ పార్ట్నర్స్ అత్యధికంగా చెరో 18 చీతాల్లో ఇన్వెస్ట్ చేశాయి. బ్లూమ్ వెంచర్స్ (10), ఎలివేషన్ క్యాపిటల్ (9) ఆ తర్వాత ఉన్నాయి. టాప్ 10 సంస్థాగత ఇన్వెస్టర్లలో ప్రేమ్జీ ఇన్వెస్ట్ ఒక్కటే ఫ్యామి లీ ఆఫీస్గా 7 చీతాల్లో ఇన్వెస్ట్ చేసింది. టాప్ 10లో ఫ్యామిలీ ఆఫీస్ చోటు దక్కించుకోవడం ఇదే ప్రథమం⇒ కోహర్ట్కు సంబంధించి ఏంజెల్ ఇన్వెస్టరుగా ఆనంద్ చంద్రశేఖర్ అత్యధికంగా 11 స్టార్టప్లలో, కునాల్ షా 8, రమాకాంత్ శర్మ ఏడింటిలో ఇన్వెస్ట్ చేశారు. ⇒ జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తన హెల్త్కేర్ స్టార్టప్ టెంపుల్తో చీతా లిస్టులోకి మళ్లీ ఎంటరయ్యారు. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రాప్టెక్ వెంచర్ ’ఆల్హోమ్’ ద్వారా ఫార్మ్ఈజీ సహ వ్యవస్థాపకులు సిద్ధార్థ్ షా, ధవళ్ షా, ధర్మిల్ సేఠ్, హార్థిక్ దేఢియా కూడా ఈ జాబితాలోకి వచ్చారు. ⇒ పది చీతాలు గెజెల్ స్థాయికి ప్రమోట్ అయ్యాయి. సీఖో, అగ్నికుల్, దేహాత్, జివ, ప్రాక్టో, ఆటంబర్గ్ టెక్నాలజీ, కుకుఎఫ్ఎం, మికో, ఖాతాబుక్, మొజాయిక్ వెల్నెస్ వీటిలో ఉన్నాయి. ఇక 3 చీతాలు నేరుగా యూనికార్న్లుగా ఆవిర్భవించాయి. స్కైరూట్ ఏరోస్పేస్, స్క్వేర్ యార్డ్స్, ఆస్ట్రోటాక్ ఇందులో ఉన్నాయి. ⇒ యూనికార్న్లయ్యే సామర్థ్యాలున్న ఆరు సంస్థలు 2026లో మార్కెట్లలో లిస్టయ్యాయి. అయ్ ఫైనాన్స్, వేక్ఫిట్, సెడెమాక్, కిష్త్, క్యాపిలరీ టెక్నాలజీస్, పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
హైరింగ్ జోరు
న్యూఢిల్లీ: దేశీయంగా ఆగస్టులో వైట్ కాలర్ ఉద్యోగుల నియామకాలు జోరుగా జరిగాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే 14 శాతం పెరిగాయి. ఇందుకు ఆటో, హెల్త్కేర్, రిటైల్ తదితర రంగాలు దన్నుగా నిల్చాయి. ఇన్ఫో ఎడ్జ్కి చెందిన నౌకరీడాట్కామ్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ గతేడాది ఆగస్టులో 2,664గా ఉండగా ఈ ఏడాది 3,028కి చేరింది. ఐటీయేతర, ఐటీ విభాగాలవ్యాప్తంగా, వివిధ స్థాయిల్లో అనుభవమున్న వారిని కంపెనీలు గణనీయంగా నియమించుకున్నాయి. అయితే, ఈ రిక్రూట్మెంట్స్ని పండగ సీజన్ కోణంలో చూడాల్సి ఉంటుందని ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) ఎండీ, సీఈవో హితేష్ ఓబెరాయ్ తెలిపారు. తదుపరి హైరింగ్ ధోరణులపై స్పష్టత రావచ్చని ఆయన పేర్కొన్నారు. నౌకరీడాట్కామ్ సైట్లో ప్రతి నెలా వచ్చే కొత్త ఉద్యోగాల పోస్టింగ్స్, రిక్రూటర్లు చేసే సెర్చ్ల ఆధారంగా భారత్లో జాబ్ మార్కెట్, నియామకాల ధోరణులను ఈ సూచీ ట్రాక్ చేస్తుంది. ఆఫీసు ఉద్యోగాలను వైట్–కాలర్ జాబ్స్గా వ్యవహరిస్తారు. రిపోర్ట్ ప్రకారం.. ⇒ ఆగస్టులో ఆటో రంగంలో అత్యధికంగా 19 శాతం హైరింగ్ వృద్ధి నమోదైంది. ఈ బాటలో హెల్త్కేర్ 16%, రిటైల్ 15%, ఇన్సూరెన్స్ 12%, ఐటీ 11%, బ్యాంకింగ్ 10%, ఎఫ్ఎంసీజీ 10%, బీపీవో/ఐటీఈఎస్, ఆయిల్..గ్యాస్, రియల్ ఎస్టేట్ 8% చొప్పున వృద్ధి చెందాయి. ఫార్మా/బయోటెక్లో రిక్రూట్మెంట్ ఫ్లాట్గా ఉండగా, ఆతిథ్యం..ట్రావెల్ రంగాల్లో హైరింగ్ 4 శాతం, విద్యా రంగంలో 8 శాతం తగ్గింది. ⇒ ఎక్స్పీరియన్స్పరంగా చూస్తే ఫ్రెషర్ల రిక్రూట్మెంట్ 15 శాతం, 4–7 ఏళ్ల అనుభవం ఉన్న వారి హైరింగ్ 10 శాతం పెరిగింది. 8–12 ఏళ్ల అనుభవం ఉన్న వారి హైరింగ్ 16 శాతం, 13–16 ఏళ్ల ఎక్స్పీరియన్స్ (18 శాతం), 16 ఏళ్లు పైగా ఉంటే 13 శాతం మేర రిక్రూట్మెంట్ పెరిగింది. ⇒ మెట్రో నగరాలలో 23 శాతం హైరింగ్తో హైద రాబాద్ అగ్రస్థానంలో నిల్చింది. కోల్కతా (22 శాతం), చెన్నై (20 శాతం) ఆ తర్వాత రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఎన్ఎస్ఈ ఐపీవో 18న!
కోల్కతా: స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఈ నెల 18న పబ్లిక్ ఇష్యూ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 22న ఇష్యూ ముగియనుండటంతో ఈ నెల 25కల్లా లిస్ట్కావచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఎక్స్ఛేంజీ సొంత షేర్ల లిస్టింగ్కు సెబీ నిబంధనలు అనుమతించనందున మరో స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈలో నమోదుకానుంది. ఇదే బాటలో ఇప్పటికే ఎన్ఎస్ఈలో బీఎస్ఈ లిస్టయిన విషయం విదితమే. ఇష్యూలో భాగంగా ఎన్ఎస్ఈ చెల్లించిన వాటా మూలధనంలో 6 శాతం వాటాను విక్రయించనుంది. రూ. 1 ముఖ విలువగల 14.89 కోట్ల షేర్లను ఎక్స్ఛేంజీలోని ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 30,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు ధరల శ్రేణి 15కల్లా ప్రకటించే అవకాశముంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 17న షేర్లను ఆఫర్ చేసే వీలుంది. ఇప్పటివరకూ 2024లో రూ. 27,870 కోట్లు సమీకరించిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇష్యూ అతిపెద్ద ఐపీవోగా నిలుస్తోంది. ఎన్ఎస్ఈ లిస్టయితే సరికొత్త రికార్డు నమోదు కానుంది. ఇష్యూ నిధులు ఎన్ఎస్ఈకికాకుండా షేర్లను ఆఫర్ చేస్తున్న వాటాదారులకు చేరనున్నాయి. ట్రేడయ్యే కాంట్రాక్టుల సంఖ్యరీత్యా ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీగా ఎన్ఎస్ఈ నిలుస్తుండటం గమనార్హం!
కైనెటిక్ కొత్త స్కూటర్.. 132 కిమీ రేంజ్!
కైనెటిక్ తన ఐకానిక్ డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ను పెద్ద బ్యాటరీ.. అదనపు టెక్నాలజీతో (డీఎక్స్ ప్లస్) అప్గ్రేడ్ చేసింది. ఈ స్కూటర్ ఇప్పుడు 3.1 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 132 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.కొత్త డీఎక్స్ ప్లస్ స్కూటర్.. రేంజ్, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్లను పొందుతుంది. ఇందులో K-కోస్ట్ టెక్ రీజెనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది. ఇది మెటల్ బాడీని కలిగి ఉండటంతో పాటు, రివర్స్తో కూడిన పార్క్ అసిస్ట్, ఈజీ ఛార్జ్, టెలిమాటిక్స్.. IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ వంటి ఆధునిక ఫీచర్లను పొందుతుంది.కైనెటిక్ డీఎక్స్ ప్లస్ స్కూటర్ క్విక్ ఛార్జింగ్కు కూడా సపోర్ట్ చేస్తుంది, దీని ద్వారా 0-80 శాతం ఛార్జింగ్ అవ్వడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది. ప్రాక్టికాలిటీకి ప్రధాన ప్రాధాన్యత లభిస్తుంది. ఇందులో సీటు కింద 37 లీటర్ల స్టోరేజ్, 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, రెండు వైపులా 12-అంగుళాల ట్యూబ్లెస్ టైర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు 220 మిమీ డిస్క్, వెనుక వైపు 130 మిమీ డ్రమ్ ఉన్నాయి.కైనెటిక్ డీఎక్స్ 3 కిలోవాట్ ధర రూ. 1.19 లక్షలు కాగా.. డీఎక్స్ ప్లస్ 3.1 కిలోవాట్ ధర రూ. 1.28 లక్షలు (ఎక్స్-షోరూమ్). డీఎక్స్ ప్లస్ బ్లాక్, సిల్వర్, బ్లూ, వైట్, రెడ్ అనే ఐదు రంగులలో లభిస్తుండగా, డీఎక్స్ బ్లాక్, సిల్వర్ ఆప్షన్లను పొందుతుంది. కంపెనీ డీఎక్స్ ప్లస్ పై రూ. 3,000 ప్రయోజనంతో పాటు, రూ. 8,999 విలువైన పొడిగించిన వారంటీ కూడా అందిస్తుంది.
ఫ్యామిలీ
పంబ-సన్నిధానం రోప్ వే ప్రాజెక్టులు వేగవంతం..
పంపాను శబరిమల సన్నిధానంతో అనుసంధానించే పూర్తి రోప్వేని సకాలంలో పూర్తి చేసేలా చర్యలుతీసుకోవాలని కేరళ రాష్ట్ర దేవస్వం పెన్షనర్ల సమాఖ్య పునలూర్ గ్రూప్ కాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.శబరిమలను సందర్శించే లక్షలాది మంది యాత్రికులకు ఈ రోప్వే గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుందని, ఈ ప్రాజెక్టును మరింత ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.గత ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం కులతుపుళ గ్రామంలో 4.5336 హెక్టార్ల భూమిని కేటాయించింది. అయితే, యుడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేశారు. అలాగే ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత వరకు త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా, శబరిమల అభివృద్ధి కార్యకలాపాలపై తన నియంత్రణను బలోపేతం చేసుకునేందుకు కేరళ ప్రభుత్వం కొత్త శబరిమల అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయనుంది. దీనివల్ల అభివృద్ధి సంబంధిత విషయాలలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) పరిపాలనా పాత్ర తగ్గుతుందని భావిస్తున్నారు.ఈ అధికార సంస్థ తొలి సమావేశం సెప్టెంబర్ 11న జరగనుంది.శబరిమల మాస్టర్ ప్లాన్ కింద ప్రాజెక్టులను కాలపరిమితిలోగా అమలు జరిగేలా చూడటమే ఈ కొత్త ప్రాధికార సంస్థ ప్రధాన లక్ష్యం. ఇది సన్నిధానంచుట్టుపక్కల ప్రాంతాలలో యాత్రికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం, అభివృద్ధి ప్రాజెక్టులను సమన్వయం చేయడం, నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షించడం వంటి వాటిపై దృష్టి సారిస్తుంది. అంతేగాదు ఈ సంస్థ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు, అటవీ శాఖ, పోలీస్ శాఖతో సహా శబరిమల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ విభాగాల పనితీరును ఈ అథారిటీ సమన్వయం చేస్తుందని చెబుతున్నారు అధికారులు.(చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం)
ప్రిన్సిపాల్ ఉద్యోగాన్ని వదిలి మరి మిల్లెట్ వ్యాపారం! ఇవాళ ఏకంగా..
స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అందులో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా, వైస్ ప్రిన్సిపాల్గా సేవలందించిన ఆమె సొంతంగా వ్యాపారం చేయాలనే సాహసం చేసింది. విద్యార్థులకు పదే పదే చెప్పిన మాటల్నే ఆచారించి చూపాలని తీసుకున్న ఆ అనూహ్య నిర్ణయం..చివరికి విజయం దక్కించుకునేలా చేసిందా అంటే..ఆ ప్రొఫెసరే తమిళనాడుకు చెందిన సుభ్రద. కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేసిన ఆమె కొద్దికాలంలోనే ఎమరాల్డ్ హైట్స్ అనే మహిళా కాలేజ్కి వైస్ ప్రిన్స్పాల్ అయ్యింది. అయితే ఆమె ఎప్పుడు తన స్టూడెంట్స్కి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉండాలి తప్ప..ఒకరి కింద పనిచేసే స్థాయిలో ఉండొద్దని సదా చెబుతుండేది. అసలు ఆ మాటలనే తానే ఆచరించి విద్యార్థులకు ఎందుకు చూపకూడదంటూ సొంతంగా వ్యాపారం చేయాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అయితే ప్రజలకు నాణ్యమైన పోషకవంతమైన ఆహారం అందించే వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే తాను గతంలో హార్మోన్ల సమస్యతో బాధపడి రెండుసార్లు గర్భస్రావం అయ్యి బాధపడిన అనుభవమే అందుకు కారణమట. ఇలాంటి సమస్యలకు మూలం పోషకాహార లోపం అని వైద్యులు చెప్పడంతోనే..ఈ వ్యాపారాన్ని ఎంచుకున్నట్లు తెలిపిందామె. అందులోనూ చిరుధాన్యాలు గ్లూటెన్ రహితమైనవి, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలు అందుకే ఈ వ్యాపారం చేసేందుకు మొగ్గు చూపిందామె.ఆ నేపథ్యంలోనే చిరుధాన్యాల ప్రాసెసింగ్పై పరిశోధన చేయడానికి మైసూర్లోని 'సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' (CFTRI)కి వెళ్లి మరి శిక్షణ తీసుకుంది. అయితే ఆ ట్రైనింగ్లో పిండిలో నిల్వచేసే పదార్థాలు కలపకపోతే నిల్వ కాలం తగ్గిపోతుంది. అలాగే కోల్డ్ చైన్ కోసం భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని చెప్పారు. అయినా సరే ఆమె పట్టు వదలకుండా ప్రిజర్వేటివ్ రహతంగా పోషకవంతమైన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో నాలుగువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 20 లక్షలు పెట్టుబడి పెట్టి మరి భూమిని లీజుకు తీసుకుంది. ఉత్పత్తులను వేరు చేయడం, గ్రేడింగ్ చేయడం, నానబెట్టడం, రుబ్బడం, ప్యాకేజింగ్ చేయడం వంటి వాటికి అనుగుణంగా యంత్రాలను మార్చుకుంది. కానీ మొదట్లో కనీసం 50 ప్యాకెట్లను కూడా అమ్మలేకపోయింది. తెల్లగా లేని దోసె లేదా ఇండ్లీ పిండి కొనేందుకు ఆసక్తి చూపకపోవడంతో..200 ప్యాకెట్లను ప్రజలకు ఉచితంగా ఇచ్చి తినేలా ప్రోత్సహించాల్సి వచ్చింది. దాంతో తన ఉత్పత్తులకు ఒక్కసారిగా ఆదరణ లభించి అమ్మకాలు ఊపందుకున్నాయి. అలాతన పీవీఆర్ బ్రాండ్తో పిండి, నూడుల్స్, హెల్త్ మిక్స్లు, పొంగల్ వంటి వాటితో సహా 83 రెడీ టు కుక్ మిల్లెట్ ఉత్పత్తులను అందించే స్థాయికి చేరుకుంది. అంతేగాదు దేశవ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఆస్పత్రులు, కార్యాలయాలు, ఆన్లైప్ ఫ్లాట్ఫామ్లలో ఈ బ్రాండ్కి ఆదరణ పెరిగి అమ్మకాలు జోరందుకున్నాయి. పైగా ఈ బ్రాండ్ని కోయంబత్తూర్లోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంక్యుబేట్ చేసింది. అలాగే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద రూ. 23 లక్షల గ్రాంట్ను కూడా అందించింది. అలా సుభ్రద కంపెనీ ప్రతి ఏడాది సుమారు రూ. 3 కోట్లో ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరుకుంది. ఇక్కడ వ్యాపారంలోకి దిగడమే కాదు..అందులో ఎదురయ్యే సవాళ్లు, ఇబ్బందులను అధిగమిస్తేనే గెలుపుని అందుకోగలమని చెబుతోంది ఈ మాజీ ప్రిన్స్పాల్ సుభద్ర కథ.(చదవండి: ఆ గాయం రూపాన్ని మార్చిందే తప్ప..ఆమె గెలుపుని కాదు!)
క్యాన్సర్పై ఢీకి.. ‘రెడీ’యేషన్
రేడియేషన్ చికిత్సలకు ఉన్న చరిత్ర దాదాపు 130 ఏళ్లు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా రేడియో యాక్టివ్ మెటీరియల్ను కనుగొన్నది 1986లో హెన్రీ బెకరెల్ అనే శాస్త్రవేత్త. అంటే... ఈ ఏడాదికి 2026 ఏడాదికి ఖచ్చితంగా 130 ఏళ్లు నిండుతాయి. ఇక నోబెల్ బహుమతి గ్రహీత మేరీక్యూరీ – పోలోనియం, రేడియమ్ వంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కనుగొన్నాక ఈ చికిత్స ప్రాధాన్యం మరింత పెరిగింది. దాదాపు ఈ దశాబ్దకాలంలో రేడియో యాక్టివ్ మెటీరియల్తో క్యాన్సర్కు చికిత్సలు చేయడంలో అనేక రకాల పురోగతి చోటు చేసుకుంది. 1970లకు ముందున్న కాలంలో ఎక్స్–రేల రూపంలో వైద్యరంగానికి సేవలందించిన రేడియేషన్ 1970ల తర్వాత సీటీ, ఎమ్మారై లుగా... ఆ తర్వాత 1980లలో పెట్ స్కాన్ వంటి రూపాలలో వైద్యచికిత్సలకు తోడ్పడుతూ వచ్చింది. అటు తర్వాత ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ, బ్రాకీథెరపీ, స్టీరియో టాక్టిక్ రేడియేషన్, రేడియో ఐసోటోప్ థెరపీ, ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ (ఐజీఆర్టీ) వంటి ఎన్నో కొత్త పద్ధతుల్లో ఈ రేడియేషన్ వైవిధ్య భరితమైన చికిత్సలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆధునిక రేడియేషన్చికిత్సల్లోని అనేక అంశాలను పరిశీలిద్దాం.క్యాన్సర్ రంగంలో అత్యంత పురోగతి తర్వాత ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ వంటి అత్యాధునికమైన చికిత్స ప్రక్రియలు రాకముందే దాదాపుగా ప్రజలందరికీ తెలిసిన చికిత్స ప్రక్రియలు శస్త్రచికిత్సలూ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీలు. ఇందులో రేడియేషన్ థెరపీలో అనేక రకాల అడ్వాన్స్మెంట్లు చోటు చేసుకున్నాయి. ఆ పురోగతులూ, వాటి ఫలితాలేమిటో చూద్దాం.రేడియేషన్ థెరపీ అంటే ఏమిటి?శక్తిమంతమైన ఎక్స్–రే వంటి రేడియేషన్స్ను ఖచ్చితంగా క్యాన్సర్ కణాలపై నిశితంగా ప్రసరించేలా చూసి, ఆ కణాన్ని పూర్తిగా తుదముట్టించే చికిత్స ప్రక్రియను ‘రేడియేషన్ థెరపీ’గా చెబుతారు. ఈ కిరణాలు కణాల్లోని డీఎన్ఏ లేదా కణాల్లోని మౌలికాంశాలను దెబ్బతీసి వాటిని నిర్వీర్యం చేస్తాయి. దాంతో ఆ క్యాన్సర్ కణాలు చనిపోవడం వల్ల క్యాన్సర్ కూడా తొలగిపోతుంది.తొలి నాళ్లలో రేడియేషన్ అనేది అది క్యాన్సర్ కణమా లేదా ఆరోగ్యకరమైన కణమా అన్న విచక్షణ లేకుండా తాను ప్రసరించిన చోట ఉన్న కణాలను నాశనం చేయగలిగే సామర్థ్యం ఉండటంతో చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణాలను సంరక్షిస్తూ, వాటికి వీలైనంత తక్కువ నష్టం కలిగేలా ఇచ్చేవారు. ఇప్పుడు ఈ రంగంలో వచ్చిన ఆధునిక పురోగతితో కేవలం క్యాన్సర్ కణాలపైనే గురిపెట్టగలిగేంత నిశితంగా రేడియేషన్ ఇవ్వడం సాధ్యమవుతోంది.రేడియేషన్ థెరపీలో కొన్ని ముఖ్యమైన రకాలివి... క్యాన్సర్ కణాలు / క్యాన్సర్ గడ్డ (ట్యూమర్) అనేది గుండె, మెదడు, వెన్నుపాము వంటి అత్యంత సున్నితమైన అవయవాలకు చాలా దగ్గరగా ఉన్నప్పుడు రేడియేషన్ను మరింత జాగ్రత్తగా, ఖచ్చితంగా ఇవ్వాలి. ఉదాహరణకు మెదడులోని అనేక ప్రాంతాలు దేహంలోని అనేక అవయవాలను నియంత్రిస్తుంటాయి. శస్త్రచికిత్స చేసే సమయంలో మెదడులోని ఏదైనా కీలకమైన అవయవాన్ని నియంత్రించే భాగం దెబ్బతింటే... ఆ అవయవం అచేతనమయ్యే అవకాశముంటుంది. రేడియేషన్ ప్రసరించినప్పుడు కూడా అలాంటి అవకాశం ఉన్నప్పటికీ... అత్యంత నిశితంగా కేవలం క్యాన్సర్ కణాన్నే గురిపెట్టి దెబ్బతీసే సాంకేతికతా ఇప్పుడు అందుబాటులో ఉంది. ప్రధానంగా చెప్పాలంటే రేడియేషన్లో బయటి నుంచి ఇచ్చే ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ (ఈబీఆర్టీ), లోపలి నుంచి ఇచ్చే ఇంటర్నల్ రేడియేషన్ థెరపీతో పాటు సిస్టమిక్ రేడియేçషన్ థెరపీ (ఎస్ఆర్టీ) అనే మరో రకమైన రేడియేషన్ ప్రక్రియలను చెప్పవచ్చు. ఈ రేడియేషన్ థెరపీలో అందుబాటులో ఉన్న వివిధ ప్రక్రియల్లో ఈ కింద పేర్కొన్నవి కొన్ని... ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ (ఈబీఆర్టీ)త్రీడీ కన్ఫార్మల్ రేడియేషన థెరపీ – (3 డీసీఆర్టీ): ఇందులో ముందుగా సీటీ వంటి స్కాన్ల సహాయంతో క్యాన్సర్ కణితి (ట్యూమర్) ఎంత పెద్దది, దాని ఆకృతి ఎలా ఉంది, అది దేహంలోని ఏ ప్రాంతంలో ఉంది అని తెలుసుకుంటారు. ఆ కణితి ఆకృతికి తగ్గట్టుగా కేవలం దానికే తాకేలా రేడియేషన్ కిరణాలను పంపిస్తారు. మనకు కావాల్సిన మేరకే కాంతి ప్రసరించే ఒక పెన్టార్చ్ లాంటి దాన్ని ఊహిస్తే... ఈ పద్ధతిలో కేవలం మనకు కావాల్సిన చిన్న ప్రాంతంపైనే కాంతి పడినట్టే రేడియేషన్ కూడా పడుతుందని అనుకోవచ్చు. దాంతో రేడియేషన్ అన్నది క్యాన్సర్ గడ్డపైనే పడుతూ... పక్కనున్న ఆరోగ్యకరమైన కణజాలానికి వీలైనంత తక్కువ నష్టం కలిగేలా చూస్తారు. మెదడు, తల–మెడ (హెడ్ అండ్ నెక్), కాలేయం, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ వంటి అనేక క్యాన్సర్లలో ఉపయోగించవచ్చు.ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ (ఐజీఆర్టీ) ఇందులో రేడియేషన్ ఇచ్చే సమయంలో క్యాన్సర్ ఉన్న ప్రదేశాన్ని ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా జాగ్రత్తగా చూస్తూ ఇస్తారు. దేహంలో ఊపిరితిత్తులూ, డయాఫ్రమ్ లాంటివి నిత్యం కదులుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా అలాంటి కదిలే అవయవాలకు రేడియేషన్ ఇవ్వడానికి ఈ ‘ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ’ ఉపయోగడుతుంది. ఉదాహరణకు ఊపిరితీసుకునే సమయంలో ఊపిరితిత్తులు ఉబ్బుతూ, ముడుచుకుంటూ... కదలికలతో ఉంటాయి. ఇలా కదిలే సమయంలో రేడియేషన్ అన్నది క్యాన్సర్ లేని మరో ఆరోగ్యకరమైన ప్రాంతాన్ని తాకకుండా... అవయవం కదులుతున్నప్పటికీ... ఆ కదలికలకు అనుగుణంగా తన ప్రసరణను తానే నియంత్రించుకుంటూ కేవలం క్యాన్సర్ ఉన్న ప్రదేశానికే రేడియేషన్ తాకేలా చూస్తుంది.ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ (ఐఎమ్ఆర్టీ) ఇందులో వివిధ దిశల నుంచి అంటే రకరకాల కోణాలనుంచి రేడియేషన్ కిరణాలను క్యాన్సర్ కణితిపైకి పంపుతారు. ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో ప్రత్యేక కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో క్యాన్సర్ ఉన్నచోట తీవ్రమైన రేడియేషన్ తాకేలా, క్యాన్సర్ లేని చోట వీలైనంత తక్కువ రేడియేషన్ ప్రసరించేలా చూసే ఈ పద్ధతినే ‘ఇంటెన్సిటీ మాడ్యులేటర్ రేడియేషన్ థెరపీ’గా చెబుతారు. ముఖ్యంగా క్యాన్సర్ గడ్డ మరో కీలకమైన ఆరోగ్యకరమైన అవయవానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు... ఆ ఆరోగ్యకరమైన అవయవానికి వీలైనంత తక్కువ నష్టం జరిగేలా చూసేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.వాల్యుమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ (వీఎమ్ఏటీ) అత్యంత ఖచ్చితమైన రీతిలో రేడియేషన్ ఇచ్చే ఈ ప్రక్రియలో రేడియేషన్ ఇచ్చే మెషిన్ క్యాన్సర్ బాధితుడి చుట్టూ తిరుగుతూ వివిధ కోణాల నుంచి రేడియేషన్ను ప్రసరింపజేస్తుంది. దాంతో క్యాన్సర్ ఉన్న భాగానికి వీలైనంత ఎక్కువగానూ, చుట్టుపక్కల ఆరోగ్యకరమైన అవయవాలకు వీలైనంత తక్కువ రేడియేషన్ తాకేలా చూస్తారు. ప్రోస్టేట్, కాలేయం, ప్రాంక్రియాస్ వంటి అనేక రకాల క్యాన్సర్లలో ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు.శరీరం లోపల నుంచే రేడియేషన్ ఇచ్చే పద్ధతులుఇప్పటివరకూ చెప్పిన పద్ధతులు కాకుండా... రేడియేషన్ వెలువడే పదార్థాన్ని శరీరంలోనే ఉంచి కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ గడ్డ దేహంలో ఉన్న ప్రాంతానికి చేరి అక్కడ నుంచి రేడియేషన్ను ప్రసరింపజేస్తుంది. ఇలా రేడియేషన్ ఇవ్వడాన్ని ‘ఇంటర్నల్ రేడియేషన్ థెరపీ’ అంటారు. ఇందులోని కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు.బ్రాకీథెరపీ : ఈ ప్రక్రియలో రేడియోధార్మిక పదార్థాలను అతి చిన్న మోతాదులో దేహంలోని క్యాన్సర్ ఉన్న ప్రాంతానికి పంపి క్యాన్సర్ గడ్డకు అతి దగ్గరగా ఉండేలా చూస్తారు. ఈ అత్యంత చిన్న మోతాదులో ఉండే రేడియో యాక్టివ్ పదార్థాలు సాధారణంగా చిన్న ‘సీడ్స్’ (విత్తనాల్లాంటి చిన్న పదార్థాలు) రూపంలో ఉంటాయి. అవి అవి క్యాన్సర్గడ్డకు అతి దగ్గరగా ఉండటంతో ఆ రేడియేషన్ ప్రధానంగా క్యాన్సర్ ఉన్న ప్రాంతంలో ప్రభావవంతంగా ప్రసరిస్తూ, గడ్డను దెబ్బతీస్తుంది. ఉదాహరణకు ప్రోస్టేట్, గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్), ఎండోమెట్రియంతో పాటు కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్లలో దీనిని ఉపయోగిస్తారు.ఇంట్రా ఆపరేటివ్ రేడియోథెరపీ (ఐఓఆర్టీ) ఇది కొంచెం ప్రత్యేకమైన పద్ధతి. క్యాన్సర్గడ్డకు శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలోనే రేడియేషన్ కూడా ఇస్తారు. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ ఉన్న ప్రదేశాన్ని బయటకు కనిపించేలా చేశాక... ఆ ప్రాంతానికి ఎక్కువ మోతాదులో రేడియేషన్ ఇస్తారు. అదే సమయంలో పక్కనున్న ఆరోగ్యకరమైన అవయవాలను రక్షించడానికి ప్రత్యేక రక్షణాత్మకమైన ప్రక్రియలను అనుసరిస్తారు. జీర్ణవ్యవస్థలోని కొన్ని క్యాన్సర్లతోపాటు శస్త్రచికిత్స చేయడం కష్టమైన కొన్ని ఇతర రకాల క్యాన్సర్లలో ఈ ప్రక్రియ ఉపయోగకరంగా ఉంటుంది.స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ (ఎస్ఆర్ఎస్) పేరుకు ఇందులో రేడియోసర్జరీ అని ఉన్నప్పటికీ ఇది శస్త్రచికిత్స కానే కాదు. ఇందులో కత్తితో కోయడం ఉండదు. కాకపోతే ఇందులో చిన్న చిన్న రేడియేషన్ కిరణాలను ఒకేచోట కేంద్రీకృతంగా పడేలా ప్రయోగిస్తారు. దాంతో చాలా ఎక్కువ మోతాదులో తీక్షణంగా పడేలా చేయడంతో క్యాన్సర్ ప్రాంతంపై అత్యంత ఖచ్చితంగా / నిశితంగా కేంద్రీకరించేలా కిరణాలు ప్రసరిస్తాయి. కీలకమైన మెదడు, తల, మెడ ప్రాంతాల్లోని కొన్ని కణుతులకు ఇది ఉపయోగపడుతుంది. మెదడులోని గడ్డలు (బ్రెయిన్ ట్యూమర్స్), పిట్యుటరీ ట్యూమర్స్, మెనింజియోమాస్, అకాస్టిక్ న్యూరోమాస్ వంటి కణుతుల్లో ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది.బయటే ఉండే మెషిన్ నుంచి రేడియేషన్ ఇవ్వగల మరికొన్ని ఆధునిక ప్రక్రియలివి... ప్రోటాన్ థెరపీ : ఇందులోని సాంకేతికత సాధారణ రేడియేషన్ ప్రక్రియ కంటే కాస్తంత వేరుగా ఉంటుంది. ఇందులో ఎక్స్–రేస్ కాకుండాప్రోటాన్లతో రేడియేషన్ ఇస్తూ... ఈ ప్రోటీన్ బీమ్ను క్యాన్సర్ గడ్డ తాలూకు ఆకృతికీ, అది లోపల ఎంత లోతు ఉందో అంతే లోతు వరకు ప్రసరించేలా చేయడం సాధ్యమవుతుంది. దాంతో క్యాన్సర్ గడ్డ కంటే లోతులో ఉన్న ఆరోగ్యకరమైన కణజాలానికి రేడియేషన్ ప్రసరించకుండా జాగ్రత్త తీసుకోడానికి వీలవుతుంది. ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, తల–మెడ (హెడ్ అండ్ నెక్), కాలేయం, అన్నవాహిక, మెదడు వంటి క్యాన్సర్లలో దీన్ని ఉపయోగిస్తారు.అయితే ప్రోటాన్ థెరపీ అన్నది ప్రతి క్యాన్సర్ బాధితులకూ తప్పనిసరిగా ఉపయోగపడుతుందని చెప్పడానికి కుదరదు. ఏ క్యాన్సర్ గడ్డకు ఏ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుందన్న అంశాన్ని డాక్టర్లు క్యాన్సర్ గడ్డ తాలూకు రకం, ఆ గడ్డ పరిమాణం, దాని ఆకృతి వంటి అనేక అంశాలపై ఆధారంగా నిర్ణయిస్తారు.ఎమ్మారై లీనియర్ యాక్సిలరేటర్ : ఇది మరింత ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ప్రక్రియ. ఇందులో రేడియేషన్ ఇచ్చే సమయంలోనే ఎమ్మారై ద్వారా కణితిని నిరంతరం గమనిస్తూ ఉంటారు. అంటే... ఇందులో... ఎమ్మారై సహాయంతో గడ్డను చూస్తూ ఉంటూనే అవసరాన్నిబట్టి రేడియేషన్ ఇస్తున్న తీరును మార్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మృదువైన కణజాలంలో (సాఫ్ట్ టిష్యూ)లలో ఉండే క్యాన్సర్లకు ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది.స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ (ఎస్బీఆర్టీ) : ఇది కూడా చాలా ఖచ్చితమైన రీతిలో / చాలా నిశితంగా రేడియేషన్ ఇవ్వగల ప్రక్రియ. దాంతో ఇందులో రేడియేషన్ను చాలా ఖచ్చితంగా క్యాన్సర్ గడ్డపైనే కేంద్రీకృతమయ్యేలా చేయవచ్చు. శస్త్రచికిత్స చేయడం కుదరని పేషెంట్లకూ లేదా శస్త్రచికిత్సకు అనువుగా ఉండని బాధితులకు ఇదో మంచి ప్రత్యామ్నాయం. ఊపిరితిత్తులు, కాలేయం, ప్రాంక్రియాస్ క్యాన్సర్లతోపాటు ఎముకలకు వ్యాపించిన మరికొన్ని క్యాన్సర్లలో దీన్ని ఉపయోగించవచ్చు.హైపర్ ఆర్క్తో అనేక క్యాన్సర్ కణుతులకు చికిత్స: స్టీరియోటాక్టిక్ రేడియేషన్ విధానాల్లో హైపర్ ఆర్క్ రేడియోథెరపీ వంటి అత్యాధునికమైన ప్రక్రియలో ఇప్పుడు మంచి ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఇందులో... మెదడులోని పలు కణుతులను లక్ష్యంగా చేసుకుని రేడియేషన్ కిరణాలను అత్యంత కచ్చితత్వంతో ప్రసరింపజేయడం సాధ్యమవుతుంది. మొత్తం మెదడుకు కాకుండా... ఒక్కో కణితిని లక్ష్యంగా చేసుకుని అవసరమైన మోతాదులో రేడియేషన్ ఇవ్వడమే ఇందులోని ప్రధాన ఉద్దేశం. ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి స్కాన్ల ఆధారంగా ఈ చికిత్స ప్రణాళికను రూపొందించాక... ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో వివిధ దిశల నుంచి రేడియేషన కిరణాలు కణితిపై కేంద్రీకృతమయ్యేలా చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు. చదవండి: ఆ గాయం రూపాన్ని మార్చిందే తప్ప..ఆమె గెలుపుని కాదు!కణితిపై అవసరమైన రేడియేషన్ మోతాదు ప్రసరించాక... ఇక దాని బయట ఉండే చోట్ల రేడియేషన్ కిరణాల వేగం తగ్గేలా ఇందులో చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు. ఫలితంగా మెదడులోని ఆరోగ్యకరమైన కణజాలంపై రేడియేషన్ దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అందరికీ అవసరం ఉండకపోవచ్చు. ఇవీ రేడియేషన్ థెరపీలోని కొన్నిప్రాథమికమైన అంశాలలో కొన్ని ముఖ్యమైనవి. వీటి పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల తమ కుటుంబంలోని క్యాన్సర్ పేషెంట్ల విషయంలో వారి బంధుమిత్రులకూ, పేషెంట్ తాలూకు అటెండెంట్లకూ ఉండే చాలా అపోహాలూ, సందేహాలూ తొలగిపోయే అవకాశాలెక్కువ.రేడియేషన్పై ఆధాపడాల్సిన అవసరమేమిటి? క్యాన్సర్ కణం తన ఉనికి, మనుగడ కోసం ఎంతకైనా తెగిస్తుంటుంది. పైగా ఆ కణం చాలా చిన్నదిగా ఉంటుంది. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ గడ్డను తొలగించేటప్పుడు కేవలం ఒక చిన్న కణం మిగిలిపోయినా... అది మళ్లీ పెరిగిపోయే ముప్పు ఉండనే ఉంటుంది. అందుకే రేడియేషన్ ద్వారా కొంత ఆరోగ్యకరమైన కణజాలం దెబ్బతిన్నప్పటికీ, ఏ చిన్నకణమూ మిగిలిపోకుండా సమూలంగా నిర్మూలించడానికి రేడియేషన్ను ఉపయోగిస్తుంటారు. ఇక కొన్ని సందర్భాల్లో... శస్త్రచికిత్సకు ముందుగా కూడా రేడియేషన్ / కీమో ఉపయోగించి ఆ గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగించడానికి అనువుగా ఉండేంత చిన్నదయ్యేలా చేశాకే సర్జరీ చేస్తుంటారు. ఇలా కూడా రేడియేషన్ ఉపయోగపడుతుంది.ఎవరికీ ఏ రేడియేషన్, ఎంత ఇవ్వాలో నిర్ణయించడమెలా... క్యాన్సర్ బాధితుల్లో రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సిన వారిలో ఇది చాలా కీలకమైన అంశం. క్యాన్సర్ బాధితులందరికీ ఒకే రకమైన రేడియేషన్ థెరపీ ఇవ్వడం కుదరదు. అనేక అంశాల ఆధారంగా ఏ తరహా క్యాన్సర్ గడ్డకూ లేదా ఏ బాధితుడికి ఏ తరహా రేడియేషన్ ఇవ్వాలనేది అనేక అంశాల ఆధారంగా డాక్టర్లు (రేడియేషన్ ఆంకాలజిస్టులు) నిర్ణయిస్తారు. వారు చూసే అంశాలివి... అది ఏరకమైన క్యాన్సర్ గడ్డ దాని పరిమాణం ఎంత (ఎంత పెద్దది) దేహంలోని ఏ ప్రాంతంలో ఉంది చుట్టుపక్కల ఉన్న అవయవాలేమిటి గడ్డ ఎంతవరకు వ్యాపించి ఉంది బయాప్సీ రిపోర్టులో ఏముంది సీటీ, ఎమ్మారై, పెట్ స్కాన్లలో ఉన్న సమాచారమేమిటి క్యాన్సర్ బాధితుడి ఆరోగ్య పరిస్థితి ఏమిటి... వంటి అనేక అంశాలను పరిశీలించి ఇవ్వాల్సిన రేడియేషన్ను నిర్ణయిస్తారు. డాక్టర్ వినితా రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ నిర్వహణ: యాసీన్
ఆ గాయం రూపాన్ని మార్చిందే తప్ప..ఆమె గెలుపుని కాదు!
కొందరు దుర్మార్గుల వికృత ప్రేమకు ఎందరో అమ్మాయిలు జీవితాలు బలైన ఉదంతాలు చూశాం. కొందరు వాటిని తట్టుకుని తమ సత్తా ఏంటో చూపించి స్ఫూర్తిగా నిలవడమే కాదు, యావత్తు దేశం తమలాంటి వాళ్లవైపు తిరిగి చూసేలా చేస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ కాజల్ ప్రజాపతి. ప్రేమ పేరుతో వెంటపడే ఓ వ్యక్తి దుశ్చర్యకు రూపాన్ని పోగోట్టుకుని, వికలాంగురాలిగా మారిన అమ్మాయి కథ.అహ్మదాబాద్లోని మెహసానాలోని రామోసానా గ్రామానికి చెందిన అమ్మాయే కాజల్ ప్రజాపతి. రిక్షా డ్రైవర్ కుమార్తె. బికాం మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు 2016లో ఓ దుర్మార్గుడి యాసిడ్ దాడికి బలైంది. ఆ వ్యక్తి ప్రేమను కాదన్నందుకు..ఫలితంగా ఘెరమైన నరకయాతనను చవిచూసింది. ఆ యాసిడ్ దాడిలో ఒక కన్ను పూర్తిగా కోల్పోగా, మరో కన్ను పాక్షికంగా చూపుని కోల్పోయింది. బయటకు తలెత్తుకోని తిరగలేని విధంగా జీవితాన్ని కోల్పోయింది. తన ముఖాన్ని తానే చూసుకోలేక, బయటకు వెళ్లలేక ఎంతో బాధను, వేదనను చవిచూసింది. హాయిగా చదువుకోవాల్సిన ఆ టీనేజ్ వయసు మొత్తం సర్జరీలకే జీవితం అంకితమైపోయింది. అలా ఆమె అప్పటికే 20కి పైగా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. అయినా సరే తనెందుకు బిక్కుబిక్కుమంటూ బతకాలి, తానేం ఏ నేరం చేశా, అన్న ఆలోచన కాజల్ని ఒక పట్టాన నిలువనిచ్చేది కాదు. ఈ సమాజంలో అందరిలా ధైర్యంగా బయట తిరగాలి, తన కాళ్లమీద తాను నిలబడేలా గౌరవంగా బతకాలి అన్న కోరికతో పోటీ పరీక్షల వైపు దృష్టిసారించింది. అస్సలు తనకు కావాల్సింది జాలి చూపులు కాదు..తను మీలాంటి మనిషి అని గుర్తించే మనసే కావలంటూ ధైర్యంగా ముందుకు సాగింది. నిజానికి కాజల్ డ్రీమ్ పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ అవ్వడం కానీ కంటి చూపు కారణంగా ఆ అవకాశం దూరమైంది. దాంతో రెవెన్యూ శాఖ ఉద్యోగాలపై ఫోకస్ పెట్టి ఆయా పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. అలా ఆమె ఈ ఏడాది ఒకటి కాదు ఏకంగా రెండు ప్రభుత్వోద్యోగాలు దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. మొదటిది గ్రామీణ పరిపాలనా కార్యదర్శి ఉద్యోగం కాగా, మరోకటి రెవెన్యూ విభాగంలో కీలకమైన డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం. అయితే కాజల్ రెండోదే ఎంచుకుంది. డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగమే ప్రతిష్టాత్మకమైనదని అదే ఎంచుకున్నట్లు ఆమె పేర్కొంది. ఈ నెల సెప్టెంబర్ 17న డాక్యుమెంట్ వెరిఫికేషన్కు హాజరుకానుంది. అంటే యాసిడ్ దాడి జరిగిన పదేళ్లకు తిరిగి తన గుర్తింపుని దక్కించుకునేలా ప్రభుత్వోద్యోగాలను సాధించింది. అంతేగాదు ఆమె నెల జీతం రూ. రూ. 49,600 దాక ఉంటుంది. కాగా, ఈ స్థాయికి చేరుకునేందుకు తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నా అని ఆనందంగా చెబుతోంది కాజల్. అలాగే తాను ఈ పరీక్షలకు సన్నద్ధమవ్వడం అంటే.. అందరికీ ఉన్నన్ని కాకపోయినా కనీస వెసులుబాటు కూడా ఏమి లేదని అంటోంది. తన ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రిపరేషన్కి ఎలాంటి కోచింగ్ తీసుకోలేదని, కేవలం ప్రభుత్వ లైబ్రరీపై ఆధారపడి చదువుకున్నట్లు తెలిపింది. కానీ ఆ లైబ్రరీ కోసం బయటకు వెళ్తే..తన రూపు చూసి జాలిపడే చూపులను ఎదుర్కొనాల్సిన ఉంటుంది. అయినప్పటికీ ధైర్యం చేశా, కానీ ఏ రోజు తన ముఖాన్ని దాచుకోలేదని అంటోంది కాజల్. ఎందుకంటే ఉద్యోగం చేసేటప్పుడు కూడా అందరితో కలవాలంటే ముందు ఈ పరిస్థితిని తాను అధిగమించాల్సి ఉంటుంది కాబట్టే ఇలా చేసినట్లు తెలిపింది. అంతేగాదు ఇక తాను ఎలాంటి శస్త్ర చికిత్సలు చేయించుకోనని, తాను ఎలా ఉన్నానో అలాగే అంగీకరించాలని ఆశిస్తోంది. ఈ గెలుపు ప్రయాణంలో ముందుగా తనకు అతిపెద్ద బలం తన అన్నయ్యేనని అంటుంది. తను నా చెల్లి అని గర్వంగా చెప్పడమే కాదు, తానెంతో ధైర్యవంతురాలిని అని చెప్పే మాటలే ధైర్యంగా ముందుకు సాగేలా చేశాయని అంటోంది. అలాగే నిర్భయంగా బయటకు రాగాలిగానంటే అందుకు తన స్నేహితురాలే కారణమని అంటోంది. ఆమె పదే పదే నువ్వు బయటకు రావాలి, ఈ సమాజంంలో నీ స్థానాన్ని తిరిగి పొందాలని చెబుతుండేది, అవి నాకు కొండంత ధైర్యాన్ని ఆశను అందించాయని చెబుతోంది. అలాగే తనకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులకు ధన్యవాదాలు చెబుతోంది. ఎందుకంటే తన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని చాలామటుకు చికిత్సలో రాయితీ అందించారని చెప్పుకొచ్చింది. ఇవాళ ఇలా గెలుపుతో నిలదొక్కుకున్నానంటే..అందుకు వాళ్లందరూ అందించిన సహాయసహకారాలే కారణమని సగర్వంగా చెబుతోంది కాజల్.(చదవండి: కుల మతాలకు అతీతంగా సరికొత్త చరిత్ర సృష్టించిన న్యాయవాది..!
అంతర్జాతీయం
ముగ్గురు సన్నిహితులకు ట్రంప్ భారీ నజరానా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు వైట్హౌస్ సిబ్బందికి చెరో 45 వేల డాలర్ల చొప్పున నగదు బహుమతులు ఇచ్చినట్లు వారి వార్షిక ఆర్థిక వివరాల ద్వారా వెల్లడైంది. ముగ్గురికీ కలిపి ట్రంప్ అందించిన బహుమతుల విలువ 1.35 లక్షల డాలర్లు. ఈ మొత్తాలు వారు ప్రభుత్వ ఖజానా నుంచి పొందే వార్షిక 1.50 లక్షల డాలర్ల వేతనాలకు అదనం.ట్రంప్ నుంచి నగదు బహుమతి అందుకున్న వారిలో నటాలీ హార్ప్, ఛాంబర్లైన్ హారిస్, మార్గో మార్టిన్ ఉన్నారు. ఈ ముగ్గురూ తమ ఆర్థిక వివరాల్లో చెల్లింపులకు ట్రంప్నే మూలంగా పేర్కొన్నారు. ‘హాలిడేస్ సందర్భంగా నగదు బహుమతి’గా వాటిని వివరించారు. ట్రంప్కు ప్రత్యేక సహాయకురాలు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా హార్ప్ పనిచేస్తున్నారు. అధ్యక్షుడి వెంట తరచూ కనిపిస్తూ ఆయన కోసం కథనాలు, సోషల్ మీడియా పోస్టులు, ఇతర సమాచారాన్ని ప్రింట్ చేస్తుండటంతో ఆమెకు ‘హ్యూమన్ ప్రింటర్’ అనే పేరు వచ్చింది.ఓవల్ ఆఫీస్ కార్యకలాపాల డిప్యూటీ డైరెక్టర్, అధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా హారిస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాషింగ్టన్లో నిర్మాణ, డిజైన్ అంశాలను పరిశీలించే ఫెడరల్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లోనూ ట్రంప్ ఆమెను నియమించారు. ట్రంప్ ప్రతిపాదించిన వైట్హౌస్ బాల్రూమ్ ప్రాజెక్టును ఈ కమిషన్ పరిశీలిస్తున్న నేపథ్యంలో ఆమె నియామకంపై మాజీ కమిషన్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ట్రంప్ కమ్యూనికేషన్స్ సలహాదారుగా ఉన్న మార్టిన్ కూడా అధ్యక్షుడితో తరచూ ప్రయాణిస్తారు. ట్రంప్ మలేషియాలో టార్మాక్పై నృత్యం చేస్తున్న దృశ్యాలు, ఓవల్ ఆఫీస్లో సందర్శకులతో మాట్లాడుతున్న దృశ్యాలు సహా ఆయనకు సంబంధించిన వీడియోలను రికార్డు చేసి ప్రచురిస్తుంటారు.ఈ నగదు బహుమతులు ఏ పరిస్థితుల్లో ఇచ్చారనే దానిపై ఆర్థిక వివరాల్లో పరిమిత సమాచారం మాత్రమే ఉంది. అయితే ట్రంప్ తరఫున వైట్హౌస్ ప్రతినిధి స్పందిస్తూ.. ప్రభుత్వంలో ఉన్న సమయంలోనూ, ప్రైవేటు రంగంలో ఉన్న సమయంలోనూ తన పరిధిలోని వ్యక్తులు, ఉద్యోగులు, సహాయకులకు క్రిస్మస్ బహుమతులు ఇవ్వడం అధ్యక్షుడికి చాలా కాలంగా ఉన్న సంప్రదాయమని తెలిపారు. ఈ బహుమతులకు వారి అధికారిక ప్రభుత్వ విధులతో సంబంధం లేదని, సంబంధిత చట్టపరమైన, నైతిక ప్రమాణాల ప్రకారం అవి అనుమతించదగినవేనని స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ముదిరిన అమెరికా–కెనడా వాణిజ్య యుద్ధం.. సుంకాలకు ప్రతిసుంకాలు!
ముదిరిన అమెరికా–కెనడా వాణిజ్య యుద్ధం.. సుంకాలకు ప్రతిసుంకాలు!
న్యూఢిల్లీ: అమెరికా–కెనడా మధ్య వాణిజ్య పోరు మరింత ముదిరింది. కెనడా నుంచి దిగుమతి అయ్యే మద్యం, మోటార్సైకిళ్లు, పాల ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే అమెరికా ప్రభుత్వ సంస్థలు కెనడా ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. కెనడా అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 8) ట్రంప్ కెనడా నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై నిషేధాన్ని ప్రకటించారు. ఈ నిషేధం సెప్టెంబర్ 29 నుంచి అమల్లోకి రానుంది.మరోవైపు కెనడా ఉత్పత్తులను అమెరికా ప్రభుత్వ ప్రధాన కొనుగోలు జాబితా నుంచి తొలగించే ప్రక్రియ వెంటనే ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్ఏ), అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (యూఎస్టీఆర్)లను ట్రంప్ ఆదేశించారు. అమెరికా వ్యాపారాలకు కెనడాలో సమాన మార్కెట్ అవకాశాలు కల్పించే వరకు కెనడా ఉత్పత్తులను అమెరికా ప్రభుత్వ సరఫరా జాబితాల్లో చేర్చబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ‘నో రెసిప్రాసిటీ – నో యాక్సెస్’ అనే విధానాన్ని ప్రకటించారు. జీఎస్ఏలోని కొనుగోలు జాబితాల్లో ఏటా 50 బిలియన్ డాలర్లకుపైగా విలువైన లావాదేవీలు ఉంటాయని తెలిపారు.ఇదిలా ఉండగా, మంగళవారం అర్ధరాత్రి తర్వాత అమెరికా వస్తువులపై కెనడా విధించిన ప్రతీకార సుంకాలు అమల్లోకి వచ్చాయి. గత నెలలో ఇరుదేశాల మధ్య చర్చలు విఫలమైన తర్వాత కెనడా తన ప్రధాన వాణిజ్య భాగస్వామిపై ఆర్థిక చర్యలను మరింత కఠినతరం చేసింది. దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడా దిగుమతులపై అమెరికా 50 శాతం వరకు సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై కెనడా 15 నుంచి 50 శాతం వరకు సుంకాలు విధించింది. దీంతో 18 నెలలుగా కొనసాగుతున్న ఇరుదేశాల వాణిజ్య వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది.ఇది కూడా చదవండి: త్వరలో మానవాతీత శక్తుల కలకలం
త్వరలో మానవాతీత శక్తుల కలకలం
బల్గేరియాకు చెందిన అంధ భవిష్యవేత్త బాబా వంగా 2027 సంవత్సరానికి సంబంధించి చెప్పినట్లు ప్రచారంలో ఉన్న జోస్యం ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ రహస్య వ్యాధి లేదా జన్యుపరమైన ప్రయోగం కారణంగా కొంతమంది మనుషుల్లో మానవాతీత శక్తులు వెలుగులోకి వస్తాయని ఆమె అనుచరులు చెబుతున్నారు. అయితే ఈ జోస్యాన్ని బాబా వంగా నిజంగా చెప్పారనడానికి ఎలాంటి నిర్ధారణ లేదు. భవిష్యత్ సంఘటనలపై బాబా వంగా చెప్పినట్లు ప్రచారంలో ఉన్న పలు జోస్యాలు గతంలో వార్తల్లో నిలిచాయి.కొవిడ్ మహమ్మారి, 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం వంటి ఘటనలను ఆమె ముందుగానే ఊహించారని అనుచరులు చెబుతుంటారు. అయితే ఈ ఘటనలకు సంబంధించిన జోస్యాలను ఆమె నిజంగా చెప్పారనడానికి ఎటువంటి అధికారిక ఆధారాలు లేవు. కాగా 2027కు సంబంధించి ప్రచారంలో ఉన్న జోస్యం ప్రకారం.. ఏదో ఒక ప్రయోగం లేదా అనారోగ్యం కారణంగా కొద్దిమంది వ్యక్తులు ‘సూపర్హ్యూమన్స్’గా మారతారట. వారి సామర్థ్యాలు ఎలా ఉంటాయి? ఈ పరిణామం ఎలా చోటుచేసుకుంటుంది? అనే విషయాలపై మాత్రం ఎలాంటి వివరాలు లేవు. ఈ జోస్యం నిజమవుతుందా లేదా అనేది భవిష్యత్తులో తేలనుంది.2026లో ప్రపంచ యుద్ధం, వాతావరణ మార్పులతో ముడిపడిన ప్రకృతి విపత్తులు, సాంకేతికత నుంచి ముప్పు, గ్రహాంతరవాసుల సందర్శన వంటి పరిణామాలను బాబా వంగా ఊహించారని ఆమె అనుచరులు చెబుతున్నారు. తూర్పున ప్రారంభమై పశ్చిమ దేశాలకు విస్తరించే యుద్ధం జరుగుతుందని కూడా ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ కూడా మూడో ప్రపంచ యుద్ధం గురించి పేర్కొన్నట్లు చెబుతున్నారు.బాబా వంగా చెప్పినట్లే 2026లో వెనిజులా, కొలంబియా, జపాన్, ఇండోనేషియాలో భారీ భూకంపాలు, ఆగస్టులో నేపాల్, టిబెట్లో భారీ వరదలు సంభవించాయని ఆమె అనుచరులు అంటున్నారు. 2026 నవంబరులో భారీ అంతరిక్ష నౌక భూమిని సందర్శిస్తుందని బాబా వంగా చెప్పినట్లు ప్రచారంలో ఉంది. ఒక క్రీడా కార్యక్రమం సందర్భంగా గ్రహాంతరవాసులు వస్తారనే మరో జోస్యం కూడా ప్రచారంలో ఉంది. ఇది కూడా చదవండి: మోక్షం కోసం చివరి మజిలీ.. ముక్తి భవన్
ఇజ్రాయెల్లో సంచలన నివేదిక.. నెతన్యాహు ఇరుక్కున్నారా?
‘నెతన్యాహు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదు!’.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై విపక్ష నేతల ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడికి కొద్ది రోజుల ముందే యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ నెతన్యాహును హెచ్చరించారన్న సంచలన నివేదిక వెలుగులోకి రావడంతో.. దాడి ముప్పు ముందే తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.హారెట్జ్ కథనం ప్రకారం.. ఇజ్రాయెల్పై 2023 అక్టోబర్ 7 దాడికి సుమారు వారం, పది రోజుల ముందు యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్.. నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. హమాస్ భారీ స్థాయిలో ఓ ఆపరేషన్కు సిద్ధమవుతోందని ఆయన హెచ్చరించినట్లు కథనం పేర్కొంది. అప్పటి హమాస్ నేత యాహ్యా సిన్వార్ ఓ మాజీ పాలస్తీనా అధికారికి తమ సంస్థ భయంకరమైన ఆపరేషన్కు సిద్ధమవుతోందని చెప్పినట్లు పేర్కొంది. దాన్ని ఆ మాజీ అధికారి యూఏఈ సలహాదారుకు చేరవేశారు. ఆ సలహాదారు ఈ సమాచారాన్ని యూఏఈ అధ్యక్షుడికి చెప్పడంతో.. ఆయన నేరుగా నెతన్యాహును సంప్రదించినట్లు కథనం చెబుతోంది. అంతేకాదు.. హమాస్ నుంచి వచ్చే ముప్పుపై ఇజ్రాయెల్కు ఇతర మార్గాల్లోనూ హెచ్చరికలు వచ్చినట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. గాజా సరిహద్దులో ఉన్న మరో దేశం ఈజిప్ట్కు చెందిన నిఘా అధికారులు కూడా దాడికి కొద్దికాలం ముందు ‘ఏదో పెద్ద విషయం జరగబోతోంది’ అంటూ ఇజ్రాయెల్ను హెచ్చరించినట్లు గత ఏడాది ఓ ఇజ్రాయెల్ పత్రిక వెల్లడించింది.పొలిటికల్ దుమారం.. ఈ నేపథ్యంలో నెతన్యాహుపై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మాజీ సైనిక కమాండర్ గాడి ఐసెన్కాట్.. నెతన్యాహుకు డజన్ల కొద్దీ హెచ్చరికలు వచ్చినా పట్టించుకోలేదని, భద్రతా వైఫల్యాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ కూడా నెతన్యాహు ఇక పదవిలో కొనసాగకూడదని వ్యాఖ్యానించారు. మరో మాజీ ప్రధాని, ఎన్నికల బరిలో ఉన్న నఫ్తాలీ బెన్నెట్ కూడా నెతన్యాహుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నెతన్యాహు ఇక ఒక్క నిమిషం కూడా తన పదవిలో కొనసాగకూడదు’ అని అన్నారు. అయితే ఈ ఆరోపణలను నెతన్యాహు కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అక్టోబర్ 7కు ముందు యూఏఈ నుంచి ప్రధానికి ఎలాంటి హెచ్చరిక అందలేదని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం నిజమేనా? హెచ్చరిక అందిందా? అందితే దానిపై నెతన్యాహు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అనే అంశాలపై రాజకీయ దుమారం మొదలైంది.ఇక, 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై భారీ దాడికి దిగింది. పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమంపైనా దాడి జరగడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. అధికారిక ఇజ్రాయెల్ గణాంకాల ఆధారంగా ఈ దాడిలో 1,221 మంది మరణించారు. మరో 251 మందిని హమాస్ బందీలుగా గాజాకు తీసుకెళ్లింది. వారిలో 44 మంది ఇప్పటికే మరణించినట్లు సమాచారం. ఈ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై భారీ సైనిక చర్య చేపట్టింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంలో గాజాలో విపరీతమైన ప్రాణనష్టం, విధ్వంసం చోటుచేసుకుంది.ఎన్నికలపై ఎఫెక్ట్?అక్టోబర్ 7 దాడిని అడ్డుకోవడంలో విఫలమైన భద్రతా వ్యవస్థపై ఇజ్రాయెల్లో చాలాకాలంగా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు యూఏఈ హెచ్చరికకు సంబంధించిన తాజా నివేదిక ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. హమాస్ దాడి ముప్పు ముందే తెలిసిందా? తెలిసి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందా? లేక తాజా ఆరోపణలు రాజకీయ ప్రత్యర్థుల ప్రచారమేనా? అన్నదానిపై ఇజ్రాయెల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అక్టోబర్ 27న జరగనున్న ఎన్నికలకు ముందు ఈ అంశం నెతన్యాహు రాజకీయ భవితవ్యంపై ఎంత ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఇరాన్కు దిమ్మతిరిగే షాక్.. భారీ దెబ్బకొట్టిన అమెరికా
జాతీయం
ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆత్మహత్మ, సూసైడ్ నోట్
ఢిల్లీ మాజీ ప్రధాన కార్యదర్శి, 74 ఏళ్ల రాకేష్ మెహతా (Rakesh Mehta) నోయిడాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. 1975 బ్యాచ్ IAS అధికారి అయిన మెహతా దివంగత మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో పనిచేశారు. తన నిర్ణయానికి అనారోగ్యం ,మానసిక సమస్యలే కారణమని పేర్కొంటూ రాసిన ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 6న ఆయన మృతదేహం లభ్యమైంది. ఆదివారం నాడు ఆయన అంత్యక్రియలు జరిగాయి.ఆయన ఢిల్లీ ప్రభుత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కమిషనర్తో సహా వివిధ హోదాల్లో పనిచేశారు. 2007లో ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, మూడేళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగారు. రాజధాని నగరంలో రవాణా, విద్యుత్ మరియు పౌర మౌలిక సదుపాయాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీకాలంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ విజయవంతంగా నిర్వహించారు.
కాంగ్రెస్కు మిత్రపక్షం నుంచే ఘాటు కౌంటర్
ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇంతకాలం ఎన్నికలు.. సీట్ల పంపిణీ కారణం కాగా.. ఈసారి కాంగ్రెస్–నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య మరో కారణం మాటల యుద్ధానికి దారి తీసింది. ఇదే అదనుగా బీజేపీ రంగంలోకి దిగి కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘వందేమాతరం’ చుట్టూ మొదలైన వివాదం.. ఇప్పుడు కూటమి మిత్రపక్షాల మధ్య రాజకీయ పోరుగా మారింది.జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో సోమవారం జరిగిన తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో జాతీయ గీతం ‘జనగణమన’కు ముందు ‘వందేమాతరం’ పూర్తి రూపాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలు మొత్తం గీతం పూర్తయ్యే వరకు గౌరవంగా నిలబడ్డారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం రాజుకుంది. కాంగ్రెస్–ఎన్సీ రెండూ ఇండియా కూటమిలో భాగస్వాములే కావడంతో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.‘పూర్తి గీతం మా వైఖరికి విరుద్ధం’శ్రీనగర్ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘వందేమాతరం’ పూర్తి రూపం స్వాతంత్య్ర సమరయోధులు కోరుకున్నదానికి అనుగుణంగా లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 1937లో ఆమోదించిన రూపాన్నే పాటించాలని, మిత్రపక్షాలు కూడా ఆ నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, మౌలానా ఆజాద్ తదితర స్వాతంత్య్ర సమరయోధుల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని వేణుగోపాల్ పేర్కొన్నారు. మతపరమైన విభేదాలకు తావులేకుండా ఉండేందుకే కాంగ్రెస్ రెండు చరణాల రూపాన్ని అనుసరిస్తోందని ఆయన గుర్తు చేశారు. అయితే దీనికి ఎన్సీ ఘాటుగా స్పందించింది.అంతమాత్రాన ఆదేశిస్తారా?కేసీ వేణుగోపాల్ ట్వీట్కు ఎన్సీ నేత బషీర్ అహ్మద్ బదులిచ్చారు. మిత్రపక్షంగా ఉన్న తమను ఏం పాడాలి, ఎంతవరకు పాడాలి అని కాంగ్రెస్ నిర్దేశించలేదని స్పష్టం చేశారు. ‘‘ఆయనకు తన అభిప్రాయాన్ని ‘ఎక్స్’లో వెల్లడించే హక్కు ఉంది. అయితే దాన్ని మిత్రపక్షాలపై విధించలేరు. ప్రజలపై ఏదైనా విషయాన్ని బలవంతంగా రుద్దడాన్ని మేం వ్యతిరేకిస్తాం అని స్పష్టం చేశారు.‘నాగ్పూర్ ఆదేశాలు పాటించొద్దు’ఎన్సీ స్పందనతో కాంగ్రెస్ కూడా వెనక్కి తగ్గలేదు. ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాలు ఇండియా కూటమిలో భాగస్వాములని గుర్తుచేసిన కాంగ్రెస్ నేతలు.. కూటమి నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. నాగ్పూర్ అంటే ఆర్ఎస్ఎస్ నిర్ణయాలను అనుసరించవద్దంటూ ఎన్సీ నేతలపై విమర్శలు చేశారు.కాంగ్రెస్పై బీజేపీ ఎదురుదాడిఈ వివాదాన్ని బీజేపీ కూడా అందిపుచ్చుకుంది. పూర్తి ‘వందేమాతరం’పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ వైఖరి ఆ పార్టీని 21వ శతాబ్దపు ‘ముస్లిం లీగ్’గా మార్చిందని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విమర్శించారు. కాంగ్రెస్ ఈ అంశంలో పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. మరో బీజేపీ నేత ఆర్ఎస్ పఠానియా కూడా కాంగ్రెస్పై మండిపడ్డారు. కశ్మీర్లో వేర్పాటువాదులు సైతం ‘వందేమాతరం’పై అభ్యంతరం వ్యక్తం చేయలేదని వ్యాఖ్యానించారు.కూటమిలో కొత్త రగడ?ఒకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ‘వందేమాతరం’ విషయంలో భిన్న వైఖరులు తీసుకోవడం ఇండియా కూటమి అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది. శ్రీనగర్ ఫిల్మ్ ఫెస్టివల్లో చోటుచేసుకున్న ఈ పరిణామం.. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయ దుమారం రేపుతోంది.రెండు చరణాలకే కాంగ్రెస్ కట్టుబాటు‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది. 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం పార్టీ కార్యక్రమాల్లో రెండు చరణాల రూపాన్నే ఆలపించాలని గత నెలలో సీడబ్ల్యూసీ నిర్ణయించింది. పూర్తి గీతం విషయంలో బీజేపీ విమర్శలు పెరగడంతో ఈ నిర్ణయం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.మరోవైపు కేంద్రం కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలలు, అధికారిక వేడుకల్లో పూర్తి ‘వందేమాతరం’ను ఆలపించే అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉండగా.. అదే ఇండియా కూటమిలోని ఎన్సీ నేతలు శ్రీనగర్లో పూర్తి గీతానికి నిలబడటం చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: సర్ప్రైజ్!! బీజేపీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?
ఐదేళ్లలో 32,596 మంది బలి.. నగరాల్లో కానరాని భద్రత!
న్యూఢిల్లీ: దేశంలోని పలు నగరాల్లో మౌలిక వసతులు, పౌరుల భద్రతపై ప్రభుత్వ గణాంకాలు ఆందోళనకర పరిస్థితిని వెల్లడిస్తున్నాయి. 2020 నుంచి 2024 మధ్య భవనాలు కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు, గుంతలు, మ్యాన్హోల్స్ లేదా మురుగు కాలువల్లో పడిపోవడం వంటి ఘటనల్లో మొత్తం 32,596 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికంగా 22,291 మంది అగ్ని ప్రమాదాల్లో మృతి చెందారు.ఏటా వేలాది మరణాలుఎన్సీఆర్బీ ఆధారిత గణాంకాల ప్రకారం.. 2020లో ఈ తరహా ఘటనల్లో 7,556 మంది, 2021లో 6,486 మంది, 2022లో 6,529 మంది, 2023లో 6,054 మంది, 2024లో 5,971 మంది మృతి చెందారు. ఐదేళ్లలో నమోదైన 32,596 మరణాలు కేవలం ప్రమాదాల గణాంకాలు మాత్రమే కావని.. నగరాల్లో నిర్మాణాలు, నిర్వహణ, భద్రతా తనిఖీలు, పాలనా బాధ్యతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.అగ్నిప్రమాదాలే ప్రధాన కారణంఐదేళ్లలో అగ్ని ప్రమాదాల కారణంగా 22,291 మంది మృతి చెందారు. 2020లో 5,473, 2021లో 4,476, 2022లో 4,237, 2023లో 3,991 మంది ప్రాణాలు కోల్పోయారు. 2024లో ఈ సంఖ్య మళ్లీ పెరిగి 4,114కు చేరింది. తాజా ఎన్సీఆర్బీ ఆధారిత వివరాల ప్రకారం.. 2024లో అగ్ని ప్రమాద మరణాల్లో గణనీయమైన సంఖ్య నివాసాలు, ఇళ్లలో జరిగిన మంటలకు సంబంధించినవే.భవనాలు కూలిపోవడంతో..2020-2024 మధ్య భవనాలు కూలిన ఘటనల్లో 5,951 మంది మృతి చెందారు. 2022లో అత్యధికంగా 1,285 మరణాలు నమోదయ్యాయి. 2024లోనూ 1,047 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 2020 నుంచి 2024 మధ్య భవన నిర్మాణాలు కూలిన ఘటనల్లో సుమారు 170 మరణాలు నమోదైనట్లు ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.గుంతలు, మ్యాన్హోల్స్తోనూ ప్రమాదంఐదేళ్లలో గుంతల్లో పడి 3,470 మంది, మ్యాన్హోల్స్ లేదా మురుగు కాలువల్లో పడి 1,094 మంది మృతి చెందారు. గుంతల ఘటనల్లో 2022 అత్యంత ప్రాణాంతకంగా నిలిచింది. ఆ ఏడాది 800 మంది ప్రాణాలు కోల్పోయారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇవి అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు కావు. మెరుగైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, పరిపాలనా పర్యవేక్షణ ఉంటే అనేక ప్రమాదాలను నివారించవచ్చు.కలుషిత నీటి కారణంగానూ..ఈ గణాంకాలు పట్టణ పౌర భద్రతకు సంబంధించిన అన్ని మరణాల పూర్తి చిత్రాన్ని చూపించవని నివేదిక పేర్కొంది. మున్సిపల్ పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో చెత్త రోడ్లు లేదా గుంతల పాత్ర ఉండొచ్చు. కలుషిత నీటి కారణంగా సంభవించే మరణాల పూర్తి వివరాలు కూడా ఇందులో లేవు. అందువల్ల 32,596 అనేది నమోదైన మరణాల సంఖ్య మాత్రమే.. పట్టణ పౌర భద్రతకు సంబంధించిన ప్రతి మరణాన్ని సూచించేది కాదు. ప్రతి కార్పొరేటర్ లేదా కౌన్సిలర్, మున్సిపల్ అధికారి, మేయర్ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: బీజేపీ ఖజానాలో భారీ పెరుగుదల.. వివరాలివే..
బీజేపీ ఖజానాలో భారీ పెరుగుదల.. వివరాలివే..
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ కేంద్ర కార్యాలయానికి మొత్తం రూ.1,472.8 కోట్ల నిధులు అందాయి. ఎన్నికల అనంతరం పార్టీ ముగింపు నిల్వ రూ.7,627.2 కోట్లకు చేరింది. మార్చి 15, 2026న ఉన్న రూ.6,722.6 కోట్లతో పోలిస్తే ఇది రూ.904.6 కోట్ల పెరుగుదల. ఈ వివరాలను బీజేపీ.. ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల వ్యయ, నిధుల నివేదికలో వెల్లడించింది.రూ.160 కోట్ల ఎన్నికల వ్యయంఅస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేంద్ర కార్యాలయంతో పాటు ఆయా రాష్ట్ర, జిల్లా విభాగాలను కలిపి మొత్తం రూ.160 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో అస్సాంలో రూ.96.3 కోట్లు, తమిళనాడులో రూ.51.6 కోట్లు, పుదుచ్చేరిలో రూ.11.9 కోట్లు వ్యయమయ్యాయి. ఈ ఎన్నికల్లో సాధారణ ప్రచారానికి పార్టీ సుమారు రూ.130.4 కోట్లు ఖర్చు చేసింది. పశ్చిమ బెంగాల్, కేరళ ఎన్నికలకు సంబంధించిన వ్యయ వివరాలను మాత్రం ఎన్నికల సంఘం ఇంకా బహిర్గతం చేయలేదు.అస్సాంలో అధిక వ్యయంఅస్సాంలో బీజేపీ సాధారణ ఎన్నికల ప్రచారానికి రూ.76.7 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో కేంద్ర పార్టీ విభాగం రూ.23.1 కోట్లు, అభ్యర్థులపై రూ.19.5 కోట్లు వ్యయం చేసినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణాలకు రూ.27.3 కోట్లు, ప్రకటనలకు రూ.37 కోట్లు, ప్రచార సామగ్రికి రూ.8.9 కోట్లు, రాష్ట్ర విభాగం ఇతర ఖర్చులకు రూ.2.3 కోట్లు ఖర్చయ్యాయి. అభ్యర్థులకు మొత్తం రూ.19.4 కోట్లు చెల్లించగా, వారి నేర చరిత్ర ప్రచురణకు రూ.16.7 లక్షలు వెచ్చించారు.తమిళనాడులో రూ.51.6 కోట్లుతమిళనాడులో బీజేపీ మొత్తం రూ.51.6 కోట్లు ఖర్చు చేసింది. సాధారణ ఎన్నికల ప్రచారానికి రూ.44.5 కోట్లు, అభ్యర్థులపై సుమారు రూ.7 కోట్లు వ్యయమయ్యాయి. పుదుచ్చేరిలో మొత్తం ఎన్నికల వ్యయం రూ.11.9 కోట్లుగా నమోదైంది. ఇదిలా ఉండగా ఇదే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ గతంలో సమర్పించిన వ్యయ వివరాల్లో మొత్తం రూ.248.6 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.ఇది కూడా చదవండి: ముగ్గురు సన్నిహితులకు ట్రంప్ భారీ నజరానా!
ఎన్ఆర్ఐ
మిస్సిసాగాలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
మిస్సిసాగా: కెనడాలోని మిస్సిసాగా నగరంలో శనివారం(సెప్టెంబర్ 5వ తేదీ) సాయంత్రం 6 గంటలకు వైఎస్సార్సీపీ కెనడా విభాగం ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజా సేవ, సంక్షేమ పథకాలు, నాయకత్వ పటిమ, ప్రజల పట్ల ఆయన చూపిన నిబద్ధతను నేతలు, కార్యకర్తలు ఘనంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమం వైఎస్సార్సీపీ కెనడా అడ్వైజర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో, వైఎస్సార్సీపీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు గారి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమ నిర్వాహకులు (వైఎస్సార్సీపీ కెనడా టీమ్):* సుబ్బారావు – వైఎస్సార్సీపీ కెనడా కో-కన్వీనర్* నూర్ గారు – వైఎస్సార్సీపీ కెనడా యూత్ వింగ్ కన్వీనర్ముఖ్య అతిథులు మరియు వక్తలుచల్లా మధుసూదన్ రెడ్డి గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ) – జూమ్ ద్వారా హాజరయ్యారుపాండుగాయల రత్నాకర్ గారు (మాజీ వైఎస్సార్సీపీ యూఎస్ఏ/ఎన్ఆర్ఐ కన్వీనర్, ఏపీ ప్రభుత్వ మాజీ నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి) – జూమ్ ద్వారా హాజరయ్యారు. డాక్టర్ ప్రదీప్ చింత గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - ఎన్ఆర్ఐ వ్యవహారాలు) – జూమ్ ద్వారా హాజరయ్యారు. కొండం వెంకట్ రెడ్డి గారు (కెనడా కమ్యూనిటీ నాయకులు) – ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దూరదృష్టి, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావాన్ని కొనియాడారు.ఎగ్జిక్యూషన్ టీమ్: కార్యక్రమ నిర్వహణ, వేదిక ఏర్పాట్లు, సమన్వయంలో కీలక పాత్ర పోషించిన సభ్యులు: అస్లాం, సుమంత్, యశ్వంత్ నిమ్మకాయల, గోపిరెడ్డి కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, కృష్ణ, ఆరిఫ్, డాక్టర్ నిరంజన్ చుక్కలూరు, సుబ్బారెడ్డి దుగంపూడి, శ్రీనివాస్ కొరపోరలు.అడ్వైజర్ కమిటీ: కార్యక్రమానికి విలువైన మార్గదర్శకత్వం అందించిన సలహాదారుల కమిటీ సభ్యులు:* కృష్ణారెడ్డి పసల* రాజగోపాల్ గుంటక* విశ్వనాథ్ రెడ్డి* విజయభాస్కర్ రెడ్డి* కృష్ణ ఆలంపాటి* డాక్టర్ శివ రెడ్డిఈ కార్యక్రమంలో మిస్సిసాగాతో పాటు పరిసర ప్రాంతాల నుండి వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించిన కోర్ కమిటీ సభ్యులందరికీ, ఎగ్జిక్యూషన్ టీమ్కు, అడ్వైజర్ కమిటీ సభ్యులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
మిస్ టీన్ యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకున్న కిరణ్ రెడ్డి
జార్జియాలోని డగ్లస్కు చెందిన 18 ఏళ్ల భారత సంతతి విద్యార్థిని కిరణ్ రెడ్డి మిస్ టీన్ యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకుంది. అమెరికా జాతీయ పోటీల్లో ఈ ఘనత సృష్టించిన తొలి భారత సంతతి అమెరికన్గా చరిత్ర సృష్టించింది. ఫ్లోరిడాలోని మయామిలో ఉన్న అడ్రియెన్ ఆర్ష్ట్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఆగస్టు 26న జరిగిన 44వ వార్షిక పోటీల్లో కిరన్ రెడ్డి మొత్తం 50 మంది పోటీదారులతో పోటీపడి ఈ కిరీటం దక్కించుకుంది. ఈపోటీల్లో ఆర్కాన్సాస్కు చెందిన రాక్వెల్ ఓలియా మొదటి రన్నరప్గా నిలవగా, న్యూయార్క్కు చెందిన ఎలిసా అకిన్, ఇండియానాకు చెందిన కీర్స్టెన్ అల్వరాడో, టెక్సాస్కు చెందిన క్లో బెల్లా డీట్జ్ టాప్ ఫైవ్లో నిలిచారు. ఈ ఈవెంట్కి మాజీ మిస్ రోడ్ ఐలాండ్ యూఎస్ఏ కెల్సీ స్వాన్సన్ వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. గత నెలలోనే మిస్ జార్జియా టీన్ యూఎస్ఏ టైటిల్ను గెలుచుకున తొలి అమెరికన్గా నిలిచిందామె. అంతేగాదు జార్జియా రాష్ట్రంకి ఈ పోటీ చరిత్రలో తొలి విజయాన్ని అందించిన ఘనత కూడా కిరణ్దే. ఈ మేరకు కిరణ్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ని స్వీకరించడంపై స్పందిస్తూ..ఇది తన అదృష్టంగా పేర్కొంది. తనకు చిన్నప్పటి నుంచి ఆదర్శంగా నిలవడం ఇష్టమని ఈ గెలుపుతో అది నిజమైందని అంటోంది.ఎవరామె..కిరణ్ విద్యా నేపథ్యం వచ్చేసి డగ్లస్లోని కాఫీ హైస్కూల్లో వాలెడిక్టోరియన్గా పట్టభద్రురాలయ్యారు. హైస్కూల్ విద్య పూర్తి చేసిన తర్వాత, రెడ్డి జార్జియా విశ్వవిద్యాలయంలో చేరారు, అక్కడ ఆమె ప్రీ-మెడికల్ ట్రాక్లో జీవశాస్త్రాన్ని అభ్యసిస్తోంది. ఆమె 15 ఏళ్ల వయసులో అందాల పోటీలోకి ప్రవేశించింది. 2024లో జరిగిన మిస్ జార్జియా టీన్ యూఎస్ఏ పోటీలో ఆమె మొదటి రన్నరప్గా నిలిచింది, ఆ తర్వాత ఈ ఏడాది జూలైలో మిస్ జార్జియా టీన్ యూఎస్ఏగా గెలుపొందడంతోనే ఈ జాతీయ టైటిల్కు ఆమె ప్రయాణం సుగమమైంది. ఇక ఆమె త్వరలోనే మిస్ టీన్ యూఎస్ఏగా బాధ్యతలు తీసుకోనుంది. అలాగే అక్టోబర్ 2026లో కంబోడియాలోని ఫ్నామ్ పెన్లో జరిగే మిస్ టీన్ యూనివర్స్ పోటీలో కిరణ్ రెడ్డి యునైటెడ్ స్టేట్స్కు ప్రాతినిధ్యం వహించనుంది కూడా. వీటి తోపాటు తన అండర్ గ్రాడ్యుయేట్ ప్రీ-మెడ్ చదువుని కూడా కొనసాగించాలని చూస్తోంది.(చదవండి: స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు)
టోక్యో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు
జపాన్లోని తెలుగు సమాజానికి అండగా నిలుస్తున్న TAJ (Telugu Association of Japan) ఆధ్వర్యంలో టోక్యోలోని ఓజిమా ప్రాంతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో తెలుగు కుటుంబాలతో పాటు స్థానిక జపాన్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని, భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి మరియు సంప్రదాయాలను ఆసక్తిగా వీక్షించారు. భారతీయులు, జపాన్ స్థానికులు కలిసి పండుగను జరుపుకోవడం రెండు సంస్కృతుల మధ్య స్నేహం, సాంస్కృతిక పరస్పర అవగాహనకు ప్రతీకగా నిలిచింది.శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, భజనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధా వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.“ఎక్కడ ఉన్నా మన సంస్కృతి మనతోనే” అనే భావనతో, జపాన్లోని తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, ఆచారాలు మరియు సంప్రదాయాలను పరిచయం చేస్తూనే, స్థానిక జపాన్ సమాజంతో కూడా సాంస్కృతిక అనుబంధాలను పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యోలో తెలుగు సంస్కృతి, భారతీయ సంప్రదాయాలు, జపాన్ స్థానికుల భాగస్వామ్యం, భక్తి మరియు సమాజ ఐక్యత కలగలిసి వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలు, చిన్నారులు, TAJ సభ్యులు మరియు జపాన్ స్థానికులు పరస్పరం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం అందరికీ ప్రసాద వితరణ నిర్వహించారు.జపాన్లో భారతీయ మరియు తెలుగు సంస్కృతిని కొనసాగిస్తూ, జపాన్ సమాజంతో స్నేహపూర్వక సాంస్కృతిక వారధులను నిర్మించడంలో TAJ కీలక పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు తెలిపారు.సంస్కృతి మన మూలం — స్నేహం మన బలం.జై శ్రీకృష్ణ! 🙏రాధే రాధే! 🌸
గల్ఫ్ దేశాల్లో వైఎస్సార్కు ఘన నివాళి
కడప: ఎడారి దేశాలైన కువైట్, దుబాయ్, ఖతార్, బహరైన్, సౌదీ అరేబియా, జుబైల్, ఒమన్ (మస్కట్)లలో దివంగత సీఎం డా. వైఎస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు. కువైట్లో వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో మాలియా ప్రాంతంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలిరెడ్డి మాట్లాడుతూ.. భూమి, ఆకాశం.. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి శాశ్వతంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.సౌదీఅరేబియాలోని జుబైల్లో వైఎస్సార్కు నివాళులు అర్పిస్తున్న వైఎస్సార్సీపీ అభిమానులుదుబాయ్ (యూఏఈ)లోని సోనాపూర్లో గల్ఫ్ కో–కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్రెడ్డి, ప్రసన్న సోమిరెడ్డిల సమక్షంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలుచేసిన ఘనత వైఎస్సార్దేనని కొనియాడారు.ఖతార్ దేశంలో పితాని శ్రీను విల్లాలో వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖతార్ కన్వీనర్ జాఫర్ హుస్సేన్ గల్ఫ్ కో–కన్వీనర్ దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇక బహరైన్లోని అంబేడ్కర్ క్లబ్లో వైఎస్సార్సీపీ కన్వీనర్ ఓర్సు నాగరాజు, బహరైన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ కృషిచేశారని తెలిపారు.దుబాయ్లో వైఎస్సార్కు నివాళులు అర్పిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు సౌదీ అరేబియా (జుబైల్)లో కూడా వైఎస్సార్ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ కన్వీనర్ షేక్ ఇలాహి నివాళులు అర్పించారు.ఒమన్ (మస్కట్)లో వైఎస్సార్సీపీ కన్వీనర్ భాస్కర్.. ఒమన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహానేత వర్థంతిని నిర్వహించారు. వైఎస్సార్ చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు.
క్రైమ్
భర్తను వదలి మరో వ్యక్తితో సహజీవనం!
అనుమానాస్పద రీతిలో చైత్ర (28) అనే వివాహిత చనిపోయిన ఘటన తాలూకా పరిధిలోని చొక్కహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. చిక్కబళ్లాపురం తాలూకా ఇనమించేనహళ్లికి చెందిన చైత్ర 8 సంవత్సరాల నుంచి భర్తను వదలి చొక్కహళ్లి గ్రామంలో అద్దె ఇంటిలో నివాసముంది. ఆమెకు 10, 12 సంవత్సరాల గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచనబలెకు చెందిన షబ్బీర్ అనే వ్యక్తి చైత్రతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చైత్రను కొట్టి తరువాత అతడే ఉరి వేసి చంపాడని చైత్ర బంధువుల ఆరోపిస్తున్నారు. అతడే ఆమెను చిక్క ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించడానికి తీసుకెళుతుండగా దారిలో చనిపోయిందని నాటకం ఆడుతున్నాడని వాపోయారు. తరువాత షబ్బీర్ ఆమె మొబైల్ని తీసుకుని పరారు కావడం అనుమానాలకు తావిస్తోంది. నందిగిరి ధామ పోలీసులు కేసు దాఖలు చేసుకొని షబ్బీర్ కోసం గాలిస్తున్నారు.-బెంగళూరు చదవండి: నాకేం తెలియదు.. అంతా నా భర్తే చూసుకుంటాడు
భార్య కోసం పోలీసు వాహనమే ఎత్తుకెళ్లాడు!
కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం చోరీకి గురైంది. మద్యానికి బానిసైన రజీ్వచమన్కు చెందిన ఎండీ.ఇజాజ్ భార్య గొడవ కారణంగా కాపురానికి రావడంలేదు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి అతడు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తన భార్యను తీసుకొచ్చేందుకు సహకరించాలని పోలీసులను కోరాడు. ఈ సమయంలో పోలీసులు అతడిని పట్టించుకోవడంలేదనే కోపంతో అక్కడే పార్కింగ్ చేసిన పెట్రోలింగ్ ఇన్నోవా వాహ నాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. అప్రమత్తమైన రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీఐ నిరంజన్రెడ్డి సీసీ కెమెరాలు పరిశీలించి వరంగల్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్పర్తి పోలీసులకు సమాచారం అందించారు. ఇజాజ్ వరంగల్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న క్రమంలో ఎల్కతుర్తి శివారులో వాహనం ప్రమాదానికి గురైంది. బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఏసీపీ, సీఐలు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాన్ని కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. చదవండి: ఇందిరమ్మ టవర్స్ డిపాజిట్ వాపస్
చిన్న ఖర్చుకూ మామనే అడగాలా?..
సంపన్న కుటుంబానికి ఆమె కోడలిగా వెళ్లింది. అయితే అత్తింట్లో అడుగు పెట్టినప్పటి నుంచే ఆమెను మనశ్శాంతి కరువైందట. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా. ఏం చేసినా ఓ కన్నేసి చూసే పిసినారి మామ. నచ్చిన దుస్తులు వేసుకుంటే.. సూటిపోటి మాటలు. కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తే ప్రశ్నలు. చిన్న ఖర్చుకూ భార్యభర్తలిద్దరూ ఆయన్నే డబ్బులు అడగాల్సిన పరిస్థితి.. ఇవన్నీ ఆమెలో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. ఆ అసహనం.. కోపంగా మారి తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్కు చెందిన 63 ఏళ్ల ఫార్మాస్యూటికల్ వ్యాపారి వినీత్ మినోచా దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో ఆయన కోడలే ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చేశారు. మాజీ పనిమనుషులకు సుపారీ ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడిందని తెలిసింది. నేరాంగీకారంలో ఆమె విస్తుపోయే విషయాలే వెల్లడించింది. సెప్టెంబర్ 5 శనివారం రాత్రి తన ఇంట్లో వినీత్ దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఆ కుటుంబానికి గతంలో పనిచేసిన విశాల్ (30), అతడి సహచరుడు రాజ్ కిశోర్పై అనుమానం వచ్చింది. ఆదివారం రాత్రి ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో విశాల్ ఇచ్చిన సమాచారంతో కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.వినీత్ కోడలు షాలు (36) తన మామను హత్య చేయాలని తమను సంప్రదించిందని విశాల్ పోలీసులకు చెప్పాడు. ఇందుకోసం రూ.6 లక్షలు ఇస్తానని ఆమె ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు షాలును అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఆమె.. ఆ తర్వాత తన ప్రమేయాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.షాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా మామ తన కదలికలను నిరంతరం గమనించేవారు. రాత్రిళ్లు పార్టీలకు వెళ్లడం, ఆలస్యంగా ఇంటికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవారు. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ.. తనకు, తన భర్తకు సంబంధించిన చిన్న ఖర్చులకు కూడా మామను డబ్బులు అడగాల్సి వచ్చేదని ఆమె పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.ఆ రాత్రి..జూలై 28న పార్టీ నుంచి షాలు ఆలస్యంగా ఇంటికి రావడంతో మామతో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఘటన తర్వాతే ఆమె మామపై కక్ష పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత వినీత్ దగ్గర గతంలో పని చేసిన విశాల్ను ఆమె సంప్రదించింది. సెప్టెంబర్ 6న రూ.2 లక్షలు, మిగిలిన రూ.4 లక్షలను 15 రోజుల తర్వాత ఇస్తానని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు హత్య కోసం ఫ్లాట్ డూప్లికేట్ తాళం చెవిని కూడా షాలు ఏర్పాటు చేసి విశాల్ చేతికి అందించింది. జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 4న అతడిని ఇంటికి పిలిచి.. హత్య స్కెచ్ను వివరించింది. గుండెపోటుగా..శనివారం రాత్రి షాలు తన భర్త సుబ్రత్, కుమారుడితో కలిసి పార్టీకి వెళ్లింది. వారు ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే విశాల్, రాజ్ కిశోర్ ఫ్లాట్కు చేరుకున్నారు. సెక్యూరిటీ గార్డు మదన్ వారిని అడ్డుకోవడంతో.. విశాల్ వెంటనే షాలుకు ఫోన్ చేశాడు. వాళ్లిద్దరూ మందులు తెచ్చారని.. లోపలికి అనుమతించాలని గార్డుకు ఆమె చెప్పింది. అయితే వినీత్ను దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేయడం.. దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలన్నది వాళ్ల ప్లాన్. అయితే జరిగింది వేరు. ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరూ.. బెడ్రూమ్లో దాక్కున్నారు. వినీత్ అక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆయనపై కత్తులతో దాడి చేశారు. ఏకంగా 26 సార్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.రక్తపు మడుగులో మామ..పార్టీ ముగించుకుని షాలు, ఆమె భర్త సుబ్రత్ రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. బెడ్రూమ్లో వినీత్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులేవీ దొంగిలించకపోవడం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. దీంతో తొలినుంచే ఇది దోపిడీ కోసం జరిగిన హత్య కాదని.. కుటుంబంలో వ్యక్తిగత విభేదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.ప్రస్తుతం షాలు జైలులో ఉంది. మరోవైపు ఆమె భర్త సుబ్రత్ ఈ కుట్ర గురించి ముందే తెలుసా? హత్యలో అతడి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం అతడి ఫోన్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: యూట్యూబర్ రమా నందన సంచలన వాంగ్మూలం
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. సర్పవరం పోలీసుల తొలిరోజు విచారణలో నిందితుడు సాధిక్ఖాన్ ఇచ్చిన సమాధానాలు దాదాపుగా ఇవే. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు అనుమానాస్పద మృతిలో కీలక నిందితుడు సాధిక్ ఖాన్ను మంగళవారం కస్టడీకి తీసుకున్న సర్పవరం పోలీసులు తొలిరోజు విచారణ ప్రారంభించారు. అతడి న్యాయవాది సమక్షంలో అదనపు ఎస్పీ మహంతి కిషోర్కుమార్ ఆధ్వర్యంలో రూరల్ పీఎస్ ఆవరణలో ఉన్న ప్రత్యేక గదిలో అతన్ని విచారిస్తున్నారు.ఉదయం ప్రారంభమైన విచారణ, రాత్రి 9.30 సమయానికి కూడా కొనసాగుతోంది. పోలీసు వర్గాల నుంచి తెలిసిన సమాచారం మేరకు.. సాధిక్ను విచారించేందుకు 200 ప్రశ్నలతో జాబితాను సిద్ధం చేసుకున్న పోలీసులు తొలిరోజు 60 ప్రశ్నలు అడిగారు. అందులో ఎక్కువ మేరకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సాధిక్ సమాధానం ఇవ్వడం గమనార్హం. సాంకేతిక ఆధారాలతో సాధిక్ను అడిగిన ప్రశ్నలకు వాస్తవ సమాధానాలు కనిపెట్టే యోచనలో పోలీసులు ఉన్నారు. విచారణకు పూర్తి స్థాయి సహకారం లేకపోవడం వల్ల సాంకేతిక అంశాలపై ఆధారపడి కేసు విచారణ కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. మీరట్లో ఏం జరిగింది... సాధిక్ మీరట్ వెళ్లడం వెనుక కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కకుండా సాధిక్ అక్కడి పోలీసుల ద్వారా అరెస్టయ్యాడని తెలిసింది. స్థానిక పోలీసులు అరెస్టు చేయడం వల్లే ఆంధ్రా పోలీసులు వెళ్లి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకురావలసి వచ్చిందని స్పష్టమైంది. ఆంధ్ర పోలీసులకు చిక్కే సమయానికి సాధిక్కు చెందిన స్థానికులు మీరట్ పోలీసులకు సమాచారం అందించి కావాలనే అరెస్టు చేయించారని, నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందే గుర్తించిన సాధిక్ తన మార్గదర్శి ద్వారా ఈ పన్నాగం పన్నాడని చెబుతున్నారు. అతడి వెనకున్నదెవరు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. సాధారణంగా దేశంలో ఏ మూల ఉన్నా నిందితులను పోలీసులు ఆయా ప్రాంతాలను వెళ్లి అరెస్టు చేసి జిల్లాకు తీసుకువస్తారు. కాని సాధిక్ విషయంలో అలా జరగలేదు. ట్రాన్సిట్ వారెంట్ తప్పనిసరి అయింది. అవును రసాయనం తెచ్చాను... సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి హత్యకు వినియోగించాడని చెబుతున్న ప్రాణాంతక రసాయనం ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చావన్న ప్రశ్నకు రసాయనం తేవడం నిజమేనని అంగీకరించినట్టు తెలిసింది. అయితే, ఆ రసాయనం ఉపయోగించి తాను చంపలేదని చెబుతున్నాడు. ఈ విషయాన్ని నిరూపించడం పోలీసులకు ఓ సవాల్గా మారింది. ఇప్పటికే జగదీశ్వర్రెడ్డి చికిత్స పొందిన ఆసుపత్రుల నుంచి ఆరోగ్య నివేదికలు సేకరించారు. వాటిని నిపుణుల పరిశీలనకు పంపారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో.. మంగళవారం నాటి విచారణలో పోలీసులు కీలక విషయం రాబట్టారు. మోసం చేయడం ఆది నుంచి సాధిక్కు ఓ అలవాటైన విషయమని మరోసారి నిర్ధారించుకున్నారు. ఇంత డాబు, దర్పాన్ని ప్రదర్శిస్తున్న సాధిక్ కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. నకిలీ సర్టిఫికెట్ ఒకటి తయారు చేయించుకొని వివిధ పోటీలలో పాల్గొనడం దగ్గర నుంచి, కోచ్గా పాఠశాలల్లో చేరడం వరకు చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని స్వయానా సాధిక్ అంగీకరించాడు. ఇద్దరు సెంటు వ్యాపారస్తుల విచారణ... సా«ధిక్ ఖాన్ను కస్టడీకి తీసుకొచ్చే కొద్ది రోజుల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. జగదీశ్వర్రెడ్డిని హతమార్చేందుకు సాధిక్ సర్వ ప్రయత్నాలు చేశాడన్న విషయం రూఢీ అయింది. అందులో భాగంగా రాజమహేంద్రవరం గాం«దీపురంలో ఉన్న ఓ సెంటు వ్యాపారస్తుడు అబ్దుర్ రెహమాన్ సాధిక్ సంప్రదించాడు. తనకు హానికారక రసాయనం కావాలని, ఒక వ్యక్తిని హతమార్చాలని చెప్పాడు. అది ప్రస్తుతం తన వద్ద లేదని చెప్పిన రెహమాన్ హైదరాబాద్కు చెందిన అబ్దుల్ ఖాదిర్ను సంప్రదించాలని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చాడు. పోలీసులు వీరిద్దరినీ విచారిస్తుండగా వారి న్యాయవాది వచ్చి విడుదల చేయించారని, విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి తీసుకెళ్లారని తెలిసింది. సాధిక్ విచారణ కొనసాగుతుండడంతో వారిద్దరినీ మరో మారు పిలిపించే అవకాశం ఉంది. ఆ పార్సిల్లో ఏముంది? అబ్దుల్ ఖాదిర్ హైదరాబాద్ నుంచి సెంట్ల తయారీలో వినియోగించే ఓ హానికర రసాయనాన్ని సాధిక్కు పంపాడని సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు పంపిన మార్గాన్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. ఓ ట్రావెల్ బస్సులో కొద్ది రోజుల క్రితం సాధిక్కు ఓ పార్సిల్ అందిందన్న సమాచారం పోలీసులకు తెలియడంతో డీఎంహెచ్వో కార్యాలయం ఎదురుగా ఉన్న సదరు ట్రావెల్స్ ఆఫీసులో విచారణ చేశారు. అక్కడి వారు పార్సిల్ రావడం నిజమేనని నిర్ధారించారు. ఆ పార్సిల్లో ఏమొచ్చిందో పోలీసులకు అంతుబట్టడం లేదు. అది ఖాదిర్ పంపిన విషపూరిత రసాయనం అయి ఉండొచ్చన్న అనుమానాలు పోలీసులలో ఉన్నాయి. -కాకినాడచదవండి: బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు
వీడియోలు
చిన్న శ్రీను పార్టీ మారడంపై బొత్స హాట్ కామెంట్స్
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం
వైఎస్ జగన్ 27% IR ఇస్తామన్నారు, ఇచ్చారు...! నువ్వు ఏం ఇచ్చావ్ బాబు
అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!
AlphaGeo: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. ప్రకృతి వార్నింగ్
YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్
వివేకా కేసులో వీడిన మిస్టరీ...? కారుమూరి సంచలన వ్యాఖ్యలు
తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. పోలీసులకు సాదిక్ ఖాన్ సమాధానాలు?
Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?
2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

