హైదరాబాద్లో వినాయక చవితి సందడి (ఫోటోలు)
టెలిగ్రామ్ ఛానెల్ ఖరీదు రూ.6 కోట్లా.. తిరుపతి యువకుడికి జాక్పాట్
సాక్షి,తిరుపతి : సోషల్ మీడియా టెలిగ్రామ్ ఛానెల్ అమ్మి రూ.6 కోట్లు సంపాదించాడు తిరుపతి యువకుడు.కానీ సీన్ కట్ చేస్తే.. అదే డబ్బు కోసం స్నేహితులే కిడ్నాప్ ప్లాన్ చేశారు.అసలు ఏం జరిగిందంటే?క్రికెట్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానెల్ను కోట్లకు విక్రయించి భారీగా డబ్బు సంపాదించిన యువకుడిని, అదే డబ్బుపై కన్నేసిన స్నేహితులే అపహరించిన సంచలన ఘటన తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి మండలం నాగపట్నం గ్రామానికి చెందిన సుమంత్ అనే యువకుడు ‘నాని క్రికెట్ ప్రిడిక్షన్’ పేరుతో ఒక టెలిగ్రామ్ ఛానెల్ను నిర్వహిస్తున్నాడు. కాగా, ఈ ఛానెల్ను నార్త్ ఇండియాకు చెందిన ఒక వ్యక్తికి సుమంత్ ఏకంగా రూ.6 కోట్లకు విక్రయించాడు. ఈ భారీ మొత్తానికి సంబంధించిన డబ్బు సుమంత్ వద్ద ఉండటంతో, అతని స్నేహితులే ఆ కోట్ల రూపాయలపై కన్నేశారు.ఈ నేపథ్యంలోనే సుమంత్ను అతని స్నేహితులు కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాపర్ల చెర నుంచి ఒక స్నేహితురాలి సహాయంతో సుమంత్ అప్రమత్తమై ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే తేరుకున్న బాధితుడు ఆగస్టు 28న తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, పోలీసు కస్టడీలో వారు విస్తుపోయే నిజాలు వెల్లడించారు.నిందితులు ఇచ్చిన సమాచారంతో తాటితోపు వద్ద ఉన్న చందు ఇంట్లో దాచిపెట్టిన రూ. కోటి 10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేసిన పోలీసులు.. మోహన్, బాలాజీ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ ఉదంతంలో ప్రధాన సూత్రధారులుగా ఉన్న యశ్వంత్, మనోజ్, గౌతంలు పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ మరోసారి ప్రశ్నలు
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల మీద విశ్వసనీయత పోతే.. నిరుద్యోగుల కలల రెక్కలు విరిగిపోతాయంటూ సోమవారం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘‘లక్షలాది మంది అభ్యర్థులు తమ జీవితాన్ని.. కుటుంబాల కష్టార్జితాన్ని ఉద్యోగ పరీక్షల కోసం ఖర్చు చేస్తున్నారు. వారికి కావాల్సింది ఒక్కటే.. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా.. తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం. వ్యవస్థే విఫలమైతే దెబ్బతినేది కేవలం పరీక్ష ఫలితాలు కాదు.. మొత్తం నియామక ప్రక్రియపై యువత పెట్టుకున్న నమ్మకం.చంద్రబాబూ.. న్యాయం చేయడం మీకు ఒక ఆప్షన్ కాదు.. ప్రభుత్వపరంగా మీ బాధ్యత. కష్టపడి చదివిన అభ్యర్థుల శ్రమకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై లేదా?.వారి భవిష్యత్తుకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం మీకు లేదా? డీఎస్సీలో బయటపడిన స్కాంకు మీరు బాధ్యత వహిస్తారా? లేదా? నిరుద్యోగుల కలలతో ఆడుకోవడం కాదు..వారి కష్టానికి న్యాయం చేయండి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. 𝗪𝗵𝗲𝗻 𝗲𝘅𝗮𝗺𝘀 𝗹𝗼𝘀𝗲 𝗰𝗿𝗲𝗱𝗶𝗯𝗶𝗹𝗶𝘁𝘆, 𝗱𝗿𝗲𝗮𝗺𝘀 𝗴𝗲𝘁 𝗰𝗹𝗶𝗽𝗽𝗲𝗱!Lakhs of aspirants sacrifice prime years of their lives and their families’ hard-earned money for a fair chance. When the system fails them, it doesn’t just affect the results, it shatters… pic.twitter.com/hyYMHwsYEK— YS Jagan Mohan Reddy (@ysjagan) September 14, 2026
ఒక్కొక్కరికి రూ.500 చొప్పున పంచిన నేత.. ఆయన ఆస్తులు ఎంతంటే?
పట్నా: బిహార్లో భారీ వరదల మధ్య పూర్ణియాకు చెందిన స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున నగదు అందించడంతో పాటు బియ్యం, అటుకులు, పిండి, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. మహిళలకు శానిటరీ ప్యాడ్లు అందించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పడవలను కూడా ఏర్పాటు చేశారు.పట్నాలోని దీఘా ఘాట్, పూర్ణియా, కటిహార్, రాఘోపూర్ ప్రాంతాల్లో పప్పూ యాదవ్ సహాయక సామగ్రి పంపిణీ చేశారు. వరద నీటిలోకి వెళ్లి బాధితులను కలుస్తున్న ఆయనకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వద్ద ఉన్న ఆస్తులపై కూడా చర్చ మొదలైంది.సహాయక చర్యల సందర్భంగా పప్పూ యాదవ్ తన వద్ద ప్రభుత్వం వద్ద ఉన్నదానికంటే కూడా ఎక్కువ డబ్బు ఉందని వ్యాఖ్యానించారు. రేషన్ సరిపోకపోవడంతో ప్రజల అవసరాలు తీర్చేందుకు నేరుగా నగదు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. పట్నాలో సహాయక సామగ్రి పంపిణీ సమయంలో జనాల రద్దీని ఉపయోగించుకుని ఆయన బ్యాగ్ లేదా జేబు నుంచి సుమారు రూ.లక్ష చోరీ అయినట్లు కూడా సమాచారం వెలువడింది. వరద సహాయక చర్యలపై బిహార్, కేంద్ర ప్రభుత్వాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.గత లోక్సభ ఎన్నికల సమయంలో పప్పూ యాదవ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ రూ.12,08,84,682, అంటే సుమారు రూ.12.08 కోట్లు. ఆయన మొత్తం అప్పులు రూ.1,72,36,808, అంటే సుమారు రూ.1.72 కోట్లు అని అందులో పేర్కొన్నారు.అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఇన్నోవా కారు, సుమారు 204 గ్రాముల బంగారం ఉన్నాయి. నివాస, వాణిజ్య భూములకు సంబంధించిన స్థిరాస్తులు కూడా అందులో నమోదయ్యాయి. అయితే ఇవి 2024 ఎన్నికల సమయంలో స్వయంగా ప్రకటించిన వివరాలు మాత్రమే. View this post on Instagram A post shared by Rajesh Ranjan (@pappuyadavjapl)
కవిత జోరు.. మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త సారథులు
ఒమన్లో జరగాల్సిన ఇరాన్ కీలక భేటీ.. వాయిదా!
వాళ్లకు ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సంక్షోభంలో నేపాల్.. వెలుగులు పంచుతున్న భారత్
ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. విధ్వంసకర బ్యాటర్ అరంగేట్రం
గణనాథుని సేవలో నమ్రతా.. వినాయకుడి అనసూయ పూజలు
పోలీస్ స్టేషన్లోనే కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై దాడి.. వాళ్ల పనేనా?
సెకన్లలోనే భారీ చెట్టెక్కిన యువతి.. వైరల్గా మారిన వీడియో
అమ్మ ఆస్తి ఎవరికి? కూతురికా.. కొడుక్కా?
మీ డాక్టర్ 4-5 ట్యాబ్లెట్లు రాసిస్తున్నారా? WHO ప్రమాణాలు ఎలా ఉన్నాయ్?
థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన
నీవే శరణ్యం గణేశా!
కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం
వివాహేతర సంబంధాల యాప్.. టాప్–5లో హైదరాబాద్!
ఎన్నికల్లో మీకు సరైన లెక్క నేను చెబుతా..
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
అలాగే ఓ బాంబు, నెత్తిన అప్పు కూడా ఇద్దాం సార్!
‘పండుగప్ప’ కోసం పోటీ.. వేలంలో దక్కించుకున్న మహిళ
విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు!
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే?
బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయం.. కదిలిన యంత్రాంగం
వైభవ్కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా
పావలా శ్యామల మరణం.. 'మా' కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ అప్పులు
రాత్రికి రాత్రే 23 కి.మీ వెనక్కి సముద్రం.. ఏం జరగబోతుంది?
సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్
భారత రోడ్లపై పుతిన్ కారు.. ప్రత్యేకతలు ఇవే!
కవిత జోరు.. మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త సారథులు
ఒమన్లో జరగాల్సిన ఇరాన్ కీలక భేటీ.. వాయిదా!
వాళ్లకు ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సంక్షోభంలో నేపాల్.. వెలుగులు పంచుతున్న భారత్
ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. విధ్వంసకర బ్యాటర్ అరంగేట్రం
గణనాథుని సేవలో నమ్రతా.. వినాయకుడి అనసూయ పూజలు
పోలీస్ స్టేషన్లోనే కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై దాడి.. వాళ్ల పనేనా?
సెకన్లలోనే భారీ చెట్టెక్కిన యువతి.. వైరల్గా మారిన వీడియో
అమ్మ ఆస్తి ఎవరికి? కూతురికా.. కొడుక్కా?
మీ డాక్టర్ 4-5 ట్యాబ్లెట్లు రాసిస్తున్నారా? WHO ప్రమాణాలు ఎలా ఉన్నాయ్?
థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన
నీవే శరణ్యం గణేశా!
కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం
వివాహేతర సంబంధాల యాప్.. టాప్–5లో హైదరాబాద్!
ఎన్నికల్లో మీకు సరైన లెక్క నేను చెబుతా..
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
అలాగే ఓ బాంబు, నెత్తిన అప్పు కూడా ఇద్దాం సార్!
‘పండుగప్ప’ కోసం పోటీ.. వేలంలో దక్కించుకున్న మహిళ
విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు!
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే?
బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయం.. కదిలిన యంత్రాంగం
వైభవ్కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా
పావలా శ్యామల మరణం.. 'మా' కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ అప్పులు
రాత్రికి రాత్రే 23 కి.మీ వెనక్కి సముద్రం.. ఏం జరగబోతుంది?
సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్
భారత రోడ్లపై పుతిన్ కారు.. ప్రత్యేకతలు ఇవే!
ఫొటోలు
హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)
'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)
ఆషికా.. బార్బీ డాల్కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)
అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)
ఫ్యాన్స్ ఫైట్ చేస్తుంటే.. స్టార్స్ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)
ఖైరతాబాద్ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)
హైదరాబాద్లో వినాయక చవితి సందడి (ఫోటోలు)
'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)
విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)
సినిమా
టీజర్, పాటల దెబ్బ.. రిలీజ్కి ముందే నాని ‘ది ప్యారడైజ్’ రికార్డు
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది ప్యారడైజ్’ గురించే చర్చ జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉండగా.. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ఆ అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై ఆసక్తిని పెంచడంతో.. ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లోనూ కనిపిస్తోంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘ది ప్యారడైజ్’ దూకుడు మొదలైంది.నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రానికి నార్త్ అమెరికాలో భారీ స్పందన లభిస్తోంది. ప్రముఖ ఓవర్సీస్ పంపిణీ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 23న నార్త్ అమెరికా ప్రీమియర్ షోలు గ్రాండ్గా ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే జోరందుకున్నాయి.తాజాగా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్లో ‘ది ప్యారడైజ్’ 250K డాలర్ల మార్క్ను దాటినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్లో తన సత్తా చాటుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్కు వస్తున్న స్పందన చూస్తుంటే.. ప్రీమియర్ షోల సమయానికి ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఇక ‘ది ప్యారడైజ్’పై నాని అభిమానులతో పాటు సినీ ప్రియుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘దసరా’కు మంచి స్పందన లభించిన నేపథ్యంలో.. ఈసారి వీరిద్దరూ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై హైప్ను మరింత పెంచింది.మొత్తానికి.. థియేటర్లలోకి రాకముందే ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్లో రికార్డుల వేట మొదలుపెట్టింది. నార్త్ అమెరికా ప్రీమియర్స్కు ఇంకా సమయం ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఏ స్థాయికి చేరుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.#ThePARADISE North America PREMIERES PRE-SALES $250K and Counting 💥Bookings Open Now 🎟️Overseas By @PrathyangiraUS , Premieres On SEPTEMBER 23 👊@NameisNani @Odela_Srikanth @AnirudhOfficial @SudhakarCheruk5 @SLVCinemasOffl @TheParadiseOffl pic.twitter.com/50lUAYqiTr— Vamsi Kaka (@vamsikaka) September 14, 2026
బిగ్బాస్లో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం
బిగ్బాస్ సీజన్-10లో ఎలిమినేషన్స్ వేడి మొదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్లు తమకు నచ్చని వారి పేర్లు చెబుతూ.. అందుకు కారణాలను వివరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ కాస్తా హౌస్లో మాటల యుద్ధానికి దారితీసినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. బిగ్బాస్ ఇచ్చిన టాస్క్లను పూర్తి చేసేందుకు కంటెస్టెంట్లు పోటీపడుతున్నారు. మరోవైపు ఎలిమినేషన్ పాయింట్స్లోనూ ఒకరిపై ఒకరు తమ అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది.తాజా ప్రోమోలో నరేశ్.. షాలినీని ఎలిమినేషన్కు నామినేట్ చేస్తూ తన కారణాలను చెప్పాడు. దీనికి షాలినీ కూడా గట్టిగానే స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ కనిపించారు. మరోవైపు వర్షిణి, షాలినీ మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లు ప్రోమోలో చూపించారు. వీరిద్దరి మధ్య అసలు గొడవకు కారణమేంటి? ఎలిమినేషన్ పాయింట్స్ విషయంలో ఎవరి వాదన సరైనది? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే బిగ్బాస్ హౌస్లో పోటీ రసవత్తరంగా మారగా.. ఎలిమినేషన్ ప్రక్రియతో మరింత వేడి పెరిగినట్లు కనిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్లో ఏం జరిగింది? ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ఎవరి మధ్య మాటల యుద్ధం ఎంతవరకు వెళ్లిందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
లూయిస్ హామిల్టన్ కూడా ఇంత ఓవర్ చేయడు.. అజిత్పై నెటిజన్ల ఫైర్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం కార్ రేస్తో బిజీగా ఉన్నారు. యూకేలోని సిల్వర్స్టోన్లో జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ రేసులో ఆయన పాల్గొన్నారు. ఈ పోటీలకు తమిళనాడు సీఎం విజయ్ సైతం హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరు కలవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ఈవెంట్లో అజిత్ కుమార్ వ్యవహరించిన తీరుపై మాత్రం నెటిజన్స్ మండిపడుతున్నారు. ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించగా అజిత్ సీరియస్ అయ్యారు. అతని వైపు కోపంగా చూస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.సెల్ఫీ కోరిన అభిమానిపై అజిత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై నెటిజన్స్ విమర్శిస్తున్నారు. అభిమానులు అనే వారే లేకపోతే మీరు జీరో అంటూ అజిత్పై మండిపడుతున్నారు. తన అభిమానుల పట్ల అజిత్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని కొందరు విమర్శలు చేస్తున్నారు. అభిమానులు లేకపోతే, అజిత్ పెద్ద సున్నా అంటూ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అజిత్ ఎందుకింత దురుసుగా ప్రవర్తిస్తున్నాడు? ఇలాంటి వాళ్లు లేకపోతే నువ్వు, నీ కుటుంబం సున్నా.. ఇప్పటికైనా ఈ దురుసుతనాన్ని పక్కన పెట్టి నవ్వు.. దీనికి నీకేమీ ఖర్చు కాదంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ఫార్ములా 1 స్టార్ లూయిస్ హామిల్టన్ కూడా ఇలా ప్రవర్తించడంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. మొత్తానికి అజిత్ తీరుపై నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Kokila Williams (@dr.kokilawilliams)
పావలా శ్యామల మరణం.. 'మా' కీలక నిర్ణయం
సీనియర్ నటి పావలా శ్యామల కూతురికి మా అండగా నిలిచింది. తల్లి మరణంతో ఒంటరైన ఆమె కూతురు మాధవి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సాయం చేసేందుకు ముందుకొచ్చింది. తీవ్ర అనారోగ్యం, నిస్సహాయ స్థితిలో ఆమెకు సహాయ, సహకారాలు అందిస్తామని మా ప్రకటించింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు నేతృత్వంలో సమావేశమైన ఈసీ కమిటీ మాధవికి సంబంధించి పలు నిర్ణయాలు వెల్లడించింది.ఆమెకు ఏడాది పాటు ఉచిత వైద్యం, ఫిజియోథెరపీ అందించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం నడవలేని స్థితిలో వీల్ ఛైర్కే పరిమితమైన మాధవి తిరిగి తన కాళ్లపై నిలబడేలా, ఎంత ఖర్చైనా ఒక సంవత్సరం పాటు పూర్తి ఉచిత వైద్య సహాయంతో పాటు ఫిజియోథెరపీ అందించాలని 'మా' కీలక నిర్ణయం తీసుకుంది. మా అసోసియేషన్ బైలాస్ ప్రకారం ఆర్టిస్టుల కుటుంబ సభ్యులను జీవితాంతం పోషించడం సాధ్యపడదని.. అందుకే ఈ వైద్య సాయాన్ని ఒక ఏడాదికే పరిమితం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె ఇష్టప్రకారం సురక్షితమైన ఆశ్రమం, పునరావాస కేంద్రంలో చేర్పించనున్నారు. కాగా. పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యతలను మా దగ్గరుండి జరిపించగా.. మాధవి భవిష్యత్తు అవసరాల కోసం మురళీమోహన్, వీకే నరేశ్ లాంటి సీనియర్ నటులు ఆర్థిక సహాయం ప్రకటించారు.
క్రీడలు
ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కిన పాక్ టీ20 కెప్టెన్
ఇటీవల పాకిస్తాన్ క్రికెట్లో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల్లో టెస్ట్ జట్టుకు దూరమైన ఆ దేశ టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, స్థానికంగా జరిగిన ఓ దేశవాలీ మ్యాచ్లో అజేయ ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కాడు.ప్రెసిడెంట్స్ ట్రోఫీలో కింగ్స్మెన్ అకాడమీ తరఫున బరిలోకి దిగిన అతడు, మార్కోర్ ఐటీ సొల్యూషన్స్ జట్టుపై 336 బంతుల్లో 42 బౌండరీలు, 6 సిక్సర్ల సాయంతో 300 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అఘా ట్రిపుల్ సెంచరీతో చెలరేగడంతో అతడి జట్టు భారీ స్కోర్ చేసింది.ఈ ట్రిపుల్తో అఘా పాక్ జాతీయ సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్దంతరంగా స్వదేశానికి పంపిన ఏడుగురు పాక్ ఆటగాళ్లలో అఘా ఒకడు. ఇంగ్లండ్ పర్యటనలో తొలి రెండు టెస్ట్ల ఓటముల తర్వాత అఘాతో పాటు మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రమ్ షహజాద్ను జట్టు నుంచి తొలగించి స్వదేశానికి పంపించారు. అలాగే హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్ను కూడా బృందం నుంచి తప్పించారు.రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అందుబాటులో లేకపోవడంతో లీడ్స్లో జరిగిన తొలి టెస్టుకు అఘానే కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే పేలవ ఫామ్ కారణంగా రెండో టెస్టులో అతడికి అవకాశం దక్కలేదు. ఇక, మూడో టెస్టుకు ముందు జరిగిన పరిణామాల్లో అఘాను ఏకంగా స్క్వాడ్ నుంచే విడుదల చేశారు.జట్టు నుంచి తప్పించిన రోజుల వ్యవధిలోనే అఘా ట్రిపుల్ సెంచరీ బాదడం పాక్ క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. అతడిని తిరిగి టెస్ట్ జట్టులోకి తీసుకోవాలని పాక్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అఘాకు పీసీబీ ఛైర్మన్ నఖ్వీ కూడా మద్దతుగా నిలిచాడు. అఘా మంచి ఆటగాడే కానీ, కొన్ని కారణాల వల్ల ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడని అన్నాడు. కాగా, ఇంగ్లండ్ పర్యటనలో ఘోరంగా విఫలమైన పాక్ జట్టు 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. చదవండి: పాకిస్తాన్కు మరో భారీ షాక్
మావాడు వైభవ్ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్ కెప్టెన్
టీమిండియాతో చారిత్రక మ్యాచ్ ఆడేందుకు జపాన్ క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్.. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ విధ్వంసకర ఓపెనర్ దూకుడుకు కళ్లెం వేసేందుకు తమ దగ్గర అస్త్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు.భారత్- జపాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇరుదేశాల పురుషుల క్రికెట్ జట్ల మధ్య తొలిసారి మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. సెప్టెంబరు 22న ఇరుజట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరుగనుంది. జపాన్లోని సానో అంతర్జాతీయ మైదానం ఇందుకు వేదిక.ఇప్పటికే వైభవ్ను ఓసారి అవుట్ చేశాడుఈ నేపథ్యంలో జపాన్ కెప్టెన్ కెండెల్ ‘విజ్డెన్’ షోలో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ సూర్యవంశీని ఎదుర్కొనే విషయంలో మాకు ఎలాంటి ఆందోళనా లేదు. ఎందుకంటే.. మా జట్టులో ఉన్న పదిహేడేళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆసియా కప్ అండర్-19 టోర్నీలో ఇప్పటికే వైభవ్ను అవుట్ చేశాడు. దూకుడుకు కళ్లెం వేసి అతడి పనిపట్టాడు. కాబట్టి ఇంకేం భయం?’’ అని పేర్కొన్నాడు.చార్లీ హరా బౌలింగ్లోకాగా అండర్-19 ఆసియా కప్-2024 టోర్నీలో భాగంగా జపాన్తో మ్యాచ్ సందర్భంగా పరుగులు రాబట్టేందుకు వైభవ్ సూర్యవంశీ ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 23 పరుగులే చేయగలిగాడు. భారత ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో జపాన్ యువ స్పిన్నర్ చార్లీ హరా-హింజే వైభవ్ను అవుట్ చేశాడు.అంత ఈజీ కాదు.. కథ వేరుగా ఉందిఅయితే, జపాన్ కెప్టెన్ కెండెల్ చెప్పినట్లు వైభవ్ సూర్యవంశీని తమ యువ స్పిన్నర్తో కట్టడి చేయడం అంత తేలికేమీ కాదు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ స్సిన్నర్ల బౌలింగ్లో 17 ఇన్నింగ్స్లో కలిపి 146 బంతుల్లో 336 పరుగులు సాధించాడు. సగటు 37 కాగా.. స్ట్రైక్రేటు 228.08. ఇందులో 20 ఫోర్లు, 34 సిక్సర్లు ఉండటం విశేషం.ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం ఆరు టీ20 మ్యాచ్లు ఆడిన పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ.. 193 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున 23 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 1028 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్తో బిజీగా ఉన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. సంజూ శాంసన్ రాక వల్ల తొలి టీ20 సందర్భంగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.చదవండి: వైభవ్ను కాదని నీకు ఛాన్స్ ఇస్తే ఏం చేశావు?
విడాకులు తీసుకున్న మహిళను నమ్మించి...
టీమిండియా వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ సోదరుడు, క్రికెటర్ మహ్మద్ కైఫ్పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని తనను మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడాకులు తీసుకున్న మహిళను నమ్మించి...దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. క్రికెటర్ షమీ సోదరుడు కైఫ్పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న సదరు మహిళకు కైఫ్ మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు.హోటల్కు రప్పించిబలవంతం మీద ఆమెను సెప్టెంబరు 9, 2023న కోల్కతాలోని ఓ హోటల్కు రప్పించి శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని కోరగా.. ఆమెతో స్నేహాన్ని తెంచుకున్నాడు. ఈ మేరకు సదరు మహిళ ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని అర్షియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కైఫ్పై కేసు నమోదైందని రిపోర్టర్ అభిషేక్ త్రిపాఠి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.అన్న మాదిరే బెంగాల్కు ఆడుతూ..కాగా అన్న షమీ మాదిరే కైఫ్ కూడా క్రికెటర్. ఉత్తరప్రదేశ్ వీరి సొంత రాష్ట్రం అయినప్పటికీ అన్న బాటలోనే దేశవాళీ క్రికెట్లో కైఫ్ బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్మద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు పలు దేశీ టోర్నమెంట్లలో ఆడుతున్నాడు. మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన అతడు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటికి 40కి పైగా వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. ఇంతకుముందు కూడా ఓ మహిళ కైఫ్పై ఇదే తరహాలో ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఆరోపించింది. అయితే, అధికారికంగా కేసు మాత్రం పెట్టలేదని సమాచారం. కాగా షమీపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.షమీపై కూడా గతంలో ఆరోపణలుషమీ భార్య హసీన్ జహాన్ స్వయంగా తీవ్రమైన ఆరోపణలతో కోర్టు మెట్లు ఎక్కింది. అతడికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించడంతో పాటు ఫిక్సింగ్ చేస్తాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పటి నుంచి విడిగా ఉంటున్న వీరు.. భరణానికి సంబంధించి తరచూ ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తున్నారు. కాగా హసీన్ జహాన్ ఐపీఎల్లో చీర్ గర్ల్గా ఉన్న సమయంలో ఆమె ప్రేమలో పడ్డ షమీ.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అయితే, అప్పటికే హసీన్కు వివాహమై కూతురు కూడా ఉన్నట్లు సమాచారం. షమీ- హసీన్కు కూడా ఓ కుమార్తె జన్మించింది.చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి?
‘సంతోషంగా ఉంది.. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు’
ఊహించిందే జరిగింది.. మహిళల ఆసియా టీ20 కప్-2026 టోర్నీ విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.గతేడాది పురుషుల జట్టు మాదిరిగానే ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకుంది హర్మన్ సేన. ఫలితంగా.. ముందే సమాచారం ఇచ్చినప్పటికీ చాంపియన్కు తానే ట్రోఫీ ప్రదానం చేస్తానని పట్టుబట్టిన నక్వీకి భంగపాటు ఎదురైంది. ‘ట్రోఫీ దొంగ’ అంటూఅతడి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత జట్టు నిరాకరించగా.. స్టేడియంలో ఉన్నవాళ్లు ‘ట్రోఫీ దొంగ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు.. రన్నరప్ శ్రీలంక మాత్రం నక్వీ చేతుల మీదుగా చెక్ అందుకుంది.ఈ నేపథ్యంలో నక్వీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండగా.. పాకిస్తాన్ అభిమానులు మాత్రం అతడిని ప్రశంసిస్తూ అతి చేయడం కెమెరా కంటికి చిక్కింది. కాగా దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్-2026 ఫైనల్లో భారత జట్టు శ్రీలంకను 72 పరుగుల తేడాతో మట్టికరిపించింది.పాత కథ పునరావృతం కాకుండా..తద్వారా ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. అయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆసియా కప్లో భారత పురుషుల జట్టు చాంపియన్గా నిలిచినప్పటికీ.. నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.దీంతో నక్వీ ట్రోఫీని తనతోపాటే తీసుకువెళ్లడం సహా.. తన అనుమతి లేకుండా భారత్కు ట్రోఫీని అందజేయవద్దనే ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ ముందుగానే ఆసియా క్రికెట్ మండలికి సమాచారం ఇచ్చింది. తమ జట్టు ఆసియా కప్ ఫైనల్లో విజేతగా నిలిస్తే నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోదని తేల్చి చెప్పింది.అయినప్పటికీ నక్వీ మొండిగా ముందుకు వెళ్లి.. చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. దీంతో దుబాయ్ స్టేడియం వీడి కారులో నక్వీ తిరిగి వెళ్తున్న వేళ కొంతమంది పాక్ అభిమానులు అతడిని చుట్టుముట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.సంతోషంగా ఉంది. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు‘మంచి పని చేశారు సర్. మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు’ అంటూ ఓ అభిమాని మాట్లాడటం రికార్డు అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు పాక్ ఫ్యాన్స్, నక్వీ తీరుపై మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.55 పరుగులకే ఆలౌట్ అయిన వాళ్లకే ఆ అర్హత ఉంది‘‘అవును.. టోర్నీ ఆసాంతం ఒక్క ఓటమి కూడా లేకుండా చాంపియన్గా నిలిచిన హర్మన్సేనకు.. ఇలాంటి వ్యక్తి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు అర్హత ఎందుకు ఉంటుంది?.. భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్ అయిన పాక్ మహిళా జట్టుకు మాత్రమే ఆ అర్హత ఉంది. నక్వీ, పాక్ జట్టు.. వారికి వారే తగినవారు. శునకానందం పొందండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా గ్రూప్ దశలో భారత జట్టుతో తలపడ్డ పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన హర్మన్సేన 8.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఇక సెమీ ఫైనల్లో భారత్ బంగ్లాపై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించగా.. శ్రీలంక చేతిలో ఓడి పాకిస్తాన్ ఇంటిబాట పట్టింది. దుబాయ్లో ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా అవతరించింది.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మHumiliation for Mohsin Naqvi 🔥😂“Good job, sir. We are happy with you. They don’t deserve the trophy,” a Pakistani fan tells Mohsin Naqvi. pic.twitter.com/6OSfKSNtzV— Anamika (@TheRubric_Medic) September 14, 2026
న్యూస్ పాడ్కాస్ట్
ఇదేనా నిష్పాక్షిక, పారదర్శక నియామకం... మెగా డీఎస్సీ వ్యవహారంపై చంద్రబాబు బాధ్యత వహించాలి... వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
ప్రపంచ పరిపాలనకు రూల్స్ మనమే రూపొందించాలి.... బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
బిజినెస్
నాలుగేళ్ల కనిష్ఠానికి హైదరాబాద్ హౌసింగ్ సేల్స్!
రియల్ ఎస్టేట్ రంగానికి కీలకంగా ఉన్న భాగ్యనగరంలో గృహ విక్రయాల వేగం మందగించింది. క్రెడాయ్ హైదరాబాద్ - క్రె మ్యాట్రిక్స్ (CRE Matrix) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (హెచ్1 2026 ఆర్థిక సంవత్సరం) నగరంలో ఇళ్ల విక్రయాలు 13 శాతం క్షీణించి 26,068 యూనిట్లకు పడిపోయాయి. గత 4.5 ఏళ్ల కాలంలో (2022 తర్వాత) ఇదే అత్యల్ప అర్ధవార్షిక విక్రయాల సంఖ్య కావడం గమనార్హం.ప్రైమ్ మార్కెట్ రూ.52,913 కోట్లువిక్రయాల సంఖ్య తగ్గినప్పటికీ ధరల పెరుగుదల మాత్రం ఆగలేదు. సగటు ఇంటి విక్రయ ధర గత ఏడాది రూ.1.85 కోట్లుగా ఉండగా, ఈసారి 10 శాతం పెరిగి రూ.2.03 కోట్లకు చేరింది. సగటు ఇంటి పరిమాణం 2,300 చదరపు అడుగులుగా ఉంది. మొత్తంగా ఈ ఆరు నెలల కాలంలో రూ.52,913 కోట్ల విలువైన గృహ విక్రయాలు జరిగాయి. బెంగళూరు, ముంబైల తర్వాత దేశంలోనే అత్యధిక విక్రయ విలువ కలిగిన మూడో అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్గా హైదరాబాద్ నిలిచింది.కొనుగోళ్లు తగ్గడానికి కారణాలేంటి?ఐటీ రంగానికి చెందిన అమెరికాలోని ఎన్ఆర్ఐల నుంచి వస్తున్న పెట్టుబడులు తగ్గాయి. ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, వీసా నిబంధనలు కఠినతరం కావడం వల్ల ప్రీమియం గృహ విభాగానికి ఆదరణ తగ్గింది.రూ.2 కోట్లకు పైబడిన ఇళ్లను కొనడానికి వేతన జీవులు వెనుకాడడమే కాకుండా అద్దె ఇళ్లకే ప్రాధాన్యమిస్తున్నారు.గల్ఫ్ యుద్ధ వాతావరణం, నిర్మాణ వ్యయాలు పెరగడం, సోషల్ మీడియాలో ధరల పెరుగుదలపై ప్రతికూల ప్రచారాలు సైతం కొనుగోలుదారుల నిర్ణయాలపై ప్రభావం చూపాయి.1.42 లక్షలకు చేరిన నిల్వ ఇళ్లుమరొకవైపు డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను భారీగా ప్రారంభించడంతో డిమాండ్, సరఫరాల మధ్య వ్యత్యాసం పెరిగింది. ఈ ప్రథమార్ధంలో రికార్డు స్థాయిలో 49,656 కొత్త ఇళ్లు లాంచ్ కాగా (37% పెరుగుదల), అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 21% పెరిగి 1,42,722 యూనిట్లకు చేరింది. వీటిని విక్రయించడానికి దాదాపు 29 నెలల సమయం పడుతుందని అంచనా. అయితే, ఈ అమ్ముడుపోని నిల్వలో కేవలం 20 శాతం (దాదాపు 30,000 ఇళ్లు) మాత్రమే తక్షణమే నివాసానికి సిద్ధంగా ఉన్నాయని, మిగిలినవి 2027-2029 లేదా ఆ తర్వాత పూర్తవుతాయని నివేదిక వెల్లడించింది. రాబోయే పండుగల సీజన్లో మార్కెట్ పుంజుకుంటుందని బిల్డర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: పండగ పూట.. బంగారం ప్రియులకు గుడ్న్యూస్!
పండగ పూట.. బంగారం ప్రియులకు గుడ్న్యూస్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
ఏఐతో రాజకీయాలకు, జాతీయ భద్రతకు ముప్పు!
కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలకు భద్రతాపరమైన ముప్పు పెరుగుతోందని చైనా దేశ భద్రతా శాఖ (స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీ) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏఐ సామర్థ్యాలు పెరగడం వల్ల రాజకీయ స్థిరత్వానికి, క్లిష్టమైన డిజిటల్ మౌలిక వసతులకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదముందని చైనా భద్రతా శాఖ మంత్రి చెన్ ఇక్సిన్ హెచ్చరించారు. ‘చైనా సైబర్ స్పేస్’ పత్రికలో ప్రచురించిన వ్యాసంలో ఆయన ఈ అంశాన్ని విశ్లేషించారు.ప్రధాన హెచ్చరికలు.. ముప్పు అంశాలుఅధునాతన ఏఐ మోడళ్ల ఆధారంగా శత్రు మూలాలు దాడుల వ్యయాన్ని, సాంకేతిక సంక్లిష్టతను తగ్గించుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. రాజకీయంగా అస్థిరతను సృష్టించడానికి ఏఐ ఆధారిత ఫేక్ కంటెంట్, డిస్ఇన్ఫర్మేషన్ (వదంతుల) ప్రచారాన్ని శత్రు మూలాలు పెద్దఎత్తున ఉపయోగించే అవకాశముందని స్పష్టం చేశారు. విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆర్థిక సర్వర్ల వంటి కీలకమైన జాతీయ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఏఐ ఏజెంట్లలో ఉన్న నిర్మాణ లోపాల వల్ల రిమోట్ పరికరాల నియంత్రణ శత్రువుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. దీని ద్వారా సున్నితమైన ప్రభుత్వ, వాణిజ్య సమాచారం లీక్ అయ్యే అవకాశముందని తెలిపారు.అంతర్జాతీయ పోటీ.. గ్లోబల్ గవర్నెన్స్ అవసరంప్రస్తుతం ఏఐ సాంకేతికత ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య ఒక వ్యూహాత్మక పోటీ వేదికగా మారిందని చైనా పేర్కొంది. కొన్ని సాంకేతికాధిపత్య దేశాలు ఏఐ సరఫరా వ్యవస్థలను, అంతర్జాతీయ ప్రామాణికాలను ఏకపక్షంగా నియంత్రించాలని చూస్తున్నాయని పరోక్షంగా అమెరికా విధానాలపై విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో ఏఐ వినియోగానికి సంబంధించి పారదర్శకమైన, న్యాయమైన అంతర్జాతీయ నియమావళి ఏర్పాటు కావాలని, ముందస్తు ప్రమాద గుర్తింపు వ్యవస్థలను బలోపేతం చేయాలని చైనా పిలుపునిచ్చింది. ఒకవైపు ఏఐ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదిగేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్న చైనా, మరోవైపు అదే ఏఐ వల్ల తమ రాజకీయ వ్యవస్థకు, భద్రతకు ఎదురయ్యే ముప్పును గుర్తించి హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదీ చదవండి: పండగ షాపింగ్కు.. ఏ కార్డు వాడదాం?
మూలధన ఆస్తుల ‘బదిలీ’ లీలలు
గత వారం మూలధన ఆస్తి అంటే ఏమిటో తెలుసుకున్నాం. నిర్వచనం, పరిధి, మినహాయింపులు ఏమిటో తెలుసుకున్నాం. అలా తెలుసుకున్న మూలధన ఆస్తిని ఏం చేస్తే పన్ను భారం ఏర్పడుతుందో తెలుసుకుందాం. మూలధన ఆస్తి బదిలీ చేయగా లాభం ఏర్పడితే, ఆ లాభాలను మూలధన లాభాలు అంటారు. ఈ ఆదాయం స్వభావరీత్యా పన్నుకి గురయ్యే ఆదాయం. మినహాయింపులు చాలా ఉన్నాయనుకోండి.నిర్వచనంలోకి వెళ్తే సెక్షన్ 2(47)లో బదిలీ అంటే ఏమిటో నిర్వచించారు. లేదా నిర్వచించడం చాలా కష్టమని అనిపించో ఏమో .. చాలా తెలివిగా ఒక జాబితాలో కొన్ని అంశాలను ప్రస్తావించి, ఇవన్నీ బదిలీలో భాగమే, బదిలీ కింద పరిగణిస్తారని గట్టిగా వక్కాణించారు. ‘బదిలీ’ లీలలు ఏవిటంటే.. అమ్మకంమార్పిడిహక్కుని వదులుకొనడంహక్కుని రద్దు చేసుకోవడంగవర్నమెంటు వారు స్వాధీనపర్చుకోవడంవ్యాపారాల్లో స్టాకుగా మార్చడంజీరో కూపన్ బాండ్ల మెచ్యూరిటీఆస్తి బదిలీ చట్ట ప్రకారం స్వాదీనపర్చుకోవడంఅనుభవించే హక్కు ఇవ్వడంచూశారా, ఒక్క ‘బదిలీ’ అనే చిన్న పదంలో ఎన్నింటిని జతకలిపారు. ఇలాగే ఉంటాయి చట్టంలోని కొన్ని అంశాలు.అమ్మకం మీకు బాగా తెలిసిందే. రిజిస్ట్రేషన్ ద్వారా అమ్ముతారు. ప్రతిఫలం తీసుకుంటారు. మార్పిడి అంటే, పాతకాలపు వస్తుమార్పిడి పద్ధతి. దీన్నే బార్టర్ సిస్టం అని అంటారు. హైదరాబాదులో ఉన్న జాగాకి బదులుగా విశాఖపట్నం జాగా తీసుకోవడం. రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఇద్దరూ బదిలీ చేసినట్లే. హక్కుని వదులుకోవడం. ఒక ఆస్తిని ముగ్గురు అనుభవిస్తున్నారు. ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి తన హక్కుని వదులుకోవడానికి రూ.20,00,000 ప్రతిఫలం తీసుకుంటారు. ఇలా హక్కు వదులుకోవడం ‘బదిలీ’లోకి వస్తుంది.హక్కులను రద్దు చేసుకోవడం. ఇది ముఖ్యంగా షేర్లలో జరుగుతుంది. కంపెనీ షేర్లు, డిబెంచర్లను వెనక్కి తీసుకుంటుంది. దీన్నే రిడెంప్షన్ అంటారు.కంపల్సరీ స్వాదీనం. గవర్నమెంటు రింగ్రోడ్ లేదా బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసమో లేక ఇతరత్రా ప్రజోపయోగకర ప్రాజెక్టు కోసమో భూమిని స్వాధీనపర్చుకున్నందుకు గాను నష్టపరిహారం ఇస్తుంది.వ్యాపారరీత్యా జరిగే వ్యవహారం. మీరు బంగారం కొన్నారు. కొన్నేళ్ల తర్వాత బంగారం షాప్ పెట్టి ఆ బంగారాన్ని ‘స్టాక్’ కింద మార్చారు. బదిలీ అయినట్లు లెక్క. అయితే, స్టాక్ని అమ్మినప్పుడే పన్ను పడుతుంది.జారీ చేసిన జీరో–బాండ్లు మెచ్యూరిటీ నాడు విక్రయంగా మారి ‘బదిలీ’గా అవుతుంది.ఆస్తి బదిలీ చట్టం ప్రకారం అమ్మకానికి అగ్రిమెంటు చేసుకుని.. కొంత మొత్తం అడ్వాన్సుగా పుచ్చుకుని, మిగతా మొత్తం రాని సందర్భంలో, బయ్యర్ ఆస్తిని స్వాదీనపర్చుకోవడం.ప్రతిఫలం లేకుండా/ఉన్నా.. ఇతరులకు ఆ ఆస్తిని అనుభవించే హక్కుని ఇవ్వడాన్ని బదిలీగానే పరిగణిస్తారు.పైవాటిలో అమ్మకం, స్వాదీనపర్చుకోవడం .. మీకు బాగా తెలిసి ఉండొచ్చు. మిగతావి తికమకలే. సందర్భాన్ని బట్టి ఉంటుంది. అటువంటి వ్యవహారాలకు కోర్టుల వరకు వెళ్లిన సందర్భాలు ఎన్నో. కోర్టు జడ్జిమెంట్లను పరిగణనలోకి తీసుకోవాలి.ఇదీ చదవండి: పండగ షాపింగ్కు.. ఏ కార్డు వాడదాం?ఏది ‘బదిలీ’ కిందికి రాదు అనేది ముఖ్యమైన మరో అంశం. ఆ జాబితా చూడండి. ఈ కింది వ్యవహారాలను ‘బదిలీ’గా పరిగణించరు. మూలధన ఆస్తి అమ్మకంగా పరిగణించరు. పన్నుండదు.ఉమ్మడి కుటుంబంలో ఆస్తి పంపకంవీలునామా ద్వారా సంక్రమణబహుమతులుకంపెనీల్లో కొన్ని సందర్భాల్లో జరిగే ప్రక్రియగోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ.. ఇవన్నీ ‘మూలధన ఆస్తుల’ బదిలీ లీలలు.
ఫ్యామిలీ
గణపతి నవరాత్రులు ఎందుకు?
గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలాప్రాంతాల్లో ఉంది. ఇలా గణపతి నవరాత్రులు, ఉత్సవాలు జరుపుకోవడం వెనక స్వాతంత్య్ర సమర యోధులు బాలగంగాధర తిలక్ మహోన్నత ఆశయమే కారణం. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి, అగ్ర, నిమ్న అనే వర్ణ భేదాలు లేకుండా హిందువులనందరినీ ఒకే వేదికపైకి తెచ్చి ఏకం చేయడానికి లోకమాన్య బాల గంగాధర తిలక్ సార్వజనిక అంటే వీధి గణేశ ఉత్సవాలకు నాంది పలికారు. ఫలితంగా శాస్త్రప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు ఏకదిన వ్రత విధానం మాత్రమే ప్రధానంగా ఉన్నప్పటికీ, సమాజంలో ఐకమత్యం, జాతీయ భావం పెంపొందించడానికే ఈ నవరాత్రి ఉత్సవాల సంప్రదాయం మొదలైంది. నాటినుంచి అది కొనసాగుతోంది, అది సంతోషకరమే. అయితే అనవసర పోటీ తత్వాలు, మితిమీరిన ఆడంబరాలు వీడి అందరూ కలసి మెలసి ఐక్యంగా ఈ పండుగను నిర్వహించుకున్నప్పుడే లోకమాన్యుడి ఆశయం నెరవేరినట్టు. – గోగులపాటి కృష్ణమోహన్, సీనియర్ పాత్రికేయులువ్యవస్థాపకులు, నా టీవీ అండ్ నా ఫౌండేషన్
పండగ కళ
గణేశుడి రూపానికి, కార్టూన్లకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే కార్టూనిస్టులకు అత్యంత ఇష్టమైన, సులభంగా విభిన్న రూపాల్లోకి మలచగలిగే రూపం గణపతి. ప్రముఖ కార్టూనిస్టులు సరసి, లేపాక్షి వినాయక చవితితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జ్ఞాపకాలతోపాటు జయదేవ్, రాజు వంటి ఉద్దండుల కార్టూన్లు మచ్చుకు కొన్ని... గణపతి విశేషాలు మరికొన్ని...1970ప్రాంతాలకు ముందు... ఆ తర్వాత అనుకుంటే బుక్స్టాల్ ముందు నుంచుంటే ఎన్నో మ్యాగజైన్లు కళ్ళముందు కళకళలాడుతూ కనపడేవి కొనండి కొనండంటూ. పండగలంటూ వచ్చాయంటే పాఠకులకు పండగే. కార్టూనిస్టులైతే నెల ముందు నుంచే బిజీ అయిపోయే వాళ్ళు. ముఖ్యంగా వినాయక చవితి, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు కార్టూనిస్టులకు ఇష్టమైన పండుగలు. అందులో వినాయక చవితి ప్రత్యేకం. గణపతి మీద ఎన్నో కార్టూన్లు గీసే వాళ్ళు. ఆ రోజుల్లో బాపు, జయదేవ్, మల్లిక్, సత్యమూర్తి, కాటూరి, రాగతి పండరి లాంటి ఎంతోమంది ప్రముఖ కార్టూనిస్టులు విరివిగా కార్టూన్లు వేసే వాళ్ళు. ప్రత్యేక సంచికంటే కార్టూన్లకు ఎక్కువప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళు. ఎక్కువ కార్టూన్లు ప్రింటవుతాయన్న ఉద్దేశంతో యువ కార్టూనిస్టులతో సహా అందరు కార్టూనిస్టులు ప్రయత్నించేవాళ్లు. అప్పుడు కార్టూన్లకు మంచి పారితోషికాలు కూడా ఇచ్చేవాళ్ళు. గణపతి మీద కార్టూన్లు అంటే ఎక్కువగా ఉండ్రాళ్ళు, చవితి–చంద్రుడు, గణపతి భూలోకం రావటం, మూషికం... ఇలాంటి సబ్జెక్టుల మీద కార్టూన్ ఎక్కువగా వేసేవాళ్ళు. అప్పుడు కార్టూనిష్టులు ఎక్కువగా ఉండేవాళ్లు, చదివేవాళ్ళు కూడా ఎక్కువమంది ఉండేవాళ్ళు కాబట్టి కార్టూనిష్టులు కూడా చాలా శ్రద్ధగా కార్టూన్లు వేసేవారు. ఇప్పుడు పత్రికలు కూడా ఎక్కువ లేవు, శ్రద్ధగా వేసే కార్టూనిష్టులు కూడా తగ్గిపోయారు. ఏమైనా, ఆ రోజులు తల్చుకుంటే భలే ఆనందంగా ఉంటుంది నాలాంటి కార్టూనిస్టులకు.– లేపాక్షి, సీనియర్ కార్టూనిస్ట్నవ్వుల దేవుడువినాయక చవితి పిల్లలకే కాదు కార్టూనిస్టులకి కూడా పండగే. వినాయకుడు కార్టూనిస్టులకి దేవుడు, స్నేహితుడు, గొప్ప సబ్జెక్టు కూడా. అందుకే ఆయన కార్టూనిస్టుల కులదైవం! ఆయన నవ్వించినట్టు ఏ దేవుడూ నవ్వించలేదు మరి. ఆయన్ని చూసే కార్టూనిస్టులు ప్రపంచాన్ని నవ్వించడం నేర్చుకున్నారేమో! దిన, వార, మాస పత్రికలు విస్తారంగా వచ్చే రోజుల్లో చవితి వచ్చిందంటే చాలు కార్టూనిస్టులు చెలరేగిపోయి కార్టూన్లు వేసేవారు. పండగ ప్రత్యేక సంచికలకి ‘ఫుల్ పేజి కార్టూన్లు’ వేసి ఆరారా నవ్వులు ఆరబోసేవారు. చవితి కార్టూన్లకి అన్ని ఐడియాలు ఎలా పుడతాయి కార్టూనిస్టులకి... అనిపిస్తుంది. పుడతాయి! ఒకటీ రెండూ కాదు ఎన్నయినా పుడతాయి. అదే మరి గణేశుడి మహిమ. పిల్లలు మట్టిలో ఆడితే కోప్పడే పెద్దలు తాము కూడా మట్టిలో చేతులు పెడతారు దేవుడి బొమ్మ చెయ్యడానికి. ఇది విచిత్రం కాదూ. బొమ్మ చేశాక అది కార్టూనిస్టులు వేసే బొమ్మలాగా పొట్టిగా ఉన్నా, పొట్ట పెద్దదైనా, చేతులు పీలగా ఉన్నా, ఎగుడుదిగుడుగా ఉన్నా ఎలా వున్నా అది గణేశుడి బొమ్మే! అలా ఎందుకు చేసావని ఆ దేవుడు చిన్నబుచ్చుకోడు. నవ్వుతాడు. నవ్వుల దేవుడు కదా! ఇదే కాదు. అంత దేవుడూ కూడా తాను కూర్చుని సవారీ చేసేది చిన్న ఎలక మీద. ఇదో విచిత్రం! ఆ బొమ్మ పక్కనే చిన్న మట్టి ఎలక పిల్లని కూడా చేసి పెట్టాలి. లేకపోతే చిన్న ఎలక కాస్తా చిన్నబుచ్చుకుంటుంది. మట్టి ఉండలు చేసి ముగ్గులోనో, బియ్యం పిండిలోనో పొర్లించి వాటినే ‘ఉండ్రాళ్ళు’ అంటాం. రంగు రంగు బట్టలు కట్టి, గొడుగు నెత్తిన పెట్టి, పీటమీద కూర్చోబెడతాం. తరవాత పూజ. ఎక్కడెక్కడో పేర్లు కూడా వినని చెట్ల ఆకులతో పూజ. పిల్లా పెద్దా కుటుంబం అంతా కూర్చుని భక్తితో చేస్తాం ఆ పూజ. ఇదంతా ఓ విచిత్రం, వినోదం కాదూ. ఈ తతంగంలో ఎక్కడికక్కడ ఐడియాలు వెల్లివిరుస్తాయి కార్టూనిస్టులకి. అందుకే వినాయకచవితి కార్టూనిస్టులకి ఓ నవ్వులగని. తవ్వుకున్నవాడికి తవ్వుకున్నంత. నవ్వుకునేవాడికి నవ్వుకున్నంత!!నవ్వించేవాడి చుట్టూ నలుగురూ చేరతారు. అలా నవ్వించే దేవుడే గణేశుడు. ఆ దేవుడి చుట్టూ తిరుగుతూ ‘గణపతి బప్పా మోరియా’ అంటూ మనం ఆనందంతో గెంతులు వేసే ఈ నవ్వుల పండగ ఏడాది పొడుగునా ఉంటే ఎంత బావుంటుంది కదా! – సరసి, సీనియర్ కార్టూనిస్ట్
మహా గణపతిం భజే!
ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు మనం వినాయకచవితి పండుగని జరుపుకుంటాము. గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యమూ తలపెట్టం. ఎందుకంటే, ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని శాస్త్రవచనం. విఘ్ననిర్మూలన కోసం అవతరించి మంగళ స్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్యమూర్తియై నిలిచాడు ఆ గణేశుడు.సమస్త మంత్రాలలోను శక్తికి కారణాలైన బీజాక్షరాలన్నింటిలోకి ముందుగా ఉచ్చరించేదే ‘ఓంకారం’ అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా వర్ణించారు. మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ ‘గణపతి’. ‘బ్రహ్మణస్పతి’ అంటే వేదాలకి నాయకుడు అని కీర్తించారు.దేవతా గణాల ప్రారంభం కంటే ముందే గణనాథునితో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి. శరీరంలోని షట్చక్రాలలో అన్నిటికన్నా అడుగున ఉండే చక్రం ‘మూలాధార చక్రం‘. ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. దీనిలో ఇంకో రహస్యం కూడా ఉంది. ‘మహాశక్తి’ అయిన పార్వతీదేవికి ‘ద్వారపాలకుడుగా’ గణపతిని పెట్టినట్టు మన పురాణగాథ, దీనిలో అంతరార్థం ఏమిటంటే –– మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో ఉంటుంది అని, ఈ కుండలిని శక్తియే మహాశక్తి –– అ మూలాధారంలో కుండలిని శక్తిని మేల్కొలపడానికి ప్రవేశించే ద్వారంవద్దనే గణపతి కావలిగా ఉన్నాడు. అంటే గణపతి బీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తే శక్తిని మేల్కొల్పటం సాధ్యపడుతుంది. మూలాధారంలో మేల్కొన్న కుండలినిశక్తి ‘ఇడ’,‘పింగళ’ నాడులద్వార షట్చక్రాలను భేదించి సహస్రారం చేరుతుంది. యోగికి ‘సిద్ధి‘ ‘బుద్ధి‘ కలుగుతుంది. ఈ బుద్ధి, సిద్ధి – ఇడా, పింగళ అనే జంటలే సుషుమ్నా నాడిలో నివసించు గణపతికి భార్యలు.వినాయకుడికి అవతారాలున్నాయా?వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. అవి 1. వక్రతుండుడు; 2. ఏకదంతుడు; 3 మహోదరుడు; 4. లంబోదరుడు; 5. గజాననుడు; 6. వికటుడు; 7. విఘ్నరాజు; 8. ధూమ్రవర్ణుడు.వినాయకుని ఆసనంలో గల అంతరార్థంచాలా ప్రతిమలలో వినాయకుడు తన ఎడమ కాలుని ముడుచుకుని, కుడి పాదాన్ని కిందకి ఉంచి కనిపిస్తాడు. దీనినే యోగశాస్త్రంలో లలితాసనం అంటారు. సాక్షాత్తూ జ్ఞానానికి ప్రతిబింబమైన లలితాదేవి కూడా ఈ భంగిమలోనే కనిపిస్తుంది. భారతీయ ప్రతిమలలో ఇది కాస్త అరుదైనప్పటికీ, బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆసనాన్ని సూచిస్తుంటాయి. ఒకపక్క ప్రశాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వానికి ఈ ఆసనం ప్రతీక. అంటే జీవితంలోని ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే, మనసుని స్థిరంగా నిలుపుకోగలగడమే మానవులకి నిజమైన సవాలు. తాను అలాంటి స్థితిలో ఉన్నానని గణేశుడు చెప్పకనే చెబుతున్నాడన్నమాట. అందుకనే భక్తులు ఎక్కువగా లలితాసనంలో ఉన్న వినాయకునికే పూజలు చేస్తుంటారు.– డి.వి.ఆర్
ఈజిప్ట్ పిరమిడ్ల వద్ద వివాహం చేసుకున్న భారత సంతతి జంట!
డెస్టినేషన్ వెడ్డింగ్లని, ఆకాశంలో పెళ్లి, నీటి అడుగుభాగన పెళ్లి తంతు వంటి వగైర విభిన్న పెళ్లిళ్ల గురించి విన్నాం. సమాధుల వద్ద పెళ్లి తంతు అదీకూడా భారతీయ వైవాహక పద్ధతిలో చేసుకుందో జంట. అయినా శుభకార్యం, అమంగళకరమైన ప్రదేశంలోనా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అత్యంత పర్యాటక ఆకర్షణగా పేరుగాంచిన గిజా పిరమిండ్ల వద్ద చేసుకుంది ఈ జంట. అలా అని అక్కడ వివాహం చేసుకోవడం ఏమంత ఈజీ కాదు. అక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటే.. పెళ్లి మండపం బుక్ చేసుకున్నంత ఈజీ కాదు. అందుకోసం పురావస్తు శాఖ అధికారుల తోపాటు ఈజిప్టు అధికారులను నుంచి కూడా ప్రత్యేకంగా అనుమతి తెచ్చుకోవాలి. ఈ కార్యక్రమం జరిగే రోజుల్లో సందర్శకులకు నిషేధం విధించాల్సి ఉంటుంది. అయితే ఈ జంట ఆ పర్మిషన్లన్నీ తెచ్చుకుని మరి ఆ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ప్రాంతంలోనే గ్రాండ్గా వివాహం చేసుకుంది. వాళ్లే డాక్టర్ మోనికా నాయర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వివేక్ నందా దంపతులు. పిరమిడ్ల వద్ద ఇలా ఒక వ్యక్తిగత వేడుకను నిర్వహించుకున్న ముగ్గురు జంటల్లో ఈ దంపతులు ఒకరుగా నిలిచారు.అలాగే అలాంటి చోట పెళ్లి తంతుని ఏర్పాటు చేసుకున్న తొలి భారతత సంతతి జంటగా ఈ వధువరులిద్దరూ నిలిచారు. అంతేగాదు వారి వేడుకలో ప్రతి అంశం ప్రభుత్వ పర్యవేక్షణలో సమీక్షించబడి, ఆమోదించడం జరుగుతుంది. ప్రతి సాయంత్రం సందర్శకుల కోసం మూసివేసి, ఆ తర్వాత ఈ జంట వేడుక కోసం వేదికను ఏర్పాటు చేస్తుంటారు అక్కడ అధికారులు. ఇలా మొత్తం పది రాత్రులు అక్కడే గడిపారు. వేదికలు, వంటశాలలు, లైటింగ్తో సహా తాత్కాలిక మౌలిక సదుపాయాలను రాత్రికి రాత్రే ఏర్పాటు చేసి, వేడుకలు ముగిసిన తర్వాత తొలగించడం చేస్తుంటారు. అలా మూడు రోజుల పాటు జరిగిన ఈ వివాహా వేడుకలో స్ఫింక్స్ (ఈజిప్ట్లోని గిజా పిరమిడ్ల సమీపంలో నెలకొన్న ఈ శిల్పం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది) పాదాల వద్ద ఏర్పాటు చేసిన విందు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పిరమిడ్ల ప్రవేశంపై కఠినమైన నియంత్రణలు ఉన్న తరుణంలో ఈ జంట వివాహ వేడుక అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి పలు దేశాల నుంచి అతిథులు హాజరయ్యారు.పిరమిడ్ల వద్ద ఈ వేడుకలు జరగడానికి ముందే ఈ జంట కైరోలో సాంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుకలు జరుపుకున్నారు. అయినా మరి అక్కడ వేడుకలు ఎందుకంటే.. పిరమిడ్లకు ఉన్న చారిత్రక ప్రాముఖ్యత, ఆ దేశంతో ఉన్న వ్యక్తిగత అనుబంధం తదితర కారణాల రీత్యా దీన్ని ఎంచుకున్నామని చెబుతున్నారు ఆ దంపతులు. కాగా నందా తన కెరీర్ తొలినాళ్లలో ఇక్కడే పనిచేశారట. ఇదీ చదవండి: గులాబీలు పండిస్తూ.. నెలకు రూ. 2.5 లక్షలు..!
అంతర్జాతీయం
అప్పు అడగడం కోసం పాకిస్థాన్ సంచలన ఎత్తుగడ
ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్ అప్పుకోసం చేయని ప్రయత్నాలు లేవు. నిజాలను దాచిపెట్టి, మోసం చేసి, పన్నాగాలు పన్నయినా సరే అప్పులు తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) అక్టోబర్లో నిర్వహించనున్న ప్లీనరీ సమావేశానికి ముందు పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్పై రూ.70 లక్షల నజరానా ప్రకటించింది. పాకిస్థాన్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఏ తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల రెడ్ బుక్లో మసూద్ అజర్ పేరును చేర్చింది.ప్రతి ఐదు ఏళ్లకు ఒకసారి విడుదల చేసే ఈ రెడ్ బుక్లో మసూద్ అజర్ పేరును చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీకి ముందు పాకిస్థాన్ చేపట్టిన ఈ చర్యను కేవలం చూపించడానికి చేసిన చర్యగా పలువురు భావిస్తున్నట్లు కథనం పేర్కొంది.గతంలోనూ ఇలాంటి ప్రకటన మసూద్ అజర్ విషయంలో పాకిస్థాన్ గతంలోనూ ఇలాంటి ప్రకటన చేసింది. 2021లో ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితా నుంచి బయటపడే ప్రయత్నాల సమయంలో, మసూద్ అజర్పై చర్యల విషయంలో ప్రశ్నలు ఎదురయ్యాయి. అప్పుడు అతడు పాకిస్థాన్ నుంచి అదృశ్యమై అఫ్గానిస్థాన్కు వెళ్లినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అదే ఏడాది ఎఫ్ఐఏ అతడిపై రూ.50 లక్షల నజరానా ప్రకటించింది. ఇప్పుడు ఐదు ఏళ్ల తర్వాత విడుదలైన కొత్త రెడ్ బుక్లో ఆ మొత్తాన్ని రూ.70 లక్షలకు పెంచింది.మసూద్ అజర్ పాకిస్థాన్లో లేడని, అఫ్గానిస్థాన్లో ఉన్నాడని పాకిస్థాన్ పదేపదే చెబుతూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో అతడిపై నజరానా పెంచుతూ ప్రకటన చేయడం ఆ దేశ చర్యపై సందేహాలకు దారితీస్తోంది. భారత్కు వ్యతిరేకంగా జరిగిన ఉగ్ర కార్యకలాపాలతో మసూద్ అజర్ పేరు ముడిపడి ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం బహావల్పూర్లోని జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని చర్య చేపట్టింది.అక్టోబర్ ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీకి ముందు పాకిస్థాన్ తీసుకున్న తాజా చర్యపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి నెలకొంది. మసూద్ అజర్ను పట్టుకునేందుకు ఇది నిజమైన ప్రయత్నమా.. లేక ఎఫ్ఏటీఎఫ్ ముందు చర్యలు తీసుకున్నట్లు చూపించే ప్రయత్నమా అన్నది తదుపరి పరిణామాల్లో తేలనుంది. ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితాలో పాక్ పేరు ఉంటే అప్పులు, పెట్టుబడులపై ప్రభావం పడొచ్చు. అంతర్జాతీయ రుణదాతలు, పెట్టుబడిదారులు దేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలించేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో నిధులు సమకూర్చుకోవడం కష్టతరం.
ఇతడు బుర్ఖా ఎందుకు ధరించాడో తెలుసా?
బ్రిటన్లోని పోర్ట్స్మౌత్లో జరిగిన వలస వ్యతిరేక నిరసనలో బుర్ఖా ధరించి గుర్తింపును దాచుకున్నారన్న ఆరోపణపై 76 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదైంది. హాంప్షైర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌతాంప్టన్లోని హెడ్జ్ ఎండ్కు చెందిన తిమోతీ మిల్లర్పై నిరసన సందర్భంగా గుర్తింపును దాచేందుకు ఉపయోగించే దుస్తులు ధరించినట్లు అభియోగం నమోదైంది.మిల్లర్ శనివారం జరిగిన నిరసనలో అరెస్టైన పలువురిలో ఒకరు. పోర్ట్స్మౌత్ నగర కేంద్రంలో సౌత్ కోస్ట్ పేట్రియాట్స్, స్టాండ్ అప్ టు రేసిజం బృందాలకు చెందిన వందలాది మంది పరస్పరం నిరసనలు చేపట్టారు. మిల్లర్ సోమవారం పోర్ట్స్మౌత్ మేజిస్ట్రేట్స్ కోర్టులో హాజరుకావాల్సి ఉంది.ఇదే ఘటనలో డేవిడ్ మెక్నాలీ అనే 33 ఏళ్ల వ్యక్తిపై రహదారిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, నేరపూరిత నష్టం కలిగించేందుకు ప్రయత్నించడం వంటి అభియోగాలు నమోదయ్యాయి. అంతకుముందు ఆదివారం ఈస్ట్నీ మెరీనాలో జరిగిన అల్లర్లకు సంబంధించి 16 ఏళ్ల యువకుడిని హింసాత్మక అల్లర్ల అనుమానంతో అరెస్టు చేశారు. అతడిని బెయిల్పై విడుదల చేశారు.అంతకుముందు ఈ నెలలో పోర్ట్స్మౌత్లో శరణార్థులను నగరానికి తీసుకురావడాన్ని అడ్డుకునే ప్రయత్నంలో వందలాది మంది మితవాద నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖాన్ని కప్పుకునేలా వస్త్రాలు ధరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.హాంప్షైర్ పోలీసులు సెక్షన్ 60ఏఏ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం నిరసనకారులు ముసుగులు, ముఖాన్ని కప్పే వస్త్రాలు లేదా గుర్తింపును దాచేందుకు ఉపయోగించే ఇతర వస్తువులను తొలగించాలని పోలీసులు ఆదేశించవచ్చు.“ప్రశాంతంగా, చట్టబద్ధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలనుకునేవారికి మేము మద్దతు ఇస్తాం. భయాన్ని సృష్టించడం, హింసను రెచ్చగొట్టడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నవారిని మాత్రం సహించం” అని అసిస్టెంట్ చీఫ్ కానిస్టేబుల్ పాల్ బార్టోలోమియో తెలిపారు.ఈ కేసులతో పాటు గతంలో జరిగిన నిరసనకు సంబంధించి 42 ఏళ్ల డెల్ లియోన్ సోమర్విల్లేపై హింసాత్మక అల్లర్లు, విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై దాడి చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
మలేషియా ప్రధాని నోట సూపర్ హిట్ హిందీ సాంగ్
న్యూఢిల్లీ: ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు కిషోర్ కుమార్ ఆలపించిన సూపర్ హిట్ హిందీ సాంగ్ ‘ఖ్వాబ్ హో తుమ్ యా కోయి హఖీకత్’ను మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఆలపించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన గాన మాధుర్యాన్ని జనం ప్రశంసిస్తున్నారు. 1960వ దశకంలోని తీన్ దేవియా(దేవ్ ఆనంద్ నటించిన చిత్రం)లోని ఈ పాటను పాడుతున్న వీడియోను అన్వర్ ఇబ్రహీం శనివారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టుచేశారు. బూడిద రంగు సూట్ ధరించి, మరొకరు వాయిస్తున్న పియానో సంగీతానికి అనుగుణంగా ఆయన ఈ పాటను చక్కగా ఆలపించారు. ఈ వీడియోకు తక్కువ సమయంలోనే పది లక్షలకు పైగా వీక్షణలు లభించాయి. నెటిజన్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియోను కచ్చితంగా ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో తెలియరాలేదు. #WATCH | Delhi: Malaysia’s Prime Minister Anwar Ibrahim sings a popular Hindi song “Khwab Ho Tum Ya Koi Haqeeqat” in Delhi.(Video source: Anwar Ibrahim/X)#BRICSSummit pic.twitter.com/E8RE9erfie— ANI (@ANI) September 12, 2026 భారత్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి అన్వర్ ఇబ్రహీం హాజరయ్యారు. ఢిల్లీలోని ఒక హోటల్లో ఆయన బస చేసిన సమయంలో ఈ వీడియో చిత్రీకరించబడినట్లు కనిపిస్తోందని జర్నలిస్టులు అంటున్నారు. ప్రఖ్యాత గాయకులు లతా మంగేష్కర్, కిషోర్ కుమార్లకు తాను పెద్ద అభిమానినని అన్వర్ ఇబ్రహీం గతంలో చెప్పారు. ఇదీ చదవండి: మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటన
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
పెద్దల నుంచి సామాన్యుల వరకు.. ఎవరినైనా గౌరవించే తీరు ప్రత్యేకమే. అలాంటి ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చేసిన ఈ చిన్న పని.. ఆయన వినయానికి నిదర్శనంగా నిలిచింది.18వ బ్రిక్స్ సదస్సు కోసం భారత్కు వచ్చిన ఆయన.. సెప్టెంబర్ 12న ఢిల్లీ నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయానికి బయలుదేరేందుకు కారులో నుంచి దిగిన షేక్ ఖలీద్.. అక్కడున్న అధికారులకు వీడ్కోలు చెబుతున్నారు. ఇంతలో తనను తీసుకొచ్చిన డ్రైవర్కు మాత్రం చెప్పకుండా వెళ్లిపోతున్నానని గుర్తించారు.వెంటనే వెనక్కి తిరిగిన ఆయన.. కారు వద్దకు వెళ్లి డ్రైవర్తో చేతులు కలిపారు. కాసేపు అతడితో మాట్లాడి మరీ వీడ్కోలు చెప్పారు. ఆ డ్రైవర్ భారతీయుడని ఏఎన్ఐ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.‘చిన్న పని.. పెద్ద మనసు!’యువరాజు చేసిన ఈ చిన్న పనిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. హోదా, స్థాయి చూడకుండా డ్రైవర్ను ప్రత్యేకంగా పలకరించడాన్ని ఆయన వినయానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. ‘ఇదే అసలైన క్లాస్’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు యూఏఈ వ్యవస్థాపకుడు షేక్ జాయెద్ విలువలను ఈ ఘటన గుర్తుచేస్తోందని పేర్కొన్నారు.భారత్ పర్యటనలో భాగంగా షేక్ ఖలీద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇంధన సరఫరాలు, వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక సహకారం, విద్య, పర్యాటకం తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. హైదరాబాద్ హౌస్లో జరిగిన భేటీలో భారత్–యూఏఈ బంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపైనా చర్చించారు.18వ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. ‘బిల్డింగ్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ’ అనే థీమ్తో జరిగిన ఈ సదస్సుకు 13 మంది ప్రపంచ నేతలు, 17 ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.అయితే అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, కీలక చర్చల మధ్య.. ఒక భారతీయ డ్రైవర్కు స్వయంగా వెనక్కి వెళ్లి వీడ్కోలు చెప్పిన అబుదాబి యువరాజు తీరు మాత్రం ప్రత్యేకంగా నిలిచింది.#WATCH | Delhi: Crown Prince of Abu Dhabi, Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan departs from India after BRICS Summit 2026. pic.twitter.com/cw3XPOlTTz— ANI (@ANI) September 12, 2026
జాతీయం
ఒరంగుటాన్ కేసు ఒక హెచ్చరిక : జాతీయ భద్రతా ముప్పు
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లాలోని ఒక అడవి ప్రాంతంలో అంతరించిపోతున్న 5 ఒరాంగుటాన్ పిల్లల జాడ రాజకీయ దుమారం రేపుతోంది. భారత దేశ తూర్పు సరిహద్దుల వెంబడి తీవ్రమైన జాతీయ భద్రతా లోపాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సంఘటనపై భొగరాయ్ బిజూ జనతా దళ్ (బీజేడీ) ఎమ్మెల్యే గౌతమ్ బుద్ధ దాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లతో సహా ప్రముఖ జాతీయ దర్యాప్తు సంస్థలచే తక్షణమే సంయుక్త విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. బాలాసోర్ జిల్లాలోని అడవుల్లో లభించిన సంఘటనపై గత 6 రోజులుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) మరియు అటవీ శాఖ దర్యాప్తు బృందం నిందితులను, వాహనాలను గుర్తించడంలో విఫలమైందని గౌతమ్ బుద్ధ దాస్ విమర్శించారు. ఇదీ చదవండి: మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటనఆందోళనకరం ఈ నేపథ్యంలో దీన్ని చాలా పెద్ద సమస్యగా ముఖ్యమంత్రి ప్రకటించగా ఇందులో ఒక అంతర్జాతీయ ముఠా ప్రమేయం ఉందని అటవీ శాఖ మంత్రి పేర్కొనడం ఎమ్మెల్యే ఉదహరించారు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది కేవలం ఒరంగుటాన్లకు మాత్రమే పరిమితం కాదు. వన్య ప్రాణుల అక్రమ రవాణా అతీతంగా విస్తరించి, జాతీయ భద్రతలో తీవ్రమైన లోపాన్ని సూచిస్తోంది. ఈ ప్రాంతంలో చాంద్ పూర్, ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం వంటి సున్నితమైన రక్షణ స్థావరాలు ఉన్నాయి. అందువల్ల ఈ సమస్య జాతీయ భద్రతకు సంబంధించినదని వేలెత్తి చూపారు. మిజోరం, పశి్చమ బెంగాల్, దిఘా నుంచి సముద్ర మార్గాల ద్వారా లేదా పర్యవేక్షణ లేని గ్రామీణ సరిహద్దు రహదారుల ద్వారా అంతర్జాతీయ సరిహద్దుల గుండా భొగరాయ్లోకి అంతరించిపోతున్న జాతిని అక్రమంగా రవాణా చేసినట్లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదే వాస్తవమైతే ఈ రవాణా మార్గాలను శత్రు వర్గాలు, ఉగ్రవాదులు, ఆయుధాలు, అక్రమ మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీని రవాణా చేయడానికి తేలికగా ఉపయోగించుకోవచ్చు. బంగ్లాదేశీయులు ఇప్పటికే రాష్ట్రంలోకి చొరబడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: పారాచూట్ ఫెయిల్: ఎముకలన్నీ విరిగి, పైలట్ 50 గంటల తర్వాతఇదే విధమైన ఆందోళనలను ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ వ్యక్తం చేశారు. అక్రమ రవాణాకు గురైన ఒరాంగుటాన్ శిశువులను స్మగ్లర్లు పట్టుబడతామనే భయంతో వదిలివేసి ఉంటారని పేర్కొన్నారు. వారిని తక్షణమే గుర్తించి తగిన దీర్ఘకాలిక చర్యలను చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ఒరాంగుటాన్ లభ్యతపై కేంద్ర దర్యాప్తు బృందాల దర్యాప్తును తిరస్కరించింది. ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత సున్నితంగా వ్యవహరిస్తుంది. దర్యాప్తు ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్టీఎఫ్, డబ్ల్యూసీసీబీ సంస్థలు ఈ నెట్వర్క్ను ఛేదించి, దోషులను అరెస్టు చేయగల పూర్తి సామర్థ్యం ఉన్న వృత్తిపరమైన సంస్థలు అని బీజేపీ ఎమ్మెల్యే ఇరాసిష్ ఆచార్య అన్నారు. జంతువుల సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. భువనేశ్వర్ నందన్కానన్లో 5 ఒరాంగుటాన్లు సురక్షితంగా ఉన్నాయి. వాటికి మంచి సంరక్షణ అందుతోందన్నారు.
లవర్ కోసం రూ.కోట్ల ఖర్చు.. బ్రేకప్ అయ్యాక తిరిగివ్వాలని కేసు
భారతీయ మూలాలున్న వ్యాపారవేత్త, టీసీఐ ఎక్స్ప్రెస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చందర్ అగర్వాల్ తన మాజీ ప్రేయసి ఫెలిషియా లీ నుంచి సుమారు రూ.3.5 కోట్లు తిరిగి ఇప్పించాలంటూ దాఖలు చేసిన కేసును సింగపూర్ హైకోర్టు కొట్టివేసింది. ఆ మొత్తం రుణంగా ఇచ్చినట్లు నిరూపించే ఆధారాలు లేవని, ఎక్కువ భాగం ఖర్చులు బహుమతులేనని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా మాజీ ప్రేయసి న్యాయ ఖర్చులను కూడా చందర్ చెల్లించాలని ఆదేశించింది.చందర్, ఫెలిషియా లీ తొలిసారి 2019లో విమాన ప్రయాణంలో కలుసుకున్నారు. అనంతరం సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం కొనసాగింది. 2022 సెప్టెంబర్లో వారి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది. అయితే అంతకుముందు నుంచే చందర్ ఆమె కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని కోర్టులో వెల్లడైంది.లూయీ విట్టాన్ హ్యాండ్బ్యాగ్, ప్రాడా వోచర్లు, ఆపిల్ హెర్మిస్ గడియారాలు వంటి ఖరీదైన వస్తువులను ఆయన కొనిచ్చారు. బార్సిలోనా, లిస్బన్, లండన్ పర్యటనలకు సంబంధించిన విమానాలు, హోటళ్లు, షాపింగ్ ఖర్చులను కూడా భరించారు. 2023 డిసెంబర్లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మార్చి 2024లో చందర్ సింగపూర్ కోర్టును ఆశ్రయించి 4,68,090 సింగపూర్ డాలర్లు, అంటే దాదాపు రూ.3.5 కోట్లు తిరిగి ఇప్పించాలని కోరారు. ఇవి బహుమతులు కాదని, వడ్డీ లేని రుణంగా ఇచ్చిన డబ్బు అని ఆయన వాదించారు.అయితే లీ ఆ వాదనను తిరస్కరించారు. సంబంధం కొనసాగిన సమయంలో తనపై చేసిన ఖర్చులన్నీ స్వచ్ఛందంగా ఇచ్చిన బహుమతులేనని, విడిపోయిన తర్వాత తిరిగి చెల్లించాలనే ఒప్పందం ఎప్పుడూ లేదని తెలిపారు. రుణంగా ఇచ్చినట్లు నిరూపించే స్పష్టమైన ఒప్పందం లేదా ఆధారాలు కూడా కోర్టుకు లభించలేదు. సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పులో కోర్టు చందర్ వాదనను తోసిపుచ్చింది. ఇక ఈ కేసులో ముందుకు వచ్చే అంశం న్యాయస్థానం ఆదేశించిన న్యాయ ఖర్చుల చెల్లింపే.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మేనేజర్ దిశ కేసులో సరికొత్త సంచలనం!
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో అత్యంత సంచలన పరిణామం చోటు చేసుకుంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసుకు సంబంధించి అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్లో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేలతో పాటు పలువురు ప్రముఖుల పేర్లు ఉండటం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.దిశా మరణంపై ఆమె తండ్రి సతీష్ సాలియన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. గత నెల ఆగస్ట్ చివరి నాటికి వాదనలు పూర్తి చేసి సెప్టెంబర్ 3న కీలక తీర్పు వెలువరించింది. దాదాపు ఆరేళ్ల పాటు ముంబై పోలీసులు ఈ ఘటనను కేవలం ఆత్మహత్య లేదా ప్రమాదవశాత్తు అకస్మాత్తు మృతి (ADR - Accidental Death Report) కోణంలోనే దర్యాప్తు చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలే ఎక్కువపోలీసుల దర్యాప్తు తీరు ‘సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలను లేవనెత్తుతోందని’, విచారణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా, దిశా మరణించి ఆరేళ్లు గడుస్తున్నా కుటుంబ సభ్యులకు పోస్ట్ మార్టం రిపోర్ట్, ఏడీఆర్ కాపీలను కూడా అందజేయలేదని హైకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులోని అనేక అనుమానాలను పరిగణలోకి తీసుకుంటూ సమగ్ర దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగిస్తూ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.సీబీఐ ఎఫ్ఐఆర్లోని కీలక అంశాలు కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ.. గత వారం దిశా తండ్రి సతీష్ సాలియన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆదిత్య ఠాక్రే తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఇతరులు ఈ కుట్రలో, ఆ తర్వాత జరిగిన పరిణామాలను కప్పిపుచ్చడంలో కీలక పాత్ర పోషించారని ఎఫ్ఐఆర్ పేర్కొంది.కేసు పత్రాలు, ఫైళ్లు, ఇతర ప్రభుత్వ రికార్డులను ధ్వంసం చేయడం, అధికారిక రికార్డులను తారుమారు చేయడం, ప్రజాధనాన్ని, మానవ వనరులను, పోలీసు యంత్రాంగాన్ని చట్టవిరుద్ధమైన పనులకు, నేరస్థులను రక్షించడానికి దుర్వినియోగం చేశారని పేర్కొంటూ.. సంబంధిత ప్రభుత్వోద్యోగులు, పోలీసు అధికారులు కూడా ఈ విచారణకు బాధ్యులవుతారని సీబీఐ తేల్చిచెప్పింది.నాటి సీఎం,ఆయన కుమారుడికి చుట్టూ బిగుస్తున్న ఉచ్చుఎఫ్ఐఆర్లో శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, నటులు డీనో మోరియో, సూరజ్ పంచోలి, సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి, అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్, దిశా కాబోయే భర్తతో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించారు. దిశా అటాప్సీ(పోస్ట్మార్టం) రిపోర్టును ఆలస్యం చేశారని, కేసును తప్పుదోవ పట్టించేలా ప్రయత్నం చేసేందుకు అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రే, అప్పటి హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ పాత్రపై కూడా ఎఫ్ఐఆర్లో ఆరోపణలు గుప్పించారు. అలాగే ఆలస్యమైన పోస్ట్మార్టమ్కు సంబంధించిన వైద్యులు, సిబ్బంది పాత్రపై కూడా విచారణ జరగాల్సి ఉందని తెలిపారు.అకస్మిక మృతిగా కేసు నమోదు చేసి..2020 జూన్ 8న ముంబైలోని మాలాడ్ ప్రాంతంలో ఓ నివాస భవనం 14వ అంతస్తు నుంచి కింద పడి దిశా సాలియన్ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత సరిగ్గా వారం రోజుల వ్యవధిలోనే (జూన్ 14న) ఆమె సహచరుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బాంద్రాలోని తన ఫ్లాట్లో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అప్పట్లో ముంబై పోలీసులు దిశా మృతి కేసుకు సంబంధించి కేవలం అకస్మిక మృతిగా నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే, తన కుమార్తెను ముందస్తు పథకం ప్రకారం గ్యాంగ్రేప్ చేసి హత్య చేశారని, దీని వెనుక పెద్దల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సతీష్ సాలియన్ గత ఏడాది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగడంతో ఈ కేసులో మునుముందు మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటన
గురుగ్రామ్లో ఒక మహిళా బైకర్ను కారుతో ఢీకొట్టి, పారిపోయిన ఘటన, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై కారు నంబరుతో సహా బాధితురాలు షేర్ చేయడంతో కారు యజమాని మీడియా ద్వారా స్పందించారు. దీంతో ఆయన ప్రకటన కీలకంగా మారింది.వాహనాన్నిఎవరు నడిపారనే దానిపై కారు యజమాని మనీష్ స్పష్టత ఇచ్చారు. కారు తనదేనని యజమాని అంగీకరించినప్పటికీ, ఈ ప్రమాద ఘటనలో తన పాత్ర ఏమీ లేదన్నారు. తాను ఆర్మీ ఉద్యోగినని, ప్రస్తుతం తాను విధి నిర్వహణలో భాగంగా అస్సాంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. తన స్నేహితుడు కళ్యాణ్ కారు నడిపినట్టు వెల్లడించారు. తన స్నేహితుడు తన కుటుంబం నుండి కారును తీసుకున్నాడని తెలిపారు.ఇదీ చదవండి: గురుగ్రామ్లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్మాట’!సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే తనకు ఈ ఘటన గురించి తెలిసిందని ఆయన చెప్పారు. తన స్నేహితుడు కళ్యాణ్ సింగ్ రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్లాలని చెప్పి కారును తీసుకున్నాడని పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలియగానే తాను తన స్నేహితుడికి ఫోన్ చేశానని, కానీ అతను ఫోన్ తీయలేదని మనీష్ చెప్పారు.. తన తండ్రిని, ఇతరులను కూడా అతని ఇంటికి పంపించానని, కళ్యాణ్ సింగ్ హర్యానాలోని పల్వాల్ జిల్లాకు చెందినవాడని కూడా కూడా చెప్పారు. కాగా 'మారుతి సుజుకి సియాజ్' (Maruti Suzuki Ciaz), దీని రిజిస్ట్రేషన్ నంబర్ HR30Y4949. ఇది హర్యానాలోని పల్వాల్ నివాసిమనీష్ పేరు మీద నమోదై ఉంది.
ఎన్ఆర్ఐ
ఫీనిక్స్లో ‘రాజా 50’ : వేలాది మందిని కట్టిపడేసిన ఇళయరాజా!
శంకర నేత్రాలయ సేవలపై అవగాహన కల్పించే లక్ష్యంతో అరిజోనాలోని ఫీనిక్స్ నగరంలో ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా, ‘రాజా 50’ పేరుతో ప్రత్యక్ష సంగీత కార్యక్రమంలో ఆహూతులను అలరించింది. దాదాపు మూడు గంటలపాటు ప్రేక్షకులను తన సంగీత ప్రపంచంలో విహరింపజేశారు. ఫీనిక్స్లో గతంలో ఎన్నో భారతీయ సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు జరిగినప్పటికీ, ఇంత భారీ స్థాయిలో లైవ్ సింఫనీ సంగీత బృందంతో జరిగిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించింది.దాదాపు 40 మంది సంగీత కళాకారులతో కూడిన బృందం ఇళయరాజాతో కలిసి వేదికను పంచుకుంది. ఒక్కో వాయిద్యం సంగీతంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇళయరాజా స్వయంగా వివరించడం ఈ కార్యక్రమాన్ని సాధారణ సంగీత కచేరీకి భిన్నంగా నిలిపింది.Arizona Financial Theatreలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 4వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు వివిధ భారతీయ భాషలు, ప్రాంతాలకు చెందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంగీతానికి భాషా సరిహద్దులు లేవని మరోసారి చాటింది.‘రాజా 50’ ఫీనిక్స్లో ఒక విజయవంతమైన సంగీత కార్యక్రమంగా మాత్రమే కాకుండా, శంకర నేత్రాలయ సేవలను 4,000 మందికి పైగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమైన అవగాహన వేదికగా నిలిచింది. ముఖ్యంగా MESU కార్యక్రమాన్ని పరిచయం చేయడం, దానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించడం ద్వారా సంగీత వేదికపై సేవా సందేశాన్ని కూడా వినిపించే అవకాశం లభించింది. ఇళయరాజా సంగీతం ప్రజలను ఒకచోట చేరిస్తే, ఆ అవకాశాన్ని శంకర నేత్రాలయ సేవలను మరింత మందికి పరిచయం చేయడానికి ఉపయోగించుకోవడం ఈ కార్యక్రమానికి మరో ప్రత్యేకతను ఇచ్చింది. సంగీతం, సమాజం, సేవ ఒకే చోట కలిసిన మరపురాని రాత్రిగా ‘రాజా 50’ నిలిచిపోయింది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు నేత్ర వైద్య సేవలను చేరువ చేయడంలో MESU చేస్తున్న సేవలను పరిచయం చేస్తూ, దానికి సంబంధించిన వీడియోలను కూడా వేదికపై ప్రదర్శించారు. సంగీతం కోసం వచ్చిన వేలాది మందికి శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలను చూపించగలగడం ఈ వేదికకు ప్రత్యేకమైన సామాజిక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.ఈ కార్యక్రమానికి ఫీనిక్స్లోని వివిధ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సంఘాలు, ఇతర భారతీయ సామాజిక సంస్థల ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు, స్పాన్సర్లు, వాలంటీర్లు తమ వంతు సహకారం అందించారు. భాషలు, ప్రాంతాలు వేరైనా ఒక మంచి కార్యక్రమం కోసం అందరూ కలిసి రావడం ఈ విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. నిర్వాహకులతో పాటు వివిధ సంఘాలు, స్పాన్సర్లు, వాలంటీర్లు, శంకర నేత్రాలయ శ్రేయోభిలాషులు, ఫీనిక్స్ భారతీయ సమాజం అందించిన సహకారం ఇందులో భాగమైంది.ఇంత పెద్ద కార్యక్రమం వెనుక ఆది మొర్రెడ్డి, అనిల్ భరద్వాజ్, విజయ్ రాజ్, చెన్నా రెడ్డి మద్దూరి, చిత్రప్రియ, సుబ్బు ఉప్పులూరి, జ్ఞాని మారుపాకుల, జెగ్గీ క్రిష్, డా. కార్తిక్ రెడ్డి దొనూర్, లక్ష్మి బొగ్గరపు, ప్రవీణ్ సామల, శరవ్ సుబ్రమణియన్, సచ్చిదానంద ప్రభు, సతీష్ పంచాక్షరం, సతి శివం, శ్యామ్ బైరా, శ్రీజిత్ శ్రీనివాసన్, గుప్తా, శ్రీని సుబ్రమణియన్, వంశీ కృష్ణ ఇరువారం, ధీరజ్ రెడ్డి పోల తమ వంతు బాధ్యతలను నిర్వర్తించారు.ఇళయరాజా సంగీత ప్రయాణానికి యాభై సంవత్సరాలు అనే సందర్భంలో జరిగిన ఈ కార్యక్రమం తరాలను కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఆయన పాటలను ఆస్వాదిస్తున్న తరం పక్కనే నేటి యువతరం కూడా అదే సంగీతాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించింది. వివిధ వయసులు, భాషలు, ప్రాంతాలకు చెందిన వేలాది మంది సంగీతంతో ఒక్కటయ్యారు.
అమెరికాలో ఏఐ కాలేజీకి ఎన్నారై దంపతుల పేరు
అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన దంపతులు విద్యారంగానికి భారీ విరాళం అందించారు. టెక్సాస్లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (UNT)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అడ్వాన్స్డ్ అనలిటిక్స్కు ప్రత్యేక కాలేజీ ఏర్పాటుకు ఏకంగా 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.167 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ భారీ విరాళం అందించిన అనురాధ, వికాస్ సిన్హా దంపతుల పేరుతోనే కొత్త కాలేజీకి ‘అనురాధ అండ్ వికాస్ సిన్హా కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్’ అని పేరు పెట్టనున్నారు.AI, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో విద్య, పరిశోధనలకు ఈ కాలేజీ కేంద్రంగా పనిచేయనుంది. AI, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, లైబ్రరీ సైన్స్, లెర్నింగ్ టెక్నాలజీస్ వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి ఈ కాలేజీ ఉపయోగపడుతుందని వర్సిటీ అధ్యక్షుడు హారిసన్ కెల్లర్ తెలిపారు.ఈ విరాళంతో కాలేజీ నాయకత్వం, విద్యార్థుల స్కాలర్షిప్లు, ప్రొఫెసర్షిప్లు, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇంక్యుబేషన్, అధునాతన పరిశోధనలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు మద్దతుగా ఆరు శాశ్వత ఎండోమెంట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే *అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్*ను కూడా ఈ కాలేజీలో ఏర్పాటు చేస్తారు. ఇది వర్సిటీలోని వివిధ విభాగాల మధ్య AI, డేటా సైన్స్ పరిశోధనలకు సమన్వయం చేస్తూ పరిశ్రమలతో భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనుంది.చదువు కోసం అమెరికాకు.. ఇప్పుడు భారీ విరాళంవికాస్, అనురాధ ఇద్దరూ భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఉత్తరప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేసిన అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీలు పొందారు. వికాస్ సిన్హా నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీలోనూ చదివి, 2023లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచే పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన బ్రాడ్కామ్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు.సిన్హా దంపతులు ఇప్పటికే UNTకు పలు సందర్భాల్లో భారీగా అండగా నిలిచారు. 2024లో వారు అందించిన విరాళంతో అనురాధ అండ్ వికాస్ సిన్హా డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, అధ్యాపకులు, పరిశోధనలకు మద్దతుగా ఎండోమెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడాదికే మరో భారీ విరాళంతో సిన్హా ఇన్నోవేషన్ ల్యాబ్ ఫర్ డేటా సైన్స్ను ఏర్పాటు చేశారు.“మాకు ఈ విరాళం అంటే అవకాశాన్ని మరో తరానికి అందించడం. వలస వచ్చినవారు అమెరికన్ డ్రీమ్లో కేవలం భాగస్వాములు మాత్రమే కాదు.. దాన్ని నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. విద్య మా జీవితాల్లో ఎన్నో తలుపులు తెరిచింది. ఇప్పుడు ఆ తలుపులు మరికొందరికి తెరిచి ఉంచాలనుకుంటున్నాం” అని వికాస్ సిన్హా తెలిపారు.AI, డేటా ఆధారంగా భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న నేపథ్యంలో.. కొత్త తరం విద్యార్థులను అందుకు సిద్ధం చేయడం, పరిశోధనలను ప్రోత్సహించడం, పరిశ్రమలతో అనుసంధానం పెంచడం ఈ కొత్త కాలేజీ ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి.(చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!)
వైఎస్సార్ చెస్ టోర్నమెంట్లో విజేతగా శిబి శ్రీనివాస్ చెమికల
మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ జర్మనీ విభాగం కన్వీనర్ కృష్ణ తేజా రెడ్డి గడ్డం ఆధ్వర్యంలో మ్యూనిక్ నగరంలో వైఎస్సార్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో విజేతగా నిలిచిన డార్మ్ స్టడ్ అప్లయిడ్ సైన్సెస్ యూనివర్సిటీ విద్యార్ధి శిబి శ్రీనివాస్ చెమికలకు వైఎస్సార్ సీపీ ఐటీ విభాగ కోర్డినేటర్ విష్ణు వర్ధన్ రెడ్డి మార్తల ట్రోఫీని అందజేశారు. జర్మనీ వైఎస్సార్ సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయి సూర్య చౌదరి నేలకుర్తి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.(చదవండి: జర్మనీలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి)
కువైట్లో భారీ డీజిల్ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్!
కువైట్ సిటీ: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన వాహనాల నుంచి డీజిల్ దొంగిలించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం పట్టుకుంది. ఈ కేసులో ఓ కువైట్ పౌరుడితో పాటు భారతీయులు సహా 40 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న కొందరు బస్సులు, లారీలను ‘అంగర్’ ప్రాంతంలోని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి డీజిల్ చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇలా సేకరించిన డీజిల్ను ఇతర ట్యాంకర్లలోకి తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ అక్రమ దందా కోసం ట్యాంకర్లను నెలకు 1,600 కువైటీ దినార్లకు అద్దెకు ఇచ్చింది అరెస్టైన కువైట్ పౌరుడేనని విచారణలో తేలింది. చాలాకాలంగా నిఘా పెట్టిన అధికారులు డీజిల్ చోరీ చేస్తున్న సమయంలో ప్రధాన నిందితులను పట్టుకున్నారు. అనంతరం దొంగిలించిన డీజిల్ కొనుగోలు చేసేందుకు వచ్చిన మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.అయితే, డీజిల్ దొంగతనం, విక్రయం, కొనుగోలులో భాగమైన మొత్తం 41 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ముఠా ఉపయోగించిన 38 ట్రక్కులు, బస్సులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలు, ఆర్థిక నష్టాన్ని అరికట్టడంలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇవీ చదవండి: లెబనాన్పై విరుచుకపడ్డ ఇజ్రాయెల్.. 11 మంది మృతి
క్రైమ్
గురుగ్రామ్లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్మాట’!
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్ఫ్లుయెన్సర్, మహిళా బైకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించి, వెంటాడి, వేధించి కారుతో ఢికొట్టి పరారైన ఘటన కలకలం రేపింది. గురుగ్రామ్ రోడ్లపై తన కెదురైప భయానక అనుభవాన్ని సోషల్ మీడియా షేర్ చేయడంతో ఇది వైరల్గా మారింది. 'rebelwheels_sia_' అనే ఇన్స్టాగ్రామ్ పేజీని నిర్వహిస్తున్న సియా అనే మహిళ, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆన్లైన్లో షేర్ చేసి, తన ఆవేదనను వివరించారు.మరోవైపు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి కావడంతో మండిపడుతున్నారు. జాతీయ రాజధానికి సమీపంలో హర్యానాలోని 'మిలీనియం సిటీ' గురుగ్రామ్ రోడ్లపై, ఇన్స్టాగ్రామ్లోని మీమ్స్లో చెప్పినట్లుగా, కొంతకాలంగా "అయితే నా మాటే లేదంటే థార్ మాటే చెల్లుతుంది" అన్నట్లుగా ఉందీ అంటున్నారు నెటిజన్లు. నిన్న పార్కింగ్ సిబ్బంది అనుచితం ప్రవర్తనతో 1999 కార్గిల్ యుద్ధ వీరుడు, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ అమిత్ కుమార్ గుప్తా చేదు అనుభవం ఎదురైంది. పోలీసు ఫిర్యాదు ప్రకారం, ఆకాశహర్మ్యాల మధ్య ఉన్న ఒక రెస్టారెంట్కు కుటుంబంతో కలిసి డిన్నర్ వెళ్లారు. ఈయన సమయంలో భారత వైమానిక దళం యొక్క ఆపరేషన్ సఫేద్ సాగర్ బృందంలో భాగంగా ఉన్నారు.అతను తన కుటుంబాన్ని దింపి, స్వయంగా కారు పార్క్ చేస్తున్న సందర్భంలో వివాదం చోటు చేసుకుంది. పార్కింగ్ సిబ్బంది అతన్ని వాలెట్ స్టాండ్ నుండి ఒక బేస్మెంట్కు, ఆపై బహుళ అంతస్తుల పార్కింగ్ స్థలానికి పంపారు. తీరా అక్కడ కారును అసలు పార్క్ చేయడానికి నిరాకరించారు. దీంతో అతను కారును రివర్స్ చే స్తుండగా అక్కడి సిబ్బంది ఒకడు విండ్షీల్డ్ను పగలగొట్టడంతోపాటు, అతన్ని ఇనుప రాడ్తో కొట్టి చంపేస్తానని బెదిరించాడు.భద్రతా సిబ్బంది ఎవరూ జోక్యం చేసుకోలేదని, పోలీసు బృందం తన వద్దకు చేరుకోవడానికి అరగంటకు పైగా పట్టిందని గుప్తా ఆరోపించారు. పార్కింగ్ ఏర్పాటు చేయడానికి జీతం తీసుకునే భద్రతా సిబ్బంది కాకుండా, ఒక రెస్టారెంట్ చెఫ్ చివరకు జోక్యం చేసుకున్నారని అతను చెప్పాడు. దీంతో మోచేయి విరగడంతో పాటు, ప్రమాదం నుండి బయటపడటానికి తలకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.ఇక రెండో ఘటనలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లో సియా తెలిపిన వివరాల ప్రకారం, గురుగ్రామ్లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆమె తన బైకింగ్ గ్రూప్ సభ్యులతో కలిసి అప్రిలియా ఆర్ఎస్ 457 (Aprilia RS 457) స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.తన రైడ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఒక కారులోని వ్యక్తులు తనను వెంబడించడానికి ప్రయత్నించారు. పలుమార్లు బైక్కు దగ్గరగా, అడ్డుగా రావడం వంటి దూకుడు చేష్టలతో వేధింంచారు. దీంతో విసుగొచ్చిన ఆమె తన బైక్కు డిస్టెన్స్పాటించాలని కోరింది. దీంతో మద్యం సేవించి ఉన్న కారులోని వ్యక్తులు మరింత రెచ్చిపోయారు. బైక్ ఆపాలని బెదిరింపులు పాల్పడ్డారు. వెంబడించి తన బైక్ను ఢీకొట్టి అక్కడి నుంచి ఉడాయించరాఉ. ఆ ధాటికి ఆమె బైక్ పైనుంచి ఎగిరిపడింది. దీంతో రోడ్డుపై కొన్ని మీటర్ల దూరం ఆమెను ఈడ్చుకెళ్లింది..ఈ ఘటన మొత్తం సియా మోటార్సైకిల్పైఅమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డైంది.You got to book this car driver under “hit and run” case @gurgaonpolice. Bring them to justice. Car No: HR 30Y 4949📹: IG/rebelwheels_sia_ pic.twitter.com/KngHxTZ5ke— Yo Yo Funny Singh (@moronhumor) September 14, 2026నెటిజన్ల ఆగ్రహం - చర్యలకు డిమాండ్ఈ రెండు ఘటనలపై సోషల్ మీడియా వినియోగదారులు మండిపడ్డతున్నారు. నగరంలో రోడ్డు భద్రత, ర్యాష్ డ్రైవింగ్ తీరుపై కొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ పోలీసులు, గురుగ్రామ్ పోలీసులు, గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు, హర్యానా పోలీసులను ట్యాగ్ చేస్తూ బాధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మహిళా డ్రైవర్ ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేశారు.
ఆ మిస్టరీ వీడకుండానే.. రియా భర్త కన్నుమూత
భార్యను అతిదారుణంగా హత్య చేసి.. ఆమె తలను భర్త ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన కేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించిన ఆ భర్త.. తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని మీడియా ముందే ప్రకటించుకున్నాడు. అంతేకాదు బయటకు వచ్చాక మరో హత్య చేస్తానంటూ పోలీస్ స్టేషన్ బయటే చెప్పాడు. చివరకు పోలీస్ కస్టడీలో ఉండగానే అతని ప్రాణం పోయింది!.అస్సాం రాజధాని గువాహటిలో సంచలనం సృష్టించిన రియా తాలుక్దార్ (25) హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు, ఆమె భర్త రమానుజ్ గోస్వామి పోలీసు వాహనం నుంచి దూకి మృతిచెందాడు. సోమవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల రమానుజ్ను వైద్య పరీక్షల అనంతరం సోమవారం తెల్లవారుజామున హటిగావ్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నరకాసుర్ పహార్ ప్రాంతం వద్ద పోలీసులపై ఒక్కసారిగా దాడికి ప్రయత్నించిన అతడు.. కదులుతున్న వాహనం నుంచి కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి లోయలో పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు అతడిని గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH)కు తరలించగా.. వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.అతనిది పారిపోయే ప్రయత్నమా? లేదంటే కావాలనే దూకి చావాలనుకున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే రియా కేసులో కొన్ని ప్రశ్నలకు అతని నుంచి పోలీసులు సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. దీంతో ఈ కేసు ఇంకా క్లిష్టతరంగా మారే అవకాశం కనిపిస్తోంది.అసలు కేసులో ఏం జరిగింది?గువాహటి సమీపంలోని హటిగావ్-బసిస్థాపూర్ ప్రాంతంలో రమానుజ్, అతడి భార్య రియా తాలుక్దార్ (25) నివసిస్తున్నారు. దాదాపు ఆరు నెలల క్రితమే వీరికి వివాహమైంది. అయితే భార్యపై అనుమానంతో రమానుజ్ తరచూ గొడవపడేవాడని తెలుస్తోంది. సెప్టెంబర్ 3న జరిగిన గొడవలో రియాపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఆమె తలను, వేళ్లను వేరు చేసి నల్లటి పాలిథిన్ సంచిలో చుట్టి ఫ్రిడ్జ్లో దాచాడు.దుర్వాసనతో వెలుగులోకి..సెప్టెంబర్ 6న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రియా మృతదేహం కనిపించింది. అయితే తల కనిపించలేదు. ఫ్రిడ్జ్ను తనిఖీ చేయగా పాలిథిన్ సంచిలో ఆమె తలను గుర్తించారు. ఘటన తర్వాత ఇంట్లో రమానుజ్ కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. చివరకు అతడు పోలీసుల ఎదుట లొంగిపోయి.. భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న రక్తపు మరకలున్న కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు.‘షుగర్ డాడీ’ ఎవరు?ఈ కేసులో మరో సంచలన అంశం రమానుజ్ చేసిన వ్యాఖ్యలు. సెప్టెంబర్ 8న పోలీసులు అతడిని ఘటనాస్థలికి తీసుకెళ్లిన సమయంలో మీడియాతో మాట్లాడిన రమానుజ్.. భార్యను చంపినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అన్నాడు. అంతేకాదు.. తన భార్య క్యారెక్టర్ అస్సలు మంచిది కాదని.. జైలు శిక్ష పూర్తయ్యాక బయటకు వచ్చి ఆ ‘షుగర్ డాడీ’ని చంపుతానంటూ హెచ్చరించాడు. ఆ వ్యక్తి ఎవరని మీడియా ప్రశ్నించగా అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో రియాకు నిజంగా ఎవరితోనైనా సంబంధం ఉందా? ‘షుగర్ డాడీ’గా అతడు ఎవరిని ఉద్దేశించాడు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ కస్టడీలో నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేసినా.. అతను నిన్నటిదాకా నోరు విప్పలేదని తెలుస్తోంది.మత్తులోనే హత్య చేసి..అనుమానంతో విచారణలో రమానుజ్.. హత్య జరిగిన సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నట్లు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఖాళీ మద్యం సీసాలు కూడా లభించాయి. రియా కుటుంబ సభ్యులు మాత్రం రమానుజ్కు డ్రగ్స్ అలవాటు, గతంలో ఆర్థిక మోసం కేసులో అరెస్టు వంటి ఆరోపణలు చేశారు. వీటిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రమానుజ్పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని హత్యకు సంబంధించిన సెక్షన్ 103(1), ఆధారాలను మాయం చేయడానికి సంబంధించిన సెక్షన్ 238 కింద కేసు నమోదు చేశారు. అతడికి ఏడు రోజుల పోలీసు కస్టడీ కూడా లభించింది. అయితే విచారణ పూర్తికాకముందే పోలీసు వాహనం నుంచి దూకడంతో ఈ కేసులో కీలక ప్రశ్నలకు సమాధానాలు మిగిలిపోయాయి.ఇదీ చదవండి: దుబాయ్ ఫ్లైట్ ఎక్కాల్సినోడు.. పాడెక్కాడు!
కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం
కరీంనగర్: ‘కన్నకొడుకే మమ్మల్ని ఇంట్లోంచి వెళ్లిపొ మ్మంటున్నాడు.. ఇల్లు అమ్మేస్తానంటున్నాడు.. ఈ వయసులో మేమెక్కడికి వెళ్లాలి.. భార్య హార్ట్ పేషెంట్.. మాకు న్యాయం చేయండి’ అంటూ వృద్ధ దంపతులు దేవులపల్లి లక్ష్మణ్– జయలక్ష్మి శనివారం తమ ఇంటి ఎదుట బైఠాయించారు. ఈ ఘటన శనివారం కరీంనగర్ కోతిరాంపూర్లో చోటుచేసు కుంది. జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన లక్ష్మణ్ 2010లో ఉద్యోగవిరమణ పొందాడు. ఆయనకు కుమారుడు రవికుమార్, ఓ కుమార్తె ఉన్నారు. రవికుమార్ హైదరాబాద్లో ఏరోస్పేస్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు నెలకు 8 లక్షల జీతం. కోతిరాంపూర్లో 2002లో లక్ష్మణ్ నిర్మించుకున్న ఇంటిని రవికుమార్ తనపేరున గిఫ్ట్డీడ్ చేసుకున్నాడు. 2023 నుంచి ఇల్లు విక్రయిస్తానని, ఖాళీ చేయాలని కుమారుడు చెబుతు న్నాడని దంపతులు ఆరోపించారు. ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయం తప్ప తమకు మరో ఆధారం లేదని వారు వాపోయారు. తమకు ఆధారంగా ఉన్న ఇంటిపై చేసిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి, న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ఇంటి ఎదుట బైఠాయించిన వృద్ధదంపతులు
రైలు కిందపడి తండ్రి,కొడుకు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులు.. కేసు ట్రయల్కు రావడంతో తమకు ఎలాగైనా శిక్ష తప్పదని భావించారు. ఈ క్రమంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిశెలపేటకు చెందిన దొంత మల్లేశ్ (52), అతని కుమారుడు నాగరాజు (32) ఇద్దరూ కలిసి 2024లో జయశంకర్ భూపాలపల్లిలో వీఆర్వోగా పనిచేసిన గుల్లకోట గ్రామానికి చెందిన మల్లేశ్ తోడళ్లుడు రమేశ్ను హత్యచేశారు. ఈ కేసులో ఇద్దరూ భూపాలపల్లి జైలుకు వెళ్లారు. భర్త, కుమారుడు జైలుకు వెళ్లడంతో మల్లేశ్ భార్య సువర్ణ అనారోగ్యానికి గురై అదే ఏడాది మృతి చెందింది. జైలు నుంచి బయటకు వచ్చిన తండ్రీ కొడుకులను ఎవరూ ఆదరించడం లేదు. దీంతో కొద్దిరోజులుగా వారు హైదరాబాద్లోని ఓ హోటల్లో పనిచేసుకుంటున్నారు. మరోవైపు హత్యకేసు ట్రయల్కు వచ్చింది. తమకు ఎలాగైనా శిక్ష పడుతుందని భావించిన తండ్రీ కొడుకులు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో నివాసముంటున్న మల్లేశ్ సోదరుడు శ్రీనివాస్ ఇంటికి శుక్రవారం వచ్చారు. శనివారం ఇంటి నుంచి బయలుదేరిన వారు ఆదివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ సమీపంలో కేరళ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని జీఆర్పీ ఎస్సై తెలిపారు.
వీడియోలు
ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు
పండుగ రోజు గుడ్ న్యూస్ క్రీడాకారులకు జగన్ అభినందనలు
దుబాయ్ కి జంప్.? బయటపడ్డ NANDUS WORLD సీక్రెట్ స్కెచ్..!
ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి రైతుల జీవితాలతో చెలగాటం
కావాలని మహిళా బైకర్ ను ఢీ కొట్టిన కారు వైరల్ అవుతున్న వీడియో
యూపీలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
అర్థరాత్రి పోలీస్ స్టేషన్ లోనే తన్నుకున్న TDP తమ్ముళ్లు
3లక్షల అమెరికన్ డైమండ్స్ తో గణపతి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే
రఘు మాస్టర్ ని కలిశా నన్నే అన్ని చూసుకోమన్నారు
గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

