'నా శవాన్ని కూడా నా భార్య తాకడానికి వీల్లేదు'
''నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని కూడా నా భార్య తాకడానికి వీల్లేదు. అంత్యక్రియల కోసం అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయకండి. నా ఆత్మశాంతి కోసం ఎలాంటి మతపరమైన క్రతువులు నిర్వహించవద్దు. ఎందుకంటే నా ఆత్మ శాంతించ ఉండకూడదు. మా అమ్మను జాగ్రత్తగా చూసుకోండి''- అని వాట్సాప్ మెసేస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడో బాడీబిల్డర్.ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలో డిగ్రీ కళాశాలలో క్లర్క్గా పనిచేస్తున్న 52 ఏళ్ల బాడీబిల్డర్ దేవదత్ శర్మ అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన ఇంట్లో తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సర్సావా పోలీస్ స్టేషన్ (Sarsawa police station) పరిధిలోని సలేంపూర్ గ్రామంలో నివసిస్తున్న దేవదత్ శర్మ శనివారం సాయంత్రం తన ఇంటి వెనుక నిర్వహిస్తున్న "రాక్ జిమ్" నుంచి ఇంటికి వచ్చారు. సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తుపాకీ కాల్పుల శబ్దం విని ఆయన భార్య సీమా రాణి అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో దేవదత్ను సమీప వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు దేవదత్ శర్మ తన మేనకోడలికి పంపిన వాట్సాప్ సందేశాన్ని కీలక ఆధారంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు, పొరుగువారిని విచారించారు. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా భావిస్తున్నట్లు సర్కిల్ ఆఫీసర్ పవన్ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దేవదత్ భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించనున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, డిజిటల్ ఆధారాలు, వాట్సాప్ సందేశాన్ని పరిశీలించిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కుమార్ చెప్పారు.మేనకోడలికి చివరి సందేశంమరణానికి ముందు దేవదత్ శర్మ తన 21 ఏళ్ల మేనకోడలు నేహా శర్మకు వాట్సాప్లో సుదీర్ఘ సందేశం పంపినట్లు పోలీసులు తెలిపారు. అందులో తాను ఎదుర్కొంటున్న అవమానాలను ఇక భరించలేకపోతున్నానని పేర్కొన్నట్లు సమాచారం. ప్రతిరోజూ అవమానాలతో జీవించడం కంటే ఒక్కసారిగా మరణించడం మేలని భావించానని, అయితే తాను పిరికివాడిని కాదని సందేశంలో రాసినట్లు తెలుస్తోంది.తన మరణానంతరం తన భార్య తన మృతదేహాన్ని తాకవద్దని కోరినట్లు సమాచారం. అంత్యక్రియల కోసం ఎక్కువ ఖర్చు చేయవద్దని, పిడకలు (ఆవుపేడతో చేసిన ఇంధనం) ఉపయోగించవద్దని కూడా సూచించినట్లు తెలుస్తోంది. తన ఆత్మశాంతి కోసం ఎలాంటి మతపరమైన క్రతువులు నిర్వహించవద్దని, తన ఆత్మ ప్రశాంతంగా ఉండకూడదని కూడా సందేశంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. చివరగా తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని మేనకోడలిని కోరినట్లు సమాచారం. ఈ సందేశం ప్రామాణికతను పోలీసులు పరిశీలిస్తున్నారు.రెండు దశాబ్దాలుగా జిమ్ నిర్వహణదేవదత్ శర్మ 2000 సంవత్సరం నుంచి తన ఇంటి వెనుక "రాక్ జిమ్" పేరుతో వ్యాయామశాలను నిర్వహిస్తున్నారు. స్థానికంగా బాడీబిల్డర్గా కూడా మంచి గుర్తింపు పొందారు. గత రెండేళ్లుగా బాలాజీ గ్రూప్ ఆఫ్ కాలేజీలో క్లర్క్గా పనిచేస్తున్నారు. అంతకుముందు తిలక్ రామ్ సైనీ గర్ల్స్ కాలేజ్, ఎలం చంద్ సైనీ గర్ల్స్ కాలేజీల్లో కూడా పనిచేశారు.కుటుంబ నేపథ్యందేవదత్ శర్మకు సీమా రాణితో 33 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అభిషేక్ దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు ఆదిత్య చండీగఢ్లో ఫోరెన్సిక్ సైన్స్ చదువుతున్నాడు. దేవదత్ శర్మకు ఒక సోదరి ఉంది. ఆమె కుమార్తె నేహా శర్మకే ఆయన చివరి వాట్సాప్ సందేశం పంపినట్లు తెలిసింది.(ఆత్మహత్య ఎన్నటికీ పరిష్కారం కాదు. మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోండి. మీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు వస్తే, దయచేసి ‘దిశా’ హెల్ప్లైన్కు కాల్ చేయండి. టోల్-ఫ్రీ హెల్ప్లైన్ నంబర్లు: 1056, 0471-2552056)
కోహ్లీ-గంభీర్ గొడవపై మాజీ అంపైర్ సంచలన వ్యాఖ్యలు
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య 2013 ఐపీఎల్లో జరిగిన వివాదం మరోసారి చర్చకు వచ్చింది. ఈ ఘటనపై మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న కోహ్లీ ఔటైన తర్వాత, అప్పటి కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గంభీర్ తన సహచరులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఆ సమయంలో కోహ్లీ-గంభీర్ మధ్య మాటల యుద్ధం మొదలై, చివరకు తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. రజత్ భాటియా ఇద్దరినీ విడదీశాడు.‘ఏదో జరుగుతుందని తెలుసు’జియోస్టార్ ‘చీకీ సింగిల్స్’ కార్యక్రమంలో అనిల్ చౌదరి ఆ ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఉత్తర భారత క్రికెటర్లలో సహజంగానే దూకుడు ఎక్కువగా ఉంటుందని, అలాంటి దూకుడు ఆటలో అవసరమేనని చౌదరి చెప్పాడు. అయితే ఆ దూకుడు హద్దు దాటకూడదని స్పష్టం చేశాడు.‘కోహ్లీకి ఎలాంటి దురుద్దేశం ఉండదు’కోహ్లీని చిన్నప్పటి నుంచే తాను చూస్తున్నానని చౌదరి తెలిపాడు. కోహ్లీకి ఎలాంటి దురుద్దేశం ఉండదని, అయితే కొన్నిసార్లు అతని స్పందన చాలా దూకుడుగా ఉంటుందని అన్నాడు.అంపైర్ నిర్ణయం సరైనదని అనిపిస్తే కోహ్లీ అభినందిస్తాడని, ఓవర్ల మధ్యలో వచ్చి సరదాగా మాట్లాడే స్వభావం కూడా అతనికి ఉందని చౌదరి పేర్కొన్నాడు. ఇలాంటి ఉత్సాహభరితమైన ఆటగాళ్లు ఉండటం వల్లే క్రికెట్కు ప్రత్యేకమైన ఉత్సాహం వస్తుందని చెప్పాడు.పదేళ్ల తర్వాత మళ్లీ వివాదం2013 ఘటన తర్వాత 2023 ఐపీఎల్లో కోహ్లీ, గంభీర్ మరోసారి తీవ్ర వాగ్వాదానికి దిగారు. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ అనంతరం కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య వివాదం మొదలై, అనంతరం గంభీర్తోనూ మాటల యుద్ధానికి దారితీసింది.ప్రస్తుతం గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్గా, కోహ్లీ వన్డే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న నేపథ్యంలో, 2013 నాటి ఘటనపై అంపైర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.
తమ్ముడి కోసం ఎవరూ చేయలేని త్యాగం చేసిన అన్న
కాన్పూర్: ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన కవల సోదరులు మహరూఫ్ అహ్మద్ ఖాన్, మస్రూర్ అహ్మద్ ఖాన్ తమ అనుబంధంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్లో అద్భుతమైన ర్యాంకులు సాధించినప్పటికీ వేర్వేరు ఐఐటీల్లో చేరకుండా కలిసి చదువుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు.వైద్య దంపతుల కుమారులైన 18 ఏళ్ల మహరూఫ్, మస్రూర్లు జేఈఈ అడ్వాన్స్డ్లో వరుసగా 32, 169 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు. మహరూఫ్కు ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చినప్పటికీ, తన సోదరుడు అదే కోర్సులో అక్కడ సీటు పొందకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. ఇద్దరికీ కంప్యూటర్ సైన్స్లో ప్రవేశం లభించిన ఐఐటీ కాన్పూర్లో కలిసి బీటెక్ చదవాలని నిర్ణయించారు.ఐఐటీ కాన్పూర్ ఓరియంటేషన్ సందర్భంగా మహరూఫ్ మాట్లాడుతూ.. నా సోదరుడి కోసం ఐఐటీ బాంబేను వదులుకుని రావడంపై నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అతనికంటే నాకు ముఖ్యమైనది ఏదీ లేదు అని తెలిపాడు.ఈ కవలలు జేఈఈ సన్నాహకానికి రాజస్థాన్లోని కోటాలో మూడేళ్లు కలిసి శిక్షణ పొందారు. జూలై 21న ఐఐటీ కాన్పూర్లో చేరిన వీరిద్దరూ, ఇకపై కూడా ఒకరికొకరు అండగా ఉంటూ చదువులో ముందుకు సాగాలని సంకల్పించారు. అన్న చేసిన ఈ త్యాగాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పటిలాగే ఒకరికొకరం తోడుగా ఉంటాం అని మస్రూర్ పేర్కొన్నాడు.మొదట కళాశాల యాజమాన్యం వీరికి ఒకే హాస్టల్లో వేర్వేరు గదులు కేటాయించింది. అయితే అధికారులను కోరడంతో హాల్ ఆఫ్ రెసిడెన్స్–13లోని B103 గదిని ఇద్దరికీ కేటాయించారు.వారి విజయంలో తల్లి డాక్టర్ జీనత్ బేగం కీలక పాత్ర పోషించారు. కుమారులు కోటాలో కోచింగ్ తీసుకునే సమయంలో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి వారితో కలిసి అక్కడే ఉండి చదువుకు పూర్తి సహకారం అందించారు. తండ్రి డాక్టర్ మన్సూర్ అహ్మద్ ఖాన్ ఉద్యోగరీత్యా ఒడిశాలోనే ఉంటూ తరచూ కుటుంబాన్ని సందర్శించేవారు.తన కుమారులు ఒకే కాలేజీలో ఇప్పుడు ఒకే గదిలో కలిసి ఉండడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ జీనత్ బేగం తెలిపారు. ఇక చిన్నప్పటి నుంచే ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనదని మహరూఫ్ గుర్తు చేసుకుంటూ..ఐదో తరగతిలో జ్వరంతో బాధపడుతున్న మస్రూర్ స్థానంలో తాను కరాటే ప్రదర్శనలో పాల్గొన్న సంఘటనను స్మరించుకున్నాడు.
పౌర స్వేచ్ఛలో తేడాలెందుకు?
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక దేశాల మధ్య పౌర స్వేచ్ఛలకు సంబంధించి ముఖ్యమైన తేడా ఒకటుంది. ఆ తేడా ప్రభావాలు అనేక విధాలుగా కనిపిస్తున్నాయి. గతంలో, వర్తమానంలోనే కాదు, మునుముందు కూడా కనిపించగల అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కనుక ఆ తేడాను, అందుకు కారణాలను అర్థం చేసుకునేందుకు ఒక ప్రాథమికమైన ప్రయత్నం అవసరం. ప్రతి దేశానికి అంతర్గత విధానాలు సరేసరి కాగా, విదేశాంగ విధానం ఒకటి ఉంటుంది. అది దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందుతుందనేది తెలిసిందే. అట్లా అనుగుణం అని తాము భావించే విధంగా విదేశాంగ విధానాన్ని ప్రభుత్వాలు రూపొందిస్తాయి. అనగా ఆ సమయంలో అధికారంలో ఉండే పార్టీలు. ఆ విధానాలలో కొన్ని స్థిరంగా ఉంటాయి. కొన్ని పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కానీ సదరు విధానం, లేదా విధానాలు దేశ ప్రయోజనాలకు అనుగుణమైనవి కావనీ, నష్టం కూడా కలిగించవచ్చుననీ ప్రతిపక్షాలో, మీడియానో, మేధావులో భావించినట్లయితే, ఆ విధానాలను నిష్కర్షగా విమర్శించే పౌర స్వేచ్ఛలు ఎంతవరకు ఉంటున్నాయి? ఆ స్వేచ్ఛలలో తేడాలెందుకు?నచ్చనిది ముఖం మీదే...ఈ ప్రశ్న విదేశాంగ విధానాల గురించి ఇతరత్రా రావటం సరేసరి కాగా, యుద్ధ సందర్భాలలో మరింత తీవ్రంగా తలెత్తుతుంది. యుద్ధమన్నది మహా సున్నితమైన విషయం, భావోద్వేగాలతో కూడా ముడిపడి ఉండేది గనుక. అటువంటి సందర్భాలలో ప్రభుత్వాలు ఒక విధానాన్ని అనుసరిస్తున్నపుడు, ఆ విధానం దేశ ప్రజలకు అవసరమని చెప్తున్నపుడు, ఆ యుద్ధం వల్ల అటువంటి ప్రయోజనాలేవీ లేవని భావించేవారు విభేదించి మాట్టాడవచ్చునా? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజ్యాంగ భావ ప్రకటనా స్వేచ్ఛను, లేదా పౌర స్వేచ్ఛను ఇస్తున్నపుడు, అటువంటి అవకాశం కాగితం పైన ఉన్నా ఆచరణలో ఎంతవరకు లభిస్తున్నది? ఇపుడు నిర్దిష్టమైన ఉదాహరణలను చెప్పుకుంటే విషయం ఇంకా బోధపడుతుంది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై పాలస్తీనాపై యుద్ధాలు సాగిస్తున్నాయి. అవి ఆ రెండు దేశాల ప్రయెజనాలకు అవసరమని చెప్తున్నాయి. కానీ ఆ వాదనతో విభేదించే అమెరికన్, ఇజ్రాయెల్ పౌర సమాజాలు, మీడియా, మేధావి వర్గాలు, రిటైరయిన సైన్యాధికారులు పెద్ద సంఖ్యలోనే తమ ప్రభుత్వ విధానాలను కేవలం నర్మగర్భంగా గాక, ప్రత్యక్షంగా, తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎప్పటికప్పుడు జరిగే ప్రజాభిప్రాయ సేకరణలలో ప్రభుత్వ విధానాలకు ఆమోదం నానాటికి తగ్గిపోతున్నది. అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలలోనూ పౌర స్వేచ్ఛలు ఈ విధంగా ప్రజాస్వామికంగా, నిర్భయమైన రీతిలో వ్యక్తమవుతున్నాయి. ఆ విధానాలు దేశ ప్రయోజనాలకు ఏ విధంగా భంగకరమో వారు వివరించి చెప్తున్నారు. ఇంకా అనాలంటే చెప్పగలుగుతున్నారు. వాస్తవానికి అమెరికా, యూరప్లలో ఈ ప్రజాస్వామిక స్వేచ్ఛలు మొదటి నుంచి ఉన్నాయి. మనవరకు చూస్తే వియత్నాం యుద్ధకాలం నుంచే కనిపిస్తున్నాయి. దేశద్రోహం పేరిట...ఇటువంటి పౌర స్వేచ్ఛలు భారతదేశం మొదలైన ప్రజాస్వామిక వ్యవస్థలలో ఉన్నాయా? ఉంటే ఎంతవరకు? ఇది ఇండియాకే కాదు, ఇటువంటి వర్ధమాన దేశాలు అన్నింటికి సంబంధించినది. ప్రస్తుత మధ్య ఆసియా యుద్ధాలనే చూద్దాము. అక్కడ ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా, గల్ఫ్ రాజ్యాల కోణం ఒకటున్నది. అది గాక ఇజ్రాయెల్– పాలస్తీనా– అమెరికా కోణం మరొకటి. రెండూ దుర్మార్గమైన యుద్ధాలే అయినా, మొదటి దానికి సంబంధించి భారత ప్రభుత్వం గల్ఫ్ నుంచి ఇంధనం, ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న భారతీయుల సంక్షేమం అనే అంశాలను పేర్కొంటున్నందున ఆ మేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ రెండవది?ఇజ్రాయెల్తో సంబంధాల సాధారణీకరణ గతంలోనే జరిగినా, ఇపుడు గాజా హత్యాకాండతో సమస్య తీవ్ర రూపం తీసుకుంది. అటువంటపుడు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ దారుణాన్ని ఖండించకపోవటమే గాక, ఇక్కడి నుంచి ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరాలను సైతం అనుమతిస్తున్నది. ఐక్యరాజ్య సమితిలో ద్వంద్వ ధోరణి చూపుతున్నది. ఇందుకు గల కారణాలలో ఇజ్రాయెల్ ప్రభుత్వపు ఇస్లాం వ్యతిరేకతతో ప్రస్తుత భారత ప్రభుత్వానికి గల ఏకీభావం కూడా ఒకటనే అభిప్రాయం ఉంది. ఇజ్రాయెల్లోని అరబ్బులను అక్కడి ప్రభుత్వం హతమార్చకుండానే ఒక పద్ధతి ప్రకారం ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చుతున్నట్లు, దానితో ప్రేరణ చెందిన ఇక్కడి ప్రభుత్వం కూడా అదే మార్గంలో ఉందనే సందేహాలున్నాయి. ప్రశ్న ఏమంటే, ఇటువంటి అంచనాలను, విమర్శలను వ్యక్తీకరించేందుకు భారత దేశంలో గల పౌర స్వేచ్ఛ ఎంత? ఇది ఒక వర్తమానపు ఉదాహరణ మాత్రమే. గతంలోకి వెళితే అనేకం ఉన్నాయి. ఉదారవాద ప్రజాస్వామిక పార్టీ అనుకునే కాంగ్రెస్ పరిపాలనలో కూడా, అదేవిధంగా, పైన అనుకున్నట్లు ఇది ఇండియాలోనే గాక, వర్ధమాన దేశాలన్నిటా కనిపిస్తున్న పరిస్థితి. అందువల్ల ఈ చర్చ భారత దేశానికి పరిమితమైనది కాదు. స్థూలంగా చెప్పుకోవాలంటే, పౌర స్వేచ్ఛలలో ఇటువంటి తేడాలు అభివృద్ధి చెందిన దేశాలలో ఒక విధంగా, వర్ధమాన దేశాలలో మరొక విధంగా కనిపిస్తున్నాయి. వర్ధమాన దేశాలలో ఆ స్వేచ్ఛలు లేకపోవటమే గాక వాటిని దేశ ద్రోహం పేరిట, మత ద్రోహం పేరిట, మరో పేరిట అణిచివేయటం కూడా జరిగితే?స్థిరపడని విలువలుఇవన్నీ చెప్పుకున్న తర్వాత, ప్రపంచంలోని ప్రజాస్వామిక వ్యవస్థలను అభివృద్ధి చెందినవి, వర్ధమాన స్థితిలో ఉన్నవి అని స్థూలంగా విభజించి చూసినపుడు, రెండింటి మధ్య ఈ తేడాలెందుకనే మౌలికమైన ప్రశ్న గురించి చర్చించటం అవసరం. ఇంత లోతైన విషయం తేలికగా అర్థమయ్యేది కాదు. కానీ ఒక ప్రాథమిక ప్రయత్నమంటూ జరగాలి. ఆ విధంగా చూసినపుడు తోస్తున్నవి కొన్నున్నాయి. మనం అభివృద్ధి చెందిన దేశాలంటున్నవి పెట్టుబడిదారీ విధానంలో ఎదిగి వచ్చినవి. ఆ క్రమంలో పౌరులకు తమ హక్కులు, స్వేచ్ఛలు, వాటిని కాపాడుకోవడం అన్నది, వారి వ్యక్తిత్వాలు, వ్యక్తిగత గుర్తింపులు రూపుదిద్దుకునే క్రమంలో ఒక సంప్రదాయంగా మారింది. ఇవన్నీ వారి ప్రజాస్వామ్యంలో భాగమయ్యాయి. వాటిని వారు బలంగా కాపాడుకుంటారు. ఇందుకు పునాదులు రినైజాన్స్–పునరుజ్జీవనోద్యమం (14–17 శతాబ్దాలు), ఫ్రెంచ్ విప్లవం (18వ శతాబ్దం), ఇంగ్లండ్లో పారిశ్రామిక విప్లవం (18వ శతాబ్దం నుంచి)లో పడ్డాయి. అప్పటి నుంచి ప్రజాస్వామ్యాలు, వ్యక్తి స్వేచ్ఛలు, పౌర స్వేచ్ఛలు వ్యవస్థీకృత రూపం తీసుకుని బలపడ్డాయి. అక్కడి పార్టీలు, ప్రభుత్వాలు, వాటి విధానాలు ఎట్లున్నా ఈ వ్యవస్థలు, స్వేచ్ఛలు మారలేదు. అదే నేటికీ కనిపిస్తున్నది. ఇందుకు భిన్నంగా, వర్ధమాన దేశాలనేవి చిరకాల ఫ్యూడల్ దశలు, రాచరికాలు, వలస పాలనల నుంచి బయటకు రావటం మొదలై ఇంకా వంద సంవత్సరాలు కూడా కాలేదు. యూరప్ తరహా విప్లవాలు రాలేదు. విలువలు ఇంకా నిజమైన అర్థంలో రూపుదిద్దుకోలేదు. పౌరుల వ్యక్తిత్వాలు, పౌర స్వేచ్ఛలు ఇంకా బలపడి వ్యవస్థీకృత రూపం తీసుకోలేదు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలనే చట్ట సభలు, పాలనా యంత్రాంగం, న్యాయస్థానాలు కూడా ఇంకా తమ స్ఫూర్తికి అనుగుణంగా స్థిరపడి బలపడవలసే ఉంది. అందువల్ల ఈ ఎదుగుదల వ్యత్యాసాలే మొదట చెప్పుకున్న వ్యత్యాసాలకు కూడా కారణమవుతున్నాయనిపిస్తున్నది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
రుణం తీర్చుకునేందుకు పెట్టుబడులతో రండి
హైడ్రా భూములు అమ్మేద్దాం
కూరలో విషం కలిపిన భార్య....
పజిల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నా: రష్మిక మందన్నా
ఇక్రిశాట్కు క్రిస్పర్ కాస్9 సాంకేతికత!
‘వలస భూతం’ ఎవరి సృష్టి?
తిరుపతిలో చోరీ కలకలం..
ప్రేక్షకుల ప్రశంసలే ముఖ్యం: రవి నంబూరి
పౌర స్వేచ్ఛలో తేడాలెందుకు?
గోపీచంద్ @ 25
Friendship Day: ముగ్గురు మిత్రులు.. ఇప్పుడు ఐఎఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్!
గోడౌన్ కాద్సార్! ఫిర్యాదుల రూం!
ఇంటితోనే ఇంకో ఇల్లు కొనచ్చు: కియోసాకి కిటుకు
సాక్షి కార్టూన్: 02-08-2026
అభిషేక్ శర్మ ఊచకోత.. 91 బంతుల్లో 233 పరుగులు
త్వరలో విశాఖ–బెంగళూరు వందేభారత్ స్లీపర్ రైలు!
లక్షాధికారిని చేసే SBI స్కీమ్..
బంగారం, వెండి ధరలు ఇలా..
‘అతడిని ఎంపిక చేయబోం.. రిటైరవ్వడమే మంచిది’
పోటాపోటీగా పొర్లు దండాలు..!
ఈ పాము కనపడితే.. వేగంగా పరిగెత్తినా తప్పించుకోలేరు..
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
UPI వాడకం ఆపేశా.. దెబ్బకు నా దశ తిరిగింది
జెన్ జీకి తొలి వికెట్.. ‘వైరస్’ అన్న నబీన్కు ఓటుతో బదులు
రిటైర్మెంట్ తర్వాత రహానేకి బీసీసీఐ పెన్షన్.. నెలకి ఎంతంటే?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
దీప్కే విదేశీ చదువులపై ఆర్టీఐ ఆరా
అందుకే వెండి ధరలు.. భారీగా తగ్గాయ్!
'నా శవాన్ని కూడా నా భార్య తాకడానికి వీల్లేదు'
ఈ రాశి వారికి వ్యాపారాలలో అధిక లాభాలు
రుణం తీర్చుకునేందుకు పెట్టుబడులతో రండి
హైడ్రా భూములు అమ్మేద్దాం
కూరలో విషం కలిపిన భార్య....
పజిల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నా: రష్మిక మందన్నా
ఇక్రిశాట్కు క్రిస్పర్ కాస్9 సాంకేతికత!
‘వలస భూతం’ ఎవరి సృష్టి?
తిరుపతిలో చోరీ కలకలం..
ప్రేక్షకుల ప్రశంసలే ముఖ్యం: రవి నంబూరి
పౌర స్వేచ్ఛలో తేడాలెందుకు?
గోపీచంద్ @ 25
Friendship Day: ముగ్గురు మిత్రులు.. ఇప్పుడు ఐఎఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్!
గోడౌన్ కాద్సార్! ఫిర్యాదుల రూం!
ఇంటితోనే ఇంకో ఇల్లు కొనచ్చు: కియోసాకి కిటుకు
సాక్షి కార్టూన్: 02-08-2026
అభిషేక్ శర్మ ఊచకోత.. 91 బంతుల్లో 233 పరుగులు
త్వరలో విశాఖ–బెంగళూరు వందేభారత్ స్లీపర్ రైలు!
లక్షాధికారిని చేసే SBI స్కీమ్..
బంగారం, వెండి ధరలు ఇలా..
‘అతడిని ఎంపిక చేయబోం.. రిటైరవ్వడమే మంచిది’
పోటాపోటీగా పొర్లు దండాలు..!
ఈ పాము కనపడితే.. వేగంగా పరిగెత్తినా తప్పించుకోలేరు..
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
UPI వాడకం ఆపేశా.. దెబ్బకు నా దశ తిరిగింది
జెన్ జీకి తొలి వికెట్.. ‘వైరస్’ అన్న నబీన్కు ఓటుతో బదులు
రిటైర్మెంట్ తర్వాత రహానేకి బీసీసీఐ పెన్షన్.. నెలకి ఎంతంటే?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
దీప్కే విదేశీ చదువులపై ఆర్టీఐ ఆరా
అందుకే వెండి ధరలు.. భారీగా తగ్గాయ్!
'నా శవాన్ని కూడా నా భార్య తాకడానికి వీల్లేదు'
ఈ రాశి వారికి వ్యాపారాలలో అధిక లాభాలు
ఫొటోలు
కొండ కోనల్లో టాలీవుడ్ హీరోయిన్ ఎంజాయ్ (ఫొటోలు)
ఈ హీరోయిన్కి 40 ఏళ్లంటే నమ్మడం చాలా కష్టం! (ఫొటోలు)
ఫ్రెండ్స్-కూతురితో కలిసి నమ్రత హాలీడే ట్రిప్ (ఫొటోలు)
రెండేళ్ల తర్వాత 'ఇరుముడి'తో మళ్లీ తెలుగులోకి (ఫొటోలు)
‘KJQ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసిన నటి రేఖా నిరోషా (ఫొటోలు)
LGBT: A Legal Battle మూవీ 50 రోజులు వేడుక (ఫొటోలు)
‘KJQ’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)
అంగరంగ వైభవంగా పాతబస్తీలో ఘనంగా ఘటాల ఊరేగింపు (ఫొటోలు)
‘ఆపిల్ డేస్' గ్రాండ్ లాంచ్లో నటి నందితా శ్వేత సందడి (ఫొటోలు)
విశాఖ ఆర్కే బీచ్లో ఫ్రెండ్షిప్ డే తీపి కిక్కు..(ఫొటోలు)
సినిమా
నేను చేసిన పనికి కేసు పెట్టాలనుకున్నారు
తమిళ స్టార్ హీరో విజయ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. అయితే ఈయన వారసుడు జేసన్ సంజయ్.. తండ్రిలానే హీరో అవుతారని అంతా అనుకుంటే దర్శకుడు అయ్యాడు. అలా 'సిగ్మా' మూవీ తీశాడు. లెక్క ప్రకారం గత నెల చివరలో రిలీజ్ కావాలి. కానీ వాయిదా వేశారు. అయితే ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా బోలెడన్ని విషయాలు పంచుకున్న జేసన్.. ఓసారి తాను చేసిన పని ఎంతలా కుటుంబాన్ని కంగారు పెట్టిందో వెల్లడించాడు.(ఇదీ చదవండి: విజయ్ సీఎం కావడంపై ఎట్టకేలకు స్పందించిన కొడుకు)'మా అమ్మ ఓ గూఢచారిలా ఉంటుంది. నేను రహస్యంగా ఏం చేయడానికి ప్రయత్నించినా, ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లినా సరే దొరికిపోయేవాడిని. గతంలో నేను అర్థరాత్రి ఎవరికీ చెప్పకుండా బయటకెళ్లి, తర్వాత రోజు ఉదయం తిరిగొచ్చాను. అయితే అప్పుడు నా ఫోన్ స్విచ్ఛాప్ ఉండేసరికి ఇంట్లో వాళ్లు కంగారుపడ్డారు. ఏకంగా మిస్సింగ్ కేసు పెట్టేందుకు రెడీ అయిపోయారు. సరిగ్గా ఆ టైంకి ఇంటికి చేరుకున్నాను' అని జేసన్ సంజయ్ చెప్పుకొచ్చాడు.ఇక తండ్రి ముఖ్యమంత్రి కావడంపై స్పందించిన జేసన్.. దీనిని 'చారిత్రక విప్లవం' అని అన్నాడు. 'నాన్న సీఎం కావడం మా కుటుంబ సభ్యులందరికీ ఎంతో పెద్ద బాధ్యతతో పాటు గౌరవం కూడా. అదే సమయంలో మేమంతా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది' అని అన్నాడు. తండ్రి ఇచ్చిన సలహా గురించి మాట్లాడుతూ.. 'ఆయన నాకు చెప్పిన మాటల్లో నాకు చాలా ఇష్టమైనది ఒకటే. 'నువ్వు నీకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలి' అని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ఆ సలహానే నాకు జీవితంలో ఎంతో ప్రేరణనిచ్చింది. ఎప్పుడైనా నీకు నా సహాయం అవసరమైతే నన్ను సంప్రదించొచ్చు. కానీ ముందుగా నువ్వే చొరవ తీసుకుని నా దగ్గరకు రావాలి. నేను అడగను అని నాన్న నాతో చెప్పారు' అని జేసన్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
స్పైడర్ మ్యాన్ ఊచకోత.. ఇక్కడే రూ.1000 కోట్లు వస్తాయేమో?
స్పైడర్ మ్యాన్ సినిమాలకు మన దేశంలోనూ చాలా క్రేజ్ ఉంది. ఎప్పటినుంచి ఈ ఫ్రాంచైజీలో మూవీస్ వస్తున్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా లేటెస్ట్ చిత్రం 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. టామ్ హోలండ్, జెండయా ప్రధాన పాత్రలు చేశారు. గత గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. తొలి వీకెండ్ ముగిసేసరికి సరికొత్త రికార్డులు సృష్టించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ప్రపంచవ్యాప్తంగా 927 మిలియన్ డాలర్లు(సుమారు రూ.8830 కోట్లు) వసూళ్లు రాగా.. భారతదేశం నుంచి రూ.309 కోట్ల కలెక్షన్ వచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. స్పైడర్ మ్యాన్ ఊపు చూస్తుంటే మన దగ్గరే రూ.1000 కోట్ల వసూళ్ల మార్క్ దాటేస్తాడేమో అనిపిస్తుంది. థియేటర్లలో అలాంటి సందడి కనిపిస్తుందిదాదాపు 225 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,100కోట్లు) బడ్జెట్తో ఈ సినిమా తీయగా.. తొలి వీకెండ్ అయ్యేసరికి పెట్టుబడిని రాబట్టేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో 38వ మూవీ కాగా.. డిసెంబరులో తర్వాత చిత్రమైన 'అవెంజర్స్ డూమ్స్ డే' రాబోతుంది. మరి ఇదెలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: నేను చేసిన పనికి కేసు పెట్టాలనుకున్నారు: సీఎం విజయ్ కొడుకు)You showed up, you cheered, and together we made history. This celebration is yours ❤️🕷️#SpiderManBrandNewDay in cinemas now, in English, Hindi, Tamil, Telugu, Malayalam & Kannada. Book your tickets via the link in bio. pic.twitter.com/Ivw4twanBK— Sony Pictures India (@SonyPicsIndia) August 3, 2026
మెడలో తాళితో 'బిగ్బాస్' ఫేమ్ ట్రాన్స్జెండర్ ప్రియాంక
బిగ్బాస్ తెలుగు 5వ సీజన్తో గుర్తింపు తెచ్చుకున్న ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్.. మెడలో తాళిబొట్టుతో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. దీంతో ఈమెప్పుడు పెళ్లి చేసుకుంది? ఎవరిని పెళ్లి చేసుకుందా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: గృహహింస.. సీరియల్ నటికి అత్తారింట్లో వేధింపులు)శ్రీకాకుళానికి చెందిన సాయితేజ తర్వాత కాలంలో లింగమార్పిడి చేయించుకుని ప్రియాంక సింగ్గా మారిపోయారు. కానీ ఈ విషయాన్ని మాత్రం తల్లిదండ్రులకు చెప్పలేదు. చాలా కాలం పాటు తన తండ్రి వద్ద ఈ విషయాన్ని దాచానని గతంలో ఓసారి ప్రియాంక చెప్పుకొచ్చింది. అయితే బిగ్బాస్ 5లోకి ఎంట్రీ ఇస్తున్న టైంలో తానొక ట్రాన్స్జెండర్ అనే విషయం తన తండ్రికి తెలిసేలా బయటపెట్టింది.ఈ షో నుంచి బయటకొచ్చేసిన తర్వాత పలు రియాలిటీ షోల్లో కనిపించిన ప్రియాంక సింగ్.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గానే ఉంటుంది. వ్రతాలు, పూజాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మెడలో తాళిబొట్టుతో కనిపించేసరికి సరదాగా ఇది పెట్టిందా? లేదంటే ఎవరైనా పెళ్లి చేసుకుందా అని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: మిడిల్ క్లాస్ తండ్రిగా రవితేజ.. 'ఇరుముడి' మరో సాంగ్ రిలీజ్) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_)
మిడిల్ క్లాస్ తండ్రిగా రవితేజ.. 'ఇరుముడి' మరో సాంగ్ రిలీజ్
రవితేజ తన స్టైల్ మార్చి చేస్తున్న సినిమా 'ఇరుముడి'. ఇప్పటివరకు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లేదంటే ప్రయోగాలు చేశాడు. ఇందులో మాత్రం కుటుంబ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా మిడిల్ క్లాస్ వ్యక్తిగా, ఓ పాపకు తండ్రిగా కనిపించనున్నాడు. ఈ నెల 21న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఇదివరకే ఇరుముడి కట్టు అంటూ అయ్యప్ప గీతం రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు కుటుంబ బంధాన్ని ఆవిష్కరించేలా 'యాలాలో యాలాలో' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. ఓ గిరిజన ప్రాంతంలో ఆటో డ్రైవర్ అయిన రవితేజ, సాయం చేసే భార్య, మంచి కూతురు.. వీళ్ల మధ్య బాండింగ్ ఇందులో చూపించారు. శివ నిర్వాణ దర్శకుడు కాగా జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: గృహహింస.. సీరియల్ నటికి అత్తారింట్లో వేధింపులు)
క్రీడలు
ప్రేమకు ఎండ్కార్డ్.. గర్ల్ఫ్రెండ్తో రొనాల్డో పెళ్లి ఎప్పుడంటే?
పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన లాంగ్టైమ్ గర్ల్ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్వేజ్ను వివాహమాడనున్నాడు. ఆగస్టు 8న వీరి వివాహం రొనాల్డో జన్మించిన పోర్చుగీస్ ద్వీపం మదీరాలో జరగనున్నట్లు సమాచారం. ఫంచల్ కేథడ్రల్లో మత పెద్దల సమక్షంలో బైబిల్పై ప్రమాణాలు చేసిన అనంతరం రింగులు మార్చుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. అనంతరం ఫైవ్స్టార్ హోటల్ అయిన సావోయ్ ప్యాలెస్లో కుటుంబసభ్యులు, స్నేహితులకు ఘనంగా విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా రొనాల్డో, రోడ్రిగ్వేజ్ రిసెప్షన్ పార్టీకి భారీ ఎత్తున సెలబ్రెటీలు రానున్నట్లు బ్రిటన్ మీడియా ఒక నివేదికలో తెలిపింది. అయితే వివాహ ప్రకటనను రొనాల్డో జంట అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే మొదట సింట్రాలోని క్వింటా డా రెగరలేరా ఎస్టేట్లో వీరి వివాహం జరగనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా రొనాల్డో పుట్టిన ప్రదేశమైన మదీరాలోనే అంరరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి వివాహం కోసం ఆగస్టు 8న ఫంచల్ కేథడ్రల్ను రిజర్వ్ చేశారని, తమ పెళ్లికి వచ్చే అతిథుల కోసం కేథడ్రల్ పక్కనే ఉన్న పెద్ద హోటల్లో రెండు ఫ్లోర్లలో ఉన్న రూంలను కూడా బుక్ చేసినట్లు సమాచారం.2016లో చిగురించిన ప్రేమక్రిస్టియానో రొనాల్డో, జార్జినాల మధ్య 2016లో ప్రేమ చిగురించింది. మాడ్రిడ్లోని ఒక గూచీ స్టోర్లో జార్జినా సేల్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సమయంలో రొనాల్డో ఆమెను మొదటిసారి కలిశాడు. ఆ తర్వాత ఒక ఫ్యాషన్ ఈవెంట్లో మళ్లీ కలుసుకున్నఈ జంట డేటింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాత క్రమంగా తమ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టారు. 2017 జనవరిలో జ్యూరిచ్లో జరిగిన 'ది బెస్ట్ ఫీఫా ఫుట్బాల్ అవార్డ్స్'లో వారు మొదటిసారి అధికారికంగా కలిసి కనిపించారు. ఆ తర్వాత అదే సంవత్సరం ఇన్స్టాగ్రామ్లో తమ మొదటి జంట ఫోటోను పంచుకున్నారు.2017 నవంబర్లో ఈ ప్రేమికులకు కుమార్తె అలనా మార్టినా పుట్టింది. అలనాను పెంచడంతో పాటు, క్రిస్టియానో జూనియర్, ఇవా, మాటియోల పెంపకంలో రోడ్రిగ్జ్ బిజీగా మారిపోయింది. 2022 ఏప్రిల్లో, ఈ దంపతులు కవల కుమార్తెలకు స్వాగతం పలికారు. ఇక 2025 ఆగస్టులో జార్జినా రోడ్రిగ్జ్ రొనాల్డో తొడిగిన ఉంగరాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ ‘నీ ప్రొపోజల్కు అంగీకరిస్తున్నా’ అని క్యాప్షన్ జత చేసి నిశ్చితార్థం జరిగినట్లు ధృవీకరించింది. అప్పటి నుంచి వీరి వివాహంపై ఊహాగానాలు వస్తున్న వేళ ఆగస్టు 8న వీరి వివాహం జరగనున్నట్లు వార్తలు రావడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.ఇక రొనాల్డో ఇటీవలే ఫిఫా ప్రపంచకప్లో పోర్చుగల్ తరఫున ఆడాడు. అయితే జట్టును ఫైనల్ చేర్చడంలో విఫలమయ్యాడు. ఈసారి ప్రిక్వార్టర్స్లోనే పోర్చుగల్ వెనుదిరిగింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడిన రొనాల్డో వయసు 41 ఏళ్లు. కాబట్టి రొనాల్డో తన కెరీర్లో చివరి ఫిఫా ప్రపంచకప్ ఆడేసినట్లే. After So Many Years, They Finally Said “I Do.” 💍❤️After a long journey together, raising kids, and living through life’s biggest highs and lows, Cristiano Ronaldo and Georgina Rodríguez have officially tied the knot 👰🤵✨ pic.twitter.com/WzrIBpTgWO— Molly (@Molly_AFC) August 2, 2026
అభిషేక్ శర్మకు నో ప్లేస్.. ఊహించని ఆటగాడికి కెప్టెన్సీ
దులీప్ ట్రోఫీ 2026 కోసం 15 మంది సభ్యుల నార్త్ జోన్ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ జట్టుకు కెప్టెన్గా ఎవరూ ఊహించిన ఆటగాడికి అవకాశం లభించింది. జమ్మూ కశ్మీర్కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ కన్హయ్య వాధ్వాన్కు సెలెక్టర్లు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు. అతడికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోనీని ఎంపిక చేశారు.ఈ జట్టులో అత్యధికంగా (6) రంజీ ఛాంపియన్ జమ్మూ కశ్మీర్ ఆటగాళ్లకు చోటు లభించింది. టీమిండియా ఆటగాళ్లు అర్ష్దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉన్నందున శుభ్మన్ గిల్, ఆకిబ్ నబీని ఎంపిక చేయలేదు. దులీప్ ట్రోఫీ ఆగస్టు 23న ప్రారంభం కానుండగా.. అదే రోజు నార్త్ జోన్-వెస్ట్ జోన్ మ్యాచ్ ప్రారంభం కానుంది.నార్త్ జోన్ జట్టు:సనత్ సంగ్వాన్, క్వామ్రాన్ ఇక్బాల్, యశ్ ధుల్, ఆయుష్ దోసేజా, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోనీ (వైస్ కెప్టెన్), కన్హయ్య వాధ్వాన్ (కెప్టెన్), నిశాంత్ సింధు, అర్జున్ శర్మ, అబిద్ ముస్తాక్, అర్ష్దీప్ సింగ్, సునీల్ కుమార్, అన్షుల్ కాంబోజ్, యుధ్వీర్ సింగ్, నిఖిల్ కశ్యప్.ఎవరీ కన్హయ్య వాధ్వాన్..?జమ్మూ కశ్మీర్ రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్ సాధించడంలో వాధ్వాన్ కీలక పాత్ర పోషించాడు. 13 ఇన్నింగ్స్ల్లో 474 పరుగులు, 36.56 సగటుతో రాణించాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. రంజీ ట్రోఫీ ఫైనల్లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు.24 ఏళ్ల వాధ్వాన్ గతేడాది దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరఫున ఆడాడు. మూడు ఇన్నింగ్స్ల్లో 99 పరుగులు చేశాడు. గత ఎడిషన్లో శుభ్మన్ గిల్ నాయకత్వంలో ఆడిన అతను, ఇప్పుడు తొలిసారి నార్త్ జోన్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
39 పతకాలకే పరిమితం.. 24 ఏళ్లలో అత్యల్పం.. అయినా..!
గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా చూస్తే 1998 తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో భారత్ సాధించిన అత్యల్ప పతకాల సంఖ్య ఇదే. అయితే గ్లాస్గో గేమ్స్లో భారత్ ఎదుర్కొన్న పరిస్థితులను పరిశీలిస్తే ఈ ప్రదర్శనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.పరిమితుల కారణంగా ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో కేవలం 10 క్రీడలనే నిర్వహించారు. భారత్కు సంప్రదాయంగా భారీగా పతకాలు అందించే షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ వంటి క్రీడలు ఈసారి పోటీల్లో లేకపోవడం భారత పతకాల అవకాశాలను గణనీయంగా దెబ్బతీసింది.2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో ఈ ఐదు క్రీడల నుంచే భారత్ 30 పతకాలు (13 స్వర్ణాలు) సాధించింది. అంటే గతసారి భారత్ సాధించిన మొత్తం పతకాలలో దాదాపు సగం ఈ క్రీడల నుంచే వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లోనూ భారత్ గ్లాస్గోలో 39 పతకాలు సాధించడం గమనార్హం.బాక్సింగ్లో చారిత్రాత్మక ప్రదర్శనభారత బాక్సర్లు ఈసారి అద్భుతంగా రాణించారు. మొత్తం 10 పతకాలు సాధించగా, అందులో ఏకంగా 7 స్వర్ణాలు, 3 రజతాలు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ఒకే దేశానికి చెందిన బాక్సింగ్ బృందం సాధించిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటిగా నిలిచింది.జూడోలో కొత్త చరిత్రజూడోలోనూ భారత్ సత్తా చాటింది. హర్ష్ సింగ్, అస్మితా డే తమ విభాగాల్లో స్వర్ణాలు సాధించి, కామన్వెల్త్ గేమ్స్ జూడోలో భారత్కు తొలి స్వర్ణ పతకాలను అందించారు. యామిని మౌర్య రజతం, ఉన్నతి శర్మ కాంస్యం సాధించారు.అథ్లెటిక్స్లోనూ మెరుపులుఅథ్లెటిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో రజత పతకం సాధించాడు. గుల్వీర్ సింగ్ 10,000 మీటర్లలో రజతం, 5,000 మీటర్లలో కాంస్యం సాధించి ఒకే కామన్వెల్త్ గేమ్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ట్రాక్ అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు.తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్లో కాంస్యం సాధించి ఈ ఈవెంట్లో భారత్కు తొలి కామన్వెల్త్ పతకాన్ని అందించాడు.వెయిట్లిఫ్టింగ్, పారా-స్పోర్ట్స్లోనూ సత్తావెయిట్లిఫ్టింగ్లో మీరాబాయి చాను వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించి అరుదైన ఘనత అందుకుంది. భారత వెయిట్లిఫ్టింగ్ బృందం మొత్తంగా 8 పతకాలు సాధించింది.పారా-అథ్లెటిక్స్లోనూ భారత్ అద్భుతంగా రాణించింది. ఈ విభాగంలో 7 పతకాలు వచ్చాయి. శర్మిలా ధంకర్, దిలీప్ మహదు గవిత్, సోమన్ రాణా స్వర్ణాలు సాధించారు.నాలుగో స్థానంలో భారత్మొత్తంగా ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. టాప్-3లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా ఉన్నాయి. భారత్, ఆతిథ్య స్కాట్లాండ్ చెరో 39 పతకాలు సాధించినప్పటికీ, భారత్ ఎక్కువ రజతాలు సాధించడంతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.సంఖ్యాపరంగా 39 పతకాలు భారత్కు 1998 తర్వాత అత్యల్పమే అయినప్పటికీ, సంప్రదాయ పతకాల వనరులైన ఐదు క్రీడలు లేకుండానే ఈ స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం గ్లాస్గో గేమ్స్లో భారత బృందం సాధించిన కీలక విజయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా బాక్సింగ్, జూడో, అథ్లెటిక్స్, పారా-స్పోర్ట్స్లో వచ్చిన పురోగతి భారత బహుళ క్రీడా సామర్థ్యానికి కొత్త ఆశలు కలిగిస్తోంది.
భారత సంతతి క్రికెటర్పై ఐసీసీ 8 ఏళ్ల నిషేధం!
భారత సంతతికి చెందిన అమెరికా క్రికెటర్ బొదుగుమ్ అఖిలేశ్ రెడ్డిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 8 ఏళ్లు నిషేధం విధించింది. అబుదాబి టీ20 లీగ్లో అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినట్లు గతేడాది నవంబర్లో అతడిపై అభియోగాలు వచ్చాయి. ఆరోపణలు నిజమని తేలడంతో అప్పట్లో ఐసీసీ అఖిలేష్పై తాత్కాలిక నిషేధం విధించింది. తాజాగా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.1.1, ఆర్టికల్ 2.1.4, ఆర్టికల్ 2.4.7కు చెందిన మూడు నిబంధనలను అఖిలేష్ ఉల్లంఘించినట్లు తేలడంతో ఐసీసీ అతడిని దోషిగా నిర్ధారించింది. అతడిపై విధించిన 8 ఏళ్ల నిషేధం నవంబర్ 21, 2025 నుంచే అమల్లోకి వచ్చిందని ఐసీసీ తెలిపింది. 8 ఏళ్ల తర్వాత అంటే 2033లో అఖిలేష్ మళ్లీ క్రికెట్ ఆడేందుకు అనుమతి ఉంటుంది. అప్పటికీ అతడి వయసు 33 ఏళ్లు నిండుతాయి కాబట్టి అతడి కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లే. యూఎస్ఏ తరఫున క్రికెట్ ఆడిన అఖిలేష్ రెడ్డి 2000లో అమెరికాలోనే జన్మించాడు. అమెరికాలో జన్మించినప్పటికీ క్రికెట్లో పేరు వచ్చింది మాత్రం హైదరాబాద్కు ఆడడం ద్వారానే. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) తరఫున దేశవాళీ డొమొస్టిక్ టోర్నీల్లో ఆడిన అఖిలేష్ అబుదాబి టీ10 లీగ్లో యూపీ నవాబ్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ ఫ్రాంచైజీకి ఆడుతున్న సమయంలో అతడిపై అవినీతి నిరోధక నియమాల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.అఖిలేష్ ఉల్లంఘించిన నిబంధనలివే..👉ఆర్టికల్ 2.1.1-అబుదాబి టీ10 లీగ్ 2025లో మ్యాచ్ల ఫలితం, పురోగతి, నిర్వహణ లేదా ఇతర అంశాన్ని నిర్ధారించడానికి, కుట్ర పన్నడానికి లేదా ఇతరత్రా అనుచితంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం, లేదా ఏ విధంగానైనా నిర్ధారించడానికి లేదా కుట్ర పన్నడానికి లేదా ఇతరత్రా అనుచితంగా ప్రభావితం చేయడానికి చేసే ఒప్పందంలో కుట్రదారుడిగా తేలడం.👉ఆర్టికల్ 2.1.4- అబుదాబి టీ10 లీగ్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లలో ఆర్టికల్ 2.1.1ను ఉల్లంఘించాలని వేరే వాళ్లను ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించడం, ప్రలోభాలకు గురి చేయడం, ప్రోత్సహించడం లేదా ఉద్దేశపూర్వకంగా సులభతరం చేయడానికి ప్రయత్నించడం.👉ఆర్టికల్ 2.4.7-విచారణలో భాగంగా దర్యాప్తుకు ఆటంకం కలిగించేలా తన వద్ద ఉన్న డేటా, సమాచారాన్ని దొరక్కుండా చేయడం లేదా తొలగించడం.👉ఇక బొదుగుమ్ అఖిలేష్ రెడ్డి అమెరికా తరఫున నాలుగు టీ20 మ్యాచ్లు ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్లు కలిపి అఖిలేష్ ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఇక మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో తొలి రెండు ఎడిషన్లలో వాషింగ్టన్ ఫ్రీడమ్కు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఒక్కసారి కూడా జట్టులో ఆడే అవకాశం లభించలేదు.Read: సొంత జట్టుతో గొడవ.. పంజాబ్ ఆల్రౌండర్ కీలక నిర్ణయం!
న్యూస్ పాడ్కాస్ట్
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
ఏపీలో దగా డీఎస్సీపై దండయాత్ర... రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు విజయవంతం
దేశంలో పసిడికి తగ్గిన డిమాండ్... ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6 శాతం డౌన్
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ కుంభకోణంపై జెన్జీ వార్...
ఏపీలో డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ పదవి నుంచి తప్పుకోవాల్సిందే...
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అక్రమాలపై విచారణ. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రెండేళ్ల బాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తం... ‘కాగ్’ గణాంకాల సాక్షిగా వాస్తవాలు బహిర్గతం
ప్రశ్నపత్రాల లీకేజీ దోషులకు పదేళ్ల జైలుశిక్ష.. పది కోట్ల రూపాయల జరిమానా... ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
కృష్ణా, గోదావరి డెల్టాలో వరి వేయొద్దని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
బిజినెస్
కాల్ డ్రాప్ అవుతోందా? వాయిస్లో సమస్యలా..? ఇకపై నేరుగా ట్రాయ్కి ఫిర్యాదు చేయొచ్చు
మొబైల్ ఫోన్ వినియోగం పెరిగిన ఈ రోజుల్లో.. కాల్ నాణ్యత ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. అయితే.. కొన్నిసార్లు కాల్ డ్రాప్లు, వాయిస్ స్పష్టంగా వినిపించకపోవడం, ఆలస్యం వంటి సమస్యలు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తన మైకాల్ (MyCall) మొబైల్ అప్లికేషన్ను కొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది.కొత్తగా అప్డేట్ చేసిన ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ కాల్ అనుభవాన్ని నేరుగా తెలియజేయవచ్చు. కాల్ ముగిసిన వెంటనే ఒకటి నుంచి ఫైవ్ స్టార్ వరకు రేటింగ్ ఇచ్చి, కాల్ నాణ్యతపై తమ అభిప్రాయాన్ని నమోదు చేయవచ్చు. దీనివల్ల టెలికాం సంస్థలకు వినియోగదారులు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు ఏమిటనేది సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.తమ కాలింగ్ అనుభవ సమస్యలను సర్వీస్ ప్రొవైడర్లకు నివేదించడానికి ఈ యాప్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుందని.. ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి వెల్లడించారు.ఈ యాప్లో కేవలం రేటింగ్ ఇవ్వడమే కాకుండా.. కాల్ డ్రాప్లు, కాల్ సమయంలో రీసౌండ్, ఆడియో ఆలస్యం, వేరే కాల్ కనెక్ట్ కావడం (క్రాస్ కనెక్షన్), వాయిస్ మధ్యలో కట్ అవ్వడం వంటి సమస్యలను కూడా రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. వినియోగదారులు ఇచ్చే ఈ వివరాలు సంబంధిత టెలికాం సంస్థలకు చేరి.. సమస్యలను పరిష్కరించేందుకు సహాయపడతాయి.Introducing the revamped MyCall App where everyconsumer’s call experience counts. Rate your recent calls, share your experience & contribute to real-world insights that can help improve call quality across India. Download the MyCall App now on Google Play pic.twitter.com/ij8LKaON93— TRAI (@TRAI) August 3, 2026
జియో బంపరాఫర్.. రూ.400తో సరికొత్త ప్యాకేజ్!
రిలయన్స్ జియో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సరికొత్త జియో హోమ్ బ్రాడ్బ్యాండ్ అండ్ హోమ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను ప్రారంభించింది. ఈ ప్లాన్లు హై-స్పీడ్ వైఫై, 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెల్లు, ప్రముఖ OTT ప్లాట్ఫారమ్ల సబ్స్క్రిప్షన్లను ఒకే ప్యాకేజీలో నెలకు రూ. 400 ప్రారంభ ధరతో అందిస్తున్నాయి.ఈ బండిల్ ఆఫర్ ద్వారా కస్టమర్లు బ్రాడ్బ్యాండ్, టెలివిజన్ మరియు స్ట్రీమింగ్ వినోదాన్ని ఒకే కనెక్షన్ మరియు ఒకే నెలవారీ బిల్లుతో పొందవచ్చు. కేవలం టీవీ మాత్రమే చూసే వారి నుంచి హై-స్పీడ్ బ్రాడ్బ్యాండ్తో పాటు లైవ్ టీవీ, ఓటీటీ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారి వరకు, వివిధ రకాల గృహ అవసరాలకు సరిపోయేలా ఈ ప్లాన్లు రూపొందించారు.ఎంచుకున్న ప్లాన్ను బట్టి, కస్టమర్లు అన్లిమిటెడ్ వైఫై, 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెల్లు, 200కి పైగా HD ఛానెల్లు.. ఆహా, జియోహాట్స్టార్, జీ5, సోనీ లివ్ వంటి వాటితో సహా 12-ప్లస్ ఓటీటీ ప్లాట్ఫారమ్ల యాక్సెస్ను ఆస్వాదించవచ్చు. ఇందులో టీవీలో యూట్యూబ్, జియో సర్వీస్ ఇంజనీర్ల ద్వారా ఉచిత ఇన్స్టాలేషన్.. మెయింటెనెన్స్, అలాగే లైవ్ టీవీని ప్లే, పాజ్ & రివైండ్ చేసే ఫీచర్లు కూడా ఉన్నాయి.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గృహాలకు.. జియో హోమ్ తన ఫైబర్ నెట్వర్క్ ద్వారా టెలివిజన్ సేవలను అందిస్తుంది. సాధారణంగా వాతావరణం బాగాలేనప్పుడు డీటీహెచ్ సేవలకు అంతరాయం కలుగుతుంది, కానీ ఫైబర్ ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితులలోనైనా అంతరాయం లేని వీక్షణ అనుభవాన్ని జియో అందిస్తుంది. కస్టమర్లు లైవ్ టీవీని పాజ్ మరియు రివైండ్ చేయగల సదుపాయం ఉన్నందున, వారు తమకు ఇష్టమైన తెలుగు సీరియల్స్, సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ లేదా న్యూస్ ప్రోగ్రామ్లను ఎప్పటికీ మిస్ అయ్యే అవకాశం లేదు.
ఐఐఆర్ఎం రూ.150 కోట్ల ఫండింగ్!
బీమా పంపిణీ సంస్థ ఐఐఆర్ఎం హోల్డింగ్స్ ఇండియా రూ. 150 కోట్ల నిధులను సమకూర్చుకుంటున్నట్లు తెలిపింది. కార్పెడియం క్యాపిటల్, సాన్షి ఫండ్-1 లీడ్ ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొంది.ఒక్కో షేరుకు రూ. 143.28 ధర చొప్పున ఫుల్లీ కన్వర్టబుల్ వారంట్లు, షేర్ల జారీ ద్వారా నిధులను సమీకరిస్తున్నట్లు కంపెనీ చైర్మన్ వి. రామకృష్ణ చెప్పారు. ఈ మొత్తాన్ని వ్యాపార విస్తరణ, కొనుగోళ్లు, వర్కింగ్ క్యాపిటల్ మొదలైన అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు వివరించారు. సింగపూర్, శ్రీలంక తదితర దేశాల్లో కూడా కార్యకలాపాలు సాగిస్తున్న ఐఐఆర్ఎం హోల్డింగ్స్కి 18 కార్యాలయాలు ఉన్నాయి. 2,000 పైచిలుకు కార్పొరేట్ క్లయింట్లు, 500 మంది సిబ్బంది ఉన్నారు.
ఇన్వెస్టర్లూ.. ఇదిగో ఈ ఫండ్ చూశారా?
లార్జ్క్యాప్ల స్థిరత్వంతో పాటు మిడ్క్యాప్ల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ‘లార్జ్ అండ్ మిడ్క్యాప్’ ఫండ్లు ఆకర్షణీయమైన ఎంపిక. ఈ విభాగంలో ‘బంధన్ లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్’ దీర్ఘకాలిక రాబడులు, వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో ప్రత్యేకతను చాటుతోంది. లార్జ్, మిడ్క్యాప్లతో పాటు ఎంపిక చేసిన స్మాల్క్యాప్ షేర్ల ద్వారా అదనపు వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫండ్ మూడు, అయిదు, ఏడు, పదేళ్ల కాలంలో కేటగిరీ సగటు, బెంచ్మార్క్ కంటే మెరుగైన ఎస్ఐపీ రాబడులను నమోదు చేసింది.పెట్టుబడి వ్యూహం సెబీ నిబంధనల ప్రకారం లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్లు కనీసం 35 శాతం చొప్పున లార్జ్క్యాప్, మిడ్క్యాప్ షేర్లలో పెట్టుబడి పెట్టాలి. ఈ ప్రాతిపదికన బంధన్ ఫండ్ పోర్ట్ఫోలియోను అధిక వృద్ధి సామర్థ్యం, నాణ్యమైన కంపెనీలు (54%), థీమాటిక్–సైక్లికల్ అవకాశాలు (31%), వాల్యూ ఆధారిత పెట్టుబడులు (11%) అనే మూడు విభాగాలుగా నిర్మిస్తోంది. లార్జ్, మిడ్క్యాప్లతో పాటు ఎంపిక చేసిన స్మాల్క్యాప్ షేర్లలో పెట్టుబడుల ద్వారా బెంచ్మార్క్ కంటే అదనపు రాబడులను సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్ పరిస్థితులు, వాల్యుయేషన్లు, వ్యాపార సైకిళ్లకు అనుగుణంగా రంగాలు, షేర్ల కేటాయింపులను ఎప్పటికప్పుడు మార్చుకోవడం దీని ప్రత్యేకత.రిస్క్ విశ్లేషణ గత ఐదేళ్లలో మిడ్, స్మాల్క్యాప్ షేర్ల ఉమ్మడి వాటా 57 శాతానికి పైగా పెరగడంతో ఫండ్ మరింత వృద్ధి ఆధారితంగా మారింది. దీంతో దీర్ఘకాలంలో అధిక రాబడులకు అవకాశం ఉన్నప్పటికీ, స్వల్పకాలంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండొచ్చు. గత దశాబ్దంలో ఈ ఫండ్ రెండుసార్లు 18–19 శాతం, ఒకసారి దాదాపు 40 శాతం మేర క్షీణించింది. అందువల్ల 5–7 ఏళ్ల పెట్టుబడి కాలపరిమితితో ఎస్ఐపీ మార్గంలో పెట్టుబడి పెట్టడం సముచితం.ఎవరికి అనుకూలం కనీసం 5–7 ఏళ్ల పెట్టుబడి కాలపరిమితి ఉన్న ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎస్ఐపీ ద్వారా క్రమబద్ధంగా పెట్టుబడి పెట్టేవారికి ఇది మెరుగైన ఎంపిక. అయితే, మిడ్, స్మాల్క్యాప్ కేటాయింపులు అధికంగా ఉండటంతో ఒక్కసారిగా భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం కంటే దశలవారీగా పెట్టుబడి కొనసాగించడం శ్రేయస్కరం. అలాగే, ఈ ఫండ్ను ఒక్క ఈక్విటీ ఫండ్పైనే ఆధారపడకుండా, లార్జ్క్యాప్ లేదా ఫ్లెక్సీక్యాప్ ఫండ్తో కలిపి పోర్ట్ఫోలియోలో భాగంగా ఉంచుకుంటే రిస్క్ బ్యాలెన్స్ అవుతుంది. పోర్ట్ఫోలియో కేటాయింపులుజూన్ 2026 నాటికి ఫండ్ పోర్ట్ఫోలియోలో లార్జ్క్యాప్లకు 38.5%, మిడ్క్యాప్లకు 35.6%, స్మాల్క్యాప్లకు 21.4% కేటాయింపులు ఉన్నాయి. మిగిలిన 4.5% నగదు, ఇతర ఈక్విటీయేతర ఆస్తుల్లో ఉంది. మిడ్, స్మాల్క్యాప్ల ఉమ్మడి వాటా 57 శాతానికి పైగా ఉండటం పోర్ట్ఫోలియోలో వృద్ధి ఆధారిత ధోరణిని సూచిస్తోంది. టాప్–10 హోల్డింగ్స్ వాటా 26.7 శాతానికే పరిమితం కావడం కొన్ని షేర్లపై అధికంగా ఆధారపడకుండా పోర్ట్ఫోలియోను వైవిధ్యంగా ఉంచుతోంది.రాబడుల పనితీరు దీర్ఘకాలిక ఎస్ఐపీ రాబడుల్లో ఈ ఫండ్ మూడు, ఐదు, ఏడు, పదేళ్ల కాలాల్లోనూ కేటగిరీ సగటు, బెంచ్మార్క్ను అధిగమించింది. రోలింగ్ రాబడులు: గత ఏడేళ్ల ఎన్ఏవీ చరిత్ర ఆధారంగా లెక్కించిన రోలింగ్ రాబడుల్లోనూ ఈ ఫండ్ నిలకడైన పనితీరును ప్రదర్శించింది. మూడేళ్లు, ఐదేళ్ల రోలింగ్ రాబడుల్లో కనిష్ట, సగటు, గరిష్ట మూడు ప్రమాణాల్లోనూ బెంచ్మార్క్ను అధిగమించడం దీర్ఘకాలిక పనితీరుకు నిదర్శనం.
ఫ్యామిలీ
ఒక్క పోజ్... వెయ్యి లైక్స్!
‘ఫొటో తీస్తా... పోజ్ ఇవ్వు!’ అని ఫ్రెండ్ అన్న వెంటనే... ఏం చేయాలో తెలియక చేతులు జేబుల్లో ఎట్టుకుని, తల ఎటు తిప్పాలో అర్థం కాక కెమెరానే చూస్తూ స్టాచ్యూ అయిపోతున్నారా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!నడవట్లేదు... మ్యూజిక్ నడుస్తోంది!కెమెరా ముందు బిగుసుకుని నిలబడాల్సిన పని లేదు. ఫ్రెండ్ను చూసి నడుస్తూ ఒక కాలు ముందుకు మరో కాలు మడమను పైకి లేపి ఆగండి. ఇక ఒక చేయి జేబులో... మరో చేయి ముందుకు ఊపితే చాలు... ఫొటోలో సినిమా హీరో ఎంట్రీ వైబ్ వచ్చేస్తుంది. ఈ పోజ్ ఎక్కువగా రోడ్డు, పార్క్, కాలేజ్ క్యాంపస్, మాల్లలో బాగుంటుంది.సైడ్ లుక్... ఫుల్ హుక్!కెమెరా వైపు ఎప్పుడూ చూడాల్సిన రూల్ లేదు. చిన్ను కొద్దిగా పైకి ఎత్తి, పక్కకు చూస్తే, చూసేవాళ్లే ‘ఏమో... ఏదో ఆలోచిస్తున్నాడు!’ అనుకుంటారు. అసలు మీరు ఆలోచించేది ఇంటికి వెళ్లాక ఏం తినాలన్నదే అయినా... ఫొటోలో మాత్రం చాలా డీప్ థింకర్లా కనిపిస్తారు!ఫ్రెండ్తో కలిసి పోజ్... డబుల్ స్టయిల్!ఒక్కడిగా ఫొటో బాగుంటుంది. కాని, ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే స్టయిల్లో నడిస్తే, అది వేరే లెవెల్. ఇద్దరూ ఒకే స్టయిల్లో నడవడం, ఒకే డైరెక్షన్ లో చూడడం, ఒకే టైమ్లో పోజ్ ఇస్తే, ఫొటోకు సినిమాటిక్ ఫీల్ను తీసుకొస్తుంది. ఫ్రెండ్స్తో రీల్స్ లేదా ఫొటోషూట్ చేస్తే ఈ పోజ్ తప్పక ట్రై చేయండి. కానీ ఒకడు హీరోలా నడుస్తుంటే, ఇంకొకడు చెప్పు జారి బ్యాలెన్స్ పట్టుకుంటే మాత్రం కామెడీ షో పోస్టర్ అయిపోతుంది!నవ్వాలా? సీరియస్గా ఉండాలా?ప్రతి ఫొటోలో పళ్లన్నీ చూపిస్తూ నవ్వితే టూత్పేస్ట్ యాడ్లా బాగుండదు. అందుకే, కొన్నిసార్లు చిన్న స్మైల్... ఇంకొన్నిసార్లు సైలెంట్ లుక్. ముఖ్యంగా కళ్లలో కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. ఫొటోకి అదే అసలైన ఫిల్టర్! గుర్తించుకోండి. పోజ్ అంటే శరీరాన్ని వంచడం కాదు, కాన్ఫిడెన్స్ను చూపించడం! అందుకే, కెమెరా ముందు సహజంగా ఉండండి. మీ స్టయిల్ను మీరే ఎంజాయ్ చేయండి.చేతులే చాలు.. కాన్ఫిడెన్స్!చేతులు ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బంది పడేవాళ్లకు ఇది లైఫ్సేవర్ పోజ్. ఒక చేయి లేదా రెండు చేతులు వెనక షర్ట్ లేదా హెయిర్ అడ్జస్ట్ చేస్తున్నట్లు పెట్టండి. అలాగే, భుజాలను నిటారుగా ఉంచి, ఛాతీని కొద్దిగా ముందుకు తీసుకొస్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అయితే, ఫొటో దిగేటప్పుడు జేబులో మొబైల్, వాలెట్, బైక్ కీ... అన్నీ నింపేస్తే మాత్రం పోజ్ కంటే జేబే హైలైట్ అవుతుంది!నిజం చెప్పాలంటే... మంచి డ్రెస్ వేసుకోవడం కంటే మంచి పోజ్ ఇవ్వడమే చాలా కష్టం. డ్రెస్ షాపులో దొరుకుతుంది. కానీ, స్టయిల్ మాత్రం మీలోనే ఉండాలి! అందుకే, ఇక్కడ కనిపించిన పోజులు పెట్టి ఫొటోలు దిగండి. అప్పుడు ఎక్కువ కష్టపడకుండానే స్టయిలిష్గా కనిపిస్తారు.
కరీబియన్ వేడుక... కెనడా వేదిక
ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద కరీబియన్ సాంస్కృతిక వేడుకకు కెనడాలోని టొరంటో నగరం వేదికగా నిలుస్తోంది. ‘టొరంటో కరీబియన్ కార్నివాల్’ ఈ ఏడాది 59వ వసంతంలోకి అడుగుపెట్టింది.ఈ వేడుకల్లో అత్యంత కీలకమైన గ్రాండ్ పరేడ్ ఆగస్టు ఒకటిన టొరంటో ఎగ్జిబిషన్ ప్లేస్లో అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది. కరీబియన్ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి ఇప్పటికే లక్షలాది మంది పర్యాటకులు టొరంటోకు చేరుకున్నారు.ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలు..ప్రస్తుతం ఈ కార్నివాల్లో భాగంగా కంటికిఇంపుగా సాగే భారీ పరేడ్లు, సంగీత పోటీలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీబియన్ దీవుల నుంచి వచ్చిన కళాకారుల సంగీత హోరు, రంగురంగుల దుస్తులలో నృత్యాలు చేస్తూ సాగే పరేడ్లు సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఒకనాడు చిన్నగా ప్రారంభమైన ఈ పండుగ, నేడు ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఎదిగి, టొరంటో నగర వైభవాన్ని ప్రపంచానికి చాటుతోంది.టొరంటో ఆర్థిక వ్యవస్థకు ఏటా అర బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని అందించే ఈ కరీబియన్ కార్నివాల్ ఉత్సవ ప్రస్థానం 1967లో ప్రారంభమైంది. కెనడా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, అక్కడ నివసిస్తున్న కరీబియన్ సమాజం తమ సాంస్కృతిక మూలాలను చాటుకోవడానికి 1967లో ‘కరిబానా’ పేరుతో ఈ వేడుకను మొదటిసారిగా ప్రారంభించింది. నాటి యోంగ్ స్ట్రీట్లో జరిగిన తొలి పరేడ్లో దాదాపు యాభైవేల మంది పాల్గొన్నారు. కెనడాకు కరీబియన్ ప్రజలు అందించిన ఈ బహుమతే, కాలక్రమేణా నేటి భారీ అంతర్జాతీయ ఉత్సవానికి బలమైన పునాదిగా మారింది.కరీబియన్ ప్రాంతంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ వేడుక ‘కరీబానా’ పేరుతో మొదలైంది. తరువాతి కాలంలో ఈ పేరును ‘టొరంటో కరీబియన్ కార్నివాల్‘గా మార్చారు. కెనడాలో స్థిరపడిన కరీబియన్ ప్రజల సాంస్కృతిక పరిరక్షణకు, వారి ఆర్థిక స్వావలంబనకు ఈ వేడుక ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.- రమా జంబుల
'మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం'.. ఇది శాస్త్రీయ వాస్తవం!
“మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం" అనేది కేవలం ఒక వేదాంత సూక్తి మాత్రమే కాదు, ఇప్పుడిది నిర్ధారణ అయిన ఒక శాస్త్రీయ వాస్తవం కూడా! మన మనస్సు, ఆలోచనలు మన శరీరంపై, ముఖ్యంగా వ్యాధి నిరోధక వ్యవస్థపై ఎంతటి బలమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసా? ఆశావాద ఆలోచనలు కేవలం మానసిక ప్రశాంతతకే కాదు, మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలకు మరోసారి తాజాగా నిరూపణ అయింది. మెదడును మనం మన ఆలోచనలతోనే 'రీ-వైరింగ్' చేస్తూ 'ఇమ్యూనిటీ'ని పెంచుకోవచ్చని ఇటీవలి ఒక విప్లవాత్మక పరిశోధన స్పష్టం చేసింది! అసలు ఆలోచనలకు, ఆరోగ్యానికి ఉన్న ఈ అద్భుతమైన లంకె ఏంటి?! చూద్దాం రండి.ఇంతవరకూ తెలుసుకున్నదిశరీరంపై ఆలోచనలు ప్రభావం చూపుతాయనే భావన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, దీని వెనుక ఉన్న నాడీ మండల నిర్మాణ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో కీలక పురోగతి సాధించింది గత కొన్నేళ్లలోనే అని డార్ట్మౌత్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ అమెరికన్ న్యూరోసైంటిస్ట్ టామ్ వేగర్ అంటారు. ఆశావాద ఆలోచనలు, మంచే జరుగుతుందన్న తలంపు, మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను (ఆనందాన్ని ఇచ్చే భాగం) క్రియాశీలం చేస్తాయి. మంచి ఆహారం తిన్నప్పుడు, ఒక ఆటలో గెలిచినప్పుడు లేదా ఎవరైనా ప్రశ్నించినప్పుడు మనకు కలిగే ఆనందానికి ఈ భాగమే కారణం. ఈ ప్రాంతంలో ఉండే నాడీ కణాలు ‘డోపమైన్’ అనే రసాయనాన్ని విడుదల చేయడం ద్వారా స్పందిస్తాయి– ఇదీ ఇంతవరకు పరిశోధకులు తెలుసుకున్నది.తాజా పరిశోధనతో నిర్థారణఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ మెడికల్ సెంటర్కు చెందిన తామర్ కొరెన్ అనే వైద్య పరిశోధకురాలు, ఎలుకలలో ఈ ‘రివార్డ్ కణాలను’ ఉత్తేజపరచడానికి జన్యు పద్ధతులను ప్రయోగించినప్పుడు ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు కనిపించాయి. ఎలుకలు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో మరింత సమర్థంగా పోరాడగలిగాయి. గుండెపోటు నుండి త్వరగా కోలుకున్నాయి, అంతేకాకుండా వాటిలో కణుతుల పెరుగుదల కూడా నెమ్మదించింది. ఈ విధానం చాలా ఆశాజనకంగా కనిపించడంతో, ఇది మనుషులకు కూడా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలని తామర్ కొరెన్ బృందం భావించింది. అయితే ఎలుకలలో ఉపయోగించిన జన్యుపరమైన పద్ధతులను మనుషులపై ప్రయోగించటం సురక్షితం కాదు. అందుకే, వారు కొందరు వ్యక్తులకు ఒక శిక్షణ ఇచ్చారు. తమ సొంత ఆలోచనల ద్వారానే మెదడులోని ఆ రివార్డ్ భాగాన్ని ఎలా ఉత్తేజపరుచుకోవాలో ఆ వ్యక్తులకు నేర్పించారు. వారు ఈ ప్రయోగాన్ని ఎలా నిర్వహించారో ప్రఖ్యాత ‘నేచర్ మెడిసిన్’ పత్రిక ప్రచురించింది.తొలినాళ్ల ప్రయోగం కుక్కపైన!ఈ రకమైన పరిశోధనలు 1890ల చివర్లో ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త చేసిన ప్రయోగాల నుంచి మొదలయ్యాయి. మన శరీరం ఆహారం నుండి శక్తిని, పోషకాలను ఎలా తీసుకుంటుందో ఆయన అధ్యయనం చేశారు. ఆకలితో ఉన్న ఒక కుక్కకు ఆహారం ఇచ్చే ప్రతిసారీ ఆయన ఒక గంట మోగించేవారు. కొద్ది రోజులకే, ఆహారం ఇవ్వకపోయినా సరే... కేవలం ఆ గంట శబ్దం వినగానే కుక్క నోట్లోంచి లాలాజలం ఊరడం మొదలైంది. మనస్తత్త్వవేత్తలు దీన్ని ‘కండిషన్డ్ రెస్పాన్స్’ (అలవాటైన స్పందన) అని పిలుస్తారు. ఈ పరిశోధనలకు గాను పావ్లోవ్కు 1904లో నోబెల్ బహుమతి లభించింది.తర్వాత ఎలుకల మీదకొన్ని దశాబ్దాల తర్వాత, రాచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ అడెర్, నికోలస్ కోహెన్ ఎలుకలపై ఇలాంటి ప్రయోగమే చేశారు. వారు ఎలుకలకు ఒక తీపి పానీయాన్ని ఇచ్చాక, ఆ వెంటనే వాటి రోగనిరోధక శక్తిని తగ్గించే ఒక మందును ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవారు. కొంతకాలం తర్వాత, ఆ ఇంజెక్షన్ ఇవ్వకుండా కేవలం తీపి పానీయం మాత్రమే ఇచ్చినా ఎలుకల రోగనిరోధక వ్యవస్థలో ఆ మార్పులు కనిపించాయి! ఈ ప్రభావాన్ని ‘సైకోసోమాటిక్’ అంటారు. అంటే ఏదైనా ఒక సంకేతం (గంట శబ్దం వినడం లేదా తీపి పానీయం తాగడం వంటివి) ద్వారా మెదడు శరీరంలో నిజమైన మార్పులను తీసుకురాగలదని దీని అర్థం. ఈ ‘సైకోసోమాటిక్’ అనే మాటకు సమాజంలో కాస్త ప్రతికూల ముద్ర ఉంది. మానసిక ఒత్తిడి లేదా మానసిక స్థితి వల్ల వచ్చే తలనొప్పి, నొప్పులు, వికారం లేదా చర్మ సమస్యల గురించి చెప్పటానికి తరచుగా ఈ పదాన్ని వాడతారు. చాలామంది వీటిని కేవలం ‘భ్రమ’ అని లేదా ఒక చిన్న విషయమని కొట్టిపారేస్తుంటారు.సైకోసోమాటిక్ గీ ప్లాసిబో ఎఫెక్ట్కొన్నిసార్లు సైకోసోమాటిక్కు వ్యతిరేకంగా కూడా జరుగుతుంది. ఉదాహరణకు ‘అసలు మందు’ కాకుండా, కేవలం మందు బిళ్లలా కనిపించే ‘పంచదార బిళ్ల’ వేసుకున్నా కొందరికి జబ్బు నయమవుతుంది. దీన్నే ‘ప్లాసిబో ఎఫెక్ట్’ అంటారు. ఇది కూడా నిజమైన వైద్యం కాదని కొందరు తీసిపడేస్తుంటారు. అయితే, కొందరు పరిశోధకులు మాత్రం ఈ ప్లాసిబో ప్రభావాన్ని ఒక గొప్ప ‘మంత్రం’గా చూస్తున్నారు.ప్లాసిబో ప్రభావం అనేది శరీరంలో జరిగే నిజమైన భౌతిక/జీవక్రియ మార్పులను నియంత్రిస్తుంది. ఆశావాద ఆలోచనలు, మంచి ఫలితం వస్తుందనే నమ్మకం లేదా నిరీక్షణ వల్ల ఇది జరగవచ్చు. కారణం ఏదైనప్పటికీ, ‘ఇది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి’ అని కొరెన్ అంటున్నారు. అది అర్థమైతే, రోగులకు ఇచ్చే చికిత్సలు ఇంకా బాగా పనిచేసేలా ఒక తోడ్పాటు అవుతుందని ఆమె చెబుతున్నారు.‘కొరెన్’ వినూత్న పరిశీలనతామర్ కొరెన్ బృందం ఇప్పుడు ఆ ‘ప్లాసిబో’ ఆలోచనను నిజంగానే పరీక్షించి చూసింది. టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలోని సైకాలజీ ల్యాబ్తో కలిసి పనిచేస్తున్న కొరెన్ బృందం, 85 మంది యువకులను ఈ ప్రయోగం కోసం ఎంచుకుంది. ఆ యువకులందరూ ఆ మెడికల్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకోవటానికి సమ్మతించి వచ్చిన వారు. (హెపటైటిస్–బి అనే వైరస్ సోకకుండా నిరోధించడానికి ఈ టీకా ఇస్తారు. ఈ టీకా.. మనుషుల శరీరం, రోగనిరోధక వ్యవస్థలపై ఎలా స్పందిస్తుందో చూడటం ద్వారా, వారి రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పులను సులభంగా కొలవడానికి పరిశోధకులకు ఒక మార్గం లభిస్తుంది.)న్యూరోఫీడ్బ్యాక్ విధానంఈ ప్రయోగం మొదటి దశ కోసం, ఎంపిక చేసిన వారికి ఫంక్షనల్ ఎమ్ఆర్ఐ స్కాన్లు చేశారు. వారు మెదడును స్కాన్ చేసే యంత్రంలో పడుకున్నారు, ఈ యంత్రం మెదడులోని ఏ భాగాలు చురుకుగా పనిచేస్తున్నాయో చూపిస్తుంది. ప్రతి 40 సెకన్ల సెషన్లో, పాల్గొనేవారిని తమ మెదడుకు పని చెప్పమని (ఆలోచించమని) చెప్పారు. ప్రతి ఒక్కరికీ తాము ఎలా ఆలోచించాలో సొంతంగా ఎంచుకునే అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు: స్క్రీన్ మీద ఉన్న ఒక ఎర్రటి చుక్కను చూడటం, తాము వెళ్లిన ఒక ప్రయాణాన్ని / పర్యటనను గుర్తుచేసుకోవడం, భవిష్యత్తు గురించి ఆలోచించడం, లేదా ఒక గణిత లెక్కను పూర్తి చేయడం... ఇలా. లక్ష్యం ఏంటంటే మన ఆలోచనలు మెదడులోని ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోవటమే.మెదడుపై ఆలోచనల ప్రభావంప్రయోగం తర్వాత మెదడు స్కాన్ చేసిన భాగాలకు 0 నుండి 10 వరకు స్కోర్లు (రేటింగ్) ఇచ్చారు. ఈ స్కోర్లు మెదడు లోపల ఉన్న ‘రివార్డ్ మార్గం’లోని చురుకుదనాన్ని ఆధారంగా చేసుకుని ఇచ్చారు. ఇందులో ప్రధానమైన ఒక భాగాన్ని ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’ అంటారు. ఎలుకలలో ఆరోగ్యకరమైన మార్పులు తేవడానికి కొరెన్ బృందం ఉత్తేజపరిచింది కూడా ఈ భాగాన్నే. ప్రయోగంలో పాల్గొన్నవారిలో కొందరిని యాదృచ్ఛికంగా (ర్యాండమ్గా) ‘కంట్రోల్ గ్రూప్’లో పెట్టారు. వారి స్కోర్లు ఈ భాగంతో సంబంధం లేని వేరే మెదడు ప్రాంతం నుండి తీసుకున్నారు. ఎవరికైనా తక్కువ స్కోరు వస్తే, తదుపరి సెషన్లో తమ ఆలోచనలను వేరే విషయంపై కేంద్రీకరించమని వారికి చెప్పారు. ఒకవేళ వారి స్కోరు పెరిగితే, అదే విధంగా ఆలోచించే పద్ధతిని కొనసాగించమని లేదా ఇంకా మెరుగుపరచుకోమని చెప్పారు. ఈ విధమైన ‘ప్రయత్నిస్తూ నేర్చుకునే’ పద్ధతిని కొన్ని వారాల పాటు 45 నుండి 60 సెషన్లలో నిర్వహించారు. ఈ ప్రక్రియ అంతటా పాల్గొనేవారికి ఉన్న ఒకే ఒక లక్ష్యం.. వీలైనంత ఎక్కువ స్కోరు సాధించడం. అయితే ‘‘మాకు స్కోరు ఎంత వచ్చిందనే దానికంటే, ఆలోచనల ద్వారా ఎంత మెరుగుదల కనిపిస్తోంది అనేది చాలా ముఖ్యమైన విషయం’’ అని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన నిట్జన్ లుబియానకర్ అంటారు.టీకా స్పందనలో మార్పులుచివరి ఎం.ఆర్.ఐ. సెషన్ పూర్తయిన వెంటనే, ప్రయోగంలో పాల్గొన్న వారందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ టీకా శరీరంలో ‘యాంటీబాడీలు’ (వ్యాధి నిరోధక ప్రొటీన్లు) తయారయ్యేలా చేస్తుంది. ఈ యాంటీబాడీలు హెపటైటిస్–బి వైరస్ను గుర్తించి, కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడతాయి. టీకా ఇవ్వడానికి ముందు, ఇచ్చిన రెండు వారాల తర్వాత వారి రక్త పరీక్షలు చేసి యాంటీబాడీలను కొలిచారు. ఎవరైతే తమ ఆలోచనల ద్వారా ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’లో మెదడు చురుకుదనాన్ని పెంచుకోగలిగారో, వారిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హెపటైటిస్–బి యాంటీబాడీల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది! ఇది వారిలో రోగనిరోధక శక్తి బలపడిందని స్పష్టంగా చూపించింది. ఈ యాంటీబాడీల పెంపు 7 నుండి 10 శాతం మాత్రమే అయినప్పటికీ, ఇది చాలా గొప్ప విషయమని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జోనాథన్ కిప్నిస్ అంటున్నారు. ఆయనకు ఈ పరిశోధనతో సంబంధం లేకపోయినా.. మెదడుకి, రోగనిరోధక వ్యవస్థకి ఉన్న సంబంధాలపై ఆయన ప్రత్యేక అధ్యయనాలు చేస్తున్నారు.మనస్సుకు, శరీరానికి ఉన్న ముడి‘‘ఈ పరిశోధనలో నిజంగానే ఒక స్పష్టమైన ఫలితం కనిపించటంతో మేమంతా చాలా ఆశ్చర్యపోయాం’’ అని కొరెన్ తన సిద్ధాంత పత్రంలో రాశారు. ల్యాబ్లోని ఎలుకలలో కనిపించిన ఫలితం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు వాటి నాడీ కణాలను నేరుగా ఉత్తేజపరిచారు. కానీ, మనుషులు కేవలం తమ సొంత ఆలోచనలతో మాత్రమే మెదడులోని ఆ భాగాన్ని యాక్టివేట్ చేసుకోవడం అనేది ఒక సైన్స్ ఫిక్షన్ (కల్పిత కథ) లాగా అనిపించిందని ఆమె అన్నారు.అంతేకాకుండా, ఈ విజయం అనేది ఒకరి వ్యక్తిత్వంపై ఆధారపడి లేదు. తాము చాలా ఆశావాదులమని లేదా నమ్మకంతో ఉంటామని సర్వేలో చెప్పిన అందరికీ ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’ స్కోర్లు ఏమీ ఎక్కువగా రాలేదు. అయితే, ఎక్కువ స్కోర్లు సాధించిన వారిలో ఒక ఉమ్మడి లక్షణం కనిపించింది. వారు ఆశావాద ఆలోచనలను (మంచి జరుగుతుందనే ఆశను) పెంచే మానసిక విధానాలను ఎంచుకున్నారు. కొందరు తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించారు. మరికొందరు తమ జీవితంలో జరిగిన మంచి అనుభవాలపై ధ్యాస పెట్టారు.పాల్గొనేవారు దేని గురించి ఆలోచించాలో పరిశోధకులు స్పష్టంగా చెప్పలేదు కాబట్టి, ఆలోచనలోని చిన్న చిన్న వివరాలు పెద్దగా తేడాను చూపలేదు. బదులుగా, పాల్గొన్నవారు స్క్రీన్ కనిపించే స్కోర్లను బట్టి తమ ఆలోచనలను మార్చుకుంటూ వచ్చారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయమని లుబియానకర్ తెలిపారు. ఈ ఫలితం ‘మన మానసిక స్థితి’ అనేది మన ఆరోగ్యంపై, రోజువారీ శరీర క్రియలపై ఎంత ప్రభావం చూపుతుందో స్పష్టంగా చెబుతోంది... మనకు తెలియకుండానే అది పనిచేస్తుంది’’ అని కొరెన్ అంటున్నారు.ఆశావాదం ఆరోగ్యదాయకంఈ అంతర్జాతీయ పరిశోధన మనకొక స్పష్టమైన, బలమైన సందేశాన్ని ఇస్తోంది: ‘శారీరక ఆరోగ్యానికి ఉదయం చేసే వ్యాయామం, తినే మంచి ఆహారం ఎంత ముఖ్యమో... మన రోజువారీ ఆలోచనా విధానం కూడా అంతే ముఖ్యం!’ అని.మనం నిత్యం అనుభవించే ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు మన వ్యాధినిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంటే... ఆశావాదం, ప్రేమ, మధుర జ్ఞాపకాలు, నమ్మకాలు మన శరీరంలో అదనపు రక్షణ కవచాన్ని నిర్మిస్తాయి. మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను మన సొంత ఆలోచనలతో క్రియాశీలం చేసుకోవడం ద్వారా ఏ వైద్యానికీ లభించని ‘సైకోసోమాటిక్ బూస్ట్’ మన శరీరానికి లభిస్తుంది.కాబట్టి, అనునిత్యం ఆశావాదంతో ఆలోచిద్దాం... మన మెదడును సానుకూలంగా రీ–వైర్ చేసుకుందాం... సహజమైన రోగనిరోధక శక్తితో సంపూర్ణ ఆరోగ్యం పొందుదాం. - సాక్షి స్పెషల్ డెస్క్- తామర్ కొరెన్, వైద్య శాస్త్రవేత్త, టెల్ అవీవ్ మెడికల్ సెంటర్
అది అంత ప్రమాదమా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి!
మా ఏడేళ్ల బాబుకు తరచు దగ్గు వస్తోంది. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. పిల్లికూతలు కూడా వినిపిస్తున్నాయి. డాక్టర్ ఇన్ హేలర్ వాడమన్నారు. కానీ ఇంట్లో వాళ్లు ఒకసారి ఇన్ హేలర్ మొదలుపెడితే జీవితాంతం అదే వాడాల్సి వస్తుందని భయపెడుతున్నారు. నిజంగానే ఇన్ హేలర్ అంత ప్రమాదకరమా? అది అలవాటు అవుతుందా?– సుమలత, విజయవాడ.ఇది మీ ఒక్కరి సందేహం కాదు. పిల్లలకు దగ్గు, వీజింగ్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినప్పుడు దాదాపు ప్రతి పేరెంట్ అడిగే మొదటి ప్రశ్న ఇదే. నిజానికి ఇన్ హేలర్ వల్ల పిల్లలకు ప్రమాదం ఉండదు. కాని, సరైన సమయంలో ఇన్హేలర్ను ఆలస్యం చేయడమే అసలు ప్రమాదం. సమయానికి సరైన చికిత్స అందకపోతే ఊపిరితిత్తుల్లో వాపు పెరిగి, శ్వాస సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. భయంతో చికిత్సను వాయిదా వేయడం కంటే, సరైన నిర్ధారణ చేయించుకుని వైద్యుడి సూచన మేరకు చికిత్స ప్రారంభించడం మంచిది. అందుకే ఇప్పుడు ఇన్ హేలర్, ఉబ్బసం, అలాగే ఆధునిక లంగ్ ఆసిలోమెట్రీ పరీక్షల గురించి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు చూద్దాం.ఇన్ హేలర్ అంటే స్టెరాయిడ్స్ మందా? అది ప్రమాదకరమా?కాదు. ఇది చాలామందిలో ఉన్న అపోహ మాత్రమే. ఇన్ హేలర్లోని మందు నేరుగా ఊపిరితిత్తులకు చేరుతుంది. అందుకే చాలా తక్కువ మోతాదులోనే మంచి ఫలితం ఇస్తుంది. శ్వాసనాళాల్లోని వాపు తగ్గి, పిల్లికూతలు, రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతాయి. పిల్లలు మళ్లీ హాయిగా పరుగులు తీస్తూ ఆటలు ఆడగలుగుతారు. వైద్యుడి సూచన మేరకు వాడితే ఇన్ హేలర్ పూర్తిగా సురక్షితమైన చికిత్స.ఒకసారి ఇన్ హేలర్ మొదలుపెడితే జీవితాంతం వాడాలా?అసలు కాదు. ఇన్ హేలర్ అలవాటు చేసే మందు కాదు. అవసరమైనంత కాలం మాత్రమే వాడాల్సిన చికిత్స. పిల్లల ఆరోగ్యం మెరుగైతే వైద్యుడు మోతాదును క్రమంగా తగ్గిస్తారు. చాలామంది పిల్లల్లో పూర్తిగా ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి చిన్నారి ఆరోగ్య పరిస్థితి వేరు కాబట్టి, చికిత్స వ్యవధి కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది.వీజింగ్ ఉన్న ప్రతి చిన్నారికీ ఇన్ హేలర్ అవసరమా?అన్ని వీజింగ్లూ ఆస్తమా కావు. వైరస్ ఇన్ ఫెక్షన్లు, అలర్జీలు, ఇతర శ్వాస సమస్యల వల్ల కూడా వీజింగ్ రావచ్చు. అందుకే కారణం తెలుసుకోకుండా ఇన్ హేలర్ ప్రారంభించకూడదు. ముందుగా సరైన పరీక్షలు చేసి సమస్యను నిర్ధారించడం చాలా ముఖ్యం.లంగ్ ఆసిలోమెట్రీ పరీక్ష అంటే ఏమిటి?పిల్లల ఊపిరితిత్తుల పనితీరును సులభంగా అంచనా వేసే ఆధునిక పరీక్షే లంగ్ ఆసిలోమెట్రీ. ఇందులో సూదులు ఉండవు, నొప్పి ఉండదు, బలంగా ఊదాల్సిన అవసరమూ లేదు. మూడేళ్ల నుంచి చిన్నారులకు కూడా ఈ పరీక్ష చేయవచ్చు. కొద్ది నిమిషాల్లో పూర్తయ్యే ఈ పరీక్ష ద్వారా ఉబ్బసం ఉందా, చిన్న శ్వాసనాళాల్లో వాపు ఉందా, ఇన్ హేలర్ అవసరమా, ఇస్తున్న చికిత్స సరిగా పనిచేస్తోందా వంటి విషయాలను వైద్యుడు కచ్చితంగా గుర్తించగలుగుతారు. దీంతో అవసరమైన పిల్లలకు మాత్రమే సరైన చికిత్స అందించి, అనవసరంగా ఇన్ హేలర్ వాడాల్సిన పరిస్థితిని నివారించవచ్చు.ప్రతి దగ్గుకూ ఇన్ హేలర్ అవసరమా?లేదు. దగ్గు రావడానికి వైరస్ ఇన్ఫెక్షన్లు, ముక్కు అలర్జీ, సైనస్ సమస్యలు, కడుపులోని ఆమ్లం పైకి రావడం, అడినాయిడ్ సమస్యలు, వాతావరణ కాలుష్యం వంటి అనేక కారణాలు ఉంటాయి. పిల్లవాడు బాగున్నాక కూడా పరీక్ష అవసరమా?అవసరం ఉండొచ్చు. బయటకు దగ్గు, దమ్ము తగ్గిపోయినా ఊపిరితిత్తుల్లో స్వల్ప వాపు కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిని ఈ పరీక్ష ద్వారా గుర్తించి చికిత్స కొనసాగించాలా, తగ్గించాలా లేదా పూర్తిగా ఆపాలా అనే విషయాన్ని వైద్యుడు నిర్ణయిస్తారు.వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు పిల్లలకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తే, పెదాలు లేదా గోళ్లు నీలిరంగులోకి మారితే, పిల్లలు మాట్లాడలేకపోయినా, తినలేకపోయినా, ఇన్ హేలర్ వాడిన తర్వాత కూడా ఉపశమనం లేకపోయినా, తరచు వీజింగ్ వస్తున్నా లేదా రాత్రిపూట దగ్గు వల్ల నిద్రపట్టకపోయినా వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. ఇటువంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఇన్ హేలర్ అనేది భయపడాల్సిన చికిత్స కాదు. సరైన సమయంలో ప్రారంభిస్తే అది పిల్లల ఊపిరితిత్తులను రక్షించే నమ్మకమైన మిత్రుడు. అవసరం లేనప్పుడు వాడకూడదు. అవసరమైనప్పుడు మాత్రం ఆలస్యం చేయకూడదు.- డా. కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్మేనిమాట..నమలడానికి పని ఇస్తే మెదడు మేల్కొంటుంది! గట్టిగా ఉండే పండ్లు, కూరగాయలు నమలడం వల్ల దవడలకే కాదు, మెదడుకూ మేలు జరుగుతుంది. నమిలే ప్రక్రియ వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరిగి, అప్రమత్తత మెరుగుపడుతుంది. అంటే... ఒక యాపిల్ తినడం కూడా మెదడుకు చిన్న మేల్కొలుపే!
అంతర్జాతీయం
పాక్లో భీకర ఆత్మాహుతి దాడి
పెషావర్: పాకిస్తాన్లోని కల్లోలిత ఖైబర్ ప్రావిన్స్లో ఆదివారం భీకర ఆత్మాహుతి దాడి జరిగింది. స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో చేపట్టిన శాంతి ర్యాలీ సమయంలో ఘటన చోటుచేసుకుంది. ర్యాలీ పోలీస్స్టేషన్ సమీపానికి రాగానే ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పేలుడు తీవ్రతకు ఐదుగురు పోలీసులు, ఒక చిన్నారి సహా 14 మంది చనిపోయారు. గాయాలపాలైన మరో 15 మందిని ఆస్పత్రులకు తరలించారు. ఈ దాడికి తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. స్థానిక గిరిజన కౌన్సిల్ స్వాత్ అమన్ జిర్గా సారథ్యంలోని జరిగిన ఈ ర్యాలీలో పాల్గొన్న వారు శాంతి నెలకొనాలంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. కాగా, కబాల్ పోలీస్ స్టేషన్లోకి చొరబడేందుకు యత్నించిన దుండగుడిని ప్రధాన గేట్ వద్ద పోలీసులు అడ్డుకోగా, అతడు అక్కడికక్కడే పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో పెనుముప్పు తప్పిందన్నారు.
చైనా సోషల్ మీడియాలో భారత్పై విషం
బీజింగ్: చైనా సోషల్ మీడియాలో భారత్కు వ్యతిరేకంగా దూషణాత్మక కంటెంట్ పెరిగిపోతోంది. భారత వృత్తి నిపుణులకు చైనా ప్రభుత్వం వర్క్ వీసాలు జారీ చేయకుండా తిరస్కరిస్తోంది. చైనాలో పని చేస్తున్న భారతీయుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు, ఉపాధి పొందడంపై ఆంక్షల విధిస్తోంది. ఈ పరిణామాలపై చైనాలోని ప్రవాస భారతీయలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమలో వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు. భారతీయ వృత్తి నిపుణులను ఒకచోట చేర్చి, ఆ వర్గానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాయబార కార్యాలయం శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి, కౌన్సిలర్లు నితిన్జీత్ సింగ్, రమేష్ సింగ్లతో కలిసి ప్రవాస భారతీయులు వివిధ అంశాలపై చర్చించారు. చైనా సోషల్ మీడియా వేదికలపై భారతీయుల ఆహారపు అలవాట్లు, సంస్కృతిని లక్ష్యంగా చేసుకుని వారిపై దూషణలతో కూడిన కంటెంట్ పెరుగుతోందని వెల్లడించారు. కాన్సులర్ సేవలకు సంబంధించిన ఇబ్బందులను ప్రస్తావించారు. తమ జీవిత భాగస్వాములకు ఇక్కడ ఉద్యోగాలు నిరాకరిస్తున్నారని తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని విక్రమ్ దొరైస్వామి చెప్పారు. చైనా సోషల్ మీడియాలో ప్రతికూల, దూషణాత్మక కంటెంట్ పట్ల వ్యక్తమవుతున్న ఆందోళనలపై స్పందించారు. అటువంటి కంటెంట్ పెరుగుదల పట్ల చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. తమ వంతుగా వాస్తవ ఆధారిత సమాచారాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేయడం ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తిని ఎదుర్కొంటున్నామని ప్రకటించారు. భారతదేశపు విభిన్న సంస్కృతి, వంటకాలను ప్రదర్శించేందుకు చైనాలో పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఎంబసీ యోచిస్తున్నట్లు తెలిపారు.
మంచుకొండలలో నిర్మల్ పుర్జా భౌతికకాయం
న్యూఢిల్లీ: ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా భౌతికకాయాన్ని పర్వతం నుంచి కిందకి తీసుకువస్తున్నట్లు అల్పైన్ క్లబ్ ప్రకటించింది. ఆయనతో పాటు మరో నలుగురు మృతదేహాలను తరలిస్తున్నట్లు తెలిపింది. ఉత్తర పాకిస్థాన్లోని ప్రపంచ అత్యుత్తమ శిఖరాలలో ఒకటైన బ్రాడ్ పీక్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది బృంద సభ్యులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ విషయమై అల్పైన్ క్లబ్ జనరల్ సెక్రటరీ అయ్యాజ్ షిగ్రి మాట్లాడుతూ.." నిర్మల్ పుర్జా, మరో ఇద్దరు నేపాల్ జాతీయులు, ఒక చైనా దేశస్థుడితో కలిపి మొత్తం నాలుగు మృతదేహాలను గ్రౌండ్ రెస్క్యూ టీమ్ పర్వతం కిందకు తీసుకువస్తున్నారు.మరింత ఎత్తైన ప్రాంతంలో మరో మృతదేహం ఉన్నట్లు రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. అయితే అత్యంత ప్రమాదకరమైన భూభాగం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అక్కడ మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేయడం ఇప్పట్లో సాధ్యం కాదు" అని ఆయన స్పష్టం చేశారు.కాగా నేపాల్కు చెందిన నిర్మల్ పూజా పర్వాతారోహనలో ఎన్నో రికార్డులను అవలీలగా తన ఖాతాలో వేసుకున్నారు. పీవోకేలో బ్రాడ్వీక్ పర్వతాన్ని అధిరోహించే క్రమంలో భారీ హిమపాతంలో చిక్కుకుని దురదృష్టవశాత్తు మృత్యువాతపడ్డారు.ఈ విషయాన్ని శనివారం ఆయనకు చెందిన అడ్వెంచర్ సంస్థ ఎలైట్ ఎక్స్పెడ్ అధికారికంగా ధృవీకరించింది. 2026 జూలై 30(గురువారం) మధ్యాహ్నం సమయంలో నిర్మల్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల అంతర్జాతీయ బృందం క్యాంప్-2 నుండి క్యాంప్-3కి వెళ్తుండగా దాదాపు 7 వేల మీటర్ల ఎత్తులో భారీ హిమపాతం విరుచుకుపడింది. ఈ ప్రమాదంలో నిర్మల్తో పాటు అమెరికా, ఒమన్, నేపాల్కు చెందిన పర్వతారోహకులు, గైడ్లు అందరూ మరణించారు.నిర్మల్ పూజా విజయాలుప్రపంచంలోని 14 అత్యంత ఎత్తైన 8,000 మీటర్ల శిఖరాలను అతి తక్కువ సమయంలో (6 నెలల 6 రోజుల్లో) అధిరోహించిన ఘనత నిర్మల్ నిమ్స్ది.8,000 మీటర్ల కంటే ఎత్తైన శిఖరాలను ప్రపంచంలోనే అత్యధిక సార్లు (దాదాపు 57 సార్లు) అధిరోహించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారుసప్లిమెంటల్ ఆక్సిజన్ (కృత్రిమ ఆక్సిజన్) సహాయం లేకుండానే 8,000 మీటర్ల శిఖరాలను అత్యధిక సార్లు విజయవంతంగా అధిరోహించిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది.బ్రిటిష్ సైన్యంలోని గూర్ఖా బ్రిగేడ్ మరియు స్పెషల్ బోట్ సర్వీస్ (SBS) ప్రత్యేక బలగాలలో సేవలందించారు.శీతాకాలంలో మొదటిసారిగా K2 శిఖరాన్ని అధిరోహించిన బృందంలో సభ్యులు2021 జనవరిలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 'కే2' (K2) పర్వతాన్ని శీతాకాలంలో అధిరోహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి 10 మంది బృందానికి ఆయన నాయకత్వం వహించారు. అప్పటివరకు వింటర్ సీజన్లో K2 పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేకపోయారుప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాలైన ఎవరెస్ట్, లోట్సే మరియు మకాలు శిఖరాలను కేవలం 48 గంటల్లో అధిరోహించిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారుఈ ఏడాది మే నెలలో పుర్జా అదనపు ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ మరియు లోట్సేలను అత్యంత వేగంగా దాటిన తన స్వంత ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు.ఆయన కేవలం 13 గంటల్లో ఎవరెస్ట్ శిఖరం నుండి లోట్సే శిఖరానికి చేరుకున్నారు.
ఏపీ సంక్షేమం కోసం వైఎస్ జగన్ మళ్లీ రావాలి.. మాజీ ఎంపీ
వాషింగ్టన్: ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు మరోసారి అవకాశం కల్పించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న.. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐలు తమవంతు సహకారం అందించాలని మాజీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అమెరికా బాల్టిమోర్లో జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) జాతీయ మహాసభల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సభల్లో ప పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గత రెండు రోజులుగా ఉత్తర అమెరికా నలుమూలల నుంచి వచ్చిన తెలుగు సోదరులు, సోదరీమణులు, ప్రముఖులు, వృత్తి నిపుణులు, శ్రేయోభిలాషులతో కలుసుకుని ఆత్మీయంగా ముచ్చటించే అవకాశం లభించింది. వారందరు దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం, మానవత్వం, ప్రజాకేంద్రిత పాలన గురించి తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది.అన్నారు.అనంతరం తన ప్రసంగంలో డా. వై.ఎస్.ఆర్ ఆశయాలను, విలువలను వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆయన నిబద్ధత, పారదర్శక.. పాలన, పేదల పట్ల ఉన్న అంకితభావం గురించి వారందరికీ వివరించానని తెలిపారు. ఈ సందర్భంగా ATA ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాయకత్వానికి, నిర్వాహకులకు, విశిష్ట అతిథులకు సభకు హాజరైన తెలుగు సమాజానికి వైఎస్సార్సీపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్ హెల్త్ హాస్పిటల్స్ ఛైర్మన్ డా. ప్రేమ్ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాతీయం
ఒడిశా వరదల్లో కొత్త భయం
భువనేశ్వర్ : ఒడిశాలోని జాజాపూర్ జిల్లాలో వరదల వల్ల ప్రజలు పడే అవస్థలు అంతా ఇంతా కాదు. అసలే వరదల వల్ల గూడు చెదిరి ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇప్పుడు పాములతో సరికొత్త సమస్య వచ్చి పడింది. వరదనీటితో పాటు పాములు సైతం ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళలనలకు గురవుతున్నారు. విషపు జీవులు కరిచివేయడం వల్ల ఇప్పటికే దాదాపు 76మందికి పైగా ఆసుపత్రులలో చేరారు.దశరథ్పూర్ బ్లాక్లోని గ్రామాల్లోని వీధులు, సంతల రోడ్లపైకి విపరీతంగా వరద చేరింది. దేవాలయాలు ఇళ్లు, ప్రభుత్వకార్యాలయాలన్నిటినీ వరద ముంచెత్తింది. దీంతో ఇళ్లలోని సామాగ్రి అంతా నీటిపాలు కావడంతో ప్రజలు తినడానికి, నిద్రపోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఈ సమస్యలతో సతమవుతున్న ప్రజలకు ఇప్పుడు ఊహించని విపత్తు కొత్త తలనొప్పిని తెచ్చింది. భారీవరదలకు విష సర్పాలు , ఇతర విష సరీసృపాల ఇండ్లలోకి చేరుతున్నాయి. ప్రజల ఇళ్లు, నివాసాలు, పంజరాలలో ఆశ్రయం పొందేందుకు యత్నిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అక్కడి ఆరోగ్యశాఖ అందించిన వివరాల ప్రకారం. గత ఐదు రోజుల్లో మంగళ్పురా మెడికల్ సెంటర్లో 76 మందికి పైగా చికిత్స పొందారని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధికారి అమృత ప్రీతమ్ మల్లా తెలిపారు. వీరిలో 37 మందిని గుర్తుతెలియని జంతువులు, 11 మందిని పాములు కాటు వేసినట్లు తెలిపారు.దీంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విషసర్పాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జాగ్రత్తలుకరెంటు లేనప్పుడు టార్చ్ లైట్ను ఉపయోగించాలిచీకటి ప్రదేశంలో తిరిగేటప్పుడు లైటును ఉపయోగించాలి. బూట్లు, బట్టలు వేసుకునే ముందు వాటిని జాగ్రత్తగా సరిచూసుకోవాలి.నేలపై పడుకోవడానికి బదులుగా, మంచం వంటి ఎత్తైన ప్రదేశాన్ని ఉపయోగించాలి.ఒకవేళ పాములు లేక ఇతర విషసర్పాలు కాటు వేసినట్లు అనుమానం వస్తే స్వంత చికిత్స కాకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అని ప్రకటన విడదల చేశారు.
కాలకృత్యాలకు వెళ్లి.. మొసలి నోటికి చిక్కి..?
కేంద్రపారా: ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్టముండై బ్లాక్ పరిధిలోని దామోదర్ పట్నా గ్రామంలో మొసలి దాడిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. నదీతీర ప్రాంతాలలో పెరుగుతున్న మొసళ్ల ముప్పుపై స్థానికుల్లో ఆందోళన పెరిగింది. గతంలోనూ ఇలాంటి ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆధారాలున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం.. అళపువ పంచాయతీ పరిధిలోని దామోదర్ పట్నా గ్రామానికి చెందిన సుచిత్రా దాస్ సోమవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నదీతీరానికి వెళ్లారు. ఎంతకీ ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. నది ఒడ్డున ఆమెకు సంబంధించిన వస్తువులు లభించడంతో.. ఆమెను ఏదైనా మొసలి నీళ్లలోకి లాగికెళ్లి ఉంటుందనే తీవ్ర అనుమానం వ్యక్తమైంది.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సుచిత్రా దాస్ ఆచూకీ కోసం బోట్లు, ప్రత్యేక పరికరాల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వంటమనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సుచిత్రా దాస్.. తన కుటుంబ పోషణకు ఏకైక ఆధారం కావడంతో, ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: కర్ణాటక మంత్రివర్గంలో కీలక మార్పులు.. కొత్త మంత్రులు వీరే!
జంతర్ మంతర్ కథే వేరు.. 300 ఏళ్ల ఆసక్తికర ప్రయాణం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఆందోళనలు, నినాదాలు, ప్రజా ఉద్యమాలు. ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయాలన్నా.. తమ సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లాలన్నా.. అనేక వర్గాలకు ఇది దశాబ్దాలుగా కీలక వేదికగా మారింది. తాజాగా నీట్ పరీక్షల అక్రమాలపై విద్యార్థుల నిరసనలకు కూడా ఇదే ప్రాంతం వేదికైంది. ఇలాంటి చరిత్ర ఉన్న జంతర్ మంతర్ను నిరసనల కోసం వినియోగించడంపై పునరాలోచించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం, కేంద్రం–ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడంతో ఈ చారిత్రక ప్రాంతం మరోసారి చర్చలోకి వచ్చింది.అయితే జంతర్ మంతర్ పుట్టుక నిరసనల కోసం కాదు. ఖగోళ పరిశోధనల కోసం నిర్మించిన ఈ ప్రదేశం.. కాలక్రమేణా ప్రజల సమస్యలు ప్రతిధ్వనించే ప్రజాస్వామ్య వేదికగా మారింది. ఒకప్పుడు సూర్యుడు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసిన ఈ ప్రాంతం.. ఆ తర్వాత పాలకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రజలు తమ గళాన్ని వినిపించే వేదికగా పరిణామం చెందింది. మరి ఈ మార్పు ఎలా జరిగింది? జంతర్ మంతర్ చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాలు ఏవి? ఆ లోతులోకి వెళ్తే. ఖగోళ కేంద్రం నుంచి ఉద్యమాల వేదిక వరకుజంతర్ మంతర్ను 18వ శతాబ్దంలో జైపూర్ మహారాజు సవాయి జైసింగ్-2 నిర్మించారు. 1724లో నిర్మించిన ఈ ఖగోళ పరిశోధనా కేంద్రంలో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసేందుకు భారీ పరికరాలను ఏర్పాటు చేశారు. ఆ కాలంలో భారతదేశ శాస్త్రీయ ఆలోచనలకు ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది.జంతర్ మంతర్ అనే పేరు కూడా దాని చరిత్రతో ముడిపడి ఉంది. సంస్కృతంలోని ‘యంత్ర’ (పరికరం), ‘మంత్ర’ (సూత్రం లేదా లెక్కింపు) అనే పదాల నుంచి ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఖగోళ గణనలకు ఉపయోగించే ప్రత్యేక యంత్రాల కారణంగా ‘యంత్ర మంత్ర’ కాలక్రమంలో ‘జంతర్ మంతర్’గా ప్రాచుర్యంలోకి వచ్చింది.కానీ కాలం మారింది. ఢిల్లీ నగరం విస్తరించడంతో పాటు జంతర్ మంతర్ చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు, అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు సమీపంగా ఉండటం వల్ల తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం మొదలైంది. అలా ఖగోళ పరిశోధనలకు వేదికగా ప్రారంభమైన ఈ ప్రదేశం.. క్రమంగా దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిరసన వేదికల్లో ఒకటిగా మారింది.అన్నా ఉద్యమంతో దేశవ్యాప్త గుర్తింపుజంతర్ మంతర్కు భారీ గుర్తింపు తెచ్చిన ఉద్యమాల్లో 2011లో అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమం ఒకటి. బలమైన లోక్పాల్ చట్టం కోసం జరిగిన ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో భాగమయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని దేశం మొత్తం చూసేలా చేసిన ఈ ఉద్యమం తర్వాత జంతర్ మంతర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.అయితే అన్నా ఉద్యమంతోనే జంతర్ మంతర్ నిరసనల చరిత్ర ప్రారంభం కాలేదు. అంతకుముందు నుంచే ఉద్యోగాలు, కార్మిక హక్కులు, సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అనేక సంఘాలు, రాజకీయ పార్టీలు ఇక్కడ ఆందోళనలు నిర్వహించాయి. అన్నా ఉద్యమం మాత్రం ఈ ప్రాంతాన్ని ప్రజా ఉద్యమాలకు ప్రతీకగా నిలిపింది.నిర్భయ ఘటనతో యువత కదిలి..2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. న్యాయం కోసం, కఠిన చట్టాల కోసం జరిగిన నిరసనల్లో జంతర్ మంతర్ కీలక కేంద్రంగా మారింది. యువత ఒక్కటిగా పోరాటానికి దిగింది. ఈ ఉద్యమం ఒక ఘటనకు వ్యతిరేకత మాత్రమే కాదు.. దేశంలో మహిళల భద్రత, న్యాయ వ్యవస్థ, చట్టాలపై పెద్ద చర్చకు దారితీసింది. ప్రజల ఆగ్రహం ప్రభుత్వాలను స్పందించేలా చేసిన సందర్భాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.రైతు ఉద్యమాలకు సాక్ష్యంజంతర్ మంతర్ చరిత్రలో రైతు ఉద్యమాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. వ్యవసాయ సమస్యలు, కనీస మద్దతు ధర, రైతుల ఆదాయం వంటి అంశాలపై రైతు సంఘాలు ఎన్నోసార్లు ఇక్కడ తమ గళాన్ని వినిపించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020–21లో జరిగిన రైతు ఉద్యమ సమయంలో జంతర్ మంతర్ మరోసారి కీలకంగా మారింది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఆందోళనలు సాగినప్పటికీ.. రైతు సంఘాలు ఇక్కడ ప్రత్యేక నిరసనలు నిర్వహించి తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి.ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యవసాయ విధానాలపై పెద్ద చర్చకు దారితీసింది. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది.రెజ్లర్ల ఆందోళనతో మరోసారి చర్చలోకి2023లో మహిళా రెజ్లర్ల నిరసనలతో జంతర్ మంతర్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఆరోపణలకు సంబంధించి సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఇక్కడ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు క్రీడా రంగంలో మహిళల భద్రత, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై పెద్ద చర్చకు కారణమయ్యాయి.నీట్ నిరసనలు.. కొనసాగుతున్న గళంఇటీవల నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై విద్యార్థులు కూడా జంతర్ మంతర్ను ఆశ్రయించారు. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్ వంటి అంశాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం, వివిధ ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలపై కూడా అనేక వర్గాలు ఇక్కడ నిరసనలు చేపట్టాయి. ఇలా జంతర్ మంతర్ కేవలం ఒక ప్రాంతంగా కాకుండా.. ప్రజల సమస్యలు దేశవ్యాప్తంగా వినిపించే వేదికగా మారింది.ఇబ్బందులు కూడా ఉన్నాయా?అయితే జంతర్ మంతర్ నిరసనల వల్ల సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కొందరు వాదిస్తున్నారు. తరచూ జరిగే ఆందోళనల కారణంగా సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని, స్థానిక ప్రజలు, అత్యవసర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్కు బదులుగా ప్రత్యేక నిరసన వేదిక ఏర్పాటు చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నుంచి వివరాలు కోరింది.ప్రజాస్వామ్యానికి ప్రతీక.. మార్పు అవసరమా?జంతర్ మంతర్ భారత ప్రజాస్వామ్యంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపించే హక్కుకు ఇది ప్రతీకగా నిలిచింది. అధికార కేంద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రజల గొంతు పాలకుల వరకు చేరే అవకాశం కల్పించింది. అయితే నగర నిర్వహణ, సాధారణ ప్రజల సౌకర్యాలు కూడా అంతే ముఖ్యమని న్యాయస్థానం పరిశీలిస్తోంది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న.. జంతర్ మంతర్ ఉద్యమాల వేదికగా కొనసాగుతుందా? లేక కొత్త నిరసన కేంద్రానికి మారుతుందా? అనేది.
‘మోదీనే బెస్ట్’ అంటూ వ్యాఖ్యలు.. సీజేపీ నేత దాస్ ‘పోస్ట్’ కలకలం
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్కు సంబంధించిన 2015 నాటి ఓ పాత సోషల్ మీడియా పోస్ట్ మళ్లీ వైరల్గా మారింది. అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై విమర్శలు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ప్రస్తుతం సీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుండటంతో, సౌరవ్ దాస్ గత వ్యాఖ్యలను నెటిజన్లు మళ్లీ ప్రస్తావిస్తున్నారు.2015లో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి సౌరవ్ దాస్ చేసిన పోస్టులో, "ఆప్కు ఏమైంది? పూర్తిగా మారిపోయింది. ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. మీరు కూడా కాంగ్రెస్లాగే మారిపోయారు. మోదీజీ చాలా మెరుగైన నాయకుడు... ఆయనే బెస్ట్" అని పేర్కొన్నారు. ఆ పోస్టు స్క్రీన్షాట్లు ప్రస్తుతం పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతున్నాయి. ఈ పాత పోస్టును ఆధారంగా చేసుకుని నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు గతంలో మోదీకి మద్దతు తెలిపిన వ్యక్తి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే పార్టీకి అధికార ప్రతినిధిగా ఉండడాన్ని ప్రస్తావిస్తుండగా, మరికొందరు రాజకీయ నాయకుల అభిప్రాయాలు కాలక్రమేణా మారవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.Whats wrong with AAP?completely changed. Double standards. U too are like congress. modiji is far better.. the best one. @ArvindKejriwal— Saurav Das (@SauravDassss) December 19, 2015సౌరవ్ దాస్ ప్రస్తుతం అభిజీత్ దిప్కే స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమాలు, విద్యా సంస్కరణలు తదితర అంశాలపై పార్టీ తరఫున తరచూ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇటీవల సీజేపీ కార్యకలాపాలు, కేంద్ర ప్రభుత్వంపై పార్టీ వైఖరి చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆయన పాత సోషల్ మీడియా పోస్టులు కూడా మళ్లీ వెలుగులోకి వచ్చాయి. అయితే వైరల్ అవుతున్న ఈ పాత పోస్టుపై సౌరవ్ దాస్ గానీ, సీజేపీ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అలాగే, 2015లో చేసిన ఆ వ్యాఖ్యలపై ఆయన ప్రస్తుత వైఖరి ఏమిటన్న విషయంపైనా ఎలాంటి స్పష్టీకరణ వెలువడలేదు.
ఎన్ఆర్ఐ
ఘనంగా తానా ప్రపంచసాహిత్యవేదిక 94వ సమావేశం
తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. “ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత” అనే అంశం మీద ఆదివారం జరిగిన 94 వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది. యూకేలో శస్త్రచికిత్సా వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా. చంద్ర చెరువు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తమ కుటుంబం తరపున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో శస్త్రచికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అలాగే ఇదే సందర్భంలో వెలువరించిన “మహర్షి సుశ్రుత ఏ కంపెండియం – ఫాదర్ ఆఫ్ సర్జరీ” అనే గ్రంధంలో విలువైన వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదములు అన్నారు. వేల సంవత్సరాలనాడే సుశ్రుతుడు సోదాహరణంగా వివరించిన వైద్య పద్దతులు, ఉపయోగించిన శస్త్ర పరికరాల జాబితా పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని అన్నారు. సుశ్రుతుడు రచించిన “సుశ్రుత సంహిత” గ్రంధంలోని అనేక విషయాలను ఇతర భారతీయ భాషలలోకి, ప్రపంచ భాషలలోకి అనువాదం కావలసిన అవసరం ఉందని, వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కారాలు స్ఫూర్తి దాయకంగావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.” తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వేల సంత్సరాలనాడే ప్రపంచం ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలగా ఉన్న “సుశ్రుత సంహిత” అనే ఆయుర్వేద గ్రంథం వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం అన్నారు. మనిషి సాధారణంగా 1,120 రకాల వ్యాధులకు గురిఅవుతాడని, 700 కు పైగా మొక్కల గురించి ఏ మొక్క, ఏ వ్యాధిని, ఎలా తగ్గిస్తుందో ప్రయోగాత్మకంగా నిరూపించాడు. 64 రకాల ఖనిజాల నుంచి అవసరమైన మందులను ఎలా తయారుచేసుకోవచ్చో వివరించాడు. ఈ గ్రంథంలో 120 శస్త్రపరికరాల గురించి వివరించాడు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! అనస్తీషియా ప్రక్రియకు ఆద్యుడు సుశ్రుతుడు. ప్రొస్టేట్ గ్రంథిని జాగ్రత్తగా తొలగించే పద్ధతి, విరిగిన ఎముకలు తిరిగి అతుక్కునేందుకు శస్త్రచికిత్స సూత్రాలు, తెగిన శరీర భాగాలను అతికించటం, అతి సున్నితమైన పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించగల్గడం, గర్భిణీస్త్రీ ఉదరంలో శిశువు పరిణామ క్రమం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్లు చేసే విధానం, వ్యాధిరహితంగా ఉండేందుకు ఏ ఏ కాలాల్లో, ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి, ఎలాంటి తృణధాన్యాలు, పప్పుదినుసుల వాడాలి అనే సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాధమికదశనుండే విద్యార్థులకు పాట్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి (డెట్రాయిట్ నుండి) సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి, డా. వి. కె రాజు (వెస్ట్ వర్జీనియా నుండి) సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్దతుల గురించి, డా. శేషు శర్మ (వాషింగ్టన్ డి.సి నుండి) సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహరం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే డా. పండరి గంటి (లాస్ ఏంజిల్స్ నుండి) సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంధంలో పేర్కొన్నారని, అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్న అతిథులందరికీ, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. (చదవండి: ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు)
డల్లాస్లో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశం
సాక్షి, అమరావతి: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ప్రముఖ నగరం డల్లాస్లో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. 2019–2024 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథ కాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్క రణల గురించి వివరించారు. పార్టీ చేపడుతున్న డిజిటల్ కార్యక్రమాలను వారికి పరిచయం చేశారు. ‘జననన్న కోసం మాట్లాడుదాం.. జగనన్న కోసం రాద్దాం.. జగనన్న కోసం పోస్ట్ చేద్దాం.. జగనన్న కోసం కోడ్ చేద్దాం (డిజిటల్ టూల్స్/ యాప్లు/టెక్ పరిష్కారాలు)..’ అని పార్టీని సాంకేతికంగా మరింత బలోపేతం చేసే కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ పోర్టల్ (www.ysrcpnriwing.org)ను ప్రారంభించారు. జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించారు. పార్టీ కోసం సేవలందించే ఎన్ఆర్ఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు పార్టీ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామంటూ వైఎస్ జగన్ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు.
కెనడాలో పంజాబ్కు చెందిన మహిళ దారుణ హత్య
కెనడాలో ఎడ్మింటన్లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 23 ఏళ్ల దమన్ ప్రీత్ కౌర్ దారుణ హత్య కలకలం రేపింది. ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.ఎడ్మంటన్ పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలు, జూలై 9న పంజాబ్లోని లుధియానా జిల్లా, సమ్రాలా నివాసి దమన్ ప్రీత్కౌర్ స్పృహలేకుండా, తీవ్ర గాయాలతో పడి ఉందనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆగ్నేయ ఎడ్మంటన్లోని సిల్వర్బెర్రీ నివాస ప్రాంతానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కౌర్ కన్నుమూసింది. ఇది హత్యేనని పోస్ట్ మార్టంలో నివేదిక ద్వారా ధృవీకరణ అయింది. ఈ కేసులో గత కొన్నాళ్లుగా దమన్ ప్రీత్ కౌర్తో కలిసి నివసిస్తున్న (Live-in Partner) ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల రీతీష్ కమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతనే గొంతు నులిమి చంపినట్టు భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వేరే అనుమానితులు ఎవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు. 'సెకండ్ డిగ్రీ మర్డర్' ఆరోపణలు నమోదు చేశారు.మరోవైపు కౌర్ మృతదేహాన్ని భారతదేశంలోని ఆమె స్వగ్రామానికి తరలించడానికి, అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబ సభ్యులకు సహాయంగా ఒక GoFundMe క్యాంపెయిన్ ప్రారంభించారు. 20 వేల డాలర్లకు గాను ఇప్పటికే దాదాపు 19వేల డాలర్ల విరాళాలు అందాయి. ఇదీ చదవండి: 150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్లో మానవత్వపు పరిమళాలు
అమెరికాలో నిర్మల్ జిల్లా యువకుడి మృతి
నిర్మల్ జిల్లా : అమెరికాలో చదువు పూర్తయి ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నాడు. కానీ విధి చిన్నచూపు చూసింది. గత శనివారం మోటారు సైకిల్పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం అతడిని పుట్టిన రోజునే మృత్యు ఒడికి చేర్చింది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన గన్ను శ్రీనివాస్రెడ్డి, విశ్వరూప దంపతుల కుమారుడు నిత్యానందరెడ్డి (24) మూడేళ్ల కిందట అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్కు ఎంఎస్ చదవడానికి వెళ్లాడు. చదువు పూర్తయి అక్కడే ఉంటూ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. మరో మూడు నెలల్లో ఇంటికి వస్తానని, ఆ తర్వాత పెళ్లి సంబంధాలు చూస్తానని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. కాగా, గత శనివారం మోటార్సైకిల్పై వెళ్తూ అదుపు తప్పి కారును ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన అతడిని అక్కడి ఆస్పత్రిలో చేరి్పంచారు. నిత్యానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు. కుటుంబ సభ్యుల మాటలు వింటే కోలుకుంటాడేమోనని అతడి స్నేహితులు భావించారు. గురువారం అతడి పుట్టిన రోజు కావడంతో ఆస్పత్రికి వచ్చి బాధాతప్త హృదయంతో కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆరోగ్యం విషమించడంతో చనిపోయాడు. శ్రీనివాస్రెడ్డి, విశ్వరూప దంపతులకు కుమారుడు నిత్యానందరెడ్డి, కూతురు ఉన్నారు. అమెరికా వెళ్లి పెద్ద చదువు చదివిన కుమారుడు కుటుంబానికి అండగా ఉంటాడని ఆశించారు. కానీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
క్రైమ్
హింసించి.. చంపేశారా..?!
అనంతపురం సెంట్రల్: ఆస్పత్రి భవనంపై నుంచి యువకుడు నగ్నంగా దూకడం.. చికిత్స పొందుతూ కొంతసేపటి తర్వాత మృతి చెందడం నగరంలో కలకలం రేపింది. ఆత్మహత్య అని ఆస్పత్రి వారు చెబుతున్నా... చిత్రహింసలు పెట్టి చంపేశారని పలువురు ఆరోపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం రామాపురం గ్రామానికి చెందిన దబ్బర అశోక్ (30) అనంతపురంలోని హిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు కమీషన్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. గత శుక్రవారం రాత్రి ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి నగ్నంగా కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసి.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడని ఆస్పత్రి వారు తెలిపారు. ఆ రాత్రి ఏం జరిగింది..? అశోక్ను ఆస్పత్రికి చెందిన ప్రముఖ వ్యక్తి, ఓ వివాహిత భర్త, మరో రౌడీషిటర్ కలిసి ఆస్పత్రిలోనే ఓ గదిలో బంధించి.. బట్టలూడదీసి చిత్రహింసలకు గురిచేశారని తెలుస్తోంది. నేరుగా చంపకుండా.. భవనంపై నుంచి దూకి చనిపోవాలని ప్రేరేపించినట్లు సమాచారం. అయితే అశోక్ భవనంపై నుంచి దూకినా స్వల్ప గాయాలే కావడంతో ప్రాణభయంతో పైకిలేచి నడుస్తూ రాగా.. క్షణాల్లో కొందరు వచ్చి ఈడ్చుకుంటూ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. దీంతో సదరు వ్యక్తులు ఆస్పత్రిలో ఆ యువకుడి ఊపిరి తీసేశారని తెలిసింది. మృతి చెందిన తర్వాత ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. మృతుడి బంధువులు వచ్చి ఆందోళన చేసి, డయల్ 100కు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువకుడి వీపుపై వాతలు, బలమైన దెబ్బలు ఉండటం కనిపించింది. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు బయటకు రాకుండా ఆస్పత్రి యాజమాన్యం జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. ప్రేమాయణమా.. అప్పుల వారి పనా..? యువకుడి మృతికి ప్రేమాయణం.. లేదా అప్పులే కారణమై ఉండవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. అశోక్ ఓ వివాహితతో వాట్సాప్ చాటింగ్ చేసేవాడని, ఈ క్రమంలోనే ప్రేమకు దారి తీసి ఉండవచ్చని, విషయం తెలిసిన తర్వాత అతడి అడ్డు తొలగించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అప్పులు కూడా చేశాడని, వసూలు చేసే క్రమంలో ఇలా చావబాది.. ఊపిరి తీసేశారా అన్న అభిప్రాయమూ వినపడుతోంది. నిందితులను కాపాడేందుకు ఒత్తిళ్లు.. ఈ కేసులోని నిందితుల్లో హాస్పిటల్కు చెందిన ప్రముఖుడు శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ మహిళా ప్రజాప్రతినిధి కుమారుడు, శింగనమల నియోజకవర్గంలోని ప్రముఖ వ్యక్తికి సదరు వ్యక్తి బంధువు. దీంతో అతన్ని కాపాడేందు కోసం అధికార తెలుగుదేశం పార్టీ నేతలు రంగంలోకి దిగి.. పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. ఇది ఆత్మహత్యా.. లేక హత్యా అనేది పోస్టుమార్టం నివేదికలో బయటపడనుంది.త్వరలోనే అన్నీ తెలుస్తాయి హిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మూడో అంతస్తు నుంచి అశోక్ అనే యువకుడు దూకి.. చికిత్స పొందుతూ మృతి చెందాడని సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాం. మృతిపై అనుమానాలు ఉన్నాయని అతడి అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ కేసులో పోస్టుమార్టం నివేదికే కీలకం. ఒత్తిళ్లకు తలొగ్గం. నిబంధనల ప్రకారమే కేసు దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే అసలు విషయాలు బయటకు వస్తాయి. – కౌలుట్లయ్య, సీఐ, త్రీటౌన్ పోలీసుస్టేషన్, అనంతపురం
మానసిక వైద్యురాలిని కబళించిన డిప్రెషన్!
వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిళ్లు.. కారణాలు ఏవైనా కావొచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడి మనిషిని కుంగదీస్తుంది. అలాంటి సమయంలో సరైన సహాయం, మద్దతు అందకపోతే పరిస్థితులు విషాదకర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించాల్సిన ఓ వైద్యురాలే.. చివరకు అదే మానసిక ఒత్తిడికి బలికావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజ్నగర్ ఎక్స్టెన్షన్లోని ఆఫీసర్స్ సిటీ-2 సొసైటీలో నివసిస్తున్న డాక్టర్ హేమికా అగర్వాల్ (40) ఆదివారం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.హేమికా తండ్రి డాక్టర్ ఆర్. చంద్ర కూడా ఘజియాబాద్లో ప్రముఖ సైకియాట్రిస్ట్గా ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన విడాకుల తర్వాత ఆమె తీవ్ర భావోద్వేగ ఒత్తిడి, డిప్రెషన్తో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుమార్తె వివాహ బంధం ముగిసిన తర్వాత మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు.దాని నుంచి బయటపడేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారని.. పేషెంట్లకు చికిత్స కొనసాగిస్తుండడంతో మామూలుగా మారిందని తాము భావించామని చెబుతున్నారాయన. మరోవైపు ఆమె మృతి వార్త స్థానికంగా వైద్య వర్గాల్లో విషాదం నింపింది. పలువురు ఆమె మృతికి సంతాపం తెలుపుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.ఇతరుల మానసిక సమస్యలకు పరిష్కారం చూపే వృత్తిలో ఉన్న ఓ వైద్యురాలే వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒత్తిడితో విషాద నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ బయటపడకపోవడంతో.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
గ్యాస్ సిలిండర్ పేలి దంపతులకు తీవ్ర గాయాలు
పెద్దపల్లి జిల్లా: రామగుండం కార్పొరేషన్ పోతనకాలనీ 83వ బ్లాక్ క్వార్టర్ నంబరు 1151లో ఆదివారం వంటగ్యాస్ సిలిండర్ పేలి సింగరేణి కార్మికుడు యాదవనేని వసంత్తోపాటు ఆయన భార్య విజ్ఞత తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. వసంత్ సింగరేణిలోని వకీల్పల్లి గనిలో జనరల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. శనివారం రెండోషిఫ్ట్ ముగించుకొని ఇంటికి చేరాడు. భార్యాపిల్లలతో కలిసి భోజనం చేసి నిద్రపోయారు. ఇదేసమయంలో బాత్రూమ్కు ఆనుకొని ఉన్నహాల్లో అదనంగా ఉన్న వంటగ్యాస్ సిలిండర్ లీకైంది. హాల్ తలుపుల, కిటికీలు మూసిఉండడంతో గ్యాస్ మొత్తం వ్యాపించింది. తెల్లవారుజామున వసంత్ బాత్రూమ్కు వెళ్లగా భార్య గ్యాస్ వాసన వస్తోందని చెప్పి హాల్లోకి వెళ్లి లైట్వేసింది. దీంతో పెద్దశబ్దంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో విజ్ఞతకు మంటలు అంటకోవడంతో కేకలు వేసింది. బాత్రూర్లోని వసంత్కూ మంటలు అంటుకున్నాయి. స్థానికులు వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దంపతులను గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్య సుమారు 80శాతం, భర్త దాదాపు 60శాతం గాయపడగా.. పరిíస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. బెడ్రూమ్లోని వారి ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. భారీపేలుడుతో ఇంట్లోని సామగ్రి మొత్తం కాలిపోయింది.
వాడొక రాక్షసుడు అందమైన భార్యను..!
జనగామ: ప్రేమించిన పెళ్లి చేసుకున్న భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరి«ధిలోని నాలుగో డివిజన్ కృష్ణాకాలనీలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల తండాకు చెందిన గుగులోత్ రజిత (26), నర్సంపేట మండలం రాజీపేటకు చెందిన అనిల్ ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. నెల రోజుల క్రితం రజిత–అనిల్ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. కృష్ణాకాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కొంతకాలంగా వీరి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అనిల్ తన భార్య రజిత కాళ్లు, చేతులు కట్టి కత్తితో మెడ కోసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనలో రజిత అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న కేయూసీ పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సై నవీన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తల్లి హత్యకు గురికావడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.
వీడియోలు
Weather Report : ఇక వర్షాలే..వర్షాలు
కొత్త మంత్రులు వీళ్లే
బ్రిటన్ లో అణు వినాశనం? మంటల్లో 'సైజ్ వెల్ -B'!
ఒరాకిల్, టెక్ మహీంద్రా ఒక్క మెయిల్ తో జాబ్ గోవిందా రోడ్డెక్కిన సాఫ్ట్ వేర్లు..
అడ్వకేట్ ను కాలుతో తన్నిన పోలీస్.. న్యాయవాదుల చట్టం కోసం డిమాండ్
లోకేష్ రాజీనామా చేసే వరకు వదలొద్దు Gen-zకి పిలుపు
Vijayawada: నారా లోకేష్ పై దండయాత్ర
ఒకడేమో క్యాన్సర్ అంటాడు.. ఇంకొకడేమో పంచ కట్టుకుని పోజులు ఇస్తాడు
బీజేపీపై పీకే ఘన విజయం
ఆ ఏముందిలే జగనే కదా అనుకున్నారు.. జగన్ పర్యటన సక్సెస్ పై ధర్మాన..


