తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ రథసప్తమి శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘పవిత్ర రథసప్తమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి, విజయాలను ప్రసాదించాలని ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. పవిత్ర రథసప్తమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి, విజయాలను ప్రసాదించాలని ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు. pic.twitter.com/uHLmS2I1Aw— YS Jagan Mohan Reddy (@ysjagan) January 25, 2026రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సూర్య భగవానుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న ఈ రోజు సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునే భక్తులు సూర్యనారాయణ స్వామి దర్శనం కోసం క్యూ లైన్లలో నిలబడి పూజలు నిర్వహిస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురి దుర్మరణం
పలన్పూర్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రక్కు.. కారుని ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బనాస్కంఠ జిల్లాలోని ఇక్బాల్గాథ్లోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది. If you are driving a truck on Highway & a biker suddenly turns in front of you and you have no time to brake, what would you do? This truck turned right, saved bike, hit car 3 de@dBaruva Junction,near Korlam Village, Srikakulam District, Andhra Pradesh.pic.twitter.com/4q89UBfpJg— Gary Pike 🇺🇦🇮🇳 (@PikeWala) January 25, 2026రాంగ్ రూట్లో వస్తున్న ట్రక్కు.. ఎదురుగా వస్తున్న ఇన్నావో కారును ఢీకొట్టింది. ఆ సమయంలో డ్రైవర్తో కలిపి 10 మంది ఇన్నోవా కారులో ఉన్నారు. వీరిలో ఏడుగురు మృత్యువాత పడగా, ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
టీ20 వరల్డ్కప్ నుంచి పాకిస్తాన్ కూడా ఔట్?
అంతా ఊహించిందే జరిగింది. టీ20 వరల్డ్కప్-2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో బంగ్లా స్ధానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్కు అవకాశం లభించింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ బాటలోనే పాకిస్తాన్ కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.పొట్టి ప్రపంచకప్ను బహిష్కరించే అవకాశం ఉందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ హింట్ ఇచ్చాడు. తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో మాట్లాడిన తర్వాత టీ20 ప్రపంచ కప్లో పాల్గొనడంపై పీసీబీ నిర్ణయం తీసుకుంటుందని నఖ్వీ తెలిపాడు. బంగ్లాదేశ్కు అన్యాయం జరిగిందని, ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని నఖ్వీ ఆరోపించాడు.కాగా భద్రత కారణాలను సాకుగా చూపుతూ ప్రపంచకప్ మ్యాచ్లు ఆడేందుకు భారత్కు రావడానికి బంగ్లాదేశ్ నిరకారించింది. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్లో బంగ్లా ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాటు చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.అయినా బీసీబీ మొండి పట్టు వీడలేదు. దీంతో చేసేదేమి లేక వరల్డ్కప్ నుంచి బంగ్లాను ఐసీసీ తప్పించింది. అయితే ఈ వివాదం ఆరంభం నుంచి బంగ్లాకు పీసీబీ మద్దతుగా నిలుస్తోంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు సపోర్ట్గా నిలిచింది. అంతకుముందు బంగ్లా మ్యాచ్లను ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్దమేనని పీసీబీ ప్రకటించింది. కానీ ఐసీసీ మాత్రం పీసీబీ ఆఫర్ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి బంగ్లా దేశ్ పట్ల పీసీబీ కపట ప్రేమ ఒలకపోస్తోంది."బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అనుసరించిన తీరు సరికాదు. ఇదే విషయాన్ని నేను ఐసీసీ బోర్డు సమావేశంలో కూడా చెప్పాను. ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదు. అందరికి ఒకే న్యాయం ఉండాలి. బంగ్లాదేశ్ లాంటి ప్రధాన వాటాదారుకు అన్యాయం జరిగితే మేము సైలెంట్గా ఉండలేము.పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే మేం వరల్డ్ కప్లో ఆడటం ఆధారపడి ఉంటుంది. మా పీఎం దేశంలో లేరు. ఆయన తిరిగొచ్చాకే దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తాం. ఐసీసీ ఆదేశాలను కాకుండా మేం ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తాం" అని నఖ్వీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.
వాణిజ్య ఒప్పందాలతో యువతకు నూతన అవకాశాలు
సాక్షి, న్యూఢిల్లీ: మన యువతకు దేశ విదేశాల్లో నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా వేర్వేరు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. యువత అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా మన దేశంలోనే ఉందని గుర్తుశారు. వారికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తే దేశం ప్రగతి మరింత వేగవంతమవుతుందని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ శనివారం 18వ రోజ్గార్ మేళాలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో జరిగిన రోజ్గార్ మేళాలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 61 వేలమందికిపైగా యువతీ యువకులకు వర్చువల్గా నియామక పత్రాలు అందజేశారు. దేశ యువతకు 2026 సంవత్సరం సరికొత్త ఆశలు ఆనందాలతో మొదలైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ నియామక పత్రం కేవలం ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి అనుమతి మాత్రమే కాదని.. ఇది దేశ నిర్మాణానికి అందిన ఆహ్వానం అని అభివర్ణించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’నిర్మాణానికి కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. నాగరిక్ దేవో భవ ‘‘ప్రభుత్వ కార్యాలయాల్లో గతంలో ఎదురైన అనుభవాలు గుర్తుచేసుకోవాలి. అలాంటి ఇబ్బందులు ప్రజలకు ఎదురు కాకుండా మనం వారికి సేవ చేయాలి. ఉద్యోగ జీవితంలో ప్రజాసేవే పరమార్థంగా భావించాలి. నాగరిక్ దేవో భవ అనే సూక్తిని పాటించాలి. విధి నిర్వహణలో ఉన్నప్పుడు పౌరుడిని దేవుడిగా పరిగణించాలి. యువత ఉపాధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. దీనివల్ల నిర్మాణ సంబంధిత రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయి. మన దేశంలో స్టార్టప్ల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 2 లక్షల రిజిస్టర్డ్ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి. ‘డిజిటల్ ఇండియాతో’నూతన ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. యానిమేషన్, డిజిటల్ మీడియాతోపాటు ఇతర రంగాల్లో ఇండియా గ్లోబల్ హబ్గా మారుతుండడం హర్షణీయం. యువత కృషి వల్లే ఈ ఘనత సాధ్యమవుతోంది. సంస్కరణలతో మేలు నేడు దేశం సంస్కరణల ఎక్స్ప్రెస్లో పయనిస్తోంది. సంస్కరణలతో ప్రజల జీవితాలు, వ్యాపార–వాణిజ్యాలను మరింత సులభతరంగా మార్చాలని నిర్ణయించాం. వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో తదుపరి తరం సంస్కరణలతో యువ పారిశ్రామికవేత్తలకు, ఎంఎస్ఎంఈలకు మేలు జరుగుతోంది. చరిత్రాత్మక కార్మిక సంస్కరణల(లేబర్ కోడ్)తో కార్మికులు, ఉద్యోగుల సామాజిక భద్రత బలోపేతమైంది. వ్యాపారవేత్తలకు సైతం లబ్ధి చేకూరుతోంది. గడిచిన పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రగతి సాధించింది. దశాబ్ద కాలంలో దేశ జీడీపీ రెట్టింపైంది. 2014 ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2.5 రెట్లు పెరిగాయి. పెట్టుబడులు పెరగడమంటే యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే. ఎల్రక్టానిక్స్ తయారీ రంగం 2014 నుంచి ఆరు రెట్లు వృద్ధి చెంది రూ.11 లక్షల కోట్లకు చేరుకుంది. ఎగుమతులు రూ.4 లక్షల కోట్లు దాటాయి’’అని ప్రధానమంత్రి వివరించారు. మహిళా సాధికారతకు బాటలు దేశంలో రోజ్గార్ మేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 11 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. శనివారం నియామక పత్రాలు అందుకున్నవారిలో 8 వేల మందికి పైగా యువతులు ఉన్నారు. గత 11 ఏళ్లలో దేశ వర్క్ఫోర్స్లో మహిళల భాగస్వామ్యం దాదాపు రెట్టింపు అయ్యిందని ప్రధాని మోదీ తెలిపారు. ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా వంటి పథకాలు మహిళా సాధికారతకు బాటలు వేశాయని, మహిళా స్వయం ఉపాధి 15 శాతం మేర పెరిగిందని గణాంకాలతో సహా వివరించారు. అంతేకాకుండా మహిళల కొనుగోలు శక్తి పెరగడంతో 2025లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 2 కోట్ల మార్కును దాటాయని ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణ కోసం రూపొందించిన ‘ఐగాట్’ప్లాట్ఫామ్లో ఇప్పటికే 1.5 కోట్ల మంది ఉద్యోగులు చేరారని, కొత్త ఉద్యోగులు కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మహీంద్రా ‘రిపబ్లిక్ డే’ ట్రాక్టర్లు
ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురి దుర్మరణం
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ రథసప్తమి శుభాకాంక్షలు
సెల్ ఫోన్లో సెకండ్ ఫ్యామిలీ
కేంద్ర బడ్జెట్ 2026: బయో ఇం‘ధనం’ కావాలి..
కథాకళి: మధురం
నాంపల్లిలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
సేవామూర్తి.. వైఎస్ జయమ్మ
అబుదాబిలో కరీనా లుక్స్ అద్బుతః..! ఆ జాకెట్ అంత ఖరీదా..
తిరుమలలో ఘనంగా రథ సప్తమి వేడుకలు
ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్
బంగారం, వెండి తగ్గొచ్చు పెరగొచ్చు.. కానీ..
సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..
ఒక్కడి ధైర్యంతో బట్టబయలు
హైకోర్టును ఆశ్రయించిన 'పవన్' కుమారుడు అకీరా నందన్
చెట్లమందులు వాడా.. చాలా గలీజ్గా ఫీలయ్యా: శివజ్యోతి
ఉండటానికి అసలు ఈ భూమినే లేకుండా చేస్తా!
కొత్త ఛాప్టర్ ప్రారంభం.. 'సుష్మిత' మరో ముందడుగు
స్టార్ యాక్టర్స్ నటించిన సినిమా.. 37ఏళ్ల తర్వాత విడుదల
‘గిల్పై వేటు.. వన్డే కెప్టెన్గా తిరిగి రోహిత్ శర్మనే’
'మన శంకర వరప్రసాద్ గారు' ఫేక్ కలెక్షన్స్.. అనిల్ సమాధానం
ఇంకా రెచ్చిపోయిన బంగారం.. తులం ఎంతంటే..
గుడిపై అపచారం.. వేణుపై భగ్గుమంటున్న నెటిజన్లు
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఓటుకేమీ ప్రమాదం లేదుగా అని అడుగుతున్నార్సార్!
IND vs NZ: అతడు అవుట్!.. భారత తుదిజట్టులో మార్పు!
ఈ రాశి వారికి ధనప్రాప్తి.. సంఘంలో గౌరవం
ఆ సీన్ రీల్స్ పిల్లలకు చూపించొద్దు : అనిల్ రావిపూడి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్!
సిల్వర్ సెంచరీ.. ‘రిచ్ డాడ్’ హ్యపీ
బాంబులా పేలిన బంగారం, వెండి ధరలు! ఇక కొన్నట్టే!!
మహీంద్రా ‘రిపబ్లిక్ డే’ ట్రాక్టర్లు
ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురి దుర్మరణం
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ రథసప్తమి శుభాకాంక్షలు
సెల్ ఫోన్లో సెకండ్ ఫ్యామిలీ
కేంద్ర బడ్జెట్ 2026: బయో ఇం‘ధనం’ కావాలి..
కథాకళి: మధురం
నాంపల్లిలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
సేవామూర్తి.. వైఎస్ జయమ్మ
అబుదాబిలో కరీనా లుక్స్ అద్బుతః..! ఆ జాకెట్ అంత ఖరీదా..
తిరుమలలో ఘనంగా రథ సప్తమి వేడుకలు
ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్
బంగారం, వెండి తగ్గొచ్చు పెరగొచ్చు.. కానీ..
సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..
ఒక్కడి ధైర్యంతో బట్టబయలు
హైకోర్టును ఆశ్రయించిన 'పవన్' కుమారుడు అకీరా నందన్
చెట్లమందులు వాడా.. చాలా గలీజ్గా ఫీలయ్యా: శివజ్యోతి
ఉండటానికి అసలు ఈ భూమినే లేకుండా చేస్తా!
కొత్త ఛాప్టర్ ప్రారంభం.. 'సుష్మిత' మరో ముందడుగు
స్టార్ యాక్టర్స్ నటించిన సినిమా.. 37ఏళ్ల తర్వాత విడుదల
‘గిల్పై వేటు.. వన్డే కెప్టెన్గా తిరిగి రోహిత్ శర్మనే’
'మన శంకర వరప్రసాద్ గారు' ఫేక్ కలెక్షన్స్.. అనిల్ సమాధానం
ఇంకా రెచ్చిపోయిన బంగారం.. తులం ఎంతంటే..
గుడిపై అపచారం.. వేణుపై భగ్గుమంటున్న నెటిజన్లు
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఓటుకేమీ ప్రమాదం లేదుగా అని అడుగుతున్నార్సార్!
IND vs NZ: అతడు అవుట్!.. భారత తుదిజట్టులో మార్పు!
ఈ రాశి వారికి ధనప్రాప్తి.. సంఘంలో గౌరవం
ఆ సీన్ రీల్స్ పిల్లలకు చూపించొద్దు : అనిల్ రావిపూడి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్!
సిల్వర్ సెంచరీ.. ‘రిచ్ డాడ్’ హ్యపీ
బాంబులా పేలిన బంగారం, వెండి ధరలు! ఇక కొన్నట్టే!!
ఫొటోలు
కొండల్లో తిరిగేస్తున్న తేజస్విని (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జనవరి 25- ఫిబ్రవరి 01)
ఫారిన్ ట్రిప్లో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)
వాలుజడతో వయ్యారంగా ప్రియాంక జైన్ (ఫొటోలు)
ముద్దుగుమ్మలు ఒకేచోటు.. మాజీ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
భారీ అగ్ని ప్రమాదం (ఫోటోలు)
రోగి సహాయకుల కష్టాలు... ఆసుపత్రికెరుక! (ఫోటోలు)
‘చాయ్ వాలా’ మూవీ సాంగ్ ను లాంచ్ చేసిన CP సజ్జనార్ (ఫోటోలు)
నిహారిక 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పదేళ్ల జర్నీ వేడుక (ఫోటోలు)
శ్రీకాకుళం : ఉల్లాసంగా రథసప్తమి సప్తాహ్ (ఫోటోలు)
సినిమా
షూటింగ్ షురూ
చిన్న బ్రేక్ తర్వాత షూటింగ్ షురూ చేశారు అల్లు అర్జున్. ఆయన హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, అనూ ఇమ్మాన్యూయేల్ నటించనున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైందని, అల్లు అర్జున్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారని బాలీవుడ్ సమాచారం. ఇటీవల ‘పుష్ప 2: ది రూల్’ సినిమా జపాన్లో విడుదల కాగా, ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా అల్లు అర్జున్ జపాన్ వెళ్లారు. తిరిగి ఆయన ఇండియాకు వచ్చి అట్లీ డైరెక్షన్లోని సినిమా షూటింగ్తో బిజీ అయ్యారని టాక్. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్స్ కాజోల్, జిమ్ సర్బ్ నటిస్తున్నారనే టాక్ కొత్తగా తెరపైకి వచ్చింది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం 2027లో విడుదల కానుందని తెలిసింది. ఇక అల్లు అర్జున్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదే ప్రారంభం అవుతుంది.
నేనో విధ్వంసం
‘పఠాన్’ (2023) వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత హీరో షారుక్ ఖాన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్, షారుక్ కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 24న రిలీజ్ చేయనున్నట్లుగా ‘డేట్ అనౌన్స్మెంట్’ వీడియోతో ప్రకటించారు. ‘భయం లేదు... నేనో విధ్వంసం’ అంటూ షారుక్ ఖాన్ డైలాగ్ చెప్పడం, యాక్షన్ విజువల్స్ ఈ వీడియోలో కనిపిస్తాయి. ఈ చిత్రంలో షారుక్‡పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది.
సమ్మర్లో స్వయంభు
నిఖిల్ హీరోగా రూపొందిన పాన్ ఇండియన్ మూవీ ‘స్వయంభు’. ఈ హిస్టారికల్ యాక్షన్ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ సమ్మర్కి ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు శనివారం నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రంలో చేసిన పాత్ర కోసం నిఖిల్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఫిజికల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. విజువల్ వండర్లా ఈ సినిమా ఉంటుంది. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటాయి. సెంథిల్ కెమెరా పనితనం, రవి బస్రూర్ సంగీతం హైలైట్గా నిలుస్తాయి’’ అన్నారు నిర్మాతలు.
'బిగ్బాస్' ఓట్లు దీనికి పనికిరావు.. అమర్దీప్ షాకింగ్ కామెంట్స్
తెలుగు బిగ్బాస్ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రతి ఏడాది సెప్టెంబరు-డిసెంబరు మధ్య కాలంలో జరుగుతూ ఉంటుంది. గతేడాది కామనర్ కల్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. అంతకు ముందు సీజన్లలో నిఖిల్, పల్లవి ప్రశాంత్ తదితరులు విన్నర్స్ అయ్యారు. గెలిచిన వాళ్లు ఏమైనా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారా అంటే అంత సీన్ లేదు. ఇప్పుడు అదే విషయమై మాట్లాడుతూ ఏడో సీజన్ రన్నరప్ అమర్దీప్ కుండబద్దలు కొట్టేశాడు. బిగ్బాస్ ఓట్లు దేనికి పనికిరావు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ట్రెండింగ్లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)'బిగ్బాస్లో ఓట్లు వేశారు కదా, వాళ్లంతా థియేటర్కి వచ్చేస్తారని మనం సినిమాలు చేయకూడదు. నువ్వు ఏం చేయగలవో ప్రూవ్ చేసి ప్రేక్షకులని రప్పించుకోవాలి. అంతే గానీ ఆ ఓట్లు దీనికి పనికిరావు. ఆ షోలో గెలిచినా, టాప్-5లో ఉన్నా గానీ అదంతా ఒక్కరోజుకే. తర్వాత నుంచి అంతా సాధారణమే. ఈవెంట్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, స్టేజీ షోలు చేసుకోవడమే. అక్కడ వచ్చిన పేరు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఆలస్యమవ్వొచ్చు కానీ సక్సెస్ అయితే దొరుకుతుంది''బిగ్బాస్లో చేసిన వాళ్లందరూ హీరోలు అయ్యింటే ఈ పాటికి పెద్ద లిస్ట్ అయ్యేది. ఈ షో అనేది వన్డే కింగ్. బయటకొచ్చిన తర్వాత ఎవడి జీవితం వాడిది. మన వ్యక్తిత్వం, అలవాట్లు, మాటలు చూసి కాసేపు రిలాక్స్ కోసం జనాలు మాట్లాడుకుని ఓట్లేస్తారు' అని అమర్దీప్ చెప్పుకొచ్చాడు. ఇతడు మాట్లాడిన దానిబట్టి చూస్తే సొహెల్కి పరోక్షంగా కౌంటర్ వేశాడా అని సందేహం వస్తుంది. ఎందుకంటే బిగ్బాస్ నుంచి బయటకొచ్చిన కొన్ని సినిమాలు చేసిన సొహెల్.. ఓ మూవీ రిలీజ్ సందర్భంగా కన్నీరు పెట్టుకున్నాడు. షోలు ఓట్లు వేశారు కదన్నా, సినిమాకు ఎందుకు రావట్లేదు అని అడిగాడు. ఇతడే కాదు సన్నీ తదితరులు కూడా హీరోగా ఒకటి రెండు మూవీస్ చేసి పూర్తిగా కనుమరుగైపోయారు. కాబట్టి బిగ్బాస్ ఫేమ్ అనేది నీటిపై బుడగ లాంటిదే. ఎప్పుడు పేలిపోతుందే చెప్పలేం!(ఇదీ చదవండి: #AA23.. సీక్రెట్ చెప్పేసిన లోకేశ్ కనగరాజ్)
క్రీడలు
జొకోవిచ్ @ 400
మెల్బోర్న్: స్టార్ ఆటగాడు, వరల్డ్ మాజీ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ తన 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో ఈ సెర్బియా దిగ్గజం ప్రిక్వార్టర్స్లోకి అడుగు పెట్టాడు. శనివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో జొకోవిచ్ 6–3, 6–4, 7–6 (7/4)తో బాటిల్ వాన్ డి జాండ్షల్ప్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును అతను తన ఖాతాలో వేసుకున్నాడు. గ్రాండ్స్లామ్ కెరీర్లో జొకోవిచ్కు ఇది 400వ విజయం కావడం విశేషం. దీంతో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్లో అత్యధిక మ్యాచ్లు నెగ్గిన రోజర్ ఫెడరర్ (102 మ్యాచ్లు) రికార్డును కూడా అతను సమం చేశాడు. వరల్డ్ నంబర్వన్, డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) కూడా ముందంజ వేశాడు. తీవ్ర వేడి కారణంగా అలసటకు గురై ఇబ్బంది పడిన సినెర్ చివరకు విజయాన్ని దక్కించుకున్నాడు. మూడో రౌండ్లో అతను 4–6, 6–3, 6–4, 6–4తో ఇలియట్ స్పిజారి (అమెరికా)పై గెలుపొందాడు. తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిజ్ (అమెరికా) మూడో రౌండ్లో 7–6 (7/5), 2–6, 6–4, 6–4తో వావ్రింకా (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. మహిళల విభాగంలో రెండు సార్లు విజేత నవోమీ ఒసాకా (జపాన్) గాయంతో మూడో రౌండ్కు ముందు టోర్నీనుంచి తప్పుకుంది. ఇతర మ్యాచ్లలో రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) 6–1, 1–6, 6–1తో కలిన్సకయా (రష్యా)పై, మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–3తో ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై, పెగులా 6–3, 6–2తో సలెక్మెన్టొవా (రష్యా)పై గెలిచి ప్రిక్వార్టర్స్కు చేరారు. యూకీ బాంబ్రీ ముందంజ... పురుషుల డబుల్స్ భారత ఆటగాడు యూకీ బాంబ్రీ మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. బాంబ్రీ – ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) తమ రెండో రౌండ్ పోరులో 4–6, 7–6 (7/5), 6–3తో సాంటియాగో గొనాలెజ్ – డేవిడ్ పెల్ జంటపై విజయం సాధించారు. అయితే మరో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీ పరాజయంతో ని్రష్కమించాడు. రెండో రౌండ్లో బాలాజీ – నీల్ ఒబర్లీనర్ (ఆ్రస్టేలియా) 5–7, 1–6తో నాలుగో సీడ్ మార్సెల్ అరెవాలో – మేట్ పావిక్ చేతిలో ఓటమి పాలయ్యారు.
బంగ్లాదేశ్ ఖేల్ ఖతం!
దుబాయ్: టి20 వరల్డ్ కప్లో భాగంగా తమ మ్యాచ్లను భారత్లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. బంగ్లా టీమ్ను వరల్డ్ కప్నుంచి తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది భద్రతకు హామీ ఇస్తూ ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ మంకు పట్టు వీడలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీమ్పై ఐసీసీ వేటు వేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్ ఈ టోర్నమెంట్లో బంగ్లా స్థానంలో బరిలోకి దిగుతుంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు మద్దతు పలికింది. దాంతో వేటు లాంఛనంగానే మారింది. టీమ్ను వరల్డ్ కప్ను తొలగిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని ఐసీసీ శుక్రవారం బీసీబీకి తెలియజేసింది. ఐసీసీలోని ఇతర సభ్య దేశాలకు కూడా ఈ సమాచారం అందించింది. టోర్నీకి దూరం కావడం బంగ్లా బోర్డుపై ఆరి్థ కపరంగా కూడా తీవ్ర ప్రభావం చూపించనుంది. వరల్డ్ కప్లో పాల్గొనేందుకు ఇచ్చే 5 లక్షల డాలర్లతో పాటు ఐసీసీనుంచి ప్రతీ ఏటా అందే 27 మిలియన్ డాలర్లు కోల్పోనుంది. బంగ్లా నిష్క్రమణ నేపథ్యమిదీ... తాజా పరిణామాలను బట్టి చూస్తే వరల్డ్ కప్కు దూరం కావడం బంగ్లా స్వయంకృతమే. ఐపీఎల్ వేలంలో బంగ్లా పేసర్ ముస్తఫిజుర్ రహమాన్ను కోల్కతా నైట్రైడర్స్ రూ. 9.50 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే బంగ్లాదేశ్లో హిందువులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ఆటగాడిని ఐపీఎల్లో ఆడించాలనే ఆలోచనపై భారత్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. వీటికి స్పందిస్తూ కేకేఆర్ యాజమాన్యం ముస్తఫిజుర్ను లీగ్ నుంచి తప్పించింది. తమ ఆటగాడిని అర్ధాంతరంగా తొలగించడం బీసీబీకి నచ్చలేదు. దీనిని ఆ దేశ బోర్డు ఒక రకమైన అవమానంగా భావించింది. దాంతో భారత్లో తమ ఆటగాళ్లకు భద్రత లేదంటూ కొత్త విషయాన్ని ముందుకు తెచ్చింది. టి20 వరల్డ్ కప్లో తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ అంశంపై స్పందించిన ఐసీసీ బంగ్లాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. టోర్నీకి చాలా తక్కువ సమయం ఉండటంతో ఇప్పుడు షెడ్యూల్ మార్పు సాధ్యం కాదని స్పష్టం చేసింది. భారత్లో ఆ దేశపు ఆటగాళ్లు, మీడియా, ఇతర సిబ్బందికి ఎలాంటి సమస్య రాకుండా అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు.
ఆర్సీబీకి తొలి ఓటమి.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది.ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని నామమాత్రపు స్కోరే పరిమితం చేశారు. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, కాప్, మిన్ను మని తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ స్మృతి మంధాన(38) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా ప్లేయరంతా దారుణంగా విఫలమయ్యారు.అనంతరం 110 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో లారా వోల్వడర్ట్(42), కాప్(19) అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సత్ఘరే రెండు, రాధా యాదవ్ ఓ వికెట్ సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా ఐదు మ్యాచ్లలో విజయం సాధించిన ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది.
'హిట్మాన్'పై అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మపై యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్మాన్ అడుగుజాడల్లో నడుస్తున్నానని చెప్పాడు. టి20 పవర్ ప్లేలో రోహిత్ శర్మలా ఆడటానికి ప్రయత్నిస్తున్నానని అన్నాడు. తనపై హిట్మాన్ ప్రభావం గురించి జియోస్టార్తో మాట్లాడుతూ.. "రోహిత్ భాయ్ దేశం కోసం చాలా చేశాడు. పవర్ప్లేలో అతడు ఇచ్చే ప్రారంభాల కారణంగా ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుందని అన్నాడు. రోహిత్ శర్మ పాత్ర పోషించాలని కోచ్ గౌతమ్ గంభీర్ తనకు సూచించినట్టు వెల్లడించాడు.గంభీర్తో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రోత్సహంతో తాను రోహిత్ శర్మ ఫార్ములాను అనుసరిస్తున్నానని అభిషేక్ తెలిపాడు. "నేను జట్టులోకి వచ్చినప్పుడు.. కోచ్, కెప్టెన్ నా నుంచి అదే ఆశించారు. తొలి బంతి నుంచే విరుచుకుపడడం నాకు ఇష్టం కాబట్టి.. అది నా శైలికి కూడా సరిపోతుందని భావించాను. రోహిత్ భాయ్ అడుగుజాడల్లో నడుస్తున్నాను. టీమిండియా తరపున ఇలా ఆడుతూ రాణించడం నాకు నిజంగా సంతోషంగా ఉంద''ని అన్నాడు.దూకుడుగా ఆడటమే నా పనితన ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటానని అభిషేక్ శర్మ చెప్పాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడి.. జట్టు భారీస్కోరుకు బాటలు వేయాలని భావిస్తానని చెప్పాడు. "నేను ఇంకా పూర్తిగా పరిణతి చెందానని చెప్పను, ఎందుకంటే ఎల్లప్పుడూ మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. కానీ మొదటి ఆరు ఓవర్లలో దూకుడుగా క్రికెట్ ఆడటమే నా పని అని భావిస్తున్నాను. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను మంచి ఆరంభం ఇస్తే జట్టు ఆ ఊపును అనుసరించగలదని నాకు తెలుసు. అందుకే జట్టుకు ఆరంభం ఇవ్వాలని ప్రతిసారి అనుకుంటాన''ని ఈ డాషింగ్ ఓపెనర్ పేర్కొన్నాడు.వారితో ప్రాక్టీస్ చేస్తాటి20 ప్రపంచకప్కు సన్నద్ధత కోసం మాట్లాడుతూ.. తన దూకుడుకు అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తానని, మ్యాచ్లకు ముందు తానెప్పుడూ ఇదే ఫాలో అవుతానని అన్నాడు. ''నాకు వారం లేదా 10 రోజులు సమయం దొరికినప్పుడు, తదుపరి సిరీస్ లేదా మ్యాచ్లలో నేను ఎదుర్కొనబోయే బౌలర్లను గుర్తుంచుకుంటాను. వారిలా బౌలింగ్ చేసే వారితో ప్రాక్టీస్ చేస్తాను. కొత్త బంతితో అవుట్-స్వింగర్లు, ఇన్-స్వింగర్లు వేయమని చెప్పి బ్యాటింగ్ చేస్తుంటాను. టి20 వరల్డ్కప్లో భాగంగా దేశవ్యాప్తంగా భిన్నమైన పరిస్థిల్లో వేర్వేరు జట్లతో ఆడాల్సి ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ చాలా ముఖ్యమ''ని అభిషేక్ అభిప్రాయపడ్డాడు.పవర్ హిట్టింగ్తో హిట్2024, జూలైలో టి20లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్తో తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే నంబర్వన్ బ్యాటర్ ఎదిగాడు. ఇప్పటివరకు 34 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి 190.92 స్ట్రైక్ రేట్తో 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి 7 నుంచి జరిగే టి20 ప్రపంచకప్లోనూ తన జోరును కొనసాగించాలని ఈ ఎడంచేతి వాటం ఓపెనర్ ఉవ్విళ్లూరుతున్నాడు. చదవండి: ప్రధాని తర్వాత కష్టమైన జాబ్.. గంభీర్పై ప్రశంసలు
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు కకావికలం.. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ సాయమూ అందక విలవిల
ఆంధ్రప్రదేశ్లో నందమూరి బాలకృష్ణ అల్లుడికి భూ పందేరం..... 2 వేల 500 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం
ఏపీలో సమగ్ర భూ రీసర్వేపై నాడు దుష్ప్రచారం చేసి, నేడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.... సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
వచ్చే ఏడాది మళ్లీ ప్రజల్లోకి. ఏడాదిన్నరపాటు పాదయాత్ర. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ
ఆదాయాన్నిచ్చే కొత్త వలస-కిరండోల్ లైన్ లేకుండానే విశాఖ రైల్వేజోన్. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం
స్వచ్ఛంద పంటల బీమాకూ మంగళం. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం
ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారిన మద్యం... సంక్రాంతి సీజన్లో టీడీపీ మద్యం సిండికేట్కు పండుగ
ఆంధ్రప్రదేశ్లో భూముల ‘రీ సర్వే’పై చంద్రబాబు దొంగాట... అప్పుడు దుష్ప్రచారం చేసి ఇప్పుడు క్రెడిట్ చోరీ కోసం పాకులాట
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా జూదాల జాతర.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో విచ్చలవిడిగా మద్యం ప్రవాహం
సంక్రాంతి సంబరాలను జూదంగా మార్చేసిన కూటమి నేతలు... ఏపీలో పండుగ వేళ యథేచ్ఛగా దోపిడీ... 2 రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల జూదం .
బిజినెస్
మొన్న బజాజ్.. ఇప్పుడు హీరో మోటోకార్ప్
భారతదేశంలోని అతి పెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన కమ్యూటర్ మోటార్ సైకిల్ ధరలు పెంచింది. వేరియంట్ను బట్టి ధరలు రూ. 250 నుంచి రూ. 750 వరకు పెరిగాయి. ఇందులో హీరో HF 100 , హీరో HF డీలక్స్ & హీరో ప్యాషన్ ప్లస్ మొదలైనవి ఉన్నాయి. ఇప్పటికే బజాజ్ ఆటో కూడా తన బైక్ ధరలను పెంచింది.ముడి సరుకుల ధరలు, ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల బైక్ ధరలను పెంచినట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయి. ధరల పెరుగుదల తరువాత హీరో HF100 రేటు రూ. 58,739 నుంచి 59,489 రూపాయల (ఎక్స్-షోరూమ్) వద్దకు చేరింది. హీరో HF డీలక్స్ ధరలు 56,742 రూపాయల నుంచి రూ. 69,235 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హీరో మోటోకార్ప్.. భారతదేశంలో హీరో HF 100, హీరో HF డీలక్స్, హీరో ప్యాషన్ ప్లస్, హీరో స్ప్లెండర్ ప్లస్ మొదలైన మోడల్స్ విక్రయిస్తోంది. ఇవి మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిస్తో ఉండటంతో పాటు.. మంచి మైలేజ్ కూడా అందిస్తున్నాయి. ఈ కారణంగానే వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి..
పెప్సికో ఇండియా కీలక బాధ్యతల్లో సవితా బాలచంద్రన్
ఎఫ్.ఎమ్.సి.జి (FMCG) దిగ్గజం పెప్సికో సవిత బాలచంద్రన్ను భారతదేశం మరియు దక్షిణాసియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. పెప్సికో నుంచి కౌశిక్ మిత్రా పదవీవిరమణ చేస్తున్న నేపథ్యంలో పెప్సికో ఈ కీలక నియామకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి బాధ్యతలు చేపడతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైనాన్స్ స్ట్రాటజీ (ఆర్థిక వ్యూహం), గవర్నెన్స్ , పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ను ఆమె పర్యవేక్షిస్తారు.బాలచంద్రన్ నియామకాన్ని స్వాగతిస్తూ, ఇండియా & సౌత్ ఆసియాలో కంపెనీ తన తదుపరి దశ వృద్ధిని వేగవంతం చేస్తున్నందున ఆర్థిక, వ్యూహం మరియు విలువ సృష్టిలో ఆమె నైపుణ్యం చాలా కీలకమని పెప్సికో తెలిపింది. పెప్సికో ఇండియా & సౌత్ ఆసియా CFOగా నియమితులైన సంగతిని లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా ప్రకటించిన సవితా బాలచంద్రన్ తన కరియర్లో ఇదొక ఉత్సాహకరమైన కొత్త అధ్యాయానికి నాందిగా అభివర్ణించారు.ఎవరీ సవితా బాలచంద్రన్దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞురాలైన ఫైనాన్స్ ప్రొఫెషనల్. పెప్సికోలో చేరడానికి ముందు, ఐదేళ్లకు పైగా టాటా టెక్నాలజీస్లో సీఎఫ్వోగా పనిచేశారు. ఆర్థిక ప్రణాళిక, రిస్క్ మేనేజ్మెంట్ మరియు వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడానికి బాధ్యత వహించారు.టాటా టెక్నాలజీస్లో CFOగా ఎంపిక కావడానికి ముందు ఆమె టాటా మోటార్స్లో సీనియర్ ఫైనాన్స్ పాత్రలను నిర్వహించారు.అంతకుమందు ఆమె టాటా మోటార్స్లో 18 సంవత్సరాలకు పైగా పనిచేశారు, ఫైనాన్స్, కార్పొరేట్ వ్యూహం మరియు వ్యాపార కార్యకలాపాలలో సీనియర్ నాయకత్వ పాత్రలను నిర్వహించారు. టాటా గ్రూప్లో ,సుదీర్ఘ పదవీకాలం ప్రపంచ మార్కెట్లు, తయారీ ఆధారిత వ్యాపారాలు మరియు పరివర్తన-ఆధారిత వృద్ధి అంశాలో లోతైన అవగాహన ఆమె సొంతం.బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుండి కామర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పూణేలోని Symbiosis (SCMHRD) నుండి ఫైనాన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (MBA) పొందారు. అలాగే అమెరికా కార్నెగీ మెల్లన్ యూనివర్శిటీ నుండి Fulbright-CII Fellowship కూడా పొందారు.
సిల్వర్ సెంచరీ.. ‘రిచ్ డాడ్’ హ్యపీ
వెండి ధరలు రోజుకో రికార్డ్ కొడుతూ దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్ సిల్వర్ 100 డాలర్ల మార్క్ను దాటేసింది. వెండి ధరలపై నిరంతరం పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి అంతకు ముందే వెండి ధర 100 డాలర్లకు చేరువ కాగానే ఆనందంతో పోస్టు పెట్టారు.‘వెండి 100 డాలర్లు (ఔన్స్కు) దాటుతోంది.. యేయ్’ అంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, ఫియాట్ కరెన్సీలపై నమ్మకం తగ్గడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి హార్డ్ అసెట్లకు కియోసాకి ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నారు.ఒకవైపు విలువైన లోహంగా, మరోవైపు పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించే లోహం కావడం వల్ల వెండికి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో వినియోగం వెండి భవిష్యత్తుపై ఆశలు పెంచుతోంది. అయితే, విశ్లేషకులు వెండి ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతాయని, ఇది అత్యంత అస్థిరమైన లోహాల్లో ఒకటని హెచ్చరిస్తున్నారు.అయితే ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని తన ఇంతకు ముందు పోస్ట్లో కియోసాకి తెలిపారు. SILVER to BREAK $100.Yay!!!!— Robert Kiyosaki (@theRealKiyosaki) January 23, 2026
పాకిస్తాన్ దరిద్రం.. పాత ఫోన్లూ కొనలేక అవస్థలు
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో అక్కడి పౌరులకు కొత్త స్మార్ట్ఫోన్ల సంగతి పక్కనపెడితే పాత (యూజ్డ్) ఫోన్లనూ కొనుక్కోవడమూ భారమైంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం.. యూజ్డ్ స్మార్ట్ఫోన్లపై విధించే వాల్యుయేషన్, సుంకాలను తగ్గించింది.ప్రస్తుత ధరల వద్ద కొత్త ఫోన్లు కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హై-ఎండ్ స్మార్ట్ఫోన్లు అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్తో పాటు ఇతర వేరియంట్లకు కూడా కొత్త అంచనా విలువలను కస్టమ్స్ వాల్యుయేషన్ డిపార్ట్మెంట్ ఖరారు చేసింది.ప్రపంచవ్యాప్తంగా పాత స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ సవరణ అవసరమైందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. డాన్ పత్రిక నివేదిక ప్రకారం.. ఐఫోన్ వంటి మోడళ్లు వయస్సు పెరిగే కొద్దీ, వారి ప్రాథమిక రిటైల్ జీవితకాలం ముగింపునకు చేరుకునే సరికి సహజంగానే విలువ కోల్పోతాయి.మార్కెట్ రేట్లకు అనుగుణంగా విలువలను సర్దుబాటు చేయడం ద్వారా, ఉపయోగించిన స్మార్ట్ఫోన్లను పౌరులకు మరింత సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ రీవ్యాల్యూయేషన్ చేపట్టారు. తాజా అప్డేట్లో నాలుగు ప్రముఖ బ్రాండ్లకు చెందిన 62 మోడళ్ల హ్యాండ్సెట్లు ఉన్నాయి.శాంసంగ్, గూగుల్ వంటి కంపెనీల మార్కెట్ డేటా, అధికారిక ట్రేడ్-ఇన్ ధరలను పరిశీలించిన తర్వాత కొత్త విలువలు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లపై అమ్మకపు పన్ను, నిలిపివేత పన్ను, ప్రత్యేక సుంకాలు వంటి సంక్లిష్టమైన పన్ను విధానం అమల్లో ఉండగా, ఇవన్నీ ప్రభుత్వ నోటిఫై చేసిన వాల్యుయేషన్ ఆధారంగా లెక్కిస్తారు.2026 కోసం సవరించిన వ్యాల్యూయేషన్లు 2024తో పోలిస్తే యూజ్డ్ స్మార్ట్ఫోన్ల విలువల్లో భారీ తగ్గుదలని చూపుతున్నాయి. ముఖ్యంగా యూజ్డ్ ఐఫోన్ల ధరలు 32% నుంచి 81% వరకు తగ్గాయి. ఈ మార్పులతో పాకిస్తాన్లో పాత స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గి, వినియోగదారులకు కొంతమేర ఉపశమనం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఫ్యామిలీ
కరెంటుకథ తెలుసా?
విద్యుత్తుకు 200 ఏళ్ల చరిత్ర ఉంది.విద్యుత్తు అనేది ఎలక్ట్రాన్ల ప్రవాహం.విద్యుత్తు ఒక వాహకం గుండా ప్రవహిస్తుంది. దీన్ని ఆంపియర్స్లో కొలుస్తారు. ఇవాళ పోద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా కరెంట్ (పవర్/ఎలక్ట్రిసిటీ/విద్యుత్తు) లేకుండా ఏ పనీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కరెంట్ లేకుండా ఏ పనీ జరగదు. అలా మన నిత్యజీవితంలో కరెంట్ ఒక కీలకమైన అంశంగా మారింది. కాసేపు కరెంట్ పోయినా విలవిలలాడిపోతుంటారు కొందరు. మరి ఈ కరెంట్ కథేమిటో తెలుసా?బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త మెరుపును విద్యుత్ అని నిరూపించాడు. ఆ తర్వాత 1800 సంవత్సరంలో అలెశాండ్రో వోల్టా మొదటి రసాయన బ్యాటరీని (వోల్టాయిక్ పైల్) కనుగొన్నారు. ఇది నిరంతర విద్యుత్ ప్రవాహానికి మార్గం సుగమం చేసింది. ఆ తర్వాత థామస్ ఎడిసన్ విద్యుత్ బల్బును తయారు చేశారు. నికోలా టెస్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ వ్యవస్థలను,మోటార్లను అభివృద్ధి చేసి విద్యుత్ ప్రసారంలో విప్లవం తెచ్చారు. అప్పటి నుంచి విద్యుత్తు వ్యవస్థ పటిష్ఠంగా మారింది. ఎలక్ట్రాన్ల ప్రవాహం ద్వారా శక్తిని ఉత్పత్తి చేయడం,నియంత్రించడం వంటివి మొదలయ్యాయి. ప్రస్తుతం జల విద్యుత్, థర్మల్ విద్యుత్,సోలార్ విద్యుత్, పవన విద్యుత్... అలా అనేక పద్ధతుల్లో కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు.కరెంట్ మీద ఆధారపడి అన్ని పరిశ్రమలు, కర్మాగారాలు నడుస్తున్నాయి. ఒక్క నిమిషం కరెంట్ పోయినా కోట్ల రూ΄ాయల నష్టం వచ్చే అవకాశం ఉంది.
ప్రశాంతతనిచ్చే పశ్చిమోత్తానాసనం
టీనేజ్ అమ్మాయిల నుంచి నడి వయసు మహిళల వరకు.. ఒత్తిడి తగ్గించి, మానసిక ప్రశాంతతను పెం΄÷ందిస్తూ, వెన్నునొప్పిని నియంత్రించేలా చేస్తుంది పశ్చిమోత్తనాసనం. ఈ భంగిమ కూర్చుని చేస్తాం. ‘పశ్చిమ’ అంటే శరీరంలోని వెనుక భాగం,‘ఉత్తాన’ అంటే పూర్తిగా వంగడం, ‘ఆసనం’ అంటే భంగిమ. ఈ ఆసనం లో తల నుంచి మడమల వరకు ఉన్న వెనుక భాగం మొత్తం బాగా లాగబడుతుంది. ఈ ఆసనం వెన్నెముకను దృఢంగా చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మనస్సుకు శాంతిని కలిగించి, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం రోజూ పది నిముషాలు ఈ ఆసనాన్ని సాధన చేస్తే మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు. కంప్యూటర్తో పని చేసే వాళ్లు వెన్ను, మెడ, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు సులువైన, తేలికైనా పశ్చిమోత్తనాసనం ఆసనం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.– పి. అనిత, యోగా ట్రైనర్
అది మన సంస్కృతి
ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేయడం, తిరిగి ఏమీ ఆశించక΄ోవడం అనే భారతీయ సంస్కృతిని జపాన్ వేదికగా చాటి చెప్పాడు ఓ భారతీయుడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతూ అందరి హృదయాలను గెలుచుకుంటోంది. రోహన్ రానా అనే వ్యక్తి తన స్నేహితునితో కలిసి జపాన్లో మెట్రో ట్రైన్ని పట్టుకోవడానికి వేగంగా వెళ్తుండగా.. ఓ వృద్ధుడైన జపనీస్ వ్యక్తి కిందపడి ఉండటాన్ని గమనించారు. ఆ వృద్ధుడికి దెబ్బ తగిలి రక్తం కారుతోంది. చుట్టూ చాలామంది ఉన్నప్పటికీ ఎవరూ ఆ వృద్ధుని పట్టించుకోలేదు. కానీ రోహన్రానా, అతని స్నేహితుడు క్షణం కూడా ఆలోచించకుండా అతనికి సాయం చేయడానికి ముందుకెళ్లారు. ఆ వృద్ధుడికి చేయూతనిచ్చి కూర్చోబెట్టి, తమ వద్ద ఉన్న బ్యాండేజీని గాయంపై వేసి, అతనికి ధైర్యం చెప్పారు. కృతజ్ఞతగా ఆ వృద్ధుడు రోహన్కి కొంత డబ్బు ఇవ్వబోయాడు. కానీ రోహన్ ఆ డబ్బును నిరాకరించాడు. అనంతరం రోహన్ ఆ విషయాన్ని చెబుతూ ఆ వృద్ధుడు ఇచ్చిన డబ్బుని చూడటం కూడా తనకు నచ్చలేదని, అది ఒక భారతీయుడిగా తన వ్యక్తిగత విలువలకు విరుద్ధమని భావోద్వేగానికి లోనయ్యాడు. సాటి మనిషిపై చూపిన జాలి, మానవత్వం భారతీయుల విలువలకు అద్దం పడుతోంది.
వెయిట్ ట్రయినింగ్ బ్రెయిన్కూ బెటరే
కండరాల బలం కోసం స్ట్రెంత్ ట్రయినింగ్ లేదా వెయిట్ ట్రయినింగ్ తప్పనిసరి అనే విషయం చాలాసార్లు వినే ఉంటాం. అయితే స్ట్రెంత్ ట్రయినింగ్ అనేది మజిల్ లాస్ను రివర్స్ చేయడమే కాదు మెదడు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తుందని, వయసు పెరిగినా మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుందని తాజా అధ్యయనం తెలియజేస్తోంది. ఈ అధ్యయనాన్ని వాషింగ్టన్ యూనివర్శిటీలోని ఓ పరిశోధక బృందం నిర్వహించింది.1,164 మందిపై...యాభై ఐదు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 1,164 మంది స్త్రీ, పురుషులపై వాషింగ్టన్ పరిశోధక బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్కి వారానికి రెండుసార్లు వెయిట్ ట్రయినింగ్ చేయడం అలవాటు. రెండో గ్రూప్నకు ఈ అలవాటు లేదు, మొదటి గ్రూపు వారు జ్ఞాపకశక్తి పరీక్షలో మెరుగ్గా రాణించారు. వెయిట్ ట్రయినింగ్ చేయని వారితో పోల్చితే చేసేవారు ఆరోగ్యకరమైన మెదడు న్యూరాన్లను కలిగి ఉన్నారు.స్ట్రెంత్ ట్రయినింగ్ అంటే?డంబెల్స్, బార్బెల్స్, ఒక మోస్తరు బరువులు, రెసిస్టెంట్ బ్యాండ్, బాడీ వెయిట్ (ఉదా: పుషప్లు), వాటర్బాటిల్స్, బ్రిక్స్తో చేసే వ్యాయామం.మతిమరుపునకు దూరంగా...వెయిట్ ట్రయినింగ్ అనేది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వివిధ న్యూరోప్రొటెక్టివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలను ఉత్పత్తి చేస్తుందని, డిమెన్షియా (మతిమరుపు)ను దూరం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు.ఉపయోగాలుమెదడుపై వెయిట్ ట్రయినింగ్ ఏ రకంగా ప్రభావం చూపుతుందంటే...ఏకాగ్రతను పెంచుతుందిజ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుందిఒత్తిడిని తగ్గిస్తుందినాడుల రక్షణకు ఉపయోగపడుతుంది
అంతర్జాతీయం
ఇమిగ్రేషన్ అధికారుల కాల్పుల్లో మరొకరు మృతి
అమెరికాలో మినయాపాలిస్లో ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్కు వ్యతిరేకంగా జరగుతున్న నిరసనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. శనివారం (జనవరి 24, 2026) ఫెడరల్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో మరో అమెరికన్ పౌరుడు మరణించాడు. మరణించిన వ్యక్తిని 37 ఏళ్ల మినయాపాలిస్ నివాసిగా అధికారులు గుర్తించారు.మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సదరు వ్యక్తి వద్ద తుపాకీతో పాటు రెండు మ్యాగజైన్లు ఉన్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. అయితే అధికారులపైకి తిరగబడటంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మినయాపాలిస్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి. కొన్ని రోజుల క్రితం రెనీ నికోల్ గుడ్ అనే 37 ఏళ్ల మహిళను ఫెడరల్ ఏజెంట్లు ఆమె కారులోనే కాల్చి చంపారు.ఈ క్రమంలో వరుస కాల్పుల ఘటనలతో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నిరసనకారులను చెదరగొట్టడానికి ఫెడరల్ ఏజెంట్లు బాష్పవాయువు ప్రయోగించారు. అయితే ఇదే సమయంలో ఓ ఐసీఈ ఏజెంట్ నిరసనకారులను వెక్కిరిస్తూ గట్టి అరిచాడు.దీంతో నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ స్పందించారు. మిన్నెసోటా ప్రజల సహనం నశించింది. ఇది అత్యంత క్రూరమైన చర్య. అధ్యక్షుడు ట్రంప్ వెంటనే ఈ ఆపరేషన్ను నిలిపివేయాలి. వేల సంఖ్యలో ఉన్న ఈ ఫెడరల్ అధికారులను వెంటనే మిన్నెసోటా నుండి వెనుక్కి పిలవాలి అని వాల్జ్ డిమాండ్ చేశారు.కాగా అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులను ఏరివేయడానికి దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్లు చేపట్టింది. ఇందులో భాగంగానే వేల సంఖ్యలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, బార్డర్ పెట్రోల్ ఏజెంట్లు మినయాపాలిస్ వంటి నగరాలకు పంపారు.
భర్త అక్రమ సంబంధం గుట్టు రట్టు.. భార్యకు కోర్టు వింత శిక్ష
చైనాలోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను సోషల్ మీడియాలో విమర్శించినందుకు భార్యకు కోర్టు వింత శిక్ష విధించింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. చైనాలోని హెనాన్ ప్రావిన్స్కు చెందిన నియు నా అనే మహిళకు, గావో ఫీతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. గావో ఫీ ఒక బొగ్గు గని కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు. అయితే అదే ఆఫీసులో పనిచేసే ఒక వివాహితతో గావో ఫీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.ఈ విషయం నియుకు తెలియడంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆమె సోషల్ మీడియాలో తన భర్త బండారాన్ని బయటపెట్టింది. అతడు పనిచేసే ఆఫీస్ వివరాలతో, భర్తను తిడుతూ పోస్టులు పెట్టింది. దీంతో గావో ఫీ తన భార్యపై కోర్టులో 'పరువు నష్టం' దావా వేశాడు. ఈ కేసును విచారించిన న్యాయస్ధానం ఎవరూ ఊహించని తీర్పు ఇచ్చింది. ఒకరు వ్యక్తిగతంగా ఎన్ని తప్పులు చేసినా, చట్టం ప్రకారం అతడి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని కోర్టు తేల్చింది. దీంతో తన భర్తకు వరుసగా 15 రోజుల పాటు సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని నియును కోర్టు ఆదేశించింది.కోర్టు ఆదేశాలు మేరకు జనవరి 12 నుంచి నియు నా క్షమాపణ వీడియోలు పెట్టడం ప్రారంభించింది. అయితే ఆమె మాత్రం చాలా వ్యంగ్యంగా తన భర్తకు సారీ చెబుతోంది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఉద్దేశించి.. "మీ ఇద్దరిది నిజమైన ప్రేమ. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ గౌరవాన్ని నేను కాపాడాలి కాబట్టి క్షమించు" అంటూ సెటైర్లు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే కోర్టు ఇచ్చిన ఈ వింత తీర్పుతో ఆమె సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయింది. ఆమెకు రోజుల వ్యవధిలోనే 3,50,000 మంది ఫాలోవర్లు వచ్చారు.
అఫ్గాన్లోమంచు తుపాన్ బీభత్సం.. 61మంది మృతి
అఫ్గానిస్థాన్లో మంచుతుపాన్, భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గత మూడు రోజులలో దాదాపు 61 మంది మృతిచెందినట్లు అక్కడి విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. అంతే కాకుండా పలు ప్రాంతాలలో తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొంది.తుఫాన్ బీభత్సంతో మధ్య, తూర్పు అఫ్గానిస్థాన్లో భారీ మరణాలు సంభవించినట్లు అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దాదాపుగా 61మంది ప్రాణాలు కోల్పోగా 110 మందికి పైగా గాయపడ్డట్లు పేర్కొంది. భారీ వానల దాటికి కాందహర్ ప్రావిన్సులోని ఒక ఇంటి పైకప్పు కూలడంతో ఆరుగురు చిన్నారులు మృతిచెందినట్లు తెలిపింది. అంతేకాకుండా మంచు కురవడంతో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకోవడంతో మృతులు మరింతగా పెరిగినట్లు పేర్కొంది.అఫ్గాన్ ప్రధాన రోడ్డు మార్గాలలో ఒకటైన సలాంగ్ జాతీయ రహదారి వానల దాటికి దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఉజ్బెనిస్థాన్ నుంచి అఫ్గాన్కు విద్యుత్ను సరఫరా అయ్యే విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ దెబ్బతినడంతో 12 ప్రావన్సులలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిపింది. తుఫాన్ దాటికి రహదారులు దెబ్బతినడంతో టెక్నికల్ సిబ్బంది సమాయానికి అక్కడికి చేరుకోలేక పోయారన్నారు.అకాల వర్షాలకు పెద్దమెుత్తంలో పంటనష్టం ఏర్పడిందని అక్కడి వార్త కథనాలు పేర్కొన్నాయి. అఫ్గాన్లో నాలుగు కోట్లకు పైగా మానవతా సహాయం కోరుతున్నారని యునేటైడ్ స్టేట్స్ నివేదిక ఇదివరకే ప్రకటించింది. కాగా ఇప్పుడు ఈ అకాల వరదలు ఆదేశాన్ని మరింత పేదరికంలో నెట్టాయి.
‘రష్యా సుంకం’ రద్దు?
వాషింగ్టన్: అమెరికా విధించిన భారీ టారిఫ్ల విషయంలో భారత్కు సగానికి సగం ఊరట లభించే అవకాశం కని్పస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు విధించిన 25 శాతం టారిఫ్లను రద్దు చేసే అవకాశమున్నట్టు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. ‘‘రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ కొద్ది నెలలుగా భారీగా తగ్గించుకుంది. కనుక 25 శాతం సుంకాలను రద్దు చేసే అంశాన్ని మా ప్రభుత్వం పరిశీలించే అవకాశముంది’’అని ఆయన చెప్పారు. శుక్రవారం అమెరికా వార్తా సంస్థ పొలిటికో ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించారు. ‘‘భారత్పై మేం విధించిన 25 శాతం చమురు టారిఫ్ బ్రహా్మండంగా పని చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు దాదాపుగా ఆగిపోయాయి. కనుక వాటిని వెనక్కు తీసుకునే ప్రక్రియ మొదలవుతుందనే భావిస్తున్నా’’అని వివరించారు. టారిఫ్ల వల్లే రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లు భారీగా తగ్గాయని ఇటీవల దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా కూడా బెసెంట్ చెప్పుకొచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్, అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో ముందడుగు పడుతుందని భావిస్తున్నారు. అయితే, భారత్ నుంచి శుద్ధి చేసిన చమురు తదితరాలను యూరప్ కొనుగోలు చేయడంపై బెసెంట్ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘యూరప్ది నిజంగా మూర్ఖపు చర్యే. భారత్తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని యూరప్ అంగలారుస్తోంది. అందుకే రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఆ దేశంపై అధిక సుంకాలు విధించలేదు’’అంటూ నిందించారు. ఆగస్టు నుంచీ రగడ భారీ వాణిజ్య అసమతుల్యతను సరిచేసే పేరిట భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఆగస్టులో తొలుత 25 శాతం టారిఫ్ విధించడం తెలిసిందే. రష్యా చమురు దిగుమతులను సాకుగా చూపుతూ కొంతకాలానికే మరో 25 శాతం మేరకు బాదారు. అంతేగాక, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే, దాన్ని తిరిగి విక్రయించే దేశాలపై ఏకంగా 500 శాతం టారిఫ్ విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఇటీవల అమెరికా సెనేట్లో ప్రవేశపెట్టారు కూడా! రష్యా తన చమురు కొనుగోళ్ల నిధులను ఉక్రెయిన్పై యుద్ధానికి వెచ్చిస్తోందని అమెరికా ఆరోపిస్తుండటం తెలిసిందే. అయితే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్, రష్యా నుంచి అధిక మెుత్తంలో చమురు దిగుమతి చేసుకుంటుంది. కాగా మెుత్తంగా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దారుగా ఉంది.
జాతీయం
‘షుగర్ ఫ్రీ’తో క్యాన్సర్ ముప్పు?
చక్కెర లేని తీపిని ఆస్వాదించేందుకు, కేలరీలను తగ్గించుకునేందుకు కృత్రిమ తీపి పదార్థాలు ఒక పరిష్కారంగా మార్కెట్లోకి ప్రవేశించాయి. కాలక్రమేణా ఇవి డైట్ సోడాలు, షుగర్-ఫ్రీ స్నాక్స్, దైనందిన ఆహారాలలో భాగంగా మారిపోయాయి. ఎఫ్డీఏ (ఎఫ్డీఏ), ఈఎఫ్ఎస్ఏ (ఈఎఫ్ఎస్ఏ) తదితర నియంత్రణ సంస్థలు వీటిని పరిమితి మేరకు వాడితే సురక్షితమే అని చెబుతున్నప్పటికీ, తాజా అధ్యయనాలు మాత్రం దీర్ఘకాలిక వినియోగంపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.ఈ అంశంపై బెంగళూరు ఆస్టర్ వైట్ఫీల్డ్కు చెందిన ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ నరేంద్ర బి.ఎస్. ‘ఇండియా టీవీ’తో మాట్లాడుతూ.. ఈ స్వీటెనర్లు అందరికీ పూర్తిగా హానికరం కానప్పటికీ, చాలామంది అనుకుంటున్నంత సురక్షితం కూడా కాదన్నారు. వీటి వాడకంతో వచ్చే క్యాన్సర్ ముప్పు గురించి ఆయన మాట్లాడుతూ తాజా పరిశోధన ఫలితాలను సంక్లిష్టంగా ఉన్నాయన్నారు. ఆర్టిఫిషియల్ షుగర్లోని ఆస్పర్టేమ్ అనే పదార్థాన్ని ఐఏఆర్సి (ఐఏఆర్సీ)‘క్యాన్సర్ కారకం కావచ్చు’ అని వర్గీకరించింది. దీని అర్థం అది కచ్చితంగా క్యాన్సర్ కలిగిస్తుందని కాదు, కానీ దానిపై మరింత లోతైన పరిశోధన అవసరమని ఆయన తెలిపారు.ఇక బరువు తగ్గే విషయంపై ఆయన మాట్లాడుతూ, చక్కెరతో పోలిస్తే ఇవి కేలరీలను తగ్గించడంలో కొంత మేలు చేస్తాయని, అయితే అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ కేవలం స్వీటెనర్లను వాడటం వల్ల బరువు సమస్యలు మాయం కావని స్పష్టం చేశారు. ఫలితాలనేవి వ్యక్తిని బట్టి మారుతుంటాయని అన్నారు. ఈ స్వీటెనర్ల ప్రభావం కేవలం బరువుకే పరిమితం కాదు. సుక్రలోజ్, సాకరిన్ వంటి కొన్ని స్వీటెనర్లు పేగులలోని మంచి బ్యాక్టీరియా, ఇన్సులిన్ పనితీరు, గ్లూకోజ్ స్థాయిలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని జంతువులు, మనుషులపై చేసిన కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయని డాక్టర్ నరేంద్ర పేర్కొన్నారు.వృద్ధులలో తక్కువ లేదా జీరో-కేలరీ స్వీటెనర్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు వేగంగా మందగించే అవకాశం ఉందని కొన్ని పరిశీలనాత్మక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయని నరేంద్ర తెలిపారు. గర్భిణులు, చిన్న పిల్లలు, జీవక్రియ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ స్వీటెనర్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వైద్య సలహాలు తీసుకోవాలని డాక్టర్ నరేంద్ర సూచించారు. రోజువారీ వినియోగం సురక్షిత పరిమితుల్లో ఉన్నప్పటికీ, ఇది ఆరోగ్యానికి శ్రేయస్కరమని చెప్పలేమన్నారు. కేవలం రుచి కోసం వీటిపై ఆధారపడకుండా పండ్లు, పెరుగు వంటి సహజసిద్ధమైన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: ‘తగ్గేదే లే..’.. అదే మాటపై శశి థరూర్
సెలబ్రిటీలను సైతం ఇన్స్పైర్ చేసిన 70 ఏళ్ల బామ్మ
అనుకున్నది సాధించేందుకు,అద్భుతాల సృష్టించేందుకు వయసుతో పనిలేదని నిరూపిస్తున్నారు లేటు వయసు సిటిజన్లు. ఇటీవల ఉత్తర ప్రదేశ్కు చెందిన 70 ఏళ్ల వినోద్ కుమార్ శర్మ తొలి వ్లాగ్లొ అద్భుతమైన వ్యూస్ సాధించి వార్తల్లో నిలిచాడు. ఏదో సరదాగా చేసిన వ్లాగ కేవలం 72 గంటల్లోనే 3 కోట్ల వ్యూస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. సంకల్ప ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదంటూ నిరూపిస్తున్న మరో 70 ఏళ్ళ మహిళ ప్రస్తుతం నెట్టింట సందడిగా మారారు.ఇన్స్టాగ్రామ్ బయో ప్రకారం, సంగ్వాన్ 68 సంవత్సరాల వయసులో వెయిట్ లిఫ్టింగ్ ప్రారంభించారు. ఆమె ఆర్థరైటిస్ పేషెంట్ , ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్. రోష్ని దేవి సంగ్వాన్ (70) ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆర్థరైటిస్తో బాధపడుతున్నప్పటికీ తన బలాన్ని, శక్తిని ప్రదర్శిస్తూ.. ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె దృఢ సంకల్పం సోషల్ మీడియా వినియోగదారులను మాత్రమే కాకుండా నటుడు సునీల్ శెట్టితో సహా ప్రముఖులను కూడా ప్రేరణగా నిలిచింది.ఇదీ చదవండి: పెప్సికో ఇండియా కీలక బాధ్యతల్లో సవితా బాలచంద్రన్ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్ అయిన రోష్ణి దేవి సంగ్వాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన కొత్త వీడియో 14 మిలియన్లకు పైగా వ్యూస్తో తెగ వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్ రీల్లో సన్నీ డియోల్, అహాన్ శెట్టి , వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటించిన కొత్త చిత్రం బోర్డర్ 2 మూవీలోని ఘర్ కబ్ ఆవోగే పాటకు సెట్ చేశారు. సునీల్ శెట్టి , సన్నీ డియోల్ ఈ రీల్పై వ్యాఖ్యానిస్తే, 40 ఏళ్ల తరువాత సినిమా హాల్లో బోర్డర్ 2 సినిమా చూస్తుంది అనే క్యాప్షన్తో ఈ వీడియో పోస్ట్ కావడం విశేషం. దీంతో "మీరు చాలా స్ఫూర్తి మంతులు. జై హింద్ జై భారత్," సునీల్ శెట్టి వ్యాఖ్యానించారు. చాలా బావుంది మేడమ్ అంటూ ఆయన కుమారుడు అహన్ శెట్టి కూడా స్పందించారు. View this post on Instagram A post shared by Roshni Devi Sangwan (@weightliftermummy)కాగా రోష్ణి దేవి సంగ్వాన్ ఇన్స్టాగ్రామ్లో 116 వేలకు పైగా అనుచరులను కలిగి ఉన్నారు. సంగ్వాన్ 103 కిలోల బరువును డెడ్లిఫ్టింగ్ చేయడం గమనార్హం. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్తో బాధపడుతున్నఆమె, జీవనశైలిలో మార్పులు, కష్టమైనవ్యాయామం సవాలుతో కూడుకున్నది అయినప్పటికీ, శరీరం చెప్పినట్టుగా విని కాలక్రమేణా తన బలాన్ని తిరిగి పొందగలిగినట్టు చెప్పారు.
‘తగ్గేదే లే..’.. అదే మాటపై శశి థరూర్
కోజికోడ్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తాజాగా కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తాను కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరిని పార్లమెంటులో ఏనాడూ ఉల్లంఘించలేదని, అయితే ‘ఆపరేషన్ సింధూర్’ విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని బలంగా వినిపించానని శశి థరూర్ స్పష్టం చేశారు. పహల్గామ్ ఘటన తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, ఆ ఒక్క విషయంలో మాత్రమే పార్టీతో బహిరంగంగా విభేదించాల్సి వచ్చిందని, దానికి తాను ఏమాత్రం విచారించడం లేదని థరూర్ తేల్చిచెప్పారు.శనివారం కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడిన శశి థరూర్, పార్టీ నాయకత్వంతో విభేదాలు ఉన్నాయన్న వార్తలపై స్పందించారు. పార్లమెంటులో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలకు, విధానాలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ విషయంలో మాత్రం తాను భిన్నమైన వైఖరిని అవలంబించినట్లు అంగీకరించారు. ఆ సమయంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను తీసుకున్న కఠినమైన వైఖరికి కట్టుబడి ఉన్నానని, దానిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ధరూర్ తేల్చి చెప్పారు.పహల్గామ్ ఘటన తర్వాత తాను ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన కాలమ్ను థరూర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ దాడికి ప్రతీకారంగా ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ పరిమిత సైనిక చర్య చేపట్టాలని తాను ఆనాడే సూచించానన్నారు. భారత్ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్న దేశమని, పాకిస్తాన్తో సుదీర్ఘ యుద్ధానికి దిగకుండానే ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని తాను భావించానన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తాను సూచించిన తరహాలోనే చర్యలు తీసుకుందని, ఈ విషయంలో తన వైఖరి సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు.ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కీలక సమావేశాలకు గైర్హాజరు కావడంపై వస్తున్న ఊహాగానాలపైన కూడా థరూర్ స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తల్లో కొన్ని నిజాలు, మరికొన్ని అబద్ధాలు ఉన్నాయని అన్నారు. తాను హాజరుకాలేనని పార్టీకి ముందుగానే సమాచారం ఇచ్చానని, ఏవైనా అంతర్గత సమస్యలు ఉంటే పార్టీ వేదికలపైనే చర్చిస్తానన్నారు. మరోవైపు కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, థరూర్ గైర్హాజరును వివాదంగా చూడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇది కూడా చదవండి: ముంబై మేయర్ ఎన్నికపై మరింత ఉత్కంఠ
పెప్సికో ఇండియా కీలక బాధ్యతల్లో సవితా బాలచంద్రన్
ఎఫ్.ఎమ్.సి.జి (FMCG) దిగ్గజం పెప్సికో సవిత బాలచంద్రన్ను భారతదేశం మరియు దక్షిణాసియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. పెప్సికో నుంచి కౌశిక్ మిత్రా పదవీవిరమణ చేస్తున్న నేపథ్యంలో పెప్సికో ఈ కీలక నియామకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి బాధ్యతలు చేపడతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైనాన్స్ స్ట్రాటజీ (ఆర్థిక వ్యూహం), గవర్నెన్స్ , పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ను ఆమె పర్యవేక్షిస్తారు.బాలచంద్రన్ నియామకాన్ని స్వాగతిస్తూ, ఇండియా & సౌత్ ఆసియాలో కంపెనీ తన తదుపరి దశ వృద్ధిని వేగవంతం చేస్తున్నందున ఆర్థిక, వ్యూహం మరియు విలువ సృష్టిలో ఆమె నైపుణ్యం చాలా కీలకమని పెప్సికో తెలిపింది. పెప్సికో ఇండియా & సౌత్ ఆసియా CFOగా నియమితులైన సంగతిని లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా ప్రకటించిన సవితా బాలచంద్రన్ తన కరియర్లో ఇదొక ఉత్సాహకరమైన కొత్త అధ్యాయానికి నాందిగా అభివర్ణించారు.ఎవరీ సవితా బాలచంద్రన్దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞురాలైన ఫైనాన్స్ ప్రొఫెషనల్. పెప్సికోలో చేరడానికి ముందు, ఐదేళ్లకు పైగా టాటా టెక్నాలజీస్లో సీఎఫ్వోగా పనిచేశారు. ఆర్థిక ప్రణాళిక, రిస్క్ మేనేజ్మెంట్ మరియు వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడానికి బాధ్యత వహించారు.టాటా టెక్నాలజీస్లో CFOగా ఎంపిక కావడానికి ముందు ఆమె టాటా మోటార్స్లో సీనియర్ ఫైనాన్స్ పాత్రలను నిర్వహించారు.అంతకుమందు ఆమె టాటా మోటార్స్లో 18 సంవత్సరాలకు పైగా పనిచేశారు, ఫైనాన్స్, కార్పొరేట్ వ్యూహం మరియు వ్యాపార కార్యకలాపాలలో సీనియర్ నాయకత్వ పాత్రలను నిర్వహించారు. టాటా గ్రూప్లో ,సుదీర్ఘ పదవీకాలం ప్రపంచ మార్కెట్లు, తయారీ ఆధారిత వ్యాపారాలు మరియు పరివర్తన-ఆధారిత వృద్ధి అంశాలో లోతైన అవగాహన ఆమె సొంతం.బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుండి కామర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పూణేలోని Symbiosis (SCMHRD) నుండి ఫైనాన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (MBA) పొందారు. అలాగే అమెరికా కార్నెగీ మెల్లన్ యూనివర్శిటీ నుండి Fulbright-CII Fellowship కూడా పొందారు.
ఎన్ఆర్ఐ
జపాన్లో ఘనంగా తెలుగువారి సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి-2026 సందర్భంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (TAJ–తాజ్) ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా వనభోజనాలు, టగ్ ఆఫ్ వార్, పిల్లలకి డ్రాయింగ్ ఈవెంట్, క్రికెట్ పోటీలు, మహిళలకి ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. కొసమెరుపుగా జనవరి 10న రోజంతా సాగిన శాస్త్రీయ మరియు సినీ నృత్యాలు, పాటలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగు, జపనీస్ వారికి చిరస్మరణీయ అనుభూతిని కలిగించాయి. ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకుండా తదుపరి తరాలకు అందించే రీతిలో తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (TAJ–తాజ్) నిరంతరం కృషి చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.(చదవండి: కెంట్ అయ్యప్ప ఆలయంలో వైభవంగా మకరవిళక్కు మహోత్సవం)
ఇంటర్నెట్ లేదు.. ఇరాన్లో ఇదీ పరిస్థితి
ఇరాన్లో అల్లకల్లోల పరిస్థితుల వేళ.. భారతీయుల తరలింపును భారత ప్రభుత్వం చేపట్టింది. ఆ ఆపరేషన్లో భాగంగా పలువురితో బయల్దేరిన రెండు విమానాలు గత అర్ధరాత్రి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నాయి. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ విదేశీ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీళ్ల ద్వారా అక్కడి పరిస్థితులను లోకల్ మీడియా సంస్థలు అడిగి తెలుసుకుంటున్నాయి.ఢిల్లీకి చేరుకున్నవాళ్లలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. తాము సురక్షితంగా రావడానికి కేంద్రం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం అక్కడి భారతీయులతో సంప్రదింపులు జరుపుతోందని.. పలు సూచనలు జారీ చేస్తోందని వివరించారు. ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘నిరసనల గురించి విన్నాను. కానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఇంటర్నెట్ లేకపోవడం పెద్ద సమస్యగా అనిపించింది’’ అని తెలిపింది. మరో యువకుడు మాట్లాడుతూ.. ‘‘వీధుల్లోకి వెళ్తే నిరసనకారులు కార్లను అడ్డుకునేవారు. ఇంటర్నెట్ లేకపోవడంతో కుటుంబాలకు కూడా సమాచారం ఇవ్వలేకపోయాం. చాలా భయమేసింది’’ అని అన్నాడు. ఇక.. ఇరాన్లో ఉద్యోగం కోసం వెళ్లిన ఒక ఇంజనీర్ ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడిందని చెప్పాడు. ‘‘ఇరాన్లో పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కానీ, పరిస్థితి మరీ ఘోరంగా ఏం లేదు. నెట్వర్క్ సమస్య తప్ప పెద్ద ఇబ్బందులేం లేవు’’ అని అన్నాడు. మరో యువతి మాట్లాడుతూ.. టెహహ్రాన్ నిరసనలు ప్రమాదకరంగానే సాగాయని, ఘర్షణల్లో పలు భవాలకు నిప్పు పెట్టారని.. ఆ పరిస్థితుల్లో భయంగా గడిపామని తెలిపింది. అదే సమయంలో.. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినవారు ఎక్కువగానే కనిపించారు అని వివరించింది. డిసెంబర్ చివరిలో అయతొల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఇరాన్లో మొదలైన భారీ నిరసనలు.. భద్రతా బలగాల ప్రతిఘటనలతో 3,000 మందిని బలిగొన్నాయి. ఇందులో సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలోనే మరణించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వేల మందిని అరెస్ట్ చేయించింది ఖమేనీ ప్రభుత్వం. ఒకానొక తరుణంలో.. నిరసనకారులకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం, ఇరాన్ ఖండన, మాటల యుద్ధం.. సైనిక ఘర్షణకు దారి తీయొచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి. ఆ సమయంలో భారత ప్రభుత్వం తన పౌరులకు ఇరాన్ ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. సరిగ్గా అదే సమయంలో.. జనవరి 15న ఇరాన్ గగనతలం తాత్కాలికంగా మూసివేయడంతో కొన్ని భారతీయ విమానాలు ప్రభావితమయ్యాయి. అయితే గల్ఫ్ దేశాల మధ్యవర్తిత్వంతో ప్రస్తుతం పరిస్థితి కొంత చల్లారింది. అయినప్పటికీ భారతీయులు స్వదేశానికే వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇరాన్లో సుమారు 10 వేలమంది భారతీయులు(విద్యార్థులు, ఉద్యోగులు, భారత మూలాలు ఉన్నవాళ్లు) ఉన్నట్లు విదేశాంగ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయుల్ని తీసుకొచ్చిన రెండు విమానాలు కమర్షియల్ ప్లైట్సే. అయితే ఇవి రెగ్యులర్ విమానాలేనని.. ఎలాంటి ప్రత్యేక తరలింపు కాదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ తరలింపును నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
పురుషులు గర్భం దాల్చగలరా? భారత సంతతి వైద్యురాలు ఏమన్నారంటే..
అమెరికాలోని డిర్క్సెన్ సెనేట్ కార్యాలయంలో జరిగిన "మహిళల రక్షణ: కెమికల్ అబార్షన్ డ్రగ్స్ ముప్పు" అనే అంశంపై జరిగిన చర్చ వివాదాస్పదంగా మారింది. మందుల ద్వారా జరిగే అబార్షన్ నుంచి మహిళలను కాపాడటం.. అనే అంశంపై సెనేట్లో జరుగుతున్న చర్చకు భారత సంతతి గైనకాలజిస్ట్, డాక్టర్ నిషా వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెనేటర్కు, డాక్టర్ మధ్య జరిగిన వాగ్వాదం హాట్టాపిక్గా మారి చర్చనీయాంశమైంది.ఆ ఒక్క ప్రశ్నతో దద్దరిల్లిన పార్లమెంట్..చర్చలో భాగంగా సెనేటర్ జోష్ హాలే నేరుగా డాక్టర్ నిషా వర్మను ఉద్దేశించి.. " మగవారు గర్భం దాల్చగలరా ?" అని ప్రశ్నించారు. అందుకు ఆమె నేరుగా అవును లేదా కాదు అని సమాధానం చెప్పకుండా దాటవేస్తూ.. తాను మహిళలుగా గుర్తింపులేని వివిధ జెండర్ ఐడెంటిటీలు ఉన్న రోగులకు కూడా చికిత్స అందించాను అని బదులిచ్చారు. ఆ సమాధానంపై తీవ్ర అసంతృప్తికి గురైన సెనేటర్ హాలే తాను అడిగిన ప్రశ్న..సైన్స్, జీవశాస్త్ర వాస్తవాలకు సంబంధించినదని, దీనికి రాజకీయ రంగు పులమాల్సిన పని లేదంటూ మండిపడ్డారు. దాంతో డాక్టర్ నిషా వర్మ తన వాదనను కొనసాగిస్తూ.. ఇలాంటి ప్రశ్నలను ముమ్మాటికి రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటారంటూ ధ్వజమెత్తారామె. అంతేగాదు తాను సైన్స్ నమ్మే వ్యక్తినని, రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే రోగులకు చికిత్స అందిస్తుంటాను. ఆ నేపథ్యంలోనే ఈ చర్చలో పాల్గొనేందుకు వచ్చాను. కానీ ఇలాంటి ప్రశ్నలు పక్కదారి పట్టిస్తాయంటూ ఘాటుగా సమాధానమిచ్చారు నిషా. అయితే "జీవశాస్త్రపరంగా పురుషులు గర్భం దాల్చలేరనే కనీస సత్యాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారు.. కాబట్టి మిమ్మల్ని సైన్స్ తెలిసిన వ్యక్తిగా ఎలా నమ్మాలి?" అంటూ హాలే ఆగ్రహం వ్యక్తం చేశారు. అబార్షన్ మందుల భద్రతపై ఆందోళనకేవలం జెండర్ వివాదమే కాకుండా అబార్షన్ కోసం వాడే మందుల భద్రతపై కూడా సెనేటర్ హాలే కీలక గణాంకాలను ప్రస్తావించారు. "అబార్షన్ డ్రగ్స్ వాడటం వల్ల 11 శాతం కేసుల్లో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని సైన్స్ చెబుతోంది. ఇది ఎఫ్డీఏ లేబుల్పై ఉన్న దానికంటే 22 రెట్లు ఎక్కువ" అని ఆయన ఆరోపించారు. మరోవైపు డాక్టర్ నిషా వర్మ ఈ వాదనను తోసిపుచ్చారు. 2000 సంవత్సరంలో ఆమోదం పొందిన నాటి నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 75 లక్షల మందికి పైగా ఈ మందులను సురక్షితంగా వాడారని, వందకు పైగా అత్యున్నత స్థాయి సమీక్షలు ఈ మందులు సురక్షితమని నిరూపించాయని ఆమె చెప్పడం విశేషం. కేవలం రాజకీయ కారణాల వల్లే అబార్షన్ హక్కులపై ఆంక్షలు విధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారామె. ఇంతకీ ఎవరీ భారత సంతతి వైద్యురాలు నిషా వర్మ..ఆమె ఎవరంటే..నిషా వర్మ నార్త్ కరోలినాలోని గ్రీన్స్బోరోలో భారత వలస తల్లిదండ్రులకు జన్మించారు. ఆమె జీవశాస్త్రం,మానవ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని, కరోలినా విశ్వవిద్యాలయం నుంచి వైద్య డిగ్రీ (MD)ని పొందారు.ఆమె బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్లో ఇంటర్న్షిప్ OB/GYN (ప్రసూతి మరియు గైనకాలజీ) రెసిడెన్సీని పూర్తి చేసింది. వర్మ ఆ తర్వాత కాంప్లెక్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫెలోషిప్ను పూర్తి చేసి ఎమోరీ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MPH) డిగ్రీని పొందారు.ఆమె డబుల్-బోర్డ్-సర్టిఫైడ్ ప్రసూతి వైద్యురాలు, పైగా కుటుంబ నియంత్రణలో స్పెషలిస్ట్ కూడా. వర్మ ప్రస్తుతం జార్జియాలో సమగ్ర పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణపై ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె ఫిజిషియన్స్ ఫర్ రిప్రొడక్టివ్ హెల్త్లో ఫెలో కూడా.అంతేగాదు ఆమె అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG)లో రిప్రొడక్టివ్ హెల్త్ పాలసీ అండ్ అడ్వకేసీకి సీనియర్ అడ్వైజర్గా పనిచేయడమే గాక ఎమోరీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో అనుబంధ అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తోందామె. Sen. Hawley: “Can men get pregnant?”Dr. Nisha Verma: “I'm not really sure what the goal of the question is.”Sen. Hawley: “The goal is just to establish a biological reality...Can men get pregnant?”pic.twitter.com/exjxLqJBTC— America (@america) January 14, 2026 (చదవండి: అలాంటి ఇలాంటి నమ్మకం కాదు..! అడగంగానే..'బంగారుపు గాజులను'..)
ఇరాన్ ఆందోళనల్లో భారతీయుల అరెస్ట్?!
ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆందోళనకారులను అణచివేస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే సైనిక చర్యకు దిగుతామని ట్రంప్.. తమ దేశ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే అంతు చూస్తామంటూ ఖమేనీ సవాల్-ప్రతిసవాల్ విసురుకుంటున్నారు. అయితే ఆందోళనలతో ఇరాన్ నెత్తురోడుతున్న వేళ.. ఆ దేశంలోని ఇతర దేశాల పౌరుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఇరాన్ సంక్షోభంలో(Iran Crisis) మరణాలను అక్కడి ప్రభుత్వం తక్కువగా చూపెడుతోందంటూ మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటిదాకా 548 మరణించారని.. అందులో 48 భద్రతా సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది(హెచ్ఆర్ఏఎన్ఏ అనే అమెరికా మానవ హక్కుల సంఘం లెక్కల ప్రకారం). అలాగే 10 వేల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారని సమాచారం. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లలో ఇతర దేశా పౌరులు ఉన్నట్లు పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. నిరసనల్లో పాల్గొనకపోయినా.. కొందరి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తన్నట్లుగా దృశ్యాలు అందులో ఉన్నాయి. అందులో భారతీయులు, అఫ్గనిస్థాన్ జాతీయులు ఎక్కువగా ఉన్నట్లు ఆ ప్రచార సారాంశం. పైగా విదేశీ వ్యవహారాల శాఖ సంబంధిత పేర్లతో ఉన్న అకౌంట్లలో ఆ వీడియోలు పోస్టు కావడం గమనార్హం. దీంతో.. ఆ దేశంలో పనుల నిమిత్తం వెళ్లిన భారత పౌరులు.. విద్యార్థుల భద్రతపై ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే.. భారత్లో ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలి(Mohammad Fathali) ఆ కథనాలను ఖండించారు. అలాంటిదేమీ.. ఇరాన్లోని భారతీయులతో సహా ఇతర దేశాల పౌరుల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో జరిగిన ఫేక్ ప్రచారం ఆధారంగానే ఆ కథనాలు పుట్టుకొచ్చాయని అంటున్నారు. పుకార్లను నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన క్లారిటీగా ఓ పోస్ట్ చేశారు. అయితే.. అటు ఇరాన్ ఈ తరహా కథనాలు మొదటి నుంచే ఖండిస్తోంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న కుట్ర అని ఆరోపించింది. ఇరాన్ నిరసనలను కొందరు విదేశీ నటులు.. మీడియా వక్రీకరిస్తున్నాయని.. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తోంది. మన పిల్లలు సేఫ్!భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ఇరాన్లో 10,000 నుంచి 12,000 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో పనుల నిమిత్తం వెళ్లేవాళ్లు, భారతీయ మూలాలు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే అక్కడికి భారత్ నుంచి అత్యధికంగా వెళ్లేది వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులే. ఈ నేపథ్యంలో.. వాళ్ల భద్రతపై కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. వాళ్లు సురక్షితంగా ఉన్నారని ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIMSA), ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ (FAIMA) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం, సీనియర్ అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని.. విద్యార్థులతో, అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొంది.
క్రైమ్
వేధింపులు తట్టుకోలేక స్టాఫ్నర్సు ఆత్మహత్యాయత్నం
చల్లపల్లి (అవనిగడ్డ): చంద్రబాబు ప్రభుత్వంలో పనిభారం, అధికారుల ఒత్తిడి పెరగడంతో మనస్తాపానికి గురైన స్టాఫ్నర్సు కాజ అనిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పనిచేయడం కంటే చావడమే మేలనుకుని నిద్రమాత్రలు మింగింది. ఈ ఘటన కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, శ్రీకాకుళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగింది. అనిత తల్లి నాగమణి, అత్త పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం.. కాజ అనిత (34) నాలుగేళ్లుగా శ్రీకాకుళం పీహెచ్సీలో స్టాఫ్నర్సుగా పనిచేస్తున్నారు. ఆమెకు భర్త శ్రీకాంత్, కుమారుడు ఆనంద్కుమార్, కుమార్తె బేబీ సునైన ఉన్నారు. భర్త శ్రీకాంత్, కొడుకు ఆనంద్కుమార్కు అనారోగ్య సమస్యలున్నాయి. భర్త, కుమారుడిని చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో గుడివాడలో ఉన్న అత్తమామల వద్దే ఉంటూ అక్కడి నుంచే రోజూ విధులకు హాజరవుతోంది. ఈ క్రమంలో కొంత కాలంగా పనిభారం ఎక్కువైంది. రాత్రి, పగలూ విరామం లేకుండా వెంటవెంటనే డ్యూటీలు వేస్తున్నారు. భర్త, కొడుకుని ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించేందుకు అనితకు ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వడం లేదు. నాలుగు నెలల క్రితం వచ్చిన వైద్యురాలు మరింత వేధింపులకు గురి చేస్తూ మెమోలు ఇస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒక వైపు జిల్లా అధికారుల చుట్టూ తిప్పుతూ, మరోవైపు అదనపు పనిభారం మోపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిత శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉండగా నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకుంది. తోటి సిబ్బంది వెంటనే చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఈ ఘటన జరిగితే శనివారం సాయంత్రం వరకూ ఏ ఒక్క అధికారీ వచ్చి పలకరించలేదని అనిత కుటుంబ సభ్యులు వాపోయారు. అనితకు ఈ పరిస్థితి కల్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లుగా పెరిగిన పనిభారం రెండేళ్ల నుంచి పనిభారం విపరీతంగా పెరిగిపోయిందని, ప్రాణం మీదకు వచ్చినా ఒక్కరోజు సెలవు కూడా ఇవ్వడం లేదని అనితను చూసేందుకు చల్లపల్లి ఆస్పత్రికి వచ్చిన శ్రీకాకుళం పీహెచ్సీ వైద్య సిబ్బంది వాపోయారు. తాము అనారోగ్యానికి గురైతే చేతికి సెలైన్ సీసాలు కట్టుకుని ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని, తమ కష్టం ఎవరికీ రాకూడదని వేడుకొంటున్నారు. స్టాఫ్నర్సుల పరిస్థితే ఆత్మహత్య చేసుకునేలా ఉందంటే కింది స్థాయి సిబ్బంది ఇంకెంత దయనీయస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలని పలువురు సిబ్బంది తమ ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్, మేల్ నర్స్కు పదేళ్ల జైలు
నిజామాబాద్ లీగల్: నకిలీ రెమిడెసివిర్ ఇంజెక్షన్లను సరఫరా చేసి, రోగుల ప్రాణాలతో చెలగాటమాడిన మేల్ నర్సు, డాక్టర్కు నిజామాబాద్ ప్రిన్సిపల్ డి్రస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి పదేళ్ల జైలు శిక్ష, చెరో రూ.లక్ష జరిమానా విధించారు. 2021లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్కు చెందిన కొండ్ర మహేశ్బాబు కరోనా చికిత్స కోసం ఆర్మూర్లోని లైఫ్ కోవిడ్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ డాక్టర్గా పనిచేస్తున్న అల్యాన సాయి కృష్ణ మార్కెట్లో ఆ ఇంజెక్షన్ల కొరత ఉండటంతో తానే వాటిని సమకూర్చుతానని పేషెంట్ తమ్ముడు రంజిత్ వద్ద రూ. 50 వేలు తీసుకొని రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు. అయినా మహేశ్కు కరోనా తీవ్రత తగ్గలేదు. మెరుగైన చికి త్స కోసం నిజామాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ ప్రవీ ణ్ పేషెంట్కు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల మూడు రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అవసరమని, ఆ ఇంజెక్షన్లను తీసుకురావాల్సిందిగా కోరాడు. అయితే పేషెంట్ బంధువు డాక్టర్ సాయికృష్ణను సంప్రదించాడు. ధర పెరిగిందని 3 ఇంజెక్షన్లకు రూ.85 వేలు ఇవ్వాలని కోరాడు, అందుకు వారు అంగీకరించడంతో నిజామాబాద్లోని తిరుమల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మేల్ నర్స్గా పనిచేస్తున్న పులి సతీశ్గౌడ్తో కలిసి మూడు ఇంజెక్షన్లను రోగి బంధువుకు ఇచ్చారు. డాక్టర్ ప్రవీణ్ వాటిని నకిలీ ఇంజెక్షన్లుగా గుర్తించి తిరిగి వెనక్కి ఇచ్చేశాడు. రెండోసారి కూడా నకిలీ ఇంజెక్షన్లు ఇవ్వడంతో తాము మోసపోయామని గ్రహించిన రోగి సోదరుడు రంజిత్కుమార్ నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పులి సతీశ్గౌడ్, డాక్టర్ సాయికృష్ణపై కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన జడ్జి పైవిధంగా తీర్పు ఇచ్చారు.
బెడ్రూమ్ నుంచి సరాసరి పీఎస్కు..
ఓరీ నా కొడకో.. నీకు ఎంత కష్టం వచ్చిందిరో అంటూ ఆ తల్లి పరిగెత్తుకుంటూ కొడుకు బెడ్రూమ్ వైపు గబగబా పరుగులు తీసింది. అక్కడ కనిపించిన దృశ్యంతో ఆమె, గ్రామస్తులు షాక్ తిన్నారు. అతన్ని ఓ మంచానికి కట్టేసింది అతని భార్య. ముదనష్టపుది అంటూ కోడలి గురించి గొణుక్కుంటూనే ఆ అత్త పెద్దమనుషుల సాయంతో కొడుకు చేతులకు కట్టిన తాడుల్ని విడిపించింది. ఇక్కడి నుంచి అసలు హైడ్రామా నడిచింది.. ఉత్తర ప్రదేశ్ అలీగఢ్లో నేరుగా బెడ్రూమ్ నుంచి టప్పల్ పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయితీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన కొడుకును కోడలు హింసిస్తోందని.. తాజాగా మంచానికి కట్టేసిందని.. గట్టిగా మందలిస్తే తనకు తుపాకీ చూపించిందంటూ ఓ ఫొటోను పోలీసులకు అందించిందా అత్త. అందులో కోడలు యిస్టైల్గా పిస్టల్తో ఫోజు ఇచ్చింది. దీంతో.. కోడలిని పీఎస్కు పిలిపించుకున్న పోలీసులు అసలు విషయంపై ఆరా తీశారు. అయితే తాను అలా చేయడానికి బలమైన కారణం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. రోజూ తాగి వచ్చి తన భర్త ప్రదీప్ తనను హింసిస్తున్నాడని.. ఇరుగుపొరుగువాళ్లనూ బండ బూతులు తిడుతున్నారని సోనీ వాపోయింది. నాలుగేళ్ల కిందట తమ వివాహం అయ్యందని.. గత రెండేళ్లుగా కట్నం కోసం వేధిస్తూ వస్తున్నాడని చెప్పింది. ఈ క్రమంలోనే తాగుబోతు భర్త తీరుతో విసిగిపోయి అలా మంచానికి కట్టేశానని చెప్పిందామె. అదే సమయంలో ఆ తుపాకీ నకిలీదని తేలింది. దీంతో ఆ అత్త షాక్ తింది. దీంతో.. ఆ అత్తాకోడళ్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే.. నెట్టింట ప్రదీప్ను మంచానికి కట్టి అత్తతో సోని గొడవపడుతున్న వీడియో వైరల్ అవుతోంది.UP Woman Ties Husband To Bed, Mother-In-Law Shows Cops Her Pic With Gun https://t.co/8I6zGHEmMl pic.twitter.com/uCp3h2XqJK— NDTV (@ndtv) January 23, 2026
ఆడుకున్న మృత్యువు
పి.గన్నవరం: నవ్వుతూ ఆడుకుంటున్న ఆ చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.. అభం శుభం తెలియని ఆ పసిప్రాయం అనంత లోకాల్లో కలసిపోయింది.. పాఠశాల ఆవరణలో సిమెంట్ ఆట బొమ్మపై ఆడుకుంటూ దిగుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో రెండో తరగతి విద్యారి్థని అశువులు బాసింది.. పి.గన్నవరం మండలం జి.పెదపూడి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. మాచవరం గ్రామానికి చెందిన దివి దుర్గా వరప్రసాద్కు, జి.పెదపూడికి చెందిన సుజాతతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు. అయితే దుర్గా వరప్రసాద్, సుజాతలు జీవనోపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నారు. వారి ఇద్దరి పిల్లలను జి.పెదపూడి గ్రామంలోని వరప్రసాద్ అత్తయ్య అధికారి సత్యవతి ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. జి.పెదపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సత్యవతి చాలాకాలం నుంచి మధ్యాహ్న భోజన పథకంలో వంట పనిచేస్తోంది. అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న చిన్నారులు ఆ ప్రాథమిక పాఠశాలలోనే చదువుకుంటున్నారు. తేజశ్రీ ఐదో తరగతి, జాహ్నవి (7) రెండో తరగతి అభ్యసిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత జాహ్నవి పాఠశాల ఆవరణలోని పార్కులో సిమెంట్ జింక బొమ్మపై ఎక్కి నవ్వుతూ కొంతసేపు ఆడుకుంది. అనంతరం కిందకు దిగుతుండగా జాహ్నవిపై ఆ బొమ్మ పడిపోయింది. సుమారు 70 కిలోల బరువున్న బొమ్మ ఆమె ఛాతిపై పడడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో పాఠశాల హెచ్ఎంతో పాటు, స్థానికులు ఆ చిన్నారిని అంబులెన్స్లో కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో మిగిలిన విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అప్పుడే భోజనం తినిపించా.. అప్పుడే భోజనం తినిపించా.. సరదాగా నవ్వుతూ ఉంది.. కొద్ది సేపటికే ఇలా జరిగిందంటూ జాహ్నవి మృతితో అమ్మమ్మ సత్యవతి బోరున విలపిస్తోంది. ఈ ఘటనతో జి.పెదపూడి గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. సంక్రాంతి పండగలకు ఇక్కడకు వచ్చిన జాహ్నవి తల్లిదండ్రులు రెండు రోజుల కిందటే తిరిగి విజయవాడకు వెళ్లారు. ఈ ఘటనపై పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.ఘటనకు కారణాలు ఇలా.. ఒక టీచర్తో నడుస్తున్న ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ మొత్తం 20 విద్యార్థులు ఉండగా, శుక్రవారం 19 మంది హాజరయ్యారు. పాఠశాల ఆవరణలోని పార్కులో పునాది నిర్మించకుండానే నేలపైనే సిమెంట్ బొమ్మలు ఏర్పాటు చేశారు. వాటికి సపోర్టు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గతంలో పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలాన్ని కొత్తపేట ఆర్డీఓ శ్రీకర్, తహసీల్దార్ పి.శ్రీపల్లవి, ఎంపీడీఓ మల్లిఖార్జునరావు, సర్పంచ్ దంగేటి అన్నవరం, ఎంపీటీసీ పల్లి మోషే తదితరులు పరిశీలించారు. శ్రీకాకుళంలో ఉన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రమాదంపై ఆరా తీసి, బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.
వీడియోలు
నాంపల్లి ప్రమాదంలో దొరకని ఐదుగురి ఆచూకీ.. ఎందుకింత ఆలస్యం?
గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ మృతి
ప్రియుడి ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు
నీకు బుద్దుందా పట్టాభి.. చంద్రబాబు అసహనం
మన వాళ్ళని విదేశాలకు పంపండి.. నాంపల్లి ప్రమాదంపై రాజాసింగ్
రూ. 450 లక్షల కోట్లు దాటిన దేశంలో ఉన్న బంగారం విలువ
ఏ క్షణమైనా యుద్ధం.. ఈసారి అణుబాంబులేనా?
మరుగుదొడ్లపై ఫోటోలు వేసుకునే మీరా జగన్ గురించి మాట్లాడేది
జగనన్న పథకాలన్నీ చోరీ చేసి..దొంగ నాటకాలు... నాగార్జున యాదవ్ ఫైర్
బొగ్గు కుంభకోణంపై భట్టికి హరీశ్ రావు మాస్ కౌంటర్
