పార్టీ పదవుల భర్తీ అన్నారు.. ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేనలో పార్టీ పదవుల భర్తీపై నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆగస్టు 15లోగా అన్ని స్థాయిల్లో పదవులను భర్తీ చేస్తామని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించినా ఆ దిశగా కదలిక లేదని జనసైనికులు మండిపడుతున్నారు. ఆరోగ్యం సరిగా లేదంటూ పదవుల భర్తీని వాయిదా వేయడం సరికాదని, ఇకనైనా దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగాలంటే క్షేత్ర స్థాయి పదవుల భర్తీ కీలకమని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమిగా జతకట్టినప్పటి నుంచీ టీడీపీ ప్రయోజనాలు, ఆ పార్టీ విజయం, పల్లకీ మోసేందుకే జనసేన పరిమితం కావడంపై ఆ పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. ‘సంస్థాగతంగా బలోపేతం అయ్యే ఆలోచనే లేదు. టీడీపీ, జనసేన నేతల మధ్య వర్గవిభేదాలు నెలకొన్న సందర్భాల్లో పార్టీ అధినేత పవన్ స్వయంగా సర్దుకుపోవాలంటూ ఉచిత సలహా ఇవ్వడం నిరుత్సాహానికి గురిచేస్తోంది’ అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పార్టీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. పదవులు ఆశిస్తున్న వారు తమ దరఖాస్తులనూ అధిష్టానానికి పంపారు. అయితే ఆగస్టు ముగుస్తున్నప్పటికీ దీనిపై అతీగతీ లేకపోవడంతో ఆశావహుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. నిజానికి జనసేనలో పదవుల భర్తీ ప్రక్రియ చేపడతామని ఆరు నెలల క్రితమే ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించి వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నా పార్టీలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదన్న భావన జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ పార్టీకి మొండిచేయి చూపారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది.
హైబ్రిడ్ మంచేనా? ముంచేనా?
ఉదయాన్నే ఆఫీస్ క్యాబ్ కోసం ఎదురుచూడక్కర్లేదు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద గంటల తరబడి టైమ్ వేస్ట్ చేయక్కర్లేదు. ఇంట్లో హాయిగా కాఫీ తాగుతూ లాప్టాప్ ఆన్ చేస్తే చాలు... ఆఫీస్లో అడుగుపెట్టినట్లే... అటెండెన్స్ పడినట్లే... ప్రపంచాన్ని చుట్టేసిన ‘కరోనా’ కార్పొరేట్ రంగానికి నేర్పిన అతిపెద్ద పాఠం ‘‘హైబ్రిడ్ వర్క్ కల్చర్’’ వారంలో మూడు రోజులు డెస్క్ వర్క్, రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్... వారాంతాల్లో సరదాలు... అసలు ఈ సరికొత్త సంస్కృతి ఉద్యోగుల జీవితాలను, కంపెనీల భవిష్యత్తును ఎలా మార్చింది? మారుస్తోంది? ఒక ప్రత్యేక కథనం.ఎక్కడ పనిచేస్తున్నారనేది కాదు... ఎంత సమర్థంగా పనిచేస్తున్నారు... ఔట్పుట్ ఎంత వచ్చిందనేదే ముఖ్యం అంటున్నాయి నేటి గ్లోబల్ కంపెనీలు. నాలుగు గోడల మధ్య మూస ధోరణిలో ఆఫీసులో పనిచేయడం... లేదా వర్క్ ఫ్రమ్ హోమ్తో విసిగి పోవడం వంటిæరోజులు ముగిశాయి. ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో హైబ్రిడ్ వర్క్ కల్చర్ ఒక ట్రెండ్గా మారింది. సంస్థల ఉత్పాదకత, ఉద్యోగుల సౌకర్యంతో పాటు లైఫ్ను సమన్వయం చేస్తూ ఈ నూతన పని సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.ఫలితమే ఫైనల్!ఉద్యోగులు తమ పనిదినాలను ఇల్లు, ఆఫీసు మధ్య పంచుకునే వెసులుబాటే హైబ్రిడ్ వర్క్. ఈ విధానంలో ఉద్యోగులు తమ సౌకర్యాన్ని బట్టి ఆఫీసు నుంచి, ఇంటి నుంచి లేదా వారికి నచ్చిన ఏ ప్రాంతం నుంచైనా పనిచేసుకునే వీలును కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఏ ప్రాంతం, ఏ దేశం అనే వాటితో సంబంధం లేకుండా కేవలం ప్రతిభను ఆధారంగా చేసుకుని ఉద్యోగులను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుంది. పని ఎక్కడి నుంచి చేసినా ఫలితమే ఫైనల్ అనేది ఈ ఆధునిక విధానంలోని ముఖ్య ఉద్దేశం. డిజిటల్ టూల్స్ సహాయంతో సాధించిన విజయాలను చూసిన కంపెనీలు ఇప్పుడు దీనిని శాశ్వత మోడల్గా మారుస్తున్నాయి.కాఫీషాప్ ఆఫీసైతే!ఒకప్పుడు ఆఫీస్ అంటే నాలుగు గోడల మధ్య అమర్చిన డెస్క్లు, వరుసగా కూర్చునే ఉద్యోగులు. నిర్దిష్టమైన పని వేళలు. కానీ ఇప్పుడది పాత పద్ధతయ్యింది. ఇంటి లివింగ్ రూమ్, నచ్చిన కాఫీ షాప్, పల్లెలోని ప్రశాంతమైన వాతావరణం... ప్రదేశం ఏదయినా లాప్టాప్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ప్రతి చోటూ ఒక వర్క్స్పేస్గా మారిపోతోంది.రెండు పడవలపై ప్రయాణం!సోమవారం పొద్దున్నే సగం తెరిచిన కళ్లతో అలారం సైలెంట్ చేయడం... ఉదయం 8:15 గంటలకు బంపర్–టు–బంపర్ ట్రాఫిక్, హారన్ల గోల మధ్య ప్రెజెంటేషన్ డెక్ గురించి ఆలోచించడం.అదే బుధవారం ఉదయం... హాయిగా ఉదయం 8:30 గంటలకు లేచి, చేతిలో కాఫీ కప్పుతో లాప్టాప్ ఆన్ చేస్తూనే, పక్కన ‘నాన్నా.. నా బార్బీ బొమ్మ కనిపించడం లేదు!’ అని అరిచే నాలుగేళ్ల చిన్నారిని శాంతింపజేయడం.ఒకే మనిషి... ఒకే ఉద్యోగం... కానీ రెండు వేర్వేరు ప్రపంచాలు! ఐటీ ఉద్యోగి జీవితంలో ‘హైబ్రిడ్ వర్క్’ తెచ్చిన తిప్పలివి. ఆఫీస్ రోజున అస్తవ్యస్తమైన ట్రాఫిక్లో గమ్యం చేరుకోవడం ఒక యుద్ధమైతే... ఇంటి నుంచి పనిచేసే రోజున ‘హోమ్’కి, ‘వర్క్’కి మధ్య గోడలు కూలిపోయి, పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియని ఆందోళన, ఒకవేళ పూర్తయినా ‘ఆఫీస్ ముగిసింది’ అనే మానసిక భావన రాదు. వీకెండ్లో కూడా మెయిల్స్, స్లాక్ మెసేజ్లు చూడాలనే మానసిక తాపత్రయం వీడదు. అంటే హైబ్రిడ్ ఉద్యోగులు రెండు పడవలపై ప్రయాణం చేస్తూ నరకయాతన పడుతున్నారు.నెగ్గుకొచ్చేదెలా?హైబ్రిడ్ కల్చర్లో సమయం కలసిరావడం, ప్రయాణ భారం తగ్గడం లాంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ పద్ధతి వల్ల ఉద్యోగులు పరోక్షంగా కొన్ని మానసిక, వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ⇒ ఈ విధానంలో ప్రధానమైన సమస్య వర్క్: లైఫ్ బ్యాలెన్స్ లోపించడం. ఇంటి నుంచి పనిచేసే రోజుల్లో ‘పని వేళలు’ ముగిసినా లాప్టాప్ ముందే గడపాల్సి వస్తోంది. ఇది తీవ్ర మానసిక ఒత్తిడికి దారితీస్తోంది. అందువల్ల ఆఫీస్ టైమింగ్స్ పూర్తికాగానే లాప్టాప్ క్లోజ్ చేయడాన్ని అలవాటు చేసుకోవాలి.⇒ ఒంటరితనం: రోజూ సహచరులను కలవకపోవడం వల్ల టీమ్తో సంబంధాలు తగ్గుతాయి. ఒక్కోసారి కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి పొరపాట్లూ జరుగుతుంటాయి. ఇంట్లో ఒక్కరే పనిచేసుకుంటూ ఉంటే, చుట్టుపక్కల మాట్లాడే మనిషి లేక ఒంటరితనం ఆవరిస్తుంది.⇒ వర్క్ బర్నౌట్: ఆఫీసులో మాదిరిగా ఇంట్లో సౌకర్యవంతమైన కుర్చీలు, టేబుళ్లు లేకపోవడం వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి సమస్యలు వెంటాడుతున్నాయి. నిరంతరం స్క్రీన్ ముందే ఉండటంతో వర్క్ బర్నౌట్ పెరుగుతోంది. అందువల్ల ప్రతి 45 నిమిషాలకోసారి చిన్న బ్రేక్ తీసుకుని స్ట్రెచింగ్ చేయాలి. అంతేకాకుండా టీమ్ సభ్యులతో కేవలం వర్క్ గురించే కాకుండా వారానికి ఒకసారి వర్చువల్ భేటీ లేదా క్యాజువల్ కాల్స్ ద్వారా నెట్వర్క్ పెంచుకోవాలి.⇒ ఎదుగుదలకూ ఆటంకం: ఆఫీసుకు క్రమం తప్పకుండా వచ్చేవారికే మేనేజర్లు, హెచ్ఆర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారని, ఇంటి నుంచి పనిచేసే వారి కష్టం సరిగ్గా గుర్తింపు పొందదనే ఆందోళన ఉద్యోగుల్లో ఉంటోంది. అందువల్ల మేనేజర్లతో నిరంతరం మీ వర్క్ ప్రోగ్రెస్ పంచుకోవాలి.నిజంగా వరమేనా?గ్యాలప్ జాతీయ సర్వే (8,090 మంది ఉద్యోగులు) ప్రకారం... హైబ్రిడ్ విధానం ఉద్యోగుల జీవితాల్లో సానుకూల మార్పు తెచ్చినట్లు తేలింది. కుటుంబానికి తగిన సమయం దొరికి ప్రశాంతత పెరగడంతో పాటు రోజుకు రెండు నుంచి మూడు గంటలపాటు ప్రయాణ భారం తగ్గుతోంది. అలాగే పనిలో ఏకాగ్రత పెరిగి వేగంగా సాగుతూ ఉత్పాదకత పెరుగుతోంది. వారంలో మూడు రోజులు ఆఫీసులో, మరో రెండు రోజులు ఇంట్లో పనిచేయడం అనే ఫ్లెక్సిబిలిటీ వల్ల మహిళా ఉద్యోగుల రాజీనామాలు తగ్గినట్లు తేలింది.ఏది బెటర్?వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగులు నిరంతరం ఇంటి నుంచి పనిచేస్తారు. కానీ హైబ్రిడ్ వర్క్లో ఉద్యోగులకు ఇల్లు, ఆఫీస్ రెండింటిలో ఏది కావాలనుకుంటే అది తమ వీలును బట్టి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల వారు ఒంటరితనానికి దూరంగా ఉంటారు. పరిశోధనల ప్రకారం 49% మంది రిమోట్ వర్కర్లు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు.సవాళ్లతో సవారీకంపెనీ యాజమాన్యాలు కూడా ఈ మార్పును సానుకూలంగానే చూస్తున్నాయి. పెరిగిన రియల్ ఎస్టేట్ ఖర్చులు, ఆఫీస్ మెయింటెనెన్స్ బిల్లులు తగ్గించుకోవడానికి ఇది ఒక చక్కని మార్గంగా మారింది. అంతేకాకుండా, గ్లోబల్ టాలెంట్ను ఆకర్షించడానికి కంపెనీలు హైబ్రిడ్/ రిమోట్ ఆప్షన్లను ఒక ఆకర్షణీయమైన ఆఫర్గా చూపుతున్నాయి. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు ఊహించని సవాళ్లు కూడా ఇందులో ఉన్నాయి.లివ్ ఎనీవేర్.. వర్క్ ఎనీవేర్!కరోనా విజృంభించిన సమయంలో ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉద్యోగాల నిర్వహణలో సరికొత్త సంస్కృతికి నాంది పలికింది. అయితే ఐదేళ్ల తర్వాత కొన్ని సంస్థలు మాత్రం ఆఫీస్కి వచ్చి పనిచేయాల్సిందేనంటూ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ, మార్పు తప్పనిసరైంది. ఇల్లు, ఆఫీసు అని రెండింటినీ సమన్వయం చేస్తూ హైబ్రిడ్ వర్క్కి శ్రీకారం చుట్టాయి. వాటిల్లో గూగుల్, మెటా, ఎయిర్బీఎన్బీ, సిస్కో సిస్టమ్స్, సిటీ గ్రూప్, గ్రామర్లీ, హబ్ స్పాట్, స్పాటిఫై వంటి ఎన్నో ప్రసిద్ధ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ‘లివ్ ఎనీవేర్ అండ్ వర్క్ ఎనీవేర్’ (ఎక్కడైనా నివసించండి... ఎక్కడి నుంచైనా పనిచేయండి) అంటూ పనిలో స్వేచ్ఛా విధానాన్ని ప్రకటించాయి.సైన్స్ రూట్స్ నుంచి..ఐటీ, కార్పొరేట్ డిక్షనరీలో ఒక సర్వసాధారణమైన పదం ‘హైబ్రిడ్ వర్క్’. నిజానికి హైబ్రిడ్ అనే పదం బయాలజీ రంగానికి చెందిన పదం. బయాలజీ పరిభాషలో హైబ్రిడ్ అంటే రెండు వేర్వేరు జాతులకు చెందిన విత్తనాలు, లేదా జీవులను కలిపి ఒక కొత్త రకాన్ని తయారుచేస్తే దాన్ని ‘హైబ్రిడ్’ అంటారు. ఇక ఆటోమొబైల్ రంగంలో పెట్రోల్, బ్యాటరీ రెండింటి ద్వారా నడిచే వాహనాలను ‘హైబ్రిడ్ కార్లు’ అంటారు. మరి ఈ పదం ఆఫీస్ కల్చర్ మారింది కొన్ని దశాబ్దాలే కిందటే. 1970లో ‘టెలి కమ్యూటింగ్’ పేరుతో ఇంటినుంచి పనిచేసే విధానం వచ్చినప్పటికీ అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. 2010 తరువాత ఇదే ఫ్లెక్సిబుల్ వర్క్గా మారింది. హైబ్రిడ్ వర్క్కి 2020 ఒక టర్నింగ్ పాయింట్. కరోనా విజృంభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలన్నీ కూడా ఇంటి వద్ద నుంచి పనిచేసే సౌలభ్యాన్ని కలిగించాయి. ఆ తరువాత సంస్థలకి, ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా సైన్స్ రంగంలో ఉన్న ‘హైబ్రిడ్’ పదాన్ని వర్క్స్పేస్కి వర్తింపజేశారు. 2021 నాటికి టైమ్స్, ఫోర్బ్స్, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ వంటి అంతర్జాతీయ పత్రికలు ఈ పదాన్ని విరివిగా ఉపయోగించడంతో ఇది కార్పొరేట్ భాషలోకి చేరింది. ఆ తరవాత ప్రపంచమూ ఈ పదానికి ఆమోదం తెలిపింది.ఫార్మల్ వర్సెస్ క్యాజువల్⇒ మల్లెట్ డ్రెస్ కోడ్: సగం ఫార్మల్, సగం క్యాజువల్ దుస్తులు ధరించడమే మల్లెట్ డ్రెస్ కోడ్. హైబ్రిడ్ ఉద్యోగుల్లో 70 శాతం కంటే ఎక్కువ మంది పై భాగాన ఫార్మల్ షర్ట్, సూట్ వేసుకుని కింద మాత్రం షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్తో మీటింగ్స్ కానిచ్చేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ⇒ థర్డ్ పీక్ అవర్: సాధారణంగా ఉద్యోగుల్లో మార్నింగ్, ఆఫ్టర్నూన్ సమయాల్లో వర్క్ పీక్లో ఉంటుంది. కానీ హైబ్రిడ్ విధానం వచ్చాక థర్డ్ పీక్ అవర్ తయారైంది. అదే రాత్రి 8 నుంచి 10 గంటల సమయం. డిన్నర్, ఫ్యామిలీ టైమ్ పూర్తయ్యాక ప్రశాంతంగా మిగిలిన పని చేసుకునేందుకు లాగిన్ అవుతున్నారు. ⇒ రోజుకి 4 స్నాక్ బ్రేక్స్: ఇంటి నుంచే పనిచేసే సమయంలో రోజుకి కనీసం నాలుగుసార్లు స్నాక్స్, టీలు తీసుకుంటున్నట్లు 48 శాతం మంది ఒప్పుకున్నారు. ఇది వారికి బాగా నచ్చిన విషయం కూడా. ⇒ పెట్ కొలీగ్స్: ఇంట్లో పనిచేస్తుంటే ఉద్యోగుల పెంపుడు కుక్కలు, పిల్లులు హఠాత్తుగా కెమెరా ముందుకు రావడం, కీబోర్డ్ పైకి ఎక్కి గందరగోళం చేయడం సర్వసాధారణమైపోయింది.⇒ తగ్గిన ఫార్మల్స్: హైబ్రిడ్ కల్చర్ దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా టైలు, బ్లేజర్లు, సూట్లు, ఫార్మల్ షూస్ అమ్మకాలు 20% పైగా తగ్గిపోయాయి. వీటి స్థానంలో కంఫర్ట్ వేర్, క్యాజువల్ దుస్తుల అమ్మకాలు భారీగా పెరిగాయి.⇒ ఓన్లీ 30 మినిట్స్!: హైబ్రిడ్ మోడల్ వచ్చాక గతంలో గంటల కొద్దీ సాగే మీటింగ్లు కేవలం 30 నిమిషాలకు కుదించుకుపోయాయి. అయితే, చిన్న చిన్న ఆన్ లైన్ చెక్–ఇన్ మీటింగ్ల సంఖ్య ఏకంగా 60% పెరిగింది!భవిష్యత్తేంటి? రాబోయే రోజుల్లో హైబ్రిడ్ వర్క్ కల్చర్ ఒక ఆప్షన్ మాత్రమే కాదు, ఉద్యోగ ప్రపంచంలో ఒక ప్రధాన భాగంగా మారిపోతుంది. ఉద్యోగం చేయడం అంటే ఒక నిర్దిష్ట ప్రదేశానికి వెళ్లడం అనేది పాతదైపోతుంది, ఎక్కడి నుంచైనా సమర్థంగా పనిని పూర్తి చేయడం మాత్రమే ఉంటుంది! నియమిత పనివేళల కంటే, సాధించే ఫలితాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అర్ధరాత్రి పనిచేస్తారో, తెల్లవారుజామున పూర్తి చేస్తారో అది పూర్తిగా ఎంప్లాయీకే వదిలేస్తారు. నగరాల్లోనే ఉండాల్సిన అవసరం ఉండదు. సొంత ఊరిలో కూర్చునే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు చేయవచ్చు. సాంకేతికత పెరిగేకొద్దీ ఇంట్లోనే ఉన్నా ఆఫీస్లో ఉన్నట్లే సహజమైన అనుభూతిని పొందే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. భవిష్యత్తులో ఉద్యోగం అనేది ఒక ప్రదేశానికి పరిమితమైన పని కాదు, అదొక ఉత్పాదకత పెంచే పని మాత్రమే!ఇదివరకు ఉద్యోగం అంటే నాలుగు గోడల మధ్య బందీ కావడం... ఇప్పుడు ఉద్యోగం అంటే స్వేచ్ఛగా ఆలోచనలను పంచుకోవడం! హైబ్రిడ్ సాంప్రదాయం అనేది కేవలం పని చేసే పద్ధతిని మాత్రమే మార్చలేదు, మనుషుల జీవన శైలినే కొత్తగా నిర్వచించింది. ప్రదేశం ఏదైనా, సమయం ఏదైనా... ఉద్యోగికి–సంస్థకు మధ్య ఉండాల్సిన నమ్మకం, బాధ్యత అనే పునాదులే ఈ విధానాన్ని నడిపిస్తాయి. కాలంతో పాటు మారుతున్న ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడమే కాదు, దాన్ని స్వీకరించడమే మన ముందున్న అసలైన భవిష్యత్తు! హైబ్రిడ్ వర్క్ ఒక ప్రయోగం కాదు, అదొక సానుకూలమైన మార్పు.∙ రమా జంబుల
కారు లోపం కాదు.. సంజూష్ నిర్లక్ష్యమే
సాక్షి, హైదరాబాద్: జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ నిర్లక్ష్యం వల్లే ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్పష్టమైంది. నిందితుడు సంజూష్ నడిపిన లగ్జరీ కారు ఆస్టన్ మార్టిన్లో ఎలాంటి సాంకేతిక, యాంత్రిక లోపం లేదని తేటతెల్లమైంది. ఈమేరకు రంగారెడ్డి జిల్లా రవాణా అధికారులు (డీటీఓ) మాదాపూర్ పోలీసులకు మోటారు వాహన తనిఖీ (ఎంవీఐ) సమర్పించిన తుది నివేదికలో వెల్లడించారు. ఈనెల 16న మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్ వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా ఆస్టన్ మార్టిన్ కారులో దూసుకొచ్చిన సంజూష్.. రోడ్డు దాటుతున్న ఒడిశాకు చెందిన భారతి ముఖీని బలంగా ఢీ కొట్టడంతో ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన తీరు, కారు మెకానికల్ పనితీరుపై సమగ్ర విచారణ కోరుతూ మాదాపూర్ పోలీసులు డీటీఓకు లేఖ రాశారు. దీంతో ఈనెల 21న మాదాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న కారును ఠాణా పరిసరాల్లోనే మోటార్ వాహనాల తనిఖీ అధికారి క్షుణ్నంగా తనిఖీ చేసి నివేదికను సమర్పించారు. బ్రేక్లు ఫెయిల్ కాలేదు సాధారణంగా ఇలాంటి లగ్జరీ కార్ల ప్రమాదాలు జరిగినప్పుడు ‘బ్రేక్లు పనిచేయలేదు’అనే సాకులు వినిపిస్తుంటాయి. కానీ, ఈ కేసులో ఆర్టీఏ అధికారులు ఆస్టన్ మార్టిన్ కారును క్షుణ్నంగా తనిఖీ చేసి ‘ఈప్రమాదం వాహన యాంత్రిక లోపాల వల్ల జరగలేదు’అని స్పష్టం చేశారు. ఫుట్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్, పార్కింగ్ బ్రేక్లు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కారులోని డ్యాష్ బోర్డ్ కెమెరాలో రికార్డ్ అయిన ఆడియో, వీడియో ఫుటేజ్లను కూడా సమగ్ర విచారణ చేసి, నివేదిక అందించాలని మాదాపూర్ పోలీసులు లేఖ రాయనున్నారు. యూకే నుంచి కారు దిగుమతి.. సంజూష్ నడిపిన లగ్జరీ కారు ఆస్టన్ మార్టిన్ యూకే నుంచి దిగుమతి అయింది. గతేడాది జూలై 11న ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో టీజీ09 జీ0666 నంబరుతో హానర్ ప్రైమ్ హౌసింగ్ ఎల్ఎల్పీ, మేంపరాల ఐశ్వర్య పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. సంజూష్ కు డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) వచ్చి రోడ్డు ప్రమాదం చేసిన రోజు నాటికి కేవలం 88 రోజులే అయ్యాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి మృతికి కారణమైన కారణంగా అతడికి ప్రస్తుతానికి డీఎల్ 6 నెలల పాటు రద్దవుతుందని, పోలీసుల విచారణ, కోర్టు తీర్పు అనంతరం డీఎల్ శాశ్వతంగా రద్దయ్యే అవకాశం కూడా ఉందని ఓ ఆర్టీఏ అధికారి స్పష్టం చేశారు.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం...ఆర్థిక ఇబ్బందులు అధిగమించి అడుగు ముందుకేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు మిత్రులతో పంచుకుంటారు. ఆసక్తికర సమాచారం నిరుద్యోగులను ఉత్సాహపరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం ఉండవచ్చు. సోదరులు అన్నిటా∙సహాయం అందిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊరట లభిస్తుంది. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో హోదాలు, బాధ్యతలు పెరుగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు.. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నలుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.వృషభం...బంధువులు, మిత్రుల సహకారంతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. అనుకోనిరీతిలో∙ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో మానసిక అశాంతి. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మిథునం...కొత్త కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యాచరణలో పెడతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కొన్ని ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. బంధువులతో సంబంధబాంధవ్యాలు మెరుగుపడతాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అదనపు విధులు చేపట్టాల్సి వస్తుంది. పారిశ్రామికవర్గాలకు అన్నింటా అనుకూలమే. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి.కర్కాటకం...ఎంతటి కార్యక్రమమైనా వేగవంతంగా పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ప్రముఖులు పరిచయమవుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అనుకోని పదవులు రావచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.సింహం...కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు రాకుండా గడుపుతారు. సన్నిహితులతో వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. భూములు కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు విజయాల బాటలో పయనిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. ముఖ్య వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో అయిష్టంగానే కొన్ని మార్పులకు అంగీకరించక తప్పదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, తెలుపు రంగులు. దుర్గాదేవిని ఆరాధించండి.కన్య...ఇతరులకు సాయపడుతూ మీ సేవాభావాన్ని చాటుకుంటారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. కీలక సమావేశాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వాహనయోగం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలను వేగవంతంగా చేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమించి స్థిరత్వం ఏర్పడుతుంది. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.తుల...కొత్త పరిచయాలతో ఉత్సాహంగా గడుపుతారు. మాటపై నిలపడి ఇతరులకు సాయం అందిస్తారు. బంధువులు, మిత్రులు చేదోడుగా నిలుస్తారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. వాహన, గృహయోగాలు కలుగవచ్చు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. ఇంటాబయటా గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, నీలం రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.వృశ్చికం..స్వయంగా కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల సందడి నెలకొంటుంది. సంఘంలో గౌరవప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుని ప్రశంసలు పొందుతారు. కళాళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. మానసిక అశాంతి. పసుపు, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.ధనుస్సు...ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. విద్యార్థులు, నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. యుక్తి, నేర్పుతో క్లిష్టమైన వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం ప్రారంభంలో ఆరోగ్య, కుటుంబసమస్యలు. అనుకోని ధనవ్యయం. బంగారు, తెలుపు రంగులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.మకరం...కొన్ని చిక్కులు అధిగమించి ముందుకు సాగుతారు. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. ప్రముఖులు మాటసహాయం అందిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. రాజకీయవర్గాలకు మరింత సానుకూలం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, గులాబీ రంగులు. వినాయక స్తోత్రాలు పఠించండి.కుంభం...ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమ మరింత పెరిగి సహనాన్ని పరీక్షిస్తుంది. విద్యార్థులు కృషి చేస్తే ఫలితం కనిపిస్తుంది. సోదరులు, మిత్రులతో అకారణంగా విరోధాలు. అనుకున్న పనుల్లో ప్రతిబ«ంధకాలు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వివాహ, ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. గృహ నిర్మాణాలపై నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలలో వేగం తగ్గి స్వల్పలాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. పారిశ్రామికవర్గాలకు లేనిపోని చిక్కులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. విందువినోదాలు. గులాబీ, ఎరుపు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.మీనం...సమస్యలను∙అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సోదరులు, మిత్రుల సహాయం కోరతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహ వేడుకలకు హాజరవుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి.. కళారంగం వారి సేవలకు గుర్తింపు లభిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
ఎన్డీయేలో రగడ.. రాజీనామా చేయాలని కేంద్రమంత్రుల డైలాగ్ వార్!
భార్య హత్యకు పుస్తకంలో ప్లాన్.. మరదలి ట్విస్ట్తో కథ రివర్స్!
ఇంట్లో పిచ్చెక్కుతోంది.. డిష్వాషర్గా కార్పొరేట్ ఉద్యోగి!
భాష మార్చలేదు.. తలవంచలేదు! నోబెల్ గెలిచిన రచయిత కథ!
నా పిల్లలే నా బలం..వారికే పూర్తి సమయం కేటాయిస్తా: నయనతార
నిప్పులు చెరిగిన నోర్జే
దెయ్యమా? మనిషేనా? హాలోవీన్ హత్యలో ఊహించని ట్విస్ట్!
ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి?
వైద్యానికని చెప్పి.. కన్న కొడుకును కడతేర్చిన తండ్రి
కోలీవుడ్లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి
రెండో పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి
'ఇరుముడి' నాగులు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?
..కరువెక్కడా కనపడి చావదేం!!
ఫైవ్ స్టార్ హోటల్లో విలాసాలు.. రూ.5.74 లక్షల బిల్లు రాగానే..
నేడు నేపాల్... రేపు ఇండియా?
అస్సలు చూపించొద్దు సార్! గత ప్రభుత్వం చేసిన పనులను మన ఖాతాలోకి వేసుకున్నామని అంటారు!!
కన్నీళ్లతో మంత్రి రాజీనామా.. ఇది తొలిసారి కాదు
మమిత సూపర్ డ్యాన్స్.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
నన్ను కూడా చేర్చుకోండి సార్! నాకు చాలా అనుభవం ఉంది!!
సాక్షి కార్టూన్: 28-08-2026
యశ్ ‘టాక్సిక్’కు అన్నామలై రివ్యూ
ఉగాండా ‘బాల’ రాజు అకాలమృతి
‘బిగ్బాస్ 10’ డేట్ వచ్చేసింది.. కంటెస్టెంట్స్ వీళ్లే!
సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు
భారత జట్టులో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. కారణమిదే?
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
కళ్ల ముందే విషాదం.. నోట మాట రావడం లేదు
కికు చిరంజీవి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
చైనా సరిహద్దు! నేపాల్ సంచలన నిర్ణయం.. భారత్ కీలక ప్రకటన!
ఎన్డీయేలో రగడ.. రాజీనామా చేయాలని కేంద్రమంత్రుల డైలాగ్ వార్!
భార్య హత్యకు పుస్తకంలో ప్లాన్.. మరదలి ట్విస్ట్తో కథ రివర్స్!
ఇంట్లో పిచ్చెక్కుతోంది.. డిష్వాషర్గా కార్పొరేట్ ఉద్యోగి!
భాష మార్చలేదు.. తలవంచలేదు! నోబెల్ గెలిచిన రచయిత కథ!
నా పిల్లలే నా బలం..వారికే పూర్తి సమయం కేటాయిస్తా: నయనతార
నిప్పులు చెరిగిన నోర్జే
దెయ్యమా? మనిషేనా? హాలోవీన్ హత్యలో ఊహించని ట్విస్ట్!
ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి?
వైద్యానికని చెప్పి.. కన్న కొడుకును కడతేర్చిన తండ్రి
కోలీవుడ్లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి
రెండో పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి
'ఇరుముడి' నాగులు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?
..కరువెక్కడా కనపడి చావదేం!!
ఫైవ్ స్టార్ హోటల్లో విలాసాలు.. రూ.5.74 లక్షల బిల్లు రాగానే..
నేడు నేపాల్... రేపు ఇండియా?
అస్సలు చూపించొద్దు సార్! గత ప్రభుత్వం చేసిన పనులను మన ఖాతాలోకి వేసుకున్నామని అంటారు!!
కన్నీళ్లతో మంత్రి రాజీనామా.. ఇది తొలిసారి కాదు
మమిత సూపర్ డ్యాన్స్.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
నన్ను కూడా చేర్చుకోండి సార్! నాకు చాలా అనుభవం ఉంది!!
సాక్షి కార్టూన్: 28-08-2026
యశ్ ‘టాక్సిక్’కు అన్నామలై రివ్యూ
ఉగాండా ‘బాల’ రాజు అకాలమృతి
‘బిగ్బాస్ 10’ డేట్ వచ్చేసింది.. కంటెస్టెంట్స్ వీళ్లే!
సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు
భారత జట్టులో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. కారణమిదే?
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
కళ్ల ముందే విషాదం.. నోట మాట రావడం లేదు
కికు చిరంజీవి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
చైనా సరిహద్దు! నేపాల్ సంచలన నిర్ణయం.. భారత్ కీలక ప్రకటన!
ఫొటోలు
ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)
'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)
నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)
నాగార్జున బర్త్డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు
మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్గా (ఫొటోలు)
‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)
హైదరాబాద్లో స్పోర్ట్ ఎక్స్పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు)
'ఇరుముడి' కావేరీ.. షూటింగ్లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు)
రాఖీ పండుగ సెలబ్రేషన్స్ లో ప్రముఖులు (ఫొటోలు)
సినిమా
ఆమెకు ప్రశాంతత ఇవ్వలేదు.. 40 ఏళ్ల బంధానికి ముగింపు
'జైలర్' సినిమాలో రజనీకాంత్ ఎంతలా హైలైట్ అయ్యారో.. విలన్గా చేసిన వినాయకన్ కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంలో చాన్నాళ్లుగా సినిమాలు చేస్తున్న ఈ నటుడు.. ఎప్పుడో ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. గతంలో పలుమార్లు ఇతడిపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. ఆ సంగతులన్నీ పక్కనబెడితే ప్రస్తుతం ఇతడు ఒంటరిగా ఉంటున్నాడు. 40 ఏళ్ల పాటు కలిసి బతికిన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. అన్నింటికీ తన ప్రవర్తనే కారణమని చెప్పాడు.(ఇదీ చదవండి: న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న తెలుగు హీరో)'నాకు ఒక భార్య ఉండేది. ఇప్పుడు మేం విడివిడిగా ఉంటున్నాం. మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు కానీ కలిసి బతకడం కష్టమని విడిపోయాం. నాకు 19 ఏళ్లున్నప్పుడు ఆమెని తొలిసారి కలిశాను. మహారాజాస్ కాలేజీలో మా ప్రేమకథ మొదలైంది. తర్వాత పెళ్లి చేసుకున్నాం. దాదాపు 40 ఏళ్ల పాటు కలిసి బతికాం. ఇప్పుడు ఆమె నా జీవితంలో లేకపోవడం చాలా కష్టంగా అనిపిస్తోంది. చెప్పాలంటే డబ్బు వ్యవహారాలని చూసుకోవడం నాకు ఇబ్బందిగా మారింది. నా దగ్గర గూగుల్ పే లాంటివి కూడా లేవు. అవన్నీ ఆమెనే చూసుకునేది''ఆమె నన్ను భరించలేకపోయింది. అది ఆమె తప్పు కాదు. నేను ఆమెకు ప్రశాంతత ఇవ్వలేదు. ఎప్పుడూ గొడవలు, గందరగోళంతో ఉండేసరికి కలిసి బతకడం కంటే విడిపోవడమే ఇద్దరికీ మంచిదని అనుకున్నాం. అయినప్పటికీ ఆమె నాకు సంబంధించిన చాలా విషయాలు చూసుకుంటోంది. నా యూట్యూబ్కి రీఛార్జ్ కూడా చేస్తోంది. నేను ప్రతి విషయాన్ని ఆమెతో చెప్పేవాడిని. ఇప్పుడు ఆమె నా జీవితంలో లేదు. దీంతో నా జీవితం చీకటిగా మారిపోయింది' అని నటుడు వినాయకన్ భావోద్వేగానికి గురయ్యాడు.మూడేళ్ల క్రితం వినాయకన్-బబిత విడిపోయారు. ఆమె బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. వినాయకన్ విషయానికొస్తే.. నటుడిగా చాలా పేరుంది. చతిక్కాత్త చంతు, చింతామణి కొలకేస్, బిగ్ బి, బ్యాచిలర్ పార్టీ, మరియన్, ఆడు, చంద్రెట్టన్ ఎవిడయా, కమ్మటిపాదం, ఆడు 2, ఈ మా యౌ, తొట్టప్పన్, పడ, ఒరుత్తీ, ఆడు 3 తదితర సినిమాల్లో నటించాడు. వంటి చిత్రాల్లో ఆయన తనదైన నటనతో మెప్పించారు. ఇకపోతే 'కమ్మటిపాదం' సినిమాకుగానూ కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడు అవార్డుని అందుకున్నాడు. ఇలాంటి నటుడి జీవితం, విడాకుల వల్ల అయోమయంగా మారిపోయింది.(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి)
నటనకు అవకాశం ఉన్నపాత్ర చేశాను
సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరు, నటరాజ్, రాయంచ కొక్కుర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించారు. ఈ మూవీ పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సెప్టెంబరు 4న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జై జ్ఞానప్రభ మాట్లాడుతూ– ‘‘పొలిటికల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ఇది. మహావీర్ మ్యూజిక్, చంద్రబోస్గారి సాహిత్యం మా సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయి. మా సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం నిరాశపరచదు’’ అని చెప్పారు. ‘‘మా మూవీ ఔట్పుట్ అందరికీ నచ్చేలా వచ్చింది... ప్రేక్షకాదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం’’ అని మేరుం భాస్కర్ తెలిపారు. ‘‘ఇటీవల నటనకు విరామం ఇచ్చాను. అయితే ‘ధర్మస్థల నియోజకవర్గం’లో డిఫరెంట్ క్యారెక్టర్ రావడంతో ఒప్పుకున్నాను. నటనకు మంచి స్కోప్ దక్కింది’’ అని వితికా షేరు పేర్కొన్నారు. రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఏలేందర్, ఆర్ట్ డైరెక్టర్ భార్గవాచారి నౌండ్ల, నటులు శివకుమార్, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా వివిధ భాషల్లో రిలీజయ్యే థ్రిల్లర్స్ వీలైనంత ఎక్కువగా ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే దాదాపు ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ అన్నీ ఈ జానర్లోని సినిమాలు, సిరీస్లని స్ట్రీమింగ్లోకి తీసుకొస్తుంటాయి. ఇప్పుడు అలానే ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రిలీజ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)'ప్రేమిస్తే' లాంటి డబ్బింగ్ బొమ్మతోపాటు పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు భరత్.. ప్రధాన పాత్ర చేసిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ 'పంచనామా'. మేధారెడ్డి, ఉదయభాను కీలక పాత్రలు చేశారు. సెప్టెంబరు 11 నుంచి జీ5 ఓటీటీలో దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ అనౌన్స్మెంట్ వీడియోని వదిలారు.యాంకర్గా చాలా గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. చాన్నాళ్లకు మళ్లీ యాంకరింగ్, మరోవైపు యాక్టింగ్ చేస్తూ కాస్తంత బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. అలా ఈ సిరీస్లోనూ నటించింది. మరి 'పంచనామా' ఏమైనా ఉదయభాను ఫేట్ మారుస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)SEP 11th 💥💥THE INVESTIGATION BEGINS...🕵️♂️#Panchanama premieres on September 11th, only on #TeluguZee5#BharathNiwas #MedhaReddy #UdayaBhanu#PamchanamaFromSep11 #PanchanamaOnTeluguZee5 pic.twitter.com/NbpDV3v2HW— ZEE5 Telugu (@ZEE5Telugu) August 29, 2026
అమ్మ జ్ఞాపకార్థం.. కొత్తింట్లోకి తెలుగు హీరోయిన్
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా కొత్త ఇంట్లో అడుగుపెట్టింది. ఇప్పటికే చనిపోయిన అమ్మ జ్ఞాపకార్థం.. ఈ ఇంటికి ఆమె పేరు పెట్టినట్లు చెబుతూ ఎమోషనల్ అయింది. కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు, సత్యనారాయణ వృతం పూజా తాలూకూ ఫొటోలని పంచుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)'నాన్న పూర్తిగా తన మనసంతా పెట్టి ఈ ఇంటిని కట్టారు. ఆయన అమ్మని ఎంతలా మిస్ అవుతున్నారో నాకు తెలుసు. అందుకే ఇంటికి 'నాగేశ్వరి నిలయం' అని ఆమె పేరు పెట్టాం. ఎందుకంటే ఇలా అయితే అమ్మ ఎప్పుడు మాకు దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తుంది' అని హీరోయిన్ ఈషా రెబ్బా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.ఈషా రెబ్బా కెరీర్ విషయానికొస్తే.. 2012లో రిలీజైన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీలో చిన్న పాత్ర చేసి నటిగా పరిచయమైంది. తర్వాత అంతకు ముందు ఆ తర్వాత, బందిపోటు, అమీ తుమీ, దర్శకుడు, ఆ, బ్రాండ్ బాబు, అరవింద సమేత, సుబ్రమణ్యపురం, రాగల 24 గంటల్లో, మామ మశ్చీంద్ర తదితర మూవీస్ చేసింది. చివరగా ఈ ఏడాది జనవరిలో రిలీజైన 'ఓం శాంతి శాంతి శాంతి' చిత్రంలో కనిపించింది. ఓటీటీల్లో పలు వెబ్ సిరీస్లు కూడా ఈషా చేసింది.(ఇదీ చదవండి: ఊపేస్తున్న 'ప్యారడైజ్' కొత్త పాట.. లిరికల్ వీడియో రిలీజ్) View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha)
క్రీడలు
'యూఎస్' కిరీటం ఎవరిదో!
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ ‘యూఎస్ ఓపెన్’కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ టోర్నీ సెప్టెంబర్ 13న ముగుస్తుంది. పురుషుల విభాగంలో కార్లోస్ అల్కరాజ్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతుండగా, గత రెండేళ్లు టైటిల్ సాధించిన అరైనా సబలెంకా వరుసగా మూడో ట్రోఫీపై కన్నేసింది. గాయం కారణంగా వరల్డ్ నంబర్వన్ యానిక్ సినెర్ ఈ టోర్నీకి దూరమయ్యాడు. దాంతో అల్కరాజ్కు అవకాశాలు మరిన్ని పెరిగాయి. మరో వైపు దిగ్గజ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ తన 25వ గ్రాండ్స్లామ్ గెలిచే ప్రయత్నంలో మరోసారి ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. గాయంతో గత ఏప్రిల్ నుంచి ఆటకు దూరంగా ఉన్న అల్కరాజ్ కోలుకొని పునరాగమనం చేయడంతో అభిమానుల అంచనాలు పెరిగాయి. తాను గెలిచిన 7 గ్రాండ్స్లామ్లలో అతను ఇక్కడే రెండు టైటిల్స్ సాధించాడు. ఈ సీజన్లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి తన కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ సాధించిన అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఈ టోర్నీలో టాప్ సీడ్ కాగా, 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) కూడా పోరాడేందుకు సై అంటున్నాడు. 2003లో ఆండీ రాడిక్ యూఎస్ ఓపెన్ నెగ్గిన తర్వాత పురుషుల విభాగంలో ఏ అమెరికన్ ఆటగాడు కూడా టైటిల్ గెలవలేకపోయాడు. ఇప్పుడు బెన్ షెల్టన్, టేలర్ ఫిట్జ్, ఫ్రాన్సిస్ టియాఫో తమ వైపునుంచి ప్రయత్నం కొనసాగించనున్నారు. మహిళల విభాగంలో 2024, 2025 విజేత, వరల్డ్ నంబర్వన్ సబలెంకా మళ్లీ యూఎస్ ఓపెన్ ట్రోఫీని అందుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సారి గెలిస్తే సెరెనా విలియమ్స్ తర్వాత వరుసగా మూడు సార్లు యూఎస్ ఓపెన్ నెగ్గిన ప్లేయర్గా ఆమె నిలుస్తుంది. అయితే ఆమె తాజా ఫామ్ అంత గొప్పగా లేదు. గత కొన్ని టోర్నీలో ఆమె కనీసం నాలుగో రౌండ్ కూడా దాటలేకపోయింది. యూఎస్ ఓపెన్కు ముందు ఆడిన హార్డ్ కోర్ట్ టోర్నీలు టొరంటో, సిన్సినాటిలలో ఆమె ఓటమిపాలైంది. 2026 వింబుల్డన్ చాంపియన్ లిండా నొస్కొవా, ఇగా స్వియాటెక్ల నుంచి సబలెంకాకు గట్టి పోటీ ఎదురవుతుండగా... రిబాకినా, పెగులా, పౌలా బడోసా, కోకో గాఫ్, స్వితోలినా వంటి ప్లేయర్లు కూడా టైటిల్ వేటలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. మహిళల సింగిల్స్లో 46 ఏళ్ల వీనస్ విలియమ్స కూడా పోటీ పడుతుండగా...డబుల్స్లో వీనస్ – సెరెనా విలియమ్స్ జోడీకి నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ద్వారా అవకాశం కల్పించారు.
మహిళల చాంపియన్ అర్జెంటీనా
ఆమ్స్టెల్వీన్: మహిళల హాకీ ప్రపంచ కప్లో 16 ఏళ్ల తర్వాత అర్జెంటీనా విజేతగా నిలిచింది. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్పై ప్రతీకారం తీర్చుకుంది. 2022 టోర్నీ ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన అర్జెంటీనా ఇప్పుడు అదే ప్రత్యర్థిని తుది పోరులో చిత్తు చేసి వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. నాలుగేళ్ల క్రితం ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో 1–3 స్కోరుతో ఓడిన టీమ్ ఇప్పుడు అదే స్కోరు 3–1తోనే (షూటౌట్) ప్రత్యర్థిని ఓడించడం విశేషం. గత మూడు ప్రపంచ కప్లను గెలుచుకున్న తర్వాత వరుసగా నాలుగో, ఓవరాల్గా పదో టైటిల్పై గురి పెట్టిన ఆతిథ్య నెదర్లాండ్స్ చివరకు రన్నరప్గా సంతృప్తి చెందింది. 2002, 2010లలో ట్రోఫీని అందుకున్న అర్జెంటీనా విజేతగా నిలవడం ఇది మూడో సారి కావడం విశేషం. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. నెదర్లాండ్స్ తరఫున 30వ నిమిషంలో యాన్సెన్ యిబీ గోల్ సాధించింది.అయితే మరో ఆరు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా గ్రానటో మారియా (54వ నిమిషం) కొట్టిన గోల్తో అర్జెంటీనా స్కోరును సమం చేసింది. దాంతో పోరు పెనాల్టీ షూటౌట్కు వెళ్లింది. నెదర్లాండ్స్ తరఫున గ్రానటో విక్టోరియా, బ్రగెసెర్ బ్రిసా, కియోరా సోఫీయా గోల్స్ కొట్టగా... డచ్ బృందంనుంచి వీన్ మారిన్ మాత్రమే గోల్ కొట్టగలిగింది. ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 1–0తో నెగ్గిన బెల్జియంకు మూడో స్థానం దక్కింది.
ఇంగ్లండ్కు భారీ ఆధిక్యం.. పాక్కు ఓటమి తప్పదా?
లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించినప్పటికీ ఇంగ్లండ్ 350 పరుగుల లీడ్కు చేరువలో ఉంది. టీ విరామ సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులతో ఆడుతోంది. డాన్ లారెన్స్ (37), గస్ అకిన్సన్ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 342 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆటకు మరో రెండు రోజులు సమయం ఉండడంతో పాక్కు మరో ఓటమి తప్పేలా లేదనిపిస్తోంది. నాసిరకం బ్యాటింగ్తో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ లార్డ్స్ పిచ్పై రెండో బ్యాటింగ్ చేసి 350కి పైగా పరుగుల టార్గెట్ను ఛేదించడం కష్టం, ఆ జట్టు బ్యాటర్లు ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా అసాధ్యమని చెప్పొచ్చు. మూడో రోజు ఆటకు వరుణుడు పదే పదే అడ్డు తగలడంతో ఇంగ్లండ్కు బ్యాటింగ్కు పెద్దగా అవకాశం రాలేదు. ఓవర్నైట్ స్కోరు 81-3తో మూడోరోజు ఆట మొదలైన కాసేపటికే ఇంగ్లండ్ రూట్ (24) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుణుడు దంచికొట్టడంతో ఆట నిలిచిపోయింది. వర్షం విరామం అనంతరం ఆట మొదలవ్వగా, హ్యారీ బ్రూక్ (34), డాన్ లారెన్స్ (37 బ్యాటింగ్) ఐదో వికెట్కు 45 పరుగులు జోడించారు. ఆ తర్వాత జేమీ స్మిత్ (7) తొందరగానే ఔటయ్యాడు. మరోసారి వర్షం దంచికొట్టడంతో ఇంగ్లండ్ టీ విరామానికి వెళ్లింది. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 3 వికెట్లు తీయగా, కుర్రమ్ షెహజాద్ 2 వికెట్లు పడగొట్టాడు.🚨 BIG WICKET FOR PAKISTAN! 🇵🇰- Mohammad Abbas dismisses Harry Brook.A brilliant catch by Mohammad Rizwan! England were 84/4, and Pakistan got their 5th wicket at 128 runs..A HUGE WICKET FOR PAKISTAN! pic.twitter.com/2ODRcq6SZj— Talha Nawaz (@TalhaDigital007) August 29, 2026Read: డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘన విజయం
డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘన విజయం
పసికూన నమీబియా ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న సౌతాఫ్రికా టీ20 ట్రై సిరీస్లో బోణీ కొట్టింది. శనివారం విండ్హోక్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. జింబాబ్వే విధించిన 145 పరుగుల టార్గెట్ను సఫారీలు 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. డెవాల్డ్ బ్రెవిస్ (32 బంతుల్లో 75 నాటౌట్, 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఓపెనర్లు ప్రిటోరియస్ (22), జోర్డాన్ హెర్మన్ (20) పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవన్స్, బ్లెసింగ్ ముజరబానీ, నైమురి తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (34) టాప్ స్కోరర్ కాగా, మరుమనీ (13 బంతుల్లో 30, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) ఆఖర్లో మెరవడంతో జింబాబ్వే గౌరవప్రదమైన స్కోరును సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో డాన్ జాసెన్ 3 వికెట్లు తీయగా, సుబ్రయెన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో సౌతాఫ్రికా సిరీస్లో బోణీ కొట్టగా, తర్వాతి మ్యాచ్ సోమవారం జింబాబ్వే, నమీబియా మధ్య జరగనుంది.🇿🇦𝐒𝐎𝐔𝐓𝐇 𝐀𝐅𝐑𝐈𝐂𝐀 𝐁𝐄𝐀𝐓 𝐙𝐈𝐌𝐁𝐀𝐁𝐖𝐄 𝐁𝐘 𝟕 𝐖𝐈𝐂𝐊𝐄𝐓𝐒🔥South Africa chased down 145 with ease, winning by 7 wickets.🔹️Dewald Brevis — 75 (32)*🔹️A match-winning knock to finish the chase in style.#SAvZIM #DewaldBrevis pic.twitter.com/LRxxAbmpS0— Sports Nexus (@SportsNexusNews) August 29, 2026Read: ఆసియా క్రీడలకు ముందే బిగ్షాక్.. పతకం పోయినట్లే!
న్యూస్ పాడ్కాస్ట్
నేపాల్లో ఆగని మృత్యుఘోష.... 579కి చేరిన మరణాల సంఖ్య... భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
కమిషనర్ ఔట్... వేతన సవరణ కమిషన్ లేదు... ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం
కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నా కుంభకర్ణుడి నిద్ర నటిస్తారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం మనదే... వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు చెబుతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
జరిమానా లెక్క తేల్చాల్సిందే... రామోజీకి, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్ చిట్ ఇవ్వలేదు.... తేల్చిచెప్పిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
మోసాలపై చర్చ మొదలైంది!. హామీల ‘వెన్నుపోటు’పై రెండేళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ జగన్ వ్యాఖ్య
మళ్లీ మాయోపాయం!. రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
బిజినెస్
ఎయిర్టెల్ యూజర్లకు అదిరిపోయే ప్లాన్స్!
ఎయిర్టెల్ యూజర్ల కోసం ప్రస్తుతం ఎన్నో రకాల ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రోజువారీ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, 5G డేటా, OTT సబ్స్క్రిప్షన్లు కావాలనుకునే వారికి కొన్ని ప్లాన్స్ ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. ఈ కథనంలో రోజుకు 2.5GB డేటా లభించే మూడు ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.రూ.399 ప్లాన్ఎయిర్టెల్ రూ.399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతిరోజూ 2.5జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 70జీబీ డేటాను వినియోగించుకోవచ్చన్నమాట. అన్లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చు. రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. దీంతో పాటు 28 రోజుల జియోహాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే, హలో ట్యూన్స్, అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం యాక్సెస్ లభిస్తాయి.రూ.1,199 ప్లాన్ఎక్కువ కాలం రీచార్జ్ గురించి ఆలోచించకుండా ఉండాలనుకునే వారికి రూ.1,199 ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2.5జీబీ డేటాను అందిస్తుంది. దీంతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. సబ్స్క్రైబర్లు ప్లాన్ కాల వ్యవధిలో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ను కూడా పొందుతారు. రోజువారీ డేటా పరిమితి అయిపోగానే, మరుసటి రోజు వరకు ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గుతుంది.రూ.3,999 ప్లాన్తరచూ రీచార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వారికి రూ.3,999 ప్లాన్ మంచి ఆప్షన్. ఈ ప్లాన్ ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంటే ఒక్కసారి రీచార్జ్ చేసుకుంటే ఏడాది పాటు రీఛార్జ్ చేసుకోవలసిన అవసరం లేదు. ఈ ప్లాన్లో ప్రతిరోజూ 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అదనంగా మూడు నెలల జియోహాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.ఏ ప్లాన్ తీసుకోవాలి?నెలనెలా రీచార్జ్ చేసుకునే అలవాటు ఉన్నవారికి రూ.399 ప్లాన్ సరిపోతుంది. 84 రోజుల వ్యాలిడిటీతో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ కావాలనుకునే వారికి రూ.1,199 ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఏడాది పాటు ఒకే రీచార్జ్తో డేటా, కాలింగ్, 5జీ సేవలు కొనసాగాలనుకునే వారికి రూ.3,999 ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
రవ్వంత బంగారంతో భారీ ఇల్లు కొన్న కియోసాకి!
ప్రముఖ రచయిత, పెట్టుబడులపై అవగాహన కల్పించే రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం ప్రాధాన్యంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కియోసాకి.. తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన ఓ పోస్టులో తాను బంగారంతో 4.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.40 కోట్లకు పైగా) విలువైన ఇంటిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.ఇంటి ధర 4.5 మిలియన్ డాలర్లు కాగా, దాన్ని సొంతం చేసుకోవడం కోసం తాను వినియోగించిన బంగారాన్ని అప్పట్లో 4.5 లక్షల డాలర్ల కొన్నట్లు రాసుకొచ్చారు. అంటే తాను 4.5 లక్షల డాలర్లకే కొన్న బంగారంతో ఇప్పుడు 45 లక్షల డాలర్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశానన్నది ఆయన భావన. బంగారం విలువ ఎంతలా పెరిగిందో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.ఇది ఎలాంటి ఫోర్క్లోజర్ లేదా ప్రత్యేక డీల్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా తాను బంగారు నాణేలను పొదుపు చేస్తూ వచ్చానని, వాటి విలువ పెరగడంతో చివరకు ఆ బంగారాన్ని ఇంటి కొనుగోలుకు ఉపయోగించానని పేర్కొన్నారు.ప్రస్తుతం వెండి ఔన్సుకు 45 డాలర్లు, బంగారం ఔన్సుకు 3,500 డాలర్ల స్థాయిలో ఉన్నాయని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. అయితే తాను వెండిని ఔన్సుకు కేవలం ఒక డాలర్ ఉన్నప్పటి నుంచే కొనుగోలు చేసి పొదుపు చేయడం ప్రారంభించానని చెప్పారు. సంప్రదాయ కరెన్సీపై ఆధారపడటానికి బదులుగా బంగారం, వెండి వంటి విలువైన ఆస్తులను కూడబెట్టుకోవడంపై తనకు నమ్మకం ఉందన్నారు.బ్యాంకులో డబ్బు దాచుకోవడం, కష్టపడి పనిచేయడం వంటి సంప్రదాయ ఆర్థిక సలహాలపై కూడా కియోసాకి విమర్శలు చేశారు. ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో కరెన్సీని ముద్రించడం వల్ల దాని విలువ క్రమంగా తగ్గుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగితపు డబ్బు విలువను కోల్పోతున్న సమయంలో బంగారం, వెండి వంటి ‘రియల్ మనీ’, రియల్ అసెట్స్లో పొదుపు చేయడం ప్రయోజనకరమని పేర్కొన్నారు.తాను ఏళ్లుగా బంగారాన్ని పొదుపు చేయడం వల్లే దాన్ని ఉపయోగించి భారీ విలువైన ఆస్తిని కొనుగోలు చేయగలిగానని కియోసాకి తెలిపారు. డాలర్లను పొదుపు చేయాలా, లేక బంగారం, వెండి వంటి విలువైన ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలా అనేది వ్యక్తిగత నిర్ణయమని తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ వారం బంగారం.. భారీ పతనం..
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఈ వారం బంగారం, వెండి ధరలకు ప్రతికూలంగా మారింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్ష్ జాక్సన్ హోల్ సదస్సులో చేసిన వ్యాఖ్యలు, అమెరికా డాలర్ బలోపేతం, ఇటీవల ధరలు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం వంటి అంశాలు బంగారం, వెండిపై ఒత్తిడిని పెంచాయి. ముఖ్యంగా ఆగస్టు 28న వార్ష్ ప్రసంగం తర్వాత సెప్టెంబర్లో అమెరికా వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు పెరగడంతో బులియన్ ధరలు ఒక్కసారిగా క్షీణించాయి.వారం ప్రారంభంలో ఆగస్టు 24న అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు సుమారు 4,696 డాలర్ల స్థాయికి చేరువైంది. అయితే వారాంతానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆగస్టు 28న ఫెడ్ చైర్మన్ ప్రసంగం తర్వాత స్పాట్ గోల్డ్ 3 శాతానికి పైగా క్షీణించి 4,567 డాలర్ల ప్రాంతానికి పడిపోయింది. అదే సమయంలో వెండి ధర కూడా దాదాపు 3.5 శాతం తగ్గి ఔన్స్కు 66.81 డాలర్లకు చేరింది.వార్ష్ వ్యాఖ్యలతో పెరిగిన వడ్డీ రేట్ల భయాలుజాక్సన్ హోల్లో ప్రసంగించిన కెవిన్ వార్ష్.. ఫెడ్ ప్రధానంగా ధరల స్థిరత్వంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అమెరికా ఫెడ్ లక్ష్యమైన 2 శాతంతో పోలిస్తే వ్యక్తిగత వినియోగ వ్యయాల (PCE) ద్రవ్యోల్బణం 12 నెలల ప్రాతిపదికన 3.7 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం లక్ష్యం వైపు స్పష్టంగా, తగిన వేగంతో కదులుతోందన్న నమ్మకం కలగకపోతే ఫెడ్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సంకేతాలిచ్చారు.దీంతో సెప్టెంబర్ ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు అవకాశాలపై మార్కెట్ అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. అధిక వడ్డీ రేట్ల వాతావరణం బంగారం వంటి వడ్డీ ఆదాయం ఇవ్వని ఆస్తులకు సాధారణంగా ప్రతికూలంగా ఉంటుంది. అదే సమయంలో డాలర్ బలోపేతం కావడంతో ఇతర కరెన్సీలు కలిగిన పెట్టుబడిదారులకు బంగారం ఖరీదుగా మారుతుంది. ఈ రెండు అంశాలు బులియన్పై ఒత్తిడిని పెంచాయి.దేశీయ మార్కెట్లోనూ భారీ పతనంఅంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్పైనా స్పష్టంగా కనిపించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో ఆగస్టు 28న 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాములకు రూ.3,300 తగ్గి రూ.1,62,400కు చేరింది. దీంతో ఆగస్టు 25న నమోదైన రూ.1,67,100 గరిష్ఠ స్థాయి నుంచి కేవలం మూడు సెషన్లలోనే బంగారం రూ.4,700 లేదా దాదాపు 3 శాతం నష్టపోయింది.వెండి కూడా అదే బాటలో పయనించింది. కిలో ధర రూ.5,000 తగ్గి రూ.2,45,500కు చేరింది. ఇటీవలి ర్యాలీ తర్వాత ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం, డాలర్ బలపడటం దేశీయ బులియన్ ధరలపై ఒత్తిడి తెచ్చాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.వచ్చే వారం కీలకంఇక వచ్చే వారం బంగారం, వెండి ధరలకు అమెరికా ఆర్థిక గణాంకాలు కీలకం కానున్నాయి. సెప్టెంబర్ ఫెడ్ సమావేశానికి ముందు ఉద్యోగాల గణాంకాలు, ద్రవ్యోల్బణం తదితర డేటాపై మార్కెట్లు దృష్టి పెట్టనున్నాయి. ప్రస్తుతానికి వార్ష్ వ్యాఖ్యలు రేట్ల పెంపు భయాలను పెంచినప్పటికీ, సెప్టెంబర్లో ఫెడ్ నిర్ణయం పూర్తిగా రానున్న ఆర్థిక గణాంకాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల బులియన్ మార్కెట్లో రానున్న రోజుల్లోనూ అధిక ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉంది.
లేటెస్ట్ ఐఫోన్పై భారీ డిస్కౌంట్ డీల్..
ఐఫోన్లకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చాలామందికి ఈ ప్రీమియం ఫోన్లు వాడాలని ఉన్నా వాటి అధిక ధరల కారణంగా కొనలేరు. అయితే యాపిల్ ఐఫోన్ కొత్త సిరీస్ విడులకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ప్రస్తుత ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro)పై ఫ్లిప్కార్ట్లో ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 256GB వేరియంట్ను రూ.90 వేలకే సొంతం చేసుకునే అవకాశం ఉంది.ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 17 ప్రో 256GB వేరియంట్ ప్రస్తుతం రూ.1,29,900కు లిస్టయింది. దీని అసలు ధర రూ.1,34,900 కాగా, నేరుగా రూ.5,000 తగ్గింపు లభిస్తోంది. అదనంగా అర్హత కలిగిన ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.9,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తున్నట్లు ఉత్పత్తి పేజీలో చూపిస్తోంది.ఈ డీల్లో అసలు ఆకర్షణ ఎక్స్ఛేంజ్ ఆఫర్. ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం ఎంపిక చేసిన పాత ఫోన్లపై ఎక్స్ఛేంజ్ విలువను అందిస్తోంది. ఇందులో భాగంగా ఐఫోన్ 15కి రూ.30,000 వరకు విలువ లభించవచ్చని తాజా డీల్ వివరాలు సూచిస్తున్నాయి. రూ.30,000 ఎక్స్ఛేంజ్ ప్రయోజనం, రూ.9,000 బ్యాంక్ డిస్కౌంట్ రెండూ పూర్తిగా లభిస్తే ఐఫోన్ 17 ప్రో రూ.90,900 లకే వస్తుంది.ఐఫోన్ 17 ప్రో మోడల్లో A19 ప్రో చిప్, 6.3 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్ప్లే, 48MP కెమెరా సిస్టమ్, 18MP సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఫ్యామిలీ
సిల్కీగా.. జాలువారేలా!
జుట్టు పట్టులా మృదువుగా ఉంచుకోవడానికి ఇంట్లోనే చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. తలకు గోరువెచ్చని కొబ్బరినూనె రాసి, సుతారంగా మర్దన చేసి, అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. తల పొడిబారిపోకుండా ఉండటానికి గోరువెచ్చని నీరు ఉపయోగించడం మంచిది. షాంపూ చేసిన ప్రతిసారీ జుట్టు మధ్య భాగం నుంచి చివర్ల వరకు కండిషనర్ రాసి.. కొన్ని నిమిషాల తర్వాత కడిగేయాలి. తడిగా ఉన్నప్పుడు జుట్టు సులభంగా తెగిపోవచ్చు. అందుకని వెంటనే గట్టిగా దువ్వకుండా, కొద్దిగా ఆరిన తర్వాత వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో మెల్లగా చిక్కులు తీయాలి.
నారికేళ వైభవం
మన దేశంలో కొబ్బరి వేలాది సంవత్సరాలుగా వినియోగంలో ఉంది. మన దేశమే కాదు, ఇండో–పసిఫిక్ ప్రాంతం అంతటా కొబ్బరి వినియోగం అప్పటి నుంచే ఉంది. మన దేశంలో కొబ్బరికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంది. సంస్కృతంలో నారికేళఫలంగా పిలుచుకొనే కొబ్బరిని పూజాదికాల్లోను, యజ్ఞయాగాలలోను, శుభకార్యాలలోను విరివిగా ఉపయోగిస్తారు. నారికేళాన్ని ‘శ్రీఫలం’ అని కూడా అంటారు. ఆధ్యాత్మిక ప్రశస్తి అటుంచితే, కొబ్బరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి పీచును, కొబ్బరి కలపను వివిధ రకాల వస్తువుల తయారీ కోసం పారిశ్రామికంగా కూడా వినియోగిస్తుంటారు. కొబ్బరి ఉత్పాదనలో మన దేశం రెండో స్థానంలో ఉంది. కొబ్బరి విశేషాలను గణాంకాలలో తెలుసుకుందాం.కొబ్బరికాయలోను, కొబ్బరినీరులోను పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరికాయలో తినే భాగంలో ఎక్కువగా కొవ్వులు ఉంటాయి. దీని నుంచే కొబ్బరి నూనె తీస్తారు. కొబ్బరి తురుమును, కొబ్బరి నూనెను రకరకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. కొబ్బరినీరు వేసవిలో దాహార్తి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరినీటిలోని ఖనిజాలు తక్షణ శక్తినిస్తాయి.
హైబ్రిడ్ మంచేనా? ముంచేనా?
ఉదయాన్నే ఆఫీస్ క్యాబ్ కోసం ఎదురుచూడక్కర్లేదు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద గంటల తరబడి టైమ్ వేస్ట్ చేయక్కర్లేదు. ఇంట్లో హాయిగా కాఫీ తాగుతూ లాప్టాప్ ఆన్ చేస్తే చాలు... ఆఫీస్లో అడుగుపెట్టినట్లే... అటెండెన్స్ పడినట్లే... ప్రపంచాన్ని చుట్టేసిన ‘కరోనా’ కార్పొరేట్ రంగానికి నేర్పిన అతిపెద్ద పాఠం ‘‘హైబ్రిడ్ వర్క్ కల్చర్’’ వారంలో మూడు రోజులు డెస్క్ వర్క్, రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్... వారాంతాల్లో సరదాలు... అసలు ఈ సరికొత్త సంస్కృతి ఉద్యోగుల జీవితాలను, కంపెనీల భవిష్యత్తును ఎలా మార్చింది? మారుస్తోంది? ఒక ప్రత్యేక కథనం.ఎక్కడ పనిచేస్తున్నారనేది కాదు... ఎంత సమర్థంగా పనిచేస్తున్నారు... ఔట్పుట్ ఎంత వచ్చిందనేదే ముఖ్యం అంటున్నాయి నేటి గ్లోబల్ కంపెనీలు. నాలుగు గోడల మధ్య మూస ధోరణిలో ఆఫీసులో పనిచేయడం... లేదా వర్క్ ఫ్రమ్ హోమ్తో విసిగి పోవడం వంటిæరోజులు ముగిశాయి. ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో హైబ్రిడ్ వర్క్ కల్చర్ ఒక ట్రెండ్గా మారింది. సంస్థల ఉత్పాదకత, ఉద్యోగుల సౌకర్యంతో పాటు లైఫ్ను సమన్వయం చేస్తూ ఈ నూతన పని సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.ఫలితమే ఫైనల్!ఉద్యోగులు తమ పనిదినాలను ఇల్లు, ఆఫీసు మధ్య పంచుకునే వెసులుబాటే హైబ్రిడ్ వర్క్. ఈ విధానంలో ఉద్యోగులు తమ సౌకర్యాన్ని బట్టి ఆఫీసు నుంచి, ఇంటి నుంచి లేదా వారికి నచ్చిన ఏ ప్రాంతం నుంచైనా పనిచేసుకునే వీలును కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఏ ప్రాంతం, ఏ దేశం అనే వాటితో సంబంధం లేకుండా కేవలం ప్రతిభను ఆధారంగా చేసుకుని ఉద్యోగులను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుంది. పని ఎక్కడి నుంచి చేసినా ఫలితమే ఫైనల్ అనేది ఈ ఆధునిక విధానంలోని ముఖ్య ఉద్దేశం. డిజిటల్ టూల్స్ సహాయంతో సాధించిన విజయాలను చూసిన కంపెనీలు ఇప్పుడు దీనిని శాశ్వత మోడల్గా మారుస్తున్నాయి.కాఫీషాప్ ఆఫీసైతే!ఒకప్పుడు ఆఫీస్ అంటే నాలుగు గోడల మధ్య అమర్చిన డెస్క్లు, వరుసగా కూర్చునే ఉద్యోగులు. నిర్దిష్టమైన పని వేళలు. కానీ ఇప్పుడది పాత పద్ధతయ్యింది. ఇంటి లివింగ్ రూమ్, నచ్చిన కాఫీ షాప్, పల్లెలోని ప్రశాంతమైన వాతావరణం... ప్రదేశం ఏదయినా లాప్టాప్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ప్రతి చోటూ ఒక వర్క్స్పేస్గా మారిపోతోంది.రెండు పడవలపై ప్రయాణం!సోమవారం పొద్దున్నే సగం తెరిచిన కళ్లతో అలారం సైలెంట్ చేయడం... ఉదయం 8:15 గంటలకు బంపర్–టు–బంపర్ ట్రాఫిక్, హారన్ల గోల మధ్య ప్రెజెంటేషన్ డెక్ గురించి ఆలోచించడం.అదే బుధవారం ఉదయం... హాయిగా ఉదయం 8:30 గంటలకు లేచి, చేతిలో కాఫీ కప్పుతో లాప్టాప్ ఆన్ చేస్తూనే, పక్కన ‘నాన్నా.. నా బార్బీ బొమ్మ కనిపించడం లేదు!’ అని అరిచే నాలుగేళ్ల చిన్నారిని శాంతింపజేయడం.ఒకే మనిషి... ఒకే ఉద్యోగం... కానీ రెండు వేర్వేరు ప్రపంచాలు! ఐటీ ఉద్యోగి జీవితంలో ‘హైబ్రిడ్ వర్క్’ తెచ్చిన తిప్పలివి. ఆఫీస్ రోజున అస్తవ్యస్తమైన ట్రాఫిక్లో గమ్యం చేరుకోవడం ఒక యుద్ధమైతే... ఇంటి నుంచి పనిచేసే రోజున ‘హోమ్’కి, ‘వర్క్’కి మధ్య గోడలు కూలిపోయి, పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియని ఆందోళన, ఒకవేళ పూర్తయినా ‘ఆఫీస్ ముగిసింది’ అనే మానసిక భావన రాదు. వీకెండ్లో కూడా మెయిల్స్, స్లాక్ మెసేజ్లు చూడాలనే మానసిక తాపత్రయం వీడదు. అంటే హైబ్రిడ్ ఉద్యోగులు రెండు పడవలపై ప్రయాణం చేస్తూ నరకయాతన పడుతున్నారు.నెగ్గుకొచ్చేదెలా?హైబ్రిడ్ కల్చర్లో సమయం కలసిరావడం, ప్రయాణ భారం తగ్గడం లాంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ పద్ధతి వల్ల ఉద్యోగులు పరోక్షంగా కొన్ని మానసిక, వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ⇒ ఈ విధానంలో ప్రధానమైన సమస్య వర్క్: లైఫ్ బ్యాలెన్స్ లోపించడం. ఇంటి నుంచి పనిచేసే రోజుల్లో ‘పని వేళలు’ ముగిసినా లాప్టాప్ ముందే గడపాల్సి వస్తోంది. ఇది తీవ్ర మానసిక ఒత్తిడికి దారితీస్తోంది. అందువల్ల ఆఫీస్ టైమింగ్స్ పూర్తికాగానే లాప్టాప్ క్లోజ్ చేయడాన్ని అలవాటు చేసుకోవాలి.⇒ ఒంటరితనం: రోజూ సహచరులను కలవకపోవడం వల్ల టీమ్తో సంబంధాలు తగ్గుతాయి. ఒక్కోసారి కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి పొరపాట్లూ జరుగుతుంటాయి. ఇంట్లో ఒక్కరే పనిచేసుకుంటూ ఉంటే, చుట్టుపక్కల మాట్లాడే మనిషి లేక ఒంటరితనం ఆవరిస్తుంది.⇒ వర్క్ బర్నౌట్: ఆఫీసులో మాదిరిగా ఇంట్లో సౌకర్యవంతమైన కుర్చీలు, టేబుళ్లు లేకపోవడం వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి సమస్యలు వెంటాడుతున్నాయి. నిరంతరం స్క్రీన్ ముందే ఉండటంతో వర్క్ బర్నౌట్ పెరుగుతోంది. అందువల్ల ప్రతి 45 నిమిషాలకోసారి చిన్న బ్రేక్ తీసుకుని స్ట్రెచింగ్ చేయాలి. అంతేకాకుండా టీమ్ సభ్యులతో కేవలం వర్క్ గురించే కాకుండా వారానికి ఒకసారి వర్చువల్ భేటీ లేదా క్యాజువల్ కాల్స్ ద్వారా నెట్వర్క్ పెంచుకోవాలి.⇒ ఎదుగుదలకూ ఆటంకం: ఆఫీసుకు క్రమం తప్పకుండా వచ్చేవారికే మేనేజర్లు, హెచ్ఆర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారని, ఇంటి నుంచి పనిచేసే వారి కష్టం సరిగ్గా గుర్తింపు పొందదనే ఆందోళన ఉద్యోగుల్లో ఉంటోంది. అందువల్ల మేనేజర్లతో నిరంతరం మీ వర్క్ ప్రోగ్రెస్ పంచుకోవాలి.నిజంగా వరమేనా?గ్యాలప్ జాతీయ సర్వే (8,090 మంది ఉద్యోగులు) ప్రకారం... హైబ్రిడ్ విధానం ఉద్యోగుల జీవితాల్లో సానుకూల మార్పు తెచ్చినట్లు తేలింది. కుటుంబానికి తగిన సమయం దొరికి ప్రశాంతత పెరగడంతో పాటు రోజుకు రెండు నుంచి మూడు గంటలపాటు ప్రయాణ భారం తగ్గుతోంది. అలాగే పనిలో ఏకాగ్రత పెరిగి వేగంగా సాగుతూ ఉత్పాదకత పెరుగుతోంది. వారంలో మూడు రోజులు ఆఫీసులో, మరో రెండు రోజులు ఇంట్లో పనిచేయడం అనే ఫ్లెక్సిబిలిటీ వల్ల మహిళా ఉద్యోగుల రాజీనామాలు తగ్గినట్లు తేలింది.ఏది బెటర్?వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగులు నిరంతరం ఇంటి నుంచి పనిచేస్తారు. కానీ హైబ్రిడ్ వర్క్లో ఉద్యోగులకు ఇల్లు, ఆఫీస్ రెండింటిలో ఏది కావాలనుకుంటే అది తమ వీలును బట్టి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల వారు ఒంటరితనానికి దూరంగా ఉంటారు. పరిశోధనల ప్రకారం 49% మంది రిమోట్ వర్కర్లు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు.సవాళ్లతో సవారీకంపెనీ యాజమాన్యాలు కూడా ఈ మార్పును సానుకూలంగానే చూస్తున్నాయి. పెరిగిన రియల్ ఎస్టేట్ ఖర్చులు, ఆఫీస్ మెయింటెనెన్స్ బిల్లులు తగ్గించుకోవడానికి ఇది ఒక చక్కని మార్గంగా మారింది. అంతేకాకుండా, గ్లోబల్ టాలెంట్ను ఆకర్షించడానికి కంపెనీలు హైబ్రిడ్/ రిమోట్ ఆప్షన్లను ఒక ఆకర్షణీయమైన ఆఫర్గా చూపుతున్నాయి. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు ఊహించని సవాళ్లు కూడా ఇందులో ఉన్నాయి.లివ్ ఎనీవేర్.. వర్క్ ఎనీవేర్!కరోనా విజృంభించిన సమయంలో ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉద్యోగాల నిర్వహణలో సరికొత్త సంస్కృతికి నాంది పలికింది. అయితే ఐదేళ్ల తర్వాత కొన్ని సంస్థలు మాత్రం ఆఫీస్కి వచ్చి పనిచేయాల్సిందేనంటూ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ, మార్పు తప్పనిసరైంది. ఇల్లు, ఆఫీసు అని రెండింటినీ సమన్వయం చేస్తూ హైబ్రిడ్ వర్క్కి శ్రీకారం చుట్టాయి. వాటిల్లో గూగుల్, మెటా, ఎయిర్బీఎన్బీ, సిస్కో సిస్టమ్స్, సిటీ గ్రూప్, గ్రామర్లీ, హబ్ స్పాట్, స్పాటిఫై వంటి ఎన్నో ప్రసిద్ధ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ‘లివ్ ఎనీవేర్ అండ్ వర్క్ ఎనీవేర్’ (ఎక్కడైనా నివసించండి... ఎక్కడి నుంచైనా పనిచేయండి) అంటూ పనిలో స్వేచ్ఛా విధానాన్ని ప్రకటించాయి.సైన్స్ రూట్స్ నుంచి..ఐటీ, కార్పొరేట్ డిక్షనరీలో ఒక సర్వసాధారణమైన పదం ‘హైబ్రిడ్ వర్క్’. నిజానికి హైబ్రిడ్ అనే పదం బయాలజీ రంగానికి చెందిన పదం. బయాలజీ పరిభాషలో హైబ్రిడ్ అంటే రెండు వేర్వేరు జాతులకు చెందిన విత్తనాలు, లేదా జీవులను కలిపి ఒక కొత్త రకాన్ని తయారుచేస్తే దాన్ని ‘హైబ్రిడ్’ అంటారు. ఇక ఆటోమొబైల్ రంగంలో పెట్రోల్, బ్యాటరీ రెండింటి ద్వారా నడిచే వాహనాలను ‘హైబ్రిడ్ కార్లు’ అంటారు. మరి ఈ పదం ఆఫీస్ కల్చర్ మారింది కొన్ని దశాబ్దాలే కిందటే. 1970లో ‘టెలి కమ్యూటింగ్’ పేరుతో ఇంటినుంచి పనిచేసే విధానం వచ్చినప్పటికీ అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. 2010 తరువాత ఇదే ఫ్లెక్సిబుల్ వర్క్గా మారింది. హైబ్రిడ్ వర్క్కి 2020 ఒక టర్నింగ్ పాయింట్. కరోనా విజృంభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలన్నీ కూడా ఇంటి వద్ద నుంచి పనిచేసే సౌలభ్యాన్ని కలిగించాయి. ఆ తరువాత సంస్థలకి, ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా సైన్స్ రంగంలో ఉన్న ‘హైబ్రిడ్’ పదాన్ని వర్క్స్పేస్కి వర్తింపజేశారు. 2021 నాటికి టైమ్స్, ఫోర్బ్స్, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ వంటి అంతర్జాతీయ పత్రికలు ఈ పదాన్ని విరివిగా ఉపయోగించడంతో ఇది కార్పొరేట్ భాషలోకి చేరింది. ఆ తరవాత ప్రపంచమూ ఈ పదానికి ఆమోదం తెలిపింది.ఫార్మల్ వర్సెస్ క్యాజువల్⇒ మల్లెట్ డ్రెస్ కోడ్: సగం ఫార్మల్, సగం క్యాజువల్ దుస్తులు ధరించడమే మల్లెట్ డ్రెస్ కోడ్. హైబ్రిడ్ ఉద్యోగుల్లో 70 శాతం కంటే ఎక్కువ మంది పై భాగాన ఫార్మల్ షర్ట్, సూట్ వేసుకుని కింద మాత్రం షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్తో మీటింగ్స్ కానిచ్చేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ⇒ థర్డ్ పీక్ అవర్: సాధారణంగా ఉద్యోగుల్లో మార్నింగ్, ఆఫ్టర్నూన్ సమయాల్లో వర్క్ పీక్లో ఉంటుంది. కానీ హైబ్రిడ్ విధానం వచ్చాక థర్డ్ పీక్ అవర్ తయారైంది. అదే రాత్రి 8 నుంచి 10 గంటల సమయం. డిన్నర్, ఫ్యామిలీ టైమ్ పూర్తయ్యాక ప్రశాంతంగా మిగిలిన పని చేసుకునేందుకు లాగిన్ అవుతున్నారు. ⇒ రోజుకి 4 స్నాక్ బ్రేక్స్: ఇంటి నుంచే పనిచేసే సమయంలో రోజుకి కనీసం నాలుగుసార్లు స్నాక్స్, టీలు తీసుకుంటున్నట్లు 48 శాతం మంది ఒప్పుకున్నారు. ఇది వారికి బాగా నచ్చిన విషయం కూడా. ⇒ పెట్ కొలీగ్స్: ఇంట్లో పనిచేస్తుంటే ఉద్యోగుల పెంపుడు కుక్కలు, పిల్లులు హఠాత్తుగా కెమెరా ముందుకు రావడం, కీబోర్డ్ పైకి ఎక్కి గందరగోళం చేయడం సర్వసాధారణమైపోయింది.⇒ తగ్గిన ఫార్మల్స్: హైబ్రిడ్ కల్చర్ దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా టైలు, బ్లేజర్లు, సూట్లు, ఫార్మల్ షూస్ అమ్మకాలు 20% పైగా తగ్గిపోయాయి. వీటి స్థానంలో కంఫర్ట్ వేర్, క్యాజువల్ దుస్తుల అమ్మకాలు భారీగా పెరిగాయి.⇒ ఓన్లీ 30 మినిట్స్!: హైబ్రిడ్ మోడల్ వచ్చాక గతంలో గంటల కొద్దీ సాగే మీటింగ్లు కేవలం 30 నిమిషాలకు కుదించుకుపోయాయి. అయితే, చిన్న చిన్న ఆన్ లైన్ చెక్–ఇన్ మీటింగ్ల సంఖ్య ఏకంగా 60% పెరిగింది!భవిష్యత్తేంటి? రాబోయే రోజుల్లో హైబ్రిడ్ వర్క్ కల్చర్ ఒక ఆప్షన్ మాత్రమే కాదు, ఉద్యోగ ప్రపంచంలో ఒక ప్రధాన భాగంగా మారిపోతుంది. ఉద్యోగం చేయడం అంటే ఒక నిర్దిష్ట ప్రదేశానికి వెళ్లడం అనేది పాతదైపోతుంది, ఎక్కడి నుంచైనా సమర్థంగా పనిని పూర్తి చేయడం మాత్రమే ఉంటుంది! నియమిత పనివేళల కంటే, సాధించే ఫలితాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అర్ధరాత్రి పనిచేస్తారో, తెల్లవారుజామున పూర్తి చేస్తారో అది పూర్తిగా ఎంప్లాయీకే వదిలేస్తారు. నగరాల్లోనే ఉండాల్సిన అవసరం ఉండదు. సొంత ఊరిలో కూర్చునే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు చేయవచ్చు. సాంకేతికత పెరిగేకొద్దీ ఇంట్లోనే ఉన్నా ఆఫీస్లో ఉన్నట్లే సహజమైన అనుభూతిని పొందే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. భవిష్యత్తులో ఉద్యోగం అనేది ఒక ప్రదేశానికి పరిమితమైన పని కాదు, అదొక ఉత్పాదకత పెంచే పని మాత్రమే!ఇదివరకు ఉద్యోగం అంటే నాలుగు గోడల మధ్య బందీ కావడం... ఇప్పుడు ఉద్యోగం అంటే స్వేచ్ఛగా ఆలోచనలను పంచుకోవడం! హైబ్రిడ్ సాంప్రదాయం అనేది కేవలం పని చేసే పద్ధతిని మాత్రమే మార్చలేదు, మనుషుల జీవన శైలినే కొత్తగా నిర్వచించింది. ప్రదేశం ఏదైనా, సమయం ఏదైనా... ఉద్యోగికి–సంస్థకు మధ్య ఉండాల్సిన నమ్మకం, బాధ్యత అనే పునాదులే ఈ విధానాన్ని నడిపిస్తాయి. కాలంతో పాటు మారుతున్న ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడమే కాదు, దాన్ని స్వీకరించడమే మన ముందున్న అసలైన భవిష్యత్తు! హైబ్రిడ్ వర్క్ ఒక ప్రయోగం కాదు, అదొక సానుకూలమైన మార్పు.∙ రమా జంబుల
యంత్ర కూర్మం
ఇవాన్ బడ్జ్ అనే ఈ 16ఏళ్ల కెనడియన్ కుర్రాడు యంత్ర కూర్మాన్ని రూపొందించాడు. సముద్రపు తాబేలు మాదిరిగా కనిపించే ఈ రోబో తాబేలు ఏఐ సాయంతో పనిచేస్తుంది. సముద్ర జలాల్లోకి దీనిని విడిచిపెడితే, అసలు తాబేలు మాదిరిగానే లోలోతుల వరకు చొరబడి ఈదులాడుతుంది. ఇందులోని శక్తిమంతమైన సెన్సర్లు, దీని ముందు భాగంలోను, అడుగు భాగంలోను అమర్చిన కెమెరాలు సముద్ర జలాల్లోని మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించి, తొలగిస్తాయి.పగడపు దిబ్బల స్థితిగతుల సమాచారాన్ని సేకరించి, ఎప్పటికప్పుడు యాప్ ద్వారా మొబైల్ఫోన్కు చేరవేస్తాయి. ‘బయోనిక్ అండర్వాటర్ రోబోటిక్ టర్టల్’ (బర్ట్) పేరుతో రూపొందించిన ఈ యంత్ర కూర్మం సాగర జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించగలదని చెబుతున్నారు. నమూనా యంత్ర కూర్మం పనితీరు పరిశీలించాక, మరిన్ని యంత్ర కూర్మాలను సముద్ర జలాల్లోకి విడిచిపెట్టాలని కెనడియన్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అంతర్జాతీయం
భారత్తో ఢీ కొట్టాడు.. జిన్పింగ్ వేటులో పడ్డాడు!
చైనాలో సైనిక ప్రక్షాళన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా జనరల్ జావో జోంగ్కిని అధ్యక్షుడు జీ జిన్పింగ్ను కీలక బాధ్యతల నుంచి తప్పించారు. గతంలో భారత్తో డోక్లామ్ ప్రతిష్టంభన, గాల్వాన్ ఘర్షణ సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్కు నేతృత్వం వహించింది ఈయనగారే. ఇందుకుగానూ జిన్పింగ్ నోట హీరోగా ప్రశంసలు అందుకున్న వ్యక్తే.. ఇప్పుడు వేటుకు గురి కావడం గమనార్హం. భారత్తో కీలక సరిహద్దు ఘర్షణల సమయంలో చైనా సైన్యానికి నాయకత్వం వహించిన జనరల్ జావో జోంగ్కి (Zhao Zongqi)పై తాజాగా వేటు పడింది. 2017లో డోక్లామ్ ప్రతిష్టంభన, 2020లో గాల్వాన్ ఘర్షణ సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) వెస్ట్రన్ థియేటర్ కమాండ్కు నేతృత్వం వహించిన జావోను చైనా అత్యున్నత రాజకీయ సలహా మండలి నుంచి తొలగించింది. అయితే ఆ తొలగింపునకు కారణాలను మాత్రం బీజింగ్ వర్గాలు వెల్లడించలేదు.2016లో వెస్ట్రన్ థియేటర్ కమాండ్ను పునర్వవ్యవస్థీకరించిన తర్వాత తొలి కమాండర్గా జనరల్ జావో జోంగ్కి బాధ్యతలు చేపట్టాడు. టిబెట్, జిన్జియాంగ్తోపాటు భారత్తో చైనా సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో పీఎల్ఏ కార్యకలాపాలను ఈ కమాండ్ పర్యవేక్షిస్తుంటుంది. అయితే 2017లో భారత్-చైనా-భూటాన్ త్రిసంధికి సమీపంలోని డోక్లామ్లో 72 రోజులపాటు ఇరు దేశాల సైనికులు ఉద్రిక్తతల్లో జావోనే కీలక పాత్ర పోషించారు. ఇందులో జావోదే పూర్తి బాధ్యత ఉందంటూ అంతర్జాతీయ మీడియా సైతం కథనాలు ఇచ్చింది.ఆ తర్వాత 2020లో తూర్పు లడ్డాఖ్లో ఉద్రిక్తతలు మొదలైనప్పుడు కూడా ఆయన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ బాధ్యతల్లోనే ఉన్నారు. అదే ఏడాది జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. చైనా అధికారికంగా నలుగురు PLA సైనికులు మరణించినట్లు ప్రకటించింది.గల్వాన్ ఘర్షణకు సంబంధించి అమెరికా నిఘా వర్గాల అంచనాలను ఉటంకిస్తూ.. 2020లో వచ్చిన ఓ నివేదికలో జావో జోంగ్కి ఆపరేషన్కు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారత్కు ‘గుణపాఠం చెప్పాలనే’ ఉద్దేశంతో ఈ చర్యకు ఆయన ఆమోదం తెలిపినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ వాదనను చైనా అధికారికంగా ధృవీకరించలేదు. డోక్లామ్, గాల్వాన్ వంటి భారత్తో అత్యంత సున్నితమైన సరిహద్దు ఘర్షణలకు జావో నేతృత్వం వహించిన నేపథ్యంలో ఆయన తాజా తొలగింపు ఆసక్తికరంగా మారింది.ఆగస్టు 26న చైనా అత్యున్నత రాజకీయ సలహా మండలి అయిన చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (CPPCC) జావోను తన స్టాండింగ్ కమిటీ నుంచి తొలగించింది. అలాగే జాతి, మత వ్యవహారాల కమిటీ డిప్యూటీ డైరెక్టర్ పదవి నుంచి తప్పించడంతోపాటు సీపీపీసీసీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. అయితే ఈ చర్యకు కారణమేంటన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయా? లేదంటే క్రమశిక్షణా ఉల్లంఘనలపై దర్యాప్తు జరుగుతోందా? అనేది కూడా స్పష్టం చేయలేదు.జిన్పింగ్ ‘పర్జ్’లో మరో వికెట్?జావోపై చర్యలు తీసుకున్న సమయంలోనే చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC)లోనూ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సీనియర్ జనరల్స్ జాంగ్ యూషియా, లియు జెన్లీపై కూడా క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.2012లో జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా సైన్యంలో అవినీతిపై ప్రారంభమైన చర్యలు క్రమంగా విస్తృత ప్రక్షాళనగా మారాయి. పలువురు సీనియర్ సైనికాధికారులు పదవులు కోల్పోవడం, కనిపించకుండా పోవడం(చంపేశారనే అనుమానాలు), దర్యాప్తులను ఎదుర్కోవడం జరిగింది. ఆయుధాల కొనుగోలు, రక్షణ విశ్వవిద్యాలయాలు, కీలక కమాండ్ల వరకు ఈ ప్రక్షాళన విస్తరించినట్లు తెలుస్తోంది.2026 ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) అంచనా ప్రకారం.. 101 మంది సీనియర్ పీఎల్ఏ అధికారులు పదవుల నుంచి తొలగించబడ్డారు. వాళ్లలో చాలామంది ఏమయ్యారో తెలియదు. ఈ నిర్ణయం ఎంతలా అంటే.. చైనా సైనిక నాయకత్వంలోని దాదాపు 52 శాతం పదవులను ప్రభావితం చేసిందట.ఇదీ చదవండి: కాళరాత్రి.. చైనా చరిత్రకే మాయని మచ్చ
హిమానీనదీ విలయంపై ఐరాస సంచలన హెచ్చరిక!
న్యూఢిల్లీ: హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో సంభవించే హిమానీనదీ సరస్సుల విస్ఫోటన వరదల వల్ల సంభవించిన మరణాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆరు దేశాల నిపుణులు రూపొందించిన ‘హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో హిమానీనద సరస్సుల విస్ఫోటన వరద ముప్పు, నిర్వహణ వ్యూహాలు, అనుసరణ లోపాలు’ అనే నివేదిక 1835 నుండి 2025 వరకు గల గణాంకాలను విశ్లేషించింది.ఈ అధ్యయనం ప్రకారం, హిందూకుష్ హిమాలయ పరిధిలోని 8 దేశాల్లో సంభవించిన వరదల ఘటనల సంఖ్య పరంగా భారత్ మూడో స్థానంలో ఉంది. చైనాలో అత్యధికంగా 199, పాకిస్థాన్లో 152, భారత్లో 62, నేపాల్లో 58 ఘటనలు నమోదయ్యాయి. అయితే, ప్రాణనష్టం విషయంలో భారత్ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంది. భారత్లో అత్యధికంగా 6,119 మంది మరణించగా, పాకిస్థాన్లో 1,991, చైనాలో 625 మరణాలు సంభవించాయి. ప్రజల నిర్వాసితుల సంఖ్యలోనూ భారత్ మొదటి స్థానంలో నిలిచింది.1950 తర్వాత వాతావరణ మార్పుల కారణంగా ఆకస్మిక వరదల తీవ్రత గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది. 1950కి ముందుతో పోలిస్తే దశాబ్దానికి సగటున 34 ఘటనలు నమోదవుతున్నాయి. దాదాపు 50 శాతం విస్ఫోటనాలకు మంచు చరియలు విరిగిపడటం, 25 శాతం ఘటనలకు భారీ వర్షాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. దాదాపు 70 శాతం ఘటనలు వేసవి, వర్షాకాలంలోనే సంభవించాయి. పర్వత లోయల్లోని రాళ్ల వ్యర్థాలు, మంచు ఆనకట్టల వెనుక ఏర్పడే సరస్సులలో నీటి మట్టం పెరిగి సహజ ఆనకట్టలు తెగిపోవడమే ఈ విపత్తుకు కారణం. భారత్లో ముందస్తు రక్షణ చర్యలు, సన్నద్ధత సరిపోకపోవడం వల్లే ఘటనలు తక్కువైనా మరణాల సంఖ్య భారీగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. 2023 తీస్తా వరదలు, 2025 చమోలీ ఘటనల నుండి సరైన గుణపాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రాణనష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దారుణ హత్య
నేపాల్ వరద బీభత్సం.. 700 దాటిన మృతుల సంఖ్య
నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 700 దాటింది. 2,426 మంది గల్లంతయ్యారు. 5,851 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 8,791 మంది పోలీసు సిబ్బంది సేవలందిస్తున్నారు. జిల్లాల వారీగా మృతుల జాబితాను నేపాల్ ప్రభుత్వం విడుదల చేసింది.రసువా-13, ధాదింగ్-45, గోర్కా-48, నవల్పూర్ (తూర్పు)-158, నువాకోట్- 49, చిత్వన్-233, తనహు-31, నవల్పూర్ (పశ్చిమ) -40 మంది మృతి చెందారు. రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో అధిక సంఖ్యలో గాయపడినట్లు నేపాల్ పోలీసుల వెల్లడించారు. ఖాట్మండు లోయలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారిలో 140 మంది డిశ్చార్జ్ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల తొలగింపు, గల్లంతైన వారి కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు.త్రిశూలి నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నేపాల్ వరద సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. త్రిశూలిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తాత్కాలికంగా హెలికాప్టర్, సహాయక చర్యలను అధికారులు నిలిపివేశారు. నది నీటిమట్టం పెరుగుతూనే ఉండటంతో ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. నేపాల్కు మరింత వరద సహాయం పంపించాలని విజ్ఞప్తి చేశారు. వరదల్లో చిక్కుకున్న 320 మంది భారతీయులను రక్షించేందుకు తగ్గిన చర్యలు తీసుకోవాలన్నారు.ఇదీ చదవండి: యుగాంతం రేంజ్లో ముప్పు?.. నేపాల్కు చైనా మరో డెడ్లీ వార్నింగ్!
నేపాల్ అంతటా హృదయవిదారక దృశ్యాలే!
నేపాల్ను భీకర వరద కుదిపేసిన నాలుగు రోజుల తర్వాత కూడా అక్కడి పరిస్థితి హృదయవిదారకంగానే ఉంది. ఇంకా రెండు వేల మందికి పైగా ఆచూకీ తెలియరావాల్సి ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నదులు, బురద, శిథిలాల నుంచి వరుసగా మృతదేహాలు బయటపడుతుండటంతో ఆస్పత్రులు, మార్చురీలు నిండిపోయాయి. నేపాల్ ఆకస్మిక వరదలు మహా విషాదాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. బోటె కోషి వరదల ఉధృతికి కొట్టుకుపోయిన మృతదేహాలు త్రిశూలి, నారాయణి నదుల వెంట దిగువ ప్రాంతాలకు చేరుతున్నాయి. ఒక్క చిత్వన్లోనే శనివారం ఉదయానికి 233 మృతదేహాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. నౌవల్పరాసి తూర్పులో మరో 158, గోర్ఖాలో 48, నౌవల్పరాసి పశ్చిమలో 47 మృతదేహాలు వెలుగుచూశాయి. వందలాది మంది జాడ తెలియరాకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆస్పత్రుల్లో స్థలం లేక.. నేపాల్-టిబెట్ పరిసరాల్లోని ఆస్పత్రుల్లో మార్చురీల సామర్థ్యం 350 మృతదేహాలుగా తెలుస్తోంది. ఈ తరుణంలో సామర్థ్యం మించిపోవడంతో మృతదేహాలను ఇతర భవనాలకు తరలిస్తున్నారు. మృతదేహాలను భద్రపరిచేందుకు భారత్పూర్ సహా పలు ప్రాంతాల్లో తాత్కాలిక కేంద్రాలను(బాడీ మేనేజ్మెంట్ సెంటర్లు) ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల టెంట్ల కింద కూడా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమ్యూనిటీ హాళ్లు, పోలీస్ ప్రాంగణాలు, ఇతర భవనాలను తాత్కాలిక మార్చురీలుగా మార్చేసినట్లు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే కోల్డ్ స్టోరేజీ కొరత, హఠాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు మృతదేహాలను భద్రపరచడం అధికారులకు మరో పెద్ద సవాలుగా మారాయి. ఎవరో గుర్తించడమే కష్టం..చాలా మృతదేహాలు బురద, శిథిలాల్లో తీవ్రంగా దెబ్బతినడంతో ముఖాలను చూసి గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో అధికారులు మృతదేహాల ఫొటోలు తీస్తూ, శరీరంపై ఉన్న గుర్తులు, దుస్తులు, టాటూలు, ఆభరణాలు, వేలిముద్రలు నమోదు చేస్తున్నారు. అవసరమైన చోట డీఎన్ఏ నమూనాలను కూడా సేకరించి కుటుంబ సభ్యులతో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు.బంధువుల కోసం ఆర్తనాదాలు..కళ్లెదుటే అయినవాళ్లు కొట్టుకుపోతుంటే.. నిస్సహాయంగా చూస్తున్న ఉండిపోయిన వాళ్లు అధికారులను బతిమాలుకుంటున్నారు. వాళ్ల ఆచూకీ చెప్పాలంటూ కన్నీళ్లతో వేడుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం నేపాల్లో వందలాది మంది ఇంకా గల్లంతై ఉండగా, మొత్తం విపత్తులో 2,000కుపైగా మంది ఆచూకీ తెలియడం లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. తాత్కాలిక బాడీ-మేనేజ్మెంట్ సెంటర్ల వద్ద తమ వారి కోసం కుటుంబ సభ్యులు ఫొటోలు, మొబైల్ చిత్రాలు పట్టుకుని తిరుగుతున్నారు. మృతదేహాలపైనా దోపిడీ..ఈ విపత్తు వేళ కొందరి అమానవీయ ప్రవర్తన కూడా వెలుగులోకి వచ్చింది. వరదలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం నుంచి చెవిపోగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటన నేపాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయినా ఆ తతంగం ఆగడం లేదని తెలుస్తోంది. మరోవైపు నదుల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలతో పాటు వస్తువులు, బ్యాగులు కూడా కనిపిస్తున్నాయి. వాటి నుంచి నగదు, నగల కోసం కొందరు పడవల్లో పరుగులు తీస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎటు చూసినా విషాదం, ఆర్తనాదాలు, మృతదేహాలే కనిపిస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది.ఇదీ చదవండి: ఆ సరస్సు నీటి రంగు మారింది.. చైనా వార్నింగ్
జాతీయం
ఆట.. మీ జీన్స్లో ఉందా?
ఒక చిన్న డీఎన్ఏ నమూనా.. దేశంలో ఒక పెద్ద క్రీడా భవిష్యత్తుకు క్లూ కానుంది! మన క్రీడాకారులు మైదానంలో చెమట చిందించక ముందే.. వారి జన్యువులను ల్యాబ్లో విశ్లేషించి ఎవరు భవిష్యత్ చాంపియన్లు కాగలరో గుర్తించే ప్రయత్నం మొదలైంది! ఎవరు ఏ క్రీడలో రాణించగలరు? ఎవరి శరీరం ఏ ఆటకు అనువుగా ఉంటుంది? ఎవరిలో ఎంత శక్తి దాగుంది? అనే ప్రశ్నలకు సమాధానాలను డీఎన్ఏలో వెతికే సరికొత్త ప్రయోగానికి గుజరాత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.అహ్మదాబాద్ వేదికగా 2030లో జరగే కామన్వెల్త్ క్రీడల్లో చాంపియన్లుగా నిలిచే సత్తా ఉన్న వారెవరో వెలికితీసేందుకు దేశంలోనే తొలిసారిగా గుజరాత్ ప్రభుత్వం క్రీడా జీనోమిక్స్ కార్యక్రమాన్ని చేపట్టింది. క్రీడాకారుల జన్యు సమాచారాన్ని వారి శారీరక, క్రీడా ప్రదర్శన వివరాలతో అనుసంధానించి సమగ్ర ప్రొఫైళ్లను రూపొందించనుంది. వాటి ఆధారంగా క్రీడా ప్రతిభను గుర్తించడంతోపాటు అందుకు అనువైన క్రీడాశిక్షణను రూపొందించడం, క్రీడాకారులకు అనువైన క్రీడను ఎంపిక చేయడం, గాయాల నిర్వహణ వంటి అంశాలను మరింత మెరుగ్గా చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ కార్యక్రమాన్ని గుజరాత్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అమలు చేస్తోంది. ఇందుకోసం గుజరాత్ అథ్లెట్ జీనోమ్ డేటాబేస్ను రూపొందించనుంది. ఇందులో క్రీడాకారుల జన్యు, శారీరక, క్రీడా ప్రదర్శనకు సంబంధించిన సమాచారాన్ని సమీకరిస్తారు. ‘‘క్రీడా ప్రతిభను గుర్తించి, క్రీడాకారులను అభివృద్ధి చేసేందుకు మరింత శాస్త్రీయ, ఆధారిత విధానాన్ని రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం’’ అని గుజరాత్ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి అర్జున్ మోఢ్వాడియా తెలిపారు.ఈ ఏడాది 2,000 డీఎన్ఏ నమూనాలుమొదటి దశలో టెన్నిస్ క్రీడాకారుల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించనున్నారు. తదుపరి దశలో ఆర్చరీ, ఫెన్సింగ్, జూడో, షూటింగ్ క్రీడాకారులను చేర్చనున్నారు. ఈ ఏడాది సుమారు 2,000 నమూనాలు, వచ్చే ఏడాది 10,000 నమూనాలు సేకరించి విశ్లేషించాలని గుజరాత్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 14 ఏళ్లలోపు, 14 నుంచి 18 ఏళ్లలోపు, 18 ఏళ్లు పైబడిన క్రీడాకారుల కోసం వేర్వేరు విభాగాలతో డేటాబేస్ రూపొందించనున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి చాంపియన్లకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, టెన్నిస్, తైక్వాండో, జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, ఫుట్బాల్, హాకీ, హ్యాండ్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, కబడ్డీ, ఖోఖో, ఆర్చరీ, షూటింగ్, చెస్ తదితర క్రీడలకు సంబంధించిన సమాచారాన్ని డేటాబేస్లో చేర్చనున్నారు.గాయాలు, శిక్షణపై కూడా ఉపయోగంజన్యు లక్షణాలు కండరాల నిర్మాణం, ఓర్పు, జీవక్రియ, వ్యాయామానికి శరీరం స్పందించే తీరు, కోలుకునే వేగం, గాయాలకు గురయ్యే అవకాశాలు వంటి అంశాలతో ఏ మేరకు సంబంధం కలిగి ఉన్నాయో తెలుసుకునేందుకు స్పోర్ట్స్ జీనోమిక్స్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ‘‘జన్యు, జీవసంబంధ సమాచారాన్ని సమీకరించడం ద్వారా ప్రతి క్రీడాకారుడికి మరింత సమగ్ర ప్రొఫైల్ను రూపొందించడమే గుజరాత్ నమూనా లక్ష్యం. తద్వారా క్రీడాకారుల ప్రతిభపై మరింత లోతైన అవగాహన లభిస్తుంది’’ అని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి బి. భారతి తెలిపారు.
క్షేమంగా ఇంటికి చేరుకున్న 28 మంది యాత్రికులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రకృతి విలయానికి అతలాకుతలమైన నేపాల్లో చిక్కుకున్న మొత్తం 68 మంది ఏపీ వాసుల్లో ఇప్పటివరకు 28 మంది సురక్షితంగా స్వస్థలాలకు చేరారు. ఇంకా 13 మంది జాడ తెలీకపోవడంతో.. వారి ఆచూకీ కోసం అక్కడి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా మానస సరోవర్ యాత్ర, ట్రెక్కింగ్ కోసం వెళ్లిన వారే కావడం గమనార్హం. ఇందులో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు. దీంతో మిగిలిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.‘సైన్ ఇన్ ట్రావెల్స్’ ఆధ్వర్యంలో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన సుమారు 28 మంది అక్కడ వరదల్లో చిక్కుకున్నారు. భారీగా వరదలు వ్యాపించడంతో వీరి కళ్ళెదుటే ఎంతోమంది మృత్యువాతపడ్డారు. అయితే, వీరందరూ శుక్రవారం రాత్రి, శనివారం మధ్యాహ్నానికి పలు గ్రూపులుగా హైదరాబాద్, విజయవాడ చేరుకున్నారు. కళ్లేదుటే ఘోరం జరిగినా ఎవరినీ రక్షించలేని, ఎవరికీ సహాయపడలేని స్థితిలో ఉన్నామంటూ వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇక ఆచూకీ లభించని 13 మంది అన్నమదేవర వెంకట్రామ్, అన్నమదేవర అనఘ, చొప్పరపు రమేశ్బాబు, సంతోష్ సాహు, స్పందన్ సాహు, పాధ్య సురభి మన్మథ, సైనా కుమారి సాహు, వీఎల్ బాలసుబ్రహ్మణ్యం, అట్లూరి శశికుమార్, నిమ్మగడ్డ రాజ్య లక్షి్మ, కె. గోవింద్, సుహాసిని రెడ్డి కందిమల్ల, రంగనాథ్లుగా గుర్తించారు. భాస్కర్ శాస్త్రి కుటుంబం క్షేమం.. మరోవైపు.. అక్కడ చిక్కుకున్న వారిలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కర్శాస్త్రి, మణి శారద, రఘునాథ శాస్త్రి, హన్షిక కూడా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. అయితే, రఘునాథ శాస్త్రికి తీవ్రమైన పల్మనరీ ఎడిమా (ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం) ఏర్పడడంతో ఆ కుటుంబం శుక్రవారం సాగా చేరుకుని హోటల్లో బసచేసింది. అక్కడ ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటుచేశారు. శనివారం వారు న్యాలమ్ కౌంటీకి చేరుకున్నారు. సరిహద్దు, వాతావరణం, రహదారి పరిస్థితులను బట్టి కోడారి మీదుగా కాఠ్మాండు చేరేందుకు వారు ప్రయతి్నస్తున్నారు. వీరి కుటుంబం ఆది లేదా సోమవారం కాఠ్మాండు చేరుకునే అవకాశముంది. సెప్టెంబర్ 1న కాఠ్మాండు–ముంబై–హైదరాబాద్ విమాన ప్రయా ణం ఖరారైనట్లు అధికారులు తెలిపారు.
గల్ల పగలగొట్టిన అమ్మాయి.. ఆ డబ్బుతో ఏం కొన్నదో తెలిస్తే షాక్
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మహిళ 9 ఏళ్ల పాటు తన గల్ల (పిగ్గీ బ్యాంక్)లో డబ్బు దాచుకుంది. చివరకు ఆ డబ్బుతో కారు, ఫోన్ లేదా మరేదైనా విలాసవంతమైన వస్తువు కొనకుండా, ఓ స్థలం కొనుగోలు చేసింది.ఇన్స్టాగ్రామ్ వినియోగదారు దీక్షా జైస్వాల్ తన ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. 2017 నుంచి ఏళ్ల తరబడి డబ్బు దాచుకోవడం ద్వారా తాను ఏం సాధించానో అందులో చూపించారు.వీడియోలో దీక్షా నవ్వుతూ తన పిగ్గీ బ్యాంక్ను ఖాళీ చేస్తూ కనిపించారు. ఏళ్ల తరబడి జాగ్రత్తగా దాచుకున్న నోట్ల కట్టలు, నాణేలను బయటకు తీశారు. "2017 నుంచి డబ్బు దాచుకోవడం ద్వారా ఏం సాధించారు?" అని వీడియోలో ఒకరు ప్రశ్నించింది.ఆ తర్వాత దీక్షా ఓ బ్యాగ్తో నడుస్తూ కనిపించారు. అందులోంచి 7 నుంచి 8 నగదు కట్టలను బయటకు తీశారు. తాను దాచుకున్న డబ్బుతో పెద్ద కొనుగోలు చేయబోతున్నట్లు ఇది సూచించారు.తర్వాతి దృశ్యంలో ఆ డబ్బుతో ఆమె ఏం కొనుగోలు చేశారో వెల్లడైంది. వాహనం లేదా మరో ఖరీదైన వస్తువు కొనకుండా, దీక్షా ఓ స్థలంలో పెట్టుబడి పెట్టారు.ఆ తర్వాత ఆమె తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. తన తాజా పెట్టుబడిని గర్వంగా చూపిస్తూ, ఏళ్ల తరబడి డబ్బు దాచుకున్న తర్వాత సాధించిన విజయాన్ని జరుపుకున్నారు.ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాలక్రమంలో విలువ కోల్పోయే వస్తువుపై డబ్బు ఖర్చు చేయకుండా, ఆస్తిలో పెట్టుబడి పెట్టిన ఆమె నిర్ణయాన్ని పలువురు ప్రశంసించారు.ఓ వినియోగదారు ఇన్నేళ్లు డబ్బు దాచుకున్న తర్వాత ఆమె కారు కొనకపోవడం సంతోషంగా ఉందని చెప్పారు. మరో వినియోగదారు తన సొంత సంపాదనతో ఓ మహిళ ఆస్తిలో పెట్టుబడి పెట్టడం చూసి "చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది" అని చెప్పారు. ఇదే సరైన మార్గమని పేర్కొన్నారు.మరికొందరు ఆమె చివర్లో కారు, ఫోన్ లేదా బంగారం చూపిస్తారని ఊహించినట్లు చెప్పారు. కానీ ఆమె తీసుకున్న నిర్ణయం చూసి ఆనందం కలిగిందన్నారు. ఓ ప్రేక్షకుడు తన ఫీడ్లో కనిపించిన వారిలో ఆమెనే తెలివైన వ్యక్తి అని పేర్కొన్నారు. చిన్న వయసులోనే ఆమె పెట్టుబడులపై అవగాహన కలిగి ఉండటం బాగుందన్నారు. View this post on Instagram A post shared by Diksha Jaiswal (@djmadgirl)
నేపాల్ వరదలు.. భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: నేపాల్ వరదల్లో గల్లంతైన భారతీయులపై విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆకస్మిక వరదల్లో మెుత్తంగా 287 మంది భారతీయులు గల్లంతు కాగా వారిలో 88 మంది సురక్షితంగా బయిటపడినట్లు తెలిపింది. గల్లంతైన వారిలో 128 మంది ఎన్నారైలు ఉన్నట్లు పేర్కొంది. గల్లంతైన వారి కోసం భారత సహాయక బృందాలు గాలింపులు చేపడుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.120 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్ చేరుకున్నట్లు తెలిపింది. అదే విధంగా మృతుల డీఎన్ఏ పరీక్షల వివరాల కోసం ఆరు ఫోరెన్సిక్ టీములను కేంద్ర ప్రభుత్వం నేపాల్ పంపినట్లు పేర్కొంది. హైడ్రో పవర్ ప్రాజెక్టు నుంచి నలుగురు భారతీయులు సురక్షితంగా బయటపడినట్లు తెలిపింది. నేపాల్–టిబెట్ వరదలు: ప్రస్తుత వివరాలు1. మొత్తం పరిస్థితి • నేపాల్–టిబెట్ మానవతా సంక్షోభం విపత్కరం. • 633 మరణాలు, 2,980 మంది మిస్సింగ్ • నేపాల్: 626 మరణాలు, 2,426 తప్పిపోయినవారు (517 విదేశీయులు, 300+ భారతీయులు). • 3,700+ మంది రక్షణ, 2,400+ మందిని 14 సైనిక హెలికాప్టర్లు గాలివెంటన్. • 11,000+ భద్రతా సిబ్బంది సెర్చ్ అండ్ రెస్క్యూ. • రోడ్లు/వంతెనలు నాశనం, బురద, కొండచరియలు, వర్షం, కఠిన భూభాగం యాక్సెస్ను పరిమితం చేస్తున్నాయి. • నేపాల్ అంతర్జాతీయ సహాయం స్వీకరిస్తోంది. భారత్, ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయి. 2. ఆంధ్రప్రదేశ్ – 13 మంది జాడ తెలియదు • 13 మంది AP సంబంధితులు జాడ తెలియదు (7 AP నివాసులు + 6 AP మూలం NRIలు/విదేశీయులు). • 6 మంది NRIలలో 4 మంది ఇషా ఫౌండేషన్ గ్రూప్కు సంబంధించినవారు. AP నివాసులు – 7: 1 అన్నండేవర వెంకట్రామ్ — 9663722477 | కాకినాడ/బెంగళూరు 2 అన్నండేవర అనఘ — 9663766711 | కాకినాడ/బెంగళూరు 3 చొప్పరాపు రమేష్ బాబు — 8861299006 | కృష్ణా/కనూరు | గైరాంగ్ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్, చైనా 4 సంతోష్ సాహు — 447860430921 | పార్వతీపురం | NRT–లండన్ 5 స్పందన్ సాహు — 447587741850 6 పాధ్య సురభి మన్మథ్ — కాంటాక్ట్ అందుబాటులో లేదు 7 సైనా కుమారి సాహు — కాంటాక్ట్ అందుబాటులో లేదు AP మూలం NRIలు/విదేశీయులు – 6: 8. వి.ఎల్. బాల సుబ్రమణ్యం — 7416410673 | గైరాంగ్ | ఇషా ఫౌండేషన్9. అట్లూరి శశి కుమార్ — +1-6095778200 | గైరాంగ్ | ఇషా ఫౌండేషన్10. నిమ్మగడ్డ రాజ్యలక్ష్మి — 7416083300 | గైరాంగ్ | ఇషా ఫౌండేషన్11. కె. గోవింద్ — 6367167312 | ఇషా ఫౌండేషన్12. సుహాసిని రెడ్డి కండిమల్ల — కాంటాక్ట్/లొకేషన్ అందుబాటులో లేదు13. రంగనాథ్ — 8790040944 | ధుంచే/స్యాబ్రుబేసి | న్యూజిలాండ్ పౌరుడు (AP సంబంధం) 3. భాస్కర్ శాస్త్రి & కుటుంబం – ఆదోని, కర్నూలు • భాస్కర్ శాస్త్రి, మణి శారద, రఘునాద శాస్త్రి, హంశిక సురక్షితంగా ఉన్నారు. • రఘునాద శాస్త్రికి తీవ్ర పల్మనరీ ఎడిమా వచ్చి ఆక్సిజన్ అవసరం. • 28 ఆగస్టు: సాగా చేరి హోటల్లో ఆక్సిజన్ ఏర్పాటు. • 29 ఆగస్టు: న్యాలామ్ కౌంటీ చేరారు (కొడారి సరిహద్దుకు సుమారు 50 కి.మీ.). • కొడారి → కాఠ్మండు వైపు కదలనున్నారు (సరిహద్దు, వాతావరణం, రోడ్ పరిస్థితులపై ఆధారపడి). • కీలక అవసరం: కొడారి–కాఠ్మండు ప్రయాణానికి పోర్టబుల్ ఆక్సిజన్/ఆక్సిజన్ ఉన్న వాహనం ఏర్పాటు చేయాలి. • 30/31 ఆగస్టు కాఠ్మండు చేరే అవకాశం. 1 సెప్టెంబర్ 2026 కాఠ్మండు–ముంబై–హైదరాబాద్ ఫ్లైట్ ధృవీకరించబడింది.కాంటాక్ట్స్:భాస్కర్ శాస్త్రి: 94401 96543 | హంశిక: 9036536111 | గ్రూప్ కోఆర్డినేటర్: +977 9843057721 | మూన్ హిమాలయ అడ్వెంచర్: +977 9860455963 / +977 1-5924890
ఎన్ఆర్ఐ
వైభవంగా సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట అంతర్జాతీయ పోటీలు
అమెరికాలోని చార్లెట్ నగరంలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు మాట్లాట 2026 అంతర్జాతీయ పోటీలు హిల్టన్ చార్లెట్ ఎయిర్పోర్ట్ రిసార్ట్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. పారుపూడి కిరణ్, తాళ్లూరి ప్రత్యూష, గొల్లపూడి సీతారామ్ నాయకత్వంలో జరిగిన ఈ పోటీల్లో అమెరికా, కెనడాలోని పలు ప్రాంతాల నుంచి 200 మందికి పైగా తెలుగు పిల్లలు పాల్గొన్నారు. దాదాపు 1000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ప్రముఖ నటుడు, దర్శకుడు, సంగీత విద్వాంసుడు శ్రీ ప్రభల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తెలుగు భాషా నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీల్లో పదరంగం (తెలుగు పదాలు వ్రాసే ఆట), తిరకాటం (తెలుగు ప్రశ్నోత్తరాల ఆట), ఒనిమా – ఒక్క నిమిషం మాత్రమే (తెలుగులో మాట్లాడే ఆట) అనే మూడు విభాగాల్లో బుడతలు (5–7), సిసింద్రీలు (8–11), చిరుతలు (12–16) వయోవర్గాల్లో పోటీలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో అమెరికా, కెనడాలోని పలు కేంద్రాల్లో జరిగిన ప్రాథమిక పోటీల్లో విజేతలైన పిల్లలు తమ కుటుంబాలతో కలిసి చార్లెట్కు చేరుకుని మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో వేడుకల్లో పాల్గొన్నారు.ముఖ్య అతిథి శ్రీ ప్రభల శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేస్తూ.. సిలికానాంధ్ర నాకు అత్యంత అభిమాన సంస్థ. మనబడి నిర్వహిస్తున్న తెలుగు మాట్లాట పోటీల స్థాయి, ఏర్పాట్లు, పిల్లల భాషా పటిమ నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. తెలుగు తెలిసిన యువతకు ఉద్యోగం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో ప్రయోజనాలు ఉన్నాయి. తెలుగు తెలిసిన వారు సంగీతం, నాట్యం, నటన వంటి కళల్లో కూడా సులభంగా రాణించడాన్ని నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. తెలుగు మాట్లాట బృందం నిబద్ధత, సమర్థత అభినందనీయం అని అన్నారు.
సోషల్ మీడియాలో సంచలనంగా కన్సల్టెంట్ కథ!
ఇండియాకు చెందిన ఓ మేనేజ్మెంట్ కన్సల్టెంట్.. త రెండున్నర ఏళ్లలో రూ.6.5 కోట్లు ఆదా చేసినట్టు, తన మొత్తం నెట్ వర్త్ను రూ.1 కోటి నుంచి రూ.7.5 కోట్లకు పెంచుకున్నట్టు రెడ్డిట్లో పంచుకున్న పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.'From Rs 1 Cr at 34 to Rs 7.5 Cr at 37: My Middle East Consulting Journey' పేరుతో పెట్టిన ఈ పోస్టులో, 37 ఏళ్ల ఈ వ్యక్తి తన కెరీర్, ఆదాయం, పొదుపు, పెట్టుబడుల వివరాలను వివరంగా పంచుకున్నాడు. ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు దేశంలోని టాప్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఈయన, ప్రస్తుతం ఒక ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేస్తున్నాడు.కెరీర్, జీతం ఎలా పెరిగాయంటే...22 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేట్ ట్రైనీగా కెరీర్ మొదలుపెట్టిన ఈయన, అప్పుడు ఏడాదికి రూ.10 లక్షలు సంపాదించేవాడు. ఎంబీఏ పూర్తయ్యాక 26 ఏళ్లకు మేనేజ్మెంట్ కన్సల్టింగ్లోకి అడుగుపెట్టాడు, అప్పటి వార్షిక ఆదాయం రూ.25 లక్షలు. 29 ఏళ్లకు మరో కెరీర్ మార్పుతో ఇండస్ట్రీ రోల్లోకి మారి, రూ.40 లక్షల ప్యాకేజీ అందుకున్నాడు. తర్వాతి ఐదేళ్లలో జీతం క్రమంగా పెరుగుతూ రూ.65 లక్షలకు చేరింది. ఈ కాలంలోనే పీఎఫ్, బంగారం, స్టాక్స్, రియల్ ఎస్టేట్లలో పెట్టుబడులతో దాదాపు రూ.1 కోటి నెట్ వర్త్ సాధించాడు.పశ్చిమాసియా మలుపు తిప్పిన సంపద34 ఏళ్ల వయసులో మళ్లీ కన్సల్టింగ్ రంగంలోకి వెళ్లి, పశ్చిమాసియాకు మారిన ఈయన జీతం ఒక్కసారిగా రూ.3.5 కోట్లకు (సుమారు 4 లక్షల డాలర్లు) పెరిగింది. అదీ పన్ను లేకుండా. ఈ భారీ జీత పెరుగుదలే ఆదా వేగాన్ని పెంచింది. "ఇప్పుడు 37 ఏళ్ల వయసులో, గత రెండున్నర ఏళ్లలో దాదాపు రూ.6.5 కోట్లు ఆదా చేశాను, నా నెట్ వర్త్ రూ.7.5 కోట్లకు చేరింది" అని ఆయన పోస్టులో పేర్కొన్నాడు.తన ప్రస్తుత ఆస్తుల గురించి కూడా వివరించాడు. ముంబైలో పూర్తిగా చెల్లించిన మూడు ప్రాపర్టీలు, భౌతిక బంగారం, సావరిన్ గోల్డ్ బాండ్ల రూపంలో సుమారు 700 గ్రాముల బంగారం, ఈక్విటీల్లో దాదాపు రూ.30 లక్షల పెట్టుబడి ఉన్నట్టు తెలిపాడు. రాబోయే కాలంలో ఈక్విటీ పోర్ట్ఫోలియోను మరింత పెంచుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ రెడ్డిట్ యూజర్లను బాగా ఆకట్టుకుంది. కొందరు తమ కెరీర్, ఫైనాన్స్ గురించి సీరియస్గా ఆలోచించేలా ప్రేరణ ఇచ్చిందని చెప్పగా, మరికొందరు ఇంత సంపద సాధించడం వెనుక ఏళ్ల కృషి, కష్టమైన నిర్ణయాలు ఉంటాయని కొనియాడారు. అధిక జీతాలు, పన్ను మినహాయింపులతో మిడిల్ ఈస్ట్ సంపద నిర్మాణానికి 'చీట్ కోడ్' లాంటిదని కొందరు వ్యాఖ్యానించారు. విదేశాలకు మారడం ఎలా సాధ్యమైందో, కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏం చేయాలో తెలుసుకోవాలని కొందరు ఆసక్తి చూపారు.
27 ఏళ్లుగా అమెరికాలోనే.. ICE అదుపులో ఎన్నారై మహిళ!
అమెరికాలో 27 ఏళ్లుగా నివసిస్తున్న ఓ భారత సంతతి మహిళకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా (గ్రీన్కార్డ్) ఉన్నప్పటికీ.. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆమెను అదుపులోకి తీసుకుంది. అంతేకాదు.. ఆమెపై గతంలో కొనసాగిన డిపోర్టేషన్ కేసును ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఇప్పటికే కొట్టివేసినప్పటికీ ఈ అరెస్టు జరగడం చర్చనీయాంశంగా మారింది.వెంకట నరసమాంబ వాసంశెట్టి అనే మహిళను ఆగస్టు 11న సాధారణ చెక్-ఇన్కు హాజరైన సమయంలో ICE అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను జార్జియాలోని డిటెన్షన్ కేంద్రంలో ఉంచినట్లు సమాచారం. 2013 నుంచి ఆమెకు అమెరికాలో లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ (LPR) హోదా ఉంది.క్రిమినల్ రికార్డ్ లేదు..వాసంశెట్టి కుటుంబం దాదాపు మూడు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడింది. నార్త్ కరోలినాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించే ఉపాధ్యాయురాలిగా ఆమె పనిచేసినట్లు ఆమె కుటుంబ న్యాయవాది వెల్లడించారు. ఆమెకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని, ఇద్దరు అమెరికా పౌరులైన పిల్లలు, ఇద్దరు అమెరికా పౌరులైన మనవళ్లు ఉన్నారని తెలిపారు.ఆమె ఇల్లు, ఉద్యోగం, కుటుంబం మొత్తం అమెరికాలోనే ఉన్నాయని.. గ్రీన్కార్డ్ను వదులుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చెబుతున్నారు.ఏడు నెలలు భారత్లో ఉన్నందుకేనా?వాసంశెట్టి 2022 జూలైలో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను చూసుకునేందుకు భారత్కు వెళ్లారు. అక్కడ ఉండగానే ఆమెకు కోవిడ్ సోకడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని న్యాయవాదులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో దాదాపు రెండు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు చెప్పారు. దీంతో ఆమె అమెరికాకు తిరిగి రావడం ఆలస్యమైంది. చివరకు 2023 ఫిబ్రవరిలో రాలీ-డర్హామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా అమెరికాకు చేరుకున్నారు. మొత్తం మీద ఆమె సుమారు ఏడు నెలలు భారత్లో ఉన్నారు. అయితే.. ఈ వ్యవధినే అమెరికా ప్రభుత్వం ఆమె గ్రీన్కార్డ్ హోదాను ప్రశ్నించడానికి ప్రధాన కారణంగా చూపినట్లు సమాచారం. అమెరికా వెలుపల ఎక్కువ కాలం ఉండటం వల్ల శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే ఉద్దేశం ఉందా? అనే అంశాన్ని అధికారులు పరిశీలించవచ్చు.‘అమెరికాను వదిలే ఉద్దేశమే లేదు’అయితే వాసంశెట్టి మాత్రం అమెరికాలో తన జీవితాన్ని కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆధారాలు సమర్పించారు. భారత్కు వెళ్లిన సమయంలోనూ అమెరికాలో తన ఉద్యోగం, కుటుంబం, ఇల్లు వంటి సంబంధాలను కొనసాగించారని ఆమె తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. అంతేకాదు.. భారత్లో ఉన్న సమయంలోనే నార్త్ కరోలినాలో తన ప్రధాన నివాసంగా ఉపయోగించుకునే ఇంటిని కొనుగోలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. తల్లిదండ్రుల అనారోగ్యం, తన ఆరోగ్య సమస్యల కారణంగా జరిగిన తాత్కాలిక ప్రయాణాన్ని అమెరికా శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే నిర్ణయంగా చూడలేమని వాదించారు.కోర్టు కేసు కొట్టేసినా.. మళ్లీ అరెస్టువాసంశెట్టిపై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) డిపోర్టేషన్ చర్యలు ప్రారంభించింది. అయితే కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించేందుకు కోర్టు విధించిన గడువులో DHS విఫలమైందని ఆమె న్యాయవాది తెలిపారు. దీంతో 2026 మే 19న ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఆమెపై కొనసాగుతున్న డిపోర్టేషన్ ప్రక్రియను ముగించారు. ఆ తర్వాత కూడా ఆమెకు విధించిన ICE చెక్-ఇన్లకు క్రమం తప్పకుండా హాజరవుతూ వచ్చారు. అలా ఆగస్టు 11న చెక్-ఇన్కు వెళ్లిన సమయంలోనే ICE అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.‘ఆమె గ్రీన్కార్డ్ హోల్డర్ కాదు’వాసంశెట్టిని అదుపులోకి తీసుకున్న తర్వాత ICE మాత్రం ఆమె గ్రీన్కార్డ్ హోల్డర్ కాదని వాదిస్తున్నట్లు ఆమె న్యాయవాదులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆగస్టు 13న ఆమె తరఫు న్యాయ బృందం అత్యవసర హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఫెడరల్ న్యాయమూర్తి.. ఆమెను నిర్బంధించడానికి ఉన్న చట్టపరమైన ఆధారాలను మూడు రోజుల్లో వివరించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించారు.తర్వాత ఏం జరగొచ్చు?తాజా కోర్టు పరిణామాల ప్రకారం.. ఆమెను వెంటనే విడుదల చేయాలని ఆదేశం వెలువడలేదు. అయితే కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, వాసంశెట్టికి బెయిల్పై విడుదల కావచ్చా? అనే అంశాన్ని పరిశీలించేందుకు ఇమ్మిగ్రేషన్ జడ్జి ఎదుట బాండ్ హియరింగ్ జరిగే అవకాశం ఉంది.27 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ.. గ్రీన్కార్డ్ ఆధారంగా జీవనం సాగిస్తున్న ఓ భారత సంతతి మహిళను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు అమెరికాలోనే కాకుండా భారతీయ సమాజంలోనూ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తాత్కాలికంగా విదేశాల్లో ఎక్కువకాలం ఉండటం వల్ల గ్రీన్కార్డ్ హోదాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది.
నాట్స్ వినూత్న సేవ కార్యక్రమం
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మిస్సోరీ చాప్టర్ సభ్యులు వినూత్నంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా సెయింట్ లూయిస్ ప్రాంతీయ ఫుడ్ బ్యాంకాక్లో జరిగిన ప్రత్యేక ఆహార సేకరణ, ప్యాకేజింగ్ కార్యక్రమంలో నాట్స్ టీమ్ చురుగ్గా పాల్గొని సేవలు అందించింది. పేదలు, నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్స్ వాలంటీర్లు, తెలుగు కుటుంబాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ నార్త్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపర, నాట్స్ మిస్సోరీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాలలతో పాటు చాప్టర్ ప్రతినిధులు మధుసూధన్ దడ్డాల, నరేష్ రాయంకుల తదితరులు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు. తెలుగు సమాజానికి, అలాగే స్థానిక అమెరికన్ సమాజానికి సహాయం చేయడంలో నాట్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా నాట్స్ నాయకులులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆకలితో ఉన్నవారికి బాసటగా నిలవడం ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాట్స్ వాలంటీర్లకు, నాట్స్ సభ్యులకు నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం)
క్రైమ్
'నా భర్తని చంపేస్తానని బెదిరించి నాపై లైంగిక దాడి'
తూర్పు గోదావరి జిల్లా: నర్సరీలో తన భర్తతో పనిచేసే సురేంద్ర అలియాస్ చిన్న తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బుర్రిలంకకు చెందిన 19 ఏళ్ల మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళ తన భర్తతో కలిసి బుర్రిలంక నర్సరీకి ఈ ఏడాది జూలైలో పని కోసం వచ్చారు. అప్పటి నుంచి నర్సరీలో పనిచేస్తూ కార్యాలయ భవనం పక్కన నివసిస్తున్నారు.ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ ఉదయం సుమారు 6:45 గంటలకు, ఆమె భర్త యథావిధిగా పనికి వెళ్లాడు. అనంతరం 7 గంటలకు అదే నర్సరీలో పనిచేస్తున్న సురేంద్ర అలియాస్ చిన్న ఆమె ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తన భర్తకు చెపుతానని హెచ్చరించడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం 8.50 నిమిషాలకు మళ్లీ వచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఎవరికైనా చెప్తే భార్యాభర్తలిద్దరినీ చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తన భర్తకు ఆమె విషయాన్ని వివరించింది. దీంతో అతడు నర్సరీ యజమానికి ఆ విషయం చెప్పగా ఆయన సూచన మేరకు బాధితురాలు ఆమె బంధువులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: సాధిక్ చేతిలో రూ.2 కోట్ల ఓడీ ఖాతా!
సాధిక్ చేతిలో రూ.2 కోట్ల ఓడీ ఖాతా!
కాకినాడ క్రైం: పంచాయతీరాజ్ శాఖ పిఠాపురం ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన సాధిక్ ఖాన్ వ్యవహారంలో తవ్వుతున్నకొద్దీ విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వర్రెడ్డికి చెందిన కరూర్ వైశ్యా బ్యాంక్(కేవీబీ)కు సంబంధించి రూ.2 కోట్ల ఓడీ పరిమితి ఉన్న ఖాతా సాధిక్ ఖాన్ చేతికి చిక్కిందనే కీలక విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేవీబీ భానుగుడి బ్రాంచికి శుక్రవారం వెళ్లి మేనేజర్ను ఆ ఖాతా వివరాలు ఇవ్వాలని కోరారు. తనకు, జగదీశ్వరరెడ్డికి చెందిన ఖాతాల్లో తన ఫోన్ నంబర్ మార్చి, వాటి ఆర్థిక లావాదేవీలను సాధిక్ ఖాన్ తన చేతుల్లో పెట్టుకున్నాడన్న నూకరాజు కుమార్తె సౌజన్య ఆరోపణలపై లోతైన విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. మరింత స్పష్టత కోసం బ్యాంకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే, సాధిక్ సోదరి, తల్లికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర బ్యాంకు ఖాతాలపై పరిశీలన మొదలు పెట్టారు. సౌజన్య దగ్గర నుంచి సాధిక్ తీసుకున్న సొత్తును వారికి బదలాయించాడన్న ఆరోపణలపై నిజానిజాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసులున్నారు. ఇదిలా ఉండగా సాధిక్ను కోర్టు సోమవారం తమ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నందున ప్రశ్నల వర్షం కురిపించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. అంతకు ముందే పూర్తి వివరాలు, సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.సాధిక్ ఖాన్ కస్టడీ పిటిషన్పైవిచారణ వాయిదా కాకినాడ లీగల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన రైఫిల్ ఘాటింగ్ శిక్షకుడు షేక్ సాధిక్ ఖాన్ను పలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. దీనిని న్యాయస్థానం వచ్చే నెల రెండో తేదీకి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్పై శుక్రవారం మొబైల్ కోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. చదవండి: నా బిడ్డకు తండ్రి నువ్వే.. డీఎన్ఏ పరీక్షకు సిద్ధం!
సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వేప చెట్టు విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వివాదం రక్తం చిందించింది. గొడ్డలతో పరస్పరం దాడులు చేసుకునేదాకా వెళ్లింది. ఈ దాడుల్లో ఇద్దరూ మృతి చెందగా.. ఘర్షణను అదుపు చేయడానికి ప్రయత్నించిన ఎస్సైకి సైతం తీవ్ర గాయాలయ్యాయి.మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు విషయంలో భుక్యా సైదా, వెంకటేశ్వర్లు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ ఉదయం దాని చెట్టు కొమ్మలు నరికేందుకు వెంకటేశ్వర్లు ప్రయత్నించాడు. అది గమనించిన సైదా అడ్డు చెప్పాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సైదా కొడుకు రాము.. అదే గొడ్డలితో వెంకటేశ్వర్లును నరికాడు. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. దీంతో కోపోద్రిక్తులైన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు, కొందరు స్థానికులు సైదా, సైదా కొడుకు రాముపై దాడికి యత్నించాడు. అది గమనించిన మరికొందరు స్థానికులు సైదా తరఫున కొట్లాటకు వచ్చారు. ఇరు వర్గాల ఘర్షణలో కొందరికి గాయాలు కాగా.. అక్కడ పరిస్థితి రణరంగాన్ని తలపించింది. ఇదే అదనుగా తన కుమారుడిని ఘటనా స్థలం నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు సైదా. అయితే.. పట్టరాని కోపంతో రాము తన తండ్రి సైదాపై గొడ్డలితో దాడి చేశాడు. ఆపై భయంతో ఓ ఇంట్లో దూరి దాక్కున్నాడు. సైదాను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా అడ్డుకున్న స్థానికులు.. రామును అప్పగిస్తేనే ముందుకు కదలిస్తామని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈలోపు.. రామును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించే ప్రయత్నం చేయగా స్థానికులు కొందరు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్సై నవీన్కు గాయాలయ్యాయి. సైదాను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆలస్యం కావడంతో మార్గం మధ్యలోనే మరణించాడు. ఎస్సై నవీన్ సహా గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. వెంకటేశ్వర్లు, సైదా మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ డబుల్ మర్డర్తో ఆ తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇదీ చదవండి: జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు
జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద విషాదం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో ఈ ఉదయం ఘోరం జరిగింది. కారు పూజ కోసం వచ్చిన ఓ కుటుంబంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆ ఇంటి పెద్ద అదే కారు కింద పడి అనూహ్యరీతిలో మృతిచెందారు. మేనల్లుడి కారు పూజ కార్యక్రమం కోసం రామచంద్రరావు(70) అనే వ్యక్తి తన బంధువులతో పెద్దమ్మ గుడికి వచ్చారు. పూజ కార్యక్రమం పూర్తయిన తర్వాత కారును అక్కడి నుంచి తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రామచంద్రరావు మేనల్లుడు పొరపాటున యాక్సిలరేటర్ను తొక్కడంతో వాహనం ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో సమీపంలో ఉన్న ఆయన కారు కింద చిక్కుకుని గాయపడ్డారు.తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. పెద్దమ్మ గుడి వద్ద నిత్యం కొత్త వాహనాలకు పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఏనాడూ ఇలాంటి ఘటన జరగలేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఆలయ ప్రాంగణంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడ విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి స్వస్థలం.. ఇలా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: జాబ్ వస్తుందన్న ఆనందం అంతలోనే..
వీడియోలు
Putta Shiva Shankar : బాబు ఉంటే బతుకు ఇంతే
'యెష నాగుల' సాంగ్ తో సోషల్ మీడియా షేక్..!
11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్
నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే
నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం
వామ్మో బియ్యం.. కొనాలంటే భయం రైతుల రియాక్షన్..
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్.. చంద్రబాబు
ఇది నెక్స్ లెవల్ స్మగ్లింగ్.. సినిమాల్లో కూడా చూసి ఉండరు నోరెళ్లబెట్టిన పోలీసులు
అవమానించిన ఒక్కొక్కరికి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి.. జగనన్న 2.0 మీ ఊహకే వదిలేస్తున్న
ప్రొద్దుటూరులో వ్యభిచారం.. TDPపై MLA వరదరాజులరెడ్డి సంచలన వ్యాఖ్యలు

