డేంజర్కే డేంజర్ ఈ బామ్మ!.. ఏం చేసిందో చూడండి
యుద్ధం అంటే కేవలం సైనికులు, ఆయుధాలే కాదు.. సామాన్య ప్రజలు కూడా అనుకోని పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉక్రెయిన్లో ఓ వృద్ధ మహిళకు ఎదురైన అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డుపై పడి ఉన్న రష్యా డ్రోన్ వద్దకు వెళ్లిన ఆమె.. దాన్ని పీకిపారేసి ఎందుకు పనికి రాకుండా చేసి పడేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఆ మహిళ.. నేలపై ఉన్న డ్రోన్ దగ్గరకు వెళ్లింది. దాని పైభాగంలోని ఫైబర్-ఆప్టిక్ కేబుల్ స్పూల్ను బయటకు తీసి అవతల పడేసింది. అనంతరం డ్రోన్ను కూడా చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేదానిపై స్పష్టత లేదు. కానీ, ఈ వీడియో సెప్టెంబర్ 15న సోషల్ మీడియా నుంచి వైరల్ అయింది. ఈ ఘటన ఉక్రెయిన్లోని జపోరిజ్జియా ప్రాంతంలో జరిగి ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఏంటీ డ్రోన్ స్పెషాలిటీ!సాధారణ డ్రోన్లు రేడియో సిగ్నళ్ల ద్వారా ఆపరేటర్ నియంత్రణలో ఉంటాయి. అయితే ఫైబర్-ఆప్టిక్ ఎఫ్పీవీ డ్రోన్లకు మాత్రం పలుచటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనుసంధానమై ఉంటుంది. డ్రోన్ ఎగురుతున్న కొద్దీ ఈ కేబుల్ స్పూల్ నుంచి బయటకు వస్తుంది. దీని ద్వారా ఆపరేటర్కు ప్రత్యక్ష వీడియో, నియంత్రణ సమాచారం అందుతుంది. రేడియో సిగ్నళ్లపై ఆధారపడకపోవడంతో ఎలక్ట్రానిక్ జామింగ్ ద్వారా వీటిని అడ్డుకోవడం సాధారణ డ్రోన్లతో పోలిస్తే కష్టంగా ఉంటుంది. అందుకే వీడియోలో కనిపించిన మహిళ స్పూల్ను తొలగించడంతో డ్రోన్కు ఆపరేటర్తో ఉన్న నియంత్రణ లింక్ తెగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి డ్రోన్ను చేతితో తాకడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు, పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. డ్రోన్లో పేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సో.. ఈ బామ్మ లక్కీ అన్నమాట.Ukrainian badass granny disables russian FPV drone 😮 pic.twitter.com/uyZiPIwtvS— Apple Tree (@LonelyAppleTree) September 16, 2026ఇదేం కొత్త కాదు!ఉక్రెయిన్లో డ్రోన్లతో సామాన్యులు తలపడిన ఘటనలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. 2022లో కీవ్కు చెందిన ఓ వృద్ధురాలు.. బాల్కనీలో నుంచి జార్ను విసిరి రష్యా డ్రోన్ను కూల్చేయడం చర్చనీయాంశమైంది. అలాగే మొన్నీమధ్యే ఓ పండ్ల వ్యాపారిని వెంటాడగా.. అతను బతిమాలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే అది పేలి.. అతనికి గాయాలయ్యాయి. తాజా వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి. మహిళ ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.ఇదీ చదవండి: ఇది వెయ్యేళ్లకొకసారి వచ్చే వర్షమట!
రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ (Disha Salian) మరణం కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం సంచలనంగా మారింది. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నశివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరేకు భారీ షాక్ తగిలింది. అనుమానాస్పదంగా మరణించిన తన కుమార్తెకు న్యాయం చేయాలనిపోరాడుతున్న దిశా తండ్రి సతీష్ సాలియన్ రూ. 500 కోట్ల నష్టపరిహాం కోరుతూ నోటీసులు పంపారు. శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే , ఎన్సిపి (ఎస్పి) నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ల కు పరువు నష్టం దావా నోటీసులు జారీ అయ్యాయి. ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగా రాజకీయ ప్రేరేపితమైందిగా తాను చేస్తున్న న్యాయ పోరాటాన్నిచిత్రీకరించడానికి ఈ ఇద్దరు నాయకులు ప్రయత్నించారని సతీష్ సాలియాన్, దీనికి బహిరంగ క్షమాపణ చెప్పాలని తన నోటీసులో పేర్కొన్నారు.బహిరంగ క్షమాపణకు డిమాండ్సతీష్ సాలియన్ 'షరతులు లేని, స్పష్టమైన , ఎలాంటి షరతులు లేని లిఖితపూర్వక బహిరంగ క్షమాపణ' చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్షమాపణను అన్ని ప్రధాన ప్రింట్, టీవీ మరియు డిజిటల్ మీడియా వేదికలలో ప్రచురించి, ప్రసారం చేయాలి. అంతేకాదు బేషరతుగా బహిరంగ క్షమాపణలతోపాటు, సోషల్ మీడియాలో మూడు నిమిషాల వీడియోను పోస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు ఆదిత్య థాకరే మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను ఇప్పటికే ఖండించారు. దిశా సాలియాన్ను తాను ఎప్పుడూ కలవలేదని, తన పేరును ఈ కేసులో అనవసరంగా లాగుతున్నారని ఎక్స్ వేదికగా వెల్లడించారు.Let’s cut through the noise and talk facts, once again: I have never met or known Disha Salian. Linking my name to this tragic case constantly is a deliberate, evidence-free attempt at character assassination by a few individuals with clear political and personal motives, for…— Aaditya Thackeray (@AUThackeray) September 16, 2026 2020 జూన్ 8న 28 ఏళ్ల దిశా సాలియన్, ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఒక ఎత్తైన నివాస భవనం నుండి పడి మరణించింది. పోలీసులు ఈ ఘటనను ప్రమాదవశాత్తు మరణంగా పరిగణించి, యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ఏడీఆర్) నమోదు చేశారు. ఆరు రోజుల తర్వాత, నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించారు.ఈ కేసును సీబీఐ తాజాగా తన చేతులోకి తీసుకుని, హత్య మరియు క్రిమినల్ కుట్ర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.ఇదీ చదవండి: రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే
HYD: ఈ హోటళ్లలో బిర్యానీ తిన్నారా?.. బిగ్ షాక్!
సాక్షి హైదరాబాద్: తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారులు బుధవారం ఎల్బీనగర్ పరిధిలోని హోటళ్లు, ఆహార తయారీ సంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఇందులో 9 సంస్థల్లో ఆహార ఉత్పత్తులు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించి, లైసెన్సులను రద్దు చేశారు. మరో 5 సంస్థలకు పరిస్థితులను మెరుగుపరచుకోవాలని నోటీసులు అందించారు. మొత్తం 20 ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహించగా.. అనుమానాస్పదంగా ఉన్న 20 ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. కొన్ని ప్రముఖ హోటళ్లలో కుళ్లిపోయిన కూరగాయలు, కలుషిత మాంసం, పురుగులు పట్టిన ముడి సరుకులు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. బొద్దింకలు, ఈగలు, ఎలుకల బెడద, అపరిశుభ్రమైన వంటశాలలు, రికార్డుల నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. ఆహార పదార్థాలకు సరైన లేబులింగ్ లేకపోవడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పురుగులు పట్టిన ముడి సరుకులు లభించాయి. ఆహార తయారీదారులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లేదని నిర్ధారించారు. హోటల్ సంగీత్ గ్రాండ్, బహార్ బిర్యానీ కేఫ్, బాలాజీ ఫేని, అండ్ నమ్కిన్, భువనేశ్వరి ఆయిల్ ఇండస్ట్రీ, హోటల్ సింధూర ఈస్ట్ కోర్ట్, కెమెస్ట్రీ బార్ అండ్ కిచెన్ (సురభి గ్రాండ్), న్యూ లిమ్రా హోటల్, ఎన్ విలేజ్ మల్టీక్యూజిన్ రెస్టారెంట్ చంపాపేట్, కినరా గ్రాండ్ రెస్టారెంట్ అండ్ బార్. వనస్థలిపురం సంస్థల లైసెన్సులను రద్దు చేసినట్లు టీజీ సేఫ్ అధికారులు వివరించారు. రామకృష్ణ ఆయిల్ మిల్, గ్రీన్ల్యాండ్ దాబా, కెఫీ కేఫ్, వన్ లాంజ్ బార్ అండ్ కిచెన్లకు లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గెలాక్సీ కేఫ్ అండ్ రెస్టారెంట్, అన్టెరా–నాగోల్, హోటల్ సారథి గ్రాండ్, లక్కీ రెస్టారెంట్–నాగోల్, విజయ రాఘవేంద్ర హోటల్, భగవతి మిస్తాన్ భండార్, ది జాయింట్ అల్ మండీ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదీ చదవండి: KBR Park: ఇక అదే దారి
హోమియోపతితో ఆరోగ్య సమస్యలకు చెక్.. 6 నెలలు ఫ్రీ ట్రీట్మెంట్!
హోమియోపతి అనేది సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక వైద్య విధానం. ఈ రంగంలో భారతదేశంలోని ఉత్తమ హోమియోపతి సంస్థలలో ఒకరిగా గుర్తింపు పొందిన ప్రముఖ హోమియోపతి సంస్థ హోమియోకేర్ ఇంటర్నేషనల్ (Homeocare International).హోమియోకేర్ ఇంటర్నేషనల్హోమియోకేర్ ఇంటర్నేషనల్కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 60కి పైగా బ్రాంచ్లు ఉన్నాయి. కాబట్టి హోమియోపతి చికిత్స కోరుకునే వారు సమీపంలోని క్లినిక్లు ఎంచుకోవచ్చు. ఇక్కడ చికిత్స కోసం వచ్చే వారికి వ్యక్తిగత అవసరాలను బట్టి అధునాతన కానిస్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స ట్రీట్మెంట్ లభిస్తుంది.చికిత్స విధానంకేవలం ఒక వ్యాధికి మాత్రమే కాకుండా.. వ్యక్తి మొత్తం ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చికిత్స అందిస్తారు. అనుభవం ఉన్న హోమియోపతి వైద్యులు రోగి సమస్యలను పరిశీలించి, అవసరానికి అనుగుణంగా ట్రీట్మెంట్ అందిస్తారని సంస్థ చెబుతోంది.ఇకపోతే.. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ నెలలో మీరు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, మీ కుటుంబ సభ్యుడు లేదా ఫ్రెండ్లో ఒకరికి 6 నెలల పాటు ఉచిత ట్రీట్మెంట్ ఇస్తామని హోమియోకేర్ ఇంటర్నేషనల్ చెబుతోంది. ఇక్కడ డయాబెటిస్, కీళ్ల నొప్పులు, స్పాండిలోసిస్, సయాటికా, డిస్క్ సమస్యలు , పైల్స్, IBS, సోరియాసిస్, వేరికోస్ వీన్స్ వంటి అనేక సమస్యలకు ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి.మరిన్ని వివరాల కోసం “హాయ్” అని 92480 90252 నంబర్కు వాట్సాప్ చేయండి.
మలేషియా విమానంలోనే ప్రాణం విడిచిన భారతీయుడు
ముగ్గురు మహిళలు.. రూ.291 కోట్ల సంచలనం..! 40 రోజుల్లోనే..
‘లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు?’
నోటి మాటతో బ్రెయిలీ అక్షరమాల
డేంజర్కే డేంజర్ ఈ బామ్మ!.. ఏం చేసిందో చూడండి
బురదలో బీజేపీ ఎమ్మెల్యే కారు.. ట్రాక్టర్తో బయటకు..
బిగ్బాస్ ఇంట్లో కలకలం.. షాలినీని పట్టుకెళ్లింది ఎవరు?
మైకు చేతిలో ఉందని ఏది పడితే అది మాట్లాడొద్దు!
సీజేపీ సరికొత్త ఉద్యమం.. మోదీ పుట్టినరోజే ఎందుకు?
సాధారణ ఫుడ్ డెలివరీ కాస్తా..ఫ్లైట్లో ఇంటికి వెళ్లేలా..!
‘కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు!
సీఎం కోటాలో నిన్ను ఐఏఎస్ను చేస్తా!
నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: శేఖర్
మమ్మీ! తమ్ముడు నా ప్రోగ్రెస్ రిపోర్టును తన ప్రోగ్రెస్ రిపోర్టు అని ఏపీ సీఎంలా చెప్పి క్రెడిట్ చోరీ చేస్తున్నాడు!!
‘జైహింద్’ అనలేదని ఐపీఎస్ అధికారిణి బదిలీ!
పసిడి ధరలు.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!
సాక్షి కార్టూన్ 17-09-2026
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా
పాప మరణం.. బాధపడుతూ నటి పూర్ణ పోస్ట్
మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్తో పోటీ.. స్పందించిన సంజూ
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
అందుకేనేమో సార్! అక్కడ ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకత వస్తుందనుకుంటా సార్!
అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడు.. ఆ తర్వాత..
బాబర్ ఆజం సంచలన నిర్ణయం!
Daily Horoscope : ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
మోదీని కలిసిన వారం రోజుల్లోనే..
నా సినిమా చూడ్డానికి మా నాన్న ఆసక్తిగా ఉన్నారు: జేసన్ సంజయ్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఆ ఒక్క సినిమా నా కెరీర్నే మార్చేసింది : సూరి
మలేషియా విమానంలోనే ప్రాణం విడిచిన భారతీయుడు
ముగ్గురు మహిళలు.. రూ.291 కోట్ల సంచలనం..! 40 రోజుల్లోనే..
‘లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు?’
నోటి మాటతో బ్రెయిలీ అక్షరమాల
డేంజర్కే డేంజర్ ఈ బామ్మ!.. ఏం చేసిందో చూడండి
బురదలో బీజేపీ ఎమ్మెల్యే కారు.. ట్రాక్టర్తో బయటకు..
బిగ్బాస్ ఇంట్లో కలకలం.. షాలినీని పట్టుకెళ్లింది ఎవరు?
మైకు చేతిలో ఉందని ఏది పడితే అది మాట్లాడొద్దు!
సీజేపీ సరికొత్త ఉద్యమం.. మోదీ పుట్టినరోజే ఎందుకు?
సాధారణ ఫుడ్ డెలివరీ కాస్తా..ఫ్లైట్లో ఇంటికి వెళ్లేలా..!
‘కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు!
సీఎం కోటాలో నిన్ను ఐఏఎస్ను చేస్తా!
నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: శేఖర్
మమ్మీ! తమ్ముడు నా ప్రోగ్రెస్ రిపోర్టును తన ప్రోగ్రెస్ రిపోర్టు అని ఏపీ సీఎంలా చెప్పి క్రెడిట్ చోరీ చేస్తున్నాడు!!
‘జైహింద్’ అనలేదని ఐపీఎస్ అధికారిణి బదిలీ!
పసిడి ధరలు.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!
సాక్షి కార్టూన్ 17-09-2026
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా
పాప మరణం.. బాధపడుతూ నటి పూర్ణ పోస్ట్
మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్తో పోటీ.. స్పందించిన సంజూ
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
అందుకేనేమో సార్! అక్కడ ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకత వస్తుందనుకుంటా సార్!
అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడు.. ఆ తర్వాత..
బాబర్ ఆజం సంచలన నిర్ణయం!
Daily Horoscope : ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
మోదీని కలిసిన వారం రోజుల్లోనే..
నా సినిమా చూడ్డానికి మా నాన్న ఆసక్తిగా ఉన్నారు: జేసన్ సంజయ్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఆ ఒక్క సినిమా నా కెరీర్నే మార్చేసింది : సూరి
ఫొటోలు
అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
సింపుల్ చీర.. స్టైలిష్ లుక్..అనసూయ ఫోటోలు చూశారా?
మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక (ఫొటోలు)
పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)
మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తజనం (ఫోటోలు)
రాజమౌళితో వారణాసి.. 15 ఏళ్లు పట్టిందన్న మహేశ్ బాబు(ఫోటోలు)
సందడిగా సమంత సీమంతం వేడుక (ఫొటోలు)
హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)
'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)
సినిమా
‘బాహుబలి, పుష్పాలకే ప్లాప్ అన్నారు.. తెలుగోళ్లకే ఎందుకిలా ?’
తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్పై సుభాస్కరన్ నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో అక్టోబరు 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సందీప్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: బిగ్బాస్లో ఎగిరిపడ్డ కంటెస్టెట్లు.. ఆడపిల్ల అని కూడా చూడలేదు)‘సంజయ్ను తెలుగు సినిమాకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు నాకు ఎంతో ప్రేమ, గుర్తింపు ఇచ్చారు. సంజయ్ అనుకుంటే ఎవరితోనైనా సినిమా చేయగలరని, కానీ నాతోనే తొలి చిత్రంలో హీరోగా తనను ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉంది. ‘సిగ్మా’ కోసం నన్ను ఎంపిక చేసినప్పుడు తమిళనాడులో ఎలాంటి సందేహాలు వ్యక్తం కాలేదు. కానీ తెలుగులో మాత్రం సందీప్ను ఎందుకు హీరోగా తీసుకున్నారనే ప్రశ్నలు వచ్చాయని సందీప్ తెలిపారు.మనోళ్లను మనమే ఎందుకు తక్కువ చేస్తాం?తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘బాహుబలి’ ఒకటని సందీప్ అన్నారు. అయితే ఆ సినిమా విడుదలైన తొలినాళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనే ప్లాప్ టాక్ వచ్చిందని గుర్తుచేశారు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. ‘మనోళ్లను మనం పెంచుకోవడానికి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం? మన వాళ్లు వేరే ప్రాంతాలకు వెళ్లి గొప్పగా చేస్తుంటే.. ‘తెలుగోళ్లు ఏదో చేయగలరు’ అంటూ ఇతర రాష్ట్రాల వారు మన టాలెంట్ను గుర్తిస్తున్నారు. ఇదే మన తెలుగు గొప్పతనం’ అని సందీప్ కిషన్ పేర్కొన్నారు.కాగా సినిమా విషయానికి వస్తే ‘సిగ్మా’లో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో ‘సిగ్మా’పై తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.
బిగ్బాస్లో ఎగిరిపడ్డ కంటెస్టెంట్లు! ఆడపిల్లని కూడా చూడలేదు..!
బిగ్బాస్10 హౌస్ కెప్టెన్సీ రేస్ మరింత రసవత్తరంగా మారింది. కెప్టెన్గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ మధ్య బిగ్బాస్ కంటెస్టెంట్లకు వరుసగా టాస్క్లు ఇచ్చారు. మొదటి లెవల్లో ‘యానిమల్ పార్క్’ టాస్క్ ఇవ్వగా.. రెండో లెవల్లో ఫిజికల్ ఛాలెంజ్ నిర్వహించారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరింది. ఒక దశలో రోహిత్, వంశీ మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం రండి!యానిమల్ పార్క్.. మొదటి లెవల్లో భాగంగా ‘యానిమల్ పార్క్’ టాస్క్ను బిగ్బాస్ ఇచ్చారు. ఈ గేమ్లో నలుగురు కంటెస్టెంట్లు రెండు జంటలుగా విడిపోయి ఆడాల్సి ఉంటుంది. ప్రతి జంటలో ఒకరు కర్టెన్ వెనుకకు వెళ్లి.. అక్కడ ఇచ్చిన జంతువుల సీక్వెన్స్ ప్రకారం ఒక్కొక్క జంతువులా నటించాలి. మరో కంటెస్టెంట్ రోప్ సహాయంతో కర్టెన్ను లాగుతూ.. తన పార్ట్నర్ ఏ జంతువులా యాక్ట్ చేస్తున్నాడో గుర్తించాలి. సరైన సమాధానం చెబితే పక్కనే ఉన్న ఆయా జంతువుల బ్లాక్స్ను తీసుకుని.. తమ పార్ట్నర్ ఉన్న ఫ్రేమ్లో జంతువులను సరైన సీక్వెన్స్లో అమర్చాలి. అన్ని బ్లాక్స్ను సరైన క్రమంలో అమర్చిన తర్వాత ఫ్రేమ్ వెనుక ఉన్న హ్యాండిల్ను స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు తీసుకెళ్లాలి. చివర్లో ఉన్న కంటెండర్ బోర్డును ఎవరు ముందుగా తీసి చూపిస్తారో.. ఆ జంట విజేతగా నిలుస్తుంది. అయితే కంటెస్టెంట్లు జంతువుల బ్లాక్స్ను ఏ క్రమంలో అమర్చారనేది సరిగ్గా ఉందా? లేదా? అన్నది సంచాలకులు నిర్ణయిస్తారు. ఈ టాస్క్లో గెలిచిన ఇద్దరు కంటెస్టెంట్లు కెప్టెన్సీ రేసులో కొనసాగడంతో పాటు.. ఓడిపోయిన ఇద్దరిలో ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించే అవకాశం కూడా పొందుతారు. ఈ టాస్క్లో సృష్టి, వంశీలను సంచాలకులుగా బిగ్బాస్ నియమించారు.జాన్సీ–ముకేశ్ జోడీ విజయంఈ గేమ్లో జంటలుగా ఎవరు ఆడతారనే ప్రశ్న రావడంతో ముకేశ్–ఝాన్సీ ఒక జోడీగా, శాలిని–అమర్ మరో జోడీగా బరిలోకి దిగారు. టాస్క్లో మొదటి నుంచి ఇద్దరు జంటలు గట్టిగానే పోటీపడ్డారు. చివరికి ఝాన్సీ,ముకేశ్ జోడీ విజయం సాధించింది. దీంతో ఝాన్సీ, ముకేశ్ కెప్టెన్సీ రేసులో కంటెండర్లుగా నిలిచారు. అంతేకాదు.. ఓడిపోయిన జంటలో నుంచి ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించే అవకాశం వారికి లభించింది. దీంతో వారు అమర్ను కెప్టెన్సీ రేసు నుంచి తొలగించారు. (ఇదీ చదవండి: తమన్నా థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్)రెండో లెవల్లో అసలు ఫిజికల్ వార్!ఆ తర్వాత రెండో లెవల్ మొదలైంది. ఈ లెవల్లో ఎలాంటి పోరాటం ఉండాలనేది ప్రేక్షకులు తమ పవర్తో నిర్ణయించారు. మానసిక బలాన్ని పరీక్షించాలా? శారీరక దృఢత్వాన్ని పరీక్షించాలా? అనే ప్రశ్నకు ప్రేక్షకులు శారీరక సామర్థ్యాన్ని పరీక్షించే ఛాలెంజ్కు మొగ్గుచూపారు. దీంతో లెవల్-2లో ఫిజికల్ ఛాలెంజ్ ఉంటుందని బిగ్బాస్ ప్రకటించారు. ఈ టాస్క్కు ‘స్నాచ్ ఇట్.. టీమ్ ఇట్.. త్రో ఇట్’ అనే పేరు పెట్టారు. ఇందులో నలుగురు కంటెస్టెంట్లు రెండు జంటలుగా విడిపోయి పోటీపడాలి. సమయానుసారం బజర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలోకి బ్యాగ్స్ పడుతుంటాయి. ఆ బ్యాగ్లను దక్కించుకునేందుకు రెండు జంటలు పోటీ పడాలి. ఎవరైతే బ్యాగ్ను దక్కించుకుంటారో.. అందులో ఉన్న బాల్స్తో ఫ్రేమ్లో ఏర్పాటు చేసిన డిస్క్లను కొట్టాలి. బజర్ పూర్తయ్యే సమయానికి ఎవరు ఎక్కువ డిస్క్లను పడగొడతారో వారే విజేతలుగా నిలుస్తారని బిగ్బాస్ వివరించారు. ఈ టాస్క్కు వంశీని సంచాలకుడిగా నియమించారు.రోహిత్,దేబ్జానీ వర్సెస్ రాంప్రసాద్,త్రిగుణ్రెండో లెవల్లో దేబ్జానీ ,రోహిత్ ఒక జోడీగా, రాంప్రసాద్, త్రిగుణ్ మరో జోడీగా బరిలోకి దిగారు. గేమ్ మొదలైన వెంటనే ఫిజికల్ ఛాలెంజ్ కావడంతో కంటెస్టెంట్లు తమ పూర్తి శక్తిని ఉపయోగించారు. రాంప్రసాద్–త్రిగుణ్ జోడీ ఒక దశలో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు దేబ్జానీకి ఫిజికల్ టాస్క్ కావడంతో చాలా కష్టంగా మారింది. ఆమె పూర్తిస్థాయిలో రాణించలేకపోవడంతో రోహిత్ దాదాపు ఒంటరిగానే పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. గేమ్లో ఒత్తిడి పెరగడంతో ఒకానొక సమయంలో దేబ్జానీ భావోద్వేగానికి గురైంది. తాను ఆడలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయినప్పటికీ రోహిత్ తన జోడీని గెలిపించేందుకు చివరి వరకు పోరాడాడు. ఒకానోక సందర్భంలో త్రిగుణ్, రాంప్రసాద్లు ఆట తీవ్రస్థాయికి చేరుకోవడంతో గాల్లోకి ఎగిరిపడిపడ్డారు. అలాంటి సన్నివేశాల్లో హౌస్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ టాస్క్లో రాంప్రసాద్, తిగ్రణ్లు విజయం సాధించగా రోహిత్ కెప్టెన్సీ రేసు నుంచి తొలగించారు.(ఇదీ చదవండి: రూ.200 కోట్ల సినిమా.. త్రివిక్రమ్ తప్పుకున్నారా?)రోహిత్,వంశీ మధ్య భారీ గొడవఇదే సమయంలో టాస్క్ నిర్వహణ విషయంలో రోహిత్, సంచాలకుడు వంశీ మధ్య వివాదం మొదలైంది. గేమ్లో జరిగిన అంశంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా మాట్లాడుకోవడంతో పరిస్థితి అదుపు తప్పే స్థాయికి చేరుకుంది. మాటలు తీవ్రం కావడంతో ఇద్దరి మధ్య గొడవ మరింత ముదిరింది. ఒక దశలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లడంతో పరిస్థితి కొట్టుకునే స్థాయికి వెళ్లినట్లు కనిపించింది. ఇలా కెప్టెన్సీ రేసులో భాగంగా ఇచ్చిన రెండో లెవల్ టాస్క్ కేవలం గేమ్గా కాకుండా.. కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. దేబ్జానీ కన్నీళ్లు పెట్టుకోవడం, రోహిత్ ఒంటరిగా పోరాడటం, చివర్లో రోహిత్, వంశీ మధ్య గొడవతో ఈ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఇరుముడి సక్సెస్.. చిన్నారి నక్షత్రకు బిగ్ సర్ప్రైజ్)
వేవేల ఊహలే చూపినా...
టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా తదితరులు నటించిన చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకత్వంలో దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 9న రిలీజ్ కానుంది. ఎలక్ట్రానిక్ కిలి, ఆర్కాడో సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘వేవేల ఊహలే చూపినా..’ అంటూ సాగే సెకండ్ సాంగ్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా, శ్రీ సాగర్ పాడారు. వేణు దోనేపూడి మాట్లాడుతూ– ‘‘వేవేల ఊహలే చూపినా..’ అనే సాంగ్ డిఫరెంట్ స్టైల్లో సాగుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి’’ అన్నారు.
సుబ్బులక్ష్మి అమ్మ సంగీతమే మనకు సందేశం
‘‘సుబ్బులక్ష్మి అమ్మ సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ... ఇలా ఏ భాషలో పాడినా ఆ భాషకే అందం తెచ్చేలా ఆ పాట ఉండేది. తన సంగీతంతో భారతదేశాన్ని, ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసిన సంగీత సామ్రాజ్ఞి. ఆమె సంగీతమే మనకు సందేశం’’ అని కమల్హాసన్ తెలిపారు. సంగీత సామ్రాజ్ఞి, గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ‘భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ పేరుతో వెండితెరపైకి రానుంది. రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అల్లు అరవింద్, రాక్లైన్ వెంకటేష్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. బుధవారం ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను కమల్హాసన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ర ష్మికా మందన్నపై చిత్రీకరించిన సన్నివేశానికి కమల్హాసన్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ– ‘‘మన దేశపు గొప్ప సంగీత సామ్రాజ్ఞి గురించి సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సుబ్బులక్ష్మి అమ్మ జీవితంలోని ఘటనల గురించి తెలిశాక ఈ బయోపిక్ తీయాలని మరింతగా స్ఫూర్తి పొందాం. నాలుగు దక్షిణ భారత భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నాం’’ అని చెప్పారు అల్లు అరవింద్. ‘‘ఈ సినిమా నిర్మించడం నాకు దక్కిన గౌరవం’’ అన్నారు బన్నీ వాస్. ‘‘ఈ సినిమా వెనక ఏడెనిమిదేళ్ల ప్రయత్నం ఉంది’’ అన్నారు రాక్లైన్ వెంకటేశ్. ‘‘నటిగా గొప్ప చాన్స్ దక్కినందుకు కృతజ్ఞతతో మనసు నిండిపో తోంది. అమ్మ జీవిత ప్రయాణంలో చిన్న భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని చెప్పారు రష్మిక. ఈ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు ఎంఎస్ సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్, ఆయన భార్య మణిమాల పాల్గొన్నారు.
క్రీడలు
ఈసారి భారత్లోనే ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ: మూడేళ్ల విరామం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం కార్యక్రమం భారత్లో జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ధ్రువీకరించారు. ‘ప్రతి ఏడాది ఐపీఎల్ వేలం కార్యక్రమం భారత్లోనే నిర్వహించాలని అనుకుంటాం. కానీ పెళ్లిళ్ల సీజన్ కారణంగా వేదిక లభించడం కష్టమవుతోంది. అయితే ఈసారి మాత్రం ఐపీఎల్ వేలం భారత్లోనే ఉంటుంది. ఈసారి మినీ వేలం కావడంతో వేదిక లభిస్తుందనే ఆశిస్తున్నాం’ అని రేపు జరిగే బీసీసీఐ ఏజీఎంలో మరోసారి ఐపీఎల్ చైర్మన్గా ఎన్నిక కానున్న అరుణ్ ధుమాల్ తెలిపారు. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను కొనసాగించాలా వద్దా అనే అంశంపై ఫ్రాంచైజీలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. 2024 ఐపీఎల్ వేలం జిద్దాలో... 2025 ఐపీఎల్ వేలం దుబాయ్లో... 2026 వేలం అబుదాబిలో నిర్వహించారు.
‘వసతి సమస్యే కాదు’
న్యూఢిల్లీ: నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో సత్తా చాటేందుకు భారత అథ్లెట్లు సిద్ధంగా ఉన్నారని ఏషియన్ గేమ్స్ డిప్యూటీ చెఫ్ డి మిషన్, టేబుల్ టెన్నిస్ (టీటీ) దిగ్గజం ఆచంట శరత్ కమల్ వెల్లడించాడు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో... అథ్లెట్ల వసతి కోసం కంటైనర్లను సిద్ధం చేయగా... దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో శరత్ కమల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కంటైనర్ రూమ్లు, క్రూయిజ్షిప్ వసతులకు భారత అథ్లెట్లు సులువుగా అలవాటు పడతారని... వారి ప్రదర్శనపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని ఆశాభావం వ్యక్తం చేశాడు. శనివారం ప్రారంభం కానున్న ఏషియన్ గేమ్స్లో భారత్ నుంచి 501 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వీరితో పాటు 265 మంది అధికారులు కూడా జపాన్కు చేరుకున్నారు. వీరిని షిప్పింగ్ కంటైనర్లు, క్రూయిజ్ షిప్లు, హోటల్స్లో వసతి ఏర్పాటు చేశారు. దీనిపై దక్షిణ కొరియాతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్లోని పలు సభ్య దేశాలు గతంలో అభ్యంతరాలు వ్యక్తంచేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శరత్ కమల్ మాట్లాడుతూ... ‘ఇలాంటి వసతి ఏర్పాట్లతో భారత అథ్లెట్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటి పరిస్థితులకు అలవాటు పడేందుకు అథ్లెట్లకు ప్రత్యేక శిక్షణ సైతం అందించాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన పలు కేంద్రాల్లో కంటైనర్ రూమ్లు ఏర్పాటు చేసి అథ్లెట్లకు అందులో వసతి ఏర్పాటు చేశాం. దీంతో వారు పరిస్థితులకు త్వరగా అలవాటు పడతారు. జపాన్కు వచి్చంది ఏషియన్ గేమ్స్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడానికి. అథ్లెట్ల అందరి లక్ష్యం అదే’ అని వివరించాడు. ఐదు ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన శరత్ కమల్... నాలుగుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొని రెండు పతకాలు గెలిచాడు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో పురుషుల టీమ్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో కాంస్య పతకాలు నెగ్గాడు. గతేడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన శరత్... ప్రస్తుతం క్రీడా పరిపాలన అంశాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నాడు. ‘ఈసారి ఆసియా క్రీడల్లో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు తప్పక పతకాలు గెలుస్తుంది. పురుషుల డబుల్స్ జోడీ మానవ్ ఠక్కర్–మనుశ్ షా... మిక్సడ్ డబుల్స్లో మనుశ్ షా–దియా జోడీలపై భారీ అంచనాలు ఉన్నాయి’ అని శరత్ వివరించాడు. ఏషియన్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ తరఫున ఐదుగురు మహిళా ప్లేయర్లు, ఐదుగురు పురుష ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. ఈ నెల 20 నుంచి 28 వరకు టీటీ పోటీలు జరగనున్నాయి.
చెత్త వేయొద్దు... సంగీతం వినొద్దు... టాటూలు కనిపించొద్దు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఏషియన్ గేమ్స్ జరుగుతుండగా... ఇప్పటికే భారత క్రీడాకారులు క్రీడా వేదికకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జపాన్లో వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై ‘సాయ్’ మన అథ్లెట్లకు అవగాహన కల్పించింది. జపాన్ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంతో పాటు అక్కడ నడుచుకోవాల్సిన తీరును వీడియో ద్వారా అథ్లెట్లకు వివరించింది. జపాన్ వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు... అపరిచిత వ్యక్తులను ఆలింగనం చేసుకోకూడదు... రహదారులపై బిగ్గరగా మాట్లాడకూడదు... లిఫ్ట్లో స్నేహితులతో కలిసి నవ్వకూడదు... ప్రయాణ సమయంలో తోటివారిని ఇబ్బంది పెట్టేవిధంగా సంగీతం వినకూడదని ‘సాయ్’ అథ్లెట్లకు సూచించింది. ‘మీరు కేవలం ఒక అథ్లెట్గా జపాన్లో పర్యటించడం లేదు. మీరు భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలను పాటిస్తూ... స్థానికులను గౌరవిస్తూ ముందుకు సాగండి’ అని ‘సాయ్’ ప్రత్యేక వీడియోలో పేర్కొంది. ఏషియన్ గేమ్స్లో భారత బృందానికి డిప్యూటీ చెఫ్ డి మిషన్గా వ్యవహరిస్తున్న టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ కూడా... జపాన్లో వ్యవహరించాల్సిన తీరుపై అథ్లెట్లకు కొన్ని సూచనలు చేశాడు. ‘జపాన్లో క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. శరీరంపై పెద్ద పెద్ద టాటూలు కనిపించకూడదు. వస్త్రాధారణ కూడా హుందాగా ఉండాలి. రోడ్లపై ఎక్కువ డస్ట్బిన్లు ఉండవు అయినా... చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. డస్ట్బిన్ కనిపించేంత వరకు చెత్తను మీ దగ్గరే పెట్టుకోవాలి. లైంగిక వేధింపుల వంటివైతే ఇక అంతే. అపరిచిత వ్యక్తిని ఏ కారణంతో అయినా తాకకూడదు. ఈ అంశంపై అథ్లెట్లకు తగిన సూచనలు ఇచ్చాం’ అని శరత్ కమల్ వెల్లడించాడు. ఇప్పటికే జపాన్లో వ్యవహరించాల్సిన తీరుపై అథ్లెట్లకు ఒక అంచనా ఏర్పడిందని... అయినప్పటికీ క్రీడల ఆరంభానికి ముందే అథ్లెట్లకు మరిన్ని సూచనలు చేస్తామని శరత్ కమల్ తెలిపాడు. భారత క్రీడాకారులకు మార్గదర్శకాల జాబితా → జపాన్ ప్రజల జీవనశైలిని గౌరవిస్తూ నడుచుకోవాలి. రోడ్లపై చెత్త వేయడం పూర్తిగా నిషిద్ధం. డస్ట్బిన్ కనిపించేంత వరకు చెత్తను తమ వద్దే ఉంచుకోవాలి. అవసరమైతే దానికి తగ్గ ఏర్పాట్లు ముందే చేసుకోవాలి. → బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు శరీరంపై ఉన్న టాటూలు కనిపించకుండా దుస్తులు ధరించాలి. ఏ ప్రదేశంలో అయినా ‘క్యూ’ పద్ధతిని పాటించాలి. ఫోన్ మాట్లాడే సమయంలో స్పీకర్ ఆన్ చేయడం, బిగ్గరగా మాట్లాడటం వంటివి చేయకూడదు. → ప్రజా రవాణ వసతులను వినియోగిస్తున్నప్పుడు పెద్ద శబ్దంతో సంగీతం వినకూడదు. ఇయర్ఫోన్లు తప్పక వాడాలి. → రహదారులపై నడుస్తున్నప్పుడు సైతం హుందాగా ప్రవర్తించాలి. అపరిచిత వ్యక్తులను తాకడం, కౌగిలించుకోవడం వంటివి చేయకూడదు. → స్థల పరిమితి కారణంగా అథ్లెట్ల కోసం ఓడరేవులోని నౌకలు, ప్రత్యేక కంటైనర్లలో వసతి ఏర్పాటు చేశారు. మన అథ్లెట్లు దీనికి అలవాటు పడేందుకు జపాన్ వెళ్లడానికి ముందే బెంగళూరు, పాటియాలా జాతీయ శిక్షణ శిబిరాల్లో అచ్చం ఇలాంటి పరిస్థితుల్లోనే అథ్లెట్లకు బస కల్పించారు. → అన్నీ పోటీలు ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతుండటంతో అథ్లెట్లు వేర్వేరు హోటళ్లలో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు తగ్గట్లే వైద్యులు, ఫిజియోలను బృందాలుగా విభజించారు. → మన అథ్లెట్ల సౌకర్యం కోసం శాఖాహార భోజన వసతి సైతం ఏర్పాటు చేయాలని నిర్వాహకులను భారత ఒలింపిక్ కమిటీ కోరింది. అలాగే క్రీడలు జరిగే సమీప ప్రాంతాల్లోని భారతీయ రెస్టారెంట్ల వివరాలను అథ్లెట్లకు అందించారు.
భారత చెస్ జట్ల శుభారంభం
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): చెస్ ఒలింపియాడ్లో డిఫెండింగ్ చాంపియన్స్గా బరిలోకి దిగిన భారత పురుషుల, మహిళల జట్లు గెలుపు బోణీ కొట్టాయి. బుధవారం మొదలైన ఈ మెగా టోర్నీ తొలి రౌండ్లో భారత మహిళల జట్టు 4–0తో డొమినికన్ రిపబ్లిక్ జట్టును ఓడించింది. బోర్డు–1పై ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి 31 ఎత్తుల్లో ఫ్రాంచెస్కా రమిరెజ్పై... బోర్డు–2పై వైశాలి 31 ఎత్తుల్లో మిగెలినా డెలారోసాపై... బోర్డు–3పై వంతిక అగర్వాల్ 50 ఎత్తుల్లో మేరీ గొంజాలెజ్పై... బోర్డు–4పై సవితాశ్రీ 38 ఎత్తుల్లో కార్లా నునెజ్ దియాపై గెలుపొందారు. మరోవైపు భారత పురుషుల జట్టు 3–1తో థాయ్లాండ్ జట్టుపై విజయం సాధించింది. బోర్డు–1పై తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ 54 ఎత్తుల్లో ప్రిన్ లావోహవిరాపాప్ చేతిలో అనూహ్యంగా ఓడిపోగా... బోర్డు–2పై నిహాల్ సరీన్ 28 ఎత్తుల్లో థానాడోన్ కుల్ప్రథనోన్పై... బోర్డు–3పై దొమ్మరాజు గుకేశ్ 37 ఎత్తుల్లో ఫారిస్ రషీద్పై... బోర్డు–4పై విదిత్ గుజరాతి 30 ఎత్తుల్లో తుఫా ఖుమ్నోరఖెవ్పై గెలిచారు.
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో ‘పోలీసింగ్’... మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
డీఎస్సీ అక్రమాలపై పోరాటం ఉధృతం.. 21న భారీ నిరసనకు YSRCP పిలుపు..
డీఎస్సీ స్కాంకు బాధ్యత వహిస్తారా? లేదా?... చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
ఇదేనా నిష్పాక్షిక, పారదర్శక నియామకం... మెగా డీఎస్సీ వ్యవహారంపై చంద్రబాబు బాధ్యత వహించాలి... వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
ప్రపంచ పరిపాలనకు రూల్స్ మనమే రూపొందించాలి.... బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
బిజినెస్
పసిడి ప్రియులకు తీపి కబురు.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు క్రితం రోజున స్వల్పంగా పెరిగి నేడు తిరిగి దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
గ్రీన్ మార్క్లో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 23,258 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 68 పాయింట్లు పుంజుకొని 74,398 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.33బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 105.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 5 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.45 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.01 శాతం పడిపోయింది.Today Nifty position 17-09-2026(time: 09:21 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
అడిడాస్లో లేఆఫ్లు.. ఒకే దెబ్బకు సగానికిపైగా..
ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్వేర్ దిగ్గజం అడిడాస్ తమ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా భారత్లో ఉద్యోగ కోతలు చేపట్టింది. హరియాణాలోని గురుగ్రామ్లో ఉన్న కంపెనీ ఇండియా టెక్నాలజీ హబ్లో దాదాపు 350 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేంద్రంలో ఉన్న మొత్తం 700 మంది ఉద్యోగుల్లో దాదాపు 50 శాతం మందిపై ఈ లేఆఫ్ల ప్రభావం పడింది.ఇటీవల నిర్వహించిన టౌన్హాల్ సమావేశంలో యాజమాన్యం ఈ నిర్ణయాన్ని ఉద్యోగులకు అధికారికంగా వెల్లడించింది. తొలగింపునకు గురైన వారిలో ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజినీర్లు ఉన్నారు. బాధితులను రెండు విభాగాలుగా వర్గీకరించారు. మొదటి గ్రూప్ ఉద్యోగులకు వెంటనే ఎగ్జిట్ లెటర్లు అందజేయగా, రెండో గ్రూప్నకు డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. ఈ సమయంలో వారు ఇతర హబ్ల్లోని సహచరులకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్(కేటీ) పూర్తి చేయాల్సి ఉంటుంది.సంస్థాగత మార్పులు.. యాజమాన్యం స్పందనఈ నిర్ణయాన్ని అడిడాస్ అధికారిక ప్రకటన ద్వారా ధ్రువీకరించింది. ‘మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆపరేటింగ్ మోడల్ను పునర్నిర్మించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’ అని పేర్కొంది. వ్యాపార నిర్వహణను మరింత సరళతరం చేయడంతో పాటు క్లిష్టమైన సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికే ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది. అదే సమయంలో, భారత మార్కెట్ తమకు ఎంతో వ్యూహాత్మకంగా కీలకమైనదని, ఇక్కడి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆవిష్కరణలలో టెక్ హబ్ పాత్ర కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. బాధితులకు తగిన పరిపరిహారంతో పాటు కెరీర్ ట్రాన్సిషన్ సాయం అందిస్తామని ప్రకటించింది.ఇదీ చదవండి: బోరుమని ఏడ్చేసిన నిర్మలా సీతారామన్
పాటపాడుతూ నిర్మలా సీతారామన్ భావోద్వేగం
కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి ఎనలేని ప్రతిభను, ఆమె సమాజానికి అందించిన అసమాన సేవలను స్మరించుకుంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భావోద్వేగానికి గురయ్యారు. సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె సంగీత ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, తాను భారతీయ సంస్కృతికి సాధికార రూపమని కొనియాడారు.సంగీత సాధన.. భక్తి తత్త్వంఎంఎస్ సుబ్బులక్ష్మి గాత్రంలో వెల్లివిరిసే భక్తిరసం, శ్రోతలను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుందని కేంద్ర మంత్రి గుర్తుచేసుకున్నారు. వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామం, భజనల ద్వారా ప్రతి ఇంటా ఆమె స్వరం చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సుబ్బులక్ష్మి కేవలం ఒక గాయని మాత్రమే కాదని, భారతీయ మూలాలను ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి అని వ్యాఖ్యానించారు.VIDEO | Karnataka: Union Minister Nirmala Sitharaman gets emotional as she remembers legendary singer MS Subbulakshmi at an event in Bengaluru to mark her 110th birth anniversary. pic.twitter.com/bRtr565lXz— Press Trust of India (@PTI_News) September 16, 2026సామాజిక సేవకు సంగీతమే ఆయుధంతమ సంగీత కచేరీల ద్వారా వచ్చిన ఆదాయంలో అత్యధిక భాగాన్ని వివిధ సామాజిక కార్యక్రమాలకు, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందించిన ఎంఎస్ సుబ్బులక్ష్మి ఉదారతను మంత్రి ప్రత్యేకంగా గుర్తు చేశారు. గాంధీజీతో ఆమెకున్న అనుబంధాన్ని, ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రతిధ్వనించిన ఆమె గాత్రం దేశానికి తెచ్చిన ఖ్యాతిని గుర్తు చేస్తూ నిర్మలా సీతారామన్ కంటతడి పెట్టారు. కళ అనేది మానవతా దృక్పథాన్ని, సమాజ సంక్షేమాన్ని పెంచేదిగా ఉండాలనడానికి ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితమే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఆమె చూపిన బాట నేటి తరం కళాకారులకు, యువతకు నిరంతర ప్రేరణ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: పసిడి ధరలు.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!
ఫ్యామిలీ
గాఢంగా నిద్రపోతే... 3.76 లక్షలు!
నిద్రపోతూ కూడా బహుమతులు సాధించవచ్చా? ‘యస్’ అంటోంది జపాన్లో జరిగే స్లీప్ టోర్నమెంట్. టోక్యోకు చెందిన ఒక మ్యాట్రస్ కంపెనీ స్లీప్ టోర్నమెంట్స్ నిర్వహిస్తుంటుంది. ఈ పోటీలో బాగా నిద్రపోయిన వ్యక్తి మన కరెన్సీలో చెప్పాలంటే 13.76 లక్షలు గెలుచుకోవచ్చు. ఈ టోర్నమెంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. పోటీదారులు 90 నిమిషాల వ్యవధిలో గాఢమైన, నాణ్యమైన నిద్రలోకి జారుకున్నామని నిరూపించుకోవాలి. ఈ టోర్నమెంట్లో పోటీదారుల నిద్రను ట్రాక్ చేసే పరికరాన్ని ఉపయోగిస్తారు. స్లీప్ టోర్నమెంట్లో పాల్గొనడానికి ముందు పోటీదారులు కొన్ని వ్యాయామాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా రాత్రంతా మేల్కొవడం లేదా నిద్రమాత్రలు వేసుకుని తీవ్రమైన నిద్రలేమితో టోర్నమెంట్లో పాల్గొనడాన్ని నిషేధించారు. ఈ టోర్నమెంట్ వచ్చే నెల మొదటి వారంలో టోక్యోలోని షేర్ గ్రీన్ మినామీలో జరగనుంది. ఇదీ చదవండి: 132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి మ్యాగజైన్..జరిమానా ఏకంగా రూ. 11 లక్షలు!
ఒక్క క్షణం ఆలస్యమైనా...
రీల్ అద్భుతంగా రావాలి. ప్రత్యేకంగా కనిపించాలి. లక్షల వ్యూస్ కావాలి. అంతే అనుకున్నదేమో ఒక తల్లి. రీల్స్ మాయలో తన వెంట బిడ్డ ఉందనే సంగతిని కూడా మరిచిపోయింది. ఏమీ తెలియని ఆ చిన్నారి ప్రమాదపుటంచుల్లోకి వెళ్లినా పట్టించుకోలేదు. ఆందోళన కలిగించే ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. ఓ మహిళ బ్రిడ్జిపై నిలుచుని రీల్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె వెంట ఉన్న చిన్నారి నెమ్మదిగా వంతెన అంచుల వైపునకు పాకుతూ వెళ్లింది. కానీ ఆ తల్లి కెమెరా వైపు చూస్తూ అదేమీ గమనించలేదు. ఇంతలో అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్పందించి.. పాపను ప్రమాదం నుంచి రక్షించాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ చోటుచేసుకుందనే వివరాలు స్పష్టంగా లేకపోయినప్పటికి .. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనలు, రోడ్లు, నీటి ప్రదేశాలు, ఎతైన ప్రాంతాల దగ్గర పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదని గుర్తుచేస్తున్నారు. రీల్ కొన్ని సెకన్ల పాటే.. కానీ చిన్నారి భద్రత మాత్రం జీవితాంతం ముఖ్యమని సూచిస్తున్నారు.
అంకుర్ నుంచి ఫాల్కే వరకు...
ఆయన కళ్లల్లో ఒక తెలియని తీక్షణత ఉంటుంది... ఆయన నటనలో అతిశయోక్తులు లేని సహజత్వం ఉట్టిపడుతుంది. కమర్షియల్ సినిమాల్లో నవ్వులు పూయించాలన్నా, క్లాసిక్ ఆర్ట్ సినిమాల్లో గుండెల్ని పిండేసే అభినయం పండించాలన్నా అది కేవలం ఆయనకే సాధ్యం. ఆయనే కన్నడ చలనచిత్ర అరుదైన నవరత్నం,భారతీయ సినీ యవనికపై ఐదు దశాబ్దాలుగా వెలుగుతున్న నటుడు అనంత్ నాగ్. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ ప్రకటించడం దక్షిణ భారతానికి దక్కిన మరో సమున్నత గౌరవం.శ్యామ్ బెనగళ్ తెలంగాణ ప్రాంతపు కథతో సినిమా మొదలెట్టాడు. అనంత్ నాగ్, షబానా ఆజ్మీలు ముఖ్యపాత్రలు. దానికి వర్కింగ్ టైటిల్గా ‘సీడ్లింగ్’ (మొలక) అని పేరు పెట్టుకున్నాడు. కాని తీస్తున్నది హిందీలో. మంచి టైటిల్ ఏం పెట్టాలో తోచడం లేదు. సీడ్లింగ్కు సరిపోలిన టైటిల్ చెప్పిన వారికి వెయ్యి రూపాయల నజరానా ప్రకటించాడు. అనంత్ నాగ్ ఆయనతో ఒకరోజు బెరుగ్గానే చెప్పాడు... ‘సార్ సీడ్లింగ్కు సరైన హిందీ మాట అంకుర్’... భారతీయ సినిమాలో ‘అంకుర్’ ఎంత పెద్ద ప్రభావపూరిత సినిమాయో ఆ సినిమాలో నటించిన అనంత్ నాగ్ కాలక్రమంలో అంతే ప్రభావపూరిత నటుడిగా అవతరించాడు. నట మహావృక్షమై దాదాసాహెబ్ ఫాల్కే వరకూ ఎదిగాడు. అనంత్ నాగ్కు మొదటి నుంచి పాత్రే ముఖ్యం. ‘అంకుర్’లో లీడ్ రోల్లో నటించిన అనంత్ నాగ్ ఆ వెంటనే ‘నిశాంత్’కు వచ్చేసరికి పనికిమాలిన పోరంబోకు పాత్రలో కనిపిస్తాడు. భూస్వామి కొడుకుగా అకృత్యాలు చేసే పాత్ర అది. ఆ తర్వాత బెనగళ్ తీసిన ‘మంథన్’లో గ్రామీణ అమ్మాయిని వల్లో వేసుకునే పాత్ర. ఇవన్నీ అందరూ అంగీకరించేవి కావు. 1978లో శ్యామ్ బెనగళ్ తీసిన ‘అనుగ్రహం’లో వాణిశ్రీ భర్తగా దారీ తెన్నూ లేని పాత్రలో నటించాడు. ఆ సమయంలోనే కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమలేఖలు’లో విలన్గా నటించాడు. ‘ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి’... జయసుధతో డ్యూయెట్ పాడాడు. అనంత్ నాగ్, గిరీష్ కర్నాడ్ ఇద్దరూ ఒకే సాంస్కృతిక మూలాల నుంచి వచ్చారు. అనంత్ నాగ్ మొదటి కన్నడ నాటకం గిరీష్ కర్నాడ్ రాసిన క్లాసిక్ ‘యయాతి’. ముంబైలో ఈ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు యయాతికి తన యవ్వనం ఇచ్చి వృద్ధుడిగా మారే కొడుకు పాత్రలో అనంత్ నాగ్ అద్భుతంగా నటించాడు. ఆ నటనను చూసి ముగ్ధుడైన గిరీష్ కర్నాడ్, ప్రముఖ దర్శకుడు జి.వి. అయ్యర్కు సిఫార్సు చేస్తే అనంత్ నాగ్కు లభించిన మొదటి కన్నడ సినిమా ‘సంకల్ప’ (1973). హిందీలో ఎంత బిజీగా ఉన్నా అనంత్ నాగ్ తన మాతృ పరిశ్రమ శాండల్వుడ్ను వదల్లేదు. వైవిధ్యమైన పాత్రలతో ఐదుసార్లు కర్ణాటక రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డును, ఆరుసార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకోవడం కన్నడ సినిమాపై ఆయనకున్న అపారమైన ప్రభావానికి నిదర్శనం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అద్భుత నటిగా పేరు తెచ్చుకున్న లక్ష్మి (‘మిథునం’ ఫేమ్), అనంత్ నాగ్ల కాంబినేషన్ సౌత్ సినిమాలోనే అత్యంత విజయవంతమైన జోడీగా నిలిచింది. కన్నడలో వీరిద్దరూ కలిసి నటించిన ‘చందనద గొంబె’ వంటి చిత్రాలు బ్లాక్బస్టర్స్ అయ్యాయి. స్క్రీన్ వెలుపల కూడా వీరు మంచి స్నేహితులు. దూరదర్శన్ లో సంచలనం సృష్టించిన ‘మాల్గుడి డేస్’ (1987) క్లాసిక్ సిరీస్ మేకింగ్, ప్రొడక్షన్ పనుల్లో తమ్ముడు శంకర్ నాగ్కు అనంత్ నాగ్ వెన్నెముకగా నిలిచాడు. నేటి తరం ప్రేక్షకులకు ఆయన ‘కెజీఎఫ్ చాప్టర్1’ లోని కథ చెప్పే జర్నలిస్ట్ పాత్రతో పూనకాలు తెప్పించాడు. అలాగే నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ కంపెనీ హెడ్గా, ‘గోధి బన్న సాధారణ మైకట్టు’లో అల్జీమర్స్ పేషెంట్గా చూపిన నట విశ్వరూపం నేటి యూత్ని ఫిదా చేసింది. అనంత్ నాగ్ సమాజం పట్ల అవగాహన ఉన్న మేధావి. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు. జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో కర్ణాటక క్యాబినెట్ మంత్రిగా (బెంగళూరు నగర అభివృద్ధి శాఖ) కూడా ఆయన సేవలందించాడు. వెండితెరపై ఎందరో హీరోయిన్లతో రొమాన్స్ పండించి చాక్లెట్ బాయ్గా పేరు తెచ్చుకున్న అనంత్ నాగ్ది రియల్ లైఫ్లోనూ లవ్ మ్యారేజే. తన సహ నటి గాయత్రిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు అదితి అనే కుమార్తె ఉంది. లైమ్లైట్కు, వెండితెరకు దూరంగా పెరిగిన అదితి పెళ్లి చేసుకుని, భర్త వివేక్తో కలిసి బెంగళూరులోనే సెటిల్ అయ్యారు. ‘సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, అది సమాజానికి అద్దం పట్టే మాధ్యమం’ అని నమ్మిన అతికొద్ది మంది నటుల్లో అనంత్ నాగ్ ఒకరు. 1973లో థియేటర్ ఆర్టిస్ట్గా మొదలైన ఆయన ప్రయాణం, ఇవాళ భారతీయ సినిమా అత్యున్నత శిఖరమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ వద్దకు చేరింది. ఏనాడూ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పర్సనల్ లైఫ్ను ఎంతో హుందాగా నడిపించిన అనంత్ నాగ్ ఎగరేసిన నట బావుటా రాబోయే తరాల నటులకు చుక్కాని. అనంత్ నాగ్ పూర్తి పేరు అనంత్ నాగర్కట్టె. తండ్రి సదానంద్, తల్లి ఆనంది. వీరిది కొంకణ కుటుంబం. అనంత్ నాగ్ బాల్యమంతా సంస్కృత భజనల, భక్తి పాటల మధ్య సాగింది. ఉడుపిలో 7వ తరగతి పూర్తయ్యాక తండ్రి అనంత్ నాగ్ని బాంబేకి చదువుకోవడానికి పంపాడు. అయితే అక్కడి ఇంగ్లిష్ మీడియంతో అనంత్ నాగ్ అవస్థ పడి పదితో చదువు ఆపేశాడు. కొన్నాళ్లు యూనియన్ బ్యాంక్లో టెంపరరీ ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే బాంబేలోని ప్రభాకర్ ముదూర్, వెంకట్రావు తలేగేరి, సత్యదేవ్ దూబె వంటి నాటకరంగ దిగ్గజాలు ఆయన్ను గుర్తించి నాటకాల్లో అవకాశం ఇచ్చారు. అనంత్ నాగ్ వేసిన మొదటి పాత్ర చైతన్య మహాప్రభు పాత్ర. ఆ నాటకం సూపర్ హిట్ అవ్వడంతో దాదాపు 8 ఏళ్ల పాటు కొంకణి, కన్నడ, మరాఠీ, హిందీ నాటకాల్లో స్టేజ్ ఆర్టిస్ట్గా రాటుదేలాడు.– కె
భాష మార్చిన రాత!
ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్... ఈ ముగ్గురు మహానేతలు బ్రిక్స్ సమ్మిట్లో ఒక చోట ఉంటే మధ్యలో నిలుచున్న ‘నాల్గవ వ్యక్తి’ మన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సిద్ధార్థ్ బాబు. ఒకే ఒక్క విదేశీభాషపై పట్టు సాధించి...ఇవాళ గ్లోబల్ లీడర్ల పక్కన దౌత్యం నెరిపే స్థాయికి ఎదిగాడు. విదేశీ భాషలు నేర్చుకుంటే లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చెప్పే సూపర్ సక్సెస్ స్టోరీ ఇది! యువతా... మీకెన్ని భాషలు వచ్చు?‘చైనాను భారతీయులు, భారత్ను చైనీయులు పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. ఈ రెండు వేర్వేరు సంస్కృతుల మధ్య భాషే వారధి. ఆ భాషతోనే మనం సంబంధాలు నెరపగలం’ అంటారు సిద్ధార్థ్ బాబు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఈస్ట్ ఏషియా డివిజన్’లో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న సిద్దార్థ్ బాబు చైనా, జపాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, మంగోలియా తదితర దేశాలతో భారత్కు ఉన్న దౌత్య సంబంధాలను పర్యవేక్షిస్తుంటారు. అంతేకాదు, ఆ రాజ్యాధినేతలు వచ్చినప్పుడు ప్రధానికి అనువాదకునిగా కీలకమైన బాధ్యతను పోషిస్తుంటారు. ఆయన మాండరిన్ ఎక్స్పర్ట్. అందుకే బ్రిక్స్లో చైనా అధ్యక్షునికీ మన ప్రధానికీ మధ్య జరిగే సంభాషణల్లో కీలకంగా మారి ఇవాళ వార్తల్లో నిలిచారు.ఎవరీ సిద్ధార్థ్ బాబు? కేరళకు చెందిన సిద్ధార్థ్ బాబుది మామూలు మధ్యతరగతి కథే. మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఒక ఈ–కామర్స్ కంపెనీలో రెండేళ్లు జాబ్ చేశారు. కానీ సంతృప్తి కలగలేదు. లైఫ్లో పెద్దగా సెటిల్ అవ్వాలనే కసితో సివిల్స్ వైపు అడుగులు వేశారు. 2017లో ఆలిండియా 15వ ర్యాంక్ కొట్టి, ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) ఆప్షన్ ఎంచుకున్నారు. అయితే వృత్తిరీత్యా ఆయన నేర్చుకున్న ‘ఒక్క భాష’ ఆయన కెరీర్ను రాకెట్లా దూసుకెళ్లేలా చేసింది.స్మార్ట్గా కొత్త భాషకొత్త భాష నేర్చుకోవడం కష్టమనే అపోహ వద్దు. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్గా ప్లాన్ చేస్తే కేవలం కొన్ని నెలల్లోనే కొత్త భాషపై పట్టు సాధించవచ్చు. భాషలు నేర్పించే డ్యుయోలింగో లాంటి యాప్స్ అనేకం ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు 15 నిమిషాలు కేటాయించి బేసిక్స్ నేర్చుకోవచ్చు. ఇక నేర్చుకోవాలనుకునే భాషలోని సినిమాలు, వెబ్ సిరీస్లను మొదట సబ్టైటిల్స్తో, ఆ తర్వాత సబ్టైటిల్స్ లేకుండా చూడటం ద్వారా ఉచ్చారణ సులువుగా అర్థమవుతుంది. స్థానిక యూనివర్సిటీలు ఆఫర్ చేసే డిప్లొమా కోర్సుల్లో చేరడం ద్వారా ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ పొందవచ్చు. ‘ఒక మనిషితో అతడికి తెలిసిన భాషలో మాట్లాడితే అది అతడి మెదడుకు చేరుతుంది. అదే అతడి మాతృభాషలో మాట్లాడితే నేరుగా అతడి గుండెకు చేరుతుంది’ అంటాడు నెల్సన్ మండేలా. సిద్ధార్థ్ బాబు సరిగ్గా ఆ పని చేయడం ద్వారా ఎదిగారు. గ్లోబల్ సిటిజన్ గా ఎదగాలనుకునే యువత అదనంగా ఒక అంతర్జాతీయ భాషను నేర్చుకోవడం రెజ్యూమెకి బ్రహ్మాస్త్రాన్ని జోడించడమే. రీల్స్లో టైమ్ వృథా చేయకుండా ఇవాళే ఒక కొత్త భాష నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ‘మాండరిన్’ మంత్రంఐఎఫ్ఎస్ ట్రైనింగ్లో భాగంగా ఒక విదేశీ భాష నేర్చుకోవాలనేది రూల్. చాలామంది ఈజీగా ఉండేవి ఎంచుకుంటే సిద్ధార్థ్ మాత్రం ప్రపంచంలోనే కష్టమైన భాషల్లో ఒకటైన చైనీస్ ‘మాండరిన్’ ఎంచుకున్నారు. ‘చైనాను అర్థం చేసుకోవాలంటే ఆ దేశ భాష నేర్చుకోవడమే దారి’ అని గ్రహించి ఆ దారిలో వెళ్లారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయంలో నాలుగేళ్లపాటు (2018–2022) పని చేస్తూ చైనా చరిత్ర, సంస్కృతి, రాజకీయాలపై లోతైన అధ్యయనం చేశారు. అయితే ఆయన అక్కడ ఉన్న కాలంలోనే కోవిడ్ చెలరేగింది. ఆ మృత్యుఘోషలో లాక్డౌన్లో నాలుగు గోడల మధ్య ఆయన మాండరిన్ భాషలో మునిగి పోయి ఆరితేరారు. ఆ తర్వాత అమెరికాలో ట్రాన్స్ లేషన్ అండ్ ఇంటర్ప్రెటేషన్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఇవన్నీ ఆయనను ప్రధానికి వెన్నెముకగా మార్చాయి. రిపబ్లిక్ డే పరేడ్స్ నుంచి బ్రిక్స్ సమ్మిట్ వరకు... మోదీ వెనుక నీడలా ఉంటూ దేశ దౌత్యవిధానంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం ఒక భాషపై కమాండ్తో దేశ భవిష్యత్తును డిసైడ్ చేసే స్థాయికి చేరాడాయన. ‘అయితే ఈ పని అంత సులువు కాదు. నేతలు మాట్లాడే సమయంలో వాటి గాంభీర్యం, లోతు తెలుసుకుని మనం అనువాదం చేయాల్సి వస్తుంది’ అంటారు సిద్ధార్థ్ బాబు.గ్లోబల్ కెరీర్కు భాష కీలకంమార్కులు, ర్యాంకుల పిచ్చిలో ఉన్న మన విద్యార్థులు, తల్లిదండ్రులు విదేశీ భాషలు నేర్చడం ఎంత ముఖ్యమో గ్రహించడం లేదు. గ్లోబలైజేషన్ పెరిగాక మాండరిన్, జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్... ఈ ఐదు భాషల్లో ఏదో ఒకటీ లేదా రెండు తెలిసిన వాళ్లకు ఇంటర్నేషనల్ కంపెనీలు, ఎంబసీలు, గ్లోబల్ ఆర్గనైజేషన్లు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నాయి. లక్షల్లో జీతాలు మాత్రమే కాదు, సిద్ధార్థ్ లాగా గ్లోబల్ స్టేజ్ మీద దేశ ప్రతినిధిగా నిలబడే అరుదైన గౌరవమూ దక్కుతుంది.
అంతర్జాతీయం
సౌదీకి కొత్త టెన్షన్.. హౌతీల సంచలన ప్రకటన!
సౌదీ అరేబియాకు వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా సౌదీకి చెందిన ఎఫ్-15నే కూల్చేశామంటూ హౌతీలు చేసిన ప్రకటన ఇప్పుడు పశ్చిమాసియాలో కలకలం రేపుతోంది. యెమెన్ గగనతలంలో సౌదీకి చెందిన అత్యాధునిక యుద్ధవిమానాన్ని స్థానికంగా తయారుచేసిన క్షిపణితో నేలకూల్చినట్లు ప్రకటించింది. విమానం కూలుతున్న దృశ్యాలంటూ వీడియోను కూడా విడుదల చేసింది. ఇప్పటికే సౌదీపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తున్న హౌతీలు.. ఇప్పుడు యుద్ధవిమానాన్నే కూల్చినట్లు చెప్పడం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. అయితే ఈ ప్రకటనను సౌదీ ధృవీకరించలేదు.గత వారం రోజుల్లో యెమెన్ వ్యాప్తంగా సౌదీ అరేబియా 450కిపైగా వైమానిక దాడులు జరిపిందని హౌతీలు ఆరోపించారు. ఖమీస్ ముషైత్, తాయిఫ్ వైమానిక స్థావరాల నుంచి ఎఫ్-15, టైఫూన్ యుద్ధవిమానాలతో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. తైజ్, లహిజ్, అల్-జౌఫ్, హజ్జా, మారిబ్, సాదా, అల్-బైదా ప్రావిన్సుల్లో దాడులు జరిగాయని, పౌరులు మరణించడంతోపాటు పలువురు గాయపడ్డారని హౌతీలు వెల్లడించారు. ఈ దాడులకు ప్రతిగా మారిబ్ గగనతలంలోకి వచ్చిన సౌదీ యుద్ధ విమానాలపై తమ దళాలు క్షిపణులతో దాడి చేశాయని పేర్కొన్నారు. కూలిన విమానం శకలాల కోసం గాలిస్తున్న సౌదీ యుద్ధ విమానాలను కూడా లక్ష్యంగా చేసుకుని వెనక్కి వెళ్లేలా చేశామని హౌతీ వర్గాలు ప్రకటించాయి.మరో సౌదీ డ్రోన్ కూడా కూల్చివేత?ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చినట్లు ప్రకటించిన కొన్ని గంటలకే.. మరో కీలక ప్రకటన చేసింది హౌతీ సైన్యం. మారిబ్ ప్రాంతంలో సౌదీకి చెందిన వింగ్ లూంగ్-2 సాయుధ నిఘా డ్రోన్ను కూల్చివేసినట్లు వెల్లడించింది. తమపై దాడులకు పాల్పడుతున్న సమయంలోనే దానిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.مشاهد نوعية لإسقاط طائرة مقاتلة سعودية من نوع F15 وحطامها في محافظة مأرب - 16 سبتمبر 2026م https://t.co/rk0suliePT— الإعلام الحربي اليمني (@MMY1444) September 16, 2026మరోవైపు.. సౌదీ, హౌతీల మధ్య ఘర్షణలు మక్కా సమీపానికి చేరడం కూడా ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మక్కాకు దక్షిణంగా ఓ హౌతీ డ్రోన్ను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ ప్రకటించింది. అది నగర నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే కూల్చివేసినట్లు తెలిపింది. పవిత్ర నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడం ‘రెడ్లైన్’ దాటడమేనని రియాద్ హెచ్చరించింది. అయితే మక్కాపై తాము దాడి చేయలేదని హౌతీలు తెలిపారు. ఈ ఘటనను సౌదీ ప్రచారం కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.2015 నుంచి కొనసాగుతున్న పోరుసౌదీ అరేబియా 2015 నుంచి యెమెన్లో హౌతీలకు వ్యతిరేకంగా సైనిక కూటమికి నాయకత్వం వహిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో కాల్పుల విరమణతో ఘర్షణలు కొంత తగ్గినప్పటికీ.. ఈ నెలలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగినట్లు కథనాలు చెబుతున్నాయి. ఎర్ర సముద్ర తీర ప్రాంతాలు, బాబ్ అల్-మండేబ్ జలసంధి పరిసరాల్లోనూ హౌతీలు తమ సైనిక కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఎఫ్-15ను కూల్చినట్లు చేసిన ప్రకటన తమ వైమానిక రక్షణ సామర్థ్యం పెరిగిందనడానికి నిదర్శనమని హౌతీ నేతలు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి: భారత యుద్ధనౌకను ఢీకొట్టిన పాక్ నౌక
భారత్లో జిన్పింగ్కు స్ట్రోక్?.. మోదీ విందుకు దూరం?
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆరోగ్యంపై తాజాగా షాకింగ్ ప్రచారం మొదలైంది. భారత్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆయన అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారని, ఆ తర్వాత తీవ్ర ఇస్కీమిక్ స్ట్రోక్ (మెదడుకు రక్తప్రసరణ తగ్గడం వల్ల వచ్చే పక్షవాతం) బారినపడ్డారని చైనా డెమోక్రసీ పార్టీ ఛైర్మన్ వాంజున్ షీ ఆరోపించారు. అయితే ఈ ప్రచారంపై చైనా, భారత్ ప్రభుత్వాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.బ్రిక్స్ విందుకు దూరం.. ఏడేళ్ల తర్వాత తొలిసారి భారత్లో పర్యటించిన జిన్పింగ్.. సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలోనూ పాల్గొన్నారు. అయితే మోదీ భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు మాత్రం ఆయన హాజరుకాలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలువురు నేతలు విందులో పాల్గొనగా.. చైనా తరఫున విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రాతినిధ్యం వహించారు.సుదీర్ఘమైన కార్యక్రమాల తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి జిన్పింగ్ హోటల్కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే విందుకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నారనే దానిపై అధికారిక వివరణ రాలేదు. ఇదే సమయంలో బ్రిక్స్ సదస్సులో మోదీ ప్రసంగం సందర్భంగా జరిగిన ఓ చిన్న సంభాషణకు సంబంధించిన వీడియో కూడా చర్చకు వచ్చింది. మోదీ.. చైనా ప్రతినిధి బృందం వైపు తిరిగి ఇట్స్ ఓకేనా? అని అడగడం, జిన్పింగ్ స్పందించినట్లు కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది.ఆసుపత్రిలో అత్యవసర చికిత్స?చైనా డెమోక్రసీ పార్టీ ఛైర్మన్ వాంజున్ షీ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ జిన్పింగ్ ఆరోగ్యంపై పలు ఆరోపణలు చేశారు. బ్రిక్స్ సదస్సులో ఆయన స్పృహ కోల్పోయారని, వెంటనే వైద్య బృందం అత్యవసర చికిత్స అందించిందని పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో బీజింగ్కు తరలించారని ఆరోపించారు. భారత్లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే తన ఆరోగ్య పరిస్థితి భారత అధికారులకు తెలిసిపోతుందనే భయంతో జిన్పింగ్ నిరాకరించారని కూడా షీ పేర్కొన్నారు. బీజింగ్కు చేరుకున్న వెంటనే ఆయనను సైనిక హెలికాప్టర్లో 301 ఆసుపత్రికి తరలించినట్లు ఆరోపించారు.అక్కడి వైద్యులు జిన్పింగ్కు తీవ్ర ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చినట్లు గుర్తించారని, విమాన ప్రయాణం కారణంగా అత్యవసర చికిత్సకు కీలకమైన సమయం కోల్పోయారని షీ తన పోస్టుల్లో పేర్కొన్నారు. విమానంలో శస్త్రచికిత్స సాధ్యం కాకపోవడంతో ప్రాథమిక చికిత్స మాత్రమే అందించగలిగారని ఆరోపించారు. జిన్పింగ్కు 301 ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆయనను ఐసీయూలో పర్యవేక్షిస్తున్నారని వాంజున్ షీ మరో పోస్టులో పేర్కొన్నారు. ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి ఇంకా బయటపడలేదని ప్రచారం చేశారు. అంతేకాకుండా చైనా సైనిక కమాండ్లు, గ్రూప్ ఆర్మీలు అప్రమత్త స్థితికి చేరుకున్నాయని, దేశంలో పరిణామాలను పర్యవేక్షిస్తున్నాయని కూడా ఆరోపించారు.ఎవరీ వాంజున్ షీ?జిన్పింగ్ ఆరోగ్యంపై ఆరోపణలు చేసిన వాంజున్ షీ.. చైనా డెమోక్రసీ పార్టీ (సీడీపీ) ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థను డెమోక్రసీ పార్టీ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. 1998లో చైనాలో ఏర్పాటైన ఈ రాజకీయ సంస్థను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం నిషేధించింది. బహుళపార్టీ ప్రజాస్వామ్యం, ప్రత్యక్ష ఎన్నికలు, అధికారాల విభజన, భావప్రకటనా స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన వంటి అంశాల కోసం ఈ సంస్థ పనిచేస్తున్నట్లు ప్రకటించుకుంది. పార్టీ ఏర్పాటులో భాగమైన పలువురు ప్రజాస్వామ్య కార్యకర్తలను చైనా అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపినట్లు మానవ హక్కుల సంస్థలు గతంలో నివేదించాయి. ప్రస్తుతం ఈ సంస్థ చైనా వెలుపల కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
అయిపాయె.. ఇక భారత్, చైనాకు బిగ్ టెన్షన్!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాపై కఠిన ఆంక్షలు విధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో రష్యా చమురు, గ్యాస్ను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కల్పించారు. ఇందులో భాగంగా 100 శాతం వరకు టారిఫ్లు విధించే అవకాశం ఉండటం భారత్, చైనాలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లుకు అనుకూలంగా 262 ఓట్లు, వ్యతిరేకంగా 159 ఓట్లు వచ్చాయి. ఇప్పటికే గత నెలలో సెనెట్ 86–11 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించింది. దీంతో ఇప్పుడు బిల్లు ట్రంప్ వద్దకు వెళ్లనుంది. తాను బిల్లుపై సంతకం చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.రష్యాపై మరింత ఒత్తిడి‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’గా పిలుస్తున్న ఈ చట్టం రష్యా ఇంధన, రక్షణ రంగాలపై కఠిన ఆంక్షలకు మార్గం సుగమం చేయనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర కీలక అధికారులపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలు తీసుకునే వీలు కల్పిస్తోంది. ఇరాన్కు సంబంధించిన అదనపు ఆంక్షలకు కూడా బిల్లులో అవకాశం ఉంది.అంతేకాకుండా రష్యాతో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలపై కూడా చర్యలకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా రష్యా చమురు, గ్యాస్ను కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 100 శాతం వరకు టారిఫ్లు విధించే అధికారాన్ని ట్రంప్కు ఇస్తోంది.భారత్, చైనాలే ఎందుకు?ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యా చమురు తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడగా.. భారత్, చైనా సహా పలు దేశాలు రష్యా నుంచి భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై ద్వితీయ టారిఫ్లు విధించే అధికారాన్ని అమెరికా ఉపయోగించవచ్చని బిల్లులో పేర్కొన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో జరిగిన చర్చలో భారత్, చైనాలను ప్రధాన కొనుగోలుదారులుగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే.. బిల్లు ఆమోదమైనంత మాత్రాన భారత్పై 100 శాతం టారిఫ్ తక్షణమే అమల్లోకి రాదు. ఏ క్షణమైనా అలాంటి టారిఫ్ విధించే అధికారం మాత్రమే అధ్యక్షుడికి లభిస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు, ఏ దేశంపై, ఎంత మేరకు అమలు చేయాలన్నది ట్రంప్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.అమెరికా మార్కెట్పై ప్రభావం?భారత్ రష్యా నుంచి భారీగా ముడిచమురు దిగుమతి చేసుకుని, దాన్ని శుద్ధి చేసి దేశీయ అవసరాలకు వినియోగించడంతోపాటు కొన్ని ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తే భారత ఉత్పత్తులపై అమెరికా అదనపు టారిఫ్లు విధించే అవకాశం ఉండటం వాణిజ్య రంగంలో కొత్త అనిశ్చితికి దారితీస్తోంది. అయితే ఇప్పటివరకు భారత్పై కొత్త 100 శాతం టారిఫ్ విధించినట్లు అమెరికా ప్రకటించలేదు.ట్రంప్కు అధికారం ఇవ్వడంపై అభ్యంతరాలుబిల్లుకు కాంగ్రెస్లో విస్తృత మద్దతు లభించినప్పటికీ.. ట్రంప్కు ఇంత విస్తృతమైన టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై డెమొక్రాట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో డెమొక్రాట్ల తరఫున సీనియర్ సభ్యుడైన గ్రెగరీ మీక్స్ ఈ బిల్లును తీవ్రంగా విమర్శించారు. రష్యాపై ఆంక్షలకు తాము మద్దతు ఇస్తున్నప్పటికీ.. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై టారిఫ్లు విధించే అధికారాన్ని ట్రంప్కు విస్తృతంగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డెమొక్రాట్లు తెలిపారు. ఇక సెకండరీ టారిఫ్లకు సంబంధించిన నిబంధనలను తొలగించే ప్రయత్నం చేసినా అది విఫలమైంది.ట్రంప్ నిర్ణయంపైనే ఉత్కంఠరష్యాపై ఒత్తిడి పెంచి ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా పుతిన్ను చర్చల వైపు తీసుకురావడమే ఈ చర్యల లక్ష్యమని బిల్లు మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ స్వయంగా టారిఫ్లు, ఆంక్షలను తన విదేశాంగ విధానంలో కీలక సాధనాలుగా ఉపయోగిస్తున్నారు.ఇప్పుడు ప్రతినిధుల సభ, సెనెట్ ఆమోదం పొందిన బిల్లు ట్రంప్ సంతకానికి వెళ్లనుంది. బిల్లు చట్టంగా మారిన తర్వాత భారత్, చైనా వంటి రష్యా ఇంధన కొనుగోలుదారులపై ట్రంప్ ఈ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారన్నదే అసలు ప్రశ్న. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు, భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: అక్కడ రూల్స్ పాటించకుంటే ఫైన్లు వేసేస్తారు!
‘రెడ్ లైన్’గా మక్కా సిటీ
కైరో: అత్యంత పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేయడానికి హౌతీ మిలిటెంట్లు ప్రయత్నిస్తున్నారని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆరోపించింది. మక్కాను ‘రెడ్ లైన్’గా ప్రకటించింది. నగరం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు హౌతీలు సౌదీ అరేబియాలోని మౌలిక సదుపాయాలను, ఎర్ర సముద్రంలోని నౌకా రవాణాను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బాబ్ ఎల్–మాండేబ్ జలసంధిలో అనేక ద్వీపాలను స్వా«దీనం చేసుకున్నారు. ఇరాన్ సైన్యం హార్మూజ్ జలసంధిలో విదేశీ చమురు రవాణా నౌకలను టార్గెట్ చేసింది. దాంతో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా, యెమెన్ సరిహద్దు నుంచి సుమారు 1,100 కిలోమీటర్ల(680 మైళ్ల) దూరంలో ఉన్న మక్కా వైపు డ్రోన్లను ప్రయోగించినట్లు వచ్చిన ఆరోపణలను హౌతీ రెబెల్స్ ఖండించారు. తాము ఎలాంటి దాడి చేయలేదని పేర్కొన్నారు. అయితే, హౌతీలు ప్రయోగించిన డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా, నాటో సభ్య దేశమైన తుర్కియే, అణ్వస్త్ర శక్తి అయిన పాకిస్తాన్ల మధ్య కుదిరిన కొత్త రక్షణ ఒప్పందానికి ఈ తాజా దాడులు పరీక్షగా మారాయి. హౌతీల దాడులను తిప్పికొట్టాలని కోరుతూ సౌదీ అరేబియా నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన అందలేదని తుర్కియే, పాకిస్తాన్ అధికారులు చెప్పారు. ఈ ఒప్పందం అమలులోకి రాకముందే మూడు దేశాల కూటమిని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తుర్కియే అధికారి ఒకరు వెల్లడించారు. మక్కాపై దాడి యత్నాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. పాక్, సౌదీ అరేబియాలు భుజం భుజం కలిపి నిలుస్తాయని వ్యాఖ్యానించారుర. దాడుల పట్ల ఏ దేశమూ ఉదాసీనంగా ఉండలేదని హౌతీలను పరోక్షంగా హెచ్చరించారు. 57కు పైగా ముస్లిం దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్లామిక్ సహకార సంస్థ కూడా మక్కాపై దాడి ప్రయత్నాన్ని ఖండించింది. బుధవారం రాత్రి సమయంలో యెమెన్లోని మధ్య ప్రాంతమైన మారిబ్పైన సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమికి చెందిన ఎఫ్–15 యుద్ధ విమానాన్ని తాము కూల్చివేసినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. అయితే, అందుకు ఆధారాలు చూపించలేదు. దాడి యత్నం పట్ల భారత్ తీవ్ర ఆందోళన న్యూఢిల్లీ: మక్కాపై డ్రోన్ దాడికి జరిగిన ప్రయత్నం పట్ల భారత్ బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది, పశ్చిమాసియాలో శాంతిని త్వరగా పునరుద్ధరించాలని మరోసారి పిలుపునిచి్చంది. మక్కా సమీపంలో జరిగిన డ్రోన్ దాడి పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై దాడులను, పౌరుల ప్రాణాలకు, మౌలిక సదుపాయాలకు ముప్పు కలిగించే చర్యలను భారత్ ఖండిస్తోందని స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ సాధ్యమైనంత త్వరగా జరగాలని ఉద్ఘాటించారు. మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీ మిలిటెంట్లు ప్రయోగించిన ఒక డ్రోన్ను మంగళవారం సాయంత్రం అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే.
జాతీయం
అల్లునిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం.. తరువాత?
మైన్పురి: ఉత్తరప్రదేశ్లోని మైన్పురిలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు పిల్లల తల్లి తన అల్లుడితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తోందన్న ఆరోపణలు కుటుంబంలో కలకలం రేపాయి. ఖర్గ్జిత్ నగర్లో ఈ ఘటన వెలుగుచూసింది. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పిల్లలు తీవ్రంగా వ్యతిరేకించి గొడవకు దిగారు. చివరకు పోలీసులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఘిరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఆ మహిళకు, కురావలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సోనాయ్ అశోక్పూర్ గ్రామానికి చెందిన ఆమె అల్లుడికి మధ్య సంబంధం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారిద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారని, కలిసి జీవించడంపై కూడా చర్చించుకున్నారని తెలిపారు. ఈ విషయం పిల్లలకు తెలియడంతో వారు తల్లి నిర్ణయాన్ని వ్యతిరేకించారు.గొడవ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు ఖర్గ్జిత్ నగర్కు చేరుకున్నారు. అక్కడున్న వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. మహిళతో పాటు ఆమె అల్లుడిని కూడా పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. వారిద్దరి మధ్య సంబంధం ఏమిటి? కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు.అలీగఢ్లోనూ ఈ తరహా ఘటన2025 ఏప్రిల్లో అలీగఢ్లోని మద్రక్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఓ యువతికి వివాహం జరగాల్సి ఉండగా, ఆమె తల్లి అనిత తన కాబోయే అల్లుడు రాహుల్తో సన్నిహితంగా ఉంటోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారని తెలిపారు. అనంతరం అనిత ఇంటి నుంచి నగదు, నగలు తీసుకుని రాహుల్తో వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. తన ఇష్టప్రకారమే రాహుల్తో వెళ్లానని అనిత పేర్కొన్నది.ఇదీ చదవండి: పురస్కారాల ఎంపిక విధానంపై అనంత్ నాగ్ కీలక వ్యాఖ్యలు
పురస్కారాల ఎంపిక విధానంపై అనంత్ నాగ్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించనుంది. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో సేవలందించిన ఆయనకు భారతీయ సినిమాకు అందించిన విశిష్ట సేవలకు ఈ అత్యున్నత సినీ పురస్కారం ప్రకటించారు. సెప్టెంబరు 22న గుజరాత్లోని కెవాడియాలో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ అవార్డును అందజేయనున్నారు.అవార్డు ప్రకటన అనంతరం పీటీఐతో మాట్లాడిన అనంత్ నాగ్.. సినీ పురస్కారాల ఎంపిక విధానంలో బంధుప్రీతి, పక్షపాతం ఉండేవని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకురావడం ద్వారా ఆ విధానాన్ని మార్చారని పేర్కొన్నారు. తమకు నచ్చిన వ్యక్తి పేరును ప్రజలు సిఫారసు చేయాలని మోదీ కోరడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఈ విధానం ద్వారా అవార్డుల ఎంపిక ప్రక్రియను ప్రజల ముందుకు తీసుకువచ్చారని వివరించారు.దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం తనకు వస్తుందని తాను ఊహించలేదని 79 ఏళ్ల అనంత్ నాగ్ తెలిపారు. ఈ పురస్కారాన్ని తన స్వస్థలమైన కర్ణాటక ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. అవార్డును ప్రకటించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అనంత్ నాగ్ 250కిపైగా చిత్రాల్లో నటించారు. కన్నడతో పాటు హిందీ చిత్రాల్లోనూ గుర్తింపు పొందారు. 1973లో ‘సంకల్ప’తో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ‘అంకుర్’, ‘నిశాంత్’, ‘మంథన్’, ‘భూమిక’, ‘కల్యుగ్’, ‘గెహ్రాయీ’ వంటి చిత్రాల్లో నటించారు. దూరదర్శన్లో ప్రసారమైన ‘మాల్గుడి డేస్’లోనూ కీలక పాత్ర పోషించారు.ఇదీ చదవండి: మోదీ 76వ పుట్టినరోజు: వారణాసిలో భారీ ఎత్తున సంబరాలు
సీఎం ‘రెండో పెళ్లి’పై బిగ్ ట్విస్ట్.. ఛానల్ ఎండీపై ఎఫ్ఐఆర్!
తిరువనంతపురం: కేరళ సీఎం వీడీ సతీశన్ రెండో పెళ్లి చేసుకున్నారంటూ బయటకొచ్చిన పత్రాలు.. ఇప్పుడు ఏకంగా పోలీస్ కేసుకు దారితీశాయి. కాగా, ఆ పత్రాలు నకిలీవని ఆరోపిస్తూ రిపోర్టర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఆంటో అగస్టిన్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేపీసీసీ అధికార ప్రతినిధి రాజు పి. నాయర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. అగస్టిన్ను మొదటి నిందితుడిగా చేర్చగా.. మరో ఇద్దరిని గుర్తు తెలియని నిందితులుగా పేర్కొన్నారు.వివాదం ఎలా మొదలైందంటే.. 2012లో కర్ణాటకలో సతీశన్ మరో వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నట్లు పేర్కొంటున్న కొన్ని పత్రాలతో ఇద్దరు వ్యక్తులు తన కార్యాలయానికి వచ్చారని ఆంటో అగస్టిన్ తెలిపారు. అప్పటికే సతీశన్కు వివాహం జరిగి ఉందని చెబుతూ ఆ పత్రాలను తనకు చూపించారని వెల్లడించారు. అయితే పత్రాలను పరిశీలించిన తర్వాత అవి నకిలీవని తేలడంతో తమ సంస్థ ఆ కథనాన్ని ప్రసారం చేయలేదని అగస్టిన్ చెప్పారు. అయినప్పటికీ ఆ పత్రాలు తన వద్దే ఉన్నాయని ఆయన వెల్లడించారు.ఈ వ్యవహారంపై రాజు పి. నాయర్ పోలీసులను ఆశ్రయించారు. ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దెబ్బతీయడం, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడం కోసం కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. దీంతో కేరళ డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ, నకిలీ పత్రాల వినియోగం, క్రిమినల్ కుట్ర, పరువునష్టం కలిగించే సమాచార ప్రచురణకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు రిపోర్టర్ టీవీపై సిట్ సోదాలుఇదే రోజున రిపోర్టర్ టీవీ, ఆ సంస్థ ప్రమోటర్లకు సంబంధించిన ప్రాంగణాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సోదాలు నిర్వహించడం మరింత చర్చకు దారితీసింది. లియోనెల్ మెస్సీ, అర్జెంటీనా ఫుట్బాల్ జట్టును కేరళకు తీసుకురావాలన్న విఫల ప్రయత్నానికి సంబంధించిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా కొచ్చి, వయనాడ్లోని ఐదు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. కోర్టు జారీ చేసిన సెర్చ్ వారెంట్లతో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.సోదాల సమయంలో జర్నలిస్టులు, ఇతర సిబ్బంది ఉపయోగించే మొబైల్ ఫోన్లను పోలీసులు తీసుకెళ్లారని రిపోర్టర్ టీవీ ఆరోపించింది. అయితే పోలీసులు ఈ వాదనను ఖండించారు. ఎలాంటి ఫోన్లను స్వాధీనం చేసుకోలేదని, దర్యాప్తుకు అవసరమైన పత్రాల కోసమే సోదాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మీడియా స్వేచ్ఛ అంశాన్ని లేవనెత్తాయి. సీఎం సతీశన్ మాత్రం సోదాలు చట్ట ప్రకారమే జరుగుతున్నాయని, ప్రభుత్వం దర్యాప్తులో జోక్యం చేసుకోదని తెలిపారు. ఇలా సీఎం ‘రెండో పెళ్లి’ అంటూ మొదలైన వివాదం.. నకిలీ పత్రాల ఆరోపణలు, పోలీస్ కేసు, టీవీ ఛానల్పై సోదాలతో మరింత ముదిరింది. అసలు ఆ పత్రాలు ఎలా వచ్చాయి? వాటి వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై ఇప్పుడు పోలీసుల దర్యాప్తు సాగుతోంది.ఇదీ చదవండి: అంతరిక్ష యుద్ధానికి మనం సిద్దమా?
జమ్ముకశ్మీర్ ఉధంపూర్లో భారీ ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లో ఉగ్ర కుట్ర భగ్నమైంది. ఉధంపూర్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ (JeM) ఉగ్ర సంస్థకు చెందినవారై ఉండొచ్చని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. సోహన్ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారం అందడంతో చేపట్టిన గాలింపు చర్యలు.. చివరకు భారీ ఎన్కౌంటర్కు దారితీశాయి.ఉధంపూర్లోని సోహన్ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు భారీగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. రాత్రంతా కొనసాగిన ఆపరేషన్ అనంతరం గురువారం తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి. వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.రాష్ట్రీయ రైఫిల్స్, పారా (స్పెషల్ ఫోర్సెస్), జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.ప్రాథమిక సమాచారం మేరకు జైషే మహ్మద్తో సంబంధాలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు, వారి గుర్తింపు కోసం దర్యాప్తు కొనసాగుతోంది.Udhampur, Jammu and Kashmir: Security forces continued their operation in the Majalta area of Udhampur district following reports of suspicious movement in the forested Khubban/Brettal-Sowan belt pic.twitter.com/crzAKvev9h— IANS (@ians_india) September 17, 2026ఇటీవల జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచాయి. సెప్టెంబర్ 5న బుద్గాం జిల్లాలో పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా కమాండర్ యాసిర్ భద్రతా బలగాల కాల్పుల్లో హతమైనట్లు అధికారులు తెలిపారు. ఉధంపూర్లో తాజా ఎన్కౌంటర్ కూడా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా జరిగింది.ఇదీ చదవండి: రెడ్ లైన్గా మక్కా నగరం! ఎందుకో తెలుసా?
ఎన్ఆర్ఐ
భద్రతా కారణాలతో విజయ్ లండన్ కార్యక్రమం రద్దు
తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ కోసం లండన్లో భారీగా తరలివచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. లండన్లోని ప్రముఖ ‘ది షార్డ్’ భవనం వద్ద విజయ్ పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని భద్రతా కారణాలతో అధికారులు రద్దు చేశారు. వందలాది మంది అభిమానులు గంటల తరబడి వేచి చూసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.విజయ్ ప్రస్తుతం తమిళనాడుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో అధికారిక పర్యటనలో భాగంగా యూకేలో ఉన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు మంగళవారం ‘ది షార్డ్’ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పలువురు అభిమానులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి అక్కడే నిరీక్షించారు. అయితే భారీగా జనసమీకరణ జరగడంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.‘అనుమతి రాలేదు.. కార్యక్రమం రద్దు’భద్రతా కారణాలతో కార్యక్రమానికి అవసరమైన అనుమతి లభించలేదని విజయ్ బృందం ప్రకటించింది. లౌడ్స్పీకర్ ద్వారా అభిమానులకు సమాచారం అందిస్తూ.. ప్రజల భద్రత దృష్ట్యా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో విజయ్ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు అభిమానులు గంటల తరబడి ఎదురు చూసినట్లు పీటీఐ తెలిపింది.VIDEO | UK: Vijay fan greeting event in London called off due to 'health and safety' reasons after large number of people gather to see Tamil Nadu CM.Announcement was made by the authorities outside CM Vijay's hotel at the Shard in London on Tuesday.(Full video available on… pic.twitter.com/l4GDVUL6Fk— Press Trust of India (@PTI_News) September 15, 2026తలా-దళపతి.. విమర్శలకు టీవీకే కౌంటర్ఇదిలా ఉండగా.. విజయ్ లండన్ పర్యటనపై డీఎంకే విమర్శలు గుప్పించింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి లండన్ వెళ్లినట్లు చెబుతున్న విజయ్.. తన స్నేహితుడు, నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న కార్ రేసును వీక్షించడంపై డీఎంకే నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. పెట్టుబడుల పర్యటన పేరుతో వెళ్లి రేసు కార్యక్రమానికి హాజరయ్యారని విమర్శించారు. దీనిపై టీవీకే నేతలు స్పందిస్తూ.. విజయ్ అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ అజిత్ను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అంతేకాకుండా అంతర్జాతీయ రేసింగ్లో అజిత్కు ఉన్న గుర్తింపును తమిళనాడు బ్రాండ్ ప్రమోషన్కు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.పెట్టుబడుల కోసం విజయ్ యూకే పర్యటనఇదిలా ఉండగా విజయ్ యూకే పర్యటన ప్రధానంగా తమిళనాడుకు భారీ పెట్టుబడులను తీసుకురావడంపైనే సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో సుమారు రూ.12,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వీటి ద్వారా రాష్ట్రంలో 9,400కు పైగా హై-వాల్యూ ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తమిళనాడును ఆసియాలో అధునాతన తయారీ, సాంకేతిక రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పెట్టుబడుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విజయ్ తన యూకే పర్యటనను ముగించుకుని బుధవారం భారత్కు తిరిగి రానున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: విజయ్పై అనుచిత కామెంట్ల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
పట్టాలపై ప్రియుడితో ఎన్నారై యువతి.. క్షణాల్లో ఘోరం!
న్యూయార్క్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై కూర్చున్న ఓ జంటను రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన మలైకా చిత్రే (24)తో పాటు నేపాలీ-అమెరికన్ నవమ్ కౌల్ (24) ఉన్నారు. బలవన్మరణమా? లేదంటే మత్తులో అక్కడికి చేరారా?.. వీళ్లు పట్టాలపై ఎందుకు కూర్చున్నారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.లోయర్ మన్హాటన్లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సౌత్ వింగ్ వైపు వెళ్తున్న నంబర్ 4 రైలు పట్టాలపై ఉన్న ఇద్దరినీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటన తర్వాత రైలులో ఉన్న సుమారు 100 మంది ప్రయాణికులను బయటకు తరలించారు.ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో..మలైకా చిత్రే న్యూజెర్సీలోని డేటన్కు చెందినవారు. అకాడియా ఫార్మాస్యూటికల్స్లో ఆపరేషన్స్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నారు. నవమ్ కౌల్ సైరేవిల్లేకు చెందినవారు కాగా.. బ్లూమ్బర్గ్లో ఫైనాన్షియల్ డేటా అనలిస్ట్గా పనిచేస్తున్నారు. ఇద్దరూ రట్జర్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులే. దాదాపు ఒకే సమయంలో అక్కడి నుంచి పట్టాలు పొందారు.ఈ విషాదంతో వాళ్ల సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నవమ్ ఎంతో స్నేహపూర్వకంగా, సరదాగా ఉండేవాడని స్నేహితులు గుర్తుచేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు దాదాపు మూడు దశాబ్దాల క్రితం నేపాల్ నుంచి అమెరికాకు వలస వచ్చినట్లు తెలిపారు. మలైకా తెలివైన, చురుకైన విద్యార్థినిగా తమకు తెలుసని ఆమె కుటుంబానికి సమీపంలోని పొరుగువారు చెప్పారు. ఇంత చిన్న వయసులో ఇద్దరూ ఇలా ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.A tragic situation in Manhattan. Recent Rutgers graduates Navam Kaul and Malaika Chitre were killed after being struck by a southbound 4 train at Spring Street around 3:15 a.m. Sunday.Reports say Kaul went onto the tracks first and Chitre climbed down after him, apparently…— Shadab Chow 🇺🇸 (@tonyinmycity97) September 15, 2026వైరల్గా మారిన వీడియో..ఈ ఘటనకు ముందు ఓ వ్యక్తి తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్గా మారింది. అందులో మలైకా, నవమ్ ఇద్దరూ పట్టాలపై ప్రశాంతంగా కూర్చున్నట్లు కనిపిస్తోంది. రైలు వస్తున్న సమయంలోనూ వారు అక్కడే ఉన్నారు. అయితే రైలు డ్రైవర్ మాత్రం.. మలైకా నవమ్ను తన వైపునకు లాగుతున్నట్లు, ఆమె నవ్వుతున్నట్లు కనిపించిందని చెప్పినట్లు సమాచారం.ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. వారిలో ఒకరు ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయి ఉండొచ్చని, ఆమెను కాపాడేందుకు మరొకరు పట్టాలపైకి వెళ్లి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రైలు డ్రైవర్ వారిని గమనించి అత్యవసర బ్రేకులు వేసినా.. అప్పటికే రైలు సమీపంలోకి రావడంతో ఆపడం సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు.మత్తులో ఉన్నారా?ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు మద్యం లేదంటే ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉండి ప్రమాదాన్ని గుర్తించలేకపోయారా? అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే ఆత్మహత్య కోణాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేదని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఆ యాక్సిడెంట్తో స్పాట్లోనే చనిపోయేదాన్ని!
620 కోట్ల కుంభకోణం.. భారత్లో తలదాచుకున్న నిందితుడు!
అమెరికాలో సుమారు రూ. 620 కోట్ల విలువైన భారీ మెడికేర్ కుంభకోణానికి పాల్పడి, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఓ భారతీయ వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్లో తలదాచుకున్నట్లు తెలిసింది. మహమ్మద్ ఖదీర్ ఖాన్ అనే ఈ నిందితుడు నగరంలోనే ఉన్నాడని అమెరికా పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక అధికారులు అతడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.టెక్సాస్లోని రిచర్డ్సన్లో ఖదీర్ ఖాన్ 'అమెరికన్ ప్రీమియర్ ల్యాబ్స్' పేరుతో ఒక జెనెటిక్ టెస్టింగ్ ల్యాబొరేటరీని నిర్వహించేవాడు. 2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబర్ మధ్య కాలంలో, అమెరికా ప్రభుత్వ మెడికేర్ పథకం కింద సుమారు 93 మిలియన్ డాలర్ల విలువైన నకిలీ క్లెయిమ్లను అతడు సృష్టించాడు. వీటి ద్వారా ప్రభుత్వం నుంచి 65 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 620 కోట్లు) అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో తేలింది. వైద్యుల వివరాలు, సంతకాలను ఫోర్జరీ చేసి ఈ భారీ మోసానికి పాల్పడినట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్బీఐ, ఆరోగ్య శాఖల సంయుక్త విచారణలో వెల్లడైంది.ఈ కుంభకోణం బయటపడటంతో అధికారులు ఖాన్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి, అతడిని 'మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్'గా ప్రకటించారు. అయితే, అప్పటికే అతను అమెరికా నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఖాన్ హైదరాబాద్లోనే ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో, శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల జాబితాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరవ్యాప్తంగా గాలిస్తున్నారు.ఇదీ చదవండి: జేడీయూ యూటర్న్.. షాక్లో బీజేపీ!
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో అంతర్జాలంలో గూగుల్ మీట్ ద్వారా 14-Sep-2026 ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొన్నారు. సకల విఘ్నాలు తొలిగి అందరి పై వినాయకుని ఆశీస్సులు ఉండాలని వినాయకుడిని కోరారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ గారు అంతర్జాలం ద్వారా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు మరియు విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు , శివ ప్రసాద్ ఆవుల మరియు కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్ , యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం మరియు సుకేందర్ నీలం మొదలగు వారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అందరి పై శ్రీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియ జేశారు.ఈ వేడుకలకు సహకారం అందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏ వి ఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (కూల్ టైమ్ ఎయిర్కాన్ ఇన్స్టాలేషన్ & సర్వీస్), కామాక్షి సిల్వర్,గోల్డ్ & డైమండ్ , బులియన్ కింగ్ గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
కాల్వలో దూకిన భర్త.. ఉరి వేసుకున్న భార్య
ఖమ్మం జిల్లా: క్షణికావేశంలో నాగార్జునసాగర్ కాల్వలో దూకిన గల్లంతయ్యాడనే విషయం తెలిసి సదరు వ్యక్తి భార్య ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెంలో బుధవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆటో నడుపుతూ జీవనం సాగించే అమ్మపాలెంనకు చెందిన తేజావత్ హరిప్రసాద్కు అన్నవరం గ్రామానికి చెందిన సునీత(28)తో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవలే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగా అప్పులయ్యాయి. దీనికి తోడు వారం రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలుకావడంతో హరిప్రసాద్ బుధవారం ఉదయం బయటకు వెళ్లి తన అన్న రామ్మూర్తికి ఫోన్ చేసి చనిపోతున్నానని, బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. ఇదే సమాచారం సర్పంచ్కు కూడా ఇవ్వగా వారు పోలీసులకు తెలపడంతో ఫోన్ నంబర్ ఆధారంగా వి.వెంకటాయపాలెం సమీపాన ఎన్ఎస్పీ ప్రధాన కాల్వ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి పరిశీలించగా హరిప్రసాద్ ఆటో, చెప్పులు, సెల్ఫోన్ ఉండడంతో ఆయన కాల్వలో దూకాడనే అనుమానంతో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చేపట్టగా రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. కాగా, భర్త కాల్వలో దూకాడని తెలియగానే సునీత ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హరిప్రసాద్ దంపతులు ఇటీవలే ప్రైవేట్ బ్యాంకులో రుణానికి దరఖాస్తు చేసుకోగా విచారణకు వచ్చిన సిబ్బంది ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూశారు. దీంతో సునీత ఉరి వేసుకుని కనిపించగా స్థానికులకు చెప్పడంతో పరిశీలించేసరికి ఆమె మృతి చెందింది. అయితే, సునీత బలవన్మరణంపై ఆమె తరఫు బంధువులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, విచారణలో వివరాలు వెల్లడవుతాయని ఎస్ఐ సూరజ్ తెలిపారు. కాగా, హరిప్రసాద్ కానరాకుండా పోవడం, సునీత ఎందుకు మృతి చెందిందో తెలియక వీరి పిల్లలు మనోహర్, భార్గవి అడుగుతున్న ప్రశ్నలు స్థానికులను కంటతడి పెట్టించాయి.
నాన్నకు మనసెలా వచ్చిందో.. ఊహించని దారుణం!
ఖమ్మం జిల్లా: ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ... ఓ రైతు కలుపు మందు తాగడమేకాక తన కుమారుడు, కుమార్తెకు కూడా తాగించాడు. ఘటనలో తండ్రి, కుమార్తె మృతి చెందగా కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం గ్రామానికి చెందిన పుసులూరి శ్రీనివాస్ (44) స్వగ్రామంలోనే కాక ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గండ్రాయిలో భూమి కౌలుకు తీసుకుని భార్యతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు.ఈక్రమాన భార్య అప్పలనరసింహాపురంలోని ఇంట్లో ఉండగా... సూర్యాపేట జిల్లా కోదాడలోని రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న కుమార్తె లాస్య (14), నేలకొండపల్లి మండలం చెరువుమాధారం ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న కుమారుడు నిఖిల్ (11)ను బుధవారం వారి పాఠశాలలకు వెళ్లి తీసుకొచ్చాడు. ఆపై పిల్లలతో కలిసి గండ్రాయిలో కౌలుకు తీసుకున్న పొలం వద్దకు వెళ్లాడు. తండ్రి ఇచ్చింది విషమని తెలియక... ముందుగా శ్రీనివాస్ థమ్సప్ సీసాలో గడ్డి మందు కలిపినట్లు తెలుస్తుండగా, పొలం వద్ద తొలుత తాను తాగాడు. ఆ తర్వాత లాస్య, నిఖిల్కు కూడా తాగించాడు. తండ్రి ఇచ్చింది విషమని తెలియని ఆ చిన్నారులు సైతం తాగేశారు. ఆపై బంధువులకు ఫోన్ చేసిన శ్రీనివాస్ విషయాన్ని చెప్పి స్విచ్చాఫ్ చేశాడు. దీంతో బంధువులు, గ్రామస్తులు గండ్రాయిలోని పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. చివరకు పోలీసుల సాయం తీసుకుని ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా గుర్తించేసరికి ముగ్గురూ స్పృహ తప్పి కనిపించాడు. ఈ మేరకు శ్రీనివాస్, ఇద్దరు పిల్లలను ఖమ్మం జనరల్ ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ తండ్రి, కుమార్తె లాస్య మృతి చెందారు. ఇక కుమారుడు నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. శ్రీనివాస్కు గ్రామంలో ఉత్తమ రైతుగా పేరుండటమేకాక అందరితో కలివిడిగా ఉండేవాడు. దీంతో ఆయన ఆత్మహత్య మిస్టరీగా మారింది. ఈ ఘటనపై ఏపీలోని చిల్లకల్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
ఇద్దరు పిల్లలు.. చక్కని సంసారం.. విధి రాసిన విషాదాంతం
పెద్దపల్లి: భార్య, భర్త, వారికి ఇద్దరు పిల్లలు.. చింత లేని ఆ చిన్న కుటుంబాన్ని విధిపగబట్టింది. ఆరునెలల్లోనే ఛిద్రం చేసింది. రోడ్డు ప్రమాదంలో భర్త కాలు కోల్పోగా, భార్య క్యాన్సర్తో సోమవారం మృతి చెందింది. వివరాలు.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామానికి చెందిన పడాల సత్యయ్యగౌడ్ – సునీత దంపతులకు అశ్విత, నిషిత్ సంతానం.అశ్విత డిగ్రీ ప్రథమ సంవత్సరం, నిషిత్ ఇంటర్ ఫస్టియర్ చదువుచున్నాడు. సత్తయ్య ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుడు. సునీత గ్రామ బస్టాండ్ సమీపంలో కిరాణం నిర్వహిస్తుండేది. ఈయేడాది ఫిబ్రవరిలో గ్రామశివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్తయ్యగౌడ్ కాలు నుజ్జునుజ్జు అయింది. డాక్టర్లు దానిని తొడవరకు తొలగించారు. మధ్య తరగతి కుటుంబం కావడం, ఇంటి పెద్దదిక్కు మంచానికే పరిమితమైన నేపథ్యంలో కుటుంబ పోషణ భారమైంది. అయినా, ఆరునెలలుగా సునీత కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. నాలుగేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న సునీతకు పరిస్థితి విషమించడంతో ఈనెల 6వ తేదీన వరంగల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి మృతిచెందగా మంగళవారం అంతక్రియలు నిర్వహించారు. మృతురాలి కుమారుడు నిషిత్ తల్లి చితికి నిప్పంటించాడు. ఆచేతానస్థితిలో ఉన్న సత్తయ్యకు ఆసరాగా ఉంటూ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలబడిన సునీత మరణంతో ఆ కుటుంబ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. దాతలు, మానవతావాదులు స్పందించి బాసటగా నిలువాలని గ్రామస్తులు కోరుతున్నారు.
విషాదం, లాడ్జ్లో చాక్లెట్ తిని కుప్పకూలిపోయింది
బెంగళూరు: కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల వర్ష ఒక లాడ్జ్లో అనూహ్యంగా కన్నుమూసిన ఘటన కలకలం రేపింది. అదీ చాక్లెట్ తిన్న తర్వాత కుప్పకూలిపోవడంతో మరింత ఆందోళనకు గురిచేసింది. అదీ బర్త్డే రోజు నాడే అందని తీరాలకు చేరడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హసన్ పోలీస్ సూపరింటెండెంట్ సమాచారం ప్రకారం బెంగళూరు నుంచి సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాసన్కు తన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 11న తన కజిన్స్, స్నేహితురాలితో కలిసి విహారయాత్ర కోసం సకలేష్పూర్లోని లాడ్జ్కు వచ్చింది. అక్కడ స్నానానికి వెళ్లేముందు చాక్లెట్ తిన్నది. తరువాత బాత్రూమ్కు నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది.ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!వర్ష టూర్ గురించి ఆమె తల్లిదండ్రులకు తెలుసని, ఆమె శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు లేవని అధికారులు తెలిపారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి, మరణానికి కారణం తెలుసుకోవడానికి వర్ష మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. వర్ష మరణం ఆకస్మిక ఆరోగ్య సమస్య వల్ల జరిగిందా లేక మరేదైనా అంతర్లీన కారణం ఉందా అనే విషయాలను నిర్ధారించేందుకు పోలీసులు పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. వర్షతో పాటు లాడ్జ్లో ఉన్న ఆమె బంధువును, స్నేహితురాలిని పోలీసులు ప్రశ్నించారు. ఇదీ చదవండి: ‘క్వీన్ ఫిషర్’ యూట్యూబర్ జీవితం విషాదాంతం
వీడియోలు
ఖమ్మంలో విషాదం... తండ్రి నిర్ణయానికి ఇద్దరు చిన్నారులు బలి..
4 ఏళ్లకే షుగర్ వ్యాధి.. కానీ ఇప్పుడు టెన్నిస్ స్టార్ ప్లేయర్
దురంధర్ ని మించిన మూవీ తో వస్తోన్న RGV
తాడిపత్రిలో YSRCP కార్యకర్త విజయ్ ఇంటిపై దాడి
మూడో టీ20లో వైభవ్ శ్రీయస్ క్లారిటీ?
రమానందన లీలలు.. తెలుగు రాష్ట్రాలే కాదు ఉత్తరాదిలో కూడా భారీ స్కాం
IMD Report: ఏపీలో భారీ వర్షాలు..!
అమ్మ అనే పిలుపు కోసం ఎదురుచూస్తున్న సమంత ఎమోషనల్ కామెంట్స్
ఆంధ్రా డీఎస్సీ - అమెరికా FBI..అతి తెలివి సరిహద్దులు దాటింది
FBI ముసుగులో చంద్రబాబు సర్కార్... ఇంటర్నేషనల్ లెవెల్ లో పరువు పాయె
