దళంలోనే వేధింపులు.. నరకం చూశా
ఒకప్పుడు అడవుల్లో తుపాకీ పట్టుకుని తిరిగింది.. మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించింది.. కానీ ఇప్పుడు అదే దళాన్ని వీడి పోలీసుల ఎదుట లొంగిపోయింది. కారణం.. బయటి శత్రువులు కాదు.. సంస్థలోనే ఎదురైన వేధింపులు, అనుభవాలేనని ఆమె చెప్పడం సంచలనంగా మారింది.ఝార్ఖండ్లోని గిరిడీహ్లో మావోయిస్టు పార్టీకి చెందిన మహిళా నేత అనిత కిస్కు అలియాస్ బబితా పోలీసుల ఎదుట లొంగిపోయారు. రూ.25 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు అగ్రనేత అజయ్ మహతో అలియాస్ టైగర్ భార్య అయిన ఆమె.. దళంలో కొనసాగిన సమయంలో ఎదురైన వేధింపులు, గ్రామస్తులపై జరుగుతున్న హింస తనను తీవ్రంగా కలచివేశాయని వెల్లడించారు.భర్త అరెస్ట్ తర్వాతే..అనిత లొంగుబాటు వెనుక ఆమె భర్త అరెస్ట్ కీలక పరిణామంగా మారింది. మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఉన్న అజయ్ మహతోను ఝార్ఖండ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. పారస్నాథ్ ప్రాంతంలో ఏరియా కమాండర్గా పనిచేసిన అజయ్పై హత్యలు, ఐఈడీ పేలుళ్లు, భద్రతా బలగాలపై దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి తీవ్ర కేసులు నమోదయ్యాయి. అతనిపై వివిధ జిల్లాల్లో 240కి పైగా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. భర్త అరెస్ట్ అనంతరం అనిత కూడా హింసాత్మక మార్గాన్ని వీడి సాధారణ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.సాంస్కృతిక కార్యక్రమం నుంచి..బొకారో జిల్లాకు చెందిన అనిత కిస్కు వయసు సుమారు 30 ఏళ్లు. నాలుగో తరగతి వరకు చదువుకున్న ఆమెకు 2009లో ఓ సాంస్కృతిక కార్యక్రమం సందర్భంగా మావోయిస్టు సంస్థతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత క్రమంగా దళంలో చేరిన ఆమె.. 2017లో అడవిలోనే అజయ్ మహతోను వివాహం చేసుకున్నట్లు తెలిపింది. పారస్నాథ్ జోన్, లుగు హిల్స్, జుమ్రా హిల్స్, కోల్హాన్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.Influenced by the #Jharkhand Government’s surrender and rehabilitation policy, Anita Kisku alias Babita Mahato, wife of hardcore #Maoist Ajay Mahato, surrenders before the Giridih Police. Giridih Superintendent of Police Dr. Bimal Kumar informed that Babita, who had been… pic.twitter.com/Q7uinWwKEH— All India Radio News (@airnewsalerts) July 21, 2026“గ్రామాల్లో భయాన్ని సృష్టించాల్సి వచ్చేది”దళంలో ఉన్న సమయంలో తనకు గ్రామాల్లో భయ వాతావరణం సృష్టించడం, లెవీ వసూళ్లు వంటి పనులు అప్పగించారని అనిత వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అయితే కాలం గడిచేకొద్దీ మావోయిస్టు సంస్థలోని అంతర్గత వ్యవహారాలు, సీనియర్ నేతల వ్యవహారశైలి, సాధారణ ప్రజలపై జరుగుతున్న దాడులు తనను కలచివేశాయని ఆమె పేర్కొన్నారు. దీనికి తోడు దళ సభ్యుల నుంచే వేధింపులు ఎదురయ్యాయని చెప్పారు. గ్రామస్తులపై అనవసరంగా హింసకు పాల్పడటం, కార్యకర్తలపై ఒత్తిడి పెరగడం తనలో అసంతృప్తిని పెంచాయని.. చివరకు ఆ జీవితం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.15 కేసుల్లో నిందితురాలుఅనిత కిస్కుపై కూడా పలు తీవ్ర కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్య, దోపిడీ, పేలుడు పదార్థాల చట్టం, యూఏపీఏ, ఆయుధాల చట్టం కింద మొత్తం 15 కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. జార్ఖండ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నయీ దిశా – ఏక్ నయీ పహల్’ పునరావాస పథకం ద్వారా ఆమెను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.మావోయిస్టులకు పోలీసుల పిలుపుఅనిత లొంగుబాటు గిరిడీహ్, బొకారో, కోల్హాన్, సింగ్భూమ్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద ఎదురుదెబ్బ అని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికైనా హింసా మార్గాన్ని వీడి మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని అధికారులు కోరారు.
కూటమిలో తిరుగుబాటు.. యంగెస్ట్ చైర్పర్సన్కు బిగ్ షాక్!
దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్పర్సన్ దియా బినుకి(21) బిగ్ షాక్ తగిలింది. ప్రతిపక్ష ఎల్డీఎఫ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో.. కేవలం ఏడు నెలలకే ఆమె పదవికి ముగింపు పడింది. అయితే ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ సభ్యుల క్రాస్ ఓటింగ్ కారణంగానే ఆమె కుర్చీని వీడాల్సి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేరళ కొట్టాయం జిల్లా పాలా మున్సిపాలిటీలో 26 మంది సభ్యులున్నారు. మున్సిపల్ కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 17 మంది ఓటు వేశారు. దీంతో అవసరమైన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు రావడంతో తీర్మానం ఆమోదం పొందింది. ఈ పరిణామం అధికార యూడీఎఫ్కు భారీ ఎదురుదెబ్బగా మారింది.కాంగ్రెస్ తిరుగుబాటుతోనే.. పాలా మున్సిపాలిటీలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్కు చెందిన నలుగురు కౌన్సిలర్లు పార్టీ విప్ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం దియా ఓటమికి కారణమైంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు బిజు మాథ్యూస్, టోనీ థైపరంబిల్, లిస్సీకుట్టి మాథ్యూ, రాజిత ప్రకాశ్లు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. డిప్యూటీ చైర్పర్సన్ మాయా రాహుల్ కూడా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. తమకు పార్టీ విప్ అందలేదని తిరుగుబాటు కౌన్సిలర్లు చెబుతూ.. స్థానిక ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.ఎవరీ దియా బిను పులిక్కకండం?21 ఏళ్ల దియా బిను పులిక్కకండం దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్పర్సన్గా రికార్డు సృష్టించారు. చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఎకనామిక్స్ చదివిన ఆమె.. ఉన్నత చదువులకు సిద్ధమవుతున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం తన తండ్రి బిను పులిక్కకండం, మేనమామ బిజు పులిక్కకండంతో కలిసి స్వతంత్ర వర్గంగా ఏర్పడ్డారు. ఈ మూడు సభ్యుల బ్లాక్కు యూడీఎఫ్ మద్దతు ఇవ్వడంతో గత డిసెంబర్లో దియా పాలా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు.యూడీఎఫ్కు అధికారం తెచ్చిన కుటుంబ బ్లాక్పాలా మున్సిపాలిటీలో సుదీర్ఘకాలంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న కేరళ కాంగ్రెస్(ఎం)కు వ్యతిరేకంగా బిను పులిక్కకండం రాజకీయంగా ఎదిగారు. స్వతంత్ర వర్గం కీలకంగా మారడంతో యూడీఎఫ్కు మున్సిపల్ పీఠం దక్కింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్, పులిక్కకండం కుటుంబం మధ్య విభేదాలు పెరిగాయి. పలు పాలనా నిర్ణయాలు, రాజకీయ అంశాలపై ఇరు వర్గాల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.వివాదాల తర్వాత అవిశ్వాస తీర్మానండీవైఎఫ్ఐ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం వంటి అంశాలపై కాంగ్రెస్, దియా వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల కాంగ్రెస్ కౌన్సిలర్ బిజు మాథ్యూస్పై దియా ఫిర్యాదు చేయడం కూడా వివాదానికి దారితీసింది. తన కార్యాలయం నుంచి ఖరీదైన వాచ్, కొన్ని అధికారిక ఫైళ్లు కనిపించకుండా పోయాయని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బిజు మాథ్యూస్ ఖండించారు."ప్రజాస్వామ్య తీర్పును గౌరవిస్తున్నా"పదవి కోల్పోయిన అనంతరం దియా బిను స్పందించారు. ప్రజాస్వామ్య తీర్పును గౌరవిస్తున్నానని తెలిపారు. తనపై అవినీతి, నిధుల దుర్వినియోగం, లంచాలు, బంధుప్రీతి లేదా చట్ట ఉల్లంఘన వంటి ఎలాంటి నిరూపిత ఆరోపణలు లేవని చెప్పారు. "నా పదవీకాలంలో పారదర్శకత, చట్టబద్ధత, ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాను. పదవులు తాత్కాలికం.. విలువలు శాశ్వతం" అని దియా పేర్కొన్నారు.పాలా మున్సిపాలిటీ భవిష్యత్పై ఉత్కంఠదియా తొలగింపుతో పాలా మున్సిపాలిటీలో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో తదుపరి పాలనపై ఉత్కంఠ నెలకొంది. అవిశ్వాస తీర్మానంతో యూడీఎఫ్ పాలన ముగియగా.. ఎల్డీఎఫ్ మద్దతుతో కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ఆలయ ఆవరణలో త్రిష-విజయ్ల ఫ్లెక్సీ.. కేసు నమోదు
తమిళనాడులో ఫ్లెక్సీ కలకలం రేగింది. సేలం జిల్లా ఆత్తూర్లో ఏర్పాటు చేసిన ఓ ఆలయ ఉత్సవ బ్యానర్ వివాదానికి దారితీసింది. ఆ బ్యానర్లో ప్రముఖ నటి త్రిషను అమ్మవారి రూపంలో చిత్రించడం, ఆ పైన తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్ ఫొటోను కూడా ‘సిగ్నేచర్ ఫోజు’తో ఉంచడంపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.పెరియా మారియమ్మన్ ఆలయ ఆడి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఫ్లెక్సీలో త్రిష అమ్మవారి గెటప్లో కూర్చున్నట్లు ఉంది. ఆ పైన విజయ్ అసెంబ్లీలో చేసిన సిగ్నేచర్ ఫోజుతో ఉన్నారు. ఆ పక్కనే ఇద్దరు అభిమానుల ఫొటోలు చెరో వైపు ఉన్నాయి. కొందరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినీ నటిని దేవతా రూపంలో చూపించడం సరైంది కాదన్నారు. వివాద నేపథ్యంలో రాత్రికి రాత్రే బ్యానర్ను అక్కడి నుంచి తొలగించారు. ఆ ప్లేస్లో మరొకటి ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే తమ దాకా విషయం రావడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. అనుమతి లేకుండా బ్యానర్ ఏర్పాటు చేయడం, అందునా అభ్యంతరకరంగా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యానర్ ఏర్పాటు చేసిన దుకాణ యజమాని గోకుల్, దానిని అమర్చిన చంద్రుపై చర్యలకు సిద్ధమయ్యారు. వాళ్లిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. విజయ్-త్రిష ఫొటోలపై చర్చఇటీవల తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చల్లో నిలుస్తున్నాయి. ఎన్నికల ముందే వీళ్ల బంధం బయటపడడం, ఎన్నికల విజయంపై విజయ్కు త్రిష అభినందనలు తెలియజేయడం, ప్రమాణస్వీకారం నాడు చేసిన హడావిడి.. పుట్టినరోజు వేడుక జరపడం ఇలా ఉండగానే ఈ నేపథ్యంలో ఆలయ ఉత్సవ బ్యానర్లో ఇద్దరి ఫొటోలు కలిసి కనిపించడం మరోసారి ఆసక్తిని రేపింది. అదే సమయంలో ఆలయ ఉత్సవాల్లో సినీ ప్రముఖుల ఫొటోలను విచ్చలవిడగా వాడడం, అభిమానుల బ్యానర్ సంస్కృతిపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.
ప్రకృతి విపత్తు.. ఒకే కుటుంబాన్ని బలిగొన్న వరద విలయం
ఈశాన్య రాష్ట్రం అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చరైదేవో జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా వరదల కారణంగా మృతుల సంఖ్య 31కు చేరగా, 16 జిల్లాల్లో 5.64 లక్షల మందికిపైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ విషాద ఘటన జూలై 21 సాయంత్రం 7 గంటల సమయంలో చరైదేవో జిల్లా టెంగాపుఖురి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్వా అభయపురి గ్రామంలో జరిగింది. భారీ వర్షాల కారణంగా వరద నీరు ఒక్కసారిగా రోహిణి దువారా ఇంట్లోకి చేరింది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో కుటుంబ సభ్యులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రోహిణి దువారా భార్య తుతుమోని దువారా, కుమార్తె బిదిషా దువారా ఉద్ధృత వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు కుమారులు విద్యుత్ దువారా, బిప్లబ్ దువారా వరద నీటిలోకి దూకినా, వారు కూడా నీటి ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు. దీంతో క్షణాల్లోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కనిపించకుండా పోయారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.Flood situation in Upper Assam has become extremely critical. Main SBI branch in Sonari town is now completely submerged. A large number of valuable documents and electronic systems have been damaged. The Army and the Indian Air Force are alert for rescue and relief operations. pic.twitter.com/aY5hC4nf4h— Nandan Pratim Sharma Bordoloi (@NANDANPRATIM) July 21, 2026ఘటన జరిగిన వెంటనే జిల్లా వరద నియంత్రణ హెల్ప్లైన్కు పలుమార్లు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం చరైదేవో జిల్లా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ నేహా యాదవ్ను సంప్రదించగా, వెంటనే రెస్క్యూ బృందాన్ని పంపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. ఈ జాప్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. చివరకు గ్రామస్థులే స్వచ్ఛందంగా గల్లంతైన నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఇదిలా ఉండగా, అస్సాంలో వరద పరిస్థితి రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతోంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, గత 24 గంటల్లో మరో 21 మంది మృతి చెందారు. దీంతో ఈ ఏడాది వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 31కు చేరింది. దిఖౌ, దిసాంగ్, బ్రహ్మపుత్ర, బుర్హిదిహింగ్, ధన్సిరి నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరద ముప్పు మరింత పెరిగింది. సహాయక చర్యల్లో భారత వైమానిక దళం, జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF), అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొంటున్నారు. వరదల కారణంగా రైల్వే ట్రాక్లు నీటమునిగిపోవడంతో ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో పలు రైళ్ల రాకపోకలు వరుసగా రెండో రోజూ నిలిచిపోయాయి. ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.𝐔𝐏𝐏𝐄𝐑 𝐑𝐀𝐈𝐋𝐖𝐀𝐘 𝐓𝐑𝐀𝐂𝐊 𝐖𝐀𝐒𝐇𝐄𝐃 𝐀𝐖𝐀𝐘 𝐁𝐘 𝐅𝐋𝐎𝐎𝐃𝐒; 𝐃𝐀𝐍𝐆𝐄𝐑𝐎𝐔𝐒 𝐒𝐈𝐓𝐔𝐀𝐓𝐈𝐎𝐍 𝐀𝐓 𝐍𝐀𝐙𝐈𝐑𝐀–𝐒𝐇𝐈𝐌𝐋𝐔𝐆𝐔𝐑𝐈𝐑𝐄𝐏𝐎𝐑𝐓 | 𝐊𝐊 𝐏𝐋𝐔𝐒+ 𝐃𝐈𝐒𝐀𝐒𝐓𝐄𝐑 𝐃𝐄𝐒𝐊𝐒𝐞𝐯𝐞𝐫𝐞 𝐟𝐥𝐨𝐨𝐝𝐢𝐧𝐠 𝐡𝐚𝐬 𝐜𝐚𝐮𝐬𝐞𝐝 𝐞𝐱𝐭𝐞𝐧𝐬𝐢𝐯𝐞… pic.twitter.com/UOyy2z3UX5— 𝐊𝐚𝐢𝐥𝐚𝐬𝐡 𝐁𝐚𝐠𝐚𝐫𝐢𝐚 (@bagaria_kailash) July 20, 2026 ఇదే సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం నుంచి చరైదేవో, నజిరా, శివసాగర్, సోనారి, జోర్హాట్, టియోక్ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు. ప్రజలకు అవసరమైన అన్ని సహాయ చర్యలు వేగంగా అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అయితే చరైదేవోలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతైన ఘటన, సహాయక బృందాల స్పందనలో ఆలస్యమైందన్న ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి.
ట్రాన్స్కో డీఈ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ సోదాలు
దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో వరస విషాదాలు
బాండీ బీచ్ హైదరాబాదీ ‘హీరో’కు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం!
కాసేపట్లో పొగాకు రైతులతో వైఎస్ జగన్ సమావేశం
బెన్ స్టోక్స్ అదిరిపోయే రీఎంట్రీ.. సూపర్ శతకం
రోడ్డు పక్కన సంచి.. నవజాత శిశువును ఉంచి..
పసిడి తగ్గినా.. ‘గోల్డ్ బాండ్ల’ జోరు తగ్గేదేలే..
ఉస్మానియాలో పావలా శ్యామల
సెల్ఫోన్ దుర్వినియోగానికి పాల్పడొద్దు
ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: నవీన్ పట్నాయక్
వారి వల్లే ఓడిపోయాం.. కానీ అతడు మాత్రం అద్భుతం: గిల్
బెంగాల్లోనూ బుల్డోజర్ న్యాయం - టీఎంసీ కార్యాలయం కూల్చివేత
బొడ్డు, నడుము ఫాంటసీ.. చాలా మారింది
ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి
ఒకే కుటుంబానికి 10 జాతీయ అవార్డులు
పార్కింగ్ కోసం జొన్న పంటను జేసీబీతో దున్నేశారు
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
విలేజ్ స్టైల్లో మెగాహీరో మాస్ పాట
నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా
'జన నాయగన్' 50 శాతమే రీమేక్.. వేరే కథ విజయ్కి చెబితే
నా ఓటు ఉంటుందా సార్!
ఐపీఎల్ టూ ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్
ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్
కనీసం వంద వరకూ ‘కృషి’ చేద్దాం సార్!!
ఓటీటీకి లేటేస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆటకు గుడ్బై చెప్పు.. భారత మాజీ క్రికెటర్ ఫైర్
దేశవాళీ టోర్నీ.. సూర్యకుమార్కు మరో అవమానం!
తాత వారసత్వం.. అమెరికాలో మెరిసిన మనవడు కార్తీక్!
నీట్ వివాదంపై మోదీ కీలక వ్యాఖ్యలు
ట్రాన్స్కో డీఈ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ సోదాలు
దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో వరస విషాదాలు
బాండీ బీచ్ హైదరాబాదీ ‘హీరో’కు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం!
కాసేపట్లో పొగాకు రైతులతో వైఎస్ జగన్ సమావేశం
బెన్ స్టోక్స్ అదిరిపోయే రీఎంట్రీ.. సూపర్ శతకం
రోడ్డు పక్కన సంచి.. నవజాత శిశువును ఉంచి..
పసిడి తగ్గినా.. ‘గోల్డ్ బాండ్ల’ జోరు తగ్గేదేలే..
ఉస్మానియాలో పావలా శ్యామల
సెల్ఫోన్ దుర్వినియోగానికి పాల్పడొద్దు
ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: నవీన్ పట్నాయక్
వారి వల్లే ఓడిపోయాం.. కానీ అతడు మాత్రం అద్భుతం: గిల్
బెంగాల్లోనూ బుల్డోజర్ న్యాయం - టీఎంసీ కార్యాలయం కూల్చివేత
బొడ్డు, నడుము ఫాంటసీ.. చాలా మారింది
ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి
ఒకే కుటుంబానికి 10 జాతీయ అవార్డులు
పార్కింగ్ కోసం జొన్న పంటను జేసీబీతో దున్నేశారు
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
విలేజ్ స్టైల్లో మెగాహీరో మాస్ పాట
నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా
'జన నాయగన్' 50 శాతమే రీమేక్.. వేరే కథ విజయ్కి చెబితే
నా ఓటు ఉంటుందా సార్!
ఐపీఎల్ టూ ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్
ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్
కనీసం వంద వరకూ ‘కృషి’ చేద్దాం సార్!!
ఓటీటీకి లేటేస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆటకు గుడ్బై చెప్పు.. భారత మాజీ క్రికెటర్ ఫైర్
దేశవాళీ టోర్నీ.. సూర్యకుమార్కు మరో అవమానం!
తాత వారసత్వం.. అమెరికాలో మెరిసిన మనవడు కార్తీక్!
నీట్ వివాదంపై మోదీ కీలక వ్యాఖ్యలు
ఫొటోలు
చీరలో చందమామలా శ్రీలీల (ఫొటోలు)
డిజైనర్ చీర.. మ్యాచింగ్ జ్యూయెల్లరీలో అనసూయ (ఫొటోలు)
'బలగం' హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో ఫోటోస్ వైరల్
హైదరాబాద్ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)
హీరోయిన్ కంటే అందంగా చెన్నై లవ్ స్టోరీ యాంకర్ చర్మిలా (ఫోటోలు)
చెల్లి సితార, ఫ్రెండ్స్తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)
వైఎస్సార్సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)
విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)
హైదరాబాద్లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
సినిమా
విజేతను కూడా ఓటమి పలకరిస్తుంది
ఎప్పటికప్పుడు తన అనుభవాలను, అభిప్రాయాలను అమితాబ్ బచ్చన్ బ్లాగ్లో షేర్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ పోస్ట్ అభిమానులను కలవరపెట్టింది. ‘‘శస్త్రచికిత్స, ఐసీయూలో నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది సంరక్షణ, ఆ తర్వాత డిశ్చార్జ్, ఇంటికి చేరుకోవడం’’ అంటూ తన బ్లాగ్లో రాసుకొచ్చారు అమితాబ్. ఈ పోస్ట్తో ఆయనకు శస్త్రచికిత్స జరిగిందన్న విషయం స్పష్టమైంది.కానీ అమితాబ్కు ఎందుకు శస్త్రచికిత్స జరిగింది? ఎప్పుడు, ఎక్కడ జరిగింది? అనే విషయాలపై స్పష్టత లేదు. అలాగే ఈ బ్లాగ్ పోస్ట్లోనే భావోద్వేగంగా స్పందించారు అమితాబ్. ‘‘డిశ్చార్జ్ అయి, తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత ఎదురయ్యే సవాళ్లు కఠినమైనవి. శారీరకంగానే కాదు... మానసికంగానూ ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరెంతటి గొప్ప విజేత అయినా ఏదో ఒక రోజు ఓటమి మిమ్మల్ని పలకరిస్తుంది. కొందరు ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటారు... మరికొందరు లొంగిపోతారు. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి’’ అంటూ అమితాబ్ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అమితాబ్ కోలుకోవాలని ఆశిస్తూ సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు షేర్ చేశారు.
సకుటుంబ సపరివార్ సమేత క్రైమ్
ఒకప్పుడు మంచి పనులు చేసేవాడు హీరో... అది కూడా చట్టబద్ధంగా... మరోవైపు చెడ్డ పనులు, అది కూడా చట్ట వ్యతిరేక పనులన్నీ విలన్ ముఠా చేసేది. కుటుంబం అంటే సదరు నేరం వల్ల బాధపడే బాధితులుగా మాత్రమే ఉండేది. రాను రాను పరిస్థితులు పూర్తిగా మారిపోతూ వచ్చాయి. చట్ట వ్యతిరేక పనులు చేసేవాళ్లు హీరోలుగా తెరకెక్కడం ఎప్పటి నుంచో సర్వసాధారణంగా మారిపోగా కుటుంబమే కథలో నేరాల కేంద్రబిందువుగా మారడం ఇప్పుడు సరికొత్త ట్రెండ్. కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా నేరాలు చేయడమో లేదా ఒకరు చేసిన నేరాన్ని దాచిపెట్టడమో వంటి కథాంశాలు సరికొత్త సక్సెస్ సీక్రెట్స్గా అవతరించాయి.ఇంటి ‘దృశ్యం’ మారిపోయింది... ‘కుటుంబం కోసం ఏమైనా చేస్తాం...’ అనే మాటను ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో విన్నాం. కానీ ఇప్పుడు దర్శకులు ఆ మాటకు కొత్త అర్థం చెబుతున్నారు. కుటుంబాన్ని కాపాడటానికి చట్టాన్ని అతిక్రమించడానికైనా, నేరాన్ని దాచిపెట్టడానికైనా, అవసరమైతే పోలీసులనే తప్పుదోవ పట్టించడానికైనా వెనుకాడని కుటుంబాలు ఇప్పుడు వెండితెరపై దర్శనమిస్తున్నాయి. ఈ ధోరణికి మలయాళ సినిమా ‘దృశ్యం’ ఊపు తెచ్చింది అని చెప్పాచ్చు.మోహన్లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాలో ఓ మధ్య తరగతి కుటుంబం తమ కుటుంబ సభ్యులు చేసిన నేరాన్ని ఎలా కప్పి పుచ్చింది? దాని కోసం ఎన్ని రకాల ఎత్తులు పై ఎత్తులు వేసింది? అనేది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ సూపర్హిట్ అవడం, థియేటర్లు కిక్కిరిసిపోవడం, పలు భాషల్లోకి రీమేక్ కావడంతో పాటు వరుస సిరీస్లు రావడం కూడా మనం చూసిందే. అక్కడ నుంచి దర్శక–నిర్మాతలు ప్రస్తుతం అలాంటి కథల్ని హిట్ కాన్సెప్ట్గా చూస్తున్నట్టు ఆ తర్వాత అదే బాటలో వస్తున్న పలు సినిమాలు నిరూపిస్తున్నాయి. ఇల్లే కదా ‘నేర’సీమ... గృహమే కదా స్వర్గసీమ అన్నది ఒకనాటి మాట... ‘ఇల్లే కదా నేరా’ల థీమా అన్నట్టుగా ప్రస్తుతం కథలు రూపొందుతున్నాయి. ఇటీవల తమిళంలో సీనియర్ హీరో అర్జున్ నటించిన ‘బ్లాస్ట్’ కూడా అలాంటి చిత్రమే. ఆ సినిమాలో సాదా సీదాగా బ్రతికే ఓ కరాటే మాస్టర్ కుటుంబం అనుకోకుండా ఓ తీవ్రమైన నేరానికి పాల్పడుతుంది. తమ ఇంటిపై దాడికి వచ్చిన అరడజను మంది గూండాలను కుటుంబ సభ్యులు అంతా కలిసి కట్టుగా హత్య చేస్తారు.అంతేకాకుండా ఆ మృతదేహాలన్నింటినీ ఇంటి ఆవరణలోనే గొయ్యి తవ్వి పాతిపెడతారు. అక్కడ నుంచి తండ్రీ కూతురు కలిసి చేసే పోరాటాలు, ఆ తర్వాత తల్లి కూడా వారితో చేతులు కలపడం, ఆఖరికి మామయ్య కూడా నేను సైతం అంటూ వీరితో కలిసి ఫైట్స్ చేయడం... వంటివి ఫ్యామిలీ బాండింగ్ను మాత్రమే కాదు... సినిమా కధల కొత్త ట్రెండ్ను కూడా పట్టి చూపిస్తాయి. ఈ సినిమా తమిళంలో రిలీజై విజయం సాధించడం, తెలుగు సహా పలు భాషా ప్రేక్షకుల నుంచి ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. ఇంటింటా ఆయుధాలు... ‘‘శత్రువులు ఇంటి మీదకు దాడి చేస్తున్నారు. మన ఇంట్లో ఉన్న ఆయుధాలన్నీ బయటకు తీయండి’’ అంటుంది కోడలు. మన దగ్గరేమున్నాయి ఆయుధాలు? అని ప్రశ్నించిన కుటుంబ సభ్యులకు ‘కత్తి పీట నుంచి కారప్పాడి’ దాకా ఉన్న ఆయుధాల జాబితాను గుర్తు చేసి, వారి చేత బట్టించి యుద్ధం చేయిస్తుంది. ఈ సన్నివేశం ఇటీవలే రిలీజ్ అయిన ‘మా ఇంటి బంగారం’ సినిమాలోనిది. ఈ సినిమాలో కుటుంబం అంతా కలిసి కట్టుగా ఉండడం, కలిసి పండగల నుంచి భోజనాల దాకా చేయడం దాకా ఎంత అందంగా చూపించారో... అవసరమైతే అందరూ కలిసికట్టుగా పోరాటాలు కూడా చేస్తారని కూడా అంతే బలంగా చూపించారు. సమంత హీరోయిన్గా నటించిన ఈ చిత్రం అంచనాలను మించిన విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఇల్లే థ్రిల్లు... థ్రిల్లర్ సినిమా తీయాలంటే ఎక్కడెక్కడికో వెళ్లనక్కరలేదు. ఒక సగటు మనిషి ఇంట్లోకి తొంగి చూస్తే చాలు అన్నట్టుగా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఒక ఇంటి ఆడపడుచును కొన్ని రోజులుగా వేధిస్తున్న ఓ పోకిరి కమ్ రౌడీ హత్యకు గురవుతాడు. విశేషం ఏమిటంటే... ఆ రౌడీ హత్య తమ ఇంట్లోని వాళ్లే చేశారని తల్లి, తండ్రి, ఇద్దరు కూతుర్లున్న ఆ ఇంట్లోని వాళ్లంతా బలంగా నమ్మడం.అయితే ఎవరు చేశారో ఎవరికీ తెలియకపోవడం... అక్కడ నుంచి ఆ ఇంటి సభ్యులందరూ ఒకరిని ఒకరు అనుమానించడం... ఇలా దాదాపుగా ఇంటి చుట్టూ పరిభ్రమించే కథతో రూపొందిన మలయాళ సినిమా ‘పరిమళ అండ్ కో’ కూడా హిట్గా నిలిచింది. ఈ సినిమా ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది. వినోదాన్ని కూడా పంచిన ఈ సినిమాలో సభ్యులందరూ తమ ఇంటి పరిస్థితులను ‘దృశ్యం’ సినిమాకు అన్వయించుకోవడం ఆ సినిమాను పదే పదే ప్రస్తావించడం కూడా కనిపిస్తుంది. ఈ తరహా ట్రెండ్కు హాస్యం కూడా జత చేయవచ్చునని నిరూపించిందీ సినిమా. భావోద్వేగమే బలం ప్రేమికురాలి కోసం లేదా స్నేహితుడి కోసం చేసే నేరాల కథలతో చాలా సినిమాలే వచ్చాయి. అయితే కుటుంబం కోసం చేసే ఉమ్మడి పోరాటం ప్రేక్షకులకు మరింత బలంగా కనెక్ట్ అవుతోంది. ‘మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాం’ అనే భావన ఫ్యామిలీ సెంటిమెంట్స్ను తట్టి లేపుతోంది. తెరమీది పాత్రలతో ప్రేక్షకులు త్వరగా మమేకమవడానికి దోహదం చేస్తోంది. అంతేకాకుండా ఈ కథలు ఒక వ్యక్తి సెంట్రిక్గా నడవడం లేదు. ఒక్క హీరోకో, హీరోయిన్కో మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరికీ ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. అది కూడా ఆకట్టుకునే అంశమే.తండ్రి ప్లాన్ వేస్తే తల్లి సహకరిస్తుంది. పిల్లలు పరిస్థితులకు అనుగుణంగా వాస్తవాలు దాచిపెట్టడం లేదా అబద్ధాలు అడడం వంటి చేతనైన పనులు చేస్తూ తమ వంతు పాత్ర పోషించడం వెరసి ప్రతి పాత్ర కథలో కీలకంగా మారుతోంది. ప్రతీ ప్రేక్షకుడూ ఒక ఇంట్లో ఏదో ఒక పాత్ర పోషించేవాడే కాబట్టి ప్రేక్షకుడికి ‘నా’ అనే అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాల్లో నేరాలు తప్పని సరై మాత్రమే చేసేవి కావడంతో చట్టపరంగా తప్పు చేసినా ‘ఎవరు కరెక్ట్? ఎవరు తప్పు?‘ అనే నైతిక సందిగ్ధత కథను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. కుటుంబం చేసిన పని చట్టపరంగా తప్పు. కానీ వారి పరిస్థితి అర్థం చేసుకున్న ప్రేక్షకుడు వాళ్లవైపే నిలబడతాడు. ఇదే ఈ చిత్రాల విజయ రహస్యం.సస్పెన్స్... సక్సెస్... థ్రిల్లర్ జోనర్లో సినిమాల విజయాలకు దోహదం చేసేది సస్పెన్స్. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని దాచడం కంటే, కుటుంబమంతా కలిసి రహస్యాన్ని కాపాడటం చాలా క్లిష్టం. ఒక్కొక్కరు ఒక్కో రకమైన మైండ్సెట్తో ఉంటారు కాబట్టి చిన్న పొరపాటు జరిగినా మొత్తం ప్లాన్ కూలిపోతుంది. ఈ అంశమే కథలో ప్రతి సన్నివేశాన్ని ఉత్కంఠభరితంగా మార్చేస్తుంది.ఓటీటీ... వెరైటీ... ప్రేక్షకులు ఇప్పుడు కేవలం యాక్షన్ లేదా మాస్ సినిమాలకే పరిమితం కావడం లేదు. ఓటీటీ వేదికలపై సందడి చేస్తున్న వందల వేల సినిమాలు చూస్తున్న నవతరం ప్రేక్షకుడు కొత్త కొత్త అనుభూతులను కోరుకుంటున్నాడు. ముఖ్యంగా మానసిక సంఘర్షణలు, కుటుంబ బంధాలు, క్రైమ్, థ్రిల్లర్ అంశాలు కలిసిన కథలకు మన వాళ్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోందనే విషయం ఓటీటీపై సక్సెస్ సాధించిన సినిమాలు, వెబ్బ సిరీస్లు నిరూపిస్తున్నాయి. దీంతో రచయితలు కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.ఆలోచింపజేసే కథలు యాగం నుంచి త్యాగం దాకా మన కుటుంబం బాగు కోసం ఏదైనా చేయాలనే తపన పెంచే కథలు చాలానే వచ్చాయి. అయితే ఫ్యామిలీ కోసం ఏం చేసినా తప్పు కాదని ఈ కథలు చెబుతున్నాయి. ఇందులో పాత్రలు అతీంద్రియ శక్తులు కలిగిన వ్యక్తి కాదు. మన పక్కింటి వ్యక్తిలా కనిపించే సాధారణ తండ్రి, తల్లి, పిల్లలే కథానాయకులు. అదే ఈ సినిమాల అతి పెద్ద బలం. ఈ జానర్లో మరో ప్రత్యేకత ఏమిటంటే... చివరికి ప్రేక్షకుడే ఒక ప్రశ్న వేసుకుంటాడు. ‘నా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తే నేనేం చేస్తాను?’ అనే ప్రశ్న కథ ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకుల్ని వెంటాడుతుంది.అందుకే ఈ సినిమాలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చర్చల్లో నిలుస్తుంటాయి.. కుటుంబ బంధాలు, నైతిక సంఘర్షణ, క్రైమ్, సస్పెన్స్... ఈ నాలుగు అంశాలను సమతుల్యం చేయగలిగితే ఇలాంటి సినిమాలకు ప్రేక్షకాదరణ కొనసాగే అవకాశాలు బలంగానే ఉన్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న వెంకీ, త్రివిక్రమ్ల ‘ఆదర్శ కుటుంబం’ వంటి సినిమాల కథలు ఇలాగే సాగుతాయనే వార్తలు వస్తున్నాయి. ఇంటి చుట్టం సరే... బయటి చట్టం సంగతేమిటి? ఈ కొత్త ట్రెండ్ విజయవంతమవుతోంది, దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలోపేతం అవుతాయనే భావన వస్తున్నా మరో వైపు చట్ట వ్యతిరేక కార్యకలాపాల ప్రశ్న ఏంటి? అనే ప్రశ్న వస్తోంది. ఒకప్పుడు ఇంట్లోని వ్యక్తి తప్పనిసరై నేరం చేసినా ఇంటిల్లిపాది కలిసి చట్టానికి అప్పగించే స్థాయిలో కథలు ఉండేవి. కానీ ఇప్పుడు తప్పులు/నేరాలు చేసినా తమ కుటుంబం తమను రక్షిస్తుంది అనే భావన ఏర్పడితే... ఇవి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇదే లైన్ తీసుకుని దర్శకులు కొత్త ట్విస్టులు, భిన్నమైన నేపథ్యాలతో సినిమాలు తీస్తూ పోతే, రకరకాల ఎత్తులు పై ఎత్తులు వేస్తూ సగటు మనిషి కూడా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవచ్చుననే సందేశం ఇస్తూ పోతే... అది సామాజిక భధ్రతకు భంగకరం కాదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. హాలీవుడ్ నుంచి ఓటీటీ మీదుగా... ప్రపంచ సినిమాను పరిశీలిస్తే కుటుంబం కోసం చట్టాన్ని ధిక్కరించే కథలు కొత్తవి కావు. హాలీవుడ్లో ‘ది గాడ్ ఫాదర్’ సిరీస్లో మాఫియా కుటుంబమే కథకు కేంద్రబిందువు. అక్కడ నేరం కుటుంబ వ్యాపారమే. హిస్టరీ ఆఫ్ వయొలెన్స్లో గతాన్ని దాచుకున్న కుటుంబం హింసలో చిక్కుకుంటుంది. తన కుమార్తెను రక్షించేందుకు ఒక తండ్రి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం... ‘ప్రిజనర్స్, నైవ్స్ అవుట్’ వంటి చిత్రాల్లో కుటుంబ సభ్యులందరూ ఒక హత్య రహస్యంలో అనుమానితులుగా మారడం కనిపిస్తుంది. బాలీవుడ్లోనూ ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడూ కనిపించాయి. కుటుంబ రహస్యాలే కథను నడిపించే ‘కపూర్ అండ్ సన్స్’, కుటుంబ బంధాలు, మోసం, నేరం, నైతిక సందిగ్ధతల కలయిక ‘మోనికా ఓ మై డార్లింగ్ గిలీ’ వంటి సినిమాల్లో కనిపిస్తుంది. సోనీ లివ్లో ప్రసారమవుతున్న ‘ఉన్ దేఖీ’ కూడా ఇదే జోనర్ సినిమానే. ఒక ధనిక కుటుంబం చేసిన హత్యను మొత్తం కుటుంబం, వారి అనుచరులు కలిసి ఎలా కప్పిపుచ్చుతారనేది ‘ఉన్ దేఖీ’ కథ... ఇది వరుస సిరీస్లతో ఘన విజయం సాధించింది. అయితే ఇవన్నీ ధనిక కుటుంబాలో, ప్రముఖుల కుటుంబాలకో సంబంధించిన కథలు కాగా సకుటుంబ సపరి‘వార్’ సమేత ‘క్రైమ్’ని నేలకు దించి సగటు మధ్య తరగతి కుటుంబాల కథలుగా మార్చింది ‘దృశ్యం’ సినిమానే అన్నది నిర్వివాదం. ఉపసంహారం... విజయాల వేటలో ఉన్న దర్శకులు, రచయితలను ఇప్పుడు కుటుంబ సమేత నేరాల కాన్సెప్ట్ను ఎంచుకుంటున్నారు. అయితే ప్రతీ సినిమాకీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలే కీలకంగా మారకూడదు. కమర్షియల్ సక్సెస్ ఎంత ముఖ్యమో సామాజిక శ్రేయస్సు కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడాన్ని ప్రోత్సహించడం అంటే వెలుగులు అందిస్తున్న సమాజ భవిష్యత్తును చీకటిమయం చేయడమేనని మరచిపోకూడదు. – సత్యబాబు, ‘సాక్షి’ సిటీ బ్యూరో
యాక్షన్ మండాడి
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మండాడి’. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న రిలీజ్ కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ రిలీజ్ చేస్తోంది.‘‘ఈ సినిమా కోసం సుహాస్, సూరి బాగా మేకోవర్ అయ్యారు. ఈ చిత్రంలోని బోట్ సీక్వెన్స్లు, యాక్షన్ సీక్వెన్స్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మణికందన్ సహ–నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు.
జననాయకన్ రిలీజ్ ముందు పూజా హెగ్డేకు షాక్!
పూజా హెగ్డే కెరీర్పై మళ్లీ అనుకోని మబ్బులు కమ్ముకున్నాయి. వరుస ఫ్లాప్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ముద్దుగుమ్మ, తన ఆశలన్నీ జననాయకన్ సినిమాపైనే పెట్టుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందని ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ సూచిస్తున్నాయి. అయితే పూజా హెగ్డేకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండవని దర్శకుడు హెచ్. వినోద్ స్పష్టంగా ప్రకటించారు. జర్నలిస్టు పాత్రలో కనిపించే పూజా కోసం తొలుత అనేక సన్నివేశాలు రాసుకున్నప్పటికీ, నిడివి కారణంగా చాలావాటిని షూట్ చేయలేకపోయారు. షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను కూడా కత్తిరించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పూజాకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇక రీమేక్ అంశంపై కూడా దర్శకుడు స్పందించారు. జననాయకన్ సినిమా, తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి రీమేక్ అని అంగీకరించిన ఆయన, కథలో భారీ మార్పులు చేసి కొత్తగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ సినిమా జూలై 23 నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ను జారీ చేసింది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుండగా.. ప్రేమలు బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది.
క్రీడలు
అతడి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జట్టు ప్రకటన వాయిదా!
శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభానికి ముందు బీసీసీఐని ఒక అంశం తెగ కలవరపెడుతోంది. అదేంటంటే కండరాల గాయంతో బాధపడుతున్న ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ లంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్కు సంబంధించి తుది జట్టును ఇంకా ప్రకటించనప్పటికీ అతడి గాయం తీవ్రత చాలా ఎక్కువగానే ఉండడంతో ఫిట్నెస్పై స్పష్టత రావడం లేదు. అందుకే శ్రీలంకతో టెస్టు సిరీస్కు జట్టు ప్రకటనను బీసీసీఐ సెలెక్టర్లు వాయిదా వేసినట్లు సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టెస్టు సిరీస్ ప్రారంభానికి మరో మూడు వారాలు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ వారం చివర్లో లేదా వచ్చే సోమవారం నాటికి జట్టును ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది.వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు. కండరాల గాయానికి స్కానింగ్ నిర్వహించనుండగా.. అది గ్రేడ్-1 గాయంగా పరిగనణించే అవకాశాలున్నట్లు ఒక నివేదిక పేర్కొంటుంది. దీంతో సుందర్ గాయంపై పూర్తి నివేదిక వచ్చాకే జట్టును ప్రకటించాలనుకుంటున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా సుందర్ కండరాల గాయానికి గురవ్వడంతో ఆ మ్యాచ్లో బౌలింగ్కు కూడా దూరంగా ఉన్నాడు.ఇక గిల్ సారథ్యంలోని టీమిండియా ఆగస్టు 4న శ్రీలంకలోని కొలంబోకు చేరుకోనుంది. టెస్టు సిరీస్ కు ముందు స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆగస్టు 7 నుంచి 10 వరకు కొలంబోలో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆటగాళ్లకు శ్రీలంక పిచ్లు, వాతావరణానికి అలవాటు పడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా, కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు రెండో టెస్టు జరగనుంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పట్టికలో పైకి ఎగబాకాలని చూస్తున్న ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. తొమ్మిది మ్యాచ్ల తర్వాత భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 44.44 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలు టాప్-2లో కొనసాగుతున్నాయి. ఇక 2017 తర్వాత శ్రీలంకలో భారత్ టెస్టు సిరీస్ ఆడడం ఇదే. 2017లో కోహ్లి కెప్టెన్సీలో లంకలో పర్యటించిన టీమిండియా 3-0 తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక చివరగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. మరోవైపు శ్రీలంక మాత్రం తాము ఆడిన చివరి టెస్టు సిరీస్ను వెస్టిండీస్కు 2-0తో కోల్పోయింది.చదవండి: ‘నిజమే సైకోలా ప్రవర్తించాడు కానీ శిక్షించొద్దు’
‘నిజమే సైకోలా ప్రవర్తించాడు కానీ శిక్షించొద్దు’
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత స్పెయిన్, అర్జెంటీనా ఆటగాళ్లు తన్నుకున్న సంగతి తెలిసిందే. అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో పరేడెస్ స్పెయిన్ ఆటగాళ్ల మీదకు కోపంతో దూసుకొచ్చాడు. తన ఎదురుగా ఉన్న ఎరిక్ గార్సియాపై పిడిగుద్దులు కురిపించాడు. అడ్డువచ్చిన మరో ప్లేయర్ గావి గొంతు పట్టుకొని అతడిని నేలపై పడేశాడు. విచక్షణ కోల్పోయి పశువులా ప్రవర్తించిన లియాండ్రో పరేడెస్పై విమర్శలు వెల్లువెత్తాయి. లియాండ్రోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తులు కూడా వచ్చాయి. అయితే లియాండ్రోపై ఎలాంటి చర్యలు తీసుకుంటామన్నది ఫిఫా ఇంకా తెలపనప్పటికీ స్పెయిన్ స్టార్ గావి మాత్రం లియాండ్రోను శిక్షించవద్దని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ‘లియాండ్రో ఓటమి నైరాశ్యంలో సైకోలా మారిపోయి మాపై దాడి చేశాడు. కానీ ఫుట్బాల్ ఆటలో ఇలాంటి గొడవలు సహజమని, ఓటమి బాధలో ఒక్కోసారి ఆటగాళ్లు లయతప్పి తాము ఏం చేస్తున్నామో కూడా మరిచిపోతారు. అందుకే లియాండ్రోను కఠినంగా శిక్షించవద్దని కోరుతున్నా. అంతగా శిక్ష వేయాలనుకుంటే అతడు భవిష్యత్తులో ఆడబోయే మ్యాచ్ల్లో ఆట మధ్యలో మైదానం నుంచి తొలగిస్తే సరిపోతుంది.’ అని తెలిపాడు. నిజానికి పరేడెస్ హింసాత్మక చర్యకు పాల్పడడం వల్ల అతడు కనీసం మూడు మ్యాచ్లు నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.ఇక మ్యాచ్ విషయానికొస్తే ఫైనల్లో ఆట అదనపు సమయం 106వ నిమిషంలో ఫెర్రాన్ టోర్రెస్ కొట్టిన గోల్తో, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో నాటకీయ విజయాన్ని అందుకుంది. 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ రెండో ఫిఫా టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. ఫిఫా చాంపియన్స్గా నిలిచిన తర్వాత స్వదేశంలో అడుగుపెట్టిన స్పెయిన్కు ఘన స్వాగతం లభించింది. 20 లక్షల మంది అభిమానుల సమక్షంలో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో విజయోత్సవ సంబరాలు జరిగాయి. 💣🇦🇷 GAVI SOBRE LA AGRESIÓN QUE RECIBIÓ DE PAREDES EN LA FINAL ESPAÑA-ARGENTINA:💥 “No creo que deba ser suspendido. Lo lógico hubiese sido expulsarle en el partido”👊🏼 “No es una imagen para los niños pero creo que hay esa parte de fútbol que es un poco más violenta”📹… pic.twitter.com/ZaSrjPUmQm— Zona Mixta (@ZonaMixta__) July 21, 2026Read: హండ్రెడ్ లీగ్లో ముంబై, సన్రైజర్స్ అరుదైన ఫీట్!
క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ముంబై, సన్రైజర్స్ అరుదైన ఫీట్!
ఇంగ్లండ్ వేదికగా ప్రారంభమైన హండ్రెడ్ లీగ్ టోర్నీలో ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ ఫ్రాంచైజీలు శుభారంభం చేశాయి. ఏకకాలంలో ప్రారంభమైన హండ్రెడ్ మెన్స్, హండ్రెడ్ వుమెన్స్ టోర్నీల్లో విజయాలు అందుకున్నాయి. పురుషుల హండ్రెడ్ లీగ్లో సన్రైజర్స్ లీడ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ లండన్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోగా, అటు మహిళల విభాగంలో ముంబై ఇండియన్స్ లండన్పై సన్రైజర్స్ లీడ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. ఏకకాలంలో రెండు జట్లు ఒక దానిపై ఒకటి వేర్వేరుగా విజయాలు నమోదు చేయడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.దంచికొట్టిన పూరన్..పురుషుల హండ్రెడ్ లీగ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ లీడ్స్ 99 బంతుల్లో 143 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (27 బంతుల్లో 41), టామ్ అల్సోప్ (18 బంతుల్లో 31) దూకుడుగా ఆడారు. ముంబై బౌలర్లలో రిచర్డ్ గ్లెసన్ 4 వికెట్లు తీయగా, సామ్ కరన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ముంబై ఇండియన్స్ లండన్ జట్టు 84 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ సామ్ కరన్ (39 బంతుల్లో 60 నాటౌట్), నికోలస్ పూరన్ (22 బంతుల్లో 58 నాటౌట్) విధ్వంసం సృష్టించారు.రాణించిన దీప్తి శర్మమహిళల హండ్రెడ్ టోర్నీ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ లండన్ జట్టు 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (33), డానీ వ్యాట్ (29) పర్వాలేదనిపించారు. ఆల్రౌండర్ దీప్తి శర్మ, డానియెల్లి గిబ్సన్లు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్రైజర్స్ 69 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఫోబె లిచ్ఫీల్డ్ (3), అనాబెల్ సదర్లాండ్ (30) విజయంలో కీలకపాత్ర పోషించారు.
‘నేను మరింత బాధ్యతగా ఆడాలి’
హరారే: ఐర్లాండ్, ఇంగ్లండ్ల చేతుల్లో టి20 సిరీస్లు ఓడిపోయిన తర్వాత భారత జట్టు ఇప్పుడు ఈ ఫార్మాట్తో మరో పోరుకు సిద్ధమైంది. మూడు టి20ల సిరీస్లో భాగంగా రేపు భారత్, జింబాబ్వే మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇటీవల ప్రదర్శనను మరచి కొత్త ఉత్సాహంతో తాము బరిలోకి దిగుతున్నామని భారత జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ వ్యాఖ్యానించాడు. ‘జింబాబ్వే చాలా మంచి జట్టు. ఎంతో పోటీతత్వంతో పోరాడుతుంది. వారిని ఓడించడం అంత సులువు కాదు. గత ఏడాది జింబాబ్వేతో ఆడిన సిరీస్లో తొలి మ్యాచ్ వారే నెగ్గారు. నాటి భారత టీమ్లో ఉన్నవారిలో చాలా మంది ఇప్పుడూ వచ్చారు. మంచి పిచ్లతో బ్యాటింగ్కు అనుకూల పరిస్థితులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గతంలో జింబాబ్వే గడ్డపై ఆడిన అనుభవం పనికొస్తుంది’ అని తిలక్ అన్నాడు. ఐర్లాండ్–ఇంగ్లండ్ల చేతుల్లో ఓటమికి పలు కారణాలు ఉన్నాయని, వాటిని విశ్లేషించుకున్నామని అతను చెప్పాడు. ముఖ్యంగా తన బ్యాటింగ్ ప్రదర్శనపై కూడా తిలక్ మాట్లాడాడు. ‘టి20 మ్యాచ్లో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అక్కడి పరిస్థితుల్లో అది అంత సులువు కాదు. పైగా మ్యాచ్లో ఎలాంటి స్థితిలో ఉన్నామో కూడా చూసుకోవాలి. నేను బ్యాటింగ్కు వెళ్లేసరికి జట్టు పవర్ప్లేలోనే నాలుగైదు వికెట్లు కోల్పోతూ వచ్చింది. అలాంటప్పుడు వచ్చీ రాగానే షాట్లు ఆడటం సరైంది కాదు. పైగా వైస్ కెప్టెన్ అంటే నేను మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంటుంది. అందుకే తొలి బంతినుంచే దూకుడుగా ఆడేందుకు ఆలోచించాల్సి వచ్చింది. గత రెండేళ్లుగా ఎక్కువగా ఆసియాలోని పిచ్లపైనే ఎక్కువ మ్యాచ్లు ఆడిన మేం ఇంగ్లండ్కు వెళ్లగానే ఇబ్బంది పడ్డాం’ అని తిలక్ వివరించాడు.
న్యూస్ పాడ్కాస్ట్
ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించిన ప్రతిపక్షాలు..
ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
రామాయపట్నంలో భారీ స్కామ్... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
తెలంగాణలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లయితే రాజకీయ సన్యాసం చేస్తా... సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్
నంబర్ 1 నుంచి నేలచూపులే... నీతి ఆయోగ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు భారీగా పతనం
ఏపీ సమస్యలపై ఎలుగెత్తాలి. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తాం... ఆక్వా రైతులతో ముఖాముఖిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
పల్నాడు కలను సాకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... 100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల కొత్త మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
బిజినెస్
బజాజ్ ఆటో లాభం హైజంప్!
ముంబై: దేశీ వాహన దిగ్గజం బజాజ్ ఆటో బంపర్ ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2026–27, క్యూ1)లో కంపెనీ రూ.3,226 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది క్యూ1తో పోలిస్తే 46 శాతం దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం 64 శాతం ఎగసి రూ. 22,377 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ. 13,642 కోట్లుగా నమోదైంది. టూ, త్రీవీలర్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల జోరు, రికార్డు స్థాయి ఎగుమతులు క్యూ1లో మెరుగైన పనితీరుకు దన్నుగా నిలిచాయి. స్టాండెలోన్ ప్రాతిపదికన కూడా కంపెనీ నికర లాభం 42 శాతం వృద్ధితో రూ. 2,983 కోట్లకు జంప్ చేసింది. స్టాండెలోన్ ఆదాయం 37 శాతం పెరిగి రూ. 17,244 కోట్లను తాకింది. వాహన విక్రయాలు జూమ్.. క్యూ1లో బజాజ్ ఆటో మొత్తం 14,38,251 వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది అమ్ముడైన 11,11,237 వాహనాలతో పోలిస్తే 29 శాతం పెరిగాయి. దేశీ వాహన సేల్స్ 11 శాతం వృద్ధి చెందగా, ఎగుమతులు ఏకంగా 54 శాతం ఎగబాకాయి. ఎగుమతులు తొలిసారి 7 లక్షల మార్కును అధిగమించాయని కంపెనీ వెల్లడించింది. ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్కు సరఫరాను మించి డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఉత్పత్తి పెంచేందుకు మరిన్ని పెట్టుబడులు పెడుతున్నామని వివరించింది.ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఆటో షేరు 1 శాతం నష్టంతో రూ.10,408 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ అహింసా ఇండెక్స్!
భారత స్టాక్ మార్కెట్లో థీమ్ ఆధారిత పెట్టబడులకు సంబంధించి మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు అంటే ఇప్పటివరకు లాభాలు, వృద్ధి, డివిడెండ్లు ప్రమాణాలుగా పరిగణించేవారు. ఇప్పుడు వీటికి ’అహింస’ అనే కొత్త ప్రమాణం కూడా జతకలిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ 500 పేరుతో అహింస ఇండెక్స్ను ప్రారంభించింది. జంతువులపై హింసకు పాల్పడని, జంతువులకు సంబంధంలేని కంపెనీలను ఈ ఇండెక్స్లో చేర్చడం విశేషం. ఇతరదేశాల్లో కొత్తగా ట్రెండవుతున్న ఎథికల్ ఇన్వెస్టింగ్ (నైతిక విలువల పెట్టుబడులు)కోరుకునే ఇన్వెస్టర్లకు దేశీయంగా ఈ ఇండెక్స్ను ఎన్ఎస్ఈ అందుబాటులోకి తెచ్చింది.ఈ ఇండెక్స్లో నిఫ్టీ 500 లోని కంపెనీలను ప్రత్యేకంగా పరిశీలించి వాటి ఉత్పత్తులు, వ్యాపార విధానాలు, సేవలు జంతువులకు ఏవిధంగా అయినా హాని కలిగిస్తున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించి ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియను అహింసాగైన్ ఫౌండేషన్ రూపొందించిన అహింసా ఇన్వెస్ట్మెంట్ మూవ్మెంట్ ఫ్రేమ్ వర్క్ ఆధారంగా నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు కేవలం లాభాలే కాకుండా పర్యావరణం, సామాజిక బాధ్యత, నైతిక విలువలు వంటి అంశాలను కూడా పెట్టుబడి చేసే ముందు పరిగణలోకి తీసుకుంటున్నారు. పర్యావరణ (ఎని్వరాన్మెంటల్) సా మాజిక (సోషల్), పాలనా (గవర్నెన్స్) ఈఎస్జీ ప్రమాణాల తర్వాత యానిమల్ వెల్ఫేర్ ఇన్వెస్టింగ్ కూడా ఇప్పుడు వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఇప్పటికే రూ.80 లక్షల కోట్లకు పైగా ఆస్తులు నిర్వహణలో ఉన్నప్పటికీ జంతు సంక్షేమాన్ని ఆధారంగా చేసుకున్న పెట్టుబడి ఉత్పత్తులు పరిమితంగానే ఉన్నాయి. ఈ కొత్త ఇండెక్స్ ఆ లోటును కొంత వరకు భర్తీ చేయవచ్చనేది మార్కెట్ నిపుణుల అంచనా. ఇన్వెస్టింగ్ అంటే కేవలం లాభాలే కాదు మన డబ్బు ఏ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోందో కూడా తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని, విలువలకు ప్రాధాన్యం ఇచ్చే పెట్టుబడుల యుగానికి ఎన్ఎస్ఈ ఇండెక్స్ నాంది పలికిందని భావిస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ఎంపిక ఎలా? ఇండెక్స్లో చేర్చే కంపెనీలను గ్రీన్, ఆరెంజ్, రెడ్ అనే మూడు విభాగాలుగా వర్గీకరిస్తారు. గ్రీన్: జంతు హింసకు దూరంగా ఉండే కంపెనీలు ఆరెంజ్: కొంత మేర ప్రభావం చూపే సంస్థలు రెడ్: ... జంతువులపై ప్రత్యక్ష ప్రభావం చూపే వ్యాపారాలు ఆరెంజ్, రెడ్ కేటగిరీల్లో ఉన్న కంపెనీలను ఈ ఇండెక్స్లో చేర్చరు. ఈ ఇండెక్స్ ఆధారంగా భవిష్యత్తులో ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్లు, ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్లు, ఇతర పెట్టుబడి ఉత్పత్తులను ప్రారంభించే అవకాశముందని ఎన్ఎస్ఈ వెల్లడించింది. ప్రస్తుతం ప్రారంభించిన ఇండెక్స్ లో బ్యాంకింగ్ రంగానికి చెందిన ఒక్క కంపెనీ కూడా లేదు. అలాగే రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు కూడా స్థానం దక్కలేదు. మరోవైపు ప్రముఖ ఐటీ కంపెనీలు,ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, కొన్ని తయారీ రంగ సంస్థలు ఇండెక్స్లో చోటు సంపాదించాయి.
పెట్రోల్లో ఇథనాల్ పెంపు?.. కేంద్రం క్లారిటీ!
ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్లో ఇథనాల్ కలపడం విషయంలో గత కొంతకాలంగా పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా E20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్ పనితీరు దెబ్బతింటుందా? అనే అనుమానాలు చాలా మంది వాహనదారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలను స్పష్టం చేసింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) అందుబాటులో ఉంది. అయితే భవిష్యత్తులో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతం కంటే ఎక్కువ పెంచే ఆలోచనపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.పెట్రోల్లో ఇథనాల్ శాతం పెంచాలంటే తొందరపడి నిర్ణయం తీసుకోబోమని, ముందుగా శాస్త్రీయ అధ్యయనాలు, సాంకేతిక పరిశీలనలు చేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ తెలిపారు. అంతే కాకుండా.. ఆటోమొబైల్ కంపెనీలు, చమురు సంస్థలు, పరిశోధనా సంస్థలతో చర్చించిన తర్వాతే భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.ఇకపోతే.. అసలు ఇథనాల్ను పెట్రోల్లో ఎందుకు కలుపుతున్నారు అనే విషయానికి వస్తే, దీనికి ప్రధాన కారణం కాలుష్యాన్ని తగ్గించడం, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం. ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల.. రైతులు ఆర్థికంగా ఎదుగుతారు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారవుతుంది కాబట్టి.భారత్ ఇప్పటికే పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్ని చేరుకుంది. 2013-14లో కేవలం 1.5 శాతంగా ఉన్న ఇథనాల్ మిశ్రమం క్రమంగా పెరుగుతూ 2025-26 నాటికి 20 శాతానికి చేరుకుంది. భవిష్యత్తులో పెరుగుతుందా.. లేదా? అనేది తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ఆగస్టు నుంచి.. మారనున్న మారుతి కార్ల ధరలు!
ఆగస్టు నుంచి.. మారనున్న మారుతి కార్ల ధరలు!
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన కార్ల ధరలను మరోమారు పెంచడానికి సిద్ధమైంది. 2026 ఆగస్టు నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మారుతి సుజుకి దాని లైనప్లోని అన్ని మోడళ్ల ధరలను రూ. 30,000 వరకు పెంచనుంది. అయితే ఏ మోడల్ ధరను ఎంత వరకు పెంచనుంది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా కంపెనీ మూడు నెలలు ముందు కూడా ధరలను పెంచింది. ఇప్పుడు మరోమారు పెంచడం వల్ల అమ్మకాలు పెరుగుతాయా?, తగ్గుతాయా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమర్పించిన ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో.. పెరిగిన ద్రవ్యోల్బణ భారాలు, ప్రతికూల వ్యయ వాతావరణం కారణంగా ధరలను సవరించాల్సి వచ్చిందని మారుతి సుజుకి పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే ఆగస్టు నుంచి కొత్త కారు కొనాలంటే.. ఇంకొంత ఖర్చు చేయక తప్పదని స్పష్టమవుతోంది.
ఫ్యామిలీ
చీకటిని జయించిన విజయగానం
కళ్లు లేకపోవడం శాపం కాదు, చూసే మనసు లేకపోవడమే అతి పెద్ద లోపం అని నిరూపించింది ఆ గొంతు. ప్రపంచాన్ని చూసే భాగ్యం ఆ కళ్లకు లేదు, కానీ తన అసాధారణ పాటతో ప్రపంచం తన వైపు చూసేలా చేసింది. మలయాళ చిత్రం ‘ఏ.ఆర్.ఎం’లో పాడిన అద్భుతమైన జోలపాటకు ‘జాతీయ ఉత్తమ గాయని’గా నిలిచిన వైకోమ్ విజయలక్ష్మి ప్రస్థానం అవార్డులకే పరిమితం కాని సుదీర్ఘ ఆత్మగౌరవ పోరాటం!‘కె.జె.ఏసుదాస్ గారు ఎక్కడ ఉన్నా నాకు ఫోన్ చేయక మానరు. ఆయనే నాకు ఎన్నో సంగీత మెళకువలు నేర్పిన గురువు’ అంటారు వైకోమ్ విజయలక్ష్మి. ‘చూపు లేని నాకు ఎస్.జానకి, వాణి జయరామ్ వంటి గాయనులే సంగీత సరస్వతులుగా కనిపించారు. వారి పాటలు వినే పాడటం నేర్చుకున్నాను’ అంటారామె.అంధులు గాయనీమణులుగా రాణించడం మనకు తెలిసిందే. కాని జాతీయగాయనిగా అవార్డు పొందడం మాత్రం విజయలక్ష్మికే సాధ్యమైంది. చూపు లేకపోయినా సినీ సంగీతంలో సంగీత దర్శకుడిగా రవీంద్ర జైన్ ఎన్నో విజయాలు సాధించారు. గాయనిగా వైకోమ్ విజయలక్ష్మి ‘ఏ.ఆర్.ఎం’ సినిమాలో ‘అంగు వాన కోనిలు’ అనే గొప్ప పాట పాడి నేషనల్ అవార్డు పొందారు. టివోలి థామస్ ఈ సినిమా హీరో.తోడుగా నిలిచిన తండ్రి... కేరళలోని కొట్టాయం జిల్లా వైకోమ్లో 1981 విజయదశమి నాడు మురళీధరన్, విమల దంపతులకు విజయలక్ష్మి జన్మించారు. పండుగరోజే పుట్టినా ఆ దంపతుల ఆనందం ఎంతోకాలం నిలవలేదు. పుట్టుకతోనే మెదడు నరాల బలహీనత కారణంగా ఆమెకు చూపు రాదని డాక్టర్లు తేల్చేశారు. ఆ సమయంలో మురళీధరన్ది మద్రాస్లో (చెన్నై) ఎలక్ట్రానిక్స్ వ్యాపారం. అయితే ఐదేళ్ల వయసుకే రేడియోలో వచ్చే ఇళయరాజా, ఎం.ఎస్. విశ్వనాథన్ల తమిళ పాటలను విని, అచ్చు గుద్దినట్టు హమ్ చేస్తున్న కూతురిని చూసి వ్యాపారాన్ని పక్కనబెట్టి, ఆమెకు సంగీతమే సర్వస్వం చేయాలని నిశ్చయించుకుని సొంత ఊరు వైకోమ్ తిరిగి వచ్చేశారు. గాయత్రి వీణలో మేటి... విజయలక్ష్మికి చూపు లేని కారణంగా పాఠశాల విద్య, సాంప్రదాయ అక్షరాస్యత సాధ్యపడలేదు. కానీ వినికిడి శక్తితో దాదాపు 100కు పైగా రాగాలను గురువు లేకుండా సొంతంగా నేర్చుకుంది. కూతురి ప్రతిభకు ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకున్న అనుభవాన్ని జోడించిన మురళీధరన్ ఒక సాధారణ ‘తంబురా’ వాయిద్యాన్ని ఎలక్ట్రికల్ పద్ధతిలో మోడిఫై చేసి, కేవలం సింగిల్ స్ట్రింగ్ ఉండేలా డిజైన్ చేశారు. దీని శబ్దానికి ముగ్ధుడైన వయోలిన్ విద్వాంసుడు కున్నకుడి వైద్యనాథన్ దీనికి ‘గాయత్రీ వీణ’ అని నామకరణం చేశారు. ఈ ఇన్స్ట్రుమెంట్తో నిరంతరాయంగా 24 గంటల పాటు 67 పాటలు వాయించి విజయలక్ష్మి ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ను సొంతం చేసుకున్నారు.రికార్డింగ్ రూమ్ సవాళ్లు... సంగీత కచేరీలతో గుర్తింపు వచ్చినా సినిమా రంగంలోకి రావడం విజయలక్ష్మికి అంత సులువు కాలేదు. ‘కళ్లు లేని ఈమె రికార్డింగ్ థియేటర్లో మైక్ ముందు ఎలా నిలబడుతుంది?’ అంటూ ఎన్నో ఆడియో స్టూడియోల నుంచి తిరస్కరణలు, అవమానాలు ఎదురయ్యాయి. చివరకు 2013లో మలయాళ దర్శకుడు కమల్ తన ‘సెల్యులాయిడ్’ చిత్రంలో ‘కాట్టే కాట్టే’పాటతో ఆమెకు మొదటి బ్రేక్ ఇచ్చారు. ఆ మొదటి పాటకే ఆమెకు కేరళ స్టేట్ అవార్డ్ దక్కింది. అయితే బ్లైండ్ సింగర్గా రికార్డింగ్స్ చేయడం ఒక పెద్ద యుద్ధం. కంపోజర్ ట్యూన్ వినిపిస్తే, దాన్ని క్షణాల్లో మైండ్లో రికార్డ్ చేసుకోవాలి. మలయాళం కాకుండా తెలుగు, తమిళం భాషల్లో పాడేటప్పుడు పదాల ఉచ్చారణ మరింత కష్టమయ్యేది. ఒకవైపు హెడ్ఫోన్స్ లో మ్యూజిక్ ట్రాక్ రన్ అవుతుంటే, లయ తప్పకుండా, శృతి జారకుండా ఒకే టేక్లో పాడటం విజయలక్ష్మి అసాధారణ శైలి.‘పాట కావాలా? పెళ్లి కావాలా?’ శారీరక లోపాలున్న మహిళలను కట్టుబాట్ల పేరుతో అణచివేయాలని చూసే వారికి విజయలక్ష్మి జీవితం ఒక గుణపాఠం. 2016లో ఒక ఎన్నారైతో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం కాగానే ఆ వ్యక్తి ఆమెపై ఆంక్షలు విధించాడు. ‘నువ్వు స్టేజ్ షోలు ఆపేయాలి, సంగీతానికి దూరంగా ఇంట్లోనే ఉండాలి’ అని కండిషన్ పెట్టాడు. విజయలక్ష్మి వెనక్కి తగ్గలేదు. ‘నా శ్వాస లాంటి సంగీతాన్ని వదులుకుని నేను బతకలేను’ అంటూ ఆ పెళ్లిని అక్కడికక్కడే రద్దు చేసుకుంటున్నట్లు ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించింది. ఆ తర్వాత 2018లో అనూప్ అనే సంగీత ప్రియుడిని వివాహం చేసుకున్నప్పటికీ మనస్పర్థల వల్ల 2021లో విడాకులు తీసుకుని ఒంటరిగానే సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.పురుషాధిక్య సమాజపు ఆంక్షలను ధిక్కరించి, ఆత్మగౌరవాన్ని గెలిపించుకున్న ఆ నిర్ణయమే ఈ రోజు ఆమెను దేశంలోనే అత్యున్నత జాతీయ అవార్డు వేదికపై విజేతగా నిలబెట్టింది.
ఎందుకీ సంతానలేమి?
మునపటితో పోలిస్తే ఇటీవల మనదేశంలో సంతానలేమి కేసులు పెరుగుతున్నాయి. అందుకే కృత్రిమ గర్భధారణ (ఫెర్టిలిటీ) సెంటర్లను సందర్శించే దంపతుల సంఖ్యా పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం చూస్తే... ప్రతి ఆరుగురు దంపతుల్లో ఒక జంటను సంతానలేమి సమస్య బాధిస్తోంది. ఇది కాస్త గడ్డు పరిస్థితే అని చెప్పవచ్చు. ఎందుకంటే ... జనాభాలో యువత శాతం తగ్గడం వల్ల అనేక ప్రతికూలతలు కనిపిస్తాయి. ఆ సమాజం వృద్ధసమాజంగా మారి మానవ వనరులు కొరవడతాయి. దాంతో ఆ దేశ ఆర్థిక సంపద తగ్గడం, జీవన నాణ్యతలు దిగజారడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. ప్రస్తుతం జపాన్ వంటి కొన్ని దేశాలు ఇందుకు ఉదాహరణ. అలాంటి పరిస్థితి రాకుండా ఉండి ఓ సమాజం యౌవనంగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే పనిచేసే సామర్థ్యం ఉన్న యువత సంఖ్య స్థిరంగా ఉండటమో లేదా పెరుగుతుండమో జరగాలి. ఇదే జరగకపోతే ఆ దేశం వంధ్యత్వ సంక్షోభం (ఇన్ఫెర్టిలిటీ) దిశగా పురోగమిస్తూ.. అభివృద్ధి పథంలో తిరోగమిస్తుంది.25న ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ డే సందర్భంగా కృత్రిమ గర్భధారణ విషయంలో అనేక అంశాలపై ‘సాక్షి’ వరుస కథనాలు...ఇటీవల మన సమాజంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరగడానికి అనేక అంశాలు కారణమవుతున్నప్పటికీ వీటిని ప్రధానంగా రెండుగా చెప్పవచ్చు. అవి మొదటిది... సామాజిక , రెండు ఆరోగ్య కారణాలుగా చెప్పవచ్చు. → సామాజికం: ఒకప్పుడు మన సమాజంలో అబ్బాయిగానీ, అమ్మాయిగానీ పెళ్లీడుకు రాగానే కుటుంబసభ్యులు మొదట వివాహానికే ప్రాధాన్యమిచ్చేవారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసు లో జరగాలంటూ అబ్బాయి సంపాదన అంతంతమాత్రంగానే ఉన్నా పెళ్లికి సిద్ధపడేవారు. కానీ ఇటీవల యువత చదువులూ, ఉన్నత ఉద్యోగాలంటూ తమ కెరియర్కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకొని... అవి పూర్తయ్యేవరకూ పెళ్లిళ్లను వాయిదా వేసుకోవడం వంటి పనులు ఇటు అబ్బాయిలూ, అటు అమ్మాయిలూ చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవలి కొత్త ఉద్యోగాల్లో ఉండే తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడులూ, అర్ధరాత్రి అపరాత్రి అనకుండా పనిచేయడాలు, శారీరకంగా కదలికలు లేని ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలు, ఒబేసిటీ, మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు... ఇవన్నీ కలసి సంతానలేమికి దారితీస్తున్నాయి.→ ఆరోగ్య కారణాలు: గతంతో పోలిస్తే యువతులు సైతం తమ కెరియర్కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. దాంతో... ఆ ఒత్తిడుల ఫలితంగా యువతుల్లో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి అవి సంతానలేమికి దారితీస్తున్నాయి. ఉదాహరణకు యువతుల్లో అనేక హార్మోన్లతో కూడిన ఓ నిర్దిష్టమైన ‘సైకిల్’ నడుస్తుంటుంది. ఈ హార్మోన్ల అసమతౌల్యత కారణంగా ఆ సైకిల్ దెబ్బతినడంతో ఈ అంశం కూడ సంతానలేమికి కారణమవుతోంది. ఇలా సైకిల్ దెబ్బతినడంతో అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇం΄్లాంటేషన్లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. దీనికి తోడు కొన్నిసార్లు యువతుల్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా సంతానం కలగడంపై ప్రభావం చూపవచ్చు.→ పురుషుల విషయంలో: ఒకప్పుడు సంతానలేమికి మహిళలనే ఎక్కువగా బాధ్యులను చేసేవారు. కానీ ఇప్పుడున్న సామాజిక అంశాలూ, యువతలో దురలవాట్లూ, మారుతున్న జీవనశైలి కారణంగా యువకుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు (మొటిలిటీ), నాణ్యత తగ్గడం వంటి అనేక అంశాలు సంతానలేమికి దారితీస్తున్నాయి. అందుకే ఒక జంటకు సంతానం కలగని సందర్భాల్లో సదరు యువకుడిలో తన వీర్యంలోని శుక్రకణాల విషయంలో వాటి సంఖ్య, కదలికలు, నాణ్యత ఇవన్నీ బాగున్నాయా అనే అంశాలను తెలుసుకోడానికి మొదట పురుషుడే వైద్యపరీక్షలు చేయించుకోవడం ముఖ్యం, అవసరం... పైగా మహిళలతో పోలిస్తే పురుషులకు నిర్వహించే వైద్యపరీక్షలు తేలికా, చవకా!నిర్ధారణ ఇలా... సంతానలేమిని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ, సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అని రెండు రకాలుగా చెప్పవచ్చు. .ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ... పూర్తి ఆరోగ్యంగా ఉన్న దంపతులు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులను పాటించకుండా, కలిసి ఉంటూ ఏడాదిపాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రానప్పుడు... ఆ జంటకు సంతానలేమి సమస్య ఉంటే దానిని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.సెకండరీ ఇన్ఫెర్టిలిటీ... జంటలో మొదటిసారి గర్భధారణ జరిగాక... మళ్లీ రెండోసారి గర్భధారణ కోరుకుని, ఏడాదిపాటు ప్రయత్నించాక కూడా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.ఈ చికిత్స ఎవరెవరికి? ∙ప్రతినెలా పీరియడ్స్ సరిగా వస్తూ, ఏడాదిపాటు ప్రయత్నించాక కూడా గర్భం రానివాళ్లలో ∙ఆ మహిళ 30 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత కూడా ఇంకా గర్భం రాని సందర్భాల్లో... ∙సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ఉన్న మహిళ వయసు 35 ఏళ్లు దాటుతున్నా... అప్పటికి ఆర్నెల్లుగా ప్రయత్నిస్తున్నా గర్భం రానప్పుడు... ఇలాంటి జంటలు ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించడం అవసరం.ట్విన్స్ మూడేళ్ల తేడా!ఏం కోల్పోయిన తిరిగి సంపాదించుకోవచ్చు. కాని ఎంత ప్రయత్నించినా తిరిగి రానివి రెండే..ఒకటి కాలం రెండు ప్రాణం...కాని ఆ కాలాన్ని ఫ్రీజ్ చేస్తే..? అదెలా జరగుతుందనుకుంటే మీరు ఈ కథ చదవాల్సిందే..అమెరికాలోని ముస్సోరి రాష్ట్రానికి చెందిన కెన్సాస్లో టేలర్ గ్రీన్హాగెన్ డెంటల్ హైజెనిస్ట్, తన భర్త జస్టిన్ ఒక ఫార్మాసిస్ట్. వీరిద్దరు సంతానం కోసం 2022లో ఐవీఎఫ్ పద్థతిని ఎంచుకున్నారు. 2023లో వీరిద్దరికి మగ శిశువు జన్మించాడు. అదే ఐవీఎఫ్ సైకిల్లో ఏర్పడిన మరో ఎంబ్రియోను క్రయోప్రిజర్వేషన్ (పిండాన్ని ఘనీభవింపజేసే ప్రక్రియ) ద్వారా భద్రపరిచి, మూడేళ్ల తర్వాత గర్భాశయంలో ప్రవేశపెట్టారు. దీంతో 2025లో వీరికి ఓ కుమార్తె జన్మించింది. ఇక్కడ విశేషమేమిటంటే ఈ ఇద్దరు పిల్లలు ఒకే రోజున ఎంబ్రియోలుగా జీవం పొందినా, ఈ ప్రపంచంలోకి రావడానికి మాత్రం మూడేళ్ల కాలం పట్టిందన్నమాట. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడం ఇప్పుడు మామూలే అయినా ఒకేసారి రూపొందిన ఎంబ్రియోలను ఇలా కాలవ్యవధిలో పిల్లలుగా జన్మించడం విశేషం. తాజాగా ఈ ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్న వీడియో టేలర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.డాక్టర్ బి. సృజనసీనియర్ కన్సల్టెంట్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్
జస్ట్ రెండేళ్లలో 142 కేజీల నుంచి 80 కేజీలకు..! నిలకడగా బరువు తగ్గాలంటే..
బరువు తగ్గడం కష్టం కాదు గానీ, మళ్లీ యథావిధిగా పెరగకుండా ఉండటమే అతి పెద్ద టాస్క్ అని అంటున్నారు పలువురు. అందుకే వెయిట్లాస్ జర్నీలో నిలకడగా బరువు తగ్గేందుకు ప్రాధాన్యత ఇవ్వమని నొక్కి చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. అదే మిమ్మల్ని స్మార్ట్గా మార్చి వెయిట్లాస్ జర్నీలో విజయం సాధించేలా చేస్తుందని చెబుతున్నారు. అందుకు ఉదాహరణే..ఈ యువకుడు. బరువు తగ్గక మునుపు తన రూపం, ఆ తర్వాత ఉన్న మార్పులను ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేశారు.ఆ వ్యక్తే కువార్ కపూర్. ఆయన సుమారు 142 కేజీల బరువు ఉండేవాడినని అన్నారు. బరువు తగ్గక మునుపు ఏవిధంగా ఉన్నానో పంచుకుంటూ..ప్రస్తుతం సుమారు 62 కేజీల పైనే తగ్గి 80 కేజీలకు తగ్గినట్లు వెల్లడించారు వీడియోలో. ఈ మార్పుకి వెనుక రహస్యం క్రాష్ డైట్లు కాదని, సరైన మార్గంలో నిలకడగా చేయడమేనని అన్నారు. తాను సరైన మార్గంలో నిలకడగా కార్డియో దినచర్యపై దృష్టిసారించి రెండేళ్లలోనే ఇంతలా స్మార్ట్గా మారానని చెప్పుకొచ్చాడు. అందుకోసం ఎలా కార్షియో సెషన్లు చేయాలో చెప్పారు. ఆయన వీడియోలో చాలామంది నేరుగా పదివేల అడుగులతో వాకింగ్ ప్రారంభిస్తారు. దీంతో త్వరితగతిన అలిసిపోయి..రెండో వారానికల్లా స్కిప్ చేస్తారని అన్నారు. అస్సలు ఈ పద్ధతిని పొరపాటుగా అభివర్ణించారు. అందుకే అతడు కొవ్వు తగ్గడానికి నిలకడగా చేసే కార్డియో ప్రగతిని పంచుకున్నారు. ప్రారంభ అధిక బరువులో..ప్రారంభ దశలో నేరుగా పదివేలు అడుగులు కాకుండా నెమ్మదిగా మొదలు పెట్టానని చెప్పారు. నిర్వహించగలిగితే సాధారణంగా రోజుకు 3000 నుంచి 5000 అడుగులు సరి అని చెప్పారు. లేదా అంతకంటే తక్కువ నడిచినా పర్లేదని అన్నారు. ఇక్కడ అలిసిపోకుండా నిలకడగా ఉండటమే లక్ష్యం అని అన్నారు. అధిక బరువు దశలో..అధిక బరువు ఉన్నవారు వారానికి రెండు సెషన్లలో, ఒకే జోన్లో 8000 అడుగులతో ప్రారంభించాలని ఆయన సిఫార్సు చేశారు. ఆయన ప్రకారం, శరీరం అలవాటుపడినప్పుడు, కార్డియో మెరుగుపడుతుంది. సామర్థ్యానికి మించి ప్రయత్నించే బదులు, సాధారణ వేగంతో చేయాలని కూడా ఆయన సూచించారు.ఓ మోస్తారు మార్పు మొదలయ్యాక..వారానికి రెండు సెషన్లలో, రెండు జోన్లలో 10,000 నుంచి 12,000 అడుగులు వేయాలని ఆ వ్యక్తి సూచించారు. ఎందుకంటే, ఈ దశలో స్థూలకాయం లేదా అధిక బరువు దశలతో పోలిస్తే శరీరం సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యం మెరుగుపడుతుందని అన్నారు.బరువు తగ్గే దశఈ దశలో, రెండు లేదా మూడు ప్రాంతాలలో వారానికి రెండుసార్లు 15,000 అడుగులు నడవాలని ఆయన సలహా ఇచ్చారు. ఇది కొవ్వు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ జిమ్లో పనితీరు తగ్గితే, ఆహారాన్ని కాకుండా కార్డియోను తగ్గించడం మంచిదని కూడా ఆయన తెలిపారు.అత్యంత కీలకమైన దశఇందులో అధిక ఫలితాలు, గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టి, రెండు లేదా మూడు విడతలుగా (సెషన్లలో) మొత్తం 20,000 అడుగులు నడవాలని ఆయన సూచించారు. ప్రతి దశకు తగిన కార్డియో వ్యాయామాలను వివరించడంతో పాటు, ఏ దశలో ఉన్నవారైనా సరే వారానికి కనీసం మూడు లేదా నాలుగు సార్లు బరువులు ఎత్తే వ్యాయామాలు (వెయిట్ లిఫ్టింగ్) చేయాలని కూడా సూచించారు. ఇలా కార్డియోని పెంచుకుంటే మెరుగైన ఫలితాలు అందుకోవడమే గాక ఆటోమేటిగ్గా బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు కువార్ కపూర్. View this post on Instagram A post shared by Kuwar Kapur (@fitnessbykuwar)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పదవిలో ఉండగా తండ్రైన తొలి ఉపాధ్యక్షుడు..హాట్టాపిక్గా ఆ శాపం..!)
పదవిలో ఉండగా తండ్రైన తొలి ఉపాధ్యక్షుడు..హాట్టాపిక్గా ఆ శాపం..!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ దంపతులు నాలుగో బిడ్డకు స్వాగతం పలికారు. ఆయన సతీమణి ఉషా వాన్స్ ఆదివారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు జేడీ వాన్స్ స్వయంగా తెలిపారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని, తన ముగ్గురు పిల్లలు తమ్ముడిని చూసి సంతోషిస్తున్నారని ఆయనే ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే ఇలా పదవిలో ఉండగా ఉపాధ్యాక్షుడి కుటుంబంలో ఒక చిన్నారి జన్మించడం 156 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడంతోనే ఈ విషయం అందర్నీ తెగ ఆకర్షిస్తోంది. ఎందుకంటే గత శతాబ్దల కాలంలో.. పదవిలో ఉన్న ఏ ఉపాధ్యాక్షుడికి ఇలా పిల్లలు కలగకపోవడంతో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.రీజన్ ఏంటంటే..జేడీ వాన్స్లా పదవిలో ఉండగా పండంటి బిడ్డకు స్వాగతం పలికిన చివరి అమెరికా ఉపాధ్యక్షుడు స్కైలర్ కోల్ఫాక్స్. అప్పటి అధ్యక్షుడు యులిసెస్ ఎస్. గ్రాంట్ హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న కోల్ఫాక్స్, తన రెండవ భార్య ఎల్లెన్ మారియా కోల్ఫాక్స్లు స్కైలర్ కోల్ఫాక్స్ జూనియర్ అనే మగబిడ్డకు జన్మనిచ్చారు. కానీ కోల్ఫాక్స్ తర్వాత వచ్చిన ఉపాధ్యక్షులందరూ బాధ్యతలు స్వీకరించే సమయానికి వయసు పైబడినవారు కావడం, లేదా పూర్తి కుటుంబం ఉండటం లేదా టీనేజ్పిల్లలు ఉండటం/వ్యక్తిగత కారణలు తదితరాలేనని చెప్పొచ్చు. అందుకు ఉదాహారణగా గతంలో ఎన్నికైన ఉపాధ్యాక్షులును పరిశీలిస్తే..2021 నుంచి 2025 వరకు జో బైడెన్ హయాంలో ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన కమలా హారిస్, ప్రమాణ స్వీకారం చేసే సమయానికి 56 ఏళ్ల వయసు. అంతకుముందు, 2017 నుంచి 2021 వరకు డొనాల్డ్ ట్రంప్ హయాంలో మైక్ పెన్స్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 57 ఏళ్ల వయసు. అంతకుముందు, బరాక్ ఒబామా హయాంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు (వారి పదవీకాలం 8 ఏళ్లు). ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు 46 ఏళ్ల వయసు. అప్పటికే ఆయనకు నలుగురు పిల్లలు ఉండటంతో, ఆ తర్వాత ఆయనకు పిల్లలు కలగలేదు. బైడెన్కు ముందు, జార్జ్ డబ్ల్యూ. బుష్ హయాంలో డిక్ చెనీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ పదవీకాలం కూడా 8 ఏళ్లే. చెనీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 60 ఏళ్ల వయసులో ఉన్నారు. ఆయనకు అప్పటికే ఇద్దరు కుమార్తెలు. మళ్లీ 156 ఏళ్ల తర్వాత అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ పదవిలో ఉండగా తండ్రైనా తొలి ఉపాధ్యక్షుడిగా అరుదైన రికార్డు సృష్టించారు. ఇది యాదృచ్ఛికమైనదే అయినా..ఈ ఘటనతో నాటి అధ్యక్షుడి శాపం కథలు తెరమీదకు వచ్చాయి. అలా ఎన్నికైన ప్రతి అధ్యక్షుడు..అధ్యక్షుడి శాపంగా పిలిచే దీన్ని 'టిప్పకానూ శాపం' (curse of Tippecanoe) అని పిలుస్తారు. దీని వెనుక ఉన్న జానపద కథనం ప్రకారం..'0'తో ముగిసే సంవత్సరంలో లేదా 20తో భాగించబడే సంవత్సరంలో ఎన్నికైన ప్రతి అమెరికా అధ్యక్షుడు పదవిలో ఉన్నప్పుడే మరణిస్తారని నమ్ముతారు (ఈ రెండు అంశాలు ఒకదానికొకటి సరిపోలుతాయి). ఈ నమ్మకం, శాపం మూలాలు 1811 నాటి టిప్పకానూ యుద్ధం నాటివి. అప్పుడు షానీ తెగ నాయకుడు టెకుమ్సే సోదరుడు టెన్స్క్వటవా, విలియం హెన్రీ హారిసన్ను శపించారు. హారిసన్ 1840లో ఎన్నికయ్యారు - ఏడాది తర్వాత న్యుమోనియాతో మరణించారు. అబ్రహం లింకన్ 1860లో ఎన్నికయ్యారు. ఆయన 5 ఏళ్ల తర్వాత హత్యకు గురయ్యారు. జేమ్స్ ఎ. గార్ఫీల్డ్, విలియం మెకిన్లీలకు కూడా అదే గతి పట్టింది. వరుసగా 1880, 1900లో ఎన్నికై, అధ్యక్ష పదవి చేపట్టిన ఏడాది లోపే హత్యకు గురయ్యారు. రూజ్వెల్ట్ 1940లో ఎన్నికయ్యారు. ఆయన ఐదేళ్ల తర్వాత మెదడులో రక్తస్రావం (cerebral hemorrhage) కారణంగా మరణించారు. చివరికి, 1960లో జాన్ ఎఫ్. కెన్నెడీ ఎన్నికయ్యారు. ఆయన సరిగ్గా మూడేళ్ల తర్వాత హత్యకు గురయ్యారు. ఈ శాపం నిజమా అంటే..అది ఆయా వ్యక్తుల వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన అంశం. కానీ ఇప్పుడు అమెరికా వాసుల దృష్టి అంతా 2040లో ఎన్నికయ్యే అమెరికా అధ్యక్షుడిపైనే ఉండటం విశేషం. ఎందుకంటే అది 21వ శతాబ్దంలో కూడా ఈ 'శాపం నిజమవుతుందా లేదా అనే ఆసక్తితో వేచిచూస్తున్నారు. ఏదీ ఏమైనా ఇలాంటివి కాస్త గమ్మత్తుగా ఫన్నీగా అనిపిస్తున్నా.. ఆ కథలన్నీ వ్యక్తిగత నమ్మకాలకు సంబంధించినదే అంటూ కొట్టిపారేస్తున్నారు మానసిక నిపుణులు.(చదవండి: సాధారణ బైక్ నుంచి బీఎండబ్ల్యూ రేంజ్కి..! వైరల్గా ఎన్నారై పోస్ట్)
అంతర్జాతీయం
ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి
ఆస్ట్రేలియాకు చెందిన 34 ఏళ్ల జెనిటార్ సా నా’అమోవానా ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈమె ఇటీవల నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. నలుగురూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటికే నలుగురు చిన్న పిల్లలను పెంచుతున్న ఆ దంపతుల ఇల్లు ఈ నలుగురు పాపల రాకతో మొత్తం ఎనిమిది మంది సభ్యుల కుటుంబంగా మారింది. కానీ ఈ సంతోషకరమైన పరిణామం రాత్రికి రాత్రే వారికి సరికొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది.నలుగురు ఆడపిల్లలు పుట్టడం తల్లిదండ్రులు తాము మర్చిపోలేని ఆశీర్వాదంగా అభివర్ణించారు. కానీ వారిని సంరక్షించేందుకు ఆర్థిక వనరులు అవసరమం. ముఖ్యంగా డైపర్లు, ఫార్ములా పాలు, బట్టలు లాంటి రోజువారీ ఖర్చులు ఊహించని భారమే. అయితే ఒకేసారి నలుగురు నవజాత శిశువులను పోషించేందుకు స్నేహితులు, అభిమానులు మొదట్లో చాలా సాయంగా నిలిచారు. మరికొంతమంది ఆ దంపతుల పట్ల ప్రశంసలు కురిపిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇంత పెద్ద కుటుంబాన్ని నిర్వహించే క్రమంలో సమాజం నుండి లభిస్తున్న ఈ మద్దతు వారికి ఎంతో విలువైందిగా మారింది.అయితే వీరికి ఇంకో సమస్య వచ్చి పడింది. వీళ్లందరితో ప్రయాణించేందుకు ప్రస్తుతం ఉన్న కారులో అందరూ సురక్షితంగా కూర్చోవడానికి సరిపడా సీట్లు లేవు. ఆసుపత్రి పర్యటనలు, స్కూల్ డ్రాప్లు, ఇతర ప్రయాణాలు సులభంగా సాగేందుకు 10 సీట్ల వ్యాన్ (10-seater van)అవసరం ఉంటుందని ఆ కుటుంబం భావిస్తోంది. అలాంటి వ్యాన్ను కొనుగోలు చేయడానికి ఆ తల్లి ఆన్లైన్లో విరాళాల సేకరణను (fundraising) ప్రారంభించడం విశేషంగా నిలిచింది. తమ ఏడుగురు పిల్లలందరికీ సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి సరైన వాహనం, వనరులు ఉన్నాయని నిర్ధారించుకోవడమే ఆ కుటుంబం తక్షణ లక్ష్యంగాపెట్టుకుంది.డాక్టర్ అలెక్సా బెండాల్ ఏమన్నారంటేమోనోజైగోటిక్ క్వాడ్రప్లెట్స్ (ఒకే ఫలదీకరణం చెందిన అండం నుండి ఏర్పడిన ఒకేలా ఉండే నలుగురు శిశువులు) ప్రపంచంలోనే అత్యంత అరుదైన గర్భధారణ రకాల్లో ఒకటి. నామోనా విషయంలో విశేషం ఏమిటంటే, ఆమెకు పుట్టిన ఈ నలుగురు శిశువులకు ఒకే మాయ (placenta) అని నామెనాకు వైద్యం చేసిన డాక్టర్, రాయల్ బ్రిస్బేన్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్కు చెందిన ఫీటల్ మెడిసిన్,ప్రసూతి వైద్యురాలు డాక్టర్ అలెక్సా బెండాల్ తెలిపారు. 1.5 కోట్ల కేసుల్లో ఒకరికి మాత్రమే జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఒకటి రెండు కేసులు ఉండి ఉండవచ్చు కానీ ఆస్ట్రేలియాలో తమకు తెలిసినంత వరకు ఇదే ఏకైక కేసు అని చెప్పారు. View this post on Instagram A post shared by Brisbane Times (@brisbane_times) ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్.
ఏం జరుగుతోంది ఇక్కడ?
ఇక్కడ నత్తల రన్నింగ్ రేస్ జరుగుతోంది! మీరు విన్నది నిజమే.. నడవడానికే బద్దకించే నత్తలు ఇక్కడ ఏకంగా ‘పరుగులు’తీస్తున్నాయి! యూకేలోని కాంగామ్లో జరిగిన ప్రపంచ నత్తల పరుగు పోటీలో వివిధ దేశాలకు చెందిన నత్తలు పాల్గొన్నాయి. ఫుల్బాల్ ప్రపంచ కప్ గెలవకపోయినా.. ఇంగ్లండ్ జట్టు ఇక్కడ ఏకంగా స్పెయిన్, అర్జెంటీనా, ఫ్రాన్స్కు చెందిన క్రీడాకారులను ఓడించి.. ప్రపంచ కప్ను ఎగరేసుకుపోయింది. ఈ టీంకు చెందిన స్విఫ్ట్ అనే నత్త ఉసేన్ బోల్ట్ పూనినట్లుగా పరుగులు తీసి.. 13 అంగుళాల దూరాన్ని.. జస్ట్ 3 నిమిషాల 30 సెకన్లలో అధిగమించి.. చాంపియన్గా నిలిచింది.ఇంత తక్కువ టైంలో అంటే.. మామూలుస్పీడా మరి.. నిజానికి ఈ విభాగంలో ప్రపంచ రికార్డు ఆర్చీఅనే నత్త పేరు మీదఉంది. 1995లో జరిగిన పోటీలో 2 నిమిషాల్లో13 అంగుళాల దూరాన్ని అధిగమించింది.ఈ పోటీలు 60 ఏళ్లుగా జరుగుతున్నాయి.ఈసారి చాంపియన్షిప్లో 270 నత్తలు పాల్గొన్నాయి.
నెతన్యాహుకు ట్రంప్ కవచం.. అమెరికా గడ్డపై అది అసాధ్యం!
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ‘అరెస్ట్ వ్యవహారం’ అమెరికాలో ఈసారికి రాజకీయ దుమారం రేపుతోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో.. న్యూయార్క్ పర్యటనకు వస్తే నెతన్యాహును అరెస్ట్ చేసే అవకాశం ఉందని నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు స్వయానా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి కౌంటర్ ఇచ్చారు.‘‘బెంజమిన్ నెతన్యాహు అమెరికాలో ఎక్కడా, ఎప్పుడూ అరెస్ట్ కాబోరు’’ అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల కోసం నెతన్యాహు న్యూయార్క్కు వచ్చే అవకాశం ఉండటంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.‘అరెస్ట్ చేయాలనే ప్రశ్నే లేదు’.. ట్రంప్ స్పష్టంనెతన్యాహు అమెరికా పర్యటనపై చర్చ జరుగుతున్న వేళ.. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అమెరికా భూభాగంలో ఇజ్రాయెల్ ప్రధానిని అరెస్ట్ చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని పేర్కొన్నారు. ఇటీవల ఇరాన్తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ పాత్రను కూడా ట్రంప్ ప్రశంసించారు. అయితే న్యూయార్క్ మేయర్ మమ్దానీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆయన వ్యాఖ్యలకు సమాధానంగానే ట్రంప్ ప్రకటన వెలువడినట్లు భావిస్తున్నారు.మమ్దానీ వ్యాఖ్యలతో మొదలైన వివాదంన్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నెతన్యాహు నగరానికి వస్తే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలిస్తున్నామని తెలిపారు. ‘‘నెతన్యాహు ది హేగ్లో ఉండాల్సిన వ్యక్తి’’ అని వ్యాఖ్యానించిన ఆయన.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపై వారెంట్ జారీ చేసిందని గుర్తుచేశారు. అయితే అదే సమయంలో చట్టాలకు లోబడే తాము పనిచేస్తామని కూడా మమ్దానీ స్పష్టం చేశారు. రాజకీయ అభిప్రాయాల ఆధారంగా కాకుండా.. న్యూయార్క్ చట్టాలు, అమెరికా నిబంధనల ప్రకారమే నిర్ణయం ఉంటుందని తెలిపారు.ఐసీసీ వారెంట్ చుట్టూ వివాదంగాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు సంబంధించి ఆరోపణలపై 2024లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఐసీసీకి తమపై అధికార పరిధి లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా.. అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఐసీసీని ఏర్పాటు చేసిన రోమ్ ఒప్పందంలో భాగస్వాములు కావు. దీంతో ఐసీసీ వారెంట్లను అమలు చేయాల్సిన చట్టపరమైన బాధ్యత అమెరికాకు లేదని నిపుణులు చెబుతున్నారు.ఇజ్రాయెల్ ఆగ్రహంమమ్దానీ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా స్పందించింది. ఐసీసీని ‘నకిలీ న్యాయస్థానం’గా అభివర్ణిస్తూ.. నెతన్యాహుపై జారీ చేసిన వారెంట్ అసంబద్ధమని పేర్కొంది. మమ్దానీ దేశీయ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది.సెప్టెంబర్ పర్యటనపై ఉత్కంఠప్రతి ఏడాది సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలకు ప్రపంచ దేశాల నేతలు న్యూయార్క్కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు గత రెండేళ్ల పర్యటనల సందర్భంగా.. ఇలాంటి చర్చే నడుస్తూ వస్తోంది. అరెస్ట్ భయంతోనే ఆయన ప్రత్యామ్నాయ మార్గాల్లో.. అతి గోప్యంగా న్యూయార్క్కు చేరుకుంటున్నారనే చర్చా జరుగుతోంది. అంతేకాదు.. ఐరాసలోనూ ఆయనకు ‘నిరసన గళం’తో చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. మామ్దానీ కామెంట్ల నేపథ్యంలో ఈసారి పర్యటనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఐసీసీ వారెంట్.. మరోవైపు అమెరికా రక్షణగా నిలవడం.. ఇంకోవైపు న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలు.. ఈ పరిణామాలతో నెతన్యాహు అమెరికా పర్యటన అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అంతర్జాతీయ వేదికపై పాక్ పరువు పాయే!
న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ)పై కెనడా విదేశాంగ మంత్రితో పాకిస్తాన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఐడబ్ల్యూటీతో పాటు, కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కెనడాను కోరారు. అయితే కెనడా విదేశాంగ మంత్రితో జరిగిన ఈ సమావేశం అనంతరం ఇరు దేశాల సంయుక్త ప్రకటనలో సింధు జలాల ఒప్పందం గానీ, కశ్మీర్ అంశం గానీ ఎక్కడా ప్రస్తావనకు రాలేదు.అంతర్జాతీయ వేదికలపై నిత్యం భారత్పై నిందలు మోపే పాకిస్తాన్ ప్రయత్నాలకు కెనడాలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెనడా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆ దేశ విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోందని, దీనిపై అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కశ్మీర్ వివాదంలోనూ మధ్యవర్తిత్వం వహించాలని కోరినట్లు సమాచారం.అయితే, దౌత్య సంబంధాల పరంగా పాక్ అభ్యర్థనలను కెనడా పెద్దగా పట్టించుకోలేదని స్పష్టమైంది. భేటీ ముగిసిన తర్వాత విడుదల చేసిన అధికారిక సంయుక్త ప్రకటనలో కశ్మీర్, సింధు జలాల వివాదం గురించి కనీసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. దీంతో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ మరోమారు పరువు తీసుకున్నట్లయ్యింది.ఇది కూడా చదవండి: అభిషేక్ బెనర్జీకి హైకోర్టు షాక్ .. కంటి చికిత్సకు సలహా!
జాతీయం
ఆలయ ఆవరణలో త్రిష-విజయ్ల ఫ్లెక్సీ.. కేసు నమోదు
తమిళనాడులో ఫ్లెక్సీ కలకలం రేగింది. సేలం జిల్లా ఆత్తూర్లో ఏర్పాటు చేసిన ఓ ఆలయ ఉత్సవ బ్యానర్ వివాదానికి దారితీసింది. ఆ బ్యానర్లో ప్రముఖ నటి త్రిషను అమ్మవారి రూపంలో చిత్రించడం, ఆ పైన తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్ ఫొటోను కూడా ‘సిగ్నేచర్ ఫోజు’తో ఉంచడంపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.పెరియా మారియమ్మన్ ఆలయ ఆడి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఫ్లెక్సీలో త్రిష అమ్మవారి గెటప్లో కూర్చున్నట్లు ఉంది. ఆ పైన విజయ్ అసెంబ్లీలో చేసిన సిగ్నేచర్ ఫోజుతో ఉన్నారు. ఆ పక్కనే ఇద్దరు అభిమానుల ఫొటోలు చెరో వైపు ఉన్నాయి. కొందరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినీ నటిని దేవతా రూపంలో చూపించడం సరైంది కాదన్నారు. వివాద నేపథ్యంలో రాత్రికి రాత్రే బ్యానర్ను అక్కడి నుంచి తొలగించారు. ఆ ప్లేస్లో మరొకటి ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే తమ దాకా విషయం రావడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. అనుమతి లేకుండా బ్యానర్ ఏర్పాటు చేయడం, అందునా అభ్యంతరకరంగా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యానర్ ఏర్పాటు చేసిన దుకాణ యజమాని గోకుల్, దానిని అమర్చిన చంద్రుపై చర్యలకు సిద్ధమయ్యారు. వాళ్లిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. విజయ్-త్రిష ఫొటోలపై చర్చఇటీవల తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చల్లో నిలుస్తున్నాయి. ఎన్నికల ముందే వీళ్ల బంధం బయటపడడం, ఎన్నికల విజయంపై విజయ్కు త్రిష అభినందనలు తెలియజేయడం, ప్రమాణస్వీకారం నాడు చేసిన హడావిడి.. పుట్టినరోజు వేడుక జరపడం ఇలా ఉండగానే ఈ నేపథ్యంలో ఆలయ ఉత్సవ బ్యానర్లో ఇద్దరి ఫొటోలు కలిసి కనిపించడం మరోసారి ఆసక్తిని రేపింది. అదే సమయంలో ఆలయ ఉత్సవాల్లో సినీ ప్రముఖుల ఫొటోలను విచ్చలవిడగా వాడడం, అభిమానుల బ్యానర్ సంస్కృతిపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.
గాంధీ నుంచి సోనమ్ వాంగ్చుక్ వరకు..
దేశంలో ఆహార నిరాకరణ అనేది కేవలం ఒక నిరసన కానే కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఒత్తిడి పెంచే ఒక చరిత్రక మార్గం. అధికార పీఠాల ముందు న్యాయం కోసం గళమెత్తిన గొంతులు విస్మరణకు గురైనప్పుడల్లా, అహింసాత్మక ఆయుధమైన ‘నిరాహార దీక్ష’ వ్యవస్థల పునాదులను కదిలించింది. నాటి మహాత్మా గాంధీ ఆమరణ నిరాహార దీక్షలనుంచి నేటి సోనమ్ వాంగ్చుక్ పోరాటం వరకు.. ఆహార పానీయాలను త్యాగం చేయడం అనేది నైతిక బలానికి నిదర్శనంగా నిలిచింది. భారతదేశంలో చర్చనీయాంశంగా నిలిచిన చారిత్రక నిరాహార దీక్షలు..ఇరోమ్ షర్మిల: అత్యంత సుదీర్ఘ పోరాటం మణిపూర్ ‘ఐరన్ లేడీ’గా పేరొందిన ఇరోమ్ చాను షర్మిల.. 2000లో మాలోమ్లో జరిగిన మారణహోమం తర్వాత సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, చరిత్రాత్మక దీక్ష చేపట్టారు. ప్రపంచ చరిత్రలోనే ఇది సుదీర్ఘ నిరాహార దీక్షగా నమోదైంది. ఈ సమయంలో ప్రభుత్వం ఆమెను అదుపులోకి తీసుకుని, ద్రవ ఆహారాన్ని అందిస్తూ ప్రాణాలు నిలిపింది. ఆగస్టు 2016లో ఆమె రాజకీయ మార్గంలో పోరాడేందుకు దీక్ష విరమించారు. ఈ పోరాటం వృథా పోలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తింది. దీని ప్రభావంతో తదంతర కాలంలో ప్రభుత్వం అనేక ప్రాంతాల నుంచి సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని పాక్షికంగా తొలగించింది.స్వామి నిగమానంద్: గంగానది రక్షణ కోసంహరిద్వార్ వద్ద గంగానది ఉనికిని కాపాడేందుకు, అక్రమ మైనింగ్, స్టోన్ క్రషర్లకు వ్యతిరేకంగా మాతృసదన్కు చెందిన సంత్ స్వామి నిగమానంద్ 2011 ఫిబ్రవరి 19న దీక్ష ప్రారంభించారు. దాదాపు 115 రోజుల పాటు ఆహారం లేకుండా పోరాడిన ఆయన, 2011 జూన్ 13న ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన అత్యున్నత త్యాగం దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలను, పౌరులను కదిలించింది. ఇది సమాజంలో పర్యావరణ పరిరక్షణ భావనను బలంగా నాటింది.జీడీ అగర్వాల్ (స్వామి జ్ఞానస్వరూప్ సానంద్)ఐఐటీ కాన్పూర్ పూర్వ ప్రొఫెసర్, కేంద్ర కాలుష్య నియంత్రణ మౌలిక విభాగానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ జీడీ అగర్వాల్ గంగానది నిర్మలత్వం, నిరంతర ప్రవాహం కోసం ‘గంగా సంరక్షణ చట్టం’ తేవాలని డిమాండ్ చేస్తూ 2018 జూన్ 22న దీక్ష చేపట్టారు. 111 రోజుల కఠిన ఉపవాసం తర్వాత 2018 అక్టోబర్ 11న రుషీకేశ్లో ఆయన కన్నుమూశారు. ఒక విద్యావంతుడైన శాస్త్రవేత్త పర్యావరణం కోసం ప్రాణాలర్పించడం అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రకృతి వినాశనంపై పెద్ద ప్రశ్నగా మారింది.జతిన్ దాస్, భగత్ సింగ్: లాహోర్ జైలులో..1929లో లాహోర్ సెంట్రల్ జైలులో స్వాతంత్య్ర సమరయోధులు జతిన్ దాస్, భగత్ సింగ్ వారి సహచరులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. జైలులోని భారతీయ ఖైదీలపై జరుగుతున్న జాత్యహంకారం, అమానుష ప్రవర్తన, నాసిరకం ఆహారానికి నిరసనగా ఈ దీక్ష సాగింది. 63 రోజుల పాటు అన్నపానీయాలు లేకుండా పోరాడి, 1929 సెప్టెంబర్ 13న జతిన్ దాస్ ప్రాణాలర్పించారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ ఖైదీలకు రాజకీయ ఖైదీల హోదా ఇచ్చేందుకు, జైలు నిబంధనల్లో మార్పులు తెచ్చేందుకు దిగివచ్చింది.మహాత్మా గాంధీ: సబర్మతి, యరవాడల నుంచి..జాతిపిత మహాత్మా గాంధీ తన జీవితకాలంలో 17 సార్లు నిరాహారదీక్షలు చేశారు. అందులో 1933లో అస్పృశ్యతా నివారణ, దళితుల ఉద్ధరణకు మద్దతుగా చేసిన 21 రోజుల ఆత్మశుద్ధి ఉపవాసం అత్యంత ప్రధానమైనది. గాంధీజీకి నిరాహార దీక్ష కేవలం రాజకీయ ఒత్తిడి సాధనం కాదు. అది ఆత్మపరిశీలన, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా అంతరాత్మ పిలుపు. ఆయన ఉపవాసాలు కుల అహంకారాన్ని దెబ్బతీసి, స్వాతంత్య్ర సంగ్రామంలో సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేశాయి.అన్నా హజారే: అవినీతికి వ్యతిరేకంగా..2011లో న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే చేసిన నిరాహార దీక్ష దేశంలోని యువతను, మధ్యతరగతిని రోడ్లపైకి తెచ్చింది. దేశంలో అవినీతి నిరోధానికి బలమైన ‘జన్ లోక్పాల్ చట్టం’ తేవాలని డిమాండ్ చేస్తూ ఆయన 12 రోజులు చారిత్రక దీక్ష చేశారు. ఈ పోరాట ధాటికి పార్లమెంట్ ప్రత్యేక తీర్మానం చేయాల్సి వచ్చింది.సోనమ్ వాంగ్చుక్లద్ధాఖ్ పర్యావరణ వ్యవస్థ, స్థానికులకు ఆరో షెడ్యూల్ కింద రాజ్యాంగ హక్కుల కల్పన కోసం సోనమ్ వాంగ్చుక్ చేసిన పోరాటం మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష నీట్ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా సాగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, యువతకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 'కాక్రోచ్ జనతా పార్టీ' ప్రారంభించిన ఈ ఉద్యమంలో సోనమ్ వాంగ్చుక్ చేరారు.చట్టం ఏం చెబుతోంది?భారత రాజ్యాంగం శాంతియుత నిరసన తెలిపే హక్కును కల్పిస్తుంది. అయితే ఇది పరిమితులు లేని హక్కు కాదు. నిరసన వల్ల ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగితే పరిపాలనా యంత్రాంగం జోక్యం చేసుకోవచ్చు. దీక్ష చేపట్టినవారి ఆరోగ్యం క్షీణించిన సందర్భాల్లో వైద్య సదుపాయం అందించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. భారత్లోనే కాకుండా ఐర్లాండ్, బ్రిటన్, అమెరికా, టర్కీ వంటి అనేక దేశాల్లోనూ ఖైదీలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ సంస్థలు నిరాహార దీక్షలను ఆశ్రయించాయి.ఇది కూడా చదవండి: టీవీల ముందు జనసంద్రం.. రోడ్లపై నిశ్శబ్దం!
భార్య, పిల్లలను కడతేర్చి ఆత్మహత్య
కర్ణాటక : జిల్లాలోని హుణసూరు పట్టణంలో హృదయ విదారక సంఘటన జరిగింది. ఓ వ్యక్తి భార్యను, ఇద్దరు పిల్లలను హత్య చేసి, తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలే కారణమని అనుమానాలున్నాయి. వివరాలు... పట్టణంలోని న్యూ మారుతి బరంగాయ్కు చెందిన హరీష్ (49), భార్య నిష్ఠ (36), పిల్లలు నిక్షా (12), రక్ష (8)తో నివసిస్తున్నాడు. ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేసే హరీష్ , మూడు రోజుల క్రితం తన తల్లిని వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాడు. సోమవారం రాత్రి కింది అంతస్తులో తన భార్య, పిల్లల ముక్కులకు, నోళ్లకు ప్లాస్టర్ అతికించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత మొదటి అంతస్తుకు వెళ్లి ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగిందని అనుమానిస్తున్నారు. ఇరుగుపొరుగు అనుమానంతో.. మంగళవారం ఉదయం 9 గంటలైనా తలుపులు తెరవకపోవడతో ఇరుగుపొరుగు వారు కిటికీలోంచి చూసి ఏదో జరిగిందని కనుగొన్నారు. పట్టణ పోలీసులకు తెలుపగా తలుపులు బద్ధలుకొట్టి లోపలకు ప్రవేశించారు. నలుగురి మృతదేహాలు కనిపించాయి. అక్కడ లభించిన డెత్ నోట్ను స్వా«దీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫలానా ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయో, ఎవరికి ఇవ్వాలో అందులో రాశాడు. పూర్తి లేఖ బయటకు రాలేదు. ఇరుకుటుంబాల బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి.
కూటమిలో తిరుగుబాటు.. యంగెస్ట్ చైర్పర్సన్కు బిగ్ షాక్!
దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్పర్సన్ దియా బినుకి(21) బిగ్ షాక్ తగిలింది. ప్రతిపక్ష ఎల్డీఎఫ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో.. కేవలం ఏడు నెలలకే ఆమె పదవికి ముగింపు పడింది. అయితే ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ సభ్యుల క్రాస్ ఓటింగ్ కారణంగానే ఆమె కుర్చీని వీడాల్సి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేరళ కొట్టాయం జిల్లా పాలా మున్సిపాలిటీలో 26 మంది సభ్యులున్నారు. మున్సిపల్ కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 17 మంది ఓటు వేశారు. దీంతో అవసరమైన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు రావడంతో తీర్మానం ఆమోదం పొందింది. ఈ పరిణామం అధికార యూడీఎఫ్కు భారీ ఎదురుదెబ్బగా మారింది.కాంగ్రెస్ తిరుగుబాటుతోనే.. పాలా మున్సిపాలిటీలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్కు చెందిన నలుగురు కౌన్సిలర్లు పార్టీ విప్ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం దియా ఓటమికి కారణమైంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు బిజు మాథ్యూస్, టోనీ థైపరంబిల్, లిస్సీకుట్టి మాథ్యూ, రాజిత ప్రకాశ్లు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. డిప్యూటీ చైర్పర్సన్ మాయా రాహుల్ కూడా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. తమకు పార్టీ విప్ అందలేదని తిరుగుబాటు కౌన్సిలర్లు చెబుతూ.. స్థానిక ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.ఎవరీ దియా బిను పులిక్కకండం?21 ఏళ్ల దియా బిను పులిక్కకండం దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్పర్సన్గా రికార్డు సృష్టించారు. చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఎకనామిక్స్ చదివిన ఆమె.. ఉన్నత చదువులకు సిద్ధమవుతున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం తన తండ్రి బిను పులిక్కకండం, మేనమామ బిజు పులిక్కకండంతో కలిసి స్వతంత్ర వర్గంగా ఏర్పడ్డారు. ఈ మూడు సభ్యుల బ్లాక్కు యూడీఎఫ్ మద్దతు ఇవ్వడంతో గత డిసెంబర్లో దియా పాలా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు.యూడీఎఫ్కు అధికారం తెచ్చిన కుటుంబ బ్లాక్పాలా మున్సిపాలిటీలో సుదీర్ఘకాలంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న కేరళ కాంగ్రెస్(ఎం)కు వ్యతిరేకంగా బిను పులిక్కకండం రాజకీయంగా ఎదిగారు. స్వతంత్ర వర్గం కీలకంగా మారడంతో యూడీఎఫ్కు మున్సిపల్ పీఠం దక్కింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్, పులిక్కకండం కుటుంబం మధ్య విభేదాలు పెరిగాయి. పలు పాలనా నిర్ణయాలు, రాజకీయ అంశాలపై ఇరు వర్గాల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.వివాదాల తర్వాత అవిశ్వాస తీర్మానండీవైఎఫ్ఐ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం వంటి అంశాలపై కాంగ్రెస్, దియా వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల కాంగ్రెస్ కౌన్సిలర్ బిజు మాథ్యూస్పై దియా ఫిర్యాదు చేయడం కూడా వివాదానికి దారితీసింది. తన కార్యాలయం నుంచి ఖరీదైన వాచ్, కొన్ని అధికారిక ఫైళ్లు కనిపించకుండా పోయాయని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బిజు మాథ్యూస్ ఖండించారు."ప్రజాస్వామ్య తీర్పును గౌరవిస్తున్నా"పదవి కోల్పోయిన అనంతరం దియా బిను స్పందించారు. ప్రజాస్వామ్య తీర్పును గౌరవిస్తున్నానని తెలిపారు. తనపై అవినీతి, నిధుల దుర్వినియోగం, లంచాలు, బంధుప్రీతి లేదా చట్ట ఉల్లంఘన వంటి ఎలాంటి నిరూపిత ఆరోపణలు లేవని చెప్పారు. "నా పదవీకాలంలో పారదర్శకత, చట్టబద్ధత, ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాను. పదవులు తాత్కాలికం.. విలువలు శాశ్వతం" అని దియా పేర్కొన్నారు.పాలా మున్సిపాలిటీ భవిష్యత్పై ఉత్కంఠదియా తొలగింపుతో పాలా మున్సిపాలిటీలో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో తదుపరి పాలనపై ఉత్కంఠ నెలకొంది. అవిశ్వాస తీర్మానంతో యూడీఎఫ్ పాలన ముగియగా.. ఎల్డీఎఫ్ మద్దతుతో కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ఎన్ఆర్ఐ
డబ్లిన్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐర్లాండ్ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో డబ్లిన్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్, వైఎస్సార్ జీవిత విశేషాలను ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో–విజువల్ ప్రదర్శన, నాయకుల ప్రసంగాలు, విందుతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ గ్లోబల్ ఎన్ఆర్ఐ వింగ్ అధ్యక్షులు ఆలూరి సాంబశివ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి హాజరై, వైఎస్సార్తో తమకున్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన మధుర స్మృతులను పంచుకున్నారు. అలాగే పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందేశాన్ని అందరికీ చేరవేస్తూ, పార్టీ ఆశయాలు, వైఎస్సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐర్లాండ్ కన్వీనర్ కిషోర్ ఆకేపాటి మాట్లాడుతూ, పార్టీని మరింత బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, సేవా కార్యక్రమాల ద్వారా వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఐర్లాండ్లోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు, ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రవాస తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్: ప్రధాని మోదీ
ఆక్లాండ్: భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్.. అంతర్జాతీయ వృద్ధికి భారత్ ప్రయోగాల వేదిక అంటూ ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్-న్యూజిలాండ్' సరికొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉందన్న మోదీ.. ఇరు దేశాల ముందు ‘అపారమైన అవకాశాల సముద్రం’ ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయాణ విజయానికి అసలైన దిశానిర్దేశకులు ఈ ప్రవాస భారతీయులేనంటూ పేర్కొన్నారు. ఈ దేశం నలుమూలలా భారతీయులు ఉన్నారని.. ఈ ప్రయాణం విజయవంతమవుతుందనే నమ్మకం ఉందన్నారు.న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఇరుదేశాల ప్రధానుల చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్ సహా పలు అంశాల్లో మరిన్ని అవకాశాలపై భారత్ ఫోకస్ పెట్టింది. ఇరుదేశాల స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ రోడ్ మ్యాప్-2030 ఆవిష్కరించారు. భారత్, న్యూజిలాండ్ దేశాలు శనివారం (జూలై 11, 2026) తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ల మధ్య జరిగిన చర్చల అనంతరం, 2030 నాటికి ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వస్తు, సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి రూ.35,000 కోట్లకు చేర్చాలని ఐదేళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.ఈ సమావేశం ద్వారా 10 ఒప్పందాలతో కలిపి మొత్తం 18 నిర్దిష్ట ఫలితాలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా రాబోయే నాలుగేళ్లలో సంబంధాలను విస్తరించుకోవడానికి ఒక రోడ్మ్యాప్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర సహకారాన్ని పెంపొందించుకోవడానికి కార్యాచరణ, భారత నౌకాదళం, న్యూజిలాండ్ రక్షణ దళాల మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందాలు జరిగాయి.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న దూకుడు నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో సహకారాన్ని విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా సాగిన మోదీ మూడు దేశాల పర్యటనలో ఆక్లాండ్ చివరి విడత. నిన్న రాత్రి ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఇటీవల భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) తర్వాత ఈ పర్యటన జరగడం విశేషం. కాగా, హాకాతో ప్రధాని మోదీకి సంప్రదాయ స్వాగతం పలికారు. మావోరి సంప్రదాయ నృత్యం హాకాతో మోదీ గౌరవ వందనం స్వీకరించారు. హాకా కళాకారులను ప్రధాని మోదీ అభినందించారు.
అమెరికాలో బెజవాడ యువతిని హత్య చేసిన భర్త
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడకు చెందిన సబ్బినేని రజిత గతేడాది అక్టోబర్ 27న అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ బెల్వ్యూ పోలీసులు జరిపిన విచారణలో..రజితను అమె భర్త నార్నే అవినాష్ చంపాడని వెల్లడవడంతో కేసును హత్య కేసుగా మార్చారు. గాయత్రీనగర్కు చెందిన సబ్బినేని కృష్ణారావుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రజితను గతేడాది తెలంగాణకు చెందిన నార్నే అవినాష్ కు ఇచ్చి హైదరాబాద్లో పెళ్లి చేశారు. జులైలో ఈ జంట అమెరికాలోని వాషింగ్టన్కు వెళ్లిపోయారు. పెళ్ళికి ముందుగానే అవినాష్కు భారత్కు చెందిన మరో మహిళతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ కారణంగా రజితను చంపాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. భార్యను ఎలా చంపితే పోలీసులకు దొరక్కుండా ఉంటారనే విషయంపై ఇంటర్నెట్లో వెతికాడు. గాలి ఆడకుండా చేస్తే ఎంత సమయానికి మనిషి ప్రాణాలు పోతాయనే విషయాలను వెతికి, గతేడాది అక్టోబర్ 27న రజితను గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. వెంటనే మృతదేహాన్ని ఫొటో తీసి తన ప్రియురాలికి వాట్సాప్లో పంపాడు. రజిత బాత్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుందని, ఎంత పిలిచినా రావడం లేదని పోలీసులకు ఫోన్ చేసి అవినాష్ చెప్పాడు. పోలీసులు వచ్చేలోపే రజిత అపస్మారకస్థితిలో పడిఉంది. వైద్యులు పరిశీలించి ఆమె మరణించిందని చెప్పారు. ఆ సమయంలోనే రజిత మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డిజిటల్ ఫోరెన్సిక్స్ ద్వారా రజితను ష్ష్ చంపాడని గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రజిత తల్లిదండ్రులు అమెరికాకు బయలుదేరారు. అమెరికా పోలీసులు అవినా షను అరెస్ట్ చేశారు.
శంకరనేత్రాలయ అమెరికా సలహామండలి సభ్యుడిగా లక్ష్మీనరసింహన్ వాసన్
లాస్ ఏంజెలెస్: లాస్ ఏంజెలెస్: శంకర నేత్రాలయ సంస్థ అమెరికా సలహా మండలి (అడ్వైజరీ బోర్డు) సభ్యుడిగా లక్ష్మీ నరసింహన్ వాసన్ను నియమితులయ్యారు. అమెరికన్ కిచెన్ ఎక్విప్మెంట్ రంగంలో స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ఎన్నో సమాజ సేవ, దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. ఆయనను ప్రతీష్టాత్మకమైన అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా నియమించామని సంస్థ అధ్యక్షులు బాలరెడ్డి ఇందుర్తి తెలియచేశారు.ఈ సందర్భంగా శంకర నేత్రాలయ యూఎస్ఏ నాయకత్వ బృందం, ఇతర సలహా మండలి సభ్యులు, శంకర నేత్రాలయ ఇండియా అధ్యక్షులు డాక్టర్ గిరీష్ రావు తదితరులు లక్ష్మీ నరసింహన్ వాసన్, ఆయన సతీమణి డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్కు స్వాగతాభినందనలు తెలియచేశారు. లక్ష్మీ నరసింహన్ వాసన్ తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని పసూర్ గ్రామంలో జన్మించి, హైదరాబాద్లో పెరిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ పట్టా పొందిన అనంతరం, 1981లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగి, ఇటీవల దక్షిణ కాలిఫోర్నియాలోని రాయల్ కిచెన్ ఎక్విప్మెంట్ కంపెనీ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి (CEO)గా సేవలందించారు.ఆయనకు క్రీడారంగంలో కూడా విశిష్టమైన ప్రస్థానం ఉంది. అమెరికాకు వెళ్లే ముందు ఆయన భారతదేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్గా రాణించి, హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలోని జట్టులో మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, శివలాల్ యాదవ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు సభ్యులుగా ఉన్నారు. భారతదేశంలో జరిగిన వివిధ క్రికెట్ మ్యాచ్లలో కూడా పాల్గొన్న ఆయన, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, ఎస్. వెంకటరాఘవన్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి మైదానాన్ని పంచుకున్నారు.లక్ష్మీ నరసింహన్ వాసన్ 1988లో డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ కార్తీక్ వాసన్ వైద్య పరిశోధనలో పీహెచ్డీ. పూర్తి చేయగా, కుమార్తె మయూరి వాసన్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలిగా గుర్తింపు పొందారు.దాతృత్వ సేవలను జీవిత ధ్యేయంగా భావించిన లక్ష్మీ నరసింహన్, భారతదేశం, అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఇటీవల శంకరనేత్రాలయా సంస్థకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళంతో, శంకరనేత్రాలయ సంస్థ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతంలో పూర్తిస్థాయి సౌకర్యాలతో కూడిన మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల మధ్యప్రదేశ్, సమీప ఐదు రాష్ట్రాల పేదప్రజలకు కంటిచూపు సంబందించిన వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. ఈ యూనిట్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు మరింత విస్తృతంగా అందించే అవకాశం కల్పిస్తుంది.శంకర నేత్రాలయ యూఎస్ఏ వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ ఎమిరిటస్ ఎస్ వి ఆచార్య, పద్మభూషణ్ డాక్టర్ జగదీశ్ సేథ్, ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శ్రీమతి లీల క్రిష్ణమూర్తి , డాక్టర్ రాజ్ మోదీ, డాక్టర్ కిశోర్ చివుకుల , ఉదయ భాస్కర్ గంటి, శ్యామ్ అప్పలి, శ్రీ మూర్తి రేకపల్లి, వంశీకృష్ణ ఏరువరం, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, వాసన్ కుటుంబం అందిస్తున్న విశేష దాతృత్వ సేవలను, సంకర నేత్రాలయ లక్ష్య సాధనకు వారు అందిస్తున్న సహకారాన్ని హృదయపూర్వకంగా అభినందించారు.
క్రైమ్
ఒంటరిగా వెళ్తున్నయువతిని ఎత్తుకెళ్ళి అత్యాచారం..!
కర్ణాటక: రాత్రి ఒంటరిగా వెళ్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన యువతిని కారులో అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మైసూరు జిల్లాలోని టి. నరసిపుర తాలూకాలోని ముగురు గ్రామం వద్ద జరిగింది. ఈ కేసులో టి.నరసిపురలో బట్టల దుకాణదారు రిహాన్ ఖాన్, హౌసింగ్ బోర్డ్వాసి కిషోర్ కుమార్, హెలవర హుండి గ్రామానికి చెందిన కిరణ్ అలియాస్ హుచ్చాను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. బెంగాల్కు చెందిన 30 ఏళ్ల యువతి, టి.నరసిపుర పట్టణంలో అద్దె ఇంట్లో నివసిస్తూ, ఒక చాట్ సెంటర్లో పనిచేస్తోంది. ఆమె 19న రాత్రి పార్టీ ఉందంటే మైసూరులో స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తిరిగి బస్టాండులో దిగి నడిచి వస్తుండగా, కారులో వచ్చిన నిందితులు ఆమెను ఏదో చిరునామా అడిగారు, తనకు తెలియదని చెప్పగా, బలవంతంగా ఎక్కించుకున్నారు. పలు లాడ్జిలు తిప్పుతూ చివరకు ముగురు గ్రామం సమీపంలో ఉన్న ఒక లాడ్జికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్ ఫోన్తో పాటు రూ. 5 వేలు దోచుకున్నారు. రూ.లక్ష ఇవ్వాలని బెదిరించి రూ.లక్ష ఇవ్వాలని దుండగులు డిమాండ్ చేశారని బాధితురాలు తెలిపింది. డబ్బు ఇంట్లో ఉందని, తీసుకెళ్తే ఇస్తానని చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లారని ఆమె పేర్కొంది. బాధితురాలు కారు దిగి వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని సహాయం కోసం కేకలు వేసింది. దీంతో నిందితులు పారిపోయారు. ఇంటి యజమాని సహాయంతో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల ఆధారంగా కారును సీజ్ చేసి, నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి మంగళవారం తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
భార్య, పిల్లలను కడతేర్చి ఆత్మహత్య
కర్ణాటక : జిల్లాలోని హుణసూరు పట్టణంలో హృదయ విదారక సంఘటన జరిగింది. ఓ వ్యక్తి భార్యను, ఇద్దరు పిల్లలను హత్య చేసి, తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలే కారణమని అనుమానాలున్నాయి. వివరాలు... పట్టణంలోని న్యూ మారుతి బరంగాయ్కు చెందిన హరీష్ (49), భార్య నిష్ఠ (36), పిల్లలు నిక్షా (12), రక్ష (8)తో నివసిస్తున్నాడు. ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేసే హరీష్ , మూడు రోజుల క్రితం తన తల్లిని వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాడు. సోమవారం రాత్రి కింది అంతస్తులో తన భార్య, పిల్లల ముక్కులకు, నోళ్లకు ప్లాస్టర్ అతికించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత మొదటి అంతస్తుకు వెళ్లి ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగిందని అనుమానిస్తున్నారు. ఇరుగుపొరుగు అనుమానంతో.. మంగళవారం ఉదయం 9 గంటలైనా తలుపులు తెరవకపోవడతో ఇరుగుపొరుగు వారు కిటికీలోంచి చూసి ఏదో జరిగిందని కనుగొన్నారు. పట్టణ పోలీసులకు తెలుపగా తలుపులు బద్ధలుకొట్టి లోపలకు ప్రవేశించారు. నలుగురి మృతదేహాలు కనిపించాయి. అక్కడ లభించిన డెత్ నోట్ను స్వా«దీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫలానా ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయో, ఎవరికి ఇవ్వాలో అందులో రాశాడు. పూర్తి లేఖ బయటకు రాలేదు. ఇరుకుటుంబాల బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి.
మద్యం మత్తులో వేధిస్తున్న కుమారుడిని హత్యచేసిన తల్లి
చల్లపల్లి: తాను ఏరోజైతే బిడ్డకు జన్మనిచ్చిందో అదే రోజు ఆ తల్లి కొడుకుని కొట్టి చంపింది. మంగళవారం పోలీస్స్టేషన్కు వెళ్లి విషయం చెప్పింది. కృష్ణాజిల్లా, చల్లపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చల్లపల్లి పడమర వీధిలో నివాసం ఉంటున్న మోతుకూరి నాగమణికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు శివ ఏసీ రిపేర్ పని చేసుకుంటూ కొన్నేళ్లుగా దూరంగా వేరే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. నాగమణి పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్(35) వద్దే ఉంటోంది. అతడు ముఠాపని, డెలివరీ బాయ్గా పని చేస్తుంటాడు. మద్యానికి బానిసైన దుర్గాప్రసాద్ తరచూ తల్లితో గొడవపడేవాడు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి కూడా ఇంట్లో తల్లీకొడుకులు ఇద్దరూ వాదులాడుకున్నారు. తెల్లారిన తరువాత నాగమణి తన పనులు చేసుకుంటూ ఇరుగుపొరుగు వారితో సాధారణంగానే మాట్లాడింది. 10.30 గంటల సమయంలో పోలీస్స్టేషన్కు వెళ్లింది. రాత్రి తాను, తన కొడుకు దుర్గాప్రసాద్ గొడవ పడ్డామని, సహనం నశించి బలమైన వస్తువుతో కొట్టగా తన కొడుకు చనిపోయాడని పోలీసులకు చెప్పింది. అవాక్కయిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా దుర్గాప్రసాద్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు.తలపై ఇనుప రాడ్డుతో కొట్టిన గాయాలు ఏడు నుంచి తొమ్మిది వరకూ గాట్లు ఉన్నట్లు తెలిసింది. చల్లపల్లి పోలీసులు వివరాలు, ఆధారాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేశారు. మృతుడు దుర్గాప్రసాద్ ఫేస్బుక్ అకౌంట్లో దొరికిన వివరాలను బట్టి అతను జూలై 20, 1991న జన్మించాడు. పుట్టిన రోజునాడే జన్మనిచ్చిన తల్లి చేతిలోనే దుర్గాప్రసాద్ హతమయ్యాడు.
రాళ్లతో కొట్టి వైఎస్సార్సీపీ బీఎల్ఏ హత్య
కనగానపల్లి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గూండాల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లిలో మంగళవారం వైఎస్సార్సీపీ బీఎల్ఏ అంకె నగేష్ (42)ను టీడీపీ సానుభూతి పరులు రాళ్లతో దాడి చేసి చంపేశారు. ఇచ్చిన బాకీ అడిగినందుకు.. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంకె లక్ష్మన్న సోదరుడు అంకె నగేష్ కనగానపల్లిలో వైఎస్సార్సీపీ తరఫున బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)గా పనిచేస్తున్నాడు. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్న నగేష్ అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అంకె మురళికి కొంత నగదు అప్పుగా ఇచ్చాడు. రెండేళ్లుగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవటంతో రెండు రోజుల క్రితం నగేష్ వారి ఇంటికి వెళ్లి అడిగాడు. ఈ సందర్భంలోనే మురళీ కుటుంబ సభ్యులు నగేష్ తో గొడవకు దిగారు. ‘‘నీకు డబ్బులు ఇచ్చేది లేదు’’ అని తేల్చి చెప్పారు. దీంతో వారిపై మంగళవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటానికి నగేష్, తన అన్న కుమారుడు అంకె పురుషోత్తంతో కలిసి వెళ్తుండగా మురళి, అతని కుటుంబ సభ్యులు కాపు కాసి రాళ్లు, ఇటుక పెళ్లలతో దాడి చేశారు. నగేష్కు ఛాతీ, తలపై గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఘటనలో పురుషోత్తం తలకు కూడా తీవ్ర గాయమైంది. సమీపంలో ఉన్న నగేష్ బంధువులు అక్కడికి చేరుకొని గాయపడ్డ ఇద్దరినీ ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన నగేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య రాధమ్మ, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకుని పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కనగానపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నగేష్ హత్యతో కనగానపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నగేష్ హత్యకు ఆర్థికలావాదేవీలే కారణంగా కనిపిస్తున్నా.. ఇందులో రాజకీయ దురుద్దేశాలూ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. నగేష్ పార్టీ బీఎల్ఏగా గ్రామంలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులూ వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో వారు ముందుకు రాకూడదన్న ఉద్దేశంతోనే టీడీపీ సానుభూతిపరులు నగేష్ హత్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వడ్ల దస్తగిరి బాబు, నితీష్, వంశీ, వన్నూరప్ప, మురళి, సురేష్, అక్కులప్ప, నాగమణి, జ్యోతి, అఖిల, లక్షి్మదేవిలపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.
వీడియోలు
10 వేలతో 9 లక్షలు.. ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్
గుంటూరు మహిళపై దాడి.. అనిత, పవన్ కు ఇచ్చిపడేసిన మహిళా నేతలు
2027 వరల్డ్ కప్.. రోహిత్, కోహ్లి ఫిక్స్.. షమీ, సిరాజ్ రీఎంట్రీ
అమెజాన్ డేటా సెంటర్ పై ఇరాన్ మెరుపు దాడులు
చిన్నబాబు కట్టుబట్టల కథ.. వీకెండ్ వస్తే గచ్చిబౌలి ఫ్లైట్
మరో కొత్త జీవో..! ప్రభుత్వ ఉద్యోగుల పని ఖతం..?
రౌడీ షీటర్ సూరి హత్య కలకలం.. చంపింది నేనే..!
రాహుల్ కి ముక్కు నుంచి రక్తస్రావం
నేడు పొగాకు రైతులతో YS జగన్ భేటీ
హైకోర్టులో AP పోలీసులకు బిగ్ షాక్


