ఈ రాశి వారికి ధన, ఆస్తి లాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు,శ్రావణ మాసం, తిథి: శు.అష్టమి రా.9.50 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: విశాఖ ఉ.11.02 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: ప.3.25 నుండి 5.10 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.57 నుండి 10.48 వరకు, తదుపరి ప.2.59 నుండి 3.49 వరకు,అమృత ఘడియలు: రా.1.54 నుండి 3.40 వరకు.సూర్యోదయం : 5.46సూర్యాస్తమయం : 6.21రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం.. కొత్తగా చేపట్టిన పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.వృషభం... శుభకార్యాలకు హాజరవుతారు. ఆత్మీయులతో చర్చలు. పరిచయాలు విస్తృతమవుతాయి. దైవదర్శనాలు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.మిథునం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా కొనసాగుతాయి. వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.కర్కాటకం... మిత్రులు, సోదరులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.సింహం....... వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. నిరుద్యోగులు, విద్యార్థులకు నిరాశ. ఆరోగ్యభంగం. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.కన్య.... అనుకోని పరిచయాలు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.తుల.... రుణభారాలు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.వృశ్చికం.... పలుకుబడి పెరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో వృద్ధి. ఉద్యోగాలలో కొంత అనుకూలత.ధనుస్సు... లేనిపోని వివాదాలు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు కొంత నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.మకరం..... పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. ధన, ఆస్తి లాభాలు. విద్యార్థులకు కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.కుంభం... కష్టానికి ఫలితం దక్కించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తుల కొనుగోలు యత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.మీనం... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు.
ఆరోగ్య పరిశోధనకు అనారోగ్య మార్గం?
ఆరోగ్య పరిశోధనా శాఖ ఇటీవల ఒక జాతీయ ఆరోగ్య పరిశోధనా విధానాన్ని ప్రతిపాదించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ విభాగం దాదాపు రెండు దశాబ్దాలుగా మనుగడలో ఉన్నప్పటికీ, ఆరోగ్య పరిశోధనకు సంబంధించి దేశానికి ఇంతవరకు ఒక కట్టుదిట్టమైన విధానం ఏదీ లేదనే వాస్తవాన్ని మొదటిసారిగా ఇపుడే గుర్తించి నట్టుంది. దేశంలో ఆరోగ్య పరిశోధనకు సంబంధించి ప్రధాన బాధ్యతను భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నిర్వర్తిస్తోంది. జాతీయ పరిశోధన–అభివృద్ధికి చెందిన నిధులలో ఆ సంస్థకు కేవలం 3.3 శాతం నిధులు మాత్రమే అందుతున్నాయని 2026 జూలైలో విడుదలైన జాతీయ ‘ఆర్ అండ్ డి’ డేటా వెల్లడించింది. రక్షణకు 32 శాతం, అంతరిక్ష పరిశోధనకు 15 శాతం అందుతున్నాయి. అసలు మొత్తం ఆర్–డిపై మన జాతీయ వ్యయం, స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో చైనా (2.58 శాతం)తో పోల్చుకుంటే, నామమాత్రంగా, 0.84 శాతంగా ఉంది. బయోమెడికల్, ఆరోగ్య ఆర్–డిపై వ్యయాన్ని పెంచడం నూతన ఆరోగ్య పరిశోధనా విధాన లక్ష్యాలలో ఒకటి. ఆరోగ్య పరిశో ధనపై పెట్టుబడిని జీడీపీలో ఇపుడున్న 0.024 శాతం నుంచి 2037 నాటికి 0.072 శాతానికి, 2047 నాటికి 0.15 శాతానికి పెంచాలని సంకల్పించారు. ఇది పెద్ద అంగగానే కనిపించవచ్చుకానీ, భారత దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లతోనూ, భవిష్యత్తులో ఉండగల వ్యాధుల భారంతోనూ పోల్చుకుంటే, ఆ వ్యయం కూడా తక్కువే. పైగా ప్రతిపాదిత పెంపుదలలు సుదూర కాలానివి. పక్షపాత పరిశోధనలకు ఊతమిస్తే?దాన్నలా ఉంచితే, ప్రతిపాదిత పెంపుదల మరింత సమస్యాయుతంగా కనిపిస్తోంది. ‘ప్రభుత్వ పెట్టుబడి క్రమేపీ పెరుగుతుంది. దానికి బాధ్యతాయుతమైన ప్రైవేటు, దాతృత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి వచ్చే పెట్టుబడి తోడవుతుంది’ అని ఆ విధానం పేర్కొంటోంది. ఆరోగ్య పరిశోధనలో ప్రైవేటు పెట్టుబడులకు ఇది అధికారికంగా ద్వారాలు తెరుస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటున్న ప్రైవేటు పెట్టుబడి స్వరూప స్వభావాలు మరింత ఆందోళనకు కారణమవుతున్నాయి. ప్రైవేటు కంపెనీల నుంచి వచ్చే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను ప్రభుత్వ సంస్థలలో ఆర్–డిపై వినియోగించేందుకు అనుమతిస్తామని ఆ విధానంలో పేర్కొన్నారు. ఈ విధానం ఇపుడున్న ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాలకు భిన్నమైనది. కోవిడ్–19 వ్యాక్సిన్ల వంటి నిర్దిష్ట ప్రాజెక్టుల కింద ఫార్మా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కొత్త ఔషధాలను లేదా టీకాలను తయారు చేస్తూ వస్తున్నాయి. అది ఫార్మా లేదా మరో కంపెనీ ఏదైనా సరే ఇచ్చే సీఎస్ఆర్ నిధులతో ఓ చిక్కు ఉంది. ఒక కంపెనీ నెలకొల్పిన దాతృత్వ సంస్థ నిధులతోనైనా కూడా ఇబ్బందే. అది పక్షపాతపూరిత పరిశోధనకు దారితీయవచ్చు. పర్యావరణ ఆరోగ్యం (వాయు కాలుష్యం, పొగాకు, ఆల్కహాల్ ప్రభావాలు), కొన్ని వృత్తి ఉద్యోగాల్లో ఆరోగ్యంపై పడే ప్రభావం, ఆహార భద్రత, వాతావరణ మార్పు వంటి వివాదాస్పద అంశాలలో జరిగే పరిశోధ నలలో రహస్య అజెండా దాగుండొచ్చు. ‘శాస్త్రీయ సందేహా’లను సృష్టించవచ్చు. కొన్ని అగ్రశ్రేణి ఆరోగ్య ఎన్జీవోలు, ప్రజారోగ్య సంస్థలు క్షేత్ర స్థాయిలో చేసే పరిశోధనా అధ్యయనాలకు విదేశీ మారక ద్రవ్య నిబంధనల పేరుతో ప్రభుత్వం ఓపక్క అడ్డంపడుతూ, మరోపక్క ఆరోగ్య పరిశోధనలు నిర్వహించేందుకు పరిశ్రమలకు, విదేశీ ఫౌండేషన్లకు ద్వారాలు తెరవడం విడ్డూరం. విశ్వాసాలకు శాస్త్రీయ ముసుగుఈ మొత్తం విధానం ఆరోగ్య పరిశోధనను అన్ని స్థాయుల్లోనూ అధికార యంత్రాంగంతో ముడిపెడుతూ కేంద్రీకృతం చేసేదిగా ఉంది. జాతీయ ఆరోగ్య పరిశోధనా అజెండా స్థూల స్థాయిలో ప్రాధాన్యాలను నిర్దేశిస్తుందనీ, అ అజెండాను మూడు అంచెల పాలనా వ్యవస్థ అమలుజరుపుతుందనీ కొత్త విధానం చెబుతోంది. నూతన ఆరోగ్య పరిశోధనా సారథ్య కమిటీ అత్యున్నత స్థాయిలో ఉండి, వ్యూహాత్మక దిశా నిర్దేశాన్ని అందిస్తుంది. దానికి ముఖ్య శాస్త్రీయ సలహా మండలి నేతృత్వం వహిస్తుంది. దానిలో ప్రభుత్వాధికారులు (వైజ్ఞానిక శాఖల కార్యదర్శులు) సభ్యులుగా ఉంటారు. రెండవ అంచెలో ఆరోగ్య పరిశోధనా విభాగం సెంట్రల్ నోడల్ ఇంప్లిమెంట్ ఏజెన్సీగా పనిచేస్తుంది. శాస్త్రీయ–సాంకేతిక అమలు బాధ్యతలను మూడవ అంచెలో భారతీయ వైద్య పరిశోధనా మండలికి అప్పగిస్తారు. ప్రజారోగ్యం ప్రాథమికంగా రాష్ట్రాల జాబితాలోకి వస్తుంది. వైద్య విద్య–పరిశోధన ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. కానీ, ప్రతిపాదిత పాలనా వ్యవస్థ రాష్ట్రాల పాత్రను తగ్గించేదిగా ఉంది. ఆరోగ్య పరిశోధనా అజెండాను కేంద్ర సారథ్య కమిటీకి అప్పగించడం వల్ల రాష్ట్రాల పాత్ర కేవలం అమలు చేయవలసినదిగా మారు తుంది. ప్రతిపాదిత ఆరోగ్య పరిశోధనా విధానం మరో ముఖ్యమైన మార్పునకు సంకేతంగా నిలుస్తోంది. ‘సమీకృత ఆరోగ్యం’ ముసుగులో ఆధునిక వైద్యానికి ఉద్దేశించిన పరిశోధనా నిధులను ఆయుర్వేదం, ఇతర వైద్య విధానాలను అనుసరించే సంస్థలు కూడా వినియోగించుకోవచ్చు. నిజానికి, అటువంటి సంస్థలు ఆయుష్ మంత్రిత్వ శాఖ, అది నిర్వహిస్తున్న యంత్రాంగాల నుంచి పరిశోధనా నిధులను ఇప్పటికే అందుకుంటున్నాయి. ఇది తిరిగి పాత పద్ధతులు, విశ్వాసాలు, అభిప్రాయాలను ధ్రువీకరించే ఉద్దేశంతో చేసే పరిశోధనలకు ఊతం ఇస్తుంది. గోమూత్రం వంటివి ఆధునిక పరిశోధనకు లోనవుతాయి. శాస్త్ర–సాంకేతిక పరిశోధన శాఖ వంటి ఇతర పరిశోధనా ఏజెన్సీలు ఇస్తున్న నిధులతో అటువంటి ప్రాజెక్టులు ఇప్పటికే నడుస్తున్నాయి. రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా...మన దేశం భౌగౌళికంగా, సాంస్కృతికంగా మాత్రమే వైవిధ్య భరితమైనది కాదు. దాని ఆరోగ్య అవసరాలు కూడా భిన్నమైనవి. వివిధ చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండటంలో తారతమ్యాలున్నాయి. బిహార్ లేదా ఒడిశా వంటి రాష్ట్రాలతో పోలిస్తే కేరళ ఆరోగ్య సవాళ్ళు పూర్తిగా భిన్నమైనవి. ‘పైనుంచి–కింద’కు అనే అజెండాను రాష్ట్రాలు అమలు చేయక తప్పని స్థితిని కల్పించే బదులు, రాష్ట్రాలు వాటి ప్రాధాన్యాలు, అవసరాల ఆధారంగా సొంత ఆరోగ్య పరిశోధనా మౌలిక వసతులను అభివృద్ధి చేసు కునేలా నిధుల రూపంలో చేయూతనందిస్తే బాగుంటుంది. ఆరోగ్య పరిశోధన అంటే కేవలం కొత్త టెక్నాలజీలను పరీక్షించడం లేదా కొత్త టీకాలు, మందులను తయారు చేయడమే కాదు; పరిశోధన ఫలితాలు ఆరోగ్య విధానాలు, బడ్జెట్లకు దారి చూపాలి. ఆరోగ్య పరిశోధన ఒక నిరంతర, గతిశీల ప్రక్రియ. అది సామాజిక–ఆర్థిక అంశాలతో సన్నిహితంగా ముడిపడి ఉంటుంది. పట్టణాల్లో ఉండే పేదలు, గిరిజనులు వంటి అనేక బడుగు, బలహీన వర్గాల ఆరోగ్య సమస్యలు తరచు పరిశీలనకు నోచుకోవడం లేదు. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో వైద్య కళాశాలలను తెరిచారు. తమతమ ప్రాంతాల్లో ఉండే ఆరోగ్య సమస్యలపై పరిశోధన సాగించే విధంగా వాటికి దిశా నిర్దేశం చేయాలి. ఆరోగ్య పరిశోధనకు అంకితమైన ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే పరిశోధన అజెండాను రూపొందించేందుకు కేంద్రీకృత విధానాన్ని అనుసరించడం, ప్రైవేటు రంగానికి ప్రముఖ పాత్ర కల్పించడం, ఆధునిక వైద్య పరిశోధనా అజెండాకు సమీకృత సంప్రదాయ వైద్యాన్ని జోడించడం వంటివాటితో ఈ విధానం తీసుకుంటున్న దిశ మాత్రమే అనారోగ్యకరంగా కనిపిస్తోంది.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
ఐపీవోలకు గ్రే మార్కెట్ జోష్
కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగుతుంటే.. మరోపక్క ప్రైమరీ మార్కెట్లు పలు ఇష్యూలతో సందడి చేస్తున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందనను అందుకోవడంతోపాటు.. లాభాల లిస్టింగ్తో ఐపీవో మార్కెట్లో జోష్ పెంచుతున్నాయి. ఫలితంగా కొత్త ఇష్యూలకు గ్రే(అనధికార అన్లిస్టెడ్) మార్కెట్లో ప్రీమియం పెరుగుతోంది. వెరసి ఇన్వెస్టర్లకు బస్ మిస్సవుతున్నామన్న ఆందోళన(ఫోమో) పెరిగి దరఖాస్తు చేసేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా లిస్టయిన షిప్రాకెట్ ఇష్యూ ధర రూ. 97కాగా.. రూ. 143 వద్ద నిలిచింది. రూ. 285 ధరతో పోలిస్తే బెహారీలాల్ ఇంజనీరింగ్ రూ. 503 వద్ద స్థిరపడింది. ఇక ప్రస్తుతం మిల్కీ మిస్ట్ డెయిరీ(రూ. 140) తాజాగా 10 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ. 200 వద్ద ఫ్రీజయ్యింది. ఈ బాటలో మాల్బియో(రూ. 807) రూ. 1,177కు ఎగసి రూ.1,037 వద్ద ముగిసింది. ధూత్ ట్రాన్స్మిషన్(రూ. 871) రూ. 1,404 వద్ద, టెక్నోక్రాఫ్ట్(రూ. 212) రూ. 315 వద్ద, ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్(రూ. 425) రూ. 570 వద్ద ముగిశాయి. అనధికార ప్రీమియం...ఇటీవల పలు కంపెనీలు లాభాలతో లిస్టవుతుండటంతో ఐపీవోకు వచ్చే కంపెనీల షేర్లు ముందుగా ట్రేడయ్యే అనధికార(గ్రే) మార్కెట్లో ప్రీమియం పలుకుతున్నాయి. ఫలితంగా కొత్త ఇష్యూలకు చిన్న ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. దీంతో షిప్రాకెట్కు రిటైలర్ల విభాగంలో 46 రెట్లు, బెహారీ లాల్కు 53 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఈ బాటలో ఆగ్మంట్, టెంప్సన్స్, సన్షైన్ పిక్చర్స్, స్కైవేస్ ఎయిర్, లలితా జ్యువెలరీ ఇష్యూలకు గ్రే మార్కెట్లో ప్రీమియం ధర పలుకుతోంది. ఐపీవో వేవ్...రూ. 2,600 కోట్ల సమీకరణ లక్ష్యంగా హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్, రూ. 1,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో లలితా జ్యువెలరీ ఐపీఓలు బుధవారం(19న) ముగిశాయి. ఈ బాటలో నేడు(గురువారం) షేరుకి రూ. 88–93 ధరల శ్రేణితో ఆభరణ వర్తక సంస్థ శంకేష్ జ్యువెలర్స్, రూ. 342–360 ధరల శ్రేణితో టీవీ ప్రొడక్షన్ సంస్థ సన్షైన్ పిక్చర్స్ ఐపీవోలు ముగియనున్నాయి. మరో 4 కంపెనీలు...గజా క్యాపిటల్ బ్రాండ్తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ ఐపీవో బుధవారం(19న) ప్రారంభమైంది. ఇందుకు ధరల శ్రేణి షేరుకి రూ. 152–160కాగా.. తద్వారా రూ. 550 కోట్లు అందుకునే యోచనలో ఉంది. టెంప్సన్స్ ఇన్స్ట్రుమెంట్స్(ఇండియా) ఐపీవో నేడు(20న) ప్రారంభంకానుంది. రూ. 825 కోట్ల సమీకరణ కోసం గోల్డ్ అండ్ సిల్వర్ ప్లాట్ఫామ్.. ఆగ్మంట్ ఎంటర్ప్రైజెస్ రేపు(21న) పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ బాటలో సోమవారం(24న) లాజిస్టిక్స్ కంపెనీ స్కైవేస్ ఎయిర్ సరీ్వసెస్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా రూ. 583 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. గత వారం ఐదు కంపెనీలు ఐపీవోలు చేపట్టగా.. ఈ నెల మొదట్లో మరో మూడు కంపెనీలు నిధుల సమీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో 2026లో లిస్టింగ్ బాట పట్టిన కంపెనీల సంఖ్య 55కు చేరనుంది. రెండు లిస్టింగ్లు సూపర్ హిట్..! ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకొని, సెకండరీ మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన రెండు కంపెనీల షేర్లు లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. ‘షిప్రాకెట్ లిమిటెడ్’ షేరు ఇష్యూ ధరతో పోలిస్తే 48% పెరగ్గా, ‘బెహరీలాల్ ఇంజనీరింగ్’ షేరు సైతం ఏకంగా 76% ప్రీమియంతో మెరిసింది. ‘షిప్ రాకెట్’ మ్యాజిక్ ..! టేమాసెక్, జొమాటోల పెట్టుబడులున్న ఈ–కామర్స్ ప్లాట్ఫామ్ ‘షిప్రాకెట్’ షేరు తొలి రోజే దూసుకెళ్లింది. ఇష్యూ ధర (రూ.97)తో పోలిస్తే బీఎస్ఈలో 34% ప్రీమియంతో రూ.130 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ అనిశి్చతుల్లోనూ ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. చివరికి 48% లాభంతో రూ.143 గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,441 కోట్లకు చేరింది. బెహరీలాల్ భళా..! ఐరన్, స్టీల్ తయారీ సంస్థ ‘బెహరీలాల్ ఇంజనీరింగ్’ షేరు మెప్పించింది. ఇష్యూ ధర (రూ.285)తో పోలిస్తే బీఎస్ఈలో 61% ప్రీమియంతో రూ.458 వద్ద లిస్టయ్యింది. ఒకానొక దశలో 89% శాతం ఎగబాకి రూ.537 గరిష్టాన్ని అందుకుంది. చివరకు 76% లాభంతో రూ.503 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,125.91 కోట్లుగా నమోదైంది. లలితా జ్యువెలరీ.. భేష్ఐపీవోకు 63 రెట్లు స్పందన రూ. 190–201 ధరల శ్రేణిలో ఐపీవోకు వచి్చన లలితా జ్యువెలరీకి ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. ఇష్యూ జ్యువెలరీ కంపెనీలలోనే అత్యధికంగా 63 రెట్లు సబ్్రస్కయిబ్ అయ్యింది. 6,27,61,403 షేర్లు ఆఫర్ చేయగా.. 395 కోట్ల షేర్లకుపైగా బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 145 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 74 రెట్లు, రిటైలర్ల నుంచి 12 రెట్లు చొప్పున దరఖాస్తులు లభించాయి. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,700 కోట్లు సమీకరించింది. ఈ నెల 24న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్
పాక్ 171 ఆలౌట్
లీడ్స్: బ్యాటర్లు విఫలమవడంతో ఇంగ్లండ్ పర్యటనను పాకిస్తాన్ జట్టు పేలవంగా ప్రారంభించింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోరుకే పరిమితమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా లీడ్స్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 48.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజమ్ జట్టుకు దూరం కాగా... సల్మాన్ ఆఘా పాకిస్తాన్ టీమ్ను నడిపించాడు. భారీ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్లో అబ్దుల్లా షఫీఖ్ (104 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... ఇమాముల్ హక్ (42; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 91 పరుగులు జోడించారు. పేస్కు అనుకూలిస్తున్న పిచ్పై ఇంగ్లండ్ బౌలింగ్ ధాటిని ఎదుర్కోవడంలో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా తడబడింది. అజాన్ అవైస్ (0), షాన్ మసూద్ (5), సౌద్ షకీల్ (5), సల్మాన్ ఆఘా (21), మొహమ్మద్ రిజ్వాన్ (12), అలీ ఉస్మాన్ (0) పెవిలియన్కు క్యూకట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ 51 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... జోష్ టంగ్ 46 పరుగులు ఇచ్చి 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన రాబిన్సన్ నిప్పులు చెరిగే బంతులతో టాపార్డర్ను కకావికలం చేయగా... టంగ్ లోయర్ ఆర్డర్ పని పట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు... బుధవారం ఆట ముగిసే సమయానికి 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్ (15), ఎమిలియో గే (33; 7 ఫోర్లు) అవుట్ కాగా... జోర్డాన్కాక్స్ (38 బంతుల్లో 23 బ్యాటింగ్; 4 ఫోర్లు), కెప్టెన్ జో రూట్ (53 బంతుల్లో 37 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, మొహమ్మద్ అలీ చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న ఇంగ్లండ్... తొలి ఇన్నింగ్స్లో ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 59 పరుగుల దూరంలో ఉంది.
డీఎస్సీ నియామకాలపై అనుమానాలు
మోసాలపై చర్చ మొదలైంది
పాక్ 171 ఆలౌట్
సింధు ముందంజ
ఆసియా స్వర్ణమే లక్ష్యం
ఖాకీ వనంలో ‘గంజాయి’!
రెండు చరణాలకే కట్టుబడతాం
మెరిసిన తెలంగాణ స్విమ్మర్లు
'ఇరుముడి'లో పాత్ర నాకు చాలా ప్రత్యేకం
7 లక్షల ఎకరాలకు సాగునీరు
ఎన్నో సంస్కరణలు, అద్భుతాలు సృష్టించారు.. మీ టాలెంట్తో కరువు కనబడకుండా చేయండి సార్!
బెంగళూరు తీగల్లో స్పైడర్మ్యాన్ బందీ
కూటమి పాలనలో పోలీసు వాహనాలు కూడా ఇలా తయారయ్యాయి!!
‘ఓహో..నీకు పీరియడ్స్ సమయమా’ అని చులకనగా చూసేవాడు: అనుపమ
సాక్షి కార్టూన్: 18-08-2026
అలాంటి వాళ్లు 'బిగ్బాస్'కి రావొద్దు: నవదీప్
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
వహ్వా.. ఇక వందేభారత్ హవా!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
జల్లు పడితే.. ఇసుక చల్లుతుంది!
సినిమా గుమ్మం దాటని దేవయాని వారసురాలు
రసాయనాలతో కల్తీ నెయ్యి .. 36 టన్నులు స్వాధీనం
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
మరో 79 పరుగులు చేస్తే రూట్ ప్రపంచ రికార్డు
రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ!
శుభవార్త చెప్పిన గ్లెన్ మాక్స్వెల్
డిప్యూటీ తహసీల్దార్ సంధ్య ఆత్మహత్య
జైలు శిక్ష తప్పించుకున్న వార్నర్.. కానీ ఒక కండిషన్!
లంకపై విజయం.. గంభీర్ ప్లాన్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్!
'బాబు' అనే పిలుపే హంతకులను పట్టించింది!
డీఎస్సీ నియామకాలపై అనుమానాలు
మోసాలపై చర్చ మొదలైంది
పాక్ 171 ఆలౌట్
సింధు ముందంజ
ఆసియా స్వర్ణమే లక్ష్యం
ఖాకీ వనంలో ‘గంజాయి’!
రెండు చరణాలకే కట్టుబడతాం
మెరిసిన తెలంగాణ స్విమ్మర్లు
'ఇరుముడి'లో పాత్ర నాకు చాలా ప్రత్యేకం
7 లక్షల ఎకరాలకు సాగునీరు
ఎన్నో సంస్కరణలు, అద్భుతాలు సృష్టించారు.. మీ టాలెంట్తో కరువు కనబడకుండా చేయండి సార్!
బెంగళూరు తీగల్లో స్పైడర్మ్యాన్ బందీ
కూటమి పాలనలో పోలీసు వాహనాలు కూడా ఇలా తయారయ్యాయి!!
‘ఓహో..నీకు పీరియడ్స్ సమయమా’ అని చులకనగా చూసేవాడు: అనుపమ
సాక్షి కార్టూన్: 18-08-2026
అలాంటి వాళ్లు 'బిగ్బాస్'కి రావొద్దు: నవదీప్
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
వహ్వా.. ఇక వందేభారత్ హవా!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
జల్లు పడితే.. ఇసుక చల్లుతుంది!
సినిమా గుమ్మం దాటని దేవయాని వారసురాలు
రసాయనాలతో కల్తీ నెయ్యి .. 36 టన్నులు స్వాధీనం
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
మరో 79 పరుగులు చేస్తే రూట్ ప్రపంచ రికార్డు
రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ!
శుభవార్త చెప్పిన గ్లెన్ మాక్స్వెల్
డిప్యూటీ తహసీల్దార్ సంధ్య ఆత్మహత్య
జైలు శిక్ష తప్పించుకున్న వార్నర్.. కానీ ఒక కండిషన్!
లంకపై విజయం.. గంభీర్ ప్లాన్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్!
'బాబు' అనే పిలుపే హంతకులను పట్టించింది!
ఫొటోలు
సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు)
అబిడ్స్ ఇస్కాన్ దేవాలయం స్వర్ణోత్సవ వేడుకలు (ఫోటోలు)
భారీ ‘కల్తీ ముఠా’ గుట్టురట్టు (ఫోటోలు)
కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు)
చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు)
అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు)
సినీ నటి అయేషా ఖాన్ నిశ్చితార్థం ...? (ఫొటోలు)
అదిరిపోయే లుక్స్తో రాశి ఖన్నా.. (ఫొటోలు)
హావభావాలతో ఆకట్టుకుంటున్న అందాల తార.. (ఫొటోలు)
భార్య బర్త్డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు)
సినిమా
హంసలా ఆషికా.. మెరిసిపోతున్న ఈషా
హంసలా మెరిసిపోతున్న ఆషికా రంగనాథ్ఎర్రని డ్రస్లో అందంగా పూజా హెగ్డేరీసెంట్ ఫొటోలని షేర్ చేసిన అనసూయవైట్ డ్రస్లో జిగేలుమంటున్న ఈషా రెబ్బాఅందంగా సంప్రదాయ లుక్లో భాగ్యశ్రీక్యూట్ క్యాట్ వాక్తో అనన్య నాగళ్ల View this post on Instagram A post shared by Nagadurga Gutha (@_nagadurga_21) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja)
వెంకటేశ్-కల్యాణ్రామ్ మూవీకి క్రేజీ టైటిల్.. ‘జనవరి 12 విడుదల’
అనిల్ రావిపూడి ప్రమోషన్స్ అంటే మామూలుగా ఉండవు..తన సినిమాల ప్రచారంలోనూ కొత్తదనం చూపించే ఆయన.. తాజాగా మరోసారి తనదైన స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వెంకటేశ్, నందమూరి కల్యాణ్రామ్ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ప్రకటించే విషయంలోనూ ఓ ఫన్నీ ఐడియాను తీసుకొచ్చారు. టైటిల్తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ఒకేసారి రివీల్ చేసి ఆసక్తి పెంచారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, కల్యాణ్రామ్ హీరోలుగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్, కల్యాణ్రామ్ బావా బామ్మర్ది పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.తాజాగా చిత్రబృందం సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటించింది. ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేసింది. అంతేకాదు.. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే క్యాప్షన్ను కూడా జత చేసింది. టైటిల్ వినగానే ఇది సినిమా విడుదల తేదీ అనుకుంటే.. అదే సినిమా పేరుగా ఉండటం విశేషం.టైటిల్ ప్రకటన కోసం రూపొందించిన వీడియోలో వెంకటేశ్, కల్యాణ్రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి.. అనిల్ రావిపూడిని సినిమా పేరేంటని అడుగుతారు. అందుకు ఆయన పదే పదే ‘జనవరి 12 విడుదల’ అని చెబుతుంటారు. తొలుత అది రిలీజ్ డేట్ అని భావించిన హీరోలు.. చివర్లో అదే సినిమా టైటిల్ అని తెలుసుకుని సరదాగా స్పందిస్తారు.టైటిల్ రివీల్ వీడియోలో దర్శకుడు అనిల్ రావిపూడి ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు ప్రత్యేకంగా నివాళి అర్పించారు. ఈవీవీ తెరకెక్కించిన ‘అప్పుల అప్పారావు’లోని కామెడీ సీక్వెన్స్ను గుర్తు చేసేలా వీడియోను రూపొందించారు. ఇలా తన కామెడీ మార్క్తో పాటు పాత తరం హాస్యాన్ని కలిపి టైటిల్ అనౌన్స్మెంట్ను కూడా ఓ ఎంటర్టైనింగ్ వీడియోగా మార్చారు.సంక్రాంతి బరిలో..‘జనవరి 12 విడుదల’ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అనిల్ రావిపూడి సినిమాలకు సంక్రాంతి సీజన్తో మంచి అనుబంధం ఉండటంతో ఈ చిత్రంపైనా అంచనాలు పెరుగుతున్నాయి. వెంకటేశ్, కల్యాణ్రామ్ కాంబినేషన్, అనిల్ రావిపూడి కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీమతి ఆర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!
సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధరలను పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC)కి సంక్షేమ విరాళంగా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు స్పష్టం చేసింది.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు రాబడిపై వర్తించే 20 శాతం వాటాను ఎగ్జిబిటర్ల నుంచి సంబంధిత చిత్రాల నిర్మాతలే వసూలు చేయాలి. అనంతరం వసూలు చేసిన మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య సంక్షేమ సంఘం ఖాతాకు జమ చేయాలి. ఈ ఖాతాను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC) ద్వారా నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలు ‘అఖండ-2’, ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు పండుగకు వస్తున్నారు’, ‘పెద్ది’ చిత్రాలకు కూడా వర్తిస్తాయి.ఈ నాలుగు చిత్రాల నిర్మాతలకు ఎగ్జిబిటర్ల నుంచి 20 శాతం సంక్షేమ విరాళాన్ని వసూలు చేసి, ప్రభుత్వం సూచించిన ఖాతాలో జమ చేసే అధికారాన్ని కల్పించారు.ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్స్ ఇండియా, వృద్ధి సినిమాస్ సంస్థలకు ప్రభుత్వం లేఖలు పంపింది. సంబంధిత నిర్మాతలు ఎగ్జిబిటర్ల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసి, టీజీఎఫ్డీసీ ద్వారా నిర్వహించే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖాతాలో జమ చేయాలని హోం శాఖ ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత నిర్మాతలకు సూచించింది.
‘భగీర.. నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే’.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పెంపుడు కుక్క ‘భగీర’ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన జీవితంలో భగీరతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ‘భగీర.. నువ్వు నా జీవితంలోకి పెంపుడు శునకంలా వచ్చావు. కొంత కాలంలోనే మా కుటుంబ సభ్యుడిగా మారిపోయావు. ప్రేమ, విశ్వాసం, అల్లరితో ప్రతి రోజూ నా అలసటను దూరం చేశావు. ఇప్పుడు చెప్పలేని బాధను మిగిల్చి వెళ్లావు. నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతో ఉంటాయి’ అంటూ భగీరకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశాడు.ఎన్టీఆర్ మాటలను బట్టి చూస్తే భగీర ఆయన కుటుంబంలో ఎంతటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందో అర్థమవుతోంది. షూటింగులు, ఇతర పనులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటికి చేరుకున్న తర్వాత పెంపుడు జంతువులతో సమయం గడపడం ఎన్టీఆర్కు ఎంతో ఇష్టమట. ముఖ్యంగా భగీరతో ఆయనకు మంచి అనుబంధం ఉండేదట.అందుకే భగీరను కోల్పోవడం ఎన్టీఆర్కు తీవ్ర భావోద్వేగాన్ని కలిగించింది.ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టొచ్చని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో ఆయన కొంతకాలం షూటింగులకు దూరంగా ఉండనున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr)
క్రీడలు
పాకిస్తాన్ పర్యటనకు శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు.. షెడ్యూల్ విడుదల
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సొంత గడ్డపై వరుస సిరీస్లను నిర్వహించేందుకు సిద్ధమైంది. శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఈ ఏడాది అక్టోబర్లో పాక్ పర్యటనకు రానున్నాయి. ఆతిథ్య పాకిస్తాన్ శ్రీలంక, ఇంగ్లండ్లతో టీ20, వన్డే త్రైపాక్షిక సిరీస్లలో తలపడనుంది. అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగమైన రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ కూడా పాక్-శ్రీలంక మధ్య జరగనుంది.ఈ హోమ్ సీజన్ షెడ్యూల్లో భాగంగా తొలుత అక్టోబర్ 9 నుంచి 13వరకు పాక్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను నిర్వహించనున్నారు. ఈ సిరీస్ మొత్తానికి రావల్పిండి క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెడుతోంది.శ్రీలంక-పాక్-ఇంగ్లండ్ మధ్య వన్డే ట్రై-సిరీస్ అక్టోబర్ 18 నుండి 31 వరకు రావల్పిండి , లాహోర్ వేదికల్లో జరగనుంది. లీగ్ దశలో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. ఇక ట్రై-సిరీస్ ముగిసిన తర్వాత శ్రీలంక జట్టు పాకిస్తాన్లోనే ఉండి రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది.ఈ సిరీస్ నవంబర్ 9న రావల్పిండి వేదికగా ప్రారంభం కానుంది. దాదాపు నెలన్నర రోజుల పాటు జరగనున్న ఈ మ్యాచ్లతో పాక్ క్రికెట్ అభిమానులు పండగ చేసుకోన్నారు. పాక్ జట్టు ప్రస్తుతం మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది.పాక్ హోమ్ సీజన్ షెడ్యూల్ ఇదేశ్రీలంకతో టీ20 సిరీస్అక్టోబర్ 9: మొదటి టీ20 (రావల్పిండి )అక్టోబర్ 11: రెండవ టీ20 ( రావల్పిండి )అక్టోబర్ 13: మూడవ టీ20 ( రావల్పిండి )అక్టోబర్ 18: పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక (రావల్పిండి క్రికెట్ స్టేడియం)అక్టోబర్ 20: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం)అక్టోబర్ 22: శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం)అక్టోబర్ 25: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)అక్టోబర్ 27: పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)అక్టోబర్ 29: శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)ఫైనల్ మ్యాచ్:అక్టోబర్ 31: ట్రై-సిరీస్ ఫైనల్ (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక టెస్టు సిరీస్ నవంబర్ 4 - 6: 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ (ఇస్లామాబాద్)నవంబర్ 9 - 13: మొదటి టెస్టు (రావల్పిండి)నవంబర్ 17 - 21: రెండవ టెస్టు (లాహోర్)
పాకిస్తాన్ను చిత్తు చేసిన టీమిండియా
పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో భారత్ తిరిగి గెలుపు బాట పట్టింది. ఆమ్స్టల్వీన్ వేదికగా చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్తో జరిగిన పూల్-డి కీలక మ్యాచ్లో 5-3 తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ అద్భుత విజయంతో భారత్ రెండవ రౌండ్కు అర్హత సాధించగా.. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ మ్యాచ్ ఆరంభం నుంచే భారత జట్టు దూకుడు ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, ఫార్వర్డ్ అభిషేక్ చెరో రెండు గోల్స్తో చెలరేగారు. దీంతో మ్యాచ్ రెండో క్వార్టర్ పూర్తయ్యేసరికి భారత్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్పై పూర్తి పట్టు సాధించింది.ఆ తర్వాత మూడో క్వార్టర్లో పాక్ పుంజుకుని రెండు గోల్స్ సాధించినప్పటికి.. భారత్ వెంటనే మరో గోల్ కొట్టి 4-2 ఆధిక్యాన్ని కొనసాగించింది. చివరి క్వార్టర్లో పాక్ మరో గోల్ కొట్టి కమ్బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికి.. భారత డిఫెండర్లు మాత్రం బలంగా నిలిచారు. దీంతో దాయాది జట్టు మూడు గోల్స్కు పరిమితమై ఓటమి చవిచూడాల్సి వచ్చింది.చదవండి: IND vs SL: ఓటమి బాధలో ఉన్న శ్రీలంకకు మరో భారీ షాక్
ఓటమి బాధలో ఉన్న శ్రీలంకకు మరో భారీ షాక్
గాలే వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ఘోర ఓటమిపాలైన శ్రీలంకకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ చండీమాల్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. గాలే టెస్టు నాలుగో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా చండీమాల్ గాయపడ్డాడు. లెగ్-సైడ్ బౌండరీ వద్ద బంతిని ఆపే ప్రయత్నంలో అతడి తలకు, భుజానికి గాయమైంది. దీంతో రెండో ఇన్నింగ్స్లో దినేష్ బ్యాటింగ్కు రాలేదు. అతడి స్ధానంలో పసిందు సూరియబండార కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చాడు. అయితే ఐసీసీ రూల్ ప్రకారం.. కంకషన్కు గురైన ఆటగాడు ఖచ్చితంగా 7 రోజుల పాటు మైదానానికి దూరంగా ఉండాలి. ఈ నిబంధన కారణంగానే కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్కు చండీమాల్ అందుబాటులో లేడు. ఈ విషయాన్ని గ్యారీ కిర్స్టన్ ధ్రువీకరించాడు. "కొలంబో టెస్టుకు దినేష్ చండీమాల్ అందుబాటులో ఉండటం లేదు. కీలక ఆటగాళ్లు దూరం కావడం జట్టుకు ఎదురు దెబ్బగానే చెప్పాలి. అయితే ఇది యంగ్ ప్లేయర్లకు మంచి అవకాశం. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వారిలో ఎవరో ఒకరికి తుది జట్టులో ఛాన్స్ ఇస్తామని" కిర్స్టన్ పేర్కొన్నాడు. మరోవైపు తొలి టెస్టుకు దూరమైన యువ ఓపెనర్ పాథుమ్ నిస్సాంక.. కొలంబో టెస్టులో కూడా ఆడేది అనుమానమే
వరల్డ్ ఛాంపియన్షిప్స్ నుంచి భారత స్టార్ అనూహ్య నిష్క్రమణ
స్వదేశంలో జరుగుతున్న BWF వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 నుంచి భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ అనూహ్యంగా నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో అమెరికాకు చెందిన గారెట్ టాన్ చేతిలో 21-19, 19-21, 17-21తో ఓటమి చవిచూశాడు. తొలి గేమ్ను గెలుచుకున్న లక్ష్య.. రెండో గేమ్లో ఆధిపత్యం కొనసాగించలేకపోయాడు. టాన్ పుంజుకుని రెండో గేమ్ను గెలుచుకోవడంతో మ్యాచ్ నిర్ణాయక మూడో గేమ్కు వెళ్లింది.పోరాడినా ఫలితం దక్కలేదుమూడో గేమ్లో టాన్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఒక దశలో 11-4 ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే లక్ష్యసేన్ అద్భుతంగా పుంజుకుని వరుస పాయింట్లు సాధించాడు. స్కోరు 17-16కు చేరడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది.కీలక సమయంలో టాన్ ఒత్తిడిని జయించి వరుస పాయింట్లు సాధించాడు. దీంతో 21-17తో మూడో గేమ్ను, మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ఈ ఓటమితో ప్రపంచ ఛాంపియన్షిప్లో లక్ష్యసేన్ ప్రయాణం ముగిసింది.ఆయుష్ శెట్టి సంచలనంమరోవైపు భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి ఈ టోర్నీలో ఇప్పటికే సంచలన విజయం నమోదు చేశాడు. 21 ఏళ్ల ఆయుష్ పురుషుల సింగిల్స్లో ప్రపంచ నంబర్ వన్, చైనా స్టార్ షి యూకీని ఓడించి సంచలనం సృష్టించాడు. ఇవాళే జరుగబోయే రెండో రౌండ్లో ఆయుష్ బరిలోకి దిగనున్నాడు.సింధుపై ఆశలుభారత స్టార్ పీవి సింధు కూడా ఇవాళే తన రెండో రౌండ్ మ్యాచ్లో బరిలోకి దిగనుంది. లక్ష్యసేన్ అనూహ్య నిష్క్రమణతో నిరాశ చెందిన భారత అభిమానులకు ఇప్పుడు సింధు, ఆయుష్ శెట్టి ప్రదర్శనలపై ఆశలు పెట్టుకున్నారు.
న్యూస్ పాడ్కాస్ట్
మళ్లీ మాయోపాయం!. రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
టీచర్లపై ఇంతలా కక్షగడతారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరిద్దాం... ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
దేశ భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే... పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్య
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బిజినెస్
తెలంగాణలో మరో 10 పట్టణాల్లోకి ఉబర్
రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్ తాజాగా దేశవ్యాప్తంగా మరో 100 నగరాల్లో తమ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలోని 10 నగరాల్లో సర్వీసులు విస్తరించినట్లు సంస్థ తెలిపింది.స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ విస్తరణలో భాగంగా కొత్త ప్రయాణికులకు పరిమిత కాలం పాటు మొదటి రైడ్ను ఉచితంగా అందిస్తున్నట్లు వివరించింది. దేశీయంగా 225 నగరాల మార్కును దాటడం ద్వారా మరింత మంది ప్రయాణికులకు సర్వీసులను విస్తరించినట్లయిందని ఉబర్ ఇండియా డైరెక్టర్ రిషాంత్ ఘోష్ చెప్పారు.
ముంబై 3.0: 124 గ్రామాలతో కొత్త నగరం!
భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన ఆర్థిక నగరాల్లో ముంబై ఒకటి. ఈ నగరం ఒకప్పుడు పెరిగినంతగా.. ఇప్పుడు పెరగడానికి కావలసినంత స్థలం లేకుండా పోయింది. భూమి పరిమితంగా ఉంది, ఆస్తుల ధరలు అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా.. రోడ్లు, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ముంబై నగర భవిష్యత్ విస్తరణకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'ముంబై 3.0'గా పిలుస్తున్న కర్నాల-సాయి-చిర్నేర్ (KSC) న్యూ టౌన్ను అభివృద్ధి చేయాలని చూస్తోంది.ఈ కొత్త నగరం రాయగఢ్ జిల్లాలోని ఉరాన్, పన్వెల్, పెన్ తాలూకాల్లోని 124 గ్రామాలను కలుపుకుని సుమారు 323.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి కానుంది. ఈ ప్రాంతానికి 'ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ' (MMRDA)ను న్యూ టౌన్ డెవలప్మెంట్ అథారిటీగా నియమించారు. అంటే.. ఇది సాధారణంగా ఏర్పడే కొత్త నివాస ప్రాంతం కాదు.. ముందస్తు ప్రణాళికతో నిర్మించే ఒక పెద్ద నగరమన్నమాట.ముంబై 3.0 ఎందుకు అవసరం?ముంబై ఇప్పటికే తన అసలు ప్రాంతాన్ని దాటి విస్తరించింది. ఆ తర్వాత నవి ముంబై ఒక ప్రధాన ప్రత్యామ్నాయ నగరంగా అభివృద్ధి చెందింది. కానీ.. నవి ముంబైలో కూడా భూమికి డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల భవిష్యత్తులో పెరిగే జనాభా, ఉద్యోగాలు, పరిశ్రమలు, గృహ అవసరాలను తీర్చడానికి మరో పెద్ద పట్టణ కేంద్రం అవసరమైంది.ముంబై 3.0 ప్రాజెక్టులో కేవలం కొత్త భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా.. ఉద్యోగాలు, నివాసాలు, పరిశ్రమలు, విద్య, వైద్యం, టెక్నాలజీ, లాజిస్టిక్స్ వంటి అన్ని రంగాలను ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేసి, సమగ్ర నగరంగా రూపొందించాలని భావిస్తున్నారు.ప్రణాళిక ప్రకారం.. సుమారు 104 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో టౌన్షిప్లు, పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చెందనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో.. గ్రీన్ జోన్లు, అడవులు, గ్రామీణ ప్రాంతాలను కూడా రక్షించడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడే ప్రయత్నం జరుగుతోంది.ముంబై 3.0కి ప్రధాన బలంఈ కొత్త నగరానికి ఉన్న అతిపెద్ద ప్రయోజనం కనెక్టివిటీ. ముంబై-నవి ముంబై మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేసిన అటల్ బిహారీ వాజ్పేయీ సెవ్రీ-న్హావా శేవా అటల్ సేతు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకం. అదే విధంగా.. నవి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పన్వెల్-కర్జత్ రైల్వే కారిడార్, విరార్-అలీబాగ్ మల్టీమోడల్ కారిడార్, ముంబై-పుణే ఎక్స్ప్రెస్వే వంటి మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతాన్ని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించనున్నాయి.దీని వల్ల భవిష్యత్తులో.. ముంబై 3.0 ప్రాంతం ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, ఆరోగ్య సేవలు, విద్య, లాజిస్టిక్స్ వంటి రంగాలకు ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది.రియల్ ఎస్టేట్పై ప్రభావంముంబై 3.0 అభివృద్ధి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఉంది. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సాధారణంగా వాటి చుట్టుపక్కల కొత్త నివాస, వాణిజ్య ప్రాంతాల అభివృద్ధికి దారితీస్తాయి.అటల్ సేతు, కొత్త విమానాశ్రయం, రైల్వే, మల్టీమోడల్ కారిడార్లు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే.. ఈ ప్రాంతంలో కొత్త రియల్ ఎస్టేట్ మైక్రో-మార్కెట్లు ఏర్పడవచ్చు. ఉద్యోగాలు పెరిగితే.. వాటికి అనుగుణంగా ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్ ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సేవలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. అయితే.. దీని ప్రయోజనాలు వెంటనే కనిపించవు. ఇలాంటి భారీ నగర ప్రాజెక్టులు పూర్తిగా అభివృద్ధి చెందడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. కాబట్టి.. దీనిని తక్షణ రియల్ ఎస్టేట్ బూమ్గా కాకుండా దీర్ఘకాలిక నగర అభివృద్ధి ప్రణాళికగా చూడాలి.భారీ పెట్టుబడులుముంబై 3.0 ప్రాజెక్టుకు ప్రభుత్వ స్థాయిలో కూడా గణనీయమైన ప్రాధాన్యం లభిస్తోంది. 2026-27 సంవత్సరానికి MMRDA సుమారు రూ.4,000 కోట్లను కర్నాలా-సాయి-చిర్నేర్ న్యూ టౌన్ అభివృద్ధికి కేటాయించింది.ఇదే సమయంలో భూముల విషయంలో 124 గ్రామాల భూస్వాములతో వ్యవహరించడం కూడా కీలకమైన అంశం. భూస్వాములకు నగదు పరిహారం, డెవలప్మెంట్ రైట్స్, ల్యాండ్ పూలింగ్ వంటి వివిధ మార్గాలను ప్రతిపాదిస్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు విజయవంతం కావాలంటే భూసేకరణ, స్థానిక ప్రజల ప్రయోజనాలు, పునరావాసం వంటి అంశాలను జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది.ముంబై 3.0 భవిష్యత్తుముంబై 3.0 అనేది ఒక్కరోజులో ఏర్పడే నగరం కాదు. ప్రణాళిక, భూమి సంబంధిత ప్రక్రియలు, మౌలిక సదుపాయాల నిర్మాణం, పెట్టుబడులు, పరిశ్రమల రాక వంటి అనేక దశల తర్వాతే ఇది పూర్తిస్థాయి నగరంగా రూపుదిద్దుకుంటుంది. ప్రాజెక్టు తొలి దశ ఈ దశాబ్దం చివరి భాగంలో రూపుదిద్దుకునే అవకాశం ఉన్నప్పటికీ.. మొత్తం నగర వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు.
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 325.78 పాయింట్లు లేదా 0.42 శాతం నష్టంతో 76,909.68 వద్ద.. నిఫ్టీ 76.60 పాయింట్లు లేదా 0.32 శాతం నష్టంతో 24,078.30 వద్ద నిలిచింది.ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్, సైయంట్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, సిఇఎస్సి లిమిటెడ్, అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో మార్పులు
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ తమ ప్లాట్ఫామ్పై వ్యూస్ లెక్కింపు విధానంలో భారీ మార్పులు తెస్తోంది. ఆగస్టు 24 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానం ప్రకారం, ఒక వీడియో ప్లే కావడం ప్రారంభమైన మరుక్షణమే (ఫస్ట్ ఫ్రేమ్ ప్లే కాగానే) దానిని ఒక ‘వ్యూ’గా పరిగణిస్తారు. గతంలో ఒక వ్యూ నమోదు కావడానికి వినియోగదారులు సదరు వీడియోను నిర్ణీత సమయం (సుమారు 30 సెకన్లు) వరకు చూడాల్సి వచ్చేది. అయితే డిజిటల్ మీడియా పోటీలో టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్.. వంటి ప్లాట్ఫామ్లకు అనుగుణంగా డేటా విధానాన్ని ఏకీకృతం చేసేందుకు యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యూట్యూబ్ షార్ట్స్లో అమల్లో ఉన్న ఈ సూత్రాన్ని ఇకపై లాంగ్-ఫార్మాట్ (పొడవైన) వీడియోలకు కూడా వర్తింపజేస్తున్నారు.క్రియేటర్లు, ప్రకటనకర్తలకు ఏం మారనుంది?ఈ మార్పు వల్ల క్రియేటర్ల ఛానెళ్లపై పబ్లిక్గా కనిపించే వ్యూస్ సంఖ్య వేగంగా, భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే, క్రియేటర్ల ఆదాయం (మానిటైజేషన్) విషయంలో ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని యూట్యూబ్ స్పష్టం చేసింది.ఆదాయంలో మార్పు ఉండదు: ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అర్హతలు కేవలం పబ్లిక్ వ్యూస్పై కాకుండా ఎంగేజ్డ్ వ్యూస్ (వీక్షకులు ఎంత సమయం వీడియో చూశారనేది) ఆధారంగానే నిర్ణయిస్తారు.యూట్యూబ్ స్టూడియోలో స్పష్టత: క్రియేటర్లు తమ అనలిటిక్స్ కోసం పబ్లిక్ వ్యూస్తో పాటు నిజమైన ఎంగేజ్మెంట్ తెలిపే ‘ఎంగేజ్డ్ వ్యూస్’ను విడివిడిగా చూసుకునే వెసులుబాటును యూట్యూబ్ స్టూడియోలో కల్పిస్తారు.పాత వీడియోల డేటా సురక్షితం: ఆగస్టు 24 కంటే ముందు అప్లోడ్ చేసిన పాత వీడియోల చారిత్రక డేటా యథాతథంగానే ఉంటుందని సంస్థ తెలిపింది.ఈ నిర్ణయం ద్వారా బ్రాండ్లు, స్పాన్సర్లకు తమ రీచ్ను ప్రతిబింబించడం క్రియేటర్లకు సులువవుతుంది. ఈ విధానం ద్వారా డిజిటల్ కంటెంట్ పరిశ్రమలో మరింత పారదర్శకత పెరుగుతుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం షాపింగ్ చేసేవారికి రిలీఫ్! పడిన ధర..
ఫ్యామిలీ
అంతా ఆమె జీవితం అయిపోయిందన్నారు..!కట్చేస్తే..
మహమ్మారి లాంటి కేన్సర్ వ్యాధులు మనుషులకు ఎలాంటి ఛాలెంజ్లు విసురుతాయంటే..తట్టుకుని నిలబడనివ్వకుండా ఏడిపించేస్తాయ్. ఒక్కోసారి ఆ క్రమంలో అవయవాలను కోల్పోయేలా చేసి వికృతంగా నవ్వుతుంది. అయినా సరే లేచి నిలబడి బతికి చూపించే వారియర్లు కొందరే. అలాంటి ధీర వనితే ఈ అమ్మాయి. ఆ మహమ్మారి కేన్సర్ ఆమె జీవితాన్ని అంధకారం చేసినా..మనసుతో రంగులను సృష్టించి ప్రపంచమే నివ్వెరపోయేలా ఫ్యాషన్ రంగంలో సత్తా చాటుతోంది. ఆ అమ్మాయే ఛత్తీశ్గఢ్లోని రాయ్పూర్కి చెందిన ఆష్కా సునీల్ గోయల్. ఐదోతరగతి చదువున్నప్పుడు.. ఒకరోజు పాఠశాలలో పరీక్ష రాస్తుండగా అత్యంత భయంకరగా అనిపించి వాష్రూమ్కి పరుగెత్తింది. అంతే సింక్ దగ్గరకు కూడా రాకమునుపు రక్తపు వాంతులు దాంతో టీచర్లు ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడమే గాక తక్షణమే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి.. ఆమె నాసికా కుహరంలో ఒక అరుదైన ట్యూమర్ (కేన్సర్)ను గుర్తించారు. ఇది చివరిదశ కేన్సర్ అని, ఆమె ఎక్కువ రోజులు బతకదని తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత ఆ ట్యూమర్ క్రమంగా ఆమె కంటి నరాలను దెబ్బతీయడం ప్రారంభించింది.చికిత్స కోసం ముంబై వెళ్తుండగా..చికిత్స కోసం ఆష్కా కుటుంబం రాయ్పూర్ నుంచి చెన్నై, ముంబై నగరాలలోని ఆస్పత్రులు చుట్టూ తిరిగింది. ఎక్కడికి వెళ్లినా చాలా కష్టం, సర్జరీ చేయడం సాధ్యం కాదు అని చేతులెత్తేసేవారు వైద్యులు. ఇక చేసేదేమి లేక ముంబై నుంచి తిరిగి విమానంలో వస్తుండగా నాన్న నాకేం కనిపించడం లేదు అంత చీకటిగా ఉంది అని చెప్పింది ఆష్కా. అంతే చూస్తుండగానే ఆమె రెండు కళ్లు చూపుని కోల్పోయాయి. ప్రశాంతంగా చనిపోనివ్వండి.. ఆష్కా బతికే అవకాశాలు తక్కువగా ఉండటంతో ‘ఆమె ఎలాగూ బతకదు, ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం దండగా అంటూ బంధువులంతా సలహాలివ్వడం మొదలు పెట్టారు ఆష్కా తల్లిదండ్రులకు. ఆమెను ప్రశాంతంగా చనిపోనివ్వండి ఇలా చికిత్సలతో కష్టపెట్టొద్దని చెప్పేవారు. అయితే ఆమె మామయ్య మాత్రం చాలు ఆపండి, ఆమెను ఎలాగైనా.. బతికించుకుంటాం అందుకోసం ఏమైనా చేస్తాం అంటూ అందరిలో స్థైర్యాన్ని నింపాడు. అలా ఆయన ఇచ్చిన ధైర్యంతో ఆమె కేన్సర్ చికిత్స మొదలైంది. కానీ కీమోథెరపీ రేడియేషన్ వల్ల ఆమె నోరు, గొంతు దెబ్బతిన్నాయి.కనీసం చుక్క నీరు తాగలేక విలవిల్లాడేది. పొడవైన జుట్టంత రాలిపోతుండేది ఆమెకు. అద్భుతం చేసినట్లు బతికిబట్టకట్టింది..చివరకు డాక్టర్లు ధైర్యం చేసి శస్త్ర చికిత్స చేసి ఆ కణితిని తొలగించారు. అయితే ఆష్కాకు చూపు మాత్రం రాలేదు. అలా రెండేళ్లు చికిత్సల కోసం ఆస్పత్రలు చుట్టూ తిరగడంతో..మళ్లీ పుస్తకాలు చేతపట్టి చదువే సరస్వంగా అహర్నిశలు కష్టపడి చదివింది. అలాగే కంటి చూపుని కోల్పోవడంతో టెక్నాలజీ వైపుకి వెళ్లగలనా అనుకుంది. కానీ అవి కూడా చాకచక్యంగా చేసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంది. అందుకు కారణం తన తల్లిదండ్రులేనని సగర్వంగా చెబుతోంది. తన తల్లి నువ్వు భిన్నంగా ఒక పనిచేయగలవు అంటూ ఇచ్చిన ప్రోత్సహంతోనే ఇదంతా సాధ్యమైందని అంటోంది. అదీగాక తన పేరెంట్స్ తాము పెద్ద చదువులు ఎలాగో చదువకోలేకపోయాం, అందువల్ల నువ్వు బాగా చదువుకోవాలని చెబుతుండేవారు. అదే తనను చదువుపై ఫోకస్ పెట్టేలా చేసిందని చెప్పుకొచ్చింది. అయితే ష్యాషన్ రంగంలోకి వెళ్లాలనుకున్నానని చెప్పగానే..చూపేలేని నీవు ఫ్యాషన్లో ఎలా రాణించగలవు అంటూ మళ్లీ ప్రశ్నలు ఎదురయ్యాయి ఆష్కాకి. మనసుతో రంగుల ప్రపంచాన్ని సృష్టించింది..ఫ్యాషన్ అంటే కేవలం కళ్లతో చూసే రంగులు మాత్రమే కాదు.. అది స్పర్శ, అనుభూతి అని ఆష్కా నమ్మింది. వస్త్రధారణ, బట్టల నిర్మాణం ఆధారంగా డిజైన్లను అర్థం చేసుకోవడం ప్రారంభించింది. బట్టలపై గుర్తులు పెట్టడానికి ప్రత్యేక మార్కర్లు, సేఫ్టీపిన్లను ఉపయోగించే సరికొత్త పద్ధతులను కనిపెట్టింది. ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థ అయిన ‘లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్’లో చదవాలనేది ఆమె కల. అయితే తల్లిదండ్రలు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడం నేర్చుకుంటే పంపిస్తామని షరతు పెట్టారు. అలా ఆమె ముంబై నగరం వెళ్లి అక్కడ చేతికర్ర సాయంతో ఒంటిరిగా బతికి చూపించి..లండన్ వెళ్లి ఫ్యాషన్ కోర్సు చదవాలనే కలను నెరవేర్చుకుంది.ప్రపంచమే నివ్వెరపోయేలా..ర్యాంప్ వాక్ చేసింది.. అలా ఆమె 22 ఏళ్ల వయసులోనే ఆష్కా ‘లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్’లో సీటు సాధించి.. బీఎస్సీ ఆనర్స్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. అంతేగాదు తన సొంత ఫ్యాషన్ బ్రాండ్ను ప్రారంభించి.. ప్రపంచ ప్రఖ్యాత ‘లండన్ ఫ్యాషన్ వీక్’ వేదికపై తన డిజైన్లను ప్రదర్శించడమే కాకుండా సగర్వంగా ర్యాంప్వాక్ చేసింది. దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్ చేతుల మీదుగా ‘ఇన్విన్సిబుల్ స్పిరిట్ అవార్డు’, బ్రిటన్ పార్లమెంటులో ‘ఇన్స్పైరింగ్ యంగ్ టాలెంట్ అవార్డు’ అందుకుని దేశకీర్తిని పెంచింది.పైగా తనను ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా చూడొద్దని అంటున్నారు. తను ఎవరినో ప్రభావితం చేయడానికి కాదని ప్రపంచ దృక్పథాన్ని మార్చడానికి ఉన్నానంటోంది. అంతేగాదు చూపులేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే మాటలు వద్దు..అంతకుమించి సమస్యలు ఈ ప్రపంచంలో ఉన్నాయని మర్చిపోకండని అంటోంది ఆష్కా. తనలాంటి దివ్యాంగులు అన్ని చేయగలరు అని విశ్వసించండి తప్ప తేలిక చసి చూడొద్దు అని గట్టి వార్నింగ్ ఇస్తోంది ఆష్కా. (చదవండి: రెండుసార్లు జేఈఈ ఫెయిల్..కానీ ఇవాళ నెలకు రూ. 2 లక్షలు)
రెండుసార్లు జేఈఈ ఫెయిల్..కానీ ఇవాళ నెలకు రూ. 2 లక్షలు
సామర్థ్యాన్ని అంచనా వేయడానికి కళశాల డ్రిగీలు అవసరం లేదు. అందుకు నిదర్శనం ఈ వ్యక్తి. అతడి గురించి సోషల్ మీడియా వేదిక అంకుర్ వారికూ పంచుకున్నారు. ఫ్రీలాన్సింగ్ చేస్తూ విజయవంతంగా కెరీర్ని నిర్మించుకున్న వ్యక్తి సక్సెస్ జర్నీని పంచుకుంటూ..ప్రతిభ ఉంటే సరిపోదు దాన్ని సరైన విధంగా ఉపయోగించుకునే తెలివితేటలు ఉండాలన్నారు. డిగ్రీలుంటే పెద్ద పెద్ద ఉగ్యోగాలు రావని, నైపుణ్యం, అవకాశాలను సృష్టించుకునే సామర్థ్యం ఉంటేనే విజయం దక్కుతుందంటూ ఈ వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు పోస్ట్లో ఇలా. అంకుర్ పోస్ట్లో ఇండోర్కి చెందిన వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు. అతడు రెండుసార్లు జేఈఈ ఫెయిల్ అయ్యాడు. కానీ అతను రాత్రిపూట యూట్యూబ్లో స్వయంగా ప్రొడక్ట్ డిజైనింగ్ నేర్చుకున్నాడు. దాని సాయంతో ఫ్రీలాన్సింగ్ చేస్తూ నెలకు రెండు లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలిపారు. ఐఐటీ గ్రాడ్యుయేట్లు సైతం సిగ్గుపడేలా తన కెరీర్ని నిర్మించుకున్నాడని అన్నారు. భారతదేశంలో ప్రతిభకు కొదువ లేదు దాన్ని ఉపయోగించుకుని టాలెంట్ని ప్రదర్శించడంలోనే ఇబ్బంది పడుతున్నారని అన్నారు చివరగా ఆ వ్యక్తి పేరు నమన్ అంటూ తన పోస్ట్ని ముగించారు. నెటిజన్లు కూడా అంకుర్ మాటలకు మద్దతిస్తూ..పట్టభద్రులైన ప్రతిఒక్కరూ అధిక జీతాలు సంపాదించలేరని అన్నారు. నిస్సందేహంగా స్వయంగా నేర్చుకుని డబ్బు సంపాదించేవారు కచ్చితంగా అత్యంత తెలివైన వారంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ankur Warikoo (@ankurwarikoo) (చదవండి: ఈ వంటకం బర్గర్కి మించి టేస్టీ..!: హర్ష్ గోయెంక)
ఈ వంటకం బర్గర్కి మించి టేస్టీ..!: హర్ష్ గోయెంక
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంక ఎప్పటికప్పుడూ..పలు స్ఫూర్తిదాయక స్టోరీలు, ఆరోగ్యం గురించి అభిమానులతో పంచుకుంటుంటారు. ఈసారి మాత్రం తనకెంతో ఇష్టమైన వంటకం గురించి షేర్ చేశారు. ఆయన సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో గుజరాత్లో అత్యంత ఇష్టపడే వీధి వంటకం గురించి పంచుకున్నారు. దాన్ని ఆయన బర్గర్కి మించి రుచికరంగా ఉంటుందని అన్నారు. ఆ వంటకం పుట్టుక..రుచి గురించి సవివరంగా రాసుకొచ్చారు. ఇంతకీ ఏంటా వంటకం అంటే.. గుజరాతీ స్ట్రీట్ ఫుడ్ అయిన దాబేలీ గురించి రాసుకొచ్చారు. ఈ వంటకం ఎవరికైనా ఆకలి పుట్టించేలా ఉంటుందన్నారు. దీన్ని మసాలా చిలగడదుంప, చట్నీలు, వేరుశెనగలు, సేవ్, దానిమ్మ గింజలతో కలగలిపిన మృదువైన పావ్ అని అన్నారు. బర్గర్కు సరైన సమాధానం ఈ గుజరాతీ వంటకం అని అన్నారు. దీన్ని చూడగానే ఎవరికైన ఆకలి పుడుతుందని అంటుననారు. తీపి, కారం, కరకరలాడే పుల్లని రుచిని కలిగి ఉంటుందన్నారు. తాను వడాపావ్, బర్గర్ కంటే ఎక్కువగా దీన్నే ఇష్టపడతానని చెప్పారు. ముంబె, గుజరాత్ వెలుపల ఉన్న ప్రజలకు ఈ దాబేలి గురించి అస్సలు తెలియదంటూ పోస్ట్ ముగించారు. కాగా, దాబేలి కచ్లోని మాండ్వీలో పుట్టిన వంకటం. దీన్ని కచ్చి దాబేలీ లేదా డబుల్ రోటీ అని పిలుస్తారు. గుజరాత్ కచ్ జిల్లా, మాండ్వీలో పుట్టింది ఈ ప్రసిద్ధ భారతీయ వంటకం. ఇది 1960 నుంచి వాడుకలో ఉంది.ఈ చిరుతిండిని మాండ్వీలోని కేశవ్జీ గాభా చూడాసమా అనే పాక నిపుణుడు తయారు చేశారని చెబుతుంటారు. ఆయనే మొదట దీన్ని విక్రయించారని, అప్పుడు ధర ఆరు పైసలు మాత్రమేనని చెప్పుకొచ్చారు. నేటికీ ఆయన కుటుంబమే ఈ వంటకం దుకాణాన్ని నిర్వహిస్తోందని చెప్పుకొచ్చారు.Dabeli is Gujarat’s answer to the burger 😋! A soft pav stuffed with spicy-sweet potato, chutneys, peanuts, sev and pomegranate. Sweet, spicy, crunchy and tangy. I much prefer it to vada pav and burger. Unfortunately most outside of Mumbai and Gujarat are unfamiliar with it! pic.twitter.com/15sW2qgTNw— Harsh Goenka (@hvgoenka) August 17, 2026 (చదవండి: ట్రెడిషనల్ డిజైనర్వేర్లో రిషబ్ సెట్టి స్టన్నింగ్ లుక్..! స్వయంగా ఆయన భార్య..)
ట్రెడిషనల్ డిజైనర్వేర్లో రిషబ్ సెట్టి స్టన్నింగ్ లుక్..!
17వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IIFM) 2026లో, రిషబ్ శెట్టి తన విజయాల జాబితాలో మరో రెండు కొత్త గౌరవాలను చేర్చుకున్నారు. ఈ కన్నడ నటుడు, చిత్ర నిర్మాత కాంతార చాప్టర్1కి ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలచుకోవడం తోపాటు లీడర్షిప్ ఇన్ సినిమా అవార్డు కూడా గెలుచుకున్నారు. ఈ అవార్డులు తోపాటు అంతర్జాతీయ వేదికపై ఆయన కనిపించిన తీరు అందరిని ఆకర్షించింది. ఆడంబరమైన ట్రెండీ ఫ్యాషన్ దుస్తులను ఎంచుకోకుండా తన కర్ణాటక మూలాలకు దగ్గరగా ఉండే సాంప్రదాయ లుక్లో అలరించారు. ఈ కాంతార చిత్రానికి కాస్ట్యూమ్ డిజైర్గా పనిచేసిన ఆయన భార్య ప్రగతిశెట్టి ఆయన కోసం ఒక నల్ల కుర్తాను డిజైన్ చేశారు. అంతేగాదు దానికి మ్యాచింగ్గా చేనేత పట్టు ధోతిని ఎంచుకున్నారామె. ఈ ఐవరీ ధోతికి జరీ అంచు ఉండగా, కుర్తాలో అత్యంత ప్రత్యేక భాగం గండబేరుండా ఎంబ్రాయిడరీ. ఇది ఆ దుస్తులకు ప్రత్యేక రూపాన్ని ఇచ్చింది. కర్ణాటక వారసత్వాన్ని ప్రదర్శించేలా..ఈ మేరకు రిషబ్ శెట్టి భార్య ప్రగతి మాట్లాడుతూ..ప్రామాణికమైన క్లాసిక్ రూపాన్ని ఇచ్చేందుకు సాంప్రదాయ ధోతి, కుర్తాను ఎంచుకున్నామని అన్నారు. ధోతి కోసం స్వచ్ఛమైన పట్టుని ఎంచుకున్నామని, అలాగే అందులో ఉండే అంచు ఆడంబరంగా కాకుండా పండుగ శోభను అందించిందన్నారు. కుర్తా కోసం చేనేత నల్ల పట్టు వస్త్రాన్ని ఎంచుకున్నామని చెప్పారు. సౌకర్యవంతంగా శుద్ధమైన ఆకృతిని కలిగి ఉంటుందన్నారు. దీంతోపాటు కర్షాటకపట్ట కృతజ్ఞాత గర్వాన్ని వ్యక్తం చేసేందుకు తమ రాష్ట్రానికి శక్తిమంతమైన ప్రతిష్టాత్మక చిహ్నమైన గండబేరుండ ఎంబ్రాయిడరీని పొందుపరిచామని అన్నారు.గండబేరుండ అంటే..ఇది రెండు తలల ఒక పౌరాణిక పక్షి. ఇది బలం ధైర్యం, శక్తి, దృఢత్వానికి ప్రతీక. కర్ణాటకలో దీనికి లోతైన సాంస్కృతిక చారిత్ర ప్రాముఖ్యత ఉంది. ఇది రాష్ట్ర వారసత్వంతో ద్గరి సంబంధ కలిగి ఉంది అని చెప్పుకొచ్చారామె. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial)(చదవండి: చేతితో చిత్రించిన పటచిత్ర చీరలో నీతా అంబానీ అద్భుతమైన లుక్..!)
అంతర్జాతీయం
ఆ ఒక్క పాటతో అన్ని వందల కోట్లు వచ్చాయా?
ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపేసిన ఆ పాట.. 14 ఏళ్లు గడిచినా యూట్యూబ్లో తన జోరు కొనసాగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా కోట్లాది మందిని అలరించిన ఆ సాంగ్ తాజాగా మరో రికార్డు సృష్టించింది. ఒకప్పుడు యూట్యూబ్లో బిలియన్ వ్యూస్ అందుకున్న తొలి వీడియోగా చరిత్ర సృష్టించిన అదే పాట.. ఇప్పుడు 6 బిలియన్ మార్క్ను అందుకుని తన సత్తా చాటింది. అంతటి ఆదరణ పొందిన ఈ పాట.. సింగర్ పీఎస్వైకి ఎంత ఆదాయాన్ని తెచ్చిపెట్టిందన్నదే ఇప్పుడు ఆసక్తికరం.దక్షిణ కొరియా పాప్ స్టార్ పీఎస్వై పాడిన ‘గంగ్నమ్ స్టైల్’ తాజాగా 6 బిలియన్ వ్యూస్ దాటి మరో సెన్సేషన్గా మారింది. 2012 జులైలో విడుదలైన ఈ పాట.. అదే ఏడాది డిసెంబర్లో యూట్యూబ్లో ఫస్ట్ బిలియన్ వ్యూస్ సాధించిన తొలి వీడియోగా చరిత్ర సృష్టించింది. 2013లో ఈ పాటకు సుమారు 1.23 బిలియన్ యూట్యూబ్ వ్యూస్ ఉన్న సమయంలో.. గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నికేష్ అరోరా ఈ వీడియోకు 8 మిలియన్ డాలర్లకుపైగా యాడ్ రెవెన్యూ వచ్చినట్లు వెల్లడించారు. అప్పటి లెక్కల ప్రకారం 8 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.50 కోట్లకుపైనే.6 బిలియన్ల వ్యూస్తో రెవెన్యూ ఎంతంటే..తాజాగా ‘గంగ్నమ్ స్టైల్’ 6 బిలియన్ వ్యూస్ దాటింది. 2023 డిసెంబర్లో 5 బిలియన్ మార్క్ చేరుకున్న ఈ వీడియో.. మరో బిలియన్ వ్యూస్ సాధించడానికి రెండేళ్ల ఏడు నెలల సమయం తీసుకుంది. అంటే.. విడుదలై దాదాపు 14 ఏళ్లు గడిచినా ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదన్నమాట.యాడ్ ఆదాయ రేటును కేవలం సూచికగా తీసుకుని 6 బిలియన్ వ్యూస్కు వర్తింపజేస్తే.. యూట్యూబ్ ప్రకటనల ద్వారా వచ్చే మొత్తం దాదాపు రూ.250–300 కోట్ల స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే యూట్యూబ్ ప్రకటన రేట్లు, ప్రేక్షకులు ఉన్న దేశాలు, మానిటైజేషన్, యాడ్ వీక్షణలు తదితర అంశాల ఆధారంగా ఈ ఆదాయం మారుతుంది. ఇతర ఆదాయ మార్గాలను కూడా కలిపి చూస్తే.. ఎంత లేదన్నా ‘గంగ్నమ్ స్టైల్’ ద్వారా మొత్తం సంపాదన సుమారు రూ.800 కోట్లకుపైగా ఉండొచ్చన్నది అంచనా.ఆ మొత్తం మొత్తం పీఎస్వైకే దక్కుతుందా?‘గంగ్నమ్ స్టైల్’కు యూట్యూబ్ మాత్రమే ఆదాయ వనరు కాదు. డిజిటల్ డౌన్లోడ్లు, మ్యూజిక్ స్ట్రీమింగ్, లైసెన్సింగ్, ప్రకటనలు, ఇతర వాణిజ్య ఒప్పందాలు కూడా ఉన్నాయి. 2013లోనే ఈ పాట డిజిటల్ డౌన్లోడ్లు, ప్రకటనలు, ఆన్-డిమాండ్ సేవల ద్వారా అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టినట్లు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.అయితే యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం పీఎస్వైకి దక్కదు. ప్లాట్ఫామ్ వాటాతో పాటు మ్యూజిక్, వీడియో హక్కుదారులు, రికార్డ్ లేబుల్, ఇతర భాగస్వాములకు కూడా ఆదాయం పంచబడుతుంది. అయినప్పటికీ.. అన్ని ఆదాయ మార్గాలను కలిపి చూస్తే పీఎస్వైకి ఈ పాట ద్వారా భారీ మొత్తమే దక్కినట్లు చెప్పొచ్చు. ఆ పాట ఎలా పుట్టిందంటే..‘గంగ్నమ్ స్టైల్’ పుట్టుక వెనుక దక్షిణ కొరియాలోని గంగ్నమ్ ప్రాంత జీవనశైలే ప్రధాన ప్రేరణ. గంగ్నమ్లో పుట్టి పెరిగిన పీఎస్వై.. అక్కడి ఉన్నతవర్గాల జీవనశైలి, వారి ఫ్యాషన్, హంగూ ఆర్భాటాలను తనదైన శైలిలో పాటగా మలిచారు. యూ జంగ్ హ్యుంగ్తో కలిసి సాహిత్యం రాయడంతో పాటు మ్యూజిక్ను రూపొందించిన పీఎస్వై.. సరదా పదాలు, వ్యంగ్యభరితమైన భావన, ఆకట్టుకునే బీట్ను జోడించారు. ఇక గుర్రపు స్వారీని తలపించే డ్యాన్స్ స్టెప్ పాటకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఇలా పెద్దగా అంచనాలు లేకుండా రూపొందిన ఈ పాట.. ప్రపంచ సంగీత చరిత్రనే మార్చేసే సంచలనంగా మారింది.ప్రపంచాన్ని ఊపేసిన గుర్రపు స్టెప్పు2012లో విడుదలైన ‘గంగ్నమ్ స్టైల్’ కొరియన్ భాషలో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. పీఎస్వై వేసిన ప్రత్యేకమైన గుర్రపు స్వారీ తరహా డ్యాన్స్ పాటకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. అమెరికా బిల్బోర్డ్ హాట్ 100లో ఈ పాట ఏడు వారాల పాటు రెండో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా యూట్యూబ్ చరిత్రలో 1 బిలియన్ వ్యూస్ అందుకున్న తొలి వీడియోగా ‘గంగ్నమ్ స్టైల్’ నిలిచింది. ఈ పాట తర్వాత.. పీఎస్వై నుంచి ఆ స్థాయి ఆల్బమ్ రాలేదు. కానీ, అప్పటి నుంచి ఆయన టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియా క్రేజ్ లేని రోజుల్లోనే.. యూట్యూబ్తో గంగ్నమ్ స్టైల్ సంచనాలు సృష్టించడం, ఇప్పుడు 6 బిలియన్ వ్యూస్తో మరో మైలురాయిని అందుకోవడం.. క్రేజ్ను ఏదీ అడ్డుకోలేదని నిరూపించింది.
ఫిట్నెస్ ఈవెంట్లో కుప్పకూలిన ప్రముఖ కోచ్
బ్యాంకాక్: తీవ్రమైన వ్యాయామం గుండెపై చూపే ప్రతికూల ప్రభావాలు, సడన్ కార్డియాక్ అరెస్ట్ ముప్పుపై మరోసారి చర్చ మొదలైంది. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగిన ‘హైరాక్స్ (HYROX) 2026’ ఫిట్నెస్ పోటీల్లో పాల్గొన్న 41 ఏళ్ల ఫిట్నెస్ కోచ్ లెరాయ్ సాండర్స్ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. దక్షిణాఫ్రికాకు చెందిన సాండర్స్ బ్యాంకాక్లో ‘ఐఏవోటీ క్రాస్ఫిట్’ వ్యాయామశాల యజమాని. ‘ఫైట్ బై డిజైన్’ వ్యవస్థాపకుడు.పోటీల సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన ఆయనకు సీఆర్పీ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఆయన మరణానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదని, అధికారిక నివేదిక వచ్చేవరకు వేచి చూడాలని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర శారీరక శ్రమ గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశం తెరపైకి వచ్చింది. తీవ్రమైన వ్యాయామం చేసేటప్పుడు కండరాలకు ప్రాణవాయువును అందించేందుకు గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం సహజం.సాధారణంగా వ్యాయామం వల్ల గుండెకు మేలు జరుగుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొన్నప్పటికీ, ముందస్తుగా గుర్తించని గుండె సమస్యలు ఉన్నప్పుడు లేదా శరీర సామర్థ్యానికి మించి శ్రమించినప్పుడు ప్రమాదకరమైన హృదయ స్పందనల లోపాలు (వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ వంటివి), సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.కార్డియోమయోపతి, కొరోనరీ ఆర్టరీ వ్యాధులు, జన్యుపరమైన సమస్యలు ఉన్నవారిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో ఛాతీలో నొప్పి, తీవ్రమైన ఆయాసం, మైకం, కళ్లు తిరగడం, అసాధారణ హృదయ స్పందనలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే శిక్షణ ఆపి వైద్యులను సంప్రదించాలి. ఫిట్నెస్గా ఉన్నంత మాత్రాన గుండె సమస్యలు రావనే భావన సరికాదని, శరీర సామర్థ్య పరిమితులను తెలుసుకుని వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: రాఖీ 27నా? 28నా?.. గ్రహణ ప్రభావమెంత?
లండన్ రెచ్చగొడుతోందా.. పుతిన్ రివేంజ్ తట్టుకోగలదా?
ఉక్రెయిన్ యుద్ధం మరో ప్రమాదకర మలుపు తిరుగుతోంది. రష్యా భూభాగంపై కీవ్ దాడులు పెంచుతున్న వేళ.. ఆ దాడుల్లో బ్రిటన్ తయారీ డ్రోన్లు ఉపయోగించారన్న సమాచారం మాస్కో ఆగ్రహానికి కారణమైంది. దీంతో రష్యా నేరుగా లండన్నే టార్గెట్ చేసింది. “బ్రిటన్ ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.. దీనికి పరిణామాలు ఉంటాయి” అంటూ హెచ్చరించింది. అయితే ఆ ‘పరిణామాలు’ ఏ రూపంలో ఉంటాయన్నది మాత్రం చెప్పలేదు. దీంతో ఇప్పుడు రష్యా తదుపరి అడుగు ఏంటన్నదే అసలు ఉత్కంఠగా మారింది.అసలు వివాదం ఏంటి?ఇటీవలి వారాల్లో ఉక్రెయిన్ రష్యా భూభాగంపై డ్రోన్ దాడులను మరింత పెంచింది. మాస్కోతో పాటు పలు ప్రాంతాల్లో చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, గిడ్డంగులు వంటి వ్యూహాత్మక లక్ష్యాలను కీవ్ టార్గెట్ చేసింది. రష్యాకు చెందిన ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ వైల్డ్బెర్రీస్కు సంబంధించిన కొన్ని గిడ్డంగులు కూడా దాడుల పరిధిలోకి వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ దాడుల్లో ఉపయోగించిన కొన్ని డ్రోన్లు బ్రిటన్లో తయారైనవేనన్న సమాచారం బయటకు రావడంతో వివాదం మొదలైంది. అయితే బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఈ డ్రోన్లను రష్యాపై దాడులకు ఉపయోగించారన్న నిర్దిష్ట నివేదికలను ధృవీకరించలేదు.రష్యా హెచ్చరిక..లండన్లోని రష్యా రాయబార కార్యాలయం బ్రిటన్పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఉద్దేశపూర్వకంగా మరింత తీవ్రతరం చేసే మార్గాన్ని లండన్ ఎంచుకుందని మండిపడింది. ఉక్రెయిన్కు ఆయుధాలు, డ్రోన్లు, ఇతర సైనిక సహాయం అందించడం ద్వారా రష్యాతో ఘర్షణలో బ్రిటన్ మరింత లోతుగా జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది. అంతేకాదు.. బ్రిటన్ “పరిణామాలను” ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే అవి ఎలాంటి చర్యలుగా ఉంటాయో మాత్రం మాస్కో వెల్లడించలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ కూడా బ్రిటన్ సైనిక సహాయంపై తీవ్ర విమర్శలు చేశారు. పాశ్చాత్య దేశాల మద్దతు పెరిగే కొద్దీ.. యుద్ధంలో వాటి ప్రమేయం కూడా పెరుగుతోందని రష్యా వాదిస్తోంది.బ్రిటన్ వెనక్కి తగ్గుతుందా?మాస్కో హెచ్చరికకు లండన్ మాత్రం తలొగ్గలేదు. ఉక్రెయిన్కు బ్రిటన్ మద్దతు “100 శాతం” కొనసాగుతుందని ప్రధాని ఆండీ బర్న్హామ్ స్పష్టం చేశారు. కష్టకాలంలో కీవ్కు అండగా నిలుస్తామని తేల్చిచెప్పారు. బ్రిటన్ ఇప్పటికే ఉక్రెయిన్కు భారీ స్థాయిలో డ్రోన్లు, ఇతర సైనిక పరికరాలను అందిస్తోంది. 2026 చివరి నాటికి ఉక్రెయిన్కు 1.5 లక్షల డ్రోన్లు అందించే ప్రణాళికలో భాగంగా భారీ సైనిక సహాయ ప్యాకేజీని లండన్ ప్రకటించింది.రష్యాకు ఇంత ఆగ్రహం ఎందుకు?ఇక్కడ అసలు సమస్య ఒక్క డ్రోన్ కాదు. ఉక్రెయిన్ రష్యా భూభాగంలోకి మరింత లోతుగా దాడులు చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మాస్కోపై ఒత్తిడి పెంచాలని కీవ్ ప్రయత్నిస్తోంది. ఇలాంటి దాడుల్లో పాశ్చాత్య దేశాల తయారీ పరికరాలు, సాంకేతికత ఉపయోగిస్తున్నట్లు రష్యా భావిస్తే.. ఈ యుద్ధం కేవలం రష్యా–ఉక్రెయిన్ మధ్యే కాకుండా రష్యా–పాశ్చాత్య దేశాల మధ్య పరోక్ష యుద్ధంగా మారుతోందన్న తన వాదనకు మాస్కో మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది.‘పరిణామాలు’ఏంటి?ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. రష్యా హెచ్చరించిన “పరిణామాలు” ఏంటో స్పష్టత లేదు. అవి దౌత్యపరమైన చర్యలుగా ఉండొచ్చు.. ఆంక్షలకు ప్రతిచర్యగా ఉండొచ్చు.. సైబర్ లేదా ఇతర హైబ్రిడ్ చర్యల రూపంలోనూ ఉండొచ్చు. అయితే ప్రస్తుతం రష్యా బ్రిటన్పై ప్రత్యక్ష సైనిక దాడి చేయబోతోందని చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ ఉక్రెయిన్కు లండన్ సైనిక మద్దతు కొనసాగించడం, కీవ్ రష్యా భూభాగంలో దాడులను మరింత పెంచడం జరిగితే.. మాస్కో స్పందన మరింత కఠినంగా మారే అవకాశం మాత్రం ఉంది.ఒకవైపు కీవ్ రష్యాపై డ్రోన్ దాడులు పెంచుతోంది. మరోవైపు లండన్.. “ఉక్రెయిన్కు 100 శాతం మద్దతు” అంటోంది. మధ్యలో మాస్కో మాత్రం.. “పరిణామాలు తప్పవు” అంటూ హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరిక కేవలం మాటల యుద్ధంగానే మిగిలిపోతుందా? లేక రష్యా నిజంగానే తదుపరి అడుగు వేస్తుందా? ఇప్పుడు ప్రపంచం చూపు ఈ పరిణామంపైనే ఉంది.
ఇరాన్తో సంబంధాలు కట్.. యూఏఈ సంచలన ఆరోపణలు
పశ్చిమాసియా సంక్షోభం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఇరాన్–యూఏఈ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. గల్ఫ్లో నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ ఆరోపించగా.. ఆ వాదనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధార ఆరోపణలని, ఇలాంటి ప్రకటనలు ప్రాంతీయ శాంతి, భద్రతకు విఘాతం కలిగిస్తాయని ఇరాన్ విదేశాంగశాఖ స్పష్టం చేసింది. మరోవైపు.. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్తో అన్ని రకాల వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.మంగళవారం గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు తమ వైపు దూసుకొచ్చినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఈ రెండు క్షిపణులను గుర్తించాయని పేర్కొంది. వాటిలో ఒకటి యూఏఈ ప్రాదేశిక జలాల వెలుపల సముద్రంలో పడగా.. మరో క్షిపణి తమ ప్రాదేశిక జలాల్లోనే కూలిపోయిందని వెల్లడించింది.ఆ తర్వాత విడుదల చేసిన మరో ప్రకటనలో.. ఈ రెండు క్షిపణులు సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకున్నట్లు తమ అంచనాల్లో తేలిందని యూఏఈ పేర్కొంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.‘నిరాధార ఆరోపణలు’.. ఇరాన్ కౌంటర్యూఏఈ ఆరోపణలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశం నుంచి యూఏఈపై క్షిపణి ప్రయోగించారన్న ఆరోపణలను ‘పూర్తిగా ఖండిస్తున్నట్లు’ ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ప్రాంతీయ దేశాల మధ్య విశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలకు ఇలాంటి ఆరోపణలు విఘాతం కలిగిస్తాయని అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిరాధార ఆరోపణలకు దూరంగా ఉండాలని యూఏఈ సహా ప్రాంతీయ దేశాలకు సూచించారు.అమెరికా, ఇజ్రాయెల్ చర్యల కారణంగా ఇప్పటికే మధ్యప్రాచ్యంలో పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని బఘాయీ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తప్పుడు ఆరోపణలు చేయడం ప్రాంతీయ భద్రతను మరింత దెబ్బతీస్తుందని అన్నారు.యూఏఈలో మిసైల్ అలర్ట్ఈ ఆరోపణలకు కొద్దిసేపటి ముందు యూఏఈ ప్రజలకు ఫోన్ ద్వారా అత్యవసర హెచ్చరిక సందేశం వచ్చింది. ‘సంభావ్య క్షిపణి ముప్పు’ ఉన్నందున సమీపంలోని సురక్షిత భవనంలోకి వెళ్లాలని అధికారులు సూచించారు. కొద్దిసేపటికే ఆ అలర్ట్ను ఉపసంహరించుకున్నారు.జూన్లో తప్పుడు అలారం వెలువడిన తర్వాత.. జూలైలో జరిగిన మరో ఘటనలో క్షిపణి యూఏఈ భూభాగంలోకి ప్రవేశించకపోయినప్పటికీ హెచ్చరిక జారీ చేశారు. తాజాగా వచ్చిన అలర్ట్ మాత్రం ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత ఆందోళనకు దారితీసింది.ఇరాన్తో సంబంధాలు కట్!తాజా పరిణామాల నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్తో అన్ని రకాల వాణిజ్యం, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూఏఈ విదేశాంగశాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ.. ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల్లో ఉన్న ఇరాన్–యూఏఈ సంబంధాలు మరింత దిగజారే పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే ఆయిల్ ట్యాంకర్లపై దాడులుయూఏఈకి చెందిన ప్రభుత్వ చమురు సంస్థ ADNOC ట్యాంకర్లు గత కొన్ని వారాలుగా వరుస దాడులకు గురవుతున్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో సముద్ర రవాణా భద్రతపై ఆందోళనలు పెరిగాయి.ఫిబ్రవరి 28న మధ్యప్రాచ్య యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇరాన్ దాడుల్లో యూఏఈ తీవ్రంగా ప్రభావితమైన దేశంగా నిలిచింది. దాదాపు 3,000 క్షిపణులు, డ్రోన్లు యూఏఈ వైపు ప్రయోగించినట్లు సమాచారం. అయితే జూన్లో ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కొంతకాలం దాడులు తగ్గాయి. తాజాగా ఆ ఒప్పందం కుప్పకూలడంతో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి.‘హర్ముజ్ మూసివేత కొనసాగుతుంది’మరోవైపు ఇరాన్ కీలక హెచ్చరిక చేసింది. ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరే వరకు హర్ముజ్ను తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తన వైఖరిని వెల్లడించింది. యూఏఈ నుంచి గల్ఫ్ వెలుపలికి వెళ్లే నౌకలకు హర్ముజ్ కీలక మార్గం కావడంతో.. ఇరాన్ తాజా ప్రకటన యూఏఈ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ చమురు రవాణాపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.హర్ముజ్.. మరోసారి యుద్ధ కేంద్రంగా!ఒకవైపు క్షిపణి ఆరోపణలు, మరోవైపు వాణిజ్య ఆంక్షలు, ఇంకోవైపు హర్ముజ్ మూసివేతపై ఇరాన్ హెచ్చరికలు.. మొత్తంగా గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ.. యూఏఈ మాత్రం సముద్ర రవాణాపై ముప్పు పెరిగిందని చెబుతోంది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్పై ఆధిపత్యం తమదేనంటూ ఓ మ్యాప్(ఏఐ జనరేటెడ్) రిలీజ్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి చుట్టూ పరిణామాలు తదుపరి రోజుల్లో మరింత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
జాతీయం
మీరట్లో ఉద్రిక్తత.. హిందూ యువతితో ఇమామ్ కుమారుడు పరార్!
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హిందూ యువతి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ యువతి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం గాలించగా, కచేరీ మసీదు ఇమామ్ (మౌలానా) మన్సూర్ కుమారుడు ఫైజ్ ఆమెను మభ్యపెట్టి తన వెంట తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలిసింది. యువతి స్నేహితురాలి ద్వారా ఈ సమాచారం బయటకు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు.అనంతరం అఖిల భారత హిందూ సురక్షా సంఘటన్ కార్యకర్తలతో కలిసి బాధిత కుటుంబీకులు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. తమ కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేసే అవకాశం ఉందని, ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఇది కూడా చదవండి: జాబిల్లిపై రాకెట్ క్రాష్.. భారీ గుంతను గుర్తించిన నాసా!
విజయ్ సర్కార్ యూటర్న్.. వివాదాస్పద ఉత్తర్వులు వెనక్కి
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సంబంధించిన వివాదాస్పద జీవోను.. బుధవారం వెనక్కి తీసుకుంది. లెఫ్ట్ పార్టీలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలంటూ అంతకు ముందు జారీ చేసిన జీవోలో దుమారం రేపింది. ఆగస్టు 14న విజయ్ ప్రభుత్వం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలకు ఓ ఉత్తర్వు జారీ చేసింది. అందులో.. లెఫ్ట్ పార్టీలతో పాటు సీపీజే నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనాలనే ఆసక్తికి విద్యార్థులు, యువత ‘లోనుకాకుండా’ చర్యలు తీసుకోవాలని పాఠశాలలు, కళాశాలలకు సూచించింది. ఇందుకోసం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. అంతేకాదు.. తీసుకున్న చర్యలపై ఆగస్టు 20లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.దేశవ్యాప్తంగా విద్యార్థి ఆందోళనలుఇటీవల పరీక్షలు, విద్యా సంబంధిత అంశాలపై దేశవ్యాప్తంగా జెన్జెడ్, జెన్ఆల్ఫా విద్యార్థుల నిరసనలు పెరుగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీపీజే ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు యువత పోరాటాలకు మద్దతుగా మాట్లాడిన సీఎం విజయ్.. మొన్న స్వాతంత్ర్య దినోత్సవంలోనూ వణక్కం జెన్జీ అంటూ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వం అంతకు ఒక్కరోజు ముందు ఈ ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.సీజేపీ తీవ్ర అభ్యంతరం.. ఆగ్రహంఈ ఉత్తర్వులపై సీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ జాతీయ సహ కన్వీనర్ సౌరవ్ దాస్.. విజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా అభివర్ణించారు. విద్యార్థులు, యువత తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోకుండా అడ్డుకోవడం అర్థరహితమైన, అహేతుకమైన చర్య అని విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. సీజేపీ, లెఫ్ట్ పార్టీలను ‘అరాచకానికి ఏజెంట్లు’గా బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం అభివర్ణించారు.విజయ్ ప్రభుత్వానికి లెఫ్ట్ మద్దతు..మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం కోసం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు జూన్లో లెఫ్ట్ పార్టీలు బేషరతుగా బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి దూరంగా నిలిచింది. దీంతో కాంగ్రెస్, వీసీకే వంటి చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొంది.ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీల ఆందోళనలకూ విద్యార్థులు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. ఈ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనే హక్కు, వారిని రాజకీయ ఆందోళనలకు దూరంగా ఉంచే ప్రయత్నాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. వివాదాస్పద ఉత్తర్వులను విజయ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం తాజా రాజకీయ పరిణామంగా మారింది.ఇటు సీపీజే పేరుపైనా వివాదంఇదిలా ఉండగా.. తమిళనాడులో కాక్రోచ్ జనతా పార్టీ పేరు పైనా వివాదం నడుస్తోంది. ఆ పేరుతో ఓ ప్రాంతీయ రాజకీయ పార్టీని నమోదు చేయాలని న్యాయవాది సి. బ్రహ్మ బాలసుబ్రమణియం నేతృత్వంలోని బృందం జూన్లో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అయితే ఆ సంస్థ.. అభిజిత్ దీప్కేకు చెందిన సీపీజేకు భిన్నమైనదని బ్రహ్మ బాలసుబ్రమణియం వాదిస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
60 ఏళ్ల క్రితం : చంద్రుడి నుండి భూమిని చూపిన చిత్రం
సరిగ్గా 60 ఏళ్ల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మొదటిసారిగా చంద్రుని కక్ష్య నుంచి భూమిని ఫొటో తీసింది. ఇది మానవుని సాంకేతిక విజయానికి ప్రతీక. మనిషి తొలిసారి తన ‘ఇంటి’ని బయట నుంచి చూసిన చిత్రం ఇది. ఆ దృశ్యంలో భూమి చిన్నదిగా కనిపించింది. కానీ ఆ చిన్న బిందువులోనే మన చరిత్ర, నాగరికతలు, యుద్ధాలు, ప్రేమలు, విజయాలు, వైఫ ల్యాలు, సముద్రాలు, అడవులు, నగరాలు– మనిషికి తెలిసిన మొత్తం ప్రపంచం ఉంది. మనిషికి తన మాతృభూమిపై ఉన్న అభిప్రాయాన్ని మార్చిన ఫొటో ఇది.మనిషి ఆకాశం వైపు చూసినప్పటి నుంచి చంద్రుడు అతనికి ఒక అద్భుతం. శతాబ్దాల పాటు చంద్రుడిని దేవతలతో, పురాణా లతో, కవిత్వంతో అనుసంధానించాడు. కాలక్రమంలో తన విజ్ఞా నంతో దానిపైనే అడుగుపెట్టడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగానే 1966 ఆగస్టు 23న జరిగిన ఆ సంఘటన అంతరిక్ష చరిత్రలో చోటుచేసుకుంది. ఆ రోజు నాసాకు చెందిన లూనార్ ఆర్బిటర్–1 చంద్రుడి సమీప కక్ష్య నుంచి భూమిని చిత్రీకరిం చింది. అందులో చంద్రుడి ఉపరితలం మీదుగా చిన్న పరిమాణంలో భూమి కనిపిస్తూ ఉంది.నిజానికి లూనార్ ఆర్బిటర్–1 ప్రధాన లక్ష్యం భూమిని ఫొటో తీయడం కాదు. అమెరికా ‘అపోలో కార్యక్రమం’ ద్వారా మనిషిని చంద్రుడిపైకి పంపేందుకు సిద్ధమవుతోంది. చంద్రునిపై ఎక్కడ దిగితే సురక్షితం? ఎక్కడ రాళ్లు, గోతులు ఎక్కువగా ఉన్నాయి లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెదకడానికి ‘లూనార్ ఆర్బిటర్’ కార్యక్రమం మొదలైంది. లూనార్ ఆర్బిటర్–1ను 1966 ఆగస్టు 10న ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ నుంచి ప్రయోగించారు. ఆగస్టు 14న అది చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అదేచంద్రుడిని చేరిన తొలి అమెరికా అంతరిక్ష నౌక.కాకతాళీయంచంద్రుడి ఉపరితలాన్ని చిత్రీకరించేందుకు దానిలో ప్రత్యేక కెమెరా వ్యవస్థ ఉంది. కెమెరా తీసిన ఫిల్మ్ను అంతరిక్ష నౌకలోనే ప్రాసెస్ చేసి, స్కాన్ చేసి, డేటాను రేడియో సంకేతాల రూపంలో భూమికి పంపే విధానం అప్పట్లో ఆ నౌకలో ఉపయోగించారు. అయితే ఆగస్టు 23న లూనార్ ఆర్బిటర్–1 చంద్రుడి అవతలి వైపు నుంచి బయటకు వస్తున్న సమయంలో చంద్రుడి అంచున భూమి కనిపించింది. అంతరిక్ష నౌకను తాత్కాలికంగా మరో దిశలో తిప్పి భూమిని చిత్రీకరించాలా అనే చర్చ భూమిపై ఉన్న శాస్త్రవేత్తల్లో జరిగింది. అప్పటి అంతరిక్ష నౌకల నియంత్రణ నేటిలా కచ్చితంగా ఉండేది కాదు. నౌకను తిప్పితే తిరిగి సరైన దిశలోకి తీసుకురావడం కష్టమయ్యే ప్రమాదం ఉంది. అయినా మిషన్ నియంత్రణ కేంద్రం ఆ అవకాశాన్ని వదులుకోలేదు. చిత్రం నాసా ట్రాకింగ్ స్టేషన్కు చేరింది. స్పెయిన్లోని రొబ్లెడో డి చావెలా కేంద్రంలో ఆ సంకేతాలను అందుకున్నారు. అది మానవ చరిత్రలో ఒక కొత్త దృశ్య శకానికి ఆరంభం. ఆ చిత్రంలో భూమి ఒక చిన్న ప్రకాశవంతమైన అర్ధచంద్రా కారంగా కనిపిస్తోంది. దాని వెనుక విశాలమైన అంతరిక్షం కింద చంద్రుడి బూడిదరంగు ఉపరితలం! ఈ ఫోటోను శాస్త్ర వేత్తలు ‘ఫ్రేమ్–17’గా వ్యవహరిస్తారు. భూమిపై అనేక చరాచర జీవులు, దేశాలు, ఖండాలు... ఎన్ని ఉన్నా అంతరిక్షం నుంచి చూసినప్పుడు ఇవేవీ కనిపించవు. ఒక చిన్న గోళంగా మాత్రమే భూమి దర్శనమిస్తుంది. ఇదే ఆ చిత్రం ఇచ్చిన సందేశం. ఇదీ చదవండి: ఫోటో తెచ్చిన తంటా..షాకైన వధువు, పెళ్లి క్యాన్సిల్ఈ కథలో మరో ఆసక్తికరమైన అధ్యాయం ఉంది. 1966లో ఆ చిత్రాన్ని అందుకున్నప్పటికీ, అప్పటి సాంకేతిక పరిమితుల వల్ల పూర్తి స్థాయి హైరిజల్యూషన్ రూపంలో దాన్ని నిల్వ చేయడం సాధ్యం కాలేదు. అయితే నలభై ఏళ్లకు పైగా గడిచిన తర్వాత నాసా పాత మాగ్నెటిక్ టేపులు, 1960ల కాలం నాటి పరికరాలు, ఆధునిక డిజిటల్ సాంకేతికతను కలిపి డేటాను మళ్లీ ప్రాసెస్ చేసింది. ఫలితంగా 2008లో మెరుగైన రూపంలో ఆ చారిత్రక చిత్రం ప్రపంచానికి అందింది. ఒక ప్రయోగం ముగిసినా దాని డేటా విలువ ఎప్పటికీ ముగియదనీ, తరువాతి కాలంలో అందుబాటులోకి వచ్చే కొత్త సాంకేతికతతో తిరిగి పరిశీలిస్తే కొత్త విషయాలు బయటపడవచ్చనీ ఇది నిరూపించింది.-ఎడిటోరియల్ టీమ్ఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది?
ఫొటో తెచ్చిన తంటా..షాకైన వధువు, పెళ్లి క్యాన్సిల్
పంజాబ్లోని ఫిరోజ్పూర్లో జరిగిన ఒక వివాహంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మరికొద్ది క్షణాల్లో పెళ్లి అనగా వరుడిని చూసిన వధువు హతాశురాలైంది. తనకు కాబోయే భర్త ఇతను కాదు అంటూ పెళ్లికి నిరాకరించడంతో వివాదం మొదలైంది.రాజస్థాన్లోని ఛత్తర్గఢ్ నుండి వచ్చిన పెళ్లి ఊరేగింపు, చివరకు వధువు లేకుండానే తిరిగి వెళ్ళిపోయిన ఘటన వైరల్గా మారింది.పోలీసుల సమాచారం ప్రకారం, బంధుమిత్రుల సందడి మధ్య వివాహ తంతు కొనసాగుతోంది. అగ్ని గుండం చుట్టూ ప్రదక్షిణలు చేసే వేడుక ప్రారంభానికి ముందు వరుడిని చూసిన వధువు షాకైంది. ఈ పెళ్లి నాకొద్దు అంటూ తెగేసి చెప్పేసింది. దీంతో అర్థాంతరంగా పెళ్లి ఆగిపోయింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఈ వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. పెళ్లికి ముందు తనకు వేరొక యువకుడి ఫోటో చూపించి, వివాహ వేదిక వద్ద వరుడిగా వేరే వ్యక్తిని తీసుకొచ్చారని వధువు ఆరోపించింది. అయితే, వరుడి కుటుంబం దీనికి భిన్నమైన వాదనను వినిపించింది. ఒక మ్యారేజ్ బ్రోకర్ ద్వారా ఈ పెళ్లి కుదిరిందని వరుడి కుటుంబం వాదించింది. రెండు కుటుంబాల అంగీకారంతోనే ఈ వివాహం నిశ్చయమైందని, పెళ్లికి ముందు ఇరు పక్షాలు ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయని వారు చెప్పారు. వరుడి ఫోటోలను ముందుగానే చూపించామని, మధ్యవర్తులు , వధువు తల్లి వరుడి తాత (తల్లి వైపు) మహేంద్ర సింగ్ తెలిపారు. అయినా సరే ససేమిరా అన్న వధువు మాత్రం పెళ్లికి గట్టిగా నిరాకరించింది. ఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది?మరోవైపు రెండు రోజుల క్రితమే వరుడి కుటుంబం నుండి ఫిర్యాదు అందిందని, దానిపై దర్యాప్తు ప్రారంభించా మని గురు హర్ సహాయ్ డీఎస్పీ తేజిందర్పాల్ సింగ్ తెలిపారు. విచారణ సమయంలో ఇరు పక్షాలు తమ వాదనలను వినిపించాయనీ, ఈ సమస్యను పరిష్కరించుకున్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. అయితే ఈ వివాదం ఎలా ముగింసిందనే దానిపై స్పష్టత లేదు. ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!
ఎన్ఆర్ఐ
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏబీసీ నెట్వర్క్ ఏర్పాటు..
అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్వర్క్ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు 'ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్'(AAA) మరియు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ కమ్యూనిటీ(ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి.ఆయా ప్రాంతాల్లో AAA, ABC రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ అభివృద్ధికి ప్రాంతీయ డైరెక్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి ప్రాంతీయ డైరెక్టర్కు ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. స్థానిక నాయకత్వంతో భాగస్వామ్యం, వ్యాపారవేత్తలు–పెట్టుబడిదారులు–వృత్తి నిపుణులను అనుసంధానం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కొత్త అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై వారు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.ఐదుగురు ప్రాంతీయ డైరెక్టర్లుబొల్లి వెంకట రామకృష్ణ (వెంకట్) – లాస్వేగాస్ (Las Vegas) లోని తెలుగు సమాజంలో చురుకైన సభ్యుడిగా, ఐటీ ప్రొఫెషనల్, వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్గా ఉన్నారు. మెంటరింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్, వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆయనకు నార్త్ కరోలినా, నెవాడా, అలబామా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.హనుమంతు సింహబలుడు (సింహ) – ఉత్తర అమెరికా సాక్షి టీవీ చీఫ్ కరస్పాండెంట్గా, గతంలో UBI TV న్యూస్ డైరెక్టర్గా పనిచేసిన మీడియా నిపుణుడు. విశ్వసనీయ జర్నలిజం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కు కట్టుబడి ఉన్న ఆయనకు న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, ఇల్లినాయిస్, మిస్సౌరీ రాష్ట్రాల బాధ్యతలు కల్పించారు.దొమ్మరాజు హేమంత్ వర్మ – టెక్నాలజీ, కన్సల్టింగ్, స్టార్టప్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారవేత్తగా ఉన్నారు. ERP & Automations డైరెక్టర్గా, వ్యూహాత్మక కన్సల్టింగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా సేవలందిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సహకారం, కమ్యూనిటీ అభివృద్ధిపై దృష్టి సారించనున్న ఆయనకు పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, ఒహాయో, మసాచుసెట్స్, ఓక్లహోమా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.గొట్టిపాటి కళ్యాణ్ – 18 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఎంటర్ప్రెన్యూర్, ఐటీ ప్రొఫెషనల్. ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో అనుభవంతో పాటు వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆంధ్ర సంస్కృతిని పరిరక్షిస్తూ తెలుగు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆయనకు అరిజోనా, వాషింగ్టన్, యూటా, కొలరాడో, న్యూ మెక్సికో రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.చౌటకూరి చేతన్ రెడ్డి – ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, కన్సల్టింగ్ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన టెక్నాలజీ ప్రొఫెషనల్. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులతో పాటు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తూ, భాగస్వామ్యాలు, అవకాశాలు, స్థిరమైన కమ్యూనిటీ ప్రభావంపై దృష్టి సారిస్తున్నారు. ఆయనకు జార్జియా (Georgia), మిషిగన్, టెన్నెస్సీ, ఫ్లోరిడా, సౌత్ కరోలినా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.నాయకత్వం, నెట్వర్కింగ్కు ప్రాధాన్యంAAA–ABC ప్రాంతీయ డైరెక్టర్లు స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్, కమ్యూనిటీ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, కొత్త భాగస్వామ్యాలు మరియు వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేయనున్నారు. అదేవిధంగా మెంటరింగ్, నాయకత్వ అభివృద్ధి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, బలమైన నెట్వర్క్ నిర్మాణం, కొత్త అవకాశాల సృష్టి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.స్థానిక సంస్థలు, రాష్ట్ర నాయకత్వం, వివిధ రంగాల నిపుణులతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిటీకి మరింత ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 2028–2031 కాలానికి నియమితులైన ఈ ప్రాంతీయ డైరెక్టర్ల నాయకత్వంలో AAA–ABC నెట్వర్క్ మరింత విస్తరించి, ఉత్తర అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ వర్గాలను మరింత దగ్గర చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
యూరప్లో ఘోర రోడ్డు ప్రమాదం..జగిత్యాల యువకుడు దుర్మరణం
జగిత్యాల: బతుకుదెరువు కోసం సుదూర తీరాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. యూరప్లోని మాల్టా దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల పట్టణానికి చెందిన 27 ఏళ్ల మహ్మద్ జావెద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లయిన మూడు నెలలకే ఆయన మరణించడంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపుర ప్రాంతానికి చెందిన మహ్మద్ జావెద్ గత ఏడాది కాలంగా మాల్టాలోని పావోలా పట్టణంలో ఒక సేల్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున దక్షిణ మాల్టాలోని కోర్మి ప్రాంతంలో జావెద్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఒక భారీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన జవ్వద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మహ్మద్ జావెద్కు మూడు నెలల క్రితమే స్వదేశానికి వచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి వేడుకల అనంతరం జీవితంలో స్థిరపడాలనే ఆశతో ఆయన తిరిగి మాల్టాకు వెళ్లాడు. ఇంతలోనే ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో జావెద్ మృతి చెందారనే వార్త వినడంతో భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి దేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర
‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకలు ఆదివారం (9 ఆగస్టు 2026) సాయంత్రం అత్యంత వైభవంగా కోలాహలంగ జరిగాయి. ఈ బోనాల వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్’ లోని శ్రీ అరసకేసరి శివాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. తెలుగు వారందరితో తో కలిపి సుమారు 850 నుండి 900 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో అమ్మ వారి భక్తి మరియు బోనాలకు సంబందించిన ప్రత్యేక పాటలకు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరికి మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్ఎస్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. మన ఈ తెలంగాణ సంప్రదాయం లో ప్రధాన భూమిక పోషించే బోనాల పండుగతో ప్రేరణ పొంది తెలుగు వారందరు బోనాల వేడుకను జరుపుకోవడం సంతోషకరం అని బోనాల్లో పాల్గొన్న వారు అన్నారు. బోనాల జాతరలో పోతురాజు మరియు పులివేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీనాథ్, గౌడ సాయి కుమార్, అయిట్ల లక్ష్మణ్, లక్ష్మిపతి మరియు అరవింద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.ఈ ఏడాది బోనం సమర్పించిన ఫ్యామిలీస్ లో శశిధర్ రెడ్డి, రమేష్ గడప, అలేఖ్య దార, అలేఖ్య తడిసిన, దీపా రెడ్డి మండల, బోయిని స్వరూప, శ్వేత కుంభం, బర్ల అరుణ్కుమార్, బైలపూడి గౌరీ వరలక్ష్మి, మోతె శ్రీనివాస రెడ్డి, బొందుగుల ఉమారాణి మరియు అన్ను సుజాత ఉన్నారు. బోనం సమర్పించిన భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు రిటర్న్ గిఫ్ట్ ను అందచేశారు. అమ్మవారికి బోనం సమర్పించిన భక్తులు ఇంట్లో వండి తెచ్చిన అన్న తీర్థ ప్రసాదాన్ని పంచి సంతోషాన్ని వెలిబుచ్చారు. వీరితో పాటు గడప రమేశ్ మరియు బసిక ప్రశాంత్ కుమార్ అమ్మవారి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు. బోనాలు పండుగ లో పాల్గొన్న భక్తులందరూ కమిటీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాద (పులిహోర , పెరుగు అన్నం మరియు కేసరి ) వితరణలో పెద్ద ఎత్తులో సంతోషంగా పాల్గొని అందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.సింగపూర్ బోనాలు - 2026 పండుగలో పాల్గొని విజయవంతం చేసిన మరియు ఎల్లప్పుడూ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు మరియు విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు మరియు శివ ప్రసాద్ ఆవుల మరియు కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్ , యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం మరియు సుకేందర్ నీలం మొదలగు వారు మాట్లాడుతూ సొసైటీకి సహాయ సహకారాలు అందిస్తున్న సింగపూర్ లో ఉన్న తెలంగాణ వాసులకు, అందరూ తెలుగు వారికి మరియు స్పాన్సర్స్ కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.అందరి పై ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని సొసైటి సభ్యులు ఆకాంక్షించారు.ఎలాంటి అసౌకర్యం లేకుండ తీసుకున్న జాగ్రత్తలకు సొసైటీ చేసిన ఏర్పాట్లను భక్తులు అభినందించారు. ఈ వేడుకలకు సహకారం అందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏ వి ఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (కూల్ టైమ్ ఎయిర్కాన్ ఇన్స్టాలేషన్ & సర్వీస్) మరియు స్వాతి ఖానాపురం; సాయి కృష్ణ కొమాకుల; నగేష్ టేకూరి; నిఖిల్ పారుపల్లి; శ్రీధర్ మారోజు & ఫ్రెండ్స్, రామాంజనేయులు చమిరాజు, అజయ్ నందగిరి, నరేష్ కుమార్ నౌల్ల, అభిమల్ల గిరి ప్రసాద్; కొల్లా శివ ప్రసాద్; మునిగెల కృష్ణం రాజు; పాతూరి రాంబాబు మరియు దండా నాగేశ్వర్ రెడ్డి, రెడ్డిపల్లి కృష్ణారావు, రవీంద్ర కుమార్ గార్లకు మరియు దేవాలయ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పండుగలో ఫొటోగ్రఫీ కవరేజ్ చేసిన కృష్ణ నెల్లుట్ల గారికి, సౌండ్ సాంకేతికతలో సహకరించిన యసరావేణి విజయ కుమార్ మెరుగు గారికి మరియు పండుగ విజయవంతంగా జరగడానికి తోడ్పడిన ప్రతిఒక్కరికి పేరు పేరున కమిటీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
బాల్టిమోర్లో 19వ ఆటా మహాసభలు.. తెలుగు సంస్కృతికి పట్టాభిషేకం
బాల్టిమోర్, అమెరికా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యువజన సదస్సు దిగ్విజయంగా ముగిశాయి. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు (జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు) అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగిన కార్యక్రమాలకు ఉత్తర అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన తెలుగు ప్రజలతో బాల్టిమోర్ నగరం ఒక మినీ తెలుగు సీమను తలపించింది. తెలుగు భాషాభిమానం, సామాజిక ఐక్యత, ఆర్థిక పురోగతి , భావితరాల చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఈ మహాసభలను హాజరైన ప్రతినిధులు ‘సూపర్ డూపర్ హిట్’గా అభివర్ణించారు. శోభాయమానమైన గ్రాండ్ బాంక్వెట్తో ప్రారంభమైన ఈ వేడుకలు ఆటా చరిత్రలోనే ఒక చిరస్మరణీయ మైలురాయిగా నిలిచాయి.జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత తెచ్చిన రాజకీయ దిగ్గజాలుఈ మహాసభలకు అమెరికా జాతీయ రాజకీయ దిగ్గజాలతో పాటు భారతదేశానికి చెందిన ప్రజాప్రతినిధులు హాజరై ప్రత్యేక శోభను తెచ్చారు. మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ మాట్లాడుతూ మేరీల్యాండ్, అమెరికా సమగ్ర అభివృద్ధిలో తెలుగు ప్రవాసుల పాత్రను కొనియాడారు. సాంకేతికత, వైద్యం, విద్య, వ్యాపారం, పౌర సేవల్లో తెలుగు వారి నిబద్ధతను అభినందించారు.ఈ కార్యక్రమానికి హాజరైన మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ తన జీవిత ప్రయాణాన్ని షేర్ చేసుకుంటూ.. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా అమెరికన్ సమాజంలో ఉన్నత అవకాశాలను సాధించవచ్చని సూచించారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా ఎఫ్. హష్మీ తన హైదరాబాద్ బాల్య జ్ఞాపకాలైన పాతబస్తీ, చార్మినార్, లాడ్ బజార్, హైదరాబాదీ బిర్యానీ, రైలు ప్రయాణాలను గుర్తుచేసుకుని ప్రేక్షకులను చప్పట్లు కొట్టేలా చేశారు. ప్రవాసులు పౌర, రాజకీయ ప్రక్రియల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రగతి, మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ రాష్ట్రాభివృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రవాస పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో తానా, నాట్స్, టీటీఏ, టీడీఎఫ్, ఏఏపీఐ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొని తెలుగు సమాజ ఐక్యతను చాటారు. అమెరికా సాయుధ దళాల్లో వీరోచితంగా సేవలందిస్తున్న తెలుగు మహిళలు, పురుషులను ఈ వేదికపై ఘనంగా సత్కరించడంతో సభ మొత్తం అత్యంత భావోద్వేగానికి గురవడమే కాదు, స్టాండింగ్ ఒవేషన్, కరతాల ధ్వనులతో వేదికను మార్మోగేలా చేశారు.వ్యాపార, సాంస్కృతిక వేడుకలుమూడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాలతో కన్వెన్షన్ సెంటర్ సభా ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఈ వేదికలపై కవిత్వం, సాహిత్యం, సినిమా, చరిత్రపై లోతైన చర్చలు జరిగాయి. పారిశ్రామిక వేదికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, వైద్యం, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలపై సీనియర్ పారిశ్రామికవేత్తలు, యువ స్టార్టప్ వ్యవస్థాపకులు విస్తృతంగా చర్చించారు. రెండవ, మూడవ తరాల తెలుగు-అమెరికన్ యువత కోసం సంస్కృతి, నెట్వర్కింగ్, నాయకత్వ నైపుణ్యాలు,కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను నిర్వహించారు. ఉర్రూతలూగించిన జానపదాలుతెలుగు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న జానపద గీతాలు ఈ వేదికకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్, జనార్దన్ పన్నెల బృందం ఆలపించిన తెలంగాణ జానపద గేయాలు చప్పట్లతో మారుమోగించాయి.తారల సందడి.. కీరవాణి స్వర నీరాజనంతెలుగు సినీ ప్రపంచానికి చెందిన ప్రముఖుల రాకతో వేడుకల్లో ఉత్సాహం రెట్టింపైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అడివి శేష్, హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీధర్ గౌడ్, వరుణ్ సందేశ్, పూజా హెగ్డే, రీతూ వర్మ, అనన్య నాగళ్ల, దివి వడ్త్యా అభిమానులతో ముచ్చటించారు. యువ నటుడు నవీన్ పోలిశెట్టి తన టైమింగ్ కామెడీ పంచ్ లతో ప్రాంగణాన్ని నవ్వుల సంద్రంలో ముంచెత్తారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, గాయని సునీత, త్రీయరీ, ఆరెంజ్ స్ట్రీట్ బృందాల ప్రదర్శనల అనంతరం... ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ మహాసభలకు 'గ్రాండ్ ఫినాలే'గా నిలిచింది.20వ మహాసభలు డాలస్లో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బానాల, సతీష్ రెడ్డి రామసహాయం మరియు కోర్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వందలాది మంది వాలంటీర్లు భోజనం, రవాణా, లాజిస్టిక్స్ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించి అతిథుల మెప్పు పొందారు.ఈ మహాసభల ముగింపు సందర్భంగా కీలక ప్రకటన చేస్తూ, 2028లో జరగబోయే 20వ ఆటా మహాసభలకు డాలస్ (టెక్సాస్) నగరం ఆతిథ్యం ఇవ్వబోతోందని నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. బాల్టిమోర్ మహాసభలు కేవలం సదస్సులు కాదు.. తెలుగువారి గుర్తింపునకు ఒక గొప్ప వేడుక.. కొత్త అవకాశాలకు వేదిక.. సంస్థలు, వృత్తులు, తరాలకు అతీతమైన ఐక్యతకు శక్తివంతమైన ప్రతీక.. అని తెలిపారు.
క్రైమ్
దారుణం: స్క్రూడ్రైవర్తో పొడిచి మహిళ దారుణ హత్య!
నెల్లూరు జిల్లా: తనను దూరం పెడుతోందని సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి మహిళపై కిరాతకానికి ఒడిగట్టాడు. మెడ భాగంలో స్క్రూడ్రైవర్తో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. జలదంకికి చెందిన ఉప్పు సునీత (30)కు 15 ఏళ్ల క్రితం ఉప్పు శీనుతో వివాహమవ్వగా విభేదాలు రావడంతో ఐదేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి కుమార్తె (14), కుమారుడు(13) శిశు సంక్షేమ పాఠశాలలో చదువుతున్నారు. మేస్త్రీ పనులకు వెళ్తున్న సునీత, కొండాపురం మండలానికి చెందిన మహేంద్ర (30) ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. సునీత, ఉప్పు శీనుకు ఈ నెల 7న జలదంకి పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం మహేంద్ర ఫోన్ నంబర్ను సునీత బ్లాక్ చేసింది. మంగళవారం మహేంద్ర వెంగళరావునగర్లో సునీత ఇంటికి వచ్చాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొద్దిసేపటి తర్వాత సునీత ఇంట్లో మృతి చెంది కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనాస్థలికి రాగా..సునీత మెడపై రక్తగాయాలను గుర్తించారు. స్క్రూడ్రైవర్తో సునీతపై దాడి చేసినట్లుగా ప్రాథమికంగా పోలీసులు నిర్థారించారు. మహేంద్రే హత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
భర్త బంధువుతో భార్య వివాహేతర సంబంధం.!
పల్నాడు: విడాకులు తీసుకోకుండానే తన భార్య రెండో పెళ్లి చేసుకుందని మైదుకూరు పట్టణంలోని రాజీవ్ గాంధీ నగర్కు చెందిన కాకిమాను వెంకట నరేష్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. రాజీవ్ గాంధీ నగర్కు చెందిన రెడ్డప్ప కుమారుడు వెంకట నరేష్కు పల్నాడు జిల్లా చిన్నకొండాయపల్లెకు చెందిన తురుమెల్ల దుర్గారావు కుమార్తె ప్రవల్లికతో 2022 ఆగస్టు 13న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కొన్నాళ్లకు నరేష్ భార్య రాజీవ్ గాంధీ నగర్కే చెందిన నరేష్ బంధువు అయిన తిరువాయిపాటి సందీప్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయమై మామ రెడ్డప్ప, భర్త నరేష్.. ప్రవల్లికను మందలించారు. అది మనసులో పెట్టుకొని నరేష్తో, అత్తమామలతో ఆమె చీటికిమాటికి గొడవపడేది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ప్రవల్లిక కాపురం చేయకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన భార్య తన బంధువైన సందీప్ను వివాహం చేసుకున్నట్లు తెలియడంతో నరేష్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనస్పర్థలతో తాము దూరంగా ఉంటున్నామని, విడాకులు తీసుకోలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నరేష్ పేర్కొన్నారు. చట్టపరంగా విడాకులు తీసుకోకుండా, తన అనుమతి లేకుండా తన భార్య రెండో వివాహం చేసుకుందని తెలిపారు. తన భార్యపై, ఆమెను వివాహం చేసుకున్న సందీప్పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
డిప్యూటీ తహసీల్దార్ సంధ్య కేసులో ఊహించని మలుపు
మహబూబాబాద్ రూరల్: ప్రేమ పేరుతో మోసపోయిన ట్రెయినీ డీటీ డోలి సంధ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేశామని మహబూబాబాద్ టౌన్ సీఐ రఘుపతిరెడ్డి మంగళవారం తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన డోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల కుమార్తె సంధ్య గ్రూప్–4లో ఎంపికై మానుకోట మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్గా విధులు నిర్వర్తించారు. ఈక్రమంలో సీరోలు మండలం రేకులతండా గ్రామానికి చెందిన తేజావత్ శ్యామ్ అక్కడే వార్డు ఆఫీసర్గా విధుల్లో చేరాడు.వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడడంతో సంధ్యను శ్యామ్ ప్రేమిస్తున్నానని చెప్పగా.. ఆమె నిరాకరించింది. గత ఏడాది సెప్టెంబర్లో సంధ్య గ్రూప్–2 ఉద్యోగం సాధించి ఖమ్మం జిల్లా పరిధిలో ట్రెయినీ డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో మళ్లీ శ్యామ్ మాయమాటలు చెప్పి సంధ్యకు దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంతకాలం ఆమెతో సాన్నిహిత్యంగా ఉన్నాడు. కాగా, మూడు నెలల నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈక్రమంలో గత శనివారం సంధ్య ఫోన్ చేసి వివాహం చేసుకోవాలని శ్యామ్ను కోరగా.. తమ తల్లిదండ్రులు అంగీకరించడం లేదని తెలిపాడు. మళ్లీ రెండు రోజుల క్రితం సంధ్య ఫోన్ చేయగా తనకు వివాహం జరిగిందని చెప్పడంతో పాటు.. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని తీవ్ర పదజాలంతో దూషించాడు. ‘పెళ్లి గురించి ప్రస్తావించొద్దని, నువ్వు చచ్చినా నాకు అవసరం లేదని, లేనిపక్షంలో నేనే చంపుతానని’ శ్యామ్ బెదిరించడంతో మనస్తాపానికి గురైన సంధ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు తేజావత్ శ్యామ్, అతడి తల్లిదండ్రులు జామ్లా, విజయపై టౌన్ ఎస్సై సూరయ్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని సీఐ తెలిపారు.
నా భర్తను చంపేశాడు!
పిఠాపురం: స్థానిక పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయట పడుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న షేక్ సాధిక్ ఖాన్.. తన కుటుంబానికి సహాయం చేస్తున్నట్టుగా నటించి, తమను హింసించాడని, తన భర్తను హత్య చేశాడని, తన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరించాడంటూ నూకరాజు కుమార్తె రాసినట్లు చెబుతున్న లేఖలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో, ఈ కేసు కీలక మలుపు తిరిగింది. సాధిక్ ఖాన్ వేధింపులు భరించలేక నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డి కలసి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీద నుంచి ఆదివారం రాత్రి గోదావరి నదిలో దూకిన విషయం తెలిసిందే. ఈ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నూకరాజు మృతదేహం సోమవారం రాత్రి లభ్యం కాగా.. మీనా, సౌజన్యల ఆచూకీ మంగళవారం సాయంత్రానికి కూడా లభించలేదు. వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో కార్తికేయరెడ్డి ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. సాధిక్ ఖాన్పై మరో ఫిర్యాదు తన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేందుకు సాధిక్ ఖాన్ కారణమంటూ నూకరాజు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు సాధిక్ ఖాన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అతడిపై తాజాగా హత్య కేసు కూడా నమోదైంది. తన కుమారుడు జగదీశ్వరరెడ్డికి సాధిక్ ఖాన్ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి, హత్య చేశాడంటూ నూకరాజు వియ్యంకుడు, సౌజన్య మామ భాస్కరరెడ్డి మంగళవారం సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉందని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సాధిక్ ఖాన్పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పోలీసులు ఇప్పటికే నూకరాజు కారు డ్రైవర్ రాజు నుంచి సమాచారం సేకరిస్తున్నారు. నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జగదీశ్వరరెడ్డి హత్యలో ఉన్న మరో వ్యక్తి ఎవరనే అంశంపై విచారణ చేపట్టారు. ‘నన్ను బెదిరించాడు’ నూకరాజు మనవడు కార్తికేయరెడ్డితో పాటు తన కోడలు సౌజన్య స్కూటీలో ఆధారాలున్నాయంటూ భాస్కరరెడ్డి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు ఆమె స్కూటీని తనిఖీ చేసి మూడు కవర్లను గుర్తించారు. వాటిలో తన భర్త జగదీశ్వరరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. సాధిక్ ఖాన్ తనను బెదిరించి, తన ఆస్తిని, ఫోన్, ఏటీఎం కార్డులు, బ్యాంకు లాకరు వివరాలన్నీ తీసుకున్నాడని, చివరకు తన భర్తను పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడని, మాట వినకపోతే తన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరించాడని సౌజన్య ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అతడి బెదిరింపులు, వేధింపులు భరించలేకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.చనిపోవాలని ముందే నిర్ణయం!కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆయన కారు డ్రైవర్ రాజును రాజమహేంద్రవరం ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి, పలు ఆధారాలు సేకరించారు. సాధిక్ ఖాన్ వేధింపులు అధికం కావడంతో తాళలేక చనిపోవాలని నూకరాజు కుటుంబం ముందే నిర్ణయించుకుందని, దీనికి ఆదివారం ఉదయం ప్లాన్ వేసుకుందని సమాచారం. ఈ క్రమంలో కారు డ్రైవర్ రాజును ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి రావాలని నూకరాజు చెప్పారు. ఆలోగా ఆస్తిపత్రాలన్నీ తీసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. ఇంటికి వచ్చిన డ్రైవర్ రాజుకు ఆస్తి డాక్యుమెంట్లు ఇచ్చి, తమ సమీప బంధువు మహేష్కు ఇవ్వాలని పంపించారు.డ్రైవర్ ఆ పని పూర్తి చేసుకుని వచ్చిన తరువాత ఆదివారం రాత్రికి రాజమహేంద్రవరం చేరుకున్నారు. డ్రైవర్ రాజు ద్వారా రాజమండ్రి రైల్వే స్టేషన్లో టిఫిన్లు తెప్పించుకున్నారు. అనంతరం, కారులో కొవ్వూరు చేరుకుని, డ్రైవర్ రాజుకు కొంత డబ్బులు ఇచ్చి వెళ్లిపోవాలని చెప్పారు. ఆ తర్వాత నూకరాజు కుమార్తె సౌజన్య కారు నడుపుతూండగా.. గంటకు పైగా కొవ్వూరు, రోడ్డు కం రైల్వే బ్రిడ్జి సమీపంలో తిరిగారు. సరిగ్గా 88వ నంబర్ పిల్లర్ వద్దకు వచ్చి, కారు దిగి, గోదావరిలో దూకేశారు. నూకరాజు మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వీడియోలు
నేను ఆ మహిళ SI ని... దరిద్రమైన కేసు నా మీద పెట్టారు.. రవి సంచలన నిజాలు
వామ్మో ఏనుగు..! టూరిస్టులకు దిమ్మతిరిగే షాక్
ఫోక్ డాన్సర్ గుట్టు బట్టబయలు.. నా భర్త మంచోడే.. ఆమె లొంగదీసుకుంది
పెద్ద ప్లాన్ వేసి..చిన్న తప్పుతో దొరికేశారు.. SP సంచలన ప్రెస్ మీట్
భర్తను చంపి.. అది చూసిన కొడుకును కూడా..
ఆ మాటే హంతకులను పట్టించిందా?
భారత్ తన కొడుకు ప్రాణాలు కాపాడటంతో పాకిస్థానీ తల్లి భావోద్వేగ సందేశం
చిరు & బాలయ్యని కూడా లెక్క చేయలేదు జానీని చూసుకునే ఆమె ఇదంతా..
రూపా రెడ్డి హత్య కేసు.. అనుమానం ఎలా వచ్చిందంటే..! SP సంచలనం
రూపారెడ్డి హత్య వెనుక అసలు కథ ఇదే..


