యూకేజీ విద్యార్థిని కొట్టి చంపిన టీచర్
విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రణయ తేజ అనే చిన్నారిని స్కూల్ టీచర్ చితకబాదింది. దెబ్బలు తాళలేక ప్రణయ తేజ మృతి చెందాడు. కేజీహెచ్ వద్ద ఆ బాలుడి బంధువులు ఆందోళనకు దిగారు. వారితో పోలీసులు మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రణయ తేజ వన్ టౌన్ లిటిల్ గార్డెన్ స్కూల్లో యూకేజీ విద్యార్థి. గురువారం ఉదయం 11.20 గంటలకు స్కూల్లో విషాద ఘటన జరిగింది. హోం వర్క్ చెయ్యలేదని టీచర్ కొడుతుంటే అతడు బాగా భయపడిపోయి, కుప్పకూలాడు. స్కూల్లో బాలుడు పడిపోయిన వెంటనే సీపీఆర్ చేశారు మరో టీచర్. ఆ వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి బాలుడిని తరలించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు బాలుడిని టీచర్లు కేజీహెచ్కు తీసుకొచ్చారు. కేజీహెచ్కు తీసుకొచ్చిన వెంటనే ఈసీజీ సహా పలు టెస్టులు చేసి చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. విశాఖలో ఈ విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్కూల్ వద్ద కూడా ఆ చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. టీచర్ను పోలీసులు అరెస్టు చేసి, కేసులో తదుపరి విచారణ జరుపుతున్నారు.
ఇన్స్టామార్ట్లో బొద్దింక : ఎఫ్డీఏ తుకారాంకు హీరోయిన్ విజ్ఞప్తి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారాం ముండే (FDA Commissioner Tukaram) రాష్ట్రంలో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలు మరియు మందుల నియంత్రణపై భారీ చర్యలు చేపడుతున్నారు. రెస్టారెంట్లు హోటళ్లు, ప్రముఖ ఫార్మా కంపెనీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, పెద్ద ఎత్తున లైసెన్సులు సస్పెండ్ చేయడం , అమ్మకాలను నిలిపివేయడం, నోటీసులు జారీ లాంటి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తుకారం ముండే చర్యలపై ప్రశంసలు కురిపించారు.మరోవైపు ముండే వ్యవహారశైలిపై బాంబై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నోటీసులివ్వకుండా తనిఖీల పేరుతో ఎఫ్డీఏ చేపడుతున్న దూకుడు చర్యలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన తరుణంగా తాజాగా తుకారాం ముండేకి ట్యాగా చేస్తూ నటి శ్వేతా తివారీ Shweta Tiwari) చేసిన విజ్ఞప్తి ఆసక్తికరంగా మారింది. ఇదీ చదవండి: రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్ స్టార్డమ్అసలు ఏమైంది? శ్వేతా తివారీ ఒక క్విక్-కామర్స్ యాప్ ద్వారా ఇన్స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన సరుకులతో పాటు ఇంట్లోకి బొద్దింక వచ్చిందని ఆరోపించిది. ఈ యాప్ ద్వారా కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు శ్వేతా తివారీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక వీడియోను పంచుకున్నారు. దీనికి మహారాష్ట్ర ఎఫ్డీఏ మిషనర్ తుకారాం ముండేను ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో తన ఇంట్లో తిరుగుతున్న బొద్దింకను చూపిస్తూ, ఆహార భద్రతా నిబంధనలపై చర్యలు తీసుకుంటున్న ముండేను ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు.కాగా ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న రెస్టారెంట్లు, క్యాంటీన్లపై కఠిన చర్యలు తీసుకుంటూ ముండే ఇటీవల సోషల్ మీడియాలో "అసలి సింగం"గా ప్రశంసలు అందుకుంటున్నారు. సదరు ఆర్డర్ లేదా డెలివరీ ప్లాట్ఫామ్కు సంబంధించిన పూర్తి వివరాలను నటి ఇంకా వెల్లడించలేదు. అలాగే ఈ ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇంకా స్పష్టత రాలేదు. ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం
రానా, నాగ్ అయిపోయింది.. ఇప్పుడు రామ్ టర్న్?
సూపర్స్టార్ రజనీకాంత్ సినిమాల్లో ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు నటించడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్లో ఆసక్తి రేపుతోంది. అశ్వత్ మారిముత్తు డైరెక్షన్లో, కమల్ హాసన్ నిర్మాతగా రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ధర్మన్లో తెలుగు యువ హీరో రామ్ పోతినేని నటించబోతున్నాడు. అయితే ఇది నెట్టింట మరో రచ్చకు దారి తీసింది.రజనీకాంత్ అల్లుడిగా కనిపిస్తాడా? లేక విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పిస్తాడా? అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సినిమాలో రామ్కు జోడీగా రాశీఖన్నా నటించనున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. దీంతో ఇప్పటికే సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరోవైపు రజనీ సినిమాలో రామ్ లాంటి తెలుగు స్టార్ నటించడంపై అభిమానుల్లోనూ భిన్నమైన చర్చ జరుగుతోంది.నాగ్ తర్వాత రామ్ వంతు?లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. నాగార్జున పోషించిన సైమన్ పాత్రపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత ఆ పాత్రకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. నాగార్జున లాంటి స్టార్ను.. మరీ చీప్గా ప్రజెంట్ చేయడంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే చాలా గ్యాప్ తర్వాత రజనీ ‘వెట్టైయాన్’ చిత్రంలో నటించిన రానాకు కూడా ప్లాపే పడింది.ఇప్పుడు అదే నేపథ్యంలో రామ్ పేరు తెరపైకి రావడంతో.. ‘రానా, నాగ్ తర్వాత ఇప్పుడు రామ్ వంతా?’ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రజనీ సినిమాలో పాత్రకు సరైన ప్రాధాన్యం లేకపోతే మాత్రం అది రామ్ కెరీర్కు పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది.పాపం.. రామ్రామ్ పోతినేనికి ఈ సినిమా కీలకంగా మారే అవకాశముంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఆయనకు ఆ స్థాయిలో విజయం దక్కలేదు. వారియర్ పేరిట ద్విభాషా చిత్రం చేసినా ఆడలేదు. పైగా సంజయ్ దత్, ఉపేంద్ర వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేసినా.. రామ్ కెరీర్కు మాత్రం పెద్దగా బూస్ట్ రాలేదు. దీంతో స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏకంగా రజనీకాంత్ సినిమాలో అవకాశం రావడం ఆయనకు పెద్ద ప్లస్ అవుతుందనే అభిప్రాయం ఒకవైపు ఉంది. రజనీ సినిమాకు ఉన్న క్రేజ్, పాన్ ఇండియా మార్కెట్ దృష్ట్యా రామ్కు కొత్త ప్రేక్షకులను చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. తేడా కొడితే పరిస్థితి ఏంటన్నదానిపైనా జోరుగా చర్చ నడుస్తోంది.రజనీకీ అంతే..మరోవైపు రజనీకాంత్ కెరీర్లోనూ ప్రతి సినిమా ఇప్పుడు కీలకమే. ‘జైలర్’కు ముందు, కూలీ కూడా ఆశించిన స్థాయిలో చిత్రాలేవీ ఆడలేదు. రెమ్యునరేషన్ ఆకాశాన్ని అంటుతూ.. కలెక్షన్లు రాక నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రజనీ తదుపరి చిత్రాలు(జైలర్-2, ధర్మన్ చిత్రాలు) కచ్చితంగా హిట్లు కావాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని తమిళంలో నటించడం.. ఇప్పుడు కోలీవుడ్తో పాటు మన దగ్గరా చర్చకు దారి తీసింది.
‘సుస్మిత వల్ల సురేఖ తలదించుకోవాల్సి వస్తోంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితపై కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “సుస్మిత వల్ల సురేఖ తలదించుకోవాల్సి వస్తోంది.. ఆమె వల్లే మంత్రి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కొండా సుస్మిత వ్యాఖ్యలపై తాజాగా ఇందిరా శోభన్ స్పందించారు. ఈ సందర్భంగా సుస్మిత ఆలోచనలు “డైపర్ల దగ్గరే ఆగిపోయాయి” అంటూ తీవ్ర విమర్శలు చేసిన ఇందిరా శోభన్.. “సుస్మిత చదువు, సంస్కారం ఇదేనా?” అని ప్రశ్నించారు. కొండా సురేఖ పేరు లేకపోతే సుస్మిత ఎవరో కూడా తెలియదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై విమర్శలు చేయడానికి సుస్మితకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. సుస్మిత వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల ముందు చులకన అవుతోందని ఇందిరా శోభన్ ఆరోపించారు. “సురేఖ పేరును సుస్మిత దిగజారుస్తోంది. సుస్మిత రెచ్చిపోతే పుచ్చిపోతది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు.. సుస్మిత వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయన్న అనుమానం కలుగుతోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కోసం సుస్మిత ఏం చేశారని ప్రశ్నించిన ఇందిరా శోభన్.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడ్డది రేవంత్రెడ్డి అని అన్నారు. ఇదే క్రమంలో “చాలా మంది నాయకులకు సన్స్ట్రోక్ ఉంటుంది.. కొండా సురేఖకు డాటర్స్ట్రోక్ ఉంది” అంటూ ఇందిరా శోభన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారాయి. కుమార్తె వ్యాఖ్యలు, వ్యవహారశైలే సురేఖకు ఇబ్బందులు తెస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్
ప్లీజ్.. దయచేసి నన్ను తీసుకోండి: ఉప్పల్ బాలు రిక్వెస్ట్
'కూతురి వైఖరితో చిక్కుల్లో కొండా సురేఖ'
సిక్కుల ఊచకోత కేసు దోషి, కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మృతి
14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’
హ్యుందాయ్ కార్ల ధరల పెంపు
ఆసీస్ జట్టు నుంచి అవుట్.. ఆ మరుసటి రోజే ఊహించని ట్విస్ట్?
ట్రెడిషనల్ అనార్కలీ డ్రెస్లో సోనమ్ అత్యద్భుతమైన లుక్..!
సచిన్ టెండుల్కర్పై డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత
ఎన్నో సంస్కరణలు, అద్భుతాలు సృష్టించారు.. మీ టాలెంట్తో కరువు కనబడకుండా చేయండి సార్!
బెంగళూరు తీగల్లో స్పైడర్మ్యాన్ బందీ
‘ఓహో..నీకు పీరియడ్స్ సమయమా’ అని చులకనగా చూసేవాడు: అనుపమ
కూటమి పాలనలో పోలీసు వాహనాలు కూడా ఇలా తయారయ్యాయి!!
ఇంత వరకూ ఆయన తప్ప ఎవరూ మెచ్చుకోలేదట... కృతజ్ఞతగానట!!
సాక్షి కార్టూన్: 18-08-2026
అలాంటి వాళ్లు 'బిగ్బాస్'కి రావొద్దు: నవదీప్
వహ్వా.. ఇక వందేభారత్ హవా!
పగటి కలలు కనొద్దు.. రాందేవ్కు కంగనా ఘాటు కౌంటర్
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
మరో 79 పరుగులు చేస్తే రూట్ ప్రపంచ రికార్డు
జల్లు పడితే.. ఇసుక చల్లుతుంది!
సినిమా గుమ్మం దాటని దేవయాని వారసురాలు
రసాయనాలతో కల్తీ నెయ్యి .. 36 టన్నులు స్వాధీనం
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ!
శుభవార్త చెప్పిన గ్లెన్ మాక్స్వెల్
మద్యం సేవిస్తే బైక్ స్టార్ట్ కాదు.. బైక్కు కొత్త సిస్టమ్
జైలు శిక్ష తప్పించుకున్న వార్నర్.. కానీ ఒక కండిషన్!
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్
ప్లీజ్.. దయచేసి నన్ను తీసుకోండి: ఉప్పల్ బాలు రిక్వెస్ట్
'కూతురి వైఖరితో చిక్కుల్లో కొండా సురేఖ'
సిక్కుల ఊచకోత కేసు దోషి, కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మృతి
14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’
హ్యుందాయ్ కార్ల ధరల పెంపు
ఆసీస్ జట్టు నుంచి అవుట్.. ఆ మరుసటి రోజే ఊహించని ట్విస్ట్?
ట్రెడిషనల్ అనార్కలీ డ్రెస్లో సోనమ్ అత్యద్భుతమైన లుక్..!
సచిన్ టెండుల్కర్పై డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత
ఎన్నో సంస్కరణలు, అద్భుతాలు సృష్టించారు.. మీ టాలెంట్తో కరువు కనబడకుండా చేయండి సార్!
బెంగళూరు తీగల్లో స్పైడర్మ్యాన్ బందీ
‘ఓహో..నీకు పీరియడ్స్ సమయమా’ అని చులకనగా చూసేవాడు: అనుపమ
కూటమి పాలనలో పోలీసు వాహనాలు కూడా ఇలా తయారయ్యాయి!!
ఇంత వరకూ ఆయన తప్ప ఎవరూ మెచ్చుకోలేదట... కృతజ్ఞతగానట!!
సాక్షి కార్టూన్: 18-08-2026
అలాంటి వాళ్లు 'బిగ్బాస్'కి రావొద్దు: నవదీప్
వహ్వా.. ఇక వందేభారత్ హవా!
పగటి కలలు కనొద్దు.. రాందేవ్కు కంగనా ఘాటు కౌంటర్
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
మరో 79 పరుగులు చేస్తే రూట్ ప్రపంచ రికార్డు
జల్లు పడితే.. ఇసుక చల్లుతుంది!
సినిమా గుమ్మం దాటని దేవయాని వారసురాలు
రసాయనాలతో కల్తీ నెయ్యి .. 36 టన్నులు స్వాధీనం
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ!
శుభవార్త చెప్పిన గ్లెన్ మాక్స్వెల్
మద్యం సేవిస్తే బైక్ స్టార్ట్ కాదు.. బైక్కు కొత్త సిస్టమ్
జైలు శిక్ష తప్పించుకున్న వార్నర్.. కానీ ఒక కండిషన్!
ఫొటోలు
విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు)
నటి మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు వైరల్
'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)
మరమనుషుల కేరింతలు.. అబ్బురపరుస్తున్న వింత రోబోలు! (ఫొటోలు)
బేబీ బంప్తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్
'మోడ్రన్ మిస్మమ్మ' మూవీ సాంగ్ లాంచ్ (ఫొటోలు)
కొండను తొలిచి కట్టిన అద్భుత గుహాలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు)
అబిడ్స్ ఇస్కాన్ దేవాలయం స్వర్ణోత్సవ వేడుకలు (ఫోటోలు)
భారీ ‘కల్తీ ముఠా’ గుట్టురట్టు (ఫోటోలు)
సినిమా
విజయ్-త్రిష బంధంపై నటి సంజన కీలక వ్యాఖ్యలు
విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హీరోయిన్ త్రిష పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తమిళనాడులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో సీఎం విజయ్కు త్రిష సెల్యూట్ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా నటి సంజన స్పందించారు. విజయ్ పాలనపై మాట్లాడే ధైర్యం లేకే కొందరు వ్యక్తిగత అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆమె విమర్శించారు.విజయ్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సంజన ప్రశంసించారు. ప్రజా సమస్యలపై ఆయన వేగంగా స్పందిస్తూ.. తన పాలనతో ఇతర రాష్ట్రాల ప్రజలను సైతం ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. విజయ్ పరిపాలనలో లోపాలు చూపించలేకే కొందరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని అన్నారు.‘విజయ్ రాష్ట్రాన్ని సమర్థంగా పరిపాలిస్తున్నారు కాబట్టి.. ఆయనపై ఆరోపణలు చేయలేకపోతున్నారు. వృత్తిపరంగా ఎలాంటి లోపాలు కనిపించనప్పుడు వ్యక్తిగత ఎజెండాను వెతకడానికి ప్రయత్నిస్తారు. వారి వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కించపరచాలని చూస్తారు. విజయ్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. మహిళలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి రాజకీయాలు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు’ అని సంజన వ్యాఖ్యానించారు.ఇక త్రిష గురించి మాట్లాడుతూ.. ఆమె ఎంతో గొప్ప నటి అని సంజన అన్నారు. సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్నారని ప్రశంసించారు. విజయ్, త్రిష మధ్య ఉన్న బంధం పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇద్దరి సాన్నిహిత్యాన్ని చూసి వారి బంధం గురించి ఓ నిర్ణయానికి రావడం సరికాదని అభిప్రాయపడ్డారు. విజయ్ సీఎం అయిన తర్వాత త్రిష పేరు ఆయనతో ముడిపెట్టి సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. సంజన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
సూర్యలోని విశ్వాసమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయానికి కారణం: వెంకీ
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. నటి మమిత బైజు నాయకిగా నటించిన ఇందులో నటి రాధిక శరత్ కుమార్, భవానీశ్రీ, సునిల్ రెడ్డి, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను వెంకీ అట్లూరి నిర్వహించారు. జీవీ.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఇటీవల తెలుగు, తమిళం భాషల్లో విడుదలై సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం చైన్నెలోని ఒక స్టార్ హోటల్లో థ్యాంక్స్ మీట్ను నిర్వహించారు.ఇందులో పాల్గొన్న నటి రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ నటుడు సూర్య తనకు చాలా కాలంగా తెలుసు అన్నారు. ఈ చిత్రంలో ఆయన ఎంతో పరిపక్వతతో నటించారని ప్రశంసించారు. ఈ చిత్రం గురించి ఒక్క నెగిటివ్ విమర్శ వస్తుందని చూశానని, అయితే అన్ని పాజిటివ్ విమర్శలే రావడం విశేషం అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి ప్రతి విషయంలోనూ చాలా క్లియర్గా ఉన్నారన్నారు. తనకు బాగా నచ్చిన చిత్రం సూర్యవంశం అనీ, ఆ తరువాత విశ్వనాథ్ అండ్ సన్స్ అని పేర్కొన్నారు.దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు. చిత్ర ప్రివ్యూను మీడియా మిత్రులతో కలిసి చూశానని, దీంతో వారి రియాక్షన్ ఎలా ఉంటుందో అని కాస్త భయపడ్డానని, అయితే ఆ తరువాత ప్రతి ఒక్కరూ బాగుందని అభినందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను ఇంతకు ముందు దర్శకత్వం వహించిన వాథ్తి, లక్కీ భాస్కర్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారని, తాజాగా తమిళంలో చేసిన విశ్వనాథ్ అండ్ సనన్స్ చిత్రానికి గాను విజయాన్ని అందించారని పేర్కొన్నారు. నటుడు సూర్యలోని విశ్వాసమే ఈ చిత్రం విజయానికి ప్రధాన కారణం అని దర్శకుడు వెంకీ అట్లూ రి పేర్కొన్నారు. కాగా నటుడు సూర్య చైన్నెలో లేని కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న లేదు.
మహిళలకు స్ఫూర్తినిచ్చే పాత్ర చేశాను : వేద జలంధర్
‘‘అమీర్ లోగ్’ చిత్రకథ హైదరాబాద్లోని ఓ బస్తీ నేపథ్యంలో జరుగుతుంది. బస్తీ అన్నది సహజంగా ఉండాలని ఇక్కడి ఓ బస్తీలోని గృహాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపాం’’ అని వేద జలంధర్ తెలిపారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీని రానా దగ్గుబాటి ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా వేద జలంధర్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అమీర్ లోగ్’లో నేను చేసిన గీత పాత్ర పక్కింటి అమ్మాయిలా, మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను చేస్తున్న ఓ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది’’ అని చెప్పారు.
పవిత్రగౌడ మాజీ భర్త మృతి!
యశవంతపుర(కర్ణాటక): చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో మొదటి ముద్దాయిగా పరప్పన జైల్లో ఉన్న నటి పవిత్రగౌడ మాజీ భర్త సంజయ్సింగ్ మరణించాడు. అతడు 8 నెలల క్రితం చనిపోగా ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్ల నుంచి సంజయ్సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ రాజస్థాన్లో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిసింది. చామరాజపేటెలో పవిత్రగౌడ సాధారణ యువతిగా ఉన్నప్పుడు సంజయ్సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతడు స్థానికంగా వ్యాపారం చేసేవాడు. వీరికి ఒక కూతురు ఉంది. తరువాత పవిత్రగౌడ టీవీ సీరియళ్లు, సినిమాల ద్వారా పేరు పొందగానే అతనికి విడాకులు ఇచ్చింది. ఆపై అతడు తాగుడుకు బానిసయ్యాడు. రేణుకాస్వామి హత్య కేసు తరువాత ఆమె గురించి మాట్లాడాడు.
క్రీడలు
లంకతో రెండో టెస్టు.. స్టార్ ప్లేయర్పై వేటు..?
శ్రీలంకతో రెండో టెస్టుకు భారత జట్టు సిద్ధమవుతున్న వేళ తుది జట్టులో కీలక మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 23 నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో ప్రారంభం కానున్న రెండో టెస్టులో మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ సరాన్ష్ జైన్కు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.33 ఏళ్ల సరాన్ష్కు ఇటీవలే భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ రెండో టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో సరాన్ష్ను జట్టులోకి తీసుకున్నారు.సరాన్ష్ కుడిచేతి ఆఫ్స్పిన్నర్తో పాటు ఎడమచేతి వాటం బ్యాటర్. 2014లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అతడు, దశాబ్దానికి పైగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించాడు. ఫస్ట్క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 181 వికెట్లు, 2223 పరుగులు సాధించాడు.సరాన్ష్ తుది జట్టులోకి వస్తే ఎడమచేతి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై వేటుకు అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. గాలేలో జరిగిన తొలి టెస్టులో కుల్దీప్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. 25 ఓవర్లు వేసి 103 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు.మరోవైపు తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు.ఈ నేపథ్యంలో కొలంబోలో పరిస్థితులకు అనుగుణంగా స్పిన్ విభాగాన్ని మార్చాలని భారత జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సరాన్ష్ జైన్కు తుది జట్టులో చోటు దక్కితే, దాదాపు 12 ఏళ్ల దేశవాళీ ప్రస్థానం తర్వాత అతడి భారత టెస్టు అరంగేట్రం సాకారం అవుతుంది.
IND vs ENG T20: ఇంగ్లండ్ను మట్టికరిపించిన భారత్
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇండియన్ మిక్స్డ్ డిజెబిలిటి క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. ‘క్రికెట్ పుట్టినిల్లు’గా భావించే స్టేడియంలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును ఏకంగా 118 పరుగుల తేడాతో మట్టికరిపించింది.ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాదిరి లార్డ్స్ బాల్కనీలో షర్టు విప్పేసి ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకుంటూ.. ఐకానిక్ మూమెంట్ను రిపీట్ చేశారు. కాగా ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు భారత పురుషుల దివ్యాంగ జట్టు ఇంగ్లండ్కు వెళ్లింది.కెప్టెన్ తుఫాన్ ఇన్నింగ్స్ఇందులో భాగంగా ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్లు గెలిచి సిరీస్ సొంతం చేసుకోగా.. భారత్ రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య లార్డ్స్ వేదికగా బుధవారం నామమాత్రపు ఏడో టీ20 జరగగా.. భారత బ్యాటర్లు దుమ్ములేపారు.ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు సాధించింది. కెప్టెన్ మజీద్ మాగ్రే కేవలం 19 బంతుల్లోనే 63 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. అర్జున్ గవ్రే 44 బంతుల్లో 68 పరుగులతో రాణించాడు. అనంతరం ఇంగ్లండ్ లక్ష్య ఛేదనకు దిగగా.. భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.88 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్దీంతో ఇంగ్లండ్ దివ్యాంగ జట్టు కేవలం 88 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో హిలాల్ అహ్మద్ వనీ నాలుగు వికెట్లు కూల్చగా.. జయేశ్ పర్మార్ మూడు వికెట్లు పడగొట్టి.. ఇంగ్లండ్ను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక లార్డ్స్ విజయంతో భారత్ ఈ సిరీస్లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 4-3కి తగ్గించగలిగింది.గంగూలీ మాదిరి సెలబ్రేషన్ఇదిలా ఉంటే.. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్పై గెలుపొందగానే భారత జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. సహాయక సిబ్బంది, ఆటగాళ్లు కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి షర్టు విప్పేసి.. గంగూలీ ఐకానిక్ లార్డ్స్ మూమెంట్ను రిపీట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత దివ్యాంగ క్రికెట్ మండలి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్గా మారింది.కాగా ఇంగ్లండ్- ఇండియా- శ్రీలంక మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్-2002 ఫైనల్లో.. భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. లార్డ్స్లో జరిగిన టైటిల్ పోరులో గంగూలీ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లండ్ను రెండు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో బాల్కనీలో గంగూలీ షర్టు విప్పేసి గాల్లో ఊపుతూ సంబరాలు చేసుకున్నాడు. చదవండి: దంచికొట్టిన సెహ్వాగ్ కుమారుడు.. వీడియో వైరల్When India wins at Lord’s, the celebrations hit different. A moment of pure cricketing joy on the Lord’s Balcony — coats off, spirits high, and the Tricolour flying with pride.118 runs. One unforgettable celebration.@imRaviKChauhan@official_idca pic.twitter.com/o6IuoRJto8— Differently Abled Cricket Council of India (@dcciofficial) August 19, 2026
దంచికొట్టిన సెహ్వాగ్ కుమారుడు.. అచ్చం తండ్రిలాగే..
టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా పేరొందాడు వీరేంద్ర సెహ్వాగ్. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే దూకుడుగా ముందుకు వెళ్తూ బంతిని బౌండరీకి తరలించడమే అతడికి అలవాటు. ఇక సెహ్వాగ్ ట్రేడ్మార్క్ బ్యాక్ ఫుట్ పంచ్ షాట్కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారనడంలో సందేహం లేదు.అచ్చం తండ్రిలాగే..వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తాజాగా ఈ మ్యాజిక్ను రిపీట్ చేశాడు. తండ్రి మాదిరే బ్యాక్ ఫుట్ పంచ్ షాట్ బాది అభిమానులను ఖుషీ చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2026లో వెస్ట్ ఢిల్లీ లయన్స్- న్యూ ఢిల్లీ టైగర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.మనీశ్ సెహ్రావత్ సుడిగాలి ఇన్నింగ్స్అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూ ఢిల్లీ టైగర్స్ తొలుత బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. కెప్టెన్ హిమ్మత్ సింగ్ (35), వికెట్ కీపర్ బ్యాటర్ కేశవ్ దలాల్ సింగ్ (36)లతో పాటు పార్థ్ బాలి (36*) రాణించగా.. లోయర్ ఆర్డర్లో మనీశ్ సెహ్రావత్ మెరుపు ఇన్నింగ్స్ (8 బంతుల్లో 30*) ఆడాడు.వెస్ట్ ఢిల్లీ బౌలర్లలో తిశాంత్ డబ్లా, మయాంక్ గుసేన్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్వంత్ ఖేజ్రోలియా, మనన్ భరద్వాజ్ తలా ఒక వికెట్ తీశారు. ఇక న్యూ ఢిల్లీ విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్ట్ ఢిల్లీ ఓపెనర్లు క్రిష్ యాదవ్, ఆర్యవీర్ సెహ్వాగ్ వేగంగా ఆడారు.దంచికొట్టిన ఓపెనర్లుక్రిష్ యాదవ్ 32 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 45 పరుగులతో అదరగొట్టగా.. ఆర్యవీర్ సైతం దంచికొట్టాడు. పద్నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు బాది 22 పరుగులు రాబట్టాడు. తండ్రి మాదిరే బ్యాక్ ఫుట్ పంచ్ షాట్తో బంతిని బౌండరీకి తరలించి కనువిందు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన వీరూ భాయ్ అభిమానులు.. ‘అచ్చం తండ్రిలాగే.. సెహ్వాగ్ బ్రాండ్ అలాంటిది మరి’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.మెరుపు అర్ధ శతకాలుఇదిలా ఉంటే.. వన్డౌన్లో వచ్చిన నితీశ్ రాణా (23 బంతుల్లో 50), కెప్టెన్ ఆయుశ్ దోసేజా (33 బంతుల్లో 64*) మెరుపు అర్ధ శతకాలు బాదగా.. వెస్ట్ ఢిల్లీ 201 పరుగులు సాధించింది. కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్లో సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ వెస్ట్ ఢిల్లీకి ఆడుతుండగా.. చిన్న కుమారుడు వేదాంత్ సెహ్వాగ్ సెంట్రల్ ఢిల్లీ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.చదవండి: కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Delhi Premier League T20 (@delhipremierleaguet20)
ఫినిషర్ రింకూ సింగ్ ఈజ్ బ్యాక్
టీమిండియా ఫినిషర్గా పేరొందిన రింకూ సింగ్ ఛేజింగ్లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. యూపీ టీ20 లీగ్ 2026లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు.. లక్నో ఫాల్కన్స్తో జరిగిన మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.🚀Rocket Rinku for a reason. 🔥pic.twitter.com/Ktl4vMBkk8 https://t.co/ChVvyki6Ym— Rokte Amar KKR (@Rokte_Amarr_KKR) August 19, 2026183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జట్టు కష్టాల్లో (10 ఓవర్లలో 75-4) ఉన్నప్పుడు ఆరో స్థానంలో బరిలోకి దిగిన రింకూ.. కేవలం 24 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు.రింకూ విధ్వంసంతో మావెరిక్స్ స్కోర్ 154/6కు చేరుకుంది. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్ను కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మావెరిక్స్ను 5 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు.2023 జ్ఞాపకాలురింకూ సింగ్ తాజా ఇన్నింగ్స్ చూసిన అభిమానులకు 2023 ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్పై అడిన సంచలన ఇన్నింగ్స్ గుర్తుకొచ్చింది. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో యశ్ దయాల్ బౌలింగ్లో వరుసగా ఐదు సిక్సర్లు బాది 29 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రింకూ, అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.ఫినిషర్గా రింకూ ఎందుకు ప్రత్యేకం..?2023 ఐపీఎల్ తర్వాత రింకూ సింగ్కు నమ్మకమైన ఫినిషర్ అనే గుర్తింపు వచ్చింది. 2026 ఐపీఎల్లోనూ అతను 59.00 సగటుతో రాణించాడు. అయితే బ్యాటింగ్ స్థానాల్లో మార్పులు రావడంతో 2023 స్థాయి స్థిరత్వాన్ని మాత్రం కొనసాగించలేకపోయాడు.అయినా ఒత్తిడిలో ఛేజింగ్ను ముగించే సామర్థ్యంలో రింకూకు ప్రత్యేక గుర్తింపు ఉంది. టీ20ల్లో ఛేజింగ్ చేసిన 54 మ్యాచ్ల్లో 34 విజయాల్లో అతను భాగమయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో 94 టీ20 మ్యాచ్ల్లో అతని సగటు 33.04, స్ట్రైక్రేట్ 139.44. ఈ క్రమంలో ఎనిమిది అర్ధసెంచరీలు సాధించాడు.
న్యూస్ పాడ్కాస్ట్
మోసాలపై చర్చ మొదలైంది!. హామీల ‘వెన్నుపోటు’పై రెండేళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ జగన్ వ్యాఖ్య
మళ్లీ మాయోపాయం!. రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
టీచర్లపై ఇంతలా కక్షగడతారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరిద్దాం... ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
దేశ భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే... పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్య
బిజినెస్
ఒక పేరుపై 9 సిమ్లే..
సైబర్ నేరాలు, మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒక వ్యక్తి పేరుపై తొమ్మిది మొబైల్ సిమ్ కనెక్షన్లు ఉంటే వారికి కొత్త కనెక్షన్ ఇవ్వొద్దని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను (టీఎస్పీలు) టెలికాం శాఖ (డాట్) ఆదేశించింది. ఈ నిబంధన ఆగస్టు 24, 2026 నుంచి అమల్లోకి రానుంది. పరిమితికి మించి కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి సబ్స్క్రైబర్ను గుర్తించేందుకు తగిన సాంకేతిక, సంస్థాగత చర్యలు తీసుకోవాలని సూచించింది.డీఐపీతో తనిఖీలుటెలికాం సంస్థలు అప్లోడ్ చేసే సబ్స్రై్కబర్ల వివరాల ఆధారంగా టెలికాం శాఖ ఏర్పాటు చేసిన ‘డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫారమ్’ (డీఐపీ)ను ఉపయోగించాలని డాట్ సూచించింది. ఇప్పటికే నిరీ్ణత పరిమితికి మించి మొబైల్ కనెక్షన్లు పొందిన సబ్స్రై్కబర్ల వివరాలు డీఐపీలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ ఆగస్టు 23 నుంచి.. తమ పేరుపై ఇప్పటికే గరిష్ట సంఖ్యలో మొబైల్ కనెక్షన్లు ఉన్న సబ్స్క్రైబర్లను గుర్తించేందుకు వారి ఫొటోలను డీఐపీలో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. దీంతో పరిమితికి మించి మరో కనెక్షన్ పొందేందుకు ప్రయత్నించే వ్యక్తిని టెలికాం సంస్థలు సులభంగా గుర్తించి, కొత్త సిమ్ జారీని అడ్డుకోగలుగుతాయి. డీఐపీతో అనుసంధాన ప్రక్రియను నవంబర్ 30లోగా క్రమబద్ధీకరించాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను టెలికాం శాఖ కోరింది.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా బంగారం ధర..
ఆకాశమే హద్దుగా బంగారం ధర..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
బెంగళూరులో వార్నర్ మ్యూజిక్ వరల్డ్-క్లాస్ టెక్ హబ్
న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ అంతర్జాతీయ సంగీత, ఎంటర్టైన్మెంట్ సంస్థ ‘వార్నర్ మ్యూజిక్ గ్రూప్’(డబ్ల్యూఎంజీ) భారతీయ ఐటీ రాజధాని బెంగళూరులో ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెలలోనే (సెప్టెంబర్) ప్రారంభం కానున్న ఈ హబ్ గ్లోబల్ మ్యూజిక్ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక డేటా ఇంజినీరింగ్తో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించనుంది.ఈ నూతన సెంటర్ కేవలం సపోర్ట్ ఆఫీస్గా కాకుండా డబ్ల్యూఎంజీ అంతర్జాతీయ సాంకేతిక వ్యవస్థకు వెన్నుముకగా నిలవనుంది. మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ (సంగీత పంపిణీ), కోర్ డేటా పైప్లైన్లు, ఆడియన్స్ అండ్ మార్కెటింగ్ డేటా ప్రాడక్ట్స్, ఏఐ/ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆధారిత ప్రాజెక్ట్లను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. మ్యూజిక్, ఏఐ కలయికలో అత్యంత సంక్లిష్టమైన సిస్టమ్స్ను అభివృద్ధి చేసేందుకు స్థానిక ప్రతిభను వినియోగించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.దిగ్గజ నాయకత్వంలో ముందుకుగతంలో వాల్మార్ట్ గ్లోబల్ టెక్లో కీలక బాధ్యతలు నిర్వహించిన మహేష్ రావు (డైరెక్టర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, సైట్ లీడ్, ఇండియా) ఈ బెంగళూరు ఆపరేషన్లకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన టొరంటో కేంద్రంగా పనిచేసే డబ్ల్యూఎంజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లేహో నిగుల్ ఆధ్వర్యంలో భారతదేశ వ్యూహాలు, బడ్జెట్, నియామకాలను పర్యవేక్షిస్తారు.పరిశ్రమ వర్గాల విశ్లేషణమ్యూజిక్ ఇండస్ట్రీలో పోటీ ఇప్పుడు కేవలం కంటెంట్ లేదా కళాకారులకే పరిమితం కాలేదు. డేటా అనలిటిక్స్, స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు, ఏఐ ఆధారిత ప్లాట్ఫారమ్లు ఉన్న సంస్థలే భవిష్యత్తును శాసిస్తాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో వరల్డ్-క్లాస్ టెక్ ఆర్గనైజేషన్ ఏర్పాటు ద్వారా భారత్లో ఉన్న అత్యుత్తమ సాఫ్ట్వేర్ టాలెంట్ను ఆకర్షించాలని డబ్ల్యూఎంజీ భావిస్తోంది. ఇది భారత సాంకేతిక రంగానికి, గ్లోబల్ మ్యూజిక్ ఎకోసిస్టమ్కు మధ్య సరికొత్త మైలురాయిగా నిలవనుంది.ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్ల చెరలో చిన్నారి ప్రపంచం!
చదువుతూనే రోజుకు రూ.1,200 సంపాదన
ఉన్నత చదువులు చదువుకుంటూనే సొంత కాళ్లపై నిలబడాలనే నిశ్చయంతో ముందుకు సాగుతున్న నేటి యువతకు బెంగళూరుకు చెందిన ఒక బీబీఏ విద్యార్థి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కళాశాల సెలవుల సమయాన్ని వృథా చేయకుండా బైక్ టాక్సీ అగ్రిగేటర్ సంస్థ రాపిడోలో క్యాప్టెన్గా చేరి రోజుకు సగటున రూ.1,200 వరకు ఆర్జిస్తున్నట్లు సదరు విద్యార్థి ఇటీవల తెలిపాడు.తన మూడు నెలల పని అనుభవాన్ని పంచుకుంటూ రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు (సుమారు 8.5 గంటలు) రాపిడో క్యాప్టెన్గా సేవలు అందించినట్లు పేర్కొన్నాడు. నిలకడైన ప్రణాళిక, కష్టపడే తత్వంతో పని చేస్తే సెలవుల్లోనే కాకుండా చదువుతో పాటు మంచి ఆదాయం పొందవచ్చని నిరూపించాడు. బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో ఉద్యోగ సాధన, గిగ్ ఎకానమీ కల్పిస్తున్న అవకాశాలపై నేటి తరం ఆలోచనా విధానానికి ఈ ఘటన అద్దం పడుతోంది.సమయ పాలన, ఆర్థిక స్వాలంబన పట్ల ఈ విద్యార్థి చూపిన చొరవ సోషల్ మీడియాలోనూ, ఇతర యువతలోనూ విశేష ఆదరణ పొందుతోంది. కేవలం చదువుకే పరిమితం కాకుండా అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగిస్తూ గిగ్ వర్కర్గా మారడం ద్వారా ఒకవైపు పాకెట్ మనీ సంపాదిస్తాన్నాడు. మరోవైపు సమాజంలో రవాణా సేవలు అందించడంలో భాగస్వామి కావడం గమనార్హం.ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్ల చెరలో చిన్నారి ప్రపంచం!
ఫ్యామిలీ
మనం గెలవటమే కాదు అవతలి వారినీ గెలిపించాలి!
నా వయసు 36. మాకు పెళ్లై 15 సంవత్సరాలైంది.. మా ఆయన ఒక బిల్డర్. మాకు ఆర్థికంగా ఇబ్బందులు లేవు. ఇద్దరు అబ్బాయిలు. ఇప్పటివరకు చాలా అన్యోన్యంగా, సంతోషంగా జీవించాం. కానీ కొంతకాలంగా మా ఆయన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. సమయం దొరికినప్పుడల్లా ఫోన్ లో అసభ్యకరమైన వీడియోలు చూస్తున్నారు. వాటిలో చూసినట్లే బెడ్రూమ్లో కూడా ఉండాలని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. నాకు అవన్నీ చాలా అసహ్యంగా, ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. అందుకే నేను ఆయనకు దూరంగా ఉండడం ప్రారంభించాను. దాంతో ఈ మధ్య ఆయన చిరాకుగా ఉంటున్నారు. ఇంట్లో కూడా మునుపటిలా కలిసిమెలిసి ఉండటం లేదు. ఆలస్యంగా ఇంటికి వస్తున్నారు. ఒకసారి ఆయన ఫోన్ లో చూస్తే డేటింగ్ యాప్లు కూడా కనిపించాయి. అయితే ఆయనకి వేరే చెడ్డ అలవాట్లు ఏమీ లేవు. ఇన్నాళ్లూ బాగానే ఉన్న వ్యక్తి ఇలా ఒక్కసారిగా ఎందుకు మారిపోయారు? ఆయనను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? దయచేసి సలహా ఇవ్వండి. – స్వాతి, బెంగళూరుమీరు రాసిన లేఖలో మీ బాధ, ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మార్పు కనిపించిందని వెంటనే ఆయన చెడ్డ వ్యక్తి అయిపోయారని లేదా మీ కుటుంబ జీవితం ముగిసిపోయిందని అనుకోవద్దు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ చాలా సులభంగా అందుబాటులో ఉంది. దానితో పాటు అశ్లీల కంటెంట్ కూడా అందరికీ సులువుగా చేరుతోంది. కొంతమంది అలాంటి వీడియోలను తరచుగా చూస్తూ, వాటిలో చూపించే దృశ్యాలే నిజమైన దాంపత్య జీవితం అని భావిస్తారు. కానీ అవి కేవలం వినోదం కోసం రూపొందించిన చిత్రాలు మాత్రమే. మనం మిగతా సినిమాలను ఎలా చూస్తామో, వాటిలాగే ఇవి కూడా నటీనటులతో చిత్రీకరించిన వినోదాత్మక కంటెంట్. అయితే, మీ లేఖలో మరింత ఆందోళన కలిగించే విషయం డేటింగ్ యాప్ల వినియోగం. అది మీ ఇద్దరి మధ్య ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. చాలామంది పురుషుల్లో మధ్యవయసులో, ముఖ్యంగా జీవితంలో ఆర్థికంగా, సామాజికంగా స్థిరపడిన తర్వాత, ఒక రకమైన మిడ్ లైఫ్ క్రైసిస్ కనిపించవచ్చు. అన్నీ ఉన్నప్పటికీ జీవితంలో కొత్తదనం కావాలనే కోరిక పెరుగుతుంది. దాంపత్య జీవితంలో కూడా చాలా సంవత్సరాలు ఒకే విధమైన అనుభవాలు ఉంటే, కొంత కొత్తదనం కోరుకోవడం అసాధారణం కాదు. దాన్ని జీవిత భాగస్వామిపై బలవంతంగా రుద్దడమే అసలు సమస్య. అదేవిధంగా, జీవిత భాగస్వామి కోరికలను పూర్తిగా తిరస్కరించడం కూడా సరైంది కాదు. అది ఇద్దరిమధ్య దూరాన్ని పెంచుతుంది. దాంపత్య జీవితం అనేది ఇద్దరి అంగీకారం, పరస్పర గౌరవం, ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. దాంపత్యంలో గెలుపు అంటే మనం గెలవడం కాదు, అవతలి వారిని గెలిపించడం!పదిసార్లు మీ భర్త మిమ్మల్ని గౌరవించినప్పుడు, ఒకసారి ఆయన కోసం, ఆయనకు నచ్చినట్లు ఉండటానికి మీరు కూడా ప్రయత్నిస్తే తప్పేమీ లేదు. మారుతున్న ప్రపంచంలో మనుషుల అభిరుచులు, ఆలోచనలు మారుతున్నాయి. అలాగని మీకు అసౌకర్యంగా అనిపించే ప్రతి విషయాన్ని మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, ఆయన ఎందుకు అలా కోరుకుంటున్నారో కూడా ప్రశాంతంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇద్దరూ మాట్లాడుకుని మీ ఇద్దరికీ ఆమోదయోగ్యమైన మధ్యమార్గాన్ని కనుగొంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అవసరమైతే ఇద్దరూ కలిసి ఒక సైకియాట్రిస్ట్ ను సంప్రదించండి. కౌన్సెలింగ్ ద్వారా ఇద్దరి అభి్రపాయాలు, అంచనాలు, పరిమితులు చర్చించి ఒక పరిష్కారానికి రావచ్చు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
దోమ దండుపై డ్రోనాస్త్రం!
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం ఏడు నుంచి పది లక్షల మంది దోమల కారణంగా చనిపోతున్నారు. మనల్ని ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించి, రోగాల బారిన పడేలా చేసే దోమలను గాలిలోనే ఎన్కౌంటర్ చేయడానికి ‘కిల్లర్ డ్రోన్స్’ రాబోతున్నాయి!దోమల నివారణ పద్దతులో ప్రధానమైనవి దోమ తెరలు, కీటకనాశినులు. అయితే వీటిలో ప్రతిదానికి ఏదో ఒక పరిమితి ఉంది. ఉదాహరణకు, పురుగు మందుల వలన పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దోమలను నిర్మూలించడానికి పరిశోధకులు అత్యాధునికమైన పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు.సోనార్–గైడెడ్ డ్రోన్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ ఫ్లైట్ కంట్రోల్ సాంకేతికతను ఉపయోగించి దోమల పనిపట్టే అత్యాధునిక యంత్రం... సోనార్–గైడెడ్ డ్రోన్. పురుగు మందులు, లేజర్లు, విద్యుత్ గ్రిడ్లను ఉపయోగించడానికి బదులుగా వేగంగా తిరిగే ప్రొఫెల్లర్లను ఉపయోగించి దోమలను నిర్మూలిస్తుంది సోనార్–గైడెడ్ డ్రోన్. గాలిలో ఎగురుతున్న దోమలను ఒక్కటొక్కటిగా గుర్తించి వాటిని నిర్మూలిస్తుంది. ఆప్టికల్ కెమెరాలపై ఆధారపడే సంప్రదాయ డ్రోన్లలా కాకుండా డ్రోన్ అల్ట్రా సోనిక్ ఫేజ్డ్–సోనార్ సాంకేతికత (ఒకే పరికరంలో అనేక చిన్న సౌండ్–వేవ్ పార్ట్స్ ఉపయోగించడం) ఆధారంగా ఈ దోమ నిర్మూలన డ్రోన్ను నిర్మించారు. తక్కువ కాంతిలో, చీకటిలో కూడా దోమలను గుర్తించే డ్రోన్ ఇది. కీటకాలను వాటి రూపాన్ని బట్టి ఈ డ్రోన్ గుర్తించదు. ప్రతి దోమ జాతికి ఉండే ప్రత్యేకమైన వింగ్బీట్ ‘ఫింగర్ ప్రింట్’ ద్వారా గుర్తిస్తుంది. ఇతర కీటకాలకు ముప్పు వాటిల్లకుండా కేవలం దోమలనే లక్ష్యంగా చేసుకునేలా ఈ డ్రోన్ను డిజైన్ చేశారు.లెసోనార్ 2దోమల సమస్యకు పరిష్కార మార్గంగా ఫ్రెంచ్ స్టార్టప్ టోర్నియోల్ 40 గ్రాముల బరువు ఉన్న ఒక డ్రోన్ను రూపొందించింది. ఈ డ్రోన్ నిర్దిష్ట ప్రాంతంలో గస్తీ కాస్తూ, అవసరమైనప్పుడు ఛార్జింగ్ కోసం తిరిగి వస్తుంది. గాలిలో దోమలను గుర్తించిన వెంటనే వాటిపై దూసుకెళ్లి తన ప్రొపెల్లర్స్తో వాటిని గాలిలోనే నిర్మూలిస్తుంది. టోర్నియోల్ తాజా మోడల్ లెసోనార్ 2. ఇందులో 32 అల్ట్రా సోనిక్ ఎమిటర్స్ ఉంటాయి. ఈ ఎమిటర్స్ మనుషులకు వినబడని అల్ట్రాసోనిక్ పల్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సమీపంలోని వస్తువులు లేదా కీటకాలపై పరావర్తనం చెందుతాయి. పరావర్తనం చెందిన పల్స్ను గ్రహించే 380 మైక్రోఫోన్లు సౌండ్ను ప్రాసెస్ చేసి, పరిసరాల రియల్– టైమ్ 3డీ మ్యాప్ను రూపొందిస్తాయి. కెమెరాకు బదులుగా సోనార్ ను ఉపయోగించడం వల్ల డ్రోన్ కాంపాక్ట్ (చిన్నగా)గా ఉండగలుగుతుంది. రాత్రిపూట కూడా చూడగలుగుతుంది.సెక్యూరిటీ ఫీచర్స్తో...కవరేజ్ ప్రాంతాన్ని గుర్తించడం, ఫర్మ్వేర్ను అప్డేట్ చేయడం, ఫైట్ షెడ్యూల్స్ రూపొందించడం.. మొదలైన పనుల కోసం ఈ డ్రోన్కు ప్రత్యేక యాప్, వెబ్ ఇంటర్ఫేస్లు ఉంటాయి.‘భద్రతా ఫీచర్స్ ఉండేలా మా డ్రోన్ను రూపొందించాం. మనుషులు, పెంపుడు జంతువులకు సురక్షిత దూరాలను పాటిస్తుంది. చిన్న పరిమాణం, తక్కువ బరువు వలన అనుకోకుండా తాకినా ఎలాంటి ప్రమాదం ఉండదు’ అని తెలియజేస్తుంది కంపెనీ వెబ్సైట్. సబ్స్క్రిప్షన్ ఆప్షన్తో ఈ కిల్లర్ డ్రోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.‘ఫోటాన్ మ్యాట్రిక్స్ ల్యాబ్’ అనే సంస్థ దోమల పని పట్టడానికి ఒక కొత్తరకం పరికరాన్ని రూపొందించింది. ఈ పరికరం నుంచి వచ్చే నీలం, ఊదారంగు కాంతి దోమ కనిపించగానే ఎటాక్ చేస్తుంది. తొలి అడుగులలో ఏ పరికరానికైనా పరిమితులు ఉంటాయి. ఈ కిల్లర్ డ్రోన్లకు కూడా అలాంటి పరిమితులు ఉండి ఉండవచ్చు. అయితే కాలక్రమంలో ఆ పరిమితులకు పరిష్కారాలు తప్పకుండా వస్తాయి అంటున్నారు నిపుణులు.అందుకే... దోమల దినోత్సవంఆడ అనోఫెలెస్ దోమలు మలేరియాను వ్యాపింపజేస్తాయని సర్ రోనాల్డ్ రాస్ 1897లో చేసిన చారిత్రక ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ 20న ‘దోమల దినోత్సవం’ జరుపుతారు. ఈ ఆవిష్కరణ వైద్యశాస్త్రంలో పెద్ద ముందడుగు.దోమలపై మైక్రోసాఫ్ట్ గురి!దోమల నివారణకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడంపై టెక్ కంపెనీలు ఆటోమేషన్, రోబోటిక్స్పై దృష్టి పెట్టాయి. మైక్రోసాఫ్ట్తో సహా పలు సంస్థలు దోమల నిర్మూలన కోసం కొత్త హైటెక్ సాధనాలను పరీక్షిస్తున్నాయి. జికా వ్యాధిని వ్యాప్తి చేసేవిగా పేరుగాంచిన ఈడిస్ ఈజిప్టి దోమలను పట్టుకోవడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక స్మార్ట్ట్రాప్ను పరీక్షిస్తోంది. కాలిఫోర్నియాలో ‘అల్ఫాబెట్’కు చెందిన లైఫ్ సైన్సెస్ విభాగం దోమల జనన నియంత్రణకు సాంకేతిక పరిష్కారాలు అన్వేషిస్తోంది.
టైర్ అయ్యాం అవుదాం మినీ రిటైర్
ఉదయం లేచింది మొదలు రాత్రి స్టవ్ కట్టేసే వరకు ఉరుకుల పరుగుల జీవితం. పెళ్లి, పిల్లలు, ఇల్లు, ఆఫీస్ డెడ్లైన్స్... కెరీర్ రేసులో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన ఆధునిక మహిళలు 2026లో కొత్త ట్రెండ్కు తెరతీశారు. అదే ‘మినీ రిటైర్మెంట్’. 60 ఏళ్లకు తీసుకునే రిటైర్మెంట్ కాకుండా కెరీర్ మధ్యలోనే 3 నుండి 6 నెలలు బ్రేక్ తీసుకుని లైఫ్ను రీఛార్జ్ చేసుకుంటున్నారు. మన దేశంలో ఈ ధోరణి పట్ల 85 శాతం ఆసక్తితో ఉంటే 35 శాతం ఆచరణలో చూపుతున్నారు.హైదరాబాద్లోని ఒక లీడింగ్ ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్గా పని చేస్తున్న కావ్య (32) ఐదేళ్లుగా రాత్రింబగళ్లు ప్రాజెక్టులతో కుస్తీ పట్టింది. శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడి లోనైంది. రెజ్యూమేలో గ్యాప్ వస్తే కెరీర్ పాడవుతుందన్న భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా నాలుగు నెలల‘మినీ–రిటైర్మెంట్’ తీసుకుంది. ఫోన్ పక్కన పడేసి, కేరళలో ఆయుర్వేద డిటాక్స్ తీసుకుంటూ, చిన్నప్పుడు వదిలేసిన పెయింటింగ్ మళ్లీ మొదలుపెట్టింది. ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో మళ్లీ ఆఫీసులో అడుగుపెట్టింది.ఒక ఎడ్–టెక్ స్టార్టప్లో కస్టమర్ సపోర్ట్ హెడ్గా ఉన్న సుజాత (36) ఆఫీస్ ఒత్తిడికి తోడు ఇంట్లో బాధ్యతలు ఎక్కువై డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఇలా అయితే లాభం లేదని దాచుకున్న డబ్బుతో మూడు నెలలు లీవ్ పెట్టి కేవలం పిల్లలతో గడపడానికి, యోగా నేర్చుకోవడానికి ఆ సమయాన్ని వాడుకుంది. ఈ చిన్న బ్రేక్ ఆమెకు కొత్తజన్మను ఇచ్చింది. ఈ ఇద్దరి కథలూ 2026లోమహిళల మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి.ఎందుకీ ధోరణి?మహిళలపై సమాజం మోపుతున్న ‘సూపర్ ఉమెన్’ ట్యాగ్ వారిపై భారానికి కారణమవుతోంది. ఇటు ఆఫీసులో మగవారితో సమానంగా టార్గెట్లు రీచ్ అవ్వాలి... అటు ఇంట్లో పర్ఫెక్ట్ కోడలిగా, భార్యగా, తల్లిగా బాధ్యతలు నెరవేర్చాలి. ఈ ‘మల్టీ టాస్కింగ్’ వల్ల మహిళల్లో విపరీతమైన యాంగ్జయిటీ, ఇన్సోమ్నియా (నిద్రలేమి) వంటి సమస్యలు పెరిగిపోయాయి. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే సమయం దొరకని పరిస్థితి. ‘ఇలాగే పరిగెడితే ఆరోగ్యం పాడవుతుంది, కొన్నాళ్లు బ్రేక్ తీసుకోక తప్పదు’ అనే సామాజిక అవసరం ఏర్పడింది. బాస్ భరోసా ఇస్తున్నారా? ఒకప్పుడు ‘కెరీర్ గ్యాప్’ ఉంటే రెజ్యూమేలను డస్ట్బిన్ లో వేసే కంపెనీలు 2026లో ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ‘సబాటికల్ లీవ్స్’ (జీతం లేని దీర్ఘకాలిక సెలవులు) ఇస్తూ ‘మీరు బ్రేక్ తీసుకుని రండి,మీ సీటు భద్రంగా ఉంటుంది’ అని భరోసా ఇస్తున్నాయి. అయితే కుటుంబాల నుండి మద్దతు విషయంలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. విద్యావంతులైన భర్తలు, ఆధునిక కుటుంబాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే సంప్రదాయ మధ్యతరగతి ఇళ్లలో మాత్రం ‘ఉన్న ఉద్యోగానికి బ్రేక్ ఇవ్వడం ఏంటి? పిచ్చి కాకపోతే’ అనే ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ మహిళలు వీటన్నింటినీ దాటి తమ ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.సగటు మహిళ ఏం నేర్చుకోవాలి? మరి నెలజీతం వస్తేనే ఇల్లు గడిచే సగటు మధ్యతరగతి మహిళలు, ఒక్క రోజు కూడా లీవ్ దొరకని చిన్న ఉద్యోగాలు చేసేవారి పరిస్థితి ఏంటి? వారు ఈ ధోరణిని ఎలా అడాప్ట్ చేసుకోవాలి? దీనికి పెద్ద పెద్ద ప్లాన్స్ అక్కర్లేదు. ‘మినీ రిటైర్మెంట్’ అనే భావనను మీ రోజువారీ జీవితంలోకి మార్చుకోవచ్చు. ‘నో ఆఫీస్ టాక్’: శనివారం లేదా ఆదివారం కనీసం ఒక అరపూట ఫోన్ ను, ఆఫీస్ మెయిల్స్ ను పూర్తిగా పక్కన పెట్టేయండి.మైక్రోబ్రేక్స్: నెలకు ఒక శనివారం ఇంట్లో వంట పనికి సెలవు పెట్టి, హోటల్ నుండి తెప్పించుకోండి. ఆ సమయాన్ని మీకోసం కేటాయించుకోండి.నో చెప్పడం నేర్చుకోండి: ఆఫీసులో మీ పని పరిధి దాటి వచ్చే అదనపు ఒత్తిళ్లకు, ఇంట్లో అనవసరపు బాధ్యతలకు సున్నితంగా ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోండి. పెద్ద బ్రేక్ తీసుకోకపోయినా ఈ చిన్న మార్పులు మీ మైండ్ను రీఛార్జ్ చేస్తాయి.జీవితం అంటే కేవలం సంపాదించడం, బాధ్యతలు మోయడమే కాదు... అందులో మనకూ ఒక స్థానం ఉండాలి. రేసుగుర్రాల్లా పరిగెత్తడం కాసేపు ఆపి, కాస్త అలసట తీర్చుకోవడంలో తప్పు లేదు. మన ఆరోగ్యం బాగుంటేనే, మన కుటుంబం, కెరీర్ బాగుంటాయి. కాబట్టి వీలైతే కొన్ని నెలలు, లేదంటే కనీసం వారంలో కొన్ని గంటలైనా మీ కోసం మీరు ‘మినీ–రిటైర్’అవ్వండి. జీవితాన్ని మళ్లీ ఆస్వాదించండి!నగరాల్లో మహిళల మినీ రిటైర్మెంట్బెంగళూరు: ఇక్కడ 35% మహిళలు టెక్ కంపెనీలలో కోడింగ్ డెడ్లైన్స్ తట్టుకోలేక 35 ఏళ్ల లోపే 6 నెలల సబాటికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.హైదరాబాద్: గచ్చిబౌలి, మాదాపూర్ ఐటీ కారిడార్లలోని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు, ఫైనాన్షియల్ సెక్టార్లలో పని చేసే మహిళల్లో 28 శాతం ‘మెంటల్ హెల్త్ బ్రేక్స్’ కోసం కంపెనీల నుండి భరోసా పొందుతున్నారు.ముంబై: ఇక్కడ 22% మంది మహిళలు అడ్వర్టయిజింగ్, మీడియా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగాల్లో బ్రేక్స్ తీసుకుని సోలో ట్రావెలింగ్కు వెళ్తున్నారు.ఢిల్లీ: గుర్గావ్, నోయిడా పరిసర ప్రాంతాల్లో 15% మహిళలు కాలుష్యం, లాంగ్ కమ్యూటింగ్ (ప్రయాణ ఒత్తిడి) వల్ల బర్నౌట్ అయి డిజిటల్ డిటాక్స్ కోసం విరామం తీసుకుంటున్నారు.
‘నేచర్స్ ఓజెంపిక్’ అంటే..?నిజంగానే బరువు తగ్గిస్తుందా?
ప్రాచీన ఆయుర్వేద మూలిక నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఆయుర్వేదంలో దారుహరిద్ర అని పిలిచే బెర్బెరిన్ బరువు నిర్వహణ, రక్తంలోని చక్కెర నియంత్రణకు సంబంధించిన ప్రయోజనాల కారణంగా ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీని గురించి వైద్యులు ఏమంటున్నారంటే..బెర్బెరిన్ అనేది బెర్బెరిస్ కుటుంబానికి చెందిన మొక్కలలో సహజంగా లభించే ఒక సమ్మేళనం. దీన్ని ఇండియన్ బార్బెర్రీ, దారుహరిద్ర లేదా ట్రీ టర్మరిక్ అని పిలుస్తారు. ఈ మొక్క భారతదేశం పాకిస్తాన్, నేపాల్లోని హిమాలయాలకు చెందినది. ఇది దక్షిణ భారతదేశం, శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలలో సహజంగా కనిపిస్తుంది. బెర్బెరిన్ ఒక కొత్త ఆరోగ్య ఆవిష్కరణలా అనిపించినప్పటికీ, దాని చరిత్ర శతాబ్దాల నాటిది. మూడువేల ఏళ్ల క్రితం నుంచి చైనీస్ వైద్యలో దీన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే భారత ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా బరువు నిర్వహణపై ఆసక్తి ఉన్నవారిలో బెర్బెరిన్కు ఆదరణ పెరుగుతోందని చెబుతున్నారు వైద్యులు. ఇది బరువు నిర్వహణ, కొలెస్ట్రాల్, చక్కెర నియంత్రణ వంటి వాటిలో దీని పాత్ర రీత్యా క్రేజ్ పెరిగిందని అంటున్నారు. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యం నుంచి గుండె సంబంధిత సమస్యలకు సైతం మద్దతిస్తుందట. ముఖ్యంగా ఆడవాళ్లలో వచ్చే పీసీఓఎస్ సమస్యలకు కూడా చెక్పెట్టగలదట. అందువల్లే దీన్ని నేచర్స్ ఓజెంపిక్ అని పిలుస్తారట. దీన్ని సాంప్రదాయకంగా జ్వరాలు, విరేచనాలు, చర్మవ్యాధులు, కంటివ్యాధుల కోసం కూడా ఉపయోగిస్తారని చెబుతున్నారు వైద్యులు. ఆ ప్రయోజనాల రీత్యా ఇటీవలకాలంలో దీన్ని క్యాప్సూలస్, టాబ్లెట్లు, సప్లిమెంట్లు రూపాల్లో విరివిగా ఉపయోగించడంతో.. ఈ పురాతన ఆయుర్వేద మూలిక నెట్టింట ట్రెండీగా మారింది. View this post on Instagram A post shared by Sarthak Ahuja (@casarthakahuja) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..)
అంతర్జాతీయం
రెండు గంటలు టెన్షన్.. టెన్షన్
మ్యూనిక్: జర్మనీలో వియత్నాం ఎయిర్లైన్స్ విమానం లోపల ఉన్న ప్రయాణికులను, జర్మనీ విమానాశ్రయ సిబ్బందిని రెండు గంటలపాటు ఉత్కంఠతకు గురి చేసింది. మ్యూ నిక్ నుంచి హనోయికి వెళ్తున్న బోయింగ్ 787–9 విమానం ఆగష్టు 15న మధ్యాహ్నం 1:45 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మ్యూనిక్ నుండి బయలుదేరింది. టేకాఫ్ కోసం విమానం పైకి లేస్తున్న సమయంలోనే దాని వేగం అసాధారణంగా తగ్గింది. రన్వేలో దాదాపు సగం దూరం వెళ్ళినప్పుడు, విమానం వేగం పెరగడం సుమారు రెండు సెకన్ల పాటు ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వేగాన్ని పుంజుకుంది. కొద్దిసేపటి తర్వాత మరోసారి వేగం తగ్గింది. టేకాఫ్ను సురక్షితంగా రద్దు చేయడానికి తగినంత రన్వే లేదని నిర్ధారించుకున్న పైలట్లు టేకాఫ్ను కొనసాగించారు. కేవలం 91 మీటర్ల రన్వే మాత్రమే మిగిలి ఉండగా టేకాఫ్ చేశారు. అంతేకాదు, విమానం ఎనిమిది ప్రధాన ల్యాండింగ్–గేర్ టైర్లలో నాలుగు పగిలిపోయాయి. టేకాఫ్ సమయంలో తోక రన్వేను ఢీకొట్టింది. గాలిలోకి లేచిన కొద్దిసేపటికే విమానం తోక నేలను తాకే అవకాశం ఉందని, టైర్లలో గాలి ఒత్తిడి తక్కువగా ఉందని హెచ్చరికలు వచ్చాయి. ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు తెలియజేసిన సిబ్బంది, విమానం మ్యూనిక్కు తిరిగి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, తిరిగి రావాల్సి ఉంటుందని కెపె్టన్ ప్రకటించిన తర్వాత, క్యాబిన్లోని వాతావరణం మారిపోయింది. ఆందోళన ఉన్నప్పటికీ, ప్రయాణికులు ప్రశాంతంగానే ఉన్నారు. మ్యూనిక్కు తిరిగి వెళ్ళేందుకు విమానం బరువును తగ్గించడానికి సిబ్బంది ఇంధనాన్ని ఖాళీ చేయడం ప్రారంభించే ముందు, అది సుమారు 9,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ప్రయాణికులు రెండు రెక్కల నుండి ఇంధనాన్ని ఖాళీ చేయడాన్ని చూస్తుండగా, ఆ విమానం గంటకు పైగా విమానాశ్రయం సమీపంలో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత విమానం విమానాశ్రయం చుట్టూ తక్కువ ఎత్తులో రెండుసార్లు ప్రదక్షిణ చేసింది. దీనివల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు దాని ల్యాండింగ్ గేర్ను ప్రత్యక్షంగా తనిఖీ చేయగలిగారు. బయలుదేరిన సుమారు రెండు గంటల తర్వాత, స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:57 గంటలకు ఆ విమానం చివరకు సురక్షితంగా ల్యాండ్ అయింది. అందుకు గుర్తుగా విమానం వెనుక భాగం కింద నిలువుగా ఉన్న గీతలు, విమానం బయటి పొర చిరిగిపోయిన అనేక ప్రాంతాలను కూడా తనిఖీ అధికారులు కనుగొన్నారు. గ్రౌండ్ సిబ్బందికి మంటలు లేదా పొగ జాడలు ఏవీ కనిపించలేదు. ఆ సమయంలో విమానంలో మొత్తం 271 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులకు ఇతర విమానయాన సంస్థల విమానాల్లో ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసింది. అలాగే, ప్రత్యామ్నాయ విమానాల కోసం ఎదురుచూస్తున్న వారికి వసతి, భోజనం మరియు స్థానిక రవాణా సౌకర్యాలను కూడా కల్పించింది. డ్యూటీలో ఉన్న నలుగురు వియత్నాం పైలట్లకు మొత్తం 63,938 గంటల విమానయాన అనుభవం ఉంది. అందులో 19,675 గంటలు బోయింగ్ 787 విమానంలో గడిపినవారున్నారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారని వియత్నాం సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. ఆగస్టు 15న జరిగిన ఈ సంఘటన విమానాశ్రయంలో కార్యకలాపాలకు కూడా అంతరాయం కలిగించింది. జర్మనీ విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ బీఎఫ్యూ దీనిని దర్యాప్తుచేస్తోంది.
ఇజ్రాయెల్ ఎన్నికల ప్రచార హోర్డింగుపై మమ్దానీ చిత్రం
టెల్ అవీవ్: అక్లోబర్లో ఎన్నికలు జరగనున్న ఇజ్రాయెల్లో ఒక ప్రచార హోర్డింగ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. టెల్ అవీవ్ నగరం మధ్యలో అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు పార్టీ ఏర్పాటు చేసిన బిల్బోర్డ్పై న్యూయా ర్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీని చిత్రించారు. పోస్టర్లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇరాన్ నాయకుడు మొ జ్తాబా ఖమేనీ, హెజ్బొల్లా అధిపతి నయీమ్ ఖాసెమ్ల పక్కన ఆయన ఫోటోను చిత్రించారు. ‘వారు నెతన్యాహు ఓడిపోవాలని కోరుకుంటున్నారు. వారిని గెలవనివ్వకండి’అని లికుడ్ పార్టీ లోగోతో రాశారు. గాజా కాల్పుల విరమణ ప్రయత్నాలు నిలిచిపోయిన తరుణంలో, ఈ చర్య వారి మధ్య బహిరంగ వైరాన్ని మరింత తీవ్రం చేసింది. జులైలో ఇజ్రాయెల్ నెసెట్ను రద్దు చేయడంతో, అక్టోబర్లో ఎన్నికలకు మార్గం సుగమమైంది. 2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలో దాడుల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జాతీయ ఎన్నికలు ఇవే. తన అతివాద కూటమిని తిరిగి అధికారంలో తీసుకొచ్చేందుకు నెతన్యాహు ప్రచారలోకి దిగారు. అమెరికాలో ఇటీవల జరిగిన పోల్స్లో, అమెరికన్ యూదుల్లో నెతన్యాహు కంటే మమ్దానీకే ఎక్కువ ప్రజాదరణ ఉందని తేలింది. అభిప్రాయ సేకరణలో తన అధికార కూటమి వెనుకబడి ఉండటాన్ని గ్రహించిన నెతన్యాహు, తన సోషల్ మీడియా ఖాతాల్లో ఆ బిల్బోర్డ్ ఫోటోను పోస్ట్ చేశారు. మమ్దానీ తనను ఒక యుద్ధ నేరస్థుడని పిలుస్తూ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్నారు. అయితే, నెతన్యాహు ఎన్నికల ప్రచార సామగ్రిలో తన చిత్రాన్ని చేర్చడంపై మమ్దానీ ఇంకా బహిరంగంగా స్పందించలేదు. మమ్దానీ తన మేయర్ ఎన్నికల ప్రచారం నుంచే గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని గట్టిగా విమర్శిస్తూ వచ్చారు. గత నెలలో నెతన్యాహును యుద్ధ నేరగాడు అనడంతో మాటల యుద్ధం తీవ్రమైంది. సెపె్టంబరులో నగరంలో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి నెతన్యాహు హాజరైతే, ఆయన అరెస్టు కోసం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన వారెంట్ను అమలు చేయాలని అమెరికా అధికారులకు పిలుపునివ్వడం తెలిసిందే.
'జమ్మూకశ్మీర్, భారత్లో ముఖ్య భాగం'.. స్పందించిన పాక్
జమ్మూకశ్మీర్ అనేది భారతదేశంలోని ముఖ్య భాగమని అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలని పాకిస్థాన్ ఖండించింది. ఈ వ్యవహారంలో స్థానిక అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఆయనని విదేశాంగశాఖ కార్యాలయానికి పిలిపించి, ఈ అంశంపై తీవ్ర నిరసన తెలిపినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికా రాయబారి సెర్గియో గోర్ బుధవారం జమ్మూకశ్మీర్లో పర్యటించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో అమెరికా రాయబారి పర్యటించడం ఇదే తొలిసారి.భారత్లో జమ్మూకశ్మీర్ ముఖ్యమైన భాగం. అద్భుతమైన ప్రకృతి అందాలతో ఎంతో అందంగా ఉంది. ఇక్కడికి రావడం, ఈ ప్రాంతాన్ని కళ్లారా చూడటం సంతోషంగా ఉంది అని గోర్ అన్నారు. జమ్మూకశ్మీర్ విషయంలో అమెరికా జారీ చేసిన 'లెవల్-4' ట్రావెల్ అడ్వైజరీని పునః పరిశీలిస్తామని చెప్పారు.జమ్మూకశ్మీర్పై సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్లోని అమెరికా రాయబారి బాధ్యతారాహిత్య ప్రకటన చేశారు. ఈ ప్రాంతం విషయంలో అమెరికా చాలా ఏళ్లుగా పాటిస్తున్న వైఖరికి విరుద్ధంగా ఉంది. జమ్మూకశ్మీర్ ఓ వివాదాస్పద భూభాగం. ఐరాస భద్రతా మండలి తీర్మానాలు, కశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తుది పరిష్కారం కోసం ఎదురుచూస్తోంది. ఈ వ్యవహారంలో అమెరికా ప్రకటనలు తదనుగుణంగా ఉండాలని దౌత్యవేత్తను కోరాం అని పాక్ తెలిపింది.
పశ్చిమాసియానే కాదు యూరప్లోనూ దాడులకు ఇరాన్ భారీ స్కెచ్?
టెహ్రాన్: ఇప్పటివరకు పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతానికే పరిమితమైన ఇరాన్-అమెరికా ఘర్షణలు.. ఇప్పుడు క్రమంగా యూరప్ (ఐరోపా) దేశాలకు విస్తరిస్తూ అంతర్జాతీయ యుద్ధ మేఘాలను అలుముకునేలా చేస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై తాము క్రమంగా పట్టు కోల్పోతున్నామనే నివేదికలు ఇరాన్ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఇదే తరుణంలో, హర్మూజ్ జలసంధి తమదేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో ఒక కొత్త మ్యాప్ను విడుదల చేయడం ఇరాన్ ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది.ఈ పరిణామాలే ఇరాన్ను రక్షణాత్మక వైఖరి వీడి, యూరప్లోని అమెరికా సైనిక స్థావరాలపై పూర్తి స్థాయి దాడికి యోచించేలా చేశాయంటూ ‘ఫైనాన్షియల్ టైమ్స్’సంచలన నివేదికను వెలుగులోకి తెచ్చింది. ఆ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మార్చి నెలలో డ్రోన్ దాడికి గురైన సైప్రస్లోని బ్రిటిష్ వైమానిక స్థావరం కూడా ఇరాన్ దాడి చేసే లక్ష్యాల జాబితాలో ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో బ్రిటిష్ సైనిక స్థావరంపై జరిగిన మొదటి దాడి ఇదే కావడంతో, ఇది అప్పట్లోనే ఇరు దేశాల మధ్య సంఘర్షణ తీవ్రతరం కావడానికి నాంది పలికింది.అలాగే, గత నెలలో తన ‘బెజ్మర్ వైమానిక స్థావరం’ నుండి అమెరికాకు చెందిన 8 బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ ఇంధన విమానాలకు, 250 మంది సైనిక సిబ్బందికి ఆశ్రయమిచ్చి, వారు పనిచేసేందుకు అనుమతించిన ఆగ్నేయ ఐరోపా దేశమైన బల్గేరియాను కూడా ఇరాన్ తన ప్రతీకార లక్ష్యంగా గుర్తించినట్లు ఈ నివేదిక పేర్కొంది.అమెరికాతో శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోవడంతో.. ఇరాన్ తన రక్షణాత్మక వైఖరిని వీడి పూర్తిగా దాడి చేసే సైనిక వ్యూహానికి మారాలని నిర్ణయించుకుందని సీనియర్ ఇరాన్ అధికారి రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించారు. ఈ సుదీర్ఘ సంఘర్షణకు శాశ్వత ముగింపు పలకడానికి, అలాగే హర్మూజ్ జలసంధి నియంత్రణపై ఉన్న వివాదాలను పరిష్కరించడానికి జరుగుతున్న చర్చలు పూర్తిగా నిలిచిపోయిన తరుణంలో ఇరాన్ ఈ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
జాతీయం
మూడు నెలలు రాపిడో నడిపాడు.. చివరికి షాకింగ్ నిజం తెలుసుకున్నాడు!
కాలేజీకి సెలవులు వచ్చాయి.. స్నేహితులు సరదాగా గడిపితే.. అతడు మాత్రం బైక్ స్టార్ట్ చేశాడు. బ్యాగ్లో పుస్తకాలకు బదులు ఫోన్ పెట్టుకున్నాడు.. క్లాస్రూమ్ బదులు బెంగళూరు రోడ్లపైకి వచ్చాడు. మూడు నెలలు రాపిడో కెప్టెన్గా పనిచేశాడు. రోజుకు రూ.1,200 వరకు సంపాదించాడు. కానీ చివరికి అతడు తెలుసుకున్నది సంపాదన లెక్క కాదు.. గిగ్ వర్కర్ల జీవితంలో దాగున్న అసలు కష్టం!బెంగళూరుకు చెందిన ఓ బీబీఏ రెండో సంవత్సరం విద్యార్థి మొదట్లో రాపిడో యాప్ విధానం, డిమాండ్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అర్థం కాలేదని చెప్పాడు. అయితే కొద్ది రోజుల్లోనే ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, తన ఆదాయాన్ని పెంచుకున్నట్లు వివరించాడు. సాధారణంగా ఉదయం 8 గంటలకు పని ప్రారంభించి సాయంత్రం 4.30 గంటల వరకు పనిచేసేవాడినని తెలిపాడు. మంచి రోజుల్లో ఇంధన ఖర్చులు, ఇతర ఖర్చులు మినహాయించకముందు సుమారు రూ.1,200 వరకు సంపాదించేవాడినని పేర్కొన్నాడు."నాకు ఇది మంచి సైడ్ హసల్గా అనిపించింది. కానీ ఇదే పనిపై ఆధారపడి జీవించే గిగ్ వర్కర్ల పరిస్థితి గురించి కూడా ఆలోచించేలా చేసింది. ఆ గంటల్లో నేను పెద్దగా విరామాలు కూడా తీసుకోలేదు" అని విద్యార్థి తన పోస్టులో రాశాడు.మధ్యాహ్నం సమయంలో రైడ్లు తక్కువగా వచ్చినప్పుడు అదనపు ఆదాయం కోసం ఫుడ్ డెలివరీలు కూడా చేసినట్లు చెప్పాడు. కొన్ని సందర్భాల్లో రెస్టారెంట్లో ఆర్డర్ వెంటనే సిద్ధమవుతుందని, మరికొన్ని సార్లు 20 నుంచి 25 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చేదని వివరించాడు.మూడు నెలల పాటు బెంగళూరులోని మెజెస్టిక్, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా పని చేశానని తెలిపాడు. ఆటో డ్రైవర్లు తనను చూసి అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఎవరూ తనను బెదిరించలేదని చెప్పాడు.తన సంపాదన వివరాలను చూపించేందుకు రాపిడో ఆదాయ డ్యాష్బోర్డ్ స్క్రీన్షాట్లను కూడా పంచుకున్నాడు. మే నెలలో 96 ఆర్డర్లు పూర్తి చేసి రూ.5,650 సంపాదించాడు. జూన్లో ఆదాయం పెరిగి రూ.16,660కి చేరింది. జూలైలో 233 రైడ్లు పూర్తి చేసి రూ.14,222 సంపాదించినట్లు తెలిపాడు."ఇది కేవలం రోజుకు రూ.1,200 సంపాదించడం గురించి కాదు. గిగ్ వర్కర్ల జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. వేచి ఉండటం, ఇంధన ఖర్చులు, ఆదాయంలో అనిశ్చితి, ప్లాట్ఫామ్ నిబంధనలు, కస్టమర్ల సమస్యలు, రెస్టారెంట్లలో ఎదురయ్యే ఇబ్బందులు, నిరంతరం పని చేయాలనే ఒత్తిడి అన్నీ అర్థమయ్యాయి" అని విద్యార్థి పేర్కొన్నాడు.ఈ పోస్టు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు అతడిని ప్రశంసించారు. గిగ్ వర్కర్ల కష్టాలను అర్థం చేసుకునేలా తన అనుభవాన్ని వివరించాడని అభినందించారు.ఒక నెటిజన్ స్పందిస్తూ, "మీ అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. ఈ అనుభవాన్ని నేర్చుకునే అవకాశంగా తీసుకోవడం అభినందనీయం" అని వ్యాఖ్యానించాడు.మరో వ్యక్తి మాట్లాడుతూ, "క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు చేసే సమయంలో డెలివరీ వ్యక్తి వచ్చినప్పుడు డబ్బు సిద్ధంగా ఉంచండి. వారికి సమయం చాలా విలువైనది" అని పేర్కొన్నాడు.మరో నెటిజన్ తన అనుభవాన్ని పంచుకుంటూ, తాను కూడా బీబీఏ చదివే సమయంలో రాపిడోలో పనిచేశానని, ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు పని చేసి రోజుకు సుమారు రూ.1,500 వరకు సంపాదించేవాడినని తెలిపాడు. తర్వాత ఆ పని మానేశానని చెప్పాడు.ఈ విద్యార్థి అనుభవం ద్వారా గిగ్ ఎకానమీలో పనిచేసే వారి ఆదాయం మాత్రమే కాకుండా, వారు ఎదుర్కొనే శ్రమ, సమయ ఒత్తిడి, అనిశ్చిత పరిస్థితులు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఉప్పు తగ్గిందని సర్ఫ్.. వికటించిన ‘మధ్యాహ్న భోజనం’
బిహార్షరీఫ్: పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనం వికటించి 24 మందికి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన బిహార్లోని నూర్ సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరసి మిడిల్ స్కూల్లో చోటుచేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులకు అన్నం, సోయాబీన్ కూరను వడ్డించారు. అయితే కూరలో ఉప్పు సరిపోలేదని కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో, వంట మనిషి ఉప్పుకు బదులుగా పొరపాటున సర్ఫ్ డిటర్జెంట్ పౌడర్ను వంటకంలో కలిపారు.పాఠశాల వంటగదిలో ఉప్పు, డిటర్జెంట్ పౌడర్ రెండూ ఒకేచోట ఉంచడం వల్లే ఈ పొరపాటు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఆహారం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులకు వాంతులు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. మొదట పాఠశాల సిబ్బంది ప్రథమ చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని బిహార్షరీఫ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని, ఒకే బెడ్పై ఇద్దరు ముగ్గురు బాలికలకు చికిత్స అందిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. సివిల్ సర్జన్ డాక్టర్ జయప్రకాష్ సింగ్ ఆస్పత్రిని సందర్శించి, బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని, విద్యార్థులంతా ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిపారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందించినప్పటికీ నూర్ సరాయ్ ఆస్పత్రి నుంచి అంబులెన్స్ గానీ, వైద్య బృందం గానీ పాఠశాలకు రాలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో చేసేదేమీ లేక ఈ రిక్షాలు, ఆటోల్లో పిల్లలను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతా ప్రమాణాలు, ఆహార పదార్థాల భద్రత, స్థానిక అత్యవసర ఆరోగ్య సేవల పనితీరుపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది.ఇది కూడా చదవండి: ఠాణాలో హల్చల్: టాయిలెట్ క్లీనర్ తాగిన నిందితుడు
ఠాణాలో హల్చల్: టాయిలెట్ క్లీనర్ తాగిన నిందితుడు
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నౌబస్తా పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి కలకలం చెలరేగింది. మహిళను వేధించిన ఆరోపణలపై విచారణ నిమిత్తం స్టేషన్కు పిలిపించిన ఆశీశ్ ద్వివేది అనే యువకుడు అక్కడి బాత్రూమ్లోకి వెళ్లి, టాయిలెట్ క్లీనర్ తాగాడు. నౌబస్తా ప్రాంతానికి చెందిన ఓ మహిళ మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశీశ్ ద్వివేదిని విచారిస్తున్నారు. సర్సౌల్ పరిధిలోని మహోలీ గ్రామానికి చెందిన ఆశీశ్ వేర్వేరు నంబర్ల నుంచి సదరు మహిళకు ఫోన్ చేసి వేధిస్తున్నాడని, నిలదీస్తే చంపేస్తామని బెదిరించాడని ఫిర్యాదులో ఆమె మామ పేర్కొన్నారు. ఈ కేసు విచారణ కోసం ఆశీశ్ను పోలీసులు స్టేషన్కు రావాలని ఆదేశించారు.మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఆశీశ్ తన స్నేహితుడితో కలిసి మద్యం మత్తులో స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడికి రాగానే పోలీసులతో వాగ్వాదానికి దిగి, దురుసుగా ప్రవర్తించాడు. అనంతరం గోడకు తల బాదుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో మూత్రవిసర్జనకని చెప్పి బాత్రూమ్కు వెళ్లాడు.అక్కడ ఉన్న టాయిలెట్ క్లీనర్ వెంటనే తాగేశాడు. అయితే అతడు తాగకముందే అడ్డుకుని లాక్కున్నామని పోలీసులు అంటున్నారు. అస్వస్థతకు గురైన అతడిని తొలుత కాన్షీరామ్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హాలెట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు నైట్ ఆఫీసర్ (ఎస్ఐ) వికాస్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ అరవింద్లను డీసీపీ (సౌత్) దీపేంద్ర నాథ్ చౌదరి సస్పెండ్ చేశారు.ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం తెచ్చిన విద్యా సంక్షోభం
పగటి కలలు కనొద్దు.. రాందేవ్కు కంగనా ఘాటు కౌంటర్
న్యూఢిల్లీ: జెన్జీ వ్యాఖ్యల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని.. ఆ అవసరం కూడా లేదని సోషల్ మీడియా వేదికగా రాందేవ్కు కాస్త ఘాటైన చురకలే అంటించారు.‘‘బాబాజీ.. నా యవ్వనం గురించి, నా బెడ్రూమ్ గురించి పగటి కలలు కనొద్దు’’ అంటూ కంగనా(40) ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పేర్కొన్నారు. వదంతులు, ఊహాగానాల ఆధారంగా ఎవరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదని అన్నారు. ‘‘నాకు ఎప్పుడూ తప్పుడు ప్రచారాల విషయంలో సుప్రీంకోర్టు నుంచి చివాట్లు పడలేదు. వాస్తవాల ఆధారంగా మాట్లాడుతున్నా.. కాబట్టి నాకు వ్యక్తిత్వ పాఠాలు చెప్పొద్దు. నాది మీ కంటే మంచి క్యారెక్టర్’’ అంటూ రాందేవ్పై విమర్శలు చేశారు.ఎక్కడ మొదలైంది?ఇటీవల నీట్ పరీక్ష వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోలపై కంగనా స్పందించారు. కొందరు యువత ప్రవర్తనను విమర్శిస్తూ వారిని ‘జనరేషన్ గట్టర్’ అంటూ అభివర్ణించారు. స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని, తల్లిదండ్రులపై ఆధారపడుతూ వ్యవస్థకు ఎలాంటి సహకారం అందించడం లేదని ఆరోపించారు.కంగనా వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాక్రోచ్ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్తోనూ ఆమెకు మాటల యుద్ధం నడిచింది. అయితే వ్యవహారం మరింత ముదరడంతో ఆమె వివరణ ఇస్తూ.. మొత్తం జెన్జీ యువతను ఉద్దేశించి మాట్లాడలేదని, కొందరి ప్రవర్తనను మాత్రమే విమర్శించానని తెలిపారు.కంగనాపై రాందేవ్ విమర్శలుఈ వివాదంపై స్పందించిన బాబా రాందేవ్(60).. కంగనా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘‘యువతను ‘జనరేషన్ గట్టర్’ అనడం కలుషిత ఆలోచనకు నిదర్శనం’’ అని వ్యాఖ్యానించారు. ఆమె బాల్యం, యవ్వనం, గత విజయాల గురించి ప్రశ్నిస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. దీంతో రాందేవ్ వ్యాఖ్యలకు స్పందించిన కంగనా.. ఆయన గతంలో పతంజలి సంస్థకు సంబంధించిన తప్పుడు ప్రకటనల కేసులో సుప్రీంకోర్టు మందలించిన విషయాన్ని ప్రస్తావించారు.పతంజలి కేసులో..2024లో పతంజలి సంస్థ వ్యాధులను నయం చేస్తామని ప్రచారం చేసిన ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అనంతరం రాందేవ్ కోర్టుకు బేషరతు క్షమాపణలు తెలిపారు.ఈ అంశాన్నే ప్రస్తావిస్తూ.. తనపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని కంగనా సూచించారు. దీంతో కంగనా–రాందేవ్ మధ్య మాటల యుద్ధం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎన్ఆర్ఐ
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏబీసీ నెట్వర్క్ ఏర్పాటు..
అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్వర్క్ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు 'ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్'(AAA) మరియు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ కమ్యూనిటీ(ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి.ఆయా ప్రాంతాల్లో AAA, ABC రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ అభివృద్ధికి ప్రాంతీయ డైరెక్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి ప్రాంతీయ డైరెక్టర్కు ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. స్థానిక నాయకత్వంతో భాగస్వామ్యం, వ్యాపారవేత్తలు–పెట్టుబడిదారులు–వృత్తి నిపుణులను అనుసంధానం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కొత్త అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై వారు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.ఐదుగురు ప్రాంతీయ డైరెక్టర్లుబొల్లి వెంకట రామకృష్ణ (వెంకట్) – లాస్వేగాస్ (Las Vegas) లోని తెలుగు సమాజంలో చురుకైన సభ్యుడిగా, ఐటీ ప్రొఫెషనల్, వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్గా ఉన్నారు. మెంటరింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్, వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆయనకు నార్త్ కరోలినా, నెవాడా, అలబామా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.హనుమంతు సింహబలుడు (సింహ) – ఉత్తర అమెరికా సాక్షి టీవీ చీఫ్ కరస్పాండెంట్గా, గతంలో UBI TV న్యూస్ డైరెక్టర్గా పనిచేసిన మీడియా నిపుణుడు. విశ్వసనీయ జర్నలిజం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కు కట్టుబడి ఉన్న ఆయనకు న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, ఇల్లినాయిస్, మిస్సౌరీ రాష్ట్రాల బాధ్యతలు కల్పించారు.దొమ్మరాజు హేమంత్ వర్మ – టెక్నాలజీ, కన్సల్టింగ్, స్టార్టప్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారవేత్తగా ఉన్నారు. ERP & Automations డైరెక్టర్గా, వ్యూహాత్మక కన్సల్టింగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా సేవలందిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సహకారం, కమ్యూనిటీ అభివృద్ధిపై దృష్టి సారించనున్న ఆయనకు పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, ఒహాయో, మసాచుసెట్స్, ఓక్లహోమా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.గొట్టిపాటి కళ్యాణ్ – 18 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఎంటర్ప్రెన్యూర్, ఐటీ ప్రొఫెషనల్. ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో అనుభవంతో పాటు వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆంధ్ర సంస్కృతిని పరిరక్షిస్తూ తెలుగు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆయనకు అరిజోనా, వాషింగ్టన్, యూటా, కొలరాడో, న్యూ మెక్సికో రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.చౌటకూరి చేతన్ రెడ్డి – ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, కన్సల్టింగ్ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన టెక్నాలజీ ప్రొఫెషనల్. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులతో పాటు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తూ, భాగస్వామ్యాలు, అవకాశాలు, స్థిరమైన కమ్యూనిటీ ప్రభావంపై దృష్టి సారిస్తున్నారు. ఆయనకు జార్జియా (Georgia), మిషిగన్, టెన్నెస్సీ, ఫ్లోరిడా, సౌత్ కరోలినా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.నాయకత్వం, నెట్వర్కింగ్కు ప్రాధాన్యంAAA–ABC ప్రాంతీయ డైరెక్టర్లు స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్, కమ్యూనిటీ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, కొత్త భాగస్వామ్యాలు మరియు వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేయనున్నారు. అదేవిధంగా మెంటరింగ్, నాయకత్వ అభివృద్ధి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, బలమైన నెట్వర్క్ నిర్మాణం, కొత్త అవకాశాల సృష్టి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.స్థానిక సంస్థలు, రాష్ట్ర నాయకత్వం, వివిధ రంగాల నిపుణులతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిటీకి మరింత ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 2028–2031 కాలానికి నియమితులైన ఈ ప్రాంతీయ డైరెక్టర్ల నాయకత్వంలో AAA–ABC నెట్వర్క్ మరింత విస్తరించి, ఉత్తర అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ వర్గాలను మరింత దగ్గర చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
యూరప్లో ఘోర రోడ్డు ప్రమాదం..జగిత్యాల యువకుడు దుర్మరణం
జగిత్యాల: బతుకుదెరువు కోసం సుదూర తీరాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. యూరప్లోని మాల్టా దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల పట్టణానికి చెందిన 27 ఏళ్ల మహ్మద్ జావెద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లయిన మూడు నెలలకే ఆయన మరణించడంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపుర ప్రాంతానికి చెందిన మహ్మద్ జావెద్ గత ఏడాది కాలంగా మాల్టాలోని పావోలా పట్టణంలో ఒక సేల్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున దక్షిణ మాల్టాలోని కోర్మి ప్రాంతంలో జావెద్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఒక భారీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన జవ్వద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మహ్మద్ జావెద్కు మూడు నెలల క్రితమే స్వదేశానికి వచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి వేడుకల అనంతరం జీవితంలో స్థిరపడాలనే ఆశతో ఆయన తిరిగి మాల్టాకు వెళ్లాడు. ఇంతలోనే ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో జావెద్ మృతి చెందారనే వార్త వినడంతో భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి దేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర
‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకలు ఆదివారం (9 ఆగస్టు 2026) సాయంత్రం అత్యంత వైభవంగా కోలాహలంగ జరిగాయి. ఈ బోనాల వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్’ లోని శ్రీ అరసకేసరి శివాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. తెలుగు వారందరితో తో కలిపి సుమారు 850 నుండి 900 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో అమ్మ వారి భక్తి మరియు బోనాలకు సంబందించిన ప్రత్యేక పాటలకు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరికి మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్ఎస్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. మన ఈ తెలంగాణ సంప్రదాయం లో ప్రధాన భూమిక పోషించే బోనాల పండుగతో ప్రేరణ పొంది తెలుగు వారందరు బోనాల వేడుకను జరుపుకోవడం సంతోషకరం అని బోనాల్లో పాల్గొన్న వారు అన్నారు. బోనాల జాతరలో పోతురాజు మరియు పులివేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీనాథ్, గౌడ సాయి కుమార్, అయిట్ల లక్ష్మణ్, లక్ష్మిపతి మరియు అరవింద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.ఈ ఏడాది బోనం సమర్పించిన ఫ్యామిలీస్ లో శశిధర్ రెడ్డి, రమేష్ గడప, అలేఖ్య దార, అలేఖ్య తడిసిన, దీపా రెడ్డి మండల, బోయిని స్వరూప, శ్వేత కుంభం, బర్ల అరుణ్కుమార్, బైలపూడి గౌరీ వరలక్ష్మి, మోతె శ్రీనివాస రెడ్డి, బొందుగుల ఉమారాణి మరియు అన్ను సుజాత ఉన్నారు. బోనం సమర్పించిన భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు రిటర్న్ గిఫ్ట్ ను అందచేశారు. అమ్మవారికి బోనం సమర్పించిన భక్తులు ఇంట్లో వండి తెచ్చిన అన్న తీర్థ ప్రసాదాన్ని పంచి సంతోషాన్ని వెలిబుచ్చారు. వీరితో పాటు గడప రమేశ్ మరియు బసిక ప్రశాంత్ కుమార్ అమ్మవారి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు. బోనాలు పండుగ లో పాల్గొన్న భక్తులందరూ కమిటీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాద (పులిహోర , పెరుగు అన్నం మరియు కేసరి ) వితరణలో పెద్ద ఎత్తులో సంతోషంగా పాల్గొని అందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.సింగపూర్ బోనాలు - 2026 పండుగలో పాల్గొని విజయవంతం చేసిన మరియు ఎల్లప్పుడూ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు మరియు విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు మరియు శివ ప్రసాద్ ఆవుల మరియు కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్ , యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం మరియు సుకేందర్ నీలం మొదలగు వారు మాట్లాడుతూ సొసైటీకి సహాయ సహకారాలు అందిస్తున్న సింగపూర్ లో ఉన్న తెలంగాణ వాసులకు, అందరూ తెలుగు వారికి మరియు స్పాన్సర్స్ కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.అందరి పై ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని సొసైటి సభ్యులు ఆకాంక్షించారు.ఎలాంటి అసౌకర్యం లేకుండ తీసుకున్న జాగ్రత్తలకు సొసైటీ చేసిన ఏర్పాట్లను భక్తులు అభినందించారు. ఈ వేడుకలకు సహకారం అందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏ వి ఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (కూల్ టైమ్ ఎయిర్కాన్ ఇన్స్టాలేషన్ & సర్వీస్) మరియు స్వాతి ఖానాపురం; సాయి కృష్ణ కొమాకుల; నగేష్ టేకూరి; నిఖిల్ పారుపల్లి; శ్రీధర్ మారోజు & ఫ్రెండ్స్, రామాంజనేయులు చమిరాజు, అజయ్ నందగిరి, నరేష్ కుమార్ నౌల్ల, అభిమల్ల గిరి ప్రసాద్; కొల్లా శివ ప్రసాద్; మునిగెల కృష్ణం రాజు; పాతూరి రాంబాబు మరియు దండా నాగేశ్వర్ రెడ్డి, రెడ్డిపల్లి కృష్ణారావు, రవీంద్ర కుమార్ గార్లకు మరియు దేవాలయ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పండుగలో ఫొటోగ్రఫీ కవరేజ్ చేసిన కృష్ణ నెల్లుట్ల గారికి, సౌండ్ సాంకేతికతలో సహకరించిన యసరావేణి విజయ కుమార్ మెరుగు గారికి మరియు పండుగ విజయవంతంగా జరగడానికి తోడ్పడిన ప్రతిఒక్కరికి పేరు పేరున కమిటీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
బాల్టిమోర్లో 19వ ఆటా మహాసభలు.. తెలుగు సంస్కృతికి పట్టాభిషేకం
బాల్టిమోర్, అమెరికా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యువజన సదస్సు దిగ్విజయంగా ముగిశాయి. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు (జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు) అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగిన కార్యక్రమాలకు ఉత్తర అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన తెలుగు ప్రజలతో బాల్టిమోర్ నగరం ఒక మినీ తెలుగు సీమను తలపించింది. తెలుగు భాషాభిమానం, సామాజిక ఐక్యత, ఆర్థిక పురోగతి , భావితరాల చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఈ మహాసభలను హాజరైన ప్రతినిధులు ‘సూపర్ డూపర్ హిట్’గా అభివర్ణించారు. శోభాయమానమైన గ్రాండ్ బాంక్వెట్తో ప్రారంభమైన ఈ వేడుకలు ఆటా చరిత్రలోనే ఒక చిరస్మరణీయ మైలురాయిగా నిలిచాయి.జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత తెచ్చిన రాజకీయ దిగ్గజాలుఈ మహాసభలకు అమెరికా జాతీయ రాజకీయ దిగ్గజాలతో పాటు భారతదేశానికి చెందిన ప్రజాప్రతినిధులు హాజరై ప్రత్యేక శోభను తెచ్చారు. మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ మాట్లాడుతూ మేరీల్యాండ్, అమెరికా సమగ్ర అభివృద్ధిలో తెలుగు ప్రవాసుల పాత్రను కొనియాడారు. సాంకేతికత, వైద్యం, విద్య, వ్యాపారం, పౌర సేవల్లో తెలుగు వారి నిబద్ధతను అభినందించారు.ఈ కార్యక్రమానికి హాజరైన మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ తన జీవిత ప్రయాణాన్ని షేర్ చేసుకుంటూ.. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా అమెరికన్ సమాజంలో ఉన్నత అవకాశాలను సాధించవచ్చని సూచించారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా ఎఫ్. హష్మీ తన హైదరాబాద్ బాల్య జ్ఞాపకాలైన పాతబస్తీ, చార్మినార్, లాడ్ బజార్, హైదరాబాదీ బిర్యానీ, రైలు ప్రయాణాలను గుర్తుచేసుకుని ప్రేక్షకులను చప్పట్లు కొట్టేలా చేశారు. ప్రవాసులు పౌర, రాజకీయ ప్రక్రియల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రగతి, మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ రాష్ట్రాభివృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రవాస పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో తానా, నాట్స్, టీటీఏ, టీడీఎఫ్, ఏఏపీఐ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొని తెలుగు సమాజ ఐక్యతను చాటారు. అమెరికా సాయుధ దళాల్లో వీరోచితంగా సేవలందిస్తున్న తెలుగు మహిళలు, పురుషులను ఈ వేదికపై ఘనంగా సత్కరించడంతో సభ మొత్తం అత్యంత భావోద్వేగానికి గురవడమే కాదు, స్టాండింగ్ ఒవేషన్, కరతాల ధ్వనులతో వేదికను మార్మోగేలా చేశారు.వ్యాపార, సాంస్కృతిక వేడుకలుమూడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాలతో కన్వెన్షన్ సెంటర్ సభా ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఈ వేదికలపై కవిత్వం, సాహిత్యం, సినిమా, చరిత్రపై లోతైన చర్చలు జరిగాయి. పారిశ్రామిక వేదికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, వైద్యం, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలపై సీనియర్ పారిశ్రామికవేత్తలు, యువ స్టార్టప్ వ్యవస్థాపకులు విస్తృతంగా చర్చించారు. రెండవ, మూడవ తరాల తెలుగు-అమెరికన్ యువత కోసం సంస్కృతి, నెట్వర్కింగ్, నాయకత్వ నైపుణ్యాలు,కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను నిర్వహించారు. ఉర్రూతలూగించిన జానపదాలుతెలుగు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న జానపద గీతాలు ఈ వేదికకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్, జనార్దన్ పన్నెల బృందం ఆలపించిన తెలంగాణ జానపద గేయాలు చప్పట్లతో మారుమోగించాయి.తారల సందడి.. కీరవాణి స్వర నీరాజనంతెలుగు సినీ ప్రపంచానికి చెందిన ప్రముఖుల రాకతో వేడుకల్లో ఉత్సాహం రెట్టింపైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అడివి శేష్, హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీధర్ గౌడ్, వరుణ్ సందేశ్, పూజా హెగ్డే, రీతూ వర్మ, అనన్య నాగళ్ల, దివి వడ్త్యా అభిమానులతో ముచ్చటించారు. యువ నటుడు నవీన్ పోలిశెట్టి తన టైమింగ్ కామెడీ పంచ్ లతో ప్రాంగణాన్ని నవ్వుల సంద్రంలో ముంచెత్తారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, గాయని సునీత, త్రీయరీ, ఆరెంజ్ స్ట్రీట్ బృందాల ప్రదర్శనల అనంతరం... ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ మహాసభలకు 'గ్రాండ్ ఫినాలే'గా నిలిచింది.20వ మహాసభలు డాలస్లో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బానాల, సతీష్ రెడ్డి రామసహాయం మరియు కోర్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వందలాది మంది వాలంటీర్లు భోజనం, రవాణా, లాజిస్టిక్స్ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించి అతిథుల మెప్పు పొందారు.ఈ మహాసభల ముగింపు సందర్భంగా కీలక ప్రకటన చేస్తూ, 2028లో జరగబోయే 20వ ఆటా మహాసభలకు డాలస్ (టెక్సాస్) నగరం ఆతిథ్యం ఇవ్వబోతోందని నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. బాల్టిమోర్ మహాసభలు కేవలం సదస్సులు కాదు.. తెలుగువారి గుర్తింపునకు ఒక గొప్ప వేడుక.. కొత్త అవకాశాలకు వేదిక.. సంస్థలు, వృత్తులు, తరాలకు అతీతమైన ఐక్యతకు శక్తివంతమైన ప్రతీక.. అని తెలిపారు.
క్రైమ్
కూకట్పల్లి ఓయో హోటళ్లలో వ్యభిచారం
హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో వ్యభిచార కేంద్రాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి 11 మందిని అరెస్టు చేశారు. ఈ వివరాలను బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. భాగ్యనగర్ కాలనీలోని అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్లో ఉన్న సాయి ప్యారడైజ్, వైసాయి కాటేజ్ ఓయో హోటళ్లలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో సీఐ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం రాత్రి ఈ దాడులు చేపట్టారు. ఈ ఘటనలో నిర్వాహకులు ఆమని (28), దినేష్ (21), రాజేష్ (28), ఉమేష్ చంద్ర (24), రామసాయి (25), విటులు రాజు (26), బాలరాజు (27), వంశీ (38) ప్రశాంత్ (36)లను అరెస్టు చేశారు. ముగ్గురు బాధితురాళ్లను రెస్క్యూ హోంకు తరలించారు. మరో ఇద్దరు నిర్వాహకులు పరారీలో ఉన్నారు. హోటళ్ల అనుమతులు రద్దు చేసి సీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అసలేం జరిగింది!
కాకినాడ: పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ముందుగా నూకరాజు, ఆయన కూతురు సౌజన్య రాసిన మరణ వాంగ్మూలాలు, అనంతరం వియ్యంకుడు భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నూకరాజు, సౌజన్యల సెల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటాను రికవరీ చేయడం ద్వారా కీలక ఆధారాలు లభిస్తాయనే కోణంలో వారి సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించే పనిలో ఉన్నారు. మరో పక్క ఈ కేసులో నిందితుడైన సాధిక్ ఖాన్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అతడు కర్ణాటకకు పారి పోయినట్లు గుర్తించి, నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే గోదావరిలో గల్లంతైన నూకరాజు భార్య మీనా, కూతురు సౌజన్యల ఆచూకీ మూడో రోజూ లభ్యం కాలేదు. ఫోన్ సంభాషణలే ఆధారం నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఆదివారం రాత్రి ఏం జరిగింది అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో రాజమహేంద్రవరం బయలు దేరిన ఆయన.. దారిలో ఎవరిని కలిశారు, ఎక్కడెక్కడ ఆగారు, ఏ ప్రాంతంలో ఎంత సేపు ఉన్నారు, ఎవరితో మాట్లాడారు తదితర వాటిపై ఆరా తీస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి గోదావరిలోకి దూకే వరకు ఫోన్ సంభాషణలను విశ్లేషిస్తున్నట్లు సమాచారం. కాకినాడ నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం వెళ్లే వరకు సాధిక్ పలు మార్లు కాల్ చేసి బెదిరించినట్లు నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారంపైనా పోలీసులు దృష్టి సారించారు. మెసేజ్లపై దృష్టినూకరాజు కుటుంబ సభ్యులకు సంబంధించిన సామగ్రిని, వారి సెల్ఫోన్లను పోలీసులు ఆయన కారులో స్వా«దీనం చేసుకున్నారు. అయితే వారి సెల్ఫోన్లలో వాట్సాప్ మెసేజ్లను ఆత్మహత్యలకు ముందు డిలీట్ చేసినట్లు గుర్తించారు. వాటిని రికవరీ చేస్తే కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావించి, ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. లేఖల పరిశీలన నూకరాజు, సౌజన్య రాసిన లేఖలను విశ్లేషిస్తున్న పోలీసులు నూకరాజు వియ్యంకుడు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దృష్టి సారించారు. తన కుమారుడిపై కోచ్ సాధిక్ ఖాన్ విష ప్రయోగం చేసి చంపేశాడని ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మృతుడు జగదీశ్వరరెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రాంతాలను పరిశీలించారు. అయితే దాదాపు రెండు నెలల క్రితం జరిగిన సంఘటన కావడం, జగదీశ్వరరెడ్డి మృతదేహాన్ని దహనం చేయడంతో ఆధారాలు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే జగదీశ్వరరెడ్డి చనిపోవడానికి ముందు తీవ్ర అస్వస్థతకు గురై సుమారు 20 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు చెబుతున్నారు. విష ప్రయోగం జరిగి ఉంటే అప్పటి మెడికల్ రిపోర్టుల్లో విషయం బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.కర్ణాటకకు పారిపోయిననిందితుడు!నిందితుడు సాధిక్ ఖాన్పై రాజమహేంద్రవరం టూటౌన్, కాకినాడ సర్పవరం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతడి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అయితే సాధిక్ ఖాన్ సోమవారం తెల్లవారుజామునే పారిపోయినట్లు గుర్తించి, సాంకేతిక ఆధారాలతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకినాడలోని అతడి ఇల్లు, రైఫిల్ షూటింగ్ అకాడమీ, బంధువుల ఇళ్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. కాగా.. సాధిక్ ఖాన్ తన సెల్ఫోన్ వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా అతడు కర్ణాటక పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు, నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను అక్కడకు పంపినట్టు సమాచారం.మూడో రోజూ లభించని ఆచూకీకంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకి గల్లంతైన నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ బుధవారానికి మూడు రోజులవుతున్నా లభించలేదు. ఈ ఘటనలో నూకరాజు మృతదేహం లభ్యం కాగా, భార్య, కుమార్తె ఆచూకీ తెలియలేదు. గల్లంతైన వారి కోసం రెండో పట్టణ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జాలర్లు బోట్లపై తిరుగుతూ గాలిస్తున్నారు. అయితే ఎక్కడా ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. గోదావరిలో వరద నీరు అధికంగా ఉండడంతో గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టడం ఇబ్బందిగా మారింది. కాగా.. ఇప్పటికే నూకరాజు కారు డ్రైవర్ రాజు నుంచి రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసులు పలు ఆధారాలను సేకరించారు.డబ్బున్న పిల్లల తల్లులే టార్గెట్!కాకినాడ రూరల్: సాధిక్ ఖాన్ వృత్తి రైఫిల్ షూటింగ్ కోచింగ్ అయినా, శిక్షణకు వచ్చే డబ్బున్న పిల్లల తల్లులే అతడి లక్ష్యమని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నూకరాజు కుమార్తె సౌజన్యను టార్గెట్ చేశాడని తెలుస్తోంది. కాకినాడలోని గుడారిగుంట సమీపంలో ప్రో షూటింగ్ అకాడమీ పేరిట సాధిక్ ఖాన్ పిల్లలకు శిక్షణ ఇస్తున్నాడు. అంతకు ముందు అకాడమీని రాయుడుపాలెం జంక్షన్ వద్ద ఓ భవనంలో నిర్వహించేవాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనతో అతడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధిక్ ఖాన్ తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు విచారణ చేసి, కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. మరో వైపు రైఫిల్ షూటింగ్ శిక్షణ పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కూడా ఆరా తీస్తున్నారు. అలాగే నూకరాజు నివాసంలో సోదాలు జరిపి ఆధారాలు సేకరిస్తున్నారు. సౌజన్యది ప్రేమ వివాహం నూకరాజు కుమార్తె సౌజన్య, జగదీశ్వరరెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కార్తికేయ రెడ్డి కుమారుడు. కాంట్రాక్టర్ అయిన జగదీశ్వరరెడ్డి కాకినాడలోనే భార్య, కుమారుడితో నివాసం ఉండేవారు. ఆయన గత జూలై 2న మృతి చెందారు. కాగా.. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయ రెడ్డి కలిసి ఆదివారం ఉదయమే కాకినాడ అశోక్ నగర్లో నివాసం నుంచి బయటకు వెళ్లారని స్థానికులు తెలిపారు. ఆ రోజు సాయంత్రం పలుమార్లు సాధిక్ ఖాన్ ఆ అపార్టుమెంట్ వద్ద కంగారుగా తిరుగుతూ కనిపించాడన్నారు.
మహేష్బాబు సినిమా చూసి.. హత్యకు స్కెచ్!
మంచి కంటే చెడు త్వరగా ఆకర్షిస్తుంది. అందుకే సినిమాల్లోనూ హీరోలను గ్యాంగ్స్టర్లుగా, మాఫియా డాన్లుగా చూపించే ట్రెండ్ పెరుగుతోంది. తెరపై చూపించే క్రైమ్ సన్నివేశాలు, వాటి ప్రభావం సమాజంపై ఎలా ఉంటుందనే చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే సందేశాత్మక చిత్రాల నుంచి కూడా చెడునే స్వీకరిస్తుండడం.. ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా కేరళలో వెలుగుచూసిన ఓ హత్య కేసు ఈ అంశంపై మరోసారి చర్చకు తెరలేపింది. తెలుగు సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన ఓ సినిమా.. అక్కడ ఓ దారుణ హత్యకు స్ఫూర్తినివ్వడమే అందుకు కారణం. కేరళలోని అలప్పుజ జిల్లాలో జరిగిన 65 ఏళ్ల వృద్ధుడి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ దొంగతనం కేసుగా మొదలైన ఈ ఘటన వెనుక.. మొదట ప్రొఫెషనల్ హంతకుల ప్రమేయం ఉందేమోనని పోలీసులు అనుమానించారు. ఆ తర్వాత లోతుగా దర్యాప్తు చేస్తే మైనర్లు, అందునా పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా నిర్ధారించుకున్నారు. అయితే తన తాత హత్యకు 13 ఏళ్ల మనవరాలే సహకరించడం.. ఈ కేసులో మరో కీలక అంశంగా వెల్లడైంది. కరువత్తలో శివన్కుట్టి(65) హత్య కేసులో మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. హత్యకు 2017లో విడుదలైన ‘స్పైడర్’ చిత్ర స్ఫూర్తిగా నిలిచిందని మైనర్ నిందితుడు పోలీసులకు చెప్పడం గమనార్హం. మహేష్ బాబు నటించిన ఈ బైలింగువల్ చిత్రంలో దర్శకనటుడు ఎస్జే సూర్య.. సైకో విలన్ పాత్ర భైరవలో అలరించాడు. మురగదాస్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రం కమర్షియల్గా ఫెయిల్యూర్గా నిలిచింది. అయితే సూర్య విలనిజానికి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. అదుగో ఆ క్యారెక్టర్ నుంచి.. అందునా ఓ సీన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని.. ఈ దారుణానికి ప్రణాళిక రచించినట్లు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. సినిమా చూసి హత్యకు ప్లాన్?పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు తొలుత శివన్కుట్టి ఇంటి పైకప్పు పెంకులు తొలగించి లోపలికి ప్రవేశించాలని భావించారు. నిద్రలో ఉన్న సమయంలో పెద్ద రాయితో దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనకు 2017లో వచ్చిన తమిళ సినిమా ‘స్పైడర్’లోని ఓ హత్య సన్నివేశమే ప్రేరణగా నిలిచిందని నిందితుడు పోలీసులకు చెప్పాడు. అయితే ఇంటి పైకప్పు కింద చెక్కతో నిర్మించిన సీలింగ్ ఉండటంతో వారి మొదటి ప్రయత్నం విఫలమైంది. దీంతో మరో మార్గంలో ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.వాట్సాప్ చాట్లే కీలక ఆధారంఈ కేసులో కీలక ఆధారాలు నిందితుల వాట్సాప్ సంభాషణల ద్వారా లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి మనవరాలు, ఆమె స్నేహితుడి మధ్య జరిగిన చాట్లలో హత్యకు సంబంధించిన పలు ప్రణాళికలు చర్చించినట్లు గుర్తించారు. విషం పెట్టడం, వాహనంతో ఢీకొట్టడం వంటి పద్ధతుల గురించి కూడా వారు మాట్లాడుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా కరునాగప్పల్లి ప్రాంతానికి చెందిన ఓ కిరాయి ముఠాను సంప్రదించి హత్య చేయించేందుకు ప్రయత్నించారని.. అయితే డబ్బు ఆఫర్ చేసినా ఆ ముఠా అంగీకరించలేదని దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు.రాత్రి రైల్లో వచ్చి.. దాడిపోలీసుల ప్రకారం.. నిందితులు శనివారం రాత్రి కొల్లం నుంచి రైలులో కరువట్టకు చేరుకున్నారు. శివన్కుట్టి నిద్రపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పైకప్పు నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం విఫలమైన తర్వాత.. వెంటిలేటర్ దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశం ద్వారా లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఒకరు ఇంట్లోకి వెళ్లి తలుపు తెరవడంతో మిగతావారు లోపలికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. శబ్దం విని శివన్కుట్టి లేచి రావడంతో ఆయనపై దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత లైవ్ మర్డర్ ఫొటోలను బాలికకు నిందితుడు పంపించాడు.ఐఫోన్, బైక్ల కోసం దొంగతనం?హత్య తర్వాత ఇంట్లో ఉన్న ఆరు సవర్ల బంగారాన్ని నిందితులు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బంగారాన్ని అమ్మి బాలికకు ఐఫోన్, ఇతర నిందితులకు బైక్లు కొనుగోలు చేయాలనుకున్నాడు. ఇంతలో పోలీసులకు దొరికిపోయాడు.తప్పుడు కథనం సృష్టించారా?కేసు దర్యాప్తులో మరో కోణం కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. శివన్కుట్టి తనపై అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక ఆరోపించినట్లు సమాచారం. అయితే అది నిజమైన కారణమా? లేదంటే శిక్ష నుంచి తప్పించుకునేందుకు సృష్టించిన కథనా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.కుటుంబంతో కలిసి జీవనం..శివన్కుట్టి కుటుంబం రెండేళ్ల క్రితం కొల్లం నుంచి కరువట్టకు మారింది. ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవరాలు తొలుత అద్దె ఇంట్లో ఉండేవారు. అనంతరం శివన్కుట్టి అదే ప్రాంతంలో భూమి కొనుగోలు చేసి కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఈ ఘటనలో చిన్న వయసులో ఉన్న నిందితులు ఇంత పక్కా ప్రణాళికతో.. అదీ సినిమా చూసి హత్యకు పాల్పడ్డారన్న విషయం కేరళలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
సార్.. ఓ పది వేలు ఇస్తారా..!
శ్రీకాకుళం: సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా జిల్లా కలెక్టర్ పేరు, ఫొటోలను వాడేస్తూ అక్రమాలకు తెగబడుతున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేరు, డీపీలో అతని ఫొటోను యాడ్ చేసి థాయ్లాండ్ దేశం (ప్లస్ 66) కోడ్ నంబరుతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బుల కోసం మూడు రోజులుగా అధికారులకు మెసేజ్లు పెడుతున్న విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. 40 విభాగాలకు మెసేజ్లు.. జిల్లాలో ప్రధానంగా ఉన్న రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాలతో కలిపి మొత్తంగా 56 శాఖలుండగా అందులో 40 శాఖల వారికి సైబర్ కేటుగాళ్లు మెసేజ్లు పంపడం గమనార్హం. వేరెవరికో ఆరోగ్యం బాగోలేదనో.. రూ.10 వేలు అవసరమనో ఓ వీడియో పెట్టి అభ్యర్థన ధోరణిలో ‘సర్’ అని సంబోధిస్తూ మెసేజ్ పెట్టడంతో అంతా అవాక్కయ్యారు. తమ ఉన్నతాధికారి ఇలాంటి మెసేజ్లు పెడుతున్నారేంటని అయోమయానికి గురయ్యారు. ఫండింగ్స్ రిలీజ్ చేసే అధికారం ఆయన చేతుల్లో పనే కదా.. ఇలా అభ్యర్థించాల్సిన అవసరమేముందబ్బా అన్న అనుమానంతో కలెక్టరేట్ కార్యాలయంలోనే కీలక వ్యక్తి ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి ఆ నంబర్ను బ్లాక్ చేసేశారు. ఇటువంటి ఫేక్ మెసేజ్లు సోషల్ మీడియాలో వస్తే స్పందించవద్దని అధికారులకు, ప్రజలకు కలెక్టరేట్ వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
వీడియోలు
బంగారం, వెండి ధరల్లో భారీ జంప్.. తులం ఎంతంటే?
వైఎస్ జగన్ ఫుల్ స్పీచ్ @ తాడేపల్లి
మాకు NEET వద్దు.. అమిత్ షా తో CM విజయ్
ఫోటో మార్ఫింగ్ వివాదం..! కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ వర్గం కుట్ర
వెళ్తూ వెళ్తూ.. అబ్బా కొడుకులకు జగన్ ఓపెన్ ఛాలెంజ్
కొంచెం కూడా సిగ్గులేకుండా.. లోకేష్ ను కాపాడుకోవడానికి మరింత దిగజారుతావా చంద్రబాబు..
టిప్పర్ బీభత్సం అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి..
పోస్టుకు 14 లక్షలు తీసుకున్నారు. ధర్మేంధ్ర ప్రధాన్ కో రూల్ నీకో రూలా..?
మోసాలు.. అనుమానాస్పద మరణాలు.. రాజకీయ వివాదాలు..! సత్యనారాయణపురం PSపై ఆరోపణలెన్నో
కొంచెం సీక్రెట్ గా చేయాలంటా.. DSC స్కాం పై మరో సంచలనం ఆడియో వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్


