‘టెట్’ లేకుండా టీచర్లను నియమించొద్దు: సుప్రీంకోర్టు
ఢిల్లీ: అర్హత లేని టీచర్లతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, ‘టెట్’ లాంటి నిర్దేశిత అర్హతలు లేని ఉపాధ్యాయులను నియమించొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పేర్కొంది. అర్హత లేని టీచర్ల నియామకంపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మద్యంతర ఆదేశాలిచ్చింది. అస్సాం టీచర్ రిక్రూట్మెంట్ కేసులో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీచర్ల రిక్రూట్మెంట్పై సమీక్ష చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సరైనటువంటి విద్యార్హతలు లేకుండా టీచర్ల నియామకం చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
‘బేబీ’ గుర్తుకు రాకపోతే విజయం సాధించినట్టే: వైష్ణవి చైతన్య
‘బేబీ’ తర్వాత ఆనంద్, నేను ఛాలెంజింగ్గా తీసుకొని ‘ఎపిక్’ చేశాం. ఈ సినిమా చూస్తున్నప్పుడు ‘బేబీ’ గుర్తుకురాకపోతే మేము విజయం సాధించినట్టే. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం నాకు మొదటి నుంచి ఉంది’ అన్నారు తెలుగు బ్యూటీ వైష్ణవి చైతన్య. బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s' వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వైష్ణవి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ మనం ఎన్నో లవ్ స్టోరీలు చూసుంటాం. కానీ, ప్రతి లవ్ స్టోరీలోనూ ఏదోక ప్రత్యేకత ఉంటుంది. ఎపిక్ లో కూడా ఆ ప్రత్యేకత ఉంది. భిన్న దారులు, భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు యూకేకి చదువుకోవడానికి వెళ్లి, అక్కడ కలుస్తారు. లివ్ ఇన్ లో ఉంటారు. ఆ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో, ఆ సంభాషణల మీద నడిచే సినిమా. అమ్మాయి జీవితాన్ని ఒకలా చూస్తుంది. అబ్బాయి ఒకలా చూస్తాడు. అసలు వీరిద్దరూ ఎలా కలిశారు? వీరిద్దరి ఆలోచనలు ఏంటి? అనేది కొత్తదనాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాలో హంగామా ఉండదు. హత్తుకునేలా ఉంటుంది.→ ఇందులో ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర సాఫ్ట్ గా, కామ్ గా ఉంటుంది. జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి ఆదిత్య ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. నేను పోషించిన కడలి పాత్ర స్ట్రాంగ్ అమ్మాయి. తన కోసం తాను నిలబడే అమ్మాయి. క్లారిటీ ఉన్న అమ్మాయి.→ కడలి పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ, కుటుంబం వల్లనో, సమాజం వల్లనో మనలోని ఆ వెర్షన్ లోపలే ఉండిపోతుంది. బయటకు రాదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదోక సమయంలో వారి కోసం వారు నిలబడాలి. అందుకే కడలి పాత్ర నా మనసుకు బాగా దగ్గరైంది.→ కథలోనూ, నా పాత్రలోనూ కొత్తదనం ఉండాలి. ఆ పాత్రలో నన్ను నేను చూసుకోగలగాలి. ఎపిక్ ఎంచుకోవడానికి కారణమదే.→ దర్శకుడు ఆదిత్యతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. ఆయన జీవితాన్ని చాలా లోతుగా గమనిస్తుంటారు. జీవితంలో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ, అందులో ఉన్న ప్రాముఖ్యత గురించి మాట్లాడుతుంటారు. ఎపిక్ సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. ఆదిత్య, కడలి పాత్రల మధ్య జరిగే చిన్న విషయాలకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూపిస్తారు. ఆదిత్య యూనిక్ డైరెక్టర్. నాకు బాగా ఇష్టమైన దర్శకులలో ఆయన ఒకరు.→ నేను ఏదైనా విషయం బయట మాట్లాడాలంటే కాస్త భయపడుతుంటాను. కడలి పాత్ర ద్వారా నేనొక విషయం నేర్చుకున్నాను. ముందు మనల్ని మనం నమ్మాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి.→ అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉన్న సినిమాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే.. ఒక సముద్రం లాంటి అమ్మాయి, తన జీవితంలో ఉన్న సమస్యను డీల్ చేస్తూ.. తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపించింది అనేది ఉంటుంది. ఈ పాత్ర ద్వారా మంచి సందేశం కూడా ఉంటుంది.→ ఈ సినిమాలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి మాట్లాడతాం కాబట్టి, 90s వెబ్ సిరీస్ అంత క్లీన్ ఎంటర్టైనర్ లా ఉండకపోవచ్చు. కానీ, దర్శకుడు ఆదిత్య ఈ సినిమాకి ఏది అవసరమో అది చూపిస్తూనే, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా దృష్టిలో ఉంచుకొని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. ఇబ్బందికర సన్నివేశాలు ఉండవు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూడొచ్చు.→ కొత్త సినిమా విషయాలకొస్తే.. సితార బ్యానర్ లో నితిన్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే, తమిళ్ లో రెండు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తున్నాను.
‘ఆ ధోరణి ఇంకెప్పుడు మారుతుందో?..’ కంగనా కీలక వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, కోలీవుడ్ నటి త్రిష కృష్ణన్ బంధం గురించి చాలాకాలంగా అక్కడ చర్చ నడుస్తోంది. అయితే ఆమెను ఉద్దేశించి.. నటుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యవహారంపై సీఎం విజయ్ కూడా భగ్గుమన్నారు. మహిళల్ని కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే ఈ ఎపిసోడ్పై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళలను కించపరిచేందుకు.. వారి వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ను లక్ష్యంగా చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ధోరణేనని ఆమె వ్యాఖ్యానించారు. హిమాచల్ప్రదేశ్లోని కులు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం కంగనా మీడియాతో మాట్లాడారు. మహిళలు ఉద్యోగం చేస్తున్నా, విజయవంతమైనా, నాయకురాలిగా ఉన్నా, అధికార స్థానంలో ఉన్నా.. వారిని కిందకు లాగేందుకు.. ఆమె పరువు, గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేయడం మనకు కొత్తేం కాదు. అలాగని ఈ సమస్య భారత్కు మాత్రమే పరిమితం కాలేదని.. ప్రపంచమంతటా ఉందని పేర్కొన్నారామె. ఈ క్రమంలోనే త్రిష ఎపిసోడ్ను ఆమె ప్రస్తావించారు. తమిళనాడులో మొన్న ఏం జరిగిందో అంతా చూశారు. ఎంతో గౌరవనీయమైన నటి ఒక వ్యవహారంలో చిక్కుకున్నారు. ఆ వ్యవహారంలో సంబంధం ఇద్దరి మధ్య ఉంది. కానీ, దూషణలు, వ్యక్తిత్వాన్ని కించపర్చడం మాత్రం మహిళపైనే జరుగుతున్నాయి. ఎందుకలా?” అని కంగనా అన్నారు. ఆ ధోరణి ఇంకెప్పుడు ఆగుతుందని వ్యాఖ్యానించారామె. సమాజం తనను తాను ఈ విషయంలో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని.. మహిళలను మనం ఎలా చూస్తున్నాం? నిజంగా వారిని గౌరవిస్తున్నామా? అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలని వ్యాఖ్యానించారు.ఆగస్టు 3న కావేరీ జలాల వివాదంపై తంజావూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు త్రిష పేరు ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. దీనికి ఆయన స్పందించిన తీరు వివాదాస్పదమైంది. త్రిషను ఉద్దేశించే ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదవడంతో ఆగస్టు 4న ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు.అయితే తాను త్రిష పేరును ప్రస్తావించలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఉదయనిధి చెప్పారు. కావేరీ నదిని ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్య చేశానని ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. త్రిషకు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు, మహిళా నేతలు స్పందించారు. కంగనా కూడా గతంలో ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. బహిరంగంగా అసభ్యకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేయడం ఏ నాగరిక సమాజమూ అంగీకరించదని పేర్కొన్నారు. ఉదయనిధిపై తీసుకున్న చట్టపరమైన చర్యలు మంచి ఉదాహరణగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.ఇదే వివాదం నేపథ్యంలో తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ సోమవారం అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశరు. మహిళలపై వ్యక్తిగత దూషణలు, ద్వంద్వార్థ వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు చేసుకోవచ్చని, కానీ మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు మాత్రం చోటు ఉండకూడదని హెచ్చరించారు. మహిళలపై దూషణలు, వ్యక్తిగత దాడులు కొనసాగితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అంతా మా ఇష్టం అంటే కుదరదిక్కడ
25 ఎకరాల్లో కొత్త సచివాలయం.. రూ.1,200 కోట్లతో నిర్మాణం
సాక్షి, చెన్నై: చెన్నై మెరీనా తీరంలోని పట్టినంబాక్కంలో 25 ఎకరాల విస్తీర్ణంలో బ్రహ్మాండ సచివాలయం, అసెంబ్లీ భవన్ రూపుదిద్దుకోనున్నది. ఇందుకు సంబంధించిన కసరత్తులు మొదలయ్యాయి. బ్రిటిష్ కాలంలో నిర్మించిన చారిత్రాత్మక సెయింట్ జార్జ్ కోట భవనంలో ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వ సచివాలయం, శాసనసభ కొనసాగుతున్నాయి. అక్కడ తీవ్రమైన వాహనాల రద్దీ, పార్కింగ్ ఇబ్బందులు ప్రజల రద్దీ పెరిగిన నేపథ్యంలో చెన్నై పట్టినంబాక్కంలో కొత్త సచివాలయాన్ని నిర్మించడానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రహ్మాండ భవనంగా.. రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త సచివాలయం, శాసనసభ సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ప్రధాన భవనాన్ని 20 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో, 15 అంతస్తుల ఎత్తులో అత్యంత అధునాతనంగా రూపొందించనున్నారు. గిండిలోని హైవేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నందంబాక్కం ఫిన్టెక్ సిటీ ఎదురుగా ఉన్న భూములను పరిశీలించిన అనంతరం,పట్టినంబాక్కంలోని 25 ఎకరాల భూమిని ఈ నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదించింది. శాంతోమ్ ప్రధాన రహదారిని అనుసంధానించే ఈ స్థలం తమిళనాడు హౌసింగ్ బోర్డు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చదరపు అడుగు మార్కెట్ మార్గదర్శక విలువ రూ.22,000 కాగా, మొత్తం భూమి అంచనా విలువ సుమారు రూ.2,047 కోట్లుగాపరిగణించి ఉన్నారు. అనుమతుల మంజూరు మైలాపూర్, పట్టినం బాక్కం పరిధిలోని 21.37 ఎకరాల హౌసింగ్ బోర్డ్ భూమిని ప్రజా ప్రయోజనాల సచివాలయ నిర్మాణానికి ఉపయోగించేందుకు తమిళనాడు హౌసింగ్ బోర్డు అనుమతి ఇచ్చింది. అలాగే మిగిలిన భూమి, రోడ్ల వినియోగానికి చెన్నై కార్పొరేషన్ కమిషనర్, రెవెన్యూ శాఖలు కూడా ఆమోదం తెలిపాయి. 1958లో సేకరించిన ఈ స్థలంలో గతంలో నిర్మించి ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన క్వార్టర్స్ భవనాలను కూల్చివేసి స్థలాన్ని ఖాళీ చేసే ప్రక్రియను హౌసింగ్ బోర్డు వేగవంతం చేయడానికి నిర్ణయించింది. చదవండి: మద్యం ప్రియులకు గుడ్న్యూస్.. బాటిల్పై రూ.10 తగ్గింపు
జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్: రెండు ఆప్షన్స్!
ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్, కీలక వ్యాఖ్యలు
క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం!
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
చరిత్రలో తొలిసారి.. ఒకే జట్టుకు ఆడనున్న మెస్సీ, రొనాల్డో!
ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైను మించిపోతున్న ఆ నగరం
‘బేబీ’ గుర్తుకు రాకపోతే విజయం సాధించినట్టే: వైష్ణవి చైతన్య
చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్
వీరంగం సృష్టించిన ముంబై ఇండియన్స్ బ్యాటర్
పోలీస్స్టేషన్లో కేటీఆర్, హరీష్.. ఉద్రిక్తంగా మారిన ఆందోళనలు
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సాక్షి కార్టూన్ 07-09-2026
బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా?
ఆ మాత్రం దానికే కరువు ప్రాంతంగా ప్రకటించ లేను!
పెట్రోలు కొరతతో క్యూబా ఏం చేసిందో తెలుసా?
ఇరుముడి మూవీ.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి
వాటిని మర్చిపోలేక ఇప్పుడు డీఎస్సీ దెబ్బలతో రియాక్షన్ చూపిస్తున్నారా సార్!
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్
జియో రూ.77 రీచార్జ్ ప్లాన్ గురించి తెలుసా?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఎంత వెతికినా నీటి జాడ దొరకదు కానీ.. ఇక పైకి రండి
నష్రా సంధుకు 6 వికెట్లు.. సెమీఫైనల్లో పాకిస్తాన్
రవితేజ ఇరుముడి.. పూనకాలు తెప్పించే ఫుల్ వీడియో సాంగ్
ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు
రూ. 17.40 కోట్ల బంగారం స్వాధీనం
ఈ రాశి వారికి పనుల్లో విజయం.. ఆస్తులు కొంటారు
శారీరక లోపం వరమైతే.. బిగ్బాస్ 10 లోకి కమెడియన్ నరేశ్
జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్: రెండు ఆప్షన్స్!
ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్, కీలక వ్యాఖ్యలు
క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం!
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
చరిత్రలో తొలిసారి.. ఒకే జట్టుకు ఆడనున్న మెస్సీ, రొనాల్డో!
ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైను మించిపోతున్న ఆ నగరం
‘బేబీ’ గుర్తుకు రాకపోతే విజయం సాధించినట్టే: వైష్ణవి చైతన్య
చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్
వీరంగం సృష్టించిన ముంబై ఇండియన్స్ బ్యాటర్
పోలీస్స్టేషన్లో కేటీఆర్, హరీష్.. ఉద్రిక్తంగా మారిన ఆందోళనలు
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సాక్షి కార్టూన్ 07-09-2026
బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా?
ఆ మాత్రం దానికే కరువు ప్రాంతంగా ప్రకటించ లేను!
పెట్రోలు కొరతతో క్యూబా ఏం చేసిందో తెలుసా?
ఇరుముడి మూవీ.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి
వాటిని మర్చిపోలేక ఇప్పుడు డీఎస్సీ దెబ్బలతో రియాక్షన్ చూపిస్తున్నారా సార్!
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్
జియో రూ.77 రీచార్జ్ ప్లాన్ గురించి తెలుసా?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఎంత వెతికినా నీటి జాడ దొరకదు కానీ.. ఇక పైకి రండి
నష్రా సంధుకు 6 వికెట్లు.. సెమీఫైనల్లో పాకిస్తాన్
రవితేజ ఇరుముడి.. పూనకాలు తెప్పించే ఫుల్ వీడియో సాంగ్
ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు
రూ. 17.40 కోట్ల బంగారం స్వాధీనం
ఈ రాశి వారికి పనుల్లో విజయం.. ఆస్తులు కొంటారు
శారీరక లోపం వరమైతే.. బిగ్బాస్ 10 లోకి కమెడియన్ నరేశ్
ఫొటోలు
‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)
నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)
చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)
కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)
గోల్డ్ డ్రెస్లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)
అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్ ఫొటోస్)
తెలంగాణ అసెంబ్లీ : బీఆర్ఎస్ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)
‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)
సినిమా
Bigg boss 10 : బిగ్బాస్ ఇంట్లో తొలిరోజే రచ్చ.. ‘నాయకుడి’ కోసం పెద్ద గొడవ!
బిగ్బాస్ అంటేనే ఆటలు, టాస్కులు, గొడవలు, అరుపులు.. షో మొదలైన తొలి రోజే ఇవన్నీ కనిపించాయి. ఒకవైపు ‘మ్యాజికల్ కీస్’ కోసం పోటీ.. మరోవైపు హౌస్మేట్స్ హోదా కోసం ‘మహా పరీక్ష’. ఇక టీమ్ లీడర్ల ఎంపిక దగ్గరికి వచ్చేసరికి సెలెబ్రిటీలు వర్సెస్ అగ్నిపరీక్ష సభ్యులుగా హౌస్ రెండుగా విడిపోయిన పరిస్థితి కనిపించింది. మాటల యుద్ధంతో హౌస్లో వేడి వాతావరణం నెలకొంది. ఇంతకీ తొలిరోజు ఏం జరిగింది? ఎవరి చేతికి ఎలాంటి పవర్స్ వచ్చాయి? ఎవరు ఏ టీమ్కు నాయకులుగా నిలిచారు? తొలిరోజు హైలెట్స్పై ఓ లుక్కేయండి..మరో ఇద్దరి చేతికి మ్యాజికల్ కీస్!బిగ్బాస్ ఇంట్లో మొత్తం 16 మంది ఉండగా.. ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్లు మ్యాజికల్ కీస్ను సొంతం చేసుకున్నారు. మరో ఇద్దరికి కీస్ రావాల్సి ఉండటంతో.. ఈ వారమంతా ‘మహా పరీక్ష’ ఉంటుందని బిగ్బాస్ ప్రకటించాడు. వచ్చే వారంలో చాలామంది ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని, ఇంకా ఎవరూ పూర్తి స్థాయి హౌస్మేట్స్ కాలేదని స్పష్టం చేశాడు. మ్యాజికల్ కీస్ సాధించిన ఎనిమిది మంది కలిసి మరో ఇద్దరిని ఎంపిక చేయాలని బిగ్బాస్ సూచించాడు. దీంతో త్రిగుణ్ వంశీ, కృష్ణుడు పేర్లను ప్రతిపాదించాడు. మరోవైపు షాలినీ రోహిత్ పేరును సూచించింది. కొద్దిసేపు చర్చ జరిగిన అనంతరం అందరూ కలిసి వంశీ, కృష్ణుడు పేర్లకు ఓటు వేశారు. దీంతో వారిద్దరూ కూడా మ్యాజికల్ కీస్ను దక్కించుకున్నారు.రోహిత్ టాస్క్ చేయలేదంటూ త్రిగుణ్ ఫైర్బిగ్బాస్ ఇచ్చిన వాటర్ కొట్టే టాస్క్ను రోహిత్ చేయలేదంటూ పలువురు కంటెస్టెంట్లు ప్రస్తావించారు. ఇదే విషయాన్ని త్రిగుణ్ కూడా పదేపదే ప్రస్తావిస్తూ తన వాదనను వినిపించాడు. అయితే తమ నిర్ణయం అందరికీ నచ్చకపోవడంపై దేబ్జానీ అసంతృప్తి వ్యక్తం చేసింది.‘మీ నిర్ణయం నాకు ఫెయిర్గా అనిపించలేదు’ అంటూ రాం ప్రసాద్తో దేబ్జానీ చెప్పింది. అయితే సెలెబ్రిటీ కేటగిరీలో ఉన్న ఇద్దరికే అవకాశం రావడం తనకు సంతోషంగా ఉందంటూ సరదాగా నవ్వేసింది.వర్షిణితో అమన్ ఫ్లర్టింగ్..ఇక హౌస్లో కొన్ని సరదా సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. కిచెన్లో ఝాన్సీ, వర్షిణి టీ తయారు చేస్తుండగా.. అక్కడికి వచ్చిన అమన్ వర్షిణితో సరదాగా ఫ్లర్ట్ చేశాడు. వర్షిణి టీ చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ ఆమెను పొగిడాడు. మరోవైపు బెడ్రూంలో రాం ప్రసాద్, నరేష్, దేబ్జానీ సరదాగా మాట్లాడుకున్నారు. రాం ప్రసాద్ను ‘రామన్న’ అంటూ పిలిచిన దేబ్జానీ.. ఇంట్లో జెన్యూన్ పర్సన్ నువ్వే అంటూ ప్రశంసించింది.త్రిగుణ్, షాలినీ మధ్య కిచెన్లో గొడవకిచెన్లో చపాతీలు చేస్తున్న త్రిగుణ్ వద్దకు వచ్చిన షాలినీ కర్రీ గురించి అడిగింది. అయితే ‘అది నా కేటగిరీ కాదు’ అని త్రిగుణ్ సమాధానం ఇచ్చాడు. ఆ మాటను షాలినీ తప్పుగా తీసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సాధారణంగా కూడా చెప్పొచ్చు కదా అంటూ షాలినీ ప్రశ్నించడంతో మాటామాటా పెరిగింది.నామినేషన్స్పై నరేష్, రాం ప్రసాద్ కామెడీమరోవైపు నామినేషన్స్ గురించి నరేష్, రాం ప్రసాద్ సరదాగా మాట్లాడుకున్నారు. గార్డెన్లో తిరుగుతూ ‘వాళ్లని చేద్దాం.. వీళ్లని చేద్దాం.. వద్దులే పాపం.. వాళ్లకి ఫ్యామిలీ ఉంది.. వీళ్లకి ఈ కష్టాలున్నాయి’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేసుకున్నారు. చివరికి మనిద్దరమే మిగిలాం.. ఒకరినొకరం నామినేట్ చేసుకుందాం అంటూ ఇద్దరూ నవ్వులు పూయించారు.ఒక్కొక్కరి చేతికి ఒక్కో పవర్మ్యాజికల్ కీస్ సొంతం చేసుకున్న కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ బిగ్బాస్ పిలిచి.. వారి కీ ద్వారా లభించే పవర్ ఏంటో వివరించాడు. అయితే తమకు వచ్చిన పవర్ గురించి ఇతర కంటెస్టెంట్లతో చర్చించవద్దని వార్నింగ్ ఇచ్చాడు.ముందుగా త్రిగుణ్కు ‘టేక్ ఓవర్’ పవర్ వచ్చింది. అంటే తనకు నచ్చిన మరో కంటెస్టెంట్ పవర్ను తీసుకునే అవకాశం అతడికి లభించింది. ఝాన్సీకి ఓ పవర్ ఇచ్చి వీకెండ్ ప్రారంభం కావడానికి ముందు వీక్లో ఎప్పుడైన దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పాడు. ఎలిమినేషన్ భయం ఉంటే ఈ పవర్ని యూజ్ చేసుకొని సేవ్ కావచ్చు అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. ముఖేష్ గౌడ: ఇతరుల పవర్ను రివర్స్ చేసే అవకాశంవర్షిణి: ‘గ్రాబ్ ఎనీ విన్’ పవర్కృష్ణుడు: ‘స్వాప్’ పవర్షాలినీ: ఇంట్లోని ఒక డ్యూటీని అసైన్ చేసే పవర్శ్రిష్టి: ఒకరిని నేరుగా నామినేట్ చేసే పవర్రాం ప్రసాద్: ‘సేఫ్ షీల్డ్’.. నామినేషన్ నుంచి ఒకరిని కాపాడే అవకాశంనరేష్: నామినేషన్స్లో డబుల్ ఓట్స్ వేసే పవర్.. ఇలా మ్యూజికల్ కీస్ గెలుచుకున్న ఒక్కొక్కరికి ఒక్కో పవర్స్ ఇచ్చాడు బిగ్ బాస్కిచెన్, క్లీనింగ్ డ్యూటీల దగ్గర మళ్లీ గొడవఆ తర్వాత హౌస్లో కిచెన్, క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్ వంటి పనులను విభజించే ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలోనూ త్రిగుణ్తో గొడవ జరిగింది.సుధీర్ డిష్ వాషింగ్ బాగా చేశాడని చెప్పడంతో.. ‘మేం చేయలేమా?’ అంటూ ముఖేష్, రోహిత్, సుధీర్, షాలినీ తదితరులు వాదనకు దిగారు. డ్యూటీలను ఎవరు ఎలా చేయాలనేది తామే నిర్ణయించుకుంటామని వారు స్పష్టం చేశారు.దేబ్జానీ బ్యాటరీని సరిగ్గా ధరించకపోవడంతో బిగ్బాస్ ఆమెను హెచ్చరించాడు. అయితే ‘ఎందుకు బిగ్బాస్.. క్యూట్గా చెప్పొచ్చు కదా’ అంటూ దేబ్జానీ సరదాగా స్పందించింది. చివరకు బిగ్బాస్కు సారీ చెప్పింది. దీనికి బిగ్బాస్ కూడా ఆసక్తికరంగా స్పందిస్తూ.. తాను స్కూల్ ప్రిన్సిపల్నో.. సాంటానో మున్ముందు తెలుస్తుందని చెప్పాడు.హౌస్మేట్ హోదా కోసం ‘మహా పరీక్ష’ఇక అసలు ఆట ఇక్కడే మొదలైంది. ‘హౌస్మేట్స్ హోదాను పొందడమే మీ లక్ష్యం. నామినేషన్లో లేకపోయినా అందరికీ ఆడియెన్స్ ఓట్లు వేస్తారు. మహా పరీక్షలో గెలిచి హౌస్మేట్ హోదాను పొందాలి. ఎలిమినేషన్ మాత్రం కన్ఫామ్’ అంటూ బిగ్బాస్ కీలక ప్రకటన చేశాడు.అంతేకాకుండా 16 మంది రెండు టీమ్లుగా విడిపోయి.. హై రిస్క్ నుంచి నో రిస్క్ వైపు తీసుకెళ్లగల సత్తా ఉన్న ఇద్దరు నాయకులను ఎంచుకోవాలని సూచించాడు.లీడర్గా రోహిత్.. రాంప్రసాద్టీమ్ లీడర్ల ఎంపికలో అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్లలో దాదాపు అందరూ రోహిత్కు మద్దతు తెలిపారు. ఒక్క ఝాన్సీ మాత్రమే మినహాయింపు. మరోవైపు సెలెబ్రిటీ కంటెస్టెంట్లు రాం ప్రసాద్, త్రిగుణ్ పేర్లకు ఓటు వేశారు.అయితే త్రిగుణ్ మాత్రం రాం ప్రసాద్ను లీడర్గా ఉంచాలని సూచించాడు. అగ్నిపరీక్ష టీమ్ మొత్తం కలిసి రోహిత్కు ఓటు వేసిందని, వాళ్లంతా ఒక గ్రూప్గా ఉన్నారని త్రిగుణ్ వ్యాఖ్యానించాడు. తాను మాత్రం ఝాన్సీకి ఓటు వేసినట్లు చెప్పాడు.త్రిగుణ్పై షాలినీ, శ్రిష్టి ఫైర్త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలతో షాలినీ, శ్రిష్టి, రోహిత్, చరణ్, అమన్ తదితరులు అతడిపై మాటల దాడికి దిగారు.‘మేం రోహిత్ ఆట చూశాం.. అందుకే అతడిని సెలెక్ట్ చేసుకున్నాం. మీరు కూడా సెలెబ్రిటీలకే ఓట్లు వేసుకున్నారు కదా.. మరి మేం అలా అన్నామా?’ అంటూ షాలినీ, శ్రిష్టి ప్రశ్నించారు.దీంతో హౌస్లో మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు బిగ్బాస్ ఇంట్లో రెండు టీమ్లు ఏర్పడ్డాయి. బ్లూ టీమ్కు రాం ప్రసాద్, రెడ్ టీమ్కు రోహిత్ నాయకులుగా నిలిచారు. లీడర్ల ఎంపికతో తొలి రోజు ఎపిసోడ్ ముగిసింది.మొత్తానికి బిగ్బాస్ సీజన్ తొలి రోజే ఆటకు కావాల్సిన మసాలా మొత్తం కనిపించింది. మ్యాజికల్ కీస్, కొత్త పవర్స్, నామినేషన్స్ చర్చలు, వ్యక్తిగత గొడవలు, సెలెబ్రిటీలు వర్సెస్ అగ్నిపరీక్ష సభ్యులుగా మారిన గ్రూప్ వార్.. ఇలా తొలిరోజే హౌస్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక ‘మహా పరీక్ష’లో ఎవరు నెగ్గుతారు? ఎవరు హౌస్మేట్స్గా కొనసాగుతారు? ఎవరి ప్రయాణం మధ్యలోనే ముగుస్తుందో చూడాలి.
గుర్తింపు కోసం అందాలు ఆరబోయను : కయాదు లోహర్
చేతిలో అవకాశాలు ఫుల్గా ఉన్న నటి కయాదు లోహర్. తమిళం తెలుగు మలయాళం అంటూ ఇప్పుడు దక్షిణాది సినిమాను చుట్టే స్తోందనే చెప్పాలి. ఈ బ్యూటీ నటించిన ఒక తెలుగు చిత్రం, ఒక మలయాళ చిత్రం ఒకే సారి విడుదల అవ్వడం విశేషం. అందులో ఒకటి జీవీ ప్రకాష్ కుమార్ సరసన నటించిన ఇమ్మార్టల్ కాగా, మరొకటి దుల్కర్ సల్మాన్తో జత కట్టిన ఐయామ్ గేమ్ చిత్రం. జీవి ప్రకాష్ కుమార్ కు జంటగా నటించిన ఇమ్మార్టల్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, ఐయామ్ గేమ్ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్లొందనే విమర్శలను కయాదు లోహర్ ఎదుర్కొంటోంది. అయితే ఈ రెండు చిత్రాలు మిశ్రమ స్పందనతోనే ప్రదర్శింపబడుతున్నాయి. దీంతో డ్రాగన్ చిత్రం తరువాత ఈ అమ్మడికి సరైన సక్సెస్ రాలేదు. అయితే ఇటీవల విమర్శలను ఎదుర్కొంటోంది. బిజీగా ఉన్న నటికి విమర్శలు ఎదురవ్వడం సహజమే. కాగా తనపై వస్తున్న విమర్శలపై ఒక భేటీలో స్పందించిన ఈ భామ.. తాను ప్రస్తుతం సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నానని, ఒక్క రోజు కాల్ షిట్ను మాత్రమే ఐయామ్ గేమ్ చిత్ర ప్రమోషన్స్కు కేటాయించినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇమ్మార్టల్ చిత్ర ప్రమోషన్ లో పాల్గొనడానికి సమయం లేకపోయిందని పేర్కొంది. ఇకపోతే గ్లామర్ గురించి అడుగుతున్నారని, అయితే కథానాయికలు అనవసరంగా ఆట బొమ్మలుగా చూపించడానికి తాను వ్యతిరేకమని అన్నారు. అయితే కథకు తప్పని సరి అయితే, ఆ పాత్ర నమ్మదగినదిగా తనకు అనిపిస్తే హద్దులు మీరని గ్లామర్ కు సమ్మతిస్తానని పేర్కొంది. అంతే కానీ ఎవ రి దృష్టిలో పడాలనో అందాలారబోయనని కయాదు లోహర్ వెల్లడించారు.
మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు: సుమంత్ ప్రభాస్
‘‘రోమాంచకం’ చేస్తున్నప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేశామో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అంతే బాగా ఎంజాయ్ చేయాలని కోరుకున్నాం. మేము కోరుకున్నటే ఆడియన్స్ బాగా నవ్వుకుంటున్నారు. ఈ మూవీ వల్ల హీరో ప్రభాస్ అన్నని కలవడం సంతోషం. ఈ సినిమా నాకు అన్ని రకాలుగా చాలా ప్రత్యేకం. ఇంకా మా చిత్రం చూడని వారు థియేటర్లకు వెళ్లండి.. మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు’’ అని హీరో సుమంత్ ప్రభాస్ తెలి పారు. వేణుగో పాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్కుమార్ జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల అయింది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన బ్లాక్ బస్టర్ ఈవెంట్లో డైరెక్టర్ వేణుగో పాల్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సందీప్, ప్రణయ్గార్లు ‘రోమాంచకం’కి అవకాశంతో పాటు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. కుటుంబ ప్రేక్షకులంతా మా మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని చెప్పారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ–‘‘రోమాంచకం’ సినిమా థియేటర్స్లో బాగా రన్ అవుతోంది. ఎక్కడా నవ్వులు తగ్గలేదు. మా మూవీకి 8.5 కోట్ల రూ పాయల కలెక్ష న్స్ వచ్చాయి’’ అని పేర్కొన్నారు. ‘‘థియేటర్స్కు వచ్చి ‘రోమాంచకం’ మూవీ చూడండి. మీకొక డిఫరెంట్ ఎక్స్పీరియ న్స్ ఇస్తుంది’’ అన్నారు డైరెక్టర్, యాక్టర్ అనుదీప్ కేవీ. ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ రజిత, డైలాగ్ రైటర్ మీరక్, నటులు సోహాన్, నరేంద్ర రవి, వెంకటేష్ కాకుమాను మాట్లాడారు.
జనవరిలో అల్లం బెల్లం
విజయ్ సేతుపతి, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమాకు ‘ఇంజి వెల్లం’(తెలుగులో అల్లం బెల్లం అని అర్థం) అనే టైటిల్ ఖరారైంది. ఈ రొమాంటిక్ డ్రామా సినిమాను సుభాస్కరన్ , మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ను రిలీజ్ చేసి, ఈ చిత్రాన్ని జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా మేజర్ స్టోరీ కోల్కతా బ్యాక్డ్రాప్తో సాగుతుందని తెలిసింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు.
క్రీడలు
వారెవ్వా వైభవ్ సూర్యవంశీ!.. ఇషాన్ను ఒప్పించి మరీ!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విమర్శించిన వాళ్లకు ఆటతో పాటు నాయకత్వ నైపుణ్యాలతోనూ అదిరిపోయేలా కౌంటర్ ఇస్తున్నాడంటూ కొనియాడుతున్నారు. కాగా రెడ్బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేనప్పటికీ పదిహేనేళ్ల వైభవ్కు బీసీసీఐ కీలక బాధ్యతను అప్పగించిన సంగతి తెలిసిందే.అపుడే వైస్ కెప్టెన్గానా?ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2026 టోర్నీలో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్కు వైభవ్ను డిప్యూటీగా నియమించింది. దీంతో చిన్న వయసులోనే, అనుభవం లేని వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్గా ఎలా నియమిస్తారని భారత మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.అయితే, వైభవ్ అటు ఆటగాడిగా రాణిస్తూనే.. తన నాయకుడిగానూ తానేం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. సెంట్రల్ జోన్తో సెమీ ఫైనల్లో ఇషాన్ గైర్హాజరీలో వైభవ్ ఒకరోజు మొత్తం కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది.708 పరుగులకు ఆలౌట్ఇక టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ సౌత్ జోన్తో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్లో.. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 708 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా సౌత్ జోన్ తమ బ్యాటింగ్ మొదలుపెట్టింది.సందిగ్దంలో జట్టుఈ నేపథ్యంలో ఆరో ఓవర్లో ఈస్ట్ జోన్ పేసర్ ముకేశ్ కుమార్ వేసిన రెండో బంతిని సౌత్ జోన్ ఓపెనర్ రికీ భుయ్ బౌండరీ దిశగా తరలించే ప్రయత్నం చేశాడు. అయితే, లెంగ్త్ను తప్పుగా అంచనా వేసిన రికీ షాట్ ఆడటంలో విఫలం కాగా.. వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రా బంతిని క్యాచ్ పట్టి.. అప్పీలు చేశాడు.ఇషాన్ను ఒప్పించిన వైభవ్అయితే, ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దీంతో రివ్యూకు వెళ్లాలా? వద్దా? అన్న సందేహంలో ఉన్న కెప్టెన్ ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లిన వైభవ్ సూర్యవంశీ.. ‘రివ్యూ తీసుకో.. పర్లేదు’ అంటూ సలహా ఇచ్చాడు. కానీ మిగతా ఆటగాళ్లు మాత్రం బంతి ముందుగా బ్యాట్ను తాకిందా? లేదంటే ప్యాడ్కు తాకిందా? అనే సందేహంలో ఉన్నారు.అయితే, ఇషాన్ కిషన్ వైభవ్ మాట మీద నమ్మకంతో రివ్యూకు వెళ్లగా.. రికీ భుయ్ అవుటైనట్లు తేలింది. దీంతో ఈస్ట్ జోన్ సంబరాలు అంబరాన్నంటాయి. వైభవ్ సూర్యవంశీని ఇషాన్, ముకేశ్తో పాటు మిగతా జట్టు సభ్యులందరూ అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా దులిప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ తొలి ఇన్నింగ్స్లో 37 బంతులు ఎదుర్కొని 44 పరుగులు చేశాడు.చదవండి: IND vs AUS: భారత జట్టులో మార్పులు🗣️ Take it...take itVaibhav Sooryavanshi 🤝 ReviewThe vice-captain urges the captain to take the review, and it turns out to be successful 🙌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/MmtESDSnMy— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2026
అతడు పోతేనే పాక్ క్రికెట్ బాగుపడుతుంది: ఆసీస్ దిగ్గజం
ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి నుంచి వరుస ఉదంతాలు పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్, కోచ్లతో విభేదాలు, ముందస్తు సమాచారం లేకుండా ఆటగాళ్లను తొలగించడం వంటి వివాదాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ జాసన్ గిలెస్పీ రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది. పాకిస్తాన్ టెస్టు జట్టుకు గిలెస్పీ కొంతకాలం కోచ్గా సేవలందించిన సంగతి తెలిసిందే. తాను కోచ్గా ఉన్న సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పూర్వ వైభవం తీసుకురావాలని భావించినప్పటికీ, చీఫ్ సెలెక్టర్గా అకీబ్ జావెద్ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గిలెస్పీ పేర్కొన్నాడు. పాక్ క్రికెట్ బోర్డు నుంచి నష్ట పరిహారం కింద తనకు వేల డాలర్లు రావాల్సి ఉందని వెల్లడించాడు. పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిలెస్పీ మాట్లాడుతూ.. ‘‘అకిబ్ జావేద్ నియామకం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. అప్పటినుంచే పాకిస్తాన్ క్రికెట్తో నాకున్న అనుబంధం చెడిపో సాగింది. పాక్ జట్టు ఇప్పుడీ స్థితిలో ఉందంటే దానికి అకిబ్ జావెద్ కారణం. టెస్టు కోచ్గా ఎంపికైనప్పుడు జట్టుకు పూర్వవైభవం తీసుకురావాలని కలలు కన్నాను. కానీ అకిబ్ జావెద్ రాకతో టెస్టు జట్టు కోచ్గా ఆటగాళ్లను, సిబ్బందిని పర్యవేక్షించడం, ఎంపికలో పాత్ర పోషించడం.. ఇలా అన్నింటిలోనూ ఏ మాత్రం ప్రాధాన్యత లేని స్థితికి పడిపోయాను. అతడితో అనుభవం నన్ను పూర్తిగా నిరుత్సాహపరిచింది. కోచింగ్పైనే విరక్తి కలిగించింది. మానసికంగానూ నాపై ప్రభావం చూపించింది. అసలు ఇంకా క్రీడలో ఎందుకు కొనసాగాలన్న పరిస్థితి ఎదురైంది. కోచ్గా వచ్చిన తర్వాత నాకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. చీఫ్ సెలెక్టర్గా ఎంపికైన అకిబ్ జావెద్ నన్ను అవమానించాడు. నా స్థాయిని పూర్తిగా తగ్గించాడు. అకిబ్కు చైర్మన్ మోసిన్ నఖ్వీతో పాటు బోర్డు మద్దతు ఉంది. అందుకే అతడిని ఎవరు ఏమీ చేయలేరని ధీమాగా ఉన్నాడు. అయితే నష్టపరిహారం కింద నాకు ఇవ్వాల్సిన వేల డాలర్లను ఇప్పటివరకు చెల్లించలేదు. అయితే ఈ విషయాన్ని నేను విడిచిపెట్టదలచుకోలేదు. ఈ విషయంలో ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు. తెర ముందు పీసీబీ కనిపిస్తున్నప్పటికీ, తెర వెనుక మాత్రం అకిబ్ జావెద్ ఒక నియంత పాత్రను పోషిస్తున్నాడు. అకిబ్ జావెద్ ఉన్నంతకాలం పాకిస్తాన్ క్రికెట్ మరింత దారుణంగా తయారవుతుందే తప్ప ముందుకు వెళ్లదు. అసలు చైర్మన్, బోర్డులోని సభ్యులు, చీఫ్ సెలెక్టర్ తమ డెస్కుల వద్ద కూర్చుని కెప్టెన్ను ఎన్నుకోవడం అర్థరహితం. అకిబ్ జావెద్ వెళ్లిపోతేనే పాక్ క్రికెట్ మళ్లీ గాడిన పడుతుంది. అప్పటివరకు ఇంతే’’ అని ముగించాడు.Jason Gillespie brutally COOKS Pakistan selector Aaqib Javed"Aaqib is still chairman of selectors. He's kept his job. He's had a crack at Gary Kirsten and I, blaming us for where Pakistan cricket is where it is. Gary and I haven't even been there for two years.""Yet, he has… pic.twitter.com/kIEWfzPvQk— Brutal Truth (@sarkarstix) September 8, 2026చదవండి: కసితీరా బాదిన అభిషేక్.. గిల్పై ప్రతీకారం!
IND vs AFG: టీమిండియాకు శుభవార్త
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అఫ్గాన్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు అతడు అందుబాటులోకి వచ్చాడని జాతీయ మీడియా వెల్లడించింది.కాగా అఫ్గాన్ క్రికెట్ బోర్డు భారత్లో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియాతో సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో అఫ్గాన్ జట్టు మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోఇక ఈ సిరీస్కు సంబంధించి ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టులోకి ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ పేసర్ హర్షిత్ రాణా, ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ గాయాల నుంచి కోలుకుని తిరిగి వచ్చారు.మ్యాచ్ ఫిట్నెస్ సాధించిన వాషీ!అయితే, ఫిట్నెస్ ఆధారంగానే ఈ నలుగురు అఫ్గాన్తో సిరీస్లో ఆడతారా? లేదా? అనేది తేలుతుందని బోర్డు పేర్కొంది. ఇండియా టుడే కథనం ప్రకారం.. వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. కానీ, బుమ్రా, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి మ్యాచ్ ఫిట్నెస్ సాధించారా? లేదా? అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.కాగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు యాజమాన్యం పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గౌతం గంభీర్ మార్గదర్శనంలో టీ20 ఫార్మాట్లో అతడు కీలక ప్లేయర్గా మారాడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలోనూ అతడికి ప్రాధాన్యం దక్కుతోంది. పెరిగిన ప్రాధాన్యందిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆఫ్ స్పిన్ సేవల కోసం యాజమాన్యం వాషీని వాడుకుంటోంది. వన్డేల్లోనూ సీనియర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కంటే ఈ చెన్నై చిన్నోడికే ప్రాధాన్యం ఇస్తోంది.అయితే, ఇటీవల యూకే పర్యటనలో వాషీ గాయపడ్డాడు. తొడకండరాల గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందిన వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని.. అఫ్గాన్తో టీ20 సిరీస్ సందర్భంగా పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే.. గాయం వల్ల 26 ఏళ్ల వాషీ శ్రీలంక పర్యటనకు దూరం కాగా.. అతడి స్థానంలో దేశవాళీ క్రికెట్ వీరుడు, 33 ఏళ్ల సారాంశ్ జైన్ టెస్టు సిరీస్కు ఎంపికై అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు టీమిండియాశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివం దూబే, నితీశ్ కుమార్ రెడ్డి (ఫిట్నెస్ ఆధారంగా), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ (ఫిట్నెస్ ఆధారంగా), వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, జస్ప్రీత్ బుమ్రా (ఫిట్నెస్ ఆధారంగా), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా (ఫిట్నెస్ ఆధారంగా).చదవండి: IND vs AUS: భారత జట్టులో మార్పులు
కసితీరా బాదిన అభిషేక్.. గిల్పై ప్రతీకారం!
భారత వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ టీమిండియా తరఫున ఓపెనింగ్ చేయడంతో పాటు డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం చూశాం. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరు పంజాబ్ క్రికెట్ లీగ్లో ప్రత్యర్థులుగా మారిపోయారు. షేర్-ఇ- పంజాబ్ టీ20లీగ్లో అభిషేక్ శర్మ అమృత్సర్ సూర్మన్స్కు కెప్టెన్గా ఉండగా, గిల్ ఫజిల్కా ఫాల్కన్స్కు నాయకత్వం వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ఈ రెండు జట్లు తలపడగా, అభిషేక్ శర్మ బౌలింగ్ను గిల్ చితక్కొట్టాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అభిషేక్ శర్మ బౌలింగ్కు రాగా, అప్పటికే గిల్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక అభిషేక్ బౌలింగ్లో తొలి బంతికి సిక్సర్ కొట్టిన గిల్, మూడో బంతిని బౌండరీ, ఐదో బంతిని సిక్సర్గా మలిచాడు. దీంతో ఓవర్లో వైడ్ సహా 16 పరుగులు వచ్చాయి. చివరి బంతికి కూడా సిక్సర్ కొట్టి అభిషేక్కు సెండాఫ్ ఇవ్వాలనుకున్నప్పటికీ, సీన్ రివర్స్ అయింది. అభిషేక్ వేసిన ఆఖరి బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ గాల్లోకి లేపగా, బౌండరీ లైన్ వద్ద ఉన్న నమన్ ధిర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో గిల్ (35 బంతుల్లో 67) ఇన్నింగ్స్కు తెరపడింది. గిల్తో పాటు ప్రాన్షు ప్రతాప్ (40), సన్వీర్ సింగ్ (40) రాణించడంతో ఫజిల్కా ఫాల్కన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం అమృత్సర్ ఇన్నింగ్స్ సమయంలో తన వంతు రావడంతో అభిషేక్ రెచ్చిపోయాడు. సహజ్ ధావన్తో కలిసి ఓపెనింగ్ ఆరంభించిన అభిషేక్ (15 బంతుల్లోనే 49; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఈ దెబ్బకు అమృత్సర్ సూర్మన్స్ 6 ఓవర్లలో 79 పరుగులు చేసింది. అభిషేక్ ఔటైనప్పటికీ, రాహుల్ కుమార్ (35 బంతుల్లో 53 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్లో గిల్ (67 పరుగులు) టాప్ స్కోరర్గా నిలిచినప్పటికీ, అభిషేక్ (49) సుడిగాలి ఇన్నింగ్స్తో టీమిండియా కెప్టెన్ను డామినేట్ చేశాడు. ఈ విజయంతో అమృత్సర్ సూర్మన్స్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.Abhishek Sharma doing what he does best in the latest round of Sher-E-Punjab T20 League 🔥🔥 pic.twitter.com/UoxZsJxbOn— Cricbuzz (@cricbuzz) September 8, 2026SHUBMAN GILL vs ABHISHEK SHARMA 😍- Incredible battle at Sher-E-Punjab T20 league, The quality of the league. pic.twitter.com/LrTXT8cXgt— Johns. (@CricCrazyJohns) September 8, 2026Read: తిలక్ వర్మ జట్టు నుంచి తీసేస్తే.. శతక్కొట్టి ఘాటు కౌంటర్!
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
కొండా సురేఖను తప్పించాల్సిందే.... కేసీ వేణుగోపాల్తో భేటీలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
Audio: బీడు పడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు... కాలువకు నీరివ్వని కూటమి సర్కార్... బోరుమంటున్న రాయలసీమ రైతులు
బిజినెస్
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
400 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:31 సమయానికి నిఫ్టీ(Nifty) 107 పాయింట్లు తగ్గి 23,673 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 402 పాయింట్లు నష్టపోయి 75,719 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.83బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 97.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.78 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.38 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.29 శాతం పడిపోయింది.Today Nifty position 08-09-2026(time: 09:31 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
కార్బన్ క్రెడిట్లో భారత్కు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్!
భారత్-బ్రిటన్ వాణిజ్య బంధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూకే తన కార్బన్ బార్డర్ అడ్జస్ట్ మెకానిజం(సీబీఏఎం) కింద అర్హతగల కార్బన్ ధరల విధానాల జాబితాలో భారత్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ (సీసీటీఎస్)ను అధికారికంగా చేర్చింది. దీంతో సీబీఏఎం పరిధిలోకి వచ్చే భారత ఉత్పత్తులను దిగుమతి చేసుకునే బ్రిటిష్ సంస్థలు సీసీటీఎస్ కింద ఆయా వస్తువులపై చెల్లించిన కార్బన్ ధరకు అనుగుణంగా ఆధారాలు, ధ్రువీకరణ షరతులకు లోబడి రిలీఫ్ పొందే వెసులుబాటు లభించనుంది. అంటే, ఒకసారి కార్బన్ భారం పడిన సరుకుపై మళ్లీ పన్ను వేయకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.వాణిజ్య మంత్రిత్వ శాఖ, బ్రిటన్ ప్రతినిధుల మధ్య సాంకేతిక స్థాయిలో సుదీర్ఘ చర్చల ఫలితంగానే ఈ గుర్తింపు లభించింది. సొంత దేశంలో ఇప్పటికే కార్బన్ ధర భరించిన సరుకులపై మళ్లీ పన్ను వేయకూడదన్నదే యూకే సీబీఏఎం మౌలిక సూత్రమని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. బ్రిటన్ ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్ సహా 16 అర్హతగల కార్బన్ ధరల పథకాలను గుర్తిస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో భారత్ చేరడం విశేషం.నిజానికి, గత మే నెలలో అమల్లోకి వచ్చిన భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సందర్భంగా సీబీఏఎం నుంచి మినహాయింపు కోసం భారత్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. 2027 జనవరి నుంచి ఉక్కు, అల్యూమినియంపై యూకే కార్బన్ పన్ను విధించే అవకాశం ఉండటంతో ఇది తీవ్ర అసమానతకు దారితీస్తుందని నిపుణులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా గుర్తింపు కొంత నష్టనివారణలా కనిపిస్తున్నా, పూర్తి మినహాయింపు కాదన్నది గమనార్హం.కార్బన్ క్రెడిట్ అంటే..ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ (లేదా దానికి సమానమైన గ్రీన్హౌస్ వాయువులు) వాతావరణంలోకి విడుదల కాకుండా ఆపగలిగితే లేదా అంతే మొత్తాన్ని వాతావరణం నుంచి తొలగించగలిగితే దానికి గుర్తుగా ఒక క్రెడిట్ లభిస్తుంది. అంటే, ఒక కార్బన్ క్రెడిట్ = ఒక టన్ను కార్బన్డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపు లేదా నివారణ. ప్రభుత్వాలు లేదా నియంత్రణ సంస్థలు కంపెనీలకు నిర్దిష్ట కార్బన్ ఉద్గార పరిమితి (క్యాప్) విధిస్తాయి. ఏదైనా కంపెనీ ఈ పరిమితి కంటే తక్కువ ఉద్గారాలు వెలువరిస్తే మిగిలిన మొత్తానికి క్రెడిట్లు లభిస్తాయి. పరిమితి మించి ఉద్గారాలు వెలువరించే కంపెనీలు, తక్కువ ఉద్గారాలు చూపిన కంపెనీల నుంచి ఈ క్రెడిట్లను కొనుగోలు చేసుకోవచ్చు. దీన్నే క్యాప్ అండ్ ట్రేడ్ విధానం అంటారు. అంటే, కాలుష్యానికి ధర పెట్టి, తక్కువ కాలుష్యం చేసేవారికి ప్రతిఫలం ఇవ్వడం.ఇదీ చదవండి: జీవించి ఉండగానే పిల్లలకు ఆస్తి రాస్తున్నారా?
అప్స్టాక్స్తో యూఎస్ స్టాక్స్
న్యూఢిల్లీ: దేశీ ఇన్వెస్టర్లు యూఎస్ స్టాక్స్ కొనుగోలు చేసేందుకు వీలుగా అప్స్టాక్స్ సొంత ప్లాట్ఫామ్ను ఆవిష్కరించింది. దీంతో యూఎస్లో లిస్టయిన 8,000కుపైగా కంపెనీల షేర్ల కొనుగోలుకి వీలు చిక్కనుంది. అంతేకాకుండా మరో 2,000 ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్లు)లోనూ ఇన్వెస్ట్ చేయవచ్చని ఒక ప్రకటనలో స్టాక్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అప్స్టాక్స్ తెలియజేసింది. యాప్ ద్వారా గ్లోబల్ దిగ్గజాలు యాపిల్, టెస్లా, అమెజాన్, గూగుల్ తదితర షేర్లను సొంతం చేసుకోవచ్చని తెలియజేసింది. దీనిలో భాగంగా ఇన్వెస్టర్లు కనీసం 1 డాలరుతో పెట్టుబడులు ప్రారంభించవచ్చని వెల్లడించింది. తద్వారా పూర్తి షేరుని కాకుండా దీనిలో కొంత భాగాన్ని సైతం కొనుగోలు చేయవచ్చని వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులు దేశీ వెల్త్ ఎకోసిస్టమ్ తదుపరి దశ వృద్ధిని ప్రతిబింబిస్తాయని అప్స్టాక్స్ సహవ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్ పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు ఈ ప్లాట్ఫామ్ ద్వారా గ్లోబల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చని తెలియజేశారు. పెట్టుబడులు ఇలా వినియోగదారులు తమ దేశీ బ్యాంక్ ఖాతాల ద్వారా రూపాయలలోనే పెట్టుబడులు చేపట్టవచ్చని అప్స్టాక్స్ పేర్కొంది. ఇవి ఆటోమేటిగ్గా డాలర్లలోకి మారి్పడి అవుతాయని తెలియజేసింది. ఇన్వెస్టర్లు యూఎస్ మార్కెట్ల ట్రేడింగ్ సమయంకానప్పుడు కూడా ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ల ద్వారా కొనుగోలు ఆర్డర్లు నమోదు చేయవచ్చని వివరించింది. స్పేస్ ఎక్స్ప్లొరేషన్, ఏఐతోపాటు.. ఇతర వర్ధమాన టెక్నాలజీలు, ఇతర రంగాలలో పెట్టుబడులకు యూఎస్ స్టాక్స్ వీలు కలి్పస్తాయని పేర్కొంది. ఆర్బీఐ అనుమతించిన ఎల్ఆర్ఎస్ ద్వారా మార్గదర్శకాలకు లోబడి ఇందుకు అవకాశముంటుందని తెలియజేసింది.
ఫ్యామిలీ
అపూర్వ భారతీయం
శిల్పాలు, చిత్రాలు, ఇన్స్టాలేషన్... కళాకృతి ఏదైనా కావచ్చు. అందులో భారతి ఖేర్ ముద్ర కనిపిస్తుంది. ‘వస్తువులలో అంతర్లీనంగా దాగి ఉన్న కళను ఖేర్ వెలుగులోకి తెస్తారు’ అంటారు ఆర్ట్ క్రిటిక్స్. ఆ వస్తువులు పురాణాలతో ముడిపడి ఉండవచ్చు. చారిత్రక సంఘటనలతో ముడిపడి ఉండొచ్చు. తాజా విషయానికి వస్తే... ఫోర్బ్స్ ఇండియా ‘షోస్టాపర్స్ 2026: 100 బిగ్గెస్ట్ సెలబ్రిటీస్’ జాబితాలో భారతి ఖేర్ చోటు సాధించారు...భారతి ఖేర్ కళాకృతులలో బొట్టు అనేది ప్రత్యేకంగా కనబడుతుంది. 1995లో మొదటిసారిగా అది ఆమె కళాకృతిలో కనిపించింది. ఇక అప్పటినుండి ఖేర్ సృజించిన కళాకృతులలో బొట్టు ప్రత్యేక సౌందర్య చిహ్నంగా మారింది. ‘బొట్టు నాకు మూడవ కన్నులాంటిది. వాస్తవ ప్రపంచానికి, ఆధ్యాత్మిక, భావనాత్మక ప్రపంచాలకు మధ్య అది బంధాన్ని ఏర్పరుస్తుంది’ అని చెబుతుంటారు ఖేర్.ఆ మ్యూజియం... ఆశాదీపంఖేర్ సృష్టించిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 2006 శిల్పం ‘ది స్కిన్ స్పీక్స్ ఏ లాంగ్వేజ్ నాట్ ఆన్ ఇట్స్ ఓన్’లో బొట్టు ప్రత్యేకంగా కనిపిస్తుంది. సోథెబీస్ వేలంలో ఈ శిల్పం రికార్డ్ స్థాయిలో రూ.6.9 కోట్లకు అమ్ముడుపోయింది. ‘మ్యూజియమ్స్ జ్ఞాపకాల నిలయాలు. అవి మౌనప్రదేశాలు కాదు. సౌందర్యం, చరిత్ర, రాజకీయాల గురించి మాట్లాడతాయి. భారతదేశంలో ఎనిమిది వందల మ్యూజియమ్స్ ఉన్నాయి. అయితే వాటిలో చాలా వరకు సరిగ్గా పనిచేయడం లేదు. పట్నాలో బిహార్ మ్యూజియంలాంటి అద్భుతమైన మ్యూజియంలు ఉన్నాయి. అలాంటివి ఆశాదీపాన్ని వెలిగిస్తాయి’ అంటున్నారు ఖేర్. ప్రారంభంఖేర్ రూపొందించిన కళాకృతులు న్యూయార్క్లోని పబ్లిక్ ఆర్డ్ ఫండ్, యార్క్షైర్ స్కల్ప ్చర్ పార్క్, కోపెన్హాగన్లోని థోర్వాల్డ్సెన్స్ మ్యూజియం, లండన్లోని హేవర్డ్ గ్యాలరీ, వి అండ్ ఏ, నేషనల్ మ్యూజియం ఆఫ్ కెనడా, గుగ్గెన్హీమ్ అబుదాబీలలో ప్రదర్శించబడ్డాయి.‘కాదేది కళకు అనర్హం’ అన్నట్లుగా ఖేర్ ఏ వస్తువుతోనైనా కళాకృతులు సృష్టించగలరు. మూడు దశాబ్దాల సుదీర్ఘ కేరీర్లో అద్భుత కళారూపాలను ఆవిష్కరించారు. ‘నిన్ను నువ్వు తెలుసుకోవడమే సకల జ్ఞానానికి ప్రారంభం’ అనే ప్రఖ్యాత తత్వవేత్త ఆరిస్టాటిల్ మాట ఆధారంగా రూపొందించిన కళారూపానికి మంచి స్పందన వచ్చింది.ఎప్పుడూ చెప్పే విషయంలండన్లోని న్యూ కాజిల్ పాలిటెక్నిక్ ఆర్ట్ అండ్ డిజైన్లో ఫౌండేషన్ కోర్సులో చేరి, ఫైన్ ఆర్ట్, పెయింటింగ్లో బి.ఏ. చేసిన భారతి ఖేర్ 1993లో ఇండియాకు వచ్చారు.‘సునామీ సమయంలో జంతువులు ఎత్తైన ప్రదేశాలకు పారిపోయాయని, పక్షులు మనుషులకు హెచ్చరికలు చేశాయని, కాని మనుషులు వాటిని వినలేకపోయారని లేదా పట్టించుకోలేదని అంటారు. మనుషులకు ఉన్న అహంకారం ఏమిటంటే తమకు అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ కళ మాత్రం మనకు ఏం తెలియదని ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది’ అంటారు భారతి ఖేర్.కొత్త మార్గంఖేర్కు బాగా ఇష్టమైన పుస్తకం హనీఫ్ ఖురేషి రాసిన ది బుద్ధ ఆఫ్ సబర్బియా.‘నేను యూకేలోని శివారు ప్రాంతాల్లో పెరిగాను. ఈ పుస్తకానికి ముందు ఫిక్షనల్ పుస్తకాలేవీ చదవలేదు. జాతి వివక్ష, వర్గ విభేదాల గురించి వ్యంగ్యం, హాస్య ధోరణిలో చెప్పిన పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని నేను ఒక్కసారిగా చదివేశాను. ఇది నా జీవితమే. నా జీవితంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఇక సినిమాల విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో కలిసి బ్యూటీఫుల్ లాండ్రెట్ అనే సినిమా చేశాను. అది నాకు ఒక కొత్త మార్గాన్ని చూపించింది’ అంటారు భారతి ఖేర్. ఆ అనుబంధమే... కళ!మాటల్లో చెప్పడానికి కష్టమైదానిని నేను కళారూపంలోకి తీసుకురావాలనుకుంటాను. దానికి సరిపోయే ప్రత్యేకమైన వస్తువు కోసం వెదుకుతాను. మనసు లోతుల్లో నుంచి పుట్టే భావోద్వేగానికి లేదా చిత్రానికి అద్భుతమైన రూపం ఇవ్వాలంటే ఎంచుకునే వస్తువు కొత్తగా ఉండాలి. మనం కంటితో చూసేదానికి, మనసుతో చూసేదానికి మధ్య అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధమే కళాకృతుల పుట్టుకకు కారణం అవుతుంది. కళ అనేది సిద్ధాంతాల సమ్మేళనం కాదు. పరిసరాలను కంటితో కాకుండా మనసుతో చూడడం. నా దృష్టిలో కళ అంటే కేవలం ఆలోచన మాత్రమే కాదు. ఒక వస్తువును అందమైన స్థితిలోకి తీసుకురావడం కూడా. ఒక కళాకృతి రూపుదిద్దుకునే క్రమంలో మ్యాజిక్ (అద్భుతం) జరుగుతుంది. ఆల్కెమీ(రూపాంతర ప్రక్రియ) జరుగుతుంది.– భారతి ఖేర్
సహ్యాద్రి గుండెల్లో ఛత్రపతి అడుగులు
సహ్యాద్రి కొండల మధ్య ప్రయాణిస్తుంటే కొన్ని ప్రదేశాల్లో చరిత్రలో మనం భాగం అయినట్టు అనిపిస్తుంది. అక్కడికి చేరుకున్న ప్రతీసారి చరిత్రలోని ఒక పేజీ మన ముందు నిలిచినట్టు అనిపిస్తుంది. మహారాష్ట్రలో ఈ ఐదు కోటలు ఒక విభిన్నమైన అనుభూతిని అందిస్తాయి.ఒక చారిత్రాత్మక యాత్రమహారాష్ట్ర అంటే ముంబై, పుణె వంటి నగరాలు మాత్రమే కాదుం సహ్యాద్రి పర్వత శ్రేణులు కూడా గుర్తొస్తాయి. ఎన్నో శతాబ్దాల చరిత్రను మోస్తున్న కోటలు ఈ నేల కీర్తిని నిలువెత్తునా చాటుతున్నాయి. వాటిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంతో బలమైన అనుబంధం ఉన్న రాయగఢ్, శివనేరి, ప్రతాపగఢ్, సింహగఢ్, తోరణ కోటలు ఒక సజీవ సాక్ష్యంలా కనిపిస్తాయి.ఈ ప్రయాణంలో ప్రతి కోట ఒక భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ఒకచోట బాల్యం, మరోచోట పట్టాభిషేకం, ఇంకోచోట యుద్ధగాథ... ఇలా సహ్యాద్రి ప్రకతి మధ్య ఛత్రపతి శివాజీ చరిత్ర మెల్లగా మన కళ్ల ముందు ఆవిష్కతమవుతుంది.శివనేరిఛత్రపతి శివాజీ జీవితాన్ని తెలుసుకునేందుకు చాలా మంది ఆయన కాలంలో నిర్మించిన కోటలను సందర్శిస్తారు. ఈ యాత్ర శివనేరితో మొదలు పెట్టడానికి ఇష్టపడుతుంటారు.ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించిన ప్రదేశంలో ఉన్నాం అనే ఫీలింగ్ చాలా స్పెషల్ అనిపిస్తుంది.కొండల మధ్య ఉన్న కోట ప్రాంగణంలో నడుస్తుంటే, బాల్యం నుంచే మొదలైన ఒక మహా చరిత్ర గుర్తుకొస్తుంది.కోట గోడల మధ్య కనిపించే ప్రాచీన నిర్మాణాలు, కొండపై నుంచి దూరదూరం వరకు కనిపించే సీనరీస్ ఇవన్నీ కలిసి శివనేరికి ఒక ప్రత్యేక ఎక్స్పీరియెన్స్ మిగిలిపోయేలా చేస్తాయి.తోరణ... తొలి అడుగు సహ్యాద్రిలో మరో ముఖ్యమైన పేరు తోరణ. శివాజీ మహారాజ్ స్వాధీనం చేసుకున్న తొలి కోటగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ కోటను ‘ప్రచండగఢ్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొండలపై వీచే గాలి, దూరంగా కనిపించే పచ్చని కొండలు, కోట అవశేషాలు కలిసి ఒక స్లో ట్రావెల్ ఎక్స్పీరియెన్స్ను ఇస్తాయి. ఒకవైపు ప్రకతి, మరోవైపు చరిత్ర... రెండూ కలిసిన అందమైన ప్రదేశమే తోరణ.ప్రతాపగఢ్...ప్రతాపగఢ్ పేరు వినగానే 1659లో అఫ్జల్ ఖాన్తో జరిగిన యుద్ధం గుర్తుకొస్తుంది. కోట దగ్గరకు చేరుకున్న తర్వాత చరిత్ర అనేది పుస్తకంలో చదివే విషయంగా మాత్రమే కాకుండా, ఈ కొండల మధ్య జరిగిన సంఘటనలా అనిపిస్తుంది. కోట చుట్టూ విస్తరించిన సహ్యాద్రి కొండల వరుసలు, మధ్యలో కనిపించే పచ్చని లోయలు, ప్రాచీన నిర్మాణాలు కలిసి నాటి గంభీరమైన పరిస్థితిని మరోసారి గుర్తు చేస్తాయి. ఇక్కడ కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడటం కూడా ఒక అనుభవమే.సందర్శనీయ ప్రదేశాలుఈ ఐదు కోటల్లో ఒక్కో కోటకు ఒక్కో కథ ఉంటుంది. శివనెరిలో బాల్యం, తోరణలో తొలి విజయం, ప్రతాపగఢ్లో మహా యుద్ధం, సింహగఢ్లో తానాజీ మలుసరేల వీరగాథ, రాయగఢ్లో మరాఠా సామ్రాజ్య రాజధాని జ్ఞాపకాలు కనిపిస్తాయి.1674లో రాయగఢ్లోనే శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది. దీంతో ఈ కోట మరాఠా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.సింహగఢ్ను గతంలో కొంధాణా అని పిలిచేవారు. 1670లో జరిగిన యుద్ధం, తానాజీ మలుసరే వీరత్వం ఈ కోట చరిత్రలో ఒక ప్రత్యేక ఘటనలుగా మిగిలిపోయాయి.ఎక్కడ ఉండాలిపుణె, మహాడ్, సతారా, జున్నర్ వంటి ప్రాంతాల్లో స్టే చేస్తూ ట్రావెల్ను స్లోగా ఎంజాయ్ చేయవచ్చు. నగరాల్లోని హోటళ్ల నుంచి సాధారణ వసతి గహాల వరకు వివిధ రకాల వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.కోట ప్రాంతాలకు సమీపంలో ఉండే చిన్న చిన్న క్యాంపుల్లో రాత్రి వేళ సహ్యాద్రి నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం ఈ ట్రిప్లో మరో హైలైట్.ఏం తినాలి ?మహారాష్ట్ర రుచులనను ఆస్వాదించడం కూడా యాత్రలో భాగంగా భావించాలి. మరీ ముఖ్యంగా పుణె, సతారా ్ర΄ాంతాల్లో ΄ోహా, మిసల్ పావ్, భాక్రీ, పిఠ్లా వంటి స్థానిక రుచులు ఆస్వాదించవచ్చు. మనం చుడ్వా అని పిలచుకునే చివ్దా, వడాపావ్, బ్రెడ్ పకోడా వంటిమి మీకు ప్రతీ చోట లభిస్తాయి. అలాగే కోట ప్రాంతాల్లో లభించే నార్మల్ మరాఠీ థాలి ట్రై చేయవచ్చు.ఆసక్తికరమైన విషయాలుశివనేరి ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది.తోరణను ప్రచండగఢ్ అనే పేరుతో కూడా పిలుస్తారు.1659లో అఫ్జల్ ఖాన్తో జరిగిన యుద్ధంతో ప్రతాపగఢ్ చరిత్రలో నిలిచిపోయింది.సింహగఢ్ పాత పేరు కొంధాణా. తానాజీ మలుసరే వీరగాథను నేటికీ చాలా మంది గుర్తు చేస్తుంటారు.1674లో రాయగఢ్లో శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది.ఏం చూడాలిశివనేరి కోట ప్రాంగణంలో చరిత్రను గుర్తుచేసుకుంటూ వాక్ చేయడం, తోరణలో సహ్యాద్రి అందాలను చూడటం, ప్రతాపగఢ్లో యుద్ధగాథలను తెలుసుకోవడం, సింహగఢ్లో తానాజీ మలుసరే వీరగాథను గుర్తుచేసుకోవడం, రాయగఢ్లో పట్టాభిషేకం జరిగినప్రాంతం వైబ్ను ఫీల్ అవ్వడం.. ఈ ఐదు అనుభవాలు కలిసి ట్రిప్ను ఒక కంప్లీట్ మెమోరీగా మార్చేస్తాయి.ఎలా వెళ్లాలిహైదరాబాద్ నుంచి సహ్యాద్రి ్ర΄ాంతానికి వెళ్లాలి అనుకుంటే ముందు పుణే చేరుకుంటే బెటర్. దీని కోసం రైలు లేదా ఫ్లైట్లో మీకు వీలైన దాన్ని ఎంచుకోవచ్చు. నిజానికి ఈ జర్నీని చాలా మంది రైల్లోనే ఎంజాయ్ చేస్తారు. పుణె చుట్టుపక్కల ఉన్న కోటలను ముందుగా చూసి, ఆ తర్వాత రాయగఢ్, ప్రతాపగఢ్, శివనేరి, తోరణ వైపు బయల్దేరవచ్చు.నగర ప్రాంతాలను దాటి సహ్యాద్రి కొండల మధ్యకు ప్రవేశించే కొద్దీ సిటీ స్ట్రెస్ జోన్ నుంచి బయటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. విజయవాడ నుంచి వచ్చే వారు హైదరాబాద్ మీదుగా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి ఐదు రోజుల ఈ చారిత్రక యాత్ర బడ్జెట్ అనేది ప్రయాణికుల లైఫ్స్టైల్ను బట్టి మారుతుంది. యావరేజ్గా కనీసం రూ.15,000–20,000 వరకు ప్రతీ వ్యక్తికి ఖర్చు అవుతుంది. ఇక ప్రీమియం ట్రావెల్ ఎక్స్పీరియెన్స్ కోసం రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయాలి. అయితే ఈ ఖర్చులు మీరు ఎలా ట్రావెల్ చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఏం తింటారు, యాక్టివిటీస్ను బట్టి మారుతాయి.ఇక హోటల్ లేదా లాడ్జి ఖర్చు విషయానికి వస్తే స్టే కోసం పర్ నైట్ వచ్చేసి రూ.1,000 నుంచి రూ.2,500 వరకు బడ్జెట్ అవ్వొచ్చు. ఫుడ్ కోసం రోజుకు సుమారు రూ.500–1,000 వరకు కేటాయించవచ్చు. ఇలాంటి ట్రిప్లో తక్కువ ధరకు దొరికే రూమ్స్ కన్నా అన్ని సదుపాయాలు, సెక్యూరిటీ ఉన్న హోటల్స్నే ఎంచుకోవడం ఉత్తమం.గమనిక: ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు లేటెస్ట్ వివరాలను సొంతంగా రీసెర్చ్ చేసుకుని ప్లాన్ చేసుకోండి. ఎం జి కిశోర్ ప్రయాణికుడు(చదవండి: మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!)
75 ఏళ్ల వయసులోనూ యంగ్గా మమ్ముట్టి..!ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం..
మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో అశేష అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు. ఆయన ఏడుపదుల వయసులోనూ యువ హీరోలకు తీసిపోని గ్లామరస్తో మంచి దృఢంగా ఉంటారు. అంతలా యంగ్గా హెల్దీగా ఉండటం కోసం మమ్ముట్టి ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలాంటి ఆహార నియమాలను పాటిస్తారు వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా.!.మమ్ముట్టి ఫిట్నెస్ ఇప్పటికీ అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తుంటుంది. కండరబలం, చురుకుదనం, ఆరోగ్యకరమైన శరీరం సౌష్టవం తదితరాలను మెయింటైన్ చేస్తూ యంగ్ లుక్లో కనిపిస్తుంటారు. ఆయన క్రమశిక్షణయుతమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందినవారు. తమిళ హీరో సూర్య సైతం ఆహారం విషయంలో మమ్ముట్టి నాకు స్పూర్తి అని చెబుతుంటారు. ఆయన ఇచ్చిన సలహాను ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఎప్పుడూ నీకు నచ్చింది తినమనే చెబుతుంటారని..కానీ నచ్చినంతగా కాకుండా మితంగా తీసుకోమని సూచిస్తుంటారు. అది ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడుతుందని ఆయన చెబుతుంటారని సూర్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చాడు. అందులో నిజమెంత అంటే..ఇష్టమైన ఆహారంపై నియంత్రణ ముఖ్యంమమ్ముట్టి చెబుతున్నట్లుగా నచ్చిన ఫుడ్ హాయిగా తినాలి, కానీ తీసుకునే పరిమాణంపై నియంత్రణ మస్ట్ అనేది సరైదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎంత తింటున్నారో అనేదానిపై నియంత్రణ మనకు సరైన కేలరీల మోతాదు తీసుకునేందుకు హెల్ప్ అవుతుందట. ఇక్కడ కేవలం తక్కువ తినడం మాత్రమే కాదు ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్లు, ఖనిజాలు ఉండే పోషకవంతమైన ఆహార తీసుకోవడం అత్యంత కీలకం అని చెబుతున్నారు నిపుణుల. ఆరోగ్యకరంగా ఉండేలా..అలాగే మమ్ముట్టి వేయించిన ఆహారాలు, చక్కెర పదార్థాలు, అధిక నూనెకు దూరంగా ఉంటూ..ఆరోగ్యకరమైన ఆహార పద్ధతినే పాటిస్తారట. ఈ ఆహారాలను తగ్గించడం వల్ల కేలరీలు పరిమితంగా ఉంటాయి. అలాగే కూరగాయాలు, పండ్లు, తృణధాన్యాలు, నట్స్, గుడ్లు, చేపలు వంటి ప్రోటీన్ వనరులు అధికంగా ఉండేవి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఫుడ్ప్లాన్..ఏదీ తీసుకున్న నియంత్రిత పరిమాణంలో తీసుకునేలా ప్రాధాన్యత ఇస్తారట. అల్పాహారంలో ఓట్స్ గంజి, గుడ్డులో తెల్లసొన, బొప్పాయి, నానబెట్టిన బాదం పప్పులు ఉంటాయట. మధ్యాహ్న భోజనానికి తక్కువ మసాలాలతో తయారు చేసిన చేపల కూరను అన్నానికి బదులుగా ఓట్స్ పుట్టుతో కలిపి తీసుకుంటానని చెప్పారు. ఇక రాత్రి భోజనంగా గోధుమ లేదా ఓట్స్ దోసెల తోపాటు చికెన్ లేదా చేపల కూర తీసుకుంటానని చెప్పారు. భోజనం చివర్లో మష్రూమ్ సూప్ తీసుకుంటారట. ఇలా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను మిళితం చేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు, అలాగే బరువు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.వ్యాయామం, తగిన విశ్రాంతి..అలాగే క్రమంతప్పకుండా వర్కౌట్లు చేస్తుంటారు. వయసు పెరిగే కొద్ది రెసిస్టెన్స్ వ్యాయామం ప్రత్యేకంగా చేయాలని చెబుతున్నారు వైద్యులు. ఎందుకుంటే కండరాలు క్షీణించే అవకాశం ఉంటుంది కాబట్టి..కార్డియో వ్యాయామాలు వంటివి చేయాలని చెబుతున్నారు. ఇక నిద్రపై కూడా మంచి శ్రద్ధపెడతానని చెప్పారు. శారీరక ఒత్తిడి నుంచి కోలుకునేందుకు సరైన నిద్ర నాణ్యత ఉండాలని అంటున్నారు. రోజువారీ పనితీరుకు నిద్ర ఎంతో కీలకం అని అంటున్నారు నిపుణులు. ఈ విధంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని నిలకడగా పాటిస్తే..ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ఆస్వాదించగలగడమే కాకుండా ఎప్పటికీ యంగ్ లుక్లోనే చురుకుగా కనిపించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రూ. 90 లక్షల జీతం వదులుకుని ఇండోర్ వ్యవసాయం..! కట్చేస్తే ఏకంగా రూ. 1.44 కోట్లు..)
రూ. 90 లక్షల జీతం వదులుకుని ఇండోర్ వ్యవసాయం ..! కట్చేస్తే ..
చాలామందికి కార్పొరేట్ జీవితంలో లక్షల్లో జీతం ఆర్జించాలన్నది డ్రీమ్. అందుకోసం ఎంతలానో కష్టపడుతుంటారు. కానీ కొందరు అంత లగ్జరీ లైఫ్ని సునాయాసంగా కాదనుకుని వ్యవసాయం వైపుగా అడుగులు వేసి రైతులనకు అండగా నిలుస్తుంటారు. ఆ క్రమంలో కొందరు భారీ లాభాలతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. అలాంటి కోవకు చెందినవాడే చత్తీశ్గఢ్కు చెందిన మోహిత్ నిఝూవన్ కూడా. అతడు ఏ పది, ఇరవై లక్షల జీతం కూడా ఏ రేంజ్ కార్పొరేట్ జీతాన్ని కాదనుకున్నాడో వింటే నోటమాటరాదు. మరి ఆ వ్యక్తి అంత లగ్జరీ లైఫ్ వదులుకుని అంతకుమించిన సక్సెస్ని ఎలా అందుకున్నాడో తెలుసుకుందామా..!.చత్తీశ్గఢ్కు చెందిన మోహిత్ నిఝూవన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి మంచి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. హాయిగా బిందాస్లా సాగిపోతున్నా లైఫ్కి సడెన్ బ్రేక్లు వేసి..అగ్రికల్చర్ రంగం వైపుకి అడుగులు వేశాడు. అది కూడా ఎలాంటి వ్యవసాయం ఎంచుకుంటే బెస్ట్ అని కూలంకషంగా తెలుసుకునేందుకు 2020లో తన ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. నియంత్రిత వాతావరణంలో పెంచగలిగే పోషకాలు అధికంగా ఉండే మొక్కతోట కూరలైన మైక్రోగ్రీన్ అనే ఇండో ఫార్మింగ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడు. అనుకున్నదే తడుపుగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాడు గానీ..పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే..తక్కువ మొత్తంలో పెట్టి అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు మోహిత్. అందుకే కేవలం రూ. 30 వేలతో చండీగఢ్లోని తన ఇంటి రెండో అంతస్థులో వంద చదరపు అడుగుల స్థలంలో మైక్రోగ్రీన్స్ని పెంచడం ప్రారంభించాడు. తొలినాళ్లలో సాగు, ఉత్పత్తి, వినియోగదారులు కొనుగోలు చేసేలా వ్యాపార నమునాని నిర్మించడం వంటి వాటి గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఒక చిన్న ప్రయోగంగా మొదలుపెట్టి క్రమంగా ఎవర్గ్రీన్ మైక్రోగ్రీన్గా ఎదగడం ప్రారంభించింది. అలా చిన్న ర్యాక్ కాస్తా మూడు ర్యాక్లు, ట్రేలుగా వర్టికల్ ఇండోర్ఫామ్ని స్థాపించాడు. ప్రారంభంలో 21 సేంద్రీయా రకాలపై దృష్టిసారించి రసాయనాలు వినియోగించకుండా సాగు చేస్తే గణనీయమైన ఫలితం వచ్చింది. దాంతో నెమ్మదిగా తన ఫామ్ని 500 చదరపు అడుగులకు విస్తరించేలా సొంతంగా ఫామ్ని ఏర్పాటు చేశాడు. అది కాస్తా విస్తరించి ఏకంగా 12 వేల ట్రైలు ఉత్పత్తి చేయగల సామర్థ్యానికి చేరుకుంది. అలా ప్రస్తుతం అతను నెలకు 12 లక్షల ఆదాయం చొప్పున ఏడాదికి ఏకంగా 1.44 కోట్లకు పైనే ఆర్జిస్తున్నాడు. కేవలం చిన్న వ్యాపార ప్రయోగంగా మొదలు పెట్టి..కోట్ల ఆదాయానికి చేరుకున్నాడు. అంతేగాదు ఇంటి మిద్దె నుంచి మొదలై..సొంతంగా ఫామ్ని నిర్మించుకునే రేంజ్కి వెళ్లాడు. అలాగే ఈ మైక్రోగ్రీన్స్ వ్యాపారంలోకి రావాలనుకునే రైతులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ కూడా ఇస్తున్నాడు. ఇక్కడ సాగు తోపాటు వాణిజ్యపరమైన అంశాలపై పట్టు సాధించడంతో విజయం సాధించగలిగాడు. అందుకని రైతులకు కూడా ఈ అంశాల్లో తర్ఫీదు పొందేలా సాయం చేస్తుంటాడు. కాగా మోహిత్ తన మైక్రోగ్రీన్ వ్యాపార సక్సెస్ జర్నీని నెట్టింట షేర్ చేసుకోవడంతో గొప్ప ప్రయాణం మిత్రమా..నిజంగా స్ఫూర్తిదాయకం అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు.Meet Mohit Nijhawan, a https://t.co/BC6fLkcQNf Computer Science graduate. This guy left his 90 LPA corporate career to grow tiny greens. Today, he has built https://t.co/7yvufGmkSg, a ₹1.44 crore business with approximately ₹60 lakhs in profit annually.He walked away from a… pic.twitter.com/HI4OPKOm7l— Vikas Alwys (@VikasAlwys) September 5, 2026 (చదవండి: మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!)
అంతర్జాతీయం
మహిళ చేతికి పనామా కెనాల్
పనామా సిటీ: రాజకీయంగా, భౌగోళికంగానూ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన పనామా కాలువ పగ్గాలను చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళ చేపట్టారు. నావల్ ఇంజినర్ ఇల్యా ఎస్పినో మరోట్టా సోమవారం పనామా కెనాల్ అడ్మినిస్ట్రేషన్ లీడ్గా బాధ్యతలు చేపట్టారు. దశాబ్ద కాలంగా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ గా ఇల్లా ఎస్పినో వందల కోట్ల డాలర్ల విలువైన కెనాల్ విస్తరణ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె పూర్తిస్థాయి అడ్మినిస్ట్రేటర్ గా బాధ్యతలు స్వీకరించడానికి మార్గం సుగమమైంది. 1999లో అమెరికా ఈ కెనాల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ముగ్గురు పనామావాసులు మాత్రమే పూర్తిస్థాయి అడ్మిని్రస్టేటర్లుగా పనిచేశారు. పనామా ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచవ్యాప్త సముద్ర వాణిజ్యంలో మూడు శాతం భాగస్వామ్యమున్న ఈ కెనాల్ అత్యంత కీలకమైందనడంలో సందేహం లేదు. పదవీబాధ్యతలు చేపట్టేందుకు కొంత సమయం ముందు ఇల్యా ఎస్పినో అసోసియేటెడ్ ప్రెస్తో మాట్లాడుతూ కెనాల్ పరీవాహక పరిధిలోనే ఓ భారీ రిజర్వాయర్ నిర్మించాలన్నది అడ్మినిస్ట్రేటర్ గా తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇండియో నదీ బేసిన్లో 150 కోట్ల డాలర్లతో నిర్మించతలపెట్టిన ఈ రిజర్వాయర్ మధ్య అమెరికా దేశాల తాగునీటి అవసరాలను యాభై శాతం వరకూ తీర్చగలదు. భవిష్యత్తులో పనామా కెనాల్ కార్యకలాపాలకు కూడా ఈ రిజర్వాయర్ ఉపయోగపడుతుందని అంచనా. అమెరికా 1914లో ఈ కెనాల్ను ప్రారంభించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి.
సౌదీ చమురు నౌకపై దాడి.. ఇద్దరు సిబ్బంది మృతి
మస్కట్: ఒమన్లోని ముసందమ్ గవర్నరేట్ సమీప సముద్ర జలాల్లో సౌదీ జెండాతో ప్రయాణిస్తున్న చమురు నౌకపై దాడి జరిగినట్లు ఒమన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నౌకలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. ‘ఎస్ఐడీఆర్’ అనే చమురు నౌకపై ఓ ప్రాజెక్టైల్ తాకడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.ముసందమ్ తీరానికి సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలోనే ఈ నౌకపై దాడి జరిగినట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాడి అనంతరం నౌకలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న వెంటనే ఒమన్ నావికాదళానికి చెందిన నౌక ఘటనాస్థలికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. నౌకలో ఉన్న సిబ్బందిని రక్షించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో భాగంగా 16 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించి, వారికి అవసరమైన వైద్యసాయం అందించినట్లు అధికారులు స్పష్టం చేశారు.ప్రమాదం జరిగిన నౌక పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది. ఘటనకు సంబంధించి అవసరమైన సహాయక చర్యలను పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ దాడికి సంబంధించిన ఇతర వివరాలపై అధికారులు ఇంకా సమాచారం తెలియాల్సి ఉందని అధికారలు తెలిపారు.
లెబనాన్పై విరుచుకపడ్డ ఇజ్రాయెల్.. 11 మంది మృతి
బీరుట్: లెబనాన్పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకపడింది. ఈ రోజు (సోమవారం) దక్షిణ లెబనాన్లోని రెమాన్ నగరంలోని ఓ భవనంపై మిసైల్స్తో దాడి చేసింది. ఈ దాడిలో 11 మంది మృతిచెందగా వారిలో ఇద్దరు చిన్నారులతో పాటు, వైద్య సిబ్బంది ఉన్నారు. ఈ వివరాలను ఆ లెబనాన్కు చెందిన నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.ఆ దేశ మీడియా కథనాల ప్రకారం... సోమవారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్లోని క్ఫర్ రెమాన్ పట్టణంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఒక నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు అని కథనాలు ప్రచురించాయి. ఇదే పట్టణంలో మరో ఘటనలో ఇజ్రాయెల్కు చెందిన డ్రోన్ ఒక పౌర వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి చేసింది. ఆ కారులో ఉన్న ఇద్దరు వైద్య సిబ్బంది మరణించినట్లు NNA తెలిపింది.అదే విధంగా దేర్ అల్-జహ్రానీ పట్టణంలోని ఒక నివాస ప్రాంతంపై కూడా ఇజ్రాయెల్ సైన్యం రాత్రివేళ దాడి చేసిందని ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ముందుగా ప్రజలను ఆదేశించిందని తెలిపింది. కాగా ఈ దాడులకు ఒక రోజు ముందు, సమీపంలోని అరబ్ సలీమ్ పట్టణంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం ఏడుగురు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. ఈ పట్టణం కూడా నబతియెహ్ జిల్లాలోనే ఉంది. అయితే ఈ ఏడాది జూన్లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ తరచుగా ఈ ఒప్పందం ఉల్లంఘన జరుగుతుంది. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ తరచుగా లెబనాన్పై దాడులకు తెగబడుతుంది.
సైన్యంలో చేరమని ఒత్తిడి చేస్తున్నారని భార్య ఆవేదన
మాస్కో: రష్యా నుంచి ఓ భారతీయ మహిళ చేసిన విజ్ఞప్తికి భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది. తన భర్తను అక్కడి పోలీసులు అక్రమంగా నిర్భందించారని అక్కడి సైన్యంలో చేరమని ఒత్తిడి చేస్తున్నారని సదరు మహిళ భారత్ ప్రభుత్వానికి ఎమెర్జెన్సీ కాల్ ద్వారా విజ్ఞప్తి చేసింది. దీనికి స్పందించిన భారత ప్రభుత్వం అతని విడుదల కొరకు రష్యాలోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.బాధితురైలైన మహిళ ఇన్స్టా వేదికగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వీడియో చేసింది. అందులో "తన భర్త ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ఇంజనీర్ చందన్ గుప్తా, నోయిడాలోని కంపెనీ ద్వారా జారీ చేయబడిన 'అత్యంత అర్హత కలిగిన నిపుణుడి' వీసాపై మా కుటుంబం మాస్కోలో ఉంది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రష్యా పోలీసులు నా భర్తను అరెస్టు చేశారు. ఎలాంటి తప్పు చేయనప్పటికీ అతడిని జైలులో ఉంచారు. ఉక్రెయిన్కు వ్యతిరేకంగా పోరాడటానికి రష్యన్ సైన్యంలో చేరమని పోలీసులు తన భర్తపై ఒత్తిడి తెచ్చారు." అని సదరు మహిళ వీడియోలో ఆరోపించింది.రష్యన్ సైన్యంలో సిబ్బంది కొరత ఉందనే నెపంతో, భారతీయులతో సహా విదేశీయులను దేశ సాయుధ దళాలలోకి బలవంతంగా చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొంది. తన భావోద్వేగ విజ్ఞప్తిలో, ఆ దంపతులకు పదేళ్ల కుమారుడు ఉన్నాడని, ఈ పరిస్థితితో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని ఆమె తెలిపింది. తన భర్తను సురక్షితంగా విడుదల చేయించడానికి ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆమె భారత ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ విషయమై రష్యాలోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.కాగా ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం మెుదలై దాదాపుగా నాలుగేళ్లు గడుస్తోంది. అయినప్పటికీ యుద్ధం ఇంకా ముగియలేదు. అయితే యుద్ధంలో పెద్దఎత్తున సైనికులు మృతిచెందడంతో రష్యాకు సైనికుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రష్యా ఉద్యోగాల పేరుతో ఆశ చూపి భారతీయులను రష్యాకు రప్పించి, ఆ తర్వాత రష్యా సైన్యంలోకి చేర్చుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.భారత్ సైతం దీనిపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకూ మెుత్తంగా 227 మంది భారతీయులు రష్యా సాయుధ దళాలలోకి చేరారని, వారిలో 139 మందిని విడుదల చేయగా, 51 మంది మరణించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగిలిన భారతీయులను సైతం త్వరగా విడుదల చేసి, తిరిగి రప్పించేందుకు భారత్ రష్యా పక్షంతో సంప్రదింపులు కొనసాగిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
జాతీయం
25 ఎకరాల్లో కొత్త సచివాలయం.. రూ.1,200 కోట్లతో నిర్మాణం
సాక్షి, చెన్నై: చెన్నై మెరీనా తీరంలోని పట్టినంబాక్కంలో 25 ఎకరాల విస్తీర్ణంలో బ్రహ్మాండ సచివాలయం, అసెంబ్లీ భవన్ రూపుదిద్దుకోనున్నది. ఇందుకు సంబంధించిన కసరత్తులు మొదలయ్యాయి. బ్రిటిష్ కాలంలో నిర్మించిన చారిత్రాత్మక సెయింట్ జార్జ్ కోట భవనంలో ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వ సచివాలయం, శాసనసభ కొనసాగుతున్నాయి. అక్కడ తీవ్రమైన వాహనాల రద్దీ, పార్కింగ్ ఇబ్బందులు ప్రజల రద్దీ పెరిగిన నేపథ్యంలో చెన్నై పట్టినంబాక్కంలో కొత్త సచివాలయాన్ని నిర్మించడానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రహ్మాండ భవనంగా.. రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త సచివాలయం, శాసనసభ సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ప్రధాన భవనాన్ని 20 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో, 15 అంతస్తుల ఎత్తులో అత్యంత అధునాతనంగా రూపొందించనున్నారు. గిండిలోని హైవేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నందంబాక్కం ఫిన్టెక్ సిటీ ఎదురుగా ఉన్న భూములను పరిశీలించిన అనంతరం,పట్టినంబాక్కంలోని 25 ఎకరాల భూమిని ఈ నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదించింది. శాంతోమ్ ప్రధాన రహదారిని అనుసంధానించే ఈ స్థలం తమిళనాడు హౌసింగ్ బోర్డు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చదరపు అడుగు మార్కెట్ మార్గదర్శక విలువ రూ.22,000 కాగా, మొత్తం భూమి అంచనా విలువ సుమారు రూ.2,047 కోట్లుగాపరిగణించి ఉన్నారు. అనుమతుల మంజూరు మైలాపూర్, పట్టినం బాక్కం పరిధిలోని 21.37 ఎకరాల హౌసింగ్ బోర్డ్ భూమిని ప్రజా ప్రయోజనాల సచివాలయ నిర్మాణానికి ఉపయోగించేందుకు తమిళనాడు హౌసింగ్ బోర్డు అనుమతి ఇచ్చింది. అలాగే మిగిలిన భూమి, రోడ్ల వినియోగానికి చెన్నై కార్పొరేషన్ కమిషనర్, రెవెన్యూ శాఖలు కూడా ఆమోదం తెలిపాయి. 1958లో సేకరించిన ఈ స్థలంలో గతంలో నిర్మించి ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన క్వార్టర్స్ భవనాలను కూల్చివేసి స్థలాన్ని ఖాళీ చేసే ప్రక్రియను హౌసింగ్ బోర్డు వేగవంతం చేయడానికి నిర్ణయించింది. చదవండి: మద్యం ప్రియులకు గుడ్న్యూస్.. బాటిల్పై రూ.10 తగ్గింపు
‘ఆ ధోరణి ఇంకెప్పుడు మారుతుందో?..’ కంగనా కీలక వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, కోలీవుడ్ నటి త్రిష కృష్ణన్ బంధం గురించి చాలాకాలంగా అక్కడ చర్చ నడుస్తోంది. అయితే ఆమెను ఉద్దేశించి.. నటుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యవహారంపై సీఎం విజయ్ కూడా భగ్గుమన్నారు. మహిళల్ని కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే ఈ ఎపిసోడ్పై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళలను కించపరిచేందుకు.. వారి వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ను లక్ష్యంగా చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ధోరణేనని ఆమె వ్యాఖ్యానించారు. హిమాచల్ప్రదేశ్లోని కులు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం కంగనా మీడియాతో మాట్లాడారు. మహిళలు ఉద్యోగం చేస్తున్నా, విజయవంతమైనా, నాయకురాలిగా ఉన్నా, అధికార స్థానంలో ఉన్నా.. వారిని కిందకు లాగేందుకు.. ఆమె పరువు, గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేయడం మనకు కొత్తేం కాదు. అలాగని ఈ సమస్య భారత్కు మాత్రమే పరిమితం కాలేదని.. ప్రపంచమంతటా ఉందని పేర్కొన్నారామె. ఈ క్రమంలోనే త్రిష ఎపిసోడ్ను ఆమె ప్రస్తావించారు. తమిళనాడులో మొన్న ఏం జరిగిందో అంతా చూశారు. ఎంతో గౌరవనీయమైన నటి ఒక వ్యవహారంలో చిక్కుకున్నారు. ఆ వ్యవహారంలో సంబంధం ఇద్దరి మధ్య ఉంది. కానీ, దూషణలు, వ్యక్తిత్వాన్ని కించపర్చడం మాత్రం మహిళపైనే జరుగుతున్నాయి. ఎందుకలా?” అని కంగనా అన్నారు. ఆ ధోరణి ఇంకెప్పుడు ఆగుతుందని వ్యాఖ్యానించారామె. సమాజం తనను తాను ఈ విషయంలో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని.. మహిళలను మనం ఎలా చూస్తున్నాం? నిజంగా వారిని గౌరవిస్తున్నామా? అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలని వ్యాఖ్యానించారు.ఆగస్టు 3న కావేరీ జలాల వివాదంపై తంజావూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు త్రిష పేరు ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. దీనికి ఆయన స్పందించిన తీరు వివాదాస్పదమైంది. త్రిషను ఉద్దేశించే ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదవడంతో ఆగస్టు 4న ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు.అయితే తాను త్రిష పేరును ప్రస్తావించలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఉదయనిధి చెప్పారు. కావేరీ నదిని ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్య చేశానని ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. త్రిషకు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు, మహిళా నేతలు స్పందించారు. కంగనా కూడా గతంలో ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. బహిరంగంగా అసభ్యకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేయడం ఏ నాగరిక సమాజమూ అంగీకరించదని పేర్కొన్నారు. ఉదయనిధిపై తీసుకున్న చట్టపరమైన చర్యలు మంచి ఉదాహరణగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.ఇదే వివాదం నేపథ్యంలో తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ సోమవారం అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశరు. మహిళలపై వ్యక్తిగత దూషణలు, ద్వంద్వార్థ వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు చేసుకోవచ్చని, కానీ మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు మాత్రం చోటు ఉండకూడదని హెచ్చరించారు. మహిళలపై దూషణలు, వ్యక్తిగత దాడులు కొనసాగితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అంతా మా ఇష్టం అంటే కుదరదిక్కడ
సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్ను కొట్టి చంపేశారు
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి బయట జరుగుతున్న గోల, అరుపులపై అభ్యంతరం వ్యక్తం చేసిన 55 ఏళ్ల మణిపురి సంగీత విద్వాంసుడు చోంగ్థమ్ విక్రమ్ సింగ్ను దారుణంగా కొట్టి చంపారు కొంతమంది దుండగులు. ఇంటి బయట పనిచేస్తున్న డెలివరీ సిబ్బంది, దాబా సిబ్బందితో జరిగిన వివాదం చివరకు దాడికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదైనాయి. ఆగ్నేయ ఢిల్లీలోని సన్లైట్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలోక్రి వద్ద 17 ఏళ్లుగా ప్రైవేట్ సంగీత ఉపాధ్యాయుడిగా, గిటారిస్ట్గా పనిచేస్తున్న చోంగ్థమ్ విక్రమ్ను కొందరు వ్యక్తులు కొట్టి హత్య చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆగ్నేయ ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తాయి ఆదివారం అర్ధరాత్రి విక్రమ్ చెత్త పారవేయడానికి తన మూడవ అంతస్తులోని ఫ్లాట్ నుండి కిందికి వెళ్ళారు. తన ఇంటి వద్ద దాబా కార్మికులు, డెలివరీ బాయ్స్ చేస్తున్న అరుపులు, గోల భరించలేక విక్రమ్ సింగ్ కిందకు వచ్చి గోల చేయ వద్దని కోరారు. ఈ క్రమంలో జరిగిన వివాదంతో రెచ్చిపోయిన ఎనిమిది మంది ఆయనపై దాడికి దిగారు. అపార్ట్మెంట్లో థర్డ్ఫ్లోర్దాకా తరుముకుంటూ వచ్చి కారిడార్లో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన విక్రమ్ను ఆయన కుమారుడు యైఫాబా సమీపంలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. గాయపడిన విక్రమ్ను మెట్ల మీదుగా మోసుకెళ్తున్న దృశ్యాలు, దాడి చేసినవారు అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డైనాయి. ఈ కేసులో ఏడుగురుని అరెస్టు చేయడంతో పాటు ఒక బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా స్థానిక హోటళ్లలో ఫుడ్ ప్యాకింగ్, డెలివరీ పనులు చేస్తున్నారు. అరెస్టు అయిన వారిని భరత్ కుమార్(19), ప్రమోద్(26), రంజాన్ ఖాన్(22), విజయ్(36), దీపాంశు (21), మోహన్ విశ్వకర్మ(32), మన్ను(26) గా గుర్తించారు.Chongtham Vikram Singh ji, a renowned musician from Manipur, went downstairs to ask some men to lower the noise outside his home. He was beaten to death for it.A father, killed outside his own home, in his own country's capital. After many such incidents, every Northeast family…— Rahul Gandhi (@RahulGandhi) September 8, 2026Manipuri musician beaten to death for objecting to shouting, drinking outside his Delhi flat; 7 held#ChongthamVikramSingh pic.twitter.com/U0fZBjClqa— Raajeev Chopra (@Raajeev_Chopra) September 7, 2026చోంగ్థమ్ విక్రమ్ సింగ్ మణిపూర్లో పేరుగాంచిన సంగీత విద్వాంసుడు. ఆయన ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు చోంగ్థమ్ ఓంగ్బి కమలా దేవి కుమారుడు. అలాగే భారత్కు చెందిన మొదటి బాఫ్టా (BAFTA) అవార్డు పొందిన చిత్ర దర్శకురాలు లక్ష్మీప్రియ దేవికి విక్రమ్ వరుసకు సోదరుడు అవుతారు. ఆయన ఢిల్లీలో ఒక మ్యూజిక్ స్కూల్ను కూడా నడుపుతున్నారు. ఈ ఘటన అనంతరం, మణిపురి సమాజ సభ్యులు న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ దాడిలో ప్రమేయం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్ఈ ఘటన సమయంలో అసలు ఏం జరిగింది? ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉంది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పోలీస్ డిప్యూటీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు బాధితుడి కుటుంబాన్ని, కమ్యూనిటీ సభ్యులను కలిసి చట్టపరమైన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు సింగ్ మరణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్లో సింగర్ హఠాన్మరణంహోంమంత్రి, హోం మంత్రిత్వ శాఖపై రాహుల్ గాంధీ ఆగ్రహంలోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చోంగ్థమ్ విక్రమ్ సింగ్ హత్యను తీవ్రంగా ఖండించారు. విక్రమ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఢిల్లీలోని ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన హోంమంత్రి, హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులు ఏమి చేస్తున్నారని మండి పడ్డారు. సత్వరమే విచారణజరిపి దోషులను శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు.ఈ హత్యను మద్యం మత్తులో జరిగిన హింసాత్మక ఘటనగా కొట్టిపారేయకూడదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా అన్నారు. పెద్ద శబ్దంతో సంగీతం, బహిరంగ గొడవలు, నిబంధనలను పట్టించుకోకపోవడం వంటి వాటిని ఏళ్లుగా సహించడం వల్లే ఈ స్థితికి దారితీసిందన్నారు. ఢిల్లీలోని తన ఇంటి బయట శబ్ద కాలుష్యంపై అభ్యంతరం చెప్పినందుకు సింగ్ను కొట్టి చంపారని ఖేరా అన్నారు. ఇటువంటి ప్రవర్తనకు వ్యతిరేకంగా నిబంధనలను స్థిరంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.THIS IS SHOCKING🚨😡Delhi.Modi’s capital.BJP’s city.Manipuri musician Chongtham Vikram Singhobjected to drunk boys making noise outside his home.They beat him on the road.Chased him into his third-floor flat.Beat him again.Hours later, he was dead in hospital.His… pic.twitter.com/QN3cr5TV7x— The Rebel (@TheRebel_IN) September 8, 2026ఇదీ చదవండి: రీల్ స్టంట్ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్లోకి..కట్ చేస్తే!
కాంగ్రెస్లో భారీ మార్పులు.. 120 మంది యువ నేతలకు పగ్గాలు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్లో యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా 120 మంది కొత్త జాతీయ కార్యదర్శుల ఎంపికకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ స్వయంగా నేతలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వారి చురుకుదనం, పనితీరు నివేదిక ఆధారంగా అర్హతలను పరిశీలిస్తున్నారు. జాతీయ స్థాయి పదవుల నియామకాలకు రాజకీయ సీనియారిటీకి బదులుగా పనితీరు, చురుకుదనాన్ని ప్రధాన ప్రామాణికంగా పరిగణిస్తున్నారు.జాతీయ కార్యదర్శి పదవుల కోసం రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కలిసి నేతలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన నేతలను ఢిల్లీకి పిలిపించారు. సోమవారం 30 మంది నేతలను ఇంటర్వ్యూ చేశారు. రాహుల్గాంధీ రాయ్బరేలీ రెండు రోజుల పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ ప్రక్రియ మళ్లీ కొనసాగనుంది. ఒక్కోసారి 10 మంది చొప్పున నేతలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. గతంలో వారు చేసిన పనులు, ప్రొఫైల్ తదితర అంశాలపై రాహుల్గాంధీ ప్రశ్నిస్తున్నారు. ఇంటర్వ్యూకు హాజరవుతున్న నేతల పనితీరు నివేదికలు ఇప్పటికే ఆయన వద్ద ఉన్నాయి.వివిధ రాష్ట్రాల్లో జాతీయ కార్యదర్శుల నియామకానికి కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత కార్యదర్శుల్లో 60 శాతానికిపైగా మార్పులు చేసి కొత్త ముఖాలకు అవకాశం కల్పించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. కేవలం సిఫార్సులు, సిఫార్సు లేఖల ఆధారంగా కాకుండా క్షేత్రస్థాయి వాస్తవాలు, పని సామర్థ్యం, దూరదృష్టి ఆధారంగా యువతకు అవకాశం కల్పించాలన్నది రాహుల్గాంధీ ఉద్దేశం. జాతీయ కార్యదర్శి పదవికి 120 మంది నేతలను ఇంటర్వ్యూ చేయనున్నారు. అనంతరం వారి నియామకం చేపట్టనున్నారు. కాంగ్రెస్ ‘సంఘటన్ సృజన్’ కార్యక్రమంలో పరిశీలకులుగా పనిచేసిన నేతలకు ఈ పదవుల కోసం ప్రాధాన్యం ఇస్తున్నారు.2004లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పునరుద్ధరణ, తరాల మార్పు రాహుల్గాంధీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. యువతను ముందుకు తీసుకురావడంతోపాటు సంస్థాగత వ్యవస్థలో మార్పులకు ఆయన గతంలోనూ ప్రయత్నించారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలోనూ ఇంటర్వ్యూ ఆధారిత నియామక ప్రక్రియను అనుసరించారు. గతంలో సీనియర్ నేతల వ్యతిరేకత, అంతర్గత విభేదాల కారణంగా ఈ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. అయితే ఇటీవల కాంగ్రెస్లో జరుగుతున్న మార్పులతో పరిస్థితి మారుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యువ నేతలకు అవకాశాలు కల్పిస్తున్నారు. దీని కొనసాగింపుగానే జాతీయ కార్యదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు చెందిన యువతకు అవకాశం కల్పించి సమ్మిళిత బృందాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.ఇది కూడా చదవండి: పేరులో తేడా.. పద్మశ్రీ గ్రహీతకూ ‘సర్’ నోటీసు!
ఎన్ఆర్ఐ
మిస్సిసాగాలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
మిస్సిసాగా: కెనడాలోని మిస్సిసాగా నగరంలో శనివారం(సెప్టెంబర్ 5వ తేదీ) సాయంత్రం 6 గంటలకు వైఎస్సార్సీపీ కెనడా విభాగం ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజా సేవ, సంక్షేమ పథకాలు, నాయకత్వ పటిమ, ప్రజల పట్ల ఆయన చూపిన నిబద్ధతను నేతలు, కార్యకర్తలు ఘనంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమం వైఎస్సార్సీపీ కెనడా అడ్వైజర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో, వైఎస్సార్సీపీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు గారి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమ నిర్వాహకులు (వైఎస్సార్సీపీ కెనడా టీమ్):* సుబ్బారావు – వైఎస్సార్సీపీ కెనడా కో-కన్వీనర్* నూర్ గారు – వైఎస్సార్సీపీ కెనడా యూత్ వింగ్ కన్వీనర్ముఖ్య అతిథులు మరియు వక్తలుచల్లా మధుసూదన్ రెడ్డి గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ) – జూమ్ ద్వారా హాజరయ్యారుపాండుగాయల రత్నాకర్ గారు (మాజీ వైఎస్సార్సీపీ యూఎస్ఏ/ఎన్ఆర్ఐ కన్వీనర్, ఏపీ ప్రభుత్వ మాజీ నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి) – జూమ్ ద్వారా హాజరయ్యారు. డాక్టర్ ప్రదీప్ చింత గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - ఎన్ఆర్ఐ వ్యవహారాలు) – జూమ్ ద్వారా హాజరయ్యారు. కొండం వెంకట్ రెడ్డి గారు (కెనడా కమ్యూనిటీ నాయకులు) – ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దూరదృష్టి, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావాన్ని కొనియాడారు.ఎగ్జిక్యూషన్ టీమ్: కార్యక్రమ నిర్వహణ, వేదిక ఏర్పాట్లు, సమన్వయంలో కీలక పాత్ర పోషించిన సభ్యులు: అస్లాం, సుమంత్, యశ్వంత్ నిమ్మకాయల, గోపిరెడ్డి కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, కృష్ణ, ఆరిఫ్, డాక్టర్ నిరంజన్ చుక్కలూరు, సుబ్బారెడ్డి దుగంపూడి, శ్రీనివాస్ కొరపోరలు.అడ్వైజర్ కమిటీ: కార్యక్రమానికి విలువైన మార్గదర్శకత్వం అందించిన సలహాదారుల కమిటీ సభ్యులు:* కృష్ణారెడ్డి పసల* రాజగోపాల్ గుంటక* విశ్వనాథ్ రెడ్డి* విజయభాస్కర్ రెడ్డి* కృష్ణ ఆలంపాటి* డాక్టర్ శివ రెడ్డిఈ కార్యక్రమంలో మిస్సిసాగాతో పాటు పరిసర ప్రాంతాల నుండి వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించిన కోర్ కమిటీ సభ్యులందరికీ, ఎగ్జిక్యూషన్ టీమ్కు, అడ్వైజర్ కమిటీ సభ్యులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
మిస్ టీన్ యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకున్న కిరణ్ రెడ్డి
జార్జియాలోని డగ్లస్కు చెందిన 18 ఏళ్ల భారత సంతతి విద్యార్థిని కిరణ్ రెడ్డి మిస్ టీన్ యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకుంది. అమెరికా జాతీయ పోటీల్లో ఈ ఘనత సృష్టించిన తొలి భారత సంతతి అమెరికన్గా చరిత్ర సృష్టించింది. ఫ్లోరిడాలోని మయామిలో ఉన్న అడ్రియెన్ ఆర్ష్ట్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఆగస్టు 26న జరిగిన 44వ వార్షిక పోటీల్లో కిరన్ రెడ్డి మొత్తం 50 మంది పోటీదారులతో పోటీపడి ఈ కిరీటం దక్కించుకుంది. ఈపోటీల్లో ఆర్కాన్సాస్కు చెందిన రాక్వెల్ ఓలియా మొదటి రన్నరప్గా నిలవగా, న్యూయార్క్కు చెందిన ఎలిసా అకిన్, ఇండియానాకు చెందిన కీర్స్టెన్ అల్వరాడో, టెక్సాస్కు చెందిన క్లో బెల్లా డీట్జ్ టాప్ ఫైవ్లో నిలిచారు. ఈ ఈవెంట్కి మాజీ మిస్ రోడ్ ఐలాండ్ యూఎస్ఏ కెల్సీ స్వాన్సన్ వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. గత నెలలోనే మిస్ జార్జియా టీన్ యూఎస్ఏ టైటిల్ను గెలుచుకున తొలి అమెరికన్గా నిలిచిందామె. అంతేగాదు జార్జియా రాష్ట్రంకి ఈ పోటీ చరిత్రలో తొలి విజయాన్ని అందించిన ఘనత కూడా కిరణ్దే. ఈ మేరకు కిరణ్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ని స్వీకరించడంపై స్పందిస్తూ..ఇది తన అదృష్టంగా పేర్కొంది. తనకు చిన్నప్పటి నుంచి ఆదర్శంగా నిలవడం ఇష్టమని ఈ గెలుపుతో అది నిజమైందని అంటోంది.ఎవరామె..కిరణ్ విద్యా నేపథ్యం వచ్చేసి డగ్లస్లోని కాఫీ హైస్కూల్లో వాలెడిక్టోరియన్గా పట్టభద్రురాలయ్యారు. హైస్కూల్ విద్య పూర్తి చేసిన తర్వాత, రెడ్డి జార్జియా విశ్వవిద్యాలయంలో చేరారు, అక్కడ ఆమె ప్రీ-మెడికల్ ట్రాక్లో జీవశాస్త్రాన్ని అభ్యసిస్తోంది. ఆమె 15 ఏళ్ల వయసులో అందాల పోటీలోకి ప్రవేశించింది. 2024లో జరిగిన మిస్ జార్జియా టీన్ యూఎస్ఏ పోటీలో ఆమె మొదటి రన్నరప్గా నిలిచింది, ఆ తర్వాత ఈ ఏడాది జూలైలో మిస్ జార్జియా టీన్ యూఎస్ఏగా గెలుపొందడంతోనే ఈ జాతీయ టైటిల్కు ఆమె ప్రయాణం సుగమమైంది. ఇక ఆమె త్వరలోనే మిస్ టీన్ యూఎస్ఏగా బాధ్యతలు తీసుకోనుంది. అలాగే అక్టోబర్ 2026లో కంబోడియాలోని ఫ్నామ్ పెన్లో జరిగే మిస్ టీన్ యూనివర్స్ పోటీలో కిరణ్ రెడ్డి యునైటెడ్ స్టేట్స్కు ప్రాతినిధ్యం వహించనుంది కూడా. వీటి తోపాటు తన అండర్ గ్రాడ్యుయేట్ ప్రీ-మెడ్ చదువుని కూడా కొనసాగించాలని చూస్తోంది.(చదవండి: స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు)
టోక్యో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు
జపాన్లోని తెలుగు సమాజానికి అండగా నిలుస్తున్న TAJ (Telugu Association of Japan) ఆధ్వర్యంలో టోక్యోలోని ఓజిమా ప్రాంతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో తెలుగు కుటుంబాలతో పాటు స్థానిక జపాన్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని, భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి మరియు సంప్రదాయాలను ఆసక్తిగా వీక్షించారు. భారతీయులు, జపాన్ స్థానికులు కలిసి పండుగను జరుపుకోవడం రెండు సంస్కృతుల మధ్య స్నేహం, సాంస్కృతిక పరస్పర అవగాహనకు ప్రతీకగా నిలిచింది.శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, భజనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధా వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.“ఎక్కడ ఉన్నా మన సంస్కృతి మనతోనే” అనే భావనతో, జపాన్లోని తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, ఆచారాలు మరియు సంప్రదాయాలను పరిచయం చేస్తూనే, స్థానిక జపాన్ సమాజంతో కూడా సాంస్కృతిక అనుబంధాలను పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యోలో తెలుగు సంస్కృతి, భారతీయ సంప్రదాయాలు, జపాన్ స్థానికుల భాగస్వామ్యం, భక్తి మరియు సమాజ ఐక్యత కలగలిసి వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలు, చిన్నారులు, TAJ సభ్యులు మరియు జపాన్ స్థానికులు పరస్పరం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం అందరికీ ప్రసాద వితరణ నిర్వహించారు.జపాన్లో భారతీయ మరియు తెలుగు సంస్కృతిని కొనసాగిస్తూ, జపాన్ సమాజంతో స్నేహపూర్వక సాంస్కృతిక వారధులను నిర్మించడంలో TAJ కీలక పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు తెలిపారు.సంస్కృతి మన మూలం — స్నేహం మన బలం.జై శ్రీకృష్ణ! 🙏రాధే రాధే! 🌸
గల్ఫ్ దేశాల్లో వైఎస్సార్కు ఘన నివాళి
కడప: ఎడారి దేశాలైన కువైట్, దుబాయ్, ఖతార్, బహరైన్, సౌదీ అరేబియా, జుబైల్, ఒమన్ (మస్కట్)లలో దివంగత సీఎం డా. వైఎస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు. కువైట్లో వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో మాలియా ప్రాంతంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలిరెడ్డి మాట్లాడుతూ.. భూమి, ఆకాశం.. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి శాశ్వతంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.సౌదీఅరేబియాలోని జుబైల్లో వైఎస్సార్కు నివాళులు అర్పిస్తున్న వైఎస్సార్సీపీ అభిమానులుదుబాయ్ (యూఏఈ)లోని సోనాపూర్లో గల్ఫ్ కో–కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్రెడ్డి, ప్రసన్న సోమిరెడ్డిల సమక్షంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలుచేసిన ఘనత వైఎస్సార్దేనని కొనియాడారు.ఖతార్ దేశంలో పితాని శ్రీను విల్లాలో వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖతార్ కన్వీనర్ జాఫర్ హుస్సేన్ గల్ఫ్ కో–కన్వీనర్ దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇక బహరైన్లోని అంబేడ్కర్ క్లబ్లో వైఎస్సార్సీపీ కన్వీనర్ ఓర్సు నాగరాజు, బహరైన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ కృషిచేశారని తెలిపారు.దుబాయ్లో వైఎస్సార్కు నివాళులు అర్పిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు సౌదీ అరేబియా (జుబైల్)లో కూడా వైఎస్సార్ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ కన్వీనర్ షేక్ ఇలాహి నివాళులు అర్పించారు.ఒమన్ (మస్కట్)లో వైఎస్సార్సీపీ కన్వీనర్ భాస్కర్.. ఒమన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహానేత వర్థంతిని నిర్వహించారు. వైఎస్సార్ చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు.
క్రైమ్
భర్త ఫోన్ ఎత్తలేదని భార్య ఆత్మహత్య
భర్త తన ఫోన్ ఎత్తలేదని క్షణాకావేశంతో ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబా బాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. టౌన్ ఎస్సై బషీరుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామా నికి చెందిన దారావత్ శారద కుమార్తె అఖిల (20)ను రెండేళ్ల క్రితం మహ బూబాబాద్కు చెందిన బానోత్ హుస్సేన్కు ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఒక కుమార్తె. హుస్సేన్ మహబూ బాబాద్ జిల్లా కేంద్రంలో ఓ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో మేనేజ రుగా ఉద్యోగం చేస్తున్నాడు. అఖిల ఇటీవల తన తల్లిగారింటికి వెళ్లింది. పాప ఏడుస్తోందని భర్తతో మాట్లాడేందుకు ఈ నెల 2వ తేదీన వీడియో కాల్ చేయగా, అతను కాల్ లిఫ్ట్ చేయ లేదు. దీంతో అఖిల వెంటనే మహ బూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంటికి వచ్చింది. కొంత సమయం తర్వాత ఆమె తల్లి కూడా వారింటికిరాగా అప్పటికే అఖిల అపస్మార కస్థితిలో ఉండటంతో వెంటనే హుస్సేన్కు ఫోన్ చేసింది. అతను ఇంటికి వచ్చి అఖిల ఎలుకల మందు పేస్టు తిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. చికిత్సకోసం ఆస్పత్రికి తరలించగా, సోమవారం తెల్లవారుజామున అఖిల మృతిచెందింది.చదవండి: పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?
కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం!
హైదరాబాద్: కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో భౌరంపేట్లోని రుద్ర సంస్థ సమీపంలో ఓ కారు మంటల్లో కాలిపోతోందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే ఓ వ్యక్తి మంటల్లో కాలిపోయి ఉన్నాడు.భౌరంపేట్లోని ప్రణీత్ ప్రణవ్ మిడోస్కు చెందిన కార్తీక్(40)గా పోలీసులు గుర్తించారు. లాండ్రీ బిజినెస్ చేసే అతను రెండున్నర సంవత్సరాలుగా భార్యకు దూరంగా ఉంటున్నాడని తెలిసింది. ఆరోగ్య సమస్యలకు తోడు ఆర్థిక సమస్యలు ఉండటంతో కారులో నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇవి కూడా చదవండి: పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?
పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?
హైదరాబాద్: వివాహం జరిగిన ఆరు నెలల్లోనే ఓ ఆయుర్వేదిక్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతికి చెందిన కాక కీర్తి (28) క్యూర్ ఆర్థో ఆసుపత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తూ కుషాయిగూడ, వైష్ణవి ఎంక్లేవ్లో నివాసం ఉంటోంది. ఏడాది నుంచీ ఇక్కడే ఉంటున్న డాక్టర్ కీర్తి ఆరు నెలల క్రితం తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాఘవను వివాహం చేసుకుంది.పనిపై భర్త రాఘవ తిరుపతికి వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో వంటగదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రికి చెందిన మరో డాక్టర్ ఇంటి పైపోర్షన్లోనే కీర్తి అద్దెకు ఉంటోంది. సోమవారం విధులకు హాజరు కాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది కీర్తి ఇంటి యజమానికి సమాచారమిచ్చారు. దీంతో వారు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.కాగా కీర్తి మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లైన 6 నెలలకే ఆమె ఇలా ఆత్మహత్యకు పాల్పడటంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారం క్రితం తిరుపతికి వెళ్లిన భర్త ఎందుకు తిరిగిరాలేదు... భార్యతో గొడవపడి వెళ్లాడా లేక ఏదైనా పనిపై వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు తిరుపతి నుంచి బయలుదేరారని, వారిచ్చే ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి తెలిపారు.ఇవీ చదవండి: కువైట్లో భారీ డీజిల్ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్!
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
తెలంగాణ: కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కల్లెడ శివారు ధర్మపురి రోడ్డులో జరిగింది.స్థానికుల సమాచారం ప్రకారం.. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే అంబులెన్స్కి సమాచారం అందించి, క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించేందుకు సహాయం చేశారు.అయితే, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివరాత్రి మహేష్ (23) పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. మరో ముగ్గురిని చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంతో ఘటనాస్థలంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రమాదానికి అతివేగమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వీడియోలు
Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు
టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!
నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్
కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!
విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన
కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన
మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!
సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..
AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

