హైదరాబాద్ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)
హైడ్రా రంగనాథ్కు తీవ్ర అవమానం.. అక్కడేం జరిగిందంటే..!
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు తీవ్ర అవమానం జరిగింది. హైకోర్టు గేట్ నంబర్ 6 నుంచి ఎంట్రీకి పోలీసులు నిరాకరించారు. సాధారణ ప్రజలు వచ్చే గేట్ నంబర్ 4 నుంచి రావాలని సూచించారు. రిజిస్ట్రార్ ప్రొటోకాల్ అనుమతి అవసరమని వెల్లడించారు. గేట్ నంబర్ 4 వద్ద ప్రజలు పార్కింగ్ చేసే ప్రాంతంలో కారును ఆపి నడుచుకుంటూ వెళ్లమంటూ పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం(సోమవారం) ఆరు గంటల సమయంలో ఏవీ రంగనాథ్ కోర్టు ఎదుట హాజరైన సమయంలో ఇది జరిగింది.ఇదిలా ఉండగా.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంటలోని ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోరాదని ఆదేశాలున్నా.. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ ఆయనకు అలవాటుగా మారిందని, ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని తేల్చిచెప్పింది. ఇంత అహంకారపూరిత ధోరణి సరికాదని, ఏ పనైనా చట్టానికి లోబడే చేయాలని స్పష్టం చేసింది. ఐపీఎస్కు కూడా చెప్పాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒక కేసులో మూడు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయంటే ఆయనకు కోర్టులపై ఉన్న గౌరవం ఏంటో తెలుస్తోందని వ్యాఖ్యానించింది. నిన్న సాయంత్రం ఏవీ రంగనాథ్ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద హడావుడి నెలకొంది. ఏజీ సుదర్శన్రెడ్డి, ఏఏజీ ఇమ్రాన్ఖాన్, స్పెషల్ జీపీలు, జీపీలు అంతా విచారణకు హాజరయ్యారు. హైడ్రా తరఫున ఏజీ వాదనలు వినిపిస్తూ.. జీఎల్ఆర్(కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని భూమి) సర్వే నంబర్ 243లో 119 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దాని పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిపై సర్వే చేయడానికి, విభజన చేపట్టడానికి కొంత గడువివ్వాలని కోరారు.న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ గతంలో కలెక్టర్ ఇదే హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎందుకు విభజనకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జీఎల్ఆర్ భూమి అని చెబుతున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదన్నారు. ఐపీఎస్ అధికారైన ఏవీ రంగనాథ్కు చట్టంపై నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా ధిక్కరణ తీరుతో వ్యవహరించారన్నారు. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి అధికారం చెలాయిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి
ఆస్ట్రేలియాకు చెందిన 34 ఏళ్ల జెనిటార్ సా నా’అమోవానా ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈమె ఇటీవల నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. నలుగురూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటికే నలుగురు చిన్న పిల్లలను పెంచుతున్న ఆ దంపతుల ఇల్లు ఈ నలుగురు పాపల రాకతో మొత్తం ఎనిమిది మంది సభ్యుల కుటుంబంగా మారింది. కానీ ఈ సంతోషకరమైన పరిణామం రాత్రికి రాత్రే వారికి సరికొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది.నలుగురు ఆడపిల్లలు పుట్టడం తల్లిదండ్రులు తాము మర్చిపోలేని ఆశీర్వాదంగా అభివర్ణించారు. కానీ వారిని సంరక్షించేందుకు ఆర్థిక వనరులు అవసరమం. ముఖ్యంగా డైపర్లు, ఫార్ములా పాలు, బట్టలు లాంటి రోజువారీ ఖర్చులు ఊహించని భారమే. అయితే ఒకేసారి నలుగురు నవజాత శిశువులను పోషించేందుకు స్నేహితులు, అభిమానులు మొదట్లో చాలా సాయంగా నిలిచారు. మరికొంతమంది ఆ దంపతుల పట్ల ప్రశంసలు కురిపిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇంత పెద్ద కుటుంబాన్ని నిర్వహించే క్రమంలో సమాజం నుండి లభిస్తున్న ఈ మద్దతు వారికి ఎంతో విలువైందిగా మారింది.అయితే వీరికి ఇంకో సమస్య వచ్చి పడింది. వీళ్లందరితో ప్రయాణించేందుకు ప్రస్తుతం ఉన్న కారులో అందరూ సురక్షితంగా కూర్చోవడానికి సరిపడా సీట్లు లేవు. ఆసుపత్రి పర్యటనలు, స్కూల్ డ్రాప్లు, ఇతర ప్రయాణాలు సులభంగా సాగేందుకు 10 సీట్ల వ్యాన్ (10-seater van)అవసరం ఉంటుందని ఆ కుటుంబం భావిస్తోంది. అలాంటి వ్యాన్ను కొనుగోలు చేయడానికి ఆ తల్లి ఆన్లైన్లో విరాళాల సేకరణను (fundraising) ప్రారంభించడం విశేషంగా నిలిచింది. తమ ఏడుగురు పిల్లలందరికీ సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి సరైన వాహనం, వనరులు ఉన్నాయని నిర్ధారించుకోవడమే ఆ కుటుంబం తక్షణ లక్ష్యంగాపెట్టుకుంది.డాక్టర్ అలెక్సా బెండాల్ ఏమన్నారంటేమోనోజైగోటిక్ క్వాడ్రప్లెట్స్ (ఒకే ఫలదీకరణం చెందిన అండం నుండి ఏర్పడిన ఒకేలా ఉండే నలుగురు శిశువులు) ప్రపంచంలోనే అత్యంత అరుదైన గర్భధారణ రకాల్లో ఒకటి. నామోనా విషయంలో విశేషం ఏమిటంటే, ఆమెకు పుట్టిన ఈ నలుగురు శిశువులకు ఒకే మాయ (placenta) అని నామెనాకు వైద్యం చేసిన డాక్టర్, రాయల్ బ్రిస్బేన్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్కు చెందిన ఫీటల్ మెడిసిన్,ప్రసూతి వైద్యురాలు డాక్టర్ అలెక్సా బెండాల్ తెలిపారు. 1.5 కోట్ల కేసుల్లో ఒకరికి మాత్రమే జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఒకటి రెండు కేసులు ఉండి ఉండవచ్చు కానీ ఆస్ట్రేలియాలో తమకు తెలిసినంత వరకు ఇదే ఏకైక కేసు అని చెప్పారు. View this post on Instagram A post shared by Brisbane Times (@brisbane_times) ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్.
హైదరాబాద్ను తాకిన ఢిల్లీ సెగ
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీ కాక్రోచ్ జనతా పార్టీ సెగ హైదరాబాద్కు తగిలింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఛలో లోక్ భవన్కు పిలుపునిచ్చాయి. దీంతో విద్యార్థులు ప్రెస్క్లబ్ నుంచి లోక్ భవన్కు బయల్దేరారు. మరోవైపు రాహుల్గాంధీ చర్చలపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. పార్లమెంట్లో చర్చిస్తామంటే రాహుల్ గాంధీ ధర్నా విరమిస్తామని అన్నారు. పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధమని చెప్పా.ఐతే ఆయన వెంటనే డిమాండ్ మార్చారు. పార్లమెంట్లో చర్చ జరపడమే కాదు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చర్చించాలని మాత్రమే అన్నారు కదా అని ప్రశ్నిస్తే.. మా డిమాండ్లు మారాయని రాహుల్ సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష నేత వెంటవెంటనే మాట మార్చడం సరికాదు’ ట్వీట్లో పేర్కొన్నారు.
'72 ఏళ్లలో కేవలం రెండు సినిమాలకే'.. డైరెక్టర్
ఇంగ్లండ్ కొత్త టెస్ట్ కోచ్గా ఆస్ట్రేలియా దిగ్గజం?
దీని ముందు చాట్జీపీటీ, ఆంథ్రోపిక్ జుజుబీ
ఆగస్టు నుంచి.. మారనున్న మారుతి కార్ల ధరలు!
రాహుల్ గాంధీ ధర్నాపై కేంద్ర సర్కారు సమాధానం ఇదే..
'వాళ్లిద్దరు లేకపోతే ఇండస్ట్రీలో లేను..': వరుణ్ సందేశ్
డింపుల్ వీడియోలు వైరల్.. అఖిలేశ్ అరెస్ట్
ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కోవిడ్ కేసులు
‘తల్లికి వందనానికి’ దేవాదాయ నిధులా?
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
వారి వల్లే ఓడిపోయాం.. కానీ అతడు మాత్రం అద్భుతం: గిల్
బెంగాల్లోనూ బుల్డోజర్ న్యాయం - టీఎంసీ కార్యాలయం కూల్చివేత
బొడ్డు, నడుము ఫాంటసీ.. చాలా మారింది
ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్
పార్కింగ్ కోసం జొన్న పంటను జేసీబీతో దున్నేశారు
బంగారం, వెండి ధరలు ఇలా..
ఒకే కుటుంబానికి 10 జాతీయ అవార్డులు
టీ20 సిరీస్.. జింబాబ్వేకు బయల్దేరి వెళ్లిన టీమిండియా
తండ్రీకొడుకుల బిజినెస్ బాగుంది ఇంక ఆ ‘బిజినెస్’ గురించి ఎందుకు పట్టించుకుంటారు!
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి
భారత్లో తొలి హైడ్రోజన్ రైలు.. టికెట్ ధర ఎంతంటే?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
డైవర్స్ కావాలి: భర్త - బిడ్డను కనాలి: భార్య
విలేజ్ స్టైల్లో మెగాహీరో మాస్ పాట
జియో రీఛార్జ్లు.. తక్కువలో టాప్ 10 ప్లాన్లు
ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ
బలూచ్ బిగ్ ట్విస్ట్తో చైనా-పాక్ ఫ్రెండ్షిప్ ఖతం!
'72 ఏళ్లలో కేవలం రెండు సినిమాలకే'.. డైరెక్టర్
ఇంగ్లండ్ కొత్త టెస్ట్ కోచ్గా ఆస్ట్రేలియా దిగ్గజం?
దీని ముందు చాట్జీపీటీ, ఆంథ్రోపిక్ జుజుబీ
ఆగస్టు నుంచి.. మారనున్న మారుతి కార్ల ధరలు!
రాహుల్ గాంధీ ధర్నాపై కేంద్ర సర్కారు సమాధానం ఇదే..
'వాళ్లిద్దరు లేకపోతే ఇండస్ట్రీలో లేను..': వరుణ్ సందేశ్
డింపుల్ వీడియోలు వైరల్.. అఖిలేశ్ అరెస్ట్
ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కోవిడ్ కేసులు
‘తల్లికి వందనానికి’ దేవాదాయ నిధులా?
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
వారి వల్లే ఓడిపోయాం.. కానీ అతడు మాత్రం అద్భుతం: గిల్
బెంగాల్లోనూ బుల్డోజర్ న్యాయం - టీఎంసీ కార్యాలయం కూల్చివేత
బొడ్డు, నడుము ఫాంటసీ.. చాలా మారింది
ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్
పార్కింగ్ కోసం జొన్న పంటను జేసీబీతో దున్నేశారు
బంగారం, వెండి ధరలు ఇలా..
ఒకే కుటుంబానికి 10 జాతీయ అవార్డులు
టీ20 సిరీస్.. జింబాబ్వేకు బయల్దేరి వెళ్లిన టీమిండియా
తండ్రీకొడుకుల బిజినెస్ బాగుంది ఇంక ఆ ‘బిజినెస్’ గురించి ఎందుకు పట్టించుకుంటారు!
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి
భారత్లో తొలి హైడ్రోజన్ రైలు.. టికెట్ ధర ఎంతంటే?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
డైవర్స్ కావాలి: భర్త - బిడ్డను కనాలి: భార్య
విలేజ్ స్టైల్లో మెగాహీరో మాస్ పాట
జియో రీఛార్జ్లు.. తక్కువలో టాప్ 10 ప్లాన్లు
ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ
బలూచ్ బిగ్ ట్విస్ట్తో చైనా-పాక్ ఫ్రెండ్షిప్ ఖతం!
ఫొటోలు
హైదరాబాద్ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)
హీరోయిన్ కంటే అందంగా చెన్నై లవ్ స్టోరీ యాంకర్ చర్మిలా (ఫోటోలు)
చెల్లి సితార, ఫ్రెండ్స్తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)
వైఎస్సార్సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)
విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)
హైదరాబాద్లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)
రకుల్.. సో బ్యూటిఫుల్ (ఫొటోలు)
హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)
చీరలో పద్ధతిగా రాశీ సింగ్ (ఫొటోలు)
సినిమా
ది రాజాసాబ్ మేకర్స్ చేతికి స్పిరిట్.. అందుకేనా??
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. గతేడాది మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఈ హారర్ కామెడీ చిత్రం అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశపర్చింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ది రాజాసాబ్ మేకర్స్కు బిగ్ డీల్ కుదిరింది. ది రాజాసాబ్ నష్టాన్ని కొంచమన్నా తగ్గించుకోవడానికి అవకాశం ఇచ్చారు. రెబల్ స్టార్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ స్పిరిట్ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను ది రాజాసాబ్ మేకర్స్కు అప్పగించారు. 'స్పిరిట్' చిత్రానికి సంబంధించిన కర్ణాటక థియేట్రికల్ పంపిణీ హక్కులను పొందినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. ది రాజాసాబ్తో నష్టపోయిన నిర్మాతను ఆదుకునేందుకే ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని తెలుస్తోంది.కాగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తోన్న యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ మూవీని పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని సందీప్ రెడ్డి వంగా ఇటీవలే వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారి పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుండగా.. త్రిప్తీ దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. టీ-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తోన్న స్పిరిట్ వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 🔥A LANDMARK ALLIANCE FOR A LANDMARK FILM 🔥We proud to announce our partnership with @asiansureshent to distribute #SPIRIT across Karnataka.❤️🔥Karnataka has always showered immense love on India's Biggest Superstar #Prabhas, and this time, we're all set to create history… pic.twitter.com/DH9y86RCKT— People Media Factory (@peoplemediafcy) July 21, 2026
బాలకృష్ణకు గాయం.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ట్వీట్
సినిమా షూటింగ్లో గాయపడ్డ నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరోలు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్లో వేరు వేరుగా పోస్టులు పెట్టారు. ‘బాలా బాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం, సామర్థ్యంతో తిరిగి ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నారు’అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. Get well soon Bala Babai. Wishing you a speedy recovery and good health. Looking forward to seeing you roar back in full form…— Jr NTR (@tarak9999) July 21, 2026‘బాయ్ మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మీరు అమితంగా ప్రేమించే పని చేయడానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్ మోడ్లోకి రావాలని కోరుకుంటున్నా’ అని కల్యాణ్ రామ్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. Get well soon Babai. ❤️Wishing you a speedy recovery. I'm sure you will be back in action in no time, doing what you love the most.— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) July 21, 2026కాగా, #NBK111(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్లో బాలకృష్ణ గాయపడ్డాడు.గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్లో జరుగుతోంది. అక్కడ మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో టీమ్.. బాలకృష్ణని ఆస్పత్రికి తరలించారు. మోకాలికి గాయమైననట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కాకినాడ పోర్ట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
సూర్య మూవీతో నయనతార ఢీ.. బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందా?
లేడీ సూపర్స్టార్ నయనతార, కవిన్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ హాయ్. ఈ రొమాంటిక్ డ్రామాతో విష్ణు ఎడవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీని వెల్లడించారు. ఈ మూవీని ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.సూర్యతో నయన్ ఢీ..అయితే అదే రోజున సూర్య హీరోగా వస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా రిలీజ్ కానుంది. ఈ మూవీకి వెంక అట్లూరి దర్శకత్వం వహించారు. దీంతో నయనతార.. సూర్య చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. హాయ్ మూవీ పోటీలోకి రావడంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తిగా మారింది. కాగా.. 'హాయ్' చిత్రాన్ని నయనతార, విఘ్నేష్ శివన్ తమ బ్యానర్ 'రౌడీ పిక్చర్స్, 'సెవెన్ స్క్రీన్ స్టూడియో', 'జీ స్టూడియోస్' భాగస్వామ్యంతో నిర్మించారు. ఈ చిత్రంలో భాగ్యరాజ్, రాధికా శరత్కుమార్, ప్రభు, విటివి గణేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతం అందించారు.
ఆపరేషన్ సఫేద్ సాగర్.. ఆమె మాటలకు సిద్ధార్థ్ ఎమోషనల్
కార్గిల్ యుద్ధ నేపథ్యంలోనే వస్తోన్న సరికొత్త వెబ్ సిరీస్ ఆపరేషన్ సఫేద్ సాగర్. 1999లో జరిగిన కార్గిల్ వార్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్కు ఓని సేన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న సిరీస్ కావడంతో వైమానికి విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ రిలీజ్ వేడుక ముంబయిలో నిర్వహించారు.ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ ఎమోషనలయ్యారు. దివంగత స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా భార్య అల్కా అహుజా ట్రైలర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్కా అహుజాను వేదికపైకి ఆహ్వానించారు. అదే సమయంలో ప్రేక్షకులంతా ఆమెకు గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు. తన భర్త కథను తెరపైకి తీసుకువచ్చినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాటలు స్పష్టంగా సిద్ధార్థ్ను కదిలించాయి.. దీంతో ఆయన వేదికపై కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.ఈ సిరీస్పై నమ్మకం ఉంచినందుకు సిద్ధార్థ్ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. నిజ జీవిత యుద్ధ వీరుడి పాత్రను పోషించడానికి తాను మొదట్లో సంకోచించానని సిద్ధార్థ్ తెలిపారు. ప్రస్తుతం మన మధ్య లేని వారి పాత్రను.. ముఖ్యంగా ఒక అమరవీరుడి పాత్రను పోషించినప్పుడు మనపై చాలా పెద్ద బాధ్యత ఉంటుందని అన్నారు. హీరోలు ఎప్పుడూ హీరోల్లా కనిపించరు. వారు తమ చర్యల వల్లే హీరోలవుతారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ అంగీకరించే ముందు తాను ఈ సిరీస్ నిర్మాతలతో చాలాసార్లు చర్చించానని వెల్లడించారు. ఆయన భార్య అల్కా అహుజా అనుమతించారా?' అదే నాకు అత్యంత ముఖ్యమని మేకర్స్తో చెప్పానని గుర్తు చేసుకున్నారు. కాగా.. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రస్తుత, పదవీ విరమణ పొందిన భారత వైమానిక దళ అధికారులు కూడా హాజరయ్యారు.అజయ్ అహుజా ఎవరంటే..స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన ఒక భారత వైమానిక దళ అధికారి. కూలిపోయిన విమానంలో తోటి పైలట్ను గుర్తించే మిషన్లో ఉండగా ఆయన విమానం కూల్చివేశారు. అహుజాకు ఆయన ధైర్యసాహసాలకు, సేవకు గాను మరణానంతరం వీరచక్ర పురస్కారం లభించింది. ఆయనను ఆపరేషన్ సఫేద్ సాగర్లోని కీలక వ్యక్తులలో ఒకరిగా గుర్తుంచుకుంటారు. ఈ సిరీస్ కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం పోషించిన పాత్ర ఆధారంగా రూపొందించారు. ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్లో అభయ్ వర్మ, దియా మీర్జా, ప్రాజక్త కోలి, ఆదిల్ హుస్సేన్, మిహిర్ అహుజా, తారుక్ రైనా కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
క్రీడలు
ODI WC: భారత జట్టు ఇదే.. వాళ్లకు నో ఛాన్స్!
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లోనూ టీమిండియాకు భంగపాటే ఎదురైంది. తొలుత టీ20 సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0 క్లీన్స్వీప్ అయిన భారత జట్టు.. ఆ తర్వాత వన్డే సిరీస్లో 2-1తో ఓడిపోయింది. తొలి వన్డేలో గెలిచిన గిల్ సేన.. ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ ఓడిపోయింది.ఫిట్నెస్లేని ఆటగాళ్లకు గిల్ వార్నింగ్ముఖ్యంగా లార్డ్స్లో భారత బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఇక జస్ప్రీత్ బుమ్రా గాయం వల్ల ఈ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయాడు. అంతకుముందే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడి జట్టుకు దూరమయ్యాడు.ఇక ఈ సిరీస్ కంటే ముందే ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి కూడా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తరచూ గాయపడే ఆటగాళ్ల వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతింటోందని కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. వన్డే వరల్డ్కప్-2027లో వరుసగా ఏడు మ్యాచ్ల దాకా ఆడాల్సి ఉంటుందని.. అలాంటి కీలక సమయంలో వీరితో కష్టమేనంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.తమ ఫిట్నెస్ ప్రమాణాలు మెరుగుపడితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని గిల్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి తరుణంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ బ్యాటర్ అభినవ్ ముకుంద్ వరల్డ్కప్ జట్టును ఎంచుకున్నాడు.వారికే పెద్దపీటటాపార్డర్లో ఎలాంటి మార్పులు చేయని అభినవ్.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ- కెప్టెన్ శుబ్మన్ గిల్ జోడీని వన్డౌన్లో విరాట్ కోహ్లిని కొనసాగించాడు. అయితే బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్కు మాత్రం చోటివ్వలేదు. ఇక వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లను ఎంచుకున్న అభినవ్.. మిడిలార్డర్లో వీరితో పాటు శ్రేయస్ అయ్యర్కు చోటిచ్చాడు.ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లను ఎంచుకున్న అభినవ్ ముకుంద్.. రవీంద్ర జడేజాను పక్కనపెట్టాడు. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు స్థానమిచ్చిన అతడు.. వరుణ్ చక్రవర్తికి చోటివ్వలేదు.ఇక పేస్ విభాగంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్లకు చోటు ఇచ్చాడు. ప్రిన్స్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ పేర్లను అభినవ్ ముకుంద్ పరిగణనలోకి తీసుకోలేదు. వీళ్లు కూడా ఉండవచ్చుఅయితే, వరల్డ్కప్ టోర్నీకి ఇంకా సమయం ఉంది కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, అర్ష్దీప్ సింగ్ ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చినా అభినవ్ ఆశ్చర్యం లేదన్నాడు. కాగా వచ్చే ఏడాది సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా వేదికలుగా అక్టోబరు- నవంబరు మధ్య వన్డే వరల్డ్కప్ జరుగనుంది.వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి అభినవ్ ముకుంద్ ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.చదవండి: ఐపీఎల్ టూ ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్!
శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు
శ్రీలంక అండర్-19 బ్యాటర్లకు భారత యువ బౌలర్లు చుక్కలు చూపించారు. అద్భుతమైన ప్రదర్శనతో ఆతిథ్య జట్టును ముప్పుతిప్పలు పెట్టారు. కాగా శ్రీలంక- భారత్ అండర్-19 జట్ల మధ్య సోమవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది.భారత్ భారీ స్కోరుకొలంబో వేదికగా టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలిరోజు మూడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసిన భారత జట్టు.. 253/3 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో 105.2 ఓవర్లలో 411 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. వన్డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా (193 బంతుల్లో 111), ఆల్రౌండర్ మనాల్ చౌహాన్ (244 బంతుల్లో 150) సెంచరీలు.. యశ్వర్దన్ చౌహాన్ (89 బంతుల్లో 78) అర్ధ శతకంతో రాణించారు.శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ మూడు వికెట్లు తీయగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంకకు భారత బౌలర్లు ఆది నుంచే షాకులు ఇచ్చారు.శ్రీలంక బ్యాటర్లకు చుక్కలుఓపెనర్లలో అవీష సమాష్ (9)ను ప్రణవ్ రాఘవేంద్ర పెవిలియన్కు పంపగా.. దిమంత మహావితన (24)ను కావ్యా పటేల్ అవుట్ చేశాడు. గత మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగిన వన్డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడను ఈసారి భారత్ ఐదు పరుగులకే పరిమితం చేసింది. చిగురుపాటి వెంకట బౌలింగ్లో సెనుజ లక్ష్య రాయ్చందానికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఆ తర్వాత భారత బౌలర్లు జోరు కొనసాగించడంతో కెప్టెన్ విమత్ దిన్సార 8, కవిజ గమాగే 7, వికెట్ కీపర్ బ్యాటర్ జేసన్ ఫెర్నాండో 0 పరుగులకే పెవిలియన్ చేరారు. విరాన్ చముదిత 21, దుల్నిత్ సిగెర 31 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో మంగళవారం నాటి ఆట ముగిసేసరికి శ్రీలంక 40 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే ఇంకా 289 పరుగులు వెనుకబడి ఉంది.భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు తీయగా.. కావ్యా పటేల్, జగన్నాథ్ హెంచుదేశన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా భారత్- శ్రీలంక మధ్య తొలి అనధికారిక టెస్టు డ్రా అయింది.చదవండి: జింబాబ్వేతో శ్రేయస్ అయ్యర్ సేనకు ముప్పు
ఇంగ్లండ్కు భారీ షాక్
ది హండ్రెడ్ లీగ్-2026కు ముందు బర్మింగ్హామ్ ఫీనిక్స్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెతల్ గాయం కారణంగా హండ్రెడ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. భారత్తో జరిగిన మూడో వన్డేలో బెతల్ మోకాలికి గాయమైంది.మ్యాచ్ ముగిసిన తర్వాత అతడిని అస్పత్రికి తరలించి స్కాన్ చేయగా గాయం తీవ్రమైనదిగా తేలింది. దీంతో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని బెతల్కు వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు హెండ్రెడ్ లీగ్కు దూరమయ్యాడు.ఆగస్టు 19 నుంచి స్వదేశంలో శ్రీలంకతో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్కు కూడా బెతల్ అందుబాటులో ఉండే సూచనలు కనిపించడం లేదు. ఆ తర్వాత జరిగే టీ20ల్లో బెతల్ ఆడే అవకాశముంది.కాగా ఈ యువ ఆటగాడు ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇటీవల భారత్తో జరిగిన టీ20, వన్డే సిరీస్లోనూ బెతల్ సత్తాచాటాడు. ఇక బెతల్ గైర్హజరీలో బర్మింగ్హామ్ ఫీనిక్స్ జట్టు కెప్టెన్గా డొనావన్ ఫెరీరా వ్యవహరించనున్నట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి.బర్మింగ్హామ్ ఫీనిక్స్ జట్టు ఇదేరెహాన్ అహ్మద్, జో క్లార్క్, స్కాట్ కర్రీ, లారీ ఎవాన్స్, డొనోవాన్ ఫెరీరా, సాకిబ్ మహమూద్, మ్యాథ్యూ మోంట్గోమరీ, మిచ్ ఓవెన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, విల్ స్మీడ్, ఉస్మాన్ తారిక్, జోర్డాన్ థాంప్సన్, క్రిస్ వుడ్, సీన్ డిక్సన్, టామ్ హెల్మ్..
జింబాబ్వేతో టీ20 సిరీస్.. శ్రేయస్ సేనకు ముప్పు వీరితోనే!
వరుసగా మూడు వైట్బాల్ సిరీస్లను కోల్పోయిన టీమిండియా వారం రోజులు తిరగక ముందే మరో కీలక పోరుకు సిద్దమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్లో తలపడనుంది. ఇప్పటికే జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. వరుస పరాజయాల తర్వాత టీమిండియా మళ్లీ గెలుపు బాట పట్టడానికి ఈ టీ20 సిరీస్ అత్యంత కీలకంగా మారింది. అయితే పేపర్ మీద భారత్ అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తున్నప్పటికి టీ20 ఫార్మాట్లో మాత్రం జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పసికూనే కాదా అని తేలికగా తీసుకుంటే మన జట్టుకు మరో పరభావం ఎదురవ్వకతప్పదు. ఎందుకంటే తమ సొంతగడ్డపై జింబాబ్వే బంగ్లాదేశ్పై వరుస విజయాలు సాధించి మంచి జోష్లో ఉండి. తాజాగా టీ20 సిరీస్ను కోల్పోయినప్పటికి ఆ జట్టు ఆటగాళ్లంతా సూపర్ ఫామ్లో ఉన్నారు. టీ20 ప్రపంచకప్-2026లో పటిష్టమైన ఆస్ట్రేలియాను సైతం జింబాబ్వే చిత్తు చేసింది. ఈ క్రమంలో జింబాబ్వే బలాలు, బలహీనతలను ఓసారి పరిశీలిద్దాం.రజాతో డెంజర్..ముఖ్యంగా ఆ జట్టుకు కెప్టెన్ సికందర్ రజా అతిపెద్ద బలం. అతడు బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ టీమ్ను ముందుండినడిపించగలడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఆడిన అనుభవం అతడికి ఉంది. ఒంటో చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. మ్యాచ్పై భారత్ పట్టు సాధించాలంటే అతడిని తొందరగా పెవిలియన్కు పంపాల్సిందే. బంతితో కూడా మ్యాజిక్ చేయగలడు.అతడి ఆఫ్ స్పిన్ను భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఎదుర్కొవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఆడితే వికెట్ సమర్పించుకోక తప్పదు. మరోవైపు యువ ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ నుంచి భారత జట్టుకు ముప్పు పొంచి ఉంది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియాపై బెన్నెట్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన మల్టీ ఫార్మాట్ సిరీస్లలో కూడా అతడు దుమ్ములేపాడు.అతడి వికెట్ను ఆరంభంలోనే భారత్ సాధిస్తే ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టవచ్చు. బెన్నెట్తో పాటు మరో బెన్ కుర్రాన్ రూపంలో మరో అద్భుతమైన ఓపెనర్ జింబాబ్వే వద్ద ఉన్నాడు. బంగ్లాదేశ్తో వన్డేలో బెన్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ సామ్ కుర్రాన్ సొదరుడే ఈ బెన్ కుర్రాన్ కావడం గమనార్హం. మిడిలార్డర్లో రియాన్ బర్ల్ వంటి సీనియర్ ఆల్రౌండర్ ఉన్నాడు. వీరితో పాటు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ బ్యాట్తో కూడా మెరుపులు మెరిపించగలడు. బౌలింగ్లో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ వంటి స్పీడ్ స్టార్లు ఉన్నారు.బలహీనతలు ఇవేఅయితే బ్యాటింగ్ ఆర్డర్లో స్థిరత్వం లేకపోవడం జింబాబ్వే ప్రధాన సమస్యగా ఉంది. టాప్ ఆర్డర్ త్వరగా వికెట్లు కోల్పోతే మిడిల్ ఆర్డర్ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. కొన్నిసార్లు మెరుగైన ఆరంభం లభించినప్పటికి పవర్ ప్లే తర్వాత వరస వికెట్లు కోల్పోయి చిత్తు అయిన సందర్భాలు ఉన్నాయి. సికందర్ రజా లేదా బెన్నెట్పై కూడా అతిగా ఆధారపడడం కూడా వారి బలహీనతగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సరైన బెంచ్ బలం కూడా జింబాబ్వే వద్ద లేదు.
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
రామాయపట్నంలో భారీ స్కామ్... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
తెలంగాణలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లయితే రాజకీయ సన్యాసం చేస్తా... సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్
నంబర్ 1 నుంచి నేలచూపులే... నీతి ఆయోగ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు భారీగా పతనం
ఏపీ సమస్యలపై ఎలుగెత్తాలి. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తాం... ఆక్వా రైతులతో ముఖాముఖిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
పల్నాడు కలను సాకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... 100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల కొత్త మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో మరో కుంభకోణానికి తెరతీసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... ల్యాప్టాప్ల కొనుగోలులో దోపిడీకి స్కెచ్
బిజినెస్
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 238.41 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 77,470.11 వద్ద, నిఫ్టీ 50.80 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 24,187.70 వద్ద నిలిచాయి.ఆస్థా స్పిన్టెక్స్ లిమిటెడ్, జిందాల్ వరల్డ్వైడ్ లిమిటెడ్, కేసీపీ షుగర్ & ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్, వెస్ట్లైఫ్ ఫుడ్వరల్డ్ లిమిటెడ్, విమ్తా ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇండో బోరాక్స్ & కెమికల్స్ లిమిటెడ్, పనాసియా బయోటెక్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్, ఏకేజీ ఎగ్జిమ్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
గూగుల్ ఉద్యోగుల ఆందోళన.. సుందర్ పిచాయ్కు వినతి!
ప్రపంచవ్యాప్తంగా ఏఐ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల పనులు వేగంగా, సులభంగా పూర్తవుతున్నాయి. అయితే.. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోతాయా?.. అనే భయం కూడా చాలా మందిలో పెరుగుతోంది. ఇదే ఆందోళన ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం అయిన గూగుల్ ఉద్యోగుల్లో కూడా కనిపిస్తోంది. దీంతో సుమారు 4500 మందికిపైగా ఉద్యోగులు సీఈఓ సుందర్ పిచాయ్కు ఒక పిటిషన్ సమర్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.సుందర్ పిచాయ్కు అందించిన పిటిషన్లో.. ఏఐ కోసం కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతూనే, మరోవైపు ఉద్యోగులను తొలగించడం సరికాదని వెల్లడించారు. ఉద్యోగులకు భద్రత కల్పించే విధంగా.. కొత్త విధానాలు తీసుకురావాలని వారు కోరారు. అంతే కాకుండా క్యాంపస్ వెలుపల 100 మంది ఉద్యోగులు శాంతియుతంగా నిరసన కూడా చేపట్టారు. ఉద్యోగ భద్రత కోసం.. గూగుల్ చరిత్రలో జరిగిన అతిపెద్ద ఉద్యమాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు.ఉద్యోగుల డిమాండ్ ఏమిటంటే కంపెనీ లేఆఫ్లు చేయాల్సి వచ్చినా.. ముందుగా స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలే అవకాశం ఇవ్వాలి. ఉద్యోగం కోల్పోయే వారికి తగిన సెవరెన్స్ ప్యాకేజీ అందించాలి. అలాగే ఉద్యోగుల పనితీరును అంచనా వేసే విధానంలో కూడా మార్పులు చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం చాలామందికి అన్యాయం చేస్తోందని ఉద్యోగులు భావిస్తున్నారు.గతంలో కూడా గూగుల్ ఉద్యోగులు.. నైతిక అంశాలపై, ఏఐ వినియోగంపై నిరసనలు చేశారు. కానీ.. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పుడు వారి ఆందోళన పూర్తిగా తమ ఉద్యోగాల గురించే. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయనే భయం వారిని ఈ ఉద్యమానికి దారితీసింది.ఇదీ చదవండి: వెకేషన్కు వెళ్లాడు.. ఉద్యోగం పోయింది!
ఏఐ మానియా.. లాభాలు ఎప్పుడొస్తాయో!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఆధిపత్యం కోసం ప్రపంచ టెక్ దిగ్గజాలు చేస్తున్న విచ్చలవిడి వ్యయం, వారి ఆర్థిక మూలాలపై ఊహించని ప్రతికూల ప్రభావం చూపుతోంది. మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్, మెటా, ఒరాకిల్ వంటి సంస్థలు ఏఐ మౌలిక సదుపాయాలు, అత్యాధునిక డేటా సెంటర్లు, ప్రాసెసింగ్ చిప్లు, విద్యుత్ వనరుల కోసం మూలధన వ్యయాన్ని ఊహించని రీతిలో పెంచేస్తున్నాయి. అయితే, ఈ స్థాయిలో పెడుతున్న పెట్టుబడులకు తగ్గట్టుగా స్వల్పకాలంలో ఆదాయం సమకూరకపోవడంతో కంపెనీల ఫ్రీ క్యాష్ ఫ్లో వేగంగా తగ్గిపోతోంది.ఆదాయానికి మించిన మూలధన వ్యయంప్రధాన కంపెనీ మొత్తం వార్షిక మూలధన వ్యయం 600- 650 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఇందులో దాదాపు 75 శాతం నిధులు నేరుగా ఏఐ మౌలిక వసతులకే కేటాయిస్తున్నారు. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పెరుగుదల కంటే ఈ మూలధన వ్యయం వేగంగా పెరుగుతుండటంతో ఆర్థిక సమతుల్యత దెబ్బతింటోంది. అమెజాన్ వంటి సంస్థల ఎఫ్సీఎఫ్ ఇప్పటికే ప్రతికూల పరిధిలోకి వెళ్లగా ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ల మిగులు నగదు నిల్వలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.అప్పుల వైపు బిగ్ టెక్ సంస్థలుఇంతకాలం రిజర్వుల్లో ఉన్న సొంత నిధులతోనే కార్యకలాపాలు సాగించిన బిగ్ టెక్ కంపెనీలు ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్లు, కార్పొరేట్ అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అపారమైన క్యాపెక్స్ అవసరాలను తీర్చుకోవడానికి బాండ్ల జారీ ద్వారా బిలియన్ల డాలర్ల రుణాలు సమీకరిస్తున్నాయి. దీంతో ప్రపంచ క్రెడిట్ మార్కెట్లలో టెక్ రంగం అత్యంత వేగంగా అప్పులు తీసుకుంటున్న విభాగంగా మారింది.ఇన్వెస్టర్ల ఆందోళనవాల్ స్ట్రీట్, గ్లోబల్ ఇన్వెస్టర్లలో ఇప్పుడు ప్రధానంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ (ఆర్ఓఐ)పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ మోడళ్ల అభివృద్ధికి, శ్రమకు అవుతున్న నిరంతర వ్యయంతో పోలిస్తే వ్యాపార రాబడి నిమ్మదించడంతో షేర్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు పెరుగుతున్నాయి.సుదీర్ఘకాలంలో ఏఐ అందించే విప్లవాత్మక మార్పులు, వ్యాపార అవకాశాలను దృష్టిలో ఉంచుకుని టెక్ దిగ్గజాలు ఈ రిస్క్ తీసుకుంటున్నాయి. అయితే, స్వల్పకాలంలో ఈ పెట్టుబడులు లాభాలుగా మారకపోతే కంపెనీల వ్యాల్యుయేషన్లపై, క్రెడిట్ రేటింగ్లపై ఒత్తిడి తప్పకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్లోకి పసిడి.. నేటి ధరలు ఇలా..
ఐఆర్జీసీ ప్రతీకార దాడులు
అమెరికా సైనిక, ఆర్థిక, సాంకేతిక మౌలిక వసతులే లక్ష్యంగా ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది. దీనిలో భాగంగా బహ్రెయిన్లో ఉన్న ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం అమెజాన్కు చెందిన ప్రధాన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది.ఆపరేషన్ నస్ర్-2లో భాగంగా ప్రతికార దాడిఇరాన్ అధికారిక వార్తా సంస్థల (ఐఆర్ఎన్ఏ, తస్నీమ్) వివరాల ప్రకారం.. తమ ఏరోస్పేస్ బలగాలు ఆపరేషన్ నస్ర్-2లో భాగంగా దాడులను నిర్వహించాయి. ఇటీవల ఇరాన్లోని దార్ఖోవిన్ వద్ద అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణలో నిర్మాణంలో ఉన్న పౌర అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా బలగాలు జరిపిన వైమానిక దాడులకు నిరసనగా ఈ క్షిపణి దాడి చేపట్టినట్లు ఐఆర్జీసీ స్పష్టం చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) హార్మూజ్ జలసంధిలో నౌకాయాన భద్రత నెపంతో ఇరాన్ స్థావరాలపై దాడులకు దిగుతుండటంతో ఇరాన్ సైతం గల్ఫ్ రీజియన్లోని అమెరికా రాడార్ వ్యవస్థలు, వైమానిక స్థావరాలతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ డిజిటల్ వనరులను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది.స్వతంత్ర వర్గాల స్పందన.. ప్రస్తుత పరిస్థితిఐఆర్జీసీ చేసిన ఈ క్షిపణి దాడి ప్రకటనపై అమెజాన్ సంస్థ గానీ, బహ్రెయిన్ ప్రభుత్వ వర్గాలు గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధ్రువీకరణ విడుదల చేయలేదు. దాడి వల్ల జరిగిన ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం వివరాలపై స్వతంత్ర వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.గ్లోబల్ టెక్నాలజీ, ఆర్థిక రంగాలపై ప్రభావంయుద్ధాల్లో కేవలం మిలిటరీ క్యాంపులనే కాకుండా ప్రధాన టెక్ కంపెనీల డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ విశ్లేషకులను ఆందోళనకు గురిచేస్తోంది. బహ్రెయిన్ వంటి కీలక ఆర్థిక కేంద్రంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మౌలిక వసతులపై దాడి జరగడం వల్ల ప్రాంతీయ డిజిటల్ సేవలు, గ్లోబల్ సప్లై చైన్, అంతర్జాతీయ వాణిజ్య నెట్వర్క్లు దెబ్బతినే ప్రమాదముంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో భద్రతా సంక్షోభాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్లోకి పసిడి.. నేటి ధరలు ఇలా..
ఫ్యామిలీ
ఐవరీ చీరలో ‘రాధమ్మ’ను తలపిస్తున్న నీతా అంబానీ!
నీతా అంబానీ ధరించే చీరలే సందర్భం ఏంటో చెప్పేస్తాయి. కార్యక్రమానికి అనుగుణమైన వస్త్రాధారణతో తన ఫ్యాషన్ అభిరుచి ఏంటో చెప్పకనే చెప్పేస్తారామె. ముఖ్యంగా భారతీయ గొప్ప వారసత్వాన్ని చాటిచెప్పేలా హస్తకళకు అద్దంపట్టే చీరలతో అందర్నీ ఆశ్చర్యపర్చడమే గాక మన కళాకారుల నైపుణ్యాన్ని ఎలుగెత్తి చాటుతారామె. ఈసారి కూడా అలాంటి అందమైన చీరలో దివ్యంగా కనిపించింది నీతా అంబానీ. తన శారీతో ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని మేకప్ ఆర్టిస్ట్ స్మారవ్ రాయ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తన ఇంట జరిగే కృష్ణుడి పూజ కోసం..శ్రీకృష్ణుడి స్ఫూర్తితో రూపొందించిన ఐవరీ చీరలో ప్రత్యేకంగా కనిపించింది. ఫ్యాషన్ని సందర్భానుసారంగా స్టైలిష్గా కనిపించడంలో నీతాకు సాటిలేరని చెప్పొచ్చు. ప్రకాశవంతమైన సంప్రదాయంతో ఫ్యాషన్ని చాటుతుందామె. ఈసారి కూడా అలానే ఇంట్లో జరిగే పూజ కోసం కృష్ణుడి స్ఫూర్తితో రూపొందించిన ఐవరీ రంగు చీరలో దివి నుంచి భువికి వచ్చిన దేవతాలా మెరిసింది. తెల్ల గన్నెరు రంగు చీరపై పురాతన బంగారు, వెండి జరీతో కృష్ణుడి రూపాన్ని అందంగా ఎంబ్రాయిడరీ చేశారు. చీర అంతటా ఆ చిన్న కృష్ణుడి మోటీప్లను ఆలోచనాత్మకం నేయడం విశేషం. ఆ శారలో అద్భుతంగా ఎంబ్రాయిడరీ చేసిన అంచు, క్లిష్టమైన పూల నమునాలు ప్రధాన ఆకర్షణగా కనిపించాయి. ఏక వర్ణంగా ఉండే ఈ చీరకు ఆ డిజైన్ అద్భుతమైన లుక్ని ఇచ్చింది. అలాగే పల్లు కూడా పారదర్శకమైన ఆర్గాంజా వస్త్రంతో కూడిన వంపుల అంచు ఆమె భుజాల మీద నుంచి అందంగా జాలువారింది. ఆ చీరకు మ్యాచింగ్గా నిరాడంబరైమన గుండ్రని మెడ, హాఫ్ హ్యాండ్స్..ఆ చీరపై ఉన్న క్లిష్టమైన హస్తకళా నైపుణ్యం స్పష్టంగా కనిపించేలా ఆకర్ణగా నిలిచింది. ఆ అందమైన లుక్కి అనుగుణంగా ధరించిన వజ్రాభరణాలు మరింత శోభను చేకూర్చాయి. ముఖ్యంగా ఎమరాల్డ్-కట్ రాళ్లతో కూడిన పొరల వజ్రాల నెక్లెస్, దానికి సరిపోయే పూల చెవిపోగులు, వరుసగా పేర్చిన వజ్రాల బ్రాస్లెట్లు, వరుసగా పేర్చిన వజ్రాల బ్రాస్లెట్లు, ఒక పెద్ద కాక్టెయిల్ ఉంగరం వంటి జ్యువెలరీ నీతాకు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన లుక్ని అందించాయి. అలాగే కురులను ముడివేసి, ముఖానికి లైట్ మేకప్తో చక్కటి గుండ్రటి బొట్టుతో సంప్రదాయం మేళవింపుతో కూడిన ఆధునిక మహిళలా మెరిసింది నీతా అంబానీ. View this post on Instagram A post shared by Sourav Roy| Hair & Makeupartist (@souravv_roy_) (చదవండి: కాంచీపురం చీరలో దేవతలా సాయిపల్లవి..!)
సాధారణ బైక్ నుంచి బీఎండబ్ల్యూ రేంజ్కి..!
సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటే ఆ ఫీల్ ఆ ఆనందం మాటలకందనిది. ఒక్కసారిగి వెనుతిరిగి చూసుకుంటే..ఇంత పెద్దస్థాయికి ఎలా చేరుకున్నాను అని ఆశ్చర్యం, గర్వం ఒకేసారి కలుగుతాయి. అంతేగాదు అందుకోసం మనవాళ్లు చేసిన త్యాగాలు కళ్లుముందు మెదలడమే కాదు..అందుకు తగ్గట్టుగా ప్రయోజకుడై వాళ్లను బాగా చూసుకుంటే..అంతకుమించిన సంతృప్తి ఇంకొకటి ఉండదు. ఆ ఆనందాన్నే ఓఎన్నారై ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది.మధురకు చెందిన ఎన్నారై అమిత్ కశ్యప్ షేర్ చేసిన వీడియో నెట్టింట హాట్టాపిక్గా మారింది. భారతదేశంలోని సాధారణ బైక్ నుంచి అమెరికాలో బీఎండబ్ల్యూ కొనుగోలు చేసే రేంజ్కి తాను ఎలా చేరుకున్నాడో ఇన్స్టాగ్రామ్ రీల్లో పంచుకున్నాడు. ఒకప్పుడు భారతదేశంలో తన వద్ద ఒక బైక్ మాత్రమే ఉండేదని, కానీ ఈరోజు అమెరికాలో తన సొంత ఇంటి గ్యారేజ్లో కారుని పార్క్ చేస్తున్నానని అని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది అన్నాడు. ఉత్తరప్రదేశ్లోని మధురకు చెందిన తాను ప్రస్తుతం అమెరికాలో టెక్సాస్లో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన పేరెంట్స్ కోసం అమెరికాలో ఒక ఇల్లు కొన్నట్లు తెలిపాడు. అమెరికా రోడ్లపై బీఎండబ్ల్యూ కారుని నడపడమే కాదు, అందులో మా అమ్మనాన్నలతో కలిసి ప్రయాణిస్తున్నానని అన్నారు. అంతేగాదు తాను కట్టిన ఇల్లుని అమ్మకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు కూడా. తను ఈ రోజు ఈ ఉన్నత స్థాయిలో ఉన్నానంటే అందుకు తన పేరెంట్స్ చేసిన త్యాగాలేనని గుర్తుచేసుక్న్ననారు. డబ్బు ఆదా చేసేందుకు తన తల్లి మట్టిపొయ్యి మీద వంట చేయడంతో సహా, ఎన్నెన్నో త్యాగాలు చేశారు. తమ సొత ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేసి మరి మంచి స్కూల్కి పంపించారని, అలాగే ఇంజనీరింగ్ ఫీజుల కోసం ప్రతి పైసాను ఎలా కూడబెట్టేవారో తాను ఇప్పటికీ మర్చిపోనని అన్నారు. అంతేగాదు అలా మట్టిపోయ్యి మీద వండుతున్నప్పుడు ఆ పొగతో ఆమె పడ్డ బాధ ఇప్పటికీ గుర్తుందని భావోద్వేగంగా మాట్లాడారు. అంతేగాదు ఆ పరిస్థితుల్లో ఏదో ఒక రోజు మంచి స్థాయికి చేరుకుని మా కుటుంబానికి ఉన్న మధ్యతరగతి అన్న ముద్రను మార్చేయాలని ఎంత బలంగా అనుకునేవాడో నాటి సంఘటనలను గుర్తుతెచ్చుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ తాను మంచిహోదాకు చేరుకుని ఆ కలను నిజం చేసుకున్నా.. అని సగర్వంగా చెబుతూ వీడియోని ముగించారు. అంతేగాదు కశ్యప్ సక్సెస్ జర్నీపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఓపికగా, నిలకడగా ఉంటే విజయ తథ్యం అదే కశ్యప్ చేసి చూపించారని పలువురు పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Amit Kashyap (@amitkashyap._) (చదవండి: రన్నింగ్ జస్ట్ ఫిట్నెస్ కాదు! అంతకుమించి..)
రన్నింగ్ జస్ట్ ఫిట్నెస్ కాదు! అంతకుమించి..
ఆరోగ్యం కోసం వ్యాయామాలు, వాకింగ్ , రన్నింగ్ వంటివి అన్ని చేస్తుంటాం. ఇది సర్వసాధారణం. చాలామంది రోజువారి దినచర్యలో భాగం కూడా. కానీ అదొక జస్ట్ రోజు చేసే ఒక సాధారణ దినచర్య కాదని, అంతకుమించి అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా అంటూ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. నిజాయితీగా వెల్లడించిన ఆ అభిప్రాయం నెటిజన్ల మనసుని హత్తుకుంది. ఆ వీడియోలో ప్రఖర్ నేగి అనే ఇన్స్టాగ్రామ్ వినియోగదారుడు తనకు 29 ఏళ్లు అని, స్థిరమైన ఉద్యోగం కూడా ఉందని చెప్పాడు. గురుగ్రామ్లో రాత్రి 7:30 గంటలకు తాను 15 కిలోమీటర్లు పరుగెత్తడానికి కారణం ఏదో తప్పనిసరి పరిస్థితులు కాదని, తనను కాపాడటానికి ఎవ్వరూ రారని తెలుసుకోవడమేనని అన్నారు. తాను సాధించాల్సిన లక్ష్యాలు తనంతట తానే సాధించుకోవాలని అన్నారు. ఇది అంగీకరించేందుకు కష్టంగా ఉన్నా..ఇదే నిజం అని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలనే ఆశావాదం పెంపొందించుకుంటే..ఏదైనా సాధ్యమేనని మనఃపూర్వకంగా విశ్వసించాలని అన్నారు. అలా రోజు చేయడం కాస్త కష్టం ఉన్నా..గొప్పగా లైప్ ఉండాలి, మరిన్ని చూడాలంటే తప్పదని అన్నారు. అలాంటి వాళ్ల గొప్ప విజయాలకు అర్హులని చెప్పారు. దయచేసి మీరు కూడా ఇలాంటి ఆశావాహ దృక్పథాన్నే అలవరుచుకోవాలని పిలుపునిస్తూ..అందరికీ "హ్యాపీ రన్నింగ్" శుభాకాంక్షలని చెప్పారు. నెటిజన్లకు ప్రఖర్ పంచుకున్న ఆలోచనలు ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు..ఆరోగ్యంగా ఉండటంపై మంచి స్ఫూర్తినిచ్చారు, ధన్యవాదాలు అని పోస్టులు పెట్టడం విశేషం. View this post on Instagram A post shared by Prakhar Negi (@negisdayintheliferunning) (చదవండి: కేవలం ఆటో నడుపుతూ నెలకు రూ. 60 వేలు..!)
పీక్ సీజన్లో హోటళ్లు చవకగా బుక్ చేసుకోవాలంటే...
సెలవులు, పండుగలు, లాంగ్ వీకెండ్లు... ఇలా పీక్ సీజన్ లో ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా గుర్తొచ్చే సమస్య హోటల్ ధరలే. అదే గది సాధారణ రోజుల్లో ఒక ధర ఉంటే, పీక్ సీజన్ లో మరో ధర ఉంటుంది. అయితే కొంచెం తెలివిగా ప్లాన్ చేస్తే 20 నుంచి 40 శాతం వరకు డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. అందుకోసం ఈ 12 సులభమైన చిట్కాలు ఉపయోగపడతాయి.1. సరైన సమయంలో బుకింగ్ చేయండి..వారం మధ్యలో, ముఖ్యంగా డిమాండ్ తక్కువగా ఉండే సమయంలో ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు ధరలు పరిశీలించి బుక్ చేయండి.2. వ్యక్తిగత బ్రౌజింగ్ లేకుండా వెతకండి..ఒకే హోటల్ను పదేపదే వెతికితే ధరల్లో మార్పు కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే వ్యక్తిగత బ్రౌజింగ్ సమాచారం లేకుండా లేదా మరో పరికరం ద్వారా కూడా ఒకసారి ధరలు పరిశీలించండి.3. ప్రధాన ప్రాంతం కాకుండా..పర్యాటక ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న హోటళ్లు ఖరీదుగా ఉండే అవకాశం ఎక్కువ. రెండు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల్లో వెతికితే తక్కువ ధరకే మంచి వసతి దొరకొచ్చు.4. వారాంతపు రోజులను వీలైతే ఎవాయిడ్ చేయండి..శని, ఆదివారాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు సోమవారం నుంచి గురువారం మధ్య బుకింగ్ చేసుకునేలా ప్రయాణ ప్రణాళిక రూపొందించండి.5. హోటల్తో నేరుగా మాట్లాడండి..ఆన్ లైన్ లో కనిపించిన ధరను ప్రస్తావిస్తూ హోటల్కు నేరుగా ఫోన్ చేస్తే కొన్నిసార్లు అదే ధరకు లేదా ఇంకా తక్కువకు గది ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఎర్లీ చెకిన్ లేదా లేట్ చెకిన్ చేసే సౌకర్యం కూడా లభించవచ్చు.6. ఫుడ్ ఉన్న ప్యాకేజీలను ఎంచుకోండి..గదితో పాటు అల్పాహారం లేదా రాత్రి భోజనం కలిపి ఇచ్చే ప్యాకేజీలు ఎంచుకుంటే విడిగా ఖర్చు చేయడంకంటే చవకగా ఉండొచ్చు.7. ఫిల్టర్ కరెక్టుగా చేయండి..మంచి రేటింగ్, సరైన ప్రదేశం, తక్కువ ధర వంటి ప్రమాణాలతో హోటళ్లను ఫిల్టర్ చేసుకుంటే చూసుకుంటే మంచి వసతి సులభంగా దొరుకుతుంది.8. ముందుగానే బుక్ చేసుకోండి..ప్రయాణ తేదీ ముందే ఖరారైతే కనీసం రెండు నెలల ముందే బుక్ చేసుకోవడం మంచిది. ఫ్రీ కేన్సిలేషన్ సౌకర్యం ఉన్న రూమ్ని ఎంచుకుంటే తరువాత ధర తగ్గినప్పుడు మళ్లీ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.9. హోటల్కు వెళ్లిన తర్వాతే చెల్లించండి..ఇలా చెకిన్ చేసిన తరువాత పే చేసే అవకాశం ఉంటే ధరలు, రూల్స్ చెక్ చేయండి. అయితే ముందుగా పక్కాగా చెల్లించాలా లేదా అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.10. ఆఫర్లను యూజ్ చేసుకోండి..వివిధ బుకింగ్ ప్లాట్ఫామ్లు, బ్యాంకులు, యూపీఐ సేవలు అందించే ఆఫర్లు, కూపన్లు, రివార్డ్ పాయింట్లను ఉపయోగించుకుంటే మరింత ఆదా చేయవచ్చు.11. రద్దీ సమయంలో వద్దు..సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎక్కువ మంది బుకింగ్ చేయడం వల్ల ధరల్లో మార్పులు ఉండొచ్చు. వీలైతే మధ్యాహ్నం లేదా సాయంత్రం ముందుగానే బుకింగ్ ప్రయత్నించండి.12. నియర్ బై టౌన్స్ చెక్ చేయండిప్రధాన ప్రాంతంలోని హోటళ్లు పూర్తిగా నిండిపోయినప్పుడు సమీప పట్టణాలు లేదా శివారు ప్రాంతాల్లో వెతికితే తక్కువ ధరకే మంచి వసతి దొరికే అవకాశం ఉంటుంది.చివరగా...ఒకే వెబ్సైట్పై ఆధారపడకుండా కనీసం రెండు లేదా మూడు బుకింగ్ వేదికల్లో ధరలను పోల్చండి. హోటల్ రివ్యూలు, కేన్సిలేషన్, అదనపు ఛార్జీలను పరిశీలించిన తర్వాతే బుకింగ్ చేయండి.
అంతర్జాతీయం
యూకే ప్రధానిగా ఆండీ బర్న్హమ్
లండన్: యూకే లేబర్ పార్టీ నేతగా ఇటీవల ఎన్నికైన ఆండీ బర్న్హమ్(56) సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు, ఉదయం కీర్ స్టార్మర్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే కింగ్ చార్లెస్–3 లేబర్ పార్టీ నేతగా ఉన్న బర్న్హమ్కు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహా్వనం పంపారు. ఆ మేరకు బర్న్హమ్ వెళ్లి బకింగ్హమ్ ప్యాలెస్లో కింగ్ చార్లెస్ను కలుసుకున్నారు. అనంతరం భార్య మేరీ– ఫ్రాన్స్ వాన్ హీల్, కొందరు పార్టీ నేతలతో కలిసి 10 డౌనింగ్ స్ట్రీట్లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మొట్టమొదటి ప్రసంగంలో.. బ్రిటన్ను రాజకీయంగా, ఆర్థికంగా కొత్తపుంతలు తొక్కించే సరికొత్త సాధనంగా తన ప్రభుత్వం ఉంటుందని ప్రకటించారు. రాజకీయాలను ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత ప్రాధాన్యత ఇచ్చేలా మారుస్తానని చెప్పారు.
గెలుపంటే ఇదేకదా.."డెలివరీ బాయ్టూ చైనా సాహిత్య పురస్కారం"
బీజింగ్: పొట్టకూటికోసం వీధుల వెంట పరుగులు తీస్తూ డెలివరీ బాయ్గా పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు ఏకం ఒక సాధారణ ఫుడ్ డెలివరీ బాయ్.. చైనాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారాన్ని కైవసం చేసుకుని అంతర్జాతీయంగా సంచలనం సృష్టించారు. 56 ఏళ్ల వాంగ్ జిబింగ్ రాసిన "మ్యాన్ ఇన్ ఎ హర్రీ" అనే కవితా సంకలనానికి ఆ దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం ‘లుక్సున్" పురస్కారం లభించిందికష్టాల నుంచి కవిత్వం వైపుచైనాలోని జియాంగ్సు ప్రావిన్స్కు చెందిన వాంగ్ జిబింగ్ జీవితం అంతా ఒడిదుడుకులతోనే సాగింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నతనంలోనే చదువుకు దూరమైన వాంగ్.. పొట్టకూటి కోసం ఎన్నో పనులు చేశారు. భవన నిర్మాణ కార్మికుడిగా, వ్యర్థాలు సేకరించే వ్యక్తిగా, రోడ్డు పక్కన చిరు వ్యాపారిగా మారారు. చివరకు 2019లో కున్షాన్ నగరంలో ఫుడ్ డెలివరీ బాయ్గా స్థిరపడ్డారు.రోజుకు 12 నుంచి 14 గంటల పాటు సైకిళ్లు, బైకులపై తిరుగుతూ డెలివరీలు ఇచ్చే క్రమంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలే ఆయనలోని కవిని మేల్కొలిపేలా చేశాయి.ఒక్క ఘటన జీవితాన్నే మార్చింది2019లో ఒక కస్టమర్ తప్పుడు అడ్రస్ ఇవ్వడం వల్ల వాంగ్ చాలా ఇబ్బంది పడ్డారు. ఆర్డర్ లేట్ అవ్వడంతో కస్టమర్ ఆగ్రహానికి గురవ్వడమే కాకుండా, కంపెనీ నుండి పెనాల్టీ పడింది. ఆ రాత్రి గుండెల్లోని ఆవేదనను కవిత్వంగా మారుస్తూ ఆయన రాసిన ‘మ్యాన్ ఇన్ ఎ హర్రీ’ (తొందరపాటులో ఉన్న మనిషి) అనే కవిత 2022లో చైనా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'వైబో' (Weibo) లో విపరీతంగా వైరల్ అయింది. కోట్లాది మంది శ్రమజీవుల మనసులను తాకిన ఆ ఒక్క కవితతో ఆయన రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.అత్యున్నత పురస్కారం ‘లుక్సున్ లిటరరీ ప్రైజ్’వాంగ్ జిబింగ్ తాజాగా రాసిన ‘లో ఫ్లైట్’ (Low Flight) అనే కవితల సంపుటికి చైనాలోనే అత్యున్నత గౌరవప్రదమైన "లు క్సున్ లిటరరీ ప్రైజ్" లభించింది. చైనా ఆధునిక సాహిత్య పితామహుడిగా పిలవబడే 'లు క్సున్' జ్ఞాపకార్థం ఇచ్చే ఈ అవార్డును, కవిత్వ విభాగంలో వాంగ్కు అందజేశారు.ఈ పుస్తకం కోసం ఆయన కేవలం తన బాధలనే కాకుండా, గిగ్ ఎకానమీ (తాత్కాలిక ఉపాధి రంగం) లో పనిచేసే దాదాపు 200 మంది తోటి డెలివరీ రైడర్ల జీవితాలను, వారి సవాళ్లను ఇంటర్వ్యూ చేసి కవితలుగా మలిచారు. ఇప్పటివరకు ఆయన దాదాపు 6,000 పైగా కవితలు రాయడం విశేషం.నగదు పురస్కారం.. అంతకుమించి రాయల్టీ!ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కింద వాంగ్కు చైనీస్ రైటర్స్ అసోసియేషన్ భారీ నగదు బహుమతిని కూడా అందజేసింది. గత అవార్డుల లెక్కల ప్రకారం ఈ పురస్కార గ్రహీతలకు సుమారు 1,00,000 చైనీస్ యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 11.5 లక్షలకు పైగా) నగదు లభిస్తుంది. దీనితో పాటు, అవార్డు రావడంతో ఆయన పుస్తకాల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగాయి. దీని ద్వారా పబ్లిషర్స్ నుండి ఆయనకు లక్షల్లో రాయల్టీ ఆదాయం కూడా సమకూరుతోంది.డెలివరీలు ఆపేది లేదుసాధారణంగా ఇంత పెద్ద అవార్డు, డబ్బు వస్తే ఎవరైనా ఆ కష్టమైన ఉద్యోగాన్ని వదిలేస్తారు. కానీ వాంగ్ జిబింగ్ మాత్రం తన వినమ్రతను చాటుకున్నారు."ఈ అవార్డు నా జీవితాన్ని కానీ, నన్ను కానీ మార్చలేదు. నాకు 60 ఏళ్లు వచ్చే వరకు నేను డెలివరీ బాయ్గానే పనిచేస్తాను. ఈ పనే నన్ను శారీరకంగా దృఢంగా ఉంచుతుంది, సమాజంలోని సామాన్య ప్రజల కష్టాలకు దగ్గరగా ఉంచుతుంది. శ్రమజీవుల గొంతుకగా నా కలాన్ని సాగిస్తూనే ఉంటాను" అని వాంగ్ స్పష్టం చేశారు.
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు
కాబూల్: అఫ్గానిస్తాన్ని భారీ వరదలు అతలాకుతలం చేశాయి. నిన్న (సోమవారం) నూరిస్తాన్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. , మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ వివరాలను అక్కడి అధికారులు ప్రకటించారు.భారీ వరదలకు నూరిస్తాన్ 'పరూన్' లో నది ఒడ్డున మార్కెట్లు, హోటళ్లు, వందలాది దుకాణాలు వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతంపూర్తిగా బురదతో నిండిపోయింది. దీంతో వరదలు తగ్గుముఖం పట్టాక క స్థానిక నివాసితులు బురద కుప్పలపై గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలింపులు చేపడుతున్నారు. అయితే ఈ వరదలలో పరూన్ నగర మేయర్తో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.కాగా సహాయక చర్యలకు సరైన సామాగ్రి లేకపోవడంతో స్థానికులు తమ చేతులతోనే బురదను తొలగిస్తూ గాలింపు చర్యలు చేపట్టడం హృదయవిదారకంగా కనిపిస్తోంది. కాగా ఈ ఘటనపై తాలిబన్ ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పందిస్తూ, నూరిస్తాన్ ప్రాంతంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని బాధితులను రక్షించడానికి మరియు వారి ఆస్తులను కాపాడటానికి సంబంధిత ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగి తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలిపారు.భారీ వర్షాలు పడే అవకాశంఆ దేశ వాతావరణ పరిస్థితులపై విపత్తు నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రావిన్సుల్లో భారీ వర్షాలు, తుఫానులు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలు నదీ తీరాలకు వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.
ఇరాన్పై అమెరికా భారీ వైమానిక దాడులు
దుబాయి: అమెరికా – ఇరాన్ల యుద్ధం మరింత వేడెక్కింది. సోమవారం ఉదయం ఇరాన్ లక్ష్యంగా అమెరికా మరోసారి దాడులకు తెగబడగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్లపై ప్రతిదాడులకు దిగింది. ఇరాన్ వాయువ్య ప్రాంతంలో భూగర్భ క్షిపణి కేంద్రంగా భావిస్తున్న తబ్రిజ్ నగరం లక్ష్యంగా అమెరికా దాడులకు దిగగా ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రతీకారంగా ఇరాన్ బహ్రెయిన్తోపాటు అమెరికా నావికాదళపు ఫిఫ్త్ ఫ్లీట్ ఉన్న కువైట్పై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరు దేశాల్లో సోమవారం ఉదయమే క్షిపణి దాడులకు సంబంధించిన హెచ్చరికలు జారీ అయ్యాయి. దూసుకొస్తున్న క్షిపణులను అడ్డుకున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరుదేశాల మధ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తూ గత నెలలో ఒక ఒప్పందం కుదిరినా ఆ తరువాత దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూండటంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో కార్యకలాపాలు మళ్లీ స్తంభించిపోయాయి. ఇరుపక్షాలూ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు చేసుకుంటూండంతో చమురు ధరలు మళ్లీ పైకి ఎగబాకాయి. సోమవారం బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్ ధర 90 డాలర్ల కంటే ఎక్కువ పలికి ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. బాగా దెబ్బకొట్టాం: ట్రంప్ ఇరాన్పై సోమవారం జరిగిన దాడులు బాగా జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒరాన్ డ్రోన్ దాడిలో శనివారం వీరసైనికుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నామని ఆయన ప్రకటించారు.
జాతీయం
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. విద్యార్థులు.. కాక్రోచ్ పార్టీ తరఫున ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్లతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ వివాదం మధ్యలో నిలిచిన ధర్మేంద్ర ప్రదాన్ రాజకీయ నేపథ్యం ఏమిటి? బీజేపీలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత ఎంత? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ పదవి నుంచి తప్పుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన్ని తప్పించే సంకేతాలు కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ లీక్ వ్యవహారంపై స్పందిస్తూ.. పరీక్షా పత్రాల లీకేజీని ‘ఘోర పాపం’గా అభివర్ణించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివాదంలో ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ నేపథ్యం మరోసారి చర్చకు వచ్చింది.తండ్రి కేంద్ర మంత్రిధర్మేంద్ర ప్రదాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రదాన్ కూడా బీజేపీ సీనియర్ నాయకుడు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రదాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చురుకుగా పనిచేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీ యువమోర్చా, పార్టీ సంస్థాగత బాధ్యతల వరకు సాగింది.వ్యూహకర్తగా.. బీజేపీలో క్రమంగా ఎదిగిన ధర్మేంద్ర ప్రదాన్ 2004లో తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ జాతీయ రాజకీయాల్లో తన స్థానం బలపర్చుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ విస్తరణ వ్యూహాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఆయన.. పార్టీ అధిష్ఠానం దృష్టిలో నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు.మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా..2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మేంద్ర ప్రదాన్కు కీలక బాధ్యతలు దక్కాయి. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఉజ్వల యోజన అమలును కేంద్రం ఆయన శాఖకు చెందిన ముఖ్య విజయాల్లో ఒకటిగా పేర్కొంది. ఆ తర్వాత 2021లో ఆయనకు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. జాతీయ విద్యా విధానం (NEP) అమలు, విద్యా రంగంలో సంస్కరణలపై ఆయన దృష్టి పెట్టారు.నీట్ వివాదమే ఇప్పుడు అతిపెద్ద పరీక్షవిద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు తెరపైకి రావడం ధర్మేంద్ర ప్రదాన్కు అతిపెద్ద రాజకీయ సవాల్గా మారింది. పరీక్ష నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని చెబుతోంది. లీక్ వ్యవహారంలో నిందితులను అరెస్టు చేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తామని స్పష్టం చేస్తోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం.. నీట్ లీక్లో నిందితులపై చర్యలు తీసుకున్నామని, విద్యార్థుల భవిష్యత్కు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు.Birthday wishes to Union Minister Shri Dharmendra Pradhan Ji. He is making commendable efforts towards the implementation of the National Education Policy, which seeks to make India a hub for knowledge, learning and innovation. Praying for his long and healthy life.@dpradhanbjp— Narendra Modi (@narendramodi) June 26, 2026బీజేపీలో ఎందుకు కీలకం?ధర్మేంద్ర ప్రదాన్ను బీజేపీలో కీలక వ్యూహకర్తల్లో ఒకరిగా భావిస్తారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణలో ఆయనకు ఉన్న అనుభవం అధిష్ఠానం దృష్టిలో ప్రత్యేక స్థానం కల్పించింది. ఒడిశాకు చెందినప్పటికీ.. ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి చేరింది. మోదీ-షా నాయకత్వానికి సన్నిహితంగా ఉండే నేతల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తుంది. అందుకే ప్రస్తుత నీట్ వివాదం నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా.. ఇప్పటివరకు బీజేపీ నాయకత్వం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ముందున్న అసలు సవాల్ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడి.. ఇంకోవైపు దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థపై తగ్గిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత.. ఇవన్నీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రదాన్ ముందున్న సవాళ్లు. మంత్రి పదవి కొనసాగుతుందా? లేదా?? అన్నది రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉన్నప్పటికీ.. కోట్లాది విద్యార్థులు నమ్మే పరీక్షా వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడం ఆయన ముందున్న అసలు పరీక్షగా మారింది.కుటుంబ నేపథ్యం.. వ్యక్తిగత జీవితంధర్మేంద్ర ప్రదాన్ భార్య పేరు మృదులా ప్రదాన్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. కుటుంబాన్ని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ, ఎక్కువ సమయం పార్టీ మరియు ప్రభుత్వ బాధ్యతలకే కేటాయించే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ధర్మేంద్ర ప్రదాన్కు చర, స్థిరాస్తులు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లలో క్లియర్గా వెల్లడించారు.
సిక్కిం సొరంగ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి
నామ్చి: సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మిస్తున్న ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం కూలిన దుర్ఘటనలో కేరళలోని కోట్టాయం జిల్లాకు చెందిన జియాలజిస్ట్ అనీష్ మోహన్ గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. సమర్దుంగ్ ప్రాంతంలోని సొరంగంలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. సొరంగంలో చిక్కుకున్న వారిని, గల్లంతైన అనీష్ మోహన్ను వెలికితీసేందుకు ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. #WATCH | Gangtok, Sikkim: Rescue operations are underway in Sikkim's Namchi district after a tunnel collapsed, trapping at least 12 workers. More details awaited. (Source: Sikkim government) pic.twitter.com/DTWs7KLtDa— ANI (@ANI) July 20, 2026సహాయక చర్యలను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్), సిక్కిం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్హెచ్పిసి అధికారులు సంయుక్తంగా ముమ్మరం చేశారు. సవాళ్లతో కూడిన వాతావరణంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల కుటుంబాలకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి తమాంగ్ సానుభూతి తెలిపారు. సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రూ.25 లక్షల కార్ లోన్ తీసుకుని.. కారే అమ్మేసిన మోసగాడు
కర్ణాటక: నగరంలో రూ. 25 లక్షల బ్యాంకు రుణంతో కారు కొని, దానిని అక్రమంగా వేరొకరికి అమ్మేసిన రుణగ్రహీత ఉదంతమిది. వివరాలు.. మధు మోహన్ అనే వ్యక్తి సరస్వతీపురంలోని ఎస్బిఐ బ్యాంక్ శాఖ నుంచి రూ. 25 లక్షల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత అతను ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేదు. దీంతో, రుణాన్ని వసూలు చేయడానికి బ్యాంకు సిబ్బంది మధు మోహన్ ఇంటికి వెళ్లినప్పుడు, అతను అందుబాటులో లేడు. పైగా కారును బ్యాంకు నుంచి అనుమతి తీసుకోకుండా, రవాణా అధికారుల నకిలీ సంతకాలతో రికార్డులను తారుమారు చేశాడు, ఆ కారును షకీబ్ మన్సూర్ అనే వ్యక్తికి అమ్మినట్లు తేలింది. దోషులపై చర్యలు తీసుకోవాలని బ్యాంకు సిబ్బంది సరస్వతీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ప్రాణాపాయ స్థితిలో సోనమ్ వాంగ్చుక్
న్యూఢిల్లీ: సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించాలని మద్దతుదారులు కోరడంతో వాంగ్చుక్ అంగీకరించినప్పటికీ, అంతకుముందు రోజు జరిగిన పోలీసుల లాఠీఛార్జీని చూసి మనస్తాపం చెంది దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు.వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంగ్చుక్ రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నాయని, పొటాషియం స్థాయి 3.2 mEq/L గా నమోదైందని తెలిపారు. అంతేకాకుండా, ఆయన రక్తహీనత, తెల్ల రక్తకణాల లోపంతో కూడిన ‘పాన్ సైటోపీనియా’ సమస్యతో బాధపడుతున్నారు. వైద్యులు ఎంత చెప్పినా ఆయన ఐవీ ఫ్లూయిడ్స్, గ్లూకోజ్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని, కేవలం ఓఆర్ఎస్, పొటాషియం సప్లిమెంట్లను మాత్రమే తీసుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీర్ఘ కాలం పాటు ఆహారం మానివేయడం వల్ల ఆయన శరీరం తీవ్ర ఒత్తిడికి గురైందని, ప్రాణాపాయం పొంచి ఉన్నందున నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరమని తెలుస్తోంది.
ఎన్ఆర్ఐ
డబ్లిన్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐర్లాండ్ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో డబ్లిన్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్, వైఎస్సార్ జీవిత విశేషాలను ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో–విజువల్ ప్రదర్శన, నాయకుల ప్రసంగాలు, విందుతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ గ్లోబల్ ఎన్ఆర్ఐ వింగ్ అధ్యక్షులు ఆలూరి సాంబశివ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి హాజరై, వైఎస్సార్తో తమకున్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన మధుర స్మృతులను పంచుకున్నారు. అలాగే పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందేశాన్ని అందరికీ చేరవేస్తూ, పార్టీ ఆశయాలు, వైఎస్సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐర్లాండ్ కన్వీనర్ కిషోర్ ఆకేపాటి మాట్లాడుతూ, పార్టీని మరింత బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, సేవా కార్యక్రమాల ద్వారా వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఐర్లాండ్లోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు, ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రవాస తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్: ప్రధాని మోదీ
ఆక్లాండ్: భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్.. అంతర్జాతీయ వృద్ధికి భారత్ ప్రయోగాల వేదిక అంటూ ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్-న్యూజిలాండ్' సరికొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉందన్న మోదీ.. ఇరు దేశాల ముందు ‘అపారమైన అవకాశాల సముద్రం’ ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయాణ విజయానికి అసలైన దిశానిర్దేశకులు ఈ ప్రవాస భారతీయులేనంటూ పేర్కొన్నారు. ఈ దేశం నలుమూలలా భారతీయులు ఉన్నారని.. ఈ ప్రయాణం విజయవంతమవుతుందనే నమ్మకం ఉందన్నారు.న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఇరుదేశాల ప్రధానుల చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్ సహా పలు అంశాల్లో మరిన్ని అవకాశాలపై భారత్ ఫోకస్ పెట్టింది. ఇరుదేశాల స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ రోడ్ మ్యాప్-2030 ఆవిష్కరించారు. భారత్, న్యూజిలాండ్ దేశాలు శనివారం (జూలై 11, 2026) తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ల మధ్య జరిగిన చర్చల అనంతరం, 2030 నాటికి ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వస్తు, సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి రూ.35,000 కోట్లకు చేర్చాలని ఐదేళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.ఈ సమావేశం ద్వారా 10 ఒప్పందాలతో కలిపి మొత్తం 18 నిర్దిష్ట ఫలితాలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా రాబోయే నాలుగేళ్లలో సంబంధాలను విస్తరించుకోవడానికి ఒక రోడ్మ్యాప్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర సహకారాన్ని పెంపొందించుకోవడానికి కార్యాచరణ, భారత నౌకాదళం, న్యూజిలాండ్ రక్షణ దళాల మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందాలు జరిగాయి.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న దూకుడు నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో సహకారాన్ని విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా సాగిన మోదీ మూడు దేశాల పర్యటనలో ఆక్లాండ్ చివరి విడత. నిన్న రాత్రి ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఇటీవల భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) తర్వాత ఈ పర్యటన జరగడం విశేషం. కాగా, హాకాతో ప్రధాని మోదీకి సంప్రదాయ స్వాగతం పలికారు. మావోరి సంప్రదాయ నృత్యం హాకాతో మోదీ గౌరవ వందనం స్వీకరించారు. హాకా కళాకారులను ప్రధాని మోదీ అభినందించారు.
అమెరికాలో బెజవాడ యువతిని హత్య చేసిన భర్త
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడకు చెందిన సబ్బినేని రజిత గతేడాది అక్టోబర్ 27న అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ బెల్వ్యూ పోలీసులు జరిపిన విచారణలో..రజితను అమె భర్త నార్నే అవినాష్ చంపాడని వెల్లడవడంతో కేసును హత్య కేసుగా మార్చారు. గాయత్రీనగర్కు చెందిన సబ్బినేని కృష్ణారావుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రజితను గతేడాది తెలంగాణకు చెందిన నార్నే అవినాష్ కు ఇచ్చి హైదరాబాద్లో పెళ్లి చేశారు. జులైలో ఈ జంట అమెరికాలోని వాషింగ్టన్కు వెళ్లిపోయారు. పెళ్ళికి ముందుగానే అవినాష్కు భారత్కు చెందిన మరో మహిళతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ కారణంగా రజితను చంపాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. భార్యను ఎలా చంపితే పోలీసులకు దొరక్కుండా ఉంటారనే విషయంపై ఇంటర్నెట్లో వెతికాడు. గాలి ఆడకుండా చేస్తే ఎంత సమయానికి మనిషి ప్రాణాలు పోతాయనే విషయాలను వెతికి, గతేడాది అక్టోబర్ 27న రజితను గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. వెంటనే మృతదేహాన్ని ఫొటో తీసి తన ప్రియురాలికి వాట్సాప్లో పంపాడు. రజిత బాత్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుందని, ఎంత పిలిచినా రావడం లేదని పోలీసులకు ఫోన్ చేసి అవినాష్ చెప్పాడు. పోలీసులు వచ్చేలోపే రజిత అపస్మారకస్థితిలో పడిఉంది. వైద్యులు పరిశీలించి ఆమె మరణించిందని చెప్పారు. ఆ సమయంలోనే రజిత మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డిజిటల్ ఫోరెన్సిక్స్ ద్వారా రజితను ష్ష్ చంపాడని గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రజిత తల్లిదండ్రులు అమెరికాకు బయలుదేరారు. అమెరికా పోలీసులు అవినా షను అరెస్ట్ చేశారు.
శంకరనేత్రాలయ అమెరికా సలహామండలి సభ్యుడిగా లక్ష్మీనరసింహన్ వాసన్
లాస్ ఏంజెలెస్: లాస్ ఏంజెలెస్: శంకర నేత్రాలయ సంస్థ అమెరికా సలహా మండలి (అడ్వైజరీ బోర్డు) సభ్యుడిగా లక్ష్మీ నరసింహన్ వాసన్ను నియమితులయ్యారు. అమెరికన్ కిచెన్ ఎక్విప్మెంట్ రంగంలో స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ఎన్నో సమాజ సేవ, దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. ఆయనను ప్రతీష్టాత్మకమైన అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా నియమించామని సంస్థ అధ్యక్షులు బాలరెడ్డి ఇందుర్తి తెలియచేశారు.ఈ సందర్భంగా శంకర నేత్రాలయ యూఎస్ఏ నాయకత్వ బృందం, ఇతర సలహా మండలి సభ్యులు, శంకర నేత్రాలయ ఇండియా అధ్యక్షులు డాక్టర్ గిరీష్ రావు తదితరులు లక్ష్మీ నరసింహన్ వాసన్, ఆయన సతీమణి డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్కు స్వాగతాభినందనలు తెలియచేశారు. లక్ష్మీ నరసింహన్ వాసన్ తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని పసూర్ గ్రామంలో జన్మించి, హైదరాబాద్లో పెరిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ పట్టా పొందిన అనంతరం, 1981లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగి, ఇటీవల దక్షిణ కాలిఫోర్నియాలోని రాయల్ కిచెన్ ఎక్విప్మెంట్ కంపెనీ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి (CEO)గా సేవలందించారు.ఆయనకు క్రీడారంగంలో కూడా విశిష్టమైన ప్రస్థానం ఉంది. అమెరికాకు వెళ్లే ముందు ఆయన భారతదేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్గా రాణించి, హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలోని జట్టులో మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, శివలాల్ యాదవ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు సభ్యులుగా ఉన్నారు. భారతదేశంలో జరిగిన వివిధ క్రికెట్ మ్యాచ్లలో కూడా పాల్గొన్న ఆయన, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, ఎస్. వెంకటరాఘవన్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి మైదానాన్ని పంచుకున్నారు.లక్ష్మీ నరసింహన్ వాసన్ 1988లో డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ కార్తీక్ వాసన్ వైద్య పరిశోధనలో పీహెచ్డీ. పూర్తి చేయగా, కుమార్తె మయూరి వాసన్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలిగా గుర్తింపు పొందారు.దాతృత్వ సేవలను జీవిత ధ్యేయంగా భావించిన లక్ష్మీ నరసింహన్, భారతదేశం, అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఇటీవల శంకరనేత్రాలయా సంస్థకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళంతో, శంకరనేత్రాలయ సంస్థ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతంలో పూర్తిస్థాయి సౌకర్యాలతో కూడిన మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల మధ్యప్రదేశ్, సమీప ఐదు రాష్ట్రాల పేదప్రజలకు కంటిచూపు సంబందించిన వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. ఈ యూనిట్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు మరింత విస్తృతంగా అందించే అవకాశం కల్పిస్తుంది.శంకర నేత్రాలయ యూఎస్ఏ వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ ఎమిరిటస్ ఎస్ వి ఆచార్య, పద్మభూషణ్ డాక్టర్ జగదీశ్ సేథ్, ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శ్రీమతి లీల క్రిష్ణమూర్తి , డాక్టర్ రాజ్ మోదీ, డాక్టర్ కిశోర్ చివుకుల , ఉదయ భాస్కర్ గంటి, శ్యామ్ అప్పలి, శ్రీ మూర్తి రేకపల్లి, వంశీకృష్ణ ఏరువరం, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, వాసన్ కుటుంబం అందిస్తున్న విశేష దాతృత్వ సేవలను, సంకర నేత్రాలయ లక్ష్య సాధనకు వారు అందిస్తున్న సహకారాన్ని హృదయపూర్వకంగా అభినందించారు.
క్రైమ్
కుక్కను వెతికిపెడితే రూ.10వేల బహుమతి
నల్గొండ, మిర్యాలగూడ: తన పెంపుడు కుక్కను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని ఓ వ్యక్తి సోమవారం మిర్యాలగూడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిర్యాలగూడ పట్టణంలోని వినోభానగర్కు చెందిన గడ్డం నాగరాజు పెంచుకుంటున్న కుక్క ఈ నెల 18వ తేదీ నుంచి కనిపిండంలేదు. దీంతో అతడు కాలనీలో సీసీ కెమెరాలను పరిశీలించగా.. వినోభానగర్ చర్జి రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కుక్కను ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించాడు. కుక్క ఆచూకీ లభించకపోవడంతో వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన కుక్కను తీసుకొచ్చి ఇస్తే రూ.10వేల వరకు బహుమతిని ఇస్తానంటూ నాగరాజు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం విశేషం.
కీచకుడిపై చట్టపరమైన చర్యలు
కాకినాడ క్రైం: ఇద్దరు మైనర్లు, ఆమె తల్లిపై ఘాతుకానికి పాల్పడిన కీచకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ‘సాక్షి’ పత్రికలో సోమవారం ప్రచురితమైన ‘కీచకుడి చేతిలో విలవిల’ కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, జిల్లా పోలీస్ శాఖ నుంచి నివేదిక కోరామన్నారు. జరిగిన నేరంపై ఆధారాలు లభ్యమయ్యాయని, ఫిర్యాదుతో నిమిత్తం లేకుండా నేరం చేసిన వ్యక్తిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మిని వివరణ కోరగా, బాధిత కుటుంబంతో సహా బాధ్యుడిని తమ కార్యాలయానికి పిలిపించి మాట్లాడామన్నారు. బాధితులు జరిగిన ఘోరాన్ని వివరించి లిఖిత పూర్వకంగా నిర్ధారించారన్నారు. మైనర్లు, ఆమె తల్లిపై జరిగిన ఘాతుకం నిజమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బాలికకు ఆరోగ్య పరీక్షలు, ఆమెకు చదువుకు ఏర్పాట్లు, నేరానికి పాల్పడిన యువకుడిపై చట్టపరమైన చర్యలు అనే మూడు అంశాలను సిఫారసు చేస్తూ కలెక్టర్కు నోట్ఫైల్ పంపామన్నారు. అలాగే ఎస్పీ బిందుమాధవ్కు వీరబాబు అనే బాధితుల బంధువు నుంచి మెయిల్ వచ్చిందని, ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడుతున్నామని కాకినాడ త్రీ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. భార్య, అత్త, మైనర్ మరదలిపై అత్యాచారం చేసిన అల్లుడు!
ఆ హోటల్ వద్ద ఆగితే అంతే..!
నల్గొండ జిల్లా: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నార్కట్పల్లి శివారులోని ఓ హోటల్ దోపిడీ దొంగలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి రాత్రివేళ హైదరాబాద్కు వెళ్లే ప్రైవేట్, ఆర్టీసీ బస్సులను డ్రైవర్లు టీ, టిఫిన్ కోసం ఈ హోటల్ వద్ద ఆపుతుంటారు. దీంతో అక్కడే మాటువేస్తున్న దోపిడీ దొంగలు పక్కా స్కెచ్తో ప్రయాణికుల సొమ్మును దోచేస్తున్నారు. హైవేపై ఎన్నో హోటళ్లు ఉన్నప్పటికీ.. కేవలం ఈ హోటల్ వద్దే పదేపదే దొంగతనాలు జరుగుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్లలో నాలుగు.. గడిచిన నాలుగేళ్లలో ఆ హోటల్ ఆవరణలోనే నాలుగు భారీ చోరీలు జరిగాయి. 2022 నవంబర్ 22న విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును హోటల్ వద్ద ఆపగా.. ఓ ప్రయాణికుడికి సంబంధంచిన కిలో 300 గ్రాముల బంగారాన్ని దుండగులు అపహరించారు. అదేవిధంగా 2023 జూలై 26న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుడికి చెందిన రూ.28 లక్షల నగదును ఈ హోటల్ వద్దే దొంగలు అపహరించారు. ఈ రెండు కేసుల్లో నిందితులు ఇప్పటికీ దొరకలేదు. 2025 ఫిబ్రవరి 9న ఈ హోటల్ వద్ద ఆపిన బస్సులో నుంచి రూ.25 లక్షలు చోరీ చేసి కారులో పారిపోతున్న ముఠాను అప్పటి ఎస్ఐ క్రాంతికుమార్ సీసీ కెమెరాల ఆధారంగా మధ్యప్రదేశ్కు వెళ్లి పట్టుకున్నారు. రికవరీ చేసిన నగదును బాధితుడికి అప్పగించారు. తాజాగా ఆదివారం ఖమ్మం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఈ హోటల్ వద్ద ఆగగా.. ఓ ప్రయాణికుడు రూ.9లక్షల నగదు ఉన్న బ్యాగును పక్కన పెట్టుకుని టిఫిన్ చేస్తుండగా.. దుండగులు ఒక్కసారిగా బ్యాగును లాక్కొని అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కారులో పరారయ్యారు. సినిమా ఫక్కీలో చోరీ..ఈ దోపిడీ ముఠాలు పక్కా ప్రణాళికతోనే సినిమా ఫక్కీలో దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దొంగలు ముందుగానే కారులో వచ్చి హోటల్ వద్ద మాటు వేస్తున్నారు. బస్సులు ఆగగానే ప్రయాణికులను గమనిస్తూ, నగదు లేదా నగలు ఉన్న బ్యాగులను టార్గెట్ చేస్తున్నారు. తరచూ ఆ హోటల్ వద్ద పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ప్రయాణికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రంగంలోకి మూడు ప్రత్యేక బృందాలువరుస చోరీల నేపథ్యంలో çహోటల్ వద్ద పోలీసులు సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.. తాజాగా జరిగిన దోపిడీపై నార్కట్పల్లి సీఐ సిరికొండ సురేష్, ఎస్ఐ పందిరి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీసీఎస్ సమన్వయంతో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. హోటల్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలు, జిల్లా సరిహద్దుల్లోని నాలుగు టోల్ ప్లాజాల డేటా, మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాపురం చేయాల్సిన భర్త.. వాట్సాప్లోనే!?
పెద్దపల్లి: అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి ఇంటినుంచి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ భజ్జురి రేఖలత సోమవారం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. పెద్దపల్లికి చెందిన రేఖలతకు భీమారం ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్తో వివాహం జరిగింది. కొంతకాలం వరకు దాంపత్యజీవితం సజావుగానే సాగినా.. ఆ తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని భర్త, కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఇకపై సక్రమంగా చూసుకుంటానని భర్త హామీ ఇచ్చాడు. కానీ, ఇంటికి తీసుకెళ్లకుండా వాట్సాప్ సందేశాలు, నోటీసుల ద్వారా వేధింపులకు పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని, భౌతిక దాడులకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆర్థిక ఆధారం లేకుండా పెద్దపల్లిలో అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న రేఖలత.. తన భర్త, ఆయన కుటుంబ సభ్యులు, తోటి కోడలు, బావల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు.
వీడియోలు
రాజీనామా చేసేంత వరకు నిరసన కొనసాగుతుంది..!
హైకోర్టు ఆవరణలో హైడ్రా కమీషనర్ కి నీకి అవమానం!
నోరు తెరిచి మాట్లాడు! పవన్ పై వరుదు కల్యాణి సీరియస్
బుడోడు రీఎంట్రీ.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే
ఆస్పత్రిలో వాంగ్ చుక్.. బయట సీజేపీ నిరసన.. టెన్షన్ టెన్షన్
సీదిరి అప్పలరాజును పరామర్శించారు YSRCP నేతలు
జంగల్ పాలనకు ముగింపు తప్పదు బయటపడ్డ గల్లా మాధవి, జత్వానీ అసలు రంగు
ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇదిగో ఇలా దరఖాస్తు చేసుకోండి
ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల
అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోవద్దు ఇంతకుఇంత అనుభవిస్తారు


