హైదరాబాద్లో మద్యం షాపులు బంద్
హైదరాబాద్: బోనాల పండుగ ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ వాతావరణం ప్రశాంతంగా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నాలుగు కమిషనరేట్ల పరిధిలో మద్యం విక్రయాలపై 24 గంటల పాటు ఆంక్షలు విధించింది.ఈ మేరకు సైబరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్లతో పాటు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, మరియు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లను తాత్కాలికంగా మూసివేయాలని కమిషనర్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆంక్షలు ఆగస్టు 9వ తేదీ ఉదయం 10:00 గంటల నుంచి ప్రారంభమై, ఆగస్టు 10వ తేదీ ఉదయం 10:00 గంటల వరకు అమలులో ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లలో ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నగర సీపీ వి.సి. సజ్జనార్ ఆదేశించారు.ఉత్సవాలు ముగిసే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, నిబంధనలను ఉల్లంఘించి దొంగచాటుగా మద్యం విక్రయించినా లేదా షాపులు తెరిచినా నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. భక్తులందరూ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం...ముఖ్య వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కళారంగం వారి యత్నాలు మరింత అనుకూలిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ఎరుపు, తెలుపు రంగులు.హయగ్రీవస్తోత్రాలు పఠించండి.వృషభం...ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు మరింత పెరుగుతాయి. పనులలో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. బంధువులను కలుసుకుని మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో ఆటంకాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. తీర్థయాత్రలు. లేత ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.మిథునం...కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చిరకాల కోరిక నెరవేరి విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.కర్కాటకం...వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వివాదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తుల వివాదాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. కళారంగం వారికి అవకాశాలు మరింతగా దక్కుతాయి. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. అనారోగ్యం. నీలం,నేరేడు రంగులు.దేవీఖడ్గమాల పఠించండి.సింహం...మొదట్లో కుటుంబసమస్యలు ఎదురై కాస్త చికాకు పరుస్తాయి. అలాగే, ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. క్రమేపీ వీటి నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో అనారోగ్యం, వైద్యసేవలు. వృథా ధనవ్యయం. గులాబీ, తెలుపు రంగులు. హనుమాన్ ఛాలీసా పఠనం మంచిది.కన్య...వీరికి అన్నింటా విజయమే. అందరిలోనూ ప్రత్యేకత నిలుపుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ముఖ్య సమాచారం అందుతుంది. పరపతి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, గృహంకొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, లేత ఎరుపు రంగులు. . శివాష్టకం పఠించండి.తుల...ఆర్థికంగా బలం చేకూరుతుంది. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యావకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ధన, ఆస్తిలాభాలు కలుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.వృశ్చికం....ముఖ్యమైన పనులను నేర్పుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాలను చేపట్టే వీలుంది. సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. వ్యాపారాలలో మరింత అనుకూలత. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. బంధువిరోధాలు. గులాబీ, నేరేడురంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.ధనుస్సు.....చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించకుంటారు. ఆస్తుల వ్యవహారంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు.విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మకరం...ఆర్థిక ఇబ్బందులు చాలావరకూ తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మీ అంతరంగాన్ని బంధువులు గుర్తించి సహాయపడతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వాహనయోగం. విద్యార్థుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. గులాబీ, లేత ఎరుపు రంగులు.గణేశ్స్తోత్రాలు పఠించండి.కుంభం...ప్రారంభంలో ఒక విషయంలో కుటుంబసభ్యులతో విభేదిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు క్రమేపీ తొలుగుతాయి. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు కొంతనెమ్మదిగా పూర్తిచేస్తారు. ప్రముఖుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.మీనం...రుణభారాలు కొంత తగ్గుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన విద్యావకాశాలు అందుతాయి. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, లేత నీలం రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
బోనమెత్తనున్నలాల్దర్వాజా
చాంద్రాయణగుట్ట: ఆషాఢమాసం బోనాల జాతరలో ఆదివారం ప్రధాన ఘట్టానికి అంకురార్పణ జరగనుంది. లాల్దర్వాజా సింహవాహిని మహంకాళికి భక్తులు బోనాలు సమరి్పంచనున్నారు. అమ్మవారి ఆలయానికి రెండు వైపులా బోనాల క్యూ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరిసరాల్లో బాంబు, డాగ్స్కా్వడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. సింహవాహిని ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు బలిహరణ, అనంతరం ఉదయం 6 గంటలకు రాజ్యసభ మాజీ సభ్యుడు దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా దేవీ మహా అభిష్కం ఉంటుంది. అనంతరం బోనాల సమర్పణ ప్రారంభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వ్రస్తాలు సమరి్పంచనున్నారు. రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణం జరుపుతారు. లాల్దర్వాజా బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయం ఇప్పటికే పోలీస్ నిఘాలోకి వెళ్లిపోయింది. బాంబు, డాగ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ వర్గాలు మోహరించాయి.
చాలు బంగారం.. చాలు
సాక్షి, అమరావతి: పసిడి ప్రియులకు పేరొందిన భారత దేశంలో బంగారం కొనుగోళ్లు, దిగుమతులు తగ్గిపోతున్నాయి. 2021–22 సంవత్సరంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 17.23 శాతం క్షీణించాయి. 2021–22లో 868.4 టన్నుల బంగారం దిగుమతి కాగా.. 2025–26లో 718.74 టన్నులకు పడిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపింది. అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు తోడు రూపాయి విలువ పడిపోవడం, బంగారం కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు విధించడం దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం దిగుమతులను తగ్గించడానికి కేంద్రం ఈ ఏడాది మే నుంచి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. మరోపక్క బంగారం కొనుగోళ్లు తగ్గించాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే పిలుపునివ్వడంతో అమ్మకాలపై గణనీయమైన ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బంగారం దిగుమతులు ఆరేళ్ల కనిష్ట స్థాయికి 120 టన్నులకు పరిమితమైనట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాని పిలుపుతో ఆభరణాల అమ్మకాలు 24 శాతం తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అలాగే పాత బంగారం అమ్మడం కూడా దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ఇదే సమయంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో స్మగ్లింగ్ పెరుగుతోంది. విలువ పరంగా 58 శాతం పెరుగుదలపరిమాణం పరంగా బంగారం దిగుమతులు తగ్గుతున్నా.. పసిడి దిగుమతుల బిల్లు మాత్రం భారీగా పెరిగిపోతోంది. 2021–22లో 868.4 టన్నుల దిగుమతికి ప్రస్తుత రూపాయి ధర ప్రకారం రూ.4,36,800 కోట్లు చెల్లించాల్సి వస్తే, 2025–26లో 718.74 టన్నులకు ఏకంగా రూ.6,88,320 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అంటే దిగుమతులు తగ్గినా బిల్లు మాత్రం ఏకంగా 57.58 శాతం పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం ఐదేళ్ల క్రితం ఔన్స్ బంగారం ధర 2,000 డాలర్లు ఉంటే ఇప్పుడది ఏకంగా 4,200 డాలర్లకు చేరడమే. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.1.40 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య కదులుతోంది. బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో వినియోగదారులు తక్కువ బరువున్న ఆభరణాల కొనుగోలుకు మక్కువ చూపిస్తున్నట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.
మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా?
ఫొటోలు సరిగా తీయలేదని...
‘జెన్జీ’ని తప్పుదోవ పట్టించారు.. రాజీనామాపై ధర్మేంద్ర ప్రధాన్
పంజాబ్ ఎన్నికలు: ఒంటరి పోరుకు కమలనాథులు సిద్ధం
హైదరాబాద్లో మద్యం షాపులు బంద్
చేదుకట్టు..! చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ తలలో
మిచెల్ శాంట్నర్ విధ్వంసం.. ముంబై జట్టుకు రాకెట్స్ షాక్
హార్మూజ్పై ఇరాన్ కీలక ప్రకటన
బెర్క్షైర్లో భారీగా షేర్ల బై బ్యాక్..
బెలూన్లు నింపుతుండగా పేలుడు
రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా
ఒకప్పుడు తోపు యాక్టర్.. ఇప్పుడు ఆటో డ్రైవర్!
దగ్గు మందు అడిగితే 'దగ్గుతున్నాడు' తప్ప మందు ఇవ్వడం లేదు!
ఇది చాలదన్నట్టు ఆ మినిస్టర్ ఎవరు సార్!
నా రెండో బిడ్డ కళ్లలో ఆయనని చూసుకుంటున్నా
'కొరియన్ కనకరాజు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
పరిపాలన ప్రైవేట్కు ఇవ్వడం కుదర్దు వెళ్లవయ్యా.. వెళ్లు!
సాక్షి కార్టూన్ : 08-08-2026
165 Km రేంజ్తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా
సమంత తిండిగోల.. తల్లి కూతురి బర్త్ డే సెలబ్రేషన్
నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా
దూకుడు తగ్గించిన పసిడి.. తులం ధర ఇలా..
హీరోగా హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. గృహయోగం
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ బిగ్ సిగ్నల్
దగ్గుబాటి సోదరులపై కేసును కొట్టేయలేం: హైకోర్టు
మేం లాభాల్లోనే ఉన్నాం: సాయి రాజేష్
శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..
మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా?
ఫొటోలు సరిగా తీయలేదని...
‘జెన్జీ’ని తప్పుదోవ పట్టించారు.. రాజీనామాపై ధర్మేంద్ర ప్రధాన్
పంజాబ్ ఎన్నికలు: ఒంటరి పోరుకు కమలనాథులు సిద్ధం
హైదరాబాద్లో మద్యం షాపులు బంద్
చేదుకట్టు..! చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ తలలో
మిచెల్ శాంట్నర్ విధ్వంసం.. ముంబై జట్టుకు రాకెట్స్ షాక్
హార్మూజ్పై ఇరాన్ కీలక ప్రకటన
బెర్క్షైర్లో భారీగా షేర్ల బై బ్యాక్..
బెలూన్లు నింపుతుండగా పేలుడు
రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా
ఒకప్పుడు తోపు యాక్టర్.. ఇప్పుడు ఆటో డ్రైవర్!
దగ్గు మందు అడిగితే 'దగ్గుతున్నాడు' తప్ప మందు ఇవ్వడం లేదు!
ఇది చాలదన్నట్టు ఆ మినిస్టర్ ఎవరు సార్!
నా రెండో బిడ్డ కళ్లలో ఆయనని చూసుకుంటున్నా
'కొరియన్ కనకరాజు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
పరిపాలన ప్రైవేట్కు ఇవ్వడం కుదర్దు వెళ్లవయ్యా.. వెళ్లు!
సాక్షి కార్టూన్ : 08-08-2026
165 Km రేంజ్తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా
సమంత తిండిగోల.. తల్లి కూతురి బర్త్ డే సెలబ్రేషన్
నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా
దూకుడు తగ్గించిన పసిడి.. తులం ధర ఇలా..
హీరోగా హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. గృహయోగం
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ బిగ్ సిగ్నల్
దగ్గుబాటి సోదరులపై కేసును కొట్టేయలేం: హైకోర్టు
మేం లాభాల్లోనే ఉన్నాం: సాయి రాజేష్
శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..
ఫొటోలు
ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)
వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు)
సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్
‘కొరియన్ కనకరాజు’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ (ఫొటోలు)
హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్
హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ (ఫొటోలు)
విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్లో ఫ్యామిలీ ఫోటోలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో బోనాల పండుగ (ఫొటోలు)
ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)
'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)
సినిమా
ముందుగా విదేశాల్లోనే...
‘రామాయణ’ సినిమా విడుదల విషయంలో చిన్న మార్పు ఉన్నట్లు ఈ చిత్రనిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబె, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ పతాకంపై నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.కాగా, ‘రామాయణ పార్ట్ 1’ ఈ ఏడాది దీపావళికి, ‘రామాయణ పార్ట్ 2’ వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్నాయి. అయితే తొలి భాగం ఇండియాలో కంటే ముందుగా విదేశాల్లోనే విడుదల కానుంది. ‘‘విదేశీ మార్కెట్లలో సినిమాల విడుదల సాధారణంగా శుక్రవారం నుంచే ప్రారంభం అవుతుంది. అందుకే అక్కడ నవంబరు 6న ‘రామాయణ పార్ట్ 1’ని రిలీజ్ చేస్తాం. ఇండియాలో మాత్రం దీపావళి పండగ రోజునే అంటే... నవంబరు 8నే రిలీజ్ చేస్తాం’’ అని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు నమిత్ మల్హోత్రా.
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో నాయికా!
సెట్స్కు వెళ్లడానికి హీరో రెడీ. స్టార్ట్... కెమెరా... యాక్షన్ చెప్పడానికి దర్శకుడు రెడీ. బడ్జెట్ కేటాయించేందుకు ప్రోడ్యూసర్ రెడీ. కానీ హీరోయిన్ మాత్రం నాట్ రెడీ. అవును... ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాల పరిస్థితి ఆల్మోస్ట్ ఇదే. తమ హీరోకు సరిగ్గా సెట్ అయ్యే హీరోయిన్ వెతుకులాటలో బిజీగా ఉన్నారు దర్శక–నిర్మాతలు. ఈలోపే ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ అంటూ... కొన్ని గాసిప్స్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. మరి... ఏయే హీరోకి ‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో నాయికా!’ చూద్దాం... ఎవరెవరు జోడీ కడతారో మరి...ముచ్చటగా మూడోసారి ‘ఖిలాడి’, ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ డింపుల్ హయతి ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారా? అంటే... ప్రస్తుతానికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. రవితేజ, శ్రీవిష్ణు హీరోలుగా హసిత్ గోలి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ కొన్ని రోజులుగా ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారని సమాచారం. అంతేకాదు... ఈ సినిమాకు ‘వీరాధి వీరులు కేరాఫ్ మహిళా మండలి’ అనే టైటిల్ను కూడా పరిశీలిస్తున్నారట మేకర్స్.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది చిత్రయూనిట్ ప్లాన్ అట. దీంతో ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమా రెగ్యులర్ షూట్ను స్టార్ట్ చేయాలని హసిత్ గోలి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట హసిత్. ఇందులో భాగంగానే రవితేజకు జోడీగా నటించేందుకు డింపుల్ హయతిని సంప్రదించారని తెలిసింది.మరి... మూడోసారి కూడా రవితేజ–డింపుల్ల జోడీ సెట్ అవుతుందా? చూడాలి. అలాగే శ్రీ విష్ణుకు జోడీగా ఓ యంగ్ నటి కనిపిస్తారట. మరోవైపు రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ ఈ ఆగస్టు 21న విడుదల కానుంది. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.దీపిక ప్లేస్లో ఆలియా? ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లోని ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్ ‘కల్కి 2898 ఏడీ 2’ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య తారాగణం అయిన కమల్హాసన్, అమితాబ్ బచ్చన్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. త్వరలోనే ప్రభాస్ కూడా షూట్లో జాయిన్ అవుతారు. అయితే ఈ మూవీలోని మరో ప్రధానమైన లీడ్ రోల్ను ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 1లో దీపికా పదుకోన్ చేశారు. కొన్ని కారణాల వల్ల ‘కల్కి 2’లో దీపికా పదుకోన్ నటించడంలేదని చిత్రయూనిట్ ప్రకటించింది.ఈ నేపథ్యంలో దీపిక పదుకోన్ ప్లేస్లో ఎవరు నటిస్తారు? అనే చర్చ ఎప్పట్నుంచో జరుగుతోంది. తొలుత సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇటివలి కాలంలో ఆలియా భట్ పేరు వినిపిస్తోంది. త్వరలో ప్రభాస్తో పాటు లీడ్ హీరోయిన్ కూడా సెట్స్లో పాల్గొనాల్సి ఉందట. దీంతో దీపిక ప్లేస్ను భర్తీ చేసేది ఎవరు? అనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం లేక పోలేదు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ‘కల్కి 2’ సినిమా 2027 చివర్లో రిలీజ్ అవుతుందని టాక్.గాడ్ ఆఫ్ వార్లో... ‘అరవిందసమేత వీరరాఘవ’ (2018) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మైథాలజీ నేపథ్యంలో రానుంది. ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ను అనుకుంటున్నారు మేకర్స్. లార్డ్ కుమారస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. భారీ బడ్జెట్తో సూర్యదేవర రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమా షూటింగ్ను వచ్చే ఏడాది ప్రారంభించాలనుకుంటున్నారు. కాగా, ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ కియారా అద్వానీని సంప్రదిస్తున్నారని, ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇటీవల ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు ఎనీ్టఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. దీంతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.చరణ్కు జోడీగా... ‘రంగస్థలం’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రామ్చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ‘ఆర్సీ 17’ (వర్కింగ్ టైటిల్). రామ్చరణ్ కెరీర్ లోని 17వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఏడాదిన్నర క్రితమే ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్కు వెళ్లలేదు. ‘పెద్ది’ సినిమా చిత్రీకరణతో రామ్చరణ్ బిజీగా ఉండటం వల్ల ‘ఆర్సీ 17’ సినిమా సెట్స్కు వెళ్లలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ను ఈ ఏడాదే ప్రారంభించాలని అనుకున్నారు మేకర్స్. కానీ ‘పెద్ది’ చిత్రీకరణ సమయంలో రామ్చరణ్ చేతికి గాయమైంది. దీంతో ఇటీవల కోయంబత్తూరులో చేతికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు రామ్చరణ్.ఈ గాయం నుంచి కోలుకుని తిరిగి రామ్చరణ్ షూట్లో పాల్గొనేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతుందట. దీంతో ఈ సినిమా షూటింగ్ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట సుకుమార్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగు తున్నాయి. అలాగే ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపికపై కూడా సుకుమార్ దృష్టి సారించారట. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం కొంతమంది కథానాయికల పేర్లును పరిశీలిస్తున్నారు మేకర్స్. సమంత, రష్మిక మందన్నా వంటి ప్రముఖ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా రుక్మిణీ వసంత్ పేరు తెరపైకి వచి్చంది. మరి... రామ్చరణ్కు జోడీగా రుక్మిణీ వసంత్నే నటిస్తారా? వేచి చూడాల్సిందే.రాకాలో నలుగురు నాయికలు? అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఒక హీరోయిన్గా కన్ఫార్మ్ అయ్యారు. అయితే ఇందులో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని, దీంతో ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్స్కు చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా ఈ చిత్రంలోని ఇతర హీరోయిన్ రోల్స్కు ఫైనలైజ్ అయ్యారని, ఆల్రెడీ ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో ఈ ముగ్గురూ పాల్గొంటున్నారని టాక్.అయితే జాన్వీ, రష్మిక, మృణాల్లు ఈ సినిమాలో భాగమైన అంశంపై మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.పైగా రష్మిక ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తున్నారట. దీంతో ఆమె ఈ చిత్రంలో అల్లు అర్జున్కు జోడీగా కనిపించక పోవచ్చట. మరి... అల్లు అర్జున్కు జోడీగా కనిపించే హీరోయిన్స్ ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది. రణ్వీర్ సింగ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ధురంధర్’ తరహాలో తక్కువ టైమ్ గ్యాప్లోనే ‘రాకా’ రెండు భాగాలు రిలీజ్ కానున్నాయని సమాచారం.రోమియో ప్రేయసి... నాని తాజా సినిమా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా ఈ సెప్టెంబరు 24న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే కాస్త గ్యాప్ తీసుకుని, ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్లోని ‘బ్లడీ రోమియో’ సినిమాలో నటిస్తారు నాని. అక్టోబరులో ఈ సినిమా రెగ్యులర్ షూట్ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ముందుగా హైదరాబాద్లో, ఆ తర్వాత ఢిల్లీలో ఈ సినిమా షెడ్యూల్స్ జరుగుతాయని తెలిసింది. కానీ... ఈ సినిమా మేజర్ షూటింగ్ మాత్రం లండన్లో ప్లాన్ చేశారని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్నది ఇంకా ఫైన లైజ్ కాలేదు. ప్రస్తుతానికి భాగ్యశ్రీ భోర్సేను అనుకుంటున్నారట మేకర్స్. ఇప్పటికే ఆమెతో చిత్రయూనిట్ సంప్రదింపులు జరిపిందని, ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలై, నాని ‘బ్లడీ రోమియో’ షూట్ను స్టార్ట్ చేసిన తర్వాత భాగ్యశ్రీ ఎంపికపై ఓ అధికారిక ప్రకటన వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ఫుడ్ మాఫియా నేపథ్యంలో సాగే ఓ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఉండబోతోందని ఇటీవల రిలీజైన ఈ సినిమా కంటెంట్ పరోక్షంగా స్పష్టం చేస్తోంది. నానికి చెందిన నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రోడక్షన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై వెంకట్ బోయనపల్లి ఈ ‘బ్లడీ రోమియో’ను నిర్మించనున్నారు. 2027లో ఈ సినిమా విడుదల కానుంది.సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో... రామ్ హీరోగా నటిస్తూ, కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘రా పో 23 (వర్కింగ్ టైటిల్). ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ప్రస్తుతం పాండిచ్చేరిలో కీలక సన్ని వేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షూటింగ్ షెడ్యూల్లో కొంత టాకీ పార్టుతో పాటు ఓ సాంగ్ను, ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు రామ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా, హీరోయిన్ పాత్రకు శ్రీనిధి శెట్టి, సంయుక్తా మీనన్ పేర్లను పరిశీలించారట. సంయుక్త ఆల్మోస్ట్ ఖరారు అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ అనుకున్న సమయానికి ప్రారంభం కాని కారణంగా కాస్త ఆలస్యంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. అంటే... ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని చెప్పాచ్చు.ఎల్లమ్మ..! ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఎల్లమ్మ’. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రూరల్ బ్యాక్డ్రాప్ చిత్రానికి ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు తొలుత కీర్తి సురేష్ను అనుకున్నారట. కానీ ఇటీవల ఓ సందర్భంలో ఈ సినిమాలో తాను నటించడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆ తర్వాత సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్, మమితా బైజు వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఈ చిత్రంలో ఇప్పటివరకు ఎవరూ ఫైనలైజ్ కాలేదు. త్వరలోనే ఈ సినిమా హీరోయిన్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.నో హీరోయిన్!ఒకవైపు కొన్ని సినిమాల్లో హీరోయిన్ల అన్వేషణ జరుగుతోంటే ఒక సినిమాకి మాత్రం హీరోయినే అక్కర్లేదట. ఎందుకంటే అసలు హీరోయిన్ లేకుండానే ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటన వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ప్రారంభంలో మొదలు కానుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా కొంతమంది బాలీవుడ్ కథానాయికల పేర్లు వినిపించాయి. కానీ కథ రీత్యా ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేక పోవడంతో అసలు ఈ సినిమాలో హీరోయిన్ పాత్రనే తొలగించాలని మేకర్స్ అనుకుంటున్నారని ఫిల్మ్నగర్ భోగట్టా. ఈ అంశంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇంకా మరికొందరు తెలుగు హీరోలు నటించనున్న మరికొన్ని కొత్త సినిమాల్లో హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు.– ముసిమి శివాంజనేయులు
భాగ్యశ్రీకి బంపరాఫర్.. ఆ స్టార్ హీరో సరసన ఛాన్స్?
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ‘లెనిన్’ సినిమా సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి మరో క్రేజీ ఆఫర్ దక్కబోతున్నట్టు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.రవితేజ హీరోగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీకి వరుసగా క్రేజీ సినిమాలు వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. ‘లెనిన్’తో ఆమెకు తొలి సాలిడ్ హిట్ దక్కింది. ఈ సక్సెస్తో భాగ్యశ్రీ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు తమిళంలో కూడా శివకార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది.
త్రివిక్రమ్ మాతో మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తారంటే?
తెలుగు స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు త్రివిక్రమ్. అతడు, అత్తారింటికి దారేది, అరవింద సమేత, అల వైకుంఠపురములో, జులాయి, ఖలేజా, సన్నాఫ్ సత్యమూర్తి, జల్సా, నువ్వే నువ్వే, అఆ తదితర సినిమాలతో తనదైన పేరుని సొంతం చేసుకున్నారు. అభిమానులతో ముద్దుగా మాటల మాంత్రికుడు అని పిలిపించుకుంటూ ఉంటారు.(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ)అయితే గత పదేళ్ల కాలంలో త్రివిక్రమ్ తీసిన సినిమాలు చూస్తే.. అన్నీ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థలోనే తెరకెక్కించారు. ఇలా ఒకే నిర్మాతతో కలిసి ఎందుకు పనిచేస్తున్నారనే దానికి నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో త్రివిక్రమ్-తమ బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'బాబాయి(చినబాబు).. ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు మొదటి మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మించాలనుకున్నారు. త్రివిక్రమ్ పనితీరు, సినిమాలపై ఆయనకున్న అభిమానం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. 'జులాయి' తొలి చిత్రం. ఇది ప్రారంభమైనప్పటి నుంచి త్రివిక్రమ్తో మా అనుబంధం మరింత బలపడింది. 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బ్యానర్ పేరుని ఆయనే సూచించారు. లోగో కూడా త్రివిక్రమ్ డిజైన్ చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన బయట బ్యానర్(నిర్మాణ సంస్థ)లో సినిమా చేయలేదు. దీనికి ఎలాంటి అగ్రిమెంట్స్ లేవు. మా మధ్య ఉన్న రిలేషన్షిప్ అలాంటిది. ఓ కుటుంబంలా అయిపోయాం' అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.త్రివిక్రమ్ ప్రస్తుతం తీస్తున్న 'ఆదర్శ కుటుంబం', త్వరలో ఎన్టీఆర్తో తీయబోయే మూవీ కూడా ఇదే సంస్థలో నిర్మిస్తున్నారు. మరోవైపు నాగవంశీ.. సితార నిర్మాణ సంస్థ తరఫున పలు మూవీస్ తీస్తూ బిజీగా ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ)
క్రీడలు
గురునాయుడుకు రజతం
తాష్కెంట్: ఆసియా జూనియర్, యూత్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత ఆటగాడు ఎస్. గురునాయుడు రజత పతకం (60 కేజీల కేటగిరీ) గెలుచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన గురు నాయుడు మొత్తం 265 కేజీల (స్నాచ్ 119 కేజీలు + క్లీన్ అండ్ జర్క్ 146 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఇదే ఈవెంట్లో మరో భారత వెయిట్ లిఫ్టర్ తోమ్చు మీటి స్వర్ణం సాధించాడు. తోమ్చు మొత్తం 266 కేజీల (స్నాచ్ 116 కేజీలు + క్లీన్ అండ్ జర్క్ 150 కేజీలు) బరువును ఎత్తి మొదటి స్థానంతో ముగించాడు.
ఫైనల్లో అష్మిత
సియోల్: కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత రైజింగ్ స్టార్ అష్మిత చాలిహా ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 50వ ర్యాంకర్ అషి్మత 21–13, 16–21, 21–13తో భారత్కే చెందిన రక్షిత శ్రీపై విజయం సాధించింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సింగిల్స్ ఫైనల్ చేరడం అష్మితకు ఇదే తొలిసారి. క్వార్టర్స్లో ప్రపంచ 22వ ర్యాంకర్, టాప్ సీడ్ హినా అకెచి (జపాన్)ను ఓడించిన అష్మిత... నేడు జరగనున్న ఫైనల్లో నాలుగో సీడ్ హాన్ క్సియాన్ జీ (చైనా)తో తలపడనుంది. గత వారం భారత యువ షట్లర్ తన్వీ శర్మ తైపీ ఓపెన్ టైటిల్ సాధించగా... ఇప్పుడు అష్మిత కొరియా ఓపెన్ టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది.
మరోసారి దొరికిపోయిన జైస్వాల్.. లోపం ఎక్కడుంది?
శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. కొలంబో వేదికగా శనివారం నాటి రెండో రోజు ఆటలో లంక బౌలర్ విశ్వ ఫెర్నాండో బౌలింగ్లో.. దిలుమ్ సుదీరకు క్యాచ్ ఇచ్చి డకౌట్గా పెవిలియన్ చేరాడు.ఈ నేపథ్యంలో లెఫ్టార్మ్ సీమర్లను ఎదుర్కోవడంలో జైసూ వైఫల్యం మరోసారి బయటపడింది. తన టెస్టు కెరీర్లో జైస్వాల్ ఇప్పటి వరకు 29 టెస్టులు ఆడి 2535 పరుగులు సాధించి మంచి రికార్డు కలిగి ఉన్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికే ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి.కేవలం 200 పరుగులుఅయితే, ఎడమచేతి వాటం ఉన్న ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ను ఎదుర్కోవడంలో జైస్వాల్ ముందు నుంచే ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటి వరకు తన కెరీర్లో లెఫ్టార్మ్ సీమర్ల బౌలింగ్లో జైసూ కేవలం 200 పరుగులు చేసి.. తొమ్మిది సందర్భాల్లో అవుటయ్యాడు. సగటు 22.2గా ఉంది. రైటార్మ్ సీమర్ల బౌలింగ్లో మాత్రం జైసూ సగటున 42 పరుగులతో ఏకంగా 1184 పరుగులు రాబట్టాడు.నిజానికి లెఫ్టార్మ్ పేసర్ల యాంగిల్ కారణంగా రైటార్మ్ బ్యాటర్లు ఇబ్బంది పడతారు. కానీ లెఫ్టాండ్ బ్యాటర్ అయిన జైసూ ఇలా వీరి బౌలింగ్లో ఇబ్బంది పడటం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే అని విశ్లేషకులు అంటున్నారు.వారి బౌలింగ్లో మరీ కష్టంకాగా లెఫ్టార్మ్ సీమర్లలో ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో జైసూ 133 పరుగులు చేసి.. మూడు సార్లు అవుటయ్యాడు. సగటు 44.3. అయితే, సౌతాఫ్రికా స్టార్లు మార్కో యాన్సన్, నండ్రీ బర్గర్ మాత్రం జైసూను మరింత ఇబ్బంది పెట్టారు. యాన్సెన్ బౌలింగ్లో జైసూ 42 పరుగులు చేసి మూడుసార్లు అవుట్ కాగా.. బర్గర్ బౌలింగ్లో కేవలం 21 పరుగులే చేసి మూడుసార్లు పెవిలియన్ చేరాడు.కేవలం టెస్టుల్లోనే కాదు టీ20 ఫార్మాట్లోనూ జైస్వాల్ లెఫ్టార్మ్ సీమర్లను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పటికి వారి బౌలింగ్లో 135 పరుగులు చేసి ఐదుసార్లు అవుటయ్యాడు. నెట్స్లో గంట ప్రాక్టీస్కాగా లెఫ్టాండ్ బ్యాటర్ అయిన జైసూకు లెఫ్టార్మ్ పేసర్ వేసే బంతి భిన్నమైన కోణంలో వస్తుంది. బౌలర్ బంతిని రిలీజ్ చేసిన మూమెంట్ మీదే అతడు ఎలాంటి షాట్ ఆడాలన్న నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా జైస్వాల్ మరోసారి లెప్టార్మ్ పేసర్ చేతికి దొరికిపోయి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో డకౌట్ అయిన వెంటనే నెట్స్లో తిరిగి ప్రాక్టీస్కు వెళ్లిన 24 ఏళ్ల జైస్వాల్.. గంటపాటు అక్కడే శ్రమించినట్లు తెలుస్తోంది.చదవండి: పడిక్కల్ భారీ శతకం.. జడ్డూ ఫిఫ్టీ.. బ్రార్ మెరుపులు
మెస్సీ ఇంట తీవ్ర విషాదం
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెస్సీ తండ్రి జార్జ్ హొరాసియో మెస్సీ (68) కన్నుమూశారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. జార్జ్ మెస్సీ అర్జెంటీనాలోని రొసారియోలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.జార్జ్ మెస్సీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన మృతికి గల ఖచ్చితమైన కారణాన్ని ఎవరూ వెల్లడించలేదు.మెస్సీ కెరీర్లో కీలక పాత్రలియోనెల్ మెస్సీ ఫుట్బాల్ ప్రయాణంలో జార్జ్ మెస్సీ పాత్ర ఎంతో కీలకం. చిన్నతనం నుంచే తన కుమారుడి కెరీర్ను దగ్గరుండి పర్యవేక్షించిన ఆయన, మెస్సీ ప్రొఫెషనల్ ఫుట్బాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా అతడి ప్రతినిధిగా, సలహాదారుగా వ్యవహరించారు.మెస్సీ చిన్న వయసులోనే స్పెయిన్లోని బార్సిలోనాకు వెళ్లిన సమయంలో కూడా జార్జ్ ఆయన వెంట ఉన్నారు. అనంతరం మెస్సీ కెరీర్కు సంబంధించిన ఆర్థిక, వృత్తిపరమైన వ్యవహారాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.జూన్లో అనారోగ్యంపై వార్తలుజార్జ్ మెస్సీ అనారోగ్యానికి గురైన విషయం జూన్లో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వచ్చినప్పటికీ, కుటుంబం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.2026 ఫిఫా ప్రపంచకప్ సమయంలోనూ జార్జ్ మెస్సీ ఆరోగ్యంపై తప్పుడు మరణవార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుటుంబం ఆ వార్తలను ఖండించింది.ప్రస్తుతం ఆయన మరణించినట్లు పలు నివేదికలు ధృవీకరిస్తున్నాయి. రొసారియోలోని ఓ ఆసుపత్రిలో దీర్ఘకాలిక అనారోగ్యంతో పోరాడుతూ ఆయన మరణించినట్లు సమాచారం.
న్యూస్ పాడ్కాస్ట్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
చంద్రబాబు పాలన రైతులకు హానికరం... చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ... వైఎస్ జగన్ ఆగ్రహం
అసత్య ప్రచారంలో ఆరితేరిన ఏపీ సీఎం చంద్రబాబు... రెండు మినహా హామీలన్నీ అమలు చేశానంటూ బుకాయింపు...
బీసీ నేతలపై రెడ్బుక్!. బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అక్రమ అరెస్టులు
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
ఏపీలో దగా డీఎస్సీపై దండయాత్ర... రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు విజయవంతం
దేశంలో పసిడికి తగ్గిన డిమాండ్... ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6 శాతం డౌన్
బిజినెస్
ఉద్యోగాలపై నందన్ నీలేకని కీలక వ్యాఖ్యలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల రాబోయే రోజుల్లో.. భారతదేశంలో ఉద్యోగాల తీరు చాలా వరకు మారే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నీలేకని అన్నారు. ముఖ్యంగా పెద్ద కంపెనీల్లో ఏఐ, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.నిజానికి.. ఒక ఉద్యోగి చేసే పనిని చిన్న చిన్న టాస్కులుగా విభజించి వాటిలో కొన్నింటిని ఏఐతో చేయించుకోవడం పెద్ద సంస్థలకు సులభంగా ఉంటుంది. కాబట్టి.. భవిష్యత్తులో పెద్ద కంపెనీలు ఉద్యోగాలు కల్పించడం కంటే, ఉద్యోగాలను తొలగిస్తాయని నీలేకని అభిప్రాయపడ్డారు.అయితే.. చిన్న కంపెనీల పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంటుందని నీలేకని అన్నారు. దేశంలో లక్షల సంఖ్యలో చిన్న సంస్థలు ఉన్నాయి. ఇందులో పనితీరు, అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి. అందువల్ల వాటి మొత్తం కార్యకలాపాలను ఏఐతో ఆటోమేట్ చేయడం అంత సులభమైన విషయం కాదు. కాబట్టి చిన్న వ్యాపారాలు.. ఏఐ ప్రభావాన్ని కొంతవరకు తట్టుకుని నిలబడగలవు, ఉద్యోగాలను కల్పించగలవని ఆయన అన్నారు.ప్రస్తుతం దేశంలో సుమారు 1.5 లక్షల స్టార్టప్లు ఉన్నాయి. 2035 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు చేరే అవకాశం ఉందని నీలకేని అంచనా వేశారు. అయితే.. చిన్న వ్యాపారాలు పెరగాలంటే నిబంధనలు సులభంగా ఉండాలని, వారికి పెట్టుబడులు, రుణాలు, మార్కెట్లు సులభంగా అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. మరోవైపు ఉద్యోగుల విషయంలోనూ పరిస్థితులు మారుతున్నాయని చెప్పారు. ఒక కంపెనీలో చేరి ఏళ్ల పాటు అక్కడే పనిచేసే రోజులు క్రమంగా తగ్గిపోతున్నాయని, భవిష్యత్తులో ఉద్యోగులు తరచుగా కంపెనీలు మారే పరిస్థితి రావచ్చని అన్నారు.ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందా?
ఈ-స్కూటర్లతో జాగ్రత్త.. బైక్లు, సైకిళ్ల కంటే ప్రమాదకరం!
ఎలక్ట్రిక్ స్కూటర్లు (ఈ-స్కూటర్లు) నడపడం మోటార్సైకిళ్లు లేదా సైకిళ్లు నడపడం కంటే ప్రమాదకరమని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ-స్కూటర్ (చిన్న చక్రాలవి) ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాలు, రక్తనాళాలు దెబ్బతినడం, అంతర్గత అవయవాలకు గాయాలు అయ్యే ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ విషయాలను ‘ది గార్డియన్’ నివేదించింది.చెల్సియా అండ్ వెస్ట్మినిస్టర్ హాస్పిటల్కు చెందిన హ్యాండ్, ట్రామా, ఆర్థోపెడిక్ సర్జన్ డేవిడ్ బోడాన్స్కీ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. 2020 నుంచి 2022 మధ్య ఇంగ్లాండ్, వేల్స్లోని 18 నగరాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల సమాచారాన్ని జాతీయ ప్రధాన ట్రామా రిజిస్ట్రీ నుంచి పరిశోధకులు విశ్లేషించారు.తలకు గాయాల ముప్పు మూడు రెట్లుమోటార్సైకిల్ రైడర్లతో పోలిస్తే ఈ-స్కూటర్ రైడర్లకు మెదడు గాయం లేదా రక్తనాళాలు దెబ్బతినే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే అంతర్గత అవయవాలకు గాయాలయ్యే అవకాశం సుమారు 1.5 రెట్లు ఎక్కువగా ఉంది. అయితే ఎముకలు విరిగే ప్రమాదం మాత్రం సైక్లిస్టులు, మోటార్సైకిల్ రైడర్లతో పోలిస్తే తక్కువగా నమోదైంది.చిన్న చక్రాలే ప్రధాన కారణమా?ఈ-స్కూటర్ల డిజైన్ కూడా ప్రమాద తీవ్రతకు ఓ కారణమని బోడాన్స్కీ అభిప్రాయపడ్డారు. చిన్న పరిమాణంలో ఉండే చక్రాలు గుంతలు, రోడ్డు గుంతలు లేదా ఇతర అడ్డంకుల్లో సులభంగా ఇరుక్కుపోయే అవకాశం ఉంది. దీంతో రైడర్లు అదుపు తప్పి హ్యాండిల్బార్లపై నుంచి ముందుకు ఎగిరి తలపై పడే ప్రమాదం ఉంటుందని ఆయన వివరించారు. మరోవైపు ప్రమాద సమయంలో ఈ-స్కూటర్ రైడర్లలో 6 శాతం కంటే తక్కువ మంది మాత్రమే హెల్మెట్ ధరించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. దీంతో తలకు సంబంధించిన గాయాలు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.మహిళలు, యువతకూ అధిక ముప్పుఈ-స్కూటర్ ప్రమాదాల్లో లింగపరమైన తేడాలు కూడా కనిపించాయి. పురుషులతో పోలిస్తే మహిళలు సుమారు మూడో వంతు ఎక్కువగా ప్రమాదాలకు గురైనట్లు, అలాగే తీవ్రమైన గాయాలు నమోదయ్యే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ-స్కూటర్ల హ్యాండిల్బార్లు సాధారణంగా పురుషుల శరీరాకృతికి అనుగుణమైన ఎత్తులో ఉండటం కూడా మహిళలకు ఎక్కువగా గాయాలు కావడానికి ఓ కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు మొత్తం ఈ-స్కూటర్ గాయాల్లో 16 శాతం మంది పిల్లలే ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.భద్రతా నిబంధనలు కఠినతరం చేయాలంటున్న నిపుణులుయూకేలోని చాలా ప్రాంతాల్లో పబ్లిక్ రోడ్లు, ఫుట్పాత్లు, సైకిల్ లేన్లపై ప్రైవేట్ ఈ-స్కూటర్లను నడపడం చట్టబద్ధం కాదు. అయినప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుపుతున్న వారి నుంచి పోలీసులు వేలాది ఈ-స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ-స్కూటర్ వినియోగదారుల భద్రత కోసం తప్పనిసరి భద్రతా శిక్షణ, హెల్మెట్ వినియోగం, మెరుగైన డిజైన్తో కూడిన స్కూటర్లను అందుబాటులోకి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువ రైడర్లకు భద్రత కల్పించేలా ఈ-స్కూటర్ల రూపకల్పన, వినియోగ నిబంధనలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
E20 పెట్రోల్పై ఆందోళనలు.. పరీక్షల్లో తేలింది ఇదే!
భారత్లో ఈ20 పెట్రోల్పై గత కొంతకాలంగా.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్ కలపడం వల్ల ఇంధన నాణ్యతపై ప్రభావం పడుతుందా?.. క్లోరైడ్, తేమ లేదా నీరు కలిసే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ నమూనాలను పరీక్షించాయి.దేశంలోని రిఫైనరీల నుంచి సేకరించిన 100కు పైగా పెట్రోల్ నమూనాలను పరీక్షించగా.. వాటిలో క్లోరైడ్ స్థాయి 1 ppm లేదా అంతకంటే తక్కువగా నమోదైంది. 80 డిస్టిలరీల నుంచి సేకరించిన ఇథనాల్ నమూనాల్లో క్లోరైడ్ స్థాయి 3 ppm కంటే తక్కువగా ఉంది. డిపోలు, టెర్మినల్స్ నుంచి సేకరించిన 80కి పైగా ఈ20 నమూనాల్లో కూడా క్లోరైడ్ స్థాయి 3 ppm కంటే తక్కువగానే ఉన్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.ఇదే సమయంలో.. దేశవ్యాప్తంగా సుమారు 90,000 పెట్రోల్ బంకుల్లోని భూగర్భ ట్యాంకులను కూడా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ట్యాంకుల్లోకి నీరు చేరినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని సంస్థలు పేర్కొన్నాయి. దీంతో ఈ20 పెట్రోల్ నాణ్యతపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణంగానే ఈ20 పెట్రోల్ను ఉపయోగించవచ్చని చమురు సంస్థలు చెబుతున్నాయి.చమురు సంస్థలు ఎన్ని చెబుతున్నా.. ఈ20పై వినియోగదారుల నుంచి విమర్శలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పాత వాహనాల్లో 20 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్ తగ్గడం లేదా వాహనం పనితీరులో మార్పులు రావచ్చని కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా పాత వాహనాలలో సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నట్లు వాహన వినియోగదారులు పేర్కొంటున్నారు.
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. తలకిందులైన రేట్లు!
బంగారం ధరలు ఈ వారం మళ్లీ పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఏకంగా 7 శాతానికి పైగా లాభపడి, ఎనిమిది నెలల్లోనే అత్యుత్తమ వారపు పనితీరును నమోదు చేసింది. స్పాట్ గోల్డ్ ఔన్సుకు సుమారు 4,336 డాలర్లకు చేరగా, ట్రేడింగ్లో 4,350 డాలర్ల సమీపంలో ఏడు వారాల గరిష్ఠాన్ని తాకింది. బలహీనమైన అమెరికా ఉద్యోగాల డేటా, తగ్గుతున్న ముడిచమురు ధరలు, వడ్డీ రేట్లపై మారుతున్న అంచనాలు పసిడి ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి.బంగారానికి పెరిగిన డిమాండ్అమెరికా జూలై నాన్-ఫార్మ్ పేరోల్స్ అనూహ్యంగా 23 వేల ఉద్యోగాలు తగ్గడం మార్కెట్లను ఆశ్చర్యానికి గురిచేసింది. జూన్ గణాంకాలను కూడా దిగువకు సవరించడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు పెరిగాయి. దీంతో ఫెడరల్ రిజర్వ్ సమీప సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం తగ్గిందన్న అంచనాలు బలపడ్డాయి. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పెరిగినప్పుడు బాండ్లపై రాబడులు, డాలర్ బలహీనపడే అవకాశం ఉండటంతో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.మరోవైపు ముడిచమురు ధరలు తగ్గడం కూడా బంగారానికి కలిసొచ్చింది. చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో ‘హయ్యర్ ఫర్ లాంగర్’ వడ్డీ రేట్ల అంచనాలు బలహీనపడతాయి. అదే సమయంలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లుతున్న నిధులు పసిడి ధరలకు అదనపు మద్దతు ఇస్తున్నాయి.సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కూడా ప్రస్తుత ర్యాలీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 2026 రెండో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకులు 288.9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఏడాది ప్రాతిపదికన ఇది 62 శాతం పెరుగుదల. దక్షిణ కొరియా సెంట్రల్ బ్యాంక్ కూడా 13 ఏళ్ల విరామం తర్వాత తిరిగి బంగారం కొనుగోలు చేయడం అధికారిక రంగంలో పసిడిపై ఆసక్తి ఇంకా బలంగానే ఉందన్న సంకేతాలను ఇస్తోంది.పెరిగింది రూ.8వేలు పైనే..ఇక హైదరాబాద్ రిటైల్ మార్కెట్ను పరిశీలిస్తే.. ఆగస్టు 8న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,350గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,39,650గా నమోదైంది. వారం ప్రారంభంలో అంటే ఆగస్టు 1న 24 క్యారెట్ల ధర రూ.1,44,220, 22 క్యారెట్ల ధర రూ.1,32,200గా ఉండగా.. వారం రోజుల్లో 24 క్యారెట్లపై రూ.8,130, 22 క్యారెట్లపై రూ.7,450 పెరిగింది.మరో భారీ బుల్రన్ అవుతుందా?అయితే ఈ ర్యాలీని నేరుగా మరో భారీ బుల్రన్గా నిర్ధారించడం తొందరపాటు అవుతుందని విశ్లేషకుల అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి బలంగా కొనసాగడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, మార్కెట్లలో రిస్క్ అప్పటైట్ తిరిగి రావడం వంటి అంశాలు బంగారంపై ఒత్తిడి తీసుకురావచ్చు. అలాగే ధరలు ఇప్పటికే అధిక స్థాయిలో ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగితే స్వల్పకాలంలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొంతకాలం పరిమిత శ్రేణిలో కదలవచ్చని పేర్కొంది.అదే సమయంలో ఆర్థిక మందగమనం, కొత్త భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు లేదా ధరలు తగ్గినప్పుడు కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు కలిసి వస్తే బంగారం మళ్లీ 4,500 డాలర్ల స్థాయిని దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంటే ప్రస్తుత ర్యాలీకి దీర్ఘకాలిక బలం ఉన్నప్పటికీ, మధ్యలో ధరల కరెక్షన్, లాభాల స్వీకరణ వంటి పరిణామాలు తప్పక చూడాల్సి ఉంటుంది.
ఫ్యామిలీ
ఫేక్ఆట కట్టించే లా
ఒకప్పుడు సెలబ్రిటీల చుట్టూ మాత్రమే తిరిగిన ‘డీప్ఫేక్’ విష సర్పం... ఇప్పుడు సామాన్యుల జీవితాల్లోకి కూడా వచ్చింది. స్విచ్ వేసి లైట్ వెలిగించినంత తేలిగ్గా ‘మాయా సాంకేతికత’ అందుబాటులోకి వచ్చింది. డీప్ఫేక్ దెబ్బకు...పచ్చని సంసారాల్లో చిచ్చు రేగుతుంది. పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. ఒక్కటా... రెండా... ఎన్నో ఎన్నెన్నో! ఏ.ఐ. టెక్నాలజీ సృష్టించిన డీప్ఫేక్, హానికరమైన సింథటిక్ కంటెంట్కు మరింత పకడ్బందీగా అడ్డుకట్ట వేయడానికి కేంద్రప్రభుత్వం నడుం బిగించింది. డీప్ఫేక్ డిటెన్షన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. పదమూడు ఏఐ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్లకు ఆమోదం తెలిపింది...డీప్ఫేక్ కంటెంట్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ఎలక్ట్రానిక్స్–ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ మెటా, ఎక్స్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను దృష్టిలో పెట్టుకొని కఠినమైన నియమాలను రూ΄÷ందించింది. ‘ఏఐ వాడకం పెరగడం వల్ల నకిలీ ఫొటోలు, వీడియోలు, ఆడియోలను సృష్టించడం సులువైంది. వీటిని సైబర్ నేరాలకు కూడా ఉపయోగిస్తున్నారు. డీప్ఫేక్లకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఉన్న చట్టాలను పటిష్టం చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియటరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్–2021)ని సవరించింది’ అంటున్నారు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్.వేగంగా చర్యలు తీసుకోవచ్చుచట్టవిరుద్ధమైన ఏఐ కంటెంట్పై ఇకపై ఆన్లైన్ ప్లాట్ఫామ్లు వేగంగా చర్యలు తీసుకోవచ్చు. గతంలో ఉన్న 36 గంటల గడువుకు బదులుగా, మూడు గంటల లోపే తొలగించాలి. చట్ట విరుద్ధమైన ఏఐ కంటెంట్ను గుర్తించడానికి, ఆటోమేటెడ్ సాధనాలతో సహా తగిన సాంకేతిక చర్యలను అమలు చేయాలని ప్రభుత్వం సోషల్ మీడియా కంపెనీలను కోరింది. సవరించిన నిబంధనల ప్రకారం ఏఐ ద్వారా రూ΄÷ందించిన కంటెంట్ను స్పష్టంగా లేబుల్ చేయాలి. సింథటిక్ కంటెంట్ను మరింత సులభంగా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. డీప్ఫేక్ల ద్వారా ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశాలను తగ్గిస్తుంది.‘సాక్ష్య’ సహకారంతో...నియంత్రణా పరమైన మార్పులతో ΄ాటు డీప్ఫేక్ డిటెన్షన్ టెక్నాలజీని మెరుగుపరచడానికి విద్యాసంస్థలలో పదమూడు ‘రెస్పాన్సిబుల్ ఏఐ’ ప్రాజెక్ట్లను ప్రభుత్వం ఆమోదించింది. ఐఐటీ, జో«ద్పూర్, ఐఐటీ, మద్రాస్ అభివృద్ధి చేస్తున్న మల్టీ– ఏజెంట్ డీప్ఫేక్ డిటెక్షన్ ఫ్రేమ్వర్క్ ‘సాక్ష్య’ ఈ కార్యక్రమాలలో కీలకమైనది. మరొక ప్రాజెక్ట్...ఏఐ విశ్లేషక్. నకిలీ ఆడియో, వీడియోలను గుర్తించడానికి దీన్ని రూ΄÷ందించారు. మీడియాఫైళ్లను విశ్లేషించడానికి, వాటిని తారుమారు చేశారా అనేది తెలుసుకోవడానికి ‘ఏఐ విశ్లేషక్’ ఉపయోగపడుతుంది. ఐఐటీ, ఖరగ్పూర్ రియల్–టైమ్ వాయిస్ డీప్ఫేక్ డిటెన్షన్ సిస్టమ్పై పనిచేస్తోంది. ఏఐ సృష్టించిన మాటలను ఇది గుర్తించగలదు. తద్వారా వాయిస్ స్కామ్లు, ఆర్థిక మోసాలు జరగకుండా నిరోధించవచ్చు.యూట్యూబ్ లైక్ డిటెక్షన్ఏఐ–ఆధారిత పోలికను గుర్తించే ్రపోగ్రామ్కు 18 ఏళ్లు పైబడిన యూజర్లు అందరికీ యాక్సెస్ విస్తరిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. దీంతో తమ పోలికతో ఏఐ ద్వారా సృష్టించబడిన డీప్ఫేక్లపై చర్య తీసుకోవచ్చు. యూట్యూబ్లోని లైక్ డిటెక్షన్ టూల్ అనేది పోలికలను కనిపెడుతుంది. ఒకవేళ ఈ టూల్ పోలిక కనుగొంటే, ఎవరి పోలిక అయితే గుర్తించబడిందో ఆ యూజర్కు ఒక హెచ్చరిక(అలర్ట్) పంపబడుతుంది. దీంతో ఆ కంటెంట్ను తొలగించమని యూట్యూబ్ను అభ్యర్థించే అవకాశం బాధితులకు దొరుకుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఏఐ ద్వారా సృష్టించబడిన చాలా డీప్ఫేక్లు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ సామాన్యులకు సంబంధించి కూడా ఇది ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో వారికి లైక్ డిటెక్షన్ టూల్ ఉపయోగపడుతుంది.ఎలా గుర్తించవచ్చు?డీప్ఫేక్ కొత్తగా వచ్చిన రోజుల్లో ఆ సాంకేతికత పరిపూర్ణంగా ఉండేది కాదు. తారుమారు చేసినట్లు స్పష్టమైన సంకేతాలు చూపించేది. వీడియోలలో కనిపించే వ్యక్తులు అసహజంగా కనురెప్పలు ఆర్పడం లాంటివి అందులో ఒకటి. తరువాత రోజుల్లో టెక్నాలజీ మెరుపడడంతో డీప్ఫేక్లను గుర్తించడం కష్టమైంది. అయినప్పటికీ కొన్ని సంకేతాలతో వాటిని గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు...→ సహజత్వం లోపించిన డీప్ఫేక్ ఫొటోలు ఎలక్ట్రానిక్ మెరుపును కలిగి ఉంటాయి → చిత్రంలోని వ్యక్తి స్పష్టమైన ఫోకస్లో ఉంటాడు. బ్యాక్గ్రౌండ్లోని అంశాలు వాస్తవికంగా అనిపించవు → సాధారణ డీప్ఫేక్ పద్ధతులలో ముఖాలను మార్చడం ఫేస్–స్వాపింగ్) ఒకటి. ముఖం అంచులను నిశితంగా చూడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖంలోని చర్మపు రంగు శరీరంలోని మిగిలిన భాగంతో సరిపోలుతుందా? ముఖం అంచులు స్పష్టంగా ఉన్నాయా లేదా చూడాలి → వీడియోలో ఉన్న వ్యక్తి పెదాల కదలికలు ఆడియోతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయా... లేదా అనేది చూడాలి → పళ్లు సహజంగా ఉన్నాయా... అసహజంగా ఉన్నాయా అనేది పరిశీలించాలి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ నార్టన్ ప్రకారం ఒక్కోపంటిని సృష్టించేంత అధునాతనమైన అల్గారిథమ్లు ఇంకా అభివృద్ధి చెందలేదు → ఫొటోలు లేదా వీడియోలు మార్ఫింగ్ చేయబడ్డాయా లేదా అనేది తెలుసుకోవడానికి మైక్రోసాఫ్ట్ ఒక అథంటికేటర్ టూల్ను అభివృద్ధి చేసింది. చిప్ మేకర్ ఇంటెల్ ‘ఫేక్క్యాచర్’ ఫొటో లేదా వీడియో నిజమైనదా కాదా అని తెలుసుకోవడానికి, పిక్సెళ్ళను విశ్లేషించడానికి అల్గారిథమ్లను ఉపయోగిస్తుంది.
మోసపోయినా మంచితనం వదలొద్దు!
జీవితంలో మనల్ని బాధించినవాళ్లు రెండు విషయాల్లో ఒకదాన్ని తప్పకుండా తీసుకెళ్తారు. ఒకటి మన ప్రశాంతతను, రెండోది మన మంచితనాన్ని. ప్రశాంతత కొంతకాలానికి తిరిగి వస్తుంది. కానీ మంచితనం పోతే మనల్ని మనమే కోల్పోతాం. ఎందుకంటే, బాధ మనిషిని రెండు రకాలుగా మారుస్తుంది.తాను అనుభవించిన గాయాలను ఇతరులకూ పంచడం మొదలుపెట్టడం అనేది ఒక రకమైతే... తాను అనుభవించిన బాధ ఇంకెవరికీ కలగకూడదనే భావనతో జీవించడం రెండో రకం. ఈ రెండో రకమైన మనుషులే నిజంగా అరుదు. వాళ్లు కూడా మోసపోతారు. వాళ్లూ కూడా విరిగిపోతారు. వాళ్లూ కన్నీళ్లు పెడతారు. కానీ తమలోని మంచి మనిషిని మాత్రం కోల్పోరు. ఎందుకంటే, చెడ్డవాడిగా మారడానికి ఒక్క గాయం చాలు, మంచి మనిషిగా మిగిలి పోవడానికి మాత్రం గొప్ప హృదయం కావాలి.విజయవంతులైన మనుషులు చాలామంది కనిపిస్తారు. తెలివైన వాళ్లు కూడా కనిపిస్తారు. కానీ, బాధను అనుభవించిన తర్వాత కూడా ఎవరికీ బాధ కలిగించకుండా జీవించే మనుషులు మాత్రం అరుదుగా కనిపిస్తారు. వాళ్ల జీవితంలో ఎంత చెడు ఎదురైనా, వాళ్లలోని మంచిని కోల్పోకపోవడమే వాళ్ళ వ్యక్తిత్వంలోని గొప్పదనం. అందుకే, బాధ హృదయాన్ని తాకినా, హృదయంలో ద్వేషానికి స్థానం ఇవ్వకుండా జీవించగలగడమే నిజమైన విజయం.ముందుగా క్షమాపణ చెప్పేవాడు ధైర్యవంతుడు. ముందుగా క్షమించేవాడు బలవంతుడు. ముందుగా మర్చిపోయే వాడు ప్రశాంతంగా జీవించగలడు. తనను బాధించిన తర్వాత కూడా మంచి తనాన్ని ఎంచుకునే మనిషి ఈ ప్రపంచంలో అత్యంత అరుదైన వ్యక్తి.– కొత్త కృష్ణవేణి
కీబోర్డ్లో 'ఎఫ్, జే' కీలపై గీతలు ఎందుకుంటాయో తెలుసా?
మనలో చాలామంది ప్రతిరోజూ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కీబోర్డ్ను ఉపయోగిస్తుంటారు. అయితే, కీబోర్డ్లోని ‘ఎఫ్’, ‘జె’ అనే రెండు కీస్పై చిన్న ఎత్తుగా ఉండే గీతలు లేదా బంప్స్ ఉంటాయి. ఇవి ఎందుకుంటాయో ఎపుడైనా ఆలోచించారా? ఈ గీతలను టచ్ టైపింగ్ సౌకర్యం కోసం తయారుచేశారు.కీబోర్డ్ వైపు చూడకుండానే వేగంగా టైప్ చేయడానికి ఈ గీతలు ఎంతగానో ఉపయోగపడతాయి. టైపింగ్ నేర్చుకునే సమయంలో చేతి వేళ్లను కీబోర్డ్ మధ్య వరుసలో ఉంచడాన్ని ‘హోమ్ రో’ అంటారు. ఎడమ చేతి చూపుడు వేలిని ‘ఎఫ్’ పై, కుడి చేతి చూపుడు వేలిని‘జె’పై ఉంచడానికి ఈ గీతలు సూచికగా పనిచేస్తాయి.అంతేకాదు టైప్ చేసేటప్పుడు ప్రతిసారీ కీబోర్డ్ వైపు చూడాల్సిన అవసరం లేకుండా, వేళ్ల స్పర్శ ద్వారా చూపుడు వేళ్లు సరైన స్థానంలో ఉన్నాయో లేదో గుర్తించవచ్చు. వేళ్లు సరైన స్థానంలో ఉండటం వల్ల సమయం ఆదా అయి, టైపింగ్ వేగం పెరుగుతుంది. స్క్రీన్ నుంచి దృష్టి మళ్లించకుండా టైప్ చేయడం వల్ల కళ్లకు విశ్రాంతి లభిస్తుంది. చూపు లేనివారు లేదా కీబోర్డ్ చూడకుండా టైప్ చేయాలనుకునే వారి కోసం జాన్ ఇ బార్ట్లీ అనే మహిళ ఈ టెక్నిక్ను రూపొందించి.. 2002లో పేటెంట్ పొందారు.
కెరీర్లో ఎదగాలంటే.. ఈ అలవాటు తప్పనిసరి!
క్షణక్షణానికి టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రపంచంలో అప్స్కిల్లింగ్ అనేది ఎంతోముఖ్యం. నేడు ఉద్యోగ భద్రత అనేది అనుభవం కంటే.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. మారుతున్న సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాత పద్ధతులు కనుమరుగవుతున్నాయి. అందువల్ల అప్స్కిల్లింగ్ అనేది ‘ఒక ఎంపిక కాదు, ఒక తప్పనిసరి అవసరం’. ముఖ్యంగా గృహిణులుగా స్థిరపడిన వారు, కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలు తిరిగి ఉద్యోగ బాట పట్టాలంటే అప్స్కిల్లింగ్ అత్యంత ఆవశ్యకమని నిపుణులు సూచిస్తున్నారు.నిరంతర అభ్యాసంనేటి ఆధునిక ఆర్థిక వ్యవస్థ కేవలం అప్డేటెడ్గా ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. డిజిటల్ అక్షరాస్యత, విశ్లేషణాత్మక ఆలోచన, కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలకు అన్ని రంగాలలో గిరాకీ పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి, మనపై మనకు నియంత్రణ ఉండటానికి ఈ అప్స్కిల్లింగ్ తోడ్పడుతుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నిర్ణయాధికారం పదునుదేలుతుంది. ముఖ్యంగా ఇది మహిళలకు ఎంతో అవసరం. ఆర్థికంగా బలోపేతం కావాలంటే నిరంతరం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవాలి.లోతైన అవగాహన ముఖ్యంఏదయినా స్కిల్ నేర్చుకున్నపుడు దానిపై లోతైన అవగాహనను పెం΄÷ందించుకోవాలి. కేవలం కంటెంట్ను నేర్చుకోవడం మాత్రమే కాకుండా, క్లిష్టమైన పని వాతావరణంలో కూడా ఆ జ్ఞానాన్ని ఆత్మవిశ్వాసంతో అమలు చేసే సామర్థ్యం పెరగాలి. డిజైన్, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు కేవలం తమ రంగానికే పరిమితం కాకుండా, సంబంధిత ఇతర రంగాలపై కూడా అవగాహన పెంచుకోవాలి. ఈ విస్తృత అవగాహనే విజయానికి దారులుపరుస్తుంది. అలాగే శిక్షణ అనేది పనికి దూరంగా ఉండే ప్రక్రియ కాదు, రోజువారీ ప్రాజెక్టులు సమస్యల పరిష్కారంలో భాగమైనప్పుడే దానికి సార్థకత ఉంటుంది.సర్టిఫికెట్లతో రాణించలేరు!ఎక్కువ మంది కెరీర్ ప్రారంభంలో మాత్రమే కొత్త విషయాలను నేర్చుకోవడంపై శ్రద్ధ చూపిస్తారు. కానీ నేర్చుకోవడం అనేది కొంతసమయానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఇది జీవితాంతం కొనసాగాలి. ముఖ్యంగా విరామం తర్వాత తిరిగి ఉద్యోగాల్లోకి చేరాలనుకునే మహిళలకు, కొత్త సాంకేతికతకు అలవాటు పడాలనుకునే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుత కాలంలో షార్ట్ కోర్సులు, బ్లెండెడ్ లెర్నింగ్ వల్ల మనం చేస్తున్న పనులను ఆపకుండానే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. కేవలం సర్టిఫికెట్ల కోసం కాకుండా, వాస్తవ ప్రపంచంలో ఉపయోగపడే ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ టూల్స్, సమస్య పరిష్కార నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలపై దృష్టి్ట పెట్టాలి. ఇవి కేవలం ఉద్యోగ అవకాశాలనే కాకుండా, మన దైనందిన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కూడా పెంచుతాయి.విజయం వరించకపోవచ్చు..కొత్త విషయాలను నేర్చుకునే క్రమంలో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. కానీ ప్రయత్నం మానకూడదు. ఏదయినా కొత్త అంశం నేర్చుకున్నపుడు ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. కానీ ఆ స్కిల్తో వచ్చిన జ్ఞానం ఎప్పటికీ ఉండిపోతుంది. అలాగే ప్రయోగాలు చేయడం నైపుణ్యాలను పెం΄÷ందించుకోవడంలో ఒక ముఖ్యమైన అంశం. ప్రతి ప్రయోగం విజయవంతం కాకపోవచ్చు, కానీ ప్రతి ప్రయోగం లోతైన అవగాహనను కలిగిస్తుంది. నూతన ఆవిష్కరణలను ్రపోత్సహిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది.గతంలో ఒక్కసారి నేర్చుకున్న విద్య దశాబ్దాల పాటు కెరీర్కు ఊతమిచ్చేది. ఇప్పుడు ఐటీ, బ్యాంకింగ్, తయారీ, ఆరోగ్యం.. ప్రతి రంగంలో ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త టెక్నాలజీ వస్తోంది. అందుకని రోజురోజుకీ మారుతున్న అంశాలపై కేవలం శిక్షణ తీసుకోవడమే కాకుండా, ఆ నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే అసలైన విజయం. కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే నిరంతర అభ్యాసం ఒక్కటే మార్గం. నైపుణ్యాన్ని పెంచుకున్న వారే రేపటి విజేతలుగా నిలుస్తారు.
అంతర్జాతీయం
షేక్ హసీనాకు బిగ్ సర్ప్రైజ్!
అధికారం కోల్పోయి దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిన తర్వాత.. రాజకీయ భవిష్యత్పై దృష్టి పెట్టిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు అనూహ్య పరిణామం ఎదురైంది. భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తానంటూ ఆమె చేసిన ప్రకటనతో బంగ్లాదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ సమయంలో ఆమెను తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ శిబిరం నుంచి వచ్చిన ఓ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది హసీనాకు బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు.. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకవైపు అవామీ లీగ్(Awami League) అధినేత్రి, మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి దేశానికి వస్తానని ప్రకటించగా.. మరోవైపు ఆమె ప్రధాన ప్రత్యర్థి అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నుంచి వచ్చిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ సమీకరణాలపై చర్చకు దారితీశాయి. బీఎన్పీకి చెందిన ఓ ఎంపీ.. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ను శత్రువుగా చూడాల్సిన అవసరం లేదని పేర్కొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.‘అవామీ లీగ్ శత్రువు కాదు.. మిత్రులం’బీఎన్పీ ఎంపీ నసీర్ ఉద్దీన్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. అవామీ లీగ్ తమకు శత్రువు కాదని, అది తమ మిత్రపక్షమని అన్నారు. “అవామీ లీగ్ మా శత్రువు కాదు. వారు మా మిత్రులు. 1971 విమోచన పోరాటంలో కలిసి పనిచేశాం. భవిష్యత్లో అవామీ లీగ్ బీఎన్పీలో విలీనం కావచ్చు” అని ఆయన వ్యాఖ్యానించిచారు.దశాబ్దాల రాజకీయ వైరంబీఎన్పీ, అవామీ లీగ్ మధ్య పోరు బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత తీవ్రమైన ప్రత్యర్థిత్వాల్లో ఒకటి. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుటుంబం ఆధిపత్యంలోని బీఎన్పీ దశాబ్దాలుగా అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణ, ప్రజాస్వామ్యం, పాలన విధానం, భద్రతా అంశాలపై రెండు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీపై మరో పార్టీ ఆరోపణలు చేయడం, రాజకీయ నిరసనలు, అరెస్టులు వంటి పరిణామాలు తరచూ చోటుచేసుకున్నాయి. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న సమయంలో బీఎన్పీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అయితే ఈ వ్యాఖ్యలు బీఎన్పీ అధికారిక వైఖరిని ప్రతిబింబిస్తున్నాయా? లేదంటే ఎంపీ వ్యక్తిగత అభిప్రాయమా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే బీఎన్పీలోని పలువురు నేతలు గతంలో అవామీ లీగ్పై తీవ్ర విమర్శలు చేశారు.ఇతర రాజకీయ శక్తుల పాత్ర ఏమిటి?బంగ్లాదేశ్ రాజకీయాలు ప్రధానంగా అవామీ లీగ్, బీఎన్పీ చుట్టూనే తిరిగినప్పటికీ.. ఇతర రాజకీయ శక్తులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ పార్టీ (బంగ్లాదేశ్) ఒకప్పుడు దేశ రాజకీయాల్లో మూడో ప్రధాన శక్తిగా ఎదిగింది. మాజీ సైనిక పాలకుడు హుస్సేన్ మహమ్మద్ ఎర్షాద్ స్థాపించిన ఈ పార్టీ గతంలో పలు ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చింది.ఇటీవలి సంవత్సరాల్లో విద్యార్థి ఉద్యమాల నేపథ్యంలో కొత్త రాజకీయ శక్తులు కూడా తెరపైకి వచ్చాయి. సంప్రదాయ అవామీ లీగ్, బీఎన్పీలకు భిన్నంగా యువత, సంస్కరణలు, కొత్త రాజకీయ వ్యవస్థపై దృష్టి పెట్టే వర్గాలు ప్రాధాన్యం పొందుతున్నాయి. అయితే జాతీయ స్థాయి అధికారం కోసం ఇప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీఎన్పీ–అవామీ లీగ్ మధ్యే కొనసాగుతోంది.ఢిల్లీ నుంచి హసీనా కీలక ప్రకటన2024లో జరిగిన విద్యార్థి ఉద్యమాల నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్లోనే ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో దాదాపు రెండేళ్ల తర్వాత తొలిసారి బహిరంగంగా మాట్లాడిన హసీనా.. ఈ ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్కు తిరిగి వస్తానని ప్రకటించారు.1971 విమోచన యుద్ధ వార్షికోత్సవ సమయంలో స్వదేశానికి చేరుకుంటానని ఆమె పేర్కొన్నారు. తన రాజకీయ పోరాటం కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చారు.హసీనా ప్రకటనపై తీవ్ర స్పందనలుఅయితే హసీనా తిరిగి వస్తానన్న ప్రకటనపై బంగ్లాదేశ్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత బీఎన్పీ ప్రభుత్వం గతంలో హసీనా పాలనపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమెపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను బంగ్లాదేశ్కు అప్పగించాలని ఢాకా భారత్ను కోరింది. భారత్ నుంచి హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.బీఎన్పీలో భిన్న స్వరాలుఒకవైపు కొందరు బీఎన్పీ నేతలు హసీనాపై తీవ్ర విమర్శలు చేస్తుండగా.. మరోవైపు నసీర్ ఉద్దీన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు భిన్నమైన చర్చకు తెరలేపాయి. హసీనా, అవామీ లీగ్ భవిష్యత్పై బంగ్లాదేశ్లో రాజకీయ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి.కొత్త రాజకీయ సమీకరణాలా?ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజకీయాలు మూడు అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. హసీనా నిజంగా డిసెంబర్లో తిరిగి వస్తారా? అవామీ లీగ్కు రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? బీఎన్పీ వైఖరిలో మార్పు వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే స్పష్టమవుతుంది. అయితే ఇప్పటివరకు ప్రత్యర్థిగా ఉన్న అవామీ లీగ్పై బీఎన్పీ ఎంపీ చేసిన “శత్రువు కాదు.. మిత్రులు” అన్న వ్యాఖ్య మాత్రం షేక్ హసీనా శిబిరంలో కొత్త ఆశలు రేకెత్తించే పరిణామంగా మారింది.
ట్రంప్కు మరో షాక్.. కోర్టు తీర్పుతో కొత్త చిక్కులు!
అమెరికా న్యాయస్థానాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వరుస షాకులు ఇస్తున్నాయి. తాజాగా.. ఆయన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైట్హౌస్ బాల్రూమ్ ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకి ఎదురైంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఈ భారీ నిర్మాణాన్ని కొనసాగించేందుకు అధ్యక్షుడికి ఏకపక్ష అధికారం లేదని అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు స్పష్టం చేసింది. దీంతో 400 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,400 కోట్లకు పైగా) వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుపై తాత్కాలికంగా బ్రేక్ పడింది.వైట్హౌస్ ఈస్ట్ వింగ్ ఉన్న ప్రాంతంలో సుమారు 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ బాల్రూమ్ను నిర్మించాలని ట్రంప్ నిర్ణయించారు. దాదాపు 999 మంది అతిథులు ఒకేసారి పాల్గొనేలా ఈ హాల్ను నిర్మించాలన్నది ప్రణాళిక. దీనిని ఆయన తన కలల ప్రాజెక్ట్గా భావిస్తున్నారు. అయితే చారిత్రక భవన పరిరక్షణ సంస్థలు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించాయి. వైట్హౌస్ నిర్మాణ రూపకల్పనలో ఇంత పెద్ద మార్పు చేయాలంటే చట్టపరమైన అనుమతులు అవసరమని వాదించాయి.కాంగ్రెస్ అనుమతి కంపల్సరీ!వాషింగ్టన్ డీసీ సర్క్యూట్ అప్పీల్ కోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం 2-1 మెజారిటీతో ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. “భారీ బాల్రూమ్ నిర్మించాలా వద్దా అన్నది కాంగ్రెస్ నిర్ణయించాల్సిన విషయం. కార్యనిర్వాహక అధికారంతో స్వయంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు” అని కోర్టు పేర్కొంది. అయితే ఈ తీర్పు బాల్రూమ్ నిర్మాణం పూర్తిగా నిలిచిపోవాలని చెప్పడం కాదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అనుమతి పొందిన తర్వాత నిర్మాణం కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది.ట్రంప్ ఆగ్రహం..ఇంతకుముందు నిర్మాణాన్ని నిలిపివేయాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తనను వ్యతిరేకించే న్యాయమూర్తులు ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వైట్హౌస్ భద్రత కోసం ఈ ప్రాజెక్టు అవసరమని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. డ్రోన్లు, క్షిపణులు, జీవాయుధ ముప్పుల నుంచి అధ్యక్షుడు, ఆయన కుటుంబం, సిబ్బంది రక్షణ కోసం ఆధునిక భద్రతా ఏర్పాట్లు ఇందులో భాగమని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.భద్రత పేరుతో నిర్మాణం కొనసాగించలేరు..అయితే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న సంస్థలు ఈ వాదనలను తోసిపుచ్చాయి. బాల్రూమ్ లేకపోవడం జాతీయ భద్రతా అత్యవసర పరిస్థితి కాదని పేర్కొన్నాయి. కోర్టు కూడా భద్రతకు సంబంధించిన భూగర్భ పనులను కొనసాగించేందుకు అనుమతించింది. బంకర్లు, ఇతర భద్రతా సదుపాయాల నిర్మాణానికి మాత్రం ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టం చేసింది.ఇప్పుడేం జరగనుంది?అప్పీల్ కోర్టు తన తీర్పు అమలును రెండు వారాల పాటు నిలిపివేసింది. ఈ సమయంలో ట్రంప్ ప్రభుత్వం అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 70 ఏళ్లకు పైగా వైట్హౌస్లో అతిపెద్ద నిర్మాణ మార్పుగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు కోర్టు, కాంగ్రెస్ నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ట్రంప్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు న్యాయస్థానం బ్రేక్ వేయడంతో.. ఇది ఆయన పాలనలో మరో కీలక న్యాయపోరాటంగా మారింది.
పుతిన్ నెక్స్ట్ టార్గెట్ అదేనా?.. అమెరికా నిఘా వర్గాల సంచలన అంచనా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా నిఘా వర్గాల సంచలన ఆరోపణలు చేశాయి. పుతిన్.. నాటో కూటమి ఐక్యతను, దాని సమిష్టి రక్షణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఆ కూటమిలోని ఓ సభ్యదేశంపై పరిమిత స్థాయి దాడికి పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాల పేర్కొంటున్నాయి. సైబర్ దాడులు, రహస్య కార్యకలాపాలు, హైబ్రిడ్ ఆపరేషన్లు లేదా చిన్న స్థాయి సైనిక చొరబాటు రూపంలో ఈ చర్య ఉండొచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం నివేదించింది.ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నిమగ్నమై ఉన్నంతకాలం నాటోతో నేరుగా తలపడేందుకు పుతిన్ ప్రయత్నించరని గతంలో అమెరికా అధికారులు భావించారు. అయితే, తాజాగా ఆ అంచనాలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులు రష్యా సైనిక స్థావరాలు, చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, యుద్ధంలో రష్యా భారీ నష్టాలను ఎదుర్కోవడం వంటి పరిణామాలను అమెరికా నిఘా వర్గాలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.రష్యా చర్యకు దిగితే భూభాగాన్ని ఆక్రమించుకోవడం కంటే నాటోలోని దేశాల మధ్య విభేదాలు సృష్టించడం, కూటమి స్పందనను పరీక్షించడమే లక్ష్యం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి చర్యలు 2026 నవంబర్ నుంచి 2029 మధ్య ఎప్పుడైనా చోటుచేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే నేరుగా భూదాడి చేసే అవకాశం తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. నాటో ఆర్టికల్ 5 ప్రకారం ఒక సభ్యదేశంపై సాయుధ దాడిని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించే అవకాశం ఉండటమే దీనికి కారణం. అలా జరిగితే రష్యా-నాటో మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.అలాంటి పరిస్థితుల్లో నాటో ఎలాంటి చర్య తీసుకుంటుందన్నదే కీలకంగా మారనుంది. కాగా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నాటో ఇప్పటికే స్పష్టం చేసింది. వివిధ రకాల పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, అవసరమైనప్పుడు నిరోధించేందుకు, రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని నాటో ప్రతినిధి కల్నల్ మార్టిన్ ఓ డొన్నెల్ తెలిపారు.ఇదిలా ఉండగా అమెరికా కీలక ఆయుధాల నిల్వలపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్కు సంవత్సరాలుగా అందించిన సైనిక సహాయం, ఇటీవల ఇరాన్కు సంబంధించిన సైనిక చర్యల కారణంగా కొన్ని కీలక ఆయుధాల నిల్వలు తగ్గినట్లు అధికారులు, రక్షణ నిపుణులు చెబుతున్నారు. ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్స్, ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ (ATACMS), స్టింగర్ క్షిపణులతో పాటు పేట్రియాట్, SM-3, THAAD వంటి వాయు రక్షణ ఇంటర్సెప్టర్ల నిల్వలపైనా ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. రష్యా-నాటో మధ్య ప్రత్యక్ష ఘర్షణ ఏర్పడితే దాని ప్రభావం యూరప్కే పరిమితం కాకుండా ప్రపంచ భద్రతా వ్యవస్థపై పడే అవకాశం ఉంది.
అమెరికానే కాపాడలేకపోయింది.. ఇంక పాక్-టర్కీ ఏం చేస్తాయి?
పశ్చిమాసియాలో మారుతున్న భద్రతా సమీకరణాలకు సంకేతంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మూడు దేశాలు కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఒక దేశంపై దాడిని మిగిలిన రెండు దేశాలపై దాడిగా పరిగణించేలా రూపొందించిన ఈ రక్షణ కూటమి.. సౌదీ భద్రతా వ్యూహంలో కీలక మార్పుగా మారింది. అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.టర్కీ, పాకిస్థాన్తో చేసుకున్న రక్షణ ఒప్పందాలు సౌదీ అరేబియాకు శాశ్వత భద్రతను అందించలేవని ఇరాన్ విమర్శించింది. అమెరికానే కాపాడలేకపోతోంది.. ఇంక పాక్ టర్కీలు వచ్చి ఏం చేస్తాయి?.. ఏం సాధిస్తాయి? అంటూ డీల్పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల కమిషన్ సభ్యుడు ఎబ్రహీం రెజాయీ ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘కాగితపు ఒప్పందాలతో భద్రత రాదు’సోషల్ మీడియా వేదికగా స్పందించిన రెజాయీ.. “టర్కీ, పాకిస్థాన్తో కుదుర్చుకున్న కాగితపు ఒప్పందాలు సౌదీకి భద్రతను తీసుకురావు. అమెరికాతో ఎన్నో ఏళ్లుగా కొనసాగించిన సంబంధాలు కూడా సౌదీకి భద్రత ఇవ్వలేదు” అని వ్యాఖ్యానించారు. సౌదీ తన విధానాలను మార్చుకుంటే ఇతర దేశాల నుంచి భద్రత కోసం ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. గతంలో సౌదీ భద్రత కోసం అమెరికాపై ఆధారపడిన తీరును ప్రస్తావిస్తూ ఇరాన్ ఈ విమర్శలు చేసింది.మక్కా వేదికగా మూడు దేశాల డిఫెన్స్ డీల్అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య ఈ రక్షణ ఒప్పందం కుదిరింది. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కాలో జరిగిన సమావేశంలో మూడు దేశాల నేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ సందర్భంగా ఈ ఒప్పందం ఖరారైంది. మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఉమ్మడి భద్రతా వ్యూహాలను రూపొందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.ఒకరిపై దాడి.. ముగ్గురిపై దాడిగానే!ఈ రక్షణ ఒప్పందంలోని కీలక అంశం పరస్పర భద్రత. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై అయినా సాయుధ దాడి జరిగితే.. దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించేలా నిబంధనలు రూపొందించారు. దాడి జరిగిన సమయంలో పరస్పర సహకారం, రక్షణ రంగంలో సమన్వయం పెంచుకోవడం ఈ ఒప్పందం లక్ష్యమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మూడు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.సౌదీ ఎందుకు కొత్త రక్షణ భాగస్వామ్యాల వైపు?ఇరాన్తో పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరిస్తోంది. గతంలో సౌదీ చమురు కేంద్రాలు, కీలక మౌలిక వసతులపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్లోని మిలీషియా గ్రూపులు ఉన్నాయని సౌదీ ఆరోపించింది. దీంతో భద్రత విషయంలో కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా కొత్త భాగస్వామ్యాలను పెంచుకోవాలని రియాద్ భావిస్తోంది.ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, గల్ఫ్ ప్రాంతంలో నౌకాయానం ప్రభావితమవడం వంటి పరిణామాలు కూడా ఈ రక్షణ ఒప్పందానికి కారణాలుగా మారాయి.భారత్-పాక్ కోణంలోనూ చర్చఈ ఒప్పందం మరో కోణంలోనూ చర్చకు దారితీస్తోంది. ఒకవేళ భవిష్యత్లో పాకిస్థాన్పై భారత్ సైనిక చర్య చేపడితే ఈ రక్షణ ఒప్పందం ఎలా ప్రభావితం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒప్పందంలోని పరస్పర రక్షణ నిబంధన ప్రకారం.. పాకిస్థాన్పై జరిగే దాడిని మిగిలిన దేశాలు ఎలా పరిగణిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి రక్షణ ఒప్పందాల్లో ప్రతిస్పందన విధానం, సైనిక సహాయం, దౌత్య మద్దతు వంటి అంశాలు ఆయా దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఆ లెక్కన.. ఈ ఒప్పందం ఉన్నంత మాత్రాన సౌదీ అరేబియా, టర్కీ వెంటనే ఏదైనా ఘర్షణలోకి దిగాల్సిందేనని స్పష్టమైన హామీ లేదు.మారుతున్న సమీకరణాలుపాక్, సౌదీ, టర్కీ రక్షణ ఒప్పందం మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త మార్పులకు సంకేతంగా మారింది. ఒకవైపు ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు సౌదీ తన భద్రతా వ్యవస్థను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు దేశాల కొత్త రక్షణ కూటమి భవిష్యత్లో పశ్చిమాసియా శక్తి సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
జాతీయం
UPI: యూపీఐ యూజర్లకు గుడ్న్యూస్.. చెల్లింపులు ఉచితమే!
సాక్షి,న్యూఢిల్లీ: యూపీఐ చెల్లింపులపై ఫీజులు వసూలు చేస్తారన్న వదంతులను కేంద్రం కొట్టివేసింది. వినియోగ దారులతోపాటు చిన్న వ్యాపారులకు కూడా యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగనున్నాయని స్పష్టం చేసింది. భవిష్యత్తులో మార్కెట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)ను అమలు చేస్తే మాత్రం కొంతమంది వ్యాపా రులు నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి రావచ్చునని కేంద్రం శనివారం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం పార్ల మెంటు వర్షాకాల సమా వేశాల్లో 2007 నాటి పేమెంట్స్ అండ్ సెటిల్ మెంట్స్ సిస్టమ్స్ చట్టానికి మార్పు లు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టడం, లోక్సభ దీనికి ఆమోదం తెల పడం తెలిసిన విషయమే. ఈ చట్టం వల్ల బ్యాంకులు, ఇతర సర్వీస్ ప్రొవైడర్స్కు యూపీఐ, ఇతర ఎలక్ట్రానిక్ పేమెంట్ పద్ధతుల ద్వారా జరిపే చెల్లింపులపై ఫీజులు వసూలు చేసే అధికారం లభిస్తుంది. అయితే యూపీఐ సేవలపై ఎలాంటి ఫీజులు ఉండవని కేంద్రం గతంలోనే చెప్పిన విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం శనివారం ఆ అనుమానాలను కొట్టివేస్తూ వ్యక్తులకు యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. భవిష్యత్తులో అతి తక్కువ మంది వ్యాపారుల నుంచి మాత్రమే నామమాత్రపు ఎండీఆర్ వసూలు చేస్తారని, అది కూడా నిర్దిష్ట విలువకు మించిన మొత్తాలపై మాత్రమేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా... ఎండీఆర్ ఛార్జీలు క్రెడిట్, డెబిట్ కార్డులకు వర్తించే ఛార్జీల కంటే తక్కువగా ఉంటాయని భరోసానిచ్చింది. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్లోని సెక్షన్ 10ఏను మార్పుల కోసం ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు పాస్ చేసిన తరువాత ఎన్పీసీఐ నేతృత్వంలోని యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ అవసరమైతే ఎండీఆర్పై ఒక నిర్ణయం తీసుకుంటుందని వివరించింది. చట్టంలో మార్పులు ఎందుకు?యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలం కొనసాగించేందుకు, సాంకేతికత పరంగా ఎదురయ్యే కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు మాత్రమే పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్స్ చట్టానికి మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్రం వివరించింది. యూపీఐ లావాదేవీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన నేపథ్యంలో మోసాలను నివారించేందుకు, హ్యాకర్ల బారి నుంచి వ్యవస్థను రక్షించేందుకు, మౌలిక సదుపాయాల పెంపునకు పెద్ద ఎత్తున డబ్బు అవసరమవుతుందని గుర్తు చేసింది. అంతేకాకుండా... మరిన్ని కంపెనీలు డిజిటల్ పేమెంట్లు చేసేలా ప్రోత్సహించేందుకు కూడా చట్టపరమైన మార్పు అవసరమైందని తెలిపింది. సబ్సిడీలపై ఆధారపడటం యూపీఏ వృద్ధికి అడ్డంకి అని స్పష్టం చేసింది. యూపీఐ వ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండేందుకు, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మారేందుకు కూడా చట్ట సవరణ అవసరమైందని తెలిపింది. విదేశీ శక్తుల ప్రభావానికి లోనై ఈ మార్పుల చేస్తున్నారన్న ఆరోపణలను ఖండించింది. 2016–17లో ప్రారంభమైనప్పటి నుంచి యూపీఐ దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చిన్న ప్రయోగంగా మొదలై ఇప్పుడు సామాన్య ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయింది. ప్రతినెల వందల కోట్ల లావాదేవీలను నమోదు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శగా నిలిచిందీ వ్యవస్థ. గత నెలలో యూపీఐ ద్వారా మొత్తం 2366 కోట్ల లావాదేవీలు జరగ్గా వీటి విలువ 29.9 లక్షల కోట్లు! భారత్తోపాటు 11 దేశాల్లో అమల్లో ఉంది ఇది.
డీలిమిటేషన్పై విజయ్ సర్కార్ కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డీలిమిటేషన్ ప్రక్రియను మద్దతిచ్చే ఏ విధమైన ప్రయత్నాన్నైనా ఏకగ్రీవంగా వ్యతిరేకించాలని నిర్ణయించింది. ఆ మేరకు సీఎం విజయ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపింది. రాష్ట్రంలో కనీసం మరో 40–50 సంవత్సరాల పాటు చట్ట సభల సభ్యుల సంఖ్యలో ఎటువంటి మార్పు తాము అంగీకరించబోమన్నట్లు అఖిల పక్ష భేటీలో నిర్ణయించాయి. ఈ భేటీకి టీవీకే కూటమి పార్టీలైన కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ పార్టీల ఎంపీలతో పాటు, స్నేహ పూర్వకంగా వ్యవహరించే సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీల ప్రతినిధులు మెుత్తంగా 21 మంది ఈ భేటీకి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తమిళనాడు హక్కులను పరిరక్షించాలనే విషయంలో సంపూర్ణ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు నేతలు తెలిపారు. అయితే ఈ అఖిలపక్ష సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఎంపీలు హాజరు కాలేదు దీనిపై సీఎం విజయ్ స్పందించారు.విజయ్ మాట్లాడుతూ.. "ఆరు పర్యాయాలు తమిళనాడును పాలించిన పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేసిన వ్యవస్థాపక నాయకులు ఉన్న పార్టీ సమావేశానికి హాజరుకాకపోవడం దురదృష్టకరం" అని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ జోతిమణి మాట్లాడుతూ.. “మేము డీలిమిటేషన్ను సమర్థించం. ముఖ్యమంత్రి విజయ్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి నిర్ణయం. డీలిమిటేషన్ అమలు చేస్తే ప్రజాస్వామ్యం తన అసలైన రూపంలో ఇక మిగలదు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలు, హక్కులను కాపాడటానికి ముఖ్యమంత్రి తన నిబద్ధతను మరోసారి స్పష్టం చేశారు” అని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితినే కొనసాగించాలని, ఎటువంటి మార్పునూ తాము అంగీకరించబోమని నేతలు స్పష్టం చేశారు.
'మొయిత్రాకు ఏమైనా జరిగితే ఆ జడ్జిదే బాధ్యత'
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను కాక్రోజ్ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తప్పుబట్టారు. మహువా మొయిత్రాపై సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో ఆమెకు ఏదైనా ముప్పు వాటిల్లితే ఇదే న్యాయమూర్తులు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి న్యాయమూర్తులు రాజీనామా చేయాలని, లేదంటే వారిని తొలగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.గుడ్లు విసురుతారని భయపడితే ఎలా?వివాదాస్పద ఫేస్బుక్ పోస్టుల కేసులో పోలీసుల విచారణకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలని మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన సొంత నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లే సమయంలో తనపై గుడ్లు విసిరే అవకాశం ఉందని, గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు నేతృత్వంలోని ధర్మాసనం.. శుక్రవారం తిరస్కరించింది. దర్యాప్తు అధికారుల ఎదుట వ్యక్తిగతంగా హాజరై విచారణకు సహకరించాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.“మీరు పార్లమెంట్ సభ్యురాలు కదా? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కోడిగుడ్ల దాడులకు భయపడుతున్నారా? మన స్వాతంత్ర్య సమరయోధులు తూటాలకు ఛాతీలను ఎదురొడ్డారు. ఇలాంటి దరఖాస్తులు ఈ కోర్టు ముందుకు రావాల్సిన అవసరమే లేదు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, మహువా మొయిత్రాపై నమోదైన కేసులో ఆమెకు ఎలాంటి వేధింపులు జరగకుండా భద్రత కల్పించాలని కలకత్తా హైకోర్టు పోలీసులను ఇప్పటికే ఆదేశించింది.న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఆందోళనకరంమహువా మొయిత్రాపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై ఎక్స్లో సౌరవ్ దాస్ స్పందించారు. “అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి మహువా మొయిత్రా బుల్లెట్లను ఎదుర్కొవాలని కోరుకుంటున్నారా? న్యాయమూర్తులుగా ఇలా బాధ్యతారహితంగా మాట్లాడే వ్యక్తులను నియమించుకున్నాం? న్యాయమూర్తుల నుంచి మనం ఆశించే న్యాయపరమైన ఔన్నత్యం ఇదేనా?, ఈ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగినవి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో నెలకొన్న దుస్థితి గురించి తెలిసిన నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత ఆందోళనకరం. తన ప్రవర్తనకు న్యాయమూర్తి సిగ్గుపడాలి. భవిష్యత్తులో మహువా మొయిత్రాకు ఏదైనా హాని జరిగితే అందుకు జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేసే వ్యవస్థలో ఇలాంటి న్యాయమూర్తులు రాజీనామా చేయాల్సి వచ్చేది లేదా అభిశంసనను ఎదుర్కోవాల్సి వచ్చేద''ని వ్యాఖ్యానించారు. So does this Supreme Court judge want @MahuaMoitra to take bullets? What kind of motormouth persons have we appointed as judges? Is this the judicial temperament we expect of constitutional court judges? This is why we need to fix judicial accountability. The statement is… pic.twitter.com/O2w8KQoGQL— Saurav Das (@SauravDassss) August 7, 2026చదవండి: పాపం! డాక్టర్ ప్రియాంక.. ఇంత దారుణమా?మొయిత్రాపై కేసు ఏమిటి?పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా హోగల్బరియా పోలీస్ స్టేషన్లో జూన్లో బీజేపీ నేత హీరక్ భట్టాచార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసేలా, సామాజిక- మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా, మత విశ్వాసాలను అవమానించేలా, ప్రజల్లో అశాంతికి దారితీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.కృష్ణనగర్ జిల్లా సెషన్స్ కోర్టు వెలుపల కొందరు బీజేపీ మహిళా కార్యకర్తలు గుమిగూడిన ఘటన నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. గతంలో నమోదైన మరో కేసులో మహువా మొయిత్రా కోర్టుకు హాజరయ్యే సమయంలో ఆమెపై గుడ్లు, టమాటాలు విసురుతామని వారు హెచ్చరించినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ ఘటన అనంతరం మొయిత్రా ఫేస్బుక్లో రెండు వీడియోలు పోస్టు చేశారు. మొదటి వీడియోలో కోర్టు వెలుపల గుడ్లతో కనిపించిన మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, పోలీసులు కేసు నమోదు చేయకపోతే కోర్టులను, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆమె పేర్కొన్నారు.మరుసటి రోజు పోస్టు చేసిన మరో వీడియోలో ఆ మహిళలందరి పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తానని ఆమె చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గుడ్లు బహిరంగంగా విసరకుండా బుర్ఖా ధరించి గుర్తుపట్టకుండా విసరాలని ఆమె సూచించినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె వ్యాఖ్యలు మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ఉద్దేశంతో ఉన్నాయని బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డీలిమిటేషన్ బిల్లుపై శిరోమణి అకాలీ దళ్ కీలక నిర్ణయం
చంఢీగఢ్: శిరోమణి అకాలీ దళ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్రం తీసుకవచ్చిన డీలిమిటేషన్ , మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు తమ పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ భేటీ అయిన ఒక రోజు అనంతరమే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మద్దతుతో రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి–బీజేపీ కూటమి మళ్లీ ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయిసుఖ్బీర్ సింగ్ బాదల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. "దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని అకాలీ దళ్ డిమాండ్ చేస్తోంది. అలాగే అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను ఏకరీతిగా 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు SAD మద్దతు ఇస్తుంది. ఈ మేరకు శిరోమణి అకాలీ దళ్.. చండీగఢ్లో జరిగిన పార్టీ సీనియర్ నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకుంది” అని బాదల్ ‘ఎక్స్’లో తెలిపారు.పార్లమెంట్ ముందున్న కీలక అంశాలపై సవివరంగా చర్చించిన అనంతరం.. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే విధంగా న్యాయమైన, సమతుల్య డీలిమిటేషన్ జరగాలని శిరోమణి అకాలీ దళ్ డిమాండ్ చేసిందని ఆయన పేర్కొన్నారు.గతంలో డీలీమిటేషన్కు వ్యతిరేకంగాఅయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఏప్రిల్లో డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అకాలీ దళ్ దానిని వ్యతిరేకించింది. ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఆ పార్టీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఆసమయంలో పంజాబ్కు ఈ బిల్లు వివక్ష చూపుతోందని అకాలీ దళ్ ఆరోపించింది. పంజాబ్కు సీట్ల సంఖ్యలో స్వల్ప పెరుగుదల మాత్రమే లభిస్తుండగా, పొరుగు రాష్ట్రాలు మరింత ఎక్కువ సీట్లు పొందే అవకాశం ఉందని పార్టీ పేర్కొంది.ఈ నేపథ్యంలో ఇటీవల మోదీతో భేటీ అయిన అనంతరం ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు తెలపడం విశేషం.2020లో తెగిపోయిన దాదాపు రెండున్నర దశాబ్దాల బంధంబీజేపీ–శిరోమణి అకాలీ దళ్ మధ్య దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కొనసాగిన పొత్తు 2020లో తెగిపోయింది. అప్పట్లో వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల నేపథ్యంలో అకాలీ దళ్.. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్ఆర్ఐ
న్యూయార్క్లో వైభవంగా ఆషాఢమాస బోనాలు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా ప్రతిబింబించేలా స్థానిక ఐసెన్ హోవర్ పార్క్లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. లాంగ్ ఐలాండ్ (నాస్సా కౌంటీ) డిప్యూటీ డైరెక్టర్ మెంగ్ లీ, లెజిస్లేటర్ రోజ్ మేరీ వాకర్, టౌన్ క్లర్క్ రాగిని శ్రీవాస్తవ ఈ వేడుకలకు అతిథులుగా హాజరయ్యారు..ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రముఖ కళాకారులు, కవులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, గాయకుడు సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్యలు ప్రత్యేకంగా తమ పాటలు, ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు.అలాగే పద్మ కోడెల చేతుల మీదుగా జరిగిన అమ్మవారి అలంకరణ, పోతురాజు వేషధారణలో ఆశోక్ చింతకుంట చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అమెరికా నేలపై తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన ఈ బోనాల సంబరాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి.
లండన్లో అట్టహాసంగా 'టాక్' బోనాల సంబురం
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. హౌంస్లౌ నగరంలోని కింగ్స్లే అకాడమిలో జూలై 19న జరిగిన ఈ వేడుకలకు బ్రిటన్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ గణేష్ కుప్పాల.. వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హైకమిషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని.. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని ముఖ్య అతిథులు తమ సందేశంలో పేర్కొన్నారు. మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలతో తమ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరును ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల కోసం తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలానికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.బోనాల వేడుకలు విజయవంతం కావడం పట్ల టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు, అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. టాక్ కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగళి, సత్య చిలుముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లారెడ్డి, గణేష్ పాస్తాం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్రీ విద్య, దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, కార్తీక్, స్నేహ, అమరేశ్వరి, సాయిరావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఈమె న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడైన శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు. స్థానిక వివరాల ప్రకారం.. దీప ఐటీ ఉద్యోగిని అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్తతో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. శ్రీపాతి దీప మరణవార్త విన్న హైదరాబాద్లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. దీప మరణంతో ఆకుతోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఘనంగా తానా ప్రపంచసాహిత్యవేదిక 94వ సమావేశం
తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. “ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత” అనే అంశం మీద ఆదివారం జరిగిన 94 వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది. యూకేలో శస్త్రచికిత్సా వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా. చంద్ర చెరువు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తమ కుటుంబం తరపున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో శస్త్రచికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అలాగే ఇదే సందర్భంలో వెలువరించిన “మహర్షి సుశ్రుత ఏ కంపెండియం – ఫాదర్ ఆఫ్ సర్జరీ” అనే గ్రంధంలో విలువైన వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదములు అన్నారు. వేల సంవత్సరాలనాడే సుశ్రుతుడు సోదాహరణంగా వివరించిన వైద్య పద్దతులు, ఉపయోగించిన శస్త్ర పరికరాల జాబితా పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని అన్నారు. సుశ్రుతుడు రచించిన “సుశ్రుత సంహిత” గ్రంధంలోని అనేక విషయాలను ఇతర భారతీయ భాషలలోకి, ప్రపంచ భాషలలోకి అనువాదం కావలసిన అవసరం ఉందని, వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కారాలు స్ఫూర్తి దాయకంగావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.” తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వేల సంత్సరాలనాడే ప్రపంచం ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలగా ఉన్న “సుశ్రుత సంహిత” అనే ఆయుర్వేద గ్రంథం వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం అన్నారు. మనిషి సాధారణంగా 1,120 రకాల వ్యాధులకు గురిఅవుతాడని, 700 కు పైగా మొక్కల గురించి ఏ మొక్క, ఏ వ్యాధిని, ఎలా తగ్గిస్తుందో ప్రయోగాత్మకంగా నిరూపించాడు. 64 రకాల ఖనిజాల నుంచి అవసరమైన మందులను ఎలా తయారుచేసుకోవచ్చో వివరించాడు. ఈ గ్రంథంలో 120 శస్త్రపరికరాల గురించి వివరించాడు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! అనస్తీషియా ప్రక్రియకు ఆద్యుడు సుశ్రుతుడు. ప్రొస్టేట్ గ్రంథిని జాగ్రత్తగా తొలగించే పద్ధతి, విరిగిన ఎముకలు తిరిగి అతుక్కునేందుకు శస్త్రచికిత్స సూత్రాలు, తెగిన శరీర భాగాలను అతికించటం, అతి సున్నితమైన పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించగల్గడం, గర్భిణీస్త్రీ ఉదరంలో శిశువు పరిణామ క్రమం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్లు చేసే విధానం, వ్యాధిరహితంగా ఉండేందుకు ఏ ఏ కాలాల్లో, ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి, ఎలాంటి తృణధాన్యాలు, పప్పుదినుసుల వాడాలి అనే సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాధమికదశనుండే విద్యార్థులకు పాట్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి (డెట్రాయిట్ నుండి) సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి, డా. వి. కె రాజు (వెస్ట్ వర్జీనియా నుండి) సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్దతుల గురించి, డా. శేషు శర్మ (వాషింగ్టన్ డి.సి నుండి) సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహరం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే డా. పండరి గంటి (లాస్ ఏంజిల్స్ నుండి) సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంధంలో పేర్కొన్నారని, అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్న అతిథులందరికీ, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. (చదవండి: ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు)
క్రైమ్
అత్తను హత్య చేసి తగులబెట్టిన అల్లుడు
సత్తుపల్లి: పెద్ద మనుషుల సమక్షాన నిర్వహించిన పంచాయితీలో డబ్బులు, బంగారం ఇవ్వాలని తీర్పు రావడంతో కక్ష గట్టిన వ్యక్తి తన అత్త (భార్య తల్లి)ను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం, తుమ్మూరుకు చెందిన వెదుళ్ల వెంకటనరసమ్మ(60) పెద్ద కూతురు మంగకు తిరుపతిరావుతో 30 ఏళ్ల క్రితం వివాహం అయింది. కొంతకాలానికి తిరుపతిరావుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మంగకు చెందిన బంగారం, రూ.50 వేల నగదును తిరుపతి ఆ మహిళకు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయమై మంగ, నరసమ్మ పెద్ద మనుషుల వద్ద ఈనెల 1వ తేదీన పంచాయితీ పెట్టించగా, ఆరు నెలల్లో నగదు, బంగారం తిరిగి ఇవ్వాలని పంచాయితీలో తీర్పు చెప్పినట్లు సమాచారం.ఆ రెండో రోజే హత్యతిరుపతిరావు పంచాయితీ జరిగిన రెండో రోజే హత్య చేసినట్లు తెలిసింది. తల్లి కనిపించడం లేదని మంగ పోలీసులకు ఫిర్యాదు చేసింది, పోలీసులు విచారించగా సెల్ఫోన్ చార్జింగ్ వైర్ నరసమ్మ మెడకు బిగించి హత్య చేసి, నారాయణపురం – బేతుపల్లి మధ్య రోడ్డు పక్కన తోటలో మృతదేహాన్ని తగలబెట్టినట్లు తిరుపతిరావు ఒప్పుకున్నాడు. పోలీసులు శనివారం ఘటనాస్థలి నుంచి ఎముకలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. తిరుపతిరావును, అతడికి సహకరించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. హత్యలో మరెవరైనా పాల్గొన్నారా, మృతదేహాన్ని నారాయణపురం తరలించడానికి ఎవరైనా సహకరించారా అనే కోణాల్లో సత్తుపల్లి పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి దర్యాప్తు మొదలుపెట్టారు.భార్యతో గొడవపడి.. ఇంటికి నిప్పు పెట్టిన భర్తపక్కింటికి కూడా వ్యాపించిన మంటలునవీపేట: భార్యతో గొడవపడిన వ్యక్తి.. మద్యం మత్తులో తన ఇంటికే నిప్పు పెట్టాడు. మంటలు పక్కింటికి కూడా వ్యాపించడంతో లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మోకన్పల్లిలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. మోకన్పల్లి గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి (వీఆర్ఏ) అల్లం సురేశ్ తరచూ భార్య ఉమతో గొడవపడేవాడు. పలుమార్లు పెద్ద మనుషులు జోక్యం చేసుకుని పంచాయితీపెట్టి రాజీ కుదిర్చారు. తాగుడుకు బానిసైన సురేశ్.. శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు. అర్ధరాత్రి వరకు గట్టిగా అరుస్తూ భార్యను కొట్టడంతో.. విషయం తెలుసుకున్న పుట్టింటివారు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. మద్యం మత్తులో తెల్లవారే వరకు కేకలు వేసిన సురేశ్.. శనివారం ఉదయం అదే మత్తులో పెట్రోల్ పోసి ఇంటి పైకప్పుకు నిప్పంటించాడు. మంటలు పక్కనే ఉన్న అల్లం సాయిబాబా ఇంటికీ వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంట్లోని వస్తువులు కాలిబూడి దయ్యాయని, రూ. లక్ష మేర ఆస్తినష్టం జరిగిందని సాయిబాబా తెలిపారు. సాయిబాబా ఫిర్యాదు మేరకు సురేశ్పై కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
ప్రాణాల మీదికి తెచ్చిన జరిమానా!
భిక్కనూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారంగా రూ.6 లక్షలు ఇవ్వాలని గ్రామస్తులు ఒత్తిడి తేవడంతో ఆటో డ్రైవర్ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. వివరాలివి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కురి్మండ్ల శ్రీనివాస్ గౌడ్ ఆటో డ్రైవర్. జూన్ 25న రామాయంపేటనుంచి వస్తుండగా ఆటోను లారీ ఢీకొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బస్వాపూర్ గ్రామానికి చెందిన కాసాల రమేష్ గౌడ్ మరణించాడు. దీనిపై పంచాయితీ చేసిన గ్రామస్తులు.. బాధిత కుటుంబానికి రూ.6 లక్షల జరిమానా విధించారు. శ్రీనివాస్గౌడ్ లక్ష రూపాయలు చెల్లించి మిగతా రూ.5 లక్షలకు తన బావ అయిన సిద్దరామేశ్వరనగర్ గ్రామానికి చెందిన సిద్దగౌడ్ను జమానత్గా ఉంచాడు. వాయిదా సమయం దాటినా డబ్బులు ఇవ్వకపోవడంతో.. మృతుడు రమేశ్ కుటుంబ సభ్యులను అతని బంధువు తీసుకెళ్లి జమానత్గా ఉన్న సిద్దగౌడ్ ఇంటి వద్ద వదిలాడు. ఈ క్రమంలో సిద్దగౌడ్ భార్య సత్తవ్వ మనస్తాపానికి గురై కెమికల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో గ్రామస్తులు కల్పించుకుని తిరిగి పంచాయితీ నిర్వహించి రూ.3 లక్షలను చెల్లించాలని శ్రీనివాస్గౌడ్కు సూచించారు. అంత డబ్బు తమ వద్ద లేదని శ్రీనివాస్గౌడ్ పేర్కొనగా.. జరిమానా చెల్లించాల్సిందేనని గ్రామస్తులు ఆదేశించారు. దీంతో శ్రీనివాస్గౌడ్ అతడి భార్య లత మనస్తాపం చెంది ఇంటికి వెళ్లి పురుగు మందు తాగారు. స్థానికులు గమనించి వారిని కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని భిక్కనూరు ఎస్ఐ అనిల్ తెలిపారు. కాగా ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాస్గౌడ్ సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకున్నాడు.
అనుమానాస్పద స్థితిలో నేతన్న మృతి
సిరిసిల్లటౌన్: తనకున్న పూరిల్లును ఇందిరమ్మ పథకం ద్వారా పక్కా ఇంటిగా నిర్మించుకునేందుకు నిబంధనలు అడ్డురావడం.. ప్రజాప్రతినిధి రూ.లక్ష డిమాండ్ చేయడం.. ఈ క్రమంలో రాజకీయ నేతతో వైరం ఏర్పడడం.. చివరికి నేతన్న జీవితం విషాదాంతం కావడం సిరిసిల్లలో చర్చనీయాంశమైంది. మూడు రోజుల క్రితం మిస్సయిన వెంకటేశం శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. రగుడు గుట్టపై శవమై.. స్థానికులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు. సిరిసిల్లలోని తారకరామానగర్కు చెందిన వెంగళ వెంకటేశం (49) కుసుమ గణేష్ అనే ఆసామి వద్ద పనిచేసేవాడు. భార్య సులోచన. వీరికి ఓ కూతురు. కాగా, ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకున్న వెంకటేశం.. ఈ విషయమై మున్సిపల్ వైస్చైర్మన్ దార్ల సందీప్ను సంప్రదిస్తే.. ఆయన డబ్బులు డిమాండ్ చేసినట్లు గతంలో ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ నిజనిర్ధారణ కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దార్ల సందీప్పై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం వెంకటేశం కనిపించకుండా పోయాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు వెంకటేశం పనిచేసే ఆసామి కుసుమ గణేశ్ను విచారించగా.. గురువారం మల్లికార్జునస్వామి గుడికి వెళ్దామని తనను తీసుకొచ్చాడని, అయితే గుట్టమీదకు తాను రాలేనని చెప్పడంతో ఒక్కడే వెళ్లాడన్నాడు. అనంతరం అక్కడి నుంచి తాను ఇంటికొచ్చినట్లు తెలిపాడు. వెంకటేశం మరణం..అనుమానాస్పదం మూడు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిన వెంకటేశం రగుడు శివారులోని మల్లికార్జునస్వామి ఆలయం గుట్ట పరిసరాల్లో విగతజీవిగా పడి ఉన్నాడు. గుట్టపై వెంకటేశం చనిపోయన విషయంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇంటి విషయంలో మున్సిపల్ వైస్చైర్మన్ దార్ల సందీప్తో వైరం ఉంది. అతని భార్య సులోచన ఇచ్చిన ఫిర్యాదులోనూ దార్ల సందీప్పై అనుమానాలు ఉన్నట్లు పేర్కొంది. కాగా, వెంకటేశం సూసైడ్ నోట్ విషయంలో పోలీసులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై టౌన్ సీఐ శ్రీనివాస్ను వివరణ కోరగా.. మృతుడి వద్ద కాగితాలు లభించాయని వాటిలో ఏమి లేదని చెప్పారు.
డేటింగ్ యాప్లో వల, వీడియోలతో బ్లాక్మెయిల్ : కోట్లు కొట్టేస్తున్న కిలాడీ
డేటింగ్ యాప్లో పరిచయమైన ఒక లేడీ కిలాడీ హనీ ట్రాప్ దందా ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన పల్లవి సింగ్ రాజ్పుత్ అనే మహిళ డేటింగ్ యాప్ టిండర్ (Tinder), ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా పురుషులతో పరిచయం పెంచుకుని, ఆపై వారిని బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేస్తోందన్న ఆరోపణలు సంచలనం రేపాయి. ఒక హైకోర్టు లాయర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ హనీట్రాప్ నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది .విచారణలో విషయాలు తెలిసి పోలీసులు సైతం నివ్వెరపోయారు.పల్లవి సింగ్ రాజ్పుత్ అనే మహిళ టిండర్ ద్వారా పురుషులకు వల వేసి, స్నేహం నటించేది. ఆ తర్వాత వారితో దగ్గరయ్యేది. ఇక్కడే తన ప్లాన్ అమలులో కీలకమైన అడుగు వేసేది. తనకు పరిచయమైన వారితో సన్నిహితంగా ఉంటున్న సమయాల్లో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసేదని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వీడియోలు, ఫోటోలు చూపించి బాధితులను బెదిరిస్తూ ఇప్పటివరకు దాదాపు రూ. 6 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. అంతేకాదు తాను డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకపోతే అత్యాచారం హత్యాయత్నం లాంటి తీవ్రమైన కేసులు పెడతానని బెదిరించేది. ఈమె ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటికే ఐదుగురు జైలుకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.నకిలీ ప్రొఫైళ్లుపల్లవి "స్వీటీ తివారి" అనే పేరుతో సహా వివిధ నకిలీ సోషల్ మీడియా ప్రొఫైళ్లను ఉపయోగించి కొత్తవారిని బురిడీ కొట్టించేదని మరొక ఫిర్యాదులో వెల్లడైంది. ఈమెకు మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు సహకరిస్తున్నారని సమాచారం.ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్కి రూ. 6 లక్షల రింగ్ : లవర్ చేసిన పని ఇదే!సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ఈ కేసువెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించి మంచంపై పెద్ద ఎత్తున నోట్ల కట్టలు పేర్చి ఉన్న ఫొటోలు, అలాగే ఒక మహిళ చేతిలో ఆయుధం పట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. అయితే, ఈ ఫొటోల విశ్వసనీయతను పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోది చేసి ముమ్మర దర్యాప్తు జరుపు తున్నారు.ఇదీ చదవండి: 26 ఏళ్ల మిలియనీర్ కుక్కలా మారేందుకు రూ. 220 కోట్లు? వీడియో వైరల్
వీడియోలు
ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు
నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు
DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్
షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని
దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన
రఫేల్ ది గేమ్ చేంజర్
నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి
అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే
లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు
కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు


