మహా గణపతిం భజే!
ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు మనం వినాయకచవితి పండుగని జరుపుకుంటాము. గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యమూ తలపెట్టం. ఎందుకంటే, ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని శాస్త్రవచనం. విఘ్ననిర్మూలన కోసం అవతరించి మంగళ స్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్యమూర్తియై నిలిచాడు ఆ గణేశుడు.సమస్త మంత్రాలలోను శక్తికి కారణాలైన బీజాక్షరాలన్నింటిలోకి ముందుగా ఉచ్చరించేదే ‘ఓంకారం’ అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా వర్ణించారు. మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ ‘గణపతి’. ‘బ్రహ్మణస్పతి’ అంటే వేదాలకి నాయకుడు అని కీర్తించారు.దేవతా గణాల ప్రారంభం కంటే ముందే గణనాథునితో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి. శరీరంలోని షట్చక్రాలలో అన్నిటికన్నా అడుగున ఉండే చక్రం ‘మూలాధార చక్రం‘. ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. దీనిలో ఇంకో రహస్యం కూడా ఉంది. ‘మహాశక్తి’ అయిన పార్వతీదేవికి ‘ద్వారపాలకుడుగా’ గణపతిని పెట్టినట్టు మన పురాణగాథ, దీనిలో అంతరార్థం ఏమిటంటే –– మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో ఉంటుంది అని, ఈ కుండలిని శక్తియే మహాశక్తి –– అ మూలాధారంలో కుండలిని శక్తిని మేల్కొలపడానికి ప్రవేశించే ద్వారంవద్దనే గణపతి కావలిగా ఉన్నాడు. అంటే గణపతి బీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తే శక్తిని మేల్కొల్పటం సాధ్యపడుతుంది. మూలాధారంలో మేల్కొన్న కుండలినిశక్తి ‘ఇడ’,‘పింగళ’ నాడులద్వార షట్చక్రాలను భేదించి సహస్రారం చేరుతుంది. యోగికి ‘సిద్ధి‘ ‘బుద్ధి‘ కలుగుతుంది. ఈ బుద్ధి, సిద్ధి – ఇడా, పింగళ అనే జంటలే సుషుమ్నా నాడిలో నివసించు గణపతికి భార్యలు.వినాయకుడికి అవతారాలున్నాయా?వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. అవి 1. వక్రతుండుడు; 2. ఏకదంతుడు; 3 మహోదరుడు; 4. లంబోదరుడు; 5. గజాననుడు; 6. వికటుడు; 7. విఘ్నరాజు; 8. ధూమ్రవర్ణుడు.వినాయకుని ఆసనంలో గల అంతరార్థంచాలా ప్రతిమలలో వినాయకుడు తన ఎడమ కాలుని ముడుచుకుని, కుడి పాదాన్ని కిందకి ఉంచి కనిపిస్తాడు. దీనినే యోగశాస్త్రంలో లలితాసనం అంటారు. సాక్షాత్తూ జ్ఞానానికి ప్రతిబింబమైన లలితాదేవి కూడా ఈ భంగిమలోనే కనిపిస్తుంది. భారతీయ ప్రతిమలలో ఇది కాస్త అరుదైనప్పటికీ, బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆసనాన్ని సూచిస్తుంటాయి. ఒకపక్క ప్రశాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వానికి ఈ ఆసనం ప్రతీక. అంటే జీవితంలోని ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే, మనసుని స్థిరంగా నిలుపుకోగలగడమే మానవులకి నిజమైన సవాలు. తాను అలాంటి స్థితిలో ఉన్నానని గణేశుడు చెప్పకనే చెబుతున్నాడన్నమాట. అందుకనే భక్తులు ఎక్కువగా లలితాసనంలో ఉన్న వినాయకునికే పూజలు చేస్తుంటారు.– డి.వి.ఆర్
సరిగా ‘సిప్’ చేస్తే... చేతికి మరో జీతం!
బంగారం, వెండి ధరలు బాగా పెరిగి పోయాయి. కొనటం కష్టం. ఒకవేళ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే... వడ్డీ ఆశాజనకంగా లేదు. ఈపీఎఫ్లో పెడితే... వడ్డీ బావున్నా దీర్ఘకాలం వేచిచూడాలి. పోస్టాఫీసు స్కీముల్లో అయితే లిమిట్ ఉంటుంది. తక్కువే పెట్టగలం. మరేం చెయ్యాలి? భవిష్యత్తు కోసం అందుబాటులో ఉన్న ఇన్వెస్ట్మెంట్ మార్గమేంటి? మున్ముందు ఒక జీతంలా నెలనెలా రావాలంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే. సిప్ మార్గంలో మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయటం. నెలకు రూ.5వేల చొప్పున ‘సిప్’ చేస్తే స్థిరమైన జీతాన్ని సాధించటం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే ఇలా సిప్ చేయటానికి కొన్ని మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. అవేంటో వివరించేదే ఈ ‘వెల్త్ స్టోరీ’నెలకు రూ.5వేలు. అంటే సంవత్సరానికి రూ.60 వేలు. ఈ మొత్తంతో అప్పటికప్పుడు ఒక నిధిని పోగేద్దామనుకుంటే సాధ్యం కాదు. కాకపోతే ఓ 20–25 సంవత్సరాలు గనక ఇలానే ఇన్వెస్ట్ చేస్తే... అర్థవంతమైన నిధి ఏర్పడుతుంది. దీనిపై స్థిరమైన జీతాన్ని పొందొచ్చు. అలా వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోతుంది. చివరి రోజుల్లో ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం తప్పుతుంది. అందుకే... దీన్ని భవిష్యత్లో వచ్చే రెండో జీతంగానే చూడాలి తప్ప ఒక భారీ గ్యారంటీడ్ నిధిగా చూడకూడదు. క్రమం తప్పకుండా విత్డ్రా చేసుకునేట్లుగా పోర్టుఫోలియోను డిజైన్ చేసుకోవచ్చు. రెండో జీతమంటే ఏంటి? ఒక పెద్ద నిధి సమకూరగానే దాన్ని ఖర్చుపెట్టేసేలా ఉండకూడదు. ఆ వచ్చేదాని కోసం ముందే ఖర్చులు సిద్ధం చేసి పెట్టుకోవటం కూడా సరికాదు. ఆ నిధి నుంచి వార్షికంగా కొంత సొçమ్ము తీసుకోవటమే లక్ష్యంగా ఉండాలి. మిగిలింది పెట్టుబడిగానే కొనసాగుతుంది. ఉదాహరణకు ఏడాదికి 4 శాతం విత్డ్రా చేసుకుంటే... ఆ మిగిలిన మొత్తం పెట్టుబడిగా కొనసాగుతుంది కనక సుదీర్ఘకాలం మన లక్ష్యానికి ఢోకా ఉండదు. అదెలాగో చూద్దాం... → రూ.30 లక్షల నిధి గనక సమకూరితే దాని ద్వారా నెలకు రూ.12 వేలు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. → రూ.60 లక్షల నిధి గనక సమకూరితే దాన్నుంచి ఈజీగా నెలకు రూ.25వేల వరకు విత్డ్రా చేసుకోవచ్చు. → రూ.కోటి నిధి గనక సమకూరితే రమారమి నెలకు రూ.40 వేలు విత్డ్రా చేసుకున్నా ఇబ్బంది ఉండదు.ప్రతి నెలా ‘సిప్’ రూపంలో రూ.5వేలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఎంతవుతుంది? నిజానికి పాతికేళ్లు గనక ఇలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే రూ.కోటి కూడా కావచ్చు. కాకపోతే ఇది పూర్తిగా మార్కెట్ రాబడులపై ఆధారపడి ఉంటుంది. దీర్ఘ కాలానికైతే మార్కెట్లు ఎప్పుడూ మంచి రాబడులే ఇస్తున్నాయి కనక ఇబ్బంది ఉండదు. ఎన్నేళ్లకు ఎంతవుతుందన్నది ఈ పట్టికలో చూద్దాం...నెలకు రూ.5వేలు... ఎంతవుతుంది?పై పట్టికలో 10 శాతం రాబడి లెక్కన చూసుకుంటే రూ.5000 సిప్ 20 ఏళ్లలో 38 లక్షలవుతుంది. దీన్లోంచి ఏటా 4 శాతం చొప్పున నెలకు రూ.22,100 విత్డ్రా చేయొచ్చు. అదే 10 శాతం రాబడి లెక్కన 25 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే సిప్ మొత్తం రూ.66 లక్షలవుతుంది. నెలకు రూ.22,100 చొప్పున విత్డ్రా చేయటానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో తెలుసుకోవాల్సింది ఒక్కటే. తొలి దశాబ్దంలో ఒక మంచి ఇన్వెస్టింగ్ పద్ధతి అలవాటవుతుంది. తరువాతి దశాబ్దాల్లో కాంపౌండింగ్ వల్ల భారీ నిధి సమకూరుతుంది. ద్రవ్యోల్బణాన్ని గమనించక తప్పదు... భవిష్యత్తులో నెలకు రూ.20వేలు వస్తుందనుకోండి. ఆ మొత్తంతో ఇప్పుడు రూ. 20 వేలతో ఏం కొనగలుగుతున్నామో అవన్నీ కొనలేం. ఎందుకంటే ధరలు పెరుగుతాయి. అదే ద్రవ్యోల్బణం. ఇది ఏటా 5 శాతం పెరుగుతుందనుకుంటే ప్రస్తుతం నెలవారీ ఇంటి ఖర్చులకు పెడుతున్న రూ.10వేలు ... 10 ఏళ్లలో రూ.16,300కు చేరుతుంది. 15 ఏళ్లలో ఇది రూ.20,800 అవుతుంది. 20 ఏళ్లలో ఇది ఏకంగా రూ.26,500 అవుతుంది. అందుకే రూ.5,000 నెలవారీ సిప్ అనేది ఒక శుభారంభంగా చూడాలి. అంతే తప్ప ఇదే పూర్తిస్థాయి రిటైర్మెంట్ ప్రణాళిక కాదు. ఇందుకంటే దేశంలో వినియోగ ద్రవ్యోల్బణం ఏటా 4 శాతం వరకూ పెరుగుతున్నట్లు గడిచిన కొన్నేళ్ల డేటా చెబుతోంది. కాకపోతే చదివే చదువు, వెళ్లే ఆసుపత్రి, జీవన స్థాయిని బట్టి కుటుంబాలు ఎవరికివారు అంతకన్నా ఎక్కువ రేటు ద్రవ్యోల్బణాన్ని కూడా భరించాల్సి రావచ్చు. ఏటా ‘సిప్’ పెంచటం... సూపర్ స్టెప్మీరు నెలకు రూ.,5వేలతోనే సిప్ ఆరంభించి ఉండొచ్చు. కానీ ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళ్లటమనేది మీకు భవిష్యత్తులో సమకూరబోయే నిధిని నాటకీయంగా మార్చేస్తుంది. అలా పెంచుతూ వెళితే ఏమవుతుందంటే... ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళితే 25 ఏళ్లలో సమకూరే నిధి వల్ల నెలకు రూ.54,300 విత్డ్రా చేసుకోవటానికి వీలవుతుంది. అందుకనే ఏటా సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లటమనేది తొలి నాళ్ల నుంచీ ఆరంభిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయమేంటంటే జీతం పెరిగినపుడల్లా... దాంట్లో కొంత సిప్కు కేటాయించటం. అలా చేయటం వల్ల పెంపు భారమనిపించదు. ఈ తప్పులు చేయొద్దు.... → మార్కెట్లు పడ్డప్పుడు నిలిపేయటం... చాలామంది ఇన్వెస్టర్లు చేసే తప్పు ఇదే. మార్కెట్లు బాగా పడుతున్న సందర్భాల్లో నష్టాలు వస్తాయనే కారణంతో సిప్ను నిలిపేస్తుంటారు. కానీ ఆ సమయంలో తాము ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తానికి ఎక్కువ యూనిట్లు వస్తాయనే వాస్తవాన్ని గ్రహించరు. ఇంకా పడ్డాక కొందాంలే... అనే ధోరణితో ఉంటారు. కానీ మార్కెట్లు పడేటపుడు ఎంతవరకూ పడతాయో... ఎప్పటి నుంచి పెరుగుతాయో ఎవ్వరూ అంచనా వేయలేరు. కాబట్టే ఇలాంటి సందర్భాల్లో సిప్ చాలా ఉపయోగపడుతుంది. లక్ష్యాలు దీర్ఘకాలికం కనక ఈ ఊగిసలాటలు తాత్కాలికమేనని గ్రహించటం అత్యవసరం. → రాబడులకు గ్యారంటీ ఉండదు... ఏటా 10 శాతమో, 12 శాతమో పెరుగుతాయనే ఉద్దేశంతోనే ఇన్వెస్ట్ చేస్తారు కదా!. కాకపోతే అది గ్యారంటీ అని, తమ చేతిలోకి అనుకున్న మొత్తం తప్పనిసరిగా వస్తుందని మాత్రం అనుకోకూడదు. కాలిక్యులేటర్లో లెక్కలు వేసి... ఆ మేరకు మొత్తం తమ చేతిలోకి వస్తుంది కదా అని దాని ఆధారంగా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవటం సరికాదు. ఎందుకంటే చివరికి మనం అనుకున్న మొత్తం కన్నా ఎక్కువైనా రావచ్చు. లేదా తక్కువైనా రావచ్చు. కాకపోతే దీర్ఘకాలంలో ఎప్పుడూ మంచి లాభాలే వస్తాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. → ఇన్వెస్ట్మెంట్ కన్నా ముందు పునాది ముఖ్యంఆర్థికంగా ఇబ్బందుల్లేని పరిస్థితులనేవి అన్నిటికన్నా ప్రధానం. ఇబ్బందులు పడుతూ... ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా దూకుడుగా సిప్లో ఇన్వెస్ట్ చేయటం కూడా అంత తెలివైన నిర్ణయమేమీ కాదు. అందుకే సిప్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ అంశాలు చూసుకోవాలి.... → అత్యవసర ఖర్చులనేవి ఎటునుంచి ఎలా వస్తాయో తెలియదు. కాబట్టి వీటికి తగినంత అత్యవసర నిధి ఉండాలి. → చాలినంత ఆరోగ్య బీమా కవరేజీ ఉండాలి. టర్మ్ లైఫ్ కవరేజీ కూడా ప్రధానమే. → ఎక్కువ వడ్డీ ఉన్న అప్పుల్ని తగ్గించుకోవటానికి ప్రణాళిక ఉండాలి. ప్రత్యేకించి క్రెడిట్ కార్డు రుణాలు, ఖరీదైన వ్యక్తిగత రుణాలు ఈ కోవలోకి వస్తాయి. → దగ్గర్లో చేయాల్సిన పనులకు ప్రత్యేక నిధి అవసరం. వచ్చే ఏడాది చెల్లించాల్సిన స్కూలు లేదా కాలేజీ ఫీజు, వచ్చేనెల చెల్లించాల్సిన గృహ రుణం ఈఎంఐ...ఇలాంటివి దీని పరిధిలోకి వస్తాయి. → ప్రత్యేకించి ఇన్వెస్ట్ చేయటానికి అప్పు తీసుకోవటమనేది ప్రమాదకరం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ట్రాప్లో పడొద్దు. ఇదీ... కుటుంబాలకు రోడ్ మ్యాప్ 1 నుంచి 3 సంవత్సరాలు... ఒక ఇన్వెస్ట్మెంట్ సంస్కృతిని అలవాటు చేసుకోవాలి. నెలకు రూ.5వేల సిప్... కొంత అత్యవసర నిధి... గతేడాది అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఫండ్లో ఇన్వెస్ట్ చేయటం వంటివి కాకుండా దీర్ఘకాలంగా మంచి పనితీరు కనబరుస్తున్నవి ఎంచుకోవటం... జీతం ఖాతాలో పడగానే ఆటోమేటిగ్గా సిప్లోకి కొంత మొత్తం పోయేటట్లు చూసుకోవటం. 4 నుంచి 10 సంవత్సరాలు... జీతం పెరిగినపుడల్లా సిప్ మొత్తాన్ని కూడా పెంచుకుంటూ వెళ్లటం. స్వల్పకాలంలో అవసరమయ్యే మొత్తాన్ని విడిగా ఉంచుకోవటం... దాన్ని దీర్ఘకాల ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లలో కలపకపోవటం... ప్రతి రోజూ కాకుండా ఏడాదికోసారి లక్ష్యాలను సమీక్షించుకోవటం. → 11 నుంచి 20 సంవత్సరాలు.. లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వెళ్లాలి. ప్రధాన లక్ష్యం దగ్గరికొస్తున్న కొద్దీ... కొంత మొత్తాన్ని ఊగిసలాటల మార్కెట్ల నుంచి స్థిరంగా ఉండే సాధనాల్లోకి మళ్లించాలి. చివరి సంవత్సరం వచ్చేదాకా వేచి చూడకుండా... మార్కెట్లు బాగున్నపుడు కొంత మొత్తాన్ని మళ్లిస్తే రిస్కు తగ్గుతుంది. → 20 ఏళ్ల తరవాత... అప్పుడప్పుడూ కావలసినంత మొత్తాన్ని తీసుకోకుండా.. ఒక ప్రణాళిక మేరకు నిర్థ్ధిష్ట కాల వ్యవధుల్లో కొంత మొత్తాన్ని తీసుకుంటే మంచిది. విత్డ్రాయల్స్ను ఏడాదికోసారి సమీక్షించుకుంటే మంచిది. స్వల్పకాలంలో చెల్లించాల్సిన వాటికోసం కొంత సొమ్ము విడిగా ఉంచుకోవాలి. అలా చేస్తే అవసరమైనపుడు ఒకవేళ మార్కెట్లు బాగులేకుంటే తక్కువకే విక్రయించి బయటపడాల్సిన పరిస్థితి ఉండదు. చివరిగా గమనించాల్సింది ఒకటే. రూ.5000 నెలవారీ సిప్ అనేది మరీ చిన్న మొత్తమేమీ కాదు. కాకపోతే దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక పెట్టుకుని, ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళితే అది మరింత అర్థవంతమైన నిధిగా మారుతుంది. నిజానికి మంచి ఫండ్లను వెతకటంలోనే విజయం ఉందనుకోవద్దు. మానకుండా చిరకాలం ఇన్వెస్ట్ చేయటంలోనే అసలు విజయం దాగి ఉంటుంది.రమణమూర్తి మంథా
Daily Horoscope : ప్రముఖుల నుంచి కీలక సందేశం
మేషం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృషభం... ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలాసవంతంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.మిథునం.... పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.కర్కాటకం.... నిర్ణయాలలో తొందరవద్దు. ఆరోగ్యసమస్యలు. శ్రమ పెరుగుతుంది. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. పనులలో ఆటంకాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.సింహం... నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో లక్ష్యసాధన. కళాకారులకు సత్కారాలు.కన్య... పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవచింతన.తుల... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి పిలుపు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబసమస్యలు తీరతాయి. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.వృశ్చికం... పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.ధనుస్సు.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. దైవదర్శనాలు.మకరం.... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి లాభం. సోదరులు,సోదరీలతో విభేదాలు తొలగుతాయి. కోర్టు కేసుల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.కుంభం.. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగమార్పులు.మీనం.... పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. సోదరులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
ప్రేక్షకుల చేతికే మొత్తం పవర్స్.. అంచనాలను పెంచేసిన బిగ్బాస్
బిగ్బాస్ సీజన్-10లో ఆదివారం ఎపిసోడ్ సందడిగా సాగింది. వినాయక చవితి సందర్భంగా హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు పండగ శుభాకాంక్షలు తెలిపి షోను ప్రారంభించారు. ఎప్పటిలాగే తనదైన శైలిలో కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతూ.. అవసరమైన చోట క్లాస్ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో బ్లాక్ కీతో హౌస్లో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చారు. ఇక రెండో వీకెండ్ ఎలా ఉండబోతుందో కూడా హింట్ ఇచ్చారు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి ఓ లుక్కేద్దాం..ఇంగ్లీష్పై నాగార్జున అసంతృప్తిహౌస్లో కొందరు కంటెస్టెంట్లు ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడటంపై నాగార్జున స్పందించారు. హౌస్లో జరిగే విషయాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉండాలంటే వీలైనంత వరకు తెలుగులో మాట్లాడాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లీష్ రాని ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలుగు సరిగా మాట్లాడటం రాకపోయినా ప్రయత్నిస్తున్న దేబ్జానీని ఈ సందర్భంగా నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు.దేబ్జానీకి ఫుల్ క్రేజ్.. రోహిత్కు వార్నింగ్కంటెస్టెంట్ల మనసులో ఎవరు ఉన్నారు? ఎవరు దూరంగా అనిపిస్తున్నారు? తెలుసుకునేందుకు నాగార్జున ఓ ఆసక్తికరమైన టాస్క్ను కంటెస్టెంట్లకు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు కంటెస్టెంట్లు తమ మనసులోని మాటలను బయటపెట్టారు. ఎక్కువమంది దేబ్జానీ పేరును ఇష్టపడుతున్నట్లు చెప్పడంతో నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. ‘నువ్వు చాలా పాపులర్ అయిపోతున్నావు’ అంటూ ఆమెతో సరదాగా అన్నారు. మరోవైపు రోహిత్ పేరును ద్వేషిస్తున్నట్లు తెలపడంతో రోహిత్ను హౌస్లో మరింత జాగ్రత్తగా ఉండాలని నాగార్జున సూచించారు.ఎక్కువ మంది చదివింది: అభిమానికి అండగా రామ్.. ఆమె కోసం మరో అడుగుబ్లాక్ కీతో అసలు ట్విస్ట్ఆదివారం ఎపిసోడ్లో బ్లాక్ కీతో బిగ్బాస్ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చారు. నాగార్జున తీసుకొచ్చిన బ్లాక్ కీని ఎవరికి ఇస్తే.. ఆ వ్యక్తి దగ్గర ఉన్న కీ పవర్ పనిచేయకుండా పోతుందని తెలిపారు. దీంతో ఆ బ్లాక్ కీ ఎవరికి ఇవ్వాలనే దానిపై కంటెస్టెంట్ల అభిప్రాయాలు తీసుకున్నారు. అందరిలో ఎక్కువమంది సృష్టి పేరు చెప్పారు. చివరికి బ్లాక్ కీని సృష్టికి ఇవ్వాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటనఇదే సమయంలో ఇప్పటివరకు మ్యాజిక్ కీ లేని నలుగురు కంటెస్టెంట్లకు మరో అవకాశం కల్పించారు. ఈ మేరకు బ్లాక్ బాక్స్ను సొంతం చేసుకునేందుకు నిర్వహించిన టాస్క్లో సుదీర్ విజయం సాధించాడు. దీంతో సృష్టి తన దగ్గర ఉన్న బ్లాక్ కీని సుదీర్కు అందించింది. ఇక సుదీర్ చేతికి చేరిన ఈ బ్లాక్ కీతో హౌస్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.ఎలిమినేషన్లో ట్విస్ట్..ఈ ఎపిసోడ్లో హౌస్మేట్స్గా అమన్, ముకేశ్, సృష్టి, నరేశ్లన ఎంపిక చేశారు. ఇప్పటివరకు హౌస్మేట్స్కానీ సుదీర్, వర్షిణి, కృష్ణుడుని యాక్టివిటీ రూంలోకి పంపించారు. ‘ మీ ముగ్గురులో హౌస్మేట్స్ ఎవరు.. ఎలిమినేట్ ఎవరు అవుతారో అక్కడ ఉన్న డోర్స్ తెరిస్తే తెలుస్తుంది’ అని నాగార్జున వాళ్లకి తెలిపాడు. ఇక్కడ ఓ మ్యాజిక్ జరిగింది అంతా సుదీర్ ఎలిమినేట్ అవుతాడు అనుకున్నారు. కానీ ఈ ముగ్గురూ హౌస్మేట్స్గానే ఎంపికయ్యారు.ముకేశ్ కళ్లపై నాగార్జున కామెంట్ముకేశ్ కళ్లను గమనించిన నాగార్జున.. ‘నీ కళ్లు చాలా బాగున్నాయి’ అంటూ ప్రశంసించారు. దీనికి ముకేశ్ థ్యాంక్యూ చెప్పాడు. ‘మీరు చెబుతుంటే నమ్మాలని అనిపిస్తుంది’ అని అన్నాడు. వెంటనే నాగార్జున సరదాగా ‘ఏంటి.. దేబ్జానీ చెబితే అర్థం కాలేదా?’ అంటూ నవ్వించారు. దీంతో పక్కనే ఉన్న దేబ్జానీ ‘నేను నిజంగానే చెప్పా సార్’ అంటూ బదులివ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి.ఇదీ చదవండి: షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్సినిమా టాస్క్..కంటెస్టెంట్ల కోసం నాగార్జున సినిమా టాస్క్ నిర్వహించారు. నరేశ్ను రెండు టీమ్లుగా విభజించమని చెప్పడంతో అతడు ఏ, బీ టీమ్లుగా విభజించాడు. ఈ పోటీలో కృష్ణుడు టీమ్ విజయం సాధించింది. విజేతలకు స్వీట్ బాక్స్లను అందించారు. ఆ సమయంలో దేబ్జానీ రాత్రిపూట తనకు కాఫీ కావాలని నాగార్జునను కోరింది. అయితే కాఫీ కావాలంటే ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ చెప్పాలని నాగార్జున కండిషన్ పెట్టారు.ఇదీ చదవండి: త్రిష రాగానే ముఖం పక్కకు తిప్పుకొన్న విజయ్దేబ్జానీ తన సీక్రెట్ చెబుతూ.. తాను ఆరో తరగతి రెండుసార్లు చదవాల్సి వచ్చిందని, తొలిసారి ఆరో తరగతిలో ఫెయిల్ అయ్యానని చెప్పింది. అయితే ఈ సీక్రెట్తో బిగ్బాస్ సంతృప్తి చెందలేదని నాగార్జున చెప్పడంతో మరో సీక్రెట్ బయటపెట్టింది. బిగ్బాస్ హౌస్లో ఉన్న ముకేశ్ అంటే తనకు చాలా ఇష్టమని దేబ్జానీ చెప్పింది. ముకేశ్ అందరితో పులహారి కలుపుతాడని కానీ తన దగ్గరకు మాత్రం రావడం లేదని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈ సీక్రెట్తో నాగార్జున ఆమెకు కాఫీని సాంక్షన్ చేశారు.రెండో వీకెండ్.. ప్రేక్షకుల చేతుల్లోనే!ఇక ఎపిసోడ్ చివర్లో వచ్చే వీకెండ్ ఎలా ఉండబోతుందో తెలిపే ఓ క్లిప్ను చూపించారు. ‘నెక్ట్స్ వీకెండ్ అంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది’ అంటూ నాగార్జున చెప్పడంతో హౌస్లో మరో ఆసక్తికరమైన పరిణామానికి తెరలేచినట్లైంది. అసలు వచ్చే వారం ప్రేక్షకుల చేతుల్లో ఉండబోయేది ఏంటి? ఎవరి గేమ్పై ఎలాంటి ప్రభావం పడనుంది? అనేది తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.ఇదీ చదవండి: బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో త్రివిక్రమ్ ప్లానేంటి?
అమెరికాలో గుండెపోటుతో నగర వాసి మృతి
నార్సింగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
ఎల్లలు లేని వినాయకుడు.. వివిధ దేశాల్లో..
కొత్త కారును అడ్డగించి రూ.2 లక్షలు డిమాండ్!
హర్ముజ్ సంక్షోభంలో బిగ్ ట్విస్ట్.. అనూహ్య పరిణామాలు!
శంషాబాద్లో బస్సు బీభత్సం.. హోటల్లోకి దూసుకెళ్లి..
‘నీట్’లో భారీ మార్పులు.. ‘బ్రిక్స్’ దేశాలకూ ‘ఎన్టీఏ’ సేవలు!
ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్పై తెగిపడ్డ విద్యుత్ తీగలు
45 ఏళ్లుగా గణేశ్ వేడుకల్లో మారుమోగుతూ..
యూఎస్ ఓపెన్ విజేత అలెగ్జాండర్ జ్వెరెవ్
థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన
ఎన్నికల్లో మీకు సరైన లెక్క నేను చెబుతా..
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
అలాగే ఓ బాంబు, నెత్తిన అప్పు కూడా ఇద్దాం సార్!
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
‘పండుగప్ప’ కోసం పోటీ.. వేలంలో దక్కించుకున్న మహిళ
వివాహేతర సంబంధాల యాప్.. టాప్–5లో హైదరాబాద్!
వైభవ్కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా
ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే?
బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయం.. కదిలిన యంత్రాంగం
ఆంధ్రప్రదేశ్ అప్పులు
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
రాత్రికి రాత్రే 23 కి.మీ వెనక్కి సముద్రం.. ఏం జరగబోతుంది?
భారత రోడ్లపై పుతిన్ కారు.. ప్రత్యేకతలు ఇవే!
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి
హెడ్కోచ్గా సౌరవ్ గంగూలీ.. బ్యాటింగ్ కోచ్గా యువరాజ్!
విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
పాముల మధ్యే విధులు నిర్వహించిన డాక్టర్
ముకేశ్ చాలా ఇష్టం.. కానీ చెప్పలేకపోతున్నా: దేబ్జానీ
అమెరికాలో గుండెపోటుతో నగర వాసి మృతి
నార్సింగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
ఎల్లలు లేని వినాయకుడు.. వివిధ దేశాల్లో..
కొత్త కారును అడ్డగించి రూ.2 లక్షలు డిమాండ్!
హర్ముజ్ సంక్షోభంలో బిగ్ ట్విస్ట్.. అనూహ్య పరిణామాలు!
శంషాబాద్లో బస్సు బీభత్సం.. హోటల్లోకి దూసుకెళ్లి..
‘నీట్’లో భారీ మార్పులు.. ‘బ్రిక్స్’ దేశాలకూ ‘ఎన్టీఏ’ సేవలు!
ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్పై తెగిపడ్డ విద్యుత్ తీగలు
45 ఏళ్లుగా గణేశ్ వేడుకల్లో మారుమోగుతూ..
యూఎస్ ఓపెన్ విజేత అలెగ్జాండర్ జ్వెరెవ్
థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన
ఎన్నికల్లో మీకు సరైన లెక్క నేను చెబుతా..
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
అలాగే ఓ బాంబు, నెత్తిన అప్పు కూడా ఇద్దాం సార్!
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
‘పండుగప్ప’ కోసం పోటీ.. వేలంలో దక్కించుకున్న మహిళ
వివాహేతర సంబంధాల యాప్.. టాప్–5లో హైదరాబాద్!
వైభవ్కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా
ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే?
బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయం.. కదిలిన యంత్రాంగం
ఆంధ్రప్రదేశ్ అప్పులు
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
రాత్రికి రాత్రే 23 కి.మీ వెనక్కి సముద్రం.. ఏం జరగబోతుంది?
భారత రోడ్లపై పుతిన్ కారు.. ప్రత్యేకతలు ఇవే!
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి
హెడ్కోచ్గా సౌరవ్ గంగూలీ.. బ్యాటింగ్ కోచ్గా యువరాజ్!
విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
పాముల మధ్యే విధులు నిర్వహించిన డాక్టర్
ముకేశ్ చాలా ఇష్టం.. కానీ చెప్పలేకపోతున్నా: దేబ్జానీ
ఫొటోలు
ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)
ఖైరతాబాద్ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)
హైదరాబాద్లో వినాయక చవితి సందడి (ఫోటోలు)
'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)
విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)
వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)
బేబీ బంప్తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)
'ఎపిక్' షూటింగ్లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)
వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)
సినిమా
షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించి ఓ స్పెషల్ మూమెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.‘రణబాలి’లో జయమ్మ పాత్రలో నటిస్తున్న రష్మిక తన షూటింగ్ పార్ట్ను పూర్తి చేశారు. ఇంజ్యూరీ నుంచి కోలుకున్న తర్వాత ఆమె తిరిగి సినిమా సెట్స్లో అడుగుపెట్టారు. తాజాగా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసిన సందర్భంగా చిత్రబృందం ఆమెకు వీడ్కోలు పలికింది. ఈ సమయంలో రష్మికను అభినందించేందుకు విజయ్ దేవరకొండ కూడా సెట్కు వచ్చారు. ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ చూశారా..షూటింగ్ పూర్తయిన సందర్భంగా..రష్మిక షూటింగ్ పూర్తయిన సందర్భంగా విజయ్ ఆమెను ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఈ స్పెషల్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమ అభిమాన జంటను ఇలా చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.బ్రిటిష్ పాలన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇదీ చదవండి: ఇరుముడి చిత్రబృందానికి ’మెగా‘ అభినందనలు It's a wrap for Jayamma ✨We will dearly miss you on sets, @iamRashmika ❤️The much loved #EndhayyaSaami out very soon.#RanabaaliTeaser TRENDING #1 on YouTube 🔥▶️https://t.co/tqKGJM7RdG#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.#NeverForget#RanabaaliOnOct16th pic.twitter.com/qHX008QMkF— Mythri Movie Makers (@MythriOfficial) September 13, 2026
బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో పరిస్థితేంటి?
బాలీవుడ్లో ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది. ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. సెప్టెంబరు 18న కేవలం రూ.2 కోట్ల బడ్జెట్తో తీస్తే బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.150 కోట్లు వసూలు చేసింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వచ్చి యావత్ భారతీయ సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిదీ ఈ చిత్రం. చిన్న సినిమాగా మొదలై సంచలన విజయాన్ని అందుకున్న ఈ మూవీని తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసుకురావడం మరింత ఆసక్తిని పెంచుతోంది. సెప్టెంబరు 18న ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రానుంది. మరి అక్కడ సంచలనం సృష్టించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.కంటెంట్ బలంగా..సాధారణంగా ప్రేక్షకులకు కంటెంట్ బలంగా ఉంటే చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆదరించడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా వైవిధ్యమైన కథాంశం, ఆసక్తికరమైన స్క్రీన్ప్లే ఉంటే సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం. ‘హనుమాన్ అంశ్’ విషయంలోనూ ఇదే ప్లస్ పాయింట్గా మారుతుందా లేదో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్ఎంతవరకు ప్రభావం చూపుతుందని..అయితే తెలుగు మార్కెట్ పూర్తిగా భిన్నం. ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సమయంలో.. ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమా ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి. మరోవైపు త్రివిక్రమ్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటంతో సినిమాకు అదనపు క్రేజ్ వస్తోంది.కేవలం వసూళ్లను చూసి సినిమాపై అంచనాలు పెట్టుకోవడం ఒక ఎత్తయితే.. తెలుగు నేటివిటీకి సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది అసలు పరీక్ష. హిందీలో ప్రేక్షకులను మెప్పించిన అంశాలు తెలుగులోనూ వర్కౌట్ అయితే ‘హనుమాన్ అంశ్’ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏషనాగుల పాటకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారంటే..ఆదర్శ కుటుంబం..మరోవైపు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. శ్రీనిధి శెట్టి హీరోయిన్. అక్టోబరు 02న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా టీజర్ విడుదల చేశారు. టీజర్లోని ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇరుముడి చిత్రబృందానికి ’మెగా‘ అభినందనలు
రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. గత నెల మూడో వారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ.230 కోట్ల వరకూ గ్రాస్ వసూలు చేసింది. చిన్నాపెద్దా అని తేడాలేకుండా పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లి సినిమా చూశారు. ఈ సినిమాని చూసిన పలువురు ఇప్పటికే ప్రశంసలు కురింపించారు. ఆ తరహాలోనే 'ఇరుముడి' విడుదలైన సమయంలో సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని చిరంజీవి, రామ్చరణ్లు అభినందించారు. తాజాగా ‘ఇరుముడి’ టీమ్ని స్వయంగా కలిసి మరో సారి శుభాకాంక్షలు తెలిపారు. రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ నిర్మాతలు నవీన్ , వై. రవి శంకర్ లతో ఈ సమావేశంలో ఉన్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ అడుతోంది. ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన A special moment of celebration ❤️🔥Megastar @KChiruTweets Garu & Mega Power Star @AlwaysRamCharan Garu met Mass Maharaja @RaviTeja_offl Garu and the team of #Irumudi to celebrate the film’s massive success ✨❤️Book Your Tickets Now! 🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI /… pic.twitter.com/qncXARM9eY— Mythri Movie Makers (@MythriOfficial) September 13, 2026
ఏషనాగుల పాటకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారంటే..
నాని హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ అభిమానులను అలరించాయి. ముఖ్యంగా ఆయా షేర్, ఏషనాగుల సాగ్స్ ఎలాంటి రికార్స్ సృష్టించారో చెప్పనవసరంలేదు. ఒక్క ఏషనాగుల సాంగే విడుదలైన కొద్ది రోజులకే 52 మిలియన్ వ్యూస్ దాటింది. మరి ఈ పాటలు పాడిన సింగర్కు ఎంత పారితోషకం ఇచ్చుంటారని సోషల్మీడియాలో హాట్టాపిక్గా మారింది.రూ. 5 లక్షల పారితోషికం ఇచ్చారా..ఈ పాటలను పాడింది సింగర్ జంగి రెడ్డి అని విషయం తెలిసిందే.. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యులో యాంకర్ అడిగిన ప్రశ్నలకు బదులు ఇస్తూ తన రెమ్యునరేషన్ కోసం వెల్లడించారు. ‘ ఆ పాటల ద్వారా లభించిన విజయం , ప్రజాదరణ ముందు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ చాలా చిన్నది. పాటల సక్సెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. రూ. 5 లక్షల పారితోషికం ఇచ్చారా అని అడిగిన ప్రశ్నకు ‘అంత స్థాయిలో పారితోషికం ఇవ్వలేదని తేల్చి చెప్పారు. అయితే నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చారని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అభిమానికి అండగా రామ్.. ఆమె కోసం మరో అడుగుట్రైలర్ లేకుండానే సినిమా..కాగా ఈ చిత్రం సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్కి ట్రైలర్ ఉండదు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కలిసి పనిచేయాలి. ప్రేక్షకులను గ్రాంటెడ్గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. దీనికోసం నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది.
క్రీడలు
Asia Cup 2026 Final: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్
భారత యువ క్రికెటర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ మహిళల టోర్నమెంట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ప్లేయర్గా నిలిచింది. దుబాయ్ వేదికగా శ్రీలంకతో ఆదివారం నాటి ఆసియా టీ20 కప్-2026 ఫైనల్ సందర్భంగా 22 ఏళ్ల షఫాలీ వర్మ ఈ ఘనత సాధించింది.శ్రీలంతో టైటిల్ పోరులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే దూకుడుగా ఆడిన ఓపెనర్ షఫాలీ వర్మ 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. అయితే, భారత ఇన్నింగ్స్లో చముడి ప్రబోద బౌలింగ్లో పదమూడో ఓవర్ ఐదో బంతికి.. చమరి ఆటపట్టుకు క్యాచ్ ఇవ్వడంతో షఫాలీ అవుటైంది.షఫాలీతో పాటు స్మృతి కూడామొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న షఫాలీ వర్మ 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తొలి వికెట్గా వెనుదిరిగింది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక మరో ఓపెనర్ స్మృతి మంధాన కూడా హాఫ్ సెంచరీ (39 బంతుల్లో 59) సాధించింది.భారత్ స్కోరు ఎంతంటే?మిగిలిన వారిలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 14 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ 17 పరుగులు చేసింది. ఆఖర్లో కమలిని 5 బంతుల్లో 15 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్.. 183 పరుగులు చేసింది.శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, కెప్టెన్ చమరి ఆటపట్టు, చముడి ప్రబోద తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.మహిళల ఆసియా టీ20 కప్ టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు👉షఫాలీ వర్మ- 24 బంతుల్లో- దుబాయ్ వేదికగా 2026లో శ్రీలంక మీద👉స్మృతి మంధాన- 25 బంతుల్లో- సెల్హైట్ వేదికగా 2022లో శ్రీలంక మీద👉రిచా ఘోష్- 26 బంతుల్లో- దంబుల్లా వేదికగా 2024లో యూఏఈ మీద👉షఫాలీ వర్మ- 26 బంతుల్లో- దంబుల్లా వేదికగా 2024లో నేపాల్ మీద👉షఫాలీ వర్మ- 26 బంతుల్లో- దుబాయ్ వేదికగా 2026లో థాయ్లాండ్ మీద.చదవండి: అదరగొట్టిన బుమ్రా.. అరుదైన ఘనతShafali Verma is accelerating and we're just getting started! 🔥Watch #INDvSL in the Final of the #DPWorldWomensAsiaCup2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #NotAGentlemansGame pic.twitter.com/u0js1RtZWo— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026
అదరగొట్టిన బుమ్రా.. అరుదైన ఘనత
అఫ్గానిస్తాన్తో తొలి టీ20తో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన ఈ పేస్గుర్రం.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొంది పూర్తిగా కోలుకున్నాడు. ఈ క్రమంలో ఫిట్నెస్ పరీక్ష పాసైన బుమ్రా ఆదివారం నాటి మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చాడు.ఇక ఢిల్లీ వేదికగా టీమిండియాకు అఫ్గాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.రెండో బంతికే వికెట్ఈ క్రమంలో బౌలింగ్ అటాక్ మొదలుపెట్టిన బుమ్రా వైడ్తో ఆరంభించినప్పటికీ.. రెండో బంతికే అఫ్గాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ను అవుట్ చేశాడు. బుమ్రా బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి గుర్బాజ్ డకౌట్గా వెనుదిరిగాడు.కాగా టీ20 ఫార్మాట్లో బుమ్రాకు ఇది 350 వికెట్ కావడం విశేషం. తద్వారా పొట్టి క్రికెట్లో 350 వికెట్ల క్లబ్లో చేరిన మూడో భారత బౌలర్గా ఈ రైటార్మ్ పేసర్ నిలిచాడు. అంతకు ముందు స్పిన్నర్ యజువేంద్ర చహల్, పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ ఘనత సాధించారు.టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్లుయజువేంద్ర చహల్- 396 వికెట్లు (హర్యానా, టీమిండియా, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ )భువనేశ్వర్ కుమార్- 363 వికెట్లు (ఉత్తరప్రదేశ్, టీమిండియా, ఇండియా-ఎ, పూణే వారియర్స్, ఆర్సీబీ, సన్రైజర్స్, )జస్ప్రీత్ బుమ్రా - 350 వికెట్లు* (గుజరాత్, టీమిండియా, ముంబై ఇండియన్స్).అఫ్గాన్ స్కోరు ఎంతంటేఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) విఫలమయ్యాడు. మిగతా వారిలో సెదీకుల్లా అటల్ (13) నిరాశపరచగా.. గుల్బదిన్ నైబ్ (2), డార్విష్ రసూలీ (2) తేలిపోయారు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (44 బంతుల్లో 64) చేయగా.. మహ్మద్ నబీ 33 పరుగులతో రాణించాడు. దీంతో అఫ్గాన్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తికి తలా ఒక వికెట్ దక్కింది. చదవండి: షఫాలీ మెరుపు హాఫ్ సెంచరీ𝐓𝐰𝐨 𝐛𝐚𝐥𝐥𝐬 𝐢𝐧𝐭𝐨 𝐡𝐢𝐬 𝐫𝐞𝐭𝐮𝐫𝐧 𝐚𝐧𝐝 𝐁𝐎𝐎𝐌! 💥Jasprit Bumrah gets the extra bounce, Abhishek Sharma completes the catch, and Rahmanullah Gurbaz has to walk!Watch #AFGVIND 1st T20I LIVE NOW on Sony Sports Ten 5 & Sony MAX.#SonySportsNetwork #SonyMax… pic.twitter.com/AKLHpuipyB— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026
Asia Cup 2026 Final: షఫాలీ, స్మృతి ఫిఫ్టీలు.. కమలిని మెరుపులు
దుబాయ్ వేదికగా మహిళల ఆసియా టీ20 కప్ -2026 టోర్నమెంట్ ఫైనల్లో భారత్ టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్.. శ్రీలంకను బౌలింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 59), షఫాలీ వర్మ (39 బంతుల్లో 68) అర్ధ శతకాలతో అలరించారు. మిగిలిన వారిలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 14, రిచా ఘోష్ 17 పరుగులు చేయగా.. ఆఖర్లో కమలిని మెరుపులు (5 బంతుల్లో 15 నాటౌట్) మెరిపించింది. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, కెప్టెన్ చమరి ఆటపట్టు, చముడి ప్రబోద తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.UPDATES👉నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసిన భారత్👉పందొమ్మిది ఓవర్లలో భారత్ స్కోరు: 167-5👉18.5వ ఓవర్: మిథాలి బౌలింగ్లో భారతి ఫుల్మలి బంతిని ఎదుర్కోగా.. సింగిల్ తీసే క్రమంలో దీప్తి (5) రనౌట్ అయింది. దీంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. కమలిని క్రీజులోకి వచ్చింది. భారతి ఒక పరుగుతో ఉంది.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్👉18.4వ ఓవర్: మిథాలి అయోధ్య బౌలింగ్లో సబ్స్టిట్యూట్ కావ్యా కవిందికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హర్మన్ (14). భారతి ఫుల్మలి క్రీజులోకి రాగా.. దీప్తి 5 పరుగులతో ఉంది. స్కోరు: 166-4👉పద్దెనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 163-3దీప్తి 2, హర్మన్ 14 పరుగులతో ఉన్నారు.👉మూడో వికెట్ కోల్పోయిన భారత్17.1వ ఓవర్: ఆటపట్టు బౌలింగ్లో కవిశా దిల్హరికి క్యాచ్ ఇచ్చిన రిచా ఘోష్ (17). దీప్తి శర్మ క్రీజులోకి వచ్చింది.👉పదిహేడు ఓవర్లలో భారత్ స్కోరు: 160-2రిచా 17, హర్మన్ 13 పరుగులతో ఉన్నారు. 👉పదహారు ఓవర్లలో భారత్ స్కోరు: 147-2రిచా 5, హర్మన్ 12 పరుగులతో ఉన్నారు.👉పదిహేను ఓవర్లలో భారత్ స్కోరు: 140-2రిచా 3, హర్మన్ 7 పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన భారత్13.4వ ఓవర్: చమరి ఆటపట్టు బౌలింగ్లో హర్మన్ పరుగు తీసే క్రమంలో స్మృతితో సమన్వయ లోపం కారణంగా స్మృతి రనౌట్ (39 బంతుల్లో 59) అయింది. రిచా ఘోష్ క్రీజులోకి రాగా.. హర్మన్ 3 పరుగులతో ఉంది. 14 ఓవర్లలో స్కోరు: 134-2.👉షఫాలీ వర్మ అవుట్12.5వ ఓవర్: చముడి ప్రబోద బౌలింగ్లో చమరి ఆటపట్టుకు క్యాచ్ ఇచ్చిన షఫాలీ (68) తొలి వికెట్గా వెనుదిరిగింది. స్కోరు: 130-1 (13). హర్మన్ప్రీత్ కౌర్ క్రీజులోకి రాగా.. స్మృతి 58 పరుగులతో ఉంది.👉పన్నెండు ఓవర్లలో భారత్ స్కోరు: 121-0షఫాలీ 67, స్మృతి 51 పరుగులతో ఉన్నారు.👉పదకొండు ఓవర్లలో భారత్ స్కోరు: 113-0👉స్మృతి హాఫ్ సెంచరీషఫాలీ 61 పరుగులతో ఉండగా.. స్మృతి మంధాన 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకుంది.👉పది ఓవర్లలో భారత్ స్కోరు: 98-0స్మృతి 38, షఫాలీ 59 పరుగులతో ఉన్నారు.తొమ్మిది ఓవర్లలో భారత్ స్కోరు: 91-0👉స్మృతి 32, షఫాలీ 58 పరుగులతో ఉన్నారు.👉24 బంతుల్లోనే షఫాలీ అర్ధ శతకం.. అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఆమెకు ఇది 21వ హాఫ్ సెంచరీ.👉ఎనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 78-0షఫాలీ 25 బంతుల్లో 53, స్మృతి మంధాన 23 బంతుల్లో 24 పరుగులతో ఉన్నారు.👉ఏడు ఓవర్లలో భారత్ స్కోరు: 69-0షఫాలీ 48, స్మృతి 21 పరుగులతో ఉన్నారు.👉పవర్ ప్లేలో భారత్ స్కోరు: 57-0 (6 ఓవర్లు)షఫాలీ 19 బంతుల్లో 38 పరుగులతో జోరు మీదుండగా.. స్మృతి 17 బంతుల్లో 19 పరుగులు చేసింది.👉ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 56-0షఫాలీ 37, స్మృతి 19 పరుగులతో ఉన్నారు.👉నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు: 35-0షఫాలీ 18, స్మృతి 17 పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు👉మూడు ఓవర్లలో భారత్ స్కోరు: 29-0👉రెండు ఓవర్లలో భారత్ స్కోరు: 18-0తొలి ఓవర్లో ఐదు పరుగులేమిథాలి అయోధ్య పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్ తొలి ఓవర్లో ఐదు పరుగులే చేసింది. ఓపెనర్లలో స్మృతి మంధాన తొలి బంతికే ఫోర్ బాది ఖాతా తెరవగా.. షఫాలీ సున్నా పరుగులతో ఉంది.తుదిజట్టులో మార్పుటైటిల్ పోరు కోసం తమ తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు హర్మన్ టాస్ సందర్భంగా వెల్లడించింది. ప్రతికా రావల్కు విశ్రాంతినిచ్చామన్న హర్మన్.. యువ ప్లేయర్ కమలినిని ఆడిస్తున్నట్లు తెలిపింది. కాగా ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పటి వరకు ఏడుసార్లు చాంపియన్గా నిలిచింది. మరోవైపు.. గత ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా నిలిచిన శ్రీలంక.. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం చేయాలని భావిస్తోంది. అయితే, గత ఎడిషన్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని హర్మన్ సేన పట్టుదలగా ఉంది. దీంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది.తుదిజట్లుభారత మహిళల జట్టుస్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణలన్ కమిలిని, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమా రావత్, శ్రీచరణి, క్రాంతి గౌడ్, నందిని శర్మ.శ్రీలంక మహిళల జట్టుచమరి ఆటపట్టు (కెప్టెన్), ఇమేషా దులాని, విష్మి గుణరత్నె, హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశా దిల్హరి, నీలాక్షిక సిల్వ, కౌశిని నుత్యాంగన (వికెట్ కీపర్), సుగందిక కుమారి, చముడి ప్రబోద, మిథాలి అయోధ్య.చదవండి: అఫ్గాన్తో తొలి టీ20.. తుదిజట్టులో వైభవ్కు దక్కని చోటు
భారత బౌలర్ల విజృంభణ.. అఫ్గాన్ నామమాత్రపు స్కోరు
అఫ్గానిస్తాన్తో తొలి టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన అ ప్గాన్ భారత బౌలర్లు విజృంభించడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కాగా భారత్ వేదికగా అఫ్గాన్ బోర్డు.. టీమిండియాకు మూడు మ్యాచ్ల సిరీస్కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.UPDATES:ఇరవై ఓవర్లలో అఫ్గాన్ స్కోరు: 156-8ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) నిరాశపరిచాడు. మిగిలిన వారిలో సెదీకుల్లా అటల్ 13 పరుగులు చేయగా.. గుల్బదిన్ నైబ్ (2), డార్విష్ రసూలీ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు.అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (44 బంతుల్లో 64) చేయగా.. మహ్మద్ నబీ 33 పరుగులతో రాణించాడు. ఫలితంగా అఫ్గాన్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు.పదిహేను ఓవర్లలో అఫ్గాన్ స్కోరు: 104-5అజ్మతుల్లా 33, నబీ 26 పరుగులతో ఉన్నారు.సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి అఫ్గాన్ స్కోరు: 56-5 (10)అజ్మతుల్లా ఒమర్జాయ్ 10, నబీ 4 పరుగులతో ఉన్నారు. అంతకు ముందు ఏడో ఓవర్ ఆఖరి బంతికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో డార్విష్ రసూలీ (2) బౌల్డ్ అయి ఐదో వికెట్గా వెనుదిరిగాడు.పవర్ ప్లేలో అఫ్గాన్ స్కోరు: 41-4 (6 ఓవర్లు)ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ను జస్ప్రీత్ బుమ్రా డకౌట్ చేయగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) రనౌట్ అయ్యాడు. వన్డౌన్ బ్యాటర్ సెదీకుల్లా అటల్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. గుల్బదిన్ నైబ్ ఆరు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో నాలుగో వికెట్గా వెనుదిరిగాడు.టాస్ గెలిచిన టీమిండియా.. వైభవ్ ఆడటం లేదుఇక టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. ఢిల్లీ వికెట్ మీద తొలుత బౌలింగ్ చేస్తే అనుకూలంగా ఉంటుంది. జింబాబ్వే పర్యటనలో మాకెన్నో సానుకూల అంశాలు కనిపించాయి. ఇక్కడా అదే జోరు కొనసాగిస్తాం. అయితే, వైభవ్ సూర్యవంశీ ఆడటం లేదు’’ అని తెలిపాడు.తిరిగి వచ్చిన సంజూకాగా జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా వచ్చిన చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. ఈ సిరీస్లో భారత్ 3-0తో జింబాబ్వేను క్లీన్స్వీప్ చేయగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును వైభవ్ గెలుచుకున్నాడు. అయితే, అఫ్గాన్తో సిరీస్తో సంజూ తిరిగి రావడంతో వైభవ్కు తుదిజట్టులో చోటు కరువైంది. ఇదిలా ఉంటే.. గాయాల నుంచి కోలుకున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుదిజట్టులోకి వచ్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు మాత్రం ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు.తుదిజట్లుభారత్సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.అఫ్గానిస్తాన్ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదీకుల్లా అటల్, డార్విష్ రసూలి, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫారూకీ.చదవండి: పంత్వి పిల్లాడి చేష్టలు: సంజీవ్ గోయెంకా
న్యూస్ పాడ్కాస్ట్
ఇదేనా నిష్పాక్షిక, పారదర్శక నియామకం... మెగా డీఎస్సీ వ్యవహారంపై చంద్రబాబు బాధ్యత వహించాలి... వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
ప్రపంచ పరిపాలనకు రూల్స్ మనమే రూపొందించాలి.... బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
బిజినెస్
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ ఆక్షన్ సెషన్.. సెబీ కొత్త ప్రతిపాదనలు
స్టాక్ మార్కెట్లో ఇటీవల ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) కారణంగా ఎక్స్పైరీ రోజున డెరివేటివ్స్ సెటిల్మెంట్ ధరల నిర్ణయంపై తలెత్తిన ఆందోళనలకు పరిష్కారం చూపేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇండెక్స్, సింగిల్ స్టాక్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ఎక్స్పైరీ సెటిల్మెంట్ ధరను ఎలా నిర్ణయించాలన్న అంశంపై రెండు ప్రత్యామ్నాయాలను సూచించింది. ఈ ప్రతిపాదనలపై మార్కెట్ భాగస్వాములు అక్టోబర్ 3 వరకు తమ అభిప్రాయాలను సమర్పించవచ్చు.సీఏఎస్తో వచ్చిన మార్పులపై సమీక్షఈక్విటీ క్యాష్ మార్కెట్లో సీఏఎస్ను సెబీ గత ఆగస్టు 3 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. షేర్లకు మరింత పారదర్శకంగా క్లోజింగ్ ప్రైస్ నిర్ణయించడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఎక్స్పైరీ రోజుల్లో సీఏఎస్ సమయంలో ఇండెక్స్ ఆప్షన్స్లో భారీగా ట్రేడింగ్ జరగడం, ఇండెక్స్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు కనిపించడంతో డెరివేటివ్స్ సెటిల్మెంట్ ధరపై మార్కెట్ భాగస్వాములు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుత విధానాన్ని సమీక్షించనున్నట్లు సెబీ ఇటీవల ప్రకటించింది.రెండు సెటిల్మెంట్ విధానాలుబ్లెండెడ్ వీవ్యాప్: ఈ విధానంలో సాధారణ నిరంతర ట్రేడింగ్ సెషన్ (CTS) చివరి 30 నిమిషాల్లో జరిగిన లావాదేవీలతో పాటు, 10 నిమిషాల సీఏఎస్లో జరిగిన ట్రేడ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. రెండు సెషన్లలో జరిగిన వాస్తవ ట్రేడింగ్ వాల్యూమ్ ఆధారంగా వాటికి వెయిటేజీ ఇచ్చి సెటిల్మెంట్ ధరను నిర్ణయిస్తారు.సీటీఎస్ వీవ్యాప్: ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని కొనసాగించడం మరో ప్రత్యామ్నాయం. అంటే సాధారణ ట్రేడింగ్ సెషన్లో చివరి 30 నిమిషాల్లో జరిగిన లావాదేవీల వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ (VWAP) ఆధారంగానే డెరివేటివ్స్ ఎక్స్పైరీ సెటిల్మెంట్ ధరను నిర్ణయిస్తారు.ఏడాది పాటు ప్రస్తుత విధానమే?సీఏఎస్ కొత్త వ్యవస్థ కావడంతో మార్కెట్ పాల్గొనేవారికి దానిపై మరింత అవగాహన రావడానికి సమయం ఇవ్వాలని సెబీ భావిస్తోంది. అందువల్ల వెంటనే బ్లెండెడ్ వీవ్యాప్కు మారకుండా, కనీసం ఏడాది పాటు సీటీఎస్ వీవ్యాప్ను కొనసాగించి, ఆ తర్వాత సీఏఎస్లో లిక్విడిటీ, భాగస్వామ్యం, వివిధ మార్కెట్ పరిస్థితుల్లో వేలం పనితీరును సమీక్షించి బ్లెండెడ్ వీవ్యాప్కు మారే అవకాశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించింది.ఇండెక్స్ వ్యాల్యూ ప్రదర్శనకు బ్రేక్?సీఏఎస్ సమయంలో కనిపించే ఇండికేటివ్ ఇండెక్స్ వాల్యూ (IIV)పై కూడా సెబీ కీలక ప్రతిపాదన చేసింది. వేలంలో ఉన్న ఆర్డర్ల ఆధారంగా రూపొందే ఇండికేటివ్ ఈక్విలిబ్రియం ప్రైస్ (IEP) వాస్తవంగా జరిగిన ట్రేడ్ ధర కాదని, అందువల్ల దాని ఆధారంగా రూపొందే ఇండెక్స్ విలువను కూడా వాస్తవ మార్కెట్ స్థాయిగా భావించే అవకాశం ఉందని సెబీ పేర్కొంది.ఈ నేపథ్యంలో సీఏఎస్ సమయంలో ఐఈపీ ఆధారంగా రూపొందే ఇండికేటివ్ ఇండెక్స్ వాల్యూను ప్రదర్శించకుండా ఉండే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగత షేర్లకు సంబంధించిన ఐఈపీలను మాత్రం కొనసాగించాలని ప్రతిపాదించింది.మార్కెట్ టైమింగ్స్లోనూ మార్పుల ప్రతిపాదనసెటిల్మెంట్ విధానంతో పాటు సీటీఎస్, సీఏఎస్, డెరివేటివ్స్ ట్రేడింగ్ మధ్య సమయ సమన్వయాన్ని కూడా సెబీ పునఃపరిశీలిస్తోంది. ఇందులో రెండు టైమింగ్ ఆప్షన్లను ప్రతిపాదించింది. ఒకదానిలో సీఏఎస్కు ముందు సీటీఎస్ను 3:30 గంటల వరకు, ఎఫ్&వో ట్రేడింగ్ను 3:45 గంటల వరకు కొనసాగించే విధానం ఉంది. మరోదానిలో సీటీఎస్ను 3:15 గంటలకు, ఎఫ్&వోను 3:30 గంటలకు ముగించే అవకాశం ఉంది.అదేవిధంగా సీఏఎస్ ముగిసిన తర్వాత డెరివేటివ్స్ ట్రేడింగ్ వ్యవధిని ఐదు నిమిషాలకు పరిమితం చేయడం, సెషన్ల మధ్య మార్పు సమయాన్ని ఒక నిమిషానికి తగ్గించడం వంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. సీఏఎస్లో రిఫరెన్స్ ధరకు ±1 శాతానికి మించి ఉన్న లిమిట్ ఆర్డర్లను రద్దు చేయడంపై పరిమితులు, ధరను మెరుగుపరిచే దిశలో మాత్రమే మార్పులకు అనుమతి ఇవ్వడం వంటి చర్యలను కూడా సెబీ పరిశీలిస్తోంది.
బ్యాంకు సెలవులు.. మళ్లీ 4 రోజులు! ఎక్కడెక్కడంటే?
డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఎంత పెరిగినప్పటికీ బ్యాంకు శాఖకు వెళ్లి నగదు డిపాజిట్, చెక్ క్లియరెన్స్, పాస్బుక్ అప్డేట్ వంటి పనులు చేసుకునే ఖాతాదారులు ఇప్పటికీ చాలా మందే ఉంటారు. ఇలాంటివారు ముందుగా బ్యాంకు సెలవుల షెడ్యూల్ను తెలుసుకోవడం మంచిది. ఈ సెప్టెంబర్ 14 నుంచి 20 మధ్య దేశంలోని బ్యాంకులు నాలుగు రోజులు మూతపడనున్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలు, నగరాలకు ఒకే విధంగా వర్తించవు. స్థానిక పండుగలు, ప్రత్యేక సందర్భాలను బట్టి సెలవులు మారుతాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తదితర బ్యాంకుల శాఖలకు ఈ సెలవుల షెడ్యూల్ వర్తిస్తుంది. సెలవు ఉన్న ప్రాంతాల్లో బ్రాంచ్ ఆధారిత సేవలు అందుబాటులో ఉండవు. అయితే ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంలు, యూపీఐ ద్వారా సాధారణంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.ఏ తేదీన.. ఎక్కడ సెలవు?సెప్టెంబర్ 14, సోమవారం: గణేష్ చతుర్థి, గణేష్ పూజ, వరసిద్ధి వినాయక వ్రత, వినాయక చతుర్థి, వినాయకర్ చతుర్థి, హర్తాలిక తదితర పండుగల సందర్భంగా బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్పూర్, పనాజీ, విజయవాడ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.సెప్టెంబర్ 15, మంగళవారం: సంవత్సరి, నువాఖై, గణేష్ చతుర్థి రెండో రోజును పురస్కరించుకుని అహ్మదాబాద్, భువనేశ్వర్, పనాజీ నగరాల్లోని బ్యాంకు శాఖలకు సెలవు ఉంటుంది.సెప్టెంబర్ 18, శుక్రవారం: యూనిటేరియన్ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా షిల్లాంగ్లో బ్యాంకు శాఖలు పనిచేయవు.సెప్టెంబర్ 20, ఆదివారం: వారాంతపు సెలవు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసిఉంటాయి.అంటే సెప్టెంబర్ 14, 15, 18 తేదీల్లో ప్రాంతాల వారీగా బ్యాంకులకు సెలవులు ఉండగా.. సెప్టెంబర్ 20న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు పనిచేయవు.దేశంలో బ్యాంకుల సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించే సెలవుల క్యాలెండర్ ఆధారంగా నిర్ణయిస్తారు. స్థానిక పండుగలు, ప్రాంతీయ ఆచారాల కారణంగా రాష్ట్రాలు, నగరాల మధ్య సెలవుల్లో వ్యత్యాసం ఉంటుంది. జాతీయ సెలవు దినాల్లో మాత్రం దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసిఉంటాయి.ఇదీ చదవండి: UPI కొత్త ఫీచర్లు.. ఫోన్ డేటా లేకున్నా పేమెంట్!
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం, వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు (Today Gold Rate) స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
కొత్త బంగారంగా రాగి.. పెట్టుబడిదారుల చూపంతా దీనిపైనే!
విలువైన లోహాలు అంటే.. ముందుగా మనకు గుర్తొచ్చేది బంగారం, వెండి మాత్రమే. పెట్టుబడిదారులు కూడా చాలాకాలంగా వీటినే సురక్షితమైన పెట్టుబడి మార్గాలుగా చూస్తున్నారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి కొంత మారుతోంది. రాగి ధరలు భారీగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకోవడంతో.. కొందరు దీనిని కూడా కొత్త బంగారంగా అభివర్ణిస్తున్నారు.గత ఏడాది బంగారం ధర దాదాపు 70 శాతం, వెండి ధర ఏకంగా 150 శాతం వరకు పెరిగాయి. ఇదే సమయంలో అల్యూమినియం, పల్లాడియం, ప్లాటినమ్తో పాటు రాగి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.భారీగా పెరిగిన రాగి ధరలులండన్ మెటల్ ఎక్స్ఛేంజ్లో రాగి ధరలు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. ఒక దశలో మెట్రిక్ టన్ను రాగి ధర 14,737 డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.14 లక్షలకు సమానం. తవ్వకం, శుద్ధి సామర్థ్యాలకు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్కు మధ్య అంతరం పెరుగుతుండటంతో.. రాగి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.రాగి ధరలు పెరగడానికి అమెరికా సుంకాల ప్రభావం కూడా ఒక ముఖ్యమైన కారణం. శుద్ధి చేసిన రాగి దిగుమతులపై అమెరికా సుంకాలు పెంచే అవకాశం ఉందన్న వార్తలతో కొనుగోలుదారులు ముందుగానే పెద్ద మొత్తంలో రాగిని కొనుగోలు చేస్తున్నారు. 2026 తొలి అర్ధభాగంలో అమెరికా సుమారు 8.85 లక్షల టన్నుల రాగిని దిగుమతి చేసుకుంది. దీంతో ప్రపంచంలోని రాగి నిల్వల్లో గణనీయమైన భాగం అమెరికాకు తరలిపోయింది. ఫలితంగా లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్లో అందుబాటులో ఉన్న నిల్వలు తగ్గాయి. ఇది ధరలు పెరగడానికి కారణమైంది.ప్రధాన కారణాలుమార్కెట్లో రాగికి చాలాకాలంగా డిమాండ్ ఉంది. అయితే డిమాండుకు తగిన సరఫరా లేదు. ప్రపంచంలో ఉన్న పాత రాగి గనులు తమ ఉత్పత్తిని పెంచడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ప్రధాన రాగి ఉత్పత్తి దేశాల్లో కూడా ఉత్పత్తి, రవాణాకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి.రాగికి డిమాండ్ పెరగడానికి మరో ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్లు భారీగా నిర్మిస్తున్నారు. ఈ డేటా సెంటర్లలో విద్యుత్ వ్యవస్థలు, కేబుల్స్, నెట్వర్క్ పరికరాలు వంటి వాటిలో రాగిని విస్తృతంగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా.. సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన రంగాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థల విస్తరణ కూడా రాగికి డిమాండ్ను పెంచుతున్నాయి. అంటే.. భవిష్యత్తులో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాలు పెరిగే కొద్దీ రాగి అవసరం కూడా పెరిగే అవకాశం ఉంది.భారీ డిమాండ్ఈ ఏడాది ఇప్పటి వరకు రాగి ధరలు సుమారు 16 శాతం పెరిగాయి. ముఖ్యంగా.. ఇటీవల నమోదైన రికార్డు ధరలు మార్కెట్ విశ్లేషకుల అంచనాలను కూడా మించిపోయాయి. కొన్ని ప్రముఖ బ్రోకరేజీలు 2026లో రాగి ధరలు టన్నుకు 11,000-12,000 డాలర్ల స్థాయిలో ఉంటాయని అంచనా వేసినప్పటికీ, మార్కెట్ ధరలు ఇప్పటికే ఆ స్థాయిని దాటిపోయాయి. దీంతో రాగి మార్కెట్పై పెట్టుబడిదారుల ఆసక్తి మరింత పెరిగింది.
ఫ్యామిలీ
చిన్నారులు జంక్ ఫుడ్ తినకుండా..ఆ టీచర్ ట్రిక్ మాములుగా లేదు!
ఈ జనరేషన్ చిన్నారులు మాములుగా లేరు. జట్ స్పీడ్గా అర్థం చేసుకుంటున్నారు. చిన్నప్పుడే స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లనే చకచక వాడేస్తున్న జెన్జీ ఇది. అయితే అందుకు తగ్గట్టుగానే ఈకాలంలో మార్కెట్లోకి వస్తున్న ప్రతి జంక్ఫుడ్కి ఆకర్షితులై ఎంతలా లాగిస్తున్నారో తెలిసిందే. వద్దు నాన్న అవి మంచివి కావు అంటే..ఇక వాళ్లు పెట్టే అల్లరి మాములుగా ఉండదు. ఇక తట్టుకోలేక తల్లిదండ్రలు కొనిచ్చేస్తున్నారు. ఏదో అప్పడప్పుడే అంటూ ఇస్తుంటారు. అయితే అసలు అలాంటి అనారోగ్యకరమైన జంక్ఫుడ్కి వాళ్లే స్వయంగా నో చెప్పేలా చేస్తోంది ఈ టీచర్. ఆ ఉపాధ్యాయురాలు చేసిన పనికి ఆ స్కూల్ విద్యార్థులు వద్దంటూ ఏడుపు లంఖించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారడమే కాదు, జంక్ ఫుడ్ తికుండా ఉండేలా చేసేందుకు ఇంతల భయపెట్టడం సమంజసమేనా అనే ప్రశ్నలు లేవనెత్తినా..చాలామంది ఆ టీచర్ ట్రిక్కే మద్దతు పలకడం విశేషం.ఇంతకీ ఆమె ఏం చేసిదంటే..జంక్ ఫుడ్ వల్ల కలిగే ప్రమాదాల గురించి పిల్లలకు తెలియజేసేలా ముందుగా వాళ్లకు కొద్దిగా కూల్డ్రింక్ల, బిస్కెట్లు ఇస్తుంది. ఆ తర్వాత వాళ్లలో ఒకళ్లను పడుకోబెట్టి అవి తిన్నాక లోపల ఏం జరుగుతోందో తెలియజేలా నకిలీ అల్ట్రాసౌండ్ స్కాన్ని చూపిస్తుంది. వాటిని చూసి పిల్లలు భయపడటమే కాదు, తినమని అనడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. ముఖ్యంగా వాళ్ల ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆరోగ్యకరమై ఆహారం గురించి తరగతి గదిలో వివరించిన ఆ పాఠం వాళ్లు జంక్ఫుడ్ ఎంత అనారోగ్యకరమైనదో వివరించేలా క్లియర్గా చూపించారామె. ఇది పిల్లల్లో భయం రేకెత్తించిన చెడు ఆహారపు అలవాట్లకు బానికాకుండా చేసే బెస్ట్ ట్రిక్ అనే చెప్పొచ్చు. అయితే ఈ భయం వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఎలాంటి పర్యవసనాలు దారితీస్తుంది అని మానసిక నిపుణులు హెచ్చరించినా..నయానో, భయానో అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండేలా చేయడంలో ఎలాంటి తప్పు లేదని మరికొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.The intention may be good, but the method matters.A viral school clip shows a teacher using props and a fake ultrasound to scare children away from junk food.Teaching kids healthy eating is important. But fear, misinformation and shock tactics at such a tender age can leave a… pic.twitter.com/SgNgqRBgKj— Neetu Khandelwal (@T_Investor_) September 11, 2026 ఇదీ చదవండి: వారానికి 60 గంటలు పనిచేస్తూ..నెలకు రూ. 63 లక్షలు!
7 ‘అడుగుల’తో దాంపత్య బలం
విడివిడిగా వ్యాయామం చేసే యువ దంపతులతో పోలిస్తే కలిసి వ్యాయామం చేసే దంపతుల్లో దాంపత్య బంధం బలోపేతం అవుతోందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దంపతులు మాట్లాడుకొనే తీరు, వారి మధ్య తలెత్తే గొడవలు, వాటిని పరిష్కరించుకునే విధానంపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. పరిశోధకులు పరిశీలించిన దంపతుల్లో దాదాపు 60 శాతం మంది తాము క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నామని చెప్పగా... వారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే కలిసి వ్యాయామం చేస్తున్నారని తేలింది. కలిసి వ్యాయామం చేసే దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సమస్యలను సులభంగా పరిష్కరించుకోవడంతో వారి మధ్య మనస్పర్థలు తక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో దంపతులు కలిసి చేసిన వ్యాయామాల్లో నడక అన్నింటికంటే ఎక్కువగా కనిపించింది. దంపతులు కలిసి చురుగ్గా ఉండేందుకు నడక వ్యాయామం చాలా సులువైన, ఉపయుక్తమైన ఎక్సర్సైజ్ అని... ఇలా కలసి నడవడం వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని వెల్లడైంది. ఈ క్రమంలో దంపతులు తమ జీవిత భాగస్వామి తమ మాటలను ఎక్కువగా వింటున్నారని, తమకు అండగా నిలుస్తున్నారన్న భావన కలుగుతోందనీ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ఫ్యామిలీ రిలేషన్స్ అనే మెడికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. స్ట్రెంత్ ట్రైనింగ్తో అతివల గుండె పదిలంవారంలో కనీసం 2 గంటలపాటు బరువులు ఎత్తడం, తాళ్లను లాగడం వంటి స్ట్రెంత్ ట్రైనింగ్/రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజులతో మహిళల్లో గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఈ వ్యాయామాలన్నీ గుండెపోటు వచ్చే ముప్పును గణనీయంగా తగ్గించగలవని ఈ పరిశోధనలో తేలింది. æఎలాంటి వ్యాయామాలు చేయని మహిళలతో పోలిస్తే వారానికి కనీసం రెండు గంటలపాటు స్ట్రెంతెనింగ్/రెసిస్టెన్స్ ట్రైనింగ్ వ్యాయామాలు చేసే మహిళల్లో గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు 20 శాతం తక్కువగా, గుండెపోటు ముప్పు 44 శాతం తక్కువగా కనిపించిందని పరిశోధకులు గుర్తించారు. అలాగే రెండు గంటలకు మించి వ్యాయామాలు చేసే మహిళల్లో ప్రతి అదనపు గంట వ్యాయామం వల్ల గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు మరో 5 శాతం, గుండెపోటు ముప్పు 14 శాతం మేర తగ్గుతోందని కనుగొన్నారు. అయితే రెసిస్టెన్స్ ట్రైనింగ్ వ్యాయామాలు మాత్రమే చేసే వారిలో పక్షవాతం వచ్చే ముప్పు తగ్గినట్లు కనిపించలేదు. రెసిస్టెన్స్ ఎక్సర్సైజులతోపాటు ఏరోబిక్ వ్యాయామాలు కూడా కలిపి చేస్తే మాత్రం మరింత ప్రయోజనం కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలను జర్నల్ ఆఫ్ ద అమెరిన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అనే జర్నల్ ప్రచురించింది. 6 సూత్రాలతో మానసిక ఆరోగ్యం మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరు అంశాలు ఎంతో కీలకమని ఓ అంతర్జాతీయ అధ్యయనం పేర్కొంది. వాస్తవానికి మానసిక ఆరోగ్యానికి 19 ప్రధాన అంశాలను పరిశోధణనాలు గుర్తించగా వాటిలో ఆరు అంశాలకు 90 శాతానికిపైగా నిపుణుల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైంది. నేచర్ మెంటల్ హెల్త్ అనే జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం 26 దేశాలకు చెందిన 11 విభాగాల్లోని 122 మంది ప్రముఖ నిపుణులతో సర్వేలు నిర్వహించారు. అయితే ఆదాయం, శారీరక ఆరోగ్యం వంటి అంశాలు కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చని అధ్యయనంలో వెల్లడైంది. 1 జీవితానికి అర్థం–పరమార్థం, లక్ష్యం ఉండటం: మన జీవితం విలువైనది. దానికో అర్థం, పరమార్థం ఉన్నాయి. మనం ఏదో ఒక లక్ష్యం వైపు ముందుకు వెళ్తున్నామనే భావన ఉండటం అవసరం. 2 జీవితంపై సంతృప్తి: జీవితాన్ని మొత్తంగా చూసుకున్నప్పుడు ఒక రకమైన సంతప్త భావన కలిగి ఉండటం ముఖ్యం. 3 స్వీయ అంగీకారం: తనలోని మంచిని, లోపాలను అర్థం చేసుకొని, తనను తాను తప్పుబట్టుకోకుండా సానుకూలంగా చూసుకోవడం. 4 ఇతరులతో సత్సంబంధాలు: మనకు బాగా దగ్గరి వారితో శ్రద్ధ, ప్రేమ, సహకారం, పరస్పర అవగాహనతో కూడిన అర్థవంతమైన సానుకూల సంబంధాలను కొనసాగించడం.5 స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం: జీవితానికి సంబంధించిన నిర్ణయాలను స్వయంగా తీసుకొనే స్వేచ్ఛ ఉండటం, తన భావాలను నిజాయితీగా వ్యక్తపరచగలగడం.6 ఆనందం: రోజువారీ జీవితంలో సానుకూల భావోద్వేగాలను సంతోషంగా, ఆనందంగా, హాయిగా అనుభవించడం.
ఈ కాలానికి తగ్గ దేవుడు
మొన్న ఓల్డ్ బోయిన్పల్లి దగ్గర రోడ్డు పక్కన రెండు మూడు కిలోమీటర్ల పొడుగునా గణేష్ విగ్రహాలు కనిపించాయి. గణపతుల గణాలు భూమ్మీదకి దిగినట్టుగా ఉంది. అలా ఆ విగ్రహాల్ని చూస్తూ ముందుకుపోతుండగా అక్కడొకచోట ఒకాయన కనిపించాడు. ‘ఇదేమిటి! ఇక్కడ ఈ గ్రీకు పెద్దమనిషి కనిపిస్తున్నాడు’ అని కళ్ళు నులుముకుని చూసాను. సందేహం లేదు.. అతనే... పుస్తకాల్లో చూసిన ముఖమే. ఎపిక్టెటస్! ‘మనల్ని బాధపెట్టేది జరిగే సంఘటనలు కాదు, ఆ సంఘటనల గురించి మనం ఏమనుకుంటున్నామో అది’ అని చెప్పిన గొప్ప తత్త్వవేత్త. ఒకప్పుడు బానిసగా బతికిన రోజుల్లో, అతడి యజమాని ఒకసారి అతడి మీద కోపంతో అతడి కాలు విరిచేసాడు. అందుకని ఇప్పుడు ఆ కాలున్నవైపు కొద్దిగా వాలి ఉన్నాడు. కానీ మార్కస్ అరీలియస్ లాంటి చక్రవర్తికే దారి చూపించిన వాడు. ‘మీరేమిటిక్కడ?’ అనడిగి, ‘నాకింకా నమ్మశక్యం కాకుండా ఉంది. లేకపోతే ఒకటో శతాబ్దపు రోమ్ ఎక్కడ? ఈ పాత బోయిన్పల్లి ఎక్కడ?’ అన్నాను. ‘నువ్వేకదా నన్ను తలుచుకుంటూ ఉన్నది’ అన్నాడు ఎపిక్టెటస్ నా వైపు చూపు తిప్పకుండానే. ఆయన ఆ గణేష్ మూర్తుల్నే కళ్ళప్పగించి చూస్తున్నాడు. అప్పుడు తట్టింది, అప్పటికి రెండు మూడు రోజులుగా నేను ఆయన పుస్తకాలే చదువుతున్నానని. ‘అంటే మీరు ఎవరు తలుచుకుంటే వాళ్ళ దగ్గర ప్రత్యక్షమవుతారా?’ అనడిగాను.‘అవును. నిన్ననే, పుణేలో ఎవరో పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద పాఠాలు చెప్తూ నా మాటలు పదే పదే చెప్తూ ఉంటే అక్కడికి పోక తప్పింది కాదు’ అని అంటూ ‘ఈయనేమిటి? ఇలా ఉన్నాడు... ఏథెన్సులోనూ, రోములోనూ నేనిలాంటి శిల్పాలు ఎప్పుడూ చూడలేదు’ అని అన్నాడు ఆశ్చర్యపోతూ. ‘ఈయన వినాయకుడు, విఘ్నాధిపతి. మావాళ్ళు చెప్పేదేమంటే ఆయన మొదట్లో రైతుల దేవుడని, ప్రకృతి దేవుడని, పర్యావరణానికి దేవుడని. ఆ చెవులు చేటలు, ఆ బొజ్జ సుభిక్షానికి గుర్తు, ఆ ఎలుక రైతుల విరోధి కదా, అందుకని లొంగదీసుకున్నాడంటారు..’ అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఎపిక్టెటస్ నా వైపు తిరిగి నన్ను పరిశీలనగా చూసాడు.‘కాదు కాదు... నువ్వు ఆ అవయవాల్ని వర్ణిస్తున్నావు. అవి అలా ఎందుకున్నాయో వివరిస్తున్నావు. నేను ఆలోచిస్తున్నది అది కాదు. నిన్న ట్రయినింగ్ క్లాసులో అంతా పిల్లలు... వాళ్ళ మాటలే ఇంకా నా చెవుల్లో వినబడుతున్నాయి. అందులో ఒకమ్మాయి ఆ ఫాకల్టీని అడుగుతోంది... నన్నంతా లావుగా ఉన్నావు, లావుగా ఉన్నావు అంటున్నారు, డైటింగ్ చెయ్యాలంటారు, యోగా చెయ్యాలంటారు... నాకు చాలా ఆందోళనగా ఉంది. నేనేం చెయ్యాలో చెప్పండి అని. కానీ, చూడు మిత్రమా.. బాడీ షేమింగ్ని పూర్తిగా జయించినవాడు ఇలా ఉంటాడు. ఎంత అన్ అ΄లొజిటిక్గా ఉన్నాడు. అచ్చం మా సోక్రటీసులాగా ఉన్నాడు. లోకం పెట్టుకునే ఏ కొలతలకీ లొంగిపోకుండా తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉన్నాడు. తను తనుగా. అలా ఉండాలంటే ముందు కావలసింది అటువంటి ఆత్మనిశ్చయత, అటువంటి ఆత్మనిర్భరత. ముందు నిన్ను నువ్వు అంగీకరిస్తే అప్పుడు తక్కిన లోకమంతా నిన్ను గౌరవించి తీరుతుంది. అవునూ, ఆ దంతమెందుకు విరిగిపోయింది?’ అనడిగాడు.‘అదా.. వ్యాసుడు భారతం చెప్తూ ఉంటే ఈయన రాయడానికి కూర్చున్నాడు. మధ్యలో గంటం విరిగి΄ోయింది. కాని రాత ఆపకూడదని నియమం. అందుకని తన దంతం తనే విరుచుకుని దాంతో రాయడం మొదలుపెట్టాడంటారు’ అన్నాను. ‘ఆహా! ఆ వ్యక్తిత్వం నేనూహించినట్టే ఉంది. అలాంటి వాళ్ళు ఒక పనికి పూనుకున్నారనుకో. వెనక్కి తగ్గరు. దేనికైనా సిద్ధపడతారు. తమ ఆత్మలోంచి కొంత ధారపోసి అయినా సరే ముందుకు నడుస్తారు. మనకి చూడటానికి వాళ్ళు గాయపడ్డారనిపిస్తుంది. కాని గాయాన్ని గేయంగా మార్చుకుంటారు. అందం కాదు, ఆర్భాటం కాదు, పదిమందీ ఏమనుకుంటారన్న ఆత్రుత కాదు, అన్నిటికన్నా ముందు తాము ఒప్పుకున్న పని ఆగిపోకుండా ముందుకు నడిచిందా లేదా. అంతే. అదే వాళ్ళకి నిజమైన అలంకారం’ అని అన్నాడు వెలుగు చిమ్ముతున్న చూపుల్తో. ‘అలా అయితే ఆ ఎలక సంగతేమిటి?’ అనడిగాను. ‘ఇందాకా నువ్వు ఈయన్ని రైతుల దేవుడని చెప్పావు. ఒక్క రైతులకే ఎందుకు? ఈయన మనుషులందరికీ దేవుడని ఆ ఒక్క ఎలకని బట్టి చెప్పొచ్చు. ఎలక చూడు. ఎంత రెస్ట్లెస్గా ఉంటుంది! నిలకడ లేని జీవి. ఊరికే పరుగెట్టుకుంటూపోతుంది. కాని ఆయన దాన్ని వాహనంగా మార్చుకున్నాడు. అంత పెద్ద శరీరం, అంత చిన్న వాహనం. ఎవరేనా తమ యాంగ్జయిటీని అదుపు చేసుకోగలిగితే అలానే ఉంటుంది, చిన్న ఎలక మీద ఏనుగు వూరేగినట్టు. అద్భుతం కదా’ అని అన్నాడు.‘మరి ఆ చెవుల సంగతేమిటి?’ అనడిగాను. ఈలోపు ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుంది. ఒకటే హారన్లు. ఎపిక్టెటస్ ఆ ట్రాఫిక్ కేసి చూసాడు. ‘ఇప్పుడు కాదులే, మరోసారి మాట్లాడుకుందాం, ఇప్పటికైతే ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈయన సరిగ్గా ఇప్పటి కాలానికి తగ్గ దేవుడు. ట్రూ పర్సనాలిటీ కోచ్. అన్నిటికన్నా ముందు మనం ఎలా బతకాలో చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావన్న దానికి ఎవరికీ సంజాయిషీలిచ్చుకోనక్కర్లేదు. నిన్ను నువ్వు అంగీకరించు. ఎవరు ఏం చెప్పినా చెవులు చాటంత చేసుకుని విను. కానీ ఊరికే ఆందోళన పడిపోకు. నువ్వెలా బతకాలో నీ స్క్రిప్టు నువ్వే రాసుకో. అవసరమైతే నీలో ఒక భాగాన్ని తుంచెయ్యవలసి వస్తే తుంచెయ్యి. ఒక్క భాగమేమిటి? నీకు అప్పగించిన పనికి అవసరమైతే నిన్ను నువ్వే మూల్యంగా చెల్లించుకోడానికి సిద్ధపడు. గుర్తుపెట్టుకో నువ్వు ఏం చెయ్యాలనుకున్నా ముందు నీకు నువ్వే ఒక పెద్ద అడ్డంకి. నిన్ను నువ్వు జయించుకున్నావా! నీకు తిరుగులేదు’ అని అంటూ వడివడిగా నడుచుకుంటూ ఆ జన సందోహంలో కలిసి΄ోయాడు, ఆ మహాతత్త్వవేత్త ఎపిక్టెటస్.వాడ్రేవు చిన వీరభద్రుడు చదవండి: ఘనమైన ఆసనం
ఘనమైన ఆసనం
గణేష్ వేడుకలలో ప్రధానంగా కనిపించేది అలంకరణ. గణనాథుడి ప్రతిమతోపాటు ఆసనం, బ్యాక్గ్రౌండ్, చుట్టూ రంగురంగుల పువ్వులు, కాంతులీనే లైట్లు... కనువిందు చేస్తుంటాయి. మండపాల వద్ద సరే, ఇళ్లలోనూ ఈ విధమైన అలంకరణ సందడి కనిపించాలంటే..?ఎక్కువ హంగామా లేకుండా అలంకరణ ఆకట్టుకునేలా ఉండేలా భిన్నమైన ఆసనాల స్టాండ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఈవెంట్ ప్లానర్స్ వీటిని మరింత అందంగా రూపుకట్టి మన ముందుకు తీసుకు వస్తున్నారు. ముత్యాలు, రత్నాలు, జరీ, వెల్వెట్, మిర్రర్ వర్క్ వంటి వాటితో రూపొందించే ఈ ఆసనాలు చిన్న వినాయక విగ్రహాలకు చక్కగా అమరుతున్నాయి. ముఖ్యంగా తక్కువ స్థలంలో పూజ చేసుకునే వారికి ఇవి ఉపయుక్తం కూడా. అందమైన పువ్వులు... ఆర్టిఫిషియల్ రోజాలు, మల్లెలు, చామంతులు, పచ్చని ఆకులతో తయారు చేసిన ఆసనం వినాయకుడి చుట్టూ పూల వేదికలా కనిపిస్తుంది. పండుగ తర్వాత ఈ ఆసనం సెట్ను స్టోర్ చేసుకుంటే ఇతర పూజ లు లేదా ఇంటి అలంకరణ ల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ ఆసనాలు కానుక గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి.స్థలానికి తగ్గట్టు ... ఫ్లాట్లు, అపార్ట్మెంట్లలో స్థలం పరిమితంగా ఉంటుంది. అందుకు తగినట్టు అలంకరణ చేయాలన్నా అందరికీ కుదరదు. అందుకని, చిన్న సైజు ఆసనాలు మార్కెట్లోకి వచ్చాయి. టేబుల్, షెల్ఫ్ లేదా చిన్న పూజా స్థలంలో కూడా వీటిని సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.సంప్రదాయం.. ఆధునికత... గోల్డ్ లేదా కాపర్ ఫినిష్తో ఉండే ఆర్టిఫిషియల్ ఆసనాలు గణేషుడి ప్రతిమకు రాజసాన్ని జోడిస్తాయి. మరోవైపు వుడ్, జూట్, పేస్టెల్ పూలతో రూపొందించిన ఆసనాలు మినిమల్ హోమ్ డెకార్ను ఇష్టపడేవారికి నచ్చుతాయి. అయితే ఆసనం ఎంచుకునేటప్పుడు విగ్రహం పరిమాణానికి తగిన సైజు ఉండేలా చూసుకోవాలి. ప్రతిమ ఎంత అందంగా ఉన్నా, దానికి తగిన ఆసనం ఆ అలంకరణకు మరింత ప్రత్యేకతను, ఇంటికి స్పెషల్ లుక్ తీసుకొస్తుంది.సులభంగా అలంకరణ కృష్ణాష్టమి, గణేష్ చతుర్ధి, వరలక్ష్మి.. వంటి సంప్రదాయ వేడుకలలో ప్రతిమలకు ఈ డెకార్ ఆసనాలు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి పూర్తిగా చేతితో తయారు చేసినవి. సులభంగా అమర్చుకోవచ్చు, విడదీసి స్టోర్ చేసుకోవచ్చు. పండగ శోభ కోసం తయారు చేసిన ఈ అలంకరణలలో పూసలు, లేసులు, కుందన్స్, మఖమల్ క్లాత్తోపాటు ఖరీదైన స్టోన్స్ కూడా ఉపయోగించి డిజైన్ చేస్తున్నాం. – లక్ష్మి సింగ్లా, డెకార్ క్రియేషన్స్ – నిర్మలారెడ్డిచదవండి: చింతలు దూరం చేసే.. ఉత్తరాల గణపయ్య!
అంతర్జాతీయం
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై విమర్శలు
జెరూసలేం: ఇజ్రాయెల్లో ప్రధాని కార్యాలయ ఖర్చులకు సంబంధించి తాజాగా వెలువడిన అధికారిక సమాచారం తీవ్ర చర్చనీయాంశమైంది. 2019 నుంచి ఆగస్టు 2026 వరకు దేశ ప్రధానుల హెయిర్ స్టైలింగ్, మేకప్, అధికారిక ప్రాతినిధ్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం సుమారు 470,000వేల డాలర్లు( భారత కరెన్సీలో దాదాపు రూ. 4.49 కోట్లు) ఖర్చు చేసినట్లు వెల్లడైంది.సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడంతో ప్రధాని కార్యాలయం ఈ వివరాలను బహిర్గతం చేసింది.ఈ ఖర్చుల్లో దాదాపు 90 శాతం కేవలం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహుల హెయిర్ స్టైలింగ్, మేకప్లకే ఖర్చయినట్లు తేలింది.ఇదీ చదవండి : బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయంఇజ్రాయెల్ - హమాస్ మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న కాలంలోనూ (సెప్టెంబర్ - నవంబర్ 2023 మధ్య) ప్రధాని హెయిర్ స్టైలింగ్ కోసం సుమారు రూ. 2 లక్షలు వెచ్చించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కేవలం దేశంలోనే కాకుండా విదేశీ పర్యటనల సమయంలోనూ ఈ సౌకర్యాల కోసం భారీగా ఖర్చు పెట్టారు.ఫిబ్రవరి 2025లో వాషింగ్టన్కు వెళ్లిన సమయంలో హెయిర్, మేకప్ నిమిత్తం సుమారు 13,500 డాలర్లు (భారత కరెన్సీలో రూ.12.9లక్షలు) ఖర్చయినట్లు డేటా ద్వారా తెలిసింది. ఈ ఖర్చులు వివిధ సంవత్సరాల్లో మారుతూ వచ్చాయి. ఇజ్రాయెల్ మాజీ ప్రధానులు నఫ్తాలీ బెనెట్, యైర్ లాపిడ్ తదితరులు ఆ పదవిలో ఉన్నకాలంతో పోలిస్తే, బెంజమిన్ నెతన్యాహు హయాంలో ఈ వ్యయం గణనీయంగా ఉన్నట్లు వెల్లడైంది. అత్యధికంగా 2025 సంవత్సరంలో సుమారు రూ.1.06 కోట్లు ఖర్చయినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, భద్రతా కారణాలను చూపుతూ హెయిర్ స్టైలిస్టులు,మేకప్ ఆర్టిస్టుల పేర్లను వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. ప్రభుత్వ నిధుల దుబారాపై పౌర హక్కుల సంఘాలు,విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. מידע שקיבלנו: הוצאות האיפור והשיער של ראשי הממשלה בישראל משנת 2019. 🔹 הן הסתכמו ב-1.43 מיליון שקל - 90% מהן היו של בני הזוג נתניהו.🔹 הוצאות סידור השיער לנתניהו בתחילת המלחמה, באוקטובר 2023, היו 2,457 שקל.🔹 ההוצאה הגבוהה ביותר: 13.5 אלף דולר בביקור של 4 ימים בארצות הברית.… pic.twitter.com/SIi8X8qgMw— התנועה לחופש המידע (@shakoof) September 10, 2026
విధి ఆడిన వింత.. భారత్లో బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్!
ఇద్దరూ భారత్లోనే పుట్టారు.. వేర్వేరు కుటుంబాలకు దత్తత వెళ్లారు.. కట్ చేస్తే.. నెదర్లాండ్స్లో ఒకరికొకరు దగ్గర్లోనే పెరిగారు. టీనేజ్లో తొలిసారి కలిసినప్పుడు ఇద్దరి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. ఒకే ముక్కు.. ఒకే నవ్వు.. ఒకే రకమైన హావభావాలు. అందుకే అప్పట్లోనే ఒకరినొకరు సరదాగా ‘సిస్టర్’ అని పిలుచుకునేవారు. కానీ వాళ్లు నిజంగానే అక్కాచెల్లెళ్లని మాత్రం దాదాపు 30 ఏళ్ల వరకు ఎవరికీ తెలియదు. చివరకు ఓ డీఎన్ఏ టెస్ట్ వాళ్ల జీవితాలనే మార్చేసింది.ముంబైలోని వేర్వేరు అనాథాశ్రమాల నుంచి 1980ల ప్రారంభంలో కొన్ని నెలల వ్యవధిలో మీనా గెల్టింక్, మినాల్ టిజ్సెన్ వేర్వేరు డచ్ కుటుంబాలకు దత్తత వెళ్లారు. ఇద్దరూ నెదర్లాండ్స్లో ఒకరికొకరు సమీపంలో పెరిగారు. టీనేజ్లో దత్తత పిల్లల కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో తొలిసారి కలుసుకున్నారు. అప్పుడు వారి స్నేహితులే ఇద్దరి పోలికలను గుర్తించారు. అద్దంలో చూసుకుంటే ఒకేలా కనిపిస్తున్నారని చెప్పడంతో మీనా ఆశ్చర్యపోయింది. ఒకే ముక్కు, ఒకే నవ్వు ఉండటాన్ని గమనించింది.ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. స్కూల్, స్నేహితులు, ప్రేమ, డ్యాన్స్, క్రీడలు, సంగీతం.. ఇలా ఎన్నో విషయాలను ఒకరికొకరు లేఖల ద్వారా పంచుకునేవారు. ఇద్దరికీ బ్యాక్స్ట్రీట్ బాయ్స్ అంటే ఇష్టమని కూడా తెలుసుకున్నారు. రక్తసంబంధం ఉందన్న చిన్న అనుమానం కూడా లేకపోయినా.. ఒకరినొకరు ‘సిస్టర్’ అని పిలుచుకునేవారు. అయితే సుమారు 15 ఏళ్ల క్రితం ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయింది. మినాల్ ఫ్రాన్స్కు వెళ్లగా.. మీనా తన మొదటి బిడ్డకు తల్లి కావడంతో కుటుంబ బాధ్యతల్లో బిజీ అయిపోయింది.డీఎన్ఏ టెస్ట్.. ఇంతలో 2017లో మీనా భారత్ నుంచి దత్తత తీసుకున్నవారి సమావేశానికి హాజరైనప్పుడు డీఎన్ఏ టెస్టింగ్ గురించి తెలుసుకుని పరీక్ష చేయించుకుంది. కానీ ఎలాంటి సరిపోలిక కనిపించలేదు. ఈ ఏడాది ఫోన్ స్టోరేజ్ సమస్యతో ఆమె ఆ యాప్ను కూడా డిలీట్ చేసింది. ఇంతలో మే 20న మినాల్ ఫేస్బుక్లో మీనాకు మెసేజ్ చేసింది. తాను ఏప్రిల్లో డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నానని, ఫలితాల స్క్రీన్ షాట్ను పంపింది. మీనాకు మొదట నమ్మశక్యం కాలేదు. యాప్ను మళ్లీ ఇన్స్టాల్ చేసి ఫలితాలను చూసిన ఆమెకు షాక్ తగిలింది. ఇద్దరి డీఎన్ఏ 100 శాతం మ్యాచ్ అయింది. వారు కేవలం చిన్ననాటి స్నేహితులు కాదు.. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పూర్తి సోదరీమణులని తేలింది.మినాల్కు కూడా తొలుత తన డీఎన్ఏ మ్యాచ్ ఎవరిదో అర్థం కాలేదు. సోషల్ మీడియాలో పాత ఫొటోలు చూసిన తర్వాత విషయం తెలిసింది. చిన్నప్పుడు తనను ఆప్యాయంగా పట్టుకున్న అదే అమ్మాయి మీనా అని గుర్తించింది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఏర్పడిన స్నేహం వెనుక ఇంత పెద్ద రక్తసంబంధం ఉందని తెలుసుకుని ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. ఆగస్టులో మళ్లీ కలుసుకున్న ఇద్దరూ కన్నీళ్లు, నవ్వులు, కౌగిలింతల మధ్య తమ అనుబంధాన్ని జరుపుకున్నారు. ఇప్పుడు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఒకరి కుటుంబాలను మరొకరు కలుసుకున్నారు. ఇద్దరి మాట తీరు, నడక, హావభావాలు ఇప్పటికీ ఒకేలా ఉన్నాయని కుటుంబ సభ్యులు గుర్తిస్తున్నారు.ముంబై కోరిక.. తమ జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో ఒకరి అవసరం మరొకరికి ఉందని మీనా చెబుతోంది. తండ్రిని కోల్పోయినప్పుడు, జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు సోదరి తన పక్కన ఉంటే బాగుండేదని భావోద్వేగానికి గురైంది. ఇప్పుడు ఇద్దరి కోరిక ఒక్కటే.. తమ బంధం మొదలైన ముంబైకి కలిసి వెళ్లి, తాము పుట్టిన నేలను మరోసారి చూడాలని కోరుకుంటున్నారు. దాదాపు 30 ఏళ్లుగా ‘సిస్టర్’ అని పిలుచుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు డీఎన్ఏ ద్వారా తాము నిజంగానే సోదరీమణులమని తెలుసుకున్న ఈ కథ నిజజీవితంలో జరిగిన ఓ సినిమా ట్విస్ట్ను తలపిస్తోంది.Çocukluk arkadaşları, yıllar sonra yaptırdıkları DNA testiyle aslında kardeş olduklarını öğrendi! 👯♀️💞📌 Bebekken Hindistan'daki yetimhanelere bırakılan ve farklı Hollandalı aileler tarafından evlat edinilen Meena Geltink ile Minal Tijssen, ilk kez 1996 yılında evlat edinilmiş… pic.twitter.com/NyMrp7DBu0— Mynet (@mynet) August 17, 2026Video Credit: Mynet.
New York: క్రిస్మస్ చెట్లతో తీరానికి రక్షణ
న్యూయార్క్: క్రిస్మస్ వేడుకల అనంతరం నిరుపయోగంగా మారిన క్రిస్మస్ చెట్లను వినూత్నంగా పునర్వినియోగించారు. 2024లో న్యూయార్క్లోని జమైకా బే వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో 250 క్రిస్మస్ చెట్లను దాదాపు 600 అడుగుల పొడవైన సహజ రక్షణ కట్టలుగా (బ్రేక్వాటర్స్) మార్చారు. పునరుద్ధరిస్తున్న ఉప్పునీటి చిత్తడి నేల (సాల్ట్ మార్ష్)లో కొత్తగా నాటిన వృక్షసంపదను అలలు, తీర కోత నుంచి కాపాడేందుకు వీటిని వినియోగించినట్లు జమైకా బే-రాక్వే పార్క్స్ కన్జర్వెన్సీ 2024 వెట్ల్యాండ్స్ ఫెలోషిప్ నివేదిక తెలిపింది.ఈ రక్షణ కట్టల వెనుక గణనీయంగా మట్టి, ఇసుక వంటి అవక్షేపాలు (సెడిమెంట్) పేరుకుపోయాయి. దీంతో కొన్ని కట్టలు అభివృద్ధి చెందుతున్న చిత్తడి నేలలో పాక్షికంగా కూరుకుపోయినట్లు సంస్థ వెల్లడించింది. ఈ చెట్లను జమైకా బే వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోని వెస్ట్ పాండ్ లివింగ్ షోర్లైన్ ప్రాజెక్టులో ఉపయోగించారు. 2012లో సూపర్స్టార్మ్ శాండీ కారణంగా మంచినీటి చెరువులోకి సముద్రపు నీరు ప్రవేశించడంతో అక్కడి పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. గతంలో మంచినీటి జీవావరణానికి అనుకూలంగా ఉన్న ప్రాంతంలో ఉప్పునీరు చేరింది.2021లో పూర్తయిన పునరుద్ధరణ పనుల్లో సుమారు 2,400 అడుగుల తీరప్రాంతాన్ని పునర్నిర్మించి, తొమ్మిది ఎకరాలకు పైగా కొత్త ఆవాసాన్ని అభివృద్ధి చేశారు. అయితే కొత్తగా పెరుగుతున్న మొక్కలకు అలలు, తీర కోత, మారుతున్న అవక్షేపాల వల్ల ముప్పు ఏర్పడింది. దీంతో క్రిస్మస్ చెట్లను ‘ఫాసిన్స్’గా పిలిచే నిర్మాణాలుగా కట్టి, బలహీనమైన తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కాంక్రీటు గోడల మాదిరిగా కాకుండా ఇవి అలల వేగాన్ని తగ్గించి, కోతను నియంత్రిస్తూ నీటితో కొట్టుకొచ్చే అవక్షేపాలు అక్కడే పేరుకుపోయేలా చేస్తాయి. కాలక్రమంలో చిత్తడి నేల మరింత బలపడటమే లక్ష్యంగా ఇది సాగింది.ఈ పద్ధతిలో ఉపయోగించిన చెట్లు జీవఅవక్షేపనీయమైనవి కావడంతో శాశ్వత నిర్మాణాలుగా కాకుండా క్రమంగా ప్రకృతి వ్యవస్థలో కలిసిపోతాయి. గతంలోనూ ఈ ప్రాజెక్టులో క్రిస్మస్ చెట్లతోపాటు గుల్లలతో చేసిన ఆయిస్టర్ షెల్ బ్రేక్వాటర్స్, కొయిర్ లాగ్స్ వంటి సహజ రక్షణ పద్ధతులను ఉపయోగించారు. నీటి ప్రవాహాన్ని తగ్గించడం ద్వారా చెట్లు అవక్షేపాలు పేరుకునేలా చేస్తాయి. వాటిపై పెరిగే మార్ష్ మొక్కల వేర్లు ఆ అవక్షేపాలను స్థిరంగా ఉంచి తీరాన్ని క్రమంగా బలోపేతం చేస్తాయి. ఇలా సాధారణ వ్యర్థంగా భావించిన 250 క్రిస్మస్ చెట్లు న్యూయార్క్ తీర రక్షణలో భాగమయ్యాయి. ఇదీ చదవండి: రాహుల్, ప్రియాంకతో మలేసియా ప్రధాని భేటీ
240 మందితో వెళ్తున్న నౌక గల్లంతు.. అసలేమైంది?
ఇండోనేషియాలోని జావా సముద్రంలో 240 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతు కావడంతో కలకలం రేగుతోంది. నౌకతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ప్రయాణికుల నౌక (‘విర్గో ట్రాన్స్పోర్ట్ 8) తూర్పు జావా ప్రావిన్స్లోని సురబయ నుంచి బోర్నియో దీవిలోని దక్షిణ కాలిమంతాన్ ప్రావిన్స్ రాజధాని బంజర్మసిన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.బంజర్మసిన్ సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యాలయానికి నౌకలో కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయడం లేదన్న సమాచారం అందింది. నౌక చివరిసారిగా బంజర్మసిన్లోని ఓ రేవుకు సుమారు 148 కిలోమీటర్లు (92 మైళ్లు) దూరంలో జావా సముద్ర జలాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. నౌక కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.బంజర్మసిన్ రెస్క్యూ ఏజెన్సీ ఆపరేషన్స్ చీఫ్ అరియాంటో అర్డీ నౌకతో సంబంధాలు తెగిపోయిన విషయాన్ని ధృవీకరించారు. సహాయక చర్యల కోసం ట్రిసక్తి ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నౌక యాజమాన్యం అందించిన సమాచారం ప్రకారం, ప్రయాణ సమయంలో నౌక ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే నౌకకు ప్రస్తుతం ఏమైందన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.ఇదీ చదవండి: లాడెన్ హిట్లిస్ట్లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు
జాతీయం
శాకాహారం మంట!
న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాధినేతలతోపాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్దసంఖ్యలో దౌత్యాధికారులకు ప్రధాని మోదీ శనివారం ఇచ్చిన విందులో కేవలం శాకాహార భోజనం వడ్డించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసహనం వ్యక్తంచేశారు. అత్యధికశాతం భారతీయులు మాంసాహారులని తెల్సి కూడా మోదీ సర్కార్ కేవలం శాకాహారం వడ్డించడంలో ఆంతర్యమేంటని ఆయన నిలదీశారు. ఈమేరకు రాహుల్ ఆదివారం ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘గణాంకాలను మీకు గుర్తుచేస్తున్నా. 80 శాతం మంది భారతీయులు మాంసాహారులే. మరీ ముఖ్యంగా భారతీయ మాంసాహార వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. నా చెల్లి చేసిన శాకాహార చిరుతిండి ఛోలే భటూరేలా మాంసాహారం ఎంతో పసందుగా ఉంటుంది. అలాంటప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ సంబంధిత విందులో మాంసాహారాన్ని విస్మరించాల్సిన అవసరం ఏమొచ్చింది? ’’అని రాహుల్ మోదీ సర్కార్కు సూటి ప్రశ్న వేశారు. పోస్ట్తోపాటు తన సోదరి చేసిన చిరుతిండి ఫొటోను పోస్ట్చేశారు. నచ్చిన ఆహారం వడ్డించరా?: కాంగ్రెస్ భారత్తోపాటు విదేశాల్లోనూ మాంసాహార ప్రియులే అత్యధికమని, అలాంటి బ్రిక్స్ దేశాల నుంచి వచ్చిన విదేశీ అతిథులకు శాకాహారం బలవంతంగా వడ్డించాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టింది. ‘‘బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యత దృష్ట్యా ప్రపంచదేశాల అతిథులు ఈ కార్యక్రమానికి వచ్చి విందు ఆరగించారు. వీళ్లు ఏ ఆహారం తినాలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయిస్తుందా? ఇప్పటికే భారతీయులు ఏం తినాలో బీజేపీ ఆదేశిస్తోంది. ఇక విదేశీయులకు శాకాహారాన్ని బలవంతంగా తినిపించడం ఎంతవరకు సబబు?’’అని కాంగ్రెస్ మీడియా విభాగ చీఫ్ పవన్ ఖేడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చవులూరించే ఎంతో మాంసాహార వంటకాలకు భారత్ పెట్టిందిపేరు. వాటిని విదేశీ అతిథులు రుచి చూడకుండా చేసి భారతీయ ఆహార సంప్రదాయాలను దాచాలని చూస్తారా?’’అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విందు మెనూను పోస్ట్చేసింది. సక్సెస్ను కాంగ్రెస్ సహించట్లేదు: బీజేపీ సదస్సు విజయవంతంకావడంతో కాంగ్రెస్ సహించట్లేదని, అందుకే అర్థంపర్థంలేకుండా ఆహారం గురించి విమర్శలుచేస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ‘‘సదస్సు గురించి వంకలుపెట్టడానికి ఏమీ లేదు. డిక్లరేషన్లో ఏకాభిప్రాయం సాధించి మోదీ సర్కార్ తన దక్షతను చాటింది. సదస్సు ఇలా విజయవంతంకావడం కాంగ్రెస్ సహించలేకపోతోంది. అందుకే విమర్శించడానికి మరే విషయాలు లేక చివరకు ఆహారం గురించి విమర్శలు చేస్తోంది’’అని భండారీ అన్నారు. ‘‘డిక్లరేషన్తో విజయం సాధించిన మోదీని రాహుల్ అభినందించాల్సిందిపోయి ఈ శాకాహారం, మాంసాహారం గోల ఏంటి?’’అని మరో బీజేపీ జాతీయ ప్రతినిధి తుహిన్ సిన్హా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పోస్ట్ చేసిన మెనూ (అన్నీ శాకాహారాలే) స్టార్టర్స్.. 1. ఖండ్వీ మిలే–ఫియులే(శనగపిండితో ఆవిరిపై ఉడికించి పలుచగా చేసిన రోల్స్) 2. మష్రూమ్ కబాబ్లు, షీర్మాల్ రొట్టెతో కలిపి ఖుంబ్ గలౌతీ మెయిన్ కోర్స్ 1. పనీర్ లబాబ్దార్ 2. హిమాలయాల్లో లభించే అరుదైన మోరెల్ మష్రూమ్లు, ఆస్పరాగస్, కుంకుమపువ్వు, ఎండుద్రాక్ష, బాదంతో చేసిన గుచ్చీ మారి్మక్ 3. క్యారెట్, గ్రీన్ బీన్స్ కూర 4. కందిపప్పు, టమాటాలతో చేసినకర్ణాటక తక్కలి బెల్లే చారు 5. చిరు ధాన్యాల పులావ్6. బీట్రూట్ రైతా 7. వివిధ రకాల భారతీయ బ్రెడ్లు తీపి పదార్థాలు1. పాత ఢిల్లీ ఫ్రూట్ క్రీమ్ 2. జిలేబీ 3. పాలు, బియ్యం, మల్బెర్రీ పండ్లు కలిపిన షాహ్తూత్ పాయసం
మూడేళ్లలోపు 21 రాష్ట్రాల్లో యూసీసీ
ముంబై: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువుదీరిన 21 రాష్ట్రాల్లోనూ 2029 ఏడాదిలోపు ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని అమలుచేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. గత పుష్కర కాలంలో ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం సాధించిన ఘనత, మోదీ నాయకత్వంలో గత పాతికేళ్లలో బీజేపీ ప్రయాణం, మోదీ జన్మదినంను గుర్తుచేస్తూ సెపె్టంబర్ 17 నుంచి సేవా సంకల్ప్ అభియాన్ జరగబోతోందని ప్రకటించాక పలు అంశాలపై ఆదివారం ముంబైలో అమిత్షా మీడియాతో మాట్లాడారు. ‘‘త్రిపుల్ తలాఖ్ను రద్దుచేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించాం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీ అమలవుతోంది. 2029లోపు ఎన్డీఏపాలిత అన్ని రాష్ట్రాల్లో ఇది అమలయ్యేలా చేస్తా’’అని అన్నారు. 2029లో సార్వత్రిక ఎన్నికలున్న విషయం తెల్సిందే. మోదీ శకంలో అన్నీ మారుతున్నాయ్.. ‘‘గతంలో దేశంలో అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయాలు తిష్టవేసి దారుణ పరిస్థితులను సృష్టించాయి. ఇప్పుడు మోదీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం వాటినన్నింటినీ పారద్రోలింది. మోదీ శకం ఆరంభమైంది. ఇప్పుడంతా పనితీరు ఆధారిత రాజకీయాలే’’అని షా అన్నారు. మానవసేవే మాధవ సేవ తరహాలో జనసేవే ప్రభు సేవ అనే కొత్త నినాదం షా విన్పించారు. 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్ను సాకారంచేసేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నాం. మోదీ సారథ్యంలో గుజరాత్లో, దేశంలో పెను సానుకూల మార్పులొచ్చాయి. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ప్రాథమికస్థాయిలో సంస్కరణల బాటలో పయనిస్తోంది’’ అని మోదీని షా కొనియాడారు.
ఏకపక్ష ఆంక్షలతో ప్రజలపై తీవ్ర ప్రభావం: పెజెష్కియాన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక, వాణిజ్య వ్యవస్థలపై అధికంగా ఆధారపడితే వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు రాజకీయ ఒడిదుడుకులకు గురయ్యే ప్రమాదం ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. అందుకే బ్రిక్స్ కూటమి దేశాలు తమ జాతీయ కరెన్సీల్లో వాణిజ్యాన్ని విస్తరించుకోవాలని, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక చట్రం దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఆదివారం బ్రిక్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. పాశ్చాత్య దేశాలపై విమర్శలు గుప్పించారు. కొన్ని దేశాలు విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలు ప్రపంచ ఆహార భద్రత, ప్రజల సంక్షేమంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పరోక్షంగా అమెరికాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్రిక్స్ కూటమి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారానికి సంబంధించిన ఒక వేదిక స్థాయిని దాటేసి, నేడు మరింత సమతుల్యమైన, సమ్మిళితమైన ప్రపంచం కోసం పెరుగుతున్న ఆకాంక్షకు ప్రతీకగా మారిందని హర్షం వ్యక్తంచేశారు. అటువంటి ప్రపంచంలో ఏ ఒక్కరికీ ఇతరుల భవిష్యత్తును నిర్ణయించే హక్కు ఉండదని తేల్చిచెప్పారు.
జిన్పింగ్ పంచ సూత్రావళి
న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాలు సమున్నతంగా ఎదిగేందుకు పంచ సూత్రావళిని పాటించాలంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సరికొత్త సూచనలు చేశారు. కృత్రిమ మేధ, వాణిజ్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్ ఫ్యాక్టరీలు, సీనియర్ శాస్త్రవేత్తలతో అతిపెద్ద సమీకృత మార్కెట్ను బ్రిక్స్ దేశాలు సొంతంగా సృష్టించుకోవాలని జిన్పింగ్ అభిలషించారు. బ్రిక్స్ సదస్సు ముగింపు సమావేశంలో ఆదివారం జిన్పింగ్ మాట్లాడారు. ‘‘అభివృద్ధిచెందుతున్న మార్కెట్లు, గ్లోబల్ సౌత్ దేశాలతో బ్రిక్స్ సభ్య దేశాలు అనుసంధానం కావాలి. దీంతో మన సరకు రవాణా గొలుసులు పటిష్టమవుతాయి. తద్వారా భవిష్యత్తులో అతిపెద్ద సమీకృత మార్కెట్ను అవతరింపజేయవచ్చు. అందుకోసం మొదటగా బ్రిక్స్ ఏఐ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీని ఏర్పాటుచేద్దాం. దీని ఏర్పాటుకు చైనా అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల తయారీ, అభివృద్ధికి కృషిచేద్దాం. ఏఐ సెమినార్లు నిర్వహిద్దాం. శిక్షణా కోర్సులను అందుబాటులోకి తెద్దాం. అలా ఓపెన్ ఏఐ ఎకోసిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. ఇక రెండోది వాణిజ్యం, పెట్టుబడులను సులభతరంచేసే వ్యవస్థను ఏర్పాటుచేయడం. ఇందుకోసం బ్రిక్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ భాగస్వామ్య వ్యవస్థను ఏర్పాటుచేద్దాం. దీని ద్వారా ఇంటెలిజెంట్ పోర్టల్, విధానాల రూపకల్పన, కొత్త పెట్టుబడులు, వ్యాపార అవకాశాలకు అనుగుణంగా వాతావరణం సృష్టించుకోవచ్చు. దీంతో బ్రిక్స్ దేశాల మధ్య వస్తుసేవలు, పెట్టుబడులు పరస్పరం సులభంగా బదిలీఅవుతాయి’’అని జిన్పింగ్ అన్నారు. ‘‘ఇక మూడోది. డిజిటల్ పరిశ్రమను బలోపేతంచేయడం. ఇందుకోసం డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం, కొత్త సాంకేతికతల మార్పిడి, వివిధ పరిశ్రమల మధ్య సమన్వయం, డిజిటల్ ఎకానమీ అభివృద్ధి కోసం కృషిజరగాలి’’అని జిన్పింగ్ చెప్పారు. ‘‘ఇక నాలుగోది స్మార్ట్ కర్మాగారాలను కొలువుతీర్చడం. రోబోటిక్స్, ఆటోమేషన్లతో తయారీరంగాన్ని ఆధునీకరించాలి. ఏఐ, డిజిటల్ సాంకేతికతలను వస్తూత్పత్తి కర్మాగారాల్లో పూర్తిస్థాయిలో ఉపయోగిస్తూ ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ను సాకారంచేయాలి. అందుకు కావాల్సిన ప్రమాణాల రూపకల్పనలో చైనా కూడా భాగస్వామిగా ఉంటుంది. ఇంటెలిజెంట్ మ్యానుఫాక్చరింగ్లో పారదర్శకత, ఎప్పటికప్పుడు అప్డేట్ ముఖ్యం’’అని ఆయన అన్నారు. ‘‘ఇక ఐదోది ఇంజనీర్స్ సృష్టి కూటమి. యూత్ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్లో భాగంగా ప్రతిభావంతులైన యువతను బ్రిక్స్ దేశాల మధ్య సమన్వయంచేస్తూ కొత్త ఇంజనీర్లను తయారుచేద్దాం’’ అని జిన్పింగ్ పిలుపునిచ్చారు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో ఏఐ కాలేజీకి ఎన్నారై దంపతుల పేరు
అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన దంపతులు విద్యారంగానికి భారీ విరాళం అందించారు. టెక్సాస్లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (UNT)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అడ్వాన్స్డ్ అనలిటిక్స్కు ప్రత్యేక కాలేజీ ఏర్పాటుకు ఏకంగా 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.167 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ భారీ విరాళం అందించిన అనురాధ, వికాస్ సిన్హా దంపతుల పేరుతోనే కొత్త కాలేజీకి ‘అనురాధ అండ్ వికాస్ సిన్హా కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్’ అని పేరు పెట్టనున్నారు.AI, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో విద్య, పరిశోధనలకు ఈ కాలేజీ కేంద్రంగా పనిచేయనుంది. AI, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, లైబ్రరీ సైన్స్, లెర్నింగ్ టెక్నాలజీస్ వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి ఈ కాలేజీ ఉపయోగపడుతుందని వర్సిటీ అధ్యక్షుడు హారిసన్ కెల్లర్ తెలిపారు.ఈ విరాళంతో కాలేజీ నాయకత్వం, విద్యార్థుల స్కాలర్షిప్లు, ప్రొఫెసర్షిప్లు, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇంక్యుబేషన్, అధునాతన పరిశోధనలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు మద్దతుగా ఆరు శాశ్వత ఎండోమెంట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే *అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్*ను కూడా ఈ కాలేజీలో ఏర్పాటు చేస్తారు. ఇది వర్సిటీలోని వివిధ విభాగాల మధ్య AI, డేటా సైన్స్ పరిశోధనలకు సమన్వయం చేస్తూ పరిశ్రమలతో భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనుంది.చదువు కోసం అమెరికాకు.. ఇప్పుడు భారీ విరాళంవికాస్, అనురాధ ఇద్దరూ భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఉత్తరప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేసిన అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీలు పొందారు. వికాస్ సిన్హా నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీలోనూ చదివి, 2023లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచే పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన బ్రాడ్కామ్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు.సిన్హా దంపతులు ఇప్పటికే UNTకు పలు సందర్భాల్లో భారీగా అండగా నిలిచారు. 2024లో వారు అందించిన విరాళంతో అనురాధ అండ్ వికాస్ సిన్హా డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, అధ్యాపకులు, పరిశోధనలకు మద్దతుగా ఎండోమెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడాదికే మరో భారీ విరాళంతో సిన్హా ఇన్నోవేషన్ ల్యాబ్ ఫర్ డేటా సైన్స్ను ఏర్పాటు చేశారు.“మాకు ఈ విరాళం అంటే అవకాశాన్ని మరో తరానికి అందించడం. వలస వచ్చినవారు అమెరికన్ డ్రీమ్లో కేవలం భాగస్వాములు మాత్రమే కాదు.. దాన్ని నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. విద్య మా జీవితాల్లో ఎన్నో తలుపులు తెరిచింది. ఇప్పుడు ఆ తలుపులు మరికొందరికి తెరిచి ఉంచాలనుకుంటున్నాం” అని వికాస్ సిన్హా తెలిపారు.AI, డేటా ఆధారంగా భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న నేపథ్యంలో.. కొత్త తరం విద్యార్థులను అందుకు సిద్ధం చేయడం, పరిశోధనలను ప్రోత్సహించడం, పరిశ్రమలతో అనుసంధానం పెంచడం ఈ కొత్త కాలేజీ ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి.(చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!)
వైఎస్సార్ చెస్ టోర్నమెంట్లో విజేతగా శిబి శ్రీనివాస్ చెమికల
మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ జర్మనీ విభాగం కన్వీనర్ కృష్ణ తేజా రెడ్డి గడ్డం ఆధ్వర్యంలో మ్యూనిక్ నగరంలో వైఎస్సార్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో విజేతగా నిలిచిన డార్మ్ స్టడ్ అప్లయిడ్ సైన్సెస్ యూనివర్సిటీ విద్యార్ధి శిబి శ్రీనివాస్ చెమికలకు వైఎస్సార్ సీపీ ఐటీ విభాగ కోర్డినేటర్ విష్ణు వర్ధన్ రెడ్డి మార్తల ట్రోఫీని అందజేశారు. జర్మనీ వైఎస్సార్ సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయి సూర్య చౌదరి నేలకుర్తి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.(చదవండి: జర్మనీలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి)
కువైట్లో భారీ డీజిల్ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్!
కువైట్ సిటీ: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన వాహనాల నుంచి డీజిల్ దొంగిలించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం పట్టుకుంది. ఈ కేసులో ఓ కువైట్ పౌరుడితో పాటు భారతీయులు సహా 40 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న కొందరు బస్సులు, లారీలను ‘అంగర్’ ప్రాంతంలోని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి డీజిల్ చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇలా సేకరించిన డీజిల్ను ఇతర ట్యాంకర్లలోకి తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ అక్రమ దందా కోసం ట్యాంకర్లను నెలకు 1,600 కువైటీ దినార్లకు అద్దెకు ఇచ్చింది అరెస్టైన కువైట్ పౌరుడేనని విచారణలో తేలింది. చాలాకాలంగా నిఘా పెట్టిన అధికారులు డీజిల్ చోరీ చేస్తున్న సమయంలో ప్రధాన నిందితులను పట్టుకున్నారు. అనంతరం దొంగిలించిన డీజిల్ కొనుగోలు చేసేందుకు వచ్చిన మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.అయితే, డీజిల్ దొంగతనం, విక్రయం, కొనుగోలులో భాగమైన మొత్తం 41 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ముఠా ఉపయోగించిన 38 ట్రక్కులు, బస్సులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలు, ఆర్థిక నష్టాన్ని అరికట్టడంలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇవీ చదవండి: లెబనాన్పై విరుచుకపడ్డ ఇజ్రాయెల్.. 11 మంది మృతి
పౌరసత్వం రద్దయిన వారికి కువైట్ గుడ్న్యూస్
కువైట్ సిటీ: కువైట్లో పౌరసత్వాన్ని కోల్పోయిన వారికి దేశంలో కొనసాగేందుకు కొత్త నివాస అనుమతి నిబంధనను తీసుకురావడానికి ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో పౌరసత్వం రద్దు చేసినా లేదా వెనక్కి తీసుకున్నా, కొన్ని షరతులతో గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు కువైట్లో నివసించేందుకు అనుమతి లభించనుంది.పౌరసత్వం కోల్పోయిన తర్వాత తమ పాత విదేశీ పౌరసత్వాన్ని తిరిగి పొందిన వారు లేదా మరో దేశ పౌరసత్వం పొందిన వారు ఈ కొత్త నిబంధన కింద సాధారణ నివాస అనుమతికి అర్హులవుతారు. అయితే ఈ అనుమతి గరిష్ఠంగా 10 సంవత్సరాల కాలానికి మాత్రమే ఉండనుందని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.అయితే, నివాస అనుమతి మంజూరు చేయడం, దాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలు, నియంత్రణలను రెసిడెన్సీ అఫైర్స్ విభాగం డైరెక్టర్ జనరల్ నిర్ణయించనున్నారు. ఈ నిబంధనల ప్రకారం నివాస అనుమతి పొందిన వారు కువైట్లో ఉద్యోగం చేసేందుకు పాటించాల్సిన నిబంధనలను కూడా అధికారులు నిర్ణయించనున్నారు.అలాగే, సవరించిన నిబంధనలను అధికారిక గెజిట్లో ప్రచురించిన తర్వాత ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. దీంతో పౌరసత్వం కోల్పోయినప్పటికీ ఇతర దేశ పౌరసత్వం పొందిన వారికి కువైట్లో చట్టబద్ధంగా నివసించే అవకాశం లభించనుంది.ఇవి కూడా చదవండి: ప్రయాణికులకు గుడ్న్యూస్.. బహ్రెయిన్-సౌదీ మధ్య కొత్త సౌకర్యం!
క్రైమ్
ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!
హైదరాబాద్: ఓ మేనమామే ఆరేళ్ల వ యసున్న కోడలిపై అఘాయిత్యానికి ఒ డిగట్టాడు. కుము రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆల స్యంగా ఆదివారం వెలుగు లోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ రాఖీ పండుగకు తన ఆరేళ్ల కూతురును తీసుకుని కాగజ్నగర్ పట్టణంలోని తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చింది.ఈ సమయంలో కూతురు అమ్మమ్మ దగ్గర ఉంటానని మారాం చేయడంతో అక్కడే వదిలి వెళ్లింది. అయితే బాలిక మేనమామ అయిన శశిధర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. శశిధర్కు వివాహమైనా భార్య పుట్టింట్లోనే ఉంటోంది.మూత్రం ఆగిపోవడంతో..ఐదు రోజులుగా బాలికకు మూత్రం రాకపోవడంతో కడుపు ఉబ్బిపోయింది. రెండు రోజుల క్రితం బాలిక అమ్మమ్మ తన కూతురుకు సమాచారం ఇచ్చింది. దీంతో తల్లి పుట్టింటికి వెళ్లి కూతురును తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షలు చేసి బాలికపై లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించారు. సోదరుడిపైనే అనుమానం వచ్చిన తల్లి పుట్టింటికి వెళ్లి రోదిస్తూ తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ విషయం స్థానిక కౌన్సిలర్, కాలనీ పెద్దలకు ఆదివారం తెలిసింది.కాలనీలో విషయం వ్యాపించడంతో కాలనీ వాసులు నిందితుడి ఇంటిని చుట్టుముట్టారు. మానవ మృగాన్ని ప్రజల మధ్యలోనే శిక్ష విధించాలని ఆందోళన చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ ప్రేమ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు గంటల తర్వాత పోలీసులు నిందితుడిని ద్విచక్రవాహనంపై పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో జోరుగా వాన
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్త దారుణహత్య
కందనూలు: వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తమ బంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిన ఉదంతం తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించారు. నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లికి చెందిన మహమ్మద్ కరీం (43), సలీమాబేగం నాగర్కర్నూల్లో నివాసం ఉంటున్నారు. సలీమాబేగం తనకు మరిది వరుసైన నాగపూర్ గ్రామానికి చెందిన గౌస్పాషాతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీన్ని గుర్తించిన కరీం తన భార్యను మందలించగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో 9న వాట్సాప్ కాల్లో రాత్రికి కరీంను చంపుతానని సలీమాబేగంకు గౌస్పాష చెప్పాడు. పదునైన కత్తి, చేతి గ్లౌజులు తీసుకొని రాత్రి 2.30 గంటల సమయంలో గౌస్పాష.. కరీం ఇంటికి వెళ్లి నిద్రలేపాడు. నిద్రమత్తులో ఉన్న కరీం డోర్ తీయగా కత్తితో గౌస్పాష అతనిపై దాడి చేసి చంపి పరారయ్యాడు.
ఓ మహిళ విషయంలో వివాదం.. ఏడుగురికి గాయాలు
సాక్షి, అనంతపురం: ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మైలారంపల్లి గ్రామంలో ఓ మహిళకు సంబంధించిన విషయంపై ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడినట్లు సమాచారం.ఘర్షణలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకున్న తర్వాత కూడా ఇరువర్గాల మధ్య వివాదం సద్దుమణగలేదు.దీంతో ఆసుపత్రి ప్రాంగణంలోనే ఇరువర్గాలు మరోసారి గొడవకు దిగాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణంగా మారడంతో.. ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అక్కడ భద్రత ఏర్పాటు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి..
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి..
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నూరు మండలం శేషయ్యగారిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శేషయ్యగారిపల్లి వద్ద బస్సు వెనుక టైర్ కింద పడి గంగవరం నరసింహులు (18), మాలికా మణి (15) మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మృతులు కడపలోని లోహియా నగర్కు చెందినవారిగా తెలుస్తోంది. అదే ప్రమాదంలో కానూరు మనోహర్ (20) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో శేషయ్యగారిపల్లి వద్ద విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: పండ్ల బుట్టలో దాచిన తుపాకీని తీసి కాల్పులు
వీడియోలు
ఫ్రీ బస్సు.. పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. వైరల్ అవుతున్న వీడియో
మీరు ఓడిపోయిన పర్లేదు.. పోటీ చేసిన ఒక్కొక్కరికి మాటిస్తున్నాను
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
తెలుగులోకి 'హనుమాన్ అంశ్ గురూజీ మాస్టర్ ప్లాన్
భారతీయులకు గుడ్ న్యూస్.. H-1Bపై కీలక అప్ డేట్
AIతో డేంజర్.. బ్రేకులు వేయాల్సిందే.. ఆంథ్రోపిక్ CEO సంచలనం
పార్టీని వీడే ప్రసక్తేలేదు.. కొండా ఫ్యామిలీ సంచలన వ్యాఖ్యలు
గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే
పోలవరంలో పాప ఘటన.. MP తనూజ రాణి ఎమోషనల్
ఒక్కటి గుర్తుపెట్టుకో.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై కోలగట్ల వీరభద్రస్వామి కౌంటర్

