Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India 76th Republic Day 2025 LIVE Updates1
గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

ఢిల్లీ : క్తరవ్యపథ్‌ వేదికగా ఢిల్లీలో 76వ గణతంత్ర వేడుకలు (76th Republic Day) ఘనంగా జరుగుతున్నాయి. గణతంత్ర వేడుకల్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ‍ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు, ముఖ్య అతిథి, ఇండోనేషియా (Indonesia) అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (Prabowo Subianto) పాల్గొన్నారు.👉76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యేకతలు ఢిల్లీలో కొనసాగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలు 90 నిమిషాల పాటు నిర్విరామంగా కొనసాగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదవి ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర వేడుకల్ని ప్రారంభించారు. #WATCH | President Droupadi Murmu unfurls the National Flag at Kartavya Path, on the occasion of 76th #RepublicDay🇮🇳National anthem and 21 Gun salute follows.(Source: DD News) pic.twitter.com/6969bmx2B4— ANI (@ANI) January 26, 2025 ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రబోవోతో పాటు 352 మంది సభ్యుల ఇండోనేషియా కవాతు, బ్యాండ్ బృందం కవాతులో పాల్గొంటుంది.గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌ ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్‌ వద్ద జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించడంతో గణతంత్ర దినోత్సవ పరేడ్ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. ఈ వేడుకల్ని వీక్షించేందుకు దాదాపు 10,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ‘స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’ పేరుతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 16 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ సంస్థలకు చెందిన 15 శకటాలతో మొత్తం 31 శకటాలు కర్తవ్య పథ్‌ వేదికగా ప్రదర్శించనున్నాయి బ్రహ్మోస్ క్షిపణి, పినాక రాకెట్ సిస్టమ్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో సహా అత్యాధునిక రక్షణ శకటాలు ప్రదర్శించనున్నాయి. ఆర్మీకి చెందిన యుద్ధ నిఘా వ్యవస్థ ‘సంజయ్’ డీఆర్‌డీవో ‘ప్రళయ్’ వ్యూహాత్మక క్షిపణి తొలిసారిగా ప్రదర్శించనుంది. ప్రదర్శనలో ఇతర సైనిక శకటాలలో టీ-90 ‘భీష్మ’ ట్యాంకులు, శరత్ పదాతిదళం వాహనాలు, నాగ్ క్షిపణి వ్యవస్థ, మౌంటెడ్ పదాతిదళ మోర్టార్ సిస్టమ్ (ఐరావత్) ఉన్నాయి.దేశంలోని సాయుధ దళాల మధ్య ఐక్యత స్ఫూర్తికి ప్రతీకగా త్రివిద దళాల సేవలు ఉమ్మడిగా ప్రదర్శించనుండగా.. డీఆర్‌డీవో ‘రక్షా కవచ్’ థీమ్‌ను ప్రదర్శించనుంది.మౌంటెడ్ కాలమ్‌కు నాయకత్వం వహించే మొదటి ఆర్మీ దళం ఐకానిక్ 61 అశ్వికదళం. ఇది ప్రపంచంలోని ఏకైక గుర్రపు అశ్వికదళ రెజిమెంట్. నారీ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్న త్రివిధ దళాల అనుభవజ్ఞులైన మహిళా అధికారులు ఉంటారు.

Chandrababu Govt Categorized By AP Secretariat Employees2
గ్రామ, సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్‌ షాక్‌

సాక్షి, విజయవాడ: గణతంత్ర దినోత్సవం వేళ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్‌ బిగ్‌ షాక్ ఇచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సచివాలయాలను కేటగిరులుగా విభజించి ఉద్యోగులను కుదిరించింది.గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ కూటమి సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాకిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 40 వేల ఉద్యోగుల సంఖ్యకు చంద్రబాబు సర్కార్‌ కోతపెట్టింది. సచివాలయ ఉద్యోగులకు క్రమబద్దీకరణకు ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం.ఇక, ఇదే సమయంలో సచివాలయాలను ఏ, బీ, సీ కేటగిరిగా విభజించింది. ఈ క్రమంలో ఏ-కేటగిరి సచివాలయాల్లో సిబ్బందిని ఆరుకి కుదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే, బీ-కేటగిరి సచివాలయంలో సిబ్బందిని ఏడుకి కుదించారు. సీ-కేటగిరి సచివాలయంలో సిబ్బంది ఎనిమిదికి కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, ఉద్యోగాల్లో భారీగా కోత విధించారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మూడు కేటగిరీలుగా వర్గీకరించాలని తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని ఏపీ గ్రామ, సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల అర్లయ్య ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుని అమలు చేసే ముందు ఉద్యోగ సంఘాల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు వివిధ రూపాల్లో కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు.ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగుల వర్గీకరణకు సంబంధించి మార్గదర్శకాల కోసం ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేస్తామన్న కమిటీని నియమించారా లేదా, ఏర్పాటై ఉంటే అందులో సభ్యులుగా ఎవరెవరు ఉన్నారనే దానిపై కూడా ఉద్యోగులు, నేతలకు సమాచారం లేదన్నారు. తమ విభాగంలో చేపట్టనున్న మార్పులు, చేర్పులపై ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ అంశంపై ప్రభుత్వంతోపాటు సంబంధిత మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.

Republic Day Celebrations At YSRCP Party Offices In AP3
వైఎస్సార్‌సీపీ కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. స్వతంత్ర్య సమరయోధుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలు. రిపబ్లిక్‌ డే సందర్బంగా జాతీయ జెండాను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక, ఏపీలోని పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ సమానంగా ఎదగాలనే దృక్పథంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాం. పేదరికం లేని సమాజం కోసం మనమంతా కృషిచేయాలి. మనల్ని మనం పరిపాలించుకుంటూ ఎంతో పురోభివృద్ధిలోకి వెళుతున్నాం. బ్రిటీష్‌ పాలకుల నుంచి విముక్తి కోసం బానిస సంకెళ్ళు తెంచుకుని పరిపాలించుకోవాలని అనేక మంది పోరాటాలు చేశారు.ఈ క్రమంలో మనల్ని మనం పరిపాలించుకునే సర్వసత్తాక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నాం. అందరూ సమానంగా ఎదగాలనే దృక్పథంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలను మన పాలనలో చూశాం. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఎదగాలనే మన ప్రయత్నం కొనసాగించాలి. పేదరికాన్ని పారద్రోలి స్వతంత్ర భారతాన్ని నిర్మించుకోవడానికి మనమంతా కృషిచేయాలని పార్టీ తరఫున ప్రజలకు విజ్క్షప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా వేడుకల్లో పార్టీ నేతలు పాల్గొన్నారు. విశాఖలో వేడుకలు..విశాఖలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండానుమాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. అనంతరం అమర్నాథ్‌ మాట్లాడుతూ..‘మన రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో లేదు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రాష్ట్ర ప్రజల హక్కులను వైఎస్సార్‌సీపీ కాపాడుతుంది. విజయసాయి రెడ్డి రాజీనామా గురించి ఆయనే చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని మాట్లాడారు. తన లాంటి వారిని వెయ్యి మందిని తయారు చేయగలరని సాయిరెడ్డి చెప్పారు.నాయకులను ఏ విధంగా తయారు చేయాలో వైఎస్ జగన్‌కు తెలుసు. వైఎస్‌ జగన్‌ ఒక టార్చ్‌బేరర్. చంద్రబాబు మీద నమ్మకం లేకనే గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు టీడీపీని వీడిచారా. నాయకుల మీద రాజకీయంగా ఒత్తిడి ఉంటుంది. కొంతమంది తట్టుకుంటారు మరి కొంతమంది తట్టుకొని నిలబడలేరు. పెట్టుబడులు రాకపోయేసరికి దావోస్‌ పర్యటనపై చంద్రబాబు మాట మార్చారు. దావోస్ పర్యటన ఒక మిథ్య అంటూ మాట్లాడుతున్నారు. పదిసార్లు దావోస్ వెళ్లి వచ్చిన తరువాత మిథ్య అని తెలిసిందా? అంటూ ప్రశ్నించారు. విజయవాడలో..విజయవాడలో జాతీయ జెండా ఎగురవేసిన సెంట్రల్ నియోజకవర్గ మాజీ MLA మల్లాది విష్ణు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ..‘రాజ్యాంగ అమలు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేదు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాజ్యమేలుతున్నాయి. రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయాల్సిన సంస్థలు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. గవర్నర్ చేత ప్రభుత్వం అన్ని అబద్దాలు చెప్పించింది.దావోస్ పర్యటనలో ఒక్క పరిశ్రమ రాలేదు. పరిశ్రమలు తీసుకురాకుండా ఎదురుదాడి చేస్తున్నారు. షేక్ హాండ్స్ కోసం కాదు దావోస్‌కు వెళ్లేది. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నేడు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మూడు పార్టీలు భిన్నమైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నాయి. ఓటు ద్వారా, నియంతృత్వం ద్వారా ఓటు హక్కును వినియోగించుకొన్నామని చెప్పే వాళ్ళు ముందుకు రావాలి.. ప్రభుత్వాన్ని ప్రశించాలి. విద్య, వైద్యాల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆసుపత్రుల్లో పిల్లలను ఎత్తుకెళ్తున్నారు.. కనీసం మందులు కూడా లేవు. వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి. తప్పులు ఎవరు చేస్తున్నారు, ఎవరు అబద్ధాలు, ఎవరు ప్రజల్లో మోసం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అని కామెంట్స్‌ చేశారు.వైఎస్సార్‌ జిల్లాలో..వైఎస్ఆర్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండా ఎగురవేసిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష, మేయర్ సురేష్ బాబు. ఈ సందర్భంగా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఎన్టీఆర్ జిల్లాలో..ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగం ఫలితంగా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. గత ఐదేళ్లలో అంబేద్కర్‌, మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లిన నాయకుడు వైఎస్‌ జగన్‌. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సుసాధ్యం చేసిన వ్యక్తి వైఎస్‌ జగన్‌. రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్‌ జగన్‌ అడుగుజాడల్లో మేము వెళ్తాం అని అన్నారు.

SRH may have landed steal deal With Brydon Carse for IPL 20254
ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్‌న్యూస్‌.. చెపాక్‌లో దుమ్ములేపిన ఆల్‌రౌండర్‌

చెన్నై వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓట‌మి చ‌విచూసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓట‌మి పాలైన‌ప్ప‌టికి ఆ జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ బ్రైడన్ కార్స్(Brydon Carse) త‌న అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ దుమ్ములేపాడు.ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్ వ‌చ్చిన కార్స్‌.. భార‌త బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. కేవలం 17 బంతుల్లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్త్తో 31 పరుగులు చేశాడు. 29 ఏళ్ల కార్స్‌ దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. లేదంటే ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ సాధించిండేది. కార్స్‌ బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్‌న్యూస్‌..కాగా బ్రైడన్ కార్స్ భారత గడ్డపై ఈ తరహా ప్రదర్శన చేయడం ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్‌-2025 మెగా వేలంలో కార్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్ కేవలం రూ. కోటిరూపయాలకే సొంతం చేసుకుంది. భారత్ పిచ్‌లపై తొలిసారి ఆడినప్పటికి ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా అందరిని కార్స్ మెప్పించాడు. కార్స్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం 5 టీ20లు మాత్రమే ఆడాడు.మొత్తంగా 9 వికెట్లు పడగొట్టాడు. ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడిన అనుభవం మాత్రం అతడికి ఉంది. సౌతాఫ్రికా టీ20, ది హండ్రెడ్, వైటాలిటీ బ్లాస్ట్‌లో ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆడాడు. కాగా ఎస్ఆర్‌హెచ్‌లో ఇప్ప‌టికే నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శ‌ర్మ, ప్యాట్ క‌మ్మిన్స్ వంటి అద్భుత‌మైన ఆల్‌రౌండ‌ర్లు ఉన్నారు. ఇప్పుడు కార్స్ రాకతో ఎస్‌ఆర్‌హెచ్ ఆల్‌రౌండ్ విభాగం మరింత పటిష్టంగా మారింది.ఐపీఎల్‌-2025కు ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు: పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్ , రాహుల్ చాహర్, ఆడమ్ జంపా , అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్జిత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్ , అనికేత్ వర్మ , ఎషాన్ మలింగ , సచిన్ బేబీ.చదవండి: IND vs ENG: తిలక్‌ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

TPCC Chief Mahesh Kumar Sensational Comments On BJP5
బీజేపీవి రాజ్యాంగ విరుద్ద కార్యక్రమాలు: టీపీసీసీ చీఫ్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కాషాయ ఎజెండాను అమలుచేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌. ఇదే సమయంలో ప్రజల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాపాలన అందిస్తోందని చెప్పుకొచ్చారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో జాతీయ పతాకాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ హనుమంతరావు, చైర్మన్లు శివసేనారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. బీజేపీ దేశంలో కాషాయ ఎజెండాను అమలు చేయాలని చూస్తోంది. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్లాన్‌ చేస్తోంది. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లోనే అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమాన పరిచారు. ఇక్కడ కేంద్రమంత్రి బండి సంజయ్ ఇందిరమ్మ పేరు పెట్టవద్దని అంటున్నాడు. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్లు నియంత పాలన చేసింది. ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ భరోసా కింద 12 వేల రూపాయలు, రైతు భరోసా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రాజ్యాంగబద్దంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాము. హైదరాబాద్ మెట్రో విస్తరణ ఒక పెద్ద ముందడుగు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎల్లప్పుడు ఉంటుంది. అందుకే జై గాంధీ, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ప్రజలంతా మద్దతు ప్రకటించాలి అని కోరారు.

Vishal's Madha Gaja Raja Official Telugu Trailer Out Now6
అదిరిపోయే పంచ్‌లతో 'మదగజరాజా' తెలుగు ట్రైలర్‌

విశాల్‌(Vishal ) నటించిన ‘మదగజరాజా’(Madha Gaja Raja) చిత్రం సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ సంక్రాంతికి కోలీవుడ్‌లో విడుదలైంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌కు దగ్గరలో ఈ మూవీ ఉంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వర్షన్‌ కూడా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.విశాల్‌ హీరోగా సుందర్‌. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్‌ అయింది. ఈ చిత్రానికి మంచి స్పందన లభించిందని యూనిట్‌ పేర్కొంది. కాగా ఈ జనవరి 31న సత్య కృష్ణన్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. జెమినీ ఫిలిం సర్క్యూట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) హీరోయిన్స్‌గా నటించారు. తెలుగు వర్షన్‌లో సినిమా రానున్నడంతో తాజాగా ‘మదగజరాజా’ ట్రైలర్‌ను హీరో వెంకటేశ్‌ హైదరాబాద్‌లో విడుదల చేశారు. కామెడీ ప్రధానంగా ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జానర్‌ సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు సుందర్‌.సి. దిట్ట అని చెప్పవచ్చు. ఆయన తన మార్క్‌ మాస్‌ అంశాలతో ఈ మూవీని రూపొందించారు. ఇందులో హీరోయిన్‌ సదా కూడా ఒక ఐటెమ్‌ సాంగ్‌లో కనిపించింది.

CM Chandrababu with media on Davos meetin7
దావోస్‌ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య

సాక్షి, అమరావతి: ‘పెట్టుబ­డుల ఆకర్షణ కోసం దావోస్‌ వెళుతున్నా. 1995­లో సీఎం అయినప్పటి నుంచి ఏటా దావోస్‌ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నా. ఎవరూ సీఐఐ, దావోస్‌ను పట్టించుకోని తరుణంలో వాటిని నేనే ప్రమోట్‌ చేశా. ఇతర రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు సాధించా’ నిన్నటివరకు ఇలా మాట్లాడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు దావోస్‌ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగి వచ్చిన తర్వాత మాట మార్చేశారు. అసలు దావోస్‌ వెళితే పెట్టుబడులు వస్తాయన్నది ఒక మిథ్య మాత్రమేనని, ఇటువంటి నెగెటివ్‌ ఆలోచనల నుంచి మీడియా తక్షణం బయటకు రావాలంటూ సరికొత్త రాగం అందుకున్నారు. శనివారం ఉండవల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచం ఎటువైపు పోతోందన్న విషయంపై జ్ఞానం పెంచుకోవడంతోపాటు అనేక దేశాల పారిశ్రామికవేత్తలను ఒకేచోట కలిసే నెట్‌వర్కింగ్‌ కేంద్రం దావోస్‌’ అంటూ సెలవిచ్చారు. ఒప్పందాల కోసం దావోస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని అవి ఇక్కడే చేసుకోవచ్చన్నారు. ఈసారి దావోస్‌ పర్యటనలో గడిచిన ఐదేళ్లలో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్‌ను పునరుద్ధరించడంపై దృష్టి సారించామని, పెట్రోనాస్, డీపీ వరల్డ్, సిస్కో, వాల్‌మార్ట్, యూనీ­లీవర్, పెప్సికో వంటి అనేక సంస్థల ప్రతి­నిధు­లతో సమావేశమైనట్టు తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని స్వాగతిస్తున్నా­మని, పెట్టుబడుల విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ ఉండటం మంచిదేనని అన్నారు. దేశానికి ముంబై ఆర్థిక రాజధాని కావడంతో అక్కడ భారీ పెట్టుబడులు వచ్చాయని, తాను గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతో అక్కడ పెట్టుబడులు వచ్చాయన్నారు. హైదరాబాద్‌ కేవలం తెలంగాణ వారిది కాదని, తెలుగు వారందరిగా దానిని చూడాలన్నారు. గతంలో దావోస్‌ అంటే ధనవంతుల కోసం అనే భ్రమ ఉండేదని, అందుకే దేశంలోని రాజకీయ నాయకులు అక్కడికి వెళితే తమ ఓట్లు పోతాయని భయపడేవారని చెప్పారు.అటువంటి సమయంలో 1995 నుంచి ఇండియాలో దావోస్‌ను తాను ప్రమోట్‌ చేశానన్నారు. తాను వెళ్లడం ప్రారంభించిన తర్వాతే అప్పటి కర్ణాటక సీఎం ఎస్‌ఎం కృష్ణ దావోస్‌కు వచ్చి పెట్టుబడుల కోసం పోటీ పడేవారని, తాను హైదరాబాద్‌ను ప్రమోట్‌ చేస్తే కృష్ణ బెంగళూరును ప్రమోట్‌ చేస్తూ పెట్టుబడులను ఆకర్షించేవారన్నారు.పోర్టులతో రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులుకొత్తగా నిర్మిస్తున్న పోర్టులతో రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. రామాయపట్నం వద్ద బీపీసీఎల్‌ భారీ రిఫైనరీ, అనకాపల్లి వద్ద అర్సెలర్‌ మిట్టల్‌ 14 మిలియన్‌ టన్నుల స్టీల్‌ప్లాంట్స్‌ పోర్టు ఆధారంగా ఏర్పాటవు­తున్నాయన్నారు. దీంతోపాటు ఎల్‌జీ రాష్ట్రంలో రూ.5 వేల కోట్లు, గ్రీన్‌కో కంపెనీ కాకినాడ వద్ద గ్రీన్‌ అమ్మోనియా, విశాఖ వద్ద ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ యూనిట్, రిలయన్స్‌ రూ.60 వేల కోట్లతో 500కు పైగా బయో ఫ్యూయల్‌ ప్రాజె­క్టులు ఏర్పాటు చేస్తున్నాయని.. రానున్న కాలంలో గ్రీన్‌ ఎనర్జీలో ఏపీ ప్రధాన హబ్‌గా తయారు కానుం­దన్నారు. టెక్నాలజీ రంగంలో సహకారం అందించేందుకు గూగుల్‌ ముందుకు వస్తోందని, అమెరికాలోని పన్ను చెల్లింపుల సమస్యపై ఒక స్పష్టత రాగానే విశాఖలో గూగుల్‌ సేవలను ప్రారంభిస్తుందన్నారు. ఇప్పటికే విశాఖకు టీసీఎస్‌ వచ్చిందని, గూగుల్‌ రాకతో విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందన్నారు. టాటా గ్రూపుతో కలిసి ఎయిర్‌­పోర్టు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ తరఫున రాష్ట్రంలో వైద్య, వ్యవసాయ రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెంచే అంశంపై దృష్టి సారించాల్సిందిగా బిల్‌గేట్స్‌ను కోరినట్టు తెలిపారు. సీఐఐ సహకారంతో రాష్ట్రంలో గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి జిందాల్‌ గ్రూపుతో దావోస్‌లో చర్చలు జరిపానని, రాష్ట్రం నుంచి జిందాల్‌ గ్రూపు వెళ్లిపోతోందన్న వార్తల్లో నిజం లేదన్నారు. విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీకి రాజీ­నామా చేయడమనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహా­రమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ మీద నమ్మకం లేకపోతే ఎవరైనా మారతారని, ఈ అంశంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడను అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక్కడి వాళ్లకు ఇంగ్లిష్‌ రాకపోతే నేర్పించా..ఇండియాలో దావోస్‌ను, సీఐఐని నేనే ప్రమోట్‌ చేశా» గతంలో దావోస్‌ అంటే కేవలం ధనికులు అనే ముద్ర ఉండేది. అక్కడికి వెళితే ఓట్లు పోతాయన్న భయంతో రాజకీయ నాయకులు వెళ్లేవారు కాదు. సీఎంగా నేను వెళ్లినప్పటి నుంచే మిగిలిన వాళ్లు రావడం మొదలు పెట్టారు.» 1997లో దావోస్‌ వెళ్లి హైదరాబాద్‌ అనగానే ఏది పాకిస్థాన్‌లోని హైదరాబాదా అని అడిగేవారు.» 25 హైస్కూల్స్‌ కూడా లేని రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేశాను.» నన్ను చూసి దావోస్‌ వచ్చిన అప్పటి కర్ణాటక సీఎం ఎస్‌ఎం కృష్ణ హైదరాబాద్‌లో ఏముంది బెంగళూరు రండి అనేవారు. ఆ తర్వాత నేను హైదరాబాద్‌లో చేసిన ప్రగతి చూసి ఎస్‌ఎం కృష్ణ కాంప్రమైజ్‌ అయ్యారు.» ఐటీ అంటే ఏమిటో మనవాళ్లకు అర్థంకాని సమ­యంలో ప్రపంచమంతా తిరిగి కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాను.» నేను అప్పట్లో పీసీ (పర్సనల్‌ కంప్యూటర్‌) అంటే అందరూ పోలీస్‌ కానిస్టేబుల్‌ అని అర్థం చేసుకునేవారు. ఇక్కడి వాళ్లకు ఇంగ్లిష్‌ సరిగా మాట్లాడటం రాకపోతే లండన్‌ నుంచి ప్రొఫెసర్లను రప్పించి ఇంగ్లిష్‌లో నైపుణ్య శిక్షణ ఇప్పించాను.» 1995లో ఐటీని ప్రమోట్‌ చేస్తే.. ఇప్పుడు 2025లో ఏఐని ప్రమోట్‌ చేస్తున్నా.» కార్పొరేట్‌–పబ్లిక్‌ గవర్నెన్స్‌లో రాణించే విధంగా సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తు­లుగా గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌ ద్వారా తయారు చేస్తా.» హైదరాబాద్‌ని తెలంగాణ వాళ్లదిగా చూడకూ­డదు. అది తెలుగు వారందరిగా పరిగణించాలి. ఆ విధంగానే హైదరాబాద్‌ను ప్రమోట్‌ చేశాను.» ఏడాదికి సగటున 15 శాతం వృద్ధిరేటును నమోదు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.2.58 లక్షల నుంచి 2047నాటికి రూ.58 లక్షలకు పెంచుతాను.» నేను ఇప్పుడివన్నీ చెబితే మీకు కథలుగా కనిపిస్తాయి. కానీ గత 30 ఏళ్లలో జరిగిన.. నేను చేసిన అభివృద్ధే దీనికి నిదర్శనం.» గతంలో నువ్వు ల్యాప్‌టాప్‌లోని డాష్‌బోర్డుతో హైదరాబాద్‌ గురించి చక్కగా ప్రమోట్‌ చేశావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్‌ చేస్తున్నావా అని బిల్‌గేట్స్‌ అడిగారు.» మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో (ఏఐ) మహారాష్ట్రను హబ్‌గా చేస్తాను అంటే.. ఇక్కడ నేను ఉన్నాను. అది నీవల్ల అయ్యేపని కాదు. ప్రతి ఇంటికి ఒక ఏఐని తీసుకువస్తా అని చెప్పాను.

Union budget 2025: Halwa done and how the taste will be soon8
ఆర్ధిక మంత్రి హల్వా.. రుచులే వేరయా!

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గారి హల్వా (halwa) వంటకం పూర్తయింది. జనాలకి రుచి చూపించడమే తరువాయి. హల్వా అంటేనే తీపి పదార్ధం. కానీ ఆర్ధిక మంత్రి గారి హల్వాకి మాత్రం రకరకాల రుచులుంటాయి. ఒకరికి తీపి, ఇంకొకరికి చేదు, మరొకరికి చప్పగా... మొత్తమ్మీద అందరూ రుచి చూడాల్సిందే... వంటకం మొన్నే పూర్తయినా... రుచి చూపించేది మాత్రం ఫిబ్రవరి 1నే.2025-26 ఆర్ధిక సంవత్సరానికి నరేంద్రం మోదీ నేతృత్వంలో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే ప్రభుత్వం తొలి బడ్జెట్ (budget 2025) ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 న ప్రారంభమవుతాయి. ఆరోజు మొదట ఎకనామిక్ సర్వే ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. గత ఆర్ధిక సంవత్సరం తాలూకు వివిధ రంగాల్లో ప్రభుత్వం సాధించిన పురోగతి, లక్ష్యాలు, ఆర్ధిక వనరులు, భవిష్యత్ అవకాశాలతో సమ్మిళితమైన ఈ సర్వే బడ్జెట్ కు ఒక దిక్సూచిగా నిలుస్తుంది.ఆమర్నాడు అంటే ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 8 వ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. వాస్తవానికి మనం బడ్జెట్ అని వ్యవహరిస్తున్నప్పటికీ... దీన్ని ఫైనాన్స్ బిల్ గా భావించాలి. సాధారణ పన్ను చెల్లింపుదారులు మొదలుకొని... ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఇన్సూరెన్సు, ఫైనాన్స్, ఆటోమొబైల్, బ్యాంకింగ్... ఇలా వివిధ రంగాలు ఈ బడ్జెట్ కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటాయి.ఆర్ధిక మంత్రి ఎలాంటి ప్రకటనలు చేస్తారు? అవి కలగజేసే ప్రయోజనం, చోటుచేసుకోబేయే మార్పులు... ఇత్యాది అంశాలను విశ్లేషిస్తూ భవిష్యత్ మార్పులకు ఆయా రంగాలు సిద్ధమవుతాయి. వాస్తవానికి బడ్జెట్ కసరత్తు ప్రారంభం కావడానికి ముందే ఆర్ధిక మంత్రి ఆయా రంగాల వారితో సమావేశమై వారి విజ్ఞప్తులు, ఆకాంక్షలు, డిమాండ్లను లుసుకున్నారు. కోరికలు, డిమాండ్లు ఎక్కువగానే ఉండటం సహజం, అయితే ఈ బడ్జెట్ లో వాటిలో ఎన్ని నెరవారుతాయో నాన్న ఆసక్తితో పరిశ్రమ వర్గాలు ఎదురుచూస్తూ ఉంటాయి.జనవరి 31 న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల తొలివిడత ఫిబ్రవరి 13 న ముగుస్తుంది. రెండో విడత సమావేశాలు మార్చి 10 న ప్రారంభమై ఏప్రిల్ 4 న ముగుస్తాయి. ఈ రెండు విడతల సమావేశాల్లోనూ పార్లమెంట్లో విస్తృత స్థాయిలో వాదోపవాదాలు జరుగుతాయి. విపక్షాల ఎదురుదాడిని తట్టుకుంటూనే ప్రభుత్వం తన వాదనలు సమర్ధించుకునే యత్నాలు చేస్తుంది. ఒక్కోసారి సాధారణ, కార్పొరేట్, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అసంతృప్తుల్ని పరిగణనలోకి తీసుకుంటూ తగిన మార్పులు చేస్తుంది. ఇలా చేసిన బడ్జెట్ (ఫైనాన్స్ బిల్లు) కు లోక్ సభ, రాజ్య సభ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది. అక్కడ కూడా లాంఛనం పూర్తయ్యాక కొత్త ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.ఈ బడ్జెట్ పై ఎన్నో వర్గాలు రకరకాల ఆశలు పెట్టుకుంటాయి. ముఖ్యంగా బడ్జెట్ వస్తున్న ప్రతిసారీ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తూ... చివరకు నిట్టూర్పులు విడిచే వర్గం ఒకటి ఉంది. వారే పన్ను చెల్లింపుదారులు.ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు చేయాలని, ట్యాక్ రిబేటులు పెంచాలని వీరు ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే కార్పొరేట్ వర్గాలు తమ తమ రంగాలకు దక్కే ప్రయోజనాలకోసం డిమాండ్ చేస్తూ ఉంటాయి.స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే వేళ.. అంటే 2047 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారత దేశం) నినాదంతో నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు భారత్.. యువరక్తంతో ఉరకలేస్తోందని, రాబోయే 30 - 40 ఏళ్ళు మనవేనని, ప్రపంచమంతా మనవైపే ఆతృతగా ఎదురుచూస్తోంది ప్రధాన మంత్రి మోదీ చెబుతూ వస్తున్నారు. మరి ప్రధాని మాటలు కార్యరూపం దాల్చాలంటే అందుకు అనుగుణమైన కసరత్తు ఇప్పటినుంచీ జరగాలి. మోదీ 3.O లో వెలుగు చూడబోయే బడ్జెట్ ఇందుకు వేదికగా నిలవాలి. 2023 - 24 లో 8.2 శాతం వృద్ధి సాధించిన భారత ఆర్ధిక వ్యవస్థ... 2024 -25 లో 6 .5 శాతం వృద్ధికే పరిమితం కావచ్చనే అంచనాలున్నాయి. ఈనేపథ్యంలో జీడీపీ వృద్ధిని పెంచే దిశగా బడ్జెట్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం అవసరం. జాతీయ రహదారుల విస్తరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, తాగు నీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలి.మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రవేశపెడుతున్న తొలి పూర్తి బడ్జెట్ ఇదే. ఇప్పుడిప్పుడే ఎన్నికలు ఏమీ లేవు, కాబట్టి ఎన్నికల అనుకూల బడ్జెట్ గా ఉదారంగా వ్యవహరించే అవకాశం లేదు కాబట్టి తాజా బడ్జెట్ లో కొంత కరమైన నిర్ణయాలే వెలువడే అవకాశం ఉంది. రాబోయే బడ్జెట్ నుంచి ఏయే వర్గాలు ఏమేమి ఆశిస్తున్నాయో.. రాబోయే కథనాల్లో వివరంగా చర్చిద్దాం.స్టాక్ మార్కెట్ ఈసారి బడ్జెట్ వచ్చేది శనివారం. వాస్తవానికి ఆరోజు స్టాక్ మార్కెట్లు పనిచేయవు. కానీ బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించాలని స్టాక్ ఎక్స్చేంజిలు నిర్ణయించాయి. ఆరోజు యధావిధిగా స్టాక్ మార్కెట్లు ఉదయం 9.15 కి ప్రారంభమై మధ్యాహ్నం మూడున్నర వరకు కొనసాగుతాయి. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతాయి. బడ్జెట్ వెలువడే సమయంలోనూ... ముఖ్యంగా ఆర్ధిక మంత్రి రెండో పార్ట్ (ట్యాక్స్‌లకు సంబంధించి) చదివే వేళ మార్కెట్లో ఈ హెచ్చుతగ్గులు తారాస్థాయికి చేరతాయి.ఆ తర్వాత విశ్లేషకులు, ఆర్ధిక నిపుణులు వెలువరించే అభిప్రాయాలను బట్టి మార్పులకు లోనవుతూ ఉంటాయి. కాబట్టి సగటు మదుపర్లు ప్రధానంగా ట్రేడర్లు ఆరోజు ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. సాధ్యమైనంతవరకు ఆరోజు ట్రేడింగ్ కు దూరంగా ఉండటమే మేలు. అధిక స్థాయిలో లాభాలు రావడానికి ఎంత అవకాశం ఉందో భారీ నష్టాలు కళ్లజూసేందుకు కూడా అంతే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్, ఆర్ధిక విశ్లేషకులు

Janasena Cader Political Flex Viral Over AP Politics9
పవన్‌కు కొత్త ట్విస్ట్‌.. అన్నా ఎన్నాళ్లీ అవమానాలు!

అన్నయ్యా.. మేము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం కానీ నువ్వు విన్నావు కాదు.. మనం లేకుంటే వాళ్లకు కుర్చీ ఎక్కే ఛాన్స్ దక్కేనా?. అలాంటప్పుడు మనం గౌరవప్రదమైన సీట్లు తీసుకుని పోటీ చేద్దాం అంటే నువ్వు ఒప్పుకోలేదు.. జస్ట్ గుప్పెడు సీట్లు తీసుకుని వాటితో మనం చేసేదేం లేదు.మనం గేమ్‌లో అరటిపండులం అయిపోతాం తప్ప గేమ్ చేంజర్స్ కాలేం. వాళ్ళు ఆట ఆడుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలి. ఈ ఖర్మ మనకు ఎందుకు అన్నయ్యా.. కలలు కనండి.. అవి నిజం చేసుకోవడానికి కృషి చేయండి అని అబ్దుల్ కలాం చెప్పారు కానీ ఆయన మన సొంత కలలు నెరవేర్చుకోవడానికి కష్టపడాలని చెప్పారు తప్ప వేరే వారి కలలు నిజం చేసేందుకు మనం శ్రమించాలని చెప్పలేదు.వాళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తారు.. పాలనను అస్తవ్యస్తం చేస్తారు .. ఆ ఫెయిల్యూర్స్‌ను నీ మీద నెట్టేస్తారు చూస్తూండండి.. ఏదైనా మంచి జరిగితే వాళ్ళ ఖాతాలో వేసుకుని.. తప్పులన్నిటికీ మనను నిందిస్తారు.. ఎందుకొచ్చిన దరిద్రం మనకు.. బయటకు వెళ్ళిపోదాం.. ప్రతిపక్షంలో ఉందాం ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. మనకు ఈ అధికారం అనే లంపటం వద్దు.. అంటూ ఆవేదనతో జనసైనికులు కడపజిల్లాలో ఫ్లెక్సీలు కట్టారు.వాస్తవానికి పవన్ సపోర్ట్‌తోనే చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో గెలిచారని.. ఇంకా చెప్పాలంటే చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మడం లేదని.. ఆయన ఏనాడో విశ్వసనీయతను కోల్పోయారని.. కానీ కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెనకుండి.. బాబు ఇచ్చిన హామీలకు తానూ బాధ్యుడిగా ఉంటూ వాటిని నెరవేర్చే బాధ్యతను నెత్తిన పెట్టుకుంటానని చెప్పడంతోనే ప్రజలు విశ్వసించి ఈ కూటమికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారని కేడర్ భావిస్తోంది. అయితే ఎన్నికల సమయంలో కనీసం యాభై సీట్లయినా తీసుకోకుండా కేవలం 21 సీట్లలో పోటీ చేయడం ద్వారా ప్రభుత్వంలో క్రియాశీలకంగా.. కీలకంగా ఉండలేని పరిస్థితి వస్తోందని కేడర్‌ లోలోన బాధ పడుతోంది.పైగా చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌ను సైతం అడుగడుగునా అవమానిస్తున్నారని.. మొన్నటి దావోస్ సభలకు సైతం డిప్యూటీ సీంఎను తీసుకుని వెళ్లలేదని.. కేవలం చంద్రబాబు.. లోకేష్ వెళ్లి ఆయనను పక్కనబెట్టేశారని.. తీరా అట్నుంచి ఇద్దరూ ఒట్టి చేతులతో వచ్చారని ఆ ఫ్లెక్సీల్లో స్పష్టంగా పేర్కొన్నారు. వారిమీద నమ్మకం లేకనే పెట్టుబడులు రాలేదని.. అదే పవన్ వెళ్లి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని.. పవన్‌ను చూసి అయినా కనీసం నాలుగైదు కంపెనీలు వచ్చేవని అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అయినా అట్నుంచి వచ్చాక బాబును ఎలివేట్ చేస్తూ టీవీలు.. ఛానెళ్లలో ప్రోగ్రామ్‌లు నడుపుతున్నారని. కేడర్‌ ఆవేదన చెందుతోంది.తప్పులు చేసేది వాళ్ళు.. ఒప్పుకునేది మీరుతిరుమలలో తొక్కిసలాట వంటి ఘోరాలు జరిగినపుడు వారెవరూ తమకు సంబంధం లేనట్లు ఉంటారు.. మీరు మాత్రం నిజాయితీగా జనంలోకి వెళ్లి తప్పు ఒప్పుకుని క్షమాపణ చెబుతున్నారు. కానీ, ఆ ఘోరానికి కారణమైన చంద్రబాబు తాలూకా మనుషులు మాత్రం కనీసం చీమ కుట్టినట్టు అయినా భావించడం లేదు. మనం ప్రతిపక్షంలో ఉండి .. ప్రభుత్వాన్ని నిలదీస్తే బాగుండు.. అధికారంలో భాగమై ఎందుకూ విలువలేకుండా పోతున్నాం.. అంటూ ఏర్పాటైన ఫ్లెక్సీ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.సగటు జనసైనికుడి ఆవేదన.. అంతర్మథనాన్ని ఆ ఫ్లెక్సీలో పాయింట్లుగా రాసి అందర్నీ ఆలోచింపజేస్తున్నారని అంటున్నారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు జనసేన కేడర్‌ ఫోన్లలో సర్క్యులేట్ అవుతూ వారిని ఆలోచనలో పడేసింది. -సిమ్మాదిరప్పన్న.

How Robots Are Helping To Personalize Knee Replacement 10
నీ రీప్లేస్‌మెంట్‌ రోబో: సు'నీ'శితంగా శస్త్ర చికిత్స..

మోకాలి ఎముకల తాలూకు మృదులాస్థి (కార్టిలేజ్‌) అరిగాక... మోకాలి కదలికల్లో ఒకదానితో మరొకటి ఒరుసుకుంటే తీవ్రమైన నొప్పి రావడం... ఈ అరుగుదల తీవ్రత నాలుగో దశకు చేరాక మోకాలి మార్పిడి (నీ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ) అవసరం ఏర్పడటం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు సంప్రదాయ పద్ధతుల్లో చేసే నీ రీప్లేస్‌మెంట్‌ చికిత్సల స్థానంలో ఇప్పుడు రోబో సహాయంతో శస్త్రచికిత్స (రోబోటిక్‌ సర్జరీ) వంటి అధునాతన పద్ధతులు అమల్లోకొచ్చాయి. ఈ నేపథ్యంలో రోబోటిక్‌(Robots ) నీ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ(knee Replacement Surgery)తో ఉండే సౌలభ్యాలూ, అనుకూలత గురించి తెలుసుకుందాం. మోకాలి ఎముకల అరుగుదల అనేక విధాలుగా జరుగుతుంది. ఈ అరుగుదలను ఆర్థరైటిస్‌గా పేర్కొంటారు. ఇందులో దశలు ఉంటాయి. ఒకదశ దాటాక (నాలుగో దశ) ఇక మోకాలి మార్పిడి శస్త్రచికిత్స వల్లనే నొప్పి తగ్గుతుంది. గతంలోనూ... ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా సాధారణ సంప్రదాయ పద్ధతుల్లో శస్త్రచికిత్సలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల అనేక శస్త్రచికిత్స పద్ధతుల్లో వచ్చినట్టే మోకాలి మార్పిడి చికిత్సల్లో సైతం రోబోటిక్‌ సర్జరీ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అందునా ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో పనిచేస్తూ... అత్యంత సునిశితంగా (ప్రెసిషన్‌తో) శస్త్రచికిత్స చేయగల సామర్థ్యం ఉన్న అత్యాధునిక రోబోల సహాయాన్ని వైద్యులు తీసుకుంటున్నారు. సంప్రదాయ శస్త్రచికిత్సతో పోలిస్తే ఈ అధునాతన పద్ధతిలో జరిగే శస్త్రచికిత్సతో ప్రయోజనాలేమిటో చూద్దాం. కృత్రిమ పరికరాలు చాలాకాలం పాటు మన్నడం : లోపల అమర్చాల్సిన పరికరాలను చాలా సునిశితత్వంతో అత్యంత ఖచ్చితమైన స్థానాల్లో అమర్చడం వల్ల అవి త్వరగా రాసుకుపోవడం, ఒరుసుకు΄ోవడం జరగవు. దాంతో చాలాకాలం పాటు మన్నికతో ఉంటాయి. తక్కువ నొప్పి: రోబోటిక్‌ శస్త్రచికిత్సలో నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ దుష్ప్రభావాలు: చాలా ఖచ్చితత్వంతో శస్త్రచికిత్స జరిగిపోవడం వల్ల ఇన్ఫెక్షన్‌ వంటి దుష్ప్రభావాలు రావడం చాలా తక్కువ. టైలర్‌ సర్జికల్‌ అప్రోచ్‌ : అందరి దేహ భాగాలూ, వాటితో పనిచేసే తీరుతెన్నులు ఒకేలా ఉండవు. దాంతో బాధితుల మోకాలి చుట్టూ ఉండే టెండన్లు, లిగమెంట్లు సరిగ్గా అమరి΄ోయేలా వారి అవసరాలకు తగ్గట్లుగా కృత్రిమ ఉపకరణాల రూపకల్పన, లోపల వాటి అమరిక అత్యంత ఖచ్చితత్వంతో జరగడంతో గతంలోని వారి వ్యక్తిగత అవయవం లాగానే మోకాలి భాగాలు అమరిపోతాయి. ఇంకా చెప్పాలంటే సంప్రదాయ చికిత్సలో శస్త్రచికిత్స చేసి లోపలి భాగాలను చూసేవరకు కండరాల పరిస్థితి అంతగా తెలియదు. అనుభవజ్ఞులైన శస్త్రచికిత్స నిపుణులు తమ అంచనా ప్రకారం శస్త్రచికిత్స నిర్వహిస్తారు. అయితే రోబోటిక్‌ సర్జరీలో కండరాల తీరుతెన్నులు శస్త్రచికిత్స ముందే స్పష్టంగా తెలుస్తాయి. ఫలితంగా ఖచ్చితమైన శస్త్రచికిత్సకు అవకాశం దొరుకుతుంది. దాంతో శస్త్రచికిత్స తర్వాత మోకాలు ముందుకూ వెనక్కు కదలడం (ఎక్స్‌టెన్షన్, ఫ్లెక్షన్‌) వంటి కదలికలు చాలా బాగుంటాయి. అందునా మోకాలి దగ్గర వంగడం అనేది సంప్రదాయ చికిత్స కంటే మరింత ఎక్కువగా ఉంటుంది. బాగుంటుంది. మోకాలు ఒంచేటప్పుడు సైతం నొప్పి చాలా తక్కువ. వేగంగా కోలుకోవడం రోబోటిక్‌ శస్త్రచికిత్స అత్యంత సునిశితత్వంతో జరగడంతో గాయం చాలా త్వరగా తగ్గుతుంది. ఇక దుష్ప్రభావాలు (సైడ్‌ ఎఫెక్ట్స్‌) కూడా చాలా తక్కువగా ఉండటం ఫలితంగా చాలా వేగంగా కోలుకుని, చాలా త్వరగా ఇంటికెళతారు. మరింత ఎక్కువ సునిశితత్వం ఇలాంటి అత్యాధునిక రోబోల సహాయంతో చేసే శస్త్రచికిత్సలో సర్జన్‌ల ముందర బాధితుల తాలూకు మోకాలి 3–డి ఇమేజ్‌ స్పష్టంగా కనిపిస్తుంటుంది. సంప్రదాయ చికిత్సల్లో ఇది అంత పూర్తిగా, స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఫలితంగా కృత్రిమ మోకాలి ఎముకల భాగాల్ని అమర్చేటప్పుడు మునుపు ఉన్నట్లే సరిగ్గా అమరిపోయేలా అమర్చడానికి వీలవుతుంది. ఎవరికి ఈ శస్త్రచికిత్సలుగతంలో శస్త్ర చికిత్స చేయించుకుని విఫలమైనవాళ్లు (వీళ్లలో మోకాలి దగ్గర కదలికలు చాలా పరిమితంగా ఉండటం, కాలు కదిలిస్తున్నప్పుడు నొప్పి ఉండటం వంటి లక్షణాలుంటాయి), అరుగుదల చాలా ఎక్కువగా (సివియర్‌ ఆస్టియో ఆర్థరైటిస్‌) ఉన్నవారికి, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో బాధపడుతుండేవారికి, అలాగే ఇక నొప్పి నివారణ మందులూ, ఇతర చికిత్సలు పనిచేయని వారికి ఈ రోబోటిక్‌ శస్త్రచికిత్స ఎంతగానో ఉపయోగపడుతుంది. (చదవండి: ఆ టైమ్‌లోనూ ఐరన్‌ యువతిలా...)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
‘ఆపిల్‌ చక్రవర్తి’కి పద్మశ్రీ.. జాతీయ వినూత్న వ్యవసాయవేత్తగానూ గుర్తింపు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.

title
వేరే అమ్మాయి ఫోటోకు ఎందుకు లైక్‌ కొట్టావ్‌..

బనశంకరి: సోషల్‌ మీడియా గొడవల వల్ల ప్రాణాలను తృణప్రాయంగా వదిల

title
బస్సు ప్రయాణికురాలి తల కట్‌

మైసూరు: కిటికీలో తల, చేతులు బయటపెట్టరాదు అని బస్సుల్లో హెచ్చ

title
గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

ఢిల్లీ : క్తరవ్యపథ్‌ వేదికగా ఢిల్లీలో 76వ గణతంత్ర వేడుకలు (7

title
Republic Day 2025: మువ్వన్నెల రైల్వే స్టేషస్లు.. మురిసిపోతున్న ప్రయాణికులు

గణతంత్ర వేడుకల సందర్భంగా దేశమంతా త్రివర్ణమయంగా మారిపోయింది.

International View all
title
ట్రంప్‌ నిర్ణయం: అమాంతం పెరిగిన గుడ్ల ధరలు

అమెరికా జనం గుడ్లు కొనుగోలు చేయాలంటే బెంబేలెత్తిపోతున్నారు.

title
జనాభా తగ్గుతోంది... వృద్ధులు పెరుగుతున్నారు 

ఇటు జనాభా క్షీణిస్తోంది. అటు వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చైనా సహా అనేక దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లివి.

title
వైట్‌ హౌస్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా కుష్‌ దేశాయ్‌ 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ డిప్యూటీ ప్రెస

title
వెనక్కి పంపేస్తున్నాం.. మాకు వద్దే వద్దు 

మెక్సికో గుండా శరణార్థులుగా చొరబడిన వారందరినీ వెనక్కి పంపేస్తామంటూ అమెరికన్లకు ఇచ్చిన వాగ్దానాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ నెర

title
అటు నలుగురు.. ఇటు 200

టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్‌–హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరువ

NRI View all
title
రాణాకు మూసుకుపోయిన దారులు.. ఇక భారత్‌కు అప్పగింతే!

వాషింగ్టన్‌: ముంబయి దాడుల కేసు కీలక నిందితుడైన తహవూర్‌ రాణాన

title
ట్రంప్‌ పాలసీ.. భారతీయ అమెరికన్లకు మేలు కూడా!

అగ్రరాజ్యం అధ్యక్షుడి(47)గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్‌ భ

title
Birthright citizenship : ట్రంప్‌ ఆర్డర్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్‌ఆర్‌ఐలకు భారీ ఊరట

అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్‌ (

title
USA: టీటీఏ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది

వాషింగ్టన్‌: మన తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (TTA) అ

title
కాన్సస్‌లో దిగ్విజయంగా నాట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌

అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..

Advertisement
Advertisement