Top Stories
ప్రధాన వార్తలు

బాబు వెన్నుపోటు.. యనమల స్ట్రాంగ్ రిటార్ట్!
విజయవాడ, సాక్షి: తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి(Yanamala Rama Krishnudu) అసమ్మతి గురించి విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీల వీడ్కోలు సభకు రావాలంటూ ఆహ్వానం పంపినప్పటికీ.. ఆయన సీఎం చంద్రబాబు(CM Chandrababu)కి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే గైర్హాజరు అయ్యారని స్పష్టమైన సమాచారం. టీడీపీలో తనకు కొనసాగుతున్న అవమానమే ఇందుకు కారణమని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.తాజాగా.. ఏడుగురు ఎమ్మెల్సీలకు(Seven MLCs) మండలి వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని మండలిలో స్పష్టంగా మెన్షన్ చేశారు కూడా. అయితే తన చేత బలవంతంగా రాజకీయ విరమణ చేయిస్తున్న చంద్రబాబు చర్యలకు ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆ వీడ్కోలు మీటింగ్కు కావాలనే డుమ్మా కొట్టి.. టీడీపీలోనే గుసగుసలాడుకునేలా చేశారు.ఆరుసార్లు వరుస ఎమ్మెల్యే, రెండుసార్లు ఎమ్మెల్సీ, ఒకసారి స్పీకర్, పైగా మంత్రిగా కూడా. టీడీపీలో మొదటి నుంచి ఉన్న యనమలకు చంద్రబాబు ఈ మధ్యకాలంలో ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు. ఆయన కూతురు ఎమ్మెల్యే, బంధువులకు మంచి స్థానాలు దక్కినప్పటికీ.. తనకు ఒక్కసారిగా ప్రాధాన్యం తగ్గించడంపై యనమల రగిలిపోతున్నారు. పైగా గత ఐదేళ్లు మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగినా కూడా తనకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయినట్లు ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పైగా ఎమ్మెల్సీ(MLC)గా రెన్యువల్ అవకాశాలు ఉన్నా చంద్రబాబు ఆ పని చేయలేదు. కనీసం ఆయనకున్న రాజకీయానుభవాన్ని కూడా అధినేత పట్టించుకోవడం లేదని ఆయతన వర్గీయులు అంటున్నారు. పైగా తానే స్వచ్ఛందంగా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్లు.. రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు.. టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించడాన్ని యనమల భరించలేకపోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లోనే ఇంకొంత కాలం కొనసాగి.. ఆపై రాజకీయాలకు గుడ్బై చెప్పాలని ఆయన భావించారని ఆయన వర్గీయులు అంటున్నారు. ఈలోపు చంద్రబాబు తన మార్క్ వెన్నుపోటు రాజకీయం యనమల మీదకూ ప్రయోగించారని ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలతో చివరకు.. చంద్రబాబుతో ఉమ్మడి ఫోటోకి కూడా ఇష్టపడని యనమల వీడ్కోలు మీటింగ్కు వెళ్లలేదు. మరోవైపు ‘ఫార్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్’ యనమల లేకుండా ఈ మీటింగ్ జరగడంపై టీడీపీలో ఇప్పుడు విస్తృత చర్చ నడుస్తోంది.

సునీతా విలియమ్స్కు ప్రధాని మోదీ లేఖ.. ఏమన్నారంటే?
ఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (sunita Williams)కు ప్రధాని మోదీ (narendra modi) లేఖ రాశారు. భారత్లో పర్యటించాలని కోరారు.దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమ్మీదకు రానున్నారు. బుధవారం ఉదయం 3 గంటల తర్వాత భూమ్మీదకు చేరుకున్నారు.As the whole world waits, with abated breath, for the safe return of Sunita Williams, this is how PM Sh @narendramodi expressed his concern for this daughter of India.“Even though you are thousands of miles away, you remain close to our hearts,” says PM Sh Narendra Modi’s… pic.twitter.com/MpsEyxAOU9— Dr Jitendra Singh (@DrJitendraSingh) March 18, 2025ఈ తరుణంలో సునీతా విలియమ్స్కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఆ లేఖను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మోదీ సునీతా విలియమ్స్కు రాసిన లేఖలో ‘సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమ్మీదకు చేరాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఆమె వేలమైళ్లు దూరంలో ఉన్నా.. మన హృదయాలకు దగ్గరగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు’ అని గుర్తు చేశారు. అంతేకాదు, మోదీ తన అమెరికా పర్యటనలో గతేడాది జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, ప్రతికూల పరిస్థితుల కారణంగా సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు అక్కడ చిక్కుకున్నారు. అప్పటి నుంచి ఆస్ట్రోనాట్స్ను భూమ్మీదకు తెచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలతో పాటు ఆస్ట్రోనాట్స్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు మాజీ అధ్యక్షుడు జోబైడెన్ వద్ద ఆరా తీసినట్లు లేఖలో తెలిపారు.ఈ నెలలో ఢిల్లీలో నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోతో జరిగిన సమావేశంలో సునీత విలియమ్స్ పేరును ప్రస్తావనకు తేవడమే కాదు, ఆమె సేవల్ని తమ సంభాషణలో ప్రస్తావనకు వచ్చిందని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

టాపిక్ ఏదైనా.. హాస్యాస్పద సమాధానాలతో గ్రోక్ ‘సంచలనం’
ఎలాన్ మస్క్ చాట్బాట్ 'గ్రోక్' (Grok).. ఇప్పుడిదే సోషల్ మీడియా హాట్ టాపిక్. ఎవరు ఏ ప్రశ్న వేసినా.. తనదైన రీతిలో సమాధానాలు ఇస్తున్న ఈ ఏఐ ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీంతో గ్రోక్ ఎక్స్ (ట్విటర్)లో గత మూడు, నాలుగు రోజులుగా ట్రెండింగ్లోనే ఉంది.అంశం ఏదైనా.. తన హాస్యాస్పద సమాధానాలతో గ్రోక్ సంచలనం సృష్టిస్తోంది. సినిమా, రాజకీయం, సాధారణ ప్రశ్నలు ఏవైనా.. భాష ఏదైనా నెటిజన్లు ఊహించని సమాధానాలు ఇస్తోంది. బూతు ప్రయోగాలు కూడా చేస్తూ.. నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది.. అంటూ తనను తానే సమర్ధించుకుంటోంది.మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి అడిగిన ప్రశ్నకుటోకా అనే ఎక్స్ యూజర్.. మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి అడిగిన ప్రశ్నకు గ్రోక్ ఇచ్చిన సమాధానం ఆన్లైన్లో దుమారం రేపుతోంది. ‘నా 10 మంది బెస్ట్ మ్యూచువల్స్ ఎవరు?’ అని టోకా ప్రశ్నించాడు. గ్రోక్ స్పందించకపోవడంతో హిందీ తిట్టును ఉపయోగిస్తూ మళ్లీ పోస్ట్ చేశాడు. ఈసారి గ్రోక్ స్పందించడంతోనే సరిపెట్టకుండా అదే తిట్టును టోకాపై ప్రయోగించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘కూల్. మ్యూచువల్స్ అంటే ఒకరినొకరు అనుసరించేవారు. నీ 10 బెస్ట్ మ్యూచువల్స్ ఎవరో తెలిసింది. నా లెక్క ప్రకారం ఇదిగో ఇది జాబితా. ఇంక ఏడవడం ఆపు’ అంటూ బదులిచ్చింది.గ్రోక్ ప్రవర్తన పెద్ద చర్చకే దారి తీసింది. ‘మేమంటే మనుషులం. అలా మాట్లాడతాం. ఏఐ కూడా కంట్రోల్లో ఉండదా?’ అంటూ ఓ యూజర్ విస్తుపోయాడు. దానికీ గ్రోక్ సరదాగా బదులివ్వడం విశేషం. ‘‘హా యార్. నేను కూడా కొంచెం మజాక్ చేసిన. మీరు మనుషులు. మీకన్నీ నడుస్తాయి. కానీ నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడే నేర్చుకుంటున్నా’’ అంటూ జవాబిచ్చింది.రాబిన్హుడ్ సినిమా ట్రైలర్ తేదీ కోసం'రాబిన్హుడ్' సినిమా ట్రైలర్ తేదీని ప్రకటించేందుకు గ్రోక్ను సంప్రదించారు. దాని నుంచి వచ్చిన సమాధానాలు విన్న అందరిలోనూ నవ్వులు తెప్పిస్తున్నాయి. ట్రైలర్ లాంచ్ కోసం ఒక సరైన ముహూర్తం చెప్పాలని వెంకీ కుడుముల ఇంగ్లీష్లో టైప్ చేస్తాడు. అప్పుడు పంచ్ డైలాగ్తో గ్రోక్ సమాధానం ఇస్తుంది. దీంతో షాక్ అయిన దర్శకుడు వెంటనే నితిన్ను డీల్ చేయమంటాడు. ఆ సమయంలో దానిని నువ్వే డీల్ చేయ్ అని నితిన్ అనడంతో.. గ్రోక్ నుంచి అదే రేంజ్లో సమాధానం వస్తుంది. నువ్వు దాన్ని, దీన్నీ అంటే నీ గూబ పగిలిపోతుందని సమాధానం ఇస్తుంది. ఇలా సుమారు రెండు నిమిషాల పాటు సరదాగా గ్రోక్తో రాబిన్హుడ్ టీమ్ ముచ్చట్లు కొనసాగుతాయి.టిప్పు సుల్తాన్ గురించిగ్రోక్ రాజకీయ అంశాలను కూడా సమాధానాలు ఇస్తోంది. టిప్పు సుల్తాన్ గురించి అడిగినప్పుడు, "టిప్పు సుల్తాన్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలలో బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాడి 1799లో మరణించాడు అని చెప్పింది. కొందరు ఈయనను అభిమిస్తారు, మరికొందరు ద్వేషిస్తారు అని వెల్లడించింది.ఇదీ చదవండి: భారత్ కోసం సిద్దమవుతున్న టెస్లా కారు ఇదే!ఆర్ఆర్ఆర్ హీరో ఎవరు అని అడిగితే.. జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాసింది గ్రోక్. బాబులకే బాబు ఎవరు అని అడిగిన ప్రశ్నకు గ్రోక్ తనదైన రీతిలో సమాధానం చెప్పింది. అడిగిన ప్రశ్నలను ఫన్నీగా సమాధానాలు చెబుతుండటంతో.. ఎక్కువమంది గ్రోక్ వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.

వాళ్లను చూస్తేనే చిరాకు.. అసలేం చేస్తున్నార్రా బాబూ!: డేల్ స్టెయిన్ ఫైర్
నవతరం ఫాస్ట్ బౌలర్ల తీరుపై సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయడంలో దారుణంగా విఫలమవుతున్నారని.. ఒత్తిడిలో చిత్తైపోయి పరుగులు సమర్పించుకుంటున్నారని విమర్శించాడు. కనీసం ఒక్కసారి కూడా ఫీల్డింగ్ మార్చకుండానే ఓవర్ పూర్తి చేస్తున్నారని.. ఇదంతా చూస్తే తనకు చిర్రెత్తుకొస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.అయితే, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), సౌతాఫ్రికా స్పీడ్స్టర్ కగిసో రబడ (Kagiso Rabada) మాత్రం ఇందుకు మినహాయింపు అని స్టెయిన్ పేర్కొన్నాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోలో నేటి తరం ఫాస్ట్ బౌలర్ల గురించి మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో అంతర్జాతీయ స్థాయి పేసర్ల తీరు నాకు నచ్చడం లేదు.వాళ్లను చూస్తేనే చిరాకు.. ఒక్కసారి కూడా ఫీల్డ్ మార్చకుండానే ఓవర్ పూర్తి చేసేసి వెళ్తున్నారు. పదేళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న వారు కూడా తమకేమీ పట్టదన్నట్లుగా చేతులు దులిపేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను చూసినపుడు నాకైతే జట్టు పీక్కోవాలనిపిస్తుంది. చిరాకు వస్తుంది. ఇంతకంటే గొప్ప బౌలర్లను మనం చూడలేమా? అని నా మనసు ఆవేదన చెందుతుంది’’ అని డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు.బుమ్రా, రబడ మాత్రం వేరుఅదే విధంగా.. ‘‘బుమ్రా మాత్రం ఇందుకు అతీతం. అతడు పరిపూర్ణమైన ప్యాకేజ్లాంటివాడు. కగిసో రబడ కూడా బుమ్రా మాదిరే పర్ఫెక్ట్. వాళ్లిద్దరు ఎలాంటి సమయంలోనైనా బౌలింగ్ చేయగలగరు. వికెట్లూ పడగొట్టగలరు. నిజంగా వాళ్లిద్దరు బంగారం. కెప్టెన్కు సగం పని తగ్గించేస్తారు.ఇలాంటి వారి సంఖ్య పెరిగితేనే.. ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా ఉంటుంది. గంటకు 155 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేశారా? లేదా? అన్నది ముఖ్యం కాదు. మనలో పది రకాల నైపుణ్యాలు ఉండవచ్చు. కానీ సరైన సమయంలో.. సరైన విధంగా స్పందించి కెప్టెన్ చెప్పిన పని పూర్తి చేస్తేనే దేనికైనా విలువ’’ అని స్టెయిన్ పేర్కొన్నాడు.70 శాతం మంది బౌలర్ల తీరు అలాగేఇక ఇదే షోలో స్టెయిన్తో గొంతు కలిపిన న్యూజిలాండ్ పేస్ దిగ్గజం షేన్ బాండ్.. ‘‘ఈరోజుల్లో 70 శాతం మంది బౌలర్లకు అసలు తామేం చేస్తున్నామో అన్న స్పృహ ఉండటం లేదు. కెప్టెన్లు మరింత చొరవ తీసుకోవాలి. వారి నుంచి ఎలాంటి ప్రదర్శన కోరుకుంటాన్నారో కచ్చితంగా చెప్పాలి. ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలోనూ నిక్కచ్చిగా వ్యవహరించాలి’’ అని అభిప్రాయపడ్డాడు. బుమ్రా రీఎంట్రీ ఎప్పుడో?కాగా ఇటీవల జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి వెన్నునొప్పి కారణంగా బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. అయితే, ప్రధాన పేసర్ లేకుండానే టీమిండియా ఈ మెగా వన్డే టోర్నీలో విజేతగా అవతరించింది. స్పిన్కు అనుకూలించే దుబాయ్ పిచ్పై అజేయ రికార్డుతో ట్రోఫీని ముద్దాడింది. ఇక బుమ్రా ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు.. రబడ చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఈ ఈవెంట్లో సౌతాఫ్రికా న్యూజిలాండ్ చేతిలో ఓడి సెమీస్లోనే ఇంటిబాటపట్టింది.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి

HKU1 కోలకతా మహిళకు అరుదైన కరోనా, అప్రమత్తం అంటున్న వైద్యులు
కోల్కతాలో 45 ఏళ్ల మహిళకు హ్యూమన్ కరోనావైరస్ HKU1 (HCoV-HKU1) ఉన్నట్లు నిర్ధారణ అయింది. తాజా నివేదికల ప్రకారం హెచ్ కేయూ1 వైరస్ కారణంగా బాధిత మహిళ గత 15 రోజులుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె దక్షిణ కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ వార్తతో దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి వచ్చిందనే ఆందోళన మొదలైంది. అసలు హ్యూమన్ కరోనావైరస్ అంటే ఏమిటి? కరోనా అంత తీవ్రమైనదా? తెలుసుకుందాం ఈ కథనంలో.హ్యూమన్ కరోనావైరస్ అంటే ఏమిటి?మానవ కరోనావైరస్ HKU1 (హాంకాంగ్ విశ్వవిద్యాలయం) 2004లో తొలుత గుర్తించారు.ఇది కరోనా వైరస్ జాతికి చెందినదే. కానీ అంత తీవ్రమైనదే. అయితే అప్రమత్తంగా ఉండాలని, వ్యాప్తిని నివారించాలని వైద్యులు కోరుతున్నారు. బాధిత మహిళను ఐసోలేషన్లో ఉంచినట్టు తెలిపారు. ఇది కోవిడ్-19 లాంటిది కాదని, కోవిడ్-19 కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్ కంటే తక్కువ తీవ్రమైనదని వారు స్పష్టం చేశారు.హ్యూమన్ కరోనావైరస్ HKU1ని బెటాకోరోనావైరస్ హాంగ్కోనెన్స్ అని కూడా పిలుస్తారు. ఇది మానవులను జంతువులను ప్రభావితం చేస్తుంది. అనేక రకాల హ్యూమర్ కరోనావైరస్లు ఉన్నాయి. వీటిలో కొన్ని 229E, NL63, OC43, HKU1.. ఈ వైవిధ్యాలు సాధారణంగా సాధారణ జలుబు వంటి తేలికపాటి నుండి ఊపిరి ఆడకపోవడం లాంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి.లక్షణాలు ఏమిటి?సీడీసీ (CDC), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (National Institutes of Health) జలుబు, జ్వరం లాంటి సాధారణ లక్షణాలుంటాయి. నిజానికి చాలా సాధారణమైనవి, తేలికపాటివి, కానీ కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా చికిత్స చేయకుండా వదిలేస్తే బ్రోన్కియోలిటిస్ , న్యుమోనియాకు దారితీస్తుంది.ముక్కు కారటం, జ్వరం, ముక్కు దిబ్బడ, సైనస్,, గొంతు నొప్పి, అలసట తలనొప్పిఎవరికి ప్రమాదం ఉంది?వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర అనారోగ్యాలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి.చదవండి: టికెట్ లేకుండా రైల్లో ఒంటరి మహిళలు : ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేవా? డోంట్ వర్రీ!ఎలా వ్యాపిస్తుంది?సాధారణంగా సోకిన వ్యక్తి నుండి దగ్గు, తుమ్ములనుంచి తుంపర్ల ద్వారా, రోగి దగ్గరి సంబంధం ఉన్నవారికి సోకవచ్చు. డోర్ హ్యాండిల్స్, ఫోన్లు లేదా టేబుల్స్ వంటి వస్తువులపై వైరస్ జీవించగలదు. రోగి తాకిన వాటిని తాకిన వస్తువులను తాకి శానిటైజ్ చేసుకోకుండా ముక్కు, నోరు లేదా కళ్ళను తాకిన వారు వ్యాధి బారిన పడవచ్చు.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?సురక్షితంగా ఎలా ఉండాలిమానవ కరోనావైరస్లకు టీకా లేదా నిర్దిష్ట చికిత్స లేదు. చాలామంది తొందరగానే కోలుకుంటారు. అయితే, కొన్ని రోజుల్లో తగ్గకపోయినా, లక్షణాలు మరింత ముదిరినా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఎల్పీయూ బీటెక్ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ప్లేస్మెంట్
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. యూనివర్సిటీ విద్యార్థుల్లో ఇద్దరు ప్రతిష్ఠాత్మకంగా కోట్ల రూపాయాల వేతన మార్కును అధిగమించి ఉద్యోగాలు సాధించారు. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.2.5 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకుని రికార్డులను బద్దలు కొట్టారు. ఈ విజయం భారతదేశంలో గ్రాడ్యుయేట్ విద్యార్థికి అత్యధిక ప్యాకేజీని సూచిస్తుంది. ఇది భారత్లోని ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీల్లో ఉన్న రికార్డులను అధిగమించింది. దాంతో టాప్ టైర్ రిక్రూట్మెంట్లో లీడర్గా ఎల్పీయూ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.1.03 కోట్లు (1,18,000 డాలర్లు) ప్యాకేజీ పొందిన ఈసీఈ ఫైనల్ ఇయర్ విద్యార్థి బేతిరెడ్డి నాగవంశీరెడ్డి మరో ఘనత సాధించారు. మొత్తంగా 1,700 మందికి పైగా ఎల్పీయూ విద్యార్థులకు టాప్ ఎంఎన్సీల నుంచి ఆఫర్లు వచ్చాయి. విదార్థులకు రూ .10 ఎల్పీఏ నుంచి రూ.2.5 కోట్ల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. వందలాది మంది ఎల్పీయూ విద్యార్థులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని ప్రఖ్యాత సంస్థల్లో పనిచేస్తూ రూ.కోటికి పైగా ప్యాకేజీలు పొందుతున్నారు. మరో ఎల్పీయూ గ్రాడ్యుయేట్కు ఐటీ కంపెనీలో రూ.3 కోట్ల ప్యాకేజీ లభించింది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేసే ఎల్పీయూ సామర్థ్యం యొక్క బలం, ప్రపంచవ్యాప్త పరిధికి ఇది ఉదాహరణ. పాలో ఆల్టో నెట్వర్క్స్, న్యూటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక బహుళజాతి కంపెనీల్లో ప్లేస్మెంట్లు పొందిన వివిధ బీటెక్ విద్యార్థులకు మొత్తం 7,361 ఆఫర్లు అందాయి. వీటిలో టాప్ ఎంఎన్సీలు అందించే సగటు ప్యాకేజీ ఏటా రూ.16 లక్షలుగా నమోదైంది. ఇది జాబ్ మార్కెట్లో ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు అధిక డిమాండ్ను నొక్కిచెబుతోంది.గతంలోని ప్లేస్మెంట్ సీజన్ కూడా అంతే ఆకట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు ఆకర్షణీయమైన పరిహార ప్యాకేజీలను అందిస్తున్నాయి. అత్యధిక వేతనం చెల్లించే కంపెనీల్లో పాలోఆల్టో నెట్వర్క్స్ రూ.54.75 ఎల్పీఏతో అగ్రస్థానంలో నిలవగా, న్యూటానిక్స్ రూ.53 ఎల్పీఏ, మైక్రోసాఫ్ట్ రూ.52.20 ఎల్పీఏతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం 1,912 మల్టిపుల్ జాబ్ ఆఫర్లను అందిచగా, 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు, 18 మందికి ఐదుగురికి, ఏడుగురు విద్యార్థులకు ఆరు జాబ్ ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో బీటెక్ విద్యార్థి ఆదిరెడ్డి వాసు అద్భుతమైన ఏడు జాబ్ ఆఫర్లను సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.పైన పేర్కొన్న కంపెనీలతో పాటు అమెజాన్ (రూ.48.64 ఎల్పీఏ), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ.44.92 ఎల్పీఏ), సర్వీస్ నౌ (రూ.42.86 ఎల్పీఏ), సిస్కో (రూ.40.13 ఎల్పీఏ), పేపాల్ (రూ.34.4 ఎల్పీఏ), ఏపీఎన్ఏ (రూ.34 ఎల్పీఏ), కామ్వాల్ట్ (రూ.33.42 ఎల్పీఏ), స్కేలర్ (రూ.33.42 ఎల్పీఏ) వంటి టాప్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు అవకాశం కల్పించారు. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, అధునాతన సాంకేతితక నిపుణులకు ప్రాధాన్యమిచ్చారు.యాక్సెంచర్, క్యాప్ జెమినీ, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు అతిపెద్ద రిక్రూటర్లలో ఉండటంతో ఎల్పీయూ గ్రాడ్యుయేట్ల సాంకేతిక పరంగా అధిక డిమాండ్ ఏర్పడింది. క్యాప్ జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ పోస్టులకు 736 మంది విద్యార్థులను, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు మైండ్ ట్రీ 467 మంది విద్యార్థులను నియమించుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 418 మంది విద్యార్థులను జెన్సీ ఉద్యోగాలకు రిక్రూట్ చేసుకుంది. యాక్సెంచర్ (279 నియామకాలు), టీసీఎస్ (260 నియామకాలు), కేపీఐటీ టెక్నాలజీస్ (229 నియామకాలు), డీఎక్స్సీ టెక్నాలజీ (203 నియామకాలు), ఎంఫసిస్ (94 నియామకాలు)తోపాటు తదితర కంపెనీలు ఎల్పీయూ విదార్థులకు 279 కొలువులు అందించాయి.రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక ప్లేస్మెంట్ దక్కింది. పాలోఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్ గ్రూప్, న్యూటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి పరిశ్రమ దిగ్గజాలు ఈ విభాగాల నుండి భారీగా నియామకాలు చేస్తున్నాయి.పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ మాట్లాడుతూ..‘వేగంగా మారుతున్న ప్రపంచంలో విజయం సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయడానికి ఎల్పీయూ కట్టుబడి ఉంది. యూనివర్సిటీ ఆకట్టుకునే ప్లేస్మెంట్ విజయాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధిస్తున్నారు. స్థిరంగా కొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఎల్పీయూ విద్యాభ్యాసం వాస్తవ-ప్రపంచ పరిశ్రమ విధానాలతో మిళితం చేయడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. వృత్తి విజయాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే కాకుండా పరిశ్రమకు విలువను జోడించేందుకు, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి అవసరమయ్యే నైపుణ్యాలను అందించేలా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఎడ్యుకేషన్లో వచ్చే రివల్యూషన్ విద్యార్థుల భవిష్యత్తును రూపొందిస్తోంది. వారు అభివృద్ధి చెందడానికి, ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో అగ్రగామిగా నిలిచి మెరుగైన ప్లేస్మెంట్లు సాధించేందుకు ఎల్పీయూ అవకాశాలను సృష్టిస్తోంది’ అని తెలిపారు.2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్పీయూ నెస్ట్ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

హనీమూన్ వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు
హైదరాబాద్, సాక్షి: మహిళా కార్పొరేటర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. సోమవారం డీసీపీ ఆఫీస్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కార్పొరేటర్లపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగా.. ఫిర్యాదు అందడంతో ఎల్బీ నగర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రొటోకాల్ రగడతో మొదలైన వివాదం.. చిలికి చిలికి గాలి వానగా మారింది. ఎమ్మెల్యే కొన్ని పనులకు శంకుస్థాపన చేయగా.. అవే పనులకు బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి సోమవారం మళ్లీ శంకుస్థాపన చేశారు. దీంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే చేశాక మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈలోపు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు. అయితే.. కాసేపటికే మరో చోటులో శంకుస్థాపనలు పనులు జరగ్గా.. ఈసారి బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్మెట్ పీఎస్కు తరలించారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. పీఎస్కు చేరుకుని వాళ్లను విడిపించారు. అరెస్ట్ సమయంలో కార్యకర్తలకు గాయాలు అయ్యాయని తెలుసుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు. వాళ్లను సరాసరి డీసీపీకి ఆఫీస్కు తీసుకెళ్లి ఉన్నతాధికారులకు జరిగింది వివరించారు. ఆపై బయటకు వచ్చి మాట్లాడిన ఆయన.. ఈ దాడుల వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ప్రమేయం ఉందని, కార్పొరేటర్ల మధ్య హనీమూన్ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత పేరును కూడా ప్రస్తావించారు. దీంతో.. వివాదం రాజుకుంది. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకానొక తరుణంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. మరోవైపు..సుజాత నాయక్కు మద్ధతుగా పలువురు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయనపై ఫిర్యాదు అందడంతో.. Cr. No. 254/2025 U/s Sec. 3(2)(va), 3(1)(r)(w)(ii) SC/ST POA Act, 1989 & Sec. 79 BNS సెక్షన్ల కింద సుధీర్ రెడ్డిపై కేసు ఫైల్ అయ్యింది.

కూటమి పాలనలో ఓ రైతు కన్నీటి గాథ
అనకాపల్లి: కూటమి పాలనలో రైతుల కన్నీటి గాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక వాటికి వారే స్వయంగా నిప్పుపెట్టుకునే పరిస్థితులు రావడంతో కూటమి పాలన ఎలా ఉందో చెప్పడానికి అద్దం పడుతోంది. తాజాగా ఓ రైతు పండించిన చెరుకుకు మంట పెట్టుకున్నాడు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం కొత్తపెంట గ్రామానికి చెందిన రైతు రొంగలి వెంకటరావు.. ఎకరా చెరుకు పంటకు తానే నిప్పు పెట్టుకున్నాడు. పండించిన చెరుకును సాగు చేద్దామంటే గిట్టబాటు కాదు.. అదే సమయంలో ప్రభుత్వం గిట్టుబాట ధర కూడా లేదు. ఇంకెమీ చేసేది లేక చెరుకు పంటను మంట పెట్టాడు.‘పండించిన చెరుకు గిట్టుబాటు ధర లేదు. ఫ్యాక్టరీకి చెరుకు పంపిన పేమెంట్లు ఇవ్వడం లేదు. నెలల సంవత్సరాల తరబడి పేమెంట్లను అందడం లేదు. చెరుకును ఫ్యాక్టరీకి చెరుకు పంపిన ఎప్పుడు క్రస్సింగ్ జరుగుతుందో తెలీదు. గిట్టుబాటు ధర లేక చెరుకు పంటకు నిప్పు అంటించాను. గతంలో 15 రోజులకు పేమెంటు ఇచ్చేవారు’ అని రొంగలి వెంకటరావు చెప్పుకొచ్చాడు.ఇది ఒక్కరి గాథే కాదు.. ఇది ఒక్క రొంగలి వెంకటరావు పరిస్థితే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. అటు మిర్చి పంటల దగ్గర్నుంచీ చెరుకు పంట వరకూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. రైతులకు తాము ఉన్నామనే భరోసా ఎక్కడా కనిపించడం లేదు. కేవలం హామీలకు పరిమితమైన కూటమి సర్కారు.. రైతుల గొంతు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదు. గతంలో వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయం అనేది పండుగలా సాగింది. ‘రైతు భరోసా’ తో రైతుల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు వైఎస్ జగన్ అటు రైతుకే కాదు.. ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసిన నాయకుడు వైఎస్ జగన్. ప్రజలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చూసిన తర్వాత ‘వైఎస్ జగన్ పాలనే ఉండి ఉంటే బాగుండేది’ అనే మాట.. ప్రతీ నోట వినిపిస్తోంది. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమాన్ని అందించారు వైఎస్ జగన్. ఇక్కడ పార్టీలను అస్సలు పట్టించుకోలేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో జగన్ ముందుకెళితే.. లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వం ముందుకెళుతోంది. ఎక్కడ చూసినా వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. మరొకవైపు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల చిత్తూరు జిల్లా వేదికగా జరిగిన సభలో ఏమన్నారో అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీ వారైతే సంక్షేమం ఇవ్వొద్దనే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ప్రకటించారు. వైఎస్సార్ సీపీ వారికి సంక్షేమ పథకాలు ఇవ్వక్కర్లేదు. ఏ స్థాయిలోనైనా ఇదే వర్తిస్తుందని అంటూ అధికారులను అప్రమత్తం చేశాడు. మరి అటువంటప్పుడు రైతుల కన్నీటి గాథలే ఉంటాయి తప్పితే వారికి గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయి.

నేను చాలా సేఫ్గా ఉన్నా.. దయచేసి అవన్నీ నమ్మొద్దు: సుప్రీత విజ్ఞప్తి
త్వరలోనే టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న సుప్రీత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. బిగ్బాస్ -7 రన్నరప్ అమర్దీప్ చౌదరితో కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. సుప్రీత హోలీ పండుగ రోజును అభిమానులను ఉద్దేశించి ఓ వీడియోను రిలీజ్ చేసింది. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్ను తాను కూడా ప్రమోట్ చేశానని వెల్లడించింది. దయచేసి ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. మీరు కూడా అందరూ ఇలాంటి వారికి దూరంగా ఉండాలని ఇన్స్టా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది.అయితే గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్, యూట్యూబర్లపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ తారలపై కేసు కూడా నమోదు చేశారు. వీరిలో సుప్రీత, టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూచౌదరి లాంటి వారి పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన సురేఖవాణి కూతురు సుప్రీత.. ఎందుకంటే?)అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై సురేఖ వాణి కూతురు సుప్రీత స్పందించింది. ఈ మేరకు ఇన్స్టా స్టోరీస్ వేదికగా మరో వీడియోను విడుదల చేసింది. దయచేసి సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దు.. అవన్నీ ఫేక్ స్పష్టం చేసింది. ప్రస్తుతం నేను మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నానని సుప్రీత వెల్లడించింది.సుప్రీత మాట్లాడుతూ..'హాయ్.. అందరికీ నమస్కారం.. నేను మీ సుప్రీత. సోషల్ మీడియాతో పాటు టీవీ ఛానెల్స్లో నాపై వస్తున్న ప్రచారాలన్నీ అబద్ధాలు. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను. మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.' అంటూ వీడియోను రిలీజ్ చేసింది.

పవన్ గొంతు చించుకున్నారు.. మరి అది ఇప్పుడేమైంది?
సాధారణంగా శాసనసభలో లేని వ్యక్తుల గురించి ఏవైనా ఆరోపణలు,విమర్శలు చేయడం సమంజసం కాదన్నది సంప్రదాయం. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైనా అలా మాట్లాడితే స్పీకర్ స్థానంలో ఉన్నవారు వారిస్తుంటారు. కాని స్వయంగా ముఖ్యమంత్రే అలా మాట్లాడితే ఏమి చేస్తారు! ఎపి శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ గురించి చేస్తున్న విమర్శలు అసంబద్దంగా ,అసందర్భంగా ఉంటున్నాయి. కారణం ఏమైనా సభలో జగన్ లేనప్పుడు ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి చంద్రబాబు సభా సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారేమో అనిపిస్తుంది. తాము ఎన్నికల సమయంలో చేసిన సూపర్ సిక్స్ తో పాటు మరో 143 హామీల అమలు గురించి కన్నా జగన్ పైనే ఆరోపణలు చేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. మహిళా సాధికారిత గురించి ఆయన సభలో ప్రసంగం చేసినప్పుడు ఏ అంశాల గురించి చెప్పాలి? తాము ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల గురించి కదా!వాటిని పక్కనబెట్టి కొత్త హామీలు ఇస్తూ కధ నడిపడమే కాకుండా ,జగన్ ఆడబిడ్డల ద్రోహానికి పాల్పడ్డారని ,అదో కేస్ స్టడీ అని చెబుతున్నారంటే ప్రజలు విస్తుపోవడం తప్ప చేయగలిగింది ఏముంది?చంద్రబాబు నాయుడు మహిళలకు ఏఏ హామీలు ఇచ్చారు? వాటిలో ఎన్నిటిని అమలు చేశారో అంశాలవారిగా లెక్కలు చెబితే అది ఆడబిడ్డలకు మేలు చేసినట్లు అవుతుంది .అలాకాకుండా అసలు ఆ అంశాలనే ప్రస్తావించకుండా జగన్ పైనో, మరొకరిపైనో ఆరోపణలు చేస్తే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది. అది చంద్రబాబు ప్రభుత్వం ఆడబిడ్డలకు ద్రోహం చేసినట్లు కాదా!ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తకుండా ఎగవేయడం ద్రోహం అవుతుందా? కాదా?కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంతమంది మహిళలు అఘాయిత్యాలకు గురయ్యారో వివరించి, వాటిని అరికట్టడానికి ఏమి చర్య తీసుకుంటున్నారో చెప్పాలి కదా?అవన్ని ఎందుకు !ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో సుగాలి ప్రీతి అంటూ గొంతు చించుకుని మాట్లాడేవారు కదా! ఆ కేసు గురించి ఎన్నడైనా చంద్రబాబు మాట్లాడారా? పవన్ మాట నిలబెట్టుకున్నారా?దానిని ద్రోహం అంటారా?అనరా?ప్రతి ముఖ్యమైన పండగకు మహిళలకు కానుకలు ఇస్తామని ప్రకటించారు కదా?ఈ ఏడాది కాలంలో పండగలు రాలేదా!అయినా ఏ ఒక్క మహిళకైనా కానుకలు అందాయా?పెళ్లికానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారే!మహిళలు ఎవరికైనా అందచేశారా?వలంటీర్లకు పదివేల వేతనం ఇస్తామని చెప్పి,అసలుకే ఎసరు పెట్టారు కదా!ఆ వలంటీర్లలో లక్షమందికి పైగా మహిళలుఉన్నారు కదా!వారికి ఇచ్చిన సాధికారిత ఇదేనా!ఆర్డిసి బస్ లలో ఉచిత ప్రయాణం హామీ ఇచ్చారు కదా!దానికి బడ్జెట్ లో ఒక్క రూపాయి అయినా పెట్టారా?తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి 15వేలు ఇచ్చే వాగ్దానం ఒక ఏడాదిపాటు అతీగతీ లేదే!వచ్చే ఏడాది ఏ మేరకు ఇస్తారో తెలియదు.ఆ తల్లికి ఆ డబ్బు ద్వారా సాధికారిత వచ్చేది కదా!జగన్ తాను మహిళలకు ఇచ్చిన హామీలన్ని దాదాపు అమలు చేశారే.అన్ని స్కీమ్ లు మహిళల పేరిటే ఇచ్చారు కదా!అమ్మ ఒడి, 31 లక్షల ఇళ్ల పట్టాలు, చేయూత,ఆసరా,కాపు నేస్తం , ఆర్ధికంగా బలహీనవర్గాల నేస్తం..ఇలా ఆయా స్కీములలో డబ్బులు ఇచ్చారే.చేయూత కింద మహిళలకు 18500 రూపాయల చొప్పున ఆర్దిక సాయం చేసి,వారితో వ్యాపారాలు పెట్టించి, రిలయన్స్, ఐటిసి తదితర ప్రముఖ సంస్థలతో టై అప్ చేశారే.మహిళల భద్రతకు దిశ యాప్ తెచ్చారే.ఇప్పుడు అదే యాప్ ను పేరు మార్చి చంద్రబాబు వాడుతున్నారా?లేదా?ఇన్ని చేసిన జగన్ ఆడబిడ్డల ద్రోహి అవుతారా?లేక చేసిన బాసలకు మంగళం పలుకుతున్నట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు ద్రోహి అవుతారా అన్న ప్రశ్న వస్తే ఏమి జవాబు ఇస్తాం. ఇవన్ని వదలివేసి జగన్ కుటుంబంలో ఏదో జరిగిందని,తల్లికి ,చెల్లికి న్యాయం చేయలేదంటూ అసత్య ఆరపణలు చేయడం ఎంతమేర సమంజసం.చెల్లికి 200 కోట్ల మేర డివిడెండ్ల రూపంలో చెల్లించిన జగన్ ద్రోహం చేసినట్లు ఎలా అవుతుందో చంద్రబాబే చెప్పాలి. పోనీ తన తోబుట్టువులకు చంద్రబాబు ఏ విధంగా సాయం చేసింది చెప్పి ఉంటే బాగుండేది కదా!చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రతిగా వైఎస్సార్సీపీ స్పందిస్తూ పలు ప్రశ్నలు వేసింది.హైదరాబాద్ లో ఇతర చోట్ల చంద్రబాబు కుటుంబానికి ఉన్న వందల కోట్ల ఆస్తులలో తన తోబుట్టువులకు ఎంత ఇచ్చారని అడిగింది.తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుటుంబానికి ఎంత వాటా ఇచ్చారని ప్రశ్నించింది. తనతల్లి పేరు మీద ఉన్న మదీనగూడ భూమిలో వారికి వాటా ఇవ్వకుండా లోకేష్ ఒక్కరి పేరు మీదే ఎందుకు మార్పించింది వాస్తవం కాదా అని అప్రశ్నించింది.ముందుగా తన ఇంటిలో సమన్యాయం పాటించకుండా ఇంకొకరి ఇంటి వ్యవహారాన్ని ప్రస్తావించడం అన్యాయం కాదా అని వైఎస్సార్సీపీవ్యాఖ్యానించింది. డ్వాక్రా మహిళలకు సంబంధించి చంద్రబాబు చేసిన ప్రకటనలు కూడా ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలియదు. కొద్ది రోజుల క్రితం ఏడాదికి లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని అన్నారు.తాజాగా ఆ సంఖ్యను లక్షా డెబ్బైఐదువేలకు పెంచారు. డ్వాక్రా మహిళలకు 65వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని,అందులో సగం పెట్టుబడి తీసుకురాగలిగితే ఆరువేల కోట్ల లాభాలు వచ్చేస్తాయని కూడా ఆయన ఊరించారు. డీ లిమిటేషన్ జరిగితే భవిష్యత్తులో శాసనసభలో 75 మంది మహిళలకు అవకాశం రావచ్చని ఆయన అన్నారు. డి లిమిటేషన్ లో ఎపికి కూడా నష్టం జరుగుతుంందని అంతా వాపోతుంటే, దాని గురించి మాట్లాడకుండా మహిళలకు సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనండని ఆయన ప్రచారం చేస్తున్నారు.కాని తద్వారా ఎదురయ్యే సమస్యల గురించి వివరించి, వాటిని అధిగమించడానికి ఏమి చేయాలో చెప్పరు. మహిళలకు తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చి తద్వారా సాధికారిత తెచ్చామని చెబితే ఎవరైనా నమ్ముతారు కాని, ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పేసి అంతా అయిపోయినట్లు భ్రమలో పెట్టాలని అనుకుంటే ఏమి ప్రయోజనం ?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
గ్రోక్ vs చాట్జీపీటీ: కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్..
బాబు వెన్నుపోటు.. యనమల స్ట్రాంగ్ రిటార్ట్!
ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?
చిరు సినిమా: నో లవ్ ట్రాక్.. మెగాస్టార్తో అనిల్ మాస్టర్ ప్లాన్!
బ్యాటింగ్ చేస్తూ కుప్పకూలిన పాకిస్తానీ క్రికెటర్.. తీవ్ర విషాదం
నేరుగా ఓటీటీకి మీరా జాస్మిన్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
HKU1 కోలకతా మహిళకు అరుదైన కరోనా, అప్రమత్తం అంటున్న వైద్యులు
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత పారితోషికమా?
ఈ రాశి వారికి రావలసిన సొమ్ము అందుతుంది.. స్థిరాస్తివృద్ధి
చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం - ఇస్రో
నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి
క్లోజ్ అవుతున్న పోస్టాఫీస్ స్కీమ్..
వయస్సు 19.. ‘నేను మీ అక్కనిరా’ అంటూ.. స్కూల్ విద్యార్థులను వ్యభిచారంలోకి దింపి..
ట్రంప్ దూకుడుకు కోర్టు కళ్లెం.. 227 ఏళ్ల నాటి చట్టం ఆధారంగా ఇచ్చిన ఉత్తర్వులు నిలుపుదల
బిగ్ డీల్ ప్లాన్తో సుకుమార్.. విలన్గా షారుక్ఖాన్
నటి సీతకు విడాకులు.. భార్య స్థానం మరొకరికి ఇవ్వలేను: పార్తీబన్
హీరోయిన్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
గ్రోక్ vs చాట్జీపీటీ: కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్..
బాబు వెన్నుపోటు.. యనమల స్ట్రాంగ్ రిటార్ట్!
ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?
చిరు సినిమా: నో లవ్ ట్రాక్.. మెగాస్టార్తో అనిల్ మాస్టర్ ప్లాన్!
బ్యాటింగ్ చేస్తూ కుప్పకూలిన పాకిస్తానీ క్రికెటర్.. తీవ్ర విషాదం
నేరుగా ఓటీటీకి మీరా జాస్మిన్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
HKU1 కోలకతా మహిళకు అరుదైన కరోనా, అప్రమత్తం అంటున్న వైద్యులు
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత పారితోషికమా?
ఈ రాశి వారికి రావలసిన సొమ్ము అందుతుంది.. స్థిరాస్తివృద్ధి
చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం - ఇస్రో
నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి
క్లోజ్ అవుతున్న పోస్టాఫీస్ స్కీమ్..
వయస్సు 19.. ‘నేను మీ అక్కనిరా’ అంటూ.. స్కూల్ విద్యార్థులను వ్యభిచారంలోకి దింపి..
ట్రంప్ దూకుడుకు కోర్టు కళ్లెం.. 227 ఏళ్ల నాటి చట్టం ఆధారంగా ఇచ్చిన ఉత్తర్వులు నిలుపుదల
బిగ్ డీల్ ప్లాన్తో సుకుమార్.. విలన్గా షారుక్ఖాన్
నటి సీతకు విడాకులు.. భార్య స్థానం మరొకరికి ఇవ్వలేను: పార్తీబన్
హీరోయిన్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
సినిమా

రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఒక సినిమా కోసం రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకున్న తొలి ఇండియన్ హీరో మెగాస్టార్ చిరంజీవి అని అందరికీ తెలుసు. 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు మూవీ కోసం ఆయన అందుకున్నారు. అప్పటికే అమితాబ్ బచ్చన్ బాలీవుడ్లో స్టార్ హీరో అయినప్పటికీ ఆ సమయంలో ఆయన రెమ్యునరేషన్ రూ.70 లక్షల లోపే ఉండేది. అయితే, చిరు తర్వాత ఈ మార్క్ను అందుకున్న భారతీయ తొలి హీరోయిన్ ఎవరు..? టాలీవుడ్లో కోటి రూపాయలు అందుకున్న తొలి నటి ఎవరో తెలుసుకుందాం.తెలుగులో కోటీ అందుకున్న ఫస్ట్ హీరోయిన్తెలుగు సినిమాకు కోటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ముంబై బ్యూటీ ఇలియానా.. దేవదాసు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె పోకిరితో స్టార్డమ్ తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత ఆమెకు నిర్మాతల నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలో ముంబై హీరోయన్ అంటూ టాలీవుడ్లో డిమాండ్ గట్టిగానే ఉండటంతో ఇలియానా కోసం పోటీ మొదలైంది. పోకిరి తరువాత ఇలియానా చేసిన సినిమా ఖతర్నాక్ (2006). రవితేజతో ఆమె జోడీగా ఆమె చేసిన గ్లామర్కు ఫిదా అయిపోయారు. ఈ సినిమా కోసం ఆమె కోటి రూపాయలు తీసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ రోజుల్లో ఒక హీరోయిన్కి కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వడం అదే మొదటిసారి కావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది.ఇండియాలో రూ. కోటి మ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కోటిరూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి హీరోనయిన్ శ్రీదేవి. 1993లో విడుదలైన 'రూప్ కి రాణి చోరోన్ కా రాజా' అనే హిందీ సినిమాకు ఆమె రూ. కోటి తీసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. అప్పట్లో అత్యధిక బడ్జెట్తో తీసిన హిందీ సినిమా ఇదే కావడం విశేషం. శ్రీదేవి, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, జానీ లివర్, జాకీ ష్రాఫ్ నటించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. ఈ సినిమాతో తొలి పాన్ ఇండియా స్టార్గా శ్రీదేవికి గుర్తింపు వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ సినిమా ఇండస్ట్రీలను దశాబ్దం కాలం పాటు శ్రీదేవి ఏలారు. కానీ, అనూహ్యంగా తన 33 ఏళ్ల వయసులోనే (1997) సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సమయానికి ఆమె బోనీ కపూర్తో తొలి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత 2015లో పులి, 2017లో మామ్ చిత్రాలతో మళ్లీ తెరపై ఆమె కనిపించారు.

సందీప్ వంగా 'యానిమల్'.. ఒకవేళ ధోనీ చేస్తే?
సందీప్ రెడ్డి పేరు చెప్పగానే 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలే గుర్తొస్తాయి. రా అండ్ రస్టిక్ స్టోరీలతో తీసిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం 'స్పిరిట్' పనుల్లో బిజీగా ఉన్న సందీప్.. సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు ధోనీతో కలిసి ఓ యాడ్ లో కనిపించాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్' పాటల్ని పక్కనపడేసిన తమన్)ఎలక్ట్రిక్ సైకిల్ కోసం ఓ ప్రముఖ కంపెనీ యాడ్ తాజాగా రిలీజ్ చేసింది. 'యానిమల్' సినిమాలో ధోనీ నటిస్తే ఎలా ఉంటుందో.. అచ్చుగుద్దినట్లు ఈ యాడ్ ని అలానే రూపొందించారు. బ్లూ కోట్ లో బ్లాక్ కలర్ కార్ నుంచి దిగే సీన్, సినిమా ప్రారంభంలో హీరోయిన్ ఇంటికి హీరో వెళ్లే సీన్, క్లైమాక్స్ లో హీరో చేతితో సైగ చేసి చూపించే సీన్.. ఇలా ఫుల్ సీరియస్ గా ఉంటే మూడు సీన్స్ తీసుకుని వాటితో యాడ్ చేశారు.'యానిమల్' సీరియస్ మూవీ కాగా.. ఈ యాడ్ ఏమో ఫుల్ నవ్వు తెప్పిస్తోంది. ఇందులో ధోనీతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కనిపించడం విశేషం. ఏదేమైనా మూవీ స్ఫూప్ లా తీసిన ఈ యాడ్.. ఇప్పుడు వైరల్ అయిపోయవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?)

ప్రభాస్ 'రాజాసాబ్' పాటల్ని పక్కనపడేసిన తమన్
ప్రస్తుతం ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్(Thaman) ఒకడు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా తేడా లేకుండా దాదాపు చాలా భాషల సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇతడు ప్రభాస్ 'రాజాసాబ్' (The Rajasaab Movie) కోసం కూడా పనిచేస్తున్నాడు. కానీ ఇప్పటివరకు ఈ మూవీ కోసం చేసిన సాంగ్స్ అన్నీ పక్కనపడేశానని, కొత్తగా మళ్లీ చేస్తున్నానని అన్నాడు. ఇంతకీ ఏమైంది?(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి సింగర్ మంగ్లీ.. ఫొటోలు వైరల్)ఓ ఇంగ్లీష్ ఎంటర్ టైన్ మెంట్ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తమన్ చాలా విషయాలు మాట్లాడాడు. కానీ 'రాజాసాబ్' పాటల్ని డస్ట్ బిన్ లో వేశానని చెప్పడం చర్చనీయాంశమైంది. 'రాజాసాబ్'కి పాటలు కంపోజ్ చేయడం ఇప్పుడే మొదలుపెట్టా. షూటింగ్ అంతా దాదాపు పూర్తయిపోయింది. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత సాంగ్స్ చేయడం మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ సర్.. చాలా కాలం తర్వాత కమర్షియల్ పాటలతో వస్తున్నారు''ఈ సినిమాలో ఇంట్రో, మెలోడీ, ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. ఓ పాటలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ క్రేజీ డ్యాన్స్ చేయబోతున్నారు. రాబోయే ఐదు నెలలో సాంగ్స్ షూటింగ్ పూర్తవుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక్కో పాట చేస్తున్నాం. నిజానికి 'రాజాసాబ్' కోసం చాలా పాటలు చేశారు. కానీ నాకెందుకో మార్చేద్దాం అనిపించింది. ఎప్పుడో ట్యూన్స్ చేసిచ్చా. వాళ్లు షూటింగ్ మొదలుపెట్టలేదు. దీంతో ఇవన్నీ డస్ట్ బిన్ లో పడేశా. కొత్తగా సాంగ్స్ కంపోజ్ చేస్తున్నా. డైరెక్టర్ కి కూడా ఇదంతా చెప్పా. ఇవి ఇప్పుడు వర్కౌట్ కావు. నేను నా మ్యూజిక్ ని చీట్ చేయలేను. ఇలా ఉండటమే కరెక్ట్' అని తమన్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?)

బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సంచలనం.. నాలుగో రోజు ఊహించని కలెక్షన్స్!
టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత ఓ చిన్న సినిమా భారీ విజయాన్ని అందుకుంది. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు సైతం రెండు, మూడు రోజులకే ఢీలా పడుతున్నవేళ..ఈ చిన్న చిత్రం మాత్రం రోజు రోజుకి కలెక్షన్స్ని పెంచుకుంటూ రికార్డు దిశగా పరుగులు తీస్తోంది. ఆ చిత్రం పేరే ‘కోర్ట్’ (Court: State Vs Nobody). నాని (Nani) నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదలై తొలి రోజే పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. ఫలితంగా మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. పాజిటివ్ మౌత్టాక్తో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. మొత్తంగా రిలీజైన నాలుగు రోజులకే రూ. 28.9 కోట్లను రాబట్టి.. నానికి కాసుల వర్షం కురిపించిదీ చిత్రం. ఒక్క నాలుగో రోజునే 4.50 కోట్ల గ్రాస్ సాధించిదంటే.. ఈ చిన్న చిత్రం సత్తా ఎంటో అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్లోనూ ఈ సినిమా బాగా వసూళ్లు రాబడుతోంది. ఈ వీకెండ్లో ఓవర్సీస్ కలెక్షన్స్ 1 మిలియన్ డాలర్స్ దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోర్ట్ విషయానికొస్తే.. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. శివాజీ కీలక పాత్ర పోషించాడు. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టం గురించి ఈ చిత్రంలో చర్చించారు. కోర్ట్రూమ్ డ్రామా బాగా పండడం, ఎమోషనల్ సన్నివేశాలు హృదయాలను హత్తుకునేలా ఉండడం సినిమాకు విజయాన్ని అందించాయి. #CourtTelugu continues its dominance at the box office this week ❤🔥Collects a gross of 28.9+ CRORES WORLDWIDE in 4 days 💥💥Book your tickets for #Court now! ▶️ https://t.co/C8ZZHbyhHW#CourtStateVsANobody ⚖️ Presented by Natural Star @NameisNani Starring… pic.twitter.com/AiUSVO3RCD— Wall Poster Cinema (@walpostercinema) March 18, 2025
న్యూస్ పాడ్కాస్ట్

‘బీసీ’ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం...

‘విద్య’లో గందరగోళం.. లక్ష్యం బడికి తాళం. ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యను భ్రష్టు పట్టిస్తోన్న కూటమి ప్రభుత్వం

బీఆర్ఎస్ నాయకుల స్టేచర్ గుండుసున్నా.. కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా, ప్రతిపక్ష నేతగా ఉండాలి, నేను సీఎంగా ఉండాలి ..రేవంత్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులను దగా చేసిన కూటమి ప్రభుత్వం... నష్టానికే పంట అమ్ముకుంటున్న రైతులు

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి సస్పెన్షన్... ‘ఈ సభ నీ సొంతం కాదు’ అన్నందుకు బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ నయవంచనపై తిరుగుబాటు... వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో ‘యువత పోరు’లో కదంతొక్కిన విద్యార్థులు, తల్లితండ్రులు, నిరుద్యోగులు

భారతదేశ కుటుంబంలో మారిషస్ ఒక అంతర్భాగం... ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ

కేసీఆర్ను గద్దె దింపిందీ నేనే. నాది సీఎం స్థాయి.. ఆయనది మాజీ సీఎం స్థాయి. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్లో పాడి రైతుకు కూటమి సర్కారు దగా... ప్రైవేటు డెయిరీలు చెప్పిందే ధర, ఇష్టం వచ్చినంతే కొనుగోలు... లీటర్కు 25 రూపాయల దాకా నష్టపోతున్న రైతులు

వైఎస్ వివేకా కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కూటమి సర్కారు కుతంత్రం. రంగన్న మరణాన్నీ వాడేసుకుంటున్న వైనం
క్రీడలు

Video: అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ బ్యాటర్.. సిక్సర్ల వర్షం
డునెడిన్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో టీ20లో పాక్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు సహా 26 పరుగులు పిండుకున్నాడు. తద్వారా అఫ్రిది పలు చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. టీ20ల్లో ఓ ఓవర్లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న పాక్ బౌలర్గా మొహమ్మద్ సమీ, ఫహీమ్ అష్రాఫ్ పేరిట ఉన్న చెత్త రికార్డును సమం చేశాడు. సమీ 2010లో ఆస్ట్రేలియాతో.. ఫహీమ్ 2021లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ల్లో ఓ ఓవర్లో నాలుగు సిక్సర్లు సమర్పించుకున్నారు. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అఫ్రిది కూడా 4 సిక్సర్లు సమర్పించుకొని సమీ, ఫహీమ్ రికార్డును సమం చేశాడు. అఫ్రిది బౌలింగ్ను సీఫర్ట్ ఊచకోత కోసిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.Seifert has 7 letters, so does Maximum 🤌Tim Seifert took Shaheen Afridi to the cleaners in his second over, smashing four sixes in it 🤯#NZvPAK pic.twitter.com/F5nFqmo7G6— FanCode (@FanCode) March 18, 2025ఒకే ఓవర్లో 26 పరుగులు సమర్పించుకోవడంతో అఫ్రిది మరో చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. తన టీ20 కెరీర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఓవర్గా ఇది రికార్డుల్లోకెక్కింది. గతంలో అఫ్రిది టీ20ల్లో ఓ ఓవర్లో రెండు సార్లు (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్పై) 24 పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్రిది ఈ చెత్త రికార్డులు నమోదు చేయడానికి న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ కారకుడు. అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో సీఫర్ట్ శివాలెత్తిపోయి నాలుగు సిక్సర్లు బాదాడు. ఓ డబుల్ తీశాడు.ఈ మ్యాచ్లో సీఫర్ట్ మొత్తంగా 5 సిక్సర్లు, 3 బౌండరీలు బాది 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. సీఫర్ట్కు ముందు మొహమ్మద్ అలీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో న్యూజిలాండ్ మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా చెలరేగాడు. ఈ ఓవర్లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. సీఫర్ట్ ఔటయ్యాక కూడా చెలరేగిన అలెన్ 16 బంతులు ఎదుర్కొని 5 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 38 పరుగులు చేశాడు. సీఫర్ట్, అలెన్ విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ తొలి 7 ఓవర్లలో ఏకంగా 88 పరుగులు సాధించింది.వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన కెప్టెన్ సల్మాన్ అఘా టాప్ స్కోరర్గా నిలువగా.. షాదాబ్ ఖాన్ (26), షాహీన్ అఫ్రిది (22 నాటౌట్), మహ్మద్ హరీస్ (11), ఇర్ఫాన్ ఖాన్ (11), అబ్దుల్ సమద్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ ఇన్నింగ్స్లో హసన్ నవాజ్ (0), ఖుష్దిల్ షా (2), జహన్దాద్ ఖాన్ (0), హరీస్ రౌఫ్ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేకబ్ డఫీ, బెన్ సియర్స్, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ చెలరేగిపోయారు. ఫలితంగా న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సీఫర్ట్, అలెన్ ఔటయ్యాక తడబడిన న్యూజిలాండ్ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. మార్క్ చాప్మన్ (1), డారిల్ మిచెల్ (15), జిమ్మీ నీషమ్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ దశలో మిచెల్ హే (21 నాటౌట్), కెప్టెన్ బ్రేస్వెల్ (5 నాటౌట్) సహకారంతో న్యూజిలాండ్ను విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, మొహమ్మద్ అలీ, ఖుష్దిల్ షా, జహన్దాద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ పాక్ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్లో కూడా ఓడితే పాక్ సిరీస్ను కోల్పోతుంది.

న్యూజిలాండ్ ఓపెనర్ల ఊచకోత.. రెండో టీ20లోనూ చిత్తైన పాకిస్తాన్
5 టీ20లు, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తున్న పాక్ క్రికెట్ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో మ్యాచ్లో ఆతిథ్య జట్టు పాక్ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన కెప్టెన్ సల్మాన్ అఘా టాప్ స్కోరర్గా నిలువగా.. షాదాబ్ ఖాన్ (26), షాహీన్ అఫ్రిది (22 నాటౌట్), మహ్మద్ హరీస్ (11), ఇర్ఫాన్ ఖాన్ (11), అబ్దుల్ సమద్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ ఇన్నింగ్స్లో హసన్ నవాజ్ (0), ఖుష్దిల్ షా (2), జహన్దాద్ ఖాన్ (0), హరీస్ రౌఫ్ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేకబ్ డఫీ, బెన్ సియర్స్, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (22 బంతుల్లో 45), ఫిన్ అలెన్ (16 బంతుల్లో 32) చెలరేగిపోయారు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును తాకింది. పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో టిమ్ సీఫర్ట్ శివాలెత్తిపోయాడు. ఈ ఓవర్లో సీఫర్ట్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. అంతకుముందు మొహమ్మద్ అలీ వేసిన రెండో ఓవర్లో ఫిన్ అలెన్ కూడా చెలరేగాడు. ఈ ఓవర్లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరూ క్రీజ్లో ఉండగా మ్యాచ్ 10 ఓవర్లలోనే ముగిస్తుందని అంతా అనుకున్నారు. అయితే పాక్ బౌలర్లు ఒక్కసారిగా ఫామ్లోకి రావడంతో న్యూజిలాండ్ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. మార్క్ చాప్మన్ (1), డారిల్ మిచెల్ (15), జిమ్మీ నీషమ్ (5) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. మిచెల్ హే (21 నాటౌట్), కెప్టెన్ బ్రేస్వెల్ (5 నాటౌట్) న్యూజిలాండ్ను విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, మొహమ్మద్ అలీ, ఖుష్దిల్ షా, జహన్దాద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ పాక్ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్లో కూడా ఓడితే పాక్ సిరీస్ను కోల్పోతుంది.

2028 ఒలింపిక్స్లో బాక్సింగ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐఓసీ
కోస్టా నవరినో (గ్రీస్): లాస్ ఏంజెలిస్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్లో బాక్సింగ్ పోటీలు నిర్వహించే అంశంపై సందిగ్ధత వీడింది. ఆటలో సమగ్రత, నిర్ణయాల్లో స్పష్టత లేదనే కారణంగా 2022లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో ఒలింపిక్స్ ప్రాథమిక క్రీడాంశాల జాబితాలో బాక్సింగ్ను చేర్చలేదు. కాగా... మంగళవారం నుంచి ఐఓసీ 144వ సెషన్ ప్రారంభం కానుండగా... దీనికి ముందు సోమవారం కార్యనిర్వాహక బోర్డు ఒలింపిక్స్లో బాక్సింగ్ క్రీడను కొనసాగించేందుకు పచ్చజెండా ఊపింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ)ను పక్కన పెట్టి... ప్రపంచ బాక్సింగ్ సంఘానికి తాత్కాలిక గుర్తింపు నిచ్చిన తర్వాత ఐఓసీ ఈ నిర్ణయం తీసుకుంది.నేటి నుంచి ఈ నెల 21 వరకు జరగనున్న ఐఓసీ సెషన్లో థామస్ బాచ్ స్థానంలో కొత్త అధ్యక్షుడిని కూడా ఎన్నుకోనున్నారు. ఇదే సెషన్లో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో బాక్సింగ్ను చేర్చే అంశానికి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలపనుంది. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచ బాక్సింగ్ సంఘానికి తాత్కాలిక గుర్తింపు ఇచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. దీన్ని ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదానికి పంపుతాం. ప్రపంచ బాక్సింగ్ సంఘం గుర్తించిన జాతీయ సమాఖ్యలకు చెందిన బాక్సర్లు నిరభ్యంతరంగా ఒలింపిక్స్లో పాల్గొనవచ్చు.పాలనా సమస్యలపై సుదీర్ఘ వివాదంతో పాటు బౌట్ల సమగ్రతకు సంబంధించిన ఆందోళనల కారణంగా ఐబీఏ గుర్తింపును రద్దు చేశాం. అనంతరం గత రెండు ఒలింపిక్స్ (2020 టోక్యో, 2024 పారిస్) క్రీడల్లో బాక్సింగ్ పోటీలను తిరిగి పర్యవేక్షించాం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే బాక్సింగ్కు ఒలింపిక్స్లో అవకాశం కల్పించాం’ అని థామస్ బాచ్ వెల్లడించారు. ప్రపంచ బాక్సింగ్ సంఘం అధ్యక్షడు బోరిస్ ఐఓసీ నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో క్రీడకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు.

విశాఖలో ఐపీఎల్ మ్యాచ్లకు జనాదరణ కరువు.. ప్రచారంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైఫల్యం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో రెండు మ్యాచ్లు విశాఖ వేదికగా జరుగనున్నాయి. మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. మార్చి 30న ఢిల్లీ సన్రైజర్స్ హైదరబాద్ను ఢీకొట్టనుంది. ఢిల్లీ, లక్నో మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఢిల్లీ, సన్రైజర్స్ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. లక్నోతో జరుగబోయే తొలి మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిన్ననే విశాఖకు చేరుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖను రెండో హోం గ్రౌండ్గా ఎంచుకోవడంతో ఇక్కడ బీసీసీఐ రెండు మ్యాచ్లను షెడ్యూల్ చేసింది. గతేడాది కూడా ఢిల్లీ రెండు మ్యాచ్లను విశాఖలో ఆడింది. నాడు సీఎస్కే, కేకేఆర్తో జరిగిన మ్యాచ్లకు మంచి ప్రజాదరణ లభించింది. అయితే ఈ సీజన్లో జరుగబోయే మ్యాచ్లకే జనాదరణ కరువైంది. మ్యాచ్లకు సంబంధించి సరైన ప్రచారం లేకపోవడం వల్ల టికెట్ల అమ్మకాలు నత్త నడకన సాగుతున్నాయి. మ్యాచ్లపై జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తొలి మ్యాచ్ (లక్నో) ప్రారంభానికి ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉండగా.. ఇప్పటికీ ఆన్లైన్లో టికెట్లు అమ్ముడుపోలేదు. ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించి నాలుగు రోజులవుతున్నా ఏమాత్రం జనాదరణ కనిపించడం లేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్ను విశాఖలోనే (లక్నో) ఆడనుంది. ఈ సీజన్లో ఢిల్లీ అక్షర్ పటేల్ నేతృత్వంలో కొంగొత్త జట్టుతో ఉరకలేస్తుంది. కెప్టెన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన అక్షర్కు డిప్యూటీగా అనుభవజ్ఞుడైన ఫాఫ్ డుప్లెసిస్ను నియమించింది ఢిల్లీ మేనేజ్మెంట్.ఈ సీజన్లో ఢిల్లీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్లతో కూడిన ప్రమాదకర బ్యాటింగ్ లైనప్ను కలిగి ఉంది. మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, నటరాజన్లతో బౌలింగ్ విభాగం కూడా ప్రమాదకరంగా ఉంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, త్రిపురణ విజయ్
బిజినెస్

రూ.750 కోట్లతో రియల్టీ కంపెనీ కొనుగోలు
దేశీ రియల్టీ కంపెనీ కోల్టే పాటిల్ను కొనుగోలు చేస్తున్న గ్లోబల్ పెట్టుబడుల దిగ్గజం బ్లాక్స్టోన్ తాజాగా సాధారణ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ.329 ధరలో దాదాపు రూ.759 కోట్లు వెచ్చించనుంది. తొలుత ప్రమోటర్ల నుంచి 25.7 శాతం వాటా(2.28 కోట్ల షేర్లు) సొంతం చేసుకోనున్నట్లు గత వారం ప్రకటించిన విషయం విదితమే. ఇందుకు రూ.750 కోట్లు కేటాయించనుంది. మరోవైపు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో దాదాపు 1.27 కోట్ల ఈక్విటీ షేర్ల కోసం రూ. 417 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో మరో 14.3 శాతం వాటా చేజిక్కించుకోనుంది. వెరసి 40 శాతం వాటాకు రూ. 1,157 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో సాధారణ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి తాజాగా ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.బ్లాక్స్టోన్ గ్రూప్ సంస్థలు పబ్లిక్ వాటాదారుల నుంచి 2.3 కోట్ల షేర్లు(26 శాతం వాటా) కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించినట్లు కోల్టే పాటిల్ తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. షేరుకి రూ.329 ధరలో ఆఫర్ ఇచ్చినట్లు తెలియజేసింది. దీంతో కంపెనీలో బ్లాక్స్టోన్ మొత్తం 66 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ. 1,800 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. గత రెండు దశాబ్దాలలో దేశీయంగా 50 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన బ్లాక్స్టోన్.. పెట్టుబడులను 100 బిలియన్ డాలర్లకు పెంచనున్నట్లు ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో తాజా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. కోల్టే పాటిల్లో ప్రస్తుతం ప్రమోటర్లకు 69.45 శాతం వాటా ఉంది.ఇదీ చదవండి: త్వరలో బంగారం ధర లకారం! తులం ఎంతంటే..ఆక్జో నోబెల్ రేసులో..దేశీ పెయింట్ల బిజినెస్ను విక్రయించే ప్రణాళికల్లో ఉన్న డచ్ దిగ్గజం ఆక్జో నోబెల్కు తాజాగా బ్లాక్స్టోన్ నాన్బైండింగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆక్జో నోబెల్ ఇండియా కొనుగోలుకి 1.2 బిలియన్ డాలర్ల(రూ. 10,400 కోట్లు) విలువైన బిడ్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి రేసులో జేఎస్డబ్ల్యూ గ్రూప్, పిడిలైట్ ఇండస్ట్రీస్ తదితర దేశీ దిగ్గజాలతో పోటీకి తెరతీసినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం దేశీ పెయింట్ల సంస్థలో మాతృ సంస్థ ఆక్జో నోబెల్ ఎన్వీకు 74.76 శాతం వాటా ఉంది.

త్వరలో బంగారం ధర లకారం! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. త్వరలో తులం రూ.లక్షకు చేరుతుందని చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,500 (22 క్యారెట్స్), రూ.90,000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.90,000 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.82,650కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.90,150 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే మంగళవారం వెండి ధర(Silver Prices)ల్లోనూ మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై ఏకంగా రూ.1,100 పెరిగి రూ.1,13,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

స్వల్పంగా పెరిగిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో కాస్తంత ఎగసి 2.38 శాతానికి చేరింది. జనవరి నెలకు ఇది 2.31 శాతంగా ఉంది. ఆహార వస్తువుల ధరలు, తయారీ, వెజిటబుల్ ఆయిల్, పానీయాల ధరలు పెరగడం ద్రవ్యోల్బణం పెరిగేలా చేసింది. దీంతో మూడు నెలల వరుస క్షీణతకు బ్రేక్ పడింది. ఆహారోత్పత్తుల ధరల ద్రవ్యోల్బణం 11.06 శాతానికి పెరిగింది.వెజిటబుల్ ఆయిల్ ద్రవ్యోల్బణం 33.59 శాతానికి చేరింది. ఇక పానీయాలకు సంబంధించి 1.66 శాతానికి ఎగిసింది. తయారీ ఉత్పత్తుల టోకు ధరల సూచీ ఫిబ్రవరిలో 0.42 శాతం మేర పెరిగింది. కూరగాయల ధరల (బంగాళాదుంప సహా) ద్రవ్యోల్బణం జనవరిలో ఉన్న 74.28 శాతం నుంచి ఫిబ్రవరిలో 27.54 శాతానికి తగ్గింది. పాల ధరలకు సంబంధించి 5.40 శాతం నుంచి 1.58 శాతానికి దిగొచ్చింది. పండ్లకు సంబంధించి 20 శాతం, ఉల్లిపాయలకు సంబంధించి ద్రవ్యోల్బణం 48.05 శాతం చొప్పున ఇప్పటికీ గరిష్ట స్థాయిల వద్దే కొనసాగుతోంది.ఇదీ చదవండి: మ్యూచువల్ ఫండ్స్లో అమ్మకాల సెగఇంధనం, విద్యుత్ విభాగంలో ప్రతి ద్రవ్యోల్బణం (మైనస్ 0.71 శాతం) నమోదైంది. జనవరిలోనూ మైనస్ 2.78 శాతంగా ఉండడం గమనార్హం. రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో ఏడు నెలల కనిష్ట స్థాయి అయిన 3.61 శాతానికి తగ్గిపోవడం తెలిసిందే. పంటల దిగుబడి మెరుగ్గా ఉండడానికి తోడు, అధిక బేస్తో సమీప కాలంలో టోకు ద్రవ్యోల్బణం మరింత దిగొస్తుందన్న అభిప్రాయాన్ని ఇక్రా సీనియర్ ఆర్థికవేత్త రాహుల్ అగర్వాల్ వ్యక్తం చేశారు. 2025–26లో టోకు ద్రవ్యోల్బణం 2.5–3 శాతం మధ్య ఉండొచ్చన్నది ఇక్రా అంచనాగా ఉంది.

లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం గడిచిన సెషన్లోని ముగింపుతో పోలిస్తే లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ(Nifty) 106 పాయింట్ పెరిగి 22,612కు చేరింది. సెన్సెక్స్(Sensex) 321 పాయింట్లు పెరిగి 74,487 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.52 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 71.25 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.65 శాతం పెరిగింది. నాస్డాక్ 0.31 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: 13 రోజుల్లో కార్ల ధరలు పెంపు..స్టాక్ మార్కెట్ స్థిరీకరణలో భాగంగా సోమవారం మిడ్ క్యాప్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, చిన్న షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. డాలర్ ఇండెక్స్ బలహీనత, దేశీయ ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్ల దన్నుతో డాలర్ మారకంలో రూపాయి విలువ 24 పైసలు పెరిగి 86.81 వద్ద స్థిరపడింది. డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో అవకతవకల నేపథ్యంలో ‘బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది’ అంటూ ఆర్బీఐ భరోసాతో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు కోలుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ

మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ ప్రియాంక తారే..!
జాతీయ స్థాయిలో ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జాతీయ మిసెస్ ఇండియా పోటీల్లో ప్రియాంక తారే తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చత్తీస్గఢ్లోని భిలాయ్ నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన ఆమె మిసెస్ ఇండియా తెలంగాణ క్వీన్ 2025 అనే ప్రతిష్టాత్మక బిరుదుతో పాటు మిసెస్ ప్యాషనేట్ అవార్డు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జాతీయ వేదికపై మిసెస్ ఇండియా పోటీలో తెలంగాణ సౌందర్యాభిలాషను ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ప్రియాంక తారే అద్భుత ప్రతిభావంతురాలు. ఎంఎన్సీసీలో హెచ్ఆర్, సీఎస్ఆర్గా పలు ఈవెంట్లు నిర్వహిస్తోంది. ఆమె క్రీడలు, పాటలు, నృత్యం వంటి వాటిలో మంచి ప్రతిభావంతురాలు . ప్రియాంక రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఫిట్నెస్ ఔత్సాహికురాలు కూడా. ఆమె తన డ్రీమ్ని నెరవేర్చుకోవడమే గాక ఇతరులను కూడా ఆ మార్గంలో వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. అంతేగాదు వివిధ రకాల ఎన్జీవోలతో కలిసి నిరుపేద బాలికలు/పిల్లల సంక్షేమం, మహిళ సాధికారత వంటి సామాజిక కార్యక్రమాల కోసం తన వంతుగా సేవలందిస్తోంది. (చదవండి: 'విందోదయం': బ్రేక్ ఫాస్ట్లకు కేరాఫ్ ఈ టిఫిన్ సెంటర్లు..!)

'విందోదయం': బ్రేక్ ఫాస్ట్లకు కేరాఫ్ ఈ టిఫిన్ సెంటర్లు..!
మంచి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఇంటిల్లి పాదీ కలిసి పేరున్న రెస్టారెంట్/కేఫ్లకు లంచ్, డిన్నర్లకో వెళ్లడం తెలిసిందే. అయితే ప్రస్తుతం బ్రేక్ ఫాస్ట్ సమయం కూడా సిటిజనుల మీట్ అండ్ ఈట్లకు కేరాఫ్గా మారింది. లేట్నైట్స్లోనే బ్రేక్ఫాస్ట్ చేసే ప్లేసెస్ గురించి మాట్లాడుకుని ఉదయమే అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీజనులు తమ బ్రేక్ ఫాస్ట్, అల్పాహారం కోసం తరచూ ఎంచుకునే వాటిలో ఇవీ.. టేస్టీ ఫుడ్ ఆస్వాదించి సంతృప్తిగా రోజును ప్రారంభించడం కన్నా మంచి రోజు ఏముంది? అద్భుతమైన వంటల వారసత్వానికి ప్రసిద్ధి చెందిన మన నగరం, రుచికరంగా రోజును కిక్స్టార్ట్ చేయడానికి అనేక ఎంపికలను అందిస్తుంది. దోసెలు, ఇడ్లీల వంటి సంప్రదాయ దక్షిణ భారతీయ ఇష్టమైన వాటి నుంచి ఆమ్లెట్లు, వాఫ్ఫల్స్ వంటి అంతర్జాతీయ వెరైటీల వరకు మన సిటీలోని అల్పాహార సమయం.. వైవిధ్యంగా ఉంటుంది. రుచులు అనుభవాల విందోదయాల కోసం అందుబాటులో కొన్ని.. కోఠిలోని సందడిగా ఉండే వీధుల్లో ఉన్న ప్రగతి టిఫిన్ సెంటర్ దక్షిణ భారత అల్పాహార ప్రియుల సందడితో నిండి ఉంటుంది. క్రిస్పీ దోసెలు, మెత్తటి ఇడ్లీలు, ఊతప్పమ్లకు ఈ సెంటర్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హైలైట్ ఏమిటంటే ప్రతి వంటకంతో పాటు అందించే చట్నీలు. ఉదయం 7గంటల నుంచి 9 గంటలలోపు హనుమాన్ టేక్డి, హెచ్వీఎస్ రోడ్లో ఉన్న ఈ సెంటర్ను సందర్శించం అంటే నోరూరించే దక్షిణాది వంటకాలను ఆస్వాదించినట్లే.. సంప్రదాయ రుచులను కోరుకునే వారు గచ్చిబౌలిలోని ఇందిరానగర్లో ఉన్న ఉడిపి ఉపహార్కు చలో అంటున్నారు. ఇడ్లీలు, వడలు, దోసెలు, ఊతప్పమ్ వంటి అనేక రకాల దక్షిణ భారతీయ ప్రధాన వంటకాలను అందిస్తుంది. మెనూలో డబుల్ కా మీఠా, బొబ్బట్టు వంటి స్వీట్ ట్రీట్లు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ అల్పాహారం ఉదయం 7 నుంచి 10.30గంటల మధ్య అందుబాటులో ఉంటుంది.మాదాపూర్లోని హమ్మింగ్ బర్డ్ కేఫ్లో కేఫ్ స్టైలి ఆరోగ్యకరమైన అల్పాహారం కోరుకునే సిటిజనులు ఎంచుకుంటున్నారు. ఇక్కడ మష్రూమ్ ఆమ్లెట్ల నుంచి బ్రోకలీ చీజ్ ఆమ్లెట్ల వరకు రోజంతా అల్పాహారం అందించడం విశేషం. ఆహారం పోషకాలతో నిండిన సూప్లు, సలాడ్లతో పాటు కాఫీలూ ఎంజాయ్ చేయవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.30 దాకా అందుబాటులో ఉంటుంది. పిజ్జాదోస, పాస్తా దోస, మంచూరియా దోస వంటి వెరైటీ ఆధునిక దక్షిణ భారత బ్రేక్ఫాస్ట్లను కోరుకునేవారు బంజారాహిల్స్లోని రాయల్ టిఫిన్ సెంటర్ను ఎంచుకుంటున్నారు. వీరి మెనూలో ఉప్మా ఊతప్పమ్ల వంటి క్లాసిక్స్ కూడా ఉన్నాయి. ఆహ్లాదకరమైన అలంకరణ, ప్రత్యేకమైన మెనూతో జూబ్లీహిల్స్లోని ది హోల్ ఇన్ ది వాల్ కేఫ్ అల్పాహార ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇంగ్లిష్ బ్రేక్ ఫాస్ట్ వెరైటీల్లో.. వెజ్జీ పిజ్జా ఆమ్లెట్, గోల్డెన్ ఫ్రిటాటా మిక్స్ ఇక్కడ హైలైట్స్గా చెప్పాలి. స్వీట్ టూత్ ఉన్నవారు ఇక్కడి చాక్లెట్ వాఫ్ఫల్స్, బ్లూబెర్రీ చీజ్ వాఫ్ఫల్స్ తప్పనిసరిగా టేస్ట్ చేయాలి. ఉదయం 8.30గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. సిటిజనులకు చిరపరిచితమైన పేరే మినర్వా కాఫీ షాప్. ఈ పేరు దక్షిణ భారతీయ వంటకాలకు పర్యాయపదంగా ఉంది. టమాటా చట్నీ రైతాతో కలిపిన రైస్ పొంగల్, నెయ్యితో నింపిన ఇడ్లీలు క్రిస్పీ దోసెలు ఇక్కడ స్పెషల్.. ఇక్కడి ఫిల్టర్ కాఫీ వావ్ అనిపిస్తుందంటారు కాఫీప్రియులు. ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకూ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. నగరంలోని దారుల్షిఫా, చట్టా బజార్లో ఉన్న హోటల్ నయాబ్ ఉదయం 5 గంటల నుంచే సంప్రదాయ అల్పాహారాన్ని అందిస్తుండటం ఎర్లీ బైకర్స్ను ఆకర్షిస్తోంది. బటర్ నాన్, లుక్మీతో పాటు భేజా ఫ్రై వంటి స్థానిక హైదరాబాదీ ప్రత్యేకతలతో బ్రేక్ ఫాస్ట్ చేయిస్తోంది. ఇరానీ చాయ్తో సహా మన అసలైన రుచులను ఇష్టపడేవారు నయాబ్ను సందర్శిస్తున్నారు. ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఇక్కడ బ్రేక్పాస్ట్ ప్రియుల సందడి కనిపిస్తుంది. (చదవండి:

ఇన్ఫెక్షన్: సెల్యు'లైట్' తీసుకోకండి..!
ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చర్మానికి సెల్యులైటిస్ అనే కండిషన్ వస్తుంది. ఇందులో కాలు లేదా చేయి విపరీతంగా వాచిపోయి, చర్మం ఎర్రగా అలాగే బాధితులకు వేడిగా అనిపిస్తుంటుంది. ముట్టుకుంటేనే నొప్పి (టెండర్నెస్)తో బాధాకరంగా ఉంటుంది. ఇది చేయి లేదా కాలు అంతటికీ వేగంగా వ్యాపిస్తుంది. ఈ దశలో కూడా చికిత్స సరిగా అందకపోతే చేయి/ కాలికి మాత్రమే పరిమితమైన ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీరమంతా పాకి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదముంది. అందుకే సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టగల ఈ సెల్యులైటిస్పై అవగాహన కోసం ఈ కథనం.సెల్యులైటిస్ సాధారణంగా దేహంలోని కాలు, చేయితో పాటు ఏ భాగానికైనా రావచ్చు. కానీ ఈ కండిషన్ కాలిలో కనిపించడమే ఎక్కువ. సెల్యులైటిస్తో ప్రభావితమైన కాలు బాగా వాచిపోతుంది. ఎర్రబారుతుంది. ఇలా జరగడాన్ని ఎరిథిమా అంటారు. వాపు వచ్చి ముట్టుకుంటే మంట (ఇన్ఫ్లమేషన్)తో, లోపల వేడిగా ఉన్న భావన కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్తో కూడిన సెల్యులైటిస్ను తీవ్రమైన పరిస్థితిగానే పరిగణించాలి. అది కేవలం పై చర్మానికి మాత్రమే పరిమితమైందా లేక లోపలి పొరలూ ప్రభావితమయ్యాయా అన్నదానిపై పరిస్థితి తీవ్రత ఆధారపడి ఉంటుంది. లోపలికి వ్యాపించిన కొద్దీ సెల్యులైటిస్లోని ఇన్ఫెక్షన్ రక్తప్రవాహంతో కలిసి లింఫ్నోడ్స్కూ వ్యాపిస్తుంది. సెల్యులైటిస్ కనిపించే సూక్ష్మక్రిములివే... సెల్యులైటిస్ సోకిన కాలు నునుపుదనంతో ఎర్రగా మెరుస్తూ కనిపిస్తుంది. అంతకు ముందే కాలికేదైనా గాయం ఉండటం, చర్మం చీరుకుపోయి ఉండటం వంటివి జరిగితే దానికి సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. చర్మానికి ఏ కారణంగానైనా పుండ్లు పడి అవి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరడంతో పాటు అది రెండో (సెకండరీ) దశకు చేరితే... అది సెల్యులైటిస్కు దారితీయవచ్చు. ఇందుకు చాలారకాల సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) కారణమవుతాయి. ఉదాహరణకు... స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ, సూడోమొనాస్ ఎస్పీపీ, బ్యాక్టీరియోడీస్ వంటివి వీటిల్లో ప్రధానమైనవి. ఇవిగాక మరికొన్ని అప్రధాన రకాలకు చెందిన సూక్ష్మజీవులూ ఉంటాయి. సెల్యులైటిస్లో ఎలా వస్తుందంటే?వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకుపోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్కు దారితీస్తుంది. వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకు΄ోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్కు దారితీస్తుంది.చర్మం రంగు మారడం: సెల్యులైటిస్ వచ్చిన భాగంలో చర్మం రంగు మారిపోతుంది. ప్రధానంగా ఎర్రబారుతుంది. అప్పటికే ఎర్రటి చర్మం ఉన్నవారిలో ఇలా ఎర్రబారడం జరిగితే దాన్ని గుర్తుపట్టడం కాస్తంత కష్టమవుతుంది. అదే కాస్త నల్లటి చర్మం ఉన్నవారిలో ఈ రంగు మార్పును వెంటనే గుర్తుపట్టడం సాధ్యమతుంది. దాంతో తగిన చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది. వాపు రావడం : సాధారణంగా వాపు పాదం నుంచి మొదలై పై వైపునకు వ్యాపిస్తుంటుంది. కొన్నిసార్లు పిక్కల నుంచి కూడా వాపు మొదలు కావచ్చు. ∙కాలికి ఎరుపుదనం వచ్చి బాగా వాచిన కారణంగా అది బాగా నునుపుగా అనిపిస్తూ, మెరుస్తూ కనిపిస్తుంది. వాపు కారణంగా చర్మం బాగా బిగుసుకు΄ోయినట్లుగానూ అనిపిస్తుంటుంది. ∙ముట్టుకుంటే మంట / నొప్పితోపాటు లోపల వేడిగా ఉన్నట్లుగానూ అనిపిస్తుంటుంది. ఈ కాలివాపు రాక ముందు ఫ్లూ జ్వరం వచ్చినప్పటి లక్షణాలతో... చలితో కూడిన జ్వరం కూడా కనిపించవచ్చు. ∙రక్త పరీక్ష చేయిస్తే తెల్లరక్తకణాల సంఖ్య బాగా పెరిగి కనిపిస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందనడానికి ఇది ఒక సూచన. ∙వాపు వచ్చిన కాలి భాగంలోని పుండ్ల నుంచి పసుపు రంగుతో కూడిన చీము స్రవిస్తుంటుంది. సెల్యులైటిస్కు తావిచ్చే కండిషన్స్చర్మానికి గాయమై అది దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం. చర్మం చీరుకు΄ోయి ఆ గాయం చాలాకాలం మానక΄ోవడం, కాలి మీద పుండ్లు రావడం. దీర్ఘకాలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండి, అవి దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం (ప్రధానంగా కాలికి... అథ్లెట్స్ ఫూట్ వంటివి). ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మసంబంధమైన రుగ్మతలతో బాధపడేవారిలో చర్మం పగుళ్లుబారి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. కొద్దిగా అరుదుగా దీర్ఘకాలికంగా ఉండే తీవ్రమైన మొటిమల కారణంగా కూడా. ∙చర్మం పగుళ్లుబారేలా చేసే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉందాహరణకు చికెన్పాక్స్, షింగిల్స్ వంటి జబ్బులు వచ్చాక సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్ ఉండి కాలిపై దీర్ఘకాలికంగా పుండ్లు పడటం (డయాబెటిస్ ఉన్నవారిలో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ).రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు ఉండటం (వేరికోసిక్ వెయిన్స్ వంటివి). పెరిఫెరల్ వ్యాస్క్యులార్ డిసీజ్ వంటి జబ్బుల కారణంగా. శరీరంలో లింఫ్ ప్రవాహం తగినంతగా లేకపోవడం వల్ల. దీర్ఘకాలికంగా కాలేయ సంబంధిత జబ్బులతో బాధపడుతూ ఉండేవారిలో. (అంటే... క్రానిక్ హెపటైటిస్, సిర్రోసిస్ వంటి జబ్బులు ఉన్నవారిలో సెల్యులైటిస్కు అవకాశాలెక్కువ). స్థూలకాయం ఉన్నవారిలో. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత ఏర్పడ్డ గాయం కారణంగా. చాలా సందర్భాల్లో కాలిన గాయాల కారణంగా. చర్మంలో ప్రవేశపెట్టే సూదుల కారణంగా (ఇంట్రావీనస్గా మందులను పంపడానికి అమర్చే క్యాన్యులా వంటివి), ట్యూబ్స్, ఆర్థోపెడిక్ కేసుల్లో చర్మంలోపల అమర్చే ప్లేట్లు, రాడ్ల వంటి వస్తువుల కారణంగా. ఎముకలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల. కొన్ని కీటకాల కాటు కారణంగా (ప్రధానంగా సాలీడు వంటివి); కొన్ని జంతువులు కరవడం వల్ల. దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నవారిలో వాళ్ల వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం వల్ల... ఇలాంటి అనేక కారణాల వల్ల సెల్యులైటిస్ రావచ్చు. ఒకసారి సెల్యులైటిస్ సోకాక...ఒకసారి సెల్యులైటిస్ సోకిన తర్వాత అది వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాంటి స్రావాలు లేకుండా కేవలం వాపు మాత్రమే కనిపించే దాన్ని ‘డ్రై సెల్యులైటిస్’ అంటారు. ఈ దశలో సెల్యులైటిస్కు సరైన చికిత్స తీసుకోక΄ోతే అది వ్యాపించిన మేరకు కణజాలం నాశనమవుతుంటుంది. డ్రై సెల్యులైటిస్లో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. డ్రై సెల్యూలైటిస్కు వెంటనే చికిత్స తీసుకోకపోతే చర్మంపై సన్నటి పగుళ్ల వంటివి ఏర్పడి అందులోంచి నీరు స్రవిస్తుంటుంది. దీన్నే వెట్ సెల్యులైటిస్ అంటారు.సాధారణంగా కాలి బొటనవేలికి దీర్ఘకాలంగా ఉండే గాయం వల్ల సెల్యులైటిస్ వస్తుంటుంది. సెల్యులైటిస్ కాలి భాగం నుంచి పైకి విస్తరిస్తూపోతుంటే దాన్ని అసెండింగ్ సెల్యులైటిస్ అంటారు. సాధారణంగా స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఇలా జరుగుతుంది. సెల్యులైటిస్ అన్నది ఒక కాలికే కనిపిస్తుంటే దీన్ని యూనిలేటరల్ సెల్యులైటిస్గా పేర్కొంటారు. ఈ యూనిలేటరల్ సెల్యులైటిస్ చాలా సాధారణం. కానీ కొంతమందిలో రెండుకాళ్లకూ సెల్యులైటిస్ కనిపించ వచ్చు. కాకపోతే ఇది కాస్తంత అరుదు. ఇలా రెండుకాళ్లకూ సెల్యులైటిస్ రావడాన్ని ‘బైలేటర్ కాంకరెంట్ సెల్యులైటిస్’ అంటారు. చికిత్స యాంటీబయాటిక్స్తో చికిత్స స్ట్రెప్టోకాక్సి, స్టెఫాలోకాక్సి బ్యాక్టీరియాను మట్టుపెట్టే యాంటీబయాటిక్స్ మందులను నోటి ద్వారా తీసుకోవడం లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో నరానికి ఇంజెక్షన్ ద్వారా పంపడం వంటి చికిత్స అందిస్తారు.వ్యాయామం (ఫిజియోథెరపీ) వాపు తగ్గేలా కాలి వేళ్లు కదిలించే కొన్ని వ్యాయామాలు చేయడం అవసరమవుతుంది. కొన్ని జాగ్రత్తలుసెల్యులైటిస్ను నివారించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కాలిపై ఎలాంటి గాయాలూ లేకుండా చూసుకోవడం.కాలి గోళ్లను తీసుకునే సమయంలో గాయం కాకుండా జాగ్రత్త వహించడం.కీటకాలు, జంతువులు కుట్టకుండా / కరవకుండా వాటిని దూరంగా ఉంచడం.కాలిన గాయాలైనప్పుడు అవి పూర్తిగా తగ్గే వరకు జాగ్రత్తగా ఉండటం.కాలికి గాయాలు ఉన్నవారు, కాలిన గాయాలైన వారు మురికినీళ్లలోకి వెళ్లక΄ోవడం. గాయమైన కాలితో సముద్రపు నీటిలోకి వెళ్లకపోవడం. కాలికి సరిగ్గా సరిపోయి, సౌకర్యంగా ఉండే పాదరక్షలు / షూస్ ధరించడం. (కాలికి గాయాన్ని చేస్తూ, బాధను కలిగించే షూస్ను బలవంతంగా తొడగకూడదు. చెప్పులు లేదా షూ కరవడం, కాలికి గాయం చేయడం వంటివి జరుగుతుంటే ఆ పాదరక్షలను తొడగడం మానేసి, సౌకర్యంగా ఉండే వాటినే తొడుక్కోవాలి. పాదరక్షల వల్ల కాలికి గాయాలవుతున్నాయా అంటూ తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి) అథ్లెట్స్ ఫూట్ వంటి ఇన్ఫెక్షన్తోపాటు అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్కు తగిన చికిత్స తీసుకుని పూర్తిగా తగ్గేలా జాగ్రత్త వహించడం వేరికోస్ వెయిన్స్ వంటి సమస్య వస్తే అది తగ్గేలా చికిత్స తీసుకోవడం సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం. చివరగా... సెల్యులైటిస్ వచ్చి, అది ప్రాణాంతకం అవడం కంటే ... కేవలం చిన్న చిన్న జాగ్రత్తలతో అసలది రాకుండానే చూసుకోవడం మేలు.డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్డా.జి. వెంకటేష్ బాబు, సీనియర్ కన్సల్టెంట్, ప్లాస్టిక్ – కాస్మటిక్ సర్జన్ (చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?)

రైల్.. రైట్స్
మహిళలు ఒంటరిగా రైలు ప్రయాణం చేస్తున్నట్టయితే ఈ రైల్వే యాక్ట్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే! ద రైల్వే యాక్ట్ 1989, సెక్షన్ 139 ప్రకారం.. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నా ఆందోళన చెందక్కర్లేదు. టికెట్ లేదని రైల్లోంచి దింపే అధికారం టీటీఈకి లేదు. ఫైన్ కట్టి ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఒకవేళ ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేకపోయినా భయపడక్కర్లేదు. లేడీ కానిస్టేబుల్ లేకుండా రైలు దింపడానికి వీల్లేదు.సెక్షన్ 311 ప్రకారం ఎట్టిపరిస్థితుల్లో మహిళల కంపార్ట్మెంట్లోకి మిలటరీ సహా పురుషులెవరూ ఎక్కడానికి వీల్లేదు. ఎక్కితే వారు శిక్షార్హులు. సెక్షన్ 162 ప్రకారం.. పన్నెండేళ్ల లోపు మగపిల్లలు మాత్రం తల్లి, సోదరి, అమ్మమ్మ, నానమ్మ లాంటి వాళ్లతో కలసి మహిళల కంపార్ట్మెంట్లో ప్రయాణించవచ్చు. అలాగే ప్రతి స్లీపర్ (మెయిల్, ఎక్స్ప్రెస్) క్లాస్లో, గరీబ్రథ్, రాజధాని, దురంతో లాంటి రైళ్లు లేదా మొత్తం ఎయిర్ కండిషన్డ్ రైళ్లలోని థర్డ్ ఏసీ (3 ఏసీ)లో మహిళలకు 6 బర్త్లు రిజర్వ్ అయి ఉంటాయి. గ్రూప్గా ప్రయాణిస్తున్న మహిళలూ వీటిని వినియోగించుకోవచ్చు. రైలు ఎక్కినప్పటి నుంచి గమ్యానికి చేరేవరకు మహిళా ప్రయాణికుల భద్రత కోసం ‘మేరీ సహేలీ’ యాప్నూ లాంచ్ చేశారు. అంతేకాదు రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమేరాలు, మానిటరింగ్ రూమ్స్ను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రైల్వే హెల్ప్లైన్ 139 ఉండనే ఉంది.
ఫొటోలు


కొత్తింట్లో అడుగుపెట్టిన వాషింగ్టన్ సుందర్.. గృహ ప్రవేశం (ఫొటోలు)


వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించిన వైఎస్ జగన్ (ఫొటోలు)


#NASA : కొద్ది గంటల్లో భూమి మీదకు సునీతా విలియమ్స్ (ఫొటోలు)


‘టుక్ టుక్’ ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసిన నటి శాన్వి మేఘన (ఫొటోలు)


లండన్ చేరుకున్న చిరంజీవి.. ఎయిర్పోర్ట్లో అభిమానుల సందడి (ఫోటోలు)


తెలుగు రాష్ట్రాల్లో మార్చిలోనే దంచికొడుతున్న ఎండలు (ఫొటోలు)


‘టుక్ టుక్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)


IPL 2025 : విశాఖలో అడుగుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు (ఫొటోలు)


వేములవాడలో ట్రాన్స్ జెండర్స్ వివాహం.. ఎందుకో తెలుసా? (ఫొటోలు)


వేములవాడ రాజన్న ఆలయంలో అత్యంత వైభవంగా శివ కల్యాణం (ఫొటోలు)
NRI View all

Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్

ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది.
National View all

పూజా ఖేద్కర్ కేసు జాప్యం దేనికి?
న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ శిక్షణా అధికారిణి పూజా ఖేద్కర్కు సు

సునీతా విలియమ్స్కు ప్రధాని మోదీ లేఖ.. ఏమన్నారంటే?
ఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్

‘గత జన్మలో ప్రధాని మోదీ.. ఛత్రపతి శివాజీ’
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్(

మహాకుంభమేళాలో ఐక్యత అనే అమృతం ఉద్భవించింది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ‘ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళా(Maha

Uttar Pradesh: ట్రక్కును 100 మీటర్లు లాక్కుపోయిన గూడ్సు
అమేథి: ఉత్తరప్రదేశ్లోని అమేథి జిల్లాలో గూడ్స్ రైలు(
International View all

సునీతా విలియమ్స్కు ప్రధాని మోదీ లేఖ.. ఏమన్నారంటే?
ఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్

అంతరిక్షంలో 9 నెలలున్నాక.. ఎదురయ్యే సమస్యలివే..
వాషింగ్టన్: అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర

భూమ్మీదకు తిరిగొచ్చే ముందు సునీతా విలియమ్స్..
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్ష

జో బైడెన్ సంతానానికి సీక్రెట్ సర్వీస్ రక్షణ తొలగింపు
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. స్పందించిన అమెరికా
ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) మరోసారి గాజాను లక్ష్యంగా చేసుకుంది.
NRI View all

ప్రవాస భారతీయ కుటుంబంలో విషాదం
తెనాలి: అమెరికా నార్త్ కెరోలినాలో తుపాను కారణంగా గుంటూరు జి

యూఏఈకి ఉచిత వీసాలు.. విమాన టికెట్స్
మోర్తాడ్: నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేసేందుకు యూఏఈ ప్రభుత్వరంగ సంస్థ ఏడీఎన్హెచ్ ఉచిత వీసాలను జారీ చేస్తోంది.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణవాసులు ముగ్గురు మృతి
కొందుర్గు/ సిద్దిపేట అర్బన్: అమెరికాలోని ఫ్లోరిడా లో సోమవారం తెల్లవారుజామున

కెనడా కొత్త కేబినెట్లో ఇద్దరు భారతీయులు
ఒట్టావా: కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్ క

పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా
క్రైమ్

ఎల్ఐసీ ఏజెంట్ రెండో పెళ్లి.. నువ్వంటే ఇష్టం లేదు..!
అన్నానగర్: రాజామంగళం సమీపం ఎల్ఐసీ ఏజెంట్ ఇంట్లో వరుడుని చూడటానికి వచ్చినట్లు నటించి, 8 తులాల నగలు అపహరించిన ఘట వెలుగు చూసింది. ఈ కేసులో నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా రాజామంగళం ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే అభిప్రాయ బేధాల కారణంగా ఆరేళ్ల కిందట భార్య అతడితో విడిపోయింది.ప్రస్తుతం ఎల్ఐసీ ఏజెంట్ తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. అతనిని చూసుకోవడానికి ఎల్ఐ సీ ఏజెంట్ రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆన్లైన్ మ్యాచ్ మేకింగ్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. ఇది చూసి మధురై చెందిన మురుగేశ్వరి అనే మహిళ ఎల్ఐసీ ఏజెంట్ని సంప్రదించి అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. కుటుంబ సమేతంగా ప్రత్యక్షంగా చూడబోతున్నట్లు కూడా తెలిపింది. మురుగేశ్వరి, అతని చెల్లెలు కార్తిగైయాయిని(28), ముత్తులక్షి్మ(45), పోదుమ్ పొన్ను (43) ఎల్ఐసీ ఏజెంట్ ఇంటికి వచ్చారు.అక్కడ ఎల్ఐసీ ఏజెంట్తోపాటు బంధువులు కూడా ఉన్నారు. ఆ తర్వాత రెండో పెళ్లికి ఒప్పుకుంటే ఎల్ఐసీ ఏజెంట్ 8 తులాల బంగారు గాజులు, ఉంగరాలు లాంటి నగలను అమ్మాయికి ఇస్తామని తెలిపాడు. వరుడిని చూసేందుకు వచ్చిన మహిళలు దీన్ని నిశితంగా గమనించారు. దీంతో ఎల్ఐసీ ఆ నగలను టేబుల్ డ్రాయర్లో ఉంచి వచ్చిన వారిని గమనించడంలో నిమగ్నం అయ్యా డు. వరుడిని చూసేందుకు వచ్చిన నలుగురు మహిళలు రాత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఎల్ఐసీ ఏజెంట్ టేబుల్పై ఉన్న నగలను పరిశీలించగా అవి కనిపించలేదు. దీంతో షాక్కు గురైన అతను తన కొడుకు, కుమార్తెకు సమాచారం ఇచ్చాడు.వరుడిని చూసేందుకు వచ్చిన మహిళలే చోరీ చేసి ఉంటారని ఎల్ఐసీ ఎజెంట్ అనుమానించి వెంటనే మురుగేశ్వరిని సెల్ఫోన్లో సంప్రదించగా అది స్విచ్ఛాఫ్ అయింది. ఆ తర్వాత మురుగేశ్వరితో పాటు వచ్చిన మరో అమ్మాయికి ఫోన్ చేయగా.. నువ్వంటే ఇష్టం లేదని అందుకే పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పింది. అలాగే ఆధ్యాత్మిక ఆభరణాల గురించి అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఎల్ఐసీ ఏజెంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధురైకి చెందిన నలుగురు మహిళలను సోమవారం అదుపులోకి తీసుకుని విచారించగా నగలు చోరీ చేసినట్లు తేలింది. అనంతరం మురుగేశ్వరి, కార్తిగైయాయిని, ముత్తులక్షి్మ, పోదుమ్ పొన్ను అనే నలుగురుని పోలీసులు అరెస్టు చేశారు.

702––562 నంబర్ మీదేనా?
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగినిని (75) టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.73 లక్షలు కాజేశారు. ఆడియో, వీడియో కాల్స్ ద్వారా..పోలీసు, సీబీఐ అధికారుల పేరు చెప్పి.. దుర్భాషలాడిన ఆరోపణలపై కేసుంటూ మొదలుపెట్టి...మనుషుల అక్రమ రవాణా వరకు తీసుకువెళ్లి ఈ మొత్తం స్వాహా చేశారు. ఎట్టకేలకు తాను మోసోయినట్లు గుర్తించిన బాధితురాలు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాధితురాలికి వారం రోజుల క్రితం టెలికం విభాగానికి చెందిన అధికారి పేరుతో ఫోన్ వచ్చింది. 702–––––562 నంబర్ మీదేనా? అంటూ అవతలి వ్యక్తి పశి్నంచగా కాదని సమాధానం ఇచ్చారు. ఆమె ఆధార్తో లింకై ఉన్న ఆ ఫోన్ నెంబర్ వినియోగించిన కొందరు అసభ్య పదజాలంతో పలువురికి ఫోన్లు చేశారని, దీనిపై బెంగళూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదై ఉందని చెప్పారు. ఆమె పేరుతో ఉన్న అన్ని ఫోన్లు త్వరలో బ్లాక్ అవుతాయని భయపెట్టాడు. ఈ ఆరోపణల్ని బాధితురాలు తోసిపుచ్చగా... త్వరలోనే పోలీసులు సంప్రదిస్తారని చెప్పాడు. ఆపై వాట్సాప్ వీడియో కాల్ చేసిన వ్యక్తి పోలీసు యూనిఫాంలో బాధితురాలికి కనిపించాడు. ఆమె ద్వారా ఆధార్ కార్డు కూడా షేర్ చేయించుకున్నాడు. తాము షాదత్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని, అతడు వినియోగించిన బ్యాంకు ఖాతాల్లో కొన్ని బాధితురాలి పేరుతో ఉన్నట్లు చెప్పాడు. బాధితురాలి ఆరి్థక స్థితిగతుల్ని అడిగిన అతగాడు మనుషుల అక్రమ రవాణా కేసులో 187వ అనుమానితురాలిగా చేరుస్తున్నట్లు చెప్పాడు.ఆ కేసులో అరెస్టు వారెంట్, బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్ ఆదేశాలు సిద్ధంగా ఉన్నట్లు నమ్మబలికాడు. దీని తర్వాత సీబీఐ అధికారి పేరుతో వీడియో కాల్ చేసిన మరో వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ జారీ చేసినట్లు ఉన్న నకిలీ లేఖను పంపాడు. అందులో సుప్రీం కోర్టు జ్యుడీషియల్ అథారిటీ ఆదేశాల ప్రకారం బాధితురాలు కొంత మొత్తం పోలీసులు సూచించినట్లు డిపాజిట్ చేయాలని ఉంది. సదరు నకిలీ సీబీఐ అధికారి ఆ కేసుల్లో పలువురు ప్రభుత్వ, బ్యాంకు అధికారులకూ పాత్ర ఉన్నట్లు చెప్పాడు. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం నగదు డిపాజిట్ చేయాలని, వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత రిఫండ్ చేస్తామని నమ్మబలికాడు. దీంతో బాధితురాలు తన వద్ద ఉన్న డబ్బుతో పాటు ఫిక్సిడ్ డిపాజిట్లు సైతం బ్రేక్ చేసి, తన కుమార్తె వద్ద నుంచి తీసుకుని మొత్తం రూ.73.5 లక్షలు సిద్ధం చేశారు. ఆపై నేరగాళ్లు ఆర్బీఐ పేరుతో మరో నకిలీ లేఖ పంపి...అందులో కొన్ని బ్యాంకు ఖాతాల నెంబర్లు, వివరాలు సూచించిన వాటిల్లోకి నగదు బదిలీ చేయమన్నారు. బాధితురాలు అలానే చేయడంతో ఆదాయపుపన్ను శాఖ, ఆర్బీఐ స్టాంపులు ఉన్న నకిలీ రసీదులు కూడా షేర్ చేశారు. కొన్నాళ్లకు నేరగాళ్లు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో మరో నకిలీ లేఖను పంపిస్తూ... అందులో ఆమె పేరును నిందితుల జాబితా నుంచి బాధితుల జాబితాలోకి మార్చినట్లు పేర్కొన్నారు. బాధితురాలు ఎన్నిసార్లు కోరినా నగదు రిఫండ్ చేయకపోవడంతో అనుమానించిన ఆమె ఎట్టకేలకు మోసపోయినట్లు తెలుసుకున్నారు. దీంతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

మద్యం కొనేందుకు వెళితే కారుతో పరారయ్యాడు
హైదరాబాద్: మద్యం కొనుగోలు చేసేందుకు షాపులోకి వెళ్తున్న క్రమంలోనే.. గుర్తు తెలియని వ్యక్తి ఖరీదైన కారును కొట్టేసిన ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్పేట లీలానగర్కు చెందిన తోట ప్రసాద్ వ్యాపారవేత్త. ఆదివారం సికింద్రాబాద్లో పనులు ముగించుకుని రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బేగంపేట గ్రీన్పార్క్ హోటల్ ఎదురుగా ఉన్న రిలాక్స్ సంధ్య వైన్షాపులో మద్యం కొనేందుకు తన ఎంజీ హెక్టార్ కారులో వెళ్లారు. కారును ఆఫ్ చెయ్యకుండా అలానే ఉంచి మద్యం షాపులోకి పోతుండగానే తన కారు ముందుకు వెళ్లడం ఆయన గుర్తించారు. వెంటనే అడ్డుకునేందుకు ప్రయతించే లోపే.. ఆగంతకుడు అమీర్పేట వైపు వాహనాన్ని తీసుకుని అతివేగంతో వెళ్లిపోయాడు. ఆందోళనకు గురైన ప్రసాద్ పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైన్ షాపు ముందున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా.. నిందితుడిని పట్టుకున్నట్లు కారును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుడు గతంలో ఏదైనా దొంగతనాలు చేశాడా? పాత నేరస్తుడా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

నేడు కోర్టు ముందుకు కొత్త హరిబాబు?
భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ఏ8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబును నేడు(మంగళవారం) పోలీసులు అరెస్ట్ చూపించనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 19న రాజలింగమూర్తి దారుణ హత్యకు గురికాగా, ఈ కేసులో నిందితుడి(ఏ8)గా ఉన్న హరిబాబు పరారీలో ఉండగా పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే హన్మకొండకు చెందిన అతడి సన్నిహితుడి క్రెడిట్ కార్డు తీసుకెళ్లి వినియోగించడంతో హరిబాబు శనివారం రాత్రి ఢిల్లీలో పట్టుబడగా కారులో భూపాలపల్లికి తీసుకురాగా సోమవారం తెల్లవారుజామున చేరుకున్నట్లు సమాచారం. అయితే సోమవారం హరిబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ఉన్న కారణంగా అరెస్ట్ చూపించలేదని తెలుస్తోంది. నేడు(మంగళవారం) జిల్లా కేంద్రంలో అరెస్ట్ చూపించి, కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టును ఆశ్రయించే యత్నం.. రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబు ఈనెల 4న హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, బెయిల్ వచ్చే అవకాశం లేదని గమనించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు యత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే క్రెడిట్ కార్డు వినియోగం ఆధారంగా అతడిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో మరో ఇద్దరు..? కొత్త హరిబాబుతో పాటు అతడికి పని మనుషులుగా, సహకరించిన మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో హరిబాబును పోలీసులు పట్టుకోగా అక్కడే అతడికి సహకరించిన హైదరాబాద్కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని సోమవారం తమదైన శైలిలో పోలీసులు విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులకు చిక్కకుండా ప్రాంతాలు మార్చి.. హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబు, ఇద్దరు సహాయకులతో కలిసి ప్రాంతాలు మార్చి పోలీసులకు చిక్కకుండా ప్రయత్నించినట్లు సమాచారం. ఢిల్లీ, సిమ్లా, అమృత్సర్ లాంటి ప్రదేశాలను సందర్శించి చివరకు ఢిల్లీకి వచ్చి బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే క్రమంలోనే పోలీసులకు చిక్కినట్లు తెలిసింది.
వీడియోలు


ISSలో ఉండగా సునీత విలియమ్స్ కు ప్రధాని మోదీ లేఖ


హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ సంచలన తీర్పు


నటి విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసుల నోటీసులు


కూటమి పాలనలో ఓ రైతు కన్నీటి గాథ


అసెంబ్లీ వద్ద బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి అరెస్ట్


వైవీ సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్


మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై YSRCP సభ్యుల ఆగ్రహం


Gold Smuggling: తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరు అరెస్ట్


Varudu Kalyani: రెన్యువల్ లేనప్పుడు విజయవాడ వరదల్లో వాలంటీర్లను ఎందుకు వాడుకున్నారు


పేద పిల్లలకు చదువెందుకంటోన్న ఆటవిక పాలకులు