Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Israel-Iran Conflicts: Trump Preps Situation Room Updates1
ఏం జరగబోతోంది?.. ట్రంప్‌ గరం గరం.. సిట్యుయేషన్‌ రూమ్‌ రెడీ

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో ఏదో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందనే భయాలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. జీ 7 సదస్సు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అర్ధాంతరంగా నిష్క్రమించడం.. పైగా ఆయన నేతృత్వంలోని సిట్యుయేషన్‌ రూమ్‌ హడావిడిగా సమావేశం అవుతుండడమే అందుకు కారణం. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌ ప్రకటించగా.. ఆ ప్రకటనను తోసిపుచ్చుతూ ‘అంతకు మించే జరగబోతోంది’ అని ట్రంప్‌ ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయి చేరుకున్న నేపథ్యంలో.. జీ7 సదస్సు నుంచి ముందుగానే ట్రంప్‌ నిష్క్రమించారు. పర్యటనను కుదించుకున్న ఆయన.. తాను జీ7 సదస్సు నుంచి వచ్చేలోపు సిట్యువేషన్‌ రూమ్‌లో సిద్ధంగా ఉండాలని జాతీయ భద్రతా మండలి(NSC)ని ట్రంప్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరికొన్నిగంటల్లో ట్రంప్ చేరుకుంటారని, ఈ సమావేశం తర్వాత ఆయన కీలక ప్రకటన చేస్తారని వైట్‌హౌజ్‌ వర్గాలు వెల్లడించాయి.‌ట్రంప్‌ ఆఫర్‌ ఉత్తదే.. పరిస్థితి చేజారిందా?అంతకు ముందు.. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ కాల్పుల విరమణకు ట్రంప్‌ ఆఫర్‌ చేశారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌ అధికారికంగా ఓ ప్రకటన చేశారు. తొలుత కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుని.. ఆ తర్వాత సరిహద్దు చర్చలు ప్రారంభించాలని ట్రంప్‌ ప్రతిపాదించారని, అయితే ఈ ఆఫర్‌ను ఇరు దేశాలు అనుసరిస్తాయా? లేదా? అనేది చూడాలని మేక్రాన్‌ అన్నారు. అయితే.. మేక్రాన్‌ ప్రకటనను ట్రంప్‌ తోసిపుచ్చారు. పబ్లిసిటీ కోసమే మేక్రాన్‌ అలాంటి ప్రకటన చేసి ఉంటారని, అసలేం జరగబోతోందో ఆయన ఊహించలేరని, తాను వాషింగ్టన్‌ వెళ్లేది కాల్పుల విరమణ కోసం కాదని.. అంతకు మించిందే జరగబోతోందని ట్రంప్‌ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధ పరిణామాలపై ట్రంప్‌ గరం గరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో.. ఈ వారంలో న్యూక్లియర్‌ డీల్‌పై ఇరాన్‌ ప్రతినిధులతో ఆరో దఫా ట్రంప్‌ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ఆ వార్తలను తోసిపుచ్చారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో అలాంటి చర్చల ప్రస్తావన కనుమరుగైందని స్పష్టత ఇచ్చారాయన. ఇక.. టెహ్రాన్‌ను వీడాలని ట్రంప్‌ చేసిన తాజా హెచ్చరికలు పరిస్థితి చేజారిందనే సంకేతాలు అందిస్తున్నాయి. ట్రంప్‌ ఆ ప్రకటన చేసిన కాసేపటికే టెహ్రాన్‌లో బాంబుల వర్షం కురుస్తోందని సమాచారం. అమెరికా రంగంలోకి దిగి భారీ బంకర్‌ బస్టర్‌ బాంబులను ఇరాన్‌ అణుస్థావరాలపై ప్రయోగించవచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.ట్రంప్‌పై ఒత్తిడి..ఇరాన్‌ మాస్టర్‌ ప్లాన్‌గల్ఫ్‌ దేశాలతో ట్రంప్‌ను దారిలోకి తెచ్చేందుకు ఇరాన్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఖతర్‌, సౌదీ అరేబియా, ఒమన్‌ దేశాలను ఆశ్రయించింది. ఇజ్రాయెల్‌ తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్‌ దేశాలను ఇరాన్‌ కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని ఆ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

Air India London flight cancelled Due to This Reason Updates2
అహ్మదాబాద్‌-లండన్‌ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. సర్వీసు రద్దు

సాక్షి, న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు హడలెత్తిస్తున్నాయి. అహ్మదాబాద్‌ ప్రమాదం తర్వాత బయట పడుతున్న సాంకేతిక లోపాల ఘటనలు ‘వామ్మో.. ఎయిరిండియా’ అనేలా చేస్తున్నాయి. తాజాగా.. మంగళవారం మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లే ఎయిరియిండియా విమానంలో సాంకేతిక సమస్య బయటపడింది. మధ్యాహ్నం 1.10 గంటలకు AI 159 బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరాల్సి ఉండగా.. పైలట్‌ టేకాఫ్‌ కంటే ముందు సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో విమానంలోని 200 మంది ప్రయాణికులను దించేశారు. తొలుత సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన నిర్వాహకులు.. చివరకు ఫ్లైట్‌ సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. జూన్‌ 12వ తేదీన ఇదే రూట్‌లో ప్రయాణించే ఎయిరింయా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో ఏఐ 171 విమానాన్ని పూర్తిగా రద్దు చేసింది ఎయిరిండియా. దాని స్థానంలోనే AI 159 విమానానికి తీసుకు వచ్చింది. అయితే.. అనూహ్యంగా.. ఇవాళ ఆ విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తడం.. టేకాఫ్‌కి ముందే ఆ సమస్యను గుర్తించడం.. చివరకు సర్వీస్‌ రద్దు కావడం జరిగిపోయాయి.Air India crashed after taking off. The plane was seen struggling to gain altitude before crashing into a fire ball.. Over 200 people were on board..#AirIndiaCrash pic.twitter.com/xacH20AlSe— Sudhir Byaruhanga (@Sudhirntv) June 12, 2025

Supreme Court Orders Release Of Kamal Haasan Thug Life In Karnataka3
సుప్రీం కోర్టులో కమల్‌ సినిమాకు భారీ ఊరట!

కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన ‘థగ్‌ లైఫ్‌’ చిత్రానికి సుప్రీ కోర్టులో భారీ ఊరట లభించింది. కర్ణాటకలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు ఈ సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీం కోర్టు హెచ్చరించింది. థియేటర్స్‌లో ఏమి ప్రదర్శించాలనే అధికారం గుంపులకు, ఆరాచక శక్తులకు లేదని, మూక బెదిరింపులకు చట్ట పాలనను తాకట్టు పెట్టలేమని కోర్టు పేర్కొంది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన ఏ సినిమానైనా విడుదల చేయాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.అసలేం జరిగిందంటే.. కమల్‌ హాసన్‌, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. ఈ సినిమా ఆడియో లాంఛ్‌ ఈవెంట్‌లో కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని అన్నారు. ఆయన చేసిన కామెంట్స్‌ కాంట్రవర్సీకీ దారి తీశాయి. కమల్‌ వ్యాఖ్యలపై కన్నడిగులు భగ్గుమన్నారు. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పకపోవడంతో కర్ణాటకలో ఈ సినిమా విడుదలను నిషేధించారు. దీనిపై చిత్రబృందం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నేడు ఆదేశాలు జారీ చేసింది.

Terrible situation in Chandrababu Constituency Kuppam: Andhra pradesh4
సీఎం చంద్రబాబు ఇలాకాలో దారుణం

కుప్పం రూరల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడిరోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన కుప్పం మండలం నారాయ­ణపురంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుప్పం మండలం నారాయ­ణపురం గ్రామా­నికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు.తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప వద్ద రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో తిమ్మరాయప్పఊరొదిలి వెళ్లిపోయాడు. ఆయన భార్య శిరీష ఇద్దరు బిడ్డలతో కలిసి గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తనకు వచ్చిన కూలి డబ్బుల్లోనే భర్త తిమ్మరాయప్ప చేసిన చిన్నపాటి అప్పులను వీలైనంత వరకు తీరుస్తూ వస్తోంది. పెద్దమొత్తం కావడంతో మునిక­న్నప్పకు అప్పు తీర్చలేక­పోయింది. ఈ నేపథ్యంలో మునికన్నప్ప వేధింపులు ఎక్కువయ్యాయి.సోమ­వారం శిరీష రోడ్డుపై నడిచి వెళ్తుండగా తక్షణమే అప్పు తీర్చాలంటూ మునికన్నప్ప ఒత్తిడి చేశాడు. గ్రామస్తులు చూస్తుండగా అసభ్య పదజాలంతో శిరీషను దూషిస్తూ అప్పు తీర్చకపోతే చంపేస్తానని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా శిరీషను నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేపచెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. దిక్కుతోచని స్థితిలో శిరీష అలాగే నరకం అనుభవించింది. ఈ విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు గ్రామానికి చేరుకుని శిరీషకు కట్లు విప్పి వివరాలు సేకరించారు. టీడీపీ కార్యకర్త మునికన్నప్పను అదుపులోకి తీసుకుని బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 341/323/324/506/34 కింద కేసు నమోదు చేశారు.కుప్పంలో పచ్చ మాఫియా దౌర్జన్యం: ఎమ్మెల్సీ భరత్‌కుప్పంలో లా అండ్‌ ఆర్డర్‌ విఫలమైందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భరత్‌ మండిపడ్డారు. ‘‘కుప్పంలో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. మహిళపై ఇష్టారాజ్యంగా దాడులు చేస్తున్నారు. చిన్న పిల్లాడు ఏడుస్తున్నా కూడా కనికరించలేదు. నారాయణపురంలో ఈ అనాగరిక ఘటన జరిగింది. కుప్పంలో పచ్చ మాఫియా దౌర్జన్యం చేస్తోంది. పోలీసులు కూడా బాధితులపైనే కేసులు పెడుతున్నారు. కుప్పంలో మహిళా అధికారులకు కూడా భద్రత లేదు’’ అని భరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Yashasvi Jaiswal To Open, Pat Cummins Captain, Jasprit Bumrah In, Steve Smith Out, Best XI Of WTC 2023 255
డబ్ల్యూటీసీ 2023-25 అత్యుత్తమ జట్టు ఇదే.. ఛాంపియన్‌ జట్టు నుంచి ఒక్కరికే అవకాశం

9 జట్లతో రెండేళ్ల పాటు సాగిన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 సైకిల్‌ మే 14న ముగిసింది. ఈ సైకిల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఫైనల్స్‌కు చేరాయి. లార్డ్స్‌ వేదికగా జరిగిన టైటిల్‌ పోరులో సౌతాఫ్రికా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాకిచ్చి విజేతగా అవతరించింది. తద్వారా సౌతాఫ్రికా 27 తర్వాత తొలి ఐసీసీ టైటిల్‌ సాధించింది. ఈ టైటిల్‌ సౌతాఫ్రికాకు తొలి ప్రపంచ టైటిల్‌. 1998లో ఆ జట్టు గ్రేమ్‌ స్మిత్‌ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గింది. తాజాగా ముగిసిన సైకిల్‌లో సౌతాఫ్రికా విజేతగా ఆవిర్భవించడంతో డబ్ల్యూటీసీ ప్రారంభమైన సీజన్‌ నుంచి వరుసగా మూడు సీజన్లలో మూడు కొత్త ఛాంపియన్‌ జట్లు అవతరించినట్లైంది.అరంగేట్రం ఎడిషన్‌ ఫైనల్లో (2019-21) న్యూజిలాండ్‌ భారత్‌ను ఓడించి విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్‌ ఫైనల్లో (2021-23) ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి విజేతగా అవతరించింది. తాజాగా జరిగిన మూడో ఎడిషన్‌లో (2023-25) సౌతాఫ్రికా ఆసీస్‌ను చిత్తు చేసి టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ను చేజిక్కించుకుంది. తొలి రెండు ఎడిషన్లలో ఫైనల్స్‌కు చేరిన భారత్‌ తాజాగా ముగిసిన సీజన్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 ముగిసిన నేపథ్యంలో ఈ ఎడిషన్‌ అత్యుత్తమ జట్టు ఇదే అంటూ సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గత ఎడిషన్‌లో అత్యుత్తమ ప్రదర్శలు చేసిన ఆటగాళ్లను ఈ జట్టుకు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. డబ్ల్యూటీసీ టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌కు కెప్టెన్‌గా ఆసీస్‌ సారధి పాట్‌ కమిన్స్‌ ఎంపికయ్యాడు. ఈ జట్టులో టీమిండియా, ఆసీస్‌ నుంచి తలో ముగ్గురు, ఇంగ్లండ్‌ నుంచి ఇద్దరు, న్యూజిలాండ్‌, శ్రీలంక, సౌతాఫ్రికా నుంచి ఒక్కొక్కరు చోటు దక్కించుకున్నారు.ఈ జట్టు ఓపెనర్లుగా టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌, ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌ డకెట్‌ ఎంపికయ్యారు. వన్‌డౌన్‌లో రూట్‌, నాలుగో స్థానంలో విలియమ్సన్‌, ఐదో ప్లేస్‌లో కమిందు మెండిస్‌ అవకాశాలు దక్కించుకున్నారు. వికెట్‌కీపర్‌గా అలెక్స్‌ క్యారీ, ఆల్‌రౌండర్‌ కోటాలో రవీంద్ర జడేజా, పేసర్లుగా కమిన్స్‌, రబాడ, బుమ్రా, స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా నాథన్‌ లయోన్‌ ఎంపికయ్యారు. ఛాంపియన్‌ జట్టు సౌతాఫ్రికా నుంచి ఈ జట్టుకు కేవలం ఒక్కరు మాత్రమే (రబాడ) ఎంపికయ్యారు. ఫాబ్‌ ఫోర్‌లో ముఖ్యుడైన విరాట్‌ కోహ్లి ఇటీవలే టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో అతనికి చోటు దక్కలేదు. ఆశ్చర్యకరంగా ఫాబ్‌ ఫోర్‌లోని మరో ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ జట్టులో చోటు దక్కని మరికొంత మంది అర్హులు కూడా ఉన్నారు. ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్‌, ఆసీస్‌ స్పీడ్‌ గన్‌ మిచెల్‌ స్టార్క్‌, టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, లంక స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య కూడా ఈ జట్టులో చోటు దక్కించుకునేందుకు అర్హులే. డబ్ల్యూటీసీ 2023-25 టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌..యశస్వి జైస్వాల్‌, బెన్‌ డకెట్‌, జో రూట్‌, కేన్‌ విలియమ్సన్‌, కమిందు మెండిస్‌, అలెక్స్‌ క్యారీ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), కగిసో రబాడ, జస్ప్రీత్‌ బుమ్రా, నాథన్‌ లయోన్‌

Shocking Details Revealed In Haryana Model Sheetal Case6
నమ్మించి గొంతుకోసి.. కారు ప్రమాదంగా చిత్రీకరించి..

సంగీత ప్రపంచంలో పాపులారిటీ సంపాదించుకుంటోందనుకున్న సమయంలోనే.. ఆమె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే దర్యాప్తులో కేసు కీలక మలుపు తిరిగింది. ఆమెది ప్రమాదం కాదని.. హత్య చేశారనే విషయం బయటపడడంతో అంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ప్రముఖ హర్యానా మోడల్‌ శీతల్‌ చౌద్రీ హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను నమ్మించి.. గొంతుకోసి హత్య చేశాడని క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు నిర్ధారించారు. ఆపై ఘటనను ఓ కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. నిందితుడు సునీల్‌ తన నేరం ఒప్పుకోవడంతో హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. హర్యానా మోడల్‌ అయిన శీతల్‌ చౌద్రీ.. అక్కడి మ్యూజిక్‌ ఇండస్ట్రీలోనూ ఆల్బమ్స్‌ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమె తన బంధువుల అమ్మాయిలతో పానిపట్‌ సత్కర్‌తర్‌ కాలనీలో నివసించసాగింది. అయితే జూన్‌14వ తేదీన ఓ ఆల్బమ్‌ షూట్‌కు వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మాత్లౌదా పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈలోపు.. ఆదివారం(జూన్‌ 15న) ఓ కాలువలో ఆమె ప్రయాణించిన కారు కొట్టుకువచ్చింది. అయితే అందులో ఆమె మృతదేహాం లేదు. ఆ మరుసటిరోజు.. కారు దొరికిన 80 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేతిపై ఉన్న టాటూల ఆధారంగా అది శీతల్‌ మృతదేహామేనని నిర్ధారించుకున్నారు. ఈలోపు.. ఆమె ప్రియుడు, ప్రమాదం నుంచి బయటపడ్డ సునీల్‌ చెప్పిన మాటల్ని అంతా నమ్మారు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె గొంతు, శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయని, ఆ గాయాల కారణంగానే ఆమె మరణించిందని తేలింది. లోతుగా దర్యాప్తు చేపట్టిన హర్యానా క్రైమ్‌ బ్రాంచ్‌ విభాగం.. చివరగా ఆమె కారులో వెళ్లిన ప్రియుడు సునీల్‌ను గట్టిగా విచారించడంతో విషయం బయటకు వచ్చింది. శీతల్‌ గతంలో సునీల్‌ పని చేసిన ఓ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసింది. వీళ్ల మధ్య ఆరేళ్లుగా పరిచయం ఉంది. శీతల్‌ ఐదు నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్తాబిడ్డలను వదిలేసి తనను వివాహం చేసుకోవాలని సునీల్‌ శీతల్‌కు ప్రపోజ్‌ పెట్టారు. ఈలోపు సునీల్‌కు ఇదివరకే పెళ్లైందని.. ఇద్దరు బిడ్డలకు తండ్రి అనే విషయం శీతల్‌కు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. తన పరువును బజారున పడేస్తుందన్న భయంతో.. మాట్లాడుకుందామని శీతల్‌ను పిలిచాడు సునీల్‌. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఆ మృతదేహాన్ని కారులో ఉంచి కాలువలోకి నెట్టేశాడు. నిందితుడు సునీల్‌ నేరం అంగీకరించడంతో.. పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. జూన్‌ 14వ తేదీ.. పానిపట్‌లో శీతల్‌ ఆల్బమ్‌ షూటింగ్‌.. ఆపై సునీల్‌తో ఔటింగ్‌. అర్ధరాత్రి దాకా కలిసి తాగిన శీతల్‌-సునీల్‌. ఆపై తన సోదరికి కాల్‌ చేసి సునీల్‌ దాడి చేస్తున్నాడని చెప్పిన శీతల్‌. కాల్‌ కట్‌ కావడంతో కంగారుపడిపోయిన శీతల్‌ సోదరి. జూన్‌ 15వ తేదీ.. మిస్సింగ్‌ కేసు నమోదు. పోలీసులు ఎంక్వైరీ. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్‌ను ప్రశ్నించిన పోలీసులు. తాము కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, తాను ఈత కొడుతూ బయటకు వచ్చి ఆస్పత్రిలో చేరానని, శీతల్‌ కారుతో సహా కొట్టుకుపోయిందని సునీల్‌ వాంగ్మూలం. శీతల్‌ ప్రయాణించిన కారు స్వాధీనం.జూన్‌ 16వ తేదీ.. శీతల్‌ మృతదేహాం లభ్యం. పోస్ట్‌మార్టం నివేదికలో హత్య జరిగిందని నిర్ధారణ.జూన్‌ 17వ తేదీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్‌ నేరాంగీకరణ. ఉదయాన్నే మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టడంతో రిమాండ్‌ విధింపు.

Why Amitabh Kant resigns as G20 Sherpa after serving govt for 45 years7
జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా

న్యూఢిల్లీ: జీ20 షెర్పా పదవికి అమితాబ్‌ కాంత్‌ రాజీనామా సమర్పించారు. 1980వ బ్యాచ్‌ కేరళ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన అమితాబ్‌ కాంత్‌ 45 ఏళ్లపాటు వివిధ హోదాల్లో సుదీర్ఘకాలంపాటు సేవలు అందించిన అనంతరం చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టడానికి ముందు.. 2022 జూలైలో ఆయనను జీ20 షెర్పాగా కేంద్రం నియమించింది. ‘నా కొత్త ప్రయాణం’ అంటూ లింక్డెన్‌లో అమితాబ్‌ కాంత్‌ (Amitabh Kant) తాజాగా ఒక పోస్ట్‌ చేశారు.‘‘45 ఏళ్లపాటు ప్రభుత్వ సేవల తర్వాత కొత్త అవకాశాలను స్వీకరించి, జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. భారత వృద్ధికి, పురోగతికి ఎన్నో అభివృద్ది చర్యల దిశగా నాకు అవకాశం కల్పించడమే కాకుండా.. జీ20 షెర్పా పదవికి నేను సమర్పించిన రాజీనామాకు ఆమోదం తెలిపినందుకు భారత ప్రధానమంత్రికి ఎంతో కృతజ్ఞతలు’’ అని పోస్ట్‌లో రాసుకొచ్చారు. భారత జీ20 షెర్పాగా ఎన్నో బహుపాక్షిక చర్చలకు నాయకత్వం వహించడం తన కెరీర్‌లో ఒకానొక పెద్ద మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.జీ20 షెర్పా బాధ్యతలకు ముందు 2016 నుంచి 2022 మధ్య నీతి ఆయోగ్‌ సీఈవోగా అమితాబ్‌ కాంత్‌ పనిచేయడం గమనార్హం. ఆ కాలంలో 115 వెనుకబడిన జిల్లాలను ప్రగతి పథకంలోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. అంతకుముందు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం సెక్రటరీగానూ కాంత్‌ సేవలు అందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్‌ చూపించిన మార్గదర్శనం, ప్రోత్సాహకానికి కాంత్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.చ‌ద‌వండి: ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమ‌తుల‌పై చైనా నియంత్ర‌ణ‌లు.. భార‌త్ కంపెనీల విల‌విల‌

Iran-Israel Conflict: India issues fresh advisory Help Line Numbers Details Here8
ఆలస్యం చేయొద్దు.. తక్షణమే టెహ్రాన్‌ను వీడండి.. భారతీయులకు అడ్వైజరీ

టెహ్రాన్‌/న్యూఢిల్లీ: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో భారతీయులకు(Indians In Iran) ఇండియన్‌ ఎంబసీ తాజాగా మంగళవారం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్‌లోని భారతీయులంతా వెంటనే నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఇప్పటివరకు ఎంబసీని సంప్రదించని భారతీయులు.. తక్షణమే అధికారులతో మాట్లాడి తమ లొకేషన్లను షేర్‌ చేయాలని సూచించింది. ఈ క్రమంలో హెల్ప్‌ లైన్‌ నెంబర్లు +98 9010144557, +98 9128109115, +98 9128109109 లకు తమ వివరాలు తెలియజేయాలని కోరింది. ఇరాన్‌ రాజధాని నగరం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం డ్రోన్లు, మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. అమెరికా రాయబార కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి.. ‘‘ఆలస్యం చేయకుండా నగరాన్ని వీడాలి’’ అంటూ భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్‌లో సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నట్లు ఒక అంచనా. వీళ్లలో 6,000 మందికి పైగా విద్యార్థులే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సత్వర చర్యలు ప్రారంభించింది. విమాన మార్గం మూసేయడంతో.. ఇప్పటికే 100 మందితో కూడిన తొలి బృందాన్ని టెహ్రాన్ నుంచి భూమార్గం ద్వారా అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి అజర్‌బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మీదుగా భారత్‌కు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు.. భారత రాయబార కార్యాలయం విద్యార్థులకు కీలక సూచనలు జారీ చేసింది. ఎల్లప్పుడూ టచ్‌లో ఉండాలని, అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో సహకరించాలని కోరింది. ఇదీ చదవండి: యుద్ధం ముగిసేది అప్పుడే.. ఇజ్రాయెల్‌ స్పష్టీకరణ

Shubhanshu Shukla carrying to space gajar halwa and more9
Shubhanshu Shukla: ఆహా... అంతరిక్షంలో గాజర్‌ హల్వా

శుభాంశు శుక్లా అంతరిక్షయాత్రకు సంబంధించిన ఆసక్తి శాస్త్రీయ విషయాలకే పరిమితం కాలేదు.‘అక్కడ ఏంతింటారు?’ లాంటివి కూడా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు.శుక్లా తనతో పాటు భారతీయ రుచులను కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్లనున్నాడు.‘ఇస్రో’ ప్రత్యేకంగా సిద్ధం చేసిన వంటకాలు, గాజర్‌ హల్వా తీసుకువెళతాడు. ఈ వంటకాలను మొదట భారతదేశ గగన్‌యాన్‌ మిషన్‌ కోసం తయారుచేశారు. వాటిని ఇప్పుడు ‘యాక్సియం–4’ మిషన్‌ కోసం ఉపయోగించనున్నారు.అంతరిక్ష పరిస్థితులను తట్టుకునేలా, మై క్రో గ్రావిటీలో తినడానికి తేలికగా, సురక్షితంగా, తాజాగా ఉండేలా ఈ ఆహారపదార్థాలను తయారుచేశారు. భారతీయ వంటకాలను ‘యాక్సియం–4’ మిషన్‌ కోసం ఆమోదించడం అంత తేలికగా జరగలేదు.ఇదీ చదవండి: Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా?‘భారతీయ వంటకాలలో మసాలాలు అధికంగా ఉన్నందున వాటిని తీసుకువెళ్లడానికి అనుమతి లభించడం కష్టం అయింది. చివరకు కొన్ని రకాల ఆహారపదార్థాలను అనుమతించారు. తన వెంట తీసుకువెళుతున్న భారతీయ వంటకాలను తోటి వారికి రుచి చూపించాలని శుభాంశు ఉత్సాహంగా ఉన్నాడు’ అంటుంది లక్నోలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శుక్లా సోదరి సుచి శుక్లా.

Top 10 Countries with Highest Income Tax in 202510
ప్రపంచంలో అత్యధిక వ్యక్తిగత పన్ను రేట్లు ఉన్న దేశాలు

ప్రతి దేశ ఆర్థిక చట్రంలో పన్నులు కీలకమైన పాత్ర పోషిస్తాయి. దేశ ఆర్థిక విధానాలు, సామాజిక కార్యక్రమాలు, పొరుగు దేశాలతో ఆర్థిక పోటీతత్వాన్ని ఇవి రూపొందిస్తాయి. 2025లో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు వివిధ దేశాల్లో గణనీయంగా మారింది. కొన్ని దేశాలు సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి ప్రగతిశీల పన్ను నమూనాలను నిర్వహిస్తున్నాయి. మరికొన్ని ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడానికి తక్కువ పన్నులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2025లో అత్యధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు ఉన్న టాప్ 10 దేశాల వివరాలు కింద తెలుసుకుందాం.భారత్‌లో ఇది గరిష్ఠంగా 30 శాతం ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement