Top Stories
ప్రధాన వార్తలు
గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
ఢిల్లీ : క్తరవ్యపథ్ వేదికగా ఢిల్లీలో 76వ గణతంత్ర వేడుకలు (76th Republic Day) ఘనంగా జరుగుతున్నాయి. గణతంత్ర వేడుకల్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు, ముఖ్య అతిథి, ఇండోనేషియా (Indonesia) అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (Prabowo Subianto) పాల్గొన్నారు.👉76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యేకతలు ఢిల్లీలో కొనసాగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలు 90 నిమిషాల పాటు నిర్విరామంగా కొనసాగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదవి ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర వేడుకల్ని ప్రారంభించారు. #WATCH | President Droupadi Murmu unfurls the National Flag at Kartavya Path, on the occasion of 76th #RepublicDay🇮🇳National anthem and 21 Gun salute follows.(Source: DD News) pic.twitter.com/6969bmx2B4— ANI (@ANI) January 26, 2025 ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రబోవోతో పాటు 352 మంది సభ్యుల ఇండోనేషియా కవాతు, బ్యాండ్ బృందం కవాతులో పాల్గొంటుంది.గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్ వద్ద జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించడంతో గణతంత్ర దినోత్సవ పరేడ్ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. ఈ వేడుకల్ని వీక్షించేందుకు దాదాపు 10,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ‘స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’ పేరుతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 16 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ సంస్థలకు చెందిన 15 శకటాలతో మొత్తం 31 శకటాలు కర్తవ్య పథ్ వేదికగా ప్రదర్శించనున్నాయి బ్రహ్మోస్ క్షిపణి, పినాక రాకెట్ సిస్టమ్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో సహా అత్యాధునిక రక్షణ శకటాలు ప్రదర్శించనున్నాయి. ఆర్మీకి చెందిన యుద్ధ నిఘా వ్యవస్థ ‘సంజయ్’ డీఆర్డీవో ‘ప్రళయ్’ వ్యూహాత్మక క్షిపణి తొలిసారిగా ప్రదర్శించనుంది. ప్రదర్శనలో ఇతర సైనిక శకటాలలో టీ-90 ‘భీష్మ’ ట్యాంకులు, శరత్ పదాతిదళం వాహనాలు, నాగ్ క్షిపణి వ్యవస్థ, మౌంటెడ్ పదాతిదళ మోర్టార్ సిస్టమ్ (ఐరావత్) ఉన్నాయి.దేశంలోని సాయుధ దళాల మధ్య ఐక్యత స్ఫూర్తికి ప్రతీకగా త్రివిద దళాల సేవలు ఉమ్మడిగా ప్రదర్శించనుండగా.. డీఆర్డీవో ‘రక్షా కవచ్’ థీమ్ను ప్రదర్శించనుంది.మౌంటెడ్ కాలమ్కు నాయకత్వం వహించే మొదటి ఆర్మీ దళం ఐకానిక్ 61 అశ్వికదళం. ఇది ప్రపంచంలోని ఏకైక గుర్రపు అశ్వికదళ రెజిమెంట్. నారీ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్న త్రివిధ దళాల అనుభవజ్ఞులైన మహిళా అధికారులు ఉంటారు.
గ్రామ, సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్ షాక్
సాక్షి, విజయవాడ: గణతంత్ర దినోత్సవం వేళ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సచివాలయాలను కేటగిరులుగా విభజించి ఉద్యోగులను కుదిరించింది.గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాకిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 40 వేల ఉద్యోగుల సంఖ్యకు చంద్రబాబు సర్కార్ కోతపెట్టింది. సచివాలయ ఉద్యోగులకు క్రమబద్దీకరణకు ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం.ఇక, ఇదే సమయంలో సచివాలయాలను ఏ, బీ, సీ కేటగిరిగా విభజించింది. ఈ క్రమంలో ఏ-కేటగిరి సచివాలయాల్లో సిబ్బందిని ఆరుకి కుదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే, బీ-కేటగిరి సచివాలయంలో సిబ్బందిని ఏడుకి కుదించారు. సీ-కేటగిరి సచివాలయంలో సిబ్బంది ఎనిమిదికి కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, ఉద్యోగాల్లో భారీగా కోత విధించారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మూడు కేటగిరీలుగా వర్గీకరించాలని తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని ఏపీ గ్రామ, సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల అర్లయ్య ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుని అమలు చేసే ముందు ఉద్యోగ సంఘాల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు వివిధ రూపాల్లో కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు.ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగుల వర్గీకరణకు సంబంధించి మార్గదర్శకాల కోసం ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేస్తామన్న కమిటీని నియమించారా లేదా, ఏర్పాటై ఉంటే అందులో సభ్యులుగా ఎవరెవరు ఉన్నారనే దానిపై కూడా ఉద్యోగులు, నేతలకు సమాచారం లేదన్నారు. తమ విభాగంలో చేపట్టనున్న మార్పులు, చేర్పులపై ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ అంశంపై ప్రభుత్వంతోపాటు సంబంధిత మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
వైఎస్సార్సీపీ కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. స్వతంత్ర్య సమరయోధుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలు. రిపబ్లిక్ డే సందర్బంగా జాతీయ జెండాను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక, ఏపీలోని పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ సమానంగా ఎదగాలనే దృక్పథంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాం. పేదరికం లేని సమాజం కోసం మనమంతా కృషిచేయాలి. మనల్ని మనం పరిపాలించుకుంటూ ఎంతో పురోభివృద్ధిలోకి వెళుతున్నాం. బ్రిటీష్ పాలకుల నుంచి విముక్తి కోసం బానిస సంకెళ్ళు తెంచుకుని పరిపాలించుకోవాలని అనేక మంది పోరాటాలు చేశారు.ఈ క్రమంలో మనల్ని మనం పరిపాలించుకునే సర్వసత్తాక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నాం. అందరూ సమానంగా ఎదగాలనే దృక్పథంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలను మన పాలనలో చూశాం. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఎదగాలనే మన ప్రయత్నం కొనసాగించాలి. పేదరికాన్ని పారద్రోలి స్వతంత్ర భారతాన్ని నిర్మించుకోవడానికి మనమంతా కృషిచేయాలని పార్టీ తరఫున ప్రజలకు విజ్క్షప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా వేడుకల్లో పార్టీ నేతలు పాల్గొన్నారు. విశాఖలో వేడుకలు..విశాఖలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండానుమాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. అనంతరం అమర్నాథ్ మాట్లాడుతూ..‘మన రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో లేదు. రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రాష్ట్ర ప్రజల హక్కులను వైఎస్సార్సీపీ కాపాడుతుంది. విజయసాయి రెడ్డి రాజీనామా గురించి ఆయనే చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని మాట్లాడారు. తన లాంటి వారిని వెయ్యి మందిని తయారు చేయగలరని సాయిరెడ్డి చెప్పారు.నాయకులను ఏ విధంగా తయారు చేయాలో వైఎస్ జగన్కు తెలుసు. వైఎస్ జగన్ ఒక టార్చ్బేరర్. చంద్రబాబు మీద నమ్మకం లేకనే గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు టీడీపీని వీడిచారా. నాయకుల మీద రాజకీయంగా ఒత్తిడి ఉంటుంది. కొంతమంది తట్టుకుంటారు మరి కొంతమంది తట్టుకొని నిలబడలేరు. పెట్టుబడులు రాకపోయేసరికి దావోస్ పర్యటనపై చంద్రబాబు మాట మార్చారు. దావోస్ పర్యటన ఒక మిథ్య అంటూ మాట్లాడుతున్నారు. పదిసార్లు దావోస్ వెళ్లి వచ్చిన తరువాత మిథ్య అని తెలిసిందా? అంటూ ప్రశ్నించారు. విజయవాడలో..విజయవాడలో జాతీయ జెండా ఎగురవేసిన సెంట్రల్ నియోజకవర్గ మాజీ MLA మల్లాది విష్ణు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ..‘రాజ్యాంగ అమలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాజ్యమేలుతున్నాయి. రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయాల్సిన సంస్థలు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. గవర్నర్ చేత ప్రభుత్వం అన్ని అబద్దాలు చెప్పించింది.దావోస్ పర్యటనలో ఒక్క పరిశ్రమ రాలేదు. పరిశ్రమలు తీసుకురాకుండా ఎదురుదాడి చేస్తున్నారు. షేక్ హాండ్స్ కోసం కాదు దావోస్కు వెళ్లేది. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నేడు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మూడు పార్టీలు భిన్నమైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నాయి. ఓటు ద్వారా, నియంతృత్వం ద్వారా ఓటు హక్కును వినియోగించుకొన్నామని చెప్పే వాళ్ళు ముందుకు రావాలి.. ప్రభుత్వాన్ని ప్రశించాలి. విద్య, వైద్యాల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆసుపత్రుల్లో పిల్లలను ఎత్తుకెళ్తున్నారు.. కనీసం మందులు కూడా లేవు. వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి. తప్పులు ఎవరు చేస్తున్నారు, ఎవరు అబద్ధాలు, ఎవరు ప్రజల్లో మోసం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అని కామెంట్స్ చేశారు.వైఎస్సార్ జిల్లాలో..వైఎస్ఆర్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండా ఎగురవేసిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష, మేయర్ సురేష్ బాబు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఎన్టీఆర్ జిల్లాలో..ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగం ఫలితంగా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. గత ఐదేళ్లలో అంబేద్కర్, మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లిన నాయకుడు వైఎస్ జగన్. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సుసాధ్యం చేసిన వ్యక్తి వైఎస్ జగన్. రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ అడుగుజాడల్లో మేము వెళ్తాం అని అన్నారు.
ఎస్ఆర్హెచ్కు గుడ్న్యూస్.. చెపాక్లో దుమ్ములేపిన ఆల్రౌండర్
చెన్నై వేదికగా భారత్తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్(Brydon Carse) తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ దుమ్ములేపాడు.ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన కార్స్.. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 17 బంతుల్లో 3 సిక్స్లు, ఒక ఫోర్త్తో 31 పరుగులు చేశాడు. 29 ఏళ్ల కార్స్ దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. లేదంటే ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించిండేది. కార్స్ బౌలింగ్లోనూ సత్తాచాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.ఎస్ఆర్హెచ్కు గుడ్న్యూస్..కాగా బ్రైడన్ కార్స్ భారత గడ్డపై ఈ తరహా ప్రదర్శన చేయడం ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్-2025 మెగా వేలంలో కార్స్ను ఎస్ఆర్హెచ్ కేవలం రూ. కోటిరూపయాలకే సొంతం చేసుకుంది. భారత్ పిచ్లపై తొలిసారి ఆడినప్పటికి ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా అందరిని కార్స్ మెప్పించాడు. కార్స్ తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు కేవలం 5 టీ20లు మాత్రమే ఆడాడు.మొత్తంగా 9 వికెట్లు పడగొట్టాడు. ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో ఆడిన అనుభవం మాత్రం అతడికి ఉంది. సౌతాఫ్రికా టీ20, ది హండ్రెడ్, వైటాలిటీ బ్లాస్ట్లో ఈ ఇంగ్లండ్ ఆల్రౌండర్ ఆడాడు. కాగా ఎస్ఆర్హెచ్లో ఇప్పటికే నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్ వంటి అద్భుతమైన ఆల్రౌండర్లు ఉన్నారు. ఇప్పుడు కార్స్ రాకతో ఎస్ఆర్హెచ్ ఆల్రౌండ్ విభాగం మరింత పటిష్టంగా మారింది.ఐపీఎల్-2025కు ఎస్ఆర్హెచ్ జట్టు: పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్ , రాహుల్ చాహర్, ఆడమ్ జంపా , అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్జిత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్ , అనికేత్ వర్మ , ఎషాన్ మలింగ , సచిన్ బేబీ.చదవండి: IND vs ENG: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
బీజేపీవి రాజ్యాంగ విరుద్ద కార్యక్రమాలు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో కాషాయ ఎజెండాను అమలుచేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదే సమయంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తోందని చెప్పుకొచ్చారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో జాతీయ పతాకాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ హనుమంతరావు, చైర్మన్లు శివసేనారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. బీజేపీ దేశంలో కాషాయ ఎజెండాను అమలు చేయాలని చూస్తోంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లోనే అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమాన పరిచారు. ఇక్కడ కేంద్రమంత్రి బండి సంజయ్ ఇందిరమ్మ పేరు పెట్టవద్దని అంటున్నాడు. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్లు నియంత పాలన చేసింది. ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ భరోసా కింద 12 వేల రూపాయలు, రైతు భరోసా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రాజ్యాంగబద్దంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాము. హైదరాబాద్ మెట్రో విస్తరణ ఒక పెద్ద ముందడుగు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎల్లప్పుడు ఉంటుంది. అందుకే జై గాంధీ, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ప్రజలంతా మద్దతు ప్రకటించాలి అని కోరారు.
అదిరిపోయే పంచ్లతో 'మదగజరాజా' తెలుగు ట్రైలర్
విశాల్(Vishal ) నటించిన ‘మదగజరాజా’(Madha Gaja Raja) చిత్రం సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ సంక్రాంతికి కోలీవుడ్లో విడుదలైంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్కు దగ్గరలో ఈ మూవీ ఉంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వర్షన్ కూడా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మంచి స్పందన లభించిందని యూనిట్ పేర్కొంది. కాగా ఈ జనవరి 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar) హీరోయిన్స్గా నటించారు. తెలుగు వర్షన్లో సినిమా రానున్నడంతో తాజాగా ‘మదగజరాజా’ ట్రైలర్ను హీరో వెంకటేశ్ హైదరాబాద్లో విడుదల చేశారు. కామెడీ ప్రధానంగా ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జానర్ సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు సుందర్.సి. దిట్ట అని చెప్పవచ్చు. ఆయన తన మార్క్ మాస్ అంశాలతో ఈ మూవీని రూపొందించారు. ఇందులో హీరోయిన్ సదా కూడా ఒక ఐటెమ్ సాంగ్లో కనిపించింది.
దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య
సాక్షి, అమరావతి: ‘పెట్టుబడుల ఆకర్షణ కోసం దావోస్ వెళుతున్నా. 1995లో సీఎం అయినప్పటి నుంచి ఏటా దావోస్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నా. ఎవరూ సీఐఐ, దావోస్ను పట్టించుకోని తరుణంలో వాటిని నేనే ప్రమోట్ చేశా. ఇతర రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు సాధించా’ నిన్నటివరకు ఇలా మాట్లాడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు దావోస్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగి వచ్చిన తర్వాత మాట మార్చేశారు. అసలు దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయన్నది ఒక మిథ్య మాత్రమేనని, ఇటువంటి నెగెటివ్ ఆలోచనల నుంచి మీడియా తక్షణం బయటకు రావాలంటూ సరికొత్త రాగం అందుకున్నారు. శనివారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచం ఎటువైపు పోతోందన్న విషయంపై జ్ఞానం పెంచుకోవడంతోపాటు అనేక దేశాల పారిశ్రామికవేత్తలను ఒకేచోట కలిసే నెట్వర్కింగ్ కేంద్రం దావోస్’ అంటూ సెలవిచ్చారు. ఒప్పందాల కోసం దావోస్కు వెళ్లాల్సిన అవసరం లేదని అవి ఇక్కడే చేసుకోవచ్చన్నారు. ఈసారి దావోస్ పర్యటనలో గడిచిన ఐదేళ్లలో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్ను పునరుద్ధరించడంపై దృష్టి సారించామని, పెట్రోనాస్, డీపీ వరల్డ్, సిస్కో, వాల్మార్ట్, యూనీలీవర్, పెప్సికో వంటి అనేక సంస్థల ప్రతినిధులతో సమావేశమైనట్టు తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని స్వాగతిస్తున్నామని, పెట్టుబడుల విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ ఉండటం మంచిదేనని అన్నారు. దేశానికి ముంబై ఆర్థిక రాజధాని కావడంతో అక్కడ భారీ పెట్టుబడులు వచ్చాయని, తాను గతంలో హైదరాబాద్ను అభివృద్ధి చేయడంతో అక్కడ పెట్టుబడులు వచ్చాయన్నారు. హైదరాబాద్ కేవలం తెలంగాణ వారిది కాదని, తెలుగు వారందరిగా దానిని చూడాలన్నారు. గతంలో దావోస్ అంటే ధనవంతుల కోసం అనే భ్రమ ఉండేదని, అందుకే దేశంలోని రాజకీయ నాయకులు అక్కడికి వెళితే తమ ఓట్లు పోతాయని భయపడేవారని చెప్పారు.అటువంటి సమయంలో 1995 నుంచి ఇండియాలో దావోస్ను తాను ప్రమోట్ చేశానన్నారు. తాను వెళ్లడం ప్రారంభించిన తర్వాతే అప్పటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ దావోస్కు వచ్చి పెట్టుబడుల కోసం పోటీ పడేవారని, తాను హైదరాబాద్ను ప్రమోట్ చేస్తే కృష్ణ బెంగళూరును ప్రమోట్ చేస్తూ పెట్టుబడులను ఆకర్షించేవారన్నారు.పోర్టులతో రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులుకొత్తగా నిర్మిస్తున్న పోర్టులతో రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ భారీ రిఫైనరీ, అనకాపల్లి వద్ద అర్సెలర్ మిట్టల్ 14 మిలియన్ టన్నుల స్టీల్ప్లాంట్స్ పోర్టు ఆధారంగా ఏర్పాటవుతున్నాయన్నారు. దీంతోపాటు ఎల్జీ రాష్ట్రంలో రూ.5 వేల కోట్లు, గ్రీన్కో కంపెనీ కాకినాడ వద్ద గ్రీన్ అమ్మోనియా, విశాఖ వద్ద ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ యూనిట్, రిలయన్స్ రూ.60 వేల కోట్లతో 500కు పైగా బయో ఫ్యూయల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాయని.. రానున్న కాలంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ ప్రధాన హబ్గా తయారు కానుందన్నారు. టెక్నాలజీ రంగంలో సహకారం అందించేందుకు గూగుల్ ముందుకు వస్తోందని, అమెరికాలోని పన్ను చెల్లింపుల సమస్యపై ఒక స్పష్టత రాగానే విశాఖలో గూగుల్ సేవలను ప్రారంభిస్తుందన్నారు. ఇప్పటికే విశాఖకు టీసీఎస్ వచ్చిందని, గూగుల్ రాకతో విశాఖ ఐటీ హబ్గా మారుతుందన్నారు. టాటా గ్రూపుతో కలిసి ఎయిర్పోర్టు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున రాష్ట్రంలో వైద్య, వ్యవసాయ రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెంచే అంశంపై దృష్టి సారించాల్సిందిగా బిల్గేట్స్ను కోరినట్టు తెలిపారు. సీఐఐ సహకారంతో రాష్ట్రంలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి జిందాల్ గ్రూపుతో దావోస్లో చర్చలు జరిపానని, రాష్ట్రం నుంచి జిందాల్ గ్రూపు వెళ్లిపోతోందన్న వార్తల్లో నిజం లేదన్నారు. విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీకి రాజీనామా చేయడమనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ మీద నమ్మకం లేకపోతే ఎవరైనా మారతారని, ఈ అంశంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడను అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక్కడి వాళ్లకు ఇంగ్లిష్ రాకపోతే నేర్పించా..ఇండియాలో దావోస్ను, సీఐఐని నేనే ప్రమోట్ చేశా» గతంలో దావోస్ అంటే కేవలం ధనికులు అనే ముద్ర ఉండేది. అక్కడికి వెళితే ఓట్లు పోతాయన్న భయంతో రాజకీయ నాయకులు వెళ్లేవారు కాదు. సీఎంగా నేను వెళ్లినప్పటి నుంచే మిగిలిన వాళ్లు రావడం మొదలు పెట్టారు.» 1997లో దావోస్ వెళ్లి హైదరాబాద్ అనగానే ఏది పాకిస్థాన్లోని హైదరాబాదా అని అడిగేవారు.» 25 హైస్కూల్స్ కూడా లేని రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశాను.» నన్ను చూసి దావోస్ వచ్చిన అప్పటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ హైదరాబాద్లో ఏముంది బెంగళూరు రండి అనేవారు. ఆ తర్వాత నేను హైదరాబాద్లో చేసిన ప్రగతి చూసి ఎస్ఎం కృష్ణ కాంప్రమైజ్ అయ్యారు.» ఐటీ అంటే ఏమిటో మనవాళ్లకు అర్థంకాని సమయంలో ప్రపంచమంతా తిరిగి కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాను.» నేను అప్పట్లో పీసీ (పర్సనల్ కంప్యూటర్) అంటే అందరూ పోలీస్ కానిస్టేబుల్ అని అర్థం చేసుకునేవారు. ఇక్కడి వాళ్లకు ఇంగ్లిష్ సరిగా మాట్లాడటం రాకపోతే లండన్ నుంచి ప్రొఫెసర్లను రప్పించి ఇంగ్లిష్లో నైపుణ్య శిక్షణ ఇప్పించాను.» 1995లో ఐటీని ప్రమోట్ చేస్తే.. ఇప్పుడు 2025లో ఏఐని ప్రమోట్ చేస్తున్నా.» కార్పొరేట్–పబ్లిక్ గవర్నెన్స్లో రాణించే విధంగా సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ద్వారా తయారు చేస్తా.» హైదరాబాద్ని తెలంగాణ వాళ్లదిగా చూడకూడదు. అది తెలుగు వారందరిగా పరిగణించాలి. ఆ విధంగానే హైదరాబాద్ను ప్రమోట్ చేశాను.» ఏడాదికి సగటున 15 శాతం వృద్ధిరేటును నమోదు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.2.58 లక్షల నుంచి 2047నాటికి రూ.58 లక్షలకు పెంచుతాను.» నేను ఇప్పుడివన్నీ చెబితే మీకు కథలుగా కనిపిస్తాయి. కానీ గత 30 ఏళ్లలో జరిగిన.. నేను చేసిన అభివృద్ధే దీనికి నిదర్శనం.» గతంలో నువ్వు ల్యాప్టాప్లోని డాష్బోర్డుతో హైదరాబాద్ గురించి చక్కగా ప్రమోట్ చేశావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను ప్రమోట్ చేస్తున్నావా అని బిల్గేట్స్ అడిగారు.» మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో (ఏఐ) మహారాష్ట్రను హబ్గా చేస్తాను అంటే.. ఇక్కడ నేను ఉన్నాను. అది నీవల్ల అయ్యేపని కాదు. ప్రతి ఇంటికి ఒక ఏఐని తీసుకువస్తా అని చెప్పాను.
ఆర్ధిక మంత్రి హల్వా.. రుచులే వేరయా!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గారి హల్వా (halwa) వంటకం పూర్తయింది. జనాలకి రుచి చూపించడమే తరువాయి. హల్వా అంటేనే తీపి పదార్ధం. కానీ ఆర్ధిక మంత్రి గారి హల్వాకి మాత్రం రకరకాల రుచులుంటాయి. ఒకరికి తీపి, ఇంకొకరికి చేదు, మరొకరికి చప్పగా... మొత్తమ్మీద అందరూ రుచి చూడాల్సిందే... వంటకం మొన్నే పూర్తయినా... రుచి చూపించేది మాత్రం ఫిబ్రవరి 1నే.2025-26 ఆర్ధిక సంవత్సరానికి నరేంద్రం మోదీ నేతృత్వంలో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే ప్రభుత్వం తొలి బడ్జెట్ (budget 2025) ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 న ప్రారంభమవుతాయి. ఆరోజు మొదట ఎకనామిక్ సర్వే ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. గత ఆర్ధిక సంవత్సరం తాలూకు వివిధ రంగాల్లో ప్రభుత్వం సాధించిన పురోగతి, లక్ష్యాలు, ఆర్ధిక వనరులు, భవిష్యత్ అవకాశాలతో సమ్మిళితమైన ఈ సర్వే బడ్జెట్ కు ఒక దిక్సూచిగా నిలుస్తుంది.ఆమర్నాడు అంటే ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 8 వ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. వాస్తవానికి మనం బడ్జెట్ అని వ్యవహరిస్తున్నప్పటికీ... దీన్ని ఫైనాన్స్ బిల్ గా భావించాలి. సాధారణ పన్ను చెల్లింపుదారులు మొదలుకొని... ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఇన్సూరెన్సు, ఫైనాన్స్, ఆటోమొబైల్, బ్యాంకింగ్... ఇలా వివిధ రంగాలు ఈ బడ్జెట్ కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటాయి.ఆర్ధిక మంత్రి ఎలాంటి ప్రకటనలు చేస్తారు? అవి కలగజేసే ప్రయోజనం, చోటుచేసుకోబేయే మార్పులు... ఇత్యాది అంశాలను విశ్లేషిస్తూ భవిష్యత్ మార్పులకు ఆయా రంగాలు సిద్ధమవుతాయి. వాస్తవానికి బడ్జెట్ కసరత్తు ప్రారంభం కావడానికి ముందే ఆర్ధిక మంత్రి ఆయా రంగాల వారితో సమావేశమై వారి విజ్ఞప్తులు, ఆకాంక్షలు, డిమాండ్లను లుసుకున్నారు. కోరికలు, డిమాండ్లు ఎక్కువగానే ఉండటం సహజం, అయితే ఈ బడ్జెట్ లో వాటిలో ఎన్ని నెరవారుతాయో నాన్న ఆసక్తితో పరిశ్రమ వర్గాలు ఎదురుచూస్తూ ఉంటాయి.జనవరి 31 న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల తొలివిడత ఫిబ్రవరి 13 న ముగుస్తుంది. రెండో విడత సమావేశాలు మార్చి 10 న ప్రారంభమై ఏప్రిల్ 4 న ముగుస్తాయి. ఈ రెండు విడతల సమావేశాల్లోనూ పార్లమెంట్లో విస్తృత స్థాయిలో వాదోపవాదాలు జరుగుతాయి. విపక్షాల ఎదురుదాడిని తట్టుకుంటూనే ప్రభుత్వం తన వాదనలు సమర్ధించుకునే యత్నాలు చేస్తుంది. ఒక్కోసారి సాధారణ, కార్పొరేట్, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అసంతృప్తుల్ని పరిగణనలోకి తీసుకుంటూ తగిన మార్పులు చేస్తుంది. ఇలా చేసిన బడ్జెట్ (ఫైనాన్స్ బిల్లు) కు లోక్ సభ, రాజ్య సభ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది. అక్కడ కూడా లాంఛనం పూర్తయ్యాక కొత్త ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.ఈ బడ్జెట్ పై ఎన్నో వర్గాలు రకరకాల ఆశలు పెట్టుకుంటాయి. ముఖ్యంగా బడ్జెట్ వస్తున్న ప్రతిసారీ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తూ... చివరకు నిట్టూర్పులు విడిచే వర్గం ఒకటి ఉంది. వారే పన్ను చెల్లింపుదారులు.ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు చేయాలని, ట్యాక్ రిబేటులు పెంచాలని వీరు ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే కార్పొరేట్ వర్గాలు తమ తమ రంగాలకు దక్కే ప్రయోజనాలకోసం డిమాండ్ చేస్తూ ఉంటాయి.స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే వేళ.. అంటే 2047 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారత దేశం) నినాదంతో నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు భారత్.. యువరక్తంతో ఉరకలేస్తోందని, రాబోయే 30 - 40 ఏళ్ళు మనవేనని, ప్రపంచమంతా మనవైపే ఆతృతగా ఎదురుచూస్తోంది ప్రధాన మంత్రి మోదీ చెబుతూ వస్తున్నారు. మరి ప్రధాని మాటలు కార్యరూపం దాల్చాలంటే అందుకు అనుగుణమైన కసరత్తు ఇప్పటినుంచీ జరగాలి. మోదీ 3.O లో వెలుగు చూడబోయే బడ్జెట్ ఇందుకు వేదికగా నిలవాలి. 2023 - 24 లో 8.2 శాతం వృద్ధి సాధించిన భారత ఆర్ధిక వ్యవస్థ... 2024 -25 లో 6 .5 శాతం వృద్ధికే పరిమితం కావచ్చనే అంచనాలున్నాయి. ఈనేపథ్యంలో జీడీపీ వృద్ధిని పెంచే దిశగా బడ్జెట్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం అవసరం. జాతీయ రహదారుల విస్తరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, తాగు నీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలి.మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రవేశపెడుతున్న తొలి పూర్తి బడ్జెట్ ఇదే. ఇప్పుడిప్పుడే ఎన్నికలు ఏమీ లేవు, కాబట్టి ఎన్నికల అనుకూల బడ్జెట్ గా ఉదారంగా వ్యవహరించే అవకాశం లేదు కాబట్టి తాజా బడ్జెట్ లో కొంత కరమైన నిర్ణయాలే వెలువడే అవకాశం ఉంది. రాబోయే బడ్జెట్ నుంచి ఏయే వర్గాలు ఏమేమి ఆశిస్తున్నాయో.. రాబోయే కథనాల్లో వివరంగా చర్చిద్దాం.స్టాక్ మార్కెట్ ఈసారి బడ్జెట్ వచ్చేది శనివారం. వాస్తవానికి ఆరోజు స్టాక్ మార్కెట్లు పనిచేయవు. కానీ బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించాలని స్టాక్ ఎక్స్చేంజిలు నిర్ణయించాయి. ఆరోజు యధావిధిగా స్టాక్ మార్కెట్లు ఉదయం 9.15 కి ప్రారంభమై మధ్యాహ్నం మూడున్నర వరకు కొనసాగుతాయి. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతాయి. బడ్జెట్ వెలువడే సమయంలోనూ... ముఖ్యంగా ఆర్ధిక మంత్రి రెండో పార్ట్ (ట్యాక్స్లకు సంబంధించి) చదివే వేళ మార్కెట్లో ఈ హెచ్చుతగ్గులు తారాస్థాయికి చేరతాయి.ఆ తర్వాత విశ్లేషకులు, ఆర్ధిక నిపుణులు వెలువరించే అభిప్రాయాలను బట్టి మార్పులకు లోనవుతూ ఉంటాయి. కాబట్టి సగటు మదుపర్లు ప్రధానంగా ట్రేడర్లు ఆరోజు ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. సాధ్యమైనంతవరకు ఆరోజు ట్రేడింగ్ కు దూరంగా ఉండటమే మేలు. అధిక స్థాయిలో లాభాలు రావడానికి ఎంత అవకాశం ఉందో భారీ నష్టాలు కళ్లజూసేందుకు కూడా అంతే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్, ఆర్ధిక విశ్లేషకులు
పవన్కు కొత్త ట్విస్ట్.. అన్నా ఎన్నాళ్లీ అవమానాలు!
అన్నయ్యా.. మేము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం కానీ నువ్వు విన్నావు కాదు.. మనం లేకుంటే వాళ్లకు కుర్చీ ఎక్కే ఛాన్స్ దక్కేనా?. అలాంటప్పుడు మనం గౌరవప్రదమైన సీట్లు తీసుకుని పోటీ చేద్దాం అంటే నువ్వు ఒప్పుకోలేదు.. జస్ట్ గుప్పెడు సీట్లు తీసుకుని వాటితో మనం చేసేదేం లేదు.మనం గేమ్లో అరటిపండులం అయిపోతాం తప్ప గేమ్ చేంజర్స్ కాలేం. వాళ్ళు ఆట ఆడుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలి. ఈ ఖర్మ మనకు ఎందుకు అన్నయ్యా.. కలలు కనండి.. అవి నిజం చేసుకోవడానికి కృషి చేయండి అని అబ్దుల్ కలాం చెప్పారు కానీ ఆయన మన సొంత కలలు నెరవేర్చుకోవడానికి కష్టపడాలని చెప్పారు తప్ప వేరే వారి కలలు నిజం చేసేందుకు మనం శ్రమించాలని చెప్పలేదు.వాళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తారు.. పాలనను అస్తవ్యస్తం చేస్తారు .. ఆ ఫెయిల్యూర్స్ను నీ మీద నెట్టేస్తారు చూస్తూండండి.. ఏదైనా మంచి జరిగితే వాళ్ళ ఖాతాలో వేసుకుని.. తప్పులన్నిటికీ మనను నిందిస్తారు.. ఎందుకొచ్చిన దరిద్రం మనకు.. బయటకు వెళ్ళిపోదాం.. ప్రతిపక్షంలో ఉందాం ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. మనకు ఈ అధికారం అనే లంపటం వద్దు.. అంటూ ఆవేదనతో జనసైనికులు కడపజిల్లాలో ఫ్లెక్సీలు కట్టారు.వాస్తవానికి పవన్ సపోర్ట్తోనే చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో గెలిచారని.. ఇంకా చెప్పాలంటే చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మడం లేదని.. ఆయన ఏనాడో విశ్వసనీయతను కోల్పోయారని.. కానీ కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెనకుండి.. బాబు ఇచ్చిన హామీలకు తానూ బాధ్యుడిగా ఉంటూ వాటిని నెరవేర్చే బాధ్యతను నెత్తిన పెట్టుకుంటానని చెప్పడంతోనే ప్రజలు విశ్వసించి ఈ కూటమికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారని కేడర్ భావిస్తోంది. అయితే ఎన్నికల సమయంలో కనీసం యాభై సీట్లయినా తీసుకోకుండా కేవలం 21 సీట్లలో పోటీ చేయడం ద్వారా ప్రభుత్వంలో క్రియాశీలకంగా.. కీలకంగా ఉండలేని పరిస్థితి వస్తోందని కేడర్ లోలోన బాధ పడుతోంది.పైగా చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ను సైతం అడుగడుగునా అవమానిస్తున్నారని.. మొన్నటి దావోస్ సభలకు సైతం డిప్యూటీ సీంఎను తీసుకుని వెళ్లలేదని.. కేవలం చంద్రబాబు.. లోకేష్ వెళ్లి ఆయనను పక్కనబెట్టేశారని.. తీరా అట్నుంచి ఇద్దరూ ఒట్టి చేతులతో వచ్చారని ఆ ఫ్లెక్సీల్లో స్పష్టంగా పేర్కొన్నారు. వారిమీద నమ్మకం లేకనే పెట్టుబడులు రాలేదని.. అదే పవన్ వెళ్లి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని.. పవన్ను చూసి అయినా కనీసం నాలుగైదు కంపెనీలు వచ్చేవని అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అయినా అట్నుంచి వచ్చాక బాబును ఎలివేట్ చేస్తూ టీవీలు.. ఛానెళ్లలో ప్రోగ్రామ్లు నడుపుతున్నారని. కేడర్ ఆవేదన చెందుతోంది.తప్పులు చేసేది వాళ్ళు.. ఒప్పుకునేది మీరుతిరుమలలో తొక్కిసలాట వంటి ఘోరాలు జరిగినపుడు వారెవరూ తమకు సంబంధం లేనట్లు ఉంటారు.. మీరు మాత్రం నిజాయితీగా జనంలోకి వెళ్లి తప్పు ఒప్పుకుని క్షమాపణ చెబుతున్నారు. కానీ, ఆ ఘోరానికి కారణమైన చంద్రబాబు తాలూకా మనుషులు మాత్రం కనీసం చీమ కుట్టినట్టు అయినా భావించడం లేదు. మనం ప్రతిపక్షంలో ఉండి .. ప్రభుత్వాన్ని నిలదీస్తే బాగుండు.. అధికారంలో భాగమై ఎందుకూ విలువలేకుండా పోతున్నాం.. అంటూ ఏర్పాటైన ఫ్లెక్సీ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.సగటు జనసైనికుడి ఆవేదన.. అంతర్మథనాన్ని ఆ ఫ్లెక్సీలో పాయింట్లుగా రాసి అందర్నీ ఆలోచింపజేస్తున్నారని అంటున్నారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు జనసేన కేడర్ ఫోన్లలో సర్క్యులేట్ అవుతూ వారిని ఆలోచనలో పడేసింది. -సిమ్మాదిరప్పన్న.
నీ రీప్లేస్మెంట్ రోబో: సు'నీ'శితంగా శస్త్ర చికిత్స..
మోకాలి ఎముకల తాలూకు మృదులాస్థి (కార్టిలేజ్) అరిగాక... మోకాలి కదలికల్లో ఒకదానితో మరొకటి ఒరుసుకుంటే తీవ్రమైన నొప్పి రావడం... ఈ అరుగుదల తీవ్రత నాలుగో దశకు చేరాక మోకాలి మార్పిడి (నీ రీప్లేస్మెంట్ సర్జరీ) అవసరం ఏర్పడటం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు సంప్రదాయ పద్ధతుల్లో చేసే నీ రీప్లేస్మెంట్ చికిత్సల స్థానంలో ఇప్పుడు రోబో సహాయంతో శస్త్రచికిత్స (రోబోటిక్ సర్జరీ) వంటి అధునాతన పద్ధతులు అమల్లోకొచ్చాయి. ఈ నేపథ్యంలో రోబోటిక్(Robots ) నీ రీప్లేస్మెంట్ సర్జరీ(knee Replacement Surgery)తో ఉండే సౌలభ్యాలూ, అనుకూలత గురించి తెలుసుకుందాం. మోకాలి ఎముకల అరుగుదల అనేక విధాలుగా జరుగుతుంది. ఈ అరుగుదలను ఆర్థరైటిస్గా పేర్కొంటారు. ఇందులో దశలు ఉంటాయి. ఒకదశ దాటాక (నాలుగో దశ) ఇక మోకాలి మార్పిడి శస్త్రచికిత్స వల్లనే నొప్పి తగ్గుతుంది. గతంలోనూ... ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా సాధారణ సంప్రదాయ పద్ధతుల్లో శస్త్రచికిత్సలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల అనేక శస్త్రచికిత్స పద్ధతుల్లో వచ్చినట్టే మోకాలి మార్పిడి చికిత్సల్లో సైతం రోబోటిక్ సర్జరీ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అందునా ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేస్తూ... అత్యంత సునిశితంగా (ప్రెసిషన్తో) శస్త్రచికిత్స చేయగల సామర్థ్యం ఉన్న అత్యాధునిక రోబోల సహాయాన్ని వైద్యులు తీసుకుంటున్నారు. సంప్రదాయ శస్త్రచికిత్సతో పోలిస్తే ఈ అధునాతన పద్ధతిలో జరిగే శస్త్రచికిత్సతో ప్రయోజనాలేమిటో చూద్దాం. కృత్రిమ పరికరాలు చాలాకాలం పాటు మన్నడం : లోపల అమర్చాల్సిన పరికరాలను చాలా సునిశితత్వంతో అత్యంత ఖచ్చితమైన స్థానాల్లో అమర్చడం వల్ల అవి త్వరగా రాసుకుపోవడం, ఒరుసుకు΄ోవడం జరగవు. దాంతో చాలాకాలం పాటు మన్నికతో ఉంటాయి. తక్కువ నొప్పి: రోబోటిక్ శస్త్రచికిత్సలో నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ దుష్ప్రభావాలు: చాలా ఖచ్చితత్వంతో శస్త్రచికిత్స జరిగిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వంటి దుష్ప్రభావాలు రావడం చాలా తక్కువ. టైలర్ సర్జికల్ అప్రోచ్ : అందరి దేహ భాగాలూ, వాటితో పనిచేసే తీరుతెన్నులు ఒకేలా ఉండవు. దాంతో బాధితుల మోకాలి చుట్టూ ఉండే టెండన్లు, లిగమెంట్లు సరిగ్గా అమరి΄ోయేలా వారి అవసరాలకు తగ్గట్లుగా కృత్రిమ ఉపకరణాల రూపకల్పన, లోపల వాటి అమరిక అత్యంత ఖచ్చితత్వంతో జరగడంతో గతంలోని వారి వ్యక్తిగత అవయవం లాగానే మోకాలి భాగాలు అమరిపోతాయి. ఇంకా చెప్పాలంటే సంప్రదాయ చికిత్సలో శస్త్రచికిత్స చేసి లోపలి భాగాలను చూసేవరకు కండరాల పరిస్థితి అంతగా తెలియదు. అనుభవజ్ఞులైన శస్త్రచికిత్స నిపుణులు తమ అంచనా ప్రకారం శస్త్రచికిత్స నిర్వహిస్తారు. అయితే రోబోటిక్ సర్జరీలో కండరాల తీరుతెన్నులు శస్త్రచికిత్స ముందే స్పష్టంగా తెలుస్తాయి. ఫలితంగా ఖచ్చితమైన శస్త్రచికిత్సకు అవకాశం దొరుకుతుంది. దాంతో శస్త్రచికిత్స తర్వాత మోకాలు ముందుకూ వెనక్కు కదలడం (ఎక్స్టెన్షన్, ఫ్లెక్షన్) వంటి కదలికలు చాలా బాగుంటాయి. అందునా మోకాలి దగ్గర వంగడం అనేది సంప్రదాయ చికిత్స కంటే మరింత ఎక్కువగా ఉంటుంది. బాగుంటుంది. మోకాలు ఒంచేటప్పుడు సైతం నొప్పి చాలా తక్కువ. వేగంగా కోలుకోవడం రోబోటిక్ శస్త్రచికిత్స అత్యంత సునిశితత్వంతో జరగడంతో గాయం చాలా త్వరగా తగ్గుతుంది. ఇక దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) కూడా చాలా తక్కువగా ఉండటం ఫలితంగా చాలా వేగంగా కోలుకుని, చాలా త్వరగా ఇంటికెళతారు. మరింత ఎక్కువ సునిశితత్వం ఇలాంటి అత్యాధునిక రోబోల సహాయంతో చేసే శస్త్రచికిత్సలో సర్జన్ల ముందర బాధితుల తాలూకు మోకాలి 3–డి ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంటుంది. సంప్రదాయ చికిత్సల్లో ఇది అంత పూర్తిగా, స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఫలితంగా కృత్రిమ మోకాలి ఎముకల భాగాల్ని అమర్చేటప్పుడు మునుపు ఉన్నట్లే సరిగ్గా అమరిపోయేలా అమర్చడానికి వీలవుతుంది. ఎవరికి ఈ శస్త్రచికిత్సలుగతంలో శస్త్ర చికిత్స చేయించుకుని విఫలమైనవాళ్లు (వీళ్లలో మోకాలి దగ్గర కదలికలు చాలా పరిమితంగా ఉండటం, కాలు కదిలిస్తున్నప్పుడు నొప్పి ఉండటం వంటి లక్షణాలుంటాయి), అరుగుదల చాలా ఎక్కువగా (సివియర్ ఆస్టియో ఆర్థరైటిస్) ఉన్నవారికి, రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతుండేవారికి, అలాగే ఇక నొప్పి నివారణ మందులూ, ఇతర చికిత్సలు పనిచేయని వారికి ఈ రోబోటిక్ శస్త్రచికిత్స ఎంతగానో ఉపయోగపడుతుంది. (చదవండి: ఆ టైమ్లోనూ ఐరన్ యువతిలా...)
Automobile: భారత్లో ఆటోమొబైల్స్ పరుగులు
‘ఆపిల్ చక్రవర్తి’కి పద్మశ్రీ.. జాతీయ వినూత్న వ్యవసాయవేత్తగానూ గుర్తింపు
జానీ మాస్టర్ కేసు: తొలిసారి నోరు విప్పిన శ్రేష్టి, సిగ్గుండాలంటూ ఫైర్!
మాస్ మహారాజా 'మాస్ జాతర'.. గ్లింప్స్ వచ్చేసింది
వేరే అమ్మాయి ఫోటోకు ఎందుకు లైక్ కొట్టావ్..
మహేశ్బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్
బస్సు ప్రయాణికురాలి తల కట్
బీజేపీవి రాజ్యాంగ విరుద్ద కార్యక్రమాలు: టీపీసీసీ చీఫ్
‘అంకుల్ ప్రైజ్’: అతడేం పనిచేస్తాడో తెలుసా..!
సూపర్ ఇన్నింగ్స్.. తిలక్కు సలాం కొట్టిన సూర్యకుమార్
ఓటీటీలో 'శ్వేతా బసు' బోల్డ్ సినిమా.. టీజరే ఇలా ఉంటే..!
అన్ని విషయాల్లో మీ ఇద్దరికీ చాలా దగ్గర పోలికలున్నాయ్ సార్!
అమెరికాలో అడుగు పెట్టాలంటే ఇది తప్పని సరి.. నిబంధనలు మార్చిన ట్రంప్
సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్బాబు, ప్రియాంక
వెనక్కి పంపేస్తున్నాం.. మాకు వద్దే వద్దు
ICC టీ20 జట్టు ప్రకటన: కెప్టెన్గా రోహిత్, నో కోహ్లి! భారత్ నుంచి నలుగురు
HYDRA: ఘట్కేసర్లో హైడ్రా కూల్చివేతలు
మొత్తం మీ గురించే కాకుండా కాస్త రాష్ట్రం గురించి కూడా చెప్పాల్సింది సార్!
మీర్పేట్ మాధవి హత్య కేసు.. పిల్లల విచారణలో కీలక విషయాలు
... అలాగే నోట్లను కూడా మార్చేద్దాం సార్!!
Automobile: భారత్లో ఆటోమొబైల్స్ పరుగులు
‘ఆపిల్ చక్రవర్తి’కి పద్మశ్రీ.. జాతీయ వినూత్న వ్యవసాయవేత్తగానూ గుర్తింపు
జానీ మాస్టర్ కేసు: తొలిసారి నోరు విప్పిన శ్రేష్టి, సిగ్గుండాలంటూ ఫైర్!
మాస్ మహారాజా 'మాస్ జాతర'.. గ్లింప్స్ వచ్చేసింది
వేరే అమ్మాయి ఫోటోకు ఎందుకు లైక్ కొట్టావ్..
మహేశ్బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్
బస్సు ప్రయాణికురాలి తల కట్
బీజేపీవి రాజ్యాంగ విరుద్ద కార్యక్రమాలు: టీపీసీసీ చీఫ్
‘అంకుల్ ప్రైజ్’: అతడేం పనిచేస్తాడో తెలుసా..!
సూపర్ ఇన్నింగ్స్.. తిలక్కు సలాం కొట్టిన సూర్యకుమార్
ఓటీటీలో 'శ్వేతా బసు' బోల్డ్ సినిమా.. టీజరే ఇలా ఉంటే..!
అన్ని విషయాల్లో మీ ఇద్దరికీ చాలా దగ్గర పోలికలున్నాయ్ సార్!
అమెరికాలో అడుగు పెట్టాలంటే ఇది తప్పని సరి.. నిబంధనలు మార్చిన ట్రంప్
సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్బాబు, ప్రియాంక
వెనక్కి పంపేస్తున్నాం.. మాకు వద్దే వద్దు
ICC టీ20 జట్టు ప్రకటన: కెప్టెన్గా రోహిత్, నో కోహ్లి! భారత్ నుంచి నలుగురు
HYDRA: ఘట్కేసర్లో హైడ్రా కూల్చివేతలు
మొత్తం మీ గురించే కాకుండా కాస్త రాష్ట్రం గురించి కూడా చెప్పాల్సింది సార్!
మీర్పేట్ మాధవి హత్య కేసు.. పిల్లల విచారణలో కీలక విషయాలు
... అలాగే నోట్లను కూడా మార్చేద్దాం సార్!!
సినిమా
బాబాయికి అభినందనలు తెలిపిన యంగ్ టైగర్
నందమూరి బాలకృష్ణకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డ్కు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. మీరు అటు సినిమా.. ఇటు ప్రజలకు అందించిన సేవలకు దక్కిన గుర్తింపు అంటూ ట్వీట్ చేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్, నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ పురస్కారాలను అనౌన్స్ చేసింది. నటసింహంగా గుర్తింపు..నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.బాలకృష్ణ హీరోగా తొలి చిత్రం..1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. 50 ఏళ్ల నట ప్రస్థానం..‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.— Jr NTR (@tarak9999) January 25, 2025
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న నితిన్
టాలీవుడ్ హీరో నితిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన భార్య షాలిని, కుమారుడితో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ప్రస్తుతం హీరో నితిన్ రాబిన్హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. భీష్మ తర్వాత వెంకీ కుడుముల- నితిన్ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.రిలీజ్ వాయిదా..గతేడాది క్రిస్టమస్ విడుదల కావాల్సిన 'రాబిన్ హుడ్' వాయిదా పడింది. పుష్ప-2 ఇంకా థియేటర్లలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి కూడా ఈ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో వచ్చేనెల ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Youth Star @actor_nithiin visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!🙏#Nithiin #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/tCR1B93mPH— Telugu FilmNagar (@telugufilmnagar) January 25, 2025
ఆ స్టార్ హీరోకున్నంత సినిమా నాకు లేదు, అది నా వల్ల కాదు: మాధవన్
హీరో మాధవన్ (R Madhavan) తమిళంతోపాటు తెలుగు, హిందీలోనూ పలు సినిమాలు చేశాడు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్తో 3 ఇడియట్స్ మూవీ చేశాడు. ఇది బ్లాక్బస్టర్ హిట్ అయింది. ఈ జర్నీలో ఆమిర్ను దగ్గరి నుంచి చూసిన మాధవన్.. ఆయనలా తను అస్సలు ఉండలేనంటున్నాడు. ఆ నాటి జ్ఞాపకాలను తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.ఏదీ ఫ్రీగా రాదనుకోమాధవన్ మాట్లాడుతూ.. ఆమిర్ ఖాన్ పర్సు వెంటపెట్టుకుని వెళ్లడు. తన స్టార్డమ్ వల్ల అలా ఉండగలుగుతున్నాడు. ఆయనకు ఏది కావాలన్నా పక్కనున్న జనాలు తీసుకొస్తారు. అలా అని ఏదీ ఫ్రీగా రాదనుకోండి.. ఆ చుట్టుపక్కన ఉండే జనాలకు ఎలాగో ఆమిర్ ఖాన్ డబ్బు చెల్లించాల్సిందే! కానీ నాకంత సినిమా లేదు. నేను ఒంటరిగా వెళ్లడానికే ఎక్కువ ఇష్టపడతాను. స్వేచ్ఛగా తిరగడం ఇష్టం. జనాలతో కలవడం ఇష్టం. ఎంత ఖర్చు పెడుతున్నాననేది చూసుకోను. నచ్చినట్లు బతికేస్తా.. ఏది కావాలనిపిస్తే అది కొనేస్తాను.(చదవండి: జైలుకు వెళ్లొచ్చిన హీరోయిన్కు సన్యాసమా? అంతా పబ్లిసిటీ కోసమే!)ఖర్చులను అదుపులో పెట్టుకోలేనుఅలా అని నా బడ్జెట్కు మించినవాటి జోలికి వెళ్లను. ఖర్చుల విషయంలో కొద్దిగా కంట్రోల్ చేసుకోలేను.. కానీ నాకున్న పరిధిలో జీవిస్తూ కాస్తంత ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాను. నాకేదైనా పెద్ద కారు నచ్చిందనుకోండి. అది నా బడ్జెట్లో రాలేదన్నప్పుడు కొనడానికి ఇష్టడపను అని చెప్పుకొచ్చాడు. అయితే అతడి ఖర్చులు చూసి భార్య సరిత తిడుతూ ఉంటుందట. ఈ విషయం గురించి చెప్తూ.. నా భార్య నేనొక మూర్ఖుడిని అనుకుంటుంది. నాకు డబ్బులు పొదుపుగా వాడటం తెలియదని తిడుతూ ఉంటుంది అని పేర్కొన్నాడు.సినిమామాధవన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హిసాబ్ బరాబర్ . అశ్వని ధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి కుల్హరి, నీల్ నితిన్ ముకేశ్, రష్మీ దేశాయ్, ఫైజల్ రషీద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. జనవరి 24 నుంచి జీ5లో ప్రసారమవుతోంది.చదవండి: సిండికేట్లో వెంకీమామ, బిగ్బీ, ఫహద్..? ఆర్జీవీ ఏమన్నారంటే?
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్
హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. సినీరంగంలో అందించిన సేవలకుగానూ ఆయనను పద్మభూషణ్తో సత్కరించనుంది. గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందుగా (జనవరి 25న) కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను అనౌన్స్ చేసింది.సినీ ప్రస్థానంనటుడిగా, రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్స్ ఆస్పత్రి చైర్మన్గా బాలకృష్ణ సేవలందిస్తున్నారు. ఈయన తాతమ్మ కల(1974) చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రి ఎన్టీఆర్తో కలిసి నటించారు.సాహసమే జీవితం చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఇప్పటి వరకు 109 చిత్రాల్లో నటించారు. చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. క్యాన్సర్ బారినపడ్డ ఎంతో మందికి బసవతారకం ఆస్పత్రిలో ఉచిత చికిత్సను అందిస్తున్నారు.చదవండి: సిండికేట్లో వెంకీమామ, బిగ్బీ, ఫహద్..? ఆర్జీవీ ఏమన్నారంటే?
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణలో నాలుగు కీలక పథకాలు నేడే ప్రారంభం... మార్చి 31వ తేదీలోగా పూర్తిగా అమలు
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారా?... బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆగ్రహం
తెలంగాణలో అమెజాన్ పెట్టుబడి 60 వేల కోట్ల రూపాయలు.. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం కీలక ఒప్పందం
తెలంగాణ రూపు రేఖలు మార్చేలా రాజధాని హైదరాబాద్ అభివృద్ధి... దావోస్ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి వెల్లడి
ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్.. 16 మంది మావోయిస్టులు మృతి
అమెరికాకు ఇక స్వర్ణయుగమే... డొనాల్డ్ ట్రంప్ స్పష్టీకరణ... 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం
హైదరాబాద్లో 450 కోట్ల రూపాయలతో భారీ ఐటీ పార్క్. ఏర్పాటుకు సిద్ధమైన క్యాపిటల్ ల్యాండ్ సంస్థ. సింగపూర్లో తెలంగాణ ప్రతినిధి బృందంతో చర్చలు, ఒప్పందం
తిరుమలలో వరుస ఘటనలపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం. తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై నివేదిక పంపాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్లో పేదల ఇళ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం కక్ష... ఇళ్లు నిర్మించుకోనివారి స్థలాల కేటాయింపులు రద్దు
హెచ్ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారు?... ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు
క్రీడలు
అర్ష్ దీప్కు అందలం
దుబాయ్: భారత యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యాడు. గతేడాది భారత జట్టు టి20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ 25 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్... 2024లో ఓవరాల్గా 18 మ్యాచ్లాడి 15.31 సగటుతో 36 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగిన వరల్డ్కప్లో ఆరంభ ఓవర్లతో పాటు, డెత్ ఓవర్స్లో చక్కటి బౌలింగ్తో ఆకట్టుకున్న అర్ష్ దీప్ ఐసీసీ టి20 టిమ్ ఆఫ్ ద ఇయర్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్గా నిలిచిన అర్ష్ దీప్... భారత టి20 జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. టి20ల్లో ఇప్పటి వరకు 97 వికెట్లు పడగొట్టిన అర్ష్ దీప్... ఈ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. 2021లో ఐసీసీ ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ప్రవేశపెట్టింది. 2021లో మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)కు ఈ గౌరవం దక్కగా... 2022, 2023లలో సూర్యకుమార్ యాదవ్ (భారత్) గెల్చుకున్నాడు.
అనికేత్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్ అనికేత్ రెడ్డి (5/72) సత్తా చాటాడు. ఫలితంగా ఓవర్నైట్ స్కోరు 33/1తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హిమాచల్ ప్రదేశ్ జట్టు 92 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. ఇనేశ్ మహజన్ (79 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ అర్ధశతకం సాధించగా... శుభమ్ అరోరా (53; 7 ఫోర్లు) హాఫ్సెంచరీ చేశాడు.అంకిత్ (31), అపూర్వ్ వాలియా (37), ఆకాశ్ వశిష్ట్ (46) తలా కొన్ని పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ రెండు వికెట్లు తీయగా... నిశాంత్, వరుణ్ గౌడ్లకు చెరో వికెట్ దక్కింది. దీంతో హైదరాబాద్కు 290 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో ప్రత్యర్థిని ఫాలోఆన్కు ఆహ్వానించింది. శనివారం ఆట ముగిసే సమయానికి హిమాచల్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. శుభమ్ అరోరా (16 బ్యాటింగ్), ప్రశాంత్ చోప్రా (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 10 వికెట్లు ఉన్న హిమాచల్ జట్టు... హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 269 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 565; హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (ఎల్బీ) (బి) అనికేత్ రెడ్డి 53; ప్రశాంత్ చోప్రా (సి) రాహుల్ రాధేశ్ (బి) నిశాంత్ 1; అంకిత్ (సి) తన్మయ్ అగర్వాల్ (బి) తనయ్ త్యాగరాజన్ 31; అపూర్వ్ వాలియా (స్టంప్డ్) రాహుల్ రాధేశ్ (బి) అనికేత్ రెడ్డి 37; ఆకాశ్ వశిస్ట్ (సి) మిలింద్ (బి) అనికేత్ రెడ్డి 46; రిషి ధవన్ (ఎల్బీ) తనయ్ త్యాగరాజన్ 22; ఇనేశ్ మహజన్ (నాటౌట్) 68; ముకుల్ నేగీ (సి) హిమతేజ (బి) అనికేత్ రెడ్డి 0; మయాంక్ డాగర్ (సి) రక్షణ్ రెడ్డి (బి) వరుణ్ గౌడ్ 0; వైభవ్ అరోరా (సి) రక్షణ్ రెడ్డి (బి) అనికేత్ రెడ్డి 3; దివేశ్ శర్మ (రనౌట్/హిమతేజ) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (92 ఓవర్లలో ఆలౌట్) 275. వికెట్ల పతనం: 1–11, 2–78, 3–111, 4–144, 5–188, 6–217, 7–217, 8–218, 9–267, 10–275, బౌలింగ్: నిశాంత్ 12–3–52–1; చామా మిలింద్ 13–1–32–0; తనయ్ త్యాగరాజన్ 24–4–62–2; అనికేత్ రెడ్డి 25–5–72–5; రక్షణ్ రెడ్డి 13–1–29–0; వరుణ్ గౌడ్ 5–0–16–1. హిమాచల్ ప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (బ్యాటింగ్) 16; ప్రశాంత్ చోప్రా (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: తనయ్ త్యాగరాజన్ 3–0–13–0; రక్షణ్ రెడ్డి 2–1–4–0.
మెరిసిన పృథ్వీరాజ్
పుదుచ్చేరి: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా పుదుచ్చేరితో జరుగుతున్న పోరులో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 209/5తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పుదుచ్చేరి జట్టు 79 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆంధ్ర జట్టుకు 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పుదుచ్చేరి బ్యాటర్ అమాన్ ఖాన్ (50) అర్ధశతకం సాధించాడు. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీరాజ్ 5 వికెట్లు పడగొట్టగా... విజయ్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మొహమ్మద్ రఫీ, శశికాంత్, లలిత్ మోహన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. కరణ్ షిండే (136 బంతుల్లో 86 బ్యాటింగ్; 9 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధశతకంతో సత్తా చాటగా... శ్రీకర్ భరత్ (41; 7 ఫోర్లు), షేక్ రషీద్ (26; 3 ఫోర్లు), రికీ భుయ్ (32; 5 ఫోర్లు, 1 సిక్స్), శశికాంత్ (39 బ్యాటింగ్; 4 ఫోర్లు) రాణించారు. పుదుచ్చేరి బౌలర్లలో అంకిత్ శర్మ 2 వికెట్లు తీశాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 5 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు ఓవరాల్గా 291 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్కోరు వివరాలు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: 303; పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్: శ్రీధర్ రాజు (సి) శ్రీకర్ భరత్ (బి) పృథ్వీరాజ్ 0; జయ్ పాండే (బి) పృథ్వీరాజ్ 3; పారస్ (సి) శ్రీకర్ భరత్ (బి) పృథ్వీరాజ్ 39; ఆకాశ్ (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 7; మోహిత్ కాలె (సి) రషీద్ (బి) పృథ్వీరాజ్ 60; అరుణ్ కార్తీక్ (సి) రికీ భుయ్ (బి) పృథ్వీరాజ్ 59; అమాన్ ఖాన్ (సి) రికీ భుయ్ (బి) లలిత్ మోహన్ 50; అంకిత్ శర్మ (సి) శ్రీకర్ భరత్ (బి) విజయ్ 13; సాగర్ (సి) రషీద్ (బి) విజయ్ 0; అబిన్ మాథ్యూ (నాటౌట్) 4; గౌరవ్ యాదవ్ (సి) అభిషేక్ రెడ్డి (బి) రఫీ 16; ఎక్స్ట్రాలు 9; మొత్తం (79 ఓవర్లలో ఆలౌట్) 260. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–20, 4–84, 5–148, 6–225, 7–237, 8–238, 9–241, 10–260, బౌలింగ్: పృథ్వీరాజ్ 23–5–64–5; మొహమ్మద్ రఫీ17–1–53–1; శశికాంత్ 15–0–57–1; లలిత్ మోహన్ 16–2–42–1; విజయ్ 8–0–36–2. ఆంధ్ర రెండో ఇన్నింగ్స్: అభిషేక్ రెడ్డి (ఎల్బీ) (బి) గౌరవ్ యాదవ్ 15; శ్రీకర్ భరత్ (ఎల్బీ) (బి) అంకిత్ శర్మ 41; షేక్ రషీద్ (రనౌట్) 26; కరణ్ షిండే (బ్యాటింగ్) 86; రికీ భుయ్ (సి) (సబ్) సీజీడీ శాస్త్రి (బి) అమన్ ఖాన్ 32; హనుమ విహారి (సి) శ్రీధర్ రాజు (బి) అంకిత్ శర్మ 0; శశికాంత్ (బ్యాటింగ్) 39; ఎక్స్ట్రాలు 9; మొత్తం (69 ఓవర్లలో 5 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–24, 2–81, 3–82, 4–141, 5–142, బౌలింగ్: గౌరవ్ యాదవ్ 10–1–49–1; అబిన్ మాథ్యూ 11–3–34–0; సాగర్ 21–3–72–0; అంకిత్ శర్మ 22–3–56–2; అమాన్ ఖాన్ 3–0–25–1; ఆకాశ్ 2–1–11–0.
క్వీన్ కీస్...
మెల్బోర్న్: పదేళ్ల క్రితం 19 ఏళ్ల ప్రాయంలో ఆ్రస్టేలియన్ ఓపెన్ లోనే మాడిసన్ కీస్ తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్కు చేరుకొని వెలుగులోకి వచ్చింది. సీన్ కట్ చేస్తే... పదేళ్ల తర్వాత అదే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆమె తన గ్రాండ్స్లామ్ టైటిల్ కలను నెరవేర్చుకుంది. 19వ సీడ్గా ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్లో బరిలోకి దిగిన ప్రపంచ 14వ ర్యాంకర్ మాడిసన్ కీస్... అందరి అంచనాలను తారుమారు చేసి చివరకు చాంపియన్గా అవతరించింది. గత రెండేళ్లు ఈ టోర్నీలో విజేతగా నిలిచి... ఆ్రస్టేలియన్ ఓపెన్కు సన్నాహకంగా జరిగిన బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీలో టైటిల్ నెగ్గి జోరు మీదున్న బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ సబలెంకాను ఓడించిన కీస్ కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ను దక్కించుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో కీస్ 6–3, 2–6, 7–5తో సబలెంకాపై గెలిచింది. విజేతగా నిలిచిన మాడిసన్ కీస్కు 35 లక్షల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 3 లక్షలు)... రన్నరప్ సబలెంకాకు 19 లక్షల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 33 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో కీస్ ముగ్గురు గ్రాండ్స్లామ్ చాంపియన్స్ను (రిబా కినా, స్వియాటెక్, సబలెంకా) ఓడించడం విశేషం. 2 గంటల 2 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో కీస్ ఆరు ఏస్లు సంధించింది. 29 విన్నర్స్ కొట్టింది. 31 అనవసర తప్పిదా లు చేసింది. తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు సబలెంకా ఐదు డబుల్ ఫాల్ట్లు, 33 అనవసర తప్పిదాలు చేసింది. నేడు యానిక్ సినెర్ (ఇటలీ), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మధ్య పురుషుల సింగిల్స్ ఫైనల్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఫైనల్ మొదలవుతుంది.
బిజినెస్
బీమాకు లభించేనా ధీమా..?
న్యూఢిల్లీ: పౌరులందరికీ బీమా రక్షణను చేరువ చేసే దిశగా 2025 బడ్జెట్లో కీలక చర్యలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘2047 నాటికి అందరికీ బీమా’ లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా ఇన్సూరెన్స్కు పన్ను ప్రయోజనాలు, ఆరోగ్య సంరక్షణకు ప్రోత్సాహకాలు కల్పించాని పరిశ్రమ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో నవీన్ చంద్ర ఝా మాట్లాడుతూ.. రానున్న బడ్జెట్లో హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణ దిశగా మరిన్ని చర్యలు ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బీమా సుగమ్’కు నియంత్రణ, నిధుల పరమైన మద్దతు అవసరమన్నారు. ఆర్థిక సేవలు తగినంత అందుబాటులో లేని ప్రాంతాల్లోని వారికి బీమా సేవలు చేరువ చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం, సబ్సిడీలపైనా బడ్జెట్లో దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. → ఎన్పీఎస్ మాదిరి పన్ను ప్రయోజనాలను లైఫ్ ఇన్సూరెన్స్ యాన్యుటీ ఉత్పత్తులకు సైతం కల్పించాలని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఎండీ, సీఈవో తరుణ్ ఛుగ్ కోరారు. కొత్త పన్ను విధానంలోనూ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై పన్ను ప్రయోజనాన్ని కల్పించాలని, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేక పన్ను మినహాయింపు తీసుకురావాలని డిమాండ్ చేశారు. → ఐఆర్డీఏఐ నివేదిక ఆధారంగా జీవిత బీమా విస్తరణ (జీడీపీలో) 2022–23లో ఉన్న 4 శాతం నుంచి 2023–24లో 3.7 శాతానికి తగ్గినట్టు తెలుస్తోంది. → బడ్జెట్లో పెన్షన్, యాన్యుటీ ప్లాన్లకు మద్దతు చర్యలు ఉండొచ్చని పీఎన్బీ మెట్లైఫ్ ఎండీ, సీఈవో సమీర్ బన్సాల్ పేర్కొన్నారు. పెన్షనర్లకు ప్రోత్సాహకంగా యాన్యుటీ ప్లాన్ల ప్రీమియంపై జీఎస్టీని తొలగించాలని బన్సాల్ డిమాండ్ చేశారు. దీంతో యాన్యుటీలు మరింత అందుబాటులోకి వస్తాయన్నారు. → బీమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు, బీమా ఉత్పత్తుల స్వీకరణను ప్రోత్సహించే దిశగా సంస్కరణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ అవకాశం కల్పిస్తోందని ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో సుబ్రత మోండల్ పేర్కొన్నారు. మరింత మంది బీమా రక్షణను తీసుకునేందుకు వీలుగా పన్ను రాయితీలు కల్పిస్తారన్న అంచనాను ఆయన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్కు సైతం బడ్జెట్లో కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని వారు, ఆర్థికంగా బలహీన వర్గాలకు బీమా అందుబాటులోకి వస్తుందన్నారు. → హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని తొలగించడం ఎంతో అవసరమని యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో శరద్ మాధుర్ అభిప్రాయపడ్డారు. బీమా మరింత మందికి చేరేందుకు వీలుగా ఆవిష్కరణలను ప్రోత్సహించాలని కోరారు.సుంకాలు, లైసెన్సు ఫీజులు తగ్గించాలిఓటీటీలు కూడా యూఎస్వో ఫండ్కి నిధులివ్వాలి కేంద్రానికి టెల్కోల బడ్జెట్ వినతులు న్యూఢిల్లీ: 4జీ, 5జీ నెట్వర్క్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలను, లైసెన్సు ఫీజులను తగ్గించాలని కేంద్రాన్ని టెలికం సంస్థలు కోరాయి. అలాగే భారీగా డేటా వినియోగానికి కారణమయ్యే ఓటీటీ ప్లాట్ఫాంలు, స్ట్రీమింగ్ సేవల సంస్థలు (ఎల్టీజీ) కూడా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్వోఎఫ్)/డిజిటల్ భారత్ నిధి ఫండ్కి తప్పనిసరిగా చందా ఇచ్చేలా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఈ మేరకు బడ్జెట్పై తమ వినతులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొదలైనవి ఇందులో సభ్యులుగా ఉన్నాయి. లైసెన్సు ఫీజును 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గిస్తే టెలికం సంస్థలపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని సీవోఏఐ తెలిపింది. ఇక తాము బోలెడంత ఖర్చు పెట్టి నెలకొల్పిన నెట్వర్క్ల ద్వారా కార్యకలాపాలు సాగిస్తూ, లాభాలు గడిస్తున్నా ఎల్టీజీలు .. పైసా కూడా కట్టడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో అవి కూడా తమలాగే యూఎస్వో ఫండ్కి చందా కట్టేలా చూడాలని కోరింది. తమపై విధిస్తున్న యూఎస్వో లెవీని పూర్తిగా తొలగించవచ్చని లేదా ప్రస్తుతమున్న రూ. 86,000 కోట్ల కార్పస్ పూర్తిగా ఖర్చు చేసేంతవరకైనా చందాలను నిలిపివేయొచ్చని సీవోఏఐ పేర్కొంది. టెల్కోలపై సుంకాల భారాన్ని తగ్గించడం, పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడం వల్ల దేశ భవిష్యత్తుపై వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టినట్లవుతుందని వివరించింది.
ఒసాము సుజుకికి పద్మవిభూషణ్
దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమాలలో భారత రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.భారత ఆటోమొబైల్ పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసిన జపనీస్ వ్యాపారవేత్త 'ఒసాము సుజుకీ' (Osamu Suzuki)కి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్ (Padma Vibhushan) పురస్కారాన్ని ప్రకటించింది. చిన్న-కార్ల స్పెషలిస్ట్ సుజుకి మోటార్ను అంతర్జాతీయ బ్రాండ్గా అభివృద్ధి చేసిన ఒసాము సుజుకికి మరణానంతరం ఈ అవార్డ్ ప్రకటించడం గమనార్హం. అసాధారణమైన, విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. అలాగే ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్యకు (Arundhati Bhattacharya) పద్మశ్రీ అవార్డ్ లభించింది.ఒసాము సుజుకీ గత డిసెంబర్లో 94 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. భారత్లో ఆటోమొబైల్ కంపెనీ ఏర్పాటుకు ఏ ఒక్క విదేశీ సంస్థ ముందుకురాని రోజుల్లో.. ఆర్థిక వ్యవస్థను గ్లోబలైజేషన్కు ద్వారాలు తెరవక ముందే, లైసెన్స్ రాజ్ కాలంలో ఒసాము సుజుకీ తీసుకున్న నిర్ణయం దేశ పారిశ్రామిక రంగంలో చిరస్థాయిలో నిలిచిపోతుంది.జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ 1981లో భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో (జాయింట్ వెంచర్) మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించింది ఆయనే. 2007లో కేంద్ర ప్రభుత్వం తన పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో కంపెనీ పేరు మారుతి సుజుకీగా మారింది.ఆ తర్వాత మెజారిటీ వాటాతో సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఏకైక ప్రమోటర్గా అవతరించింది. తుదిశ్వాస విడిచే వరకు మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్కు డైరెక్టర్గా ఒసాము సేవలు అందించారు. మాలిగ్నెంట్ లింఫోమా (కేన్సర్లో ఒక రకం) కారణంగా ఈ నెల 25న ఒసాము సుజుకీ మరణించినట్టు సుజుకీ మోటార్ కార్పొరేషన్ శుక్రవారం ప్రకటించింది. ‘‘ఆయన దూరదృష్టి, భవిష్యత్పై సానుకూల దృక్పథం, రిస్క్ తీసుకునే తత్వం, భారత్ పట్ల ప్రగాఢమైన ప్రేమ అనేవి లేకుంటే, భారత ఆటోమొబైల్ పరిశ్రమ నేడు ఇంత శక్తివంతంగా మారి ఉండేది కాదు’’అని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు.నేడు భారత్లో లక్షలాది మంది మెరుగైన జీవనం వెనుక ఆయన కృషి ఉందన్నారు. ఆటోమొబైల్ రంగం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు ఒసాము అందించిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర సర్కారు.. 2007లో పద్మభూషణ్ అవార్డుతో ఆయన్ను సత్కరించింది. 1958లో సుజుకీలో చేరిక..1930 జనవరి 30న జన్మించిన ఒసాము సుజుకి, చువో యూనివర్సిటీ, ఫాకుల్టీ ఆఫ్ లా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. 1958లో సుజుకీ మోటార్ కంపెనీలోనే చేరారు. 1963లో డైరెక్టర్గా నియమితులయ్యారు. 1967లో మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. 1978లో ప్రెసిడెంట్; సీఈవోగా, 2000 జూన్లో సుజుకీ మోటార్ కార్పొరేషన్కు చైర్మన్, సీఈవోగా నియమితులయ్యారు. ‘‘మారుతి సుజుకీ రూపంలో ఆయన అందించిన అసాధారణ సేవలు భారత ఆటోమొబైల్ ముఖచిత్రాన్ని విప్లవాత్మకంగా మార్చడమే కాదు, భారత్–జపాన్ మధ్య బంధాన్ని బలోపేతం చేశాయి.
ట్రాయ్ ఎఫెక్ట్.. ఎయిర్టెల్ కొత్త చౌక ప్లాన్లు
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాలను అనుసరించి దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన ఎయిర్టెల్ (Airtel) రెండు వాయిస్-ఓన్లీ చౌక రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. 2జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించాలని ట్రాయ్ ఇటీవల టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ ప్లాన్లను ప్రారంభించిన ఏడు రోజులలోపు ట్రాయ్ సమీక్షిస్తుంది.ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ఎయిర్టెల్ తన వాయిస్-ఓన్లీ ప్లాన్లను సవరించింది. ఇటీవల తీసుకొచ్చిన రెండు ప్లాన్ల ప్రయోజనాలను అలాగే ఉంచుతూ తక్కువ ధరలో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. పాత ప్లాన్లను తొలగించింది. ఈమేరకు ఎయిర్టెల్ తన వెబ్సైట్లో ప్లాన్లను అప్డేట్ చేసింది. సవరించిన ఎయిర్టెల్ ప్లాన్లు ఇవే..రూ.469 ప్లాన్ఇది 84 రోజుల ప్లాన్. గతంలో ఈ ప్లాన్ ధర రూ.499 ఉండేది. దీన్ని ప్రస్తుతం రూ. 30 తగ్గించింది. దీంతో దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్ను ఆనందించవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 900 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్లో ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు. ఎటువంటి డేటా అవసరం లేకుండా కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు అవసరమయ్యే 2జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం దీన్ని తీసుకొచ్చారు.రూ. 1849 ప్లాన్ ఇది 365 రోజుల ప్లాన్. ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ. 1,959. రూ. 110 తగ్గించి రూ. 1,849 లకు తీసుకొచ్చింది. దీంతో దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్ మాట్లాడవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 3,600 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా దీర్ఘకాలిక వాయిస్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను కోరుకునే వినియోగదారుల కోసం దీన్ని రూపొందించారు.జియో ప్లాన్లుట్రాయ్ మార్గదర్శకాలకు అనుగుణంగా వాయిస్-ఓన్లీ ప్లాన్లను ప్రారంభించిన మొదటి టెలికం కంపెనీ రిలయన్స్ జియో. 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో చౌకైన వాయిస్-ఓన్లీ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. 84 రోజుల ప్లాన్ ధర రూ. 458. దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుంది. 1,000 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇక 365-రోజుల ప్లాన్ ధర రూ. 1,958. దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్తోపాటు 3,600 ఉచిత ఎస్ఎంఎస్లు ఆనందించవచ్చు. ఈ రెండు ప్లాన్లలోనూ ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు.
దక్షిణ హైదరాబాద్కు 'రియల్' అభివృద్ధి!
నీళ్లు ఎత్తు నుంచి పల్లెం వైపునకు ప్రవహించినట్లే.. రోడ్లు, విద్యుత్, రవాణా వంటి మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న చోటుకే అభివృద్ధి విస్తరిస్తుంది. ఐటీ ఆఫీస్ స్పేస్, నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి (Real estate Development) క్రమంగా దక్షిణ హైదరాబాద్ (South Hyderabad) మార్గంలో శరవేగంగా విస్తరిస్తోంది. విమానాశ్రయంతో పాటు ఔటర్ మీదుగా వెస్ట్తో సౌత్ అనుసంధానమై ఉండటం ఈ ప్రాంతం మెయిన్ అడ్వాంటేజ్. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఏఐ, ఫ్యూచర్ సిటీలను దక్షిణ హైదరాబాద్లోనే అభివృద్ధి చేయనుంది. పుష్కలంగా భూముల లభ్యత, అందుబాటు ధర, మెరుగైన రవాణా, మౌలిక వసతులు ఉండటంతో దక్షిణ ప్రాంతంలో రియల్ మార్కెట్ అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని శ్రీఆదిత్య హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదిత్యరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూలోని మరిన్ని అంశాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనగరం నాలుగు వైపులా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాన నగరంలో మూసీ సుందరీకరణ, శివార్లలో ఫ్యూచర్ సిటీ, మెట్రో రెండో దశ విస్తరణ వంటి బృహత్తర ప్రాజెక్ట్లకు శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాజెక్ట్లతో గృహ కొనుగోలుదారుల భావోద్వేగాలు మారుతాయి. జనసాంద్రత, రద్దీ ప్రాంతాల్లో ఉండే బదులు ప్రశాంతత కోసం దూరప్రాంతాలను ఎంచుకుంటారు. ఇదే సమయంలో మెట్రో విస్తరణతో కనెక్టివిటీ పెరగడంతో పాటు ఆయా మార్గాలలో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఓల్డ్సిటీ, చాంద్రయాణగుట్ట మీదుగా శంషాబాద్కు మెట్రో అనుసంధానంతో ఆయా ప్రాంతాల్లో కూడా గేటెడ్ కమ్యూనిటీలు జోరుగా వస్తాయి. దీంతో బడ్జెట్ హోమ్స్తో సామాన్యుడి సొంతింటి కల మరింత చేరువవుతుంది.ట్రిపుల్ ఆర్తో ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ అభివృద్ధి దశను మార్చేసిన ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల 30 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్)ను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఔటర్ లోపల ప్రాంతం ఇప్పటికే రద్దీ అయిపోయింది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్కు, ట్రిపుల్ ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఇలా వేర్వేరు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్లను చేపట్టాలి. ట్రిపుల్ ఆర్తో నగరంతోనే కాదు రాష్ట్రంలోని ఇతర జిల్లాలూ అనుసంధానమై ఉంటాయి. కనెక్టివిటీ పెరిగి రవాణా మెరుగవుతుంది. దీంతో ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గడంతో పాటు శివారు, పట్టణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ట్రిపుల్ ఆర్ ప్రాంతాల్లో కేవలం నివాస, వాణిజ్య సముదాయాలే కాదు గిడ్డంగులు, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.సిటీ వ్యూతో బాల్కనీ కల్చర్.. లగ్జరీ హౌసింగ్ అంటే కనిష్టంగా 2,500 చ.అ. విస్తీర్ణం ఉండాలి. అయితే విస్తీర్ణం మాత్రమే లగ్జరీని నిర్వచించలేదు. బెంగళూరు, ముంబైలలో 3 వేల చ.అ. ఫ్లాట్లనే ఉబర్ లగ్జరీ అపార్ట్మెంట్గా పరిగణిస్తారు. కానీ, మన దగ్గర 6, 8, 10 వేల చ.అ.ల్లో కూడా అపార్ట్మెంట్లు కూడా నిర్మిస్తున్నారు. అయినా కూడా ఇతర మెట్రోలతో పోలిస్తే మన దగ్గరే ధరలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు.. హైదరాబాద్లో 5–10 వేల చ.అ. ఫ్లాట్ రూ.6–12 కోట్లలో ఉంటే.. బెంగళూరు, ముంబై నగరాల్లో 3 వేల చ.అ. ఫ్లాటే రూ.12 కోట్లు ఉంటుంది. పుష్కలమైన స్థలం, వాస్తు, కాస్మోపాలిటన్ కల్చర్, ఆహ్లాదకరమైన వాతావరణం, జీవనశైలి బాగుండటం వల్లే హైదరాబాద్లో లగ్జరీ ప్రాజెక్ట్లు వస్తున్నాయి. మన నగరంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి విశాలమైన, డబుల్ హైట్ బాల్కనీలను వాడుతుంటారు. అదే ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో వాతావరణం పొల్యూషన్ కాబట్టి బాల్కనీలు అంతగా ఇష్టపడరు.ఇంటి అవసరం పెరిగింది గతంలో ఇండిపెండెంట్ హౌస్లు ఎక్కువగా ఉండేవి. అందుకే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అబిడ్స్ వంటి పాత నగరంలో ఈ తరహా ఇళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ కమ్యూనిటీ లివింగ్ల ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాత ఇంటి ప్రాముఖ్యత, అవసరం తెలిసొచ్చింది. వర్క్ ఫ్రం హోమ్తో 50–60 శాతం సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పిల్లలు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. బయటకు వెళ్లి ఆడుకోవాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు, భద్రత ఉండదు. అదే గేటెడ్ కమ్యూనిటీల్లో ఇబ్బందులు ఉండవు. కమ్యూనిటీ లివింగ్లలో గృహిణులు, పిల్లలకు రక్షణ ఉండటంతో పాటు ఒకే తరహా అభిరుచులు ఉన్నవాళ్లు ఒకే కమ్యూనిటీలో ఉంటారు. అలాగే ఒకే ప్రాంతంలో అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి. దీంతో టెన్షన్ ఉండదు. చోరీలు, ప్రమాదాల వంటి భయం ఉండదు. సీసీటీవీ కెమెరాలు, 24/7 సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఉంటుంది. నిరంతరం నిర్వహణతో కమ్యూనిటీ పరిశుభ్రంగా, హైజీన్గా ఉంటుంది. థర్డ్ పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వంద శాతం పవర్ బ్యాకప్, నిరంతరం నీటి సరఫరా ఉంటుంది.
ఫ్యామిలీ
కోలో కోలోయన్న కోలో..
జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి వింజమూరి అనసూయాదేవి జీవితం ఎంతటి స్ఫూర్తిమంతమైనదో డాక్యుమెంటరీగా తీసి, ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’లో ప్రదర్శించారు ఆమె కుమార్తె సీతారత్నాకర్. ‘అసమాన అనసూయ’ ను తెరపై చూసిన నాటి తరమే కాదు, నేటి నవతరమూ కళ్లప్పగించి చూస్తూనే ఉంది. ఈ సందర్భంగా తల్లి తన జీవితంలో నింపిన స్ఫూర్తిని సీతారత్నాకర్ పంచుకున్నారు.మారుమూల పల్లెల్లో దాగి ఉన్న జానపద గేయాలకు సభా గాన మర్యాద కలిగించి సంగీత జగత్తులో ఉన్నతస్థానాన్ని కలిగించిన తొలి గాయని వింజమూరి అనసూయాదేవి. జానపద గేయాలకు కర్నాటక బాణీలో స్వర రచన చేసిన తొలి స్వరకర్త. విశ్వ విద్యాలయాలలో శాస్త్రీయ సంగీతాన్ని పాఠ్యాంశంగా చేర్పించిన అసమాన గాయని. దక్షిణ భారతదేశంలో తొలి మహిళా సంగీత దర్శకురాలు. ఆమె ఒక అద్భుతం. ఆమెను తలుచుకుంటున్నారు కుమార్తె సీతారత్నాకర్.పాట పాడింది... బాధ్యతలూ నెరవేర్చిందిఅమ్మానాన్నలకు మేం ఐదుగురం సంతానం. అమ్మకు సంగీతం అంటేప్రాణం. స్కూల్ లేని రోజుల్లో అమ్మ తనతోపాటు మమ్మల్నీ కచేరీలకు తీసుకెళ్లేది. ఎక్కడకు వెళ్లినా తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తూనే కళను కూడా సాకారం చేసుకున్నారు. నేనూ, మా అక్క భరతనాట్యం నేర్చుకొని దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చాం. అక్కకు పెళ్లయ్యి అమెరికా వెళ్లడం, నాకు పెళ్లవడంతో నృత్యం ఆగిపోయింది. దూరదర్శన్లో ఉద్యోగం వచ్చింది. మేం మొదటి నుంచి చెన్నైలో ఉండేవాళ్లం. అలా చెన్నై, ఢిల్లీ దూరదర్శన్లో 37 ఏళ్లు వర్క్ చేశాను. ఎంతో మంది కళాకారులను, యాక్టివిస్ట్లను దూరదర్శన్కి పరిచయం చేశాను. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు నలుగురూ అమెరికాలో స్థిరపడ్డారు. అమ్మ ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువ సమయం తనతో గడిపే అవకాశం లభించేంది. అమ్మకు జానపద గేయాల గురించి తెలుసు కాబట్టి కాకినాడకు తీసుకెళ్లి, అక్కడి పల్లె పాటల మీద ఓ కార్యక్రమాన్ని చేశాం. అదొక మధురానుభూతి నాకు. నేను చేసిన ప్రోగ్రామ్స్ చూసేది. సూచనలు ఇచ్చేది. ‘ఇంకా ఏదైనా చేయాలి’ అంటూ గాయనిగా స్వరాలను కూర్చుతూనే ఉండేది. రచనలు చేస్తూనే ఉండేది. భావగీతాలు, జానపద గేయాలు ఈ రెండు పుస్తకాలు ఆమె 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా విడుదలయ్యాయి. ఆ తర్వాత జానపద సంగీతంపై ఏడు పుస్తకాలను విడుదల చేశారు. ఇవి కాకుండా నేనూ–నా రచనలు, గతానికి స్వాగతం అనే పుస్తకాలు, 95వ పుట్టిన రోజు సందర్భంగా ‘అసమాన అనసూయ’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు.యజ్ఞంలా అనిపించింది...నిరంతర కృషియే అమ్మను అసమానంగా ఈ రోజు నిలబెట్టింది. అమ్మ మరణించాక ఆమెకు సంబంధించిన ఫుటేజీ అంతా ఒకసారి చూడటం మొదలుపెట్టాను. మరికొంత మా వాళ్ల నుంచి సేకరించాను. అదంతా చూడటానికే నాకు రోజుల సమయం పట్టింది. ఆవిడ వీడియోలు చూస్తున్నప్పుడు ‘నా పాటలు ఆగిపోకూడదు...’ వంటి మాటలు విన్నాను. దీంతో అమ్మకు సంబంధించిన డాక్యుమెంటరీ ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్నించాను. ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి.. అని చాలా ఆలోచించేదాన్ని. ఫుటేజీలో ఆమె దినచర్యతోపాటు, జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ చేర్చుకుంటూ, ప్రముఖుల సభా విశేషాలు, పుస్తకప్రారంభోత్సవాలు, కుటుంబ సభ్యుల నుంచి కామెంట్స్ జత చేసి ఒక రూపం తీసుకువచ్చాను. ఈ సమయంలో అమ్మ నా వెంటే ఉంటూ నాకు సూచనలు చేస్తున్నట్టు అనిపించేది. డాక్యుమెంటరీ పూర్తవ్వడానికి మూడేళ్ల సమయం పట్టింది. అమ్మ ఘనత అలనాటి వారికే తెలుసు అనుకున్నాను. కానీ, నేటి తరం కూడా అమ్మ డాక్యుమెంటరీ చూడటం, ఆమె గొప్పతనం గురించి ప్రస్తావిస్తుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది’ అంటూ తన తల్లితో తనకున్న అనుబంధాన్ని తెలిపారు సీతా రత్నాకర్. – నిర్మలారెడ్డి
తారలు అక్షరాలు తళుక్కుమన్నాయి
సాహిత్యాభిమానులు క్యూ కట్టారు. వేదికల మీద రచయితలు, రచయిత్రులు, నటీనటులు తమ మాటల మూటలు విప్పారు. పుస్తకాలు మేమున్నామంటూ ఆకర్షణీయమైన అట్టలతో పాఠకుల్ని కేకేశాయి. హైదరాబాద్లో శుక్రవారం మొదలైన హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ నగరానికి కొత్త శోభను తెచ్చింది. ఈ సందర్భంగా తారలేమన్నారో అక్షరాలు ఎలా మెరిశాయో ఇక్కడ చదవండి.ప్రపంచమే ఒక రంగస్థలంభారతదేశం గొప్ప లౌకికదేశమని కొనియాడారు అమల్ అల్లానా. దేశవిభజన సమయంలో అమల్ తల్లి రోషన్ నిండు గర్భిణి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నెల రోజులకు పుట్టింది అమల్. ఆమె తండ్రి ఇబ్రహీమ్ అల్కాజీ గుర్తింపు పొందిన డైరెక్టర్. సౌదీ అరేబియా, కువైట్ మూలాలున్న కుటుంబం ఆయనది. విభజన సమయంలో ఇబ్రహీం సోదరులంతా పాకిస్థాన్కు వెళ్లిపోయారు. ఇబ్రహీమ్ మాత్రం ఇండియాలో కొనసాగారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అమల్. తల్లి కుటుంబం గుజరాత్కు చెందినది కావడం కూడా తాము ఇండియాలో ఉండిపోవడానికి అదో కారణమంటూ తాను చూసిన ఇండియా గమనాన్ని విశ్లేషించారు. ‘అరవైల నాటి ఇండియాని చూశాను, 90ల నాటికి వచ్చిన మార్పులకు ప్రత్యక్ష సాక్షిని. అలాగే 2025కి సాధించిన పురోగతిని ఆస్వాదిస్తున్నాను. కొత్త బాధ్యతలను భుజానికెత్తుకుంటూ పాత బ్యాగేజ్ని తగ్గించుకుంటూ ముందుకుపోవడమే అభివృద్ధి’ అన్నారు అమల్. అవి గోల్డెన్ డేస్! రంగస్థల దర్శకత్వం, కాస్ట్యూమ్ డిజైనింగ్, సీన్ డిజైనింగ్లో నైపుణ్యం సాధించిన అమల్ అల్లానా ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’కు చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆమె తల్లి రోషన్ అల్కాజీ రచనలు ‘ఏన్షియెంట్ ఇండియన్ కాస్ట్యూమ్, మిడివల్ ఇండియన్ కాస్ట్యూమ్’ లను పరిష్కరించారు. ఇటీవల తండ్రి జీవితాన్ని ‘ఇబ్రహీం అల్కాజీ: హోల్డింగ్ టైమ్ క్యాప్టివ్’ పేరుతో అక్షరబద్ధం చేశారు. ఈ రచనలోని విషయాలను ప్రస్తావించడం అంటే నా తండ్రిని గుర్తు చేసుకోవడమే అంటూ ‘మేము ముంబయిలోని ఒక ఆరు అంతస్థుల భవనంలో నివసించేవాళ్లం. ఆ టెర్రస్ని చూసిన మా తండ్రి అక్కడ 80 మంది వీక్షించే రంగస్థల వేదికను ఏర్పాటు చేశారు. అప్పుడు నాటకాన్ని చూడడానికి ప్రేక్షకులు ఐదంతస్థులు మెట్లెక్కి వచ్చేవారు. అవి రంగస్థలానికి గోల్డెన్ డేస్. ఇప్పుడు రంగస్థలానికి వన్నె తగ్గిన మాట నిజమే కానీ, రంగస్థలం అంతరించిపోవడం అనేది జరగదు. ఎందుకంటే ప్రపంచ దేశాల సంస్కృతి అంతా రంగస్థలం చుట్టూనే పరిభ్రమించింది’ అన్నారు అమల్ అల్లానా.భాగమతి ప్రేమకథ స్ఫూర్తినిస్తూనే ఉంటుందిబెంగాల్కు చెందిన మౌపియా బసు జర్నలిస్టు, రచయిత. చారిత్రక పరిశోధనల ఆధారంగా కథనాలను వెలువరించే మౌపియా నాలుగేళ్ల కిందట హైదరాబాద్కు వచ్చారు.‘అనార్కలి అండ్ సలీం: ఏ రీటెల్లింగ్ ఆఫ్ ముఘల్ ఈ ఆజమ్, ‘ద క్వీన్స్ లాస్ట్ సెల్యూట్: ద స్టోరీ ఆఫ్ ద రాణీ ఆఫ్ ఝాన్సీ అండ్ ద 1857 మ్యూటినీ, ఖోక, కమల్సుందరి’ రచనలు చేసిన మౌపియాకు హైదరాబాద్ నగరం కొత్త సందేహాలను రేకెత్తించింది. నగరంలో ఎక్కడికెళ్లినా ఆమెకు వినిపించిన భాగ్యనగర్ అనే పేరు మీద పరిశోధన మొదలుపెట్టారు. తాను తెలుసుకున్న విషయాలను ‘భాగమతి : వై హైదరాబాదీస్ లాస్ట్ క్వీన్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద సిటీ’ పేరుతో ప్రచురించారు. హైదరాబాద్వాసుల్లో పరిపూర్ణమైన మతసామరస్యాన్ని, బ్రదర్హుడ్ను చూశానన్నారు మౌపియ. ‘ఈ నగరంలో నివసించే వాళ్లు తమను తాము మతం, కులం,ప్రాంతం, భాషల ఆధారంగా పరిచయం చేసుకోరు. ‘హైదరాబాదీని’ అని గర్వంగా చెప్పుకుంటారు. హైదరాబాద్లో మాత్రమే వినిపించే డయలక్ట్ కూడా వీనులవిందుగా ఉంటుంది. హైదరాబాద్ మీద సామాన్యుల్లో ఉన్న అనేక అపోహలను నా పర్యటన తుడిచేసింది. ఓల్డ్సిటీకి వెళ్లవద్దనే హెచ్చరికలను పట్టించుకోకుండా రంజాన్ మాసంలో వెళ్లాను. ఆత్మీయతకు అర్థాన్ని తెలుసుకున్నాను. అక్కడి వాళ్లను పలకరించినప్పుడు వారి నోటివెంట కూడా భాగమతి మాట వినిపించింది. ఒక ప్రేమ కథ రెండు మతాలను కలిపి ఉంచుతోంది. ఆ ప్రేమకథ నాలుగు వందల ఏళ్లుగా జనం నాలుకల మీద సజీవంగా ఉంది. అయితే నాకు సమాధానం దొరకని ప్రశ్న ఏమిటంటే... గోల్కొండను పాలించిన కుటుంబాల సమాధులున్నాయి, మహళ్లు, ప్యాలెస్లున్నాయి. కానీ భాగమతి ఊహాచిత్రం తప్ప అధికారిక డాక్యుమెంట్ కానీ, శిల్పం వంటి ఆధారం కానీ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాద్ అధికారిక రికార్డుల్లో ఎక్కడా ఆమె పేరు కనిపించదు. కానీ ఇక్కడ పర్యటించిన యాత్రికుల రచనల్లో ఉంది. డచ్, బ్రిటిష్ వ్యాపారుల రికార్డుల్లో భాగ్నగర్ పేరు ఉంది. సినిమా, రంగస్థలం, కవిత్వం, పెయింటింగ్లుల్లో భాగమతి కనిపిస్తోంది. ఆమెకు సంబంధించిన భౌతిక ఆధారం ఒక్కటీ లభించకపోవడానికి కారణం ఉద్దేశపూర్వకంగా తుడిచేయడం జరిగిందా అనేది సమాధానం లేని ప్రశ్నగానే ఉంది’ ఈ చారిత్రకాంశం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి మౌఖికంగా కొనసాగుతోంది’ అని వివరించారు మౌపియా బసు. ఆమె శిల్పం లేదు. ఆమె రూపాన్ని చిత్రపటంగా అయినా ఎవరూ చూడలేదు. ఆమె సమాధి ఎక్కడో తెలీదు. కానీ ఇన్ని వందల ఏళ్లుగా ఆమె పేరును తలవడం మానలేదు హైదరాబాదీలు.ఫెమినిస్ట్ అయితే తప్పేంటి?షబానా ఆజ్మీ తెలుగింటి ఆడపడచు. ఆమె పుట్టిల్లు హైదరాబాద్. తొలిసారి కెమెరా ముందుకు వచ్చిందీ ఇక్కడే! ఆ జ్ఞాపకాలతోపాటు నేటి సినిమా.. ఆ రంగంలో పెరుగుతున్న అమ్మాయిల పాత్ర గురించీ ముచ్చటించారు. అవి ఆమె మాటల్లోనే.. ‘నేను హైదరాబాద్లోనే పుట్టినా ఇక్కడ గడిపింది తక్కువే! నాన్న (కైఫీ ఆజ్మీ)పోయెట్ మాత్రమే కాదు కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ కూడా. ఆయన అండర్ గ్రౌండ్ జీవితం వల్లే నా తొమ్మిదో ఏట అమ్మ నన్ను తీసుకుని ముంబైకి వెళ్లింది. సమ్మర్కి మాత్రం వచ్చేవాళ్లం. అమ్మ (షౌకత్ ఆజ్మీ) రంగస్థల నటి. దాంతో హైదరాబాద్లోని మా ఇంట్లో సాహిత్యం, నాటకం, సామాజిక స్పృహ కలగలసిన ఒక ప్రోగ్రెసివ్ వాతావరణం ఉండేది. ఆ నేపథ్యంలో పెరిగాన్నేను. దాంతో యాక్టివిజం కూడా నాకు వారసత్వంగా అబ్బింది. ఆ గుణం వల్లే ముంబైలోని మురికివాడల నిర్వాసితుల కోసంపోరాడాను. పొట్ట చేతపట్టుకుని సిటీకి వచ్చేవాళ్లకు పని దొరుకుతుందేమో కానీ సొంత జాగా దొరకదు. దానికోసం వాళ్ల తరఫున నిలబడ్డాను. మహిళల హక్కుల కోసమూ ముందుంటాను. కొంతమంది ఫెమినిస్ట్ అని చెప్పుకోవడం పట్ల నామోషీ ఫీలవుతున్నట్లనిపిస్తోంది ‘నేనేం ఫెమినిస్ట్ను కాను’ అని చెప్పుకుంటున్న వాళ్ల తీరును చూస్తే! ‘అంకురం’తో సొంతూరు పర్యటననా మొదటి సినిమా శ్యామ్ బెనెగల్ తీసిన ‘అంకురం’ షూటింగ్ హైదరాబాద్ (ఎల్లారెడ్డి గూడ) లోనే జరిగింది. బాల్యం తర్వాత మళ్లీ హైదరాబాద్కు రావడం అప్పుడే! అంతా కొత్తగా అనిపించింది. అంకురంలో నాది పనమ్మాయి పాత్ర. దానికి తగ్గట్టు నన్ను మలచడానికి శ్యామ్ బెనెగల్ నన్ను.. చీర కట్టుకుని మేమున్న ఇంటి పరిసరాల చుట్టూ తిరిగి రమ్మన్నాడు. మనుషులను, కల్చర్ను అబ్జర్వ్ చేయడానికి. ఓ మూడు రోజులు అదేప్రాక్టీస్! మాకు భోజనాలు ఏర్పాటు చేసిన చోట కూడా వాళ్లంతా టేబుల్ మీద తింటుంటే.. నన్నో మూలన, కింద కూర్చొని తినమనేవాడు. ఒకరోజు నేనలా తింటుంటే.. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి ‘ఇక్కడేదో సినిమా షూటింగ్ అవుతోందట కదా! హీరోయిన్ ఏది’ అనడిగారు. ‘బయటకు వెళ్లింద’ని చెప్పాను. ‘నువ్వెవరు?’ అనడిగారు. ‘ఆయాను’ అన్నాను. దీన్నంతా దూరం నుంచి గమనించిన శ్యామ్ బెనెగల్.. ఆ స్టూడెంట్స్ వెళ్లిపోగానే నన్ను పిలిచి, ‘నువ్విక ఈప్రాక్టీస్ ఆపేయొచ్చ’ని చెప్పారు. అలా ఉండేది ప్యార్లల్ మూవీస్లో పాత్రల ప్రిపరేషన్! హాలీవుడ్లో కూడా నటించాను (Madame Sousatzka, City of joy) కదా! వాళ్ల తీరు వేరు. పేపర్ మీద రాసుకున్నది రాసుకున్నట్టుగా జరగాలి. అది ఏ కాస్త కింద మీదైనా కంగారుపడిపోతారు. మళ్లీ అంకుర్ జ్ఞాపకాలకొస్తే.. నాకు కాస్ట్యూమ్స్ను కుట్టించడానికి ఓ దర్జీని పిలిపించారు. అతను టేప్ లేకుండా జస్ట్ అలా వచ్చి నన్నోసారి పై నుంచి కిందకు.. కింద నుంచి పైకి చూసి వెళ్లిపోయాడంతే! తర్వాత రెండు రోజులకు పర్ఫెక్ట్ సైజ్తో కాస్ట్యూమ్స్ను రెడీ చేసిచ్చాడు.పారలల్ మూవీస్కి... ఫార్ములా మూవీస్కి మధ్య వ్యత్యాసంపారలల్ మూవీస్లో స్త్రీ పాత్రలకు ఔచిత్యం, వ్యక్తిత్వం ఉండేవి. అదంతా సీరియస్ వ్యవహారం. ఫార్ములా మూవీస్కి వినోదమే ప్రధానం. ఆర్ట్ మూవీస్ నుంచి కమర్షియల్ మూవీస్కి వెళ్తున్న కొత్తలో భలే ఇబ్బంది పడ్డాను. ముఖ్యంగా డాన్స్ విషయంలో! ప్యార్లల్ మూవీ మూవ్మెంట్ను ఇప్పుడు ఓటీటీ రీప్లేస్ చేస్తోంది. అన్నిరకాల సినిమాలతో ప్రేక్షకులకు చాయిస్ ఉండాలి. ఈ మధ్య కొన్నివర్గాల వాళ్లు తమ ఐడియాలజీస్ను ప్రమోట్ చేసుకోవడానికి సినిమాను ఉపయోగించుకుంటున్నారనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల విచక్షణ చాలా గొప్పది. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.పురుషులను ఎడ్యుకేట్ చేయాలిఅన్ని రంగాల్లో అమ్మాయిలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వివక్ష వీడట్లేదు. దానికి సినిమా రంగమూ అతీతం కాదు. ప్రతిచోట స్త్రీలకు భద్రత ఉండాలి! వివక్షను రూపుమాపడానికి పురుషులను ఎడ్యుకేట్ చేయాలి. అది ఇంటి నుంచే మొదలవ్వాలి. తల్లిదండ్రులే ఆ ప్రయత్నానికి నాంది పలకాలి. ఈ విషయం మీద మా అబ్బాయి (యాక్టర్, స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్) ‘మర్ద్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మగ పిల్లల్లో అవేర్నెస్ కల్పిస్తున్నాడు!’ అంటూ చెప్పుకొచ్చింది నటి షబానా ఆజ్మీ. సినిమా ఇండస్ట్రీలో మహిళా టెక్నీషియన్స్ పెరిగారు. వాళ్లలో స్క్రిప్ట్ రచయితలు, దర్శకులు కూడా ఉండటంతో సున్నితమైన అంశాలు తెరమీదకు వస్తున్నాయి. నటనలో కూడా నేటి అమ్మాయిలు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాకపోతే ఐటమ్ సాంగ్స్తోనే పేచీ. అవి పెట్టినా కాస్త అర్థవంతంగా ప్రెజెంట్ చేయొచ్చు కదా!గర్ల్ఫ్రెండ్సే కారణం.. ‘స్త్రీకి స్త్రీ శత్రువు కాదు. ఇలాంటి తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటోంది పురుషాధిపత్య సమాజం. దాని మాయలో పడకూడదు. స్త్రీకి స్త్రీయే నేస్తం. నేనీ రోజు ఈ స్థాయికి చేరానంటే కారణం నా చుట్టూ ఉన్న స్త్రీమూర్తులు.. గర్ల్ఫ్రెండ్సే! అందుకే సిస్టర్హుడ్ను పెంపొందించుకోవాలి. అలాగే తిండి, కట్టు, బొట్టు లాంటివన్నీ వ్యక్తిగత విషయాలు. మన సౌకర్యం, అభిరుచిని బట్టి నిర్ణయించుకునేవి తప్ప సమాజమో, ప్రభుత్వాలో నిర్ణయించేవి కావు!’– హుమా ఖురేషీచిత్చోర్ ఏమన్నాడు‘గోరి తేరా గావ్ బడా ప్యారా’ అంటూ అమోల్ పాలేకర్ హైదరాబాద్ వచ్చేశాడు మరాఠీ న్యూవేవ్ సినిమా పయనీర్, నటుడు, దర్శకుడు, థియేటర్ పర్సనాలిటీ, చిత్రకారుడు అమోల్ పాలేకర్... మారిన సినిమా తీరు, మరాఠీ రంగస్థలం గురించి మాట్లాడుతూ.. ‘సినిమా థియేటర్ ఉనికి కోల్పోయింది. ఓటీటీ వచ్చింది. సెల్ఫోన్లో ప్రపంచం కనబడుతోంది. ఈ మార్పంతా ఓ పద్ధతి ప్రకారం జరిగింది. అది ప్యార్లల్ మూవీ మూవ్మెంట్నూ కంట్రోల్ చేసింది. సొంత ప్రయోజనాల కోసం పాలక వర్గాలకు కొమ్ముకాసే వాళ్లు సినిమా రంగంలోనూ ఉంటారు. ఏటికి ఎదురీదే వాళ్లు కొద్దిమందే! వాళ్లు మైనారిటీ వర్గంగా మిగిలిపోయి ప్రభావం చూపించలేకపోతారు. వీటన్నిటి క్రమంలో ఊరటను.. సంతోషాన్నిస్తున్నది రంగస్థలమే! అది తన శోభను కోల్పోలేదు. ముఖ్యంగా మరాఠీ రంగస్థలం. యంగ్ జనరేషన్తో కళకళలాడుతోంది. అది ఒక్క ముంబై, పుణెలోనే కాదు మహారాష్ట్ర అంతటా ఎక్స్పెరిమెంట్స్తో వైబ్రెంట్గా ఉంది’ అని చెప్పారు. – వాకా మంజులారెడ్డి
టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి
గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మారణాలు ఆందోళన రేపుతున్నాయి. దీనికి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బాగా ఫిట్గా ఉన్నామను కున్నవారు కూడా ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్తో కుప్పకూలుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయితాజాగా బ్రెజిలియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకస్మిక మరణం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అదీ వీపుమీద టాటూ వేయించుకుంటూ ఉండగా ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. వివరాలు ఏంటంటే..45 ఏళ్ల బ్రెజిలియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రికార్డో గొడోయ్ టాటూ వేసుకుంటూ ఉండగా కుప్పకూలిపోయాడు. వీపు మొత్తంవీపు టాటూ వేయించుకోవాలని భావించిన గొడోయ్ బ్రెజిల్లోని శాంటా కాటరినాలోని టాటూ స్టూడియోకు వచ్చాడు. ఈ ప్రక్రియ కోసం మత్తు (జనరల్ అనస్థీషియా) ఇచ్చిన కొద్దిసేపటికే అతను గుండెపోటుకు గురయ్యాడు. దీంతో హుటాహుటిన కార్డియాలజిస్ట్తో సహా వైద్య సిబ్బంది అతడిని బతికించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రయత్నాలు విఫలమై అదే రోజు మధ్యాహ్నం గొడోయ్ మరణించాడు. ఈ విషయాన్ని స్టూడియో యజమాని గొడోయ్ ఇన్స్టా పేజ్ ధృవీకరించింది. జనవరి 20న ఈ విషాదం చోటు చేసుకుంది.ఎవరీ గొడోయ్ ప్రీమియం గ్రూప్ సీఈవో రికార్డో గొడోయ్ లగ్జరీ కార్ల వాడకంలో పేరుగాంచాడు. వ్యాపారవేత్తగా, లగ్జరీ కార్లు , హై-ఎండ్ జీవనశైలితో బాగా పాపులర్ అయ్యాడు. లగ్జరీ కార్ల గురించి ఆకర్షణీయమైన పోస్ట్లతో ఫ్యాన్స్ను ఆకట్టుకునేవాడు. సోషల్ మీడియాలో 225,000 మందికి పైగా అభిమానులను సంపాదించుకున్నాడు. లగ్జరీ ఆటోమొబైల్ పరిశ్రమ గురించి ఆకర్షణీయమైన కంటెంట్ను అందిస్తూ గొడోయ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో కనెక్ట్ అయ్యాడు.టాటా వేయించుకున్నాక త్వరలోనే మిమ్మల్ని పలకరిస్తా అంటూ తన అనుచరులకు హామీ ఇచ్చిన గొడోయ్ గుండెపోటుతో మరణించడంతో ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేశారు. టాటూ స్టూడియో యజమాని సైతం సంతాపం ప్రకటించాడు. గొడోయ్ను "గొప్ప స్నేహితుడు"గా అభివర్ణించాడు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. View this post on Instagram A post shared by RICARDO GODOI (@ricardo.godoi.oficial)
నిఖిల్ కామత్ సూపర్ ఫుడ్ ఇదే..! దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుందా..?
జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్(Nikhil Kamath)) అవిసే గింజలు, మఖానాలను ఇష్టంగా తింటానని ఒక ఇంటర్యూలో అన్నారు. భారతదేశంలో తదుపరి సూపర్ ఫుడ్(superfood) మఖానాలేనని కూడా చెప్పారు. ఆరోగ్య స్ప్రుహ ఉన్న ఈ ఆధునిక కాలంలో కచ్చితంగా గొప్ప ఆరోగ్య ఆహార బ్రాండ్గా అవతరిస్తుందని అన్నారు. ఇది డయాబెటిస్, కొలస్ట్రాల్, రక్తపోటు సమస్యలను అద్భుతంగా అదుపులో ఉంచుతుందని చెప్పారు. ఇది నిజంగానే దీర్ఘకాలిక వ్యాధుల(chronic illnesses)ను నివారించడంలో సహాయపడుతుందా అంటే..పోషకాల ప్రొఫైల్..మఖానా(Makhana)లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మఖానాలో 9 శాతం ప్రోటీన్, ఫైబర్తో నిండి ఉంటుంది. సహజంగా లభించే సోడియం చాలా తక్కువ సాంద్రతలను కలిగి ఉంటుంది. దీనిలో కొద్దిపాటి కొవ్వు మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్(MufA) రూపంలో ఉంటుంది. పైగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెరను నిర్వహించడానికి, శరీర కొవ్వును తగ్గించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికీ అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇది గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందట. మఖానాలో ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు కేన్సర్ నిరోధక లక్షణాలను పెంచుతుందట. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ ఎంజైమ్లు మూత్రపిండాలు శుభ్రపరచడానికి కూడా ఉపయోగపడుతుందట. పెద్దలకు 25-30 గ్రాములు, పిల్లలకు 10-20 గ్రాములు చొప్పున తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని స్మూతీలు, కూరలు, స్నాక్ల రూపంలో తీసుకోవచ్చు. అయితే పాలతో మరింత పోషక విలువలను అందిస్తుందట. అలాగే ఇక్కడ తినమగానే.. ప్యాకింగ్ చేసిన రోస్ట్ మఖానాలు మాత్రం తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇవి ప్రయోజనాల కంటే అనారోగ్యకరమైన ప్రమాదాలనే ఎక్కువగా అందిస్తుందని సూచిస్తున్నారు. (చదవండి: తలనే లాక్ చేశాడు..! తాళం మాత్రం భార్య చేతిలో..)
ఫొటోలు
తల్లి కోసం బెంగళూరులో ఫ్లాట్ కొన్న తేజస్విని.. నిజంగా గ్రేట్! (ఫోటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జనవరి 26-ఫిబ్రవరి 02)
64 ఏళ్ల హీరోతో జత కడుతున్న 29 ఏళ్ల హీరోయిన్ (ఫోటోలు)
Abhinaya: మూగ హీరోయిన్.. కానీ హావభావాలు పలికించడంలో దిట్ట (ఫోటోలు)
Malavika Mohanan: రాజాసాబ్లో ప్రభాస్తో జోడీ కట్టిన బ్యూటీ.. ఎంతందంగా ఉందో!(ఫోటోలు)
50 నిండినా వన్నె తగ్గని అందం, ఫ్యాషన్కి, పిట్నెస్కి పెట్టింది పేరు (ఫోటోలు)
భార్య, కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నితిన్ (ఫోటోలు)
బాక్ల్ శారీలో బిగ్ బాస్ శ్రీ సత్య క్యూట్ లుక్స్ (ఫొటోలు)
నటుడు ప్రకాష్ రాజ్ కొత్త కారవ్యాన్ చూశారా (ఫోటోలు)
నాకు ఇష్టమైన ఫోటోలు ఇవే అంటూ.. షేర్ చేసిన 'రష్మిక మందన్న'
National View all
‘ఆపిల్ చక్రవర్తి’కి పద్మశ్రీ.. జాతీయ వినూత్న వ్యవసాయవేత్తగానూ గుర్తింపు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.
వేరే అమ్మాయి ఫోటోకు ఎందుకు లైక్ కొట్టావ్..
బనశంకరి: సోషల్ మీడియా గొడవల వల్ల ప్రాణాలను తృణప్రాయంగా వదిల
బస్సు ప్రయాణికురాలి తల కట్
మైసూరు: కిటికీలో తల, చేతులు బయటపెట్టరాదు అని బస్సుల్లో హెచ్చ
గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
ఢిల్లీ : క్తరవ్యపథ్ వేదికగా ఢిల్లీలో 76వ గణతంత్ర వేడుకలు (7
Republic Day 2025: మువ్వన్నెల రైల్వే స్టేషస్లు.. మురిసిపోతున్న ప్రయాణికులు
గణతంత్ర వేడుకల సందర్భంగా దేశమంతా త్రివర్ణమయంగా మారిపోయింది.
International View all
ట్రంప్ నిర్ణయం: అమాంతం పెరిగిన గుడ్ల ధరలు
అమెరికా జనం గుడ్లు కొనుగోలు చేయాలంటే బెంబేలెత్తిపోతున్నారు.
జనాభా తగ్గుతోంది... వృద్ధులు పెరుగుతున్నారు
ఇటు జనాభా క్షీణిస్తోంది. అటు వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చైనా సహా అనేక దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లివి.
వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా కుష్ దేశాయ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస
వెనక్కి పంపేస్తున్నాం.. మాకు వద్దే వద్దు
మెక్సికో గుండా శరణార్థులుగా చొరబడిన వారందరినీ వెనక్కి పంపేస్తామంటూ అమెరికన్లకు ఇచ్చిన వాగ్దానాన్ని డొనాల్డ్ ట్రంప్ నెర
అటు నలుగురు.. ఇటు 200
టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరువ
NRI View all
రాణాకు మూసుకుపోయిన దారులు.. ఇక భారత్కు అప్పగింతే!
వాషింగ్టన్: ముంబయి దాడుల కేసు కీలక నిందితుడైన తహవూర్ రాణాన
ట్రంప్ పాలసీ.. భారతీయ అమెరికన్లకు మేలు కూడా!
అగ్రరాజ్యం అధ్యక్షుడి(47)గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భ
Birthright citizenship : ట్రంప్ ఆర్డర్ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్ఆర్ఐలకు భారీ ఊరట
అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ (
USA: టీటీఏ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది
వాషింగ్టన్: మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అ
కాన్సస్లో దిగ్విజయంగా నాట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..
క్రైమ్
అదుపు తప్పి.. వేగంగా ఢీకొట్టి..
బంజారాహిల్స్: ఫుట్పాత్పై నిద్రిస్తున్నవారి నుంచి కారు దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన బంజారాహిల్స్లో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్కు చెందిన ఆభరణాల వ్యాపారి తనయుడు సాధుల హర్షవర్ధన్ మరో ఐదుగురు స్నేహితులతో కలిసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–13లోని సాయి మెన్షన్ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆయనే నిర్మాతగా, హీరోగా అర్జున్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. శుక్రవారం రాత్రి హర్షవర్ధన్ తన స్నేహితులు సాంకేత్ శ్రీనివాస్ అలియాస్ తేజ, మాడే కార్తీక్, వంశీ, రాకేష్ నేతతో కలిసి ఉంటున్నాడు. హర్షవర్ధన్, వంశీలు గదిలో మద్యం తాగుతుండగా.. రాకేష్ అనే మరో స్నేహితుడు జూబ్లీహిల్స్లోని ఎయిర్లైవ్ పబ్లో ఉండగా తనను పికప్ చేసుకోవడానికి రావాలని హర్షవర్ధన్కు ఫోన్ చేశాడు. తాను మద్యం మత్తులో ఉన్నానని, మీరు వెళ్లి తీసుకురావాలంటూ కార్తీక్కు చెప్పి కారు తాళంచెవి ఇచ్చాడు. అర్ధరాత్రి 1.04 గంటల ప్రాంతంలో కార్తీక్.. థార్ కారు నడుపుతుండగా తేజ పక్కన కూర్చొని రాకే‹Ùను తీసుకురావడానికి జూబ్లీహిల్స్ పబ్కు బయలుదేరారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 నుంచి అగ్రసేన్ చౌరస్తా మీదుగా అతి వేగంగా కేబీఆర్ పార్కు వైపు వెళ్తుండగా బసవతారకం కేన్సర్ హాస్పిటల్ సమీపంలో కారు అదుపుతప్పి ఫుట్పాత్ను ఢీకొట్టి అక్కడ నిద్రిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న వ్యక్తి (40) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్రెడ్డి సిబ్బందితో కలిసి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన వివరాలను ప్రత్యక్ష సాక్షుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కారు డోర్ తీసి పరారైన యువకులు.. కారు బోల్తా పడిన తర్వాత డోర్ నుంచి ఇద్దరు యువకులు బయటకు వచ్చి పరుగులు తీశారని అక్కడ ఉన్నవారు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు కారు నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ సేకరించి సీసీ ఫుటేజీల ఆధారంగా కారు ఎక్కడి నుంచి వచి్చందో గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత భయంతో కార్తీక్, తేజ పారిపోతూ గదిలో ఉన్న హర్షవర్దన్, వంశీ, నేతను కూడా పారిపోవాలని చెప్పడంతో అంతా ఉడాయించారు. అయితే తెల్లవారుజామున ఇంటికి వచ్చిన రాకే‹Ùకు గదికి తాళం వేసి ఉండడం కనిపించింది. పోలీసులు రాకేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ మిస్టరీ వీడింది. పరారీలో ఉన్న కార్తీక్, తేజ, హర్షవర్ధన్, వంశీ, నేత తదితరులను అదుపులోకి తీసుకున్నారు. కారు నడిపిన కార్తీక్ పక్కనే కూర్చొన్న తేజలపై బీఎన్ఎస్ సెక్షన్ 105 (2), 337, ఎంవీ యాక్ట్ 184, 187, పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కారు ఇచి్చన హర్షవర్దన్పై కూడా కేసు నమోదైంది. కారు నడుపుతున్న కార్తీక్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించారు. కార్తీక్, తేజకు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించగా వారు మద్యం తాగలేదని తేలింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన యువతి
సాక్షి, హైదరాబాద్: మ్యాట్రిమోనీలో పరిచయమైన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిట్టనిలువునా మోసగించిందో కిలేడీ. ఈ కేసులో తిరుపతికి చెందిన తమ్మ హేమమణి అలియాస్ ప్రీతి రెడ్డి..ఆమెకు సహకరించిన కొండారెడ్డిలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరానికి చెందిన 45 ఏళ్ల బాధితుడికి గతేడాది మేలో విడాకుల మ్యాట్రిమోనీ యాప్ ద్వారా హేమమణితో పరిచయం ఏర్పడింది. తాను ఎంబీబీఎస్, ఎండీ అర్హతలు కలిగిన కార్డియాలజిస్ట్ అని పరిచయం చేసుకుంది. విడాకులు తీసుకొని భర్తతో దూరంగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో తక్కువ కాలంలోనే పలు సామాజిక మాధ్యమాలలో ఇరువురూ సన్నిహితులుగా మారిపోయారు. కొంతకాలం తర్వాత నిందితురాలు వివాహ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో బాధితుడు అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె రోగికి చికిత్స చేయడానికి నిధులు అవసరమని పేర్కొంటూ బాధితుడి నుంచి సొమ్ము వసూలు చేసింది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. తర్వాత ఆమె బాధితుడిని మళ్లీ సంప్రదించి తన తల్లి చనిపోయిందని అత్యవసరంగా ఇంకొంత సొమ్ము అవసరముందని చెప్పింది. పలు లావాదేవీల్లో మొత్తం రూ.4.97 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ మధులత నేతృత్వంలోని బృందం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
Hyderabad: దొరకని ఆనవాళ్లు
మేడ్చల్రూరల్: మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధి మునీరాబాద్ సమీపంలో ఓఆర్ఆర్ కల్వర్టు కింద యువతిని దారుణంగా హతమార్చిన ఘటన బయటపడి 24 గంటలు దాటినా ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు పోలీసులకు లభించలేదు. నిందితులు పోలీసులకు క్లూస్ దొరక్కుండా ఉండేందుకు యువతి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ముందుగానే పథకం రూపొందించుకుని ఓఆర్ఆర్ కల్వర్టు కింద..నిర్మానుష్య ప్రదేశం, సీసీ కెమెరాలు లేని ప్రాంతంగా భావించి ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నారు. హత్యకు గురైన యువతి ఒంటిపై ఉన్న నగలు (పూసలదండ, జడ పిన్నీసులు) ఏపీలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తారని సమాచారం. దీంతో పోలీసులు ఏపీలోని మిస్సింగ్ కేసులను సైతం పరిశీలనలోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా హత్య ఘటన పోలీసులకు పెను సవాల్గా మారింది. నిందితుడు ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా చాకచక్యంగా వ్యవహరించి హత్యకు పాల్పడి పరారయ్యాడు. దీంతో సీసీఎస్ పోలీసులు, ఎస్ఓటీ, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. సైబరాబద్ కమిషనరేట్తో పాటు రాష్ట్రంలోని ఇతర పోలీస్స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. శనివారం ఉదయం మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ శ్రీనివాస్రెడ్డిలు సంఘటన స్థలిని పరిశీలించారు. Hyderabad: యువతి దారుణ హత్య.. చేతులపై ముగ్గురి పేర్లతో పచ్చబొట్టు ..
కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ మూలాలను రాచకొండ పోలీసులు ఛేదించారు. సరూర్నగర్లోని అలకనంద, మాదన్నపేటలోని జనని, అరుణ ఆసుపత్రులలో అక్రమంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఒక్కో కిడ్నీ మార్పి డికి రూ.60 లక్షల చొప్పున గ్రహీత నుంచి వసూలు చేస్తున్న ఈ గ్యాంగ్.. గత రెండేళ్లలో నగరంలో 50కి పైగా కిడ్నీ మార్పిడులు చేయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ముఠాలోని 9 మందిని అరెస్టు చేయగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. కేసు వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సు«దీర్ బాబు శనివారం మీడియాకు వెల్లడించారు. ఆర్థిక కష్టాలతో పక్కదారి హైదరాబాద్కు చెందిన డాక్టర్ సిద్ధంశెట్టి అవినాశ్ 2022లో సైదాబాద్లోని మాదన్నపేట రోడ్లో ఉన్న జనని, అరుణ ఆసుపత్రులను కొనుగోలు చేసి కొంతకాలం నడిపించాడు. తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా విక్రయించాలని భావించాడు. ఆ సమయంలో విశాఖపట్నంకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి అవినాశ్ను సంప్రదించి, ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సూచించాడు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.2.5 లక్షలు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్రతిపాదనకు అంగీకరించిన అవినాశ్ జనని, అరుణ ఆసుపత్రుల్లో ఏప్రిల్ 2023 నుంచి 2024 జూన్ వరకు అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ దందాలో వైజాగ్కు చెందిన పవన్ అలియాస్ లియోన్, పూర్ణ అలియాస్ అభిషేక్లు కీలక పాత్ర పోషించారు. వీరు తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పెరుమాల్, జమ్మూకశ్మీర్కు చెందిన డాక్టర్ సోహిబ్తోపాటు నల్లగొండకు చెందిన మెడికల్ అసిస్టెంట్లు రమావత్ రవి, సపావత్ రవీందర్, సపావత్ హరీశ్, పొదిల సాయి, తమిళనాడుకు చెందిన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు శంకర్, ప్రదీప్, కర్ణాటకకు చెందిన సూరజ్లను కలుపుకొని ముఠాగా ఏర్పడ్డారు. ఒక్కో కిడ్నీ రూ.60 లక్షలు.. ఈ ముఠా ఒక్కో కిడ్నీకి రూ.60 లక్షల చొప్పున గ్రహీత నుంచి వసూలు చేసేది. ఇందులో కిడ్నీ దాతకు రూ.5 లక్షలు, అవినాశ్కు రూ.2.5 లక్షలు, ప్రధాన సర్జన్కు రూ.10 లక్షలు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లకు రూ.30 వేల చొప్పున ముట్టజెప్పేవారు. మిగిలిన రూ.42 లక్షలను లక్ష్మణ్, పవన్, పూర్ణ, అభిషేక్లు పంచుకునేవారు. శస్త్ర చికిత్స చేసే సర్జన్ను తమిళనాడు, జమ్మూకశ్మీర్ నుంచి హైదరాబాద్కు విమానంలో తీసుకొచి్చ, స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేసేవారు. అలకానందకు ఆపరేషన్ల మార్పు జనని, అరుణ ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి దందా కు బ్రేక్ ఇద్దామని భావించిన డాక్టర్ అవినాశ్.. గతే డాది జూలైలో సరూర్నగర్లోని అలకానంద ఆసుపత్రి ఎండీ డాక్టర్ గుంటుపల్లి సుమంత్ను సంప్ర దించి, దందా గురించి తెలిపాడు. అతడు అంగీకరించటంతో అలకానందలో గతేడాది డిసెంబర్ నుంచి దాదాపు 20 అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్ర చికి త్సలు నిర్వహించారు. ప్రతీ సర్జరీకి సుమంత్కు రూ.1.5 లక్షలు కమీషన్గా అందేవి. విశ్వసనీయ స మాచారం అందడంతో ఈ నెల 21న రంగారెడ్డి జి ల్లా వైద్యాధికారులతో కలిసి పోలీసులు అలకానంద ఆసుపత్రిపై దాడిచేసి దందా గుట్టను రట్టు చేశా రు. తమిళనాడుకు చెందిన కిడ్నీ దాతలు నస్రీన్ బా ను అలియాస్, ఫిర్దోష్, కర్ణాటకకు చెందిన గ్రహీ త లు బీఎస్ రాజశేఖర్, భట్ ప్రభలను అదుపులోకి తీ సుకున్నారు. ఈ నెల 23న డాక్టర్ సుమంత్, రిసెప్షనిస్ట్ నర్సగాని గోపిలను అరెస్టు చేశారు. తాజాగా డాక్టర్ అవినాశ్, ప్రదీప్, రవి, రవీందర్, హరీశ్, సా యి, సూరజ్ మిశ్రాలను అదుపులోకి తీసుకున్నా రు. సర్జన్లు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సోహిబ్, దళారులు పవన్, పూర్ణ, లక్ష్మణ్లు పరారీలో ఉన్నారు. జీవన్దాన్ దాతల జాబితా లీక్ అవయవదానానికి సంబంధించిన సేవలు నిర్వహిస్తున్న జీవన్దాన్ సంస్థ డేటా లీక్ కావటమే కిడ్నీ దందాకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. పవన్, లక్ష్మణ్లు దాతలు, గ్రహీతల వివరాలను అక్రమ మార్గంలో సేకరించి ఈ దందా నిర్వహించినట్లు గుర్తించారు. వారు దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నా యి. గతంలో ఈ ముఠా శ్రీలంకలో కూడా కిడ్నీ మార్పిడి దందా చేసిందని అనుమానిస్తున్నారు.
వీడియోలు
తులం బంగారం ఎంతో తెలుసా?
తాడేపల్లి YSRCP కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Watch Live: ఢిల్లీలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
దావోస్ లో 4 రోజులు తండ్రీకొడుకులు చేసింది ఇదే !
డింగ్ డాంగ్ 2.O @ 25 January 2025
అన్నా క్యాంటీన్ల భోజనంలో నాణ్యత కరువు
ఇజ్జత్ కా సవాల్
ఏపీలో ఆగని రెడ్ బుక్ అరాచకాలు
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు