Top Stories
ప్రధాన వార్తలు

‘స్కామ్స్టర్ బాబు’.. హ్యాష్ ట్యాగ్ రిలీజ్ చేసిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ పాలనలో జరుగుతున్న కుంభకోణాలను, కుట్రలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయటపెట్టారు. వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశంలో అన్ని విషయాలను వివరించారు. ఆపై స్కామ్ స్టర్ బాబు’(#ScamsterBabu) అంటూ హ్యాష్ ట్యాగ్తో చంద్రబాబు అక్రమాలు, అవినీతి, స్కాంల ఆధారాలను వైఎస్ జగన్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అక్రమాలను మరోసారి వివరించారు. ఈ సందర్భంగా.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆధారాలతో సహా వివరాలను ట్యాగ్ చేశారు. మద్యం స్కాంలోని వాస్తవాలతోపాటు పూర్తి సమాచారాన్ని తెలిపారు. కేసులోని అబద్ధాలు, కట్టు కథలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం తీరు, ప్రజా వ్యతిరేకతపై ప్రశ్నించే గొంతులను నులుమేస్తున్న తీరుపై మాట్లాడారు. యథేచ్ఛగా సాగుతున్న రాజకీయ వేధింపులు, అధికార దుర్వినియోగంపై ఆధారాలను బహిర్గతం చేశారు. ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలపై పెరిగిన కక్షసాధింపుల గురించి చర్చించారు. వీటికి సంబంధించిన వివరణాత్మక ఆధారాలను ట్వీట్లో జత చేసినట్టు తెలిపారు.In today’s press meet, I addressed key issues impacting our state and people:Facts on Liquor Case – Uncovered a deep web of lies and cooked-up stories with complete factual data.Red Book Files – Exposed vendetta politics and misuse of power to silence opposition.Targeted… pic.twitter.com/b0cXzjvc7w— YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2025

‘కోటా’ మరణాలపై సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీ: రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్, ఐఐటీ కోచింగ్ సెంటర్లకు అడ్డాగా ఉన్న రాజస్థాన్లోని కోటాలో ఈ ఏడాది 14 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆత్మహత్యలపై నమోదైన పిటిషన్లపై జేబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఏం చేస్తోంది?.. కోటాలో ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలను తేలికగా తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆత్మహత్యలపై సిట్ ఏర్పాటు చేశామని రాజస్థాన్ సర్కార్ తెలిపింది. తదుపరి విచారణ జులై 14కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కాగా, రాజస్థాన్లో కోచింగ్ సెంటర్ హబ్గా పేరు పొందిన కోటాలో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలు చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోవడమో, తల్లిదండ్రులు చేసిన అప్పు వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది చాలా ఆందోళకరమైన విషయం అంటూ రాజస్థాన్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయంటూ నిలదీసింది.

పచ్చ దండుకు కరోనా టెన్షన్
సాక్షి,వైఎస్సార్ జిల్లా: ఏపీలో కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. నమోదవుతున్న కోవిడ్-19 కేసులతో కూటమి నేతల్లో టెన్షన్ మొదలైంది. అందుకే కోవిడ్-19 కేసుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, వైఎస్సార్ జిల్లాలో కరోనా కేసు నమోదైంది. ఆ కేసును దాచిపెట్టేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదుపై కడప డీహెచ్ఎంవో నాగరాజు స్పందించారు. కడప జిల్లాలో ఎక్కడా కరోనా కేసులు నమోదు కాలేదు. కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న చాగలమర్రి మహిళకు కోవిడ్ లేదు. ఆమెకు కొంత ఊపిరితిత్తుల సమస్య మాత్రమే ఉంది’ అని అన్నారు. కానీ రిమ్స్లో చికిత్స పొందుతున్న మహిళకు కరోనా సోకినట్లు రిమ్స్ సూపరింటెండెంట్ రమాదేవి తెలిపారు. బాధిత మహిళకు వైద్యం చేస్తున్న అధికారులు కరోనా పాజిటివ్ అంటుంటే డీఎంహెచ్ఓ కాదని చెప్పడంతో అధికారుల తీరుపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే? ఈ నెల (మే) 27 నుంచి కడపలో టీడీపీ మహానాడు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలో కోవిడ్ కేసులు నమోదు కావడంతో పచ్చ నేతల్లో ఆందోళన మొదలైంది. కోవిడ్ అంటే మహానాడుకు ఎవరూ రారనే భయంతో కేసులే నమోదు కాలేదని వైద్యాదికారులతో చెప్పిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.బాధిత మహిళకు చికిత్స చేస్తున్న రిమ్స్ సూపరింటెండెంట్ కోవిడ్ నిర్దారణ అయిందని స్పష్టం చేయడం.. జిల్లా వైద్యాధికారి కోవిడ్ లేదని చెప్పడమే అందుకు నిదర్శనమంటూ ప్రజలు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

మోదీపై రాహుల్ ఘాటు విమర్శలు.. జైశంకర్కు కొత్త పేరు
సాక్షి,ఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశ విదేశాంగ విధానం కుప్పకూలిందని వ్యాఖ్యానించారు.ఈ మేరకు గురువారం రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ప్రధాని మోదీపై ఆపరేషన్ సిందూర్పై ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ ప్రకటనను ఎందుకు నమ్మారు?.కెమెరాల ముందు మాత్రమే మీ రక్తం ఎందుకు మరుగుతోంది. భారత దేశ గౌరవం విషయంలో మీరు ఎందుకు రాజీ పడ్డారు. పహల్గాం ఉగ్రదాడిపై భారత్కు మద్దతిస్తూ.. పాకిస్తాన్ను ఏ ఒక్క దేశం ఎందుకు ప్రశ్నించలేదు. భారత్-పాక్ల మధ్య మధ్యవర్తిత్వం వహించమని ట్రంప్ను ఎవరు అడిగారు?’ అని నొక్కాణించారు.मोदी जी, खोखले भाषण देना बंद कीजिए।सिर्फ इतना बताइए:1. आतंकवाद पर आपने पाकिस्तान की बात पर भरोसा क्यों किया?2. ट्रंप के सामने झुककर आपने भारत के हितों की कुर्बानी क्यों दी?3. आपका ख़ून सिर्फ़ कैमरों के सामने ही क्यों गरम होता है?आपने भारत के सम्मान से समझौता कर लिया! pic.twitter.com/HhjqbjDsaB— Rahul Gandhi (@RahulGandhi) May 22, 2025 ఈ సందర్భంగా దేశ విదేశాంగ విధానం కుప్పకూలిందని ఆరోపిస్తూ ఆ శాఖను నిర్వర్తిస్తున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్కు రాహుల్ కొత్త పేరు పెట్టారు. జైశంకర్ కాదని..జైచంద్ జైశంకర్ అని విమర్శించారు. జై శంకర్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. తాను పైన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. Will JJ explain:• Why has India been hyphenated with Pakistan?• Why didn’t a single country back us in condemning Pakistan?• Who asked Trump to “mediate” between India & Pakistan?India’s foreign policy has collapsed. https://t.co/m8q2lAFRm4— Rahul Gandhi (@RahulGandhi) May 23, 2025ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిణామలపై కాంగ్రెస్ నేతలు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ను జైచంద్ జైశంకర్ అని సంబోధిస్తూ విమర్శిస్తున్నారు.దీంతో జైచంద్ జైశంకర్ పేరు ఎందుకు పెట్టారా అని పలువురు నెటిజన్లు ఆరాతీస్తున్నారు. ప్రముఖ కవి పృథ్వీరాజ్ రాసో రాసిన ఓ కవిత నుంచి ఈ పేరును తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ కవితలో రాజ్పుత్ పాలకుడు జైచంద్, మరొక రాజ్పుత్ పాలకుడు పృథ్వీరాజ్ చౌహాన్కు వ్యతిరేకంగా ముహమ్మద్ ఘోరీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పబడింది. రాహుల్పై బీజేపీ విమర్శలుఅయితే, రాహుల్ కామెంట్స్పై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శలు గుప్పించారు.ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయన నిర్లక్ష్య ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనతో రాహుల్ గాంధీ స్వభావం ఎలాంటిదో చెబుతోంది. రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ అంటే పడకపోవచ్చు. కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిపై ఉపయోగించిన భాష దురదృష్టకరం’ అని మండిపడ్డారు.ఆపరేషన్ సిందూర్ ఎంత విజయవంతమైందో మనందరికీ తెలుసు. ప్రతి భారతీయుడు దాని గురించి గర్వపడుతున్నాడు.ప్రపంచం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అభినందిస్తోంది. మన ధైర్య సాయుధ దళాలను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. ఉగ్రవాదులను మాత్రమే కాకుండా ఉగ్రవాదాన్ని నిర్మూలించేలా ఆపరేషన్ సిందూర్తో సంకేతం పంపించామని’ భాటియా సూచించారు.

ఒకే ఇంట్లో షెహన్షా, బాద్షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్గా షారుక్ ఖాన్
ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్స్టార్ 'షారుక్ ఖాన్'ను కందేరే ప్రీమియం లైఫ్స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్కు, మరోవైపు ఆధునికత, డిజైన్పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్కు షారుక్ ఖాన్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్గా 75కి పైగా రిటైల్ అవుట్లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్షా (బచ్చన్) మరియు బాద్షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

ఆమే నేరంగా చూడడం లేదు.. అరుదైన తీర్పిచ్చిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: పోక్సో చట్టం కింద శిక్ష పడ్డ ఓ వ్యక్తికి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఊరట ఇచ్చింది. ఆర్టికల్ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగిస్తూ అతని శిక్షను రద్దు చేసింది. ఇదొక అరుదైన కేసుగా పేర్కొన్న సుప్రీం కోర్టు(Supreme Court) అద్భుతమైన తీర్పు ఇస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.‘‘కుటుంబం ఆమెను వదిలేసింది. వ్యవస్థ ఆమెను నిందించింది. న్యాయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. చట్టం దృష్టిలో ఇది నేరమే అయి ఉండొచ్చు. కానీ, బాధితురాలే జరిగిన దానిని నేరంగా పరిగణించడం లేదు. ఇప్పుడు ఆమె వేదనల్లా.. నిందితుడికి శిక్ష పడకుండా రక్షించుకోవాలని. అందుకోసమే ఆమె పోలీస్, న్యాయవ్యవస్థలతో పోరాడుతోంది. ఈ కేసులోని వాస్తవాలు.. ప్రతీ ఒక్కరికీ ప్రతి ఒక్కరికీ కంటి తెరుపు. .. నిందితుడితో బాధితురాలికి ఉన్న భావోద్వేగ అనుబంధం, వారి ప్రస్తుత కుటుంబ జీవితంతో సహా అసాధారణ పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని ‘‘పూర్తి న్యాయం’’ అందించేందుకు ఆర్టికల్ 142(Article 142) కింద అధికారాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా,జస్టిస్ ఉజ్జయ్ భుయాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. తద్వారా అతని శిక్ష రద్దు చేస్తున్నట్లు జస్టిస్ ఓకా తీర్పు వెల్లడించారు. సంచలన కేసుగా..పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక వ్యక్తి తన 24 ఏళ్ల వయసులో 15 ఏళ్ల మైనర్ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే.. ఆ తర్వాత మైనార్టీ తీరాక ఆమెనే అతను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ జంట పిల్లలతో సంతోషంగా జీవిస్తోంది. అయితే అప్పటికే అతనిపై పోక్సో యాక్ట్(POCSO Act) కింద కేసు నమోదు అయ్యింది. కింది కోర్టులో 20 ఏళ్ల కారాగార శిక్షపడడంతో.. కేసు కలకత్తా హైకోర్టుకు చేరింది. అయితే.. 2023లో ఈ కేసు విచారణ సందర్భంగా సదరు వ్యక్తికి ఊరట ఇచ్చిన హైకోర్టు, తీర్పు ఇచ్చే ప్రయత్నంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలికలు తమ లైంగిక కోరికలు అణుచుకోవాలంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పును సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు.. కోల్కతా హైకోర్టు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. కిందటి ఏడాది ఆగష్టులో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసి నిందితుడికి శిక్షను పునరుద్ధరించింది. అయితే బాధితురాలు/అతని భార్య విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని శిక్షను అమలు చేయకుండా.. ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించింది. ఈ కేసులో బాధితురాలి ప్రస్తుత మానసిక స్థితి పరిశీలన కోసం నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయించింది సుప్రీం కోర్టు. ఏప్రిల్ సీల్డ్ కవర్లో అందిన ఆ నివేదికను పరిగణనలోకి తీసుకున్న ద్విసభ్య ధర్మాసనం తాజాగా.. బాధితురాలి భర్తకు ఊరట ఇస్తు తీర్పు వెల్లడించింది.ఇదీ చదవండి: ఏకంగా 27 సార్లు బెయిల్ పిటిషన్ వాయిదా?

కాన్స్లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్ బ్యాగ్తో
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కాన్స్ ఫిలి ఫెస్టివల్ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) మరోసారి సంచలనం రేపింది. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చిలుక లాంటి గౌనుతో పాటు చిలుక క్లచ్తో తొలిసారి మురిపించిన ఈ బ్యూటీ ఈ సారి ఏకంగా గోల్డ్, డైమండ్స్తో రూపొందించిన 'బికినీ' బ్యాగ్తో కనిపించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ డైమండబ్యాగ్ ధర ఎంతో తెలుసా?గత కొన్నేళ్లుగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ సందడిలో ఎక్కువగా వినిపించే పేరు ఊర్వశి రౌతేలా. అలాగే వివాదాలకు కూడా తక్కువేమీ కాదు. మొన్న చిలక క్లచ్తో వివాదాన్ని రూపి, కొంతమందినెటిజన్లను ఆకట్టుకోవడంలో విఫలమైనప్పటికీ, ఖరీదైన బ్యాగ్తో రెడ్ కార్పెట్పైకి తిరిగి వచ్చింది. దీని ధర. రూ. 5.29 లక్షల బస్ట్ గోల్డ్ బికినీ బ్యాగ్ను ప్రదర్శించడం చర్చకు దారి తీసింది. అంతేకాదు ఈ ఫెస్టివల్లో మొదటి రోజు ఆమో ధరించిన చిలుక క్లచ్ కూడా జుడిత్ లీబర్ బ్రాండ్కు సంబంధించిందే.. దీని ధర రూ. 4.86లక్షలు.బంగారు రంగు ఫిష్టైల్-స్టైల్ గౌనులో నటి లా వెన్యూ డి ఎల్'అవెనిర్ (కలర్స్ ఆఫ్ టైమ్) ఉర్వశి రౌతేలా ఈ ప్రదర్శనకు హాజరైంది. ఈ గౌను అభిమానులను మంత్రముగ్ధులను చేసినప్పటికీ, హైలైట్గా నిలిచించి మాత్రం గోల్డ్ బికినీ బ్యాగ్.ఇదీ చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్పై ప్రశంసలు లగ్జరీ బ్రాండ్ జుడిత్ లీబర్ బస్ట్-షేప్డ్ బికినీ బ్యాగ్ను ధరించింది. మెటాలిక్ గోల్డ్ బికినీ టాప్తోపాటు, ఖరీదైన రత్నాలు, స్ఫటికాలు, వివిధ ఆకారాలు, కట్లు, ఫ్యాన్సీ నెక్లెస్ల కలగలుపుతో తయారు చేశారు. చేయబడింది. వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, బ్యాగ్ షాంపైన్-టోన్డ్ మెటల్ హార్డ్వేర్తో పుల్-ట్యాబ్ మాగ్నెటిక్ క్లోజర్ను కలిగి ఉంది. షోల్టర్ చైన్తోపాటు, మెటాలిక్ లెదర్-లైన్డ్ ఇంటీరియర్తో కూడా వచ్చింది. ఇక ధర విషయాని వస్తే దీని ధర 6,195 అమెరికన్ డాలర్లు. అంటే దాదాపు రూ. 5,29,000 అవుతుంది. ఈ బస్ట్ బ్యాగ్ ఎనిమిది ఇతర వేరియంట్లలో అందుబాటులో ఉంది. చదవండి: బనారసీ చీరలో నీతా అంబానీ లుక్ : లగ్జరీ బ్యాగ్ స్పెషల్ ఎట్రాక్షన్ఫోటోషూట్ కోసం ఊర్వశి ఏం చేసిందంటే..కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025, ఊర్వశి రౌతేలా మెట్లపై ఫోటోషూట్ సమయంలో ఎవ్వరినీ లోపలికి రావడానికి వీల్లేకుండా, దారిని బ్లాక్ చేసిందట. రెడ్ కార్పెట్ కి వెళ్లేముందు హోటల్ మెట్ల మార్గంలో ఫోటోషూట్ చేయించుకుంది. ఈ సందర్భంగా ఇతర అనేక మంది ఇతర అతిథులకు ఆటంకం కల్పించింది. కనీసం వారినిచూసి అని పక్కకు తప్పుకోకుండా, తన పోజుల్లో మునిగిపోవడంతో వారు అసౌకర్యానికి గురయ్యారని సమాచారం.

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, ఒంగోలు: దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఒకటైన మహానందినిని దర్శనం చేసుకుని కారులో ఇంటికి వెళ్తున్న కుటుంబాన్ని మృత్యువు కబళించింది. బాధితుల కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చిందిపోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శైవక్షేత్ర దర్శనం అనంతరం మహానంది నుంచి చీరాల వెళ్తున్న ప్రయాణికుల కారు కోమరోలు మండలం తాటిచెర్లమోటు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది.రాంగ్రూట్లో వచ్చిన లారీని బాధితులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కార్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా..మరో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని రక్షించే ప్రయత్నించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాద తీవ్రత కారణంగా కారులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు ఘటన స్థలంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలుగజ్జల నరసింహ (33), బచ్చు సందీప్ అలియాస్ సన్నీ(30),గజ్జల బబ్లు(29), కర్రెద్దుల దివాకర్ అలియాస్ చిన్ని,గజ్జల భవాని (20)గజ్జల అంకాలుగా పోలీసులు గుర్తించారు.

పవన్ కల్యాణ్తో రామ్ చరణ్ సినిమా.. త్రివిక్రమ్ దర్శకుడు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ (2024) సినిమా విడుదలై ఏడాదిన్నర దాటినప్పటికీ, ఆయన తదుపరి చిత్రంపై స్పష్టత లేకపోవడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. మొదట్లో అల్లు అర్జున్తో పాన్-ఇండియా చిత్రం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ, అది వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు 2026 వరకు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో, త్రివిక్రమ్ సినిమా తాత్కాలికంగా వాయిదా పడినట్లు మొన్నటిదాక ప్రచారం జరిగింది. ఇప్పుడు మొత్తానికి ఈ చిత్రం ఉండకపోవచ్చని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. బన్నీ ప్రాజెక్ట్ని పక్కకు పెట్టి రామ్ చరణ్తో పాన్ ఇండియా సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడట. వెంకీ చిత్రం తర్వాత...బన్నీ సినిమా వాయిదా పడడంతో త్రివిక్రమ్ ఈ గ్యాప్లో విక్టరీ వెంకటేశ్తో ఓ కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడట. ఈ చిత్రం కథా చర్చలు పూర్తయి, మరికొద్ది రోజుల్లో సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇది పూర్తయిన తర్వాత బన్నీతో సినిమా చేస్తాడని మొన్నటి దాకా ప్రచారం జరిగింది. కానీ అది కూడా జరిగేలా లేదు. త్రివిక్రమ్ ఆ ప్రాజెక్టుని పూర్తిగా పక్కకు పెట్టేసి.. రామ్ చరణ్తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.పవన్ కోసం..పవన్ కల్యాణ్ చొరవతో రామ్ చరణ్ కోసం త్రివిక్రమ్ ఓ క్రేజీ కథను రెడీ చేశాడట. ఇటీవల ఈ కథను చరణ్కు చెప్పి ఒప్పించారట. ఈ చిత్రానికి త్రివిక్రమ్ సన్నిహితుడైన పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. పెద్ది చిత్రం పూర్తయిన వెంటనే చరణ్ త్రివిక్రమ్ సినిమాని సెట్స్పైకి వెళ్తుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. సుక్కు మూవీకి బ్రేక్!వాస్తవానికి పెద్ది తర్వాత చరణ్ .. సుకుమార్తో సినిమా చేయాల్సింది. ఇటీవల సుకుమార్ కూడా తన తదుపరి సినిమా చరణ్తోనే అని ప్రకటించాడు. కానీ పవన్ కల్యాణ్ కారణంగా చరణ్.. సుక్కు ప్రాజెక్టుని పక్కకు పెట్టి..త్రివిక్రమ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రం తర్వాత సుకుమార్తో సినిమా చేయాలని భావిస్తున్నాడట. మరి సుక్కు అంతకాలం వెయిట్ చేస్తాడా లేదా మధ్యలో మరో హీరోని చూస్కొని సినిమా చేస్తాడా అనేది తెలియాల్సింది.

ఇండిగో ఘటన వేళ.. వక్రబుద్ధి చాటుకున్న పాక్!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఢిల్లీ-శ్రీనగర్ ఇండిగో విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు లోనైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానం ముందుభాగం బాగా దెబ్బతింది కూడా. అయితే ఆ సమయంలో అప్రమత్తమైన పైలట్.. పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారట!. బుధవారం సాయంత్రం 227 మందితో ఢిల్లీ నుంచి శ్రీనగర్కు ఇండిగో విమానం బయల్దేరింది. ఈదురు గాలులు, వడగండ్ల కారణంగా అమృత్సర్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ భయపడిపోయారు. ఆ టైంలో అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సంకేతాలు పంపించారు. మరోవైపు.. ఈ అల్లకల్లోల్లాన్ని తప్పించుకునేందుకు పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారట. అందుకోసం లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కోరారు. అయితే, ఇండిగో అభ్యర్థనను లాహోర్ ఏటీసీ తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. దీంతో చేసేది లేక చివరకు.. శ్రీనగర్లోనే విమానం సేఫ్ ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే భారత్కు చెందిన విమానయాన సంస్థలకూ పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇవాళ్టితో(మే 23) ఆ గడువు ముగియనుంది. తాజాగా మరోసారి దానిని పొడిగించే యోచనలో పాక్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఒకేసారి.. ఒక నెల కంటే ఎక్కువ కాలం ఆంక్షలు విధించేందుకు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) నిబంధనలు అనుమతించవు.ఇదీ చదవండి: పాక్ ఆర్మీ అధికారి బలుపు కామెంట్స్
be alert: మెట్రో రైళ్లలో అమ్మాయిల్ని క్లిక్మనిపించి..
విక్రమ్ సరసన క్రేజీ హీరోయిన్కు గోల్డెన్ ఛాన్స్
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
థేమ్స్నదిలో ఘనంగా శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య తెప్పోత్సవం
కాన్స్లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్ బ్యాగ్తో
‘కోటా’ మరణాలపై సుప్రీంకోర్టు సీరియస్
ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్తో ఏకంగా 222 కిలోలు బరువు..! వాకింగ్ చేయలేక..
లాంచ్కు సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
విజయ్ సేతుపతి 'ఏస్' సినిమా రివ్యూ
బెట్టింగ్ యాప్స్ స్మోకింగ్ కన్నా డేంజర్: కేఏ పాల్
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
కెప్టెన్గా బుమ్రా.. సుదర్శన్కు దక్కని చోటు!.. శార్దూల్కు ఛాన్స్!
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్
అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
చిన్నప్పటి ఫోటోతో అక్కకు 'బర్త్డే శుభాకాంక్షలు' చెప్పిన స్టార్ హీరో
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్కి ఫిదా
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
నీటి వివాదం.. పాక్ హోంమంత్రి ఇంటికి నిప్పు
అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)
be alert: మెట్రో రైళ్లలో అమ్మాయిల్ని క్లిక్మనిపించి..
విక్రమ్ సరసన క్రేజీ హీరోయిన్కు గోల్డెన్ ఛాన్స్
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
థేమ్స్నదిలో ఘనంగా శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య తెప్పోత్సవం
కాన్స్లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్ బ్యాగ్తో
‘కోటా’ మరణాలపై సుప్రీంకోర్టు సీరియస్
ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్తో ఏకంగా 222 కిలోలు బరువు..! వాకింగ్ చేయలేక..
లాంచ్కు సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
విజయ్ సేతుపతి 'ఏస్' సినిమా రివ్యూ
బెట్టింగ్ యాప్స్ స్మోకింగ్ కన్నా డేంజర్: కేఏ పాల్
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
కెప్టెన్గా బుమ్రా.. సుదర్శన్కు దక్కని చోటు!.. శార్దూల్కు ఛాన్స్!
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్
అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
చిన్నప్పటి ఫోటోతో అక్కకు 'బర్త్డే శుభాకాంక్షలు' చెప్పిన స్టార్ హీరో
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్కి ఫిదా
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
నీటి వివాదం.. పాక్ హోంమంత్రి ఇంటికి నిప్పు
రాజ్యాంగం, 'సుప్రీం' మధ్య విడదీయరాని బంధం - సీజేఐ జస్టీస్ బీఆర్ గవాయ్
సినిమా

ACE X review: విజయ్ సేతుపతి ‘ఏస్’ మూవీ టాక్ ఎలా ఉందంటే..?
వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఏస్’(ACE). దర్శక, నిర్మాత అరుముగ కుమార్ ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడిగా రుక్మిణి వసంత్ నటించారు. శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి. శివ ప్రసాద్ తెలుగులో రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. టాలీవుడ్లో కూడా విజయ్ సేతుపతి ప్రమోషన్స్ చేయడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు(ACE Review). (చదవండి: డైరెక్టర్ నోటి దురుసు.. ట్రెండింగ్లో ‘బాయ్కాట్ భైరవం’)ఇలా ఓ మోస్తరు అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 23) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తమిళ్నాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల ఫస్డ్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘ఏస్’ సినిమా ఎలా ఉంది? విజయ్ సేతుపతి ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండిఎక్స్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. యావరేజ్ ఫిల్మ్ అని మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. What a delightful entertainer! #ACE is just what I was craving for. A pleasant, funny simple entertainer that has loads of action, romance and comedy! A film that truly makes you forget the pressures of life and relax for a good three hours. @VijaySethuOffl looks smart, having… pic.twitter.com/QVa4hM7TdK— Cineobserver (@cineobserver) May 22, 2025 ‘ఏస్’ ఓ కామెడీ ఎంటర్టైనర్. కడుపుబ్బా నవ్విస్తుంది. యాక్షన్, రొమాన్స్ కూడా కూడా ఆకట్టుకుంటాయి. లైఫ్లో అన్ని ఒత్తిళ్లను మరిచిపోయి హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది. విజయ్ సేతుపతి తెరపై చాలా స్మార్ట్గా కనిపించాడు. యాక్టింగ్ నీట్గా ఉంది. రుక్మిని వసంత్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. యోగిబాబు కామెడీ అదిరిపోయింది’ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. #ACE [4/5] – A fun comedy-heist set in Malaysia!@VijaySethuOffl delivers both mass & class moments.@iyogibabu is in top form – his chemistry with VJS is a blast!@rukminitweets does her part well.@samcsmusic's BGM fits perfectly.@Aaru_Dir delivers a clever entertainer for… pic.twitter.com/BpBWTT3AvJ— CinemaNagaram (@CinemaNagaram) May 22, 2025 మలేషియాలో జరిగే దోపిడి ఆధారంగా నడిచే కామెడీ చిత్రమిది. విజయ్ సేతుపతి మాస్ క్లాస్ మూమెంట్స్తో ఆకట్టుకున్నాడు. విజయ్ సేతుపతితో కలిసి యోగి బాబు చేసిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. రుక్మిణి వసంత్ తన పాత్రకు న్యాయం చేసింది. సామ్ సీఎస్ బీజీఎం బాగుంది.అర్ముగ కుమార్ ఇంటెలిజెంట్ రైటింగ్ బాగుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.#ACE Vijay Sethupathi and Yogi Babu carried the movie entirely. It was funny and intelligent about how an unknown lands in Malaysia and pulls off a chaotic heist by misleading police and loan sharks. It has good chances to get a sequel.Rukmini was cute and so was their love story— Procrastinator (@BagaCoolAipoyam) May 23, 2025@VijaySethuOfflன் #ACE ஒரு பரபரப்பான ரொமான்டிக் க்ரைம் காமெடி. மலேசியாவில் படமாக்கப்பட்ட இப்படத்தில் விஜய் & @iYogiBabuவின் கெமிஸ்ட்ரி, ஆக்ஷன், காமெடி, ரொமான்ஸ் கலந்து ரசிகர்களை கவர்கிறது. இயக்குனர் @Aaru_Dirன் புதுமையான கதைக்களம் பாராட்டுக்குரியது. #MovieReview #RukminiVasanth pic.twitter.com/V3jNnixC68— Ranjith (@RanjithAnthony) May 23, 2025#AceFirs & foremost the movie did not bore or cringe at any point.The movie just needed better staging & execution, was feeling like watching film that should have come 10 years back(KTv Movies).@VijaySethuOffl & #YogiBabu managed to evoke laughter at intervals,#RukminiVasanth… pic.twitter.com/s4LnPOEGUl— Jiya Rahman (@jiyathedon) May 23, 2025

దశాబ్ధాల బంధానికి బిగ్బి కటీఫ్..కౌన్ బనేగా కెబీసీ పతి?
కౌన్ బనేగా కరోర్ పతి(Kaun Banega Crorepati ) అంటే అమితాబ్, అమితాబ్ అంటే కెబిసి అన్నంతగా పెనవేసుకుపోయిన బంధం తెగిపోనుందా? దేశంలో మరెన్నో టీవీ షోలకు ఊపిరిపోసిన ఆ టెలివిజన్ షో సమర్పకుడికి స్థాన చలనం తప్పదా? భారతీయ టెలివిజన్ రంగంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్న వార్త ఇది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఐకానిక్ క్విజ్ షోకు సారధ్యం వహించిన లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇక ఆ బాధ్యతకు గుడ్ బై చెప్పనున్నారు. రెండున్నర దశాబ్ధాల క్రితం అంటే 2000లో ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క మూడవ సీజన్ మినహా అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఫేస్ ఆఫ్ కెబిసీగా ఉన్నారు. ఒక్క 3వ సీజన్ను మాత్రం షారుఖ్ ఖాన్ హోస్ట్ చేశారు. ఆ ఒక్క సీజన్ తప్ప మరెప్పుడూ ఆ షోకి దూరం కాని, ఈ 81 ఏళ్ల బాలీవుడ్ స్టార్...వ్యక్తిగత కారణాల వల్ల షో నుంచి నిష్క్రమిస్తున్నారని ఇటీవలి నివేదికలు ధృవీకరిస్తున్నాయి. ఇది అభిమానులను ఆశ్చర్యపరిచేది మాత్రమే కాదు ఎన్నో జ్ఞాపకాలను మేల్కొలిపే వార్త కూడా. ఈ విజయవంతమైన షోని అందిస్తున్న సోనీ టీవీ ఇంకా ఈ మార్పును ధృవీకరించనప్పటికీ త్వరలో ప్రారంభం కానున్న సీజన్ 17 కోసం బిగ్ బి స్థానంలో కొత్త హోస్ట్ రావచ్చనే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. దీంతో తదుపరి షో ప్రెజెంటర్ ఎవరు అనేదానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ షో పట్ల ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ.. అత్యంత ప్రభావం చూపిన బిగ్ బీ ఛెయిర్లో కూర్చోవడానికి బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ అంతగా ముందుకు రావడం లేదని సమాచారం. ఈ నేపధ్యంలో బాలీవుడ్ హంగామా నుంచి అందుతున్న ఒక నివేదిక ప్రకారం, బాలీవుడ్ ’భైజాన్’ – సల్మాన్ ఖాన్(Salman Khan) తో షోరన్నర్లు ముందస్తు చర్చలు జరుపుతున్నారంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, బిగ్ బాస్ షో ద్వారా చిన్న తెరపై బిగ్ బీ తర్వాత ఆ స్థాయిలో పేరుగాంచిన సల్లూ భాయ్ భారతదేశపు అత్యంత విజయవంతమైన పురాతన షో... కేబీసీకి కొత్త హోస్ట్గా రానున్నాడు. ఈ వార్తల నేపధ్యంలో ‘‘ సల్మాన్ ఖాన్ కు ఉన్న విస్త్రుత ప్రజాదరణ, ఆయనను బిగ్ బికి సరైన వారసుడిగా మార్చగలదని టీవీ పరిశ్రమలోని వ్యక్తులు భావిస్తున్నారు., ‘సల్మాన్ చిన్న తెరకు ఇప్పటికే చిరపరిచితమైన స్టార్. పైగా ఆయన మారుమూల కేంద్రాలలోని ప్రేక్షకులతో సైతం బలమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. ప్రతిదీ సరిగ్గా జరిగితే, అతను ఈ షోను తుఫానుగా తీసుకెళ్లగలడు‘ అని ఒక బాలీవుడ్ మీడియా పేర్కొంది.సల్మాన్ ఖాన్ నిజంగా అమితాబ్ బచ్చన్ స్థానంలోకి వస్తే, అభిమానులు ఆయనను నిశితంగా గమనిస్తారు. బిగ్ బి అత్యున్నత స్థాయి ప్రజెంటేషన్తో పోలికలు తప్పవు. అయితే సల్మాన్ ఖాన్ కు వీక్షకుల్లో ఉన్న ఆకర్షణ మాస్ అప్పీల్ కొత్త తరం ప్రేక్షకులను ఆకర్షించవచ్చు. ఏదేమైనా కేబీసీ సీజన్ 17 వచ్చే ఆగస్టులో ప్రారంభమయే అవకాశం ఉంది, ఈ నేపధ్యంలో ప్రస్తుతానికి, అధికారిక ప్రకటన కోసం అందరి దృష్టి సోనీ టీవీపైనే ఉంది.

తండ్రైన కిరణ్ అబ్బవరం.. క్యూట్ పిక్ షేర్ చేసిన హీరో
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తండ్రి అయ్యాడు. గురువారం(మే 22) ఆయన సతీమణి రహస్య(Rahasya Gorak ) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.‘మగబిడ్డ పుట్టాడు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్యూ రహస్య. జై శ్రీరామ్'' అని కిరణ్ అబ్బవరం ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా తన బాబుకు సంబంధించిన ఫస్ట్ ఫోటోని షేర్ చేసుకున్నారు. ఇందులో కిరణ్ తన కుమారుడి చిట్టి పాదాలను ముద్దాడుతూ కనిపించారు.కిరణ్, రహస్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన ‘రాజావారు రాణిగారు’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు.పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్ 22న వీరిద్దరి వివాహం జరిగింది. ఈ ఏడాది జనవరిలో ప్రెగ్నెన్నీ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత సీమంతానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు బాబు పుట్టినట్లు తెలిపారు. దీంతో అభిమానులు కిరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.సినిమాల విషయాలకొస్తే..‘క’తో గతేడాది భారీ హిట్ అందుకున్నాడు.ఇటీవల వచ్చిన ‘దిల్ రూబా’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.ప్రస్తుతం ‘కె-ర్యాంప్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నాడు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

డైరెక్టర్ నోటి దురుసు.. ట్రెండింగ్లో ‘బాయ్కాట్ భైరవం’
‘సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. రెండిటిని మిక్స్ చేయడం కరెక్ట్ కాదు. కానీ కొంతమంది సినిమా స్టేజ్పై రాజకీయాలు మాట్లాడి..కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. వారి సొంత అభిప్రాయాన్ని స్టేజ్పై వెల్లడించి.. చేజేతులా సినిమాను చంపేసుకుంటున్నారు. తాజాగా బైరవం(Bhairavam Movie) సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల కూడా అదే చేశాడు. ఆయన నోటి దురుసు కారణంగా ఇప్పుడు బాయ్కాట్ భైరవం(#BoycottBhairavam) అనే హ్యాష్ట్యాగ్ నెట్టింట ట్రెండింగ్గా మారింది. ఒకవైపు వైఎస్సార్సీసీ ఫ్యాన్స్..మరోవైపు మెగా అభిమానులు భైరవం సినిమా చూడొద్దని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు. అసలేం జరిగింది?ఆ డైలాగ్ అవసరమా?మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కారణాలేంటో తెలీదు గానీ పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈనెల 30న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యం చిత్రబృందం వరుస ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టింది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ని ఏపీలో పెద్ద ఎత్తున నిర్వహించింది. అయితే ఆ స్టేజ్పై దర్శకుడు విజయ్ కనకమేడల చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి దారి తీశాయి.‘ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కరెక్టుగా సంవత్సరం క్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారు’అని సినిమా ఈవెంట్లో పొలిటికల్ కామెంట్స్ చేశాడు. దీంతో వైఎస్సార్సీసీ శ్రేణులు విజయ్ కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భం లేకపోయినా..ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. భైరవం సినిమాను బహిష్కరించాలంటూ ‘బాయ్కాట్ భైరవం’ అనే హ్యాష్ట్యాగ్ని ట్విటర్లో వైరల్ చేస్తున్నారు. విజయ్ నోటి దురుసు కారణంగానే ఈ వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా విజయ్పై మండిపడుతున్నారు. దానికి కారణం కొన్నేళ్ల క్రితం ఫేస్బుక్లో విజయ్ పెట్టిన ఒక పోస్టే.No apology will make up for these filthy acts. Unanimously #BoycottBhairavam and TFI should call for a ban on this director, #VijayKanakamedala. Anyone who books a ticket for this film isn’t just insulting the stars, they’re disrespecting the entire art of cinema. pic.twitter.com/ynpUYmF9Gd— At Theatres (@attheatres) May 22, 2025కొంపముంచిన ‘ఛా’విజయ్ కనకమేడల ఫేస్బుక్లో 2011లో చిరంజీవి, రామ్ చరణ్లపై ఒక పోస్ట్ పెట్టాడు. హిందీలో అమితాబ్, అభిషేక్ కలిసి నటించిన ‘పా’ సినిమా పోస్టర్ని మార్పింగ్ చేసి చిరంజీవి, రామ్ చరణ్ ముఖాలను వాటిపై అతికించారు. ఆ పోస్టర్కి ‘ఛా’ అనే టైటిల్ పెట్టి.. ‘సామాజిక న్యాయం సమర్పించు ‘ఛా’ అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇప్పుడిదే మెగాఫ్యాన్స్ ఫైర్ అవ్వడానికి కారణం అయింది. చిరంజీవి, రామ్ చరణ్లను ఇంత దారుణంగా అవమానిస్తావా అంటూ మెగా ఫ్యాన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహించిన భైరవం సినిమాను బహిష్కరించాలని మెగా ఫ్యాన్స్ పిలుపునిచ్చారు.హ్యాక్ అయిందా? అదేలా?సోషల్ మీడియాలో బాయికాట్ భైరవం ట్యాగ్ ట్రెండ్ కావడంలో విజయ్ కనకమేడల దీనిపై రియాక్ట్ అయ్యాడు. ఆ పోస్ట్ తాను పెట్టింది కాదని, హ్యాక్ అయిందని తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ మెగాఫ్యాన్స్ మాత్రం హ్యాకింగ్ అనేది పచ్చి అబద్దం అని, 2011లో నువ్వ ఎవరో కూడా తెలియదు.. నీ అకౌంట్ని ఎలా హ్యాక్ చేస్తారు? ఒకవేళ చేసినా 14 ఏళ్లుగా నీ ఫేస్బుక్ని చెక్ చేసుకోలేదా? అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దర్శకుడి నోటి దురుసు కారణంగా సినిమాకు ఎంతోకొంత నష్టం అయితే జరిగినట్లే.Mr. అతి @DirVijayK మాట పొదుపు గా ఉండాలి , చేతలకి అదుపు ఉండాలి 🤬🤬#BoycottBHAIRAVAM pic.twitter.com/1YFBJmPBQv— Aravind Reddy (@AravindOnAir) May 23, 2025 నమస్కారం అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ..మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్…— Vijay Kanakamedala (@DirVijayK) May 22, 2025#Hacked #Tollywood #director #BoycottBHAIRAVAM #dengey #megadogs #mogga pic.twitter.com/NPM4jtyhQl— 𝔾𝕙𝕠𝕤𝕥ℝ𝕚𝕕𝕖𝕣🐉 (@yashwanthpotter) May 23, 2025
న్యూస్ పాడ్కాస్ట్

చంద్రబాబుదే మద్యం కుంభకోణం... గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్... మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది మృతి... ఇది అసాధారణ విజయం అంటూ స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

హామీలు నెరవేర్చలేకే రెడ్బుక్ కుట్రలు... బరితెగించి తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?. బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడమా?

హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం... 17 మంది మృత్యువాత... మృతుల్లో 8 మంది చిన్నారులు

మద్యం కుంభకోణం పూర్తిగా కట్టుకథే... ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కేసే... ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్.. దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసిన సిట్

రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు.. ఏపీలో మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం... కూటమి ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

విచారణ పేరుతో వేధింపులు... న్యాయస్థానం తీర్పు బేఖాతరు... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి పట్ల అభ్యంతకరంగా ఏపీ సిట్ తీరు

లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే.. ఆధారాలతో సహా గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ... ఆ కేసులో ముందస్తు బెయిల్పై బయట ఉన్న చంద్రబాబు

భారత వాయుసేనకు వందనం, పాకిస్తాన్కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు... ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, జవాన్లను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ
క్రీడలు

ప్రొ హాకీ లీగ్కు భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల కోసం హాకీ ఇండియా (హెచ్ఐ) జట్టును ప్రకటించింది. జూన్ 7 నుంచి యూరప్లోని అమ్స్టెల్వీన్, నెదర్లాండ్స్, అంట్వెర్ప్, బెల్జియంలో భారత పురుషుల హాకీ జట్టు మ్యాచ్లు ఆడనుంది. దీని కోసం గురువారం 24 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జూన్ 7, 9న నెదర్లాండ్స్తో, 11, 12న అర్జెంటీనాతో టీమిండియా తపలడుతుంది. ఆ తర్వాత 14, 15న ఆ్రస్టేలియాతో, 21, 22న బెల్జియంతో మ్యాచ్లు ఆడుతుంది. ఈ ఏడాది ఆరంభంలో భువనేశ్వర్ వేదికగా జరిగిన హాకీ ప్రొ లీగ్ అంచె పోటీల్లో 8 మ్యాచ్లాడిన భారత్ 5 విజయాలతో 15 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ‘అనుభవజు్ఞలు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. ప్లేయర్లంతా బాగా సాధన చేశారు. హాకీ ప్రపంచకప్నకు అర్హత సాధించే నేపథ్యంలో... ప్రతి పాయింట్ కీలకం కావడంతో అన్నీ మ్యాచ్ల్లో విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తాం. పెనాల్టీ కార్నర్లను సది్వనియోగం చేసుకునే అంశంలో మరింత దృష్టిపెట్టాం’అని భారత హెడ్ కోచ్ క్రెయిగ్ ఫాల్టన్ అన్నాడు. పరాజయాలను ‘డ్రాలుగా... ‘డ్రా’లను విజయాలుగా మలచడమే లక్ష్యంగా ఉన్నామన్నాడు. భారత పురుషుల హాకీ జట్టు గోల్కీపర్స్: కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్, డిఫెండర్స్: సుమిత్, అమిత్ రొహిదాస్, జుగ్రాజ్ సంగ్, నీలమ్ సంజీప్, హర్మన్ప్రీత్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్, సంజయ్, యశ్దీప్ సివాచ్, మిడ్ఫీల్డర్స్: రాజ్ కుమార్ పాల్, నీలకంఠ శర్మ, హార్దిక్ సింగ్, రాజిందర్ సింగ్, మన్ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, శంషేర్ సింగ్, ఫార్వర్డ్స్: గుర్జాంత్ సింగ్, అభిషేక్, శైలానంద్ లక్రా, మన్దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, దిల్ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్.

భారత క్రికెట్లో ‘సుదర్శన’ మంత్రం
దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, తమిళనాడు మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్... తొలి ఇన్నింగ్స్లో హైదరాబాద్ తరఫున రెండు, తమిళనాడు తరఫున మూడు సెంచరీలు నమోదయ్యాయి. మ్యాచ్ సాధారణ ‘డ్రా’ దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే రెండో ఇన్నింగ్స్లో హైదరాబాద్ కుప్పకూలింది. దాంతో చివరి రోజు తమిళనాడు విజయలక్ష్యం 11 ఓవర్లలో 144... సాధారణంగా ఇలాంటి స్థితిలో బ్యాటర్లు మైదానంలోకి దిగి లాంఛనంగా కొన్ని బంతులు ఆడి ‘షేక్ హ్యాండ్’కు సిద్ధమవుతారు. కానీ తమిళనాడు టి20 శైలిలో గెలుపుపై గురి పెట్టింది. ఒకవైపు సీనియర్ జగదీశన్ చెలరేగుతుండగా మరో ఓపెనర్ తన విధ్వంసకర బ్యాటింగ్తో 20 బంతుల్లోనే 5 సిక్సర్లతో 42 పరుగులు బాదాడు. 7 ఓవర్లలో స్కోరు 108/1. అనూహ్యంగా వెలుతురులేమితో మ్యాచ్ను అంపైర్లు నిలిపివేయడంతో హైదరాబాద్ బతికిపోయింది. అయితే 21 ఏళ్ల ఆ ఓపెనర్ ఆటపై అన్ని వైపుల నుంచి అసాధారణ ప్రశంసలు వెల్లువెత్తాయి. తొలి ఇన్నింగ్స్లోనూ సెంచరీ బాది ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన ఆ కుర్రాడే సాయి సుదర్శన్. అతనికిదే తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కావడం విశేషం. నాలుగు సీజన్ల పాటు దేశవాళీ క్రికెట్లో నిలకడైన ఆటతో ‘ఆల్ ఫార్మాట్’ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్ ఇప్పుడు ఇంగ్లండ్తో సిరీస్కు ఎంపిక చేయనున్న ఆటగాళ్లలో ముందు వరుసలో ఉన్నాడు. - సాక్షి క్రీడా విభాగం రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేయడానికి ముందే సాయి సుదర్శన్ ఐపీఎల్లో ఒక సీజన్ ఆడాడు. 2022లో ఐదు మ్యాచ్లలో కలిపి 114 బంతులు ఎదుర్కొని ఒక హాఫ్ సెంచరీ సహా 145 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే ఐపీఎల్లో ఒక ఏడాది బాగా ఆడి ఆ తర్వాత ఎంతో మంది కనుమరుగైన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి అతని ప్రదర్శనను ఎవరూ అంత సీరియస్గా చూడలేదు. కానీ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్లోనే అతని ఆటను చూశాక భవిష్యత్తులో చాలా తొందరగా భారత్కు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్గా సుదర్శన్కు గుర్తింపు లభించింది.రంజీ ఆరంభానికి చాలా ముందే ‘ఈ అబ్బాయిలో ఎంతో ప్రత్యేకత ఉంది. సాధ్యమైనంత తొందరగా ఇతడిని తమిళనాడు జట్టులోకి తీసుకోండి’ అంటూ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ చేసిన సూచనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటూ ‘ఫాస్ట్ ట్రాక్’తో ముందు టి20ల్లోకి, ఆ తర్వాత వన్డేల్లోకి, ఆపై రంజీ టీమ్లోకి ఎంపిక చేశారు. తనపై ఉంచిన ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడు. ఒక్కసారి తమిళనాడు జట్టులోకి వచ్చాక తనకు లభించిన ప్రతీ అవకాశాన్ని సుదర్శన్ సమర్థంగా ఉపయోగించుకున్నాడు. చూడచక్కటి ఆటతో... సుదర్శన్ బ్యాటింగ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘క్లాస్’ తరహా శైలి అతనిది. చక్కటి డ్రైవ్లతో అలవోకగా ఫోర్లు రాబట్టడం అతనికి బాగా తెలిసిన విద్య. అవసరమైన సమయంలో గేర్లు మార్చి సిక్స్లు కొట్టినా అందులోనూ ఒక కళ ఉంటుంది. అప్పుడప్పుడు పుల్, హుక్ షాట్లతో పాటు స్లాగ్ స్వీప్లు, స్కూప్ షాట్లను కూడా ఐపీఎల్లో సుదర్శన్ చూపించాడు. టి20లు అయినా సరే లెక్క లేనితనంతో గుడ్డిగా బ్యాట్ ఊపే తత్వం కాదు. తనకు ఏం కావాలనే దానిపై అతనికి మంచి అవగాహన ఉంది. ఐపీఎల్లో నాలుగు సీజన్ల కెరీర్ చూస్తే అతని బ్యాటింగ్లో ఎక్కడా తడబాటు కనిపించకపోవడమే కాదు... అనవసరపు చెత్త షాట్లతో అవుటైన సందర్భాలు చాలా అరుదు. ఇదే అతడిని ఇతర దేశవాళీ బ్యాటర్లతో పోలిస్తే భిన్నంగా నిలబెట్టింది. అందుకే ఐపీఎల్లో చెలరేగుతున్న సమయంలో అతడిని టెస్టు జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ అన్ని వైపుల నుంచి వినిపించడం సుదర్శన్ బ్యాటింగ్పై నమ్మకాన్ని చూపిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే టి20 ఫార్మాట్లో ఇప్పుడు అందరినీ ఆకట్టుకున్నా... సుదర్శన్ వన్డేలూ బాగా ఆడగలడు కాబట్టే ముందుగా అదే ఫార్మాట్లో తొలి అవకాశం దక్కింది. ఇక టెస్టు క్రికెట్కు సరిపోగల బ్యాటింగ్ నైపుణ్యం, పట్టుదల, టెక్నిక్ అతనిలో పుష్కలంగా ఉన్నాయి. అమ్మా నాన్న అండతో... సాయి సుదర్శన్ ఇప్పటికే భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 3 వన్డేలు ఆడితే వరుసగా 55 నాటౌట్, 62, 10 పరుగులు సాధించాడు. బరిలోకి దిగిన ఏకైక టి20లో బ్యాటింగ్ అవకాశం రాలేదు. వేర్వేరు కారణాలతో ఆ తర్వాత అతనికి అవకాశాలు లభించలేదు. సుదర్శన్ టి20 సామర్థ్యమేమిటో ఐపీఎల్ చూపించింది. నిజానికి ఈ ఫార్మాట్లో తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అదరగొట్టడంతోనే అతను ముందుగా వెలుగులోకి వచ్చాడు. అయితే అనూహ్యంగా మెరిసి ఆపై మళ్లీ కనబడకుండా పోయే ఆటగాళ్ల జాబితాలో అతను చేరరాదని సుదర్శన్ తల్లిదండ్రులు భావించారు. అందుకే పక్కా ప్రణాళికతో, సరైన కోచింగ్తో అతడికి వారు మార్గనిర్దేశనం చేశారు. క్రీడాకారుల కుటుంబం నుంచి రావడం కూడా అతనికి ఎంతో మేలు చేసింది. అథ్లెట్ అయిన తండ్రి భరద్వాజ్ ‘శాఫ్’ క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించగా...తల్లి ఉష తమిళనాడు రాష్ట్ర జట్టు తరఫున వాలీబాల్ ఆడింది. పదేళ్ల వయసులో క్రికెట్ మొదలు పెట్టిన సుదర్శన్ ఆ తర్వాత మెల్లగా ఒక్కో మెట్టే ఎక్కుతూ వివిధ వయో విభాగాల్లో రాణిస్తూ ముందంజ వేశాడు. అండర్–19 చాలెంజర్ ట్రోఫీ తర్వాత భారత్ ‘ఎ’కు ఆడిన తర్వాత రెగ్యులర్గా మారాడు. వరుసగా రెండు ఐపీఎల్లలో 500కు పైగా పరుగులు సాధించి తన విలువేమిటో అతను చూపించాడు. టెస్టులకు చేరువలో...దేశవాళీలో నిలకడైన ప్రదర్శన, ప్రస్తుత ఫామ్, రోహిత్, కోహ్లిల రిటైర్మెంట్తో ఖాళీలు... ఇప్పుడు అన్నీ సరిగ్గా సరిపోయే సందర్భం 24 ఏళ్ల సుదర్శన్ కోసం వచ్చింది. దాదాపు 40 పరుగుల ఫస్ట్ క్లాస్ సగటు అసాధారణం కాకపోయినా... 29 మ్యాచ్లలో 1957 పరుగుల అనుభవం టెస్టు టీమ్లో అవకాశం కల్పించడానికి సరిపోతుంది. ప్రస్తుత టీమ్లో రాహుల్ ఓపెనింగ్ స్థానానికి మారితే మిడిలార్డర్ సుదర్శన్కు సరైన స్థానం కాగలదు. పైగా రెండు సీజన్ల పాటు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ‘సర్రే’ టీమ్కు ప్రాతినిధ్యం వహించడం కూడా అతనికి మరో అదనపు అర్హతగా మారనుంది. భారత్ తరఫున టెస్టు ఆడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇటీవల వెల్లడించిన సుదర్శన్ కోరిక త్వరలోనే తీరవచ్చు. ఇదే జోరును అతను కొనసాగిస్తే స్థానం సుస్థిరం కూడా కావచ్చు.

పతకమే లక్ష్యంగా...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. ఈ నెల 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరగనున్న ఈ టోర్నీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో జ్యోతి డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. 2023లో బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలుగమ్మాయి స్వర్ణం సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో నిరాశజనక ప్రదర్శన తర్వాత గాయాల నుంచి కోలుకున్న 25 ఏళ్ల జ్యోతి పూర్తి స్థాయిలో సత్తా చాటేందుకు తన టెక్నిక్లో మార్పులు చేసుకొని పాత పద్ధతిలోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించింది. ‘పారిస్ విశ్వక్రీడల కోసం ‘సెవెన్ స్ట్రయిడ్’ టెక్నిక్ ప్రయత్నించాను. కానీ అది నాకు ఉపయోగపడలేదు. దాని వల్ల రెండుసార్లు గాయపడ్డా. అందుకే పాత పద్దతైన ‘ఎయిట్ స్ట్రయిడ్’లోనే పరుగెత్తాలని నిర్ణయించుకున్నా. గాయాల బారిన పడకుండా ఉంటే 13 సెకన్ల లోపే లక్ష్యాన్ని చేరుతాననే నమ్మకముంది’ అని జ్యోతి చెప్పింది. హర్డిల్స్ మధ్య అడుగుల వ్యూహాన్ని స్ట్రయిడ్ అంటారు. 100 మీటర్ల హర్డిల్స్లో జాతీయ రికార్డు (12.78 సెకన్లు) కలిగిన జ్యోతి... గత ఆసియా చాంపియన్షిప్ 200 మీటర్ల పరుగులో రజత పతకం కూడా నెగ్గింది. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 59 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం గురువారం దక్షిణ కొరియాకు బయల్దేరింది.

క్వార్టర్ఫైనల్లో శ్రీకాంత్
కౌలాలంపూర్: తొలి రౌండ్లో మెరుగైన ర్యాంకింగ్ ప్లేయర్లపై రాణించిన భారత షట్లర్లకు ప్రిక్వార్టర్స్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, హెచ్.ఎస్.ప్రణయ్, ఆయుశ్ శెట్టి, సతీశ్ కుమార్ కరుణాకరన్లకు పరాజయం ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్స్ చేరగా... మహిళల డబుల్స్లో ప్రేరణ అల్వేకర్–మృణ్మయి దేశ్పాండేలకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రేరణ–మృణ్మయి జంట 9–21, 14–21తో సూ యిన్ హుయ్–లిన్ జి యున్ (చైనీస్ తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్లో తనీషా–ధ్రువ్ కపిల జోడీ 21–17, 18–21, 21–15తో ఫ్రాన్స్కు చెందినలీ పాలెర్మో–జులియెన్ మైమో జంటపై గెలిచింది. శ్రీకాంత్ వరుస గేముల్లో... పురుషుల సింగిల్స్లో ఒక్క శ్రీకాంత్ మాత్రమే ముందంజ వేశాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంక్ ప్లేయర్ శ్రీకాంత్ 23–21, 21–17తో తనకన్నా మెరుగైన 33వ ర్యాంకర్ ఎన్హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై వరుస గేముల్లో విజయం సాధించాడు. ఈ రెండు గేములు గెలిచేందుకు శ్రీకాంత్ 59 నిమిషాలు పాటు చెమటోడ్చాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ ఫ్రాన్స్కు చెందిన తొమా పొపొవ్తో తలపడతాడు. మిగతా పురుషుల సింగిల్ పోటీల్లో సతీశ్ కరుణాకరన్ 14–21, 16–21తో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. ఆశించిన స్థాయి ఆటతీరు కనబరచలేకపోయిన ప్రణయ్ 9–21, 18–21తో వరుస గేముల్లో యుషి తనక (జపాన్) చేతిలో కంగుతినగా... ఆయుశ్ శెట్టి 13–21, 17–21తో తొమ పొపొవ్ ధాటికి నిలువలేకపోయాడు.
బిజినెస్

ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!
గూగుల్ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత తన జీవనశైలి మెరుగైందని ఆ సంస్థ మాజీ ఉద్యోగి తెలిపారు. షావో చున్ చెన్(39) సింగపూర్లోని గూగుల్ కార్యాలయంలో ఉద్యోగం చేసేవారు. కొన్ని కారణాలతో ఫిబ్రవరి 2024లో సంస్థ తనను తొలగించింది. చెన్ తన గూగుల్ కార్యాలయంలో వారానికి 40 గంటలకు పైగా పనిచేసేవారు.ఉద్యోగం పోయిన తర్వాత సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ లెక్చరర్గా చేరారు. అక్కడ వారానికి మూడు గంటలు మాత్రమే పనిచేస్తున్నాడు. థాయ్లాండ్లో ఉంటున్న 39 ఏళ్ల చెన్ ప్రతి వారం సింగపూర్కు విమానంలో ప్రయాణం చేస్తూ ఉద్యోగాన్ని సాగిస్తున్నాడని చెప్పాడు. తాను కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నట్లు తెలిపాడు. వారానికి మూడు గంటల పాటు డిజిటల్ మార్కెటింగ్ క్లాసు బోధిస్తూ నెలకు 2,000 నుంచి 4,000 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.1.33 లక్షల నుంచి రూ.2.6 లక్షలు) సంపాదిస్తున్నాని చెప్పాడు. ఈ డబ్బు తన ప్రయాణాలకు, థాయ్లాండ్లో తన కుటుంబ ఖర్చులకు సరిపోతుందని చెన్ చెప్పారు.ఇదీ చదవండి: సైబర్ మోసాల కట్టడికి ‘ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్’2024 ఫిబ్రవరిలో గూగుల్ తనను తొలగించిన తర్వాత తాను ఆర్థికంగా స్వతంత్రుడినయ్యానని పేర్కొన్నారు. దాదాపు దశాబ్ద కాలం పాటు గూగుల్లో అనవసరంగా సమయం వృథా చేశానని చెప్పారు. అనుకోకుండా కంపెనీ తనను తొలగించడంతో మంచే జరిగిందన్నారు. ఇకపై ఎక్కువ కాలం జీతంపై ఆధారపడాల్సిన అవసరం లేదని గ్రహించినట్లు తెలిపారు. ఇప్పటికే చెన్ ఇతర మార్గాల ద్వారా సమకూరిన డబ్బుతో సుమారు 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.17 కోట్లు) పోర్టఫోలియోను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం అసిస్టెంట్ లెక్చరర్గా చేస్తూనే యూట్యూబ్లో ఎడ్యుకేషనల్ కంటెంట్, కోచింగ్ బిజినెస్ ద్వారా కూడా తాను డబ్బు సంపాదిస్తున్నానని తెలిపారు. ఆన్లైన్ కోచింగ్ ద్వారా గంటకు 500 డాలర్లు (సుమారు రూ.43,000) ఆర్జిస్తున్నట్లు పేర్కొన్నారు.

రిలీఫ్ ర్యాలీ.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
శుక్రవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 728.96 పాయింట్లు లేదా 0.90 శాతం లాభంతో.. 81,680.95 వద్ద, నిఫ్టీ 239.25 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 24,848.95 వద్ద నిలిచాయి.సిగ్మా సాల్వ్, ఖైతాన్ (ఇండియా), క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్, అపోలో పైప్స్, హొనస కన్స్యూమర్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, కృతి న్యూట్రియంట్స్, సంఘ్వీ మూవర్స్, ది గ్రోబ్ టీ, యూఎఫ్ఓ మూవీజ్ ఇండియా వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఇటీవల భారీగా పడిన మార్కెట్లలో ఈ రోజు రిలీఫ్ ర్యాలీ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 173 పాయింట్లు పెరిగి 24,783కు చేరింది. సెన్సెక్స్(Sensex) 508 ప్లాయింట్లు ఎగబాకి 81,466 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.82 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.93 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.52 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్తో పోలిస్తే స్థిరంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.04 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.28 శాతం లాభపడింది.అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు గురువారం అరశాతానికిపైగా నష్టపోయాయి. అమెరికా ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు, బాండ్లపై రాబడులు పెరగడంతో ఐటీ, ఆయిల్, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా నిన్నటి మార్కెట్ సెషన్లో సెన్సెక్స్ 645 పాయింట్లు నష్టపోయి 80,952 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 204 పాయింట్లు కోల్పోయి 24,610 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 1,107 పాయింట్లు క్షీణించి 80,490 వద్ద, నిఫ్టీ 351 పాయింట్లు పతనమై 24,462 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 5% మించగా, జపాన్ బాండ్ ఈల్డ్స్ 3.5 శాతానికి చేరుకున్నాయి. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు డీలాపడ్డాయి.ఇదీ చదవండి: భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్లో వేడుకలురూపాయి 36 పైసలు క్రాష్విదేశీ బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో నిన్న రూపాయి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. డాలర్ మారకంలో 36 పైసలు క్షీణించి 85.95 వద్ద స్థిరపడింది. అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం ప్రపంచ ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. మధ్యప్రాచ్య దేశాల్లో భౌగోళిక ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోవడంతో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. ఈ పరిణామాలూ దేశీయ కరెన్సీపై ప్రభావాన్ని చూపాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్లో వేడుకలు
న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్లో భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఎసీసీ) ఇండియా వీకెండ్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుంది. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు..వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు.ఈ వేడుకల నిర్వాహకుల వివరాల ప్రకారం.. ఈ ఉత్సవాలు ‘గ్రాండ్ స్వాగత్’ పేరుతో సెలబ్రిటీల ప్రత్యేక కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. ఈ హైప్రొఫైల్ ఈవెంట్లో మనీష్ మల్హోత్రా రూపొందించిన ఫ్యాషన్ షో ఉంటుంది. ఇది భారతదేశం హస్తకళలు, సమకాలీన డిజైన్లకు వేదికగా నిలుస్తుంది. విజువల్ ఫీస్ట్కు అనుబంధంగా వికాస్ ఖన్నా తయారు చేసిన స్టార్ మెనూతో వంటకాలు ఉంటాయి. ఈ వేడుకల్లో భాగంగా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ ఆధ్వర్యంలో ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్’తో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. క్రీస్తుపూర్వం 5000 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశీయ పరిణామాలను తెలియజేసేలా నాటకాలుంటాయి. ప్రదర్శనలు, దృశ్యాలు, కథల ద్వారా ఈ ఈవెంట్ చరిత్రకు జీవం పోస్తుందని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్అతిథులు బాలీవుడ్ నృత్య వర్క్షాప్ల్లో పాల్గొనవచ్చు. గార్బా, దాండియా రాస్ను ఆస్వాదించవచ్చు. ‘ది గ్రేట్ ఇండియన్ బజార్’లో భాగంగా భారతీయ వస్త్రాలు, హస్తకళలు, ప్రాంతీయ వంటకాలను రుచి చూడవచ్చు. ఎస్ఎంఏసీసీ ఇండియా వీకెండ్ యూఎస్లో నిర్వహించే అతిపెద్ద భారతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఉండనుంది.ఈ కార్యక్రమంలో శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్, శాస్త్రీయ సంగీతకారుడు రిషబ్ శర్మ ప్రదర్శనలు ఉండనున్నాయి. ఎడ్డీ స్టెర్నోతో మార్నింగ్ యోగా, క్రికెట్ థీమ్ ప్యానెల్స్, షియామక్ దావర్ నేతృత్వంలో బాలీవుడ్ డ్యాన్స్ వర్క్షాప్లు ఉంటాయి. ‘సంస్కృతి మనుషులను కలుపుతుంది. సహానుభూతిని పెంపొందిస్తుంది. 5,000 ఏళ్లకు సంబంధించిన భారతదేశ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని ఈ సందర్భంగా నీతా అంబానీ అన్నారు.

బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ
ఫ్యామిలీ

రానూ.. బొంబైకి రానూ.. !
హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికగా గురువారం నిర్వహించిన ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ 2025 వేదిక పై మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు విభిన్నకళారూపాలతో ఆకట్టుకున్నారు. ఈ టాలెంట్ కాంపిటీషన్ ఫినాలేలో తెలుగు సాంగ్ రాను బొంబైకి రాను అనే సాంగ్తో పలువురు ఉర్రూతలూగించారు. 24 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు వారి దేశాలకు చెందిన విభిన్న కళలతో అలరించారు. దీంతో పాటు పాటలు, నృత్యాలు, ఇతర సాంస్కృతిక అంశాలు, ఐస్ స్కేటింగ్, డ్యాన్సింగ్, డీజే ప్లేయింగ్ వంటి ప్రదర్శనలిచ్చారు. ఈ టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండోనేషియా (పియానో) మొదటి స్థానంలో నిలవగా, మిస్ కామెరూన్ (సింగింగ్) రెండో స్థానంలో, మిస్ ఇటలీ (బ్యాలే నృత్యం) మూడో స్థానంలో నిలిచారు. సంప్రదాయ శ్రీలంక సింహళీ నృత్యంతో అలరించారు మిస్ శ్రీలంక. ఒక్క రోజులో తన కోసం సంప్రదాయ డ్రెస్ను తన తల్లి డిజైన్ చేసి ఇచ్చినందుకు ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో భారతీయ కంటెస్టెంట్ మిస్ ఇండియా నందిని గుప్తా బాలీవుడ్ హిట్ సాంగ్ రామ్ లీలా సినిమాలోని దోల్ భాజే సాంగ్ ప్రేక్షకులు, జ్యూరీ సభ్యుల ప్రశంసలు అందుకున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో నందినీ గుప్తా చేసిన నృత్యం ఆద్యాంతం ఆక్టట్టుకుంది. చివరగా 24 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు అద్దాల మేడలున్నవే, రాను బొంబైకి రానూ.. అనే తెలుగు పాటలకు స్టెప్స్ వేస్తూ అదరగొట్టారు. (చదవండి: అమేజింగ్ అమ్మాయిలు)

లైట్ తీస్కో భయ్యా..!
‘ఇదిగోండి సార్ మీ ఫుడ్...’ ‘ఏమిటిది?’ ‘అదే సార్.. మీరు బాగా ఎంజాయ్ చేసే టర్కిష్ డిలైట్’ ‘సారీ.. నేనిప్పుడు టర్కీ ఫుడ్ తినడం లేదు.. ప్లీజ్ క్యాన్సిల్’ ‘అదేంటి మీకు ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం కద సార్..’ ‘లైట్ తీస్కో భయ్యా..!’ ప్రస్తుతం ఇలాంటి సన్నివేశాలు హైదరాబాద్నగరంలోని రెస్టారెంట్స్లో సర్వసాధారణంగా మారాయి. ఒకప్పుడు టర్కీ వంటకాలంటే లొట్టలేసుకుని తినే సిటీ ఫుడ్ లవర్స్ ఇప్పుడు టర్కీ ఫుడ్ అంటే పీచే ముడ్ అంటున్నారు. దీంతో గత కొంత కాలంగా టర్కిష్ రుచులపైనే ఆధారపడి వ్యాపారం చేస్తున్న పలు రెస్టారెంట్స్ వెలవెలబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో గత కొంత కాలంగా టర్కీ వంటకాలకు ఫుల్ డిమాండ్. అత్యంత ఆదరణ పొందుతున్న సిటీలోని విదేశీ క్యుజిన్స్లో ఇటలీ వంటకాల తరహాలోనే టర్కీ వెరైటీస్కి కూడా మంచి క్రేజ్ ఉంది. దీంతో గత కొన్నేళ్లుగా ప్రత్యేకించి టర్కీ వంటకాలను అందించే రెస్టారెంట్లు నగరమంతా విస్తరించాయి. అయితే తాజాగా సరిహద్దుల్లో సంభవించిన పరిణామాల నేపథ్యంలో బాయ్ కాట్ టర్కీ ఉద్యమంలో నగరంలోని టర్కీ ఫుడ్ లవర్స్ కూడా మేము సైతం అంటున్నారు. టర్కీ పేరుతో ఉన్న వంటకాలను తినబోం అంటూ వారు తెగేసి చెబుతుండడంతో నగరంలో సదరు వంటకాలకు డిమాండ్ సగానికి పడిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన సాన్ సెబాస్టియన్ చీజ్కేక్ నుంచి టర్కీ టీ దాకా పేరు వింటనే సై అనే నగరవాసులు ఇప్పుడ నై అంటుండడంతో రెస్టారెంట్ల నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.. ఎన్నో కేఫ్స్, రెస్టారెంట్స్.. నగరంలో అత్యంత తొలిగా తుర్కీ వంటకాలు అందించడం ప్రారంభించిన రెస్టారెంట్ బంజారాహిల్స్లోని లెవంట్గా చెప్పొచ్చు. ఇక్కడి లెవంట్ మషావీ ముషక్కల్, బుర్జ్ దజాజ్, మనకీష్, తజీన్ దజాజ్ వంటివన్నీ నగరవాసుల ఆదరణకు నోచుకున్నవే. అదే విధంగా బెంగళూరు నుంచి వచ్చిన మరో టర్కీ రెస్టారెంట్ కెబెప్సీ సైతం వెరైటీల మెనూతో టర్కీ ఫుడ్ లవర్స్కు చిరునామాగా ఉండేది. ఇక్కడి బెయ్తీ చికెన్, లాంబ్ మండీ, జిహాన్ కబాబ్ వంటివి బాగా ఫేమస్. ఇక టోలీచౌకిలోని కెబాబ్జాదెహ్ సంప్రదాయ టర్కీ వంటకాలకు పేరొందింది. చీజ్ ఖీమా నాన్, గ్రీక్ చికెన్, ఇజి్మర్ చికెన్, లాంబ్ చాప్స్తో నోరురిస్తుంది. టర్కీ టీ, రెడ్ సెంటిల్ సూప్లకు పేరొందిన జౌక్, పిలాఫ్ ప్లాటర్, లహ్మకున్ తదితర టర్కీ స్ట్రీట్ ఫుడ్కి బెస్ట్గా పేరొందింది. వివిధ వెరైటీలు.. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇస్తాంబుల్, టర్కిష్ డిలైట్, టర్కీ మిల్క్ కేక్స్ తదితర టర్కీ స్వీట్స్కి కేరాఫ్గా నిలిచిన గోర్మేట్ బక్లావా, టర్కీ బ్రేక్ ఫాస్ట్ అందించే జూబ్లీహిల్స్లోని కార్డ్ యార్డ్ కేఫ్.. టర్కీ డెజర్ట్ కునాఫాలకు పేరొందిన కెపె్టన్ కునాఫా, టర్కీ షావర్మాతో ఆకట్టుకునే మల్లేపల్లిలోని టర్కిష్ సెంట్రల్.. కెబాబ్ క్రాలిక్ తదితర రెస్టారెంట్స్, కేఫ్స్ గత కొంత కాలంగా టర్కీ వంటకాలకు పేరొందాయి.రణ వేళ.. రుచుల వెలవెల.. ‘టర్కీ వంటకాలు అంటే అక్కడ నుంచి దిగుమతి అయినవి కాదు. కేవలం అక్కడి స్టైల్ను అనుసరించి మేము సొంతంగా తయారు చేసేవి మాత్రమే’ అంటూ పలు రెస్టారెంట్స్ అతిథులకు, భోజన ప్రియులకు సర్థి చెప్పాల్సిన పరిస్థితి నగరంలో ఏర్పడిందని ఓ చెఫ్ ‘సాక్షి’కి వివరించారు. అంతేకాకుండా మెనూలోని వంటకం పేరు ముందు టర్కీ తొలగించడం వంటి మార్పు చేర్పులు కూడా చేసుకుంటున్నామని పలువురు రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. ఏదేమైనా.. వంటకాల పట్ల అనూహ్యంగా ఏర్పడిన ఈ వ్యతిరేక ధోరణి కొన్ని రోజులకు సద్ధుమణిగిపోతుందని, టర్కీ ఫుడ్కి డిమాండ్ ఎప్పటిలా పుంజుకుంటుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: 900 Egg Diet: బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! చివరికి గంటకు పైగా..)

పిల్లలూ..ఈ సమ్మర్ ఈ సినిమాలు చూస్తున్నారా..?
పిల్లలూ...భారతం తెలుసా మీకు? రామాయణ, మహాభారతాలుమన తొలి పాఠ్యపుస్తకాలు. మీకు పదేళ్లు దాటితే ఈ రెండూ ఏదో ఒక మేరకు తెలిసుండాలి. వినడం, చదవడం ద్వారా మాత్రమే కాక చూడటం వల్ల కూడా భారతం తెలుసుకోవచ్చు. స్కూళ్లు తెరవడానికి ఇంకా రెండు వారాలుంది. భారతం మీద వచ్చిన సినిమాలు వరుసపెట్టి చూడండి చాలు. ఆ లిస్టు ఇవాళ ఇస్తున్నాం. రేపు రామాయణం సినిమాల లిస్ట్ ఇస్తాం. పిల్లలూ...మహాభారతం అంటే పాండవులకు కౌరవులకు మధ్య వార్ అని మాత్రమే అనుకుంటున్నారా మీరు? మహాభారతంలో ఎన్నో ఎపిసోడ్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి, వీరత్వాలూ శూరత్వాలూ ఉన్నాయి, చీటింగ్ ఉంది, నిజాయితీ ఉంది, ట్రూత్ కోసం నిలబడిన వారు ఉన్నారు, గొప్ప విమెన్ ఉన్నారు, ఆటవిక వీరులున్నారు... వీరందరినీ మీరు తెలుసుకోవాలి.మహాభారతంలో పాండవులు రాజ్యం కోల్పోయి అరణ్యవాసం చేస్తారు. అజ్ఞాతవాసం కూడా చేస్తారు. కొన్ని సందర్భాల్లో లైఫ్లో ఇలాంటి సవాళ్లు వస్తాయి. పాండవులు భయపడలేదు. అరణ్యవాసం చేసి, అజ్ఞాతవాసం చేసి మళ్లీ యుద్ధం చేసి గెలిచారు. అరణ్యవాసం అంటే అడవుల్లో ఉండటం, అజ్ఞాతవాసం అంటే ఐడెంటిటీని దాచి బతకడం.ఇవాళ ప్రపంచంలో చాలా చోట్ల వార్స్ జరుగుతున్నాయి. వార్ను ప్రజలు కోరుకోరు. పాలకులే కోరుకుంటారు. వాళ్లకు కావాల్సినదాని కోసం కొట్లాడుకుంటారు. కాని వార్ని ఆపడానికి కొంతమంది ట్రై చేస్తారు. పీస్ అంబాసిడర్స్గా మారి వార్ వద్దని మంచి మాటలు చెబుతారు. భారతంలో కృష్ణుడు అలా పాండవులకు, కౌరవులకు రాయబారం చేయాలని చూశాడు. కాని కుదరలేదు. మహాభారతంలో ద్రోణుడు వంటి గొప్ప టీచర్ ఉన్నాడు. శకుని వంటి విలన్ ఉన్నాడు. మాట వినని, మొండికేసే దుర్యోధనుడున్నాడు. వీళ్లందరి నుంచి మనం నేర్చుకోదగ్గ లెసన్స్ ఉంటాయి. అలాగే మహాభారతంలో కుంతి, ద్రౌపది, సుభద్ర... వంటి గొప్ప స్త్రీ పాత్రలను మనం తెలుసుకోవాలి.మహాభారతాన్ని పిల్లల కోసం సులభంగా అర్థమయ్యేలా కొన్ని పుస్తకాలు రాశారు. అవి తెప్పించుకుని చదవండి. లేదా సినిమాలు చూసి కూడా భారతాన్ని తెలుసుకోవచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. సెలవులు కొన్నాళ్లే మిగిలాయి. ఈ సినిమాలు చూసేయండి మరి. అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి.1. బాలభారతం: ఇది 1972లో వచ్చిన తెలుగు సినిమా. పాండవుల, కౌరవుల చైల్డ్హుడ్ ఇందులో ఉంటుంది. అందరూ పిల్లలే నటించారు.2. మాయాబజార్: ఇది తప్పకుండా చూడాల్సిన క్లాసిక్. ఇందులో ఘటోత్కచుడు స్పెషల్ అట్రాక్షన్. ఈ కథ భారతంలో లేదుగానీ ఇందులో ఉన్నవన్నీ భారతంలోని క్యారెక్టర్లే. దుష్ట చతుష్టయం అనే నలుగురు ఎవరో ఈ సినిమాలో చూడొచ్చు. చెడు ఆలోచనలు చేస్తే చెడు ఫలితమే వస్తుందని తెలుసుకుంటారు.3. భీష్మ: మహా భారతంలో భీష్ముడు చాలా ముఖ్యమైన పాత్ర. మహాభారతంలో ఆది నుంచి అంతం వరకూ ఆయన ఉంటాడు. ఆయన మీద తీసిన సినిమా ఇది. పెద్దవాళ్లను తోడు చేసుకుని డౌట్స్ అడుగుతూ ఈ సినిమా చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి.4. నర్తన శాల: ఇది పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు జరిగిన కథ. పాండవుల్లో భీముడు ఎంత బలం కలిగినవాడో ఈ సినిమాలో చూడొచ్చు. అలాగే కీచకుడు అనే క్యారెక్టర్ ఉంటుంది. బ్యాడ్ క్యారెక్టర్. ఉమెన్తో మిస్ బిహేవ్ చేసి తగిన పనిష్మెంట్ పొందుతాడు. తప్పకుండా చూడండి.5. వీరాభిమన్యు: భారతంలో అభిమన్యుడు అద్భుతమైన పాత్ర. పద్మవ్యూహంలోకి చొచ్చుకు వెళ్లి గొప్పగా పోరాడుతాడు. కాని తిరిగి రావడం తెలియక మరణిస్తాడు. అతని మీద తీసిన సినిమా ఇది.6. పాండవ వనవాసము: పాండవులు వనవాసం చేసినప్పుడు అంటే అడవుల్లో ఉన్నప్పుడు ఏమేమి ఘటనలు జరిగాయో ఈ సినిమా చూపిస్తుంది.7. దానవీరశూర కర్ణ: మహాభారతాన్ని ఒక్కొక్కరు ఒక్కో పర్స్పెక్టివ్లో చూస్తారు. ఈ సినిమా కర్ణున్ని ఒక వీరుడుగా, శూరుడుగా చూపుతుంది. అతను దానం ఇవ్వడంలో మేటి అట. అలాగే అతను పొందిన అవమానాలను ఎలా తట్టుకున్నాడో కూడా ఈ సినిమా చూపుతుంది. కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేస్తాడు. వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. యుద్ధ సమయంలో ఫ్రెండ్ పక్షాన నిలవడం అతని ధర్మం. ఈ సినిమా తప్పక చూడండి.8. ఏకలవ్య: ఏకలవ్య శిష్యరికం అని మీరు సామెత వింటూనే ఉంటారు కదా... ద్రోణుడి బొమ్మ పెట్టుకుని విలువిద్య నేర్చుకుంటాడితను. అర్జునుడిని మించిన విలుకాడితను. ద్రోణుడు గురుదక్షిణ అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా బొటనవేలు కోసి ఇచ్చేస్తాడు. అన్నట్టు పిల్లలూ... ఈ సినిమాల్లో భాష మీకు పూర్తిగా అర్థం కాక΄ోవచ్చు. ఇందులో గ్రాంథిక తెలుగు ఉంటుంది. అయినా సరే చూస్తూ ఉంటే భాష కూడా మీకు తెలుస్తుంది. తెలుగు గొప్ప భాష. అందులో ఎన్నో స్థాయులు ఉన్నాయి. అన్నింటితో మనకు పరిచయం ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం. మీ అమ్మతోనో నానమ్మతోనో కలిసి భారతం సినిమాలు చూడటం మొదలుపెట్టండి. (చదవండి: చిన్నారులు పజిల్స్ ఎందుకు చేయాలో తెలుసా..!)

అమేజింగ్ అమ్మాయిలు
ఈమె పేరు.. వలేరియా పేరస్. మిస్ ప్యూర్టో రికో! వృత్తిరీత్యా టీచర్. మిడిల్ స్కూల్ పిల్లలకు సైన్స్ బోధిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు, ఆతిథ్యం గురించి వలేరియా పంచుకున్న విషయాలు... ‘‘మిస్ వరల్డ్ కోసం 119 మంది అమేజింగ్ అమ్మాయిలతో పోటీ వావ్ అనిపిస్తోంది. ఈ పోటీల కోసం ఇండియా.. ఎస్పెషల్లీ హైదరాబాద్ రావడం సూపర్బ్ ఫీలింగ్. ఇక్కడి హాస్పిటాలిటీ నాకు చాలా నచ్చింది. మా ఇంటిని, దేశాన్ని వదిలి ఎక్కడో సుదూర తీరాలకు వచ్చినట్టేమీ అనిపించడం లేదు. ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. మేమంతా భిన్న దేశాల నుంచి వచ్చినవాళ్లమనే భావన కలగట్లేదు. చాలా త్వరగా మా మధ్య బాండింగ్ ఏర్పడింది. ఇనాగ్యురల్ ఫంక్షన్ రోజు.. మేమంతా ఒకరికొకరం మేకప్ చేసుకున్నాం. హెయిర్ స్టయిల్ చేసుకున్నాం. జ్యూవెలరీ కూడా ఎక్సేఛేంజ్ చేసుకున్నాం. అంత అద్భుతమైన సిస్టర్హుడ్ డెవలప్ అయింది మా మధ్య! ఇక్కడికి రావడానికి ముందు కొంచెం భయమేసింది.. ఇక్కడి మనుషులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. వాతావరణం ఎలా ఉంటుందో అని! కానీ ల్యాండ్ అయ్యాక.. ఇక్కడి వాళ్ల మర్యాద చూస్తున్నాను కదా.. ట్రెమండస్! పహల్గామ్ ఘటనతో దేశంలో ఊహించని పరిణామాలు ఏర్పడ్డాయి కదా! అది కూడా కొంచెం భయపెట్టింది. ఫార్చునేట్లీ అంతా ప్రశాంతంగానే ఉంది. ఉండాలి కూడా! అయితే ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా మా సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. మాకెలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకుంది. చూసుకుంటోంది. తెలంగాణ కల్చర్, ఆర్ట్.. రిచ్ అండ్ క్రియేటివ్గా ఉంది. ఫుడ్ కొంచెం కారంగా ఉన్నా డెలీషియస్గా ఉంది. నచ్చింది. నా బ్యూటీ విత్ పర్పస్ విషయానికి వస్తే.. ఆటిజం, డౌన్సిండ్రోమ్ పిల్లల కోసం వర్క్ చేస్తున్నాను. అంతేకాదు సమాజంలోని అట్టడుగు వర్గాల సాధికారత కోసమూ కృషిచేస్తున్నాను. మనుషులందరూ సమానమే! కాబట్టి అవకాశాలూ సమానంగా ఉండాలి. ఉన్నవాళ్లు, లేనివాళ్లు, జెండర్ విభేదాలు ఉండకూడదు. అంతేకాదు ప్రతివారికీ వారికే ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని వాళ్లు గుర్తించి, ఆ దిశగా వాళ్ల ప్రయాణం సాగేందుకు సాయపడుతున్నాను’’ అన్నారు వలేరియా.– రమ సరస్వతిఫొటో: ఎస్ ఎస్ ఠాకూర్
ఫొటోలు


Cannes 2025 : కాన్స్ రెడ్కార్పెట్పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)


శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)


కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)


శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)


హైదరాబాద్లో ‘థగ్ లైఫ్’ చిత్రం మీడియా మీట్ (ఫొటోలు)


విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)


కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్ మూమెంట్స్ (ఫొటోలు)


Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్ బ్యూటీలు (ఫొటోలు)


లిక్కర్ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్ ధ్వజం (చిత్రాలు)


అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)
అంతర్జాతీయం

భారత్కు అండగా ఉంటాం
అబుదాబీ/టోక్యో: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), జపాన్ ప్రకటించాయి. భారత్కు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ అరాచకాలను, ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటాన్ని ప్రపంచ దేశాల నేతలకు తెలియజేయడానికి ఏర్పాటైన అఖిలపక్ష బృందాలు తమ కార్యాచరణ ప్రారంభించాయి. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని బృందం గురువారం యూఏఈ మంత్రి షేక్ నహ్యన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, డిఫెన్స్ కమిటీ చైర్మన్ అలీ అల్ నుయామీతోపాటు ఇతర నేతలతో అబుదాబీలో సమావేశమైంది. జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలో మరో బృందం జపాన్ రాజధాని టోక్యోలో జపాన్ విదేశాంగ మంత్రి తకాషీ ఇవాయాతోపాటు మరికొందరు నేతలతో భేటీ అయ్యింది. ఉగ్రవాదం అనేది కేవలం ఏదో ఒక దేశానికి పరిమితమైన సమస్య కాదని, మొత్తం ప్రపంచానికి ముప్పుగా మారిందని అలీ అల్ నుయామీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొత్తం మానవాళికి ఉజ్వలమైన భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. జపాన్ మంత్రి ఇవాయా మాట్లాడుతూ... ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే అంతం చేయాల్సిందేనని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఉద్ఘాటించారు. మరోవైపు డీఎంకే ఎంపీ కె.కనిమొళి నేతృత్వంలోని మరో అఖిలపక్ష బృందం రష్యాకు బయలుదేరింది. మొత్తం 33 దేశాలకు అఖిలపక్ష బృందాలను పంపించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అమెరికాలో ఇజ్రాయెల్ రాయబార సిబ్బందిపై కాల్పులు, ఇద్దరు మృతి
వాషింగ్టన్: అమెరికాలో ఇజ్రాయెల్ రాయబార సిబ్బంది ఇద్దరు హత్యకు గురయ్యారు. నార్త్ వెస్ట్ డీసీలోని యూదుల మ్యూజియానికి సమీపంలో జరిగిన కాల్పుల్లో రాయబార సిబ్బంది అయిన సారా లిన్ మిల్గ్రిమ్, యారోన్ లిచిన్స్కీ అక్కడికక్కడే మృతి చెందారు. అమెరికన్ యూదు అసోసియేషన్ ఇచ్చిన విందు నుంచి తిరిగి వెళ్తుండగా కాల్పుల ఘటన జరిగింది. కాల్పుల అనంతరం నిందితుడు మ్యూజియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈవెంట్ సెక్యూరిటీ అతడిని వెంటనే అదుపులోకి తీసుకుంది. ఈ సమయంలో ‘ఫ్రీ పాలస్తీనా’ అని నినాదాలు చేశాడు. నిందితుడిని చికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జ్గా గుర్తించారు. అతనికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. కాల్పుల్లో మరణించిన లిచిన్స్కీ రాయబార కార్యాలయంలో రీసెర్చ్ అసిస్టెంట్ కాగా, మిల్గ్రిమ్.. ఇజ్రాయెల్ ఎంబసీలో పనిచేస్తున్న అమెరికా పౌరురాలు. వారిద్దరూ త్వరలో నిశ్చితార్థం చేసుకోవాలనుకున్నారని అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి యెచియల్ లెయిటర్ తెలిపారు. వచ్చేవారం జెరూసలేంలో సారాకి ప్రపోజ్ చేయాలని యారోన్ ప్లాన్ చేసుకున్నారని, ఈలోపే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నీచమైన ఉగ్రవాద చర్య: నెతన్యాహుఈ దాడిని అమెరికా, ఇజ్రాయెల్ నేతలు, అధికారులు ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాల వద్ద భద్రతను పెంచాలని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. ఈ దాడిని యూదు వ్యతిరేక, నీచమైన ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. యువ జంటను కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ రాయబార సిబ్బందిపై కాల్పులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ‘యూదు వ్యతిరేకతతో చేసిన హత్యలని స్పష్టమవుతోంది. ఇలాంటి హత్యలు ఇప్పుడే అంతం కావాలి. ద్వేషం, రాడికలిజానికి అమెరికాలో స్థానం లేదు. బాధితుల కుటుంబాలకు నా సంతాపం. ఇలాంటివి జరగడం చాలా విచారకరం’ అని ట్రంప్ ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ‘ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సిబ్బంది హత్యను మేమూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పిరికితనం. యూదు వ్యతిరేక హింస. బాధ్యులను గుర్తించి న్యాయం ముందు నెలబడతాం’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ ప్రతినిధులు నిరంతరం ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని, అయినా ఇజ్రాయెల్ ఉగ్రవాదానికి లొంగిపోదని ఆ దేశ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ అన్నారు.

ట్రంప్.. మళ్లీ అదే తీరు!
వాషింగ్టన్: కొన్ని వారాల క్రితం శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మీడియా సాక్షిగా తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. సాదరంగా ఆహా్వనించి నిందారోపణల బురద కుమ్మరించడం అగ్రరాజ్యానికి ఏమాత్రం తగదని ఆనాడే ప్రపంచమీడియా తీవ్రంగా మందలించినా ట్రంప్ తన తెంపరితనాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదని బుధవారం మరోసారి రుజువైంది. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటారనే ఆశతో వైట్హౌస్కు విచ్చేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొసాకు ట్రంప్ ఆరోపణలతో స్వాగతం పలికారు. దక్షిణాఫ్రికాలో వేలాది మంది శ్వేతజాతి రైతులను వధించారని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో హతాశుడైన రమఫొసా వెంటనే తేరుకుని ట్రంప్కు దీటుగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే? శ్వేతసౌధంలో మీడియా సమక్షంలో సంయుక్తంగా మాట్లాడేందుకు రమఫొసా సిద్ధంకాగా ట్రంప్ మీడియాతో మాట్లాడటం వదిలేసి అక్కడే ఉన్న పెద్ద టెలివిజన్లో ఒక వీడియో చూపిస్తాం చూడండని అక్కడి వారందరినీ ఆదేశించారు. ‘‘శ్వేతజాతీయులను చంపేయండి. శ్వేతజాతి రైతులను కాల్చిచంపండి’’ అంటూ దక్షిణాఫ్రికాలో చిన్నపాటి కమ్యూనిస్ట్పార్టీ అయిన ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేత జూలియస్ మలేమా పాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. వీడియో ప్లే అవడం పూర్తయ్యాక ట్రంప్ రమఫొసాను ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ‘‘ దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులు జాత్యహంకారానికి గురయ్యారనేది ఒట్టిమాట. వాస్తవానికి వేలాది మంది శ్వేతజాతి రైతులను ఊచకోత కోశారు. ఆ దేశంలో ఎన్నో ప్రాంతాలు శ్వేతజాతీయుల సమాధి దిబ్బలుగా మారాయి. శ్వేతజాతీయులు పీడనకు, వేదనకు గురయ్యారు. మీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చాలా మంది శ్వేతజాతీయులు బతుకుజీవుడా అంటూ అమెరికాకు శరణార్థులుగా వలసవచ్చారు. వాళ్లకు మేం ఆశ్రయం కల్పించాం’’ అంటూ ట్రంప్ చెప్పుకుంటూ పోయారు. శ్వేతజాతీయుల అవస్థలు ఇవి అంటూ విదేశీ వార్తాసంస్థల్లో ప్రచురితమైన కథనాల జిరాక్స్ కాపీలను మీడియా ప్రతినిధులకు చూపించి రమఫొసాకు అందజేశారు. వీటికి సంజాయిషీ చెప్పాలని డిమాండ్చేశారు. ‘‘ అన్ని హత్యలే. దక్షిణాఫ్రికాలో ఎక్కడ చూసినా మరణాలే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వైఖరితో ఒక్కసారిగా విసిగిపోయిన రమఫొసా పట్టరాని ఆగ్రహంతో ఉన్నాసరే సంయమనం పాటించారు. హుందాగా వ్యవహరిస్తూ సూటిగా మాట్లాడారు. ‘‘ అసలేంటీ వీడియో?. నేనెప్పుడూ ఈ వీడియో చూడలేదు. ఎక్కడిదీ వీడియో?. ఈ వీడియో ఎంత వరకు వాస్తవం?’’ అంటూ ట్రంప్పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ దశాబ్దాలుగా జాత్యహంకారానికి, పీడనకు కోట్లాదిమంది నల్లజాతీయులు బాధితులయ్యారు. లెక్కలేనంత మంది బలయ్యారు. మా దేశంలో శ్వేతజాతీయుల ఊచకోత అనేది పూర్తిగా అబద్ధం. నిజానికి ఆఫ్రికనర్స్గా పిలిచే మైనారిటీ శ్వేతజాతీయులే చాన్నాళ్లు మా దేశాన్ని చెండుకు తిన్నారు. ఆఫ్రికన్ల దీనగా«థను వినే ఓపిక మీకు ఉంటే మా బాధ సరిగ్గా అర్థమవుతుంది.’’ అని రమఫొస సూటిగా సమాధానం ఇచ్చారు. ట్రంప్ చూపిన వీడియోలో ఒక రోడ్డు పక్కన చోట పెద్ద సంఖ్యలో సమాధులు ఉన్నాయి. అయితే ఇవి నిజమైన సమాధులు కావని, 2020లో ఖ్వజూలు–నటాల్ ప్రావిన్సులో ఒక రైతు జంట పొలంలో హత్యకు నిరసనగా ఏర్పాటుచేసిన నకిలీ సమాధులు అని కొందరు వాదించారు. ఉంటే ఇచ్చేవాడినే శ్వేతజాతి, నల్లజాతీయుల్లో ఎవరు పీడనకు గురయ్యారని ఓవైపు ట్రంప్, రమఫొసా వాదించుకుంటుంటే ఒక విలేకరి మధ్యలో కల్గజేసుకుని వందల కోట్ల రూపాయల విలువైన విమానాన్ని బహుమతిగా స్వీకరించడం ఎంత వరకు నైతికతగా అనిపించుకుంటుంది? అని ట్రంప్ను సూటి ప్రశ్న వేశారు. దీంతో చిర్రెత్తికొచ్చిన ట్రంప్.. ‘‘ నువ్వో చెత్త రిపోర్టర్వు. ఇంత కీలకమైన విషయంపై చర్చిస్తుంటే మధ్యలో నీ విమానం గోల ఏంటి?. నువ్వు అసలు ప్రశ్నలు అడగొద్దు’’ అని అతనిపై ట్రంప్ అరిచాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్ను కూల్ చేసేందుకు రమఫొసా మధ్యలో కలుగజేసుకున్నారు. ‘‘ ఖతార్ మాత్రమే కాదు. కావాలంటే మేం కూడా మీకు విమానాన్ని బహుమానంగా ఇస్తాం’’ అని అన్నారు. దీనికి ట్రంప్ వెటకారంగా బదులిచ్చారు. ‘‘ అగ్రరాజ్యమైన అమెరికాకే ఎయిర్ఫోర్స్వన్గా కొత్త విమానాన్ని ఇచ్చే దమ్ముంటే మీరూ ఇవ్వొచ్చు. నేను తీసుకునేందుకు రెడీ’’ అని అన్నారు. వెంటనే రమఫొసా ‘‘ అగ్రరాజ్యంగా ఉండి కూడా మీరు ఇంకొకరి నుంచి తీసుకునే స్థితిలో ఉన్నా.. ఇచ్చే స్థితిలో మేం లేము. మా వద్ద అసలు విమానమే లేదు’’ అని అనేసరికి అక్కడ ఉన్న వాళ్లంతా ఘొల్లున నవ్వేశారు.

జనావాసంలో కూలిన చిన్న విమానం
శాన్ డియాగో: అమెరికాలోని శాన్ డియాగో శివారులోని జనావాసాల మధ్య గురువారం తెల్లవారుజామున చిన్న విమానం ఒకటి కూలింది. ఈ ఘటనలో పలువురు మృత్యువాతపడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమాన శకలాలతోపాటు ఇంధనం పారబోసినట్లు పడి మండటంతో 15 ఇళ్లలో మంటలు చెలరేగాయి. మరో డజను వరకు కార్లు కాలిపోయాయని అధికారులు తెలిపారు. జనావాసాలున్న చోట విమాన ప్రమాదం చోటుచేసుకుందన్నారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని ఆస్పత్రిలో చేర్చామని, మరో ఇద్దరికి స్వల్పంగానే గాయాలయ్యాయన్నారు. కూలిన ప్రైవేట్ సెస్నా రకం విమానంలో 10 మంది వరకు ప్రయాణించే వీలుందని, ఘటన సమయంలో అందులో ఎందరున్నారనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. బుధవారం రాత్రి న్యూయార్క్ నగరంలోని టెటెర్»ొరో ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ తీసుకునన ఈ విమానం కన్సాస్ రాష్ట్రం విచిటాలోని కల్నల్ జేమ్స్ జబరా ఎయిర్పోర్టులో కాసేపు ఆగింది. అనంతరం టేకాఫ్ తీసుకున్న ఈ విమానం శాన్ డియాగోలోని మాంట్గోమెరీ–గిబ్స్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్టులో ల్యాండవ్వాల్సి ఉందని సమాచారం. మరో మూడు మైళ్ల ప్రయాణం ఉందనగా ప్రమాదంలో చిక్కుకుందన్నారు. విమానం పైలట్ నుంచి ఎటువంటి ప్రమాద సంకేతాలు రాలేదని తెలిపారు. అక్కడికి సమీపంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సైనికుల నివాస ప్రాంతముందని చెప్పారు. కాగా, అలాస్కాలోని ఓ కంపెనీకి చెందిన ఈ విమానం 1985లో తయారైంది. సుమారు 4 గంటల సమయంలో దట్టంగా మంచుకురుస్తుండగా విమానం కరెంటు తీగలను తాకడం వల్ల ప్రమాదానికి గురైందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు వివరించారు.
జాతీయం

నీట్–పీజీ సీట్లు బ్లాక్ చేయకుండా కఠినచర్యలు తీసుకోవాలి
న్యూఢిల్లీ: పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ల విషయంలో కొన్ని కాలేజీలు ముందుగానే సీట్లు బ్లాక్ చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నీట్–పీజీకి సంబంధించి కౌన్సెలింగ్కు ముందే ఫీజుల వివరాలు బహిర్గతం చేయాలని అన్ని ప్రైవేట్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలను ఆదేశించింది. సీట్ల బ్లాకింగ్ వల్ల అవకాశం కోల్పోయిన ఇద్దరు అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని అలహాబాద్ హైకోర్టు గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని, లక్నోలోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ జనరల్కు ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టర్ జనరల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్తో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. మెడికల్ పీజీ సీట్లను ముందుగానే బ్లాక్ చేసి, ఇష్టా్టనుసారంగా విక్రయించుకోవడం అనేది తప్పుడు చర్య మాత్రమే కాకుండా, వ్యవస్థలో లోపాలకు ఉదాహరణ అని వెల్లడించింది. పారదర్శకత లేకపోవడానికి, ప్రభుత్వ విధానాలు బలహీనంగా ఉండడానికి నిదర్శనమని తెలియజేసింది. సీట్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌన్సెలింగ్కు ముందే ఫీజులను వెల్లడించడం తప్పనిసరి అని స్పష్టంచేసింది. ట్యూషన్, హాస్టల్ ఫీజులు, కాషన్ డిపాజిట్తోపాటు ఇతర ఫీజులను విద్యార్థులకు తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. నేషనల్ మెడికల్ కమిషన్ ఆధ్వర్యంలో కేంద్రీకృత ఫీజుల నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. సీట్లు బ్లాక్ చేసే కాలేజీలకు జరిమానాలు విధించాలని స్పష్టంచేసింది. ఆయా కాలేజీలపై అనర్హత వేటు వేయాలని పేర్కొంది.

మతాలన్నింటి సారం ఒక్కటే
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) చట్టం–2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మూడు రోజులపాటు జరిగిన వాదనలు గురువారం ముగిశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. వక్ఫ్ అనేది కేవలం ఒక సేవా కార్యక్రమం అని, అది ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదని తుషార్ మెహతా పేర్కొనగా, కపిల్ సిబల్ స్పందిస్తూ... మరణానంతర జీవితం కోసం దేవుడికి, సమాజానికి సేవ చేయడమే వక్ఫ్ అని తేల్చిచెప్పారు. ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం భగవంతుడికి అంకితంకావడం వక్ఫ్ అని వివరించారు. సీజేఐ జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. హిందూ మతస్తుల్లో మోక్షం అనే భావన ఉందని గుర్తుచేశారు. జస్టిస్ అగస్టీన్ జార్జి స్పందిస్తూ.. క్రైస్తవ మతంలోనూ అలాంటి భావనే ఉందన్నారు. స్వర్గానికి చేరుకోవడానికి క్రైస్తవులు ఆరాటపడుతుంటారని తెలిపారు. అనంతరం రాజీవ్ ధావన్ మాట్లాడుతూ కేంద్రం వాదనను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. వేదాల ప్రకారం చూస్తే హిందూ మతంలో దేవాలయాలు తప్పనిసరి భాగం కాదని చెప్పారు. ప్రకృతిని ఆరాధించే ఆచారం హిందూ మతంలో ఉందన్నారు. అగ్ని, నీరు, వర్షం, పర్వతాలు, సముద్రాలను దేవుళ్లుగా పూజిస్తుంటారని గుర్తుచేశారు. దాదాపు అన్ని మతాల్లో సేవా భావన ఉందని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. మతాల్లో అదొక ప్రాథమిక సూత్రమని వెల్లడించారు. సేవా కార్యక్రమాల విషయంలో మతాలన్నింటి సారం ఒక్కటేనని, వాటి మధ్య భేదం లేదని పరోక్షంగా తెలియజేశారు. మరోవైపు వక్ఫ్(సవరణ) చట్టాన్ని చట్టబద్ధంగానే తీసుకొచ్చారని, ఇది చట్టవిరుద్ధమని సాక్ష్యాధారాలతో సహా నిరూపించాల్సిన బాధ్యత పిటిషనర్లదేనని సీజేఐ సూచించారు. పార్లమెంట్ ఆమోదంతో తీసుకొచి్చన చట్టంపై స్టే ఇవ్వొద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఎందుకు? సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను కూడా సభ్యులుగా నియమించాలన్న నిబంధనను చట్టంలో చేర్చడాన్ని కపిల్ సిబల్ తప్పుపట్టారు. హిందూ ధార్మిక సంస్థల్లో హిందూయేతరులకు ప్రవేశం ఉండదని తెలిపారు. అలాంటప్పుడు వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. వక్ఫ్(సవరణ) చట్టంపై సుప్రీంకోర్టు ఉత్తర్వు శుక్రవారం వెలువడే అవకాశం ఉంది.

‘విరమణ’లో ఏ దేశం పాత్రా లేదు
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని, అణుయుద్ధ ప్రమాదాన్ని అమెరికాయే నివారించిందని.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఖండించారు. ఇస్లామాబాద్, న్యూఢిల్లీ మధ్య నేరుగా కాల్పుల విరమణ చర్చలు జరిగాయని, మరే ఇతర దేశం పాత్ర లేదని జైశంకర్ నొక్కి చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించాలంటూ పాక్ చేసిన ప్రతిపాదనకు భారత్ స్పందించిందని, కాల్పుల విరమణకు అంగీకరించిందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ను సందర్శించాల్సి ఉండగా, పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో జైశంకర్ ఆయన స్థానంలో వెళ్లారు. గురువారం డచ్ దినపత్రిక డి వోక్స్క్రాంట్కు ఇచి్చన విస్తృత ఇంటర్వ్యూలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని దేశాల్లాగే అమెరికా మాట్లాడింది భారత్–పాక్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో.. అనేక దేశాలు భారత్ను సంప్రదించాయని, పాకిస్తాన్తో కూడా మాట్లాడాయని, అమెరికా సైతం అలాగే మాట్లాడిందని తెలిపారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు సహా అగ్రశ్రేణి అధికారులు తమను సంప్రదించారని, కానీ వారు తమ ఆందోళనలను మాత్రమే తెలియజేశారని స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరుకుంటే నేరుగా భారత్ని సంప్రదించాల్సి ఉంటుందని తమ ప్రభుత్వం అమెరికాతో సహా అన్ని దేశాలకు తెలియజేసిందని ఆయన గుర్తు చేశారు. ఆ తరువాత కాల్పులు ఆపడానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ సైన్యం సందేశం పంపిందని, దానికి అనుగుణంగా భారత సైన్యం స్పందించిందని స్పష్టం చేశారు. ఇందులో అమెరికా ఎక్కడుందని వ్యాఖ్యాత ప్రశ్నించగా..‘‘పాక్, భారత్ మధ్యలోకి అమెరికా రాలేదు. అమెరికా తన పరిధిలోనే ఉండిపోయింది. సుదూరంగా అమెరికా గడ్డమీదనే ఆగిపోయింది’’ అని జైశంకర్ చమత్కరించారు. పహల్గాం ఉగ్రవాద దాడుల అంశంపై జైశంకర్ మాట్లాడారు. భారతీయుల మధ్య మత సామరస్యాన్ని చెడగొట్టడం, కశీ్మర్లో అభివృద్ధి చెందుతున్న పర్యాటక పరిశ్రమను దెబ్బతీయడం వారి లక్ష్యమన్నారు. వారు ఉద్దేశపూర్వకంగా దాడికి మతపరమైన రంగును పులిమారని జైశంకర్ అన్నారు. పాక్ నటించడం మానెయ్యాలి ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడంలో తమ ప్రమేయం లేదని ప్రపంచం ముందు పాక్ నటించడం మానెయ్యాలన్నారు. ఉగ్రవాదుల కార్యకలాపాల్లో ప్రభుత్వం మాత్రమే కాదు.. సైన్యం కూడా భాగస్వామి అని నొక్కి చెప్పారు. ‘‘ఐక్యరాజ్యసమితి నిషేధ జాబితాలోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులందరూ పాకిస్తాన్లో ఉన్నారు. వారు పెద్ద నగరాల్లో, పట్టపగలు పనిచేస్తారు. వారి చిరునామాలు తెలుసు. వారి కార్యకలాపాలు తెలుసు. కాబట్టి ప్రమేయం లేదని పాకిస్తాన్ నటించకూడదు’’అని జైశంకర్ హితవు పలికారు.

మందుగుండైన సిందూరం: ప్రధాని మోదీ
బికనెర్/జైపూర్: పహల్గాం ఉగ్రవాద దాడికి కేవలం 22 నిమిషాల్లో సరైన జవాబు ఇచ్చామని, ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. పవిత్ర సిందూరం మందుగుండుగా(గన్పౌడర్) మారితే ఏం జరుగుతుందో మన శత్రువులతోపాటు ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్ను మోకాళ్లపై కూర్బోబెట్టామని, మన సైనిక దళాలు అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించాయని, ఆపరేషన్ సిందూర్ను విజయవంతం చేశాయని ప్రశంసించారు. ప్రధాని మోదీ గురువారం రాజస్తాన్లో పర్యటించారు. పాకిస్తాన్ సరిహద్దులోని బికనెర్ జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించడం ఇదే మొదటిసారి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే 9 అతిపెద్ద ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశామని వెల్లడించారు. తన సిరల్లో రక్తం బదులు వేడివేడి సిందూరం ప్రవహిస్తోందని వ్యాఖ్యానించారు. భారత్లో జరిగే ప్రతి ఉగ్రదాడికి పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... అణ్వాయుధాలకు భారత్ భయపడదు ‘‘ఉగ్రవాద దాడికి భారత్ ప్రతిస్పందనను ప్రతీకార చర్యగా చూడొద్దు. ఇదొక కొత్త రకమైన న్యాయం. ఇది ఆపరేషన్ సిందూర్. ఇది ఆగ్రహం కాదు.. దేశ శక్తి సామర్థ్యాలకు ప్రతీక. ఇది నూతన భారతదేశం. పాకిస్తాన్తో వ్యాపారం, వాణిజ్యం జరిపే ప్రసక్తే లేదు. పొరుగు దేశంతో ఇకపై చర్చలంటూ జరిగితే కేవలం ఉగ్రవాదులు, పాక్ ఆక్రమిత కశీ్మర్(పీఓకే)పైనే జరుగుతాయి. అణ్వాయుధాలు చూపించి బెదిరిస్తామంటే ఇక్కడ బెదిరిపోయే వాళ్లు ఎవరూ లేరు. అణ్వస్త్రాల ముప్పు చూసి భారత్ భయపడదు. దేశంలో ఇకపై ఉగ్రదాడులు జరిగితే ఎలా బదులివ్వాలో మాకు బాగా తెలుసు. ముష్కర మూకలకు అర్థమయ్యే రీతిలోనే బుద్ధి చెప్తాం. ఉగ్రవాదులపై ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడులు చేయాలో మన సైనిక దళాలే నిర్ణయిస్తాయి. మన జవాన్లకు ఆ స్వేచ్ఛ ఉంది. ఉగ్రవాద దాడుల కుట్రదారులను, పాక్ ప్రభుత్వ అండతో చెలరేగిపోతున్న ఉగ్రవాదులను వేర్వేరుగా చూడం. వారందరినీ ఒక్కటిగానే పరిగణిస్తాం. ఆపరేషన్ సిందూర్ నుంచి ఈ మూడు సూత్రాలు తీసుకున్నాం. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదుల ఆటలు ఇకపై సాగవు. ఐసీయూలోకి చేరిన పాక్ ఎయిర్బేస్ బికనెర్ జిల్లాలోని నాల్ ఎయిర్బేస్పై దాడి చేయడానికి పాకిస్తాన్ సైన్యం ప్రయత్నించింది. కానీ, మన ఎయిర్బేస్కు ఎలాంటి నష్టం జరగలేదు. పాక్ చర్యకు బదులుగా మన సైన్యం పాకిస్తాన్లోని రహిమ్యార్ ఖాన్ ఎయిర్బేస్పై దాడికి దిగింది. దాంతో అది చాలావరకు ధ్వంసమైంది. ప్రస్తుతం ఐసీయూలో ఉంది. ఎప్పుడు బయటకు వస్తుందో ఎవరికీ తెలియదు. భారత్పై ప్రత్యక్ష యుద్ధంలో పాకిస్తాన్ ఎప్పటికీ నెగ్గలేదు. భారత్తో తలపడినప్పుడల్లా పరాజయమే చవిచూసింది. అందుకే ప్రత్యక్షంగా ఎదుర్కొనే సత్తా లేక ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుకుంటోంది. దొంగదెబ్బ తీయాలని చూస్తోంది. 2019లో బాగల్కోట్ వైమానిక దాడుల తర్వాత రాజస్తాన్లో మాట్లాడుతూ మన దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ తలవంచనివ్వబోనని ప్రతిజ్ఞ చేశా. అదే రాజస్తాన్ గడ్డపై దేశ ప్రజలకు మరో మాట చెబుతున్నా. మన ఆడబిడ్డల సిందూరం తుడిచేయాలని చూసే ఉగ్రవాదులను ఏరిపారేస్తాం. మన రక్తం పారించాలని కుట్రలు చేస్తే ప్రతి రక్తం బొట్టుకు ముష్కరులు మూల్యం చెల్లించక తప్పదు’’ అని మోదీ స్పష్టం చేశారు.ఉగ్రవాదులను ఎగుమతి చేసినంత కాలం భిక్షం ఎత్తుకోవాల్సిందే!‘‘ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ అమాయకులను హత్య చేస్తూ మన దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించాలన్నదే పాక్ ఎత్తుగడ. కానీ, ఇక్కడ భరతమాత సేవకుడు మోదీ ఉన్నాడు. తలెత్తుకొని నిల్చున్నాడు. మోదీ మనసు ప్రశాంతంగానే ఉండొచ్చు.. అతడి రక్తం మాత్రం సెగలు కక్కుతోంది. ఉగ్రవాదులను ఎగుమతి చేసినంత కాలం పాకిస్తాన్కు పూట గడవదు. భిక్షం ఎత్తుకోవాల్సిందే. ఇండియా నుంచి ప్రవహించే నదుల్లో వాటా కూడా దక్కదు. భారతీయుల రక్తంతో ఆటలాడితే అందుకు చెల్లించే మూల్యం ఊహించనంతగా ఉంటుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి. ఉగ్రవాద భూతాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయడమే మన సంకల్పం. దీన్నుంచి మనల్ని ప్రపంచంలోని ఏ శక్తి కూడా వేరుచేయలేదు. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో మన సంకల్పాన్ని ఇతర దేశాలకు తెలియజేయడానికే అఖిలపక్ష బృందాలను పంపించాం. పాకిస్తాన్ అసలు రూపాన్ని మొత్తం ప్రపంచానికి చూపిస్తాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. 103 అమృత్ భారత్ స్టేషన్లు ప్రారంభం ప్రధానమంత్రి మోదీ దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను గురువారం వర్చువల్గా ప్రారంభించారు. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో రూ.1,100 కోట్లతో రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేశారు. అభివృద్ధి చెందిన భారత్ కోసం ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టుల ఆధునీకరణ కోసం గత 11 ఏళ్లుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేష్ణోక్ స్టేషన్లో బికనెర్–ముంబై ఎక్స్ప్రెస్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అలాగే రైల్వేలు, రహదారులు, విద్యుత్, నీటి సరఫరా, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలకు సంబంధించిన రూ.26,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు బికనెర్ జిల్లాలోని ప్రఖ్యాత కర్ణి మాత ఆలయాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయం ఎలుకలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎటు చూసినా ఎలుకలే కనిపిస్తుంటాయి. భక్తులు వాటిని పవిత్రంగా భావిస్తారు.
ఎన్ఆర్ఐ

జార్ఖండ్లో శంకర నేత్రాలయ MESU ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరాలు
శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఆధ్వర్యంలో జార్ఖండ్లో రెండు కంటి శస్త్రచికిత్స శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. గిరిధీహ్ జిల్లాలోని బొగ్గు , మైకా తవ్వకాల మధ్యన , గ్రామీణ ప్రాంతమైన గాండాలే ఈ శిబిరం గురించి అవగాహన కల్పించారు. ఉచిత కంటిదృష్టి పరీక్షలు , ముత్యబిందు శస్త్రచికిత్సలు నిర్వహించారు.దేశంలోని అత్యంత వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు నాణ్యమైన కంటి వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో, అనుభవజ్ఞులైన వైద్యులు ,సహాయక సిబ్బందిని బస్సుల ద్వారా అక్కడికి పంపించాలన్న ఆలోచనతో గొప్ప శంకర నేత్రాలయ స్థాపకుడు పద్మభూషణ్ డా. ఎస్.ఎస్. బద్రినాథ్ దూరదృష్టిని చూపించారు. ఆసుపత్రులకు చేరలేని ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ ప్రజలకు, తమ స్వగ్రామంలోనే, ప్రయాణం లేకుండా, ఉచితంగా ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సా సదుపాయాలు ఎమ్ఈఎస్యూలు అందిస్తున్నాయి. వీల్పై ఆపరేషన్ థియేటర్ అనే వినూత్న ఆవిష్కరణ ద్వారా, అన్నివిధాలా అవసరమైన సాంకేతిక సామగ్రితో కూడిన శస్త్రచికిత్సలు ఎంతో అవసరమైన వారికీ అద్దెనైనా లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే కాదు-ఇది ఒక జీవితాంతం గుర్తుండిపోయే దాతృత్వం అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!ముగింపు రోజు, అన్ని SN సిబ్బంది, స్కూల్ టీచర్స్, వాలంటీర్లకు గుర్తింపు ప్రదానం చేశారు. పిల్లల పాఠశాల వారు క్యాంప్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు , 9 రోజులు క్యాంప్కు ప్రదేశం అందజేసేందుకు సహాయం చేసినందుకు బాక్సా ట్రస్ట్ RO వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. శంకర నేత్రాలయ స్పాన్సర్లు కన్నన్ వెంకటేశ్వర్ (MESU జార్ఖండ్ క్యాంప్ #113), స్వర్నిమ్ కనత్ , కార్టీక్ రామకృష్ణన్ (MESU జార్ఖండ్ క్యాంప్ #114), మరియు స్థానిక ప్రాయోజకుడు బాక్సా ట్రస్ట్ వారు ఈ రెండు MESU క్యాంప్లు #113 మరియు #114లో వారి సేవలను అందించి, గ్రామీణ భారతదేశంలో కంటి అనారోగ్యాన్ని నివారించడానికి మరొక అడుగు ముందుకేశారు.బాల రెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ చైర్మన్ డాక్టర్ ఎస్. సురేంద్రన్, అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు కౌశిక్ అదికారి, ఉజ్జల్ సిన్హా మరియు సంకర నేత్రాలయ USA వ్యవస్థాపకుడు శ్రీ SV ఆచార్య, EVP శ్యామ్ అప్పలి, సెక్రటరీ వంశీ ఎరువరం, ట్రస్టీ మెహర్ లంకా వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు గారికి ఈ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాధాలు తెలియజేశారు.

డబ్లిన్లో శ్రీవాసని కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో నిర్వహించారువిద్యనాథ్ రజిత, కళ్యాణ్ ఇనిస్ దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. అలాగే శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, పవన్ కుమార్ సహకారంతో శాస్రోక్తంగా ఏంతో విశేషమైన గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు, శ్రీనివాస్, సరిత సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు, తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. తదుపరి శిరీష, కవిత, రేణుక తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు.అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు, ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని , శ్రీమతి మౌనిక నడిపించారు. చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి పాటలు,నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు. పిల్లలందరికీ పినాక శర్మ ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండికార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు.చివరిగా అపూర్వ చారిటీ సంస్థ తరుపున ప్రవీణ్ నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి ,అందులో వాసవి అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పగా, జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్సైట్ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు
ఫిలింనగర్(హైదరాబాద్): ప్రేమ పేరుతో ఓ యువతిని మోసగించి..మరో యువతితో తిరుగుతున్న యువకుడిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. అర్చిత్ పసుపులేటి అనే యువకుడు 2023 ఓ యువతిని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ యువతితో సన్నిహితంగా ఉండడంతో గర్భందాల్చగా అబార్షన్ చేయించాడు. అనంతరం ఆమెను దూరం పెట్టాడు. ఇటీవల అర్చిత్ మరో యువతితో తిరుగుతున్నట్లు తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్చిత్తో పాటు అతని సోదరుడు, మామ, మరో ఇద్దరు స్నేహితులపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొంది. తనను మానసికంగా వేధిస్తుండడంతో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా ప్రవర్తించారని, ఆర్థికంగా దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొంది. తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు తోసేశారని, అర్ధరాత్రి రోడ్డుపై బలవంతంగా నడుచుకుంటూ ఫిలింనగర్ పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశానని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఆమె పోలీసులకు అందజేశారు. ఈ మేరకు పోలీసులు అర్చిత్తో పాటు సోదరుడు, మామ, మరో ఇద్దరిపై బీఎన్ఎస్ సెక్షన్ 69, 79, 89, 351 (3) కింద కేసు నమోదు చేశారు.

ఒంటరి మహిళలే రాము టార్గెట్.. 18 దారుణ హత్యలు!
ఘట్కేసర్(హైదరాబాద్): మహిళను హత్యచేసి మృతదేహాన్ని కాల్చిన నిందితుడికి 1వ అడిషనల్ జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 4, 2021న అంకుషాపూర్ రైల్వేట్రాక్ 218/16–18 మైలురాయి వద్ద ముళ్లపొదల్లో 35–45 ఏళ్లున్న గుర్తు తెలియని మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను అక్కడికి తీసుకొచ్చి గుర్తుపట్టకుండా ముఖం కాల్చివేసినట్లు కేసు నమోదైంది. అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబు దర్యాప్తు చేయగా.. మృతురాలు నగరానికి చెందిన దినసరి కూలీ కూర వెంకటమ్మగా తేలింది. సీసీ ఫుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా.. పోలీసులు సీసీ పుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి 18 మందిని హత్య చేసిన నిందితుడు సీరియల్ కిల్లర్ సంగారెడ్డి జల్లా కంది మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన మైనం రాములు (47)గా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్చేసి రిమాండ్కు తరలించి దర్యాప్తు తర్వాత చార్జ్షిట్ దాఖలు చేశారు. మహిళ హత్య కేసును ఛేదించిన అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబును పోలీస్ ఉన్నతాధికారులు అభినందించి అవార్డును అందజేశారు. ఇరు వాదనలు విన్న 1వ అడిషనల్ మేడ్చల్ జిల్లా న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు విధించారు.

బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంలో గ్యాంగ్రేప్
యశవంతపుర: మాజీ మంత్రి, రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అనుచరులు తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆర్ఎంసీ యార్డు పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. తాను బీజేపీ కార్యకర్తనని, మాట వినలేదని చెప్పి మునిరత్న తనపై వ్యభిచారం సహా పలు కేసులు పెట్టించి జైలుకు పంపాడని ఆమె ఆరోపించింది. 2023 జూన్లో కేసులు మాఫీ చేయిస్తానని ఎమ్మెల్యే అనుచరులు వసంత్, చెన్నకేశవ, కమల్ ఎమ్మెల్యే ఆఫీసుకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. ముఖంపై మూత్రం పోసి, ప్రమాదకరమైన జబ్బు వైరస్ను ఎక్కించారని పేర్కొంది. కాగా, మునిరత్నపై ఇదివరకే కాంట్రాక్టర్లకు బెదిరింపులు, హనీట్రాప్ తదితర కేసులు ఉన్నాయి. అరెస్టయి బెయిలుపై విడుదలయ్యారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే తాజా ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించలేదు.

మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడం మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమనే చెప్పాలి. ఆపరేషన్ కగార్ పేరిట తరుముతున్న సాయుధ పోలీసు బలగాలు..మరోవైపు ముంచుకొస్తున్న ఆనారోగ్య సమస్యలు.. కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీ కేడర్ను సతమతం చేస్తున్నాయి. ప్రధానంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న నాయకులంతా ఐదుపదుల వయస్సు దాటినవారే కావడంతో ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య వారిని వెంటాడుతూనే ఉంది. కొందరు కీలక నేతలను అనారోగ్యంతో కోల్పోతే, మరికొందరు ఎన్కౌంటర్లలో హతమవడం మావోయిస్టులను కలవర పెడుతోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ మెంబర్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ జూన్ 2023లో మృతి చెందారు. అంతకుముందే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ కమిటీ మెంబర్ యాపా నారాయణ (హరిభూషణ్) కరోనాతో మృతి చెందారు.మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) సైతం కిడ్నీలు ఫెయిల్ అవడం ఇతర అనారోగ్యంతో బాధపడుతూ బస్తర్ అటవీ ప్రాంతంలో చనిపోయారు. ఇక సెంట్రల్ కమిటీలోని కొందరు నేతలు సొంతగా నడవలేని స్థితిలోనూ ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సాయుధ బలగాల నుంచి తప్పించుకుని తిరగడం వారికి కష్టమవుతోందనే వాదనలు ఉన్నాయి. కీలక నేతలే టార్గెట్గా ఆపరేషన్లు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 డెడ్లైన్గా విధించడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసులు మావోయిస్టు కీలక నేతలనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఓవైపు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్మఢ్, బస్తర్, కర్రిగుట్టలు సహా కీలక ప్రాంతాలన్నింటిలోకి చొచ్చుకుని వెళుతూ దళాలు క్యాంపులు నిర్మిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తేనే మావోయిస్టులను మూలాల నుంచి దెబ్బ కొట్టవచ్చన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. గతంలోనూ ఇదే తరహా వ్యూహాలను అమలు చేశాయి. ఈ ఏడాది జనవరి 16న ఛత్తీస్గఢ్ జాపూర్ జిల్లా పరిధిలో చేసిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ను మట్టుపెట్టాయి. జనవరి 21న ఒడిశా మావోయిస్టు పార్టీ కార్యదర్శి చలపతి మరణించారు. 2024 డిసెంబర్లో ములుగు జిల్లా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో కుర్సుం మంగు అనే కీలక నేత చనిపోయారు. దంతెవాడ–బీజాపూర్ జిల్లా పరిధిలో 2024 సెప్టెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మాచర్ల ఏసోబు అలియాస్ రణ«దీర్ ఎన్కౌంటర్ అయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అత్యంత చురుకైన, ప్రమాకరమైన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా కోసం వేలాది మందితో కూడిన భద్రత బలగాలు గాలిస్తున్నాయి. క్రమంగా కుచించుకుపోతున్న పార్టీ మావోయిస్టుల స్థావరాలు భద్రత బలగాల హస్తగతం అవుతుండడం..వరుస ఘటనల్లో అగ్ర నాయకత్వాన్ని కోల్పోతుండడంతో మావోయిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ప్రస్తుతం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీలో వంద మంది లోపే సభ్యులు ఉన్నారని, వారిలోనూ 80 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నట్టు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.ఇలా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ మావోయిస్టు కమిటీల్లో కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోగా..ఉన్న వారు లొంగిపోతుండడంతో పార్టీ క్రమంగా కుచించుకుపోతోందని అంటున్నారు. తుడిచివేతే లక్ష్యంగా ‘కగార్’ దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో 2009లో కేంద్రం ఆపరేషన్ గ్రీన్హంట్ను చేపట్టింది. గడిచిన పదహారేళ్లలో ఈ కార్యక్రమం ఆపరేషన్ సమాధాన్, ప్రహార్గా కొనసాగి ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలను నలువైపుల నుంచి చుట్టుముట్టడం ద్వారా మావోయిస్టులను పూర్తిగా ఏరివేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా.. 1) ఆయా ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని కోసం సీఆర్పీఎఫ్, ఇండోటిబెటన్ పోలీస్, బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ, కోబ్రా ఇలా వివిధ పేర్లతో లక్ష మందికి పైగా జవాన్లను తయారు చేశారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున క్యాంపులు ఏరా>్పటు చేస్తున్నారు. 2) మావోయిస్టుల సమాచారం సేకరించడంలో భాగంగా డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిíÙయల్ ఇంటిలిజెన్స్లను వాడుతున్నారు. 3) తమ ఆ«దీనంలోకి వచి్చన ప్రాంతాల్లో వెనువెంటనే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్ను అమలు చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. 4) లొంగిపోవాలని భావించే మావోయిస్టులకు ఉదారంగా సరెండర్ పాలసీ అమలు. ఈ నాలుగు లక్ష్యాలతో ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న మొదలైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి క్యాంపులు రావడంతో నక్సలైట్ల కదలికలు పరిమితం అయ్యాయి. వారు దట్టమైన అడవుల్లో, షెల్టర్ జోన్లలో ఉండటాన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి గుర్తిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్లు చేసే క్రమంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. సరెండర్ పాలసీ కారణంగా లొంగుబాట్లు కూడా పెరిగాయి.
వీడియోలు


Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు


First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం


హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు


Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి


West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు


COVID Guidelines: ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్


సీఎం రేవంత్ బండారం మొత్తం బయటపడింది: కేటీఆర్


నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు


కేటీఆర్, హరీష్రరావు ఇంటికి వెళ్లి ఈ లేఖ తయారుచేశారు


బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?