హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో బ్రిటీషర్ని పెళ్లాడిన నటి (ఫొటోలు)
ఎలాంటి ఒప్పందాలు మేలు?
ఆర్థిక సార్వభౌమాధికారం, దీర్ఘకాల పోటీతత్వాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని ముఖ్య దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవాలి. ప్రస్తుతం 13 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ), 6 ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు అమలులో ఉన్నాయి. దశల వారీగా దిగుమతి సుంకాల తగ్గింపు; ఇతర దేశాల ద్వారా భారత్లోకి ప్రవేశి స్తున్న చైనా వస్తు ప్రవాహాన్ని అరికట్టడం; ఆహార ప్రాసెసింగ్, ఐటీ, టెక్స్టైల్స్, ఫార్మా, రసాయనాల విషయంలో భారత్కు ఉన్న పోటీతత్వాన్ని నిలుపుకోవడం; రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు రక్షణ లాంటి అంశాల విషయంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి. ఆయా వాణిజ్య ఒప్పందాలు భారత్కు మిశ్రమ ఫలితాలను అందించాయి. భారత్ – ఆసియాన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారత్కు వాణిజ్య లోటు అధికమైంది. దక్షిణ కొరియా విషయంలో భారత్ నుండి ఎగుమతుల కన్నా కొరియా నుండి దిగుమతులు అధి కంగా ఉన్నాయి. జపాన్, ఎస్ఏఎఫ్టీఏలో ఒప్పందాలు పరిమిత ప్రయోజనాలనే అందించాయి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియాలతో ఒప్పందాలు వాణిజ్యపరంగా ప్రయోజ నాన్ని కల్పించాయి.ఎదురయ్యే పరిణామాలుసంబంధిత లెజిస్లేటివ్, న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత యూకేతో జరిగిన వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తుంది. అటు ఈయూ కౌన్సిల్, యూరోపియన్ పార్లమెంట్; ఇటు భారత పార్లమెంటు ఆమోదం తర్వాత యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో జరిగిన ఒప్పందం ఖరారవుతుంది. భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం కొంత సమయం తీసుకొనే అవకాశం ఉంది. ఒప్పందాలు ఖరారయ్యే సమయంలో కొన్ని వ్యూహాత్మక సవాళ్లను భారత్ ఎదుర్కోవచ్చు. ఆ యా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వలన దిగుమతుల పెరుగుదలతో పాటు, సున్నితమైన రంగాలలో ఉపాధి నష్టాన్ని భారత్ చవిచూడవచ్చు. దిగుమతి సుంకాలు తగ్గించనప్పటికీ ఉత్పత్తుల సర్టిఫికేషన్, పర్యావరణ, శ్రామిక ప్రమాణాలు, శానిటరీ, ఫైటో శానిటరీ అంశాలు భారత్కు సమస్యగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి.వ్యవసాయ సబ్సిడీలు ఆ యా దేశాలలో అధికంగా ఉన్నందు వలన భారత రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ఈయూ, యూకే నుండి డైరీ ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్ దిగుమతులను నిరోధించే విధంగా భారత్ ఒప్పందం చేసుకోవాలి. ఈయూ చివరి నిమిషంలో ‘వాతావరణ అనుసంధాన వాణిజ్య నియమాలకు’ పట్టుబట్టే అవకాశం ఉంది. తద్వారా భారత్ నుండి ఎగుమ తయ్యే సిమెంటు, ఉక్కు, అల్యూమినియంపై ‘కార్బన్ ట్యాక్స్’ పడి, ఆయా ఉత్పత్తుల విషయంలో పోటీతత్వం తగ్గుతుంది. అమెరికా కూడా ఒప్పందం సమయంలో డిజిటల్ వాణిజ్య సరళీకరణ, పటిష్ఠమైన మేధా సంబంధిత హక్కులు, వ్యవసాయం, మెడికల్ డివైజెస్కు సంబంధించిన డిమాండ్లు తెచ్చే అవకాశం ఉంది. భారత్ కూడా ఫార్మా రంగం, హెచ్–1 బి వీసాల సరళీకరణ లాంటి అంశాలు లేవనెత్తవచ్చు.చేరకపోవడమే సముచితంచైనా కేంద్ర బిందువుగా ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’ (ఆర్సీఈపీ) ఏర్పాటయింది. ఆస్ట్రేలియా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆసియాన్ దేశాలు, న్యూజిలాండ్ ఇందులో సభ్య దేశాలు. దీని ఏర్పాటుకు సంబంధించిన చర్చలలో భారత్ పాల్గొన్న ప్పటికీ, ఒప్పందం సమయంలో సభ్యత్వం పొందడాన్ని విరమించు కొంది. ఈ ఒప్పందం వలన రైతులు, ఎంఎస్ఎంఈ సంస్థలకు నష్టం కలుగుతుందనీ, వాణిజ్య లోటు అధికమవుతుందనీ, ప్రాంతీయ వాణిజ్యంలో చైనా ఆధిపత్యం ఉంటుందనీ భారత్ భావించింది. డైరీ, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచ మార్కెట్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో భారత్ పోటీ ఎదుర్కొంటోంది. ఒప్పందం వలన గోధుమ, పామాయిల్, మిల్క్ పౌడర్ లాంటి ఉత్పత్తులు చౌకగా భారత్లోకి దిగుమతి అయినట్లయితే రైతులు నష్టపోయేవారు. ఆ యా దేశాలు అవలంబించే డంపింగ్ను నియంత్రించడానికి సరిపోను రక్షణ వలయం విషయంలో భారత్ వెనుకబడి ఉంది. రసాయనాలు, యంత్రాలు, ఉక్కు, ఎలక్ట్రానిక్స్, ఆట వస్తువులు చైనా నుండి భారత్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఎక్కువ. చౌక ధరలకు ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమయినప్పుడు ఆయా రంగాలకు సంబంధించిన పరిశ్రమలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తాయి. ఈ ఒప్పందంలో భారత్ భాగం కాకపోవడాన్ని సమర్థవంతమైన నిర్ణయంగా చూడాలి.ఏ వ్యూహం అవసరం?పశ్చిమ దేశాల మార్కెట్లతో పాటు చైనాపై అధికంగా ఆధార పడే కన్నా ఫార్మల్ అగ్రిమెంట్స్ లేకపోయినప్పటికీ కొన్ని దేశాలతో భారత్ వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోవాలి. ఆఫ్రికా ప్రస్తుత జనాభా 1.4 బిలియన్లు కాగా 2050 నాటికి 2.5 బిలియన్లకు చేరుతుందని అంచనా. ఆఫ్రికాలోని కెన్యా, నైజీరియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికాలతో వాణిజ్య ఒప్పందాలకు భారత్ ప్రయత్నించాలి. ఆఫ్రికాతో ఒప్పందం కారణంగా ఆహార భద్రత, శక్తి, ఖనిజాలు, అవస్థాపనా సౌకర్యాల ప్రాజెక్టులు, ఫార్మా రంగంలో భారత్కు వ్యూహాత్మక ప్రయోజనాలు కలుగుతాయి. వాణిజ్యపరమైన అడ్డంకులు తక్కువగా ఉండటంతో పాటు ఆఫ్రికా వృద్ధి రేటు అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. భారత్ ఉత్పత్తులకు స్థిరమైన డిమాండ్ ఉన్న మిడిల్ ఈస్ట్లోని యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్లతో వాణిజ్య సంబంధాలను మెరుగు పరచుకోవడానికి ప్రయత్నించాలి. ఆహారం, వ్యవ సాయ ఉత్పత్తులు, టెక్ట్స్టైల్స్, ఆభరణాలు, ఫార్మా, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, మెషినరీ, హ్యాండీక్రాప్ట్స్, ఆయుర్వేదిక్, హెర్బల్, వెల్నెస్ ఉత్పత్తులకు ఆ యా మార్కెట్లలో డిమాండ్ ఉంది.లాటిన్ అమెరికాలోని బ్రెజిల్, మెక్సికో, చిలీ, పెరూ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు అవసరం. ఇంజినీరింగ్ వస్తువులు, రసాయ నాలు, ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, టెక్స్టైల్స్ ఉత్పత్తులకు బ్రెజిల్లో డిమాండ్ అధికం. మొత్తంగా లాటిన్ అమెరికా మార్కెట్ లోనే వీటికి డిమాండ్ అధికంగా ఉన్నందువలన భారత్కు వాణిజ్య పరంగా లాభదాయకంగా ఉంటుంది. చిలీ, పెరూ, మెక్సికోతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొరకు చర్చలు జరుగుతున్న సమయంలో భారత్ వేగంగా స్పందించడం ద్వారా ఒప్పందాలను ఖరారు చేసుకోవాలి. తక్కువ దిగుమతి సుంకం, మార్కెట్ లభ్యత కారణంగా భారత్ ఎగుమతులు పెరుగుతాయి.‘స్మార్ట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని’ అవలంబించడం ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై దృష్టి సారించాలి. అత్యంత సరళీకరణ ఒప్పందాలు వాణిజ్య లోటు పెరుగుదలకు దారి తీస్తాయి. వస్తువులకు సంబంధించిన ఒప్పందాల వలన పరిమిత ప్రయోజనాలే సిద్ధిస్తాయి కనుక తయారీ, సేవలకు సంబంధించిన ఒప్పందాలపై భారత్ భవిష్యత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. వాణిజ్య ఒప్పందాల ద్వారా అధిక ప్రయోజనాలు పొందాలంటే శ్రామిక మార్కెట్లు, లాజిస్టిక్స్, తయారీ రంగం, సేవల వాణిజ్యం, మౌలిక సౌకర్యాల రంగాలలో సంస్కరణలు అవసరం.డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్ఛార్జి),ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్
హలీమ్ను ఎలా తయారు చేస్తారో తెలుసా?
సాక్షి,హైదరాబాద్: రంజాన్ మాసం అంటే హలీమ్కి పెట్టింది పేరు. ముస్లిం సోదరులు ఉపవాసం ముగిసిన తర్వాత ఇఫ్తార్ సమయంలో హలీమ్ వడ్డించడం ఒక సంప్రదాయంగా మారింది. గోధుమలు, మాంసం, పప్పులు, మసాలాలు కలిపి గంటల తరబడి మెల్లగా ఉడికించే ఈ వంటకం బలవర్ధకమైన ఆహారం మాత్రమే కాదు. రంజాన్ సమయంలో ఐక్యత, పంచుకోవడం, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుంది.హలీమ్కి హైదరాబాద్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజాం కాలంలో ఇది రాజభవన విందుల్లో మాత్రమే లభించేది. తర్వాత సాధారణ ప్రజలలో విస్తరించి ప్రతి ఒక్కరినీ మైమరిచిపోయేలా చేసింది.2010లో హైదరాబాద్ హలీమ్కి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) గుర్తింపు కూడా లభించింది. రంజాన్ మాసంలో హలీమ్ అంటే వంటకం మాత్రమే కాదు, ఒక భావోద్వేగం, సంప్రదాయం. అలాంటి హైదరాబాదీ స్పెషల్ హలీమ్ను ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం వీడియోను క్లిక్ చేసి వీక్షించండి.
జమ్మూలో ఎన్కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టులు హతం
జమ్మూకశ్మీర్లోని కిష్వార్తా జిల్లాలోని మారుమూల ప్రాంతంలో భద్రతా బలగాలకు తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. సైన్యం జరిపిన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్లో ముగ్గుర ఉగ్రవాదులు హతమయినట్లు తెలుస్తోంది. జమ్మూలోని. మృతిచెందిన ఉగ్రవాదులు పాకిస్థాన్లోని జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రసంస్థతో సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే మృతిచెందిన ఉగ్రవాదుల నుండి ఏకే-47 రైఫిల్స్తో పాటు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.అయితే దేశంలోకి ఉగ్రవాదుల ప్రవేశాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని అధికారులు అన్నారు. వేట కొనసాగుతుందని శాంతికి భంగం కలిగించే వారికి ఎట్టిపరిస్థితుల్లో భారత్లో ఆశ్రయం దొరకదని ఆర్మీ అధికారులు తెలిపారు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్ ప్రాంతంలో భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దులోకి ప్రవేశించకుండా ఆధునాతన డ్రోన్లు నిఘా కెమెరాలతో పహారా కాస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ జమ్మూ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లలో దాదాపు ఆరుగురు టెర్రరిస్టులు హతమైనట్లు అధికారులు తెలిపారు.
కాళేశ్వరాన్ని వదిలేయం వాడుకలోకి తెస్తాం: సీఎం రేవంత్
టీమిండియా కొంపముంచిన గంభీర్.. నెటిజన్లు ఫైర్
ముత్యాలూ సజ్జలూ
ఆరా ఆఫ్ ఉస్తాద్
ఎలాంటి ఒప్పందాలు మేలు?
మా ఓటమి కారణమదే.. మళ్లీ బలంగా తిరిగొస్తాం: సూర్యకుమార్
‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. పెళ్లిపై స్పందించిన విజయ్, రష్మిక
టీమిండియా జోరుకు బ్రేక్.. సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి
అభిషేక్ మరో 'సారీ'.. సౌతాఫ్రికాపై అట్టర్ ప్లాప్
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. తొలి భారత బౌలర్గా
అల్లు అర్జున్ పార్టీ.. ఉపాసన, రామ్ చరణ్తో పాటు సెలబ్రిటీలు
అది బంగారాన్ని మించిపోతుంది..: కియోసాకి
T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్!
కరెంటు పనికి వచ్చి.. యువతిపై కన్నేసి..
పవిత్ర ఉన్నప్పుడు నాన్న సైలెంట్: నరేశ్ కుమారుడు
పెరుగుపై పేరుకునే నీరు పారబోస్తున్నారా..?
తొలిసారి కూతురి ఫోటో షేర్ చేసిన అర్జున్
మీరేం కంగారు పడకండి సార్! తిరుపతిలో 6, కాశిబుగ్గలో 9, సింహాచలంలో 10 మంది చనిపోతేనే మనబాబుగారు రాజీనామా మాట ఎత్తలేదు!!
ఈ రాశి వారికి వ్యాపారవృద్ధి.. ఆస్తి లాభం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
దంపతులకు మరణ శిక్ష.. యూపీ కోర్టు సంచలన తీర్పు
ఇది నాకు మరో జీవితం.. స్టేజీపై ఏడ్చేసిన వరలక్ష్మి
హ్యాట్రిక్ కొట్టిన పసిడి.. వెండి ఒక్కసారిగా రూ.20 వేలు..
వసూళ్లు చూసి నమ్మలేకపోతున్నాను: సుహాస్
ఈ రాశి వారికి శుభవార్తలు.. రాబడి పెరుగుతుంది
మైనర్ బాలుడితో కోడలు వివాహేతర బంధం..!
సిగ్గులేకుండా అబద్ధాలు.. నష్టపోయింది మేమే: బంగ్లాదేశ్ కోచ్ ఫైర్
ఏక సభ్య కమిషన్
నెలసరి పోరాటం
ఈ మూవీకి ఫ్యామిలీస్ దూరంగా ఉండండి.. చూస్తే సీఎం మెచ్చుకుంటారు
కాళేశ్వరాన్ని వదిలేయం వాడుకలోకి తెస్తాం: సీఎం రేవంత్
టీమిండియా కొంపముంచిన గంభీర్.. నెటిజన్లు ఫైర్
ముత్యాలూ సజ్జలూ
ఆరా ఆఫ్ ఉస్తాద్
ఎలాంటి ఒప్పందాలు మేలు?
మా ఓటమి కారణమదే.. మళ్లీ బలంగా తిరిగొస్తాం: సూర్యకుమార్
‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. పెళ్లిపై స్పందించిన విజయ్, రష్మిక
టీమిండియా జోరుకు బ్రేక్.. సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి
అభిషేక్ మరో 'సారీ'.. సౌతాఫ్రికాపై అట్టర్ ప్లాప్
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. తొలి భారత బౌలర్గా
అల్లు అర్జున్ పార్టీ.. ఉపాసన, రామ్ చరణ్తో పాటు సెలబ్రిటీలు
అది బంగారాన్ని మించిపోతుంది..: కియోసాకి
T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్!
కరెంటు పనికి వచ్చి.. యువతిపై కన్నేసి..
పవిత్ర ఉన్నప్పుడు నాన్న సైలెంట్: నరేశ్ కుమారుడు
పెరుగుపై పేరుకునే నీరు పారబోస్తున్నారా..?
తొలిసారి కూతురి ఫోటో షేర్ చేసిన అర్జున్
మీరేం కంగారు పడకండి సార్! తిరుపతిలో 6, కాశిబుగ్గలో 9, సింహాచలంలో 10 మంది చనిపోతేనే మనబాబుగారు రాజీనామా మాట ఎత్తలేదు!!
ఈ రాశి వారికి వ్యాపారవృద్ధి.. ఆస్తి లాభం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
దంపతులకు మరణ శిక్ష.. యూపీ కోర్టు సంచలన తీర్పు
ఇది నాకు మరో జీవితం.. స్టేజీపై ఏడ్చేసిన వరలక్ష్మి
హ్యాట్రిక్ కొట్టిన పసిడి.. వెండి ఒక్కసారిగా రూ.20 వేలు..
వసూళ్లు చూసి నమ్మలేకపోతున్నాను: సుహాస్
ఈ రాశి వారికి శుభవార్తలు.. రాబడి పెరుగుతుంది
మైనర్ బాలుడితో కోడలు వివాహేతర బంధం..!
సిగ్గులేకుండా అబద్ధాలు.. నష్టపోయింది మేమే: బంగ్లాదేశ్ కోచ్ ఫైర్
ఏక సభ్య కమిషన్
నెలసరి పోరాటం
ఈ మూవీకి ఫ్యామిలీస్ దూరంగా ఉండండి.. చూస్తే సీఎం మెచ్చుకుంటారు
ఫొటోలు
లాంచనంగా మొదలైన రిషభ్ శెట్టి 'జై హనుమాన్' (ఫొటోలు)
లక్కీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్-1 లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
సరస్వతి మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
విశ్వక్ సేన్ కల్ట్ మూవీ టీజర్ లాంఛ్ (ఫొటోలు)
హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో బ్రిటీషర్ని పెళ్లాడిన నటి (ఫొటోలు)
సోఫీ షైన్ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
పళని మురుగన్ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)
అంబానీ ఇంద్రభవనానికి హిల్లరీ క్లింటన్ (ఫోటోలు)
నరేశ్కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)
సినిమా
'ఉస్తాద్ భగత్ సింగ్' రెండో పాట రిలీజ్
పవన్ కల్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. మార్చి 26న థియేటర్లలోకి రానుంది. అందుకు తగ్గట్లే ప్రమోషన్లు మొదలుపెట్టారు. గతంలో 'దేఖ్ లేంగే సాలా' పేరుతో ఓ పాట రిలీజ్ చేయగా.. ఇప్పుడు 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పేరుతో మరో సాంగ్ విడుదల చేశారు.'మెడపై ముట్టుకుంటే తొడ గొట్టినట్లే..' అంటూ సాగే ఈ పాటలో ఈ ఒక్క లైన్ తప్పితే మిగతా లిరిక్స్ ఏమంత ఆకట్టుకునేలా అయితే లేవు. దానికి తోడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే నచ్చేలా ఈ సాంగ్ కంపోజ్ చేసినట్లు అనిపిస్తుంది. ట్యూన్ కూడా రెగ్యులర్గానే అనిపించింది. పాటలో చాలావరకు పవన్ మేనరిజమ్నే చూపించారు. సినిమాలో ఓ డైలాగ్తో ఈ పాట పుట్టిందని దర్శకుడు హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యాట్యూబ్లో ఓకే ఓకే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?ఇకపోతే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా.. దళపతి విజయ్ చేసిన 'తెరి' రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. టీమ్ ఈ విషయాన్ని ఖండించింది గానీ చాలామంది నెటిజన్లకు ఇంకా ఈ సందేహం అలానే ఉండిపోయింది. దానికి తోడు ఈ మూవీపై ఇప్పటివరకు అయితే పెద్దగా బజ్ కూడా లేదు. అలానే ధురంధర్ 2, టాక్సిక్ చిత్రాలు రిలీజైన తర్వాత వారమే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరి వాటి నుంచి పోటీ తట్టుకుని ఎలా నిలబడుతుందనేది కూడా చూడాలి.
సీరియల్ బ్యూటీ రొమాంటిక్ యాక్షన్ మూవీ.. టీజర్ రిలీజ్
స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన జ్యోతిరాయ్.. 'గుప్పెడంత మనసు' సీరియల్లో జగతి మేడమ్గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కొన్నేళ్ల క్రితం ఉన్నట్లుండి పూర్తిగా సీరియల్స్ చేయడం తగ్గించేసిన ఈమె, సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే 'కిల్లర్' పేరుతో తెరకెక్కుతున్న చిత్రం నుంచి అప్డేట్ వచ్చేసింది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: సమంత నుంచి సర్ప్రైజ్.. పోస్ట్ వైరల్)సీరియల్లో పద్ధతి అయిన పాత్రల్లో కనిపించిన జ్యోతిరాయ్.. ఈ సినిమాలో సూపర్ ఉమన్ తరహా పాత్ర చేసినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. టెరర్రిస్ట్(ఉగ్రవాది), వ్యాంపైర్(రక్త పిశాచి), స్పై(గూఢచారి) అనే కన్ఫ్యూజన్.. జ్యోతి పోషించిన పాత్రలో చూపించారు. ఓవైపు ఫుల్ రొమాన్స్ చూపిస్తూనే మరోవైపు ఈమె పాత్రతో యాక్షన్ కూడా చేయించారు. ఈమె భర్త పూర్వజ్.. ఇదే మూవీలో పోలీస్గా నటించాడు. టీజర్ అయితే ఆసక్తికరంగానే ఉంది. మరి మూవీ ఎలా ఉంటుందనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)
రుక్మిణి వసంత్ స్టైల్.. కాజల్ అగర్వాల్ అదే గ్లామర్
ముద్దుగా మెరిసిపోతున్న రుక్మిణి వసంత్వయసు పెరుగుతున్నా అదే గ్లామర్తో కాజల్పార్టీలో చిల్ అయిపోతున్న 'ధురంధర్' ఆయేషాచీరలో అందంగా మాయ చేస్తున్న శ్రీలీలజపాన్ ట్రిప్ వేసిన హీరోయిన్ నివేదా పేతురాజ్అల్లు వారి పార్టీలో మిహీక-శ్రీలీల చిల్ మోడ్ View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier)
'ది కేరళ స్టోరీ-2' డబ్బు కోసం చిచ్చు పెడుతున్నారు: ప్రముఖ దర్శకుడు
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ది కేరళ స్టోరీ-2 చిత్రంపై మండిపడ్డారు. రెండేళ్ల క్రితం విడుదలైన ది కేరళ స్టోరీ మూవీకి సీక్వెల్గా ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ తెరకెక్కించారు. సన్షైన్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్లాల్ షా ‘ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్’ను నిర్మించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ వివాదస్పదంగా మారింది. ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై దర్వకుడు అనురాగ్ కశ్యప్ రియాక్ట్ అయ్యారు.ఫిల్మ్ఫేర్ అవార్డుల సందర్భంగా కొచ్చిలో కనిపించిన అనురాగ్ కశ్యప్ను కేరళ స్టోరీ-2పై మాట్లాడమని మీడియా ప్రతినిధులు కోరడంతో ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఈ మూవీ కేవలం డబ్బు సంపాదించుకోవడానికి చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని శక్తులు ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలను కూడా కల్పితంగా తెరకెక్కించి కొందరు లాభపడాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్పారు. అందులో చూపినట్లు ఎవరైనా బీఫ్ తినిపిస్తారా.. కనీసం కిచిడీని కూడా అలా తినిపించరు కదా అంటూ భగ్గున్నారు. ఈ సినిమా మేకర్స్ అత్యాశపరులుగా కనిపిస్తున్నారు. వాళ్లు కేవలం డబ్బు కోసం మాత్రమే ఇలాంటి కథలు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. 'ది కేరళ స్టోరీ-2' సినిమా ‘విద్వేషపూరిత ప్రోపగాండా’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
క్రీడలు
వారెవ్వా బుమ్రా.. లెగ్ స్టంప్ ఎగిరిపోయిందిగా? వీడియో
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా ప్రోటీస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ను బుమ్రా ఔట్ చేసిన తీరు గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే.జస్ప్రీత్ అద్భుతమైన బంతితో డికాన్ను బోల్తా కొట్టించాడు. బుమ్రా వేసిన బంతికి డికాక్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 2 ఓవర్ వేసిన బుమ్రా.. ఐదో బంతిని నిప్-బ్యాకర్ డెలివరీగా సంధించాడు. అయితే ఆ బంతిని డి కాక్ ఎటువంటి ఫుట్ వర్క్ లేకుండా స్లాగ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి కాస్త లో-బౌన్స్గా వచ్చి బ్యాట్ను మిస్స్ అయ్యి లెగ్ స్టంప్ను గిరాటేసింది. ఇది చూసిన డికాక్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. జస్ప్రీత్ దెబ్బకు డికాక్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ను కూడా బుమ్రా పెవిలియన్కు పంపాడు.తుది జట్లుభారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడిJasprit Bumrah wastes no time and removes the danger man, Quinton de Kock, in this all-important Super 8 clash. 🔥ICC Men's #T20WorldCup | SUPER 8 | #INDvSA | LIVE NOW 👉 https://t.co/dZWPZfqfbO pic.twitter.com/23RqtAxaoq— Star Sports (@StarSportsIndia) February 22, 2026
భారత్పై సౌతాఫ్రికా ఘన విజయం
India vs South Africa Super 8 live updates: అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. సఫారీ బౌలర్ల దాటికి 111 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో శివమ్ దూబే(42) టాప్ స్కోరర్గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్ మూడు, బాష్ రెండు వికెట్లు సాధించారు.ఓటమికి చేరువలో భారత్15 ఓవర్ వేసిన కేశవ్ మహారాజ్ బౌలింగ్లో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్దీప్ సింగ్ ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ 8వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.భారత్ ఆరో వికెట్ డౌన్86 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత విజయానికి 34 బంతుల్లో 102 పరుగులు కావాలి.పీకల్లోతు కష్టాల్లో భారత్.. కెప్టెన్ సూర్య ఔట్టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కార్భిన్ బాష్ బౌలింగ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(18) ఔటయ్యాడు. క్రీజులోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. భారత్ విజయానికి 64 బంతుల్లో 134 పరుగులు కావాలి.భారత్ నాలుగో వికెట్ డౌన్43 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. బాష్ బౌలింగ్లో ఔటయ్యాడు.అభిషేక్ శర్మ ఔట్అభిషేక్ శర్మ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. జాన్సెన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. 7 ఓవర్లకు భారత్ స్కోర్: 42/3తిలక్ వర్మ ఔట్5 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన తిలక్ వర్మ.. జాన్సెన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.భారత్ తొలి వికెట్ డౌన్188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఐడైన్ మార్క్రమ్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ డౌకటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. అదేవిధంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫోరుతో తన ఖాతా తెరిచాడు.భారత్ టార్గెంట్ ఎంతంటే?అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో సౌతాఫ్రికా బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు.డేవిడ్ మిల్లర్(63) టాప్ స్కోరర్ నిలవగా.. బ్రెవిస్(45), స్టబ్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ రెండు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు.సౌతాఫ్రికా ఆరో వికెట్ డౌన్157 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన మార్కో జాన్సెన్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు.సౌతాఫ్రికా ఐదో వికెట్ డౌన్.. మిల్లర్ ఔట్డేవిడ్ మిల్లర్ రూపంలో సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 63 పరుగులు చేసిన మిల్లర్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు.సౌతాఫ్రికా నాలుగో వికెట్ డౌన్డెవాల్డ్ బ్రెవిస్ రూపంలో సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.నిలకడగా ఆడుతున్న మిల్లర్, బ్రెవిస్30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు మిల్లర్, బ్రెవిస్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 64 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 10 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్రికెల్టన్ రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రికెల్టన్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 6 ఓవర్లకు ప్రోటీస్ స్కోర్: 41/3సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్12 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్(4).. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు.సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2 ఓవర్లకు ప్రోటీస్ స్కోర్: 10/1టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సూపర్-8 పోరులో ప్రోటీస్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది.గత మ్యాచ్కు దూరమైన లుంగీ ఎంగిడి, జాన్సెన్, కేశవ్ మహారాజ్ జట్టులోకి వచ్చారు. భారత్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. వాషింగ్టన్ సుందర్ను జట్టులో కొనసాగించారు. దీంతో అక్షర్ పటేల్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యాడు.తుది జట్లుభారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి
ఆసియా కప్ 2026 విజేతగా భారత్
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్ను భారత్ వరుసగా రెండో ఎడిషన్లోనూ కైవసం చేసుకుంది. బ్యాంకాక్ వేదికగా జరిగిన 2026 ఎడిషన్లో భారత-ఏ జట్టు విజేతగా అవతరించింది. ఇవాళ (ఫిబ్రవరి 22) జరిగిన ఫైనల్లో టీమిండియా 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్-ఏపై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ తొలి ఎడిషన్ (2023) ఫైనల్లోనూ భారత-ఏ జట్టు బంగ్లాదేశ్-ఏపైనే విజయం సాధించే టైటిల్ను చేజిక్కించుకుంది.నేటి ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. తేజల్ హసబ్నిస్ (51 నాటౌట్), కెప్టెన్ రాధా యాదవ్ (36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల చేసింది. వీరిద్దరు కాకుండా భారత ఇన్నింగ్స్లో వ్రింద దినేశ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేసింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్ 1, ప్రేమా రావత్ 4, మిన్నూ మణి డకౌటయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో అజేయంగా నిలిచింది.బంగ్లా బౌలర్ ఫాహిమ ఖాతూన్ (4-0-25-4) అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ను కట్టడి చేసింది. మరో బౌలర్ ఫాతిమా జహా సోనియా (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేసింది. ఫర్జానా ఎస్మిన్ (4-0-30-1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్ 3 ఓవర్లలో 12 పరుగులు.. ఫరీహా త్రిస్న 3 ఓవర్లలో 23 పరుగులు.. లతా మొండల్, సదియా అక్తర్ తలో ఓవర్ వేసి 14, 9 పరుగులిచ్చారు.అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్-ఏ జట్టు తడబడింది. భారత బౌలర్లు ప్రేమా రావత్ (4-0-12-3), తనూజా కన్వర్ (3.1-0-11-2), సోనియా మెంధియా (4-0-21-2), కెప్టెన్ రాధా యాదవ్ (4-0-16-1), సైమా ఠాకోర్ (2-0-11-1), మిన్నూ మణి (2-0-17-1) ధాటికి 19.1 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. బంగ్లా ఇన్నింగ్స్లో 20 పరుగులు చేసిన షమీమా సుల్తానా టాప్ స్కోరర్గా నిలిచింది. సర్మిన్ సుల్తానా (18), కెప్టెన్ ఫాతిమా ఖాతూన్ (14), సదియా అక్తర్ (10) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. ప్రేమా రావత్ 3 వికెట్లు తీయడంతో పాటు 3 క్యాచ్లు కూడా పట్టి భారత గెలుపులో కీలకపాత్ర పోషించింది.
ఆసియా కప్ ఫైనల్.. స్వల్ప స్కోర్కే పరిమితమైన టీమిండియా
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీ ఫైనల్లో భారత-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్లు తలపడుతున్నాయి. బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల స్కోర్కు మాత్రమే పరిమితమైంది. బంగ్లా బౌలర్ ఫాహిమ ఖాతూన్ (4-0-25-4) అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ను కట్టడి చేసింది. మరో బౌలర్ ఫాతిమా జహా సోనియా (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేసింది. ఫర్జానా ఎస్మిన్ (4-0-30-1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్ 3 ఓవర్లలో 12 పరుగులు.. ఫరీహా త్రిస్న 3 ఓవర్లలో 23 పరుగులు.. లతా మొండల్, సదియా అక్తర్ తలో ఓవర్ వేసి 14, 9 పరుగులిచ్చారు.భారత్ ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే అది తేజల్ హసబ్నిస్ (51 నాటౌట్), కెప్టెన్ రాధా యాదవ్ (36) చలవ వల్లే. వీరిద్దరు కాకుండా వ్రింద దినేశ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్ 1, ప్రేమా రావత్ 4, మిన్నూ మణి డకౌటయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో అజేయంగా నిలిచింది.అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ మాత్రమే కోల్పోయి 26 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాలంటే 90 బంతుల్లో మరో 109 పరుగులు చేయాలి. కాగా, సెమీఫైనల్స్లో భారత్ శ్రీలంకపై, బంగ్లాదేవ్ పాకిస్తాన్పై విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించాయి.
న్యూస్ పాడ్కాస్ట్
తాత్కాలిక సుంకాలు 10 శాతం నుంచి 15 శాతానికి పెంపు... వెంటనే అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు చెల్లవ్... పన్ను విధింపు కాంగ్రెస్ అధికారం మాత్రమే... అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
చంద్రబాబుదే కల్తీ పాపం.. కల్తీ నెయ్యి సరఫరా జరిగింది, వినియోగించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బాబు సర్కారు దగా... ఉప ప్రణాళిక నిధుల్లో 27 వేల కోట్ల రూపాయలు కోత
హెరిటేజ్తో ఇందాపూర్ డెయిరీ బంధంపై అట్టుడికిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి
నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచల తీర్పు.. లొంగిపోవాల్సిందే..!
ఏపీలో వ్యవసాయం.. బాబు సర్కారులో అపాయం
ఆంధ్రప్రదేశ్లో శైవక్షేత్రాల్లో భక్తుల భద్రతను గాలికొదిలేసిన బాబు సర్కారు
పన్నుల బాదుడు, అప్పుల పద్దు తప్ప సంపద సృష్టి, సూపర్ సిక్స్ అమలు జాడలేని ఏపీ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ మంటలు... విద్యార్థుల ఫీజుల కోసం చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు
బిజినెస్
ఫారెక్స్ ఆల్టైమ్ హై.. బంగారం 128.46 బిలియన్ డాలర్లు
ముంబై: విదేశీ మారకం నిల్వలు ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఫిబ్రవరి 13తో ముగిసిన వారంలో 8.66 బిలియన్ డాలర్ల మేర పెరిగి 725.72 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. అంతుకుముందు ఫిబ్రవరి6తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 6.71 బిలియన్ డాలర్ల మేర తగ్గి 717.06 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో నమోదైన 723.77 బిలియన్ డాలర్లు పూర్వపు గరిష్ట స్థాయిగా ఉంది. ఫిబ్రవరి 13తో ముగిసిన వారంలో కరెన్సీ ఆస్తులు (విదేశీ మారకం నిల్వల్లో అధిక భాగం) నికరంగా 3.55 బిలియన్ డాలర్లు పెరిగి 573.60 బిలియన్ డాలర్లకు చేరాయి. డాలర్లతోపాటు, యూరో, పౌండ్, యెన్ రూపంలో విదేశీ కరెన్సీ ఆస్తులున్నాయి. బంగారం రూపంలో మారకం నిల్వలు 4.99 బిలియన్ డాలర్ల మేర పెరిగి 128.46 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) 103 మిలియన్ డాలర్లు పెరిగి 18.92 బిలియన్ డాలర్లకు చేరాయి.
మౌలిక రంగం మందగమనం
న్యూఢిల్లీ: కీలక మౌలిక రంగాల్లో పనితీరు జనవరిలో చెప్పుకోతగ్గ స్థాయిలో నిదానించింది. వృద్ధి 4 శాతానికి పరిమితమైంది. గతేడాది జనవరిలో వృద్ధి రేటు 5.1 శాతం కాగా, గత డిసెంబర్లోనూ 4.7 శాతం స్థాయిలో ఉండడం గమనించొచ్చు. ముఖ్యంగా మడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి తగ్గిపోవడం వృద్ధిపై ప్రభావం చూపించింది. రిఫైనరీ ఉత్పత్తుల వృద్ధి సైతం ఫ్లాట్గా నమోదైంది. ఇక బొగ్గు ఉత్పత్తి 3.1 శాతానికి పరిమితమైంది. 2025 జనవరిలో బొగ్గు ఉత్పత్తి 4.6 శాతంగా ఉంది. సిమెంట్ ఉత్పత్తి 10.7 శాతం వృద్ధికి తగ్గింది. 2025 జనవరిలో ఇది 14.3 శాతం పెరగడం గమనార్హం. ఎరువులు, స్టీల్, విద్యుదుత్పత్తి గతేడాది జనవరితో పోలి్చతే సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి 2.8 శాతానికి తగ్గింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 4.5 శాతంగానే ఉంది. ఎనిమిది రంగాలకు గాను ఏడింటిలో వృద్ధి తగ్గుముఖం పట్టినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్ పేర్కొన్నారు. ఈ ప్రకారం పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2025 డిసెంబర్లో ఉన్న 7.8 శాతం నుంచి ఈ ఏడాది జనవరిలో 5.5 శాతానికి తగ్గొచ్చని అంచనా వేశారు.
డిజిటల్ విప్లవం: క్యాష్కు చెక్.. యూపీఐదే హవా!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం సామాన్యుడి జీవనశైలిని సమూలంగా మార్చేసింది. చిల్లర కష్టాలకు చెక్ పెడుతూ.. గల్లీ లోని కిరాణా షాపు నుంచి మల్టీప్లెక్స్ల వరకు ఎక్క డ చూసినా ఇప్పుడు ‘స్కాన్ అండ్ పే’ మంత్రమే మార్మోగుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, రూపే డెబిట్ కార్డులు, తక్కువ–విలువ కలిగిన భీమ్–యూపీఐ లావాదేవీల వల్ల దేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ మేరకు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) సంయుక్తంగా విడుదల చేసిన ‘సామాజిక–ఆర్థిక ప్రభావ విశ్లేషణ’ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనాన్ని ఇప్సోస్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించింది. యూపీఐ సంచలనం.. రికార్డుల మోత గత ఎనిమిదేళ్ల వ్యవధిలో దేశంలో డిజిటల్ లావాదేవీలు ఏకంగా 11 రెట్లు పెరిగాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2,071 కోట్లుగా ఉన్న ఆన్లైన్ లావాదేవీల సంఖ్య 2024–25 నాటికి 22,831 కోట్లకు చేరింది. మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో ఒకప్పుడు కేవ లం 4 శాతంగా ఉన్న యూపీఐ వాటా.. ఇప్పు డు ఏకంగా 80 శాతానికి చేరుకుని అగ్రగామిగా నిలిచింది. పీర్–టు–మర్చంట్ అంటే వినియోగదారు లు వ్యాపారులకు చేసే చెల్లింపుల్లో 26 రెట్ల భారీ వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్–టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 49% వాటాతో మన దేశం గ్లోబల్ లీడర్గా కొనసాగుతోంది. తగ్గుముఖం పట్టిన ఏటీఎం క్యూలు దేశంలో యూపీఐ వాడకం విపరీతంగా పెరగడంతో జేబులో నగదు పెట్టుకుని తిరిగే వారి సంఖ్య గ ణనీయంగా తగ్గింది. నివేదిక ప్రకారం.. 59% మంది వినియోగదారులు, 57% మంది వ్యాపారులు తమ దైనందిన జీవితంలో నగదు వాడకం బాగా తగ్గిపోయిందని స్పష్టం చేశారు. నగదు డ్రా చేసేందుకు బ్యాంకులకు వెళ్లే వినియోగదారుల సంఖ్య 69% మేర తగ్గిపోగా, ఏటీఎంల నుంచి డబ్బు లు డ్రా చేయడం 62% మేర పడిపోయింది. వ్యాపారుల్లో ఏటీఎం విత్డ్రాలు 61% మేర తగ్గాయి. జీడీపీకి భారీ ఆర్థిక ఊతం నగదు నిర్వహణ ఖర్చులు తగ్గడం, డిజిటల్ లావాదేవీల్లో పారదర్శకత పెరగడం ద్వారా యూపీఐ ఏకంగా భారత జీడీపీకి (2022 సంవత్సరంలో) అదనంగా 16.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.3 లక్షల కోట్లు) జోడింపును అందించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. లావాదేవీలపై అదనపు రుసుములు లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. మారుమూల ప్రాంతాల్లోనూ మారుమోగుతున్న ‘స్కాన్ అండ్ పే’ డిజిటల్ చెల్లింపుల మద్దతు కేవలం మహానగరాలకే పరిమితం కాలేదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, మారుమూల ప్రాంతాల్లోనూ యూపీఐ క్యూఆర్ కోడ్లు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. వృద్ధి రేటును గమనిస్తే.. లక్షదీ్వప్లో ఏకంగా 136%, మేఘాలయలో 83%, జమ్మూకాశీ్మర్లో 76% మేర యూపీఐ లావాదేవీల వృద్ధి నమోదైంది. వినియోగదారులు ఏమనుకుంటున్నారు? చాలా సులభంగా వాడుకునే వీలుండటం (63%), తక్షణమే ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ జరగడం (59%) వల్లే యూపీఐను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు వినియోగదారులు సర్వేలో తెలిపారు. క్యాష్బ్యాక్ ఆఫ ర్లు (52%), మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యం (37%), మెరుగైన భద్రతా ఫీచర్లు (36%) లాంటివి డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నా యి. మరింత మందికి చేరువయ్యేందుకు స్థానిక భాష ల్లో యాప్స్ అందుబాటులో ఉండాలని 21% మంది అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు నగదు కోసం ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరిగిన సగటు భారతీయుడు.. ఇప్పుడు తన స్మార్ట్ఫోన్నే బ్యాంక్గా మా ర్చుకుని పారదర్శకమైన ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నాడని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది.
బీమా వృద్ధికి ఎఫ్డీఐల దన్ను
దేశీయంగా బీమా రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం పరిశ్రమ వృద్ధికి దోహదపడే పురోగామి చర్యగా కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ మహేష్ బాలసుబ్రమణియన్ అభివరి్ణంచారు. జీఎస్టీపరమైన చర్యలతో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు 18 శాతం, సంప్రదాయ పథకాలు 4.5 శాతం చౌకగా లభిస్తాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచి్చన ఇంటర్వ్యూలో చెప్పారు. మరిన్ని విశేషాలు.. భారత బీమా రంగంలో 100 శాతం ఎఫ్డీఐలను అనుమతించడం వల్ల పెట్టుబడులు, పోటీ తదితర విషయాల్లో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు సకాలంలో తీసుకున్న పురోగామి చర్య. తదుపరి దశలో అధిక వృద్ధిని వేగవంతంగా సాధించడానికి పరిశ్రమకు కావల్సిన దీర్ఘకాలిక పెట్టుబడులు లభించేందుకు ఇది ఉపయోగపడుతుంది. కస్టమర్ కోణంలో చూస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. పెట్టుబడి పెరగడం వల్ల సహజంగానే ఆవిష్కరణలకు ఊతం లభిస్తుంది. బీమా సంస్థలు డిజిటల్ ప్లాట్ఫాంలపై భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు వీలవుతుంది. దీనితో జీవిత బీమా మరింత సరళంగా మారి, ఇంకా అందుబాటులోకి వస్తుంది. అంతిమంగా కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులు, దీటైన ధరలో లభిస్తాయి. సరీ్వసులు కూడా మెరుగుపడతాయి. ఇక, ఏజెంట్లు, బ్రోకర్స్, డిజిటల్ ప్లాట్ఫామ్లులాంటి ఇంటరీ్మడియరీలకు ఈ సంస్కరణతో మరింత విస్తృతమైన, వైవిధ్యమైన మార్కెట్ ఏర్పడుతుంది. బీమా సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో కూడా విస్తరిస్తున్న తరుణంలో బీమాపై అవగాహనను పెంచడంలో, ఆఖర్లో ఉన్న వారికి కూడా బీమాను చేరువ చేయడంలో వారి పాత్ర ఇంకా కీలకంగా మారుతుంది. ఇన్సూరెన్స్ విస్తృతి ఇంకా అంతంతమాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో కవరేజీని విస్తరించడం, ఆర్థిక భద్రతను పటిష్టం చేయడానికి సంబంధించిన దీర్ఘకాలిక విజన్కి ఇది దన్నుగా నిలుస్తుంది. ప్రీమియంలు, డిమాండ్పై జీఎస్టీ సంస్కరణల ప్రభావం ఎలా ఉంది? ఇది వినియోగదారులకు కచ్చితంగా ప్రయోజనం చేకూర్చేదే. భారత్లో సాధారణంగా సున్నా శాతం శ్లాబ్ను నిత్యావసరాలకు, మనుగడ సాగించేందుకు కీలకమైన ఉత్పత్తులకు రిజర్వ్ చేశారు. బీమాను ఈ ‘ఎసెన్షియల్’ విభాగంలోకి చేర్చడం ద్వారా, ఆర్థిక భద్రత అనేది ఉన్నా లేకున్నా ఫర్వాలేదు అనుకోవడానికి లేదని, ప్రతి కుటుంబానికి ఇది కీలక అవసరమని ప్రభుత్వం ఒక శక్తివంతమైన సందేశం ఇచి్చనట్లయింది. 18 శాతం మేర చౌకగా లభించడం వల్ల, పూర్తిగా ప్రొటెక్షన్ పథకాలైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల విషయంలో ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటోంది. ప్రొటెక్షన్లో సాధారణంగా వెనుకబడి ఉన్న భారత్లాంటి మార్కెట్లో ఇది చాలా పెద్ద కరెక్షన్గా చెప్పవచ్చు. దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మొదటిదేమిటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు 18 శాతం చౌకగా లభించడం వల్ల తొలిసారిగా తీసుకునే వారికి మరింత అందుబాటులోకి వస్తుంది. ఇక రెండో కోణంలో చూస్తే, ప్రస్తుత కస్టమర్లకు అదనపు భారం పెరగకుండా 18 శాతం అధిక కవరేజీ లభించినట్లవుతుంది. అసలు బీమా లేని వారికి, సరైన కవరేజీ లేని వర్గాలకి కూడా జీఎస్టీ కోతతో ప్రయోజనాలు లభిస్తాయి. సాంప్రదాయ పథకాలు 4.5 శాతం, రెన్యువల్స్ 2.25 శాతం చౌకగా లభించడం వల్ల కస్టమర్లకు సానుకూలంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో బీమా ధోరణులు ఎలా ఉంటున్నాయి? ఆర్థికంగా భారీ ఆకాంక్షలు, పురోగామి ఆలోచనా ధోరణులున్న వినియోగదారులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జీవిత బీమాకి సంబంధించి విశిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాంటార్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం హైదరాబాద్లాంటి అర్బన్ సెంటర్ల సారథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో క్రియాశీలక ప్లానింగ్, పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ, జీవిత బీమాపై అత్యధిక స్థాయిలో అవగాహన ఉన్నట్లు వెల్లడైంది. ఆర్థిక భద్రతకు నెలకొన్న డిమాండ్ని ఈ డేటా సూచిస్తోంది. సర్వే ప్రకారం ఈ ప్రాంతంలోని వినియోగదారుల్లో 78 శాతం మందికి సేవింగ్స్ ప్లాన్స్ గురించి అవగాహన ఉంది. గ్యారంటీగా ఏకమొత్తాన్ని అందించే, లేదా, స్థిరంగా నెలవారీ ఆదాయాన్ని అందించే ప్లాన్లను పరిశీలిస్తామని 87 శాతం మంది తెలిపారు. పొదుపు ఆధారిత పథకాలకు ప్రాథమికంగా ప్రాధాన్యమిస్తున్నప్పటికీ, సమగ్ర భద్రతవైపు మళ్లుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లోని మొత్తం ఎన్వోపీల్లో టర్మ్ పాలసీల వాటా 32 శాతంగా ఉండగా, వీటి వృద్ధి 50 శాతం మేర ఉంటోందని కోటక్ లైఫ్ గమనించింది. సంపదను పెంపొందించుకోవడానికి ఎంత ప్రాధాన్యం ఉంటోందో ప్రొటెక్షన్కి కూడా అంతే ప్రాధాన్యత లభిస్తోంది. బ్యాంకెష్యూరెన్స్ వాటా 48 శాతంగా, ప్రొప్రైటరీ మాధ్యమాల వాటా 52 శాతంగా మా పంపిణీ వ్యవస్థ సమతూకమైన విధంగా ఉంటోంది. వచ్చే మూడు నుంచి అయిదేళ్లలో వృద్ధి, విస్తరణ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? కార్యకలాపాలు ప్రారంభించిన 25వ సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) సాధించడమనేది జీవిత బీమాలాంటి దీర్ఘకాలిక వ్యాపారంలో కోటక్ లైఫ్ సంపాదించుకున్న విశ్వసనీయతకు నిదర్శనం. మేము ఇప్పుడు 4.3 కోట్ల మందికి భద్రతనిస్తూ, దేశీయంగా దిగ్గజ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటిగా కార్యకలాపాలు సాగిస్తున్నాం. హ్యాపీయూ యాప్లాంటి వాటితో మరింత ఆరోగ్యకరమైన, సురక్షితమైన విధంగా జీవించేలా కస్టమర్లను ప్రోత్హిస్తున్నాం. వచ్చే మూడు నుంచి ఐదేళ్ల వ్యవధిలో గణనీయంగా విస్తరించనున్నాం. ప్రస్తుత 333 శాఖల స్థాయి నుంచి రాబోయే కొన్నేళ్లలో రెట్టింపు స్థాయికి పెంచుకోనున్నాం. ఈ క్రమంలో 1 లక్ష మందికి పైగా ఉన్న మా డి్రస్టిబ్యూటర్ల వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ, సర్వీసింగ్ .. ఆటోమేషన్ని బలోపేతం చేసుకునేందుకు డిజిటల్కి సంబంధించి పెట్టుబడులను కొనసాగిస్తాం. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేథ వినియోగం ఎలా ఉంటోంది? కస్టమర్లు, భాగస్వాములు, ఉద్యోగులు అందరికీ సమగ్రమైన ప్రయోజనాలను అందించే విధంగా ఏఐ, ఎంఎల్ (మెషిన్ లెరి్నంగ్), ఆటోమేషన్ కలిసికట్టుగా పని చేయాలని మేము భావిస్తాం. కస్టమర్ల విషయానికొస్తే సోర్సింగ్ నుంచి క్లెయిమ్స్ వరకు టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నాం. క్లెయిమ్ల విషయంలో ఏఐ చాట్బాట్ల దన్నుతో 80 శాతం లావాదేవీలను డిజిటల్కు మార్చగలిగాం. 2 లక్షల క్లెయిమ్ల్లో 65 శాతం క్లెయిమ్లను ఫైనల్ డాక్యుమెంట్లు అందిన రోజే సెటిల్ చేశాం. పాలసీల విక్రయాలు, సరీ్వసు కోసం అడ్వైజర్లకి ఆప్టిమస్, బూస్ట్ 360, స్మార్ట్సెల్లాంటి సాధనాలను అందుబాటులోకి తెచ్చాం. ఉద్యోగులకు పూర్తి స్థాయిలో మద్దతు లభించేలా, కావ్య పేరిట ఏఐ ఆధారిత హెచ్ఆర్ అసిస్టెంట్ని ప్రవేశపెట్టాం. బీమా విస్తృతి పెరగడానికి ఎలాంటి వ్యూహాలు అవసరం? దేశీయంగా జీవిత బీమా విస్తృతి ప్రస్తుతం గ్లోబల్ బెంచ్మార్క్ల కన్నా చాలా దిగువన దేశ జీడీపీలో అత్యంత తక్కువగా 2.8 శాతం స్థాయిలోనే ఉంటోంది. ప్రొటెక్షన్ అంతరం దాదాపు 17 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో 80 శాతం మేర ఉంటోంది. 2050 నాటికి రిటైర్మెంట్ సేవింగ్స్ అవసరాలు, లభ్యత మధ్య అంతరం 85 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సవాళ్ల తీవ్రత, సత్వరం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి. దీన్ని పరిష్కరించేందుకు పరిశ్రమ ప్రధానంగా ట్రిపుల్ ‘ఏ’ ఫ్రేమ్వర్క్, అంటే అవగాహన పెంపొందించడం (ఎవేర్నెస్), మరింత అందుబాటులోకి తేవడం (యాక్సెసబిలిటీ), చౌకగా అందించడమనే (అఫోర్డబిలిటీ) వ్యూహాన్ని అమలు చేస్తోంది. – హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
ఫ్యామిలీ
టీనేజర్లకు డిజిటల్ డిసిప్లిన్...
టీనేజర్ల చేతుల్లో సెల్ ఫోన్ కేవలం ఒక పరికరం కాదు, వారి శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ఒకప్పుడు ‘పదో తరగతి దాటాక ఫోన్ కొనిస్తాం’ అనే మాటలు వినిపించేవి. కాని, నేడు ఆరో తరగతి విద్యార్థుల వద్ద కూడా స్మార్ట్ఫోన్లు దర్శనమిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ నిప్పులాంటిది. దాన్ని వంట వండుకోవడానికి వాడుకోవచ్చు లేదా ఇల్లు తగలబెట్టుకోవడానికి వాడుకోవచ్చు. టీనేజర్లకు సెల్ ఫోన్ వాడకంలో స్వీయ నియంత్రణ నేర్పించడం ఒక కళ. ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు. ఓపికతో, ప్రేమతో, శాస్త్రీయ అవగాహనతో వారిని డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ప్రయాణించేలా తీర్చిదిద్దడం నేటి తరం తల్లిదండ్రుల బాధ్యత. అదెలాగో ఈరోజు తెలుసుకుందాం. మెదడుపై డిజిటల్ ప్రభావంటీనేజ్ అనేది మానవ జీవితంలో అత్యంత కీలకమైన దశ. ఈ సమయంలో మెదడులోని ‘ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్’ అనే భాగం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం, ఉద్వేగాలను అదుపు చేసుకోవడం, పర్యవసానాలను అంచనా వేయడం ఈ భాగం బాధ్యత.మరోవైపు, సోషల్ మీడియా యాప్స్ అన్నీ ‘డోపమైన్’ అనే రసాయనాన్ని విడుదల చేసేలా రూపొందించారు. ఒక ‘లైక్’ లేదా ‘నోటిఫికేషన్’ వచ్చినప్పుడు మెదడులో రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అందుకే టీనేజర్లు అంత త్వరగా వాటికి అడిక్ట్ అవుతారు. అలాగని వాళ్లనుంచి ఫోన్ తీసేయడం పరిష్కారం కాదు. అది వారిని మరింత మొండిగా మారుస్తుంది. దానికి బదులుగా ‘డిజిటల్ క్రమశిక్షణ’ నేర్పించాలి. అంటే టీనేజర్లను శిక్షించడం కాదు, వారి మెదడును రీవైరింగ్ చేయడం అని గుర్తుంచుకోండి.డిజిటల్ డీ–అడిక్షన్ యాక్షన్ ప్లాన్...1. క్రమంగా తగ్గించడం: ఒక్కసారిగా ఫోన్ లాగేసుకుంటే పిల్లల్లో ‘విత్ డ్రాయల్ సింప్టమ్స్’ వస్తాయి. అందువల్ల ప్రతి వారం వారి స్క్రీన్ టైమ్ను 15–20 నిమిషాలు తగ్గిస్తూ రండి.2. గ్రే స్కేల్ మోడ్: ఫోన్లోని రంగులు మన మెదడును ఆకర్షిస్తాయి. పిల్లల ఫోన్ సెట్టింగ్స్లో ‘గ్రేస్కేల్’ మోడ్ ఆన్ చేయండి. దీంతో మెదడుకు ఆ ఫోన్ పట్ల ఆసక్తి క్రమంగా తగ్గుతుంది. ఇది ఒక శక్తిమంతమైన సైకలాజికల్ ట్రిక్.3.డిజిటల్ కాంట్రాక్ట్: తల్లిదండ్రులు, పిల్లలు కూర్చుని ఒక ఒప్పందం రాసుకోవాలి. నో ఫోన్ జో¯Œ ్స, నో ఫోన్ టైమ్స్ స్పష్టంగా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా ముందే నిర్ణయించాలి. అలారం కోసం స్మార్ట్ఫోన్ కాకుండా విడిగా ఒక ‘అలారం క్లాక్’ కొనివ్వండి.4. డిజిటల్ లిటరసీ: ‘నువ్వు వాడుతున్న యాప్ ఉచితం అయితే, అక్కడ నువ్వే ఒక ప్రొడక్ట్వి’ అనే నిజాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అల్గారిథమ్స్ మనల్ని ఎలా బానిసలుగా మారుస్తాయో శాస్త్రీయంగా వివరించాలి.5. ప్రత్యామ్నాయ వ్యాపకాలు: మెదడు డోపమైన్ కోసం ఫోన్ను ఆశ్రయిస్తుంది. దానికి బదులుగా క్రీడలు, సంగీతం, పెయింటింగ్ లేదా ఇతర హాబీలను ప్రోత్సహించాలి. శారీరక శ్రమ వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఫోన్ ఇచ్చే తాత్కాలిక సంతోషం కంటే మిన్నగా ఉంటాయి.6. డిజిటల్ కరెన్సీ సిస్టమ్: వారికి ఒక రివార్డ్ సిస్టమ్ ఏర్పాటు చేయండి. ఉదాహరణకు, ‘ఈ రోజు నువ్వు ఫిజికల్ రీడింగ్ లేదా ఇంట్లో సహాయం చేస్తే, దానికి బదులుగా నీకు 30 నిమిషాల ఎక్స్ట్రా గేమ్ టైమ్ వస్తుంది.’ దీనివల్ల వారు ఫోన్ సమయాన్ని ఒక ప్రివిలేజ్గా భావిస్తారు తప్ప హక్కుగా కాదు.7. ప్రొఫెషనల్ హెల్ప్: ఫోన్ లేకపోతే మీ పిల్లల్లో విపరీతమైన ఆందోళన, ఆహారం మానేయడం లేదా ఒంటరిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే, అది తీవ్రమైన అడిక్షన్ కావచ్చు. అటువంటప్పుడు ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది.మీరే వారి రోల్ మోడల్మీరు చేతిలో ఫోన్ పట్టుకుని, పిల్లలను ఫోన్ పక్కన పెట్టమంటే వారు వినరు. మనస్తత్వశాస్త్రంలో దీనిని ‘అబ్జర్వేషనల్ లెర్నింగ్‘ అంటారు.» ఆఫీసు నుంచి ఇంటికి రాగానే కనీసం ఒక గంట పాటు మీ ఫోన్ను పక్కన పెట్టండి.»పిల్లలతో ‘ఐ కాంటాక్ట్’ కలిపి మాట్లాడండి.»మీరు సోషల్ మీడియాలో ఎంత సమయం గడుపుతున్నారో గమనించుకోండి.» గ్యాడ్జెట్స్ కంటే గొప్ప కనెక్షన్ మన మనుషుల మధ్య ఉండాలని గుర్తుంచుకోండి.- సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్
మనసు పిలిచింది
47 సంవత్సరాల తర్వాత కమల్, రజనీ కలిసి నటిస్తున్నారు. ఈ ఇద్దరు తమిళ నటులు తెలుగువారికి ప్రీతిపాత్రులు. తెలుగు కుటుంబాల గుండెల్లో పాగా వేసిన సూపర్స్టార్లు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే తెలుగువారికి ఇద్దరి కథలెన్నో గుర్తుకు వస్తాయి. ఒక నోస్టాల్జియా...47 సంవత్సరాల తర్వాత రజనీకాంత్, కమల్హాసన్ కలిసి నటిస్తున్నారు. ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ డైరెక్టర్. దాని గ్లింప్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, భారతీయ ప్రేక్షకులను ఉర్రూతలూపుతోంది. నెల్సన్ వారిద్దరి మధ్య పోటీని అలాగే ఉంచుతూ కమలహాసన్కు సీనియారిటీ ఇస్తూ తీసిన ‘కెహెచ్ అండ్ ఆర్కె’ స్పెషల్ గ్లింప్స్ అభిమానులను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. తమిళంలోనే ఈ సినిమా తీస్తున్నా తెలుగువారికి స్ట్రయిట్ పిక్చర్తో సమానం. ఎందుకంటే వాళ్లిద్దరూ తెలుగువారికీ సూపర్స్టార్లే కదా. తెలుగువారికి రామారావు, నాగేశ్వరరావు ఎలా ఇష్టమో తమిళంలో ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్ కూడా అలాగే ఇష్టం. ఎం.జి.ఆర్ తెలుగు ప్రేక్షకులకు నేరుగా తెలియకపోయినా డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుసు. అలాగే తెలుగువారికి కృష్ణ, శోభన్బాబు ఎలా ఇష్టమో రజనీకాంత్, కమలహాసన్ కూడా అంతే ఇష్టం. వీరిద్దరూ తెలుగువారితో పాటే తమ కెరీర్ను కొనసాగించారు. తెలుగువారు తమను మరువకుండా చూశారు. వారికి అలా కలిసొచ్చింది.‘అంతులేని కథ’ (1974)లో ఇద్దరూ యుక్తవయసులో తొలిసారి తెలుగు తెర మీద కనిపించినా ఆ తర్వాత రకరకాల దారుల్లో తెలుగువారికి దగ్గరవుతూ వచ్చారు. కమలహాసన్ ‘మరో చరిత్ర’తో సూపర్హిట్ కొట్టి తెలుగులో ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అయితే రజనీకాంత్ ‘చిలకమ్మ చెప్పింది’, ‘అన్నదమ్ముల సవాల్’ చేసినా సరైన దగ్గరితనం ‘వయసు పిలిచింది’ (1978)తోనే వచ్చింది. కమల్, రజనీ కలిసి నటించిన ఈ సినిమా తెలుగునాట మహిళా ప్రేక్షకులు రజనీకాంత్ను అభిమానించేలా చేసింది. అతని చిక్లెట్ మేనరిజం యూత్కు నచ్చింది. ఆ రోజుల్లో రజనీ పుణ్యమా అని అందరూ చిక్లెట్లు తినడమే. మేడ మెట్లు ‘అలా కూడా ఎక్కుతారా’ అని రజనీని చూసి నోరెళ్లబెట్టారు. స్టయిల్ను తెలుగువారికీ రజనీయే పరిచయం చేశాడు. ఆ తర్వాత ‘సొమ్మొకడిది సోకొకడిది’, ‘ఆకలి రాజ్యం’ తదితర సినిమాలతో కమల్– ‘టైగర్’, ‘రామ్ రాబర్ట్ రహీం’ సినిమాలతో రజనీ తెలుగు థియేటర్లలో ఆడారు. ఈలోపు వీరి డబ్బింగ్ సినిమాలు వచ్చి పోతూ వీరినీ తెలుగు హీరోలుగా వుంచాయి.‘సాగర సంగమం’ కమల్ హాసన్కు తెలుగులో శాశ్వత స్థానం సంపాదించి పెట్టింది. ఈ బంగారానికి ‘స్వాతిముత్యం’ తావి మాత్రమే. ఈ సమయంలో రజనీ తెలుగుకు కొంత ఎడంగా ఉన్నా ఒక్కసారిగా ‘ముత్తు’ ఆ తర్వాత ‘బాషా’ సినిమాలతో ‘నేను ఒక్క సినిమా తీస్తే వంద సినిమాలు తీసినట్టే’ అన్నట్టుగా సూపర్హిట్ కొట్టారు. ‘అందమైన అనుభవం’, ‘అల్లావుద్దీన్ అద్భుత దీపం’ (1979) తర్వాత కలిసి నటించడం మానుకున్న కమల్, రజనీ తమ స్టార్డమ్, అభిమానుల ఘర్షణల వల్ల ఎడాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. నేడు రజనీ 75కు, కమల్ 71కి చేరుకున్నా ప్రేక్షకులు వారిని సూపర్ స్టార్లుగానే తప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చూడ నిరాకరిస్తున్నారు. కాలం మనుషుల్ని దగ్గర చేస్తుంది తప్పదు. ఇన్నాళ్ల తర్వాత ఇద్దరూ ఒకేసారి పక్క పక్కన తెర మీద కనిపించబోతున్నారు. నెల్సన్ దర్శకుడు కాబట్టి కామెడీ కూడా ఉంటుంది. ఇద్దరూ కామెడీ చేయడంలో మేటి కదా. ఈ వంకన ఈ రోజు నుంచే సినీ ప్రేక్షకులు వీరి సినిమా కోసం ఎదురు చూడటం మొదలుపెడతారు. ఏ సంక్రాంతికో, దీపావళికో ఈ డబుల్ ధమాకా దద్దరిల్లనుంది.
కథల కళల బండిలో బడిబాటకు...
‘పిల్లలందరూ ఆర్టిస్ట్లే. ఆర్టిస్ట్లందరూ పిల్లలే’ అనే మాట ఉంది. రూబుల్ నాగి ప్రసిద్ధ మ్యూరల్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు. పిల్లల మనసు చిత్రం తెలిసిన మనసెరిగిన మహిళ. ‘రూబుల్ నాగి ఫౌండేషన్’ ద్వారా దేశవ్యాప్తంగా వందలాది మంది పేదింటి పిల్లలకు విద్య అందిస్తోంది. తన కృషికి గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్–2026’ అందుకుంది. ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ అనేది యునెస్కో సహకారంతో యూకేలోని వర్కీ ఫౌండేషన్ ఇచ్చే వన్ మిలియన్ డాలర్ల అవార్డ్...‘రూబుల్ నాగి విద్యావేత్త. అణగారిన వర్గాల పిల్లలకు అక్షరాన్ని చేరువ చేసిన మార్గదర్శి’ అని ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ అవార్డు కమిటీ అభివర్ణించింది. 130 దేశాల నుండి వచ్చిన 5,000 నామినేషన్ల నుండి నాగిని అవార్డు కోసం ఎంపిక చేశారు. జమ్మూకశ్మీర్లో పుట్టిన నాగి రాజకీయ శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేషన్ చేసింది. తరువాత లండన్లోని స్లేడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చదువుకుంది. సోథెబీస్ లండన్లో యూరోపియన్ ఆర్ట్ను అభ్యసించింది.చదువు పూర్తయిన తరువాత ‘న్యూ డిజైన్ స్టూడియో’ ప్రారంభించి ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకుంది. 800 మ్యూరల్స్ వేసింది. 150పైగా ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించింది. రాష్ట్రపతి భవన్ మ్యూజియంలో నాగి కళాకృతులను ప్రదర్శించారు. వీటిని రాష్ట్రపతి స్వయంగా ఎంపిక చేయడం విశేషం.కళ పేదల కోసం‘కళ కళ కోసమే’ అనేది ఒక వాదం. ‘కళ ప్రజల కోసం’ అనేది మరో వాదం. నాగి రెండో మార్గాన్ని ఎంచుకుంది. ఆర్టిస్ట్గా ఏకాంత దీవిలో, ఊహల మధ్య మాత్రమే ఉండిపోలేదు ఆమె. సామాన్య ప్రజల మధ్యకు వచ్చింది. ‘సమాజం కోసం ఏం చేయగలను?’ అని ఆలోచించింది. తన దగ్గర ‘కళ’ అనే శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి చదువుకు దూరం అయిన పేదపిల్లలకు చదువును దగ్గర చేయాలని నిర్ణయించుకుంది.లెర్నింగ్ సెంటర్లతో...దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో గ్రామాల్లో 800 లెర్నింగ్ సెంటర్లను ప్రారంభించింది. ‘కళ’ అనే మాధ్యమంతో వందలాది మంది పేద పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించింది. ఈ విద్యాకేంద్రాలకు ముందు పిల్లలెవరూ బడి ముఖం చూడలేదు. అక్షరం ముక్క రాదు. అలాంటి పిల్లలు కూడా లెర్నింగ్ సెంటర్లో చేరిన తరువాత చదువులో అద్భుత ప్రతిభ చూపుతున్నారు. పెద్ద స్కూల్స్లో చదివేవారితో సమానంగా పోటీ పడుతున్నారు. లెర్నింగ్ సెంటర్లు ప్రారంభించడానికి ముందు ‘పిల్లలు బడికి ఎందుకు దూరం అవుతున్నారు?’ అనే కోణంలో అధ్యయనం చేసింది నాగి. పేదరికం, ఇంటిపనులు, పొలం పనులు, బాల కార్మిక వ్యవస్థ... ఇలా ఎన్నో కారణాలు కనిపించాయి. ఈ కారణాలను అడ్డంకులుగా భావించలేదు. ప్రత్యామ్నాయ మార్గాలు, స్ఫూర్తిదాయకమైన మాటలతో ఎంతోమంది పేదపిల్లలు బడి బాట పట్టేలా చేసింది. విద్యారంగంలో నాగి చేసిన రెండు దశాబ్దాల కృషికి గుర్తింపుగా ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ దక్కింది.పిల్లలతో కలిసిపోయి...రూబుల్ నాగి దేశమంతటా విస్తృతంగా ప్రయాణిస్తుంటుంది. విద్యాకేంద్రాలలో పిల్లలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటుంది. ఆరువందల మందికి పైగా స్వచ్ఛంద సేవకులు ఆమె సైన్యం. విద్యాకేంద్రాల ద్వారా ఎంతోమంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పిస్తోంది.ఆ మాటే మంత్రంగా...కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలోని నాగి ఆర్ట్ స్టూడియోకు దగ్గరలోని మురికివాడ నుంచి ఒక పిల్లాడు వచ్చి ఆర్ట్వర్క్స్ను ఆసక్తిగా చూస్తున్నాడు. ‘ఏ క్లాసు చదువుతున్నావు?’ అని అడిగింది నాగి. ‘చదవడం లేదు’ అన్నాడు. ‘ఎందుకు?’ అని అడిగితే ‘మా దగ్గర డబ్బులు లేవు’ అన్నాడు. ఆ మాట నాగిని బాగా ఆలోచించేలా చేసింది. స్టూడియో అనే నాలుగు గోడలకే పరిమితం కావద్దు అని నిర్ణయించుకుంది. మరుసటి రోజే మురికి వాడకు వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకుంది. తన ఆర్ట్తో మురికివాడలలోని గోడలను అందంగా కనిపించేలా చేసింది. రెండో అడుగుగా లెర్నింగ్ సెంటర్లను ప్రారంభించింది. ‘క్లాస్రూమ్లో మాత్రమే పాఠాలు’ అని కాకుండా చెట్ల కింద, ప్రకృతి మధ్య పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.‘విద్యా కార్యక్రమాలు మరింతగా విస్తరించడానికి, నైపుణ్య ఆధారిత, డిజిటల్ అభ్యాస కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి ఈ ప్రైజ్మనీ వినియోగిస్తాను’ అని చెప్పింది రూబుల్ నాగి. సవాళ్లు ఉన్నాసరే...మురికివాడల్లో మేము గోడలపై పెయింటింగ్ వేస్తున్నప్పుడు పిల్లలు గుమిగూడేవారు. ‘మీలో ఎవరికైనా కథ వినాలని ఉందా?’ అని అడిగితే ‘నేను వింటాను’ అంటూ అందరూ ఉత్సాహంగా స్పందించేవారు. అలా కథలు, బొమ్మల ద్వారా వారు బడిలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేశాం. మా ప్రయత్నం విజయవంతం అయింది. ఆర్ట్–బేస్డ్ లెర్నింగ్ ప్రక్రియ ద్వారా పిల్లలు పాఠాలను సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నాలుగు గోడల మధ్యే పాఠాలు చెప్పాలనుకోలేదు. ఆసక్తిగా చెబితే పిల్లలు ఆరుబయట కూర్చోనైనా వింటారు. రెండు మూడు రోజులు లెర్నింగ్ సెంటర్కు వచ్చిన విద్యార్థి మరుసటి రోజు రాకపోతే మా వాలెంటీర్లు ఆ విద్యార్థి ఇంటికి వెళతారు. కారణం ఏమిటో తెలుసుకుంటారు. ఆ విద్యార్థి రోజూ స్కూల్కు వచ్చేలా చేస్తారు. లెర్నింగ్ సెంటర్ల నిర్వహణ అనేది సులువైన విషయమేమీ కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ వాటిని నిర్వహిస్తున్నాం.– రూబుల్ నాగి
ఊహా స్వర్గాలు... విఫల నగరాలు
సత్సంకల్పంతో ప్రారంభమైన కొన్ని నగరాలు చరిత్రలో నిలిచిపోతాయి. శతాబ్దాలు గడిచినా, తరతరాల జనావాసాలుగా కళకళలాడుతూ ఉంటాయి. సంకల్పశుద్ధి లేకుండా, భ్రమాత్మకమైన అంచనాలతో, అత్యాశతో, అనవసర స్పర్థలతో ప్రారంభించ తలపెట్టిన కొన్ని నగరాలు కార్యరూపం దాల్చకుండానే కనుమరుగైపోతాయి. అలాంటి నగరాల్లో కొన్ని అరకొర నిర్మాణాలతో కాలగతిలో అధోగతికి చేరుకుంటాయి. అవి కేవలం ఊహాస్వర్గాలుగా మాత్రమే మిగిలిపోతాయి. వనరుల వృథాకు, మానవశ్రమ వృథాకు కారణభూతమైన ఇలాంటి విఫల నగరాలు ప్రపంచంలో ఉన్నాయి. జనాలకు ఉపాధి లేకుండా, ఉత్పాదక కార్యకలాపాలు లేకుండా, కనీసం పర్యాటకుల రాకపోకలైనా లేకుండా భూతాల నిలయాల్లా కనిపించే అలాంటి కొన్ని విఫల నగరాల కథా కమామిషు తెలుసుకుందాం...జింగోనియా- ఇటలీఇటలీలోని అత్యంత పురాతన నగరాల్లో మిలాన్ ఒకటి. ప్రపంచ ఫ్యాషన్ రాజధానిగా పేరుపొందిన మిలాన్ నగరానికి ఆనుకొని, దానికి దీటైన నగరాన్ని నిర్మించాలని రోమన్ వాణిజ్యవేత్త రెంజో జింగోనె తలపెట్టాడు. జింగోనియా పేరుతో 1960లలో యాభైవేల జనాభా నివాసానికి తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసి, నగర నిర్మాణాన్ని ప్రారంభించాడు. కార్మికుల వసతి కోసం జింగోనె ఈ నగర నిర్మాణానికి సంకల్పించాడు. వివిధ పరిశ్రమల కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు కర్మాగారాలకు చేరువలోనే ఆవాసాలను ఏర్పాటు చేస్తే, వారి రవాణా సమయం తగ్గి, ఉత్పాదకత పెరుగుతుందని ఆశించాడు.జింగోనియా నగరంలో కార్మికులకు ఇళ్లతో పాటు వారి అవసరాలకు అనుగుణంగా షాపింగ్ మాల్, ఆస్పత్రి, భారీస్థాయి హోటల్, క్రీడా మైదానం, హెలికాప్టర్ల రాకపోకల కోసం హెలిపోర్ట్ వంటి వాటితో భారీ ప్రణాళికను సిద్ధం చేసి, మొదలుపెట్టిన జింగోనియా నగర నిర్మాణం విఫలమైంది. ఐదు పట్టణాల సరిహద్దులకు అనుబంధంగా చేపట్టిన ఈ నగర నిర్మాణం పౌర సేవలు అందించడంలో, పాలనలోను వైఫల్యం వల్ల జనాలకు ఎందుకూ పనికిరాకుండా మిగిలింది. ప్లాన్ వాజిన్ - ఫ్రాన్స్ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ జనసమ్మర్దానికి, పారిశుద్ధ్య సమస్యలకు పరిష్కారంగా తలపెట్టిన నగరం ప్లాన్ వాజిన్. సెంట్రల్ ప్యారిస్ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, ఆ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో పునర్నిర్మించడంతో పాటు సేన్ నది కుడివైపు ఒడ్డున ఆధునిక అవసరాలకు తగిన రీతిలో ప్రణాళికాబద్ధంగా నిర్మించ తలపెట్టిన నగరం ఇది. ఫ్రాన్స్లో స్థిరపడిన స్విస్ ఆర్కిటెక్ట్ ల కార్బ్యూజీర్ బహుళ అంతస్తుల భవంతులతో కూడిన ఈ అధునాతన నగర నిర్మాణం కోసం 1925లో ప్రణాళికను సిద్ధం చేశాడు. దీనికోసం సెంట్రల్ ప్యారిస్ నుంచి ప్యారిస్ శివారు ప్రాంతాలకు తరలిపోవడానికి సంపన్న ఉద్యోగ వర్గాలు సిద్ధపడినా, అదే ప్రాంతంలో తరతరాలుగా ఉంటున్న భూస్వాములు మాత్రం తమకు అలవాటైన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేందుకు నిరాకరించారు.కొంతమంది ఇళ్లు ఖాళీ చేసి తరలిపోవడంతో సేన్ నది కుడివైపు ఒడ్డున దాదాపు ఆరువందల ఎకరాల స్థలంలోని పాత కట్టడాలను పడగొట్టారు. మిగిలిన జనాలను కూడా ఇక్కడి నుంచి శివార్లకు తరలించి, ఈ ప్రదేశంలో ఒకేలాంటి అరవై అంతస్తుల ఆకాశ హర్మ్యాలను నిర్మించాలని అనుకున్నా, అది సాధ్యపడలేదు. ఖాళీ చేయడానికి మొండికేసిన భూస్వాములు నగరపాలక అధికారులపై పట్టు బిగించారు. భూస్వాముల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు– నది ఒడ్డున ఏకంగా అరవై అంతస్తుల భవంతులు నిర్మించడం వల్ల సమస్యలు తలెత్తవచ్చంటూ కార్బ్యూజీర్ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఫలితంగా ఇది కార్యరూపం దాల్చకుండా శాశ్వతంగా మూలపడింది. టెలోసా - అమెరికాఅగ్రరాజ్యమైన అమెరికాలో భూతలస్వర్గంలాంటి నగరాన్ని నిర్మించాలని అపరకుబేరుడు మార్క్ లోర్ తలపెట్టాడు. మార్క్ లోర్ సంకల్పం మరీ భూతకాలంలోనిది కాదు, ఇట్టిటీవలిదే! ఆయన 2021లో టెలోసా పేరుతో లక్షన్నర ఎకరాల విస్తీర్ణంలో అమరధామంలాంటి అద్భుత ఆత్మనిర్భర, సుస్థిర నగరాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించాడు. ఒక నగరాన్ని నిర్మించాలంటే దశాబ్దాలు పట్టే పరిస్థితులు ఉంటాయి కదా, అలాంటిది ఐదేళ్లలోనే దీనిని విఫల నగరంగా ఎలా జమకట్టేస్తారనే అనుమానం వస్తోందా? ఎందుకంటే, ఈ నగరం కోసం ఇప్పటి వరకు ఎక్కడా భూమి కొనుగోలు చేయలేదు. ఇప్పటి వరకు దీనిని కచ్చితంగా ఎక్కడ నిర్మించదలచుకున్నదో కూడా తేల్చుకోలేదు. నెవాడ, యూటా, అరిజోనా, టెక్సస్, అపలాషియా ప్రాంతాల్లో ఏదో ఒకచోట దీనిని నిర్మించనున్నామని, 2030 నాటికల్లా ఈ నగరాన్ని యాభైవేల మంది నివసించేలా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. ఇప్పటి వరకు కేవలం కాగితాలకు, వెబ్సైట్కు మాత్రమే పరిమితమైన ఈ నగరం 2030 నాటికి ఒక ఆకారాన్ని సంతరించుకునే పరిస్థితులు కనుచూపు మేరలో లేవు కాబట్టి, ఇది కూడా విఫల నగరంగానే మిగిలిపోతుందని నిపుణులు భావిస్తున్నారు.కాలిఫోర్నియా సిటీ - అమెరికాఅమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన నగరం కాలిఫోర్నియా సిటీ. కాలిఫోర్నియాలోని అతిపెద్ద నగరాలైన లాస్ ఏంజెలెస్, శాండియాగోలకు దీటైన నగరాన్ని నిర్మించాలని అమెరికన్ రియల్టర్ న్యాట్ మెండల్సన్ సంకల్పించుకున్నాడు. లాస్ ఏంజెలెస్కు ఈశాన్యాన సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని మోహవీ ఎడారి ప్రాంతంలో 82 వేల ఎకరాల స్థలాన్ని 1958లో కొనుగోలు చేశాడు. ఈ ఎడారి నేలలో నగర నిర్మాణాన్ని 1965లో ప్రారంభించాడు. ప్రారంభ దశలో 1.40 లక్షల జనాభా ఆవాసానికి తగిన విధంగా రహదారులు, నివాస భవనాలు, విమానాశ్రయం, గోల్ఫ్కోర్స్, విశాలమైన స్విమింగ్ పూల్, జైలు భవనం సహా పలు భారీ నిర్మాణాలు జరిపించాడు. నివాస భవనాల నిర్మాణాన్ని ప్రారంభించడానికి ముందే కిలోమీటర్ల కొద్ది విశాలమైన రోడ్లు నిర్మించారు.అనుకున్న సంఖ్యలో నివాస భవంతుల నిర్మాణం చేపట్టడంలో మెండల్సన్ విఫలమయ్యాడు. లాస్ ఏంజెలెస్పై స్పర్థతో అతడు ప్రారంభించిన ఈ నగరం ప్రస్తుతం జనసంచారం లేక మరుభూమిలా మిగిలింది. ఎడారి ప్రాంతంలో నిర్మించిన ఈ నగరం చివరకు ఎడారిలా మారిందని జనాలు వాపోవడం తప్ప దీనివల్ల సాధించినదేమీ లేదు. దీని నిర్మాణం కోసం చేసిన భారీ వ్యయమంతా వృథాగా మారింది. మెండల్సన్ ఇక్కడ నగరాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించగానే, చాలామంది ఈ ప్రాంతంలో స్థలాలు కొనుగోలు చేశారు. వారందరికీ కోలుకోలేని నష్టమే మిగిలింది. అలైస్ సిటీ - జపాన్జపాన్ రాజధాని టోక్యో నగరం జనసమ్మర్దంతో కిక్కిరిసి పోతుండటంతో దీనికి పరిష్కారంగా భూగర్భ నిర్మాణాన్ని తలపెట్టింది ఒక నిర్మాణ సంస్థ. టోక్యో నగరానికి దిగువన సమస్త సౌకర్యాలతో స్వర్గతుల్యమైన భూగర్భ నగరాన్ని నిర్మించడానికి జపానీస్ నిర్మాణ సంస్థ టాయ్సీ కార్పొరేషన్ 1989లో ప్రణాళికను కూడా రూపొందించింది. భూగర్భంలో బహుళ అంతస్తులతో నిర్మించ తలపెట్టిన ఈ నగరానికి అలైస్ సిటీ అని నామకరణం చేసింది. టౌన్ స్పేస్, ఆఫీస్ స్పేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ అనే మూడు విభాగాలతో ఈ నగర ప్రణాళికను పకడ్బందీగా తయారు చేసింది.టౌన్ స్పేస్లో నివాస భవనాలు, పార్కులు, సినిమా థియేటర్ల వంటి వినోద కేంద్రాలు; ఆఫీస్ స్పేస్లో కార్యాలయ భవనాలు, హోటళ్లు, క్లబ్బులు, పబ్బులు వంటి నిర్మాణాలు; ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో నగరం అంతటికీ సౌర విద్యుత్తు సరఫరాకు అవసరమైన సోలార్ డోమ్స్, మంచినీటి సరఫరా కేంద్రం, టోక్యో నగరం నుంచి రాకపోకలు జరిపేందుకు వీలుగా భూగర్భ మెట్రో రైలు మార్గం వంటి మౌలిక వసతులను నిర్మించాలని సంకల్పించుకుంది. అలైస్ సిటీ తలపెట్టిన అనతికాలంలో జపాన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. మరోవైపు, భూగర్భంలో బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టినా, అగ్నిప్రమాదాల వంటి విపత్తులు సంభవిస్తే జనాల ప్రాణాలకు భద్రత కల్పించడం సాధ్యమయ్యే పరిస్థితులు కూడా లేకపోవడంతో ఇది ప్రతిపాదనలకు, కాగితాల మీద రూపొందించిన ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైంది. మాడర్ఫాంటీన్ - దక్షిణాఫ్రికాదక్షిణాఫ్రికాలో జోహాన్నెస్బర్గ్కు చేరువలోనే మరో అద్భుత నగరాన్ని నిర్మించే ప్రతిపాదనతో చైనీస్ రియల్ ఎస్టేట్ డెవలపర్ షాంఘై జెండాయ్ 2013లో ముందుకొచ్చాడు. ఈ ప్రతిపాదనకు జౌటెంగ్ ప్రావిన్షియల్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా, జోహాన్నెస్బర్గ్ మునిసిపల్ అధికారులు మాత్రం దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రావిన్షియల్ ప్రభుత్వం వరుస మీడియా సమావేశాలు నిర్వహించింది. జోహాన్నెస్బర్గ్ పక్కనే ‘దక్షిణాఫ్రికా న్యూయార్క్’ నగరం సిద్ధమవుతోందని పత్రికలు, టీవీ చానెళ్లు కథనాలతో ఊదరగొట్టాయి. దాదాపు నాలుగువేల ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన ఈ నగరం కోసం 8400 కోట్ల రాండ్లు (రూ.47 వేల కోట్లు) పెట్టుబడి పెట్టడానికి జౌటెంగ్ ప్రావిన్షియల్ ప్రభుత్వం సంసిద్ధత ప్రకటించింది.అధునాతన నగర నిర్మాణం కోసం జెండాయ్ స్థలం కూడా కొనుగోలు చేశాడు. దురదృష్టవశాత్తు దక్షిణాఫ్రికా ఆర్థిక ఇక్కట్లలో చిక్కుకుంది. మరోవైపు స్థానిక అధికారుల నుంచి జెండాయ్ని నమ్ముకుని వచ్చిన విదేశీ పెట్టుబడిదారులకు సమస్యలు మొదలయ్యాయి. అనుకున్న ప్రకారం నిర్మాణాలు మొదలు పెట్టాలనుకున్న నాటి నుంచి అధికారుల నుంచి అడుగడుగునా సహాయ నిరాకరణ ఎదురవడంతో పెట్టుబడిదారులు వెనక్కు తగ్గారు. ఆరంభంలో ఎంత ఊదరగొట్టినా, ఏళ్లు గడిచినా ఇక్కడ తలపెట్టిన నిర్మాణాలేవీ మొదలు కాలేదు. క్రమంగా జనాల్లో కూడా దీనిపై ఆసక్తి సన్నగిల్లింది. చివరకు కార్యరూపం దాల్చకుండానే మాడర్ఫాంటీన్ నగర ప్రణాళిక అటకెక్కింది. డోంగ్టాన్ - చైనాచైనాలోని షాంఘై పరిధిలో ఉన్న చాంగ్మింగ్ దీవిలో తలపెట్టిన ‘ఎకో సిటీ’ డోంగ్టాన్. బ్రిటిష్ ఇంజినీరింగ్ సంస్థ ‘అరూప్’ షాంఘై పారిశ్రామిక పెట్టుబడుల సంస్థతో (ఎస్ఐఐసీ) కలసి 2005లో ఈ నగర నిర్మాణానికి సంకల్పించింది. ‘అరూప్’ లండన్ కార్యాలయం నుంచి ఈ ప్రాజెక్టును ప్రపంచ ప్రఖ్యాత సివిల్ ఇంజినీర్ పీటర్ హెడ్ పర్యవేక్షిస్తూ వచ్చారు. షాంఘై కమ్యూనిస్టు పార్టీ అధినేత చెన్ లియాంగ్యు రాజకీయంగా అండగా నిలిచారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ‘వరల్డ్ అర్బన్ ఫోరమ్’ వేదికపై ఈ ఎకో సిటీ నమూనాను ప్రదర్శించి, ‘అరూప్’ సంస్థ ప్రశంసలు పొందింది. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి సుస్థిర, పర్యావరణహిత నగరంగా ‘డోంగ్టాన్’ నగరం రూపుదిద్దుకోనున్నట్లుగా మీడియా కథనాలు వెల్లువెత్తాయి.ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆరంభంలోనే రాజకీయ ఆటంకాలు ఎదురవలేదు. ఇన్ని సానుకూలతలు ఉన్నాక ఇప్పటికే ఈ నగర నిర్మాణం ఒక కొలిక్కి వచ్చి ఉండాలి. అయినా, ఇది నేటికీ ప్రణాళికలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టుకు ఏమాత్రం సంబంధం లేని పింఛను కుంభకోణంలో చెన్ లియాంగ్యు, కీలకమైన ఆయన మద్దతుదారులు 2008లో అరెస్టయ్యారు. అనుకోని ఈ పరిణామంతో ‘అరూప్’ సంస్థకు రాజకీయ అండ కొరవడింది. అయినా వెనక్కు తగ్గకుండా ‘అరూప్’ సంస్థ ఈ ప్రాజెక్టు నమూనాను 2010లో జరిగిన ‘షాంఘై వరల్డ్ ఎక్స్పో’లో ప్రదర్శించింది.ఆ కార్యక్రమానికి హాజరైన నాయకులు దీనిని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడారు. నగర నిర్మాణానికి భూకేటాయింపులు కూడా జరిగాయి. అయితే, రాజకీయ నాయకుల అంతర్గత కుమ్ములాటలు, అవినీతి వ్యవహారాల కారణంగా పెట్టుబడిదారులు వెనక్కు తగ్గారు. క్రమంగా వార్తా కథనాల్లో కూడా ‘డోంగ్టాన్’ ప్రస్తావన వినిపించడం మానేసింది. తర్వాత చడీచప్పుడూ లేకుండా ఈ నగర నిర్మాణ ప్రణాళిక మూలపడింది.
అంతర్జాతీయం
అరబ్ దేశాల్లో క్యాసినో.. లగ్జరీ కా సీన్ ...!
అత్యంత కఠినమైన సంప్రదాయాలు, ఆచారాలకు పేరొందిన అరబ్ దేశాలు పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఉదారవాద విధానాల వైపు మారడం ప్రారంభమై..గత కొంత కాలంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ ట్రెండ్లో ముందున్న దుబాయ్... ఇప్పటికే ప్రపంచ పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. ఈ నేపధ్యంలో దుబాయ్కి సమీపంలోనే ఉన్న రస్ ఆల్ ఖైమా లో ఏర్పాటవుతున్న క్యాసినో ఆ ప్రాంత పర్యాటక సంప్రదాయాలను పునర్నిర్వచించనుంది. క్యాసినో అంటే ప్రధానంగా జూదకేంద్రాలు అనేది తెలిసిందే. ప్రపంచంలో పలు దేశాల్లో ఇవి విజయవంతంగా నడుస్తున్నప్పటికీ చాలా దేశాల్లో అనుమతులు లేవు. మన దేశంలో సైతం కేవలం గోవాలో అది కూడా సముద్రజలాలపై తప్ప మరెక్కడా వీటి నిర్వహణకు అవకాశం లేదు. ఈ నేపధ్యంలో అత్యంత కఠినమైన సంప్రదాయాలకు పేరొందిన అరబ్ దేశాల్లో తొలి క్యాసినో పరిచయం కానుండడం ప్రపంచ పర్యాటకంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దాదాపు 5.1 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రిసార్ట్ అయిన విన్ అల్ మార్జన్ ఐలాండ్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రస్ అల్ ఖైమా లో ఏర్పాటవుతోంది. తద్వారా ప్రపంచ పర్యాటక రంగంలో ఒక పెద్ద మార్పుకు రంగం సిద్ధమవుతోంది. దుబాయ్ నుంచి 50 మైళ్ల లోపు దూరంలో ఉన్న 60 హెక్టార్ల మానవ నిర్మిత ద్వీపంలో ఈ రిసార్ట్ నిర్మితమైంది. ఇది అరేబియన్ గల్ఫ్ కంటే 70 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. పూర్తి విలాసవంతంగా రూపొందిన ఈ రిసార్ట్లో మొత్తం 1,530 గదులు సూట్లు, పై అంతస్తులలో బోటిక్ హోటల్, ఇందులోని ‘ఎన్ క్లేవ్‘లో 313 అల్ట్రా–లగ్జరీ బస సౌకర్యం ఉంటుంది. మొత్తం 20,900 చదరపు మీటర్ల క్యాసినో 22వ అంతస్తులో రెండవ గేమింగ్ ప్లేస్, వాటర్ గేమ్స్ కోసం డీప్–వాటర్ మెరీనాలు ఉంటాయి. విన్ అల్ మార్జన్ ద్వీపంలో 22 రెస్టారెంట్లు, లాంజ్లు కూడా ఉంటాయి.వీటిలో చెఫ్ అలైన్ డుకాస్ రూపొందించిన ఫ్రెంచ్–అమెరికన్ స్టీక్హౌస్ ప్రఖ్యాత లాస్ వెగాస్ సప్పర్ క్లబ్ అయిన డెలిలా లు ఉన్నాయి. ఫైవ్–స్టార్ స్పా, లగ్జరీ రిటైల్ ప్రొమెనేడ్, థియేటర్, నైట్క్లబ్ 7,700 చదరపు మీటర్ల ఈవెంట్స్ సెంటర్ ఉన్నాయి.షెడ్యూల్ ప్రకారం దీని నిర్మాణం చకచకా పురోగమిస్తోంది,గత 2025 చివరి నాటికి దాదాపుగా 90శాతం పనులు పూర్తి కాగా, మరో ఏడాది అంటే 2027లో ఇది ప్రారంభానికి నోచుకుంటుందని అంచనా. ప్రారంభం తర్వాత ఈ రిసార్ట్ రస్ అల్ ఖైమా ప్రొఫైల్ను పెంచుతుందని, సంపన్నులైన పర్యాటకులను, సందర్శకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుందని గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే యుఎఇ ఆర్థిక వృద్ధి బాటలో వైవిధ్యాన్ని సృష్టించడానికి, ప్రపంచ క్యాసినో గమ్యస్థానాలతో పోటీ పడటానికి ఈ ఎడారి ‘ఆటల వేదిక’ సిద్ధమవుతోంది. ఈ విన్ అల్ మార్జన్ ద్వీపం పర్యాటకం, వినోదం పట్ల అరబ్ ప్రాంతపు సంప్రదాయ విధానాన్ని పునర్నిర్వచించడం గల్ఫ్లో ఆతిథ్య పరిశ్రమకు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయంగా పర్యాటక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరో బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. అన్ని దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై తాత్కాలిక సుంకాన్ని పది నుంచి పదిహేను శాతంకు పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కాగా శుక్రవారం ఆయా దేశాలపై ట్రంప్ విధించిన గ్లోబుల్ టారిఫ్లను రద్దు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ధర్మాసనం తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. సెక్షన్ 122 కింద కొత్తగా 10 శాతం గ్లోబల్ టారిఫ్ను విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారమే ట్రంప్ సంతకాలు చేశారు. అయితే ట్రంప్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి.. గరిష్టంగా 15 శాతం వరకు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించారు."ప్రపంచ దేశాలపై విధిస్తున్న 10% సుంకాన్ని 15%కి పెంచాలని నిర్ణయించాను. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. దశాబ్దాలుగా అనేక దేశాలు అమెరికాను దోచుకుంటున్నాయి. రాబోయో కొద్ది నెలల్లో చట్టబద్దంగా అనుమతించదగిన టారిఫ్లను అమల్లోకి తీసుకు రానున్నాను" అని ట్రూత్ సోషల్లో ట్రంప్ పేర్కొన్నారు.కాగా సెక్షన్ 122 ప్రకారం.. అమెరికా ప్రెసెడెంట్ గరిష్టంగా 15 శాతం వరకు సుంకాలు విధించవచ్చు. ఈ సుంకాలు 150 రోజుల వరకు అమలులో ఉంటాయి. ఆ తర్వాత పొడిగించాలంటే అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం తప్పనిసరి
ఇరాన్ - అమెరికా వార్ టెన్షన్
ఇరాన్, అమెరికా వార్ టెన్షన్ రోజురోజుకూ పెరుగుతుంది. ఏక్షణానైనా యుద్ధం మెుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న విదేశీ పౌరుల కోసం ఆ దేశాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సెర్బియా, స్వీడన్ దేశాలు ఆ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి.ప్రస్తుతం ఇరాన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. వచ్చే రెండువారాల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని లేని పక్షంలో ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇది వరకే ట్రంప్ అమెరికా నావికాదళాన్ని ఇరాన్ కు సమీపంలో మోహరించిన సంగతి తెలిసిందే. ఏదైనా తేడాలొస్తే ఏ క్షణానైనా దాడి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గట్లేదు. దీంతో ఇరాన్ లోని తమ దేశ పౌరుల కోసం ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. వారిని వెనక్కి రావాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నాయి. సెర్బియా దేశం ఈ విషయంలో తమ దేశ పౌరులకు స్పష్టమైన ఆ దేశాలు ఇచ్చింది. ఇరాన్ లో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నందున తమ దేశ పౌరులెవరూ అక్కడి వెళ్లకూడదని ఆదేశించింది. అంతేకాకుండా అక్కడ ఉన్న వారు వీలైనంత త్వరగా ఇరాన్ ని వదలాలని అక్కడి విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా స్వీడన్ సైతం తమ దేశస్థులు వీలైనంత త్వరగా ఇరాన్ ని వీడాలని తెలిపింది. బల్కాన్ కంట్రీ గత నెలలోనే ఆ దేశ పౌరులు ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పేర్కొంది.ఇదిలా ఉండగా తాజాగా ఆక్సియోస్ (Axios) నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని టార్గెట్ చేసి హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు ఆక్సియోస్ నివేదిక ప్రచురించింది. దీంతో ఈఅంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో ఇప్పుడు ఏ జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.
భూమికి చేరువగా పెద్ద భవనం అంత ఆస్టరాయిడ్ : నాసా హెచ్చరిక
ఒక పెద్ద గ్రహశకలం భూమికి చేరువగా వస్తోందని నాసా (NASA) ఒక హెచ్చరిక జారీ చేసింది. ఈ శిల కొన్ని గంటల్లో భూమిని సమీపిస్తుందని భావిస్తున్నారు. దీనికి ఆస్టరాయిడ్ (గ్రహశకలం)2025 YU15 అని పేరు పెట్టారు. దీని వెడల్పు 410 అడుగులు. NASA JPL దాని పరిమాణాన్ని ఒక పెద్ద భవనంతో పోల్చింది. దీని వల్ల ఎలాంటి ముప్పు ఉంది?ఈ ఆస్టరాయిడ్ను 2025లో గుర్తించారు. ఇది ఫిబ్రవరి 21న భూమికి దగ్గరగా వస్తుందనీ, ఇది భూమికి దగ్గరగా ఉన్నప్పుడు, భూమికి , ఆస్టరాయిడ్ మధ్య దూరం 5.89 మిలియన్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని నాసా చెప్పింది. భూమికి చేరువగా వస్తున్న ఆస్టరాయిడ్ 2025 YU15 ను శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు 7.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో భూమికి కొంత సమీపం నుండే వెళ్తున్నప్పటికీ, దీని దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని వారు భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ, వీటిని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. గ్రహాల గురుత్వాకర్షణ శక్తి వల్ల వీటి కక్ష్యలో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు వీటి పట్ల అప్రమత్తంగా ఉంటారు.ఇది గంటకు 21,306 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు, ఇది 36,60,000 మైళ్ల దూరంలో ఉంటుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ దూరం తక్కువే అయినప్పటికీ, శాస్త్రవేత్తలు దీనిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆస్టరాయిడ్ 2025 YU15 'అటెన్' (Aten) సమూహానికి చెందినది. ఈ తరహా గ్రహశకలాలు భూమి కక్ష్యను దాటుతుంటాయి.ఆస్టరాయిడ్ 2025 YU15 వల్ల ముప్పు ఉందా?దీనివల్ల తక్షణ ముప్పు ఏమీ లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రమాదకరమైన వస్తువులను గుర్తించడానికి నాసా కొన్ని కఠినమైన నిబంధనలను పాటిస్తుంది. ఏదైనా గ్రహశకలం భూమికి 7.4 మిలియన్ కిలోమీటర్ల లోపు ఉండి, 85 మీటర్లకుమించి వెడల్పు ఉంటేనే దానిని ప్రమాదకరమైనదిగా భావిస్తారు. అందువల్ల, ఆస్టరాయిడ్ 2025 YU15 ప్రయాణం సురక్షితమైనదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇదీ చదవండి: సుందర్ పిచాయ్తో సరదాగా, సర్ప్రైజింగా : వైరల్ వీడియోలుభారత్ ,అంతర్జాతీయ సంస్థలు ఎందుకు గమనిస్తున్నాయి?భారతదేశం కూడా గ్రహశకలాల పరిశోధనలో తన పట్టును పెంచుకుంటోంది. ఇస్రో (ISRO) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. భారీ గ్రహశకలాలను దగ్గరగా అధ్యయనం చేయడంపై భారత్ దృష్టి సారించింది. ముఖ్యంగా 2029లో భూమికి దగ్గరగా రానున్న 'అపోఫిస్' (Apophis) గ్రహశకలంపై పరిశోధనలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నాసా,ఈఎస్ఏ (ESA), జాక్సా (JAXA) వంటి సంస్థలతో భారత్ సహకరించనుంది. భవిష్యత్తులో గ్రహశకలాలపై ల్యాండింగ్ చేసే ప్రయత్నాలు కూడా జరగవచ్చు.నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ప్రకారం, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా శక్తివంతమైనది, అది సెకనుకు 9.8 మీటర్ల వేగంతో ఒక వస్తువును లాగగలదు. కొన్నిసార్లు, ఉల్కలు కూడా భూమి వైపుకు లాగబడతాయి. గ్రహశకలాలు , ఉల్కలు రెండూ భూమిపై పడితే హానికరం కావచ్చు.అందుకే ఖగోళ సైంటిస్టులు దీన్ని అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం
జాతీయం
ఢిల్లీ డిక్లరేషన్: బయటపడిన పాక్ కుళ్లు.. తైవాన్ భయం?
న్యూఢిల్లీ: ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ నేపధ్యంలో భారత్ నేతృత్వంలో ‘ఢిల్లీ డిక్లరేషన్’ రూపొందింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. అమెరికా, చైనా తదితర అగ్రరాజ్యాలు సహా 88 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు తెలపడం గమనార్హం. అయితే ఈ చరిత్రాత్మక ఒప్పందంలో పాకిస్తాన్, తైవాన్ దేశాలు భాగస్వాములుగా చేరకపోవడం చర్చనీయాశంగా నిలిచిందిదౌత్యపరమైన విబేధాలతో..భారత్ ప్రతిపాదించిన ఈ అంతర్జాతీయ ఏఐ ఫ్రేమ్వర్క్కు పాకిస్తాన్ దూరంగా ఉండటం వెనుక ప్రధానంగా దౌత్యపరమైన విబేధాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై భారత్ సాధిస్తున్న దౌత్య విజయాలను గుర్తించడానికి పాక్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఈ సదస్సులో భారత్ పోషించిన పాత్రపై పాకిస్తాన్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఇదే ఈ ఒప్పందానికి పాక్ను దూరం చేసింది. సాంకేతిక పురోగతి కంటే రాజకీయ ప్రాధాన్యతలే గొప్ప అనే ధోరణితో పాకిస్తాన్ వ్యవహరిస్తోంది.తైవాన్కు ‘వన్ చైనా’ అడ్డంకిమరోవైపు సెమీకండక్టర్ల తయారీలో ప్రపంచానికే తలమానికంగా నిలిచిన తైవాన్ ఈ సదస్సుకు హాజరుకాకపోవడం వెనుక ‘వన్ చైనా’ (One China) విధానం ఒక ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ ఢిల్లీ డిక్లేరేషన్పై సంతకం చేసిన దేశాలలో చైనా ఒకటి. అంతర్జాతీయ వేదికలపై తైవాన్ను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించే ఏ ప్రయత్నాన్నైనా చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తైవాన్ గైర్హాజరుకు సాంకేతిక కారణాల కంటే చైనా ఒత్తిడి, అంతర్జాతీయ గుర్తింపు సమస్యలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ చిప్ల సరఫరాలో 90 శాతానికి పైగా వాటా కలిగిన తైవాన్ ఈ ఒప్పందంలో లేకపోవడం సాంకేతికంగా పెద్ద లోటుగా మిగిలింది. భారత్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సు 88 దేశాల అఖండ మద్దతుతో విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి వరకు సాంకేతికతను తీసుకెళ్లాలనే సంకల్పాన్ని చాటిచెప్పింది.
ఐదు లక్షల లంచం.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్
హుబ్లీ: కర్ణాటకలో సంచలన ఘటన చోటుచేసుకుంది. అవినీతి, లంచం కేసుల్లో దాడులు నిర్వహించే లోకాయుక్తకు ప్రతిపక్ష బీజేపీ శాసనసభ్యుడు చిక్కారు. లంచం తీసుకుంటూ గదగ్ జిల్లా సిరహట్టి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లామాణి పట్టుబడ్డారు. శనివారం మధ్యాహ్నం గదగ్ జిల్లా లక్ష్మేశ్వర పట్టణంలోని ఎమ్మెల్యేకు చెందిన బాలాజీ ఆస్పత్రిపై లోకయుక్త అధికారులు దాడి చేశారు.ఈ సందర్భంగా కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు డబ్బులు తీసుకుంటున్న ఎమ్మెల్యే చంద్రుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన ఇద్దరు పీఏలు మంజునాథ వాల్మీకి, గురు నాయక్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్ననీటి పారుదల పనులకు సంబంధించి కాంట్రాక్టర్ విజయ్ పూజార్ని ఎమ్మెల్యే రూ.11 లక్షలు డిమాండ్ చేశారని, అందులో రూ.5 లక్షలు తీసుకుంటుండగా దాడి చేసినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఓ పీఏ రూ.50 వేల నగదున్న కవరును బయటకు విసిరేయగా దానిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా, ధార్వాడ లోకాయుక్త ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలో అధికారులు, సిబ్బంది, దాడిలో పాల్గొన్నారు. నగదు డిమాండ్ చేస్తూ విజయ్కు చేసిన ఫోన్ కాల్ ఆడియో ఆధారంగా ఎమ్మెల్యేపై నిఘా ఉంచినట్లు సమాచారం. అరెస్టు గురించి విధానసభ స్పీకర్ యూటీ ఖాదర్కు సమాచారం అందించారు. ఈ విషయంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాగా, 2023లో కూడా మరో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే.
ఏఐ దెబ్బ: ‘లివ్స్పేస్’లో వెయ్యి మంది అవుట్!
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఏ రంగాన్నీ విడిచిపెట్టడం లేదు. ప్రపంచాన్ని ఏఐ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో హోమ్ ఇంటీరియర్ రంగంలో అగ్రగామి స్టార్టప్ సంస్థ ‘లివ్స్పేస్’ సంచలన నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచి, కార్యకలాపాలను పూర్తిగా ఏఐ ఆధారితంగా మార్చే క్రమంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. సుమారు 1,000 మంది సిబ్బందిని, అంటే సంస్థలోని 12 శాతం సిబ్బందిని ఇంటికి పంపినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.కేకేఆర్ (కేకేఆర్) లాంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులతో రూపుదిద్దుకున్న ఈ యూనికార్న్ స్టార్టప్లో 7,000 నుండి 8,000 మంది వరకు సిబ్బంది ఉన్నారు. తాజా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా డిజైనింగ్, సేల్స్, ఆపరేషన్స్, మార్కెటింగ్ విభాగాలపై ఏఐ ప్రభావం తీవ్రంగా పడింది. ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో సంస్థను ‘ఏఐ-నేటివ్ ఏజెంటిక్’ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.ఈ పరిణామాలపై కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ, ఇది కేవలం పొదుపు చర్య మాత్రమే కాదని, వనరులను వ్యూహాత్మకంగా పునఃకేటాయించడంలో భాగమేనని అన్నారు. సాంకేతికతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే సంస్థగా కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ఆటోమేషన్ చేస్తున్నట్లు వివరించారు. గతంలో మానవ వనరులతో సాధ్యమయ్యే పనులను ఇప్పుడు అధునాతన ఏఐ ఏజెంట్లు చేపడుతున్నాయని, దీనివల్ల ప్రస్తుతం ఉన్న బృందాల పనితీరు కూడా మెరుగుపడుతుందని సంస్థ భావిస్తోంది.లివ్స్పేస్ చరిత్రలో ఉద్యోగుల తొలగింపు ఇది మొదటిసారి కాదు. గతంలో 2020లో 400 మందిని, 2023లో దాదాపు 100 మందిని ఆర్థిక లక్ష్యాల సాధనలో భాగంగా తొలగించింది. ఆర్థిక ఫలితాల పరంగా చూస్తే 2025 మార్చి నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో లివ్స్పేస్ తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంది. మునుపటి ఏడాది 1,185 కోట్లుగా ఉన్న ఆదాయం, తాజాగా 23 శాతం వృద్ధి చెంది 1,460 కోట్ల రూపాయలకు చేరుకుంది. అదే సమయంలో సంస్థ తన నష్టాలను కూడా 416 కోట్ల నుండి 242 కోట్లకు తగ్గించుకోగలిగింది. సుమారు 500 మిలియన్ డాలర్ల నిధులను సేకరించి, ఒక బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన సంస్థగా ఎదిగినప్పటికీ, మారిన సాంకేతిక పరిస్థితుల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.మరోవైపు సంస్థ నాయకత్వంలోనూ కీలక మార్పు చోటుచేసుకుంది. లివ్స్పేస్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ జైన్ తన పదవికి రాజీనామా చేశారు. 2015లో తన స్టార్టప్ ‘డిజైన్అప్’ను లివ్స్పేస్లో విలీనం చేసిన నాటి నుండి సంస్థలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2022లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తన వ్యక్తిగత కారణాలతో సంస్థ నుండి నిష్క్రమిస్తున్నట్లు ఆయన తెలిపారు. సాంకేతిక పరిణామాల నేపథ్యంలో నాయకత్వ మార్పులు కూడా సహజంగానే జరుగుతున్నాయని ఈ సందర్భంగా సంస్థ పేర్కొనడం గమనార్హం. ఇది కూడా చదవండి: ‘మూన్ మిషన్’కు బ్రేక్..‘నాసా’ కీలక ప్రకటన
లడ్డూపై ఏకసభ్య కమిటీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సుబ్రహ్మణ్య స్వామి
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సుబ్రహ్మణ్య స్వామి సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఆయన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మసనం రేపు(సోమవారం) విచారణ చేపట్టనుంది.కాగా, తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్పై చంద్రబాబు ప్రభుత్వం మరో కమిటీ నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏపీ సీఎం చంద్రబాబు, సిట్, సీబీఐ, టీటీడీలను చేర్చారు.అయితే, తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కారు ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కల్తీ కుతంత్రం పనిచేయకపోవడంతో చంద్రబాబు.. తన సొంత కమిటీ వేశారు. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో, కూటమి ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపింది. సిట్ సూచనలకు భిన్నంగా కమిటీ ఏర్పాటు చేసి.. తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకోవాలని బాబు ప్రభుత్వం భావిస్తోంది.
ఎన్ఆర్ఐ
ఎవరీ వంది వర్మ...? మార్స్ రోవర్స్ తొలి ప్లాన్ డ్రైవ్..
అంగారక గ్రహంపై నాసా తొలి ఏఐ ప్లాన్ డ్రైవ్ వెనుక ఉన్న ప్రధాన శాస్త్రవేత్తగా భారత సంతతి మహిళ వంది వర్మ చరిత్ర సృష్టించారు. భారత్కి చెందిన ఈ రోబోటిక్స్ ఇంజనీర్ వంది వర్మ విమానాయనానికి సంబంధించిన కుటుంబంలోనే పెరగడంతో సాంకేతికను అన్వేషించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. నాసా ప్రకారం..వర్మ జేపీఎల్ ప్రిన్సిపాల్ ఇంజనీర్గా, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో మొబిలిటీ అండ్ రోబోటిక్స్ విభాగానికి డిప్యూటీ సెక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థకు ముందు, అధికారికంగా ధృవీకరించిన ప్లాన్ అములు చేసే భాష PLEXIL, రోవర్లు, మానవ అంతరిక్ష ప్రయాణ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతికతను డెవలప్చేయడానికి రూపొందించిన బృందానికి ఆమె నాయకత్వం వహించినట్లు నాసా పేర్కొంది. ఆ కారణంతోనే రోబోటిక్ ఇంజనీరింగ్నే కెరీర్గా ఎంచుకుంది..వర్మ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. విమానాలు,ఇంజనీరింగ్ వాతావరణాలతో ఆమెకు తొలి దశలో పరిచయం ఉండటం వల్ల ఆమెకు టెక్నాలజీపై ఆసక్తి పెరిగింది. చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి, తర్వాత కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి రోబోటిక్స్లో మాస్టర్స్ అండ్ పిహెచ్డి పొందారామె. ఇక వర్మ డిసెంబర్ 8 నుంచి 10 తేదీల్లో ఏఐ ప్లాన్ పెర్సెవరెన్స్ మార్స్ రోవర్ మొదటి డ్రైవ్లను పూర్తి చేసినట్లు నాసా ధృవీకరించింది. ఈ ప్రదర్శనం మన సామర్త్యాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయో చెబుతుండటమే గాక, ఇతర ప్రపంచాలను ఎలా అన్వేషించాలో తెలుపుతుందని నాసా అడ్మినిస్ట్రేర్ జారెడ్ ఐజాక్మాన్ చెబుతున్నారు. (చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!)
పావురాలకు దాణా వేస్తే 2.2 లక్షల జరిమానా
సింగపూర్: భారత్లో పలు నగరాల్లో విపరీతంగా కన్పించే పావురాలను అమితంగా ఇష్టపడుతూ వాటికి జొన్నల వంటి తిండి గింజలను దాణాగా వేస్తూ పిల్లలుపెద్దలు ఎంతో ఆనందపడతారు. అచ్చం అదే పని చేసి సింగపూర్లో ఓ భారతీయ వృద్ధురాలు లక్షల రూపాయల జరిమానా కట్టాల్సి వచ్చింది. పావురాల రెట్ట, వ్యర్థాల్లో పలు రకాల శ్వాసకోశ వ్యాధికారక క్రిములు ఉంటాయి.గాలిలో ఇవి కలిశాక మనుషులు పీలిస్తే ఇబ్బందుల్లో పడతాము. దీంతో పావురాల సంతతి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవద్దనే ఉద్దేశంతో వీటికి దాణా వేసి ప్రక్రియపై సింగపూర్లో నిషేధం విధించారు. ఈ విషయం తెలీక 71 ఏల్ల షణ్ముగనాథన్ శ్యామల అనే పెద్దావిడ గత ఆరు నెలల్లో తొమ్మిదిసార్లు పావురాలకు దాణా వేశారు. విషయం తెల్సి అధికారులు ఈమెపై కేసు నమోదుచేశారు. విచారించిన కోర్టు ఈమెకు 2,518 డాలర్ల(దాదాపు రూ.2,27,753) జరిమానా విధించింది.
ఎన్నారైలకు గుడ్న్యూస్.. అంత బంగారంపై నోట్యాక్స్
భారత ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ఎన్నారైలకు బంగారంపై కలిపించిన వెసులుబాటు పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఎన్నార్లైలకు విధించిన బంగారం పరిమితి నిబంధనలను మారుస్తున్నట్లు తెలిపింది.ఇదివరకూ ప్రవాస భారతీయులు భారత్ వచ్చే సమయంలో వారి వెంట ఉన్న బంగారు ఆభరణాలకు విలువ ఆధారంగా సుంకం ఉండేది. మహిళలకు రూ. లక్షలోపు, పురుషులకు రూ. 50 వేల లోపు విలువ ఉన్న పసిడికి ఎటువంటి సుంకం ఉండేది కాదు. ఆ పైన విలువ ఉన్న వాటికి మత్రమే సుంకం చెల్లించే విధంగా నియమాలు ఉండేవి.అయితే ప్రస్తుత బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం పరిమితిపై వెసులుబాటును మార్చుతున్నట్లు ప్రకటించింది. ప్రవాస భారతీయులు స్వదేశానికి వచ్చే సమయంలో మహిళలకు 40 గ్రాములు, పురుషులకు 20 గ్రాముల బంగారాన్ని ఎటువంటి సుంకం లేకుండా తీసుకరావచ్చని పేర్కొంది. ఆ పైన ఉన్న వాటికి మాత్రమే పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదివరకూ ఉన్న ద్రవ్య విలువ ఆధారంగా రూ. లక్షకు కేవలం ఆరు గ్రాములు, రూ. 50 వేలకు మూడు గ్రాముల పరిమితే ఉంటుంది. ప్రస్తుతం అది 20 నుంచి 40 గ్రాములకు చేరుకుంది. భారత ప్రభుత్వం ఆ పరిమితిని గణనీయంగా పెంచడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అంబటి, జోగి ఇళ్లపై దాడి.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ గూండాల దాడిని వైఎస్సార్సీపీ సెంట్రల్ సౌదీ అరేబియా ఎన్ఆర్ఐ వింగ్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు ప్రజలు.. ఏపీలో జరుగుతున్న చంద్రబాబు సర్కార్ అరాచకాలను గమనిస్తున్నారని పేర్కొంది. కూటమి సర్కార్.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అభివృద్ధిని అడ్డుకుందని.. కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తోందని వైఎస్సార్సీపీ సెంట్రల్ సౌదీ అరేబియా ఎన్ఆర్ఐ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన విధ్వంసం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పార్టీ కన్వీనర్ సయ్యద్ రబ్బానీ మండిపడ్డారు. ఈ అక్రమ చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో చట్టం ముందు తప్పకుండా జవాబుదారీగా నిలబడాల్సిందేనన్నారు. న్యాయం తప్పక గెలుస్తుందని మేము దృ ఢంగా విశ్వసిస్తున్నామన్నారు. ఇవాళ వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ముందడుగు వేసి.. ఈ అన్యాయ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్ జగన్ చూపిన సంక్షేమ మార్గమే.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని.. మేమంతా ఆయన వెంటే ఉంటామని సయ్యద్ రబ్బానీ ఒక ప్రకటనలో తెలిపారు.
క్రైమ్
నీ భర్తను అడ్డు తొలగించుకో.. నిన్ను బాగా చూసుకుంటా!
చేవెళ్ల: ఇన్స్టాలో పరిచయమైన ప్రియుడి మోజులో పడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కడతేర్చింది ఓ భార్య. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా నిందితులైన మృతుడి భార్య, ఆమె ప్రియుడిని జైలుకు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శంకర్పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన నారగూడెం కృష్ణ(35) జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి చంద్రారెడ్డినగర్లోని అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. ఇదిలా ఉండగా, చేవెళ్ల మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన శరత్ అనే వ్యక్తి చేవెళ్లలోని గణేశ్నగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం రాజేశ్వరితో ఇతనికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఇతని మోజులో పడిన రాజేశ్వరి భర్తతో తరచూ గొడవ పడుతోంది. ఇదే అదనుగా భావించిన శరత్ నీ భర్తను అడ్డు తొలగించుకో, నిన్ను బాగా చూసుకుంటా అని నమ్మించాడు. ఈక్రమంలో గురువారం రాత్రి మద్యం తాగి వచి్చన భర్తతో రాజేశ్వరి గొడవ పడింది. అతను నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. గాఢ నిద్రలో ఉన్న కృష్ణ కాళ్లు, చేతులు కట్టేసి, ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారు. అతడు చనిపోయిన తర్వాత, తెల్లవారుజాము వరకూ ఇంట్లోనే ఉన్న ప్రియుడు ఆతర్వాత జారుకున్నాడు. శుక్రవారం ఉదయం ఏమీ తెలియనట్లు తన భర్త నిద్ర లేవడం లేదంటూ, ఆటోను పిలిపించి పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు మృతిచెందాడని చెప్పడంతో, బాడీని ఇంటికి తీసుకెళ్లి బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. తన కొడుకు మృతికి కోడలే కారణమని కృష్ణ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ భూపాల్శ్రీధర్, డీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని, ఆమె ఫోన్ నంబర్ల ఆధారంగా విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. ప్రియుడు శరత్తో కలిసి తానే హత్య చేసినట్లు అంగీకరించింది. ఇరువురినీ కోర్టులో హాజరుపర్చిన అనంతరం శనివారం రిమాండ్కు తరలించారు.
చిమ్మచీకటి.. ఒళ్లంతా గాయాలు
పెద్దపల్లిరూరల్: భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలు విడాకుల దాకా వచ్చాయి. సుమారు పన్నెండేళ్లపాటు సంసారం సాఫీగానే సాగినా.. ఆ తర్వాత తలెత్తిన విభేదాలు దంపతుల మధ్య చిచ్చుపెట్టాయి. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం కోర్డు విచారణకు వచి్చన మొదటి భార్య పద్మను పెద్దపల్లి బస్టాండ్ నుంచి నమ్మించి తన వెంట తీసుకెళ్లిన భర్త వెంకటేశ్.. కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్పేట మైసమ్మగుడి ప్రాంతంలో బండరాయితో మోదీ, తీవ్రంగా గాయపర్చి చనిపోయిందనుకుని వెనుదిరిగాడు. ఈ విషయాన్ని పెద్దపల్లి ఎస్సై లక్ష్మణ్రావు తెలిపారు. వివరాలు.. చిమ్మచీకటి.. మరునాడు రోజంతా.. ఈనెల 19న పెద్దపల్లి కోర్డుకు కేసు విచారణకు హాజరైన దంపతులు పద్మ – వెంకటేశ్ విచారణ ముగిసిన తర్వాత వెలుపలకొచ్చారు. పద్మ తన తండ్రి మల్లయ్యతో కలిసి వచ్చింది. తిరుగు ప్రయాణంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ వెళ్లేందుకు బస్సు ఎక్కించిన మల్లయ్య.. పనినిమిత్తం ఆయన కాల్వశ్రీరాంపూర్ వెళ్లాడు. ఈ విషయాన్ని పసిగట్టిన వెంకటేశ్.. బస్సు వెనకాలే వెళ్లి అక్కడ నుంచి పద్మను మాట్లాడాలంటూ కిందకు దించాడు. ఆ తర్వాత కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్పేట ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చేందుకు నిశ్చయించుకున్నాడు. కోర్టులో పెట్టిన కేసు వాపస్ తీసుకోవాలని పద్మను బెదిరిస్తూ విచక్షణారహితంగా కొట్టి పెద్దబండ రాయితో మోదాడు. తీవ్రగాయాలతో స్పృహతప్పి పడిపోయిన పద్మ చనిపోయిందనుకుని నిశ్చయించుకున్న వెంకటేశ్.. అక్కడి నుంచి వెనుదిరిగాడు. అప్పటికే రాత్రంతా కటికచీకట్లో నరకయాతన అనుభవించిన పద్మ.. మరుసటి రోజు అవే ముళ్లపొదల్లో నిస్సహాయ స్థితిలో పడిఉంది. మల్లయ్య ఫిర్యాదుతో పోలీసులు విచారించగా.. పద్మపై దాడికి పాల్పడ్డాడని అంగీకరించి ఘటనా స్థలాన్ని చూపడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అచేతనావస్థలో ఉన్న పద్మను శుక్రవారం రాత్రి పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. హత్యాయత్నం కేసు.. అరెస్టు భర్త చేతిలో తీవ్రంగా గాయపడి కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నూనె పద్మను ఆమె భర్త వెంకటేశ్ హతమార్చేందుకు యతి్నంచాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి నిందితుడు వెంకటేశ్ను అరెస్టు చేసినట్టు ఎస్సై లక్ష్మణ్రావు వివరించారు.
చంపుతానని బెదిరించి.. అన్నంత పనిచేసి
రామగిరి(మంథని): తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడానికి ఇద్దరు కారణమని, ఎప్పటికైనా వారిద్దరినీ చంపుతానని సుమారు 15ఏళ్లపాటు బెదిరిస్తూ వచ్చిన ఆ వ్యక్తి అనుకున్నట్లే మొలుగూరి కొమురయ్య(58)ను హతమార్చాడు. పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీలోని బంధువుల వివాహ వేడుకకు హాజరైన కొమురయ్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రామగిరి పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన మొలుగూరి కొమురయ్య, మొలుగురి సత్తయ్య అన్నదమ్ములు. కొమురయ్య బేగంపేటలో ఉంటూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సత్తయ్య సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లిలో కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సత్తయ్య బావమరిది బుర్ర రాజకొమురయ్య కొడుకు తిరుపతి 2011లో కమాన్పూర్ మండలం గుండారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే, తన కుమారుడికి కొమురయ్య, సత్తయ్య యాక్సిడెంట్ చేయించారని రాజకొమురయ్య అప్పట్నుంచి అనుమానిస్తూనే ఇద్దరితోనూ గొడపడుతూ వస్తున్నాడు. ఎలాగైనా ఇద్దరినీ చంపుతానని బెదిరించేవాడు. ఈనేపథ్యంలోనే సెంటినరీకాలనీలోని కమ్యూనిటీహాల్లో శనివారం జరిగే బంధువుల వివాహ వేడుకలకు కొమురయ్య, సత్తయ్య కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. దీనిని అవకాశంగా తీసుకున్న రాజకొమురయ్య హఠాత్తుగా సత్తయ్యపై కత్తితో దాడి చేయగా కుడి చేతికి గాయమైంది. అక్కడే ఉన్న కొమురయ్య అడ్డుకునేందుకు యత్నించగా అతడిపైనా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కొమురయ్య ఘటన స్థలంలోనే మరణించాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బేగంపేట గ్రామానికి చెందిన బుర్ర రాజకొమురయ్య తన భర్తపై దాడి చేశాడని మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. బంధువుల వివాహ వేడుకల్లో విగతజీవిగా పడిఉన్న కొమురయ్యను చూసి స్థానికులు కంటతడిపెట్టారు.
25 ఏళ్ల యువతిని లొంగదీసుకున్న 50 ఏళ్ల వ్యక్తి..!
హైదరాబాద్: వివాహితను బెదిరించి లొంగదీసుకున్న ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఆర్నగర్ పోలీసుల కథనం ప్రకారం... గుంటూరుకు చెందిన యువతి(25) ఎస్ఆర్నగర్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే క్రమంలో బంజారాహిల్స్కు చెందిన మల్లికార్జున్రెడ్డి(50) పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2024లో ఆమెకు వేరే వ్యక్తితో వివాహమైంది. గతేడాది నుంచి మల్లికార్జున్రెడ్డి మళ్లీ ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. ఇటీవల మధురానగర్లోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, చెప్పినట్లు వినకపోతే వాటిని కుటుంబసభ్యులకు పంపుతానని భయపెట్టి లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోవాలని వేధించాడు. స్నేహితురాలి సాయంతో ఆమె హైకోర్టును ఆశ్రయించడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఆర్నగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును మధురానగర్ పీఎస్కు బదిలీ చేశారు.
వీడియోలు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి రిసెప్షన్ డేట్ లీక్
SBI నుంచి మరో అతిపెద్ద IPO.. రూ.1.36 లక్షల కోట్లు..
తప్పు చేసిన వారు వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి ఆహుతి కాక తప్పదు
కారులో డెడ్ బాడీ
హనుమాన్ సీక్వెల్.. “జై హనుమాన్” మొదలైంది.. పూజా కార్యక్రమంలో రిషబ్ శెట్టి
బొగ్గుల శ్రీనివాస్ ది హత్యే.. చంపింది వాళ్లే.. ACP సంచలన ప్రెస్ మీట్
గుర్తుపెట్టుకో.. చెంపలేసుకొని సారీ చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది
కొచ్చిలో ఘనంగా 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలు
నాపై దాడిని బీజేపీ, జనసేన నేతలు ఖండించారు.. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప
అది దేవుడు నీకు వేసిన శిక్ష.. శివుడి మెడలో పాముపై బాబు వ్యాఖ్యలు.. భూమన కౌంటర్

