Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ysrcp Zptc Ramagovinda Reddy Was Unanimously Elected As Chairman Of Ysr Zilla Parishad1
వైఎస్సార్‌ జిల్లా జడ్పీ ఛైర్మన్‌ పదవి వైఎస్సార్‌సీపీ కైవసం

సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌ జిల్లా జడ్పీ ఛైర్మన్‌ పదవి వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్‌ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం రామగోవిందరెడ్డి జడ్పీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.కాగా, బ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డిని వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేశారు.కాగా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్‌ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్‌ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్‌ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్‌ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్‌ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్‌కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.కాగా, చైర్మన్‌ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన ఎన్నికలో వైఎస్సార్‌ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికల అధికారి అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

IPL 2025: Sunrisers hyderabad vs Lucknow super giants Live Updates And Highlights2
ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌.. బౌలింగ్ ఎంచుకున్న ల‌క్నో

SRH vs LSG Live Updates And Highlights: ఐపీఎల్‌-2025లో మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరుకు తెర‌లేచింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జ‌ట్లులక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్‌), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), సిమర్జీత్ సింగ్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్టిట్యూట్స్:లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, మణిమారన్ సిద్ధార్థ్, ఆకాష్ సింగ్సన్‌రైజర్స్ హైదరాబాద్: సచిన్ బేబీ, వియాన్ ముల్డర్, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కట్, జీషన్ అన్సారీ

YS Jagan Heavily Slams CBN Pawan Over Kasinayana Kshetram Row3
దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి పాలనలో ఒకవైపు యధేచ్చగా జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు, మరోవైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే ఆలయాల పరిరక్షణ కొనసాగిందన్న ఆయన.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతోనే ఇప్పుడు ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెబ్బ తింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్‌ జగన్‌(YS Jagan) ట్వీట్‌లో ఏమన్నారంటే.. నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్‌ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?. ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రం(Kasinayana Kshetram)లో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మం(Hindu Dharmam)పై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?.. .. అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా? అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్‌ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు. ఆలయాలపట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణపట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. .. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్‌ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు(Chandrababu)గారి ఆదేశాలమేరకు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడిచేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటీ మీ సమాధానం? తామే ఉత్తర్వులిచ్చి, తమ చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారు. వీళ్ల తీరే అంత? .. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమనుతాము చిత్రీకరించుకునేది వీళ్లే. .. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్‌ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో… pic.twitter.com/gTRsvBfnia— YS Jagan Mohan Reddy (@ysjagan) March 27, 2025

YSRCP MLC Bharat Slams TDP Govt Conspiracy Over MPP Elections In Kuppam4
‘మా ఎంపీటీసీల బస్సును అడుగడుగునా అడ్డగించారు’

కుప్పం(చిత్తూరు జిల్లా): కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భరత్ ధ్వజమెత్తారు. ఎంపీటీసీలను ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోకి ఆడ్డుకున్నారని మండిపడ్డారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో భాగంగా కుప్పంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును భరత్ ఎండగట్టారు.‘పోలీసులు నామమాత్రంగా బందోబస్తు నిర్వహించారు. మా ఎంపీటీసీలు వెళ్తున్న బస్సును అడుగు అడుగునా అడ్డగించారు. పోలీసులు సెక్యూరిటీ ఉన్నా చోద్యం చూస్తున్నారు. టీడీపీ సీనియర్ నేతలు గంజాయి కేసులు పెడతాము అని ఎంపీటీసీలను బెదిరించారు. రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోందని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ఏం జరుగుతుందో అందరూ చూశారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈరోజు మాపై దాడి కూడా చేయాలని కుట్ర చేశారు. ఈ ఎన్నికలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం. కోరం లేకుండా ఎంపీపీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు’ అని భరత్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వాదులు ఒకసారి కుప్పం వైపు చూడండిప్రజాస్వామ్య వాదులుగా చెప్పుకుంటున్న వారు ఒకసారి కుప్పం వైపు చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు\ చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు. ‘కోరం లేకుండా రామకుప్పం ఎంపిపి ఎన్నికలు నిర్వహించారు. టీడీపీ నాయకులతో కుమ్మక్కు రాజకీయం చేశారు. కుప్పం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యంను ఖూనీ చేశారు. టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది’ అని మండిపడ్డారు గోవిందప్ప.ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదుఈ తరహా ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు.. జరగలేదన్నారు రామకుప్పం ఎంపీపీ కుందనందన రెడ్డి,. ‘ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అంటే ఒక ఆదర్శంగా ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీటీసీలు అందరినీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మాపై కేసులు పెడతాం అని బెదిరించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం’ అని రామకుప్పం ఎంపీపీ కుందనందన రెడ్డి స్పష్టం చేశారు.

Ysrcp Candidate Alla Subbamma Won As The Tripuranthakam Mpp5
కూటమి కుట్రలు పటాపంచలు.. ఈ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం

సాక్షి, ప్రకాశం జిల్లా: త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు ఎదురైంది. త్రిపురాంతకం ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ విజయం సాధించారు. అక్రమ కేసులతో భయపెట్టినా వైఎస్సార్‌సీపీకే ఎంపీటీసీలు పట్టం కట్టారు. టీడీపీ ప్రలోభాలకు గురిచేసినా త్రిపురాంతకం-2 ఎంపీటీసీ సృజన లొంగలేదు. ఎన్నికల హాలులోనే సృజనపై టిడిపి ఎంపీటీసీలు దాడికి కూడా యత్నించారు. సృజనా ఎత్తిన చేయిని బలవంతగా దించివేయడానికి కూటమి అభ్యర్థి చల్లా జ్యోతి ప్రయత్నించింది.మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలలో వైఎస్సార్ సీపీ గెలిచింది. టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రలోభాలు పెట్టినా... వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు మాత్రం వారి ఒత్తిడి కి తలొగ్గలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హైడ్రామా మధ్య మండల ప్రజా పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఐదు ఎంపీపీ, నాలుగు వైస్ ఎంపీపీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి.కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు ఎంపీపీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లక్ష్మి దేవి విజయం సాధించారు. పెనుకొండ నియోజకవర్గం రొద్దం ఎంపీపీ స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి నాగమ్మ గెలుపొందారు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ ఎంపీపీ స్థానం లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వండ్రయ్య విజయం సాధించారు.వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతుగా మెజారిటీ ఎంపీటీసీలు చేతులెత్తడంతో ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యింది. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రలోభాలు.. బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ ఎమ్మీటీసీలు లొంగలేదు. కోరం ఉన్నా సంతకాలు తీసుకోవడంలో అధికారులు జాప్యం చేయడం, సమయం పూర్తి కావడంతో గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు.రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడంతో సమయానికి సభ్యులు రాక రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సారసీపీ విజయం సీఎం చంద్రబాబబుకు చెంపపెట్టు అని శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ స్పష్టం చేశారు.తిరుపతి రూరల్‌ ఎంపీపీ స్థానం వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మూలం చంద్రమౌళిరెడ్డి గెలుపొందారు. ఆయనకు 33 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు మద్దతునిచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రుత్తుల సర్వేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బలం లేకపోవడంతో టీడీపీ ఎంపీటీసీలు పోటీకి దూరంగా ఉన్నారు. మాడుగుల ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తాళ్లపురెడ్డి రాజారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్‌. రాయవరం మండల ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేసుబోయిన వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవరపల్లి మండలం ఎంపీపీగా చింతల భూలోక లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Ram Charans Diet And Fitness Secrets For Toned Body At 406
గ్లోబల్‌ స్టార్‌ రామ​ చరణ్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌..! డైట్‌లో అవి ఉండాల్సిందే..

చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. నటన పరంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌ ఎందులోనైనా తండ్రికి ధీటుగా చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు. ఈ రోజుతో ఆయనకు 40 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చరణ్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌, డైట్‌ప్లాన్‌లు ఏంటో చూద్దామా. ఆయన తొలి చిత్రం చిరుత మూవీ నుంచి ఇటీవల విడుదలైన గేమ్‌ఛేంజర్‌ మూవీ వరకు అదే లుక్‌తో కనిపించేలా బాడీని మెయింటైన్‌ చేస్తున్నారు. అంతలా ఫిట్‌గా కనిపించేందుకు వెనుక ఎంతో డెడీకేషన్‌తో చేసే వర్కౌట్‌లు అనుసరించే డైట్‌లే అత్యంత ప్రధానమైనవి. అవేంటో చూద్దామా..రామ్‌ చరణ్‌ ఒకసారి అపోలా లైఫ్‌ డాట్‌ కామ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఫిట్‌గా యాక్టివ్‌గా ఉండేందుకు ఎలాంటి వ్యాయమాలు, ఆహారం తీసుకుంటారో షేర్‌ చేసుకున్నారు. జంపింగ్ జాక్‌లు, సీటెడ్ మెషిన్ ప్రెస్‌ల నుంచి మిలిటరీ పుషప్‌లు, బార్‌బెల్ స్టిఫ్-లెగ్ డెడ్ లిఫ్ట్‌ల వరకు ప్రతిదీ చేస్తానని అన్నారు. అయితే ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకుంటానని అన్నారు. సమతుల్య జీవనశైలికి ప్రాధన్యాత ఇస్తానని చెప్పారు. ప్రతిరోజూ కొన్ని క్రీడలు తప్పనిసరిగా ఆడతానని అన్నారు. వారంలో నాలుగు రోజులు అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తానని అన్నారు. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పారు. అలాగే ప్రతిరోజు ఒక గంటన్నర పాటు వ్యాయామం చేస్తానని తెలిపారు. అంతేగాదు శరీర బరువుని అదుపులో ఉంచే వ్యాయామాలపై దృష్టి పెడతానని చెప్పారు. 80% ఆహారంపైనే..ఫిట్ బాడీని నిర్వహించడంలో ఆహారం ప్రాముఖ్యతను హైలెట్‌ చేశారు రామ్‌చరణ​. మన ఆరోగ్యం 80 శాతం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందన్నారు. అందువల్ల మనం ఏం తింటున్నాం అనేది అత్యంత ముఖ్యం అని చెప్పారు. అలాగే తాను ఆహారం విషయంలో చాలా కేర్‌ తీసుకుంటానని చెప్పారు. అనారోగ్యకరమైన ఆహారాలకు చాలా దూరంగా ఉంటానని చెప్పారు. అంతేగాదు ప్రతి ఆదివారం చీట్‌మీల్స్‌లో పాల్గొంటా, కానీ అది సృతి మించకుండా చూసుకుంటానని అన్నారు. డైట్ సీక్రెట్స్ఫిట్‌నెస్ కోచ్ రాకేష్ ఉడియార్ రూపొందించిన డైట్ ప్లాన్ ప్రకారం..కెఫిన్, ఆల్కహాల్, చక్కెర పానీయాలు, రెడ్ మీట్, గోధుమలు, ప్రోటీన్ షేక్‌లకు దూరంగా ఉంటారట రామ్‌చరణ్‌. తన రోజుని గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లేట్‌ లేదా పూర్తి గుడ్లు, ఓట్స్‌, బాదంపాలతో ప్రారంభిస్తారట. ఆ తర్వాత మధ్యాహ్నం కూరగాయలతో చేసి సూప్‌ని తీసుకుంటారట. ఇక భోజనంలో చికెన్‌ బ్రెస్ట్‌, బ్రౌన్‌ రైస్‌, గ్రీన్‌ వెజిటేబుల్‌ కర్రీ తీసుకుంటారట. సాయంత్రం స్నాక్స్‌ కోసం గ్రిల్డ్ ఫిష్, చిలగడదుంప, గ్రిల్డ్ వెజిటేబుల్స్‌ను ఇష్టపడతారని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనంలో 'లార్జ్ మిక్స్‌డ్ గ్రీన్ సలాడ్', కొన్ని అవకాడోలను తీసుకుంటారని తెలిపారు ఫిట్‌నెస్ కోచ్ రాకేష్ ఉడియార్.వారంలో చేసే వర్కౌట్‌లు:సోమవారం: బైసెప్స్ (తప్పనిసరి)మంగళవారం: క్వాడ్స్బుధవారం: క్లేవ్స్‌ అండ్‌ అబ్స్గురువారం: ఛాతీ ట్రైసెప్స్శుక్రవారం: బ్యాక్‌ వర్కౌట్‌లుశనివారం: హామ్ స్ట్రింగ్ అండ్‌ ఇన్నర్‌ థై అబ్స్ఆదివారం: ఫుల్‌ రెస్ట్‌ View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) (చదవండి: బాబోయ్‌ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్‌నెస్ ఇన్ఫ్లుయెన్సర్‌ జీవనశైలి)

Judge Yashwanth Varma Cash Row: CJI Meets 6 High Court Bar Heads7
జస్టిస్‌ యశ్వంత్‌ వివాదంపై ఏం చేద్దాం..? వారితో సీజేఐ ప్రత్యేక భేటీ

న్యూఢిల్లీ: ఒకవైపు ఢిల్లీ హైకోర్టులో బాధ్యతలు ఏమీ అప్పగించడం లేదు.. మరొకవైపు అలహాబాద్ హైకోర్టేమో వద్దంటోంది. ఇది జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రస్తుత పరిస్థితి. ఢిల్లీలోని తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయన ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ చిక్కుల్లో పడ్డారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయడానికి పూనుకున్న సుప్రీంకోర్టు.. ముగ్గురు ప్రధాన న్యాయమూర్తలతో కూడిన కమిటీని ఇప్పటికే నియమించింది.అయితే యశ్వంత్ వర్మ సచ్ఛీలురుగా బయటకొచ్చేవరకూ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయొద్దంటూ అక్కడ బార్ అసోసియేషన్ తో పలు రాష్ట్రాల బార్‌ అసోయేషన్స్‌ కూడా కోరాయి. గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్, కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్, కర్ణాటక హైకోర్టు బార్ అసోసియేషన్, లక్నో బార్ అసోసియేషన్స్‌ డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీజేఐ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పలు బార్ అసోసియేషన్ హెడ్స్ తో సీజేఐ సంజీవ్ ఖన్నా ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ బదిలీని నిలుపుదల చేయాలని సదరు బార్‌ అసోసియేషన్స్‌ కోరిన తరుణంలో వారితో సీజేఐ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులతో సీజేఐ సమావేశమై వారితో చర్చించారు. వారి డిమాండ్‌ ను పరిగణలోకి తీసుకుంటామని సీజేఐ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. #WATCH | Presidents of Bar Associations of High Court of Allahabad, Lucknow bench, Gujarat, Karnataka, and Jabalpur bench of Madhya Pradesh have come to Supreme Court to meet Chief Justice of India Sanjiv Khanna and other senior judges on the issue of Justice Yashwant Varma.… pic.twitter.com/JuX6sLgsl3— ANI (@ANI) March 27, 2025 ఢిల్లీ హైకోర్టు ‘ దూరం’ పెట్టేసింది..!జస్టిస్ యశ్వంత్ వర్మపై అవినీతి ఆరోపణల అనంతరం ఏం జరుగుతుందా అని ఉత్కంఠ ఏర్పడింది. యశ్వంత్ యధావిధిగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారా.. లేక అలహాబాద్ హైకోర్టు వెళతారా అనే సందిగ్థంలో ఉండగా సుప్రీంకోర్టు కొలీజియం ,, అలహాబాద్ హైకోర్టుకు పంపడానికే మొగ్గుచూపింది. ఢిల్లీ హైకోర్టులో యశ్వంత్ కు ఎటువంటి బాధత్యలు అప్పగించకపోవడంతోనే.. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అలహాబాద్ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిరసనలు..అయితే అలహాబాద్ హైకోర్టు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తొలుత తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.. దీనిపై తీవ్రంగా మండిపడింది. అవినీతి ఆరోపణలు ఉన్న యశ్వంత్ ను ఇక్కడకు ఎలా బదిలీ చేస్తారంటూ నేరుగా సీజేఐకే లేఖ రాసింది. ఆ ‘ చెత్త’ మాకొద్దంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే బదిలీకి, అవినీతి అంశానికి ఎటువంటి సంబంధం లేదని సీజేఐ చెప్పుకొచ్చారు. యశ్వంత్ పై దర్యాప్తు జరుగుతుందంటూనే బదిలీని సమర్ధించుకుంది ధర్మాసనం. అయినా మళ్లీ అలహాబాద్ హైకోర్టుకే యశ్వంత్ వర్మ అంటూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని.. అక్కడ బార్ అసోసియేషన్ ఖండించింది. జస్టిస్ యశ్వంత్ గతంలో ఇచ్చిన తీర్పులన్నీ రివ్యూ చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది. ప్రజల్లో నమ్మకం చూరగొనాలంటే ఆయన తీర్పులపై మళ్లీ సమీక్షలు అవసరమని, సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దర్యాప్తు చేయించాలని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ డిమాండ్ చేశారు.ఇంట్లో నోట్ల కట్టలు..!కాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది. ఈ తరుణంలో జస్టిస్ యశ్వంత్ పై సుప్రీంకోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే ఆరు రాష్ట్రాలకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని కొన్నాళ్లపాటు నిలుపుదల చేయడమే సమంజనమా అనే కోణంలో సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy Counters BRS KTR Revenge Politics Speech In Assembly8
నన్ను జైల్లో పెట్టి హింసించినా.. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేదు: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న బీఆర్‌ఎస్‌​ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు.. గురువారం మధ్యాహ్నాం సెషన్‌లో తొలుత కేటీఆర్‌ ప్రసంగించగా.. ఆ ఆరోపణలపై సీఎం రేవంత్‌ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు ఎవరిది? మీదా? నాదా?.. ఎవరైనా అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగరేస్తే రూ.500 ఫైన్‌ విధిస్తారు. కానీ, డ్రోన్‌ ఎగరేశానని బీఆర్‌ఎస్‌ హయాం(BRS Rule)లో నాపై కేసు పెట్టారు. అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పంపారు. నన్ను జైల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. నక్సలైట్లు, దేశ ద్రోహులు ఉండె డిటెన్షన్‌ సెల్‌లో పార్లమెంట్‌ సభ్యుడినైన నన్ను వేశారు. నేను పడుకోకుండా రాత్రిళ్లు లైట్లు వేశారు. జైల్లో 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపా. .. చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. నా బిడ్డ లగ్గానికి రాకుండా ఢిల్లీ నుంచి అడ్వకేట్‌లను తీసుకొచ్చారు. చర్లపల్లి జైలు నుంచి ఫంక్షన్ హాల్ కు వచ్చి.. మళ్ళీ జైలుకు పోయా. నా కుటుంబ సభ్యులను అసభ్యంగా తిట్టినా భరించా. సొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించా. దేవుడు అన్ని చూస్తుంటాడంటూ సహనంతో ఎదురు చూశా. అంతేకానీ.. కేసీఆర్‌ కుటుంబంపై ఏనాడూ.. ఎలాంటి రాజకీయ కక్ష చర్యలకు పాల్పడలేదు. వారిని జైలుకు పంపుతానన్న హామీని కూడా నెరవేర్చలేదు. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. కేసీఆర్ కుటుంబంలో ఏం జరగాలో అది జరిగింది. నా మీద కక్ష చూపిన వారిని ఆ దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు. నేను నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే ఇవాళ కేటీఆర్‌(KTR) అసెంబ్లీలో కూర్చొని ఇలా మాట్లాడేవారు కాదు. ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు అధికారం ఇచ్చారు. కక్షలు తీర్చుకోవడానికి కాదు. ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. ఇదీ చదవండి: అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా: కేటీఆర్‌

L2: Empuraan Movie Review And Rating In Telugu9
‘ఎల్2: ఎంపురాన్’ మూవీ రివ్యూ

మోహన్‌లాల్‌(mohalal) సినిమాలకు మాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి ఆదరణ ఉంటుంది. ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా ‘లూసిఫర్‌’ చిత్రం యావత్‌ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమే ‘ఎల్‌2: ఎంపురాన్‌’ (L2: Empuraan Telugu Movie Review ). పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లే దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్‌ చేశారు మేకర్స్‌. టాలీవుడ్‌లో దిల్‌ రాజు విడుదల చేస్తుండడంతో ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. లూసిఫర్‌ చిత్రం ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. పీకేఆర్‌ మరణంతో కేరళలో రాజకీయ అలజడి మొదలవ్వడం.. సీఎం సీటు కోసం కుట్రలు చేసిన బాబీ(వివేక్‌ ఒబెరాయ్‌)ని స్టీఫెన్‌ (మోహన్‌లాల్‌) అడ్డుకొని.. పీకేఆర్‌ కొడుకు జతిన్‌ రాందాస్‌(టొవినో థామస్‌)ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తాడు. అక్కడితో లూసిఫర్‌ కథ ముగుస్తుంది. సీఎం అయిన తర్వాత జతిన్‌ రాందాస్‌ బుద్ది కూడా మారుతుంది. సొంత ప్రయోజనాల కోసం మతతత్వ వాది బాబా భజరంగి(అభిమన్యు సింగ్‌)తో చేతులు కలిపి ఎల్‌యూఎఫ్‌ పీకేఆర్‌ అని కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల్లోకి వెళ్తాడు. ఈ విషయం లండన్‌లో ఉన్న స్టీఫెన్‌(మోహన్‌ లాల్‌)కి తెలుస్తుంది. తన రాష్ట్రాన్ని కబలించడానికి శత్రువులంతా ఏకమై రాజకీయ యుద్ధం చేయడానికి సిద్ధమైతే..స్టీఫెన్‌ దాన్ని ఎలా తిప్పికొట్టాడు? అనేది సినిమా కథ. అసలు స్టీఫెన్‌ నేపథ్యం ఏంటి? ఖురేషీ అబ్రాన్‌గా పేరు మార్చుకొని విదేశాల్లో ఏం చేస్తున్నాడు? అతని కోసం ఇతర దేశాల గుఢాచార సంస్థలు ఎందుకు వెతుకుతున్నాయి. జతిన్‌ కొత్త పార్టీని స్థాపించిన తర్వాత పీకేఆర్‌ కూతురు ప్రియ(మంజు వారియర్‌) ఎలాంటి నిర్ణయం తీసుకుంది? బల్రాజ్‌ పటేల్‌ కాస్త బాబా భజరంగిగా ఎలా మారాడు? భజరంగికి జయేద్‌ మసూద్‌(పృథ్విరాజ్‌ సుకుమార్‌) మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(L2: Empuraan Movie Review ) ఎలా ఉందంటే..ఆరేళ్ల క్రితం వచ్చిన లూసిఫర్‌ చిత్రంలో మోహన్‌లాల్‌ని డిఫరెంట్‌గా చూపించడంతో పాటు పొలిటికల్‌ డ్రామాను బాగా పండించాడు దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్‌, మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. సీక్వెల్‌కి కూడా అదే ఫాలో అయ్యాడు. హీరోతో పాటు ప్రతి పాత్రకు భారీ ఎలివేషన్స్‌ ఇచ్చాడు.కథ-కథనాన్ని కూడా బాగానే రాసుకున్నాడు. కానీ కథ కంటే ఎక్కువ ఎలివేషన్స్‌పైనే దృష్టిపెట్టాడు. మోహల్‌లాల్‌ వచ్చే ప్రతి సీన్‌కి ఎలివేషన్‌ పెట్టడం కొన్నిచోట్ల అతిగా అనిపిస్తుంది. అలాగే సినిమాలోని ప్రతి పాతకు ఓ ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ చూపించడంతో కథనం సాగదీసినట్లుగా సాగుతుంది. సీన్ల పరంగా చూస్తే మాత్రం సినిమా అదిరిపోతుంది. ప్రతి ఐదు పది నిమిషాలకు గూస్‌బంప్స్‌ తెప్పించే సన్నివేశం ఉంటుంది. సినిమా ప్రారంభమైన యాభై నిమిషాల వరకు మోహన్‌లాల్‌ తెరపై కనిపించడు. ఆయన వచ్చి ఈ రాజకీయ అలజడిని ఎలా అడ్డుకుంటాడో అనేలా కథనాన్ని నడిపించి.. ఆయన ఎంట్రీ కోసం ఎదురు చూసేలా చేశారు. ప్రేక్షకుడు ఎదురుచూపులకు ఏ మాత్రం నిరాశ కలగకుండా ఎంట్రీ సీన్‌ ఉంటుంది. హీరో విదేశాల్లో ఉన్నప్పుడు వచ్చే యాక్షన్‌ సీన్లు హాలీవుడ్‌ సినిమాలను గుర్తు చేస్తాయి. ఆయా సన్నివేశాలను స్టైలీష్‌గా తీర్చి దిద్దారు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ద్వితియార్థం మొత్తం కేరళ రాజకీయాల చుట్టే జరుగుతుంది. అయితే సినిమాల్లో చాలా లేయర్లు ఉండడం.. పార్ట్‌ 3 కోసమే అన్నట్లుగా కొన్ని సన్నివేశాలు పెట్టడం ఆడియెన్స్ ని డీవియేట్‌ చేస్తుంది. ఇక సినిమాకి మరో ప్రధాన మైనస్‌ ఎంటంటే.. డైలాగులు. ఈ సినిమాలోని డైలాగులలో ఎక్కువగా ఓ మతం ప్రజలు వాడే పదాలే ఎక్కువగా కలిపిస్తాయి . డబ్బింగ్‌ విషయంలో జాగ్రత్త పడాల్సింది. తెలుగు నేటివిటికి తగ్గట్లుగా మార్పులు చేస్తే బాగుండేది. క్లైమాక్స్‌లో మోహల్‌ లాల్‌, పృథ్విరాజ్‌ కలిసి చేసే ఫైటింగ్‌ సీన్‌ ఫ్యాన్స్‌ని ఈలలు వేయిస్తుంది. పార్ట్‌ 3పై ఆసక్తిని పెంచేలా ముగింపు ఉంటుంది. స్టీఫెన్‌ అలియాస్‌ ఖురేషీ అబ్రాన్‌ నేపథ్యం పూర్తిగా తెలియాలంటే ‘ఎల్‌ 3’ కోసం ఎదురు చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. మోహన్‌లాల్‌ యాక్టింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో ఆయన ఒకరు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. ‘ఎల్‌2:ఎంపురాన్‌’లో స్టీఫెన్‌గా, ఖురేషి అబ్రాన్‌గా రెండు పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఫ్యాన్స్‌ సినిమా చూడడానికి ఆయన ఎంట్రీ సీన్‌ ఒకటి చాలు. తెరపై ఆయన కనిపించిన ప్రతిసారి ఫ్యాన్స్‌కి పునకాలే. సీఎం జతిన్‌ రాందాస్‌గా టోవినో థామస్‌ సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పాత్ర కోసం రాసుకున్న సన్నివేశాలే సినిమాకు కీలకం. మంజు వారియర్‌ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించింది. పొలిటికల్‌ లీడర్‌గా ఆమె బాగా నటించారు. సెకండాఫ్‌లో ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. ఇక విలన్‌ బాబా భజరంగీ అలియాస్‌ బల్రాజు పటేల్‌గా అభిమన్యు సింగ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతావారంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. యాక్షన్‌ కొరియోగ్రఫీ సినిమా స్థాయిని పెంచేసింది. హాలీవుడ్‌ మూవీ స్థాయిలో యాక్షన్‌ సీన్లను తీర్చిదిద్దారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. దీపక్ దేవ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను ఇంకాస్త క్రిస్పీగా కట్‌ చేసి, నిడివిని తగ్గిస్తే బాగుండేదేమో. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ పిక్చర్స్, శ్రీ గోకులం మూవీస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Deadlines You Cannot Miss Before 2025 March 3110
మార్చి 31 డెడ్‌లైన్‌.. ఇవన్నీ పూర్తి చేశారా?

మార్చి 31తో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అంతే కాకుండా ఆదాయ పన్ను, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, యూపీఐ రూల్, అప్డేటెడ్ ఐటీఆర్ డెడ్‌లైన్‌ మొదలైనవాటికి కూడా అదే ఆఖరి రోజు కావడం గమనార్హం. కాబట్టి ఈ కథనంలో ఏప్రిల్ 1నుంచి ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం.మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్మహిళలు, బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్' (MSSC) ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ 2023 జూన్ 27న ప్రారంభించింది. ఇది ఈ నెల చివరి నాటికి క్లోజ్ అవుతుంది. ఈ పథకంలో రూ. 1000 నుంచి రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ గడువు రెండేళ్లు. ఇందులో వడ్డీ 7.5 శాతం ఉంటుంది.యూపీఐ రూల్నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల భద్రతను మెరుగుపరచడానికి కొత్త ఆదేశాలను ప్రకటించింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి.ఐటీఆర్ డెడ్‌లైన్‌భారతదేశంలోని పన్ను చెల్లింపుదారులు 2025 మార్చి 31కు ముందే తమ అప్డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR-U) దాఖలు చేసుకోవాలి. గడువులోపల ఐటీఆర్ ఫైల్ చేసుకుంటే.. దాఖలు చేసిన రిటర్న్‌లకు 25% తక్కువ అదనపు పన్ను రేటు ఉంటుంది. గడువు దాటితే.. అదనపు పన్ను భారం మోయాల్సి ఉంటుంది.హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్య భీమాకు సంబంధించిన ఏవైనా ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటే మార్చి 31లోపల క్లియర్ చేసుకోవాలి. సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపును కోల్పోకుండా ఉండటానికి గడువు లోపల చెల్లింపులు పూర్తవ్వాలి. అలా చేయడంలో విఫలమైతే గడువులోగా ప్రీమియంలు చెల్లించకపోతే ఆరోగ్య కవరేజీని కోల్పోయే ప్రమాదం ఉంది.అడ్వాన్స్ ట్యాక్స్అదనపు ఆదాయాలపై ముందస్తు పన్ను చెల్లించడంలో విఫలమైన.. జీతం పొందుతున్న ఉద్యోగులు మార్చి 31 లోపల చెల్లించవచ్చు. పన్ను చెల్లింపుదారులు 2021-22 ఆర్థిక సంవత్సరానికి అప్డేట్ చేయబడిన రిటర్న్(ITR-U)ను దాఖలు చేయడం ద్వారా గత ఆదాయపు పన్ను రిటర్న్‌లను సరిదిద్దవచ్చు. దీనికి కూడా మార్చి 31 చివరిరోజు.ఇదీ చదవండి: మూడో కంటికి చిక్కని ‘సిగ్నల్‌’.. ఈ యాప్ గురించి తెలుసా?ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్పన్ను చెల్లింపుదారులు మార్చి 31 లోపల.. ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్, డిక్లరేషన్స్ సమర్పించాల్సి ఉంటుంది. పన్ను భారం తగ్గించుకునేందుకు సరైన ప్లాన్ చేసుకుంటే గడువు లోపల పన్ను చెల్లించాలి. అయితే పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునేవారే ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్ మెంట్లు చేసుకోవచ్చు. కొత్త పన్న విధానానికి ఇది వర్తించదు.ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు రూల్స్ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ తమ క్రెడిట్ కార్డు పాలసీల్లో కీలక మార్పులు చేస్తోంది. ఎస్‌బీఐ తన క్లబ్ విస్తారా ఎస్‌బీఐ, క్లబ్ విస్తారా ఎస్‌బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డుల నిబంధనలను సవరించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement