Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan criticizes the coalition government for harassing YSRCP sympathizers1
హరికృష్ణకు పోలీసుల వేధింపులపై వైఎస్ జగన్ ఫైర్

సాక్షి,తాడేపల్లి : హరికృష్ణకు పోలీసుల వేధింపులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫైరయ్యారు. చంద్రబాబు సర్కారును ఎక్స్‌ వేదికగా ఎండగట్టారు.‘పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్ప‌డ‌డం ఎంతవరకు సమంజసం? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు?’ అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్ప‌డ‌డం ఎంతవరకు సమంజసం? చట్టాన్ని… pic.twitter.com/Zx02eOB3fz— YS Jagan Mohan Reddy (@ysjagan) May 23, 2025థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా?.స్వయంగా టీడీపీ నేత కారులో హరికృష్ణను తరలించి, స్టేషన్‌లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్‌లో దాచిపెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేయకపోతే అతన్ని ఏం చేసేవారు?. ఎవరి ఆదేశాలతో,ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు?. ఇది రాజ్య హింస కాదా?. ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది?. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా?. చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా?. చంద్రబాబు.. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఎంతమాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికీ తీసుకెళ్తాం. హరికృష్ణకు న్యాయం జరిగేంతవరకూ ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టం’ అని వైఎస్‌ జగన్‌ చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

BRS Leaders Skip Welcoming Kavitha at Shamshabad Airport2
కేసీఆర్‌ చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి: కవిత

సాక్షి, హైద‌రాబాద్‌: తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖపై ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. అమెరికా నుంచి హైద‌రాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కవిత మీడియాతో మాట్లాడారు. ‘‘ కేసీఆర్‌ దేవుడు.. ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి. రెండు వారాల కిందట కేసీఆర్‌కు లేఖ రాశా. కేసీఆర్‌కు లేఖ రాసిన మాట వాస్తవమే. లేఖ రాయడంలో పర్సనల్‌ ఏజెండా ఏమీ లేదు. పార్టీ నేతలు అనుకున్నదే నేను లేఖలో రాశా. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం కుట్ర. లేఖ లీక్‌ చేసింది పార్టీలోని కోవర్టులే. మా నాయకుడు కేసీఆర్‌.. ఎలాంటి ఆలోచన లేదు. ఆయన నాయకత్వంలో పనిచేస్తా. నా లేఖ లీక్‌తో కాంగ్రెస్‌, బీజేపీలు సంబరపడిపోతున్నాయి. గతంలోనూ కేసీఆర్‌కు లేఖలు రాశా. తాజాగా రాసిన లేఖను లీక్‌ చేసింది ఎవరో తెలియాలి’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.కాగా, కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అమెరికా నుంచి హైద‌రాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న క‌విత‌కు స్వాగ‌తం ప‌లికేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాలేదు. క‌విత‌కు స్వాగ‌తం ప‌లికేందుకు ఆమె మ‌ద్ద‌తు దారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు త‌ర‌లివ‌చ్చారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవితకు స్వాగతం, సుస్వాగతం అంటూ ప్లకార్డులు, బ్యానర్లను ప్ర‌ద‌ర్శించారు. వాటిల్లో ఎక్క‌డా పార్టీ పేరు, ముఖ్య నేత‌ల ఫొటోలు క‌నిపించ‌లేదు. టీమ్ క‌వితక్కా అంటూ ప్లకార్డులు ద‌ర్శ‌న‌మిచ్చాయి.

Shah Rukh Khan As Brand Ambassador of Candere3
ఒకే ఇంట్లో షెహన్‌షా, బాద్‌షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్

ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ 'షారుక్ ఖాన్‌'ను కందేరే ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్‌తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్‌కు, మరోవైపు ఆధునికత, డిజైన్‌పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్‌గా 75కి పైగా రిటైల్ అవుట్‌లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్‌స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్‌షా (బచ్చన్) మరియు బాద్‌షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

West Indies Matthew Forde smashes joint-fastest fifty in ODI history4
వెస్టిండీస్ వీరుడి విధ్వంసం.. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!

డబ్లిన్ వేదిక‌గా ఐర్లాండ్‌తో రెండో వ‌న్డేలో వెస్టిండీస్ ఆట‌గాడు మాథ్యూ ఫోర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఎనిమిదో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఈ కరేబియన్ వీరుడు.. ఐర్లాండ్ బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో ఫోర్డ్ కేవలం 16 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ వరల్డ్ రికార్డును ఫోర్డ్ సమం చేశాడు. 2015లో జోహన్నెస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌పై ఏబీ డివిలియర్స్ 16 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు.తాజా మ్యాచ్‌తో డివిలియర్స్‌తో సంయుక్తంగా ఫోర్డ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 19 బంతులు ఎదుర్కొన్న ఈ విండీస్ ఆల్‌రౌండర్‌.. 8 సిక్సర్లు, 2 ఫోర్లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కీసీ కార్తీ(109 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 102 పరుగులు) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన జాబితా ఇదేఏబీ డివిలియర్స్ - 16 బంతులు - దక్షిణాఫ్రికా వర్సెస్‌ వెస్టిండీస్ (2015)మాథ్యూ ఫోర్డ్ - 16 బంతులు - వెస్టిండీస్ వర్సెస్‌ ఐర్లాండ్ (2025)సనత్ జయసూర్య - 17 బంతులు - శ్రీలంక వర్సెస్‌ పాకిస్తాన్ (1996)కుశాల్ పెరెరా - 17 బంతులు - శ్రీలంక వర్సెస్‌ పాకిస్తాన్ (2015)మార్టిన్ గుప్టిల్ - 17 బంతులు - న్యూజిలాండ్ వర్సెస్‌ శ్రీలంక (2015)లియామ్ లివింగ్‌స్టోన్ - 17 బంతులు - ఇంగ్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ (2015)చదవండి: IND vs ENG: టీమిండియా సార‌థిగా శుబ్‌మ‌న్ గిల్ ఫిక్స్‌!.. వైస్ కెప్టెన్ ఎవ‌రంటే?

Famous Punjabi Singer and Actor Gippy Grewal Tweet To Anand Mahindra5
ఆనంద్ మహీంద్రాకు సింగర్ ట్వీట్: సాయం చేయండి అంటూ..

ఇండియన్ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. సేఫ్టీ, దృఢమైన నిర్మాణం వంటి కారణాల వల్ల ఎక్కువ మంది ఈ బ్రాండ్ కార్లను ఇష్టపడుతుంటారు. కానీ.. పంజాబీ సింగర్ అండ్ యాక్టర్ 'గిప్పీ గ్రెవాల్‌' (Gippy Grewal) మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేశారు.నిరాశ కలిగించే ఎక్స్‌పీరియన్స్‌ అంటూ.. ''దయచేసి సాయం చేయండి అని మహీంద్రా రైస్, ఆనంద్ మహీంద్రాలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. నా టీమ్ కోసం రెండు స్కార్పియో ఎన్ కార్లను కొనుగోలు చేసాను. అయితే వాటిలో ఎప్పుడూ టెక్నీకల్ ప్రాబ్లమ్స్ తలెత్తుతూనే ఉన్నాయి. డీలర్‌షిప్ సిబ్బంది కూడా సరైన పరిష్కారం చూపించడం లేదు'' అని రెండు స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశారు.నేను ఇండియన్ బ్రాండ్‌కు పెద్ద అభిమానిని. ఈ కారణం చేతనే రెండు 'స్కార్పియో ఎన్' కార్లను కొనుగోలు చేసాను. కార్లలో సమస్యలు తలెత్తినప్పుడు.. సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్తే, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సర్వీస్ సెంటర్‌కు వాహనాలు ఎన్నిసార్లు వచ్చాయో చూపించడానికి డీలర్‌షిప్ తమ వాహనాల ఎంట్రీ & ఎగ్జిట్ లాగ్‌ల కాపీని ఇవ్వడానికి కూడా నిరాకరించిందని సింగర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే..మొదటి వాహనంలో.. ఎల్ఈడీ డీఆర్ఎల్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సరిగ్గా పనిచేయడం లేదు. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ బ్లింక్ అవుతుంది, తరచుగా ఫోన్ నుంచి డిస్‌కనెక్ట్ అవుతుంది. డీలర్‌షిప్ ఈ సమస్యను పరిష్కరించలేకపోయింది. రెండవ వాహనం కూడా ఇలాంటి సమస్యలే.. బూట్ స్పేస్ కూడా సమస్య కూడా ఉంది. ఇది తయారీ లోపం కావచ్చని గిప్పీ గ్రేవాల్ మెయిల్‌లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా దీనిపై స్పందించలేదు. తప్పకుండా తగిన పరిష్కారం చూపించే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.Disappointing experience @MahindraRise @anandmahindra, please help, Bought 2 Scorpio-Ns for my team, but facing persistent tech issues & poor dealership experience. Requesting immediate resolution & investigation into Raj Vehicles, Mohali. @MahindraScorpio Mail Screenshot… pic.twitter.com/TJ7ZVWDPbs— Gippy Grewal (@GippyGrewal) May 23, 2025

Drunken Police Constables Hulchul In Tirumala6
తిరుమలలో మద్యం మత్తులో పోలీసుల హల్‌చల్‌

సాక్షి, తిరుమల: తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్‌చల్‌ చేశారు. .కర్నూలుకి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు మద్యం మత్తులో తిరుమలకు వచ్చారు. ఘాట్‌ రోడ్డులో ర్యాష్‌ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టారు. రోడ్డుపై నానా హంగామా చేశారు. ఫుల్‌గా మద్యం తాగి భక్తులను ఇబ్బందులకు గురిచేశారు.తిరుమల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్‌ స్టేషన్‌కు వారిని తరలించారు. కర్నూలుకు చెందిన కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ గుర్తించారు. డ్రంక్‌ డ్రైవ్‌ టెస్ట్‌లో 300 పాయింట్లు చూపించినట్లు సమాచారం. ఓ కానిస్టేబుల్‌ ఘటన స్థలం నుంచి పరారీ కాగా, పోలీసులు విచారణ చేపట్టారు.కాగా, తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో ఓ వ్యక్తి నమాజ్‌కు సంబంధించిన వీడియో గురువారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ దృశ్యాలు చూసిన భక్తులు షాక్‌కు గురయ్యారు. సీసీ కెమెరా ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి నమాజ్‌ చేస్తుంటే టీటీడీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు.మద్యం సేవించడం, ఎగ్‌ బిర్యానీ తినడం, ఆలయంపై డ్రోన్లు తిరగడం వంటి ఘటనలను మర్చిపోకముందే.. ఇప్పుడు ఏకంగా కల్యాణ వేదిక వద్ద ఓ వ్యక్తి నమాజ్‌ చేశాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, నమాజ్‌ చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో తిరుమలకు వచ్చినట్లు టీటీడీ సిబ్బంది గుర్తించారు.

Corona Case Registered In Hyderabad7
హైదరాబాద్‌లో కోవిడ్‌ కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కోవిడ్‌ కేసు నమోదైంది. కూకట్‌పల్లిలో డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. వైద్యుడు నాలుగు రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్నారు. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన లేకపోవడం వంటి లక్షణాలు ఉండటంతో.. అన్నిరకాల పరీక్షలు చేయించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మరోవైపు, ఢిల్లీలో కోవిడ్‌ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 23 కేసులు నమోదయ్యాయి.కాగా, కోవిడ్‌ మొదటి వేవ్‌ 2020 ఏప్రిల్‌ నుండి 2021 మార్చి వరకు కొనసాగింది. యంత్రాంగం ఎంత కష్టపడినా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడలేదు. లాక్‌డౌన్‌ సడలింపు వేళలో ప్రజలు నిత్యవసరాల కోసం రావడం, ఇతర ప్రాంతాలకు వెళ్తుండడం.. ఆ సమయాన జాగ్రత్తలు పాటించకపోవడంతో కేసులు గణనీయంగా పెరిగాయి. మొదటి వేవ్‌లో కరోనా వ్యాక్సిన్‌ రావడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ అందించిన ప్రభుత్వం.. ఆతర్వాత అందరికీ ఇవ్వడానికి రెండేళ్లు పట్టింది.కోవిడ్‌ రెండో వేవ్‌ 2021 ఏప్రిల్‌లో ప్రారంభం కాగా డిసెంబర్‌ వరకు కొనసాగింది. ఈ వేవ్‌లో తెలంగాణ వ్యాప్తంగా పరిశీలిస్తే ఖమ్మం జిల్లానే ఎక్కువ తల్లడిల్లింది. కోవిడ్‌ సోకిన రెండు, మూడు రోజులకే కొందరు మృతి చెందడమే కాక వృద్ధుల మరణాలు గణనీయంగా నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పడకలు సరిపోక చికిత్స అందకపోవడంతో గంటల్లోనే ప్రాణాలు వదలడం సాధారణంగా మారింది. దీనికి తోడు చాలాచోట్ల ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది.

Karnataka Haveri incident, accused Get Bail, Celebrate With Victory Procession8
గ్యాంగ్‌రేప్‌ నిందితులకు బెయిల్‌.. కార్లు, బైకులతో విజయోత్సవ ర్యాలీ

సాక్షి,బెంగళూరు: ఓ మహిళపై సామూహిక అత్యాచారం. ఆపై జైలు శిక్ష, బెయిల్‌పై విడుదల. ఈ తరహా దారుణాల నిందితులు చేసిన తప్పుకు పశ్చాతాపానికి గురవుతుంటారు. సమాజంలో తిరగలేక సిగ్గుతో తలదించుకుంటుంటారు. కానీ కర్ణాటక కేసు నిందితులు అందుకు భిన్నంగా వ్యవహించారు. బెయిల్‌ రావడంతో బైక్‌, కార్లలో తిరుగుతూ విజయోత్సవ ర్యాలీలు జరిపారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల,గ్యాంగ్‌ రేప్‌ కేసులో ఏడుగురు ప్రధాన నిందితులు అఫ్తాబ్‌, మదర్ సాబ్‌, సమీవుల్లా, మొహమ్మద్ సాదిక్‌, తౌసీఫ్‌, రియాజ్‌, షోయిబ్‌లకు కర్ణాటక హవేరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ అనంతరం, చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి సంబరాలు చేసుకున్నారు. వీధుల్లో కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. SHOCKING 🚨 7 Gang rape accused take out road show after securing BAIL in Karnataka's Haveri. Names — Mohammad Sadiq Agasimani, Shoib Mulla, Tausip Choti, Samiwulla Lalanavar, Aptab Chandanakatti, Madar Saab Mandakki, and Riyaz Savikeri. pic.twitter.com/pNMF21YXJy— Times Algebra (@TimesAlgebraIND) May 23, 2025కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.. 2024 జనవరి 8న కర్ణాటకలోని హవేరీ జిల్లాలో హనగర్‌కు చెందిన ఓ హోటల్‌ గదిలో దారుణం జరిగింది. నిందితులు హోటల్‌ గదిలోకి చొరబడి ఓ జంటపై దాడి చేశారు. అనంతరం బాధితురాల్ని స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తాజాగా, ఆ కేసులో ఏడుగురు ప్రధాన నిందితలు బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్‌ రావడంపై నిందితులు హవేరి జిల్లా అక్కి అలూరు పట్టణంలో పెద్ద ఎత్తున మోటార్ బైక్‌లు, కార్లు, డీజే మ్యూజిక్‌తో కూడిన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చిరునవ్వుతో చేతులు ఊపుతూ, విజయోత్సవ సంకేతాలిచ్చిన దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. బాధితురాలు ఓ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారు. ఆమె కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో ఆమె, తన ప్రియుడితో కలిసి 2024 జనవరి 8న హనగల్‌కు చెందిన ఓ హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు. అయితే జనవరి 11న న్యాయమూర్తి ఎదుట బాధితురాలు స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి ఆదేశాలతో ఈ కేసులో పోలీసులు మొత్తం 19 మందిని అరెస్ట్ అయ్యారు. వీరిలో 12 మందిని దాదాపు 10 నెలల క్రితమే బెయిల్‌పై విడుదల చేశారు. కానీ, ఏడుగురు ప్రధాన నిందితులు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇదే కేసులో ఆ ఏడుగురికి న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో నిందితులు బైక్‌లు,కార్లలో ర్యాలీతో సంబరాలు చేసుకున్నారు.ఈ ఘటనపై నెటిజన్లు, స్థానికులు.. న్యాయం గెలవాలన్న ఆశతో బాధితురాలు ఎదురుచూస్తున్న సమయంలో నిందితులు చేసిన విజయోత్సవాల ర్యాలీ బాధితురాలిని మరింత మానసికంగా దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు.

Actor Vishal Why Will Get Late Marriage Plan9
విశాల్‌ పెళ్లి ఇంత ఆలస్యం కావడానికి కారణం ఎవరు..?

ప్రస్తుతం తమిళ నటుడు విశాల్‌ వయసు 50కి చేరువవుతోంది. నిజానికి అన్ని విధాలుగా బాగున్న ఓ వ్యక్తి అంత కాలం పాటు వివాహం కోసం ఆగడం అసాధారణమేననాలి. అందునా విశాల్‌... ఏ వయసుకా ముచ్చటను అచ్చంగా ఫాలో అయే అచ్చ తెలుగు సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడు అనేది కూడా తెలిసిందే. పోనీ సినీనటుడిగా పరిగణనలోకి తీసుకున్నా, 40ఏళ్లకు కాస్త అటూ ఇటూగా పెళ్లి చేసుకోవడం రివాజు. మరోవైపు విశాల్, ధన్షికల మధ్య ప్రేమ ప్రయాణం కూడా ఈ నాటిది కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో... విశాల్‌ తన పెళ్లిని ఎందుకు ఇన్నేళ్ల పాటు వాయిదా వేశాడు?అయితే విశాల్‌ పెళ్లి ఆలస్యం కావడానికి ఆయన తీసుకున్న నిర్ణయమే కారణం. అది వ్యక్తిగత సమస్యల వల్ల కాదు, ఎవరిపైనా ప్రేమ లేకపోవడం వల్ల కూడా కాదు. అది ఒక భవన నిర్మాణంతో ముడిపడింది. ఆయన చేసుకున్న ప్రతిజ్ఞ తో ముడిపడింది. నడిగర్‌ సంఘం (దక్షిణ భారత కళాకారుల సంఘం)కు తమ భవన నిర్మాణం ఓ కల. ఎందరో కళాకారులకు, సాంకేతిక నిపుణులకు నిలయమైన తమిళనాట అందరికీ ఉపయుక్తమైన ఒక భవనం లేకపోవడం అనే లోటు తీరేందుకు ఓ విశాలమైన వసతి కావాలని ఎందరో కోరుకున్నారు. చాలా సార్లు ఆ భవన నిర్మాణం ప్రతిపాదనలు వచ్చినా రకరకాల కారణాల వల్ల పట్టాలెక్కలేదు.ఈ నేపధ్యంలోనే కొత్త నడిగర్‌ సంఘంకు ప్రధాన కార్యదర్శిగా విశాల్‌ ఎంపికయ్యాడు. అంతేకాదు భవనం పూర్తయ్యే వరకు తాను విశ్రమించబోనని ఆయన హామీ ఇచ్చాడు.నడిగర్‌ సంఘం భవన నిర్మాణ ప్రాజెక్టు తమిళ చిత్ర పరిశ్రమలో సినీ కార్యక్రమాలు కళాకారుల సమావేశాలకు ప్రత్యేక స్థలo లేకపోవడంతో ఈ భవనం నిర్మాణం చాలా ముఖ్యమైనదిగా మారింది. ఎట్టకేలకు కళాకారులకు ఉపయుక్తంగా ఉండే ఆధునిక సౌకర్యాలతో కూడిన ఒక అత్యుత్తమ భవన నిర్మాణానికి 2017లో శ్రీకారం చుట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు రజనీకాంత్‌ కమల్‌ హాసన్‌ దీనికి పునాదిరాళ్లు వేశారు. విజయ్‌ కమల్‌ హాసన్‌ లు తమ వ్యక్తిగత నిధుల నుంచి రూ.1 కోటి చొప్పున విరాళంగా ఇచ్చారు, అలాగే మరో హీరో, నటుడు కార్తీ నిర్మాణాన్ని పర్యవేక్షించడంలో చురుకుగా పాల్గొన్నాడు, ఇలా ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ... ఈ భవనం పదేపదే నిర్మాణ జాప్యాలను ఎదుర్కొంది. వ్యక్తిగతంగా భావోద్వేగాలను సైతం హీరో విశాల్‌ ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడిగా పెట్టాడని చెప్పొచ్చు. ఈ భవనం సాకారమయే వరకు తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టాలని కూడా అతను నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఆయన తమందరి కల నెరవేరేదాకా పెళ్లి చేసుకోనని శపధం చేశాడు. ఏమైతేనేం.. చెన్నై నడిబొడ్డున టి. నగర్, హబీబుల్లా రోడ్‌లో ఈ భవనాన్ని చలనచిత్ర పరిశ్రమ వివిధ రకాల అవసరాలను తీర్చగల బహుళార్ధక సాధక సినీ కేంద్రంగా భవనం రూపుదిద్దుకుంది. ఇందులో అవార్డు ఫంక్షన్ల కోసం 1000 సీట్ల ఆడిటోరియం, 800 సీట్ల వివాహ మందిరం, 300 సీట్ల చిన్న చిన్న సమావేశ మందిరాలు డిజైన్‌ చేశారు. భవనం దాదాపుగా సిద్ధమై ప్రతిజ్ఞ నెరవేరడంతో, విశాల్‌ పెళ్లికి సిద్ధమ్యాడు. నటి సాయి ధన్షికతో తన వివాహాన్ని ప్రకటించాడు, ఇది అన్ని రకాల ఊహాగానాలకు ముగింపు పలికింది. అయితే ఈ ప్రకటన వారి సన్నిహితులెవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే.. వారిద్దరూ 15 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసనీ, బలమైన స్నేహ బంధాన్ని ప్రేమ గా మార్చుకున్నారని కూడా తెలుసు. ముఖ్యంగా తన జీవితంలోని కష్ట సమయాల్లో విశాల్‌ చూపిన అచంచలమైన మద్దతు తోడ్పాటును ధన్షిక చాలా కాలంగా ఆరాధించింది. పెళ్లి ప్రకటన సందర్భంగా విశాల్‌ తమ ఇద్దరి ప్రయాణం గురించి మాట్లాడాడు. తాను చేసిన ప్రతిజ్ఞను ప్రస్తావిస్తూ వివాహం గురించిప ఆలోచనను నడిగర్‌ సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఆలోచన ఆపిందని ఆయన అంగీకరించాడు తనను నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ధన్షికను అభివర్ణించాడు ఇంత కాలం వేచి ఉన్నందుకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు.

Trump Warns Apple, 25% Tariff If iPhones Not Made in USA10
యాపిల్‌కు ట్రంప్‌ వార్నింగ్‌.. భారత్‌లో ఐఫోన్‌ తయారు చేస్తే..

వాష్టింగ్టన్‌: భారత్‌లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడో తయారు చేసిన ఐఫోన్లను అమెరికాలో అమ్ముతామంటే ఉపేక్షించబోనని ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా మినహాయించి ఇతర దేశాల్లో తయారు చేసిన ఐఫోన్‌లను దేశీయంగా అమ్మితే 25 శాతం టారిఫ్ విధిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సొంత సోషల్‌ మీడియా ట్రూత్‌ సోషల్‌గా ఓ వేదికగా ఓ పోస్టును షేర్‌ చేశారు. అందులో ‘నేను చాలా కాలం క్రితమే నేను ఈ విషయాన్ని యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ చెప్పాను. అమెరికాలో అమ్మే ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలని, విదేశాల్లో కాదని. భారత్‌తో పాటు మరో ఇతర దేశంలోనైనా తయారు చేసిన ఐఫోన్లను ఇక్కడ అమ్మితే వాటిపై యాపిల్ కంపెనీ అమెరికాకు కనీసం 25 శాతం టారిఫ్ చెల్లించాల్సిందే’అని పేర్కొన్నారు. Time for Apple to manufacture in America or pay the tariffs. pic.twitter.com/KOnDC8NKDr— Gunther Eagleman™ (@GuntherEagleman) May 23, 2025అయితే, ట్రంప్ విధించే టారిఫ్‌లు యాపిల్ ఒక్క కంపెనీకే ప‌రిమితం అవుతుందా? లేదంటే అన్నీ కంపెనీల‌పై సుంకం విధిస్తారా? అన్న‌ది స్ప‌ష్టంగా తెలియాల్సి ఉంది. మ‌రోవైపు ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై యాపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.మరోవైపు, అమెరికా,చైనా సుంకాల యుద్ధంతో అవ‌రోధాలు త‌లెత్తుతున్న నేప‌థ్యంలో యాపిల్ కంపెనీ ఐఫోన్ త‌యారీకి భార‌త్ ప్ర‌త్యాహ్నాయంగా భావిస్తోంది. ఇందులో భాగంగా భార‌త్‌లో భారీ ఎత్తున త‌యారీ రంగంలో పెట్టుపెట్టేందుకు సిద్ధ‌మైంది. కాగా, యాపిల్ నివేదిక ప్ర‌కారం.. జూన్ త్రైమాసికంలో అమెరికాలో అమ్మే ఫోన్లలో ఎక్కువ శాతం భారత్‌లో త‌యారు చేసిన‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement