Top Stories
ప్రధాన వార్తలు

హద్దు మీరొద్దు.. పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
పోలీసుల తీరు చూస్తుంటే మాకు రక్తపోటు (బీపీ) పెరిగిపోతోంది. చాలా క్యాజువల్గా కేసులు పెడుతున్నారు. వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ఏదో ఒక కేసు నమోదు చేయాలి. ఎవరో ఒకరిని అరెస్టు చేయాలనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. -హైకోర్టు ధర్మాసనం తప్పు చేస్తే.. కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా? మేమేం చేయలేం..! మీరు మరో మార్గం చూసుకోండని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్ ఉంది. దాన్ని కూడా ఫాలో కావడం లేదు. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదు.. మా మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉంది. పోలీసులు ఏది దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారు. వారు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల ‘అతి’పై హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. పెద్దల మెప్పు కోసం పనిచేస్తే, సమస్య వచ్చినప్పుడు వాళ్లొచ్చి మిమ్మల్ని కాపాడరని వ్యాఖ్యానించింది. చట్టం, నిబంధనలు, పోలీసు మాన్యువల్కు లోబడి పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది. పోలీసులు తమ పరిధులు గుర్తెరిగి విధులు నిర్వర్తించాలంది. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో తమకు బాగా తెలుసని పేర్కొంది. అలాగే తాము ఏమీ చేయలేమని అనుకోవద్దని హెచ్చరించింది. ఏం చేస్తున్నా కూడా చూడనట్లుగా తమను (కోర్టు) కళ్లు మూసుకుని ఉండాలని భావిస్తున్నారని, అది ఎంత మాత్రం సాధ్యం కాదని తెలిపింది. పోలీసుల తీరు చూస్తుంటే తమకు రక్తపోటు (బీపీ) పెరిగిపోతోందంటూ వ్యాఖ్యానించింది. చాలా క్యాజువల్గా కేసులు పెట్టేస్తున్నారని, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారని పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి వాటిని తాము నమ్మాలని పోలీసులు అనుకుంటున్నారని పేర్కొంది. ఏదో ఒక కేసు నమోదు చేయాలి.. ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనే రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడింది. ప్రభుత్వాన్ని డ్రామా రూపంలో వ్యంగ్యంగా విమర్శించినందుకు కేసు పెడితే.. ప్రతి సినిమా హీరోను, ప్రతి నటుడినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం తప్పా? దానిపై రీల్ చేయడం తప్పా? అని పోలీసులను నిలదీసింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కిందకు వస్తుందా? అని విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు ఎలా పడితే అలా కేసులు పెడితే విశ్వసనీయత ఏముంటుందని ప్రశ్నించింది. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదని, తమ మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. పోలీసులు ఏం దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసులు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదని, ఈ విషయాన్ని తాము ఒప్పుకుని తీరాల్సిందేనని పేర్కొంది. ఇప్పటికే పలు సందర్భాల్లో మేజిస్ట్రేట్ల తీరును ఆక్షేపించామని హైకోర్టు గుర్తు చేసింది. డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించి, రీల్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్కుమార్ అరెస్ట్ చేయడంపై సంబంధిత రికార్డులన్నీ తమ ముందుంచాలని కర్నూలు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ను ఆదేశించింది. అలాగే పోలీసులు సమర్పించిన రికార్డులు, నమోదు చేసిన వాంగ్మూలాల కాపీలను తమకు పంపాలని కర్నూలు ఫస్ట్ క్లాస్ స్పెషల్ జుడీషియల్ మేజిస్ట్రేట్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.అక్రమ నిర్భంధంపై హెబియస్ కార్పస్..పోలీసులు తన తండ్రి ప్రేమ్కుమార్ను అక్రమంగా నిర్భంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొరిటిపాటి అభినయ్ గతేడాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ నిర్వహించింది. అభినయ్ తరఫున న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించగా, పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపించారు.తప్పుల మీద తప్పులు...డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ కేసు పెడతారా? అది కూడా అరెస్టు సమయంలో రూ.300 దొరికాయంటూ! అని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, ఇలా చేస్తే సమస్యలపై సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో మహేశ్వరరెడ్డి స్పందిస్తూ.. నానాపటేకర్ నటించిన వజూద్ సినిమాలో పోలీసులు వ్యవహరించిన రీతిలో ఈ కేసులో పోలీసులు ప్రవర్తిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల పట్ల పోలీసులు ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం బేఖాతరు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో చట్ట నిబంధనల గురించి పోలీసులను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జోక్యం చేసుకుని పోలీసుల చర్యలను సమర్థించే ప్రయత్నం చేయగా ధర్మాసనం ఆయన్ను వారించింది. తప్పు చేసిన వారిని వెనకేసుకురావద్దని హితవు పలికింది.అరెస్ట్ చేయడానికే కేసు పెడతామంటే ఎలా..?“ప్రేమ్కుమార్ను అర్థరాత్రి అరెస్ట్ చేస్తారా? అంత అత్యవసరంగా అరెస్టు చేయాల్సినంత కేసా ఇది? పైగా కర్నూలు నుంచి 8–9 గంటలు ప్రయాణం చేసి వచ్చి మరీ అరెస్ట్ చేస్తారా? ఆయననేమన్నా పారిపోతున్నారా? ప్రేమ్కుమార్ రీల్ను సోషల్ మీడియాలో చూశానంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడం.. మీరు పోలోమంటూ కర్నూలు నుంచి అర్థరాత్రి వచ్చి అరెస్ట్ చేయడం! అంతేకాదు.. అరెస్ట్ చేసి పలు ప్రదేశాలు తిప్పారు. ఇదంతా ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు? ఉన్నతాధికారుల మెప్పు కోసం పనిచేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఓ వ్యక్తిని ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడి వ్యక్తులను పంచాయతీదారులుగా చూపాలి. కానీ ఈ కేసులో కర్నూలు పోలీసులు తమ వెంట అక్కడి నుంచే పంచాయతీదారులను తెచ్చుకున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పోలీసులు కొత్త కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. మీరు ఇలాంటివి చేస్తుంటే, మేం కళ్లు మూసుకుని ఉండాలని భావిస్తున్నారు. మీరు ఇలాగే వ్యవహరిస్తుంటే చాలా సమస్యలు వస్తాయి. తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య’ అని ధర్మాసనం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎలా పడితే అలా చేసే ముందు బాగా ఆలోచించుకోండి...!“గుంటూరులో ప్రేమ్ కుమార్ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కర్నూలు పోలీసులు కేసు ఎలా పెడతారు? మీకున్న పరిధి ఏమిటి? అసలు కర్నూలు నుంచి గుంటూరుకు వచ్చేందుకు మీ జిల్లా ఎస్పీ నుంచి అనుమతి తీసుకున్నారా? మేం ఇప్పుడు అనుమతి ఉందా? అని అడిగాం కాబట్టి వచ్చే విచారణ నాటికి అనుమతి తెస్తారు. ప్రేమ్కుమార్ అరెస్ట్ గురించి గుంటూరు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. కానీ వారికి మీరెప్పుడు సమాచారం ఇచ్చారు? మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల చర్యలు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది. ప్రేమ్ కుమార్ను అర్ధరాత్రి అరెస్ట్ చేసిన కర్నూలు త్రీటౌన్ ఎస్హెచ్వో.. ఫిర్యాదులు అందగానే ఎన్ని కేసుల్లో ఇలా అప్పటికప్పుడు అరెస్టులు చేశారు? ఎన్ని కేసుల్లో ఇలా అర్ధరాత్రులు వెళ్లారు? మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా? మేమేమీ చేయలేం.. మీరు మరో మార్గం చూసుకోండని మమ్మల్ని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు వారి సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్ ఉంది. దాన్ని కూడా వాళ్లు ఫాలో కావడం లేదు. ఇక్కడ మా మేజిస్ట్రేట్ల తప్పు కూడా ఉంది. ఈ కేసులో ప్రేమ్కుమార్ నేరాలు చేయడమే అలవాటైన వ్యకిŠాత్గ పేర్కొంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో రాస్తే మేజిస్ట్రేట్ దాన్ని కనీస స్థాయిలో కూడా పరిశీలించలేదు. రూ.300 వసూలు చేయడం అలవాటైన నేరం కిందకు వస్తుందా? అనే విషయాన్ని కూడా గమనించలేదు. ఈ కేసుకు సంబంధించిన అన్నీ రికార్డులను మేం పరిశీలించాలనుకుంటున్నాం’ అని ధర్మాసనం తెలిపింది. ఈమేరకు రికార్డులను తమ ముందుంచాలని కర్నూలు త్రీటౌన్ ఎస్హెచ్వో, మేజిస్ట్రేట్ను ఆదేశించింది.పౌర స్వేచ్ఛపై “సుప్రీం’ ఏం చెప్పిందంటే...“ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు..’’“స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది’’“భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియచేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి’’– ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో “సుప్రీం కోర్టు’’ కీలక వ్యాఖ్యలు

అప్పులు చేయడంలో రికార్డు సృష్టించిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టించారు. కూటమి ప్రభుత్వానికి అప్పు వారమైన మంగళవారం(నిన్న) రోజున 7.09 శాతం వడ్డీతో మరో రూ.4,548 కోట్లు అప్పు తీసుకుంది కూటమి ప్రభుత్వం. దీంతో, చంద్రబాబు చేసిన అప్పులు రికార్డు స్థాయిలో రూ.1.52లక్షల కోట్లకు చేరుకున్నాయి.అప్పులు చేయడంలో చంద్రబాబు సర్కార్ దూసుకెళ్తోంది. తాజాగా కూటమి ప్రభుత్వం రూ.4,548 కోట్లు తీసుకుంది. ఇందుకు గాను 7.09 శాతం వడ్డీతో అప్పు తీసుకోవడం గమనార్హం. దీంతో, రాష్ట్ర చరిత్రలో ఒక్క ఏడాదిలో ఇంత అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదే. బడ్జెట్లో చెప్పిన దానికి మించి కూటమి సర్కార్ అప్పులు చేసింది. బడ్జెట్ అప్పులు రూ.98,088 కోట్లకు చేరగా.. బడ్జెట్ బయట అప్పు రూ.54,700 కోట్లకు చేరుకుంది. దీంతో, బడ్జెట్ బయట, లోపల.. చంద్రబాబు చేసిన అప్పులు రూ.1.52లక్షల కోట్లకు చేరుకుంది. అయితే, ఇన్ని అప్పులు చేసినా.. కూటమి ప్రభుత్వం మాత్రం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదు.ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ గత గురువారం వెల్లడించింది.భారీగా తగ్గిన రెవెన్యూ రాబడులు.. పన్నులు ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు లేనందున సాధారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు పెరగాలి. అందుకు పూర్తి విరుద్ధంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల కన్నా.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల్లో రూ.11,450కోట్ల మేర తగ్గుదల నమోదైంది. అంటే చంద్రబాబు పాలనలో సంపదలోనూ, వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అమ్మకం పన్నుతోపాటు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఆదాయం కూడా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు అమ్మకం పన్ను ఆదాయం రూ.1,068 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.721 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. భారీగా పెరిగిన అప్పులు... తగ్గిన కేంద్రం గ్రాంట్లు 2024–25 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకే బడ్జెట్ పరిధిలోనే రూ.90,557 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.70 వేల కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా రూ.20 వేల కోట్లు అప్పు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో రూ.16,766 కోట్ల తగ్గుదల నమోదైంది.

అది మనుషుల్ని చంపడం కన్నా ఘోరం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: పర్యావరణాన్ని తమ కళ్లెదుటే నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని.. ఇలాంటి చర్యలను అడ్డుకట్ట ఎలా వేయాలో తమకు బాగా తెలుసని దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) అంటోంది. చెట్లను నరికిన వ్యవహారంలో ఓ వ్యక్తికి భారీ జరిమానా విధించిన కోర్టు.. ఇలాంటి చర్యలు మనుషుల్ని చంపడం కన్నా ఘోరం అంటూ వ్యాఖ్యానించింది. తాజ్ ట్రాపిజెమ్ జోన్ పరిధిలోని మధుర-బృందావన్లో దాల్మియా ఫార్మ్స్ నిర్వాహకుడు శివ్ శంకర్ అగర్వాల్.. చెట్లు నరికిన కేసులో ఊరట కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజల్ భుయాన్ ధర్మాసనం అక్రమంగా నరికిన ప్రతీ చెట్టుకు లక్ష రూపాయాల జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చింది.అనుమతి లేకుండా అన్నేసి చెట్లు నరకడం అన్నింటికంటే ఘోరం. అంత వృక్షసంపదతో పచ్చదనం మళ్లీ కావాలంటే కనీసం వందేళ్లైనా పట్టొచ్చు. ఇది మనుషుల్ని చంపడం కంటే పెద్ద నేరం. ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోలేం. కాలుష్య ప్రభావం రాబోయే తరాల మీద పడకుండా చూడాలంటే చెట్లు అవసరం.వాటిని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని అభిప్రాయపడింది. ఇక.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే కోర్టు చెట్టుకు లక్ష చొప్పున .. రూ.4 కోట్ల 54 లక్షల జరిమానా కట్టాలని ఆదేశించింది. అయితే.. అగర్వాల్ తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ.. తన క్లయింట్ తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పాడని, అందుకు సంబంధించి అఫిడవిట్ కూడా కోర్టుకు సమర్పించామని తెలియజేశారు. అయినప్పటికీ జరిమానా విషయంలో ధర్మాసనం అస్సలు తగ్గలేదు.మరోవైపు సమీపంలోని స్థలంలో తోటలు వేసుకునేందుకు అగర్వాల్ అనుమతి కోరగా.. అతనిపై దాఖలైన ధిక్కార పిటిషన్ను విచారణ తర్వాతే ఆ అంశంపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా.. జోన్లోని అటవీయేతర, ప్రైవేట్ భూములలోని చెట్లను నరికివేయడానికి ముందస్తు అనుమతి పొందాలనే నిబంధనను తొలగిస్తూ 2019లో ఇచ్చిన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు గుర్తుచేసుకుంది.తాజ్ ట్రాపిజెమ్ జోన్ను కేంద్రం 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఏర్పాటు చేసింది. కాలుష్య కోరల్లోంచి తాజ్ మహల్తో పాటు ఇతర వారసత్వ సంపదలను పరిరక్షించే ఉద్దేశంతో ఈ జోన్ను తీసుకొచ్చారు. మొత్తం 10,400 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతం ఇది. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్లో కొంత భాగం కూడా ఉంది. అత్యంత సున్నిత ప్రాంతంగా పేరున్న టీటీజెడ్ పర్యవేక్షణ కోసం ప్రత్యేక కాలుష్య నియంత్రణ మండలి కూడా ఉంది. అయితే..2019లో సుప్రీం కోర్టు టీటీజెడ్లో చెట్లను తొలగించడం కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలన్న నిబంధనను ఎత్తేసింది. వ్యవసాయ, పశుపోషణ సంబంధిత కార్యకలాపాల కోసం చెట్లను తొలగిండచంలో తప్పేమీ లేదని అభిప్రాయపడింది. అయితే తర్వాతి రోజుల్లో ఆ ఉత్తర్వులను సమీక్షించిన సర్వోన్నత న్యాయస్థానం 2019 నాటి ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

నా సెంచరీ గురించి పట్టించుకోవద్దు.. శశాంక్కు శ్రేయస్ చివరి ఓవర్ సందేశం
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీని త్యాగం చేసి మరీ తన జట్టును గెలిపించాడు. శ్రేయస్కు సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం శశాంక్ సింగ్కు స్ట్రయిక్ ఇచ్చి నిస్వార్దమైన కెప్టెన్ అనిపించుకున్నాడు. కెప్టెన్ త్యాగాన్ని శశాంక్ వృధా కానివ్వలేదు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఏకంగా 23 పరుగులు సాధించాడు. ఫలితంగా పంజాబ్ భారీ స్కోర్ చేసింది. చివరి ఓవర్లో శశాంక్ చేసిన పరుగులే అంతిమంగా పంజాబ్ గెలుపుకు దోహదపడ్డాయి.ఒకవేళ శ్రేయస్ జట్టు ప్రయోజనాలు పట్టించుకోకుండా సెంచరీనే ముఖ్యమనుకునే ఉంటే ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమిపాలయ్యేది. ఎందుకంటే గుజరాత్, పంజాబ్ మధ్య పరుగుల తేడా కేవలం 11 పరుగులు మాత్రమే. శ్రేయస్ వ్యక్తిగత స్వార్దం చూసుకుని సెంచరీ కోసం ప్రయత్నించి ఉంటే చివరి ఓవర్లో మహా అయితే 10-15 పరుగులు వచ్చేవి. ఇదే జరిగి ఉంటే పంజాబ్ 230-235 పరుగులకు పరిమితం కావాల్సి వచ్చేది. అప్పుడు గుజరాత్ సునాయాసంగా లక్ష్నాన్ని ఛేదించి ఉండేది.పంజాబ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్కు ముందు శ్రేయస్ 97 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఆ ఓవర్లో కనీసం ఒక్క బంతి ఎదుర్కొన్నా శ్రేయస్ సెంచరీ చేసేవాడు. కానీ అతను స్ట్రయిక్ కోసం పాకులాడలేదు. శశాంక్ మంచి టచ్లో ఉన్న విషయాన్ని గమనించి అతన్నే స్ట్రయిక్ తీసుకోమన్నాడు. శశాంక్కు సైతం స్ట్రయిక్ రొటేట్ చేసే అవకాశం రాలేదు. భారీ షాట్టు ఆడే క్రమంలో 5 బంతులు బౌండరీలకు తరలి వెళ్లగా.. ఓ బంతికి రెండు పరుగులు (రెండో బంతి) వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ శ్రేయస్ స్ట్రయిక్ తీసుకుని (సింగిల్ తీసుంటే) ఉండవచ్చు. కానీ అతను అలా చేయలేదు.జట్టు ప్రయోజనాల కోసం సెంచరీ త్యాగం చేసిన అనంతరం యావత్ క్రికెట్ ప్రపంచం శ్రేయస్పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. శశాంక్ సింగ్ సైతం మ్యాచ్ అనంతరం తన కెప్టెన్ను కొనియాడాడు. శశాంక్ మాటల్లో.. టీ20ల్లో, ముఖ్యంగా ఐపీఎల్లో సెంచరీ చేసే అవకాశం అంత ఈజీగా రాదు. కానీ మా కెప్టెన్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. చివరి ఓవర్ మొత్తం నన్నే స్ట్రయిక్ తీసుకొని భారీ షాట్లు ఆడమన్నాడు. తన సెంచరీ గురించి ఆలోచించొద్దని చెప్పాడు. నేను స్వయంగా స్ట్రయిక్ రొటేట్ చేస్తానని చెప్పాను. కానీ అతను నాకు సెంచరీ ముఖ్యం కాదని చెప్పాడు. ఇలా చెప్పాలంటే ఏ కెప్టెన్కు అయినా చాలా గట్స్ ఉండాలి. మా కెప్టెన్కు ఆ గట్స్ ఉన్నాయి. శ్రేయస్ నన్ను ప్రతి బంతిని సిక్సర్ లేదా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించమని చెప్పాడు. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. కెప్టెన్ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్తో నేను రెచ్చిపోయాను.కాగా, శ్రేయస్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు నాటౌట్), శశాంక్తో పాటు (16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు నాటౌట్), ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 232 పరుగులకే పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్ ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్ఫోర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 2, జన్సెన్, మ్యాక్స్వెల్ తలో వికెట్ పడగొట్టారు.

ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పౌరసత్వ రుజువుకు పెద్దపీట
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు చేస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీనిలో ఓటరు నమోదు కోసం పౌరసత్వానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేశారు. ఇటువంటి మార్పులు చేర్పుల కారణంగా చట్టపరమైన సవాళ్లు ఎదురుకానున్నాయి.ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వులోని వివరాల ప్రకారం ఇంతవరకూ అమెరికాలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ(Election process)లో అత్యవసమైన ఎన్నికల నిబంధనలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే ఓటరు జాబితాలను వెలువరించడంలో, ఎన్నికల సంబంధిత నేరాలను విచారించడానికి అందరూ సమాఖ్య సంస్థలకు సహకరించాలని ఆ ఉత్తర్వులో కోరారు. ఎన్నికల నిబంధనలను పాటించని రాష్ట్రాలు సమాఖ్య నిధులలో కోతలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆ ఉత్తర్వులో హెచ్చరించారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. సమాఖ్య ఎన్నికలలో ఓటు వేసేందుకు పాస్పోర్ట్ వంటి పౌరసత్వ రుజువును తప్పనిసరి చేశారు.ఎన్నికల రోజు తర్వాత అందుకున్న మెయిల్-ఇన్ బ్యాలెట్(Mail-in ballot)లను రాష్ట్రాలు ఇకపై అంగీకరించకూడదని దీనిలో స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వం తాము తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల్లో అక్రమాలు, మోసాలను అరికట్టేందుకేనని పేర్కొంది. ముఖ్యంగా మెయిల్-ఇన్ ఓటింగ్ సందర్భంలో డాక్యుమెంట్ మోసాలు జరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆర్డర్పై సంతకం చేస్తున్నప్పుడు ట్రంప్ అమెరికా ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలను ప్రస్తావించారు. ఈ తాజా ఉత్తర్వు ఇటువంటి అవకతవకలను అంతం చేస్తుందని పేర్కొన్నారు.రిపబ్లికన్ చట్టసభ సభ్యులు ఈ ఉత్తర్వుకు మద్దతు ప్రకటించారు. ఇది ఎన్నికల సమగ్రతపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఉపయోపగడుతుందని పేర్కొన్నారు. జార్జియా విదేశాంగ కార్యదర్శి బ్రాడ్ రాఫెన్స్పెర్గర్ మాట్లాడుతూ ఈ ఉత్తర్వు అమెరికన్ పౌరులు మాత్రమే ఇక్కడి ఎన్నికల ఫలితాలను నిర్ణయించేలా ఉందని పేర్కొన్నారు. మరోవైపు డెమొక్రాట్లు ఈ ఉత్తర్వును ఖండించారు. కొందరు ఓటర్లు ఓటు హక్కును కోల్పోతారని వారు పేర్కొన్నారు. 2023 నాటి ఒక నివేదిక ప్రకారం అర్హత కలిగిన అమెరికా పౌరులలో తొమ్మిది శాతం మందికి పౌరసత్వ రుజువు అందుబాటులో లేదని తెలుస్తోంది.మరోవైపు ఇప్పటివరకూ ఎన్నికల సమయంలో 18 రాష్ట్రాలు ఎన్నికల రోజు తర్వాత అందుకున్న మెయిల్ బ్యాలెట్లను ఆ తేదీకి ముందు పోస్ట్మార్క్ చేసినంత వరకు అంగీకరిస్తూ వస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఇకపై ఈ పద్ధతికి స్వస్తి పలికారు. కాగా కొలరాడో డెమోక్రటిక్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెనా గ్రిస్వోల్డ్ మాట్లాడుతూ ఈ ఉత్తర్వు సమాఖ్య ప్రభుత్వం వాడుతున్న చట్టవిరుద్ధమైన ఆయుధంగా అభివర్ణించారు. ట్రంప్ ఓటర్ల సంఖ్యను మరింతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఇది కూడా చదవండి: Kashmir: హురియత్ దుకాణం బంద్.. వేర్పాటువాదుల నోటికి తాళం

కేటీఆర్పై కేసు నమోదు
సాక్షి, నల్లగొండ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదైంది. నల్లగొండ జిల్లాలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రజిత ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీసులు కేటీఆర్పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ వ్యవహారంలో నిందితులతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ తమపై కేటీఆర్ ట్వీట్ చేశారని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రజిత తెలిపారు. దీనికి సంబంధించి.. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ రజిత.. కేటీఆర్పై ఫిర్యాదు చేశారు. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలో కేటీఆర్తో పాటు క్రిషాంక్, కొణతం దిలీప్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. నిందితుడు చిట్ల ఆకాష్ తన డ్రైవర్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఆమె ఫిర్యాదుతో నకిరేకల్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేటీఆర్పై రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. పేపర్ లీకేజీ ఘటనలో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 🚨A Shocking Case of SSC Paper Leak as well as Nexus for Top Rankings - Congress leaders involved with Private School Management to send the SSC 10th Class Examination First Day Question paper through Whatsapp Groups...While 15 people have been involved,only 6 have been… pic.twitter.com/XHBScJBrY7— Dr.Krishank (@Krishank_BRS) March 24, 2025

బెట్టింగ్ యాప్ వ్యవహారం.. మాజీ సీఎం ఇళ్లలో సీబీఐ సోదాలు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బాఘేల్ వరుస షాక్లు తగులుతున్నాయి. పలు కేసుల్లో ఈడీ, సీబీఐ అధికారులు ఆయనను టార్గెట్ చేశారు. తాజాగా బెట్టింగ్ యాప్ వ్యవహారం విషయమై.. భూపేష్ బాఘేల్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. ఇక, ఇప్పటికే ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరిపింది దీంతో, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.వివరాల ప్రకారం.. మాజీ సీఎం భూపేష్ బాఘేల్ను పలు కేసులు టెన్షన్ పెడుతున్నాయి. ఆయనపై కేసుల ఉచ్చు బిగుస్తోంది. తాజాగా మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించిన కేసులో భూపేష్ బాఘేల్ నివాసాల్లో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. రాయ్పుర్, భిలాయిలోని ఆయన నివాసాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు (CBI Raids) చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయను అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్ పోలీసు అధికారి ఇంట్లోనూ ఈ దాడులు జరుగుతున్నాయి.మరోవైపు.. సీబీఐ సోదాలపై మాజీ సీఎం భూపేష్ బాఘేల్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన ట్విట్టర్ వేదికగా..‘ఇప్పుడు సీబీఐ వచ్చింది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 8, 9 తేదీల్లో అహ్మదాబాద్ (గుజరాత్)లో జరగనున్న ఏఐసీసీ సమావేశం కోసం ఏర్పాటైన “డ్రాఫ్టింగ్ కమిటీ” సమావేశానికి భూపేష్ బాఘేల్ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే నేడు ఉదయమే సీబీఐ రాయ్పూర్, భిలాయ్లోని ఆయన నివాసాలకు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించడం విశేషం.अब CBI आई है.आगामी 8 और 9 अप्रैल को अहमदाबाद (गुजरात) में होने वाली AICC की बैठक के लिए गठित “ड्राफ़्टिंग कमेटी” की मीटिंग के लिए आज पूर्व मुख्यमंत्री भूपेश बघेल का दिल्ली जाने का कार्यक्रम है.उससे पूर्व ही CBI रायपुर और भिलाई निवास पहुँच चुकी है.(कार्यालय-भूपेश बघेल)— Bhupesh Baghel (@bhupeshbaghel) March 26, 2025ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో మాజీ సీఎం భూపేష్ బాఘేల్ను పలు కేసులు వెంటాడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి భూపేష్ బాఘేల్, ఆయన కుమారుడు చైతన్య నివాసంలో ఇటీవల ఈడీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ సోదాల సందర్భంగా రూ.30 లక్షల నగదు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సోదాల అనంతరం తిరిగి వెళ్తున్న ఈడీ అధికారుల వాహనాలపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో, ఒక్కసారిగా అక్కడ ఆందోళన నెలకొంది. #WATCH | Raipur: CBI raids underway at the residence of former Chhattisgarh CM and Congress leader Bhupesh Baghel. pic.twitter.com/McOgzts1qk— ANI (@ANI) March 26, 2025

భారత ఆర్థిక వ్యవస్థ భేష్
భారత ఆర్థిక వ్యవస్థ వైవిధ్యంతో ఎంతో బలంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా నివేదిక తెలిపింది. వేగవంతమైన ఆర్థిక వృద్ధితో విపత్తును (కరోనా) తట్టుకుని నిలబడిందని పేర్కొంది. ప్రపంచబ్యాంక్తో కలసి ఐఎంఎఫ్ భారత ఆర్థిక వ్యవస్థపై సమగ్ర విశ్లేషణ చేసింది. ఈ నివేదికను విడుదల చేయగా ఆర్బీఐ దీన్ని స్వాగతిస్తున్నట్టు ప్రకటించింది.‘భారత ఆర్థిక వ్యవస్థ 2010 తర్వాత ఎన్నో కష్టాలను అధిగమించింది. మహమ్మారిని తట్టుకుని నిలబడింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల రుణ వితరణ పెరిగింది’ అని ఈ నివేదిక వివరించింది. తీవ్రమైన స్థూల ఆర్థిక వాతావరణంలోనూ మోస్తరు రుణ వితరణకు మద్దతుగా బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల వద్ద తగినన్ని నిధులున్నట్టు పేర్కొంది. ఎన్బీఎఫ్సీలకు సైతం బ్యాంకుల మాదిరే లిక్విడిటీ కవరేజీ రేషియో (ఎల్సీఆర్)ను అమలు చేయడాన్ని ప్రశంసించింది. రిస్క్ల నివారణ, నిర్వహణ పరంగా అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా సెక్యూరిటీల మార్కెట్ నియంత్రణలు మెరుగుపడినట్టు పేర్కొంది. భారత బీమా రంగం సైతం బలంగా వృద్ధి చెందుతున్నట్టు తన నివేదికలో ప్రస్తావించింది.ఇదీ చదవండి: ఎన్పీఏల వేలానికి ప్రత్యేక పోర్టల్ సైబర్ భద్రతా పర్యవేక్షణబ్యాంకుల్లో వ్యవస్థలు, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా భద్రతా చర్యలను సైతం ఐఎంఎఫ్ విశ్లేషించింది. బ్యాంక్లకు సంబంధించి అత్యాధునిక సైబర్ భద్రతా పర్యవేక్షణను భారత అధికారులు కలిగి ఉన్నట్టు తెలిపింది. కొన్ని ప్రత్యేకమైన టెస్ట్ల నిర్వహణ ద్వారా దీన్ని మరింత బలోపేతం చేయొచ్చని సూచించింది.

ఐసీయూలో తల్లి.. IPLకు నో చెప్పిన హీరోయిన్
హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుతున్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తెలుగులోనూ ప్రభాస్ సాహో మూవీలో నటించింది. కెరీర్ పరంగా ఎప్పుడూ ఏదో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉండే ఈమె.. సడన్ గా ఆస్పత్రిలో కనిపించింది. ఈమె తల్లి ఐసీయూలో ఉండటమే దీనికి కారణం.(ఇదీ చదవండి: పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని)శ్రీలంకకు చెందిన జాక్వెలిన్.. చాన్నాళ్ల క్రితమే మన దేశానికి వచ్చేసింది. హిందీ మూవీస్ చేస్తూ ముంబైలో సెటిలైపోయింది. తెలుగు, కన్నడ, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తల్లితో పాటు కలిసుంటోంది. అయితే జాక్వెలిన్ తల్లి కిమ్ కి సోమవారం గుండెపోటు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకా ఆమె ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా పరామర్శించి వెళ్లినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఐపీఎల్ లో గౌహతి వేదికగా గురువారం కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు ప్రారంభోత్సవ వేడుకలకు జాక్వెలిన్ హాజరై ఫెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది. కానీ తల్లి ఐసీయూలో ఉండటంతో దీనికి నో చెప్పేసింది. ప్రస్తుతాకైతే ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: మిలియన్ డాలర్ 'కోర్ట్'.. నానికి ఇది చాలా స్పెషల్)

అడుగుకు కమీషన్.. 'రూపాయి పావలా'
సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేమో ఓ వైపు సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ అమలు చేస్తానని చెబుతూ.. మరోవైపు మద్యం దందా, ఇరిగేషన్ పనుల్లో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట సొంతంగా సంపద సృష్టించుకుంటుంటే, టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం రెండడుగులు ముందుకేసి సొంతానికి సంపద సృష్టించుకోవడానికి వినూత్న మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఆక్రమ ఆదాయ మార్గాలను అన్వేషించడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పరిస్థితి మరీ చిల్లరగా ఉంది. కిలో చికెన్కు రూ.10 మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఇటీవల హుకుం జారీ చేసిన విషయంపై కలకలం సద్దుమణగక ముందే ఈ దంపతుల కన్ను గోడౌన్లపై పడింది. చదరపు అడుగుకు రూపాయి పావలా కమీషన్ ఇచ్చి తీరాల్సిందేనని స్వయంగా ఎమ్మెల్యేనే గోడౌన్ల యజమానులకు అల్టిమేటం జారీ చేశారు. సొంత పార్టీ నేతలైనా సరే కమీషన్ ఇచ్చిన తర్వాతే గోడౌన్ లీజుకు పర్మిషన్ ఇస్తామని తెగేసి చెప్పడంతో టీడీపీ నాయకులు సైతం గగ్గోలు పెడుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు సుమారు 14 వేల ఎకరాల్లో పొగాకు పంట సాగు చేశారు. ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. రైతుల వద్ద నుంచి కొన్న పొగాకును నిల్వ చేసుకునేందుకు పొగాకు కంపెనీలకు ఆళ్లగడ్డ, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, ఆర్.జమ్ములదిన్నెలోని గోడౌన్లు అవసరమవుతాయి. సుమారు 2.50 లక్షల చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. ఒక్కో చదరపు అడుగుకు నెలకు రూ.5.25 చొప్పున ఇస్తామని పొగాకు కంపెనీలు యజమానులకు ఆఫర్ ఇచ్చాయి. మూడేళ్ల పాటు అగ్రిమెంట్ ఇవ్వాలని చెప్పడంతో యజమానులంతా సంతోషపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సదరు ప్రజాప్రతినిధి ప్రతి అడుగుకు తనకు రూపాయి పావలా కమీషన్ ఇచ్చి తీరాల్సిందేనని ఖరాకండిగా చెప్పేశారు. కమీషన్ ఇవ్వకుంటే అగ్రిమెంట్ ఎలా చేసుకుంటారో చూస్తానని హెచ్చరించినట్లు యజమానులు వాపోతున్నారు. తమకు పెద్దగా మిగిలేది ఉండదని మొరపెట్టుకున్నా వినిపించుకోలేదని సమాచారం. దీంతో చేసేది లేక ఆమె గారు అడిగిన మేరకు అడుగుకు “రూపాయి పావలా’ కమీషన్కు ఓకే చెప్పారు. ఈ లెక్కన ప్రతి నెలా రూ.3.12 లక్షల మేర ఎమ్మెల్యేకు ముట్టజెప్పాల్సి ఉంటుంది. ఈ విషయం స్థానికంగా రైతులందరికీ తెలియడంతో ఇంత చిల్లర వ్యవహారాలు ఎక్కడా ఉండవని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ODI WC Qualifiers: విండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్రౌండర్ అవుట్
‘క్లైమెట్ ఎమర్జెన్సీ’..ఇలాంటప్పడు ఈ సిరి ధాన్య పంటలే మేలు..!
పీఎస్యూల్లో వాటా విక్రయం వాయిదా
‘నవరాత్రి’ యుద్ధం: ‘మాంసమే కాదు మద్యం దుకాణాలూ వద్దు’
నా సెంచరీ గురించి పట్టించుకోవద్దు.. శశాంక్కు శ్రేయస్ చివరి ఓవర్ సందేశం
తెలంగాణ అసెంబ్లీ.. కళ్యాణలక్ష్మీ, తులం బంగారంపై బీఆర్ఎస్ నిరసన
ప్రైవేటు జిత్తులకు చిత్తవ్వాల్సిందేనా?
శబరిమలలో పూజ వివాదంపై స్పందించిన మోహన్లాల్
అది మనుషుల్ని చంపడం కన్నా ఘోరం: సుప్రీం కోర్టు
పెళ్లి సంగతి తర్వాత... కౌన్సెలింగ్ ఇప్పించండి..!
‘లిప్లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్కు అంతా తెలుసు: సిరాజ్
'6 నెలల సమయమివ్వండి.. అర్జున్ వరల్డ్లోనే బెస్ట్ బ్యాటర్ అవుతాడు'
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ధన, వస్తులాభాలు
మన ఆస్కార్ అవార్డ్స్ను లాక్కున్నారు.. దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
టికెట్లివ్వగానే పని చేయడం మానేస్తున్నార్సార్!
64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లి
ODI WC Qualifiers: విండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్రౌండర్ అవుట్
‘క్లైమెట్ ఎమర్జెన్సీ’..ఇలాంటప్పడు ఈ సిరి ధాన్య పంటలే మేలు..!
పీఎస్యూల్లో వాటా విక్రయం వాయిదా
‘నవరాత్రి’ యుద్ధం: ‘మాంసమే కాదు మద్యం దుకాణాలూ వద్దు’
నా సెంచరీ గురించి పట్టించుకోవద్దు.. శశాంక్కు శ్రేయస్ చివరి ఓవర్ సందేశం
తెలంగాణ అసెంబ్లీ.. కళ్యాణలక్ష్మీ, తులం బంగారంపై బీఆర్ఎస్ నిరసన
ప్రైవేటు జిత్తులకు చిత్తవ్వాల్సిందేనా?
శబరిమలలో పూజ వివాదంపై స్పందించిన మోహన్లాల్
అది మనుషుల్ని చంపడం కన్నా ఘోరం: సుప్రీం కోర్టు
పెళ్లి సంగతి తర్వాత... కౌన్సెలింగ్ ఇప్పించండి..!
‘లిప్లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్కు అంతా తెలుసు: సిరాజ్
'6 నెలల సమయమివ్వండి.. అర్జున్ వరల్డ్లోనే బెస్ట్ బ్యాటర్ అవుతాడు'
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ధన, వస్తులాభాలు
మన ఆస్కార్ అవార్డ్స్ను లాక్కున్నారు.. దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
టికెట్లివ్వగానే పని చేయడం మానేస్తున్నార్సార్!
64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లి
సినిమా

మేలో రైడ్
అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైడ్ 2’. రాజ్కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘రైడ్’ (2018)కి సీక్వెల్గా ‘రైడ్ 2’ రూపొందింది. ఈ మూవీలో వాణీ కపూర్, రితేష్ దేశ్ముఖ్ ఇతర పాత్రలు పోషించారు. అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్, భూషణ్ కుమార్, గౌరవ్ నంద, క్రిషణ్ కుమార్, ప్రగ్యా సింగ్ నిర్మించారు.ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘వాస్తవ ఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘రైడ్ 2’. ఈ మూవీలో ఐఆర్ఎస్ అధికారి అమయ్ పట్నాయక్గా అజయ్ దేవగన్ నటించారు. వాస్తవ ఘటనలకి సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు జోడించి తనదైన శైలిలో ఈ మూవీని తీర్చిదిద్దారు రాజ్కుమార్ గుప్తా. ‘రైడ్’ సినిమాలా ‘రైడ్ 2’ కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.

ఎక్కడికెళ్లినా గర్వంగా ఇక్కడికే వస్తా!: శ్రీలీల
‘‘ఒక సినిమాతో ప్రేక్షకులకు వినోదం పంచితే, మరో సినిమాతో సందేశం ఇవ్వాలి. ఇలా నా సినిమాలను బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నాను. తెలుగు అమ్మాయిగా, హీరోయిన్గా నాపై ఆ బాధ్యత ఉంటుంది’’ అని హీరోయిన్ శ్రీలీల అన్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘రాబిన్హుడ్’. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ అతిథి పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక శ్రీలీల పంచుకున్న విశేషాలు. ⇒ ‘రాబిన్హుడ్’ సినిమాలో ఫారిన్ నుంచి ఇండియాకు వచ్చిన నీరా వాసుదేవ్ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తన ప్రపంచంలో తను ఉంటుంది. ఈ ప్రపంచం అంతా తన చుట్టూనే ఉంటుందని అనుకుంటుంది. నా కెరీర్లో నీరా వాసుదేవ్ లాంటి ఫన్ రోల్ను ఇప్పటివరకూ చేయలేదు. నితిన్గారితో వర్క్ చేయడం ఇది రెండోసారి (గతంలో ‘ఎక్స్ట్రా’ మూవీలో కలిసి నటించారు). చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓ ఫ్యామిలీ మెంబర్లా ఉంటారు. ఈ సినిమాతో మాకు హిట్ పెయిర్గా పేరు వస్తుంది. ‘రాబిన్హుడ్’ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ⇒ నీరా వాసుదేవ్ పాత్రకు రష్మికా మందన్నాను అనుకున్నారు. రష్మికకు కూడా నచ్చిన పాత్ర ఇది. కానీ కాల్షీట్స్ విషయంలో సమస్యలు రావడం వల్ల రష్మిక తప్పుకున్నారు. ఆ సమయంలో వెంకీగారు నాకు ఫోన్ చేసి, ఈ రోల్ గురించి చెప్పారు. నాకు నచ్చి ఓకే అన్నాను. ఇటీవల ‘పుష్ప: ది రూల్’ షూటింగ్లో మేం కలుసుకున్నప్పుడు రష్మిక నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేను మైత్రీ ఫ్యామిలీలో ఉన్నానని గర్వంగా చెప్పగలను. మన ఫ్యామిలీతో సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో, వారితో మూవీ చేస్తే అలా ఉంటుంది. ⇒ ‘పుష్ప ది రూల్’ సినిమాలో ‘కిస్సిక్’ స్పెషల్ సాంగ్ చేశాను. ఈ సాంగ్ సక్సెస్ తర్వాత ఆ తరహా స్పెషల్ సాంగ్స్ చేసేందుకు నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ ‘పుష్ప: ది రూల్’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొందిన భారతీయ సినిమా. సో... ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశాను. అయితే ఇకపై ఇలాంటి పెద్ద సినిమాల్లో సాంగ్స్కి బదులుగా మంచి రోల్స్ చేయాలనుకుంటున్నాను. ⇒ 2023లో నావి ఐదారు సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంతో త్రీ షిఫ్ట్స్ కూడా వర్క్ చేశాను. అయితే గత ఏడాది హీరోయిన్గా ఒకే ఒక్క సినిమా (‘గుంటూరు కారం) లో కనిపించాను. నా ఫైనల్ ఇయర్ మెడికల్ ఎగ్జామ్స్ వల్ల ఎక్కువ సినిమాలు చేయలేదు. ఈ గ్యాప్లో ఎన్నో మంచి రోల్స్, మంచి చిత్రాలు వదులుకున్నాను.⇒ ప్రస్తుతం రవితేజగారితో ‘మాస్ జాతర’, శివ కార్తికేయన్గారితో ‘పరాశక్తి’, కన్నడ–తెలుగు భాషల్లో ‘జూనియర్’ సినిమా చేస్తున్నాను. ‘రాబిన్ హుడ్’లో కేతికా శర్మ చేసిన స్పెషల్ సాంగ్ ‘అదిదా సర్ప్రైజ్’లోని కొన్ని డ్యాన్స్ మూమెంట్స్కి భిన్నాబిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మీరు అద్భుతమైన డ్యాన్సర్. ఆ తరహా డ్యాన్స్ మూవ్స్, కొరియోగ్రఫీ గురించి ఓ హీరోయిన్గా ఏం చెప్తారు? ‘‘ఒక అమ్మాయి దృష్టి కోణంలో చెప్పాలంటే... మనం కంఫర్టబుల్గా ఉన్నామా? లేదా? అనేది ముఖ్యం. స్టెప్స్ అనేవి చేసేవారి కంఫర్ట్ లెవల్స్పై ఆధారపడి ఉంటాయి. కంఫర్ట్ జోన్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది. అయితే... అమ్మాయి ఇబ్బంది పడలేదు అన్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. హీరోయిన్గా నేను ఎన్నో సాంగ్స్ చేశాను. శేఖర్ మాస్టర్తో కూడా చేశాను. అందరం హ్యాపీ’’ అంటున్న శ్రీలీలతో బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలోని డ్యాన్స్ మూవ్స్, అలాగే వేరే సినిమాల్లోని ఈ తరహా డ్యాన్స్ మూవ్స్పై మహిళా కమిషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. మీరేం అంటారు? అన్న ప్రశ్నకు శ్రీలీల బదులిస్తూ... ‘‘మహిళా కమిషన్కి మంచి స్థాయి ఉంది. ఏది సరైనదో వారికి తెలుసు. పాత సినిమాల పట్ల కూడా వారికి నాలెడ్జ్ ఉంది. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నాను’’ అన్నారు.హిందీ చిత్ర పరిశ్రమలో బిజీ అవుతున్నారు... అక్కడికే వెళ్లిపోతారని కొందరు అంటున్నారు.. అన్ని భాషల్లో సినిమాలు చేయాలనుకుంటున్నాను. కానీ శ్రీలీల అంటే ఎవరు? తెలుగింటి అమ్మాయి. తెలుగు∙చిత్ర పరిశ్రమ నాకు ఇల్లులాంటిది. ఒకవేళ బయటకు వెళ్లినా గర్వంగా ఇక్కడికే (తెలుగు) తిరిగి వస్తాను. మన పిల్లలు చదువుకోవడానికి మరొక చోటుకు వెళతారు. కానీ మళ్లీ మన ఇంటికే వస్తారు కదా! సరిహద్దులు మారినంత మాత్రాన గాలి మారదు. నేను అన్ని భాషలనూ బ్యాలెన్స్ చేస్తూ, సినిమాలు చేయాలనుకుంటున్నాను.

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. దర్శకుడు భారతీరాజా కుమారుడు కన్నుమూత
కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ గుండెపోటుతో ఈ రోజు సాయంత్రం మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన మనోజ్కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 48 ఏళ్లు కాగా.. ఇటీవలే ఆయనకు గుండెకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది.కాగా.. మనోజ్ భారతిరాజా ప్రముఖ లెజెండరీ ఫిల్మ్ మేకర్ భారతిరాజా కుమారుడు. మనోజ్ తొలిసారిగా తాజ్ మహల్ (1999)మూవీలో నటించారు. ఆ తర్వాత అల్లి అర్జున (2002), కాదల్ పుక్కల్ (2001), అన్నక్కోడి, పల్లవన్, లాంటి తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. గత రెండేళ్లుగా దర్శకత్వం వైపు అడుగులు వేశారు. తన తండ్రి నిర్మించిన 2023 తమిళ చిత్రం మార్గజి తింగల్తో దర్శకుడిగా పరిచయమయ్యారు.మనోజ్ అరంగేట్రం చేయడానికి ముందు సినిమా పట్ల ఉన్న అభిరుచితో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. అంతకుముందు అతను సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ అభ్యసించారు. ఫైనల్ కట్ ఆఫ్ డైరెక్టర్ (2016) వంటి చిత్రానికి తన తండ్రికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే మనోజ్ తన స్నేహితురాలు, తమిళ నటి నందనను నవంబర్ 19న, 2006న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

అర్ధరాత్రి నుంచే ఓటీటీకి ముఫాసా.. ఎక్కడ చూడాలంటే?
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరించిన చిత్రం ది లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఇప్పటికే ఈ సిరీస్లో లయన్ కింగ్-2 కూడా వచ్చేసింది.అయితే గతేడాది లయన్ కింగ్ ప్రీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఈ సినిమాను అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ తెరకెక్కించారు. గతేడాది డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా మొదటి వారంలో భారీ కలెక్షన్స్ రాబట్టింది. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించారు. తెలుగులో మహేశ్ బాబు.. ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పగా, హిందీలో షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.అయితే ముఫాసా: ది లయన్ కింగ్ మరికొద్ది గంటల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ అర్ధరాత్రి నుంచే జియోహాట్స్టార్లో అందుబాటులోకి రానుంది. మార్చి 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. Two lions, one destiny, bound by more than blood.#Mufasa: The Lion King, coming to #JioHotstar on March 26 in English, Hindi, Tamil and Telugu.#MufasaOnJioHotstar #JioHotstar #InfinitePossibilities pic.twitter.com/2mYE0RvhCL— JioHotstar (@JioHotstar) March 24, 2025
న్యూస్ పాడ్కాస్ట్

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్కుమార్ అరెస్ట్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...

25 ఏళ్లపాటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొద్దు... చెన్నైలో జేఏసీ తొలి సమావేశంలో తీర్మానం

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు మాయం... దాదాపు 2 లక్షల మేర తగ్గిపోయిన ఉద్యోగుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్లో హజ్ యాత్రికులకు కూటమి సర్కార్ ద్రోహం... ఏపీ హజ్ కమిటీ ఇచ్చిన లేఖ ఆధారంగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను రద్దు చేసిన కేంద్రం

‘చేతి’లో ఉన్నంత కాలం.. పాలన పరుగు!. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 3లక్షల4వేల965 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి

భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్, విల్మోర్

‘బీసీ’ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం...

‘విద్య’లో గందరగోళం.. లక్ష్యం బడికి తాళం. ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యను భ్రష్టు పట్టిస్తోన్న కూటమి ప్రభుత్వం
క్రీడలు

2032 తర్వాత ‘గాబా’ కనుమరుగు
బ్రిస్బేన్: ఆ్రస్టేలియాలోని ప్రఖ్యాత క్రికెట్ స్టేడియం ‘గాబా’ కనుమరుగు కానుంది. సుదీర్ఘకాలంగా ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన బ్రిస్బేన్లోని ‘గాబా’ మైదానాన్ని 2032 ఒలింపిక్స్ తర్వాత కూల్చివేయనున్నారు. 2028 ఒలింపిక్స్కు లాస్ ఏంజెలిస్ ఆతిథ్యమిస్తుండగా... మరో నాలుగేళ్ల తర్వాత బ్రిస్బేన్ వేదికగా విశ్వక్రీడలు జరగనున్నాయి. దాని కోసం ఆ్రస్టేలియా ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా... క్వీన్స్లాండ్ ప్రభుత్వం వేదికలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒలింపిక్స్ కోసం విక్టోరియా పార్క్లో 63 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో కూడిన నూతన అధునాతన స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇందులోనే ఒలింపిక్స్ ఆరంభ, ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. విశ్వక్రీడలు ముగిసిన అనంతరం ‘గాబా’ మైదానాన్ని పూర్తిగా పడగొట్టి ఒలింపిక్స్ కోసం నిర్మించిన కొత్త స్టేడియంలోనే క్రికెట్ మ్యాచ్లు జరపనున్నారు. ఒకవేళ 2032 ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ మెడల్ ఈవెంట్గా కొనసాగితే క్రికెట్ ఈవెంట్ స్వర్ణ పతక పోరుకు మాత్రం పాత ‘గాబా’ మైదానమే ఆతిథ్యమివ్వనుంది. ‘గాబా స్టేడియానికి ఎంతో చరిత్ర ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నో మరపురాని మ్యాచ్లు జరిగాయి. ఆటగాళ్లకు, అభిమానులకు ఈ మైదానంతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి.అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ మైదానాన్ని కూల్చివేయనున్నారు. దీని స్థానంలో క్వీన్స్ల్యాండ్లో మరో కొత్త స్టేడియం సిద్ధమవుతుంది. అందులో ఐసీసీ ఈవెంట్లు, యాషెస్ సిరీస్, ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ వంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లు యధావిధిగా జరుగుతాయి’ అని క్వీన్స్ల్యాండ్ క్రికెట్ సీఈవో టెర్రీ స్వెన్సన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. » 1931 నుంచి టెస్టు మ్యాచ్లకు ఆతిథ్యమిస్తున్న ‘గాబా’ స్టేడియంలో ఇప్పటి వరకు 67 పురుషుల టెస్టు మ్యాచ్లు, 2 మహిళల టెస్టులు జరిగాయి. »పేస్కు పెట్టింది పేరైన ‘గాబా’ పిచ్పై ఆ్రస్టేలియా జట్టు 1988 నుంచి 2021 వరకు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడలేదు. 2020–21 పర్యటనలో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. »2032 ఒలింపిక్స్ ప్రణాళికల్లో భాగంగా ‘గాబా’ మైదానాన్ని ఆధునీకికరించాలని తొలుత భావించారు. అయితే అధిక వ్యయం కారణంతో ఆ ప్రణాళికను పక్కన పెట్టి పార్క్ల్యాండ్ ఇన్నర్ సిటీలో కొత్త స్టేడియం నిర్మాణం చేపడుతున్నారు. »ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న సమయంలో ‘గాబా’ మైదానాన్ని మరింత మెరుగు పరచాలని భావించినా... ఇప్పటికి నాలుగేళ్లు గడిచినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. »విశ్వక్రీడలకు మరో ఏడేళ్ల సమయమే ఉండటంతో కొత్త స్టేడియం నిర్మాణానికే మొగ్గుచూపారు. »ఇటీవల ఐఓసీ అధ్యక్షురాలిగా ఎన్నికైన క్రిస్టీ కొవెంట్రీ ప్రణాళికల విషయంలో పక్కాగా ఉండటంతో... ఆ్రస్టేలియా ప్రభుత్వం వేదికల నిర్మాణాన్ని వేగవంతం చేసింది.

ఇంగ్లండ్ లయన్స్తో భారత్ ‘ఎ’ జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు
న్యూఢిల్లీ: ఐపీఎల్ అనంతరం జరగనున్న ఇంగ్లండ్ పర్యటనకు బీసీసీఐ ప్రత్యేక ప్రణాళికలు వేస్తోంది. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్తో టీమిండియా 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. 2007 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్ గెలవలేదు. దీంతో ఈసారి మెరుగైన ఫలితం సాధించాలనే ఉద్దేశంతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో భారత ‘ఎ’ టీమ్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనుంది. ఎర్రబంతితో నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ మ్యాచ్ల్లో ప్రధాన ఆటగాళ్లు కూడా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి హెడింగ్లే వేదికగా తొలి టెస్టు జరగనుంది. దానికంటే ముందే భారత ‘ఎ’ జట్టు ఇంగ్లండ్లో పర్యటించనుంది. ‘ఇంగ్లండ్ లయన్స్, భారత్ ‘ఎ’ జట్ల మధ్య మే 30న కాంటర్బరీలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది. జూన్ 6 నుంచి నార్తంప్టన్లో రెండో మ్యాచ్ నిర్వహిస్తాం’ అని ఇంగ్లండ్, వెల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లంతా ఐపీఎల్లో బిజీగా ఉన్నారు. మే 25 ఐపీఎల్ ఫైనల్ జరగనుండగా... ఆ తర్వాతే ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కానుంది. కరుణ్ నాయర్కు పిలుపు.. దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ను భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఇంగ్లండ్కు పంపాలని బీసీసీఐ భావిస్తోంది. విదర్భ జట్టు రంజీ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించిన కరుణ్ నాయర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ‘జట్టును ప్రకటించేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్కు ముందు ఆటగాళ్ల ఎంపికపై ఒక స్పష్టత వస్తుంది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ‘వైట్ వాష్’కు గురైన టీమిండియా... ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లోనూ ఓటమి పాలైంది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. ఇంగ్లండ్ పర్యటనతో టీమిండియా 2025–27 డబ్ల్యూటీసీ సైకిల్ను ప్రారంభించనుంది.

బంగ్లాదేశ్తో భారత్ మ్యాచ్ ‘డ్రా’
షిల్లాంగ్: ఆసియా కప్–2027 క్వాలిఫయింగ్ టోర్నమెంట్ మూడో రౌండ్ను భారత జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. బంగ్లాదేశ్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్ను భారత్ 0–0తో ‘డ్రా’గా ముగించింది. నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. తొలి అర్ధభాగంలో బంగ్లాదేశ్ దూకుడు ప్రదర్శించగా... రెండో అర్ధభాగంలో భారత్ జోరు కనబరిచింది. రెండు జట్లు గోల్స్ అవకాశాలు సృష్టించుకున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాయి. 68వ నిమిషంలో శుభాశీష్ బోస్, 81వ నిమిషంలో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి బంగ్లాదేశ్ గోల్పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్లు బయటకు వెళ్లాయి. గ్రూప్ ‘సి’లో భారత్తోపాటు బంగ్లాదేశ్, హాంకాంగ్, సింగపూర్ జట్లున్నాయి. భారత్ తమ తదుపరి మ్యాచ్ను జూన్ 10న సింగపూర్తో ఆడుతుంది. గ్రూప్ ‘సి’లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు 2027 ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధిస్తుంది.

ముల్లాన్పూర్లో మహిళల వన్డే వరల్డ్కప్ ఫైనల్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే వరల్డ్కప్ క్రికెట్ టోర్నమెంట్ వేదికల వివరాలు బహిర్గతమయ్యాయి. ముల్లాన్పూర్ (పంజాబ్)లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యమివ్వనుందని సమాచారం. 34 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంగల ఈ స్టేడియం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు రెండో హోంగ్రౌండ్గా ఉంది.ముల్లాన్పూర్తోపాటు విశాఖపట్నం, తిరువనంతపురం, ఇండోర్, రాయ్పూర్లలో వరల్డ్కప్ మ్యాచ్లు నిర్వహిస్తారు. ముల్లాన్పూర్, తిరువనంతపురం, రాయ్పూర్లలో ఇప్పటి వరకు మహిళల అంతర్జాతీయ మ్యాచ్లు జరగలేదు. » అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించనున్న మహిళల వన్డే వరల్డ్కప్ ఈ ఏడాది సెపె్టంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు జరగనుంది. అయితే ఈ తేదీలను ఐసీసీ, బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. » ఎనిమిది దేశాల మధ్య వన్డే వరల్డ్కప్ జరగనుంది. మొత్తం 31 మ్యాచ్లు జరుగుతాయి. ఆతిథ్య దేశం భారత్తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఇప్పటికే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించాయి. » ఏప్రిల్ 9 నుంచి 19 వరకు లాహోర్లో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా చివరి రెండు జట్లు ఖరారవుతాయి. క్వాలిఫయింగ్ టోర్నీలో పాకిస్తాన్, వెస్టిండీస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, థాయ్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ వరల్డ్కప్కు అర్హత సాధిస్తే మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారు. పాకిస్తాన్ జట్టు ఆడే మ్యాచ్లను శ్రీలంక లేదా యూఏఈలలో నిర్వహిస్తారు. » భారత్ నాలుగోసారి మహిళల వన్డే వరల్డ్కప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. గతంలో భారత్ 1978, 1997, 2013లలో ఈ మెగా టోర్నీని నిర్వహించింది. ఇప్పటి వరకు వన్డే వరల్డ్కప్ 12 సార్లు జరగ్గా... భారత్ రెండుసార్లు (2005, 2017) రన్నరప్గా నిలిచింది.
బిజినెస్

జీడీపీ వృద్ధికి ఎస్అండ్పీ కోత
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) 6.7 శాతం వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను తాజాగా 6.5 శాతానికి సవరించింది. 2024–25 సంవత్సరం మాదిరే వృద్ధి అంచనాలను ఇస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే రుతుపవనకాలం సాధారణంగా ఉంటుందని, కమోడిటీ, చమురు ధరలు కనిష్ట స్థాయిల్లోనే ఉంటాయన్న అంచనాల ఆధారంగా ఈ వృద్ధి రేటును ఇస్తున్నట్టు ఎస్అండ్పీ తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గడం, బడ్జెట్లో ప్రకటించిన పన్ను ప్రయోజనాలు, తక్కువ రుణ వ్యయాలు ఇవన్నీ భారత్లో విచక్షణారహిత వినియోగాన్ని పెంచుతాయని అంచనా వేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంపై అమెరికా టారిఫ్ల పెంపు ప్రభావం, ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం వంటి సవాళ్లను ప్రస్తావించింది. అయినప్పటికీ వర్ధమాన దేశాల్లో చాలా వాటిల్లో దేశీ డిమాండ్ బలంగా కొనసాగుతుందని అంచనా వేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సెంట్రల్ బ్యాంక్లు ఈ ఏడాది అంతటా వడ్డీ రేట్లను తగ్గించొచ్చని పేర్కొంది. ఒక శాతం వరకు రేట్ల తగ్గింపు.. ‘‘ఆర్బీఐ వడ్డీ రేట్లను మరో 0.75 శాతం నుంచి 1 శాతం వరకు ప్రస్తుత సైకిల్లో తగ్గించొచ్చు. ద్రవ్యోల్బణం తగ్గడం, తక్కువ చమురు రేట్ల ఫలితంగా ద్రవ్యోల్బణం ఆర్బీఐ లకి‡్ష్యత స్థాయి 4 శాతానికి సమీపంలో 2025–26లో ఉండొచ్చు’’అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది. బలమైన దేశీ డిమాండ్తో వర్ధమాన దేశాలు నిలదొక్కుకుంటాయని పేర్కొంది. దిగుమతులపై టారిఫ్లతో అమెరికా వృద్ధి తగ్గడమే కాకుండా, ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా వేసింది. దీంతో 2025లో యూఎస్ ఫెడ్ మరొక్కసారే 25 బేసిస్ పాయింట్ల మేర రేటు తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రోడ్డు ప్రమాదాలతో జీడీపీకి నష్టంఏటా 3 శాతం కోల్పోవాల్సి వస్తోంది: గడ్కరీ న్యూఢిల్లీ: దేశంలో ఏటా 5 లక్షల వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. వీటి కారణంగా 3 శాతం జీడీపీని నష్టపోవాల్సి వస్తోందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. యూఎస్–భారత్ భాగస్వామ్యంతో ఢిల్లీలో రహదారి భద్రతపై ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. దేశానికి రహదారి ప్రమాదాలు అతి ముఖ్యమైన సమస్యగా ఉన్నట్టు చెప్పారు. ఏటా 4.80 లక్షల రహదారి ప్రమాదాల్లో 1.88 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలిపారు. ఇందులో 10,000 మంది 18 ఏళ్లలోపు ఉంటుండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.ఇదొక ప్రధానమైన ప్రజారోగ్య సమస్యే కాకుండా, ఏటా 3 శాతం జీడీపీని నష్టపోవాల్సి వస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బలహీన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్లు) రహదారి ప్రమాదాలకు కారణాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఖర్చు ఆదా చేసుకోవడం, ప్రాజెక్టు నిర్మాణాలను సీరియస్గా తీసుకోకపోవడం కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతన్నట్టు చెప్పారు. రహదారి ప్రమాద బాధితులకు సాయాన్ని ప్రోత్సహించేందుకు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు చెప్పారు. ‘‘ప్రమాద బాధితుల సాయానికి ముందుకు వచ్చే మూడో పక్ష వ్యక్తికి రూ.25,000 బహుమతి ఇవ్వాలని నిర్ణయించాం. ప్రమాదం లేదా ప్రమాదం అనంతరం ఎవరైనా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే గరిష్టంగా రూ.1,50,000 లేదా ఏడేళ్ల పాటు చికిత్స వ్యయాలకు చెల్లింపులు చేయనున్నాం’’అని మంత్రి గడ్కరీ వెల్లడించారు.

సేవలపై ఫిర్యాదుకు వేచి చూడాల్సిందే
న్యూఢిల్లీ: ఏఐ ఏజెంట్లు, చాట్బాట్లు ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినా.. కస్టమర్ సేవల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం లభించడం లేదు. ఫిర్యాదు నమోదు చేయడానికే గంటలు, రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. 2024లో దేశీయ వినియోగదారులు సేవలపై ఫిర్యాదు నమోదు చేయడానికి వేచి చూసిన సమయం 1500 కోట్ల గంటలు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వివరాలను సర్విస్ నౌ ‘కస్టమర్ ఎక్స్పీరియెన్స్’ నివేదిక వెల్లడించింది. కస్టమర్ల అంచనాలు, లభిస్తున్న సేవల మధ్య ఉన్న ఎంతో అంతరం ఉన్నట్టు ఈ నివేదిక గుర్తించింది. 5,000 మంది కస్టమర్లు, 204 మంది కస్టమర్ సేవల ఏజెంట్లను ప్రశ్నించి, వచ్చిన వివరాల ఆధారంగా ఫలితాలను విశ్లేషించింది. ఓపిక పట్టాల్సిందే.. 80 శాతం భారత వినియోగదారులు కనీస అవసరాలైన ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం, ఉత్పత్తుల సిఫారసుల కోసం ఏఐ చాట్బాట్లపై ఆధారపడుతున్నారు. కస్టమర్లు అంతా కలసి ఇందుకోసం ఏటా 1500 కోట్ల గంటల సమయం వెచ్చిస్తున్నారు. 2023తో పోల్చితే 2024లో ఒక ఫిర్యాదు పరిష్కారానికి వేచి చూడాల్సిన సమయం 3.2 గంటలు తగ్గింది. అయినప్పటికీ కస్టమర్ల అంచనాలకు, లభిస్తున్న సేవలకు మధ్య ఎంతో అంతరం ఉంది. 39 శాతం కస్టమర్ల ఫిర్యాదులను హోల్డ్లో పెట్టడం, 36 శాతం ఫిర్యాదులను బదిలీ చేయడం కనిపించింది. ఫిర్యాదుల ప్రక్రియ ఎంతో కష్టంగా ఉందని 34 శాతం మంది వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. నాసిరకం సేవల కారణంగా బ్రాండ్లను మార్చడానికి 89 శాతం వినియోగదారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. బలహీనమైన సేవలపై ఆన్లైన్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రతికూల అభిప్రాయాలను నమోదు చేస్తామని చెప్పారు. కస్టమర్ల సేవల్లో నెలకొన్న అంతరాన్ని తొలగించడానికి, వేగంగా పెరుగుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి వీలుగా వ్యాపార సంస్థలు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఏఐ ఆధారిత సామర్థ్యాలను పెంచుకోకుంటే కంపెనీలు కస్టమర్ల విశ్వాసాన్ని కోల్పోవాల్సి వస్తుందని సర్విస్నౌ ఇండియా ఎండీ సుమీత్ మాధుర్ అన్నారు.

ఐపీవోకు ఇందిరా ఐవీఎఫ్ నో
న్యూఢిల్లీ: ఫెర్టిలిటీ క్లినిక్ చైన్ ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలను పక్కనపెట్టింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంది. కంపెనీ ఇంతక్రితం గోప్యతా మార్గంలో ఐపీవో చేపట్టేందుకు సెబీకి ముందస్తు దరఖాస్తు చేసింది. రహస్య ఫైలింగ్ చేసిన కంపెనీ సంబంధిత వివరాలను గోప్యంగా ఉంచేందుకు వీలుంటుంది. అంతేకాకుండా కచ్చితంగా పబ్లిక్ ఇష్యూ చేపట్టాలన్న నిబంధనలేమీ లేవు. ఫిబ్రవరి 13న సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను సమర్పించిన కంపెనీ కారణాలు వెల్లడించకుండా ఈ నెల 19న ఉపసంహరించుకుంది. ఇంతక్రితం 2023లో హోటళ్ల అగ్రిగేటర్ ఓయో సెబీకి రహస్య ఫైలింగ్ చేసినప్పటికీ ఐపీవో చేపట్టలేదు. అయితే 2024లో రిటైల్ దిగ్గజం విశాల్ మెగామార్ట్, ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ ఐపీవోలు చేపట్టి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాయి. ఈ బాటలో గత వారం ఫిజిక్స్వాలా సైతం కాన్ఫిడెన్షియల్ రూట్లో సెబీకి పత్రాలు దాఖలు చేసింది. కాగా.. 2022 డిసెంబర్లో టాటా ప్లే(గతంలో టాటా స్కై) దేశీయంగా తొలిసారి రహస్య ఫైలింగ్ రూట్లో సెబీకి దరఖాస్తు చేసింది. 2023 ఏప్రిల్లో అనుమతి పొందినప్పటికీ ఐపీవోకు రాకపోవడం గమనార్హం! అగ్రివేర్హౌసింగ్కు చెక్ అగ్రివేర్హౌసింగ్ అండ్ కొలేటరల్ మేనేజ్మెంట్ సంస్థ 2024 డిసెంబర్లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ను సెబీ తాజాగా వెనక్కి పంపింది. టెక్నాలజీ ఆధారిత అగ్రికల్చర్ సర్విసులందించే కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయాలని భావించింది. వీటికి జతగా మరో 2.69 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచాలని ప్రణాళికలు వేసింది. వాటాదారుల్లో టెమాసెక్ 1.19 కోట్ల షేర్లు ఆఫర్ చేయనుంది. సాధారణ ఫైలింగ్ చేస్తే సెబీ అనుమతి పొందిన 12 నెలల్లోగా ఐపీవో చేపట్టవలసి ఉంటుంది.

ఈ ఏడాది ఐటీఈఎస్ కొలువుల జోరు
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశీ ఐటీఈఎస్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎనేబుల్డ్ సర్విసెస్) రంగం గణనీయంగా వృద్ధి చెందనుంది. ఉద్యోగావకాశాలు 20 శాతం మేర పెరగనున్నాయి. ఏఐ ఆధారిత నియామకాల సేవల ప్లాట్ఫామ్ ఇన్స్టాహైర్ రూపొందించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 42,000 మంది ఉద్యోగార్థుల ప్రొఫైల్స్, 11,000 పైచిలుకు రిక్రూటర్–క్యాండిడేట్ల ఇంటర్వ్యూ వివరాల అధ్యయనం ఆధారంగా సంస్థ దీన్ని రూపొందించింది. తమ ‘ఇన్స్టాహైర్ టెక్ శాలరీ ఇండెక్స్ 2025‘ ప్రకారం అనుభవం, డొమైన్లవ్యాప్తంగా జీతభత్యాల డైనమిక్స్ కూడా మారుతున్నట్లు తెలిపింది.కొత్త టెక్నాలజీల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ, సైబర్సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఉద్యోగావకాశాలు 75 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక తాత్కాలిక ఉద్యోగుల గిగ్ ఎకానమీ, రిమోట్ వర్క్ విధానాలు కూడా పరిశ్రమ రూపురేఖలను తీర్చిదిద్దడంలో కీలకంగా ఉంటున్నాయని ఇన్స్టాహైర్ నివేదిక తెలిపింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ జాబ్ మార్కెట్లో పోటీపడేందుకు దాదాపు 40 శాతం మంది ఉద్యోగులు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందడమో లేదా ప్రస్తుతమున్న వాటిని మరింతగా మెరుగుపర్చుకోవడంపైనో దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. నివేదికలోని మరిన్ని వివరాలు.. ⇒ వివిధ స్థాయుల్లో అనుభవమున్న డెవ్ఆప్స్ నిపుణులకు, ముఖ్యంగా ఏడబ్ల్యూఎస్ నైపుణ్యాలున్న వారికి 10 శాతం మేర వేతన వృద్ధి ఉంటోంది. 0–5 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రంట్ ఎండ్ డెవలపర్ల వేతనం వార్షికంగా సుమారు రూ. 1.5 లక్షలు తగ్గగా, ఆరేళ్ల పైగా అనుభవమున్న ఫ్రంట్ ఎండ్ నిపుణుల శాలరీలు వార్షికంగా సుమారు రూ. 4 లక్షల మేర పెరిగాయి. మొబైల్ డెవలప్మెంట్, డేటా సైన్స్ విభాగాల్లోనూ ఇదే ధోరణి నెలకొంది. ⇒ బ్యాక్ఎండ్ నైపుణ్యాలకు సంబంధించి పైథాన్ నిపుణులకు అత్యధికంగా వేతనాలు ఉంటున్నాయి. ప్రతి అయిదేళ్ల అనుభవానికి వేతనం రెట్టింపు స్థాయిలో ఉంటోంది. జావాకి కూడా మంచి డిమాండ్ నెలకొంది. ఫ్రెషర్స్ నుంచి పదేళ్ల పైగా అనుభవమున్న వరకు వివిధ స్థాయుల్లోని ఉద్యోగుల వేతనాలు అయిదు రెట్లు పెరిగాయి. ⇒ ప్రతిభావంతులకు హాట్స్పాట్గా బెంగళూరు కొనసాగుతోంది. దేశీయంగా 35 శాతం మంది టెక్నాలజీ సిబ్బందికి కేంద్రంగా ఉంటోంది. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్ (చెరి 20 శాతం చొప్పున), పుణె (15 శాతం), చెన్నై (10 శాతం) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ⇒ చండీగఢ్, జైపూర్, ఇండోర్లాంటి ద్వితీయ శ్రేణి నగరాలు ఆకర్షణీయమైన టెక్ హబ్లుగా ఎదుగుతున్నాయి. ⇒ నిపుణులు, నాన్–మెట్రో ప్రాంతాలకు రీలొకేట్ అయ్యేందుకు రిమోట్ పని విధానంపరమైన వెసులుబాటు ఉపయోగకరంగా ఉంటోంది. ⇒ సైబర్సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ల సారథ్యంలో నియామకాలు జోరందుకోనున్నా యి. ఏఐ అనుభవానికి కంపెనీలు ప్రా ధాన్యం ఇస్తున్నందున వైవిధ్యం కన్నా నైపుణ్యాలను బట్టి నియమించుకునే ధోరణి పెరుగుతోంది. ⇒ కంపెనీలు వినూత్న హైరింగ్ వ్యూహాలను అమలు చేస్తుండటంతో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెట్టే నిపుణులకు కెరియర్ వృద్ధి మెరుగ్గా ఉంటుంది.
ఫ్యామిలీ

పెను గాలుల నుంచి టేపులతో అరటికి రక్షణ!
అరటి తోటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రైతులకు పెనుగాలులు తీవ్ర నషాన్ని కలిగిస్తూ ఉంటాయి. లక్షలు పెట్టుబడి పెట్టి పెంచిన అరటి తోటల్లో కొద్ది రోజుల్లో గెలలు కోతకు వచ్చే దశలో సుడిగాలులు, తుపాన్లకు విరిగి పడిపోతే రైతులకు నూటికి నూరు శాతం నష్టం జరుగుతుంది. వెదురు బొంగుల ఊతంతో అరటి చెట్లకు గాలుల నుంచి రక్షించుకునేందుకు రైతులు విఫలయత్నం చేస్తూ వుంటారు. అయితే, కర్ణాటకలో అరటి తోటలు సాగు చేస్తున్న ఒక యువ రైతు సరికొత్త ఆలోచనతో, తక్కువ ఖర్చుతోనే అరటి తోటలను పెను గాలుల నుంచి చక్కగా రక్షించుకుంటున్నారు. చెట్టుకు నాలుగు వైపులా గూటాలు వేసి, వాటికి ప్లాస్టిక్ టేప్లను కట్టటం ద్వారా పెను గాలుల నుంచి అరటి చెట్లను చాలా వరకు రక్షించుకోవచ్చని యువ రైతు సురేష్ సింహాద్రి చెబుతున్నారు.. సురేష్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తణుకు. కర్ణాటకలోని మైసూరుప్రాంతానికి వలస వెళ్లి కొన్ని సంవత్సరాల నుంచి యాలక్కి రకం అరటి తోటలను కౌలు భూముల్లో సాగు చేస్తున్నారు. చామరాజానగర జిల్లా కొల్లేగాలా తాలూకా, సత్తేగాల గ్రామంలో సురేష్ అరటి తోటలను సాగు చేస్తున్నారు. ఆయన అనుభవాలు.. ఆయన మాటల్లోనే..అరటి చెట్లకు నాలుగు వైపులా గూటాలు వేసి టేపులతో కట్టేస్తాంగాలుల నుంచి అరటి చెట్లకు గల సమస్యను అధిగమించడానికి తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాధారణంగా వెదురు బొంగులను ఆసరాగా పెట్టి అరటి చెట్లకు రక్షణ కల్పిస్తుంటారు. ఇందుకోసం కర్రల కొనుగోలుకే ఎకరానికి రూ. లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే, మేము కర్రల అవసరం లేకుండా కేవలం టేపులతోనే అరటి చెట్టుకు నాలుగు వైపులా కట్టి గాలుల నుంచి విజయవంతంగా రక్షించుకుంటున్నాం. చెట్టుకు నాలుగు వైపులా నేలలోకి కట్టె గూటాలు దిగవేసి, వాటికి టేపులతో అరటి చెట్టు పై భాగాన్ని కడుతున్నాం. చెట్టుకు గట్టిగా బిగుతుగా కట్టకుండా కొంచెం వదులుగా ఉండేలా చెట్టు చుట్టూతా టేపులను రక్షణ చక్రం మాదిరిగా కడతాం. గాలులు వీచి చెట్టు అటూ ఇటూ ఊగినప్పుడు చెట్టు కాండం విరిగి పడిపోకుండా రక్షించుకుంటున్నాం. చెట్టుకు 6 నెలల వయసులో పువ్వు దశలో టేపు కట్టాలి. గత ఏడాది ఎప్పుడూ ఎరుగని రీతిలో మాప్రాంతంలో గాలి వాన వచ్చి అరటి తోటలే కాదు, కరెంటు స్థంభాలు కూడా కూలిపోయాయి. అయినా, మా తోటలో కొన్ని చెట్లు మాత్రమే ఒరిగాయి. మిగతా చెట్లు అదృష్టం కొద్దీ గాలులను చాలా వరకు తట్టుకున్నాయి. టేపులతో కట్టటం వల్లనే ఇది సాధ్యమైంది.ఎకరానికి రూ. 12 వేల ఖర్చుఎకరం అరటి తోటకు రూ. 12 వేల ఖర్చుతోనే టేపులతో రక్షణ కల్పించుకుంటున్నాం. ఎకరానికి 25 కిలోల టేపు అవసరం అవుతుంది. కిలో ధర రూ. 130. టేపులు కట్టడానికి కట్టె గూటాలు కావాలి. యూకలిప్టస్ లేత కర్రలను కొనుగోలు చేసి, 2 అడుగుల గూటాలను తయారు చేసుకొని వాడుతున్నాం. అడుగున్నర లోతు వరకు నేలలోకి ఏటవాలుగా దిగగొట్టి, ఆ గూటాలకు టేపులు కడతాం. దీని వల్ల గాలులు వచ్చినప్పుడు అవి చెక్కుచెదర కుండా చెట్టును కాపాడుతున్నాయి. కూలీల ఖర్చుతో కలిపితే చెట్టుకు రూ. 10 లకు మించి ఖర్చు కాదు. 6“6 దూరంలో అరటి మొక్కలు నాటితే ఎకరానికి 1200 మొక్కలు పడతాయి. అంటే.. ఎకరానికి టేపులు కట్టడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 12,000 మాత్రమే! కట్టిన టేపు రెండో పంటకు వాడటానికి పనికిరాదు. ప్రతి పంటకు మళ్లీ కట్టుకోవాలి. మేం యాలక్కి రకం నాటు రకం పిలకలను తెప్పించి నాటుతున్నాం. టిష్యూకల్చర్ మొక్కలు నాటితే అవి మరీ ఎత్తు పెరుగుతాయి. నాటు పిలకలు అయితే ఎత్తు తక్కువ పెరుగుతాయి, కాండం గట్టిగా కూడా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం, వినియకచవితి రోజుల్లో ఈ రకం అరటికాయలకు మంచి గిరాకీ ఉంటుంది. కిలో కాయలను రూ. వందకు కూడా అమ్ముతూ ఉంటాం. రైతుగా నా అనుభవాలను, టేపులను అరటి చెట్లకు కట్టే విధానాన్ని చూపే వీడియోలను ‘మీ ఫార్మర్ సురేష్ (@MeFarmerSuresh)’ అనే నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. రైతులు ఈ వీడియోలు చూసి అవగాహన పెంచుకోవచ్చు. నా ఫోన్ నంబర్: 99004 42287.

బతికాను.. బతికించాను
దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా సాగింది కోవిడ్ కాలం! నిజంగానే ఫ్రంట్లైన్ వారియర్స్ ధైర్యంగా మనకు అండగా నిలబడకపోయుంటే ఎలా ఉండేదో మన జీవనం! ఆ టాస్క్లో వైద్యులది కీలకపాత్ర. ట్రాన్స్పోర్టేషన్ దగ్గర్నుంచి మందుల దాకా ఎదురైన సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటూ తమను తాము మోటివేట్ చేసుకుంటూ స్టాఫ్ని ముందుకు నడిపిస్తూ పేషంట్స్కి భరోసా ఇచ్చి, ప్రభుత్వ ఆసుపత్రుల గౌరవాన్ని పెంచిన డాక్టర్లలో హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ అప్పటి సూపరింటెండెంట్.. ఇప్పుడు మహేశ్వరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ ఒకరు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన చెప్పిన విషయాలు..‘‘కోవిడ్ ప్రకృతి వైపరీత్యంలా వచ్చింది. దీని గురించి ప్రజలకే కాదు.. డాక్టర్స్కీ అవగాహన లేదప్పుడు. నేనప్పుడు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్నాను. గాంధీ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా మార్చారు. అందుకని జనరల్ పేషంట్స్ అందరూ ఉస్మానియా కే వచ్చేవాళ్లు. వాళ్లకు కోవిడ్ ఉండొచ్చు.. లేకపోవచ్చు. టెస్ట్లో వాళ్లకు కోవిడ్ నిర్ధారణైతే గాంధీకి పంపేవాళ్లం. అప్పటికే అది ఎందరికో వ్యాపించేసేది. ఏదో ఒక జబ్బుతో వచ్చిన వాళ్లకు కోవిడ్ అని తేలితే కోవిడ్తో పాటు వాళ్లకున్న జబ్బుకూ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చేది. ఉదాహరణకు అపెండిక్స్తో జాయిన్ అయిన వాళ్లకు కోవిడ్ అని తేలితే వాళ్లను గాంధీకి పంపలేకపోయేవాళ్లం. ఎందుకంటే గాంధీలో అప్పుడు అపెండిక్స్ ట్రీట్మెంట్ లేదు.. కేవలం కోవిడ్కే! దాంతో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పేషంట్కి ఉస్మానియాలోనే అపెండిక్స్కి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్లం. ఈ మొత్తం సర్వీస్లో నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్ సిబ్బందిని అప్రిషియేట్ చేయాలి. వాళ్లు చాలా ధైర్యంగా నిలబడ్డారు. మా బలాన్ని పెంచింది.. లాక్డౌన్ ఎంత గడ్డు పరిస్థితో అందరికీ తెలుసు. రవాణా కూడా ఉండేది కాదు. హాస్పిటల్ స్టాఫ్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే వాళ్లకోసం ఆర్టీసీ సంస్థ వాళ్లతో మాట్లాడి స్పెషల్ బస్లు, పాస్లను ఏర్పాటు చేయించాం. ఫుడ్ కూడా సమస్య కూడా ఉండేది. కొన్ని మందుల కొరత వల్ల దొంగతనాలూ జరిగేవి. అన్ని సమస్య ల్లో.. అంత కోవిడ్ తీవ్రతలోనూ సర్జరీలు చేశాం. సరైన చికిత్స చేస్తూ రోగులకు ఇబ్బందుల్లేకుండా చూసుకోగలిగాం. ముగ్గురు పేషంట్లకు న్యూరో సర్జరీ అయిన వెంటనే కోవిడ్ సోకింది. వాళ్లను ఆరోగ్యవంతులను చేసి పంపాం. చికిత్సతోపాటు కౌన్సెలింగ్ చేస్తూ వాళ్లకు ధైర్యమిచ్చే వాళ్లం. పేషంట్స్ చూపించిన కృతజ్ఞత మా స్ట్రెంత్ను పెంచింది. ఐసీయూలో పేషంట్లను చూస్తుండటం వల్ల నాకూ కోవిడ్ వచ్చింది. గాంధీలో అడ్మిట్ అయ్యాను. తీవ్రమయ్యేసరికి నిమ్స్ లో చేరాల్సి వచ్చింది. నా పక్క బెడ్ అతని కండిషన్ సడెన్గా సీరియస్ అయి చనిపోయాడు. చాలా డిస్టర్బ్ అయ్యాను. నేను వీక్ అయితే నా స్టాఫ్ కూడా వీక్ అయిపోతారని నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. డిశ్చార్జ్ అవగానే డ్యూటీలో చేరాను. వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి అందరూ భయపడుతుంటే నేనే ముందు వ్యాక్సిన్ తీసుకుని మిగతావాళ్లను మోటివేట్ చేశాను. సమర్ధంగా, సమన్వయంతో పనిచేసి... కోవిడ్ టైమ్లో మేము అందించిన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులకి మంచి పేరొచ్చింది. గౌరవం పెరిగింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం కోవిడ్ పరిస్థితులను చక్కగా మేనేజ్ చేసింది. వైద్యరంగం, పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయడం వల్ల సమర్థంగా కోవిడ్ సిట్యుయేషన్ను ఎదుర్కొన్నాం. కోవిడ్ను మానవ చరిత్రలో ఒక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. గుణపాఠంగా మలచుకోవచ్చు. ఆరోగ్యాన్ని మించింది లేదని కరోనా మహమ్మారి నిరూపించింది. శుభ్రత నేర్పింది. మంచి జీవనశైలి అవసరాన్ని తెలియజెప్పింది. మానవ సంబంధాల విలువ చూపించింది’’ అంటూ నాటి గడ్డు రోజులను తాను అధిగమించిన తీరును గుర్తు చేసుకున్నారు డాక్టర్ నాగేందర్. – సరస్వతి రమ

మంచు పావురం
కశ్మీర్లో సైకిల్ తొక్కడం కష్టం. అయితే మగ పోస్ట్మేన్లే సైకిల్ తొక్కుతారు. ఉల్ఫతాబానోకు తన రెండు కాళ్లే సైకిల్ చక్రాలు. కశ్మీర్లో మొదటి మహిళా పోస్ట్ఉమన్గా ఆమె 30 ఏళ్లుగా నడిచి ఉత్తరాలు అందిస్తోంది. మంచు తుఫాన్లు, కాల్పుల మోతలు, భయం గొలిపే ఒంటరి మార్గాలు ఆమెను ఆపలేవు. ఇలా వార్తలు మోసే పావురం ఒకటి ఉందని తెలియడానికి ఇంత కాలం పట్టింది. ఇప్పుడుగాని మీడియా రాయడం లేదు. ఈ ఉత్తరం జీవితకాలం లేటు.మంచులో నడవడం మీకు వచ్చా? మూడు నాలుగడుగుల మంచులో నాలుగు అడుగులు నడవడం ఎంత కష్టమో తెలుసా? బాగా శక్తి ఉన్న యువతీ యువకులకే సాధ్యం కాదు. కాని 55 ఏళ్ల ఉల్ఫతా బానో గత 30 ఏళ్లుగా అలాంటి మంచులోనే నడిచి తన ఊరికి బయటి ప్రపంచానికి అనుసంధానకర్తగా ఉంది. ‘హిర్పురా’ అనే చిన్న పల్లెకి ఆమె ఏకైక మహిళా పోస్ట్ఉమన్. ఈ ఊరు శ్రీనగర్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంతో తెగినట్టుండే ఈ ఊరిలో ఒక వార్త తెలియాలన్నా ఒక విశేషం అందాలన్నా ఉల్ఫతానే ఆధారం.5 నెలలు మంచులోనేదక్షిణ కశ్మీర్లోని హిర్పురాలో ప్రతి నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల పాటు దారుణమైన వాతావరణం ఉంటుంది. దట్టమైన మంచు కురుస్తుంది. రోడ్లు మూసుకుపోతాయి. కాని హిర్పురాకు ప్రతిరోజూ కనీసం 30 ఉత్తరాలో, పార్శిళ్లో వస్తాయి. ఒక పురుష ఉద్యోగి జిల్లా హెడ్క్వార్టర్ అయిన షోపియన్కు వెళ్లి వాటిని పట్టుకొస్తాడు. ఇక పంచే బాధ్యత ఉల్ఫతా బానోదే. ‘నేను మెట్రిక్యులేషన్ చదవడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది. నా భర్త కూడా పోస్ట్మేన్గా పని చేసి రిటైర్ అయ్యాడు. నాకు ప్రస్తుతం 22 వేల రూపాయల జీతం వస్తోంది’ అని తెలిపింది ఉల్ఫతా బానో.ఎన్నో సవాళ్లు ధైర్యమే జవాబుఉల్ఫతాకు సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం కష్టమే ఆప్రాంతంలో. అందుకే తాను ఎక్కువగా నడుస్తుంది. ‘రోజుకు నాలుగైదు కిలోమీటర్లు నడుస్తాను’ అంటుందామె. ఉల్ఫతా ఎంతో అవసరం అయితే తప్ప లీవ్ పెట్టదు. ‘దట్టమైన మంచు కురుస్తున్నా లాంగ్బూట్లు వేసుకొని గొడుగు తీసుకొని డ్యూటీకి వెళతాను. పాపం... ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటారు కదా’ అంటుందామె. మంచులో ఒకో ఇంటికి మరో ఇంటికి కూడా సంబంధం తెగిపోయినా ఉల్ఫతా మాత్రం అక్కడకు వెళ్లి ఉత్తరం అందిస్తుంది. ‘ఊళ్లో చాలామంది స్టూడెంట్స్ స్టడీ మెటీరియల్ తెప్పించుకుంటూ ఉంటారు. వారికి నన్ను చూస్తే సంతోషం. వాళ్ళు చదువుకోవడానికి నేను సాయపడుతున్నందుకు తృప్తిగా ఉంటుంది’ అంటుందామె.క్రూరమృగాల భయంకశ్మీర్ సున్నితప్రాంతం. గొడవలు... కాల్పుల భయం ఉండనే ఉంటుంది. అయితే అది అటవీప్రాంతం కూడా. ‘మంచు కాలంలో ఆహారం దొరక్క మంచు చిరుతలు, ఎలుగుబంట్లు ఊరి మీద పడతాయి. నేను ఉత్తరాలు ఇవ్వడానికి తిరుగుతుంటే అవి ఎక్కడ దాడి చేస్తాయోననే భయం ఉంటుంది. కాని నాకెప్పుడు అవి ప్రమాదం తలపెట్టలేదు’ అంటుంది ఉల్ఫతా. సాధారణంగా ఇలాంటి ఊళ్లలో డ్యూటీ చేసినా చేయక పోయినా ఎవరూ పట్టించుకోరు. ‘కాని డ్యూటీ ఒప్పుకున్నాక చేయాలి కదా. అది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతే నన్ను 30 ఏళ్లుగా పని చేసేలా చేస్తోంది’ అని సంతృప్తి వ్యక్తం చేస్తుంది ఉల్ఫతా.ఏసి ఆఫీసుల్లో ఉంటూ హాయిగా వాహనాల్లో వచ్చి పోతూ కూడా తమ డ్యూటీ తాము చేయడానికి అలక్ష్యం చేసే వారు ఉల్ఫతాను చూసి బాధ్యతను గుర్తెరగాలి.

యాక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అంటే ఏంటి..? నటి సమంత, దర్శకుడు విక్రమ్ భట్..
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, నటుడు అయిన విక్రమ్ భట్ ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలు అందించారు. అంతేగాదు ఆయనకు ఫిల్మ్ఫేర్, ఉత్తమ దర్శకుడు వంటి అవార్డులు కూడా వరించాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన దిగ్గజ దర్శకుడు విక్రమ్ భట్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఓ మూవీ ప్రమోషన్లో పాల్గొన్నప్పడూ తన అనారోగ్యం గురించి బయటపెట్టారు. ఆ వ్యాధి కారణంగా తానెంతలా డిప్రెషన్కి గురయ్యానో కూడా వివరించారు. తన వ్యాధి నటి సమంత ఎదుర్కొంటున్న వ్యాధి దగ్గర దగ్గరగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. అసలు విక్రమ్ భట్ ఈ వ్యాధిబారిన ఎలా పడ్డారు..? ఏంటా వ్యాధి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.బాలీవుడ్లో మంచి పేరుగాంచిన రాజ్ మూవీ సీరిస్ దర్శకుడు విక్రమ్ భట్ తాను టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఎదుర్కొంటున్న మైయోసిటిస్ లాంటి వ్యాధితోనే బాధపడుతునట్లు వెల్లడించారు. దీని కారణంగా చాలా డిప్రెషన్కి గురైనట్లు చెప్పుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే తన లైఫ్లో భార్య శ్వేత కూడా ఉండకూడదని నిర్ణయించుకున్నారట. అయితే తన భార్య అది నీ ఛాయిస్ కాదని తన నోరు మూయించేసిందన్నారు. ఆ కష్టకాలంలో తనతో ఉండి భరోసా ఇచ్చిందన్నారు. నిజానికి వ్యాధి కంటే దాని కాణంగా వచ్చే డిపప్రెషన్, ఆందోళనలే అత్యంత ప్రమాదకరమైనవన్నారు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద అనారోగ్యం డిప్రెషన్ అని అన్నారు. దీనిపై సమంత, దీపికా పదుకునే లాంటి వాళ్లు మాట్లాడి యూత్ని చైతన్యపరుస్తున్నారని అభినందిచారు. దానివల్ల చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు తగ్గుతాయన్నారు. ఇక అలాగే తాను ఎదుర్కొంటున్న వ్యాధి గురించి కూడా వివరించారు.ఆ వ్యాధి ఏంటంటే..విక్రమ్ ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. దీని కారణంగా ఎముకలు కలిసిపోతున్నట్లుగా ఉండే ఒక విధమైన ఆర్థరైటిస్ సమస్య అని తెలిపారు. ఫలితంగా చాలా నొప్పిని అనుభవిస్తానని 56 ఏళ్ల భట్ అన్నారు. ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ (AxSpA) అంటే..ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది ప్రధానంగా వెన్నెముక, సాక్రోలియాక్ కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి కారణంగా దీర్ఘకాలికి వెన్నునొప్పిని ఎదుర్కొంటారు. అది భరించలేనదిగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకు వస్తుందంటే..రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన కీళ్లపై దాడి చేసినప్పుడు ఇది సంభవిస్తుందట. ఫలితంగా వాపుతో కూడిన భరించలేని నొప్పి ఎదురవ్వుతుందని అన్నారు. దీనికి కుటుంబ డీఎన్ఏ కీలకపాత్ర పోషిస్తుందట. ఎందుకంటే కుటుంబంలో ఎవరికైన ఆర్థరైటిస్ ఉన్న చరిత్ర ఉంటే..ఈ పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇక ఈ పరిస్థితితో ఉన్నవారు ఉదయం లేచిన వెంటనే హాయిగా నడలేరట. ఎక్కడకక్కడ ఎముకలు బలంగా బిగిసుకుపోయి అలసటతో కూడిన నొప్పి వంటి లక్షణాలు ఉంటాయట. కాలక్రమేణ వెన్నెముక కదలికలు కష్టమై తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సింపుల్గా చెప్పాలంటే కదలికలే ఉండవు. చికిత్స:అది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి వేరుగా ఉంటుందట. చికిత్సలో ఎక్కువ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు), ఫిజికల్ థెరపీ, జీవనశైలి మార్పులతో నయం అయ్యేలా చెస్తారు వైద్యులు. రోగ నిర్థారణ ఎంత తొందరగా జరిగిందన్న దానిబట్టే త్వరగా కోలుకోవడం అనేది ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితికి శాశ్వత చికిత్స లేదట. కేవలం మందులతో ఈ రోగాన్ని అదుపులో ఉంచడమే మార్గమని అన్నారు వైద్యులు. మైయోసిటిస్కి పూర్తి భిన్నం..ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ కీళ్ల ధృడత్వాన్ని బలహీనపరుస్తుంది. అదే మైయోసిటిస్ అనేది కండరాల వాపుకి సంబంధించినది. దీనివల్ల రోజువారీ కార్యకలాపాలు చేయడం కష్టతరమవుతుంది. అదే ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అయితే వెన్నెముక, కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలిక నొప్పి, కదలకుండా ధృఢంగా అయిపోతాయి ఎముకలు. చెప్పాలంటే కదలికలనేవి ఉండవు అని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరింత సమాచారం కోసం వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: 'బిర్యానీ' పూర్తిగా మాంసం ఆధారిత వంటకమా?)
ఫొటోలు


శ్రీశైలం క్షేత్రం..భక్తజనసంద్రం (ఫొటోలు)


చీరలో రీతూ చౌదరి ఒయ్యారాలు (ఫొటోలు)


విశాఖ బీచ్రోడ్డులో యువతతో కలిసి వైద్యురాలు స్టెప్పులు (ఫొటోలు)


చిత్తూరు : శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)


అరుణాచల క్షేత్రంలో అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)


గ్రీన్ శారీలో బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ (ఫోటోలు)


సన్నజాజితీగలా హీరోయిన్ జ్యోతిక, థ్యాంక్స్ టూ విద్యా బాలన్ (ఫోటోలు)


మై విలేజ్ షో అనిల్ దంపతుల చండీ హోమం (ఫోటోలు)


పింక్ శారీలో ఆహా అనేలా మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామరస్ లుక్ (ఫోటోలు)


మనీష్ మల్హోత్రా పింక్ గోల్డ్ డ్రెస్: ‘ఉమ్రావ్ జాన్’ రేఖ మేజిక్ రిపీట్
International

ఇజ్రాయెల్ దాడికి మరోమారు గాజా విలవిల
దేర్ అల్ బలా: గాజాపై ఇజ్రాయెల్ నిరంతర దాడులకు తెగబడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం(Israeli army) దక్షిణ గాజాలోని ప్రముఖ ఆస్పత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.⭕️A key Hamas terrorist who was operating from within the Nasser Hospital compound in Gaza was precisely struck.The strike was conducted following an extensive intelligence-gathering process and with precise munitions in order to mitigate harm to the surrounding environment as… pic.twitter.com/C3pZqlC6NO— Israel Defense Forces (@IDF) March 23, 2025అంతకుముందు దక్షిణ గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ సీనియర్ నాయకునితో సహా 26 మంది పాలస్తీనియన్లు(Palestinians) మృతిచెందారు. ఖాన్ యూనిస్ నగరంలోని నాసర్ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని తాజాగా దాడి జరిగిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ నేపధ్యంలో పెద్ద సంఖ్యలో మృతులు, గాయపడిన వారిని నాసర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం ఆసుపత్రిపై దాడిని ధృవీకరించింది. యాక్టివ్గా ఉన్న హమాస్ ఉగ్రవాదులపై దాడి జరిగిందని తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Israel-Hamas war)లో ఇప్పటివరకూ 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక లక్షా 13 వేల మందికి పైగా జనం గాయపడ్డారని పేర్కొంది. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 673 మంది మృతిచెందారు. మృతుల్లో 15,613 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 872 మంది ఏడాది లోపు వయసు కలిగినవారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం 2023, అక్టోబర్ 7న ప్రారంభమైంది.ఇది కూడా చదవండి: కర్నాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో రసాభాస

చైనాలో మెగా ఫ్యాక్టరీ.. అమెరికా సిటీ కంటే పెద్దగా..
బీజింగ్: వినూత్న, భారీ ప్రాజెక్టులకు పెట్టింది పేరైన చైనా దేశం మరోమారు తన భారీతనాన్ని చాటుకుంటోంది. ఏకంగా ఒక నగరం కంటే పెద్ద స్థాయిలో నూతనంగా ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో సిటీ కంటే ఎక్కువ విస్తీర్ణంలో అంటే దాదాపు 32,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ కర్మాగారం నిర్మాణ పనులు చకచకా పూర్తవుతున్నాయి.చైనాలోని హెనాన్ ప్రావిన్సులోని ఝెన్ఝౌ నగరం శివారు ప్రాంతంలో బీవైడీ సంస్థ ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలను ఈ కర్మాగారంలో తయారుచేయనున్నారు. తాజాగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక డ్రోన్ వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో సామాజిక మాధ్యమాల్లో దీని గురించి చర్చ మొదలైంది. ఉత్పత్తి యూనిట్లు, పెద్ద భవనాలు, టెన్నిస్ కోర్టు, ఫుట్బాల్ మైదానాలతో సకల సదుపాయాలతో కర్మాగార పనులు కొనసాగుతున్నాయి. రోజు ఇక్కడ పనిచేసే కారి్మకులతో ఇప్పటికే ఈ ప్రాంతం కొత్త సిటీలా మారిపోయిందని డ్రోన్ వీడియోను చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఇదే ప్రాంత సమీపంలో బీవైడీ కంపెనీకి ఒక ఫ్యాక్టరీ ఉంది.ఈ ఫ్యాక్టరీ.. అమెరికాలో నెవడా రాష్ట్రంలో విద్యుత్కార్ల దిగ్గజం టెస్లాకు చెందిన ఫ్యాక్టరీ కంటే విస్తీర్ణంలో పెద్దదికావడం విశేషం. కొత్త ఫ్యాక్టరీని ఎనిమిది బ్లాకులుగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే బీవైడీ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 9,00,000 మంది సిబ్బంది ఉన్నారు. మరో మూడు నెలల్లో 2,00,000 మంది సిబ్బందిని కొత్తగా నియమించుకోనున్నారు. ఝెన్ఝౌ నగరంలో నిర్మిస్తున్న కొత్త కర్మాగారంలో రోజు 60,000 మంది కారి్మకులు పనిచేస్తుండటంతో ఇప్పుడు అదొక కొత్త సిటీలా కనిపిస్తోందని ఒక నెటిజన్ అన్నారు. BYD has announced that their Zhengzhou factory will be 50 square miles, which is reportedly bigger than San Francisco at 46.9 square miles, per the Sun. pic.twitter.com/y39khwcyuc— unusual_whales (@unusual_whales) March 24, 2025

కుమారునికి డిస్నీలాండ్ చూపించి... గొంతు కోసి చంపేసింది!
న్యూయార్క్: పిల్లలకు తల్లి ఒడిని మించిన స్వర్గం లేదంటారు. కానీ అమెరికాలో ఓ కన్నతల్లే కొడుకు ప్రాణాలు తీసింది. సరితా రామరాజు అనే భారత సంతతికి చెందిన మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. తన 11 ఏళ్ల కొడుకు యతిన్కు మూడు రోజుల పాటు డిస్నీలాండ్ తిప్పి చూపించింది. తర్వాత హోటల్ గదిలో గొంతు కోసి చంపేసింది. తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు 911కు ఫోన్ చేసి చెప్పింది. వాళ్లు వచ్చేసరికే బాలుడు శవమై కనిపించాడు. అపస్మారక స్థితిలో ఉన్న సరితను ఆస్పత్రికి తరలించారు. బాలుడు చనిపోయాకే ఆమె 911కు ఫోన్ చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. వంటకు ఉపయోగించే పెద్ద కత్తి హోటల్ గదిలో దొరికింది. దాంతోనే పొడిచి చంపినట్టు భావిస్తున్నారు. ఆమెకు 26 ఏళ్ల నుంచి యావజ్జీవ శిక్ష దాకా పడవచ్చని కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపింది. సరితది బెంగళూరు. భర్త ప్రకాశ్ రాజుతో 2018లో విడాకులు తీసుకుంది. కొడుకు యతిన్ రాజును కోర్టు తండ్రి సంరక్షణలో ఉంచింది. సరితకు సందర్శన హక్కులు మాత్రమే లభించాయి. విడాకుల తర్వాత సరిత కాలిఫోర్నియా నుంచి వర్జీనియాలోని ఫెయిర్ ఫాక్స్కు మారింది. యతిన్ను తనకు అప్పగించాలంటూ గత నవంబర్లో పిటిషన్ దాఖలు చేసింది. ‘‘కొడుకు వైద్యం, స్కూలింగ్ వంటి నిర్ణయాలు తన ప్రమేయం లేకుండానే తీసుకుంటున్నారు. నా మాజీ భర్తకు మాదకద్రవ్యాల వ్యసనముంది. మద్యం, ధూమపానం మత్తులో ఉంటాడు’’ అని ఆరోపించింది. ఇటీవల కొడుకును చూసేందుకు సరిత శాంటా అనాకు వచ్చింది. తనను మూడు రోజులూ డిస్నీల్యాండ్కు తీసుకెళ్లింది. ఈ నెల 19న కొడుకును తండ్రికి అప్పగించాల్సి ఉంది. ఆ రోజు ఉదయం 9.12కు ఈ ఘాతుకానికి పాల్పడింది. తనపై సరిత ఆరోపణలన్నీ అవాస్తవమని ప్రకాశ్ అన్నాడు. ‘‘ఆమెకు తీవ్రమైన మానసిక సమస్యలున్నాయి. తనతో మాట్లాడేందుకే యతిన్ భయపడేవాడు’’ అని ఆరోపించారు.

ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రైల్వేస్టేషన్
టోక్యో: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3డీ ప్రింటెడ్ రైల్వేస్టేషన్ నిర్మాణానికి జపాన్లోని ఓ రైల్వే ఆపరేటింగ్ సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ స్టేషన్ చుట్టకొలత 108 చదరపు అడుగులు. జపాన్లో జనాభా పరంగా మూడో అతిపెద్ద నగరమైన ఒసాకా నుంచి 60 మైళ్ల దూరంలోని దక్షిణ వకయామ ప్రావిన్స్లో ఈ స్టేషన్ను నిర్మించబోతున్నట్లు వెస్ట్ జపాన్ రైల్వే(జేఆర్ వెస్ట్) సంస్థ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం ఇక్కడ కలపతో నిర్మించిన రైల్వే కాంప్లెక్స్ ఉంది. అది చాలావరకు దెబ్బతినడంతో పూర్తిగా కూల్చివేసి 3డీ ప్రింటెడ్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ కొత్త స్టేషన్ చిత్రాలను ఇప్పటికే విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సెరెండిక్స్ అనే నిర్మాణ సంస్థ సైతం ఇందులో భాగస్వామిగా మారుతోంది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీలో ఈ సంస్థకు మంచి అనుభవం ఉంది. కొత్త టెక్నాలజీతో రైల్వే స్టేషన్నిర్మాణం కేవలం ఆరు గంటల్లో పూర్తి కానుంది. జపాన్లో ప్రస్తుతం పనిచేసే సామ ర్థ్యం కలిగిన యువత సంఖ్య తగ్గుతోంది. వృద్ధు ల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రామిక శక్తి అందుబాటులో లేకుండాపోతోంది. అందుకే తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తయ్యే టెక్నాలజీపై జపాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో తక్కువ మంది కార్మికులతో నిర్మాణాలు చకచకా పూర్తి చేయొచ్చు. ఇందులో భవనం విడిభాగాలను ముందుగానే తయారు చేస్తారు. నిర్మాణ స్థలానికి తీసుకెళ్లి వాటిని బిగించేస్తారు.
National

‘ఇది పార్లమెంట్ సాక్షిగా జరిగిన అన్యాయం’
ఢిల్లీ పార్లమెంట్లో అరకు కాఫీస్టాల్ ప్రారంభోత్సవానికి స్థానిక పార్లమెంట్ సభ్యురాలిగా తనపట్ల వివక్ష చూపడం, కనీసం ఆహ్వానం లేకపోవడం అత్యంత బాధాకరమని అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, గొల్ల బాబూరావులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లోనే అణగారిన, వెనుకబడినవర్గాలకు అవమానం జరగడం దారుణమని అన్నారు. గిరిజన ఎంపీనైనందుకే అవమనించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదా అని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. అటువంటి కాఫీస్టాల్ను పార్లమెంట్లో ప్రారంభించే సందర్బంగా కనీసం అరకు ఎంపీగా ఉన్న నాకు ఆహ్వానం వస్తుందని ఆశించాను. అలాగే కనీసం కాఫీగింజలను పండించే పదిమంది గిరిజన రైతులను ఈ కార్యక్రమానికి పిలిస్తే, అద్భుతమైన ఈ కాఫీ రుచుల వెనుక వారి శ్రమ ప్రపంచానికి తెలిసేది. అరకుకే ప్రత్యేకమైన గిరిజన థింసా నృత్యాన్ని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించి వుంటే జాతీయ స్థాయిలో గిరిజన సంస్కృతికి ఒక పరిచయ వేదికగా మారేది. అరకు అంటే కేవలం కాఫీ మాత్రమే కాదు సహజసిద్దమైన ఔషదగుణాలు ఉన్న పసుపు, అరుదైన సుగంధద్రవ్యాలు కూడా. ఇవ్వన్నీ పార్లమెంటేరియన్లకు పరిచయం చేసే సందర్భంగా ఆ కాఫీస్టాల్ ప్రారంభోత్సవం ఉండేది. కానీ దీనికి భిన్నంగా కేవలం ఎంపిక చేసుకున్న వారితోనే ఈ స్టాల్ను ప్రారంభించారు. కావాలనే స్థానిక ఎంపీగా ఉన్న నాకు ఆహ్వానం లేకుండా చేశారు. దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తున్నాము. అలాగే ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నాము. ఈ వివక్షపై పార్లమెంట్ నుంచి సమాధానం వస్తుందని ఆశిస్తున్నాను.రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ..పార్లమెంట్లో అరకు కాఫీస్టాల్ ప్రారంభోత్సవంకు ఏపీ నుంచి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, ఏపీకి చెందిన కొందరు ఎంపీలను ఆహ్వానించారు. స్టాల్ ప్రారంభించిన తరువాత స్పీకర్ సహా ఎంపీలు కాఫీని సేవించి, దాని రుచిని గురించి ప్రశంసించారు. ఈ సందర్బంలో స్థానిక అరకు ఎంపీని ఎందుకు ఆహ్వానించలేదని ఎవరూ ప్రశ్నించకపోవడం దారుణం. గిరిజన మహిళ కావడం వల్లే ఆమెను అవమానించేందుకు ఆహ్వానించలేదా? వైయస్ఆర్సీపీ నుంచి గెలవడం వల్లే పిలవలేదా? పార్లమెంట్లోనే ఇటువంటి పరిణామాలు బాధాకరం’ అని అన్నారు గొల్ల బాబూరావు

ఓలా సీఈవోపై కునాల్ కమ్రా సూపర్ పంచ్లు
ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా (Kunal Kamra) ఇటీవల ముంబైలో నిర్వహించిన షో వివాదాస్పదమైంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను అవమానించారంటూ ఆయన మద్దతుదారులు కునాల్పై విరుచుకుపడుతున్నారు. కునాల్ షో నిర్వహించిన ముంబైలోని యూనికాంటినెంటల్ హోటల్ హాబిటాట్ స్టూడియోపై షిండే వర్గీయులు దాడికి పాల్పడ్డారు. కునాల్ కమ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. షిండేపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు కునాల్ క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. తాను క్షమాపణ చెప్పబోనని, తనపై పెట్టిన కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని కునాల్ స్పష్టం చేశారు.ఇదిలావుంటే తన షోలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అజిత్ పవార్ (Ajit Pawar) సహా పలువురు ప్రముఖులపై కునాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. వ్యాపార ప్రముఖులను కూడా ఆయన వదల్లేదు. ముఖ్యంగా ఓలా సీఈవో భవిశ్ అగర్వాల్పై వేసిన సెటైర్లు బాగా పేలాయి. గతంలో వీరిద్దరి మధ్య ట్విటర్లో మాటల యుద్ధం నడిచింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు సరైన సర్వీసు అందించడం లేదని వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను భవిశ్ దృష్టికి తీసుకురాగా, ఆయన వెటకారంగా స్పందించారు. తమ సర్వీసు సెంటర్కు వచ్చి పనిచేస్తే, ఫ్లాప్ షోకు వచ్చిన దానికంటే ఎక్కువ డబ్బు ఇస్తానని కునాల్ను భవిశ్ అగర్వాల్ వెటకరించాడు. ఈ నేపథ్యంలో కునాల్ తాజా షోలో భవిశ్పై సెటైర్లు వేశాడు.‘భారత వ్యాపారవేత్తలు తాము తప్పు చేసినప్పుడు కూడా ఒప్పుకోరు. ఉదాహరణకు, ఓలా వ్యక్తిని తీసుకోండి. నేను ఏమి చెప్పినా అతడికి ఎందుకు కోపం వచ్చేస్తుంది? వారు ద్విచక్ర వాహనాలను తయారు చేస్తారు, కానీ వారి చక్రాలు రెండూ పనిచేయవు. అయినప్పటికీ, 'మాతో కలిసి పని చేయండి, మనమంతా కలిసి భారతదేశాన్ని నిర్మిద్దాం' అని అతడు నాతో అంటాడు. ఈ వ్యాపారవేత్తలందరికీ ఈ కోరిక ఎందుకు కలిగిందో? మీరు మంచి బైక్ను తయారు చేయలేరు కానీ, మొత్తం దేశాన్ని నిర్మించాలనుకుంటున్నారా? మీ ఆకాంక్షలను అదుపులో ఉంచుకోండి. సమస్యను పరిష్కరించడానికి బదులుగా, అతను కొత్త బైక్ రంగులను ప్రారంభించాడు. బహుశా వేరే రంగు సమస్యను అద్భుతంగా పరిష్కరిస్తుంది కాబోలు. డీటాక్స్ అవసరమైన చోట, వారు బోటాక్స్ అందిస్తున్నారు. నాకు డబ్బు ఇస్తానని అతడు అన్నాడు. అదేదో మీ కంపెనీ నుంచి రిఫండ్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇవ్వొచ్చుగా.ఓలా (Ola) గురించి ట్వీట్ చేయడం మానేశాను. ఎందుకంటే నా కారణంగానే ఓలా షేర్లు పతనమవుతున్నాయని జనాలు నిందిస్తున్నారు. నేను నా ట్వీట్లు రాశాను, అతడు తన ట్వీట్లు రాశాడు. నేను ఎప్పుడూ ఓలాలో ఉద్యోగాన్ని అంగీకరించలేదు. ఓలా సీఈఓతో గొడవ తర్వాత కస్టమర్లు నాకు ట్యాగ్ చేయడంతో పాటు నేరుగా మెసేజ్లు కూడా పంపించారు. వినియోగదారుల రక్షణ కోసం ఉద్దేశించిన ప్రభుత్వం సంస్థలు శక్తిహీనంగా మారాయి. బాధితులు ఓలా యజమాని దగ్గరకు వెళతారు, అతడు మోదీ జీతో ఫోటో చూపిస్తాడు, వారు వెనక్కి తిరిగి వెళ్లిపోతారు! నేనేం చేయాలి?” అని కునాల్ కమ్రా చమత్కరించారు. కాగా, ఇన్ఫోసిస్ సుధామూర్తి, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాపైనా కునాల్ సెటైర్లు వేశారు. చదవండి: చట్టం అందరికీ సమానమేనా?.. స్టూడియో విధ్వంసంపై కునాల్ కమ్రా

శివసేన టార్గెట్గా కునాల్ కమ్రా వీడియో
ముంబై: నగరంలోని హబిటాట్ స్టూడియోను శివసేనకు చెందిన కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా(Kunal Kamra).. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. తన స్టూడియోను శివసేన సేనకు చెందిన కొంతమంది ఎలా ధ్వంసం చేశారో చూపిస్తూ తన యూట్యూబ్ చానల్ లో వీడియోను పోస్ట్ చేశారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యానించిన తర్వాత కునాల్ కమ్రా.. ఈ వీడియోను ప్రజల్లోకి తీసుకొచ్చాడు.కునాల్ కమ్రాకు షోలు చేసే ముంబైలోని హాబిటాట్ స్టూడియోను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి ఒక వర్గానికి చెందిన వ్యక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్టూడియోపై విరుచుకుపడ్డారు.మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కమ్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జరిగిన పరిణామాల నేపధ్యంలో శివసేన కార్యకర్తలు స్టూడియోపై దాడిచేయడం, ఆ తరువాత ముందస్తు నోటీసు లేకుండా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు పాల్పడింది. ఇదిలా ఉండగా, షిండేపై చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎమ్మెల్యే ముర్జి పటేల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కునాల్ కమ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ప్రజాప్రతినిధులు లేని పాలన ఇంకెన్నాళ్లు?
సాక్షి, ముంబై: దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని కలిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)కు గత మూడేళ్లుగా ఎన్నికలు జరగలేదు. దీంతో మూడేళ్లుగా ప్రజాప్రతినిధులు లేకుండానే మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిపాలన కార్యకలాపాలు జరుగుతున్నాయి. రాజకీయ పరిణామాల రీత్యా...వాయిదా 2022, మార్చి 7న మున్సిపల్ కార్పొరేటర్ల పదవీకాలం ముగిసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా వాయిదాపడుతూ వచ్చాయి. గత మూడేళ్లలో, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన బాధ్యతలను మొదట ఇక్బాల్ సింగ్ చాహల్ ఆ తరువాత భూషణ్ గగ్రానీ స్వీకరించారు. ఈ మూడేళ్లలో వీరిద్దరూ మున్సిపల్ కమిషనర్లు స్వయంగా మూడు బడ్జెట్లను సమర్పించారు. ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా నగరానికి అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టారు. మున్సిపల్ ఎన్నికలు జరగకపోయినా మూడేళ్ల వ్యవధిలో రూ.6,000 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు గ్రీన్సిగ్నలిచ్చారు. ముఖ్యంగా రోడ్లు, మురుగునీటి శుద్ధి, డీశాలినేషన్ ప్రాజెక్టులు, దహిసర్–భయందర్ లింక్ రోడ్డులకు అనుమతులు మంజూరుచేశారు. ప్రభుత్వ అప్పుల పెరుగుదల.... 2024–25 ఆరి్థక సంవత్సరానికి మున్సిపల్ కార్పొరేషన్ అప్పులు రూ.1.90 లక్షల కోట్లుగా తేలింది. తాజా లెక్కల ప్రకారం, ఈ సంఖ్య రూ.2,32 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో, బడ్జెట్ వ్యయంపై బహిరంగ చర్చ జరగలేదు. కమిషనర్లు పరిపాలించడమేమిటి? కమిషనర్ల ఆధ్వర్యంలో బీఎంసీ పరిపాలన జరగడమేమిటంటూ విపక్ష పారీ్టలు విమర్శిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు లేని పాలన ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధమని, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా కీలక నిర్ణయాలు అమల వుతున్నాయని ఆరోపిస్తున్నాయి. మున్సిపల్ పాలనలో పారదర్శకత లేదని, పెద్ద మొత్తంలో నిధులు ఖర్చవుతున్నాయని మండిపడుతున్నాయి. మరో 6–7 నెలల తర్వాతే! ప్రస్తుత పరిస్థితి దృష్యా ఎన్నికలు మరో 6-7 నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 1984లో అప్పటి కమిషనర్ డి.ఎం.సుక్తాంకర్ కార్యనిర్వాహక పాలన తర్వాత మళ్లీ 38 ఏళ్లకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులు లేకుండా పాలన జరుగుతోంది. అయితే ఈసారి ఇది మరింత ఎక్కువ కాలం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధి, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని త్వరలో ఎన్నికలు నిర్వహించాలని పలువురు నాయకులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
NRI

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్పర్సన్గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

లండన్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

ఖాకీచకుడు.. కాటేయజూస్తున్నాడు
ఒంగోలు టౌన్: భర్త మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతూ తనను పట్టించుకోవడం లేదని న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం ఓ మహిళ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. ఒంగోలు నగరం కమ్మపాలేనికి చెందిన జి.హర్ష వర్థిని జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన నవీన్తో 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నవీన్ భార్యాబిడ్డలను పట్టించుకోవడం మానేశాడు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అయితే అక్కడి కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట హర్షవర్థిని తన పిల్లలతో సహా బైఠాయించింది. టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావుతోపాటు మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా మొండికేయడంతో కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. జనాలు గుమిగూడడంతో ట్రాఫిక్ స్తంభించింది. కలెక్టర్ను కలిసి సమస్య తెలియజేయాలని సీఐ సూచించగా.. అక్కడకు వెళ్లినా పోలీసుల దగ్గరకే పంపిస్తారని, తనకు న్యాయం జరగదని పేర్కొనడం గమనార్హం. న్యాయం జరిగేలా చూస్తామని సీఐ చాలా సేపు బతిమాలడంతో ఎట్టకేలకు ఆమె ఆందోళన విరమించింది.

వెంటాడి వేటాడి..తండ్రిని చంపించిన కన్న కూతురు
సూర్యాపేటటౌన్: గ్రామంలో ఆధిపత్యం కోసం మామను అతికిరాతంగా హత్య చేయించాడు సొంత అల్లుడు. నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసులో 13 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్ల డించారు. చక్రయ్యగౌడ్ ఆధిపత్యం సహించలేక..మెంచు చక్రయ్యగౌడ్ గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్గా కూడా పనిచేశాడు. అతడికి ఐదుగురు కుమార్తెలు సంతానం. తన మూడో కుమార్తె కనకటి సునీతను కూడా సర్పంచ్గా, మూడో అల్లుడు కనకటి వెంకన్నను పీఏఏసీఎస్ చైర్మన్గా చేశాడు. అల్లుడు కనకటి వెంకన్న పీఏసీఎస్ చైర్మన్ అయిన్నప్పటి నుంచి నూతనకల్ మండలంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం ఉండటం వెంకన్న వర్గీయులు సహించలేకపోయారు. చక్రయ్యగౌడ్కు వ్యతిరేకంగా వెంకన్న వర్గీయులు ఒక గ్రూపుగా ఏర్పడడంతో వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2023లో చక్రయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో కనకటి వెంకన్న కూడా కాంగ్రెస్లోకి వచ్చాడు. అయినప్పటికీ గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఎలాగైనా మామ చక్రయ్యగౌడ్ను అడ్డు తొలగించుకోవాలని కనకటి వెంకన్న నిర్ణయించుకున్నాడు.బొడ్రాయి మహోత్సవంలో హత్యకు పథకం.. ఈ నెల 13న మిర్యాల గ్రామంలో బొడ్రాయి మహోత్సవం జరిగింది. గతంలో కనకటి వెంకన్న ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగేవి, చక్రయ్యగౌడ్ ఈసారి ఉత్సవాలను తన ఆధ్వర్యంలో జరపాలని బహిరంగంగా ప్రకటించడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా చక్రయ్యగౌడ్ను హత్య చేయాలని తన వర్గీయులను కొంతమందిని వెంకన్న పురమాయించాడు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం చక్రయ్యగౌడ్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా.. అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్య, ఐదో అల్లుడు కనకటి లింగయ్యతో పాటు వెంకన్న అనుచరులైన కనకటి శ్రవణ్, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేష్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్ అడ్డగించి మారణాయుధాలు, వెదురు కరల్రతో చక్రయ్యగౌడ్పై దాడి చేసి హత్య చేశారు. ఇదంతా దూరంగా నుంచి గమనిస్తున్న వెంకన్న చక్రయ్యగౌడ్పై దాడి జరిగగానే అతడు చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి అందరూ పారిపోయారు. ఈ హత్యపై నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం ఉదయం తుంగతుర్తి పరిధిలో వాహనాల తనిఖీల్లో భాగంగా.. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్యతో పాటు హత్యకు కుట్ర పన్నిన మూడో అల్లుడు కనకటి వెంకన్న, వెంకన్న భార్య సునీత, మొదటి కుమార్తె కనకటి స్వరూప, ఐదో కుమార్తె కనకటి కల్యాణితో పాటు దిండిగల నగేశ్, జక్కి పరమేష్, మన్నెం రమేశ్, కనకటి వెంకన్న అలియాస్ మొండి వెంకన్న, కనకటి శ్రావ్య, కనకటి/వర్దెల్లి అనూష, జక్కి స్వప్న, భారీ సతీష్ రెండు కార్లలో వెళ్తుండగా పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. చక్రయ్యగౌడ్ను హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక కర్ర, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 42 మందిపై కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న ఏడుగురు నిందితుల్లో కనకటి ఉప్పలయ్య మినహా మిగతా ఆరుగురు గతంలోనే కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం.కస్టడీ పిటీషన్ వేసి దర్యాప్తు చేస్తాంఈ హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఎవరినీ వదిలిపెట్టకుండా కచ్చితమైన ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు పారదర్శకంగా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కస్టడీ పిటిషన్ వేసి నిందితులను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఈ కేసు ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ డి. శ్రీను, ఎస్ఐలు మహేంద్రనాథ్, ఎం. వీరయ్య, ఆర్. క్రాంతికుమార్ను ఎస్పీ అభినందించారు.

Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్: అతి వేగం ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలను తీసుకుంది. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం దుమ్ముగూడెం ప్రగలపల్లి గ్రామానికి చెందిన బంటు రాజ్కుమార్(20), పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన అటికెటి సిద్దార్ధ(21) ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఆదివారం రాత్రి వీరు ఓయూ హాస్టల్ నుంచి బైక్పై విద్యానగర్ వెళుతుండగా అడిక్మెట్ ఫ్లైఓవర్పై వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

గృహిణికి అండగా ఉన్నందుకు...అంతమొందించాడు
హైదరాబాద్: లైంగిక వేధింపులకు గురవుతున్న ఓ మహిళకు అండగా ఉన్న లాయర్ను కక్షగట్టి దారుణంగా హత్య చేశాడు. చంపాపేటలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలి్పన వివరాల ప్రకారం..మహేశ్వరం మండల కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్ (56) నగరంలోని చంపాపేట డివిజన్ న్యూమారుతీనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. తన ఇంటి సమీపంలోనే ఓ అపార్ట్మెంట్లో ఇటీవల ఫ్లాట్ను కొనుగోలు చేసి..ఓ గృహిణి కుటుంబ సభ్యులకు అద్దెకు ఇచ్చాడు. అదే కాలనీ సమీపంలోని సుల్తానా అల్వా కాలనీ శ్మశాన వాటిక కాపలాదారుడుగా పని చేస్తున్న గులాం దస్తగిరి ఖాళీ సమయంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా కూడా పనిచేస్తున్నాడు.ఇజ్రాయిల్ కొనుగోలు చేసిన ఫ్లాట్లో దస్తగిరి విద్యుత్ మరమ్మతు పనులకు వెళ్తుండే వాడు. ఈ క్రమంలోనే ఫ్లాట్లో అద్దెకు ఉంటున్న గృహిణితో పరిచయం ఏర్పడింది. దీన్ని అలుసుగా తీసుకున్న దస్తగిరి తనను ప్రేమించాలని, అండగా ఉంటానని ఆమెను వేధించసాగాడు. వేధింపులు భరించలేని ఆ గృహిణి ఫ్లాట్ యజమాని ఇజ్రాయిల్కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఆయన దస్తగిరిని మందలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయించి.. దస్తగిరి వేధింపులు ఎక్కువ అవడంతో 25 రోజుల క్రితం ఇజ్రాయిల్ ఐఎస్సదన్ పోలీసులకు గృహిణితో ఫిర్యాదు చేయించాడు. ఆమెకు దస్తగిరి నుంచి ప్రాణహాని ఉందని హెచ్చరించాడు. ఆమెను బంధువుల ఇంటికి పంపించి వేశాడు. ఈ క్రమంలో పోలీసులు దస్తగిరిని స్టేషన్కు పిలిపించి..నామమాత్రంగా మందలించి, కౌన్సిలింగ్ చేసి పంపించేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దస్తగిరి..ఇజ్రాయిల్పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. గత మూడు రోజులుగా ఇజ్రాయిల్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించిన దస్తగిరి సోమవారం ఉదయం 9 గంటలకు ఇజ్రాయిల్ తన స్కూటీపై ఒంటరిగా రావటాన్ని పసిగట్టి..ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.విషయం తెలసుకున్న స్థానికులు రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇజ్రాయిల్ను సమీపంలోని డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చేరి్పంచారు. పరీక్షించిన వైద్యులు ఇజ్రాయిల్ అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా పోలీసులు గృహిణి ఫిర్యాదును సీరియస్గా తీసుకోలేదని, తీసుకుని ఉంటే ఈ హత్య జరిగేది కాదని స్థానికులు విమర్శిస్తున్నారు. కాగా ఇజ్రాయిల్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర మాజీ డైరెక్టర్గా పనిచేశాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు.
వీడియోలు


ఏపీ సర్కార్, పోలీసులపై హైకోర్టు సర్జికల్ స్ట్రైక్!


పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం చేసుకుంటున్నారా?


ఇఫ్తార్ విందుకు హాజరుకానున్న వైఎస్ జగన్


నకిరేకల్ పీఎస్ లో కేటీఆర్ పై కేసు నమోదు


కార్లకు నిప్పు పెట్టి పారిపోయిన దుండగుడు


బడుగు బలహీన వర్గాలపై కూటమికి ప్రేమ లేదు: బొత్స


పోలీసుల అతిపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం


గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ గెలుపు


గిట్టబాటు ధరల్లేక, ప్రభుత్వం పట్టించుకోక రోడ్డెక్కిన మిర్చి రైతులు


పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలతో చంద్రబాబు చెలగాటం