Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Telangana Assembly Budget Session Live Updates1
తెలంగాణ బడ్జెట్‌ మూడు లక్షల కోట్లు: భట్టి

Telangana Budget Live Updates..👉తెలంగాణ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. తెలంగాణ బడ్జెట్‌ రూ.3.4లక్షల కోట్లు2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లు.రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు.మూలధన వ్యయం రూ.36,504 కోట్లు. బడ్జెట్ కేటాయింపులు..పౌరసరఫరాల శాఖ- 5734 కోట్లువిద్య - 23,108కోట్లుపంచాయతీ &రూరల్ డెవలప్‌మెంట్ -31605 కోట్లురైతు భరోసా- 18,000 కోట్లు.వ్యవసాయ రంగానికి -24,439 కోట్ల రూపాయలుపశుసంవర్ధక శాఖకు -1,674 కోట్లు.పౌరసరఫరాల శాఖకు -5,734 కోట్లు.మహిళా, శిశు సంక్షేమం -2,862 కోట్లుఎస్సీ అభివృద్ధి -40,232 కోట్లుఎస్టీ అభివృద్ధి-17,169 కోట్లుబీసీ అభివృద్ధి-11,405కోట్లుచేనేత రంగానికి-371మైనారిటీ-3,591కోట్లువిద్యాశాఖకు-23,108 కోట్లుకార్మిక ఉపాధి కల్పన-900 కోట్లుపంచాయతీరాజ్ శాఖకు-31,605 కోట్లుమహిళా శిశు సంక్షేమశాఖ-2,862 కోట్లు.షెడ్యూల్ కులాలు-40,232 కోట్లుషెడ్యూల్ తెగలు-17,169 కోట్లు.వెనుకబడిన తరగతుల సంక్షేమానికి-11,405 కోట్లు.ఐటీ శాఖకు-774 కోట్లువిద్యుత్ శాఖకు-21,221 కోట్లుమున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు-17,677 కోట్లునీటి పారుదల శాఖకు-23,373 కోట్లురోడ్డు భవనాలు శాఖకు-5907 కోట్లుపర్యాటక శాఖకు-775 కోట్లుక్రీడా శాఖకు-465 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు-1023 కోట్లుదేవాదాయ శాఖకు-190 కోట్లుహోంశాఖకు- 10,188 కోట్లుమహాలక్ష్మి పథకానికి రూ.4305 కోట్లుగృహజోత్యి పథకానికి రూ.2080 కోట్లు.సన్న బియ్యం బోనస్‌కు రూ.1800 కోట్లు.రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1143 కోట్లు. బడ్జెట్‌ పూర్తి కాపీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..భట్టి ప్రసంగం..అంబేద్కర్‌ స్పూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.తెలంగాణ తాత్కాలిక, దీర్థకాలిక ప్రయోజనాలే ముఖ్యం. మాపై కొంతమంది సోషల్‌ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారు.అబద్ధపు వార్తలతో ప్రజలు మోసం చేస్తున్నారు. అబద్దపు విమర్శలను తిప్పి కొడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత.అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు మా నినాదం.తెలంగాణ రైజింగ్‌ 2050 అనే ప్రణాళికతో సీఎం పాలనను ముందుకు నడిపిస్తున్నారు.నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిణామం 200 బిలియన్‌ డాలర్లు. రాబోయే ఐదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్‌ డాలర్లు ఉండేలా కార్యాచరణ. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణానికి రూ.11,600‍కోట్లు.58 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌.AI సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్‌ హబ్‌.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసన్న వడ్లకు క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్..40 లక్షల ఎకరాల్లో సన్న వడ్లసాగు విస్తరణ.ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంపు.ఆయిల్ ఫామ్ సాగుకు టన్నుకు 2000 అదనపు సబ్సిడీ.వడ్ల బోనస్ కింద రైతులకు 1,206 కోట్లు చెల్లింపు.తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింపు.57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రం పునరుద్ధరణ.రాజీవ్ యువ వికాస పథకానికి రూ.6000 కోట్లు.బీఎఫ్ఎస్ఐ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులుప్రతీ నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు.స్కూల్స్‌లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు.గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంపు.విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ పథకం.కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్య శ్రీలో చేరిక.. 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్య శ్రీ లబ్ధి..ఆరోగ్య శ్రీ ప్యాకేజీల ఖర్చు 20 శాతం పెంపు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని తెలంగాణ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధుని సాధిస్తుంది.24-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 16,12,579 కోట్లు.గత ఏడాదితో పోల్చితే వృద్ధి రేటు 10.1శాతంగా నమోదైంది. బడ్జెట్‌​ ప్రసంగం చదువుతున్న భట్టి విక్రమార్క. ఆర్థిక మంత్రిగా భట్టి మూడోసారి బడ్జెట్‌ ప్రసంగం..👉బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతల నినాదాలు.. కాంగ్రెస్‌ వ్యతిరేక నినాదాలు.. 👉బడ్జెట్ ప్రతులను స్పీకర్ గడ్డం ప్రసాద్‌, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేసిన భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు.అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ నేతల నిరసన..అసెంబ్లీ మీడియా పాయింట్ కేటీఆర్‌ కామెంట్స్‌..ఎండిన పంటలు, రైతులకు సంఘీభావంగా నిరసన చేస్తున్నాం.11 నెలలుగా మేము ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నాం.వర్షాలు సమృద్ధిగా పడ్డాయి.. రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదు.ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉన్నా రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు.తెలంగాణలో నాలుగు వందలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇసుక దోపిడి చేస్తున్నారు.కేసీఆర్ పాలనలో 36శాతం కృష్ణా జలాలను వాడుకొని రైతులకు నీళ్లు ఇచ్చాం.కాంగ్రెస్ పాలనలో కిందికి నీళ్లు వదిలి.. పంటలు ఎండబెట్టారు.కాలం తెచ్చిన కరువు కాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు.రేవంత్ రెడ్డి ముందు చూపులేని ప్రభుత్వం వల్ల పంటలు ఎండుతున్నాయి.రేవంత్ రెడ్డి గుడ్డి చూపు, చేతగాని, తెలివితక్కువ తనం వల్ల రైతులకు సమస్యలు.ఎండిన పంటలకు ఎకరానికి 25వేల పంట నష్టం ఈ బడ్జెట్ లో కేటాయించాలిపంటలు ఎండిపోవడానికి చెక్ డ్యామ్ లు, చెరువులు నిలపకపోవడం వల్లే నష్టం జరిగింది.త్వరలో ఎండిన పంటలు ఉన్న ప్రాంతాల్లో పర్యటన చేస్తాం👉తెలంగాణ వార్షిక బడ్జెట్‌ 2025-26కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ ప్రారంభం ​కేబినెట్‌ భేటీ.. అసెంబ్లీ హాల్‌లో బడ్జెట్‌ మీద కేబినెట్‌ భేటీబడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి11.14కు తెలంగాణ బడ్జెట్‌శాసన సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టిమండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కఘనస్వాగతం పలికిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, శాసనసభ సెక్రటరీ నరసింహచార్యులు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు. ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన భట్టి విక్రమార్క.అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరగనున్న కేబినెట్‌ సమావేశానికి హాజరు కానున్న భట్టి. 👉నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.👉వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) గాను రూ.3.05 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్టు తెలిసింది.👉2024–25లో ప్రతిపాదించిన రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఇది సుమారు 5 శాతం అదనం.👉ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆమోదించనుంది. అనంతరం 11:14 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. శాసనమండలిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.గ్యారంటీలకు తోడుగా! 👉తాజా బడ్జెట్‌లో ఎప్పటిలాగే వ్యవసాయం, వైద్యం, సాగునీరు, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల పద్దులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలుతోపాటు అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రతిపాదనలు ఉంటాయని పేర్కొంటున్నాయి.👉ఆరు గ్యారంటీల్లో ఒకటైన సామాజిక పింఛన్ల పెంపు ద్వారా ఏటా రూ.3,500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, ఈ మేరకు పింఛన్ల బడ్జెట్‌ పెంచుతారని సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వంటి పథకాల కొనసాగింపునకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నారు.👉రైతు భరోసాకు రూ.18వేల కోట్లు, పంటల బీమా ప్రీమియం కోసం రూ. 5 వేల కోట్లను ప్రతిపాదించే అవకాశం ఉంది. రీజనల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ పథకాలకు సంబంధించి రాష్ట్రం భరించాల్సిన మొత్తాన్ని కూడా బడ్జెట్లో చూపించనున్నారు.👉గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 36వేల కోట్ల వరకు ప్రతిపాదించగా.. ఈసారి దీన్ని రూ.65 వేల కోట్లవరకు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.రూ.లక్ష కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల దాకా..! 👉తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 12 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో 2014–15 సంవత్సరానికి గాను 10 నెలల కాలానికి బడ్జెట్‌ పెట్టగా.. 2024–25లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌తో పాటు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2014–15లో నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను రూ.లక్ష కోట్లతో ప్రవేశపెట్టారు. తర్వాతి నాలుగేళ్లలో బడ్జెట్‌ పరిమాణం రూ.1.75 లక్షల కోట్ల వరకు చేరింది.👉2019–20లో కరోనా ప్రభావంతో బడ్జెట్‌ను తగ్గించి రూ.1.46లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. తర్వాతి రెండేళ్లలోనే ఏకంగా రూ.85 వేల కోట్ల మేర బడ్జెట్‌ పెరిగి రూ.2.30లక్షల కోట్లకు చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2.90లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్‌ 2024–25లో రూ.2.91లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకుముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ (2024–25) బడ్జెట్‌లో అంచనా వ్యయాన్ని రూ. 2.75 లక్షల కోట్లుగానే ప్రతిపాదించడం గమనార్హం.

BCCI Responds to Virat Kohli Criticism of Family on Tour Policy2
BCCI: విరాట్‌ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ

ఆటగాళ్ల కుటుంబ సభ్యులను విదేశీ పర్యటనలకు అనుమతించే విషయంలో తమ నిర్ణయం మారదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) స్పష్టం చేసింది. జట్టుతో పాటు బోర్డుకు కూడా ఇదే మంచిదని పేర్కొంది. ఈ విషయంలో ఆటగాళ్లకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని.. అయితే, తాము జట్టు ప్రయోజనాల కోసం కఠినంగా వ్యవహరించక తప్పదని తెలిపింది.ఈ మేరకు బోర్డు తరఫున.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా (Devajit Saikia) తమ స్పందన తెలియజేశారు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీని చేజార్చుకుంది. 3-1తో ఓడి ఇంటిబాటపట్టింది.ఈ పరాభవం తర్వాత.. విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై బీసీసీఐ కఠిన నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నలభై ఐదు రోజుల్లోపు విదేశీ పర్యటనలో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కుటుంబ సభ్యులను వారం రోజులు మాత్రమే అనుమతిస్తారు.విరాట్‌ కోహ్లి ఘాటు విమర్శలుఅంతకు మించి పర్యటన కొనసాగితే రెండు వారాల పాటు సన్నిహితులకు అక్కడే ఉండే వెసలుబాటు ఉంటుంది. అయితే, ఈ విషయంలో టీమిండియా సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్నిహితులే సగం బలమని.. ఆటగాడి విజయం వెనుక కుటుంబ సభ్యుల పాత్రను అందరికీ వివరించలేమని పేర్కొన్నాడు.మైదానంలో దిగని వాళ్లు, అక్కడ ఏం జరుగుతుందో తెలియని వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిరాశ కలిగించిందని కోహ్లి ఘాటుగా విమర్శించాడు. ప్రతి ఆటగాడు తన కుటుంబ సభ్యులు వెంట ఉంటే మరింత బాధ్యతగా ఆడతారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ విషయంలో యూటర్న్‌ తీసుకోనుందనే వార్తలు వచ్చాయి.బీసీసీఐకి, దేశానికి ఇదే మంచిదిఅయితే, అలాంటిదేమీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా తాజాగా కొట్టిపడేశారు. ‘‘మేము ప్రవేశపెట్టిన నిబంధనలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు చేయడం లేదు. బీసీసీఐకి, వ్యవస్థకి, జట్టుకు, దేశానికి ఇదే మంచిది.ఈ అంశంలో ఆటగాళ్ల నుంచి భిన్నాభిప్రాయాలు, మిశ్రమ స్పందన వస్తుందని తెలుసు. ఇక్కడంతా ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి.. ఎవరైనా తమ గొంతును వినిపించవచ్చు. తమ భావాలను నిర్భయంగా పంచుకోవచ్చు.అయితే, ఈ నిబంధన విషయంలో అందరు ఆటగాళ్లూ సమానమే. జట్టులోని ప్రతి సభ్యుడు, కోచ్‌లు, మేనేజర్లు, సహాయక సిబ్బంది.. ఇలా అందరికీ రూల్స్‌ వర్తిస్తాయి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం.రాత్రికి రాత్రే హడావుడిగా ఈ విధానాన్ని మేము ప్రవేశపెట్టలేదు. దశాబ్దాలుగా జరుగుతున్న విషయాలను పరిగణనలోకి తీసుకుని మా అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ ఈ పాలసీ తీసుకువచ్చారు. నిజానికి గతంతో పోలిస్తే విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై మేము ఆటగాళ్లకు చాలా వరకు మినహాయింపులు ఇచ్చాం. అయితే, ఇప్పుడు ఈ రూల్‌ కాస్త కఠినంగా అనిపించినా.. తప్పక అమలు చేస్తాం’’ అని దేవజిత్‌ సైకియా స్పష్టం చేశారు.చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌

Sunita Williams family reaction and interesting facts 3
సునీతా విలియమ్స్‌ ఫ్యామిలీ గురించి తెలుసా?

సునీతా విలియమ్స్‌కు స్పేస్‌ సెంటరే కుటుంబం అంటారు ఆమె ఫ్యామిలీ మెంబర్స్‌. ఆమెకు ఏది ఇష్టమో తమకు అదే ఇష్టం అని చెబుతారు. తండ్రి దీపక్‌ పాండ్యా, తల్లి ఉర్సులిన్‌ బోనీ పాండ్యా (Ursuline Bonnie Zalokar) వారి ముగ్గురు సంతానంలో సునీత చిన్నది. అన్నయ్య జె.థామస్‌తో పాటు అక్క దీనా ఆనంద్‌ ఉన్నారు. అమెరికాలోనే జన్మించిన సునీత చదువు అంతా అక్కడే సాగింది. చదువు పూర్తయ్యాక తండ్రి దీపక్‌ పాండ్యా (Deepak Pandya) సూచనలతో అమెరికన్‌ నేవీలో జాయిన్‌ అయ్యారు.నేవీలో పనిచేస్తున్న సమయంలోనే మైఖేల్‌ జె.విలియమ్స్‌ (Michael J. Williams)తో పరిచయం స్నేహంగా మారింది. వివాహ బంధంతో ఒక్కటై 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ శివారులో నివసిస్తున్నారు. ఈ జంటకు పిల్లలు లేరు. ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలని ఉందని చెప్పే సునీతకు పెంపుడు కుక్క గార్బీ అంటే చాలా ఇష్టం. గార్బీతో ఉన్న ఫొటోలను సునీత తరచు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. 2006లో మొదటిసారి తనతో పాటు భగవద్గీతను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లింది. 2012లో ఓం సింబల్‌ తీసుకెళ్లినట్టు చెప్పిన సునీత గణేష్‌ విగ్రహాన్ని ఎప్పుడూ తనకు తోడుగా తీసుకెళుతుందట. సునీత విశ్వాసాలకు విలియమ్స్‌ మద్దతు ఇస్తాడు. తల్లి బోనీ పాండ్యా కూతురి గురించి వివరిస్తూ.. ‘ఆమె సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటంపై మాకు ఎలాంటి ఆందోళన లేదు. విధి నిర్వహణలో భాగంగా కష్టపడి పనిచేస్తుంది. కూతురి నుండి చాలా కాలం దూరంగా ఉండటం మొదట్లో కష్టమయ్యేది. కానీ, ఇప్పుడు అది అలవాటయ్యింది. తను తనకు ఇష్టమైనది చేస్తోంది. అలాంటప్పుడు నేను బాధపడటం అంటూ ఉండదు. తన ప్రయత్నాల్లో తను ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను ప్రత్యేకించి ఆమెకు ఎటువంటి సలహాలు ఇవ్వను. ఎందుకంటే, ఏం చేయాలో తనకే బాగా తెలుసు. అంతా సవ్యంగానే జరుగుతుంది’ అని ధీమాను వ్యక్తం చేస్తారు ఆమె తల్లి బోనీ పాండ్యా.బాల్యం నుంచి ధైర్యం ఎక్కువసునీతా విలియమ్స్‌ (Sunita Williams) తిరిగి భూమి పైకి వస్తున్న వార్త గురించి యావత్‌ ప్రపంచం స్పందన ఒకటే... ‘చాలా సంతోషంగా ఉంది’ అయితే ఇండియాలోని ఆమె కజిన్‌ మాత్రం ‘భయంగా ఉంది’ అంటున్నాడు. ‘వీలైనంత త్వరగా ఆమె భూమి మీదికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకో నాకు భయంగా ఉంది. ఆమె చక్కని ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అంటున్నాడు దినేష్‌ రావత్‌.సుదీర్ఘమైన ప్రయాణం తరువాత భూమికి తిరిగి వస్తున్న సునీతా విలియమ్స్‌ ఆ తర్వాత విపరీతమైన శారీరక మార్పులను ఎదుర్కొనే అవకాశం ఉందనే ఆందోళన నేపథ్యంలో ఆయన ‘భయం’ అనే మాట వాడాడు. సునీతా విలియమ్స్‌ బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘సునీత చిన్నప్పుడు మా దగ్గరికి వచ్చింది. నేను ఆమెను ఒంటె సవారీలకు తీసుకువెళ్లేవాడిని. సవారీ అయిపోయిన తరువాత కూడా దిగేది కాదు! సోమనాథ్‌ తీర్థయాత్రలతో పాటు దేశంలోని వివిధప్రాంతాలకు వెళ్లాం. సునీతకు చిన్నప్పటి నుంచి ధైర్యం ఎక్కువ. ఆమె తరచుగా నా చెయ్యి పట్టుకునేది. ఎందుకు ఇలా? అని అడిగితే నాన్నలా అనిపిస్తావు అని చెప్పింది’ అంటూ ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లాడు దినేష్‌ రావత్‌.మా తరానికి స్ఫూర్తిప్రదాతనేను స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి సునీతా విలియమ్స్‌ గురించి చదువుతూ పెరిగాను. సైంటిస్ట్‌ (Scientist) కావాలనుకునే మహిళల సంఖ్య తక్కువగా ఉన్న రోజుల్లో కల్పనాచావ్లా భారతీయ మహిళల్లో కొత్త ఆలోచన రేకెత్తించారు. సునీతా విలియమ్స్‌ అంతరిక్షంలో చేసిన పరిశోధనలు స్ఫూర్తినిచ్చాయి. మనదేశంలో అంతరిక్షం, పరిశోధన రంగాలను కెరీర్‌ ఆప్షన్స్‌గా ఎంచుకునే యంగ్‌ జనరేషన్‌ తయారైంది. మా తరం అలా తయారైనదే.సైంటిస్ట్‌గా సునీతా విలియమ్స్‌ ఒక రోల్‌మోడల్‌. అకుంఠిత దీక్ష, అంకితభావంతో పని చేయడం, అంతరిక్ష పరిశోధనల ద్వారా కొత్త విషయాలను ఎక్స్‌ప్లోర్‌ చేయడంలో ఆమెకున్న ఆసక్తి, వాటిని ఛేదించడానికి చూపించే చొరవ అమోఘం. స్టెమ్‌ ఫీల్డ్‌లో భవిష్యత్తు తరాలు ఆమె అడుగుజాడల్లో నడుస్తాయి. మగవాళ్ల ఆధిపత్యం కొనసాగుతున్న రంగంలో మహిళ కూడా విజయవంతంగా రాణించగలరని సునీతా విలియమ్స్‌ తన పరిశోధనల ద్వారా నిరూపించారు. – శరణ్య. కె. సైంటిస్ట్, బయోటెక్నాలజీ

Ap Coalition Government U Turn On Unemployment Allowance4
నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వం యూటర్న్‌

సాక్షి,గుంటూరు: నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మాధవరావు నిరుద్యోగభృతి గురించి ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇస్తున్నారని అడిగారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ప్రశ్నలకు మంత్రి రాంప్రసాద్‌ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో రాంప్రాసద్‌ తీరుపై ఎమ్మెల్సీ మాధవరావు మండిపడ్డారు. గతంలోనూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 2014-2019లో ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ధ్వజమెత్తారు.ఇప్పుడు మరోసారి నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చి మరో మారు మాట తప్పిందని దుయ్యబట్టారు.

Lovely Professional University B.Tech student securing job offer of Rs 2.5 cr package5
ఎల్‌పీయూ బీటెక్‌ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. యూనివర్సిటీ విద్యార్థుల్లో ఇద్దరు ప్రతిష్ఠాత్మకంగా కోట్ల రూపాయాల వేతన మార్కును అధిగమించి ఉద్యోగాలు సాధించారు. బీటెక్‌ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.2.5 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకుని రికార్డులను బద్దలు కొట్టారు. ఈ విజయం భారతదేశంలో గ్రాడ్యుయేట్ విద్యార్థికి అత్యధిక ప్యాకేజీని సూచిస్తుంది. ఇది భారత్‌లోని ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీల్లో ఉన్న రికార్డులను అధిగమించింది. దాంతో టాప్ టైర్ రిక్రూట్‌మెంట్‌లో లీడర్‌గా ఎల్‌పీయూ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.1.03 కోట్లు (1,18,000 డాలర్లు) ప్యాకేజీ పొందిన ఈసీఈ ఫైనల్ ఇయర్ విద్యార్థి బేతిరెడ్డి నాగవంశీరెడ్డి మరో ఘనత సాధించారు. మొత్తంగా 1,700 మందికి పైగా ఎల్‌పీయూ విద్యార్థులకు టాప్ ఎంఎన్‌సీల నుంచి ఆఫర్లు వచ్చాయి. విదార్థులకు రూ .10 ఎల్‌పీఏ నుంచి రూ.2.5 కోట్ల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. వందలాది మంది ఎల్‌పీయూ విద్యార్థులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని ప్రఖ్యాత సంస్థల్లో పనిచేస్తూ రూ.కోటికి పైగా ప్యాకేజీలు పొందుతున్నారు. మరో ఎల్పీయూ గ్రాడ్యుయేట్‌కు ఐటీ కంపెనీలో రూ.3 కోట్ల ప్యాకేజీ లభించింది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేసే ఎల్‌పీయూ సామర్థ్యం యొక్క బలం, ప్రపంచవ్యాప్త పరిధికి ఇది ఉదాహరణ. పాలో ఆల్టో నెట్వర్క్స్‌, న్యూటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్‌, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక బహుళజాతి కంపెనీల్లో ప్లేస్‌మెంట్‌లు పొందిన వివిధ బీటెక్‌ విద్యార్థులకు మొత్తం 7,361 ఆఫర్లు అందాయి. వీటిలో టాప్ ఎంఎన్‌సీలు అందించే సగటు ప్యాకేజీ ఏటా రూ.16 లక్షలుగా నమోదైంది. ఇది జాబ్ మార్కెట్‌లో ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్లకు అధిక డిమాండ్‌ను నొక్కిచెబుతోంది.గతంలోని ప్లేస్‌మెంట్‌ సీజన్ కూడా అంతే ఆకట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు ఆకర్షణీయమైన పరిహార ప్యాకేజీలను అందిస్తున్నాయి. అత్యధిక వేతనం చెల్లించే కంపెనీల్లో పాలోఆల్టో నెట్వర్క్స్ రూ.54.75 ఎల్పీఏతో అగ్రస్థానంలో నిలవగా, న్యూటానిక్స్ రూ.53 ఎల్పీఏ, మైక్రోసాఫ్ట్ రూ.52.20 ఎల్పీఏతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం 1,912 మల్టిపుల్ జాబ్ ఆఫర్లను అందిచగా, 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు, 18 మందికి ఐదుగురికి, ఏడుగురు విద్యార్థులకు ఆరు జాబ్ ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసు అద్భుతమైన ఏడు జాబ్ ఆఫర్లను సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.పైన పేర్కొన్న కంపెనీలతో పాటు అమెజాన్ (రూ.48.64 ఎల్పీఏ), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ.44.92 ఎల్పీఏ), సర్వీస్ నౌ (రూ.42.86 ఎల్పీఏ), సిస్కో (రూ.40.13 ఎల్పీఏ), పేపాల్‌ (రూ.34.4 ఎల్పీఏ), ఏపీఎన్ఏ (రూ.34 ఎల్పీఏ), కామ్వాల్ట్ (రూ.33.42 ఎల్పీఏ), స్కేలర్ (రూ.33.42 ఎల్పీఏ) వంటి టాప్ రిక్రూటర్లు ఎల్‌పీయూ విద్యార్థులకు అవకాశం కల్పించారు. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, అధునాతన సాంకేతితక నిపుణులకు ప్రాధాన్యమిచ్చారు.యాక్సెంచర్, క్యాప్ జెమినీ, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు అతిపెద్ద రిక్రూటర్లలో ఉండటంతో ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్ల సాంకేతిక పరంగా అధిక డిమాండ్ ఏర్పడింది. క్యాప్ జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ పోస్టులకు 736 మంది విద్యార్థులను, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు మైండ్ ట్రీ 467 మంది విద్యార్థులను నియమించుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 418 మంది విద్యార్థులను జెన్సీ ఉద్యోగాలకు రిక్రూట్ చేసుకుంది. యాక్సెంచర్ (279 నియామకాలు), టీసీఎస్ (260 నియామకాలు), కేపీఐటీ టెక్నాలజీస్ (229 నియామకాలు), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203 నియామకాలు), ఎంఫసిస్‌ (94 నియామకాలు)తోపాటు తదితర కంపెనీలు ఎల్‌పీయూ విదార్థులకు 279 కొలువులు అందించాయి.రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక ప్లేస్‌మెంట్ దక్కింది. పాలోఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్ గ్రూప్, న్యూటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి పరిశ్రమ దిగ్గజాలు ఈ విభాగాల నుండి భారీగా నియామకాలు చేస్తున్నాయి.పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), ఎల్‌పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ మాట్లాడుతూ..‘వేగంగా మారుతున్న ప్రపంచంలో విజయం సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయడానికి ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. యూనివర్సిటీ ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ విజయాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధిస్తున్నారు. స్థిరంగా కొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఎల్‌పీయూ విద్యాభ్యాసం వాస్తవ-ప్రపంచ పరిశ్రమ విధానాలతో మిళితం చేయడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. వృత్తి విజయాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే కాకుండా పరిశ్రమకు విలువను జోడించేందుకు, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి అవసరమయ్యే నైపుణ్యాలను అందించేలా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఎడ్యుకేషన్‌లో వచ్చే రివల్యూషన్ విద్యార్థుల భవిష్యత్తును రూపొందిస్తోంది. వారు అభివృద్ధి చెందడానికి, ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో అగ్రగామిగా నిలిచి మెరుగైన ప్లేస్‌మెంట్లు సాధించేందుకు ఎల్‌పీయూ అవకాశాలను సృష్టిస్తోంది’ అని తెలిపారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

Sobhita Dhulipala reveals love story with Naga Chaitanya started 6
చైతూతో ప్రేమకథ అలా మొదలైంది.. రివీల్ చేసిన శోభిత ధూళిపాల

టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాలను పెళ్లాడారు. గతేడాది డిసెంబర్ వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని ‍అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీతారలు హాజరయ్యారు.అయితే ఈ జంట పెళ్లి తర్వాత తొలిసారి ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ప్రముఖ మ్యాగజైన్ వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తమ ప్రేమకథ తొలిసారి ఎక్కడ మొదలైందనే విషయాన్ని రివీల్ చేశారు. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు శోభిత స్పందించారు. మిమ్మల్ని చైతూ ఫాలో అవుతున్నాడు.. కానీ మీరెందుకు ఫాలో కావడం లేదని ఓ నెటిజన్‌ తనను అడిగాడని వెల్లడించింది. ఆ తర్వాత నేను చైతూ ప్రొఫైల్‌కి వెళ్లి చూస్తే నాతో పాటు కేవలం 70 మందిని మాత్రమే అతను ఫాలో అవుతున్నాడని తెలుసుకున్నా.. ఆ తర్వాత చైతన్యను ఫాలో అయ్యానని తెలిపింది.అప్పటి నుంచి మేమిద్దరం చాటింగ్ ప్రారంభించినట్లు శోభిత తెలిపింది. ఏప్రిల్ 2022లో చైతన్య- నేను తొలిసారి కలుసుకున్నట్లు శోభిత వివరించింది. ముంబయికి టికెట్‌ బుక్ చేసుకుని వచ్చిన చైతూతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశా.. అప్పటి నుంచి మా డేటింగ్ మొదలైందని చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా చాలా నేచురల్‌గా జరిగిందని వెల్లడించింది. ఆ తర్వాత ఒకరి కుటుంబాలను ఒకరు కలుసుకున్నట్లు పేర్కొంది. అలా తమ ప్రేమ మొదలైందని తాజా ఇంటర్వ్యూలో శోభిత తమ లవ్ స్టోరీని రివీల్ చేసింది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia)

Sunita Williams Ancestral Home Where Her Parents Lived In Jhulasan Gujarat7
Sunita William పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్‌ వీడియో

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో (మార్చి 19 ఉదయం) అంతరిక్షం నుండి తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషాన్ని నింపింది. నిజంగా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి, చిరునవ్వులు చిందించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈనేపథ్యంలోనే ఆమె పూర్వీకులు, ఎవరు? ఏ రాష్ట్రానికి చెందినది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. సునీతా విలియమ్స్ తండ్రి దీపక్‌ పాండ్యా, గుజరాత్‌లోని ఝులసన్ గ్రామానికి చెందినవారు. ఇక్కడే ఆమె పూర్వీకుల ఇల్లు (Ancestral Home) ఉంది. తొమ్మిది నెలల ఉత్కంఠ తరువాత ఆమె సురక్షితంగా భూమికి తిరిగి రావడంతో ఆ గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. ఆమె రాకను ప్రత్యక్షంగా చూడటానికి గ్రామం మొత్తం ఒక ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన టీవీల ముందు గుమిగూడి సునీతను చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో విశేషంగా నిలిచింది. View this post on Instagram A post shared by India Today (@indiatoday) ఇది సునీత తండ్రి దీపక్ పాండ్య పూర్వీకులకు సంబంధించిన ఇల్లుగా భావిస్తున్నారు. ఇండియా టుడే షేర్ చేసిన వీడియో ప్రకారం, సునీత పూర్వీకుల ఇల్లు ఇప్పటికీ ఉంది. అయితే, ఎత్తైన ఈ ఇంటికి చాలా కాలంగా ఇల్లు లాక్ చేయబడి ఉండటం వల్ల కొంచెం పాతబడినట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడా పగుళ్లు కూడా ఉన్నాయి. అయితే సునీతకు భారతదేశంతో ఉన్న అనుబంధానికి నిదర్శనం. 1958లో ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడంతో ఇంటికి సరైన నిర్వహణలేకుండా ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అది దృఢంగానే కనిపిస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సునీత విలియమ్స్‌ను భారత్‌ రావాల్సిందిగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆమె, సొంత గ్రామానికి వస్తారా? పూర్వీకుల ఇంటిని సందర్శిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.సమోసా పార్టీసునీతా విలియమ్స్ వదిన, ఫల్గుణి పాండ్యా ఈ క్షణాన్ని 'అద్భుతం'గా అభివర్ణించారు. త్వరలో ఆమె కుటుంబం త్వరలో భారతదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా తమ పూర్వీకుల గ్రామం ఝులసన్‌తో బలమైన సంబంధాన్ని ఆమె గుర్తు చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సమోసా తిన్న మొదటి వ్యక్తి సునీత కాబట్టి, ఆమె సురక్షితంగా తిరిగి రావడాన్ని పండుగలా జరుపుకునేందుకు కుటుంబం సమోసా పార్టీ ఇస్తుందని కూడా ఆమె చమత్కరించారు. చదవండి: సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!తొమ్మిది నెలలు అంతరిక్షంలోనేఒక వారం రోజుల మిషన్‌మీద రోదసిలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకు పోయారు. తొమ్మిది నెలల తర్వాత, వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి భూమికి తిరిగి వచ్చారు. అచంచలమైన ధైర్య సాహసాలు, అకుంఠిత దీక్ష, అంకితభావంతో సునీతా విలియమ్స్‌ ఒక రోల్‌మోడల్‌గా నిలిచారు.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్‌ వస్తే? ఏలా మేనేజ్‌ చేస్తారు?

YSRCP Protest Chandrababu Promise On Free Bus Journey Scheme8
ప్చ్‌.. చంద్రబాబు పేరు చెప్పినా వినలేదు!

తిరుపతి, సాక్షి: సాధారణంగా.. చం‍ద్రబాబు ఎన్నికలొస్తున్నాయంటే అడ్డగోలు హామీలు ప్రకటిస్తారు. వాటిని అమలు చేయడం అనేది ఆయన రాజకీయంలోనే లేదు. ఈ మాట మేం అంటోంది కాదు.. యావత్‌ ఏపీ కోడై కూస్తోంది ఇప్పుడు. ఈ క్రమంలో నిరసనలూ వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutavam) చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకు వినూత్న ప్రయత్నం జరిగింది. బుధవారం ఉదయం కొందరు ప్రయాణికులు.. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కారు. కండక్టర్‌ వచ్చి టికెట్‌ అడగ్గానే.. వాళ్లంతా తమ చేతుల్లోని ఫోన్లను చూపించారు. ‘‘అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. నాదీ హామీ’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. ఆ వీడియోను ప్రదర్శించిన మహిళలు.. తాను అందుకే ఎక్కామని చెప్పారు. ఇంతలో చంద్రబాబు ఫేస్‌ మాస్క్‌ వేసుకుని ఓ వ్యక్తి అక్కడ ప్రత్యక్షం కావడంతో.. ఆ కండక్టర్‌ నిర్ఘాంతపోయారు. అయితే.. ఏపీలో ఎక్కడా ఉచిత ప్రయాణం లేదని చెబుతూ ఆ మహిళల గుంపును దిగిపోవాలని సూచించాడు. ఈలోపు చంద్రబాబు ముఖం మాస్క్‌తో ఉన్న వ్యక్తి బస్సులో హడావిడి చేశారు. అయితే ‘‘టికెట్ అడిగితే నా పేరు చెప్పండి’’ స్వయంగా చంద్రబాబు ఆ వీడియోలో చెప్పిన మాటలు మరోసారి కండక్టర్‌కు చూపించారు. ఈ క్రమంలో కండక్టర్‌ వాళ్లతో వాగ్వాదానికి దిగారు. తాము సీఎం చంద్రబాబు చెబితేనే ఫ్రీ ప్రయాణానికి వచ్చామని పదే పదే చెప్పడంతో ఆ కండక్టర్‌ చివరకు పోలీసులను ఆశ్రయించారు. దీంతో.. బస్సును నేరుగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పీఎస్‌కు తరలించగా.. అదుపులోకి తీసుకున్న ఆ ప్రయాణికుల్లో మేయర్‌ డాక్టర్‌ శిరీష(Mayor Sirisha) కూడా ఉండడం చూసి పోలీసులు కంగుతిన్నారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జి అభినయ్‌ రెడ్డి నేతృత్వంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసంపై బుధవారం ఇలా నిరసన కార్యక్రమం జరగడం మరో విశేషం.

today gold and silver rates on telugu states9
ఫస్ట్‌టైమ్‌ బంగారం ధర ఎంతకు చేరిందంటే..

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర బుధవారం జీవితకాల గరిష్టాలను చేరింది. సమీప భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,900 (22 క్యారెట్స్), రూ.90,440 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.ఇదీ చదవండి: స్టార్‌లింక్‌ సర్వీసులపై స్పెక్ట్రమ్‌ ఫీజు?చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.90,440 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.83,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.90,590 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లోనూ మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై ఏకంగా రూ.1,000 పెరిగి రూ.1,14,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

YSRCP MLC Botsa Strong Counter To Nara Lokesh Over School Dropouts10
APLC: మేమెందుకు క్షమాపణలు చెప్పాలి?

అమరావతి, సాక్షి: శాసనమండలిలో ఇవాళ మరోసారి మంత్రి నారా లోకేష్‌, ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ(Botsa Satyanaraya) మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి లోకేష్ ఆరోపించగా.. బొత్స ఆ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ఏపీలో 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారనడం(Drop Outs) సరికాదు. మంత్రి నారాలోకేష్‌(Nara Lokesh)కు ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఏనాడూ 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు బదిలీ అయిన సందర్భమూ లేదు. .. సౌకర్యాలు లేవనడం కరెక్ట్ కాదు. కావాలంటే మండలి సభ్యులందరినీ తీసుకెళ్లి స్టడీ టూర్ పెట్టండి. 2014-19 మధ్య స్కూల్స్ ఎలా ఉన్నాయి...2019-24 మధ్య ఎలా ఉన్నాయో పెద్దలతో గ్రామసభలు పెట్టి చర్చిద్దాం. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. కానీ, తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం(English Medium) కూడా ప్రోత్సహించాలన్నదే మా విధానం. .. ప్రాధమిక విద్యనుంచి టోఫెల్ విద్యను నేర్పించడం. ఇంగ్లీష్ మీడియంలో ఐబి విద్యను అందించడం. సెంట్రల్ సిలబస్ (సిబిఎస్) ను ప్రవేశపెట్టడం లాంటివి చేశాం. మొన్న 80% మంది విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాశారు. కిందిస్థాయి నుంచి కమ్యూనికేషన్ కోసం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ను అందుబాటులోకి తెచ్చాం. రేపు ఈ సబ్జెక్ట్ మీద చర్చించాలని మేం కోరాం. ఈ రోజు ఉద్యోగుల సమస్యల పై చర్చించాలని మేం వాయిదా తీర్మానం ఇచ్చాం. నేను తప్పు మాట్లాడితే రికార్డుల నుంచి నా మాటలను తొలగించండి. మేం క్షమాపణ చెప్పాలనడమేంటి... ఎందుకు మేము క్షమాపణ చెప్పాలి అని లోకేష్‌ వ్యాఖ్యలను ఉద్దేశించి బొత్స తీవ్రంగా ధ్వజమెత్తారు.అంతకుముందు.. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు , ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ,ఐఆర్ ,డీఏ ,ఉద్యోగుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్‌ తిరస్కరించారు. అనంతరం.. ప్రశ్నోత్తరాలు జరిగాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
NRI View all
title
సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్‌ రిక్వెస్ట్‌!

భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్యం  కేసులో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది.

title
తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో

title
ఏయూ హాస్టల్‌కి నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత మంచాలు

 ఆంధ్ర యూనివర్సీటీలో విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో, ఆంధ్ర

title
పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా

title
Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్‌ సంతాపం

అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్

NRI View all
title
Updates: విజయవంతంగా భూమ్మీదకు సునీత అండ్‌ కో

అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ల్యాండైన సునీతా విలియమ్స్‌ అండ్‌ కో

title
నాట్స్ తెలుగు సంబరాలు సినీ ప్రముఖులకు ఆహ్వానం

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ బృందం పలువురు సిన

title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’

అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో  మెడికల్‌ కాన్ఫరెన్స్‌ ఘనంగా జరిగింది.

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

Advertisement
Advertisement