Top Stories
ప్రధాన వార్తలు

హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టులో వైజాగ్ను చేర్చాలి: వైఎస్సార్సీపీ డిమాండ్
ఢిల్లీ: హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్టులో వైజాగ్ను కూడా చేర్చాలని లోక్సభ వేదికగావైఎస్సార్సీపీడిమాండ్ చేసింది. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ ను ఈ ప్రాజెక్టులో చేర్చలేదనివైఎస్సార్సీపీఎంపీ తనూజరాణి స్పష్టం చేశారు. ఈరోజు(సోమవారం) లోక్ సభలో రైల్వే శాఖ పద్దులపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘హౌరా చెన్నై మెయిన్ లైన్ లో వయా వైజాగ్ ద్వారా ప్రతిరోజు 508 ట్రైన్లు వెళ్తుంటాయి. అమరావతికి 363 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైజాగ్ కు హై స్పీడ్ ట్రైన్ కనెక్టివిటీ కల్పించాలి’ అని ఆమె కోరారు. ‘రాయగడ డివిజన్ లోకి అరకు వ్యాలీ రైల్వే స్టేషన్ ను మార్చవద్దు. వాల్తేరు డివిజన్లోని అరకు వ్యాలీ రైల్వే స్టేషన్ ను కొనసాగించాలి. ఈ మార్పు వల్ల గిరిజనుల సెంటిమెంట్ దెబ్బతింటుంది’ అని ఆమె పేర్కొన్నారు.బడ్జెట్ లో పేదలకు అన్యాయం జరిగింది..రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగావైఎస్సార్సీపీతరఫున ఎంపీ గొల్లబాబు రావు మాట్లాడారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కార్పోరేషన్లకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తగిన నిధులు ఇవ్వడం లేదు. దీని కారణంగా పేదలకు అన్యాయం జరిగింది. సోషల్ జస్టిస్ మినిస్ట్రీ.. సోషల్ ఇంజస్టిస్ మినిస్ట్రీగా మారింది. సాక్షాత్తు ప్రధానమంత్రి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతిలో హామీ ఇచ్చారు.. దాన్ని నిలబెట్టుకోలేదు. ఏపీకి తగిన న్యాయం చేయాలి. 2014-19 మధ్య రాష్ట్ర ప్రభుత్వం పోలవరం బాధ్యత ను ఎందుకు ఎత్తుకుంది?, కేంద్రం పోలవరంకు సరైన నిధులు ఇవ్వడం లేదు. పోలవరం ఎత్తును 45 నుంచి 41 మీటర్లకు తగ్గిస్తే ఏపీ ప్రజలు ఊరుకోరు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలి. రైల్వే జోన్ శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభించలేదు’అని గొల్లబాబూ రావు స్పష్టం చేశారు.

భారత ప్రధాని మోదీ ‘మంచి మాట’ చెప్పారు: చైనా
బీజింగ్: భారత్ తో స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్న చైనా.. ప్రధాని నరేంద్ర మోదీ చేసి వ్యాఖ్యలను స్వాగతించింది. తమ దేశం భారత్ తో స్నేహం కోసం ఎదురుచూసే వేళ మోదీ ఈ తరహాలో పాజిటివ్ గా మాట్లాడగం నిజంగా అభినందనీయమని చైనా విదేశాంగ ప్రతినిధి మావ్ నింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే తాము భారత్ నుంచి ఆశిస్తున్నదంటూ సంతోషం వ్యక్తం చేశారు ఆమె. ఇరు దేశాలది ఎన్నో ఏళ్ల చరిత్రభారత్, చైనాలకు గత కొన్ని శతాబ్దాలుగా చారిత్రాత్మ ఘనతలు ఉన్నాయని, ఈ క్రమంలోనే ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని రాటుదేలిన దేశాలు భారత్, చైనాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా పాడ్ కాస్టర్, ఏఐ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రిడ్ మ్యాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో అంతర్జాతీయ అంశాలను మోదీ ప్రసావించారు. దీనిలో భాగంగా చైనాతో సంబంధాల గురించి ప్రస్తావించగా మోదీ తనదైన శైలిలో జవాబిచ్చారు. ప్రధానంగా ఇటీవల ఎలిఫెంట్, డ్రాగన్’ కలిసి డ్యాన్స్ చేస్తే బాగుంటుందని చైనా చేసిన వ్యాఖ్యలపై పాడ్ కాస్ట్ లో అడగ్గా మోదీ సూటిగా బదులిచ్చారు.పోటీ అనేది వివాదం కాకూడదు..ఎక్కడైనా పోటీ అనేది వివాదం కాకూడదని, బేధాభిప్రాయాలు అనేవి ఘర్షణ వాతావరణాకి దారితీయకూడదని అంటూ చైనాను ఉద్దేశించి మోదీ సుతిమెత్తని శైలిలో చెప్పుకొచ్చారు. ఎంతో ఘన చరిత్ర కల్గిన ఇరు దేశాల జీడీపీ.. వరల్డ్ జీడీపీలో 50 శాతానికి పైగానే ఉందన్నారు మోదీ. తమ మధ్య ఎంతో బలమైన సంబంధాలున్నాయనే తాను నమ్ముతున్నానని మోదీ పేర్కొన్నారు.ఎలిఫెంట్, డ్రాగన్ డ్యాన్స్ కలిసి చేద్దాంసరిగ్గా పదిరోజుల క్రితం భారత్ తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒకరిని ఒకరు కించ పరుచుకోవడం కంటే కలిసి పని చేస్తే అద్భుతాలు స్పష్టించవచ్చాన్నారు వాంగ్ యి. ఆ దేశ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీట్ తర్వాత వాంగ్ యి మాట్లాడుతూ.. ‘ ఢిల్లీ, బీజింగ్ కలిసే పని చేసే సమయం ఆసన్నమైంది. డ్రాగన్, ఎలిఫెంట్ డ్యాన్స్ కలిసి చేస్తే బాగుంటుంది. ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. సహకారంతో పోయేదేమీ ఉండదు. సహకారం ఇచ్చి పుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతాం. ఇది దేశ ప్రజలకు, దేశాలకు మంచిది’ అని పేర్కొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో వాంగ్ యి భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కొంత కాలంగా ఇరుదేశాల మధ్య సామరస్య వాతావరణం2020లో గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్నుంచి నిన్న మొన్నటి వరకూ ఇరు దేశాలు పెద్దగా సమావేశం అయ్యింది కూడా తక్కువే. ఆపై 2024లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ తరువాత .ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కాస్త చల్లబడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న చోట నుంచి ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి పిలపించడంతో అప్పట్నుంచీ సామరస్య వాతావరణం కనిపిస్తోంది.

బాపట్ల జిల్లా పర్యటనకు వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థీవదేహానికి నివాళులు అర్పించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతిగత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85)సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి. రేపు బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా మేదరమెట్లలో పిచ్చమ్మ పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పిస్తారు.

నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి
భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రశంసలు కురిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ అతడేనని కొనియాడాడు. తాను ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రానే అని కోహ్లి వెల్లడించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటిన కోహ్లి.. ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) సోషల్ మీడియాతో మమేకమైన కోహ్లి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అత్యుత్తమ బౌలర్ ఇక మీ కెరీర్లో ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రపంచంలో ప్రస్తుతం వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్ ఎవరంటే.. జస్ప్రీత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఐపీఎల్లో కొన్ని సందర్భాల్లో అతడు నన్ను అవుట్ చేశాడు. అయితే, ఎక్కువసార్లు నేనే అతడిపై పైచేయి సాధించాను. అయినా సరే.. మా ఇద్దరి మధ్య పోటీ అంటే ఎంతో ఆసక్తికరంగా, సరదాగా ఉంటుంది. ప్రతి బంతిని షాట్ బాదేందుకు నేను ప్రయత్నిస్తా.నన్ను ఆపేందుకు అతడూ ట్రై చేస్తాడు. ఇద్దరి మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరుకున్న వేళ.. ఎవరూ కూడా తగ్గకుండా ముందుకు సాగితే మజాగా ఉంటుంది కదా!.. ఇక నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు నేను రెగ్యులర్గా బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొంటా. నాకు నచ్చిన, నేను ఆస్వాదించే మూమెంట్ అది. అంతేకాదు.. అదే కఠినమైన సవాల్ కూడా!’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు.కాగా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభమైన నాటి(2008) నుంచి కోహ్లి ఆర్సీబీలో కొనసాగుతుండగా.. బుమ్రా తన కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్తో ప్రయాణిస్తున్నాడు. ఫోర్లు బాదిన కోహ్లి.. అవుట్ చేసిన బుమ్రాఇక 2013, ఏప్రిల్ 4న ముంబై తరఫున ఆర్సీబీతో మ్యాచ్తో బుమ్రా ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. నాడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 32 పరుగులు ఇచ్చిన బుమ్రా మూడు వికెట్లు తీశాడు.తన ఆరంభ ఓవర్లోనే కోహ్లి ఒకటి, రెండు, నాలుగో బంతుల్లో ఫోర్లు బాది చుక్కలు చూపించగా.. ఐదో బంతికి బుమ్రా విజయం సాధించాడు. నాడు 19 ఏళ్ల వయసులో ఉన్న బుమ్రా తన అద్భుత నైపుణ్యాలతో వికెట్ల ముందు కోహ్లిని దొరకబుచ్చుకుని.. తన తొలి వికెట్ సాధించాడు. ఇక ఇప్పటి వరకు 133 మ్యాచ్లు పూర్తి చేసుకున్న బుమ్రా 165 వికెట్లు తీశాడు. ముంబై జట్టు ఐదుసార్లు టైటిల్ గెలిచిన సందర్భాల్లోనూ అతడు జట్టులో భాగంగా ఉన్నాడు.మరోవైపు.. కోహ్లి జట్టు ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఇదిలా ఉంటే.. కోహ్లి- బుమ్రా టీమిండియాకు కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే. కోహ్లి సారథ్యంలో బుమ్రా ఆడగా.. పలు సందర్భాల్లో బుమ్రా కెప్టెన్సీలో కోహ్లి ఆడటం విశేషం. చదవండి: అసలు అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు?: పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం"𝙒𝙝𝙚𝙣𝙚𝙫𝙚𝙧 𝙄 𝙛𝙖𝙘𝙚 𝙝𝙞𝙢, 𝙞𝙩'𝙨 𝙡𝙞𝙠𝙚, '𝙊𝙠𝙖𝙮, 𝙞𝙩'𝙨 𝙜𝙤𝙣𝙣𝙖 𝙗𝙚 𝙛𝙪𝙣.'" 🗣Ever wondered who’s the toughest bowler Virat’s ever faced? 🤔 Catch him spill the tea, at the 𝗥𝗖𝗕 𝗜𝗻𝗻𝗼𝘃𝗮𝘁𝗶𝗼𝗻 𝗟𝗮𝗯 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗦𝗽𝗼𝗿𝘁𝘀 𝗦𝘂𝗺𝗺𝗶𝘁… pic.twitter.com/36F8d8twN6— Royal Challengers Bengaluru (@RCBTweets) March 17, 2025

చట్టసభలు ఒక్కరివి ఎలా అవుతాయి?
శాసనసభలో ప్రతిపక్షం తరపున ప్రసంగించేటప్పుడు వ్యూహాత్మకంగా ఉండాలి. అధికార పక్షం డైవర్ట్ చేసే అవవకాశం ఉన్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండ్లకంట జగదీశ్ రెడ్డి అధికార కాంగ్రెస్ వేసిన ట్రాప్లో పడినట్లు అనిపిస్తుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ మీద జగదీశ్ రెడ్డిని శాసనసభ నుంచి ఈ సెషన్ వరకు సస్పండ్ చేశారు. నిజానికి ఇందులో జగదీశ్ రెడ్డి చేసిన పెద్ద తప్పేమీ లేదనిపిస్తుంది. సభ ఎవరిది అన్న ప్రస్తావన తెచ్చి అందరిది అని, అందరి తరపున పెద్ద మనిషిగా స్పీకర్ ఉన్నారని, అది ఆయన సొంతం కాదని జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఆధారంగా మంత్రులు శ్రీధర్ బాబు, తదితరులు పెద్ద రగడ సృష్టించారు.స్పీకర్ను, అందులోను దళిత నేతను అవమానించారంటూ ఆక్షేపిస్తూ, జగదీశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో జగదీశ్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ఉండాల్సింది. తాను గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడుతున్న సంగతిని ఆయన మర్చిపోయారు. ఆ స్పీచ్లో ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సాగించారు. ఆ క్రమంలో ఒకసారి మంత్రి కోమటి రెడ్డి అడ్డుపడి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ జోక్యం చేసుకుని జగదీశ్ రెడ్డి ప్రసంగానికి అడ్డుపడడం సరికాదని చెప్పారు. ఈ క్రమంలో జరిగిన సంవాదంలో జగదీశ్ రెడ్డి తన మానాన ఉపన్యాసం కొనసాగించకుండా తాను ఏమి తప్పు చేశానో చెబితే, ఆ తర్వాత మాట్లాడతానని అన్నారు. అక్కడే ఆయన పొరపాటు చేసినట్లు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలం అవుతోందని, పిట్టకథలతో ఆయా అంశాలు వివరిస్తూ జగదీశ్ రెడ్డి మాట్లాడారు. నాలుగు బర్రెల కథ అంటూ ఒక స్టోరీ చెప్పినప్పుడు చర్చను పక్కదారి పట్టించవద్దని స్పీకర్ సూచించారు. తాను చర్చను పక్కదారి పట్టించ లేదని, ఒక్క అక్షరమైనా పక్కదోవ పట్టించినట్లు తేల్చాలని, సభలో ఉండమంటే ఉంటా.. పొమ్మంటే పోతా.. అంటూ ఆవేశంగా తన చేతిలో ఉన్న నోట్స్ను బల్లపైకి విసిరారు. నిజానికి జగదీశ్ రెడ్డి ఇంత ఆగ్రహం చెందాల్సిన అవరమే కనిపించదు. జగదీశ్ రెడ్డి స్పీకర్ను బెదిరిస్తున్నారని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సలహా ఇచ్చారు. అప్పుడైనా ఈయన సర్దుకుని ఉండాల్సింది.స్పీకర్ జోక్యం చేసుకుని మీరు సీనియర్ సభ్యులు, పదేళ్లు మంత్రిగా పనిచేశారు. సహనంగా ఉండాలని, సంప్రదాయాలను పాటించాలని వ్యాఖ్యానించారు. ఆ మాట జగదీశ్ రెడ్డికు మరింత కోపం తెప్పించిందట. తాను ఏ సంప్రదాయాన్ని ఉల్లంఘించానో చెబితే, ఆ తర్వాత మాట్లాడతా అని ఆయన అన్నారు. అప్పుడు తనను ప్రశ్నించడమే సంప్రదాయ విరుద్ధమని ప్రసాదకుమార్ జవాబు ఇచ్చారు. అప్పుడైనా జగదీశ్ రెడ్డి సంయమనం పాటించి తన స్పీచ్ కంటిన్యూ చేసి ఉండాల్సింది. అలా కాకుండా ఈ సభ అందరిది అని, సమాన హక్కులు ఉంటాయని, పెద్దమనిషిగా స్పీకర్ ఉంటారని, మీ సొంతం కాదని అనడం వివాదంగా మారింది. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకున్న కాంగ్రెస్ పార్టీ వెంటనే రియాక్ట్ అయింది.స్పీకర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ బాబు అయితే ఏకంగా స్పీకర్ను జగదీశ్ రెడ్డి దూషించారని విమర్శించారు. నిజానికి జగదీశ్ రెడ్డి దూషించిందేమీ లేదు. నీ సొంతం కాదు అనడం అభ్యంతరం అయితే అవ్వవచ్చు. అందులో దూషణ ఏమీ లేదు. కాని అధికార పక్షం ఆయా పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవడం జరుగుతుంటుంది. గతంలో స్పీకర్ పై కాగితాలు విసిరిన కారణంగా అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ల సభ్యత్వమే రద్దు చేసిన విషయాన్ని అధికార పక్షం గుర్తు చేసింది. ఈ దశలో అయినా జగదీశ్ రెడ్డి వెనక్కి తగ్గి సారీ చెప్పేస్తే అయిపోయేది. ఆయన అలా చేయలేదు. దాంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మద్దతు ఇవ్వక తప్పలేదు. దీంతో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వాదనను ఎఫెక్టివ్గా వినిపించే అవకాశాన్ని జగదీశ్ రెడ్డి కోల్పోయారు. ఆ తర్వాత సభ నుంచి సస్పెండ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేయడం, తదుపరి అదే ప్రకారం సెషన్ అంతటికి సస్పెండ్ చేయడం జరిగిపోయాయి. ఈ మాత్రానికి సెషన్ అంతా సస్సెండ్ చేయడం కూడా అంత సమంజసం కాదు. జగదీశ్ రెడ్డి తప్పుగా మాట్లాడారని అనుకుంటే ఒక రోజు సస్సెండ్ చేసి ఉంటే సరిపోయేది. తప్పు చేయలేదని, హరీష్ రావు కేటీఆర్లు అన్నప్పటికి, పరిస్థితిని బట్టి మసలుకోకపోతే వారికే నష్టం జరుగుతుంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకుండా ఉండడానికి ఇలాంటి ఘటనలను వాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అది కరెక్టో, కాదో తెలియదు కాని, ఈ మొత్తం వ్యవహారంలో జగదీశ్ రెడ్డి చేసింది పెద్ద తప్పు కాకపోయినా సెషన్ అంతా సస్పెండ్ అవడం, కాంగ్రెస్ ట్రాప్లో బీఆర్ఎస్ పడినట్ల అయిందనిపిస్తుంది. ఇలాంటివి ఉమ్మడి ఏపీలోనూ అనేకసార్లు జరిగాయి. ప్రత్యేకించి అధికారపక్షం వారు విపక్ష సభ్యులు బాగా మాట్లాడుతున్నప్పుడు వారి భాషణలో ఏదైనా ఒక్క పదం దొరికితే, దానిమీదే రచ్చ చేసి మొత్తం చర్చను డైవర్ట్ చేస్తుంటారు. కాంగ్రెస్, టీడీపీల మధ్య హోరా హోరీగా చర్చలు జరుగుతున్నప్పుడు ఇలాంటివి చోటు చేసుకుంటాయి. టీడీపీ హయాంలో ప్రతిభా భారతి స్పీకర్గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ హయాంలో కుతూహలమ్మ డిప్యూటి స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చోటు చేసుకున్నాయి. వెంటనే అధికారపక్షం దళిత, మహిళ కార్డులను బయటకు తీసి విపక్షాన్ని ఇరుకున పెట్టడానికి యత్నిస్తుంది. విపక్షం కూడా అలా ప్రయత్నం చేస్తుంటుంది కాని, వారికి తక్కువ అవకాశాలు లభిస్తాయి. జగదీశ్ రెడ్డి కాస్త సంయమనంగా వ్యవహరించి ఉంటే, కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్కి అవకాశం ఉండేది కాదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన విధంగానే ఇప్పుడు కూడా విపక్ష సభ్యుడిపై ఇంతటి సీరియస్ చర్య తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మంచి సంకేతం పంపించలేదు. నిజానికి ఈ సభ అందరిది అన్నది వాస్తవమే. - కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవాహారాల వ్యాఖ్యాత

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న యూట్యూబర్లపై కేసులు.. త్వరలోనే అరెస్ట్?
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కంటెంట్ క్రియేటర్లపై కేసులు నమోదు చేశారు. వారిలో హర్షసాయి, సన్నీ యాదవ్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, రీతూ చౌదరి, బండారు పేషయాని సుప్రిత తదితరులపై వారిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల చేయగా.. త్వరలోనే వీరిని అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం.

భైడెన్కు ఏమీ తెలియదు.. ఆ సంతకాలు చెల్లవు: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానో వివాదాస్పదంగానో మారుతోంది. గత ప్రభుత్వాలు తీరుకు భిన్నంగా ట్రంప్ పాలన కొనసాగుతోంది. ఏది చేసినా తానే అమలు చేయాలి అన్న చందంగా ఉంది ట్రంప్ తీరు. అక్రమ వలసల వెనక్కి పంపించే నిర్ణయం దగ్గర్నుంచీ, ‘గ్రీన్ కార్డు రద్దు’ అంశం ఇలా ట్రంప్ తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదంగానే ఉంటోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని డొనాల్డ్ ట్రంప్ తాజాగా తప్పుబట్టారు. అధ్యక్షుడిగా దిగిపోవడానికి కొన్ని గంటల ముందు పలువురికి క్షమాబిక్షలు ప్రసాదించారు బైడెన్. అధ్యక్షుడిగా తనకున్న విచాక్షణాధికారాలతో బైడెన్ ముందుకెళ్లారు. అయితే అది సరైన చర్య కాదంటూ ట్రంప్ తాజాగా డిక్లేర్ చేశారు. అవి చెల్లవు.. బైడెన్ కు ఏమీ తెలియదుఅయితే ఆ క్షమాభిక్షలు చెల్లవు అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అసలు బైడెన్ కు ఏమీ తెలియదని, అది బైడెన్ దిగి పోవడానికి చివరి గంటల్లో కాకతాళీయంగా చర్యగా అభివర్ణించారు. ఆ సమయంలో విచారణ జరిపిన కమిటీలోని సభ్యులు క్షమాభిక్షలు ఇవ్వడం కూడా చెల్లదన్నారు ‘ఆ సంతకం చేసింది బైడెన్ కాదు.. బైడెన్ కు ఆ సంతకాలు గురించి కూడా ఏమీ తెలియదు. నా పరిభాషలో చెప్పాలంటే అవి ఆటోపెన్ సంతకాలు’ అంటూ ట్రంప్ కొత్త పల్లవి అందుకున్నారు.కాగా, ప్రధానంగా 2021, జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్పై జరిగిన దాడికి సంబంధించిన శిక్ష అనుభవిస్తున్న వారికి బైడెన్ క్షమాభిక్ష కింద విముక్తి కల్పించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతీకార చర్యలు తీసుకునేందుకు వీలులేకుండా ఈమేరకు చర్యలు తీసుకున్నారు.అమెరికా అధ్యక్షుడిగా తనకు ఉన్న ప్రత్యేక అధికారాలతో చివరి గంటల్లో జో బైడెన్ క్షమాభిక్షలు ఇచ్చారు. అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె తదితరులకు ముందస్తు క్షమాభిక్ష జారీ చేశారు. అలాగే, క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులకూ కూడా ఉపశమనం కల్పించారు బైడెన్

వయస్సు 19.. ‘నేను మీ అక్కనిరా’ అంటూ.. స్కూల్ విద్యార్థులను వ్యభిచారంలోకి దింపి..
సాక్షి, వరంగల్ : అభం శుభం తెలియని బాలికల జీవితాలతో ఆడుకున్న కిలాడీ లేడీని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ మత్తులో ఆ మోసగత్తె చేసిన అరాచకాలు విని పోలీసులే అవాక్కయ్యారు. కొద్దిరోజుల క్రితం ఓ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కిలాడీ లేడీ.. వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో నివాసం ఉంటోంది. డ్రగ్స్కు బానిసైన ఆ లేడీ.. తనతోపాటు డ్రగ్స్కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీళ్లంతా కలిసి వరంగల్లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహిస్తోంది ఈ ముఠా. నేను మీ అక్కని రా అంటూఇందుకోసం ఇన్ స్టాగ్రామ్ను వినియోగించింది. ఇన్స్టా స్టోరీస్లో ట్రెండింగ్ పాటలకు డ్యాన్స్ చేయడంతో పాటు ఖరీదైన దుస్తులు, లగ్జరీ కార్లలో ప్రయాణిస్తూ ఫొటులు దిగింది. ఆ ఫొటోల్ని చూసిన నెటిజన్లు ఆమెను ఫాలో అవడం మొదలు పెట్టారు. అనతి కాలంలో ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగారు. అంతే పాఠశాలలకు వచ్చి వెళ్లే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో నేను మీ అక్కనిరా అంటూ వారితో మెల్లగా మాటలు కలుపుతోంది ఈ కిలాడీ లేడీ. ఇన్ స్టాలో తన ఫాలోవర్లను చూపించి క్రమంగా వారికి దగ్గరవుతుంది. చనువు పెంచుకొని కిడ్నాప్ చేస్తోంది. ఆపై బాలికలకు మత్తు పదార్ధాలు ఇచ్చి వ్యభిచారంలోకి దించుతుంది.ఏడాదిన్నరగాఈ ముఠా దాదాపూ ఏడాదిన్నరగా ఇలాంటి పనులే చేస్తూ పలువురి బాలికల జీవితాల్ని నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్క జిల్లాలకు కూడా తరలించినట్లు సమాచారం. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వెలుగులోకి కిలాడీ లేడీ గ్యాంగ్ అరాచకాలు ఈ ఫిర్యాదు క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరాతీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని తెలిపింది. స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా తేలింది. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ కిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో రెండ్రోజుల్లో ఆ కిలాడీ లేడీ లీలలను భయటపెట్టే అవకాశం ఉంది.

నటి సీతకు విడాకులు.. భార్య స్థానం మరొకరికి ఇవ్వలేను: పార్తీబన్
ఆర్. పార్తీబన్ (R. Parthiban) నటుడు మాత్రమే కాదు.. దర్శకుడు, నిర్మాత కూడా! అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ఆరంభించిన దాదాపు 16 సినిమాలకు దర్శకుడిగా, దాదాపు 14 సినిమాలకు నిర్మాతగా పని చేశాడు. వందకుపైగా సినిమాల్లో యాక్టర్గా పని చేశాడు. రచయితగా, సింగర్గానూ తన టాలెంట్ చాటుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. సీత వల్లే ఆ సినిమా హిట్టుడైరెక్టర్గా నా మొదటి సినిమా పుదియా పాడై (Pudhiya Paadhai). సీత నటించడం వల్లే ఈ సినిమా హిట్టయింది. తర్వాత సీతనే పెళ్లి చేసుకున్నాను. పెళ్లయ్యాక కొంతకాలం పాటు ఆమె సినిమాలు చేయలేదు. సినిమాల్లో నటించమని ఒత్తిడి చేయొద్దన్నారు. సరేనని ఊరుకున్నాను. తర్వాత కొంతకాలానికి తనకే ఆసక్తి వచ్చి మళ్లీ యాక్టింగ్ మొదలుపెట్టింది. అయితే కొన్ని కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడిపోయాం. అప్పుడు మేము కలిసున్న ఇంటిని అమ్మేశాం. ఇంతవరకు మళ్లీ ఇల్లు కొనలేకపోయాను. అద్దె ఇంట్లోనే ఉంటున్నాను.అందుకే ఇంకా సింగిల్గానే..అయితే ఇప్పటికీ సీతను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. అందుకే 24 ఏళ్లయినా మళ్లీ పెళ్లి చేసుకోలేదు. నా భార్యగా సీతకు స్థానమిచ్చాను. దాన్ని మరొకరికి ఇవ్వలేను. ఇద్దరమ్మాయిలకు పెళ్లయింది. నా కొడుకు, నేను మాత్రం ఇంకా సింగిల్గానే ఉంటున్నాము. సీతతో నేను టచ్లో లేను. ఆమె తల్లి చనిపోయినప్పుడు మాత్రం వెళ్లి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించాను అని చెప్పుకొచ్చాడు.పార్తీబన్ కెరీర్పార్తీబన్ 1990లో నటి సీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. 2001లో పార్తీబన్- సీత విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఇతడు ఒంటరిగానే ఉంటున్నాడు. సీత మరొకరిని పెళ్లి చేసుకోగా తర్వాతి కాలంలో ఆయనకు సైతం విడాకులిచ్చినట్లు తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2 వంటి పలు చిత్రాల్లో నటించాడు. సుడల్ 1 వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేశాడు. ప్రస్తుతం హాలీవుడ్లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.చదవండి: కూతురికి పాలు పట్టిద్దామంటే రూ.5 కూడా చేతిలో లేవు: నటుడు

సైన్స్ కోర్సు చదవలేకపోయానంటూ.. కన్నీళ్లు పెట్టుకుంది! కట్చేస్తే..
తల్లిదండ్రులు ఒక్కోసారి తమ పిల్లలు చదవాలనుకున్న ఉన్నత చదువులను చదివించలేకపోవచ్చు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ స్థాయి చదువులను చదివించలేకపోతుంటారు. కొందరేమో..! మగపిల్లవాడు కదా అని వాడిని మాత్రం అప్పోసొప్పో చేసి మరీ చదివిస్తుంటారు. ఆడపిల్లలని మాత్రం ఏ సర్కారీ బడిలోనో జాయిన్ చేసి.. తూతూ మంత్రంగా చదివిస్తుంటారు. పాపం అలానే ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో తల్లిదండ్రులు చేశారు. అయితే ఆ అమ్మాయి డ్రీమ్ని నెరవెర్చేందుకు కేంద్ర విద్యా మంత్రే కదిలొచ్చారు. అదెలా జరిగిందంటే..బీహార్లోని దానాపూర్కు చెందిన విద్యార్థిని ఖుష్బు కుమారి తాను సైన్సు కోర్సులో జాయిన్ అయ్యి డాక్టర్ అవ్వాలనుకుంది. అయితే ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో తల్లిదండ్రులు ఆ అమ్మాయిని బలవంతంగా ఆర్ట్స్ కోర్సులో జాయిన్ చేశారు. దీంతో ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల కారణంగా తన డ్రీమ్ని ఎలా కోల్పోయిందో ఓ వీడియోలో వివరించింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరింది. ఆ బాలిక వీడియోలో తన తల్లిదండ్రులు చూపిస్తున్న లింగ వివక్షపై విరుచుకుపడుతూ.. తన గోడుని వెళ్లబోసుకుంది. తాను ఇంటర్లో సైన్స్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా..కానీ నా తల్లిదండ్రులు పదిలో 400 మార్కులకు తెచ్చుకుంటే నీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వచ్చని అన్నారు. అయితే తాను 399 మార్కులే స్కోర్ చేయడంతో తన కల కలగానే మారిపోయిందని కన్నీళ్లుపెట్టుకుంది. అబ్బాయిలకు మాత్రమే నచ్చిన చదువు చదువుకునే స్వేచ్ఛ ఉంది. ఆడపిల్లలకు ఉండదు. కనీసం తమకు ఫోన్ కూడా ఇవ్వరు పేరెంట్స్ అంటూ భోరుమంది వీడియోలో. అంతే ఆ వీడియోపై కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే స్పందించి.. ఆమెకు చదవు విషయంలో పూర్తి మద్దతిస్తానని హామీ ఇచ్చారు. పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ ఏర్పాటు చేసిన వీడియో కాల్లో మంత్రి ప్రధాన్ ఆ బాలికతో నేరుగా మాట్లాడారు. తల్లిదండ్రులపై ఎలాంటి ద్వేషం పెట్టుకోవద్దని చెప్పడమే గాక బాగా చదువుకోవాలని సూచించారు. అలాగే ఆమె చదువాలనుకున్న చదువుకి కావాల్సిన ఏర్పాట్లను బిహార్ సీఎం నితీష్ కుమార్ చూసుకుంటారని చెప్పారు మంత్రి ప్రధాన్. ఆ బాలిక ప్రతిస్పందనగా.. మంచి కళాశాలో సైన్సు కోర్సులో చేరాలన్న తన కోరికను కేంద్రమంత్రికి విన్నవించింది. ఆయన అందుకు తగిన ఏర్పాటు చేసేలా పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్కి ఆదేశాలు జారీ చేశారు. 2025-27 విద్యా సంవత్సరానికే ఆమెకు నచ్చిన కోర్సులో జాయిన్ అయ్యేలా వెసులబాటు కల్పించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. కాగా, ఆ అమ్మాయి తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా తమ కూతురిని ఇలా బలవంతంగా ఆర్ట్స్ కోర్సులో జాయిన్ చేశామని చెప్పారు. ఏదీఏమైతేనేం తన కోరిక నెరవేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చేలా చేసింది. (చదవండి: ఎవరీ తారా ప్రసాద్..? ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..)
పాకిస్తాన్ ఆల్రౌండర్కు భారీ షాకిచ్చిన ఐసీసీ
ఏఐ తోడుంటే.. విజయం మీవెంటే..
పుష్ప- 2 గంగమ్మ జాతర సాంగ్.. అల్లు అర్జున్ ఒంటినిండా గాయాలే!
Posani Krishna Murali : న్యాయవాది సమక్షంలో విచారణ.. సీఐడీ కస్టడీకి పోసాని
సర్వమతాల భక్తులు కొలిచే సాగర్ మాత
బాక్సాఫీస్ వద్ద ఛావా దూకుడు.. పుష్ప-2 రికార్డ్ బ్రేక్!
హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టులో వైజాగ్ను చేర్చాలి: వైఎస్సార్సీపీ డిమాండ్
యూఏఈకి ఉచిత వీసాలు.. విమాన టికెట్స్
Virushka: తల్లీ, తండ్రి, తోబుట్టువు.. అందరికీ ఒకేలా కనిపించవు!
ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ బ్రేకప్.. త్వరలోనే తెలుగులో ఎంట్రీ!
కేంద్రం, తమిళనాడుల మద్య రూపాయి లొల్లి
హీరోయిన్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
వచ్చే సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం: అనిల్ రావిపూడి
గెలుపే లక్ష్యం.. అలుపెరగని పోరాటం
క్లోజ్ అవుతున్న పోస్టాఫీస్ స్కీమ్..
అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్కు ఘోర అవమానం
బంగారం పంట పండింది
తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..
వెంకటేష్తో హిట్ సినిమా.. జైలుకు వెళ్లడంతో ఆమె కెరీర్ క్లోజ్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
పాకిస్తాన్ ఆల్రౌండర్కు భారీ షాకిచ్చిన ఐసీసీ
ఏఐ తోడుంటే.. విజయం మీవెంటే..
పుష్ప- 2 గంగమ్మ జాతర సాంగ్.. అల్లు అర్జున్ ఒంటినిండా గాయాలే!
Posani Krishna Murali : న్యాయవాది సమక్షంలో విచారణ.. సీఐడీ కస్టడీకి పోసాని
సర్వమతాల భక్తులు కొలిచే సాగర్ మాత
బాక్సాఫీస్ వద్ద ఛావా దూకుడు.. పుష్ప-2 రికార్డ్ బ్రేక్!
హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టులో వైజాగ్ను చేర్చాలి: వైఎస్సార్సీపీ డిమాండ్
యూఏఈకి ఉచిత వీసాలు.. విమాన టికెట్స్
Virushka: తల్లీ, తండ్రి, తోబుట్టువు.. అందరికీ ఒకేలా కనిపించవు!
ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ బ్రేకప్.. త్వరలోనే తెలుగులో ఎంట్రీ!
కేంద్రం, తమిళనాడుల మద్య రూపాయి లొల్లి
హీరోయిన్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
వచ్చే సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం: అనిల్ రావిపూడి
గెలుపే లక్ష్యం.. అలుపెరగని పోరాటం
క్లోజ్ అవుతున్న పోస్టాఫీస్ స్కీమ్..
అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్కు ఘోర అవమానం
బంగారం పంట పండింది
తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..
వెంకటేష్తో హిట్ సినిమా.. జైలుకు వెళ్లడంతో ఆమె కెరీర్ క్లోజ్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
సినిమా

బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత పారితోషికమా?
'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam) సినిమాని మీలో చాలామంది చూసే ఉంటారు. అందులో బుల్లిరాజు (Bulliraju) పాత్ర కాస్త ఎక్కువగానే ఫేమస్ అయింది. ఇంతకు ముందు ఏ సినిమాల్లో నటించనప్పటికీ.. సూపర్ కామెడీ టైమింగ్ తో ఈ పిల్లాడు అదరగొట్టేశాడు. తాజాగా ఇతడి రెమ్యునరేషన్ కి సంబంధించిన రూమర్స్ కొన్ని వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్.. ఫోటోలు వైరల్)ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి అనే ఊరికి చెందిన రేవంత్.. 5వ తరగతి చదువుతున్నాడు. ఓ వీడియో వల్ల వైరల్ అయిన ఇతడిని చూసిన అనిల్ రావిపూడి సినిమాలోకి తీసుకున్నాడు. సినిమా రిలీజ్ తర్వాత బుల్లిరాజుగా హీరో వెంకటేశ్ కంటే ఎక్కువ వైరల్ అయిపోయాడు. ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్టు డిమాండ్ మామూలుగా లేదు.'సంక్రాంతి వస్తున్నాం' రిలీజైన దగ్గర నుంచి చాలా కథలు వింటున్నాడట. అదే టైంలో రోజుకి రూ.లక్ష రూపాయల రెమ్యునరేషన్(Remuneration) కూడా డిమాండ్ చేస్తున్నాడట. ఇంత ఇచ్చేందుకు నిర్మాతలు కూడా ఓకే అంటున్నారని సమాచారం. మరోవైపు అనిల్ రావిపూడి.. త్వరలో చిరంజీవితో తీయబోయే మూవీలోనూ బుల్లిరాజ్ అలియాస్ రేవంత్ ఉంటాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: స్కూటర్ కి దెయ్యం పడితే.. ఫన్నీగా 'టుక్ టుక్' ట్రైలర్)

నటుడిపై మాజీ భార్య తీవ్ర ఆరోపణలు.. ఇక ఆపేయాలంటూ వార్నింగ్!
మాజీ భార్య తనను వేధింపులకు గురి చేస్తోందంటూ ప్రముఖ మలయాళ నటుడు బాలా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెతో పాటు మరో యూట్యూబర్పై కొచ్చి పోలీసులను ఆశ్రయించారు. అయితే అతని మాజీ భార్య ఎలిజబెత్ ఉదయన్ నటుడిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. తనను బాలా వేధించడంతో పాటు అత్యాచారం చేశాడంటూ ఎలిజబెత్ ఉదయన్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. తాజాగా ఈ వివాదంపై నటుడు బాలా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ విషయంపై మాట్లాడుతూ ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశారు. అంతకుముందే నటుడి భార్య కోకిల సైతం తన భర్తపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎలిజబెత్ను కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది.బాలా వీడియోలో మాట్లాడుతూ.."దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి. ఈ వివాదంపై ఇది నా చివరి వీడియో కావాలని కోరుకుంటున్నా. ప్రియమైన ఎలిజబెత్.. మీ కుటుంబం పట్ల నాకు గౌరవం ఉంది. ప్రస్తుతం మీరు డిప్రెషన్తో బాధపడుతున్నారు. ఇప్పుడు మీకు కావాల్సింది సోషల్ మీడియా అటెన్షన్ కాదు.. ఈ సమయంలో మీకు వైద్యం చాలా అవసరం. మీ కుటుంబంలో ఎవరైనా డాక్టర్ ఉన్నట్లయితే సరైన వైద్యం తీసుకోండి. లేదంటే మీ సోదరులు, తల్లిదండ్రులతో కలిసి వైద్యుని వద్దకు కెళ్లండి. తనపై తప్పుడు ప్రచారం మానేయండి. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకండి. లేని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వెనుకాడను' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. నటుడు బాలా.. డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్ను 2021లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మనస్పర్థలు రావడంతో ఈ జంట విడిపోయారు. అయితే ఈ విషయంలో కొందరు ఎలిజబెత్కు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు ఆమె తీరును తప్పుబడుతున్నారు. మీవల్లే ఎలిజబెత్ అలా ప్రవర్తిస్తోందని నటుడు బాలాపై కొందరు విమర్శలు చేస్తున్నారు.

'పొలిమేర' దర్శకుడి మరో దెయ్యం సినిమా.. టీజర్ రిలీజ్
'పొలిమేర' రెండు సినిమాలు ఎంత సెన్సేషన్ సృష్టించాయో అందరికీ తెలిసిందే. తొలిభాగం ఓటీటీలో రిలీజై హిట్ కాగా.. తొలుత థియేటర్లలో రిలీజైన సీక్వెల్ అంతకు మించిన రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ విశ్వనాథ్.. మరో దెయ్యం మూవీతో వచ్చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)కాకపోతే ఈసారి అనిల్ విశ్వనాథ్.. దర్శకుడి బాధ్యతలు తీసుకోలేదు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూనే షో రన్నర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో అల్లరి నరేశ్ హీరోగా చేస్తున్నాడు. తాజాగా '12 ఏ రైల్వే కాలనీ' టైటిల్ పెట్టినట్లు టీజర్ రిలీజ్ చేశారు. 'ఈ స్పిరిట్స్, ఆత్మలు కొంతమందికే ఎందుకు కనబడతాయ్?' అనే డైలాగ్ ఆకట్టుకుంది.టీజర్ బట్టి చూస్తే ఇందులో దెయ్యాలు, ఆత్మలు కనిపించే వ్యక్తిగా అల్లరి నరేశ్ కనిపించనున్నాడు. 'పొలిమేర' హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఇందులోనూ సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవిలో విడుదల ప్లాన్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్?)

కూతురికి పాలు పట్టిద్దామంటే రూ.5 కూడా చేతిలో లేవు: నటుడు
సినిమా సక్సెస్ అయిందంటే ఆర్టిస్టుల పంట పండినట్లే అంటుంటారు. కానీ తన విషయంలో మాత్రం ఇది తలకిందులైంటున్నాడు బాలీవుడ్ నటుడు ఆది ఇరానీ (Adi Irani). తను నటించిన సినిమాలు సక్సెస్ అయినప్పటికీ కష్టాలు మాత్రం కొనసాగాయని చెప్తున్నాడు. ఈయన 1990వ దశకంలో అనేక సినిమాలు చేశాడు. షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan), సల్మాన్ ఖాన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇబ్బందులు ఏకరువు పెట్టిన నటుడుసహాయ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆది తాజాగా తన ఇబ్బందులను బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1993లో వచ్చిన బాజీగర్ సినిమా (Baazigar Movie) షారూఖ్ను స్టార్గా మార్చింది. కానీ నాకు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. 1995లో నాకు కూతురు పుట్టింది. ఆ సమయంలో పాల ధర రూ.5గా ఉండేది. కూతురికి పాలు కొనడానికి నా దగ్గర కనీసం రూ.5 కూడా ఉండేవి కాదు. బాజీగర్ సినిమా స్టిల్పెట్రోల్కు డబ్బుల్లేకపోతే..ప్రతిరోజు నగరానికి వెళ్లి ఉద్యోగం కోసం చెప్పులరిగేలా తిరిగేవాడిని. అవకాశాల కోసం అడుక్కునేవాడిని. నా స్నేహితుడి స్కూటర్ తీసుకుని వెళ్లేవాడిని. కొన్నిసార్లు అందులో పెట్రోల్ కొట్టించడానికి కూడా నా దగ్గర డబ్బు ఉండేదికాదు. అప్పుడు బస్సుల్లో తిరిగేవాడిని. జనాలేమో.. నువ్వేంటి, బస్స్టాప్లో ఉన్నావని ఆశ్చర్యపోతూ అడిగేవారు. ఫ్రెండ్ వస్తానన్నాడు, అందుకే వెయిట్ చేస్తున్నా అని అబద్ధాలు చెప్పేవాడిని. అక్క సాయం వద్దన్నానుబస్సుల్లో తిరుగుతుంటే నీకు బస్ ఎక్కాల్సిన అవసరం ఏంటనేవారు. వారి మాటలు భరించలేక ఒక్కోసారి ఇంటికి తిరిగి వెళ్లిపోయేవాడిని. మా అక్కకు నా విషయం తెలిసి ఎన్నోసార్లు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ నేను ఒప్పుకోలేదు. తమ్ముడినైనంతమాత్రాన జీవితాంతం నన్ను పోషించాలని లేదు కదా.. పైగా తనకంటూ ఓ కుటుంబం ఉంది. అప్పటికే ఆ ఫ్యామిలీని చూసుకుంటోంది. నా బాధలేవో నేను పడ్డా..మళ్లీ నా కుటుంబాన్ని కూడా తనే చూసుకోవడం కరెక్ట్ కాదుకదా.. అందుకే నా బాధలేవో నేను పడ్డాను అని చెప్పుకొచ్చాడు. కాగా ఆది ఇరానీ అక్క అరుణ ఇరానీ అప్పటికే ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఆది ఇరానీ.. దిల్, బాజీగర్, బాద్షా, హమ్ ఆప్కే దిల్ మే రెహతా హై, వెల్కమ్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. 2022లో వచ్చిన ఎ థర్స్డే చిత్రంలో చివరిసారిగా నటించాడు.చదవండి: నువ్వు దొరకడం నా అదృష్టం.. ఈ ఏడాదైనా జరగాల్సిందే!: రవి కృష్ణ
న్యూస్ పాడ్కాస్ట్

‘విద్య’లో గందరగోళం.. లక్ష్యం బడికి తాళం. ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యను భ్రష్టు పట్టిస్తోన్న కూటమి ప్రభుత్వం

బీఆర్ఎస్ నాయకుల స్టేచర్ గుండుసున్నా.. కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా, ప్రతిపక్ష నేతగా ఉండాలి, నేను సీఎంగా ఉండాలి ..రేవంత్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులను దగా చేసిన కూటమి ప్రభుత్వం... నష్టానికే పంట అమ్ముకుంటున్న రైతులు

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి సస్పెన్షన్... ‘ఈ సభ నీ సొంతం కాదు’ అన్నందుకు బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ నయవంచనపై తిరుగుబాటు... వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో ‘యువత పోరు’లో కదంతొక్కిన విద్యార్థులు, తల్లితండ్రులు, నిరుద్యోగులు

భారతదేశ కుటుంబంలో మారిషస్ ఒక అంతర్భాగం... ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ

కేసీఆర్ను గద్దె దింపిందీ నేనే. నాది సీఎం స్థాయి.. ఆయనది మాజీ సీఎం స్థాయి. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్లో పాడి రైతుకు కూటమి సర్కారు దగా... ప్రైవేటు డెయిరీలు చెప్పిందే ధర, ఇష్టం వచ్చినంతే కొనుగోలు... లీటర్కు 25 రూపాయల దాకా నష్టపోతున్న రైతులు

వైఎస్ వివేకా కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కూటమి సర్కారు కుతంత్రం. రంగన్న మరణాన్నీ వాడేసుకుంటున్న వైనం

ఆంధ్రప్రదేశ్లో కోటి మంది డ్వాక్రా మహిళలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ద్రోహం... స్త్రీనిధి సంస్థ నిధులకు ఎసరు
క్రీడలు

నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి
భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రశంసలు కురిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ అతడేనని కొనియాడాడు. తాను ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రానే అని కోహ్లి వెల్లడించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటిన కోహ్లి.. ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) సోషల్ మీడియాతో మమేకమైన కోహ్లి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అత్యుత్తమ బౌలర్ ఇక మీ కెరీర్లో ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రపంచంలో ప్రస్తుతం వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్ ఎవరంటే.. జస్ప్రీత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఐపీఎల్లో కొన్ని సందర్భాల్లో అతడు నన్ను అవుట్ చేశాడు. అయితే, ఎక్కువసార్లు నేనే అతడిపై పైచేయి సాధించాను. అయినా సరే.. మా ఇద్దరి మధ్య పోటీ అంటే ఎంతో ఆసక్తికరంగా, సరదాగా ఉంటుంది. ప్రతి బంతిని షాట్ బాదేందుకు నేను ప్రయత్నిస్తా.నన్ను ఆపేందుకు అతడూ ట్రై చేస్తాడు. ఇద్దరి మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరుకున్న వేళ.. ఎవరూ కూడా తగ్గకుండా ముందుకు సాగితే మజాగా ఉంటుంది కదా!.. ఇక నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు నేను రెగ్యులర్గా బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొంటా. నాకు నచ్చిన, నేను ఆస్వాదించే మూమెంట్ అది. అంతేకాదు.. అదే కఠినమైన సవాల్ కూడా!’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు.కాగా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభమైన నాటి(2008) నుంచి కోహ్లి ఆర్సీబీలో కొనసాగుతుండగా.. బుమ్రా తన కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్తో ప్రయాణిస్తున్నాడు. ఫోర్లు బాదిన కోహ్లి.. అవుట్ చేసిన బుమ్రాఇక 2013, ఏప్రిల్ 4న ముంబై తరఫున ఆర్సీబీతో మ్యాచ్తో బుమ్రా ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. నాడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 32 పరుగులు ఇచ్చిన బుమ్రా మూడు వికెట్లు తీశాడు.తన ఆరంభ ఓవర్లోనే కోహ్లి ఒకటి, రెండు, నాలుగో బంతుల్లో ఫోర్లు బాది చుక్కలు చూపించగా.. ఐదో బంతికి బుమ్రా విజయం సాధించాడు. నాడు 19 ఏళ్ల వయసులో ఉన్న బుమ్రా తన అద్భుత నైపుణ్యాలతో వికెట్ల ముందు కోహ్లిని దొరకబుచ్చుకుని.. తన తొలి వికెట్ సాధించాడు. ఇక ఇప్పటి వరకు 133 మ్యాచ్లు పూర్తి చేసుకున్న బుమ్రా 165 వికెట్లు తీశాడు. ముంబై జట్టు ఐదుసార్లు టైటిల్ గెలిచిన సందర్భాల్లోనూ అతడు జట్టులో భాగంగా ఉన్నాడు.మరోవైపు.. కోహ్లి జట్టు ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఇదిలా ఉంటే.. కోహ్లి- బుమ్రా టీమిండియాకు కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే. కోహ్లి సారథ్యంలో బుమ్రా ఆడగా.. పలు సందర్భాల్లో బుమ్రా కెప్టెన్సీలో కోహ్లి ఆడటం విశేషం. చదవండి: అసలు అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు?: పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం"𝙒𝙝𝙚𝙣𝙚𝙫𝙚𝙧 𝙄 𝙛𝙖𝙘𝙚 𝙝𝙞𝙢, 𝙞𝙩'𝙨 𝙡𝙞𝙠𝙚, '𝙊𝙠𝙖𝙮, 𝙞𝙩'𝙨 𝙜𝙤𝙣𝙣𝙖 𝙗𝙚 𝙛𝙪𝙣.'" 🗣Ever wondered who’s the toughest bowler Virat’s ever faced? 🤔 Catch him spill the tea, at the 𝗥𝗖𝗕 𝗜𝗻𝗻𝗼𝘃𝗮𝘁𝗶𝗼𝗻 𝗟𝗮𝗯 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗦𝗽𝗼𝗿𝘁𝘀 𝗦𝘂𝗺𝗺𝗶𝘁… pic.twitter.com/36F8d8twN6— Royal Challengers Bengaluru (@RCBTweets) March 17, 2025

అతడిపై నిషేధం.. బీసీసీఐ నిర్ణయం సరైందే: కేకేఆర్ స్టార్
హ్యారీ బ్రూక్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయాన్ని ఇంగ్లండ్ వెటరన్ ఆటగాడు మొయిన్ అలీ (Moeen Ali) సమర్థించాడు. రెండేళ్ల పాటు ఈ ఇంగ్లండ్ యువ బ్యాటర్పై నిషేధం విధించడం తప్పేమీ కాదని పేర్కొన్నాడు. ఆటగాళ్లు అకస్మాత్తుగా ‘తప్పుకోవాలనే’ నిర్ణయం తీసుకోవడం వల్ల జట్టు కూర్పు దెబ్బతింటుందని అభిప్రాయపడ్డాడు.ఢిల్లీ క్యాపిటల్స్కు ఎదురుదెబ్బకాగా ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్పై బీసీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అతడు రాబోయే రెండు సీజన్ల పాటు ఐపీఎల్లో పాల్గొనకుండా ఈ నిషేధం అమలుకానుంది. ఢిల్లీ క్యాపిటల్స్కు ఎంపికైన బ్రూక్.. మార్చి 22 నుంచి జరిగే ఐపీఎల్ 18వ సీజన్ (IPL 2025)లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ సీజన్ ఐపీఎల్ నుంచి తప్పుకొంటున్నట్లు బ్రూక్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు చేపట్టింది.ఐపీఎల్లో ఈ ఏడాది సవరించిన నిబంధనల ప్రకారం.. ఎవరైనా విదేశీ ఆటగాడు వేలంలో తన పేరు నమోదు చేసుకొని అమ్ముడైన తర్వాత సీజన్కు అందబాటులో ఉండాల్సిందే. గాయం తప్ప ఇతరత్రా కారణాలను సాకులుగా చెబితే కుదరదు. నిబంధన ప్రకారమేఇలా సీజన్ నుంచి అనూహ్యంగా తప్పుకొన్న ఆటగాళ్లను రెండు సీజన్ల పాటు వేలంలో.. అలాగే లీగ్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తారు. ఈ మేరకు ఐపీఎల్ నియమావళిలో నిబంధనలు పొందుపరిచారు. తాజా నిబంధన ప్రకారమే హ్యారీ బ్రూక్పై చర్యలు తీసుకున్నట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా 2025, 2026 సీజన్లలో బ్రూక్ పాల్గొనేందుకు వీలుండదు. ఈ మేరకు సదరు క్రికెటర్తో పాటు, ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కు సమాచారం ఇచ్చారు. నిజానికి బ్రూక్ ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు. నానమ్మ మృతి కారణం చూపుతూగతేడాది కూడా తన నానమ్మ మృతి కారణం చూపుతూ ఏకంగా లీగ్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ క్రికెట్కే తన ప్రాధాన్యత అని స్వదేశంతో భారత్ (జూన్లో)తో జరిగే సిరీస్కు ముందు పూర్తిస్థాయి ఉత్తేజంతో అందుబాటులో ఉండేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తాఈ పరిణామాల నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మొయిన్ అలీ మాట్లాడుతూ.. ‘‘ఇదేమీ కఠిన నిర్ణయం కాదు. బీసీసీఐ ఎందుకు ఇలా వ్యవహరించిందో నేను అర్థం చేసుకోగలను. బ్రూక్ ఒక్కడే కాదు.. చాలా మంది గతంలో ఇలాగే చేశారు.తమకు నచ్చినపుడు తిరిగి వచ్చి ఆర్థికంగా లబ్ది పొందారు. అయితే, వారికి ఇదంతా బాగానే ఉన్నా.. సదరు ఆటగాళ్లను కొన్న ఫ్రాంఛైజీలకు నష్టం జరుగుతుందనేది కాదనలేని వాస్తవం. ఒక్క ఆటగాడి వల్ల జట్టు కూర్పు, వ్యూహాలు, ప్రణాళికలు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.అకస్మాత్ మార్పుల వల్ల అంతా గందరగోళమైపోతుంది. హ్యారీ బ్రూక్ను కొనుక్కున్న జట్టు అతడి స్థానాన్ని సరైన ఆటగాడితో భర్తీ చేయాలనే చూస్తుంది. కానీ అది సాధ్యం కావచ్చు.. కాకపోవచ్చు. కాబట్టి వారు తమ ప్రణాళికలను అందుకు తగ్గట్లుగా మార్చుకోవాల్సి ఉంటుంది.ఆదిల్ రషీద్ సైతంగాయం వల్ల సీజన్ నుంచి తప్పుకొంటే ఎవరూ తప్పుబట్టరు. బోర్డు కూడా ఇందుకు మినహాయింపు ఇస్తుంది. కానీ ఇలా వేరే కారణాలు చూపుతూ అర్ధంతరంగా తప్పుకోవడం ఏమాత్రం సరికాదు’’ అని మొయిన్ అలీ బ్రూక్ తీరును విమర్శించాడు. ఇంగ్లండ్ క్రికెటర్ ఆదిల్ రషీద్ కూడా మొయిన్ అలీ తరహాలోనే బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించడం విశేషం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో మొయిన్ అలీని కోల్కతా రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.చదవండి: IPL 2025: ఓపెనర్లుగా కోహ్లి, సాల్ట్.. ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే..?

అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు? : పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ (Ahmed Shehzad) మండిపడ్డాడు. స్వప్రయోజనాల కోసం జట్టును భ్రష్టుపట్టిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దాల్సిన జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) ఎప్పుడో చేతులెత్తేసిందని.. కేవలం సొంతవాళ్లకు జీతాలు ఇచ్చుకునేందుకు ఇదొక మాధ్యమంగా ఉపయోగపడుతుందని ఆరోపించాడు.గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్- సౌతాఫ్రికా జట్లతో త్రైపాక్షిక వన్డే సిరీస్లో ఓటమిపాలైన రిజ్వాన్ బృందం.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ వైఫల్యం చెందింది.ఈ మెగా వన్డే టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి.. కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖరిదైన బంగ్లాదేశ్తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో నిరాశగా వెనుదిరిగింది.ఈ క్రమంలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజంలపై వేటు వేసిన పీసీబీ.. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ నుంచి వారిని పక్కనపెట్టింది. టీ20 కొత్త కెప్టెన్గా సల్మాన్ ఆఘాకు బాధ్యతలు అప్పగించింది. 91 పరుగులకే ఆలౌట్ .. ఘోర ఓటమిఅయితే, కివీస్ దేశ పర్యటనలో భాగంగా తొలి టీ20లో పాకిస్తాన్ అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకుంది. తొలుత 91 పరుగులకే ఆలౌట్ అయిన పాకిస్తాన్.. లక్ష్య ఛేదనలో కివీస్ను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయింది.పాక్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 10.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. ఫలితంగా పాక్ టీ20 చరిత్రలో ఇదో ఘోర ఓటమి(59 బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థి టార్గెట్ ఛేదించడం)గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ పీసీబీ సెలక్షన్ కమిటీ తీరును తూర్పారబట్టాడు.అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు? ‘‘అసలు షాదాబ్ను ఏ ప్రాతిపదికన జట్టులోకి తీసుకున్నారు. అతడి ప్రదర్శన గత కొంతకాలంగా ఎలా ఉందో మీకు తెలియదా? అతడిని జట్టులోకి తీసుకువచ్చింది ఎవరు? ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఏమవుతుందో చూడండి. షాదాబ్ విషయంలో పీసీబీ ప్రణాళికలే వేరు. అతడిని ఎందుకు ఎంపిక చేశారన్నది కొద్దిరోజుల్లోనే బయటపడుతుంది.అయినా.. కివీస్తో తొలి టీ20లో మా బౌలర్లు అసలు ఏం చేశారు? మాట్లాడితే సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నారు అంటారు. కానీ వాళ్లలో ఒక్కరైనా బాధ్యతగా ఆడారా? అసలు ప్రత్యర్థిని కాస్తైనా భయపెట్టగలిగారా? ఇంతకంటే చెత్త ఓటమి మరొకటి ఉంటుందా?’’ అని షెహజాద్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా కివీస్తో తొలి టీ20లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ కేవలం 3 పరుగులే చేశాడు. అదే విధంగా.. రెండు ఓవర్ల బౌలింగ్లో పద్దెమినిది పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.ఎన్సీఏను ఎవరు నడిపిస్తున్నారు?ఇక NCA గురించి ప్రస్తావిస్తూ.. ‘‘జాతీయ క్రికెట్ అకాడమీ ఆటగాళ్ల నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దాలి. ఇక్కడి నుంచే మెరికల్లాంటి ఆటగాళ్లు వచ్చేవారు. నేను.. మహ్మద్ ఆమిర్, ఇమాద్ వసీం, ఉమర్ అమీన్, షాన్ మసూద్ వచ్చాం. మేము ఎన్సీఏలో ఉన్నప్పుడు వివిధ రకాల శిక్షణా శిబిరాలు నిర్వహించేవారు. ముదాస్సర్ నజర్ వంటి కోచ్లు ఉండేవారు.కానీ గత నాలుగేళ్లుగా ఎన్సీఏ ఏం చేస్తోంది? ఎన్సీఏను ఎవరు నడిపిస్తున్నారు? ఆటగాళ్ల అభివృద్ధికి దోహదం చేయాల్సింది పోయి.. సొంతవాళ్లకు జీతాలు ఇచ్చేందుకు మాత్రమే దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఎన్సీఏ చీఫ్ నదీమ్ ఖాన్ ఏం చేస్తున్నారు.ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారా? జవాబుదారీతనం ఉందా? ప్రతిసారీ ఆటగాళ్లను ఓటములకు బాధ్యులను చేయడం సరికాదు. నదీమ్ ఖాన్ను ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎన్సీఏ లాంటి కీలకమైన వ్యవస్థను నీరుగారుస్తుంటే ఎవరూ మాట్లాడరే? అసలు ఆయనను ఏ ప్రాతిపదికన అక్కడ నియమించారు? ఇందుకు అతడికి ఉన్న అర్హతలు, నైపుణ్యాలు ఏమిటి? అసలు పీసీబీ ఏం చేస్తోంది?’’ అని అహ్మద్ షెహజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: IPL 2025: 18వ సారైనా... బెంగళూరు రాత మారేనా!

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్గా డుప్లెసిస్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. తమ జట్టు వైస్ కెప్టెన్గా ఫాఫ్ డుప్లెసిస్ను నియమిస్తున్నట్లు ఇవాళ (మార్చి 17) వెల్లడించింది. గత రెండు సీజన్లలో ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరించిన ఫాఫ్ను ఢిల్లీ ఈ సీజన్ మెగా వేలంలో సొంతం చేసుకుంది. ఢిల్లీ ఫాఫ్ను బేస్ ధర రూ. 2 కోట్లకు దక్కించుకుంది. కొద్ది రోజుల కిందటే ఢిల్లీ యాజమాన్యం తమ నూతన కెప్టెన్గా అక్షర్ పటేల్ను ఎంపిక చేసింది. ఈ సీజన్లో ఫాఫ్ అక్షర్కు డిప్యూటీగా పని చేస్తాడు. ఆర్సీబీ కెప్టెన్గా, సౌతాఫ్రికా కెప్టెన్గా ఫాఫ్కు మంచి అనుభవం ఉంది. ఫాఫ్ కెప్టెన్సీ అనుభవం ఈ సీజన్లో అక్షర్ పటేల్కు చాలా ఉపయోగపడుతుందని ఢిల్లీ మేనేజ్మెంట్ భావిస్తుంది. ఫాఫ్ ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్, ఆర్సీబీ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. ఫాఫ్ తన ఐపీఎల్ కెరీర్లో 145 మ్యాచ్లు ఆడి 136.37 స్ట్రయిక్రేట్తో 4571 పరుగులు చేశాడు. ఇందులో 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫాఫ్ ఈ సీజన్లో ఢిల్లీ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆసీస్ యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్తో ఫాఫ్ జోడీ కట్టవచ్చు. కాగా, ఢిల్లీ మేనేజ్మెంట్ అక్షర్ పటేల్ను కెప్టెన్గా నియమించకముందు ఈ సీజన్లోనే తమతో చేరిన కేఎల్ రాహుల్ను కెప్టెన్సీ కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే ఢిల్లీ మేనేజ్మెంట్ ఆఫర్ను రాహుల్ తిరస్కరించాడని సమాచారం. రాహుల్ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ సీజన్లో రాహుల్, డుప్లెసిస్తో పాటు ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ కూడా ఢిల్లీతో జతకట్టాడు. ఈ సీజన్ మెగా వేలంలో ఢిల్లీ మేనేజ్మెంట్ స్టార్క్కు మంచి ధర చెల్లించి సొంతం చేసుకుంది. గత సీజన్ వరకు ఢిల్లీ కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ను ఈ సీజన్లో లక్నో రికార్డు ధరకు (రూ.27 కోట్లు) సొంతం చేసుకుంది. పంత్ లక్నో కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం.. మే 24న లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే మ్యాచ్తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ వైజాగ్లో జరుగనుంది. ఈ సీజన్ మార్చి 22న కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్తో మొదలవుతుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, త్రిపురణ విజయ్
బిజినెస్

భారత్లో యాపిల్-గూగుల్ భాగస్వామ్యం..?
భారత్లోని ఐఫోన్ల్లో రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (ఆర్సీఎస్) మెసేజింగ్ను తీసుకురావడానికి యాపిల్ గూగుల్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ భాగస్వామ్యం మెసేజింగ్ సాంకేతికతలో మార్పును సూచిస్తుంది. ఈ చర్యలు ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో ఒకటైన ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారుల సంఖ్యను పెంచేలా వీలు కల్పిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత ఐఓఎస్ 18.2 వెర్షన్లో పీ2పీ (పర్సన్-టు-పర్సన్) ఆర్సీఎస్ను యూఎస్, కెనడా, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె, బెల్జియం, చైనా వంటి ఎనిమిది దేశాల్లో ప్రారంభించారని గ్లోబల్ ఆర్సీఎస్ ప్లాట్ఫామ్ ప్రొవైడర్ డాట్గో సీఈఓ ఇందర్పాల్ ముమిక్ పేర్కొన్నారు. ఇందుకోసం యాపిల్ ‘ఐమెసేజ్’ క్లయింట్ గూగుల్ బ్యాక్ ఎండ్ సర్వర్లలో పనిచేయడానికి పరస్పరం ఇరు కంపెనీలు సహకరించుకున్నట్లు తెలిపారు. ఈ దేశాల్లో ఆర్సీఎస్ కోసం క్యారియర్ నెట్ వర్క్లను అనుసంధానించినట్లు చెప్పారు. అయితే గూగుల్కు అంతగా ఆదరణ లేని చైనాలో ప్రత్యామ్నాయ సర్వర్ వెండర్లను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.జీఎస్ఎం అసోసియేషన్ అభివృద్ధి చేసిన అధునాతన ప్రోటోకాల్ ఆర్సీఎస్ మెసేజింగ్ హై-రిజల్యూషన్ మీడియా షేరింగ్, రీడ్ రసీదులు, టైపింగ్ ఇండికేటర్స్, ఇంటర్నెట్ ఆధారిత సందేశాలు వంటి ఫీచర్లను అందిస్తుంది. సాంప్రదాయ ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ మాదిరిగా కాకుండా ఆర్సీఎస్ మొబైల్ డేటా లేదా వై-ఫై ద్వారా పనిచేస్తుంది. ఇది అంతరాయంలేని మెరుగైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: ‘ఆర్థికాభివృద్ధికి ఈ రెండే కీలకం’రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్(ఆర్సీఎస్) మెసేజింగ్ సాంప్రదాయ ఎస్ఎంఎస్లతో పోలిస్తే వినియోగదారు అనుభవాన్ని పెంచే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అధిక రిజల్యూషన్ చిత్రాలు, వీడియోలు, జిఫ్ల వంటి ఫైళ్లను ఆర్సీఎస్ మెసేజింగ్ అందిస్తుంది. వాట్సాప్, ఐమెసేజ్ వంటి చాట్ యాప్స్ మాదిరిగానే అవతలి వ్యక్తి టైప్ చేస్తున్నప్పుడు రియల్టైమ్లో చూడవచ్చు. ఎస్ఎంఎస్ మాదిరిగా కాకుండా ఆర్సీఎస్ సందేశాలను వై-ఫై లేదా మొబైల్ డేటా ద్వారా పంపవచ్చు. ఇది ఎస్ఎంఎస్ ఛార్జీలను ఆదా చేస్తుంది. సాధారణ సందేశాలను 160 అక్షరాలకు పరిమితం చేసే ఎస్ఎంఎస్ మాదిరిగా కాకుండా, ఆర్సీఎస్ మరింత వివరణాత్మక సందేశాలకు అనుమతిస్తుంది.

భారత్ కోసం సిద్దమవుతున్న టెస్లా కారు ఇదే!
టెస్లా (Tesla) కంపెనీ తన కార్లను ఇండియన్ మార్కెట్లో విక్రయించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సంస్థ భారతీయ విఫణి కోసం ప్రత్యేకంగా 'మోడల్ వై' (Model Y)ను మరింత చౌకైన వెర్షన్గా అభివృద్ధి చేస్తోంది. దీని ధర సాధారణ మోడల్ కంటే 20 శాతం తక్కువ. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో టెస్లా ఈ మోడల్ తీసురానుంది.టెస్లా తన భారత కార్యకలాపాలను.. తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ కారుతో ప్రారంభించాలని యోచిస్తోంది. దీనిని కంపెనీ బెర్లిన్ గిగాఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ. 21 లక్షలు ఉంటుంది. ఈ కారును చైనా, యూరప్, ఉత్తర అమెరికా మార్కెట్లలో కూడా విక్రయించే అవకాశం ఉంది. అమెరికాలో కూడా దీని ఉత్పత్తిని పెంచడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది.సర్టిఫికేషన్ కోసం దరఖాస్తుటెస్లా కంపెనీ భారతీయ మార్కెట్లో విక్రయించనున్న ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం.. సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో కార్లను విక్రయించే ముందు సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియ తప్పనిసరి. కాబట్టి టెస్లా ఇండియా మోటార్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో 'మోడల్ వై, మోడల్ 3' కార్ల హోమోలోగేషన్ కోసం రెండు దరఖాస్తులను సమర్పించింది.

‘ఆర్థికాభివృద్ధికి ఈ రెండే కీలకం’
భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి సాధించాలంటే బలమైన ప్రైవేట్ మూలధన వ్యయం(private capital expenditure), వినియోగం పెరగాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. రూ.52 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లున్న ఎస్బీఐ బ్యాంక్కు ఈయన ఇటీవల ఛైర్మన్గా ఎన్నికయ్యారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేస్తూ, భవిష్యత్తు వృద్ధిని అంచనా వేస్తూ వ్యాఖ్యలు చేశారు.దేశాభివృద్ధికి ప్రస్తుతం కొన్ని రంగాల్లో ప్రైవేటు మూలధన వ్యయం జరుగుతుండగా ఉక్కు, సిమెంట్ వంటి కీలక పరిశ్రమలు పెట్టుబడులకు ముందుండాలని శెట్టి సూచించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక పురోగతికి ఈ రంగాలు కీలకమని చెప్పారు. ప్రస్తుత త్రైమాసిక ఆర్థిక గణాంకాలు వృద్ధికి కీలకమైన వస్తు వినియోగంలో సానుకూల ధోరణిని సూచిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ 40వ పెళ్లి రోజు.. బంగారు రంగు కేక్!భారతదేశం అర్థవంతమైన పురోగతిని సాధించడానికి 8 శాతం జీడీపీ వృద్ధి రేటు అవసరమని నొక్కి చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి వినియోగం పెంపు, ప్రైవేట్ రంగ పెట్టుబడుల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పెరుగుదలపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టారిఫ్ సంబంధిత సమస్యల కారణంగా ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలు నెలకొంటాయని భావించడంలేదని వివరించారు.

ప్రతి నెలా రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద మొత్తం ఎలా?
నేను ప్రతి నెలా రూ.5,000 మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. దీర్ఘకాలానికి మెరుగైన పథకాలను సూచించగలరు. – అహ్మద్ వానిదీర్ఘకాలానికి ఈక్విటీ ఫండ్స్ మెరుగైనవే. మార్కెట్లలో ఉండే ఆటుపోట్ల దృష్ట్యా మీకు సౌకర్యమైన పథకాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటే, హైబ్రిడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతాయి. ఇవి మూడింత రెండొంతులు పెట్టుబడులను ఈక్విటీలకు, మిగిలినది డెట్కు కేటాయిస్తుంటాయి. మార్కెట్ పతనాల్లో పెట్టుబడుల విలువ క్షీణతకు డెట్ పెట్టుబడులు కుషన్గా పనిచేస్తాయి. ప్రతి నెలా రూ.5,000 చొప్పున గత 20 ఏళ్ల నుంచి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ మొత్తం రూ.51.25 లక్షలుగా మారి ఉండేది.అంటే వార్షిక సిప్ రాబడి 12.18 శాతం. ఒకవేళ పెట్టుబడుల్లో అనుభవం ఉండి, మార్కెట్ ఆటుపోట్లను తట్టుకునేట్టు అయితే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఈ పథకాలు పూర్తిగా ఈక్విటీల్లో.. అది కూడా లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. అధిక రిస్క్ తీసుకున్నప్పటికీ 20 ఏళ్ల కాలంలో చూస్తే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లో వార్షిక రాబడి 12.66 శాతమే ఉంది. కనుక ఇన్వెస్టర్లు తమ రిస్క్కు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలి. ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి పలు న్యూ ఫండ్ ఆఫర్లు (ఎన్ఎఫ్వోలు/కొత్త పథకాలు) ప్రారంభం కావడం చూశాను. అవి ఎంతో ఆకర్షణీయంగా అనిపించాయి. కానీ, ఇప్పటికే పెట్టుబడులకు అందుబాటులో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పథకాల కంటే ఎన్ఎఫ్వోల్లో ఇన్వెస్ట్ చేయడం మెరుగైనదా? అన్న విషయంలో నాకు స్పష్టత లేదు. ఎన్ఎఫ్వోల్లో పెట్టుబడులు పెట్టే ముందు చూడాల్సిన అంశాలు ఏవి? – కరుణాకర్మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తరచుగా కొత్త పథకాలను ప్రవేశపెడుతుంటాయి. ప్రస్తుత పథకాలతో పోల్చి చూస్తే వీటిల్లో ఉండే వ్యత్యాసం కొంతే. కొన్ని ఎన్ఎఫ్వోలు మాత్రం కొత్త పెట్టుబడుల అవకాశాలతో ముందుకు వస్తుంటాయి. ఇన్వెస్టర్లు ఇప్పటికే మంచి పనితీరు చూపిస్తున్న పథకాలకు పరిమితం కావడం మంచిది. ఎన్ఎఫ్వోల్లో ఇన్వెస్ట్ చేసే ముందుకు ప్రశ్నించుకోవాల్సిన అంశాలు చూద్దాం. ఎన్ఎఫ్వోలో కొత్తదనం ఏదైనా ఉందా? అన్నది చూడాలి. చాలా ఎన్ఎఫ్వోలు ప్రస్తుత పథకాలకు మాస్క్ మాదిరిగా ఉంటాయి. ఇంటర్నేషనల్ ఈక్విటీ, గోల్డ్ ఫండ్స్ తదితర వినూత్నమైన ఆఫర్లు మినహా సాధారణమైన ఎన్ఎఫ్వోలతో పోర్ట్ఫోలియోకు అదనంగా ఒనగూడే ప్రయోజనం ఏదీ ఉండదు. థీమ్ లేదా సెక్టార్ ఫండ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సంబంధిత ఎన్ఎఫ్వో తమ పెట్టుబడుల అవసరాలను తీర్చే విధంగా ఉందా? అన్నది చూడాలి.మీ ప్రస్తుత పెట్టుబడులు మీ ఆర్థిక లక్ష్యాలను తీర్చే విధంగా ఉంటే, ఎన్ఎఫ్వో మెరుగైన ఆప్షన్ కాకపోవచ్చు. ప్రతీ ఫండ్ మీ పోర్ట్ఫోలియోలో చేరాలనేమీ లేదు. కొత్తగా వచ్చిన ఎన్ఎఫ్వో మాదిరిగా పెట్టుబడుల విధానాన్ని ఆఫర్ చేస్తున్న పథకాలు ఇప్పటికే ఏవైనా ఉన్నాయేమో పరిశీలించాలి. ఒకవేళ ఉంటే, వాటిల్లో రాబడుల పనితీరు కొన్నేళ్ల నుంచి మెరుగ్గా ఉందా? లేదా అన్నది పరిశీలించాలి.సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
ఫ్యామిలీ

ఔషధ గుణాల సిరి ‘ఉసిరి : దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఉసిరిని ( Amla) ఔషధ గుణాల సిరి, ఆరోగ్య సిరి అని పిలుస్తారు. ప్రకృతిపరంగా సహజ సిద్ధంగా లభించే వాటిలో ఉసిరి ఒకటి. ఇవి కూడా సీజన్ పరంగానే లభిస్తాయి. ఉసిరికాయలు బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులకు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. సన్న నిమ్మ, చీని, మామిడి, సపోటా, సీతాఫలం తరహాలోనే ఉసిరి కూడా రైతుకు కొన్నేళ్లపాటు ఆదాయాన్ని అందిస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఉసిరి ప్రయోజనాలు(Helath benifits) తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఉసిరి(Indian gooseberry) ముసలితనాన్ని నిరోధించడంలోనూ, శక్తివంతులుగా చేయడంలో దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక రకమైన ఎలర్జీతో సతమత మవుతుంటారు. కాలుష్య ప్రభావంతో 30% ఏదో రకమైన ఎలర్జీతో బాధపడుతుంటారు. ఈ ఎలర్జీ ఆస్త్మా రూపంలో ఉంటుంది. ఎలర్జీ నుండి రక్షణ కల్పించడంలో ఉసిరికాయ ఎంతో దోహదపడుతుంది. ఉసిరి ఫంగస్ నిరోధకంగా రక్తనాళాలలో కలిగే ఫ్లేక్ నిరోధకంగా, క్యాన్సర్ నిరోధకంగా జీవకణాల్లో డీఎన్ఏకు పెంచడం ద్వారా రోగ నిరోధకంగా పనిచేస్తుంది. మనకు లభించే ఆహార పదార్థాలన్నింటిలో అత్యద్భుతమైన యాంటీ యాక్సిడెంట్ గుణాలు పదార్థం కలిగి ఉంటుంది. శరీరంలో నిరంతరం జరిగే జీవ ప్రక్రియతోపాటు కాలుష్యంవల్ల శరీరంలో కణాల మధ్య జరిగే నష్టాన్ని నివారించడంలో చక్కటి పాత్ర పోషిస్తుంది. చదవండి: మండుతున్న ఎండలు : సమతుల ఆహారంతోనే ఆరోగ్యంఅనారోగ్యాన్ని కలిగించే కణ విభజనను ఉసిరి నివారిస్తుంది. ఉసిరికాయ నిజానికి అద్భుతమైన ఫలంగానే భావించాలి. సూపర్ ఫుడ్గా పరిగణించే పసుపు కంటే ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు రెండు రెట్లు అధికంగా ఉంటాయి. ఉసిరిలో దానిమ్మకాయ కంటే 60 రెట్లు అధికంగా ఉంటాయి. ఉసిరిలో శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ సి కలిగి ఉండి కమజాలాన్ని కలిపి ఉంచే పునరుత్పత్తి చేయడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి, చర్మవ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇలా ఉసిరికాయలో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని పచ్చళ్ళుగా( ఊరగాయ) తయారు చేసుకుని ఎంచక్కా ఆరగించే అవకాశం ఉంది. వీటిని నిల్వ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ ఉసిరి చెట్టును చాలామంది ఇంటి పెరటి భాగంలో పెంపకం చేపడుతారు. చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్

మండుతున్న ఎండలు : సమతుల ఆహారంతోనే ఆరోగ్యం
జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మార్చిలోనే ఎండలు ముదురుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్రమైన ఎండలతోపాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ కాలంలో మనం తీసుకునే ఆహారం అత్యంత కీలకంమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు శరీరం డీ హైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. చెమట అధికంగా ఉత్పన్నమవుతుంది. ఇలా ఉంటే శరీరంలోని లవణాలు తగ్గిపోయి వడదెబ్బ బారిన పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు తప్పక పాటించాలని చెబుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ల లోపు నిత్యం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజుల్లో 42 వరకూ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. ఈ నేపత్యంలో వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలామంది చల్లని ద్రవ పదార్థాలు తీసుకునేందుకు ఇష్టపడతారు. వేసవిలో చర్మవ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటంది. ఇవన్నీ ఎదుర్కొవాలంటే రోగ నిరోధకశక్తి పెంచే విధంగా....ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవాలి. మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడుతుందనే ఆలోచన కలిగి ఉండాలి. ఎక్కువ నీరు తీసుకోవాలి శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు తగ్గించడంలో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు 3–5 లీటర్ల వరకు నీరు తీసుకుంటూ ఉండాలి. శరీరం డీ హైడ్రేషన్కు గురి కాకుండా చూసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. తాజా పండ్లు తీసుకోవాలి ప్రతి రోజూ నీరు, పోషకాల శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. తాజా పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, జామ, అరటి, యాపిల్ పండ్లు తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, కమల రసాలు శ్రేయేస్కరం. రాగులు, జొన్నలు తదితర చిరుధాన్యాలు తీసుకోవడం కూడా మంచిది. ఇవి శక్తిని ఇవ్వడంతోపాటు ఎండల్లో నిస్సత్తువ రాకుండా చూస్తుంది. ద్రవ పదార్థాలు తీసుకోవాలి ఎండలో ఎక్కువగా తిరిగే వారు ద్రవ పదర్థాలను తీసుకుంటూ రావాలి. మజ్జిగతో పాటు కొబ్బరినీరు, లస్సీ, చెరుకు రసం అధికంగా వినియోగించాలి. ఉల్లిపాయల్లో శరీరాన్ని చల్లబరిచే గుణం కలిగి ఉంది. ఉల్లిని నిత్యం ఆహారంలో తీసుకుంటే వడ దెబ్బ బారిన పడే అవకాశాలు తక్కువ. మజ్జిగ శరీరంలోని జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు అందులో ప్రో బయోటిక్స్ అధికంగా ఉంటాయి. కొబ్బరినీరు ఈ కాలంలో తరుచుగా తీసుకుంటే ఖనిజ లవణాలు ఎక్కువ శక్తిని ఇచ్చి వడగాలులు, వేగి గాలుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. పటిష్టమైన రోగ నిరోధక శక్తి వేసవిలో బలమైన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఖనిజ లవణాలు అధికంగా ఉండేలా చూడాలి. పాలు, గుడ్లు, టమోటా, నారింజ, పసుపు రంగు కూరగాయలు, చిలకడదుంప, చేపలు, బ్లాక్ బెర్రి, బ్లూ బెర్రి తినడం మంచిది. ఆహారంలో సొరకాయ, బీరకాయ, దోసకాయ, పొట్లకాయ తదితర కూరగాయలు వినియోగించడం శ్రేయస్కరం.చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి ప్రతి ఒక్కరూ ఎండలో అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండడం ఎంతో మంచిది. తలపై రక్షణకు గొడుగు లేదా టోపీ పెట్టుకోవాలి. చేనేత, కాటన్ దుస్తులు ధరించి మంచిది. ఎక్కువ నీరు తాగడంతోపాటు మనిషికి సరిపడేలా నిద్రపోవాలి. ప్రతిరోజు వ్యాయామం మరింత మంచిది. ఎండలు ఎక్కువగా ఉండడంతో కాపీ, టీలు అలవాటున్న వారు వీలైనంత తగ్గించుకుంటే మంచిది. – డాక్టర్ శ్రీనాథరెడ్డి, సూపరింటెండెంట్, వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి, కడప

పదోతరగతి పరీక్షలు: ఈ పంచ సూత్రాలతో ఒత్తిడి పరార్..! గెలుపుని ఒడిసిపడదాం ఇలా..
ఈనెల 21 నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పరీక్షల్లో విజయానికి ప్రణాళిక బద్ధంగా చదవడం సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా అలసిపోయి ప్రతికూల ఆలోచనలతో ఆందోళన చెందుతుంటారు. దీంతో పరీక్షలు అంటే విద్యార్థులకు భయం ఏర్పడడం సహజం. ఇలాంటి సమయాల్లో ఎంతో నేర్పుగా ఉండి, ఆందోళనలను దూరం చేసుకుని స్వేచ్ఛగా పరీక్షలను రాస్తే విజయం సొంతం చేసుకోవచ్చు. ప్రణాళిక బద్ధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వీలు కలుగుతుంది.ఉపాధ్యాయులు ఇలా చేయాలి..విద్యార్థులను జీపీఏ, ర్యాంకులు, మార్కుల పేరు తో ఒత్తిడి చేయరాదు. ఇంటి వద్ద పిల్లలు ఎలా చదువుతున్నారు అనే దానిపై తల్లిదండ్రులతో ఆరా తీయాలి. పరీక్షల నేపథ్యంలో ఆందోళన చెందకుండా తరచూ పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడి ప్రోత్సహించాలి.విద్యార్థులతో చేయకూడనివి..విద్యార్థులను ఇతరులతో పోల్చి వాళ్లలోని ఆత్మనున్యత భావాన్ని కలిగించరాదు. వారిని భోజనం చేయడానికి ఒంటరిగా వదలకుండా వారితో కలిసి కడుపునిండా భోజనం చేసేలా చూడాలి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో గడుపుతూ వాళ్ల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చాలి. వారిపై అత్యాశలు పెట్టుకొని వారిని చదవాలంటూ తరచూ ఒత్తిడికి గురిచేయొద్దు. తల్లిదండ్రులు, టీచర్లు వారి ఆశలను పిల్లలపై రుద్ది ఇబ్బందులకు గురి చేయరాదు.వైద్యులతో కౌన్సెలింగ్పరీక్షలు అంటేనే భయానికి గురయ్యే విద్యార్థులకు ఒత్తిడి బారిన పడకుండా స్థానిక వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. విషయాల వారీగా ఎలా సిద్ధం కావాలని తెలియజేస్తూ ప్రశాంతంగా ఉండేందుకు సలహాలు సూచనలు చేయాలి. పౌష్టిక ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర కలిగి ఉండడం, యోగా ధ్యానం చేసే విధంగా ప్రోత్సహించాలి. టీవీ సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి. చదువుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలి. బట్టీ పట్టకుండా అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలి.పంచ సూత్రాలు పాటిద్దాం..ధోరణి: విద్యార్థులు మానసిక స్థితి బాగుండాలి. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో ఎలాంటి ఆందోళన గురికారాదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సందేహాలను నివృత్తి చేసుకొని బృంద చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలి.నమ్మకం: సబ్జెక్టుల వారీగా పట్టు సాధించేందుకు కృషి చేయాలి. ముందుగా తనపై తనకు నమ్మకం కలిగి ఏదైనా సాధించగలమనే దీమా పెంచుకోవాలి. లక్ష సాధనకు ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలి.ఏకాగ్రత: పాఠ్యాంశాలను చదివే క్రమంలో పూర్తి ఏకాగ్రతను కలిగి ఉండాలి. చదివే సమయంలో ఆలోచనలు, చూపు పక్కదారి పట్టకుండా చూసుకోవాలి. నిత్యం ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.క్రమశిక్షణ: పరీక్షల సమయంలో సామాజిక మాద్యమాలకు దూరంగా ఉండాలి. సెల్ ఫోన్, టీవీలకు బానిసలు కాకుండా పుస్తకాలపైనే దృష్టి పెట్టాలి. చదువును వదిలి పక్కదారి పట్టే విధంగా కాకుండా క్రమశిక్షణగా మెలగాలి.దృష్టి: విద్యార్థుల దృష్టి పూర్తిగా చదువుపై కేంద్రీకరించాలి. వ్యసనాలకు దూరంగా ఉండి పుస్తకాలతోనే గడపాలి. టీచర్లు, పేరెంట్స్ విద్యార్థులకు అనుకూల వాతావరణాన్ని కల్పించి కఠిన అంశాలపై పట్టు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలి. సులువైన వాటిని చివరకు చదివే విధంగా సూచనలు చేయాలి.అందమైన చేతి రాతతో..పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించేందుకు అందమైన చేతి రాత ఎంతో ఉపకరిస్తుంది. అక్షరాలను ఆకట్టుకునే విధంగా గుండ్రంగా రాస్తూ పదాలకు పదాలకు మధ్య సమదూరాన్ని పాటించాలి. అక్షరాలన్నీ ఒకే సైజులో ఉండేలా, అక్షర దోషాలు లేకుండా కొట్టివేతలకు తావుగకుండా చూసుకోవాలి.తేలికగా జీర్ణమయ్యే ఆహారం మేలుసమయానికి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్, మాంసాహారాలకు దూరంగా ఉండాలి. పప్పు దినుసులు, ఆకుకూరలు, పాలు, పండ్లు తినాలి. కాఫీ, టీ జోలికి పోరాదు. నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. గోరువెచ్చని నీరు తాగితే జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు ఉండవు. రోజు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.– డాక్టర్ గందె కార్తీక్, జనరల్ ఫిజీషియన్, నారాయణపేటప్రశాంతంగా చదవాలిపరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పిల్లలు ఆందోళన, మానసిక ఒత్తిడికి గురికారాదు. మార్కులపై దృష్టి పెట్టి బెంగ పడితే లాభం ఉండదు. మానసిక ప్రశాంతతతోనే ఉత్తీర్ణత సాధిస్తాం. మెదడు చెరుకుగా పనిచేసే విధంగా ఉత్తేజితం కావాలి.– యాద్గిర్ జనార్ధన్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నారాయణపేట.ఇతర విషయాలపై దృష్టి పెట్టొద్దుప్రశాంతంగా ఉండి ఉత్సాహంతో పరీక్షలకు హాజరు కావాలి. గంటల తరబడి చదవాలనే నియమం లేదు. మానసికంగా సంసిద్ధులుగా ఉన్న సమయంలోనే పాఠ్యాంశాలు చదవాలి. ఇతర విషయాలపై దృష్టి పెట్టరాదు. ఇప్పటివరకు చదివిన అంశాలనే పునఃశ్చరణ చేసుకోవాలి. కొత్త వాటి జోలికి పోరాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.– గోవిందరాజు, డీఈఓ(చదవండి: తల్లికి జరిగిన అన్యాయమే ఐఏఎస్ అధికారిగా మార్చింది..ఆనంద్ మహీంద్రా మెచ్చిన స్టోరీ..)

పద్ధతిగా బతకడం అంటే ఇది..!
ఓ రాజుకు ఒక గురువు తారసపడ్డాడు. రాజ్యం సుఖసంతోషాలతో ఉండాలంటే ఏమి చేయాలని ఆ గురువును అడిగాడు రాజు. ప్రతి గ్రామంలోనూ సత్సంగం జరుపుకోడానికి, ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవడానికి తగిన భవన సముదాయాలు కట్టించమన్నాడు గురువు.అలాగేనన్నాడు రాజు. అయితే రాజు మనసులో ఓ అనుమానం మొదలయ్యింది. ‘నిజంగా అలాంటి ఏర్పాట్లు చేస్తే ప్రజల్లో నైతికత, భక్తి భావం నెలకొని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారా?’ అని! ‘సరే, ప్రయత్నించి చూద్దాం, సాధ్యాసాధ్యాలు పరిశీలిద్దాం’ అని మందీమార్బలంతో బయలుదేరాడు.తమ రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న చిన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ గుడి దగ్గర ప్రవచనకర్త ప్రవచనాలు చెబుతూ ఉన్నాడు. జనం దండిగా కూర్చుని ప్రవచనాలను ఆసక్తిగా వింటూ ఉన్నారు. కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు రాజు అక్కడే ఉండి ‘‘నాలుగు మంచి మాటలు వినడానికి మీరు చూపిస్తున్న ఆసక్తి ఎంతో సంతోషకరం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న మీకందరికీ నా కానుకగా ఒక్కో వెండినాణెం ఇవ్వదలిచాను. వచ్చి తీసుకోండి’’ అని చెప్పాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆశ్చర్యపోయాడు రాజు. విషయం ఏమిటని ప్రవచనకర్తను అడిగాడు. ‘‘ఇక్కడి వారికి చేయి చాపడం ఇష్టం ఉండదు. ఉచితంగా ఇస్తే ఏదీ తీసుకోరు’’ అని చెప్పాడు ప్రవచనకర్త. ఎందువల్ల వారు ఇలా చేస్తున్నారని అడిగాడు రాజు.‘‘ఏళ్లకొద్దీ ఈ గ్రామంలో సత్సంగం జరుగుతోంది. బతికినంత కాలం పద్ధతిగా బతకాలని అనుకుంటారు. తాము కష్టపడి సంపాదించిన దానితో తృప్తిగా జీవనం సాగిస్తారు’’ అని బదులిచ్చాడు ప్రవచనకర్త. రాజు చిన్నగా అక్కడినుంచి బయలుదేరి నదికి ఆవల ఉన్న మరో గ్రామానికి వెళ్ళాడు. అక్కడ రచ్చబండ దగ్గర చాలామంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాజు వచ్చింది తెలుసుకుని అందరూ గుమికూడారు.‘‘మీ ఊర్లో సత్సంగం జరుగుతోందా?’’ అని అడిగాడు రాజు. అలాంటి పదమే వినలేదని బదులిచ్చారు. మీకందరికీ వెండి నాణేలు పంచాలని ఉందని చెప్పాడు రాజు. అంతే... జనం పరుగులు తీస్తూ వచ్చి, ఎగబడి తీసుకున్నారు. రాజులో ఆలోచనలు మొదలయ్యాయి.‘మొదటి గ్రామంలో ఇచ్చేవాడున్నా తీసుకోలేదు వారు. ఆధ్యాత్మిక భోధనల వల్ల గ్రామస్తులు ఉన్నదానితో తృప్తిగా ఉన్నారు. వారి మనస్సుల్లో ఆధ్యాత్మిక బీజాలు నాటబడ్డాయి. రెండవ గ్రామంలో... ఎవరైనా ఇస్తే తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామస్తులు తీసుకోవడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారంటే వారిలో ‘ఇంకా... ఇంకా’ కావాలన్న కోరిక బలంగా ఉంది. ఎందుకంటే ఆ గ్రామస్తుల మనస్సుల్లో ఆధ్యాత్మిక బీజాలు నాటబడ లేదు’ అని గుర్తించాడు రాజు.‘ఆధ్యాత్మిక బోధనలు చేయించి మంచి చెడ్డలు తెలియజేయాల్సిన బాధ్యత నాది’ అని అనుకుంటూ అక్కడినుంచి కదిలాడు రాజు. త్వరత్వరగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భవన సముదాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు (చదవండి: దైనందిన జీవితంలో దైవం అంటే..?)
ఫొటోలు


వైట్ స్కర్ట్లో పిజ్జా ఆరగిస్తోన్న నభా నటేశ్.. ఈ ఫోటోలు చూశారా?


హీరోయిన్ నయనతార కొత్త ఇల్లు.. చాలా కాస్ట్ లీ (ఫొటోలు)


Sai Pallavi: బుజ్జితల్లి.. అప్పుడలా.. ఇప్పుడిలా..! (ఫోటోలు)


లుక్స్తోనే కట్టిపడేస్తోన్న కీర్తి సురేష్ ... (ఫోటోలు)


బాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్స్.. స్పెషల్ అట్రాక్షన్గా తమన్నా!


కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తున్న నేహా శెట్టి.. వైరల్ అవుతున్న ఫోటోస్


కొండాపూర్ లో సందడి చేసిన వైష్ణవి చైతన్య ,దిల్ రాజు సతీమణి వైగారెడ్డి (ఫొటోలు)


‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)


విశాఖపట్నం : సాగరతీరంలో..సరదాగా.. (ఫొటోలు)


విజయవాడలో పర్యటించిన మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ (ఫొటోలు)
National View all

హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టులో వైజాగ్ను చేర్చాలి: వైఎస్సార్సీపీ డిమాండ్
ఢిల్లీ: హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్టులో వైజాగ్ను కూడా చే

పెళ్లి చేసుకున్నాం.. కానీ వేరుగా ఉంటున్నాం!
బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం డ

పందెం గెలిచిన బాలు.. ఇక కృష్ణయ్య బాధ్యత తనదే
మడుగులో నీటికోసం దిగిన తనను మొసలి అమాంతం పట్టుకుని లోపలి ఈడ్చుకెళ్ళిపోతూ తనను హరించేస్తున్న తరుణంలో కన్నీటి పర్యంతమవుతూన

పోలీసులమంటూ ఫోన్.. ముసలావిడ దగ్గర రూ.20 కోట్లు స్వాహ
దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు ఈ సైబర్ మోసగాళ్ల వలలో పడిపోవద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు.

ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు?
తమిళనాడు: ప్రియురాలిని బావిలో తోసి ప్రియుడు కడతేర్చాడు.
NRI View all

యూఏఈకి ఉచిత వీసాలు.. విమాన టికెట్స్
మోర్తాడ్: నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేసేందుకు యూఏఈ ప్రభుత్వరంగ సంస్థ ఏడీఎన్హెచ్ ఉచిత వీసాలను జారీ చేస్తోంది.

కెనడా కొత్త కేబినెట్లో ఇద్దరు భారతీయులు
ఒట్టావా: కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్ క

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు
National View all

‘అంత మాట అంటారా?.. పిల్ల చేష్టలు వద్దు’
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ఔరంగజేబుతో పోలుస

Bihar: మళ్లీ పోలీసులపై దాడి
బీహార్: బీహార్లో పోలీసులపై దాడులు ఆగడం లేదు.

తమిళనాడులో ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్
చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి(

అప్పుడే మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: దేశంలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి.

బోడో ఒప్పందంతో శాంతి, అభివృద్ధి
గౌహతి/కొక్రాఝర్: బోడో ఒప్పందాన్ని అమలు చేసి ఈ ప్రాంతంలో శాంతిని, అభివృద్ధిని సుసాధ్యం
International View all

భారత్తో వాణిజ్యంపై యూఎస్ స్పై చీఫ్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తూ వివిధ దేశాల వాణిజ్యాలపై ప్రభావితం చూపుతున్న నేపథ్యంలో ఇండియాపై యూఎ

మరికొన్ని గంటల్లో భూమి మీదకు సునీత విలియమ్స్.. టైమ్ ఎప్పుడంటే?
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ ఎట్టకేలకు

తిట్టుకు తిట్టుతోనే బదులు!
వాషింగ్టన్: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్కు చెంది ఎస్ఏఐ చాట్

చైనాలో మేడిన్ రష్యా
బీజింగ్/హాంకాంగ్: మన దేశంలోని అనేక వస్తువులపై మేడిన్ చైనా

37 కిలోలు, రూ.75 కోట్లు!
న్యూఢిల్లీ/బనశంకరి: కర్నాటక పోలీసులు 37 కిలోల ఎండీఎంఏ (మెథిల
International View all

భారత ప్రధాని మోదీ ‘మంచి మాట’ చెప్పారు: చైనా
బీజింగ్: భారత్ తో స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్న చైనా..

భైడెన్కు ఏమీ తెలియదు.. ఆ సంతకాలు చెల్లవు: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి డొనాల్

పాక్లో మరో హత్య: జమీయత్ ఉలేమా నేత ముఫ్తీ అబ్దుల్ హతం
క్వెట్టా: పాకిస్తాన్లో మరో దారుణం చోటుచేసుకుంది.

Kalpana Chawla: రెండు పుట్టిన రోజుల వ్యోమగామి
కల్పనా చావ్లా(

త్వరలో ట్రంప్-పుతిన్ చర్చలు.. కాల్పుల విరమణపై నిర్ణయం?
వాషింగ్టన్ డీసీ: రష్యా- ఉక్రెయిన్(
NRI View all

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణవాసులు ముగ్గురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది.

పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా

గ్రీన్కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్.. అమెరికా పౌరసత్వం కట్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసార

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!
ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
క్రైమ్

భర్తతో విడిపోయి ఒంటరిగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
పాయకాపురం(విజయవాడరూరల్): మహిళతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై నున్న పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పాయకాపురం ఎల్బీఎస్ నగర్కు చెందిన పల్లపు నాగదుర్గ ఐదేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పొలం పనులు చేసుకునే ఆమెకు సత్తెనపల్లికి చెందిన కొక్కిలిగడ్డ మోజెస్ ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. అప్పటి నుంచి విజయవాడ వస్తూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని నాగదుర్గ కోరగా ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఆమె సత్తెనపల్లి వెళ్లి మోజెస్ తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. అతను రెండు నెలల్లో పెళ్లి చేసుకొంటానని చెప్పి గుంటూరు నెహ్రూనగర్ పాత బస్స్టాండ్ వద్ద రూమ్ తీసుకొని కొన్ని నెలలు కాపురం చేసి వెళ్లిపోయాడు. నాగదుర్గ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు?
తమిళనాడు: ప్రియురాలిని బావిలో తోసి ప్రియుడు కడతేర్చాడు. తిరువణ్ణామలై జిల్లా కలసపాక్కంకు చెందిన వేల్మురుగన్ కుమార్తె రోషిణి (21). ఈమె తన కళాశాల చదువు పూర్తి చేసి, పోలీసు దళంలో చేరడానికి ఒక ప్రైవేట్ శిక్షణ కేంద్రంలో చదువుతోంది. అలనార్కమంగళం గ్రామానికి చెందిన పరశురామన్ కుమారుడు శక్తివేల్ (29) కూడా అదే శిక్షణ కేంద్రంలో చదువుతున్నాడు. వారిద్దరూ స్నేహితులు. ఈ క్రమంలో రోషిణి, శక్తివేల్ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శిక్షణ కేంద్రం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారిద్దరు మన్సూరాబాద్ రోడ్డులో నడిచి వెళుతుండగా వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన శక్తివేల్ రోషిణిపై దాడి చేశాడు. ఆమెను సమీపంలోని బావిలో తోసేశాడు. అనంతరం శక్తివేల్ అర్ధరాత్రి పోలూరు పోలీస్స్టేష¯Œన్కు వెళ్లి లొంగిపోయాడు. తరువాత, అతను పోలీసులకు, ‘రోషిణి, నేను ప్రేమించుకున్నాం’అని చెప్పాడు. ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయడానికి వరుడి కోసం వెతుకుతున్నారు. మనం వెంటనే పెళ్లి చేసుకుందమని రోషిణికి చెప్పాను. కానీ రోషిణి నిరాకరించింది. దీంతో తమ మధ్య వివాదం చెలరేగింది. దీనికి కోపంగా, తాను ఆమె చెంప మీద కొట్టాను. ‘ఫలితంగా, రోషిణి సమీపంలోని బావిలోకి దూకింది’ అని అతను చెప్పాడు. ఆ తరువాత, సంఘటన జరిగిన ప్రాంతం మంగళం పోలీస్స్టేషన్ పరిధిలోకి రావడంతో పోలీసులు మంగళం పోలీసులకు సమాచారం అందించారు. మంగళం పోలీసులు ఆదివారం ఉదయం సంఘటన స్థలానికి వెళ్లగా, రోషిణి బావిలో చనిపోయి పడి ఉండడాన్ని వారు గుర్తించారు. అగి్నమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి, పోలీసులకు అప్పగించారు. పోలీసులు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు శక్తివేల్ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

యువతి నిశ్చితార్థం రద్దు చేయించి..
హైదరాబాద్: ప్రేమించానని ఏడేళ్లుగా వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, యువతి నిశ్చితార్థాన్ని సైతం రద్దు చేయించాడు. ఆపై ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధిత యువతి, మహిళా సంఘాల సహాయంతో కుటుంబ సభ్యులతో కలిసి యువకుడి ఇంటి ఎదుట ధర్నా చేశారు. ఈ సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లెలగూడకు చెందిన ఓ యువతి(28) ని మీర్పేట ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీకి చెందిన పూర్ణేశ్వర్రెడ్డి(28) ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని గతంలో ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేయించాడు. ఆమెతో చనువుగా ఉంటూ.. ఇంట్లో వారికి, బంధువులకు పరిచయం చేశాడు. కానీ ఆ తరువాత యువకుడికి గుట్టుచప్పుడు కాకుండా.. మరో యువతితో పెళ్లి చూపులు జరిగాయి. విషయం తెలుసుకున్న యువతి నిలదీయడంతో కులం వేరు కావడంతో మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని సమాధానం చెప్పాడు. దీంతో సదరు యువతి న్యాయం చేయాలంటూ ఆదివారం పూర్ణేశ్వర్రెడ్డి ఇంటి ఎదుట బంధువులతో కలిసి ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

వృద్ధ దంపతులను మోసం చేసిన బ్యాంకు మేనేజర్ మేఘన
యశవంతపుర(కర్ణాటక): వృద్ధురాలిని మోసం చేసిన గిరినగరకు చెందిన ప్రైవేటు బ్యాంకు మేనేజర్ మేఘన, ఆమె భర్త శివప్రసాద్, స్నేహితులు వరదరాజు, అన్వర్ఘోష్లను గిరినగర పోలీసులు అరెస్ట్ చేశారు. గిరినగరలోని ఒక ప్రైవేట్ బ్యాంక్లో వృద్ధ దంపతులు జాయింట్ అకౌంట్ తెరిచారు. కొంతమొత్తం డిపాజిట్ చేశారు. బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ మేఘనా పరిచయం ఉండటంతో వృద్ధ దంపతులు తమ కష్టాలు ఆమె వద్ద చెప్పుకునేవారు. ఇటీవల ఇంటిని కూడా విక్రయిం కోటి రూపాయిలు బ్యాంకులో జమా చేశారు. ఆ నగదుపై మేఘనా కన్ను పడింది. బాండ్ అవధి ముగిసిందని, కొత్తగా డిపాజిట్ చేసేందుకు చెక్ అవసరమని మభ్య పెట్టి కొన్నిపత్రాలపై సంతకాలు చేయించుకుంది. అనంతరం రూ.50 లక్షలను తన అకౌంట్కు బదిలీ చేయించుకుంది. వృద్ధ దంపతుల కుమారుడు బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా నగదు తక్కువగా కనిపించింది. బ్యాంకుకు వెళ్లి మేఘనాను ప్రశ్నించారు.మీరు చెప్పిన ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు మేఘనా దబాయించింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా మేఘనా వంచన బయట పడింది. మేఘనతోపాటు ఆమె భర్త శివప్రసాద్, స్నేహితులు వరదరాజు, అన్వర్ఘోష్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
వీడియోలు


TTD: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం


వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీ మేనిఫెస్టోలో ఎలా పెట్టారు


కూటమి ప్రభుత్వం ఉద్యోగుల అంశంపై చర్చను పక్కదారి పట్టిస్తోంది: బొత్స


కూటమి తెచ్చిన మార్పుకు ఉదాహరణగా నిలుస్తున్న చిన్నారి


YV సుబ్బారెడ్డి ఇంట విషాదం


పుష్ప 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసిన ఛావా..


కల్కి 2పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన అమితాబ్


AP Volunteers: ఇవాళ వాలంటీర్ల రాష్ట్ర వ్యాప్త ధర్నా


అమెరికాలో రోడ్డుప్రమాదం తెలంగాణ వాసులు దుర్మరణం


Anakapalle: క్వారీ లారీ ఢీకొని రైల్వే ట్రాక్ ధ్వంసం