Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan condoles Death of YV Subbareddy Mother Pitchamma1
వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

సాక్షి, తాడేపల్లి: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యర్రం పిచ్చమ్మ(85) ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. కాగా, పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి. పిచ్చమ్మ పార్థివదేహానికి వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించనున్నారు.

tasmac liquor scam protest tamil nadu cops detain bjp leaders annamalai tamilisai 2
తమిళనాడులో ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్‌

చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి(liquor scandal) వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎంఏసీ) సారధ్యంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తును కోరుతూ, నిరసనకు దిగబోతున్నామని ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వం సహా తమిళనాడు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రాష్ట్ర బీజేపీ నేతలు(BJP leaders) సోమవారం ఉదయం 11 గంటలకు నిరసన చేపట్టనున్న తరుణంలో అందుకు ముందుగానే పోలీసులు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొందరు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత సౌందరరాజన్ తన నిర్బంధం గురించి మాట్లాడుతూ ‘వారు మమ్మల్ని ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వడం లేదు. మా కార్యకర్తలలో మూడు వందల మందిని ఒక కల్యాణ మండపంలో నిర్బంధించారు. టీఏఎస్‌ఎంఏసీలో జరిగిన వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నామని’ అన్నారు.Many Tamil Nadu BJP leaders have been arrested by Tamil Nadu Police for organizing a protest against TASMAC scam worth 1000 cr by DMK gang.This is the same scam they want to cover up by diverting attention to the language issue.This is what real dictatorship looks like!! pic.twitter.com/L14GjJE54f— Mr Sinha (@MrSinha_) March 17, 2025రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై(State BJP chief Annamalai) ఈ నిర్బంధాలను ఖండించారు. డీఎంకే ప్రభుత్వం భయంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘ఎక్స్‌’ పోస్ట్ లో ఆయన ఇలా రాశారు..‘డీఎంకే ప్రభుత్వం భయంతో వణికిపోతోంది. అందుకే బీజేపీ నేతలైన తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వన్ రాష్ట్ర జిల్లా నిర్వాహకులను గృహ నిర్బంధంలో ఉంచింది. వారు నిరసనలో పాల్గొనకుండా నిర్బంధించింది. తేదీ ప్రకటించకుండా అకస్మాత్తుగా నిరసన ప్రారంభిస్తే ఏమి చేయగలరు?’ అని అన్నామలై ప్రశ్నించారు. కాగా డీఎంకే ప్రభుత్వం బీజేపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్షం నేతృత్వంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని, కేంద్ర సంస్థలు పనిచేస్తున్నాయని డీఎంకే నేతలు ఆరోపించారు.Unlawful arrest by Dictator CM @mkstalin! You looted Tamil Nadu, and now you want to silence BJP. We will not back down!We have been arrested along with Sr Leader Thiru @PonnaarrBJP anna.DMK Liquor Scam 😡 1000 Crores Corruption. @annamalai_k @blsanthosh pic.twitter.com/INhAFM5Vsh— Amar Prasad Reddy (@amarprasadreddy) March 17, 2025ఇది కూడా చదవండి: పాక్‌లో మరో హత్య: జమీయత్‌ ఉలేమా నేత ముఫ్తీ అబ్దుల్ హతం

RCB LIKELY PLAYING XI FOR IPL 20253
IPL 2025: ఓపెనర్లుగా కోహ్లి, సాల్ట్‌.. ఆర్సీబీ ప్లేయింగ్‌ ఎలెవెన్‌ ఇదే..?

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 18వ ఎడిషన్‌ మరో 5 రోజుల్లో (మార్చి 22) ప్రారంభం కానుంది. లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించని ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కేకేఆర్‌ హోం గ్రౌండ్‌ అయిన ఈడెన్‌ గార్డెన్స్‌లో జరుగనుంది.అన్ని సీజన్లకు ముందు లాగే ఈ సారి కూడా ఆర్సీబీ 'ఈ సాలా కప్‌ నమ్మదే' అన్న నినాదంతో బరిలోకి దిగుతుంది. 17 సీజన్లలో ఒక్క సారి కూడా టైటిల్‌ గెలవని ఆర్సీబీ ఈసారి ఎలాగైనా తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తుంది. ఈ సారి ఓ అంశం ఆర్సీబీ టైటిల్‌ కలను సాకారం చేసేలా సూచిస్తుంది. ఆ జట్టు స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి జెర్సీ నంబర్‌.. ఈ సారి ఐపీఎల్‌ ఎడిషన్‌ సంఖ్య మ్యాచ్‌ అవుతున్నాయి. విరాట్‌ జెర్సీ నంబర్‌ 18 కాగా.. ఈ యేడు ఐపీఎల్‌ ఎడిషన్‌ సంఖ్య కూడా పద్దెనిమిదే. ఇలాగైనా విరాట్‌ లక్కీ నంబర్‌ 18 ఆర్సీబీకి టైటిల్‌ సాధించిపెడుతుందేమో చూడాలి.ఇదిలా ఉంటే, గత సీజన్లతో పోలిస్తే ఆర్సీబీ ఈ సీజన్‌లో కాస్త ఫ్రెష్‌గా కనిపిస్తుంది. కొత్త కెప్టెన్‌ (రజత్‌ పాటిదార్‌), కొత్త ఆటగాళ్లతో బెంగళూరు ఫ్రాంచైజీ ఉరకలేస్తుంది. మెగా వేలానికి ముందు విరాట్‌ (21 కోట్లు), రజత్‌ పాటిదార్‌ (11 కోట్లు), యశ్‌ దయాల్‌ను (5 కోట్లు) మాత్రమే అట్టిపెట్టుకున్న ఆర్సీబీ.. మ్యాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌, సిరాజ్‌ లాంటి స్టార్లను వదిలేసింది.మెగా వేలంలో ఆర్సీబీకి 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కేవలం 22 మందితోనే సరిపెట్టుకుంది. వేలంలో ఆర్సీబీ ఫిల్‌ సాల్ట్‌, జేకబ్‌ బేతెల్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, టిమ్‌ డేవిడ్, రొమారియో షెఫర్డ్ లాంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లను.. హాజిల్‌వుడ్‌, ఎంగిడి లాంటి స్టార్‌ విదేశీ పేసర్లను కొనుగోలు చేసింది. దేశీయ స్టార్లు జితేశ్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, కృనాల్‌ పాండ్యాపై కూడా ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ నమ్మకముంచింది.ఈ సీజన్‌ కోసం​ ఆర్సీబీ ఎంపిక చేసుకున్న జట్టును చూస్తే.. ఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ను ఓపెన్‌ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్‌ కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ కూడా ధృవీకరించాడు. వన్‌డౌన్‌లో కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌.. నాలుగో స్థానంలో లివింగ్‌స్టోన్‌, ఐదో స్థానంలో జితేశ్‌ శర్మ, ఆరో ప్లేస్‌లో టిమ్‌ డేవిడ్‌, ఏడో స్థానంలో కృనాల్‌ పాండ్యా, బౌలర్లుగా భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌, హాజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.ఆర్సీబీ మొత్తం జట్టు: రజత్‌ పాటీదార్‌ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, జితేశ్‌ శర్మ, దేవదత్‌ పడిక్కల్, స్వస్తిక్ చికారా, లియామ్‌ లివింగ్‌స్టోన్, కృనాల్‌ పాండ్యా, స్వప్నిల్‌ సింగ్, టిమ్‌ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్ భాండగే, జాకబ్‌ బెథెల్, జోష్‌ హాజల్‌వుడ్, భువనేశ్వర్‌ కుమార్, రసిక్ సలాం దార్‌, సుయశ్‌ శర్మ, నువాన్‌ తుషారా, లుంగి ఇన్‌గిడి, అభినందన్‌ సింగ్, మోహిత్‌ రతీ, యశ్‌ దయాల్‌.

BJP MLA paidi rakesh reddy Interesting Comments On Alliance4
‘తెలంగాణలో జనసేన, టీడీపీతో పొత్తు బీజేపీకే నష్టం’

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన, టీడీపీతో పొత్తు కడితే బీజేపీకి నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతుందన్నారు. ఇదే సమయంలో రాజాసింగ్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలకు పాత ఇనుప సామాను అంటే ఎవరో బాగా తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ సమావేశాల సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి మీడియాతో చిట్‌బాట్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో కూటమి గురించి బీజేపీ హైకమాండ్‌ ఆలోచన చేయవద్దు. జనసేన, టీడీపీతో కలిసి వెళ్తే బీజేపీ నష్టం జరుగుతుంది. అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఇబ్బంది అవుతుంది. బీఆర్‌ఎస్‌ లాంటి పార్టీలకు లబ్ధి జరుగుతోంది. కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతోందన్నారు.రాజాసింగ్ కామెంట్స్ స్పందిస్తూ..‘తెలంగాణ ప్రజలకు పాత ఇనుప సామాను అంటే అందరికీ తెలుసు. పార్టీ అంతర్గత వ్యవహారాలు వేదికలపై కాకుండా ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. రాజాసింగ్ తెలంగాణ బీజేపీకి ఆస్తి వంటి నాయకులు. ప్రధాని మోదీకి ఇక్కడ ఏం జరుగుతుందో పిన్ టూ పిన్ రిపోర్ట్ వెళ్తుంది. అధిష్ఠానం అంతా గమనిస్తోంది. పార్టీకి మంచి జరిగేది నలుగురిలో చెప్పాలి.. చెడు జరిగేది అధిష్ఠానం చెవిలో చెప్పాలి.పార్టీ ప్రెసిడెంట్‌గా ఈటల, అరవింద్, రామచందర్ రావు, డీకే అరుణ, రఘునందన్ రావు ఎవరో ఒకరు అవుతారు. అధ్యక్షుడితో పాటు ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు పెడితే బాగుంటుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేకంగా ఇంచార్జ్‌లను పెట్టాలి. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రక్షాళన చేస్తారని వినిపిస్తోంది. అదే జరిగితే కొండా సురేఖ, తుమ్మల, జూపల్లి మంత్రి పదవులు పోతాయి అంటున్నారు అని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

BJP MLA Basangouda Patil Yatnal Controversy Remarks Against Ranya Rao5
రన్యా రావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

బెంగళూరు: కన్నడ నటి రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె తన ప్రైవేటు భాగాల్లో బంగారం దాచిపెట్టి స్మగ్లింగ్‌ చేసిందని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఇదే సమయంలో బంగారం స్మగ్లింగ్‌ వ్యవహారంలో మంత్రుల ప్రమేయం కూడా ఉందని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.బీజాపూర్ బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రన్యారావు తన శరీరమంతా బంగారంతో కప్పేసింది. ఆమె తన శరీరంలో ఏయే చోట్ల బంగారం దాచుకుని వచ్చిందో నాకు తెలుసు. ఆమె తన ప్రైవేటు భాగాల్లో బంగారం దాచిపెట్టి స్మగ్లింగ్‌ చేసింది. బంగారం స్మగ్లింగ్‌ వ్యవహారంలో మంత్రులకు కూడా ప్రమేయం ఉంది. ఈ విషయాలు అన్నీ నాకు తెలుసు. శాససభ సమావేశాల్లో ఒక్కొక్కరి బండారం బయటపెడతాను. ప్రతి పాయింట్‌ అసెంబ్లీలో వివరిస్తాను. రన్యా రావుతో పరిచయం ఉన్న ఇద్దరు మంత్రుల పేర్లను సభలో చెబుతాను. నేను ఇప్పుడు మీడియా ముందు దాని గురించి మాట్లాడను. ఆమెకు ప్రోటోకాల్ ఇచ్చిన వారి గురించి మేము సమాచారాన్ని సేకరించాం. వాళ్ళకి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి కోసం తెచ్చారో నాకు తెలుసు. ఎవరు తప్పు చేసినా, అది తప్పే. కస్టమ్స్ అధికారులు తప్పు చేస్తే, మేం వారిని సమర్థించడం లేదు’ అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.మరోవైపు కస్టడీలో తనను టార్చర్‌ చేస్తున్నారంటూ రన్యా రావు కోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే. తెల్ల కాగితంపై తన సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. కనీసం నిద్ర పోనివ్వకుండా, తిండి కూడా తిననివ్వడం లేదంటూ ఫిర్యాదు చేశారు. కాగా, రన్యా రావు కేసు విషయంలో ఎయిర్‌ పోర్టులో ప్రోటోకాల్‌ ఉల్లంఘన వెనుక ఆమె సవితి తండ్రి, ఐపీఎస్‌ అధికారి రామచంద్రరావు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, ఆయన పాత్రపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. Karnataka BJP MLA Basangouda Patil Yatnal-"I will name all Ministers involved in Ranta Rao gold smuggling case in Assembly session. I have complete information about her relationships and how the gold was brought in.She had gold all over her body and smuggled it in." pic.twitter.com/6xd4dy5Tne— News Arena India (@NewsArenaIndia) March 17, 2025ఇదిలా ఉండగా.. బంగారం స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువైన బంగారంతో రన్యా రావు పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో, రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Who Is Tara Prasad Skater Praised By Anand Mahindra6
ఎవరీ తారా ప్రసాద్‌..? ఆనంద్‌ మహీంద్రా ప్రశంసల జల్లు..

విల్లులా శరీరాన్ని వంచుతు చేసే సాహస క్రీడ స్కేటింగ్‌. అలాంటి స్కేటింగ్‌కి న్యత్యం జత చేసి మంచుపై అలవోకగా చేసే.. ఈ ఫిగర్ స్కేటింగ్‌ అంతకుమించిన సాహస క్రీడ. అలాంటి కష్టతరమైన సాహస క్రీడలో సత్తా చాటుతూ..మీడియా దృష్టిని ఆకర్షించింది ఈ భారత సంతతి టీనేజర్‌. ఆమె భారత్‌ తరఫున ఆడి గెలవడం కోసం తన అమెరికా పౌరసత్వాన్ని తృణప్రాయంగా వదులకుంది. పుట్టి పెరిగిన అమెరికా కంటే భారతవనే తన మాతృదేశం అంటూ..విశ్వ వేదిక మూడు రంగుల జెండాను రెపరెపలాడిస్తోంది. ఈ పాతికేళ్ల యువకెరటం పేరు తారా ప్రసాద్‌. ఈ అమ్మాయి సాధించిన విజయాల గురించి వివరిస్తూ..మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్‌లో మహీంద్రా తారను అభినందనలతో ముంచెత్తారు. దీంతో ఒక్కసారిగా ఎవరీ అమ్మాయి అంటూ ఇంటర్నెట్‌లో సర్చ్‌ చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ ఈ టెక్‌ దిగ్గజం ఆనంద్‌ మెచ్చిన ఆ యువ తార ఎవరో చూద్దామా..!ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో స్ఫూర్తిదాయకమైన కథలు పంచుకుంటూ ఉండే ఆనంద్‌ మహీంద్రా ఈసారి ఫిగర్ స్కేటర్ తారా ప్రసాద్‌ని ప్రశంసిస్తూ పోస్టు పెట్టారు. దానికి తారా చేసిన ఫిగర్‌ స్కేటింగ్‌ వీడియోని కూడా జత చేశారు. ఆ ఫిగర్‌ స్కేటింగ్‌ చూస్తే.. ఎవ్వరైనా కళ్లు ఆర్పడం మర్చిపోతారు. అంతలా ఒళ్లు జల్లుమనేలా ఉంటుంది ఈ క్రీడ. అందువల్లే ఈ బిజినెస్‌ దిగ్గజం మహీంద్రా ఆమె అద్భుత ప్రతిభను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మహీంద్రా పోస్ట్‌లో.."ఇటీవల తన స్నేహితుడొకరు ఈ అమ్మాయి స్కేటింగ్‌ ప్రతిభకు సంబంధించిన వీడియో పంపించేంత వకు ఆమె గురించి నాకు తెలియదు. ఓ వైపు నృత్యం చేస్తూ..మరోవైపు గాలలో ఎగురుతూ.. చేస్తున్నా ఆమె ఫిగర్‌ స్కేటింగ్‌కి విస్తుపోయే. ఆమె అద్భుత ప్రతిభ నన్ను ఎంతగానో కట్టిపడేసింది.అంతేగాదు ఆమె భారత్‌కి ప్రాతినిథ్యం వహించాలన్న ఉద్దేశ్యంతో 2019లో అమెరికా పౌరసత్వాన్ని భారతీయ పౌరసత్వంగా మార్చుకుంది. ఏకంగా మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో గెలుపొందింది. గతేడాది వింటర్ ఒలింపిక్స్‌లో మీరు తృటిలో స్థానం కోల్పోయినా..వచ్చే ఏడాది జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌లో తప్పక విజయం సాధిస్తారు. ఆ విశ్వక్రీడలపై దృష్టిపెట్టి ఒలింపిక్స్‌ పతక కలను సాకారం చేసుకో తల్లి." అని ఆశ్వీరదీస్తూ మహీంద్రా పోస్ట్‌లో రాసుకొచ్చారు.తారా ప్రసాద్ ఎవరు?ఫిబ్రవరి 24, 2000లో అమెరికాలో జన్మించింది తారా ప్రసాద్. ఆమె కుటుంబం తమిళనాడు నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడింది. అయితే ఆమె అక్కడే పుట్టి పురిగినా..తన మాతృదేశంపై మమకారం వదులుకోలేదు. అందుకు కారణం తన తల్లిదండ్రులే అని సగర్వంగా చెబుతోంది తార. చిన్నప్పుడు స్కేటింగ్‌ షూస్‌ కట్టుకుని మంచుగడ్డలపై ఆడుకునేది. అయితే పెద్దయ్యాక దాన్నే ఆమె కెరియర్‌ ఎంచుకుంటుందని ఆమె కుటుంబసభ్యులెవ్వరూ అనుకోలేదట.ఏమాత్రం పట్టు తప్పిన ప్రమాదాలు జరిగే క్లిష్టమైన ఫిగర్‌ స్కేటింగ్‌ క్రీడను ఎంచుకుంది తార. ఇది ఒక కష్టసాధ్యమైన కళాత్మక క్రీడ. చెప్పాలంటే నృత్యం, స్కేటింగ్‌ మిళితం చేసే ఒక అద్భుత ప్రదర్శన. అలాంటి క్రీడలో కఠోర సాధనతో నైపుణ్యం సాధించింది. భారత్‌ తరుఫున ప్రాతినిథ్యం వహంచింది..2016లో 'Basic Novice' పోటీల్లో (14 ఏళ్ల లోపు వారు పోటీ పడే కాంపిటీషన్స్) పాల్గొనడంతో మొదలుపెట్టి.. క్రమంగా 'Intermediate Novice' పోటీలు (16 ఏళ్ల లోపు వారు).. ఆపై 'Advanced Novice' (10-16 ఏళ్ల లోపు అమ్మాయిలు) పోటీల్లో సత్తా చాటింది. 2020 నుంచి సీనియర్ విభాగంలో.. భారత్ తరపున బరిలోకి దిగింది. ఆవిధంగా తార 2022, 2023, 2025 సంవత్సరాల్లో భారత జాతీయ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది. అయితే.. సియోల్లో ఇటీవలే ముగిసిన 'ఫోర్ కాంటినెంట్స్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్స్ 2025లో 16వ స్థానంతో సరిపెట్టుకుందీ ఈ టీనేజర్. భారత్లో క్రికెట్‌కి ఉన్నంత ఆదరణను పిగర్ స్కేటింగ్‌కి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నానంటోంది తార. వచ్చే ఏడాది జరగనున్న 'వింటర్ ఒలింపిక్స్'పై దృష్టి సారించి విజయం సాధించడమే తన లక్ష్యం అని చెబుతోంది. మరీ ఆ యువతారకి ఆల్‌ద బెట్‌ చెప్పి.. మరిన్ని విజయాలను సొంతం చేసుకుని మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుకుందాం.Hadn’t heard about Tara Prasad’s accomplishments till a friend recently sent me this clip. Apparently Tara switched her U.S citizenship to an Indian one in 2019 and has since been our national skating champ three times. Well done, Tara. I hope you are in the vanguard of… pic.twitter.com/GK4iL4VrVh— anand mahindra (@anandmahindra) March 11, 2025(చదవండి: స్టూడెంట్‌ మైండ్‌ బ్లాక్‌ స్పీచ్‌..! ఫిదా అవ్వాల్సిందే..)

Post office scheme Close MSSC will be closed by 31st March7
క్లోజ్‌ అవుతున్న పోస్టాఫీస్‌ స్కీమ్..

ప్రజల్లో ఆర్థిక పొదుపును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పోస్టాఫీసుల ద్వారా వీటిని అమలు చేస్తోంది. అలాంటి మంచి స్కీముల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్‌సీ) పథకం ఒకటి.మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఇక చాలా తక్కువ రోజులే సమయం ఉంది. పోస్టాఫీస్ కింద నిర్వహించే ఎంఎస్ఎస్‌సీ పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌లో పెట్టుబడి సమయాన్ని ప్రభుత్వం ఇంకా పొడిగించలేదు. ఇప్పటి వరకు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయని మహిళలకు కొన్ని రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..మహిళలకు ప్రత్యేకంస్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్ కింద భారత ప్రభుత్వం 2023 మార్చి 31న మహిళలు, బాలికల కోసం ఎంఎస్ఎస్‌సీ (మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్) పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇది రెండు సంవత్సరాల కాలానికి అమలు చేస్తున్న స్వల్పకాలిక డిపాజిట్‌ స్కీమ్‌. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం లక్ష్యం.ఎంత వడ్డీ లభిస్తుంది?దేశంలోని ఏ మహిళ అయినా ఈ పథకంలో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ కింద ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది. ఎంఎస్ఎస్‌సీ స్కీమ్‌పై 7.5% వార్షిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఇది బ్యాంకులలో 2 సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై ఇస్తున్న వడ్డీ కంటే ఎక్కువ. ఇది సురక్షితమైన పథకం ఎందుకంటే ఇది ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దీని కింద పోస్టాఫీస్ లేదా రిజిస్టర్డ్ బ్యాంకుల్లో సులభంగా ఖాతా తెరవవచ్చు.పెట్టుబడి ఎంత పెట్టవచ్చు?మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం కింద దేశంలో నివసించే ఏ మహిళ అయినా కనీసం రూ .1,000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 2 సంవత్సరాల వ్యవధి తర్వాత, అసలు, వడ్డీ మొత్తం చెల్లిస్తారు. ఏదైనా అవసరం పడితే ఒక సంవత్సరం తరువాత డిపాజిట్‌ మొత్తంలో 40% వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. తీవ్రమైన అనారోగ్యం లేదా ఖాతాదారు మరణం వంటి పరిస్థితులలో ఖాతాను ముందస్తుగా మూసివేయవచ్చు. డిపాజిటర్‌ 6 నెలల తర్వాత ఖాతాను మూసివేస్తే వడ్డీ రేటు తగ్గవచ్చు.

Telangana Assembly Session On March 17th Live Updates8
తెలంగాణ అసెంబ్లీ ముందుకు ఐదు కీలక బిల్లులు..

Telangana Assembly Session Updates..తెలంగాణ వచ్చాక వర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం: సీఎం రేవంత్‌శాసనసభలో సీఎం రేవంత్‌ కామెంట్స్‌..కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్‌ జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, పీవీ నరసింహారావు పేర్లు పెట్టుకున్నాంతెలుగు వర్సిటీ పేరును మారుస్తున్నాంపొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదుఏపీలో కూడా ఇదే పేరుతో యూనివర్సిటీ ఉంది.అందుకే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకున్నాం.తెలుగు వర్సిటీ ఆయన పేరు పెట్టాలని గత శాసనసభలోనే నిర్ణయించాం.రాజకీయాలు కలుషితం అయ్యాయో.. ఆలోచనలు కలుషితం అయ్యాయో తెలియదు.బల్కంపేట నేచర్‌ క్యూర్‌ ఆసుపత్రికి రోశయ్య పేరు పెడతాం.తెలంగాణ వచ్చాక ఆర్టీసీ పేరును కూడా మార్చుకున్నాం. ఐదు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వంబిల్లులను ప్రవేశపెట్టేముందుకు స్పీకర్‌ అనుమతి కోరిన మంత్రి శ్రీధర్‌బాబుఅసెంబ్లీ ముందుకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లుఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనర్సింహబీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం 👉తెలంగాణ శాసన సభలో ముగిసిన ప్రశ్నోతాలు.👉మొదలైన జీరో అవర్..👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి.శాసనసభ నుంచి ఎంఐఎం వాకౌట్..శాసనసభ నడపడంలో ప్రభుత్వం విఫలమైందిశాసనసభ గాంధీ భవన్ కాదు.తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం.ప్రశ్నోత్తరాల సమయం గంట మాత్రమే తీసుకోవడం ఏంటని ప్రశ్నించిన అక్బరుద్దీన్.ప్రశ్నోత్తరాల సమయంలో మిగిలిన ప్రశ్నలపై సమాధానం చెప్పకుండా ఎలా జీరో అవర్‌ ప్రారంభిస్తారు?నిన్న రాత్రి 10 గంటలకు ఎజెండా మాకు అందింది.. మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి?.శాసనసభలో కొత్త సాంప్రదాయం ఏంటి?తమ ప్రశ్నను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని, మంత్రి ఎందుకు ప్రశ్న చదవడం లేదని ఆగ్రహం.సభ జరిగే తీరుపై అసహనం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ.మేము అడిగిన ప్రశ్నను సమాధానం ఇవ్వడం లేదు.శాసనసభ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా నడవడం లేదు.శాసనసభలో నిబంధనలు పాటించడం లేదు.నిబంధనల ప్రకారం శాసనసభ నడవడం లేదని వాకౌట్ చేసిన ఎంఐఎం20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం: భట్టి2030 నాటికి 20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంసౌర, పవన, గ్రీన్‌ హైడ్రోజన్‌పై ప్రభుత్వం ఫోకస్‌పునరుత్పాదక ఇంధన వనరుల పెంపునకు క్లీన్‌ ఎనర్జీ పాలసీ2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంపెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించడానికి పాలసీ తెచ్చాంరాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోతుందిప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సౌరఫలకాలు ఏర్పాటు చేస్తున్నాంకాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్‌..బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కామెంట్స్‌..ఏం తెచ్చారు ఏం ఇచ్చారు అని ప్రభుత్వం నన్ను ప్రశ్నిస్తుంది..నాకు కాంగ్రెస్ ఏం ఇచ్చింది?గత ఏడాది బడ్జెట్ నుంచి కేవలం 90 లక్షలు మాత్రమే ఇచ్చింది.కొడంగల్‌కు 1000 కోట్లు తీసుకుపోయారు.శాసన సభకే అవమానం.శాసనసభలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మూడు సమానమే.అసెంబ్లీలో కేటీఆర్‌ చిట్‌చాట్‌.. రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలుసీఎం రేవంత్‌ టార్గెట్‌గా కేటీఆర్‌ కామెంట్స్‌..తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందిరేవంత్ రెడ్డి అప్రూవర్‌గా మారి.. తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పాడు71వేల కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడు2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.‌. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవిపిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారు?నిండు సభలో బట్టలు విప్పి కొడాతమని రేవంత్ బజారు భాష మాట్లాడారుమెదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదుకాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడుసంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదురాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే.. తెలంగాణ పెరుగుతుందా?కేంద్రంతో సఖ్యతగా ఉండి.. నిధులు సాధిస్తానని ఎంత తెచ్చాడుకేసీఆర్‌పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నాడుగాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి గవర్నరెన్స్ పై దృష్టి పెట్టాలి కుటుంబాలు మాకు లేవా?. పిల్లలు మాకు లేరా? రేవంత్‌కే ఉన్నారా?నాకు అడ్డమైన వారితో‌ లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్‌లో దాటిన రేఖలు బయట పెట్టాలా? మంత్రి సీతక్క వర్సెస్‌ గంగుల.. 👉విద్యార్థుల డైట్‌ ఛార్జీలు పెంచాం: మంత్రి సీతక్కగత ప్రభుత్వంతో పోలిస్తే విద్యార్థుల డైట్‌ ఛార్జీలు పెంచాం8-10 తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540 డైట్‌ ఛార్జీలు చెల్లిస్తున్నాంఇంటర్‌ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు రూ.2,100 డైట్‌ ఛార్జీలు చెల్లిస్తున్నాంవిద్యార్థుల డైట్‌ ఛార్జీలకు రూ.499.51 కోట్లు ఖర్చు చేశాం: మంత్రి సీతక్కవిద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దు.విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే.. బీఆర్‌ఎస్‌ ఓర్వలేక పోతుంది.నేను గంగుల కమలాకర్ లెక్క చదువుకోలేకపోవచ్చు.నేను సమాజాన్ని చదివాను.గవర్నమెంట్ స్కూళ్లలో చదివినం. గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాం..సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే నైజం మాదిమా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్య కోసం 167 కోట్లు చెల్లించాముపిల్లలను సరిగా పర్యవేక్షించని సిబ్బంది అధికారులపై చర్యలు ఉంటాయివిద్యార్థులకు స్కాలర్‌షిపులు ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే బాగుండు అని బీఆర్ఎస్ భావిస్తోందిమేము స్కాలర్‌షిప్లు ఇవ్వకపోతే రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ చూస్తోందికానీ మేము బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వము..విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్లు, విదేశీ విద్యానిధి పూర్తిగా చెల్లిస్తున్నాము👉విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి: గంగుల కమలాకర్‌విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి2016లో కేసీఆర్‌ హయాంలో విదేశీ విద్యా పథకం అమలు చేశారుగతంలో ఏటా 300 మంది విద్యార్థులను పథకం కింద ఎంపిక చేశారుప్రస్తుత ప్రభుత్వం బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకు పథకం కింద ఇచ్చింది గుండు సున్నాజనవరిలో కేవలం 105 మంది ఎస్సీలను పథకం కింద ఎంపిక చేశారుగతంలో 1,050 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విదేశాలకు పంపారుగతంలో రూ.439 కోట్లతో 2,751 మంది మైనార్టీలకు విదేశీ విద్య అందించారు.

Youtuber Anvesh Roast Bigg Boss Winner Pallavi Prashanth9
ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్‌ ఫైర్‌

బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లకు వెన్నులో వణుకు మొదలైంది. సామాన్యుల జీవితాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న సుప్రిత, రీతూ చౌదరి వంటి సెలబ్రిటీలు మెట్టు దిగొచ్చి క్షమాపణలు చెప్తున్నారు. తెలిసో తెలియకో బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేశామని, జనాలు వాటిని నమ్మొద్దని కోరుతున్నారు.బెట్టింగ్‌ యాప్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమంఎలాగైనా సరే ఈ బెట్టింగ్‌ భూతం నుంచి యువతను, పేద కుటుంబాలను కాపాడాలని పూనుకున్నారు హైదరాబాద్‌ మాజీ అడిషనల్‌ డీజీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌. ఈ ఉద్యమం (#SayNoToBettingApps)లో యూట్యూబర్‌, ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌ సైతం భాగమయ్యాడు. బెట్టింగ్‌ యాప్స్‌ హానికరం అని చెప్తూ.. వాటిని ప్రమోట్‌ చేసినవాళ్లను ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ (Pallavi Prashanth)ను సైతం ఏకిపారేశాడు. అతడు గతంలో క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌ గురించి చేసిన వీడియోను రిలీజ్‌ చేశాడు. రైతుబిడ్డ అంటేనే అసహ్యం: అన్వేష్‌అనంతరం అన్వేష్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.. ప్రపంచంలో నేను ఎక్కువ అసహ్యించుకునేది పల్లవి ప్రశాంత్‌నే! రైతుబిడ్డ.. రైతుబిడ్డ అంటూ సానుభూతితో గెలిచాడు. ప్రైజ్‌మనీ రైతులకు ఇస్తానన్నాడు.. కానీ ఇచ్చాడా? పోనీ.. దేశానికి రైతు వెన్నుముక అన్నవాడు ఏనాడైనా సేంద్రీయ వ్యవసాయం గురించో, రైతుల కష్టాల గురిందో వీడియోలు చేశాడా? లేదు.. డబ్బు కోసం బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసి తనను నమ్మి గెలిపించిన జనాలకు నమ్మకద్రోహం చేశాడు.ముష్టివాడిలా అడుక్కున్నాడు.. కోట్లకు పడగలెత్తాడురైతు పేరు వాడుకుని ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేసి ఈ వెధవ అందర్నీ మోసం చేశాడు. రైతు అంటేనే ఛీ అనేలా చేశాడు. నాకు రైతు అంటే ఎంతో గౌరవం. వారికోసం వీడియోలు కూడా చేశాను. కానీ వీడిని చూస్తేనే అసహ్యం. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు దేహి అంటూ ముష్టివాడిలా అడుక్కున్నాడు. బయటకు వచ్చాక సూటు, బ్యాడ్జి.. ఆరుగురు సెక్యురిటీగార్డులు.., కార్లు! వీడికంత అవసరమా? బెట్టింగ్‌ యాప్స్‌తో ఒక్కొక్కరూ కోట్లకు పడగలెత్తారు. నెక్స్ట్‌ పల్లవి ప్రశాంత్‌..ఈ ఇన్‌ఫ్లూయెన్సర్ల వల్ల నష్టపోయినవాళ్లందరూ నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లండి. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయడం చట్టరీత్యా నేరం. కాబట్టి ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి నష్టపరిహారం తీసుకోండి. ఇలా చేస్తే​కానీ ఎవరికీ సిగ్గు రాదు. ఆడేవాడు చచ్చిపోతుంటే ఆడించేవారు మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు అని నా అన్వేషణ యూట్యూబర్‌ అన్వేష్‌ మండిపడ్డాడు. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసినందుకుగానూ లోకల్‌ బాయ్‌ నాని, సన్నీయాదవ్‌, హర్షసాయిపై కేసులు నమోదయ్యాయి. నెక్స్ట్‌ పల్లవి ప్రశాంత్‌దే అన్న టాక్‌ వినిపిస్తోంది.చదవండి: థియేటర్‌లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్‌లు

Telangana People Dead In USA Road Accident10
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణవాసులు ముగ్గురు మృతి

వాషింగ్టన్‌: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం తెల్లవారుజామున 3:30 గంటకు(భారత కాలమానం ప్రకారం) రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి మృతిచెందారు. మృతులను ప్రగతి రెడ్డి (35), ఆమె కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56)గా గుర్తించారు. వీరంతా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లోని టేకులపల్లి వాసులుగా తెలుస్తోంది. మృతులు మాజీ సర్పంచ్‌ మోహన్‌రెడ్డి కుమార్తె కుటుంబీకులని సమాచారం. వీరి మరణ వార్త తెలియడంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
పోలీసులమంటూ ఫోన్‌.. ముసలావిడ దగ్గర రూ.20 కోట్లు స్వాహ

దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు ఈ సైబర్ మోసగాళ్ల వలలో పడిపోవద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు.

title
ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు?

తమిళనాడు: ప్రియురాలిని బావిలో తోసి ప్రియుడు కడతేర్చాడు.

title
Amritsar: ఆలయంపై గ్రనేడ్‌ విసిరిన వ్యక్తి ఎన్‌కౌంటర్‌

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌(

title
రన్యా రావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

బెంగళూరు: కన్నడ నటి రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యా

title
తమిళనాడులో ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్‌

చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి(

NRI View all
title
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణవాసులు ముగ్గురు మృతి

వాషింగ్టన్‌: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది.

title
పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన భార్య ఉషా

title
గ్రీన్‌కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్‌.. అమెరికా పౌరసత్వం కట్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసార

title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!

ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

NRI View all
title
కెనడా కొత్త కేబినెట్‌లో ఇద్దరు భారతీయులు

ఒట్టావా: కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్‌ క

title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

title
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’

అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో  మెడికల్‌ కాన్ఫరెన్స్‌ ఘనంగా జరిగింది.

title
డాక్టర్‌ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!

డొమినికన్ రిపబ్లిక్‌లో  కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

Advertisement
Advertisement