బీజేపీ ఆఫీస్ దగ్గరే తేల్చుకుంటాం: సీఎం రేవంత్
ఆసిఫాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామం (కొత్తగూడ)లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా రూ. 112. 4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్లను సైతం ప్రారంభించారు. ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కాళేశ్వరం కూలేశ్వరమైంది. రూ. లక్ష కోట్లు గోదావరిలో పోసినట్లైంది. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తాం. తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్ర సీఎంతో చర్చలకు యత్నిస్తున్నాం. మహారాష్ట్ర సీఎంతో మీటింగ్కు కిషన్రెడ్డి చొరవ చూపాలి. తుమ్మిడిహెట్టి నిర్మిస్తే లిఫ్ట్లు అవసరం లేదు.75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటున్నాం. మేం కొన్న ధాన్యాన్ని, మొక్కజొన్నను కేంద్రం తీసుకోవాలి.బీజేపీ నేతలు బస్సు యాత్రలు కాదు.. కేంద్రాన్ని ధాన్యం కొనమని చెప్పండి. లేదంటే అదేంటో తేలుస్తాం. ధాన్యాన్ని కిషన్రెడ్డి ఇంటి ముందు పారబోస్తాం. లేకపోతే ఈ నెల 15 తర్వాత బీజేపీ ఆఫీస్ దగ్గరే తేల్చుకుంటాం’ అని హెచ్చరించారు.
ఇదేందయ్యా ఇది.. 45 లీటర్ల ట్యాంక్కు 52 లీటర్ల పెట్రోల్!
బంక్ల వద్ద పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మనం ఇచ్చిన మొత్తానికి అంత పరిమితిలో పెట్రోల్ కొట్టారా.. లేదా అనే అనుమానం సాధారణంగా వాహనదారులకు వస్తూ ఉంటుంది. అందుచేత తాము నమ్మిన బంక్లకే ఎక్కువగా వెళుతూ ఉంటారు వాహనదారులు. అయితే ఈ తరహాలో జరిగే మోసాలు వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అన్ని బంక్లలో ఇలా చేయకపోయినా కొన్ని బంక్లు ఈ తరహా మోసాలు చేస్తారనడానికి తాజా ఘటనే నిదర్శనం. తాజాగా ఉత్తర్ప్రదేశ్లో ఈ తరహా మోసం వెలుగుచూసింది. కొత్త కారు తీసుకున్న వ్యక్తి ఫుల్ ట్యాంక్ చేయిద్దామని బంక్కు వెళితే అతనికి విపత్కరణ పరిణామం ఎదురైంది. తన కారు ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్లైతే, 52 లీటర్ల పెట్రోల్ కొట్టినట్లు బిల్ ఇవ్వడంతో ఒక్కసారిగా అతను షాక్ తిన్నాడు. తన కారు ట్యాంకు కెపాసిటీ ఎంత అని పలుమార్లు చెక్ చేసుకున్న తర్వాత జరిగిన మోసాన్ని గ్రహించాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ 45 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ అని, మరి ఇంకా ఏడు లీటర్ల పెట్రోల్ ఎందుకు ఎక్కువైందని ఆ బంక్ సిబ్బందిని ప్రశ్నించాడు. కాన్పూర్కు చెందిన చరణ్ సింగ్ అనే వ్యక్తి ఈ పరాభవం ఎదురుకాగా, ఆ మోసం ఎలా జరిగిందో వివరించాడు. తొలుత 41 లీటర్ల ఇంధనాన్ని నింపి ఆపేసి, మళ్లీ పెట్రోల్ కొట్టడం ప్రారంభించారన్నాడు. పెట్రోల్ కొట్టడాన్ని మధ్యలో ఎందుకు ఆపారని ప్రశ్నించగా, ఫుల్ ట్యాంక్ చేసేటప్పుడు రెండు విడతల్లో కొట్టాలని సిబ్బంది బదులిచ్చారని చరణ్ సింగ్ తెలిపాడు. పెట్రోల్ నింపడంలో ఆలస్యం కావడం, చివరకు మొత్తం 52 లీటర్ల పెట్రోల్ అని పేర్కొన్న బిల్లును చేతికి అందించగానే తాను షాక్కు గురైనట్లు తెలిపాడు. దీనిపై పెట్రోల్ బంక్ సిబ్బందిని నిలదీయగా వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు. మేనేజ్మెంట్ కూడా సరిగా సమాధానం చెప్పక పోవడంతో అధికారికంగా ఫిర్యాదు చేశాడు. స్థానిక తూనికలు, కొలతల అధికారుల కుమ్మక్కుతో ఒక వ్యవస్థీకృత మోసాల దందా నడుస్తోందని ఆరోపిస్తూ సింగ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పంపిణీ యంత్రాలలో ఏమైనా అవకతవకలు జరిగాయేమోనని తనిఖీ చేయడానికి జిల్లా యంత్రాంగం విచారణ ప్రారంభించింది.
IPL 2026: టాప్-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా!
ఐపీఎల్లో పరుగుల పండుగ అభిమానులకు ఎంత కిక్ ఇస్తుందో, వివాదాలు, గొడవలు కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్ను అలరించాయి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి తాజా 19వ సీజన్ దాకా ఎన్నో గొడవలు, వివాదాలు చోటు చేసుకున్నాయి. మరి ఈ సీజన్లో అభిమానులకు కిక్ ఇచ్చిన టాప్-10 వివాదాలు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.1) కోహ్లి-గిల్ క్యాచ్ వివాదంఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లి క్యాచ్ ఔట్పై ఎంత రగడ జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 63 పరుగులతో కోహ్లి ఆర్సీబీని విజయం వైపు నడిపిస్తున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ క్యాచ్ను గిల్ సరిగ్గా పట్టలేదని, చేతుల్లోకి వెళ్లడానికి ముందు బంతి నేలను తాకిందని కోహ్లీ భావించాడు. A chat between Virat Kohli and Shubman Gill on the catch. - The celebration by Kohli after winning the argument. 😄 pic.twitter.com/9yVbseOqGy— Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2026అయితే అంపైర్ నితిన్ మీనన్ ఔట్ ఇవ్వడంతో షాక్ తిన్న కోహ్లీ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. తాను ఔట్ కాదని, క్రీజు వదలి వెళ్లనని, థర్డ్ అంపైర్ రివ్యూకు చాన్స్ ఇవ్వాలిని మొండిపట్టు పట్టాడు. చేసేదేం లేక అంపైర్ తన నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు నివేదించాడు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్కు కూడా అది స్పష్టంగా కనిపించకపోయినా.. బంతిలో కొంత భాగం నేలను తాకినట్లు గుర్తించి ఔట్ నిర్ణయాన్ని రద్దు చేసి నాటౌట్గా ప్రకటించాడు. కోహ్లీ సంబరాలు చేసుకోగా, గిల్ మాత్రం నిరాశతో చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత 75 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో కోహ్లీ ఆర్సీబీకి రెండో టైటిల్ అందించాడు.2) షేక్హ్యాండ్ వివాదం..ఈ సీజన్లో అభిమానులకు మరింత కిక్ ఇచ్చిన ఎపిసోడ్ అంటే కోహ్లీ, హెడ్ మధ్య జరిగిన షేక్ హ్యాండ్ వివాదమే అని చెప్పొచ్చు. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీతో హెడ్ వ్యంగ్యంగా మాట్లాడడం, దానికి కోహ్లీ ధీటుగా బదులివ్వడం జరిగిపోయాయి. అయితే ఈ గొడవ ఇక్కడితో సద్దుమణగలేదు. Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂Kohli you character 🔥 pic.twitter.com/W9CS6KM52t— Avénue.1 (@Avnueone8) May 23, 2026మ్యాచ్ పూర్తైన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో హెడ్ తన వద్దకు వచ్చినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం హెడ్ భార్యను కూడా తాకింది. ఆమెపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతూ కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. మరి ఈ వివాదానికి ఈ సీజన్తో ముగింపు పడిందా అంటే చెప్పలేని పరిస్థితి.3) టిమ్ డేవిడ్ అనైతిక చర్యమే 11న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ విజయం తర్వాత ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ చేతి వేళ్లతో అసభ్య సంజ్ఞలు చేయడం వివాదాస్పదమైంది. సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తనను విడుదల చేయడంపై వ్యంగ్యంగా ఈ సైగలు చేసినట్లు తేలింది. దీంతో బీసీసీఐ టిమ్ డేవిడ్ చర్యను తప్పుబడుతూ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది.4) టాస్ వివాదం..ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 పోరు సందర్భంగా టాస్ సమయంలో నెలకొన్న గందరగోళం వివాదంగా మారింది. మొదట టాస్ వేసినప్పుడు పరాగ్ హెడ్ అని చెప్పాడు. అయితే మ్యాచ్ రిఫరీ ప్రకాశ్ భట్ మాత్రం పరాగ్ చెప్పింది అర్థం కాలేదంటూ టాస్ మళ్లీ వేయించాడు. రెండో ప్రయత్నంలో రాజస్తాన్ రాయల్స్కు టాస్ అనుకూలించడంతో బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి ప్రయత్నంలో గుజరాత్కు టాస్ అనుకూలంగా వచ్చినట్లు తర్వాత తేలింది. ఈ సమయంలో గుజరాత్ కెప్టెన్ గిల్ కాస్త అయోమయానికి గురయ్యాడు. కానీ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంతో ఈ వివాదంపై పెద్దగా చర్చ జరగలేదు.5) అంపైరింగ్పై ఎస్ఆర్హెచ్ ఫిర్యాదు ఈ సీజన్లో వరుస వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయాలు తమను తీవ్ర ప్రభావితం చేశాయంటూ ఎస్ఆర్హెచ్ బీసీసీఐని ఆశ్రయించడం హైలైట్గా నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్లో క్లాసెన్ వివాదాస్పద క్యాచ్, కేకేఆర్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్పై, లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ బంతి బౌండరీ లైన్ను దాటకముందే, ఆ తాడును వెనక్కి నెట్టేయడంపై ఎస్ఆర్హెచ్ అసహనం వ్యక్తం చేసింది. ఎంసీసీ నిబంధనల ప్రకారం ఈ చర్యపై ఆటగాడికి భారీ జరిమానా విధించాలని బీసీసీఐ ఎదుట వాదించడం చర్చనీయాంశమైంది.6) పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ ఘటనపంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్లో ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ (ఈ-సిగరేట్) చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. నిబంధనల ప్రకారం ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో ఇలాంటి చర్యలకు పాల్పడడం నిషిద్ధం. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన బీసీసీఐ ఆట పరువుకు భంగం కలిగించినందుకు పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.Captain of Rajasthan Royals team Riyan Parag enjoying vape in the RR dressing room .Vaping is illegal in India . Hello @BCCI is this allowed? #PBKSvsRR pic.twitter.com/banIgJDO6u— Surbhi (@SurrbhiM) April 29, 20267) రాజస్తాన్ డగౌట్ మొబైల్ వివాదంఈ సీజన్లో వివాదాల్లో హైలైట్గా నిలిచిన వాటిలో రాజస్తాన్ రాయల్స్ డగౌట్లో మొబైల్ ఫోన్ కనిపించడమే. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా డగౌట్లో రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండడం కెమెరాల కంటికి చిక్కింది. ఈ చర్య పట్ల సీరియస్ అయిన బీసీసీఐ భిందర్ మొబైల్ అనుకోకుండా వాడానని, మెడికల్రిపోర్ట్స్ చూసుకునేందుకే ఫోన్ వాడినట్లు తెలిపాడు. తన చర్య పట్ల క్షమాపణ చెప్పినప్పటికీ, అతడి వివరణతో సంతృప్తి చెందని బీసీసీఐ రోమి భిందర్కు రూ.లక్ష జరిమానా విధించింది. రోమి భిందర్ చర్యను వ్యతిరేకిస్తూ బీసీసీఐ ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు, నిబంధనలు జారీ చేసింది.8) అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్ఐపీఎల్ 2026 సీజన్లో లక్నోతో మ్యాచ్ సందర్భంగా కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యాడు. షాట్ ఆడిన అంగ్క్రిష్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న గ్రీన్ వద్దని వారించడంతో వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ దశలో బంతిని అందుకున్న షమీ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు. The infamous Angkrish Raghuvanshi Run out today ! 😔What's your opinion on this decision 🤔 , my opinion is that it was not out, a blunder by 3rd umpire ! What was the hurry 😯?#LSGvsKKR #IPL2026pic.twitter.com/eJmxLm5Gwk— Cricket IQ (@S17Anurag) April 26, 2026ఈ నేపథ్యంలో తన రన్నింగ్ దిశను మార్చుకున్న రఘువంశీ షమీ వేసిన బంతికి అడ్డు రావడంతో అది అతడి ప్యాడ్లకు తగిలింది. దీంతో లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నందుకు అంపైర్ అంగ్క్రిష్ రఘువంశీని ఔట్గా ప్రకటించాడు.9) అర్ష్దీప్ ఇన్స్టా వివాదంపంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దాదాపు 200 పైగా పోస్టులను తొలగించడం ఆసక్తిగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్లో పలు వివాదాల నేపథ్యంలో అర్ష్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేలింది. టోర్నీ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ సహా జట్టు సమావేశాలకు సంబంధించి కంటెంట్ను సోషల్మీడియాలో షేర్ చేసుకోవద్దంటూ బీసీసీఐ ఆటగాళ్లను హెచ్చరించింది. అందుకే అర్ష్దీప్ తన ఇన్స్టాలో పోస్టులు తొలగించి ఉంటాడని అభిమానులు భావించారు.10) జాసన్ హోల్డర్ క్యాచ్ వివాదంగుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో రజత్ పాటీదార్ ఇచ్చిన క్యాచ్ హోల్డర్ డైవ్ చేసి పట్టినప్పటికీ ఆ క్యాచ్ పూర్తి వివాదాస్పదమయింది. పాటిదార్ ఇచ్చిన క్యాచ్ను అందుకునే క్రమంలో హోల్డర్ బంతిని తొలుత నేలకు ఆనించినట్లు కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, అంపైర్ ఔటివ్వడం ఆర్సీబీ డగౌట్లో ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించింది. They checked the runout for 1 min and there was indeed a check of that Patidar's catch by Jason Holder, just judged in 17 secsTruly disappointing to see umpiring at this level this season. New day, new lowpic.twitter.com/KGgbi2a7qb— Gautam (@indiantweetrian) April 30, 2026హోల్డర్ పట్టిన క్యాచ్పై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్ కాదని తెలుస్తున్నప్పటికీ మూడో అంపైర్ పాటిదార్ను ఔట్ అని ప్రకటించడం అత్యంత వివాదాస్పదమయ్యింది.చదవండి: భారత్లో ఫిఫా ప్రసార హక్కులు ఆ సంస్థకే!
Hyd: భూములు బంగారం.. కొండలకే కోట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధానిలో భూములు బంగారమైపోయాయి. కొండలే రూ.కోట్లు పలుకుతున్నాయి. హైదరాబాద్ భూముల వేలం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన రాయదుర్గం భూముల వేలంలో ఎకరం రెండొందల కోట్లు పైగానే పలికింది. వరుసగా నిర్వహించిన రెండు వేలాల్లో సైతం ఎకరం భూమి ధర రెండొందల కోట్ల మార్కును దాటేయడం విశేషం. గతంలో రూ. 177 కోట్లు పలికితేనే వామ్మో అనుకునే ఆశ్చర్యపోతే, ఇప్పుడు రూ. 200 కోట్లను ఎకరం భూమి దాటేసి మరీ రికార్డులను స్పష్టించింది. ఈరోజు(సోమవారం, జూన్ 1వ తేదీ) టీజీఐఐసీ(Telangana Industrial Infrastructure Corporation) తాజాగా నిర్వహించిన భూముల వేలంలో రికార్డు ధర పలికింది. టీజీఐఐసీ వేలంలో రూ. 204 కోట్లకు పైగా పలికింది రాయదుర్గం భూమి. రాయదుర్గంలో 5 ఎకరాల 9 గుంటల భూమికి వేలం వేయగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వెళ్లింది. రెండు రోజుల క్రితం వేలంలో ఎకరం భూమి రూ. 237 కోట్లు రికార్డు ధర పలకగా, ఈసారి అదే పరిధిలో ఎకరం భూమి రూ. 204 కోట్లకు వెళ్లింది. దాంతో రెండు విడతల్లోనూ రెండొందల కోట్ల మార్కను ఎకరం భూమి దాటేయడంతో భూములు మరింత ప్రియం అయిపోతున్నాయని అనుకోవడం మన వంతైంది. రెండు విడతల్లో కలిపి ప్రభుత్వానికి రూ. 2500 కోట్ల ఆదాయం సమకూరింది. రెండు రోజుల క్రితం సర్వే నంబర్ 83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి ఈ-వేల నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 6 ఎకరాల 9 గుంటలు రూ. 1490.73 కోట్లు పలికింది. దీన్ని గౌర వెంచర్స్ దక్కించుకుంది.
ఓటీటీలో స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ధురంధర్’ దెబ్బకు దావూద్ ముఠాలో కలకలం.. మన దేశంలోకి..
ఇదేందయ్యా ఇది.. 45 లీటర్ల ట్యాంక్కు 52 లీటర్ల పెట్రోల్!
జూన్లో లాంచ్ అయ్యే కార్లు: లగ్జరీ నుంచి ఈవీ వరకు..
ధనుశ్ లేటేస్ట్ మూవీ.. ఏకంగా నంబర్వన్గా ట్రెండింగ్..!
కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ కవర్లో ఏముంది?
రామ్ చరణ్ పెద్ది.. టికెట్ బుకింగ్స్ షురూ.. ఒక్కో టికెట్ ఎంతంటే?
కెనడా క్రికెట్పై సస్పెన్షన్.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం!
విరాట్ కోహ్లీ నేర్పే పెట్టుబడి పాఠాలు!
బీజేపీ అభ్యర్థి కొడుకుతో సూలే కుమార్తె పెళ్లి
తిరుపతిలో నా పెళ్లి!
3,500 ఏళ్ల క్రితం ప్రజల తెలివి.. నేటి టెక్నాలజీకే సవాల్!
IPL 2026: ఫైనల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్!
స్వామీ క్షమించండీ! మహానాడు కోసం మిమ్మల్ని కూడా వాడేశారు!
'నీకు నేను చాలా కృతజ్ఞుడిని'.. శోభితకు చైతూ స్పెషల్ విషెస్
రాత్రికి రాత్రే కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగులు!
ఐటీ ఉద్యోగానికి గుడ్బై.. ఆటో డ్రైవింగ్తో హ్యాపీ లైఫ్!
ఇక ఆర్టీసీ చార్జీల బాదుడు
ఐపీఎల్ ఎగ్గొట్టి.. అక్కడెలా ఆడావు?.. సంగక్కర ఆగ్రహం
పండుగలా దిగివచ్చిన పసిడి, వెండి..
చాలామందితో ఫిజికల్ రిలేషన్.. నా పార్ట్నర్స్కు ముందే తెలుసు: నటి షాకింగ్ కామెంట్స్
ఆరెంజ్ క్యాప్ వైభవ్దే.. ప్రైజ్మనీ ఎంతంటే?
బలగం నటి.. ఇంత గ్లామరస్గా మారిపోయిందేంటి?
మటన్ అడిగితే బీఫ్ పెడతారు
బంగారం రేట్లు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
తమిళనాడు కాంగ్రెస్లో భారీ ట్విస్ట్..
... ఇక డాలర్ పతనాన్ని ఎవరూ ఆపలేరు!
రోహిత్ శర్మ వద్దు.. ముంబై కెప్టెన్గా అతడే సరైనోడు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
సిద్దు ఇంటికి ఎమ్మెల్యేల క్యూ
ఓటీటీలో స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ధురంధర్’ దెబ్బకు దావూద్ ముఠాలో కలకలం.. మన దేశంలోకి..
ఇదేందయ్యా ఇది.. 45 లీటర్ల ట్యాంక్కు 52 లీటర్ల పెట్రోల్!
జూన్లో లాంచ్ అయ్యే కార్లు: లగ్జరీ నుంచి ఈవీ వరకు..
ధనుశ్ లేటేస్ట్ మూవీ.. ఏకంగా నంబర్వన్గా ట్రెండింగ్..!
కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ కవర్లో ఏముంది?
రామ్ చరణ్ పెద్ది.. టికెట్ బుకింగ్స్ షురూ.. ఒక్కో టికెట్ ఎంతంటే?
కెనడా క్రికెట్పై సస్పెన్షన్.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం!
విరాట్ కోహ్లీ నేర్పే పెట్టుబడి పాఠాలు!
బీజేపీ అభ్యర్థి కొడుకుతో సూలే కుమార్తె పెళ్లి
తిరుపతిలో నా పెళ్లి!
3,500 ఏళ్ల క్రితం ప్రజల తెలివి.. నేటి టెక్నాలజీకే సవాల్!
IPL 2026: ఫైనల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్!
స్వామీ క్షమించండీ! మహానాడు కోసం మిమ్మల్ని కూడా వాడేశారు!
'నీకు నేను చాలా కృతజ్ఞుడిని'.. శోభితకు చైతూ స్పెషల్ విషెస్
రాత్రికి రాత్రే కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగులు!
ఐటీ ఉద్యోగానికి గుడ్బై.. ఆటో డ్రైవింగ్తో హ్యాపీ లైఫ్!
ఇక ఆర్టీసీ చార్జీల బాదుడు
ఐపీఎల్ ఎగ్గొట్టి.. అక్కడెలా ఆడావు?.. సంగక్కర ఆగ్రహం
పండుగలా దిగివచ్చిన పసిడి, వెండి..
చాలామందితో ఫిజికల్ రిలేషన్.. నా పార్ట్నర్స్కు ముందే తెలుసు: నటి షాకింగ్ కామెంట్స్
ఆరెంజ్ క్యాప్ వైభవ్దే.. ప్రైజ్మనీ ఎంతంటే?
బలగం నటి.. ఇంత గ్లామరస్గా మారిపోయిందేంటి?
మటన్ అడిగితే బీఫ్ పెడతారు
బంగారం రేట్లు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
తమిళనాడు కాంగ్రెస్లో భారీ ట్విస్ట్..
... ఇక డాలర్ పతనాన్ని ఎవరూ ఆపలేరు!
రోహిత్ శర్మ వద్దు.. ముంబై కెప్టెన్గా అతడే సరైనోడు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
సిద్దు ఇంటికి ఎమ్మెల్యేల క్యూ
ఫొటోలు
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు(ఫొటోలు)
భర్తతో కలిసి జపాన్ ట్రిప్లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు)
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్.. అవతరణ అదిరేలా (ఫొటోలు)
రాయల్ ఛాలెంజర్స్ రాజసం.. ఫైనల్లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు)
‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
చైతూ 'మై లేడీ'.. శోభిత 'బంగారం'.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
ముగిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
బేబీ జంట రొమాంటిక్ సాంగ్ స్టిల్స్ (ఫొటోలు)
హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)
సినిమా
త్రిష మ్యాజికల్ మే.. గుర్రాన్ని దత్తత తీసుకున్న హీరోయిన్
మిల్టెన్ కెనిస్ అనే గుర్రాన్ని దత్తత తీసుకున్న రెజీనామే నెల జ్ఞాపకాలని పంచుకున్న హీరోయిన్ త్రిషతెల్లచీరలో అందంగా మెరిసిపోతున్న దివ్యభారతిఅల్లు స్నేహ మే నెల ఇలా గడిచింది.. ఫొటోలుఆరెంజ్ కలర్ డ్రస్ లో మాయ చేస్తున్న నభామేకప్ లేకపోయినా అందంగా ఆషికా రంగనాథ్ View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Jabili 🌝 (@srideviactor) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Richa Panai (@richapanai)
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థియేటర్లలో ఓ మాదిరిగా ఆడిన మూవీస్ కూడా మన దగ్గర బాగానే ఆదరణ తెచ్చుకుంటాయి. అలా ఇప్పుడు ఓ మలయాళ పోలీస్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'దృశ్యం' చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా 'ద్రిదమ్'. గత నెల 8న థియేటర్లలో రిలీజైంది. కానీ ఓ మాదిరి స్పందన మాత్రమే సొంతం చేసుకుంది. యంగ్ హీరో షేన్ నిగమ్ లీడ్ రోల్ చేశాడు. ఇప్పుడీ చిత్రం వచ్చే శుక్రవారం(జూన్ 12) నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి వస్తుంది.'ద్రిదమ్' విషయానికొస్తే.. ఎస్సై విజయ్ (షేన్ నిగమ్) కొత్తగా ఓ ఊరికి పోస్టింగ్ మీద వస్తాడు. చేరిన రెండో రోజే ఓ హత్య, మూడోరోజు ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, తర్వాత ఓ బ్లాక్మెయిల్ కేసు, తర్వాత మరికొన్ని హత్యలు.. ఇలా వరస కేసులు వస్తూనే ఉంటాయి. వీటని పరిష్కరించడం కోసం విజయ్ ఏం చేశాడు? అసలు ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? కొత్తగా జాయిన్ అయిన విజయ్.. వీటిని ఎలా హ్యాండిల్ చేశాడు? ఇవన్నీ చేసిన తర్వాత విజయ్ కనుక్కొన్న అసలు రహస్యం ఏంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ 'మధువిధు' తెలుగు రివ్యూ)
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. వినోదం ఇక మాక్సిమమ్..!
హైదరాబాద్ సినీ ప్రియులకు బిగ్ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న సినీ ప్రియుల కల తీరనుంది. ఐమ్యాక్స్ థియేటర్ ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. నగరంలోని సుదర్శన్ థియేటర్లో ఈ ఐమ్యాక్స్ ఏర్పాటు కానుంది. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ పేరుతో ఈ ఐమ్యాక్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.ఇప్పటి వరకు భాగనగరంలో ఒక్క ఐమ్యాక్స్ థియేటర్ కూడా అందుబాటులో లేదు. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ఏర్పాటు సినీ ప్రియుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఈ ఏడాదిలోనే ఐమ్యాక్స్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. MAX PICTUREMAX SOUNDMAX IMMERSIONIntroducing, IMAX 🔥Coming soon only at AMB Classic Victory, Hyderabad 🌟@IMAX @SureshProdns#IMAX #HomecomingwithAMBClassicVictory pic.twitter.com/OcuQfibz7N— AMB Cinemas (@amb_cinemas) June 1, 2026
అమ్మపై ప్రేమతో... లక్షల మొక్కలు నాటిన పోకిరి నటుడు
ోపోకిరి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న వారిలో టాలీవుడ్ నటుడు షాయాజీ షిండి. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తన డైలాగ్స్, మేనరిజంతో ఫ్యాన్స్ను తెగ నవ్వించారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వెండితెరపై పవర్ఫుల్ విలన్గా.. కమెడియన్గా మెప్పించారు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సమాజసేవలో పాటుపడుతున్నారు షాయాజీ షిండే. పర్యావరణ పరిరక్షణ కోసం దాదాపు 6.5 లక్షల చెట్లతో ఒక చిన్న అడవినే సృష్టించాడు. షాయాజీ షిండే నిజ జీవితంలో ఒక అద్భుతమైన హీరో అనిపించుకుంటున్నారు. ప్రకృతిని ప్రాణంగా ప్రేమిస్తూ లక్షలాది మొక్కలకు ప్రాణం పోస్తున్నారు. తన తల్లిపై ప్రేమతో మొక్కలు నాటుతున్నట్లు ఆయన వెల్లడించారు. అమ్మ చనిపోయినప్పుడు ఆమె బరువుకు సమానంగా విత్తనాలు నాటినట్లు తెలిపారు. అవే ఇప్పుడు లక్షల మొక్కలై నాకు తోడుగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
క్రీడలు
బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసిన ఆర్సీబీ బ్యాటర్!
ఐపీఎల్ 2026 సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్ను నిలబెట్టుకుంది. అయితే ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించడం వైరల్గా మారింది. అయితే టిమ్ డేవిడ్ ఇదంతా ఫన్ మోడ్లో చేయడంతో పెద్దగా వివాదం కాలేదు.విషయంలోకి వెళితే.. ఈ సీజన్లో బీసీసీఐ ఏఐ రోబోట్ చంపాక్ను పరిచయం చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు బంతిని తీసుకురావడం, బ్యాటర్లకు వెల్కమ్ చెప్పడం లాంటి పనులతో రోబో బాగా పాపులర్ అయింది. అయితే ఈ ఏఐ రోబోను టిమ్ డేవిడ్ నాశనం చేసినంత పని చేశాడు. మ్యాచ్ విజయం అనంతరం ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్తో చాంపియన్ ఫొటోలకు ఫోజిచ్చేందుకు వచ్చింది. ఈ సమయంలో టిమ్ డేవిడ్ చాంపియన్ అని రాసి ఉన్న బోర్డు నుంచి బయటకు వచ్చి ఏఐ రోబో చంపాక్ను తన్నాలని చూశాడు. కానీ తన ఆలోచనను విరమించుకొని తిరిగి తన స్థానానికి వెళ్లిపోయాడు. టిమ్ డేవిడ్ చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్, హాజిల్వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కోహ్లీ (75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో ఆర్సీబీని గెలిపించగా, వెంకటేశ్ అయ్యర్ (32), టిమ్ డేవిడ్ (24) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, రబాడలు చెరొక వికెట్ తీశారు.The moment when the rest of the players were celebrating with the IPL trophy, Tim David started having fun with Champak. Never change Timmy 😂❤️ pic.twitter.com/CYteAnZ53z— ` (@Atomickolly17) May 31, 2026చదవండి: IPL 2026: టాప్-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా!
IPL 2026: టాప్-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా!
ఐపీఎల్లో పరుగుల పండుగ అభిమానులకు ఎంత కిక్ ఇస్తుందో, వివాదాలు, గొడవలు కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్ను అలరించాయి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి తాజా 19వ సీజన్ దాకా ఎన్నో గొడవలు, వివాదాలు చోటు చేసుకున్నాయి. మరి ఈ సీజన్లో అభిమానులకు కిక్ ఇచ్చిన టాప్-10 వివాదాలు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.1) కోహ్లి-గిల్ క్యాచ్ వివాదంఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లి క్యాచ్ ఔట్పై ఎంత రగడ జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 63 పరుగులతో కోహ్లి ఆర్సీబీని విజయం వైపు నడిపిస్తున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ క్యాచ్ను గిల్ సరిగ్గా పట్టలేదని, చేతుల్లోకి వెళ్లడానికి ముందు బంతి నేలను తాకిందని కోహ్లీ భావించాడు. A chat between Virat Kohli and Shubman Gill on the catch. - The celebration by Kohli after winning the argument. 😄 pic.twitter.com/9yVbseOqGy— Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2026అయితే అంపైర్ నితిన్ మీనన్ ఔట్ ఇవ్వడంతో షాక్ తిన్న కోహ్లీ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. తాను ఔట్ కాదని, క్రీజు వదలి వెళ్లనని, థర్డ్ అంపైర్ రివ్యూకు చాన్స్ ఇవ్వాలిని మొండిపట్టు పట్టాడు. చేసేదేం లేక అంపైర్ తన నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు నివేదించాడు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్కు కూడా అది స్పష్టంగా కనిపించకపోయినా.. బంతిలో కొంత భాగం నేలను తాకినట్లు గుర్తించి ఔట్ నిర్ణయాన్ని రద్దు చేసి నాటౌట్గా ప్రకటించాడు. కోహ్లీ సంబరాలు చేసుకోగా, గిల్ మాత్రం నిరాశతో చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత 75 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో కోహ్లీ ఆర్సీబీకి రెండో టైటిల్ అందించాడు.2) షేక్హ్యాండ్ వివాదం..ఈ సీజన్లో అభిమానులకు మరింత కిక్ ఇచ్చిన ఎపిసోడ్ అంటే కోహ్లీ, హెడ్ మధ్య జరిగిన షేక్ హ్యాండ్ వివాదమే అని చెప్పొచ్చు. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీతో హెడ్ వ్యంగ్యంగా మాట్లాడడం, దానికి కోహ్లీ ధీటుగా బదులివ్వడం జరిగిపోయాయి. అయితే ఈ గొడవ ఇక్కడితో సద్దుమణగలేదు. Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂Kohli you character 🔥 pic.twitter.com/W9CS6KM52t— Avénue.1 (@Avnueone8) May 23, 2026మ్యాచ్ పూర్తైన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో హెడ్ తన వద్దకు వచ్చినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం హెడ్ భార్యను కూడా తాకింది. ఆమెపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతూ కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. మరి ఈ వివాదానికి ఈ సీజన్తో ముగింపు పడిందా అంటే చెప్పలేని పరిస్థితి.3) టిమ్ డేవిడ్ అనైతిక చర్యమే 11న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ విజయం తర్వాత ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ చేతి వేళ్లతో అసభ్య సంజ్ఞలు చేయడం వివాదాస్పదమైంది. సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తనను విడుదల చేయడంపై వ్యంగ్యంగా ఈ సైగలు చేసినట్లు తేలింది. దీంతో బీసీసీఐ టిమ్ డేవిడ్ చర్యను తప్పుబడుతూ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది.4) టాస్ వివాదం..ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 పోరు సందర్భంగా టాస్ సమయంలో నెలకొన్న గందరగోళం వివాదంగా మారింది. మొదట టాస్ వేసినప్పుడు పరాగ్ హెడ్ అని చెప్పాడు. అయితే మ్యాచ్ రిఫరీ ప్రకాశ్ భట్ మాత్రం పరాగ్ చెప్పింది అర్థం కాలేదంటూ టాస్ మళ్లీ వేయించాడు. రెండో ప్రయత్నంలో రాజస్తాన్ రాయల్స్కు టాస్ అనుకూలించడంతో బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి ప్రయత్నంలో గుజరాత్కు టాస్ అనుకూలంగా వచ్చినట్లు తర్వాత తేలింది. ఈ సమయంలో గుజరాత్ కెప్టెన్ గిల్ కాస్త అయోమయానికి గురయ్యాడు. కానీ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంతో ఈ వివాదంపై పెద్దగా చర్చ జరగలేదు.5) అంపైరింగ్పై ఎస్ఆర్హెచ్ ఫిర్యాదు ఈ సీజన్లో వరుస వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయాలు తమను తీవ్ర ప్రభావితం చేశాయంటూ ఎస్ఆర్హెచ్ బీసీసీఐని ఆశ్రయించడం హైలైట్గా నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్లో క్లాసెన్ వివాదాస్పద క్యాచ్, కేకేఆర్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్పై, లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ బంతి బౌండరీ లైన్ను దాటకముందే, ఆ తాడును వెనక్కి నెట్టేయడంపై ఎస్ఆర్హెచ్ అసహనం వ్యక్తం చేసింది. ఎంసీసీ నిబంధనల ప్రకారం ఈ చర్యపై ఆటగాడికి భారీ జరిమానా విధించాలని బీసీసీఐ ఎదుట వాదించడం చర్చనీయాంశమైంది.6) పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ ఘటనపంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్లో ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ (ఈ-సిగరేట్) చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. నిబంధనల ప్రకారం ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో ఇలాంటి చర్యలకు పాల్పడడం నిషిద్ధం. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన బీసీసీఐ ఆట పరువుకు భంగం కలిగించినందుకు పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.Captain of Rajasthan Royals team Riyan Parag enjoying vape in the RR dressing room .Vaping is illegal in India . Hello @BCCI is this allowed? #PBKSvsRR pic.twitter.com/banIgJDO6u— Surbhi (@SurrbhiM) April 29, 20267) రాజస్తాన్ డగౌట్ మొబైల్ వివాదంఈ సీజన్లో వివాదాల్లో హైలైట్గా నిలిచిన వాటిలో రాజస్తాన్ రాయల్స్ డగౌట్లో మొబైల్ ఫోన్ కనిపించడమే. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా డగౌట్లో రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండడం కెమెరాల కంటికి చిక్కింది. ఈ చర్య పట్ల సీరియస్ అయిన బీసీసీఐ భిందర్ మొబైల్ అనుకోకుండా వాడానని, మెడికల్రిపోర్ట్స్ చూసుకునేందుకే ఫోన్ వాడినట్లు తెలిపాడు. తన చర్య పట్ల క్షమాపణ చెప్పినప్పటికీ, అతడి వివరణతో సంతృప్తి చెందని బీసీసీఐ రోమి భిందర్కు రూ.లక్ష జరిమానా విధించింది. రోమి భిందర్ చర్యను వ్యతిరేకిస్తూ బీసీసీఐ ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు, నిబంధనలు జారీ చేసింది.8) అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్ఐపీఎల్ 2026 సీజన్లో లక్నోతో మ్యాచ్ సందర్భంగా కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యాడు. షాట్ ఆడిన అంగ్క్రిష్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న గ్రీన్ వద్దని వారించడంతో వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ దశలో బంతిని అందుకున్న షమీ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు. The infamous Angkrish Raghuvanshi Run out today ! 😔What's your opinion on this decision 🤔 , my opinion is that it was not out, a blunder by 3rd umpire ! What was the hurry 😯?#LSGvsKKR #IPL2026pic.twitter.com/eJmxLm5Gwk— Cricket IQ (@S17Anurag) April 26, 2026ఈ నేపథ్యంలో తన రన్నింగ్ దిశను మార్చుకున్న రఘువంశీ షమీ వేసిన బంతికి అడ్డు రావడంతో అది అతడి ప్యాడ్లకు తగిలింది. దీంతో లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నందుకు అంపైర్ అంగ్క్రిష్ రఘువంశీని ఔట్గా ప్రకటించాడు.9) అర్ష్దీప్ ఇన్స్టా వివాదంపంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దాదాపు 200 పైగా పోస్టులను తొలగించడం ఆసక్తిగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్లో పలు వివాదాల నేపథ్యంలో అర్ష్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేలింది. టోర్నీ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ సహా జట్టు సమావేశాలకు సంబంధించి కంటెంట్ను సోషల్మీడియాలో షేర్ చేసుకోవద్దంటూ బీసీసీఐ ఆటగాళ్లను హెచ్చరించింది. అందుకే అర్ష్దీప్ తన ఇన్స్టాలో పోస్టులు తొలగించి ఉంటాడని అభిమానులు భావించారు.10) జాసన్ హోల్డర్ క్యాచ్ వివాదంగుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో రజత్ పాటీదార్ ఇచ్చిన క్యాచ్ హోల్డర్ డైవ్ చేసి పట్టినప్పటికీ ఆ క్యాచ్ పూర్తి వివాదాస్పదమయింది. పాటిదార్ ఇచ్చిన క్యాచ్ను అందుకునే క్రమంలో హోల్డర్ బంతిని తొలుత నేలకు ఆనించినట్లు కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, అంపైర్ ఔటివ్వడం ఆర్సీబీ డగౌట్లో ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించింది. They checked the runout for 1 min and there was indeed a check of that Patidar's catch by Jason Holder, just judged in 17 secsTruly disappointing to see umpiring at this level this season. New day, new lowpic.twitter.com/KGgbi2a7qb— Gautam (@indiantweetrian) April 30, 2026హోల్డర్ పట్టిన క్యాచ్పై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్ కాదని తెలుస్తున్నప్పటికీ మూడో అంపైర్ పాటిదార్ను ఔట్ అని ప్రకటించడం అత్యంత వివాదాస్పదమయ్యింది.చదవండి: భారత్లో ఫిఫా ప్రసార హక్కులు ఆ సంస్థకే!
అతడిని వన్డౌన్లో ఆడిస్తారా?: ఇంగ్లండ్ దిగ్గజం ఫైర్
ఐపీఎల్-2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అనుసరించిన వ్యూహాలపై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ మండిపడ్డాడు. అసలు గుజరాత్ నాయకత్వ బృందం ఆలోచన ఏమిటో తనకు అర్థం కాలేదన్నాడు.జోస్ బట్లర్ను కాదని నిశాంత్ సింధును వన్డౌన్లో ఎలా ఆడిస్తారని బ్రాడ్ ప్రశ్నించాడు. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఈ క్రమంలో బెంగళూరు వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడగా.. గుజరాత్ రన్నరప్తో సరిపెట్టుకుంది. కాగా ఆర్సీబీతో ఫైనల్ సందర్భంగా గుజరాత్ తమ టాపార్డర్ను మార్చిన సంగతి తెలిసిందే.ఆదిలోనే షాక్ఓపెనర్లుగా సాయి సుదర్శన్, కెప్టెన్ శుబ్మన్ గిల్ కొనసాగగా.. వన్డౌన్లో మాత్రం బట్లర్ను కాదని నిశాంత్ సింధును ఆడించారు. అయితే, సీజన్ ఆసాంతం ఆకట్టుకున్న సాయి ఫైనల్లో 12, గిల్ 10 పరుగులే చేయడంతో గుజరాత్కు ఆదిలోనే షాక్ తగిలింది.ఇలాంటి తరుణంలో అన్క్యాప్డ్ నిశాంత్ సింధు మూడో స్థానంలో వచ్చి 18 బంతుల్లో 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగి 23 బంతుల్లో 19 పరుగులే చేసి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో స్టువర్ట్ బ్రాడ్ గుజరాత్ జట్టు యాజమాన్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంత బట్లర్ మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. కానీ ఫైనల్లో అనూహ్య రీతిలో అతడిని నాలుగో స్థానానికి మార్చారు.నాకైతే అర్థం కావడం లేదుఅసలు ఫైనల్లో.. అది కూడా ముందుగా బ్యాటింగ్ చేస్తూ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏబీ డివిలియర్స్ సైతం దీనిని ఆత్మరక్షణ ధోరణిగానే అభివర్ణించాడు.ఇక ఈ సీజన్లో ఓపెనర్లు గిల్, సాయి చెరో 700కు పైగా పరుగులు సాధించారు. ఓపెనర్లు ఇంత నిలకడగా రాణించడం మంచిదే. అదే సమయంలో ఇలాంటి ప్రదర్శనల వల్ల మిడిలార్డర్ను పరీక్షించేందుకు వీలుకాదు. ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే..ఒత్తిడిలో వారు ఎలా రాణిస్తారో తెలియదు. టైటిల్ పోరులో ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే.. మిగతా వాళ్లు కూడా పెవిలియన్కు క్యూ కట్టేశారు’’ అని స్టువర్ట్ బ్రాడ్ విమర్శించాడు.బహుశా అందుకేనేమో!ఇక ఇదే షోలో ఇంగ్లండ్ మరో మాజీ ఆటగాడు స్టీవెన్ ఫిన్స్పందిస్తూ.. ‘‘ఇంగ్లండ్ తరఫున చాలా ఏళ్ల పాటు ఓపెనర్గా ఆడిన అనుభవం బట్లర్కు ఉంది. అలాంటిది అతడిని డిమోట్ చేయడం ఆశ్చర్యకరంగా అనిపించింది.అయితే, పాత బడుతున్న కొద్దీ వికెట్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని గుజరాత్ నాయకత్వ బృందం భావించి ఉంటుంది. కాసేపు నిశాంత్ స్టాండింగ్ ఇస్తే బట్లర్ కుదురుకోగలడని అంచనా వేసి ఉంటుంది. కానీ అదేమీ జరుగలేదు’’ అని పేర్కొన్నాడు.కాగా గుజరాత్ టాపార్డర్ కుదేలు కాగా.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అజేయ అర్ధ శతకం (50)తో రాణించాడు. ఫలితంగా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో పూర్తి చేసి టైటిల్ విజేతగా నిలిచింది.చదవండి: ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశారు?!
ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశారు?!
ఐపీఎల్ పందొమ్మిదో సీజన్ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ నిలబెట్టుకుంది. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది.ఇదిలా ఉంటే.. ఈ సీజన్తో కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ కెరీర్ చరమాంకానికి చేరినట్లు తెలుస్తోంది. అంచనాలు అందుకోలేక చతికిలపడిన కొందరు ప్లేయర్లను వదిలించుకునేందుకు ఫ్రాంఛైజీలు సిద్ధమైనట్లు సమాచారం. ఈ జాబితాలో టాప్-5లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఇవే!కరుణ్ నాయర్కరుణ్ నాయర్ను ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. మిడిలార్డర్లో రాణిస్తాడనే ఉద్దేశంతో 34 ఏళ్ల ఈ వెటరన్ బ్యాటర్కు అవకాశం ఇచ్చింది. ఇక, ఐపీఎల్-2025లో కరుణ్ నాయర్ కాస్త ఫర్వాలేదనిపించాడు.ఎనిమిది ఇన్నింగ్స్లో కలిపి 198 పరుగులు చేయగలిగాడు. దీంతో ఈ ఏడాది కూడా ఫ్రాంఛైజీ అతడిని కొనసాగించింది. అయితే, ఐపీఎల్-2026లో రెండు ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ కేవలం 18 పరుగులే చేశాడు. ఫీల్డింగ్లోనూ విఫలమయ్యాడు.వచ్చే సీజన్ నాటికి కరుణ్ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు పునర్నిర్మాణంలో భాగంగా యువ ఆటగాళ్లను ఎంచుకునే క్రమంలో కరుణ్ నాయర్కు స్వస్తి పలికే అవకాశం ఉంది. ఇక అతడికి కొత్త జట్టు దొరకడం కూడా కష్టమే!టి.నటరాజన్సన్రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్గా వచ్చి.. ఐపీఎల్లో ఇటీవలి కాలంలో ప్రభావం చూపిన లెఫ్టార్మ్ పేసర్లలో ఒకడిగా ఎదిగాడు టి.నటరాజన్. ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది అతడిని ఏకంగా రూ. 10.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.అందుకు తగ్గట్లుగానే ఆరంభంలో రాణించినప్పటికీ.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించకలేకపోయాడు ఈ తమిళనాడు బౌలర్. పది ఇన్నింగ్స్లో కలిపి కేవలం ఐదు వికెట్లే తీశాడు. ఎకానమీ 11.18.వరుసగా ఆరు మ్యాచ్లలో నటరాజన్ ఒక్క వికెట్ కూడా తీయలేక చతికిలపడ్డాడు. కాబట్టి ఢిల్లీ అతడిని వదిలివేయడం ఖాయంగానే కనిపిస్తోంది.అన్రిచ్ నోర్జేసౌతాఫ్రికా స్పీడ్స్టర్ అన్నిచ్ నోర్జేను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. పదునైన పేస్ ఆయుధంతో రాణించగల నోర్జే.. అదే స్థాయిలో గాయాల బారిన పడటం ప్రతికూలంగా మారింది.తాజా ఎడిషన్లో అతడు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడగలిగాడు. గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. గతంలో కేకేఆర్ తరఫున కూడా కేవలం రెండు మ్యాచ్లే ఆడి వెళ్లిపోయాడు. దీంతో గాయాల బెడదతో బాధపడుతున్న నోర్జేకు ఫ్రాంఛైజీలు మళ్లీ అవకాశం ఇవ్వడం దాదాపుగా అసాధ్యమే అనిపిస్తోంది.ట్రెంట్ బౌల్ట్న్యూజిలాండ్ సీనియర్ పేసర్ ఫాస్ట్బౌలర్ ట్రెంట్ బౌల్ట్కు ఐపీఎల్లోనూ ఘన చరిత్రే ఉంది. వివిధ ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తూ.. విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ కివీస్ బౌలర్.. ఇప్పటికి 124 మ్యాచ్లలో కలిపి 145 వికెట్లు పడగొట్టాడు.ఇక ఐపీఎల్-2026కు ముందు ముంబై ఇండియన్స్ రూ. 12.50 కోట్ల భారీ ధరకు బౌల్ట్ను కొనుగోలు చేసింది. అయితే, ఆశించిన రీతిలో అతడు రాణించలేకపోయాడు. ఐదు మ్యాచ్లు ఆడి కేవలం రెండే వికెట్లు తీశాడు. దీంతో అతడికి బౌలింగ్ కోటా పూర్తి చేసే అవకాశం కూడా రాలేదు. కాబట్టి 36 ఏళ్ల బౌల్ట్ను ముంబై వదిలేస్తే.. అతడికి మరో ఫ్రాంఛైజీ నుంచి అవకాశం రావడం కష్టమే అనిపిస్తోంది.హర్షల్ పటేల్ఐపీఎల్-2026కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ హర్షల్ పటేల్ను రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. గతేడాది 13 ఇన్నింగ్స్లో కలిపి అతడు 16 వికెట్లు తీశాడు అయితే, గతంలో మాదిరి ఈసారి హర్షల్ రాణించలేదు.ఐదు మ్యాచ్లు ఆడి 10కి పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. వచ్చే సీజన్ నాటికి హర్షల్ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఈ పరిణామాల క్రమంలో సన్రైజర్స్ అతడిని వదిలివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హర్షల్ వేలంలోకి వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఫ్రాంఛైజీ అతడి వైపు మొగ్గుచూపకపోవచ్చు.చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్మనీ?
న్యూస్ పాడ్కాస్ట్
ఐపీఎల్ బాద్షా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై జయకేతనం
ఏపీ మెగా డీఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి సర్కార్ యత్నాలు... తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యా శాఖ
చేతికి వచ్చి చేజారిన ఉద్యోగం... ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో బయటపడుతున్న లీలలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా... కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
చంద్రబాబు రాక్షస పాలనపై పోరుబాట... వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పునకు సంకేతాలు.. సిద్ధరామయ్య రేపు రాజీనామా చేసే అవకాశం
మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా?... చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన మాజీ సీఎం వైఎస్ జగన్
యుద్ధమా? ఒప్పందమా?... ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో పగిలిన అక్రమాల పుట్ట... ఎస్సీఆర్టీ నుంచే కుంభకోణం..
అమరావతిలో చంద్రబాబు లూటీ... అవినీతి, దోపిడీతో ఎప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు.
బిజినెస్
ఫాస్ట్ట్యాగ్ యూజర్లకు హెచ్చరిక.. నటుడి షాకింగ్ అనుభవం!
ప్రముఖ నటుడు అశ్విన్ ముష్రాన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో వాహనదారులలో చర్చకు దారితీసింది. ఈ సంఘటన ఫాస్ట్ట్యాగ్ (FASTag) వ్యవస్థలో జరిగే మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసింది.అశ్విన్ ముష్రాన్ ముంబైలోని బాంద్రా వర్లీ సీ లింక్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, టోల్ ప్లాజా వద్ద ఒక సమస్య ఎదురైంది. టోల్ సిబ్బంది తన ఫాస్ట్ట్యాగ్ ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేదని చెప్పారు. దీంతో తనకు రూ.200 జరిమానా విధించి, చెల్లించాలని కోరారు. అయితే.. జరిమానా చెల్లించిన తరువాత, తన ఫాస్ట్ట్యాగ్ ఖాతాను చెక్ చేసుకుంటే, అందులో దాదాపు రూ.3,000 బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశారు.అశ్విన్ ముష్రాన్ వెంటనే.. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తిరుగు ప్రయాణంలో అదే వాహనం అదే టోల్ ప్లాజా గుండా ఎటువంటి సమస్య లేకుండా వెళ్లింది. అనంతరం తన ఫాస్ట్ట్యాగ్ బ్యాలెన్స్కు సంబంధించిన ఆధారాలను చూపించి టోల్ సూపర్వైజర్తో మాట్లాడారు. చివరికి సంబంధిత అధికారులు తనకు 200 రూపాయలు తిరిగి చెల్లించినట్లు పేర్కొన్నారు.ఈ సంఘటనకు కారణం సాంకేతిక లోపమా?, లేక మోసానికి సంబంధించినదా? అనే విషయం స్పష్టంగా తెలియదు. కానీ.. వాహనదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేసింది.ఫాస్ట్ట్యాగ్ మోసాల పట్ల జాగ్రత్తలుప్రయాణానికి ముందు ఫాస్ట్ట్యాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. అవసరమైతే స్క్రీన్షాట్ తీసుకోవాలి.బ్యాలెన్స్ లేదని చెబితే వెంటనే అదనపు చెల్లింపు చేయకుండా, ఖాతా వివరాలను మరోసారి ధృవీకరించమని అడగాలి.ప్రతి టోల్ చెల్లింపు తర్వాత వచ్చిన SMS లేదా యాప్ నోటిఫికేషన్ను పరిశీలించడం మంచిది.అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే సంబంధిత టోల్ అధికారులకు లేదా ఫాస్ట్ట్యాగ్ కస్టమర్ కేర్కు వెంటనే ఫిర్యాదు చేయాలి.అశ్విన్ ముష్రాన్ వీడియో వైరల్ అయిన తర్వాత.. చాలామంది నెటిజన్లు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. ఒక్కోసారి రూ.200 చిన్న మొత్తంగా కనిపించినా, వేలాది వాహనాల వద్ద ఇలాంటి ఘటనలు జరిగితే అది పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. కాబట్టి ఫాస్ట్యాగ్ ఉపయోగించే ప్రతి వాహనదారులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. View this post on Instagram A post shared by Ashwin Mushran (@ashwinmushran)
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 508.40 పాయింట్లు లేదా 0.68 శాతం నష్టంతో 74,267.34 వద్ద, నిఫ్టీ 165.15 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో 23,382.60 వద్ద నిలిచాయి.ఎన్ఐఐటీ లిమిటెడ్, జీ-టెక్ జైంక్స్ ఎడ్యుకేషన్ లిమిటెడ్, లంబోధర టెక్స్టైల్స్ లిమిటెడ్, రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్, పశుపతి అక్రిలాన్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జీనా సిఖో లైఫ్కేర్ లిమిటెడ్, కోస్టల్ కార్పొరేషన్ లిమిటెడ్, బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ లిమిటెడ్, అరిహంత్ ఫౌండేషన్స్ & హౌసింగ్ లిమిటెడ్, డెల్ఫీ వరల్డ్ మనీ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఆదాయాల అంతరం.. ఆప్యాయతలు దూరం!
సాఫ్ట్వేర్ రంగంలో భారీ ప్యాకేజీలు, విలాసవంతమైన జీవనశైలి ఒకవైపు ఆకర్షిస్తున్నా.. అంతర్గతంగా ఐటీ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో కొత్త రకమైన ఆర్థిక విబేధాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న ఒక సీనియర్ ప్రొడక్ట్ డిజైనర్ తన భాగస్వామితో ఎదుర్కొంటున్న ‘ఆదాయ అసమానత’కు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కలిసి జీవించడం సులువే అయినా నెలవారీ ఖర్చులు, జీతాల మధ్య ఉండే భారీ వ్యత్యాసం వారి మధ్య ఉన్న ప్రేమను ఎలా దూరం చేస్తోందో సదరు టెక్కీ ఆవేదన వ్యక్తం చేశాడు.కార్పొరేట్ ఉద్యోగుల ప్రొఫెషనల్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ‘గ్రేప్వైన్’లో ఒక మైక్రోసాఫ్ట్ టెక్కీ ‘గూఫీపాండా’ అనే పేరుతో తన వ్యక్తిగత జీవితంలోని అంశాలను పంచుకున్నాడు. అందులోని వివరాల ప్రకారం.. ‘నేను మైక్రోసాఫ్ట్లో సీనియర్ ప్రొడక్ట్ డిజైనర్గా పనిచేస్తూ ఏడాదికి రూ.48 లక్షలు సంపాదిస్తున్నాను. నా స్నేహితురాలి వార్షిక ఆదాయం రూ.8 లక్షలు. ఈ ఏడాది ప్రారంభంలో మేమిద్దరం కలిసి ఉండాలని(లివ్-ఇన్ రిలేషన్షిప్) నిర్ణయించుకున్నాం. నా ఆఫీస్కు దగ్గర్లోనే ఒక మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాం. మొదట్లో అంతా సజావుగానే సాగింది. కానీ బడ్జెట్ దగ్గరకు వచ్చేసరికి అసలు కథ మొదలైంది’ అని పేర్కొన్నాడు.ప్లాట్ లీజు ఒప్పందంపై సంతకాలు చేసి కొత్త ఇంట్లోకి మారిన తర్వాత నిత్యం వచ్చే బిల్లులు, కిరాణా ఖర్చులు, భారీ సెక్యూరిటీ డిపాజిట్ వంటివి వారి ఆర్థిక స్థితిగతుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించాయి. ఇద్దరి జీతాల మధ్య ఏకంగా 6 రెట్లు తేడా ఉండటంతో ఖర్చులను సమానంగా పంచుకోవడం అసాధ్యంగా మారింది.టెక్కీ తెలిపిన వివరాల ప్రకారం..ప్రస్తుతం అద్దె, రోజువారీ జీవనశైలి ఖర్చులతో కూడిన ఉమ్మడి బడ్జెట్లో 85 శాతానికి పైగా అతడే ఒంటరిగా భరిస్తున్నట్లు చెప్పాడు. బంధం న్యాయంగా సాగాలనే ఉద్దేశంతో ఆఫీస్ సీనియర్లను సంప్రదించి ఒక జాయింట్ అకౌంట్ కూడా క్రియేట్ చేసినట్లు తెలిపాడు. అయినా సమస్య సర్దుమణగలేదన్నాడు.కారు రిపేర్ బిల్లుతో..ఈ ఏర్పాటు కొంతకాలం స్థిరంగా సాగినట్లు అనిపించినా ఊహించని ఖర్చులు ఎదురైనప్పుడు అసలు సమస్య తీవ్రరూపం దాల్చింది. ఇటీవల వారి కారు రిపేర్ బిల్లు వచ్చింది. ఈ ఖర్చును ఇద్దరం పంచుకుందామని అతను ప్రతిపాదించగా ఆమె ఆర్థికంగా ఆ విషయాన్ని పూర్తిగా దాటవేసేందుకు ప్రయత్నించినట్లు పోస్ట్లో తెలిపాడు. ‘డబ్బు విషయంలో జరిగే ప్రతి చిన్న గొడవ మా మధ్య ఉన్న ఆప్యాయతను, ప్రేమను క్రమంగా నాశనం చేస్తోంది. వ్యక్తిగత జీవితంలో నేను ఎదుర్కొన్న అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితి ఇదే’ అని సదరు టెక్కీ ఆందోళన వ్యక్తం చేశాడు.నెటిజన్ల అభిప్రాయాలుఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారడంతో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలతో కామెంట్ చేస్తున్నారు. ‘ఆమెతో నీకు దీర్ఘకాలిక భవిష్యత్తు ఉంటుందని నమ్మకం ఉంటే ఆర్థిక భారాన్ని నువ్వే ఎక్కువగా మోయడంలో తప్పులేదు. ఆదాయ అసమానతలు సహజం. భాగస్వామి కెరీర్ ఎదగడానికి నువ్వే సాయం చేయాలి’ అని కొందరు చెబుతున్నారు. ‘ఆమెకు నీతో కలిసి జీవించాలనే నిబద్ధత ఉంటే.. అదనపు ఖర్చుల విషయంలో రక్షణాత్మకంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? నువ్వు ఆమెను జీవిత భాగస్వామిగా చూస్తున్నావా లేక కేవలం రూమ్ మేట్లా భావిస్తున్నావా?’ అని కొందరంటున్నారు. నెటిజన్ల నుంచి వచ్చిన ఈ స్పందనపై సదరు మైక్రోసాఫ్ట్ ఉద్యోగి మళ్లీ స్పందించాడు. తాను ఆమెను కేవలం ఫ్లాట్ మేట్లా కాకుండా తన జీవిత భాగస్వామిగానే భావిస్తున్నానని స్పష్టం చేశాడు. అయితే, సాధారణ డేటింగ్ స్థాయి నుంచి ఒకే ఇంట్లో ఉంటూ సంసారాన్ని నిర్వహించే స్థాయికి మారే క్రమంలో ఎదురైన ఆర్థిక సవాళ్లు తను ఊహించలేదని అంగీకరించాడు. ‘త్వరలోనే మేమిద్దరం ప్రశాంతంగా కూర్చుని, దీర్ఘకాలంలో మా బంధం నిలబడటానికి తగ్గట్టుగా ఒక స్థిరమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకుంటాం’ అని అతను ముగించాడు.ఇదీ చదవండి: రైల్వే సూపర్ యాప్.. పాత యాప్ మధ్య తేడా ఏమిటి?
ఇన్వెస్టర్స్ అలర్ట్: ఇవిగో ‘న్యూ ఫండ్ ఆఫర్స్’
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కొత్తగా స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్) కేటగిరీలో రెండు ఫండ్స్ని ఆవిష్కరించింది. ఐసిఫ్ యాక్టివ్ అసెట్ అలొకేటర్ లాంగ్–షార్ట్ ఫండ్, ఐసిఫ్ ఈక్విటీ లాంగ్–షార్ట్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఈ రెండు ఫండ్ ఆఫర్లు జూన్ 02 వరకు అందుబాటులో ఉంటాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా లాంగ్–షార్ట్ పొజిషన్లు తీసుకోవడం, డెరివేటివ్స్ ద్వారా రిస్క్లను అదుపులో ఉంచడంలాంటి విధానాలతో మెరుగైన రాబడులు అందించేందుకు ఈ వ్యూహాలు పని చేస్తాయని సంస్థ ఈడీ శంకరన్ నరేన్ తెలిపారు.మొదటిది ఈక్విటీ, డెట్, కమోడిటీస్ డెరివేటివ్స్, ఇన్విట్స్ మొదలైన వాటికి నిధులు కేటాయిస్తుంది. రెండోది వివిధ మార్కెట్ క్యాప్స్వ్యాప్తంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. డెరివేటివ్స్ వ్యూహాన్ని కూడా పాటిస్తూ మెరుగైన రాబడులు అందించడంపై దృష్టి పెడుతుంది. ఈ తరహా సిఫ్లో తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారు కనీసం రూ. 10 లక్షలు, ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వారు రూ. 10,000 నుంచి వీటిలో పెట్టుబడులు పెట్టొచ్చు. కోటక్ ఎంఎఫ్ నిఫ్టీ ఫండ్ కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ ఆల్ఫా లో–వోలటైలిటీ 30 ఇండెక్స్ ఫండ్ని ప్రవేశపెట్టింది. ఇది జూన్ 12తో ముగుస్తుంది. ధరల పరంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కాకుండా విస్తృత మార్కెట్కి మించి రాణించగలిగే అవకాశాలున్న 30 సంస్థలు ఈ ఇండెక్స్లో ఉంటాయి. పరిస్థితులను బట్టి ఈ స్టాక్స్లో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలు గల ఇన్వెస్టర్లు దీన్ని పరిశీలించవచ్చని సంస్థ ఎండీ నీలేష్ షా తెలిపారు. మహీంద్రా మాన్యులైఫ్ ‘ఎంపవర్ సిఫ్’ సిఫ్ కేటగిరి కింద మహీంద్రా మాన్యులైఫై మ్యుచువల్ ఫండ్ కొత్తగా ‘ఎంపవర్ సిఫ్’ని ఆవిష్కరించింది. ఈ తరహా ఫండ్స్లో లాంగ్–షార్ట్ పొజిషనింగ్, డెరివేటివ్స్ ఆధారిత వ్యూహాలు కూడా అమలు చేస్తారని సంస్థ తెలిపింది. మారుతున్న ఇన్వెస్టర్ల ఆకాంక్షలు, లక్ష్యాలకు అనుగుణంగా మరింత మెరుగైన రాబడులను అందించేందుకు ఇవి ఉపయోగపడతాయని సంస్థ ఎండీ ఆంథోని హెరెడియా తెలిపారు. ఎంపవర్ సిఫ్ కింద ఈక్విటీ, హైబ్రిడ్, ఫిక్సిడ్ ఇన్రం కేటరిగీలవ్యాప్తంగా వివిధ వ్యూహాలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.
ఫ్యామిలీ
పాడు పొగతో మూడింతల సెగ
సిగరెట్ తెల్లగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ దాంతో కలిగే నష్టం దాని పొగంత నల్లగా ఉంటుంది. స్టైల్గా రెండు వేళ్లతో పట్టుకోడానికి అనువుగా ఉండవచ్చు. కానీ దానితో వచ్చే నష్టాలు వేలు కాదు కదా... లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టినా సరిపోనంతగా లేదా బాగు చేయలేనంతగా భారీగా ఉంటాయి. ఒక్కోసారి జీవితాన్నే మూల్యంగా కోరవచ్చు కూడా. రెండు వేళ్లతో కలిగే మూడు చేతుల నష్టాలేమిటో చూద్దాం.ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్... నష్టాలు..సిగరెట్ లేదా పొగతాగడం అలవాటున్న వ్యక్తి... ఆ దుష్ప్రభావాల వల్ల తానే స్వయంగా నష్టపోతాడు. ఆ అలవాటుకు తన ప్రాణాన్నే పణంగా పెడతాడు. తల మీద ఉన్న వెంట్రుకలూ, తలలోని కీలక అవయవాలు మొదలుకొని కాలూ, కాలి వేలి వరకు పొగాకు వల్ల ప్రభావితం కాని అవయవమంటూ ఏదీ ఉండదు. తలలోని అవయవాలూ, మెడ (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్లు మొదలుకొని ఊపిరితిత్తులూ, కడుపు... ఇలా ప్రతి అవయవమూ క్యాన్సర్తో ప్రభావితం కావడానికి కారణం... పొగాకులో దాదాపు 5000 హానికరమైన రసాయనాలు దేహానికి హాని చేస్తాయి. అంతేకాదు... దాదాపు 60 రకాల రసాయనాలైతే నేరుగా క్యాన్సర్ను కలగజేస్తాయి కాబట్టి వాటిని కార్సినోజెన్స్ అని కూడా పిలుస్తారు. ఇలా తానే స్వయంగా నష్ట΄ోతున్నందున దీన్ని ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు.సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ – అనర్థాలు...నేరుగా పొగతాగే వ్యక్తితోపాటు పక్కనే ఉండే స్నేహితులకూ, తనతోపాటు గడిపే మిత్రులతోపాటు జీవిత భాగస్వామి పొగపీల్చడాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. దీంతో వాళ్లు నేరుగా సిగరెట్ తాగక΄ోయినప్పటికీ పొగాకు దుష్ప్రభావాలకు లోనవుతారు. ప్రధానంగా జీవిత భాగస్వామీ, పిల్లలూ ఇలా ప్యాసివ్ స్మోకింగ్కు గురవుతారు. మరీ ముఖ్యంగా భర్త తాలూకు ఆ అలవాటు భార్య గర్భధారణ విషయంలోనూ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భర్త తాలూకు సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సంతాన సాఫల్యంపై దాని ప్రభావమూ పెరుగుతుంది. భర్త పొగతాగే అలవాటుతో భార్య జీవరసాయనాల్లో మార్పు వచ్చి, అండాల సంఖ్య తగ్గడం జరుగుతుంది. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యంకాదు. సిగరెట్ పొగలో ఉన్న రసాయనాల వల్ల మహిళలకు చాలా త్వరగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెలలు నిండకముందే బిడ్డపుట్టడమూ, అలా పుట్టే పిల్లల్లో బరువు చాలా తక్కువగా ఉండటమూ, ఆ పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలు పెరగడమూ జరుగుతాయి.థర్డ్ హ్యాండ్ స్మోకింగ్... దుష్ప్రభావాలు...నేరుగా సిగరెట్ కాల్చేవారిది ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్. మన స్నేహితుడో లేదా కుటుంబసభ్యుడైనందువల్లనో ఆ అలవాటు ఉన్నవారి నుంచి పొగ పీల్చడాన్ని సెకండ్హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ఇక ఓ వ్యక్తి మూసి ఉన్న ఓ గదిలోనో లేదా లిఫ్ట్లోనో కొద్దిసేపటి కిందట సిగరెట్ కాల్చి వెళ్లిపోయినప్పటికీ... చాలాసేపటి తర్వాత ఎవరైనా ఆ గదిలోకి వెళ్తే అప్పటికీ ఆ సిగరెట్ వాసన వస్తుండటం, అక్కడ ఉన్న నుసిలాంటి ఇతరత్రా చాలా సూక్ష్మమైన వ్యర్థాలు ఆ గదిలోకి వెళ్లినవారి బట్టలకు అంటుకుపోవడం, మన బట్టల్ని వాసన చూసినవారు కూడా సిగరెట్ వాసనను పసిగట్టడం... ఇవన్నీ ‘థర్డ్ హ్యాండ్ స్మోకింగ్’ కిందకు వస్తాయి. ఈ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా గదిలో ఉండిపోయే నుసి, అతి సూక్ష్మమైన సన్నటి ధూళి కణాలు... పొగకు ఎక్స్పోజ్ అయిన బట్టలపై కొన్ని నెలలపాటు, ఆ మాటకొస్తే కొన్నేళ్ల వరకు కూడా అలాగే ఉండిపోతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మరీ ముఖ్యంగా గాలి ప్రవేశించలేకుండా ఉండి, గట్టిగా మూసి ఉన్న గదుల్లో స్మోకింగ్ చేసినప్పుడు, ఇతరులు అందులోకి వెళ్లినప్పుడు ఈ థర్డ్ హ్యాండ్ దుష్ప్రభావాలు మరింత ఎక్కువకాలం కొనసాగుతుంటాయి. ఈ పరిశోధనల్లో తేలినదేమిటంటే.. థర్డ్ హ్యాండ్ స్మోకింగ్కు గురైన 22 గంటల తర్వాత కూడా... వ్యక్తులపై ఆ దుష్ప్రభావాల ప్రభావం కనిపిస్తుందన్నది పరిశోధకుల మాట. యూఎస్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్సైడ్లో సెల్బయాలజిస్ట్ ప్రూ టాల్బోట్ చెబుతున్న దాని ప్రకారం... థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ దుష్ప్రభావాలపై ఇప్పటివరకూ ప్రజల్లో పెద్దగా అవగాహన లేదనీ, పొగతాగే అలవాటున్న వ్యక్తుల తాలూకు కార్లు వాడేవారూ, కొనేవారూ లేదా హోటళ్లలో అంతకుముందు స్మోకర్స్ ఉండి ఖాళీ చేసిన గదులు షేర్ చేసుకునేవారు, క్యాసినోలకు వెళ్లేవారందరికీ ఈ ముప్పు చాలా ఎక్కువనీ, అన్ని అవయవాలకంటే చర్మానికి నేరుగా ఈ ముప్పు ఉంటుందంటూ చెబుతున్నారు.క్యాన్సర్ను సిగరెట్ బాక్స్లో ప్యాక్ చేసి, పిల్లలకు ఇవ్వడం సబబేనా?ప్రాణాంతకమైన క్యాన్సర్ను అందమైన సిగరెట్ పెట్టెలో ప్యాక్ చేసి తీసుకెళ్లి ఇంట్లోని అమాయకమైన పిల్లలకు గిఫ్ట్గా ఇవ్వడం ఎంతవరకు సబబంటూ పరిశోధకులూ, వైద్య ప్రముఖులు పొగాకు వాడేవారిని నేరుగా ప్రశ్నిస్తున్నారు. పొగతాగే అలవాటు ఉన్న తండ్రులు తమ పిల్లలకు పొగ వల్ల దెబ్బతిన్న డీఎన్ఏను సంక్రమింపజేస్తున్నారని వాపోతున్నారు. పిల్లలకు లోపభూయిష్టమైన డీఎన్ఏ దక్కడానికి కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట బ్రాడ్ఫోర్ట్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తల్లిదండ్రుల్లో పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. తమ పొగతాగే అలవాటు కారణంగా తండ్రులు తమ పిల్లలకు దెబ్బతిన్న (డ్యామేజ్డ్) డీఎన్ఏ ను సంక్రమింపజేస్తున్నారని, దాంతో తండ్రి తప్పిదం వల్ల పిల్లలు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోందని ఆ అధ్యయనం చెబుతోంది. దీనికి కారణమేమిటంటే... పురుషుల వీర్యకణాల్లోని డీఎన్ఏ... పొగవల్ల తీవ్రంగా దెబ్బతింటుంది. దాంతో లోపభూయిష్టమైన ఆ డీఎన్ఏ కారణంగా పిల్లల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతాయి. పుట్టబోయే పిల్లల్లో కనిపించే రిస్క్ను తప్పించుకునేందుకు ఒక ఉపాయాన్ని చెబుతున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్ డయానా యాండర్సన్. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం. అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటుకు దూరంగా ఉంటే డీఎన్ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయంటున్నారామె. ఈ అనర్థాలన్నిటి కంటే... స్వయానా తానూ, జీవన సహచరి అయిన తన భార్య, తమకు పుట్టే పిల్లలూ, తన తోటి స్నేహితులూ, వారితోపాటు సమస్త సమాజమంతా ఆరోగ్యంగా ఉండటానికి పొగతాగడమూ, పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానేయడమే మంచిదంటూ డాక్టర్లూ, వైద్య పరిశోధకులూ, ఆరోగ్యాన్ని కోరుకునే అందరూ సూచిస్తున్నారు. ఇక్కడ పొగతాగడం అంటే కేవలం సిగరెట్, బీడీ, చుట్ట అనే కాదు... జర్దా, ఖైనీ, పాన్మసాలా... ఇలా పొగాకు ఏ రూపంలో ఉన్నా అంతే ప్రమాదకారి అని గుర్తించడం అవసరం. నిర్వహణ: యాసీన్(చదవండి: పిల్లలకు సమయం కేటాయించాలి)
పిల్లలకు సమయం కేటాయించాలి
‘పిల్లలకు డబ్బు, ఆస్తులు ఇవ్వడం కాదు, రోజూ తగినంత సమయం కేటాయించడం ముఖ్యం’ అంటున్నారు సైకాలజిస్ట్ పి.జ్యోతిరాజ. ఇరవయ్యేళ్లుగా సైకాలజిస్టుగా చిల్డ్రన్, ఫ్యామిలీ కౌన్సెలర్గా ఉన్న జ్యోతిరాజ పిల్లల పెంపకంలో తాను తీసుకున్న జాగ్రత్తలను ఇలా తెలిపారు...‘‘నిన్నటి తరం పిల్లలు అమ్మనాన్నలు ఏం చెబితే అది విన్నారు. తర్వాతి తరం నిర్ణయాలలో పిల్లల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలు ఎంత చెబితే అంత అనే విధంగా ఉంది. ఆరవ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని కౌన్సెలింగ్కు నా దగ్గరకు తీసుకువచ్చారు. ఇంట్లో ఆ అమ్మాయికి నచ్చినట్టే తల్లిదండ్రులు ఉండాలి. లేదంటే, ఇంట్లో పెద్ద గొడవ. రెండు విషయాల్లో మరీ సమస్య పెద్దదిగా కనిపిస్తోంది. ‘ఒకటి ఫోన్ వాడకం, రెండవది చదువుకోమని చెప్పడం.’ ఈ రెండింటిలోనూ పిల్లలు అతిగా స్పందిస్తున్నారు. పిల్లలకు ఇచ్చింది సమయాన్నే..!నాకు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు సంతానం. వారిని మూడో క్లాస్ నుంచి ఒంటరిగా పనులు చేసుకోవడం, బయటకు వెళ్లిరావడం, వారికి కావల్సినవి వారే కొని తెచ్చుకోవడం వంటివి అలవాటు చేస్తూ వచ్చాను. దీని వల్ల పై చదువుల సమయంలో మాకు దూరంగా ఉన్నా పిల్లలు ఇబ్బందులు పడలేదు. వారికి స్వేచ్ఛగా ఉండే అవకాశం ఇస్తూనే, క్రమశిక్షణనూ అలవాటు చేశాను. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ ఇంటి విషయాలలో కూడా వారి అభిప్రాయం తీసుకునేదానిని. అది నచ్చకపోయినా కొట్టిపడేసిన దాన్ని కాదు. వాళ్లు చెప్పినవన్నీ అనుకూలంగా, వాడదగినవిగా ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు వెంటనే ‘నో’ చెప్పకుండా ఎలా చేస్తే బాగుంటుందో కాస్త సమయం తీసుకునైనా చెప్పేదాన్ని. దీని వల్ల పిల్లలు అర్థం చేసుకునేవారు. అర్థం చేసుకోవడమే ముఖ్యంపిల్లలు చదువులో టాపర్స్గా ఉన్నారా, గ్రేడ్స్ వస్తున్నాయా అని చూసేదాన్ని కాదు. వారు ఆ చదువును ఎంతబాగా అర్థం చేసుకోగలుగుతున్నారు.. అనేదానిపై దృష్టి పెట్టమనేదాన్ని. స్కూల్ నుంచి వచ్చాక ‘టీచర్లు ఏం చెప్పారు, ఏం విన్నావు, ఏం నేర్చుకున్నావు, స్కూల్లో ఏం జరిగింది?’ అని అడిగేదాన్ని. వాళ్లు చెప్పేదంతా వినేదాన్ని. అంతేకానీ, హోమ్వర్క్, క్లాస్ వర్క్, మార్కుల గురించి అడిగేదాన్ని కాదు. మా పిల్లలు చదువుకునే టైమ్లో కంప్యూటర్స్ బూమ్లో ఉంది. కానీ, మా అమ్మాయి ఆర్కిటెక్చర్ చేస్తానంది. సరే అన్నాను. మంచి ర్యాంక్ తెచ్చుకుంది. మా అబ్బాయిని సైన్స్ వైపుగా వెళతావా అని అడిగాను. లేదు ఇంజనీరింగ్ అన్నాడు. వారి ఇష్టాలను కాదనలేదు. వాళ్ల మాటకు మేం విలువ ఇచ్చాం. వాళ్లూ మా మాటలకు విలువ ఇచ్చారు. లేట్ నైట్స్ బయట తిరగడం మాత్రం ఒప్పుకునేదాన్ని కాదు. రాత్రి సమయాల్లో బయట ఉంటే సమస్యలు ఏ విధంగా వస్తాయో వివరించేదాన్ని. నేను మీతో ఉన్నాను అనే భరోసా! మా బాబుకి బిట్స్లో సీట్ వచ్చేముందు కొంతకాలం హాస్టల్లో ఉండేవాడు. అక్కడ ఉన్నన్ని రోజులూ ఏదో తెలియని ఆందోళన ఫీలవుతున్నట్టు గమనించాను. దీంతో ఇంటికి తీసుకువచ్చేశాను. ఇంట్లోనే చదువు, టెస్ట్.. జరిగేలా ప్రతిరోజూ ప్లాన్ చేశాం ‘ఏం టెన్షన్ పడకు. ర్యాంకు రాకపోయినా పర్వాలేదు. ఇది కాకపోతే మిగతా చాయిస్లు కూడా ఉన్నాయి’ అని చెప్పదాన్ని. నీకు నేను ఉన్నాను అని మోరల్గా సపోర్ట్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ చూశాను. మా అమ్మాయి పెళ్లయ్యి, అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. వాళ్లకు ఒక బాబు. నాలుగేళ్ల వయసు. బోలెడన్ని ప్రశ్నలు వేస్తుంటాడు. పిల్లలు అడిగే సందేహాలకు ఓపికగా సమాధానాలు చెప్పకపోతే నిరుత్సాహపడిపోతారు. వారి ఆలోచనలు మరోవైపుకు మళ్లుతాయి. తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వదగిన ఆస్తి తగినంత సమయం వారితో గడపడమే. మా అబ్బాయి కూడా విదేశాలలోనే జాబ్ చేస్తున్నాడు. ఇద్దరూ వారి వారి జీవితాల్లో సంతోషంగా ఉన్నారు.’’∙నిర్మలారెడ్డిమనం వింటే.. వాళ్లు వింటారు..! ఈ మధ్య ఒక పదమూడేళ్ల అబ్బాయిని వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్కు తీసుకువచ్చారు. ఆ అబ్బాయి ధోరణి ఎలా ఉందంటే, పేరెంట్స్ ఏది చెబితే అది రివర్స్ చేస్తాడు. మొదట ఆ అబ్బాయి అడిగిందల్లా ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉండేవారు. అది కాస్తా బెడిసికొట్టింది. ఆ అబ్బాయితో తల్లిదండ్రులు గడపాల్సిన విధానం, సమయం,.. అన్నీ చెబుతూ కొన్ని సెషన్స్ ఇస్తే కొంతవరకు మార్పు వచ్చింది. పేరెంటింగ్ ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ప్రతిరోజూ వారితో కనెక్టివ్గా ఉండాలి.డబ్బులు ఉన్నాయని అడిగినవన్నీ కొనిస్తే అమ్మనాన్నలు డబ్బు మిషన్లలాగే కనిపిస్తారు. మా పిల్లలకు ఏది అవసరమో అదే కొనేదాన్ని. అవసరం లేనిదాని గురించి చెప్పేదాన్ని. డ్యూటీ టైమ్ అయిపోయి ఇంటికి వచ్చానంటే పిల్లలకే సమయం కేటాయించేదాన్ని. ఇప్పటికీ ప్రతిరోజూ ఫోన్ ద్వారా పిల్లలతో కమ్యూనికేషన్లో ఉంటాను. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటే సమస్యలు వచ్చినా సాల్వ్ చేసుకోవడం సులువు అవుతుంది.మనం వింటే.. వాళ్లు వింటారు..! ఈ మధ్య ఒక పదమూడేళ్ల అబ్బాయిని వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్కు తీసుకువచ్చారు. ఆ అబ్బాయి ధోరణి ఎలా ఉందంటే, పేరెంట్స్ ఏది చెబితే అది రివర్స్ చేస్తాడు. మొదట ఆ అబ్బాయి అడిగిందల్లా ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉండేవారు. అది కాస్తా బెడిసికొట్టింది. ఆ అబ్బాయితో తల్లిదండ్రులు గడపాల్సిన విధానం, సమయం,.. అన్నీ చెబుతూ కొన్ని సెషన్స్ ఇస్తే కొంతవరకు మార్పు వచ్చింది. పేరెంటింగ్ ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ప్రతిరోజూ వారితో కనెక్టివ్గా ఉండాలి. డబ్బులు ఉన్నాయని అడిగినవన్నీ కొనిస్తే అమ్మనాన్నలు డబ్బు మిషన్లలాగే కనిపిస్తారు. మా పిల్లలకు ఏది అవసరమో అదే కొనేదాన్ని. అవసరం లేనిదాని గురించి చెప్పేదాన్ని. డ్యూటీ టైమ్ అయిపోయి ఇంటికి వచ్చానంటే పిల్లలకే సమయం కేటాయించేదాన్ని. ఇప్పటికీ ప్రతిరోజూ ఫోన్ ద్వారా పిల్లలతో కమ్యూనికేషన్లో ఉంటాను. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటే సమస్యలు వచ్చినా సాల్వ్ చేసుకోవడం సులువు అవుతుంది. డా.పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్ నిర్మలారెడ్డి(చదవండి: తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు)
న్యాయం దక్కలేదు.. చట్టం మారింది
లైంగిక హింసకు గురైన ఓ ఆదివాసీ మహిళకు అండగా నిలబడి, ఆమె గౌరవాన్ని రక్షించడంలో వ్యవస్థ విఫలమైంది. న్యాయవ్యవస్థ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే ఘటనల్లో ఇది ఒకటి.– సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ రక్షకభట నిలయంలోనే తనకు రక్షణ కరువైందని, న్యాయం చేయాలని, మృగాళ్లను శిక్షించాలని ఓ యువతి వేడుకుంది. అయితే, న్యాయస్థానాల్లో ఆమెకు చుక్కెదురైంది. వ్యక్తిగతంగా ఆమెకు న్యాయం దక్కలేదు. నిందితులకు శిక్షపడలేదు. కాని, భారత న్యాయవ్యవస్థలో పలు మార్పులకు, మహిళా రక్షణ చట్టాల బలోపేతానికి ఈ కేసు నాంది పలికింది. అదే తుకారాం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు. ‘మథుర’ కేసుగా ఇది ప్రాచుర్యం పొందింది. ఇదీ విషాదంఅక్షరం ముక్క రాకపోయినా, తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెంది అనాథగా బతకాల్సి వచ్చినా, ఆమె వెరవలేదు. తన కాళ్లపై నిలబడింది. కూలి నాలి చేసుకుంటూ సోదరుడు గామాతో కలిసి జీవిస్తూ, తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అదే ఆమె పాలిట శాపమైంది. సోదరుడు పెట్టిన కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఆ యువతే మథుర. కూలి పనులతో పాటు స్థానికంగా ఒకరి ఇంట్లోనూ పని చేసేది. ఆ ఇంటి యజమానురాలి బంధువు అశోక్తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆమె సోదరుడు గామాకు నచ్చలేదు. దీంతో ఆమె యజమానురాలు నున్షి, ఆమె భర్త, అశోక్లు మథురను అపహరించారని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు నిమిత్తం ఆమెను మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దేశాయ్గంజ్ పోలీస్స్టేషన్కు రాత్రి సమయంలో తీసుకువచ్చారు. ఆమె వయస్సు ధ్రువీకరణ పత్రం తీసుకుని మర్నాడు స్టేషన్కు రావాలని చెప్పి రైటర్ బయటకు వెళ్లాడు. తుకారాం, గణపత్ అక్కడే కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు.ఏం జరిగిందిమ«థుర వాంగ్మూలం ప్రకారం..‘అందరం బయటకు వెళుతున్న సమయంలో గణపత్ తనను ఆపాడని, మిగతా వాళ్లు వెళ్లిపోవాలని తుకారామ్ ఆదేశించాడు. పోలీస్ స్టేషన్ తలుపులు మూసేశారు. లైట్లు ఆర్పేశారు. ఒంటరిగా ఉన్న తనను భవనం వెనుక వైపు ఉన్న బాత్రూమ్లోకి లాక్కెళ్లి తుకారామ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడ్ని తప్పించుకుని బయటకు వస్తుండగా గణపత్ సైతం లైంగిక దాడికి యత్నించాడు. అతడు మద్యం మత్తులో ఉండడంతో తప్పించుకుని పోలీస్స్టేషన్ వెలుపలికి వచ్చాను’. ఈ ఘటనపై స్థానికుల నుంచి సైతం ఒత్తిడి రావడంతో కేసు నమోదైంది. కోర్టులో విచారణతొలుత చంద్రపూర్ సెషన్స్ కోర్టులో కేసు విచారణకు వచ్చింది. లైంగిక నేరం జరిగిందనడానికి బలమైన కారణాలు లేవని, ఆమె ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఎటువంటి గాయాలు, ప్రతిఘటనకు సంబంధించిన ఆనవాళ్లు లేవని తేల్చింది. ఆమె అంగీకార పూర్వకంగానే ఇది జరిగి ఉండొచ్చని పేర్కొంది. కానిస్టేబుళ్లను నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో కేసు హైకోర్టుకు చేరింది. సెషన్స్ కోర్టు వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. భయం, నిస్సహాయత కారణంగా ఆమె ప్రతిఘటించకపోవడాన్ని ‘సమ్మతి’గా భావించలేమని తుకారామ్కు ఐదేళ్లు, గణపత్కి ఏడాది జైలు శిక్ష విధించింది.సుప్రీంకోర్టులోనూ..హైకోర్టు తీర్పుపై నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిస్సహాయ లొంగుబాటును అత్యాచారంగా పరిగణించడానికి సరిపడా ఆధారాలు లేవని పేర్కొంది. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. వెల్లువెత్తిన నిరసనలుకోర్టులో కేసు నిలబడలేదు. ఆమె కోరుకున్న న్యాయం దక్కలేదు. కాని, సమాజం నుంచి అనూహ్యంగా మద్దతు వెల్లువెత్తింది. సుప్రీం కోర్టు తీర్పుపై మేధావులు కలమెత్తారు. ఇది వాంఛనీయం కాదంటూ నలుగురు న్యాయ శాస్త్ర ప్రొఫెసర్లు అప్పటి చీఫ్ జస్టిస్కు బహిరంగ లేఖ రాశారు. చట్టం, రాజ్యాంగం ప్రకారం మహిళలకు సంక్రమించిన హక్కులను హరించేలా తీర్పు ఉందంటూ ఆక్షేపించారు. మథురకు జరిగిన అన్యాయాన్ని కోర్టు గుర్తించినప్పటికీ సాంకేతికపర అడ్డంకులు న్యాయానికి ప్రతిబంధకాలుగా, నిందితులకు అనుకూలంగా మారాయి. మథురకు న్యాయం జరగలేదంటూ పౌర సమాజం స్పందించింది. లైంగిక నేరాలకు వ్యతిరేకంగా మొదటిసారి గొంతెత్తి నినదించింది. ప్రభుత్వాన్ని కదిలించింది. చట్టాల్లో మార్పులకు ఈ కేసు నాంది పలికింది.మార్పులు ఇలా..అన్యాయానికి గురైన మహిళలకు రక్షణగా చట్టాల్లో మార్పులకు ఈ కేసు నాంది పలికింది. ఈ సవరణలు భారత న్యాయవ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చింది.‘కస్టోడియల్ రేప్’ అంటే నిర్దిష్టమైన నిబంధనలను నిర్వచించింది. పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ అధీనంలో ఉన్న, పని చేస్తున్న వారిపై లైంగిక దాడికి పాల్పడితే పదేళ్ల వరకు శిక్ష విధించేలా మార్పులు చేసింది. తన సమ్మతి లేకుండానే లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదు చేస్తే, తాను నిర్దోషినని నిందితుడే నిరూపించుకునేలా భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో మార్పులు చేశారు.బాధితురాలి గౌరవాన్ని కాపాడేందుకు లైంగిక దాడి కేసులను బహిరంగ విచారణ కాకుండా, ఇన్ కెమెరా ట్రయల్స్ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు రూపొందించారు.బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసేలా మీడియాలో పేరు రాయడం, ఫొటోలు ప్రచురించడాన్ని నిషేధించారు. \భయం, బెదిరింపులు, నిస్సహాయత కారణంగా ప్రతిఘటించకపోవడాన్ని ‘సమ్మతి’గా, నిశబ్దాన్ని అనుమతిగా భావించరాదని గుర్తించారు. -దిలీప్ మాదిరెడ్డి
అటు ప్రయోగం ఇటు ప్రయోజనం!
అందమైన పరిసరాల్లో పుట్టి పెరిగిన కళాకారుల రచనల్లో సౌందర్యం జాలువారుతుందని వర్డ్స్వర్త్, కీట్స్, కాలెరిజ్ తదితర ఇంగ్లిష్ భావకవులు– మూడువందల యేళ్ళ కిందట – ఓ సిద్ధాంతం చెప్పారు. విలియం గిల్పిన్ అనే విమర్శకుడు వారి సిద్ధాంతానికి ‘పిక్చరెస్క్ ఈస్థెటిక్స్‘ (రమణీయ సౌందర్యశాస్త్రం) అని పేరుపెట్టారు. అంతకు వెయ్యిన్నర సంవత్సరాల కిందట భామహుడు మొదలుకొని ఆనందవర్ధనుడి వరకు ఎందరో భారతీయ ఆలంకారికుల సిద్ధాంతాల్లోనూ అలాంటి భావాలున్నాయనే మాట నిజమే– అయితే అదలా వుంచండి! ఇరవయ్యొకటో శతాబ్దిలో ఈ భావనకు ఉదాహరణగా చెప్పదగిన రచయిత జ్షాన్ మారీ గుస్తావ్ లా క్లేజ్యో ఒకరు. లా క్లేజ్యోకు 2008లో నోబెల్ సాహిత్యపురస్కారం ప్రకటిస్తూ ‘ఆయన రచనలు సరికొత్త ప్రయోగాలూ, కవితాత్మక సాహసకృత్యాలూ, ఆనందానుభూతుల చిత్రణలతో నిండి వుంటాయ’ంది స్వీడిష్ ఎకాడెమీ. (నోబెల్ సాహిత్య పురస్కారం ఎవరికివ్వాలో నిర్ణయించేది ఈ ఎకాడెమీయే.) అంతేకాదు– ‘ప్రస్తుతం చెలామణీలో వున్న నాగరికతను మించినవారి కథలనూ, దాని పరిధిలోకి రానివారి కథలనూ కూడా చిత్రించిన రచయిత’గా లా క్లేజ్యోను ప్రశంసించింది స్వీడిష్ ఎకాడెమీ. నవలాకారుడిగానూ, కథానిక రచయితగానూ, వ్యాసకర్తగానూ, అనువాదకుడిగానూ సుప్రసిద్ధుడు లా క్లేజ్యో. ఇటలీ సరిహద్దుకు చేరువగా వుండే ఫ్రెంచ్ నగరం నీస్లో పుట్టారాయన. అది ఆయన తల్లి తరఫు బంధువుల స్వస్థలం. లా క్లేజ్యో తండ్రి తరఫు బంధువులు వందల సంవత్సరాల కిందటే తరలి వెళ్ళిపోయారు. అలా ఆయన పుడుతూనే ద్విజాతీయుడు. అందుకే లా క్లేజ్యో తనను తాను ఫ్రాంకో–మారిషియన్గా చెప్పుకుంటారు.ఇంగ్లండ్– ఫ్రాన్స్– మెక్సికో దేశాల్లో చదువుకుని డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు లా క్లేజ్యో. అండర్ గ్రాడ్యుయేట్ పట్టాకోసం ఆయన ఆంగ్ల సాహిత్యం చదువుకున్నారు. మాస్టర్స్ కోసం, ఫ్రెంచ్ ప్రయోగాత్మక కవి– రచయిత– చిత్రకారుడు హెన్రీ మిషో రచనలను ఎంచుకున్నారు. తీరా డాక్టరేట్ విషయానికి వచ్చేసరికి ఆధునిక చరిత్ర ఆవిర్భవిస్తున్న దశను లా క్లేజ్యో ఎంపిక చేసుకున్నారు. సామాన్య శకం 1525 వరకూ, స్వతంత్రంగా జీవించిన పూరిపెచా ప్రజలు ఆ దశలో మశూచికం తదితర అంటువ్యాధుల పాలబడ్డారు. ఆ పరిస్థితిలో, వారి నాయకులు ప్రజల సంక్షేమం కోసం యుద్ధాన్ని నివారించాలని భావించారు. స్పెయిన్ రాజుకు సామంతరాజ్యంగా ఉంటామని స్వచ్ఛందంగా ప్రకటించారు. దాన్నే ‘పూరిపెచా జాతిపై దిగ్విజయం’గా వక్రీకరించారు స్పానిష్ చరిత్రకారులు. లా క్లేజ్యో తన సిద్ధాంత గ్రంథంలో ఈ వంచనను వెలికితీశారు! పదహారో శతాబ్ది నాటి రాతప్రతుల ఆధారంగా ఆయన ఈ గుట్టు రట్టు చేయగలిగారు. ఆయన అధ్యయన ప్రణాళిక ఇంత క్లిష్టంగా వున్నందువల్లనే అది పూర్తికావడానికి పాతికేళ్ళు పట్టింది.రచయితగా, ప్రయోగశీలతనూ – ప్రయోజన దృష్టినీ గొప్పగా సమ్మిళితం చేశారు లా క్లేజ్యో. రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, శాలింగర్, మిషో, హెమింగ్వే, ఫాక్నర్– లా క్లేజ్యోను ప్రభావితం చేసినవారు. అలాంటి రచయిత ప్రయోగం– ప్రయోజనం అనే రథచక్రాల మీద వీరవిహారం చెయ్యడంలో వింతేముంది? ఏడేళ్ళ పసితనంలోనే సముద్రం గురించి చిన్న పుస్తకం రాసేశాడు ఈ పిడుగు! నైజీరియాలో వున్న తండ్రిని మరుసటి సంవత్సరం –1948లో– కుటుంబ సమేతంగా కలవబోతున్నానన్న ఊహే, లా క్లేజ్యో చేత ఆ పుస్తకం రాయించింది. ఇదే ఊహ, 44 సంవత్సరాల తర్వాత ‘అనీత్సా’ అనే నవలగానూ రూపుదిద్దుకుంది. అదీ పూర్తిగా కల్పన కాదంటారు లా క్లేజ్యో సాహిత్య నిపుణులు. బహుశా అందుకేనేమో, వారెన్ మాటీ అనే విమర్శకుడు ఈ 44 యేళ్ళ కాలాన్ని లా క్లేజ్యో శిక్షణకాలంగా అభివర్ణించాడు! ఈ కథ 1848లో జరిగిందని రచయిత ప్రత్యేకంగా ప్రకటించడం విశేషం! ఫ్రాన్స్ దక్షిణ తీరం నుంచి ఓ పాత నావలో బయల్దేరిన తల్లీ కొడుకులు పశ్చిమ ఆఫ్రికా తీరం పొడుగునా సాగించే సుదీర్ఘ యాత్రే ఈ నవలకు ఇతివృత్తం. ఈ రెండు పుస్తకాలూ రాయడానికి మధ్య కాలంలో లా క్లేజ్యో ఎన్నో మెరుపులు మెరిపించారు. 1963లో వెలువడిన ‘లా ప్రాసెస్ వెర్బల్’ (విచారణ– ఇంటరాగేషన్) అనేది లా క్లేజ్యో తొలి నవల. దానికే ‘ప్రీ రెనాడో‘ పురస్కారం అందుకున్నాడాయన. ఇదే రచన మరో పోటీల్లో కూడా షార్ట్ లిస్ట్ కావడం విశేషమే మరి. లా క్లేజ్యో ప్రయోగాల్లో అత్యధిక పాఠకాదరణ పొందిన నవల ‘డెజెర్ట్.’ ఉత్తర ఆఫ్రికాలో కనిపించే సంచార ఆదివాసుల ప్రణయగాథ దానికి ఇతివృత్తం. ఈ నవల వేర్వేరు కాలాల్లో జరిగిన కథను వేర్వేరు వ్యక్తుల దృష్టికోణం నుంచి చూపిస్తాడు కథకుడు. ఇలాంటి శిల్పవిన్యాసం పాఠకులను రంజింప చెయ్యడంలో వింతేముంది?లా క్లేజ్యోతో పొల్చదగిన రచయితలు అతని సమకాలికుల్లో ఎవరూ లేరనే చెప్పొచ్చు. అయితే అతనికన్నా ముందుగా నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న ఫ్రెంచ్ రచయితలు కూడా ఎవరికీ తీసిపోరు మరి! ఈ పురస్కారం మొదలైన యేడాదే, 1901లో, దాన్ని గెల్చుకున్నవాడు సూలీ ప్రూదాం. ఆయన రాసిన ప్రతీకాత్మక కవిత్వం సుప్రసిద్ధం. ముఖ్యంగా, ప్రూదాం రాసిన ‘ద బ్రోకెన్ వేజ్ – పగిలిన కలశం’ కవితను నెట్ లో చూడొచ్చు! ఇక 85 ఏళ్ళ తర్వాత ఈ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన క్లాడ్ సిమో కూడా తక్కువ వాడేం కాడు. శైలీ విన్యాసానికీ, ప్రయోగశీలతకూ సిమో సుప్రసిద్ధుడు. పోతే, 2000 సంవత్సరానికి గానూ నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న గావ్ షింజియాంగ్ ఫ్రెంచ్ జాతీయుడే కానీ ఫ్రెంచ్ రచయిత కారు! అయినా, పెద్దలతో పోలికలెందుకు మనకు? ఎవరంత వాళ్ళు వారనుకుంటే పోలా? -లిట్వరల్డ్
అంతర్జాతీయం
ఆగని యుద్ధం.. ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం?!
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాల ప్రయత్నాలు విఫలమవడంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన షరతుల నేపథ్యంలో ఈ సంక్షోభం మరింత సుదీర్ఘంగా సాగేలా కనిపిస్తోంది. కీలకమైన హర్మూజ్ జలసంధి మూసివేత భయాలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాము ఎలాంటి అణు ఆయుధాలను తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి తన కోడలు లారా ట్రంప్ నిర్వహించిన ‘ఫాక్స్ న్యూస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు కావలసిన ఒకే ఒక్క గ్యారెంటీ, ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకూడదు. అందుకు వారు అంగీకరించారు, ఇది చాలా ఆసక్తికరమైన విషయం’ అని పేర్కొన్నారు.మరోవైపు, న్యూయార్క్ టైమ్స్, యాక్సియోస్ మీడియా సంస్థల కథనాల ప్రకారం.. శాంతి ఒప్పందం పేరిట ట్రంప్ ఇరాన్కు అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త ప్రతిపాదనలను పంపారు. అయితే ఈ కొత్త షరతుల కారణంగా పశ్చిమాసియాలో అధికారికంగా యుద్ధం ముగింపు, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి పట్టే మరింత సమయం పట్టే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ ముగింపు ఒప్పందంలో భాగంగా ‘లేబనాన్’ను కూడా చేర్చాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లేబనాన్లోకి 30 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి దాడులను తీవ్రం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ డిమాండ్ తెరపైకి తెచ్చింది. దీంతో పాటు వ్యాపార పరంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఓడలపై ఇరాన్ ఎలాంటి పన్నులు వసూలు చేయకూడదని ట్రంప్ ప్రతిపాదించగా, అలాంటి నిబంధన ఏదీ ఒప్పందంలో లేదని ఇరాన్ మీడియా సంస్థ ‘ఫార్స్’ కొట్టిపారేసింది. అంతేకాకుండా, సదరు జలసంధిపై తమ పూర్తి సార్వభౌమాధికారాన్ని చాటే బిల్లును ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఆమోదించబోతోందని స్పష్టం చేసింది.తమ అణు కార్యక్రమంపై అమెరికాతో కీలక చర్చలు ప్రారంభించడానికి ముందే, గతంలో అమెరికా స్తంభింపజేసిన తమ 12 బిలియన్ డాలర్ల ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అదే సమయంలో, ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను నాశనం చేస్తామంటూ ట్రంప్ మునుపు చేసిన వ్యాఖ్యలను ఇరాన్ అధికారిక వర్గాలు తోసిపుచ్చాయి. ట్రంప్ వాదనలపై టెహ్రాన్ (ఇరాన్) మొదటి నుంచి సందేహాలు వ్యక్తంచేస్తుండటంతో, కీలక ప్రాధాన్యతల విషయంలో ఇరు పక్షాల మధ్య ఇంకా చాలా వ్యత్యాసాలు కొనసాగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
బస్సు ప్రమాదం.. 8 మంది మృతి, 33 మందికి గాయాలు
ఇస్తాంబుల్: పశ్చిమ తుర్కియేలో ఆదివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటక బస్సు రహదారి పక్కన ఉన్న ఫెన్సింగ్ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకోవడంతో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 33 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని స్థానిక మీడియాను ఉటంకిస్తూ షిన్హువా వెల్లడించింది.షిన్హువా తెలిపిన వివరాల ప్రకారం.. 38 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు తుర్కియేలోని ఇజ్మిర్ నగరం నుంచి మధ్యధరా సముద్ర తీరంలోని పర్యాటక నగరం అంతాల్యాకు వెళ్తుండగా, దేశంలోని డెనిజ్లీ ప్రావిన్స్లో డెనిజ్లీ-అయ్దిన్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.మృతుల్లో బస్సు డ్రైవర్తో పాటు 9 నెలల శిశువు కూడా ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని షిన్హువా తెలిపింది. ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం.. దట్టమైన పొగమంచు, అధిక వేగం ప్రమాదానికి కారణాలై ఉండొచ్చని భావిస్తున్నారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కొందరికి తీవ్ర గాయాలు కావడంతో అవయవాల తొలగింపు శస్త్రచికిత్సలు అవసరం కావచ్చని పేర్కొన్నారు. పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
చైనాకు చెక్.. AUKUS కూటమి భారీ వ్యూహం!
ప్రపంచ భద్రతా సమీకరణాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా సవాళ్లకు ఎదుర్కొనేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి అత్యాధునిక అండర్వాటర్ డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి శ్రీకారం చుట్టాయి. AUKUS రక్షణ కూటమి కింద చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సముద్ర గర్భంలో పనిచేసే మానవరహిత అత్యాధునిక అండర్వాటర్ డ్రోన్లను రూపొందించనున్నారు. ఇందులో భాగంగా తొలి దశ సామర్థ్యాలను 2027 నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రకటించారు.సింగపూర్లో జరిగిన ప్రతిష్ఠాత్మక షాంగ్రి-లా డైలాగ్ సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. AUKUS “పిల్లర్-2” కింద ప్రకటించిన తొలి ప్రధాన ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. కాగా, ఈ అండర్వాటర్ డ్రోన్లు కేవలం నిఘా కోసమే కాకుండా.. శత్రు జలాంతర్గాములను గుర్తించడం, సముద్ర గర్భంలోని మైన్లను నిర్వీర్యం చేయడం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సముద్ర యుద్ధ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. అవసరమైతే లక్ష్యాలపై దాడులు చేయగల సామర్థ్యాన్ని కూడా వీటికి కల్పించనున్నారు.2021లో ఏర్పడిన AUKUS కూటమి రెండు ప్రధాన భాగాలుగా పనిచేస్తోంది. “పిల్లర్-1” కింద ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే జలాంతర్గాముల సాంకేతికత అందిస్తుండగా, “పిల్లర్-2” కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్సోనిక్ ఆయుధాలు, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ టెక్నాలజీ, అండర్సీ వార్ఫేర్ వంటి అత్యాధునిక రక్షణ సాంకేతికతలను సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు.⚡️ US, UK and Australia ANNOUNCE UNDERWATER DRONES projectDeveloped under their military alliance known as AUKUS, technology is expected to be ready by next year pic.twitter.com/yW4pmf3RKc— RT (@RT_com) May 30, 2026ప్రస్తుతం ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో దాదాపు 95 శాతం సముద్ర గర్భంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే జరుగుతోంది. అలాగే అనేక దేశాల గ్యాస్, ఇంధన సరఫరా వ్యవస్థలు కూడా సముద్ర అడుగునే ఉన్నాయి. ఇటీవల బాల్టిక్ సముద్రం, తైవాన్ సముద్ర జలసంధి ప్రాంతాల్లో అండర్సీ కేబుళ్లు దెబ్బతిన్న ఘటనలు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో కీలక మౌలిక వసతుల రక్షణ కోసం అండర్వాటర్ డ్రోన్లను ఉపయోగించాలని AUKUS దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సముద్ర గర్భం ఇప్పుడు కొత్త యుద్ధ రంగంగా మారుతోందని, అక్కడి ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ టెక్నాలజీ కీలకమని వారు పేర్కొన్నారు.అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ ద్వారా డ్రోన్లలో ఉపయోగించే సెన్సర్లు, నావిగేషన్ వ్యవస్థలు, AI ఆధారిత నిర్ణయ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు వంటి కీలక టెక్నాలజీలను కూడా మూడు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. జీపీఎస్ అందుబాటులో లేని సముద్ర గర్భంలో కూడా స్వతంత్రంగా ప్రయాణించే సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ మొత్తం వ్యూహం వెనుక ప్రధాన కారణం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న నౌకాదళ శక్తి. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ పరిసర ప్రాంతాల్లో బీజింగ్ దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని మిత్రదేశాలు సముద్ర ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ఈ ప్రాజెక్ట్ను వేగవంతం చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం ఈ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, ఇది ప్రాంతీయ ఆయుధ పోటీని మరింత పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.
ట్రంప్ హెల్త్ రిపోర్ట్: ఫుల్ ఫిట్.. కానీ..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై నెలకొన్న సందేహాలకు వైట్ హౌస్ తెరదించింది. త్వరలో 80వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ట్రంప్.. తన విధులను నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఆరోగ్యంతో ఉన్నారని తాజాగా విడుదలైన వైద్య నివేదిక వెల్లడించింది. అయితే దీర్ఘకాలం పాటు ఆయన ఉత్సాహంగా ఉండాలంటే బరువు తగ్గడంతో పాటు వ్యాయామంపై దృష్టి సారించాలని వైద్యులు సూచించారు.పూర్తిగా ఫిట్.. కానీ జాగ్రత్తలు అవసరంవాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో ట్రంప్నకు వైద్య పరీక్షలు జరిగిన అనంతరం, వైట్ హౌస్ ఫిజీషియన్ డాక్టర్ సీన్ బార్బబెల్లా అధికారిక నివేదక విడుదల చేశారు. ట్రంప్ తన కమాండర్ ఇన్ చీఫ్ విధులను నిర్వహించడానికి ఎటువంటి శారీరక ఇబ్బందులు లేవని నివేదిక తెలిపింది. ఆయన బరువు 238 పౌండ్లు ఉండగా, గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 73 సార్లుగా నమోదైంది. వైద్యపరంగా అన్ని అవయవాల పనితీరు సాధారణ స్థితిలోనే ఉన్నదని, క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు గుండె సంబంధిత పరీక్షలన్నీ సజావుగా సాగాయని అధికారులు తెలిపారు.మేధో శక్తికి పక్కా స్కోరువయసు రీత్యా ట్రంప్ మేధస్సుపై వస్తున్న విమర్శలకు ఈ నివేదిక గట్టి సమాధానం ఇచ్చింది. పూర్తిస్థాయి నాడీ సంబంధిత పరీక్షలు నిర్వహించగా, ట్రంప్ 30కి 30 మార్కులు సాధించి, తన మానసిక పదునును నిరూపించుకున్నారు. గతంలో పలుమార్లు ఆయన సభల్లో కళ్లు మూసుకోవడంపై వచ్చిన విమర్శలను ట్రంప్ కొట్టిపారేశారు. అలసట వల్ల కాకుండా, కేవలం విశ్రాంతి కోసమే అలా చేస్తానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుత ఆరోగ్య స్థితిని కాపాడుకునేందుకు ఆయనకు వ్యక్తిగత ఆహార నియమాలు, వ్యాయామాలపై ప్రత్యేక సూచనలు చేశారు.నిరంతర పర్యవేక్షణలో ఆరోగ్యంనివేదికలో పేర్కొన్నట్లుగా, ట్రంప్ చేతులపై ఉన్న స్వల్ప రంగు మార్పులు తరచుగా షేక్హ్యాండ్స్ ఇవ్వడం, గుండె ఆరోగ్యం కోసం తీసుకునే ఆస్ప్రిన్ మందుల ప్రభావమేనని వైద్యులు వివరించారు. ఈ చిన్నపాటి సమస్యలు మినహా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని వెల్లడించారు. గతంలో ఆరోగ్యంపై వచ్చిన వదంతులను పక్కనపెట్టి, ఇప్పుడు సూచించిన జీవనశైలి మార్పులను ట్రంప్ పాటించాలని డాక్టర్లు కోరారు.
జాతీయం
‘గుడ్డిగా ఏఐని నమ్మితే..’: హెచ్చరించిన గూగుల్
న్యూఢిల్లీ: నేటి డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) మన జీవితాల్లో అంతర్భాగమైపోయింది. అయితే చాట్జీపీటీ, జెమిని వంటి అత్యాధునిక ఏఐ చాట్బాట్లను తప్పుదారి పట్టించేలా సులభంగా మానిప్యులేట్ చేయవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇంటర్నెట్లో ఉద్దేశపూర్వకంగా ప్రచురించిన చిన్న బ్లాగ్ పోస్ట్లు కూడా ఏఐని తప్పుదోవ పట్టిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏఐని బురిడీ కొట్టించడం..ఏఐ చాట్బాట్లు సాధారణ సెర్చ్ ఇంజిన్ల వలే కాకుండా, ఇంటర్నెట్లోని సమాచారాన్ని సేకరించి ఒక ఖచ్చితమైన సమాధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. ఒక బిబిసి రిపోర్టర్ తన వ్యక్తిగత వెబ్సైట్లో తాను ‘వరల్డ్ ఛాంపియన్ హాట్-డాగ్ ఈటర్’ అని ఫేక్ పోస్ట్ పెట్టగా, 24 గంటల్లోనే ప్రధాన ఏఐ చాట్బాట్లు దానిని నిజమని నమ్మి ప్రచారం చేశాయి. ఇది హాస్యంగా అనిపించినా ఆరోగ్య సలహాలు, ఆర్థిక చిట్కాలు, రాజకీయ అభిప్రాయాల విషయంలో ఇలాంటి మానిప్యులేషన్ జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు.గూగుల్ కఠిన నిర్ణయాలుఏఐ సెర్చ్ ఫలితాలను ప్రభావితం చేయడం నిబంధనలకు విరుద్ధమని గూగుల్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న స్పామ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ, ఏఐ ఫలితాలను మానిప్యులేట్ చేసే వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. పెద్ద ఏఐ సంస్థలు తమ అల్గారిథమ్లను మెరుగుపరుస్తున్నప్పటికీ, సమాచార మార్పిడిలో ఈ ‘పిల్లి-ఎలుక’ ఆట నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఏఐ సంస్థలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ, వినియోగదారులు కూడా ఏఐ ఇచ్చే సమాధానాలను గుడ్డిగా నమ్మకుండా, అధికారిక, నమ్మకమైన వనరుల ద్వారా సమాచారాన్ని సరిచూసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రియురాలి కోసం ప్రియుడి సాహసం.. కట్ చేస్తే
ప్రియురాలి కోసం సరిహద్దులు దాటే సాహసం చేసిన ఒక యువకుడు చిక్కుల్లో పడ్డాడు. ఆన్లైన్లో పరిచయమైన జమ్మూ కాశ్మీర్ యువతిని కలవడానికి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీవోకే) ముజఫ్ఫరాబాద్కు చెందిన యువకుడు జీషాన్ మిర్ (22)ని నియంత్రణ రేఖ (LoC) భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. విచారణలో అసలు విషయం చెప్పాడు. దీంతో ఈ స్టోరీ నెట్టింట్ వైరల్గా మారింది.జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్కు చెందిన ప్రియురాల్ని కలవాలన్న అతని కోరికకు సరిహద్దు గీత వద్దే ఎదురు దెబ్బ తగిలింది. ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్ పరిధిలోని 'సిలికోట్' ప్రాంతంలో ఒక వ్యక్తి నియంత్రణ రేఖ దాటి రావడాన్ని సైనికులు గమనించారు. అతను భారత భూభాగంలోకి అడుగుపెట్టిన వెంటనే సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది. విచారణలో అతను పీఓకేలోని ముజఫరాబాద్కు చెందిన పెయింకాడి నివాసి జీషాన్ అహ్మద్ మీర్ (తండ్రి లాల్ దిన్ మీర్) గా గుర్తించారు. అతని వద్ద ఉన్న పాకిస్తానీ గుర్తింపు కార్డు (ID Card)ద్వారా అతని వివరాలను ధృవీకరించారు. సోషల్ మీడియా ద్వారా ఉరి ప్రాంతానికి చెందిన ఇరమ్ బానో అనే యువతితో తనకు పరిచయం ఏర్పడిందని, ఆమెను కలుసుకోవడానికే తాను ప్రాణాలకు తెగించి సరిహద్దు దాటానని జీషాన్ భద్రతా సిబ్బందికి తెలిపాడు. ప్రస్తుతం జీషాన్తో పాటు అతను చెప్పిన యువతిని కూడా భద్రతా సంస్థలు విచారిస్తున్నాయి. వారి మధ్య జరిగిన డిజిటల్ సంభాషణలను (చాట్స్) అధికారులు పరిశీలిస్తున్నారు.సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు సోపోర్ యువకుల అరెస్ట్మరొక ఘటనలో, శనివారం మరియు ఆదివారం మధ్య రాత్రి హత్లంగా-నంబ్లా మార్గం ద్వారా పీఓకేలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు సోపోర్ నివాసితులను సైన్యం అదుపులోకి తీసుకుంది. వీరిలో ఆదిల్ హుస్సేన్ దార్, ఇష్ఫాక్ అహ్మద్, జాఫర్ అహ్మద్లుగా గుర్తించారు. వీరిలో ఆదిల్ హుస్సేన్ దార్ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న టెరిటోరియల్ ఆర్మీ (TA-161) సిబ్బంది కావడం గమనార్హం.వారు నియంత్రణ రేఖను చేరుకోవడానికి ముందే నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ వారిని పట్టుకుంది. వీరు సరిహద్దు దాటడానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.ఇదీ చదవండి: కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్ఫ్లూయెన్సర్
డిప్యూటీ సీఎం పోస్టులు లేవా?
శివాజీనగర: రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి స్థానాలను సృష్టించడం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆదివారం కల్బుర్గిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, రెండు దశల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. డీసీఎం పదవుల గురించి ప్రస్తావన రాలేదు. జూన్ 3 తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటుగా తొలి దశలో ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలనేది 2 రోజుల్లో ఖరారవుతుందన్నారు. తొలి దశ మంత్రిమండలి ఏర్పాటు తరువాత 15 రోజుల్లోగా 2వ దశ మంత్రివర్గ విస్తరణ అవుతుందని, పూర్తిస్థాయిలో కేబినెట్ ఏర్పాటవుతుందని తెలిపారు. ఒకవేళ డీసీఎంలు అవసరమైతే ఎంతమంది ఉండాలనేది చర్చిస్తాము, దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిగాయి. జూన్ 3 తరువాత స్పష్టమైన చిత్రం లభిస్తుంది అని చెప్పారు.కేపీసీసీ సారథిపైకేపీసీసీ అధ్యక్షుని మార్పుపై ఖర్గే స్పందిస్తూ, సీఎం ప్రమాణం తరువాత సహజంగానే కేపీసీసీ కొత్త సారథి నియామకం అవుతుందని చెప్పారు. ప్రభుత్వం సుపరిపాలనకు ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుని మధ్య ఉత్తమ అవగాహన అవసరముందన్నారు. సీఎం, మంత్రులతో ఐకమత్యంతో పనిచేయాలన్నారు. పార్టీ నిర్మాణంలో శక్తియుక్తులు, ప్రజా మద్దతు కలిగిన నేతను పార్టీ అధ్యక్షునిగా నియమించాలని చర్చలు జరిగాయన్నారు.
సీబీఎస్ఈలో జేబు దొంగలు.. జాగ్రత్త!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తున్న ఆన్సర్ షీట్ స్కానింగ్, రీవ్యాల్యుయేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విద్యార్థుల సమాధాన పత్రాలను స్కానింగ్ చేయడంలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవడానికి కూడా విద్యార్థుల నుంచే డబ్బు వసూలు చేయడం అన్యాయమని ఆయన విమర్శించారు.ఈ సందర్భంగా ఎక్స్లో చేసిన పోస్టులో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “జేబుదొంగలతో జాగ్రత్త.. ఇప్పుడు వాళ్లు CBSEలోనే కూర్చున్నారు. బోర్డు తప్పు వల్ల మీ మార్కులు తప్పుగా నమోదైతే మీకు ఏమి దక్కుతుంది? ఒక బిల్లు మాత్రమే. డిజిటల్ స్కాన్డ్ కాపీకి ఒక్కో సబ్జెక్టుకు రూ.100, రీ-టోటలింగ్కు రూ.100, రీ-ఎవాల్యుయేషన్కు ఒక్కో ప్రశ్నకు రూ.25 చెల్లించాలి” అంటూ మండిపడ్డారు.जेबकतरों से सावधान - आज वो CBSE के अंदर बैठे हैं। CBSE की गलती से नंबर ग़लत आए तो आपको क्या मिलता है?एक bill:Digital scan copy: ₹100/विषयRe-totalling: ₹100/paperRe-evaluation: ₹25/सवालअपनी ही answer sheet की सही जाँच के लिए एक बच्चे को ₹2000 तक भरने पड़ सकते हैं।… pic.twitter.com/H0WS1xF6Zf— Rahul Gandhi (@RahulGandhi) June 1, 2026సీబీఎస్ఈ పరీక్షల ఆన్సర్ షీట్ల స్కానింగ్, డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. విద్యార్థుల మార్కులు తప్పుగా అప్లోడ్ అవుతున్నాయని, వాటిని సరిచేయాలంటే మళ్లీ డబ్బు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. ఒక విద్యార్థి తన సమాధాన పత్రం సరిగ్గా మూల్యాంకనం అయ్యిందో లేదో నిర్ధారించుకోవడానికి సుమారు రూ.2,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.CBSE’s May 2025 tender required answer sheets to be scanned with automatic robotic scanners, spines preserved, at a minimum of 300 DPI.The tender re-issued in August quietly removed all of it. “Scanners” became generic. Resolution dropped to 200 DPI.Now we know what that… https://t.co/XXdorOi3oq— Rahul Gandhi (@RahulGandhi) May 31, 2026“తప్పు సీబీఎస్ఈది.. శిక్ష విద్యార్థికి.. లాభం ప్రభుత్వానికి” అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా చూస్తే తప్పులు సరిదిద్దబడవని, మరింత పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో ఎక్కువ నష్టం చవిచూస్తున్నది పిల్లలేనని, వారి సమయం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే కొన్ని సందర్భాల్లో ఆన్సర్ షీట్లు మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు వచ్చిన ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావించారు. దీనివల్ల పేజీలు మిస్ కావడం, బ్లర్ కాపీలు రావడం, సమాధాన పత్రాలు పూర్తిగా అప్లోడ్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.ఎవరీ సార్ధక్ సిద్ధాంత్..ఈ వివాదానికి సంబంధించి రాహుల్ గాంధీ షేర్ చేసిన పోస్ట్లో ఉన్న అంశాలను బయటపెట్టిన వ్యక్తి జార్ఖండ్కు చెందిన విద్యార్థి సార్థక్ సిద్ధాంత్. సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో అందుబాటులో ఉన్న టెండర్ పత్రాలను పరిశీలించిన ఆ 17 ఏళ్ల కుర్రాడు.. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) కాంట్రాక్ట్ నిబంధనలను మూడు దశల్లో సడలించినట్లు ఆధారాలతో వెల్లడించాడు. ఈ మార్పులు ప్రత్యేకంగా హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్ ఎడుటెక్ సంస్థకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించాడు.సార్థక్ సిద్ధాంత్ తన వెబ్సైట్లో ప్రచురించిన వివరాల ప్రకారం.. 2025 మేలో విడుదల చేసిన టెండర్లో ఆన్సర్ షీట్లను ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్లతో, కనీసం 300 DPI నాణ్యతతో స్కాన్ చేయాలని పేర్కొన్నారు. అయితే అదే టెండర్ను ఆగస్టులో మళ్లీ విడుదల చేసినప్పుడు ఆ నిబంధనలను సడలించి, స్కానర్ల ప్రస్తావనను సాధారణీకరించడంతో పాటు రిజల్యూషన్ను 200 DPIకు తగ్గించినట్లు వెల్లడించారు. అనంతరం ఆన్సర్ షీట్లను మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు బయటపడిందని, దీనివల్లే బ్లర్ కాపీలు, మిస్సింగ్ పేజీలు, స్కాన్ కాని సమాధాన పత్రాల సమస్యలు వచ్చాయని ఆరోపించారు.ఇక రాహుల్ గాంధీ కోఎంప్ట్ ఎడుటెక్ సంస్థపై కూడా విమర్శలు గుప్పించారు. గతంలో ఈ సంస్థ మరో పేరుతో వివాదాల్లో చిక్కుకుందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత సంస్థ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సమాధాన పత్రాల గందరగోళానికి సంబంధించిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నామని సీబీఎస్ఈ చెబుతోంది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్లకు చెందిన నిపుణులతో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో వ్యవస్థను సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.మొత్తంగా, లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసిన ఈ వివాదం దేశవ్యాప్తంగా విద్యా మూల్యాంకన వ్యవస్థ పారదర్శకత, సాంకేతిక ప్రమాణాలు, రీవ్యాల్యుయేషన్ ఫీజులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఎన్ఆర్ఐ
రష్యాలో డ్రోన్ దాడి.. ఏపీ వాసి మృతి
శ్రీకాకుళం జిల్లా: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామానికి చెందిన ఓ తెలుగు కుటుంబంలో విషాదం నింపింది. ఇచ్ఛాపురం మండలం ఒడిశా సరిహద్దు గ్రామమైన మాదుబందకు చెందిన ఎ.రామయ్య (26) పొట్టకూటి కోసం రష్యాకు వలస వెళ్లాడు. రష్యన్ కంపెనీలో రెండు నెలలుగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా.. సోమవారం వేకువజామున 4.40 నిమిషాల సమయంలో అకస్మాత్తుగా జరిగిన డ్రోన్ దాడిలో రామయ్యతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రిలో చేర్పించగా, అప్పటికే రామయ్య మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి తల్లిదండ్రులు గౌరమ్మ, నిమ్మయ్యతో పాటు అన్నయ్య, ఇద్దరు అక్కలు ఉన్నారు. తమ కుమారుని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గంజాం జిల్లా మేజిస్ట్రేట్ వి.కీర్తి బాసన్ మంగళవారం కుటుంబ సభ్యులను ఓదార్చి ఢిల్లీలోని అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరిపారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
'థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమే..
మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్రామ నేపథ్యం నుంచి విదేశాలకు వలస వెళ్లి విజవయంతంగా స్థిరపడ్డాయి. వారిలో కొందరు తమ మూలాలను చూసుకునేందుకు వెనక్కి వచ్చి మరి భారతగడ్డపై అడుగుపెడుతుంటారు. పైగా తాము పుట్టి పెరిగిన ప్రాంతాలు, తమ పూర్వీకుల ఇళ్లను చూసి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. నిజంగా నాడు వాళ్లు అభివృద్ది చెందాలని కష్టపడి ఉండకపోతే..తాము అక్కడ ఉండే వాళ్లం కాదన్న ఆలోచన ఉబ్బితబ్బిబైలా చేయడమే కాదు సగర్వంగా అనిపిస్తుంది. అలాంటి భావోద్వేగాన్నే పొందాడు ఈ భారత సంతతి వ్యక్తి. అందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అసలేం జరిగిందంటే..గోల్డ్ వాటర్ వ్యవస్థాపకుడు విజయ్ తిరుమలై అమెరికాలో రోడ్షోకు వెళ్లేమందు వార్షిక చిత్తిరై ఉత్సవం నిమిత్తం ఆలయ పునరుద్ధరణ పనుల కోసం తన తండ్రి గ్రామాన్ని సందర్శించడానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ తన నాన్న, మామయ్యలు పెరిగిన ఇల్లు తదితరాలను గుర్తు చేసుకుంటూ..ఆ టైంలో ఇక్కడ కరెంట్ లేదు, నీటి సరఫరా లేదని చెప్పారు. అయినప్పటికీ బాల్యంలో ఇక్కడే పాలిటెక్నిక్ చదవి ఈ చుట్టుపక్కలే ఆడుకుంటూ ఎంజాయ్ చేశారని అన్నారు. ఇక తన కుటుంబం ఏ స్థాయికి చేరుకుందో గుర్తుచేసుకుంటూ..తన కజిన్స్ , ఇతర కుటుంబసభ్యులు అమెరికాలో బే ఏరియా, టొరంటో తదితర ప్రాంతాల్లో స్టార్టప్లు, బిగ్టెక్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో స్థిరపడ్డారని అన్నారు. తమ కెరీర్ ప్రారంభంలో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ..మమ్మల్ని మంచి స్థాయిలో స్థిరపడేలా పెంచినందుకు మా తల్లిదండ్రులకు, పెద్దలకు సదా కృతజ్ఞతలని పోస్ట్లో పేర్కొన్నారు. అలాగే తమ పూర్వీకుల ఇంటి ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ ఇంటిలోనే తన తండ్రి, మామయ్యల బాల్యం సాగిందని చెప్పారు. అయితే నెటిజన్లు వలసలు, త్యాగాల ఫలితం ఉన్నత స్థాయికి ఎదగడంతో ముడిపడి ఉన్న కుటుంబ చరిత్రను ఈ ఇల్లు గుర్తు చేస్తుందని అన్నారు. మరొక నెటిజన్ శెభాష్ విజయం..ఒక తరం అభివృద్ధి చెందడం కోసం ఇంకో తరం కష్టపడి త్యాగాలు చేస్తుంది. ఇది అద్భుత కుటుంబ కథ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.Yesterday took some time off ( before i head off for a US road show) to visit my dad's village for the annual festival ( Chittirai) to the temple where we do our part for renovations etcThis is the house my dad and my uncles grew up, no electricity, no running water, nothing,… pic.twitter.com/S8ZohHFMLM— Vijay Thirumalai (@vijaythirumalai) May 18, 2026 (చదవండి: ఆమె ఐస్క్రీమ్ బ్రాండ్కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..)
మేయర్ పీఠంపై ఇండియన్.. ఎవరీ తుషార్ కుమార్?
లండన్: తూర్పు ఇంగ్లాండ్లో 23 ఏళ్ల తుషార్ కుమార్ మేయర్ ఎన్నికల్లో గెలిచి యునైటెడ్ కింగ్డమ్ (UK) చరిత్రలోనే మేయర్ పీఠాన్ని అధిరోహించి అత్యంత పిన్నవయస్కుడైన భారతీయునిగా చరిత్ర సృష్టించారు. కింగ్స్ కాలేజ్ లండన్ నుండి పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన తుషార్ కుమార్, గత వారం జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్' (Elstree and Borehamwood) టౌన్ కౌన్సిల్ మేయర్గా బాధ్యతలు స్వీకరించారు.రాజకీయ ప్రస్థానంలేబర్ పార్టీకి చెందిన ఈ కౌన్సిలర్ 2023లో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్' టౌన్ కౌన్సిల్లో చేరారు. మేయర్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన డిప్యూటీ మేయర్గా కూడా సేవలందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తుషార్ కుమార్ మాట్లాడుతూ.. "23 ఏళ్ల వయసులో, యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ సంతతి మేయర్గా అధికారికంగా బాధ్యతలు చేపట్టడం నాకొక అద్భుతమైన గౌరవం" అని ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన స్థానిక ప్రజలకు, కౌన్సిలర్లకు, కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.మాజీ మేయర్ డాన్ ఓజారోవ్ అందించిన మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు తెలిపిన తుషార్.. కొత్త డిప్యూటీ మేయర్గా ఎన్నికైన కౌన్సిలర్ లిండా స్మిత్కు స్వాగతం పలికారు.లక్ష్యాలు లండన్లో విద్యార్థిగా ఉన్నప్పుడే కౌన్సిలర్గా ఎన్నికైన తుషార్, నిజమైన మార్పు అనేది స్థానిక సంఘాల స్థాయి నుంచే మొదలవుతుందని, యువతను ప్రజా సేవ వైపు, సామాజిక జీవితం వైపు ప్రేరేపించడమే తన ప్రధాన లక్ష్యమని తుషార్ పేర్కొన్నారు. తన మేయర్ పదవీ కాలంలో స్థానికంగా ఉన్న పేద ప్రజలకు సహాయం చేసే 'WD6 ఫుడ్ సపోర్ట్' (WD6 Food Support) అనే స్వచ్ఛంద సంస్థకు ప్రధాన చారిటీగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుతెలిపారు. తుషార్ కుమార్ తనలో ఆత్మవిశ్వాసాన్ని, పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కింగ్స్ కాలేజ్ లండన్లోని 'సివిక్ లీడర్షిప్ అకాడమీ' ఎంతగానో సహాయపడిందని చెప్పారు. అలాగే విద్యార్థిగా ఉన్నప్పుడు 'యూనివర్శిటీ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్' లో కూడా ఆయన అనుభవాన్ని గడించారు. గతంలో ఆయన బ్రిటన్ ప్రభుత్వ 'డిపార్ట్మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్' (DWP) లో పాలసీ అడ్వైజర్గా, అలాగే ఒక జాతీయ LGBTQ చారిటీ సంస్థలో రీసెర్చ్ అనలిస్ట్గా పనిచేశారు. 'బుక్మార్క్ రీడింగ్ చారిటీ' ద్వారా అక్షరాస్యత కార్యక్రమాలకు కూడా ఆయన మద్దతు అందించారు.
ఆమె ఐస్క్రీమ్ బ్రాండ్కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..
ఫుడ్తో కొంగొత్త పరిచయాలే కాదు..ఓ దేశాన్నే మైమరిపించొచ్చు. ఎంతటి శత్రుత్వాలు, కోపతాపలు..ఒక్క విందుతో సమసిపోతాయి. అలాంటి టేస్టీ ఫుడ్తో ఇతర దేశాల మనసును దోచుకుని కోట్లు ఆర్జించడం మాటలు కాదుకదా. అలాంటి ఘన విజయాన్నే అందుకుంది ఈ భారత సంతతి మహిళ. మన భారతీయ రుచులను జోడించి తయారు చేసిన ఐస్క్రీమ్ బ్రాండ్తో దూసుకుపోతూ..శెభాష్ అనిపించుకుంటోంది పూజా బావిషి. ఎవరామె అంటే..భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పూజా బావిషి, 'మలై' అనే ఐస్ క్రీమ్ బ్రాండ్తో అమెరికన్లను ఆకట్టుకుంటోంది. ఇది ఏడాదికి రూ. రెండు వేల కోట్లు టర్నోవర్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఇద హోల్సేల్ ఈ కామర్స్ వ్యాపారంగా మారింది. 46 ఏళ్ల వ్యవస్థాపకురాలు, సీఈఓ 2015లొ ఈ మలైని ప్రారంభించారు. ఈ వ్యాపారం న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలలో నాలుగు దుకాణాలను నిర్వహిస్తోంది. చాలామటుకు ఐస్క్రీమ్లలో చాక్లెట్, వెనిలా వంటి ఫ్లేవర్లు చూశాం. కానీ అంతకుమించిన రుచి కోసం మలై వంటి వెరైటీ టేస్ట్ని పరిచయం చేశారు. దీని తయారీలో ఉపయోగించిన యాలకులు, గులాబీ, కుంకుమపువ్వు, జాజికాయ వంటి రుచులను జోడించడంతో అమెరికా వాసుల మనసులను దోచుకుంది ఈ మలై ఐస్ క్రీమ్. ఈ కంపెనీ 2025లోనే సుమారు రూ. రెండు వేల కోట్లు పైనే ఆర్జించేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతకుముందు ఏడాది 2024, 2025 సంత్సరాలలో సంస్థ లాభదాయకంగా సాగింది. ఇక పూజా విద్యా నేపథ్యం వచ్చేసి..బావిషి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అర్బన్ ప్లానింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే ఆమె ఆమె వాషింగ్టన్ డిసి-ఆధారిత లాభాపేక్షలేని సంస్థ అయిన ఈక్వల్ రైట్స్ సెంటర్లో పౌర హక్కుల ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేశారు.వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చిందిలా..స్నేహితులకు ఇంట్లో తయారు చేసిన ఐస్క్రీంల రుచి చూపించినప్పుడు వ్యాపారం చేయాలనే ఆలోచనకు అంకురార్పణ చేసినట్లు గుర్తు చేసుకుంది. అల్లం-స్టార్ సోంపు ఐస్ క్రీమ్ - ఒక డిన్నర్ పార్టీలో తక్షణమే అందర్నీ ఆకట్టు కోవడంతో..ఇలాంటి టేస్టే టేస్టీ ఐస్క్రీం షాపు పెట్టాలని భావించారట ఆమె. అయితే తన ఉత్పత్తులు మార్కెట్లో క్లిక్ అవుతాయో లేతో అన్న సందేహం మాత్రం బాగా ఉండేదని చెప్పుకొచ్చారామె. అయితే తన షాపుకు వచ్చే కస్టమర్ ఎలాంటి ఫ్లేవర్ కోరుకుంటున్నారు అనేది నిశితంగా గమనిస్తూ..టేస్టీ, టేస్టీ..మలై ఐస్క్రీమ్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే తన షాపు కి వచ్చే కస్టమర్ ఎవరు?, వాళ్లకేం కావాలన్నదే పూర్తిగా అవగాహన ఉండాలని, లేదంటే వ్యాపారం లాభదాయకంగా ఉండదని అంటోంది. అలాగే తాను కేవలం లాభాల మీదే గాక, వ్యాపార విస్తరణపై కూడా దృష్టిపెట్టానని అన్నారు. అలాగే తాను వ్యాపారాన్ని చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి..అన్ని విధాల క్లిక అవుతుందని నమ్మకం కొనసాగేక ముందుకు తీసుకెళ్లానని అన్నారు. అలాగే భారతీయ రుచులు ప్రయోగాత్మకమైనవి కావు, ఈ రుచులను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఎంతో ఇష్టంగా ఆస్వాదించడం విశేషం. పైగా మార్కెట్ పరంగా అగ్రస్థానంలో ఉంది. అందుకు చాలా గర్వకారణంగా ఉందంటోంది పూజ. View this post on Instagram A post shared by Malai (@malai_icecream) (చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..)
క్రైమ్
ప్రియునితో కలిసి వదిననే చంపిన మరదలు..!
బెంగళూరు: బంగారు నగల కోసం మానవులు రాక్షసులుగా మారుతున్న ఉదంతాలు అక్కడక్కడా జరుగుతున్నాయి. అదే రీతిలో బంగారం కోసం ప్రియునితో కలిసి సొంత వదిననే గొంతు కోసి చంపిందో మరదలు. ఈ కిరాతక ఘటన చిక్కబళ్లాపురం నగరంలో వెలుగుచూసింది. ఏం జరిగిందంటే.. వివరాలు.. మే 28వ తేదీ అర్ధరాత్రి కందవార పేట సమీపంలోని బాపూజినగరలో మేస్త్రి నరసింహమూర్తి ఇంట్లో కోడలు పుష్పలతను దొంగలు పడి గొంతు కోసి బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఆమె పక్కనే పడుకొన్న మరదలు భవ్య నోట్లో బట్టలు కుక్కి పెప్పర్ స్ప్రే కొట్టి పారిపోయారు. ఈ మేరకు బాధితురాలు భవ్య కుటుంబీకులకు, పోలీసులకు తెలిపింది. పుష్పలత తల్లిదండ్రులు మహేశ్, లక్ష్మి మాత్రం ఏదో జరిగిందని, భర్త తరఫు వారే తమ బిడ్డను బలిగొన్నారని విలపించారు. పోలీసులు మొదట్లో ఇది దోపిడీ అనుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న భవ్యను విచారించగా ఆమె మాటల్లో పొంతన కుదరలేదు. నివ్వెరపోయే నిజాలు.. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సె దర్యాప్తులో అసలు నిజాన్ని గుర్తించారు. భవ్యకు హొసకోటకు చెందిన వ్యక్తితో పెళ్లి చేసి పంపారు. కానీ ఆమె భర్త మిత్రుడు, కార్ డ్రైవర్ లోహిత్కుమార్ లల్లుతో అక్రమ సంబంధం ఏర్పడి అతనితో పరారైంది. భర్త గొడవచేయడంతో పుట్టింటికి వచ్చేసింది. మరోవైపు లల్లు నీ ప్రైవేటు వీడియోలు బయట పెడతానని బెదిరించడంతో భవ్య రూ. 5 లక్షల వరకూ ఇచ్చుకుంది. మరింత డబ్బులు కావాలని బెదిరించగా, నా వదిన దగ్గర బంగారు నగలు ఉన్నాయి, ఆమెను హత్య చేసి తీసుకుపో అని చెప్పింది. 28వ తేదీ అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ప్లాన్ ప్రకారం భవ్య వదిన పక్కన పడుకుంది. లల్లు రాగానే తలుపులు తీసింది. ఇద్దరూ కలిసి పుష్పలతను దిండుతో అదిమి, కత్తితో గొంతుకోసి చంపి ఆభరణాలను తీసుకొని వెళ్లాడు. దొంగలు తనపై దాడి చేశారని భవ్య నాటకమాడింది. అదే రోజు ఇంటి సీసీ కెమెరాలు పనిచేయలేదు. ఎక్కడా దొంగల ఆచూకీ లేదు. పోస్టుమార్టం రిపోర్టు ఇది సహజ మరణం కాదు అని తేలి్చంది. దీంతో భవ్యను తమదైన రీతిలో ప్రశ్నించగా, మొత్తం ఏకరువు పెట్టింది. లల్లును కూడా అరెస్టు చేశారు. అత్త మామల పాత్ర ఉంటే వదిలిపెట్టబోమని ఎస్పీ కుశాల్ తెలిపారు.
భర్త, అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నా..!
రాజేంద్రనగర్ : భర్తతో పాటు అత్త వేధింపులు రోజురోజుకూ అధికమయ్యాయని.. ఇక తాను భరించలేనని ఓ వివాహిత తన తండ్రికి ఫోన్ చేసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ ఎస్ఐ ప్రశాంత్ తెలిపిన మేరకు.. సికింద్రాబాద్కు చెందిన భవాని (26) రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీకి చెందిన శ్రీకాంత్లు ప్రేమించి 2025లో పెళ్లి చేసుకున్నారు. శ్రీకాంత్ స్థానికంగా వెల్డింగ్ షాప్ లో పనిచేసేవాడు.పెళ్లయిన తరువాత భవాని అత్త కనకమ్మ రోజూ తాగి వచ్చి కోడలితో గొడవకు దిగేది. భర్త శ్రీకాంత్కు చెప్పినా పట్టించుకోకుండా తల్లికి వత్తాసు పలికేవాడు. ఇదిలా ఉండగా శ్రీకాంత్ సొంత ఊరు అయిన సిద్దిపేటలో శుభకార్యం ఉండడంతో భార్యాభర్తలతో పాటు అత్త గ్రామానికి వెళ్లారు. అక్కడ అత్త భవానీని బంధువుల ముందే తిట్టి అవమానించింది. ఈనెల 30న తిరిగి వచ్చారు.ఆరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో భవాని తండ్రి ఎల్లయ్యకు ఫోన్ చేసి.. వేధింపులు రోజురోజుకూ ఎక్కువయ్యాయని ఇక తాను భరించలేనని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపి ఫోన్ కట్ చేసింది. అనంతరం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎల్లయ్య ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎల్లమ్మ పండుగ వేళ.. కన్నవారికి తీరని కడుపుకోత
నల్గొండ జిల్లా: తల్లిదండ్రులు రేణుకా ఎల్లమ్మ పండుగ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వారి కుమార్తె మధ్యాహ్నం సమయంలో సరదాగా తోటి పిల్లలతో ఈత కొట్టేందుకు వెళ్తుండగా తల్లిదండ్రులు వద్దని వారించిన వినలేదు. బాలిక గుంత లోతు గమనించక ఈత కొడుతూ కొంత దూరం వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందింది. ఈ ఘటన కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బిల్లంకానిగూడెంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యాలమ్మగూడెంలో ఆది, సోమవారాల్లో గంగదేవమ్మ పండగ నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. ముందు రోజు శనివారం గ్రామానికి చెందిన ఎలుక శంకర్, కల్పన దంపతులు ఇంట్లో రేణుకా ఎల్లమ్మ పండుగ నిర్వహిస్తున్నారు. వారు ఈ పనుల్లో నిమగ్నం కాగా.. వారి కుమార్తె హారిక(13) గ్రామ శివారులోని నీటి గుంతలో ఈత కొట్టేందుకు తన అన్న గణేష్, తన మేనత్త కుమార్తె, కుమారుడితో కలిసి గ్రామ శివారులో రైతులు పొలాల దిగువ భాగంలో నీటి నిల్వ కోసం తీసిన పెద్దగుంత వద్దకు వెళ్లారు. గుంత లోతు ఎక్కువగా ఉండటంతో గమనించని హారిక ఈత కొడుతూ దూరంగా వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. హారిక అన్న గణేష్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే ఈ విషయాన్ని గణేష్ తన తల్లిదండ్రులకు తెలపడంతో అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో నకరేకల్ ఫైరింజన్ సిబ్బందిని పిలిపించారు. సిబ్బంది బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. హారిక చిన్నపురిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
భార్య చేతిలో భర్త హతం
ఆదోని అర్బన్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న నెపంతో భర్తను భార్య గొంతు నులిమి చంపేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అమరావతినగర్లో శనివారం వెలుగుచూసింది. ఆదోని వన్టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. అమరావతి నగర్కు చెందిన నల్లబోతుల మహేష్(28), బళ్లారి ఈరమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.ఈరమ్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకుని మహేష్ మద్యం సేవించి గొడవ పడేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన ఈరమ్మ పొలానికి తీసుకెళ్లి మహేష్ గొంతు నులిమి హత్య చేసినట్టు సీఐ తెలిపారు. మృతుడు అక్క చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
వీడియోలు
RCB తలరాతను మార్చిన ఒకే ఒక్కడు
పేకాటలో ఫస్ట్ వస్తే టీచర్ ఉద్యోగం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు
నాకు అది ఇష్టం లేదు పెళ్లి, పిల్లలుపై క్లారిటీ ఇచ్చిన ప్రవల్లిక
నన్ను గెలవలేవ్ అన్నారు సీఎంగా మీ ముందుకొచ్చా
బెంగళూరులో జరగాల్సింది అహ్మదాబాద్ లో ..బాంబు పేల్చిన DK శివకుమార్
కొత్త పార్టీ పెట్టబోతున్న అన్నామలై.. వాళ్ళ పరిస్థితేంటి ?
సిగ్గుండాలి లోకేష్..! పోస్టుకో రేటు చొప్పున అమ్ముకుంటావా..
హైబ్రిడ్ మహానాడు VS లోగ్రేడ్ దగానాడు CM చంద్రబాబు కాదు.. కళ్యాణి సెటైర్లు
మరి ఇంత బరితెగించాలా..! చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ వార్నింగ్
ఇదే నాకు లాస్ట్ ఛాన్స్.... లోకేష్ వల్ల నా జీవితం నాశనం అయింది


