Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Leaders Protest AT Visaka Cricket Stadium Updates1
వైఎస్సార్‌సీపీ నిరసనలు.. విశాఖ స్టేడియం వద్ద పోలీసుల మోహరింపు

సాక్షి, విశాఖపట్నం: విశాఖ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కాసేపట్లో నిరసన కార్యక్రమం జరగనుంది. దివంగత మహానేత వైఎస్సార్‌ పేరును క్రికెట్‌ స్టేడియానికి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు నిరసనలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కూటమి కక్ష సాధింపులో భాగంగా నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు భారీ సంఖ్యలో స్టేడియం వద్ద మోహరించారు.కూటమి సర్కార్‌ పాలనలో విశాఖ క్రికెట్‌ స్టేడియానికి వైఎస్సార్‌ పేరును తొలగించడం పట్ల వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తొలగించిన పేరు యథావిధిగా పెట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ స్టేడియానికి వైఎస్సార్‌ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో, చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు.నిరసనల నేపథ్యంలో గురువారం తెల్లవారుజామునుంచే వైఎస్సార్‌సీపీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈరోజు ఉదయమే పలువురు నేతల ఇళ్ల వద్దకు పోలీసులు చేరుకుని వారి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా క్రికెట్‌ స్టేడియం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇక, నగరంలోని పీఎంపాలెం వద్దనున్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడి­యంలో మాజీ సీఎం వైఎస్సార్‌ పేరును పాలకవర్గం తొలగించింది. వైఎస్సార్‌ రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తుగా 2009 సెప్టెంబరు 14న అప్పటి ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆధ్వ­ర్యంలో ఏసీఏ–వీడీసీఏ స్టేడియాన్ని వైఎస్సార్‌ ఏసీఏ–­వీడీసీఏ స్టేడియంగా పేరు మార్చారు. అప్పుడు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది.తాజాగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికా­రంలోకి వచ్చాక, ప్రధానంగా విశాఖలో వైఎస్సార్‌ గుర్తులు తుడి­చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా విశాఖ బీచ్‌ తదితరచోట్ల వైఎస్సార్‌ వ్యూ పాయింట్లు ధ్వంసం చేశారు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో పలుచోట్ల ఉన్న వైఎస్సార్‌ పేరును మరమ్మతుల పేరిట తొలగించేస్తున్నారు. ఈ చర్యపట్ల క్రికెట్‌ అభిమానులతోపాటు వైఎస్సార్‌ అభిమానులు మం­డిపడుతున్నారు. ప్రభుత్వం మార్కు తన పాలనలో చూపించాలిగానీ ఇలాంటి విధ్వంసకర విషయాల్లో కాదని ఆక్షేపిస్తున్నా­రు.

US SAys H-1B visa Applications To Be deleted March 202
ట్రంప్‌ సంచలన నిర్ణయం.. హెచ్‌-1బీ వీసాలో మార్పులు

వాషింగ్టన్‌: అమెరికాలోని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా హెచ్‌-1బీ వీసా అమలులో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పాత దరఖాస్తులను ఫారిన్‌ లేబర్‌ యాక్సెస్‌ గేట్‌వే(ఫ్లాగ్) డిలీజ్‌ చేస్తోంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ కోసం మరో కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుంది.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వారి విషయంలో ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే పలు దేశాల వలసదారులను అమెరికా నుంచి పంపించేశారు. పలు దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ సైతం విధించారు. ఇక, తాజాగా అమెరికా హెచ్1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం దృష్టి సారించింది.ఇందులో భాగంగానే అమెరికా హెచ్‌-1బీ వీసా అమలులో మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే పాత దరఖాస్తులను ఫారిన్‌ లేబర్‌ యాక్సెస్‌ గేట్‌వే(ఫ్లాగ్) డిలీట్‌ చేస్తోంది. త్వరలోనే వీసాల జారీ కోసం యూఎస్‌ ఇమిగ్రేషన్‌ విభాగం కొత్త దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ సర్కారు వెల్లడించింది. అందుకే, పాత రికార్డులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ దరఖాస్తుల ప్రక్రియ కోసం కొత్త వ్యవస్థను యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) ప్రవేశపెట్టనుంది.తాజా ఆదేశాల ప్రకారం.. మార్చి 20 నుంచి ఐదేళ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను సిస్టమ్‌ నుంచి తొలగించనున్నారు. అంటే.. ఉదాహరణకు ఓ దరఖాస్తుకు సంబంధించిన 2020 మార్చి 22న తుది నిర్ణయం వెలువడి ఉంటే.. ఈ ఏడాది మార్చి 22న దాని రికార్డులను తొలగిస్తారు. హెచ్‌-1బీ సహా అన్ని తాత్కాలిక లేబర్‌ కండిషన్‌ అప్లికేషన్స్‌, శాశ్వత లేబర్‌ సర్టిఫికేట్‌ అఫ్లికేషన్లపై ఈ తొలగింపు ప్రభావం పడనుందని ఆఫీస్‌ ఆఫ్‌ ఫారిన్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ విభాగం నోటీసులు జారీ చేసింది.ఇక, ఫారిన్‌ లేబర్‌ యాక్సెస్‌ గేట్‌వే(ఫ్లాగ్) అనేది అమెరికాలో కార్మికులకు సహాయపడే పోర్టల్‌. ఇదిలా అమెరికా, విదేశీ కార్మికులకు రక్షణ కల్పిస్తుంది. ఈ పోర్టల్‌లో H-1B, H-1B1, H-2A, H-2B, E-3 వీసాలు, శాశ్వత కార్మిక ధృవీకరణ దరఖాస్తులు సేవ్‌ చేసి ఉంటాయి. ఇక, ట్రంప్‌ నిర్ణయంతో గత ఐదేళ్లకు ముందుగా సేవ్‌ చేయబడిన దరఖాస్తులను ఈరోజు రాత్రి నుంచి తొలగించనున్నట్టు కార్మిక శాఖ ఉపాధి మరియు శిక్షణ పరిపాలన, విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం (OFLC) తెలిపింది. ఉద్యోగులకు సంబంధించి ఐదు సంవత్సరాల కంటే పాతవైన వీసాల రికార్డులన్నింటినీ మార్చి 19లోగా డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలను ఇప్పటికే ఆదేశించారు. లేదంటే ఆ రికార్డులను కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొంది.H-1B Chaos: America’s Visa Purge BeginsThe U.S. Department of Labor is wiping H-1B visa applications from its system, a bombshell for global tech talent. It’s a policy shift that screams isolationism—thousands of skilled workers now face uncertainty. Advocates say it’s about… pic.twitter.com/pBy8YJROrL— Brain Snacks-Learn with laughter!!! (@NgChinSiang2) March 19, 2025

Financial Twist In Chandrababu And Bill Gates Meeting3
గూగుల్, గేట్స్ ముసుగులో నడుస్తున్నదంతా మాయేనా?

‘గోరంతను కొండంతలుగా చేసి చెప్పడం’ అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఫరెగ్జాంపుల్ ‘ఒక పని’ చేయడం వల్ల వాస్తవంగా దక్కే ప్రయోజనం పది రూపాయలు ఉన్నదనుకోండి.. అక్కడ ఓ వెయ్యిరూపాయల లాభం రాబోతున్నట్టుగా పదేపదే టముకు వేయడం, ప్రచారం చేసుకోవడం లాంటిదన్నమాట. వాస్తవం ఏంటంటే.. ఆ పని ఇంకా మొదలు కాదు కూడా! కానీ, ఆ పని చేయగానే వెయ్యి రూపాయలు లాభం తనకు రాబోతున్నట్టుగా.. ఒక వ్యక్తి బీభత్సంగా ప్రచారం చేసుకుని.. లాభాలను ప్రొజెక్టు చేసి, ఓ అయిదువందల రూపాయల అప్పులు పుట్టించాడనుకోండి. ఆ అయిదువందల రూపాయలతో చిన్న వ్యాపారం చేసి ఓ రెండొందల లాభాలు ఆర్జించాడనుకోండి. అతనివద్ద నికరంగా రెండొందల రూపాయలైతే ఉంటాయి. కానీ, దీనంతటికీ మూలం అయిన ‘ఒక పని’ అనేది జరిగిందో లేదో, అన్నట్టుగా వెయ్యిరూపాయల లాభం వచ్చిందో లేదో ఎవ్వరికీ తెలియదు. ఇలాంటి మేధావిని, ఈ టెక్నిక్కులను ఏమనాలి? వీటినే గజకర్ణ, గోకర్ణ టక్కుటమార విద్యలు అని అంటారు. కేవలం మార్కెటింగ్ మాయాజాలంతో బాహ్య ప్రపంచాన్నంతా ఒక మాయలో ఉంచి.. నడిపించే దందా అన్నమాట. వాస్తవాలు వేరే ఉంటాయి.. వాటి ద్వారా పొందే ప్రయోజనాలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో అనుసరిస్తున్న వైఖరి.. ఈ గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలనే తలపిస్తోంది. కాస్త లోతుగా గమనించండి. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు వస్తోన్నదంటే.. వారు పెట్టే పెట్టుబడుల గురించి, కల్పించబోయే ఉద్యోగావకాశాల గురించి గోరంతలను కొండంతలుగా పెంచి చూపిస్తూ.. కొన్ని వందలసార్లు తమ అనుకూల మీడియాలో వార్తలు వేయించుకుంటూ.. తప్పుడు ప్రచారాలు సాగించడం చంద్రబాబు స్టయిల్! చిన్న సంస్థ వస్తున్నా సరే.. ఇన్ని వందల కోట్లు పెడుతున్నారు.. ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అని నారా తండ్రీ కొడుకులు పదేపదే చెబుతూ ప్రజల్ని మాయ చేస్తుంటారు. రెండు ఉదాహరణలు తీసుకుందాం. విశాఖలో గూగుల్ ఇన్నోవేషన్ హబ్ అంటున్నారు. దీనిద్వారా రాష్ట్ర యువతరానికి స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణలు అందుతాయని అంటున్నారు. అలా జరిగితే మంచిదే. అయితే గూగుల్‌ను తీసుకురావడం.. ఓ మహాద్భుతం అని చెప్పుకునే పాలకులు.. గూగుల్ మన రాష్ట్రంతో వ్యాపారం చేస్తున్నదని, మన డబ్బులనే వారికి చెల్లిస్తున్నాం తప్ప.. వారు తమ సంస్థ డబ్బు ఒక్క రూపాయి కూడా ఇక్కడ పెట్టుబడి రూపంలో పెట్టడం లేదు.. ఇక్కడ వారేమీ వందల వేల ఉద్యోగాలు ఇవ్వబోవడం లేదు.. అనేది దాచిపెడుతున్నారు. అయితే యువతరానికి నైపుణ్యాల ముసుగులో.. ఖజానా నుంచి రాచమార్గంలో దోచిపెడతారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అవసరమే. కానీ.. వాటిని పరిమితంగా ప్రారంభించి.. గూగుల్ కు దోచిపెట్టే డబ్బును.. సొంత నైపుణ్యాలు, సొంత ఆలోచనలు కలిగి ఉన్న యువతరానికి ఉచితంగా పెట్టుబడులుగా సమకూరిస్తే యువతరం మరింతగా బాగుపడుతుంది కదా.. అనే ఆలోచన ప్రభుత్వం వారు చేయరు. యువతరం కోసం అంటూ గూగుల్ కు వందల కోట్ల రూపాయలు సమర్పించుకోడానికి సిద్ధపడతారే తప్ప.. నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీని పట్టించుకోరు. ఇదంతా వంచన కాక మరేమిటి?.బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో ఒప్పందాలు కూడా ఇంచుమించు ఇలాంటివే. గేట్స్‌తో నలభై నిమిషాలు కూర్చోవడమే తన జీవితానికి అత్యున్నత విజయం అయినట్టుగా చాటుకుంటున్నారు చంద్రబాబునాయుడు. కానీ ఏం సాధించారు. ఈ ఒప్పందాల మర్మం ఏమిటి? అనేక రంగాలను జాబితాగా ప్రకటించి.. గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తుంది అని చెప్పేశారు. ఎన్ని వేల కోట్లు గేట్స్ ఫౌండేషన్ ఏపీకి ఇవ్వనున్నదో స్పష్టంగా చెప్పరు ఎందుకు? ఎందుకంటే.. వారు ఒక్కరూపాయి కూడా ఇవ్వడం లేదు. వారు ఆల్రెడీ తయారు చేసుకుని ఉన్న సాంకేతికతలను ఏపీ కోసం వాడుకోవడానికి వారికి రాష్ట్రప్రభుత్వమే వందల కోట్లు ముట్టజెప్పడానికి సిద్ధపడుతూ ఒప్పందాలు చేసుకుంటున్నదేమోనని ప్రజల అనుమానంగా ఉంది. ఆధునికత, సాంకేతికత, ఏఐ వంటి మాయాపూరితమైన పదాల ముసుగులో పది రూపాయల ఖర్చయ్యే వ్యవహారాలకు పదివేల రూపాయలు ముట్జజెప్పినా.. అది సామాన్యులకు బోధపడేసరికి పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. పాలన అవకాశం దక్కింది కదా అని ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా, తాను ఏ హామీలతో ప్రజలను బురిడీ కొట్టించారో వాటిని పట్టించుకోకుండా.. ఇలాంటి దొంగ చాటు దందాలు నడిపించడం ప్రజలను మోసం చేయడమేనని, ఇవే సంస్థల నుంచి పెట్టుబడుల రూపంలో, ఉద్యోగాల రూపంలో రాష్ట్రానికి ఏమైనా సాధిస్తే మాత్రమే చంద్రబాబు తన విజయంగా చెప్పుకోవాలని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు...ఎం. రాజేశ్వరి

Shreyas Iyer Continues Red Hot Form, Scores Blazing 85 In Punjab Kings Practice Match Before IPL 20254
IPL 2025: సూపర్‌ ఫామ్‌ను కొనసాగించిన శ్రేయస్‌ అయ్యర్‌

ఐపీఎల్‌ 2025 ప్రారంభానికి ముందు పంజాబ్‌ కింగ్స్‌ నయా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సూపర్‌ ఫామ్‌ను కొనసాగించాడు. నిన్న (మార్చి 19) జరిగిన ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీ (41 బంతుల్లో 85 పరుగులు) విరుచుకుపడ్డాడు. పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌-ఏ, టీమ్‌-బిగా విడిపోయి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడగా.. టీమ్‌-బి శ్రేయస్‌ అయ్యర్‌ ప్రాతినిథ్యం​ వహించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రేయస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. శ్రేయస్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ప్రదర్శించిన ఫామ్‌ను కొనసాగించాడు. అనంతరం ఛేదనలో టీమ్‌-ఏ కూడా పర్వాలేదనిపించింది. ఆ జట్టుకు ఓపెనర్లు ప్రియాన్ష్‌ ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు పోటీ పడి బౌండరీలు, సిక్సర్లు బాదారు. ఆర్య 72, ప్రభ్‌సిమ్రన్‌ 66 పరుగులు చేసి ఔటైన అనంతరం టీమ్‌-ఏ కష్టాల్లో పడింది. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేకపోవడంతో టీమ్‌-ఏ నిర్ణీత ఓవర్లలో 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా శ్రేయస్‌ టీమ్‌ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్‌-ఏ ఓడిపోయినా ప్రియాన్ష్‌ ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ ఫామ్‌లోకి రావడం పంజాబ్‌ కింగ్స్‌కు శుభసూచకం. ఈ ఇ​ద్దరే రానున్న సీజన్‌లో పంజాబ్‌ ఇన్నింగ్స్‌లు ప్రారంభిస్తారు. ఈ ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌లో మరో అద్భుత ప్రదర్శన నమోదైంది. శ్రేయస్‌ టీమ్‌లో భాగమైన అర్ష్‌దీప్‌ సింగ్‌ 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సీజన్‌ ప్రారంభానికి ముందు పంజాబ్‌కు ఇది కూడా శుభసూచకమే. మొత్తంగా ముగ్గురు బ్యాటర్లు, ఓ బౌలర్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఫామ్‌ను ప్రదర్శించడం​ పంజాబ్‌ కింగ్స్‌కు తమ తొలి మ్యాచ్‌ ముందు మంచి బూస్టప్‌ను ఇస్తుంది. ఐపీఎల్‌ 2025 సీజన్‌ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుండగా... పంజాబ్‌ కింగ్స్‌ మార్చి 25న గుజరాత్‌ టైటాన్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈసారి పంజాబ్‌ కింగ్స్‌ గతంలో ఎప్పుడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. ఆ జట్టు బ్యాటింగ్‌ విభాగాన్ని చూస్తే ఎంతటి బౌలర్లైనా ఉలిక్కి పడాల్సిందే.శ్రేయస్‌ అయ్యర్‌, మార్కస్‌ స్టోయినిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, శశాంక్‌ సింగ్‌, జోస్‌ ఇంగ్లిస్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, ఆరోన్‌ హార్డీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మార్కో జన్సెన్‌ రూపంలో ఆ జట్టులో డైనమైట్లు ఉన్నారు. బౌలింగ్‌ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్‌ బలగం చూసి పంజాబ్‌ను టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా చెప్పవచ్చు.తొలి మ్యాచ్‌తో పంజాబ్‌ ఎదుర్కోబోయే గుజరాత్‌ ఈ సీజన్‌లో కొత్తగా కనిపిస్తుంది. జోస్‌ బట్లర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ లాంటి విధ్వంసకర బ్యాటర్ల చేరికతో ఆ జట్టు బ్యాటింగ్‌ విభాగం ‍కూడా ప్రమాదకరంగా కనిపిస్తుంది. శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలో ఆ జట్టు టైటిల్‌ గెలిచేందుకు ఉరకలేస్తుంది. గుజరాత్‌ బౌలింగ్‌ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తుంది. రబాడ, సిరాజ్‌, ఇషాంత్‌ శర్మ, ప్రసిద్ద్‌ కృష్ణ, గెరాల్డ్‌ కొయెట్జీ లాంటి అంతర్జాతీయ స్థాయి పేసర్లతో కళ​‍కళలాడుతుంది. ప్రపంచ మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఆ జట్టులో ఉండనే ఉన్నాడు. అతనితో పాటు కొత్తగా వాషింగ్టన్‌ సుందర్‌ స్పిన్‌ విభాగంలో చేరాడు. దేశీయ ఆటగాళ్లు సాయి సుదర్శన్‌, రాహుల్‌ తెవాతియా, షారుఖ్‌ ఖాన్‌, మహిపాల్‌ లోమ్రార్‌ గుజరాత్‌కు అదనపు బలాన్ని ఇస్తున్నారు.పంజాబ్‌ కింగ్స్‌శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), నేహల్‌ వధేరా, ప్రియాన్ష్‌ ఆర్య, హర్నూర్‌ సింగ్‌, పైలా అవినాశ్‌, ముషీర్‌ ఖాన్‌, మార్కస్‌ స్టోయినిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, శశాంక్‌ సింగ్‌, ఆరోన్‌ హార్డీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మార్కో జన్సెన్‌, సూర్యాంశ్‌ షేడ్గే, ప్రవీణ్‌ దూబే, జోస్‌ ఇంగ్లిస్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, విష్ణు వినోద్, హర్ప్రీత్‌ బ్రార్‌, అర్షదీప్‌ సింగ్‌, యుజ్వేంద్ర చహల్‌, లోకీ ఫెర్గూసన్‌, విజయ్‌కుమార్‌ వైశాక్‌, కుల్దీప్‌ సేన్‌, యశ్‌ ఠాకూర్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌గుజరాత్‌ టైటాన్స్‌శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రాహుల్‌ తెవాతియా, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌, రషీద్‌ ఖాన్‌, మహిపాల్‌ లోమ్రార్‌, రవిశ్రీనివాసన్‌ సాయి కిషోర్‌, షారుఖ్ ఖాన్‌, నిషాంత్‌ సింధు, అర్షద్‌ ఖాన్‌, కరీమ్‌ జనత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జయంత్‌ యాదవ్‌, జోస్‌ బట్లర్‌, కుమార్‌ కుషాగ్రా, అనూజ్‌ రావత్‌, గెరాల్డ్‌ కొయెట్జీ, మానవ్‌ సుతార్‌, గుర్నూర్‌ బ్రార్‌, ఇషాంత్‌ శర్మ, కగిసో రబాడ, కుల్వంత్‌ కేజ్రోలియా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ

AP High Court says Social media posts cannot be equated with cybercrime5
సోషల్‌ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరమంటే ఎలా?: హైకోర్టు

సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయి? బీఎన్‌ఎస్‌ సెక్షన్‌–111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్‌ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్‌ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయి? పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్‌ నేరంతో సమానంగా ఎలా చూడగలం? సోషల్‌ మీడియా పోస్టులను మెటీరియల్‌ బెనిఫిట్‌ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేం. – పోలీసులను ఉద్దేశించి హైకోర్టు సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తా­య­ని హైకోర్టు పోలీసులను బుధవారం ప్రశ్నించింది. భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్‌–­111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్ర­మ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్‌ నేరా­లు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్‌ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయో చెప్పాలంది. పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్‌ నేరంతో సమానంగా ఎలా చూడగలమో చెప్పాలంది. ప్రస్తు­త కేసులో నిందితులు ఓ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూ­ర్చేందుకు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని, దీన్ని పర్‌సెప్షనల్‌ బెనిఫిట్‌ (అనుభూతి ద్వారా పొందే ప్రయోజనం)గా భావించగలమే తప్ప.. మెటీరియల్‌ బెనిఫిట్‌ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేమంది. సోషల్‌ మీడి­యా పోస్టుల ద్వారా పిటిషనర్లు ఏ విధంగా ఆర్ధిక, వస్తు తదితర రూపేణ ప్రయోజనం పొందారో చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. వీటన్నింటిపైనా స్పష్టతనివ్వాలని రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేస్తూ న్యా­యమూర్తి జస్టిస్‌ న్యాపతి విజయ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ సోషల్‌ మీడియా పోస్టులకు సంబంధించి పోలీసు­లు వేర్వేరుగా నమోదు చేసిన పలు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా విభాగం మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే వ్యవహారంలో సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి కూడా ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను జస్టిస్‌ విజయ్‌ బుధవారం విచారించారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లక్ష్మీ­నారాయణ వాదనలు వినిపిస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా పిటిషనర్లు వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డారన్నారు. దీని­పై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయో చెప్పాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేశారు.

Chiranjeevi Received Life Achievement Award From UK6
చిరంజీవికి లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌ ప్రదానం

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవిని యుకెకి చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా ఘనంగా సత్కరించారు. సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలనుగానూ లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీంతో చిరు అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలు షేర్‌ చేస్తున్నారు.సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ స‌హా ఇత‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా మరియు ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేశారు. ReelN Ltd Founder Aman Dhillon with @BridgeIndiaOrg Founder bestows megastar #Chiranjeevi at @UKParliament amidst high-profile consulates and MPs. Truly, a great honour! @KChiruTweets @PratikEPG pic.twitter.com/SsNUVH29ES— ReelN (@ReelnUK) March 19, 2025

Lovely Professional University B.Tech student securing job offer of Rs 2.5 cr package7
ఎల్‌పీయూ బీటెక్‌ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. యూనివర్సిటీ విద్యార్థుల్లో ఇద్దరు ప్రతిష్ఠాత్మకంగా కోట్ల రూపాయాల వేతన మార్కును అధిగమించి ఉద్యోగాలు సాధించారు. బీటెక్‌ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.2.5 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకుని రికార్డులను బద్దలు కొట్టారు. ఈ విజయం భారతదేశంలో గ్రాడ్యుయేట్ విద్యార్థికి అత్యధిక ప్యాకేజీని సూచిస్తుంది. ఇది భారత్‌లోని ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీల్లో ఉన్న రికార్డులను అధిగమించింది. దాంతో టాప్ టైర్ రిక్రూట్‌మెంట్‌లో లీడర్‌గా ఎల్‌పీయూ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.1.03 కోట్లు (1,18,000 డాలర్లు) ప్యాకేజీ పొందిన ఈసీఈ ఫైనల్ ఇయర్ విద్యార్థి బేతిరెడ్డి నాగవంశీరెడ్డి మరో ఘనత సాధించారు. మొత్తంగా 1,700 మందికి పైగా ఎల్‌పీయూ విద్యార్థులకు టాప్ ఎంఎన్‌సీల నుంచి ఆఫర్లు వచ్చాయి. విదార్థులకు రూ .10 ఎల్‌పీఏ నుంచి రూ.2.5 కోట్ల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. వందలాది మంది ఎల్‌పీయూ విద్యార్థులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని ప్రఖ్యాత సంస్థల్లో పనిచేస్తూ రూ.కోటికి పైగా ప్యాకేజీలు పొందుతున్నారు. మరో ఎల్పీయూ గ్రాడ్యుయేట్‌కు ఐటీ కంపెనీలో రూ.3 కోట్ల ప్యాకేజీ లభించింది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేసే ఎల్‌పీయూ సామర్థ్యం యొక్క బలం, ప్రపంచవ్యాప్త పరిధికి ఇది ఉదాహరణ. పాలో ఆల్టో నెట్వర్క్స్‌, న్యూటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్‌, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక బహుళజాతి కంపెనీల్లో ప్లేస్‌మెంట్‌లు పొందిన వివిధ బీటెక్‌ విద్యార్థులకు మొత్తం 7,361 ఆఫర్లు అందాయి. వీటిలో టాప్ ఎంఎన్‌సీలు అందించే సగటు ప్యాకేజీ ఏటా రూ.16 లక్షలుగా నమోదైంది. ఇది జాబ్ మార్కెట్‌లో ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్లకు అధిక డిమాండ్‌ను నొక్కిచెబుతోంది.గతంలోని ప్లేస్‌మెంట్‌ సీజన్ కూడా అంతే ఆకట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు ఆకర్షణీయమైన పరిహార ప్యాకేజీలను అందిస్తున్నాయి. అత్యధిక వేతనం చెల్లించే కంపెనీల్లో పాలోఆల్టో నెట్వర్క్స్ రూ.54.75 ఎల్పీఏతో అగ్రస్థానంలో నిలవగా, న్యూటానిక్స్ రూ.53 ఎల్పీఏ, మైక్రోసాఫ్ట్ రూ.52.20 ఎల్పీఏతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం 1,912 మల్టిపుల్ జాబ్ ఆఫర్లను అందిచగా, 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు, 18 మందికి ఐదుగురికి, ఏడుగురు విద్యార్థులకు ఆరు జాబ్ ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసు అద్భుతమైన ఏడు జాబ్ ఆఫర్లను సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.పైన పేర్కొన్న కంపెనీలతో పాటు అమెజాన్ (రూ.48.64 ఎల్పీఏ), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ.44.92 ఎల్పీఏ), సర్వీస్ నౌ (రూ.42.86 ఎల్పీఏ), సిస్కో (రూ.40.13 ఎల్పీఏ), పేపాల్‌ (రూ.34.4 ఎల్పీఏ), ఏపీఎన్ఏ (రూ.34 ఎల్పీఏ), కామ్వాల్ట్ (రూ.33.42 ఎల్పీఏ), స్కేలర్ (రూ.33.42 ఎల్పీఏ) వంటి టాప్ రిక్రూటర్లు ఎల్‌పీయూ విద్యార్థులకు అవకాశం కల్పించారు. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, అధునాతన సాంకేతితక నిపుణులకు ప్రాధాన్యమిచ్చారు.యాక్సెంచర్, క్యాప్ జెమినీ, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు అతిపెద్ద రిక్రూటర్లలో ఉండటంతో ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్ల సాంకేతిక పరంగా అధిక డిమాండ్ ఏర్పడింది. క్యాప్ జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ పోస్టులకు 736 మంది విద్యార్థులను, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు మైండ్ ట్రీ 467 మంది విద్యార్థులను నియమించుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 418 మంది విద్యార్థులను జెన్సీ ఉద్యోగాలకు రిక్రూట్ చేసుకుంది. యాక్సెంచర్ (279 నియామకాలు), టీసీఎస్ (260 నియామకాలు), కేపీఐటీ టెక్నాలజీస్ (229 నియామకాలు), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203 నియామకాలు), ఎంఫసిస్‌ (94 నియామకాలు)తోపాటు తదితర కంపెనీలు ఎల్‌పీయూ విదార్థులకు 279 కొలువులు అందించాయి.రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక ప్లేస్‌మెంట్ దక్కింది. పాలోఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్ గ్రూప్, న్యూటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి పరిశ్రమ దిగ్గజాలు ఈ విభాగాల నుండి భారీగా నియామకాలు చేస్తున్నాయి.పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), ఎల్‌పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ మాట్లాడుతూ..‘వేగంగా మారుతున్న ప్రపంచంలో విజయం సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయడానికి ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. యూనివర్సిటీ ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ విజయాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధిస్తున్నారు. స్థిరంగా కొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఎల్‌పీయూ విద్యాభ్యాసం వాస్తవ-ప్రపంచ పరిశ్రమ విధానాలతో మిళితం చేయడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. వృత్తి విజయాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే కాకుండా పరిశ్రమకు విలువను జోడించేందుకు, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి అవసరమయ్యే నైపుణ్యాలను అందించేలా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఎడ్యుకేషన్‌లో వచ్చే రివల్యూషన్ విద్యార్థుల భవిష్యత్తును రూపొందిస్తోంది. వారు అభివృద్ధి చెందడానికి, ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో అగ్రగామిగా నిలిచి మెరుగైన ప్లేస్‌మెంట్లు సాధించేందుకు ఎల్‌పీయూ అవకాశాలను సృష్టిస్తోంది’ అని తెలిపారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

Here are some of the latest updates in the automobile industry8
తాజా ఆటోమొబైల్‌ అప్‌డేట్స్‌

హ్యుందాయ్, హోండా కార్స్‌ వాహన ధరల పెంపుఏప్రిల్‌ నుంచి కొత్త ధరలు అమల్లోకి ముంబై: వాహన ధరల పెంపు కంపెనీల జాబితాల్లో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా(హెచ్‌ఎంఐఎల్‌), హోండా కార్స్‌ చేరాయి. ‘‘పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఇన్‌పుట్‌ వ్యయాలను కొంత భర్తీ చేయడానికి ధరలను సవరించాల్సి వస్తుంది. అందుకే వాహన ధరలను ఏప్రిల్‌ నుంచి 3% వరకు పెంచుతున్నాము’’ అని హెచ్‌ఎంఐఎల్‌ డైరెక్టర్, సీఓఓ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు. అమేజ్, సిటీ, సిటీ ఈ:హెచ్‌ఈవీ, ఎలివేట్‌తో సహా వేరియంట్, మోడల్‌ బట్టి ధరల పరిధి మారుతుందని హోండా కార్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ కునాల్‌ బెహ్‌ తెలిపారు. మారుతీ సుజుకీ ఇండియా, కియా ఇండియా, టాటా మోటార్స్‌లు తమ వాహన ధరలు వచ్చే నెల నుంచి పెంచే యోచనలతో ఉన్నట్లు ఇప్పటికే తెలిపారు. టఫే వైస్‌చైర్మన్‌గా లక్ష్మీ వేణున్యూఢిల్లీ: ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ (టఫే) వైస్‌ చైర్మన్‌గా లక్ష్మీ వేణు నియమితులయ్యారు. ఇప్పటికే ఆమె సంస్థ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మీకి ట్రాక్టర్లు, ఆటో విడిభాగాల పరిశ్రమలో గణనీయంగా అనుభవం, వ్యాపార నిర్వహణ సామర్థ్యాలు ఉన్నట్లు సంస్థ చైర్మన్‌ మల్లికా శ్రీనివాసన్‌ తెలిపారు. వ్యూహాత్మక లక్ష్యాల సాధనలో టఫే, ఐషర్‌ ట్రాక్టర్స్‌ బృందాలతో కలిసి పని చేయనున్నట్లు లక్ష్మీ తెలిపారు. బిజినెస్‌ టుడే ‘వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన మహిళలు‘, ఎకనమిక్‌ టైమ్స్‌ ‘యంగ్‌ లీడర్స్‌ – 40 అండర్‌ 40‘ జాబితాల్లో లక్ష్మీ చోటు దక్కించుకున్నారు. ఆమె సుందరం–క్లేటన్‌ ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఉబెర్‌ టూవీలర్‌ రైడర్లకు మరింత భద్రతన్యూఢిల్లీ: టూ–వీలర్‌ డ్రైవర్లు, రైడర్లకు మరింత భద్రత కలి్పంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు రైడ్‌–õÙరింగ్‌ సంస్థ ఉబెర్‌ వెల్లడించింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఉబెర్‌ మోటో డ్రైవర్లకు సేఫ్టీ కిట్లను అందించింది. వీటిలో హెల్మెట్లు, సేఫ్టీ స్టిక్కర్లు మొదలైనవి ఉన్నాయి. ఉబెర్‌ మోటో యాప్‌లో హెల్మెట్లు ధరించాలంటూ ప్రయాణికులకు కూడా కోరే విధంగా ఫీచర్లు ఉంటాయని సంస్థ వివరించింది. ట్రాఫిక్‌లోను సులభంగా వెళ్లగలిగే వెసులుబాటు, సౌకర్యం, తక్కువ ఖర్చు వంటి అంశాలు బైక్‌ ట్యాక్సీలకు సానుకూలాంశాలుగా ఉంటున్నాయని పేర్కొంది.ఇదీ చదవండి: ఎన్‌విడియాతో ఐటీ దిగ్గజాల జత

Trump Will Help Zelensky Get More Air Defence9
ఉక్రెయిన్‌-రష్యా మధ్య ‘మూడు ముక్కలాట’.. మరో కొత్త ట్విస్ట్‌

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌-రష్యా మధ్య కాల్పులు విరమణ ఒప్పందంలో రోజుకో ట్విస్ట్‌ చోటుచేసుకుంటోంది. అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా పుతిన్‌ తన ఇష్టానుసారం ఉక్రెయిన్‌పై మరోసారి దాడులకు పాల్పడ్డారు. దీంతో, అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు మరిన్ని వైమానిక రక్షణ పరికరాలను అందంచనున్నట్టు వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.తాజాగా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా అంగీకరించడం లేదు. అందుకే ఉక్రెయిన్‌ సాయం అందించడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్‌కు వైమానిక రక్షణ పరికరాలను యూరప్‌ నుంచి పంపించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. శాంతిని కోరుకుంటున్నామని, 30 రోజులపాటు ఉక్రెయిన్‌ ఇంధన, మౌలిక వసతులపై దాడులు చేయబోమని సూత్రప్రాయ అంగీకారానికి సిద్ధపడిన రష్యా వెనువెంటనే దాడులకు దిగింది. రష్యా డ్రోన్లు జనావాసాలపై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్‌ బుధవారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దాదాపు గంటకుపైగా ఫోన్‌లో మాట్లాడిన కొద్దిగంటలకే రష్యా మళ్లీ తన భీకర దాడులను మొదలుపెట్టడం గమనార్హం. దాడులు ఆపబోమని తాజా ఘటనతో రష్యా చెప్పేసిందని, సమీ పట్టణంలోని ఒక ఆస్పత్రిపై, ప్రజల ఇళ్లపై డ్రోన్ల దాడులు జరిగాయి. మరోవైపు.. మాస్కోనే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని కీవ్‌ ఆరోపిస్తే, ఉక్రెయినే దాడులు చేసిందని రష్యా పేర్కొంది. ఈ దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న సమయంలోనే రెండు దేశాలు 175 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకోవడం గమనార్హం.

Farmers Protest Punjab Police Trying to Clear Shambhu Border Farmers Chased away Leader Detained10
శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రైతులను ఖాళీ చేయించిన పోలీసులు

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలంటూ పంజాబ్-హర్యానాలోని శంభు సరిహద్దు(Shambhu border) వద్ద 13 నెలలుగా ధర్నా చేస్తున్న రైతులను పోలీసులు అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రైతులు నిర్మించిన తాత్కాలిక వేదికను, టెంట్లను తొలగించారు. రైతు నాయకులు జగ్జీత్ సింగ్ దల్లెవాల్, సర్వాన్ సింగ్ పాంధర్ సహా దాదాపు 200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ పోలీసుల చర్యలపై బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | पुलिस ने पंजाब-हरियाणा शंभू बॉर्डर पर किसानों द्वारा बनाए गए अस्थायी मंच से पंखों को हटाया। किसान यहां विभिन्न मांगों को लेकर धरने पर बैठे थे। प्रदर्शनकारी किसानों को मौके से हटाया जा रहा है। pic.twitter.com/tbZw7TDqzA— ANI_HindiNews (@AHindinews) March 19, 2025పటియాలా ఎస్ఎస్పీ నానక్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘శంభు సరిహద్దులో రైతులు చాలా కాలంగా నిరసనలు చేపడున్నారు. డ్యూటీ మేజిస్ట్రేట్(Duty Magistrate) సమక్షంలో పోలీసులు రైతులకు ముందస్తుగా హెచ్చరిక జారీచేశాకనే, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశాం. కొంతమంది రైతులను బస్సులలో వారి ఇంటికి పంపించామని అన్నారు. ఇక్కడి నిర్మాణాలు, వాహనాలను కూడా తొలగిస్తున్నట్లు తెలిపారు. రోడ్డును క్లియర్ చేసి, వాహనాల రాకపోకల కోసం తెరుస్తామన్నారు. రైతుల నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకపోవడంతో తాము ఎటువంటి బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాలేదని, రైతులు తమకు సహకరించారని నానక్ సింగ్ అన్నారు.#WATCH | पुलिस ने पंजाब-हरियाणा शंभू बॉर्डर से किसानों को हटाया जो विभिन्न मांगों को लेकर धरने पर बैठे थे। pic.twitter.com/UspNUmgY5R— ANI_HindiNews (@AHindinews) March 19, 2025ఈ తొలగింపులకు ముందుగా ఇక్కడ పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. శంభు సరిహద్దు వద్ద రైతులు నిర్మించిన తాత్కాలిక షెల్టర్లను కూల్చివేయడానికి బుల్డోజర్లను ఉపయోగించారు. పంజాబ్ పోలీసులు.. రైతు నాయకులను అదుపులోకి తీసుకోవడంపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు మాట్లాడుతూ తాను పంజాబ్ ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నానని, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిగ్గుపడాలని, కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన చర్చలకు పరిష్కారం దొరకాలని ఆప్‌ ప్రభుత్వం కోరుకోవడంలేదని ఆయన విమర్శించారు.ఇది కూడా చదవండి: సునీత లానే అంతరిక్షంలో చిక్కుకుపోయిన ‘హీరో’

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
Sunita Williams: సునీతా విలియమ్స్‌ ప్రయాణాన్ని గుర్తుచేసే మిథిలా పెయింటింగ్‌

పట్నా: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌(

title
శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రైతులను ఖాళీ చేయించిన పోలీసులు

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలంటూ ప

title
వచ్చే నెలలోనే కొత్త సారథి..!

సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్ర

title
‘మీరు సమాధుల్లో దాక్కున్నా తవ్వితీస్తాం’

ముంబై: నాగ్ పూర్ లో జరిగిన హింసకు కారణమైన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌

title
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీం కోర్టులో కీలక పరిణామం

సాక్షి,ఢిల్లీ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హ

International View all
title
ట్రంప్‌ సంచలన నిర్ణయం.. హెచ్‌-1బీ వీసాలో మార్పులు

వాషింగ్టన్‌: అమెరికాలోని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరో కీల

title
విరామం అంటూనే విరుచుకుపడింది

కీవ్‌: అగ్రరాజ్యం అమెరికా ప్రోద్బలంతో కాల్పుల విరమణకు దాదాపు

title
భారత్‌లో ట్రంప్‌ కంపెనీ.. తొలి ఆఫీస్‌ ఎక్కడంటే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు చెందిన వ్యాపార సమ్మేళనం ట్రంప్ ఆర్గనైజేషన్ భారతదేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట

title
Trump: న్యాయవ్యవస్థను బేఖాతరు చేయబోతున్నారా?

అమెరికా న్యాయవ్యవస్థ కంటే తమకు అసాధారణ అధికారాలు దఖలుపడ్డాయనే భావన డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగంలో గూడుకట్టుకుపోయిందనే వార

title
అమెరికాలో మరో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం

ఆరేలియో మార్టినెజ్: అమెరికాలోని హోండురాస్‌(

NRI View all
title
సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్‌ రిక్వెస్ట్‌!

భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్యం  కేసులో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది.

title
తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో

title
ఏయూ హాస్టల్‌కి నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత మంచాలు

 ఆంధ్ర యూనివర్సీటీలో విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో, ఆంధ్ర

title
పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా

title
Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్‌ సంతాపం

అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్

NRI View all
title
Updates: విజయవంతంగా భూమ్మీదకు సునీత అండ్‌ కో

అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ల్యాండైన సునీతా విలియమ్స్‌ అండ్‌ కో

title
నాట్స్ తెలుగు సంబరాలు సినీ ప్రముఖులకు ఆహ్వానం

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ బృందం పలువురు సిన

title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’

అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో  మెడికల్‌ కాన్ఫరెన్స్‌ ఘనంగా జరిగింది.

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

Advertisement
Advertisement