అనంత్ బర్త్డే, స్పెషల్ కేక్, అంబానీ ముద్దు వైరల్
Anant Ambani Birthday Celebrations రిలయన్స్ వారసుడు, వ్యాపారవేత్త అనంత్ అంబానీ 31వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించు కున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఈ రోజు (ఏప్రిల్ 10) బర్త్డే జరుపుకుంటున్నారు. గుజరాత్లోని జామ్నగర్లోని వంతారా యూనివర్సిటీలో తండ్రి ముఖేష్ అంబానీ, భార్య రాధిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.అంబానీ కుటుంబం ఒక వేడుకను నిర్వహిస్తే, అది చాలా ఘనంగా ఉండాల్సిందే. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆహార పంపిణీ కార్యక్రమాలతో ఈ సందర్భాన్ని జరుపుకోగా, అనంత్ స్వయంగా భోజనాలు వడ్డించడం దగ్గర్నించి, ఈ రాజరాజేశ్వర ఆలయ పునరుద్ధరణకు మద్దతు ప్రకటించడం వంటి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.వంతారా యూనివర్సిటీఅలాగే తన తన కలల ప్రాజెక్ట్ 'వంతర'కు విస్తరణగా వంతర విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయడం మరో విశేషం. తన సన్నిహిత కుటుంబ సభ్యులు , స్నేహితులతో ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అనంత్ అంబానీ తన భార్య రాధికా మర్చంట్ , తండ్రి ముఖేష్ అంబానీతో కలిసి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?స్పెషల్గా కేక్ముఖ్యంగా ఈ వేడుకలో కేక్ అందరి దృష్టిని ఆకర్షించింది ప్రత్యేకమైన, పుస్తకం ఆకారంలో ఉన్న పుట్టినరోజు కేక్. ఇందులో అమర్చిన పేజీలపై "వన్యప్రాణులు, జ్ఞానానికి ఒక కొత్త అధ్యాయం," "వన్యప్రాణుల విద్యకు ఒక వారసత్వాన్ని ప్రారంభించడం," , "ప్రకృతి జ్ఞానాన్ని కలిసే చోట" వంటి పదబంధాలు ఉన్నాయి, ఇవి ప్రకృతి పట్ల అనంత్కున్న దార్శనికత , నిబద్ధతకు ప్రతిబింబంగా నిలుస్తుంది అంటున్నారు అభిమానులు. Anant Ambani celebrating his birthday with Ranveer Singh, Mukesh Ambani and Radhika at Vantara University.❤️The way Mukesh Ambani kissed Anant at the end… pure gold.👌🏻And honestly Ranveer is just on another level lately, literally the main character wherever he walks in.🔥 pic.twitter.com/NNzQZjqVRj— Rohan💫 (@rohann__45) April 10, 2026 ఆన్లైన్ వైరల్గా మారిన వీడియో ప్రకారం కేక్ కట్ చేసిన తరువాత ముఖేష్ అంబానీ అనంత్ను ముద్దు పెట్టుకున్న తీరు మరింత హృద్యంగా నిలిచింది. ఈ వేడుకుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు సందడి చేశారు. జాహ్నవి కపూర్, రణ్వీర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరితోపాటు వరుణ్ ధావన్, శిఖర్ పహారియా కూడా సరదాగా గడుపుతూ కనిపించారు. అలాగే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, రితేష్ దేశ్ముఖ్ , షెహనాజ్ గిల్ ఈ వేడుకలకు హాజరైనట్టు సమాచారం. థఇదీ చదవండి: నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!
త్వరలో తెలంగాణ లిక్కర్ చార్జీలు పెంపు..!
హైదరాబాద్: తెలంగాణలో లిక్కర్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో రాష్ట్రంలో లిక్కర్ చార్జీలు పెరుగనున్నాయి. ఈ నెలాఖరుకల్లా చార్జీల పెంపుపై నిర్ణయం కమిటీ నిర్ణయం తీసుకోనుంది. లిక్కర్ చార్జీల పెంపును 12 నుంచి 15 శాతం వరకూ పెంచాలని కంపెనీల ప్రతిపాదనలు పంపగా, దానిపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే బీర్ల ధరలను ప్రభుత్వం పెంచగా, మళ్లీ లిక్కర్ ధరలను పెంచాలని భావిస్తోంది. రెండేళ్లకొకసారి లిక్కర్ ధరలను పెంచే నిబంధన ఉందని అధికారులు అంటుండగా, లిక్కర్ ధరలు పెరిగి దాదాపు మూడేళ్లు అవుతుందని ప్రభుత్వం అంటోంది. దాంతో లిక్కర్ ధరల పెంపునకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైందనే విషయం అర్ధమవుతోంది.
ఆకాశంలో హైఅలర్ట్.. ఐరన్ ఎస్కార్ట్తో ఇరాన్ ప్రతినిధులు
ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఇస్లామాబాద్పైనే ఉంది. అమెరికా- ఇరాన్ మధ్య చర్చలకు ఆ దేశం అతిథ్యం ఇస్తుండడంతో ఇప్పుడు ఆ ప్రాంతం హై సెన్సిటివ్ జోన్గా మారింది. ఈ నేపథ్యంలో పాక్ సైతం ఆ భేటీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇరాన్ ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆధునాతన యుద్ధ విమానాలతో "ఐరన్ ఎస్కార్ట్" ఏర్పాటు చేస్తోంది.మధ్యప్రాచ్యంలో గత నలబై రోజులుగా జరిగిన మహా విధ్వంసానికి తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు (శనివారం) అమెరికా ప్రతినిధుల బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ నాయకత్వం వహిస్తుండగా ఇరాన్ తరపున పాల్గొనే వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే ఇరాన్ ప్రతినిధుల బృంధం కోసం ఇదివరకే పాక్ ఆ దేశానికి అత్యాధునిక భద్రతా విమానాలను పంపినట్లు తెలుస్తోంది.అమెరికాతో చర్చలకు వస్తున్న ఇరాన్ ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన JF-17 థండర్, F-16 యుద్ధ విమానాలు, IL-78 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, C-130 రవాణా విమానాలతో పాటు పలు నిఘా విమానాలు గగనతలంలో పహారా కాస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ ఎస్కార్ట్ను నిపుణులు "ఐరన్ ఎస్కార్ట్" గా పిలుస్తారు. ఒకవేళ ఈ చర్చలు విజయవంతంగా పూర్తయితే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి ముఖాముఖి సమావేశం ఇదే అవుతుంది.ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ మరియు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.అయితే ఇదివరకే చర్చలు జరిగే ఇస్లామాబాద్ ప్రదేశం ఆ దేశ మిలటరీ ఆదీనంలోకి వెళ్లింది. హైలెవల్ డెలిగేషన్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాలను లాక్డౌన్ చేయడమే కాకుండా గగనతలంలో వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. అయితే చర్చల నేపథ్యంలో ఇజ్రాయెల్ తీరు ఆందోళన కలుగజేస్తోంది. సీజ్ఫైర్ ఒప్పందంలో లెబనాన్పై దాడుల నిలిపివేత కూడా ఉందని పాకిస్థాన్, ఇరాన్ భావిస్తుండగా.. అమెరికా, ఇజ్రాయెల్ దీనిని తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.
బీఆర్ఎస్లో జీవన్రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్
సిద్ధిపేట: ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసిన జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 20వ తేదీన బీఆర్ఎస్లో జీవన్రెడ్డి చేరనున్నారు. దీనిలో భాగంగా జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలోనే జీవన్రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్ 10వ తేదీ) సిద్దిపేట జిల్లాలో కేసీఆర్తో జీవన్రెడ్డి సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలో సుమారు ఐదు గంటల పాటు కేసీఆర్తో జీవన్రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం బీఆర్ఎస్లో జీవన్రెడ్డి చేరికపై స్పష్టత నిచ్చారు. దీనిలో భాగంగా జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయింది. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు సీఎం నడుచుకునే వారు. కానీ ఇప్పుడు సీఎం చెబితే పీసీసీ అమలు చేస్తోంది. త్వరలోనే జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుతా. పీసీసీ తప్పు చేసి ఆ నింద ఏఐసీసీపై వేస్తుంది. నాకు 14 సార్లు B ఫామ్ ఇచ్చారంటే అది నా సమర్థతోనే ఇచ్చారు. నేను కంటెంట్ ఉన్న నాయకున్నీ కాబట్టే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎందుకు వెళ్తున్నానో మీకే తెలియాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తుంది. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని ప్రజల్లో చర్చ మొదలైంది. మిగిలిన రెండున్నరేళ్లు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పని చేయాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
బిష్ణోయ్ సూపర్ డెలివరీ.. కోహ్లి ఫ్యూజ్లు ఔట్? వీడియో వైరల్
మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్.. కేఫ్లో బిగ్బాస్ దివి చిల్..!
బజాజ్ 2026 పల్సర్ లాంచ్.. ధర ఎంతంటే?
ఆర్సీబీ ఓపెనర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు.. మార్గాలు ఇవే
యూకేలో ఆంటీ కేసు... అనసూయ పోస్ట్ వైరల్
తక్కువ ధరలో.. టెస్లా కొత్త కారు!
త్వరలో తెలంగాణ లిక్కర్ చార్జీలు పెంపు..!
పట్టుదలకు ప్రతిరూపం పాయల్
హైదరాబాద్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం..
అవన్నీ పీరియడ్స్లో ఉండగానే చేశా: శ్రీలీల
రష్మిక ఊర్లో రిసెప్షన్.. మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తండ్రి
ఇది మా చారిత్రక విజయం.. మా లక్ష్యాలు ఇవే..: ఇరాన్
విజయ్కు షాక్.. పోటీ చేయకముందే ఓటమి
నా దగ్గర పైసలు లేవు. అమరావతి అని పదిసార్లు అనుకో! పో!
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
చంద్రబాబు సర్కార్ మళ్లీ అప్పు
ఆంటీ అనకూడదు
అంతకాలం సీఎంగా ఉండి ఆమె ఇంకేం పనిచేసినట్లు సార్!
రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సీజ్ఫైర్ ప్రకటన
కీర్తి సురేశ్కు మందు అలవాటు లేదు కానీ..: సమంత
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
PSL: పాక్ క్రికెట్ బోర్డు పరువు తీసిన ఆసీస్ స్టార్!
సముద్ర గర్భంలో రష్యా దుష్ట కార్యక్రమాలు
‘చిరయ్యా’ రివ్యూ : ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్ ఇది!
బంగారం ధరలు రివర్స్.. కొనేవారికి గుడ్న్యూస్
'విశ్వంభర' విడుదల తేదీ వైరల్
చారిత్రక ద్వైపాక్షిక సిరీస్ను ప్రకటించిన పాకిస్తాన్
అనుష్క శెట్టి.. నమ్మశక్యం కాని రూమర్
పిట్ట ముట్టడం లేదని.. చెట్టును పెంచాడు!
బిష్ణోయ్ సూపర్ డెలివరీ.. కోహ్లి ఫ్యూజ్లు ఔట్? వీడియో వైరల్
మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్.. కేఫ్లో బిగ్బాస్ దివి చిల్..!
బజాజ్ 2026 పల్సర్ లాంచ్.. ధర ఎంతంటే?
ఆర్సీబీ ఓపెనర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు.. మార్గాలు ఇవే
యూకేలో ఆంటీ కేసు... అనసూయ పోస్ట్ వైరల్
తక్కువ ధరలో.. టెస్లా కొత్త కారు!
త్వరలో తెలంగాణ లిక్కర్ చార్జీలు పెంపు..!
పట్టుదలకు ప్రతిరూపం పాయల్
హైదరాబాద్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం..
అవన్నీ పీరియడ్స్లో ఉండగానే చేశా: శ్రీలీల
రష్మిక ఊర్లో రిసెప్షన్.. మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తండ్రి
ఇది మా చారిత్రక విజయం.. మా లక్ష్యాలు ఇవే..: ఇరాన్
విజయ్కు షాక్.. పోటీ చేయకముందే ఓటమి
నా దగ్గర పైసలు లేవు. అమరావతి అని పదిసార్లు అనుకో! పో!
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
చంద్రబాబు సర్కార్ మళ్లీ అప్పు
ఆంటీ అనకూడదు
అంతకాలం సీఎంగా ఉండి ఆమె ఇంకేం పనిచేసినట్లు సార్!
రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సీజ్ఫైర్ ప్రకటన
కీర్తి సురేశ్కు మందు అలవాటు లేదు కానీ..: సమంత
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
PSL: పాక్ క్రికెట్ బోర్డు పరువు తీసిన ఆసీస్ స్టార్!
సముద్ర గర్భంలో రష్యా దుష్ట కార్యక్రమాలు
‘చిరయ్యా’ రివ్యూ : ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్ ఇది!
బంగారం ధరలు రివర్స్.. కొనేవారికి గుడ్న్యూస్
'విశ్వంభర' విడుదల తేదీ వైరల్
చారిత్రక ద్వైపాక్షిక సిరీస్ను ప్రకటించిన పాకిస్తాన్
అనుష్క శెట్టి.. నమ్మశక్యం కాని రూమర్
పిట్ట ముట్టడం లేదని.. చెట్టును పెంచాడు!
ఫొటోలు
గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ (ఫొటోలు)
సీతామహాలక్ష్మిలా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)
తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
మిస్ తెలుగు యూఎస్ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)
తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)
గ్రాండ్గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)
సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)
సినిమా
తిరుమల శ్రీవారి సేవలో శ్రీలీల.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలీలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. హీరోయిన్ శ్రీలీలను చూసిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే చివరిసారిగా పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించింది. టాలీవుడ్లో స్టార్ హీరోలతో మెప్పించిన కన్నడ బ్యూటీ.. ఐటమ్ సాంగ్స్లోనూ మెప్పించింది. పుష్ప-2 చిత్రంలో ఐటమ్ సాంగ్తో అదరగొట్టేసింది. అంతేకాకుండా ఈ ఏడాది పరాశక్తి మూవీతోనూ అలరించింది. Actress #Sreeleela visited Tirumala Tirupati Devasthanams today to seek divine blessings 🙏 pic.twitter.com/TBSdj6FQ6G— Eluru Sreenu (@IamEluruSreenu) April 9, 2026
మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్.. కేఫ్లో బిగ్బాస్ దివి చిల్..!
మాల్దీవుస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్..హీరోయిన్ ప్రియమణి లేటేస్ట్ లుక్..గ్రీన్ డ్రెస్లో మెరిసిపోతున్న నటి బిందు మాధవి..కేఫ్లో చిల్ అవుతోన్న బిగ్బాస్ దివి..జిమ్లో హనీ రోజ్ కసరత్తులు.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Divi (@actordivi)
దురంధర్-2 వసూళ్లు.. 22 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 హవా ఇంకా కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా మూడు వారాలైనా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 1500 కోట్లు మార్క్ దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దురంధర్ సీక్వెల్గా తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్లోనే సీక్వెల్ రిలీజ్ చేశారు.ఈ మూవీ విడుదలైన 22 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1680 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే రూ.1276 కోట్లు రాబట్టగా.. ఓవర్సీస్లో దాదాపు రూ.404 కోట్లు కలెక్ట్ చేసింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ.1081 కోట్లు వసూళ్లు సాధించింది. ఓవరాల్గా చూస్తే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అమిర్ ఖాన్ మూవీ దంగల్ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బాహుబలి-2, పుష్ప-2 చిత్రాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరి దురంధర్-2 ఈ చిత్రాల రికార్డులు బద్దలు కొడుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. Duniya mein ek ka hi raj - DHU…RAN…DHAR 🔥⁰Day-wise break-up | IndiaWeek 1: ₹690 Cr* Week 2: ₹271 Cr* DAY 16: ₹23 Cr* DAY 17: ₹27 Cr* DAY 18: ₹30 Cr* DAY 19: ₹11 Cr* DAY 20: ₹11 Cr* DAY 21: ₹10 Cr* DAY 22: ₹8 Cr* India: ₹1081 Cr* Worldwide GBOC (3… pic.twitter.com/pw6lPwb4nV— Jio Studios (@jiostudios) April 10, 2026
కాంతార వివాదం.. అలా చేసేందుకు ఒప్పుకున్న రణ్వీర్ సింగ్
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కాంతార వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ వివాదంపై ఇప్పటికే దురంధర్ హీరో క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఇంకా కోర్టులో ఇంకా నడుస్తోంది. రణ్వీర్ సింగ్ సోషల్ మీడియాలో చెప్పిన సారీ సరిపోదంటూ బెంగళూరుకు చెందిన న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పడంతో పాటు కర్ణాటకలోని చాముండి ఆలయాన్ని సందర్శించాలని కోర్టు ఆదేశించింది.దీనిపై తాజాగా రణ్వీర్ సింగ్ న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. మరోసారి క్షమాపణ పత్రాన్ని సమర్పిస్తామని రణ్వీర్సింగ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ముంబైలోని సింధీ కుటుంబంలో పెరగడం వల్ల తనకు ఇక్కడి ఆచారాలు, వాటి సున్నితత్వం గురించి అవగాహన లేదని తన క్షమాపణ పత్రంలో పేర్కొన్నారు. సరైన సమయంలో చాముండి ఆలయాన్ని సందర్శించి.. తన భక్తిని చాటుకుంటానని కోర్టుకు లిఖితపూర్వకంగా అందజేశారు.అసలు వివాదం ఎంటంటే?గతేడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కాంతార మూవీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. 'కాంతార: చాప్టర్ 1' చిత్రంలోని ఒక కీలక సన్నివేశాన్ని అనుకరించారు. రిషబ్ నటనను ప్రశంసించే సందర్భంలో రిషబ్ అద్భుతమైన నటించారు.. ముఖ్యంగా ఆడ దెయ్యం(చాముండి దైవం) మీ శరీరంలోకి ప్రవేశించే షాట్ అమోఘం అంటూ వేదికపై యాక్షన్ చేస్తూ చూపించారు. ఇదంతా తమ దైవాన్ని కించపరిచేలా రణ్వీర్ ఇమిటేట్ చేశారంటూ పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. పవిత్రమైన దైవాన్ని దెయ్యంగా సంభోధించడం కరెక్ట్ కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో రణ్వీర్ సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదంకర్ణాటక హైకోర్టుకు చేరింది.
క్రీడలు
క్రికెట్ కోచ్కు బెయిల్ నిరాకరణ
ముంబైలోని ఓ స్థానిక క్రికెట్ కోచ్ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో నిందితుడు గత 8 నెలలుగా జైలులో మగ్గుతున్నాడు. తాజాగా నిందితుడి తరఫు న్యాయవాది బెయిల్కు అప్పీల్ చేయగా.. ప్రత్యేక POCSO కోర్టు నిరాకరించింది.న్యాయమూర్తి సురేఖా సిన్హా మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే, మైనర్ బాలికలపై మళ్లీ నేరం జరిగే ప్రమాదం ఉంది. నిందితుడు పరారయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. 2023లో మరో మైనర్ బాలిక కూడా ఇదే కోచ్పై అనుచిత ప్రవర్తన ఆరోపణలు చేసినట్టు ప్రాసిక్యూషన్ గుర్తు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. కోచ్ తనపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత మైనర్ బాలిక ఆరోపించింది. వైద్య ఆధారాలు, వెంటనే నమోదు చేసిన FIR ఈ కేసుకు బలమైన సాక్ష్యాలుగా నిలిచాయి. కోచ్ CCTV కెమెరాలను ధ్వంసం చేసి ఆధారాలు తొలగించాడని ప్రాసిక్యూషన్ వాదించింది. తప్పుడు ఫిర్యాదునిందితుడి తరఫు న్యాయవాది బాలిక తప్పుడు ఫిర్యాదు చేసిందని వాదించారు. కోచ్ 2025 ఆగస్టు 5 నుంచి 8 నెలలుగా కస్టడీలో ఉన్నాడని, కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. నిందితుడి తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకోని కోర్టు.. నేరం తీవ్రతను హైలైట్ చేస్తూ బెయిల్ నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం సరైంది కాదని తీర్పులో పేర్కొంది.
ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం! రూ.13 కోట్ల ఆటగాడిపై వేటు?
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ ధనధాన్ లీగ్లో భాగంగా శనివారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. లక్నోతో జరిగిన చివరి మ్యాచ్లో ఓటమి పాలైన సన్రైజర్స్.. ఇప్పుడు పంజాబ్పై ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓ కీలక మార్పుతో బరిలోకి దిగే అవకాశముంది. గత మ్యాచ్లో విఫలమైన స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్పై వేటు వేసేందుకు ఎస్ఆర్హెచ్ సిద్దమైంది. గతేడాది జరిగిన మినీ వేలంలో రూ.13 కోట్ల భారీ ధరకు లివింగ్స్టోన్ను ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది.కానీ తొలి రెండు మ్యాచ్లలో అతడికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. అయితే లక్నో జరిగిన మ్యాచ్కు మాత్రం లివింగ్స్టోన్కు తుది జట్టులో చోటు దక్కింది. కానీ తనకు దక్కిన అవకాశాన్ని ఈ ఇంగ్లీష్ ఆల్రౌండర్ సద్వినియోగపరుచుకోలేకపోయాడు. దీంతో పంజాబ్తో మ్యాచ్కు అతడిని పక్కన పెట్టేందుకు ఎస్ఆర్హెచ్ సిద్దమైంది.అతడి స్ధానంలో మరో ఇంగ్లండ్ ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్కు తుది జట్టులో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. తొలి మూడు మ్యాచ్లకు స్వల్ప గాయం కారణంగా బెంచ్కే పరిమితమైన కార్స్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అతడు నెట్స్లో కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు.దీంతో బ్రైడన్ కార్స్ ఐపీఎల్ అరంగేట్రం దాదాపు ఖాయమైనట్లే. ఇదొక్కటి మినహా ఎస్ఆర్హెచ్ జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోపోవచ్చు. మరోవైపు పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో మంచి జోష్లో ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న పంజాబ్ను ఎస్ఆర్హెచ్ ఎలా ఎదుర్కొంటుందో ఎదురు చూడాలి.చదవండి: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై 12 జట్లతో!
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై 12 జట్లతో!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చారిత్రత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్లో అఫ్గానిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లను చేర్చేందుకు ఐసీసీ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో తొమ్మిది జట్లు పోటీ పడుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ సంఖ్యను పన్నెండుకు పెంచేందుకు ఐసీసీ సిద్దమైంది. దీంతో డబ్ల్యూటీసీ 2027-29 సైకిల్లో అఫ్గాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లు కూడా చేరనున్నాయి. ఈ మూడూ టెస్టు హోదా పొందినప్పటికీ ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ సైకిల్లో మాత్రం చోటు దక్కలేదు. ఇప్పుడు తొలిసారి వరల్డ్ టెస్టు ఛాంపియన్షిష్లో ఈ మూడు జట్లు పోటీపడనున్నాయి. కాగా ప్రస్తుత నిబంధనల ప్రకారం.. డబ్ల్యూటీసీలో చేరాంటే కనీసం రెండు టెస్టు సిరీస్లైనా ఆడాలి. కానీ ఇప్పుడు 12 జట్లను చేర్చాలని నిర్ణయించడంతో.. కనీసం ఒక్క టెస్టు సిరీస్ ఆడినా కూడా సదరు జట్టుకు డబ్ల్యూటీసీలో భాగమయ్యే అవకాశం లభిస్తోంది. అయితే ఈ నిబంధన 2027-29 సైకిల్ నుంచి అమలులోకి రానుంది. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రోజర్ ట్వోస్ నేతృత్వంలోని ఐసీసీ బృందం ఈ కొత్త మోడల్పై కసరత్తు చేస్తోంది. ఈ కమిటీ త్వరలోనే తుది సిఫార్సులను ఐసీసీ అందించే అవకాశం ఉంది. కాగా కాగా 2019లో ఐసీసీ తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ప్రవేశపెట్టింది. రెండేళ్ల వ్యవధిలో ఆడే మ్యాచ్లు, వాటి ఫలితాల ఆధారంగా జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఇందులో గెలిచిన జట్టుకు ఐసీసీ గద లభిస్తుంది.విజేతలు వీరేతొలి సీజన్లో భారత్- న్యూజిలాండ్ (2019-21) డబ్ల్యూటీసీ ఫైనల్ తలపడగా.. కేన్ విలియమ్సన్ బృందం విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లి సేన రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక రెండో సీజన్లో (2021-23)లోనూ టీమిండియా ఫైనల్ చేరగా.. ఈసారి ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు ఎదురైంది. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్-2025లో ఆస్ట్రేలియాను ఓడించి సౌతాఫ్రికా విజేతగా అవతరించింది.చదవండి: IPL 2026: లక్నో జట్టులోకి సౌతాఫ్రికా సూపర్ స్టార్
IPL 2026: సునీల్ నరైన్ ప్రపంచ రికార్డు
విండీస్ దిగ్గజ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ మరో రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన ఈ విండీస్ వీరుడు.. తాజాగా ఓ ప్రపంచ రికార్డును సెట్ చేశాడు. భారత్ వేదికగా జరిగే ఐపీఎల్లో కేకేఆర్కు ఆడే నరైన్.. 2026 ఎడిషన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో నిన్న (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్లో ఓ వికెట్ (షమీ) తీయడంతో భారత్లో టీ20ల్లో 200 వికెట్లు (183 మ్యాచ్లు) పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారతగడ్డపై ఈ మైలురాయిని తాకిన తొలి విదేశీ బౌలర్గా చరిత్రకెక్కాడు. ఈ విభాగంలో నరైన్ తర్వాతి స్థానాల్లో డ్వేన్ బ్రావో (190), రషీద్ ఖాన్ (188) ఉన్నారు.నరైన్ భారత్లో ప్రపంచ రికార్డు సెట్ చేసిన మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో సునీల్ బంతితో రాణించినా (4-0-13-1) కేకేఆర్కు ఓటమి తప్పలేదు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రహానే (41), అంగ్క్రిష్ రఘువంశీ (45), కెమెరాన్ గ్రీన్ (39*), రోవ్మన్ పావెల్ (32*) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.అనంతరం కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా రాణించినా ఆయుశ్ బదోని (54), ముకుల్ చౌదరి (54 నాటౌట్) మ్యాచ్ను లాగేసుకున్నారు. ముఖ్యంగా ముకుల్ చౌదరి సిక్సర్లతో విరుచుకుపడి చివరి బంతికి లక్నోను గెలిపించాడు. ప్రస్తుత ఎడిషన్లో కేకేఆర్కు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటివరకు ఆడి న 4 మ్యాచ్ల్లో 3 ఓటములు ఎదుర్కోగా.. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఓడిన 3 మ్యాచ్ల్లో కేకేఆర్ ఆటగాళ్లు రాణించినా, అదృష్టం వారి పంచన లేదు. 4 మ్యాచ్లైనా ఇంకా ఖాతా తెరవకపోవడంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా సంక్లిష్టం కానున్నాయి. ఏప్రిల్ 14న జరిగే తదుపరి మ్యాచ్లో కేకేఆర్ సీఎస్కేతో తలపడుతుంది.
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో ‘సీఎంఆర్ఎఫ్’ నిధులు స్వాహా... టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి సీఎంవో వరకూ వసూళ్ల పర్వం
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మావిగన్.. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు: వైఎస్ జగన్
ఇరాన్ను తుడిచిపెట్టేస్తాం, వారి నాగరికతను నాశనం చేస్తాం. తీవ్రంగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
మళ్లీ పెరిగిన వెండి, బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీకి దినదిన గండం... ఐదో రోజూ స్తంభించిన ఓపీ, అత్యవసర వైద్యసేవలు
లోక్సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ... రెండు ఫైటర్ జెట్లను కూల్చివేసిన ఇరాన్
వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా చర్చ...
అవినీతి కోసమే అమరావతి... కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం..
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల కోట్ల రూపాయల బకాయిలు రాకపోవడంతో...
బిజినెస్
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 918.60 పాయింట్లు లేదా 1.20 శాతం లాభంతో 77,550.25 వద్ద, నిఫ్టీ 275.50 పాయింట్లు లేదా 1.16 శాతం లాభంతో 24,050.60 వద్ద నిలిచాయి.డీపీ వైర్స్ లిమిటెడ్, గ్లోటిస్ లిమిటెడ్, ఆర్ట్ నిర్మాణ్ లిమిటెడ్, హింద్ రెక్టిఫయర్స్ లిమిటెడ్, అట్లాస్ సైకిల్స్ (హర్యానా) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆర్ఎమ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఇన్వెంచర్ గ్రోత్ & సెక్యూరిటీస్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, శేషాసాయి టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్!
ఒక సంస్థలో ఏళ్ల తరబడి పనిచేసిన ఉద్యోగికి, ఆ సంస్థ పట్ల వారు చూపిన అంకితభావానికి, విధేయతకు ఇచ్చే గౌరవపూర్వకమైన బహుమతే గ్రాట్యుటీ. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, ఉద్యోగి శ్రమకు యాజమాన్యం ఇచ్చే గుర్తింపు. మరి ఈ గ్రాట్యుటీ అందరికీ వస్తుందా? దీని లెక్కలేంటి? తాజా నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఓసారి పరిశీలిద్దాం.గ్రాట్యుటీ అంటే ఏమిటి?‘పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972’ ప్రకారం, ఒక ఉద్యోగి ఒకే సంస్థలో దీర్ఘకాలం పనిచేసినందుకు ప్రతిఫలంగా యజమాని ఇచ్చే మొత్తాన్ని గ్రాట్యుటీ అంటారు. సాధారణంగా ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు, రాజీనామా చేసినప్పుడు లేదా దురదృష్టవశాత్తు మరణించినప్పుడు ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.గ్రాట్యుటీ పొందడానికి అర్హతలుగ్రాట్యుటీ అందరికీ వర్తించదు. దీనికి కొన్ని ప్రాథమిక నియమాలు ఉన్నాయి. ఒకే సంస్థలో కనీసం 5 ఏళ్ల నిరంతర సేవలు పూర్తి చేసి ఉండాలి. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఏ సంస్థ అయినా గ్రాట్యుటీ చట్టం పరిధిలోకి వస్తుంది. ఒకవేళ ఉద్యోగి మరణించినా లేదా ప్రమాదం వల్ల అంగవైకల్యం సంభవించినా ఈ ఐదేళ్ల నిబంధన వర్తించదు. అటువంటప్పుడు వారు పనిచేసిన కాలానికే గ్రాట్యుటీ చెల్లిస్తారు.ఎలా లెక్కిస్తారు?గ్రాట్యుటీ లెక్కించడానికి ఒక నిర్దిష్టమైన సూత్రం ఉంది. ఇందులో ప్రధానంగా రెండు అంశాలు కీలకం. చివరిగా తీసుకున్న వేతనం (బేసిక్+డీఏ), పూర్తి చేసిన సర్వీసు కాలం.గ్రాట్యుటీ=(చివరగా తీసుకున్న వేతనం*సర్వీసు చేసిన మొత్తం సంవత్సరాలు*15)/26ఇక్కడ 26 రోజులను ఒక నెలగా పరిగణిస్తారు. నెలలో 4 ఆదివారాలు తీసివేసి 15 రోజులను సగటు వేతనంగా లెక్కిస్తారు.ఉదాహరణ:రాము అనే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 10 ఏళ్ల 7 నెలలు పనిచేశాడు. అతను ఉద్యోగం వదిలేటప్పుడు అతని బేసిక్ పే, డీఏ కలిపి రూ.50,000 అనుకుందాం.గమనిక: సర్వీసు కాలం 6 నెలల కంటే ఎక్కువ ఉంటే దాన్ని తదుపరి ఏడాదిగా పరిగణిస్తారు. అంటే ఇక్కడ రాము సర్వీసును 11 ఏళ్లుగా తీసుకోవాలి.గ్రాట్యుటీ: (50000*11*15)/26=రూ.3,17,307.ముఖ్యమైన అంశాలుప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి గరిష్టంగా రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీని పన్ను మినహాయింపుతో పొందవచ్చు. కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వస్తే ఈ పరిమితి పెరిగే అవకాశం ఉంది.ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(10) ప్రకారం నిర్దేశిత పరిమితి వరకు మినహాయింపు లభిస్తుంది.ప్రతి ఉద్యోగి తన గ్రాట్యుటీ కోసం నామినీని నియమించుకోవడం తప్పనిసరి.ఇదీ చదవండి: రఫేల్ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట!
స్పెయిన్లో ఉద్యోగం.. ఇల్లు కూడా ఫ్రీ!
ఉన్న ఊరిలో లేదా నగరంలో కాకుండా.. ఎక్కడైనా ఉద్యోగం చేయాలంటే?, తప్పకుండా నివాసం (ఇల్లు) వెతుక్కోవాల్సిందే. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో అయితే.. ఇంటి అద్దెలకు వేలరూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. అంటే.. వచ్చే జీతంలో ఇంటికోసం కొంత వెచ్చించాల్సి వస్తుంది. కానీ స్పెయిన్ దేశంలో ఒక చిన్న గ్రామం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.ఉద్యోగం ఇవ్వడమే కాకుండా.. ఉచితంగా ఇల్లు కూడా ఇస్తామంటోంది స్పెయిన్లోని అరెనిల్లాస్. ఈ గ్రామం స్పెయిన్లోని సొరియా ప్రాంతంలో ఉంది. ఇక్కడ ప్రస్తుతం 40 మంది మాత్రమే శాశ్వత నివాసం ఉంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా గ్రామాల నుంచి పట్టణాలకు ప్రజలు వలస వెళ్తుండటంతో, ఈ ప్రాంతం 'ఎంప్టీ స్పెయిన్' అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ పరిస్థితిని మార్చడానికి ఈ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది.షరతులుఈ ఆఫర్ ప్రకారం, ఒక కుటుంబానికి పూర్తిగా పునరుద్ధరించిన ఇల్లు ఉచితంగా లభిస్తుంది. అంతేకాకుండా వారికి ఒక స్థిరమైన ఉద్యోగం కూడా కల్పిస్తారు. గ్రామంలో శాశ్వతంగా నివసించే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. ఈ అవకాశానికి కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. ఆ కుటుంబానికి పాఠశాల వయస్సు ఉన్న పిల్లలు ఉండాలి. వారు గ్రామంలో పూర్తిగా నివసిస్తూ, గ్రామంలోని బార్ను నిర్వహించాలి. అదేవిధంగా భవనాల నిర్వహణ వంటి మున్సిపల్ పనులు కూడా చేయాలి.100 కంటే ఎక్కువ దరఖాస్తులు!నిజానికి ఎక్కడైనా ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా ఇవ్వడం అనేది చాలా అరుదు. కానీ ఇలాంటి ఆఫర్ అరెనిల్లాస్ అందించడం చాలా ప్రత్యేకమైన విషయం. ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చాక.. ఇప్పటివరకు 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.అరెనిల్లాస్ గ్రామం పర్వత ప్రాంతంలో ఉండటం వల్ల ప్రకృతి అందాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. వసంత కాలంలో సుమారు 24°C వరకు ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఇది ఒక అందమైన ప్రదేశంలా కనిపిస్తుంది.ఇబ్బందులూ ఉంటాయ్!ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉండటం, నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒంటరితనం అనిపించవచ్చు. శీతాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ప్రజా రవాణా సదుపాయాలు తక్కువగా ఉండటంతో, సొంత వాహనం అవసరం అవుతుంది. సమీప పాఠశాల సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అయితే పిల్లలకు ఉచిత రవాణా ఉంటుంది. ఆరోగ్య సేవలు కూడా ప్రాథమిక స్థాయిలో మాత్రమే ఉంటాయి.ఇదీ చదవండి: WFH అడిగిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన బాస్
టెక్ స్టార్టప్ల్లోకి పెట్టుబడులు తగ్గాయ్..
న్యూఢిల్లీ: దేశీ టెక్నాలజీ అంకుర సంస్థల నిధుల సమీకరణ గత ఆర్థిక సంవత్సరంలో 11.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన 14.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 18 శాతం క్షీణించింది. అయితే, 2023–24లో సమీకరించిన 9.7 బిలియన్ డాలర్లతో పోలిస్తే పెరిగింది. మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ’ట్రాక్షన్’ ఇండియా టెక్ వార్షిక ఫండింగ్ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా నిధులను దక్కించుకున్న స్టార్టప్లపరంగా అంతర్జాతీయంగా అమెరికా, బ్రిటన్, చైనా తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిల్చింది. జర్మనీ, ఫ్రాన్స్కన్నా ముందుంది. తాజా గణాంకాల ప్రకారం సీడ్ స్థాయి స్టార్టప్లలో పెట్టుబడులు 1.5 బిలియన్ డాలర్ల నుంచి 15 శాతం క్షీణించి 1.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. వ్యాపారాలను విస్తరించే ప్రణాళికల్లో ఉన్న ఎర్లీ స్టేజ్ అంకురాల్లోకి ఫండింగ్ 3.6 బిలియన్ డాలర్ల నుంచి 33 శాతం ఎగిసి 4.8 డాలర్లకు పెరిగింది. లేట్ స్టేజ్ స్టార్టప్లకు నిధులు 9.2 బిలియన్ డాలర్ల నుంచి 38 శాతం క్షీణించి 5.6 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. నివేదికలో మరిన్ని వివరాలు.. 2025–26లో 100 మిలియన్ డాలర్ల పైబడిన ఫండింగ్ లావాదేవీలు 13 నమోదయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి 23గా, 2023–24లో 13గా నమోదయ్యాయి. నిధులను ఆకర్షించడంలో ఫిన్టెక్, రిటైల్ టాప్ రంగాలుగా నిల్చాయి. ప్రధానంగా ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఫిన్టెక్ కంపెనీలకు భారీ స్థాయిలో నిధులను లభించాయి. నెక్స్ట్రాలోకి 710 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు, నెయిసాలోకి 600 మిలియన్ డాలర్లు, ఐనాక్స్ క్లీన్ ఎనర్జీలోకి 344 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లోకి దాదాపు అంతక్రితం ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే 3.6 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఫిన్టెక్ సంస్థలు 14 శాతం అధికంగా 2.4 బిలియన్ డాలర్లు దక్కించుకున్నాయి. రిటైల్ స్టార్టప్లలోకి పెట్టుబడులు 32 శాతం క్షీణించి 3.5 బిలియన్ డాలర్ల నుంచి 2.4 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఐపీవోలపరంగా టెక్ సంస్థల ఇష్యూలు 52 శాతం పెరిగి 47కి చేరాయి. లెన్స్కార్ట్, గ్రో, మీషోలాంటి బడా ఐపీవోలు వీటిలో ఉన్నాయి. 2024–25లో 4 అంకురాలు యూనికార్న్ హోదా (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్) దక్కించుకోగా, 2025–26లో ఇది 50 శాతం పెరిగి 6 స్టార్టప్లకు చేరింది.
ఫ్యామిలీ
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎలా, ఎపుడు చేసుకోవాలి? ఈ లాభాలు తెలుసా?
ఇచ్ఛాపురం: ఇటీవల సీజన్లో పెళ్లిళ్లు జోరుగా జరిగాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన కొత్త జంటలు వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీరి జీవితం కొత్తగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రభుత్వం పథకాలు రావాలన్నా, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయించాలన్నా, పాస్పోర్టు, భూములకు సంబంధించిన మ్యుటేషన్లు ఇతరత్రా అవసరాలు ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పటికప్పుడు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతూ చివరికి సర్టిఫికెట్ల కోసం బ్రోకర్లపై ఆధారపడి ఎక్కువ మొత్తంలో సొమ్ములు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను కొత్త జంట ముందుగానే గుర్తించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ పొందితే వారికే మంచిది.సర్టిఫికెట్ వల్ల ఉపయోగాలు పాస్పోర్టు అప్లికేషన్, బ్యాంక్ జాయింట్ అకౌంట్, కేంద్ర, రాష్ట్ర రక్షణ బలగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సర్వీస్ రికార్డుల్లో పేరు చేర్చుకునేందుకు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి వీసాప్రాసెస్, వీటితో పాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నవ వధూవరులు పెళ్లి చేసుకొనే ప్రదేశం ఆధారంగా గ్రామం ఐతే గ్రామ సచివాలయం లేదా పంచా యతీ కార్యాలయం, పట్టణం ఐతే వార్డు సచివాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం వివాహ శుభలేఖ, జీలకర్ర బెల్లం తలపై పెట్టుకున్న వధూవరుల ఫొటో, మంగళసూత్రం కట్టేటప్పుడు ఫొటో, పూల దండలు మార్చుకున్నప్పుడు ఫొటోలు ఉండాలి. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుల జిరాక్సులను జతచేయాలి. నవవధూవరుల తరఫున ఇద్దరు సాక్షులు, వారి ఆధార్ కార్డుల జిరాక్సు లను గ్రామ/వార్డు సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయంలోగానీ మున్సిపల్ కార్యాలయంకు గానీ అందజేయాలి. జత చేసిన ధ్రువీకరణ పత్రాలను జనన, మరణ రిజి్రస్టేషన్ అధికారి పరిశీలించి సర్టిఫికెట్ని జారీ చేస్తారు. ఆలయాల్లో వివాహం చేసుకుంటే దేవదాయ శాఖకు మందస్తుగానే రుసుం చెల్లిస్తే అధికారులు రశీదులు ఇస్తారు. వాటి ఆధారంగానే వివాహానికి సంబంధించిన ఇతర పత్రాలు ఫొటోలు సాక్షుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇళ్లు, కల్యాణ మండపాల్లో సంప్రదాయంగా వివాహం చేసుకుంటే అందుకు తగ్గ అన్ని రకాలు పత్రాలు సమర్పించి దరఖాస్తులు చేసుకోవాలి. ఇదీ చదవండి: ఆడబిడ్డ పుట్టిందని, అంతులేని సంబరం : వీడియో వైరల్90 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పెళ్లి జరిగిన 30 రోజుల్లో మున్సిపల్, పంచాయతీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొంటే తక్కువ ఫీజు ఉంటుంది. సాధారణంగా ఫీజు రూ.100 నుంచి రూ.500 వరకు మాత్రమే ఉంటుంది. వివాహం జరిగి 90రోజులు దాటితే సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఇందుకు ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి. యు.ఉపేంద్ర, జనన, మరణ, రిజిస్ట్రేషన్ అధికారి, ఇచ్ఛాపురం మున్సిపాలిటి
'బుజ్జి ఫొటోగ్రాఫర్'..! జస్ట్ 18 నెలల వయసుకే..
కొందరు చిన్నారులు వయసు పెరిగే కొద్ది తమలోని అసాధారణ ప్రతిభను కనబరుస్తారు. ఇంకొందరు బైబర్త్ నైపుణ్యం పెంపొందించుకుంటారు. వయసుకి వారి ప్రదర్శించే ప్రతిభకు పొంతనలేని వారి సామర్థ్యం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసేలా కట్టిపడేస్తుంది. అలాంటి కోవకు చెందిందే కేరళలోని పాలక్కాడ్కు చెందిన నాలుగేళ్ల పిహు. ఆమె పిట్ట కుంచెం కుత ఘనం అన్నట్లుగా ఫోటోగ్రఫీలో అసామాన్య ప్రజ్ఞతో ఆకట్టుకుంటోంది. ఆమె ఏ వయసులో కెమెరా పట్టుకుని క్లిక్ మనిపించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేరళలోని పాలక్కాడ్ నగరానికి చెందిన నాలుగేళ్ల పిహు వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన తండ్రి విపిన్దాస్, తల్లి శ్రీ హేమ శ్రీధరన్ దంపుతుల పెద్ద కుమార్తె. తన వయసు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే ఆమె మాత్రం తన చిట్టి చేతులతో కెమెరాతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఈ చిన్నారి కెమెరాల పట్ల అసాధారణమైన ఆసక్తిని కనబరుస్తోంది. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అయిన తండ్రి విపిన్ దాస్ అడుగుజాడల్లో నడిచేస్తోంది. అంత చిన్న వయసులోనే ఆ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడం విశేషం. పైగా తన టాలెంట్తో ఆ అభిరుచి తన డీఎన్ఏలోనే ఉంది అని చెప్పకనే చెబుతోంది పిహు. కేవలం 18 నెలల వయసులోనే బొమ్మ కెమరా కాకుండా, ఒరిజనల్ కెమెరాను పట్టుకుంది. ఆ పరికరం తన బరువులో దాదాపు సగం బరువు అయినా..ఆమె దానిని జాగ్రత్తగా ఎత్తి తనకు ఇష్టమైన ఏనుగు బొమ్మ ఫోటోని తీసింది. అది చూసిన తల్లిదండ్రులు ఓ చిన్న పసిపాప తీసిన ఫోటోనేనా..? అని విస్తుపోయారు. పైగా అంత చిన్నవయసులోనే కెమెరాలోని రకారకాల లెన్స్లు, గింబల్ వంటి వాటిపై ఆకస్తి చూపించేది. ప్రతి బటన్ ఎలా పనిచేస్తుందనేది తల్లిదండ్రులను అడిగి తెలుసుకునేది. అయితే తల్లిదండ్రులు అంత చిన్నవయసుకు కెమెరా ఎందుకని బొమ్మ కెమెరా ఇచ్చేందుకు యత్నిస్తే అస్సలు ఒప్పుకునేది కాదని చెప్పుకొచ్చారు. ఎలా నేర్చుకుందంటే..పిహు ఫొటోలు అందంగా తీయడం ఎలా నేర్చుకుందంటే..తన స్నేహితుడి బిడ్డ పుట్టినరోజు వేడుకలో సదరాగా ఇచ్చిన చిన్న కెమెరాను ప్రోఫెషనల్ కెమెరా మ్యాన్లు పట్టుకున్నట్లుగా పట్టుకుని ఫొటోలు తీసిందని చెబుతున్నారు ఆమె తండ్రి విపిన్ దాస్. అక్కడే తీస్తున్న ఇతర ఫొటోగ్రాఫర్లను పరిశీలిస్తూ తీయడం నేర్చుకుందని, పైగా ఆ వేడుకలో తీసిన పది ఫొటోలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలా అప్పటి నుంచి పిహు తండ్రి తోపాటు అవుట్డోర్ ఫొటోషూట్లకు వెళ్లడం ప్రారంభించింది. అలాగే తన తల్లి శ్రీహేమ రెండోసారి గర్భవతి అయినప్పుడు తల్లికి ఆ చిన్నారి వ్యక్తిగత ఫొటోగ్రాఫర్గా మారింది. నేచురల్ వెలుగులో అద్భుతమైన పోర్ట్రెయిట్లను తీసింది ఆ చిన్నారి. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) ఆ చిన్నారికి పేరొచ్చింది అప్పుడే..గతేడాది నవంబర్లో రాజకీయ నాయకుడు, ఎంపీ షఫీ పరంబిల్ ఆమె వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో పిహు పేరు మారుమ్రోగిపోయింది. ఆ వీడియోలో పిహు ఎంపీకి సంబంధించిన కొన్ని ఫొటోలు క్లిక్మనిపించింది. అంత ఎవరా ఆ చిన్నారి అంటూ తెలుసుకోవడం ప్రారంభించారు. ఇక తన కూతురుకి ఏ యాంగిల్ ఫోటోలు తీస్తే బాగా వస్తాయనే దానిపై మంచి పట్టుందని చెబుతున్నారు విపిన్ దాస్. View this post on Instagram A post shared by Shafi Parambil (@shafi_parambil) ఇవేగాక ఆమె ఇటీవలే, పాలక్కాడ్లోని శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగే పదిరోజుల వార్షిక రథోత్సవమైన ప్రసిద్ధ కల్పతి రథోత్సవంలో సైతం అద్భుతంగా ఫొటోలు తీసిందన్నారు. అక్కడ కమనీయ దృశ్యాలను చాలా అద్భుతంగా కెమెరాలో బంధించిందని చెప్పారు. అంతేకాదండోయో ఈ చిన్నారి పిహుకి 'cam_girl_pihu' అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది. దానిని ఆమె తల్లిదండ్రులే నిర్వహిస్తున్నారు.(చదవండి: నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్చేస్తే..)
నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్చేస్తే..
ఏ వ్యాపారమైన ప్రారంభంలో ఒడిదుడుకులు సాధారణం. ఇక్కడ వాటిని అధిగమిస్తు ముందుకు సాగేవారు ఏదో ఒకరోజు తప్పక గెలుస్తారు. అందుకు ఉదాహరణ ఈ వ్యక్తి. ఒకప్పుడు సాదాసీదా తోపుడు బండిపై పండ్ల వ్యాపారం. ఒక్కోసారి ఒక్కటి కూడా అమ్ముడు అవ్వక వద్దురా ఈ వ్యాపారం అనేలా నిరాశను కలుగజేసింది. అయినా ఎలాగైనా ఏదో సాధించాలన్న కసి, పట్టుదల మళ్లీ మళ్లీ అదే వ్యాపారం చేసి నిలదొక్కుకోవడమే గాక పదిమందికి ఉపాధి ఇచ్చే స్థాయికి చేరాడు, పైగా కోట్లలో లాభాలు ఆర్జించడం మొదలైంది. ఎలా ఆ వ్యక్తి ఆ స్థాయిలో పండ్ల వ్యాపారంలో సక్సెస్ని అందుకున్నాడంటే..ఆ వ్యక్తే మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్కి చెందిన అబ్దుల్ రైస్. దాదాపు 30 ఏళ్ల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఒక సాధారణ బండిపై పండ్లు అమ్ముతూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రారంభరోజుల్లో అతడి వ్యాపారం ఎంత దారుణంగా ఉండేదంటే..సరిగా అమ్మకాలు సాగాక రోజంతా వేచి చూడాల్సి వచ్చేది. ఆ తోపుడు బండి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోక ఇక వదిలేద్దాం రా బాబు అని అనుకునేవాడు. మరోవైపు వర్షాకాలంలో ఆ కొద్దిపాటి అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయేవి. ఈ ఇబ్బందులతో ఆయన ఛీ ఈ వ్యాపారం నాకొద్దు అంటూ విలపించేవాడు. అయితే బంధువులు, కుటుంబ సభ్యుల మద్దతుతో అబ్దుల్ సుమారు రూ. 5 లక్షల రుణం తీసుకుని మళ్లీ అదే వ్యాపారం ప్రారంభించారు. ఈసారి ఆయనకు గతంలో చూసిన సవాళ్లు అన్ని పాఠాలుగా మారి, ఎలా వ్యాపారం నిర్వహించాలో తెలిసొచ్చింది. నిరంతర శ్రమ, పట్టుదలతో లాభాల పట్టేంచేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆ చిన్న వ్యాపారం కాస్త కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. కాలక్రమేణ తన చిన్న తోపుడు బండి వ్యాపారం ఒక అభివృద్ధి చెందుతున్న సంస్థగా మారింది. అలా అతని సంస్థ ఏకంగా రూ. 3 కోట్ల వార్షిక టర్నోవర్తో దూసుకుపోవడమే గాక దాదాపు 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఒకప్పుడు మనుగడ కోసం పడిన పోరాటం ఇప్పుడు చాలామందికి ఉపాధి అందించే రేంజ్కు చేరడం విశేషం. అతడి సంస్థ బుర్హాన్పూర్లో నీలం ఫ్రూట్’గా ప్రసిద్ధి చెందింది. నాణ్యత, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి అక్కడందరి మన్ననలకు అందుకుంది. అతడి దుకాణం నుంచి పండ్లు కొనడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం గమనార్షం. అతడి సంస్థ వద్దకు సుమారు రెండు నుంచి మూడు వాహానాలు వస్తాయట. చిల్లర వినియోగదారులే కాకుండా, చాలా మంది చిరు వ్యాపారులు కూడా అతని వద్ద పండ్లు కొని స్థానిక మార్కెట్లలో అమ్ముతారు. తద్వారా అతడి వ్యాపార విస్తరణ మరింత పెరుగుతూ వచ్చింది. పట్లుదల, నిరంతర కృషి ఉంటే ఎంతటి భయాంకరమైన సవాళ్లనైనా దాటగలుగతాం, విజయం సాధించగలం అని అబ్దుల్ రైస్.(చదవండి: కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నీతా..! గులాబీ కుర్తా..)
వధువు కావలెను
అమ్మాయికి వంట వచ్చా.. అనే ప్రశ్న బదులు.. అబ్బాయి సంపాదన ఎంత అనే క్వశ్చన్ బాగా వినిపిస్తోంది. అమ్మాయి చదువుకుందా.. అని ఆరా తీయడం బదులు.. అబ్బాయి బుద్ధిమంతుడా కాదా అన్న ఎంక్వైరీలు మొదలయ్యాయి. కట్నం ఎంత ఇస్తారు.. అన్న మాట వినిపిస్తున్నా.. కట్నం ఇవ్వకపోయినా పర్లేదు అన్న అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. జిల్లాలో పురుష పుంగవులకు వివాహ రేఖలు కనిపించడం లేదు. 30 దాటినా పెళ్లి కాని వారి మగవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. శ్రీకాకుళం కల్చరల్, శ్రీకాకుళం రూరల్: జిల్లాలో పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నారు. ఇదివరకు అబ్బాయి ఓకే అంటే అమ్మాయి తరఫు వారు హమ్మయ్య అంటూ గెంతులు వేసే వారు. కానీ ఇప్పుడు ఓకే చెప్పే అధికారం పూర్తిగా అమ్మాయి తరఫు వారికే మళ్లిపోయినట్టు ఉంది. ఫలితంగా వయసు ముదురుతున్నా పెళ్లి కాక ఎంతో మంది యువకులు మిగిలిపోతున్నారు. ఒకప్పటిలా తల్లిదండ్రులు చూపించిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పుడు తక్కువైపోయారు. అబ్బాయిలు రాజీ పడుతున్నా అమ్మాయిలు నో అంటున్నారు. పెరిగిన అడ్డుగోడలు.. ప్రస్తుతం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫలానా విధంగా ఉండాలని అమ్మాయిలు చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు. సంపాదన ఒక్కటే చూడకుండా ప్రొఫెషన్ను కూడా గమనిస్తున్నారు. తక్కువ సంపాదన ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వాళ్లకి తక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద స్థాయిలో జీతాలు ఉండి ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగాల సంబంధాలను కూడా వదిలేసుకోవడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తుండడంతో ఉన్నత ఉద్యోగులకు అందునా ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటిలాగానే డిమాండ్ ఉంది. పెళ్లికి అమ్మాయిల అనుమతి రోజులు మారాయి. అమ్మాయి కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి నేను నచ్చానో లేదో ఒకసారి అడగండి అని అబ్బాయిలే అంటున్నారు. అవసరమైతే కట్నం లేకుండా చేసుకుంటామంటున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బిఎస్సీ అగ్రికల్చరల్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజినీరింగ్ వంటి కోర్సులను చదివే వారి సంఖ్య తక్కువగా ఉండేది. ఈ అర్హతలు చెబితే చాలు ఇట్టే పెళ్లయిపోయేది. కానీ ఇప్పుడా పప్పులు ఉడకడం లేదు. పెరిగిన వివాహం వయసు ఒకప్పుడు అమ్మాయికి పెళ్లీడు రాగానే పెళ్లి చేసే వారు. ఇప్పుడు 25 ఏళ్ల వరకు వివాహ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఒకప్పుడు అబ్బాయిలు కూడా 20 ఏళ్లకు పెళ్లి చేసుకునే వారు. కానీ వారు కూడా 30 ఏళ్లు దాకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆ తర్వాత అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది. గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే సరైన వయసులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాలలో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెపుతున్నారు. అంతా 30 ఏళ్లు పైబడినవారే జాతకాల కోసం ముహుర్తాల కోసం వచ్చేవారు అధికంగా 30ఏళ్లు పైబడినవారే. చాలా మంది తల్లిదండ్రులు వారి అబ్బాయిలకు తగిన అమ్మాయిలు దొరకడం లేదని బాధ వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలను ఎంచుకునే అవకాశం అమ్మాయిలకు లభిస్తుండడం గమనిస్తున్నాం. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం, గుడివీధి యువత ఆలోచనలో మార్పు యువత ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పే ఒక కారణమైతే, అమ్మాయిలు తక్కువగా ఉండ డం మరో కారణం. పెళ్లి కోసం అమ్మాయిలను వెతుక్కోవడానికే సరిపోతుంది. – వేదుల విజయభాస్కరశర్మ, పురోహితులు
అంతర్జాతీయం
‘కాల్పుల విరమణ’ గందరగోళం పాపం పాక్దే!
మధ్యవర్తి అంటే పెద్దమనిషి తరహాలో పెద్దరికంతో, హుందాగా వ్యవహరించాలి. కానీ దశాబ్దాలుగా ఉగ్రమూకలను చంకనెత్తుకు తిరుగుతూ తమ దేశంలో ఉగ్రవాదమే లేదని బొంకే పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపైనా అదే ధోరణిని ప్రదర్శించి మరోసారి నవ్వులపాలైంది. ఇందుకు పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తెరమీదకొచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనల ఘటనే సాక్ష్యంగా నిలిచింది. తమ భూభాగంతోపాట లెబనాన్ మీదా దాడులను ఆపేయాలని ఇరాన్ స్పష్టంగా పది ప్రతిపాదనలను పంపితే వాటిలోంచి ‘లెబనాన్’అనే పేరును తొలగించి అమెరికా, ఇజ్రాయెల్లకు పాకిస్తాన్ ప్రతిపాదనలను చేరవేసిందనేది ఇప్పుడు విన్పిస్తున్న ప్రధాన ఆరోపణ. పాక్ మధ్యవర్తిత్వంలో తమకు అందిన ప్రతిపాదనల్లో ‘లెబనాన్’అనే పదం ఎక్కడా లేదనేది అమెరికా, ఇజ్రాయెల్ వాదన. దీంతో పాకిస్తాన్ చేసిన అసమర్థ, అసంబద్ధ మధ్యవర్తిత్వం కారణంగా తమపై దాడులభారం తప్పట్లేదని ఇప్పుడు లెబనాన్ పాక్పై ఆగ్రహంగా ఉంది. పాక్ మాత్రం దీంతో తమకెలాంటి సంబంధంలేదని చేతులు దులిపేసుకునేలా మాట్లాడటం గమనార్హం. ‘‘లెబనాన్తో కలుపుకుని ప్రతిచోటా, ఎక్కడా దాడులు జరపబోమని ఇరాన్, అమెరికా, మిత్రదేశాల మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదన అమల్లోకి వచ్చింది’’అని తొలుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’లో ఒక ట్వీట్చేశారు. ట్వీట్చేసిన కొద్దిసేపటికే లెబనాన్పై ఇజ్రాయెల్ భీకరదాడులు చేయడంతో కాల్పులవిరమణ ఒప్పందంలో లెబనాన్ పేరు ఉందా? లేదా? అనే గందరగోళం తలెత్తింది. ఇందుకు పాకిస్తానే కారణమని లెబనాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇరాన్ పంపిన ప్రతిపాదనలకు పాకిస్తాన్ ఏకపక్షంగా సవరణలుచేసి అమెరికాకు పంపిందని ఆరోపించింది. ఇరాన్ సైతం ఇదే వాదనలు చేసింది. తాము పంపిన వాటిని మార్చేసి అమెరికాకు పంపడంతోపాటు, అమెరికా పంపిన ప్రతిపాదనలనూ కాస్తంత అటూఇటూ మార్చేసి తమకు అందజేసిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం పాకిస్తాన్ రెండు నాల్కల ధోరణిని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘సీజ్ఫైర్లో లెబనాన్ ఉందని ఇరాన్ను మధ్యవర్తిత్వ దేశాలు నమ్మించి ఉండవచ్చు. ఇందులో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. లెబనాన్పై దాడి చేయబోమనే ప్రతిపాదనలకు మేం సమ్మతి తెలపలేదు’’అని అన్నారు. ట్వీట్ సైతం అమెరికా నుంచే.. షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’ఖాతాలో ప్రత్యక్షమై ట్వీట్ సైతం సొంతంగా టైప్ చేసింది కాదు అని, అమెరికా అధ్యక్షభవనం నుంచి వచ్చిన సందేశాన్నే ఉన్నది ఉన్నట్లుగా షరీఫ్ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారని తెలుస్తోంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. సందేశం మీద తొలుత డ్రాఫ్ట్ అనే పదం కన్పించి తర్వాత అది కన్పించకుండా పోయింది. షరీఫ్ ‘ఎక్స్’లో పోస్ట్చేయబోయే వాక్యాలను తొలుత శ్వేతసౌధం ధ్రువీకరించిందని, వైట్హౌస్ అనుమతితోనే షరీఫ్ ఆ సందేశాన్ని పోస్ట్చేశారని న్యూయార్క్టైమ్స్ పేర్కొంది. దీనిపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి ఖండన రాకపోవడంతో ఇదే వాస్తవమనే వాదనకు బలం చేకూరింది. ఒక పక్షం వాదనలు, డిమాండ్లను అత్యంత పారదర్శకంగా మరో పక్షానికి అందించడంలో పాకిస్తాన్ విఫలమైందని, అందుకే లెబనాన్ విషయంలో సందిగ్ధత చోటుచేసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
సందిగ్ధత నడుమ శాంతి
దుబాయ్/ఇస్లామాబాద్/బీరూట్/వాషింగ్టన్: పాకిస్తాన్ అస్తవ్యస్థ మధ్యవర్తిత్వంతో అమల్లోకి వచ్చిన ‘రెండు వారాల కాల్పుల విరమణ’పూర్తి సందిగ్ధవాతావరణంలో కొనసాగుతోంది. ఓవైపు లెబనాన్పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ తెగేసి చెప్పడం, మరోవైపు లెబనాన్పై దాడులుచేస్తే హార్మూజ్ పీకనొక్కేసి నౌకల రాకపోకలను శాశ్వతంగా మూసేస్తామన్న ఇరాన్ ప్రకటనతో అసలు కాల్పులవిరమణ అనేది ఏ స్థాయిలో అమలవుతోందనే ప్రశ్న యావత్ ప్రపంచప్రజలను వేధిస్తోంది. కాల్పుల విరమణ మొదలయ్యాక సైతం లెబనాన్పై బుధవారం ఇజ్రాయెల్ దాడులు చేయడంతో కన్నెర్రజేసిన ఇరాన్ కొన్ని నిమిషాల్లోనే మళ్లీ హార్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో పర్షియన్ గల్ఫ్ గుండా చమురు, పెట్రో ఉత్పత్తుల నౌకల రాకపై గంపెడాశలు పెట్టుకున్న ప్రపంచదేశాలు వెనువెంటనే నిట్టూర్చాయి. మరోవైపు తమ గగనతలంలోకి గత 24 గంటల్లో ఎలాంటి శత్రు క్షిపణులు, డ్రోన్లు చొరబడలేదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ గురువారం ప్రకటించాయి. పాకిస్తాన్లో జరగబోయే చర్చల్లో ఎలాంటి ఫలితం వస్తుందో? చర్చలు విఫలమైతే మళ్లీ భీకరదాడులు, ప్రతిదాడులు తప్పవేమోనన్న భయాందోళనల పీడకల ప్రపంచదేశాలను వదిలిపోవట్లేదు. మరోవైపు తమపై ఇజ్రాయెల్ బుధవారం జరిపిన భీకరదాడిలో పెద్దసంఖ్యలో జనం ప్రాణాలుకోల్పోవడంతో ఆ దేశంతో చర్చలకు సిద్ధమని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ప్రకటించారు. దీంతో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ‘‘నేరుగా చర్చలు జరపాలని కేబినెట్ మంత్రులను ఆదేశించా. లెబనాన్లో హెజ్బొల్లా సాయుధులు తమ ఆయుధాలను త్యజించాల్సిందే. అప్పుడే ఇరుదేశాల మధ్య శాంతియుత సంబంధాలపై దృష్టిసారించగలం’’అని నెతన్యాహూ అన్నారు. లెబనాన్పై భీకరదాడులు కొనసాగుతాయన్న కొద్దిసేపటికే ఆయన ఇలా భిన్నమైన ప్రకటనచేయడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనమేరకే నెతన్యాహూ లెబనాన్తో నేరుగా చర్చలకు అంగీకరించారని తెలుస్తోంది. వాషింగ్టన్లో వచ్చేవారం జరగబోయే ఈ చర్చల్లో అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి యేషెల్ లీటెర్, లెబనాన్లో అమెరికా రాయబారి మైఖేల్ పాల్గొంటారని తెలుస్తోంది. మా వేలు ట్రిగ్గర్మీదే ఉంది.. కాల్పుల విరమణ ప్రతిపాదనల్లో లెబనాన్ పేరు చేర్చినా ఇజ్రాయెల్ దాడులు ఆపకపోవడంపై ఇరాన్ మండిపడింది. లెబనాన్పై దాడులుచేస్తే మరింతగా రెచ్చిపోతామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. శనివారం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరగబోయే చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో బఘేర్ భేటీకానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లెబనాన్ విషయంలో వెనక్కి తగ్గకపోతే దారుణ ప్రతిదాడులు తప్పవని, గన్ ట్రిగ్గర్పై తమ వేలు అలాగే ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ హెచ్చరించారు. మరోవైపు చమురుధరలు పెరుగుతూ పోతున్నాయి. గురువారం అంతర్జాతీయంగా నాణ్యమైన బ్రెంట్ రకం చమురు ధర బ్యారెల్కు 98 డాలర్లకు పెరిగింది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28నాటి ధరతో పోలిస్తే ఇది ఏకంగా 35 శాతం అధికంకావడం గమనార్హం. చర్చల అంశాలపైనా సందిగ్ధత చర్చల్లో ఇరాన్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందో? వాటికి అమెరికా, ఇజ్రాయెల్ ఏ రీతిలో స్పందిస్తాయోననే సందిగ్ధత కొనసాగుతోంది. శనివారం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో చర్చలు జరగనున్నాయి. ఇన్నాళ్లూ అంతర్జాతీయ సముద్రజలాలుగా ఉన్న హార్మూజ్ జలసంధి జలాలపై ఇకపై తమ గుత్తాధిపత్యం ఉండాలని ఇరాన్ డిమాండ్చేసే వీలుంది. ఇరాన్ నవతరం క్షిపణుల తయారీ ప్రాజెక్ట్, అణ్వాయుధ సామర్థ్యాన్ని సముపార్జించడంపై చర్చల్లో అమెరికా, ఇజ్రాయెల్ అడ్డుచెప్పే అవకాశముంది. ఆపత్కాలంలో కలిసిరావాల్సిన నాటో సభ్యదేశాలు మొండిచేయి చూపించాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణల నడుమ జర్మనీ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్ అగ్రరాజ్యానికి మద్దతుపలికారు. ‘‘అమెరికాతో నాటో కలిసి నడుస్తుంది. ఈ మేరకు బుధవారం ట్రంప్తో సంభాషించా. అయితే ఏమేరకు అమెరికాకు సాయపడాలనే అంశంపై జూలైలో తుర్కియేలోని అంకారాలో జరిగే నాటో శిఖరాగ్ర సదస్సులో తేలుస్తాం. అమెరికా, యూరప్లను కలుపుతూ నాటో పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం’’అని మెర్జ్ అన్నారు. మరోవైపు చర్చలకు పాకిస్తాన్ సన్నాహకాలు చేస్తోంది. ఏర్పాట్లపై పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, ప్రధాని షెహబాజ్తో సమీక్ష జరిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్లతో కూడిన అమెరికా ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయంకల్లా ఇస్లామాబాద్కు చేరుకోనుంది. శిథిలాల దిబ్బ... బుధవారం మధ్యాహ్నం 10 నిమిషాల్లో 100కుపైగా ప్రాంతాలపై ఒకేసారి దాడిచేసి లెబనాన్లో ఇజ్రాయెల్ వినాశనం సృష్టించిన ఘటనలో మరణాల సంఖ్య గురువారానికి 303కు పెరిగింది. 1,150 మందికిపైగా గాయాలపాలయ్యారు. చాలా మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. దాడుల్లో హెచ్బొల్లా నేత నయీం ఖాసిమ్ సన్నిహితుడు అలీ యూసుఫ్ హర్షీ హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. శిథిలాల గుట్టలుగా మారిన దాడి ప్రాంతాల్లో ఇంకా బాధితుల కోసం అన్వేషణ కొనసాగుతోంది.సముద్ర మందుపాతరలతో జాగ్రత్త సరకు రవాణా నౌకలకు ఇరాన్ సూచన సీమైన్స్ అమర్చిన ప్రాంతం ‘చార్ట్’విడుదలదాడులు, ప్రతిదాడులు, బెదిరింపులు, కవి్వంపులు, హెచ్చరికల దశ దాటి కాల్పులవిరమణ పర్వంలోకి అడుగుపెట్టిన పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ కాస్తంత మెత్తబడి అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా వెళ్లేందుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చింది. అయితే యుద్ధంవేళ అనుమతిలేకుండా హార్మూజ్ గుండా వెళ్లే నౌకలను నాశనంచేసేందుకు పర్షియన్ గల్ఫ్ జలాల్లో అమర్చిన సముద్రమందుపాతరల జాడను వెల్లడిస్తూ ఇరాన్ తాజాగా ఒక చిత్రపటాన్ని విడుదలచేసింది. నలుపు, తెలుపురంగుల్లో ఉన్న ఈ చిత్రపటంలో పేర్కొన్న వృత్తాకార ప్రాంతం(డేంజర్ జోన్) నుంచి కాకుండా కాస్తంత దూరంగా జరిగి నౌకలు రాకపోకలు సాగించాలని ఇరాన్ ప్రకటించింది. చార్జ్ ప్రకారం చూస్తే సీమైన్స్ను ఇరాన్ తీరంవైపు కాకుండా ఆవలివైపునకు అత్యధికంగా అమర్చినట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ తీరం వెంబడి దాడుల నుంచి తప్పించుకునేందుకు తీరానికి దూరంగా నౌకలు వెళ్తాయని ముందే ఊహించి, వాటి రాకపోకలను అడ్డుకునేందుకే ఇరాన్ ఇలాంటి ఎత్తుగడ వేసిందని స్పష్టమవుతోంది. సీమైన్స్ బారిపడకుండా ఈ నౌకలు ఇకపై ఇరాన్కు దగ్గరగా లరాక్ ద్వీపానికి సమీపంగా వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. మేం ఇరాన్ చుట్టూతే ఉంటాం: ట్రంప్కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినంత మాత్రాన పశ్చిమాసియాను అమెరికా బలగాలు వీడిపోవని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆయన గురువారం ఒక పోస్ట్పెట్టారు. ‘‘యుద్ధం శాశ్వత ముగింపునకు సంబంధించిన సమగ్ర ఒప్పందం కుదిరే వరకు, అది అమల్లోకి వచ్చే వరకు అమెరికా బలగాల ఎక్కడికీ పోవు. పశ్చిమాసియాలో ఇరాన్ చుట్టూతా మొహరించే ఉంటాయి. ఒకవేళ ఏదైనా కారణంతో ఒప్పందం కుదరకపోతే మళ్లీ బాంబుల దాడి, కాల్పుల మోత మరింతగా మోగుతుంది’’ అని ట్రంప్ అన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సీజ్ఫైర్ ప్రకటన
ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈ మధ్యే రెండు వారాల కాల్పుల విరమణని ట్రంప్ ప్రకటించారు. అది ప్రస్తుతం అమల్లో ఉంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించారు. ఆర్థడాక్స్ ఈస్టర్ పండగని పురస్కరించుకుని ఈ ప్రకటన చేశారు.క్రెమ్లిన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఏప్రిల్ 11న సాయంత్రం 4 గంటల నుంచి ఏప్రిల్ 12వ తేదీ ముగింపు వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో అన్ని దిశల్లో సైనిక చర్యలని నిలిపివేయాలని రష్యా సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. కానీ శత్రువుల నుంచి ఎలాంటి దాడులు జరిగినా దానికి తగినట్లే ప్రతిస్పందించడానికి సైన్యం సిద్ధంగా ఉందని కూడా స్పష్టం చేసింది. ఇదే విధంగా ఉక్రెయిన్ కూడా సీజ్ ఫైర్ పాటిస్తుందని రష్యా ఆశాభావం వ్యక్తం చేసింది.ఇదిలా ఉండగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ.. అమెరికా ద్వారానే ఈస్టర్ సందర్భంగా కాల్పుల విరమణకు సంబంధించిన ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్వర్యంలో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ సఫలమయ్యాయి. భూభాగం, రాజకీయపరమైన రాయితీలు ఇవ్వాలని రష్యా పట్టుబడుతుండగా వాటికి ఉక్రెయిన్ తిరస్కరిస్తోంది. అందుకే 2022లో ఈ యుద్ధం మొదలైనప్పటికీ ఇప్పటికీ ఎటూ తేలట్లేదు. దీని కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు.
నాటో తీరుపై ట్రంప్ మళ్లీ విమర్శలు
నాటో వ్యహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మనల్ని నిరాశపరిచే నాటో కూటమితో పాటు మిత్ర దేశాలకు, ఒత్తిడి పెట్టకపోతే సమస్యలేవి అర్థం కావు అని అన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ పెట్టారు. ఇరాన్తో యుద్ధం చేసే విషయంలో, హర్మూజ్ని దక్కించుకునే విషయంలో నాటో కలిసి రానందుకు ఇప్పటికే నాటో దేశాలని ఇప్పటికే ట్రంప్ విమర్శిస్తున్నారు.మరోవైపు మంగళవారం రాత్రికే ఇరాన్ నాగరికతని అంతం చేస్తానని హెచ్చరికలు ఇచ్చిన ట్రంప్.. సరిగ్గా గంటన్నర ముందు కాల్పుల విరమణ ప్రకటించారు. రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పాక్ మధ్యవర్తిత్వం చేయగా.. ఇప్పుడు ఆ దేశంలోని ఇస్లామాబాద్లోనే అమెరికా-ఇరాన్ చర్చలకు సిద్ధమయ్యాయి. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఇరు దేశాల ప్రతినిధులు.. ఇస్లామాబాద్ చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకోసం పాక్ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. చర్చల కోసం వచ్చే బృందాలకు పూర్తి సహకారం అందిస్తామని పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అయితే సీజ్ ఫైర్ కొనసాగుతుండగానే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అన్నారు.
జాతీయం
బోరుబావిలో పడ్డ బాలుడు.. 75 అడుగుల లోతులో..
ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జులారియాలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. బాలుడు 75 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 9(గురువారం) రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్లోని పాలి జిల్లాకు చెందిన గొర్రెల కాపరుల కుటుంబం తమ మందలతో కలిసి ఇక్కడికి వచ్చింది. వారి రెండేళ్ల కుమారుడు భగీరథ్ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు.ఎస్పీ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బోరుబావిపై రక్షణగా ఒక రాయిని ఉంచారు. అయితే.. ఒక గొర్రె ఆ రాయిని పక్కకు నెట్టేసింది. ఆ తర్వాత బాలుడు.. ఆ మూతను తెరిచి లోపలికి తొంగి చూస్తుండగా ప్రమాదవశాత్తూ లోపలికి జారి పడిపోయాడు. బద్నావర్ ఎస్హెచ్ఓ అశోక్ పాటిదార్ నేతృత్వంలో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆరు పొక్లెయిన్లు, జేసీబీ యంత్రాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. ఉజ్జయిని కలెక్టర్ రోషన్ సింగ్, ఎస్పీ ప్రదీప్ శర్మ స్వయంగా ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ఉజ్జయినిలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 4న ఉజ్జయినిలో తీర్థయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా.. గునా బైపాస్ రోడ్డు వద్ద కారు డివైడర్ను ఢీకొట్టి 40 అడుగుల లోతైన గుంతలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఒక చిన్నారితో సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో.. ఉజ్జయినిలోని ధాబా రోడ్డులో ఉన్న గేబీ హనుమాన్ ఆలయం సమీపంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ సంతోష్ ఠాగూర్ ధృవీకరించారు.
బిహార్ కొత్త సీఎం ఆయనే.. బ్యాక్ గ్రౌండ్ ఇదే!
పట్నా: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టనున్నారు. జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీలో బీజేపీ ముఖ్య నాయకులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి పేరును ఖరారు చేయనున్నారు.ఏప్రిల్ 14వ తేదీన బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేస్తారు. అనంతరం కొత్త సీఎం పేరును అధికారికంగా ప్రకటిస్తారు. ఏప్రిల్ 15న సామ్రాట్ చౌదరి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతుండడం బిహార్ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడం వల్ల నామమాత్రపు నాయకుడిగా మిగిలిపోతారని, రాష్ట్రంలో ఆయన పార్టీ ప్రభావం తగ్గిపోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి.. 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్బత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. ఆయన 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్గా నియమితులయ్యారు.2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్(యూ)లో చేరి 2 జూన్ 2014న పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సామ్రాట్ చౌదరి 2018లో భారతీయ జనతా పార్టీలో చేరి బీహార్ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా, 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024 జనవరి 28న నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సామ్రాట్ చౌదరి.. బీహార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచే కొత్త రూల్
ఢిల్లీ: టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు ఇవాళ నుంచి(ఏప్రిల్ 10, శుక్రవారం) బంద్ కానున్నాయి. ఫాస్టాగ్ లేని వాహనాలకు 1.25 రెట్ల అధిక రుసుము చెల్సించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయరహదారులపై టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపేయనుంది. కేవలం ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులను పూర్తిచేయాల్సి ఉంటుంది.ఒకవేళ వాహనాలకు ఫాస్టాగ్ను అతికించకపోతే యూపీఐ విధానం ద్వారా టోల్ రుసుమును చెల్లించవచ్చు. కానీ వాస్తవిక రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా టోల్ చార్జీని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ.. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ను జారీచేసింది.ఫాస్టాగ్ విధానంలో మాత్రమే టోల్ప్లాజా గేట్ల వద్ద ఎలాంటి క్యూ సమస్యలు తలెత్తబోవని, అందుకే ఫాస్టాగ్ను ప్రోత్సహిస్తున్నామని మంత్రిత్వశాఖ చెబుతోంది. వ్యాలిడిటీ దాటిపోయిన ఫాస్టాగ్లతో వచ్చే వాహనాల టోల్చార్జీలను యూపీఐ విధానంలో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. ఫాస్టాగ్ లేదా యూపీఐ విధానంలోనూ చెల్లింపులు జరపని వాహనాలను 14వ నిబంధన మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
ఓటెత్తిన కేరళ
తిరువనంతపురం: కేరళ 16వ అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 78.12% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటేసిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ నేత సతీశన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, బీజేపీ రాష్ట్ర చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ తదితరులున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) రతన్ యూ కేల్కర్ తెలిపారు. అక్కడక్కడా సాంకేతిక లోపాలు తలెత్తాయన్నారు. రెండు పోలింగ్ బూత్లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. ప్రస్తుత సరళిని బట్టి చూస్తే 90 శాతం వరకు ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 74.06 శాతం మంది ఓటేయగా, ఈసారి అంతకుమించి తరలిరావడం విశేషం. అసెంబ్లీలోని మొత్తం 140 నియోజకవర్గాల్లో 2.71 కోట్ల ఓటర్లున్నారు. 1987 ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 80.54 శాతం ఓటింగ్ నమోదైంది. మరోసారి భారీగా ఓటింగ్ నమోదు కావడంపై వివిధ పార్టీలు తమకు అనుకూలమైన విశ్లేషణలు విన్పిస్తున్నాయి. సర్ ప్రక్రియ వల్లే ఈ స్థాయిలో ఓటర్లు తరలివచ్చారని సీపీఎం నేత మోహనన్ పేర్కొన్నారు. గతంలో ఓటింగ్ శాతాలు భారీగా ఉన్నప్పుడు ఫలితాలు యూడీఎఫ్కే అనుకూలంగా వచ్చాయని కాంగ్రెస్ నేత దీప్తి మేరీ వర్గీస్ గుర్తు చేశారు. అయితే, ఈ దఫా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం వల్లే ఓటింగ్ శాతం పెరిగినట్లు బీజేపీ నేత షైజు విశ్లేషించారు. ఇది తమ పారీ్టకి అనుకూల అంశమన్నారు.పుదుచ్చేరిలో 89.87%పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి గురువారం జరిగిన పోలింగ్లో ఏకంగా 89.87 శాతం పోలింగ్ నమోదైంది. 1964లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొంది, భారత్లో విలీనమయ్యాక పుదుచ్చేరిలో దాదాపు 90 శాతం మంది ఓటర్లు తరలివచ్చి ఓటేయడం ఇదే మొదటిసారి. గతంలో ఇక్కడ జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలన్నిటిలోనూ ఇదే రికార్డని చీఫ్ ఎలక్టోరల్ అధికారి పి.జవహర్ తెలిపారు. ఇది చరిత్రాత్మకం, అసాధారణమని ఆయన పేర్కొన్నారు. ఒక్క స్వల్ప ఘటన మినహా పుదుచ్చేరి, కారైకాల్ మొత్తమ్మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రారంభమైన ఉదయం 7 గంటలకే జనం పోలింగ్ బూత్ల వద్దకు చేరుకున్నారు. ఎండలు మండిపోతున్నా లెక్కచేయలేదు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అవకాశమి చ్చారు. సీఎం ఎన్.రంగస్వామి, లోక్సభ ఎంపీ వీ వైతిలింగం, డీఎంకే నేత ఆర్.శివ, హోంమంత్రి నమశ్శివాయం ఓటు వేసిన వారిలో ఉన్నారు. అస్సాంలో 85% మైనారిటీల ప్రాబల్యమున్న చోట్ల 90 శాతంపైనే గువాహటి: అస్సాం అసెంబ్లీకి గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల నాటికి 85.64 శాతం మంది ఓటేశారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 126 స్థానాలకు ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గత 2021లో జరిగిన ఎన్నికల్లో 82.04 శాతం ఓటింగ్ నమోదైంది. 2016 శాతం అత్యధికంగా 84.72 మంది ఓటేయడం రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర ప్రజలు ఈదఫా గత రికార్డును తిరగరాయడం విశేషం. ఓ వైపు వర్షం కురుస్తున్నా జనం లెక్క చేయలేదు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఈసీ పేర్కొంది. దాల్గావ్ నియోజకవర్గంలో అత్యధికంగా 95.83 శాతం మంది ఓటేయగా, అత్యల్పంగా న్యూ గువాహటిలో 72.10 మంది ఓటేశారు. మైనారిటీల ప్రాబల్యమున్న 19 నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. 2023లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలివి. గురువారం సీఎం హిమంత బిశ్వ శర్మ, భార్య, పిల్లలతో కలిసి వచ్చి కామ్రూప్ (మెట్రో) గారాల్ బునియాదీ స్కూల్ బూత్లో ఓటేశారు. జోర్హాత్లోని డీసీబీ స్కూల్ బూత్లో కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఓటేశారు. ఓటేసిన మరికొందరు ప్రముఖుల్లో కేంద్ర మంత్రి పబిత్రా మర్ఘరెటా, ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా తదితరులున్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావడంపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును, నయా అస్సాంను కోరుకుంటున్నారనేందుకు ఇదే సంకేతమని విశ్లేషించారు. ఓటరు శాతం భారీగా నమోదు కావడాన్ని చారిత్రక పరిణామంగా సీఎం హిమంత అభివరి్ణంచారు. ఫలితం ఇప్పటికే నిర్ణయమైపోయిందని వ్యాఖ్యానించారు. తమ పాలన పట్ల ప్రజలు సంతృప్తి, సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పోలింగ్ సంబంధిత ఘర్షణల్లో 30 మంది గాయపడినట్లు ఐజీ అఖిలేశ్ కుమార్ తెలిపారు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’
అల్ఫారెట్టా, జార్జియా: స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి-2026’ అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు.ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. నాలుగేళ్ల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ(యూఎస్ఏ) సేవా సంస్థలకు అందజేయనున్నారు.ఈ వేడుకల్లో బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి (శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రతినిధులు), గిరిధర్ కొటగిరి (ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు), జ్యోత్స్న పాలకుర్తి (గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ చైర్మన్), రమణ గంద్ర (గేట్స్ అధ్యక్షులు), సునీత పోట్నూరు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు), ఆది శ్రీనివాసన్ (ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు), శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ (ప్రెసిడెంట్ అండ్ సీఈఓ), జనార్ధన్ పన్నెల (శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధి) పాల్గొన్నారు.
న్యూయార్క్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయుల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్టర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరంలోని ఇండియా హౌస్లో ఘనంగా నిర్వహించారు.గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వ్యాపారం, మీడియా, ఫైనాన్స్, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అమెరికాలో భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు.FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తమ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు.కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో', 'ఉజ్వల యోజన' వంటి పథకాల ద్వారా భారత్ మహిళా సాధికారతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అలాగే 100 మిలియన్ కుటుంబాలను మహిళల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థికంగా శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరఫున గుర్తింపు సర్టిఫికెట్లు, FIA శాలువాలు, ట్రోఫీలు అందజేశారు.నార్త్స్టార్ స్ట్రాటజీస్ COO జోడి లిన్ హెర్క్లోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల్ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాన్సుల్ జనరల్ సతీమణి మోనాలిసా శువదర్షిణి ప్రధాన్ కూడా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్ మాట్లాడుతూ, కమ్యూనిటీ నిర్మాణంలో FIA పాత్రను కొనియాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అమెరికన్ నటి రేష్మా శెట్టి.. మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ తానియా కిన్సెల్లా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం ఇస్తూ.. అడ్డంకులను అధిగమించిన వైనాన్ని వివరించారు.కార్యక్రమ ప్రారంభంలో దివంగత అవార్డు గ్రహీత రాధా సుబ్రమణ్యం జ్ఞాపకార్థం మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం ముగింపులో FIA ప్రధాన కార్యదర్శి సృష్టి కౌల్ నరులా ధన్యవాదాలు తెలిపారు. FIA జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల వందన సమర్పణతో వేడుకలను ముగిశాయి.ఎఫ్ఐఏ సంస్థ 1970 నుండి భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారతీయ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఇండో–అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తోంది.
సింగపూర్లో ఘనంగా ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి తనయులు కే నాగేంద్రనాథ్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం 43, బర్గండీ క్రిసెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 70 మంది దర్శకుడు కె. విశ్వనాథ్ అభిమానులు హాజరయ్యారు.సంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ, కె. నాగేంద్రనాథ్తో తనకు దాదాపు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తెలిపారు. సామవేదం షణ్ముఖ శర్మ 2017లో సింగపూర్ విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన శివపదం కార్యక్రమానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో సందేశాలు అందించిన పుస్తక రచయిత, ప్రముఖ దర్శకులు సీనియర్ డైరెక్టర్ వంశీకి, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయులు ఏడిద రాజాకి ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్య అతిథి కె. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ శంకరాభరణం’ చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం అప్పట్లో తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందిందని తెలిపారు. ప్రస్తుతం పుస్తక రచయిత వంశీని సంప్రదించి పునర్ముద్రణ చేయించామని చెప్పారు. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న హైదరాబాద్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామని, దానికి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలు, విశేషాలు వినిపించడంతో ఇది ఒక అచ్చ తెలుగు పండుగలా అనిపించిందని తెలిపారు.ఈ సందర్భంగా తొలి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినసంస్కార భారతి అధ్యక్షులు రమణమూర్తి కి, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు బి.వి.ఆర్. చౌదరి దంపతులకు, తంగిరాల రాజశేఖర్, సౌభాగ్యలక్ష్మి దంపతులకు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు.కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి ఆలపించగా, శేషశ్రీ వీణపై ఒక గీతాన్ని వాయించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ప్రేక్షకులతో పంచుకోగా, చిత్ర మరియు పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం రాజశేఖర్–సౌభాగ్యలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో భోజనాన్ని సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లలో శ్రీలలిత, మాధవి పాలకుర్తితోపాటు, సుబ్బు పాలకుర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ్, సత్య జాస్తి, రాజ్ కుమార్ తదితరులు సహాయ సహకారాలను అందించారు.
క్రైమ్
ప్రాణం తీసిన స్నానం సరదా
సాక్షి, పాడేరు: సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలో దిగిన ముగ్గురు గిరిజన యువతులు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతిచెందారు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. హుకుంపేట మండలం మారుమూల బూర్జ పంచాయతీ జంబువలస గ్రామానికి చెందిన గిరిజన యువతులు సాలెపు త్రిష (17), సాలెపు పవిత్ర (16), సాలెపు రత్నకుమారి(16) అంజలి కలిసి అనంతగిరి మండలం వాలాసి పంచాయతీలోని ములగుమ్మి జలపాతం వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. గ్రామంలో ఇటుకల పండుగ కావడంతో నలుగురు యువతులు జలపాతం వద్ద ఉత్సాహంగా గడిపారు. త్రిష, పవిత్ర, రత్నకుమారి జలపాతంలోకి దిగి స్నానాలు చేస్తుండగా, అంజలి ఒడ్డున పెద్ద బండరాయిపై నిల్చుని సెల్ఫోన్లో వారిని ఫొటోలు తీస్తోంది. అయితే, త్రిష, పవిత్ర, రత్నకుమారి ప్రమాదవశాత్తూ జారి జలపాతంలో పడిపోయారు. ముగ్గురూ నీటిలో మునిగి మృతిచెందారు. వారు మునిగిపోయారనే కంగారులో అంజలి బండరాయి నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న జంబువలస గ్రామానికి చెందిన గిరిజనులంతా జలపాతం వద్దకు చేరుకుని ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన అంజలిని అనంతగిరి మండలంలోని లుంగపర్తి పీహెచ్సీకి తరలించారు. మృతిచెందిన త్రిష హుకుంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. రత్నకుమారి అనంతగిరి మండలం బీంపోల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షలు రాసి ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది. ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన ముగ్గురు గిరిజన యువతులు మృతిచెందడంతో జంబువలస గ్రామంలో విషాదం నెలకొంది.వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతంలో ప్రమాదవశాత్తూ పడిపోయి ముగ్గురు యువతులు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముగ్గురు యువతుల మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవలే ఇంటర్మీడియెట్, టెన్త్ పరీక్షలు రాసి మంచి భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్థినులు ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
రేప్ చేసి ఉరివేశారు?
రాయపర్తి/వర్ధన్నపేట: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ తండాలో గురువారం గ్యాంగ్రేప్ కలకలం రేపింది. తల్లిదండ్రులు, బంధువుల కథనం ప్రకారం.. ఓ తండాకు చెందిన గిరిజన దంపతులకు కుమారుడు, కూతురు (21) ఉన్నారు. తల్లిదండ్రులు బతుకుదెరువుకోసం హైదరాబాద్లో ఉంటుండగా కుమారుడు మధ్యప్రదేశ్లో పోస్టుమ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. యువతి తన ఇంట్లో ఉంటోంది. పక్కనే పెద్దనాన్న ఇల్లు ఉండగా ఏదైనా అవసరం ఉంటే ఆ కుటుంబ సభ్యులతో చెప్పేది. నర్సంపేటలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆ యువతి నర్సు(ఏఎన్ఎం)గా శిక్షణ పొందుతోంది.తండానుంచి నర్సంపేటకు వస్తూ పోతున్న క్రమంలో పర్వతగిరి మండలం రావూరు తండాకు చెందిన కొంతమంది యువకులు తరుచూ వెంటపడుతుండేవారని తన పెద్దనాన్న కుటుంబ సభ్యులతో సదరు యువతి చెప్పేది. బుధవారం రాత్రి యువతి పెద్దనాన్న ఇంట్లో కాకుండా తన ఇంట్లో పడుకుంది, ఉదయం చూడగా ఉరేసుకుని కనిపించింది. ఈ క్రమంలో తల్లిదండ్రులతోపాటు బంధువులు సదరు యువతిని పక్కనే ఉన్న మొక్కజొన్న చేనులో రావూరుకు చెందిన నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసి ఇంట్లో ఉరివేసి వెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన.. పోలీసులు యువతి మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం వర్ధన్నపేటకు తీసుకురాగా కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. యువతిపై గ్యాంగ్ రేప్ చేయడం వల్లనే మృతిచెందిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సాయిబాబు ఆందోళనకారులను నచ్చచెప్పి న్యాయం చేస్తామనిచెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీస్ శాఖలో భారీగా జీతాల కుంభకోణం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సంచలనాత్మకంగా వెలుగులోకి వచ్చిన జీతాల కుంభకోణం కలకలం రేపుతోంది. మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ నిధులను అక్రమంగా వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు రూ.1 కోటి 40 లక్షల రూపాయల మేర నిధులు కాజేయబడినట్లు టాస్క్ ఫోర్స్ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో ఒక పోలీసు ఉద్యోగిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో ఆర్థిక వ్యవహారాలపై పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పార్కింగ్ కోసం తల నరికేస్తే : బంధువులు అతడిని కొట్టి చంపేశారు
బిహార్లో జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేపాయి. ఒక చిన్న పార్కింగ్ వివాదం రెండు హింసాత్మక ఘటనలకు దారి తీసింది. రోడ్డు పక్కన వ్యాపారి ఒక పికప్ డ్రైవర్ను తల నరికాడు, ఆ తర్వాత మృతుడి కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట నిందితుడిని హతమార్చిన కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం, అరేరియా జిల్లాలోని ఫోర్బ్స్గంజ్ పట్టణంలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడైన డ్రైవర్ను అరేరియాలోని జోగ్బాని పట్టణానికి చెందిన అలీ హుస్సేన్గా గుర్తించారు. ప్రతీకారంగా హత్యకు గురైన రోడ్డు పక్కన వ్యాపారిని రవి చౌహాన్గా గుర్తించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫోర్బ్స్గంజ్ పట్టణంలో ఒక చిన్న పార్కింగ్ సమస్యపై 'సత్తు' అమ్మే చౌహాన్, హుస్సేన్పై దాడి చేసి, అతని తల నరికి, అందరి ముందూ వీరంగం సృష్టించాడు. ఆ తర్వాత నిందితుడు మృతదేహాన్ని, నరికిన తలను సంఘటనా స్థలంలోనే వదిలిపెట్టి అక్కడినుంచివెళ్లి పోయాడు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?ఇది చూసి మృతుడి బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. హుస్సేన్ బంధువులతోపాటు, స్థానికులు కూడా ఇంటి దగ్గర దాక్కున్న నిందితుడిని సంఘటనా స్థలానికి లాక్కొచ్చి, కర్రలతో, రాడ్లతో కొట్టి, పోలీసుల కళ్లెదుటే చంపేశారు. ఈ జంట హత్యల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులకు, ఆగ్రహించిన గుంపుకు మధ్య ఘర్షణ జరిగింది. సంఘటనా స్థలం చుట్టూ ప్రజలు గుమిగూడటం ప్రారంభించడంతో, అదనపు పోలీసు బలగాలు మెహరించాయి. ఈ రెండు ఘటనల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ, పోలీసులు ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే!
వీడియోలు
వాటర్ తో గేమ్స్ వద్దు.. ఒక సెల్ఫీ మూడు ప్రాణాలు
నల్లగా ఉన్నాడని లవర్తో మొగుణ్ణే లేపించేసింది
మీ అన్నను చంపించింది నువ్వే అని టాక్... అచ్చెన్నకు గుబాపగిలేలా సజ్జల కౌంటర్
మోనాలిసాకు బిగ్ షాక్ భర్త ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు
వేసిన 20 రోజులకే ఖతం చేతులతో తవ్వితే ఊడిపోతున్న రోడ్డు
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
చిరు ఆగ్రహం
హరూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్
MAVIGUN పై షర్మిల జోకర్ కామెంట్స్ సజ్జల సెటైర్స్ అదుర్స్
ఎర్రంనాయుడు మరణంలో నీ హస్తం లేదా? అచ్చెన్న పై తమ్మినేని సీతారాం షాకింగ్ నిజాలు


