వెలుగులోకి ‘లేడీ కెప్టెన్’ లీలలు.. టీసీఎస్లో సంచలనం
ముంబై: లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలతో ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ నాసిక్ క్యాంపస్ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా ఈ ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 2021 నుంచి టీసీఎస్లో దారుణాలు జరుగుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మహిళా ఉద్యోగులను మత మార్పిడి చేసుకునేలా ప్రోత్సహించిన ఆరుగురు ఉద్యోగులు అరెస్టయ్యారు. పరారీలో ఉన్న హెచ్ఆర్ మేనేజర్ కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెలుగులోకి వచ్చాయి. ఆమె సహచర ఉద్యోగులకు హిందూ మహిళా ఉద్యోగులను పెళ్లి చేసుకోవాలని ప్రోత్సహించేవారని సమాచారం. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించడం, మత మార్పిడిని ప్రోత్సహించడం, వారి బ్రెయిన్వాష్ చేసి మతం మార్చుకునేలా ఒత్తిడి చేయడం, అందుకు కావాల్సిన నిధులను సమకూర్చడం వంటి చర్యలు జరిగినట్లు తేలింది. హెచ్ఆర్ విభాగానికి చెందిన కొంతమంది ఉద్యోగులు కూడా ఈ వ్యవహారంలో భాగమయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.హెచ్ఆర్ మేనేజర్ మా సహచరులతో నిత్యం మాట్లాడేవారు. వారి మాటల్లో మతం ప్రస్తావన ఉండేది. హిందూ మహిళా ఉద్యోగులను ప్రేమలోకి దించమని, వారిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చేవారు. 2021 నుంచి ఇదే విధంగా జరుగుతోంది. మత మార్పిడిని ప్రోత్సహిస్తూ ఫండ్స్ సమకూర్చేవారు' అని సాక్షులు వివరించారు.ఓ నిందితుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఓ ఉద్యోగినిని శారీరకంగా లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు తప్పించుకుని తిరిగేవాడు. ప్రశ్నిస్తే బాధిత ఉద్యోగినిని బాడీషేమింగ్ చేస్తూ అసభ్యంగా మాట్లాడేవాడు. సంస్థలో ఇలా జరుగుతోందని హెచ్ఆర్ విభాగంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా వారి చర్యలకు పరోక్షంగా సహకరించారు.నిందితులు పురుష ఉద్యోగులలో ఒకరిని నమాజ్ చేయమని బలవంతం చేసి, అతని మతాన్ని అవమానించాడు. బాధిత మహిళా ఉద్యోగులు కంపెనీ మహిళా హెచ్ఆర్ మేనేజర్కు ఫిర్యాదు చేస్తే..‘ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుండి తొలగిస్తాం’ అని బెదిరించేవారు ‘లేడీ కెప్టెన్’గా పేరున్న హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ మహిళా ఉద్యోగులతో స్నేహం పెంచి, వారిని సౌకర్యంగా ఉంచి, క్రమంగా నమాజ్ చేయడం, హిజాబ్ ధరించడం వంటి ఆచారాలకు శిక్షణ ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. టీసీఎస్ నాసిక్ క్యాంపస్ ఘటన యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంది.
జూ. ఎన్టీఆర్ 'డ్రాగన్' రూమర్స్కు చెక్ పెడతారా?
జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'డ్రాగన్'పై ఊహాగానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా టైటిల్ నుంచి మొదలుకొని దాని కథ, షూటింగ్ షెడ్యూల్, నటీనటులు, ఇలా ఏ అంశంపై కూడా స్పష్టత లేకపోవడంతో అభిమానులు, సినీ వర్గాలు చర్చల్లో మునిగిపోయాయి. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు వాయిదా పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక దశలో కథనే పూర్తిగా మార్చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ అనిశ్చితి మధ్య ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దానిపై కూడా విమర్శలు చెలరేగాయి.ఇటీవలే మళయాళ నటుడు టొవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి అధికారికంగా బయటపడింది. అతడు ఎన్టీఆర్ సోదరుడి పాత్ర చేయాల్సిందని సమాచారం. అయితే తాజాగా ఆ పాత్ర కోసం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ను సంప్రదిస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఆలియా భట్ను కూడా సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్-ఆలియా మధ్య ఓ పాట కూడా ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ సినిమాను 'గోల్డెన్ ట్రయాంగిల్' నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. థాయ్లాండ్, మయన్మార్, లావోస్ కలిసే ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఒకప్పుడు ఇది మాదకద్రవ్యాల ఉత్పత్తికి అతిపెద్ద కేంద్రం. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని 'డ్రాగన్' వస్తోందని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్డేట్స్ వస్తాయని ప్రచారం జరుగుతోంది. టీజర్ వస్తుందనే మాటలు వినిపిస్తున్నా, అభిమానులు మాత్రం టీజర్ సంగతి పక్కనపెడితే, కనీసం టైటిల్, రిలీజ్ డేట్ చెప్పండి చాలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. డ్రాగన్ చుట్టూ నడుస్తున్న ఊహాగానాలు, ప్రచారాల్లో కొన్నింటికి వచ్చే నెలలో తెరపడే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా సినిమా టైటిల్, రిలీజ్ డేట్ లేదా టీజర్ రూపంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వార్న్ మరణంపై కుమారుడి సంచలన వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 2022లో థాయ్లాండ్లో 52 ఏళ్ల వార్న్ హార్ట్ ఎటాక్తో మరణించాడు. అయితే తాజాగా నాలుగేళ్ల తర్వాత వార్న్ మరణంపై అతడి కుమారుడు జాక్సన్ వార్న్ స్పందించాడు. కోవిడ్ వాక్సిన్ వల్లే తన తండ్రి చనిపోయినట్లు జాక్సన్ వెల్లడించాడు. ‘టూ వరల్డ్స్ కొలైడ్’ పాడ్కాస్ట్కు ఇంటర్య్వూ ఇచ్చిన జాక్సన్ వార్న్ మాట్లాడుతూ.. ‘నాన్నకు నాలుగు కొవిడ్ టీకాలు ఇవ్వాల్సి వచ్చింది. అవి తీసుకోవడం ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో టీకాలు వేపించుకున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వల్లే ఆయన మరణించారేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. ఆ వ్యాక్సిన్ ప్రభావం నాన్న ఆరోగ్యంపై పడింది. అయితే ఆయనకు అంతర్గతంగా కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన మద్యం తాగేవారు, స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. అవే అలవాట్లు ఉన్న చాలామంది ఇంకా ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఆ సమయంలో నాన్న ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించారు. నాన్న మరణ వార్త విన్న తర్వాత ప్రభుత్వం, కొవిడ్ పరిస్థితులపై కోపం వచ్చింది’ అని జాక్సన్ వార్న్ తెలిపారు. అయితే వార్న్ చనిపోవడానికి ముందు 2021లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన హండ్రెడ్ టోర్నీలో కోవిడ్ బారిన పడ్డాడు. అయితే వార్న్ మరణించిన సమయంలో ఆయనకు ఎలాంటి అనారోగ్యం బారిన పడినట్లు రిపోర్ట్లో తేలడం అప్ప ట్లో ఆసక్తిగా మారింది.2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి ఎడిషన్ను షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్తాన్ రాయల్స్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో వార్న్ 55 మ్యాచ్లాడి 57 వికెట్లు పడగొట్టాడు.చదవండి: ‘సోకులకే ఉన్నాడు తప్ప ఆడింది ఏమీ లేదు’
జువ్వలదిన్నెకు వైఎస్ జగన్.. కూటమిలో ఉలిక్కిపాటు
సాక్షి, నెల్లూరు రూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నె పర్యటన కూటమి ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తోంది. గత నెల రోజులుగా తీరప్రాంతంలో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఇప్పుడేమో.. రేపటి జగన్ పర్యటనతో తారాస్థాయికి చేరిన ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతుందన్న ఆందోళనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. మత్స్యకారుల విషయంలో టీడీపీ పెద్దల వ్యవహారంతో ఆ పార్టీ పునాదులే కూలిపోతున్నాయి. తీర ప్రాంతంలో టీడీపీ జెండా పీకేసేందుకు మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం, తమను దోచుకుంటున్న పాండిచ్చేరి మెకనైజ్డ్ బోట్లను వదిలేయడం వంటి ఘటనలు మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. పైగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు ఈ కుట్రలకు కారణమని ఆరోపణలు రావడంతో, ఆయనను తీరప్రాంతంలో నిషేధిస్తూ, ఆయనతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడితే భారీ జరిమానా విధించేలా మత్స్యకార పెద్దలు తీర్మానించడం(దురాయి విధింపు) సంచలనం సృష్టించింది. ఈ తరుణంలో.. జగన్ రాక మత్స్యకారుల పోరాటానికి మరింత బలం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. ఫిషింగ్ హర్బర్ను సందర్శించడంతో పాటు ఆయన మత్స్యకారులతో ముఖాముఖి కానున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే అదనుగా జగన్ ఇచ్చే భరోసాతో మత్స్యకారులు తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలని భావిస్తున్నారు. తమ భవిష్యత్ బతుకులకు వెన్నుపోటు పొడిచి ఛిద్రం చేస్తున్న వాళ్లను వదిలే ప్రసక్తే లేదని మత్స్యకారులు అంటున్నారు. జగన్ పర్యటన తర్వాత కావలి నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాలు తమ భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. తెలుగు దేశం పార్టీని తీర ప్రాంతంలో సమూలంగా నిషేధించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని గంగలో కలిపేస్తామని తీర్మానం చేయబోతున్నాయట. జగన్ రాకతో ఉమ్మడి నెల్లూరుతో పాటు ప్రకాశం, గుంటూరుల నుంచి కూడా భారీగా మత్స్యకారులు తరలి రావొచ్చని అంచనాలున్నాయి. ఈ పరిణామాలను నిశీతంగా పరిశీలిస్తున్న కూటమి ప్రభుత్వం.. జగన్ పర్యటనకు మత్స్యకారులు స్వచ్చందంగా తరలి రాకుండా తమదైన కుట్రలను ప్రయోగించే అవకాశం లేకపోలేదు.
పడవలో ఫైట్
కాలేయం కొవ్వెక్కుతోంది
'ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు': IMF రిపోర్ట్
గోల్డ్ ఈటీఎఫ్లు మెరిశాయ్
భారత్ వృద్ధికి... క్రూడ్ కోత!
ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం
వస్తున్నాయ్... వస్తున్నాయ్.. నారీశక్తి రథచక్రాలు
అడవిలో సవాల్
మీరొస్తామంటే... మేమొద్దంటామా..!
మళ్లీ యుద్ధ మేఘాలు!
వైభవ్ సూర్యవంశీపై నిషేధం?
టీచర్.. మీ స్టూడెంట్ని నా చివరి కోరిక తీరుస్తారా..!
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
‘టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతా’
మండుతున్న ఎండలు
న్యాయం చేయండి.. తప్పు చేస్తే శిక్షించండి.. సజ్జనార్తో మంగ్లీ
గెలిస్తే.. ఏఐ మంత్రిత్వ శాఖ
హార్దిక్తో విభేదాలు.. స్పందించిన కృనాల్
'బావ బావ అంటాంటే.. బాగుందే నీతో ఉంటాంటే'.. రవితేజ వారసుడి లవ్ సాంగ్ రిలీజ్
సుపరిపాలనపై ఏపీ మంత్రులకు సింగపూర్లో శిక్షణ
ఇంటర్ ఫలితాల్లో ‘వాగ్దేవి’ సత్తా
సూర్యకుమార్ యాదవ్పై వేటు!
విజయశాంతి రెడ్డి కేసులో మరో ట్విస్ట్
ఈ రాశి వారికి శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలబ్ధి
ఐపీఎల్ నుంచి రోహిత్ శర్మ అవుట్?
వారమైనా గ్యాస్ సిలిండర్ రాలేదా?
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
సాక్షి కార్టూన్ 13-04-2026
'పెద్ది' సర్ప్రైజ్.. పదేళ్ల తర్వాత మళ్లీ చరణ్తో సినిమా
కమిన్స్లా కాదు.. ఇషాన్ కిషన్పై జహీర్ ఖాన్ ఫైర్!
పడవలో ఫైట్
కాలేయం కొవ్వెక్కుతోంది
'ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు': IMF రిపోర్ట్
గోల్డ్ ఈటీఎఫ్లు మెరిశాయ్
భారత్ వృద్ధికి... క్రూడ్ కోత!
ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం
వస్తున్నాయ్... వస్తున్నాయ్.. నారీశక్తి రథచక్రాలు
అడవిలో సవాల్
మీరొస్తామంటే... మేమొద్దంటామా..!
మళ్లీ యుద్ధ మేఘాలు!
వైభవ్ సూర్యవంశీపై నిషేధం?
టీచర్.. మీ స్టూడెంట్ని నా చివరి కోరిక తీరుస్తారా..!
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
‘టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతా’
మండుతున్న ఎండలు
న్యాయం చేయండి.. తప్పు చేస్తే శిక్షించండి.. సజ్జనార్తో మంగ్లీ
గెలిస్తే.. ఏఐ మంత్రిత్వ శాఖ
హార్దిక్తో విభేదాలు.. స్పందించిన కృనాల్
'బావ బావ అంటాంటే.. బాగుందే నీతో ఉంటాంటే'.. రవితేజ వారసుడి లవ్ సాంగ్ రిలీజ్
సుపరిపాలనపై ఏపీ మంత్రులకు సింగపూర్లో శిక్షణ
ఇంటర్ ఫలితాల్లో ‘వాగ్దేవి’ సత్తా
సూర్యకుమార్ యాదవ్పై వేటు!
విజయశాంతి రెడ్డి కేసులో మరో ట్విస్ట్
ఈ రాశి వారికి శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలబ్ధి
ఐపీఎల్ నుంచి రోహిత్ శర్మ అవుట్?
వారమైనా గ్యాస్ సిలిండర్ రాలేదా?
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
సాక్షి కార్టూన్ 13-04-2026
'పెద్ది' సర్ప్రైజ్.. పదేళ్ల తర్వాత మళ్లీ చరణ్తో సినిమా
కమిన్స్లా కాదు.. ఇషాన్ కిషన్పై జహీర్ ఖాన్ ఫైర్!
ఫొటోలు
సూపర్ స్టార్ బాటలో మహేశ్ బాబు.. ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్స్ (ఫోటోలు)
తమిళ న్యూఇయర్ స్పెషల్.. హీరోయిన్స్ ఇలా (ఫొటోలు)
రుక్మిణి వసంత్ రాజస్థాన్ ట్రిప్ (ఫొటోలు)
#SRHvsRR మ్యాచ్.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)
నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
హైదరాబాద్ : పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)
చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)
భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)
హైదరాబాద్ లో వైభవ్ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్ (ఫొటోలు)
కూకట్పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)
సినిమా
అల్లు- అట్లీ రాకా.. ఆ స్టార్ హీరో ఓకే చెప్పారా?
అల్లు అర్జున్-అట్లీ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ రాకా. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ లుక్లో ఐకాన్ స్టార్ తోడేలు లాంటి లుక్లో కనిపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.900 కోట్ల భారీ బడ్జెట్తో సన్ పిక్చర్ నిర్మిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.ఇదిలా ఉండగా.. రాకాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్గా మారింది. అట్లీతో జతకట్టి సూపర్ హిట్ కొట్టిన షారూఖ్ ఖాన్ ఈ మూవీలో కనిపించనున్నారని లేటేస్ట్ టాక్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఒక చిన్న పాత్ర చేయడానికి బాలీవుడ్ బాద్షా ఇప్పటికే అంగీకరించారని సమాచారం. అట్లీతో షారూక్కు ఉన్న అనుబంధం వల్లే రాకా మూవీకి ఓకే చెప్పారని ఓ నివేదికలో వెల్లడైంది. అట్లీ తెరకెక్కించిన జవాన్లో షారూక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన సంగతి తెలిసిందే.అందువల్లే ఈ మూవీలో నటించడానికి షారూక్ ఖాన్ దాదాపు ఓకే చెప్పారని టాక్. ఇదే నిజమైతే జవాన్ తర్వాత మరోసారి అట్లీతో కలిసి పని చేయనున్నారు. ఈ విషయంపై షారుక్ టీమ్ కొందరు సంప్రదించగా.. వారి నుంచి మాత్రం ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే గతంలో అల్లు అర్జున్ 'జవాన్' చిత్రంలో ఒక అతిథి పాత్రలో నటించాల్సి ఉండగా.. పుష్ప: ది రూల్ సినిమా షెడ్యూల్ వల్ల కుదరలేదు. దీంతో 'రాకా' మూవీతోనైనా వీరిద్దరిని స్క్రీన్పై చూసే అవకాశం ఆడియన్స్కు దక్కనుంది. షారుక్ ఖాన్ రాకాలో అతిథి పాత్రలో కనిపిస్తే ఈ ప్రాజెక్ట్ క్రేజ్ మరింత పెరగనుంది.
లుక్ మార్చిన మెగా కోడలు.. నల్ల చీరలో మృణాల్
చీరలో కాదు గ్లామరస్ లుక్స్లో లావణ్య త్రిపాఠితమిళ న్యూఇయర్.. అమృత అయ్యర్ వీడియోరాజస్థాన్ ట్రిప్లో రుక్మిణి వసంత్ హ్యాపీస్నల్ల చీరలో నవ్వుతూ మాయ చేస్తున్న మృణాల్కొంటె చూపులతో రచ్చ చేస్తున్న డింపుల్మత్తెక్కించేలా శ్రీముఖి పోజులు.. చూస్తూ అలా View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya)
దురంధర్ ఫ్రాంచైజీ.. ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సీక్వెల్ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది విడుదలైన దురంధర్కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజైన 26 రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. రెండు పార్ట్లు కలిపి రూ.3 వేల కోట్లు సాధించిన మొదటి చిత్రంగా అరుదైన రికార్డ్ సృష్టించింది.ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1712 కోట్లకు పైగా వసూళ్లతో ఇంకా రాణిస్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన దురంధర్ చిత్రాలు కలెక్షన్స్ రికార్డ్ సృష్టించాయి. ఈ రెండు సినిమాలు కలిపి బాహుబలి-2, పుష్ప-2 ఆల్టైమ్ కలెక్షన్స్ను దాటేశాయి. దురంధర్, దురంధర్-2 కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్ల మార్క్ సాధించాయి.గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1,307.35 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది మార్చి 19న రిలీజైన దురంధర్ ది రివెంజ్ కేవలం 26 రోజుల్లోనే రూ. 1,712 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు చిత్రాల వసూళ్లను కలిపితే రూ. 3,019.35 కోట్లతో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి.గతంలో వచ్చిన టాలీవుడ్ బాహుబలి, పుష్ప సిరీస్ చిత్రాల మొత్తం వసూళ్లను దురంధర్ ఫ్రాంచైజీ ఎప్పుడో దాటేసింది. బాహుబలి పార్ట్-1కు రూ.650 కోట్లు రాగా.. బాహుబలి 2: రూ. 1,788 కోట్లు రాగా.. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ రూ. 2,438 కోట్లుగా ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్ప చిత్రాల విషయానికొస్తే పార్ట్-1 రూ. 350.10 కోట్లు రాబట్టగా.. పుష్ప 2: ది రూల్ మూవీ రూ. 1,742.10 కోట్ల సాధించింది. ఈ రెండు సినిమాల మొత్తం రూ. 2,092.20 కోట్లు వచ్చాయి.ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా రూ. 3,000 కోట్ల మార్క్ దాటలేదు. ఈ విషయంలో దురంధర్ ఫ్రాంచైజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా 'ధురంధర్' సిరీస్లోని రెండు చిత్రాలు కూడా రూ. 1,000 కోట్ల క్లబ్లో చేరిన మొట్ట మొదటి ఇండియన్ ఫ్రాంచైజీగా నిలిచింది. మూడు నెలల గ్యాప్లోనే రిలీజైన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. మూడు వేల కోట్ల మార్క్తో సరికొత్త ఒరవడికి నాంది పలికాయి. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ధురంధర్: ది రివెంజ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి రాణిస్తోంది. చైనా, గల్ఫ్ దేశాల్లాంటి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కాకుండానే ఈ గణాంకాలను సాధించడం దురంధర్కే సాధ్యమైంది. ఈ లెక్కన భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని దురంధర్ మార్చేసింని చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన దురంధర్ పేరు బాక్సాఫీస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆ హీరోయిన్ ఇంటికొస్తే.. నా కొడుకు భయపడేవాడు: అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు తన కొత్త సినిమా ‘భూత్ బంగ్లా’ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు ఆరవ్ కుమార్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. భూల్ భులయ్య సినిమా చూసి..ఆరేళ్ల పాటు విద్యాబాలన్కి దూరంగా ఉన్నాడని..ఆమె ఇంటికి వస్తే భయపడిపోయేవాడని చెప్పాడు.మంజులిక అనుకొని.. 2007లో విడుదలైన భూల్ భులయ్య సినిమా నా కొడుకుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ సినిమా చూసిన తర్వాత ఆరేళ్ల పాటు అందులో నటించిన విద్యాబాలన్ని చూసి భయపడిపోయాడు. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడల్లా..భయంతో వణికిపోయేవాడు. ఆమె కళ్లల్లోకి చూసేవాడు కాదు. అతను ఆమెలో మంజులిక(భూల్ భులయ్యలో విద్యాబాలన్ పోషించిన పాత్ర పేరు) చూసేవాడు. అందుకే ఆమె వస్తుందంటే భయంతో పారిపోయేవాడు. నేనే అతన్ని ఓదార్చి.. ఆమె మంజులిక కాదని, విద్యాబాలన్ అని..మంచి అమ్మాయి అని చెప్పాల్సి వచ్చింది. అయినా కూడా ఆరేళ్ల పాటు నమ్మలేకపోయాడు’ అని అక్షయ్ అన్నారు.అదే తేడాభూత్ బంగ్లా, భూల్ భులయ్యా చిత్రాల మధ్య తేడాలను వివరిస్తూ.. 'భూత్ బంగ్లా' ఒక హారర్ ఫాంటసీ; ఇది ఒక డిస్నీ సినిమా లాంటిది. 'భూల్ భులయ్యా' ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అది మొదలైనప్పుడు, ఆమె దెయ్యం పట్టినట్లు కనిపిస్తుంది, కానీ తర్వాత అది ఒక మానసిక సమస్య అని తెలుస్తుంది. 'భూత్ బంగ్లా'లో , వధుసూర్(రాక్షసుడు) ఎలా వచ్చాడో, అతను ఎందుకు అలా చేస్తున్నాడో మేము వివరించాం. ఈ సినిమా చూసి పిల్లలను కూడా ఎంజాయ్ చేస్తారు’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు.
క్రీడలు
ఊహించని దెబ్బ.. ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్పై గెలిచి రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఎస్ఆర్హెచ్ బౌలర్ బైడన్ కార్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన బ్రైడన్ కార్స్ స్థానాన్ని శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుషంకతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. పేస్ అటాక్లో కార్స్ కీలకం అవుతాడని భావించిన మేనేజ్మెంట్కు ఇది ఊహించని దెబ్బ. కానీ ఏమాత్రం ఆలస్యం చేయని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మదుషంక రూపంలో బ్రైడన్ కార్స్కు సరైన ప్రత్యామ్నాయంగా ఎంచుకొంది. కాగా మధుషంకను ఎస్ఆర్హెచ్ రూ. 75 లక్షల బేస్ ప్రైస్కే జాయిన్ అవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో దిల్షాన్ మధుషంకను ఎస్ఆర్హెచ్ క్యాంప్లోకి ఆహ్వానిస్తున్నట్లు తమ ఎక్స్లో పేర్కొంది. మధుషంక చేరికతో హైదరాబాద్ బౌలింగ్ దళం మరింత పటిష్టంగా మారిందనే చెప్పాలి. ఒక లెఫ్టార్మ్ పేసర్గా పవర్ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీయగల నైపుణ్యం అతనికి ఉంది.గతంలో అంతర్జాతీయ క్రికెట్తో పాటు పలు లీగ్లలో కూడా తన మార్క్ చూపించిన ఈ లంక బౌలర్ రాకను అభిమానులు స్వాగతిస్తున్నారు. మధుషంక లంక తరఫున 28 వన్డేలు, 19 టీ20, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్రఫుల్ హింగే, సాకిబ్హుస్సేన్ వంటి యంగ్ బౌలర్లకు తోడుగా మధుషంక జతవ్వడం జట్టుకు అదనపు బలం. మరి మధుషంక చేరికతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ బలపడినట్లే.Dilshan Madushanka joins the squad as a replacement for Brydon Carse, who is ruled out due to injury.Welcome, Dilshan 🧡 pic.twitter.com/zJQWtbXVZt— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2026
IPL 2026: కేకేఆర్పై సీఎస్కే విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 32 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రమన్దీప్ సింగ్ (35) టాప్ స్కోరర్గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది. సీఎస్కేతో మ్యాచ్లో కేకేఆర్ కష్టాల్లో పడింది. నూర్ అహ్మద్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో కేకేఆర్ 85 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. తొలుత రహానే (28)ను బుట్టలో వేసుకున్న నూర్ మరుసటి బంతికి కామెరున్ గ్రీన్ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. రింకూ సింగ్ (5), పావెల్ (2) క్రీజులో ఉన్నారు.అంతకముందు కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన అంగ్క్రిష్ రఘువంశీ అకిల్ హొసేన్ బౌలింగ్లో డెవాల్డ్ బ్రెవిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సునీల్ నరైన్ (24) రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో షాట్కు యత్నించిన నరైన్ స్లిప్లో గుర్జన్పీత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది.ఫిన్ అలెన్ ఔట్..193 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ (1) శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.కేకేఆర్ టార్గెట్ 193 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్ కేకేఆర్ ముంగిట 193 పరుగుల లక్ష్యాన్ని విధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. శాంసన్ (48) టాప్ స్కోరర్గా నిలవగా, డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీయగా, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్లు తలా ఒక వికెట్ తీశారు.16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే 3 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (37), సర్ఫరాజ్ (23) క్రీజులో ఉన్నారు. అంతకముందు శాంసన్ కార్తిక్ త్యాగీ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు.సంజు క్లీన్ బౌల్డ్111 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 11.2 ఓవర్లో కార్తిక్ త్యాగీ బౌలింగ్లో సంజు శాంసన్ క్లీన్ బ్లౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే స్కోరు 13 ఓవర్లకు 128 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. రెండో వికెట్ డౌన్కేకేఆర్తో మ్యాచ్లో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన ఆయుశ్ మాత్రే వైభవ్ అరోరా బౌలింగ్లో వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. శాంసన్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.రుతురాజ్ (7) ఔట్..కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లేమితో సతమతమవుతున్న కెప్టెన్ రుతురాజ్ (7) మరోసారి నిరాశపరుస్తూ అనుకుల్రాయ్ బౌలింగ్లో రోవ్మెన్ పావెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఈ మ్యాచ్కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. నవదీప్ సైనీ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు. సీఎస్కే మాత్రం ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది.ముఖాముఖి పోరులో ఇరుజట్లు ఇప్పటివరకు 31 సార్లు తలపడగా సీఎస్కే 20 సార్లు, కేకేఆర్ 11 సార్లు విజయం సాధించాయి. 2022 నుంచి చూసుకుంటే ఈ రెండు జట్లు చెరో మూడు మ్యాచ్లు నెగ్గాయి.చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.కోల్కతా నైట్ రైడర్స్ తుది జట్టు: అజింక్యా రహానే(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్కీపర్), రోవ్మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.
వార్న్ మరణంపై కుమారుడి సంచలన వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 2022లో థాయ్లాండ్లో 52 ఏళ్ల వార్న్ హార్ట్ ఎటాక్తో మరణించాడు. అయితే తాజాగా నాలుగేళ్ల తర్వాత వార్న్ మరణంపై అతడి కుమారుడు జాక్సన్ వార్న్ స్పందించాడు. కోవిడ్ వాక్సిన్ వల్లే తన తండ్రి చనిపోయినట్లు జాక్సన్ వెల్లడించాడు. ‘టూ వరల్డ్స్ కొలైడ్’ పాడ్కాస్ట్కు ఇంటర్య్వూ ఇచ్చిన జాక్సన్ వార్న్ మాట్లాడుతూ.. ‘నాన్నకు నాలుగు కొవిడ్ టీకాలు ఇవ్వాల్సి వచ్చింది. అవి తీసుకోవడం ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో టీకాలు వేపించుకున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వల్లే ఆయన మరణించారేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. ఆ వ్యాక్సిన్ ప్రభావం నాన్న ఆరోగ్యంపై పడింది. అయితే ఆయనకు అంతర్గతంగా కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన మద్యం తాగేవారు, స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. అవే అలవాట్లు ఉన్న చాలామంది ఇంకా ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఆ సమయంలో నాన్న ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించారు. నాన్న మరణ వార్త విన్న తర్వాత ప్రభుత్వం, కొవిడ్ పరిస్థితులపై కోపం వచ్చింది’ అని జాక్సన్ వార్న్ తెలిపారు. అయితే వార్న్ చనిపోవడానికి ముందు 2021లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన హండ్రెడ్ టోర్నీలో కోవిడ్ బారిన పడ్డాడు. అయితే వార్న్ మరణించిన సమయంలో ఆయనకు ఎలాంటి అనారోగ్యం బారిన పడినట్లు రిపోర్ట్లో తేలడం అప్ప ట్లో ఆసక్తిగా మారింది.2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి ఎడిషన్ను షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్తాన్ రాయల్స్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో వార్న్ 55 మ్యాచ్లాడి 57 వికెట్లు పడగొట్టాడు.చదవండి: ‘సోకులకే ఉన్నాడు తప్ప ఆడింది ఏమీ లేదు’
SRHకు అదిరిపోయే శుభవార్త
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభవార్త. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ త్వరలోనే జట్టుతో చేరనున్నట్లు సమాచారం. కాగా వెన్నునొప్పి కారణంగా ఈ పేస్ బౌలర్ చాలాకాలంగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియా కెప్టెన్గా ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్లో జట్టును ముందుకు నడిపించాల్సిన కమిన్స్ (Pat Cummins).. ఫిట్నెస్ సమస్యల వల్ల ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత పూర్తిగా ఆటకు దూరమైపోయాడు. టీ20 ప్రపంచకప్-2026లో అతడు లేకుండానే బరిలోకి దిగిన ఆసీస్.. గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టి అవమానం పాలైంది.కమిన్స్ లేని లోటు సుస్పష్టంమరోవైపు.. సన్రైజర్స్ జట్టులో సైతం కమిన్స్ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్, ప్రధాన పేసర్గా అతడు సేవలు అందిస్తాడన్న సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్-2026లో కమిన్స్ గైర్హాజరీలో ఇప్పటికి ఐదు మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ కేవలం రెండు మాత్రమే గెలిచింది.గెలుపు బాట తొలుత కోల్కతా నైట్ రైడర్స్పై గెలిచిన ఇషాన్ కిషన్ బృందం.. తాజాగా రాజస్తాన్ రాయల్స్పై సోమవారం జయభేరి మోగించింది. సొంతమైదానం ఉప్పల్లో రాయల్స్ను 57 పరుగుల తేడాతో చిత్తు చేసి గెలుపు బాట పట్టింది. ఇలాంటి తరుణంలో కమిన్స్కు సంబంధించిన అప్డేట్ అందడం ఎస్ఆర్హెచ్ శిబిరంలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.ఆరోజే హైదరాబాద్కుక్రిక్బజ్ కథనం ప్రకారం.. కమిన్స్ బుధవారం (ఏప్రిల్ 15) ఆస్ట్రేలియాలో ఫిట్నెస్ టెస్టుకు హాజరుకానున్నాడు. పరీక్షలో పాసైతే గనుక ఏప్రిల్ 17 నాటికి అతడు హైదరాబాద్కు చేరుకుంటాడు. ఈ విషయం గురించి జట్టు సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘అతడు ఫిట్నెస్ టెస్టు క్లియర్ చేసి త్వరలోనే క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి నిరభ్యంతర పత్రం (NOC) పొందుతాడని ఆశిస్తున్నాం’’ అని తెలిపాయి. కాగా కమిన్స్ స్థానంలో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ సన్రైజర్స్ను ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.చదవండి: SRH: షూ కోసం తల్లి నగలు అమ్మి.. ఎవరీ సాకిబ్ హుస్సేన్?BCCI: సూర్యకుమార్ యాదవ్పై వేటు!
న్యూస్ పాడ్కాస్ట్
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం... డిమాండ్లపై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్... అణ్వాయుధాలు, హార్మూజ్పైనే పీటముడి
ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు షురూ. మరో దఫా చర్చించే అవకాశం
భారీగా పడిపోతున్న బంగారం ధరలు
అమరావతిలో నీకింత.. నాకింత... ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన ‘బీఎస్సార్’కు రాజధానిలో భారీగా పనుల అప్పగింత
ఆంధ్రప్రదేశ్లో ‘సీఎంఆర్ఎఫ్’ నిధులు స్వాహా... టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి సీఎంవో వరకూ వసూళ్ల పర్వం
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మావిగన్.. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు: వైఎస్ జగన్
ఇరాన్ను తుడిచిపెట్టేస్తాం, వారి నాగరికతను నాశనం చేస్తాం. తీవ్రంగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
మళ్లీ పెరిగిన వెండి, బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీకి దినదిన గండం... ఐదో రోజూ స్తంభించిన ఓపీ, అత్యవసర వైద్యసేవలు
బిజినెస్
నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు!
ఐటీ రంగంలో మానవీయ విలువలకు, గ్రామీణ ప్రతిభకు పెద్దపీట వేస్తుందని పేరున్న ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ‘జోహో’లోనూ లేఆఫ్స్ కలకలం రేపుతున్నాయి. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దాదాపు 300 మంది ట్రైనీలను కంపెనీ ఒక్కసారిగా విధుల్లోంచి తొలగించినట్లు తెలుస్తోంది. టెక్ నిపుణుల వేదిక ‘బ్లైండ్’లో బాధిత ఉద్యోగి ఒకరు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఏం జరిగింది? ఈ నిర్ణయానికి కారణమేంటి?బాధితుడి కథనం ప్రకారం.. కంపెనీలో అంతర్గతంగా జరిగిన కొన్ని పరిణామాలే ఈ తొలగింపులకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక సీనియర్ ఉద్యోగి, ‘మీరు మమ్మల్ని (అనుభవజ్ఞులను) తీసేసి తక్కువ జీతానికే వచ్చే ట్రైనీలతో ఖాళీలు భర్తీ చేయాలని చూస్తున్నారా?’ అని యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ చర్చ జరిగిన కొద్ది రోజుల్లోనే ఫ్రెషర్లను భర్తీ చేస్తున్నారనే అపవాదు పోగొట్టుకోవడానికి కంపెనీ ఏకంగా 300 మంది ట్రైనీలను తొలగించిందని సదరు యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఫ్రెషర్ల ఆవేదన‘నేను ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చాను. ఈ ఉద్యోగం నాకు కెరీర్తోపాటు నా కుటుంబానికి జీవనాధారం. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలను వదులుకుని జోహోలో చేరాను. అక్కడైతే కనీసం బెంచ్ మీద ఉన్నా భద్రత ఉండేది. ఇక్కడ కనీసం నోటీసు పీరియడ్ కూడా ఇవ్వకుండా రోడ్డున పడేశారు’ అని ఒక బాధిత యువకుడు ‘బ్లైండ్’లో వాపోయాడు.వెంబు మాటలకు, చేతలకు పొంతన లేదు!జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తరచుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, చిన్న పట్టణాల నుంచి ప్రతిభను వెలికితీయడం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని బాధితులు విమర్శిస్తున్నారు. ‘చిన్న పట్టణాల నుంచి నియామకాలు చేపడుతున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు, వివరణ లేకుండా వందలాది మంది యువత భవిష్యత్తును దెబ్బతీయడం ఏ రకమైన సంస్కృతి?’ అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.టెక్ వర్గాల్లో తీవ్ర నిరసనఈ వ్యవహారంపై గూగుల్, గోల్డ్మన్ సాక్స్, హెచ్పీ వంటి దిగ్గజ సంస్థల ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘300 మంది కెరీర్లతో ఆటలాడటం దారుణం. ఫ్రెషర్లను పావులుగా వాడుకుంటున్నారు’ అని గోల్డ్మన్ సాక్స్లో పనిచేసే ఒక ఉద్యోగి వ్యాఖ్యానించారు. ‘అంతర్గత రాజకీయాల క్రాస్ఫైర్లో ఎప్పుడూ అమాయక ఫ్రెషర్లే బలిపశువులవుతున్నారు’ అని మరొకరు పేర్కొన్నారు.కంపెనీ స్పందన కోసం నిరీక్షణఈ ఆరోపణలపై వివరణ కోరుతూ జోహో సంస్థకు కొన్ని మీడియా సంస్థలు ఈమెయిల్ పంపాయని తెలుస్తుంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించలేకపోయినా, సోషల్ మీడియాలో వస్తున్న వరుస పోస్టులు మాత్రం ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?
యాపిల్ పెట్టుబడిపై నీలినీడలు!
‘ఒరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలవబడే దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ బెర్క్షైర్ హాత్వే సీఈఓ బాధ్యతల నుంచి డిసెంబర్ 31న తప్పుకున్నప్పటి నుంచి యాపిల్ పెట్టుబడులపై నీలినీడలు కమ్ముకున్నాయి. తన అర్ధ శతాబ్దపు ప్రస్థానంలో బెర్క్షైర్ క్లాస్-ఏ షేర్లను ఏకంగా 61,00,000 శాతం వృద్ధి పథంలో నడిపించిన బఫెట్, ఆ పగ్గాలను ఇటీవల తన వారసుడు గ్రెగ్ అబెల్కు అప్పగించారు. అయితే, అబెల్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బెర్క్షైర్ అత్యంత కీలకమైన యాపిల్ పెట్టుబడి బఫెట్ నిర్దేశించిన ప్రాథమిక సూత్రాలనే ఉల్లంఘిస్తోందనే చర్చ ఆసక్తికరంగా మారింది.విలువే ప్రాణం.. కానీ..వారెన్ బఫెట్ పెట్టుబడి శైలిలో అత్యంత ముఖ్యమైన నియమం ‘వాల్యుయేషన్’. ఒక సంస్థకు తిరుగులేని మార్కెట్ పట్టు, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పటికీ ఆ సంస్థ షేరు ధర దాని అసలు విలువ కంటే ఎక్కువగా ఉంటే బఫెట్ అటువైపు చూడరు. గ్రెగ్ అబెల్ తాను రాసిన మొదటి వార్షిక లేఖలో యాపిల్ను తన ‘ఫరెవర్ హోల్డింగ్స్’ (ఎప్పటికీ కొనసాగించే పెట్టుబడులు) జాబితాలో చేర్చారు. కానీ ప్రస్తుత మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే యాపిల్ షేరు ధర బఫెట్ సూత్రాలకు విరుద్ధంగా చాలా ఖరీదుగా కనిపిస్తోంది.స్తంభించిన వృద్ధిఇటీవలి కాలంలో యాపిల్ అమ్మకాల వృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఉత్పత్తుల ఆదాయం మందగించింది. కేవలం సర్వీసెస్ విభాగం మాత్రమే స్వల్ప వృద్ధిని కనబరుస్తోంది. ఏప్రిల్ 10 నాటికి యాపిల్ షేర్లు తమ ఆర్జన కంటే 33 రెట్లు (33 రెట్లు ఈపీఎస్-ఎర్నింగ్ పర్ షేర్) ఎక్కువ ధరకు ట్రేడ్ అవుతున్నాయి. 2016లో బఫెట్ తొలిసారి యాపిల్లో వాటాలను కొనుగోలు చేసినప్పుడు, ఆ స్టాక్ కేవలం 10 నుంచి 15 రెట్ల పీఈ రేషియోలో లభించేది. బఫెట్ సీఈఓగా ఉన్న చివరి తొమ్మిది త్రైమాసికాల్లోనే యాపిల్లోని సుమారు 75 శాతం వాటాను (687.6 మిలియన్ షేర్లు) విక్రయించడం గమనార్హం. కేవలం వాల్యుయేషన్ పరంగా ఆకర్షణీయంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఏఐ ఆశలు వర్కౌట్ అవుతాయా?యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా కృత్రిమ మేధ రంగంలోకి కంపెనీ అడుగుపెట్టడం ఇన్వెస్టర్లలో కొంత ఉత్సాహాన్ని నింపినప్పటికీ అది తక్షణ ఆదాయ వృద్ధికి ఎంతవరకు దోహదపడుతుందనేది ప్రశ్నార్థకమే. యాపిల్ తన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే కార్యక్రమం(బైబ్యాక్) కోసం 2013 నుంచి 841 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినప్పటికీ ఆదాయ వృద్ధి లేకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తోంది.ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలా?గ్రెగ్ అబెల్ యాపిల్ను దీర్ఘకాలిక సంపద సృష్టికర్తగా చూస్తున్నప్పటికీ బఫెట్ మార్గంలోనే నడిస్తే మాత్రం రాబోయే త్రైమాసికాల్లో బెర్క్షైర్ తన యాపిల్ వాటాను మరింత తగ్గించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కేవలం బ్రాండ్ విలువను చూసి పెట్టుబడి పెట్టడం కంటే, ఆ సంస్థ ఇచ్చే రాబడి, వాల్యుయేషన్ మధ్య సమతుల్యతను గమనించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్ వంటి దిగ్గజ సంస్థలే వృద్ధి కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోను పునసమీక్షించుకోవడం ఉత్తమం.గమనిక: పై కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. షేర్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?
‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?
భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మధ్యతరగతి ప్రజలే కీలకం. దేశంలో తయారయ్యే సగటు వస్తువులను అధికంగా కొనేది వీరే. ప్రభుత్వానికి సింహభాగం పన్నులు కట్టేదీ వీరే. కానీ, ప్రస్తుతం వారు ఆర్థికంగా, సామాజికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పేదల కోసం పథకాలు ఇస్తోంది. ధనికుల కోసం ప్రోత్సాహకాలు అందిస్తోంది. కానీ, ఈ రెండింటి మధ్య ఉన్న మధ్యతరగతి ప్రజల కష్టాలను మాత్రం విస్మరిస్తోంది.వచ్చే జీతం చాలడం లేదుమునుపటితో పోలిస్తే ఇప్పుడు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ సామాన్యుడి జీతం మాత్రం పెరగడం లేదు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కో లేదా ఆఫీస్ ఉద్యోగికో వచ్చే ప్రారంభ జీతం ఎంత ఉందో, నేటికీ దాదాపు అంతే ఉంది. కానీ, అప్పటితో పోలిస్తే ఇళ్ల అద్దెలు, పెట్రోల్, కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. మన దేశంలో 70 శాతం మంది సంపాదన దేశ సగటు ఆదాయం కంటే తక్కువగానే ఉంది. అంటే, కొద్దిమంది ధనికులు రోజురోజుకు మరింత ధనవంతులు అవుతుంటే మెజారిటీ ప్రజలు మాత్రం బతుకు బండి అంతంతమాత్రంగానే నెట్టుకొస్తున్నారు.చదువు, వైద్యం, ఇల్లుమధ్యతరగతి బడ్జెట్ను ఈ మూడు అంశాలు పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేక, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు భరించలేక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ఏటా ప్రైవేట్ రంగంలో ఫీజులు 10-20% పెరుగుతున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం సొంత అవసరాలను త్యాగం చేసి మరీ ఫీజులు కడుతున్నారు. మరోవైపు పెరిగిన వైద్య ఖర్చుల దృష్ట్యా ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇన్సూరెన్స్ ఉన్నా అది అన్నింటికీ సరిపోవడం లేదు. వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. నగరాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. సొంత ఇల్లు కొందామంటే బ్యాంక్ వడ్డీలు భయం పుట్టిస్తున్నాయి. దీంతో సంపాదనలో సగం అద్దెకో లేదా ఈఎంఐకో సరిపోతోంది.‘ప్రభుత్వం లెక్కించే ధరల పెరుగుదల పాత పద్ధతిలో ఉంది. అది పప్పులు, ఉప్పుల ధరల మీద దృష్టి పెడుతుంది కానీ, మనం ఎక్కువగా ఖర్చు చేసే స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులను సరిగ్గా లెక్కలోకి తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. అందుకే ప్రభుత్వ లెక్కల్లో ధరలు తక్కువగా ఉన్నా సామాన్యుడికి మాత్రం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి’పొదుపు మాయం.. అప్పులే శరణ్యంఒకప్పుడు మధ్యతరగతి వారు భవిష్యత్తు కోసం డబ్బు దాచుకునేవారు. కానీ ఇప్పుడు నెలవారీ జీతం క్షణాల్లో అయిపోతోంది. దాచుకోవడానికి రూపాయి మిగలడం లేదు. అవసరాల కోసం అప్పులు చేయడం, క్రెడిట్ కార్డులు వాడటం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ప్రజల పొదుపు తగ్గిపోయి, అప్పులు పెరగడం ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం.ఆశలు నీరుగారుతున్నాయిమధ్యతరగతి వారు కష్టపడి పైకి రావాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల్లో ప్రమోషన్లు లేవు. కొత్త ఉద్యోగం చూద్దామంటే రిస్క్ ఎక్కువగా ఉంది. కొత్త టెక్నాలజీలు సంప్రదాయ కొలువులకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. కొంతమంది సంపన్నులకే మంచి చదువు దొరుకుతుండటంతో పేద/దిగువ మధ్యతరగతి వారు పైకి రావడం ఒక యుద్ధంలా మారింది.‘మధ్యతరగతి వారు కేవలం పన్నులు కట్టే యంత్రాలు కాదు. దేశం ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఈ వర్గం కూడా బలంగా ఉండాలి. పెరిగిన పన్నుల భారం తగ్గించి విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా ఏ ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలి. లేకపోతే దేశ ప్రగతి ప్రమాదపు అంచులకు చేరుతుంది’ఇదీ చదవండి: ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా?
ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా?
ఆరోగ్య బీమా అనేది ఆపద సమయంలో ఆదుకునే ఒక రక్షా కవచం. కానీ, అవసరానికి ఆ కవచం పనిచేయకపోతే పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం దేశంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రి ఖర్చుల కోసం క్లెయిమ్ చేస్తే.. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదో ఒక కారణంతో తిరస్కరించడం లేదా సగం డబ్బులే ఇవ్వడం వంటివి సాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారిక గణాంకాలు, నిపుణుల విశ్లేషణతో రూపొందించిన ప్రత్యేక కథనం మీ కోసం..క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది?వైద్య ఖర్చులు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సామాన్యుడికి ఆరోగ్య బీమా కొండంత అండ. అయితే, క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో పాలసీదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో ‘బీమా భరోసా’ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు, 2025 ఆర్థిక సంవత్సరం మొత్తం ఫిర్యాదుల సంఖ్యను మించిపోయాయి. ఫిబ్రవరి 2026 నాటికి ఈ పోర్టల్లో సుమారు 73,729 ఫిర్యాదులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో దాదాపు 69% ఫిర్యాదులు కేవలం క్లెయిమ్ తిరస్కరణ లేదా జాప్యానికి సంబంధించినవే కావడం గమనార్హం.క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణాలుబీమా సంస్థలు క్లెయిమ్లను తిరస్కరించడానికి నిబంధనలతోపాటు పాలసీదారుల అవగాహన లోపం కూడా ఒక కారణం. క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.ముందస్తు వ్యాధులను చెప్పకపోవడం..పాలసీ తీసుకునేటప్పుడు బీపీ, షుగర్ వంటి పాత జబ్బుల గురించి దాచడం అతిపెద్ద తప్పు. 36 నెలల నిరీక్షణ కాలం (మారటోరియం పీరియడ్) ముగియకముందే ఇలాంటివి బయటపడితే కంపెనీలు క్లెయిమ్ను నేరుగా తిరస్కరిస్తాయి.వెయిటింగ్ పీరియడ్కొత్తగా పాలసీ తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులకు కవరేజీ ఉండదు. సాధారణంగా మొదటి 30 రోజులు (ప్రమాదాలు మినహా) నిర్దిష్ట వ్యాధులకు (హెర్నియా, క్యాటరాక్ట్.. వంటివి) 2-4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈలోపు క్లెయిమ్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది.వైద్య అవసరం లేకుండానే ఆసుపత్రిలో చేరికకేవలం డయాగ్నోస్టిక్ పరీక్షల కోసం లేదా ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం ఉన్న జబ్బులకు ఆసుపత్రిలో చేరితే క్లెయిమ్ రాదు. కనీసం 24 గంటల ఆసుపత్రి చేరిక తప్పనిసరి (డే కేర్ చికిత్సలు మినహా).కాస్మెటిక్ సర్జరీలు, దంత చికిత్సలు, విటమిన్ సప్లిమెంట్స్ వంటివి చాలా పాలసీల్లో కవర్ కావు. మీరు పాలసీ తీసుకునే ముందే వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.ఆసుపత్రిలో చేరిన 24-48 గంటల్లోపు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. రీయింబర్స్మెంట్ విషయంలో డిశ్చార్జ్ అయిన 15-30 రోజుల్లోపు పత్రాలు సమర్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి.పాలసీ కొనే ముందు చెక్ చేయాల్సినవి..పాలసీ డాక్యుమెంట్ అనేది కేవలం కాగితాల కట్ట కాదు, అది ఒక చట్టపరమైన ఒప్పందం. కొనే ముందు కీలక అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి.గది అద్దెపై పరిమితి ఉందో లేదో చూడండి. గది అద్దె పరిమితి మించితే, మొత్తం బిల్లులో కంపెనీ కోత విధిస్తుంది.బిల్లులో కొంత శాతం మీరే చెల్లించాలనే నిబంధన(కో-పేమెంట్) ఉంటే ప్రీమియం తగ్గుతుంది కానీ, క్లెయిమ్ సమయంలో మీ జేబుకు చిల్లు పడుతుంది.మీ ఇంటికి దగ్గరలో ఉన్న ప్రముఖ ఆసుపత్రులు ఆ బీమా నెట్వర్క్లో ఉన్నాయో లేదో సరిచూసుకోండి.ఒకే ఏడాదిలో ఒకటికంటే ఎక్కువసార్లు అనారోగ్యం పాలైతే బీమా మొత్తం (సమ్ అస్యూర్డ్) తిరిగి రీఛార్జ్ అయ్యే సౌకర్యం ఉందో లేదో చూడండి.ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పే మాటల కంటే పాలసీలోని ‘కీ ఫీచర్స్ డాక్యుమెంట్’ చదవడం ఉత్తమం. ఏదైనా ఫిర్యాదు ఉంటే మొదట బీమా సంస్థకు, అక్కడ పరిష్కారం లభించకపోతే ఐఆర్డీఏఐ ‘బీమా భరోసా’ పోర్టల్ లేదా ఇన్సూరెన్స్ అంబడ్స్మన్ను ఆశ్రయించవచ్చు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఫ్యామిలీ
గొప్ప డాక్టర్ని అవ్వాలనుకున్నా..కానీ ఆ ఒక్క రీజన్..!
విదేశాల్లో ఉద్యోగం అనేది చాలామంది యువత డ్రీమ్. మా అబ్బాయి ఫారెన్లో ఫలానా ఉద్యోగం చేసుకుంటున్నాడు అని తల్లిదండ్రులు కూడా తమ బంధువులకు, మిత్రులకు గర్వంగా చెప్పుకుంటుంటారు. కానీ వాస్తవ జీతంలో అదేమంత సౌఖ్యంగా ఉండదు పైగా అక్కడ నుంచి ఎలా బయటపడాలి, తిరిగి సొంతగూటికి వచ్చేస్తే పరిస్థితి ఏంటి అన్న భయం ఓ రేంజ్లో వెంటాడతాయి. చాలామంది అక్కడ కొత్త లైఫ్స్టైల్కి అడ్జెస్ట్ కాలేక మరోపక్క తమవాళ్లను వదిలేసి వచ్చేశామన్న బెంగ కుదురుగా ఒక చోట నిలవనివ్వక..తిరిగి సొంత గడ్డకి పయనమయ్యేలా చేస్తాయి. ఇక్కడ కూడా ఈ ఫిజియోథెరపిస్టూ అలానే భారత్కి గోడకు కొట్టి బంతిలా తిరిగొచ్చేశాడు. తాను ఎందుకలో వచ్చేశాడో చెబుతుంటే..అమ్మో విదేశాలకా అని అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే. ఫిజియోథెరపిస్ట్ మానవ్ షా తానెలా విదేశీ ఉద్యోగం అనే డ్రీమ్ని మధ్యలో వదిలేసి భారత్కి వచ్చాశాడో సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడించాడు. ఆ పోస్ట్లో మానవ్ షా..తన మంచి ఉద్యోగంతో చక్కటి లైఫ్ని లీడ్ చేస్తున్న టైంలోనే ఇంటికి తిరిగి వచ్చేశానని చెప్పుకొచ్చాడు. ఏకంగా ఏడాదికి రూ. 40 లక్షల జీతంతో మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నట్లు చెప్పాడు. అంతేగాదు, మంచి ఆర్థిక భద్రతతో లైఫ్ బిందాస్గా ఉందని చెప్పుకొచ్చాడు. కానీ అవేమి అతడి ఒంటరితనాన్ని దూరం చేయలేకపోయాయని అంటున్నాడు. తాను నేషనల్ హెల్త్ సర్వీస్లో పనిచేస్తుండేవాడినని తెలిపాడు. అయితే అక్కడ ఉదయం 9 టు 5 ఉద్యోగ సంస్కృతికి బంధీ అయిపోతున్న ఫీలింగ్ వచ్చేదట. వ్యక్తిగత ఎదుగుదల ఏం లేకుండా..స్వేచ్ఛలేని జీవితాన్ని గడుపుతున్నట్లుగా ఉండేదట. సింపుల్గా చెప్పాలంటే అదొక జైలులా అనిపించేదట. పోనీ అక్కడ నుంచి వచ్చేద్దామంటే..అప్పటికే చక్కగా సెటిల్ అయిన లైఫ్, స్నేహితులు, ఆ సౌకర్యాలను వదిలేయాలంటే విపరీతమైన భయం, అనుమానాలు, సందేహాలతో చాలా రోజుల పాటు సతమతమయ్యానని చెప్పుకొచ్చాడు. తాను తన ఇంటికి దూరంగా ఉండటంతో విపరీతమైన ఒంటరితనంతో బాధపడేవాడినని, కొన్ని గొప్ప క్షణాలను కోల్పోతున్న ఫీలింగ్ వచ్చేదని అన్నాడు. వాటన్నింటిని ఏ జీతం భర్తీ చేయలేదని తెలుసుకుని తక్షణమే తన సొంత గూటికి వచ్చేశానని అన్నాడు. అలాగే ఇక్కడ విదేశంలో సంపాదించినంత కాకపోయినా..తన వాళ్లతో హాయిగా గడపగలనన్నా ఆ ఆలోచనే సంతోషంలో ముంచెత్తుందని చెబుతున్నాడు. అలాగే తక్కువ జీతమే అయినా..చక్కగా పొదుపు చేయగలను, నాణ్యమైన ఆరోగ్యాన్ని అందివ్వగలనని అన్నాడు. అన్నింటికంటే సంతృప్తిగా, మనశ్శాంతిగా బతకుతానని చెబుతున్నాడు. నెటిజన్లు కూడా అతడి నిర్ణయానికి మద్దతిస్తూ..వెస్ట్రన్ డ్రీమ్ లేదా విదేశీ ఉద్యోగం అనే కల దూరపు కొండలు నునుపు అన్నట్లు ఉంటుందే తప్ప..ఎన్నో ఆనందాల క్షణాలను కోల్పోతాం. ఏకాకిగా ఓ యంత్రంలా బతుకుతున్నట్లుగా జీవితంపై విరక్తి వచ్చేస్తుందంటూ పోస్టులు పెట్టారు. కొందరు తాము కూడా అలానే విదేశం నుంచి సొంత గూటికి వచ్చేసినట్లు చెప్పడం విశేషం. View this post on Instagram A post shared by Manav Shah (@physiomanav) (చదవండి: సామాజిక బాధ్యత అంటే ఇదే..! రెప్పపాటులో ఆ పాప..)
కమల్ హాసన్ సౌందర్య చిట్కా..! ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి..
నటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణ నటుడు కమల్ హాసన్ తనయగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గాయనిగా, నటిగా నూటికి నూరు మార్కులు దక్కించుకుంది. శృతి ఎప్పటికప్పుడూ ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన టిప్స్ షేర్ చేస్తూ..ఆరోగ్యంపై స్ప్రుహను కలిగిస్తుంటారామె. అలానే ఈసారి తన జుట్టు, చర్మం ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో షేర్ చేస్తూ..ఆ విషయంలో తన తండ్రి ఇచ్చిన సౌందర్య చిట్కా గురించి మాట్లాడింది. ఆ చిట్కా చాలా బాగా పనిచేస్తుందని, దాన్ని గట్టిగా నమ్ముతానంటూ ఆ బ్యూటి టిప్ గురించి వివరించింది. ఇంతకీ ఏంటా సౌందర్య చిట్కా అంటే..కూలీ నటి శృతి తాను ఆయిల్ని ఎంతో ఇష్టపడతానని, దీన్ని ఒంటికి, జుట్టుకి రాసుకుంటానని అన్నారామె. ఇదేమి రెసిపీ లాంటిది కాకపోయినా..ఎంతో ఇష్టమని అంటోంది. నువ్వులు, కొబ్బరి నూనెతో కలగలసిన నూనె అంటే మహా ఇష్టమని, ఇది చర్మానికి, జుట్టుకి బాగా పనిచేస్తుందని తన నాన్నే(కమల హాసన్) స్వయంగా చెప్పారని చెప్పుకొచ్చింది. నిపుణులు ఏమంటున్నారంటే..జుట్టు ఆరోగ్యానికి నువ్వులు వల్ల కలిగే అనేక ప్రయోజనాల కారణంగా సాంప్రదాయంగానూ, ఆధునికంగా కేశ సంరక్షణకు ది బెస్ట్ అని అన్నారు. దీనిలో అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఈ, బి కాంప్లెక్స్ విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం, వంటి ఖనిజాలతో నిండి ఉంటుందని తెలిపారు. తలకు తీవ్రంగా తేమను అందించి జుట్టు కుదుళ్లను బలపరిచి, పెరుగుదలను ప్రేరేపిస్తుందని అన్నారు. దీనిలో సహజంగా ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రుని, వివిధ చర్మ సమస్యలను అరికట్టి..జుట్టు పెరుగుదలకు దోహదపడుతుందని చెప్పారు. అలాగే ఇది సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుందని తెలిపారు. అంతేగాదు దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుని డల్గా కానివ్వకుండా నిరోధిస్తాయని అన్నారు. గోరువెచ్చని నూనెతో మసాజ్లు తలకు రక్తప్రసరణను అందించి జుట్టు ఆరోగ్యానికి, విశ్రాంతికి సహాయపడతాయని చెప్పారు. అంతేగాదు ఆయుర్వేదం ప్రకారం..అన్ని నూనెల్లోకెల్లా నువ్వులు నూనె అత్యంత శ్రేష్టమైనదని అన్నారు. ఈ నువ్వుల నూనెని సౌందర్యం, ఔషధ ఉత్పత్తులలో వినియోగిస్తారని చెబుతున్నారు. సాంప్రదాయకంగా, నువ్వుల నూనె నాడీ వ్యవస్థపై వెచ్చదనాన్ని, ప్రశాంతతను కలిగించే ప్రభావాలను కలిగి ఉండటం వల్ల అత్యంత ప్రభావవంతమైన నూనెగా పేరుగాంచింది. అంతేగాదు ఆయుర్వేదం నువ్వుల నూనెను నూనెలకే రాజుగా పరిగణిస్తుంది. ఎందుకంటే ఇది వ్యాధికారకాలను నిర్మూలించి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా శక్తిని సమతుల్యం చేయడం వంటి అనేక ప్రయోజనాలను పుష్కలంగా అందిస్తుందని చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: సామాజిక బాధ్యత అంటే ఇదే..! రెప్పపాటులో ఆ పాప..)
సామాజిక బాధ్యత అంటే ఇదే..!
రోడ్డుపై అనునిత్యం ఎన్నో ప్రమాదాలు జరుతుంటాయి. ఇది సర్వసాధారణ. కానీ క్షణంలో స్పందించి చేతనైన సాయం అందిస్తే..ప్రాణాలను రక్షించిన వాళ్లం అవుతాం. అయితే అందుకు ఎవ్వరూ ముందుకురారు. పోలీసు కేసులని, రిస్క్ అని భయంతో దూరంగా ఉండిపోతారు. కొందరు ముందుకొచ్చినా..మిగతా వాళ్లు సహకరించకపోవడంతో వెనకడుగువేస్తుంటారు. అందుకే పోలీసులు, ప్రభుత్వం దీనిపై అవగాహన కార్యక్రమాలతో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తుంటుంది కూడా. కానీ ఈ అమ్మాయి దాన్ని అక్షరాల తూచా తప్పకుండా పాటించి ఘెర ప్రమాదాన్ని తప్పించింది.ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. సీసీ కెమెరాలో అందుకు సంబంధించిన ఘటన రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఒక మహిళ రోడ్డు దాటుతూ వచ్చే ఆటోని గమనించకపోవడంతో పెనుప్రమాదం చోటుచేసుకుంది. ఆ మహిళను తప్పించబోయి ఆ ఆటోనే ఆమెపై బోర్లపడింది. స్కూల్ నుంచి వస్తున్న ఆ చిన్నారి రెప్పపాటులో స్పందించి ఒక్కసారిగా ఆ ఆటోని ఎత్తేసింది. అదంతా సీసీటీవి కెమెరాలో రికార్డు అయ్యింది. దాన్ని చూసిన సిటీ కమిషనర్ ఆ విద్యార్థిని పిలిపించి మరి ఆమె సాహసాన్ని మెచ్చుకోవడమే గాక సన్మానం చేసి అభినందించారు. ఇదీ సామాజిక బాధ్యతంటే అని నొక్కి చెప్పారు సిటీ కమిషనర్. *కర్ణాటక::మంగళూరులో ఒక మహిళ రోడ్డు దాటుతూ వచ్చే ఆటోను గమనించకపోవడంతో ఆటో అతను ఆమెను తప్పించబోయి అదుపుతప్పి ఆమె మీదే బోర్ల పడ్డది ఆటో అప్పుడే అదే రోడ్డు పై నుండి స్కూల్ నుండి వస్తున్న ఒక పాప సడెన్ గా ఆటోను ఒక్కసారిగా ఎత్తేసింది ✊ అది సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవడంతో అది చూసిన… pic.twitter.com/MqTuaqpGKh— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) April 12, 2026 (చదవండి: Asha Bhosle and Lata Mangeshkar: తెలుపు రంగు దుస్తులే ధరించడానికి రీజన్ ఇదే..!)
అక్కాచెల్లెళ్లు తెలుపు రంగు దుస్తులే ధరించడానికి రీజన్ ఇదే..!
దిగ్గజ నేపథ్య గాయని ఏప్రిల్ 12, ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఏ తరానికి చెందినవారైన ఆశా మధురమైన గాత్రానికి ఫిదా అవ్వాల్సిందే. ట్రెండ్కి తగ్గట్టుగా ఆలపిస్తూ..అభిమానుల మనసును దోచుకునే దిగ్గజ గాయని. ఆ సంగీత నైపుణ్యం ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి కూడా. అక్క లతా మంగేష్కర్ అడుగుజాడల్లోనే నడుస్తూ..సంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటువంటి పాటలైన ఆశా స్వరంతో జత కలిస్తే ఓ అద్భుతం అనేలా పేరుతెచ్చుకున్నారామె. అలాంటి పాటలరాణి మనముందు లేరు అన్నమాటే బాధగా అనిపిస్తున్నా..ఆమె జ్ఞాపకాలు, స్మృతులు మనకళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. వాటిలో ఒకటి అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఒకే విధమైన రంగు చీరలతో కనిపించిన అద్భుతమైన దృశ్యాలు. ఇద్దరు ఎక్కువగా తెలుపు రంగునే ఎంచుకునేవారు. దీంతో అభిమానులు ఇద్దరూ ఇలా ఎందుకు ధరిస్తారనే దానిపై చాలా కుతుహలంగా ఉండారు. ఒక షాడ్కాస్ట్లో దివంగత గాయని ఆశా భోంస్లేనే ఆ విషయాన్ని పంచుకున్నారు. ఎందుకు ఆ రంగే ఇష్టం అంటే..గతేడాది ఆర్జే అన్మోల్, అతని భార్య నటి అమృతరావు హోస్ట్ చేసిన 'కపుల్ ఆఫ్ థింగ్స్' అనే పాడ్కాస్ట్తో భోస్లే అరంగేట్రం చేశారు. ఆ సంభాషణలో తన సోదరి వృత్తిపరమైన ప్రత్యర్థి అయినప్పటికీ ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారామె. అంతేగాదు ఆ ఇంటర్వ్యూలో ఆశా తన సోదరి ఇద్దరూ తెలుపు రంగుకే తొలి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చేవారో చెప్పారు. View this post on Instagram A post shared by Lata Mangeshkar (@lata_mangeshkar) "నేను దీదీ(లతా మంగేష్కర్) ఎల్లప్పుడూ తెల్ల చీరలే ధరించేవాళ్లం. తెలుపు రంగు మా చర్మ ఛాయకు బాగా నప్పుతుందని మేము భావించేవాళ్ళం. ఇతర రంగులు ధరిస్తే, మేము మరింత నల్లగా కనిపించేవాళ్ళం. ఆ తర్వాత, నేను గులాబీ రంగు చీరలు ధరించడం మొదలుపెట్టాను, దీదీ నన్ను వింతగా చూసేవారు, కానీ నేను నెమ్మదిగా గులాబీ రంగుతో పాటు ఇతర రంగులను కూడా జోడించడం ప్రారంభించాను." అని నవ్వతూ చెప్పారామె. కాగా, ఆశా భోంస్లే తన దుస్తుల విషయంలో రంగులను ఇష్టపడటం మొదలుపెట్టారు. కానీ లతా మంగేష్కర్ అడపాదడపా కనిపించే ప్రకాశవంతమైన ఎరుపు రంగు బ్రోకేడ్ పల్లు లేదా షెవ్రాన్ ప్రింటెడ్ బహుళ-రంగుల అంచు మినహా, తెలుపు, లేత తెలుపు వంటి ఐవరీ దుస్తులకే పరిమితమయ్యారు. భోంస్లే కాలక్రమేణా తన జీవిత ఉత్సాహాన్ని వ్యక్తపరిచేలా రంగుల దుస్తులతో తన ఇమేజ్ను పెంచుకున్నారు. ఆమె ఎక్కువగా చందేరి, బనారసి, చేనేత వస్త్రాలు, కాంజీవరం చీరలు, షిఫాన్ ప్రింట్లు వంటి రకరకాల రంగురంగుల చీరలతో తళుక్కుమనేవారు. గాత్రంలోనే కాదు..వేషధారణలోనూ ఆశా ఎవర్గ్రీన్ అన్నట్లుగా తన మార్కును చూపించేవారామె. View this post on Instagram A post shared by RJ Anmol 🇮🇳 (@rjanmol27) (చదవండి: Asha Bhosle: నిశబ్దంగా ఆ మధుర స్వరం.. కానీ ఆమె జ్ఞాపకాలు చిరస్మణీయం!)
అంతర్జాతీయం
యూఏఈ సంచలన కామెంట్స్
యూఏఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. హర్ముజ్ జలసంధి మీద అధికారం కేవలం ఒక్క ఇరాన్కే లేదని తెలిపింది. అది ఏమి టెహ్రాన్ ఆస్తి కాదని తెలిపింది. హర్ముజ్ జలసంధిని విముక్తి చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు యుఏఈ మద్దతిస్తుందని ప్రకటించింది.ప్రస్తుతం పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా హర్మూజ్ను బ్లాకేడ్ చేయడంతో చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో గల్ఫ్ దేశాలు అమెరికాను రిక్వెస్ట్ చేస్తున్నాయి. హర్ముజ్ దిగ్భందనం తొలగించాలని సౌదీఅరేబియా అమెరికాను కోరింది.ఈ నేపథ్యంలో యూఏఈ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హర్ముజ్ జలసంధి కేవలం ఇరాన్ సొత్తు కాదని తెలిపింది. హర్మూజ్ను విముక్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు గల్ఫ్ దేశాలు అండగా నిలుస్తాయని పేర్కొంది. ఈ అంశమై బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడు సమావేశమైనట్లు తెలుస్తోంది.దేశ సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలి గానీ ఇటువంటి దిగ్భందనాలు చేయడటం మంచిది కాదని యూఏఈ పేర్కొంది. ఈ విషయమై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో యూఏఈ సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంది. అయితే అమెరికా విపరీత డిమాండ్ల వల్లనే చర్చలు విఫలమయ్యాయని ఆయన యూఏఈతో తెలిపినట్లు సమాచారం.ప్రస్తుతం అమెరికా సైతం హర్ముజ్ను బ్లాకేడ్ చేయడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇరాన్ పోర్టుల నుండి నౌకలు ఎటు కదలడం లేదు. దీంతో రోజుకు సరాసరిన రూ. 4 వేల కోట్ల రుపాయల నష్టం జరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరో టెన్షన్.. నార్త్ కొరియా క్షిపణుల ప్రయోగం
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఉత్తర కొరియా మరో ప్రయోగం చేసింది. తమ దేశానికి చెందిన “చోయ్ హ్యోన్” అనే యుద్ధనౌక నుంచి రెండు స్ట్రాటజిక్ క్రూయిజ్ క్షిపణులు, మూడు యాంటీ-వార్షిప్ క్షిపణులను ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్జోంగ్ స్వయంగా పరిశీలించారు.ఈ క్షిపణి పరీక్షలు విజయవంతమైనట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది. క్రూయిజ్ క్షిపణులు సుమారు 7,869 నుంచి 7,920 సెకన్లపాటు ప్రయాణించగా, యాంటీ-షిప్ క్షిపణులు 1,960 నుంచి 1,973 సెకన్లపాటు గాల్లో ప్రయాణించాయని పేర్కొంది. ఎల్లో సీ మీదుగా ముందుగా నిర్దేశించిన మార్గంలో ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాయని తెలిపింది.ఈ విన్యాసం యెుక్క ప్రధాన లక్షం సమీకృత ఆయుధ నియంత్రణ వ్యవస్థను మరియు మెరుగైన యాంటీ-జామింగ్ నావిగేషన్ వ్యవస్థను పరీక్షించడం, అలాగే సిబ్బందికి ప్రయోగంపై అవగాహన కల్పించడమనంది. కాగా ఇటీవల నార్త్ కొరియా ప్రపంచానికి తన ఆయుధ శక్తిని ప్రదర్శించేలా తరచుగా క్షిపణులు ప్రయోగం చేపడుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ దాదాపుగా 10కి పైగా క్షిపణులను ప్రయోగించింది. వీటిలో అధికంగా బాలిస్టిక్, క్రూయిజ్, మరియు హైపర్సోనిక్ క్షిపణులు అధికంగా ఉన్నాయి.
ట్రంప్ కొత్త టార్గెట్.. ప్రపంచ దేశాల్లో వణుకు..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ఒక్క వ్యాఖ్య ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇరాన్ తో తీవ్ర స్థాయి ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ.. ‘ఇరాన్ వ్యవహారం పూర్తయిన తర్వాత క్యూబా వైపు వెళ్తాం’ అంటూ ట్రంప్ చేసిన హెచ్చరిక అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో గుబులు రేపుతోంది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఓవల్ ఆఫీస్ బయట ఆయన చేసిన ఈ ఆకస్మిక వ్యాఖ్యలు.. అమెరికా తదుపరి లక్ష్యం క్యూబానేనా అనే తీవ్ర ఉత్కంఠకు తెరతీశాయి.ఇరాన్ తర్వాత క్యూబాపై గురిప్రస్తుత ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్లో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత అమెరికా దృష్టి క్యూబాపై పడుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఓవల్ ఆఫీస్ వెలుపల మీడియాతో అనధికారికంగా మాట్లాడుతూ.. ‘ఇరాన్ తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ముగియగానే తాము క్యూబా వ్యవహారాన్ని చూసుకుంటామని’ ఆయన పేర్కొన్నారు. దీనిపై శ్వేతసౌధం నుంచి ఎలాంటి అధికారిక వ్యూహం కానీ, సైనిక చర్యల కచ్చితమైన సమయం కానీ వెలువడకపోయినప్పటికీ, ఈ వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తున్నాయి.దారుణమైన పాలన.. విఫల దేశంక్యూబా దశాబ్దాలుగా తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోయిందని ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దానిని ఒక ‘విఫల దేశం’గా అభివర్ణించిన ఆయన, పాత కాస్ట్రో శకంలో జరిగిన పరిపాలనా లోపాలను ఎత్తిచూపుతూ.. ఆ దేశం ఎన్నో ఏళ్లుగా అత్యంత దారుణమైన పాలనలో ఉందని అన్నారు. అమెరికా విదేశాంగ విధానంలో క్యూబా ఎప్పుడూ ఒక ప్రత్యేక అంశంగానే ఉంటుందని వ్యాఖ్యానించిన ట్రంప్, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్దిష్ట దౌత్య లేదా ఆర్థిక చర్యల గురించి మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఉత్కంఠ1959 నాటి క్యూబా విప్లవం, ప్రచ్ఛన్న యుద్ధం సమయం నుంచి అమెరికా-క్యూబా మధ్య సంబంధాలు ఎప్పుడూ ఉప్పు-నిప్పులాగే ఉన్నాయి. ఆర్థిక ఆంక్షలు, ప్రయాణ నిబంధనల వంటివి నేటికీ కొనసాగుతున్నాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో అదీ ఇరాన్ వ్యవహారంలో ప్రపంచం అట్టుడుకుతున్న వేళ, ట్రంప్ క్యూబా పేరును ప్రస్తావించడం గ్లోబల్ మార్కెట్లలో, లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర అనిశ్చితికి దారితీస్తోంది. ప్రస్తుతానికి క్యూబా అధికారుల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాకపోయినా, ఈ పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇది కూడా చదవండి: సీనియర్ జర్నలిస్ట్ సంచలన నిర్ణయం.. పోస్ట్మ్యాన్గా మారి..
అప్పులతో పాక్ సతమతం..?
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లిపోతున్న పాక్కు మరో ఇబ్బంది వచ్చి పడింది. UAE ఇచ్చిన $3 బిలియన్ డాలర్లు అప్పు పూర్తిగా తిరిగి చెల్లించాలని కోరడంతో ఎలా చెల్లించేది అనే సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఈ అప్పులు ఎలా చెల్లించేదని ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడిచమురు ధరల వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. ఇంతకాలంగా యూఏఈకి ఉన్న అప్పును పలు దపాలుగా పాకిస్థాన్ వాయిదా వేస్తో వచ్చింది అయితే ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చెల్లించాలని కోరడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయమై పాక్ ఆర్థిక శాఖ మంత్రి జౌరంగజేబ్ స్పందించారు. మేము సమకూర్చుకోవాల్సిన నిధులను ద్వైపాక్షిక మార్గాలు, రుణాల ద్వారా సమకూర్చుకునే యత్నం చేస్తున్నాం. అప్పు చెల్లించడానికి ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నాం అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో యుఏఈకి ఉన్న అప్పును చెల్లిస్తామని స్పష్టం చేశారు . అయితే అప్పుకోసం చైనా,లేదా సౌదీ అరేబియాలను సంప్రదిస్తున్నారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు పాక్ మంత్రి సమాధానం దాటవేశారు.కాగా ప్రస్తుతం ప్రస్తుతం పాక్ వద్ద $ 16.4 బిలియన్ల విదేశీ మారక నిల్వలు ఉండగా అవి ఆ దేశ దిగుమతులకు మూడునెలల వరకూ సరిపోతాయని కథనాలు పేర్కొన్నాయి. అయితే పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఆదేశంలో లాక్ డౌన్ విధించారు. ఇంధన వినియోగం తగ్గించడం కోసం షాపింగ్ మాల్స్, బజార్లు అన్ని రాత్రి 8 గంటల వరకే క్లోజ్ చేసేలా ఆదేశాలిచ్చారు.
జాతీయం
భోపాల్లో 'బ్లడ్ కిక్' కలకలం
భోపాల్: భోపాల్లో 'బ్లడ్ కిక్' కలకలం రేపుతోంది. నగరంలో ఒక భయంకరమైన కొత్త వ్యసనానికి అలవాటు పడుతున్నారు. మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధం లేదు.. కానీ అంతే వేగంగా ప్రాణాలను తీసే కొత్త వ్యసనం వెలుగులోకి వచ్చింది. దీనిని "బ్లడ్ కిక్" అని పిలుస్తున్నారు. యువకులు తమ సొంత రక్తాన్ని తీసి, తిరిగి తమ శరీరంలోకే ఎక్కించుకునే (ఇంజెక్ట్) ఈ వింత ధోరణి ఆందోళన కలిగిస్తోంది.విదేశాల్లో మొదలైన ఈ వికృత ధోరణి ఇప్పుడు నిశ్శబ్దంగా మధ్యప్రదేశ్ రాజధానిలోకి ప్రవేశించింది. ఇది వైద్యులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ ఏడాది(2026) జనవరి నుంచి గాంధీ మెడికల్ కాలేజీలో ఐదు కేసులు వెలుగులోకి వచ్చాయి. బాధితులందరూ 18 నుండి 25 ఏళ్ల మధ్య వయస్సు గలవారే. తల్లిదండ్రులు వారి ప్రవర్తనలో మార్పును గమనించి.. వారిని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు తీవ్ర ఆగ్రహంతో గొడవలకు దిగుతున్నారు. చివరకు దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు వారిని సైకియాట్రీ విభాగానికి తీసుకువస్తున్నారు.మాదక ద్రవ్యాలు తీసుకోరు. వీరిలో మద్యం వాసన కానీ.. డ్రగ్స్ ఆనవాళ్లు గానీ కనిపించవు. బదులుగా, శరీరంపై ఇంజెక్షన్లు తీసుకున్న గుర్తులు ఉంటాయి. ఇలాంటి వింత పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని హమీడియా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. తమ రక్తాన్ని తిరిగి శరీరంలోకి ఎక్కించుకోవడం వల్ల తక్షణ శక్తి, ప్రశాంతత, నియంత్రణ లభిస్తుందని వ్యసనానికి అలవాటుపడిన యువకులు నమ్ముతున్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
పశ్చిమాసియా సంక్షోభం.. మామిడి ప్రియులకు గుడ్న్యూస్
ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందనేది తాతల కాలం నాటి సామెత... కానీ ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు అది అక్షర సత్యం కూడా. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న సాంకేతిక యుగంలో యుద్ధం లాంటి పరిస్థితులు మరింత ప్రభావాన్ని చూపిస్తాయని ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం నిరూపిస్తోంది. నెలలుగా కొనసాగుతున్న పశ్చిమ ఆసియా సంక్షోభం ఓ వైపు గ్యాస్ పెట్రోల్ వంటి అత్యవసరాలకు ఇబ్బందులు సృష్టిస్తుంటే మరోవైపు మామిడి పండ్ల ప్రియులకు తీపి కబురు తెస్తోంది.పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా ఏటా ఆకాశంలో చక్కర్లు కొట్టే మామిడి పండ్ల ధరలు ఈ సీజన్లో నేల చూపులు చూడనున్నాయి. దీనికి కారణం యుద్ధం నేపధ్యంలో విదేశాలకు ఎగుమతులు గణనీయంగా తగ్గడం. ప్రస్తుతం జనాదరణ పొందిన బెనిషాన్ రకం మామిడి పండు కిలోకు రూ. 150–200 మధ్య అమ్ముడవుతోంది. అలాగే తీపి, రసభరితమైన రుచికి ప్రసిద్ధి చెందిన రసాలు హైదరాబాద్లో కిలోకు రూ. 100–150కి లభిస్తున్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే సీజన్ ప్రారంభం కాబట్టి అంతగా తెలియకున్నా రాబోయే రోజుల్లో మామిడి ధరలు బాగా తగ్గే అవకాశం ఉందని పండ్ల వ్యాపారులు అంచనా వేస్తున్నారు.ప్రతి సంవత్సరం, తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ దేశాలకు మామిడి పండ్లు భారీగానే ఎగుమతి అవుతాయి. మరీ ముఖ్యంగా యూఏఈ, యూఎస్ కెనడాలకు మన దగ్గర నుంచి మామిడి పండ్ల ఎగుమతి ఎక్కువ. సగటున ప్రతి సంవత్సరం, భారతదేశం సుమారు 30 వేల మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఎగుమతి చేస్తుంది, వాటిలో అత్యధిక వాటా అంటే దాదాపుగా 10 వేల మెట్రిక్ టన్నులకు పైగా ఒక్క యూఏఈకి వెళుతుంది.అయితే ఎడతెగని యుద్ధం, తద్వారా యుఏఈలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల కారణంగా, మామిడి ఎగుమతులకుు డిమాండ్ తగ్గింది. అందుబాటులో ఉన్న ఒక నివేదిక ప్రకారం, ఇప్పటికే మామిడి ఎగుమతులు 20–30 శాతం తగ్గుదలను నమోదు చేస్తున్నాయి. ఆ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితితో పాటు బాగా పెరిగిన ఎగుమతి వ్యయం కూడా దీనికి దోహదం చేస్తోంది. రవాణా ఛార్జీలు పెరగడం వల్ల యూఎస్ కెనడా వంటి ఇతర గమ్యస్థానాలకు ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి.ఏతావాతా ఇది భారతీయ నగరాల్లో మామిడి ధరలు తగ్గడానికి దారితీయవచ్చునని అంచనా. దేశీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ, అత్యుత్తమ నాణ్యత గల కొన్ని రకాల ఖరీదైన పండ్ల విక్రయాలకు ఎగుమతులే ఆధారం వాటి ఎగుమతులు పడిపోయినప్పటికీ వాటికి స్థానికంగా కొనుగోలుదారులు దొరుకుతారో లేదోనని కూడా ఎగుమతిదారులు సందేహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎగుమతిదారులు ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి రావాలని ఎదురుచూస్తున్నారు.
ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య ఎక్స్ప్రెస్వే(Delhi-Dehradun Expressway)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. సుమారు 11,868 కోట్లతో చేపట్టిన ఆ ప్రాజెక్టులో భాగంగా 212 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వే నిర్మించారు. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్గా కూడా పిలుస్తున్న ఈ మార్గం చార్ధామ్ యాత్రికులకు కీలకమార్గం కానున్నది. ఢిల్లీ-డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ ఢిల్లీ, డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయాన్ని 6 గంటలకు పైగా నుండి సుమారు 2.5 గంటలకు తగ్గిస్తుంది. మానవ-జంతు సంఘర్షణను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో దీనిని అనేక అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. ఈ ప్రాజెక్టులో 12 కిలోమీటర్ల పొడవైన వన్యప్రాణుల ఎలివేటెడ్ కారిడార్ కూడా ఉంది. ఇది ఆసియాలోనే అత్యంత పొడవైన వాటిలో ఒకటి. దీని ప్రారంభోత్సవానికి ముందు ప్రధానమంత్రి డెహ్రాడూన్ సమీపంలోని మా దాత్ కాళీ ఆలయాన్ని సందర్శించి, అక్కడ ప్రార్థనలు చేశారు.వేగవంతమైన ప్రయాణం, మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లతో కొత్తగా ప్రారంభించిన ఈ కారిడార్ ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ,ఉత్తరాఖండ్ గుండా వెళుతుంది. ఆరు లేన్ల ఎక్స్ప్రెస్వేగా నిర్మించిన ఈ కారిడార్ సులభమైన, హై-స్పీడ్ ప్రయాణాన్ని అందిస్తుంది. #WATCH | Dehradun, Uttarakhand: Prime Minister Narendra Modi inaugurates the Delhi–Dehradun Economic Corridor.The corridor will reduce travel time between Delhi and Dehradun from over 6 hours to around 2.5 hours. It has been designed with several features aimed at significantly… pic.twitter.com/JZj6J4UUbT— ANI (@ANI) April 14, 2026
ఈసారి వానలు తక్కువే: ఐఎండీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగానే కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఎల్ నినో పరిస్థితులు జూన్లో ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, దీని ప్రభావం నైరుతి రుతు పవనాలపై పడనుందని అంచనా వేసింది. సాధారణంగా జూన్ నుంచి సెపె్టంబర్ వరకు సాధారణ వర్షపాతం సరాసరిన 87 సెంటీమీటర్ల కాగా, ఈసారి 80 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదయ్యే అవకాశముందని ఐఎండీ చీఫ్ మహాపాత్ర పేర్కొన్నారు. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో ఇవే పరిస్థితులుంటాయన్నారు. అయితే, ఈశాన్య, వాయువ్య, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
ఎన్ఆర్ఐ
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’
అల్ఫారెట్టా, జార్జియా: స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి-2026’ అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు.ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. నాలుగేళ్ల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ(యూఎస్ఏ) సేవా సంస్థలకు అందజేయనున్నారు.ఈ వేడుకల్లో బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి (శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రతినిధులు), గిరిధర్ కొటగిరి (ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు), జ్యోత్స్న పాలకుర్తి (గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ చైర్మన్), రమణ గంద్ర (గేట్స్ అధ్యక్షులు), సునీత పోట్నూరు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు), ఆది శ్రీనివాసన్ (ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు), శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ (ప్రెసిడెంట్ అండ్ సీఈఓ), జనార్ధన్ పన్నెల (శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధి) పాల్గొన్నారు.
న్యూయార్క్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయుల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్టర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరంలోని ఇండియా హౌస్లో ఘనంగా నిర్వహించారు.గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వ్యాపారం, మీడియా, ఫైనాన్స్, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అమెరికాలో భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు.FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తమ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు.కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో', 'ఉజ్వల యోజన' వంటి పథకాల ద్వారా భారత్ మహిళా సాధికారతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అలాగే 100 మిలియన్ కుటుంబాలను మహిళల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థికంగా శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరఫున గుర్తింపు సర్టిఫికెట్లు, FIA శాలువాలు, ట్రోఫీలు అందజేశారు.నార్త్స్టార్ స్ట్రాటజీస్ COO జోడి లిన్ హెర్క్లోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల్ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాన్సుల్ జనరల్ సతీమణి మోనాలిసా శువదర్షిణి ప్రధాన్ కూడా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్ మాట్లాడుతూ, కమ్యూనిటీ నిర్మాణంలో FIA పాత్రను కొనియాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అమెరికన్ నటి రేష్మా శెట్టి.. మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ తానియా కిన్సెల్లా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం ఇస్తూ.. అడ్డంకులను అధిగమించిన వైనాన్ని వివరించారు.కార్యక్రమ ప్రారంభంలో దివంగత అవార్డు గ్రహీత రాధా సుబ్రమణ్యం జ్ఞాపకార్థం మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం ముగింపులో FIA ప్రధాన కార్యదర్శి సృష్టి కౌల్ నరులా ధన్యవాదాలు తెలిపారు. FIA జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల వందన సమర్పణతో వేడుకలను ముగిశాయి.ఎఫ్ఐఏ సంస్థ 1970 నుండి భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారతీయ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఇండో–అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తోంది.
క్రైమ్
భార్యతో అక్రమ సంబంధం.. స్నేహితుడిని చంపిన భర్త!
చివ్వెంల(సూర్యాపేట) : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని యువకుడిని హత్య చేసిన వ్యక్తిని, అతడికి సహకరించిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సూర్యాపేట రూరల్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన రత్నావత్ మణిభార్గవ్, రత్నావత్ సాయిదుర్గ ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు స్నేహితులు. సాయిదుర్గ భార్య సాయిశ్రీతో మణిభార్గవ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలియడంతో మణిభార్గవ్కు ఈ నెల 9న రాత్రి సాయిదుర్గ ఫోన్ చేసి గ్రామ శివారులోని అడవికుంట చెరువు వద్దకు రమ్మని చెప్పాడు. దీంతో మణిభార్గవ్ చెరువు వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడి చేరుకున్న సాయిదుర్గ, అతడి భార్య సాయిశ్రీ కలిసి మణిభార్గవ్తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మణిభార్గవ్ను సాయిదుర్గ కిందపడేసి ఛాతిపై బలంగా కొట్టడంతో అతడు స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆటో స్టార్ట్ చేసే తాడును మణిభార్గవ్ మెడకు గట్టిగా బిగించడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం సాయిదుర్గ, సాయిశ్రీ దంపతులు అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో దురాజ్పల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. హైదరాబాద్కు వెళ్తున్న సాయిదుర్గ, సాయిశ్రీ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి ఆటో, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఎవరి కోసం బతకాలె కొడుకా
కరీంనగర్ జిల్లా: అనారోగ్యంతో భర్త దూరమైనా ఒక్కగానొక్క కొడుకే సర్వస్వంగా భావిస్తూ ఆ తల్లి కూలీనాలీ చేసుకుంటూ పోషించుకుంది. భర్త దూరమైన దుఃఖం నుంచి తేరుకోకముందే కొడుకు వెన్నెముక వ్యాధి బారిన పడ్డాడు. ఆపరేషన్కు రూ.లక్షలు అవసరం కాగా.. ఎలాగోలా సొమ్ము పోగు చేసుకుంది. ఇక కొడుక్కు ఏ బాధ లేదనుకున్న సమయంలో విధి మరోసారి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. సైకిల్పై వెళ్తున్న బాలుడు కింద పడడంతో మెదడులో రక్తం గడ్డకట్టింది. ఆపరేషన్ చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శంషాబాద్లో తీవ్ర విషాదం నెలకొనగా.. ఆ తల్లి దుఃఖాన్ని ఆపడం ఎవరితరం కాలేదు.. స్థాని కుల కథనం ప్రకారం.. శంశాబాద్ గ్రామానికి చెందిన బాకారపు రాజేశ్వరి– కుమార్ దంపతుల కొడుకు అక్షిత్(11) ఐదో తరగతి చదువుతున్నాడు. కుమార్ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించగా రాజేశ్వరీ కూలీ పనులు చేసుకుంటూ కొడుకును పోషించుకుంటోంది. అక్షిత్ కొద్ది నెలల నుంచి వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. ఆపరేషన్కు రూ.16 లక్షలు అవసరం కాగా.. రూ.9లక్షలు పోగు చేశారు. ఇటీవల అక్షిత్ సైకిల్ నుంచి పడగా మెదడులో రక్తం గడ్డకట్టింది. కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మెరుగైన చికిత్సకు హైదరాబాద్ తరలించారు. కొద్దిరోజులు అక్కడ చికిత్స పొందగా.. రక్తకణాలు పెరుగుతూ, తగ్గుతున్నాయని కరీంనగర్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి సోమవారం బాలుడు చనిపోయాడు. ‘నన్ను ఒంటరి చేసి వెళ్లిపోయావా బిడ్డా’ అంటూ అంత్యక్రియల్లో తల్లి రోదించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. సర్పంచ్ మెరుగు కళావతి సంపత్ రూ.3,016 ఆర్థికసాయం అందించారు.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ క్షిప్రా మృతి
బెంగళూరు: రోడ్డు ప్రమాదంలో యువ టెక్కీ దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా సుళ్యకు చెందిన టెక్కీ క్షిప్రా (27) మృతి చెందింది. మంగళూరుకు చెందిన శశి కళాభట్కు ఏకైక కూతురు క్షిప్రా. బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో టెక్కీగా పని చేస్తోంది. రాయచూరు జిల్లాలో స్నేహితురాలి పెళ్లి ఉండడంతో సహ ఉద్యోగులతో కలిసి ఆనందంగా కారులో కర్నూలు పర్యటనకు వెళ్లారు. ఆదోని పట్టణం వద్ద కారు డ్రైవర్కు నిద్ర మత్తు వచ్చి చెట్టును ఢీన్నాడు. ఈ ప్రమాదంలో క్షిప్రాకు బలమైన గాయాలై అక్కడే చనిపోయింది. మరో యువకుడు, ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. క్షిప్రా ఎంటెక్ చేసింది, కొన్నేళ్ల కిందట తండ్రి చనిపోగా, ఆమెను తల్లి కంటికి రెప్పలా చూసుకుంటోంది. తల్లీ కూతురు బెంగళూరులోనే నివసిస్తున్నారు. ఇంతలో ఏకైక ఆధారంగా ఉన్న కూతురు కూడా మరణించడంతో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.
బతికే భాగ్యమున్నా.. నమ్మిన సిద్ధాంతం కోసం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, సిద్దిపేట/ మిరుదొడ్డి: రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్న చివరి మహిళా మావోయిస్టు రంగనబోయిన భాగ్య అలియాస్ రూపీ చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఆమె చనిపోయింది. అబూజ్మాడ్ అడవిలోని చోటేబెటియా–పర్తాపూర్ పోలీస్స్టేషన్ ఏరియా పరిధి మచ్పల్లి దగ్గర మావోయిస్టు కమాండర్ రూపీ నేతృత్వాన దళం సంచరిస్తోందనే సమాచారంతో ఆదివారం రాత్రి నుంచి భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. సోమవారం చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో రూపీ మరణించినట్టు కాంకేర్ ఎస్పీ నిఖిల్ రఖేచా వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మరో 12మంది మావోయిస్టులు ఘటనాస్థలం నుంచి తప్పించుకున్నట్టు సమాచారం. దీంతో మచ్పల్లి అడవుల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.చివరి వరకు అక్కడే...ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, లొంగిపొమ్మని ఎందరు చెప్పినా నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడుతానని చెప్పిన రూపీ అలాగే కొనసాగింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రభావంతో దండకారణ్యంలో మావోయిస్టులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. నలువైపులా ఒత్తిడి పెరగడం, కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దళ సభ్యులకు లభించని గడ్డు పరిస్థితులు ఉన్నాయి. రహస్య శిబిరం నుంచి కాలు బయటపెడితే ఎన్కౌంటర్ కావడం తథ్యమనే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు సైతం లొంగుబాట పట్టారు. ఈ క్రమంలోనే రూపీని సైతం లొంగిపోవాలని కోరుతూ కాంకేర్ ఎస్పీ రెండుసార్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. లొంగుబాటుకు మార్గం సుగమం చేస్తామని అక్కడి విలేకరులు సైతం ఆమెకు మూడుసార్లు లేఖలు పంపించారు. అయితే, ఈ ప్రతిపాదనలను ఆమె తిరస్కరించినట్టు స్థానిక మీడియా ద్వారా తెలిసింది. ఆఖరి వరకు ఉద్యమంలోనే ఉంటానంటూ మధ్యవర్తుల ద్వారా సమాధానం పంపినట్టు తెలిపారు. అన్నట్టుగానే చివరకు రూపీ ఎన్కౌంటర్లోనే ప్రాణాలు కోల్పోయారు. శారీరక దివ్యాంగురాలైన రూపీ పట్టుదలతో రెండు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితం గడిపింది. కగార్ నిర్బంధం మధ్య, కేంద్రం విధించిన గడువు దాటే వరకు భద్రతా దళాల కంట పడకుండా ఆమె రహస్య జీవితం గడపడం విశేషం.2002లో అజ్ఞాతంలోకి...సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రంగనబోయిన ఎల్లవ్వ–నర్సయ్య దంపతులకు పెద్ద కూతురైన భాగ్య 2002లో మావోయిస్టుల కార్యకలాపాలకు ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి స్వగ్రామానికి తిరిగి రాలేదు. తొమ్మిదేళ్ల క్రితం తండ్రి నర్సయ్య చనిపోయినా, కడసారి చూపు కోసం భాగ్య రాలేదు. ఎన్కౌంటర్లో భాగ్య మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందటంతో ధర్మారం శోకసముద్రంలో మునిగిపోయింది. భాగ్య మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు గ్రామ సర్పంచ్ చెప్యాల శ్రీనివాస్ నేతృత్వంలో గ్రామస్తులు బయలుదేరి వెళ్లారు.శవమై వస్తున్నవా బిడ్డా....‘లొంగిపోయి ప్రాణాలతో వస్తావనుకున్న బిడ్డా.. చివరకు మాకు దు:ఖాన్ని మిగిల్చి శవమై వస్తున్నవా బిడ్డా..వృద్ధాప్యంలో నేనే చనిపోతే నువ్వు వస్తవో రావో అనుకున్నా బిడ్డా.. ఇప్పుడు నీ శవాన్ని చూసి ఎలా తట్టుకోవాలి బిడ్డా... మీ అయ్య సచ్చినా నువ్వు రాలేదు బిడ్డా’అంటూ... మావోయిస్టు భాగ్య అలియాస్ రూపీ తల్లి ఎల్లవ్వ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఎన్కౌంటర్లో అక్క మృతి చెందిన విషయం తెలిసి భాగ్య చెల్లెళ్లు కవిత, మమత, తమ్ముడు కుమార్లు బోరున విలపించారు.
వీడియోలు
సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
ప్రపంచంలోనే వర్షం వస్తే నీళ్లు ఎత్తిపోసే ఏకైక రాజధాని అమరావతి
మహిళను 6 సార్లు కత్తితో పొడిచిన రాక్షసుడు..
సీఎం రేసులో కీలక నేతలు
ఆపని చేస్తే ఎప్పుడూ చూడని ఉద్యమం చూపిస్తాం, కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్
చైనా చరిత్రలో చూడని అతి పెద్ద హ్యాకింగ్ దేశ రహస్యాలు లీక్..?
ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఒక్క హార్బర్ కూడా కట్టలేదు
ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై
డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం
పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..


