చంద్రబాబు ప్రత్యేక విమానాల ఖర్చు.. ఏడాదికి రూ.54.63 కోట్లు
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగిస్తున్న ప్రత్యేక హెలికాప్టర్, విమానాల అద్దె ఖర్చు రూ.54.63 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సీఎం చంద్రబాబు (వీవీఐపీ) వినియోగించిన ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దె చెల్లించేందుకు రూ.13,65,75,000 విడుదల చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) జె.శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు త్రైమాసికాలకు కలిపి ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దెకు రూ.54.63 కోట్లు అయినట్లు ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఇప్పటికే మూడు త్రైమాసికాలకు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దె చెల్లింపునకు రూ.40.97 కోట్లను విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ప్రత్యేక హెలికాప్టర్తోపాటు ప్రత్యేక విమానం వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆయన తరచూ ప్రత్యేక విమానంలో హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణం చేస్తున్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాలను వినియోగిస్తున్నారు. అందువల్లే ఏడాదిలోనే రూ.54.63 కోట్లు అద్దెల రూపంలో చెల్లించాల్సి వచ్చిందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్, విమానాల అద్దె వ్యయం ఇలా..తొలి త్రైమాసికం రూ.19,12,05,000 రెండో త్రైమాసికం రూ.10,92,60,000మూడో త్రైమాసికం రూ.10,92,60,000 నాలుగో త్రైమాసికం రూ.13,65,75,000 పవన్, లోకేశ్ ప్రత్యేక విమానాల ఖర్చు ఎంతో?ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లనే వినియోగిస్తున్నారు. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పర్యటనలకు, తరచూ హైదరాబాద్కు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు.అయినా పవన్కళ్యాణ్, లోకేశ్ తిరుగుతున్న ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల వ్యయం గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. వీరిద్దరి ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దెలకు ఎంత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది.
ఈ రాశి వారికి బంధువుల ద్వారా శుభవార్తలు..ఆకస్మిక ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: శు.షష్ఠి రా.11.01 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: ఉత్తరాభాద్ర ప.1.20 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: రా.12.46 నుండి 2.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.38 నుండి 8.08 వరకు, అమృత ఘడియలు: ఉ.8.40 నుండి 10.11 వరకుసూర్యోదయం : 6.38సూర్యాస్తమయం : 5.47రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.వృషభం: శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక ప్రగతి. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.కర్కాటకం: స్నేహితులతో తగాదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.సింహం: ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.కన్య: మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలలో అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.తుల: బంధువుల ద్వారా శుభవార్తలు. వాహనయోగం. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.వృశ్చికం: కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.ధనుస్సు: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది.మకరం: అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు విస్తరణలో పురోగతి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.కుంభం: వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనలాభం. కార్యసిద్ధి. ఉద్యోగార్ధులకు శుభవార్తలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.
ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా అదరగొట్టింది. బౌలింగ్లో విఫలమైనప్పటికి బ్యాటింగ్లో మాత్రం దుమ్ములేపింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో చేధించింది.తద్వారా న్యూజిలాండ్ను 7 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తన రీఎంట్రీ మ్యాచ్లో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. రాయ్పూర్లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. తొలి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కిషాన్ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో ఏకంగా 76 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 82 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన కిషన్పై సూర్యకుమార్ ప్రశంసల వర్షం కురిపించాడు. పవర్ప్లేలో అతడు ఆడిన తీరు అద్భుతమని సూర్యకొనియాడాడు. "ఇషాన్ లంచ్లో ఏం తిన్నాడో, మ్యాచ్కు ముందు ఏ 'ప్రీ-వర్కౌట్' డ్రింక్ తీసుకున్నాడో నాకు తెలియదు. కానీ అతడి బ్యాటింగ్ చేసిన తీరు మాత్రం అద్భుతం. కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్ను నేను ఎప్పుడూ చూడలేదు. పవర్ప్లేలో తొలి రెండు ఓవర్లలో మాకు కేవలం 8 పరుగులకే వచ్చాయి. అటువంటిది పవర్ప్లేను 75 పరుగులతో ముగించడం నిజంగా గ్రేట్. ఆ క్రెడిట్ మొత్తం కిషన్కే దక్కాలి. 200 పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు బ్యాటర్ల నుంచి ఇటువంటి ఇన్నింగ్స్లే మేము ఆశిస్తాము. ప్రతీ ఒక్కరూ పూర్తి స్వేచ్చగా ఆడుతూ తమను తాము నిరూపించుకోవాలి. ఈ మ్యాచ్లో ఇషాన్ సరిగ్గా అదే చేశాడు.పవర్ప్లేలో ఇషాన్ స్ట్రైక్ అస్సలు నాకు ఇవ్వలేదు, అందుకు కోపంగా ఉన్నాను(నవ్వుతూ). అయితే కిషాన్ దూకుడుగా ఆడడంతో క్రీజులో కుదురుకోవడానికి నాకు సమయం దొరికింది. చాలా రోజుల తర్వాత హాఫ్ సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. గత మూడు వారాల నుంచి నెట్స్లో ఎక్కువగా గడిపాను. వాటి ఫలితం ఈ మ్యాచ్లో స్పష్టంగా కన్పించింది.ఒకానొక దశలో న్యూజిలాండ్ 230 పరుగులు చేసేలా కనిపించింది. కానీ కుల్దీప్ యాదవ్, వరుణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని కట్టడి చేశారు. దూబే కూడా కీలక ఓవర్ బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. రాబోయో మ్యాచ్లలో ఇదే బ్రాండ్ ఆఫ్ కొనసాగిస్తాము" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు.
బిజినెస్ నుంచి బ్రేకింగ్ న్యూస్ దాకా
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా ఇండో–ఏషియన్ న్యూస్ సర్విస్(ఐఏఎన్ఎస్)ను పూర్తిగా స్వాదీనంలోకి తెచ్చుకుంది. ఇప్పటికే న్యూస్ ఏజెన్సీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసిన అదానీ గ్రూప్ మిగిలిన 24 శాతం వాటాను సైతం చేజిక్కించుకుంది. డీల్ విలువను వెల్లడించనప్పటికీ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ ద్వారా ఐఏఎన్ఎస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్లో మిగిలిన వాటా ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. కాగా.. 2023 డిసెంబర్లో అదానీ గ్రూప్ ఏఐఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీలో 50.5 శాతం వాటా కొనుగోలు చేసింది. తద్వారా న్యూస్వైర్ ఏజెన్సీని ఏఎంజీ మీడియాకు అనుబంధ సంస్థగా మార్చుకుంది. తిరిగి 2024 జనవరిలో ఐఏఎన్ఎస్లో వాటా పెంచుకోవడం ద్వారా ఏఎంజీ మీడియా 76 శాతం వోటింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ బాటలో మిగిలిన 24 శాతాన్ని సొంతం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఐఏఎన్ఎస్ను పూర్తి అనుబంధ సంస్థగా ఏర్పాటు చేసుకోనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. దేశీయంగా వివిధ భాషల న్యూస్ ఏజెన్సీలలో ఒకటైన ఐఏఎన్ఎస్ ప్రింట్, డిజిటల్, బ్రాడ్క్యాస్ట్ ప్లాట్ఫామ్స్కు వార్తలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్డీటీవీ, బీక్యూ ప్రైమ్లలో వాటాలు కొనుగోలు చేసిన అదానీ గ్రూప్ ఇకపై మీడియా, కంటెంట్ ఎకోసిస్టమ్లో కార్యకలాపాలను మరింత విస్తరించనుంది.
‘సోలార్’ స్కామ్ రూ.500 కోట్లు
‘జగన్నాథుని జనయాత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
సీటు కోసం కాలిపై వేటు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ప్రజల్ని తప్పుదోవ పట్టించారు
మేం చెప్పిందే చేయాలి
మెడికల్ బిల్లులకు మోక్షమెప్పుడు?
‘ల్యాండ్ టైట్లింగ్’ ఆదర్శం
ఇరాన్పై యుద్ధమేఘాలు!
బంధువుకు భూ పందేరం.. గీతం కబ్జాలకు గిఫ్ట్!
కరుణతోనే సామాజిక మార్పు
'వెంకటేశ్' రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన సుస్మిత
నాకు నాన్న లేరు.. 'చిరు' సార్ను చూస్తే ఏడుపొచ్చింది: ఖుషి
అప్పుడు ఇనుము.. ఇప్పుడు వెండి..
బంగారం, వెండి తగ్గొచ్చు పెరగొచ్చు.. కానీ..
ODI WC 2027: భారత వన్డే జట్టు.. ఊహించని పేరు!
టీమిండియాకు భారీ షాక్
లిక్కర్ మాఫియా, మైనింగ్ కింగ్లు బైకు దొంగలు..ఎవరినీ మా పార్టీ చిన్న చూపు చూడదు!
ఉండటానికి అసలు ఈ భూమినే లేకుండా చేస్తా!
వందల కోట్ల అక్రమాస్తులను పట్టించిన రూ.60 వేల లంచం
రూ. 30 కోట్ల సంపద కంటే అతి విలువైనది పోగొట్టుకున్నా..!
షాకిచ్చిన ఐసీసీ.. స్పందించిన బంగ్లాదేశ్
పసిడి, వెండి ఢమాల్.. రెచ్చిపోయిన ధరలు రివర్స్!
ఈ రాశి వారికి ధనప్రాప్తి.. సంఘంలో గౌరవం
అంతకంటే ఎక్కువ ఇంకేం కోరుకోలేను.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్
IND vs NZ: అతడు అవుట్!.. భారత తుదిజట్టులో మార్పు!
భర్తను చంపేసి.. రాత్రంతా పోర్న్ వీడియోస్ చూస్తూ గడిపిన మాధురి..
‘గిల్పై వేటు.. వన్డే కెప్టెన్గా తిరిగి రోహిత్ శర్మనే’
బీజేపీ నూతన సారథికి 'ఐదు రాష్ట్రాల' ఎనికల సవాలు
గుడిపై అపచారం.. వేణుపై భగ్గుమంటున్న నెటిజన్లు
పదో సినిమా ఫిక్స్.. టైటిల్ విచిత్రంగా ఉండబోతోంది: అనిల్
‘సోలార్’ స్కామ్ రూ.500 కోట్లు
‘జగన్నాథుని జనయాత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
సీటు కోసం కాలిపై వేటు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ప్రజల్ని తప్పుదోవ పట్టించారు
మేం చెప్పిందే చేయాలి
మెడికల్ బిల్లులకు మోక్షమెప్పుడు?
‘ల్యాండ్ టైట్లింగ్’ ఆదర్శం
ఇరాన్పై యుద్ధమేఘాలు!
బంధువుకు భూ పందేరం.. గీతం కబ్జాలకు గిఫ్ట్!
కరుణతోనే సామాజిక మార్పు
'వెంకటేశ్' రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన సుస్మిత
నాకు నాన్న లేరు.. 'చిరు' సార్ను చూస్తే ఏడుపొచ్చింది: ఖుషి
అప్పుడు ఇనుము.. ఇప్పుడు వెండి..
బంగారం, వెండి తగ్గొచ్చు పెరగొచ్చు.. కానీ..
ODI WC 2027: భారత వన్డే జట్టు.. ఊహించని పేరు!
టీమిండియాకు భారీ షాక్
లిక్కర్ మాఫియా, మైనింగ్ కింగ్లు బైకు దొంగలు..ఎవరినీ మా పార్టీ చిన్న చూపు చూడదు!
ఉండటానికి అసలు ఈ భూమినే లేకుండా చేస్తా!
వందల కోట్ల అక్రమాస్తులను పట్టించిన రూ.60 వేల లంచం
రూ. 30 కోట్ల సంపద కంటే అతి విలువైనది పోగొట్టుకున్నా..!
షాకిచ్చిన ఐసీసీ.. స్పందించిన బంగ్లాదేశ్
పసిడి, వెండి ఢమాల్.. రెచ్చిపోయిన ధరలు రివర్స్!
ఈ రాశి వారికి ధనప్రాప్తి.. సంఘంలో గౌరవం
అంతకంటే ఎక్కువ ఇంకేం కోరుకోలేను.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్
IND vs NZ: అతడు అవుట్!.. భారత తుదిజట్టులో మార్పు!
భర్తను చంపేసి.. రాత్రంతా పోర్న్ వీడియోస్ చూస్తూ గడిపిన మాధురి..
‘గిల్పై వేటు.. వన్డే కెప్టెన్గా తిరిగి రోహిత్ శర్మనే’
బీజేపీ నూతన సారథికి 'ఐదు రాష్ట్రాల' ఎనికల సవాలు
గుడిపై అపచారం.. వేణుపై భగ్గుమంటున్న నెటిజన్లు
పదో సినిమా ఫిక్స్.. టైటిల్ విచిత్రంగా ఉండబోతోంది: అనిల్
ఫొటోలు
తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు (ఫోటోలు)
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్ డే పార్టీలో సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
Anchor Suma : అందం పెరుగుతోంది కానీ తగ్గట్లేదు (ఫోటోలు)
లుక్ టెస్ట్ అంటూ ఫోటోలు వదిలిన శివాత్మిక రాజశేఖర్
సుకుమార్ కుమార్తె బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
జిమ్లో కష్టపడుతున్న అనసూయ (ఫోటోలు)
ఆర్సీబీ క్వీన్స్.. అదిరిపోయే లుక్స్.. స్మృతి స్పెషల్ (ఫొటోలు)
కళ్లతో మాయ చేస్తూ.. అనుపమ గ్లామర్ షో (ఫొటోలు)
మంచు ముద్దలలో మునిగిన లోయ (ఫొటోలు)
ఇది అంతులేని కథలా.. సిట్ విచారణ వేళ కేటీఆర్ (చిత్రాలు)
సినిమా
కీర్తి సురేశ్ హోంటూర్.. ఇల్లులానే లేదు!
సెలబ్రిటీలు ప్రేమలో ఉంటే ఇట్టే తెలిసిపోతుంది. కానీ, హీరోయిన్ కీర్తి సురేశ్ మాత్రం తన ప్రేమను సీక్రెట్గా ఉంచింది. ఒకటీరెండేళ్లు కాదు, ఏకంగా 15 ఏళ్లు! పన్నెండో తరగతిలోనే ఆంటోని తటిల్తో లవ్లో పడ్డ కీర్తి.. స్టార్ హీరోయిన్ అయ్యాక కూడా ఆ రిలేషన్ను కొనసాగించింది. మనసుపడ్డవాడినే మనువాడింది. 2024లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయల ప్రకారం వీరి పెళ్లి జరిగింది.ఇంటి పేరుతాజాగా ఈ దంపతులు తమ హోమ్ టూర్ వీడియోతో వార్తల్లోకెక్కారు. కొచ్చిలో వాళ్లుంటున్న ఇంటిని చూపించారు. ఆ భవంతికి హౌస్ ఆఫ్ ఫన్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. ఫ్యామిలీ ఫోటోలు, పెళ్లి ఫోటోలు, మహానటి సినిమాకుగానూ జాతీయ అవార్డు అందుకున్నప్పుడు తనపై వచ్చిన వార్తల కథనాల క్లిప్పింగ్స్ను కీర్తి చూపించింది. ముఖ్యంగా తన జ్ఞాపకాలకు, అనుభవాలకు వేదికైన మెమొరీ వాల్ అన్నింటికంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇల్లులా లేదుతన పెంపుడు కుక్కలు నైక్, కెన్నీ కోసం స్పెషల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. సాంప్రదాయాన్ని, మోడ్రన్ను మిక్స్ చేసేలా ఇంటీరియర్ డిజైన్ ఉంది. బాల్కనీ మాత్రం మొక్కలతో పచ్చదనం పరుచుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ భవంతి చూసిన నెటిజన్లు.. ఇది వారి ఇల్లులా కనిపించట్లేదు, కెఫెలా ఉందని, బాగుందని కామెంట్లు చేస్తున్నారు. సినిమాహీరోయిన్గా కీర్తి సురేశ్ సూపర్ సక్సెస్.. అటు కమర్షియల్ సినిమాలతో పాటు ఇటు లేడీ ఓరియంటెడ్ సినిమాలూ చేస్తోంది. అయితే భవిష్యత్తులో దర్శకురాలిని అవ్వాలని ఉందని ఆ మధ్య మనసులోని మాట బయటపెట్టింది. గత ఐదారేళ్లుగా తనకు వచ్చిన ఐడియాలను రాసిపెట్టుకున్నట్లు తెలిపింది. మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ, మలయాళంలోనూ ఒక్కో సినిమా చేస్తోంది.చదవండి: నా ఫోటోలు చూసి అమ్మ ఒకటే ఏడుపు: హీరోయిన్
అనుపమ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎట్టకేలకు రిలీజ్ డేట్
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ లాక్ డౌన్. ఈ చిత్రానికి ఏఆర్ జీవా దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుందని లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. లాక్డౌన్లో చిక్కుకుపోయి కష్టాలు పడిన ఓ యువతి జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాలో అనిత అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ చిత్రంలో చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్స్టన్, ఇందుమతి, రాజ్కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎన్ఆర్ రఘునందన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించారు. Every pause had a purpose. 🎬 #Lockdown in cinemas Jan 30. 🗓️#LockdownInCinemasJan30@anupamahere #ARJeeva @LycaProductions #Subaskaran @gkmtamilkumaran #PriyaaaVenkat @shakthi_dop @NRRaghunanthan @sidvipin @EditorSabu @sherif_choreo #SriGirish #OmSivaprakash… pic.twitter.com/hqNtUX8qxl— Lyca Productions (@LycaProductions) January 23, 2026
నిహారిక హారర్ కామెడీ సినిమా.. గ్లింప్స్ రిలీజ్
'మ్యాడ్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంగీత్ శోభన్.. హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాకాస'. మెగా డాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తోంది. గతంలో 'కమిటీ కుర్రోళ్లు'తో హిట్ కొట్టిన ఈమె.. అప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆకట్టుకుంది. ఇప్పుడు హారర్ కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా 'రాకాస' గ్లింప్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: మెగా హీరో పాన్ ఇండియా సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?)వీరుడు అని పవర్ఫుల్ డైలాగ్ చెప్పి ఎంట్రీ ఇచ్చిన సంగీత్ శోభన్.. ఓ భయంకరమైన ప్లేసులో చిక్కుకుంటాడు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీలా అనిపిస్తుంది. ఈ చిత్రంతో మానస శర్మ దర్శకురాలిగా పరిచయమవుతోంది. నయన్ సారిక హీరోయిన్. ఏప్రిల్ 3న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)
జిమ్లో అనసూయ.. మాయ చేసేస్తున్న మృణాల్
జిమ్లో కష్టపడిపోతున్న యాంకర్ అనసూయసిల్క్ చీరలో అందంగా 'ధురంధర్' సారా అర్జున్సింపుల్ బట్ బ్యూటీపుల్గా కాయదు లోహర్సన్నని నడుముతో మాయ చేస్తున్న దిశా పటానీరోజురోజుకీ మెరుపుతీగలా మారిపోతున్న త్రిషనవ్వుతూ కితకితలు పెట్టేస్తున్న మృణాల్ ఠాకుర్ View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Sara Arjun (@saraarjunn) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet)
క్రీడలు
పార్థ్, ధర్మేంద్ర మాయాజాలం
రాజ్కోట్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో పంజాబ్ జట్టుపై సౌరాష్ట్ర విజయం సాధించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా రెండు రోజుల్లోనే ముగిసిన పోరులో సౌరాష్ట్ర 194 పరుగుల తేడాతో పంజాబ్ను చిత్తు చేసింది. పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తున్న టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ వరుసగా రెండో ఇన్నింగ్స్లోనూ విఫలం కావడం ఫలితంపై ప్రభావం చూపింది. ఓవర్నైట్ స్కోరు 24/3తో శుక్రవారం రెండో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర... చివరకు 58.5 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (41 బంతుల్లో 56; 10 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (44 బంతుల్లో 46; 4 ఫోర్లు), హేత్విక్ కొటక్ (39; 3 ఫోర్లు, 2 సిక్స్లు), పార్థ్ భట్ (37 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) కీలక పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 5 వికెట్లు పడగొట్టగా... జస్సిందర్ సింగ్ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ప్రత్యర్థి ముందు 320 పరుగుల లక్ష్యం నిలవగా... పంజాబ్ మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చింది. భారీ ఆశలు పెట్టుకున్న శుబ్మన్ గిల్ (32 బంతుల్లో 14; 1 ఫోర్) విఫలమవడంతో పంజాబ్ చివరకు 39 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఉదయ్ శరణ్ (71 బంతుల్లో 31; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... తక్కినవాళ్లంతా చేతులెత్తేశారు. సౌరాష్ట్ర బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ పార్థ్ భట్, ధర్మేంద్ర జడేజా చెరో 5 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్లో గిల్ సహా ఐదు వికెట్లు తీసిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పార్థ్ భట్... రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్లు వేసి కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీయం విశేషం. రెండో ఇన్నింగ్స్లోనూ గిల్ను పార్థ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంతకుముందు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులు చేయగా... పంజాబ్ 139 పరుగులు చేసింది. ఈ విజయంతో సౌరాష్ట్ర పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరి నాకౌట్ అవకాశాలను మెరుగు పరుచుకోగా... పంజాబ్ మూడో ఓటమితో క్వార్టర్స్ రేసుకు దూరమైంది. ఇదే గ్రూప్లో భాగంగా జరుగుతున్న మరో మ్యాచ్లో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 323 పరుగులకు ఆలౌట్ కాగా... కర్ణాటక 58 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. మహారాష్ట్రతో మ్యాచ్లో గోవా జట్టు తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకు ఆలౌట్ కాగా... మహారాష్ట్ర 91 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. కేరళతో మ్యాచ్లో చండీగఢ్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు చేయగా... కేరళ రెండో ఇన్నింగ్స్లో 5.5 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది.
క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమి
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ పీవీ సింధు, లక్ష్య సేన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 13–21, 17–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యు ఫె (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 18–21, 20–22తో ప్రపంచ 44వ ర్యాంకర్ పానిత్చపోన్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, లక్ష్య సేన్లకు మూడు వేల డాలర్ల (రూ. 2 లక్షల 75 వేలు) చొప్పున ప్రైజ్మనీ, 5,040 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఇషాన్, సూర్య విధ్వంసం.. న్యూజిలాండ్ను చిత్తు చేసిన భారత్
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో ఊదిపడేసింది. లక్ష్య చేధనలో 7 పరుగులకే ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వికెట్లను భారత్ కోల్పోయింది.అయితే ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. భారీ షాట్లతో ప్రత్యర్ధి బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం కిషన్ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 76 పరుగులు చేశాడు. కిషన్ ఔటయ్యాక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత ఆచితూచి ఆడిన సూర్య.. క్రీజులో సెటిల్ అయ్యాక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టీ20ల్లో ఏడాది తర్వాత తన హాఫ్ సెంచరీ మార్క్ను సూర్య అందుకున్నాడు. ఓవరాల్గా 37 బంతులు ఎదుర్కొన్న స్కై.. 9 ఫోర్లు, 4 సిక్స్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే (18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లతో 36 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఇష్ సోధీ, డఫీ తలా వికెట్ సాధించారు. టీ20ల్లో న్యూజిలాండ్పై భారత్కు ఇదే అత్యధిక విజయవంతమైన రన్ చేజ్ కావడం విశేషం.Let me tell to today's Generation, Ishan Kishan was our Abhishek Sharma before Abhishek Sharma existed. pic.twitter.com/wtwZ7D4bVu— Selfless⁴⁵ (@SelflessCricket) January 23, 2026కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (44), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.
IND VS NZ 2nd T20I: న్యూజిలాండ్ భారీ స్కోర్
రాయ్పూర్లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.న్యూజిలాండ్ ఈ స్కోర్ చేసేందుకు ప్రతి ఒక్కరి దోహదపడ్డారు. రచిన్ రవీంద్ర (44), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో సత్తా చాటారు. కాన్వే (19), సీఫర్ట్ (24), ఫిలిప్స్ (19), డారిల్ మిచెల్ (18), మార్క్ చాప్మన్ (10), జకరీ ఫౌల్క్స్ (15 నాటౌట్) క్రీజ్లో ఉన్నంతసేపు బ్యాట్ ఝులిపించారు. ఆఖర్లో సాంట్నర్, ఫౌల్క్స్ క్యామియో న్యూజిలాండ్ను 200 పరుగుల మార్కును దాటించింది.భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో అర్షదీప్ సింగ్ (4-0-53-0) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియాఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20లో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవెన్లో తెచ్చారు.మరోవైపు న్యూజిలాండ్ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్ స్థానంలో టిమ్ సీఫర్ట్.. క్రిస్టియన్ క్లార్క్ స్థానంలో జకరీ ఫౌల్క్స్, జేమీసన్ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీలో సమగ్ర భూ రీసర్వేపై నాడు దుష్ప్రచారం చేసి, నేడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.... సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
వచ్చే ఏడాది మళ్లీ ప్రజల్లోకి. ఏడాదిన్నరపాటు పాదయాత్ర. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ
ఆదాయాన్నిచ్చే కొత్త వలస-కిరండోల్ లైన్ లేకుండానే విశాఖ రైల్వేజోన్. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం
స్వచ్ఛంద పంటల బీమాకూ మంగళం. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం
ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారిన మద్యం... సంక్రాంతి సీజన్లో టీడీపీ మద్యం సిండికేట్కు పండుగ
ఆంధ్రప్రదేశ్లో భూముల ‘రీ సర్వే’పై చంద్రబాబు దొంగాట... అప్పుడు దుష్ప్రచారం చేసి ఇప్పుడు క్రెడిట్ చోరీ కోసం పాకులాట
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా జూదాల జాతర.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో విచ్చలవిడిగా మద్యం ప్రవాహం
సంక్రాంతి సంబరాలను జూదంగా మార్చేసిన కూటమి నేతలు... ఏపీలో పండుగ వేళ యథేచ్ఛగా దోపిడీ... 2 రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల జూదం .
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ రిజిస్ట్రేషన్ల బాదుడు... వచ్చే నెల నుంచి పెంపు అమలు చేసేందుకు సన్నాహాలు... ఆదాయమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు పండుగ లేనట్లే... ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచిన ఏపీ సీఎం చంద్రబాబు
బిజినెస్
కంపెనీ భవిష్యత్ మార్చిన కళ్లజోడు!
దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఎందరో హాజరవుతారు. ఈ సారి ఆ సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) హాజరయ్యారు. ఈ సమయంలో మాక్రాన్ ధరించిన సన్గ్లాసెస్ ఎందోమందిని ఆకట్టుకుంది.మాక్రాన్ ఉపయోగించిన సన్గ్లాసెస్ చూడటానికి చాలా స్టైలిష్గా, కొత్తగా కనిపించడంతో.. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా చాలామంది అవి ఏ బ్రాండ్?, అని తెలుసుకోవడానికి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆలా తెలుసుకునే క్రమంలోనే అవి iVision Tech కంపెనీ తయారు చేసినవని తెలుసుకున్నారు.మాక్రాన్ ధరించిన కళ్లజోడు పసిఫిక్ ఎస్1 మోడల్, దీని ధర 659 యూరోలు అని కంపెనీ తన వెబ్సైట్లో వెల్లడించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు వంటి ప్రముఖ వ్యక్తి వాడిన ఉత్పత్తి అంటే, ఆ కంపెనీపై నమ్మకం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పెట్టుబడిదారులు కూడా ఈ కంపెనీ భవిష్యత్తులో ఇంకా ఎదిగే అవకాశం ఉందని భావించి ఆ సంస్థ షేర్లు కొనడం మొదలుపెట్టారు. దాంతో స్టాక్ మార్కెట్లో సంస్థ షేర్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయని సీఈఓ స్టెఫానో ఫుల్చిర్ పేర్కొన్నారు.ఈ షేర్ ధర పెరగడం వల్ల కంపెనీ మొత్తం విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) సుమారు 38 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే ఒక కళ్లజోడు వల్లే కంపెనీకి కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇది సాధారణంగా ఊహించని విషయం.ఈ రోజుల్లో ఫ్యాషన్, టెక్నాలజీ, వ్యాపారం అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఒక ప్రముఖ నాయకుడు ఉపయోగించిన వస్తువు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టగలదు. అదే సమయంలో, ఒక చిన్న కంపెనీకి కూడా పెద్ద అవకాశాలు తీసుకురాగలదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.ఇదీ చదవండి: ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి..
బంగారం, వెండి తగ్గొచ్చు పెరగొచ్చు.. కానీ..
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి ఆస్తుల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అన్న విషయాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తాత్కాలిక మార్కెట్ ఊగిసలాటలకంటే దీర్ఘకాలిక ఆర్థిక వాస్తవాలే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈమేరకు సోషల్ మీడియాలో రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక పోస్ట్ చేశారు. అమెరికా జాతీయ రుణం నిరంతరం పెరుగుతుండటం, డాలర్ కొనుగోలు శక్తి తగ్గుతుండటమే తన పెట్టుబడి దృక్పథానికి ప్రధాన కారణమని కియోసాకి తెలిపారు.“బంగారం, వెండి లేదా బిట్కాయిన్ ధరలు పెరుగుతాయా పడిపోతాయా అని నేను పట్టించుకోను, ఎందుకంటే అమెరికా జాతీయ రుణం పెరుగుతూనే ఉంది, అదే సమయంలో డాలర్ విలువ క్రమంగా తగ్గుతోంది” అంటూ తన ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చారు.కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వ ద్రవ్య విధానాలపై కియోసాకి చాలాకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజా వ్యాఖ్యల్లో, ఫెడరల్ రిజర్వ్, యూఎస్ ట్రెజరీ, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను “అధిక విద్య కలిగిన కానీ అర్హత లేని పీహెచ్డీలు” నియంత్రిస్తున్నారని విమర్శించారు.ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని కియోసాకి తెలిపారు. పరిమిత సరఫరా ఉన్న ఈ ఆస్తులు ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదలకు రక్షణగా నిలుస్తాయని ఆయన నమ్మకం.Q: Do I care when the price of gold silver or Bitcoin go up or down?A: No. I do not care.Q: Why Not?A: Because I know the national debt of the US keeps going up and the purchasing power of the US dollar keeps going down.Q: Why worry about the price of gold, silver,…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 23, 2026
వరుసగా 4 రోజులు సెలవులు.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్
జనవరి నెలాఖరులో బ్యాంకు పనులుండే కస్టమర్లకు అలర్ట్.. వరుస సెలవులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు రోజుల బ్యాంక్ సెలవులు ఖరారవ్వగా, నాలుగో రోజు బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపుతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడే పరిస్థితి కనిపిస్తోంది.జనవరి 24 నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. మరుసటి రోజు జనవరి 25 ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే ఉంటుంది. అంటే వరుసగా మూడు రోజులు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు.ఇదిలా ఉండగా, వారానికి ఐదు పని దినాలు అమలు చేయాలనే దీర్ఘకాలిక డిమాండ్తో జనవరి 27న దేశవ్యాప్తంగా సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఒకవేళ ఈ సమ్మె జరిగితే, నాలుగు రోజుల పాటు బ్యాంక్ శాఖలు పూర్తిగా మూసి ఉండే అవకాశం ఉంది.ఆన్లైన్ సేవలు యథావిధిగా..సెలవుల నేపథ్యంలో బ్యాంక్ బ్రాంచ్లలో చేయాల్సిన అత్యవసర పనులను కస్టమర్లు ముందుగానే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివున్నా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వీటి ద్వారా చెల్లింపులు, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేయవచ్చు.
అమెజాన్ ఉద్యోగులకు అమావాస్యే! కత్తులు సిద్ధం!!
అమెజాన్లో వేలాది ఉద్యోగులు ఉద్వాసనకు దగ్గరయ్యారు. రాయిటర్స్, బ్లూమ్బర్గ్ ఉటంకించిన వర్గాల సమాచారం ప్రకారం.. అమెజాన్ వచ్చే వారం ప్రారంభంలో మరోసారి కార్పొరేట్ ఉద్యోగ కోతలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. అంతర్గత బ్యూరోక్రసీని తగ్గించడం, నిర్వహణలో అధిక పొరలను తొలగించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.గతేడాది అక్టోబర్లో సుమారు 14 వేల ఉద్యోగాలను తొలగించిన తర్వాత ఇప్పుడు కూడా మరో 14 వేల మందికి పైగా ఉద్యోగుల తొలగింపు అమెజాన్ సిద్ధమైంది. ఈ రెండు రౌండ్లలో మొత్తంగా 30 వేల మందిని తొలగించాలన్నది అమెజాన్ టార్గట్ అని రాయిటర్స్ ఇప్పటికే నివేదించింది. తాజా రౌండ్ లేఆఫ్ల ప్రక్రియ మంగళవారం నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.ప్రభావితమయ్యే విభాగాలురాయిటర్స్ సమాచారం ప్రకారం.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్, ప్రైమ్ వీడియో, మానవ వనరులు (People Experience and Technology) విభాగాలలో ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశముంది. అయితే ఉద్యోగ కోతల ఖచ్చితమైన సంఖ్య మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. గత అక్టోబర్లో కోతలను అమలు చేయాలా లేదా 2026 ప్రారంభానికి వాయిదా వేయాలా అనే స్వేచ్ఛను అమెజాన్ మేనేజర్లకు ముందుగానే ఇచ్చింది. దీని ద్వారా భవిష్యత్తులో మరిన్ని కోతలకు అవకాశం ఉందని సంకేతాలు కనిపిస్తున్నాయి.పూర్తిగా అమలైతే, ఈ తొలగింపులు అమెజాన్ కార్పొరేట్ వర్క్ఫోర్స్లో దాదాపు 10% వరకు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం అమెజాన్కు సుమారు 3.5 లక్షల కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్లో మొత్తం 15.7–15.8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో ఎక్కువ మంది గిడ్డంగులు, ఫుల్ఫిల్మెంట్ కేంద్రాల్లో ఉన్నారు.గతంలోనూ భారీ కోతలు2022 చివరి భాగం నుంచి 2023 ప్రారంభం వరకు అమెజాన్ సుమారు 27,000 ఉద్యోగాలను తొలగించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ కోతలలో ఒకటిగా నిలిచింది. గతేడాది అక్టోబర్లో తొలగింపులకు గురైన ఉద్యోగులకు ఇతర అంతర్గత పాత్రలు లేదా కొత్త అవకాశాలు వెతుక్కునేందుకు 90 రోజుల పేరోల్ గ్యారెంటీ ఇచ్చినట్లు రాయిటర్స్ తెలిపింది.
ఫ్యామిలీ
శ్రీపంచమి రోజున సరస్వతి మాతను ఎలా పూజించాలంటే..!
ఈ ఆధునిక యుగంలో సమస్తానికీ మూలకారణం విద్య ఒక్కటే. చక్కటి విద్యకారణంగానే పిల్లలు సభ్యమానవులై, మంచి జీవితాన్ని గడపగలుగుతారు. భాషాజ్ఞానం, వాక్పటుత్వం, వాక్చాతుర్యం ద్వారానే వారు ఇతరులపై తమదైన ముద్ర వేయగలుగుతారు. పవిత్రంగా, మనస్పూర్తిగా, నిర్మలమైన మనస్సుతో అమ్మను ఆరాధిస్తే చాలు ఆ చదువుల తల్లి ప్రసన్నమై కోరిన విద్యలను ప్రసాదిస్తుంది.సకల కళలకు, విద్యకు అధిదేవత శ్రీసరస్వతీదేవి. వివిధ పురాణాలలో సరస్వతీ ఆవిర్భావం గురించి వివిధ కథనాలు కనబడతాయి. గాయత్రీ ఉపాసనలో కూడా సరస్వతీదేవి ప్రస్తావన కనబడుతుంది. ‘‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి.....’’ అంటూ విధ్యాభ్యాసం ప్రారంభిస్తారు. అగ్నికార్యక్రమాలలో కూడా సరస్వతీదేవి ప్రార్థన కనిపిస్తుంది. ఈ విధంగా సరస్వతీదేవి ప్రస్తావన అన్ని ఙ్ఞాన సముపార్జన కార్యక్రమాలలో, దేవతాపూజా విధానాలలో కనిపిస్తుంది. ఎవరైనా సరే, తమకుగాని, తమ హితులు, సన్నిహితులు, పుత్రులు, బంధుమిత్రులకు పాండిత్యం లభించాలన్నా, కోరిన కోరికలు నెరవేరాలన్నా, ఉన్నత విద్యాప్రాప్తి, ఉన్నతోద్యోగం, పదోన్నతి లభించాలన్నా వసంత పంచమి నాటి ఉదయమే స్నానాదికాలు ముగించుకుని, గణపతిని పూజించి, కలశంలో దేవిని ఆవాహన చేయాలి. సరస్వతీదేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమె ప్రతిమ లేదా చిత్రపటాన్ని తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్లనువ్వులతో చేసిన లడ్లు, చెరుకురసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపళ్లు వంటి వాటిని నివేదిస్తే సరస్వతీదేవి ప్రసన్నురాలై కోరిన కోరికలు తీరుస్తుందని శాస్త్రోక్తి. లేదంటే ఎవరైనా పేద విద్యార్థులను చదివించే బాధ్యతను హృదయపూర్వకంగా తీసుకోవడం లేదా శక్తి కొలది ఎవరైనా పేద విద్యార్థులకు పుస్తకాలను కొనివ్వడం లేదా పండితులు, గురువులకు గ్రంథాలను బహూకరించడం. (చదవండి: ఇవాల్టితో శబరిమల దర్శనం ముగియనుంది..!)
రూ. 30 కోట్ల సంపద కంటే అతి విలువైనది పోగొట్టుకున్నా..!
జీవితంలో ఏం పోగొట్టుకున్నా..ఏదో ఒక సమయానికి తిరిగి దాన్ని సంపాదించుకోగలం. కానీ పాడైన ఆరోగ్యాన్ని తిరిగి పొందడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి పూడ్చలేని నష్టం వాటిల్లచ్చు కూడా. అందుకే భూమ్మీద నూకలు ఉంటే ఏమైనా చేయగలం..అదే పోతే ఎన్ని ఉన్నా..నిరూపయోగమే అని మన పెద్దలు ఊరికే అనలేదు కాబోలు. ఇప్పుడు ఆ విషయాన్ని ఓ వ్యవస్థాపకుడు నెట్టింట షేర్చేస్తూ..తాను కూడా అదే తప్పిదం చేశానంటూ సోషల్ మీడియా వేదికగా తన గోడుని వెళ్లదీసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రతిఒక్కర్నీ ఆలోచించేలా చేయడమే గాక 'ఆరోగ్యమే అన్నికంటే ముఖ్యం' అనే విషయాన్ని అందరికి గర్తు చేసేలా అమితంగా ఆకర్షిస్తోంది. ముంబైకి చెందిన వ్యవస్థాపకుడు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని షేర్ చేశాడు. తాను వ్యాపార సంస్థలో సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టపోయానని చెప్పారు. దానిఫలితం తన శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించిందని నిజాయితీగా వివరించారు. తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పటికీ..బరువు పెరుగుతూనే వస్తున్నానని వాపోయారు. వ్యాపారం నష్టం తట్టుకోవడం సులువే..ఎప్పటికైన పోగొట్టుకున్నది సంపాదించేయొచ్చు. కానీ పాడైన ఆరోగ్యం బాగవ్వడం దాదాపు అసాధ్యం అని బాధగా చెప్పుకొచ్చారు. అంతేగాదు వ్యాపార నష్టం ఎప్పటికీ వ్యక్తిగత నష్టానికి దారితీయకూడదని గట్టిగా హెచ్చరించారు కూడా. తాను వ్యాపారంలో కేవలం రూ. 30 కోట్లే పోగొట్టుకున్నానని, దానికంటే విలువైన ఆరోగ్యంకోల్పోయానని ఆవేదనగా చెప్పుకొచ్చారు ఎవర్స్టోన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దేశాయ్. కాగా, 2017లో దేశాయ్ భారతీయ స్పోర్ట్స్ బ్రాండ్ని దేశాయ్ D: FYని ప్రారంభించారు. అయితే ఈ వెంచర్ భారీ నష్టాలను చవిచూసింది. కేవలం 30 నెలల్లో ఆయన దాచుకున్న పొదుపు మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. అయితే అంతా తాను 30 కోట్లు ఎలా కోల్పోయానో ఆరా తీశారే గానీ..ఈ 30 నెలలలో ఎంత టెన్షన్, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నాననేది అడగలేదని అన్నారు. నిద్రలేమి అదిక బరువుకి దారితీస్తుంది..ఆ టైంలో ఒత్తిడితో రాత్రి ఆరుగంటల కంటే తక్కువ సమయం నిద్రపోయానని, తనకు తెలియికుండానే చాలా ఒత్తిడిని అనుభవించానని అన్నారు దేశాయ్. వారానికి నాలుగుసార్లు వాకింగ్, జాగింగ్ వంటివి అన్ని చేసినా..తన శరీరంలో పెద్దగా మార్పులు కనిపించలేదని అన్నారు. ఎంత కష్టపడి వర్కౌట్లు చేసినా..నాణ్యమైన నిద్ర మాత్రం తిరిగి పొందలేకపోయానన్నారు. అలాగే ఒత్తిడిని కూడా దూరం చేసుకోలేకపోయానని చెప్పారు. ఒత్తిడి, నిద్రలేమి శరీరాన్ని చిత్తు చేస్తాయ్..తన పోస్ట్లో ఒత్తిడి, నిద్ర లేమి ఏవిధంగా శరీరాన్ని ప్రభావితం చేస్తాయో వివరించారు. ఆరుగంటల కంటే తక్కువ నిద్ర లేమి ఇన్సులిన్ని ప్రభావితం చేసి, టెస్టోస్టిరాన్ను దెబ్బతీస్తుంది.ఎక్కువైన కార్టిసాల్ (ఒత్తిడి ) క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ కొవ్వు తగ్గడాన్ని నిరోధిస్తుందిఎంతలా ప్రయత్నించినా నిద్ర లేమిని తరిమికొట్టలేరుచివరగా ఆయన తాను కోల్పోయిన సంపదను తిరిగి పొందగలిగినప్పటికీ..ఆరోగ్యపరంగా పూర్తిస్థాయిలో కోలుకోలేదని అన్నారు. అంతేగాదు. తాను సుమారు ఏడేళ్లలోనే కోల్పోయినదంతా సంపాదించానని, కానీ ఆరోగ్యాన్ని తిరిగి పొందలేకపోయానని అన్నారు. అలాగే దేశాయ్ తన పోస్ట్ని ముగిస్తూ..తన తోటి వ్యవస్థాపకులందర్నీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యంగా ఉండండి అని పిలుపునివ్వడం విశేషం. View this post on Instagram A post shared by Prashant Desai (@itsprashantdesai) (చదవండి: మోదీ మెచ్చిన 'బగురుంబ'..! అచ్చం సీతకోక చిలుకలా..)
మోదీ మెచ్చిన 'బగురుంబ'..! అచ్చం సీతకోక చిలుకలా..
ప్రకృతిని పూజించడం, ఆరాధించడం ఇవాళ్టిదేం కాదు.. మనిషి జీవితంలోని ప్రతిదశ ప్రకృతితో ముడిపడిపోయి ఉంటుంది. అంతలా పెనువేసుకుపోయారు మనిషి, ప్రకృతి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రకృతితో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. అలా ప్రకృతిని ఆరాధించే అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక సంప్రదాయ నృత్యమే బగురుంబ. మరి ఆ నృత్యం విశేషాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.అస్సాం ప్రజలకు ప్రకృతి అంటే కేవలం ఒక వనరుకాదు, ఒక జీవనాధారం. వారి నృత్యం, పాట, పండుగ, అన్నీ పచ్చదనం చుట్టూనే తిరుగుతాయి. అలా ప్రకృతితో మమేకమయి చేసే ప్రసిద్ధ నృత్యం బగురుంబ నృత్యం. అతిపెద్ద గిరిజన తెగ అయిన బోడో ప్రజల సంప్రదాయ నృత్యం ఇది. ఈ నృత్యంలో మహిళలు తమ చేతుల్లో రంగురంగుల కండువాలను పట్టుకుని రెండు చేతులు చాచి ఎగురుతున్న సీతాకోక చిలుకల వలె కదులుతారు. అందుకే దీనిని సీతాకోక చిలుక నృత్యం అని కూడా పిలుస్తారు.వసంతాన్ని ఆహ్వానిస్తూ..ప్రకృతి పట్ల బోడో ప్రజలకున్న గౌరవానికి చిహ్నం బగురుంబ. వసంత రుతువు రాకను ఆహ్వానిస్తూ, ప్రకృతి అందాలను కొనియాడుతూ ఏప్రిల్ నెలలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యం చేసేటపుడు స్త్రీలు దోఖానా అనే సంప్రదాయ చీర, జ్వమ్గ్రా అనే కండువాను ధరిస్తారు. వీరు సాధారణంగా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నృత్యానికి తోడుగా పురుషులు వెదురు ఫ్లూట్, డ్రమ్, వయోలిన్, జోటా, తార్ఖా వంటి వాయిద్యాలను వాయిస్తారు.ప్రధాని ప్రశంసఇటీవలే గువాహటిలోని సరుసాజై స్టేడియంలో 10,000 మంది బోడో మహిళా కళాకారులు ఏకకాలంలో ఈ బగురుంబ నృత్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా వీక్షించి ప్రశంసించారు. బిహు నృత్యం కూడా అస్సాంలో చాలా ప్రసిద్ధమైనది. ఇది వసంత కాలాన్ని, పంటల సాగును సూచిస్తుంది. ఈ రెండు నృత్యాలు అస్సాంలోని వైవిధ్యమైన సంస్కృతిని చాటి చెబుతాయి.The stage is all set, the performers are pumped up.#BagurumbaDwhou - just a few hours to go! pic.twitter.com/PfSiC6CQLy— Himanta Biswa Sarma (@himantabiswa) January 17, 2026 (Beauty Tips: కళ్ల కింద నలుపు తగ్గాలంటే..!)
అందమైన కళ్ల కోసం..!
ఈ స్మార్ట్ టెక్నాలజీ కాలంలో స్కీన్ టైం ఎక్కువైపోతోంది. దేనికైనా..ఫోన్, ల్యాప్టాప్తోనే రోజంతా పని. అది లేకుండా ఒక్క పూట గడవడం కష్టం అన్నంతగా టెక్నాలజీపై ఆధారపడిపోయాం. దాంతో అందరి కళ్లు మసకబారిపోయి అందవిహీనంగా తయారవుతున్నాయి. అందానికి కేంద్రమైన నయనాలే డల్గా అలసిపోయినట్లు ఉంటే అందమైన ముఖానికి ఆస్కారం ఏముంది. అందుకే కంటి కాంతి కోసం ఈ కేర్ తప్పనిసరి. అది కూడా మన ఇంట్లో దొరికే వాటితోనే కంటి కింద నల్లటి వలయాలను పోగొట్టుకుందాం ఇలా..!.కళ్లు త్వరగా అలసిపోవడం, కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడటం వంటివి తరచూ జరుగుతుంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంతో పాటు కళ్లు ఆకర్షణీయంగా, అందంగా తయారవుతాయి.బంగాళదుంపని మెత్తగా రుబ్బి రసం తీయాలి. అందులో దూదిని ముంచి కనురెప్పలపై పదిహేను, ఇరవై నిమిషాలపాటు ఉంచి కడిగేయాలి. బేబీ ఆయిల్ని కళ్లచుట్టూసున్నితంగా మసాజ్ చేస్తే ఒత్తిడి తగ్గి మంచి రిలీఫ్ వస్తుంది.కనురెప్పలు దట్టంగా పెరగాలంటే క్రమం తప్పకుండా ప్రతీరోజూ రాత్రి పడుకునే ముందు రెప్పలకి ఆముదం రాయాలి. కొబ్బరి నూనె చుక్కల్ని కళ్ల చుట్టూ వలయాకారంలో నెమ్మదిగా మసాజ్ చేస్తే కళ్ల కింద నలుపు తగ్గుముఖం పడుతుంది.కాచి వడబోసిన నీటిలో చిటికెడు ఉప్పు వేసి కళ్లని కడిగితే కాంతిమంతంగా కనిపిస్తాయి.టొమాటో రసాన్ని, నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి కళ్ల చుట్టూ అప్లై చేయాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే కళ్ల కింద నలుపు తగ్గడమే కాకుండా మంచి రిలీఫ్ వస్తుంది. ఈ మిశ్రమం రోజు విడిచి రోజు పెడితే మంచి ఫలితాన్నిస్తుంది. కీరాని ముక్కలుగా కోసి రుబ్బి రసం తీసుకోవాలి. దాంట్లో రోజ్వాటర్ని కలిపి కళ్లచుట్టూ పట్టించి అరగంట తరువాత కడిగేసుకోవాలి.(చదవండి: అసామాన్య ప్రతిభాశాలి స్పేస్ జర్నీ ముగిసింది..! రిటైర్మెంట్ తర్వాత సునీత..)
అంతర్జాతీయం
అమెరికా-కెనడాల మధ్య ‘బోర్డ్ ఆఫ్ పీస్’ అగ్గి..!
అమెరికా-కెనడాల మధ్య డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ అగ్గి రాజేస్తుంది. ట్రంప్ ఏర్పాటు చేసిన ఈ పీస్ బోర్డుకు కెనడా సమ్మతి తెలపకపోవడంతో అది మరొక వివాదానికి దారి తీసింది. తమకు సహకరించని దేశాలను గుర్తుపెట్టుకుంటామని వ్యాఖ్యానించిన ట్రంప్.. కెనడాపై మాత్రం పెరు పెట్టి మరీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కెనడా కృతజ్ఞత లేని దేశం అంటూ నిప్పులు చెరిగారు. తమ వల్లే ఆ దేశం మనుగడలోకి వచ్చిందని, ఇప్పటికీ తామే ఆదేశానికి ఆధారమని ధ్వజమెత్తారు. దీనిపై కెనడా ఘాటుగా స్పందించింది. ట్రంప్.. ఇక మీ మాటలు చాలంటూ ఘాటుగా బదులిచ్చింది. దీనిపై కెనడా ప్రధాని మార్క్ కార్నే మాట్లాడుతూ.. తమకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందంటూ ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. తమ ఎవరి మీద ఆధారపడి బతకడం లేదని, కెనడియన్లకు ప్రత్యేకమైన జీవన స్థితిగతులు ఉన్నాయన్నారు. ‘ అమెరికా వల్ల కెనడియన్లు జీవించడం లేదు. కెనడా అభివృద్ధి చెందుతోంది ఎందుకంటే మనం కెనడియన్లం’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో బోర్డ్ ఆఫ్ పీస్లో తమను జాయిన్ అవ్వమని ట్రంప్ నుంచి ఆహ్వానం అందిన విషయాన్ని కార్నే అంగీకరించారు. ఆయన రెండు దేశాల మధ్య ఉన్న అద్భుతమైన భాగస్వామ్యాన్ని కూడా ఒప్పుకున్నారు. కాకపోతే తమకు ప్రత్యేక అభిప్రాయాలుంటాయనే విషయాన్ని కార్నే తేల్చిచెప్పారు. ఆ బోర్డుకు అత్యధిక మొత్తంలో చెల్లించడానికి తాము సిద్ధంగా లేమని తెగేసి చెప్పేశాకాగా, ఇక దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోఅమెరికా ఆధిపత్యంపై సెటైర్లు వేశారు. అమెరికా ఆధిపత్యం తగ్గిపోతున్నదని, మధ్యస్థ శక్తులు కలిసి కొత్త సహకార ప్రపంచాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ శాంతి కూటమికి కెనడా దూరంగా ఉంది. అయితే ట్రంప్ మాత్రం కెనడాపై రెచ్చిపోయి ప్రసంగించడంతో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎటు దారితీస్తాయో అనే చర్చ మొదలైంది.ఇదీ చదవండి:Trump: మరో కొత్త తలనొప్పి..!
జాబిల్లి చిరునవ్వితే.. ఇవాళ రాత్రి ఆకాశంలో అద్భుతం!
ఆకాశంలో అద్భుతం.. చందమామ, శని, నెప్ట్యూన్ల అరుదైన కలయిక!. వసంత రాత్రి వెన్నెలలో నక్షత్రాల మధ్య నవ్వు పూస్తే.. జనవరి 23, 2026.. అంటే ఇవాళ రాత్రి ఆకాశంలో ఖగోల అద్బుతం కనువిందు చేయనుంది. చంద్రుడు, శని(శాటర్న్), వరుడు(నెప్ట్యూన్) ఒకే ప్రాంతంలో దగ్గరగా కనిపించనున్నాయి. ఈ త్రిగ్రహ సంయోగం (Triple Conjunction) ఒక మధురానుభూతిని అందించబోతోంది. అదే.. కాస్మిక్ స్మైల్!.చంద్రుడు తన అర్థ ఆకారం పెరిగే క్రమంలో ఉండడం వల్ల(waxing crescent) ఉండటం వల్ల.. ఈ త్రిగ్రహ సంయోగం ఆకాశంలో చిరునవ్వు లాంటి ఆకారాన్ని సృష్టించనుంది. చిరునవ్వు షేప్లో చంద్రుడు.. ఆపైన రెండు కళ్ల ఆకారంలో శని, వరుణ గ్రహాలు చెరో పక్క కనిపింనుచన్నాయి. అయితే ఇలా ఏర్పడడానికి కారణం ఉంది.ఖగోళ శాస్త్రంలో కాంజంక్షన్ అనేది సాధారణమైన విషయం. రెండు లేదంటే అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రేఖాంశంలో.. అదీ దగ్గరగా కనిపించే సంఘటన. అయితే ఇవాళ రాత్రి ఏర్పడబోయేది కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఈసారి చంద్రుడు శని కంటే కొన్ని డిగ్రీల ఉత్తరంగా వంగడం.. అదే ప్రాంతంలో నెప్ట్యూన్ కూడా కనిపించడం వల్ల ఈ అరుదైన సంయోగం ఏర్పడబోతోంది.భారత్లో చూడొచ్చా?సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో పశ్చిమం వైపు ఈ దృశ్యం అత్యంత స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం ఖగోళ శాస్త్రజ్ఞులకే కాకుండా.. ఫోటోగ్రాఫర్లకు, ఖగోళ ప్రేమికులందరికీ ఒక మధుర క్షణమనే చెప్పొచ్చు. అయితే.. చంద్రుడు, శని మన కంటికి సులభంగా కనిపించినప్పటికీ.. నెప్ట్యూన్ కాస్త మసకగా ఉండటం వల్ల దాన్ని చూడటానికి టెలిస్కోప్ అవసరం పడొచ్చు.పసుపు వెలుగులో చంద్రుడు చిరునవ్వు, సంధ్యా సమయం పశ్చిమ దిక్కున.. ఆకాశంలో ఆహ్లాదకరం.. కాస్మిక్ స్మైల్గా మంత్రముగ్ధం చేసే క్షణం..చంద్రుని నవ్వు (Moon–Saturn–Neptune triple conjunction) చాలా అరుదుగా జరుగుతుంది. అలాగని ఇదే మొదటిసారి కాదు. కిందటి ఏడాది జూన్ 19న కూడా ఇలాంటి అరుదైన సంయోగం ఏర్పడి.. ఆకాశంలో “స్మైలీ ఫేస్” లాంటి దృశ్యం కనిపించింది. మళ్లీ ఇవాళ.. ఈ ప్రత్యేక దృశ్యం మనకు దర్శనమివ్వబోతోంది.
ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ పై ..ఇజ్రాయెల్ విమర్శ
గాజాలో శాంతికోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ (శాంతి మండలి)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం గాజాలో శాంతికోసమే మాత్రమే కాదని అంతర్జాతీయ విభేదాలను పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అయితే తాజాగా దీనిపై ఇజ్రాయెల్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఉగ్రవాదులను ప్రోత్సహించే దేశాలు గాజాలో బలగాలను మెహరిస్తాయంటే తాము ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమని ఆ దేశ మంత్రి నిర్ బర్కత్ అన్నారు.డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సరికొత్త రూపం మెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభేదాలను పరిష్కరిస్తానంటూ బోర్డ్ ఆఫ్ పీస్ పేరుతో ఒక అంతర్జాతీయ శాంతిమండలిని ఏర్పాటు చేశారు. నిన్న దావోస్లో జరిగిన మీటింగ్లో దీనిని 35 దేశాలతో స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక యుద్ధాలను ఆపడమే తరువాయి అంటున్నారు. అయితే ట్రంప్ క్లోజ్ ఫ్రైండైన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ తొలుత దీనిని వ్యతిరేకించారు. అనంతరం అంగీకారం తెలిపాడు. ఇప్పుడు తాజాగా ఆదేశ ఆర్థిక మంత్రి దావోస్లో ఈ అంశంపై మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ "ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాల బలగాలని గాజాలో మెహరించడానికి మేము ఒప్పుకోం. ఖతర్, టర్కీ దేశాల బలగాల్ని మేము ఆమెదించం ఎందుకంటే వారా గాజాలోని జిహాది ఆర్గనైజేషన్లకు మద్దతిస్తారు. వారు అక్కడ కాలుమోపితే మేము నమ్మం వారు ట్రంప్కు చెందిన సంస్థలో ఉన్న మేము పట్టించుకోం" అని బర్కత్ అన్నారు. ప్రస్తుతం ఒక మంచి ప్రతిపాదనతో ముందుకెళ్తున్నారు. అయితే హమాస్ పరిస్థితి ఏంటి దానిని ఖచ్చితంగా నాశనం చేయాల్సిందే అన్నారు. దౌత్య సంబంధాలు మెరుగ్గా ఉన్నప్పుడే ఏదైనా దేశం పరస్పరం సహకరించుకుంటాయన్నారు. అందుకే గాజాలో పాకిస్థాన్ బలగాల్ని తాము నమ్మకమైన అంగీకరమైన భాగస్వామిగా చూడడం లేదన్నారు. అయితే నిన్న ( గురువారం) దావోస్లో పాకిస్థాన్ డొనాల్డ్ ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్లో చేరడానికి అంగీకారం తెలిపింది. కాగా ఇదివరకూ జరిగిన ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ గాజాలో శాంతి కోసం తమ బలగాల్ని మెహరించాల్సి ఉంటుంది
ట్రంపరితనం.. పిల్లాడిని వదల్లేదు!
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో ఐదేళ్ల బాలుడు లియామ్ కోనేజో రామోస్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై దుమారం చెలరేగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం ఖండించారు. చిన్నారుల్ని ఇలా అరెస్టు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ చర్యను సమర్థించింది.మిన్నెసోటాలోని కొలంబియా హైట్స్ ప్రాంతంలో ప్రీ-స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్న లియామ్ను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ)అధికారులు అదుపులోకి తీసుకున్నారు.బాలుడితో పాటు అతని తండ్రిని నిర్భందించి తీసుకెళ్లారు. ఇలా చిన్నారుల్ని అదుపులోకి తీసుకోవడం గత రెండు వారాల్లో అదే స్కూల్ జిల్లాలోని నాలుగు విద్యార్థులను ఐసీఈ అధికారులు అదుపులోకి తీసుకున్నారని స్థానిక పాఠశాల అధికారులు వెల్లడించారు.అదుపులోకి తీసుకున్న అనంతరం ఐసీఈ అధికారులు చిన్నారిని ‘ఎర’గా ఉపయోగించారని ఆరోపించారు. ఐదేళ్ల బాలుడిని ఎందుకు అదుపులోకి తీసుకోవాలి? ఇది మానవత్వానికి విరుద్ధం’ అని కమలా హారిస్ వ్యాఖ్యానించారు. మరోవైపు ట్రంప్ బృందం ఈ చర్యను చట్టపరమైన అమలు చర్యగా సమర్థించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తాము ఎలాంటి తప్పు చేయలేదు’ అని స్పష్టం చేసింది.ఈ ఘటన అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాలపై చర్చకు దారి తీసింది. ప్రజలు,పాఠశాల అధికారులు, మానవ హక్కుల సంస్థలు చిన్నారులను ఇలాంటి చర్యల్లో భాగం చేయడం అమానుషం’ అని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘He is just a baby’అనే ట్యాగ్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. Liam Ramos is just a baby. He should be at home with his family, not used as bait by ICE and held in a Texas detention center.I am outraged, and you should be too. pic.twitter.com/djr2z1AG0N— Kamala Harris (@KamalaHarris) January 22, 2026
జాతీయం
ధోబీ ఘాట్లో కొరియన్ పిల్లల పనీ, పాటా : వైరల్ వీడియో
పిల్లలు పెంపకంలో తల్లిదండ్రులకు కచ్చితంగా కొన్ని సూత్రాలను పాటించాలి. తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదనే ఉద్దేశంతో వాళ్లకి ఏ కష్టం తెలియకుండా, అడిగిందల్లా క్షణాల్లో కళ్ల ముందర ఉంచుతూ, కాలు కందకుండా పెంచాలని భావిస్తుంటారు. నిజానికి ఈ విధానం వల్ల పిల్లల్లో సోమరితనం, కష్టపడి సాధించాలనే తపన సామర్థ్యం, తగ్గిపోయే అవకాశాలు చాలా ఉన్నాయంటారు చైల్డ్ సైకియాట్రిస్టులు. అందుకే పిల్లలకు బాల్యం నుంచే శ్రమ విలువ, గౌరవం తెలిసేలా చేయాలి. ఒక విదేశీ మహిళ, తన బిడ్డలతో ఇలానే చేస్తోంది అంటే నమ్ముతారా? దీనికి సంబంధించి ఒక వీడియో నెట్టింట విశేషంగా నిలిచింది.‘వోనీ_బ్రదర్స్' అనే ఇన్స్టా ఖాతాలో భారతీయ పనిపద్ధతులు, జీవనశైలిని కొరియన్ కుటుంబానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీని ప్రకారం వివిధ భారతీయ అనుభవాలు, ఆహారాలు, లేదా ప్రయాణ విశేషాలు కాకుండా ఆ కుటుంబం తమ పిల్లలకు చేతులతో బట్టలు ఉతకడంలో ఉండే కష్టాన్ని చూపించాలని నిర్ణయించుకుంది. అలా ఇద్దరు చిన్న కొరియన్ పిల్లలు ముంబైలోని ప్రసిద్ధ ధోబీ ఘాట్కి వచ్చి, మురికి బట్టలకు బండకేసి బాది ఉతికారు. తల్లి కూడా దగ్గరే నిలబడి, వారితో పాటు బట్టలు ఉతకడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. దీనికి ముందు అక్కడి కార్మికులు బట్టలను శుభ్రం చేయడం, ఉతకడం లాంటి పనులను పిల్లలు జాగ్రత్తగా పరిశీలించడం విశేషం. "ధోబీ ఘాట్లో కొరియన్ పిల్లలు. నిజమైన భారతీయ జీవితాన్ని గడుపుతున్నారు. ధోబీ ఘాట్. నిజమైన పని, నిజమైన గౌరవం," అనే క్యాప్షన్తో షేర్ అయిన ఈ వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Jung ae Um🇰🇷 living in India🇮🇳 (@wonny_brothers)> ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల పెరోల్కాగా వోనీ_బ్రదర్స్ భారతదేశంలో మొదటిసారిగా పానీ పూరీని ప్రయత్నించిన వీడియో వైరల్ అయింది. అలాగే ఈ బ్రదర్స్లో ఒకరు సూపర్ సింగర్ జూనియర్ 9 పోటీదారు మైత్రేయన్తో కలిసి "కనిమా"అనే తమిళ పాటకు డాన్స్ చేస్తూ ఆన్లైన్లో అందరి దృష్టినీ ఆకర్షించారు. దీనిపై ఇది కేవలం రీల్స్ కోసం చేసినట్లు అనిపించవచ్చు గానీ, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పే ఒక జీవిత పాఠం. దీనిని తేలికగా తీసుకోకూడదు," అని వ్యాఖ్యానించారు.
వీడియో: చిన్నోడా.. అలసిపోయి ఉంటావ్!
ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో ఇవాళ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బహిరంగ సభకు హజరైన జనాల్లో ఓ పిల్లాడు చేసిన పని మోదీ దృష్టిని ఆకర్షించింది. అంతే.. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. తిరువనంతపురంలో శుక్రవారం ప్రధాని మోదీ సభ జరిగింది. అయితే ఒక చిన్న పిల్లాడు ప్రధాని మోదీ డ్రాయింగ్ ఫోటోను ఎత్తిపట్టి చాలా సేపు నిలబడి ఉన్నాడు. అది గమనించిన ప్రధాని మోదీ.. తన ప్రసంగాన్ని ఆపి ఆ బాలుడిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘చిన్నోడా, నువ్వు చాలా సేపు ఫోటో పట్టుకుని నిలబడ్డావు. అలసిపోయి ఉంటావ్. ఆ ఫోటోను నాకు ఇవ్వు. దాని వెనకాల నీ చిరునామా రాయు. నేను నీకు వ్యక్తిగతంగా లేఖ రాస్తాను’’ అని అన్నారు. ఈ క్రమంలో.. ఆ పిల్లాడి చేతుల్లోని ఫొటోను జాగ్రత్తగా తీసుకోవాలని తన ప్రత్యేక రక్షణ బృందం (SPG)కి సూచించారు. అది ఆ బాలుడి ప్రేమ, ఆశీర్వాదాల ప్రతీక. దాన్ని జాగ్రత్తగా తీసుకోండి అంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో సభ ఒక్కసారి చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ సమయంలోనే.. మరో మహిళ ఓ పెద్ద పుస్తకాన్ని ఎత్తి మోదీ వైపు ప్రదర్శించింది. మోదీ ఆమెను కూడా గుర్తించి.. ఆమె కూడా నాకు ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు. పెద్ద పుస్తకం తయారు చేసి తీసుకొచ్చారు అని అనడంతో నవ్వులు పూశాయి. ఇక కేరళ సభలో మోదీ రాజకీయ ప్రసంగంలో.. సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళలో మార్పు అవసరమని.. అందుకు బీజేపీని ఆశీర్వదించాలని కేరళ ప్రజలను ఆయన కోరారు. ఇప్పటికే ఆ మార్పు మొదలైందని.. ప్రజల ఆశీస్సులతోనే కేరళలో కమల వికాసం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారాయన. ఈ పర్యటనలోనే ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, కొత్త రైలు సేవలను ప్రారంభించారు. కేరళ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషిని కేరళ ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారాయన. प्रधानसेवक मोदी जी के प्रति केरला के बच्चों का प्रेम pic.twitter.com/u0tKKimQsw— Dr Neetu Dabas 🇮🇳 (@INeetuDabas) January 23, 2026
సోషల్ మీడియా సెన్సేషన్.. ఎవరీ అభినవ భగత్ సింగ్!
ప్రశ్నిస్తాం.. ప్రశ్నిస్తాం..అన్న నేతలే పారిపోతుంటే, ఓ బాలుడు మాత్రం అందుకు భిన్నంగా నిలుస్తున్నాడు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అవినీతి చూసి ‘ఆ నాకెందుకులే’ అని పక్కకు తప్పుకోకుండా, ప్రశ్నిస్తున్నాడు. విమర్శిస్తున్నాడు. ఇందుకోసం పాఠ్య పుస్తకాలే కాదు, లా పుస్తకాలు కూడా తిరగేస్తున్నాడు. అధికారులకు, నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. నెటిజన్లు అతన్ని ‘యూపీ భగత్ సింగ్’గా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన 14 ఏళ్ల బాలుడు అశ్వమిత్ గౌతమ్. సాధారణంగా 14ఏళ్ల బాలుడు అంటే తొమ్మిది, లేదంటే పదోతరగతి పుస్తకాలతో కుస్తీ పడతారు. మార్క్స్,ఎగ్జామ్స్,పర్సంటేజ్ పేరుతో క్షణం తీరికి లేకుండా స్కూల్,ట్యూషన్,ఇల్లే జీవితంగా గడిపేస్తుంటారు. కానీ ఈ ఛోటా భగత్ సింగ్ అలా కాదు. సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన గౌతమ్ ఇన్స్టాగ్రామ్లో ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్ను సంపాదించాడు. రాజకీయాలు, నేతలు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, మీడియా, వ్యాపారవేత్తల స్కాంలు వంటి అంశాలపై ఆధారాలతో మాట్లాడుతున్నాడు. ప్రజలు అతన్ని అభినవ భగత్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్తో పోలుస్తున్నారు. ఈ చైతన్యం పాలకులను, అధికారులను అసహనానికి గురి చేసింది. మైనర్ అని కూడా చూడకుండా అతనిపై సెక్షన్ 151 ప్రయోగించి అరెస్టు చేశారు. కొద్దిసేపటికే విడుదల చేసినా, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతని వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతూ, ప్రభుత్వాలపై అతను సంధించిన ప్రశ్నలు ప్రజల్లో చైతన్యం రేపుతున్నాయి.వెరసీ అతడిని అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలపై విమర్శాత్మక వీడియోలు పోస్ట్ చేసినందుకు ఈ చర్య తీసుకోవడం పిల్లల హక్కులు, భావప్రకటన స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లలపై కేసులు నమోదు చేయడం ప్రత్యేక నిబంధనలతో మాత్రమే సాధ్యం. ఈ కేసు చట్టపరమైన సరళతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. న్యాయవేత్తలు పిల్లలపై ఇలాంటి చర్యలు భయపెట్టే ప్రయత్నం’ అని వ్యాఖ్యానిస్తున్నారు.అశ్వమిత్ గౌతమ్ కథ ఒక చిన్నారి ధైర్యానికి ప్రతీక. వయసు చిన్నదైనా, ఆలోచనలు పెద్దవిగా మారి సమాజాన్ని కదిలిస్తున్నాయి. పిల్లలపై ఇలాంటి చర్యలు చట్టపరంగా సరైనవా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సత్యం, న్యాయం కోసం ప్రశ్నించే స్వరం ఎప్పటికీ ఆగదు. ఈ బాలుడి ధైర్యం కొత్త తరం యువతకు ప్రేరణగా నిలుస్తోంది.
కేరళని ధ్వంసం చేసింది వారే : మోదీ
కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే శబరిమల అయ్యప్ప దేవాలయంలో గోల్డ్ చోరీ నిందితులని అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో ఈ సారి అధికార మార్పు తప్పనిసరని పేర్కొన్నారు. ఈ రోజు (శుక్రవారం) కేరళలో మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా అధికార కమ్యూనిస్టుల ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తిరువనంతపురంలో LDF, UDF ప్రభుత్వాలు ఇంతకాలం చేసిన అవినీతిని బీజేపీ అంతం చేస్తుందని తెలిపారు. మోదీ కేరళ పర్యటన సందర్భంగా ఇటీవల తిరువనంతరంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఆయన ప్రస్థావించారు. కేరళ ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అందుకు నిదర్శనం ఇటీవల తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమేనని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న LDF, UDF కూటములకు ప్రత్యామ్నయంగా బీజేపీ ఎదిగిందన్నారు.ప్రధాని మోదీ మాట్లాడుతూ "రాబోయే ఎన్నికలు కేరళ స్థితిని గతిని రెండింటిని మారుస్తాయి. ఇప్పటివరకూ మీరు కేరళని రెండువైపుల నుంచే చూశారు. LDF, UDF రెండు కూటములు కేరళని ధ్వంసం చేశాయి. కానీ మూడోవైపు కూడా ఉంది అదే అభివృద్ధి, పరిపాలన అదే బీజేపీ" అని ఆయన అన్నారు. ఇంతకాలం ఈ రెండుకూటములు అవినీతి, లంచగొడితనం చేసి రాష్ట్రాన్ని బాగుపడకుండా చేశాయన్నారు. ఇక్కడ కాంగ్రెస్ "ముస్లీం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్" గా మారిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని వికసిత్ కేరళగా మార్చే హామీ తనదని అన్నారు. LDF, UDF కూటములు ఒకే నాణానికి రెండు వైపుల్లాంటివి ఆ రెండింటి పాలన ఒకే విధంగా ఉంటుందన్నారు. ఐదు లేదా పది సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుందని వారికి తెలుసని మారేది ప్రభుత్వమే.. పాలన కాదు ఆ రెండు పార్టీల విధానం ఒకటేనని తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు మేలు చేసి అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలని అది బీజేపీ పార్టీనేనని మోదీ స్పష్టం చేశారు.ఇటీవల తిరువనంతపురం ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు అద్భుతమని అక్కడ పాలించడానికి బీజేపీని ప్రజలు ఆదరించారని తెలిపారు. రాష్ట్ర యువతకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మోదీ విమర్శించారు. ప్రస్తుతం ప్రపంచంలోని ఎన్నో దేశాలతో ఇండియా భారీ ఒప్పందాలు చేసుకుంటుందని అందుకే కేరళలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
ఎన్ఆర్ఐ
పురుషులు గర్భం దాల్చగలరా? భారత సంతతి వైద్యురాలు ఏమన్నారంటే..
అమెరికాలోని డిర్క్సెన్ సెనేట్ కార్యాలయంలో జరిగిన "మహిళల రక్షణ: కెమికల్ అబార్షన్ డ్రగ్స్ ముప్పు" అనే అంశంపై జరిగిన చర్చ వివాదాస్పదంగా మారింది. మందుల ద్వారా జరిగే అబార్షన్ నుంచి మహిళలను కాపాడటం.. అనే అంశంపై సెనేట్లో జరుగుతున్న చర్చకు భారత సంతతి గైనకాలజిస్ట్, డాక్టర్ నిషా వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెనేటర్కు, డాక్టర్ మధ్య జరిగిన వాగ్వాదం హాట్టాపిక్గా మారి చర్చనీయాంశమైంది.ఆ ఒక్క ప్రశ్నతో దద్దరిల్లిన పార్లమెంట్..చర్చలో భాగంగా సెనేటర్ జోష్ హాలే నేరుగా డాక్టర్ నిషా వర్మను ఉద్దేశించి.. " మగవారు గర్భం దాల్చగలరా ?" అని ప్రశ్నించారు. అందుకు ఆమె నేరుగా అవును లేదా కాదు అని సమాధానం చెప్పకుండా దాటవేస్తూ.. తాను మహిళలుగా గుర్తింపులేని వివిధ జెండర్ ఐడెంటిటీలు ఉన్న రోగులకు కూడా చికిత్స అందించాను అని బదులిచ్చారు. ఆ సమాధానంపై తీవ్ర అసంతృప్తికి గురైన సెనేటర్ హాలే తాను అడిగిన ప్రశ్న..సైన్స్, జీవశాస్త్ర వాస్తవాలకు సంబంధించినదని, దీనికి రాజకీయ రంగు పులమాల్సిన పని లేదంటూ మండిపడ్డారు. దాంతో డాక్టర్ నిషా వర్మ తన వాదనను కొనసాగిస్తూ.. ఇలాంటి ప్రశ్నలను ముమ్మాటికి రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటారంటూ ధ్వజమెత్తారామె. అంతేగాదు తాను సైన్స్ నమ్మే వ్యక్తినని, రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే రోగులకు చికిత్స అందిస్తుంటాను. ఆ నేపథ్యంలోనే ఈ చర్చలో పాల్గొనేందుకు వచ్చాను. కానీ ఇలాంటి ప్రశ్నలు పక్కదారి పట్టిస్తాయంటూ ఘాటుగా సమాధానమిచ్చారు నిషా. అయితే "జీవశాస్త్రపరంగా పురుషులు గర్భం దాల్చలేరనే కనీస సత్యాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారు.. కాబట్టి మిమ్మల్ని సైన్స్ తెలిసిన వ్యక్తిగా ఎలా నమ్మాలి?" అంటూ హాలే ఆగ్రహం వ్యక్తం చేశారు. అబార్షన్ మందుల భద్రతపై ఆందోళనకేవలం జెండర్ వివాదమే కాకుండా అబార్షన్ కోసం వాడే మందుల భద్రతపై కూడా సెనేటర్ హాలే కీలక గణాంకాలను ప్రస్తావించారు. "అబార్షన్ డ్రగ్స్ వాడటం వల్ల 11 శాతం కేసుల్లో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని సైన్స్ చెబుతోంది. ఇది ఎఫ్డీఏ లేబుల్పై ఉన్న దానికంటే 22 రెట్లు ఎక్కువ" అని ఆయన ఆరోపించారు. మరోవైపు డాక్టర్ నిషా వర్మ ఈ వాదనను తోసిపుచ్చారు. 2000 సంవత్సరంలో ఆమోదం పొందిన నాటి నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 75 లక్షల మందికి పైగా ఈ మందులను సురక్షితంగా వాడారని, వందకు పైగా అత్యున్నత స్థాయి సమీక్షలు ఈ మందులు సురక్షితమని నిరూపించాయని ఆమె చెప్పడం విశేషం. కేవలం రాజకీయ కారణాల వల్లే అబార్షన్ హక్కులపై ఆంక్షలు విధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారామె. ఇంతకీ ఎవరీ భారత సంతతి వైద్యురాలు నిషా వర్మ..ఆమె ఎవరంటే..నిషా వర్మ నార్త్ కరోలినాలోని గ్రీన్స్బోరోలో భారత వలస తల్లిదండ్రులకు జన్మించారు. ఆమె జీవశాస్త్రం,మానవ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని, కరోలినా విశ్వవిద్యాలయం నుంచి వైద్య డిగ్రీ (MD)ని పొందారు.ఆమె బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్లో ఇంటర్న్షిప్ OB/GYN (ప్రసూతి మరియు గైనకాలజీ) రెసిడెన్సీని పూర్తి చేసింది. వర్మ ఆ తర్వాత కాంప్లెక్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫెలోషిప్ను పూర్తి చేసి ఎమోరీ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MPH) డిగ్రీని పొందారు.ఆమె డబుల్-బోర్డ్-సర్టిఫైడ్ ప్రసూతి వైద్యురాలు, పైగా కుటుంబ నియంత్రణలో స్పెషలిస్ట్ కూడా. వర్మ ప్రస్తుతం జార్జియాలో సమగ్ర పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణపై ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె ఫిజిషియన్స్ ఫర్ రిప్రొడక్టివ్ హెల్త్లో ఫెలో కూడా.అంతేగాదు ఆమె అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG)లో రిప్రొడక్టివ్ హెల్త్ పాలసీ అండ్ అడ్వకేసీకి సీనియర్ అడ్వైజర్గా పనిచేయడమే గాక ఎమోరీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో అనుబంధ అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తోందామె. Sen. Hawley: “Can men get pregnant?”Dr. Nisha Verma: “I'm not really sure what the goal of the question is.”Sen. Hawley: “The goal is just to establish a biological reality...Can men get pregnant?”pic.twitter.com/exjxLqJBTC— America (@america) January 14, 2026 (చదవండి: అలాంటి ఇలాంటి నమ్మకం కాదు..! అడగంగానే..'బంగారుపు గాజులను'..)
ఇరాన్ ఆందోళనల్లో భారతీయుల అరెస్ట్?!
ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆందోళనకారులను అణచివేస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే సైనిక చర్యకు దిగుతామని ట్రంప్.. తమ దేశ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే అంతు చూస్తామంటూ ఖమేనీ సవాల్-ప్రతిసవాల్ విసురుకుంటున్నారు. అయితే ఆందోళనలతో ఇరాన్ నెత్తురోడుతున్న వేళ.. ఆ దేశంలోని ఇతర దేశాల పౌరుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఇరాన్ సంక్షోభంలో(Iran Crisis) మరణాలను అక్కడి ప్రభుత్వం తక్కువగా చూపెడుతోందంటూ మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటిదాకా 548 మరణించారని.. అందులో 48 భద్రతా సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది(హెచ్ఆర్ఏఎన్ఏ అనే అమెరికా మానవ హక్కుల సంఘం లెక్కల ప్రకారం). అలాగే 10 వేల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారని సమాచారం. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లలో ఇతర దేశా పౌరులు ఉన్నట్లు పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. నిరసనల్లో పాల్గొనకపోయినా.. కొందరి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తన్నట్లుగా దృశ్యాలు అందులో ఉన్నాయి. అందులో భారతీయులు, అఫ్గనిస్థాన్ జాతీయులు ఎక్కువగా ఉన్నట్లు ఆ ప్రచార సారాంశం. పైగా విదేశీ వ్యవహారాల శాఖ సంబంధిత పేర్లతో ఉన్న అకౌంట్లలో ఆ వీడియోలు పోస్టు కావడం గమనార్హం. దీంతో.. ఆ దేశంలో పనుల నిమిత్తం వెళ్లిన భారత పౌరులు.. విద్యార్థుల భద్రతపై ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే.. భారత్లో ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలి(Mohammad Fathali) ఆ కథనాలను ఖండించారు. అలాంటిదేమీ.. ఇరాన్లోని భారతీయులతో సహా ఇతర దేశాల పౌరుల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో జరిగిన ఫేక్ ప్రచారం ఆధారంగానే ఆ కథనాలు పుట్టుకొచ్చాయని అంటున్నారు. పుకార్లను నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన క్లారిటీగా ఓ పోస్ట్ చేశారు. అయితే.. అటు ఇరాన్ ఈ తరహా కథనాలు మొదటి నుంచే ఖండిస్తోంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న కుట్ర అని ఆరోపించింది. ఇరాన్ నిరసనలను కొందరు విదేశీ నటులు.. మీడియా వక్రీకరిస్తున్నాయని.. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తోంది. మన పిల్లలు సేఫ్!భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ఇరాన్లో 10,000 నుంచి 12,000 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో పనుల నిమిత్తం వెళ్లేవాళ్లు, భారతీయ మూలాలు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే అక్కడికి భారత్ నుంచి అత్యధికంగా వెళ్లేది వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులే. ఈ నేపథ్యంలో.. వాళ్ల భద్రతపై కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. వాళ్లు సురక్షితంగా ఉన్నారని ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIMSA), ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ (FAIMA) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం, సీనియర్ అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని.. విద్యార్థులతో, అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొంది.
క్లీవ్ల్యాండ్లో శంకర నేత్రాలయ తొలి నిధి సమీకరణ కార్యక్రమం దిగ్విజయం
శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో “Echoes of Compassion – Where Arts Meet Heart” అనే శీర్షికతో, ఒహియో చాప్టర్ యొక్క తొలి నిధి సమీకరణ కార్యక్రమం క్లీవ్ల్యాండ్లో గర్వంగా నిర్వహించబడింది. ఈ చారిత్రక కార్యక్రమం డిసెంబర్ 13, శనివారం సాయంత్రం 4:00 గంటల నుండి 7:00 గంటల వరకు, ఒహియో రాష్ట్రం మెడినా నగరంలోని మెడినా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ (మిడిల్ స్టేజ్) లో ఘనంగా జరిగింది.ఒహియో రాష్ట్ర సాంస్కృతిక కమిటీ సభ్యురాలు శ్రీమతి కల్యాణి వేటూరి గారి సమర్థ మార్గదర్శకత్వంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో, గ్రేటర్ క్లీవ్ల్యాండ్ ప్రాంతానికి చెందిన అనేక సంగీత మరియు శాస్త్రీయ నృత్య పాఠశాలలు పాల్గొని, చూపు సంరక్షణ ద్వారా మానవ సేవ చేయాలనే శంకర నేత్రాలయ యొక్క మహత్తర సేవా లక్ష్యానికి తమ మద్దతును అందించాయి.ఈ సాయంత్రం శాస్త్రీయ సంగీతం మరియు భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాల అద్భుత సమ్మేళనంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి ప్రదర్శనకు ప్రేక్షకుల నుండి హర్షాతిరేక చప్పట్లతో అపూర్వ స్పందన లభించింది.సంగీత ప్రదర్శనలు⇒ సప్త స్వర అకాడమీ విద్యార్థులు(గురు శ్రీ విష్ణు పసుమర్తి మరియు గురు శ్రీ కృష్ణ పసుమర్తి గారి నాయకత్వంలో)⇒ మధురాలయ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ విద్యార్థులు(గురు శ్రీ లలిత్ సుబ్రహ్మణియన్ గారి మార్గదర్శకత్వంలో)శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు⇒ కూచిపూడి — శ్రీమతి కల్యాణి వేటూరి గారి శిష్యులు, శ్రీ మయూరి డాన్స్ అకాడమీ⇒ భరతనాట్యం — గురు శ్రీమతి సుజాత శ్రీనివాసన్ గారి శిష్యులు, శ్రీ కలామందిర్⇒ కథక్ — గురు శ్రీమతి అంతర దత్తా గారి శిష్యులు, అంగకళ కథక్ అకాడమీ⇒ కూచిపూడి — గురు శ్రీమతి సుధా కిరణ్మయి తోటపల్లి గారి శిష్యులు, నర్తనం డాన్స్ అకాడమీతీవ్రమైన మంచు తుఫాను మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, సేవాభావం ప్రకాశవంతంగా వెలిగింది. “వర్షమైనా మంచైనా, కార్యక్రమం కొనసాగాల్సిందే” అనే నమ్మకంతో ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించబడింది. 150 మందికి పైగా సమాజ సభ్యులు హాజరై, అపూర్వమైన సమాజ మద్దతును చాటిచెప్పారు.ఈ కార్యక్రమానికి ఇండియా ఫెస్ట్ U.S.A. స్థాపకులు శ్రీ భరత్ పటేల్ ప్రత్యేక అతిథిగా హాజరై, కార్యక్రమానికి మరింత గౌరవం మరియు ప్రోత్సాహాన్ని అందించారు.“ఎకోస్ ఆఫ్ కంపాషన్” కార్యక్రమం కళ, సంస్కృతి, సమాజం ఏకమై ఎలా అర్థవంతమైన మార్పును తీసుకురాగలవో స్పష్టంగా చాటింది. కరుణ మరియు సహకారంతో సేవ చేయాలనే శంకర నేత్రాలయ U.S.A. లక్ష్యాన్ని మరింత బలపరిచింది.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నాయకత్వం మరియు లాజిస్టిక్ మద్దతు అందించిన SNUSA అధ్యక్షులు శ్రీ బాల రెడ్డి ఇందుర్తి, శ్రీమతి నీలిమ గడ్డమనుగు, శ్రీ మూర్తి రేకపల్లి, డా. రెడ్డి ఊరిమిండి, శ్రీ వంశీ ఏరువరం, శ్రీ శ్యామ్ అప్పల్లి, శ్రీ రత్నకుమార్ కవుటూరు, శ్రీ గిరి కోటగిరి, శ్రీ అమర్ అమ్యరెడ్డి మరియు శ్రీ గోవర్ధన్ రావు నిడిగంటి గారికి SNUSA ఒహియో చాప్టర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
అలస్కాలో ‘గుంటూరు విద్యార్థి’ అదృశ్యం
అలాస్కా: అమెరికాలోని అలాస్కాకు ఒంటరిగా బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. ప్రకృతి అందాలను తిలకించడానికి వెళ్లి.. మంచు కొండల మధ్య ఆచూకీ లేకుండా పోయాడు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కరసాని హ్యూస్టన్లో నివాసం ఉంటున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో హరి డిసెంబర్ 22, 2025న ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు.అక్కడ హీలీ పట్టణంలోని ఔరోరా డెనాలి లాడ్జ్లో బస చేశారు జనవరి 4 నాటికి తిరిగి వస్తానని తన రూమ్మేట్స్కు కూడా సమాచారం ఇచ్చారు. అయితే, డిసెంబర్ 30న చివరిసారిగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన హరి.. ఆ మరుసటి రోజు డిసెంబర్ 31 హోటల్ నుంచి చెక్-ఔట్ కాగా.. అప్పటి నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.డిసెంబర్ 31న ఆయన హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక క్యాబ్ సర్వీస్ వాడినట్లు సమాచారం. హరికి డ్రైవింగ్ రాకపోవడంతో ఆయన క్యాబ్లు, స్థానిక రవాణాపైనే ఆధారపడ్డారు. హోటల్ నుంచి బయలుదేరిన హరి ఆ క్యాబ్లో ఎక్కడికి వెళ్లారు? ఆ డ్రైవర్ ఎవరు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 31 తర్వాత డెనాలి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల ఫారన్హీట్ వరకు పడిపోయాయని, హరి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అతని స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్రైమ్
జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్.. 16 మంది మావోల మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా చోటానాగ్రా పోలీస్స్టేషన్ పరిధిలో కుంబాదీహ్ గ్రామ సమీపంలో గల చైబాస అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పతిరాం మాంఝీ అలియాస్ అనల్దా మృతి చెందాడు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనలో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలతోపాటు నిత్యావసర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో అనల్దా మృతిచెందినట్టు కొల్హాన్ డివిజన్ డీఐజీ అనురంజన్ కిస్పొట్టా ధ్రువీకరించారు. జార్ఖండ్లోని పిట్రాండ్కు చెందిన అనల్దా 1987 నుంచి క్రియాశీలకంగా ఉన్నాడు. టార్గెట్ మిసిర్బెహ్రాఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత మావోయిస్టులకు దండకారణ్యంలో ఉన్న సేఫ్ జోన్లు క్రమంగా ప్రమాదంలో పడ్డాయి. దీంతో ఒకప్పటి పీపుల్స్వార్కు చెందిన మావోయిస్టుల్లో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్–తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలకు చేరుకోగా, మావోయిస్టు పార్టీలో విలీనమైన ఎంసీసీ (మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్)కి సంబంధించిన కీలక నేతలు ఒడిశా–జార్ఖండ్ సరిహద్దులో విస్తరించిన శరందా అడవులను షెల్డర్ జోన్గా మార్చుకున్నారు. చోటానాగ్రా సమీపంలోని దట్టమైన అడవుల్లో మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు మిసిర్ బెహ్రా ఉన్నాడనే సమాచారంతో బుధవారం రాత్రి భద్రతా దళాలు భారీ ఆపరేషన్ మొదలు పెట్టాయి. అంబూష్ ను ఛేదించి ఇప్పటికే దండకారణ్యంపై పట్టు కోల్పోయిన మావోయిస్టులు శరందా అడవులను చేజార్చుకోవద్దనే ఉద్దేశంతో ఉన్నారు. ఆకురాలే కాలం మొదలైన తర్వాత కచి్చతంగా భద్రతా దళాలు అడవిలోకి వస్తాయనే అంచనాతో అంబూ ష్ దాడికి వల పన్నారు. దీంతో గురువారం ఉదయం చై బాస దగ్గర ఇరువర్గాలు ఎదురుపడటంతో కాల్పులు మొ దలయ్యాయి. విడతల వారీగా చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు అనల్దాతోపాటు మరో 15 మంది మావోయిస్టులు మరణించారు. అగ్రనేత అనల్దాను భద్రతా దళాలు గుర్తించగా, మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. మావోయిస్టులు అంబూష్ ఏర్పాటు చేసిన ప్రాంతం కావడంతో భద్రతా దళాలు ఆచితూచి సెర్చ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో పోలీసు, సీఆర్పీఎఫ్కు చెందిన 1,500 మంది బలగాలు పాల్గొన్నాయి. ఒక్కొక్కరుగా.. దేశంలో సాయుధ పోరాట పంథాను అనుసరిస్తున్న విప్లవ పార్టీల్లో ప్రధానంగా ఉత్తర భారత దేశానికి చెందిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్(ఎంసీసీ), ఉమ్మడి ఏపీకి చెంది న పీపుల్స్వార్ (పీడబ్ల్యూ) పార్టీలు విలీనం కావడంతో 2004లో సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఏర్పాటైంది. అయితే, ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత ఇటు ఎంసీసీతోపాటు అటు పీడబ్ల్యూకు చెందిన సీనియర్ నాయకులు వరుస ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు.జార్ఖండ్లో గత ఏప్రిల్లో జరి గిన ఎన్కౌంటర్లో ప్రయాగ్మాంఝీ మృతిచెందగా ఆ త ర్వాత సెప్టెంబర్లో పర్వేశ్ మరణించారు. ఇప్పుడు అనల్ దా కూడా చనిపోయాడు. దీంతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఎంసీసీకి చెందిన కీలక నేతల్లో పొలిట్బ్యూరో సభ్యుడు మిసిర్ బెహ్రా మినహా మిగిలిన అగ్రనేతలు మరణించినట్టయింది. ఇటు పీడబ్ల్యూకు సంబంధించి తిప్పిరి తిరుపతి ఒక్కరే ఆ పార్టీకి చివరి ఆశగా మిగిలాడు. సీనియర్ నేతలు గణపతి, సంగ్రామ్, విశ్వనాథ్లు వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక ఛత్తీస్గఢ్ కేడర్ నుంచి పాపారావు దండకారణ్యంలో ఆ పార్టీకి కేరాఫ్ అడ్రస్గా ఉన్నాడు.హింసను వీడాలి: అమిత్షామావోయిస్టులు హింసాత్మక భావజాలాన్ని విడనాడి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. నక్సల్రహిత సమాజాన్ని సాధించడంలో సంయుక్త బలగాలు మరో భారీ విజయం సాధించాయని ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దేశంలో మార్చి 31 లోగా నక్సలిజాన్ని పారద్రోలాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు.
నిన్నగాక మొన్న పెళ్లి : చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్లు
గుజరాత్లోని అహ్మదాబాద్లో దారుణం చోటు చేసుకుంది. తన అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి తన భార్యను కాల్చి చంపి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్వల్ప వివాదమే ఈ విషాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసుల ప్రకారం మృతులను గుజరాత్ మారిటైమ్ బోర్డులో క్లాస్-1 అధికారి యశరాజ్సింగ్ గోహిల్ , అతని భార్య రాజేశ్వరి గోహిల్గా గుర్తించారు. ఈ జంటకు కేవలం రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. బుధవారం రాత్రి ఇంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే క్షణికావేశంతో యశరాజ్సింగ్ తన లైసెన్స్ రివాల్వర్తో రాజేశ్వరిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత, యశరాజ్సింగ్ 108 అత్యవసర సేవకు ఫోన్ చేశాడు. అధికారులు అక్కడికే చేరుకునేసమయానికే రాజేశ్వరి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అత్యవసర బృందం ఫ్లాట్ నుండి వెళ్లిపోయిన తర్వాత, యశరాజ్సింగ్ మరో గదిలోకి వెళ్లి అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: రూ. 40 వేల కోట్ల కంపెనీకి సారథి : వైఫల్యాలు వెక్కిరించినా!మరోవైపు యశరాజ్సింగ్ గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు , రాజ్యసభ ఎంపీ శక్తిసింగ్ గోహిల్ మేనల్లుడు. ఈ మరణాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషి విచారం వ్యక్తం చేస్తూ, ఈ ఘటనతో కుటుంబం తీవ్రంగా కలత చెందిందని అన్నారు. అతనొక యువ అధికారి, ఇటీవల పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గుజరాత్ మారిటైమ్ బోర్డులో చేరాడనీ, యూపీఎస్సీకి కూడా సిద్ధమవుతున్నాడని ఇంతలోనే ఈ విషాదం జరిగిందని విచారం వ్యక్తం చేశారు ఇద్దరి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అతని తుపాకీ లైసెన్స్, 108 కాల్ రికార్డులు వంటి వివరాలను పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: మొన్ననే పెళ్లి, తగాదా...నాలుక కొరికేసింది, తీవ్ర ఘర్షణ!
తల్లిదండ్రుల దశదిన కర్మ రోజే కూతురు జన్మదినం
పెద్దపల్లి జిల్లా: లింగాపూర్ గ్రామానికి చెందిన కందుల తిరుపతి–స్రవంతి దంపతుల మధ్య వచ్చిన స్వల్ప ఘర్షణతో క్షణికావేశంలో దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడారు. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా 15ఏళ్ల ఏకైక కూతురు శివాణి ఉంది. ఈక్రమంలో బుధవారం తల్లిదండ్రుల దశదినకర్మ రోజే కూతురు శివాణి జన్మదినం కావడంతో బంధువులు, గ్రామస్తుల ప్రోత్సాహంతో బాధ నుంచి మరల్చేందుకు తల్లిదండ్రుల చిత్రపటం ఎదుట కేక్ కట్ చేయించారు. కాగా ఉద్విగ్న క్షణాలతో కన్నీటిని ఆపుకుంటూ బాధను అదిమి పట్టి అతికష్టంగా ముఖంపై చిరునవ్వును చిందినట్లుగా శివాణి కేక్ కట్ చేసిన తర్వాత పక్కకు వచ్చి ఒక్కసారిగా కన్నీంటిపర్యంతమైంది. బాలిక రోధనను చూసిన బంధువులు, గ్రామస్తులు మరోసారి కంటతడిపెట్టారు. గ్రామస్తులంతా చిన్నారికి అండగా నిలుస్తూ భరోసా కల్పించారు.
మృత్యువుతో పోరాడి ఓడిన యువ డాక్టర్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): డాక్టర్ అయిన బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు పడ్డ సంతోషం మూన్నాళ్లకే ఆవిరైంది. ఎండీ కోర్సు చదువుతున్న యువడాక్టర్ గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మోతె ప్రేమ్కుమార్–యశోద దంపతుల పెద్ద కుమార్తే రోస్లిన్(27) రష్యాలో ఎంబీబీఎస్ పూర్తిచేసింది. కొంతకాలం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి, ఎల్లారెడ్డిపేట పీహెచ్సీలో వైద్యసేవలు అందించింది. ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే రాజన్నపేటకు చెందిన సాయిబాబాను ప్రేమవివాహం చేసుకుంది. అనంతరం హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎండీ కోర్సు సెకండియర్ చదువుతుంది. ఇంతలోనే గర్భం దాల్చింది. అయితే గత డిసెంబర్లో తీవ్ర జ్వరంతో ఇంటికొచ్చి మందులు వాడింది. అదే నెల 24న ఇంట్లో హఠాత్తుగా ఊపిరి ఆగిపోవడంతో వెంటనే సీపీఆర్ చేసి స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు, అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. అక్కడ 4 రోజులు చికిత్స అందించారు. సుమారు రూ.7లక్షల వరకు ఖర్చు చేశారు. రికవరీ కాకపోవడంతో తిరిగి ఎల్లారెడ్డిపేటకు తీసుకొచ్చి చికిత్స అందించారు. మళ్లీ హైదరాబాద్లోని మరో హాస్పిటల్లో చేర్పించారు. 27 రోజులపాటు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
వీడియోలు
Dharmana : భూములు కొట్టేయడానికే చట్టమా? మీరే పెద్ద దొంగలు..
Perni Nani: జగన్ ట్రెండ్ సెట్టర్.. మీరు ఫాలోవర్స్..
RS Praveen : ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి
GVMC ఉద్యోగి భౌతికకాయానికి YSRCP నేతల నివాళులు
Chandrasekhar : సచివాలయం ఉద్యోగులను చంపేస్తున్నారు.. ఇంకెంత మందిని బలి తీసుకుంటావ్
ఉదయగిరిలో మగ పెద్ద పులి జాగ్రత్త..అటవీశాఖ హెచ్చరిక
Kakinada : ఈ ప్రభుత్వానికి ఓటు వేసి నరకం చూస్తున్నాం..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి
KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ
ప్రతి పొలానికి పక్కా మ్యాప్.. పాసు పుస్తకాలు ముందు పెట్టి..
