వారాలకు వారాలు.. వాకిట్లో ఎదురుచూపులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట గ్యాస్ సంక్షోభం సామాన్య గృహ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్యాస్ బుకింగ్ చేసి వారాలు గడుస్తున్నా డెలివరీ చేయకపోవడంతో నిత్యం ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. క్షేత్ర స్థాయిలో ఓటీపీ సమస్య వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఫలితంగా గ్యాస్ లోడ్ల కోసం సామాన్యులు ఆశగా ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది. మరోవైపు వాణిజ్య గ్యాస్ కొరత హోటల్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా హోటళ్లు, చిరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో 14.2 కిలోల సిలిండర్ను రూ.2వేలు, 19 కిలోల వాణిజ్య సిలిండర్ను రూ.4 వేలు పెట్టి అధికరేట్లకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ఈ ఆర్థిక భారాన్ని పూడ్చుకునేందుకు వ్యాపారులు టిఫిన్లు, కర్రీలపై రూ.10 చొప్పున పెంచి విక్రయిస్తున్నారు. దీంతో రోజువారీ కూలి పనులు చేసుకునే బడుగు జీవులకు నెలకొచ్చే స్వల్ప ఆదాయంలో రూ.2వేల నుంచి రూ.3 వేల వరకూ చిల్లుపడుతోంది. వెరసి సామాన్య ప్రజలు ఇంటిలోవంట చేసుకోలేక.. బయట అధిక రేట్లకు కొని, తినలేక నరకయాతన అనుభవిస్తున్నారు.మూడు వారాలకుపైనే బ్యాక్ లాగ్స్రాష్ట్రంలో గ్యాస్ బుకింగ్స్ బ్యాక్ లాగ్స్ మూడు వారాలకు పైనే ఉంటున్నాయి. అంటే, బుకింగ్ చేసుకున్న 10 నుంచి 21 రోజుల తర్వాత కూడా డెలివరీ అవుతుందన్న గ్యారెంటీ లేదు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే గ్యాస్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 4 వేల టన్నుల గ్యాస్ అవసరం కాగా మూడున్నర రోజులకు మించి నిల్వలు ఉండట్లేదు. రోజువారీ బుకింగ్లతో పోలిస్తే డెలివరీలు పెంచామని ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు సైతం గ్యాస్ సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విద్యార్థులు, వృద్ధులు, చిన్నారులకు పెట్టే ఆహారంలో మెనూలు కుదించడంతో కడుపునిండా తిండి దొరకట్లేదు. ఇక సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారుల పరిస్థితి దయనీయంగా మారింది.బ్లాక్ మార్కెట్ దందాదేశవ్యాప్తంగా గ్యాస్ డెలివరీలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఓటీపీ విధానం ఏపీలో ఘోరంగా విఫలమైంది. గ్యాస్ బుక్ చేసుకున్న వారికి రోజులు గడిచినా ఓటీపీలు రాకపోవడంతో గ్యాస్ కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఇక స్థానిక అధికారులు కొందరు దగ్గరుండి ఓటీపీ లేకుండా గ్యాస్ పంపిణీ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అనుకూల ఏజెన్సీలు, కొందరు ప్రజా ప్రతినిధులు గ్యాస్ను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ జేబులు నింపుకోవడం సమస్యకు మరోకోణం. ఇక్కడ ఓటీపీతో పాటు ఈ–కేవైసీ సమస్య జటిలంగా మారింది. ప్రభుత్వం 90 శాతానికిపైగా ఈ–కేవైసీ చేశామని ఆర్భాటంగా ప్రకటిస్తే.. గ్యాస్ ఏజెన్సీల అసోసియేషన్ 75 శాతం మాత్రమే ఈ–కేవైసీ పూర్తయినట్టు చెప్పడం గమనార్హం.పీఎన్జీ కోసమే ఎల్పీజీ జాప్యం..!రాష్ట్రంలో 1.61 కోట్ల గృహ వినియోగ గ్యాస్ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు సగటున 84 లక్షల వరకు గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసేవారు. ఇప్పుడు అది కాస్త పడిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం వినియోగదారులను పైప్డ్ నేచ్యురల్ గ్యాస్ (పీఎన్జీ)కు మారాలని ఉచిత సలహా ఇస్తోంది. వాస్తవానికి 3 లక్షల పీఎన్జీ కనెక్షన్ల సామర్థ్యం ఉన్న నెట్వర్క్లో కేవలం 65 వేల కనెక్షన్లు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. అధిక డిపాజిట్లు, నెలవారీ బిల్లు కట్టాల్సి రావడంతో ఇది సామాన్యులకు భారంగా మారుతోంది. అందుకే పెద్దగా ఇష్టపడట్లేదు. కానీ, ప్రభుత్వం మాత్రం బలవంతంగా 6 నెలల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో.. ఎల్పీజీ సరఫరాలను కావాలనే జాప్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1.61 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లలో కనీసం 2 శాతం కూడా లేని పీఎన్జీకి విస్తృత ప్రచారం చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకోవడం విస్తుగొలుపుతోంది. దీపం–2.0లో లబ్ధిదారులకు ఖేదంచంద్రబాబు ప్రభుత్వం సామాన్యులను మోసం చేయడమే అజెండాగా పాలన సాగిస్తోంది. ముఖ్యంగా దీపం.–2.0 పథకంలో మహిళలను తీవ్రంగా వంచించింది. ఏపీలో 1.48 కోట్ల రైస్ కార్డుదారులు ఉన్నారు. వీళ్లందరూ అల్పాదాయ, పేద వర్గాలే. ఇక్కడ 1.61 కోట్ల ఎల్పీజీ గృహ కనెక్షన్లలో పేదలే ఎక్కువగా గ్యాస్ వినియోగిస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఏటా 85–90 లక్షల మందికి మాత్రమే ఉచిత గ్యాస్ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. దాదాపు 60 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ఎగనామం పెడుతోంది.
ఈక్విటీ ఫండ్స్.. తగ్గేదేలే!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఆటుపోట్లు నెలకొన్న తరుణంలోనూ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడుల పట్ల తమ విశ్వాసాన్ని చాటారు. మార్చి నెలలో ఈక్విటీ ఫండ్స్లోకి రికార్డు స్థాయిలో రూ.40,456 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో వచ్చిన రూ.25,978 కోట్లతో పోల్చి చూస్తే 56 శాతం పెరిగాయి. 2025 జూలై (రూ.42,702 కోట్లు) తర్వాత ఒక నెలలో వచ్చిన అత్యధిక పెట్టుబడులు ఇవి. ముఖ్యంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్కు అత్యధిక ఆదరణ లభించింది. మరోవైపు డెట్ ఫండ్స్ నుంచి భారీ స్థాయిలో రూ.2.95 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ఫిబ్రవరిలో ఇదే విభాగం రూ.42,106 కోట్లను ఆకర్షించడం గమనార్హం. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మార్చిలో రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులను నికరంగా కోల్పోయింది. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని నికర ఆస్తుల (ఏయూఎం) విలువ ఫిబ్రవరి చివరికి ఉన్న రూ.82.03 లక్షల కోట్ల నుంచి మార్చి చివరికి రూ.73.73 లక్షల కోట్లకు తగ్గింది. ఇందులో ఈక్విటీ ఫండ్స్ రూ.31,97,698 కోట్లుగా ఉంది. స్టాక్స్ విలువలు తగ్గడం ఏయూఎంపై ప్రభావం చూపించింది. విభాగాల వారీగా.. → అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ రూ.10,054 కోట్ల పెట్టుబడులను మార్చి నెలలో ఆకర్షించాయి. → స్మాల్క్యాప్ ఫండ్స్లోకి రూ.6,263 కోట్లు, మిడ్క్యాప్ లోకి రూ.6,063 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. → లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్ రూ.5,307 కోట్లు, లార్జ్క్యాప్ ఫండ్స్ రూ.2,997 కోట్ల చొప్పున రాబట్టాయి. → మల్టీక్యాప్ ఫండ్స్లోకి రూ.2,981 కోట్లు రాగా, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ రూ.437 కోట్లను కోల్పోయాయి. → గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు భారీగా తగ్గి రూ.2,266 కోట్లకు పరిమితమయ్యాయి. ఫిబ్రవరిలో ఇదే విభాగంలోకి రూ.5,255 కోట్లు, జనవరిలో రూ.24,040 కోట్లు చొప్పున రావడం గమనార్హం. → హైబ్రిడ్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.16,500 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ నుంచి రూ.21,000 కోట్లు బయటకు వెళితే, మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్స్లోకి రూ.5,000 కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్ల నమ్మకం.. ‘మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టిపై ఇన్వెస్టర్లలో స్థిరమైన విశ్వాసం కొనసాగుతోందని మార్చి నెల పెట్టుబడులు తెలియజేస్తున్నాయి. భారత్ నిర్మాణాత్మక వృద్ధి బలంగా ఉండడంతో, ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను సర్దుబాటు చేసుకుంటున్నారు’ అని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. సిప్ సరికొత్త రికార్డు.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈక్విటీల్లోకి నెలవారీ వచ్చే పెట్టుబడులు మార్చిలో ఆల్టైమ్ గరిష్ట రికార్డును నమోదు చేశాయి. రూ.32,087 కోట్ల పెట్టుబడులు సిప్ రూపంలో వచ్చాయి. ఫిబ్రవరిలో సిప్ పెట్టుబడులు రూ.29,845 కోట్లుగా ఉన్నాయి. దీర్ఘకాలం కోసం సిప్ రూపంలో వివిధ పథకాల్లో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టే సంస్కృతి ఇటీవలి కాలంలో విస్తరిస్తున్నట్టు ఈ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది.
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు.
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.నవమి రా.8.42 వరకు తదుపరి దశమి, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.10.20 వరకు తదుపరి శ్రవణం, వర్జ్యం: ప.2.34 నుండి 4.16 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.50 నుండి 7.28 వరకు, అమృత ఘడియలు: రా.12.45 నుండి 2.27 వరకు.సూర్యోదయం : 5.50సూర్యాస్తమయం : 6.10రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాల వృద్ధి. ఉద్యోగాలలో ఉత్సాహం.వృషభం: అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాల యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.మిథునం: వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.కర్కాటకం: మిత్రులతో మరింత సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.సింహం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో ఆదరణ. విద్యార్థులకు అనుకూలస్థితి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.కన్య: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువులతో విభేదాలు. ధనవ్యయం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.తుల: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. వాహనాలు కొంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభం. ఉద్యోగాలలో హోదాలు.ధనుస్సు: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.మకరం: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. వాహనసౌఖ్యం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు.కుంభం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.మీనం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో అనుకూలత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.
ప్రేమోన్మాది చేతిలో బాలిక దారుణ హత్య
ఖాజీపేట: ప్రేమోన్మాది చేతిలో ఓ బాలిక దారుణహత్యకు గురైంది. ఈ దుర్ఘటన వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలో శుక్రవారం జరిగింది. వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ఇళ్లూరు శ్రీనివాసులు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె రామకీర్తన (16) ఉన్నారు. కీర్తన ఖాజీపేటలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివి ఇటీవలే పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటుంది. శుక్రవారం ఉదయం కీర్తన తండ్రి శ్రీనివాసులు తన పెద్ద కుమారునితో కలిసి మైదుకూరుకు జీవాల కొనుగోలుకు వెళ్లాడు. తల్లి నాగమణి కూలి పనులకు వెళ్లారు. కీర్తన తమ్ముడు బడికి వెళ్లాడు. దీంతో కీర్తన ఒంటరిగా ఇంటి వద్ద ఉండడంతో ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ వచ్చి కొడవలితో గొంతుకోసి పరారయ్యాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి, అతడి పెద్దకుమారుడు రక్తపుమడుగులో పడి ఉన్న రామకీర్తనను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటికి రామకీర్తన మాట్లాడు తుండడంతో విషయం తెలుసుకుని పోలీసు లకు సమాచారం ఇచ్చారు. కీర్తన గొంతు నుంచి రక్తస్రావం జరగకుండా టవల్ను చుట్టి ఆమెను చేతులతో ఎత్తుకుని ఆటో వరకు తీసుకెళ్లారు. అనంతరం కడపకు తీసుకెళ్తుండగా హైవేపైకి రాగానే 108 ఎదురవడంతో అందులో కడప రిమ్స్కు తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందడంతో కుటుంబసభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.ప్రేమోన్మాదమే హత్యకు కారణంఆవుల వెంకటేష్ రెండేళ్ల నుంచి ప్రేమ పేరుతో రామకీర్తన వెంటపడుతున్నాడు. ప్రేమించాలని వేధిస్తున్నాడు. పలుమార్లు బాలిక తండ్రితో మీ కూతురు ఇతరులతో ఫోన్ మాట్లాడుతోందంటూ ఫిర్యాదు చేశాడు. దీనికి ఆమె సంగతి మేం చూసుకుంటాం.. నీవు కలగజేసుకోవద్దని శ్రీనివాసులు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రామకీర్తనపై కక్ష పెంచుకున్న వెంకటేష్ శుక్రవారం ఉదయం ఆమెతో ఫోన్లో మాట్లాడే యత్నం చేశాడు. బాలిక స్పందించక పోవడంతో ఆవేశంతో ఇంటికి వెళ్లి కొడవలితో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. పోలీసుల కాళ్లుపట్టుకున్న తల్లిదండ్రులు బాలిక హత్యతో శ్రీనివాసులు బంధువులు, గ్రామస్తులు కోపోద్రిక్తులయ్యారు. ఖాజీపేట పోలీస్స్టేసన్కు తరలివచ్చి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని నినదించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరు సరిగా లేదని ఖాజీపేట బస్టాండ్ కూడలిలో రాస్తా్తరోకో చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు టౌన్లోకి వాహనాలు రాకుండా జాతీయరహదారి నుంచి ట్రాఫిక్ మళ్లించారు. దీంతో బాలిక బంధువులు జాతీయ రహదారి దిగ్బంధించారు. సుమారు మూడు గంటల పాటు జాతీయ రహదారిపై రాస్తా్తరోకో చేశారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని భీష్మించారు. ఓ దశలో మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు, పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని లాఠీచార్జీ చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు యత్నించారు. అయితే బాలిక తల్లిదండ్రులు తీవ్రంగా ప్రతిఘటించారు. రామకీర్తన తల్లిదండ్రులు, బంధువులు పోలీసుల కాళ్లు పట్టుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి తప్పకుండా న్యాయం చేస్తామని దిశా డీఎస్పీ బాలస్వామిరెడ్డి హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు. మాకు న్యాయం కావాలిమా ఇంటికే వచ్చి నా కూతురి గొంతుకోసి వెళ్లడం దారుణం. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వాడిని వదిలేదే లేదు. మాకు జరిగిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగకూడదు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఉరిశిక్ష పడాలి. అంత వరకూ పోరాటం చేస్తూనే ఉంటాం. – శ్రీనివాసులు–నాగమణి, బాలిక తల్లిదండ్రులు
భూముల విలువల పెంపు నివేదిక ఇవ్వండి
జస్టిస్ వర్మ రాజీనామా
రూ.1,856 కోట్ల నిఘా డ్రోన్ కనిపించుట లేదు
పరిశ్రమలు పప్పు'పప్పు'
ప్రేమోన్మాది చేతిలో బాలిక దారుణ హత్య
ప్రజా ప్రయోజనార్థం టాటా సన్స్ను లిస్ట్ చేయాలి
నేడు పాక్ లో కాల్పుల విరమణపై చర్చలు
మండిన ఎండ.. అక్కడక్కడ వాన
చర్చలు విఫలమైతే సర్వనాశనమే: పాక్ ప్రధాని
భారత్ వృద్ధి అంచనాలు అప్
అవన్నీ పీరియడ్స్లో ఉండగానే చేశా: శ్రీలీల
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
ఆంటీ అనకూడదు
చంద్రబాబు సర్కార్ మళ్లీ అప్పు
అంతకాలం సీఎంగా ఉండి ఆమె ఇంకేం పనిచేసినట్లు సార్!
రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సీజ్ఫైర్ ప్రకటన
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
సముద్ర గర్భంలో రష్యా దుష్ట కార్యక్రమాలు
చారిత్రక ద్వైపాక్షిక సిరీస్ను ప్రకటించిన పాకిస్తాన్
బంగారం ధరలు రివర్స్.. కొనేవారికి గుడ్న్యూస్
'విశ్వంభర' విడుదల తేదీ వైరల్
అనుష్క శెట్టి.. నమ్మశక్యం కాని రూమర్
బీసీబీ నూతన అధ్యక్షుడి సంచలన నిర్ణయం
ఇరాన్ అణుసంస్థ అధిపతి కీలక వ్యాఖ్యలు
ఉద్యోగం - ఆర్థిక స్వేచ్ఛ: కియోసాకి సూచన
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
హర్మూజ్పై ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన
హర్మూజ్పై ఇరాన్ సంచలన ప్రకటన
పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు
అమెరికా నౌకలు, యుద్ధ విమానాలు, సైనికులు రెడీ: ట్రంప్
భూముల విలువల పెంపు నివేదిక ఇవ్వండి
జస్టిస్ వర్మ రాజీనామా
రూ.1,856 కోట్ల నిఘా డ్రోన్ కనిపించుట లేదు
పరిశ్రమలు పప్పు'పప్పు'
ప్రేమోన్మాది చేతిలో బాలిక దారుణ హత్య
ప్రజా ప్రయోజనార్థం టాటా సన్స్ను లిస్ట్ చేయాలి
నేడు పాక్ లో కాల్పుల విరమణపై చర్చలు
మండిన ఎండ.. అక్కడక్కడ వాన
చర్చలు విఫలమైతే సర్వనాశనమే: పాక్ ప్రధాని
భారత్ వృద్ధి అంచనాలు అప్
అవన్నీ పీరియడ్స్లో ఉండగానే చేశా: శ్రీలీల
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
ఆంటీ అనకూడదు
చంద్రబాబు సర్కార్ మళ్లీ అప్పు
అంతకాలం సీఎంగా ఉండి ఆమె ఇంకేం పనిచేసినట్లు సార్!
రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సీజ్ఫైర్ ప్రకటన
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
సముద్ర గర్భంలో రష్యా దుష్ట కార్యక్రమాలు
చారిత్రక ద్వైపాక్షిక సిరీస్ను ప్రకటించిన పాకిస్తాన్
బంగారం ధరలు రివర్స్.. కొనేవారికి గుడ్న్యూస్
'విశ్వంభర' విడుదల తేదీ వైరల్
అనుష్క శెట్టి.. నమ్మశక్యం కాని రూమర్
బీసీబీ నూతన అధ్యక్షుడి సంచలన నిర్ణయం
ఇరాన్ అణుసంస్థ అధిపతి కీలక వ్యాఖ్యలు
ఉద్యోగం - ఆర్థిక స్వేచ్ఛ: కియోసాకి సూచన
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
హర్మూజ్పై ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన
హర్మూజ్పై ఇరాన్ సంచలన ప్రకటన
పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు
అమెరికా నౌకలు, యుద్ధ విమానాలు, సైనికులు రెడీ: ట్రంప్
ఫొటోలు
గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ (ఫొటోలు)
సీతామహాలక్ష్మిలా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)
తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
మిస్ తెలుగు యూఎస్ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)
తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)
గ్రాండ్గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)
సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)
సినిమా
'మిమ్మల్ని చూసి నిజంగా గర్వపడుతున్నా'.. ఐకాన్ స్టార్ ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులపై ప్రశంసలు కురిపించారు. సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టడాన్ని అభినందించారు. ప్రతి ఏటా ఒక మంచి పని చేయడం.. హెచ్పీవీ వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించిన అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. మీరంతా కలిసి అద్భుతమైన పని చేశారని కొనియాడుతూ ట్వీట్ చేశారు.అల్లు అర్జున్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే కార్యక్రమాన్ని స్వీకరించి.. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా ప్రోగ్రామ్ చేపట్టిన నా అభిమానులందరినీ చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నా. మీరందరూ అద్భుతమైన పని చేశారు. మీ ప్రతి కార్యాచరణ చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోతోంది. మీ శక్తి అంతా మంచి పనులకే కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూసి నిజంగా గర్వపడుతున్నా. ఈ గొప్ప కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తమ అమూల్యమైన మద్దతు, ప్రోత్సాహం అందించిన గౌరవనీయ మంత్రులు, నాయకులు, ప్రభుత్వ అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల్లో శాశ్వతమైన సానుకూల ప్రభావాన్ని సృష్టించే కార్యక్రమాల కోసం మనమందరం కలిసికట్టుగా నిలబడదాం.' అంటూ పోస్ట్ చేశారు. I am truly soo proud of all my fans for embracing the “One Good Deed Every Year” initiative and taking up a meaningful programme like the #HPVVaccine Awareness Drive. You guys have outdone yourself and it truly fills my heart seeing every activity . Soo glad all of your energy is…— Allu Arjun (@alluarjun) April 10, 2026
నయనతార ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ టాక్ ఏంటి?
వరుస బ్లాక్బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కాన్సెప్ట్ బాగున్నా.. తెరపై ఆకట్టుకునేలా తీయడంతో దర్శకుడు విఘ్నేష్ విఫలం అయ్యాడని సినిమా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు.కథ విషయానికొస్తే.. ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘లవ్ టుడే’ మాదిరే ఈ చిత్రం కూడా ఫోన్ చుట్టూనే నడుస్తుంది. అయితే ఇందులో కథను 14 ఏళ్లు ముందుకెళ్లి..అంటే 2040లో నడుస్తున్నట్లుగా చూపించారు. అప్పటి వరకు మొబైల్, సోషల్ మీడియా ప్రభావం మన జీవితాలపై ఎలా ఉంటుందనేది వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు విఘ్నేష్. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అంటూ ప్రేమకు కూడా ఒక ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరమైన పాయింటే కానీ.దాన్ని అంతే ఆసక్తికరంగా తెరపై చూపించి ఉంటే బాగుండేదని సినిమా చూసిన నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. #LIK (Tamil) {2.25/5} - Lyt Idi Kuda.#LoveInsuranceKompany #LIKReview #CMReviews pic.twitter.com/qi58kxTikQ— Cinema Madness 24*7 (@CinemaMadness24) April 10, 2026#LIK - 2/5Movie has a unique futuristic concept, but the story is weak and not very engaging. PR gives a good performance and tries hard to carry the film with his energy. Some scenes and comedy work, but the slow narration and uneven screenplay make it boring at times.…— Raghavendra (@SRaghavendra87) April 10, 2026
తిరుమల శ్రీవారి సేవలో శ్రీలీల.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలీలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. హీరోయిన్ శ్రీలీలను చూసిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే చివరిసారిగా పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించింది. టాలీవుడ్లో స్టార్ హీరోలతో మెప్పించిన కన్నడ బ్యూటీ.. ఐటమ్ సాంగ్స్లోనూ మెప్పించింది. పుష్ప-2 చిత్రంలో ఐటమ్ సాంగ్తో అదరగొట్టేసింది. అంతేకాకుండా ఈ ఏడాది పరాశక్తి మూవీతోనూ అలరించింది. Actress #Sreeleela visited Tirumala Tirupati Devasthanams today to seek divine blessings 🙏 pic.twitter.com/TBSdj6FQ6G— Eluru Sreenu (@IamEluruSreenu) April 9, 2026
మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్.. కేఫ్లో బిగ్బాస్ దివి చిల్..!
మాల్దీవుస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్..హీరోయిన్ ప్రియమణి లేటేస్ట్ లుక్..గ్రీన్ డ్రెస్లో మెరిసిపోతున్న నటి బిందు మాధవి..కేఫ్లో చిల్ అవుతోన్న బిగ్బాస్ దివి..జిమ్లో హనీ రోజ్ కసరత్తులు.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Divi (@actordivi)
క్రీడలు
వైభవ్ వీర విహారం.. ఆర్సీబీని చిత్తు చేసిన రాజస్తాన్
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. రాయల్స్కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం గమనార్హం.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతికే డేంజరస్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఔటైనప్పటికి.. తర్వాత వచ్చిన ఆర్సీబీ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ముఖ్యంగా కెప్టెన్ రజత్ పాటిదార్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి పాటిదార్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. పాటిదార్ 40 బంతుల్లో 4 ఫోర్లు,4 సిక్స్లతో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(29), షెఫర్డ్(22), విరాట్ కోహ్లి(32) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, జోఫ్రా ఆర్చర్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు సందీప్ శర్మ, రవీంద్ర జడేజాతలా వికెట్ సాధించారు.వైభవ్ విధ్వంసంఅనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో చేధించింది. ఈ భారీ లక్ష్య చేధనలో రాజస్తాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు. వైభవ్ బ్యాటింగ్ ధాటికి ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు ధ్రువ్ జురెల్(43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 81 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, కృనాల్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 26 బంతుల్లోనే! వీడియో
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 26 బంతుల్లోనే
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ధనధాన్ లీగ్లో భాగంగా గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 202 పరుగుల లక్ష్య చేధనలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం ఈ బుడ్డోడు ఉతికారేశాడు. తొలిసారి హేజిల్వుడ్ను ఎదుర్కొన్న వైభవ్.. 4 ఓవర్లో వరసగా 4, 4, 4 ,6తో 19 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ ఓవర్లో వరసగా రెండు సిక్సర్లతో 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించడం ఇది రెండో సారి కావడం విశేషం. ఈ మ్యాచ్లో ఓవరాల్గా కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. వైభవ్ ఈ తుఫాన్ ఇన్నింగ్స్తో ఆరెంజ్ క్యాప్ను తన సహచరుడు జైశ్వాల్ నుంచి సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ నాలుగు మ్యాచ్లు 266.67 స్ట్రైక్ రేటుతో 200 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: బిష్ణోయ్ సూపర్ డెలివరీ.. కోహ్లి ఫ్యూజ్లు ఔట్? వీడియో వైరల్Vaibhav Sooryavanshi in IPL1st ball v Bumrah - 61st ball v Bhuvi - 41st ball v Shardul - 61st ball v Washington- 61st ball v Arshdeep - 41st ball v Hazlewood - 4Unreal Talent, Unreal Hitting pic.twitter.com/XGQT8SnR4u— Cricketopia (@CricketopiaCom) April 10, 2026
బిష్ణోయ్ సూపర్ డెలివరీ.. కోహ్లి ఫ్యూజ్లు ఔట్? వీడియో వైరల్
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో బిష్ణోయ్ బంతితో మ్యాజిక్ చేశాడు. బిష్ణోయ్ తన తొలి ఓవర్లోనే అద్బుతమైన బంతితో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని బోల్తా కొట్టించాడు. ఆర్సీబీ తమ ఇన్నింగ్స్ మొదటి బంతికే ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. అయినప్పటికి కోహ్లి మాత్రం బౌండరీలతో రాజస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే డేంజర్గా మారుతున్న కోహ్లిని అవుట్ చేయడానికి కెప్టెన్ రియాన్ పరాగ్..ఐదో ఓవర్లోనే రవి బిష్ణోయ్ను రంగంలోకి దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని బిష్ణోయ్ వమ్ము చేయలేదు. ఆ ఓవర్లో నాలుగో బంతికి కోహ్లికి బిష్ణోయ్ గుగ్లీగా సంధించాడు. బిష్ణోయ్ వేసిన ఆ అద్భుతమైన డెలివరీని అంచనా వేయడంలో కోహ్లీ విఫలమయ్యాడు. కోహ్లి బంతిని బౌలర్ తల మీదుగా కొట్టడానికి ప్రయత్నించాడు.అయితే బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి స్టంప్స్ను గిరాటేసింది. దీంతో కోహ్లి ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కోహ్లి కేవలం 16 బంతుల్లో 7 ఫోర్లు సాయంతో 32 పరుగులు చేశాడు. బిష్ణోయ్ విషయానికి వస్తే తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులు లిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2026: 'రోజుకు 150 సిక్సర్లు.. ఇదే నా సక్సెస్ సీక్రెట్'
ఆర్సీబీ ఓపెనర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఓ అవాంఛిత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్లోని మొదటి బంతికే మూడుసార్లు అవుట్ తొలి ప్లేయర్గా సాల్ట్ నిలిచాడు. ఐపీఎల్-2026లో గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదటి బంతికే సాల్ట్ ఔటయ్యాడు. రాజస్తాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మొదటి బంతికే అద్భుతమైన బౌన్సర్తో సాల్ట్ను బోల్తా కొట్టించాడు. దీంతో తొలి బంతికే అత్యధిక సార్లు ఔటైన బ్యాటర్గా పార్ధివ్ పటేల్, పృథ్వీషాను సాల్ట్ అధిగమించాడు. వీరిద్దరూ గతంలో రెండు సార్లు మ్యాచ్ తొలి బంతికే ఔటయ్యారు. ఓవరాల్గా ఐపీఎల్ ఇన్నింగ్స్ పరంగా అయితే ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో పార్థివ్ పటేల్(4 సార్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో డ్వేన్ స్మిత్, పృథ్వీ షా, కెఎల్ రాహుల్, సాల్ట్ ఉన్నారు.ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక సార్లు అవుటైన ప్లేయర్లు4 - పార్థివ్ పటేల్3 - డ్వేన్ స్మిత్3 - పృథ్వీ షా3 - కేఎల్ రాహుల్3 - ఫిల్ సాల్ట్*చదవండి: IPL 2026: 'రోజుకు 150 సిక్సర్లు.. ఇదే నా సక్సెస్ సీక్రెట్'
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో ‘సీఎంఆర్ఎఫ్’ నిధులు స్వాహా... టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి సీఎంవో వరకూ వసూళ్ల పర్వం
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మావిగన్.. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు: వైఎస్ జగన్
ఇరాన్ను తుడిచిపెట్టేస్తాం, వారి నాగరికతను నాశనం చేస్తాం. తీవ్రంగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
మళ్లీ పెరిగిన వెండి, బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీకి దినదిన గండం... ఐదో రోజూ స్తంభించిన ఓపీ, అత్యవసర వైద్యసేవలు
లోక్సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ... రెండు ఫైటర్ జెట్లను కూల్చివేసిన ఇరాన్
వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా చర్చ...
అవినీతి కోసమే అమరావతి... కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం..
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల కోట్ల రూపాయల బకాయిలు రాకపోవడంతో...
బిజినెస్
బీపీసీఎల్ సీఎండీగా సంజీవ్ ఖన్నా
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు కొత్త చైర్మన్, ఎండీగా (సీఎండీ) సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు బీపీసీఎల్లోనే రిఫైనరీస్కు ఆయన డైరెక్టర్గా పనిచేశారు. సీఎండీగా జి.కృష్ణకుమార్ పదవీ కాలం 2025 ఏప్రిల్30తో ముగిసింది. అప్పటి నుంచి సీఎండీగా అదనపు బాధ్యతలను సైతం ఖన్నాయే చూశారు.పెట్రోలియం శాఖ నుంచి నియామకం సమాచారం రావడంతో సీఎండీ బాధ్యతలను ఖన్నా స్వీకరించినట్టు స్టాక్ ఎక్స్చెంజీలకు బీపీసీఎల్ సమాచారం ఇచ్చింది. ఆయన నియామకం ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వాచినట్టు వెల్లడించింది.2029 మే 31 వరకు (పదవీ విరమణ) లేదంటే తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన ఈ బాధ్యతలు చూస్తారని తెలిపింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లిలో ఖన్నా కెమికల్ ఇంజనీర్ చదివారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి ఫైనాన్స్ మేనేజ్మెంట్లో పోస్ట్గ్రాడ్యుయేషన్ సైతం పూర్తి చేశారు.
'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం'
అమెరికాలో నివసిస్తున్న ఒక ఎన్నారై జంట.. తాము పనిచేసే కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత భారతదేశానికి తిరిగి రావాలని ప్లాన్ వేసుకున్నారు. 2025 అక్టోబర్లో మహిళ ఉద్యోగం కోల్పోగా, ఇటీవల ఒరాకిల్ లేఆఫ్స్ సమయంలో ఆమె భర్తకు కూడా ఉద్యోగం పోయింది. 60 రోజుల గడువులో.. ఇండియాకు రావాలనుకుంటున్న సమయంలో జాబ్ కోసం నెటిజన్ల సలహాలు అడిగారు. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన తరువాత నుంచి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, H4 వీసా కోసం ఎదురుచూశానని ఆమె పోస్టులో వెల్లడించారు. అయితే సరైన అవకాశాలు లేకపోవడంతో పరిస్థితి కష్టంగా మారింది. ఇదే సమయంలో తన భర్త కూడా ఉద్యోగం కోల్పోయారు. అతని H1B వీసాకు సంబంధించి PERM, I-140 ప్రాసెస్ లేకపోవడంతో, వీసా రిన్యూవల్ లేదా దీర్ఘకాలికంగా అమెరికాలో ఉండే అవకాశం లేకుండా పోయింది. దీంతో అతనికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే మిగిలింది.ఈ పరిస్థితుల్లో.. ఆ దంపతులు అమెరికాలో కొనసాగడం సాధ్యం కాదని భావించి, భారతదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జూలై నాటికి ఇండియాకు వెళ్లి అక్కడ కొత్తగా జీవితం ప్రారంభించాలని వారు ఆలోచిస్తున్నారు. “ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగం ఎలా దొరుకుతుంది? ఎంత సమయం పడుతుంది? కెరీర్ను ఎలా మళ్లీ ప్రారంభించాలి?” వంటి ప్రశ్నలు అడిగారు. దీనికి నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి.ఇదీ చదవండి: 'యాప్లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓకొంతమంది ''భారతదేశంలో స్కిల్స్ ఉంటే ఉద్యోగ అవకాశాలు బాగానే ఉంటాయి'' అని ప్రోత్సహించారు. మరికొందరు ''ఇక్కడ కూడా ఉద్యోగ మార్కెట్ కఠినంగానే ఉంది, కానీ అమెరికాతో పోలిస్తే స్థిరత్వం మెరుగ్గా ఉండొచ్చు'' అని చెప్పారు. ఇంకొందరు మాత్రం ''ముందు మానసికంగా స్థిరపడండి, తర్వాత ప్లానింగ్ చేసుకోండి'' అని సలహా ఇచ్చారు.
'యాప్లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓ
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతూ.. దాదాపు అన్ని రంగాల్లోనూ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు తీసుకొస్తోంది. 2007లో యాపిల్ కంపెనీ ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు.. ఫోన్ పరిశ్రమలో ఒక మహత్తర మార్పు చోటుచేసుకుంది. అప్పటివరకు మనం ఉపయోగించిన కీప్యాడ్ ఫోన్లు నెమ్మదిగా అంతరించిపోయి, టచ్స్క్రీన్ ఫోన్లు వచ్చేశాయి. ఇప్పడూ స్మార్ట్ఫోన్లను మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి.నథింగ్ సీఈఓ 'కార్ల్ పీ' అభిప్రాయం ప్రకారం.. గత ఇరవై సంవత్సరాలుగా స్మార్ట్ఫోన్ల వినియోగంలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. మనం ఇంకా లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్, యాప్లు, యాప్ స్టోర్లకు పరిమితమై ఉన్నాం. ఏ చిన్న పని చేయాలన్నా మనం అనేక యాప్లను ఉపయోగిస్తూ.. సమయం వృధా చేస్తున్నాం. ఇది కొంత క్లిష్టంగా మారింది.ప్రస్తుతం ఏఐ ఒక కొత్త విప్లవానికి దారితీయనుంది. భవిష్యత్తులో యాప్లు పూర్తిగా మాయమైపోయి.. వాటి స్థానంలో ఏఐ ఏజెంట్స్ రానున్నాయి. అలవాట్లు, ఇష్టాలు, అవసరాలను అర్థం చేసుకుని మన తరఫున పనులను స్వయంగా నిర్వహిస్తాయి. ఉదాహరణకు, ఒక స్నేహితుడితో కాఫీకి వెళ్లాలని అనుకుంటే, మనం వేర్వేరు యాప్లను ఉపయోగించకుండా, ఏఐ మన కోసం సమయం నిర్ణయించి, స్థలం ఎంపిక చేస్తుందన్నమాట.ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇచ్చే ఆదేశాలపై ఆధారపడి పనిచేస్తుంది. కానీ భవిష్యత్తులో రానున్న ఏఐ మన ఆలోచనలను కూడా ముందుగానే అర్థం చేసుకుని సూచనలు ఇవ్వగలదు. ఇది మన జీవితాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, టెక్నాలజీపై మన ఆధారాన్ని కూడా పెంచుతుంది.ఈ మార్పు స్టార్టప్ కంపెనీలకు ఒక సవాలుగా మారవచ్చు. ఇప్పటివరకు యాప్లపై ఆధారపడిన వ్యాపార నమూనాలు భవిష్యత్తులో పనిచేయకపోవచ్చు. అందువల్ల.. కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుని, ఏఐ ఆధారిత పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. లేకుంటే.. వారు ఇతర సంస్థలతో వెనుకబడే అవకాశం ఉంది.ఇప్పటికే కొన్ని కంపెనీలు ఏఐను తమ ఉత్పత్తుల్లో అమలు చేయడం ప్రారంభించాయి. నథింగ్ వంటి సంస్థలు వినియోగదారులకు ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తూ, కొత్త అనుభవాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో ఏఐ ఎంతగా పనిచేస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
హ్యుందాయ్ వైబ్ ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?
హ్యుందాయ్ ఇండియా.. తన గ్రాండ్ ఐ10 నియోస్ కొత్త వైబ్ ఎడిషన్ను పరిచయం చేసింది. దీని ధరలు రూ. 7.09 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్పెషల్ ఎడిషన్ స్పోర్ట్జ్, స్పోర్ట్జ్ (O) వేరియంట్ల ఆధారంగా నిర్మితమైంది.గ్రాండ్ ఐ10 నియోస్ వైబ్ ఎడిషన్ స్పోర్ట్జ్ వైబ్, స్పోర్ట్జ్ (ఓ) వైబ్ అనే రెండు ట్రిమ్లలో మాత్రమే లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లలోనూ ఎరుపు రంగు ఇన్సర్ట్లతో కూడిన నలుపు రంగు ఇంటీరియర్, అలాగే నలుపు రంగులో పెయింట్ చేసిన 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. లెదర్-ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి.స్పోర్ట్జ్ (ఓ) వైబ్ వేరియంట్లో పుష్-బటన్ స్టార్ట్తో కూడిన స్మార్ట్ కీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, ఆరు ఎయిర్బ్యాగ్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇందులో లభిస్తాయి.పవర్ట్రెయిన్ ఎంపికల విషయానికొస్తే, వైబ్ ఎడిషన్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్తో కొనసాగుతుంది, దీనికి 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్ లభిస్తుంది. కాబట్టి పనితీరు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.
ఫ్యామిలీ
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎలా, ఎపుడు చేసుకోవాలి? ఈ లాభాలు తెలుసా?
ఇచ్ఛాపురం: ఇటీవల సీజన్లో పెళ్లిళ్లు జోరుగా జరిగాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన కొత్త జంటలు వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీరి జీవితం కొత్తగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రభుత్వం పథకాలు రావాలన్నా, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయించాలన్నా, పాస్పోర్టు, భూములకు సంబంధించిన మ్యుటేషన్లు ఇతరత్రా అవసరాలు ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పటికప్పుడు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతూ చివరికి సర్టిఫికెట్ల కోసం బ్రోకర్లపై ఆధారపడి ఎక్కువ మొత్తంలో సొమ్ములు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను కొత్త జంట ముందుగానే గుర్తించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ పొందితే వారికే మంచిది.సర్టిఫికెట్ వల్ల ఉపయోగాలు పాస్పోర్టు అప్లికేషన్, బ్యాంక్ జాయింట్ అకౌంట్, కేంద్ర, రాష్ట్ర రక్షణ బలగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సర్వీస్ రికార్డుల్లో పేరు చేర్చుకునేందుకు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి వీసాప్రాసెస్, వీటితో పాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నవ వధూవరులు పెళ్లి చేసుకొనే ప్రదేశం ఆధారంగా గ్రామం ఐతే గ్రామ సచివాలయం లేదా పంచా యతీ కార్యాలయం, పట్టణం ఐతే వార్డు సచివాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం వివాహ శుభలేఖ, జీలకర్ర బెల్లం తలపై పెట్టుకున్న వధూవరుల ఫొటో, మంగళసూత్రం కట్టేటప్పుడు ఫొటో, పూల దండలు మార్చుకున్నప్పుడు ఫొటోలు ఉండాలి. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుల జిరాక్సులను జతచేయాలి. నవవధూవరుల తరఫున ఇద్దరు సాక్షులు, వారి ఆధార్ కార్డుల జిరాక్సు లను గ్రామ/వార్డు సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయంలోగానీ మున్సిపల్ కార్యాలయంకు గానీ అందజేయాలి. జత చేసిన ధ్రువీకరణ పత్రాలను జనన, మరణ రిజి్రస్టేషన్ అధికారి పరిశీలించి సర్టిఫికెట్ని జారీ చేస్తారు. ఆలయాల్లో వివాహం చేసుకుంటే దేవదాయ శాఖకు మందస్తుగానే రుసుం చెల్లిస్తే అధికారులు రశీదులు ఇస్తారు. వాటి ఆధారంగానే వివాహానికి సంబంధించిన ఇతర పత్రాలు ఫొటోలు సాక్షుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇళ్లు, కల్యాణ మండపాల్లో సంప్రదాయంగా వివాహం చేసుకుంటే అందుకు తగ్గ అన్ని రకాలు పత్రాలు సమర్పించి దరఖాస్తులు చేసుకోవాలి. ఇదీ చదవండి: ఆడబిడ్డ పుట్టిందని, అంతులేని సంబరం : వీడియో వైరల్90 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పెళ్లి జరిగిన 30 రోజుల్లో మున్సిపల్, పంచాయతీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొంటే తక్కువ ఫీజు ఉంటుంది. సాధారణంగా ఫీజు రూ.100 నుంచి రూ.500 వరకు మాత్రమే ఉంటుంది. వివాహం జరిగి 90రోజులు దాటితే సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఇందుకు ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి. యు.ఉపేంద్ర, జనన, మరణ, రిజిస్ట్రేషన్ అధికారి, ఇచ్ఛాపురం మున్సిపాలిటి
'బుజ్జి ఫొటోగ్రాఫర్'..! జస్ట్ 18 నెలల వయసుకే..
కొందరు చిన్నారులు వయసు పెరిగే కొద్ది తమలోని అసాధారణ ప్రతిభను కనబరుస్తారు. ఇంకొందరు బైబర్త్ నైపుణ్యం పెంపొందించుకుంటారు. వయసుకి వారి ప్రదర్శించే ప్రతిభకు పొంతనలేని వారి సామర్థ్యం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసేలా కట్టిపడేస్తుంది. అలాంటి కోవకు చెందిందే కేరళలోని పాలక్కాడ్కు చెందిన నాలుగేళ్ల పిహు. ఆమె పిట్ట కుంచెం కుత ఘనం అన్నట్లుగా ఫోటోగ్రఫీలో అసామాన్య ప్రజ్ఞతో ఆకట్టుకుంటోంది. ఆమె ఏ వయసులో కెమెరా పట్టుకుని క్లిక్ మనిపించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేరళలోని పాలక్కాడ్ నగరానికి చెందిన నాలుగేళ్ల పిహు వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన తండ్రి విపిన్దాస్, తల్లి శ్రీ హేమ శ్రీధరన్ దంపుతుల పెద్ద కుమార్తె. తన వయసు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే ఆమె మాత్రం తన చిట్టి చేతులతో కెమెరాతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఈ చిన్నారి కెమెరాల పట్ల అసాధారణమైన ఆసక్తిని కనబరుస్తోంది. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అయిన తండ్రి విపిన్ దాస్ అడుగుజాడల్లో నడిచేస్తోంది. అంత చిన్న వయసులోనే ఆ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడం విశేషం. పైగా తన టాలెంట్తో ఆ అభిరుచి తన డీఎన్ఏలోనే ఉంది అని చెప్పకనే చెబుతోంది పిహు. కేవలం 18 నెలల వయసులోనే బొమ్మ కెమరా కాకుండా, ఒరిజనల్ కెమెరాను పట్టుకుంది. ఆ పరికరం తన బరువులో దాదాపు సగం బరువు అయినా..ఆమె దానిని జాగ్రత్తగా ఎత్తి తనకు ఇష్టమైన ఏనుగు బొమ్మ ఫోటోని తీసింది. అది చూసిన తల్లిదండ్రులు ఓ చిన్న పసిపాప తీసిన ఫోటోనేనా..? అని విస్తుపోయారు. పైగా అంత చిన్నవయసులోనే కెమెరాలోని రకారకాల లెన్స్లు, గింబల్ వంటి వాటిపై ఆకస్తి చూపించేది. ప్రతి బటన్ ఎలా పనిచేస్తుందనేది తల్లిదండ్రులను అడిగి తెలుసుకునేది. అయితే తల్లిదండ్రులు అంత చిన్నవయసుకు కెమెరా ఎందుకని బొమ్మ కెమెరా ఇచ్చేందుకు యత్నిస్తే అస్సలు ఒప్పుకునేది కాదని చెప్పుకొచ్చారు. ఎలా నేర్చుకుందంటే..పిహు ఫొటోలు అందంగా తీయడం ఎలా నేర్చుకుందంటే..తన స్నేహితుడి బిడ్డ పుట్టినరోజు వేడుకలో సదరాగా ఇచ్చిన చిన్న కెమెరాను ప్రోఫెషనల్ కెమెరా మ్యాన్లు పట్టుకున్నట్లుగా పట్టుకుని ఫొటోలు తీసిందని చెబుతున్నారు ఆమె తండ్రి విపిన్ దాస్. అక్కడే తీస్తున్న ఇతర ఫొటోగ్రాఫర్లను పరిశీలిస్తూ తీయడం నేర్చుకుందని, పైగా ఆ వేడుకలో తీసిన పది ఫొటోలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలా అప్పటి నుంచి పిహు తండ్రి తోపాటు అవుట్డోర్ ఫొటోషూట్లకు వెళ్లడం ప్రారంభించింది. అలాగే తన తల్లి శ్రీహేమ రెండోసారి గర్భవతి అయినప్పుడు తల్లికి ఆ చిన్నారి వ్యక్తిగత ఫొటోగ్రాఫర్గా మారింది. నేచురల్ వెలుగులో అద్భుతమైన పోర్ట్రెయిట్లను తీసింది ఆ చిన్నారి. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) ఆ చిన్నారికి పేరొచ్చింది అప్పుడే..గతేడాది నవంబర్లో రాజకీయ నాయకుడు, ఎంపీ షఫీ పరంబిల్ ఆమె వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో పిహు పేరు మారుమ్రోగిపోయింది. ఆ వీడియోలో పిహు ఎంపీకి సంబంధించిన కొన్ని ఫొటోలు క్లిక్మనిపించింది. అంత ఎవరా ఆ చిన్నారి అంటూ తెలుసుకోవడం ప్రారంభించారు. ఇక తన కూతురుకి ఏ యాంగిల్ ఫోటోలు తీస్తే బాగా వస్తాయనే దానిపై మంచి పట్టుందని చెబుతున్నారు విపిన్ దాస్. View this post on Instagram A post shared by Shafi Parambil (@shafi_parambil) ఇవేగాక ఆమె ఇటీవలే, పాలక్కాడ్లోని శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగే పదిరోజుల వార్షిక రథోత్సవమైన ప్రసిద్ధ కల్పతి రథోత్సవంలో సైతం అద్భుతంగా ఫొటోలు తీసిందన్నారు. అక్కడ కమనీయ దృశ్యాలను చాలా అద్భుతంగా కెమెరాలో బంధించిందని చెప్పారు. అంతేకాదండోయో ఈ చిన్నారి పిహుకి 'cam_girl_pihu' అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది. దానిని ఆమె తల్లిదండ్రులే నిర్వహిస్తున్నారు.(చదవండి: నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్చేస్తే..)
నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్చేస్తే..
ఏ వ్యాపారమైన ప్రారంభంలో ఒడిదుడుకులు సాధారణం. ఇక్కడ వాటిని అధిగమిస్తు ముందుకు సాగేవారు ఏదో ఒకరోజు తప్పక గెలుస్తారు. అందుకు ఉదాహరణ ఈ వ్యక్తి. ఒకప్పుడు సాదాసీదా తోపుడు బండిపై పండ్ల వ్యాపారం. ఒక్కోసారి ఒక్కటి కూడా అమ్ముడు అవ్వక వద్దురా ఈ వ్యాపారం అనేలా నిరాశను కలుగజేసింది. అయినా ఎలాగైనా ఏదో సాధించాలన్న కసి, పట్టుదల మళ్లీ మళ్లీ అదే వ్యాపారం చేసి నిలదొక్కుకోవడమే గాక పదిమందికి ఉపాధి ఇచ్చే స్థాయికి చేరాడు, పైగా కోట్లలో లాభాలు ఆర్జించడం మొదలైంది. ఎలా ఆ వ్యక్తి ఆ స్థాయిలో పండ్ల వ్యాపారంలో సక్సెస్ని అందుకున్నాడంటే..ఆ వ్యక్తే మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్కి చెందిన అబ్దుల్ రైస్. దాదాపు 30 ఏళ్ల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఒక సాధారణ బండిపై పండ్లు అమ్ముతూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రారంభరోజుల్లో అతడి వ్యాపారం ఎంత దారుణంగా ఉండేదంటే..సరిగా అమ్మకాలు సాగాక రోజంతా వేచి చూడాల్సి వచ్చేది. ఆ తోపుడు బండి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోక ఇక వదిలేద్దాం రా బాబు అని అనుకునేవాడు. మరోవైపు వర్షాకాలంలో ఆ కొద్దిపాటి అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయేవి. ఈ ఇబ్బందులతో ఆయన ఛీ ఈ వ్యాపారం నాకొద్దు అంటూ విలపించేవాడు. అయితే బంధువులు, కుటుంబ సభ్యుల మద్దతుతో అబ్దుల్ సుమారు రూ. 5 లక్షల రుణం తీసుకుని మళ్లీ అదే వ్యాపారం ప్రారంభించారు. ఈసారి ఆయనకు గతంలో చూసిన సవాళ్లు అన్ని పాఠాలుగా మారి, ఎలా వ్యాపారం నిర్వహించాలో తెలిసొచ్చింది. నిరంతర శ్రమ, పట్టుదలతో లాభాల పట్టేంచేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆ చిన్న వ్యాపారం కాస్త కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. కాలక్రమేణ తన చిన్న తోపుడు బండి వ్యాపారం ఒక అభివృద్ధి చెందుతున్న సంస్థగా మారింది. అలా అతని సంస్థ ఏకంగా రూ. 3 కోట్ల వార్షిక టర్నోవర్తో దూసుకుపోవడమే గాక దాదాపు 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఒకప్పుడు మనుగడ కోసం పడిన పోరాటం ఇప్పుడు చాలామందికి ఉపాధి అందించే రేంజ్కు చేరడం విశేషం. అతడి సంస్థ బుర్హాన్పూర్లో నీలం ఫ్రూట్’గా ప్రసిద్ధి చెందింది. నాణ్యత, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి అక్కడందరి మన్ననలకు అందుకుంది. అతడి దుకాణం నుంచి పండ్లు కొనడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం గమనార్షం. అతడి సంస్థ వద్దకు సుమారు రెండు నుంచి మూడు వాహానాలు వస్తాయట. చిల్లర వినియోగదారులే కాకుండా, చాలా మంది చిరు వ్యాపారులు కూడా అతని వద్ద పండ్లు కొని స్థానిక మార్కెట్లలో అమ్ముతారు. తద్వారా అతడి వ్యాపార విస్తరణ మరింత పెరుగుతూ వచ్చింది. పట్లుదల, నిరంతర కృషి ఉంటే ఎంతటి భయాంకరమైన సవాళ్లనైనా దాటగలుగతాం, విజయం సాధించగలం అని అబ్దుల్ రైస్.(చదవండి: కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నీతా..! గులాబీ కుర్తా..)
వధువు కావలెను
అమ్మాయికి వంట వచ్చా.. అనే ప్రశ్న బదులు.. అబ్బాయి సంపాదన ఎంత అనే క్వశ్చన్ బాగా వినిపిస్తోంది. అమ్మాయి చదువుకుందా.. అని ఆరా తీయడం బదులు.. అబ్బాయి బుద్ధిమంతుడా కాదా అన్న ఎంక్వైరీలు మొదలయ్యాయి. కట్నం ఎంత ఇస్తారు.. అన్న మాట వినిపిస్తున్నా.. కట్నం ఇవ్వకపోయినా పర్లేదు అన్న అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. జిల్లాలో పురుష పుంగవులకు వివాహ రేఖలు కనిపించడం లేదు. 30 దాటినా పెళ్లి కాని వారి మగవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. శ్రీకాకుళం కల్చరల్, శ్రీకాకుళం రూరల్: జిల్లాలో పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నారు. ఇదివరకు అబ్బాయి ఓకే అంటే అమ్మాయి తరఫు వారు హమ్మయ్య అంటూ గెంతులు వేసే వారు. కానీ ఇప్పుడు ఓకే చెప్పే అధికారం పూర్తిగా అమ్మాయి తరఫు వారికే మళ్లిపోయినట్టు ఉంది. ఫలితంగా వయసు ముదురుతున్నా పెళ్లి కాక ఎంతో మంది యువకులు మిగిలిపోతున్నారు. ఒకప్పటిలా తల్లిదండ్రులు చూపించిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పుడు తక్కువైపోయారు. అబ్బాయిలు రాజీ పడుతున్నా అమ్మాయిలు నో అంటున్నారు. పెరిగిన అడ్డుగోడలు.. ప్రస్తుతం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫలానా విధంగా ఉండాలని అమ్మాయిలు చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు. సంపాదన ఒక్కటే చూడకుండా ప్రొఫెషన్ను కూడా గమనిస్తున్నారు. తక్కువ సంపాదన ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వాళ్లకి తక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద స్థాయిలో జీతాలు ఉండి ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగాల సంబంధాలను కూడా వదిలేసుకోవడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తుండడంతో ఉన్నత ఉద్యోగులకు అందునా ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటిలాగానే డిమాండ్ ఉంది. పెళ్లికి అమ్మాయిల అనుమతి రోజులు మారాయి. అమ్మాయి కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి నేను నచ్చానో లేదో ఒకసారి అడగండి అని అబ్బాయిలే అంటున్నారు. అవసరమైతే కట్నం లేకుండా చేసుకుంటామంటున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బిఎస్సీ అగ్రికల్చరల్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజినీరింగ్ వంటి కోర్సులను చదివే వారి సంఖ్య తక్కువగా ఉండేది. ఈ అర్హతలు చెబితే చాలు ఇట్టే పెళ్లయిపోయేది. కానీ ఇప్పుడా పప్పులు ఉడకడం లేదు. పెరిగిన వివాహం వయసు ఒకప్పుడు అమ్మాయికి పెళ్లీడు రాగానే పెళ్లి చేసే వారు. ఇప్పుడు 25 ఏళ్ల వరకు వివాహ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఒకప్పుడు అబ్బాయిలు కూడా 20 ఏళ్లకు పెళ్లి చేసుకునే వారు. కానీ వారు కూడా 30 ఏళ్లు దాకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆ తర్వాత అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది. గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే సరైన వయసులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాలలో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెపుతున్నారు. అంతా 30 ఏళ్లు పైబడినవారే జాతకాల కోసం ముహుర్తాల కోసం వచ్చేవారు అధికంగా 30ఏళ్లు పైబడినవారే. చాలా మంది తల్లిదండ్రులు వారి అబ్బాయిలకు తగిన అమ్మాయిలు దొరకడం లేదని బాధ వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలను ఎంచుకునే అవకాశం అమ్మాయిలకు లభిస్తుండడం గమనిస్తున్నాం. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం, గుడివీధి యువత ఆలోచనలో మార్పు యువత ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పే ఒక కారణమైతే, అమ్మాయిలు తక్కువగా ఉండ డం మరో కారణం. పెళ్లి కోసం అమ్మాయిలను వెతుక్కోవడానికే సరిపోతుంది. – వేదుల విజయభాస్కరశర్మ, పురోహితులు
అంతర్జాతీయం
ఎప్స్టీన్తో లింకులు.. పెదవి విప్పిన అమెరికా ఫస్ట్ లేడీ
అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్.. జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను ఖండించారు. తనపై వస్తున్న కథనాలు అబద్ధాలుగా ఆమె కొట్టిపారేశారు. మెలానియా తన పరువు తీసేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్స్టీన్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని.. అతని నేరాల గురించి కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను కుట్రగా ఆమె అభివర్ణించారు.ఎప్స్టీన్తో నన్ను ముడిపెడుతూ చేస్తోన్న అసత్య ప్రచారం వెంటనే ఆగాలి. నాపై దుష్ప్రచారం చేసే వ్యక్తులు నైతిక విలువలు లేనివారు. వారి అజ్ఞానాన్ని నేను వ్యతిరేకించను. కానీ నా ప్రతిష్టను దెబ్బతీయాలనే వారి దురుద్దేశాన్ని నేను ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఎప్స్టీన్ నేరాల బాధిత మహిళలను బహిరంగ విచారణ నిర్వహించి.. వారు తమ ఆవేదనను చెప్పుకునే అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ప్రతి మహిళకు తన కథను బహిరంగంగా చెప్పే హక్కు ఉండాలి. అప్పుడు మాత్రమే వాస్తవం వెలుగులోకి వస్తుందని మెలానియా అన్నారు.మోడల్గా ఉన్న మెలానియాను డొనాల్డ్ ట్రంప్నకు పరిచయం చేయడంలో జెఫ్రీ ఎప్స్టీన్ కీలక పాత్ర పోషించాడంటూ ట్రంప్ జీవిత విశేషాలను రాస్తున్న మైఖెల్ వోల్ఫ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మెలానియా ఈ ఆరోపణలను గతంలోనే ఖండించారు. తాను ట్రంప్ను తొలిసారి న్యూయార్క్లోని కిట్కాట్ క్లబ్లో కలుసుకొన్నట్లు ఆమె పేర్కొన్నారు.కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన మరిన్ని కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో భాగంగా వీటిని బహిర్గతం చేసింది. ఎప్స్టీన్ ద్వారా ట్రంప్కు పరిచయమైన ఒక మహిళను, ఆమె మైనర్గా ఉన్నప్పుడు ట్రంప్ లైంగికంగా వేధించారని తాజాగా ఆ పత్రాల్లో వెల్లడైంది. ఎప్స్టీన్ ఆ బాలికను న్యూయార్క్కి తీసుకెళ్లి ట్రంప్కు పరిచయం చేశాడు.ఆ సమయంలో ట్రంప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, తాను అతడ్ని గాయపరిచినట్టు ఆ మహిళ దర్యాప్తు అధికారులకు వివరించిందని 2019లో FBI జరిపిన ఇంటర్వ్యూల ప్రకారం తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని తనకు, తన కుటుంబ సభ్యులకు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆమె ఆరోపించింది.
తగ్గినట్లే తగ్గి.. ట్విస్ట్ ఇచ్చిన నెతన్యాహు
పశ్చిమాసియా యుద్ధంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లెబనాన్పై దాడుల విషయంలో తగ్గినట్లే కనిపించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. ఆ వెంటనే ‘తూచ్’ అనేశారు. ఓవైపు శాంతి చర్చలకు సిద్ధమంటూనే.. మరోవైపు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. లెబనాన్తో ప్రత్యక్ష చర్చలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎట్టకేలకు అంగీకరించారు. వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభించాలని సంబంధిత కేబినెట్ అధికారులకు సూచించారాయన. అదే సమయంలో.. లెబనాన్ విషయంలో కాల్పుల విరమణ అనేది ఉండబోదని కుండబద్ధలు కొట్టారు. హెజ్బోల్లా సంస్థను నామ రూపాలు లేకుండా చేసేంత వరకు ఐడీఎఫ్(ఇజ్రాయెల్ సైన్యం) సైనిక చర్య కొనసాగుతుందని పేర్కొన్నారాయన. ‘‘అందరికీ ఒక్కటే చెప్పదల్చుకున్నా. లెబనాన్ విషయంలో కాల్పుల విరమణ అనేది ఉండబోదు. హెజ్బోల్లాపై మా శాయశక్తులు దాడులు కొనసాగిస్తాం. శాంతిని నెలకొల్పుతాం’’ అని ప్రకటించారు. లెబనాన్ నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడంతోనే శాంతి చర్చలకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన నెతన్యాహు.. రెండు లక్ష్యాలను తమ ముందు పెట్టుకున్నామని చెప్పారు. ఒకటోది.. హెజ్బోల్లాకు ఆయుధాలు అందకుండా చేసి ఆ గ్రూప్ను అంతమొందించడం, రెండోది లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య శాశ్వతంగా శాంతి పరిస్థితులు నెలకొల్పడం అని ప్రకటించారు. రెండు వారాల యుద్ధ విరమణకు అమెరికా-ఇరాన్ ముందుకు వచ్చినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్పై భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 300 మంది మరణించారు. ఈ పరిణామంపై ఇరాన్ భగ్గుమంది. ఇది ఇస్లామాబాద్(పాక్) వేదికగా జరగబోయే శాంతి చర్చలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని చెబుతూ.. హర్ముజ్ను మళ్లీ మూసేసింది. లెబనాన్పై దాడులు కొనసాగితే.. తాము తిరిగి యుద్ధం ప్రారంభిస్తామని బెదిరించింది కూడా. అయితే కాల్పుల విరమణ అనేది లెబనాన్కు వర్తించబోదని అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్లు చెబుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా వేదికగా.. లెబనాన్-ఇజ్రాయెల్ శాంతి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నేపాల్ కార్మిక మంత్రి దీప్కుమార్ షా తొలగింపు
కఠ్మాండు: నేపాల్ కొత్త ప్రభుత్వంలో ఒక కుదుపు. నూతన మంత్రివర్గం కొలువుదీరిన 15 రోజుల్లో ఒక మంత్రికి ఉద్వాసన పలికారు. భార్యకు లబ్ధి చేకూర్చడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రధానమంత్రి బాలెంద్ర షా కార్మిక, ఉద్యోగ, సామాజిక భద్రత శాఖ మంత్రి దీప్కుమార్ షాను కేబినెట్ నుంచి తొలగించారు. అధికార రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్ఎస్పీ) సిఫార్సు మేరకు ప్రధానమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. దీప్కుమార్ షా భార్య హెల్త్ ఇన్సూరెన్స్ బోర్డు సభ్యురాలిగా పనిచేసేవారు. ఆమె పదవీ కాలం ముగిసింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఆమెను మళ్లీ అదే పదవిలో నియమించడంతో వివాదం మొదలైంది.
సముద్ర గర్భంలో రష్యా దుష్ట కార్యక్రమాలు
లండన్: రష్యా తీరుపై యునైటెడ్ కింగ్డమ్ (యూకే) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ ప్రాదేశీక జలాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో రష్యా రహస్యంగా జలాంతర్గామి అటాక్ ఆపరేషన్లు నిర్వహిస్తోందని ఆరోపించింది. రష్యా దుందుడుకు చర్యలను తమ సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించింది. కొన్ని వారాల క్రితం హై నార్త్లోని అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిన ఒక రష్యన్ అటాక్ జలాంతర్గామిని బ్రిటిష్ విమానాలు, యుద్ధనౌకలు గుర్తించాయని, దాని కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాయని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉత్తర అట్లాంటిక్లో నీటి అడుగున కీలకమైన మౌలిక సదుపాయాల సమీపంలో రష్యా సబ్మెరైన్లు దుష్ట కార్యకలాపాల్లో పాల్గొన్నాయని విమర్శించింది. రష్యా చర్యలను యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తప్పుపట్టారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణకు బ్రిటిష్ ప్రజలు మూల్యం చెల్లించకుండా కాపాడేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు తేల్చిచెప్పారు. తమ సంకల్పాన్ని పరీక్షించే రష్యా నీచ కార్యకలాపాలను బహిర్గతం చేయడానికి, కఠిన చర్యలు తీసుకోవడానికి ఎంతమాత్రం వెనుకాడబోమని స్పష్టంచేశారు. బ్రిటిష్ సైన్యం ప్రపంచంలోనే అత్యుత్తమమైన సైన్యంలో ఒకటని వివరించారు. తమ జాతీయ, ఆర్థిక భద్రతను కాపాడటానికి ప్రభుత్వం ఏమైనా చేస్తుందన్న విషయంలో ప్రజలకు సందేహం అవసరం లేదన్నారు. ఇప్పుడు చాలామంది దృష్టి పశ్చిమాసియా యుద్ధంపైనే ఉందని బ్రిటిష్ రక్షణ మంత్రి జాన్ హీలీ అన్నారు. అదేసమయంలో యూకేకు ఉత్తరాన పెరుగుతున్న రష్యా ముప్పునకు తమ సేనలు దీటుగా ప్రతిస్పందిస్తున్నాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్కు మద్దతు కొనసాగిస్తూనే తమ మాతృభూమిపై ఈగ వాలనివ్వబోమని తేల్చిచెప్పారు. సముద్ర అంతర్భాగంలో తమ మౌలిక సదుపాయాలకు నష్టం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యాను హెచ్చరించారు.
జాతీయం
జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా
ఢిల్లీ: నోట్ల కట్టల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం ఆయన రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. పార్లమెంట్లో ఆయన అభిశంసన పెండింగ్లో ఉండగానే.. ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. కిందటి ఏడాది మార్చిలో యశ్వంత్ వర్మ ఢిల్లీ జడ్జిగా ఉన్న టైంలో.. ఆయన నివాసంలో అగ్నిప్రమాదం జరగ్గా భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అప్పుడు ఆయన హోలీ సెలవుకు సొంతూరు వెళ్లారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ‘న్యాయవ్యవస్థలో అవినీతి..’ అంటూ ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఒకానొక టైంలో ఆయన ఇచ్చిన తీర్పులన్నింటిపైనా రివ్యూ జరగాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఈ తరుణంలో.. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు స్వయంగా సుప్రీం కోర్టు రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది. మునుపెన్నడూ లేని రీతిలో వెబ్సైట్లో కాలిన ఆ నోట్ల ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేసింది. ముగ్గురు జడ్జిలతో కూడిన ఇన్హౌజ్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయించింది. అటుపై దర్యాప్తు నేపథ్యంలో ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే అలాంటి వ్యక్తి తమకు వద్దంటూ ఆ టైంలో అలహాబాద్ బార్ అసోషియేషన్ నిరసనలకు దిగింది. దీంతో ఆయనకు ఎలాంటి పని అప్పగించకుండానే ఖాళీగా కూర్చోబెట్టారు. మరోవైపు.. ఆయనపై పార్లమెంట్లో అభిశంసన ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈలోపు.. ‘సుప్రీం’ కమిటీ తన నివేదికను అప్పటి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించగా.. ఆయన దానిని లేఖ రూపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఆ నివేదిక ప్రకారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతికి పాల్పడ్డారని, స్వచ్ఛందంగా రాజీనామాకు ఆయన అంగీకరించలేదని, కాబట్టి ఆయన్ని తొలగించాలని ఇన్-హౌజ్ కమిటీ సిఫార్సు చేసింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా ఆయనపై రాజీనామా ఒత్తిడి పెరిగింది. అయితే ఎప్పటికప్పుడు ఆయన వాటిని ఆరోపణలు తోసిపుచ్చుతూ వచ్చారు. కమిటీ నివేదిక.. అభిశంసన.. వీటి నుంచి బయటపడేందుకు ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించగా.. అక్కడా ఆయన చుక్కెదురైంది. చివరకు స్వచ్చందంగా తన జడ్జి పోస్టుకి రాజీనామా చేశారు.గతంలోనూ.. జస్టిస్ సౌమిత్ర సేన్ ( కలకత్తా హైకోర్టు) ఇంపీచ్మెంట్ ప్రక్రియ దగ్గరి దాకా వెళ్లి రాజీనామా చేశారు. జస్టిస్ పి.డి. దినకరన్ (సిక్కిం హైకోర్టు), జస్టిస్ వి. రమణ (మద్రాస్ హైకోర్టు) మాత్రం ఆరోపణలు రాగానే రాజీనామా చేసేశారు.
తెలంగాణ హైకోర్టులో పవన్ ఖేరాకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ఊరట లభించింది. అస్సాం సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో.. తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు, అలాగే విచారణకు సహకరించాలని పవన్ ఖేరాను ఆదేశించింది.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భూయాన్శర్మపై పవన్ ఖేరా(Pawan Khera) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయిన సంగతి తెలిసే ఉంటుంది. రిణికి భూయాన్శర్మ వద్ద పలు దేశాలకు చెందిన పాస్పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది.పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ న్యాయవాది రవీందర్రెడ్డిలు వాదనలు వినిపిస్తూ.. రాజకీయంగా ఎదుర్కోలేక, ఊహాజనిత కేసులు పెట్టి వేధించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పిటిషనర్ గురించి అస్సాం సీఎం అనుచితంగా మాట్లాడంతోపాటు 100 మందికిపైగా పోలీసులను ఢిల్లీలోని ఆయన నివాసానికి పంపడంలో దురుద్దేశం ఉందన్నారు. అయితే పిటిషనర్ భార్య ఇక్కడ నగరంలోని సనత్నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, అందువల్ల స్థానికంగా ఇక్కడే ఉంటున్నారని.. ఈ పిటిషన్పై విచారించే పరిధి ఈ కోర్టుకు ఉందని తెలిపారు. అస్సాం ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దేవజిల్ షైకీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్పై నమోదైన కేసు సాధారణమైన పరువు నష్టం కేసు కాదన్నారు. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయన్న ఆరోపణలు చేయడానికి నకిలీపత్రాలను వినియోగించారని తెలిపారు. నిందితుడు ఢిల్లీలో శాశ్వత నివాసి అనడానికి సంబంధించిన ఆధార్కార్డు ఉందన్నారు. హైదరాబాద్ నివాసినంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన.. పిటిషనర్ పవన్ ఖేరాకు మధ్యంతర ఊరట ఇస్తూ ఈలోపు సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు.
బోరుబావిలో పడ్డ బాలుడు.. 75 అడుగుల లోతులో..
ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జులారియాలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. బాలుడు 75 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 9(గురువారం) రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్లోని పాలి జిల్లాకు చెందిన గొర్రెల కాపరుల కుటుంబం తమ మందలతో కలిసి ఇక్కడికి వచ్చింది. వారి రెండేళ్ల కుమారుడు భగీరథ్ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు.ఎస్పీ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బోరుబావిపై రక్షణగా ఒక రాయిని ఉంచారు. అయితే.. ఒక గొర్రె ఆ రాయిని పక్కకు నెట్టేసింది. ఆ తర్వాత బాలుడు.. ఆ మూతను తెరిచి లోపలికి తొంగి చూస్తుండగా ప్రమాదవశాత్తూ లోపలికి జారి పడిపోయాడు. బద్నావర్ ఎస్హెచ్ఓ అశోక్ పాటిదార్ నేతృత్వంలో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆరు పొక్లెయిన్లు, జేసీబీ యంత్రాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. ఉజ్జయిని కలెక్టర్ రోషన్ సింగ్, ఎస్పీ ప్రదీప్ శర్మ స్వయంగా ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ఉజ్జయినిలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 4న ఉజ్జయినిలో తీర్థయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా.. గునా బైపాస్ రోడ్డు వద్ద కారు డివైడర్ను ఢీకొట్టి 40 అడుగుల లోతైన గుంతలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఒక చిన్నారితో సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో.. ఉజ్జయినిలోని ధాబా రోడ్డులో ఉన్న గేబీ హనుమాన్ ఆలయం సమీపంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ సంతోష్ ఠాగూర్ ధృవీకరించారు.
బిహార్ కొత్త సీఎం ఆయనే.. బ్యాక్ గ్రౌండ్ ఇదే!
పట్నా: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టనున్నారు. జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీలో బీజేపీ ముఖ్య నాయకులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి పేరును ఖరారు చేయనున్నారు.ఏప్రిల్ 14వ తేదీన బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేస్తారు. అనంతరం కొత్త సీఎం పేరును అధికారికంగా ప్రకటిస్తారు. ఏప్రిల్ 15న సామ్రాట్ చౌదరి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతుండడం బిహార్ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడం వల్ల నామమాత్రపు నాయకుడిగా మిగిలిపోతారని, రాష్ట్రంలో ఆయన పార్టీ ప్రభావం తగ్గిపోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి.. 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్బత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. ఆయన 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్గా నియమితులయ్యారు.2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్(యూ)లో చేరి 2 జూన్ 2014న పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సామ్రాట్ చౌదరి 2018లో భారతీయ జనతా పార్టీలో చేరి బీహార్ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా, 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024 జనవరి 28న నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సామ్రాట్ చౌదరి.. బీహార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’
అల్ఫారెట్టా, జార్జియా: స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి-2026’ అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు.ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. నాలుగేళ్ల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ(యూఎస్ఏ) సేవా సంస్థలకు అందజేయనున్నారు.ఈ వేడుకల్లో బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి (శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రతినిధులు), గిరిధర్ కొటగిరి (ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు), జ్యోత్స్న పాలకుర్తి (గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ చైర్మన్), రమణ గంద్ర (గేట్స్ అధ్యక్షులు), సునీత పోట్నూరు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు), ఆది శ్రీనివాసన్ (ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు), శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ (ప్రెసిడెంట్ అండ్ సీఈఓ), జనార్ధన్ పన్నెల (శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధి) పాల్గొన్నారు.
న్యూయార్క్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయుల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్టర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరంలోని ఇండియా హౌస్లో ఘనంగా నిర్వహించారు.గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వ్యాపారం, మీడియా, ఫైనాన్స్, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అమెరికాలో భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు.FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తమ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు.కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో', 'ఉజ్వల యోజన' వంటి పథకాల ద్వారా భారత్ మహిళా సాధికారతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అలాగే 100 మిలియన్ కుటుంబాలను మహిళల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థికంగా శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరఫున గుర్తింపు సర్టిఫికెట్లు, FIA శాలువాలు, ట్రోఫీలు అందజేశారు.నార్త్స్టార్ స్ట్రాటజీస్ COO జోడి లిన్ హెర్క్లోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల్ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాన్సుల్ జనరల్ సతీమణి మోనాలిసా శువదర్షిణి ప్రధాన్ కూడా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్ మాట్లాడుతూ, కమ్యూనిటీ నిర్మాణంలో FIA పాత్రను కొనియాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అమెరికన్ నటి రేష్మా శెట్టి.. మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ తానియా కిన్సెల్లా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం ఇస్తూ.. అడ్డంకులను అధిగమించిన వైనాన్ని వివరించారు.కార్యక్రమ ప్రారంభంలో దివంగత అవార్డు గ్రహీత రాధా సుబ్రమణ్యం జ్ఞాపకార్థం మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం ముగింపులో FIA ప్రధాన కార్యదర్శి సృష్టి కౌల్ నరులా ధన్యవాదాలు తెలిపారు. FIA జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల వందన సమర్పణతో వేడుకలను ముగిశాయి.ఎఫ్ఐఏ సంస్థ 1970 నుండి భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారతీయ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఇండో–అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తోంది.
సింగపూర్లో ఘనంగా ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి తనయులు కే నాగేంద్రనాథ్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం 43, బర్గండీ క్రిసెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 70 మంది దర్శకుడు కె. విశ్వనాథ్ అభిమానులు హాజరయ్యారు.సంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ, కె. నాగేంద్రనాథ్తో తనకు దాదాపు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తెలిపారు. సామవేదం షణ్ముఖ శర్మ 2017లో సింగపూర్ విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన శివపదం కార్యక్రమానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో సందేశాలు అందించిన పుస్తక రచయిత, ప్రముఖ దర్శకులు సీనియర్ డైరెక్టర్ వంశీకి, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయులు ఏడిద రాజాకి ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్య అతిథి కె. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ శంకరాభరణం’ చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం అప్పట్లో తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందిందని తెలిపారు. ప్రస్తుతం పుస్తక రచయిత వంశీని సంప్రదించి పునర్ముద్రణ చేయించామని చెప్పారు. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న హైదరాబాద్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామని, దానికి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలు, విశేషాలు వినిపించడంతో ఇది ఒక అచ్చ తెలుగు పండుగలా అనిపించిందని తెలిపారు.ఈ సందర్భంగా తొలి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినసంస్కార భారతి అధ్యక్షులు రమణమూర్తి కి, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు బి.వి.ఆర్. చౌదరి దంపతులకు, తంగిరాల రాజశేఖర్, సౌభాగ్యలక్ష్మి దంపతులకు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు.కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి ఆలపించగా, శేషశ్రీ వీణపై ఒక గీతాన్ని వాయించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ప్రేక్షకులతో పంచుకోగా, చిత్ర మరియు పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం రాజశేఖర్–సౌభాగ్యలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో భోజనాన్ని సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లలో శ్రీలలిత, మాధవి పాలకుర్తితోపాటు, సుబ్బు పాలకుర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ్, సత్య జాస్తి, రాజ్ కుమార్ తదితరులు సహాయ సహకారాలను అందించారు.
క్రైమ్
నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!
క్రైమ్ థ్రిల్లర్లా, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్లోని ధార్లో చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన సంఘటన కలకలం రేపింది. అంతేకాదు ఏమీ తెలియనట్టు నేరాన్ని దోపిడీలా చిత్రీకరించడానికి కపట నాటకమాడింది. అందర్నీ నమ్మించాలని మొసలి కన్నీళ్లు కార్చింది. చివరికి పోలీసులు విచారణలో ఆమె దారుణం వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలోని గొండికోట చరణ్ గ్రామంలో ఏప్రిల్ 7వ తేదీ రాత్రి హత్య జరిగింది . సుగంధ ద్రవ్యాల వ్యాపారి 28 ఏళ్ల పురోహిత్ దేవకృష్ణ, తన ఇంట్లో హత్యకు గురైనాడు. అతని శరీరంపై పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దేవకృష్ణకు 12 ఏళ్ల క్రితం ప్రియాంకతో వివాహం జరిగింది. ప్రారంభంలో సవ్యంగా సాగిన వారి దాంపత్య జీవితంలో కలతలు మొదలయ్యాయి. ప్రియాంక, కమలేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి మోజులో భర్త అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది.ఇదీ చదవండి: పార్కింగ్ కోసం తల నరికేస్తే : బంధువులు అతడిని కొట్టి చంపేశారుప్రియుడు కమలేష్తో కలిసి కుట్ర పన్నింది. కమలేష్, సురేంద్ర అనే వ్యక్తికి సుమారు లక్ష రూపాయల సుపారీ ఇచ్చి దేవకృష్ణను హత్య చేయించేలా పథకం వేశారు. ప్రియాంక ఇంటికి కమలేష్, సురేంద్ర వచ్చి దేవకృష్ణపై దాడి చేసి చంపేశారు. అనంతరం ప్రియాంక దొంగలు ఇంట్లోకి చొరబడి, రూ. 3.5 లక్షల విలువైన వస్తువులను దోచుకుని, తన భర్త ప్రతిఘటించడంతో అతడిని చంపేశారని పోలీసుల ముందు వాపోయింది. మొదట్లో ఇది దోపిడీ, హత్యగానే భావించిన పోలీసులుసంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇంట్లోనే నగలు, డబ్బు అలాగే ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు, ప్రియాంక పదేపదేమాట మారుస్తూ ఉండటంతో అనుమానం పెరిగింది. తమదైన శైలిలో విచారించడంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. ఈ విషయాన్నిమొబైల్ ఫోన్ డేటాతో సహా సాంకేతిక ఆధారాలు, కమలేష్తో ఆమెకున్న సంబంధాన్ని, హత్య జరిగిన సమయంలో ఆమె చేసిన కాల్స్ ఆధారంగా దీన్ని మరింత నిర్ధారించుకున్నారు. అటు ప్రియాంక కూడా చేసిన నేరాన్ని ఒప్పుకుంది. దీంతో పోలీసులు ప్రియాంకతో పాటు కమలేష్, సురేంద్రలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?
ఆమె.. అలా మోసపోయింది
సోషల్ మీడియా స్నేహాలు ఎంత ప్రమాదకరమైనవో తెలియజేసే మరో ఘటన ఇది. పథకం ప్రకారం ఫేస్బుక్లో పరిచయమైన వివాహిత (36)ను హనీట్రాప్ చేసి తాను పెద్ద వ్యాపారినని నమ్మబలికి, మాయమాటలతో లోబర్చుకుని ఆమె వద్ద రూ. కోటి విలువైన బంగారు వజ్రాభరణాలు తీసుకుని ఉడాయించాడో ఓ వ్యక్తి. పోలీసుల కళ్లుగప్పి సుమారు నాలుగేళ్లుగా తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ డీఐ సత్యనారాయణ తెలిపిన మేరకు.. మూసారాంబాగ్కు చెందిన సూరజ్శర్మ అలియాస్ నితిన్ డైమా (30) కింగ్కోఠిలోని ఓ ఆటోమొబైల్ షాపులో పనిచేస్తుంటాడు. 2022లో ఫేస్బుక్లో జూబ్లీహిల్స్కు చెందిన ఓ వివాహిత పరిచయమైంది. దీంతో తరచూ ఇద్దరూ కలుసుకోసాగారు. ఈ క్రమంలో సూరజ్శర్మ.. తాను పెద్ద వ్యాపారినని..అంతేకాక తనకు అతీంద్రీయశక్తులు ఉన్నాయని నమ్మించాడు. పలుమార్లు ఆమె వద్ద నుంచి రూ.50 లక్షల నగదు, రూ.10 లక్షల విలువ చేసే వజ్రాభరణాలు, రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. కొద్ది రోజుల దాకా ఆమెతో సన్నిహితంగా ఉండడంతో నామె భర్త, పిల్లలను వదిలి సూరజ్తోనే సహజీవనం చేసింది. అయితే.. పథకం ప్రకారం నిందితుడు ఆమెను వదిలేసి పరారయ్యాడు. పోలీసులకు దొరక్కుండా ఫోన్ను స్విచ్ఛాఫ్ చేశాడు. ఫేస్బుక్ ఖాతాను మూసేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదేళ్లుగా సూరజ్ కదలికలపై నిఘా పెట్టారు. ఐదేళ్లుగా ఫోన్ వాడకుండా ఫేస్బుక్ను ఉపయోగించకుండా ఉన్న నిందితుడు.. ఇక తనను అందరూ మరిచిపోయారని భావించి పాత ఫోన్ నెంబరును యాక్టివేట్ చేయించాడు. అనంతరం ఫేస్బుక్లో కూడా యాక్టివ్ అయ్యాడు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులు.. నిందితుడు మూసారాంబాగ్లో ఓ ఇంట్లో ఉన్నాడని గుర్తించి గురువారం అరెస్టు చేశారు. ఆరా తీయగా నిందితుడి అసలు పేరు నితిన్ డైమా అని తేలింది. అతనికి వివాహం జరిగినట్లు కూడా గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. :::సాక్షి, బంజారాహిల్స్
ప్రాణం తీసిన స్నానం సరదా
సాక్షి, పాడేరు: సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలో దిగిన ముగ్గురు గిరిజన యువతులు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతిచెందారు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. హుకుంపేట మండలం మారుమూల బూర్జ పంచాయతీ జంబువలస గ్రామానికి చెందిన గిరిజన యువతులు సాలెపు త్రిష (17), సాలెపు పవిత్ర (16), సాలెపు రత్నకుమారి(16) అంజలి కలిసి అనంతగిరి మండలం వాలాసి పంచాయతీలోని ములగుమ్మి జలపాతం వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. గ్రామంలో ఇటుకల పండుగ కావడంతో నలుగురు యువతులు జలపాతం వద్ద ఉత్సాహంగా గడిపారు. త్రిష, పవిత్ర, రత్నకుమారి జలపాతంలోకి దిగి స్నానాలు చేస్తుండగా, అంజలి ఒడ్డున పెద్ద బండరాయిపై నిల్చుని సెల్ఫోన్లో వారిని ఫొటోలు తీస్తోంది. అయితే, త్రిష, పవిత్ర, రత్నకుమారి ప్రమాదవశాత్తూ జారి జలపాతంలో పడిపోయారు. ముగ్గురూ నీటిలో మునిగి మృతిచెందారు. వారు మునిగిపోయారనే కంగారులో అంజలి బండరాయి నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న జంబువలస గ్రామానికి చెందిన గిరిజనులంతా జలపాతం వద్దకు చేరుకుని ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన అంజలిని అనంతగిరి మండలంలోని లుంగపర్తి పీహెచ్సీకి తరలించారు. మృతిచెందిన త్రిష హుకుంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. రత్నకుమారి అనంతగిరి మండలం బీంపోల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షలు రాసి ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది. ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన ముగ్గురు గిరిజన యువతులు మృతిచెందడంతో జంబువలస గ్రామంలో విషాదం నెలకొంది.వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతంలో ప్రమాదవశాత్తూ పడిపోయి ముగ్గురు యువతులు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముగ్గురు యువతుల మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవలే ఇంటర్మీడియెట్, టెన్త్ పరీక్షలు రాసి మంచి భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్థినులు ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
రేప్ చేసి ఉరివేశారు?
రాయపర్తి/వర్ధన్నపేట: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ తండాలో గురువారం గ్యాంగ్రేప్ కలకలం రేపింది. తల్లిదండ్రులు, బంధువుల కథనం ప్రకారం.. ఓ తండాకు చెందిన గిరిజన దంపతులకు కుమారుడు, కూతురు (21) ఉన్నారు. తల్లిదండ్రులు బతుకుదెరువుకోసం హైదరాబాద్లో ఉంటుండగా కుమారుడు మధ్యప్రదేశ్లో పోస్టుమ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. యువతి తన ఇంట్లో ఉంటోంది. పక్కనే పెద్దనాన్న ఇల్లు ఉండగా ఏదైనా అవసరం ఉంటే ఆ కుటుంబ సభ్యులతో చెప్పేది. నర్సంపేటలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆ యువతి నర్సు(ఏఎన్ఎం)గా శిక్షణ పొందుతోంది.తండానుంచి నర్సంపేటకు వస్తూ పోతున్న క్రమంలో పర్వతగిరి మండలం రావూరు తండాకు చెందిన కొంతమంది యువకులు తరుచూ వెంటపడుతుండేవారని తన పెద్దనాన్న కుటుంబ సభ్యులతో సదరు యువతి చెప్పేది. బుధవారం రాత్రి యువతి పెద్దనాన్న ఇంట్లో కాకుండా తన ఇంట్లో పడుకుంది, ఉదయం చూడగా ఉరేసుకుని కనిపించింది. ఈ క్రమంలో తల్లిదండ్రులతోపాటు బంధువులు సదరు యువతిని పక్కనే ఉన్న మొక్కజొన్న చేనులో రావూరుకు చెందిన నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసి ఇంట్లో ఉరివేసి వెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన.. పోలీసులు యువతి మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం వర్ధన్నపేటకు తీసుకురాగా కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. యువతిపై గ్యాంగ్ రేప్ చేయడం వల్లనే మృతిచెందిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సాయిబాబు ఆందోళనకారులను నచ్చచెప్పి న్యాయం చేస్తామనిచెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వీడియోలు
వాటర్ తో గేమ్స్ వద్దు.. ఒక సెల్ఫీ మూడు ప్రాణాలు
నల్లగా ఉన్నాడని లవర్తో మొగుణ్ణే లేపించేసింది
మీ అన్నను చంపించింది నువ్వే అని టాక్... అచ్చెన్నకు గుబాపగిలేలా సజ్జల కౌంటర్
మోనాలిసాకు బిగ్ షాక్ భర్త ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు
వేసిన 20 రోజులకే ఖతం చేతులతో తవ్వితే ఊడిపోతున్న రోడ్డు
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
చిరు ఆగ్రహం
హరూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్
MAVIGUN పై షర్మిల జోకర్ కామెంట్స్ సజ్జల సెటైర్స్ అదుర్స్
ఎర్రంనాయుడు మరణంలో నీ హస్తం లేదా? అచ్చెన్న పై తమ్మినేని సీతారాం షాకింగ్ నిజాలు


