ఏకపక్షం చెల్లదు.. హైడ్రాను ఆదేశించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలోనే హైడ్రా పనిచేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎలాంటి అనుమతి లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని కంచె వేసే అధికారం లేదని స్పష్టం చేసింది. ఆక్రమణ ఆరోపణ రాగానే కంచె వేసే అధికారం ఉందన్న వాదనపై పత్రాలను తమ ముందు ఉంచాలని హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ను ఆదేశించింది.కాగా, గండిపేట మండలం నార్సింగిలోని 1608 గజాల భూమిపై వివాదం జిల్లా కోర్టు విచారణలో ఉంటే వెంటనే అందులో వేసిన కంచెను తొలగించాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల కాపీ అందిన 48 గంటల్లో ప్రక్రియ పూర్తి చేయాలంది. దీనిపై నివేదిక సమర్పించాలంటూ... తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. ఆ భూమిలో హైడ్రా బోర్డు తొలగించాల్సిన అవసరం లేదంది. వివాదాస్పద భూమిపై విచారణ కోర్టు పరిధిలో ఉంటే కంచె తొలగించాలంది.కోర్టు పరిధిలోని భూమి చుట్టూ ఉన్న ప్రహరీని హైడ్రా తొలగించిందని, ఆ సంస్థ జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ నార్సింగికి చెందిన జి.రాహుల్ యాదవ్ సహా ఏడుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి వాదిస్తూ.. ‘వివాదాస్పద భూమి మా ప్రైవేట్ భూమి. హక్కులు మాకే చెందేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు.ఆ కేసులో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అందులో ప్రతివాదిగా నార్సింగి మున్సిపల్ కమిషనర్ కూడా ఉన్నారు. ఇదే భూమికి సంబంధించి మరో పిటిషన్ దాఖలైంది. వివాదాస్పద భూమిలో హైడ్రా జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి’ అని కోరారు. హైడ్రా కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. ఎంఏయూడీ పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నా.. ప్రతిసారి ఆదేశాలు పొందాల్సిన అవసరం లేదన్నారు. ఎంఏయూడీ అనుమతి లేకుండా ఏజెన్సీ సొంత నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.
ఈ రాశి వారికి వ్యాపారవృద్ధి.. ఉద్యోగులకు పదోన్నతులు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.దశమి ప.11.48 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: జ్యేష్ఠ ప.1.29 వరకు, తదుపరి మూల, వర్జ్యం: రా.10.17 నుండి 12.03 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.21 నుండి 11.07 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.36 వరకు, అమృత ఘడియలు: లేవు.సూర్యోదయం : 6.33సూర్యాస్తమయం : 5.56రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం.. సోదరులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వృషభం... రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబసమస్యలు. దైవదర్శనాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.మిథునం... ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. అప్రయత్న కార్యసిద్ధి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు.కర్కాటకం..... ఉద్యోగయోగం. చర్చలు సఫలం. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.సింహం..... ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. సోదరులు, సోదరీలతో విభేదాలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.కన్య... ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. దైవదర్శనాలు.అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.తుల.... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.వృశ్చికం.. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. యత్నకార్యసిద్ధి. దైవచింతన. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.ధనుస్సు.... ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. కార్యజయం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.మకరం....... ఆదాయానికి మించి ఖర్చులు. కుటుంబసభ్యులతో విభేదాలు. మానసిక అశాంతి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.కుంభం... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనులలో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.మీనం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆధ్యాత్మిక చింతన. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వస్తు, వస్త్రలాభాలు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
నిందలతో సవాళ్లు సమసిపోవు!
పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న బలూచిస్తాన్ యోధులు జన వరి 31న బలూచిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో 37 మంది పౌరులతో పాటు, భద్రతా దళాలకు చెందిన 17 మంది హతులయ్యారు. తామే ఈ దాడులకు పాల్పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. బలూచ్ యోధులు కనీసం 12 చోట్ల ఒకే సమయంలో దాడులు చేశారు. పోలీసు స్టేషన్లు, సైనిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. యోధుల్లో ఆత్మాహుతి దళానికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిలో ఒకరిని ఆసిఫా మెంగల్ (24)గా బీఎల్ఏ ప్రకటించింది. ప్రతి దాడుల్లో ఇంతవరకు 200 మందికి పైగానే మిలిటెంట్లు చని పోయారని సైన్యం వెల్లడించింది.‘‘వీరు మామూలు టెర్రరిస్టులు కారు’’ అని పాక్ దేశీయాంగ మంత్రి మొహిసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్య దాడుల తీవ్రతకు అద్దం పట్టింది. వీటిలో ‘ఇండియా హస్తం’ ఉందని ఆయన ఆరోపించారు. ఆధారాలు చూపకుండా, గత రెండు దశాబ్దాలుగా పాక్ ఈ రకమైన ఆరోపణలు చేస్తూనే ఉంది.బుగతీ హత్యతో మరో తిరుగుబాటునఖ్వీ చెప్పినదాంట్లో ఒకటి మాత్రం వాస్తవం. వారు ‘మామూలు టెర్రరిస్టులు’ కారు. దేశ విభజన సమయంలో కలాత్ ప్రాంతం పాక్లో విలీనమైన అంశం వివాదాస్పదంగానే ఉంది. అప్పటి నుంచి అంటే 1948 నుంచి 2000 ప్రారంభం వరకు బలూచ్ తిరుగుబాటు గెరిల్లా పోరాట పంథానే అనుసరిస్తూ వచ్చింది. గ్యాస్ పైపులైన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి వాటిని ధ్వంసం చేసిన మిలిటెంట్లు పర్వత ప్రాంతాల్లోకి పరారయ్యేవారు. సాధారణంగా వారు బుగతీ లేదా మర్రీ అనే రెండు పెద్ద బలూచ్ తెగలలో ఒక వర్గానికి చెందినవారై ఉండేవారు. పాక్ పాలనా వ్యవస్థలో భాగంగా ఉన్న గిరిజన సర్దార్లు వాటికి నేతృత్వం వహించేవారు. రాజకీయ నాయకుని నుంచి తిరుగుబాటుదారుగా మారిన బలూచిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అక్బర్ ఖాన్ బుగతీని అప్పటి పాక్ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆదేశాల మేరకు 2006లో వేటాడి చంపారు. పాక్ రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 1970లలో వామపక్ష విప్లవంలో మర్రీ తెగ సర్దార్ ఖేర్ బకష్ మర్రీ నాయకత్వ పాత్ర వహించారు. పాక్ ప్రభుత్వం ముందు బుగతీ 14 డిమాండ్లు పెట్టారు. బలూచిస్తాన్కు స్వయం ప్రతిపత్తి ఇస్తూ, ఆ ప్రాంతంలోని వనరులపై అక్కడి ప్రభుత్వానికే నియంత్రణ ఉండా లన్నది వాటిలో ఒకటి. వాటిపై కనీసం చర్చలు జరిపేందుకు కూడా ముషారఫ్ తిరస్కరించడం పెద్ద తప్పిదం. బుగతీ హత్యతో ఐదవ తిరుగుబాటు మొదలై ఈనాటికీ కొనసాగుతోంది. వనరులు బలూచిస్తాన్వి అయినా...అక్బర్ ఖాన్ బుగతీ లేవనెత్తిన డిమాండ్లు కొత్తవేమీ కావు. వాటిని కోరినవారిలో ఇతరులూ ఉన్నారు. బలూచిస్తాన్లో వన రులు పుష్కలం. అది చమురు, ఇంధన వాయువు, ఖనిజాలు, రాగి, బంగారంతోపాటు ఇతర లోహాల నిక్షేపాలకు పేరెన్నికగన్నప్రాంతం. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ వాటి నమూనాలనే అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్కు చూపించారు. ఆ ప్రాంతంలో లభ్య మయ్యేవాటిని తవ్వి తీసుకుపోవడమేగానీ, బలూచీ ప్రజానీకానికి అవి అందినది స్వల్పం. సుయీ చమురు క్షేత్రాల నుంచి గ్యాస్ ఇతర రాష్ట్రాలకు పైపుల ద్వారా వెళ్ళేది. కానీ, బలూచిస్తాన్లోని చాలా ప్రాంతాలకు అది అందని మావిపండుగానే ఉండేది. పాక్ 1993 నుంచి గనుల లీజులను విదేశీ కంపెనీలకు కట్టబెడుతూ వస్తోంది. చగాయీ జిల్లాలో రేకో డిగ్ వద్ద స్వర్ణ, తామ్ర గనుల తవ్వకాలు సాగుతున్నాయి. గ్వాదర్ పోర్టును నిర్మించే కాంట్రాక్టును ప్రభుత్వం చైనాకు అప్పగించింది. చగాయీలోనే సైండక్ ప్రాంతం వద్ద తామ్ర, స్వర్ణ గనుల తవ్వకాలను కూడా చైనాకు మంజూరు చేశారు. మునీర్ ఇపుడు ట్రంప్కు వాటినే ఆశ చూపుతున్నారు. ఇటీవలి దాడులు అక్కడ కార్యకలాపాలు నిర్వహించడానికి వచ్చే అంతర్జాతీయ సంస్థ లను పునరాలోచనలో పడేస్తాయనడంలో సందేహం లేదు. మారిన పోరాట పంథాబలూచ్ తిరుగుబాటు తీరుతెన్నులు కూడా మారాయి. ఇప్పటి నేతలకు గిరిజన సర్దార్లకు రాజకీయంగా, లేదా సామాజికంగా ఎక్కడా పోలిక లేదు. గిరిజన నాయకులు కంటకప్రాయమైన పర్వత ప్రాంత శిబిరాల్లో రోజులు గడిపి ఉండవచ్చు. కానీ, వారి రాజకీ యాలు పాక్కు వ్యతిరేకమైనవి కావు. సమాఖ్య వ్యవస్థ లోపలే తమకు సముచిత స్థానం కల్పించాలనీ, తమను ప్రధాన లబ్ధిదా రులు కానివ్వాలనీ వారు కోరుకున్నారు.బీఎల్ఏకు 2018 నుంచి బషీర్ జెబ్ నేతృత్వం వహిస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఫ్రంట్కు అల్లా నాజర్ నాయకత్వం వహిస్తు న్నారు. మెకానికల్ ఇంజనీరింగ్లో జెబ్ డిప్లొమా చేయగా, నాజర్ వృత్తి రీత్యా డాక్టర్. వీరి నేతృత్వంలో బలూచ్ తిరుగుబాటు మరింత హింసాయుతంగా మారింది. ఆత్మాహుతి దాడులకు శ్రీకారం చుట్టింది. చైనా వర్కర్లను, వారి ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని 2018 నుంచి వివిధ దాడులు చేసింది. సంచలనం సృష్టించిన 2025 నాటి రైలు హైజాక్ ఉదంతం కూడా తమ పనేనని బీఎల్ఏ చెప్పుకొంది. నేటి సోషల్ మీడియా యుగంలో జెబ్, నాజర్ ప్రసంగాలు విస్తృతంగా పరివ్యాప్తి చెందుతున్నాయి. తమ తల్లితండ్రుల కన్నా ఎక్కువ విద్యావంతులైన నవతరం తాము చిన్నచూపునకు గురి కావడం పట్ల ఆగ్రహంతో ఉంది. మితిమీరిన సైన్యం ఆగడాలను వ్యతిరేకిస్తోంది. భద్రతా దళాల ప్రమేయంతో తమ తండ్రులు, సోదరులు, భర్తలు, కుమారులు అదృశ్యమవుతున్న ఘటనలకు వ్యతిరేకంగా గతంలోనూ బలూచ్ మహిళలు నిరసన ప్రదర్శనలకు దిగేవారు. కానీ, తిరుగుబాటులో మహిళలు స్వయంగా పాలుపంచు కోవడం కొత్త ధోరణి.దాడులతో భంగపడిన సైన్యం బలూచ్ ప్రజానీకంపై మరింతగా విరుచుకుపడుతుంది. గత చరిత్ర దానినే సూచిస్తోంది. హింస చక్రభ్రమణంలా కొనసాగుతుంది. ఈ రక్తసిక్త ఘటనలు శ్రీలంక నుంచి భారతదేశపు కశ్మీర్, ఈశాన్య ప్రాంతం, బలూచిస్తాన్ వరకు మొత్తం ప్రాంతానికి ఒక పాఠం నేర్పుతున్నాయి. తమ దేశంలోని ఘటనలకు పొరుగు దేశాలను నిందించడం వల్ల దేశంలో కొందరిని రంజింపజేసినట్లు అవుతుందేమో; కానీ, సమస్యకు మూల కారణాలు ఆ యా దేశాలలోనే ఉన్నందు వల్ల వాటికి పరిష్కారాలు అవే కనుగొనాలి. ఇతరులను నిందించడం వల్ల సవాళ్లు సమసిపోవు. నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
‘స్టార్ట్’కి చెదలు!
అడిగేవారు లేకపోతే, జవాబుదారీతనం కొరవడితే... ఎక్కడైనా ఇష్టారాజ్యం తప్పదు. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలు అలాగే వ్యవహరిస్తున్నాయి. ఎవరేమనుకుంటే ఏమిటన్నట్టు రెచ్చిపోతున్నాయి. అణ్వాయుధాల వల్ల భూగోళానికి పెను ముప్పు ఏర్పడుతుందని ప్రపంచ ప్రజానీకం దశాబ్దాల పాటు ఒత్తిళ్లు తెచ్చిన పర్యవసానంగా ఆ రెండింటి మధ్యా 1991లో మొదటిసారి వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు(స్టార్ట్)–1 ఒప్పందం కుదిరింది. దాని స్థానంలో 2010లో ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం సాకారం కాగా, దానికి ఈనెల 5తో నూకలు చెల్లాయి. ఆ విషయంలో మళ్లీ చర్చలు మొదలెట్టాలని, సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి రావాలని రెండేళ్లుగా పలువురు నిపుణులు, ప్రపంచ శాంతిని కాంక్షించేవారు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. కానీ అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. ఆయన స్థానంలో నిరుడు జనవరిలో వచ్చిన డోనాల్డ్ ట్రంప్కు సైతం ఈ సంగతి తెలుసు. దాన్ని గురించి మీడియా ప్రశ్నిస్తే ‘ముగిసిపోతుందా...పోనీయండి. దాని స్థానంలో మరొకటి కుదుర్చుకుంటాం’ అన్నారే తప్ప ఇంతవరకూ ఆ దిశగా చర్చల కోసం చేసిందేమీ లేదు. కొత్త ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అడపా దడపా చెప్పకపోలేదు. కానీ ఉక్రెయిన్లో ఆయన సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం ఆ మాటల్లోని చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేసింది. అమెరికా పోకడలూ దానికి భిన్నంగా ఏమీలేవు. ‘న్యూ స్టార్ట్’ ముగియటంతో ఇరుపక్షాలనూ కట్టిపడేసే అంతర్జాతీయ ఒప్పందమేదీ ఉనికిలో లేకుండా పోయింది. ఇకపై రెండు అగ్రరాజ్యాలూ ఆయుధాలు పోగేసుకున్నా, పరస్పరం కయ్యానికి కాలు దువ్వుకున్నా, అణ్వాయుధాల్ని ప్రయోగించే సాహసం చేసినా... ప్రపంచమంతా నిస్సహాయంగా చూస్తూ ఉండక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు దేశాలకూ, వాటిని సమర్థిస్తున్నవాటికీ జవాబుదారీతనం, భయభక్తులు, వెరపు వంటివి మాయ మయ్యాయి. ఒకప్పుడు ప్రపంచం ఇంతకన్నా కాస్తయినా మెరుగ్గా ఉండేదనటానికి వ్యూహాత్మక ఆయుధాల పరిమితి ఒప్పందం(సాల్ట్) గురించిన చర్చలే ఉదాహరణ. ఆ ఒప్పందం సాకారం కాలేదు. ఒకవేళ అలా అయినా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికే ఇరు దేశాలూ పోగేసుకున్న ఆయుధాలు ఇక పెరగకుండా చూడటం తప్ప ఆ చర్చలు సాధించేది పెద్దగా ఏమీ ఉండేదికాదు. కానీ అంతకన్నా మెరుగైన ‘స్టార్ట్–1’ కుదిరింది. అణ్వాయుధం, లేదా వేరే బాంబును మోసుకేళ్లే సామర్థ్యమున్న క్షిపణులను (వార్హెడ్లను) 6,000కు తగ్గించటం, వాటి లాంచర్ల (వాహనాల) సంఖ్యను 1,600కు కుదించటం అది సాధించిన ఘనవిజయం. 2010లో కుదిరిన ‘న్యూ స్టార్ట్’ కూడా చెప్పుకోదగ్గ ముందడుగు. దానివల్ల వార్హెడ్ల సంఖ్య 1,550కి, లాంచర్ల సంఖ్య 700కు తగ్గాయి. పరస్పరం డేటా మార్పిడి, నోటిఫికేషన్ల విడుదల, క్షిపణుల్ని మోహరించిన ప్రాంతాల తనిఖీలకు అనుమతించటం అందులో ఉన్నాయి. నిజానికి ఈరెండింటికీ మధ్య 1993లో ‘స్టార్ట్–2’ గురించి చర్చలు సాగాయి. బహుళ సంఖ్యలో వార్హెడ్లను ప్రయోగించగల క్షిపణులను నిషేధించాలన్నది ఈ చర్చల ఆంతర్యం. కానీ ఎలాంటి ఫలితమూ లేకుండా ముగిసిపోయాయి. ఇప్పటికే అమెరికా, రష్యాల మధ్య చడీచప్పుడూ లేకుండా ఆయుధ పోటీ సాగుతోంది. తమదగ్గరున్న అణ్వాయుధాలకు కృత్రిమ మేధ(ఏఐ)ను జతచేసి, వాటి శక్తిని అనేక రెట్లు పెంచుకుంటున్నాయి. గంటకు 6,437 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగల రకరకాల క్షిపణులు వచ్చేశాయి. వాటిని విడివిడిగా గురిచూసి కొట్టడం అసాధ్యమని తేలాకే ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’ పేరుతో కొత్త పాట అందుకున్నారు. ఆ ‘బంగారు గుమ్మటం’ అమెరికాను ఎంతవరకూ రక్షిస్తుందో నిజంగా ఏమైనా జరిగితే తప్ప ఎవరికీ తెలియదు. మొత్తానికి ఇద్దరి వద్దా అటూ ఇటూగా చెరో 5,000 అణ్వాయుధాలున్నాయి. మిగతా దేశాలన్నిటి వద్దా అందులో సగం కూడా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణమే కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రపంచ ప్రజానీకం, ముఖ్యంగా ఆ రెండు దేశాల్లోని ప్రజలూ తీవ్రంగా ఒత్తిళ్లు తీసుకురావాలి. లేనట్టయితే ప్రపంచం క్షణక్షణ గండంగా బతుకీడ్చక తప్పదు.
బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి భారీ స్పందన
Turkey: పార్లమెంటులో ఎంపీల రణరంగం
జనవరిలోనూ ఎగుమతులు సానుకూలమే
ఫిల్మ్ఫేర్- 2026.. నామినేషన్స్లో ఉన్న సినిమాలివే..
భారత్తో ఒప్పందం చారిత్రాత్మకం: ట్రంప్
అంబటిపై కక్ష సాధింపు.. గుంటూరు కోర్టుకు తరలింపు
ఏకపక్షం చెల్లదు.. హైడ్రాను ఆదేశించిన హైకోర్టు
మూసీలో ముందడుగు.. నిర్వాసితులకు పరిహారం
ఇప్పటికీ నెరవేరని కోరిక ఒకటి ఉంది: శ్రియ
ఆటో విడిభాగాల రంగానికి ప్రభుత్వం అండ
పక్షవాతంతో మంచానికే పరిమితం..కానీ ఆయుర్వేదం నడిచేలా చేసింది..!
వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?
దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లందరూ కలసి ఏర్పాటు చేశార్సార్! రోజూ ఓ రెండు గంటలు కోచింగ్ ఇవ్వాలట!
అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ఓపెనింగ్ ఫిక్స్.. మొదటి సినిమా ఇదే..!
ప్రశ్నించే అధికారం లేకుండా చట్టాలు ఎలా చేయాలో వీళ్లు అధ్యయనం చేస్తార్సార్!
T20 WC 2026: సంజూ శాంసన్కు జాక్పాట్
టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న బంగ్లా జట్టుకి రిలీఫ్
బంగారం, వెండి ధరల అప్డేట్స్
ఆటోడ్రైవర్ బ్యాంక్ అకౌంట్లో వందల కోట్లు..!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ప్రముఖులతో పరిచయాలు
న్యూజిలాండ్ ఓపెనర్ల ఊచకోత.. సరికొత్త చరిత్ర
ఈ రాశివారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం
ఎన్నో హిట్లు.. కానీ, స్కిన్ షో తప్పడం లేదా?
పురపాలక ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల తాయిలాలు
నితీశ్ కుమార్ రెడ్డి వీరోచిత పోరాటం
'రాజాసాబ్'పై మళ్లీ ట్రోలింగ్.. చివరకు హీరోయిన్ కూడా
Exit Poll: మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా!
ఒకేరోజు రెండు హిట్ సినిమాలు.. ప్రేక్షకులకు పండగే
తడబడిన వెండి ఎగసిన పసిడి
IND vs PAK: థాంక్యూ.. బీసీసీఐ రియాక్షన్ వైరల్
బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి భారీ స్పందన
Turkey: పార్లమెంటులో ఎంపీల రణరంగం
జనవరిలోనూ ఎగుమతులు సానుకూలమే
ఫిల్మ్ఫేర్- 2026.. నామినేషన్స్లో ఉన్న సినిమాలివే..
భారత్తో ఒప్పందం చారిత్రాత్మకం: ట్రంప్
అంబటిపై కక్ష సాధింపు.. గుంటూరు కోర్టుకు తరలింపు
ఏకపక్షం చెల్లదు.. హైడ్రాను ఆదేశించిన హైకోర్టు
మూసీలో ముందడుగు.. నిర్వాసితులకు పరిహారం
ఇప్పటికీ నెరవేరని కోరిక ఒకటి ఉంది: శ్రియ
ఆటో విడిభాగాల రంగానికి ప్రభుత్వం అండ
పక్షవాతంతో మంచానికే పరిమితం..కానీ ఆయుర్వేదం నడిచేలా చేసింది..!
వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?
దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లందరూ కలసి ఏర్పాటు చేశార్సార్! రోజూ ఓ రెండు గంటలు కోచింగ్ ఇవ్వాలట!
అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ఓపెనింగ్ ఫిక్స్.. మొదటి సినిమా ఇదే..!
ప్రశ్నించే అధికారం లేకుండా చట్టాలు ఎలా చేయాలో వీళ్లు అధ్యయనం చేస్తార్సార్!
T20 WC 2026: సంజూ శాంసన్కు జాక్పాట్
టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న బంగ్లా జట్టుకి రిలీఫ్
బంగారం, వెండి ధరల అప్డేట్స్
ఆటోడ్రైవర్ బ్యాంక్ అకౌంట్లో వందల కోట్లు..!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ప్రముఖులతో పరిచయాలు
న్యూజిలాండ్ ఓపెనర్ల ఊచకోత.. సరికొత్త చరిత్ర
ఈ రాశివారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం
ఎన్నో హిట్లు.. కానీ, స్కిన్ షో తప్పడం లేదా?
పురపాలక ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల తాయిలాలు
నితీశ్ కుమార్ రెడ్డి వీరోచిత పోరాటం
'రాజాసాబ్'పై మళ్లీ ట్రోలింగ్.. చివరకు హీరోయిన్ కూడా
Exit Poll: మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా!
ఒకేరోజు రెండు హిట్ సినిమాలు.. ప్రేక్షకులకు పండగే
తడబడిన వెండి ఎగసిన పసిడి
IND vs PAK: థాంక్యూ.. బీసీసీఐ రియాక్షన్ వైరల్
ఫొటోలు
శ్రీ కాళహస్తీలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
శ్రీశైలం నడకదారి.. భక్తుల రద్దీ (ఫోటోలు)
హీరోయిన్ సోనమ్ కపూర్ సీమంతం వేడుక (ఫోటోలు)
గ్రాండ్గా బిగ్బాస్ శివజ్యోతి తమ్ముడి నిశ్చితార్థ వేడుక (ఫొటోలు)
బిగ్బాస్ ఆదిరెడ్డి చిన్న కూతురి అన్నప్రాసన వేడుక (ఫొటోలు)
నిఖిల్ 'స్వయంభు' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
మేం ప్రతిపక్షం... మాది ప్రజాపక్షం.. అసెంబ్లీ వద్ద కదం తొక్కిన వైఎస్సార్సీపీ (ఫొటోలు)
రారండి.. కేరళ (ఫొటోలు)
మహాశివరాత్రి 2026 : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
సినిమా
ఆ సంతోషం, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను: చిరంజీవి
ఎంతటి దూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్క అడుగు పడిందంటే ఎంతో కొంత విజయం లభించినట్లే! అలా తన సినీ ప్రస్థానానికి పునాది వేసిన తొలి సినిమాను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. 1979లో వచ్చిన పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి నటప్రస్థానం మొదలైంది. తొలి మెట్టుకే విజయాన్ని అందుకుని గుండె నిండా ధైర్యంతో ముందడుగు వేశారు. తనను తాను చెక్కుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. చందమామ కథలాంటి అనుభూతితాజాగా ఆయన పునాదిరాళ్లు సెట్లో అడుగుపెట్టిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆతృత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. నట జీవితానికి పునాది రాళ్లుఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు" అని ట్వీట్ చేశారు. తన ఫస్ట్ మూవీ చిత్రీకరణ సమయంలో దిగిన ఫోటోలను ఈ పోస్ట్కు జత చేశారు. ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు.ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి.ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు… pic.twitter.com/Rsc6UYmgiK— Chiranjeevi Konidela (@KChiruTweets) February 11, 2026 చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేశా: హీరో నిఖిల్
త్రీడీలో చూసి షాక్ అయ్యాను
‘‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా విజయం తర్వాత అంతకంటే అద్భుతమైన ప్రాజెక్ట్తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ చిత్రం చూసిన తర్వాత నిఖిల్ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా సంతోషపడతారు’’ అని నిఖిల్ చె΄్పారు. నిఖిల్ హీరోగా, సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో త్వరలో రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో నిఖిల్ మాట్లాడుతూ– ‘‘వెయ్యేళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రాంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవారు. అల్లరిగా తిరిగే అండర్ డాగ్ రాజ్యాలను శాసించే స్థాయికి ఆయన ఎలా ఎదిగారు? అనేది మా సినిమాలో చూపించాం. ఈ మూవీని త్రీడీలో చూసినప్పుడు షాక్ అయ్యాను. ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని చె΄్పారు. భరత్ కృష్ణమాచారి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా అందరికీ గొప్ప అనుభూతినిస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో భాగం కావడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు కెమెరామేన్ సెంథిల్ కుమార్.
ఇన్నాళ్లు అక్కడే నలిగిన జ్ఞాపకం.. ఇంతకాలానికి!
నటి షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ రెండోసారి తల్లి కాబోతోంది. గతేడాది ఆగస్టులో తను రెండోసారి గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఆమె తన బేబీ షవర్ ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో భర్త, కుమారుడితో కలిసి దిగిన పిక్స్ జత చేసింది. వీటిలో పూర్ణ లైట్ పింక్ కలర్ గౌన్లో అందంగా ముస్తాబైంది.గర్వంగా ఉందిఅయితే ఈ డ్రెస్ వెనక ఓ స్టోరీ ఉందని చెప్పింది. అతడు (పూర్ణ భర్త) నాకు తొలిసారి ఐ లవ్యూ చెప్పినరోజు ఈ గౌన్ గిఫ్ట్ ఇచ్చాడు. ఏళ్ల తరబడి ఈ డ్రెస్ కప్బోర్డులో అలాగే నలిగిపోతూ ఉంది. ఒక మంచిరోజుకోసం ఇన్నేళ్లుగా ఎదురు చూస్తోంది. ఇంతకాలానికి ఆ మంచి రోజు రానే వచ్చింది. మాతృత్వాన్ని సెలబ్రేట్ చేసుకునేరోజు దాన్ని ధరించాను. నా భర్త ఈ సెలబ్రేషన్స్ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుతంగా మలిచాడు. నా మనసు సంతోషం, ప్రేమతో ఉప్పొంగిపోతోంది. అలాగే నా డ్యాన్స్ స్కూల్లో పిల్లలు ఒక్కో స్టెప్పు వేస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది.సినిమామలయాళ నటి పూర్ణ తెలుగులో.. శ్రీ మహాలక్ష్మి, సీమ టపాకాయ్, అవును, నువ్వలా నేనిలా, రాజుగారి గది, మామ మంచు అల్లుడు కంచు, సుందరి, అఖండ 2 వంటి పలు సినిమాలు చేసింది. గుంటూరు కారం మూవీలో కుర్చీ మడతపెట్టి పాటలో కనిపిస్తుంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది. 2022లో వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడింది. ఆ మరుసటి ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) చదవండి: ఆ సంతోషం, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను: చిరంజీవి
యూఫోరియా మూవీకి మహేశ్ బాబు రివ్యూ.. ఏమన్నారంటే?
టాలీవుడ్ మూవీ యూఫోరియాపై ప్రిన్స్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఇది తప్పక చూడాల్సిన సినిమా అని అన్నారు. గుణశేఖర్ తన కథలను ఎలా ప్రజెంట్ చేస్తారనే దానిలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన నమూనా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉందని.. సినిమా బాగా నచ్చిందని మహేశ్ ట్వీట్ చేశారు. గుణశేఖర్, భూమికతో పాటు మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ సినిమాను గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో భూమిక ప్రధాన పాత్రలో నటించగా.. సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. There’s always a distinct pattern in how Gunasekhar garu presents his stories…Enjoyed the film especially the way the climax unfolds…👏🏻👏🏻👏🏻A must watch! Congratulations to Guna Sekhar garu, @bhumikachawlat and the entire team of #Euphoria 🤗🤗🤗@neelima_guna #YukthaGuna…— Mahesh Babu (@urstrulyMahesh) February 11, 2026
క్రీడలు
బెల్జియం చేతిలో భారత్ పరాజయం
రూర్కెలా: ప్రొ హాకీ లీగ్ కొత్త సీజన్ను భారత పురుషుల హాకీ జట్టు ఓటమితో ప్రారంభించింది. ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియం జట్టుతో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 1–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టును బెల్జియం జట్టు కట్టడి చేసింది. కేవలం రెండు పెనాల్టీ కార్నర్లు పొందిన భారత జట్టు అందులో ఒకదానిని సది్వనియోగం చేసుకుంది. ఆట 29వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను శిలానంద్ లాక్రా గోల్గా మలిచాడు. బెల్జియం తరఫున నెల్సన్ ఒనానా (23వ నిమిషంలో), థామస్ క్రాల్స్ (53వ నిమిషంలో), అర్నో వాన్ డెసెల్ (57వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. తమకు లభించిన ఏడు పెనాల్టీ కార్నర్లను బెల్జియం వృథా చేసుకోవడం గమనార్హం. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో అర్జెంటీనాతో భారత్ ఆడుతుంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో తాజా గెలుపుతో బెల్జియం 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.
‘డబుల్ సూపర్’ ధమాకా
ప్రపంచకప్లో డజను మ్యాచ్లు ముగిసినా అభిమానులకు ఇంకా ఏదో వెలితి... కొన్ని చక్కటి ఇన్నింగ్స్లు, మరికొన్ని మంచి బౌలింగ్ ప్రదర్శనలు వచ్చినా అసలైన టి20 మజా మాత్రం ఇంకా కనిపించలేదు... ఇలాంటి సమయంలో బుధవారం జరిగిన పోరు ఫుల్ మీల్స్ను అందించింది... దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ కలిసి ఉత్కంఠతో నిండిన అద్భుత మ్యాచ్ను చూపించాయి... 20 ఓవర్ల సమరంలో ఇరు జట్లూ 187 పరుగులతో సమఉజ్జీలుగా నిలవగా, సూపర్ ఓవర్ తప్పలేదు. అక్కడా ఎవరూ తగ్గకుండా సమం–సమం అనడంతో మరో సూపర్ ఓవర్ ముందుకు వచ్చింది. ఈసారి మాత్రం ఆధిపత్యం ప్రదర్శించిన సఫారీ టీమ్ ఎట్టకేలకు గట్టెక్కింది. ప్రధాన పోరుతో పాటు రెండు సూపర్ ఓవర్లతో సాగిన డ్రామా టోర్నీకే హైలైట్గా నిలిచింది. దక్షిణాఫ్రికా ప్రదర్శనకంటే కీలక సమయాల్లో వరుస తప్పులు చేసిన అఫ్గానిస్తాన్ స్వయంకృతమే ఫలితాన్ని నిర్దేశించింది. అఫ్గాన్ బెస్ట్ బౌలర్ రషీద్ ఖాన్ రెండు సూపర్ ఓవర్లలో ఒక్కటి కూడా బౌలింగ్ చేయకపోగా... రెండో సూపర్ ఓవర్లో ఫామ్లో ఉన్న గుర్బాజ్ను కాకుండా నబీకి స్ట్రయిక్ అవకాశం ఇవ్వడం కూడా జట్టును ఓడించాయి. అహ్మదాబాద్: టి20 ప్రపంచకప్లో డజను మ్యాచ్ల తర్వాత అద్భుతమైన వినోదాన్ని చూసే అవకాశం అభిమానులకు దక్కింది. బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా ‘డబుల్ సూపర్ ఓవర్’లో అఫ్గానిస్తాన్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రికెల్టన్ (28 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్లు), డికాక్ (41 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్కు 61 బంతుల్లో 114 పరుగులు జోడించారు. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులకే ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (42 బంతుల్లో 84; 4 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎన్గిడి (3/26) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. స్కోర్లు సమం కావడంతో నిర్వహించిన తొలి ‘సూపర్ ఓవర్’లో ఇరు జట్లు సరిగ్గా 17 పరుగులే చేశాయి. దాంతో రెండో ‘సూపర్ ఓవర్’ను ఆడించాల్సి వచ్చింది. ఇందులో దక్షిణాఫ్రికా 23 పరుగులు చేయగా, 19 పరుగులు చేసిన అఫ్గానిస్తాన్ 4 పరుగులతో ఓడింది. దక్షిణాఫ్రికా వరుసగా రెండో విజయం అందుకొని గ్రూప్ ‘డి’ నుంచి ‘సూపర్ ఎయిట్స్’కు చేరువ కాగా... వరుసగా రెండో ఓటమితో అఫ్గానిస్తాన్ ముందంజ వేసే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. చివరి ఓవర్ డ్రామా సాగిందిలా... ఆఖరి ఓవర్లో అఫ్గానిస్తాన్కు 13 పరుగులు అవసరం కాగా, ఒకటే వికెట్ ఉంది. తొలి బంతికి నూర్ను రబడ బౌల్డ్ చేసినా అది నోబాల్ అయింది. తర్వాతి బంతి వైడ్ కాగా, ఆ తర్వాత వేసిన బంతికి నూర్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను యాన్సెన్ వదిలేశాడు. ఆ వెంటనే నూర్ సిక్స్ బాదడంతో తొలి రెండు బంతుల్లోనే 8 పరుగులు వచ్చినట్లయింది. ఇక చేయాల్సింది 4 బంతుల్లో 5 పరుగులే. తర్వాతి బంతికి షాట్ ఆడి నూర్ సగం దూరం వచ్చినా... ఫరూఖీ వెనక్కి పంపడంతో పరుగు రాలేదు.ఓవర్ నాలుగో బంతి మళ్లీ నోబాల్ కావడంతో పాటు 2 పరుగులు తీయడంతో సమీకరణం మరింత సులువుగా మారింది. 2 బంతుల్లో 3 పరుగులు కావాలి, పైగా ఫ్రీ హిట్...బహుశా బ్యాటర్లకు ఇదే సూచన ఇచ్చేందుకు ‘వాటర్ బాయ్స్’ను పంపించగా, అంపైర్లు అనుమతించలేదు! నూర్ లాంగాఫ్ దిశగా కొట్టిన షాట్కు తొలి పరుగు సులువుగా రాగా, రెండో పరుగు తీసే ప్రయత్నంలో ఫారుఖీ నెమ్మదించడంతో రనౌటయ్యాడు. దాంతో స్కోర్లు సమమయ్యాయి. ఫీల్డర్ వైపు చూడకుండా వేగంగా పరుగెత్తి బ్యాట్తో డైవ్ చేసే ప్రయత్నం చేస్తే ఫారుఖీ పరుగు సునాయాసంగా పూర్తయ్యేది. అంతకుముందు మూడో బంతికి సింగిల్ నిరాకరించిన ఫారుఖీ అసలు సమయంలో సరిగా పరుగెత్తక తన జట్టుకు గెలుపును దూరం చేశాడు. దీని తర్వాత మరో రెండు బంతులు కూడా ఉన్నాయి కాబట్టి అఫ్గానిస్తాన్ ఈ రిస్క్ చేయకుండా ఉండాల్సింది.మొదటి సూపర్ ఓవర్: ఎన్గిడి బౌలింగ్లో అజ్మతుల్లా 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. అనంతరం ఫారుఖీ బౌలింగ్లో 5 బంతుల్లో 11 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా తప్పనిసరిగా సిక్స్ కొట్టాల్సిన స్థితిలో నిలిచింది. లో ఫుల్టాస్ను లాంగాఫ్ మీదుగా స్టబ్స్ సిక్స్ బాదడంతో దక్షిణాఫ్రికా కూడా 17 పరుగులే చేయగలిగింది. రెండో సూపర్ ఓవర్: అజ్మతుల్లా బౌలింగ్లో స్టబ్స్ వరుసగా 6, 1 రాబట్టగా, మిల్లర్ వరుసగా 2, 6, 6, 2 బాదడంతో 23 పరుగులు లభించాయి. ఆ తర్వాత కేశవ్ మహరాజ్ ఓవర్లో అఫ్గానిస్తాన్ తొలి 2 బంతుల్లో పరుగులేమీ చేయకుండా వికెట్ కోల్పోయింది. అయితే గుర్బాజ్ చెలరేగి వరుసగా 6, 6, 6 కొట్టడంతో పాటు తర్వాతి బంతి వైడ్గా పడింది. ఈసారి కూడా సిక్స్ కొడితే అఫ్గాన్ గెలిచే అవకాశాలు ఉండగా, చివరి బంతికి గుర్బాజ్ క్యాచ్ ఇచ్చాడు. 38 ఇప్పటి వరకు అంతర్జాతీయ టి20ల్లో ‘సూపర్ ఓవర్’ ద్వారా ఫలితాలు వచ్చిన మ్యాచ్లు.2 అంతర్జాతీయ టి20ల్లో ‘డబుల్ సూపర్ ఓవర్’ ద్వారా ఫలితం తేలిన మ్యాచ్లు. ఈ రెండింటిలోనూ అఫ్గానిస్తాన్ ప్రత్యర్థిగా ఉండటం గమనార్హం. 2024లో అఫ్గానిస్తాన్పై భారత్ ‘డబుల్ సూపర్’లో గెలిచింది. 2025లో నేపాల్పై నెదర్లాండ్స్ ‘ట్రిపుల్ సూపర్ ఓవర్’లో నెగ్గింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) నబీ (బి) ఫారుఖీ 5; డికాక్ (సి) జద్రాన్ (బి) రషీద్ 59; రికెల్టన్ (ఎల్బీ) (బి) రషీద్ 61; బ్రెవిస్ (సి) నబీ (బి) ఒమర్జాయ్ 23; మిల్లర్ (నాటౌట్) 20; స్టబ్స్ (సి) ముజీబ్ (బి) ఒమర్జాయ్ 1; యాన్సెన్ (సి) అటల్ (బి) ఒమర్జాయ్ 16; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–12, 2–126, 3–127, 4–155, 5–159, 6–187. బౌలింగ్: ఫరూఖీ 4–0–32–1, ముజీబ్ 3–0–30–0, ఒమర్జాయ్ 4–0–41–3, నబీ 2–0–20–0, రషీద్ 4–0–28–2, నూర్ 3–0–35–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) లిండే (బి) మహరాజ్ 84; జద్రాన్ (బి) ఎన్గిడి 12; నైబ్ (సి అండ్ బి) ఎన్గిడి 0; అటల్ (సి) యాన్సెన్ (బి) రబడ 0; రసూలీ (రనౌట్) 15; ఒమర్జాన్ (సి) స్టబ్స్ (బి) ఎన్గిడి 22; నబీ (సి) మార్క్రమ్ (బి) లిండే 5; రషీద్ (సి) మిల్లర్ (బి) యాన్సెన్ 20; ముజీబ్ (రనౌట్) 0; నూర్ (నాటౌట్) 15; ఫారుఖీ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 187. వికెట్ల పతనం: 1–51, 2–51, 3–52, 4–121, 5–121, 6–139, 7–164, 8–169, 9–175, 10–187. బౌలింగ్: ఎన్గిడి 4–0–26–3, యాన్సెన్ 4–0–42–1, రబడ 3.4–0–38–1, లిండే 3–0–39–1, మహరాజ్ 4–0–27–1, మార్క్రమ్ 1–0–14–0.
టీ20 ప్రపంచకప్: ఇంగ్లాండ్కి షాకిచ్చిన వెస్టిండీస్
టీ20 ప్రపంచకప్లో ఇప్పటికే ఒక్కో మ్యాచ్ గెలిచిన వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు.. బుధవారం రాత్రి వాంఖడే వేదికగా తలపడ్డాయి. ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో విండీస్ జట్టు విజయం సాధించింది. 30 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ని మట్టికరిపించింది. 76 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన రూథర్ఫర్డ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కి దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రూథర్ఫర్డ్ 76 పరుగులు చేయగా.. ఛేజ్ 34, హోల్టర్ 33 తలో చేయి వేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓవర్టన్, రషీద్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్ జట్టుకు మంచి ఆరంభమే దక్కినప్పటికీ.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. వరస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 19 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. సామ్ కరన్ 43 పరుగులతో కాస్త పోరాడినప్పటికీ ఇతడికి సహకారం అందించే బ్యాటర్లు కరువయ్యారు. ఫలితంగా ఈ టోర్నీలో విండీస్ రెండో విజయం నమోదు చేసింది.
రూథర్ఫోర్డ్ వీరంగం.. హోల్డర్ మెరుపులు.. విండీస్ భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) రాత్రి 7 గంటలకు మొదలైన మ్యాచ్లో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.8 పరుగులకే ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (1), షాయ్ హోప్ (0) వికెట్లు కోల్పోయిన విండీస్ను షిమ్రోన్ హెట్మైర్ (23), రోస్టన్ ఛేజ్ (34) ఆదుకున్నారు. వీరిద్దరు ఔటయ్యాక రూథర్ఫోర్డ్ (76 నాటౌట్), హోల్డర్ (33) చెలరేగి ఆడి విండీస్కు భారీ స్కోర్ అందించారు. వీరిద్దరు చివరి ఓవర్లలో విధ్వంసం సృష్టించారు. పోటీపడి సిక్సర్లు బాది స్కోర్ను 200 దరికి చేర్చారు. రూథర్ఫోర్డ్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాదగా.. హోల్డర్ 17 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లు కొట్టాడు. మిగతా విండీస్ బ్యాటర్లలో రోవ్మన్ పావెల్ 14, రొమారియో షెపర్డ్ ఒక్క పరుగు (నాటౌట్) చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ (4-0-16-2) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి విండీస్ బ్యాటర్లను కట్టడి చేయగా.. జేమీ ఓవర్టన్ (4-0-33-2) పర్వాలేదనిపించాడు. జోఫ్రా ఆర్చర్ వికెట్ తీసినా (4-0-48-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్లో సత్తా చాటిన సామ్ కర్రన్ (3-0-36-1) ఈ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. జాక్స్ 2 ఓవర్లలో 32, డాసన్ 3 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను ఇంగ్లండ్ మెరుపు వేగంతో ప్రారంభించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేసి, మరో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (15) ఆచితూచి ఆడుతుండగా.. జేకబ్ బేతెల్ (20) వేగంగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ వికెట్ నష్టానికి 67 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 84 బంతుల్లో 130 పరుగులు చేయాలి.
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీలో సూపర్ సిక్స్ మోసాల ఖరీదు లక్షన్నర కోట్ల రూపాయలు.. రాష్ట్ర గవర్నర్తోనూ అవే అబద్ధాలు చెప్పించిన సీఎం చంద్రబాబు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నోటీసుపై 120 మంది విపక్ష ఎంపీల సంతకాలు
ఆంధ్రప్రదేశ్ ఆయకట్టు ఎడారే!. ఆల్మట్టి ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్ దూకుడు ఆంధ్రప్రదేశ్లో ‘ఆప్కాస్’ ఉద్యోగాలకు మంగళం
అమరావతి సైతం ప్రైవేట్ పరం... అందినకాడికి బాదుడే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు
పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ... వియ్యంకుల సంస్థలకు పనుల అప్పగింత
జంగిల్రాజ్పై ప్రశ్నిస్తున్నందుకే గూండా దాడులు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు అరాచకాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
‘లిఫ్ట్’ తాకట్టుపై రాయలసీమ కన్నెర్ర... ఆపిన పనులు రెండు నెలల్లో మళ్లీ మొదలుపెట్టాలని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ... చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
రెడ్బుక్కే రాజ్యాంగం, చంద్రబాబే ‘సుప్రీం’... తిరుమల శ్రీవారి లడ్డూపై సొంత విచారణ చేపట్టాలని ఏపీ సీఏం నిర్ణయం
కొలిక్కివచ్చిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం. అమెరికా టారిఫ్లు 18 శాతానికి తగ్గింపు
బిజినెస్
60 దాటిన బంగారం-వెండి నిష్పత్తి.. ఇక ధరలు తారుమారు!
బంగారం-వెండి నిష్పత్తి (Gold-Silver Ratio) ఇటీవల గణనీయ మార్పులను చూపిస్తోంది. ఇది విలువైన లోహాల మార్కెట్లో ఉన్న అధిక అస్థిరతను సూచిస్తుంది. 2026 జనవరి చివరలో వెండి ధరలు ఘోరంగా పెరగడంతో ఈ నిష్పత్తి చారిత్రాత్మక కనిష్ట స్థాయి అయిన 44–46కు పడిపోయింది. వెండి ధరలు ఔన్స్కు 100 డాలర్లను మించిపోయాయి.అయితే, ఫిబ్రవరి ప్రారంభంలో వెండి ధరల్లో తీవ్ర దిద్దుబాటు చోటుచేసుకోవడంతో, బంగారం-వెండి నిష్పత్తి వేగంగా 60కు పుంజుకుంది. 2026 ఫిబ్రవరి 11 నాటికి ఈ నిష్పత్తి 61 పైన ట్రేడ్ అవుతోంది.నెల ప్రారంభంలో బంగారం-వెండి నిష్పత్తిలో కనిపించిన తీవ్ర అమ్మకాలు, బులియన్ ధరలలో కొత్త ర్యాలీకి దారితీశాయి. బుధవారం (ఫిబ్రవరి 11) స్పాట్ గోల్డ్ ధరలు 0.7% పెరిగి ఔన్స్కు 5,057.23 డాలర్లకు చేరాయి. ఏప్రిల్ డెలివరీ కోసం యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1% పెరిగి ఔన్స్కు 5,081.40 డాలర్లను తాకాయి. స్పాట్ సిల్వర్ 2.3% పెరిగి ఔన్స్కు 82.56 డాలర్లు చేరింది.ఇక ఫిబ్రవరి 2 నుండి, బంగారం ధరలు 15% పైగా పెరిగాయి, వెండి ధరలు 16% పెరిగాయి. జనవరి 30 న వెండి ఒక్క సెషన్లోనే 26% క్షీణతను ఎదుర్కొంది. ఇది లోహ మార్కెట్లో తీవ్ర అస్థిరతను స్పష్టంగా చూపిస్తుంది.బంగారం-వెండి నిష్పత్తి అంటే..బంగారం-వెండి నిష్పత్తి అనేది బంగారం, వెండి సాపేక్ష విలువను కొలుస్తుంది. ఇది ఒక ఔన్సు బంగారాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన వెండి ఔన్సుల సంఖ్యను సూచిస్తుంది. బంగారం ధరను వెండి ధరతో భాగించడం ద్వారా ఈ నిష్పత్తిని లెక్కిస్తారు. ఈ నిష్పత్తి రెండు విలువైన లోహాల సాపేక్ష పనితీరు, మార్కెట్ విలువను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.నిష్పత్తి 60 దాటడం దేనికి సూచన?బంగారం-వెండి నిష్పత్తి 43.80 వద్ద కనిష్టంగా గుర్తించడం సాంకేతికంగా, చారిత్రాత్మకంగా ముఖ్యమైన సంఘటన అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ నిష్పత్తి 60ని దాటడం మార్కెట్ సాధారణీకరణ దశకి సూచన. అంటే సమీప కాలంలో బంగారం ధరలు వెండి ధరలను అధిగమించే అవకాశం ఉంది.
పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీ
ప్రముఖ దేశీయ ఐటీ సేవల సంస్థ ఎల్టీఐ మైండ్ట్రీ (LTIMindtree) తన పేరును మార్చుకుంది. కంపెనీ కొత్త పేరును ఎల్టీఎం లిమిటెడ్ (LTM Limited)గా ప్రకటించింది. తన కొత్త బ్రాండ్ గుర్తింపు, లోగోను ఆవిష్కరించింది. వేణు లాంబును చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్గా నియమించిన సంవత్సరం తర్వాత తన పేరును అధికారికంగా మార్చుకుంది."వ్యాపార సృజనాత్మకత భాగస్వామి" (Business Creativity Partner)గా కొత్త గుర్తింపు, స్థానాన్ని ప్రకటిస్తూ, ఎల్టీఎం తన సాంకేతిక సామర్థ్యాలు, లోతైన డొమైన్ నైపుణ్యం కలిసి వాటాదారులకు అర్థవంతమైన విలువను ఎలా సృష్టిస్తాయో వివరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో తెలిపింది."మార్కెట్లు మారుతున్నాయి, క్లయింట్ల అంచనాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో, మన ప్రస్తుత సామర్థ్యాలు, భవిష్యత్తు దృష్టిని ప్రతిబింబించే బ్రాండ్తో ముందుకు సాగుతున్నాము. బిజినెస్ క్రియేటివిటీ భాగస్వామిగా, మనం పని చేసే కొత్త మార్గాలు, కొత్త ఉత్పాదకత నమూనాలు, విలువ సృష్టించే కొత్త విధానాలను రూపొందిస్తున్నాము" అని సీఈఓవేణు లాంబు తెలిపారు.ఎల్టీఐ మైండ్ట్రీ లిమిటెడ్.. లార్సెన్ & టుబ్రో గ్రూప్కు చెందిన ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ. ఎల్అండ్టీఐ ఇన్ఫోటెక్, మైండ్ట్రీ విలీనంతో ఏర్పడిన ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల సంస్థలకు డిజిటల్ మార్పు, క్లౌడ్, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవలను అందిస్తోంది. ఇటీవల విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక (Q3) ఆర్థిక ఫలితాల ప్రకారం.. కంపెనీ ఆదాయం సుమారు 11 శాతం పెరిగి రూ. 10,781 కోట్లకు చేరుకోగా, పునరావృతం కాని (one-off) వ్యయ ప్రభావాల కారణంగా నికర లాభం సుమారు 12 శాతం తగ్గి రూ. 960 కోట్లుగా నమోదైంది.ఇదీ చదవండి: ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్ ఆఫర్ ఇదే..
ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్ ఆఫర్ ఇదే..
గూగుల్ తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) ఉద్యోగుల కోసం మరోసారి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలను (Voluntary Exit Packages - VEP) ప్రకటించింది. ఏఐ (AI) ఆధారిత భవిష్యత్తుకు పూర్తిగా కట్టుబడి ఉన్న సంస్థగా మారేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.“కొత్త సంవత్సరాన్ని మనం బలమైన స్థితిలో ప్రారంభిస్తున్నాం. 2025లో మీరు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. అయితే టెక్నాలజీ రంగం వేగంగా మారుతోంది. పోటీ తీవ్రంగా ఉంది. కాబట్టి మన ఏఐ మిషన్కు పూర్తిగా అనుగుణంగా పనిచేసే శ్రామిక శక్తి అవసరం” అని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలిపారు.ఏఐ-ఫస్ట్ దిశగా అడుగులుగూగుల్ ఇప్పుడు పూర్తిగా “ఏఐ-ఫస్ట్” సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే వ్యాపార విభాగంలోని ప్రతి ఉద్యోగీ ఏఐని స్వీకరించి, ఎక్కువ ప్రభావాన్ని చూపాలని సంస్థ స్పష్టం చేసింది. “ఈ వేగానికి సరిపోలలేనివారు లేదా ముందుకు సాగడానికి సిద్ధంగా లేనివారు స్వచ్ఛందంగా నిష్క్రమించేందుకు కంపెనీ అవకాశం ఇస్తుంది” అని షిండ్లర్ పేర్కొన్నారు.ఎవరిపై ప్రభావం?ఈ స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలు ముఖ్యంగా సొల్యూషన్స్ టీమ్స్, సేల్స్ విభాగం, కార్పొరేట్ డెవలప్మెంట్, ఇతర సంబంధిత వ్యాపార విభాగాల వారికి వర్తిస్తాయి. అయితే, అమెరికాలోని పెద్ద కస్టమర్ సేల్స్ టీమ్స్, కొన్ని కస్టమర్-ఫేసింగ్ పాత్రలకు ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేశారు. “మా వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నాము” అని షిండ్లర్ తెలిపారు.ఏడాదిలో మూడోసారి.. ఇది గూగుల్ అమలు చేస్తున్న మూడో స్వచ్ఛంద నిష్క్రమణ ప్రణాళిక. గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంది. 2025 జూన్లో ‘రిటర్న్-టు-ఆఫీస్’ విధానం కఠినతరం చేసిన సమయంలో యూఎస్ ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు ఇచ్చింది. మళ్లీ 2025 అక్టోబర్లోనూ యూట్యూబ్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఎగ్జిట్ ప్యాకేజీలు ప్రకటించింది.వీఈపీ ప్యాకేజీలో ఏం ఉంటాయంటే..గూగుల్ వీఈపీ (Voluntary Exit Program) ప్యాకేజీని ఎంచుకుని స్వచ్ఛందంగా నిష్క్రమించే ఉద్యోగులకు సాధారణంగా వారి సర్వీస్ పీరియడ్, దా ఆధారంగా లంప్సమ్ సెవరెన్స్ పే (కొన్ని వారాలు/నెలల జీతం), ప్రోరేటెడ్ బోనస్ చెల్లింపు, ఉపయోగించని సెలవులకు నగదు, కొంతకాలం వరకు ఆరోగ్య బీమా కొనసాగింపు, ఇప్పటికే వెస్ట్ అయిన RSUs/స్టాక్లపై హక్కులు, అలాగే కొత్త ఉద్యోగం కోసం కెరీర్ ట్రాన్సిషన్ లేదా అవుట్ప్లేస్మెంట్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు అందిస్తారు.
ఎయిర్టెల్ సరికొత్త ఏఐ ఫ్రాడ్ అలర్ట్ ప్రారంభం
దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా వన్-టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) లీకేజీల ద్వారా జరుగుతున్న బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా పనిచేసే అత్యాధునిక ‘ఫ్రాడ్ అలర్ట్’ ఫీచర్ను కంపెనీ ఆవిష్కరించింది.ఏమిటీ ఏఐ ఫ్రాడ్ అలర్ట్?సాధారణంగా డెలివరీ బాయ్స్ లేదా సర్వీస్ ఏజెంట్ల పేరుతో ఫోన్ చేసే మోసగాళ్లు వినియోగదారులను మాటల్లో పెట్టి వారి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఓటీపీలను కాజేస్తుంటారు. ఇలాంటి దాడుల నుంచి కస్టమర్లను రక్షించడమే ఈ ఏఐ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.ఒక కస్టమర్ కాల్లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి బ్యాంకింగ్ ఓటీపీ కోసం ప్రయత్నిస్తున్నాడని ఏఐ గుర్తించినట్లయితే నెట్వర్క్ స్థాయిలో ఎయిర్టెల్ వెంటనే జోక్యం చేసుకుంటుంది. కాల్ సమయంలో కస్టమర్కు వెంటనే ‘ఫ్రాడ్ అలర్ట్’ ద్వారా హెచ్చరిక పంపుతుంది. తద్వారా కస్టమర్ అప్రమత్తమై తన సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్త పడవచ్చు.ఈ సందర్భంగా ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శాశ్వత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఎయిర్టెల్ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నెట్వర్క్గా మార్చాలన్నదే లక్ష్యం. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీలు కీలకమే అయినప్పటికీ నేరగాళ్ల చేతికి చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే నెట్వర్క్ స్థాయిలోనే ఈ మోసాలను అడ్డుకునే ఏఐ పరిష్కారాన్ని తీసుకొచ్చాం. ప్రయోగాత్మక పరీక్షల్లో ఇది మంచి ఫలితాలను ఇచ్చింది’ అని పేర్కొన్నారు.అందుబాటులోకి ఎప్పుడు?గత రెండేళ్లుగా స్పామ్ కాల్ హెచ్చరికలు, హానికరమైన లింక్లను కట్టడి చేయడం వంటి చర్యలు తీసుకుంటున్న ఎయిర్టెల్ ఇప్పుడు ఈ ఓటీపీ ప్రొటెక్షన్ను మరింత బలోపేతం చేసింది. ఎయిర్టెల్ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ప్రస్తుతం ప్రారంభ దశలో భాగంగా హరియాణా రాష్ట్రంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ సదుపాయాన్ని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్టెల్ కస్టమర్లందరికీ ఈ సర్వీసును విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ రక్షణ వ్యవస్థ పూర్తిగా నెట్వర్క్ స్థాయి ఏఐ సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది. వినియోగదారుల మొబైల్ ఫోన్లలో ప్రత్యేకంగా ఎలాంటి యాప్లు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే నెట్వర్క్ స్థాయిలోనే మోసపూరిత కాల్స్, ఓటీపీ లీకేజీలను గుర్తించి అడ్డుకుంటుంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట
ఫ్యామిలీ
సైకిల్ నేర్పించి రూ. 35 లక్షలు సంపాదించాడు!
చిన్నతనంలో సైకిల్ తొక్కడం నేర్చుకున్నారా? పెద్దయ్యాక కూడా సైకిల్ తొక్కే అలవాటును కొనసాగిస్తున్నారా? అబ్బే.. అసలు అలవాటు చేసుకోలేదండీ అంటారా? మరేం ఫర్వాలేదు. వయసుతో సంబంధం లేకుండా సైకిల్ తొక్కడం ఎంచక్కా నేర్చేసుకోవచ్చు. ఏంటీ.. సైకిల్ తొక్కడం కూడా నేర్పుతారా? కారు, బైక్ డ్రైవింగ్ నేర్పడం గురించి విన్నాం కానీ.. దీని గురించి ఎప్పుడూ వినలేదే అనుకుంటున్నారా? మీకో ఆసక్తికర సంగతి తెలుసా? సైకిల్ తొక్కడం నేర్పించి ఓ కుర్రాడు రెండేళ్లలో లక్షలకు లక్షలు సంపాదించాడు. ఆశ్చర్యపోతున్నారా? ఇంతకీ ఎవరా కుర్రాడు, ఏమా కథ.. తెలుసుకుందాం రండి.డబ్బు సంపాదించడం కోసం మనుషులు రకరకాల పనులు చేస్తుంటారు. చైనాలోని షాంఘై యూనివర్శిటీ ఆఫ్ స్పోర్ట్లో మూడవ సంవత్సరం మాస్టర్ డిగ్రీ చదువుతున్న లీ అనే విద్యార్థి కూడా ఖాళీ సమయంలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. పట్టణ ప్రాంతాల్లో సైక్లింగ్కు పెరుగుతున్న ఆదరణను గమనించి ఆ దిశగా అడుగులు వేశాడు. తన స్నేహితుడితో కలిసి షాంఘైలో ప్రొఫెషనల్ సైక్లింగ్ శిక్షణ మొదలు పెట్టాలని భావించాడు. అయితే తన మిత్రుడికి ఉద్యోగం దొరకడంతో అతడు మధ్యలోనే వెళ్లిపోయాడు. లీ మాత్రం ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు.చదువు కొనసాగిస్తూనే..ముందుగా సైకిల్ తొక్కడం ఎలా నేర్చుకోవాలో బోధిస్తూ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. రెండు నెలల తర్వాత అతడికి తొలి అవకాశం దక్కింది. అక్కడి నుంచి లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఒక్క చదువు కొనసాగిస్తూనే, మరో పక్క ఉపాధి వెతుక్కున్నాడు. పిల్లలు, పెద్దలకు ఎంతో ఓపిగ్గా సైకిల్ తొక్కడం (bicycle ride) నేర్పిస్తూ మన్ననలు పొందాడు. దీంతో అతడికి దగ్గర సైకిల్ నేర్చుకునేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. తన వద్ద నేర్చుకుంటే కచ్చితంగా సైకిల్ వస్తుందన్న భరోసా ఇవ్వడంతో ఔత్సాహికులకు నమ్మకం పెరిగింది. ఒక్కొక్కరి నుంచి 800 యువాన్లు (సుమారు రూ. 10 వేలు) తీసుకునేవాడు. రెండు క్లాసులతోనే శిక్షణ పూర్తి చేసేవాడు. ఒక్కొ క్లాస్కు గంటన్నర నుంచి 2 గంటల సమయం తీసుకుంటాడు. పిల్లలు త్వరగా నేర్చుకోలేరు కాబట్టి వారికి ఎక్కువ సమయం కేటాయించేవాడు. సైక్లింగ్ శిక్షణ ద్వారా రెండేళ్లలో అతడు దాదాపు 35 లక్షల రూపాయలకు పైగా సంపాదించినట్టు 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' వెల్లడించింది.అలా నేర్పిస్తాడు..ఓర్పుగా నేర్పించడమే తన విజయ రహస్యం అంటాడు లీ. శిక్షణ కోసం తన దగ్గరకు వచ్చే వారితో ముందుగా 10 నిమిషాలు మాట్లాడతానని, దీని ద్వారా వారు ఎంత సమయంలో నేర్చుకోగలుగుతారో అంచనా వస్తానని చెప్పాడు. చిన్నతనం సైకిల్ నేర్చకుంటూ పడిపోవడంతో కలిగిన భయం వల్ల చాలా మంది వెనుకంజ వేస్తుంటారు. వారిలో ఆ భయాన్ని పొగొట్టడానికే వారితో మాట కలుపుతానని వివరించారు.చదవండి: ఫిట్స్తో ఎవరైనా పడిపోతే ఇలా చేయకండిషాంఘై దాటి..సైక్లింగ్కు ఇంత ఆదరణ ఉందని తాను ఊహించలేదని లీ చెప్పాడు. జూన్లో తన చదువు పూర్తవగానే తన సేవలను విస్తరిస్తానని తెలిపాడు. తన బోధనా పద్ధతులను మరింత మెరుగుపరుచుకుని షాంఘై వెలుపల కూడా శిక్షణ ఇస్తానని వెల్లడించాడు. జెజియాంగ్, జియాంగ్సు ప్రాంతాల్లోనూ సైక్లింగ్ కోచింగ్కు ప్లాన్ చేస్తున్నానని పేర్కొన్నాడు.
పక్షవాతంతో మంచానికే పరిమితం..కానీ ఆయుర్వేదం నడిచేలా చేసింది..!
అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉండే తమిళ నటుడు అరవింద్ స్వామి నటన పరంగానే కాదు గ్లామరస్ పరంగా ఆయనకు సాటిలేరెవ్వరూ. బాంబే, రోజా మూవీలో వేలాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు అరవింద్స్వామి. అలాంటి ఆయన కెరీర్పీక్లో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇటీవలే ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకు చేరవవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఇన్నాళ్లు తాను ఎందుకు సినీ ఫీల్డ్కి ఎందుకు దూరంగా ఉన్నారో వెల్లడించారు. అనారోగ్యం బారిన పడటం ఒక కారణమైతే, అధిక బరువు మరో కారణమంటూ..తాను ఎదుర్కొన్య ఆరోగ్య సమస్య గురించి కూడా వివరించారు. ఇంతకీ ఆయన ఏ అనారోగ్య సమస్యతో బాధపడ్డారంటే..అరవింద్ స్వామికి 2005లో పాక్షికంగా పక్షవాతం వచ్చింది. 18 నెలలు ఎంతగానో నొప్పితో విలవిలలాడాడు. చివరికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన అది వద్దనుకుని కేరళకు చెందని ఆయుర్వేద వైద్యుడిని ఆశ్రయించినట్లు తెలిపారు. ఒకటిన్నర ఏడాదిగా అనుభవించిన బాధ అంత ఇంత కాదని, ఆఖరికి స్పర్శను కూడా కోల్పోయానని అన్నారు. కానీ ఆయుర్వేదం తనను మూడు రోజుల్లో తిరిగి నడిచేలా చేసిందన్నారు. అది నాకు చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఆయన తనకు పనిచేసింది కాబట్టి ప్రజలను ఫాలో అవ్వమని సూచించడం లేదు. అలాగే గుడ్డిగా కూడా ఫాలో కావొద్దన్నారు. వైద్యుల సూచనల మేరకు, ఆరోగ్య పరిస్థితి రీత్యా సరైన నిర్ణయం తీసుకోండని అన్నారు. ఇక్క నొప్పి, కదలలేని పరిస్థితి కంటే..మానసికంగా స్థైర్యంగా ఉండటం అత్యంత ప్రధానమని అన్నారు. ఆ పరిస్థితిలో నాకే ఇలా అనే ఆలోచన దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదన్నారు. ఆ సమస్య నుంచి బయటపడ్డ వెంటనే..ఫజిల్స్, చదరంగం వంటి ఆటలతో బిజీ అయిపోయినట్లు తెలిపారు. అయితే ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డాక మళ్లీ సినీ రంగంవైపుకి రావాలని అస్సలు అనుకోలేదు, సినిమా చేయాలని కూడా అనుకోలేదట. ఎందుకంటే ఆ టైంలో చాలా మందులు వాడటంతో విపరీతం బరువు పెరిగిపోయి, జుట్టు ఊడిపోయి అదోలా తయారయ్యానని, దాంతో సినిమాల ఆలోచన రాలేదని చెప్పుకొచ్చారు అరవింద్ స్వామి. ఎంత టెక్నాలజీ అభివృద్ది చెంది..ఆధునాత వైద్యం చెంతకు చేరినా..ఏళ్లనాటి పురాతన ఆయుర్వేదమే అత్యుతమమని పలు ఉదంతాల్లో నిరూపితమైంది కూడా.(చదవండి: అమెరికా కోడలు..ఇండియా అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..)
అమెరికా కోడలు..పల్లెటూరి అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..
అత్తా కోడలు బంధం అనగానే ఎలా ఉంటుందో తెలిసిందే. ఒక ఇంటిలో రెండు కొప్పులు పొసగవు అన్న నానుడిలా ఉంటుంది చాలావరకు. కానీ ఈ అత్తాకోడళ్లు అందుకు విరుద్ధం. పైగా ఆ కోడలు దేశం, సంస్కృతి, వేషధారణ అన్ని పూర్తి విభిన్నం..అయినా వారి మధ్య అనుబంధం మాములుగా లేదు. అందుకు సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోని డెట్రాయిట్లో జన్మించిన వ్యవస్థపకురాలు బ్రిటినీ గ్రే యాదవ్ షేర్ చేశారు. ఆ వీడియోలో రెండు వేర్వేరు దేశాలు మధ్య శక్తిమంతమైన బాండింగ్ని చూపించింది. ఆమె తన భారతీయ అత్తగారితో గడిపిన క్షణాన్ని షేర్ చేసింది. తాము రోజంతా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటామని పోస్ట్లో రాసుకొచ్చింది. ఆతర్వాత ఆమె తన అత్తగారు ఆ వీడియోలో ఎందుకు అంతలా నవ్వుకుంటున్నామో వివరించింది. తాము సరదాగా మాట్లాడుకుంటూ..తన అత్తగారు కోడలి నుంచి ఆశిస్తోంది ఏంటో చెప్పగా..దాన్ని తాను చేసి చూపించడంతో నవ్వులు విరిశాయని పేర్కొంది. ఇంతకీ భారతీయ అత్తగారు కోడలి నుంచి ఏం ఆశించారంటే..ప్రతి రోజు వంట చేయడం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, పాదాలు నొక్కడం తదితరాలని మాట. ఆ అత్తగారు కోరుకున్నట్లుగానే బ్రిటనీ నేలపై కూర్చోగా..అత్తగారు సోఫాలో కూర్చొని..ఒకటే పకపక నవ్వు. ఇద్దర్నీ చూస్తే..అత్త కోడళ్లలా కాకుండా స్నేహితుల్లా మెలుగుతున్న వారిని చూస్తే రెండు కళ్లు చాలవు అన్నంత అద్భుతంగా ఉంది ఆ ఘట్టం. ఇక బ్రిటనీ డెట్రాయిట్కి చెందిన నల్లజాతి అమ్మాయి కాగా, ఆ అత్తగారు భారత్లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళ. నెటిజన్లు కూడా ఆ అత్తాకోడళ్లు కలిసిమెలిసి ఉన్న విధం చూసి ఫిదా అవ్వడమే గాక ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Brittany Grey-Yadav (@brittanygreyyadav) (చదవండి: బరువు తగ్గాలంటే..తూచా తప్పకుండా పాటించాల్సిన ఏడు సూత్రాలు..!)
Weight Loss: తూచా తప్పకుండా ఈ ఏడు సూత్రాలు..!
బరువు తగ్గడం అన్నది చాలామందికి అతిపెద్ద సమస్య. కానీ కొందరికి చాలా సింపుల్. అదికూడా నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండానే వెయిట్లాస్ అవుతారు. అలాగని, అధిక వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చేయరు. సాధారణంగా రోజువారీగా చేసే సింపుల్ వ్యాయామాలు..కాస్త తెలిగా మంచి ఆహారం తీసుకుంటూ తగ్గుతారు. ఇక్కడ ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా..తగిన ప్రోటీన్లు, విటమిన్లు అందేలా జాగ్రత్త వహిస్తే..ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా బరువు తగ్గేలా మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక్కడొక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అదే నిరూపించాడు. రోజువారీ ఆహారాన్ని రుచికరంగా, ఆరోగ్యకరంగా మార్చుకుని..అవలీలగా 35 కిలోలు తగ్గి స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు బరువు తగ్గాలంటే ఈ ఏడు చిట్కాలు తప్పకుండా ఫాలో అవ్వాలని అంటున్నాడు. అవేంటో చూద్దామా..!ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అన్ష్ త్రిపాఠి కొలెస్ట్రాల్ తగ్గించే వాస్తవిక ఆహార నియమాలను షేర్ చేసుకున్నాడు. తన పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. బరువు తగ్గడంలో కన్ఫ్యూజన్కి గురికావొద్దని అంటున్నాడు. మన స్వచ్ఛమైన భారతీయ ఆహారంతోనే కొవ్వుని కరిగించేలా తీసుకుంటే చాలని చెబుతున్నాడు. ప్రధాన నియమం..కొలెస్ట్రాల్ని తగ్గించే ఆహారాలే మన భోజనపు ప్లేట్లో ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ వేటిలో ఉంది..? తగినన్ని కూరగాయలు తింటున్నామా?.. నూనె దగ్గర నుంచి కార్బోహైడ్రేట్స్ వరకు అన్ని నియంత్రణలో ఉన్నాయా..? అని గమనించాలి. ఇక్కడ ఏది మిస్ అవ్వకూడదు. ఆహారంలో ఉండాల్సినవి..తప్పనిసరిగా సగం కూరగాయల్లో 1/4 వంతు ప్రోటీన్, 1/4 కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడాలి.ప్రోటీన్ తప్పనిసరి..ఆహారంలో కొవ్వు నష్టాన్ని ప్రోటీన్ నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రోటీన్ తక్కువగా ఉంటే ఆకలి కోరికలు పెరుగుతాయి. ఫలితంగా శరీరంలో కండరాలను కోల్పోవడం ప్రారంభమవుతుంది. .కూరగాయలు తప్పనిసరి..ఆరోగ్యకరమైన ఆహారంలో అతి ముఖ్యమైన భాగం. ప్లేట్లో వండిన లేదా పచ్చిగా ఉన్న భోజనానికి కనీసం రెండు వేర్వేరు కూరగాయలు ఉండాలి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, తక్కువ కేలరీలను కలిగి ఉంటాయికార్బోహైడ్రేట్ నియంత్రణ నియమంమన ఆహారంలో కార్బోహైడ్రేట్లను జోడించాలి కానీ మితంగా ఉండాలి. భోజనంలో 1 రోటీ లేదా 1 కప్పు బియ్యం ఉండేలా కేర్ తీసుకోవాలి. అవసరం అనుకుంటే వాటి స్థానంలో పోహా లేదా ఉప్మాతో కూడా మార్చుకోవచ్చు. కొవ్వు/నూనె నియమండైట్ విషయంలో చాలామంది ఫెయిలైదే ఇక్కడే అని అంటున్నాడు. మన భోజనంలో రెండు నుంచి మూడు స్పూన్లకు మించి నూనె ఉండకుండా చూసుకోవాలి. అప్పుడు ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుంది. కేలరీలు కూడా సమృద్ధిగా ఉంటాయి.గుర్తించుకోవాల్సిన విషయాలుశాఖాహారుల కోసం, కొవ్వు తగ్గింపు ప్లేట్లో సగం ప్లేట్ సబ్జీ, 1 కటోరి పప్పు/పనీర్/టోఫు, 1 రోటీ లేదా చిన్న మొత్తం రైస్ ఉండాలి. శాఖాహారులకు కొవ్వు నష్టం కష్టంగా అనిపించిందంటే..ప్రోటీన్ తీసుకోవడం చాలా తక్కువగా ఉందని అర్థం.అలాగే నాన్-వెజ్ ప్లేట్లో చికెన్/చేప/గుడ్లు ప్రధానంగా ఉంటాయి. ప్లేట్లో సగానికిపైగా కూరగాయలు ఉండాలి. సమతుల్యతను కాపాడుకోవడానికి కార్బ్ భాగం చిన్నగా ఉండాలి. భాగాలను నియంత్రించినప్పుడు మాత్రమే మాంసాహార ప్లేట్ కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.అల్పాహారం ప్లేట్లలో తక్కువ కార్బోహైడ్రేట్లతో ప్రోటీన్ ఉండాలి, ద్రవ కేలరీలు ఉండకూడదు. అయితే డిన్నర్ లేదా లంచ్ ప్లేట్లో ప్రోటీన్ క్వాండిటీ తక్కువగా ఉంటే..ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉండవచ్చు.చక్కెర పానీయాలు నివారించండి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే వంటకాలను ఇతరులతో షేర్ చేసుకోండి. ఇలా గనుక ఆహారంలో మార్పులు చేసుకుని తూచా తప్పకుండా ఫాలో అయితే..ఇట్టే బరువు తగ్గుతారంటూ తన పోస్ట్ని ముగించాడు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ త్రిపాఠి.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఉబర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్లో కోడింగ్..!)
అంతర్జాతీయం
పేషెంట్లపై కాల్పులు.. వందలమంది ఉరి?
ఇటీవల ఇరాన్కు వ్యతిరేకంగా ఆదేశంలో పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. లక్షలాది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. దీంతో ఖమేనీ సర్కార్ వారి నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేసింది. పెద్ద సంఖ్యలో అక్కడి పౌరులపై కాల్పులు జరిపింది. మిగతా వారిని జైళ్లలో బంధించింది. ఇదంతా తెలిసిన విషయమే.. అయితే జైళ్లలో బంధించిన నిరసనకారులను ఇరాన్ చిత్రవధకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని అక్కడి సైనికులు కాల్చివేస్తున్నారని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు అణు ఒప్పందంపై చర్చలకోసం ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ ఆ చర్చలు విఫలమైతే గనుక తీవ్ర యుద్ధం తప్పేలా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్న అంతర్గత పరిస్థితులు ప్రపంచాన్ని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిపిన వారిని అక్కడి ప్రభుత్వం ఊచకోత కోస్తున్నట్లు తెలుస్తోంది.న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. "ఇరాన్ నిరసనల్లో గాయపడిన వారిని అక్కడి భద్రతా బలగాలు ఆసుపత్రుల్లోనే కాల్చి చంపుతున్నాయి. అందుకోసం ఆసుపత్రుల్లో ఇటీవల చేరిన వివరాలను ఇరాన్ భద్రతా బలగాలు సేకరిస్తున్నాయి. ఇటువంటి ఘటనలు ప్రతిరోజు సాధారణంగా మారిపోయాయి. భద్రతా బలగాల భయానికి నిరసనల్లో గాయపడిన వారు ఆసుపత్రులకు రావడానికి భయపడుతున్నారు. అంతేకాకుండా అక్కడ జైళ్లలో మగ్గుతున్న మహిళలపై తీవ్రమైన లైంగిక దాడులు జరుగతున్నాయి. అక్కడ నిరసనలల్లో అరెస్టై జైళ్లలో ఉన్న మహిళలు తమ కుటుంబసభ్యులను గర్భనిరోధక మాత్రలు పంపించాల్సిందిగా కోరుతున్నారు" అని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.వీటితో పాటు గడిచిన మూడు వారాల్లో 207 మంది రాజకీయ ఖైదీలు ఉరితీయబడ్డారని తెలిపింది. వారందరిని దేశవ్యాప్తంగా ఉన్న 57 జైళ్లలో బంధించారు. అయితే అమెరికా కథనాల ప్రకారం ఇరాన్ వ్యతిరేక నిరసనల్లో దాదాపు 6,221 మంది ఖైదీలు మరణించగా, ఇరాన్ లెక్కల ప్రకారం 3,117 మంది ప్రాణాలు వదిలారు. నిరసనల్లో ఇప్పటివరకూ 42,000 మందిని అరెస్టు చేశారు.
క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియో
దేశం కాని దేశంలో మనకు సంబంధించిన వస్తువులను చాలా ఆందోళన కలిగించే అంశం. మరీ ముఖ్యంగా వీసా, పాస్పోర్ట్, క్రెడిట్ కార్డు అత్యంత ముఖ్యమైన వస్తువులను పోగొట్టుకోవడం తీవ్ర ఒత్తిడికి కారణమవుతుంది. కానీ మన దేశంలో అలా కాదు. క్రెడిట్ కార్డును కోల్పోయిన మహిళను స్నేహితులు సేవ్ చేసారు. దీనికి సంబంధించి ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. అదేంటో చూద్దామా.బెర్లిన్కు చెందిన జెన్నిఫర్ అనే 29 ఏళ్ల యువతి భారత పర్యటనకు వచ్చింది. అయితే ఊహించని క్రమంలో క్రెడిట్ కార్డులు. కార్పొరేట్ ఐడి క్రెడిట్ కార్డు ఉన్న పర్స్ ఎక్కడో పారేసుకుంది. దీంతో ఆమె పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. కానీ ఈ సమయంలో ఒక్క సెకను కూడా చింతించిలేదనీ, దీనికి కారణంగా భారత్లో ఉన్న తన స్నేహితులేనని చెప్పుకొచ్చింది. వారంతా కష్టకాలంలో అండగా నిలిచి గట్టెక్కించారనీ, ట్రూ స్టోరీ పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్ చేసింది. అలాగే జెన్నిఫర్ తన స్నేహితులతో తన వాట్సాప్ సంభాషణల స్క్రీన్షాట్లను షేర్ చేసింది.తన టూర్ పూర్తయ్యేవరకు తన ఫ్రెండ్స్ తనకు కావాల్సిన డబ్బును ఏర్పాటు చేసి తాను ఎలాంటి ఆందోళన పడకుండా చూసుకున్నారని, ఇలాంటి మద్దతు లభిస్తుందని తాను అస్సలు ఊహించలేదని పేర్కొంది. అంతేకాదు ఎవరి డబ్బులు వారికి తిరిగి ఇచ్చేస్తాను. భారతీయుల స్నేహాన్ని, ఆతిథ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదని వెల్లడించించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజనులు కూడా ఆనందాన్ని ప్రకటించారు. View this post on Instagram A post shared by Jennifer (@jennijigermany) నెటిజన్ల స్పందనబెంగళూరులోని బస్సులో పర్సును (క్రెడిట్ కార్డులు , కార్పొరేట్ ఐడీ కార్డ్ ఉన్న) పోగొట్టుకున్నా.. ఆ మరుసటి రోజు ఉదయం దానిని తిరిగి ఇవ్వడానికి తన కార్యాలయానికి వచ్చాడంటూ తన అనుభవాన్ని ఒకరు పంచుకున్నారు. స్నేహం,స్నేహితులు అంటే అదే కదా.. జాతి, జాతీయత, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆదుకుంటారు అని మరొకరు వ్యాఖ్యానించారు.
‘తృణధాన్యాలు’ తొలగింపు
న్యూయార్క్: అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో మన రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. భారత రైతాంగానికి నష్టం కలిగించే నిర్ణయాలు ఉండబోవని హామీ ఇస్తోంది. ఉభయతారకంగా ఉండే ఒప్పందానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంటోంది. ఇటీవల ఇరుదేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనిపై అమెరికా ప్రభుత్వం సోమవారం ఫ్యాక్ట్షీట్ విడుదల చేసింది. అమెరికాకు సంబంధించిన ఏయే వస్తువులు, ఉత్పత్తులపై భారత్లో టారిఫ్లు రద్దు కావడం లేదా తగ్గించడం జరుగుతుందో వెల్లడించింది. అయితే, మరుసటి రోజే ఈ ఫ్యాక్ట్షీట్లో సవరణ చేసి, మంగళవారం మరోసారి విడుదల చేయడం గమనార్హం. సవరించిన జాబితాలో ‘కొన్ని రకాల తృణధాన్యాలు’అనే పదాన్ని ట్రంప్ సర్కార్ తొలగించింది. అంటే అమెరికా నుంచి భారత్కు ఎగుమతి చేసే తృణధాన్యాలపై సుంకాలు రద్దు చేయడం లేదా తగ్గించడం ఉండబోదని తేలి్చచెప్పింది. ఇలా ఫ్యాక్ట్షీట్ను సవరించడం వెనుక ఏం జరిగిందన్నది తెలియరాలేదు. తొలుత విడుదల చేసిన జాబితాలో మధ్యంతర ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు ప్రస్తావించారు. అమెరికా పారిశ్రామిక వస్తువులు, సరుకులు, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తొలగించడానికి లేదా తగ్గించడానికి భారత్ అంగీకరించిందని పేర్కొన్నారు. ఇందులో మద్యం తయారీకి ఉపయోగించే ధాన్యాలు, ఎర్ర జొన్నలు, ట్రీ నట్స్, తాజా లేదా శుద్ధి చేసిన పండ్లు, కొన్ని రకాల తృణధాన్యాలు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్తోపాటు అదనపు ఉత్పత్తులు ఉన్నట్లు జాబితాలో పొందుపర్చారు. 500 బిలియన్ డాలర్లకుపైగా విలువైన ఇంధన, సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గుతోపాటు ఇతర ఉత్పత్తులను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయబోతోందని తెలియజేశారు. సవరించిన ఫ్యాక్ట్షీట్ను గమనిస్తే.. ఇందులో కొన్ని రకాల తృణధాన్యాలు అనే పదాన్ని తొలగించారు. అలాగే ‘అమెరికా వస్తువులు, ఉత్పత్తులు కొనడానికి భారత్ కట్టుబడి ఉంది’అనే వ్యాక్యంలో కట్టుబడి అనే పదాన్ని తొలగించారు. ‘కొనాలని భావిస్తోంది’అని చేర్చారు. నిజానికి గతవారం మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత భారత్, అమెరికాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ‘తృణధాన్యాలు’అనే ప్రస్తావన లేదు. అమెరికా ప్రభుత్వం తమ ఫ్యాక్ట్షీట్లో ఈ పదాన్ని చేర్చి, ఒక్కరోజులోనే తొలగించడం గమనార్హం. అమెరికా నుంచి తృణధాన్యాలను దిగుమతి చేసుకొంటే భారత రైతులు నష్టపోతారన్న వాదన వినిపిస్తోంది. ఇది కూడా చదవండి: ‘తొలగింపు నోటీసు’లో లోపాలు.. మరో అవకాశం ఇచ్చిన స్పీకర్
శాంతి మంత్రంతో బౌద్ధ సన్యాసుల సరికొత్త చరిత్ర
వాషింగ్టన్: ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ బౌద్ధ సన్యాసుల బృందం అమెరికాలోని టెక్సాస్ నుంచి ప్రారంభించిన పాదయాత్ర వాషింగ్టన్కు చేరుకోవడంతో ముగిసింది. గత అక్టోబర్లో టెక్సాస్లో కాలినడకన బయలుదేరిన బౌద్ధ సన్యాసుల బృందం సుమారు 15 వారాల పాటు 2,300 మైళ్లకు పైగా దూరం ప్రయాణించి, మంగళవారం తెల్లవారుజామున వాషింగ్టన్ డీసీకి చేరుకుంది. కాషాయ వస్త్రాలు ధరించి, పోటోమాక్ నదిపై ఉన్న చైన్ బ్రిడ్జిని దాటుతూ, నగరంలోకి ప్రవేశించిన సన్యాసులపై స్థానికులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.ఈ సుదీర్ఘ యాత్రలో సన్యాసుల వెన్నంటే ఉంటూ అందరి హృదయాలను గెలుచుకుంది వారి రెస్క్యూ డాగ్ ‘అలోకా’. కరుణ, ఐక్యత, శాంతిని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగింది. ఈ బౌద్ధ సన్యాసుల పాదయాత్ర మనుషుల మధ్య వైరాన్ని తగ్గించే ఒక గొప్ప ప్రయత్నంగా స్థానికులు అభివర్ణిస్తున్నారు. వీరి ప్రయాణంలో ఎదురైన సవాళ్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. గడ్డకట్టే చలి, భయంకరమైన శీతాకాలపు తుఫానులను సైతం లెక్కచేయకుండా ఈ సన్యాసులు పాదయాత్ర సాగించారు. చెప్పులు లేకుండా కూడా వీరు నడవడం అనేది వారిలోని పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.వీరి పాదయాత్రకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ఈ యాత్ర ఒక జాతీయ ఉద్యమంగా మారిందని పలువురు అంటున్నారు. ఈ సన్యాసులకు మార్గం మధ్యలో స్థానికులు ఆహారం, ఆశ్రయం కల్పించారు. అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైన ఆధ్యాత్మిక పాదయాత్రగా ఇది నిలిచింది. దీంతో ఈ యాత్ర ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆసియా నుండి యూరప్ వరకు పలు దేశాలలో ఇలాంటి శాంతి యాత్రలు చేపట్టేందుకు ఇది స్ఫూర్తినిస్తోంది. వర్జీనియాలోని ఆర్లింగ్టన్లో సన్యాసులు తమ పాదయాత్రలోని చివరి మజిలీ పూర్తి చేశారు. తరువాత రాజధానిలోకి అడుగుపెట్టారు. ద్వేషాన్ని అంతం చేసేందుకు కరుణ ఒక్కటే మార్గమని వీరు సందేశమిచ్చారు.ఇది కూడా చదవండి: మంచుకురిసే వేళలో.. ‘ఇగ్లూ విలేజ్’కి వెళితే..
జాతీయం
‘అస్థిరత దిశగా ప్రపంచం’: రాహుల్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్సభలో కేంద్ర బడ్జెట్పై జరుగుతున్న చర్చల్లో బుధవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రపంచమంతా స్థిరత్వం నుండి తీవ్రమైన అస్థిరత వైపు వేగంగా పయనిస్తున్నదని ఆయన హెచ్చరించారు. ప్రపంచ దేశాల మధ్య మారుతున్న సంబంధాలను గమనించకుండా.. ఆర్థిక ప్రణాళికలు రచించడం సాధ్యం కాదని రాహుల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తలెత్తుతున్న అలజడులు భారత ఆర్థిక వ్యవస్థపై, దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయని, దీనిని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలని రాహుల్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వేను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ, అందులో తాను గమనించిన రెండు అత్యంత లోతైన అంశాలను సభకు వివరిస్తున్నానని అన్నారు. అందులో మొదటిది ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, అమెరికా ఆధిపత్యాన్ని చైనా, రష్యా లాంటి శక్తులు సవాలు చేస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. ఇక రెండవది ఇంధనం, ఆర్థిక వ్యవస్థలను ఆయుధాలుగా మలుచుకుంటున్న తీరు అని అన్నారు. ఈ పరిణామాలు ప్రపంచాన్ని మునుపెన్నడూ లేని విధంగా అంచనాలకు అందని స్థితికి నెట్టేస్తున్నాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) చేసిన ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అనే వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఈ సందర్భంగా తప్పుబట్టారు. ప్రస్తుతం మనం యుద్ధాల యుగంలోకే ప్రవేశిస్తున్నామని రాహుల్ పేర్కొన్నారు. ఉక్రెయిన్, గాజా, ఇరాన్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ మేఘాలను ఆయన ఉదాహరణగా చూపారు. శాంతి స్థాపన జరుగుతుందన్న అంచనాలు ఇక చెల్లవని, నిరంతర సంఘర్షణలే నేటి ప్రపంచ వాస్తవమని రాహుల్ స్పష్టం చేశారు.అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందని రాహుల్ అన్నారు. ప్రపంచమంతా అస్థిరమైన, ఊహించని కొత్త ఒరవడిలోకి మారుతోందని విశ్లేషించారు. లోక్సభలో అధికార పక్ష సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, డాలర్ ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవాలని రాహుల్ సూచించారు. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం తదితర అంతర్గత సమస్యలతో పాటు, ప్రపంచ అస్థిరతలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపకల్పన ఉండాలని రాహుల్ తన ప్రసంగంలో డిమాండ్ చేశారు.
ఒంటరిగానే గెలుస్తాం.. స్టాలిన్
తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే సొంతంగానే మెజార్టీ సాధిస్తుందని ప్రకటించారు. ఆ పార్టీకి పొత్తులతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు.ప్రస్తుతం తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. ఈ అంశంపైనే ఇటీవల DMK ఎంపీ MP కనిమెుళి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సారి కాంగ్రెస్కు అధిక సంఖ్యలో సీట్లతో పాటు మంత్రివర్గంలోనూ చోటు కావాలని కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే డీఎంకే అధినేత ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.డీఎంకే ఒంటరిగానే మెజార్టీ సీట్లు సాధిస్తుందని తెలిపారు. అంతేకాకుండా 2021 లో సాధించిన స్థానాల కంటే ఈ ఏడాది మరిన్ని అధిక సీట్లు గెలుస్తామని తెలిపారు. ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు సాధించి స్వంతంగానే అధికారం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేసి 18 స్థానాల్లో గెలిచింది. అయినప్పటికీ మంత్రి వర్గంలో చోటు దక్కలేదు.అయితే ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ గతంతో పోలిస్తే మరిన్ని అధిక స్థానాలు కోరుతుందని తెలుస్తోంది. మంత్రి వర్గంతో పాటు రాజ్యసభ స్థానంకోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల సీట్ల షేర్ అంశాలు ఈ నెల 22నుంచి ప్రారంభమవుతాయని డీఎంకే పార్టీ ప్రకటించింది. కాగా ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సినీనటుడు విజయ్ టీవీకే పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.
ముంబై మేయర్గా రీతూ తావ్డే ఏకగ్రీవం
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చరిత్రలో కొత్తదనం చోటుచేసుకుంది. బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డే ముంబై నూతన మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 40 ఏళ్లలో ఈ ప్రతిష్టాత్మక పదవిని బీజేపీ దక్కించుకోవడం ఇదే తొలిసారి. శివసేన (యూబీటీ) అభ్యర్థిని బరిలోకి దింపకపోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. దీనితో బీఎంసీపై 25 ఏళ్లుగా సాగుతున్న థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. శివసేన నేత సంజయ్ ఘాడీ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు.53 ఏళ్ల రీతూ తావ్డే ఘాట్కోపర్ వెస్ట్ నుండి మూడుసార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. క్షేత్రస్థాయి రాజకీయాలు, ప్రజా సంక్షేమ రంగాల్లో ఆమెకు దశాబ్ద కాలానికి పైగా అనుభవం ఉంది. 2012లో వార్డు 127 నుండి తొలిసారిగా బీఎంసీలోకి అడుగుపెట్టిన ఆమె, 2017లో వార్డు 121 నుండి తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవల జనవరి 15న జరిగిన ఎన్నికల్లో వార్డు 132 నుండి ఘనవిజయం సాధించి తన పట్టును మరోమారు నిరూపించుకున్నారు. గతంలో ఆమె ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యా కమిటీ చైర్పర్సన్గా కూడా సేవలందించారు.మొత్తం 227 స్థానాలు ఉన్న బీఎంసీలో బీజేపీ 89 సీట్లు గెలుచుకుని, అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాని మిత్రపక్షమైన శివసేన 29 స్థానాలను దక్కించుకుంది. 118 మంది కార్పొరేటర్ల బలంతో బీజేపీ నేతృత్వంలోని 'మహాయుతి' కూటమి మేయర్ పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకుంది. 1997 నుండి సుమారు 25 ఏళ్ల పాటు బీఎంసీని పాలించిన శివసేన (యూబీటీ) ఈసారి 65 స్థానాలకే పరిమితమైంది. వారి మిత్రపక్షాలైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఆరు స్థానాలను, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకున్నాయి. సంఖ్యాబలం లేకపోవడంతో మేయర్ అభ్యర్థిని నిలబెట్టకూడదని శివసేన (యూబీటీ) నిర్ణయించుకుంది.
‘తొలగింపు నోటీసు’లో లోపాలు.. మరో అవకాశం ఇచ్చిన స్పీకర్
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ విపక్ష ఎంపీలు సమర్పించిన నోటీసులో సాంకేతిక, విధానపరమైన లోపాలు ఉన్నట్లు లోక్సభ సచివాలయం గుర్తించింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఫార్మాట్లో ఈ నోటీసు లేదని అధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు నోటీసును తిరస్కరించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ స్పీకర్ ఓం బిర్లా ఈ భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు.ఈ నోటీసులో ప్రధానంగా కాలక్రమ లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఈ నోటీసులో రాబోయే కాలానికి సంబంధించిన సంఘటనలను సుమారు నాలుగు సార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం జరిగిన సంఘటనల ఆధారంగానే నోటీసు ఉండాలి తప్ప, భవిష్యత్తు తేదీలను పేర్కొనడం నిబంధనలకు విరుద్ధం. ఇటువంటి పొరపాట్ల వల్ల ఈ నోటీసును రద్దు చేసే అధికారం సచివాలయానికి ఉన్నప్పటికీ, తదుపరి చర్యల కోసం స్పీకర్ సానుకూలంగా స్పందించారు.సాంకేతిక కారణాలతో నోటీసును తోసిపుచ్చకుండా, అందులోని లోపాలను సరిదిద్దుకునేలా విపక్షాలకు అవకాశం కల్పించాలని స్పీకర్ సచివాలయ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని, అవసరమైన సవరణలు చేయించిన తర్వాతే ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. సవరించిన నోటీసు అందిన వెంటనే, నిబంధనలకు లోబడి త్వరితగతిన పరిశీలించాలని సచివాలయానికి ఆదేశాలు జారీ చేశారు.సవరించిన నోటీసు తిరిగి సమర్పించిన తర్వాత, అది పార్లమెంటరీ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో అధికారులు మరోసారి తనిఖీ చేయనున్నారు. అన్నీ సవ్యంగా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల మొదటి విడత ముగిసిన తర్వాత, రెండో విడత ప్రారంభంలో ఈ అంశాన్ని చర్చకు స్వీకరించే అవకాశం ఉంది. విపక్షాల ప్రతిపాదనపై తుది నిర్ణయం వారు సమర్పించే సవరణల పైనే ఆధారపడి ఉంటుందని సచివాలయ వర్గాలు తెలియజేశాయి.
ఎన్ఆర్ఐ
చాట్జీపీటీతో చిక్కుల్లో పడ్డ గొట్టుముక్కల మధు
ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వీలైనన్ని ఎక్కువ మార్గాల్లో వినియోగించుకుంటున్నారు యూజర్లు. ఈ క్రమంలో అమెరికాలో సంచలనం చోటు చేసుకుంది. అమెరికా సైబర్ ఏజెన్సీ అధికారి ఒకరు చాట్జీపీటీ వినియోగంతో చిక్కుల్లో పడ్డారు. ఆయన భారతీయ మూలాలు, అందునా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి కావడం ఇక్కడ విశేషం. అమెరికా ప్రభుత్వ నెట్వర్క్లను రక్షించే బాధ్యత కలిగిన సీఐఎస్ఏ(Cybersecurity & Infrastructure Security Agency) చూసుకుంటుంది. దానికి తాత్కాలిక డైరెక్టర్ ఉన్న డాక్టర్ మధు గొట్టుముక్కల(Madhu Gottumukkala) ఏఐతో కొత్త తలనొప్పి తెచ్చి పెట్టుకున్నారు. చాట్జీపీటీలో ఆయన సంస్థకు చెందిన కీలకమైన పత్రాలను అప్లోడ్ చేశారట. అది పబ్లిక్ వెర్షన్లో కావడంతో వివాదం రాజుకుంది. పొలిటికో నివేదిక ప్రకారం.. కిందటి ఏడాది జులై-ఆగస్టు మధ్యకాలంలో మధు గొట్టుముక్కల కాంట్రాక్టింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పత్రాలను చాట్జీపీటీకి అప్లోడ్ చేశారు. అవి అంత గోప్యమైనవి కాకపోయినా.. కేవలం అధికారిక సంబంధిత పత్రాలే(For Official Use Only) కావడంతో రచ్చ మొదలైంది. ఆయన అలా అప్లోడ్ చేయగానే.. ఆటోమేటెడ్ సెక్యూరిటీ అలర్ట్ మోగింది. దీంతో డీహెచ్ఎస్ (Department of Homeland Security) అప్రమత్తమైంది. మధు గొట్టుముక్కల చేసిన పని వల్ల ఏదైనా నష్టం జరిగిందా? అనేదానిపై డీహెచ్ఎస్ సమీక్ష జరిపింది. అయితే ఆ ఇంటర్నల్ రివ్యూలో ఏం తేలిందో మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆయనపై ఏమైనా చర్యలు ఉంటాయా? అనేదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. సాధారణంగా.. డీహెచ్ఎస్ పరిధిలోని ఉద్యోగులకు చాట్జీపీటీ, ఇతర ఏఐ టూల్స్ను ఉపయోగించడానికి యాక్సెస్ ఉండదు. కానీ, మధు గొట్టుముక్కల మాత్రం ప్రత్యేక అనుమతి తీసుకున్నారట. ప్రత్యేక అనుమతులతో పరిమితంగా ఉపయోగించేందుకు వీలుందట. అయితే అందులో డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడం అభ్యంతరాలకు దారి తీసింది. ఈ క్రమంలో ఆయనపై సస్పెన్షన్ వేటు లేదంటే బదిలీ వేటులాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లేదంటే.. ఏఐ టూల్స్ వినియోగంపై మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మధు గొట్టుముక్కల.. భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ అధికారి. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంగా తెలుస్తోంది. కుటుంబం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. రష్యా, చైనా వంటి దేశాల నుండి వచ్చే అధునాతన సైబర్ ముప్పులను సీఐఎస్ఏ డైరెక్టర్ ఎదుర్కోవడం ఆయన బాధ్యత. డకోటా స్టేట్ యూనివర్సిటీలో పీహెచ్డీ, డల్లాస్లో ఎంబీఏ, అర్లింగ్టన్లో ఎంఎస్, విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో బీఈ చేశారు. ఆయన చేసిన పని అమెరికా సైబర్ సెక్యూరిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ సున్నితమైన పత్రాలను AI ప్లాట్ఫారమ్లలో ఉపయోగించడం ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న ముందుకు తెచ్చింది.
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే వలస కార్మికుల ఉచిత వీసాల కోసం అక్కడి ఏడీఎన్హెచ్ సంస్థ, తెలంగాణలోని జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నాలుగు చోట్ల ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. క్లీనింగ్ విభాగంలో పనిచేసేందుకు ఉచితంగా వీసాలను జారీ చేసి, ఉచిత విమాన టికెట్, వసతి, భోజన సదుపాయం కల్పించి.. మన కరెన్సీలో రూ.23 వేల వరకు వేతనాలను చెల్లించనున్నారు. వచ్చే నెల 6న జగిత్యాల, సిరిసిల్లలో, 7న నిజామాబా ద్, ఆర్మూర్లలోని జీటీఎం సంస్థ కార్యాలయాలలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. వివ రాల కోసం ఆర్మూర్ (8332062299), నిజామాబాద్ (8686860999), జగిత్యాల (83320422 99), సిరిసిల్ల (9391661522) నంబర్లలో సంప్రదించవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దళారుల్ని నమ్మొద్దు ఈనెల 9, 10 తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరైన వంద మందిని రెండు మూడు రోజుల్లో యూఏఈకి పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దళారులను నమ్మి మోసపోవద్దు. – చీటీ సతీశ్రావు, చైర్మన్, జీటీఎం ఇంటర్నేషనల్ (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!)
వైభవంగా తానా మిడ్-అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలను చూడటానికి వచ్చిన జనసందోహం, మరోవైపు తమ ఆట, పాటలతో మైమరపింపజేసిన చిన్నారులతో తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సూపర్ హిట్టయింది. వెస్ట్ చెస్టర్ లో జనవరి 17వ తేదీన జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దాదాపు 1500మందికిపైగా వచ్చిన జనసందోహం నిర్వాహకులకు, కళాకారులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికితోడు సంక్రాంతి థీమ్ ను ప్రతిబింబించేలా చేసిన కార్యక్రమాలు, పోటీలు అందరిలోనూ పాల్గొనేలా చేశాయి.తానా మిడ్ అట్లాంటిక్ కు చెందిన బోర్డ్ డైరెక్టర్ రవిపొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు చిన్నారులు పాడిన సినిమా పాటలు ఎంతోమందిని అలరింపజేశాయి. యాంకర్లు శ్వేత కొమ్మోజి, మనీషా మేక కూడా కార్యక్రమాల విజయానికి తమవంతుగా వ్యాఖానాలను జోడించి ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. సాంప్రదాయ భోగిపళ్లు కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు వారిపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు, కిడ్స్ విలేజ్ థీమ్ కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారిని తానా నాయకులు అభినందించారు. ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకుల కోసం 7,000 పౌండ్లకు పైగా ఆహారాన్ని విరాళంగా సేకరించడంలో ప్రతిభ కనబరిచిన యువ వలంటీర్లను ఈ సంక్రాంతి వేడుకల్లో సత్కరించడం హైలైట్ గా నిలిచింది. వెస్ట్ వైట్ ల్యాండ్ టౌన్ షిప్ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ వైస్-ఛైర్ మిస్టర్ రాజేష్ కుంభార్దరే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి వలంటీర్లను సత్కరించారు.తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తదితరులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ను అభినందించారు. ఈవెంట్ కోఆర్డినేటర్లు సురేష్ యలమంచిలి, కృష్ణ నందమూరితోపాటు మిడ్ అట్లాంటిక్ టీమ్ నాయకులు, వలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన క్రాస్ రోడ్స్, గోల్డెన్ స్పాన్సర్స్ గా ఉన్న శ్రీధర్ అంచూరి మరియు సురేష్ బందుగులకు, కమలం ది డెకర్ కంపనీకి, అతిథులకు, వలంటీర్లకు కమ్యూనిటీ నాయకులకు, ఈ వేడుకకు సహకరించిన అందరికీ తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.తానా మిడ్ అట్లాంటిక్ టీమ్`సరోజ పావులూరి, దీప్తి కోక, మనీషామేక, శైలజ కస్తూరి, సునీత వాగ్వాల, మైత్రి నూకల, బిందు ఆలపాటి, రమ్య మాలెంపాటి, ఇందు సందడి, రాణి తుమ్మల, భవానీ క్రొత్తపల్లి, అనుపమ యలమంచి, భవానీమామిడి, నీలిమ వోలేటి, రవీన తుమ్మల, శ్రావణి రాయలతోపాటు, విశ్వనాథ్ కోగంటి, శ్రీధర్ సాధినేని, శ్రీకాంత్ గూడురు, గోపి వాగ్వాల, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, వెంకట్ ముప్పా, రమేష్ గుట్ట, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి, ప్రసాద్ కస్తూరి, రంజిత్ కోమటి, రంజిత్ మామిడి, మూర్తి నూతనపాటి, చందు భాతుస్కర్, సంతోష్ రౌతు, సత్య పొన్నగంటి, రాజు గుండాల, రాధాకృష్ణ మూల్పూరి, నాయుడమ్మ యలవర్తి, చలం పావులూరి, మోహన్ మల్ల ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు.
భార్యను, బంధువులను కాల్చి చంపాడు!
న్యూయార్క్: అమెరికాలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ భారత సంతతి వ్యక్తి క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. భార్య, ఆమె తరఫు ముగ్గురు బంధువులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్లముందే జరిగిన దారుణం చూసి బెంబేలెత్తిపోయిన అతని 12 ఏళ్ల కొడుకు, బంధువుల తాలూకు మరో ఇద్దరు పిల్లలు వెంటనే ఓ గదిలోకి దూరి గడియ పెట్టుకుని బతికిపోయారు. కొడుకు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే పారిపోయిన నిందితున్ని కొద్ది దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం అందరినీ కలచివేస్తోంది. నిందితున్ని విజయ్కుమార్ (51)గా, మృతులను అతని భార్య మీమూ డోగ్రా (43), మిగతా వారిని గౌరవ్ కుమార్ (33), నిధీ చందర్ (37), హరీశ్ చందర్ (38)గా గుర్తించారు. ఇది మాటలకందని ఘోరమని అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది. బాధిత కుటుంబానికి అన్నివిధాల సాయమూ అందిస్తున్నట్టు పేర్కొంది. గదిలో దాక్కున్న పిల్లలు విజయ్కుమార్ దంపతులు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నివసిస్తుండేవారు. శుక్రవారం అర్ధరాత్రి ఏదో విషయమై ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఘర్షణ నడుమే కొడుకుతో కలిసి శివారు నగరమైన లారెన్స్విలేలోని బ్రూక్స్ ఐవీ కోర్ట్లో ఉంటున్న డోగ్రా తాలూకు బంధువులు గౌరవ్, నిధి, హరీశ్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఘర్షణ శ్రుతిమించి కాల్పులకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవకు దారితీసిన కారణమేమిటో తెలియాల్సి ఉందని చెప్పారు. ‘‘విజయ్ దంపతుల 12 ఏళ్ల కొడుకు తెల్లవారుజాము 2:30 ప్రాంతంలో మాకు కాల్ చేసి దారుణం గురించి చెప్పాడు. రాపిడ్ రెస్పాన్స్ బృందం నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది. నలుగురు వ్యక్తు లు ఇంట్లో తూటా గాయాలతో పడిపోయి కన్పించారు. ముగ్గురు పిల్లలు సకాలంలో స్పందించి పక్క గదిలోకి పరుగెత్తి దాక్కోవడంతో దాడి నుంచి బయ ట పడ్డట్టున్నారు’’అని పోలీసులు వివరించారు.
క్రైమ్
8 కేజీలకు పైగా బంగారమిచ్చినా కట్న వేధింపులే
రాయచూరు( కర్ణాటక ): కేజీల కొద్దీ బంగారం, లక్షల రూపాయల డబ్బు తీసుకుని పెళ్లి చేసుకున్న తరువాత కూడా మరింత కట్నం తేవాలని వేధిస్తున్న ధనదాహపు భర్త, అత్తమామల ఉదంతమిది. నవ వివాహితను వేధిస్తున్న కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ఈ విషయంపై సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరారెడ్డి వివరాలను వెల్లడించారు. కళ్లుచెదిరే కట్న కానుకలు.. జిల్లాలోని సింధనూరులోని రామ్ కిశోర్ కాలనీలో నివాసముంటున్న సూర్యబాబు కుమార్తెకు బళ్లారి జిల్లా కృష్ణా నగర క్యాంప్ నివాసి ఆలపాటి కృష్ణ చైతన్యతో గత ఏడాది జూన్ 7న వివాహమైంది. కృష్ణచైతన్య బెంగళూరులో టెక్కీగా పనిచేస్తున్నాడు. పెళ్లి సమయంలో కృష్ణ చైతన్యకు అక్షరాలా 8.5 కేజీల బంగారం, 4.5 కేజీల వెండి, రూ.6 లక్షల నగదు, రూ.8 లక్షలు దుస్తులకు, రూ.15 లక్షలు విలువ చేసే కారు, వంట సామగ్రి కోసం రూ.3 లక్షలు, కుటుంబ సభ్యుల ఖర్చులకు రూ.15 లక్షలు ఇచ్చి అత్యంత ఆర్భాటంగా పెళ్లివేడుకను జరిపించారు. నవంబరు నుంచి నరకం అయితే నవంబర్ నెలలో మరింత కట్నం తేవాలని భర్త, అత్తమామలు, అతని అక్క, బావ, మరిది తదితరులు నవ వధువును చిత్రహింసలు పెట్టసాగారు. ఇది తట్టుకోలేక ఆమె పుట్టింటికి వచ్చేసి ఉంటోంది. పుట్టింటి నుంచి ఆస్తిలో సగ భాగం తెచ్చేవరకు ఇంటికి రావద్దంటూ భర్త హుకుం జారీ చేశాడని సీఐ తెలిపారు. వారి సతాయింపులను తట్టుకోలేక సూర్యబాబు, కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై గృహ హింస కేసు నమోదు చేశామన్నారు. భర్త కృష్ణచైతన్య, అత్త అనంతలక్ష్మి, మామ ఆలపాటి శ్రీనివాస్, కుటుంబ సభ్యులు గీతాశ్రీ, వెంకటకృష్ణ, శ్రీకాంత్, కృష్ణవంశీలను అరెస్ట్ చేశామని తెలిపారు.
ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి.. యువతి అదృశ్యం
హైదరాబాద్: ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సైదాబాద్లో నివాసం ఉండే పల్లవి షిండే (26) ఇటీవల 8న కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని మంజీరా మెజిస్టిక్ కమర్షియల్ కాంప్లెక్స్లోని కోడ్ జెన్స్ టెక్నాలజీలో ఉద్యోగంలో చేరింది. 9న ఉదయం 9.20 గంటలకు ఉద్యోగం నిమిత్తం విధులకు హాజరయ్యేందుకు ఇంట్లో నుంచి వెళ్లింది. సాయంత్రం 8 గంటలకు ఫోన్ చేసి.. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని, ఇంటికి వస్తున్నానని చెప్పింది. అర్ధరాత్రి అయినా ఇంటికి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో మంగళవారం కేపీహెచ్బీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏసీబీ వలలో మాదాపూర్ ఎస్ఐ
హైదరాబాద్: మాదాపూర్ ఎస్సై వినయ్కుమార్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం.. ఐటీ కన్సల్టెన్సీ కంపెనీ కేసు విషయంలో కోర్టు నుంచి ఆర్డర్ కాపీ ఉన్నప్పటికీ బీఎన్ఎస్ఎస్ నోటీసు ఇవ్వడానికి ఎస్సై వినయ్ జాప్యం చేస్తున్నారు. నోటీసు కావాలని బాధితుడు పదేపదే వేడుకోవడంతో రూ.లక్ష లంచం ఇవ్వాలన్నారు. ఒకేసారి ఇవ్వలేననడంతో.. రూ.50 వేల చొప్పున ఇవ్వాలన్నారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వినయ్ రూ.50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఆస్తి దక్కకుండా చేసిందన్న అక్కసుతో..
గార్ల: అన్నకు రెండో పెళ్లి చేసి మొత్తం ఆస్తి తనకు దక్కకుండా చేసిందన్న కోపంతో నిద్రమత్తులో ఉన్న అత్తకు ఓ అల్లుడు విద్యుత్షాక్ పెట్టి చంపాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై బి.సాయికుమార్ కథనం ప్రకారం.. సీతంపేట పంచాయతీ మంగళితండాకు చెందిన బానోత్ రాజేశ్ అన్న రమేశ్కు మూడు రోజుల క్రితం సీతంపేటలో రెండో వివాహం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన ధరావత్ కౌసల్య (50) అలియాస్ కంసాలి తన కూతురును బానోత్ రాజేశ్కు పదేళ్ల క్రితం ఇచ్చి వివాహం చేసింది. వీరి కుటుంబం సజావుగానే సాగుతోంది. రమేశ్కు సైతం 15 ఏళ్ల క్రితం వివాహం జరగగా అతని భార్య ఏడేళ్ల క్రితం అతన్ని వదిలి వెళ్లిపోయింది. రమేశ్కు రెండో పెళ్లి సంబంధంగా కౌసల్య ఇటీవల తన అన్న కూతురు అంజలితో సంబంధం కుదిర్చింది. రమేశ్, అంజలి వివాహం మూడు రోజుల క్రితం సీతంపేటలో జరిగింది. అంతా నిద్రలో ఉండగా.. రమేశ్కు పెళ్లికాకపోతే ఆస్తిమొత్తం రాజేశ్కు దక్కేది. దీన్ని మనసులో పెట్టుకున్న రాజేశ్ తన అన్నకు రెండో పెళ్లి చేసి తనకు ఆస్తి దక్కకుండా చేసిందనే అక్కసుతో అత్త కౌసల్యను చంపేందుకు ప్లాన్ వేశాడు. మంగళవారం తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉండగా అత్తమామను చంపేందుకు ఇనుప కడ్డీలకు విద్యుత్ వైరు కట్టి వారు పడుకున్న మంచం తలదిండు కింద పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. కౌసల్యకు మెలకువ వచ్చి కదలడంతో ఇనుపకడ్డీ తాకి విద్యుత్షాక్తో అక్కడికక్కడే మృతిచెందింది. మామ వెంటనే నిద్రలేచి తనభార్యను పట్టుకోగా అతనికి సైతం విద్యుత్షాక్ తగలడంతో కేకలు వేశాడు. ఇంట్లోని అందరూ లేచే సరికి అత్త మృతిచెందగా, మామ స్పృహ కోల్పోయి ఉన్నాడు. వెంటనే రాజేశ్ తండ్రి వచ్చి విద్యుత్ బోర్డు ప్లగ్ తీశాడు. రాజేశ్ భార్య ఎందుకు ఇలా చేశావని నిలదీయగా మద్యం మత్తులో కత్తితో ఆమెపై దాడి చేశాడు. అడ్డువచ్చిన అంజలిపైనా కత్తితో దాడి చేశాడు. ఇరువురికి గాయాలు కాగా, ఇరుగుపొరుగు వారు వచ్చి వారిని గార్ల ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి రాజేశ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దివ్యాంగుడైన రాజేశ్కు కొంత ఎలక్ట్రీíÙయన్ పని కూడా వస్తుంది. దీంతో కరెంటుపై కొంత అవగాహన ఉండడంతో ఇనుప కడ్డీలకు విద్యుత్ వైర్లు పెట్టడం, దానిని మంచంలో ఎవరికీ కనిపించకుండా అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
వీడియోలు
కూతురుని చూసేందుకు వచ్చిన తల్లికి అవమానం
ఏపీఎస్ఆర్టీసీపై బాబు దొంగ దెబ్బ!
జోగి రమేష్ కు కన్నబాబు పరామర్శ
సర్కార్ శాడిజం.. కాపు నేతపై కన్నింగ్ ప్లాన్
ఇందాపూర్ పేరుతో టీటీడీకి హెరిటేజ్ కంపెనీ నెయ్యి సరఫరా...
దివాలా అంచున ఆంధ్రప్రదేశ్ దిక్కుమాలిన విజనరీ
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో YS జగన్ సమావేశం
ఎవరి పాపం.. ఎవరికి శాపం ?
Stock Market: లక్షకు 9 లక్షలు.. 7 రూపాయల షేరు 65కు జంప్.. రాత మారిపోయింది..!
రూట్ మార్చిన బంగారం, వెండి.. ఇవాళ ఎంత పెరిగిందంటే

