డ్రైవర్ నిద్రమత్తు.. ఏపీలో మరో బస్సు బోల్తా
సాక్షి, అనకాపల్లి జిల్లా: నక్కపల్లి జాతీయపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒడిశా నుంచి సుమారు 38 మంది ప్రయాణికులతో చెన్నై వెళ్తున్నట్లు సమాచారం. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తృటిలో భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ఆంధ్రప్రదేశ్లో బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల తిరుపతి జిల్లాలో ప్రైవేట్ బస్సుకు తృటిలో ఘోర ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పూతలపట్టు –నాయుడుపేట ప్రధాన రహదారిలోని పాకాల మండలం నేండ్రగుంట సమీపంలో ఘటన జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఘటన జరిగింది. వేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు లారీని తప్పించబోయి అవతలి వైపు రోడ్డు దూసుకెళ్లి డివైడర్ను ఢీకొట్టింది.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం...ఆర్థిక పరిస్థితి ఎనలేని ఉత్సాహాన్నిస్తుంది. కీలక వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. విద్యార్థులు, నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. యుక్తి, నేర్పుతో క్లిష్టమైన వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం చివరిలో ఆరోగ్య, కుటుంబసమస్యలు. అనుకోని ధనవ్యయం. బంగారు, తెలుపు రంగులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.వృషభం...కొన్ని ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ప్రముఖులు సహాయం అందిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. దూరపు బంధువులను ఆశ్చర్యకరంగా కలసుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. రాజకీయవర్గాలకు మరింత సానుకూలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, గులాబీ రంగులు. వినాయక స్తోత్రాలు పఠించండి.మిథునం....ఎంతటి వ్యవహారమైనా ప్రారంభంలో వేగవంతంగా కొనసాగుతాయి. అనంతరం∙కొంత మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ప్రముఖులు పరిచయం కాగలరు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. క్రీడాకారులు, రాజకీయవర్గాలకు అనుకోని పిలుపు రావచ్చు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కర్కాటకం...కొత్త పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు అన్నింటా అనుకూలమే. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి.సింహం....ఆర్థిక విషయాలు మునుపటి కంటే ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ప్రధాన సమావేశాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వాహనయోగం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు.. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు సఫలమవుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.కన్య...కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధువులు, మిత్రులు మాటసాయం అందిస్తారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. సమస్యలు కొన్ని ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. వాహన, గృహయోగాలు కలుగవచ్చు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. కొద్దిపాటి ఆరోగ్యసమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఇంటాబయటా గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. వైద్యులు, రాజకీయవర్గాలకు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. దూరప్రయాణాలు. గులాబీ, నీలం రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.తుల....రానురాను అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. బంధువులు, మిత్రుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళాకారులు,రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధననష్టం. మానసిక అశాంతి. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.వృశ్చికం...ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు అందరికీ నచ్చి ప్రోత్సాహిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికర సమాచారం నిరుద్యోగులను ఉత్సాహపరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. సోదరులు కొంత సహాయం అందిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మందగించినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. క్రీడాకారులు, కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నలుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.ధనుస్సు...స్వయంగా కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల హడావిడి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం. వ్యాపార లావాదేవీలు మరింత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకునే సమయం. వైద్యులు, సాంకేతిక వర్గాలకు అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.మకరం....కొన్ని సమస్యలు, వివాదాలు వెంటాడినా ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సోదరులు, మిత్రుల సహాయం కోరతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంగతులు గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహ వేడుకలకు హాజరవుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. రాజకీయవేత్తలు, వైద్యులకు సరైన గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.కుంభం...కీలకమైన పనులు కొన్ని శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు ఉండదు. సన్నిహితులతో వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు విజయాల బాటలో పయనిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. ముఖ్య వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇష్టంలేకున్నా కొన్ని మార్పులు తప్పదు. సాంకేతిక, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, తెలుపు రంగులు. దుర్గాదేవిని ఆరాధించండి.మీనం..ఆర్థిక ఇబ్బందులు మరింత చికాకు పరుస్తాయి. శ్రమ మరింత పెరిగి చికాకు పరుస్తుంది. విద్యార్థులు మరింత కృషి చేస్తే ఫలితం కనిపిస్తుంది. సోదరులు, మిత్రులతో అకారణంగా విరోధాలు. అనుకున్న పనుల్లో ప్రతిబ«ంధకాలు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వివాహ, ఉద్యోగయత్నాలు నిదానంగా కొనసాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. గృహ నిర్మాణాలపై నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు నెమ్మదిగా సాగి స్వల్పలాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. క్రీడాకారులు, పారిశ్రామికవర్గాలకు లేనిపోని చిక్కులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. విందువినోదాలు. గులాబీ, ఎరుపు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.
ఎన్డీయేతో పొత్తు.. కాంగ్రెస్తో గమ్మత్తు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముసుగు రాజకీ యం మరోసారి చర్చనీయాంశమైంది. అవసరానికి తగ్గట్లుగా ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో ఆరితేరిన ఆయన ఇప్పుడు ఎన్డీయేతో పొత్తులో ఉండి తెరచాటున కాంగ్రెస్తో సంబంధాలు నెరుపుతున్నట్లు తేలిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా ఆయన ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు నటిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పెద్దలతో లోపాయకారీగా మంతనాలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు, నేతలతో కాంగ్రెస్కు చెందిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితర నేతలు రేవంత్రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీపీకి చెందిన ఓ మంత్రి ఆహ్వానం మేరకు ఎన్డీయే ఇచ్చిన విందుకు రేవంత్రెడ్డి హాజరయ్యారు. దీన్నిబట్టి సీఎం చంద్రబాబు ఎన్డీయేలో ఉంటూనే రేవంత్రెడ్డి ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో గుట్టుగా దోస్తీ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.2024 ఎన్నికల్లో కాంగ్రెస్తో రహస్య స్నేహం..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. 2024 ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి తెరచాటున విశ్వప్రయత్నాలు చేసినట్లు బయటపడింది. ఏపీలోనూ ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. బయటకు మాత్రం ఎన్డీయేతో పొత్టు పెట్టుకుని అవసరాన్ని బట్టి మాత్రం కాంగ్రెస్తో సంబంధాలు నెరిపారు. ప్రస్తుతం తెలంగాణ సీఎంతో టీడీపీ మంత్రులు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండడం బహిరంగ రహస్యమే. వారు తరచూ ఆయనతో విందు భేటీల్లో పాల్గొంటున్నట్లు బహిరంగ రహస్యం. చంద్రబాబు కూడా రేవంత్కు అనుకూలంగా పనిచేస్తున్నట్లు తేలిపోయింది. ఎందుకంటే.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాను కోరిన మీదటే చంద్రబాబు నిలిపివేసినట్లు స్వయంగా రేవంత్రెడ్డి అక్కడి అసెంబ్లీలో చెప్పిన విషయం తెలిసిందే. దీన్నిబట్టే చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని అప్పట్లో తేటతెల్లమైంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ ఆయన ఎన్డీయేలో ఉండి తెరవెనుక కాంగ్రెస్తో రాయబారాలు నడిపినట్లు తెలుస్తోంది. 2011లో చీకట్లో చిదంబరాన్ని కలిసిన బాబు..మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సైతం చంద్రబాబు కాంగ్రెస్తో రహస్య బంధం కొనసాగించారు. 2011 ఆగస్టులో ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన తన రాజకీయ అవసరాల కోసం రాత్రి వేళ అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని కలిసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆయన యూపీఏ ప్రభుత్వంతో లోపాయకారీగా పలు వ్యవహారాలు నడిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించేందుకు అన్ని విధాలా సహకరించారు. అప్పట్లో కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే అది వీగిపోయేందుకు సహకరించి ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టారు. 2011–2013 మధ్య కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో తెరచాటున కలిసి పనిచేశారు. రాష్ట్ర విభజనలోనూ కాంగ్రెస్తో స్నేహం..ఆ సమయంలోనే ఆంధ్రా ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగేలా రాష్ట్ర విభజన జరుగుతున్నా చంద్రబాబు కాంగ్రెస్కే అనుకూలంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకుని తన అవకాశవాదాన్ని చాటుకున్నారు. ఇక 20014–19 మధ్య కూడా ఎన్డీయేతో పొత్తులో ఉండి కాంగ్రెస్తో రహస్యం బంధాన్ని కొనసాగించారు. 2018లో ఆ ముసుగును తీసేసి ఎన్డీయే నుంచి బయటకొచ్చి యూపీఏతో స్నేహం చేశారు. అదే ఏడాది తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి ఎన్నికల ప్రచారం కూడా చేశారు. అనంతరం.. 2019 ఎన్నికల్లో యూపీఏతో అవగాహన కుదుర్చుకున్నారు. అయితే, ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే యూపీఏను వదిలేసి ఎన్డీయేకి జైకొట్టారు...ఇలా తన రాజకీయ అవసరాన్ని బట్టి రంగులు మార్చడం చంద్రబాబుకే చెల్లింది. ఇదే క్రమంలో తాజాగా ఎన్డీయేతో కలిసి ఉంటూనే బీజేపీకి అనుకూలంగా అన్నీ చేస్తున్నట్లు నటిస్తూ తెర వెనుక మాత్రం కాంగ్రెస్తో సంబంధాలు కొనసాగించడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ బిర్యానీ కోసం అమెరికా నుంచి వచ్చేశా..!
హైదరాబాద్ బిర్యానీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ రుచి కోసమే ఎంతో మంది సెలబ్రిటీలు ఉవి్వళ్లూరుతుంటారు. నగరానికి వస్తే బిర్యానీ రుచిని ఆస్వాదించకుండా ఉండరు. ఈ క్రమంలోనే.. ‘నేను కేవలం బిర్యానీ తినడానికే హైదరాబాద్కు విమానంలో వచ్చాను’ అనే క్యాప్షన్తో ఓ యూట్యూబర్ వీడియో అప్లోడ్ చేస్తే దానికి ఏకంగా దాదాపు 5.1 మిలియన్ల పైగా వీక్షణలు వచ్చాయి. నగరం వైపు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న అంశాల్లో హైదరాబాదీ క్యుజిన్ టాప్లో ఉందనే విషయాన్ని ఇది నిరూపిస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్ లేదా ఇన్స్ట్రాగాంలో ’హైదరాబాద్’ అని సెర్చ్ చేస్తే.. బిర్యానీ, బన్ మస్కా, లేదా జూబ్లీహిల్స్ కేఫ్లోని మరో ఫ్యూజన్ డిష్.. తదితర వీడియోలతో స్క్రీన్ నిండిపోతుంది. ఒకప్పుడు చార్మినార్ లాంటి చారిత్రక నిర్మాణాలు దర్శనమిచ్చే చోట ఇప్పుడు హైదరాబాదీ క్యుజిన్ చవులూరిస్తోంది. 2019లో హైదరాబాద్కు యునెస్కో ద్వారా క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ హోదా లభించింది. ఈ హోదా, చారిత్రక రుచిని ఆస్వాదించేవారు తప్పక సందర్శించాల్సిన స్థలంగా నగరాన్ని ప్రాచుర్యంలోకి తెచి్చంది. దీంతో నవతరపు పర్యాటకుల అభిరుచుల్లో.. నగర చారిత్రక, వాస్తు నిర్మాణ కళల కన్నా మన పాకశాస్త్ర కళలే కొంత ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సోషల్లో హల్చల్.. ‘నేను కేవలం బిర్యానీ తినడానికే ఇక్కడికి విమానంలో వచ్చాను’ అని ఇటీవలే నగరాన్ని సందర్శించిన ప్రముఖ యూట్యూబర్ డైలీ మాక్స్ ప్రకటించారు. అలాగే.. తమ జాబితాలో ఒక ప్రసిద్ధ వంటకాన్ని పూర్తి చేయాలనే నిర్దిష్ట ఉద్దేశ్యంతో నగరానికి ప్రయాణించినట్టు మరో ప్రముఖ జంట, అల్ఫోన్సో జెస్సికాల వ్లాగ్ చూపిస్తుంది. మరో యూ ట్యూబర్ క్రిస్ లూయిస్ హైదరాబాద్ వంటల ప్రపంచం గురించి దఫాలుగా అనేక వీడియోలను రూపొందించారు. ఇక ముంబైకి చెందిన చెఫ్ వెల్టన్ సల్దానానే ఇటీవల తన బిర్యానీ భక్తితో వార్తల్లో నిలిచారు. ఆయన నగరం నుంచి తిరిగి వెళుతూ రూ.5000 విలువైన బిర్యానీ ప్యాకెట్లను తీసుకెళ్లారు. అయితే.. దీని కోసం ఆయన విమానాశ్రయంలో రూ. 4,200 రుసుము సర్చార్జిగా చెల్లించారు. దీంతో ఆయన బిర్యానీ ప్యాకెట్లు రూ.9,200 ఖర్చు చేసినట్టయింది. లైఫ్స్టైల్ కంటెంట్ క్రియేటర్లు సైతం.. కేవలం ఫుడ్ బ్లాగర్లే కాకుండా, లైఫ్స్టైల్ కంటెంట్ క్రియేటర్లు కూడా హైదరాబాద్ ఆహార సంస్కృతి వ్యాప్తికి కారణమవుతున్నారు. మానవ సంబంధాలపై దృష్టి సారించే దుబాయ్కు చెందిన అంతర్జాతీయ కథకుడు ఖలీద్ అల్ అమెరి, ‘భారతదేశంలోనే అత్యుత్తమ బిర్యానీ‘ని కనుగొనడానికి నగరంలో తాను చేసిన తన 72 గంటల ప్రయాణం పంచుకున్నారు. ఇక ప్రముఖ నటుడు యూట్యూబర్ కూడా అయిన ఆశిష్ విద్యార్థి నగరంలోని ఆహార అభి‘రుచుల’ను ఆస్వాదిస్తారు. తెల్లవారు జామున పాయా, నహారీ తినే ఆచా రాన్ని అనుసరించేందుకు హోటల్ నయాబ్ ను సందర్శించడం ఒక మరపురాని అనుభవ ంగా ఆయన వర్ణిస్తారు. దాదాపు ప్రతీ వారం ఒక హైదరాబాద్ ఫుడ్ పోస్ట్ వైరల్ అవుతుండడం కనిపిస్తోంది. అలా చూస్తే త్వరలోనే మన దేశపు ఫుడ్ టూరిజమ్కి భాగ్యనగరం కేరాఫ్గా నిలవడం తథ్యం అనిపిస్తోంది.
డ్రైవర్ నిద్రమత్తు.. ఏపీలో మరో బస్సు బోల్తా
10 మంది శాస్త్రవేత్తల అదృశ్యం
స్వార్థంతోనే బిల్లును వ్యతిరేకించారు
విశాఖలో న్యాయమూర్తుల అతిథి గృహాలకు శంకుస్థాపన
వచ్చే మంగళవారం బాబు సర్కారు మళ్లీ రూ.4,600 కోట్ల అప్పు
ఐసీఐసీఐ బ్యాంక్కి ప్రొవిజనింగ్ దన్ను
స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు డౌన్
మైనింగ్ మాఫియా కాటు.. నాగులకొండకు చేటు
నీటి కేటాయింపులు లేకున్నా అడ్డగోలుగా ప్రాజెక్టులు
జగిత్యాల.. ‘జంగ్’ సైరన్!
రేపే గ్రహకూటమి.. ఈ 5 రాశుల వారికి తిరుగులేదు
రుతుపవనాల దగా?
అమ్మలా మోసి.. నాన్నలా కాచి
ఆసియాకు కొత్త కుబేరుడు.. ముఖేష్ అంబానీ నెం.2
సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో
గేమ్ చేంజర్ X నేమ్ చేంజర్
మీరు నెత్తిన పెట్టుకున్న ఈశ్వరన్ జైలుకెళ్లాడు.. సింగపూర్ ఎవరి దెబ్బకు భయపడిందో అందరికీ తెలుసు!!
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా
సంచలనం.. వైభవ్ సూర్యవంశీకి రూ.150 కోట్లు!?
T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ
అతడి కోసం ఢిల్లీ విరాట్ కోహ్లిని వద్దనుకుంది: సెహ్వాగ్
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం!
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా
కళ్లు చెమర్చే దృశ్యం.. హృదయాన్ని తాకిన చిన్నారి వీడియో
శుభవార్త చెప్పిన తెలుగు హిట్ సీరియల్ హీరోయిన్
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
డ్రైవర్ నిద్రమత్తు.. ఏపీలో మరో బస్సు బోల్తా
10 మంది శాస్త్రవేత్తల అదృశ్యం
స్వార్థంతోనే బిల్లును వ్యతిరేకించారు
విశాఖలో న్యాయమూర్తుల అతిథి గృహాలకు శంకుస్థాపన
వచ్చే మంగళవారం బాబు సర్కారు మళ్లీ రూ.4,600 కోట్ల అప్పు
ఐసీఐసీఐ బ్యాంక్కి ప్రొవిజనింగ్ దన్ను
స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు డౌన్
మైనింగ్ మాఫియా కాటు.. నాగులకొండకు చేటు
నీటి కేటాయింపులు లేకున్నా అడ్డగోలుగా ప్రాజెక్టులు
జగిత్యాల.. ‘జంగ్’ సైరన్!
రేపే గ్రహకూటమి.. ఈ 5 రాశుల వారికి తిరుగులేదు
రుతుపవనాల దగా?
అమ్మలా మోసి.. నాన్నలా కాచి
ఆసియాకు కొత్త కుబేరుడు.. ముఖేష్ అంబానీ నెం.2
సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో
గేమ్ చేంజర్ X నేమ్ చేంజర్
మీరు నెత్తిన పెట్టుకున్న ఈశ్వరన్ జైలుకెళ్లాడు.. సింగపూర్ ఎవరి దెబ్బకు భయపడిందో అందరికీ తెలుసు!!
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా
సంచలనం.. వైభవ్ సూర్యవంశీకి రూ.150 కోట్లు!?
T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ
అతడి కోసం ఢిల్లీ విరాట్ కోహ్లిని వద్దనుకుంది: సెహ్వాగ్
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం!
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా
కళ్లు చెమర్చే దృశ్యం.. హృదయాన్ని తాకిన చిన్నారి వీడియో
శుభవార్త చెప్పిన తెలుగు హిట్ సీరియల్ హీరోయిన్
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఫొటోలు
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)
ముంబైలో INCA అవార్డ్స్.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)
సిద్ధార్థ్ బర్త్డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)
'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)
ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)
భూత్ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్ (ఫోటోలు)
సినిమా
సినిమా నిలబడాలి: కిరణ్ అబ్బవరం
‘‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా చూసిన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మంచి ప్రయత్నం చేశారంటూ ఇండస్ట్రీ పెద్దలు, ఇతరులు ప్రశంసించడం హ్యాపీగా ఉంది’’ అని కిరణ్ అబ్బవరం తెలిపారు. సాయి తేజ్ హీరోగా, వేద జలంధర్ హీరోయిన్గా వి. మునిరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సుమైర స్టూడియోస్తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘మా సినిమా రిలీజైన ఒక్క రోజులోనే ఇందులో నటించిన ఐదారుగురికి అవకాశాలు రావడం హ్యాపీ. నెక్ట్స్ కూడా కొత్తవాళ్లతోనే చేస్తాను. కొత్తవాళ్లు రావాలి, సినిమా నిలబడాలి’’ అన్నారు. ‘‘మేము థియేటర్స్కి వెళ్లినప్పుడు మా సినిమాలోని పాత్రల పేర్లను ప్రేక్షకులు పలుకుతున్నారు. పాత్రలన్నీ ఆడియన్స్కి రిజిస్టర్ అయ్యాయనేందుకు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి’’ అని మునిరాజు చెప్పారు. ‘‘మా ప్రయత్నం విజయవంతమైందనే నమ్మకం కుదిరింది’’ అన్నారు వేద. ‘‘మాలాంటి కొత్తవాళ్లకు ధైర్యాన్నిచ్చిన సక్సెస్ ఇది’’ అని సాయి తేజ్ తెలిపారు.
'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి కష్టాలు మామూలుగా లేవు. తొలుత మార్చిలో రిలీజ్ అన్నారు. పని ఇంకా పూర్తవ్వకపోయేసరికి ఏప్రిల్ చివరలో కచ్చితంగా విడుదల చేస్తాం అని మాటిచ్చారు. తీరా ఈసారి కూడా మాట తప్పి జూన్లో థియేటర్లలోకి వస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈసారి తేదీ వెల్లడించనప్పటికీ బయట రూమర్స్ మాత్రం వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రకారం.. 'పెద్ది' మూవీని జూన్ 4న థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఈ తేదీ దాదాపుగా ఖరారు అయినప్పటికీ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత దీనిని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ డేట్కి వస్తామని ఇప్పటికే యష్ 'టాక్సిక్' సినిమా ఖర్చీఫ్ వేసుకుంది. మరి 'పెద్ది' కూడా అదే తేదీకి వస్తే రెండు పాన్ ఇండియా చిత్రాల మధ్య పోటీ నెలకొంటుంది. అప్పుడు ఇద్దరిలో పైచేయి ఎవరిది అవుతుందో చూడాలి?స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న 'పెద్ది'లో చరణ్.. క్రికెట్, కుస్తీ క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకుడు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడేసరికి చాలామంది దీనిపై మెల్లగా ఆసక్తి తగ్గుతోంది. ఒకవేళ మూడోసారి కూడా వాయిదా పడితే గనుక మరింత డ్యామేజీ కావడం గ్యారంటీ. మరి టీమ్ ఈసారి ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'దేవర 2' కంటే ముందు కొరటాల నుంచి మరో హిట్ సినిమా సీక్వెల్?)
'దేవర 2' కంటే ముందు మరో హిట్ సినిమా సీక్వెల్?
రచయితగా ఇండస్ట్రీలో చాన్నాళ్లుగా ఉన్నప్పటికీ దర్శకుడిగా మారిన తర్వాత వరస విజయాలు అందుకున్న కొరటాల శివకు 'ఆచార్య'తో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయ్యేసరికి కొన్నాళ్లు కనిపించలేదు. తర్వాత ఎన్టీఆర్తో 'దేవర' తీసి సక్సెస్ అందుకున్నాడు. ఇదంతా జరిగి రెండేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొరటాల ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు.(ఇదీ చదవండి: ట్రైలర్: ఈసారి రక్తపాతాన్ని నమ్ముకున్న రవిబాబు)'దేవర 2' కూడా అదిగో ఉంటుంది ఇదిగో ఉంటుందని అంటున్నారు గానీ సరిగ్గా ఎప్పుడు మొదలవుతుందనేది అర్థం కావట్లేదు. దర్శకుడిగా తర్వాత ఏం సినిమా చేస్తారనే సంగతి పక్కనబెడితే మరో విషయంలో కొరటాల బిజీగా మారిపోతున్నారు. 'దేవర' తీసిన నిర్మాత మిక్కిలినేని సుధాకర్తో కలిసి పలు చిత్రాలని నిర్మించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.రీసెంట్గానే విశ్వక్ సేన్ హీరోగా ఓ కొత్త చిత్రాన్ని 'దేవర' నిర్మాత ప్రారంభించారు. ఇప్పుడు 'మంగళవారం' చిత్రానికి సంబంధించిన సీక్వెల్ కూడా ఈ నిర్మాణ సంస్థలోనే తీయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. దీని పనులు కొరటాలనే దగ్గరుండి చూసుకోబోతున్నారట. దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' చేస్తున్నాడు. ఇది పూర్తవగానే 'మంగళవారం' సీక్వెల్ పనులు షురూ కాబోతున్నాయట.పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్ చేసిన 'మంగళవారం' మూవీ హారర్ థ్రిల్లర్ జానర్లో వచ్చి హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ అంటే ఈసారి కథతో రాబోతున్నారనే ఆసక్తి నెలకొంది.(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)
రుక్మిణి స్మైల్ ప్లీజ్.. పద్ధతిగా నిధి అగర్వాల్
నవ్వుతూ కేక పుట్టిస్తున్న రుక్మిణి వసంత్బాలి ట్రిప్ లో మాళవిక మోహనన్ ఎంజాయ్చీరలో పద్ధతిగా కనిపిస్తున్న నిధి అగర్వాల్రెడ్ డ్రస్లో మెరిసిపోతున్న కల్యాణిబీచ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న జైన్ మేరీ ఖాన్జిమ్లో కష్టపడిపోతున్న బిగ్బాస్ దివి View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Zayn Khan (@zaynmarie) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real)
క్రీడలు
విభిన్న మస్కట్లకు ఆహ్వానం
న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ కోసం ప్రత్యేక మస్కట్ రూపొందించేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) దేశవ్యాప్త పోటీని ప్రకటించింది. 17 ఏళ్ల తర్వాత భారత్లో జరుగనున్న ఈ పోటీలకు ‘బాయ్’ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో అభిమానులు, దేశ ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో విభిన్న ఆలోచనలు, సరికొత్త ఆకృతులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏడాది ఆగస్టు 17–23 మధ్య న్యూఢిల్లీ వేదికగా ఈ చాంపియన్షిప్ జరగనుంది. గత దశాబ్దంలో ఈ చాంపియన్షిప్లో భారత షట్లర్లు 15 పతకాలు సాధించారు. పీవీ సింధు 2019లో చారిత్రాత్మక స్వర్ణం గెలవగా... గతేడాది సాత్విక్–చిరాగ్ జంట కాంస్యం నెగ్గింది. దేశ క్రీడా ప్రగతిని, సాంస్కృతిక వైభవాన్ని, బ్యాడ్మింటన్ విజయ యాత్రను ప్రతిబింబించే విధంగా మస్కట్ రూపకల్పన ఉండాలని ‘బాయ్’ భావిస్తోంది. వచ్చేనెల 10 వరకు జరగనున్న ఈ పోటీలో ఆసక్తిగల వారు ‘బాయ్’ అధికారిక వెబ్సైట్ https://www. badmintonindia.org/ ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చు. విజేతకు రూ. 25 వేల నగదుతో పాటు... ఫైనల్ మ్యాచ్ వీఐపీ పాస్లు ఇవ్వనున్నారు. ‘దేశంలో బ్యాడ్మింటన్కు ఆదరణ బాగా పెరిగింది. ప్రాంతం, సంస్కృతి, నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతీచోట బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ప్రపంచ చాంపియన్షిప్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్ను మన దేశంలో నిర్వహిస్తున్న సందర్భంగా... అభిమానులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే మస్కట్ పోటీ ప్రారంభించాం’ అని ‘బాయ్’ కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు.
2–2తో సమం
బ్యూనస్ ఎయిర్స్: ప్రపంచకప్, ఆసియా క్రీడలకు సన్నాహాల్లో భాగంగా అర్జెంటీనాలో పర్యటించిన భారత మహిళల హాకీ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. నాలుగు మ్యాచ్ల సిరీస్ను 2–2తో సమంగా ముగించింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన భారత జట్టు తదుపరి రెండు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ను ‘డ్రా’ చేసుకుంది. తొలి మ్యాచ్లో భారత జట్టు 2–4తో ఓడిపోయింది. భారత్ తరఫున నవ్నీత్ కౌర్, అన్ను ఒక్కో గోల్ చేశారు. రెండో మ్యాచ్ను టీమిండియా 1–2తో చేజార్చుకుంది. భారత్ తరఫున ఇషిక ఏకైక గోల్ చేసింది. మూడో మ్యాచ్లో భారత బృందం 2–1తో గెలిచింది. భారత జట్టుకు నవ్నీత్ కౌర్, నేహా ఒక్కో గోల్ అందించారు. చివరిదైన నాలుగో మ్యాచ్లో భారత జట్టు ‘షూటౌట్’లో 3–2తో నెగ్గింది.
ఎస్ఆర్హెచ్ను గెలిపించిన బౌలర్లు
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్కేతో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీ త 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 3 వికెట్లతో ఆకట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకోగా, క్లాసెన్ (59) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతావారు పరుగులు చేయడంలో విఫలం కావడంతో ఎస్ఆర్హెచ్ 200 స్కోరు మార్కును దాటలేకపోయింది. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్, జేమి ఓవర్టన్లు చెరో మూడు వికెట్లు తీయగా, ముకేశ్ చౌదరీ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఛేదనను సీఎస్కే ధాటిగానే ఆరంభించింది. ఆరంభంలోనే ఓపెనర్ సంజూ శాంసన్ ఔటైనప్పటికీ వన్డౌన్లో వచ్చిన ఆయుశ్ మాత్రే 13 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 30 పరుగులు సాధించాడు. మిడిలార్డర్లో సర్ఫరాజ్ ఖాన్ (25), మాథ్యూ షార్ట్ (34) పరుగులతో పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఓవర్టన్ (16) కాస్త ప్రతిఘటించినప్పటికీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు కఠినంగా బంతులేయడంతో సీఎస్కే ఓటమి దిశగా పయనించింది.
తలతిక్క నిర్ణయాలతో కొంపముంచిన పటీదార్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఓటమిని కొనితెచ్చుకుంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ తలా తోక లేని నిర్ణయాలతో జట్టు ఓటమికి బాటలు వేశాడు. అదెలాగంటే 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఈ సమయంలో అక్షర్ పటేల్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఆర్సీబీకి భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్ ప్రధాన బౌలర్లు. మ్యాచ్లో గెలిచే దశలో ఉన్న సమయంలో ప్రధాన బౌలర్లను చివరి ఓవర్లలో బౌలింగ్ చేయించాలి. కానీ ఇక్కడే పటిదార్ తెలివితక్కువ పని చేశాడు. ఈ మ్యాచ్లో భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లు ముగిసేరికి 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మరోవైపు హాజిల్వుడ్ వికెట్లేమీ తీయకపోయినప్పటికీ 3 ఓవర్ల వరకు ఎకానమీ రేటు బాగానే ఉంది. అయితే పటీదార్ డెత్ ఓవర్ల వరకు వీరిని అంటిపెట్టుకోకుండా మధ్యలోనే కోటా పూర్తి చేయించాడు. ఇదే ఆర్సీబీని దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. భువనేశ్వర్, హాజిల్వుడ్ కోటా పూర్తవ్వడం, సుయాశ్ శర్మ ప్రభావం చూపించకపోవడంతో పటీదార్ రసిక్ సలామ్ చేతిలో బంతిని పెట్టాడు.గత మ్యాచ్లో మెరిసిన రసిక్ సలామ్ ఈ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి వికెట్ తీయకపోగా 40 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్ వేసిన షెపర్డ్ ఒత్తిడిలో సరిగ్గా బౌలింగ్ చేయలేక 17 పరుగులు సమర్పించుకొని జట్టు ఓటమికి కారణమయ్యాడు. అదే భువనేశ్వర్ లేదా హాజిల్వుడ్లలో ఒకరితో చివరి ఓవర్ వేయించి ఉంటే ఆర్సీబీ గెలిచి ఉండేదేమో. ఏది ఏమైనా పటీదార్ తన తిక్క నిర్ణయంతో చేజేతులా ఆర్సీబీకి ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది.
న్యూస్ పాడ్కాస్ట్
లోక్సభలో గట్టెక్కని మహిళా బిల్లు... అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు... మూడింట రెండొంతుల మెజారిటీ సాధనలో మోదీ సర్కారు విఫలం
డీలిమిటేషన్ దంగల్కు రంగం సిద్ధం... మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్
మత్స్యకారుల కడుపుపై తంతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు కుట్ర... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
చట్టసభల్లో చారిత్రక మలుపు... లోక్సభ స్థానాలు 850కి పెంపు... రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం... డిమాండ్లపై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్... అణ్వాయుధాలు, హార్మూజ్పైనే పీటముడి
ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు షురూ. మరో దఫా చర్చించే అవకాశం
భారీగా పడిపోతున్న బంగారం ధరలు
అమరావతిలో నీకింత.. నాకింత... ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన ‘బీఎస్సార్’కు రాజధానిలో భారీగా పనుల అప్పగింత
ఆంధ్రప్రదేశ్లో ‘సీఎంఆర్ఎఫ్’ నిధులు స్వాహా... టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి సీఎంవో వరకూ వసూళ్ల పర్వం
బిజినెస్
మెటాలో భారీ లేఆఫ్లు.. 16,000 మందిపై వేటు?
సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్ఫార్మ్స్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. రాబోయే నెలల్లో సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి దశ మే 20న ప్రారంభం కానుందని, తొలి విడతలోనే దాదాపు 8,000 మంది ఉగ్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఇది మెటా ప్రపంచ శ్రామిక శక్తిలో సుమారు 10 శాతం వంతు కావడం గమనార్హం.మార్క్ జుకర్బర్గ్ నాయకత్వంలోని మెటా, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్తులో కార్యకలాపాలను మరింత ఆటోమేషన్ చేసే దిశగా కంపెనీ తన శ్రామిక శక్తిని పునర్నిర్మిస్తోంది. కేవలం ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసమే ఏడాదికి సుమారు 135 బిలియన్ డాలర్ల భారీ వ్యయాన్ని కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఈ వ్యూహాత్మక మార్పుల వల్లే ప్రస్తుత ఉద్యోగ కోతలు అనివార్యమవుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే 2022, 2023 మధ్య కాలంలో మెటా దాదాపు 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో అధిక విస్తరణ, తదనంతర ఆర్థిక మందగమనం వల్ల ఆ నిర్ణయాలు తీసుకున్నట్లు అప్పట్లో కంపెనీ వెల్లడించింది. తాజాగా ఇప్పుడు ఏఐ పురోగతి, ఉద్యోగుల ఉత్పాదకతను ప్రాతిపదికగా తీసుకుని తుది జాబితాను ఎగ్జిక్యూటివ్లు సిద్ధం చేస్తున్నారు.నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, స్టాక్ మార్కెట్లో కంపెనీ పనితీరును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ లేఆఫ్లు సాగనున్నాయి. 2026 చివరి నాటికి మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం ఉందని, దీనివల్ల ప్రభావితమయ్యే మొత్తం ఉద్యోగుల సంఖ్య 16,000కు చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామం ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మరోసారి తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ సీఈవోకి భారీ వేతనం.. రూ.కోట్లలో హైక్
కొత్త క్రెడిట్ కార్డు.. ఎల్ఈడీ లైట్లతో..
ముంబై: ప్రముఖ రుణ సేవల ప్లాట్ఫాం ‘చెక్’, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దేశంలోనే తొలి కో–బ్రాండెడ్ ఎల్ఈడీ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. సులభతర చెల్లింపులు, గరిష్ట రివార్డు పాయింట్లే లక్ష్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులకు వినూత్న అనుభవాన్ని అందించేందు కు చెక్ ఏయూ క్రెడిట్ కార్డు పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు ప్రకటించాయి.ఎల్ఈ డీ ఆధారిత చెల్లింపుల ట్యాపింగ్ విధానం ఈ క్రెడిట్ కార్డు ప్రత్యేకత అని చెక్ వ్యవస్థాపకుడు, సీఈవో ఆదిత్య సోని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పీఓఎస్ యంత్రాల ద్వారా జరిపే ప్రతి చెల్లింపు సందర్భంగా క్రెడిట్ కార్డులోని ఎల్ఈడీ లైటు వెలుగుతుందని.. తద్వారా చెల్లింపు ధ్రువీకరణ తక్షణమే కనిపిస్తుందని వివరించారు.ఇందుకు బ్యాటరీ అవసరం లేదని.. పీఓసీలోని ఎన్ఎఫ్సీ ఫీల్డ్ సాయంతో ఎల్ఈడీ కాంతి ప్రసరిస్తుందన్నారు. ఈ సరికొత్త క్రెడిట్ కార్డు కావాలనుకొనే వారు చెక్ యాప్ లో ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
కాగ్నిజెంట్ సీఈవోకి భారీ వేతనం.. రూ.కోట్లలో హైక్
కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్ 2025 సంవత్సరానికి గాను మొత్తం 10.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 88.5 కోట్లు) వేతనాన్ని అందుకున్నారు. ఇది మునుపటి ఏడాదితో పోలిస్తే దాదాపు 29 శాతం పెరుగుదల కావడం గమనార్హం. ఈ వేతనంలో 1.3 మిలియన్ డాలర్లు బేసిక్ పే, 4.3 మిలియన్ డాలర్లు నగదు ప్రోత్సాహకం, 4.9 మిలియన్ డాలర్ల ఆర్ఎస్యూ (ఈక్విటీ పరిహారం) చెల్లింపులు ఉన్నాయి.అయితే, ఆయన టార్గెట్ టోటల్ డైరెక్ట్ కాంపెన్సేషన్ 19 మిలియన్ డాలర్ల కంటే ఇది తక్కువగా ఉంది. ఎందుకంటే పనితీరు ఆధారిత పీఎస్యూ (PSU) గ్రాంట్లు భవిష్యత్తులో లభించనున్నాయి. కాగా, ఇదే ఏడాది భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందిన సీఈఓగా హెచ్సీఎల్ టెక్ సీఈఓసి.విజయకుమార్ (10.8 మిలియన్ డాలర్లు) నిలవగా, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ రూ. 80.6 కోట్లు, విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా రూ. 53.6 కోట్లు ఆర్జించారు.కంపెనీ ఆర్థిక పనితీరు విషయానికొస్తే, కాగ్నిజెంట్ 2025లో అంచనాలను మించి రాణించింది. కృత్రిమ మేధ (AI), నైపుణ్యం కలిగిన మానవ వనరులు, భారీ ఒప్పందాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా కంపెనీ ఆదాయం 7 శాతం పెరిగి 21.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ కూడా కంపెనీ అంచనా వేసిన 15.3-15.7 శాతం కంటే మెరుగ్గా 15.8 శాతంగా నమోదైంది. గతంలో ఎదుగుదల విషయంలో వెనుకబడిన తమ సంస్థ, ఇప్పుడు ప్రత్యర్థి కంపెనీల మధ్య అగ్రస్థానానికి చేరుకుందని రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కంపెనీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ కూడా తన లక్ష్యం కంటే అధికంగా 6.6 మిలియన్ డాలర్ల పరిహారాన్ని అందుకున్నారు.ఇక కంపెనీలోని వేతన వ్యత్యాసాల విషయానికి వస్తే, సీఈఓ వేతనానికి, సాధారణ ఉద్యోగి వేతనానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్ ఉద్యోగి సగటు వేతనం 45,138 డాలర్లుగా ఉండగా, సీఈఓ వేతన నిష్పత్తి 477:1గా నమోదైంది. అమెరికాలో సగటు ఉద్యోగి వేతనం 1,40,739 డాలర్లుగా ఉండటంతో అక్కడ నిష్పత్తి 153:1గా ఉంది. అయితే, జీవన వ్యయ సర్దుబాటు చేయకుండా లెక్కిస్తే, భారతీయ ఉద్యోగి సగటు వేతనం కేవలం 14,136 డాలర్లు (సుమారు రూ. 11.8 లక్షలు) మాత్రమే. ఈ క్రమంలో సీఈఓ, భారతీయ ఉద్యోగి వేతన నిష్పత్తి అత్యధికంగా 1,523:1గా ఉండటం గమనార్హం.ప్రస్తుతం కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,51,600 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో మెజారిటీ వాటా భారత్దే కావడం విశేషం. మన దేశంలో 2,56,900 మంది ఉద్యోగులు ఉండగా, ఉత్తర అమెరికాలో 41,600 మంది, యూరప్లో 14,600 మంది, బ్రిటన్లో 7,800 మంది పనిచేస్తున్నారు. కంపెనీ తన మార్జిన్లను మెరుగుపరుచుకుంటూ ఆదాయ వృద్ధి అంచనాలను 4 శాతం నుండి 6.5 శాతానికి పెంచడం, భవిష్యత్తులో ఐటీ మార్కెట్లో సంస్థ మరింత పట్టు సాధిస్తుందనే సంకేతాలను ఇస్తోంది.ఇదీ చదవండి: డ్యాన్స్ చేస్తున్న సీఈవో.. షాకిచ్చిన టెకీ!
హైదరాబాద్లో రియల్ బూమ్.. ఇప్పుడు ఇక్కడే..
15 కి.మీ. దూరంలో సెక్రటేరియట్, లక్డీకాపూల్ వంటి హాట్ స్పాట్స్..20 కి.మీ. దూరంలో ఐటీ హబ్, శంషాబాద్ విమానాశ్రయం..చుట్టూ ఆర్మీ కాపలా.. హిమాయత్నగర్, గండిపేట జలాశయాలతో కళకళ..కూతవేటు దూరంలో అంతర్జాతీయ స్థాయి విద్యా, వైద్య, వినోద కేంద్రాలు.. ..ఇలాంటి వసతులు ఉన్న ఏ ప్రాంతంలోనైనా స్థిరాస్తి ధరలు ఆకాశంలో ఉంటాయి. కానీ, అందుబాటు ధరల్లోనే సామాన్యుల సొంతింటి కలను నెరవేరుస్తోంది బుద్వేల్. రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రేషన్ పరిధిలో అప్పా జంక్షన్, బండ్లగూడ, హైదర్షాకోట్, కిస్మత్పూర్, బుద్వేల్, అత్తాపూర్, పీరంచెరువు, మంచిరేవుల ప్రాంతాలు ప్రధానమైనవి. -సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో రియల్ బూమ్ బంజారాహిల్స్తో మొదలై.. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్కు, అక్కడి నుంచి గచ్చిబౌలి, కొండాపూర్కు విస్తరించింది. ప్రస్తుతం ఈ బూమ్ బుద్వేల్కు విస్తరించిందని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మెట్రో రైలుతో సిటీలో ప్రయాణం సులువైంది. ఔటర్ రింగ్ రోడ్డుతో ఆదిభట్ల, మహేశ్వరంలోని ఐటీ, హార్డ్వేర్ పార్క్లతో పాటు ఏరో స్పేస్ కంపెనీలకు సులువుగా చేరుకునే అవకాశం కలిగింది. అలాగే ఓఆర్ఆర్ మీదుగా 40 కి.మీ. దూరంలో షాద్నగర్, కొత్తూరులోని లాజిస్టిక్ పార్కులకూ చేరుకోవచ్చు. అందుకే ఇప్పటి వరకు ధనవంతులు తమ మొదటి ఆస్తిని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఎంచుకుంటే.. రెండో ఆస్తిని రాజేంద్రనగర్లో ఎంచుకుంటున్నారు. ఇది చాలు రాజేంద్రనగర్ ఉన్నత శ్రేణి వర్గాలు ఉండే ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని చెప్పడానికి.. ఐటీ, ఎన్నారైల దృష్టి ఇక్కడే.. రూ.35వేల నుంచి రూ.40 వేల మధ్య వేతనాలు ఉండే ప్రతి ఉద్యోకి ఇది అనుకూలమైన ప్రాంతం. ఐటీ ఉద్యోగులందరికీ భారీ వేతనాలు ఉండవు. దీంతో గచి్చబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో ఉండలేకపోతున్నారు. అందుబాటు ధరల్లో.. తక్కువ దూరంలో ఉండే ప్రాంతం కావడంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. రేతిబౌలి ఫ్లైఓవర్ మీదుగా రాయదుర్గం జంక్షన్ నుంచి ఐటీ హబ్కు త్వరగా చేరుకోవచ్చు.అందుకే గతంలో మాదిరిగా ట్రాఫిక్లో చిక్కుకుంటూ జూబ్లీహిల్స్ మీదుగా సైబర్ టవర్స్కు వెళ్లే బదులు లంగర్హౌజ్ మీదుగా రాయదుర్గం జంక్షన్కు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఐటీ హబ్కు కూతవేటు దూరమే. 20 నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకునే వీలుండటంతో ఎన్నారైలు, విదేశీయులు ఈ ప్రాంతంపై మక్కువ చూపుతున్నారు.వంద ఫీట్ల రోడ్డు.. బుద్వేల్ నుంచి సన్సిటీ మీదుగా బండ్లగూడ జాగీర్ వరకూ వంద అడుగుల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతం ఒక ప్రధాన వృద్ధి కారిడార్గా ఉండటంతో 3–4 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని అంచనా. ఈ ప్రాంతం మధ్యస్థాయి, ఉన్నత స్థాయి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఎన్ఐఆర్డీ, ఎన్జీరంగా వర్సిటీలతో పాటు అప్పా జంక్షన్లో సుమారు 70కి పైగా విద్యా సంస్థలు, ప్రముఖ ఆస్పత్రులు ఉన్నాయి. అప్పా జంక్షన్ చుట్టూ మిలటరీ ఏరియా ఉండటంతో శాంతి భద్రతల సమస్య లేదు. ఈ ప్రాంతం హిమాయత్సాగర్, గండిపేట జలాశయాలు అతి దగ్గర్లో ఉండటంతో జల వనరులకూ కొదవేలేదు.రిజిస్ట్రేషన్లు రయ్.. రయ్.. గతేడాది రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 13,423 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 4,140 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాయి. రూ.కోట్లలో ఆదాయం సమకూరింది. ప్రతి సంవత్సరం రిజి్రస్టేషన్లు 10–15 శాతం వృద్ధి చెందుతున్నాయి. ప్రధానంగా బుద్వేల్, కిస్మత్పూర్, మంచిరేవుల, హైదర్షాకోట్ ప్రాంతాల్లో రిజి్రస్టేషన్లు జోరుగా సాగుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు విదేశీ సంస్థల ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాపర్టీల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ అపార్ట్ మెంట్లలో ధర చ.అ.కు రూ.10 వేల వరకు, విల్లాలు అయితే రూ.12 వేల వరకు చెబుతున్నారు.బుద్వేల్ ఎకో ఫ్రెండ్లీ జోన్బుద్వేల్ పర్యావరణ అనుకూల ప్రాంతం. జంట జలాశయాలు, గ్రీనరీ, ప్రతిపాదిత కొత్వాల్ ఎకో పార్క్లకు సమీపంలో ఉండటంతో ఎకో ఫ్రెండ్లీ జోన్ అయిన ఈ ప్రాంతంలో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), ప్రవాసులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, వైద్యులు ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు.– బూరుగు రాంబాబు, డైరెక్టర్, ప్రణవ గ్రూప్ఇది చదివారా? రూ. 640 కోట్ల ఇల్లు.. నాన్న ఇచ్చిన గిఫ్ట్!
ఫ్యామిలీ
పెట్రోలుకు నీటి వాకిలి హార్మోజ్ జలసంధి
ఇప్పుడు రోజూ హార్మోజ్ జలసంధి వార్తల్లో ఉంది. యుద్ధం జరుగుతుంటే దానిని ఒక దేశం మూసేస్తానంటే మరో దేశం తెరుస్తాను అంటోంది. దీని వివరాలు చూద్దాం. అసలు జలసంధి అంటే ఏంటి? రెండు పెద్ద సముద్రాలను కలిపే సన్నటి నీటి దారిని ‘జలసంధి’ అంటారు. ఇది ఒక నీటి వంతెన లాంటిది. మన ఇంటి సందులో నుంచి మెయిన్ రోడ్కి వెళ్లినట్టు. హోర్ముజ్ జలసంధి కూడా అలాంటిదే. ఇది ఇరాన్ దేశం, ఒమన్ దేశం మధ్యలో ఉంది. పర్షియన్ గల్ఫ్ అనే సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలుపుతుంది. మ్యాప్లో చూస్తే V షేప్లో కనిపిస్తుంది. దీని పేరు ‘హోర్ముజ్’ అనే దీవి పేరు మీదుగా వచ్చింది. ఆ దీవి ఒకప్పుడు వ్యాపారానికి చాలా ఫేమస్.ఏమిటి ఈ జలసంధి ప్రత్యేకత?ప్రపంచంలో రోజూ వాడే పెట్రోల్, డీజిల్లో దాదాపు 20%– అంటే రోడ్డు మీద తిరిగే 5 పెట్రోలు ట్యాంక్ లారీల్లో 1 లారీలోని సరుకు– ఇదే దారిలో షిప్పుల్లో వెళ్తుంది. అందుకే దీన్ని ‘ఆయిల్ హైవే’ అంటారు. ఈ జలసంధి మొత్తం వెడల్పు 33 కిలోమీటర్లు. కానీ పెద్ద పెద్ద షిప్పులు వెళ్లడానికి కేవలం 3 కి.మీ. దారి మాత్రమే వాడతారు. రెండు వైపులా వెళ్లే, వచ్చే షిప్పులకు వేరు వేరు లైన్లు ఉంటాయి – రోడ్ మీద లాగా. రోజుకి దాదాపు 20–30 పెద్ద ఆయిల్ ట్యాంకర్ షిప్పులు ఇక్కడి నుంచి వెళ్తాయి. ఒక్కో షిప్ 2 కోట్ల లీటర్ల ఆయిల్ తీసుకెళ్లగలదు!ఇక్కడ ఎందుకు గొడవలు?ఈ దారి చాలా చిన్నది కాబట్టి, ఏదైనా దేశం దీన్ని మూసేస్తే ప్రపంచానికి పెట్రోల్ దొరకడం కష్టం. పెట్రోల్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అందుకే అన్ని దేశాలు దీన్ని జాగ్రత్తగా చూస్తాయి. మనం వాడే పెట్రోల్, డీజిల్లో చాలా భాగం గల్ఫ్ దేశాల నుంచి ఇదే దారిలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా జరిగితే మన బైక్, బస్ రేట్లు కూడా పెరుగుతాయి. హోర్ముజ్ జలసంధి అంటే ప్రపంచానికి పెట్రోల్ పంచే ‘సన్నటి డోర్’. ఆ డోర్ సేఫ్గా ఉంటేనే మన వాహనాలు స్మూత్గా నడుస్తాయి.
చిట్టి చేతుల్లో పచ్చని ప్రపంచం
చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి, నీరు లేకపోతే జీవం ఉండదు, పక్షులు, జంతువులు ప్రకృతి సమతుల్యతను కాపాడుతాయి... ఇలా ఒక్కో విషయాన్ని పిల్లలకు వివరించి చెప్పడమే కాదు, ఆచరణలో పెట్టేలానూ చేయాలి. అప్పుడే భవిష్యత్తులో మార్పులు వస్తాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను సరైనచోట వేయడం, నీటిని పొదుపు చేయడం, వస్తువులను రీసైక్లింగ్ విధానంలో వాడటం.. ఇవన్నీ పెద్దలు ఆచరిస్తూ పిల్లలకు నేర్పించాలంటున్నారు నిపుణులు.గాలి, నీరు, నేల, చెట్లు, జంతుజాలం.. ఇవన్నీ మన జీవనానికి ఆధారం. పిల్లలకు వీటి ప్రాముఖ్యతను తెలియజేయాలి. పర్యావరణానికి సంబంధించి కథలు, పెయింటింగ్, ఆటల ద్వారా అవగాహన తీసుకురావచ్చు. ప్రయోగాత్మకంగా నేర్పాలంటే పిల్లలతో మొక్కలు నాటించడం, వాటికి నీరు పోయించడం, పర్యావరణ పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, సేంద్రీయ ఎరువుల తయారీ.. లాంటి పనులలో భాగస్వాములను చేయడం వల్ల వారికి ప్రకృతిపై ప్రేమను కలుగుతుంది.చిన్న ఆలోచనతో పెద్ద మార్పు...→ ప్రకృతి సహజవనరులు–ప్రతికూల అంశాల గురించి ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వవచ్చు. → స్థానిక పార్కుల వద్దకు తీసుకెళ్లి, చుట్టుపక్కల ఉన్న చెత్తను సేకరించడం, రీసైక్లింగ్ పట్ల అవగాహన కలిగించడం, కాలుష్య నివారణలో భాగస్వాములను చేయాలి. → గ్లోబల్ స్థాయిలో పర్యావరణంలో పిల్లలను ఇన్వాల్వ్ చేస్తున్న సంస్థలు, అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తెలియజేయాలి. → వాహనాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగ, ఎండ వేడిమి పెరగడానికి కారణాల గురించి తెలియజేయాలి.కీడు చేసే రసాయనాలు→ ఇంటి శుభ్రతలో వాడే క్లీనర్లలో ఉండే విషపూరిత రసాయనాలు, వీటి వాడకం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవడం, మూగజీవాల ఆరోగ్యం దెబ్బతినడం వంటి ప్రమాదాల గురించి అవగాహన కలిగించాలి. ఇంటి శుభ్రతలో సేంద్రీయ ఉత్పత్తుల తయారీని పరిచయం చేసి, పర్యావరణ హానిని తగ్గించవచ్చు. → పర్యావరణ అనుకూల వస్తువుల వాడకం వల్ల జంతువులకు, మానవ మనుగడకు ఎంత మేలు చేస్తుందో తెలియజేయవచ్చు. → ఔషధ మొక్కల ఆధారిత పదార్థాల నుండి తయారుచేసిన ఉత్పత్తులు, నీటి వ్యవస్థల గురించి అవగాహన కలిగించాలి. ఇంటా బయట మనవంతుగా కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ స్వచ్ఛత లో భాగస్వాములు అవ్వాలని చెప్పవచ్చు. → ఆన్లైన్ – ఆఫ్లైన్ వేదికలుగా జరిగే పర్యావరణ సంబంధిత వర్క్షాప్స్, కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్పిల్లలకు బొమ్మలతో ఆడుకోవడం అంటే ఇష్టం. అందుకోసం వారికి ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్ తయారీని పరిచయం చేయడం, లేదా కొనుగోలు చేసి వాటి, ఉపయోగాలను వివరించాలి. కొబ్బరిచిప్పలు, వెదురు కొమ్మలు, మట్టి కుండలలో చిన్న చిన్న మొక్కల పెంపకం తెలిసిందే. టెడ్డీబేర్ క్లాత్ను ఉపయోగించి, బొమ్మ ఆకారం వచ్చేలా కుట్టి, అందులో కోకోపిట్ నింపి, తల భాగంలో జుట్టు ఎలా అయితే ఉంటుందో, అలా గోధుమ గడ్డి పెరిగేలా ఏర్పాటు చేయవచ్చు. కళ్లూ, ముక్కు.. వంటివి పెట్టి బొమ్మ చేయవచ్చు. బొమ్మ తల భాగంలో పైన కొన్ని నీళ్లు చల్లుతూ ఉంటే వారం రోజుల్లో మొలకలు ఏపుగా పెరుగుతాయి. వరి, ఇతర చిరుధాన్యాలతోనూ ఇలాంటి బొమ్మలను తయారు చేయించవచ్చు. ఓల్డ్ క్లాత్స్తో తయారు చేసిన ప్లాంట్ టాయ్స్ని పిల్లల చేత చేయించడానికి ఈ సీజన్ చాలా అనుకూలమైనది. పెద్దలు పర్యావరణాన్ని కాపాడేందుకు చేసే ప్రతి పని, పిల్లల్లో ఆలోచనను కలిగిస్తుంది. ప్రకృతి పట్ల బాధ్యతగా నడుచుకునేందుకు తగిన అవగాహన ఏర్పడుతుంది. ప్రకృతికి దగ్గరగా...మన భూమిని కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు అనే ఆలోచనతో పిల్లల చేత పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ప్రకృతికి నష్టం కలగకుండా ఎలా జీవించాలి, కమ్యూనిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చెరువుల చుట్టూ పేరుకుపోయిన చెత్తను శుభ్రపరచడం, ఎకో–ఫ్రెండ్లీ ఉత్పత్తుల తయారీ, వాడకం, ప్లాంటేషన్ డ్రైవ్ చేస్తుంటాం. ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రతీ పనిలోనూ పిల్లల్లో మనోవికాసం వృద్ధి చెందుతుంది. – మేఘనా ముసునూరి, పర్యావరణ వేత్త, ఫౌంటెన్హెడ్ గ్లోబల్ స్కూల్ ఫౌండర్ – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి
మౌన్ జారో పెళ్లికూతురు
పెళ్లి పీటలెక్కే ముందు నాజూగ్గా కనిపించాలన్న ఆకాంక్ష కొత్తది కాదు. కానీ ఇప్పుడు ఆ ఆకాంక్ష ఢిల్లీలో కొత్త రూపం తీసుకుంది. దాని పేరే ‘మౌన్ జారో పెళ్లికూతురు’. ‘మౌన్ జారో’ అనే టైప్ 2 డయాబెటిస్ ఇంజెక్షన్లను ఇస్తూ ఢిల్లీలోని వెల్నెస్ క్లినిక్లు, బరువు తగ్గించే కేంద్రాలు పెళ్లికూతుళ్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.క్షేమకరం కాని ఈ ట్రెండ్ పై కథనం.అదేమిటో... పెళ్లంటే అమ్మాయే అందంగా కనిపించాలని సామాజిక చట్టం. అబ్బాయి ఎలా ఉన్నా పర్వాలేదు. అమ్మాయి రూపానికి సంబంధించి ఎన్నో పట్టింపులు, ఆరాలు, నఖశిఖ పర్యంత పరీక్షలు. కాబట్టే పెళ్లంటే ఈ కాలంలో కూడా అమ్మాయిలు టెన్స్ అయ్యే పరిస్థితి ఉంది. వీరి కోసమని ‘మేకోవర్’లూ, ‘బ్రైడల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్యాకేజీ’లు మార్కెట్లో బయలుదేరాయి. ఈ పరిస్థితి ఢిల్లీలో కొత్త రూపం తీసుకుంది. దాని పేరే ‘మౌన్ జారో పెళ్లికూతురు’.‘మౌన్ జారో’ అనేది టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు వాడే ఔషధం. దీనిలోని ‘టిర్జెపటైడ్’ అనే పదార్థం ఆకలిని తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది. ఈ ఔషధం పేరుతోనే ఇప్పుడు ఢిల్లీలోని వెల్నెస్ క్లినిక్లు, బరువు తగ్గించే కేంద్రాలు పెళ్లికూతుళ్ల కోసం ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.ఎందుకు ఈ ట్రెండ్?పెళ్లికి మూడు నుంచి ఆరునెలల ముందు 10నుంచి 15 కిలోలు తగ్గాలని చాలామంది యువతులు కోరుకుంటున్నారు. జిమ్, డైట్తో సాధ్యం కాని ఫలితాలు త్వరగా కావాలనుకునే వారు ఈ ప్యాకేజీల వైపు మొగ్గుతున్నారు. పెళ్లికి అవసరమైన లెహంగా ఫిట్టింగ్, ఫొటో షూట్, సోషల్ మీడియా ఒత్తిడి కూడా దీనికి కారణమవుతున్నాయి.ప్యాకేజీల్లో ఏముంది?ఢిల్లీలోని క్లినిక్లు ‘బ్రైడల్ ట్రాన్స్ఫర్మేషన్’, ‘వెడ్డింగ్ రెడీ’ పేర్లతో ప్యాకేజీలు ఇస్తున్నాయి. వీటిలో వైద్యుల పర్యవేక్షణలో మౌన్ జారో ఇంజెక్షన్లు, డైట్ కౌన్సెలింగ్, బాడీ కాంటూరింగ్ (నిర్దిష్ట శరీర భాగం సన్నబరచడం) సెషన్లు కలిపి అందిస్తున్నారు. వీటి ధర 50 వేల నుంచి 2 లక్షల వరకు ఉంటోంది. పెళ్లి డేట్ చెప్పగానే ఆ డేట్కు టార్గెట్ బరువు సెట్ చేసి ప్లాన్ ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.వైద్యుల హెచ్చరికఅనన్య లాంటి కేసులపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మౌన్ జారో అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడని ఔషధం. వికారం, వాంతులు, ప్యాంక్రియాటైటిస్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కేవలం కాస్మెటిక్ కారణాలతో, వైద్య అవసరం లేకుండా దీన్ని వాడడం ప్రమాదకరమని ఎండోక్రై నాలజిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గిన తర్వాత జీవనశైలి మార్చుకోకపోతే తిరిగి బరువు పెరిగే అవకాశం 80 శాతం వరకు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.నా రూపమే నా సౌందర్యంఇలాంటి ట్రెండ్ సమాజంపై ఒత్తిడిని పెంచుతోందనీ సాదాసీదా అమ్మాయిల ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తోందని సామాజికవేత్తలు అంటున్నారు. పెళ్లంటే సన్నగా ఉండాలనే భావన బలపడేలా చేస్తున్న సౌందర్య సాధనాల సంస్థల ప్రచారాన్ని నిరోధించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ‘మౌన్ జారో పెళ్లికూతురు’ ట్రెండ్ యథాతథ రూపంలోని ఒరిజినాలిటీని సవాలు చేస్తోంది. ‘నా రూపమే నా సౌందర్యం’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెళ్లగిస్తోంది. ‘ఆరోగ్యంగా ఉండటమూ అందంగా ఉండటమే’ అనే సంగతిని ఆడపిల్లలు మర్చిపోతున్నారు. పెళ్లిరోజున అందంగా కనిపించాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆ ప్రయత్నంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరైనదేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరిని మర్చిపోవద్దు. అలాగే నకిలీ వెల్నెస్ క్లినిక్ల బారిన పడొద్దు. పెళ్లిలో బాగా కనిపించాలని..ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల అనన్య శర్మ (పేరు మార్చబడింది) అనుభవం ఈ ట్రెండ్కు అద్దం పడుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన అనన్యకు 2026 ఆగస్టులో వివాహం నిశ్చయమైంది. ఆమె బరువు 78 కిలోలు. డిజైనర్ లెహంగా సెట్ అవ్వాలంటే కనీసం 65 కిలోలకు రావాలని బోటిక్ వారు సూచించారు. జిమ్లో చేరినా ఉద్యోగ ఒత్తిడి వల్ల క్రమం తప్పకుండా వెళ్లలేకపోయింది. దీంతో స్నేహితురాలి సలహాతో సౌత్ ఢిల్లీలోని ఒక ప్రముఖ స్లిమ్మింగ్ క్లినిక్లో ‘బ్రైడల్ మౌన్ జారో ప్యాకేజీ’ తీసుకుంది. నాలుగు నెలల ప్యాకేజీ ఖరీదు 1.4 లక్షలు. వారానికి ఒకసారి టిర్జెపటైడ్ ఇంజెక్షన్, నెలకు రెండుసార్లు డైటీషియన్ కన్సల్టేషన్, 8 సెషన్ల బాడీ కాంటూరింగ్ ఇందులో భాగం. ‘మొదటి నెలలోనే ఆకలి బాగా తగ్గింది. 4 కిలోలు తగ్గాను’ అని అనన్య చెప్పింది. నాలుగు నెలలు పూర్తయ్యేసరికి ఆమె 12 కిలోలు తగ్గి 66కిలోలకు చేరింది. అయితే ఈ క్రమంలో తరచూ వికారం, నీరసం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపింది. ‘పెళ్లి అయ్యాక మందు ఆపేస్తే మళ్లీ బరువు పెరుగుతానేమో అనే భయం ఉంది. కానీ పెళ్లి రోజు ఫోటోల్లో బాగా కనిపించడం నాకు ముఖ్యం’ అని ఆమె అంది.
ఆ నవవధువు ధైర్యానికి..అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయ్..!
ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ శారీరక లోపం పైకే కనిపిస్తుంది కాబట్టి ఈజీగా చులకనగా చూసేస్తాం. ఎక్కడో కొందరే మెచ్యూరిటీగా వ్యవహరిస్తారు. కానీ అలాంటి వాళ్లు పక్కనే ఉంటే జీవితంలో ప్రతిదాన్ని ఇట్టే జయించగలరు. ముఖ్యంగా తమలోని లోపాన్ని ఆనందంగా స్వీకరించి ధైర్యంగా నిలబడగలుగుతారు, స్ఫూర్తిగా నిలుస్తారు. అందుకు నిదర్శనం ఈ నవవధువే. ఆమె కథ వింటే అందం గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఆ అమ్మాయే మహిమా ఘాయ్. ముంబైకి చెందిన మహిమ తన పెళ్లి రోజున జుట్టు లేకుండా వేడుకలోకి అడుగుపెట్టి..అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. పైగా అక్కడ ఎవ్వరు నవవధువు బట్టతలను చూడలేదు. ఆమె స్థైర్యం, ఆత్మవిశ్వాసం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. సహజత్వం గొప్పతనాన్ని చాటుతున్నట్లుగా అనిపించింది. అందం ప్రమాణాలకు అతీతమైనదని నిరూపించిన గొప్ప దృశ్యం అది. హుందాతనం, ఆత్మవిశ్వాసానికి మించిన సౌందర్యం ఇంకొకటి లేదని ఆ ఘటన నిరూపించింది. పెళ్లికూతురు అంటే ఇలానే ఉండాలనే అభిప్రాయాల్ని బేఖాతురు చేస్తూ వచ్చిన విధం అందర్నీ కట్టిపడేసింది. మహిమ అంత ధైర్యంగా అంత ముఖ్యమైన ఘట్టంలో అలా ఎలా కనిపించిందంటే..మహిమ కథేంటో తెలుసుకోవాల్సిందే..!.అంగీకరించక తప్పని పరిస్థితి..మహిమ చిన్నతనంలో అలోపేసియా బారిన పడింది. దాంతో జుట్టు ఊడిపోతుండేది. ఆమె పెరుగుతున్న కొద్దీ తలపై జుట్టపెరగక మచ్చలు ఎక్కువవుతుండేవి. మళ్లీ జుట్టురావాలనే ఉద్దేశ్యంతో ఎన్నో ఇంటి చికిత్సలు, వైద్య చికిత్సలు ఎన్నో చేయించుకుంది. ఏవి ఫలితం ఇవ్వలేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది ఆమె కుటుంబం. చివరికి వైద్యులు ఆమె వ్యాధిని నిర్థారించారు. ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పారు. నవ్వు మాయమైన క్షణం..పెద్దయ్యే కొద్ది ఆత్మనూన్యత భావంతో తీవ్ర క్షోభని అనుభవించింది. తనలో తాను కుంగిపోవడం, తరచుగా ఎవరు పట్టించుకోవడం లేదనే భావన వంటి అభద్రతాభావం ఎక్కువైపు తుండేవి. తన పరిస్థితిని దాచేందుకు, అందరి దృష్టిని మరల్చడానికి విగ్గులు ధరిస్తుండేది. ఇది కూడా ఆమెకు ఉపశమనం ఇవ్వకపోగా ఆభద్రతా భావాన్ని మరింత ఎక్కువయ్యేలా చేసేవి. ఒక రోజు కాలేజ్లో చేసిన చిలిపి పని అందరి ముందు ఆమె నిజరూపం భయటపడంతో అలా గంటల తరబడి ఏడుస్తూ ఉండిపోయింది. ఆ రోజు నుంచి ఆమె ముఖంలో నవ్వు మాయమైపోయింది. సరిగ్గా ఆ కష్టసమయంలో తాను చేసే కళాకృతులే మహిమకు కొండంత బలాన్ని ఇచ్చేవి. మహిమ స్వతహగా విజువల్ ఆర్టిస్ట్. బొమ్మలేయడంలో దిట్ట.అతడి రాకతో వచ్చిన మార్పు..ఆ క్రమంలో ఆన్లైన్ ఆర్డర్లపై ప్రాజెక్టులు తీసుకోవడంతో..శశాంక్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వృత్తిపరమైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతని ఆలోచనాత్మక ప్రవర్తన, నిజాయితీ ఆమెను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. అతడితో ఉంటే మహిమకు అభ్రతభావం మొత్తం తొలిగిపోయేది. అయితే తన గురించి శశాంక్కి పూర్తిగా తెలియాలని విగ్గు తీసి చూపింది. తన నిజ స్వరూపాన్ని చూసినప్పుడు కూడా శశాంక్ ఆమెతో మెలిగిన తీరు మహిమను మరింతగా ఆకట్టుకున్నాయి. అది శారీరక లోపం కంటే మంచి మనసుని చూసే అతడి విధానం మహిమలో ఉన్న అనుమానాలన్నింటిని పటాపంచలు చేసింది. ఆ తర్వాత ఇద్దరు 2025లో పెళ్లి చేసుకోవాలని నిర్ణియించుకున్నారు. అయితే శశాంక్ కుటుంబ తనను ఎలా చూస్తుందో అని ఆందోళన చెందింది. వాళ్లు కూడా ఆమెను మనస్ఫూర్తిగా తమ కుటుంబంలోకి స్వాగతించారు. ఆ నేపథ్యంలోనే మహిమ ఇక ఎప్పటికి ముసుగు వెనుక దాగుడు మూతలు వద్దు అనుకుని ఇలా జుట్టు లేకుండానే నవ వధువుగా పెళ్లిపందిరిలోకి వచ్చింది. ఆ పెళ్లికి వచ్చిన వాళ్లు సైతం ఆమె బట్టతలను చూడలేదు, పెళ్లి కూతురు ఆత్మవిశ్వాసం, స్థైర్యం అందరి మనసులను కదిలించాయి. తన వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా నిలిచిన ఆ వధువుని అంతా గౌరవప్రదంగా చూశారు. మన లోపాన్ని(స్థితిని) మనం అంగీకరించడంతోనే గుర్తింపు మొదలవ్వుతుందని ఈ వధువు మహిమ నిరూపించింది. తనను తాను యథావిధిగా స్వీకరించడమే అందం అని అంటోంది మహిమ..! View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: సైకిల్పై సవారీ.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ!)
అంతర్జాతీయం
బుధవారం మళ్లీ ప్రళయమే: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ మాటల యుద్ధం నడుస్తోంది. హార్మూజ్ విషయం, ఇరాన్తో చర్చలు అంశంలో అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు.కాగా, ఇరాన్ ఒప్పందం కుదరకపోతే కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించకపోవచ్చని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణ గడువులోగా ఒప్పందం కుదురుతుందా లేదా అనే దానిపై నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మళ్లీ బాంబుల మోత ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి మూసి ఉంచిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరిచింది. కాల్పుల విరమణ ముగిసేదాకా వాణిజ్య నౌకలు అందులో రాకపోకలు సాగించవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఈ పరిణామాన్ని స్వాగతించిన ట్రంప్ ఇరాన్ ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధనాన్ని మాత్రం తాము ఉపసంహరించుకోబోమని స్పష్టం చేశారు. అలా అయితే హార్మూజ్ను మళ్లీ మూసి వేస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.#WATCH | On being asked if he will extend the ceasefire, US President Donald Trump says, "Maybe I won't extend it. But the blockade is going to remain. So you have a blockade, and unfortunately, we'll have to start dropping bombs again..."(Source: The White House) pic.twitter.com/6HURzpzE0s— ANI (@ANI) April 18, 2026మళ్లీ మూసివేస్తాం: ఇరాన్ఇరాన్ పోర్టుల దిగ్బంధమనం కొనసాగుతుందని ట్రంప్ చేసిన ప్రకటనపై ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ మండిపడ్డారు. తమ నౌకలను అడ్డుకుంటే హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. హార్మూజ్ జలసంధి, శాంతి ఒప్పందం తదితర విషయాలపై ట్రంప్ ఒక గంటలోనే 7 పోస్టులు చేశారని, అవన్నీ అబద్ధాలేనని ఘాలిబఫ్ తెలిపారు. అబద్ధాలతో యుద్ధం గెలవలేరని.. చర్చల్లో కూడా పురోగతి సాధించలేరని విమర్శించారు. జలసంధికి సంబంధించి ప్రతి నిర్ణయం తామే తీసుకుంటామని రాసుకొచ్చారు. తాము ఇప్పటికే ప్రకటించిన మార్గంలోనే నౌకల రాకపోకలు సాగుతాయని పేర్కొన్నారు.ఐఆర్జీసీ హెచ్చరిక.. హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఇరాన్ విదేశాంగమంత్రి ప్రకటించగా, IRGC నేవీ విభాగం మాత్రం పలు నిబంధనలు విధించింది. హార్మూజ్ గుండా వెళ్లే అన్ని నౌకలు తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. తాము నిర్దేశించిన మార్గంలోనే పౌర, వాణిజ్య నౌకలు రాకపోకలు సాగించాలని తెలిపింది. సైనిక నౌకలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని స్పష్టంచేసింది. ఈ నిబంధనలన్నీ.. కాల్పుల విరమణ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది.
ఇక చాలూ.. ఇజ్రాయెల్పై ట్రంప్ అసహనం
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, శాశ్వత శాంతి స్థాపనకు ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ.. మిత్రదేశం ఇజ్రాయెల్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా లెబనాన్పై దాడులు కొనసాగించడం సరికాదన్నారు. ఈ క్రమంలో దాడులు ఇకనైనా ఆపాలంటూ ట్రంప్ సూచించారు.‘‘లెబనాన్పై ఇజ్రాయెల్ ఇక దాడులు చేయడానికి వీల్లేదు. వాళ్లు దాడులు చేయకుండా అమెరికా నిషేధం విధించింది. ఇక చాలు..’’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతోనే లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం తర్వాతే హర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిచేందుకు అంగీకరించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ రెండు వారాల యుద్ధ విరమణ.. శాంతి చర్చలకు ఇరాన్-అమెరికాలు ముందుకు వచ్చాయి. అయితే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో ఇరాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ దాడులు ఆగకుంటే శాంతి చర్చలు ముందుకు సాగవని చెబుతూ వచ్చింది. ఇజ్రాయెల్ ఏమో.. లెబనాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న హెజ్బొల్లా గ్రూపులతో తమ దేశానికి ముప్పు ఉందని చెబుతూ దాడులు కొనసాగించింది. దీంతో లెబన్నాన్-ఇజ్రాయెల్ మధ్య చర్చల కోసం అమెరికా రంగంలోకి దిగాల్సి వచ్చింది.ట్రంప్ తాజా హెచ్చరికలపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కానీ, ఈ వార్నింగ్ కంటే ముందే ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. దక్షిణ లెబనాన్లో తమ సైన్యం మోహరింపు కొనసాగుతుందని ప్రకటించారు. ‘‘రాకెట్ దాడులు, డ్రోన్ల ముప్పు ఇంకా ఇజ్రాయెల్ తొలగిపోలేదు. అందుకే మేం చేయాలనుకున్నది చేస్తాం. అదేంటో ఇప్పుడు నేను మీ ముందు చెప్పలేను’’ అని మీడియా ముందు నెతన్యాహు ప్రకటించారు.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగాయి. 38 రోజుల తర్వాత ఇరు దేశాలకు శాంతి చర్చలకు అంగీకరించాయి. అయితే లెబనాన్ కూడా ఈ కాల్పుల విరమణలో భాగమని ఇరాన్ చెబుతుండగా.. అదసలు వేరే అంశమని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఎల్లుండి ఇస్లామాబాద్ వేదికగా రెండో దఫా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 22వ తేదీతో ఇరాన్ అమెరికా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది.
గంటలో ట్రంప్ 7 అబద్ధాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ది అసలు నోరేనా? అని అంటోంది ఇరాన్ మీడియా. పశ్చిమాసియా యుద్ధంపై వైట్హౌజ్ వేదికగా ఒక్క గంటలో ఆయన ఏడు ప్రకటనలు చేశారు. అయితే అవన్నీ అబద్ధాలేనని ఇరాన్ అంటోంది. ఇంతకీ ఏ ఏడు ఏంటంటే.. ఇరాన్-అమెరికా మధ్య హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)పై ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా నౌకా దళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తే.. తాము హార్ముజ్ను మూసివేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘలీబాఫ్.. డోనాల్డ్ ట్రంప్ను హెచ్చరించారు. ఈ దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందంటూ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.ఎక్స్ వేదికగా స్పందించిన ఘలీబాఫ్.. హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు ఇరాన్ అనుమతితోనే జరుగుతుందని స్పష్టం చేశారు. దిగ్బంధనం కొనసాగితే, హార్ముజ్ జలసంధి ఎంతమాత్రం తెరిచి ఉండదంటూ ఆయన స్పష్టం చేశారు. "వారు ఈ అబద్ధాలతో యుద్ధంలో గెలవలేదు. చర్చల్లో కూడా ఎక్కడికీ వెళ్లలేరు. జలసంధి తెరిచి ఉందా లేదా అనేది క్షేత్రస్థాయి పరిస్థితులు నిర్ణయిస్తాయి కానీ సోషల్ మీడియా కాదు. ట్రంప్ ఒక గంటలో ఏడు ఆరోపణలు చేశారని.. అవన్నీ అబద్ధాలు’’ అంటూ ఘలీబాఫ్ కొట్టిపారేశారు. అయితే, ఆ ఏడు అవాస్తవాలు ఏమిటనేది ఆయన స్పష్టంగా వివరించలేదు.లెబనాన్లో కాల్పుల విరమణ కాలంలో అన్ని వాణిజ్య నౌకల కోసం హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంటుందని ఇరాన్ ప్రకటించిన కొద్ది గంటలకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఇరాన్ యుద్ధం కారణంగా దాదాపు రెండు నెలల పాటు మూతబడటంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు, సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం ఇరాన్ దీనిని తెరిచినప్పటికీ, వాణిజ్య నౌకలు భద్రతా హామీల కోసం వేచి చూస్తున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.అయితే, ఇరాన్ యుద్ధంపై గతంలో ట్రంప్ ఏడు స్టేట్మెంట్లను పరిశీలిస్తే.. అవన్నీ అబద్ధాలేనని తేలింది. హార్ముజ్ పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్ చెప్పడాన్ని తప్పుబట్టిన ఇరాన్.. మా అనుమతితో మాత్రమే తెరుస్తామని చెబుతోంది. నావికాదళ ఆంక్షలు త్వరగా ముగుస్తాయని ట్రంప్ వ్యాఖ్యలు చేయగా.. ఇది తప్పుదారి పట్టించే ప్రకటన అంటూ అమెరికా ఒత్తిడి కొనసాగుతుందని ఇరాన్ చెప్పింది. ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిందని ట్రంప్ వ్యాఖ్యలను ఘలీబాఫ్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ యుద్ధంలో నిలబడిందని పేర్కొన్నారు.అలాగే, చర్చలు దాదాపు పూర్తయ్యాయని ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్.. యురేనియం తరలింపు వంటి అంశాలు ఎప్పుడూ చర్చల్లో లేవని స్పష్టం చేసింది. ఇరాన్ యురేనియం అమెరికాకు తరలిస్తుందని ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది. శుద్ధి చేసిన యురేనియం ఎక్కడికీ తరలించబడదని పేర్కొంది. హార్ముజ్ ఎప్పటికీ తెరిచి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్ ఇస్తూ.. ఆంక్షలు కొనసాగితే హార్ముజ్ను మూసివేస్తామని హెచ్చరించింది. అమెరికా–ఇరాన్ ఒప్పందం త్వరగా కుదురుతుందని ట్రంప్ చెప్పగా.. ఇది అవాస్తమంటూ పేర్కొన్న ఇరాన్.. చర్చలు ఇంకా క్లిష్టంగా ఉన్నాయని తెలిపింది.హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్ చెప్పారు.. మా అనుమతితోనే తెరుస్తామని ఇరాన్ చెప్పిందినావికాదళ ఆంక్షలు త్వరగా ముగుస్తాయని ట్రంప్ అన్నారు.. అమెరికా బ్లాకేడ్ కొనసాగుతోందని ఇరాన్ అంటోందిఇరాన్ యుద్ధంలో ఓడిపోయిందని ట్రంప్ అన్నారు.. తాము యుద్ధంలో నిలబడ్డామని ఇరాన్ స్పష్టం చేసిందిచర్చలు దాదాపుగా పూర్తయ్యాయని ట్రంప్ చెప్పుకొచ్చారు.. ఆయన చెప్పిన అంశాలపై చర్చలు జరగలేదని ఇరాన్ చెబుతోందిశుద్ధి యురేనియం ఇరాన్ అమెరికాకు తరలిస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.. శుద్ధి చేసిన యురేనియం ఎక్కడికీ తరలించబడదని ఇరాన్ అంటోందిహర్ముజ్ ద్వారా అమెరికాకు ఫ్రీ చమురు రాబోతోందని.. ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ చెప్పడం.. అదంతా అబద్ధమేనని ఇరాన్ ప్రకటించిందిడీల్ త్వరలోనే అని ట్రంప్.. చర్చలు క్లిష్టదశలో ఉన్నాయని ఇరాన్ స్పష్టీకరణ
ఇరాన్కు ట్రంప్ బంపరాఫర్
వాషింగ్టన్: హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సహాయంతో ఇరాన్ జలమార్గం నుండి సముద్ర మైన్లను తొలగిస్తోందని ట్రంప్ చెప్పుకొచ్చారు. మైన్లను తొలగించడానికి అమెరికా, ఇరాన్ కలిసి పనిచేస్తున్నాయని ట్రంప్ అన్నారు.ఇక, అమెరికా నేవీ ఇప్పటికే ఒక లిట్టోరల్ కాంబాట్ షిప్ను మైన్ క్లియరింగ్ ఆపరేషన్ల కోసం అక్కడ ఉంచారు. అలాగే, అదనంగా జపాన్ నుంచి రెండు మైన్ క్లియరింగ్ నౌకలు కూడా ఆ ప్రాంతానికి బయలుదేరాయి. అయితే, యుద్ధం నేపథ్యంలో హార్మూజ్లో చిన్న పడవల సాయంతో ఇరాన్ మైన్లను అమర్చింది. కాగా.. గత వారం న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, హార్మూజ్లో ఇరాన్ వేసిన అన్ని మైన్స్ను గుర్తించడం కష్టంగా మారింది. కొన్ని మైన్స్.. నీటి ప్రవాహం కారణంగా కొట్టుకుపోయినట్టు తెలిపింది. దీంతో, నీటి నుంచి మైన్స్ను తీయడం కష్టంగా మారిందని పేర్కొంది.మరోవైపు.. బెల్జియం, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ సహా ఐరోపా దేశాలకు హార్మూజ్ జలసంధిలో ఉన్న మైన్లను తొలగించే సామర్థ్యం ఉందని ఫ్రాన్స్ రక్షణ మంత్రి కేథరీన్ వాట్రిన్ వెల్లడించారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ జలమార్గం గుండా ప్రయాణించే నౌకలకు ఐరోపా దేశాలు పూర్తి మద్దతుతో కూడిన ఎస్కార్ట్ సేవలను అందించగలవని వాట్రిన్ తెలిపారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, కీలకమైన నౌకా మార్గాలను సురక్షితం చేసే ప్రయత్నాల్లో భాగంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ సహా ఇతర ప్రపంచ నాయకులు సమావేశం కానున్నారు.సమావేశానికి మాక్రాన్, స్టార్మర్ నాయకత్వంమరోవైపు ఇరాన్పై దౌత్య, ఆర్థిక ఒత్తిడిని పెంచే అంతర్జాతీయ ప్రయత్నాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నాయకత్వం వహిస్తున్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా ఒక అంతర్జాతీయ మిషన్ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో భాగంగా ఈ చర్చలు ఉంటాయని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.సుమారు 40 దేశాల నాయకులు హాజరుకాగా మాక్రాన్తో కలిసి ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పారిస్కు చేరుకోనున్నారు. అలాగే జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని కూడా హాజరు కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇతర ప్రపంచ నేతలు వర్చువల్గా ఇందులో పాల్గొననున్నట్లు సమాచారం. ఇరాన్తో కాల్పుల విరమణకు మద్దతు ఇవ్వడం, కీలకమైన సముద్ర మార్గం గుండా సురక్షిత ప్రయాణం లక్ష్యంగా సుమారు 40 దేశాల నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారని అంతర్జాతీయ మీడియా CNN పేర్కొంది. అయితే, ఆ జాబితాను ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు, సిబ్బంది భద్రతను మెరుగుపరిచేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ (International Maritime Organization) చేస్తున్న పనికి మద్దతు ఇవ్వడంపై కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చిస్తారని పేర్కొంది.
జాతీయం
రూ. 1000, రూ. 500 మార్పిడికి కొత్త రూల్స్? పీఐబీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు వీగిపోయిన వైనంపై వాడి వేడి చర్చ జరుగుతుండగా, డీమానిటైజేషన్కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 2016లో చేపట్టిన పెద్ద నోట్లు రద్దు తరువాత ఇపుడు మళ్లీ పాతనోట్ల మార్పిడి అవకాశం కల్పిస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై పీఐబీ సోషల్ మీడియి ద్వారా వివరణ ఇచ్చింది.2016లో రద్దయిన పాత రూ. 1000, రూ. 500, నోట్లను మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో అవకాశం కల్పించిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. దీంతో బ్యాంకు వినియోగదారుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారిక విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఇది పూర్తిగా నకిలీ వార్త అని, ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దని కూడా హెచ్చరించింది. Has RBI really announced 'new rules' for exchanging old ₹500 & ₹1000 notes❓Some news reports claim that the Reserve Bank of India (@RBI) has issued new guidelines to exchange discontinued currency notes.#PIBFactCheck❌ This claim is FAKE!❌RBI has made NO such… pic.twitter.com/8ph2mlCrLT— PIB Fact Check (@PIBFactCheck) April 17, 2026కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద సందేశం, ఫోటో లేదా వీడియో మీకు కనిపిస్తే, దానిని తమకు సెండ్ చేయాలని కోరింది.దాని ధృవీకరిస్తామని తెలిపింది.కరెన్సీకి సంబంధించిన ఏ సమాచారం కోసమైనా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను (rbi.org.in) చెక్ చేయాలని వెల్లడించింది.WhatsApp: +91 8799711259Email: factcheck@pib.gov.in
బాక్సైట్.. ఫైట్ .. తీవ్రరూపం
రాయగడ : రాయగడలో బాక్సైట్ ఫైట్ తీవ్ర రూపం దాల్చుతోంది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం కాశీపూర్లో గల టికిరిలో ఉత్కళ అల్యూమినియం కర్మాగారానికి 1994లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్నో అభ్యంతరాలు, అవాంతరాలు, ప్రజల వ్యతిరేకతలు మధ్య 1996లో ప్రాజెక్టు పనులు పూర్తవ్వాల్సి ఉండగా అది 2006లో ప్రారంభమైంది. ఈ కర్మాగారం ఏర్పాటులో భాగంగా వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు సైతం త్యాగం చేశారు. అందుకు వారికి కర్మాగారం నష్టపరిహారం కూడా చెల్లించింది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో ఇప్పటికీ ఈ ప్రాంతంలో వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. సిజిమాలి తవ్వకాలకు అనుమతి కాశీపూర్ సమితి పరిధిలొని సగుబారి పంచాయతీలో గల కంఠమాల్ సమీపంలొ ఉన్న సిజిమాలి (Sijimali)లో సుమారు 311 మిలయన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాలు దాదాపు 1549 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సిజిమాలి కొండలో ఉన్న బాక్సైట్ తవ్వకాల కోసం 2023 వ సంవత్సరంలో వేదాంత కంపెనీకి 50 ఏళ్ల కోసం లీజ్ కింద అనుమతులు ఇచ్చింది. అయితే ఆది నుండే అవాంతరాలు ఏర్పడుతుండటంతో వేదాంత కంపెనీ తవ్వకాల కొసం ప్రయత్నించినా ఆ దిశగా ముందుకు వెళ్లలేకపోయింది. గ్రామ సభలు, పల్లెసభలను నిర్వహించిన అనంతరం ఆయా ప్రభావిత ప్రాంతాల ప్రజల అనుమతులతో తవ్వకాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎలాంటి గ్రామ సభలు, పల్లె సభలను నిర్వహించకుండా ప్రజల అభిమతం తెలుసుకోకుండా వేదాంత కంపెనీ తవ్వకాల కొసం కదం తొక్కినప్పటికీ దానికి అనుగుణంగా ముందుకు వెళ్లలేకపోయింది. ఎందుకంత వ్యతిరేకత..? కొండలనే తమ దైవంగా భావించే ఆదివాసీలు అడవులను నమ్ముకుని జీవనోపాధిని పొందుతుంటారు. మైనింగ్ తవ్వకాల వల్ల తాము దైవంగా భావించే కొండలు అంతరించిపోవడంతో పాటు పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని పచ్చని అడవులు నాశనం అవుతాయని భావించిన ఆదివాసీలు ఆది నుండే తవ్వకాలకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొండలపై జీవించే ఎంతో మంది ఆదివాసీలు తమకు నిలువనీడ లేకుండా పోతుందని, అదేవిధంగా తాగునీటి వనరులు కూడా దొరకడం గగనమవుతుందని భావిస్తూ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటైతే తమ జీవన స్థితిగతులు మెరుగుపడతాయని భావించి మొదట్లో కాశీపూర్లో గల ఉత్కళ అల్యూమినియం కర్మాగారం ఏర్పాటుకు ఆ ప్రాంత ప్రభావితమయ్యే గ్రామాలకు చెందిన ప్రజలు వారి భూములను, స్థలాలను అప్పగించారు. కానీ ఆ తర్వాత కూడా వలసలు ఆగలేదు. ఉన్న స్థలాల సైతం, నమ్ముకున్న అడవులసైతం ఇచ్చివేస్తే మిగిలేది ఏమీలేదని గట్టిగా నమ్మిన గ్రామస్తుల తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. సిజిమాలిలో జరిగింది ఇదే.. సిజిమాలి బాక్సైట్ నిక్షేపాలను తవ్వకాల కోసం వేదంత కంపెనీ సగుబారి నుంచి కంఠమాల్ గ్రామ సమీపంలో గల సిజిమాలి కొండవరకు రహదారిని నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా గ్రామస్తులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఏప్రిల్ 7 వ తేదిన జిల్లా కలెక్టర్ అశుతొష్ కులకర్ణి కంఠమాల్ గ్రామ ప్రజలకు ఈ కొండను ప్రభుత్వం తవ్వకాల కొసం వేదాంత కంపెనీకి అనుమతులు ఇచ్చిందని, వారు తవ్వుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు తెలపకూడదని మైకు ద్వారా పోలీసులు బలగంతో అక్కడకు చేరుకున్న కలెక్టర్ గ్రామస్తులకు వివరించారు. అదే రోజు రాత్రి పోలీసులు కంఠమాల్ గ్రామంలో గల సుభాసిణి మాఝి అనే ఒక నిందితురాలిని అరెస్టు చేసే పేరిట పూర్తి పోలీసుల బలగాలతో అర్ధరాత్రి గ్రామంలో దమన కాండను సృష్టించారు. ఈ దాడుల్లో ఎంతొ మంది ఆదివాసీలు గాయాలపాలయ్యారు. అదేవిధంగా గ్రామంలొకి భాష్వ వాయువును కూడా పోలీసులు ప్రయోగించారు. మరుసటి రోజు ఏప్రిల్ 8న మరికొంత మంది పోలీసులు ఉదయం కంఠమాల్ గ్రామానికి వెళ్లి రహదారి నిర్మాణానికి సంబంధించి సన్నాహాలు చేయగా గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. సంప్రదాయ ఆయుధాలతో వ్యతిరేకించారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య జరిగిన వాగ్వాదంలొ పోలీసులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో సుమారు 58 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. దీంతొ పరిస్థితులు ఉద్రిక్తమవ్వడంతో గ్రామంలొ 163 సెక్షన్ జారీ చేశారు. కొద్ది రొజులు సద్దుమణగగా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకరి తర్వాత ఒకరు గ్రామంలోకి వెళ్లారు. ఫ్యాక్ట్ పైండింగ్ టీంలుగా ఇటు ప్రతిపక్ష పార్టీ బీజేడీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రనాయకులు కంఠమాల్ గ్రామంలొ గ్రామస్తులతో సమావేశమయ్యారు. తాము అండగా ఉంటామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఆదివాసీల హక్కులను కాలరాయడం విచారకరమని ఈ మేరకు తమ హైకమాండ్ లకు రాజకీయ నాయకులు నివేదికలను కూడా సమర్పించారు. ఇందులో భాగంగా కొరాపుట్ లొక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలొ రాయగడ, బిసంకటక్, గుణుపూర్ ఎమ్మెల్యేలు అప్పల స్వామి కడ్రక, నీలమాధవ హికక, సత్యజీత్ గొమాంగొలు కంఠమాల్ గ్రామంలొ పర్యటించిన అనంతరం కలెక్టర్ అశుతొష్ కులకరి్ణతో సమావేశమయ్యారు. పల్లె సభలు, గ్రామ సభలను జరిగినట్లుగా సాక్ష్యాలను సృష్టించి వేదాంత కంపెనీ సిజిమాలి కొండలను తవ్వేందుకు ప్రయత్నిస్తుందని సరాసరి కలెక్టర్తో చెప్పారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ విషయమై చొరవ తీసుకొవాలని కొరారు. బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా ప్రతిపక్షపార్టీలు గ్రామస్తులకు మద్దతు చెబుతున్నాయి. ఇదీ చదవండి: మీటింగ్లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులుప్రభావిత గ్రామాలు సిజిమాలి బాక్సైట్ తవ్వకాలు కొనసాగితే ప్రభావిత గ్రామాల గురించి తెలుసుకుంటే.. జిల్లాలోని 18 గ్రామాలు నేరుగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం, కంపెనీలు అంచనా వేశారు. ఇందులో రాయగడ జిల్లాలోని 8 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే సామాజిక కార్యకర్తలు, గిరిజన సంఘాల అంచనా మేరకు మైనింగ్ వల్ల సుమారు 50 నుంచి 80 గ్రామాలు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. దీని వల్ల సుమారు ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 30 వేల మందికి పైగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని అంచనా. ఇదీ చదవండి: మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది!
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన మూడోదశ 2028 వరకు కొనసాగింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం 83,977 కోట్ల రూపాయల కేటాయింపులు జరుగుతాయి. భారత్ మ్యారీ టైం ఇన్సురెన్స్ పూల్ ఏర్పాటు ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.నిరంతర సముద్రయాన బీమా కవరేజీ కోసం 12,980 కోట్ల రూపాయలు కేటాయింపులు ఉంటాయి. ప్రపంచ అస్థిరత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నౌకల బీమా కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. యుద్ధ ప్రమాద నష్టాలను కవర్ చేసేలా బీమా ఉంటుంది.రాజమండ్రి (నిడదవోలు)-(దువ్వాడ) మధ్య 3, 4వ రైల్వే లైన్ ట్రాక్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 198 కిలోమీటర్ల రూట్లో, 458 కిలో మీటర్ల ట్రాక్ ఏర్పాటు కానుంది. 9,889 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.మరిన్ని కీలక నిర్ణయాలుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అదనపు డీఏ నిధుల విడుదలకు క్యాబినెట్ ఆమోదం ఈ ఏడాది జనవరి నుంచి అదనంగా పెరిగిన రెండు శాతం డీఏడీఏ పెంపుతో ఖజానాపై 6,791 కోట్ల రూపాయల అదనపు భారం 50.46 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు,68.27 శాతం పెన్షన్ దారులకు ప్రయోజనంఘజియాబాద్, సీతాపూర్ థర్డ్ , ఫోర్త్ రైల్ లైన్ విస్తరణకు 14,926 కోట్ల రూపాయలు
స్టేట్ టాపర్.. అవినీతి ఉచ్చులో..!
జైపూర్: రాజస్థాన్లో ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారుల చేతికి చిక్కింది. భూవ్యవహారానికి సంబంధించిన దందాలో రూ. 60 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అధికారులకు పట్టుబడింది. గతంలో తను ఇచ్చిన ఓ ఇంటర్వూలో అవినీతిని అంతమెుందిస్తానంటూ ప్రగల్భాలు పలికిన ఈ అధికారి ఇప్పుడు తానే లంచం తీసుకుంటూ పట్టుబడడంతో ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశమైంది.రాజస్థాన్లో ఎస్డీఎమ్గా విధులు నిర్వహిస్తున్న కాజల్ మీనా అనే అధికారి భూవ్యవహారానికి సంబంధించిన కేసు పరిష్కారం కోసం కోసం రూ. లక్ష తొలుత డిమాండ్ చేసింది. అయితే బాధితులు అంత చెల్లించలేము అని అనడంతో రూ. 60 వేలకు డీల్ కుదిరింది. అయితే ఈ వివరాలని బాధితుడు ఏసీబీకి తెలియజేయడంతో పక్కా ప్లాన్ వేసిన అధికారులు రెడ్హ్యాండెడ్గా ఆమెను పట్టుకున్నారు. అయితే ఆ సమయంలో తన బ్యాగులో మరో రూ. 4 లక్షలున్నాయని వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.కాజల్ మీనా నేపథ్యంకాజల్ మీనా 2024లో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలలో టాఫర్గా నిలిచారు. అంతే కాకుండా హిమాచల్ ప్రదేశ్ ఐఐటీ మండిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల్లో టాపర్గా నిలిచిన సందర్భంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్గా మారింది. అప్పుడు అవినీతిని నిరోధిస్తానని ప్రజా సేవ చేయడమే లక్షమని పేర్కొంది. కాగా ఇప్పుడు తన తొలి పోస్టింగ్ లోనే లంచం తీసుకుంటూ దొరకడంతో దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అవినీతిని నిర్మూలిస్తానని ప్రగల్భాలు పలికిన అధికారి తన తొలిపోస్టింగ్లోనే ఏసీబీకి చిక్కడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఎన్ఆర్ఐ
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్లోని తెలుగు వాసులు ఈ ఏడాది ఉగాది పండుగను సంప్రదాయానికి అనుగుణంగా, ఆత్మీయంగా మరియు వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20, 2026 తేదీలలో ఈ ఉత్సవాలు చాంగీ రామర్ దేవాలయం, సెంగ్కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం మరియు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రత్యేకంగా, టీమ్ శివ ప్రసాద్ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాలయాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి మరియు ప్రసాదాన్ని పంపిణీ చేశారఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆనందం, ఐక్యత మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది.ఈ ఉత్సవాల ద్వారా సాంప్రదాయం, సంస్కృతి, భక్తి మరియు ఐక్యత మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో, సింగపూర్లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు.
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు)
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
క్రైమ్
20 నిమిషాలు.. 10 కేజీల గోల్డ్.. రూ.35 లక్షలు
సింగ్రౌలీ: మధ్యప్రదేశ్లోని బ్యాంకు దోపిడీ కలకలం రేపింది. తుపాకులతో లోపలికి చొరబడిన దుండగులు.. కస్టమర్లు, బ్యాంకు సిబ్బందిని రూ. 15 కోట్ల విలువైన బంగారం(10 కేజీలు), రూ.35 లక్షల నగదుతో పరారయ్యారు. సింగ్రౌలీలో శుక్రవారం మధ్యాహ్నం(ఏప్రిల్ 17) సమయంలో ఐదుగురు దుండగులు కస్టమర్ల ముసుగులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖ బ్యాంకులో ప్రవేశించారు. కేవలం 20 నిమిషాల్లో బంగారం, వెండి, రూ.35 లక్షల నగదుతో ఉడాయించారు.మొదట ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించారు. లోపలికి రాగానే తుపాకులు తీసి సిబ్బందిని బెదిరించడం ప్రారంభించారు. వెంటనే మరో ముగ్గురు సహచరులు కూడా లోపలికి రావడంతో బ్యాంకు మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లిపోయింది. దోపిడీ దొంగలు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరపడంతో కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. లాకర్లు, నగదు నిల్వలకు సంబంధించిన తాళాలు ఇవ్వాలంటూ బ్రాంచ్ మేనేజర్ను బెదిరించారు. మేనేజర్ నిరాకరించడంతో అతని తలపై తుపాకీతో బలంగా కొట్టి గాయపరిచారు. ఆ తర్వాత బలవంతంగా తాళాలు తీసుకున్నారు.ఆ సమయంలో బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడం దొంగలకు కలిసి వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారిని ఎవరూ అడ్డుకోలేకపోయారని.. క్షణాల్లో అంతా జరిగిపోయిందని ఓ కస్టమర్ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. నగరం వెలుపలికి వెళ్లే అన్ని దారులన్నీ మూసివేశారు. నిందితులను గుర్తించడానికి బ్యాంకు, పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది, కస్టమర్ల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు.
నోట్ల కట్టల వెనుక మిస్టరీ.. గోదావరి జిల్లాల్లో సంచలనం
నరసాపురం: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో ఓ పాస్టర్ ఇంట్లో రూ.2,27,94,000 పోలీసులు స్వాధీనం చేసుకోవడం గోదావరి జిల్లాల్లో సంచలనంగా మారింది. కొద్దినెలల క్రితం వరకూ సాధారణ జీవితం గడిపిన పాస్టర్ గంటా జాన్ బాబూరావు ఒక్కసారిగా విలాసవంతమైన జీవితంలోకి మారడమే కాకుండా, పెద్ద సంఖ్యలో ఆస్తుల కొనుగోలు చేయడం, ఈ క్రమంలో ఆయన ఇంట్లో కోట్లలో నోట్ల కట్టలు లభ్యం కావడం హాట్టాపిక్గా మారింది. ఇంట్లో లభ్యమైన నగదుకు ఆధారాలు చూపని కారణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నరసాపురం డీఎస్పీ సుధాకర్ నేతృత్వంలో రూరల్ సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రెండు బృందాలు విస్తృతంగా దర్యాప్తు చేపట్టాయి. శుక్రవారం ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. జాన్ బాబూరావు నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. పలు దస్తావేజులు, ఆస్తి పత్రాలు స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. ఇటీవల బాబూరావు తనతో పాటు అతని అల్లుడు, కుమార్తె పేరుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా ఐటీ అధికారులు ప్రాథ«మికంగా గుర్తించారు. తమ వద్ద ఉన్న నగదుకు అన్ని ఆధారాలు ఉన్నట్టు పాస్టర్ కుమార్తె ఫోన్ ద్వారా ఐటీ అధికారులకు తెలిపినట్టు సమాచారం. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన జాన్బాబూరావు గ్రామంలో చిన్న చర్చి నడిపేవారు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్కు చెందిన వ్యక్తితో తన కుమార్తె వివాహం చేశారు. అప్పటి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు.
నీలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాను.. సారీ..!
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్లోని ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన ఖమ్మం జిల్లాకు చెందిన వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోటపాడుకు చెందిన నవిత(34) కు 11ఏళ్ల క్రితం సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన గుప్త సాయిబాబుతో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్లు, ఏడు నెలల కుమారులు ఉన్నారు. గతంలో ఓ ఎమ్మెల్యేకు చెందిన డెవలపర్లో ఉద్యోగం చేసిన నవిత సొంతంగా పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయింది. కుటుంబ సభ్యుల సహకారంతో అప్పుల ఊబి నుంచి బయటపడిన ఆమె ఉద్యోగం మానేశారు. ఇటీవల మరోసారి అప్పులు చేసి నష్టాల్లో కూరుకుపోయింది. ఈమేరకు అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరగడంతో ఈనెల 16న ఇద్దరు పిల్లలను కోటపాడులో వదిలి జనగామ జిల్లా కేంద్రానికి వచ్చింది.పురుగుల మందు తాగి...జనగామ బాలాజీనగర్లో ఓ భవనానికి ‘టు లెట్’ బోర్డ్ ఉండడంతో నవిత పైఅంతస్తుకు వెళ్లి రూములు ఉన్నాయా.. అని అడిగింది. అక్కడ అద్దెకు ఉన్నవారు డబుల్ బెడ్రూమ్ ఉందని చెప్పగా, సూపర్వైజర్ వచ్చి వివరాలు ఆరా తీశాడు. అయితే, వెంట ఎవరూ రాలేదని అడిగితే తన సోదరుడు వస్తున్నాడని చెప్పి ఆయనను బయటకు పంపించింది. అనంతరం సమీపంలోని షాప్నకు వెళ్లిన ఆమె పెన్ను, పేపర్ తీసుకుని లేఖ రాసింది. ఆతర్వాత ఎరువుల షాప్నకు వెళ్లి పురుగుల మందు కొనుగోలు చేసి తిరిగి అద్దె అడిగిన భవనంలోకి వచ్చి తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చాలాసేపు గడిచినా సవిత బయటకు రాకపోవడం, గదిలో నుంచి వాసన వస్తుండడంతో పక్కన అద్దెకు ఉంటున్న వారు చూడగా ఆమె అపస్మారక స్థితిలో ఉండడంతో అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి అప్పటికే సవిత మృతి చెందినట్లు నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఇంటి నుంచి బయలుదేరే సమయంలో నవిత తన భర్తకు ‘నీలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాను.. సారీ..’ అని మెసేజ్ పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు పోలీసులు ఆమె మృతదేహం వద్ద సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నా, దానిపై పురుగుల మందు పడడంతో చదవడం సాధ్యం కాలేదు. అయితే, లేఖపై ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా ఇచ్చిన సమాచారంతో ఆమె సోదరుడు, కుటుంబీకులు చేరుకుని ఫిర్యాదు చేశాడు.
ప్రియుడిపై మోజు సుపారీ ఇచ్చి భర్తను లేపేసిన భర్య!
వరంగల్ క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, నిత్యం తాగి ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే నెపంతో రూ.5లక్షలు సుఫారీఇచ్చి భర్తను హత్య చేయించింది ఓభార్య. ఈ ఘటనకు సంబంధించి ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈనెల 8న పరకాలకు చెందిన మడికొండ సాంబయ్య తన కుమారుడు మడికొండ సుమన్ భరత్ (38) కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మడికొండ సుమన్ భరత్కు 2012 సంవత్సరంలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాములపల్లికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అనంతరం లావణ్యకు పరకాల పట్టణంలోని ఇమ్మడి నరేశ్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ విషయంలో మడికొండ సుమన్ భరత్ రోజు తాగి వచ్చి లావణ్యను హింసించేవాడు. దీంతో లావణ్య తన తమ్ముడు పెండల రాజు, ప్రియుడు ఇమ్మడి నరేశ్తో కలిసి సుమన్ భరత్ను హత్య చేయడానికి ప్లాన్ వేసింది. దీంతో ప్రియుడు ఇమ్మడి నరేష్కు పరిచయం ఉన్న గోవిందరావుపేటకు చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లతో హత్యకు బేరం కుదుర్చుకున్నారు.బంగారం కుదువపెట్టి సుపారీ ఇచ్చి..లావణ్య తన బంగారం కుదువ పెట్టి రూ.1,59,000, ఇమ్మడి నరేశ్, పెండల రాజు కలిసి రూ.3లక్షలు పోగు చేసి మొత్తం రూ.4,59,000 చిరంశెట్టి వెంకటేశ్వర్లుకు ఇచ్చి సుమన్భరత్ను హత్య చేయించారు. వెంకటేశ్వర్లు మరో వ్యక్తి భూక్య రాకేశ్తో కలిసి సుమన్ భరత్కు మద్యం, డబ్బులు ఆశ చూపి ఈనెల 3న రాత్రి 8 గంటలకు ములుగుకి పిలిపించారు. అక్కడినుంచి చిరంశెట్టి వెంకటేశ్వర్లు వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి సుమన్ భరత్కి మద్యం తాగించారు. అతను మత్తులో లేవలేని స్థితిలో ఉండగా చిరంశెట్టి వెంకటేశ్వర్లు బీర్ బాటిల్తో భరత్ తల వెనక భాగంలో కొట్టగా సుమన్ భరత్ పడిపోయాడు. అనంతరం వారు ముందే తెచ్చి పెట్టుకున్న పెట్రోల్ భరత్ ఒంటిపై పోసి నిప్పంటించారు. భరత్ మృతదేహం కాలుతుండగా.. భూక్యా రాకేశ్, చిరంశెట్టి వెంకటేశ్వర్లు ఫోన్లో ఫోటోలు, వీడియో తీసి, మరుసటి రోజు ములుగుకు వచ్చిన లావణ్య, పెండల రాజుకు చూపించారు. దీంతో సుఫారీలో మిగిలిన డబ్బులను వారు అప్పగించారు. అనంరతం లావణ్య తన అత్తగారి ఇల్లు అయిన పరకాలకి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉంది. ఈనెల 5న చిరంశెట్టి వెంకటేశ్వర్లు రాత్రి 10 గంటలకు పొలం వద్దకు వెళ్లి భరత్ కాలిపోగా మిగిలిన ఎముకలను పక్కనే ఉన్న వాగులో పడేశాడు. దర్యాప్తులో భాగంగా పరకాల పోలీసులు చిరంశెట్టి వెంకటేశ్వర్లు, భూక్య రాకేశ్ను గోవిందరావుపేట శివారులోని చిరంశెట్టి వెంకటేశ్వర్లు వ్యవసాయ భూమి వద్దకు తీసుకెళ్లి కాల్వలోని భరత్ ఎముకలు, బూడిద, కాలిచ్చి పడేసిన సిగరెట్ పికలు, బీర్ బాటిల్ ముక్కలు, మందు బాటిళ్ల మూతలు, ప్లాస్టిక్ ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. హత్య కేసును చేధించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన పరకాల ఏసీపీ సతీష్బాబు, ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్నాయక్ను డీసీపీ అంకిత్ కుమార్ అభినందించారు.
వీడియోలు
అంబటి రాంబాబు దీక్ష వద్ద జడ శ్రావణ్ స్పీచ్
మహిళా బిల్లుపై బాబు కుట్ర ఆధారాలతో బయటపెట్టిన MLC లేళ్ల అప్పిరెడ్డి
అంతా బోగస్.. సుమన్ శెట్టి షాకింగ్ నిజాలు
విజయ్ కి అంత సీన్ లేదు...ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్
ముగ్గువేసి మనసులు గెలిచిన విజయ్
నాకు ఫీల్డింగ్ పెట్టడం రాదు అంతా రోహితే చూసుకునేవాడు..
మమ్మల్ని హింసించిన వారిని 2029 తరువాత కులం,మతం చూడకుండానే బొక్కలో వేస్తాం
నా రైట్స్ నాకే..! హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
ఆల్కా అదిరిపోయే ఆఫర్ 100 షేర్లు కొంటే 600షేర్లు ఫ్రీ



