ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: అమావాస్య సా.5.31 వరకు, తదుపరి వైశాఖ శుద్ధ పాడ్యమి, నక్షత్రం: రేవతి ప.12.05 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.13 వరకు, అమృత ఘడియలు: ఉ.9.46 నుండి 11.18 వరకు, తదుపరి తె.4.07 నుండి 5.36 వరకు (తెల్లవారితే శనివారం).సూర్యోదయం : 5.48సూర్యాస్తమయం : 6.11రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.వృషభం.... కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. రుణబాధలు తొలగుతాయి. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.మిథునం.... ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూలాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.కర్కాటకం.... ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు ముందుకు సాగవు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.సింహం.... పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.కన్య.... పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.తుల.... పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు లభిస్తుంది. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.వృశ్చికం... వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. అనారోగ్యం. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు నెలకొంటాయి.ధనుస్సు... శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.మకరం.... ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.కుంభం... సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.మీనం... మీ శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి 'రహ్మాన్ డకాయత్' అడుగులు
‘ధురంధర్-1’లో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా పోషించిన రహ్మాన్ డకాయత్ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్రతో అక్షయ్కు ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఈ సీనియర్ నటుడు తన రెండో ఇన్నింగ్స్ను మరింత జోరుగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్ నుంచి అక్షయ్ ఖన్నాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. అది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చిన ఆఫర్ అని సినీ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. విక్టరీ వెంకటేశ్తో తీస్తున్న సినిమా సెట్స్పై ఉంది. అలాగే జూ.ఎన్టీఆర్ హీరోగా ఓ మైథలాజికల్ కథను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండిటిలో ఏదో ఒక సినిమా కోసం అక్షయ్ ఖన్నా పేరు పరిశీలనలో ఉందని సమాచారం.అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ.. టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఖచ్చితమని తెలుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ నటులు ఇప్పుడు టాలీవుడ్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మి వంటి పలువురు నటులు ఇప్పటికే తెలుగు ప్రాజెక్టుల్లో నటించారు. మరికొందరు బాలీవుడ్ నటులు కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి అక్షయ్ ఖన్నా లాంటి ప్రతిభావంతుడైన నటుడిని టాలీవుడ్ వదులుకోదు. ఆయనకు మంచి పాత్రలు దక్కడం ఖాయం.
విజయ్ వరాల జల్లు : భారీ హామీలతో TVK మేనిఫెస్టో
సాక్షి, చెన్నై: రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ విజయ్ గురువారం తమిళగ వెట్రి కజగం(TVK) మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇందులో మహిళలు, రైతులు మరియు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని పలు సంక్షేమ చర్యలను వాగ్దానం చేశారు. విజయ్ తన మేనిఫెస్టోను నిజాయితీకి నిదర్శనంగా అభివర్ణించారు. విజయ్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు, వాగ్దానాలు ఆసక్తికరంగా మారాయి.నిజాయితీ పరిపాలనను తన సిద్ధాంతం టీవీకే పార్టీ అధినేత ప్రకటించారు. అందుకే తమ పార్టీ తొలి ఎన్నికల ప్రణాళిక కూడా నిజాయితీకి హామీలనీ, తాము స్టాలిన్ లాగా ప్రజలను తప్పుదోవ పట్టించమని వెల్లడించారు.. ప్రజలకు ఉత్తుత్తి వాగ్దానాలతో రూపొందించిన తొందరపాటు ఎన్నికల ప్రణాళిక తమది కాదని పేర్కొన్నారు. డీఎంకే, మిగతా పార్టీలన్నీ ఒకటే అని చెప్పాం కదా?... కావాలంటే ఇరు పక్షాలు విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలను తీసుకుని పోల్చి చూడండని విజయ్ అన్నారు.పీటీఐ ప్రకారం, ఈ ప్రకటనలలో ముఖ్యంంగా మహిళలకు నెలకు రూ. 2,500 సహాయం, పెళ్లి చేసుకునే పేదింటి వధువులకు నాణ్యమైన పట్టు చీరతో పాటు 8 గ్రాముల బంగారం మహిళలు నడుపుతున్న స్వయం సహాయక బృందాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు , బడి మానేయడాన్ని నివారించడానికి తల్లులకు సంవత్సరానికి రూ. 15,000 సహాయం అందిస్తామని కూడా విజయ్ హామీ ఇచ్చారు. ప్రధాన పార్టీలు నిజమైన విధాన ప్రత్యామ్నాయాలను అందించడం కంటే, ఒకరిని మించి ఒకరు పోటీ పడాలనే లక్ష్యంతో ఒకే రకమైన వాగ్దానాలతో కూడిన తొందరపాటు ఎన్నికల ప్రణాళికలను జారీ చేస్తున్నాయని ఎద్దేవా ఏశారు. ఈ పార్టీలన్నీ ఒకే గొడుగు కింద పనిచేస్తున్న "అవినీతి ముఠాలు" అని ఆయన ఆరోపించారు. టీవీకే ఓటర్లను అదే విధంగా తప్పుదోవ పట్టించదని అన్నారు.ముఖ్యమైన హామీలుమహిళా సంక్షేమానికి నగదు సాయం: మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం.నిరుపేద వధువులకు 8 గ్రాముల (కాసు) బంగారం , పట్టుచీర.మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు.5 ఎకరాలలోపు భూమి ఉన్న చిన్న రైతులకు సహకార బ్యాంకుల్లో ఉన్న పంట రుణాల పూర్తి మాఫీ.వరి పంటకు క్వింటాల్కు రూ. 3,500 మద్దతు ధర (MSP).ఆరోగ్యం మరియు విద్య విషయంలో కూడా కీలక హామీని తన మానిఫెస్టోలో పొందుపర్చారు. దీనికి ప్రకారం ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా.రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక ఆసుపత్రుల ఏర్పాటు మరియు ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు.విద్యా రంగానికి సంబంధించి, విద్యార్థులకు అండగా నిలిచేందుకు రూ. 20 లక్షల వరకు ఉన్నత విద్యా రుణాలను అందించనున్నట్లు TVK అధినేత ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి కె. కామరాజ్ పేరుతో 100 ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాల విద్యను మధ్యలోనే మానేసే సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో, ప్రభుత్వ, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం. దీంతోపాటు తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత, నిజాయితీతో కూడిన పరిపాలన అందిస్తామని విజయ్ పేర్కొన్నారు.ప్రస్తుత అధికార పక్షం (DMK), ఇతర పార్టీలు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని, తమ మేనిఫెస్టో మాత్రం ఆచరణాత్మక మైందని ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
ఇరాన్పై ట్రంప్ గేమ్ ప్లాన్ మారింది..!
ఇరాన్తో అంత ఈజీ కాదనే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పదే పదే బోధపడుతూనే ఉంది. ఇటీవల పాకిస్తాన్లో ఇరాన్తో జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో ట్రంప్కు ఈ విషయం బాగానే అర్థమైంది. బెదిరింపులతో ఇరాన్ను దారి తెచ్చుకోవాలనుకుంటే ఏదీ కూడా వర్కౌట్ కావడం లేదు కాదు కదా.. కనీసం మిత్ర దేశాల సహకారం కూడా లభించడం లేదు. దాంతో సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇరాన్ను యుద్ధంతో వశపరుచుకోవడం వల్ల కాదు అనుకున్నారో ఏమో కానీ ట్రంప్ మాత్రం తన రూట్ మార్చుకున్నారు. ఇప్పటివరకూ సర్వనాశనం అంటూ ఇరాన్పై యుద్ధభేరీ మోగిస్తూ వచ్చిన ట్రంప్.. ప్రస్తుతం ఆర్థిక యుద్ధ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇరాన్తో యుద్ధాన్ని పక్కకు పెట్టి వారిపై ఆర్థిక ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. గత రాత్రి వైట్హౌస్లో డచ్ రాజు, డచ్ రాణిలతో జరిగిన ప్రైవేట్ డిన్నర్ కార్యక్రమంలో ఇదే విషయాన్ని ట్రంప్ చెప్పినట్లు సమాచారం. ఇరాన్ యుద్ధాన్ని త్వరితగతిన ముగించడానికి టెహ్రాన్పై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే ఏకైక మార్గమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. పాకిస్తాన్లో ఇరాన్తో జరిగిన మొదటి విడత చర్చలు చేదు అనుభవంతో ముగిసిన తర్వాత,తి రిగి చర్చలను మళ్లీ పట్టాలు ఎక్కించాలంటే కచ్చితంగా ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే ఒక్కటే మార్గమని ట్రంప్ ఓ స్పష్టతకు వచ్చారని, ఇదే విషయాన్ని డచ్ రాజు విల్లెం-అలెగ్జాండర్, రాణి మాక్సిమాలకు చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అనేది అత్యంత ఆందోళనకరమని, ఇది మరొక ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉండటంతో డచ్ ప్రభుత్వం.. యుద్ధంలో అమెరికాకు సహకరించడానికి నిరాకరించింది. యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే హర్మూజ్ జలసంధి విషయంలో ఓ స్పష్టతకు రావాలని, అందుకు ఇరాన్తో చర్చలు అవసరమని డచ్ ప్రభుత్వ ప్రతినిధులు.. ట్రంప్కు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచడమే ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. సైనిక దాడులకన్నా ఆర్థిక యుద్ధం మీద దృష్టి పెట్టడమే సరైనదిగా ట్రంప్ యోచిస్తున్నారు. దీనిలో భాగంగా ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచడానికి ప్రధానంగా చమురు ఎగుమతులను అడ్డుకోవడం, బ్యాంకులపై ఆంక్షలు విధించడంతో, మరియు నావికాదళ నిర్బంధం వంటి వ్యూహాలను ఉపయోగించి వారిని కట్టడి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అఖిలభారత సర్వీసుల విధానం నిష్ఫలమవుతోంది
దక్షిణాదిపై కక్షసాధింపే..
తెలంగాణ బలిదానాలకు కాంగ్రెస్సే కారణం
తెలంగాణపై బీజేపీ విషం చిమ్ముతోంది
తేజస్వీ వ్యాఖ్యలను తిప్పికొట్టండి
‘సర్’పై పారాహుషార్
వోల్వో కీలక ప్రకటన: రూ.లక్ష వరకు పెరగనున్న ధరలు!
దండించే అధికారం కేంద్రానిదే
డీలిమిటేషన్.. తెలంగాణలో 26... ఏపీలో 38
చావుబతుకుల్లో ఉంటే రోడ్డున పడేశారు!
వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా
‘ఏ క్షణమైనా బ్రెయిన్స్ట్రోక్.. సిగరెట్లు అడుక్కుంటున్నాడు’
కీలక పదవి దక్కిన వెంటనే ఈడీ రైడ్స్!
వార్డుల్లో పోటీ చేయడానికే అభ్యర్థులు దొరక్కపోతే రేపు ఎమ్మెల్యే ఎన్నికల్లో మన పరిస్థితి ఏంటి సార్!!
ఇదేం పెద్ద విశేషం! ఇప్పటికే వర్కింగ్ సీఎం కదా!!
తినడానికి కూడా లేనప్పుడే నా చేయి పట్టుకుంది: కిరణ్ అబ్బవరం
వారెవ్వా.. అటునుంచి షాక్.. ఇటునుంచి గుడ్న్యూస్
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్!
కంజూస్ డాక్టర్
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
‘ట్రంప్ రండి.. కూర్చొని మాట్లాడుకుందాం’ : ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్లో అడుగుపెట్టిన పాక్ సైన్యాధిపతి మునీర్
బంగారం ధరలు సలసల!
ఏసీ లేకుండానే ఇల్లు కూల్గా..! ఎలాగో తెలుసా..?
PSL: పీసీబీ పరువు తీసిన పాకిస్తాన్ క్రికెటర్
టీసీఎస్ నాసిక్ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్ ఘటన!
మామ్ వెయిట్లాస్ జర్నీ..! 82కేజీల నుంచి 60 కేజీలకు..
కాలేయం కొవ్వెక్కుతోంది
అఖిలభారత సర్వీసుల విధానం నిష్ఫలమవుతోంది
దక్షిణాదిపై కక్షసాధింపే..
తెలంగాణ బలిదానాలకు కాంగ్రెస్సే కారణం
తెలంగాణపై బీజేపీ విషం చిమ్ముతోంది
తేజస్వీ వ్యాఖ్యలను తిప్పికొట్టండి
‘సర్’పై పారాహుషార్
వోల్వో కీలక ప్రకటన: రూ.లక్ష వరకు పెరగనున్న ధరలు!
దండించే అధికారం కేంద్రానిదే
డీలిమిటేషన్.. తెలంగాణలో 26... ఏపీలో 38
చావుబతుకుల్లో ఉంటే రోడ్డున పడేశారు!
వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా
‘ఏ క్షణమైనా బ్రెయిన్స్ట్రోక్.. సిగరెట్లు అడుక్కుంటున్నాడు’
కీలక పదవి దక్కిన వెంటనే ఈడీ రైడ్స్!
వార్డుల్లో పోటీ చేయడానికే అభ్యర్థులు దొరక్కపోతే రేపు ఎమ్మెల్యే ఎన్నికల్లో మన పరిస్థితి ఏంటి సార్!!
ఇదేం పెద్ద విశేషం! ఇప్పటికే వర్కింగ్ సీఎం కదా!!
తినడానికి కూడా లేనప్పుడే నా చేయి పట్టుకుంది: కిరణ్ అబ్బవరం
వారెవ్వా.. అటునుంచి షాక్.. ఇటునుంచి గుడ్న్యూస్
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్!
కంజూస్ డాక్టర్
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
‘ట్రంప్ రండి.. కూర్చొని మాట్లాడుకుందాం’ : ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్లో అడుగుపెట్టిన పాక్ సైన్యాధిపతి మునీర్
బంగారం ధరలు సలసల!
ఏసీ లేకుండానే ఇల్లు కూల్గా..! ఎలాగో తెలుసా..?
PSL: పీసీబీ పరువు తీసిన పాకిస్తాన్ క్రికెటర్
టీసీఎస్ నాసిక్ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్ ఘటన!
మామ్ వెయిట్లాస్ జర్నీ..! 82కేజీల నుంచి 60 కేజీలకు..
కాలేయం కొవ్వెక్కుతోంది
ఫొటోలు
ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్
వైట్ డ్రెస్ ఔట్ఫిట్లో జాన్వీ కపూర్ (ఫోటోలు)
మహేశ్బాబు బ్యానర్ సినిమా ‘రావు బహదూర్’.. సాంగ్ ఈవెంట్ (ఫోటోలు)
ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్ ఎక్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)
సినిమా
శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్..!
అప్పుడే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడే సందడి. ఈ ఫ్రైడే నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్, తెరచాప, గాలి లాంటి చిత్రాలతో పాటు మలయాళ డబ్బింగ్ సినిమా పల్లి చట్టంబి థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. వీటిలో బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలపై ఆడియన్స్లో బజ్ ఏర్పడింది.ఇక ఓటీటీల విషయానికొస్తే తెలుగులో పోచమ్మ వెబ్ సిరీస్, హిందీ నుంచి అస్సీ, దో దివానే షహర్ మే, మట్కా కింగ్ వెబ్ సిరీస్లు ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. ఇవే కాకుండా కొన్ని చిత్రాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఏ ఓటీటీకి రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..దో దివానే షహర్ మే(బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17ఆల్ఫా మేల్స్ సీజన్-5(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17180(మూవీ)- ఏప్రిల్ 17రూమ్మేట్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17గోరిల్లా స్టోరీ(డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 17ఫుల్ స్వింగ్- సీజన్-4(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 17ట్విస్టెడ్(హాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 17లెగో — ఫ్రెండ్స్ ది నెక్ట్స్ చాప్టర్-(హాలీవుడ్ సిరీస్) -ఏప్రిల్ 17బెబెఫిన్సింగ్-ఎలాంగ్మూవీ ఇన్ టూ ద పింక్ఫాంగ్ వరల్డ్(కొరియన్ మూవీ)- ఏప్రిల్ 19అమెజాన్ ప్రైమ్మట్కా కింగ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17బాలిస్టిక్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17బ్రదర్స్ అండర్ ఫైర్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 17ది నాపాబాయ్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17ది విజిలర్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17జీ5..అస్సీ (హిందీ సినిమా)- ఏప్రిల్ 17ఆశకల్ అయిరామ్(మలయాళసినిమా)- ఏప్రిల్ 17ఆహా..పోచమ్మ(తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17బుక్ మై షోది బ్రైడ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17హెచ్బీవో మ్యాక్స్..డస్ట్ బన్నీ(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17హులు..షెల్బీ ఓక్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17లయన్స్ గేట్ ప్లేగుడ్ బాయ్(హాలీవుడ్)- ఏప్రిల్ 17
'అదే నాన్నలో చాలా ప్రత్యేకం'.. మెగాస్టార్పై తనయుడి ప్రశంసలు
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా మరోసారి వాయిదా వేశారు. జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఒక పాట మినహాయిస్తే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. మరింత థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమే వాయిదా వేస్తున్నామని నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేసింది.అయితే ఇటీవలే గ్లోబల్ స్టార్ మరో అరుదైన ఘనత సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈ ఘనత అందుకున్న హీరోగా నిలిచాడు. ప్రముఖ ఈ స్క్వేర్ ఇండియా మ్యాగజైన్పై రామ్ చరణ్ ఫోటోను ముద్రించారు. అంతకుముందు కేవలం ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఈ మ్యాగజైన్లో ప్రచురించారు. తాజాగా ఈ ఘనతను మన రామ్ చరణ్ అందుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. నాన్న ఎంతో మందిపై ప్రభావం చూపారని అన్నారు. ప్రతిరోజు ఆయనను చూస్తూ పెరగడం వల్ల నాపై ప్రభావం మరింత ఎక్కువగా ఉందన్నారు. నా జీవితంలో రియల్ హీరో నాన్నే అని వెల్లడించారు. కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే.. ముందు స్పందించే వ్యక్తి ఆయనేనని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు వెళ్లడం నాన్న నైజమన్నారు.నాన్న వారసత్వాన్ని మేము చాలా సులభంగానే అందిపుచ్చుకున్నామని రామ్ చరణ్ తెలిపారు. ఎంత స్టార్డమ్ ఉన్నా ఇంటి దగ్గర అందరి తండ్రుల్లాగే సింపుల్గా ఉండేవారని.. అదే ఆయనతో చాలా ప్రత్యేకమైన విషయమన్నారు. ఇక సినిమా కోసం రోజులో కేవలం నాలుగు గంటలే నిద్రపోయిన సందర్భాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. అదే సమయంలో వరుస షూటింగ్ల నుంచి మూడు రోజులు విరామం తీసుకుని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవారని అన్నారు. ఆయన అటు పని.. ఇటు ఫ్యామిలీని సమన్వయం చేసేవారని చెర్రీ పేర్కొన్నారు. ఈ విషయంలో తాను కూడా నాన్ననే ఫాలో అవుతున్నానని రామ్ చరణ్ స్పష్టం చేశారు.
'ముంబయిలో ఆడిషన్.. సౌత్ డైరెక్టర్ చాలా అసభ్యంగా..'
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కొత్త కాదు. ఇండస్ట్రీలోకి వచ్చినవారిలో చాలామందికి దాదాపు ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఈ విషయాన్ని కొందరు హీరోయిన్స్ బయటికి చెబుతుంటారు. మరికొందరు తమ బాధను చెప్పేందుకు భయపడుతూ ఉంటారు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణమైపోయింది.తాజాగా మరో హీరోయిన్ తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. బాలీవుడ్ బ్యూటీ డైసీ షా తాను ఎదుర్కొన్న సంఘటనను వివరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. దక్షిణాది డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. కాస్టింగ్ సెషన్ జరుగుతున్నప్పుడు.. అనుచితంగా తన శరీరాన్ని తాకాడని వెల్లడించింది. ఆ సమయంలో తాను చాలా ఇబ్బందికి గురయ్యానని పేర్కొంది. ముంబయిలో జరిగిన క్యాస్టింగ్ మీట్లో ఈ సంఘటన జరిగిందని పంచుకుంది.డైసీ షా మాట్లాడుతూ..'దక్షిణాదికి చెందిన ఒక డైరెక్టర్ నన్ను చాలా అసభ్యంగా తాకారు. ఆయన కాస్టింగ్ కోసం ఓసారి ముంబైకి వచ్చారు. అతన్ని కలవడానికి ఆరు నుంచి ఏడుగురు అమ్మాయిలం వెళ్లాం. అక్కడ ఆయన మమ్మల్ని ఒక్కొక్కరిని విడివిడిగా కలుస్తున్నారు. అది నాకు నచ్చలేదు. ఆ సమయంలో నా శరీరాన్ని తాకారు.. నా చేయి కూడా పట్టుకున్నారు. నన్ను ఎవరైనా తాకితే చాలా భయంగా ఉంటుంది. అందుకే నేను మసాజ్ కూడా చేయించుకోను. ఒక మహిళ కూడా నన్ను తాకడం ఇష్టం లేదు. అదే ఒక పురుషుడు నన్ను తాకితే ఎలా ఉంటుంది. అందుకే నాకు అది నచ్చలేదు. ఆ తర్వాత అతనికి తిరిగి ఫోన్ చేస్తానని చెప్పా. కానీ చేయలేదు' అని వెల్లడించింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.కాగా.. డైసీ షా.. సల్మాన్ ఖాన్ సరసన 'జై హో' (2014) చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'హేట్ స్టోరీ 3' (2015)లో కనిపించింది. మొదట కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వద్ద సహాయకురాలిగా తన కెరీర్ను ప్రారంభించింది. 'భద్ర', 'బాడీగార్డ్' వంటి చిత్రాలతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటనతో పాటు, డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొంది. పలు టెలివిజన్ కార్యక్రమాలలో కనిపించింది. ఇటీవలే 'రెడ్ రూమ్' అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం పలాష్ ముచ్చల్ దర్శకత్వంలో వస్తోన్న థ్రిల్లర్ మూవీలో డైసీ హీరోయిన్గా నటిస్తోంది.
OTT: ‘థ్రాష్’ రివ్యూ.. ముచ్చెమటలు పట్టించే థ్రిల్లరి సినిమా
భయం....నవరసాలలో ఈ భయానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ సినిమాలలో భయం అనే ఎమోషన్ ను రకరకాలుగా రక్తగట్టిస్తుంటారు దర్శకులు. ఇప్పుడొచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ, సౌండ్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుడిని ముచ్చమటలు పట్టించడం నల్లేరు మీద నడకే. చాలా సినిమాలలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి కాని కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. పైగా హాలివుడ్ లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు కొదవే ఉండదు. గడచిన కొన్నేళ్ళలో నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అని చెప్పుకునే హాలివుడ్ సినిమాలు ఎన్ని వచ్చినా అలరించినవి కొన్నే. కాని ఇటీవల నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయిన థ్రాష్ సినిమా మాత్రం చూసే ప్రేక్షకులను కుర్చీ అంటుకుపెట్టుకునేలానే కాదు ఒళ్ళంతా ముచ్చెమటలు పోయించినా ఆశ్చర్యపోనక్కరలేదు. హాలివుడ్ టామీవిర్కోలా రాసిన కథను తానే దర్శకత్వం వహించి తెరకెక్కించిన విధానం నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చు. అంతలా ఈ థ్రాష్ సినిమాలో ఏముందో ఓసారి చూద్దాం.అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో అనీవిలే అనే నగరంపై కాటగిరీ5 తో హరికేన్ హెన్రీ విరుచుకుపడుతుంది. ఇంత పెద్ద తుఫాను వస్తుంది అని తెలిసినా తన తన తల్లి ఇల్లుని వదలలేక ఒంటరిగా ఉండిపోతుంది డకోటా.మరో పక్క లీసా తన డెలీవరీ కోసం వెళుతూ డకోటా ఇంటి ముందే నీటిలో చిక్కుకుపోతుంది. ఇంకో వైపు డీ, రాన్ తమ చెల్లేలితోపాటు డబ్బులు కోసం ఆశపడే జంట దగ్గర ఆశ్రయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అనుకున్నట్టుగానే హరికేన్ ధాటికి అనీవిలే రిజర్వాయర్ గోడ కూడా కూలి నీళ్ళు నగరాన్ని ముంచెత్తుతాయి. నీటి తో పాటు తుఫాను సముద్రంలోని సొర చేపలను కూడా నగరంలోకి తీసుకువస్తుంది. ఇక్కడే ఉంది పెద్ద ట్విస్టు. ఓ పక్క నీళ్ళు, మరో పక్క సొరచేపలు వీటి మధ్య డకోటా, లీసా, అలాగే డీ రాన్ లు ఎలా బ్రతికి బట్టకడతారో అన్నదే థ్రాష్ సినిమా. మొత్తం సినిమాలో ఒకే ఒక దగ్గర దర్శకుడు సినిమా లిబర్టీ తీసుకున్నాడు. మిగతా అంతా మనకు యదార్ధంగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అయ్యాక చాలా కాలం తరువాత మంచి థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అప్పట్లో హాలివుడ్ సినిమా సెన్సేషన్ ట్విస్టర్ తరువాత అంతకన్నా ఎక్కువ థ్రిల్లింగ్ కలిగించే సినిమా ఈ థ్రాష్ అవుతుంది. మస్ట్ వాచ్ ఫర్ థ్రిల్లర్ లవర్స్.- హరికృష్ణ ఇంటూరు
క్రీడలు
గర్జించిన శ్రేయస్, ప్రబ్సిమ్రన్.. పంజాబ్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో జోరు కనబరుస్తోంది. గురువారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ప్రబ్సిమ్రన్ (80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (65) వీరవిహారం చేయడంతో 196 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఛేదించడం విశేషం. ముంబై బౌలర్లలో గజన్ఫర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ఒక దశలో డికాక్, నమన్ ధిర్ల జోరుతో ముంబై ఇండియన్స్ 200 ప్లస్ పరుగులు చేస్తుందనిపించింది. కానీ నమన్ ధిర్ ఔటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 పరుగుల వద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇక ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు ప్రబ్సిమ్రన్, శ్రేయస్ అయ్యర్ పోటీపడి మరీ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. పంజాబ్ దూకుడు ముందు ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముంబై బౌలర్లలో బుమ్రా సహా అందరూ దారాళంగా పరుగు లిచ్చుకున్నారు. సీజన్లో పంజాబ్ వరుసగా నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్ల్లో 4 పరాజయాలతో 9వ స్థానంలో కొనసాగుతోంది.The winning momentum refuses to stop 🌪️A flawless record remains perfectly intact 🛡️Punjab Kings conquer the Wankhede to climb up to the top spot in the table! ❤️Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/LUuZx5nlbf— IndianPremierLeague (@IPL) April 16, 2026
శ్రేయస్ స్టన్నింగ్ క్యాచ్.. షాకైన రోహిత్, సూర్య!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. గురువారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద అయ్యర్ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. అతని స్టన్నింగ్ క్యాచ్ను కళ్లారా చూసిన ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆశ్చర్యపోయారు. మార్కో యాన్సెన్ వేసిన 18వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్ బాదిన హార్దిక్ రెండో బంతిని డాట్ చేశాడు. మూడో బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. సిక్సర్గా దూసుకొచ్చిన బంతిని బౌండరీ లైన్పై అయ్యర్ అద్భుతంగా అందుకొని చాకచక్యంగా లోపలికి విసిరేసాడు. అక్కడే ఉన్న బార్ట్లెట్ ఏ తప్పిదం చేయకుండా అందుకున్నాడు. ఎడమవైపు గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకోవడంతో పాటు అంతే సమర్థవంతంగా అయ్యర్ లోపలికి విసిరేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. క్యాచ్ పూర్తయిన వెంటనే శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు అరవండంటూ ప్రేక్షకులను ఉద్దేశించి సైగలు చేశాడు. అప్పటి వరకు అరిచిన ముంబై ఫ్యాన్స్.. ఈ క్యాచ్తో మౌనం వహించారు. దాంతో వారిని ఇంకా గట్టిగా అరవాలంటూ అయ్యర్ కోరాడు. అయితే అయ్యర్ పట్టిన క్యాచ్కు డగౌట్లో ఉన్న రోహిత్, సూర్యకుమార్లు ఫిదా అయ్యారు. వాట్ ఏ క్యాచ్ అని రోహిత్ సూర్యతో చెబుతున్నట్లు కెమెరాల్లో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.SHREYAS IYER, WHAT HAVE YOU DONE!! 🤯🎥 One of the best catches you would see in the #TATAIPL history 🔥🔥Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6EKgHR82cL— IndianPremierLeague (@IPL) April 16, 2026SKY & ROHIT COULDN'T BELIEVE IT - SHREYAS IYER YOU BEAUTY 😍 pic.twitter.com/lo0McmMaJh— Johns. (@CricCrazyJohns) April 16, 2026
డికాక్ కొత్త చరిత్ర.. ఒక్క సెంచరీతో ఇన్ని రికార్డులా?
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్లో డికాక్కు ఇదే తొలి మ్యాచ్ కాగా, ఆడిన తొలి మ్యాచ్లోనే శతక్కొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో డికాక్ ఒక్క సెంచరీతో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.టీ20 క్రికెట్లో డికాక్కు ఇది 9వ సెంచరీ. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి, రిలీ రోసౌ, సాహిబ్జదా ఫర్హాన్లు కూడా 9 శతకాలతో నాలుగో స్థానంలోనే ఉన్నారు. ఇక విండీస్ వీరుడు క్రిస్ గేల్ 22 శతకాలతో తొలి స్థానంలో ఉండగా, బాబర్ ఆజమ్ (11), డేవిడ్ వార్నర్ (10) శతకాలతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్లు తరఫున సెంచరీలు బాదిన మూడో బ్యాటర్గా డికాక్ నిలిచాడు. 2016లో ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున ఆర్సీబీతో మ్యాచ్లో 108 పరుగులు, 2022లో లక్నో సూపర్జెయింట్స్ తరఫున కేకేఆర్తో మ్యాచ్లో 140 నాటౌట్, తాజాగా పంజాబ్తో మ్యాచ్లో అజేయ శతకంతో మెరిశాడు. గతంలో సంజూ శాంసన్ (ఢిల్లీ, రాజస్తాన్, సీఎస్కే), కేఎల్ రాహుల్ (పంజాబ్, ఢిల్లీ, లక్నో) ఈ ఫీట్ సాధించారు. మరో విశేషమేమిటంటే ఈ ముగ్గురు కూడా వికెట్ కీపర్లే కావడం గమనించాల్సిన అంశం.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున పంజాబ్పై సెంచరీ సాధించిన రెండో బ్యాటర్గా డికాక్ నిలిచాడు. 2014లో లెండిల్ సిమ్మ న్స్ (100 నాటౌట్) పంజాబ్పై తొలి సెంచరీ సాధించాడు.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో డికాక్ చోటు సంపాదించాడు. సనత్ జయసూర్య (114 నాటౌట్) తొలి స్థానంలో ఉంటే డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ (109 నాటౌట్, 105 నాటౌట్) ముంబై తరపున రెండుసార్లు తన బెస్ట్ స్కోర్లు నమోదు చేశాడు.ఐపీఎల్ 2026 సీజన్లో డికాక్ది రెండో సెంచరీ. సీఎస్కే ఓపెనర్ సంజూ శాంసన్ ఈ సీజన్లో తొలి సెంచరీ సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు.పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు.𝑸𝒖𝒊𝒕𝒆 𝒅𝒆 𝑲𝒏𝒐𝒄𝒌! 👏#MIvPBKSpic.twitter.com/ZmfClFOpm8— Mumbai Indians (@mipaltan) April 16, 2026What a player, what a knock, and what a way to start the season! 💯Quinton de Kock, take a bow for a truly special Wankhede hundred! 👏Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @mipaltan pic.twitter.com/jEhH1ofb1z— IndianPremierLeague (@IPL) April 16, 2026చదవండి: ఐపీఎల్లో సెంచరీ కొట్టిన అర్ష్దీప్
ఐపీఎల్లో సెంచరీ కొట్టిన అర్ష్దీప్
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే అర్ష్దీప్ సెంచరీ నమోదు చేసింది బ్యాటింగ్లో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే బౌలింగ్లో అర్ష్దీప్ ఈ ఫీట్ను సాధించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఓపెనర్ రికెల్టన్ను ఔట్ చేయడం ద్వారా అర్ష్దీప్ ఐపీఎల్లో వంద వికెట్ల మార్క్ను చేరుకున్నాడు. ఐపీఎల్లో వంద వికెట్లు సాధించి ఐదో లెఫ్టార్మ్ పేసర్గా, నాలుగో భారత బౌలర్గా నిలిచాడు. ఇంతకముందు ట్రెంట్ బౌల్ట్ (144 వికెట్లు), ఉనాద్కట్ (114 వికెట్లు), ఆశిష్ నెహ్రా (106 వికెట్లు), జహీర్ ఖాన్ (102 వికెట్లు) ముందున్నారు. ఇక పవర్ ప్లేలో అర్ష్దీప్ వికెట్ తీసుకోవడం 11 ఇన్నింగ్స్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.Back-to-back breakthroughs 🎯A century of #TATAIPL wickets 🌟Arshdeep Singh becomes the first @PunjabKingsIPL bowler to reach the milestone 👏Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @arshdeepsinghh pic.twitter.com/ioOXVqbfWX— IndianPremierLeague (@IPL) April 16, 2026 #MI in 𝗱𝗲𝗲𝗽 trouble 😯🎥 Arshdeep Singh with 2️⃣ wickets in his second over 👊Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6zPnONpClJ— IndianPremierLeague (@IPL) April 16, 2026
న్యూస్ పాడ్కాస్ట్
మత్స్యకారుల కడుపుపై తంతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు కుట్ర... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
చట్టసభల్లో చారిత్రక మలుపు... లోక్సభ స్థానాలు 850కి పెంపు... రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం... డిమాండ్లపై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్... అణ్వాయుధాలు, హార్మూజ్పైనే పీటముడి
ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు షురూ. మరో దఫా చర్చించే అవకాశం
భారీగా పడిపోతున్న బంగారం ధరలు
అమరావతిలో నీకింత.. నాకింత... ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన ‘బీఎస్సార్’కు రాజధానిలో భారీగా పనుల అప్పగింత
ఆంధ్రప్రదేశ్లో ‘సీఎంఆర్ఎఫ్’ నిధులు స్వాహా... టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి సీఎంవో వరకూ వసూళ్ల పర్వం
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మావిగన్.. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు: వైఎస్ జగన్
ఇరాన్ను తుడిచిపెట్టేస్తాం, వారి నాగరికతను నాశనం చేస్తాం. తీవ్రంగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
బిజినెస్
కంపెనీల్లో ఇదేం నీతి? దెబ్బకు హెచ్ఆర్ సైలెంట్!
కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల రాజీనామాలు, నోటీసు పీరియడ్ల విషయంలో అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముంబైకి చెందిన కంటెంట్ స్ట్రాటజిస్ట్ నిషాంత్ జోషి పంచుకున్న ఒక ఘటన ఇందుకు ఆజ్యం పోసింది. తన సహోద్యోగికి కొత్త ఉద్యోగం వచ్చినప్పుడు, 90 రోజుల నోటీసు పీరియడ్ తగ్గించాలని కోరగా.. అది ‘వృత్తిపరమైన నైతికత’ (Professional Ethics) అని హెచ్ఆర్ విభాగం బదులిచ్చింది. దీనికి ఆ ఉద్యోగి స్పందిస్తూ.. ‘గత నెలలో కంపెనీ మొత్తం డిజైన్ టీమ్ను ఉన్నపళంగా తొలగించినప్పుడు ఈ నైతికత ఏమైంది?’ అని ప్రశ్నించడంతో హెచ్ఆర్ నోట మాట రాలేదని జోషి పేర్కొన్నారు.ద్వంద్వ నీతిపై ఆగ్రహంఉద్యోగులు వెళ్లేటప్పుడు మూడు నెలల సమయం కావాలని కోరే కంపెనీలు, వారిని తొలగించేటప్పుడు మాత్రం కనీస సమయం కూడా ఇవ్వకపోవడంపై నిషాంత్ జోషి విమర్శలు గుప్పించారు. ‘సంస్థ మిమ్మల్ని తీసివేయాలనుకున్నప్పుడు తెల్లవారుజామునే మీ ఆఫీస్ అకౌంట్లు అన్నీ డిసేబుల్ అవుతాయి.. అక్కడ అప్పగింతలు (Handover) ఉండవు, గౌరవం ఉండదు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 90 రోజుల నోటీసు పీరియడ్ అనేది పని సజావుగా సాగడం కోసం కంటే, ఉద్యోగి వేరే అవకాశాలకు వెళ్లకుండా అడ్డుకోవడానికే ఎక్కువగా ఉపయోగపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.నెటిజన్ల మద్దతుఈ పోస్ట్పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. అనేకమంది తమ సొంత అనుభవాలను పంచుకుంటూ, కొత్తగా చేర్చుకునే అభ్యర్థి వెంటనే రావాలని కోరుకునే సంస్థలు, పాత ఉద్యోగిని మాత్రం 90 రోజులు వదలకపోవడం విడ్డూరమని మండిపడుతున్నారు. ఐటీ కన్సల్టింగ్ రంగంలో మొదలైన ఈ 90 రోజుల నిబంధన ఇప్పుడు అన్ని రంగాలకు పాకి ఉద్యోగులను వేధించే సాధనంగా మారిందని మరికొందరు విమర్శించారు. వృత్తిపరమైన నైతికత అనేది కేవలం ఉద్యోగులకే కాదు, సంస్థలకు కూడా వర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.మార్పు అవసరంఈ చర్చ ద్వారా కార్పొరేట్ నిబంధనల్లో మార్పు రావాల్సిన అవసరాన్ని నెటిజన్లు నొక్కి చెప్పారు. 90 రోజుల నోటీసు పీరియడ్ అనేది కాలం చెల్లిన పద్ధతి అని, ఇది ఉత్పాదకతను తగ్గించడమే కాకుండా ఉద్యోగి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంపెనీలు తమ ప్రయోజనాలతో పాటు ఉద్యోగుల కెరీర్ వృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సరళీకృతం చేయాలని, పరస్పర అవగాహనతో కూడిన పని వాతావరణం ఉండాలని ఈ చర్చ సారాంశం.ఇదీ చదవండి: ‘టెక్ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు..
లాభాలకు బ్రేక్.. పడిపోయిన బ్యాంక్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. బ్యాంక్, ఆటో షేర్లకు అమ్మకాల ఒత్తిడితో నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలు తమ గరిష్టాలను కోల్పోయాయి.బీఎస్ ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 122.56 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టపోయి 77,988.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 34.55 పాయింట్లు లేదా 0.14 శాతం క్షీణించి 24,196.75 వద్ద ముగిసింది.నిఫ్టీ 50 ఇండెక్స్ లో హెచ్డీఎఫ్ సీ బ్యాంక్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్ సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.63 శాతం, 0.83 శాతం పెరిగాయి.రంగాల వారీగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ మెరుగైన పనితీరు కనబరిచగా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్ లూజర్స్ గా ఉద్భవించాయి.
మారుతి పాపులర్ చిన్న కారు నిలిపివేత!
భారతీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తన పాపులర్ టాల్బాయ్ హ్యాచ్బ్యాక్ 'ఇగ్నిస్' (Ignis) ఉత్పత్తిని నిశ్శబ్దంగా నిలిపివేసింది. మార్కెట్లో డిమాండ్ తగ్గడం, అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితమే దీని ఉత్పత్తి నిలిచిపోయినట్లు డీలర్ వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం డీలర్లు ఈ కారు కోసం కొత్త బుకింగ్లను తీసుకోవడం నిలిపివేసినప్పటికీ, అధికారిక నెక్సా (NEXA) వెబ్సైట్లో మాత్రం ఈ మోడల్ ఇంకా లిస్టింగ్లో కనిపిస్తోంది.2017లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఇగ్నిస్, తన విభిన్నమైన డిజైన్, డ్రైవింగ్ డైనమిక్స్తో యువతను ఆకట్టుకుంది. 2020లో ఫేస్లిఫ్ట్ వెర్షన్ ద్వారా మరిన్ని అప్డేట్లను పొందిన ఈ కారు, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో 83bhp శక్తిని, 113Nm టార్క్ను అందించేది. ఫీచర్ల పరంగా 7-అంగుళాల స్మార్ట్ప్లే టచ్స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, క్లైమేట్ కంట్రోల్, ఎయిర్క్రాఫ్ట్ స్టైల్ స్విచ్లు దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. భద్రత కోసం ఏబీఎస్, ఈబీడీ, ఐసోఫిక్స్ మౌంట్ల వంటి ప్రామాణిక ఫీచర్లతో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉండేది.పంచ్కు పోటీ వస్తోందా?ఇగ్నిస్ నిష్క్రమణతో మారుతి సుజుకి తన దృష్టిని ఇప్పుడు సరికొత్త మైక్రో ఎస్యూవీ వైపు మళ్లించింది. ప్రస్తుతం 'Y43' అనే కోడ్నేమ్తో అభివృద్ధి చెందుతున్న ఈ కొత్త కారు, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది నేరుగా టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి బలమైన మోడళ్లతో పోటీ పడనుందని చెబుతుతున్నారు. ఇగ్నిస్ స్థానాన్ని భర్తీ చేయనున్న ఈ కొత్త ఎస్యూవీ, మారుతి సుజుకి పోర్ట్ఫోలియోలో బ్రెజ్జా కంటే దిగువన ఉండి, నెక్సా ప్రీమియం డీలర్షిప్ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది.రాబోయే Y43 మోడల్ 1.2 లీటర్ 'డ్యూయల్ జెట్' పెట్రోల్ ఇంజిన్తో వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇగ్నిస్ కేవలం హై-రైడింగ్ హ్యాచ్బ్యాక్గా మాత్రమే పరిమితమవ్వగా, కొత్త మోడల్ పూర్తిస్థాయి మైక్రో ఎస్యూవీ లుక్, ఫీచర్లతో రానుంది. పంచ్ వంటి కార్లు ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న నేపథ్యంలో, మారుతి కూడా తన కొత్త ఉత్పత్తితో గట్టి పోటీ ఇవ్వాలని ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట!
సాంకేతిక ప్రపంచంలో పారదర్శకత, భద్రత గురించి గొప్పలు చెప్పుకునే యాపిల్, గూగుల్ సంస్థల అసలు రంగు బయటపడిందని కొందరు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అశ్లీలతను, ఏకాభిప్రాయం లేని లైంగిక కంటెంట్ను ప్రోత్సహించబోమని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఈ టెక్ దిగ్గజాలు వాస్తవానికి ‘న్యూడిఫై’(లైంగిక పరమైన) యాప్ల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాయని ‘టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్’ (టీటీపీ) తాజా నివేదికలో బయటపెట్టింది.కోట్లలో డౌన్లోడ్లు.. వందల కోట్లలో ఆదాయం!టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం, యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లలో కృత్రిమ మేధ సాయంతో సాధారణ వ్యక్తుల, సెలబ్రిటీల ఫొటోల నుంచి దుస్తులను తొలగించి నగ్నంగా మార్చే అన్డ్రెస్ లేదా న్యూడిఫై యాప్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ తరహా యాప్లు ఇప్పటివరకు సుమారు 483 మిలియన్ల సార్లు డౌన్లోడ్ అయ్యాయి. యాప్ మ్యాజిక్ గణాంకాల ప్రకారం, వీటి ద్వారా ఈ కంపెనీలు 122 మిలియన్ డారల్లు (సుమారు రూ.1,000 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించాయి. యాపిల్ స్టోర్లో 18, గూగుల్ ప్లే స్టోర్లో 20 ఇలాంటి యాప్లను పరిశోధకులు గుర్తించారు.సెర్చ్ చేస్తే చాలు.. ప్రకటనలే స్వాగతం!వినియోగదారులు యాప్ స్టోర్ల్లో న్యూడిఫై వంటి పదాల కోసం వెతికినప్పుడు ఈ యాప్లు కనిపించడమే కాకుండా కంపెనీలు స్వయంగా వాటికి సంబంధించిన ప్రకటనలను కూడా ప్రదర్శిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా ఆటోకంప్లీట్ ఫీచర్ ద్వారా వినియోగదారులను నేరుగా ఇటువంటి అశ్లీల యాప్ల వైపు మళ్లిస్తున్నాయని నివేదిక తీవ్రంగా విమర్శించింది. ‘ఈ కంపెనీలు కేవలం యాప్లను ఆమోదించడమే కాదు, వాటి ద్వారా లాభం పొందుతూ వినియోగదారులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి’ అని టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేటీ పాల్ అన్నారు.నిబంధనలు ఏం చెబుతున్నాయి?యాపిల్ మార్గదర్శకాలు బహిరంగ లైంగిక లేదా అశ్లీల కంటెంట్ను స్పష్టంగా నిషేధిస్తున్నాయి. గూగుల్ సైతం వ్యక్తులను దిగజార్చే ‘ప్రాంక్’ పేరుతో బట్టలు విప్పినట్లు చూపే యాప్లను అనుమతించబోమని చెబుతోంది. అయితే, ఫొటో ఎడిటింగ్ యాప్లుగా ముసుగు వేసుకుని వచ్చే ఇటువంటి సాఫ్ట్వేర్లను గుర్తించడంలో ఈ కంపెనీలు విఫలమవుతున్నాయి.అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడినగ్నత్వ యాప్ల వల్ల మహిళలు, చిన్నారుల భద్రత ప్రమాదంలో పడుతోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ‘టేక్ ఇట్ డౌన్’ చట్టంపై సంతకం చేశారు. ఇది ఏకాభిప్రాయం లేని లైంగిక చిత్రాలను ప్రచురించడాన్ని నేరంగా పరిగణిస్తుంది. అశ్లీల చిత్రాలను తొలగించని టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లను విచారించేలా యూకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది.దిద్దుబాటా? కంటితుడుపు చర్యలా?బ్లూమ్బెర్గ్, టీటీపీ నివేదికల అనంతరం, యాపిల్ సుమారు 15 యాప్లను తొలగించినట్లు తెలిపింది. గూగుల్ కూడా పలు యాప్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. అయితే, ఒకసారి తొలగించిన యాప్లు కొన్ని నెలలకే మళ్లీ కొత్త పేర్లతో ప్రత్యక్షమవుతున్నాయని, టెక్ దిగ్గజాల పర్యవేక్షణ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం లాభాల కోసం నైతికతను పక్కన పెడుతున్న ఇలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: కాకమీదున్న పసిడి ధరలు
ఫ్యామిలీ
ఇద్దరు పిల్లలతో నిస్సహాయ స్థితి నుంచి మున్సిపల్ కమిషనర్గా..!
వైవాహిక జీవితంలో ముసిరిన చీకట్లు ఊపిరి సలపనివ్వలేదు. పోనీ పిల్లలు పుట్టాకన్నా.. తన స్థితి మారుతుందనుకుంటే మరింత నరకప్రాయమైంది. చేతిలో ఇద్దరు పిల్లలతో అక్కడే ఉండాలా? బయటకు వచ్చేయాలా? అన్న మీమాంస..ఇక తప్పని స్థితిలో ఇంటి నుంచి ఒంటరిగా ఇద్దరి పిల్లలతో బయటపడింది. అలా అనాడు నిస్సహాయ స్థితిలో అందరి జాలి చూపులతో కనిపించిన ఆ అభాగ్యురాలు.. ఇవాళ అందరు చేతులెత్తి సలాం కొట్టే పొజిషన్కి చేరుకుంది. ఓ జిల్లాకే అధికారిగా పాలన చేస్తూ..స్ఫూర్తిగా నిలిచారామె. పరిస్థితులు మన జీవితాన్ని తలకిందులు చేస్తాయేమో..కానీ మన మనః స్థితిని కాదు అని అంటారామె.ఆ అసామన్య ధీరురాలే సవితా ప్రధాన్. మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లా మడై గ్రామంలో ఓ ఆదివాసి కుటుంబంలో పెరిగారు. తండ్రి వరి కోయడం, బీడి ఆకులు ఏరడం, మహువా పువ్వులు సేకరించడం వంటి పనులు చేస్తుంటాడు. ఓ పల్లెటూరి అమ్మాయిలా పెరిగినా సవితా ఇంటర్ పూర్తి చేసిన కొద్ది రోజులకే 16వ ఏటనే పెళ్లి చేశారు. అది కూడా తన కంటే పదకొండేళ్లు పెద్దవాడైన వ్యక్తితో వివాహం చేశారు. అయితే అత్తగారింట్లో ఆమె జీవితం నరకప్రాయంగా ఉండేది. భర్త, అత్తమామలు, ఆడపడచు వేధింపులకు తాళ్లలేకపోయింది. పిల్లలు పుడితే అంతా సర్దుకుంటుందని నచ్చచెప్పేవారు తల్లిదండ్రులు. ఇద్దరు కుమారులు అథర్వ, యూజుస్లు పుట్టాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోగా, మరింత దిగజారింది. ఇక తన వల్ల కాదంటూ ఇద్దరు పిల్లలతో బయటకొచ్చేసింది. చాలా తక్కువ వస్తువులతో బయటకొచ్చిన ఆమె ఒక బంధువు ఇంట్లో చేరి స్థానిక బ్యూటీపార్లర్లో పనిచేసింది. అంతటి నిస్సహాయ స్థితిలో ఉన్న సవితకు ఎలాంటి భరోసా లేదు. కనీసం ఆర్థిక సాయం కూడా లేదు. పైగా ముందుకు సాగడానికి స్పష్టమైన మార్గం కూడా లేదు. తనకు తన పిల్లలకు ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవాలనే అచంచలమైన సంకల్పం మాత్రమే ఉంది. అదే ఆమెను ధైర్యంగా నడిపించేది. ఇంటర్తో ఆపిన చదువుని మళ్లీ కొనసాగించాలని నిశ్చయించుకుంది. ఎక్కువ గంటలు పనిచేస్తూ..మరోవైపు తన కుమారులను ఒంటరిగా పెంచుతూ చదువు కొనసాగించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మకమైన పరీక్ష అయినా మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేరవ్వడం ప్రారంభించింది. అయితే ఎలాంటి కోచింగ్లు లేవు, కనీసం విద్యాపరమైన మద్దతు కూడా లేదు. తీరిక సమయంలోనే చదువుకోవడం ఒక్కటే తప్ప ఇంకే వెసులుబాటు లేదు. అయినప్పటికీ 2005 ఎంపీపీఎస్సీ పరీక్ష రాసి తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారామె. అప్పుడామెకు పోలీస్ సర్వీస్ స్థానంలో పోస్ట్ వచ్చింది. అయితే సవితకు పరిపాలన సేవ చేయడమే ఇష్టం అందుకని మరోసారి 2006లో ఎంపీపీఎస్సీ పరీక్ష రాసి తను కోరుకున్న పోస్ట్ని సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 83వ ర్యాంకు సాధించి మధ్యప్రదేశ్ పరిపాలన సర్వీస్ అధికారిణిగా స్థానం పొందారు. ఆమె తన వృత్తి జీవితాన్ని నరసింగ్పూర్ జిల్లాలోని గోటేగావ్ మున్సిపల్ కౌన్సిల్లో ప్రారంభించారు. ఆ తర్వాత గ్వాలియర్లోని పట్టణ పరిపాలన అభివృద్ధి శాఖలో జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె సింగ్రౌలి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆమె ఐఏఎస్ కాదు..అయితే సవితా కథను పలు మీడియాల్లో ఐఏఎస్గా అభివర్ణించాయి. ఆ విషయాన్ని స్పష్టంగా చేసేందుకు మళ్లీ ఇవాళ మీడియా ముందుకొచ్చారు. తాను మధ్యప్రదేశ్ పరిపాలనా సేవా అధికారిణి అయిన PCS అధికారిణిని మాత్రమేనని, భారత పరిపాలనా సేవ (IAS) సభ్యురాలిని కాదని స్పష్టం చేశారు. PCS అంటే ప్రధానంగా ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ (Provincial Civil Service) అని అర్థం. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నిర్వహించే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇక సవితా భవిష్యత్తులో ఐఏఎస్గా పదోన్నతి పొందే అవకాశం ఉన్నప్పటికీ..ప్రస్తుతానికి తాను ఏ హోదాలో ఉన్నానో దానికే గర్విస్తున్నానని క్లియర్గా చెప్పారు. అయితే పలు మీడియా కథనాల్లో తనను ఐఏఎస్ అధికారిగా చెబుతూ ఏవేవో రాసేశారని, అదంతా కరెక్ట్ కాదంటూ తన స్టోరీని చెప్పుకొచ్చారామె. ఇక సవితా ప్రధాన్ కథ అసంతృప్తికరమైన వైవాహిక బంధం, చేతిలో ఇద్దరి పిల్లల బాధ్యత అయినా జీవితంపై ఆశ వదులుకునేందుకు ఇష్టపడ లేదు. తనకెదురైన కష్టాలకు ఎదురెళ్లి మరీ..శివంగిలా పోరాడింది. పోనీ పుట్టింట వాళ్లు సైతం ఆదుకోలోని పరిస్థితే అయినా..తన తలరాతను చూసి తిట్టుకుంటూ కూర్చోలేదు. ఎలాగైన తన జీవితాన్ని కన్నీళ్లమయంగా కాదు కాంతిమయం మార్చుకోవాలి, ఆనందకరంగా జీవించాలి అని అనుకుంది. కోరుకున్నట్లుగానే సాధించింది, "దటీజ్ సవితా" అని అనిపించుకున్నారామె.(చదవండి: తొలి అంధ బధిర న్యాయవాది..! చిమ్మ చీకటి నుంచే సక్సెస్ అందుకుంది..!)
అక్షరాలా... మహిళా సాధికారతకే ఓటు
‘మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు?’ అనే ప్రశ్నకు 360 డిగ్రీల కోణంలో సమగ్రంగా చెప్పే జవాబులు ఎన్నో ఉన్నాయి. అలాంటి జవాబులకు ఉపయోగపడే పుస్తకం... ఉమెన్ అండ్ రిజర్వేషన్స్ ఇన్ ఇండియా. తరుణ్ బెహూరియా రాసిన ఈ పుస్తకంలో రిజర్వేషన్ల ప్రాముఖ్యత, మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితంపై దాని ప్రభావాన్ని గురించి వివరంగా చర్చించారు. ‘సరిౖయెనప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం అవసరం’ అనే అంశంతో ‘ఉమెన్ అండ్ రిజర్వేషన్ ఇన్ ఇండియా’ పుస్తకం రాశారు. పంచాయతీరాజ్లో రిజర్వేషన్ల ప్రభావం, భారతదేశంలో మహిళా సాధికారత: రాజకీయ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు: ఒక సామాజిక అవసరం, జాతీయ బాధ్యత, భారతదేశంలో మహిళలకు కోటాల అమలు, మహిళా రిజర్వేషన్ బిల్లు: మహిళా సాధికారతకు ఒక మైలురాయి. స్థానిక స్వపరి పాలన, మహిళలు, రాజకీయ భాగస్వామ్యం: శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్... ఇలా ఆసక్తికరమైన చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా భారత రాజకీయ చరిత్ర, ΄÷రుగుదేశాలలో మహిళల రాజకీయ భాగస్వామాన్ని గురించి వివరించే పుస్తకం... ఉమెన్స్ రిజర్వేషన్ అండ్ పాలిటిక్స్– పోస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. భారతదేశంలో మహిళలకు ఉన్న రిజర్వేషన్లను విశ్లేషించే ప్రయత్నమే ఈ పుస్తకం. నాలుగు విభాలుగా విభజించిన ఈ పుస్తకం మహిళా రిజర్వేషన్ చట్టంలోని వివిధ కోణాలను వివరిస్తుంది.
...ఆల్ ది బెస్ట్
భారతీయ మహిళలకు ఆల్ ది బెస్ట్. చైతన్యవంతమైన తెలుగింటి మహిళలకు ఆల్ ది బెస్ట్. మేధస్సులో, దార్శనికతలో, భవిష్యత్తు నిర్మాణంలో గొప్ప దక్షత, దీక్ష కలిగిన మన నారీశక్తికి ఆల్ ది బెస్ట్. అదిగో... చట్టసభల్లో స్త్రీలకు సంబంధించిన గొప్ప ఘట్టానికి తెర లేవనుంది. నేటి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది. ఎన్నాళ్ల కల ఇది! ఎన్నో తరాల కల. అందుకే ఇది చారిత్రాత్మక ఘట్టం. ప్రజాస్వామ్యంలో స్త్రీలకు సమాన భాగస్వామ్యం ఉందని చాటే అపురూప ఘట్టం. ఇక చట్టసభల్లో స్త్రీల గళం మరింత బలంగా వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది. విధాన నిర్ణయాల్లో స్త్రీ దృక్పథం చేరితే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని స్త్రీలు చూపబోతున్నారు. ఇంటిని నడిపిన అనుభవంతో దేశాన్ని నడిపే సామర్థ్యం స్త్రీలకు ఉంది. ఈ బిల్లు కేవలం సీట్ల గురించి కాదు, గౌరవం గురించి. ఆత్మగౌరవం గురించి. స్త్రీలు ద్వితీయశ్రేణి పౌరులు కాదని ఎలుగెత్తి చాటడం గురించి. ఈ సందర్భం స్త్రీల పోరాటానికి, పట్టుదలకు తార్కాణం. చర్చ సజావుగా సాగి, బిల్లు కార్యరూపం దాల్చాలని ఆకాంక్షిద్దాం. ఒక కొత్తప్రారంభానికి సిద్ధమవుదాం. భారత నారీ శక్తికి మరోసారి ఆల్ ది బెస్ట్. ... మీరు గెలవాలి!మహిళలకు అధికారం ఇస్తే వారు ఎంత అద్భుతంగా పనిచేస్తారో అనడానికి మన గ్రామ పంచాయతీలే నిదర్శనం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 14.5 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులుగా పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. తాగునీటిప్రాజెక్టుల అమలులో సుమారు 60% పైగా మెరుగుదల కనిపించినట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది మహిళా నాయకత్వం స్థానిక పాలనను ప్రజల అవసరాలకు మరింత దగ్గరగా తీసుకువస్తుందని స్పష్టంగా చూపిస్తుంది.అప్పుడే సంపూర్ణ ప్రజాస్వామ్యంప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, పార్లమెంటులో మహిళలప్రాతినిధ్యం సగటున 27.5%గా ఉంది. మహిళ లప్రాతినిధ్యం పెరిగిన దేశాల్లో సమాజం ఎంతోవేగంగా అభివృద్ధి చెందిందని గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, ప్రపంచంలోనే అత్యధికంగా 64% మంది మహిళలు పార్లమెంటులో ఉన్న రువాండాలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అక్కడ మహిళా నాయకత్వం వల్ల భూమిపై మహిళలకు సమాన హక్కులు కల్పించే చట్టాలు వచ్చాయి, ప్రస్తుతం అక్కడ 26% భూమి మహిళల పేరు మీదనే ఉంది. తల్లి మరణాల రేటు సగానికి పైగా తగ్గడమే కాకుండా, ఆడపిల్లలందరికీప్రాథమిక విద్య అందేలా అక్కడి మహిళా నాయకులు అద్భుతమైన కృషి చేశారు. అర్జెంటీనా వంటి దేశాల్లో 42.4% మంది మహిళలు చట్టసభల్లో ఉండటం వల్ల మహిళల హక్కులకు సంబంధించిన బిల్లుల సంఖ్య భారీగా పెరిగింది. కుటుంబాల్లో మహిళలు చేసే అప్రకటిత సేవలకు (అన్పెయిడ్ కేర్ వర్క్) గుర్తింపు తెచ్చేలా వారు విధానాలను మార్చగలిగారు.సామాజిక జీవనం మారి పోయిందిస్వీడన్, నార్వే వంటి నార్డిక్ దేశాల్లో మహిళలప్రాతినిధ్యం 45% పైగా ఉండటం వల్ల అక్కడ సామాజిక జీవనమే మారి పోయింది. పిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవడమే కాకుండా, తండ్రులకు కూడా సమానంగా పేరెంటల్ లీవ్స్ ఇచ్చేలా చట్టాలను రూపొందించారు. దీనివల్ల మహిళలు ఉద్యోగాల్లో, వ్యా పారాల్లో రాణించడానికి గొప్ప అవకాశం దక్కింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా 21% పైగా మహిళాప్రాతినిధ్యం ఉండటం వల్ల పేద కుటుంబాల సంక్షేమంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. జనాభాలో సగం ఉన్న మహిళలు నిర్ణయాధికారంలో భాగస్వాములు కావడం ద్వారా మాత్రమే సమ్మిళిత ప్రజాస్వామ్యం సంపూర్ణమవుతుంది. ఎన్ని సవాళ్లు ఉన్నా...ఈ రిజర్వేషన్ల విధానం సమాన అవకాశాలు అనే రాజ్యాంగప్రాథమిక సూత్రాన్ని దెబ్బతీస్తుందని కొందరు విమర్శకులు భావిస్తారు. రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక వారి అర్హతలు, ప్రజాబలం, సిద్ధాంతాల ఆధారంగా జరగాలి కానీ, కేవలం జెండర్ ఆధారంగా జరగకూడదని వారు వాదిస్తారు. చట్టసభల్లో మహిళలకు స్థానాలు కేటాయించినప్పటికీ, వాస్తవంగా వారి కుటుంబాల్లోని పురుషులే పెత్తనం చెలాయించే అవకాశం ఉందనే విమర్శలు బలంగా ఉన్నాయి. అలాగే, ఓటర్ల స్వేచ్ఛ పరిమితం అవుతుందని, పార్టీల అంతర్గత విభేదాలు తలెత్తి భవిష్యత్తులో ఇతర వర్గాల నుండి కూడా ఇలాంటి కోటా డిమాండ్లు పుట్టుకొచ్చి వ్యవస్థను సంక్లిష్టం చేస్తాయనే ఆందోళనలు ఉన్నాయి. పలువురు మహిళా నాయకులు సైతం తమను కేవలం ఒక మహిళగా కాకుండా, తమ నాయకత్వ పటిమతో గుర్తింపు పొందాలని కోరుకోవడం కూడా గమనించాల్సిన అంశం. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, మహిళలకుప్రాతినిధ్యం కల్పించే విధానం కేవలం రాజకీయ స్థానాలను పెంచే సాధారణ చర్య కాదు. ఇది భారతీయ సమాజాన్ని మరింత సమానత్వపూర్వకంగా మలిచే ఒక గొప్ప నిర్మాణాత్మక సంస్కరణ. చట్టసభల్లో మహిళలు అడుగుపెట్టడం వల్ల విధానాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా మానవీయ కోణాన్ని సంతరించుకుంటాయి. చట్టసభల వేదికగా మహిళలు ధైర్యంగా మాట్లాడటం, బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువతులకు వారు సజీవ ఆదర్శంగా, మార్గదర్శకులుగా నిలుస్తారు.– బాల లత మల్లవరపు సివిల్స్ మెంబర్, డైరెక్టర్, ధనిక్ భారత్ప్రోత్సాహం అవసరంమామూలుగా ఒక బిల్లు అమలు చేయనున్నారనే వార్త రాగానే అందరం థ్యాంక్స్ చెబుతాం... ఎన్నో మాట్లాడతాం. కానీ ఆ బిల్లు పాస్ అవ్వాలి.. అంతటితో ఆగకూడదు... అమలు చేశాక దాని తాలూకు పనులు సరిగ్గా జరుగుతున్నాయా... లేదా అనేది ముఖ్యం. ఎన్నికలు దగ్గర పడుతున్న ప్రతిసారీ మహిళల కోసం ఏదో చేస్తాం అని మాటలు చెబితే చాలామంది నమ్మే పరిస్థితుల్లో లేరు. చెప్పినది అమలు చేయాలి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇలాంటివి అమలు చేసినా... చేయక పోయినా అన్ని రంగాల్లో మహిళలు తమను నిరూపించుకుంటున్నారు. పాలిటిక్స్, జర్నలిజమ్, డాక్టర్స్, పైలట్స్... ఇలాంటి రంగాల్లో ముందుంటున్నారు. కష్టమైనా, ఒడిదుడుకులు ఎదురైనా తమ కలలను నిజం చేసుకుంటున్నారు. అయితే జనరల్గా మహిళల శాతం ఏ రంగంలో అయినా తక్కువే ఉంటోంది. అంతెందుకు? పొలిటికల్ మీటింగ్స్ తీసుకోండి... 20 మంది మగవాళ్లు ఉంటే అందులో ఓ ముగ్గురు లేదా నలుగురు మహిళలు ఉంటే అది పెద్ద విషయం. అదే ఒక బిల్లు పాస్ అయినప్పుడు, అది ఒక ‘లా’ అయినప్పుడు కేటాయించిన ‘శాతం’లో మహిళలకు పూర్తి అవకాశం దక్కుతుంది. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మహిళలదే. రూరల్ ఏరియాస్లో కొన్ని చోట్ల ఇంకా మహిళల పట్ల కాస్త వివక్ష ఉందనిపిస్తోంది. చె΄్పాలంటే ఈ విషయంలో నార్త్ కంటే సౌత్ కొంత బెస్ట్. అక్కడితే పోలిస్తే ఇక్కడ మహిళలకు ప్రోత్సాహం కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే ‘గ్రాస్ రూట్’ లెవల్లో ఉన్న అమ్మాయిలకు ఇంకా ఎంకరేజ్మెంట్ అవసరం. ఇప్పుడు మారుమూలప్రాంతాల్లో కూడా అమ్మాయిలను చదివిస్తున్నారు. ఆ తర్వాత కూడా వాళ్లను ఎంకరేజ్ చేయాలి. ‘గ్రాస్ రూట్’ లెవల్ నుంచి ఆ నెక్ట్స్ లెవల్ వరకూ అందరూ ముందుకు వస్తే అప్పుడు మొత్తం 33 శాతం రిజర్వేషన్ ఫుల్ అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఆ చట్టం అమలులోకి తెచ్చినా మహిళలు సద్వినియోగం చేసుకోక పోతే ఇక ఉపయోగం ఏం ఉంటుంది? అందుకే ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పదలచుకున్నాను. కాస్త ధైర్యంగా మాట్లాడే మహిళలను ఎలా ఎదగనివ్వకుండా చేయాలా... అని కొంతమంది చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడి, అనుకున్నది సాధించిన మహిళలు ఉన్నారు. వాళ్లని స్ఫూర్తిగా తీసుకోవాలి. మహిళలకు కేటాయించినవి దక్కించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ముందుకు రండి... నిరూపించుకుని నిలబడండి. – జయసుధ, నటిఇదో గొప్ప ముందడుగుఈ 33 శాతం రిజర్వేషన్ బిల్లు మహిళా సాధికారతకు భరోసా ఇస్తుంది. నారీ శక్తి కేవలం మాటలకే పరిమితం కాదు, ప్రధాని దానిని మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, చెందుతుంది అంటే మహిళలకు సాధికారత కల్పించినప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ బిల్లు వ్యవస్థపై, పాలకవర్గంపై విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది. ఈ బిల్లు ఒక గొప్ప ముందడుగు, ఒక కల నిజమైన క్షణం. – ఖుష్బూ, నటిస్ఫూర్తిదాయకం33 శాతం బిల్లు అనేది కచ్చితంగా ఆహ్వానించదగ్గది. మహిళలకు ఎక్కువ అవకాశం కల్పించే ఇలాంటి నిర్ణయాలు స్వాగతించదగ్గవి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటే బాగుంటుంది. రాజకీయాలైనా, సినిమా అయినా... ఏ రంగం అయినా మనకు వచ్చిన చాన్స్ని ఉపయోగించుకోవాలి. సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడాలి. క్రియేటివ్ ఫీల్డ్లో ఇలాంటి రిజర్వేషన్లు ఉండవు. కానీ, 33 శాతం అనేది ఇతర రంగాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాలి. ప్రతిభకు తగ్గ గుర్తింపు ఇవ్వాలి. అలాగే ఎవరో ఒకరు ప్రోత్సహించాలని ఆశించకుండా అమ్మాయిలు తమకు తాముగా కూడా ముందడుగు వేయాలి. – మానస శర్మ, యువ దర్శకురాలుఐపీయూ (ఇంటర్– పార్లమెంటరీ యూనియన్) అనేది ప్రపంచవ్యాప్తంగా జాతీయ పార్లమెంట్లకు సంబంధించిన సంస్థ. దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఏర్పాటైంది. పార్లమెంట్లు మరింత బలంగా, పర్యావరణహితంగా ఉండడానికి, లింగసమానత్వం సాధించడానికి కృషి చేస్తోంది ఐపీయూ. ∙ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకత్వంలో మహిళలప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందనీ, అత్యంత శక్తిమంతమైన నిర్ణయాలు ఇప్పటికీ పురుషులే తీసుకుంటున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.ఐపీయూ, యూఎన్ ఉమెన్ విడుదల చేసిన గణాంకాలలో ముఖ్యాంశాలు...27.5%ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ సీట్లలో 27.5 శాతం మహిళలు ఉన్నారు. ఇది 2025 నాటి 27.2 శాతం కంటే కొద్దిగా ఎక్కువ. రాజకీయప్రాతినిధ్యానికి సంబంధించి మహిళలు ఎంత నెమ్మదిగా పురోగమిస్తున్నారో ఇది తెలియజేస్తుంది.19.9%జనవరి 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా 54 మంది మహిళలు పార్లమెంట్ స్పీకర్లుగా ఉన్నారు. మొత్తం స్పీకర్లలో ఇది 19.9 శాతం.76%రాజకీయాల్లోని మహిళలు ఆన్లైన్, ఆఫ్లైన్లో వివిధ రకాలుగా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. మహిళా పార్లమెంటేరియన్లలో 76 శాతం మంది బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. సమాన రాజకీయ అధికారం దిశగా మహిళల పురోగతిని మందగింపచేసే ప్రయత్నాల్లో భాగమే ఈ బెదిరింపులు.మహిళలు నాయకత్వ స్థానాలకు చేరుకున్నప్పటికీ తరచుగా అ్ర పాధాన్య శాఖలకే పరిమితమవుతున్నారురక్షణ, హోం, న్యాయ, ఆర్థిక, ఆరోగ్య, విద్య వంటి మంత్రిత్వశాఖలను దాదాపుగా పురుషులే నిర్వహిస్తున్నారు. 14 దేశాలుప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల క్యాబినెట్లో లింగసమానత్వాన్ని సాధించాయి. సమానప్రాతినిధ్యం సాధ్యమేనని నిరూపించాయి. ఎనిమిది దేశాలలో ఇప్పటికీ ఒక్క మహిళా మంత్రి కూడా లేరు.
నెర్రెలిస్తున్న నేలతల్లికై... అక్షర చైతన్య యాత్ర!
అంతకంతకూ క్షీణిస్తున్న భూసారాన్ని మనకు మనమే తక్షణం కాపాడుకోవాలి. లేదంటే, మరో నాలుగైదు దశాబ్దాల్లో మానవ జాతికి మనుగడే ఉండదు. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు... ప్రపంచ వ్యాప్తంగా భూసార పరీక్షలు సాగించిన పరిశోధకుల మాట. కానీ, అత్యంత కీలకమైన ఈ అంశం పట్ల ఎంతమందికి చైతన్యం ఉంది? పెరుగుతున్న భూతాపం, అంతకంతకూ ఎక్కువవుతున్న చెట్ల నరికివేత లాంటి అంశాలపై జనంలో ఎంతో కొంత అవగాహన కలిగించే ప్రయత్నం జరుగుతోంది. మరి, మనకు ఆహారం అందించే పుడమి తల్లి చేవ చచ్చి, చేష్టలుడిగి, జీవచ్ఛవమవుతున్న దుఃస్థితి గురించి ఎవరికి పడుతోంది? భవిష్యత్ మానవ జాతి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ పరిస్థితిపై సాగిన ఓ ప్రజా ఉద్యమమే... ‘సేవ్ సాయిల్’. ఉద్యమ స్థాయిలో సాగిన ఈ ప్రజా చైతన్య కార్యక్రమం.. ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గీవాసుదేవ్ మానస పుత్రిక.100 రోజులు.. 27 దేశాలు.. 30 వేల కిలోమీటర్లు...‘సేవ్ సాయిల్’ ఉద్యమం చేపట్టిన ఆయన అందులో భాగంగా నాలుగేళ్ళ క్రితం 2022లో 100 రోజుల పాటు 27 దేశాల మీదుగా దాదాపు 30 వేల కిలోమీటర్లు మోటార్ సైకిలుపై ప్రయాణించారు. భారతదేశంతో పాటు ఐరోపా, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యాల మీదుగా ఆ యాత్ర సాగింది. అదో ప్రపంచవ్యాప్త బృహత్తర ప్రయత్నం. అయితే, వివిధ దేశాల్లోని వైవిధ్యభరితమైన వాతావరణ, భౌగోళిక పరిస్థితులతో ముడిపడిన ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావాలంటే, కొన్ని పదులు, వందలమంది తెర వెనుక ఉండి శ్రమిస్తే కానీ సాధ్యం కాదు.యాత్రలో భాగంగా మొత్తం 691 కార్యక్రమాలుగా సాగిన ‘సేవ్ సాయిల్’ (Save Soil) విషయంలోనూ అదే జరిగింది. ఈ ప్రజాచైతన్య ఉద్యమంలో తెర వెనుక హీరోలు ఎందరో. అలాంటి పదుల మంది స్వచ్ఛంద సేవకులు, కార్యకర్తల వ్యక్తిగత అనుభవాలు, అనుభూతులు, ఆ వంద రోజుల ప్రయాణంలో జరిగిన పలు సంఘటనలు... అన్నీ అనేక విధాలుగా మానవాసక్తికరమైన కథనాలే. ‘సేవ్ సాయిల్’ ఉద్యమంలోని అలాంటి తెలియని తెర వెనుక కథలు తాజాగా పుస్తకరూపం సంతరించుకున్నాయి. ‘సేవ్ సాయిల్ – 100 డేస్ దట్ మూవ్డ్ ది వరల్డ్’ అన్న పేరుతో పెంగ్విన్ బుక్ హౌస్ వారు ప్రచురించారు.నాలుగేళ్ళలో.. 410 కోట్ల మందికి...హైదరాబాద్లో ఏప్రిల్ 14వ తేదీ, మంగళవారం సాయంత్రం వినూత్న రీతిలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ప్రముఖ భరతనాట్య కళాకారిణి, సద్గురు కుమార్తె అయిన రాధే జగ్గీ (Radhe Jaggi) ఈ సంకలన గ్రంథానికి సంపాదకత్వం వహించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు – సంగీత దర్శకుడు రామ్ మిరియాల, పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ – మోడల్ శిల్పారెడ్డితో కలసి పుస్తక సంపాదకురాలి చర్చా గోష్ఠి ఫక్కీలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం సాగింది. “ప్రపంచవ్యాప్తంగా గత నాలుగేళ్ళలో దాదాపు 410 కోట్ల మందికి చేరువైన ‘సేవ్ సాయిల్’ ఇవాళ అతి పెద్ద ప్రజా చైతన్య ఉద్యమం” అని రాధే వివరించారు.‘సేవ్ సాయిల్’ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న అనుభవం రాధేది. భారతీయ సంప్రదాయ కళల పరిరక్షణ, ప్రచారం కోసం స్థాపించిన ‘ప్రాజెక్ట్ సంస్కృతి’తో కలిసి ఆ యాత్రలో అనేక వేదికలపై ఆమె ప్రదర్శనలు ఇచ్చారు. మట్టితో ముడిపడిన కథాంశంతో రాధే బృందం చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఉద్యమ సందేశాన్ని మరింత వ్యాపింపజేశాయి. అలా యాత్రలో ప్రత్యక్ష భాగస్వామి అయిన రాధే తన అనుభవంతో పాటు పలువురు స్వచ్ఛంద సేవకుల అనుభూతులనూ, వారు ఎదుర్కొన్న సంఘటనలనూ సంకలించారు. వెరసి, విభిన్న వర్గాలకు చెందిన 86 మంది వేర్వేరు వ్యక్తుల విభిన్న అనుభవాల సమాహార రూపం... ‘సేవ్ సాయిల్’ గ్రంథం. ఆ వాలంటీర్ల కథలు, అప్పటి ఫోటోలతో పుస్తకాన్ని ఆసక్తిగా తీర్చిదిద్దారు. ఎక్కడ, ఏ పేజీ అయినా తీసుకొని చదువుకొనేలా అనుభవాలను రాశిపోసిన ఈ రచన నేలతల్లి పరిరక్షణ ఉద్యమం వెనుక ఉన్న విస్తృతి, ఉత్సాహం, సవాళ్లను పరిచయం చేస్తుంది.ఎండకు ఎండి, వానకు తడిసి, మంచులో వణికి... యూరోపియన్ ప్రాంతాల్లో వర్షంలో తడుస్తూ, ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో గడ్డకట్టే చలిలో వణుకుతూ, ఎర్రటి ఎండలో ఎడారి తుపానులకు ఎదురొడ్డుతూ సాగిన ఉద్యమ యాత్ర ఇది. ఐక్యరాజ్య సమితి హాళ్ళ నుంచి రోడ్డు పక్క టీ షాపుల దాకా ఆగిన ప్రతిచోటా నేలతల్లిని కాపాడుకోవాలన్నదే ప్రధాన సందేశం. ఓ దేశంలో అసలు కార్యక్రమానికి ముందు కిచెన్లో ఇరుక్కుపోయిన క్షణాలు, డ్రోన్ను నోట కరుచుకొని ఓ వాలంటీర్ చెట్టెక్కిన సంగతులు, వాహనం క్లచ్ పాడైపోయి బాగు చేయాల్సిన క్షణంలో చిమ్మచీకటి వేళ అపరిచిత వ్యక్తులు అందించిన సాయాలు, ఈ ఉద్యమం కోసం తెలుగునాట ఓ వ్యక్తి కాలినడకన కొన్ని పదుల కి.మీ.లు నడక సాగించడం... ఇలా ఎన్నెన్నో కథలు ఈ పుస్తకంలో చదవవచ్చు.“పలువురిని ఇంటర్వ్యూ చేసి, వారి అనుభవాలను వారి మాటల్లోనే అందించాం. ఈ పుస్తకం చదువుతుంటే, ఆ సంఘటలన్నీ కళ్ళ ముందు కదలాడి, ‘సేవ్ సాయిల్’ ప్రపంచ యాత్రలో మీరూ స్వయంగా పాల్గొన్న అనుభూతి కలుగుతుంది’’ అని రాధే వివరించారు. “రైతులు తమ జీవనోపాధి కోసం పోరాడుతుంటారు. అలాంటి సమయంలో పర్యావరణ బాధ్యతను కూడా వాళ్ళ మీదే పెట్టడం సరైంది కాదు. మనందరం సహజసిద్ధంగా మట్టిలో సేంద్రియ పదార్థాలను పెంచాలి. రైతులకు అండగా నిలవాలి. అదే సమయంలో ప్రభుత్వాలు సైతం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని, కట్టుదిట్టంగా అమలు చేస్తేనే, నేలతల్లి సంరక్షణ నిజంగా సాధ్యమవుతుంది” అని ఆమె అభిప్రాయపడ్డారు.ఏం చేస్తున్నామని సిగ్గేసింది: రామ్ మిరియాల ‘వ్యవసాయ భూముల్లో సేంద్రియ పదార్థాల పరిమాణాన్ని కనీసం 3 నుంచి 6 శాతానికి పెంచే విధానాలను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా నేలతల్లి ఎదుర్కొంటున్న సార సంక్షోభాన్ని ఎదుర్కోవడం ‘సేవ్ సాయిల్’ ఉద్యమ లక్ష్యం. శాస్త్రవేత్తలు, రైతులు, అంతర్జాతీయ సంస్థలు, సామాన్య పౌరుల నుంచి పాలకుల దాకా అందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి, ఆహార భద్రత, నీటి భద్రత, జీవ వైవిధ్యం, వాతావరణ స్థిరత్వానికి నేలలో జీవం ఎంత ముఖ్యమైనదో చాటుతోంది. ఈ లక్ష్యాలన్నీ నచ్చి దీనిలో నేనూ భాగమయ్యాను’ అని సినీ గాయకుడు రామ్ మిరియాల వివరించారు.“వయసు మీద పడినవారే ఎంతో చేస్తుంటే, వయసులో ఉన్న మనం ఏం చేస్తున్నామని నాకే సిగ్గేసింది. అందుకే, నా వంతుగా ఈ ప్రజా చైతన్య ఉద్యమం కోసం స్వయంగా ఓ పాట రాసి, స్వరపరిచి పాడాను” అని రామ్ చెప్పుకొచ్చారు. మనిషికీ, మట్టికీ ఉన్న బంధాన్నీ, అలాగే మనం మట్టిని కాపాడుకోవలసిన అవసరాన్నీ చెప్పిన “నిలువెల్లా పురుడోసుకొని నేలమ్మ...” అనే ఆ పాట పాడి, వినిపించారు. “దేశమంటే మట్టేనోయ్... మట్టి లేకపోతే మనిషెక్కడోయ్...” అంటూ వినూత్న ధోరణితో ఆలోచింపజేశారు. మట్టిని ప్రాణమున్న బంగారంగా వర్ణిస్తూ సాగిన రామ్ మిరియాల పాట ఆహూతులను అలరించడమే కాక, మట్టిపై ప్రేమను మరింత పెంచేలా సాగింది.అందుకే... సమంతను భాగస్వామిని చేశా: శిల్పారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ, “సేవ్ సాయిల్ ఉద్యమం తాలూకు లక్ష్యం నన్నెంతో ప్రేరేపించింది. ఇప్పుడు మనం కళ్ళు తెరవకపోతే, మహా ఉపద్రవం తప్పదు. అందుకే, మానవాళి భవిష్యత్తు కోసం నా వంతుగా ఇందులో నేనూ భాగమయ్యాను. సినీ నటి సమంత లాంటి నా ఆత్మీయ మిత్రులనూ, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులనూ ఈ కృషిలో భాగం చేశాను. స్వయంగా స్విట్జర్లాండ్ వెళ్ళి, యాత్రలో పాల్గొన్నాను. మహా సముద్రం లాంటి ఈ ప్రయత్నంలో నేను ఓ నీటిబిందువును మాత్రమే” అని వినయంగా పేర్కొన్నారు. ఆహూతుల సందేహాలకు సైతం సమాధానాలిస్తూ, చర్చా గోష్ఠిగా సాగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జంట నగరాలలోని వివిధ వర్గాల ప్రజలు పెద్దయెత్తున పాల్గొనడం విశేషం.చదవండి: వాత్స్యాయన కామసూత్రాలకు కూచిపూడి నృత్యభాష్యంఏమైనా, ‘మనం ఈ నేల నుంచి పుట్టాం. ఈ నేలపైనే జీవిస్తాం. ఇక్కడే కన్నుమూస్తాం. చివరకు ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఆ వాస్తవం ఇప్పటికైనా గుర్తించి, మన నేలతల్లి జవజీవాలను మనమే పరిరక్షించుకోవాలన్న ఆలోచన ఇప్పటికైనా తెచ్చుకుందాం. లేదంటే భావితరానికి బతుకే లేదు’. ఈ సద్గురు సందేశం ఆలోచించి తీరాల్సిందే కాదు... తక్షణమే ఆచరణలోకి దిగాల్సినది. ‘సేవ్ సాయిల్’ పుస్తకంలోని విభిన్న అనుభవాలు అక్షరాలా అందుకు మరో ప్రేరణ.- రెంటాల జయదేవ
అంతర్జాతీయం
యుద్ధమైనా.. శాంతి చర్చలైనా.. మేం ఒక్కటే
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా గౌరవించి తీరాల్సిందేనని పేర్కొంది. అదే సమయంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి చర్చల ప్రతినిధి మహ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అయినా.. శాంతి చర్చలైనా.. ఇరాన్, దాని మిత్ర శక్తులు ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాయని స్పష్టం చేశారు. హెజ్బొల్లా ధైర్యం, రెసిస్టెన్స్ ఐక్యత వల్లే లెబనాన్లో కాల్పుల విరమణను సాధ్యమైందని అన్నారాయన. యుద్ధం జరిగినా, శాంతి ఒప్పందం వచ్చినా.. ఇరాన్, రెసిస్టెన్స్(మిత్ర శక్తుల) శక్తులు ఒక్కటిగానే ఉంటాయని.. ఈ శక్తులు కలకాలం ముందుకు సాగుతాయన్నారు. అలాగే.. ఇజ్రాయెల్కు ప్రాధాన్యత ఇవ్వడమే పనిగా పెట్టుకున్న అమెరికా ఆ విధానాన్ని వదిలేయాలని సూచించారు. శాంతి ఒప్పందాన్ని గౌరవించాలని అమెరికాకు హితవు పలికారు. హర్ముజ్ జలసంధి అమెరికా దిగ్బంధనం(బ్లాకేడ్) కొనసాగుతోంది. ఈ చర్య అంతర్జాతీయ చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఈ జోక్యాన్ని చూస్తూ ఊరుకోబోమని చెబుతోంది. లెబనాన్లో కాల్పుల విరమణ ఇంకా ఆచరణలోకి రాలేదు. అమెరికా మధ్యవర్తితత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తగ్గినా.. చిన్నపాటి దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఘలీబాఫ్ వ్యాఖ్యలు పశ్చిమాసియా సంక్షోభంలో రెసిస్టెన్స్ శక్తుల ఐక్యతను బలపరిచే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇరాన్ చెబుతున్నట్లు.. అమెరికా గనుక ఇజ్రాయెల్ ఫస్ట్ విధానాన్ని వీడి శాంతి ఒప్పందాన్ని గౌరవించకపోతే ప్రాంతీయ స్థిరత్వం మళ్లీ దెబ్బతినే అవకాశం ఉంది. ఇక అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు త్వరలో మళ్లీ ఇస్లామాబాద్లోనే జరగనున్నాయి. తొలి దఫా చర్చలు విఫలం కావడంతో.. ఎవరో ఒకరు దిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అటు అమెరికా.. ఇటు ఇరాన్ తగ్గేదే లే అంటున్నాయి. బంతి ఇరాన్ కోర్టులోనే ఉందని అమెరికా అంటుంటే.. తమ డిమాండ్లలో ఏ ఒక్కటి తగ్గినా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ అంటోంది. పాక్ మధ్యవర్తిత్వంలో తొలుత ఇరాన్, అమెరికా ప్రతినిధులు పరోక్ష చర్చలు జరుపుతారు. ఫలితాలు సానుకూలంగా ఉంటే ప్రత్యక్ష చర్చలు జరగొచ్చు.
ట్రంప్ దెబ్బ: బీబీసీలో భారీ లేఆఫ్స్
లండన్: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రభావవంతమైన వార్తా సంస్థగా పేరొందిన ‘బీబీసీ’ మునుపెన్నడూ లేని విధంగా పెను సంక్షోభంలో కూరుకుపోయింది. ఆర్ధిక కష్టాలు, కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ దిగ్గజ సంస్థ, తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 2,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని నిర్ణయించుకుంది. దశాబ్ద కాలంలో బీబీసీ తీసుకున్న అత్యంత కఠినమైన, అతిపెద్ద లేఆఫ్స్ నిర్ణయం ఇదే కావడం గమనార్హం.ఆర్థిక లోటు.. భారీగా కోతలుద్రవ్యోల్బణం, తగ్గుతున్న వాణిజ్య ఆదాయం, లైసెన్స్ ఫీజులపై పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో బీబీసీ తన వార్షిక బడ్జెట్లో దాదాపు 10 శాతం ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రాబోయే రెండేళ్లలో ఈ 2,000 ఉద్యోగాల కోతలను అమలు చేయనుంది. 2027 ఏప్రిల్ నాటికి ఈ ప్రభావం పూర్తిగా కనిపించనుంది. తాత్కాలిక డైరెక్టర్ జనరల్ రోడ్రి టాల్ఫన్ డేవిస్ ఈ విషయాన్ని ఉద్యోగులకు తెలియజేస్తూ, సంస్థ ముందున్న కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకే అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.ట్రంప్ 10 బిలియన్ డాలర్ల దావాఒకవైపు ఆర్థిక ఇబ్బందులు పీడిస్తున్న వేళ, బీబీసీకి భారీ చట్టపరమైన చిక్కులు తోడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత జనవరి ఆరున క్యాపిటల్ దాడికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీలో బీబీసీ తప్పుదోవ పట్టించేలా ఎడిటింగ్ చేసిందని ఏకంగా 10 బిలియన్ డాలర్ల (రూ. 93,359.43 కోట్లు) పరువునష్టం దావా వేశారు. ఈ వివాదం కారణంగానే గత డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, వార్తా విభాగం అధిపతి డెబోరా టర్నెస్ తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సంక్షోభ సమయంలో వచ్చే నెలలో మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ మ్యాట్ బ్రిట్టిన్ కొత్త డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.ప్రశ్నార్థకంగా మారిన మనుగడ1922లో స్థాపించిన బీబీసీకి ప్రధాన ఆదాయ వనరు వీక్షకులు చెల్లించే వార్షిక లైసెన్స్ ఫీజు . అయితే, స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ల రాకతో ప్రజల వీక్షణ అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. చాలా కుటుంబాలు సాంప్రదాయక టీవీలకు దూరమవుతుండటంతో బీబీసీ ఆర్థిక నమూనా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బ్రిటన్ లేబర్ పార్టీ ప్రభుత్వం కూడా ఈ లైసెన్స్ ఫీజు విధానాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడంతో, బహుళ టీవీ, రేడియో ఛానెళ్లు నడుపుతున్న బీబీసీ భవిష్యత్తు మనుగడపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి.ఇది కూడా చదవండి: ఖరగ్పూర్: సెకనుకో మలుపు.. ఓటరు నాడి ఎటు?
భారత్కు అమెరికా ఎనర్జీ షాక్
అమెరికా తన మిత్రదేశం భారత్కు షాకిచ్చింది. రష్యా, ఇరాన్ చమురుపై ఇప్పటివరకు ఇచ్చిన ఆంక్షల మినహాయింపును రద్దు చేసింది. ఈ ప్రభావం భారత్కు లభిస్తున్న తక్కువ ధరల క్రూడ్ ఆయిల్ సరఫరాపై పడే అవకాశం కనిపిస్తోంది.ఆ రెండు దేశాల నుంచి మార్చి 11కి ముందు లోడ్ చేసిన చమురు సరఫరాకు మాత్రమే అమెరికా భారత్ సహా కొన్ని దేశాలకు మినహాయింపు ఇచ్చింది. అయితే ఆ స్టాక్ ఇప్పుడు పూర్తయింది. ఇకపై రష్యా, ఇరాన్ చమురు కొనుగోలు చేసే దేశాలు(భారత్ సహా) సెకండరీ సాంక్షన్స్(ద్వితీయ శ్రేణి ఆంక్షలు) ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది భారత్కు ఒక ఎనర్జీ షాక్ లాంటిదే. ఇప్పటివరకు రష్యా నుండి తక్కువ ధరల క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి భారత్ తన ఇంధన ఖర్చులను తగ్గించుకుంది. అమెరికా ఆంక్షల మినహాయింపు రద్దు చేయడంతో ఆ సరఫరా తగ్గిపోవచ్చు. దీని వల్ల దేశీయ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.భారత్ ప్రస్తుతం రష్యా నుండి భారీగా డిస్కౌంట్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాది గణాంకాల ప్రకారం.. రోజుకు సుమారు 2.08 మిలియన్ బ్యారెల్స్ వరకు చేరింది. అయితే కొన్నినెలలపాటు రష్యా నుండి దిగుమతులు తగ్గినా.. డిస్కౌంట్ ధరలు కారణంగా మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది మార్చిలో భారత్ రష్యా నుండి 5.3 బిలియన్ యూరోల విలువైన(47,700 కోట్ల రూపాయల) క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి మాత్రం 7 సంవత్సరాల తర్వాత 2026లో మొదటిసారి సుమారు 4 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసింది.తాజా పరిణామాల దృష్ట్యా భారత్ తన ఎనర్జీ పాలసీని మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. విభిన్న సరఫరా మార్గాలు (పశ్చిమాసియా.. గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా) అన్వేషించుకోవాల్సి ఉంటుందని.. దీర్ఘకాలంలో పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి పెట్టడం తప్పనిసరి అవుతుందని చెబుతున్నారు.హర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు రవాణా మార్గాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయి. అమెరికా "మాక్సిమమ్ ప్రెషర్" విధానాన్ని మళ్లీ అమలు చేస్తూ, ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం ప్రపంచ చమురు ధరలపై కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు..అమెరికా ఇరాన్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్పై కొత్త ఆంక్షలు విధించింది. సుమారు రెండు డజన్ల కంపెనీలు, వ్యక్తులు, నౌకలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో కొందరు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ సలహాదారుడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని సమాచారం.
లాటరీలో చవకగా పికాసో పెయింటింగ్
పారిస్: అదృష్టం ఉండాలేగానీ సంపద అయినా అంతకంటే విలువైన వస్తువైనా మనల్నే వెతుక్కుంటూ వస్తుందని మరోమారు నిరూపితమైంది. ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో కుంచె నుంచి జాలువారిన కళాఖండాలకు చిత్రకారులు, సంపన్నుల ప్రపంచంలో భలే డిమాండ్ ఉంది. సంపన్నులు మొదలు సాధారణ కళాకారుల దాకా ఎంతో మంది పికాసో ఒరిజినల్ పెయింటింగ్లను తమ సొంతం చేసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. అలాంటిది ఒక ఫ్రాన్స్ సేల్స్ ఇంజనీర్కు కేవలం 117 డాలర్లకే అంటే 10,915 రూపాయలకే ఏకంగా రూ.9.33 కోట్ల విలువైన పికాసో పెయింటింగ్ దక్కింది. పెయింటింగ్ విక్రయం కోసం దాని యాజమాన్యం చేపట్టిన లక్కీ డ్రాలో 58 ఏళ్ల అరీ హొదారా అనే వ్యక్తి ఈ ‘హెడ్ ఆఫ్ ఏ ఉమెన్’పెయింటింగ్ను సొంతం చేసుకున్నారు. అల్జీమర్స్ వ్యాధి సంబంధ పరిశోధనకు కావాల్సిన నిధుల సమీకరణ కోసం రఫెల్ అనే సంస్థ ఈ పెయింటింగ్ను ‘క్రిస్టీస్’అనే వేలంసంస్థకు అప్పగించి అమ్మిపెట్టాలని సూచించింది. లక్కీ డ్రా టికెట్ ధరను 117 డాలర్లు నిర్ణయించారు. మొదారా కొన్న టికెట్కే లక్కీ డ్రా తగలడంతో అతను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ‘‘ఎవరో నన్ను ఆటపట్టించడానికి ఫోన్చేశారనుకున్నా. వేలంసంస్థ ఒకటికి రెండు సార్లు విషయం చెప్పడంతో నాకు ఇది అబద్ధం కాదు అని అర్ధమైంది’’మొదారా తెగ సంతోషం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా టికెట్ల అమ్మకాల ద్వారా రూ.130 కోట్లు సమకూరాయని రఫేల్ సంస్థ తెలిపింది. పికాసో తన ప్రేయసి డోరా మార్ను ఊహించుకుంటూ విభిన్నంగా 1941లో ఈ పెయింటింగ్వేశారు.
జాతీయం
అది మాకు కష్టమైన పనే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సామాజిక సంక్షేమం, సంస్కరణల పేరిట ఏ మతంలోని సారాన్నీ తీసివేయలేమని సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. శబరిమల ఆలయంలో తరుణ వయస్సు మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ ఇచ్చిన ఆదేశంపై పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. సామాజిక సంస్కరణ పేరిట మతానికి సంబంధించిన ఆచారాలను తొలగించలేమని తొమ్మిది న్యాయమూర్తుల బెంచ్ తెలిపింది. లక్షలాది మంది నమ్మకాల్ని తప్పు అని ప్రకటించడం అత్యంత కష్టమైన పనుల్లో ఒకటని పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ప్రస్తుతం శబరిమల కేసుకు సంబంధించిన కీలక రాజ్యాంగ ప్రశ్నలపై వాదనలు వింటోంది.ముఖ్యంగా మత స్వేచ్ఛ, సామాజిక సంస్కరణ మధ్య సమతుల్యతపై చర్చ జరుగుతోంది. 2018లో సుప్రీంకోర్టు అన్ని వయస్సుల మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. పరిమితులను అత్యవసర మత ఆచారంగా పరిగణించలేమని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ తెలిపింది. 10 నుంచి 50 సంవత్సరాల మధ్య మహిళలు, బాలికలు ఆలయంలోకి రాకూడదనే ఆచారాన్ని దాదాపు అంటరానితనంతో సమానమని పేర్కొంది.తాజాగా జరిగిన విచారణ సమయంలో మత సంబంధిత విషయాల్లో ప్రజాహిత వ్యాజ్యాల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై వాదనలకు స్పందిస్తూ.. లక్షలాది మంది నమ్మకాల్ని తప్పు అని కోర్టు ఎలా ప్రకటించాలన్నదే అత్యంత కఠినమైన సమస్యగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానించారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని అనుచితమని ప్రకటించడం న్యాయస్థానాలకు కష్టమైన పనేనని తెలిపారు. ట్రావెన్కోర్ దేవస్థాన మండలి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. మతంపై నమ్మకం లేని వారు వాటిని ప్రశ్నిస్తూ దాఖలు చేసే పిటిషన్లను విచారణకు స్వీకరించడం సరైనదేనా? అని అన్నారు. అయ్యప్ప ఆలయాలు ఎన్ని ఉన్నా శబరిమలలోని ఆలయం చాలా విశిష్టమైనదని తెలిపారు. ఆచారాలను మహిళలపై వివక్షగా భావించొద్దని అన్నారు. 10-50 ఏళ్ల మధ్య వయసున్న బాలికలు, మహిళల ప్రవేశంపై మాత్రమే ఆంక్షలున్నాయని చెప్పారు.
ఎయిర్పోర్ట్లో ఆకాసా, స్పైస్జెట్ విమానాలు ఢీ!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. స్పైస్జెట్, ఆకాసా ఎయిర్ విమానాలు ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. స్పైస్జెట్ విమానం టాక్సింగ్ చేస్తుండగా, నిలిచి ఉన్న అకాసా విమానాన్ని ఢీకొట్టింది. ఈ స్వల్ప ప్రమాదంలో రెండు విమానాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. స్పైస్జెట్ విమానం కుడి వింగ్లెట్ దెబ్బతినగా, అకాసా విమానం ఎడమ వైపు హారిజాంటల్ స్టెబిలైజర్కు దెబ్బ తగిలింది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
మహిళా రిజర్వేషన్ బిల్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు ఉద్దేశించిన మూడు కీలక బిల్లులను కేంద్రం ఇవాళ(ఏప్రిల్ 16, గురువారం) లోక్సభలో ప్రవేశపెట్టారు. వీటిపై చర్చలో భాగంగా ప్రధాని సభలో ప్రసంగిస్తూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజకీయ రంగు పులమొద్దన్నారు.‘‘దేశ ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన బిల్లు ఇది. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ అందరికీ దక్కుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి నష్టపోవద్దు. క్షేత్రస్థాయిలో మహిళా నాయకత్వం సిద్ధంగా ఉంది. నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని వారంతా భావిస్తున్నారు. అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత నాది. బీసీ వర్గాల్లో జన్మించిన నాకు ప్రధాని పదవి దక్కడం రాజ్యాంగ నిర్మాతల చలవే...డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. గ్యారెంటీగా అంశాన్ని ఈ విషయాన్ని చెపుతున్నా. ఇప్పుడున్న నిష్పత్తిలో నియోజకవర్గాల్లో పెరుగుతాయి. మా విధానాల్లో స్పష్టత ఉంది. గతంలో జరిగిన మహిళలకు జరిగిన వివక్ష అనే పాపాన్ని కడిగేస్తున్నాం. సాంకేతిక అంశాలతో వ్యతిరేకించొద్దు. బిల్లును ఎలాగా ఆమోదించాలో సమయం నిర్ణయిస్తుంది. మూడు దశాబ్దాల పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు. మహిళా బిల్లుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతివ్వాలి. ఈ బిల్లును తేవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు’’ అని ప్రధాని మోదీ అన్నారు.డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ విపక్షాలను హెచ్చరించారు. “దేశ పార్లమెంట్ చరిత్రలో ఈ రోజును మర్చిపోలేం. మహిళా రిజర్వేషన్ గొప్ప బిల్లు. ఈ చారిత్రక సమయంలో పాలు పంచుకోవడం నా అదృష్టం. ఈ బిల్లులతో దేశానికి సరికొత్త దశ, దిశను ఇస్తున్నాం. వికసిత్ భారత్ అంటే రోడ్లు, రైళ్లు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు. మహిళల స్వావలంబన కూడా ఉంటేనే అది సంపూర్ణ వికసిత్ భారత్ అవుతుంది. దేశ రాజకీయాల్లో, వికసిత్ భారత్ సాధనలో మహిళల పాత్ర కీలకం...మహిళలకు అవకాశమిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారు. రాజకీయాల్లో తమ శక్తిని చాటేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఎవరికైనా అవకాశమిస్తేనే కదా.. వారి సామర్థ్యం తెలుస్తుంది. రాజకీయాల్లో సామర్థ్యం, అనుభవం ఉన్న మహిళలు పుష్కలంగా ఉన్నారు. దేశ ప్రగతిలో మహిళలకూ బాగస్వామ్యం కల్పించాల్సిందే. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు.. మహిళలకు మనం ఇస్తున్న కానుక కాదు. అది వారి హక్కు" అని మోదీ వ్యాఖ్యానించారు.“ఈ బిల్లును తీసుకురాగానే కొందరు విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ మాట్లాడుతున్నారు. అలాంటి వారిని ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం, ఉత్తరాది, దక్షిణాది అనే భేదభావం మాకు లేదు. ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాం” అని మోదీ స్పష్టం చేశారు.ఈ బిల్లుతో కేవలం దేశంలోని మహిళలకు వారి హక్కులను కల్పిస్తున్నాం. ఈ బిల్లుపై క్రెడిట్ నాకు అవసరం లేదు. మీరే (విపక్షాలను ఉద్దేశిస్తూ) తీసుకోండి.. మహిళా బిల్లుపై అన్ని పార్టీల నేతల ఫొటోలూ వేసుకోండి. ఈ బిల్లును అడ్డుకోకుండా సహకరించి మీ గొప్పతనం చాటుకోండి. మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిద్దాం” అని మోదీ విపక్షాలను కోరారు.
టీసీఎస్ నాసిక్ కేసు : మరో కీలక నిర్ణయం
TCS Nasik case టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ కార్యాలయంలో కొంతమంది ఉద్యోగులపై లైంగిక వేధింపులు,మత మార్పిడి ఆరోపణల కేసులో రోజుకో పరిమాణం చోటు చేసుకుటోంది. ముఖ్యంగా మతమార్పిడి ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కేసులో సంచలన ఆరోపణల నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు, హిందూ మహిళలు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఘీ కొనసాగుతున్న ఈ ఆందోళనలు, ఆఫీస్పై దాడుల నేపథ్యంలో టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిడులు జరిగాయని ఆరోపిస్తూ, ఏప్రిల్ 16, 17 తేదీలలో దేశవ్యాప్త నిరసనలకు బజరంగ్ దళ్ బుధవారం పిలుపునిచ్చింది. దీనికి తోడ స్థానిక రాజకీయ పార్టీలు కార్యాలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం, లైంగిక వేధింపుల విచారణ కొనసాగుతున్ననేపథ్యంలో, నాసిక్ బ్రాంచ్ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని (work from home) కోరింది. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ పరిణామం గురించి తెలిసిన ఒక కంపెనీ అధికారి మీడియాకు తెలిపారు. నాసిక్ బీపీఓ యూనిట్ 5000 చదరపు అడుగుల కార్యాలయ స్థలం, ఇక్కడ సుమారు 170 మంది ఉద్యోగులు రెండు షిఫ్టులలో పనిచేస్తారు. ప్రస్తుతం, టీసీఎస్ కార్యాలయం ఉన్న అశోకా బిజినెస్ ఎన్క్లేవ్ గేటు బయట నాసిక్ పోలీసుల బృందం మోహరించి ఉంది అయితే పోలీసులు ప్రాంగణాన్ని అధికారికంగా సీల్ చేశారన్న వాదనలను కంపెనీ అధికారి ఖండించారు.ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్కాగా టీసీఎస్ నాసిక్ బీపీఓ యూనిట్లో పనిచేస్తున్న ఒక మహిళ, తన సహోద్యోగి పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి తనతో శారీరక సంబంధం కొనసాగించాడని ఆరోపిస్తూ మార్చిలో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు సమయంలో, 2022 మరియు 2026 మధ్య ఎదుర్కొన్న మానసిక మరియు లైంగిక వేధింపులకు సంబంధించి, అలాగే మానవ వనరుల విభాగం చర్యలు తీసుకోకపోవడంపై పోలీసులు మరో ఎనిమిది ఎఫ్ఐఆర్లను (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్) నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) సందీప్ మిట్కే నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) విచారిస్తోంది.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
ఎన్ఆర్ఐ
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు)
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’
అల్ఫారెట్టా, జార్జియా: స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి-2026’ అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు.ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. నాలుగేళ్ల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ(యూఎస్ఏ) సేవా సంస్థలకు అందజేయనున్నారు.ఈ వేడుకల్లో బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి (శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రతినిధులు), గిరిధర్ కొటగిరి (ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు), జ్యోత్స్న పాలకుర్తి (గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ చైర్మన్), రమణ గంద్ర (గేట్స్ అధ్యక్షులు), సునీత పోట్నూరు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు), ఆది శ్రీనివాసన్ (ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు), శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ (ప్రెసిడెంట్ అండ్ సీఈఓ), జనార్ధన్ పన్నెల (శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధి) పాల్గొన్నారు.
క్రైమ్
కర్నూలులో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
సాక్షి, కర్నూలు: జిల్లాలో గురువారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం- రెడీమిక్స్ లారీ ఢీ కొట్టి ఎనిమిది మంది మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం ధాటికి బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. మరోవైపు లారీ కూడా ఓ పక్కకు ఒరిగి పడిపోయింది. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, మూడేళ్ల చిన్నారి, వాహన డ్రైవర్తో సహా మరో వ్యక్తి. గాయపడినవాళ్లలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల పేర్లు.. కుమార్ (60), దీపిక వీణ (35), సునీల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), తాయమ్మ (60), లోలాక్షి. కర్ణాటక చిక్మంగళూరు వాసులుగా గుర్తించారు. మంత్రాలయ శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో బొలెరోలో 16 మంది ఉన్నారు. మృతదేహాలను ఎమ్మిగనూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
షాకింగ్ : కోతిని తరమబోయి.. సజీవ దహనం!
మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్లో విషాదం చోటు చేసుకుంది. కోతులను తరమబోయి ఒక రిసార్ట్ ఉద్యోగి మరణించిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. విద్యుత్ షాక్తో అక్కడి కక్కడే మరణించాడు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పోలీసుల కథనం ప్రకారం, ఖజురహో రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక రిసార్ట్ పైకప్పుపైకి కోతి వచ్చింది. దీంతో ఇనుప రాడ్తో కోతిని తరమడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో కోతిని భయపెట్టి, దాన్ని తరిమికొట్టడానికి రాడ్ను పైకి ఎత్తినప్పుడు, అది రిసార్ట్ పైకప్పుపై ఉన్న హై-వోల్టేజ్ విద్యుత్ తీగకు తగిలింది. 33 kV హై-టెన్షన్ తీగ కావడంతో తీవ్రమైన విద్యుదాఘాతానికి రాను రైక్వార్ చనిపోయాడు. ఖజురహో నివాసి అయిన రాను ఐదు రోజుల క్రితమే ఆ రిసార్ట్లో చేరాడు.బమితా పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. రిసార్ట్ పైకప్పుకు సమీపంలో హై-టెన్షన్ లైన్ ఉండటం నిబంధనలను ఉల్లంఘించిందా లేదా ఈ సంఘటన రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే దానిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని బమితా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ వాల్మీకి చౌబే తెలిపారు. ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్An employee of the Pradeep Raikwar Hotel in Bamitha village, Chhatarpur district, Madhya Pradesh, India, lost his life instantly after being electrocuted by a 33 kV power line while attempting to drive a monkey away from the hotel grounds with an iron pipe. pic.twitter.com/W1J5IqOdfj— T_CAS videos (@tecas2000) April 15, 2026 రిసార్ట్ యజమాని జయ్ తివారీ మాట్లాడుతూ, కోతిని తరిమికొట్టే ప్రయత్నంలో ఈ విషాద సంఘటన జరిగింది. రిసార్ట్ పైనుంచి నేరుగా 33 కేవీ రైల్వే లైన్ వెళుతుంది. దానిని తరలించడానికి అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, రైల్వే అధికారులు తొలగించడానికి నిరాకరించారు. మృతుడికిను రైక్వార్కు ఇద్దరు చిన్న పిల్లలన్నారని తెలిపారు.
టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్లో జరిగిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తు కొత్త మలుపు తీసుకుంది. అరెస్టు అయిన ఉద్యోగులలో ఒకరి భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ కేసులో ప్రధాన నిందితుడు డానిష్ షేక్ భార్య ఫిర్యాదుదారులలో ఒక మహిళకు, తన భర్తకు మధ్య ఉన్న చెడిపోవడంతోనే ఈ పరిమాణానికి దారి తీసిందని, అదే ఇతరుల జీవితాలను నాశనం చేసిందని ఆరోపించింది ఈ కేసులో తన భర్తతో సహా ఇతర పురుషులందరూ నిర్దోషులని, వేర్వేరు సమస్యలు, కేసులను కలిపివేశారని ఆమె ఆరోపించింది.నిందితుడి భార్య సంచలన ఆరోపణలుకేవలం వారి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం విఫలం కావడంవల్ల తలెత్తిన వివాదమని ఆమె పేర్కొంది. డానిష్ షేక్, బాధితురాలిగా చెబుతున్న మహిళకు మధ్య సంబంధం ఆఫీసులో అందరికీ తెలుసంటూ ఆమెపై పలు ఆరోపణలు చేసింది. ఆ మహిళ తన భర్త (నిందితుడు) కోసం గంటల తరబడి వేచి చూసేదని, ఆమె అతనిపై ఇష్టంతోనే తన ఆహార్యాన్ని, అలవాట్లను మార్చుకుందని ఆరోపించారు.ఉపవాసాలు చేయడం, దుస్తులు మార్చుకోవడం లాంటి ప నులెన్నో చేసిన తన భర్తకు ఆకర్షించిదని తెలిపింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కలత చెందారని ఆమె పేర్కొంది. ఆ సంబంధం ముగిసిన తర్వాత, ఫిర్యాదుదారురాలి తల్లిదండ్రులు కొంతమంది రాజకీయ నాయకులను సంప్రదించి, ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని ఇతర పురుషుల పేర్లను కూడా చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆమెను ఒప్పించారని ఆమె ఆరోపించింది.కేసు పూర్వాపరాలు, అరెస్టుల పర్వంపెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తన సహోద్యోగి ఒకరు తనతో సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళా ఉద్యోగి ఆరోపించడంతో ఈ కేసు ప్రారంభమైంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, ఇలాంటి అనుభవాలే ఎదురైన మరో ఏడుగురు మహిళలు ముందుకు రావడంతో ఈ కేసు మరింత ముదిరింది.మొత్తం 8 మంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో, 8 మంది ఉద్యోగులపై మొత్తం 9 FIRలు నమోదయ్యాయి.ఇప్పటివరకు 7 గురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్, రజా మెమోన్, షారూఖ్ ఖురేషీ, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీ ,ఒక మహిళా ఆపరేషన్స్ మేనేజర్ ఉన్నారు. ప్రధానంగా రేప్, మానసిక , లైంగిక వేధింపులతో మత మార్పిడికి ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు సంచలనం రేపాయి. అలాగే ఫిర్యాదులను పట్టించుకోలేదనే కారణంతో HR ఎగ్జిక్యూటివ్ నిదా ఖాన్పై కూడా కేసు నమోదైంది.ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులందరినీ టీసీఎస్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ COO ఆర్తి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సమగ్ర అంతర్గత విచారణకు ఆదేశించారు. ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!సిట్ విచారణఈ కేసు తీవ్రత దృష్ట్యా నాసిక్ పోలీసులు ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. కేవలం ఒక మహిళా ఫిర్యాదుతో మొదలైన ఈ కేసు, విచారణ కొనసాగుతున్న కొద్దీ మరికొంతమంది బాధితులు ముందుకు రావడంతో మరింత విస్తృతమైంది.ఈ కేసులో ఒకవైపు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు, మరోవైపు వ్యక్తిగత కక్షలనే వాదనలు వినిపిస్తుండటంతో సిట్ విచారణ కీలకంగా మారింది.ఇదీ చదవండి: ఎల్పీజీ యథాస్థితికి రావాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?నిదా ఖాన్పై ఆరోపణలుబాధితుల నుండి వచ్చిన 70కి పైగా ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా, హెచ్ఆర్ మేనేజర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) వాటిని పట్టించుకోలేదని సిట్ వెల్లడించింది. కార్యాలయంలోని లైంగిక వేధింపుల నివారణ (పోష్) కమిటీలో సభ్యురాలిగా ఉన్నప్పటికీ, ఫిర్యాదులను పక్కన పెట్టి, నిందితులను రక్షించడానికి ప్రయత్నించిన హెచ్ఆర్ మేనేజర్ నిదాఖాన్ను పోలీసులు కీలక 'సూత్రధారి'గా గుర్తించారు. నిందితుల మధ్య జరిగిన సుమారు 78 అనుమానాస్పద కాల్ రికార్డులు, ఈమెయిళ్లు, చాట్ సంభాషణలతో సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆర్థిక లావా దేవీలు జరిగినట్లు కూడా అనుమానిస్తున్నారు.
గూగుల్ పేలో ‘పాకెట్మనీ’ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ..!
పెద్దపల్లిరూరల్: సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తులు వేస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నిత్యజీవితంలో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గూగుల్ పే ద్వారా చెల్లింపులు చేసేందుకు యాప్ ఓపెన్ చేయగానే తొలుత ‘పాకెట్మనీ’ అనే సింబల్ కనిపిస్తోంది. దానిని నొక్కితే బ్యాంకు ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతున్నాయట. డిజిటల్ పేమేంట్ చేసే వారంతా తమకు అవసరం లేనియాప్, లింకుల జోలికి వెళ్లక పోవడమే మంచిదని పోలీసు అధికారులు పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
వీడియోలు
"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!
Breaking News: పూడి శ్రీహరికి బెయిల్
BC నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక సమావేశం
Delhi Airport: ఢీకొన్న రెండు విమానాలు
వడదెబ్బకు విరుగుడు! ఈ 3 తింటే సేఫ్ .. బాడీని కూల్ చేసే ఫుడ్స్
హీరోలు అంత ఫిట్ గా ఎలా ఉంటున్నారో తెలుసా? వీరి డైట్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు!
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు వల్లభనేని వంశీ ఫిర్యాదు
మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయం చేయొద్దు
LIVE:లష్కరే టాప్ కమాండర్పై కాల్పులు...
YSRCP శ్రీహరి అరెస్ట్, కుప్పం పోలీసుల తీరుపై అనుమానాలు


