Top Stories
ప్రధాన వార్తలు
బాబును పాన్ ఇండియా స్టార్ను చేద్దాం!!
దేశంలో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్లు..పాన్ ఇండియా క్రికెటర్లు..పాన్ ఇండియా బిజినెస్ మెన్..పాన్ ఇండియా హీరోలు..పాన్ ఇండియా మార్కెట్ ఉన్న నటీనటులు.. ఇదీ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న అంశం .అయితే పబ్లిసిటీ అంటే పీక కోసుకునే చంద్రబాబుకు కూడా ఇప్పుడు జాతీయస్థాయి లీడర్గా ఎదగాలనే పిచ్చి పట్టుకుంది. దేశంలో తన కన్నా సీనియర్ నాయకులు లేరని. మోడీ తదితరులు కూడా తనకన్నా జూనియర్లు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు పబ్లిసిటీతో అయినా సరే మీడియాను కొనేసి అయినా సరే.. లేకుంటే కొత్త పబ్లిసిటీ వ్యవస్థను ఏర్పాటు చేసి అయినా సరే యమర్జంట్గా పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అవ్వాలని తెగ ఆరాట పడుతున్నారు.ఈ క్రమంలోనే దావోస్ సదస్సుకు చంద్రబాబు లోకేష్ వెళ్లగా దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ప్రచారం చేసే నిమిత్తం ఎన్డీటీవీ.. ఐబీఎన్ వంటి జాతీయ ఇంగ్లీష్ ఛానల్ కు భారీ ఎత్తున డబ్బు గుమ్మరించారు. దీంతో ఆ చానళ్ళు చంద్రబాబు ఆహా ఓహో అంటూ జాకీలు పెట్టి లేపుతున్నాయి.👉చదవండి : భజన బ్యాచ్.. కొన్నాళ్ళు సైలెంట్గా ఉండండమ్మాఆ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఏ మేరకు పెట్టుబడులు వస్తాయన్నది గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడే తేటతెల్లమైంది. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్న ఏటా దావో సదస్సుకు వెళ్లడం.. ఫోటోలు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఒక్క పరిశ్రమ కూడా వచ్చింది లేదు. కానీ అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరుగుతున్నాయి... అదిగో భారీ పరిశ్రమ.. ఇదిగో వేలల్లో ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టడం అందరికీ తెలిసిందే.వాస్తవానికి చంద్రబాబుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహా టీవీ, తోపాటు పదుల సంఖ్యలో వెబ్సైట్లు . వందల సంఖ్యలో ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్ పేజీలు.. వేలల్లో సోషల్ మీడియా కార్యకర్తలు నిత్యం భజన చేస్తూ ఎలివేషన్లు ఇస్తున్నారు.చంద్రబాబు ప్రస్తుతం ఏం చేస్తానన్నది ప్రజలకు చెప్పారు కానీ వచ్చే పాతికేళ్లు.. రానున్న 50 ఏళ్లలో రాష్ట్రాన్ని అలా మారుస్తా? ఇలా మారుస్తా అంటూ మభ్య పెట్టడం అందరికీ తెలిసిందే. 30 ఏళ్ల కిందట విజన్ 2020 అంటూ కథలు చెప్పారు కానీ ఏమీ చేసింది లేదు. ఇప్పుడు ఏకంగా విజన్ 2047 అంటున్నారు. ఈ కథలన్నీ ప్రజలతో నమ్మించడానికి సరికొత్త ఏజెన్సీ సృష్టించడానికి ప్రభుత్వం పథకం సిద్ధం చేసింది.👉చదవండి : దావోస్ వెళ్దాం.. పబ్లిసిటీ బారెడు.. దక్కేది చెంచాడు!ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు సమాచారం అందించడానికి ప్రభుత్వం తరఫున సమాచార శాఖ ఉండనే ఉన్నది. దీనిలో ఐఏఎస్ అధికారి తో పాటు ఎంతమంది సీనియర్ జర్నలిస్టులు, జేడీలు, డీడీలు, ఏడీలు, డీపిఆర్ఓ, కేడర్లో పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్లంతా సరిపోలేదని మరో ప్రైవేట్ ఏజెన్సీని తీసుకొచ్చి చంద్రబాబు కు ఎలివేషన్..జాతీయ స్థాయి ప్రచారం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అంటే ఆ ఏజెన్సీకి ప్రజాధనం ధారవోసి చంద్రబాబుకు పబ్లిసిటీ ఇప్పిస్తారన్నమాట. దీనికోసం కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భారీ ఎత్తున సిబ్బందిని నియమించి వారితో బాబుకి ఎలివేషన్ ఇప్పిస్తారన్నమాట.దీంతోపాటు ఇద్దరు ఉద్యోగులను ప్రోగ్రాం కోఆర్డినేటర్లుగా నియమించి వారికి రూ.లక్షన్నర జీతం ఇవ్వాలని నిర్ణయించారు. వారు చంద్రబాబు పర్యటనకు..సభలు సమావేశాలకు సంబంధించిన వివరాలను మీడియాకు అందజేస్తారు. ఇటు తమ అనుకూల మీడియాకు కోట్లు దారబోస్తూనే ప్రైవేటు ఏజన్సీ ద్వారా కూడా భారీ ఎత్తున పబ్లిసిటీ చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మొత్తానికి ఎదైనాగానీ చంద్రబాబు తక్షణం జాతీయ స్థాయి నాయకుడు అయిపోవాలి..అదే టీడీపీ లక్ష్యం. 👉చదవండి : లోకేష్కు ఫుల్ ఎలివేషన్.. కాబోయే డిప్యూటీ సీఎం?సిమ్మాదిరప్పన్న
కోల్కత్తా టీ-20లో భారత్ ఘన విజయం
కోల్కాతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 133 పరుగుల టార్గెట్ను 12.5 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. ఈ విజయంతో 5మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది. ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 79(5 ఫోర్లు, 8 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు.స్కోర్లు: ఇంగ్లాండ్132/9 భారత్ 133/3ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల దాటికి కేవలం 132 పరుగులకే ఆలౌటైంది. తొలి ఓవర్లోనే విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ను ఔట్ చేసి అర్ష్దీప్ సింగ్ భారత్కు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.ఆ తర్వాత మళ్లీ మూడో ఓవర్లో బెన్ డకెట్ను అర్ష్దీప్ పెవిలియన్కు పంపాడు. అనంతరం స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్ను ఔట్ చేసి ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఓవరాల్గా భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.తుది జట్లుభారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అర్ష్దీప్ సింగ్..
మీర్పేట్లో కిరాతం.. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి..
సాక్షి, హైదరాబాద్: మీర్పేటలో దారుణం జరిగింది. డీఆర్డీవో కాంట్రాక్ట్ ఉద్యోగి గురుమూర్తి.. అనుమానంతో భార్యను కిరాతకంగా చంపేశారు. భార్య వెంకట మాధవిని చంపి ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టిన భర్త.. ఉండకబెట్టిన మాంసాన్ని చెరువులో పడేశారు.ఈ నెల 13వ తేదీ నుంచి వెంకట మాధవి కనిపించకుండా పోయింది. ఈ నెల 18న తన భార్య వెంకటమాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త గురుమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమర్షియల్ సిలిండర్ తీసుకొచ్చి ముక్కలను ఉడకబెట్టిన భర్త.. ముక్కలను ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చాడు. తర్వాత మృతదేహం పొడిని చెరువులో కలిపాడు. మూడు రోజుల పాటు ఇంట్లో మృతదేహాన్ని కాల్చివేసి పొడిగా మార్చేశాడు. బాడీ మొత్తాన్ని పొడిగా మార్చడంతో ఆనవాళ్లు దొరకలేదు.గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. 13 ఏళ్ల క్రితం వెంకటమాధవితో గురుమూర్తికి వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. తూప్రాన్పేట్లోని దండుపల్లిలో నివాసముంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని గుర్తించారు.దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించానని, ఆ తర్వాత వాటిని జిల్లెలగూడ చెరువులో పడేసినట్టు తెలిపాడు. దీంతో మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.ఇదీ చదవండి: ఓసారి మా ఇంటికొచ్చి.. టీ తాగి వెళ్లండి!
అంతరిక్షం నుంచి మహాకుంభ మేళా ఎలా కనిపిస్తుందంటే?.. ఫొటోలు విడుదల చేసిన ఇస్రో
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbh Mela)కు భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన పూర్తికానుంది. మౌని అమావాస్య (రెండో షాహీ స్నానం) వచ్చే జనవరి 29న , ఫిబ్రవరి మూడో తేదీన వసంత పంచమి రోజు (మూడో షాహీ స్నానం), ఫిబ్రవరి 12న (మాఘ పూర్ణిమ) అధిక సంఖ్యలో జనం రావచ్చని అంచనా.. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గణాంకాల ప్రకారం జనవరి 20 నాటికి 8.81 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తాజాగా మహాకుంభ మేళాకు సంబంధించిన కొన్ని చిత్రాలను విడుదల చేసింది. స్పేస్ సెంటర్ నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మహాకుంభ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు చేయకముందు, తర్వాత తీసిన ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో గతేడాది ఏప్రిల్లో మహాకుంభ్ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా కనబడగా, డిసెంబర్ 22 నాటికి నిర్మాణాలతో కనిపించింది. ఈ నెల 10న తీసిన ఫొటోల్లో ఓ పెద్ద నగరాన్ని తలపించేలా మహాకుంభ్ ప్రాంతం దర్శినమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇదీ చదవండి: స్వచ్ఛ కుంభమేళాకాగా, అశేష భక్త జనవాహిని తరలివస్తోన్న ప్రయాగ్రాజ్లోని కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొనబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి ఐదో తేదీన ప్రధాని మోదీ త్రివేణి సంగమ స్థలిలో పుణ్యస్నానం ఆచరిస్తారని ఆయా వర్గాలు మంగళవారం తెలిపాయి. మరోవైపు ఈనెల 27వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించనున్నారు. గంగా హారతి కార్యక్రమంలోనూ పాల్గొంటారు. అధికారులతో భేటీ కానున్నారు. అమిత్ షా వారంరోజుల్లో వస్తుండటంతో కుంభమేళాలో భద్రతను మరోసారి సమీక్షించారు. ప్రధాన కూడళ్ల వద్ద మరోసారి తనిఖీలుచేశారు. Maha Kumbh Tent City, Prayagraj, India as viewed by EOS-04 (RISAT-1A) satellite. 🛰️#MahaKumbh2025 #ISRO pic.twitter.com/J9nT6leYIJ— ISRO InSight (@ISROSight) January 22, 2025
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి
ముంబై : మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జల్గావ్ జిల్లా పరండా రైల్వేస్టేషన్ సమీపంలో ట్రైన్ ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంపై ప్రయాణికుల తెలిపిన వివరాల మేరకు.. జల్గావ్ జిల్లా పరండా రైల్వేస్టేషన్ సమీపంలోని పాచోరా ప్రాంతంలో వేగంగా వెళ్తున్న పుప్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లోకో పైలెట్ బ్రేకులు వేశారు. బ్రేకులు వేయడంతో ట్రైన్ చక్రాల నుంచి పొగ వ్యాపించింది. దీంతో ఆ పొగను చూసిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పుప్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు వ్యాపించాయంటూ బిగ్గరగా అరుస్తూ ప్రాణభయంతో పరుగులు తీశారు. వారిలో 35-40 మంది ట్రైన్ నుంచి దూకారు. ట్రైన్ చైన్ లాగడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు పుష్పక్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ నుంచి పట్టాలు దాటే ప్రయత్నం చేశారు. పట్టాలు దాటుతుండగా..ఎదురుగా వస్తున్న కర్నాటక ఎక్స్ప్రెస్ ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారని సమాచారం. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. VIDEO | At least six persons were killed after they stepped down from their train on the tracks and were run over by another train coming from the opposite direction in North Maharashtra's Jalgaon district on Wednesday evening. Visuals from the spot near Pachora station, where… pic.twitter.com/EKQU5LE50w— Press Trust of India (@PTI_News) January 22, 2025
బీజేపీకి షాక్.. కూటమికి సీఎం నితీష్ కుమార్ గుడ్బై.. ఎక్కడంటే?
ఇంఫాల్ : బీహార్ సీఎం నితిష్ కుమార్ (cm nitish kumar) బీజేపీకి ఝలక్ ఇచ్చారు. మణిపూర్ (manipur) బీజేపీ (bjp) నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో జనతా దళ్ (యునైటెడ్) తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జేడీయూ యూనిట్ అధినేత కాష్ బీరెన్ సింగ్ రాష్ట్ర అధికార బీజేపీకి మద్దతు ఉప సంహరించుకుంటున్నట్లు మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ బహ్లాకు లేఖ రాశారు. ప్రతిపక్ష బాధ్యత వహిస్తారని సూచించారు.మణిపూర్లో తమపార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నసీర్కు అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో సీటును కేటాయించాలని కోరారు. ఇకపై రాష్ట్రంలో బీజేపీకి జేడీయూ మద్దతు ఉండబోదని, అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతారని లేఖలో పేర్కొన్నారు. గతంలో బీజేపీకి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. తాజాగా, జేడీయూ సైతం కమలానికి గుడ్ బై చెప్పడం మణిపూర్ రాష్ట్ర రాజకీయాలు చర్చాంశనీయంగా మారాయి. 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు స్థానాలను గెలుచుకుంది. అయితే ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల తర్వాత ఐదురుగు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 60 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి నాగా పీపుల్స్ ఫ్రంట్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే బీహార్లో అభివృద్ది ఆగిపోతుందనే అనుమానాల్ని జేడీయూ నేతలు కొట్టి పారేస్తున్నారు. కేంద్ర ఎన్డీఏ కూటమిలో జేడీయూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాదు కూడదు అంటే .. అది బీజేపీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు.
రూ.వేల కోట్ల సంపన్నుడు.. లోకల్ ట్రైనే ఎక్కుతాడు..
దేశంలోని కొందరు పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖలు తమ నిరాంబర శైలితో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో నిరంజన్ హీరానందని (Niranjan Hiranandani) ఒకరు. వేల కోట్ల సంపదకు అధిపతి అయినా లోకల్ ట్రైన్లోనే ప్రయాణిస్తూ పలువురి ఆదర్శంగా నిలుస్తున్నారు. రియల్ ఎస్టేట్ పరిశ్రమలో 'ఇండస్ట్రీ గురు'గా పేరొందిన ఆయన హీరానందని గ్రూప్ పేరుతో భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి కొత్త శిఖరాలకు నడిపించారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండి డేటా సెంటర్స్, ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ బిజినెస్ కొత్త యుగం వరకు విస్తరించిన హీరానందని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు నిరంజన్ హీరానందని నాయకత్వం వహిస్తున్నారు. తన పదునైన వ్యాపార చతురత, నైపుణ్యంతో హీరానందని గ్రూప్ను ప్రపంచ ఖ్యాతి పొందిన కంపెనీగా మార్చడంలో ప్రసిద్ది చెందారు. నిరంజన్ హిరానందని గురించి, ఆయన విజయవంతమైన ప్రయాణం గురించి ఈ కథనంలో తెలుసుకుందామా..?నిరంజన్ హీరానందని నెట్వర్త్హురున్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. భారతదేశంలోని 50 మంది ధనవంతులలో నిరంజన్ హీరానందనీ ఉన్నారు. నిరంజన్కు రూ. 12 వేల కోట్లకుపైగా విలువైన ఆస్తులు ఉన్నాయి . విలాసవంతమైన కార్ల కలెక్షన్ కూడా ఉంది. అయితే నిరంజన్ గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయన ఇప్పటికీ ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తూ కనిపిస్తారు.లోకల్ ట్రైన్లో ప్రయాణం ఇందుకే..ముంబై మహా నగరంలో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. అంతటి ట్రాఫిక్లో ప్రయాణించాలంటే చాలా సమయం పడుతుంది. దీంతో టైమ్కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే నిరంజన్ హీరానందని ట్రాఫిక్లో సమయాన్ని వృథా చేయకుండా ముంబై లోకల్ రైలులో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. ఇలా రైలులో వెళ్తున్నప్పుడు సాధారణ వ్యక్తులతో ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చన్నది ఆయన భావన."ఆయన (నిరంజన్ హీరానందానీ) తెలివిగల పెట్టుబడి వ్యూహాలు, మార్గదర్శక పరిణామాలకు ప్రసిద్ధి చెందారు. అతని ఆర్థిక విజయం రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్దాల అంకితభావం కృషి ప్రత్యక్ష ఫలితం" అని నిరంజన్ హీరానందానీ అధికారిక వెబ్సైట్ తెలిపింది. "ఆయన ప్రయత్నాలు ముంబై స్కైలైన్ను మార్చడమే కాకుండా, పట్టణ జీవన ప్రమాణాలను కూడా మార్చేశాయి, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, స్థిరమైన జీవనం ,విలాసవంతమైన జీవనశైలి అనేకమందికి అందుబాటులోకి తీసుకువచ్చాయి" వెబ్సైట్ పేర్కొంది.స్వీయ నిర్మిత బిలియనీర్నిరంజన్ హీరానందని సెల్ఫ్ మేడ్ బిలియనీర్గా గుర్తింపు పొందారు. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్న లక్ష్యంతో సీఏ చదువును అభ్యసించిన ఆయన తర్వాత అకౌంటింగ్ టీచర్గా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. వాణిజ్య రంగంలో కొన్ని సంవత్సరాల తరువాత, హీరానందని తన సోదరుడితో కలిసి హీరానందని గ్రూప్ను స్థాపించారు. తరువాత 1981లో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. కాలక్రమేణా, హీరానందని తన దృష్టిని రియల్ ఎస్టేట్ పరిశ్రమపైకి మళ్లించి చివరికి ఆ రంగంలో తనను తాను ప్రముఖ వ్యక్తిగా స్థాపించుకున్నారు.
మహాకుంభ్ మేళా తేనే కళ్ల బ్యూటీ.. ఏకంగా సినిమాలో ఆఫర్!
సోషల్ మీడియా ఆ మహిళను ప్రపంచానికి పరిచయం చేసింది. అంతకుముందు తాను ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కాదు.. రాజకీయ నాయకురాలు అంత కన్నా కాదు. ఆమె ఓ సాధారణ మహిళ. పొట్టికూటి కోసం రోడ్డు వెంట చిన్న చితకా వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఇప్పుడేమో ఆ మహిళ ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది. ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. అంతేకాదు బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టిసిందేనే వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటో తెలుసుకుందాం.యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహకుంభ్ మేళా మోనాలిసా అనే మహిళకు ఒక్కసారిగా ఫేమ్ తీసుకొచ్చింది. ఆమెను ఓవర్నైట్ స్టార్ను చేసింది. దానికి కారణం ఆమె కళ్లు. తేనేలాంటి కళ్లతో మహాకుంభ్ మేళాలో పూసల దండలు విక్రయిస్తున్న మోనాలిసా అనే మహిళను ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఆ తర్వాత అది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఏ సోషల్ మీడియా చూసిన ఆమె వీడియోలే దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోనాలిసా పేరు వైరల్ కావడంతో ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఆమెకు ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఏకంగా సినిమా ఛాన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాడు.మహాకుంభ్ మేళాలో అందరి కళ్లను తనవైపు తిప్పుకున్న తేనేకళ్ల సుందరి మోనాలిసా. ఆమెను చూసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన మూవీలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించాడు. దీనికి కారణం ఆమెకున్న స్పెషల్ అట్రాక్షన్ కళ్లు. ఆ అందమైన కళ్లతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తన సినిమాలో అమ్మాయి కోసం వెతుకున్న బాలీవుడ్ డైరెక్టర్కు మోనాలిసా గురించి తెలిసింది. డైరీ ఆఫ్ మణిపూర్ మూవీలో ఆమెకు అవకాశమివ్వనున్నట్లు సనోజ్ మిశ్రా తెలిపారు. ఆమెకు తన సినిమాలో ఓ రైతుకు బిడ్డగా నటించే పాత్ర ఇస్తానని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా వల్ల ఓవర్నైట్ స్టార్ అయిన మోనాలిసా ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ(YSRCP) మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి (Varudu Kalyani) ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. హోం మంత్రి సొంత జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, బెల్ట్ షాప్లు, గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాల లభ్యతతో అసాంఘిక శక్తులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.వరుదు కళ్యాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:మహిళలకు భద్రత లేదు: రాష్ట్రంలో మహిళలు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్ళే విద్యార్ధులకు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో రోజులు గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఇంత దారుణమైన సంఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదు. భీమిలి నియోజకవర్గంలో దివ్యాంగురాలైన ఒక మైనర్ బాలికపైన మద్యం తాగిన దుండగుడు అత్యాచారం చేశాడు. అలాగే మరో మైనర్ బాలికను కారులో బలవంతంగా తీసుకువెళ్ళి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించి అక్కడ పని చేస్తున్న మహిళలపై దౌర్జన్యం చేశాడు. కర్నూలు జిల్లా కోడుమూరు మండల ప్రాధమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన స్కూల్ లో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కేవలం రోజుల వ్యవధిలోనే ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉంటే, ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా వీటిని నివారించడంలో విఫలమయ్యారు. మహిళల రక్షణ కోసం ఎటువంటి ప్రత్యేక చర్యలు లేవు.గతంలో జగన్గారి ప్రభుత్వంలో తీసుకువచ్చిన దిశ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొత్తగా ఎటువంటి వ్యవస్థను తీసుకు రాకపోవడం వల్ల నిత్యం మన రాష్ట్రంలో ప్రతి గంటకు రెండుమూడు సంఘటనలు మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఇవి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు. దీనికి ప్రధానంగా మద్యం ఏరులై పారుతోంది. 50వేలకు పైగా బెల్ట్షాప్లు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో కూడా వెలిశాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సంబరాల్లో ఇష్టారాజ్యంగా బెల్ట్షాప్లు నిర్వహించినా ప్రభుత్వం పట్టించకోలేదు. ఎనీటైం మద్యం లభించే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ మద్యం మత్తులో మందుబాబులు పట్టపగలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన జాతరలో ఎనబై శాతం మద్యం మత్తులో జరిగినవే.మాదక ద్రవ్యాల నియంత్రణలో చర్యలు ఏవీ?గంజాయిని వంద రోజుల్లో అరికడతామని చెప్పిన హోం మంత్రి తాను నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్ లోనూ, విశాఖ జైలు ఆవరణలోనూ గంజాయిని పండిస్తుంటే ఏం చేస్తున్నారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి సాగు జరుగుతోంది. హోం మంత్రి సొంత నియోజకవర్గం మీదుగా గంజాయి రవాణా జరుగుతోంది. సాక్షాత్తు స్పీకర్ చెప్పిన మాటల ప్రకారం విశాఖ కేంద్రంగా గంజాయి సాగు, రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో అసమర్థమైన పాలన జరగుతోంది. మహిళా రక్షణపై నిత్యం హోం మంత్రి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపుంజులతో ఫోటోలు దిగడం, పోలీసుల పహారాలో కోడిపందాలు, బెల్ట్షాపల్ నిర్వాహణ కొనసాగించారు.హోం మంత్రినే స్వయంగా అలా చేస్తే ఇక అసాంఘిక శక్తులకు పట్టపగాలు ఉంటాయా? మరోవైపు ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలోనే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కొకైన్ వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇలాంటి పరిస్థితి ఉంటే మహిళల గౌరవానికి రక్షణ లేదు. రాష్ట్రంలోని పోలీసులను ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టేందుకే వినియోగించుకుంటున్నారు. చివరికి దావోస్ వెళ్ళిన మంత్రి నారా లోకేష్ అక్కడ కూడా తన రెడ్బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు.దాడుల ఘటనల్లో బాధితులకు భరోసా ఏదీ?:యలమంచిలి ఏటికొప్పాకలో నాలుగేళ్ళ బాలికపై లైంగిక దాడి జరిగితే రాష్ట్ర హోం మంత్రి ఏమైనా స్పందించారా? మీ పక్క నియోజకవర్గం యలమంచిలిలో రాంబిల్లి గ్రామంలో ఒక యువతిని సురేష్ అనే నిందితుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన జరిగి ఆరు నెలలు అయినా, నేటికీ హోమంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందించలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యతా యుతమైన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ స్పందించి, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్నారని తెలియగానే హడావుడిగా కూటమి ప్రభుత్వంలోని మంత్రులు అక్కడికి పరుగులు పెడుతుంటారు.ఇదీ చదవండి: కూటమి సర్కార్.. పరిశ్రమలకు శాపం: నాగార్జున యాదవ్ఎక్కడ తమకు చెడ్డపేరు వస్తుందోనని మాత్రమే వారు స్పందిస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్దితో వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. బాధిత కుటుంబాలకు మేం అండగా ఉంటామనే భరోసాను కల్పించలేక పోతున్నారు. ఎంతసేపు రాజకీయాలు చేయడం, ఇసుక, మద్యం ఆదాయాన్ని పంచుకోవడం, సీఎం, డిప్యూటీ సీఎం అంటూ పదవులను పంచుకోవడంపైనే శ్రద్ద కనపరుస్తున్నారు. మధ్యం, మాదక ద్రవ్యాల కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయి. అందుకే వెంటనే రాష్ట్రంలోని బెల్ట్షాప్లన్నింటినీ తొలగించాలని, మద్యం విక్రయాలను నియంత్రించాలని, లేని పక్షంలో బెల్ట్షాప్లను మహిళలే ధ్వంసం చేస్తారని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు.
స్టాక్ బ్రోకింగ్లోకి జియో అడుగు.. ఇక దూకుడే!
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (Jio Financial Services), యూఎస్ కంపెనీ బ్లాక్ రాక్ (BlackRock) తమ మ్యూచువల్ ఫండ్ వ్యాపారంపై రూ.117 కోట్లను తాజాగా ఇన్వెస్ట్ చేసినట్టు ప్రకటించాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్ రాక్ చెరో 50 శాతం వాటాతో ‘జియో బ్లాక్రాక్ అస్సెట్ మేనేజర్స్ ప్రైవేటు లిమిటెడ్’ను ఏర్పాటు చేయడం తెలిసిందే.జియో బ్లాక్ రాక్ అస్సెట్ మేనేజర్స్కు సంబంధించి రూ.117 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లను (రూ.10 ముఖ విలువ) జియో ఫైనాన్షియల్, బ్లాక్రాక్కు (చెరో 5.85 కోట్ల షేర్లు) కేటాయించినట్టు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. ఇరు సంస్థలు ఇప్పటికే చెరో రూ.82.5 కోట్ల చొప్పున ఆరంభ పెట్టుబడి పెట్టడం గమనార్హం. అలాగే, ఇరు సంస్థలూ కలసి తమ జాయింట్ వెంచర్ కంపెనీ జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా ‘జియో బ్లాక్రాక్ బ్రోకింగ్ ప్రైవేటు లిమిటెడ్’ను ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ ద్వారా స్టాక్ బ్రోకింగ్ వ్యాపారం నిర్వహించనున్నాయి. వృద్ధిలో స్టాక్ బ్రోకరేజ్ పరిశ్రమభారతీయ స్టాక్ బ్రోకరేజ్ పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధించింది. ముఖ్యంగా కోవిడ్ అనంతరం డిజిటల్ స్వీకరణలో పెరుగుదల నేపథ్యంలో ఎక్కువ మంది రిటైల్ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు తరలివస్తున్నారు. మార్కెట్లు, పెట్టుబడి అవకాశాలను సులభంగా అందుకునేందుకు ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల ఇన్వెస్టర్లు మళ్లుతున్నారు. దీంతో జెరోధా (Zerodha), ఏంజిల్ వన్ (Angel One), అప్స్టాక్స్ (Upstox), ఫైవ్పైసా (5Paisa) వంటి ప్రముఖ సంస్థల వృద్ధికి దారితీసింది.ఈ ప్లాట్ఫామ్లు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్లు, పోటీ ధర, అధునాతన సాధనాలను అందించడం ద్వారా పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చాయి. స్టాక్ ట్రేడింగ్ను ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చాయి. పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యత, ఈక్విటీ మార్కెట్లలో పెరుగుతున్న ఆసక్తి, డిజిటల్ ఫైనాన్స్ను ప్రోత్సహించే ప్రభుత్వ కార్యక్రమాలతో భారతీయ బ్రోకరేజ్ పరిశ్రమ అపారమైన వృద్ధి సామర్థ్యంతో బలమైన భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంది.జియో ఫైనాన్స్ క్యూ3 ఫలితాలుజియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 2024 డిసెంబర్కి అమ్మకాలలో స్వల్ప పెరుగుదలను నివేదించింది. 2023 డిసెంబర్ నాటి రూ. 414 కోట్ల నుంచి 5.8% వృద్ధిని నమోదు చేసి రూ. 438 కోట్లకు పెరిగాయి. అయితే ఎబిటా (EBITDA) 2.2% స్వల్ప క్షీణతను చూసింది. రూ.320 కోట్ల నుంచి రూ. 313 కోట్లకు తగ్గింది. నిర్వహణ లాభాల మార్జిన్ (OPM) కూడా క్షీణిచించింది. 2023 డిసెంబర్లో ఉన్న 77% నుండి 2024 డిసెంబర్లో 71%కి పడిపోయింది. మార్జిన్లలో క్షీణత ఉన్నప్పటికీ, నికర లాభం స్థిరంగా ఉంది. స్వల్పంగా 0.3% రూ. 294 కోట్ల నుంచి రూ. 295 కోట్లకు పెరిగింది. కార్యాచరణ సామర్థ్యం, మార్జిన్ కంప్రెషన్లో సవాళ్లు ఉన్నప్పటికీ ఇది స్థిరమైన లాభదాయకతను సూచిస్తోంది.
ఎయిర్టెల్ యాప్లో బజాజ్ ఫైనాన్స్.. కొత్త క్రెడిట్ కార్డు
నితీశ్ కుమార్ కళ్లు చెదిరే క్యాచ్.. జోస్ బట్లర్! వీడియో వైరల్
జిమ్లో ఆదిపురుష్ భామ.. పెళ్లి కూతురిలా అత్తారింటికి దారేది హీరోయిన్!
తెలంగాణలో సన్ పెట్రోకెమికల్స్ భారీ పెట్టుబడులు
రూ.వేల కోట్ల సంపన్నుడు.. లోకల్ ట్రైనే ఎక్కుతాడు..
బ్యాడ్ బాయ్గా వస్తోన్న నాగ శౌర్య.. ఆసక్తిగా ది డెవిల్స్ ఛైర్ పోస్టర్!
కోల్కత్తా టీ-20లో భారత్ ఘన విజయం
బాబును పాన్ ఇండియా స్టార్ను చేద్దాం!!
పాకిస్తాన్ను చిత్తు చేసిన ఐర్లాండ్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
మీర్పేట్లో కిరాతం.. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి..
‘చాలా చెడ్డ దేశం’.. రాగానే ట్రంప్ చర్యలు షురూ
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారంవేళ ఖఢ్గం పట్టుకుని ట్రంప్ డ్యాన్స్
మీరు ఎంత త్వరగా ఇక్కడి నుండి వెళితే అంత మంచిది.. లేకుంటే మాజీ సీఎం అయ్యే ప్రమాదముంది సార్!
ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి.. ఆస్తులు కొంటారు.
సైఫ్ అలీఖాన్కు తెలీకుండా భార్యనే నిద్రమాత్రలిచ్చింది: చిత్రనిర్మాత
ఐఏఎస్, ఐపీఎస్లపై కూటమి సర్కార్ కక్ష
భార్య పేరు మీద డిపాజిట్.. రూ.32వేలు వడ్డీ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. కెప్టెన్గా సంజూ శాంసన్! నితీశ్కు చోటు?
హెచ్1బీ వీసాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
10 బంతుల్లోనే ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్కప్-2025లో సంచలనం
ఎయిర్టెల్ యాప్లో బజాజ్ ఫైనాన్స్.. కొత్త క్రెడిట్ కార్డు
నితీశ్ కుమార్ కళ్లు చెదిరే క్యాచ్.. జోస్ బట్లర్! వీడియో వైరల్
జిమ్లో ఆదిపురుష్ భామ.. పెళ్లి కూతురిలా అత్తారింటికి దారేది హీరోయిన్!
తెలంగాణలో సన్ పెట్రోకెమికల్స్ భారీ పెట్టుబడులు
రూ.వేల కోట్ల సంపన్నుడు.. లోకల్ ట్రైనే ఎక్కుతాడు..
బ్యాడ్ బాయ్గా వస్తోన్న నాగ శౌర్య.. ఆసక్తిగా ది డెవిల్స్ ఛైర్ పోస్టర్!
కోల్కత్తా టీ-20లో భారత్ ఘన విజయం
బాబును పాన్ ఇండియా స్టార్ను చేద్దాం!!
పాకిస్తాన్ను చిత్తు చేసిన ఐర్లాండ్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
మీర్పేట్లో కిరాతం.. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి..
‘చాలా చెడ్డ దేశం’.. రాగానే ట్రంప్ చర్యలు షురూ
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారంవేళ ఖఢ్గం పట్టుకుని ట్రంప్ డ్యాన్స్
మీరు ఎంత త్వరగా ఇక్కడి నుండి వెళితే అంత మంచిది.. లేకుంటే మాజీ సీఎం అయ్యే ప్రమాదముంది సార్!
ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి.. ఆస్తులు కొంటారు.
సైఫ్ అలీఖాన్కు తెలీకుండా భార్యనే నిద్రమాత్రలిచ్చింది: చిత్రనిర్మాత
ఐఏఎస్, ఐపీఎస్లపై కూటమి సర్కార్ కక్ష
భార్య పేరు మీద డిపాజిట్.. రూ.32వేలు వడ్డీ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. కెప్టెన్గా సంజూ శాంసన్! నితీశ్కు చోటు?
హెచ్1బీ వీసాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
10 బంతుల్లోనే ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్కప్-2025లో సంచలనం
సినిమా
ఆటో డ్రైవర్ను కలిసిన సైఫ్ అలీఖాన్.. ఎంత నగదు ఇచ్చారంటే?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. సైఫ్పై దాడి జరిగిన తర్వాత ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా తన ఆటోలోనే లీలావత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడంతో సైఫ్కు ప్రాణాపాయం తప్పింది. దీంతో ఆటో డ్రైవర్ను పలువురు అభినందించారు.ఈనెల 16న సైఫ్ ఇంట్లోకి చోరీకి యత్నించిన వ్యక్తి హీరోపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్కు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే సైఫ్ ఆస్పత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలో సైఫ్ను ఆటోలో ముంబయిలోని లీలావతికి తీసుకెళ్లారు భజన్ సింగ్. ఆ సమయంలో అతనెవరో తాను గుర్తు పట్టలేదన్నారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చడమే తన లక్ష్యంగా ఆటో నడిపినట్లు భజన్ సింగ్ వెల్లడించారు. అయితే సైఫ్ ప్రాణాలు కాపాడిన భజన్ సింగ్కు ముంబయికి చెందిన ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ అందించింది. సైఫ్ ఆర్థిక సాయం..తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్కు సైఫ్ అలీ ఖాన్ ఆర్థిక సాయమందించారు. తనవంతుగా రూ.50 వేలను భజన్ సింగ్ రానాకు అంద జేశారు. ఈ సందర్భంగా ఆపద సమయంలో తనను రక్షించినందుకు అతనికి సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే అంతకు ముందు తన ఆటోలో వచ్చింది సైఫ్ అలీఖాన్ అని తెలియదని.. వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని భజన్ సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.నిందితుడి అరెస్ట్.. సైఫ్ అలీఖాన్పై దాడి చేసిన నిందిచతుడి ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్కు చెందిన మహమ్మద్ షరీఫుల్గా అతన్ని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో పోలీసులు అతనితో పాటు సైఫ్ ఇంటికి వెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పదేళ్లుగా నన్ను అలా ట్రోల్ చేస్తునే ఉన్నారు: అనిల్ రావిపూడి
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ శాతం చాలా తక్కువ. వరుస హిట్లను అందించిన దర్శకులు చాలా అరుదు. టాలీవుడ్లో అయితే రాజమౌళి తర్వాత కెరీర్లో ఒక్క ప్లాఫ్ లేని దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi ) మాత్రమే. ఆయన దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తి అయ్యాయి. ఈ పదేళ్లలో ఏనిమిది సినిమాలు తెరకెక్కిస్తే ప్రతిదీ సూపర్ హిట్ టాక్నే సంపాదించుకుంది. ఇక ఈ సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam) సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. వారం రోజుల్లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది. ఎఫ్ 2 మొదలుకొని చివరి 5 సినిమాలు 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. అయినా కూడా అనిల్ రావిపూడిపై కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన సినిమాల్లో ఉండే కామెడీ ‘జబర్థస్త్’ కామెడీ షోని గుర్తు చేస్తుందని కొంతమంది విమర్శిస్తుంటారు. తాజాగా ఈ విమర్శలపై అనిల్ రావిపూడి స్పందించాడు. గత పదేళ్లుగా తన సినిమాలను ‘జబర్థస్త్ కామెడీ’ షోతో పోలుస్తూనే ఉన్నారని.. సినిమా ప్రేక్షకులే వారికి సమాధానం చెబుతున్నారని కాస్త వ్యంగ్యంగా చెప్పారు.‘నా సినిమాల్లో జబర్దస్త్ టైపు స్కిట్స్ ఉంటాయని కొంతమంది అంటుంటారు. అలా అనేవాళ్లు పది శాతం ఉంటే.. 90 శాతం మంది నా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. గత పదేళ్లుగా కొంతమంది నా సినిమాలను విమర్శిస్తూనే ఉన్నారు. నాకు అలవాటైపోయింది. అందుకే నేను వాళ్లను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నా. ఆడియన్సే వాళ్లకు సమాధానం చెబుతున్నారు. ఒకవేళ వాళ్లు అన్నదే నిజమైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా వారం రోజుల్లో 200 కోట్లను రాబట్టదు. ఎవరో ఏదో అంటున్నారని నేను నా పంథాను మార్చుకోను. ఇలానే సినిమాలు చేస్తాను. నాకు ఆడియన్స్ తోడుగా ఉన్నారు. నా సినిమాలను ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాంటి వల్గారిటీ లేకుండా సినిమాలను చేస్తున్నాను. కామెడీ కోసం కూడా బూతు పదాలను వాడట్లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు చేత కూడా కొంతవరకు మాత్ర బూతులు తిట్టించాను. అది కూడా ఓ మంచి సందేశం ఇవ్వడం కోసమే. ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్లు చూసి పిల్లలు ఎలా చెడిపోతున్నారనేది ఈ సినిమాలో చూపించాం. దాని కోసమే చిన్న చిన్న బూతు పదాలు వాడం.అంతకు మించి నా సినిమాల్లో బోల్డ్ కంటెంట్ అనేది ఉండదు. ఇకపై కూడా కామెడీ సినిమాలను చేస్తాను.ప్రతి శుక్రవారం ఏ సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్లో ఉంటా. నాకంటే సినిమా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను తప్పులు చేస్తే సరిద్దుకుంటా. ఇక ముందు నేను తీసే సినిమాల జర్నీ కూడా ఇలానే ఉంటుంది’ అని అనిల్ రావిపూడి అన్నారు.కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. విక్టరీ వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదలై సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్లోంది. విడుదలైన ఎనిమిది రోజుల్లో 218 కోట్ల గ్రాస్ వసూళ్లను సంపాదించి సంక్రాంతి విన్నర్గా నిలిచింది.
బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్.. అదే ప్రధాన కారణం: అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం స్కై ఫోర్స్ అనే మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. సందీప్ కేవ్లానీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హైజరైన అక్షయ్ బాక్సాఫీస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఓటీటీల వల్లే మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయని అక్షయ్ కుమార్ అన్నారు. ఓటీటీలు వచ్చాక థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల భారీగా తగ్గిందని తెలిపారు. పెద్ద చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద రాణించకపోవడానికి ప్రధాన కారణం ఓటీటీలేనని వెల్లడించారు.అక్షయ్ కుమార్ మాట్లాడుతూ..'ఈ మధ్యకాలంలో నేను చాలామందితో సినిమాల గురించి ఆరా తీశా. ఏ సినిమా అయినా ఓటీటీలో చూస్తామని అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద సినిమాలు సరిగ్గా సక్సెస్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం ఓటీటీనే అని నాకు అర్థమైంది. కరోనా టైమ్లో ఓటీటీ వేదికగా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూశారు. ఆ తర్వాత పరిస్థితులు మారినప్పటికీ ప్రేక్షకులు ఓటీటీకే మొగ్గు చూపుతున్నారు. అది ఒక అలవాటుగా మారిందని' అన్నారు. కాగా.. తెలుగులోనూ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఓటీటీలో సడెన్గా ఎంట్రీ ఇచ్చిన తెలుగు 'సస్పెన్స్ థ్రిల్లర్' సినిమా
వేదిక(Vedhika) ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘ఫియర్’ (Fear) ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ చిత్రం సడెన్గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్గా మెప్పించిన ఈ సినిమాలో అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు నటించారు. డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మించారు. విడుదలకు ముందే ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది . అయితే, ఈ చిత్రం టాలీవుడ్లో గతేడాది డిసెంబర్ 14న రిలీజైంది. (ఇదీ చదవండి: చనిపోయిన తర్వాత నా ఫోటోలు పెట్టకండి.. కన్నీళ్లతో గ్లామర్ క్వీన్ రిక్వెస్ట్)ఫియర్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే నేడు (జనవరి 22) ఓటీటీలో విడుదలైంది. 'అమెజాన్ ప్రైమ్'లో(Amazon Prime Video) ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఎక్కువగా థ్రిల్లర్ అంశాలతో పాటు హారర్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీనేజ్ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతమేరకు ఉండాలి అనే కాన్సెప్ట్తో ఫియర్ చిత్రాన్ని తీశారు. సినిమా కాస్త పర్వాలేదనిపించేలా ఉంటుంది. కానీ, పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేకపోయింది.కథేంటంటే..సింధు(వేదిక) అనే అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతూ ఉంటోంది. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ఊహించుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు తాను ప్రాణంగా ప్రేమించే అరవింద్ కృష్ణ(సంపత్) దూరం కావడంతో మరింత మనోవేదనకు గురి అవుతుంది. అంతేకాకుండా తన చెల్లి ఇందుతో గొడవ పడటం, పేరేంట్స్కు దూరంగా ఉండటం లాంటి సింధును మరింత కుంగదీస్తాయి. అసలు సింధు తన చెల్లితో ఎందుకు గొడవ పడింది? తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికి కారణమేంటి? ఆమె ప్రియుడు సంపత్ తిరిగొచ్చాడా? అనేది తెలియాలంటే ఫియర్ చూడాల్సిందే.
న్యూస్ పాడ్కాస్ట్
ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్.. 16 మంది మావోయిస్టులు మృతి
అమెరికాకు ఇక స్వర్ణయుగమే... డొనాల్డ్ ట్రంప్ స్పష్టీకరణ... 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం
హైదరాబాద్లో 450 కోట్ల రూపాయలతో భారీ ఐటీ పార్క్. ఏర్పాటుకు సిద్ధమైన క్యాపిటల్ ల్యాండ్ సంస్థ. సింగపూర్లో తెలంగాణ ప్రతినిధి బృందంతో చర్చలు, ఒప్పందం
తిరుమలలో వరుస ఘటనలపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం. తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై నివేదిక పంపాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్లో పేదల ఇళ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం కక్ష... ఇళ్లు నిర్మించుకోనివారి స్థలాల కేటాయింపులు రద్దు
హెచ్ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారు?... ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కానున్న కేటీఆర్
మహా కుంభమేళాకు తరలివస్తున్న అశేష జనవాహిని.. రెండ్రోజుల్లో రెండున్నర కోట్ల మంది పుణ్యస్నానాలు
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
తిరుపతి తొక్కిసలాట ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపణ
క్రీడలు
చరిత్ర సృష్టించిన అర్ష్దీప్ సింగ్..
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా అర్ష్దీప్ రికార్డులకెక్కాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో బెన్ డకెట్ను ఔట్ చేసిన అర్ష్దీప్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.ఇప్పటివరకు 61 టీ20 మ్యాచ్లు ఆడిన అర్ష్దీప్.. 97 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉండేది. చాహల్ 80 మ్యాచ్ల్లో 96 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్తో చాహల్ రికార్డును సింగ్ బ్రేక్ చేశాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్కు అర్ష్దీప్ అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్లోనే విధ్వంసర ఆటగాడు ఫిల్ సాల్ట్ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత మూడో ఓవర్లో బెన్ డకెట్ను ఔట్ చేశాడు. ఈ పంజాబీ పేసర్ గత కొంత కాలంగా టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు అర్ష్దీప్ ఎంపికయ్యాడు. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి అర్ష్దీప్ బంతిని పంచుకోనున్నాడు.టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు వీరే..97 వికెట్లు - అర్ష్దీప్ సింగ్ (61 మ్యాచ్లు)96 వికెట్లు - యుజ్వేంద్ర చాహల్ (80 మ్యాచ్లు)90 వికెట్లు - భువనేశ్వర్ కుమార్ (87 మ్యాచ్లు)89 వికెట్లు - జస్ప్రీత్ బుమ్రా (70 మ్యాచ్లు)89 వికెట్లు - హార్దిక్ పాండ్యా(110 మ్యాచ్లు)తుది జట్లుభారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: BCCI: టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు.. డ్రెస్ కోడ్ ఫాలో అవుతాం: బీసీసీఐ
రీ ఎంట్రీ ఇస్తా.. క్రికెట్ ఆడాలని ఉంది.. కానీ: డివిలియర్స్
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్(AB De Villiers) అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను తిరిగి కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు. అయితే, మరోసారి ప్రొఫెషనల్ క్రికెటర్గా మారి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లేదంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో మాత్రం ఆడలేనని స్పష్టం చేశాడు.లెజెండరీ బ్యాటర్గాకాగా 2004లో సౌతాఫ్రికా(South Africa) తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన డివిలియర్స్ లెజెండరీ బ్యాటర్గా ఎదిగాడు. ప్రొటిస్ జట్టు కెప్టెన్గానూ పనిచేశాడు. ఇక వికెట్ కీపర్గానూ సత్తా చాటిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. తన కెరీర్లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 8765, 9577, 1672 పరుగులు చేశాడు.ఇక డివిలియర్స్ ఖాతాలో ఖాతాలో 22 టెస్టు సెంచరీలు, 25 వన్డే శతకాలు ఉన్నాయి. ఐపీఎల్లో సుదీర్ఘ కాలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)కు ప్రాతినిథ్యం వహించిన ఏబీడీ.. ఓవరాల్గా 184 మ్యాచ్లు ఆడి 5162 రన్స్ సాధించాడు. ఇందులో మూడు శతకాలు కూడా ఉండటం విశేషం.‘రియల్ క్రికెట్’ ఆడాలని ఉందికాగా 2021 నవంబరులో డివిలియర్స్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం తన సమయంలో ఎక్కువ భాగం కుటుంబానికి కేటాయించిన ఏబీడీ.. చారిటి, బ్రాడ్కాస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి తనకు ‘రియల్ క్రికెట్’ ఆడాలని ఉందంటూ అతడు వ్యాఖ్యానించడం విశేషం.ఈ విషయం గురించి మెలిండా ఫారెల్కు చెందిన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘ఈరోజుకీ నేను క్రికెట్ ఆడగలననే నమ్మకంతో ఉన్నాను. అయితే, ఇప్పటి వరకు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా పిల్లలు మాత్రం నాపై ఒత్తిడి పెంచుతున్నారు. వాళ్లతో కలిసి నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాలో మళ్లీ క్రికెట్ ఆడాలనే కోరిక కలిగింది.ఏదో ఓ చోట కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలని భావిస్తున్నా. అయితే, నేను ఆర్సీబీ గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఐపీఎల్ లేదంటే సౌతాఫ్రికా టీ20 లీగ్లో మాత్రం పాల్గొనను. కేవలం నా పిల్లల కోసం, క్రికెట్ మీదున్న ప్రేమ కారణంగా మళ్లీ బరిలోకి దిగాలని భావిస్తున్నా.ఏదేమైనా మరోసారి ఒత్తిడిలోకి కూరుకుపోవాలని మాత్రం అనుకోవడం లేదు. కాస్త సరదాగా.. సంతృప్తికరంగా నా ఇన్నింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా’’ అని 40 ఏళ్ల ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.చదవండి: Ajinkya Rahane: రోహిత్ శర్మకు అంతా తెలుసు.. రిలాక్స్డ్గా ఉంటాడు
Ind Vs Eng 1st T20I: తుది జట్లు ఇవే.. షమీకి దక్కని చోటు
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు తెరలేచింది. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు.ఈ మ్యాచ్తో షమీ రీఎంట్రీ ఇస్తాడని అంతా భావించినప్పటికి.. జట్టు మెనెజ్మెంట్ తుది జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. రెండో టీ20కు షమీ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి స్పిన్నర్ల కోటాలో చోటు దక్కించుకున్నారు.అయితే రెగ్యూలర్ ఫాస్ట్ బౌలర్ ఒక్క అర్ష్దీప్ సింగ్ ఒక్కడే ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు నితీశ్ రెడ్డి, హార్దిక్ పాండ్యా అర్ష్దీప్తో పాటు బంతిని పంచుకునే అవకాశముంది. బ్యాటింగ్ లైనప్లో మాత్రం శాంసన్, అభిషేక్, రింకూ సింగ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.తుది జట్లుభారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
తండ్రికి స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ ఇచ్చిన రింకూ సింగ్.. వీడియో
టీమిండియా స్టార్ ప్లేయర్, కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ డౌన్ టు ఎర్త్ క్రికెటర్లలో ఒకడు. పేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్.. తనకు ఇష్టమైన ఆటకోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకొనొక దశలో స్వీపర్గా పనిచేసిన రింకూ.. ఇప్పుడు భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.అయితే రింకూ సింగ్ విజయం వెనక అతడి తండ్రిది ఖన్చంద్ర సింగ్ కీలక పాత్ర. ఖన్చంద్ర సిలిండర్ల మోస్తే వచ్చే డబ్బుతో రింకూ క్రికెట్ ఆడేవాడు. అతడి సంపాదనతో కుటుంబం మొత్తం గడిచేది. అయితే తాజాగా రింకూ సింగ్ తన తండ్రిపై ప్రేమను చాటుకున్నాడు. తన తండ్రికి రింకూ ఖరీదైన నింజా స్పోర్ట్స్ బైక్ను గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ బైక్ ఖరీదు రూ. 3.19 లక్షలగా ఉన్నట్లు తెలుస్తోంది. నింజా స్పోర్ట్స్ బైక్తో రింకూ తండ్రి అలీఘడ్లో చక్కర్లు కొడుతున్నాడు. ఆ సిటీలోని చిన్న చిన్న వీధుల్లో అతను కవాసాకి నింజా బైక్ను రైడ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా తన తనయుడు స్టార్ క్రికెటర్ అయినప్పటికి.. ఖన్చంద్ర ఇంకా వంటగ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే పనని వదలకపోవడం విశేషం. మరోవైపు రింకూ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ను పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించారు. త్వరలోనే ఎంగేజ్మెంట్ జరిగే అవకాశముంది. కాగా రింకూ సింగ్ ప్రస్తుతం ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సిద్దమవుతున్నాడు. బుధవారం జరగనున్న తొలి టీ20లో రింకూ ఆడనున్నాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే! అతడికి నో ఛాన్స్? View this post on Instagram A post shared by Sonu Lefti (@sonulefti0700)
బిజినెస్
నెలలో కొత్తగా 14.63 లక్షల మంది చందాదారులు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నవంబర్ 2024 తాత్కాలిక పేరోల్ డేటాను విడుదల చేసింది. నవంబర్లో 14.63 లక్షల మంది సభ్యులు చేరినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. 2024 అక్టోబర్తో పోలిస్తే ఇది 9.07 శాతం అధికం. 2023 నవంబర్తో పోలిస్తే ఈ సంఖ్యలో 4.88 శాతం పెరుగుదల నమోదైంది.ఈపీఎప్వో తెలిపిన వివరాల ప్రకారం..2024 నవంబర్లో సుమారు 8.74 లక్షల మంది ఈపీఎఫ్లో కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారు. ఇది అక్టోబర్ 2024తో పోలిస్తే 16.58 శాతం అధికం.18-25 సంవత్సరాల మధ్య వయసువారు అత్యధికంగా 4.81 లక్షల మంది కొత్తగా సభ్యులుగా చేరారు. ఇది మొత్తం కొత్త సభ్యుల్లో 54.97%గా ఉంది.సుమారు 2.40 లక్షల మంది మహిళా సభ్యులు కొత్తగా చేరారు. ఇది అక్టోబర్ 2024తో పోలిస్తే 14.94% పెరుగుదలను సూచించింది.ఇటీవల కొత్తగా చేరిన మొత్తం సభ్యుల్లో 20.86% వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది.ఇదీ చదవండి: అమెరికా చమురు ఎగుమతులు పెంపుఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 7.6 కోట్లకుపైగా చందాదార్లకు ఇటీవల కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. యాజమాన్యం (కంపెనీ) నుంచి తనిఖీ లేదా ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండా ఉద్యోగులే వారి పేరు, పుట్టిన తేదీ, జాతీయత, లింగం, తల్లి/తండ్రి పేరు, జీవిత భాగస్వామి పేరు, కంపెనీలో చేరిన/రాజీనామా చేసిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో మార్చుకునే వెసులుబాటును తెచ్చింది. అంతేగాక ఆధార్ ఓటీపీ సాయంతో ఈపీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టయితే యజమాని వద్ద పెండింగ్లో ఉన్న బదిలీ క్లెయిమ్ అభ్యర్థనను తొలగించి.. చందాదార్లు నేరుగా ఈపీఎఫ్ఓకు క్లెయిమ్ను సమర్పించవచ్చు.
ట్రంప్ ఎఫెక్ట్.. 20 రోజుల్లో రూ.50,000 కోట్ల అమ్మకాలు
భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (Foreign Institutional Investors) 2025 జనవరిలో ఇప్పటివరకు దాదాపు రూ.50,000 కోట్లకుపైగా పెట్టుబడిని ఉపసంహరించుకున్నారు. ఈ భారీ అవుట్ ఫ్లో సెన్సెక్స్, నిఫ్టీలపై గణనీయంగా ప్రభావం చూపుతోంది. ఎఫ్ఐఐల అమ్మకాల దోరణి కొనసాగుతుండడంతో సూచీలు పతనమవుతున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు వెలువరిస్తున్న త్రైమాసిక ఫలితాలు పెద్ద ఇన్వెస్టర్లకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. వార్షిక ప్రాతిపదికన చాలా కంపెనీల లాభాల వృద్ధి స్థిరంగానే ఉంది.ట్రంప్ ప్రభావం..అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడంతో భారత్ మార్కెట్లో ఎఫ్ఐఐ(FII)ల అమ్మకాల్లో వేగం పెరుగుతోంది. అందుకుతోడు ట్రంప్ ‘కంట్రీఫస్ట్’ దోరణితో తీసుకుంటున్న నిర్ణయాలు మరింత భయాందోళనలు రేకిత్తిస్తున్నాయి. ట్రంప్ అమెరికా అనుకూల విధానాల వల్ల చాలామంది ఇన్వెస్టర్లు యూఎస్లోనే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే భారత్లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు వాటిని విత్డ్రా చేసి అమెరికా మార్కెట్లో ఇన్వెస్ట్(Invest) చేయాలని భావిస్తున్నారు. దాంతో భారత మార్కెట్లు భారీగా కుదేలవుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతను ఇప్పటికే ప్రారంభించింది. అమెరికా బాండ్ ఈల్ట్లు పెరుగుతున్నాయి.ఇదీ చదవండి: అమెరికా చమురు ఎగుమతులు పెంపుడాలర్ బలపడటం, విదేశీ నిధుల ఉపసంహరణతో అమెరికా డాలర్(US Dollar)తో పోలిస్తే ఇటీవల భారత రూపాయి 3 శాతం క్షీణించి రికార్డు స్థాయిలో రూ.86.70 వద్ద ముగిసింది. ఈ క్షీణత భారత స్టాక్ మార్కెట్పై ఒత్తిడి పెంచింది. ఈక్విటీ మార్కెట్లు స్థిరపడాలంటే బాండ్ ఈల్డ్స్, యూఎస్ డాలర్ నిలకడగా ఉండడం చాలా అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా చమురు ఎగుమతులు పెంపు.. భారత్పై ప్రభావం ఎంతంటే..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యూఎస్ కీలక ప్రకటనలు చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ తన ఇంధన ఎగుమతులను పెంచబోతున్నట్లు తెలిపింది. దాంతో ప్రపంచ చమురు, గ్యాస్ మార్కెట్ గణనీయంగా ప్రభావితం చెందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా తీసుకున్న ఈ చర్య ధరలను తగ్గిస్తుందని, సరఫరాను పెంచుతుందని, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని అంచనా వేస్తున్నాయి.ఇంధన ఉత్పత్తి పెంపుఅమెరికా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమవుతోంది. చమురు డ్రిల్లింగ్ను ప్రోత్సహించడం, గతంలో ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం, ఇంధన ఎగుమతులను పెంచడం వంటి ప్రణాళికలను డొనాల్డ్ ట్రంప్ వివరించారు. ఈ వ్యూహం ప్రపంచ చమురు మార్కెట్లో అమెరికాను టాప్లో నిలిపేందుకు దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: రూపాయి పడినా ఇంకా విలువైనదే..అంతర్జాతీయ ధరలపై ప్రభావంయూఎస్ ఇంధన ఎగుమతుల పెరుగుదల మార్కెట్లో ‘ఒపెక్ +(ఆయిల్ ఎగుమతి చేసే దేశాల కూటమి)’ నియంత్రణను కట్టడి చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోకి మరిన్ని చమురు, గ్యాస్ సరఫరాదారులు ప్రవేశించడంతో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ముడిచమురు ధరలు తగ్గడం వల్ల దిగుమతి ఖర్చులు తగ్గుతాయని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చని భారత్ వంటి దేశాలకు ఇది ప్రయోజనం చేకూరుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలంలో యూఎస్ చమురు ఉత్పత్తి ఒపెక్ +, ఇతర ఉత్పత్తిదారుల వ్యూహాల పునఃసమీక్షకు దారితీస్తుంది. పెరిగే యూఎస్ చమురు ఎగుమతులు ఇతర ప్రాంతాల సరఫరాదారులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇది ధరల స్థిరత్వానికి మరింత దోహదం చేస్తుంది.
రూపాయి పడినా ఇంకా విలువైనదే..
అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి(Rupee) మారకం విలువ ఇటీవల భారీగా క్షీణిస్తోంది. అయినా అంతర్జాతీయ మార్కెట్లో ఇతర పోటీ కరెన్సీలతో పోలిస్తే రూపాయి ఇంకా అధిక విలువ కలిగి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్(Rajan) పేర్కొన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)లో రూపాయి భవిష్యత్తు గమనంపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదుఅమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని రాజన్ అన్నారు. అనేక ఇతర కరెన్సీలు కూడా ఇదే ధోరణిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్ (ఆర్ఈఈఆర్) ఇప్పటికీ అధిక విలువను సూచిస్తోందన్నారు. ఈ ఓవర్ వాల్యుయేషన్ రూపాయి మరింత పతనం అయ్యేందుకు అవకాశం ఉన్నట్లు సూచిస్తుందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి అధిక విలువ కలిగి ఉండడం వల్ల భవిష్యత్తులో భారతీయ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.ఆర్బీఐ జోక్యం తగదురూపాయి విలువను కాపాడేందుకు కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని రాజన్ అన్నారు. ప్రాథమిక ఆర్థిక సర్దుబాట్లకు ప్రతిస్పందనగా, కరెన్సీ విలువను పెంచేలా కేంద్ర బ్యాంకులు జోక్యం చేసుకోవడం మానుకోవాలని, స్వల్పకాలిక అస్థిరతను అరికట్టడానికి మాత్రమే చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి క్షీణత, అమెరికా డాలర్ బలపడటం, ఇతర ప్రపంచ ఆర్థిక అంశాలు సహజ మార్కెట్ ప్రతిస్పందనగానే భావించాలని రాజన్ తెలిపారు.ఇదీ చదవండి: ఇన్ఫీలో మూర్తి కుటుంబం కంటే రెట్టింపు వాటాఅమెరికా కరెన్సీ యుద్ధంప్రపంచ కరెన్సీలను అమెరికా ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉందని రాజన్ హెచ్చరించారు. ఇతర దేశాలపై ఆర్థిక సుంకాలు విధించడానికి అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరెన్సీలపై పెరుగుతున్న ఈ ఆర్థిక యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకర్లకు ఆందోళన కలిగిస్తుందన్నారు.
ఫ్యామిలీ
పసుపు @ 11 వెరైటీలు
పసుపు అంటే సాధారణంగా సేలం.. దుగ్గిరాల వంటి వంగడాలు గుర్తుకు వస్తుంటాయి. అరుదుగా పండే 11 రకాల దేశీ పసుపు రకాలను పండిస్తున్నారు మహిళా రైతు నడింపల్లి కవిత. కస్తూరి.. లకడాండ్.. నల్ల పసుపు.. రోమ్.. తెల్ల పసుపు.. చింతపల్లి.. సోనియా.. రాజాపూరి.. ప్రతిమ.. వీఐపీ(848), వీఐపీ (849) వంటి ప్రత్యేక పసుపు రకాలను ఆమె పండిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో తనకున్న ఐదెకరాల వ్యవసాయక్షేత్రంలో మామిడిలో అంతర పంటగా ఈ రకాలను ఆమె సాగు చేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా కవిత వ్యవసాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భీమవరం సమీపంలోని మొగల్లుకు చెందిన కవిత కుటుంబం హైదరాబాద్ గచ్చిబౌలిలో స్థిరపడ్డారు. వ్యవసాయంపై మక్కువ కలిగిన కవిత సంగారెడ్డి జిల్లాలో ఐదెకరా సొంత భూమిలో ఈ ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. విజయనగరం జిల్లా నుంచి చింతపల్లి రకం, మేఘాలయ, అస్సాం, డెహ్రాడూన్ తదితరప్రాంతాల నుంచి మరికొన్ని పసుపు రకాలను సేకరించిన కవిత గత మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. పసుపులో రారాజు కస్తూరి.. కస్తూరి రకం పసుపులో రారాజుగా పేరుంది. పసుపు నాణ్యతకుప్రామాణికమైన కర్క్మిన్ ఈ కస్తూరి రకంలో సుమారు 15 శాతం వరకు ఉంటుందన్నారామె. దీన్ని ఔషధాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. సుమారు 3 సంవత్సరాలు పెరిగిన కస్తూరి రకం పసుపునకు క్యాన్సర్ను కూడా నయం చేయగల ఔషధ సామర్థ్యం ఉంటుందని ఆమె చెబుతున్నారు. లకడాంగ్ రకం పసుపు ముఖ సౌందర్యానికి, చర్మ సౌందర్యానికి ఉపయోకరమన్నారు. పండించిన పసుపు కొమ్ములను ఉడికిస్తే ఔషధ గుణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పసుపు కొమ్ములను సోలార్ డ్రయ్యర్లో ఎండబెడుతున్నారు. పసుపును ΄÷డితో పాటు ద్రవ రూపంలోకి, ట్యాబ్లెట్ల రూపంలోకి కూడా మార్చుతున్నారు. పసుపు ఉత్పత్తులను అమెరికా, దుబాయ్ వంటి విదేశాల్లో నివాసం ఉండే పరిచయస్తులకు ఆమె ఇస్తున్నారు. వ్యవసాయం అంటే ఇష్టం.. ప్రకృతి వ్యవసాయం అంటే నాకు ఎంతో ఇష్టం. అరుదైన పసుపు రకాలను సాగు చేయాలని అనుకొని సేకరిస్తున్నాను. ఇప్పటి వరకు 11 వెరైటీల పసుపును పండిస్తున్నాను. అస్సాం రకాన్ని కూడా సాగు చేయాలనుకుంటున్నాను. దేశీ ఆవులను పెంచుతూ పాలేకర్ పద్ధతిలో నేను చేస్తున్న వ్యవసాయానికి మా కుటుంబసభ్యులు ఎంతో సహకరిస్తున్నారు.– నడింపల్లి కవిత (76809 67818), పసుపు రైతు– పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
ఇంట్లో సాఫ్ట్ వేర్ కొలువు..పొలంలో ప్రకృతి సేద్యం
ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్ చదివి సింగపూర్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్ నిర్వహించటంతో పాటు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలతో పాటు కలెక్టరేట్లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూనే ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న బాల భాస్కర శర్మ కృషి ప్రశంసనీయం. కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామం వద్ద‡వారసత్వంగా సంక్రమించిన 8.5 ఎకరాల భూమిలో అంబా గో ఆధారిత వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. 75 సెంట్లలో పాలీహౌస్ ఏర్పాటు చేసుకొని అందులో అనేక కొత్త పంటలు పండిస్తున్నారు. పెనుగాలులు, భారీ వర్షాలకు దెబ్బతింటున్నందున సాధారణంగా ఉద్యాన శాఖ పాలీహౌస్లను ప్రోత్సహించటం లేదు. అయితే, శర్మ తన పొలం చుట్టూ గాలులను తట్టుకునేలా నేరేడు, రేగు తదితర పండ్ల చెట్లు పెంచి, మధ్యలో పాలీహౌస్ నిర్మించి, సమర్థవంతంగా నిర్వహించటం విశేషం. జిల్లాకు పరిచయమే లేని వెల్లుల్లి, బ్రకోలి తదితర అనేక రకాల కూరగాయలను పాలీహౌస్లో సాగు చేస్తున్నారు. బ్రకోలిని కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. పాలిహౌస్లో వంగ, బీర, టొమాటో, పచ్చి మిరప, కాళీఫ్లవర్, క్యాబేజీ, ఎర్ర క్యాబేజి, ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, బీన్స్, చిక్కుడు, కాకర, క్యాప్సికం, ఎర్రబెండ, సొర, పొట్ల, తంబకాయ, బుడం కాయ, కీరదోసతో పాటు.. ఎర్రతోట కూర, కొత్తిమీర, పుదీన, గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చలి, చుక్కకూర, మెంతికూర వంటి 35 పంటలు సాగు చేస్తున్నారు. ఎతై ్తన బోదెలు ఏర్పాటు చేసుకొని మల్చింగ్, వీడ్ మ్యాట్ వేసి మొక్కలు నాటుకున్నారు. ఆరుబయట పొలాల్లో 3 నెలలు దిగుబడినిచ్చే కూరగాయలు పాలీహౌస్లో 5 నెలల వరకు దిగుబడినిస్తున్నాయి.పండ్ల చెట్లు.. ఫైనాపిల్ కూడా..7.75 ఎకరాల్లో చాలా రకాల పండ్ల చెట్లను పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో శర్మ పెంచుతున్నారు. నిమ్మ 250, జామ 200, సీతాఫలం 200, మామిడి 40, అంజూర 100, నేరెడు 200, మునగ 200, అరటి 80 చెట్లతో పాటు కొన్ని సపోటా, కొబ్బరి, ఉసిరి, నేరెడు, రేగు, రామాఫలం చెట్లు పెంచుతున్నారు. రాయలసీమప్రాంతంలో ఇంతవరకూ లేని ఫైనాపిల్ మొక్కలను కూడా పెంచుతున్నారు. మధురై నుంచి ఎర్రబెండ సీడ్ తెప్పించి నాటుకున్నారు.ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెటింగ్కర్నూలులోని నంద్యాల చెక్పోస్టు దగ్గర ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేయటంతో పాటు బాలబాస్కర శర్మ ఆన్లైన్ మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించారు. తను పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు కెమికల్స్ లేకుండా ఆహార పంటలు పండిస్తున్న రైతుల నుంచి బియ్యం, పప్పులు, పసుపు తదితరాలను సేకరించి విక్రయిస్తున్నారు. 8 దేశీ ఆవులను పోషిస్తూ నాలుగు ట్యాంకుల ద్వారా ద్రవ జీవామృతం పంటలకు ఇస్తున్నారు. వర్మీ కంపోస్టుతో పాటు రోజుకు 40 లీటర్ల వర్మీవాష్ కూడా ఉత్పత్తి చేసి డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. చీడపీడల నివారణకు అవసరాన్ని బట్టి కషాయాలు, వేపనూనె తదితరాలను వాడుతున్నారు. సోలార్ ట్రాప్స్, తెలుపు, పసుపు జిగురు అట్టలను ఏర్పాటు చేశారు. పండ్ల తోటలకు నష్టం కలిగించే పండు ఈగ ట్రాప్కు ఏర్పాటు చేశారు. అన్ని పంటలకు డ్రిప్ సదుపాయం కల్పించారు.రసాయనాల్లేకుండా పండించిన పంట కావడం వల్ల కూరగాయలు, ఆకు కూరలకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. శర్మ కృషిని గుర్తించిన కర్నూలు జిల్లా యంత్రాంగం.. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రత్యేకంగా కెమికల్స్ లేకుండా పండించిన కూరగాయలు విక్రయించేందుకు అవకాశం ఇచ్చిప్రోత్సహిస్తుండటం విశేషం. ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్ చదివి సింగపూర్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్ నిర్వహించటంతో పాటు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలతో పాటు కలెక్టరేట్లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.రసాయనాల్లేని ఆహారం అందిస్తున్నా..!సింగ్పూర్లో 2020 వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశా. కరోనా కారణంగా ఇంటికి వచ్చేశా. ఇంటి నుంచే సాఫ్ట్వేర్ ఉద్యోగం చే స్తూ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకున్నా. 8 ఆవులను పెంచుతూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మా వ్యవసాయ క్షేత్రంలో కెమికల్స్ వాసన అనేది ఉండదు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో కూరగాయల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ అవకాశం ఇచ్చారు. ప్రత్యేక స్టోర్తో పాటు వెబ్సైట్ ద్వారా కూడా విక్రయిస్తున్నాం. రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తదితర ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నామనే సంతోషం ఉంది. ఎర్ర బెండకాయకు మంచి ఆదరణ ఉంది. పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర బెండకాయను ప్రజలు ఇష్టంగా తీసుకుంటున్నారు.– యు. బాల భాస్కర శర్మ (62817 00553), సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమ్ ప్రకృతి రైతు, కర్నూలు– గవిని శ్రీనివాసులు, సాక్షి కర్నూలు (అగ్రికల్చర్)
సెకండ్ హ్యాండ్ సంపన్నులు!
ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ఆడంబర జీవనశైలికి అలవాటుపడి అప్పులపాలైన వాళ్లను ఎంతోమందిని చూస్తుంటాం. అయితే దీనికి భిన్నంగా ఆర్థిక స్థోమత హైలెవెల్లో ఉన్నప్పటికీ నిరాడంబరశైలిని అనుసరించే ధోరణి సంపన్నులలో పెరుగుతోంది. దీనికి ఉదాహరణ షాంగ్ సావెద్ర, అనీ కోల్... మిలియనీర్లు అయిన సావెద్ర, ఆమె భర్త ఇంద్రభవనంలాంటి ఇళ్లెన్నో నిర్మించుకునే ఆర్థిక స్థోమత ఉంది. అయినా సరే ఆ దంపతులు లాస్ ఏంజిల్స్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి విడి విడిగా కార్లు లేవు. ఇద్దరూ కలిసి సెకండ్ హ్యాండ్ కారును ఉపయోగించుకుంటారు.పిల్లలు సెకండ్హ్యాండ్ బొమ్మలతో ఆడుకుంటారు. వృథా ఖర్చుకు దూరంగా ఉంటారు. ‘అఫ్కోర్స్, నేను కూడా లగ్జరీ ఐటమ్స్ చూసి టెంప్ట్ అవుతుంటాను. అయితే తొందరపడకుండా కొద్దిసేపు ఆలోచిస్తాను. వెంటనే కొనేయాలనే ఆలోచన నుంచి బయటపడతాను. మనసు పడ్డాం కాబట్టి కొనడం కాకుండా ఆ వస్తువు నిజంగా మనకు ఎంత అవసరమో అని ఆలోచిస్తే సమస్య ఉండదు’ అంటుంది షాంగ్ సావెద్ర.రీసెర్చర్, పర్సనల్ ఫైనాన్స్ కోచ్ అనీ కోల్ మిలియనీర్. అయితే ఆమె సంపాదనతో పోల్చితే చేసే ఖర్చు చా... లా తక్కువ! ఎన్నో సంవత్సరాల క్రితం కారును అమ్ముకుంది. ఇంట్లో పనివాళ్లు అంటూ ఎవరూ ఉండరు. వంట చేయడం నుంచి జుత్తు కత్తిరించుకోవడం వరకు తానే చేస్తుంది! సెలవు రోజుల్లో ఎంజాయ్ చేయడానికి ఖర్చు అవసరం లేని ఫ్రీ యాక్టివిటీలకు ప్రాధాన్యత ఇస్తుంది. పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చే జీవనశైలిని అనుసరిస్తోంది. దుస్తుల నుంచి వస్తువుల వరకు సెకండ్ హ్యాండ్ వాటికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సంపన్నులది పీనాసితనంగా అనిపించవచ్చుగానీ.. కొద్దిగా ఆలోచించినా అర్థమవుతుంది వారి ఆచరణ ఎంత అనుసరణీయమో.
శిక్ష సరే.. రక్షణ ఏది?
నెవర్ అగైన్.. దేశంలో ఎక్కడ ఏ మహిళపై ఏ నేరం జరిగినా ప్లకార్డ్ మీద కనిపించే స్లోగన్! కానీ ఆ నేరాలూ అగైన్ అండ్ అగైనే.. ఈ ప్లకార్డూ అగైన్ అండ్ అగైనే! లేకపోతే నిర్భయ ప్రజాగ్రహానికి పార్లమెంట్ దద్దరిల్లి.. ప్రత్యేక చట్టం, మహిళల భద్రత, రక్షణకు ప్రత్యేక ఫండ్, హెల్ప్ లైన్స్, అలర్ట్ యాప్స్.. ఎన్ని వచ్చాయి! అయినా కోల్కతా ఆర్జీ కర్ దారుణం జరిగింది.. మనమంతా మళ్లీ ఉలిక్కిపడేలా చేసింది. పనిచేసే చోటే డాక్టర్ లైంగిక దాడికి.. హత్యకు గురైంది. దోషి సంజయ్ రాయ్ అనే వలంటీరని తేల్చిన సియల్దా జిల్లా సెషన్స్ కోర్ట్ అతనికి జీవిత ఖైదు విధించింది. ఇలాంటివి జరిగినప్పుడల్లా అల్టిమేట్ శిక్షలను చేర్చుకుంటూ చట్టాలను మార్చుకుంటున్నాం! అయినా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో హెచ్చరిస్తూనే ఉంది ఏ ఏటికా ఏడు మహిళలపై పెరుగుతున్న నేరాలతో! కారణం మనం విక్టిమ్కే సుద్దులు చెబుతున్నాం. విక్టిమ్కే హద్దులు పెడుతున్నాం. విక్టిమ్నే బ్లేమ్ చేస్తున్నాం! అంటే నేరాన్ని ప్రేరేపించే భావజాలాన్ని పెంచి పోషిస్తున్నాం! ఆ సుద్దులేవో అక్యూజ్డ్కి చెప్పడం మొదలుపెడితే, తన హద్దులేంటో అక్యూజ్డ్ గుర్తించేలా చేయగలిగితే, అమ్మాయి అంటే సెక్సువల్ ఆబ్జెక్ట్ కాదు, వ్యక్తిత్వమున్న తనలాంటి మనిషే అనే అవగాహన కల్పించగలిగితే... నెవర్ అగైన్ ప్లకార్డ్ అవసరం రాదు! శిక్షల మీద మొమెంటరీ కామెంట్స్కి స్పేస్ ఉండదు! మహిళ హాయిగా పనిచేసుకుంటుంది. ఎన్సీఆర్బీ ఆశ్చర్యపోతుంది. ఆర్జీ కర్ డాక్టర్ సంఘటనలో కోర్టు జీవితఖైదు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శిక్ష సరే మహిళకు రక్షణేది అంటూ తెలుగు రాష్ట్రాల్లోని పలు రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు కొందరు వెలిబుచ్చిన అభిప్రాయాలు.ఒక్కటి నెరవేరక పోయినా.. ఆర్జీ కర్ సంఘటన తర్వాత ఆ హాస్పిటల్లోని జూనియర్ డాక్టర్లు నిరహార దీక్ష చేశారు. సీసీటీవీ కెమెరాలు, ట్రాన్స్పోర్టేషన్, వాష్ రూమ్స్, ఇంటర్నల్ కంప్లయింట్ సెల్ వంటి వాటికోసం డిమాండ్ చేశారు. అవన్నీ నేరవేరాయో లేదో తెలియదు. ఒక్కటి నేరవేరకపోయినా ఉద్యమించాల్సిందే. మళ్లీ ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా ఉండటానికి! ఇక నేరస్థుడి శిక్ష విషయానికి వస్తే సంజయ్ రాయ్ నిజంగా దోషే అయితే అతనికి శిక్ష అవసరమే! అది అతనిలో పరివర్తన తీసుకురావాలి. అందులో అనుమానమే లేదు. అయితే అంతకన్నా ముందు అలాంటి నేరాలను ప్రేరేపించే పురుషాధిపత్య భావజాలాన్ని రూపు మాపాలి. ఆ మార్పు కోసం అందరం పాటుపడాలి.– బి. జ్యోతి, రాష్ట్ర కన్వీనర్, చైతన్య మహిళా సంఘం.రియాక్షన్స్ మాత్రమే ఉంటాయిఆర్జీ కర్ కేస్ జడ్జిమెంట్ రాగానే దోషికి డెత్ పెనాల్టీ విధించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్షణికావేశాలు, కోపాల వల్లే లాంగ్ టర్మ్ సొల్యుషన్ వైపు వెళ్లనివ్వకుండా మహిళా భద్రత, రక్షణ విఫలమవుతూ వస్తోంది. మన దగ్గర నివారణ చర్యలుండవు. రియాక్షన్సే ఉంటాయి. న్యాయం కోసం పోరాడేవాళ్లనే వేధిస్తుంటారు. నేరస్థులను పూజిస్తారు. మ్యారిటల్ రేప్ను నేరంగా పరిగణించడాన్ని ప్రభుత్వాలే అడ్డుకుంటున్నాయి. ఇక ట్రాన్స్ విమెన్పై జరిగే నేరాలనైతే నేరాలుగానే చూడట్లేదు. మార్పును మతం మీదో, సంస్కృతి మీదో దాడిలాగా చూస్తున్నంత కాలం ఈ నేరాలు ఆగవు. నేరం జరిగిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి శిక్షలు పడాలి అని కాకుండా అసలు నేరాలు జరగకుండా ఏం చేయాలి, ఎలాంటి సిస్టమ్స్ను డెవలప్ చేయాలనే దాని మీద దృష్టిపెట్టాలి. ప్రాథమిక స్థాయిలోనే జెండర్ సెన్సిటైజేషన్, సెక్స్ ఎడ్యుకేషన్ మొదలవ్వాలి. సమానత్వం, పరస్పర గౌరవం, కన్సెంట్ గురించి పిల్లలకు నేర్పాలి.– దీప్తి సిర్ల, జెండర్ యాక్టివిస్ట్తల్లిదండ్రులే కల్పించాలిపైశాచికంగా ప్రవర్తించిన ఒక వ్యక్తికి న్యాయస్థానం సరైన శిక్షనే విధించింది. స్త్రీ–పురుష సమానత్వం, స్త్రీల మీద గౌరవం లేకనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంతటా ఇలాంటి పరిస్థితే! సామాజిక మార్పే దీనికి పరిష్కారం. స్త్రీ–పురుషులు ఇద్దరూ సమానమనే అవగాహన వస్తే స్త్రీల పట్ల పురుషులకు గౌరవం ఏర్పడుతుంది. తల్లిదండ్రులే ఆ అవగాహన కల్పించాలి.– డా.రుక్మిణీరావు, సామాజిక కార్యకర్తఆ ప్రయత్నం లేకపోతే రక్షణ ఎండమావే!సంజయ్ రాయ్కి పడిన శిక్ష గురించి అసంతృప్తి వినిపిస్తోంది మరణ శిక్ష విధిస్తే బాగుండేదంటూ! రేప్ చేసిన వాళ్లను ఎన్కౌంటర్ చేసిన దాఖలాలున్నాయి. లైంగికదాడులు, హత్యలు ఆగలేదే! దీన్ని బట్టి పురుషాధిపత్య సమాజానికి సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరమని అర్థమవుతోంది. విచ్చలవిడి శృంగారం, క్రైమ్ సినిమాలు, డ్రగ్స్ను కట్టడి చేయాలి. మహిళలను సెక్సువల్ ఆబ్జెక్ట్గా చూసే తీరును సంస్కరించాలి. మగపిల్లలకు చిన్నప్పటి నుంచే జెండర్ సెన్సిటివిటీని బోధించాలి. ఇందుకోసం పౌర సంస్థలు, విద్యావంతులు, ఎన్జీవోలు ఉద్యమించాలి. ఈ ప్రయత్నం లేకుండా ఎంతటి కఠిన శిక్షలు విధించినా మహిళా రక్షణ ఎండమావే! కార్యాచరణ మహిళా భద్రత, రక్షణ లక్ష్యంగా ఉండాలి తప్ప శిక్షల ధ్యేయంగా కాదు! – జూపాక సుభద్ర, రచయిత్రి, అడిషనల్ సెక్రటరీ గవర్నమెంట్ రిటైర్డ్ నేరాలు పుట్టకుండా ఆపాలిశిక్ష ఉద్దేశం నేరాన్ని తొలగించడం కానీ నేరస్థుడిని కాదు. ఇక్కడ మనం నేరస్థుడి గురించే మాట్లాడుతున్నాం. కానీ నేరం జరగకుండా ఉండే వాతావరణ కల్పన గురించి ఆలోచించట్లేదు. చర్చించట్లేదు. మాట్లాడట్లేదు. నేరస్థుడిని శిక్షించడం ఒక ఎత్తు. మరోవైపు మహిళల పట్ల జరుగుతున్న నేరాలను నిరోధించగలగాలి, నేరాలు పుట్టకుండా ఆపగలగాలి, నేరప్రవృత్తి ప్రబలకుండా చేయగలగాలి. ఇది సమాజం బాధ్యత. అయితే లోపమెక్కడంటే.. నువ్విలా ఉండు, ఇలా నడుచుకో అంటూ విక్టిమ్నే డిక్టేట్ చేస్తున్నాం. ఆర్డర్ వేస్తున్నాం. అక్యూజ్డ్ని అడ్రస్ చేయం. ఈ ఆలోచనలో, ఆచరణలో మార్పు రావాలి. పురుషుడి లైంగిక స్వేచ్ఛకి హద్దులున్నాయని నేర్పాలి. మగ పిల్లలకు జెండర్ కాన్షస్ కల్పించాలి. మహిళలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత రావాలి. ఇవన్నీ సాధ్యమైతేనే స్త్రీలపై జరిగే నేరాలు తగ్గుతాయి. – జహా ఆరా, సీనియర్ అడ్వకేట్, విశాఖపట్టణంపెద్ద తలకాయల కుట్రఆర్జీ కర్ కేస్ ఒక వ్యవస్థాగత హత్య. ఆ దారుణానికి పాల్పడిన నేరస్థుల్లో సంజయ్ రాయ్ ఒకడు తప్ప కేవలం అతనొక్కడే నేరస్థుడు కాదు. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ నివేదిక కూడా చెప్పింది.. మల్టిపుల్ డీఎన్ఏ ఆనవాళ్లున్నాయని తేల్చి! అందుకే సంజయ్ రాయ్ ఒక్కడికే శిక్ష పడటం పట్ల అంతటా అసంతృప్తి కనపడుతోంది. ఇందులో రూలింగ్ పార్టీ ఇన్వాల్వ్ అయినట్టు తోస్తోంది. బాధిత కుటుంబాన్ని రకరకాలుగా మభ్యపెట్టేందుకు చేసిన ప్రయత్నాలే అందుకు నిదర్శనం. అసలు నేరస్థులు వెలుగులోకి రాకుండా సాక్ష్యాలను మాయం చేయడం, ఒక్కడినే దోషిగా నిలబెట్టడం వంటివన్నీ చూస్తే నిజంగా దీని వెనక పెద్ద తలకాయలున్నట్లు, వాళ్లే ఈ నేరానికి కుట్ర పన్నినట్టు అనిపిస్తోంది.– మోక్ష, నటిప్రధాన సమస్యఖైదీకి ఉరి శిక్ష నుంచి లైఫ్ పడిందంటే దీని వెనకాల ఎంత మంది ప్రమేయం ఉందో! ఇది దోషిని బతికించే ప్రయత్నమే. మెడికల్ కాలేజీలలో సెక్యూరిటీ అనేది ప్రధాన సమస్య. సాధారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లందరికీ ఒక్కటే విశ్రాంతి గది ఉంటుంది. లేడీ డాక్టర్లు తెల్లవారు జామున రెండు–మూడు గంటలకు రెస్ట్ తీసుకోవాల్సి వస్తే బోల్ట్ లేని ఆ గదిలోని పడుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆ బ్లాక్లలో సెక్యూరిటీ ఉండదు. లేడీ డాక్టర్లకు అనుకోని అవాంతరం ఎదురైనప్పుడు ఒక అలారం కోడ్ ఉంటే బాగుంటుంది. దానికి వెంటనే ఆ సిస్టమ్ రెస్పాండ్ అవ్వాలి. అప్పుడు నైట్ షిఫ్టుల్లోనూ అమ్మాయిలు ధైర్యంగా పనిచేయగలుగుతారు. అప్రమత్తంగా ఉండాల్సిన విషయాల పట్ల అమ్మాయిలకు అవగాహన పెంచాలి. – డాక్టర్ మనోరమ, గైనకాలజిస్ట్
ఫొటోలు
ఎవరీ మోనాలిసా? ఓవర్నైట్లో జాక్పాట్ కొట్టిన తేనె కళ్ల సుందరి (ఫోటోలు)
కడపలో వైభవంగా శ్రీరాముడి శోభాయాత్ర.. ఆకట్టుకున్న విద్యార్థుల విన్యాసాలు (ఫొటోలు)
శ్రీమంతుడు విలన్ రెండో పెళ్లి.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)
కలలు రూపుదిద్దుకుంటున్నాయి.. సింధు పోస్ట్ వైరల్ (ఫొటోలు)
ఫ్రెండ్స్తో థాయ్లాండ్ బీచ్లో చిల్ అవుతున్న హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (ఫోటోలు)
ప్రపంచంలోనే మొదటి సీఎన్జీ స్కూటర్ (ఫొటోలు)
చెన్నై సూపర్ చాంప్స్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో సమంత సందడి (ఫొటోలు)
ఒకప్పడు తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేసిన ఈ బుల్లితెర నటి గురించి తెలుసా..? (ఫొటోలు)
ముంబై మ్యూజికల్ ఈవెంట్లో ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్ (ఫోటోలు)
చిన్ననాటి కలను నెరవేర్చుకున్న సారా.. సాగరంలో సాహస విహారం (ఫొటోలు)
International View all
ట్రంప్ సంచలన నిర్ణయాలు.. మీరేమంటారు?
అందరూ ఊహించినట్టుగానే అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
టాప్ హెజ్బొల్లా కమాండర్ షేక్ ముహమ్మద్ అలీ హమాదీ హతం
బీరూట్ : ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( FBI ) హిట్ లిస
వణికిస్తున్న ట్రంప్.. అమెరికాలో బెంబేలెత్తుతున్న 7 లక్షల మంది భారతీయులు!
వాషింగ్టన్ : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (don
అమెరికా చమురు ఎగుమతులు పెంపు.. భారత్పై ప్రభావం ఎంతంటే..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యూఎస్ కీలక ప్రకటనలు చేస్తోంది.
ట్రంప్ మాటకు హిల్లరీ నవ్విన వేళ..
అమెరికాలో స్వర్ణయుగం తెస్తానని ట్రంప్ ప్రమాణస్వీకార ప్రసంగంలో పలు ప్రతిజ్ఞలు చేస్తున్నవేళ విపక్ష నాయకురాలు, అమెరికా మాజ
NRI View all
ట్రంప్ సంచలన నిర్ణయాలు.. మీరేమంటారు?
అందరూ ఊహించినట్టుగానే అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఆమెకున్న తెలివితేటలకు హ్యాట్సాఫ్!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణస్వీకారోత్సవం సంద
తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మీట్ అండ్ గ్రీట్’
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో జనవరి 18న ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం జరిగింది.
డుం.. డుం.. డుం..
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించింది తమిళనాడుకు చెందిన ఓ యువతి.
ట్రంప్, జేడీ వాన్స్ ప్రమాణం.. ప్రత్యేక ఆకర్షణగా ఉషా చిలుకూరి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప
National View all
అంతరిక్షం నుంచి మహాకుంభ మేళా ఎలా కనిపిస్తుందంటే?.. ఫొటోలు విడుదల చేసిన ఇస్రో
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్(Prayagraj)లో
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి
ముంబై : మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
వణికిస్తున్న ట్రంప్.. అమెరికాలో బెంబేలెత్తుతున్న 7 లక్షల మంది భారతీయులు!
వాషింగ్టన్ : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (don
బీజేపీకి షాక్.. కూటమికి సీఎం నితీష్ కుమార్ గుడ్బై.. ఎక్కడంటే?
ఇంఫాల్ : బీహార్ సీఎం నితిష్ కుమార్ (cm nitish kumar) బీజ
Delhi Election: కేజ్రీవాల్ ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
క్రైమ్
కర్ణాటకలో ట్రక్కు బోల్తా. 10 మంది దుర్మరణం
బెంగళూరు, సాక్షి: కర్ణాటక రోడ్డు గంటల వ్యవధిలో మరోసారి నెత్తురోడింది. ఉత్తర కన్నడ(Uttara Kannada) జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూరగాయలు, పండ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి.మరణించిన వారంతా కూరగాయల వ్యాపారులుగా తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున ట్రక్కులో కూరగాయల లోడుతో వ్యాపారులు సావనూర్ నుంచి కుంత మార్కెట్కు వెళ్తున్నారు. గులాపురా గ్రామ సమీపంలోని యాలాపురా హైవే వద్దకు చేరుకోగానే డ్రైవర్ ఓ వాహనానికి దారి ఇచ్చే క్రమంలో అదుపు తప్పడంతో మరో ట్రక్కును ఢీకొట్టింది. దీంతో దాదాపు 50 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. #WATCH | #Karnataka: 10 died and 15 injured after a truck carrying them met with an accident early morning today. All of them were travelling to Kumta market from Savanur to sell vegetables: SP Narayana M, Karwar, Uttara Kannada (Visuals from the spot)ANI pic.twitter.com/9vgO1nOKOu— OTV (@otvnews) January 22, 2025పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 4:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 10మంది మృతి చెందగా.. మరో 20 మంది తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రమాదంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయచూరు, సింధనూరులో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 14 మంది మృతి చెందారనే వార్త బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. అంతకు ముందు.. మంగళవారం అర్ధరాత్రి.. కర్ణాటకలోని హంపి(Hampi) క్షేత్రంలో జరిగే నరహరి తీర్ధుల ఆరాధనకు 14 మంది వేద పాఠశాల విద్యార్ధులతో వెళుతున్న వాహనం సింధనూరు సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివ, ముగ్గురు విద్యార్ధులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు విద్యార్ధులు గాయపడగా, వారిని సింథనూరు ఆసుపత్రికి తరలించారు. కారు టైర్ ఊడిపడడంతో.. వాహనం బోల్తా ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పెళ్లయిన రోజే ప్రాణాలు తీసుకుంది
సత్యవేడు: పెళ్లయిన రోజే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఆంబాకంలో కలకలం రేపింది. పోలీసుల కథనం.. తమిళనాడుకు చెందిన ధనంజయ, రతి దంపతుల కుమార్తె ఆర్తీ(20) అక్కడే ఓ ప్రయివేటు కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. సత్యవేడు మండలం ఆంబాకానికి చెందిన సమీప బంధువు సూర్య వారితో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సూర్యకు, ఆర్తీకి వివాహం జరిపించారు. ఆ తర్వాత తిరుత్తణిలోని సుబ్రమణ్యస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి సత్యవేడు మండలంలోని ఆంబాకానికి వచ్చారు. రాత్రి దుస్తులు మార్చుకుని వస్తానని చెప్పి గదిలోకి వెళ్లిన ఆర్తీ ఎంతకీ రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా.. ఆమె ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే సత్యవేడు వైద్యశాలకు ఆమెను తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్టు ఎస్ఐ రామస్వామి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
‘అఫ్జల్గంజ్’ కేసులో పురోగతి
హైదరాబాద్, సాక్షి: అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పురోగతి చోటు చేసుకుంది. దోపిడీ కాల్పులకు పాల్పడింది అమిత్, మనీష్లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. నిందితులిద్దరి బీహార్ లేదంటే జార్ఖండ్ పారిపోయి ఉంటారని ఓ అంచనాకి వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ బీదర్ పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.తొలుత తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్పేట వరకు వెళ్లిన దుండగులు.. అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆపై గజ్వేల్ నుంచి అదిలాబాదు వరకు లారీలో ప్రయాణించినట్లు గుర్తించారు.అదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్కు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జాయింట్ ఆపరేషన్లో భాగంగా బీదర్-హైదరాబాదు పోలీసుల ప్రత్యేక బృందాలు బీహార్తో పాటు జార్ఖండ్కు చేరుకున్నాయి. ‘కాల్పుల’ వాహనం దొరికిందిసాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకతో పాటు నగరంలో తుపాకీతో కాల్పులకు తెగబడిన దుండగులు వినియోగించిన వాహనాన్ని హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్గంజ్లోని మహాత్మా గాంధీ బస్టేషన్ (ఎంజీబీఎస్) పార్కింగ్ నుంచి ఈ వాహనాన్ని మంగళవారం రికవరీ చేశారు. నిందితుల ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్న అధికారులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 750 సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్ను వడపోసిన సిటీ పోలీసులు మరిన్ని కెమెరాల ఫీడ్ను అధ్యయనం చేయడంపై దృష్టి పెట్టారు. నేరం జరిగిన తీరు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న దుండగులు.. హైదరాబాద్లోనే షెల్డర్ తీసుకుని, బీదర్లో నేరం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బీదర్లోని శివాజీ జంక్షన్ వద్ద ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనాన్ని కొల్లగొట్టడానికి దుండగులు బైక్పై వెళ్లారు. ఈ వాహనానికి ‘ఏపీ’ రిజి్రస్టేషన్తో కూడిన నకిలీ నంబర్ ప్లేట్ ఉంది. దీన్ని హైదరాబాద్ లేదా శివారు ప్రాంతాల్లో చోరీ చేసి ఉంటారని భావిస్తున్న అధికారులు.. ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. బీదర్లో నేరం చేసిన తర్వాత రాయ్పూర్ వెళ్లడానికి అఫ్జల్గంజ్కు వచి్చన దుండగులు.. రోషన్ ట్రావెల్స్ వద్దకు ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చారు. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారులు మంగళవారం ఎంజీబీఎస్ పార్కింగ్లో ఉన్న అనుమానాస్పద వాహనాలను పరిశీలించారు. గురువారం పార్క్ చేసిన వాటి వివరాలు ఆరా తీసి నిందితులు వాడింది గుర్తించారు. నిందితులు సికింద్రాబాద్లోని అల్ఫా హోటల్ వద్ద ఎక్కిన ఆటోలో గజ్వేల్ వెళ్లాలని ప్రయత్నించి, తిరుమలగిరిలో దిగిపోయారు. అక్కడ నుంచి శుక్రవారం మధ్యాహా్ననికి ఆదిలాబాద్ చేరుకున్న దుండగులు సరిహద్దులు దాటించి మహారాష్ట్రలో ప్రవేశించినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఆద్యంతం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిన నిందితుల ఆచూకీ కనిపెట్టడానికి పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
మీ కొడుకు రేప్ కేసులో దొరికాడు
బొంరాస్పేట: ‘హలో..ఆప్ కా బేటా రేప్ కేస్ మే మిల్గయా. ఛోడ్దేనా బోలేతో పచాస్ హజార్ అర్జెంట్ పే కరో.. నైతో జైల్మే దాల్దేతే’.. (నీ కొడుకు అత్యాచార ఘటనలో దొరికాడు. అతడిని విడిచిపెట్టాలంటే వెంటనే రూ.50 వేలు ఫోన్ పే చేయండి. లేదంటే జైలులో వేస్తాం) అంటూ వచ్చిన ఫోన్కాల్తో ఓ తండ్రి భయాందోళనకు గురయ్యాడు. ఏం చేయాలో తోచక పక్కనున్న తన సన్నిహితుడికి ఫోన్ ఇచ్చి మాట్లాడించాడు. ఇది సైబర్ నేరగాళ్ల పని అని తెలుసుకొని ఫోన్ కట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా రేగడిమైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్యామలయ్యగౌడ్ స్థానికంగా కిరాణదుకాణం నడిపిస్తున్నాడు. ఇతని చిన్న కొడుకు సత్యనారాయణగౌడ్ భార్యాపిల్లలతో హైదరాబాద్లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం 10.38 గంటలకు శ్యామలయ్యగౌడ్కు ఓ నంబరు నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడుతూ.. నీ కొడుకు ఓ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో దొరికాడని చెప్పాడు.ఫోన్లో పోలీస్ వాహనాల సైరన్ వినిపిస్తూ సత్యనారాయణను అరెస్టు చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేశాడు. హడలిపోయిన శ్యామలయ్యగౌడ్ వెంటనే పక్కనున్న వ్యక్తికి ఫోన్ ఇచ్చాడు. సైబర్ నేరగాళ్లుగా అనుమానించిన ఆయన పోలీస్స్టేషన్ వివరాలు అడగగా అవతలి వ్యక్తి పరుషపదజాలంతో తిట్టాడు. దీంతో ఫేక్ అని భావించి ఫోన్ కట్ చేశాడు. ఆ వెంటనే సత్యనారాయణకు ఫోన్ చేయగా, తాను ఆఫీసులో ఉన్నానని తండ్రికి చెప్పాడు. కొడుకుతో వీడియోకాల్ మాట్లాడిన తర్వాత తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. అనంతరం ఈ ఘటనపై నేషనల్ హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఫోన్కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
వీడియోలు
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 8 మంది మృతి
హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం
కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు: Varudu Kalyani
అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ దందాపై ప్రభుత్వం సీరియస్
ప్రభుత్వ స్కూల్లో టీచర్ కు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి
మొత్తం ఇండస్ట్రీ పై రైడ్లు జరుగుతున్నాయి: దిల్రాజు
అక్రమ కూల్చివేతలను అడ్డుకున్న దానం!
రషీద్ కుటుంబానికి ప్రభుత్వం వేధింపులు