Top Stories
ప్రధాన వార్తలు
Republic Day 2025: 942 మందికి శౌర్య పురస్కారాలు
జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేశంలోని రక్షణ విభాగంలో విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి శౌర్య పురస్కారాలు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి 942 మంది రక్షణ సిబ్బందికి శౌర్య పురస్కారాలు ప్రకటించారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా, పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర భద్రత తదితర విభాగాలకు చెందిన 942 మంది సిబ్బందికి శౌర్య పురస్కారాలు ప్రకటించారు. ఇందులో 95 మంది సైనికులకు శౌర్య పతకం, 101 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పతకం, 746 మందికి ప్రశంసనీయ సేవా పతకాలు లభించాయి.95 శౌర్య పురస్కారాలలో అత్యధిక పురస్కారాలను నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నియమితులైన సైనికులకు అందజేయనున్నారు. వీరిలో నక్సలైట్ ప్రాంతానికి చెందిన 28 మంది సైనికులు, జమ్ముకశ్మీర్ ప్రాంతానికి చెందిన 28 మంది సైనికులు, ఈశాన్య ప్రాంతానికి చెందిన 03 మంది సైనికులు, ఇతర ప్రాంతాలకు చెందిన 36 మంది సైనికులు ఉన్నారు. వీరిలో 78 మంది పోలీసులు, 17 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు.101 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలలో 85 పోలీసు సేవకు, ఐదు అగ్నిమాపక సేవకు, ఏడు పౌర రక్షణ-హోంగార్డ్లకు, నాలుగు సంస్కరణల విభాగానికి లభించాయి. 746 మెరిటోరియస్ సర్వీస్ (ఎంఎస్ఎం)పతకాలలో 634 పోలీసు సేవకు, 37 అగ్నిమాపక సేవకు, 39 సివిల్ డిఫెన్స్-హోం గార్డ్స్కు, 36 కరెక్షనల్ సర్వీస్కు లభించాయి.రాష్ట్రాల వారీగా గ్యాలంట్రీ అవార్డుల డేటాను పరిశీలిస్తే ఈ అవార్డులను ఛత్తీస్గఢ్కు చెందిన 11 మందికి, ఒడిశాకు చెందిన ఆరుగురికి, ఉత్తరప్రదేశ్కు చెందిన 17 మందికి, జమ్ముకశ్మీర్కు చెందిన 15 మంది పోలీసు సిబ్బందికి అందజేయనున్నారు. అస్సాం రైఫిల్స్ నుండి ఒక సైనికునికి, బీఎస్ఎఫ్ నుండి ఐదుగురు, సీఆర్పీఎఫ్ నుండి 19 మంది, ఎస్ఎస్బీ నుండి నలుగురికి శౌర్య పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను ఉత్తరప్రదేశ్ అగ్నిమాపక విభాగానికి చెందిన 16 మంది అగ్నిమాపక సిబ్బందికి, జమ్ముకశ్మీర్ అగ్నిమాపక విభాగానికి చెందిన ఒక అగ్నిమాపక అధికారికి అందజేయనున్నారు.ఇది కూడా చదవండి: Republic Day 2025: ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రత్యేకతలివే..
బాబు మార్క్ పాలన.. హనుమాన్ దేవాలయం కూల్చివేత
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో టీడీపీ పాలనలో మళ్లీ దేవాలయాల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. తాజాగా విశాఖపట్నంలో అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని అధికారులు కూల్చివేశారు. అయితే, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే దేవాలయాన్ని కూల్చివేయడంతో హిందూ ధార్మిక సంఘాలు కూటమి సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.వివరాల ప్రకారం.. చంద్రబాబు పాలనలో దేవాలయాలు కూల్చివేతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. విశాఖలో సీతమ్మధారలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని శనివారం ఉదయం అధికారులు కూల్చివేశారు. అయితే, కూల్చివేతలకు సంబంధించి అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దేవాలయం కూల్చివేతపై హిందూ ధార్మిక సంఘాలు.. కూటమి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఈ సందర్బంగా హిందూ ధర్మిక సంఘం స్పందిస్తూ.. ‘రాష్ట్రంలో హిందువులు బతకలేని పరిస్థితి నెలకొంది. రాజకీయ కుట్రతోనే హనుమాన్ దేవాలయం కూల్చివేశారు. శ్రీరామనవమిలోగా కూల్చిన దేవాలయాన్ని పున:ప్రతిష్ట చేయాలి. దేవాలయం కూల్చివేత వెనుక ఏ రాజకీయ నాయకుడు ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. విశాఖలో రాజకీయ నాయకులు ఆక్రమణలను కూల్చివేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. టీడీపీ పాలనలో మళ్లీ దేవాలయాలను కూల్చివేయడంపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాన్ని కూల్చివేయడం దారుణం. ఇన్ని రోజులు దేవాలయం ఇక్కడే ఉంది. ఇప్పుడే ఎందుకు కూల్చివేశారు. మా కళ్ల ముందే దేవాలయాన్ని కూల్చివేశారు. మాకు కన్నీళ్లు ఆగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిని కూల్చి వేస్తున్నప్పుడు మేము అడ్డుకునే ప్రయత్నం చేసినా మమ్మల్ని లాగిపడేశారు. కూటమి సర్కార్ నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.
అపుడు వాచ్మెన్గా, ఇపుడు దర్జాగా : శభాష్ రా బిడ్డా! వైరల్ స్టోరీ
పిల్లలు ప్రయోజకులైనపుడు ఆ తల్లితండ్రులు ఆనందంతో పొంగిపోతారు. తమ కష్టం ఫలించి కలలు నెరవేరాలని వేయి దేవుళ్లకు మొక్కుకుని, ఆశలు ఫలించాక వారికి కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అలాంటి ఊహించిన దానికంటే మరింత ఉన్నత స్థితికి చేరితే .. ఆ ఆనందానికి అవధులు ఉండవు. సుమతీ శతకకారుడు చెప్పినట్టు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినపుడు కాదు, ప్రయోజకుడై తమకు గర్వంగా నిలిచినపుడు కలిగేది. అలాగే పిల్లలు కూడా అమ్మానాన్న కల నెరవేర్చాలని కలలు కంటారు. మంచి చదువు చదివి, ఉన్నతోద్యోగం సంపాదించాక కన్నవారిని ఆనందంగా అపురూపంగా చూసుకోవాలని పట్టుదలగా ఎదుగుతారు. తమ కలను సాకారం చేసుకొని పేరెంట్స్ కళ్లలో ఆనందం చూసి పొంగిపోతారు. అలాంటి ఆనందదాయకమైన స్ఫూర్తిదాయకమైన నిజజీవిత కథనం గురించి తెలుసుకుందాం.న్యూఢిల్లీకి చెందిన ఒక తండ్రికి ఇలాంటి అద్భుతమైన ఆనందమే కలిగింది. ఖగోళ శాస్త్రవేత్త ఆర్యన్ మిశ్రా తన సొంత తన తండ్రినీ, తల్లినీ లగ్జరీ హోటల్ ఐటీసీకి ఎలా తీసుకువచ్చాడో పంచుకున్నాడు. ఎక్స్( ట్విటర్)లో ఆయన షేర్ చేసిన ఈ స్టోరీ ఇంటర్నెట్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. 20 లక్షలకు పైగా వ్యూస్ను దక్కించుకుంది.ఆర్యన్ తండ్రి ఐటీసీ హోటల్లో 1995- 2000 వరకు 25 సంవత్సరాలు వాచ్మెన్గా పనిచేశాడు. పాతికేళ్ల తరువాత అదే హోటల్కు భార్యతో కలిసి గెస్ట్గా రావడమే ఈ స్టోరీలోని విశేషం. దీనికి సంబంధించిన ఫోటోను కూడా ఆర్యన్ ట్వీట్ చేశారు. తరువాత విందు కోసం అతిథిగా పనిచేశాడు. వాచ్మెన్గా పనిచేస్తున్నపుడు.. ఇదే హెటల్కి డిన్నర్కి వస్తానని బహుశా ఆయన ఊహించి ఉండడు. కానీ అతని కొడుకు మాత్రం తండ్రికి అంతులేని ఆనందాన్ని మిగిల్చాడు. బిడ్డల్ని పోషించేందుకు అహర్నిశలు శ్రమించే తల్లిదండ్రులకు ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది.ఈ స్టోరీ గురించి తెలుసుకున్న నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. తండ్రీ కొడుకులకు అభినందనలు తెలిపారు. తండ్రిని ఇంత బాగా సత్కరించినందుకు మరికొందరు మిశ్రాను ప్రశంసించారు. “మీ విజయోత్సాహంలో ఈ క్షణాలు చాలా గొప్పవి. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి” అని ఒక యూజర్ చెప్పారు.My father was a watchman at ITC in New Delhi from 1995-2000; today I had the opportunity to take him to the same place for dinner :) pic.twitter.com/nsTYzdfLBr— Aryan Mishra | आर्यन मिश्रा (@desiastronomer) January 23, 2025 “మీరు ఎవరో నాకు తెలియదు, కానీ ఇంత అందమైన కథ చదివినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది. చాలా సంతోషంగా ఉంది” అని ఒక రాశారు. మరొకరు ఒక హృదయ విదారక జ్ఞాపకాన్ని పంచుకుంటూ, “చాలా అందంగా ఉంది. నాకర్తవ్యాన్ని గుర్తు చేశారు. అపుడు ఎక్కువ ఖర్చు చేయలేకపోయాము. ఇప్పుడు నేను చేయగలను, కానీ విధి మరోలా ఉంది’’ అన్నారు. చాలా సంతోషం.. ఈ భగవంతుడు మీకుటుంబాన్ని చల్లగా చూడాలి అంటూ చాలామంది ఆశీర్వదించారు.
‘అతడిని తప్పించి మంచి పనిచేశారు.. ఇది విన్నింగ్ టీమ్’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టును సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్(AB de Villiers) సమర్థించాడు. ఐసీసీ టోర్నీలో విజేతగా నిలిచేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్న టీమ్ అని కొనియాడాడు. అతడిని తప్పించి మంచి పనిచేశారుఅదే విధంగా.. ఈ జట్టు నుంచి పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ను తప్పించడం కూడా సరైన నిర్ణయమేనని డివిలియర్స్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఆడనుంది. తొలి మ్యాచ్లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 20న తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొట్టనున్న రోహిత్ సేన.. అనంతరం మార్చి 2న న్యూజిలాండ్తో పోటీపడుతుంది.రోహిత్ శర్మ కెప్టెన్సీలోఇక ఈ మెగా ఈవెంట్కు సంబంధించి వారం క్రితమే(జనవరి 18) బీసీసీఐ తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో సిరాజ్కు చోటు దక్కలేదు. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు.. మరో సీనియర్ మహ్మద్ షమీ, యువ తరంగం అర్ష్దీప్ సింగ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ విషయంపై స్పందించిన ఏబీ డివిలియర్స్.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో సిరాజ్ లేకపోయినా టీమిండియాపై పెద్దగా ప్రభావం పడబోదని పేర్కొన్నాడు. గత కొంతకాలంగా అతడు కాస్త ఆందోళనగా కనిపిస్తున్నాడన్న ఏబీడీ.. ఆస్ట్రేలియా పర్యటనలో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం ఇందుకు కారణం కావొచ్చన్నాడు.కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలిఆసీస్ టూర్లో తన శక్తి మొత్తాన్ని ఖర్చు చేసిన సిరాజ్ కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంటేనే బాగుంటుందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అంతేగాక కంగారూ గడ్డపై అతడి ప్రదర్శన అంతగొప్పగా కూడా లేదని.. ఇప్పట్లో అతడు బరిలోకి దిగకపోవడమే మంచిదని పేర్కొన్నాడు. అయితే, అద్భుతమైన నైపుణ్యాలున్న సిరాజ్.. త్వరలోనే టీమిండియాలోకి తిరిగి వస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.ఇదొక విన్నింగ్ టీమ్ఇక చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే జట్టు గురించి ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘‘టోర్నమెంట్ విన్నింగ్ టీమ్ ఇది. భారత జట్టు తమ మ్యాచ్లను యూఏఈలో ఆడబోతోంది. కాబట్టి బ్యాటర్లు ప్రధామైన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.ఐసీసీ టోర్నమెంట్లలో గెలవాలంటే పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన జట్టు ఉండాలి. వరల్డ్కప్ ఈవెంట్లలో ఆస్ట్రేలియా అనుసరించే వ్యూహాలను మనం చూస్తూనే ఉంటాం. వారి బ్యాటింగ్ ఆర్డర్ డీప్గా ఉంటుంది. వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గనిస్తాన్పై వీరోచిత డబుల్ సెంచరీ చేసి.. మ్యాచ్ను గెలిపించిన గ్లెన్ మాక్స్వెల్ ప్రదర్శన ఇందుకు నిదర్శనం.ఇక ఈ జట్టులో హార్దిక్ పాండ్యాతో పాటు ఆల్రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. లోయర్ ఆర్డర్లో ఈ ముగ్గురు నెగ్గుకురాగలరు’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటడం ఖాయమని డివిలియర్స్ రోహిత్ సేనకు మద్దతు ప్రకటించాడు.ఎనిమిది జట్లుకాగా చాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్.. వన్డే వరల్డ్కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి. ఇక టీమిండియా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది.చదవండి: జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి? చీఫ్ సెలక్టర్గా ఉంటే..
సక్సెస్ కోసం ఆ విషయాల్లో రాజీ పడ్డాను : రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక(rashmika mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవల పుష్ప 2(pushpa 2)తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. త్వరలోనే ఛావా అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇలా వరుస సినిమాల్లో నటించడం కోసం పెద్ద త్యాగమే చేశానంటోంది రష్మిక. కొన్ని విషయాల్లో రాజీ పడడం వల్లే ఈ స్థాయి సక్సెస్ని అందుకుంటున్నానని చెబుతోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కెరీర్ పరంగా బిజీగా ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని బాధ పడింది. తనకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని.. కానీ కెరీర్ కోసం వాళ్లకు దూరంగా ఉండాల్సి వస్తోందని ఎమోషల్ అయింది.‘ఫ్యామిలీనే నా బలం. ఎక్కువ సమయం కుటుంబంతోనే గడిపేదాన్ని. నా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి రోజు చాటింగ్ చేసుకుంటాం. కానీ షూటింగ్స్ కారణంగా తనను కలువలేకపోతున్నాను. తను చాలా స్మార్ట్. రానున్న రోజుల్లో అద్భుతమైన మహిళగా మారనుందని నమ్ముతున్నా. ‘వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదు. ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయాల్సి ఉంటుంది’ అని మొదట్లోనే మా అమ్మ చెప్పింది. నా విషయంలో ఇప్పుడు అదే జరుగుతుంది. వృత్తిపరమైన కమిట్మెంట్స్ నిలబెట్టుకోవడానికి ఫ్యామిలీ టైమ్ త్యాగం చేయాల్సి వస్తోంది. వీలున్నప్పుడల్లా కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతుంటా’ అని రష్మిక చెప్పుకొచ్చింది.సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం లక్ష్మణ్ ఉదేకర్ దర్శకత్వంలో ఛావా(Chhava) అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక నటిస్తోంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘సికందర్’, ‘థామ’, ‘కుబేర’, ‘ది గర్ల్ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు.
రాణాకు మూసుకుపోయిన దారులు.. ఇక భారత్కు అప్పగింతే!
వాషింగ్టన్: ముంబయి దాడుల కేసు కీలక నిందితుడైన తహవూర్ రాణాను భారత్కు అప్పగించే విషయంలో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. రాణా వేసిన రివ్యూ పిటిషన్ను అమెరికా సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. భారత్-అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా ఆ దేశ లోయర్ కోర్టు గతంలో ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను సవాల్ చేయడానికి రాణాకు ఇక అవకాశాల్లేకుండా పోయాయి.2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాణా కీలక నిందితుడిగా ఉన్నాడు. పాకిస్థాన్ మూలాలున్న కెనడియన్ రాణా. ముంబై దాడులకు ఆర్థిక సాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతేగాక, ఈ కేసులో ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్ హెడ్లీకి ఇతడు అత్యంత సన్నిహితుడు. అలాగే.. దాడులకు ముందు ముంబయిలో తుది రెక్కీ నిర్వహించింది కూడా తహవూరేనని విచారణలో భాగంగా హెడ్లీ గతంలోనే వెల్లడించాడు. మరో కేసులో ఉగ్రమూకలకు సాయం చేశాడన్న ఆరోపణల కింద గతంలో షికాగో కోర్టు 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. రాణా ప్రస్తుతం లాస్ ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, తహవూర్ రాణాను అప్పగించాలని భారత్ చేసిన అభ్యర్థనకు గతంలో అనుకూలంగా కాలిఫోర్నియా జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. భారత్-అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాణా.. ఫెడరల్ కోర్టులతో సహా పలు పిటిషన్లు వేశాడు. చివరగా.. కిందటి ఏడాది నవంబర్ 13వ తేదీన సుప్రీం కోర్టులో రిట్ ఆఫ్ సెర్షియోరరి దాఖలు చేశాడు. డిసెంబర్ 16వ తేదీన వాదనలు జరిగాయి. కింది కోర్టులు లేదంటే ట్రైబ్యునళ్లు తమ అధికార పరిధిలో ఉండేలా చూడటం ఈ రిట్ ఉద్దేశం. కింది కోర్టులు, ట్రైబ్యునళ్లు వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేయడానికి ఈ రిట్ను జారీ చేస్తారు.కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలు అమెరికా-భారత్ నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని రెండు రకాలుగా ఉల్లంఘిస్తుందని రాణా తరఫు అటార్నీ వాదనలు వినిపించాడు. ఈ కేసులో ఇప్పటికే రాణాను ఇల్లినాయిస్(చికాగో) కోర్టు నిర్దోషిగా పేర్కొందనే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాడు. అమెరికాలో ఈ కేసుకు సంబంధించి అపరాధిగా తేలినా లేదంటే నిరపరాధిగా నిరూపించినా.. అమెరికా-భారత్ ఒప్పందం ప్రకారం సదరు వ్యక్తిని అప్పగించడం కుదరదని రాణా తరఫు అటార్నీ వాదించాడు.మరోవైపు.. ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ ఎలిజబెత్ ప్రెలోగర్ వాదనలు వినిపించారు. భారత్ అభియోగాలను ఇల్లినాయిస్ పరిగణనలోకి తీసుకుని ఉండకపోవచ్చని, కాబట్టి ఆ దేశానికి అప్పగించే విషయంలో రాణాకు ఎలాంటి ఉపశమనం ఇవ్వకూడదని కోర్టును కోరారామె. అలాగే.. ఈ కేసును ప్రత్యేకమైందిగా పరిగణించాలని ఆమె కోరారు. దీంతో.. రాణా వాదనలను తోసిపుచ్చిన కోర్టు అతడి పిటిషన్ కొట్టేస్తూ జనవరి 21వ తేదీన తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు దానిని తిరస్కరించడంతో.. మళ్లీ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పుడు దానిని కూడా కోర్టు తోసిపుచ్చింది. దీంతో అతని ముందు దారులు మూసుకుపోయాయి. భారత్కు ఇదో విజయంతహవూర్ రాణా అప్పగింతకు అమెరికా సుప్రీం కోర్టు మార్గం సుగమడం చేయడాన్ని.. భారత విజయంగా అభివర్ణించారు సీనియర్ లాయర్ ఉజ్వల్ నికమ్. అమెరికా సుప్రీం కోర్టు అతని వాదనలను, పిటిషన్లను తోసిపుచ్చింది. ట్రంప్ ప్రభుత్వం త్వరలోనే అతన్ని భారత్కు అప్పగిస్తుందని ఆశిస్తున్నా అని అన్నారాయన.
చంద్రబాబు, రేవంత్ల స్ఫూర్తితో అలా ముందుకు..!
కాంగ్రెస్ పార్టీని నిత్యం విమర్శించే భారతీయ జనతా పార్టీ హామీల విషయంలో ఇప్పుడు ఆ పార్టీ బాటనే పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఇచ్చిన కొన్ని హామీలు కాంగ్రెస్ పలు రాష్ట్రాలలో చేసినవి కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాలను ఎలా అమలు చేయాలో తెలియక అవస్థలు పడుతుంటే.. బీజేపీ కూడా అదే తరహా ఎన్నికల ప్రణాళికను ప్రకటించి ప్రజలను ఆకరర్షించడానికి నానా పాట్లు పడుతోంది. కాంగ్రెస్ పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో వాగ్దానాల పోస్టర్ ను విడుదల చేస్తూ చెప్పిన సంగతులు కూడా చిత్రంగానే ఉన్నాయి!. వరుస విజయాలతో ఢిల్లీలో బలంగా నాటుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ రెండు జాతీయ పార్టీలకు సవాల్గా మారింది. ఆశ్చర్యకరంగా.. పొరుగున ఉన్న పంజాబ్లోనూ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో ఈసారి గెలిస్తే అది తమ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చని బీజేపీ భావిస్తోంది. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పటికీ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా బెయిల్పై విడుదలై పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళుతున్నారు. విద్య, వైద్యం వంటివాటిలో, సంక్షేమ స్కీముల అమలులో కేజ్రీవాల్ బలమైన ముద్ర వేసుకున్నారు. దానిని నిలబెట్టుకోవడానికి ఆప్ కృషి చేస్తుంటే, ఆ పార్టీని దెబ్బతీయడానికి బీజేపీ పలు ఆకర్షణీయమైన స్కీములతో మానిఫెస్టోని విడుదల చేసింది. వాటిలో ముఖ్యమైనది.. మహిళా సమృద్ధి యోజన. దీని ప్రకారం ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తారట. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఒక్క ఢిల్లీకే ఈ హామీని పరిమితం చేయడమేమిటి?. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి దేశమంతటా అలాగే చేస్తామని చెబుతారేమో తెలియదు. ఈ హామీ కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టిందే అనిపిస్తుంది. బీజేపీ గతంలో ఇలాంటి హామీలకు విరుద్దమని చెబుతుండేది. మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఉచితాలు, రుణమాఫీల వంటి హామీలను బీజేపీ ఒప్పుకోదని పలు సభలలో బహిరంగంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల బృందం దేశ రాజకీయాలను శాసించడం ఆరంభమయ్యాక, ప్రతి రాష్ట్రంలో అధికారం సాధించాలన్న లక్ష్యంతో పని చేయడం ఆరంభించారు. అందులోనూ దేశ రాజధాని కావడంతో ఢిల్లీకి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ స్కీమును అమలు చేస్తామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఏడాది గడిచినా అమలు చేయలేకపోయింది. అలాగే ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ చేసిన వాగ్దానం ప్రకారం ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ప్రతి నెల ఇవ్వాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కాని ఆ ఊసే ఎత్తడం లేదు. బీజేపీ నేరుగా టీడీపీ, జనసేనల మానిఫెస్టోలో భాగస్వామి కాకపోయినా, ఆ ప్రణాళిక విడుదలలో భాగస్వామి అయింది. ఏపీలో ఈ హామీ అమలు చేయడానికి ఏడాదికి సుమారు రూ.36 వేల కోట్లు అవసరమవుతాయి. అవి ఎక్కడ నుంచి వస్తాయో ఇంతవరకు చెప్పలేకపోయారు. ఇక.. ఢిల్లీలో గర్భిణులకు రూ.21 వేలు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, హోళీ, దీపావళి పండగలకు ఉచితంగా ఒక్క గ్యాస్ సిలిండర్ ఇస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ స్కీములను కొనసాగిస్తామని కూడా ఆయన అన్నారు. వృద్ధాప్య పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని హామీలు ఇచ్చారు. రెండో విడత మరికొన్ని హామీలు ఇచ్చారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని అందులో తెలిపారు. ఎన్నికలు జరిగే లోపు మరికొన్ని ప్రజాకర్షక వాగ్దానాలు చేస్తారట. సిద్దాంతంతో సంబంధం లేకుండా బీజేపీ ఇలా దిగజారి పోయిందా? అనే ప్రశ్నకు జవాబు దొరకదు. ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు పరస్పరం దారుణమైన విమర్శలు చేసుకున్న తర్వాత, తిరిగి ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. అప్పుడే బీజేపీ విలువలు ఏమిటో అర్ధమైపోయింది. ఇక కాంగ్రెస్ విషయానికి వద్దాం. ఆ పార్టీ పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాగ్దానాల పోస్టర్ ను విడుదల చేశారు. ఆయనకు జాతీయ స్థాయి ఎలివేషన్ రావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడి ఉండవచ్చు. కానీ ఆయన పేర్కొన్న హామీలు ఎంతవరకు అమలు అవుతాయో గ్యారంటీ లేదు. తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసేస్తున్నామని చెప్పడం చిత్రంగానే ఉంటుంది. మహిళలకు రూ.1500 రూపాయల చొప్పున ఇచ్చే హామీని ఎందుకు అమలు చేయలేకపోయారు?. రైతు భరోసా స్కీమ్ పరిస్థితి ఏమిటి? పూర్తిగా అయినట్లు చెప్పలేకపోతున్నారు. ఇంతవరకు రూ.22 వేల కోట్ల మేర మాఫీ చేశామని చెప్పారు. కాగా ఢిల్లీలో 300 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని ప్రకటించారు. అలాగే రూ.500లకే గ్యాస్ సరఫరా చేస్తామని డిల్లీ కాంగ్రెస్ పక్షాన ప్రకటించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించి ఆ స్కాం అసలు పార్టనర్ ను ఓడిస్తే ఢిల్లీలో మంచిరోజులు వస్తాయని అన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ నేత కవిత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మరికొందరు ఆప్ నేతలు ఈ కేసులో జైలుకు వెళ్లారు. కవిత అరెస్టును స్వాగతించిన కాంగ్రెస్, కేజ్రీవాల్ అరెస్టు అయినప్పుడు మాత్రం బీజేపీని విమర్శిస్తూ ధర్నాలు చేసింది. ఈ ద్వంద్వ వైఖరిపై ఇంతవరకు వివరణ ఇచ్చినట్లు కనిపించదు. పొత్తు కుదరలేదు కనుక లిక్కర్ స్కామ్ పార్టనర్ అని రేవంత్ చెబుతున్నారు. కేసీఆర్ టైమ్ లో ఉన్న అవినీతి నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నామని రేవంత్ ప్రచారం చేసి వచ్చారు. దీనిలో ఎంత నిజం ఉందన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు. కొన్ని హామీలు అమలు చేశామని చెబితే ఫర్వాలేదు కాని, అన్నింటిని చేసేసినట్లు ప్రచారం చేస్తే విమర్శలు వస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తన హామీలలో కొత్తగా విద్యార్ధులందరికి ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. ఇప్పటికే విద్యార్దినులకు ఉచిత బస్ అమలు చేస్తుండగా.. ఇకపై బాలురకు కూడా ఫ్రీ బస్ సదుపాయం అని హామీ ఇచ్చారు. విద్యార్ధులకు మెట్రో చార్జీలలో ఏభై శాతం భరిస్తామని మరో హామీ ఇచ్చారు. యువతను ఆకర్షించడానికి ఆప్ వేసిన గాలం ఇది. ఢిల్లీలో ఉచిత విద్యుత్, ఉచిత నీరు తదితర హామీలను ఆప్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఇది పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో గవర్నర్ ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేజ్రీవాల్ను, ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అనేక వ్యూహాలను అమలు చేసింది. అందులో భాగంగా ఈడీని కూడా ప్రయోగించిందన్న రాజకీయ విమర్శలు వచ్చాయి. మొత్తంగా.. బీజేపీ ఇన్ని వ్యూహాలు పన్నుతూ డిల్లీలో ఎంత మేర ఫలితాన్ని ఇస్తుందన్నది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలు తేల్చుతాయి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!
శరీరం తేలికగా కదలటానికి, చురుకుగా ఉండటానికి ఎముకలు బలంగా ఉండటం ఎంతైనా అవసరం ఎముకలు బలహీనపడితే.. విరగడం, ఆస్టియోపోరోసిస్ ముప్పు పెరుగుతుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవన శైలిమార్పులతోపాటు, వ్యాయామాన్ని కూడా క్రమం తప్పకుండా చేయాలి. ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి, అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదాన్ని నివారించగల శక్తి అధో ముఖానికి ఉంది. రోజూ ఈ ఆసనాన్ని దినచర్యలో భాగం చేస్తూ ఉంటే మైండ్, బాడీ చురుకుదనం పెరుగుతుంది. ఇలా వేయాలి....∙మ్యాట్ పైన లేదా నేలపైన నిటారుగా నిల్చొని చేతులను పైకి స్ట్రెచ్ ఉంచాలి. తర్వాత నడుం భాగం వంచుతూ, చేతులను పూర్తిగా నేలమీద ఆనించాలి. ∙చేతులను పాదాలకు దూరంగా తీసుకెళుతూ త్రికోణాకారంలో ఉండాలి.కాలి వేళ్ల మీద ఉంటూ మడమలను పైకి లేపాలి. శరీర బరువు చేతులు, కాలి ముని వేళ్ల మీద ఉంటుంది. ∙నిమిషం సేపు ఇదే భంగిమలో ఉండాలి. తిరిగి యధాస్థితికి రావాలి. ఇలా ఒకటి నుంచి 3 సార్లు ఈ ఆసనాన్ని పునరావృతం చేయాలి.ఈ ఆసనం వేయటానికి మొదట్లో కాస్త కష్టంగా వున్నా రోజూ సాధన చేస్తూ ఉంటే సులువవుతుంది. వెన్నెముక, కాళ్ళను బలోపేతం చేస్తుంది. అదే విధంగా ఏకాగ్రత పెంచి, ఒత్తిడి నుండి రిలీఫ్ని ఇస్తుంది. అజీర్తి సమస్యలు దూరమవుతాయి. నడుము నొప్పి తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్ సమస్య నుండి రక్షిస్తుంది. సైనస్, ఆస్తమా, పీరియడ్స్లో వచ్చే సమస్యల నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇన్ని ప్రయోజనాలని ఈ ఆసనం ద్వారా పొందవచ్చు. ఎముకలు దృఢంగా ఉండటానికి ఏం చేయాలి?ఎముకలు దృఢంగా ఉండాలంటే.. సమతుల్య, పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి.కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు సమృద్ధిగా లభించే ఆహారం తినాలి.పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు తినాలి.విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారాలు తినాలి.బాల్యంలో ఎముకలు దృఢంగా ఉండటానికి పోషకాలు తీసుకోవడం ముఖ్యం.వ్యాయామం చేయడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.మెనోపాజ్ దాటిన స్త్రీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.ఎముకలు, కండరాలను బలోపేతం చేసేలా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.ఇదీ చదవండి: టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి
జగన్ వరుస నిర్ణయాలతో వైఎస్సార్సీపీలో నూతనోత్సాహం
గుంటూరు, సాక్షి: చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గడువు ముగిసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. సంపద సృష్టి పేరుతో ప్రజలపై పెనుభారం మోపే కుట్రలకు తెర తీసింది కూటమి సర్కార్. దీంతో ప్రజల తరఫున పోరాటాలకు ప్రతిపక్ష బాధ్యతతో వైఎస్సార్సీపీ సిద్ధమైంది. అదే సమయంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.వైఎస్సార్సీపీలో కొంతకాలంగా భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నది చూస్తున్నదే. వరుసగా జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్(YS Jagan) విడివిడిగా భేటీ అవుతూ వచ్చారు. రెడ్బుక్ రాజ్యాంగం(Red Book Constitution), కీలక నేతలపై అక్రమ కేసులు.. నిర్బంధాలు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వంటి పరిణామాలు చర్చించారు. కూటమి ప్రతీకార రాజకీయాలకు భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని కేడర్కు ధైర్యం చెప్పారు. రాజకీయంగా ప్రత్యర్థుల కుట్రలకు తాను ఎంతగా ఇబ్బంది పడింది.. వాటికి ఎదురొడ్డి ప్రజాభిమానంతో చారిత్రక విజయం సాధించింది వివరించారు. రాబోయే రోజులు మళ్లీ మనవేనని.. కాబట్టి పోరాట పటిమ తగ్గకూడదని పిలుపు ఇచ్చారు. అదే సమయంలో ‘మార్పు’ తప్పదనే సంకేతాలిచ్చారు కూడా. అలాంటి వాళ్లకే పదవులువైఎస్సార్సీపీ(YSRCP)లో ఇప్పటికే దాదాపు అన్ని జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తైంది. నియోజకర్గాల కార్యవర్గాల అంశం చివరి దశలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక.. మండల్, బూత్ లెవల్ నియామకాలు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. అయితే.. త్వరలో వైఎస్ జగన్ కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ టైంలోనే వాటిని భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి.. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించాకే వైఎస్ జగన్ ఈ ప్రక్షాళన మొదలుపెట్టారు. మార్పులపై కీలక నేతలతో చర్చలు జరిపారు. పార్టీలో ఎవరైతే చురుకుగా ఉంటున్నారో.. వాళ్లకే పదవులను అప్పగిస్తున్నారు. తద్వారా పార్టీ కేడర్ను చెక్కుచెదరకుండా చూసుకున్నారు. అంతేకాదు.. స్వయంగా తానే కార్యకర్తల దగ్గరకు వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని ప్రకటించారు. ఈ వరుస కొత్త పరిణామాలు.. పార్టీలో నూతనోత్సాహం నింపుతున్నట్లు తెలుస్తోంది. పోరుబాటలో YSRCP..ఒకవైపు ప్రక్షాళనతో పార్టీ పునఃనిర్మాణం చేస్తూనే మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని వైఎస్ జగన్ పార్టీ కేడర్కు పిలుపు ఇస్తున్నారు. చంద్రబాబు(Chandrababu) మళ్లీ మేనిఫెస్టో విషయంలో మోసానికి దిగారు. సూపర్ సిక్స్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా గత ప్రభుత్వంపై నిందలతోనే కాలాయాపన చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిని కేడర్కు గుర్తు చేస్తున్నారు.ఐదారు నెలలకే చంద్రబాబు సర్కార్పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు కష్టకాలంలో ఉన్నారని, ఈ టైంలో ప్రజలకు అండగా నిలబడాలని సూచించారు. ఇప్పటికే రైతు పోరుబాట, విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా కార్యక్రమాలు జరిగాయి. ఫిబ్రవరి 5న ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల కోరుతూ మరో ధర్నాకు సిద్ధమైంది. మొత్తంగా.. పార్టీలో పోరాట పటిమ తగ్గకూడదని వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో మరిన్ని ప్రజాపోరాటాలకు వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ అనే సంకేతాలిస్తోంది.
ఊహించని రేటుకు చేరిన బంగారం.. అదే బాటలో వెండి
రూ. 82,420కు చేరిన తులం బంగారం రేటు.. ఈ రోజు (జనవరి 25) అక్కడే స్థిరంగా ఉంది. దీంతో పసిడి రేట్లలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అయితే ఈ కథనంలో మన దేశంలో ఏ నగరం గోల్డ్ రేటు ఎక్కువగా ఉంది?.. ఎక్కడ తక్కువగా ఉందనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా.. గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 75,550 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 82,420 వద్ద నిలిచాయి. నిన్న భారీగా పెరిగిన గోల్డ్ రేటు ఈ రోజు స్థిరంగా ఉంది.చైన్నైలో కూడా బంగారం ధరలలో ఎటువంటి మార్పులు లేదు. కాబట్టి ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 75,550 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,420 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 75,700 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 82,570 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాత్రమే కాకుండా.. ఈ రోజు (శనివారం) వెండి ధరలలో కూడా ఎటువంటి మార్పు లేదు. కాబట్టి కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 వద్ద ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: డబ్బు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు: ఇలా..
కేబీసీ తొలి విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?
ఇంటర్ విద్యార్థినిపై బ్లేడ్తో దాడి
శ్రీవల్లి అదృశ్యం
Mahakumbh: కారులో మంటలు.. అగ్నిమాపక దళం అప్రమత్తం
నెలలో 8.2 లక్షల క్రెడిట్ కార్డులు జారీ
మహిళా ప్రధానికి ట్రంప్ బెదిరింపులు?
‘బాబూ.. ప్రజలకు వైద్యం ముఖ్యమా లేక ఎయిర్పోర్టులా?’
సక్సెస్ కోసం ఆ విషయాల్లో రాజీ పడ్డాను : రష్మిక
వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ?
చంద్రబాబు, రేవంత్ల స్ఫూర్తితో అలా ముందుకు..!
అన్ని విషయాల్లో మీ ఇద్దరికీ చాలా దగ్గర పోలికలున్నాయ్ సార్!
ఓటీటీలో 'శ్వేతా బసు' బోల్డ్ సినిమా.. టీజరే ఇలా ఉంటే..!
సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్బాబు, ప్రియాంక
మొత్తం మీ గురించే కాకుండా కాస్త రాష్ట్రం గురించి కూడా చెప్పాల్సింది సార్!
అమెరికాలో అడుగు పెట్టాలంటే ఇది తప్పని సరి.. నిబంధనలు మార్చిన ట్రంప్
HYDRA: ఘట్కేసర్లో హైడ్రా కూల్చివేతలు
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.
ఊహించని రేటుకు చేరిన బంగారం.. అదే బాటలో వెండి
జగన్ వరుస నిర్ణయాలతో వైఎస్సార్సీపీలో నూతనోత్సాహం
ఓటీటీలో రియల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్
కేబీసీ తొలి విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?
ఇంటర్ విద్యార్థినిపై బ్లేడ్తో దాడి
శ్రీవల్లి అదృశ్యం
Mahakumbh: కారులో మంటలు.. అగ్నిమాపక దళం అప్రమత్తం
నెలలో 8.2 లక్షల క్రెడిట్ కార్డులు జారీ
మహిళా ప్రధానికి ట్రంప్ బెదిరింపులు?
‘బాబూ.. ప్రజలకు వైద్యం ముఖ్యమా లేక ఎయిర్పోర్టులా?’
సక్సెస్ కోసం ఆ విషయాల్లో రాజీ పడ్డాను : రష్మిక
వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ?
చంద్రబాబు, రేవంత్ల స్ఫూర్తితో అలా ముందుకు..!
అన్ని విషయాల్లో మీ ఇద్దరికీ చాలా దగ్గర పోలికలున్నాయ్ సార్!
ఓటీటీలో 'శ్వేతా బసు' బోల్డ్ సినిమా.. టీజరే ఇలా ఉంటే..!
సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్బాబు, ప్రియాంక
మొత్తం మీ గురించే కాకుండా కాస్త రాష్ట్రం గురించి కూడా చెప్పాల్సింది సార్!
అమెరికాలో అడుగు పెట్టాలంటే ఇది తప్పని సరి.. నిబంధనలు మార్చిన ట్రంప్
HYDRA: ఘట్కేసర్లో హైడ్రా కూల్చివేతలు
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.
ఊహించని రేటుకు చేరిన బంగారం.. అదే బాటలో వెండి
జగన్ వరుస నిర్ణయాలతో వైఎస్సార్సీపీలో నూతనోత్సాహం
ఓటీటీలో రియల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్
సినిమా
సక్సెస్ కోసమే సినిమా..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సినిమా వాణిజ్యపరమైన అంశమని, ఈ కారణం చేత సక్సెస్ కోసమే కమర్షియల్ హంగులతో నిర్మిస్తున్నారని ప్రముఖ భారతీయ నటులు, దర్శకులు అమోల్ పాలేకర్ అన్నారు. డిజిటల్ టెక్నాలజీ యుగంలో సినిమా దర్శకుడు ఇతర సినిమా బృందం కన్నా సాంకేతికత పైనే ఎక్కువ ఆధారపడుతోందన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్లో భాగంగా ప్లీనరీలో అమోల్ పాలేకర్ తన సతీమణి సంధ్య గోఖలేతో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకులు మోహనక్రిష్ణ ఇంద్రగంటితో తాను రాసిన నూతన పుస్తకం ‘వ్యూ ఫైండర్’ పై చర్చించారు.‘నా వరకూ సినిమా అంటే అందరిలా కాకుండా విభిన్నంగా తీయడమే నచ్చుతుందన్నారు. మెయిన్ స్ట్రీంలో సినిమా రంగానికి నియమాలు, నిబంధనలు, పరిమితులు వంటి సంస్కృతిలో ఇమడలేకపోయానన్నారు. ఎంత పెద్ద విజయం సాధించినా, నిర్మించగలిగినా ఆ క్రెడిట్ మొదట రచయితకే చెల్లుతుంది. ప్రస్తుత సినిమా వందల కోట్ల అంశంగా మారింది. ఒక పెద్ద నిర్మాత నాతో ఇలాంటి సినిమాలే తీయాలని సంప్రదించాడు, అలాంటి పది సినిమాల్లో 9 రిజక్ట్ చేసేవాడిని’ అని అన్నారు. ‘ఒక సినిమా షూట్లో భాగంగా తోటి నటి స్మితను నిజంగా కొట్టాల్సి వచ్చింది, దర్శకుడి ప్రోద్భలంతో ఆ సీన్ బాగా పండించడానికి ఇష్టం లేకున్నా కొట్టాల్సి వచ్చింది. ఆ సీన్లో స్మిత మంచి నటన కనబర్చింది. అనంతరం క్షమాపణ కోరినా, నేను కొట్టడం వల్లే మరింత వాస్తవంగా నటించగలిగానని ఆమె చెప్పడంతో ఆశ్చర్యపోయాను’ అన్నారు. ‘70లలో అద్భుతమైన మధ్య తరగతి సినిమాల ప్రస్తావన రావడంతో.. నాటి జీవితాలకు, ప్రస్తుత జీవన శైలికి తేడా ఉందని, ఇప్పుడు అలాంటి కథలను ఊహించలేం. కానీ ఈ మధ్య అలాంటి కథే ‘సత్యం సుందరం’ నన్నెంతో హత్తుకుంది. నా సినీ మిత్రుడు ఉత్పల్ దత్ ఎంత మంచివాడో నాకే తెలుసు, కానీ దేశంలోనే మొట్టమొదటి సెడేటివ్ కేసుతో అరెస్టు అయ్యాడు’ అని గుర్తు చేసుకున్నారు. నాస్తికులుగా బతకడం కష్టం.. ‘నా భార్యను కలవక ముందు జీవితం, ఆ తరువాతి జీవితం అనేంత ప్రభావం చూపించింది. సతీమణి సంధ్యను కలువక ముందు ఐదేళ్లకు ఒక సినిమా తీస్తే, ఆమెను కలిశాక ఏడాదికో సినిమా తీయగలిగాను. తన పుస్తకం వ్యూ ఫైండర్ మా ఇద్దరి ప్రయాణం క్లైమాక్స్ వంటిది’ అని మోహన క్రిష్ణ ఇంద్రగంటితో చమత్కరించారు. ‘నా చివరి ఎనిమిది సినిమాలకూ నా భార్యే రైటర్. మేమిద్దరమూ నాస్తికులమే, సామాజికంగా నాస్తికులుగా సాగడం అంత సులువు కాదు’ అన్నారు.. ‘నేను సినిమా రంగానికి చెందిన వ్యక్తిని కాదు, 2000 సంవత్సరంలో అమోల్ పాలేకర్ సినిమాకు మొదటి సారి పనిచేశాను’ అని సంధ్య తెలిపారు.
సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్బాబు, ప్రియాంక
మహేశ్బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమా పనులు ప్రారంభమయ్యాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్గా ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 'SSMB 29' చిత్రాన్ని లాంచ్ చేశారు. చిత్ర యూనిట్తో పాటు మహేశ్బాబు(Mahesh Babu) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ, ఈ సినిమా కార్యక్రమానికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఆ సమయంలో ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. అయితే, తాజాగా జక్కన్న తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో షేర్ చేసి అభిమానుల్లో జోష్ పెంచాడు.మహేశ్బాబు అభిమానుల దృష్టి అంతా SSMB29 సినిమాపైనే ఉంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాజమౌళి( S. S. Rajamouli) ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక వీడియోను పంచుకున్నారు. ఒక సింహాన్ని లాక్ చేసినట్లు అందులో ఉంది. అంటే మహేశ్ను తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేసినట్లు చెప్పేశాడు. జక్కన్న పోస్ట్కు కామెంట్ బాక్స్లో మహేశ్బాబు కూడా 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..' అంటూ రెస్పాండ్ అయ్యాడు. ఆపై నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) కూడా చప్పట్ల ఎమోజీతో చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. అయితే, 'ఫైనల్లీ' అంటూ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కామెంట్ బాక్స్లో రియాక్ట్ కావడం విశేషం. ఇలా జక్కన్న చేసిన పోస్ట్కు చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. జక్కన్న పాస్పోర్ట్ చూపిస్తూ సింహం ఫోటోతో పోజ్ ఇచ్చారు. దీంతో SSMB29 సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లేనని మహేశ్ అభిమానులు అనుకుంటున్నారు.'ఫైనల్లీ' తేల్చేసిన ప్రియాంక చోప్రాహీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్లో అడుగుపెట్టారు. SSMB29 ప్రాజెక్ట్ కోసమే ఆమె ఇక్కడకు వచ్చినట్లు తేలిపోయింది. తాజాగా రాజమౌళి చేసిన పోస్ట్కు ఫైనల్లీ అంటూ ఆమె రెస్పాండ్ అయ్యారు. దీంతో మహేశ్బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రానే హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది. సింగర్, యాక్టర్ నిక్ జోనాస్తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో స్థిరపడిన ప్రియాంక. చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మహేశ్బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని పరోక్షంగా క్లారిటీ వచ్చేసింది. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు అని తెలుస్తోంది.‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్లో హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కానున్నారు. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli)
ఇబ్బందిగా ఉన్నా నా భర్త సర్దుకుపోతాడు: కీర్తీ సురేష్
సౌత్ ఇండియా నటి కీర్తీ సురేష్(Keerthy Suresh) చాలా లక్కీ అనే చెప్పాలి. బాలనటిగా రంగప్రవేశం చేయడం వల్లో ఏమోగానీ, కథానాయకిగానూ చాలా త్వరగా క్లిక్ అయ్యారు. అదేవిధంగా మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ వెనువెంటనే రంగప్రవేశం చేసి అంతే వేగంగా విజయాలను తన ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా నాయకిగా గుర్తింపు పొందారు. అంతేకాదు అతి పిన్న వయసులోనే మహానటి చిత్రంలో అద్భుతమైన హావభావాలను పలికించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అంతే స్వీడ్గా పెళ్లి చేసుకున్నారు. ఇదంతా నటిగా దశాబ్ద కాలంలోనే జరిగిపోయింది. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన తన 15 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ ఆంటోనిని(Antony Thattil) కుటుంబ సభ్యుల సమ్మతితో పెళ్లి చేసుకున్న ఆ వెంటనే తాను నటించిన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. కాగా ఇటీవలే తన భర్తతో హనీమూన్ కోసం థాయ్ల్యాండ్ వెళ్లి వచ్చిన ఈ బ్యూటీని ఒక భేటీలో కీర్తీసురేశ్ తన వివాహ జీవితం గురించి అగిడిన ప్రశ్నకు తాను వివాహానికి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే సంతోషంగా ఉన్నానని చెప్పారు. కారణం తాము సుదీర్ఘ కాలంగా డేటింగ్లో ఉండటం వల్ల ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసన్నారు. అందువల్ల తనకు పెద్దగా ఛేంజ్ అంటూ ఏమీ లేదని అన్నారు. తాను ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటుంటానని, అది తన భర్తకు కాస్త సంకటంగా ఉంటుందన్నారు. అయినా దాన్ని ఆయన ఇబ్బందిగా భావించడం లేదన్నారు. తనను అర్థం చేసుకున్న వ్యక్తి కావడంతో చాలా విషయాల్లో సర్దుకు పోతుంటారని చెప్పారు. అందువల్ల తమ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుందని నటి కీర్తీసురేశ్ పేర్కొన్నారు. కాగా హిందీ చిత్రం బేబీ జాన్ ఇటీవల విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం నూతన చిత్రాలేమీ అంగీకరించలేదు. కీర్తీసురేశ్ నటించిన రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి.
బీ కేర్ఫుల్...
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం డేంజరస్ వాటర్స్ (Dangerous Waters)ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.జీవితమన్నది క్షణభంగురం. ఏ క్షణానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి అనుక్షణం అప్రమత్తత అవసరం. ఈ నేపథ్యంలోనే రూ΄పొందిన హాలీవుడ్ సినిమా ‘డేంజరస్ వాటర్స్’(Dangerous Waters ). ఇదో పూర్తి థ్రిల్లర్ జోనర్ మూవీ. సినిమా మొత్తం ఓ మూడు పాత్రలతో 90 శాతం సముద్రంలోనే జరిగిన కథ. సినిమాలో ఉన్నది మూడు పాత్రలే అయినా మంచి స్క్రీన్ప్లేతో చూసే ప్రేక్షకులను మాత్రం కట్టిపడేసే ప్రయత్నం చేశారు దర్శకుడు జాన్ బర్.ఈ సినిమా లయన్స్ గేట్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ఇది పెద్దవాళ్లు మాత్రమే చూసే సినిమా. ఇక ఈ చిత్రకథ విషయానికొస్తే... అల్మా తన కూతురు కోసం ఓ సూపర్ వెకేషన్ ప్లాన్ చేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ డెరెక్తో కలిసి కూతురుతో పాటు బోట్లో బెర్ముడా వరకు ట్రావెల్ చేసి, సముద్రం మధ్యలో తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలన్నది ప్లాన్. దీనికి కూతురు రోజ్ అయిష్టంగానే ఒప్పుకుంటుంది. ప్రయాణం మొదలైనపుడు అంతా బాగానే ఉంటుంది. దారి మధ్యలో వేరే ఒక బోట్ వీళ్లకు ఎదురుగా వచ్చి అల్మాను చంపేసి డెరెక్ను గాయపరుస్తారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో నడి సంద్రంలో రోజ్ ఒంటరిదైపోతుంది.దాడి చేయడానికి వచ్చినవాళ్లు బోట్లోని రేడియోను అలాగే బోట్ ఇంజన్ను ధ్వంసం చేసి వెళతారు. చుట్టూ నీళ్లు తప్ప ఏమీ లేని ఆ ప్రాంతం నుండి రోజ్ ఎలా బయటపడిందనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా చాలా నెమ్మదిగా ప్రారంభమై, ఉత్కంఠభరితంగా సాగుతూ ఊహకందని క్లైమాక్స్ ట్విస్టులతో అద్భుతంగా ముగుస్తుంది. గంటా నలభై నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవాళ్లకి ఇదో సూపర్ సినిమా. మరింకేం... ఈ వీకెండ్ ‘డేంజరస్ వాటర్స్’లోకి మీరూ ట్రావెల్ చేయండి. – ఇంటూరు హరికృష్ణ
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారా?... బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆగ్రహం
తెలంగాణలో అమెజాన్ పెట్టుబడి 60 వేల కోట్ల రూపాయలు.. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం కీలక ఒప్పందం
తెలంగాణ రూపు రేఖలు మార్చేలా రాజధాని హైదరాబాద్ అభివృద్ధి... దావోస్ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి వెల్లడి
ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్.. 16 మంది మావోయిస్టులు మృతి
అమెరికాకు ఇక స్వర్ణయుగమే... డొనాల్డ్ ట్రంప్ స్పష్టీకరణ... 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం
హైదరాబాద్లో 450 కోట్ల రూపాయలతో భారీ ఐటీ పార్క్. ఏర్పాటుకు సిద్ధమైన క్యాపిటల్ ల్యాండ్ సంస్థ. సింగపూర్లో తెలంగాణ ప్రతినిధి బృందంతో చర్చలు, ఒప్పందం
తిరుమలలో వరుస ఘటనలపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం. తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై నివేదిక పంపాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్లో పేదల ఇళ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం కక్ష... ఇళ్లు నిర్మించుకోనివారి స్థలాల కేటాయింపులు రద్దు
హెచ్ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారు?... ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కానున్న కేటీఆర్
క్రీడలు
Ind vs Eng: టీమిండియాకు ఎదురుదెబ్బ.. విధ్వంసకర వీరుడికి గాయం!
ఇంగ్లండ్తో రెండో టీ20కి టీమిండియా(India Vs England 2nd T20) పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. విజయంతో ఆరంభించిన ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆధిపత్యమే లక్ష్యంగా చెపాక్ బరిలో దిగనుంది. అయితే, చెన్నై మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.కోల్కతా వేదికగా జరిగిన తొలి టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) గాయపడినట్లు సమాచారం. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా శుక్రవారం సాయంత్రం చిదంబరం స్టేడియంలో నెట్స్లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు.చీలమండ నొప్పిఈ సందర్భంగానే అభిషేక్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. అతడి పాదం మెలిక పడగా.. చీలమండ నొప్పి(Ankle Injury)తో విలవిల్లాడాడు. ఈ క్రమంలో వెంటనే ఫిజియోలు వచ్చి అభిషేక్ను పరీక్షించారు. అనంతరం అతడు మైదానం వీడాడు. అయితే, మళ్లీ నెట్ సెషన్లో బ్యాటింగ్కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో శనివారం నాటి రెండో టీ20కి అభిషేక్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అన్న అంశంపై సందిగ్దం నెలకొంది.సంజూకు జోడీ ఎవరు?ఒకవేళ అభిషేక్ శర్మ గనుక దూరమైతే సంజూ శాంసన్తో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్గా వస్తాడా? లేదంటే ప్రయోగాత్మకంగా ఇంకెవరినైనా టాపార్డర్కు ప్రమోట్ చేస్తాడా? అనే చర్చ జరుగుతోంది. కాగా ఈడెన్ గార్డెన్స్లో బుధవారం ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.తొలి టీ20లో అభిషేక్ ధనాధన్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు.. బట్లర్ బృందాన్ని 132 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం.. లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్(20 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ధనాధన్ దంచికొట్టాడు. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న 24 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 79 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లతో పాటు ఏకంగా ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం.మిగతా వాళ్లలో కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ 19, హార్దిక్ పాండ్యా 3 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేవలం మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.షమీ వస్తాడా?కాగా టీమిండియలో పునగామనం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీకి కోల్కతాలో మొండిచేయి ఎదురైన విషయం తెలిసిందే. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన క్రమంలో షమీకి చోటు ఇవ్వలేకపోయినట్లు మేనేజ్మెంట్ వర్గాలు తెలిపాయి. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అద్భుత గణాంకాలు కలిగి ఉన్న యువ పేసర్ అర్ష్దీప్ ఒక్కడికే తుదిజట్టులో దక్కగా.. షమీ బెంచ్కే పరిమితమయ్యాడు.అయితే, తొలి టీ20లో ప్రభావం చూపలేకపోయినప్పటికీ రవి బిష్ణోయికి మరో అవకాశం ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది కాబట్టి వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్లతో పాటు అతడినీ రెండో టీ20లో కొనసాగించే అవకాశం ఉంది. ఇక అభిషేక్ శర్మ గాయంతో దూరమైతే గనుక షమీని తుదిజట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. గత మ్యాచ్లో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పొదుపుగా బౌలింగ్ చేయలేకపోయాడు. ఆరంభ ఓవర్లలో అర్ష్దీప్ త్వరత్వరగా వికెట్లు తీశాడు కాబట్టి సరిపోయింది. అందుకే ఈసారి అర్ష్దీప్తో పాటు షమీని కొత్త బంతితో బరిలోకి దించాలనే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చెన్నైలో చిదంబరం స్టేడియం(చెపాక్)లో శనివారం రాత్రి ఏడు గంటలకు ఇండియా- ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 ఆరంభం కానుంది.చదవండి: భారత్తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
ఐసీసీ మహిళల వన్డే జట్టులో స్మృతి, దీప్తి
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘మహిళల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్’ జట్టులో ఇద్దరు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన, స్పిన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఈ టీమ్లో స్థానం సంపాదించారు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గాకాగా స్మృతి మంధాన 2024లో 13 వన్డేలు ఆడి 747 పరుగులు చేసింది. తద్వారా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో వరుసగా రెండు శతకాలు బాదిన ఆమె న్యూజిలాండ్పై కూడా ఒక సెంచరీ చేసింది.24 వికెట్లు పడగొట్టిఇక 2024లో 13 వన్డేలాడిన దీప్తి శర్మ 186 పరుగులు చేయడంతో పాటు... 24 వికెట్లు పడగొట్టి ఈ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ జట్టుకు దక్షిణాఫ్రికా స్టార్ లౌరా వాల్వర్ట్ సారథిగా ఎంపికైంది.మరోవైపు.. ఇంగ్లండ్ నుంచి అమీ జోన్స్, సోఫీ ఎకెల్స్టోన్, కేట్ క్రాస్ రూపంలో ముగ్గురు ప్లేయర్లు, ఆస్ట్రేలియా నుంచి ఆష్లే గార్డ్నర్, అనాబెల్ సథర్లాండ్ చోటు దక్కించుకున్నారు. సఫారీ ప్లేయర్ మరీనే కాప్తో పాటు శ్రీలంక నుంచి చమరి ఆటపట్టు, వెస్టిండీస్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ కూడా ఈ టీమ్కు ఎంపికయ్యారు.ఐసీసీ మహిళల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024స్మృతి మంధాన, లారా వాల్వర్ట్(కెప్టెన్), చమరి ఆటపట్టు, హేలీ మాథ్యూస్, మరీనే కాప్, ఆష్లే గార్డ్నర్, అనాబెల్ సథర్లాండ్, అమీ జోన్స్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లిస్టోన్, కేట్ క్రాస్. మరిన్ని క్రీడా వార్తలుఫైనల్లో సూర్మా క్లబ్ రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్ తొలి టోర్నమెంట్లో జేఎస్డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సూర్మా క్లబ్ జట్టు 4–2 గోల్స్ తేడాతో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టును ఓడించింది. సూర్మా క్లబ్ తరఫున ఎంగెల్బెర్ట్ (1, 17వ, 47వ నిమిషాల్లో) మూడు గోల్స్ చేయగా... హినా బానో (9వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది.బెంగాల్ టైగర్స్ తరఫున కెప్టెన్ వందన కటారియా (48వ నిమిషంలో), శిల్పి దబాస్ (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. నాలుగు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక సూర్మా క్లబ్ 13 పాయింట్లతో... ఒడిశా వారియర్స్ జట్టు 11 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్కు చేరుకున్నాయి. ఈనెల 26న జరిగే ఫైనల్లో సూర్మా క్లబ్, ఒడిశా వారియర్స్ టైటిల్ కోసం తలపడతాయి. శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టుకు నాలుగో ఓటమిసాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టుకు నాలుగో ఓటమి ఎదురైంది. బెంగళూరులో శుక్రవారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి జట్టు 0–1 గోల్ తేడాతో స్పోర్టింగ్ క్లబ్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిపోయింది.ఆట 34వ నిమిషంలో ఆసిఫ్ గోల్తో ఆధిక్యంలోకి వెళ్లిన స్పోర్టింగ్ జట్టు ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్లో శ్రీనిధి జట్టు 9 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. 3 మ్యాచ్ల్లో గెలిచి, 2 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, 4 మ్యాచ్ల్లో ఓడిన శ్రీనిధి జట్టు 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. 28న హైదరాబాద్లో జరిగే తదుపరి మ్యాచ్ లో నాంధారి జట్టుతో శ్రీనిధి జట్టు ఆడుతుంది.
ఐసీసీ టెస్టు జట్టులో బుమ్రా, జడేజా, జైస్వాల్
దుబాయ్: గతేడాది సుదీర్ఘ ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్–2024’ను ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చోటు దక్కించుకున్నారు. 11 మందితో కూడిన ఈ జట్టుకు ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను సారథిగా ఎంపిక చేయగా... జట్టులో బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ రూపంలో నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లకు చోటు దక్కింది. న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్, మ్యాట్ హెన్రీ ఎంపిక కాగా... శ్రీలంక నుంచి కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నాడు. 2024లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బుమ్రా... టెస్టుల్లో 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. కెరీర్లో 20కి లోపు సగటుతో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా రికార్డుల్లోకెక్కిన బుమ్రా... ఇటీవల‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో 32 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. జడేజా గతేడాది 527 పరుగులు చేయడంతో పాటు... 48 వికెట్లు పడగొట్టి ఈ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. ఇక ఆసీస్తో సిరీస్లో ప్రధాన ప్లేయర్లంతా విఫలమైన చోట చక్కటి ప్రదర్శన కనబర్చిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్... గతేడాది 54.74 సగటుతో 1478 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (1556) అగ్రస్థానంలో ఉండగా... జైస్వాల్ రెండో ‘ప్లేస్’లో నిలిచాడు. 23 ఏళ్ల జైస్వాల్ దక్షిణాఫ్రికా పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై మెరుగైన ప్రదర్శన చేశాడు. గతేడాది విలియమ్సన్ 1013 పరుగులు చేయగా... శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్ 1049 పరుగులు చేశాడు. ఇక పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు ‘బోర్డర్–గావస్కర్ ట్రోపీ’అందించిన ఆసీస్ సారథి కమిన్స్ 2024లో 37 వికెట్లు పడగొట్టడంతో పాటు 306 పరుగులు చేశాడు. మరోవైపు ఐసీసీ ‘వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్’లో టీమిండియా నుంచి ఒక్క ప్లేయర్కూ చోటు దక్కలేదు. గతేడాది భారత జట్టు కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడటంతో మన ఆటగాళ్లకు ఈ జట్టులో స్థానం లభించలేదు. వన్డే జట్టుకు శ్రీలంక ప్లేయర్ చరిత అసలంక కెపె్టన్గా ఎంపికయ్యాడు. ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024: కమిన్స్ (కెప్టెన్ ; ఆ్రస్టేలియా) యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, బుమ్రా (భారత్), డకెట్, రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (ఇంగ్లండ్), విలియమ్సన్, హెన్రీ (న్యూజిలాండ్), కమిందు మెండిస్ (శ్రీలంక).
‘బంగారు’ గుర్రానికి అనూశ్ బైబై
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో ఈక్వె్రస్టియన్ చాంపియన్ అనూశ్ అగర్వల్లా తనకు అచ్చొచ్చిన రేసుగుర్రానికి గుడ్బై చెప్పాడు. ‘మన్ని’ అని ముద్దుగా పిలుచుకునే గుర్రంతో ఏడేళ్ల బంధానికి భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు. 2023లో హాంగ్జౌ (చైనా)లో జరిగిన ఆసియా క్రీడల్లో అనూశ్ పాలిట ‘మన్ని’ బంగారు గుర్రం అయ్యింది.ఈక్వె్రస్టియన్ (గుర్రపుస్వారీ) ఈవెంట్లో మన్నిపై స్వారీ చేసిన అనూశ్ స్వర్ణ పతకం సాధించాడు. ‘మన్ని’కి రిటైర్మెంట్ ఇవ్వాల్సిన సమయం వచ్చిoదని, ఇకపై ఆ రేసుగుర్రంతో బరిలోకి దిగబోనని సోషల్ మీడియాలో ప్రకటించాడు. ‘నా తొలి అడుగులన్నీ మన్నితోనే వేశా. తొలి గ్రాండ్ప్రి, మొదటి అంతర్జాతీయ గ్రాండ్ప్రి, అంతర్జాతీయ పోటీల్లో ప్రథమ స్థానం... ఇలా చెప్పుకుంటూపోతే... పెద్ద పెద్ద అంతర్జాతీయ టోర్నీల్లో నా పోటీ ప్రదర్శనలకు రేసుగుర్రం నేను కన్న కలల్ని సాకారం చేసింది. అన్నింటికి మించి ఓ గుర్రం, రైడర్ ఒకరిపై ఒకరు నమ్మకం పెట్టుకుంటే ఏం జరుగుతుందో తన వేగంతో చాటి చెప్పింది’ అని భావోద్వేగంతో ఇన్స్టాగ్రామ్లో వీడియోను పోస్ట్ చేశాడు.
బిజినెస్
కేంద్ర బడ్జెట్పై ఎస్బీఐ అంచనాలు
కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటన సమీపిస్తున్న తరుణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే సామర్థ్యం ఉన్న కీలక రంగాలను హైలైట్ చేస్తూ అంచనాలను వెల్లడించింది. ఎస్బీఐ ప్రీ బడ్జెట్ విశ్లేషణలో భాగంగా ప్రస్తావించిన అంశాలు కింది విధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతారు.గ్రామీణాభివృద్ధిపై దృష్టికీలక గ్రామీణ పథకాలకు కేటాయింపులు పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ), గ్రామీణ గృహనిర్మాణం, గ్రామీణ రహదారులు వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రత్యేకించి పట్టణ వినియోగం నెమ్మదించడంతో గ్రామీణ డిమాండ్ను పెంచడం, విస్తృత ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం దీని లక్ష్యం.ఆరోగ్య సంరక్షణ, బీమా సంస్కరణలుహెల్త్ కేర్, ఇన్సూరెన్స్ రంగాల్లో పలు సంస్కరణలు చేపట్టే అవకాశం ఉంది. టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను మరింత చౌకగా ఉండేలా జీఎస్టీ, పన్నులను మినహాయించడం, ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని జీడీపీలో 5 శాతానికి పెంచడం, వైద్య పరికరాలపై జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించడం వంటి వాటిపై దృష్టి సారించవచ్చు. ఈ చర్యలు బీమా సదుపాయాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు ఉపయోగపడుతాయి. ఆరోగ్య సంరక్షణ సేవలకు డిమాండ్ పెరుగుతుండడంతో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఈ సమస్యకు పరిష్కారంగా నిలుస్తాయి.ఎంఎస్ఎంఈలకు మద్దతుసూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను ఆదుకునేలా బడ్జెట్లో చర్యలు ఉండబోతున్నాయి. ఇందులో ఎంఎస్ఎంఈలకు తక్కువ వడ్డీ ఫైనాన్సింగ్, పన్ను మినహాయింపులు, రిటైల్, ఇతర రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు ఉండవచ్చు. నిర్వహణ సవాళ్లను తగ్గించడం, సృజనాత్మకతను పెంపొందించడం దీని లక్ష్యం.ఇదీ చదవండి: లిక్విడిటీ లోటు రూ.3 లక్షల కోట్లుడిజిటల్ మౌలిక సదుపాయాలుముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణపై బడ్జెట్లో దృష్టి సారించనున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు, వ్యాపారాలను ఆన్లైన్ బాటపట్టించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పెంచడానికి ఇది సహాయపడుతుంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక లావాదేవీలను క్రమబద్ధీకరించడం సులువుకానుంది.
ఊహించని రేటుకు చేరిన బంగారం.. అదే బాటలో వెండి
రూ. 82,420కు చేరిన తులం బంగారం రేటు.. ఈ రోజు (జనవరి 25) అక్కడే స్థిరంగా ఉంది. దీంతో పసిడి రేట్లలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అయితే ఈ కథనంలో మన దేశంలో ఏ నగరం గోల్డ్ రేటు ఎక్కువగా ఉంది?.. ఎక్కడ తక్కువగా ఉందనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా.. గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 75,550 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 82,420 వద్ద నిలిచాయి. నిన్న భారీగా పెరిగిన గోల్డ్ రేటు ఈ రోజు స్థిరంగా ఉంది.చైన్నైలో కూడా బంగారం ధరలలో ఎటువంటి మార్పులు లేదు. కాబట్టి ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 75,550 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,420 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 75,700 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 82,570 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాత్రమే కాకుండా.. ఈ రోజు (శనివారం) వెండి ధరలలో కూడా ఎటువంటి మార్పు లేదు. కాబట్టి కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 వద్ద ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: డబ్బు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు: ఇలా..
లిక్విడిటీ లోటు రూ.3 లక్షల కోట్లు
భారతీయ బ్యాంకింగ్(Banking) వ్యవస్థలో లిక్విడిటీ లోటు గరిష్ఠ స్థాయికి చేరింది. తాజాగా ఈ లోటు ఏకంగా రూ.3 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అమెరికా డాలర్(US Dollar)తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా పడిపోతుండడం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అధికమవడం, యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు లిక్విడిటీ తగ్గడానికి కారణమవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.లిక్విడిటీ లోటుకు కొన్ని కారణాలను మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డాలర్తో పోలిస్తే భారీగా పడుతున్న రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయిస్తోంది. పన్ను చెల్లింపులకు సంబంధించిన అవుట్ ఫ్లోలు కూడా లిక్విడిటీ లోటు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద ప్రభుత్వ నగదు నిల్వలు పెరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.ఆర్బీఐ స్పందన..లిక్విడిటీ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆర్బీఐ విభిన్న చర్యలు తీసుకుటోంది. ఆర్బీఐ వేరియబుల్ రెపో రేటు (వీఆర్ఆర్-షార్ట్టర్మ్లో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు ఆర్బీఐ అప్పులు ఇవ్వడం) ఆక్షన్లను పెంచింది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి లిక్విడిటీని చొప్పించడానికి రోజువారీ వేలం నిర్వహిస్తుంది. జనవరి 23న ఆర్బీఐ రూ.3.15 లక్షల కోట్లను వ్యవస్థలోకి చొప్పించింది. బ్యాంకు నిల్వల నిర్వహణలో అంతరాన్ని సర్దుబాటు చేసిన తర్వాత కూడా లోటు రూ.3.3 లక్షల కోట్లకు పైగానే ఉంది.ఇదీ చదవండి: ఫుడ్ కేటరింగ్ పునరుద్ధరణకు భాగస్వామ్యంనగదు నిల్వల నిష్పత్తిని (CRR) నికర డిపాజిట్లలో 4 శాతానికి తగ్గించిన ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలోకి దాదాపు రూ.1.16 లక్షల కోట్ల లిక్విడిటీని ఇటీవల విడుదల చేసింది. ఇది కూడా లిక్విడిటీ లోటు సమస్యకు కారణమని కొందరు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే నెలలో జరగనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం కీలకంగా మారనుంది.
రైల్వేలో ఫుడ్ కేటరింగ్ మెరుగుపడనుందా..?
రైల్వే ప్రయాణీకులకు మరింత మెరుగైన ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులు అందించేందుకు భారతీయ రైల్వే క్యాటరింగ్, టికెటింగ్ అండ్ టూరిజం విభాగం ఐఆర్సీటీసీ కట్టుబడి ఉంది. ఇందుకోసం తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్తో జతకట్టింది. ఈ సహకారం వల్ల రైళ్లలో ఆహార ఆఫర్లను పునరుద్ధరించడం, ప్రయాణీకులకు అధిక నాణ్యమైన భోజనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇప్పటికే ఐఆర్సీటీసీ 90 పట్టణాలు, 100 రైల్వే స్టేషన్లలో వేలాది మంది వినియోగదారులకు ఫుడ్ అగ్రిగేటింగ్ ప్లాట్ఫామ్ జొమాటోతో సహకారం కుదుర్చుకుని సేవలందిస్తోంది. తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్తో చేసుకున్న ఒప్పందం రైళ్లలో లభించే ఆహారం నాణ్యతను పెంచుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం రోజుకు 16 లక్షల భోజనాలను అందిస్తున్నాం. జోజనం మెనూను మెరుగుపరచడం కోసం కస్టమర్ల నుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. మెనూను అప్డేట్ చేసి ఫుడ్ ఆఫర్ ట్రయల్స్ త్వరలో నిర్వహిస్తాం. ఇందుకోసం తాజాగా ప్రముఖ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు సమగ్ర ప్యాకేజీచిన్న పరిశ్రమలకు మద్దతుకేటరింగ్, టూరిజం విభాగంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఈ) చేయూతనిచ్చేందుకు ఐఆర్సీటీసీ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. వస్తువులు, సేవల కోసం సుమారు 63% ఎంఎస్ఈలపైనే ఆధారపడుతున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇది ప్రభుత్వం నిర్దేశించిన 25% కంటే చాలా ఎక్కువ. ఎంఎస్ఈలతోపాటు సంస్థ వృద్ధిపై ఐఆర్సీటీసీ దృష్టి సారించినట్లు పేర్కొంది.
ఫ్యామిలీ
తలనే లాక్ చేశాడు..! తాళం మాత్రం భార్య చేతిలో..
ధూమపానం సేవించడం అనేది ఓ ఫ్యాషన్లా మారింది యువతకు. ఏదో సరదాగా ట్రై చేసి.. చివరికి దానికి అడిక్ట్ అయిపోతున్నారు. కొందరూ మాత్రం పొగరాయుళ్లుగా మారిపోవడం లేదు. మరికొందరికి మాత్రం అదొక బలహీనతలా మారిపోతోంది ఈ వ్యసనం. అయితే ఇలాంటి బలహీనతతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఈ ధూమపాన అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఎంతటి భయనాక నిర్ణయం తీసుకున్నాడో తెలిస్తే కంగుతింటారు. అయితే అతడు ఈ వ్యసనాన్ని జయించేందుకు ఇలాంటి నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం అనేది ప్రశంసించదగ్గ విషయం. ఆ నేపథ్యంలోనే ఆ వ్యక్తి సెన్సేషన్గా మారి వార్తల్లో నిలిచాడు కూడా. అతడెవరంటే..టర్కిష్కి చెందిన ఇబ్రహీం యుసెల్(Ibrahim Yucel) పొగ తాగడం మానేయాలని(Quit Smoking) గట్టిగా బీష్మించుకున్నాడు. కానీ ఎంతలా ఆ అలవాటుని వదులుకుందామన్నా..సాధ్యం కాలేదు. తన పిల్లల పుట్టిన రోజులప్పుడు, తమ పెళ్లిరోజు అప్పుడు.. ఇక ఈ రోజు నుంచి సిగెట్ మానేస్తానని ఒట్టు పెట్టుకోవడం..మళ్లీ ఏదో ఒక బలహీన క్షణంలో తెలియకుండానే తాగడం. ప్రతిసారి తన నిర్ణయాన్ని బ్రేక్ చేసేయ్యడం ఓ భయానక బలహీనతగా మారింది. ఇక లాభం లేదనుకుని ఏకంగా బోను(Cage) మాదిరిగా హెల్మెట్ని తయారు చేయించుకుని దాన్ని తలకు తగిలించుకుని లాక్ చేసేసుకున్నాడు. బయటకు కూడా మనోడు అలానే వెళ్తాడట. ఎందుకంటే ఎవర్ని చూసినా.. మళ్లీ నాలిక ఓ దమ్ము కొట్టు బ్రదర్.. అంటాదేమోనన్న భయంతో తలకు ఇలా ఇనుప ఊచల బోను మాదిరి హెల్మట్ ధరించుకుని వెళ్తున్నాడు. ఇలా వెళ్లడంతోనే యూసెల్ ఓ సెన్సేషన్ వ్యక్తిగా మారిపోయాడు. ఆ విషయం కాస్త దావనంలా వ్యాపించి మీడియా వరకు చేరడంతో వింత వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. పదకొండేళ్ల క్రితం మీడియాలో బోనులో తలను లాక్ చేసుకున్ని వ్యక్తి అంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అయితే కేవలం భోజనం చేసేటప్పడూ లేదా ఏదైనా తినాలనుకున్నప్పుడూ మాత్రమే భార్య లాక్ని ఓపెన్ చేస్తుందట. ఆయన ఒకప్పుడు రోజుకి రెండు సిగరెట్ ప్యాకెట్లు హాంఫట్ చేసేవాడట. దీనివల్ల కలిగే అనారోగ్య ప్రమాదాల రీత్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాడు యూసెల్. ఈ వ్యసనం నుంచి బయటపడాని ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు యూసెల్. మరీ యూసెల్ ఈ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడ్డాడా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది.కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ(world Health Organisation) కూడా ప్రతి ఏడాది ఈ పొగాకు కారణం దాదాపు ఎనిమిది మిలియన్ల మంది మరణిస్తున్నట్లు చెబుతోంది. మధ్య తరగతి కుటుంబాల్లోనే ఈ వ్యసనానికి సంబంధించిన మరణాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. He quit because his father died of lung cancer. pic.twitter.com/RAWSVJvCXY— Clover Lavender (@AyoolaMatthee) November 7, 2024 (చదవండి: కామ్య... అఖండ ఖ్యాతి..! 17 ఏళ్లకే ఏడు పర్వతాలను అధిరోహించింది..!)
National Girl Child day 2025 సమాన అవకాశాలేవీ?
స్త్రీని ఆదిశక్తిగా, చదువుల తల్లిగా, అన్నపూర్ణగా పేర్కొనే భారతీయ సంస్కృతికి భిన్నంగా ఆమె శక్తిహీనురాలిగా, నిస్సహాయురాలిగా అణిగిమణిగి సర్దుకు పోయే జీవితం గడపవలసిన దుర్భర పరిస్థితి కొనసాగుతోంది. ఈ వివక్ష పుట్టుకతోనే ఆరంభమవుతుంది. వివక్ష, హింస, లైంగిక వేధింపులు, సరైన విద్య, వైద్య సదుపాయాలు అందుకోలేకపోవడం వంటి సవాళ్లు–ఇబ్బందు లను బాలికలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమాజంలో ఉన్న బాలికలకు సాధికారత కల్పించడం, వారిని రక్షించడం ప్రధాన అంశాలుగా జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008 నుంచి మన దేశంలో జరుపుతున్నారు. బాలికల స్థితిని మెరుగుపరచడంలో దేశం పురో గతి సాధించిన మాట నిజమే. కాని, అది తగినంత కాదు. ఇప్పటికీ విద్య, పోషకాహారం, ఆరోగ్యం వంటి రంగాలలో అసమానతలు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను సాధించే విధంగా జాతీయ బాలికా దినోత్సవ సందర్భాన్ని వినియోగిస్తోంది. లింగ వివక్షకు సంబంధించిన సమస్యలపై పని చేయడం, బాలికల ఆరోగ్యం, పోష కాహారం, లింగ నిష్పత్తి అంతరాన్ని తగ్గించడం వంటి ముఖ్యమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం; అవకాశాల పరంగా అసమానతలను తొల గించడం; ఆడపిల్లలందరికీ వారి హక్కులు, అర్హమైన గౌరవం, విలువలు లభి స్తాయని నిర్ధారించడం; కొత్త అవకాశాలను అందించడం, ఎదగడానికి వీలు కల్పించడం వంటివి ఈ లక్ష్యాలు. ‘బేటీ బచావో బేటీ పఢావో’, ‘సుకన్య సమృద్ధి యోజన’, ‘బాలికాసమృద్ధి యోజన, ‘లాడ్లీ’ పథకం, మాధ్యమిక విద్య కోసం బాలికలకు జాతీయ ప్రోత్సాహకాల వంటి పథకాలను ప్రభుత్వాలు ఎన్ని తీసు కొస్తున్నా... ఆడపిల్లలు తగినంతగా అభివృద్ధి చెందకపోవడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించాలి.ఇవీ చదవండి: National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..!National Girl Child Day 2025: అమ్మాయిలకు హెల్తీ ప్లేట్! – డా‘‘ హెచ్. అఖ్తర్ బాను ‘ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్, కర్నూలు(నేడు జాతీయ బాలికా దినోత్సవం)
National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..!
కరాటే అనేది మార్షల్ ఆర్ట్ మాత్రమే కాదు... మహత్తరమైన ఫిలాసఫీ కూడా. ఆ తత్వంలో... మనల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చే... సాహసంతో దూసుకెళ్లే స్ఫూర్తి దాగుంది. అందుకే కరాటే అనే ఆత్మరక్షణ విద్య అత్యవసరం అయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అనంతపురం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న వంద విద్యాసంస్థల్లో 30 రోజుల పాటు 50 వేల మంది అమ్మయిలకు కరాటే క్లానుల నిర్వహణకు శ్రీకారం చుట్టారు...అక్షరక్రమంలోనే కాదు, ఆత్మరక్షణలోనూ అనంతపురం జిల్లాను ముందు వరుసలో ఉంచే లక్ష్యంగా అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న పాఠశాలల నుంచి కాలేజీల వరకు కరాటే క్లాసుల నిర్వహణకు చొరవ తీసుకున్నారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ సహకారంతో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ వర్కర్లు, ఆర్డీటీ సంస్థ ప్రతినిధులతో కలసి అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యతోపాటు యోగా, మానసిక వికాస తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 3న సామాజిక ఉద్యమకారిణి, తొలితరం ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు, జడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల పరిధిలోని బాలికల పాఠశాలలు, కళాశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. (National Girl Child day 2025 సమాన అవకాశాలేవీ?)‘నిజం చెప్పాలంటే కొన్నిరోజుల ముందువరకు ఇల్లు దాటి ఒంటరిగా బయటికి రావాలంటే భయంగా ఉండేది. ఎవరైనా కామెంట్ చేస్తారేమో అనే భయమే దీనికి కారణం. ఒకరోజు మా అక్క ను ఎవరో అసభ్యంగా కామెంట్ చేస్తే ఇంట్లో చెప్పి ఏడ్చింది. అప్పటినుంచి నాకు కూడా అలాంటి అనుభవం ఎదురవుతుందేమోననే భయం ఏర్పడింది. కరాటే క్లాసులకు హాజరు కావడం వల్ల నాలో ఉన్న ఆ భయం పోయింది. ఇప్పుడు నేను నిశ్చింతగా బయటికి వెళుతున్నాను. ఎవరైనా కామెంట్ చేస్తే వారిని ధైర్యంగా పోలీస్స్టేషన్కు ఈడ్చుకు వెళ్లగలననే నమ్మకం వచ్చింది’ అంటుంది పల్లవి.‘కరాటే నేర్చుకోవడం అనేది ఎవరినో భయపెట్టడానికి కాదు. మనం ధైర్యంగా ఉండడానికి. కరాటేలాంటి ఆత్మరక్షణ విద్యల వల్ల క్రమశిక్షణ, ఆరోగ్య స్పృహ పెరుగుతుందనేది అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను’ అంటుంది శ్రీలత. (National Girl Child Day 2025: అమ్మాయిలకు హెల్తీ ప్లేట్!)‘మా అమ్మాయికి ఎంసెట్ కోచింగ్ ఇప్పటినుంచే ఇప్పిస్తున్నాం’ అని ఘనంగా చెప్పుకునే తల్లిదండ్రులను, ‘అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ ఎందుకు!’ అని ఆశ్చర్యపడేవాళ్లను ఎందరినో చూస్తుంటాం. పల్లవి, శ్రీలత, ఆఫ్రోజ, భార్గవి.. లాంటి అమ్మాయిల మనసులో మాట విన్నప్పుడు కరాటే నుంచి యోగా వరకు శిక్షణ తరగతులు నిర్వహణ అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.– ఖాజీ హిదాయతుల్లా, సాక్షి, అనంతపురం సిటీఎప్పుడు ఏ ఆపద వచ్చినా...జిల్లా వ్యాప్తంగా 50 వేల మంది అమ్మాయిలను ఆత్మరక్షణ విద్యలో ఆరితేరేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు ప్రతి మండలం లో కార్యక్రమాన్ని నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించి అమలు చేస్తున్నాం. నాలుగు రిసోర్స్ టీమ్లు అందుబాటులో ఉంటాయి. వాటికి వీరవాహిని, బలప్రభ, సురసేన, శక్తిసేనగా నామకరణం చేశాం. సంక్షేమ శాఖ, కరాటే అసోసియేషన్, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు చెందిన వారు ప్రతి టీమ్ను పర్యవేక్షిస్తారు. ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా సమర్థంగా తిప్పికొట్టేలా అమ్మాయిలను తీర్చిదిద్దుతున్నాం. పది నుంచి పద్దెనిమిది ఏళ్లలోపు టీ నేజ్ అమ్మాయిలకు వచ్చే సమస్యలపైన అవగాహన కల్పిస్తున్నాం. – బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్, అనంతపురంఅదృష్టంగా భావిస్తున్నా...కరాటే, యోగా, మానసిక వికాసం, ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఉచితంగా శిక్షణ పొందడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎవరైనా ఆకతాయులు నా జోలికి వస్తే తోక ముడిచి పరుగెత్తేలా చేయగలననే నమ్మకం వచ్చింది. అన్ని పాఠశాలల్లోనూ ప్రాథమిక స్థాయి నుంచే ఇటువంటి శిక్షణ ఇస్తే మరింత బాగుంటుంది.– జి. భార్గవి, ఇంటర్ విద్యార్థిని, రాప్తాడుసెల్ఫ్–డిఫెన్స్సాహసానికి జెండర్ భేదం లేదు. అయితే కొన్ని ఆటలు మాత్రం ‘పురుషులకు మాత్రమే’ కోట గోడలలో బంధీలై పోయాయి. ఇప్పుడు ఆ కోటలు బ్రద్దలవుతున్నాయి. తమిళనాడులో ‘ఇలవట్ట కల్’ అనేది పురాతన ఆట. పెద్ద పెద్ద గుండ్రాళ్లను ఎత్తి పడేసే ఈ ఆటలో పురుషులు మాత్రమే పాల్గొనేవారు. మహిళలు ప్రేక్షక΄ాత్రకే పరిమితం అయ్యేవారు. ఈసారి మాత్రం మేము సైతం అంటూ ‘ఇలవట్ట కల్’లో మహిళలు సత్తా చాటారు. భవిష్యత్ తరాలకు తరగని ఉత్సాహాన్ని ఇచ్చారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులో ఈసారి మహిళల కోసం ‘ఇలవట్ట కల్’ ప్రత్యేకంగా నిర్వహించారు. 47 కేజీలు, 67 కేజీల విభాగంలో మహిళలు సత్తా చాటారు. ఎత్తే సత్తా ‘ఇలవట్ట కల్’ ΄ోటీలలోపాల్గొన్న భవధరణి 67 కేజీల బరువు ఉన్న రాతిగుండును ఏకంగా రెండు సార్లు అలవోకగా ఎత్తిపడేసి మొదటి బహుమతిని గెలుచుకుంది. ‘ఈ ΄ోటీలలో ΄ాల్గొనడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి... సంప్రదాయంగా వస్తున్న ఆటలను కాపాడుకోవడం. రెండు... ఇలవట్ట కల్లో మహిళలు కూడా సత్తా చాటగలరు అని నిరూపించడం’ అంటుంది భవధరణి.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై
17 ఏళ్లకే ఏడు పర్వతాలను అధిరోహించింది..! మన్కీ బాత్లో సైతం..
ప్రయాణ ప్రేమికుడు, ప్రఖ్యాత పర్వతారోహకుడు సర్ మార్టిన్ కాన్వే ‘అధిరోహించిన ప్రతి శిఖరం ఏదో ఒకటి నేర్పుతుంది’ అంటారు. అలా చిన్న వయసులోనే ఎన్నో శిఖరాల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంది విశాఖపట్నానికి చెందిన కామ్య కార్తికేయన్. పదహారేళ్లకే ఎవరెస్ట్ అధిరోహించి రికార్డ్ సృష్టించింది. తాజాగా అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ని అధిరోహించి సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేసిన యంగెస్ట్ ఫిమేల్గా రికార్డు సృష్టించింది....ఇలా మొదలైంది...కార్తికేయన్, లావణ్య దంపతులకు సాహస యాత్రలు ఇష్టం. తమ చిన్నారి కామ్యను భుజాలపై మోసుకుంటూనే ట్రెక్కింగ్కు వెళుతుండేవారు. అలా పర్వత శిఖరాలతో చిన్నవయసులోనే కామ్యకు పరిచయం అయింది. మూడేళ్ల వయసులోనే ముంబైలోని లోనావాలాలో తండ్రితోపాటు ట్రెక్కింగ్లో పాల్గొని ‘శభాష్’ అనిపించుకుంది. మహారాష్ట్రలోని డ్యూక్స్ నోస్, రాజ్గడ్ పర్వతాల్ని నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో పాటు అధిరోహించింది.తల్లికి తగిన తనయ...హిమాలయాల ట్రెక్కింగ్కు తల్లితోపాటు వెళ్లింది కామ్య. అప్పుడు ఆమె వయసు ఏడేళ్లు. తల్లీ కూతుళ్లు మొదటి ప్రయత్నంలోనే 12 వేల అడుగుల ఎత్తైన చంద్రశీల పర్వతారోహణ చేశారు. ఆ తర్వాత హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒకటైన 13,500 అడుగుల ఎత్తైన హర్కిదమ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. అది పూర్తి చేసిన కొద్ది రోజుల్లోనే 13,500 అడుగుల ఎత్తైన కేదార్కంఠ పర్వతారోహణ చేశారు. తొమ్మిదేళ్ల వయసులో హిమాలయాల్లో రూప్కుండ్ ట్రెక్కింగ్ చేసి రికార్డు సృష్టించింది కామ్య.ప్రధాని మన్ కీ బాత్లో కామ్య...‘అవరోధాల్ని అధిగమించి మన ఖ్యాతిని ఖండాంతరాల్లో ఇనుమడింపజేయాలి అనుకునేవారికి విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్ అనే చిన్నారి స్ఫూర్తినిచ్చింది’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కామ్యను ప్రశంసించారు. దక్షిణ అమెరికాలోని అత్యంత ఎత్తైన అకాన్కాగువా పర్వతాన్ని అధిరోహించిన సమయంలో మన్ కీ బాత్లో కామ్య ప్రస్తావన తీసుకువచ్చారు మోదీ.ఏడు ఖండాల్లో ఎన్ని రికార్డ్లో!దక్షిణ అమెరికాలో 22,837 అడుగుల ఎత్తైన మౌంట్ అకాన్కాగువాని అధిరోహించి ఈ శిఖరాన్ని అధిరోహించిన తొలి బాలికగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన 18,652 అడుగుల మౌంట్ కిలిమంజారోపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి ఈ శిఖర యాత్ర పూర్తి చేయించడం ద్వారా ఆసియాలోనే అతి పిన్న వయస్కురాలిగా రికార్డు. యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన 18,510 అడుగుల మౌంట్ ఎల్బ్రస్ని అధిరోహించి యంగెస్ట్ గర్ల్ ఇన్ ది వరల్డ్గా రికార్డు ఆస్ట్రేలియా ఖండంలోని అతి ఎత్తైన మౌంట్ కాజియాస్కోని అధిరోహించిన రెండో బాలికగా రికార్డు ఉత్తర అమెరికాలోని 20,308 అడుగుల మౌంట్ డెనలీని అధిరోహించిన యంగెస్ట్ నాన్ అమెరికన్గా రికార్డు. ఆసియా ఖండంలో అత్యంత ఎత్తైన 29,031 అడుగుల మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించి నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ని అధిరోహించి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా, తాజాగా అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ని అధిరోహించి, ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది. ఆల్ రౌండర్ముంబై నేవీ స్కూల్లో ప్లస్టు చదువుతున్న కామ్య కార్తికేయన్ పర్వతారోహణలోనే కాదు చదువులోనూ ప్రతిభ కనబరుస్తోంది. ప్రతి పరీక్షలోనూ ఫస్ట్ గ్రేడ్ సాధిస్తోంది. సంగీతంలోనూ ప్రావీణ్యం పొందిన కామ్య పియానో వాయిద్యానికి సంబంధించి 3 గ్రేడులు పాసైంది. కర్ణాటక సంగీతం, భరతనాట్యంలోనూ ‘ఆహా’ అనిపించేలా ప్రతిభ చూపుతోంది. ప్రతి అడుగూ సవాల్గా స్వీకరించానుసెవెన్ సమ్మిట్స్ పూర్తి చేసి భారత త్రివర్ణపతాకాన్ని ఏడు ఖండాల్లోనూ రెపరెపలాడించాలన్నదే అమ్మా నాన్నల కల. వారి ఆకాంక్ష నెరవేర్చినందుకు గర్వంగా ఉంది. ఒకానొక సమయంలో మా పేరెంట్స్ తమ సంపాదనంతా నా మీదే ఖర్చు చేశారు. కొందరు దాతలు సహకారం అందించి నన్ను ముందుకు నడిపించారు. ఎంతటి కష్టాన్నైనా అవలీలగా ఎదుర్కోవాలన్నది నాన్న దగ్గర నేర్చుకున్నాను. – కామ్య కార్తికేయన్ (చదవండి: మహాకుంభమేళాలో ఆకర్షణగా మరో వింత బాబా..ఏకంగా తలపైనే పంటలు..!)
ఫొటోలు
బాక్ల్ శారీలో బిగ్ బాస్ శ్రీ సత్య క్యూట్ లుక్స్ (ఫొటోలు)
నటుడు ప్రకాష్ రాజ్ కొత్త కారవ్యాన్ చూశారా (ఫోటోలు)
నాకు ఇష్టమైన ఫోటోలు ఇవే అంటూ.. షేర్ చేసిన 'రష్మిక మందన్న'
మహాకుంభ మేళాలో ‘టీమిండియా క్రికెటర్లు’.. అంతా AI మహిమ!
ఆదిలాబాద్ : నాగోబా జాతర..ఇంద్రాదేవికి ‘మెస్రం’ పూజలు (ఫొటోలు)
బోల్డ్ సినిమాలకు 'శ్వేతా బసు' గ్రీన్ సిగ్నల్ (ఫోటోలు)
ఏలూరు : అంగరంగ వైభవంగా బాలోత్సవం (ఫొటోలు)
మెహబూబ్ దిల్ సే, శ్రీ సత్య నువ్వే కావాలి సాంగ్ లాంచ్ (ఫొటోలు)
మణికొండ : నార్సింగిలో పశుసంక్రాంతి జాతర..భారీగా పలికిన ధరలు (ఫొటోలు)
IIFA అవార్డ్స్ విలేకరుల సమావేశంలో షారుఖ్ ఖాన్,నోరా ఫతేహి సందడి (ఫొటోలు)
International View all
టిక్టాక్ యాప్ ఉన్న ఫోన్ రూ.43 కోట్లు?
భారతదేశంలో టిక్టాక్(TikTok)ను పూర్తిగా నిషేధించినప్పటికీ..
మహిళా ప్రధానికి ట్రంప్ బెదిరింపులు?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని
పాక్ జైలులో భారత యువకుడు విలవిల.. ప్రేమే కారణం
‘నాన్నా.. ఆ అమ్మాయి నాకోసం ఎంతగానో పరితపిస్తోంది...
రాణాకు మూసుకుపోయిన దారులు.. ఇక భారత్కు అప్పగింతే!
వాషింగ్టన్: ముంబయి దాడుల కేసు కీలక నిందితుడైన తహవూర్ రాణాన
అమెరికాలో అక్రమ వలసదారులు అరెస్ట్.. భారత్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అక్రమ వలసదారులు అగ్ర రాజ్యం అమెరికాను వీడుతున్న
National View all
Mahakumbh: కారులో మంటలు.. అగ్నిమాపక దళం అప్రమత్తం
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది.
చంద్రబాబు, రేవంత్ల స్ఫూర్తితో అలా ముందుకు..!
కాంగ్రెస్ పార్టీని నిత్యం విమర్శించే భారతీయ జనతా పార్టీ హామీల విషయంలో ఇప్పుడు ఆ పార్టీ బాటనే పట్టడం ఆశ్చర్యం కల
తల్లి ఊపిరి ఆగిందని తెలియక..
సేలం(తమిళనాడు): తల్లి మరణించిందని తెలియని మానసిక రోగి అయిన క
ఢిల్లీ పోస్టర్ వార్లో ఆసక్తికర మలుపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతు
మహిళా సెక్యూరిటీ గార్డును హత్య చేసిన ప్రియుడు..
అన్నానగర్: చెన్నై పక్కనే ఉన్న మామల్లపురంలో బుధవారం వివాహేతర
NRI View all
రాణాకు మూసుకుపోయిన దారులు.. ఇక భారత్కు అప్పగింతే!
వాషింగ్టన్: ముంబయి దాడుల కేసు కీలక నిందితుడైన తహవూర్ రాణాన
ట్రంప్ పాలసీ.. భారతీయ అమెరికన్లకు మేలు కూడా!
అగ్రరాజ్యం అధ్యక్షుడి(47)గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భ
Birthright citizenship : ట్రంప్ ఆర్డర్ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్ఆర్ఐలకు భారీ ఊరట
అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ (
USA: టీటీఏ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది
వాషింగ్టన్: మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అ
కాన్సస్లో దిగ్విజయంగా నాట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..
క్రైమ్
khammam: మిర్చితోటలో వ్యక్తి మృతదేహం లభ్యం
కూసుమంచి: ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, లింగారంతండా సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మిర్చి తోటలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించగా.. హైదరాబాద్కు చెందిన సదరు వ్యక్తిని తీసుకొచ్చి హత్య చేసినట్లు తేలింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం మిర్చి తోటలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన రైతు పోలీసులకు సమాచారం అందించాడు.సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై నాగరాజు మృతుడి రెండు చేతులు ప్లాస్టిక్ తాడుతో కట్టేసి ఉండటం, తలపై గాయాలు కనిపించడమే కాక మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో మృతుడు హైదరాబాద్కు చెందిన బొల్ల రమేష్(52)గా తేలింది. ఆయన రెండు రాష్ట్రాల్లో పాన్ మసాలా సరఫరా చేసేవాడు. ఈనెల 18న బయటికి వెళ్లిన అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అక్కడి ఖార్ఖానా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేస్తుండగానే ఓ వ్యక్తి రమేష్ ను హత్య చేసినట్లు చెబుతూ లొంగిపోయాడు.నలుగురు వ్యక్తులు 18న రాత్రి అతడిని కారులో ఖమ్మం వైపు తీసుకొచ్చి హత్య చేసిన అనంతరం ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారి పక్కన మిరపతోటలో మృతదేహాన్ని పడవేసినట్లు చెప్పాడు. దీంతో అక్కడి పోలీసులు వచ్చి గాలించినా సరైన ప్రాంతం తెలియక వెనుతిరిగారు. ఇంతలోనే కూసుమంచి పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రమేష్ కుటుంబీకులతో శుక్రవారం రాత్రి వచ్చి మృతదేహం ఆయనదేనని నిర్ధారించుకున్నారు. డబ్బు కోసమే రమేష్ ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించి అన్నం ఫౌండేషన్ సభ్యుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.
బంజారాహిల్స్లో కారు చోరీ.. ఖైరతాబాద్లో చైన్ స్నాచింగ్..
బంజారాహిల్స్: చైన్ స్నాచింగ్ చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా కారు చోరీకి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్, ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఎన్బీటీనగర్ బస్తీకి చెందిన అఫ్రోజ్ తన మారుతీ వ్యాన్లో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లేవాడు. గురువారం రాత్రి కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో రిపేరు చేయాలని రోడ్డునెంబర్–12లోని కమాన్లో మెకానిక్కు కారు అప్పగించి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వరకు కారుకు మరమ్మతులు చేసిన మెకానిక్ షెడ్కు తాళం వేసీ ఇంటికి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం వ్యాన్ తీసుకెళ్లేందుకు అక్కడికి వచి్చన ఆఫ్రోజ్కు షెడ్ ఎదుట కారు కనిపించలేదు. దీంతో మెకానిక్కు ఫోన్ చేయడంతో తాను కారు అక్కడే పార్కింగ్ చేసి వెళ్లిపోయానని చెప్పిన అతను ఘటనా స్థలానికి పరిగెత్తుకొచ్చాడు. పరిసర ప్రాంతాల్లో గాలించినా కారు కనిపించకపోవడంతో బాధితుడు ఆఫ్రోజ్ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కారు తాజ్కృష్ణా హోటల్ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. కాగా ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఆనంద్నగర్ కాలనీలో ఓ మహిళ మెడలో గొలుసు చోరీకి గురైనట్లు ఖైరతాబాద్ పోలీసులకు సమాచారం అందింది. అక్కడి పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించగా మారుతీ వ్యాన్లో వచ్చిన ఓ వ్యక్తి కారు దిగి కొంతదూరం నడిచి వెళ్లి రోడ్డుపై వెళుతున్న నర్సమ్మ అనే మహిళ మెడలోని 2.5 తులాల బంగారు గొలుసు లాక్కుని పరారైనట్లుగా గుర్తించారు. దీంతో కంట్రోల్ రూం నుంచి అన్ని ఠాణాలకు సమాచారం అందించారు. బంజారాహిల్స్లో చోరీకి గురైన కారు అదేనని గుర్తించారు. దీంతో అటు ఖైరతాబాద్ పోలీసులు, ఇటు బంజారాహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందీలను ఏర్పాటు చేసి దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన సదరు దొంగ కారును ఖైరతాబాద్లో వదిలేసి సందుల్లో పడి ఉడాయించినట్లుగా తేలింది. అర్ధరాత్రి బంజారాహిల్స్లో కారు దొంగిలించిన అతను ఉదయం వరకు అటూ ఇటూ తిరుగుతూ ఆనంద్నగర్ కాలనీలో ఒంటరిగా కనిపించిన మహిళను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లుగా పోలీసులు నిర్థారించారు. స్నాచర్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. వెస్ట్–సెంట్రల్ జోన్ల సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకోవడంతో బంజారాహిల్స్, ఖైరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కేసు మూసేసినా ధన దాహం తీరలేదు!
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యగా తేలిన మిస్సింగ్ కేసులో అనుమానితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో షాహినాయత్గంజ్ ఠాణా మాజీ ఇన్స్పెక్టర్ బాలు చౌహాన్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ కేసు క్లోజ్ అయినా ధనదాహం తీరని ఇన్స్పెక్టర్ వేధించడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం కొసమెరుపు. షాహినాయత్గంజ్ ఠాణా పరిధిలో నివసించే ఓ వ్యక్తి అప్పుల బాధతో గత నెల 5న అదృశ్యమయ్యాడు. దీనిపై గత నెల 7న కుటుంబీకుల ఫిర్యాదుతో షాహినాయత్గంజ్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు కొలిక్కిరాకుండానే గత నెల 11న అబ్దుల్లాపూర్మెట్లో ఆ వ్యక్తి మృతదేహం లభించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. అప్పు ఇచి్చన వారి వేధింపుల కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. ఇలాంటి కేసుల్లో సాధారణంగా పోలీసులు అబ్దుల్లాపూర్మెట్ ఠాణాలో నమోదైన కేసులు షాహినాయత్గంజ్ ఠాణాకు బదిలీ చేయించుకుంటారు. అయితే బాలు చౌహాన్ మాత్రం ఆ కేసును అక్కడే ఉంచి.. ఇక్కడ నమోదైన మిస్సింగ్ కేసును గత నెల 19న క్లోజ్ చేశారు. ఆ కేసులో అనుమానితులుగా ఉన్న అప్పు ఇచ్చిన వ్యక్తులను పిలిచి నిందితులుగా చేరుస్తానంటూ బెదిరించాడు. ఓ వ్యక్తిని మాత్రం తీవ్రంగా హెచ్చరించిన బాలు చౌహాన్ అలా కాకుండా ఉండాలంటే తనకు రూ.1.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత నెల 23, 24 తేదీల్లో చౌహాన్ వేధింపులు ఎక్కువ కావడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సలహా మేరకు ఇన్స్పెక్టర్ను కలిసి, అతడితో రూ.50 వేలకు బేరసారాలు చేసి, ఆ మొత్తం తతంగాన్ని ఆడియో రికార్డు చేశాడు. ఈ సాక్ష్యాన్ని ఏసీబీ అధికారులకు అందించాడు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసు ఉన్నతాధికారులు బాలు చౌహాన్పై ఈ నెల 3న బదిలీ వేటు వేశారు. దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి ఏసీబీ అధికారులు శుక్రవారం అతడిని అరెస్టు చేశారు.
ఇన్స్టా లవ్.. బెంగుళూరుకు పయనమైన ముగ్గురు బాలికలు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ఇంస్టాగ్రామ్లో మూడు నెలల క్రితం పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలు నమ్మి ఓ బాలిక ఇల్లు వదిలి బెంగళూరుకు పయనం కాగా.. ఆమెకు తోడుగా మరో ఇద్దరు బాలికలు వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నార్త్జోన్ ఏసీపీ స్రవంతిరాయ్ తన కార్యాలయంలో ఈ కేసు వివరాలను మీడియాకు వెల్ల్లడించారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు.. న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన ఓ బాలిక సమీపంలోని ఓ మదర్సాలో చదువుకొని ఇంటి వద్దే ఉంటోంది. ఆమెకు ఇంస్టాగ్రామ్లో బెంగళూరుకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్యలో ఆ యువకుడి స్నేహితుడైన గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన వేణు(23) అనే యువకుడు రావడంతో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి వారు దూరంగా ఉంటుండగా.. మూడు నెలల క్రితం నుంచి వేణు ప్రేమ పేరుతో ఆ బాలికకు మాయమాటలు చెబుతూ వచ్చాడు. తనతో వస్తే బెంగళూరు తీసుకెళ్లి పెళ్లిచేసుకుంటానని నమ్మించడంతో అతగాడి మాటలు విన్న ఆ బాలిక విషయాన్ని తన ఇద్దరి స్నేహితులకు చెప్పింది. దీంతో ఆ ఇరువురు బాలికలు తాము కూడా బెంగళూరు వస్తామని చెప్పడంతో వేణు వారిని తెనాలికి రమ్మని చెప్పాడు. ప్రణాళిక ప్రకారం బాలికలను గురువారం రాత్రి తెనాలికి రప్పించిన వేణు అక్కడ తన స్నేహితులైన కేతవత్ యువరాజ్నాయక్(21), పెద్ద వెంకటేశ్వర్లు(30)ను బాలికలకు పరిచయం చేశాడు. ఉదయాన్నే బెంగళూరుకు రైలులో వెళ్దామని, టికెట్లు కూడా తీసుకున్నామని బాలికలకు చూపించాడు. ఈ రాత్రికి మనం అందరం గుంటూరు జిల్లా చేబ్రోలులోని పెద్ద వెంకటేశ్వర్లు ఇంట్లో ఉందామనుకొని పయనమయ్యారు. గంటల వ్యవధిలో బాలికల ఆచూకీ.. ముగ్గురు బాలికలు కనిపించడం లేదంటూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సింగ్నగర్ సీఐ వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి.. ఎస్ఐ సేనాపతి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుల ఇంస్టాగ్రామ్ ఐడీ నంబర్లు, బండి నంబర్ల ఆధారంగా పోలీసులు తెనాలి చేరుకొని బాలికలు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఉంటున్న బాలిక పాత స్నేహితుడు నిందితులను పట్టించడంలో పోలీసులకు సహాయం చేసినట్లు తెలిసింది. బాలికలను వీరు వేరే రాష్ట్రంలోకి తీసుకువెళ్లి వారి జీవితాలను నాశనం చేసేందుకు పన్నాగం పన్నినట్లుగా తెలుస్తోంది. మరో కేసు కూడా.. అదేరోజు అదే ప్రాంతానికి చెందిన మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక కూడా అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందగా ఆ బాలిక ఆచూకీని కూడా గంటల వ్యవధిలోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఏసీపీ వివరించారు. ఒకే రోజు రెండు కేసులలో నలుగురు బాలికల ఆచూ కీని తెలుసుకొని, కేసులను ఛేదించిన బృందాలను సీపీ రాజశేఖర్బాబు, డీసీపీ రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించినట్లు స్రవంతిరాయ్ తెలిపారు.
వీడియోలు
టీడీపీ పాలనలో మళ్లీ దేవాలయాల కూల్చివేత ప్రారంభం
మాజీ సీఎం KCR ఇంట్లో విషాదం
విజయసాయి రెడ్డి రాజీనామా
మీరు గెలిచింది దీనికోసమేనా? ఫీల్డ్ అసిస్టెంట్ హత్యపై విరూపాక్షి స్ట్రాంగ్ రియాక్షన్
కొత్త అల్లుడికి 250 రకాల వంటకాలు పెట్టినట్టు.. జగన్ కూడా ఒకేసారి ప్రజలకి ఇచ్చాడు
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో హైడ్రా కూల్చివేతలు
పుష్ప 2 సెలబ్రేషన్స్ కు దూరంగా పుష్ప టీమ్
RC16 కి రెహమాన్ బ్రేక్.. ఎలాంటి ఇబ్బంది లేదు
గెట్ రెడీ.. రంగం సిద్ధం?
భారత్ కస్టడికి ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణా..