ఫైనల్లో ఊచకోత.. సంజూ శాంసన్ వరల్డ్ రికార్డు
టీ20 వరల్డ్కప్-2026ను టీమిండియా స్టార్ ఓపెనర్గా సంజూ శాంసన్ ఘనంగా ముగించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్లో శాంసన్ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లను ఉతికారేశాడు.మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లను సైతం సంజూ విడిచిపెట్టలేదు. అతడి మెరుపు బ్యాటింగ్కు బౌండరీలు చిన్నబోయాయి. శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ టోర్నీలో 5 మ్యాచ్లు ఆడిన శాంసన్.. 80.25 సగటుతో 321 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన సంజూ శాంసన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.సంజూ సాధించిన రికార్డులు ఇవే👉టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా సంజూ రికార్డులెక్కాడు. సంజూ తొలి ఓవర్లో ఇప్పటివరకు 4 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు మహ్మద్ రిజ్వాన్, క్వింటన్ డికాక్, గుర్బాన్, సాల్ట్ పేరిట ఉండేది. వీరిందరూ తొలి ఓవర్లో మూడు సిక్స్లు బాదారు.👉ఒక టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ప్రపంచకప్లో సంజూ 21 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో ఫిన్ అలెన్(21)ను సంజూ అధిగమించాడు.👉ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ హాఫ్ సెంచరీలు సాధించిన మూడో ప్లేయర్గా శాంసన్ నిలిచాడు. శాంసన్ కంటే ముందు షాహిద్ అఫ్రిది, విరాట్ కోహ్లి ఈ ఫీట్ సాధించారు.Pressure? WHAT PRESSURE!? 💪Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:👉 Virat Kohli | 2014👉 Sanju Samson | 2026ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026
కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి
రాజమహేంద్రవరం: కల్తీ పాల ఘటనలో మరొకరు మృత్యువాత పడ్డారు. రాజమండ్రి శివారు లాలాచెరువు ప్రాంతానికి చెందిన శానాపతుల రామలక్ష్మి(73) మృతి చెందారు. ఈరోజు(ఆదివారం, మార్చి 8వ తేదీ) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణం కోల్పోయారు. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి డెల్టా హాస్పిటల్లో రామలక్ష్మి చికిత్స పొందుతున్న ఆమె.. ఈరోజు తుది శ్వాస విడిచారు. దాంతో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. అయితే అనధికారికంగా మృతుల సంఖ్య 12గా ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురు రోగులు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. కాగా, రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై, నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో రోజుకొకరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూండటం.. బాధిత కుటుంబాలను తీరని విషాదంలో ముంచుతోంది. మరోవైపు చికిత్స పొందుతున్న వారి పరిస్థితి సైతం విషమంగానే ఉంది. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. అయితే, వారి విషయంలో విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు సైతం ఇప్పటికే చేతులెత్తేశారు. ప్రస్తుతం జరుగుతున్న చికిత్సే కొనసాగించాలంటూ ఉచిత సలహా ఇచ్చి వెనుదిరిగారు. తాజాగా మరొకరు మృతి చెందడంతో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
మీరు ఎందుకు రాలేదు.. ఏం చర్యలు తీసుకున్నారు?: కేంద్రం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకపోవడం కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రానికి రాష్టపతి వస్తే.. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ కనీసం పట్టించుకోరా అంటూ మండిపడింది. దీనికి సమాధానం చెప్పాలంటూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తిని కేంద హోం సెక్రటరీ గోవింద్ మోహన్ వివరణ కోరారు. సాధారణంగా రాష్ట్రపతి ఒక రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు స్వాగతం పలకడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు రాష్ట్రం నుంచి ఎటువంటి స్వాగతం కానీ ఆహ్వానం కానీ లభించలేదు. దీన్నే కేంద్రం ప్రధానంగా ప్రస్తావించింది. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్లు.. రాష్ట్రపతిని ఆహ్వానించడానికి కానీ వీడ్కోలు చెప్పడానికి కానీ ఎందుకు హాజరు కాలేదు? రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్రూమ్లో నీరు లేదు 3) రాష్ట్రపతి వచ్చే మార్గం చెత్తతో నిండి ఉంది 4) డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్, సిలిగురి పోలీసు కమిషనర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ బాధ్యులు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. దీనికి ఐదు గంటల్లోగా సమాధానం చెప్పండి’ అంటూ కేంద హోం సెక్రటరీ గోవింద్ మోహన్ ఆదేశించారు.అదొక ప్రైవేట్ ఆర్గనైజేషన్: సీఎం మమతాసిలిగురిలో జరిగిన 9వ అంతర్జాతీయ ఆదివాసీ సంతల్ సమావేశానికి గౌరవనీయులైన రాష్ట్రపతిని ఆహ్వానించారు. అంతర్జాతీయ సంతల్ కౌన్సిల్ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఈ కార్యక్రమం ఏర్పాట్లకు సిబ్బంది తగినంత లేరని జిల్లా యంత్రాంగం రాష్ట్రపతి కార్యాలయానికి లిఖిత పూర్వకంగా తెలియజేసింది. ఫోన్ ద్వారా కూడా తెలియజేశాం. గౌరవనీయులైన రాష్ట్రపతిని మేయర్ సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్, డిఎం డార్జిలింగ్ సిలిగురి పోలీస్ కమిషనరేట్ స్వాగతించి, వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి సచివాలయం ఆమోదించిన లైనప్ ప్రకారం ఇది జరిగింది. ఈ లైనప్లో కానీ వేదిక ప్రణాళికలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి భాగం కాలేదు. జిల్లా యంత్రాంగం వైపు నుండి ఎటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదు’ అని మమతా ట్వీట్ చేశారు. కాగా, 9వ అంతర్జాతీయ సంతల్ సదస్సులో పాల్గొనడానికి సిలిగురికి వచ్చిన తనకు.. ముఖ్యమంత్రి నుంచి, రాష్ట్ర మంత్రుల నుంచి కూడా తనకు ఆహ్వానం అందలేదన్నారు ముర్ము. ‘మమత నా చెల్లెలు లాంటిది. బహుశా ఆమె కోపంగా ఉండవచ్చు. నేను బెంగాల్ పర్యటనకు వస్తే ఆమె నన్ను పట్టించుకోలేదు. సంతాల్ దివస్కు సరైన ఏర్పాట్లు చేయలేదు. ఆ కార్యక్రమానికి మమత హాజరు కాకపోవడం నన్ను బాధించింది.ఆమె అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఇంత ఇరుకైన ప్రదేశంలో నిర్వహించాలని ఎంచుకుందో నాకు తెలియదు. వేదిక పెద్దదిగా ఉంటే, సమావేశానికి ఎక్కువ మంది హాజరయ్యేవారు అని ఆమె బిధాన్నగర్లో జరిగిన మరో కార్యక్రమంలో స్పష్టం చేశారు.. బిధాన్నగర్లో సమావేశం జరిగి ఉంటే ఐదు లక్షల మంది సులభంగా హాజరయ్యేవారని కూడా ముర్ము ప్రధానంగా ప్రస్తావించారు.రాష్ట్రపతితో రాజకీయాలు సరికాదురాష్ట్రపతితో కూడా రాజకీయాలు చేయాలనుకోవడం సరైనది కాదని ప్రధాని మోదీ నిన్ననే(శనివారం, మార్చి 7వ తేదీ) ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతిని టీఎంసీ అవమానించింది. టీఎంసీ హద్దు మీరి ప్రవర్తిస్తోంది’ అని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
సారా మీనాకారి నెక్లెస్..! ఇంత స్పెషాల్టీ దాగుందా..?!
సచిన్ టెండూల్కర్ అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండూల్కర్ల వివాహం గత గురవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు, పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు విచ్చేసి వధువరులు ఆశ్వీరదించారు కూడా. అయితే ఈ వేడుకలో అర్జున్ అక్క సారా కుందనపు బొమ్మలా అందరి కళ్లను ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె ధరించిన మీనాకారి నెక్లెస్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. సునీతా షెఖావత్ కలెక్షన్కి సంబంధించిన ఈ నెక్లెస్ చాలా ప్రత్యేకంగా తయారు చేశారట. ఇందులో హస్తకళ, సంప్రదాయ కుందన్ సెట్ పోల్కీలు, పూల మోటిఫ్లు తరతరాల సంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి. ప్రముఖ ఆభరణాల నిపుణురాలు ప్రియంషు గోయెల్ జైపూర్కి చెందిన సునీతా షెఖావత్ తయారు చేసిన ఈ నెక్లెస్ ధర దగ్గర రూ. 40 నుంచి రూ. 60 లక్షలు పైన ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెక్లెస్లో కొలంబియన్ ఎమరాల్డ్లు, సౌత్ సీ ముత్యాలను పొందుపరిచారు. అద్భుతమైన వారసత్వ ఆభరణాలు.. మన దేశ సంస్కృతిని, గత వైభవాన్ని కళ్లముందు కదలాడలే చేసింది ఈ ఆభరణం. అంతేగాదు దీన్ని తయారు చేసేందుకు 360 గంటలు పైనే పట్టిందట. ఈ ఆభరణం ప్రత్యేకతలను వివరిస్తూ నెట్టింట షేర్ చేశారు ప్రియంషు గోయెల్. View this post on Instagram A post shared by Sunita Shekhawat (@sunita_shekhawat_jaipur) (చదవండి: Arjun-Saaniya Chandhok Wedding: అంజలి, సారా ఆ చీరలే ఎందుకు ఎంచుకున్నారంటే..)
నటుడు పార్తిబన్ పరువు తీసేసిన త్రిష.. ట్వీట్ వైరల్
T20 WC 2026: చరిత్ర సృష్టించిన భారత్.. వరల్డ్ రికార్డు
మహిళల నుంచే అన్నీ.. గౌతమ్ అదానీ భావోద్వేగం!
‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్లో రోల్ మోడల్గా తెలంగాణ
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం.. ఏం జరగబోతుంది?
ఫైనల్లో ఊచకోత.. సంజూ శాంసన్ వరల్డ్ రికార్డు
షార్ట్ ఫిల్మ్లో మహేశ్ కొడుకు గౌతమ్.. ఎలా నటించాడంటే?
Final: ఊచకోత.. టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు
ఫైనల్లో అభిషేక్ శర్మ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. BSNL కొత్త ఆఫర్!
T20 WC 2026: అదే మా కొంపముంచింది.. బ్రూక్ ఆవేదన
T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
విజయ్తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత
పడిపోతున్న పసిడి ధరలు.. ఈసారి తులం..
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
మరో దేశంపై యుద్ధం ప్రకటించిన ట్రంప్
'లడ్డూ'పై సమాధానం చెప్పలేక చంద్రబాబు సతమతం
యుద్ధంతో ధరలకు రెక్కలు
T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్!
డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ
పాలు పోసి పెంచితే చివరకు.. ఇరాన్కు భారీ షాక్!
T20 WC Final: బుమ్రా కూడా మనిషే కదా!: కివీస్ స్టార్
ఇరాన్, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన
మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..
100 ఎకరాలు ఉంటే చెప్పండి: మీనాక్షి
ఈ రాశి వారికి ధనలాభం.. వస్తువులు లాభం
ఇంటర్నెట్ను ఊపేసిన ఈ బాలుడు గుర్తున్నాడా? ఇప్పుడు మరోసారి..
మరో ఫ్లాట్ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ఇరాన్తో యుద్ధం.. ఇజ్రాయెల్కు వారానికి ఎంత నష్టమంటే..!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
నటుడు పార్తిబన్ పరువు తీసేసిన త్రిష.. ట్వీట్ వైరల్
T20 WC 2026: చరిత్ర సృష్టించిన భారత్.. వరల్డ్ రికార్డు
మహిళల నుంచే అన్నీ.. గౌతమ్ అదానీ భావోద్వేగం!
‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్లో రోల్ మోడల్గా తెలంగాణ
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం.. ఏం జరగబోతుంది?
ఫైనల్లో ఊచకోత.. సంజూ శాంసన్ వరల్డ్ రికార్డు
షార్ట్ ఫిల్మ్లో మహేశ్ కొడుకు గౌతమ్.. ఎలా నటించాడంటే?
Final: ఊచకోత.. టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు
ఫైనల్లో అభిషేక్ శర్మ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. BSNL కొత్త ఆఫర్!
T20 WC 2026: అదే మా కొంపముంచింది.. బ్రూక్ ఆవేదన
T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
విజయ్తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత
పడిపోతున్న పసిడి ధరలు.. ఈసారి తులం..
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
మరో దేశంపై యుద్ధం ప్రకటించిన ట్రంప్
'లడ్డూ'పై సమాధానం చెప్పలేక చంద్రబాబు సతమతం
యుద్ధంతో ధరలకు రెక్కలు
T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్!
డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ
పాలు పోసి పెంచితే చివరకు.. ఇరాన్కు భారీ షాక్!
T20 WC Final: బుమ్రా కూడా మనిషే కదా!: కివీస్ స్టార్
ఇరాన్, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన
మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..
100 ఎకరాలు ఉంటే చెప్పండి: మీనాక్షి
ఈ రాశి వారికి ధనలాభం.. వస్తువులు లాభం
ఇంటర్నెట్ను ఊపేసిన ఈ బాలుడు గుర్తున్నాడా? ఇప్పుడు మరోసారి..
మరో ఫ్లాట్ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ఇరాన్తో యుద్ధం.. ఇజ్రాయెల్కు వారానికి ఎంత నష్టమంటే..!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
ఫొటోలు
గ్రాండ్గా హీరోయిన్ శ్రద్ధాదాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)
'మృత్యుంజయ్' థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 08-15)
తమిళనాడు డివోషనల్ ట్రిప్లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)
హైదరాబాద్లో గ్రాండ్గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)
రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)
మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)
సినిమా
త్రిషపై చిల్లర కామెంట్స్.. నోరు జారిన సీనియర్ నటుడు
తమిళనాడులో ఓవైపు ఎన్నికల హడావుడి ఉంది. మరోవైపు స్టార్ హీరో విజయ్ వైవాహిక బంధం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. రీసెంట్గానే ఇతడి భార్య సంగీత, కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఓ నటితో తన భర్తకు అక్రమ సంబంధం ఉందనే కారణాన్ని పిటిషన్లో పేర్కొంది. ఇదలా ఉండగానే త్రిషతో కలిసి విజయ్ ఏకంగా ఓ పెళ్లికి వెళ్లడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. వీళ్లిద్దరి మధ్య ఏముందనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇంతలోనే తమిళ నటుడు, దర్శకుడు పార్తిబన్.. త్రిషపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్)తాజాగా ఓ మూవీ ఈవెంట్లో యాంకర్ మాట్లాడుతూ.. త్రిష గురించి అభిప్రాయం చెప్పాలని పార్తిబన్ని అడిగింది. 'పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని అన్నాడు. అయితే పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు.. త్రిషని అవమానించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన సరదాగానే అన్నాడని, మిగతా వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.ఏదేమైనా పార్తిబన్ లాంటి ఓ సీనియర్ నటుడు, దర్శకుడు.. త్రిష లాంటి హీరోయిన్ గురించి పబ్లిక్గా ఇలా మాట్లాడటం సరికాదనే అభిప్రాయం పలువురు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. గతంలోనూ ఈ నటుడు హీరోయిన్ల గురించి నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలో కథ ఉందా? లేదా అనేది ప్రేక్షకులు చూడటం లేదు. హీరోయిన్ డ్యాన్స్ కోసమే సినిమాలు చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వాలేదు.. సినిమా హిట్టవుతుంది అని అన్నారు. తర్వాత తన మాటలపై విమర్శలు రావడంతో క్షమాపణ చెప్పుకొచ్చాడు.పార్తిబన్ విషయానికొస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, పొన్నియన్ సెల్వన్ 2 తదితర సినిమాల్లో నటించాడు. తెలుగులోనూ 'రచ్చ'లో చరణ్ తండ్రిగా చేశాడు. ఇతడు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే తెలుగు మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నటి సీతని 1990లో పెళ్లి చేసుకున్న పార్తిబన్.. 2001లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్)Parthiban attacks Trisha😝“Intha Kunthavai ah veetukullaye Kunthavaikirathu nalathu”😀pic.twitter.com/X5St5Ycnvk— Christopher Kanagaraj (@Chrissuccess) March 8, 2026
నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్
తెలుగు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కావ్యరెడ్డితో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఈ శుభకార్యం జరగ్గా.. టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త, దర్శకుడు బోయపాటి శీను తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో ఫంకీ సినిమా.. స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది)ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు అయిన సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంలోనే సమంత లాంటి హీరోయిన్తో నటించాడు. సక్సెస్ కూడా అందుకున్నాడు. తర్వాత అడపాదడపా మూవీస్ చేశాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. 'రాక్షసుడు' అనే రీమేక్ మూవీ హిట్ అయింది. రీసెంట్ టైంలో అయితే భైరవం, కిష్కింధపురి చిత్రాలతో పలకరించాడు. ఇవి బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు.హీరో బెల్లకొండ శ్రీనివాస్.. ప్రేమలో ఉన్నాడని, నిశ్చితార్థం చేసుకోబోతున్నాడనే విషయం రెండు మూడు రోజుల క్రితం బయటకు వచ్చింది. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఎంగేజ్మెంట్ జరిగింది. శ్రీనివాస్కి కాబోయే భార్య కావ్యకు ఇండస్ట్రీతో సంబంధం లేదు. ఈమె తాత జడ్జి కాగా తండ్రి లాయర్. వీళ్లది హైదరాబాదే. శ్రీనివాస్, కావ్య కుటుంబాలకు ముందు నుంచే పరిచయం ఉందని అంటున్నారు. మరి కావ్యతో పరిచయం, ప్రేమ ఎలా అనే విషయాల్ని శ్రీనివాసే బయటపెట్టాలి. వీళ్ల పెళ్లి బహుశా ఈ ఏడాదిలోనే ఉండొచ్చు.(ఇదీ చదవండి: ప్రేమలో పడ్డ కోర్ట్ జంట? రోషన్, శ్రీదేవి రియాక్షన్ ఇదే!)Actress Samyuktha attends the Engagement Function of Hero #BellamkondaSrinivas as he gets engaged to Kavya.#SamyukthaMenon pic.twitter.com/dwbJaOphM2— idlebrain.com (@idlebraindotcom) March 8, 2026
ప్రేమలో పడ్డ కోర్ట్ జంట? రోషన్, శ్రీదేవి రియాక్షన్ ఇదే!
కోర్ట్ జంట హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి జంటగా నటించిన చిత్రం బ్యాండ్మేళం. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ జంట సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా వారికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆన్స్క్రీన్లో ప్రేమపాటలు పాడుకుంటున్న ఈ జంట ఆఫ్స్క్రీన్లోనూ లవ్లో ఉందని ప్రచారం జరుగుతోంది. లవ్ రూమర్స్ఇదెంతవరకు నిజం? అని యాంకర్ ప్రశ్నించాడు. అందుకు రోషన్, శ్రీదేవి స్పందిస్తూ.. కోర్ట్ మూవీ కంటే ముందే మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ఇద్దరం చైల్డ్ ఆర్టిస్టులం.. ఎలా పరిచయమయ్యామో గుర్తు లేదు కానీ ఫ్రెండ్స్ అయ్యాం. అందుకే ఇంత క్లోజ్గా ఉంటాం. ఒరేయ్, పోరా అని పిల్చుకుంటాం.అది చూసి నవ్వుకుంటాంకోర్ట్ సినిమా సమయం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్గా మారాం. తెరపై మమ్మల్ని చూసి ప్రేమికులు అనుకుంటారు. ఆ కామెంట్స్ చూసి మేము నవ్వుకుంటాం. కానీ, మేము మంచి మిత్రులం మాత్రమే.. మా మధ్య ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చారు. తాము కేవలం మిత్రులమే అని నొక్కి చెప్పారు. బ్యాండ్మేళం విషయానికి వస్తే.. దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన బాక్సాఫీస్ వద్ద ఎంత గట్టి సౌండ్ చేస్తుందో చూడాలి!చదవండి: ఆస్తి చూసి పెళ్లి? బిగ్బాస్ బ్యూటీ ఆన్సరిదే!
ఆ ఫోన్ రాకపోయుంటే చనిపోయేవాడిని: నాగమణికంఠ
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూసేవాళ్లు చాలామంది! ఆ ఛాన్స్ దొరక్క ఇక జీవితంపై ఆశలు వదిలేసుకుని తనువు చాలించాలనుకున్నాడు నాగమణికంఠ. అలాంటి సమయంలో బిగ్బాస్ షో నుంచి పిలుపు వచ్చింది. మళ్లీ గుండె నిండా ఆత్మవిశ్వాసం నింపుకుని షోలో అడుగుపెట్టాడు. ఒక్క పాటతో ఫుల్ ట్రోల్ అయ్యాడు. కానీ, తర్వాత నెమ్మదిగా ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బీబీ జోడీ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడు.రెండేళ్లపాటు..ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ.. మనలో వచ్చే నెగెటివ్ ఆలోచనలను అక్కడే చంపేయాలి. రెండేళ్లపాటు నేనేం సంపాదించలేదు, ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. ఇక అయిపోయిందిరా భయ్ అనుకున్నాను. ఆ 10 నిమిషాల్లో నాకు ఫోన్కాల్ రాకపోయుంటే నా జీవితం ముగిసిపోయేది. సరిగ్గా అదే సమయంలో బిగ్బాస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఏడ్చేసిన సదాఅప్పుడు కన్నీళ్లు తుడుచుకుని ఇంటర్వ్యూకి వెళ్లాను అని పేర్కొన్నాడు. నీ వెనక ఇలాంటి గతం ఉందని తెలీదు, నాకు చాలా బాధగా అనిపిస్తోందంటూ నటి సదా కన్నీళ్లు పెట్టుకుంది. కాగా నాగమణికంఠ సీరియల్ నటుడు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుంది. కానీ, అతడిని తండ్రిగా స్వీకరించలేకపోయాడు. బిగ్బాస్ షోతో గుర్తింపుఇంతలో తల్లి క్యాన్సర్తో 2019లో మరణించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేసిన అతడు మంచి ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. కూతురు పుట్టడంతో తల్లే తిరిగి వచ్చిందని సంతోషించాడు. కానీ, భార్యాభర్తల మధ్య కలహాలు మొదలవడంతో ఇండియాకు ఒంటరిగా తిరిగొచ్చేశాడు. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్తో గుర్తింపు పొందాడు.
క్రీడలు
Final: ఊచకోత.. టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు
భారత టీ20 ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్- అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో యాభైకి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్ జంటగా ప్రపంచ రికార్డు సాధించారు. వీరిద్దరి విధ్వంసం కారణంగా.. టీ20 ప్రపంచకప్ సెమీస్ లేదంటే ఫైనల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో న్యూజిలాండ్తో ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత ఓపెనర్లు సంజూ- అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. నాలుగో ఓవర్ ముగిసేసరికి సంజూ 14 బంతుల్లోనే 24, అభిషేక్ శర్మ 10 బంతుల్లోనే 23 పరుగులు సాధించారు.CHETTA POWER! 💪Outrageous six from Sanju Samson as 21 runs came off Matt Henry's over! 🥶ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/LGg4snOIuP— Star Sports (@StarSportsIndia) March 8, 2026దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో 50కి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్ జోడీగా భారత స్టార్లు నిలిచారు. ఇక ఆ తర్వాత కూడా సంజూ- అభిషేక్ జోరు కొనసాగించారు. అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.Cometh the hour, cometh the man! 😍Abhishek Sharma brings up his fifty in just 18 balls, fastest of the tournament! 💪ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/mcmGhlxJxe— Star Sports (@StarSportsIndia) March 8, 2026మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపిన అభిషేక్.. రచిన్ రవీంద్ర బౌలింగ్లో టిమ్ సీఫర్ట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సంజూతో కలిసి అభిషేక్ తొలి వికెట్కు 43 బంతుల్లో 98 పరుగులు జోడించాడు.కాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన ఓపెనింగ్ జోడీగా పాకిస్తాన్ స్టార్లు కమ్రాన్ అక్మల్- షాజైబ్ హసన్ రికార్డు సాధించాడు. వీరు 2009లో లార్డ్స్ వేదికగా శ్రీలంక మీద 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజాగా వీరి రికార్డును బద్దలు కొడుతూ సంజూ- అభిషేక్ శర్మ కలిసి కేవలం నాలుగు ఓవర్లలోనే 51 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ 33 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఫైనల్లో అభిషేక్ శర్మ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక మ్యాచ్లో తన ఫామ్ను తిరిగి అందుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ తన విశ్వరూపాన్ని చూపించాడు. తన పేలవ ఫామ్కు చెక్ పెడుతూ కివీస్ బౌలర్లను ఉతికారేశాడు.నరేంద్ర మోడీ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా టీ20 వరల్డ్కప్ నాకౌట్స్ మ్యాచ్లలో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన ప్లేయర్గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు.ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెతల్ పేరిట ఉండేది. వీరిద్దరూ ఇదే వరల్డ్కప్ సెమీఫైనల్స్లో 19 బంతుల్లో ఆర్ధ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తాజా ఇన్నింగ్స్తో వీరిద్దరిని అభిషేక్ అధిగమించాడు.ఓవరాల్గా 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 6 ఫోర్లు, 3 సిక్స్లతో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఫలితంగా భారత్ స్కోర్ కేవలం 7 ఓవర్లలోనే వంద పరుగుల మార్క్ దాటింది.🚨 ABHISHEK SHARMA SELECTION UNDER QUESTION 🚨Fans said – “Why is GG wasting a spot for this blind slogger?”Management said – Abhishek has only 89 runs in 7 matches with 3 ducks, but we won’t change the winning combination for the Final! 🤯pic.twitter.com/05OFSZf4PT— Sam (@Cricsam01) March 7, 2026
T20 WC Final: అదృష్టం!.. భయపెడుతున్న మరో సెంటిమెంట్
న్యూజిలాండ్తో టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. ఊహాగానాలకు తెరదించుతూ సెమీ ఫైనల్లో ఆడిన తుదిజట్టునే టైటిల్ పోరులోనూ కొనసాగించింది. వరుస వైఫల్యాల తర్వాత కూడా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. నంబర్ వన్ బౌలర్ వరుణు చక్రవర్తికి తుదిజట్టులో చోటు ఇచ్చింది.అదే వేదిక.. అదే అంపైర్ఇదిలా ఉంటే.. భారత్- కివీస్ జట్లకు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాకు బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఇదే వేదికపై టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్.. తాజా ఫైనల్కు కూడా అంపైర్ కావడం గమనార్హం.అదృష్టం ఏమిటంటేఇక ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడిపోవడం కూడా అభిమానులను కలవరపెడుతోంది. 2016 నుంచి ఇప్పటి వరకు 14 టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లలో పదకొండు లక్ష్య ఛేదనకు దిగిన జట్లే గెలవడం ఇందుకు కారణం. అయితే, అదృష్టం ఏమిటంటే.. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచిన సందర్భాలలో.. మూడు విజయాలూ టీమిండియా ఖాతాలోనే ఉండటం. కాగా టీమిండియా కివీస్తో ఫైనల్లో ఏ మార్పు లేకుండానే బరిలోకి దిగగా.. న్యూజిలాండ్ కోల్ మెకాంచీ స్థానంలో జేకబ్ డఫీని తీసుకువచ్చింది. Classic Ravi Shastri energy at the toss! 😍🚨 The coin toss goes Mitchell Santner's way & New Zealand will bowl first in the final! ✌️ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/g8UkcXpNKo— Star Sports (@StarSportsIndia) March 8, 2026తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి , అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ .
గతం గురించి ఆలోచించడం లేదు.. ఇది మాకు చాలా స్పెషల్: సూర్య
టీ20 ప్రపంచకప్-2026లో తుది పోరుకు తేర లేచింది. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్-భారత్ తలపడతున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత టీమిండియాను బ్యాటింగ్కు అహ్హనించాడు. న్యూజిలాండ్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. మెక్కాంచీ స్ధానంలో పేసర్ జాకబ్ డఫీ తుది జట్టులోకి వచ్చాడు. టీమిండియా మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. సెమీస్లో ఆడిన టీమ్నే కొనసాగించింది. ఇక టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు."ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. గత కొన్ని మ్యాచ్లుగా మేము మొదట బ్యాటింగ్ చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నాము. సెమీస్ లేదా ఫైనల్ వంటి మెగా మ్యాచ్లలో తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరును ప్రత్యర్ధి ముందు ఉంచిగల్గితే ఉత్తమంగా ఉంటుంది.2023 వరల్డ్కప్ ఓటమి గురుంచి మేము ఆలోచించడం లేదు. అది గతం మాత్రమే. ఇది డిఫెరెంట్ ఫార్మాట్. మా కుర్రాళ్లు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారు. 1,20,000 మంది ప్రేక్షకుల ముందు ఇటువంటి మ్యాచ్ ఆడడం నిజంగా చాలా స్పెషల్. టాస్ వేసే సమయానికే స్టేడియం నిండిపోయింది. మా ఆట తీరుతో వారిని అలరిస్తామని" సూర్య పేర్కొన్నాడు.తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ
న్యూస్ పాడ్కాస్ట్
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
భవిష్యత్ అభివృద్ధి శూన్యం... ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్. సెమీస్లో 7 పరుగులతో ఇంగ్లండ్పై గెలుపు
హాజరైన సెలబ్రిటీలు... విరోష్ రిసెప్షన్ కు
‘లడ్డూ’పై బాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. శాసన మండలిలో చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు
స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెద్ది
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలపై ఆటవిక దాడి... మహిళా దినోత్సవ వేళ చంద్రబాబు మార్కు గిఫ్ట్
తీవ్రరూపం దాలుస్తున్న పశ్చిమాసియా యుద్ధం... ఇరాన్కు అండగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు...
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. కుటుంబ సభ్యులతోపాటు ఆర్మీ చీఫ్ ముసావీ కూడా మృతి... క్షిపణి దాడుల్లో హత్య చేసిన ఇజ్రాయెల్
బిజినెస్
పతనమైన వెండి.. రూ.35 వేలు తగ్గిన రేటు!
భారతదేశంలో బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో కేజీ సిల్వర్ రేటు వారం రోజుల్లో సుమారు రూ. 35వేలు తగ్గింది. ఈ కథనంలో లేటెస్ట్ సిల్వర్ ధరల గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.మార్చి 1న రూ.3.25 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు మార్చి 7 నాటికి రూ.2.90 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.35వేలు తగ్గిందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే రేట్లు కొనసాగుతున్నప్పటికీ.. ప్రస్తుతం దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.85 లక్షల దగ్గర ఉంది. దీన్నిబట్టి చూస్తే దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగా ఉందని తెలుస్తోంది.ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్నవేళ బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయనుకుంటే.. మెల్లగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ తగ్గుదల కేవలం తాత్కాలికం మాత్రమే. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు తప్పకుండా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
గ్యాస్ సిలిండర్ బుకింగ్.. కొత్త రూల్స్!
ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దేశీయ గ్యాస్ సిలిండర్ల బుకింగ్కు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఒక సిలిండర్ డెలివరీ తర్వాత మరొక సిలిండర్ బుక్ చేయడానికి 15 రోజుల గడువు ఉండేది. ఇకపై ఈ వ్యవధిని 21 రోజులకు పెంచారు. అంటే ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత మరో సిలిండర్ డెలివరీకి కనీసం 21 రోజుల విరామం ఉండాల్సి ఉంటుంది.ఈ కొత్త నిబంధన అమలుకు గ్యాస్ ఏజెన్సీల సాఫ్ట్వేర్ను వెంటనే అప్డేట్ చేశారు. అయితే బుకింగ్ విధానం మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి తాత్కాలికమే అయినా భవిష్యత్తులోనూ 21 రోజుల గడువు పూర్తైన తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకునే విధానాన్ని అమలు చేయాలనే విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.ఏడాదికి 15 సిలిండర్ల కొనుగోలుకు అనుమతిదేశీయ గ్యాస్ సిలిండర్ల వినియోగంపై చమురు సంస్థలు ఇప్పటికే కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నాయి. వాటి ప్రకారం ప్రతి వినియోగదారు సంవత్సరానికి గరిష్టంగా 12 సబ్సిడీ సిలిండర్లు మాత్రమే పొందగలరు. అదనంగా మూడు సబ్సిడీ రహిత సిలిండర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ఏడాదిలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక్క గ్యాస్ కనెక్షన్పై మొత్తం 15 సిలిండర్లు కొనుగోలు చేయడానికి అనుమతి ఉంటుంది.24 గంటల్లో సిలిండర్ డెలివరీవినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బుకింగ్ చేసిన తర్వాత 24 గంటలలోపు సిలిండర్ డెలివరీ చేయాలని చమురు కంపెనీలు ఏజెన్సీలకు సూచించాయి. ఈ నిబంధన వల్ల వినియోగదారులకు మరింత సౌలభ్యం కలగనుంది.21 రోజుల తర్వాతే రెండో సిలిండర్ డెలివరీకొత్త నిబంధన ప్రకారం మొదటి సిలిండర్ అందుకున్న 21 రోజుల తర్వాత మాత్రమే రెండో సిలిండర్ డెలివరీ ఇవ్వబడుతుంది. దీనిని ఏజెన్సీల సాఫ్ట్వేర్లో లాక్ చేశారు. అయితే సిలిండర్ల కొరత ఏమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లిపారు. ఇక సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ వారం బాట్లింగ్ ప్లాంట్లు ఆదివారాల్లో కూడా పనిచేయనున్నట్లు సమాచారం.గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా..పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన ధరలు పెరగడంతో భారతదేశంలో డొమెస్టిక్ ఎల్పీజీ (14.2 కేజీలు) సిలిండర్ ధరలు మార్చి 7 నుంచి రూ.60 పెరిగాయి. ఈ పెంపు ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తించదు. వారికి రూ.300 సబ్సిడీ కొనసాగుతుంది.దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీలో రూ.913, ముంబైలో రూ.912.50, కోల్కతాలో రూ.939, చెన్నైలొ రూ.928.50, బెంగళూరులో రూ.915.50, హైదరాబాద్లో రూ.965లుగా ఉన్నాయి.
పాకిస్తాన్లో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్.. డీజిల్!
పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను దాదాపు 20 శాతం వరకు పెంచినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.ఆ దేశ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ టెలివిజన్ ద్వారా దేశ ప్రజలకు పెట్రోల్, డీజిల్ పెంపు విషయాన్ని ప్రకటించారు. ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు 55 పాకిస్తాన్ రూపాయలు పెంచి 321.17 రూపాయలకు నిర్ణయించింది. అలాగే డీజిల్ ధరను లీటరుకు 335.86 రూపాయలకు పెంచింది. ఇటీవలి సంవత్సరాల్లో ఇది అతిపెద్ద ధర సర్దుబాట్లలో ఒకటిగా భావిస్తున్నారు.ద్రవ్యోల్బణంపై ప్రభావంఇంధన ధరల పెరుగుదలతో దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలపై ఇది తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా ఇంధన ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరగడం, దాంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడం సాధారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలుధరల పెంపు ప్రకటనకు ముందే లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లోని పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. కొరత వచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ముందుగానే ఇంధనం కొనుగోలు చేయడానికి ఎగబడినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది.ప్రభుత్వం హెచ్చరికఇంధన నిల్వలు చేసుకునే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని షెహబాజ్ షరీఫ్ హెచ్చరించారు. దేశంలో తగినంత పెట్రోల్ నిల్వలు ఉన్నప్పటికీ మధ్యప్రాచ్య పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో తెలియకపోవడంతో వాటిని జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.చమురు దిగుమతులపై ఆధారపడిన పాకిస్తాన్పాకిస్తాన్ తన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ సరఫరాలు ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా వస్తాయి. ఇకపై అంతర్జాతీయ చమురు ధరల మార్పులకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతి వారం సమీక్షిస్తామని పాకిస్తాన్ చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇన్వెస్ట్ చేస్తేనే ఇంకా ముందుకు..
దేశీయంగా మహిళలకు ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్థిక భద్రత, సంపద సృష్టి అవకాశాలు పరిమితంగానే ఉంటున్నాయని ఫిన్టెక్ ప్లాట్ఫాం ఎల్ఎక్స్ఎంఈ ఫౌండర్ ప్రీతి రాఠీ గుప్తా తెలిపారు. చాలా మంది మహిళల్లో పొదుపు చేసే అలవాటు ఉన్నప్పటికీ మ్యుచువల్ ఫండ్స్, ఈక్విటీలు, పెన్షన్లు, లేదా బీమాలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటోందని వివరించారు.చాలా మంది బంగారం, నగదు, చిట్ఫండ్స్పైనే ఆధారపడుతుంటారని, వీటిపై దీర్ఘకాలంలో రాబడులు అంతంత మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక పురోగతికి సంబంధించి ఎల్ఎక్స్ఎంఈ–ఈవై ఉమెన్స్ ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ ఇండెక్స్ (2026) అధ్యయనం ప్రకారం భారత్కి 100కి 28.1 స్కోరు మాత్రమే లభించిందని గుప్తా చెప్పారు. బీమా లేకపోవడం, అసంఘటిత రంగంలో ఉద్యోగం, వేతనజీవులకు మాత్రమే రూపొందించబడిన సిస్టంలు మొదలైనవి మహిళల పురోగతికి ఆటంకాలుగా ఉంటున్నాయని వివరించారు.అయితే, మహిళలు క్రమంగా ఆర్థిక భద్రతపై మరింతగా దృష్టి పెట్టే ధోరణి పెరుగుతోందని తెలిపారు. ఎమర్జెన్సీ నిధి, బీమా కవరేజీ, ఆర్థిక పరిజ్ఞానం, కమ్యూనిటీ మద్దతు మొదలైనవి మహిళలు పెట్టుబడులు పెట్టడాన్ని ప్రారంభించేందుకు, క్రమంగా సంపద నిర్మించుకునేందుకు తోడ్పడతాయని ఆమె చెప్పారు. పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 40 లక్షల కోట్ల మేర జత కాగలదని గుప్తా పేర్కొన్నారు.
ఫ్యామిలీ
12 రోజెస్
30 వయసుకి ముందు ‘ఏం చేశారు?’ అనడిగితే, పాత జెనరేషన్ ఆలోచిస్తుంది. కాని, ఈ జెనరేషన్ అమ్మాయిలు అప్పటికే సాధిస్తారు! చిన్న వయసులోనే ఎవరిపైనా ఆధారపడకుండా, ఆధిక్యతను నిరూపించుకుంటున్నారు. కలలకు డెడ్లైన్ పెట్టకుండా, తమ జీవితానికి తామే సింహాసనం వేసుకుంటున్నారు. అలా ‘ఫోర్బ్స్ 30 అండర్ 30– 2026’ జాబితాలో ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న మహారాణులు వీళ్లే!ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్ లో ‘భోజనాలు ఎక్కడ?’ అని తెలుసుకునే లోపే,ముప్పై ఏళ్లు దాటిన వారిని ‘పెళ్లి ఎప్పుడు?’ అని అడిగే బంధువుల కోసం ఈసారి కొంతమంది అమ్మాయిలు స్పెషల్ సమాధానం రెడీ చేశారు. ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 – 2026’ బ్యాచ్ని చూపిస్తూ, ఇది కేవలం లిస్ట్ కాదు, యాంబిషన్ కు ఆధార్ కార్డు; డ్రీమ్స్కు రేషన్ కార్డు; సక్సెస్కు అడ్రెస్ ప్రూఫ్. వయసుతో సంబంధం లేకుండా, ఫెయిల్యూర్కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, సక్సెస్తో సెల్ఫీ తీసుకున్న బ్యాచ్ ఇది.అందుకే ఇకపై ‘సెటిల్ అయ్యావా?’ అని అడిగే ముందు,‘మీరు స్కేల్ అప్ అయ్యారా?’ అంటూ మోటివేషన్ ఇస్తున్నారు. ఇలా ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఈ యంగ్ అచీవర్స్ గురించి,మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ. కలలు కనడం ఒక ఎత్తు, ‘అయ్యో, అవి నిజమవుతాయా?’ అని అనుమానం పెట్టుకోవడం మరో ఎత్తు. కాని, ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 – 2026’ జాబితాలో చోటు సంపాదించిన వాళ్లు మాత్రం కలలు కనే దశ దాటేసి, వాటికి గడువు పెట్టుకుని, నెరవేర్చుకుని, ఫ్రేమ్ కట్టేసిన బ్యాచ్. ఈ జాబితాలో వ్యాపారవేత్తలు, నిపుణులు, క్రీడాకారులు, సంగీతం, సినిమా కళాకారులు, రూపకర్తలు ఇలా రంగుల మేళవింపే కనిపించినా, వారిది ఒకే లక్షణం– అదే సాధించాలనే తపన! ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, ఆర్థిక రంగాల్లో పేరొందిన ఫోర్బ్స్ సంస్థ.భారత్లో ప్రతి ఏడాది విడుదల చేసే ఈ ప్రత్యేక జాబితా ఇప్పుడు పదమూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసే ఈ జాబితాలో ఈసారి పదిహేను విభాగాల్లో యువ ప్రతిభను గుర్తించగా, అందులో నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులు అందించే వ్యాపారాలు, దేశ రక్షణ, అంతరిక్ష రంగాలు, ప్రకటనలు, మార్కెటింగ్ వంటి కొత్త విభాగాలు చేర్చారు. ఇలా చిన్న వ్యాపారం నుంచి అంతరిక్ష ప్రయోగం దాకా ప్రతిభకు విస్తృత వేదిక సిద్ధమైంది. అసాధ్యాలను సాధించిన ఆణిముత్యాలుఈ యువ సైన్యం ‘సెటిల్ అవ్వడం’ అంటే కుర్చీలో కూర్చోవడం కాదు, కుర్చీని సృష్టించేవారిగా ఎదగడం అనే ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. సుమారు వెయ్యికి పైగా వచ్చిన దరఖాస్తులను జల్లెడ పట్టి, నిపుణుల కమిటీ చర్చలు, వాదోపవాదాల తర్వాత ఎంపికైన ఈ ముప్పై మందిలో పన్నెండు మంది మహిళలు తమ ప్రతిభతో వెలుగొందగా, మిగిలిన స్థానాలను యువకులు కైవసం చేసుకున్నారు. అమ్మాయిల దూరదృష్టి, అబ్బాయిల వినూత్న ఆలోచనలు కలగలిసి కృత్రిమ మేధస్సు నుంచి వ్యవసాయ సాంకేతికత వరకు, అజ్రక్–కాంతా వంటి సంప్రదాయ కళల నుంచి క్రీడలు, సినిమా, రక్షణ–అంతరిక్ష రంగాల వరకు పదిహేను విభాగాల్లో సంచలనం సృష్టించాయి. పన్నెండు ప్రేరణ గాథలు! ముప్పైమంది సభ్యులతో మెరిసిన ఈ జాబితాలో, అసలైన స్పాట్లైట్ మాత్రం ఆ పన్నెండుమంది మహిళలదే! కలలకు క్యాలెండర్ ఉండదని, విజయానికి డెడ్లైన్ పెడితే చాలు సాధ్యమవుతుందని వారు నిరూపించారు. కాంతా కుట్టుతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న మౌమితా బసాక్, అజ్రఖ్కు ఆధునిక ఊపు తెచ్చిన ముబస్సిరా ఖలిద్ ఖత్రి సంప్రదాయం కూడా స్టయిలిష్గా మెరవొచ్చని నిరూపించారు. దృశ్య కథలతో సమాజానికి కొత్త కళ్లద్దాలు పెట్టిస్తున్న ప్రియా దాలి, కళ అంటే కేవలం వినోదం కాదని గుర్తు చేశారు.పద్దెనిమిదేళ్లకే స్టార్టప్ స్టీరింగ్ పట్టిన కాజల్ భేడా, చికంకారీకి ఫ్యాషన్ ఫ్రేమ్ ఇచ్చిన ఆకృతి రావల్, పర్యాటకానికి కొత్త అడ్రస్ రాసిన సిమోనా మోహన్ , మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం తీసుకొచ్చిన రమ్య ఎల్లాప్రగడ, సంరక్షణ కేంద్రాల నుంచి బయటికొచ్చిన యువతకు దిక్సూచి అయిన అనీషా శర్మ ఇలా ప్రతి పేరు ఒక కథ, ప్రతి కథ ఒక ప్రేరణ. చెస్బోర్డుపై చక్రం తిప్పిన దివ్యా దేశ్ముఖ్, విలువిద్యలో లక్ష్యాన్ని ఛేదించిన శీతల్ దేవి క్రీడల్లో భారత ప్రతిష్ఠను ఎగరేశారు. ముప్పైమందిలో అందరూ ప్రతిభావంతులే! కాని, ఈ మహిళలు మాత్రం ‘ముందు మేముంటాం, మిగతావాళ్లు ఫాలో అవుతారు!’ అన్నట్టు నిలిచారు.సంక్షోభమైనా సరైన సమయమే! కాజల్ భేడాప్రపంచం మొత్తం మాస్కులు కట్టుకుని భయంతో కూర్చున్న రోజుల్లో కాజల్ భేడా, ఒక కొత్త ఆలోచనకు ముసుగు తీసేసింది. ‘బ్రాండ్ అంటే కేవలం ప్రకటన కాదు, అది ఒక కథ’ అనే ఆలోచనే 2020లో ముంబై నేలపై ‘స్క్రిబ్బల్డ్’ సంస్థ స్థాపించింది. బ్రిటన్ లో మీడియా నిర్మాణంలో పొందిన శిక్షణ, నమ్మకాన్ని బలంగా చేసుకొని, సంస్థలు చెప్పాలనుకునే అసలైన సందేశం, ప్రకటన ఏజెన్సీలు అందించే సాధారణ పనుల మధ్య ఉన్న ఖాళీని భర్తీ చేయాలనే సంకల్పంతో ముందడుగు వేసింది. బయట పెట్టుబడుల కోసం తలుపులు తట్టకుండా, తన శ్రమనే మూలధనంగా మార్చి లాభాల్లో నడిచే సంస్థగా తీర్చిదిద్దింది. నేడు ఆమె నైకా, అమెజాన్, అదానీ వంటి ప్రముఖ సంస్థల కథలను కొత్త శైలిలో చెప్తోంది. ఇలా సంక్షోభం వచ్చినా, కలలకు స్టార్ట్ బటన్ నొక్కడానికి సరైన సమయమే అని చెప్తోంది.భావాలే బలం, ధైర్యమే దారి: అనీత్ పడ్డాచిన్నప్పటి నుంచి ఇంట్రావర్ట్గా మెలిగిన ఆ అమ్మాయి, ఒక రోజు అందరి చూపులు తనవైపు తిప్పుకుంటుందని ఎవరైనా ఊహించి ఉంటారా? అదే అనీత్ పడ్డా కథ. ‘నటనలో చేతి కదలికలకన్నా హృదయ స్పందన ముఖ్యం’ అని తల్లి చెప్పిన మాటలను గుండెల్లో దాచుకుని, నటనను సాధన చేసింది. ప్రకటన రంగంలో ప్రారంభించి, భావోద్వేగ ప్రధాన పాత్రలతో గుర్తింపు పొందింది. సామాజిక అంశాలపై అవగాహన కలిగించే కథలను ఎంచుకోవడం ఆమె ప్రత్యేకత. కేవలం 23 ఏళ్ల వయసులోనే తనదైన ముద్ర వేసిన ఈ యువ నటి, తదుపరి చిత్రంలో మరో కొత్త అవతారంలో కనిపించేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో మరింత విభిన్న పాత్రలు, ప్రతి కథలోనూ కొత్త అనుభూతి పంచాలనే తపనతో ముందుకు సాగుతోంది.కథలతో కట్టిపడేసే సృజనశీలి: ప్రియా దాలిరూపకల్పన అంటే రంగులు మాత్రమే కాదు; కథనం అంటే మాటలు మాత్రమే కాదు; సమాజం అంటే జనాలు మాత్రమే కాదు అంటూ ఈ మూడింటినీ ఒకే తాడుతో కట్టి అందమైన గాలిపటంలా ఎగరేసింది ప్రియా దాలి. వివిధ దృశ్య కథనాల ద్వారా అణగారిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చింది. అలాగే, వివిధ సామాజిక అంశాలపై అవగాహన కలిగించే ప్రాజెక్టులు రూపొందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. టిండర్, గోద్రేజ్ గ్రూప్ వంటి సంస్థలతో కలిసి దీర్ఘకాలిక సహకారాల్లో భాగమైంది. పిల్లల పుస్తకాల ప్రచురణలోనూ తన ముద్ర వేసి, 2023లో ‘ఆర్ యూ సీరియస్?’ అనే సృజనాత్మక సంస్థను స్థాపించింది. ఆమె కథ చూస్తే అనిపిస్తుంది. నవ్వుతూ చెప్పిన కథ కూడా సమాజాన్ని ఆలోచింప జేయగలదని!స్టయిల్కు సవాల్!: ఆకృతి రావల్‘అమ్మా! ఈ చేతిపని చీరలు యువత కూడా కట్టుకుంటారా?’ అనే ప్రశ్నే ఆకృతి రావల్ కథకు ఆరంభం. 2020లో వాట్సాప్నే దుకాణంగా మార్చి ‘హౌస్ ఆఫ్ చికంకారీ’ని ప్రారంభించింది. లక్నో చుట్టుపక్కల కళాకారుల ఇళ్లలో మోగే సూదుల శబ్దాన్ని నేరుగా యువత అల్మరాలోకి తీసుకొచ్చింది. అసలైన చికంకారీకి తోడు కశ్మీరీ ఆరికారీ వంటి మరిన్ని చేతివృత్తులను చేర్చి, సంప్రదాయాన్నే ట్రెండ్గా మార్చేసింది. కళాకారులకు నెలకొక స్థిరమైన ఆదాయం కల్పిస్తూ, అసంఘటిత మార్కెట్లో ఒక క్రమశిక్షణను తీసుకొచ్చింది. ఆమె ప్రయాణం షార్క్ టాంగ్ వేదికపై మెరిసి, పలువురు పెట్టుబడిదారుల మద్దతును సంపాదించింది. అలా సంప్రదాయానికి స్టయిల్ అద్దిన ఈ యువ పారిశ్రామికవేత్త కథ చేతిపనికీ క్లాప్స్ కొట్టేలా చేస్తోంది.కథలు నేస్తున్న కళాకారిణి: మౌమితా బసాక్పశ్చిమ బెంగాల్ పల్లెలో పెరిగిన మౌమితా బసాక్ చేతిలో సూది పడితే అది కేవలం కుట్టు కాదు, ఒక కథ మొదలవుతుంది! మనం సాధారణంగా పాత బట్ట అని పక్కన పెట్టేసేదాన్ని, ఆమె ‘ఇదే నా కాన్వాస్’ అంటూ రంగుల కలలు నేస్తుంది. సంప్రదాయ కాంతా కుట్టును ఆధునిక భావాలతో కలిపి, చీరపై చిన్న చిన్న ముచ్చట్లు కుట్టేస్తుంది. టీ, కాఫీ రంగుల సహజ మరకలు, మిగిలిపోయిన వస్త్రాల ముక్కలు ఇవన్నీ ఆమె చేతిలో పడితే వినూత్న డిజైన్లుగా మారతాయి.ఆమె డిజైన్స్ దేశం దాటి స్పెయిన్ , బ్రిటన్ , పోలండ్ వరకు చేరి ప్రశంసలు అందుకున్నాయి. రాష్ట్ర, అంతర్జాతీయ వేదికల వరకు అనేక అవార్డులు, పురస్కారాలు ఆమె ఖాతాలో చేరాయి. మహిళా సాధికారత, గ్రామీణ జీవితం, అసమానతలపై తన కుట్టులోనే సందేశాలు నేస్తూ ‘సూది చిన్నదైనా, సందేశం పెద్దది!’ అని నవ్వేస్తుంది. స్థానిక మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం ఆమెకు మరో గర్వకారణం. అలా పాతబట్టలలో కూడా కొత్త ప్రపంచం దాగి ఉంటుందని నిరూపిస్తోంది.ఇంటివద్దే సెలవుల మజా!: సిమోనా మోహన్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ఇరవై ఎనిమిది ఏళ్ల సిమోనా మోహన్, ఇప్పుడు పర్యాటక రంగంలో కొత్త పంథాను చూపిస్తోంది. పర్యావరణ హిత పర్యాటకానికి ప్రాధాన్యం ఇచ్చే సంస్థను నిర్వహిస్తోందామె. అతిథులకు కేవలం వసతి మాత్రమే కాదు, స్థానిక ప్రకృతి, సంస్కృతి, ఆహారం అన్నీ కలిసిన ప్రత్యేక అనుభవాన్ని అందిస్తోంది. నీలగిరుల మధ్య మూడు పడకగదుల కాటేజీలో కేవలం మూడువేల రూపాయలకే బస చేసే సౌకర్యంతో పాటు భోజనం, స్థానిక కొనుగోళ్లు, వాహన సదుపాయాలన్నీ ఒకే ప్యాకేజీలో ఏర్పాటు చేస్తోంది. ముందుగా ఒక ప్రాంతంలో బలపడిన తర్వాతే కొత్త మార్కెట్లలో అడుగుపెట్టాలనే స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది.చెస్ వేదికపై మహారాణి: దివ్యా దేశ్ముఖ్ఇరవై ఏళ్ల వయసులోనే చెస్ బోర్డుపై తన మేధస్సుతో ఆకాశాన్ని తాకేసింది దివ్య దేశ్ముఖ్! మహారాష్ట్రకు చెందిన ఈమె, అంతర్జాతీయ గ్రాండ్మాస్టర్ హోదా సాధించిన కొద్దిమంది భారతీయ మహిళల్లో ఒకరు. అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తనదైన ముద్ర వేసి, యువతలో చదరంగంపై ఆసక్తిని పెంచుతోంది. బోర్డుపై ఆమె నడిపే ప్రతి పావు ఒక వ్యూహం, ప్రతి కదలిక ఒక లెక్క, ప్రతి ఆట చివరికి చెక్మేట్ వైపు దారి తీసే తెలివైన అడుగు. ఎక్కడా తడబడకుండా, పాయింట్ టు పాయింట్గా ప్రత్యర్థిని కట్టడి చేస్తూ ముందుకు సాగే ఈ చిన్న మేధావి, ఇప్పుడు 2026 కాండిడేట్స్ టోర్నీపైనే ఉంది. ఆమె ఆటతీరు చూస్తే, చదరంగ బోర్డుపై రాజు, రాణి, కోట అన్నీ ఉన్నా, ఆ ఆటకు ప్రాణం పోసేది దివ్య చేతులే అనే భావన కలిగిస్తుంది.అజ్రక్కి ఆడపడుచుగా!: ముబస్సిరా ఖలీద్ ఖత్రిమూడు తరాలుగా ఆ ఇంట్లో మోగేది చెక్క ముద్రల శబ్దమే, కాని, ఆ ముద్రలు వేసేది మాత్రం మగవాళ్లే! ఆ సంప్రదాయానికి చిన్న నవ్వుతో ‘ఇప్పుడు నా వంతు’ అంటూ రంగంలోకి దిగింది ముబస్సిరా ఖలీద్ ఖత్రి. గుజరాత్ కచ్ ప్రాంతానికి చెందిన ఈమె, అజ్రక్ అనే ఆ క్లిష్టమైన ముద్రణ కళలో తొలి మహిళా కళాకారిణిగా అడుగుపెట్టి అడ్డుగోడలను బద్దలుకొట్టడమే కాదు, ఆంక్షల సరిహద్దులను కూడా చెరిపేసింది! సంప్రదాయ పద్ధతికి తన స్వేచ్ఛా చిత్రణను, హస్తకళా నైపుణ్యాన్ని జోడించి, చెక్క ముద్రల మధ్యలో కొంచెం తన స్టయిల్ చల్లి కొత్త డిజైన్స్ని చూపించింది. తర్వాత వ్యాపార నైపుణ్యాలను అభ్యసించి, కళకు వ్యాపార దక్షతను కూడా జోడించింది. ‘శ్రీ గౌరవ కిలారు సన్మాన్’ అందుకుంది. ఆమె డిజైన్స్ వస్త్రాలు దేశీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్నాయి. అనంతరం ‘ఎలీషియన్ ’ అనే తన బ్రాండ్ ద్వారా అజ్రక్ కూడా ఆధునికంగా మెరిసేలా చేసింది.మరచిపోయిన ధనం, మళ్లీ చేతిలోకి: పూజా మాలిక్, సరితా జైన్ డబ్బు పోతే బాధే కాని, ఎప్పుడో పెట్టి మరచిపోయిన డబ్బు ఒక్కసారిగా తిరిగి చేతిలో పడితే? ఆ ఆనందానికి మాటలు సరిపోవు! అదే ఆనందాన్ని అందిస్తున్న సంస్థే ‘ఈక్విట్రేసర్స్ వెల్త్ అడ్వైజర్స్’. స్థాపకురాలు పూజా మాలిక్, సహస్థాపకురాలు సరితా జైన్ కలిసి ఆర్థిక రంగంలో ఓ విభిన్న మార్గాన్ని ఎంచుకున్నారు. పెట్టుబడిదారుల విద్య, రక్షణ నిధుల పరిధిలో పనిచేస్తూ, ఎప్పుడో మరచిపోయిన బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, లాభాంశాలు వంటి ఆస్తులను గుర్తించి, వాటి అసలైన హక్కుదారులకు తిరిగి అందించే బాధ్యత తీసుకున్నారు.‘ఇది ఎక్కడో ఉంది. కానీ ఎవరిది?’ అనే గందరగోళానికి ముగింపు పలుకుతూ, వారసులను గుర్తించడం నుంచి మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, సులభంగా పూర్తి చేయడం వరకూ అండగా నిలుస్తున్నారు. వందకు పైగా వినియోగదారులతో, ముఖ్యంగా అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, విదేశాల్లో నివసించే భారతీయులతో పనిచేస్తూ, 2025 ఆర్థిక సంవత్సరంలో యాభై లక్షల రూపాయల ఆదాయం సాధించారు. మరచిపోయిన సంపదకు మళ్లీ చిరునవ్వు తెప్పిస్తున్నారు ఈ ఇద్దరూ.వైకల్యం విజయానికి అడ్డుకాదు: శీతల్ దేవి జమ్మూ కశ్మీర్ పర్వత గ్రామం నుంచి వచ్చిన పారా ఆర్చర్ శీతల్ దేవి కథ, అసాధ్యాన్ని సాధ్యం చేసిన సాహసగాథ. చేతులు లేకున్నా, తన పాదాలనే చేతులుగా మార్చుకొని విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించే ఈ క్రీడాకారిణి, ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. ఆమెలోని సహజ సమతౌల్యాన్ని గమనించిన కోచ్లు ఆర్చరీకి దారి చూపించారు. అలా పవర్ఫుల్గా ట్రైనింగ్ తీసుకొని, పదిహేడేళ్లకే భారత యువతుల్లో అతిపెద్ద ప్యారాలింపిక్ పతకాన్ని గెలిచి, ప్రపంచ చాంపియన్ గా ఎదిగింది. డిసెంబర్లో సాధారణ దేశీయ ట్రయల్స్లో మూడవ స్థానం సాధించి, సాధ్యం కేవలం ఒక పదం మాత్రమే కాదు, కష్టపడి, ధైర్యంగా ముందుకు పోయినవారి ఆస్తి అని నిరూపించింది.మెదడు ఆరోగ్యానికి, సాంకేతిక స్పర్శ: రమ్య ఎల్లాప్రగడ, లక్షయ్ సాహ్నీరమ్య ఎల్లాప్రగడ, లక్షయ్ సాహ్నీ కలిసి 2020లో ప్రారంభించిన ‘మార్బుల్స్ హెల్త్’ మెదడు ఆరోగ్యానికి కొత్త దారిని చూపుతోంది. న్యూరాకిల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ, శస్త్రచికిత్స అవసరం లేకుండా మెదడు సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టింది. మందులు, మానసిక చికిత్సలకు తోడ్పడే విధంగా వైద్య అనుమతి పొందిన నాడీ ఉత్తేజక వ్యవస్థలను అభివృద్ధి చేసింది. వీరి ప్రధాన ఉత్పత్తి ‘ఈజ్’ దేశంలోనే తొలి వైద్య అనుమతి పొందిన నాడీ ఉత్తేజక పరికరంగా గుర్తింపు పొందింది. ఇది ప్రస్తుతం ఆసుపత్రుల్లో, వైద్య పర్యవేక్షణలో, గృహ సంరక్షణలోనూ వినియోగంలో ఉంది. ప్రధానంగా మానసిక వైద్యులు, ఆసుపత్రులతో కలిసి పనిచేస్తున్న ఈ సంస్థ,‘ఆరోగ్యం అంటే శరీరానికే కాదు, మనసుకు కూడా’ అని గుర్తుచేస్తోంది.అనాథాశ్రమం తర్వాత తోడుగా!: అనీషా శర్మ, గిరీశ్ మెహతాఅనాథాశ్రమంలో పెరిగి, పద్దెనిమిదేళ్లు నిండగానే బయట ప్రపంచం ముందు నిలబడ్డప్పుడు వచ్చే ఆ గందరగోళం గిరీశ్ మెహతా, అనీషా శర్మకు బాగా తెలుసు. ‘ఇక ఇల్లు లేదు, మార్గం ఎక్కడ?’ అన్న అనుభవమే వీరిని ఒక వేదికగా మలిచింది. అదే ‘ కేర్ లీవర్స్ ఇన్నర్ సర్కిల్ సంస్థ’. సంరక్షణ గృహాల నుంచి బయటకు వచ్చే యువతే, తమలాంటి వారికోసం నడిపే ఈ సమూహం ‘మన వాళ్లు మన కోసం’ అన్న భావనను కలిగిస్తుంది.ఓటరు కార్డ్ కోసం ఏ కార్యాలయానికి వెళ్లాలి? ఆధార్ ఎలా పొందాలి? ప్రభుత్వ పథకాల సాయం ఎలా అందుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు వీరు సమాధానం మాత్రమే కాదు, తోడుగా కూడా నిలుస్తారు. వారి సహాయవాణికి అప్పటి మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మద్దతు తెలపడం మరింత ఉత్సాహం ఇచ్చింది. ఇప్పటి వరకు మూడువేల మందికి పైగా యువత ఈ వేదికతో అనుసంధానమై ఉండగా, ఐదువందల మందికి పైగా అవసరమైన పత్రాల సాధనలో నేరుగా సహాయం అందించారు. ఒక చిన్న తోడు కూడా జీవితాన్ని ఎంత పెద్దగా మార్చగలదో చాటి చెప్తోంది.ఒకప్పుడు ముప్పై ఏళ్లు అంటే ‘సెటిల్ అయ్యే వయసు’. కాని ఈ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ బ్యాచ్ చూస్తే అర్థమవుతుంది, ముప్పై అంటే సెటిల్ అవ్వడం కాదు, ప్రపంచాన్ని స్కేలప్ చేయడం అని! కాబట్టి, కలలకు డెడ్లైన్ పెట్టి, కష్టానికి కమిట్ అవ్వండి. అప్పుడు సక్సెస్ మీ అడ్రస్ వెతుక్కుంటూ వస్తుంది! - దీపిక కొండి
స్ట్రాంగ్ ఉమెన్ అవుతారా?
ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు శారీరకంగా బలంగా ఉంటే సరిపోదు.. మానసికంగానూ బలంగా ఉండాలి. అపుడే అన్ని రంగాల్లోనూ రాణించగలుగుతారు. అందుకోసం కొన్ని అలవాట్లను మార్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఒక చిన్న అలవాటు మీ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలదు, అదే సమయంలో పూర్తిగా దెబ్బతీయగలదు కూడా. మిమ్మల్ని మీరు ఒక స్ట్రాంగ్ ఉమెన్గా చూసుకోవాలనుకుంటే, మీరు అలవర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అలవాట్లు..భావోద్వేగాలపై నియంత్రణ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక బలంతో పాటే మానసికంగా దృఢంగా ఉండటమూ చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉపయోగించడమే మానసిక దృఢత్వానికి మొదటి మెట్టు. ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో తెలిసుండాలి. కోపం, బాధ కలిగినపుడు కుంగిపోకుండా.. ఆ భావాలను అర్థం చేసుకుని మరింత మానసిక పరిపక్వతతో ముందుకు సాగుతుండాలి.నో చెప్పడమే బెటర్అందరినీ మెప్పించాలనేం లేదు. అలా ప్రయత్నిస్తే మానసిక అలసట తప్పదు. అందుకే ఎదుగుదలకు, మనశ్శాంతికి అడ్డుపడే విషయాలకు నిర్మొహమాటంగా నో అని చెప్పగలగాలి. ఇందులో ఎటువంటి గిల్టీ ఫీలింగ్ని కలిగి ఉండకూడదు. సమయానికి విలువ ఇవ్వడం, అనవసరమైన బాధ్యతలను తిరస్కరించడం అనేది స్వార్థం కాదు, మీ ఆత్మగౌరవానికి నిదర్శనం.‘కాదు’ అని చెప్పగలగడం విజయానికే కాదు, ప్రశాంతమైన జీవనానికి కూడా తోడ్పడుతుంది.తప్పుల నుంచి పాఠాలుఓటమికి భయపడని వారే విజేతలుగా నిలుస్తారు. తమ తప్పులకు ఇతరులను నిందించకూడదు. బాధ్యత తీసుకోవాలి, లోపాలను విశ్లేషించుకోవాలి. ఆ తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలి. ఈ నేర్చుకునే తత్వం అన్ని పరిస్థితుల్లోనూ మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది.నేర్చుకోవడానికి సిగ్గుపడకపోవడం తమకు అన్నీ తెలుసు అని ఎప్పుడూ అనుకోకూడదు. తమకున్న జ్ఞానంపై నమ్మకం ఉన్నప్పటికీ, ఇతరుల అనుభవాలకు విలువ ఇవ్వాలి. ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు దానిని మనస్ఫూర్తిగాస్వీకరించాలి. ఇతరులలోని మంచిని, గొప్ప లక్షణాలను అడాప్ట్ చేసుకోవడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు. ఈ లక్షణాలు అలవర్చుకుంటే ఏ మహిళ అయినా తన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలదు.అసూయ పడకపోవడం మానసిక బలానికి ప్రధాన వనరు అసూయ లేకపోవడం. ఇతరుల విజయాన్ని చూసి కుళ్లుకోవద్దు. బదులుగా వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరని గుర్తించాలి. ఇతరులతో పోల్చుకోవడం మానేసి, నిన్నటి కంటే ఈరోజు తాము ఎంత మెరుగ్గా ఉన్నాము అనే దానిపైనే దృష్టి పెట్టాలి.చదవండి: ట్రావెలింగ్ నుంచి హోస్టింగ్ వరకుమార్పును స్వీకరించాలిప్రపంచంలో మార్పు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. మార్పును చూసి భయపడకుండా దానిని ఒక అవకాశంగా మలచుకోవాలి. అది కెరీర్ అయినా.. వ్యక్తిగత జీవితం అయినా పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. గతాన్ని తలచుకుని బాధపడటం కంటే, భవిష్యత్తు కోసం ప్రస్తుతం ప్రణాళికలు రచించుకోవాలి.
మహిళా ఉద్యోగులకు తప్పని తిప్పలు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరి సంఖ్య పెరుగుతోంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు తగిన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం కూడా చేసింది. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కనిపించడం లేదు. విధి నిర్వహణలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికి చెప్పుకోలేని బాధలతో అల్లాడుతున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులను పనిసమయం ముగిసినప్పటికీ గంటల తరబడి పనులు చేయిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాగేనా మహిళలను గౌరవించేది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లు ఏవీ? ప్రభుత్వ కార్యాలయాల్లో విధిగా మహిళా రక్షణ సెల్ (ఉమెన్ ప్రొటెక్షన్ సెల్) ఉండాలని కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం చెబుతోంది. కలెక్టరేట్ కాంప్లెక్స్, సంక్షేమభవన్, సర్వజనవైద్యశాల, జిల్లా పరిషత్, నగరపాలకసంస్థ, ఆర్డీవో కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. వీటిలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కనిపించడం లేదు. వాటి బాధ్యతలను మహిళలకే అప్పగించాల్సి ఉంది. సంబంధిత కార్యాలయాల్లో మహిళలు ఏ విధంగా వేధింపులకు గురైనా, మహిళలకు సంబంధించిన పైళ్లు పెండింగ్లో పెట్టినా.. మహిళల హక్కులు, ప్రయోజనాలకు భంగం కలిగించినా ఈ సెల్లో ఫిర్యాదు చేయవచ్చు. మహిళల నుంచి ఫిర్యాదులు వస్తే ఈ విభాగం ఇన్చార్జ్లు సంబందిత హెచ్ఓడీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే వీలుంది. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటులో ప్రభుత్వం చేసిన చట్టం కాగితాల మీద ఉంది తప్ప కార్యరూపం దాల్చడం లేదు.ప్రత్యేక సదుపాయాలు నిల్అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండాలి. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవి కనిపించడం లేదు. అంతేగాకుండా మహిళలకు ప్రత్యేక వెయిటింగ్ రూమ్ ఉండాలి. మధ్యాహ్నం భోజనం చేయడానికి, అరగంటపాటు విశ్రాంతి తీసుకోవడానికి వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కాని ఎక్కడా మహిళలకు వెయిటింగ్ రూములు లేవు. ప్రస్తుతం గ్రామస్థాయి కార్యాలయం నుంచి మండలం, డివిజన్, జిల్లా స్థాయి కార్యాలయాల వరకు మహిళా ఉద్యోగులు ఉన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో చెప్పుకోలేని బాధలతో సతమతం అవుతున్నారు.పస్తులే దిక్కు ప్రభుత్వ మహిళ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనంలో కూడిన 180 రోజుల మెటర్నటీ లీవ్లు ఉన్నాయి. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో మహిళలు 50 శాతం వరకు ఉన్నారు. మహిళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలల పాటు మెటర్నటీ లీవ్లు ఇస్తున్నప్పటికీ ఈ కాలానికి వేతనాలు చెల్లించడం లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అంతంతమాత్రంగా రూ.20 వేలలోపు ఉన్నాయి. వేతనంతో కూడిన సెలవులు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఆరు నెలలు మెటర్నటీ లీవ్ల్లో ఉన్న సమయానికి ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వీరికి వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్లు ఇవ్వాలని ఉద్యోగసంఘాలు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం స్పందిచడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సౌకర్యాలు కను‘మరుగు’ జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టరేట్లోనే మహిళా ఉద్యోగులకు కనీస సదుపాయాలు లేవు. కలెక్టరేట్లో 30 ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల కార్యాలయాలు ఉన్నాయి. రెవెన్యూ, పౌరసరఫరాలు, సర్వే, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, డీఆర్డీఏ, డ్వామా, సహకార శాఖ, ప్రణాళిక విభాగం తదితర కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో మహిళా ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. రన్నింగ్ వాటర్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెస్ట్ రూములు లేవు. కొన్ని శాఖల్లో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లు కాగితాల మీదనే కనిపిస్తున్నాయి. రెస్ట్ రూములు ఏర్పాటు చేయాలి మహిళా ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు సానుభూతితో వ్యవహించాలి. ప్రధానంగా వార్డు, గ్రామ సచివాయాల్లో పనిచేసే వారికి పని ఎక్కువగా ఉంటోంది. ఉదయం 8 గంటలకే విధులకు వెళ్లి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పనిచేయాల్సి వస్తోంది. మొత్తంగా 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు కచ్చితమైన పని వేళలు అమలు చేయాలి. మహిళలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రెస్ట్ రూములు ఏర్పాటు చేయాలి. – ఎస్.చందన, ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వ శాఖల్లో మహిళా ఉద్యోగులు సంఖ్య భారీగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్లకుండా ఆఫీసుల్లోనే భోజనాలు చేస్తున్నారు. ఇటువంటి వారికి తగిన వసతి కలి్పంచాలి. ఉమన్ ప్రొటెక్షన్ సెల్లను మరింత పకడ్బందీగా అమలు చేయాలి. మరుగుదొడ్లను ఆధునీకరించాలి. మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. – సరస్వతి, మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం నేత
AI నైపుణ్యాల్లో మహిళల దూకుడు.. అధ్యయనంలో వెల్లడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పని వాతావరణాన్ని సమూలంగా మారుస్తున్న ప్రస్తుత తరుణంలో... భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఏఐని స్వీకరించడంలో పురుషులతో సమానంగానే కాకుండా, వారి కంటే ముందున్నారని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన 'లింక్డ్ఇన్' తాజా పరిశోధనలో వెల్లడైంది.లింక్డ్ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలోని మహిళా నిపుణుల్లో 90 శాతం మంది... కార్యాలయాల్లో ఏఐ సాధనాలను ఉపయోగించడం పట్ల తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని చెప్పారు. ఇది పురుషుల (86%) కంటే ఎక్కువ. అంతేకాకుండా, ఏఐ సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో కూడా మహిళలు మరింత చురుకుగా ఉన్నారు. తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి 35 శాతం మంది మహిళలు చురుకుగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటుండగా, పురుషుల్లో ఈ సంఖ్య 29 శాతంగా మాత్రమే ఉంది.ఈ సానుకూల ధోరణి కేవలం కార్యాలయాలకే పరిమితం కాలేదు. వ్యాపారవేత్తల విభాగంలో కూడా... తమ కంపెనీల వృద్ధిపై పురుషుల (66%) కంటే మహిళా వ్యవస్థాపకులు (78%) అత్యంత సానుకూలంగా ఉన్నారు. తమ వ్యాపారాలను మరింత విస్తరించడానికి వీరు 'ఏఐ ఆధారిత ఆటోమేషన్', స్మార్ట్ వర్క్ఫ్లోలు మరియు డేటా ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. తమ సంస్థల్లో 'డిజిటల్ పరివర్తన'కు నాంది పలుకుతున్నారు.దీనిపై లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పర్ట్, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరాజితా బెనర్జీ మాట్లాడుతూ.. “భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఏఐ సాధనాలను ఉపయోగించడంలో బలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. లేబర్ మార్కెట్ వాస్తవ పరిస్థితులు మాత్రం కాస్త నిరాశజనకంగానే ఉన్నాయి. లింక్డ్ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం ఇప్పటికీ 28.1% శాతంతో చాలా తక్కువగా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి కేవలం సాంకేతికత ఒక్కటే సరిపోదు. అయితే ఇక్కడో ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే... ఇప్పటికే విధుల్లో ఉన్న అనేక మంది మహిళలు ఏఐ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మరింత ఉత్పాదకతను సాధించే సాధనంగా వారు ఏఐని చూస్తున్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలకు అవసరమైన ఏఐ నైపుణ్యాలను వారు వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. పనిలో (ప్రాజెక్టులలో) తమ ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపించడానికి, నాయకత్వ పాత్రల్లో ఎదగడానికి మహిళలకు ఏఐ ఒక బలమైన సాధనంగా ఉపయోగపడుతుంది," అని అన్నారు.వృత్తిపరమైన ఎదుగుదలకు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో మహిళా నిపుణుల కోసం లింక్డ్ఇన్ చెబుతున్న ఐదు సూచనలు ఇక్కడ ఉన్నాయి:👉మనిషి చేసే పనులకు ఏఐని జతచేయండి: విశ్లేషించడం, నిర్వహించడం మరియు పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐని ఉపయోగించండి. ఆ మిగిలిన సమయాన్ని... మనుషులకు మాత్రమే సాధ్యమయ్యే నైపుణ్యాలైన బృంద స్ఫూర్తిని పెంపొందించడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు సానుభూతిని ప్రదర్శించడం కోసం కేటాయించండి.👉మీ సొంత అభ్యాసానికి ఏఐని ఉత్ప్రేరకంగా మార్చుకోండి: అనుబంధ రంగాలను అన్వేషించడానికి, కొత్త విషయాలను త్వరగా నేర్చుకోవడానికి లేదా నైపుణ్యాల లోపాలను గుర్తించడానికి ఏఐని ఉపయోగించండి. మీ ఉద్యోగ పాత్ర, లక్ష్యాలు మరియు ఇప్పటికే ఉన్న నైపుణ్యాల ఆధారంగా నేర్చుకోవాల్సిన కొత్త కోర్సులను... లింక్డ్ఇన్ లెర్నింగ్ యొక్క 'ఏఐ-పవర్డ్ కోచింగ్’ మీకు సూచిస్తుంది. అసలు ఎక్కడ ప్రారంభించాలో తెలియని గందరగోళాన్ని ఇది తొలగిస్తుంది.👉 మీ మానవ నైపుణ్యాలను విస్తృతం చేసుకోండి: మీ సామర్థ్యాలను పదునుపెట్టే సహచరుడిగా ఏఐని భావించండి. కొత్త ఆలోచనలను పరీక్షించడానికి, సృజనాత్మక పరిష్కారాల కోసం లేదా రాబోయే ఫలితాలను ముందుగానే అంచనా వేయడానికి దీనిని ఉపయోగించండి. ఏఐతో మీ భాగస్వామ్యం మీ ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుంది. మంచి ఆలోచనలను... అందరూ ఆమోదించదగిన, డేటా-ఆధారిత ప్రతిపాదనలుగా మార్చడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.👉 ప్రాంప్ట్ ఇవ్వడంలో ప్రావీణ్యం పొందండి: ఏఐ సాధనాల వాడకంపై అవగాహన ఉండటం నేడు తప్పనిసరి. అయితే ఆ సాధనాలకు సరైన ఆదేశాలు ఇవ్వడం తెలిస్తేనే అసలైన ప్రయోజనం కలుగుతుంది. సమర్థవంతమైన ప్రాంప్ట్లను (కమాండ్స్ను) రూపొందించడం నేర్చుకోండి. ఈ నైపుణ్యం మిమ్మల్ని హైబ్రిడ్ ప్రొఫెషనల్గా మారుస్తుంది. ఏ సంస్థకైనా మీరు అత్యంత ఆవశ్యకమైన ఉద్యోగిగా మారుతారు.👉 కేవలం రోజువారీ పనులకే కాదు, మీ కెరీర్ కోసం ఏఐని ఉపయోగించండి: ఏఐని కేవలం ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేయడానికి మాత్రమే పరిమితం చేయకండి. మీ వృత్తిపరమైన భవిష్యత్తును నిర్వహించుకోవడానికి దాన్ని అనుమతించండి. లింక్డ్ఇన్ యొక్క 'ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్' వంటి సాధనాలతో, మీరు సహజ భాషను ఉపయోగించి మీ లక్ష్యాలు మరియు నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాల కోసం వెతకవచ్చు. ఆ ఉద్యోగానికి మీరు ఎంతవరకు సరిపోతారో లింక్డ్ఇన్ యొక్క 'జాబ్ మ్యాచ్' మీకు స్పష్టంగా చూపిస్తుంది.👉ఏఐ కేవలం మీరు పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి మాత్రమే కాకుండా... మీ భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి అవసరమైన సమయాన్ని కూడా ఇస్తుంది. వేగంగా మారుతున్న పరిస్థితులను ఎదుర్కొంటున్న మహిళా నిపుణులకు, ఏఐని స్వీకరించడం అనేది ఒక కెరీర్ అడ్వాంటేజ్ మాత్రమే కాదు.. వారు కోరుకునే కెరీర్ వైపు పయనించడానికి ఇది ఒక స్పృహతో కూడిన పిలుపు.
అంతర్జాతీయం
లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యం సీక్రెట్ ఆపరేషన్
పశ్చిమాసియా మెుత్తం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దాడులు ప్రతి దాడులతో ఆ ప్రాంతంలో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇజ్రాయెల్ బలగాలు ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నాయి. 1986 యుద్ధంలో మృతిచెందిన ఓ సైనికుడి మృతదేహం కోసం అర్థరాత్రి వేళ గాలింపులు జరిపాయి.ప్రస్తుతం లెబనాన్లోకి ఇజ్రాయెల్ సైన్యం చొచ్చుకెళ్లింది. ఆ దేశంలోకి చొరబడి హిజ్బుల్లా, హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అక్కడ టెల్ అవీవ్ ఒక ఆసక్తికర ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. 1986లో లెబనాన్తో యుద్ధం సమయంలో రాన్ అరాద్ అనే ఇజ్రాయెల్ ఫైలట్ మరణించాడు. హెజ్బొల్లా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్పై దాడిచేయగా అది తూర్పు లెబనాన్లోని బెక్కా లోయ సమీపంలో నబిట్ అనే గ్రామం వద్ద కూలిపోయింది.అయితే ఆరోజు జరిగిన దాడిలో ఫైలట్ అరాద్ మరణించినట్టు ఇజ్రాయెల్ అప్పుడే నిర్ధారించింది. ఆయన మృతదేహాన్ని వెనక్కితీసుకురావడానికి ప్రయత్నాలు జరుపగా అవి ఫలించలేదు. అయితే ప్రస్తుతం దానికి సరైన సమయం అని భావించిన ఇజ్రాయెల్ ప్రత్యేక కమెండోలను రంగంలోకి దించింది. నాలుగు సైనిక హెలికాప్టర్లతో శుక్రవారం రాత్రి వేళ నబిట్ ప్రాంతానికి చేరుకొని గాలింపులు చేపట్టారు.తాజాగా ఆ ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని పంచుకున్నారు. "ఇజ్రాయెల్ సైనికులు నాలుగు హెలికాప్టర్లలో వచ్చారు. ఆ లోయ ప్రాంతంలో ఆ సైనికుడి మృత దేహం కోసం తవ్వకాలు జరిపారు. అయితే వారికి ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. అయితే అతని డెడ్బాడీ కోసం మరోసారి వెతుకతామని వారు తెలిపారు" అని గ్రామస్థులు పేర్కొన్నారు.అయితే అరాద్ అవశేషాలు దొరికే దాకా గాలింపు కొనసాగుతాయని ఇజ్రాయెల్ పేర్కొంది. దీంతో ఇజ్రాయెల్ తమ దేశ సైనికులకు ఎంత గౌరవం ఇస్తుందా అనే విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే అరాద్ను ఎక్కడ పూడ్చిందీ తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్.. హెజ్బొల్లా దళాలను విచారించి ఆ ఆధారంగానే ఈ ఆపరేషన్ చేపట్టిందని సమాచారం.
ఇరాన్ దాడులు.. మృతుల వివరాలు ప్రకటించిన యుఏఈ
ఓ వైపు తమ పరిసర దేశాలపై దాడులు చేయమని ప్రకటించిన ఇరాన్... మరోవైపు అటాక్స్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న దుబాయిపై మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకపడినట్లు యూఏఈ తెలిపింది. ఇప్పటి వరకూ ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు విదేశీ పౌరులు మృతి చెందగా 112 మంది గాయపడ్డట్లు యుఏఈ రక్షణ శాఖ ప్రకటించింది.అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాలపై అటాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాల్లోని యుఎస్ఏ మిలిటరీ స్థావరాలే లక్షంగా దాడులకు తెగబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నిన్న (శనివారం) స్పందించారు. గల్ఫ్ దేశాలపై దాడులు జరిపినందుకు క్షమాపణలని ఇకపై దాడులు జరపమన్నారు. అయితే వారి దేశం నుంచి అమెరికా దాడులు చేయకుండా చూసుకోవాలని కోరారు. అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. యుఏఈపై ఇరాన్ దాడులు జరుపుతున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిందియుఏఈ డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ చేస్తూ "7 వతేదీ శనివారం రోజు యుఏఈ పై ఇరాన్ 16 బాలిస్టిక్ క్షిపణులు, 121 డ్రోన్లు ప్రయోగించింది. వాటిలో 15 క్షిపణులు, 119 డ్రోన్లు గాలిలోనే కూల్చివేయబడ్డాయి. ఇప్పటివరకూ మెుత్తంగా 221 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించబడగా 205 క్షిపణులను గాలిలోనే కూల్చివేశాము. 14 సముద్రంలో పడ్డాయి. 2 క్షిపణులు మాత్రం యూఏఈ భూభాగాన్ని తాకాయి. అదేవిధంగా 1,305 డ్రోన్లను ప్రయోగించగా 1,229 కూల్చివేశాము. 76 డ్రోన్లు భూభాగాన్ని తాకాయి." అని తెలిపిందికాగా ఇప్పటి వరకూ ఈ దాడులలో ముగ్గురు విదేశీ పౌరులు మృతి చెందారని వారు పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ జాతీయులను పేర్కొంది. అయితే ఇరాన్ జరిపిన అటాక్స్ వల్ల 112 మందికి స్వల్ప గాయాలయ్యాయాయని అందులో వివిధ దేశాలకు చెందిన ప్రజలున్నారని యుఏఈ రక్షణ శాఖ వెల్లడించింది.
దుబాయ్: మెరీనా టవర్పై ‘బాలిస్టిక్’ శకలాలు.. యూఏఈ అప్రమత్తం
దుబాయ్: గల్ఫ్ తీరంలో యుద్ధ మేఘాలు విస్తరిస్తున్న తరుణంలో దుబాయ్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకున్నప్పటికీ, ఆ క్షిపణి శకలాలు దుబాయ్ మెరీనాలోని ఒక ఎత్తైన భవనంపై పడటంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. శనివారం జరిగిన ఈ ఘటనలో భవనం పైభాగం నుంచి దట్టమైన పొగలు వెలువడటాన్ని అధికారులు గుర్తించారు.గల్ఫ్ రీజియన్లో ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తన గగనతల భద్రతను మరింత పటిష్టం చేసింది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన 16 బాలిస్టిక్ క్షిపణులు, 121 డ్రోన్లను యూఏఈ రక్షణ విభాగం గుర్తించింది. వీటిలో 15 క్షిపణులను, 119 డ్రోన్లను గాలిలోనే కూల్చివేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కూల్చివేసిన ఒక క్షిపణి శకలాలు దుబాయ్ మెరినాలోని ఒక టవర్ ఫాసాడ్పై పడటంతో స్వల్ప నష్టం వాటిల్లింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని దుబాయ్ ప్రభుత్వ మీడియా విభాగం తెలిపింది.యుద్ధ సంక్షోభం మొదలైన తర్వాత మొదటిసారిగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అబుదాబి టీవీలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘మనం ఇప్పుడు యుద్ధ సమయంలో ఉన్నాం. ఈ గడ్డుకాలాన్ని ఎదుర్కొని మరింత శక్తివంతంగా మారుతాం’ అని ఆయన దేశప్రజల్లో ధైర్యాన్ని నింపారు. దేశ భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ పొరుగు దేశాలపై జరుగుతున్న దాడులపై విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, అమెరికాతో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో పొరుగు దేశాలకు కలిగిన ఇబ్బందులకు ఆయన క్షమాపణలు తెలిపారు.తమపై దాడులు జరిగితే తప్ప, తాము ఏ పొరుగు దేశంపైకి క్షిపణులను ప్రయోగించబోమని ఇరాన్ స్టేట్ టీవీ వేదికగా ప్రకటించారు. అయితే, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేసిన 'బేషరతు లొంగుబాటు'ను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇరాన్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న ఇరాన్ అణు కార్యకలాపాలకు నిరసనగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో ఇరాన్పై భారీ దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ♦️ התקפת כטב"ם על מגדל רב הקומות בעיר דובאי pic.twitter.com/swNhyNGk4z— Asslan Khalil (@KhalilAsslan) March 7, 2026
పూటకో మాట!
ఒకటే నోరు. కానీ పూటకో మాట. రోజుకోవైఖరి. ఇరాన్ యుద్ధంపై అమెరికా, ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి విస్మయం గొలుపుతోంది. సహేతుకమైన కారణమేదీ లేకుండానే ఏకపక్షంగా తెర తీసిన ఈ యుద్ధాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక అగ్ర రాజ్యం కిందా మీదా పడుతోంది. ఫిబ్రవరి 28న శనివారం ఇజ్రాయెల్తో కలిసి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరిట ఇరాన్పై అమెరికా భారీ స్థాయి యుద్ధానికి దిగడం తెలిసిందే. ఆ క్రమంలో యుద్ధ కారణాలకు సంబంధించి ట్రంప్ మొదలుకుని ఆయన యంత్రాంగంలోని ఇతర నేతల దాకా పదేపదే మాట మారుస్తూ నవ్వులపాలు అవుతున్నారు.ఇప్పటికీ కనీసం ఒక్కటంటే ఒక్క ఆమోదయోగ్యమైన కారణం కూడా చూపలేకపోయారు. ఫలితంగా ట్రంప్ సర్కారు సొంత ప్రజల దృష్టిలోనే పలుచన కావడంతో పాటు స్వదేశంలో శరవేగంగా ఆదరణ కోల్పోతోంది. ఇరాన్లో నాయకత్వ మార్పే లక్ష్యమని ట్రంప్ తొలుత చెప్పారు. తర్వాత అణు ముప్పును బూచిగా చూపారు. కొన్ని కారణాలైతే పరస్పర విరుద్ధంగా కూడా ఉండటం విశేషం! ఇలా యుద్ధం మొదలైన ఈ 8 రోజుల్లోనే ట్రంప్, ఆయన యంత్రాంగం పదేపదే మాట ఎలా మారుస్తూ వచ్చిందంటే...ఇరాన్ విముక్తి కోసమే!ఇరాన్ మత పాలకుల దశాబ్దాల దమననీతికి బదులిచ్చేందుకు, వారి బారినుంచి ఆ దేశాన్ని విముక్తం చేసేందుకే యుద్ధం మొదలు పెట్టినట్టు ఫిబ్రవరి 28న శనివారం ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ పెట్టారు. ‘‘ఇరాన్ నుంచి ప్రపంచానికి అణు ముప్పు పొంచి ఉంది. దానికి చరమగీతం పాడబోతున్నాం. అలాగే ఇరాన్ క్షిపణి వ్యవస్థను కూడా పూర్తిగా నేలమట్టం చేయబోతున్నాం’’ అని 8 నిమిషాల వీడియోలో చెప్పుకొచ్చారు. అంతేగాక, ‘‘ఈ సువర్ణావకాశాన్ని ఇరాన్వాసులు అందిపుచ్చుకోవాలి. దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకునే సాహసం ప్రదర్శించాలి’’ అంటూ పిలుపునిచ్చారు! అనంతరం తొలి బాంబులు ఇరాన్ను తాకిన కాసేపటికి ఆక్సియోస్ న్యూస్ వెబ్సైట్తో ట్రంప్ మాట్లాడారు. ‘‘యుద్ధాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగిస్తా. లేదంటే రెండు మూడు రోజుల్లోనే ముగించేస్తా. మా దాడి నుంచి కోలుకునేందుకు ఇరాన్కు ఎలాగూ ఏళ్లు పడుతుంది’’ అని చెప్పుకొచ్చారు.స్వీయ రక్షణకే!ఫిబ్రవరి 28న యుద్ధం మొద లైన కాసేపటికే ఐక్యరాజ్య సమితిలో యూఎన్ మిషన్ మరో వైఖరి తీసుకుంది. స్వీయరక్షణ కోసమే ఇరాన్పై దాడికి దిగాల్సి వచ్చిందంటూ భిన్న స్వరం వినిపించింది! ‘‘ఇరాన్ క్షిపణి పాటవం, అణ్వాయుధ ఆకాంక్షలు గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలకు పెను ముప్పుగా మారాయి. అందుకే దానిపై దాడులు తప్పలేదు’’ అని చెప్పుకొచ్చింది. శాంతియుత పరిష్కారం కోసం ఎంతగా సంప్రదింపులు జరిపినా లాభం లేకపోయిందంటూ ఐరాసలో అమెరికా రాయబారి వైక్ వాల్జ్ మొసలి కన్నీరు కార్చారు. ‘‘కనుక ఇజ్రాయెల్తో కలిసి దాడులకు దిగక తప్పలేదు. యూఎన్ చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం మా చర్య పూర్తిగా చట్టబద్ధమే’’ అంటూ వాదించారు. తమ చర్యను స్వాగతిస్తూ ఇరాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి మరీ పండుగ చేసుకుంటున్నారని అదేమీ లేదు!ఐరాసలో అమెరికా వినిపించిన స్వరాన్ని పెంటగాన్ వర్గాలు ఆ మర్నాడే ఖండించడం విశేషం! యుద్ధం మొదలైన మర్నాడు మార్చి 1న తాజా పరిస్థితిని అవి కాంగ్రెస్కు నివేదించాయి. ఆ క్రమంలో, ‘‘గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై గానీ, సిబ్బందిపై గానీ తొలుత దాడులకు దిగే ఉద్దేశం ఇరాన్కు ఏమాత్రమూ లేదు. దానిపై ఇజ్రాయెల్ తొలుత దాడి చేస్తే తప్ప ఇరాన్ నాయకత్వం అలాంటి ఆలోచన కూడా చేయబోదు’’ అని స్పష్టం చేశాయి!రూబియోను ఖండించిన ట్రంప్!రూబియో వ్యాఖ్యలను ఆ మర్నాడే ట్రంప్ ఖండించారు. ఇరాన్పై సైనిక చర్యకు దిగాలన్న నిర్ణయం పూర్తిగా తనదేనని మార్చి 3న స్పష్టం చేశారు. ‘‘ఇజ్రాయెల్ మమ్మల్ని ఒత్తిడి చేయడమేమిటి? అయితే గియితే మేమే ఇజ్రాయెల్ను ఒత్తిడి చేశామని చెప్పాలి’’ అని కూడా అన్నారు. ఇరాన్ దురుద్దేశాలే సైనిక చర్యకు కారణం తప్ప ఇజ్రాయెల్ కాదన్నారు. దాంతో రూబియో కంగుతిన్నారు. ముందు రోజు తాను చేసిన వ్యాఖ్యలను మీడియానే సందర్భరహితంగా చూపించి దురుద్దేశాలు ఆపాదించిందంటూ నాలిక మడతేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్రూబియో భిన్న స్వరంపెంటగాన్ వర్గాల వ్యాఖ్యలు చేసిన మర్నాడే, అంటే మార్చి 2న అందుకు పూర్తి భిన్నంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. ‘‘ఇరాన్ ఏ క్షణంలోనైనా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై దాడి చేయొచ్చు. ఇరాన్ సైనిక ఫీల్డ్ కమాండర్లకు ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్పై దాడి యోచనలో ఉన్నట్టు నాకు కచ్చితమైన సమాచారముంది. అప్పుడు మన స్థావరాలకూ ముప్పు తప్పదు. కనుక మనమే ముందస్తు దాడులకు దిగడం తప్ప మరో మార్గం లేదు. లేదంటే భారీగా నష్టపోతాం’’ అని క్యాపిటల్ హిల్ భవనంలో జరిగిన ఉన్నత స్థాయి రహస్య భేటీలో చెప్పుకొచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మాత్రం తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ ఇరాన్పై దాడికి దిగుతుండటంతో తమకూ మరో మార్గం లేకపోయిందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు!ట్రంప్ను చంపాలనుకున్నారు!మార్చి 4న పెంటగాన్ బ్రీఫింగ్లో అమెరికా రక్షణ మంత్రి ఇరాన్పై యుద్ధానికి సరికొత్త కారణాన్ని తెరపైకి తెచ్చారు. ‘‘ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నింది. ఇరాన్ ఐఆర్జీసీ సైనిక యూనిట్ కమాండర్కు ఈ మేరకు బాధ్యతలు కూడా అప్పగించింది. కానీ (ఖమేనీ హత్య ద్వారా) వారిపై ట్రంపే పై చేయి సాధించారు’’ అని చెప్పుకొచ్చారు!
జాతీయం
బెంగాల్ సీఎంపై రాష్ట్రపతి ముర్ము ఆగ్రహం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగ్రహg వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో తన పర్యటనకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక ఎంపిక అంశానికి సంబంధించి ఏర్పాట్లను సరిగా చేయకపోవడాన్ని ముర్ము ఆక్షేపించారు. 9వ అంతర్జాతీయ సంతల్ సదస్సులో పాల్గొనడానికి సిలిగురికి వచ్చిన ముర్ము.. ముఖ్యమంత్రి నుంచి, రాష్ట్ర మంత్రుల నుంచి కూడా తనకు ఆహ్వానం అందలేదన్నారు. ‘మమత నా చెల్లెలు లాంటిది. బహుశా ఆమె కోపంగా ఉండవచ్చు. నేను బెంగాల్ పర్యటనకు వస్తే ఆమె నన్ను పట్టించుకోలేదు. సంతాల్ దివస్కు సరైన ఏర్పాట్లు చేయలేదు. ఆ కార్యక్రమానికి మమత హాజరు కాకపోవడం నన్ను బాధించింది.ఆమె అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఇంత ఇరుకైన ప్రదేశంలో నిర్వహించాలని ఎంచుకుందో నాకు తెలియదు. వేదిక పెద్దదిగా ఉంటే, సమావేశానికి ఎక్కువ మంది హాజరయ్యేవారు అని ఆమె బిధాన్నగర్లో జరిగిన మరో కార్యక్రమంలో స్పష్టం చేశారు.. బిధాన్నగర్లో సమావేశం జరిగి ఉంటే ఐదు లక్షల మంది సులభంగా హాజరయ్యేవారని కూడా ముర్ము ప్రధానంగా ప్రస్తావించారు.రాష్ట్రపతితో రాజకీయాలు సరికాదురాష్ట్రపతితో కూడా రాజకీయాలు చేయాలనుకోవడం సరైనది కాదని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతిని టీఎంసీ అవమానించింది. టీఎంసీ హద్దు మీరి ప్రవర్తిస్తోంది’ అని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
టెన్త్ పాసైన వారికి మమతా బెనర్జీ గుడ్ న్యూస్
కోల్కాతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరుద్యోగ యువతకు తీపి కబురు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పదో తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు నెలకు రూ.1500 ఇస్తామని ప్రకటించారు. నేటి నుంచే( మార్చి 7, శనివారం) ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ‘యువ సాథీ’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని.. 21-40ఏళ్ల వారు ఈ పథకానికి అర్హులుగా మమతా బెనర్జీ తెలిపారు. కేవలం స్కాలర్షిప్లు తప్ప ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందని వారు మాత్రమే దీనికి అర్హులన్నారు.వాస్తవానికి ఏప్రిల్ 1 నుండి ప్రారంభం ఈ పథకం ప్రారంభం కావాల్సిఉందని.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) కానుకగా ఒక రోజు ముందుగానే ఇవాళ నుంచి (మార్చి7) నుంచే అమలు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఓటరు జాబితా సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ ప్రకటన చేశారు.కాగా, సీఎం తన ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక గణాంకాలను వెల్లడించారు. బెంగాల్లో నిరుద్యోగిత రేటు 40 శాతం తగ్గిందని ఆమె పేర్కొన్నారు. 'ఉత్కర్ష బంగ్లా' ద్వారా 40 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా.. అందులో 10 లక్షల మందికి ఉపాధి లభించిందని మమతా తెలిపారు.బెంగాల్ చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో (MSME) దేశంలోనే నంబర్ వన్గా ఉందని.. దాదాపు 1.5 కోట్ల మంది ఈ రంగంలో పని చేస్తున్నారని వివరించారు. బెంగళూరు కంటే బెంగాల్లోనే ఐటీ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తోందంటూ ఆమె వ్యాఖ్యానించారు. రైతులకు నెలకు రూ.10,000 ఇస్తున్నామని, భూమి లేని రైతులకు కూడా రూ. నాలుగు వేలు సహాయం అందిస్తున్నామని తెలిపారు. బీర్భూమ్ జిల్లాలోని దేవుచా పచామి బొగ్గు గనుల ద్వారా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని.. రాబోయే 100 ఏళ్ల వరకు రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని మమతా ధీమా వ్యక్తం చేశారు.
తన లవ్తో అమ్మ..అపుడు ఎంత ఏడ్చానో నాకే తెలియదు!
కనిపెంచిన బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడం,పెళ్లిళ్లు చేయడం చాలా కామన్. అదే సమయంలో ఒంటరి తల్లితండ్రుల కోసం ఆలోచించడం, వారికి మళ్లీ ప్రేమను పరిచయం చేయడం పెళ్లి చేయడం లాంటి ఘటనలు కూడా చూశాం.తల్లిగానీ, తండ్రి గానీ మళ్ళీ ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం అనేది ఏ బిడ్డకైనా చాలా అరుదైన, భావోద్వేగంతో కూడిన క్షణం. అలాంటి హృదయాన్ని హత్తుకునే వేడుక ఒకటి నెట్టింట సందడిగా మారింది.పూజా భట్నాగర్ అనే యువతికి తన తల్లి వివాహ వేడుకను కళ్ళారా చూసే అదృష్టం దక్కింది. ఆ అద్భుతమైన క్షణాలను ఆమె సోషల్ మీడియాలో పంచు కున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన తల్లిదండ్రుల మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, పూజా తన తల్లి పెళ్లికి సంబంధించిన దృశ్యాలను ఒక వీడియో రూపంలో షేర్ చేసింది. తల్లి ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కుమార్తెగా మెరిసిపోతూ కనిపించారు. అలాగే ఒక ఏడాది క్రితం వివాహ సమయంలో పూజ పోస్ట్ చేసిన మరొక వీడియోలో,సింగిల్ మదర్గా ఒంటరిగా తన తల్లి ప్రయాణం గురించి మాట్లాడింది. ఎంతో ధైర్యంగా ఒంటరిగానే తనను పెంచి ప్రయోజకురాల్ని చేసిందని గుర్తు చేసుకుంది. ఇలాంటి తన తల్లికి తన జీవితంలోని కీలక మలుపులో మద్దతు ఇవ్వడం తన బాధ్యత అనిఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. కుమార్తె భావోద్వేగంఈ సందర్భంగా పూజ చాలా భావోద్వేగానికి లోనైంది. తల్లి వివాహం సందర్భంగా తాను అనుభవించిన అనుభూతుల గురించి వివరించింది. "ఆ రోజు నేను ఎన్ని ఆనంద బాష్పాలు కార్చానో ఎవరికీ తెలియదు. నా కళ్లముందే మా అమ్మ పెళ్లి జరగడం చూస్తుంటే నేను చాలా అదృష్టవంతురాలిని అనిపించింది. నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుందని అర్థమైంది." అని పేర్కొంది. ఈ జంటకు ఎవరి దిష్టి తగలకూడదని ఆకాంక్షిస్తూ "No Nazar" అని ఆమె పేర్కొన్నారు. అమ్మ తన ఆత్మబంధువును (Soulmate) పెళ్లి చేసుకోవడం చూస్తున్నారు" అనే క్యాప్షన్తో ఈ వీడియోను పోస్ట్ చేసింది.నెటిజన్లు స్పందనదీనిపై నెటిజన్లు కూడా ఆనందంగా కమెంట్స్ చేశారు. ఒక కూతురుగా తన తల్లి సంతోషం కోసం తీసుకున్న చొరవను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. View this post on Instagram A post shared by Pooja (Piyu) (@pooja_bhatnagar_)
డిప్యూటీ సీఎంకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. గాలిలో ఉండగానే హెలికాప్టర్ క్యాబిన్లో ఒక్కసారిగా పొగలు రావడంతో పైలట్ అప్రమత్తమై, హెలికాప్టర్ను వెనక్కి మళ్లించారు. ఈ ఘటనలో డిప్యూటీ సీఎం సహా అందులోని వారంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.అధికారిక వర్గాల సమాచారం ప్రకారం కేశవ్ ప్రసాద్ మౌర్య శనివారం ఉదయం లక్నో నుంచి కౌశాంబి జిల్లా పర్యటనకు హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ లోపల పొగలు రావడం పైలట్ దృష్టికి వచ్చింది. ఈ ఆకస్మిక పరిణామంతో అప్రమత్తమైన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా లక్నో విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు. తక్షణమే హెలికాప్టర్ను వెనక్కి మళ్లించి, విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు రన్వే వద్ద అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనలో మౌర్యతో పాటు ఉన్న సిబ్బంది, పైలట్లకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం.. కేశవ్ ప్రసాద్ మౌర్య ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కౌశాంబి చేరుకోవాల్సి ఉంది. అక్కడ శీతలా దేవి గెస్ట్ హౌస్ సమీపంలో నిర్వహించే ప్రతిష్టాత్మక 'సరస్ మహోత్సవం'ను ఆయన ప్రారంభించాల్సి ఉంది. ఈ పండుగతో పాటు జిల్లాలోని పార్టీ శ్రేణులతో కీలక సమావేశం నిర్వహించడం, వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష జరపడం వంటి కార్యక్రమాలు ఆయన పర్యటనలో భాగంగా ఉన్నాయి. అయితే ఈ అనూహ్య ఘటనతో పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.హెలికాప్టర్లో పొగలు రావడానికి గల అసలు కారణాలపై పౌర విమానయాన శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంజిన్ వైఫల్యమా లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో నిపుణులు విచారణ చేపట్టనున్నారు. వీఐపీల ప్రయాణానికి వాడే హెలికాప్టర్లలో ఇటువంటి సాంకేతిక లోపాలు తలెత్తడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వార్త తెలియగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు నేతలు మౌర్యకు ఫోన్ చేసి, క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఎన్ఆర్ఐ
13 ఏళ్ల టీనేజర్ అమెరికాలో మైనర్లపై వేధింపులు, దొంగతనాలు
అమెరికాలో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఒక భారతీయుడిని అరెస్టు చేశారు. ఓదెల యశస్వి కొత్తపల్లిగా గుర్తించబడిన నిందితుడు అక్రమ వలసదారు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రకటించింది. న్యూజెర్సీలో పిల్లలపై లైంగిక వేధింపులతోపాటు, దొంగతనానికి సంబంధించిన ఆరోపణలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించింది.సరైన పత్రాలు లేకుండా అమెరికాలోని ప్రవేశించిన నిందితుడు యశస్విని చైల్డ్ రేపిస్తూ అని పేర్కొంది. అతడిపై యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం తొలగింపు చర్యలు పెండింగ్లో ఉన్నాయని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఈసీఇ) ఎక్స్లో ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుమైనర్లపై లైంగిక నేరాలకుపాల్పడినట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, దొంగతనం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే నిందితుడిపై కేసు ఎప్పుడు, ఎక్కడ నమోదైంది, ఎప్పుడు అరెస్టు చేశారనే విషయాలపై స్పష్టతనివ్వలేదు.—SEXUAL ASSAULT OF A CHILD UNDER 13 —SHOPLIFTING —PUBLIC DISORDER Vodela Yashaswi Kottapalli, a criminal illegal alien from India, has pending charges for sexual assault and larceny in New Jersey. We’ll keep him in custody pending removal proceedings. pic.twitter.com/VM97e9KUD9— U.S. Immigration and Customs Enforcement (@ICEgov) February 16, 2026 ఇదీ చదవండి: పెళ్లయ్యి ఆరునెలలే.. వాలెంటైన్స్డే రోజే హత్య
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది కూడా శివాలయాల సందర్శన యాత్ర ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు నిర్వహించారు. సింగపూర్లోని జురాంగ్ ఈస్ట్ ,బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్రను నిర్వహించారు. సుమారు 230 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. భక్తుల శివనామస్మరణలతో ప్రముఖ దేవాలయాలు కిటకిటలాడాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష, ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవ, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల మరియు ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మొదలగు వారు ఉన్నారు.వీరితో పాటు యాత్రలో సహాయపడిన పెరుకు శివ రామ్ ప్రసాద్,సమ్మయ్య మొలుగూరి, లక్ష్మణ్ రాజు కల్వ, వేణు గోపాల్ ఐరేని, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు అందరికి కృతజ్ణతలు తెలియజేశారు. ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్ గారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి , చల్ల కృష్ణ మొదలగు వారు గత సంవత్సరం లాగే ఈ సారి కూడా భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
అమెరికాలోని కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి ఉదంతం విషాదాంతమైంది. తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభ్యమైంది. పోలీసులు అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.అతని మృతదేహాన్నివీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యంత క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి, ప్రియమైనవారికి తమ హృదయపూర్వక సానుభూతిని తెలియ జేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.Consulate General of India in San Francisco is deeply concerned about the disappearance of Saketh Sreenivasaiah, an Indian post-graduate student of UC Berkeley, hailing from the State of Karnataka. The Consulate is in touch with the family and also is in contact with the…— India in San Francisco (@CGISFO) February 14, 2026 కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు.మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. తమ కొడుకు ఎలాగైనా క్షేమంగా తిరిగి వస్తాడని ఎదురు చూసిన కుటుంబీకుల్లో శ్రీనివాసయ్య మరణవార్త తీరని విషాదాన్ని మిగిల్చింది.
అమెరికాలో కర్నాటక విద్యార్థి అదృశ్యం
న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోరి్నయాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా పోయారు. కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) అమెరికాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్కిలీలో కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ పీజీ చేస్తున్నాడు. మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. సాకేత్ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆచూకీ కనుగొనే విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కర్నాటకలోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని శనివారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి సాకేత్ కనిపించకుండాపోయాడంటూ అతడి రూమ్మేట్ బనీత్ సింగ్ ఈ నెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని చోట్లా వాకబు చేసిన తను ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపినట్లు బనీత్ తెలిపాడు. ప్రభుత్వానికి సాకేత్ తండ్రి వినతి అమెరికాలో గల్లంతైన తమ కుమారుడిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందజేసినట్లు తండ్రి శ్రీనివాసయ్య తెలిపారు. చివరిసారిగా తమ కుమారుడితో ఈ నెల 9వ తేదీన ఫోన్లో మాట్లాడామన్నారు. 12వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ అతడి రూమ్మేట్ తమకు తెలిపాడన్నారు. కుమారుడి కోసం అమెరికా వెళ్లే విషయమై తాము ఆలోచిస్తున్నామన్నారు. సాకేత్ విషయంలో కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్ అధికారులు అక్కడి పోలీసులతో మాట్లాడాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కర్నాటక ప్రభుత్వం శనివారం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది.
క్రైమ్
రమ్య మృతి కేసు నిందితుడికి రెడ్కార్నర్ నోటీసు
హైదరాబాద్: ఏడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి, మరో ఇద్దరు మృతికి కారణమైన నిందితుడికి బంజారాహిల్స్ పోలీసులు రెడ్కార్నర్ నోటీసు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... 2016 జూలై ఒకటిన రమ్య(9) అనే విద్యారి్థనిని పాఠశాల నుంచి తీసుకొని ఆమె బాబాయి పి.రాజేష్, తాత మధుసూదనాచారిలు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–3 నాగార్జున సర్కిల్ నుంచి బంజారాహిల్స్ వైపు కారులో వెళ్తున్నారు. అదే సమయంలో సినీమ్యాక్స్ భవనంలోని టీజీఐ ఫ్రైడ్ పబ్లో అతిగా మద్యం తాగిన ఆర్.శ్రావిల్, కచ్చా విష్ణువినీత్ల కారు బంజారాహిల్స్ నుంచి నాగార్జున సర్కిల్ పంజగుట్ట వైపు అతివేగంగా దూసుకువచ్చింది. శ్రావిల్ నడుపుతున్న ఈ కారు అదుపుతప్పి పంజగుట్ట శ్మశానవాటిక సమీపంలోని డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు రమ్య ఉన్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో రమ్య, మధుసూదనాచారి, రాజేష్లు మృతి చెందారు. ఈ మేరకు ఏ1 శ్రావిల్, ఏ2 విష్ణువినీత్లపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు నడుస్తుండగానే విష్ణువినీత్ అమెరికా వెళ్లాడు. ఈ నెల 17న నాంపల్లి సెషన్స్ కోర్టులో ఈ కేసు వాయిదా ఉండటంతో పోలీసులు సాక్షుల విచారణ చేపట్టారు. నిందితులను కూడా హాజరుపర్చేందుకుగాను అమెరికా నుంచి విష్ణువినీత్ను రప్పించేందుకు రెడ్కార్నర్ నోటీసు జారీ చేశారు.
కన్న తండ్రే కాలయముడయ్యాడు..
కామారెడ్డి క్రైం: పోషించడం చేతకాక కన్న తండ్రే తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లల పాలిట కాలయముడయ్యాడు. తన చేతులతోనే అభం శుభం ఎరుగని చిన్నారులను చెరువులో తో సేసి హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. ఈ హృదయ విదారకమైన ఘటన కామారెడ్డిలో శనివారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఆర్బీనగర్ కాలనీలో నివాసం ఉండే ఇస్మాయిల్, షహీబాలకు ముగ్గురు కుమార్తెలు షీపత్(8), అయాత్(7), మరియం(5) ఉన్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా కుమార్తెలను దుకాణంలో తినుబండారాలు కొనిస్తానని తీసుకెళ్లాడు. దగ్గర్లోని దుకాణానికి వెంట తీసుకువెళ్లిన తండ్రి, పిల్లలలు ఇంటికి తిరిగి రాలేదు. కొద్ది సేపటికి షబీనా భర్తకు ఫోన్ చేసి పిల్లలు ఎక్కడున్నారు? ఇంకా ఇంటికి రాలేదని అడిగింది. తాను పిల్లలకు తినుబండారాలు కొనిచ్చిన తర్వాత ఇంటికి వెళ్లాలని సూచించి ఆటో నడిపేందుకు బయటకు వెళ్లిపోయాన ని బుకాయించాడు. పిల్లలు తప్పిపోయినట్లు నటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి నాటకమాడాడు. అందరూ కలిసి చాలా సేపు సమీప ప్రాంతాల్లో పిల్లల కోసం గాలించి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాయంత్రం చీకటిపడే వరకు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో గాలించారు. సీసీ కెమెరాలను పరిశీలించినా పిల్లల ఆచూకీ లభించలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులు ఇస్మాయిల్ను విచారించగా తానే పిల్లలల్ని చెరువులో తోసి హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు వెంటనే పెద్ద చెరువు వద్దకు చేరుకుని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 10 గంటల ప్రాంతంలో అయాత్, మరియంల మృతదేహాలు లభించాయి. షీపత్ మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది సహకారంతో అర్ధరాత్రి కనుగొన్నారు. విషయం బయటకు తెలియడంతో పెద్ద ఎత్తున బంధువులు, స్థానికులు పెద్ద చెరువు వద్దకు చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోషణ భారమై పిల్లలను తానే హత్య చేసినట్లు ఇస్మాయిల్ అంగీకరించాడని పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
వ్యభిచార కేంద్రాలపై పోలీసుల దాడి
హైదరాబాద్: వేరు వేరు ప్రాంతాలలో వ్యభిచార కేంద్రాలపై దాడి చేసి పలువురిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్పల్లి సుమిత్రానగర్లోని ఓ అపార్టుమెంట్లో వ్యభిచార కేంద్రంపై గురువారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకురాలు (40), విటుడు రవికుమార్ (47), మరో మహిళ(47)ను అరెస్టు చేశారు. మహిళను రెస్క్యూ హోంకు తరలించి, నిర్వాహకురాలు, రవికుమార్లను రిమాండ్కు తరలించారు. అదే విధంగా అదే కాలనీలోని మరో అపార్టుమెంట్లో వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకురాలు (46), విటుడు శ్రీవేంద్ర వర్మ (30)లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో మహిళను (32) హోంకు తరలించారు.
పెరిగిన అప్పులు.. బ్యాంకర్ల వేధింపులతో
కరీంనగర్ జిల్లా: వ్యాపారంలో నష్టం, పెరిగిన అప్పులు, బ్యాంకర్ల వేధింపులతో ఓ రైస్మిల్ యజమాని భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తణుకు సురేశ్, స్వప్న (42) దంపతులకు మండలంలోని మొలంగూర్ శివారులో రైస్మిల్లు ఉంది. 2021–2022లో కస్టం మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వం వీరి రైస్మిల్లుకు ధాన్యం కేటాయించింది. అయితే అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టం వాటిల్లింది. అలాగే వ్యాపారం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు పెరిగిపోయాయి. దీంతో బకాయిలు చెల్లించాలని వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పుల బాధతో మనస్తాపం చెందిన స్వప్న శుక్రవారం ఉదయం ఇంట్లో బాత్రూములోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుర్లుండగా పెద్దకూతురు వివాహం చేశారు. చిన్నకూతురు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. సురేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
వీడియోలు
ముగ్గురు బిడ్డలను పోషించలేక కన్న తండ్రి దారుణం
దేవాలయంలో ఘోర ప్రమాదం.. భక్తులు నిద్రిస్తుండగా ఊడిపడిన సీలింగ్
పెళ్లి తర్వాత నో బ్రేక్.. మళ్లీ షూటింగ్ లో బిజీ అయిన విరోష్!
మీకు ఓటేసిన పాపానికి మహిళలు ఏడుస్తున్నారు
జగనన్నను మళ్లీ సీఎం చేయాలి.. మహిళలకు రోజా పిలుపు
గడప గడపకు వెంకట్ గౌడ్
సాయి మాధవ్ బుర్రా అలా మాట్లాడటం కరెక్ట్ కాదు
అమెరికాకు చేరుకున్న సైనికుల పార్థివదేహాలు ట్రంప్ నివాళి
భారత్ ను టెన్షన్ పెడుతున్న కీలక అంశాలు..
అమెరికాకు భారీ నష్టం.. కొండను తవ్వి ఎలుకను పట్టారా


