నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడుతారు.
ఇరాన్పై అమెరికా భీకర దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. చర్చల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ ఇరాన్పై అమెరికా భీకర దాడులకు దిగింది. దీంతో కాల్పుల విరమణ నామమాత్రంగానే మిగిలి.. పరిస్థితి మళ్లీ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. ఇక హర్ముజ్ జలసంధి నుంచి గల్ఫ్ దేశాల వరకు యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంతో ప్రపంచం ఉత్కంఠగా పరిణామాలను గమనిస్తోంది.అమెరికా బలగాలు తాజాగా దక్షిణ ఇరాన్లోని పలు కీలక స్థావరాలపై వరుసగా రెండో రోజు భారీ వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధికి సమీపంలోని వ్యూహాత్మక ప్రాంతాలు, రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలే ప్రధాన లక్ష్యాలుగా చేసుకున్నాయి. ఈ దాడుల్ని అమెరికా స్వీయ రక్షణ దాడులుగా అభివర్ణించడం గమనార్హం. తాజా దాడుల్లో హర్మోజ్గాన్ ప్రావిన్స్లోని సిరిక్, మినాబ్, ఖేష్మ్ (Qeshm) దీవి, జాస్క్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. బందర్ అబ్బాస్ సమీపంలో కూడా వైమానిక హెచ్చరిక వ్యవస్థలు చురుగ్గా పనిచేసినట్లు ఇరానియన్ మీడియా వెల్లడించింది. పలు రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు సమాచారం.అంతేకాకుండా ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భావించే అసలుయె ప్రాంతంలోని ప్రముఖ పెట్రోకెమికల్ ప్లాంట్పై కూడా అమెరికా దాడులు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇంధన, పెట్రోకెమికల్ రంగాలపై ఆధారపడిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.ఇదే సమయంలో రాజధాని టెహ్రాన్ పశ్చిమ ప్రాంతాల్లో ఎయిర్ సైరన్లు మోగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భద్రతా బలగాలు అప్రమత్తమై కీలక ప్రాంతాల్లో పహారా పెంచాయి. దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు.సంచలన వ్యాఖ్యలుఅమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలు ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. "ఇరాన్ చర్చలకు ముందుకు రాకపోతే ఇక బాంబులతోనే మాట్లాడాల్సి వస్తుంది" అంటూ ఆయన చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా దాడులు ఇరాన్ సామర్థ్యాలను దెబ్బతీసేలా, తమ సైనిక కార్యకలాపాలకు అనుకూల పరిస్థితులు సృష్టించేలా కొనసాగుతాయని హెగ్సెత్ స్పష్టం చేశారు. ఇరాన్ స్పందనఅమెరికా చర్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తప్పుడు నెపాలతో దాడులకు పాల్పడుతోందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఆరోపించారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కూడా ఈ దాడులను ఖండిస్తూ తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ తదితర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం. అయితే ఆ దేశాలు చాలా వరకు వాటిని అడ్డుకున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతమంతా హైఅలర్ట్లోకి వెళ్లింది. తాజా పరిణామాలు చూస్తే అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కేవలం పరిమిత ప్రతీకార దాడుల దశ దాటి.. మరింత విస్తృత ఘర్షణ వైపు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి భద్రత, చమురు సరఫరాలు, గల్ఫ్ దేశాల స్థిరత్వంపై ఈ సంక్షోభం ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రశాంతత కోసం ఐటీ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం
భారతదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్యోగ వలసల ధోరణిలో ఒక ఊహికందని, సంచలనాత్మక మార్పు చోటుచేసుకుంటోంది. నిన్నటివరకు మెట్రో నగరాల్లోని భారీ ప్యాకేజీలు, ఆకాశాన్ని తాకే జీతాల కోసం పరుగులు తీసిన యువ ఐటీ, కార్పొరేట్ నిపుణులు.. ఇప్పుడు రూట్ మార్చుకుంటున్నారు. మెట్రో నగరాల్లోని విపరీతమైన ట్రాఫిక్, కాలుష్యం, అధిక జీవన వ్యయంతో విసిగిపోయిన యువత.. భారీ జీతాల కంటే ప్రశాంతమైన జీవితానికే (క్వాలిటీ ఆఫ్ లైఫ్) ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘అడెక్కో ఇండియా’ నిర్వహించిన ‘ఎక్స్టర్నల్ డిస్రప్షన్స్ అండ్ వర్క్ఫోర్స్ ప్రొడక్టివిటీ రిపోర్ట్ 2026’ నివేదికలో వెల్లడైన ఈ నిజాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.జీతాల కంటే ప్రశాంతతకే ఓటుభారతదేశంలో ప్రతిష్టాత్మక కంపెనీలకు, మెరుగైన కెరీర్ ఎదుగుదలకు బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తూ వచ్చాయి. అయితే ‘అడెక్కో ఇండియా 2026’ నివేదిక ప్రకారం, 35 ఏళ్లలోపు వయసున్న యువ నిపుణులలో దాదాపు 50 నుంచి 55 శాతం మంది మెట్రో నగరాల్లోని భారీ జీతాల కంటే సొంత ఊర్లకు దగ్గరగా ఉండటం, ప్రశాంతమైన జీవన ప్రమాణాలకే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా, భారతదేశ ప్రతిభావంతులైన శ్రామిక శక్తి (టాప్ టాలెంట్) ఇప్పుడు మెట్రోల సరిహద్దులు దాటి చిన్న నగరాల వైపు వేగంగా విస్తరిస్తోంది.చిన్న నగరాల్లో భారీగా పెరుగుతున్న ఉద్యోగాలుఈ మార్పు తాత్కాలికమైనది కాదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని మొత్తం ఫార్మల్ హైరింగ్ (ఉద్యోగ నియామకాల) వృద్ధిలో ఏకంగా 70 శాతం చిన్న నగరాల (నాన్-మెట్రోస్) నుంచే వస్తుండగా, మెట్రో నగరాల వాటా కేవలం 30 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం భారతదేశంలోని రిమోట్ ఉద్యోగులలో 30-35 శాతం మంది టైర్-2, టైర్-3 నగరాల నుంచే పని చేస్తున్నారు. ముఖ్యంగా కోయంబత్తూర్, ఇండోర్, సూరత్, వడోదర, లక్నో వంటి నగరాలు నైపుణ్యం కలిగిన నిపుణులను, సరికొత్త ఉద్యోగ అవకాశాలను భారీగా ఆకర్షిస్తూ కొత్త హబ్లుగా అవతరిస్తున్నాయి.రంగాలవారీగా రిమోట్ ఉద్యోగాల జోరుయువత మానసిక స్థితిని అర్థం చేసుకున్న కార్పొరేట్ కంపెనీలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. దాదాపు 40 శాతం సంస్థలు ఇప్పటికే ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్ను అమలు చేస్తూ, ప్రధాన నగరాల్లో పెద్ద ఆఫీసులతో పాటు చిన్న పట్టణాలలో శాటిలైట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. రంగాలవారీగా చూస్తే, టెక్నాలజీ (ఐటీ) రంగంలో రిమోట్, హైబ్రిడ్ నియామకాలు ఏడాది ప్రాతిపదికన 30 శాతం పెరిగాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో 20-25 శాతం, హెల్త్కేర్ రంగంలో 15-20శాతం, అలాగే ఈ-కామర్స్ అండ్ రిటైల్ రంగంలో 15-18 శాతం మేర హైబ్రిడ్ ఉద్యోగాలు వృద్ధి చెందాయి.వివిధ ప్రాంతాలకు శ్రామికశక్తి విస్తరణనగరాల్లో నిరంతరం తలెత్తుతున్న మౌలిక వసతుల లోపాలు, ప్రకృతి విపత్తులు ఈ వలసలను మరింత వేగవంతం చేస్తున్నాయి. దేశంలోని 97 శాతం మంది యజమానులు వాతావరణ మార్పులు, మౌలిక సదుపాయాల ఒత్తిడి, ప్రజారోగ్య సమస్యల వంటి బాహ్య అడ్డంకులను నిరంతరం ఎదుర్కొంటున్నట్లు నివేదిక పేర్కొంది. కేవలం ఒకే నగరంలో కేంద్రీకృతమవ్వడం వల్ల వరదలు, రవాణా వ్యవస్థల స్తంభన వంటి సమయాల్లో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. అందుకే సుమారు 95 శాతం కంపెనీలు తమ వ్యాపార కొనసాగింపు కోసం శ్రామిక శక్తిని వివిధ ప్రాంతాలకు విస్తరించడాన్ని (డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ఫోర్స్) ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నాయి.హైదరాబాద్, బెంగళూరులో..నగరాల్లో పెరుగుతున్న తీవ్ర ఒత్తిడి కారణంగా ఉద్యోగుల మానసిక స్థితి, ఉత్సాహం, ఉత్పాదకత దారుణంగా దెబ్బతింటున్నాయి. ఈ నివేదిక ప్రకారం, 42శాతం కంపెనీలు తమ ఉద్యోగులలో ఉత్సాహం తగ్గిందని, 40శాతం కంపెనీలు అబ్సెంటీయిజం (ఆఫీసులకు రాకపోవడం) పెరిగిందని తెలిపాయి. ఐటీ హబ్ బెంగళూరులో అత్యధికంగా 48శాతం మంది యజమానులు తమ ఉద్యోగుల మోరల్ పడిపోయినట్లు పేర్కొనగా, హైదరాబాద్ 44 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే, కాలుష్యం, వాతావరణ విపత్తుల కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో అత్యధికంగా 44 శాతం కంపెనీలు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది.భవిష్యత్ వ్యూహాలు, సవాళ్లుఈ సరికొత్త పరిణామాలపై అడెక్కో ఇండియా కంట్రీ మేనేజర్ సునీల్ చేమంకోటిల్ స్పందిస్తూ, ‘భారతదేశంలోని యజమానులు కేవలం విపత్తులను నిర్వహించడం లేదు, ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన వర్క్ఫోర్స్ మార్కెట్లో రీసైలెన్స్ (స్థిరత్వం) ను తిరిగి నిర్వచిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత విపత్తు నివారణ చర్యలలో కంపెనీలు తమ సామర్థ్యానికి 10 పాయింట్లకు గానూ కేవలం 5 పాయింట్లు మాత్రమే ఇచ్చుకోవడం గమనార్హం. రాబోయే రోజుల్లో మెట్రో నగరాల ఆర్థిక ప్రాముఖ్యత తగ్గకపోయినప్పటికీ, భారతదేశ ప్రతిభావంతుల భవిష్యత్తు మాత్రం చిన్న నగరాల వైపే నడవబోతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ జైళ్లలో ఖైదీలపై కుక్కలను ఉసిగొల్పి..
కేంద్రం లెక్క.. అవినీతి పక్కా!
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ అవినీతి మరోసారి బట్టబయలైంది. సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ వ్యయం సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాల బాగోతం బయటపడింది. సచివాలయం ‘శాశ్వత’ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చదరపు అడుగుకు రూ.20,439.58 వ్యయం చేస్తుంటే... గ్రిహ 4–స్టార్, ఎనర్జీ కన్సర్వేషన్ అండ్ సస్టెయినబుల్ బిల్డింగ్ కోడ్(ఈసీఎస్బీసీ)– 2024 ప్రమాణాలతో కట్టే కేంద్రప్రభుత్వ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్కు చదరపు అడుగుకు రూ.5,587.44 మాత్రమే కేంద్రం మంజూరు చేయడమే ఇందుకు నిదర్శనం.ఐఏఎస్, గ్రూప్–1 నుంచి గ్రూప్–డి, ఎన్జీవో క్వార్టర్స్కు చదరపు అడుగుకు రాష్ట్ర ప్రభుత్వం సగటున రూ.10 వేల నుంచి రూ.12 వేలు వ్యయం చేస్తుంటే.. గ్రిహ–4, ఈసీఎస్బీసీ–2024, ఎకో–నివాస్ సంహిత–2024 ప్రమాణాల ప్రకారం నిర్మించే రెసిడెన్షియల్ కాంప్లెక్స్కు చదరపు అడుగుకు రూ.3,945.39 మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ అంచనా వ్యయాన్ని ఇష్టారాజ్యంగా పెంచేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందన్నది స్పష్టమవుతోందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు 5.53 ఎకరాల్లో జీ+13 అంతస్తులతో 23.25 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 8 వేల మంది సిబ్బంది పని చేసేందుకు వీలుగా సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.1,299.08 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే సిబ్బందికి నివాస సదుపాయం కల్పించడం కోసం 17 ఎకరాల్లో 11 టవర్లలో 31.30 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు రూ.1,234.91 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏకీకృత సముదాయం (సీజీజీపీఓఏ), ఉద్యోగుల నివాస గహాల (జీపీఆర్ఏ) నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు. ఈ రెండు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ ద్వారా మొత్తం రూ.2,533.99 కోట్లు ఖర్చు చేయనుంది. రూ.4,350.42 నుంచి రూ.20,439.58 వరకు.. » రాజధాని అమరావతిలో సచివాలయం శాశ్వత భవనాలను డయాగ్రిడ్ విధానంలో 39 అంతస్తులతో నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో ఒక టవర్ మొత్తం ఐదు టవర్లను చంద్రబాబు సర్కార్ నిర్మిస్తోంది. ఇదే టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలకు అప్పగిస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. » 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ టెండర్లను చంద్రబాబు సర్కార్ రద్దు చేసి.. 2025లో మళ్లీ టెండర్లు నిర్వహించింది. మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,083.29 కోట్లు పెరిగింది. » ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. ఈ భవనాలకు హై సైడ్ ఎలక్ట్రికల్ (విద్యుత్ సరఫరా), హెచ్వీఏసీ (హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ – వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది. » దాంతో శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.6,671.31 కోట్లకు చేరుకుంది. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరింది. టవర్ల డిజైన్ల పనులను రూ.401.54 కోట్లకు పోస్టర్ పార్టనర్స్–హాఫీజ్ కాంట్రాక్టర్, జెనిసిస్ ప్లానర్స్కు అప్పగించారు. తాజాగా అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది. » అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేఅవుట్లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే పనులను రూ.1057.62 కోట్లతో చేపట్టింది. దీన్ని కూడా కలుపుకుంటే.. సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం రూ.10,670.47 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు ఇప్పటికే రూ.20,439.57కు చేరుకుంది.హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్తో భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ అమరావతిలో అధిక ధరలకు కాంట్రాక్టు పనులను సిండికేటు కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టి.. నీకింత నాకింత అంటూ ప్రభుత్వ పెద్దలు దోచుకుతింటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరింత పెరగనున్న అంచనా వ్యయం! » రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. » ఈ లెక్కన సచివాలయం శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో వేచి చూడాలని ఇంజినీరింగ్ నిపుణులు లెక్కలు వేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చి చేపట్టిన భవనాల నిర్మాణ వ్యయాన్ని దేశంలో ఎక్కడా లేని రీతిలో పెంచేసి దోచుకుతింటుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్షమాగుణానికి నిలువెత్తు రూపం..
‘దీదీ’కి భారీ షాక్: ఢిల్లీలో టీఎంసీ ఆఫీస్ ఖాళీ
విజయవాడలో దంచికొట్టిన వర్షం.. ఐదు రోజులు గట్టి వానలే..
తుపాకీతో కాల్చుకుని మహిళ ఆత్మహత్య
ట్రంప్ చెప్పింది నిజమేనా?.. లేక గప్పాలా?
భర్త వదిలేసిన తర్వాత... నా మనసు ఒక తోడు కోరుకుంది..!
ఇతిహాసాలను మలుపు తిప్పిన శాపాలు..!
ప్రశాంతత కోసం ఐటీ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం
సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం
కాంగ్రెస్లో టీఎంసీ విలీనం?.. ఇదిగో క్లారిటీ
పెద్ది.. ఎంతపని చేశావ్ బుచ్చిబాబు?
ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు: సీఎం విజయ్
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
సకల శాఖలు లోకేశ్ చూస్తారు తన శాఖ తప్ప! సీఎం ఏ శాఖా చూడరు
కుప్పలు కుప్పలుగా పాములు
పసిడి రీబౌండ్
చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ
'అతడు పేరుకే ఆల్రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ'
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
సాక్షి కార్టూన్ 09-06-2026
ఎద్దు లేదని భార్యనే నాగలికి కట్టిన రైతు.. సీఎం స్పందించి..
పసిడి ఇంత భారీ పతనం.. ఇవే కారణాలు
వైభవ్ నిర్దయగా సిక్సర్లు బాదాడు!.. ఇదే కొనసాగితే కష్టం!
టాక్సిక్ వంద రోజుల రీ షూట్.. నిర్మాణ సంస్థ క్లారిటీ
మమతా బెనర్జీ పార్టీని వీడుతున్న సీనియర్లు
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
తమిళనాడు నుంచి దుబాయికి బస్సు టికెట్
గోల్డ్ లోన్.. కష్టాలు!
ఆ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ని.. ఇప్పుడు హీరో చేశా: విజయ్ సేతుపతి
క్షమాగుణానికి నిలువెత్తు రూపం..
‘దీదీ’కి భారీ షాక్: ఢిల్లీలో టీఎంసీ ఆఫీస్ ఖాళీ
విజయవాడలో దంచికొట్టిన వర్షం.. ఐదు రోజులు గట్టి వానలే..
తుపాకీతో కాల్చుకుని మహిళ ఆత్మహత్య
ట్రంప్ చెప్పింది నిజమేనా?.. లేక గప్పాలా?
భర్త వదిలేసిన తర్వాత... నా మనసు ఒక తోడు కోరుకుంది..!
ఇతిహాసాలను మలుపు తిప్పిన శాపాలు..!
ప్రశాంతత కోసం ఐటీ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం
సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం
కాంగ్రెస్లో టీఎంసీ విలీనం?.. ఇదిగో క్లారిటీ
పెద్ది.. ఎంతపని చేశావ్ బుచ్చిబాబు?
ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు: సీఎం విజయ్
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
సకల శాఖలు లోకేశ్ చూస్తారు తన శాఖ తప్ప! సీఎం ఏ శాఖా చూడరు
కుప్పలు కుప్పలుగా పాములు
పసిడి రీబౌండ్
చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ
'అతడు పేరుకే ఆల్రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ'
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
సాక్షి కార్టూన్ 09-06-2026
ఎద్దు లేదని భార్యనే నాగలికి కట్టిన రైతు.. సీఎం స్పందించి..
పసిడి ఇంత భారీ పతనం.. ఇవే కారణాలు
వైభవ్ నిర్దయగా సిక్సర్లు బాదాడు!.. ఇదే కొనసాగితే కష్టం!
టాక్సిక్ వంద రోజుల రీ షూట్.. నిర్మాణ సంస్థ క్లారిటీ
మమతా బెనర్జీ పార్టీని వీడుతున్న సీనియర్లు
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
తమిళనాడు నుంచి దుబాయికి బస్సు టికెట్
గోల్డ్ లోన్.. కష్టాలు!
ఆ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ని.. ఇప్పుడు హీరో చేశా: విజయ్ సేతుపతి
ఫొటోలు
సాకర్ సమరానికి వేళాయే.. నేటి నుంచే ఫుట్బాల్ పండగ (ఫోటోలు)
కలర్ఫుల్ డ్రెస్లో సురేఖవాణి కూతురు సుప్రీత.. ఫోటోలు
దర్శక దిగ్గజం భారతీ రాజాకు సినీ ప్రముఖుల నివాళి.. ఫోటోలు
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం...ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
అందంతో కిక్కెక్కిస్తున్న భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)
వరంగల్ : కనుల పండువగా ఎస్సార్ స్నాతకోత్సవం (ఫొటోలు)
నాలుగో వెడ్డింగ్ యానివర్సరీ.. ఫ్యామిలీతో నయన్ ఫారిన్ వెకేషన్ (ఫోటోలు)
విజయ్ సేతుపతి ‘స్లమ్డాగ్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
హైదరాబాద్లో కుండపోత వర్షం (ఫొటోలు)
సినిమా
బాలయ్య బర్త్ డే.. యాక్షన్ గ్లింప్స్ రిలీజ్
నందమూరి బాలకృష్ణ హీరోగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీని ఎన్బీకే111 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇవాళ బాలయ్య బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఎన్బీకే111 గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్లో నోట్లో సిగరెట్ పెట్టుకుని బుల్లెట్ బైక్పై ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. ఈ ఫైట్ సీన్ చూస్తుంటే మరో యాక్షన్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. జేసీబీతో ఫైట్ సీన్ మరి ఓవర్గా అనిపిస్తోంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
'భారతీ రాజా మరణం.. రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం'
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రభంజనం తర్వాత మరో స్టార్ హీరో అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. పాలిటిక్స్లో తన ఎంట్రీపై కీలక నిర్ణయం ప్రకటిస్తానని ఇప్పటికే రాఘవ లారెన్స్ వెల్లడించారు. ఈనెల 11న ఉదయం 9:30 గంటలకు కీలక ప్రకటన ఉంటుందని తెలిపారు. అయితే దర్శకుడు భారతీ రాజా మరణంతో తన సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.రాఘవ లారెన్స్ తన ట్వీట్లో రాస్తూ.. 'అందరికీ నమస్కారం.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ భరతిరాజా మృతికి సంతాపం ప్రకటించింది. ఈ నష్టం మా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత వ్యక్తిగతంగా నన్ను బాధ కలిగిస్తోంది. భరతిరాజా చిత్ర పరిశ్రమకు చేసిన అపారమైన సేవ పట్ల గౌరవంతో.. నేను నా ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నా. ఈనెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు నా నిర్ణయం ప్రకటిస్తా' అని పోస్ట్ చేశారు.కాగా.. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి టీవీకే తరఫున రాఘవ లారెన్స్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ ప్రకటనపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. Hi everyone, I had earlier informed you that I would be making an important life decision announcement on Thursday, the 11th, at 9:30 AM.The industry is currently mourning the passing of Bharathiraja sir. This loss feels deeply personal, like losing a member of the family.… pic.twitter.com/eNfEG6LxRr— Raghava Lawrence (@offl_Lawrence) June 10, 2026
'అనారోగ్యం, జ్ఞాపకశక్తి సమస్య.. అయినా భారతీ రాజా వినలేదు'
దక్షిణాది సినీ పరిశ్రమ ఓ సినీ దిగ్గజాన్ని కోల్పోయింది. వెటరన్ డైరెక్టర్ భారతీ రాజా(84) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు సినీ రంగానికి ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. తమిళనాడు సీఎం విజయ్తో పాటు కోలీవుడ్ స్టార్స్ భారతీ రాజాకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సినీ రంగంలో చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కేవలం పల్లె అందాలను ప్రేక్షకులకు చూపించడమే కాదు.. నటుడిగా కూడా రాణించారు. దర్శకత్వం వహిస్తూనే తన నటనతో అభిమానులను మెప్పించారు. చివరిసారిగా ఆయన తన కెరీర్లో నటించిన సినిమా తుడురుమ్. మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. తుడరుమ్ చిత్రంలో స్టంట్ మాస్టర్ పళనిస్వామి పాత్రలో భరతిరాజా కనిపించారు.అనారోగ్యంతోనే షూటింగ్..తుడరుమ్ మూవీ సెట్స్పైకి వెళ్లే సమయంలోనే భారతీరాజా అనారోగ్యం, జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ మందులు తీసుకుంటూనే షూటింగ్లో పాల్గొన్నారు. ఆయన చిత్ర నిర్మాణ బృందానికి భారం కాకూడదని పట్టుబట్టి మరి.. తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారని తుడరుమ్ డైరెక్టర్ తరుణ్ మూర్తి వెల్లడించారు. భారతీ రాజా డైలాగులు గుర్తుంచుకోవడానికి.. రిపీట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారని గుర్తు చేసుకున్నారు.భారతిరాజా కెరీర్..దర్శకుడిగా భారతిరాజా మూవీ మేకింగ్ను స్టూడియోల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లడంతో సినిమారంగం స్వరూపాన్నే మార్చేసింది. ఆయన 1977 లో ‘16 వయతినిలే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి, రజనీకాంత్ నటించారు. తమిళ సినిమాకు 'మట్టి వాసన'ను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన తన కెరీర్లో ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. అంతేకాకుండా 2004లో పద్మశ్రీ అందుకున్నారు.
దర్శక దిగ్గజానికి దర్శకధీరుడు నివాళి
దర్శక దిగ్గజం భారతీ రాజా మరణంపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ఆయన తన సహజమైన, రాజీపడని కథనంతో సినీరంగంలో ఒక విప్లవం సృష్టించారని కొనియాడారు. మా అందరికీ నిజమైన మార్గదర్శిగా నిలిచారన్నారు. ఆ మరపురాని గ్రామీణ కథలు, ఆ నిర్భయమైన దృక్పథం, ఆయన తెరపైకి తీసుకువచ్చిన వాస్తవికత సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు. ఆయన అసాధారణమైన కృషిని, వారసత్వాన్ని వీక్షించడం, స్మరించుకోవడం మనందరికీ గౌరవమని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా భారతీ రాజా మరణం పట్ల రాజమౌళి తన సంతాపం వ్యక్తం చేశారు.కాగా.. వయో, అనారోగ్య సమస్యలతో దర్శక దిగ్గజం భారతీ రాజా కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ అంతా షాకింగ్కు గురైంది. తమిళనాడు సీఎం విజయ్ సైతం ఎమోషనల్ అయ్యారు. భారతీరాజాకు నివాళులర్పిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పలువురు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు భారతీ రాజాకు సంతాపం ప్రకటించారు. Bharathiraja garu was a true pioneer who revolutionized cinema with his raw and uncompromising storytelling. Those unforgettable rural narratives, that fearless vision and the authenticity he brought to the screen will live on forever.It was an honour to witness and celebrate…— rajamouli ss (@ssrajamouli) June 10, 2026
క్రీడలు
ఆస్ట్రేలియాకు ఘోర అవమానం
ఆరు సార్లు విశ్వవిజేత, ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ కూడా అయిన ఆస్ట్రేలియా వన్డే జట్టుకు ఘోర అవమానం జరిగింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న (జూన్ 9) జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయంపాలైన ఆ జట్టు.. మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో ఓపెనర్ మాథ్యూ షార్ట్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో వరుసగా మూడో ఇన్నింగ్స్లోనూ ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీ ఖాతా తెరవకుండానే కుప్పకూలింది.ఇటీవల పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లోనూ ఆస్ట్రేలియా ఓపెనర్లు రెండుసార్లు (చివరి రెండు వన్డేలు) ఒక్క పరుగు కూడా జోడించలేకపోయారు. తాజాగా బంగ్లాదేశ్ మ్యాచ్లోనూ అదే పరిస్థితి పునరావృతం కావడంతో, వన్డే చరిత్రలో వరుసగా మూడు ఇన్నింగ్స్ల్లో ఓపెనింగ్ వికెట్కు ఖాతా తెరవని జట్ల జాబితాలో ఆస్ట్రేలియా చేరింది.ఈ అవాంఛనీయ జాబితాలో ఇప్పటికే న్యూజిలాండ్ (2015) ఉండగా, తాజాగా ఆస్ట్రేలియా వారి సరసన నిలిచింది. అయితే అత్యంత చెత్త రికార్డు మాత్రం పసికూన పపువా న్యూ గినియా పేరిట ఉంది. 2022లో పపువా న్యూ గినియా వరుసగా నాలుగు వన్డే ఇన్నింగ్స్ల్లో ఓపెనింగ్ వికెట్కు ఒక్క పరుగు కూడా నమోదు చేయలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్వర్త్ లూయిస్) సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కుదేలైపోయారు.బ్యాటింగ్లో సత్తా చాటిన మొసద్దెక్ (10-1-37-2) బౌలింగ్లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్ను విజేతగా ప్రకటించారు.36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్లో జరిగిన మ్యాచ్లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్కు షాకిచ్చింది.
నైట్క్లబ్ వివాదం.. స్టోక్స్పై వేటు
నైట్క్లబ్ వివాదంలో చిక్కుకున్న ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్పై అందరూ ఊహించిన విధంగానే వేటు పడింది. న్యూజిలాండ్తో రెండో టెస్ట్కు అతడితో పాటు నైట్క్లబ్ వివాదంలో మరో నిందితుడు గస్ అట్కిన్సన్ను కూడా జట్టు నుంచి తప్పించారు. జట్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకటించింది.లార్డ్స్ టెస్ట్లో విజయానంతరం స్టోక్స్, అట్కిన్సన్లు లండన్లోని ఓ నైట్క్లబ్కు వెళ్లారు. వీరిద్దరు జట్టుకు విధించిన అర్ధరాత్రి కర్ఫ్యూను ఉల్లంఘించి అక్కడ ఉండగా, ఓ రగ్బీ ఆటగాడితో ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ECB విచారణ చేపట్టిన తర్వాత ఇద్దరినీ రెండో టెస్ట్కు ఎంపిక చేయలేదు.దీంతో 2022లో స్టోక్స్కు కెప్టెన్సీ అప్పగించిన మాజీ సారథి జో రూట్ మళ్లీ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన రూట్వైపే ECB మొగ్గుచూపింది.స్టోక్స్ స్థానంలో జోర్డన్ కాక్స్, అట్కిన్సన్ స్థానంలో జోఫ్రా ఆర్చర్ జట్టులోకి వచ్చారు. ఐపీఎల్ తర్వాత ఆర్చర్ తిరిగి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.కాగా, నైట్ఫైట్ తర్వాత స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అతడు ఇప్పటికే వన్డే, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి టెస్ట్ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. తాజా ఉదంతం తర్వాత స్టోక్స్ క్రికెట్ కెరీర్ మొత్తానికే గుడ్బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో గెలుపొంది, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్లో రెండో టెస్ట్ జూన్ 17 నుంచి కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా మొదలుకానుంది.న్యూజిలాండ్తో రెండో టెస్ట్కు ఇంగ్లండ్ జట్టు..రూట్ (C), డకెట్, గే, బేతెల్, బ్రూక్, స్మిత్ (WK), రూ, కాక్స్, రెహాన్, రాబిన్సన్, జోఫ్రా, టంగ్, ఫిషర్, బేకర్, బషీర్
ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ (జూన్ 10) జరిగిన తొలి మ్యాచ్లో భారత్పై ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా పోరాడి ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. భారత్ 19.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది.భారత్ను గెలిపించేందుకు రిచా ఘోష్ (36 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. శ్రీచరణి తొలి బంతికి సింగిల్ తీసి రిచాకు స్ట్రయిక్ ఇచ్చింది. అప్పటికే జోష్లో ఉన్న రిచా.. రెండో బంతిని బౌండరీకి, మూడో బంతిని సిక్సర్కు తరలించి భారత్ను గెలుపు వాకిటి వరకు చేర్చింది.అయితే తొందరగా మ్యాచ్ను ముగిద్దామనే క్రమంలో నాలుగో బంతికి లిండ్సే స్మిత్ బౌలింగ్లో స్టంపౌటయ్యింది. అప్పటికీ భారత్కు గెలిచే అవకాశం ఉండింది. మిగిలిన రెండు బంతుల్లో ఆరు పరుగులు సాధిస్తే టీమిండియాదే గెలుపు. చేతిలో ఓ వికెట్ ఉండింది. అయితే ఐదో బంతికి రేణుకా సింగ్ కూడా ఔట్ కావడంతో భారత్ ఆలౌటై, మ్యాచ్ను చేజార్చుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో యామీ జోన్స్ (64), కెప్టెన నాట్ సీవర్ బ్రంట్ (57) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో డేనియెలా గిబ్సన్ (30 నాటౌట్) బ్యాట్ను ఝులిపించింది. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2, షఫాలీ, రేణుకా, శ్రీ చరణి, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.భారత ఇన్నింగ్స్ విషయానికొస్తే.. రిచా మినహా జట్టులో ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేదు. షఫాలీ (13), యస్తికా (15), హర్మన్ (17), భారతి (18), రాధా యాదవ్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లిన్సే స్మిత్ 3, డీన్, కోల్మన్, గిబ్సన్ తలో 2, వాంగ్ ఓ వికెట్ పడగొట్టారు.కాగా, ఈ ప్రపంచకప్ రెగ్యులర్ మ్యాచ్లు జూర్ 12 నుంచి మొదలవుతాయి. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్-శ్రీలంక తలపడనున్నాయి. భారత్ జూన్ 14న జరిగే తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది.
అర్హతే లేదు.. అఫ్గనిస్తాన్పై సంచలన వ్యాఖ్యలు!
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు మదన్ లాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుకు అసలు టెస్టు హోదా పొందే అర్హతే లేదన్నాడు. కనీస స్థాయి లేని జట్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఎందుకు అవకాశం ఇస్తుందో తనకు అర్థం కావడం లేదన్నాడు.ఐర్లాండ్తో పాటు టెస్టు హోదాకాగా 2001లో ఐసీసీ అఫిలియేట్ మెంబర్గా ఉన్న అఫ్గనిస్తాన్.. 2013లో అసోసియేట్ మెంబర్ స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుని 2017లో ఐర్లాండ్తో పాటు టెస్టు హోదా పొందింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో 2018లో తమ తొలి టెస్టు ఆడి ఘోర పరాజయం చవిచూసింది.తాజాగా ముల్లన్పూర్లో మరోసారి టీమిండియాతో టెస్టులో తలపడ్డ అఫ్గనిస్తాన్ జట్టు.. ఇన్నింగ్స్ మీద 300 పరుగుల అతి భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్రౌండర్ మదన్ లాల్ అఫ్గన్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఎందుకు అనుమతిస్తున్నారు?‘‘అసలు అఫ్గనిస్తాన్ను టెస్టు క్రికెట్ ఆడేందుకు ఎందుకు అనుమతిస్తున్నారు? వాళ్లకు టెస్టు జట్టు హోదా ఎలా ఇచ్చారో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు. అఫిలియేట్ దేశాలకు కూడా వన్డే, టీ20 ప్రదర్శనలు, రికార్డుల ఆధారంగా టెస్టు హోదా ఇస్తున్నారు.నిజానికి అఫ్గనిస్తాన్ టీ20లలో మాత్రమే మెరుగ్గా ఆడుతోంది. వన్డేల్లో కూడా వాళ్లు మరింత దృష్టి సారించాలి. ముఖ్యంగా 50 ఓవర్ల పాటు అవుట్ కాకుండా నిలబడే సత్తా ఉండాలి. అలాంటి వాళ్లు ఏకంగా టెస్టు బరిలో దిగుతున్నారు.అఫ్గనిస్తాన్లో అవి శూన్యంభారత్తో మ్యాచ్లో 152, 112 పరుగులు మాత్రమే స్కోరు చేయగలిగారు. గతంలో 109, 102 పరుగులకే కుప్పకూలారు. టెస్టు క్రికెట్ను ప్రమోట్ చేసేందుకు ఇలాంటి జట్లను అనుమతించడం తగునా? నిజానికి ఐదు రోజుల క్రికెట్ ఆడేందుకు పూర్తిస్థాయి వ్యవస్థ, సదుపాయాలు అవసరం. కానీ అఫ్గనిస్తాన్లో అవి శూన్యం. అఫ్గన్ ఆటగాళ్లు చెత్తగా ఆడుతున్నారని నేను అనను.అయితే, వాళ్లకు టెస్టులు ఆడేందుకు వీలైన పరిస్థితులు లేవు. వాళ్లు ఇంతవరకు ఐదు రోజుల క్రికెట్కు అలవాటు పడనే లేదు. వ్యవస్థ సరిగ్గా లేనపుడు వాళ్లు మాత్రం ఏం చేయగలరు?’’ అని మదన్ లాల్ న్యూస్18తో పేర్కొన్నాడు. కాగా అఫ్గనిస్తాన్ ఇప్పటికి పదమూడు టెస్టులు ఆడి.. నాలుగు మాత్రమే గెలిచింది. ఎనిమిదింట ఓడి.. రెండు డ్రా చేసుకుంది.చదవండి: గంభీర్ను పట్టించుకోని సీనియర్లు!
న్యూస్ పాడ్కాస్ట్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్...
నేడు విశాఖకు వైఎస్ జగన్మోహన్రెడ్డి... స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి... ఆరుగురికి తీవ్ర గాయాలు
విష ప్రచారం చేయడం దుర్మార్గం.. మేం రైతులం కాదా?... సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న అక్రమాల రాకెట్
మనోడే.. ఇచ్చేద్దాం. ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్్సకు పోలవరం పనులు
ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
బిజినెస్
రూ.20 వేల రేంజ్లో రియల్మీ కొత్త ఫోన్
ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ రియల్మీ భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ ‘రియల్మీ పీ4ఆర్ 5జీ’ (Realme P4R 5G) విడుదల చేసింది. బ్యాటరీ సామర్థ్యాన్ని ప్రధాన ఆకర్షణగా చేసుకుని P4 సిరీస్లో తాజా మోడల్గా వచ్చిన ఈ ఫోన్లో ఏకంగా 8,000mAh ‘టైటాన్’ బ్యాటరీని అందించడం విశేషం. ఈ ధర విభాగంలో ఇంత పెద్ద బ్యాటరీతో వచ్చిన ఫోన్లలో ఇది ఒకటిగా కంపెనీ పేర్కొంటోంది. పూర్తి ఛార్జ్పై మూడు రోజుల వరకు వినియోగాన్ని అందించగలదని రియల్మీ చెబుతోంది.ఫోన్ ప్రధాన ఫీచర్లుస్మార్ట్ఫోన్ పరిశ్రమలో కెమెరా, చిప్సెట్ల కంటే ఇప్పుడు ఎక్కువమంది వినియోగదారులు బ్యాటరీ బ్యాకప్కు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో రియల్మీ ఈ ఫోన్ను రూపొందించింది. 8,000mAh బ్యాటరీతో పాటు 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ లైఫ్ను దీర్ఘకాలం కాపాడే టెక్నాలజీ కారణంగా ఏడు సంవత్సరాల వరకు బ్యాటరీ పనితీరు నిలకడగా ఉంటుందని కంపెనీ హామీ ఇస్తోంది.ఈ ఫోన్లో 6.8 అంగుళాల సన్లైట్ డిస్ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్కు శక్తినిచ్చే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. Realme UI 7.0 ఆధారిత ఆండ్రాయిడ్ ప్లాట్ఫారమ్పై ఇది పనిచేస్తుంది.గేమింగ్ సమయంలో హీట్ సమస్యను తగ్గించేందుకు 5,300mm² ఎయిర్ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్, వన్-ట్యాప్ కూలింగ్ వంటి ఫీచర్లను అందించారు.ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ AI కెమెరాను అందించారు. AI Portrait Glow, AI Eraser 2.0, AI Ultra Clarity, AI Unblur వంటి AI ఆధారిత ఫోటో ఎడిటింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను ఏర్పాటు చేశారు.భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం కేవలం 8.8 మిల్లీమీటర్లు మాత్రమే. MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, 400 శాతం అల్ట్రా వాల్యూమ్ సపోర్ట్ చేసే సూపర్ లీనియర్ స్పీకర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.ధరలు, ఆఫర్లురియల్మీ పీ4ఆర్ 5జీ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది. ఇందులో 4GB + 128GB వేరియంట్ రూ.18,999లకు, 6GB + 128GB మోడల్ రూ.20,999లకు, 6GB + 256GB వేరియంట్ రూ.22,999లకు లభిస్తుంది. ప్రారంభ ఆఫర్లో భాగంగా రూ.2,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్తో పాటు మూడు నెలల నో-కాస్ట్ EMI సదుపాయం లభించనుంది. దీంతో ప్రారంభ ధర రూ.16,999కు తగ్గనుంది.ఈ ఫోన్ టైటానియం గ్లేర్, సిల్వర్ గ్లేర్, లావండర్ గ్లేర్ అనే రంగుల్లో లభించనుంది. తొలి విక్రయాలు జూన్ 17 నుంచి ప్రారంభమవుతాయి. ఫ్లిప్కార్ట్తో పాటు రియల్మీ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు.ఇదీ చదవండి: బంగారం.. భలే లాభం! ఆర్బీఐ గుడ్న్యూస్
రూ.10,000 కోట్లకు 5 ఐపీఓలు రెడీ!
ముంబై: దేశీయ ప్రాథమిక మార్కెట్ రానున్న రోజుల్లో ఐపీఓలతో మరింత సందడి చేయనుంది. గ్లోబల్ ట్రావెల్–టెక్ యూనికార్న్ ఓయో మాతృసంస్థ ‘ప్రిజమ్’, వార్బర్గ్ పింకస్ పెట్టుబడులున్న ‘ట్రూహోమ్ ఫైనాన్స్’, ‘వీగాలాండ్ డెవలపర్స్’, ‘అద్వాంతా ఎంటర్ప్రైజెస్’, ‘మెహతా హైటెక్ ఇండస్ట్రీస్’ల పబ్లిక్ ఇష్యూలకు సెబీ అనుమతి ఇచి్చంది. ఈ ఐదు కంపెనీలు కలిపి సుమారు రూ.10,000 కోట్లు సమీకరించే అవకాశం ఉందని మర్చంట్ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. కంపెనీలు దాఖలు చేసిన ముసాయిదా పత్రాలపై సెబీ జూన్ 1–5 మధ్య తన పరిశీలన పూర్తిచేసి అనుమతులు జారీ చేసింది. ప్రిజమ్ (ఓయో) భారీ ఇష్యూ గ్లోబల్ ట్రావెల్–టెక్ దిగ్గజం ఓయోను నిర్వహిస్తున్న ‘ప్రిజమ్’ సంస్థ ఐపీఓ ద్వారా రూ.6,650 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఈ ఇష్యూతో సంస్థ విలువ 7–8 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంస్థ 2025 డిసెంబరులో కాని్ఫడెన్షియల్ ప్రి–ఫైలింగ్ మార్గం ద్వారా సెబీకి ముసాయిదా పత్రాలను సమరి్పంచింది. ఓయో ఆపరేటర్ ‘ఒరవెల్ స్టేస్’ 2025 సెప్టెంబరులో ‘ప్రిజమ్’గా పేరు మార్చుకుంది. ట్రూహోమ్ ఫైనాన్స్ ఇష్యూ @ రూ.3,000 ట్రూహోమ్ ఫైనాన్స్ ఐపీఓ పరిమాణం రూ.3,000 కోట్లుగా ఉండనుంది. ఇందులో రూ.1,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీ చేయనుంది. అలాగే ప్రమోటర్ సంస్థ ‘మ్యాంగో క్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్’ రూ.1,500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనుంది. తాజా షేర్ల జారీ ద్వారా వచ్చే నిధులను మూలధనాన్ని బలోపేతం చేసుకోవడానికి, రుణాల పంపిణీ అవసరాలను తీర్చడానికి, ఆర్బీఐ నిర్దేశించిన మూలధన సమృద్ధి ప్రమాణాలను పాటించడానికి వినియోగించనుంది. వీగాలాండ్ డెవలపర్స్ వీ–గార్డ్ గ్రూప్కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ‘వీగాలాండ్ డెవలపర్స్’ ఐపీఓ ద్వారా రూ.250 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలోనే ఉంటుంది. ఈ నిధులను ప్రస్తుత, రానున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు, అలాగే నివాస సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములను కొనుగోలు చేయడానికి వినియోగించనుంది. అద్వాంతా ఎంటర్ప్రైజెస్ అగ్రికల్చరల్ సొల్యూషన్స్ అందించే ఈ సంస్థ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉంటుంది. ప్రమోటర్ యూపీఎల్ లిమిటెడ్తో పాటు ఇతర ఇన్వెస్ట్మెంట్ సంస్థలు మెల్వుడ్ హోల్డింగ్స్– ఐఐ, కేఐఏ ఈబీటీ స్కీమ్–2 కలిపి 3.61 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. మెహతా హైటెక్ ఇండస్ట్రీస్అహ్మదాబాద్కు చెందిన ఈ సంస్థ ఐపీఓ ద్వారా గరిష్టంగా 62 లక్షల కొత్త ఈక్విటీ షేర్లను ఐపీఓ ద్వారా జారీ చేయనుంది.
బంగారం.. భలే లాభం! ఆర్బీఐ గుడ్న్యూస్
బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) మరోసారి భారీ లాభాలను అందించాయి. 2019-20 సిరీస్–VII కింద జారీ చేసిన ఎస్జీబీల ముందస్తు రిడెంప్షన్ (Premature Redemption) ధరను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గ్రాముకు రూ.15,275గా నిర్ణయించింది.ఆర్బీఐ ఈ బాండ్లను 2019 డిసెంబర్ 10న గ్రాముకు రూ.3,745 ధరతో జారీ చేసింది. అప్పుడు వీటిని కొనుగోలుచేసినవారికి ఐదేళ్లలో సుమారు 308 శాతం లాభం లభించినట్లైంది. అంటే గ్రాముకు రూ.11,530 లాభం అన్నమాట. అలాగే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన గ్రాముకు రూ.50 తగ్గింపు కూడా ఆర్బీఐ ఇచ్చింది. దీంతో ఆన్లైన్లో కొన్నవారికి ఈ లాభం 313 శాతానికి పైగా చేరింది.రూ.లక్షకు రూ.4 లక్షలు!ఈ సిరీస్లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుల పెట్టుబడి విలువ ప్రస్తుతం రూ.4.08 లక్షలకు పైగా పెరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి అదనంగా బాండ్ జారీ ధరపై సంవత్సరానికి 2.5 శాతం స్థిర వడ్డీని కూడా అర్ధవార్షికంగా పొందారు. అంటే మొత్తం రాబడి ఇంకా ఎక్కువే.రిడెంప్షన్ ధర ఎలా నిర్ణయించారు?ఎస్జీబీ రిడెంప్షన్ ధరను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. జూన్ 5, 8, 9 తేదీల ముగింపు ధరల సగటు ఆధారంగా ఈ విడతకు గ్రాముకు రూ.15,275 ధరను ఖరారు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది.ఐదేళ్ల తర్వాతే ముందస్తు నిష్క్రమణసావరిన్ గోల్డ్ బాండ్ల అసలు గడువు ఎనిమిదేళ్లు. అయితే జారీ తేదీ నుంచి ఐదో సంవత్సరం పూర్తైన తర్వాత వడ్డీ చెల్లింపు తేదీల్లో ముందస్తుగా బాండ్లను రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ఈ సిరీస్కు జూన్ 10, 2026 తేదీని అర్హత కలిగిన రిడెంప్షన్ తేదీగా ఆర్బీఐ ప్రకటించింది.పన్ను ప్రయోజనాలు ఏమిటి?వ్యక్తిగత పెట్టుబడిదారులు ఎస్జీబీలను ఆర్బీఐ వద్ద రిడీమ్ చేసుకున్నప్పుడు లభించే మూలధన లాభాలపై గతంలో పన్ను మినహాయింపు ఉండేది. అయితే 2026 బడ్జెట్ తర్వాత పన్ను నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ వడ్డీ ఆదాయం మాత్రమే ఆదాయపు పన్నుకు లోబడి ఉంటుంది. బాండ్ల బదిలీ ద్వారా వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలు వర్తిస్తాయి.ఏమిటీ ఎస్జీబీ పథకం?భౌతిక బంగారం కొనుగోలు అవసరం లేకుండా బంగారం ధరల పెరుగుదల ప్రయోజనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. బంగారం ధరల పెరుగుదలతో పాటు 2.5 శాతం వార్షిక వడ్డీ కూడా లభించడం ఈ పథకాన్ని ప్రత్యేకంగా నిలిపింది. దేశంలో భౌతిక బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గృహ పొదుపులను ఆర్థిక ఆస్తులుగా మలచడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు.అయితే ప్రభుత్వం 2023 చివరి నుంచి కొత్త సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని నిలిపివేసింది. నిర్వహణ వ్యయాలు పెరగడం, గోల్డ్ ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వంటి ప్రత్యామ్నాయాల ప్రాచుర్యం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. అయితే ఇప్పటికే జారీ చేసిన బాండ్లు చెల్లుబాటులోనే ఉంటాయి. పెట్టుబడిదారులు వాటిని మెచ్యూరిటీ వరకు కొనసాగించవచ్చు లేదా అర్హత వచ్చినప్పుడు ముందస్తు రిడెంప్షన్ను ఎంచుకోవచ్చు.ఇదీ చదవండి: ఈజీగా ‘EPF 100% విత్డ్రా’.. కొత్తగా మారిందిదే..
మిశ్రమంగా ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 27.15 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టపోయి 23,214.95 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 64.42 పాయింట్లు లేదా 0.09 శాతం పెరిగి 73,983.18 వద్ద ముగిసింది.హెచ్ యూఎల్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ సెన్సెక్స్ లో టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.49 శాతం, 1.33 శాతం నష్టపోయాయిరంగాల వారీగా, నిఫ్టీ మీడియా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ కెమికల్ మెరుగైన పనితీరు కనబరిచాయి.
ఫ్యామిలీ
సింగిల్ మదర్గా పడ్డ కష్టానికి..కుమారుడిచ్చిన గొప్ప గౌరవం!
ఓ అమ్మ ఒంటరిగా పిల్లల్ని పెంచడం అంటే ఎంత కష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కష్టానికి తగ్గట్టుగా కొడుకు ప్రయోజకుడు అయితే ఆ ఆనందం మాటలకందనిది. కానీ అదే కుమారుడు ఆ అమ్మ కష్టాన్ని గుర్తించి గౌరవిస్తే..అంతకంటే ఆ తల్లికి కావల్సిందేముంటుంది. అలాంటి సందర్భమే ఇక్కడే చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అతడు ఒకప్పుడు ఐఐటీ జేఈఈ పరీక్షల్లో విఫలమైన భారతీయ్ టెక్ నిపుణుడు అభిజయ్ అరోరా. తన తల్లికి భావోద్వేగభరితమైన నివాళి అర్పించడంతో నెట్టింట వైరల్గా మారాడు. అతడు ప్రస్తుతం గూగుల్ పనిచేస్తున్నాడు. ఆయన తనతల్లి తనను ప్రయోజకుడిగా తీర్చిదిద్దేందుకు పడ్డ కష్టానికి తగిన గౌరవం దక్కేలా న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్లో బిల్బోర్డు భారీ స్క్రీన్పై తనతోపాటు తనతల్లి ఫోటో కనిపించేలా చేశాడు. అభిజయ్ తన తల్లికి వీడియో కాల్ చేసి మరి ఆ భారీ స్క్రీన్ని చూపించి సంతోషం వ్యక్తం చేశాడు. వేల మైళ్ల దూరం నుంచి చూస్తున్న ఆమె ఆ నివాళి తనకే అంకితం చేయబడిందని తెలిసి చిరునవ్వులు చిందించింది. అభిజయ్ అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంటూ..పోస్ట్లో ఇలా రాసుకొచ్చాడు. "ఆమె తన కలల కన్నా నా కలలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, ఎన్నో ఎదురుదెబ్బలు, అనిశ్చితిలో తనకు అండగా నిలిచిన మహిళ మా అమ్మ. అందుకే ఆమెను ఇలా గౌరవించా. ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. ఆమె చేసిన త్యాగాలన్నింటికీ నా నా కృతజ్ఞతను తెలియజేయడానికి, నేను మా అమ్మను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డ్పై చూపించాను." అని పేర్కొన్నాడు. దాంతోపాటు తన సక్సెస్ జర్నీని కూడా పంచుకున్నాడు.ఐఐటీ ఫెయిల్ నుంచి గూగూల్ ఉద్యోగిగా..హర్యానాలోని పంచకులకు చెందిన అభిజయ్ బాల్యం అంతా తన ఒంటరి తల్లి ఆధ్వర్యంలోనే సాగిందని చెప్పుకొచ్చాడు. తన స్థోమత కారణంగా పాత పుస్తకాలు చదువుకునేవాడినని తెలిపాడు. కానీ తన అమ్మ తనకు మంచి విద్య అందించాలని తపించిపోయేది. అందుకోసం ఏం చేయాలో అన్ని చేసేది. అయితే అత్యంత పోటీతో కూడిన ఐఐటీ జేఈఈలో ఫెయిలై అమ్మని నిరాశపరిచిన క్షణం తనని నిద్రపోవనివ్వకుండా చేసేదని అన్నాడు. ఏనాటికైనా అమ్మని గర్వంగా తలెత్తుకునేలా చేయాలని బలంగా అనుకునేవాడినని చెప్పాడు. అయితే 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన వెంటనే ఏ ఉద్యోగ ఆఫర్ తనకు రాలేదని, 2017లో హ్యాకథాన్ గెలుచుకోవడం తన మొదటి గెలుపని చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత మళ్లీ 2016 నుంచి 2020 వరకు మొత్తం మూడుసార్లు జీమ్యాట్ పరీక్ష రాసినా.. ఓటమే ఎదురైందని వెల్లడించాడు. కానీ 2021లో తాను దరఖాస్తు చేసుకున్న ప్రతి బిజినెస్ స్కూల్ నుంచి తిరస్కరణను ఎదుర్కొన్నాడు. అమెరికాలో కూడా తన కష్టాలు కొనసాగాయి. అక్కడ కూడా అతను ఉద్యోగం కోసం వెతుకుతూనే 90 రోజుల వీసా గడువుతో పోటీ పడాల్సి వచ్చింది. వారానికి దాదాపు వంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా..పదే పదే రిజెక్ట్ అవుతూనే ఉండేవి. అయితే ఆ టైంలో తన భార్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోగా, తల్లి నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇక ఇలా లాభం లేదని తనే అవకాశాలు సృష్టించుకోవాలని భావించి అభిజయ్ ఒక AI-ఆధారిత రెజ్యూమె టూల్ను తన నెట్వర్క్ను, గుర్తింపును విస్తరించుకోవడానికి ఆన్లైన్లో కంటెంట్ను పంచుకోవడం ప్రారంభించాడు. ఈ వ్యూహం ఫలించి.. 2022లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. 2025 నాటికి, అతను శాన్ ఫ్రాన్సిస్కోలోని యూట్యూబ్ కోసం గూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గా చేరాడు. ఆ తర్వాత, అతను సిలికాన్ వ్యాలీ AI నాయకులతో ఒక పాడ్కాస్ట్ను ప్రారంభించి..దాదాపు ఆరు లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో ఒక ఆన్లైన్ కమ్యూనిటీని నిర్మించుకున్నాడు. అలా తల్లి పడ్డ త్యాగాలకి, కష్టానికి సరైన అర్థం ఇచ్చేలా మంచి ఉన్నత స్థాయికి చేరుకున్న అభిజిత్ అందుకు కృజ్ఞతలు తెలుపుతూ ఇలా అమ్మకు టైమ్స్ స్క్వేర్ నివాళి అందించాడు. నెటిజన్లు కూడా ఆ తల్లికి ఇది హృదయపూర్వక కృతజ్ఞత, ఆమె గర్వించేలా మరింతగా ఎదగండి అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhijay Arora Vuyyuru | AI, Tech & Careers (@abhijayarora_) (చదవండి: తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..)
తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..
చాలామంది కెరీర్లో చాలా ఓటములు, నిరాశను ఎదుర్కొన్నవారే. ఆశించినట్లుగా ఉన్నత చదువును అందుకోలేక..నచ్చలేంది చదవలేక సతమతమవుతుంటారు. ముఖ్యంగా ఇతరులు సాధిస్తే..తానొక్కడే ఫెయిల్ అవ్వడం, ప్రతిదాంట్లో నిరాశ, నైరాశ్యం వెంటాడుతుంటే కుంగిపోతాం. కానీ ఇక్కడ ప్రయత్నం ఆగిపోకూడదు. ఈ రోజు ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఏదో ఒకరోజు తప్పక ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటాం అనేందుకు ఈ వ్యక్తే కథే ఉదాహరణ. నెట్టింట అతడి స్టోరీ వైరల్గా మారడమే కాదు స్ఫూర్తిగా నిలిచింది.వ్యవస్థాపకుడు, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్మీడియా వేదికగా 26 ఏళ్ల శౌర్య శిఖర్ విజయవంతమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఇది మొక్కవోని స్థైర్యంతో చివరికి సక్సెస్ని ఒడిసిపట్టుకున్న అందమైన విజయగాథ. ఐదేళ్ల క్రితం వరకు శౌర్య కెరీర్లో సెటిల్ అవ్వలేక చాలా ఇబ్బందిపడ్డ వ్యక్తి. అతను అందరిలా ఐఐటీ-జేఈఈ సాధించాలని కలలుగన్న వ్యక్తి. అయితే అతడు అందులో సక్సెస్ అవ్వలేకపోయాడు. తన తండ్రి ఐఐటీ అయ్యి ఉండి, తాను సాధించలేక పోవడం అతడ్ని మరింత కుంగదీసింది. తీవ్ర నిరాశతో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిబిఎ) డిగ్రీలో జాయిన్ అయ్యాడు. అదీ చదవలేక నానా పాట్లు పడ్డాడు. ఆ క్రమంలో ఏకంగా 110 కేజీల అధిక బరువుతో ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. కాలేజ్లో చదువుతున్నప్పుడే శౌర్య అంకుర్ వారికూ బృందంలో చేరాడు. కానీ శౌర్య నిరాశ, కెరీర్లో అనిశ్చితి, వ్యక్తిగత పోరాటాల మధ్య చిక్కుకుని తనకు భవిష్యత్తు అనేది ఉందా అని భయపడుతుండేవాడు. చెప్పాలంటే తను ఎందుకు పనిరానని భావంతో ఉండేవాడు. తనకెంతో ఇష్టమైన ఇంజనీరింగ్ కోర్సు చేయలేకపోయానని, బీబీఏ చేస్తున్న ఫూల్ని అని బాగా బాధపడేవాడు. ఇక ఎప్పటికీ తన లైఫ్ మంచిగా ఉండదేమో అని దిగులుతో ఉండేవాడు. కట్చేస్తే..సరిగ్గా ఐదేళ్ల తర్వాత అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 26 ఏళ్ల వయసులో శౌర్య మంచి కెరీర్ను నిర్మిచుకుని నెలకు లక్షల్లో జీతం ఆర్చించే స్థాయికి చేరుకున్నాడు. అంతేగాదు తన తండ్రి పదవీ విరమణ సందర్భంగా ఆయనకు ఏకంగా రూ. 55 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ కారుని కొనిచ్చాడు. విలాసవంతమైన కారు కోసం చెల్లించిన డౌన్ పేమెంట్ శౌర్య నికర ఆస్తిలో 5% కంటే తక్కువగా ఉందని, అలాగే ఈఎంఐ అతని నెలవారీ సంపాదనలో 7% కంటే తక్కువగా ఉంటుందని వారికూ వెల్లడించారు. అతనిలో వచ్చిన మార్పు కేవలం డబ్బుకే పరిమితం కాలేదు, ఏళ్లు గడిచే కొద్దీ..శౌర్య ఆరోగ్యం, ఫిట్నెస్పై దృష్టి సారించి ఫిట్గా మారాడు. ఇక్కడ శౌర్య కథ విలాసవంతమైన కారు, సంపద గురించి చెప్పడం లేదు. ఎదురు దెబ్బలు ఒక వ్యక్తి భవిష్యత్తుని నిర్దేశించవు, జీవితంలో ఒక దశ దారుణమైన వైఫల్యం ఎదుర్కొని ఉండొచ్చు. కానీ అదే క్రమంగా విభిన్నమైన మార్గానికి నాంది పలికి ఉన్నతమైన స్థానానికి చేరుకునేలా చేస్తుంది అనేందుకు శౌర్యనే ఉదాహరణ. కానీ ఇక్కడ జీవితంలో ఎదురయ్యే గడ్డుపరిస్థితులకు చేతులెత్తేయకుండా ముందుకు సాగడమే జీవితం అని నమ్మి..ప్రయత్నం ఆపకూడదనేది గ్రహించాలని అంటున్నారు అంకుర్ వారికూ. అలాంటి స్థితిలో ధైర్యంగా ముందుకు సాగినవాడు తప్పకుండా ఏదో ఒకనాటికి జీవితం మంచిగా సెటిల్ అవుతుందని అన్నారు. ఈ స్టోరీ నెటిజన్ల మనసుని తాకడమే కాదు..అత్యంత నిరాశ నిస్ప్రుహల మధ్య ఆశావాదం హాస్యస్పదంగా అనిపించినా.. ఇక్కడ శౌర్య కార్యాచరణలో నిమగ్నమే ముందుకు సాగాలనే దృక్పథాన్ని ఎంచుకోవడం నిజంగా అభినందనీయం. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా..ముందుకు సాగే వారే విజేతలు అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు.(చదవండి: చాయ్-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఏమన్నారంటే..)
ఊరి ఆడబిడ్డల సందడి.. వినూత్న సమ్మేళనం
బెజ్జంకి (సిద్దిపేట): పూర్వ విద్యార్థుల సమ్మేళనం మాదిరి.. ఊరి ఆడబిడ్డలంతా సందడి చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లె రెడ్డి ఆడబిడ్డలు వినూత్న వేడుకను జరుపుకొన్నారు. గ్రామంలో పుట్టిపెరిగిన మహిళలు.. పెళ్లై అత్తారింటికి వెళ్లిన ఆడబిడ్డలతో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన యువతులు ఆదివారం గ్రామంలో ఆడబిడ్డల సమ్మేళనం నిర్వహించారు. గ్రామంలోని యువతులకు ఈగ్రామ ఆడబిడ్డలను పరిచయం చేసేందుకే ఈకార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 60 మంది వరకు మహిళలు పాల్గొన్నారు.
చాయ్-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఏమన్నారంటే..
దక్షిణ భారతదేశంలో చాలామందికి చాయ్ తోపాటు ఏదో ఒకటి ముంచుకునే తినే అలవాటు ఉంది. అలాంటి వాటిలో ఈ చాయ్ ఇడ్లీ కలిపి తినడం అనేది కూడా ఒకటి. అయితే ఇలా తినొచ్చా అంటే..ఇటీవల సోషల్ మీడియాలో చాయ్ ఇడ్లీ కాంబినేషన్ సూపర్ అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట హాట్టాపిక్గా మారి చర్చలకు తెరతీసింది. ఆ పోస్ట్పై సీనియర్ కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ..ఆయన ఆ పోస్ట్లో షేర్ చేసిన ఫోటోలో.. చాయ్ ఇడ్లీ కనిపించిన విధం గురించి మాట్లాడారు. ఆ చిత్రంలో ఇడ్లీ పసుపు వర్ణంలో చాలా గట్టిగా ఉన్నట్లుగా కనిపిస్తుందన్నారు. "బహుశా అందుకే ఇలా చాయ్ ఇడ్లీ కాంబినేషన్ సూపర్ అంటున్నారేమె. మాములుగా ఆ ఇడ్లీని తినడం కష్టం..ఇలా గట్టిదైతే వేడివేడి చాయ్లో ముంచుకుంటే సులభంగా నోటిలో కరిగిపోతుంది. అందుకు ఇలా అభిప్రాయ పడి ఉండొచ్చు. కానీ ఇడ్లీ అనేది మల్లెపువ్వుతా స్పాంజ్లా ఉండాలి. అలాంటి ఇడ్డీని కచ్చితంగా చాయ్లో ముంచి తినడం అంత ఈజీ కాదు. ఆయన చివరికి చెప్పేందేంటంటే..ఆ రెండింటిని వేర్వేరుగా ఆస్వాదించడమే మంచిదన్నారు." ఇడ్లీని చాయ్లో ముంచడం కంటే ఇడ్లీ తినేశాక చాయ్ తీసుకుంటే బెటర్ అని అన్నారు. తాను బ్రేక్ఫాస్ట్ లేదా భోజనం చేశాకే టీ తాగడానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తనకు చాయ్ అంటే మహా ఇష్టమని, ఇక అల్పాహారంలో ఇడ్లీ అంటే చాలా ఇష్టంగా తింటానని అన్నారు. నిపుణులు ఏం అంటున్నారంటే..టీ తాగేటప్పుడు తినే కొన్ని రకాల స్నాక్స్, ఆహారాల కాంబినేషన్ మంచిదికాదంటున్నారు. ముఖ్యంగా ఇడ్లీలు, బిస్కెట్ల కాంబినేషన్తో చాయ్ తాగడం అస్సలు మంచిది కాదనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా టీ కాంబినేషన్తో తింటే అరుగుదల,జీర్ణాశయం సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంతేగాదు కడుపు ఉబ్బరం, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. పైగా మెటబాలిజం కూడా నెమ్మదించి అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇవే కాదు మరే ఇతర పోషకమైన వాటిని కూడా చాయ్ కాంబినేషన్తో వద్దనే అంటున్నారు. దానివల్ల ఆయా పోషకాలు శరీరానికి సరిగా అందవని అంటున్నారు. అందువల్ల కాస్త విరామం ఇచ్చి వేర్వేరుగా తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.Oh, I see what you're doing here! Aside from provoking me, that is.I have to be honest: that idli looks a bit too solid and dense for my liking. And the discolouration in the pic is not very appetising. There’s something about a perfectly soft, snowy-white, fluffy idli that… https://t.co/O9GsGAGPa6— Shashi Tharoor (@ShashiTharoor) June 7, 2026 (చదవండి: 145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..)
అంతర్జాతీయం
జోహన్నెస్బర్గ్లో మారణహోమం.. 12 మంది మృతి
జోహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో మంగళవారం అర్ధరాత్రి వేళ కాల్పుల కలకలం చేటుచేసుకుంది. ఈస్ట్ జోహన్నెస్బర్గ్లోని క్లీవ్ల్యాండ్ పరిధిలో ఉన్న జంపర్స్ ఇన్ఫార్మల్ సెటిల్మెంట్పై గుర్తు తెలియని దుండగులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఈ దారుణ సాయుధ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి సుమారు 11:10 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు సౌత్ ఆఫ్రికన్ పోలీస్ సర్వీస్ బుధవారం తెలిపింది.అర్ధరాత్రి వేళ మారణకాండజంపర్స్ సెటిల్మెంట్లో కాల్పులు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే అక్కడ ఎనిమిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ అతడు మరణించాడు. గాయపడిన మరో తొమ్మిది మంది బాధితులకు ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.పక్కా స్కెచ్తో విరుచుకుపడ్డ దుండగులుఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు పక్కా ప్లాన్తో వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఒక తెల్లటి టయోటా క్వాంటం వాహనంలో 10 మందికి పైగా సాయుధ దుండగులు క్లీవ్ల్యాండ్లోని పెట్రోల్ బంక్ సమీపంలోకి చేరుకున్నారు. అనంతరం వారు ఆ ఇన్ఫార్మల్ సెటిల్మెంట్కు ఉన్న రెండు ప్రవేశ మార్గాల గుండా లోపలికి ప్రవేశించారు. అక్కడ ఉన్న స్థానికులపై ఏకపక్షంగా, విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ముందుకు సాగారు. అనంతరం అదే వాహనంలో అక్కడి నుండి పరారయ్యారు.ముమ్మరంగా సాగుతున్న గాలింపు చర్యలుఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుల లక్ష్యం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అయితే పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలియజేయాలని కోరారు. కాగా, ప్రపంచంలోనే అత్యధిక హత్యల రేటు ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటిగా ఉంది, ఇక్కడ సగటున రోజుకు 60 హత్యలు జరుగుతుండటం గమనార్హం.
తాలిబన్ కమాండర్కు అమెరికాలో 42 ఏళ్ల శిక్ష!
వాషింగ్టన్: అమెరికా సైనికుల మరణాలకు కారకుడు, అంతర్జాతీయ జర్నలిస్ట్ను బందీ చేసిన తాలిబన్ మాజీ కమాండర్ హాజీ నజీబుల్లాకు అమెరికా ఫెడరల్ కోర్టు 42 ఏళ్ల సుదీర్ఘ జైలు శిక్షను ఖరారు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ కాలంలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడులకు సూత్రధారిగా వ్యవహరించిన ఈ 50 ఏళ్ల నిందితుడు, అమెరికా కోర్టులో తన నేరాలను అంగీకరించాడు. ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇవ్వడం, విదేశీయులను బందీలుగా మార్చడం వంటి అభియోగాలపై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ సంచలన తీర్పును వెల్లడించింది.అమెరికా సైనికులపై ఘాతుకం2007 నుండి 2009 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్లోని వర్దక్ ప్రావిన్స్లో తాలిబన్ కమాండర్గా నజీబుల్లా నెత్తుటి ఏరులు పారించాడు. నాటో దళాలు, అమెరికా సైనికులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు, ఐఈడీ పేలుళ్లను ఇతని నాయకత్వంలోనే ఉగ్రవాదులు అమలు చేశారు. ముఖ్యంగా 2008 జూన్ 26న అమెరికా మిలిటరీ కాన్వాయ్పై జరిగిన దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులతో పాటు ఒక ఆఫ్ఘన్ అనువాదకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఉగ్రదాడికి తానే బాధ్యుడినంటూ నజీబుల్లా అప్పట్లో బాహాటంగానే చెప్పుకున్నాడు.జర్నలిస్ట్ కిడ్నాప్.. తుపాకీ నీడలో 7 నెలలుసైనికులపై దాడుల అనంతరం 2008 నవంబర్లో ‘న్యూయార్క్ టైమ్స్’ జర్నలిస్ట్ డేవిడ్ రోడ్, అతని డ్రైవర్, అనువాదకుడిని నజీబుల్లా బృందం కిడ్నాప్ చేసింది. వారిని పాకిస్తాన్లోని తాలిబన్ నియంత్రణ ప్రాంతాలకు తరలించి, దాదాపు ఏడు నెలల పాటు బందీలుగా ఉంచారు. అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, తుపాకీ గురిపెట్టి జర్నలిస్ట్తో ప్రాధేయపడేలా వీడియోలు రికార్డు చేయించారు. అయితే ఆ జర్నలిస్ట్ 2009 జూన్లో ఉగ్రవాదుల నుండి తప్పించుకున్నారు.చాకచక్యంగా అరెస్ట్.. న్యాయం గెలిచిందిదాదాపు దశాబ్ద కాలం పాటు తప్పించుకు తిరిగిన నజీబుల్లాను 2020లో ఉక్రెయిన్లో అంతర్జాతీయ దళాలు పట్టుకుని అమెరికాకు అప్పగించాయి. అమెరికా పౌరులను, సైనికులను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు ఎంతకాలం తప్పించుకున్నా వదిలిపెట్టేది లేదని ఈ తీర్పు ద్వారా స్పష్టమైందని అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె, ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ అన్నారు.ఇది కూడా చదవండి: ఐర్లాండ్లో చెలరేగిన అల్లర్లు: కత్తిపోట్ల ఘటనతో..
ఇరాన్ యుద్ధం.. నెతన్యాహు సంచలన నిర్ణయం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర దశకు చేరుకుంటున్నాయా?. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న సంచలన నిర్ణయం అవుననే అంటోంది. ఇకపై అమెరికా మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఇరాన్పై దాడులు కొనసాగించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. మరికొన్ని గంటల్లో ఇరాన్పై దాడి చేయబోతున్నామని అమెరికా ముందుగానే ఇజ్రాయెల్కు సమాచారం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.పశ్చిమాసియా సంక్షోభంపై జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. "అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన కేబినెట్ వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే అలాంటి పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని.. కానీ అవసరమైతే అందుకు వెనుకాడబోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో.. అమెరికా-ఇరాన్ డీల్ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు ఎయాల్ జమీర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం చర్చలో ఉన్న ఏ ఇరాన్ ఒప్పందమైనా.. ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలకు అనుకూలంగా కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.గత కొంతకాలంగా.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మిత్రదేశాలైన అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విబేధాలకు కారణం అవుతున్నాయి. ఇరాన్తో అణు ఒప్పందం నేపథ్యంతో శాంతి చర్చలకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇటు ఇరాన్, అటు లెబనాన్లో యుద్దానికి తాత్కాలిక విరమణ ప్రకటించారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని లెబనాన్(దక్షిణ ప్రాంతాల్లో)పై ఇజ్రాయెల్ దాడులు జరుపుతూనే వస్తోంది. ఈ దాడుల్లో అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఈ పరిణామాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. లెబనాన్పై సైనిక చర్య ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నెతన్యాహుని ట్రంప్ మందలిస్తున్నారని కొంతకాలంగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ, నెతన్యాహు మాత్రం అదేం పట్టించుకోకుండా ‘పరిమిత దాడులకు’ ఆదేశాలిస్తూనే వస్తున్నారు. ఇరాన్-అమెరికా మధ్య డీల్ కుదిరితే.. తమ సైనిక చర్యల స్వేచ్ఛకు భంగం కలుగుతుందనే యోచనలో ఇజ్రాయెల్ ఉంది, అందుకే ఇరాన్ ఒప్పందంలో తమకూ ప్రాధాన్యం ఇవ్వాలని నెతన్యాహు ట్రంప్ను కోరుతున్నట్లు తెలుస్తోంది.ఇజ్రాయెల్కు సమాచారం ఇచ్చి మరీ దాడులు?ఇటు హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ దక్షిణ ప్రాంతాల్లోని వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధవిమానాలు దాడులు నిర్వహించాయి. జాస్క్, బందర్ అబ్బాస్, ఖెష్మ్ దీవి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా(ఇరాన్ దాడికి ప్రతీకారంగానే!) తమ దాడులు పూర్తయ్యాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించుకుంది. ఇరాన్ నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇటు.. అమెరికా దాడులకు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. తమపై జరిగిన ప్రతి దాడికి సమాధానం ఇస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి హెచ్చిరించిన కాసేపటికే దాడులు జరిగాయి. అమెరికా స్థావరాలు, బహ్రెయిన్లో ఉన్న అమెరికా ఐదో నౌకాదళాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఎదురుదాడులకు దిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బహ్రెయిన్ ప్రభుత్వం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇటు అమెరికా సైనిక దూకుడు కొనసాగితే మరింత తీవ్రమైన ప్రతీకార చర్యలు తప్పవని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. అయితే..మరికొన్ని గంటల్లో ఇరాన్పై దాడి చేయబోతున్నామని ఇజ్రాయెల్కు అమెరికా ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తాజా దాడులు ఆ సమాచారం అనుగుణంగానే జరిగాయా? లేదంటే అమెరికా ఇరాన్పై మరేదైనా కొత్త దాడులకు వ్యూహ రచన చేస్తోందా? అనే ఉత్కంఠ నెలకొంది.
ఐర్లాండ్లో చెలరేగిన అల్లర్లు: కత్తిపోట్ల ఘటనతో..
బెల్ఫాస్ట్: ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఒక స్థానిక వ్యక్తిపై సుడాన్ దేశానికి చెందిన శరణార్థి జరిపిన కత్తిపోట్ల దాడి.. నగరంలో భారీ ఎత్తున వలస వ్యతిరేక అల్లర్లకు దారితీసింది. సోషల్ మీడియాలో ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో ఆగ్రహోదగ్రులైన స్థానికులు వీధుల్లోకి వచ్చి, వలసదారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగి, దీనిని ఒక ‘తీవ్రమైన సంక్షోభ పరిస్థితి’గా ప్రకటించారు.అర్ధరాత్రి ఘోరం.. కత్తితో విచక్షణారహితంగా దాడిబెల్ఫాస్ట్లోని కిన్నైర్డ్ ఎవెన్యూలో సోమవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. స్టీఫెన్ ఓగిల్వీ (44) అనే స్థానిక వ్యక్తిపై 30 ఏళ్ల సుడాన్ శరణార్థి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఓగిల్వీ ముఖం, మెడ, వీపు, కళ్ల భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బుధవారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.సోషల్ మీడియాలో వైరల్ వీడియోతో..నడిరోడ్డుపై జరిగిన ఈ భీభత్సానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షం కావడంతో ప్రపంచవ్యాప్త రైట్-వింగ్ నేతలు తీవ్రంగా స్పందించారు. బ్రిటీష్ నేత జేమ్స్ రాబిన్సన్ ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ నిరసనలకు పిలుపునిచ్చారు. ఎలాన్ మస్క్ సైతం ఈ వీడియోను రీపోస్ట్ చేస్తూ, నిరసనలు జరగబోయే ప్రాంతాల వివరాలను పంచుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ముసుగులు ధరించిన నిరసనకారులు శరణార్థుల ఇళ్లపై రాళ్లు, ఇటుకలతో దాడులు చేస్తూ ‘స్థానిక ఇళ్లు స్థానికులకే’ అంటూ గోడలపై నినాదాలు రాశారు.తగలబడుతున్న వీధులు.. ఈ వలస వ్యతిరేక ప్రదర్శనలు కాస్తా హింసాత్మకంగా మారడంతో బెల్ఫాస్ట్ వీధులు రణరంగాన్ని తలపించాయి. నిరసనకారులు వలసదారుల ఇళ్లను, వాహనాలను తగులబెట్టారు. ఒక మిడిల్ ఈస్టర్న్ సూపర్మార్కెట్కు కూడా నిప్పు పెట్టారు. ప్రాణభయంతో వలసదారులు తమ ఇళ్లను వదిలి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తర ఐర్లాండ్ న్యాయశాఖ మంత్రి లాంగ్ ఈ హింసాకాండను తీవ్రంగా ఖండిస్తూ, ప్రజలంతా సంయమనంతో మెలగాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: అఫ్గాన్పై పాక్ భీకర వైమానిక దాడులు.. 13 మంది దుర్మరణం
జాతీయం
ఎద్దు లేదని భార్యనే నాగలికి కట్టిన రైతు.. సీఎం స్పందించి..
ముంబై: ఎద్దు స్థానంలో భార్యను ఉంచి నాగలి లాగుతున్న ఓ రైతు వీడియో ఇటీవల వైరల్ అయింది. ఇటీవల అకాల వర్షాల సమయంలో పిడుగు పడి ఒక ఎద్దు చనిపోవడంతో రైతు కాశీనాథ్ గైక్వాడ్ తన భార్య హౌసాబాయిని నాగలి లాగేందుకు ఎద్దు స్థానంలో ఉపయోగించిన దృశ్యాలు కనిపించాయి. కొత్త ఎద్దును కొనుగోలు చేసే స్తోమత లేకపోవడం, కీలకమైన విత్తనాల సీజన్ కోల్పోతామనే భయంతో ఆ దంపతులు కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేయడం కొనసాగించేందుకు ఈ సాహసం చేశారు.మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లా, దేవోని తహసీల్ పరిధిలోని బోంబ్లీ ఖుర్ద్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీని గురించి తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెంటనే లాతూర్ జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి కుటుంబ పరిస్థితిపై సమగ్ర నివేదిక కోరారు. రైతుకు ఆలస్యం లేకుండా ప్రత్యామ్నాయ ఎద్దు అందించాలని, అత్యవసర సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి జోక్యం తర్వాత జిల్లా యంత్రాంగం స్థానిక గోశాల నుంచి ఒక ఎద్దును వెంటనే ఏర్పాటు చేసింది. దీంతో ఆ కుటుంబానికి తక్షణ ఉపశమనం లభించింది. కాశీనాథ్, హౌసాబాయి గైక్వాడ్ దంపతులు ఎన్నో ఏళ్లుగా పంటలో వాటా పద్ధతిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం వారు ఒక జత ఎద్దులను కొనుగోలు చేసేందుకు రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టారు. అయితే ఇటీవల తుపాను సమయంలో పిడుగు పడి ఒక ఎద్దు చనిపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. మరో ఎద్దు కొనుగోలు చేసే స్థితిలో లేకపోయింది.జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎద్దు మరణంపై అధికారిక అంచనా ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబానికి త్వరలో రూ.32,000 పరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.పరిహార ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి వేగంగా స్పందించడం, వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవడం పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి. సంక్షోభ సమయంలో ఇబ్బందులు పడుతున్న రైతు కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వ సున్నిత వైఖరి, తక్షణ చర్యలను లాతూర్ ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నేరుగా డబ్బు ఇచ్చి కొత్త ఎద్దు కొనుగోలు చేయకపోయినా ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత పశుసంవర్ధక శాఖ ప్రత్యామ్నాయంగా ఎద్దును ఏర్పాటు చేసి గైక్వాడ్ కుటుంబానికి అప్పగించింది.
తమిళనాడు నుంచి దుబాయికి బస్సు టికెట్
చెన్నై: తమిళనాడులో ఓ కండక్టర్ ఇచ్చిన టికెట్ ప్రయాణికున్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. తన సమీపంలోని ఊరికి వెళ్లాలని ప్రయాణికుడు సదరు కండక్టర్ని టికెట్ అడిగారు. దానికి సరే అని తలూపిన కండక్టర్ టికెట్ ఇచ్చారు. తీరా టికెట్ చూస్తే అందులో వేరే దేశానికి టికెట్ ఉంది. అంతే కాకుండా దాని ఖరీదు రూ. 10 వేలుగా ఉంది.అసలేం జరిగిందంటే?దామోదరన్ అనే వ్యక్తితో పాటు అతని స్నేహితుడు కలిసి బెంగళూరు వెళ్తున్న తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ఎక్కారు. వారు తమిళనాడులోని హుసూరు ప్రాంతానికి వెళ్లడానికి టికెట్ అడిగారు. దీంతో కండక్టర్ టికెట్ ఇచ్చారు. అయితే, కండక్టర్ తన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్ ద్వారా ప్రింట్ తీసి ఇచ్చిన టికెట్లను చూసి దామోదరన్ షాక్కు గురయ్యాడు.అందులో అతడు వెళ్లాల్సిన గమ్యస్థానం హుసూరుకు బదులు (దుబాయి, యుఏఈ) అని అని రాసి ఉంది. అంతే కాకుండా టికెట్ ధర రూ. పదివేలుగా ఉంది. దీంతో సదరు ప్రయాణికుడు షాక్కు గురయ్యాడు. దీంతో ఒక సాధారణ అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణం కాస్తా, అంతర్జాతీయ విమాన ప్రయాణంలా మారిపోయిందని ఆశ్చర్యపోయాడు. సాధారణంగా అతను వెళ్లాల్సిన గమ్యస్థానానికి రూ.150 వరకూ టికెట్ ధర ఉంటుంది.సోషల్ మీడియాలో ట్రెండింగ్అయితే ఈ ఘటనను తాలూకా వివరాలతో పాటు ఆ టికెట్ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో కాస్తా ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై రకరకాల జోకులు, మీమ్స్తో విరుచుకుపడ్డారు. తమిళనాడు రవాణా సంస్థ గల్ఫ్ దేశాలకు కూడా బడ్జెట్ బస్సు సర్వీసులను ప్రారంభించిందా ఏంటి? అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేశారు. సముద్రాలను దాటి బస్సు ప్రయాణిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.అధికారుల వివరణఈ టికెట్ వైరల్ కావడంతో తమిళనాడు రవాణా సంస్థ (TNSTC) సేలం డివిజన్ అధికారులు వెంటనే స్పందించారు... కండక్టర్ ఉపయోగించిన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్లో ఏర్పడిన ఒక సాంకేతిక లోపం వల్లే టికెట్పై దుబాయ్ అని ప్రింట్ అవ్వడం, అంత భారీ మొత్తంలో ఛార్జీ పడటం జరిగాయి. ప్రయాణికుల నుంచి కేవలం ఛార్జీ రూ. 150 మాత్రమే వసూలు చేశారని, ఈ తప్పు కేవలం టికెట్పై ప్రింట్ అయిన వివరాలకే పరిమితమైందని అధికారులు స్పష్టం చేశారు.
భర్తను అలా చూసి కారు బోనెట్పైకి భార్య చివరికి.. వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో గుండె ఝల్లుమనే ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతనిపై నిఘాపెట్టింది. ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూసిన ఆమె వాహనాన్ని ఆపే ప్రయత్నంలో వేగంగా దూసుకెళ్తున్న కారు బోనెట్మీదకు లంఘించింది. ఈ ఘటన భమోరా పరిధిలోని దేవ్చరా చౌరహా (కూడలి) వద్ద శనివారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. ఆమె బోనెట్పై వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గోదావరి (38) , నేత్రపాల్ సింగ్ ఇద్దరూ భార్యాభర్తలు. తన భర్త వేరే మహిళతో కలిసి కారులో ప్రయాణించడం చూసి, అతడిని అడ్డుకోడానికి ప్రయత్నించింది. కానీ అతను ఆపకుండా,మరింత వేగం పెంచడంతో, బోనెట్పై దూకేసింది. ఆమె బోనెట్పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా 100 మీటర్ల దూరం లాక్కెళ్లిన వైనం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మొత్తానికి అడ్డుకుని, ఆమెను సురక్షితంగా కిందకు దించారు. కారు ముందుకు దూసుకెళ్తుంటే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మహిళ బోనెట్ను గట్టిగా పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో కనిపించాయి. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్High drama unfolds in #Bareilly as wife catches husband with alleged girlfriend in a vehicle. She climbs onto car bonnet; gets dragged for nearly 100 meters. FIR Filed @uppolice @timesofindia pic.twitter.com/prKxvw3YvB— Sandeep Rai (@RaiSandeepTOI) June 9, 2026 భమోరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గోదావరి తన భర్త నేత్రపాల్ సింగ్కు సాధన అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. ఈ విషయంపై తాను భర్తను ప్రశ్నించినప్పుడల్లా ఆయన తనను తిడుతూ, శారీరకంగా హింసించేవాడని ఆమె తెలిపింది. ఇద్దరూ కారులో వెడుతుండగా, వారిని ఆపడానికే తాను అలా చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.తాను బోనెట్పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడని ఆమె ఆరోపించింది. ఈ ఘర్షణలో సాధన తనపై దాడి చేసి, తన మెడలోని బంగారు గొలుసును లాక్కుని అక్కడి నుంచి పారిపోయిందని గోదావరి తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఈ రసాభాసలో తన మామయ్య వాహనం కూడా దెబ్బతిన్నట్లు చెప్పింది.అయితే, సాధన ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తాను బ్లాక్ ఆఫీస్ నుండి తిరిగి వస్తుండగా నేత్రపాల్ కారులో కేవలం లిఫ్ట్ మాత్రమే తీసుకున్నానని, గోదావరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించింది. పైగా ఈ ఘటనలో తనపైనే దాడి జరిగిందని ఆమె ఆరోపించింది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తభమోరా ఎస్హెచ్ఓ (SHO) పవన్ కుమార్ స్పందిస్తూ, నేత్రపాల్ సింగ్, సాధనలపై ర్యాష్ డ్రైవింగ్, దాడి, ఉద్దేశపూర్వ దాడి లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇదీ చదవండి: హాట్ టాపిక్గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా
ప్రతీ ఆదివారం రెండు బిర్యానీలు ఫ్రీ : అవాక్కయ్యారా?
లక్షలాది మంది భారతీయులకు ఇష్టమైన వంటకం బిర్యానీ. సందర్భం ఏదైనా బిర్యానీ ఒక ఎమోషన్. అయితే ఒక ప్లేట్ బిర్యానీ చివరకు కోర్టు కేసు వరకు వెళ్తుందని ఎవరైనా ఊహిస్తారా? దీనికి సంబంధించి పుదుచ్చేరిలో జరిగిన ఒక విచిత్రమైన విషయం నెట్టింట సందడిగా మారింది.‘లైవ్లా’ (LiveLaw) నివేదిక ప్రకారం. స్థానిక రెస్టారెంట్లో పి. సుందరకుమార మణికందన్ అనే వినియోగ దారుడు తన స్నేహితుడు మహమ్మద్ నియాజుద్దీన్తో పుదుచ్చేరి ఎంజీ రోడ్డులోని ఎంతో ఇష్టంగా బిర్యానీ ఆర్డర్ చేసి తింటూ ఉండగా, బిర్యానీలో చనిపోయిన పురుగు కనిపించింది. దీని తీవ్రతను గమనించిన అతను వీడియోలు, ఫోటోలు తీశారు. రెస్టారెంట్లో పరిశుభ్రత లోపించిందని, దీనివల్ల తనకు మానసిక ఆందోళన కలగడమే కాకుండా, ఆరోగ్యం పాడవుతుందనే భయం, హోటళ్లపై నమ్మకం పోయిందని ఆరోపించాడు. ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్ఆ తర్వాత, మణికందన్ ఆ రెస్టారెంట్కు లీగల్ నోటీసు జారీ చేశారు. నిర్లక్ష్యం, ఆరోగ్య సమస్యలు, మానసిక వేదన , న్యాయపరమైన ఖర్చులను పేర్కొంటూ, అతను రూ. 1.3 లక్షల పరిహారం కోరారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. దీనికి ఎలాంటి స్పందన రాకపోవడంతో పుదుచ్చేరిలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు ఫిర్యాదు చేశాడు. సురక్షితమైన ఆహారాన్ని అందించడంలో రెస్టారెంట్ విఫలమైందని, ఇది ‘వినియోగదారుల రక్షణ చట్టం, 2019’ కింద సేవా లోపమేనని ఫిర్యాదు చేశారు.ఈ కేసులో రెస్టారెంట్ చేసిన ఒక పెద్ద తప్పు వారికి మైనస్ అయింది. కోర్టు నుంచి నోటీసులు అందినప్పటికీ 'బిర్యానీ అండ్ కో' ప్రతినిధులు కమిషన్ ముందు హాజరు కాలేదు. దీంతో ఈ కేసును కోర్టు ఏకపక్షంగా విచారించింది. కస్టమర్ ఇచ్చిన ఫోటోలు అంత స్పష్టంగా లేకపోయినా, వీడియో ఫుటేజీని కమిషన్ నిశితంగా పరిశీలించింది. ఆ వీడియోలో బిర్యానీలో చనిపోయిన ఈగ లాంటి పురుగు స్పష్టంగా కనిపించింది. అలాగే గూగుల్ రివ్యూలో కస్టమర్ పెట్టిన పోస్టుకు రెస్టారెంట్ మొదట స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పి, ఇలాంటివి మళ్లీ జరగవని పేర్కొంది. కానీ లీగల్ నోటీసుకు ఇచ్చిన రిప్లైలో మాత్రం తాము తప్పు చేయలేదని బుకాయించింది. ఈ పరస్పర విరుద్ధమైన సమాధానాల వల్ల రెస్టారెంట్ నమ్మకాన్ని కోల్పోయిందని కమిషన్ అభిప్రాయపడింది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తవినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటళ్లకు ఉందని స్పష్టం చేసింది. కస్టమర్కు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకపోయినప్పటికీ, ఈ ఘటన వల్ల ఆయన మానసిక వేదనకు, ఇబ్బందులకు గురయ్యారని కోర్టు అంగీకరించింది. దీని ప్రకారం వినియోగదారుడి మానసిక క్షోభ, శారీరక ఇబ్బందులకుగానూ కస్టమర్కు 10వేల రూపాయలు,కోర్టు ఖర్చుల కింద అదనంగా మరో రూ. 3,000 ఇవ్వాలని చెల్లించాలని రెస్టారెంట్ను ఆదేశించింది.అయితే, అందరినీ ఆశ్చర్యపరిచిన అసలైన విషయం మరొకటి ఉంది. ఈ నగదు పరిహారంతో పాటు, ఫిర్యాదు దారుడికి 10 ప్లేట్ల హైదరాబాదీ చికెన్ బిర్యానీని ఉచితంగా అందించాలంటూ వినూత్న ఆదేశాలు జారీ చేసింది. ఐదు వారాల పాటు ప్రతి ఆదివారం రెండు ప్లేట్ల చొప్పున ఈ బిర్యానీని అందించాలని, అది కూడా పూర్తి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ తయారు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉచిత బిర్యానీ పంపిణీ కోర్డు ఆర్డర్ అందిన రెండు వారాల్లోగా ప్రారంభం కావాలని ఆదేశించింది.ఇదీ చదవండి: హాట్ టాపిక్గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా
ఎన్ఆర్ఐ
న్యూజిల్యాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరంలో న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ప్రముఖ గాయని దాసరి మేఘన నాయుడు, యువ గాయకుడు సుస్వర తరంగ్ పాల్గొని తెలంగాణ ఉద్యమ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రవాస తెలుగు ప్రజలను ఉర్రూతలూగించారు. అసోసియేషన్ అధ్యక్షులు కోడూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ మోహన్ కుమార్ సేథి ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో, రాష్ట్ర సాధనలో అమరులైన ఉద్యమ వీరులను త్యాగాలను స్మరించుకుని తెలుగు ప్రజల ఐక్యత గొప్పతనాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కి ఇంతకాలం నుంచి మద్దతు అందిస్తున్న ట్రాన్స్ పసిఫిక్ డైరెక్టర్ తమ్మినేని రోహిత్ రెడ్డిని సన్మానించారు. గాయని గాయకులు వందేమాతరం శ్రీనివాస్, దాసరి మేఘన నాయుడు, సుస్వర తరంగ్ని ఘనంగా సత్కరించారు.ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు పట్లోళ్ల నరేందర్ రెడ్డితో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన రోహిత్ తమ్మినేని, దయానంద్ కటకం, జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల, విజేత యాచమనేని, మధు ఎర్ర, వర్ష పట్లోళ్ల, స్వాతి మేకల,కావ్యా మాశెట్టి, కిరణ్మయి పద్మ, విశ్వనాథ్ అవిటి, మహమ్మద్ బిలాలుద్దీన్, హరీష్ గోపాల్, మనోహర్ కన్నం, శ్రీనివాస్ పందిళ్ళ, రమేష్ రెడ్డి రామిండ్ల, శ్రీరామ్ విజయ్, శ్రీనివాస్ గాజుల, ప్రమోద్ ఇరుగు, అనిల్ మెరుగు, రమేష్ ఆడెపు, రవి కుమార్ వట్టం, మారుతి జెల్ల, మహేందర్ రెడ్డి ద్యావ, శ్రీనివాస్ కలకోట తదితరులు హాజరయ్యారు.
భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!
భారత సంతతి విద్యార్థి అవని అహుజాకి ప్రతిష్టాత్మక హెన్నీ ఫోర్డ్II స్కాలర్ అవార్డుని గెలుచుకుంది. ఎంఐటీలో అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ఈ అవార్డుని సాధించిన ఎన్నారైగా ఘనత సృష్టించింది. అసాధారణమైన విద్యా ప్రతిభ, ఇంజనీరింగ్లలో బలమైన నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించే సీనియర్ అండర్ గ్రాడ్యుయేట్లకు ఈ పురస్కారన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డుతో ప్రతిష్టాత్మక ఎంఐటీ విద్యార్థుల ప్రత్యేక బృందంలో చేరారు. ఈ పురస్కారం ఇటీవల కోడే రీసెర్చ్ గ్రూప్లో ఆమె చేసి వర్క్ కెపాసిటివ్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ పరిశోధనకు గానూ లభించింది. ఈ సాంకేతికతను భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వైర్లెస్గా ఛార్జ్ చేయడానికి, శరీరంలో అమర్చే వైద్య పరికరాలకు శక్తిని అందించడానికి ఉపయోగించవచ్చు. ఈ మేరకు అవని మాట్లాడుతూ.."ఈ అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా, ఆనందంగా ఉంది. ముఖ్యంగా డీన్ హామండ్ను కలవడం ఒక గొప్ప గౌరవం." అని అన్నారామె. నిజానికి హెల్త్కేర్ టెక్నాలజీలు, రోబోటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లలో పనిచేయగల సామర్థ్యమే, ఆమెను ఎంఐటీ అత్యంత ప్రతిభావంతులైన అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధకులలో ఒకరిగా నిలబెట్టింది. అలాగే అవనికి అత్యంత ఆసక్తి ఉన్న రంగాలలో మహిళల ఆరోగ్య పరిశోధన ఒకటి. అంతేగాదు ఆమె రొమ్ము కేన్సర్ స్క్రీనింగ్ను మరింత సులభతరం చేయడానికి రూపొందించిన, ధరించగలిగే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ ప్యాచ్కు సంబంధించిన పరిశోధనలలో కూడా కీలకపాత్ర పోషించారామె. తాను పీహెచ్డీ పూర్తి అయిన వెంటనే మహిళల ఆరోగ్య పరిశోధన రంగంలో పవర్ ఎలక్ట్రానిక్స్ను అన్వయించాలని చూస్తున్నట్లు తెలిపారు.(చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!)
NRI : అమెరికాలో రోడ్డు ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సతీమణి డాక్టర్ సుచియాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగనయాష్కీని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్కు వస్తుండగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని, ఈ ప్రమాదంలో డాక్టర్ సుచియాష్కీకి పక్కటెముకలు విరిగిపోయాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కాగా, మధుయాష్కీ కూడా అమెరికాలోనే ఉన్నారు. చిన్న కుమార్తె డాక్టర్ గగన న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్కు హాజరయ్యేందుకు యాష్కీ దంపతులు అమెరికా వెళ్లారు.కుమార్తెను ఎండీ కోర్సులో జాయిన్ చేసి వచ్చే సమయంలో సుచి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వేరే కారులో మధుయాష్కీ కూడా ఉన్నారని, భార్యకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో గురువారం ఇండియాకు రావాల్సిన యాష్కీ, అక్కడే ఉండిపోయారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ ఫోన్లో మధుయాష్కీని పరామర్శించారు.
ఆటా సభలకు వైఎస్ జగన్కు ఆహ్వానం
సాక్షి,తాడేపల్లి: అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) మహాసభలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బుజల, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జయసింహారెడ్డి చల్లా, రామాంజుల రెడ్డి తదితరులు.. 2026 జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న 19వ ఆటా మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధికి ఆటా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆటా సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మహాసభలు ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనే ఈ వేడుకలు తెలుగు వారి ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని మరింతగా చాటిచెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆటా ప్రతినిధులు సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, మహాసభల ఏర్పాట్ల గురించి వైయస్ జగన్కు వివరించారు.
క్రైమ్
భర్తను అలా చూసి కారు బోనెట్పైకి భార్య చివరికి.. వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో గుండె ఝల్లుమనే ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతనిపై నిఘాపెట్టింది. ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూసిన ఆమె వాహనాన్ని ఆపే ప్రయత్నంలో వేగంగా దూసుకెళ్తున్న కారు బోనెట్మీదకు లంఘించింది. ఈ ఘటన భమోరా పరిధిలోని దేవ్చరా చౌరహా (కూడలి) వద్ద శనివారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. ఆమె బోనెట్పై వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గోదావరి (38) , నేత్రపాల్ సింగ్ ఇద్దరూ భార్యాభర్తలు. తన భర్త వేరే మహిళతో కలిసి కారులో ప్రయాణించడం చూసి, అతడిని అడ్డుకోడానికి ప్రయత్నించింది. కానీ అతను ఆపకుండా,మరింత వేగం పెంచడంతో, బోనెట్పై దూకేసింది. ఆమె బోనెట్పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా 100 మీటర్ల దూరం లాక్కెళ్లిన వైనం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మొత్తానికి అడ్డుకుని, ఆమెను సురక్షితంగా కిందకు దించారు. కారు ముందుకు దూసుకెళ్తుంటే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మహిళ బోనెట్ను గట్టిగా పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో కనిపించాయి. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్High drama unfolds in #Bareilly as wife catches husband with alleged girlfriend in a vehicle. She climbs onto car bonnet; gets dragged for nearly 100 meters. FIR Filed @uppolice @timesofindia pic.twitter.com/prKxvw3YvB— Sandeep Rai (@RaiSandeepTOI) June 9, 2026 భమోరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గోదావరి తన భర్త నేత్రపాల్ సింగ్కు సాధన అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. ఈ విషయంపై తాను భర్తను ప్రశ్నించినప్పుడల్లా ఆయన తనను తిడుతూ, శారీరకంగా హింసించేవాడని ఆమె తెలిపింది. ఇద్దరూ కారులో వెడుతుండగా, వారిని ఆపడానికే తాను అలా చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.తాను బోనెట్పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడని ఆమె ఆరోపించింది. ఈ ఘర్షణలో సాధన తనపై దాడి చేసి, తన మెడలోని బంగారు గొలుసును లాక్కుని అక్కడి నుంచి పారిపోయిందని గోదావరి తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఈ రసాభాసలో తన మామయ్య వాహనం కూడా దెబ్బతిన్నట్లు చెప్పింది.అయితే, సాధన ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తాను బ్లాక్ ఆఫీస్ నుండి తిరిగి వస్తుండగా నేత్రపాల్ కారులో కేవలం లిఫ్ట్ మాత్రమే తీసుకున్నానని, గోదావరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించింది. పైగా ఈ ఘటనలో తనపైనే దాడి జరిగిందని ఆమె ఆరోపించింది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తభమోరా ఎస్హెచ్ఓ (SHO) పవన్ కుమార్ స్పందిస్తూ, నేత్రపాల్ సింగ్, సాధనలపై ర్యాష్ డ్రైవింగ్, దాడి, ఉద్దేశపూర్వ దాడి లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇదీ చదవండి: హాట్ టాపిక్గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా
లండన్లో భారతీయ కుటుంబం అనుమానాస్పద మరణం
లండన్లో విషాదం చోటుచేసుకుంది. లండన్లోని ఒక విలాసవంతమైన నివాస భవనంలో 36వ అంతస్తు బాల్కనీ నుండి కింద పడి భారత సంతతికి చెందిన దంపతులు, వారి తొమ్మిదేళ్ల కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. ఈ ఘటన మే 27న దక్షిణ లండన్లోని 46 అంతస్తుల భవనంలో జరిగింది.మే 27న భవనం 36వ అంతస్తులపైనుంచి కింద పడ్డారని ప్రత్యక్ష సాక్షులు సమాచారం ఇవ్వడంతో అత్యవసర సేవా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పారామెడిక్స్ వారిని బతికించడానికి ప్రయత్నించినప్పటికీ, రాకేష్ పై (47), ఆయన భార్య అదితి పరల్కర్ (46) తొమ్మిదేళ్ల కుమారుడు సిద్ (9) అక్కడికక్కడే మరణించినట్లు నిర్ధారించారు. ఇది ఆత్మహత్యా లేక హత్య అనే సందేహాలు వెల్లువెత్తాయి.సిద్కు తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని, ఇదే వారి ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. రాకేశ్, ఆదితి 2020లో భారత్లో తమ కుమారుడికి వైద్యం చేయించారని, అయినప్పటికీ పరిస్థితి మెరుగు పడకపోవడం, ఇక దీనికి చికిత్స లేదని వైద్యులు తేల్చి చెప్పడంతో వారు లండన్కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.ఘోర విషాదం, ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మరణించడం చాలా బాధాకరం, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో యూకేలోనే పుట్టాడని, ఆ సమస్యలే వారు ఈ ఘోరానికి దారితీసి ఉండవచ్చని స్థానిక ఎంపీ నీల్ కోయల్ ఆ భవన నివాసితులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.ఈ దంపతులు ఫైనాన్స్ , నిర్మాణ రంగ కన్సల్టింగ్ విభాగాల్లో పనిచేసేవారు. ఫ్రెండ్స్ అంతా వీరిని 'ఆది' 'రాబిన్' అని పిల్చుకునే వారు. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్ అనారోగ్యం విషయంలో అదితి బాగా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నట్టు అనిపించినా, రాబిన్ ప్రశాంతంగా, పరిస్థితులను మేనేజ్ చేసేవాడని గుర్తు చేసుకున్నారు.మరోవైపు ఈ విషాదానికి కొన్ని వారాల ముందు, వీరి ఇంటినుంచి అరుపులు కేకలు వినిపించాయని పొరుగువారు పోలీసులకు చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు ప్రకటించారు. ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త
ఆంటీతో యువకుడి వివాహేతర సంబంధం..!
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో పట్టపగలు మహిళ దారుణ హత్యకు గురైంది. సన్నిహితంగా ఉంటున్న వ్యక్తే అనుమానంతో ఆమెను కడతేర్చాడు. అనంతరం నిందితుడు పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసుల కథనం మేరకు.. కనుపర్తిపాడుకు చెందిన రేవతి (35)కి సుమారు 18 సంవత్సరాల క్రితం సుమన్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. విభేదాల నేపథ్యంలో ఐదేళ్ల క్రితం రేవతి భర్త నుంచి విడిపోయింది. ఆమె పిల్లలతో కలిసి కనుపర్తిపాడులో తండ్రి వద్ద ఉంటోంది. ఈక్రమంలో అదే ప్రాంతానికి చెందిన కడప శ్రీకాంత్తో ఆమెకు పరిచయమైంది. ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల ఆమె మరొకరితో మాట్లాడుతుందన్న అనుమానంతో శ్రీకాంత్ తరచూ గొడవ పడేవాడు. ఎలాగైనా రేవతిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.కత్తితో పొడిచి..మంగళవారం రేవతి కొండాయపాళెంలోని ఓ భవనంలో వాచ్మెన్గా పనిచేస్తున్న తన తండ్రికి భోజనం బాక్స్ ఇచ్చి స్కూటీలో పెట్రోల్ పట్టించుకుని వెళ్తానని బయటకు వచ్చింది అక్కడ శ్రీకాంత్ ఆమెను కలిశాడు. ఇద్దరూ పడారుపల్లి చెరువుకట్ట రేవు వద్దకు వెళ్లారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీకాంత్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రేవతిపై పలుమార్లు పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం నిందితుడు నేరుగా వేదాయపాళెం పోలీస్స్టేషన్కు వెళ్లి తాను ఓ మహిళను హత్య చేశానని జరిగిన విషయం చెప్పాడు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడి కాలికి గాయమై ఉండటంతో అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్లో చేర్పించినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు.
భార్య, కుమారున్ని హతమార్చి..
కర్ణాటక: కుటుంబాన్ని ప్రాణంలా కాపాడుకోవాల్సిన ఇంటి పెద్ద హంతకుడయ్యాడు. భార్య, కుమారున్ని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మండ్య నగరంలో దుస్తుల వ్యాపారి ఒకరు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. వ్యాపారి ప్రభాకర్ (65), భార్య జ్యోతి (55), కుమారుడు సంతోష్ (30) మృతులు. ఏం జరిగిందంటే.. వివరాలు.. నెహ్రూ నగరలో ప్రభాకర్కు క్లాత్ స్టోర్ ఉంది. కుటుంబ నిర్వహణ, వ్యాపారం కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో సోమవారం రాత్రి భోజనం చేసి పడుకున్నాక.. భార్య జ్యోతి గొంతుకు చీర బిగించి చంపబోయాడు. ఆ శబ్ధాలకు మరో గదిలో ఉన్న కుమారుడు సంతోష్ వచ్చాడు. అయినప్పటికీ ప్రభాకర్ భార్యను హతమార్చి, ఆపై కుమారున్ని కూడా అదే మాదిరిగా ప్రాణాలు తీశాడు. పక్క గదిలో నిద్రిస్తున్న కోడలికి ఇదేమీ తెలియదు. తరువాత తన బట్టల అంగడికి వచ్చి ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కోడలు నిద్రలేచి అత్త వద్దకు వెళ్లగా ఘోరం బయటపడింది. తూర్పు పోలీసు స్టేషన్ సిబ్బంది, మండ్య ఎస్పీ శోభారాణి చేరుకుని పరిశీలించారు. పాపం.. కొత్త కోడలు ఈ ఘటనలో మరో విషాదం ఏమిటంటే.. నెల రోజుల క్రితమే సంతోష్కు ఘనంగా పెళ్లి చేయడం. అతని భార్య జీవితం కూడా ఛిన్నాభిన్నమైంది. రాత్రి తన గదినుంచి భర్త బయటకు వెళ్లిన సంగతి ఆమెకు తెలియరాలేదు. ఫ్యాన్ శబ్దం ఎక్కువగా ఉండడం వల్ల ఏ చప్పుళ్లు వినిపించలేదని ఆమె తెలిపింది. డెత్నోట్లో.. వ్యాపారంలో నష్టాలు, అప్పుల వల్ల విరక్తికి గురై ప్రభాకర్ భార్య, కొడుకును చంపేశారని ఎస్పీ శోభ తెలిపారు. ప్రభాకర్ డెత్నోట్ లభించిందని తెలిపారు. ఇంటి రుణం, నష్టాలు, ఉచిత బస్సు పథకం వల్ల తమకు వ్యాపారం బాగా తగ్గిపోయిందని లేఖలో రాశారన్నారు.
వీడియోలు
ఇది స్విమ్మింగ్ పూల్ కాదు ఫ్లైఓవర్.. చూసి షాక్ అవుతున్న పబ్లిక్
రామోజీ తద్దినానికి 10 కోట్లు.. కార్మికుల కుటుంబాలకు 9 కోట్లు ఇవ్వలేరా..
పొన్నూరు టీడీపీకి భారీ షాక్.. YSRCPలో చేరిన వంద టీడీపీ కుటుంబాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు YS జగన్ భరోసా..
ఇరాన్ ఆర్థిక వెన్నెముకపై.. అమెరికా బాంబుల వర్షం
జగనన్న చెప్పిన ఆ ఒక్క మాట నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది
జబర్దస్త్ షోకి వెళ్ళావా... లోకేష్ ? ఛీ..ఛీ ప్రభుత్వాన్ని పెట్టుకొని కోటి రూపాయలు ఇవ్వలేరా?
స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ ఎమోషనల్.. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే.. జననేత భరోసా..
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
జ్ఞానేశ్వరి కేసులో అనుమానాలు.. కుక్క ప్రవర్తనలో మార్పు!

