మహిళలందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటుంది.. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితో పాటు, మహిళా సాధికారత లక్ష్యంగా మా హయాంలో పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేశాం...అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాం. దాదాపు 32కు పైగా పథకాల ద్వారా మహిళలకు భరోసా కల్పించాం. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్ర పోషిస్తున్నారు. మహిళల అభ్యున్నతే.. ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం’’ అని వైఎస్ జగన్ అన్నారు.
ఇండియాలోని ఇజ్రాయెల్లో నిశ్శబ్దం
హిబ్రూ–ప్రభావిత కేఫ్ సంస్కృతి సహా పలు ఇతర లక్షణాల కారణంగా మన దేశంలోని హిమాలయ ప్రాంత గ్రామమైన కసోల్ ను ‘మినీ ఇజ్రాయెల్‘ గా పేర్కొంటారు. ఈ ప్రాంతం తొలిసారి ఈ పర్యాటక సీజలో అసాధారణ నిశ్శబ్ద వాతావరణాన్ని చవిచూస్తోంది. చాలా కాలంగా ఇజ్రాయెల్ నుంచి వచ్చే సందర్శకులపై ఆధారపడిన స్థానిక వ్యాపారాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.సుందరమైన పార్వతి లోయలో ఉన్న కసోల్, కల్గా , పుల్గా వంటి సమీప గ్రామాలు సంవత్సరాలుగా ఇజ్రాయెల్ బ్యాక్ప్యాకర్లకు ఇష్టమైన స్టాప్లుగా నిలుస్తూన్నాయి. చెక్క ఇళ్ళు, ఆపిల్ తోటలు, ప్రశాంతమైన ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామాలు ఇజ్రాయెల్ ప్రయాణికులకు ఉపకరించేప్రత్యేక పర్యాటక సంస్కృతికి నిలయాలుగా మారాయి.ఇక్కడి చాలా కేఫ్లు ఇజ్రాయెల్ శైలిలో రూపొందిన వంటకాలను అందిస్తాయి అతిథులకు ఇంట్లో ఉన్నట్లు అనిపించేలా హోమ్స్టేలు తరచుగా తమ మెనూలను హిబ్రూలో ముద్రిస్తాయి. అయితే, ఈ సంవత్సరం, సందర్శకుల రాక కనిపించక సందడి తగ్గిపోయింది. ‘‘అంతర్జాతీయ బ్యాక్ప్యాకర్లకు బాగా ప్రసిద్ధి చెందిన జిప్సీ హౌస్ కేఫ్ – హోమ్స్టే దగ్గర ఆ తేడా కనిపిస్తోందని సిబ్బంది అంటున్నారు. ‘సీజన్ ఇప్పుడే ప్రారంభమైంది కానీ డిమాండ్ లో తరుగుదల స్పష్టంగా ఉంది‘ అని ఒక ఉద్యోగి అన్నారు. ‘సాధారణంగా ప్రతి సీజన్ లో మాకు 50 నుంచి 100 మంది ఇజ్రాయెల్ పర్యాటకులు వస్తారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్కరు కూడా రాలేదు అని చెప్పారు.ఈ పరిస్థితికి కారణం ప్రస్తుతం ఇజ్రాయెల్ – ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలే అని వీరు అంటున్నారు, యుద్ధం ప్రయాణ సౌకర్యాలకు అంతరాయం కలిగించింది. అదే ధరమ్కోట్ కసోల్ వంటి బ్యాక్ ప్యాకింగ్ కేంద్రాలను ప్రభావితం చేసిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పరిస్థితి ఇక్కడితో ఆగకపోవచ్చునని విదేశీ పర్యాటకులకు కీలక ప్రవేశద్వారాలుగా ఉంటున్న మనాలి, సిమ్లా వంటి టాప్ హిల్ స్టేషన్స్ ను కూడా ప్రభావితం చేయవచ్చునని అంచాన వేస్తున్నారు. స్థానిక ఆపరేటర్ల ప్రకారం, సాధారణంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పార్వతి లోయలో ఇజ్రాయెల్ ప్రయాణికులకు ఫుల్ సీజన్. ‘ప్రతి సంవత్సరం 10,000 కంటే ఎక్కువ మంది ఇజ్రాయెల్ బ్యాక్ప్యాకర్లు కసోల్ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు అని ఓ ట్రావెల్ సంస్థ ప్రతినిధి అన్నారు. ‘ఈసారి, ఈ సంఖ్యలు వందల్లోనే ఉండవచ్చు’’ అన్నారాయన. ఈ మార్పు బుకింగ్ విధానాలలో కూడా కనిపిస్తుందని ట్రావెల్ ఏజెంట్లు అంటున్నారు.‘ఇజ్రాయెల్ పర్యాటకులు సాధారణంగా తమ బసలను 20–30 రోజుల ముందుగానే బుక్ చేసుకుని మార్చి నాటికి రావడం ప్రారంభిస్తారు‘ అని విదేశీ సందర్శకులతో పనిచేసే ట్రావెల్ ఏజెంట్ రంజిత్ రాణా అంటున్నారు. ‘‘ఈ సంవత్సరం దాదాపుగా ఏ మాత్రం బుకింగ్లు లేవు. ఫిబ్రవరిలో వచ్చిన వారు కూడా ముందుగానే వెనుదిరిగారు.’’ అని చెప్పారాయన.హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విడుదల చేసిన పర్యాటక డేటా ప్రకారం, కాంగ్రా జిల్లా సిమ్లా జిల్లా తర్వాత పార్వతి లోయను కలిగి ఉన్న కులు జిల్లా విదేశీ పర్యాటకుల రాకపోకలలో రాష్ట్రంలోని మొదటి మూడు జిల్లాల్లో ఒకటి. అందువల్ల అంతర్జాతీయ పర్యాటకుల రాకలో తేడా వస్తే అది స్థానిక జీవనోపాధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎయిర్ కనెక్టివిటీ కూడా ఈ పరిస్థితిలో కీలక పాత్ర పోషించింది. టెల్ అవీవ్, న్యూఢిల్లీ మధ్య ప్రత్యక్ష విమానాలను నడుపుతున్న ఏకైక విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, కానీ ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఈ మార్గం తాత్కాలికంగా మూతబడింది. అలాగే చాలా కాలంగా భారతదేశానికి వెళ్లే ఇజ్రాయెల్ ప్రయాణికులకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన రవాణా కేంద్రంగా ఉంది. టెల్ అవీవ్ నుంచి దుబాయ్కు వెళ్లే మార్గాల్లో అనిశ్చితి...తో చాలా మంది పర్యాటకులు తమ ప్రయాణాలను వాయిదా వేస్తున్నారు.
'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!
'ధురంధర్' సినిమాని చూసి తెలుగు దర్శకనిర్మాతలు చాలా అంటే చాలా నేర్చుకోవాలి. కేవలం కంటెంట్ అనే కాదు మిగతా విషయాల్లోనూ ఈ మూవీ ఓ గైడ్ లాంటిది అని చెప్పొచ్చు. తాజాగా సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ విషయం మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఏంటా విషయాలు? టాలీవుడ్ దీనిని చూసి ఏమేం నేర్చుకోవాలి?(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)గత కొన్నాళ్ల నుంచి పాన్ ఇండియా, సీక్వెల్ అనే ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగులోనే చిన్నపెద్ద అనే తేడా లేకుండా ప్రతి దర్శకుడు ఓ సినిమా తీసేయడం, సీక్వెల్ ఉంటుంది అన్నట్లు చివరలో స్టోరీని అర్థంతరంగా వదిలేయడం లాంటివి చాలానే చూశాం. వీటన్నింటికి భిన్నంగా కంటెంట్పై నమ్మకంతో 'ధురంధర్' టీమ్ రెండు భాగాల షూటింగ్ ఒకేసారి పూర్తి చేసింది. తొలి భాగం హిట్టయితేనే రెండో పార్ట్ తీస్తాం అనే ట్రెండ్ని బ్రేక్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ల కంటెంట్పై వాళ్లకు అంత బలమైన నమ్మకం ఉండటమే దీనికి కారణం.టాలీవుడ్ ఓ సినిమాకు సీక్వెల్ అంటే అది ఎన్నేళ్ల తర్వాత వస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిది 'ధురంధర్' టీమ్ ఎంత ఫెర్ఫెక్ట్ ప్లానింగ్తో వచ్చారంటే.. తొలి పార్ట్ రిలీజైన మూడు నెలల్లో రెండో పార్ట్ రిలీజ్ చేస్తామని మాటిచ్చారు. ఇప్పుడు దానికే కట్టుబడ్డారు. ఈ నెల 19న 'ధురంధర్ 2'ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. చాలామంది తెలుగు దర్శకనిర్మాతలు.. తమ సినిమాలో కంటెంట్ అంతంత మాత్రంగానే ఉన్నా ఏదో ఉంది అనేంత హడావుడి చేస్తుంటారు. 'ధురంధర్' టీమ్ మాత్రం ఎక్కువ హడావుడి చేయలేదు. ప్రమోషన్స్ లాంటివి కూడా పెద్దగా చేయలేదు. కేవలం ప్రేక్షకుల్ని మాత్రమే నమ్ముకుంది.(ఇదీ చదవండి: ‘ధురంధర్2’కి పెయిడ్ ప్రీమియర్స్.. రన్టైమ్ ఎంతంటే?)తెలుగులో చాలా సినిమాల పాటలు, టీజర్, ట్రైలర్స్ లాంటివి నేరుగా రిలీజ్ చేయకుండా.. మొదట ఓ అప్డేట్ అంటారు. తర్వాత సాంగ్కి టీజర్ అంటారు. తీరా రిలీజ్ టైంకి వచ్చేసరికి సాంకేతిక కారణాలు చెప్పి వాయిదా వేస్తుంటారు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటారు. ఈ విషయంలోనూ 'ధురంధర్' టీమ్ని మెచ్చుకోవాలి. ఓ టైమ్ చెప్పారు. సరిగ్గా అదే సమయానికి ట్రైలర్ రిలీజ్ చేసేశారు.తొలి భాగం దేశవ్యాప్తంగా అద్భుతమైన హిట్ అయినా సరే ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ల పెంపులాంటివి అడగలేదు. మూవీ రిలీజ్కి 10-12 రోజులు ముందుగానే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసేశారు. అదీ సాధారణ ధరలతోనే. టికెట్పై రూ.50-100 అదనం చెప్పి ప్రేక్షకుడి నుంచి దోచుకునే ప్రయత్నం చేయలేదు. పైన చెప్పిన విషయాల్లో చాలావరకు టాలీవుడ్లో చాలామంది పాటించరు.తీసిన సినిమాకు పెట్టిన బడ్జెట్కి టికెట్ ధరలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఒకవేళ ఏమైనా అంటే వింత వింత కారణాలు చెబుతారు. థియేటర్లకు జనాలు రావట్లేదని బాధపడతారు. చెప్పాలంటే ప్రేక్షకులని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. ఏం తీసినా సరే చూస్తారులే అని అనుకుంటున్నారు. అందుకే తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు సైతం డిజాస్టర్ టాక్లు తప్పట్లేదు.(ఇదీ చదవండి: మరింత వైలెంట్గా ధురంధర్ 2 ట్రైలర్)
ఇరాన్పై భీకర పోరు : అత్యవసరంగా ఇజ్రాయెల్కు 12 వేల బాంబులు
ఇరాన్తో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్కు అత్యవసర ఆయుధాల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. అత్యవసర మినహాయింపు ద్వారా (కాంగ్రెస్ ఆమోదం అవసరం లేకుండా) ఇజ్రాయెల్కు 151.8 మిలియన్ల డాలర్ల విలువైన 12,000 బాంబు కేసింగ్స్ను (ఒక్కొక్కటి1,000 పౌండ్ల బరువు) విక్రయించనుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వెంటనే విక్రయించాల్సిన అత్యవసర పరిస్థితి వచ్చిందని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమర్ధించుకున్నారు. తద్వారా ఆయుధ ఎగుమతి నియంత్రణ చట్టంలోని సెక్షన్ 36(b)ను మినహాయించినట్టు చెప్పారు. ఈ ప్రతిపాదిత అమ్మకం ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందనీ, దాని రక్షణను బలోపేతం చేస్తుందని అని స్టేట్ డిపార్ట్మెంట్ బ్యూరో ఆఫ్ పొలిటికల్-మిలిటరీ అఫైర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్ , ఉబ్బితబ్బిబ్బైన యజమానిఅత్యవసర మినహాయింపు (Emergency Waiver) అంటే సాధారణంగా ఇలాంటి అమ్మకాలకు కాంగ్రెస్ ఆమోదం అవసరం. అయితే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో "ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్" కింద తనకున్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి కాంగ్రెస్తో సంబంధం లేకుండా ఈ విక్రయాన్ని వేగవంతం చేశారు. అమెరికన్ రక్షణ సంస్థలు తమ అత్యాధునిక ఆయుధాల ఉత్పత్తిని నాలుగు రెట్లు పెంచడానికి అంగీకరించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ ఆయుధాల సరఫరా వల్ల ఇజ్రాయెల్ తన రక్షణను బలోపేతం చేసుకోవడమే కాకుండా, ప్రాంతీయ ముప్పులను అడ్డు కోవడానికి సహాయపడుతుందని బ్యూరో ఆఫ్ పొలిటికల్-మిలిటరీ అఫైర్స్ తెలిపింది.ఇదీ చదవండి: పెట్రోల్ , డీజిల్ ధరల షాక్ తప్పదా? వైరల్ వీడియోదీనిపై విమర్శలు ఈ నిర్ణయంపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సమీక్షను దాటవేయడం ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న వాదనలకు విరుద్ధంగా ఉందని . డెమొక్రాటిక్ నాయకుడు గ్రెగొరీ మీక్స్ విమర్శించారు. ప్రభుత్వం యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూనే, ఇలా "అత్యవసర" అధికారాన్ని వాడటం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం..
టీవీకే చీఫ్ విజయ్ మ్యానిఫెస్టో.. వారికి బంపరాఫర్
మహిళలందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
యుద్ధ ఆయుధాలు బంగారంతో.. కియోసాకి ట్వీట్
ఇండియాలోని ఇజ్రాయెల్లో నిశ్శబ్దం
‘పబ్లిసిటీ మాత్రం ఉంటుంది.. ప్రజలకు చేసేదేమీ ఉండదు’
'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!
ఈ చెట్టు వయసు 2200 సంవత్సరాలు!
ఆ రోజు రాత్రే ప్రియాంకకు ‘ఫ్రెంచ్ కిస్’.. సీక్రెట్స్ బయటపెట్టిన నిక్ జోనాస్
గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణలపై ట్రంప్ రియాక్షన్
T20 WC 2026: అదే మా కొంపముంచింది.. బ్రూక్ ఆవేదన
బాంబుల మోత మధ్య సౌదీ సర్కారు శుభవార్త
పడిపోతున్న పసిడి ధరలు.. ఈసారి తులం..
మొయిన్ అలీపై నిషేధం..!
'లడ్డూ'పై సమాధానం చెప్పలేక చంద్రబాబు సతమతం
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
మరో దేశంపై యుద్ధం ప్రకటించిన ట్రంప్
విజయ్తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత
ఒకప్పుడు క్లాస్ టాపర్..కానీ ఇవాళ..!
T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
స్వగ్రామంలో విజయ్.. ఎమోషనల్ ఫోటో షేర్ చేసిన మేనమామ
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న నాయకుడి పాలనలో ఉన్నాం!
T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్!
యుద్ధంతో ధరలకు రెక్కలు
డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ
ఇరాన్, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన
IND vs ENG: సెమీస్లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి!
T20 WC Final: బుమ్రా కూడా మనిషే కదా!: కివీస్ స్టార్
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం.. ఐసీసీ టోర్నీ వాయిదా
అణ్వాయుధ ప్రోగ్రామ్.. అమెరికాకు ఇరాన్ కండీషన్..!
కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం..
టీవీకే చీఫ్ విజయ్ మ్యానిఫెస్టో.. వారికి బంపరాఫర్
మహిళలందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
యుద్ధ ఆయుధాలు బంగారంతో.. కియోసాకి ట్వీట్
ఇండియాలోని ఇజ్రాయెల్లో నిశ్శబ్దం
‘పబ్లిసిటీ మాత్రం ఉంటుంది.. ప్రజలకు చేసేదేమీ ఉండదు’
'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!
ఈ చెట్టు వయసు 2200 సంవత్సరాలు!
ఆ రోజు రాత్రే ప్రియాంకకు ‘ఫ్రెంచ్ కిస్’.. సీక్రెట్స్ బయటపెట్టిన నిక్ జోనాస్
గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణలపై ట్రంప్ రియాక్షన్
T20 WC 2026: అదే మా కొంపముంచింది.. బ్రూక్ ఆవేదన
బాంబుల మోత మధ్య సౌదీ సర్కారు శుభవార్త
పడిపోతున్న పసిడి ధరలు.. ఈసారి తులం..
మొయిన్ అలీపై నిషేధం..!
'లడ్డూ'పై సమాధానం చెప్పలేక చంద్రబాబు సతమతం
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
మరో దేశంపై యుద్ధం ప్రకటించిన ట్రంప్
విజయ్తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత
ఒకప్పుడు క్లాస్ టాపర్..కానీ ఇవాళ..!
T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
స్వగ్రామంలో విజయ్.. ఎమోషనల్ ఫోటో షేర్ చేసిన మేనమామ
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న నాయకుడి పాలనలో ఉన్నాం!
T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్!
యుద్ధంతో ధరలకు రెక్కలు
డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ
ఇరాన్, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన
IND vs ENG: సెమీస్లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి!
T20 WC Final: బుమ్రా కూడా మనిషే కదా!: కివీస్ స్టార్
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం.. ఐసీసీ టోర్నీ వాయిదా
అణ్వాయుధ ప్రోగ్రామ్.. అమెరికాకు ఇరాన్ కండీషన్..!
ఫొటోలు
ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)
హైదరాబాద్లో గ్రాండ్గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)
రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)
మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు
జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష సందడి.. ఫోటోలు వైరల్
సినిమా
'నీ కొత్త ప్రయాణం చూస్తుంటే ఆనందంగా ఉంది'.. రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్- నయనిక జంటకు మెగా హీరో రామ్ చరణ్ విషెస్ చెప్పారు. పెళ్లి వేడుకలో పాల్గొన్న చెర్రీ నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. అల్లు శిరీష్-నయనిక జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. నయనికతో ఈ అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు శిరీష్ను అభినందించారు. మీ వైవాహిక జీవితం ఇద్దరికీ అంతులేని ఆనందం, ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు.కాగా.. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వెడ్డింగ్ గ్రాండ్గా జరిగింది. హైదరాబాద్లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్లో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వెడ్డింగ్కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లికి హాజరైన రామ్ చరణ్ నూతన జంటను ఆశీర్వదించారు.కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. So happy to see @AlluSirish begin this wonderful new journey with #Nayanika Wishing the both of you endless happiness, love and a blessed married life ❤️Congratulations ✨ pic.twitter.com/2FYRvGcNXX— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2026
నేను బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా
సోషల్ మీడియా, యూట్యూబ్ చూసేవాళ్లకు షన్ను అలియాస్ షణ్ముఖ్ జస్వంత్ గురించి పరిచయం అక్కర్లేదు. 'వైవా' అనే షార్ట్ ఫిలింతో నటుడిగా మొదలైన ఇతడు.. ఇప్పుడు సినిమాలో హీరోగా చేసేంత వరకు వచ్చాడు. అయితే తోటి యూట్యూబర్ దీప్తి సునైనాతో ప్రేమ-బ్రేకప్, బిగ్బాస్ 5వ సీజన్లో సిరి హనుమంతుతో చేసిన రచ్చ, ఓసారి డ్రగ్స్తో దొరికిపోవడం.. ఇలా చాలాసార్లు సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాడు. గత కొన్నేళ్లుగా పెద్దగా కనిపించని షన్ను.. కొన్నిరోజుల క్రితం వైష్ణవి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన షణ్ముఖ్ జస్వంత్.. గతంలో తనకు జరిగిన చేదు సంఘటనలు, బ్రేకప్, బిగ్బాస్ అనుభవం, వైష్ణవితో ప్రేమ-నిశ్చితార్థం ఇలా చాలా విషయాలు గురించి మాట్లాడాడు. మిగతా వాటి సంగతేమో గానీ తనని తాను.. బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని అని చెప్పుకోవడం మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. బ్రేకప్ (దీప్తి సునైనాతో) తర్వాత నిజంగా బాధపడ్డారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ సంగతులు చెప్పుకొచ్చాడు. ఒక టీవీ షోకి వెళ్లకుండా ఉండాల్సిందని బిగ్బాస్ గురించి పరోక్షంగా ప్రస్తావించాడు.'అవును బ్రేకప్ తర్వాత చాలా బాధపడ్డాను. కానీ ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాను. నా వల్ల తనకు, ఎవరికీ బ్యాడ్ నేమ్ రాకూడదని అనుకున్నాను. పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు నడిచాను. కానీ ఎందుకు బ్రేకప్ చెప్పావ్? నాకు సమాధానం చెప్పు అని ఒత్తిడి చేయలేదు. చెప్పాలంటే నేను బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని. బ్రేకప్ తర్వాత ఒక్కరిని కూడా టార్చర్ చేసింది లేదు ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టింది లేదు. ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఫోన్ తీసి ఫొటోలు చూసుకోవడమే తప్పితే.. ఇది చేస్తా అది చేస్తా అనే బ్యాచ్ కాదు' అని షన్ను చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: గద్దర్ అవార్డ్స్-2025 విజేతలు.. ఉత్తమ నటుడు నాగచైతన్య)'బ్రేకప్ తర్వాత తనకు ప్రేమపై పూర్తిగా నమ్మకం పోయింది. అలాంటి టైంలో తన జీవితంలోకి వైష్ణవి వచ్చిందని షన్ను చెప్పాడు. ఈమెకు చాలా దైవభక్తి. ఎప్పటికప్పుడు దేవాలయాలకు వెళ్తూనే ఉంటుంది. అలానే మాకు పరిచయమైంది. తొలుత హనుమాన్ చాలీసా లాంటివి వాట్సాప్లో పంపించుకునేవాళ్లం. హనుమాన్ జయంతి సందర్భంగా కరుంగళి మాలతో పాటు హనుమాన్ చాలీసా లాంటివి వైష్ణవి పంపింది. నేను కూడా రామకోటి లాంటివి శ్రీరామనవమి టైంకి పంపించాను. అలా స్నేహితులుగా ఉన్నవాళ్లం కాస్త తర్వాత స్టేజీకి వెళ్లాం''అయితే ప్రేమలాంటివి కాకుండా డైరెక్ట్గా పెళ్లి ప్రపోజల్ పెట్టాను. నా గురించి అన్ని తెలిసి కూడా వైష్ణవి, వాళ్ల అమ్మ ఒప్పుకోవడం గొప్ప విషయం. ఇక నా చేతిపై పచ్చబొట్టు గురించి వైష్ణవి చెప్పిన మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అది మీకో మెమొరీ. ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు. లేదంటే ఎప్పుడు తీసేయాలన్నా సరే మీ ఇష్టం అని నాతో చెప్పింది. అది కాదండీ, ఇలా మాట్లాడండి అని పిలవడం తప్పితే ఇప్పటివరకు నన్ను షన్ను అని పిలవలేదు' అని షన్ను.. తనకు కాబోయే భార్య వైష్ణవి గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హీరోగా 'ప్రేమకు నమస్కారం' సినిమా చేస్తున్నాడు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు.(ఇదీ చదవండి: సీరియల్ నటి చెల్లిని పెళ్లి చేసుకున్న ఆర్జే సూర్య)
‘ధురంధర్2’కి పెయిడ్ ప్రీమియర్స్.. రన్టైమ్ ఎంతంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్2: ది రివెంజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలు డబుల్ చేసింది. యాక్షన్తో పాటు ఎమోషనల్ డ్రామాకు కూడా పెద్ద పీట వేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మార్చి 19న బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయమని రణ్వీర్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే చిత్రబృందం మాత్రం ఒక రోజు ముందే బాక్సాఫీస్ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. మార్చి 18న పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఆ రోజు సాయంత్రం ఫస్ట్ షో నుంచే ‘ధురంధర్2: ది రివెంజ్’ మూవీని ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే బుక్మై షో, డిస్ట్రిక్ట్ యాప్ల ద్వారా టికెట్ బుకింగ్స్ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ పెయిడ్ ప్రీమియర్స్కి మాత్రం కేవలం హిందీ భాషలో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హైదరాబాద్లోని వివిధ మల్టీప్లెక్స్లలో ఇప్పటికే టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. మామలుగా అయితే పెయిడ్ ప్రీమియర్స్కి టికెట్ ధరలను పెంచుతారు. కానీ ధురంధర్ 2కి మాత్రం ప్రీమియర్స్కి కూడా నార్మల్ ధరలే ఉండడం గమనార్హం. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్స్కి రావడం కోసమే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీ రన్టైమ్..ధురంధర్ 2 మూవీ రన్టైమ్పై మొన్నటి వరకు సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. ఈ మూవీ నిడివి 3 గంటల 55 నిమిషాలు. మొదటి భాగం 3 గంటలా 34 నిమిషాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. బ్రేక్ టైమ్తో కలిపితే నాలుగు గంటలకు పైనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంత నిడివితో ఏ చిత్రం రాలేదు. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే కంటెంట్ ఉంది కాబట్టే.. రన్టైమ్ విషయంలో మేకర్స్ భయపడడం లేదట. మరి ధురంధర్ 2 ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందో తెలుసా?
హీరోయిన్ త్రిష రెండు దశాబ్దాలకు పైగా సినీప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. వర్షం సినిమాతో తెలుగులో సెన్సేషన్ సృష్టించిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్ సరసన గిల్లిలో హీరోయిన్గా యాక్ట్ చేసి స్టార్ స్టేటస్ అందుకుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. అయితే ఈ బ్యూటీ దళపతి విజయ్తో ప్రేమాయణం నడుపుతుందని చాలాకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఇటీవల విజయ్, త్రిష జంటగా ఓ పెళ్లికి హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే త్రిష విజయ్ కంటే ముందు వేరే హీరోలతో లవ్లో పడింది. ఆ కథేంలో ఇప్పుడు చూసేద్దాం..హీరోలతో లవ్త్రిష తమిళంలో పలువురు స్టార్స్తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో శింబుకి జోడీగా సినిమాలు చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ముదిరి ప్రేమగా మొగ్గలు తొడిగిందట. బయటకు వెళ్లినప్పుడు కూడా చేతిలోన చెయ్యేసి మరీ నడిచేవారు.. కానీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. ఆ తర్వాత దళపతి విజయ్తో ఎక్కువ సినిమాలు చేసిన సమయంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, కొంతకాలానికి ఆ రూమర్స్ దానంతటవే ఆగిపోయాయి.ప్రకంపనలు రేపిన సుచీలీక్స్అనంతరం త్రిష టాలీవుడ్ హీరో రానాకు క్లోజ్ అయింది. మొదట్లో వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఒకానొక సమయంలో ఈ స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ తర్వాతెందుకో విడిపోయారు. కోలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన సుచీలీక్స్ వ్యవహారంలో త్రిష-రానా క్లోజ్ ఫోటో ఒకటి బయటకు రావడం అప్పట్లో సంచలనం రేపింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తోనూ ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. త్రిష వల్లే ధనుష్- ఐశ్వర్య వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.పెళ్లి క్యాన్సిల్వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ 2015లో పెళ్లికి రెడీ అయింది త్రిష. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో వివాహం రద్దు చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని కండీషన్ పెట్టాడని, అది నచ్చకనే అతడిని పెళ్లి చేసుకోలేదని త్రిష ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ధనుష్తో త్రిష అంత క్లోజ్గా ఉండటం నచ్చకే అతడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని అంటుంటారు.విజయ్తో లవ్ఇప్పుడు మరోసారి విజయ్తో ప్రేమలో మునిగి తేలుతోంది త్రిష. విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది హీరో భార్య సంగీత. ఈ సమయంలో విజయ్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అందరికీ తాము ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్తోంది. మరి విజయ్- సంగీత విడాకులు తీసుకున్నాక వీరు ప్రేమను పెళ్లి బంధంతో బలపర్చుకుంటారేమో చూడాలి!చదవండి: నోటికి ఎంతొస్తే అంత అనేస్తారా? బుర్రసాయి మాధవ్కు వరలక్ష్మి శరత్కుమార్ కౌంటర్
క్రీడలు
T20 WC Final: ఆ ఇద్దరిపై వేటు!.. అతడికి చోటు?
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో బ్యాటర్ల, బౌలర్ల జాబితాలో అగ్రస్థానం టీమిండియా ఆటగాళ్లదే. ఓపెనింగ్ స్టార్ అభిషేక్ శర్మ నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతుండగా.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ బౌలర్గా కొనసాగుతున్నాడు.అయితే, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అభిషేక్, వరుణ్ స్థాయికి తగ్గట్లు ఆడటంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ దారుణమైన ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 89.ఏకంగా 64 పరుగులుమరోవైపు.. వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఆరంభ మ్యాచ్లలో రాణించినా.. కీలక నాకౌట్ దశలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళనకరంగా పరిణమించింది. ముఖ్యంగా ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో ఈ స్పిన్ బౌలర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 64 పరుగులు ఇచ్చుకుని కేవలం ఒకే ఒక్క వికెట్ కూల్చాడు.ఆ ఇద్దరిపై వేటు వేయాలి!ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎనిమిది ఇన్నింగ్స్లో కలిపి వరుణ్ 8.85 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో ఫైనల్ నేపథ్యంలో అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలపై వేటు వేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.ముఖ్యంగా వరుణ్ను తప్పించి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలను కొనసాగించాలా? వద్దా? అన్న అంశం గురించి స్పందించాడు.నలుగురు విఫలమైనా.. ‘‘ఇప్పుడిదే అతిపెద్ద ప్రశ్న. అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఎందుకు కొనసాగించవచ్చో చెబుతాను. మనకు ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. మరీ గ్రహచారం బాగాలేకపోతే నలుగురు విఫలమైనా.. మరో నలుగురు పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది.బౌలర్లలో ఒక్కరు విఫలమైనా..అభిషేక్ శర్మ పరుగులు చేయకుండానే టీమిండియా ఫైనల్ వరకూ వచ్చింది. అయితే, బౌలర్ ఒక్క ఓవర్లో విఫలమైనా భారీ మూల్యం చెల్లించకతప్పదు. ఐదుగురు బౌలర్లలో ఒక్కరు చెడ్డగా ఆడినా అంతే సంగతులు.ఇన్నింగ్స్లో ఓ బౌలర్కు 20 శాతం బౌలింగ్ కోటా ఉంటుంది. నిజానికి గత మ్యాచ్లో వరుణ్ పేలవంగా ఆడాడు. అందుకే కుల్దీప్ను తీసుకురావాలనే ఆలోచన రావొచ్చు. అనుభవజ్ఞుడైన లెఫ్టార్మ్ స్పిన్నర్ అందుబాటులో ఉంటే బాగుంటుంది.నేను మాత్రం ఆ ఇద్దరినీ కొనసాగిస్తాఅయితే, నేను మాత్రం తుదిజట్టును ఎంపిక చేసే స్థానంలో ఉంటే.. వరుణ్ చక్రవర్తినే కొనసాగిస్తా. అతడితో పాటు అభిషేక్ శర్మనూ కొనసాగిస్తా’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కీలక మ్యాచ్లో తుదిజట్టులో మార్పులు అంతగా మంచిది కాదని.. తమదైన రోజున చెలరేగే సత్తా ఉన్న అభిషేక్, వరుణ్ వంటి స్టార్లపై వేటు వేయడం తగదని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం ఫైనల్కు షెడ్యూల్ ఖరారైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్
T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫైనల్కు రంగం సిద్ధమైంది. టీమిండియా- న్యూజిలాండ్ ఆదివారం టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్ ఫైనల్ విజేతపై తమ అంచనాలు తెలియజేశారు. డివిలియర్స్ యూట్యూబ్ చానెల్ వేదికగా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే.. ప్రతి ఒక్కరు సౌతాఫ్రికాను ‘చోకర్స్’ అని పిలవడానికి ఇష్టపడతారు. కీలక మ్యాచ్లలో మనం ఓడిపోవడం ఇందుకు కారణం.ఇది అసాధ్యంఅయితే, న్యూజిలాండ్ విషయంలోనూ నేను ఇదే మాట అంటాను. న్యూజిలాండ్ ఇప్పటి వరకు వరల్డ్కప్లు గెలవనేలేదు. సౌతాఫ్రికా మాదిరే ఎన్నోసార్లు ఫైనల్కు చేరినా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈసారైనా గెలిచేందుకు ప్రయత్నించండి.నిజానికి నాకు న్యూజిలాండ్ జట్టు అంటే చాలా ఇష్టం. కానీ వాళ్లు టీమిండియాను ఓడించలేరు. ఇది జరగాలంటే మాత్రం ఏదో ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని భారత జట్టు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది అసాధ్యం. కివీస్ గెలవాలనే కోరుకుంటున్నా. కానీ వాళ్లు భారత్ను ఓడించగలరా?.. అంటే లేదనే చెప్తాను’’ అని పేర్కొన్నాడు.జట్టు గెలవాలని నాకూ ఉందిఇందుకు డివిలియర్స్ బదులిస్తూ... ‘‘అవును.. న్యూజిలాండ్కు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఆ జట్టు గెలవాలని నాకూ ఉంది. కానీ వారికి ఆ అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలి’’ అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో న్యూజిలాండ్ ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే నెగ్గింది.రెండుసార్లు టీమిండియాను ఓడించిఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని 2000 సంవత్సరంలో కైవసం చేసుకున్న కివీస్.. మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ విజేతగానూ 2021లో అవతరించింది. ఈ రెండుసార్లూ న్యూజిలాండ్ ప్రత్యర్థి టీమిండియానే కావడం విశేషం. అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్తో తలపడిన కివీస్కు ఈ సారి పరాజయమే ఎదురైంది. భారత్ విజేతగా అవతరించింది. అయితే, కివీస్ ఇంత వరకు ఒక్క వరల్డ్కప్ ట్రోఫీ గెలవకపోగా.. భారత్ మూడు ప్రపంచకప్ టోర్నీలు గెలిచింది. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్, 2024 టీ20 ప్రపంచకప్ ట్రోఫీలను సొంతం చేసుకుంది.చదవండి: T20 WC Final: పిచ్ ఎలా ఉండబోతోంది?.. ఎర్ర మట్టితోనా?
T20 WC 2026: ఐసీసీ రంగంలోకి దిగినా.. తప్పని చిక్కులు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో వెస్టిండీస్ ఫర్వాలేదనిపించగా.. సౌతాఫ్రికా సెమీస్ వరకు ప్రయాణం కొనసాగించింది. లీగ్ దశలో అదరగొట్టిన విండీస్ జట్టు.. సూపర్-8లో కీలక మ్యాచ్లో టీమిండియా చేతిలో ఓడి నిష్క్రమించింది.మరోవైపు.. సౌతాఫ్రికా లీగ్ దశలో అజేయంగా నిలవడంతో పాటు.. సూపర్-8లోనూ హ్యాట్రిక్ విజయాలతో సెమీస్లో అడుగుపెట్టింది. అయితే, కీలక మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి మరోసారి ‘చోకర్స్’ అన్న బిరుదును సార్థకం చేసుకుంది. ఇక ఈ రెండు జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించినా.. ఇంకా ఇంటికి చేరుకోలేదు.భారత్లోనే చిక్కుకుపోయారుఇందుకు మధ్య ప్రాచ్యంలోని యుద్ధ వాతావరణం కారణం. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుండగా.. అందుకు ఇరాన్ కూడా గట్టిగానే బదులిస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో గగనతలం మూసివేశారు. దీంతో వెస్టిండీస్, జింబాబ్వే, సౌతాఫ్రికా జట్ల ఆటగాళ్లు భారత్లోనే చిక్కుకుపోయారు. అయితే, జింబాబ్వే జట్టును ప్రత్యేక విమానంలో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)తరలించినట్లు సమాచారం.ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా..ఇక వెస్టిండీస్ జట్టు కోసం కూడా ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా.. ఎయిర్ ట్రాఫిక్ అధికారుల నుంచి ఇంత వరకు ఆమోదం లభించనట్లు తెలుస్తోంది. దీంతో ఆటగాళ్లలో మరోసారి ఆందోళన నెలకొంది. కాగా ఇప్పటికే వెస్టిండీస్ హెడ్కోచ్ డారెన్ సామీ (Daren Sammy).. తమను స్వదేశానికి చేర్చమంటూ దీనంగా అర్థించిన విషయం తెలిసిందే.ఇక బౌలర్ అకీల్ హొసేన్ సైతం క్రిస్టియాన్ రొనాల్డోనే ఈ పరిస్థితులలో తమను ఆదుకోగలడంటూ ట్వీట్ చేశాడు. అయితే, ఐపీఎల్లో భాగమైన షెర్ఫానే రూథర్ఫర్డ్, రోవ్మన్ పావెల్, షిమ్రన్ హెట్మైర్ తదితరులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.సౌతాఫ్రికానూ వీడని చిక్కులుఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా ఆటగాళ్లు కూడా మరికొన్నాళ్లు భారత్లోనే ఉండాల్సి రావొచ్చు. అయితే, న్యూజిలాండ్తో టీ20 సిరీస్ నేపథ్యంలో దాదాపు నలుగురు ఆటగాళ్లు నేరుగా కివీస్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. సెమీస్ మ్యాచ్లలో సౌతాఫ్రికాను న్యూజిలాండ్.. ఇంగ్లండ్ను టీమిండియా ఓడించి ఫైనల్కు అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి టైటిల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక.చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్
T20 WC Final: పిచ్ ఎలా ఉండబోతోంది?.. ఎర్ర మట్టితోనా?
టీమిండియా చరిత్రకు అడుగుదూరంలో ఉంది. వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా అవతరించాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టింది సూర్యకుమార్ సేన.సొంతగడ్డపై టీ20 వరల్డ్కప్-2026 ఆడుతున్న భారత జట్టు లీగ్ దశలో అజేయంగా నిలిచింది. సూపర్-8లో తొలుత తడబడినా.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించి సెమీస్ చేరింది. ఇక సెమీ ఫైనల్లో ఇంగ్లండ్తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లోనూ ఏడు పరుగుల తేడాతో గెలిచి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది.వరుసగా రెండుసార్లుతద్వారా వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ టోర్నీ ఫైనల్కు చేరిన జట్టుగా నిలిచింది. ఇక ట్రోఫీ కోసం న్యూజిలాండ్తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. అయితే, ఫైనల్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కావడం సెంటిమెంట్ పరంగా టీమిండియాకు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఇదే వేదికపై 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో తాజా ఫైనల్కు సంబంధించిన పిచ్ విషయంలో కూడా టీమిండియా తీవ్రంగా ఆలోచిస్తోంది. నిజానికి పిచ్ ఎంపిక, తయారీ ఐసీసీ పరిధిలోని అంశం. కానీ ఎర్ర మట్టితో చేసిన పిచ్పై ఆడాలనే తమ ఉద్దేశాన్ని భారత జట్టు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎర్రమట్టితో చేసిన పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తోంది. ముంబైలో ఇదే జరిగింది.టీమిండియా కోరుకుంది ఇదేఇక అహ్మదాబాద్లో నల్లరేగడి మట్టితో చేసిన పిచ్పై సౌతాఫ్రికా జట్టుతో ‘సూపర్–8’ మ్యాచ్ ఆడిన సూర్యకుమార్ సేన దారుణంగా ఓడిపోయింది. అది పునరావృతం కాకుండా టీమిండియా బ్యాటింగ్ పిచ్నే కోరుకుంటోంది. ఈ విషయం గురించి జట్టు సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ..ఎర్ర మట్టితోనే‘‘నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాకు మిశ్రమ మట్టితో తయారైన పిచ్ లభించనుంది. స్పోర్టింగ్ పిచ్నే రూపొందిస్తున్నారు. అయితే, ఎక్కువ మటుకు ఇది ఎర్ర మట్టితోనే తయారు చేస్తారు. కాస్త బౌన్సీగా ఉండటంతో పాటు.. బ్యాటర్లకు కూడా అనుకూలిస్తుంది’’ అని పేర్కొన్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా అహ్మదాబాద్లో జరిగిన తొలి ఐదు మ్యాచ్లలో పేస్ బౌలింగ్లో 762 బంతుల్లో బ్యాటర్లు 1062 పరుగులు సాధించారు. ఫాస్ట్ బౌలర్లకు 45 వికెట్లు దక్కాయి. ఇక స్పిన్ బౌలింగ్లో 421 బంతుల్లో బ్యాటర్లు 617 పరుగులు రాబట్టగా.. బౌలర్ల ఖాతాలో 20 వికెట్లు చేరాయి. చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్
న్యూస్ పాడ్కాస్ట్
భవిష్యత్ అభివృద్ధి శూన్యం... ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్. సెమీస్లో 7 పరుగులతో ఇంగ్లండ్పై గెలుపు
హాజరైన సెలబ్రిటీలు... విరోష్ రిసెప్షన్ కు
‘లడ్డూ’పై బాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. శాసన మండలిలో చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు
స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెద్ది
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలపై ఆటవిక దాడి... మహిళా దినోత్సవ వేళ చంద్రబాబు మార్కు గిఫ్ట్
తీవ్రరూపం దాలుస్తున్న పశ్చిమాసియా యుద్ధం... ఇరాన్కు అండగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు...
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. కుటుంబ సభ్యులతోపాటు ఆర్మీ చీఫ్ ముసావీ కూడా మృతి... క్షిపణి దాడుల్లో హత్య చేసిన ఇజ్రాయెల్
భగ్గుమన్న పశ్చిమాసియా... ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు... భారీగా ప్రతిదాడులకు దిగిన ఇరాన్
బిజినెస్
రికార్డుల రియల్ ఎస్టేట్.. ఇప్పుడంతా టెన్షన్!
స్థిరాస్తి రంగం లావాదేవీలలో అత్యంత ప్రధానమైంది సెంటిమెంట్. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఎవరైనా సరే.. వారి భావోద్వేగాలపై ప్రభావం పడిందంటే చాలు తుది నిర్ణయానికి పునరాలోచనలో పడతారు. ఏ దేశ స్థిరాస్తి రంగంలోనైనా ఇదే పరిస్థితి. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలలో యుద్ధం నేపథ్యంలో ప్రధానంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం అనిశ్చితిలో పడింది. గతేడాది దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో 2.70 లక్షలకు పైగా స్థిరాస్తి లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 917 బిలియన్ ఏఈడీ. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ.2,30,872 కోట్లు. దుబాయ్ రియల్టీ చరిత్రలో ఇదే అత్యధిక లావాదేవీలు కావడం గమనార్హం. – సాక్షి, సిటీబ్యూరో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్పై మొదలు పెట్టిన యుద్ధం క్రమంగా యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్(యూఏఈ) దేశాలకు విస్తరించింది. దీంతో స్థిరాస్తి పెట్టుబడిదారులు ప్రపంచంలోని అత్యంత డైనమిక్ ప్రాపర్టీ మార్కెట్లలో ఒకటైన దుబాయ్లో ప్రాంతీయ అస్థిరత దెబ్బతింటుందా అనే సందిగ్ధంలో పడిపోయారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ను తాత్కాలికంగా ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.2008 ఆర్థిక సంకోభం, కరోనా మహమ్మారి కాలంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ షాక్కు గురైంది. కాకపోతే విధానపరమైన సంస్కరణలతో ఆయా విపత్కర పరిస్థితుల నుంచి వేగవంతంగా కోలుకుంది. అయితే ఈసారి దుబాయ్ కూడా ఎదురుదాడికి దిగడంతో పశ్చిమాసియా దేశాల్లో సురక్షిత ఆర్థిక కేంద్రమైన ఎమిరేట్స్లో భౌతిక నష్టం పరిమితమే అయినప్పటికీ.. ప్రపంచ పెట్టుబడిదారుల సెంటిమెంట్పై ప్రభావం తప్పక ఉంటుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.భారతీయుల పెట్టుబడులు ఎందుకంటే? 150 దేశాల పెట్టుబడిదారులు యూఏఈ ప్రాపర్టీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. యూఏఈ జనాభాలో దాదాపు 88–89 శాతం మంది ప్రవాసులు ఉంటారు. దీంతో సహజంగానే ఇక్కడ ప్రాపర్టీ మార్కెట్లో వీరిదే హవా.. భౌగోళిక సామీప్యత, డాలర్ కంటే దిర్హమ్ స్థిరత్వం, ఎక్కువ విలువ, అద్దె రాబడులు అధికంగా ఉండటం వంటి కారణంగా భారతీయులు దుబాయ్లో పెట్టుబడులకు మొగ్గు చూపిస్తుంటారు. భారత సంతతికి చెందిన డెవలపర్ల వాటా నిర్మాణ దశలోని ప్రాజెక్ట్లలో 8–10 శాతం వరకు ఉంటుంది.మన ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.2,30,872 కోట్లు.. ప్రపంచదేశాలతో పోలిస్తే అత్యధిక అద్దె రాబడి వచ్చేది దుబాయ్లోనే.. ఇక్కడ అద్దె వార్షిక ఆదాయం 6–9 శాతం మధ్య ఉంటుంది. భారత్ అతిపెద్ద విదేశీ పెట్టుబడుల దేశం దుబాయ్. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఇండియన్స్ ఆస్తి కొనుగోళ్ల వాటా 20–22 శాతంగా ఉందని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2021 నుంచి దుబాయ్లో గృహాల ధరలు సుమారు 60–75 శాతం మేర పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దుబాయ్లో దాదాపు 2 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. వీటి విలువ 538 బిలియన్ ఏఈడీ(ఇండియన్ కరెన్సీలో రూ.1,34,945 కోట్లు).ఆర్థిక సంకోభం, కోవిడ్ సమయంలో.. దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్ గతంలోనూ చేదు అనుభవాలను చవిచూసింది. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దుబాయ్లో ప్రాపర్టీల ధరలు 50–60 శాతం మేర క్షీణించాయి. దీని నుంచి కోలుకునేందుకు 6–7 ఏళ్ల కాలం పట్టింది. చమురు ధరల పతనం, అధిక సరఫరా కారణంగా 2014, 2019లలో ఇక్కడ ధరలు దాదాపు 25–30 శాతం మేర తగ్గాయి. ఇక, ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి కాలంలో ప్రాపర్టీ మార్కెట్లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. అద్దెలపై ప్రభావం.. సాధారణంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రవాసులపై అధికంగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాపర్టీ ఇన్వెస్టర్లు తాత్కాలికంగా వేచి చూసే ధోరణి అవలంబిస్తారు. ఇలాంటి సెంటిమెంట్ ప్రభావం తొలుత నిర్మాణ ప్రారంభ దశలో కొనుగోళ్ల, ఊహాజనిత పెట్టుబడులపై చూపిస్తాయి. ఎందుకంటే ఈ విభాగాలు మార్కెట్ సెంటిమెంట్, విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటాయి. అలాగే యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల పర్యాటక పరిశ్రమ దెబ్బతింటుంది. దీంతో పర్యాటక ప్రాంతాల్లోని అద్దెలు, ఆతిథ్య ప్రాపర్టీలు, రిటైల్ ఆస్తులపై తాత్కాలిక ప్రభావం ఉంటుంది.
‘చైనాతో చేసిన పొరపాటు భారత్తో చేయం’
రెండు దశాబ్దాల క్రితం చైనా విషయంలో చేసిన వాణిజ్యపరమైన తప్పులను భారత్ విషయంలో పునరావృతం చేయబోమని అమెరికా స్పష్టం చేసింది. భారత్తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకున్న తరుణంలో అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ‘రైసినా డైలాగ్ 2026’ వేదికగా ఆయన ఇరు దేశాల ఆర్థిక సంబంధాలపై ప్రసంగం చేశారు.చైనా అనుభవాలే గుణపాఠం‘20 ఏళ్ల క్రితం చైనాకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించి ఆ దేశాన్నే మాకు పోటీగా మార్చిన పొరపాటును భారత్ విషయంలో చేయం’ అని లాండౌ కుండబద్ధలు కొట్టారు. అమెరికా ప్రభుత్వం తన ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, అందుకే భారత్తో కుదుర్చుకోబోయే ఏ ఒప్పందమైనా పరస్పర ప్రయోజనం ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారు. తానేమీ ఇక్కడ సామాజిక సేవ చేయడానికి రాలేదని, అమెరికా ప్రయోజనాలే తమకు పరమావధి అని వ్యాఖ్యానించారు.ఊగిసలాటలో వాణిజ్య ఒప్పందం?భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ముగింపు దశలో ఉందని లాండౌ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ ఇటీవలి పరిణామాలు ఒప్పందాన్ని మరింత జాప్యం చేసే దిశగా ఉన్నాయి. ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్లు చెల్లవని తీర్పునిచ్చింది. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్త దిగుమతులపై 10% నుంచి 15% వరకు అదనపు సర్ఛార్జీని విధించింది. గతంలో భారతీయ వస్తువులపై ఉన్న 25% సుంకాన్ని ఒప్పందం ద్వారా 18%కి తగ్గిస్తామని అమెరికా ఆశ చూపేది. కానీ ప్రస్తుతం అందరికీ వర్తించే సుంకం 10%కి తగ్గడంతో అమెరికా ఆఫర్కు ఉన్న ప్రాధాన్యత తగ్గింది.
‘భారతీయ బ్యాంకింగ్పై నమ్మకం’లో కొత్త కోణాలు
చిరకాలంగా బ్యాంకింగ్ రంగంలో నమ్మకమనేది కీలకాంశంగా ఉంటోంది. అయితే ఆ నమ్మకం కలిగే ప్రక్రియ ఇప్పుడు మారుతోంది. నేటి కస్టమర్ల దగ్గర మరింత సమాచారం ఉంటోంది. వారు మరింతగా కనెక్ట్ అయి ఉంటున్నారు. తమకు అందుబాటులో ఉన్న ఆప్షన్ల గురించి కూడా అవగాహన పెరిగింది. కాబట్టి, ఇప్పుడు వారు బ్యాంకుల నుంచి కేవలం ఆర్థిక తోడ్పాటును మాత్రమే కాకుండా, విశ్వసనీయత, జవాబుదారీతనం, నిలకడైన నిరంతర సేవలను కూడా ఆశిస్తున్నారు.ఆర్థిక రంగ సంస్కరణల తర్వాతి కాలంలో బ్యాంకింగ్ రంగం ప్రధానంగా బ్యాంకింగ్ సేవలను ఎక్కువ మందికి చేరవేయడంపై దృష్టి పెట్టింది. మరింత మంది ప్రజలను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమనేది ఆర్థిక, సామాజిక పరంగా ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఈ దిశగా గణనీయమైన పురోగతి కూడా సాధించబడింది. ఇప్పుడు బ్యాంకింగ్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో, కస్టమర్లు మరో ముఖ్య అంశాన్ని కోరుకుంటున్నారు. అదేమిటంటే, మారుతున్న పరిస్థితుల్లో కూడా తమ బ్యాంక్ ఆధారపడే విధంగానే ఉంటుందని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందనే ఓ నమ్మకాన్ని వారు కోరుకుంటున్నారు.విశ్వాసానికి మారుతున్న పునాదులుకొన్ని సంవత్సరాల క్రితం వరకు బ్యాంకులపై విశ్వాసం ప్రధానంగా భౌతిక ఉనికితో అనుసంధానమై ఉండేది. దగ్గరలో ఉన్న బ్రాంచ్, చిరపరిచితమైన సిబ్బంది, స్థిరమైన ప్రక్రియలు కస్టమర్లకు భరోసా కలిగించేవి. స్థిరత్వమే విశ్వాసానికి ఆధారంగా ఉండేది.టెక్నాలజీ అభివృద్ధితో బ్యాంకింగ్ రంగం మారిన తర్వాత సౌలభ్యమనేది కూడా కస్టమర్ల ప్రాధాన్యతల్లో కీలకంగా మారింది. వేగవంతమైన లావాదేవీలు, సులభమైన ప్రక్రియలు రోజువారీ బ్యాంకింగ్ను సులభతరం చేశాయి. అయితే కాలక్రమేణా ఇవి ప్రత్యేతలుగా కాకుండా సర్వసాధారణంగా ఆశించే సేవలుగా మారిపోయాయి.ఇప్పుడు కస్టమర్లు బ్యాంకింగ్ సేవలనేవి ఎప్పుడు కావాలంటే అప్పుడు సాధారణంగా అందుబాటులోనే ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి దృష్టి ఇప్పుడు విశ్వసనీయ వ్యవస్థలవైపు మళ్లింది. బ్యాంకింగ్ సిస్టమ్లు సజావుగా పనిచేయాలి. కస్టమర్ సమాచారం భద్రంగా ఉండాలి. సంస్థలు కార్యకలాపాల్లో క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటున్నారు.దీనితో భద్రత అనే భావన పరిధి కూడా పెరిగింది. బ్యాంక్ ఆర్థికంగా పటిష్టంగా ఉండటం ముఖ్యమే. అదే సమయంలో మోసాల నివారణ, వ్యక్తిగత డేటా రక్షణ, సమస్యలు తలెత్తినప్పుడు వేగంగా స్పందించడంలాంటి బ్యాంకింగ్ సామర్థ్యాలపై కూడా కస్టమర్లు దృష్టి పెడుతున్నారు.రుణ లభ్యత పెరగడం కూడా కస్టమర్ల అంచనాలను ప్రభావితం చేసింది. రుణాల మంజూరులో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం, వడ్డీ మరియు ఛార్జీల్లో పారదర్శకత ఉండటం, రిస్క్ను సమగ్రంగా అంచనా వేయడం వంటి అంశాల విషయంలో బ్యాంకుల నుంచి కస్టమర్లు భరోసాను కోరుకుంటున్నారు. బ్యాంకులు వ్యాపార వృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా తాము సేవలందించే కస్టమర్ల దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి కూడా మద్దతుగా నిలిచేలా ఉండాలని ఈ అంశాలు సూచిస్తాయి.ఇలాంటి పరిస్థితుల్లో విశ్వసనీయత, వివేచన, స్థిరత్వాన్ని బట్టి నమ్మకం నిలిచి ఉంటుంది.డిజిటల్ పురోగతి - కస్టమర్ అవగాహనభారత్లో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి రోజువారీ బ్యాంకింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. ఎక్కడో దూరంగా ఉండి కూడా ఖాతాలు తెరవొచ్చు. రుణాలపై నిర్ణయాలు కూడా గతంతో పోలిస్తే చాలా వేగంగా తెలియజేయవచ్చు. ఇలాంటి పురోగతి వల్ల వ్యక్తులు, వ్యాపారాలకు ఆర్థిక అంశాల నిర్వహణ మరింత సులభమైంది.అయితే ఈ అభివృద్ధితో పాటు కస్టమర్లలో సైబర్ భద్రత అంశాలపై కూడా అప్రమత్తత పెరుగుతోంది. మోసాలు, డేటా లీక్ ఘటనలు భద్రత చర్యల ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాయి. కేవలం సౌలభ్యం మాత్రమే కస్టమర్లకు భరోసా కలిగించడం లేదు. భద్రత, సన్నద్ధత కూడా అంతే ముఖ్యమైనదిగా ఉంటోంది.ఇప్పుడు బ్యాంకులు డిజిటల్ సేవలు అందించగలవా లేదా అనే విషయం గురించి కస్టమర్లు ప్రశ్నించడం లేదు. బ్యాంకులు రిస్క్లను ఎంత సమర్ధవంతంగా ముందుగానే గుర్తిస్తున్నాయి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తున్నాయి అనే అంశాలను గమనిస్తున్నారు. అసాధారణ లావాదేవీలపై తక్షణ అలర్ట్లు, అవసరమైన సమయంలో సత్వర సహాయం, ఖాతాలను భద్రంగా ఉంచే స్పష్టమైన విధానాలు కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టడంలో కీలకంగా మారుతున్నాయి.దీర్ఘకాలిక నమ్మకాన్ని పెంపొందించుకునే సంస్థలు టెక్నాలజీతో పాటు బాధ్యత కూడా పెరుగుతుందని గుర్తిస్తున్నాయి. అందువల్ల డిజిటల్ సామర్థ్యాల విస్తరణతో పాటు పర్యవేక్షణ వ్యవస్థలు, భద్రతా చర్యలు, స్పందనా విధానాలను పటిష్టం చేసుకోవడంపై కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ యుగంలో నమ్మకమనేది అప్రమత్తత, పారదర్శకత, జవాబుదారీతనంపై ఆధారపడి ఉంటుంది.ముందున్న దారిగత దశాబ్దకాలంలో భారత బ్యాంకింగ్ రంగం స్థిరంగా విస్తరించింది. బ్యాంకింగ్ సేవల లభ్యత విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు నిర్ణయాల నాణ్యతపై దృష్టి పెరుగుతోంది. ముఖ్యంగా కీలక సమయాల్లో బ్యాంకులు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నాయనేది కస్టమర్లు నిశితంగా గమనిస్తున్నారు.కొన్ని సందర్భాల్లో బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ అంటే కొంత నిగ్రహం పాటించడం కూడా అవుతుంది. ఉదాహరణకు రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే రుణాన్ని నిరాకరించడం, భారీ లావాదేవీల ముందు అదనపు ధృవీకరణ చేపట్టడం, లేదా నిర్దిష్ట ఆర్థిక ఉత్పత్తి అనేది కస్టమర్ పరిస్థితులకు ఎందుకు అనుకూలం కాదనే విషయాన్ని స్పష్టంగా వివరించడంలాంటి చర్యలు అవసరం కావచ్చు. ఇలాంటి నిర్ణయాలు తాత్కాలికంగా వ్యాపార విస్తరణ వేగాన్ని నెమ్మదింపచేసినా, అవి సంస్థల బాధ్యతాయుతమైన వైఖరికి నిదర్శనంగా నిలుస్తాయి. దీర్ఘకాలంలో కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు తోడ్పడతాయి. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్యాంకు సమతుల్యతతో, స్థిరంగా వ్యవహరిస్తుందనే నమ్మకాన్ని పెంచుతుంది.మొత్తంగా చూస్తే విశ్వాసమనేది మాటలతో కాదు, రోజువారీ తీసుకునే చర్యలతోనే ఏర్పడుతుంది. న్యాయబద్ధంగా ఉంటూ, క్రమశిక్షణ, బాధ్యతతో వ్యవహరించే బ్యాంకులు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలవు. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కూడా అవి తోడ్పడతాయి.- హితేంద్ర నాథ్ ఝా, హెడ్ - రిటైల్ లయబిలిటీస్, టీఏఎస్సీ & టీపీపీ, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
భారత్కు ఇంధన సవాలు
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం భారతదేశ ఇంధన భద్రతకు పెను సవాలుగా మారాయని 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా పేర్కొన్నారు. ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్న ఆయన భారత ఆర్థిక గమనం, రాష్ట్రాల పురోగతిపై తన విశ్లేషణను పంచుకున్నారు.అంచనాలను మించి ఆర్థిక వృద్ధిప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందని పనగారియా స్పష్టం చేశారు. ‘2025-26తో ముగిసిన మూడేళ్ల కాలంలో భారత వాస్తవ జీడీపీ సగటున 7.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఉత్పాదక రంగం ఏకంగా 11.2 శాతం సగటు వృద్ధితో దూసుకుపోతోంది. ఇది పారిశ్రామికాభివృద్ధిలో ఒక సానుకూల సంకేతం’ అని ఆయన విశ్లేషించారు.అమెరికా వాణిజ్య విధానాల వల్ల ఎదురయ్యే సవాళ్లను భారత్ చాకచక్యంగా అవకాశాలుగా మలుచుకుందని ప్రశంసించారు. ఇటీవల కొన్ని దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దేశ వాణిజ్య పరిధి పెరుగుతుందన్నారు.తక్షణమే దృష్టి సారించాల్సిన అంశాలుదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన ప్రధానాంశాలను పనగారియా సూచించారు.దిగుమతి సుంకాలు, నాణ్యత నియంత్రణ ఉత్తర్వులను హేతుబద్ధీకరించడం.1956 నాటి యూజీసీ చట్టం స్థానంలో పార్లమెంటు పరిశీలనలో ఉన్న కొత్త చట్టాన్ని తీసుకురావడం.2013 నాటి ఎల్ఏఆర్ఆర్ చట్టాన్ని సవరించి భూసేకరణ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించడం.రాష్ట్రాలకు సూచనలు‘విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్) నష్టాల వల్ల రాష్ట్రల ఖజానా ఖాళీ అవుతోంది. రాబోయే 5-7 ఏళ్లలో వీటిని క్రమ పద్ధతిలో ప్రైవేటీకరించాలి. కార్మిక సంస్కరణల్లో భాగంగా పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత వంటి అంశాల్లో సరళీకృత విధానాలను అవలంబించాలి. పట్టణ భూ విపణిని వ్యాపార అనుకూలంగా మార్చడంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వచ్చే వారికి అనువైన వాతావరణం కల్పించాలి. భారతదేశం తన యువ శక్తిని, విస్తారమైన నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారుతుంది’ అని అరవింద్ పనగారియా ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అమెరికాలో పెరిగిన నిరుద్యోగం
ఫ్యామిలీ
జస్ట్ మూడు నెలల్లో 14 కిలోలు బరువు తగ్గాలంటే..!
శీతాకాలం కంటే వేసవికాలంలో బరువు తగ్గడం చాలా సులభం. అందులోనూ ప్రస్తుతం చలికాలం ముగిసి.. వేసవికాలంలోకి ప్రవేశిస్తున్నాం. ఇన్నాళ్లు చలికి భయపడి ముసుగుతన్ని పడుకున్న వాళ్లంతా ఒక్కసారిగా ఈ మండే ఎండల్లో అయినా కొలెస్ట్రాల్ తగ్గించుకుని బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటివాళ్లు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ డాన్ గో నెట్టింట షేర్ చేసిన పదహారు రూల్స్ తప్పక ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన వేసవి సమీపించగానే చాలామంది వెయిట్లాస్కు ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం ఇన్స్టాగ్రామ్ వేదికగా వెయిట్లాస్ టిప్స్ షేర్ చేశారు ఫిట్నెస్ కోచ్ డాన్గో. ఆరోగ్యప్రదంగా తక్కువ టైంలో కిలోల కొద్ది బరువు తగ్గి.. మెరుగైన ఫలితాలు సత్వరమే అందుకోవాలంటే ఈ పదహారు రూల్స్ తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!.నిద్రకు కొన్ని గంటల ముందు తినకపోవడం..నిద్రవేళకు కనీసం మూడు నుంచి ఐదు గంటలు ముందు తినడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎక్కువగా ఆహారం తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీలు తీసుకోవడంలో కేర్.. శరీర బరువుని 12తో గుణించగా వచ్చిన మొత్తంని మీ రోజువారీ కేలరీలుగా కేటాయించండి. ఈ అసాధారణ సూత్రాన్ని తప్పక అనుసరించమని కోరారు ఫిట్నెస్ కోచ్.ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం..రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ అవనసం. శరీర బరవుని ఏడుతో గుణిస్తే వచ్చిన మొత్తం మీర రోజువారిగా తీసుకోవాల్సిన ప్రోటీన్గా గుర్తించండి. ఈ విధానం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గించుకుంటూ..కండరాలను నిర్మించడానికి, నిర్వహించొచ్చని చెబుతున్నారు. అందుకు ఈ మాత్రం ప్రోటీన్ తప్పనిసరి అని అన్నారు.ఆహారంలో జోడించాల్సిన ఆహారాలురోజువారీ ఆహారంలో ఏం చేర్చుకోవాలంటే..గ్రీకు పెరుగునీరు, కాఫీ, టీలీన్ గ్రౌండ్ బీఫ్ (వీలైతే అదనపు లీన్)చికెన్ బ్రెస్ట్ టర్కీ (గ్రౌండ్ లేదా బ్రెస్ట్)కొవ్వు చేపగుడ్లు, గుడ్డులోని తెల్లసొనకాటేజ్ చీజ్లీఫీ గ్రీన్స్బంగాళాదుంపలుషెల్ఫిష్బీన్స్, కాయధాన్యాలుబెర్రీలుఆపిల్, నారింజ, కివి, ద్రాక్షపండు వంటి అధిక ఫైబర్ పండ్లుఆకుపచ్చ క్రూసిఫెరస్ కూరగాయలుకాలీఫ్లవర్, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, మిరియాలు, ఆస్పరాగస్, దోసకాయలు వంటి ఇతర అధిక-పరిమాణ కూరగాయలురోజుకు రెండు పూటల భోజనం..ఫిట్నెస్ కోచ్ రోజుకు రెండు పూటలా భోజనం తీసుకునేలా చూసుకోమని సూచించారు.భోజన షెడ్యూల్లో తీసుకోవాల్సిన కేర్..ఫిట్నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన భోజన షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంటుంది:పడుకునే ముందు 3 నుంచి 5 గంటల ముందు చివరి భోజనంనిద్రలేచిన 1 నుంచి 2 గంటల ముందు మొదటి భోజనంరెండవ భోజనం మధ్యలో ఉండాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలి అనేది ఇక్కడ ఉంది:గ్రీకు పెరుగు - ప్రేగులకు మంచిదిప్రోటీన్ పౌడర్ - ఆకలిని నియంత్రిస్తుంది, కండరాలను మెరుగుపరుస్తుందిబ్లూబెర్రీస్ - ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. అలాగే వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.హైడ్రేటెట్గా ఉండండిశరీరానికి తగిప హైడ్రేషన్ కూడా అవసరం. దీని కోసం, ఫిట్నెస్ కోచ్ ఉదయం 500 మి.లీ నీరు, అలాగే భోజనానికి ముందు తర్వాత త్రాగాలని సూచిస్తున్నారు. అయితే, పడుకునే రెండు గంటల ముందు నీరు త్రాగడం మానేయాలని చెబుతున్నారు.శక్తిమంతమైన వ్యాయామాలు..ఆహారంతో పాటు, ఒక రోజు విశ్రాంతితో వారానికి మూడు సార్లు కాస్త ఫోర్స్తో కూడిన వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. అవసరైమతే కాస్త అధిక ఫోర్స్తో చేసే వర్కౌట్లు మరింతగా చేసేలా ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు.శరీరాన్ని కదిలిస్తూ ఉండండిశక్తి శిక్షణ తర్వాత, శరీరానికి సరైన కదలిక కూడా అవసరం. రోజుకు కనీసం 8 వేల నుంచి 10 వేల అడుగులు వేయండి" అని ఫిట్నెస్కోచ్ సిఫార్సు చేస్తున్నారు. డెస్క్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన ప్రణాలికకు అంతరాయం కలగకుండా..డెస్క్ కింద ట్రెడ్మిల్ తీసుకోవడం, వాక్ చేస్తూ మీటింగ్లు ప్లాన్ చేయడం వంటివి చేయాలి.నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండిచక్కటి సౌకర్యవంతమైన బెడ్రూమ్లో నిద్రపోవాలి. బెడ్రూమ్ చూడగానే నిద్ర వచ్చేలా ఆహ్లాదంగా ఉంచుకోవాలి.స్థిరమైన నిద్ర దినచర్య..మంచి నిద్ర తోపాటు ఇవి కూడా ఉండాలి.ఉదయం నిద్ర లేవగానే సూర్యరశ్మిని పొందండిముఖ్యంగా వారాంతాల్లో ఒకే సమయంలో నిద్రపోండి, మేల్కొనండిశరీరాన్ని చల్లబరచడానికి వేడి స్నానం లేదా స్నానం చేయండిమంచానికి ఒక గంట ముందు స్క్రీన్లను చూడటం మానుకోండిసూర్యుడు అస్తమించేటప్పుడు మసకబారిన లైట్లు లేదా ఎరుపు రంగు ప్రకాశించే బల్బులను ఉపయోగించండిపురోగతిని ట్రాక్ చేయండివార గడిచినప్పుడల్లా..బరువు, శరీరం కొలతల్లో వచ్చిన మార్పులు గమనించాలి. అందుకు తగ్గట్లుగా పోషకాహారం తీసుకుంటుండాలి. అలాగే ఆ మార్పులను ఫోటోలు తీస్తూ..గమనించుకోవాలన్నారు.పరివర్తనను గుర్తించి..మెయింటైయిన్ చేయాలి..కేవలం ట్రాక్ చేయడమే కాకుండా, బాడీలోని మార్పులను గమనిస్తూ..ఆ దిశగా ప్లాన్లో మార్పులు చేర్పులు చేసుకుంటుండాలి. ఈ సమయంలో ఆల్కహాల్ను నివారించండిమెరుగైన ఫలితాలు అందుకుంటున్నప్పుడు ఆల్కహాల్ జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు.నిరాశను దరిచేరనివ్వకుండా యాక్టివ్గా ఉండటం..అద్దంలో మార్పులు చూస్తూ..మరింత ఆత్మవిశ్వాసంతో డైట్ని, రూల్స్నిన స్థిరత్వంతో పాటించాలి. ఇలా చేస్తే..ఈ సమ్మర్లో సత్వరమే బరువు తగ్గడం పెద్ద కష్టం కాదని చెబుతున్నారు డాన్గో. అంతేగాదు నియమానుసారంగా సూచించిన ఈ రూల్స్ అన్నింటిని క్రమం తప్పకుండా ఫాలో అయితే ఈజీగా 14 కిలోలు తగ్గుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Dan Go | High Performance Health Coach (@coachdango)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Arjun-Saaniya Chandhok Wedding: అంజలి, సారా ఆ చీరలే ఎందుకు ఎంచుకున్నారంటే..)
అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో కుందనపు బొమ్మలా సారా..!
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సానియా చందోక్ల వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు క్రికెట్ దిగ్గజాల నుంచి బాలీవుడ్ తారలు, పలువురు ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు. తమ్ముడి పెళ్లిలో అక్క సారా కుందనపు బొమ్మలా మెరిసింది. మొత్తం వేడుకలో సారా లుక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయతను ఆధునికతను కలగలసిన స్టైలిష్ లుక్లో కనిపించింది. సింపుల్గా చెప్పాలంటే దివి నుంచి భువికి వచ్చిన దేవతాలో అత్యద్భుతంగా ఉంది సారా. తల్లి అంజలి సైతం గులాబీ రంగు చీరనే ఎంచుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో సారా, అంజలీలు పెళ్లి వేడుకలో ధరించిన చీరలు, ఆభరణాల స్పెషాల్టీ గురించి సవివరంగా చూద్దామా..!.సారా తన తమ్ముడి పెళ్లి వేడుక కోసం పింక్ బంధానిని ఎంచుకుంది. అద్భుతమైన జర్దోజి రేషమ్ ఎంబ్రాయిడరీకి తగ్గా కట్వర్క్ రోసెట్ బోర్డర్. జ్యువెల్డ్ టాసెల్స్తో డెకరేట్ చేసిన హాట్పింక్ సిల్క్ బ్లౌజ్తో మరింత అందంగా కనిపించింది. ఆ చీరపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ అత్యంత హైలెట్గా కనిపించడమే గాక ఆ శారీ అందాన్ని రెట్టింపు చేసింది. ఆ చీరకు దగ్గ భారీ సాంప్రదాయ ఆభరణాలు సారాను మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆకుపచ్చ పూసల బహుళ స్టెప్స్ ఎంబెడెడ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు, పాపిడి బొట్టు, ఆమె లుక్ని మరింత హైలెట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే మేకప్ కూడా చాలా నేచురల్గా కనిపించిన తీరు..సహజత్వానికి ప్రతిక సారా అని చెప్పకనే చెబుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)ఇక కూతురు సారా అందానికి తగ్గట్టుగా తల్లి అంజలి ఈ వేడుకలో రాజరికపు గులాబీ రంగు చేనేత పట్టు చీరను ఎంచుకుంది. ఆమె అత్యంత విలాసవంతమైన లగ్జరీని అంతగా ఇష్టపడరు. సచిన్ భార్య అంజలి ధరించిన చీరను డిజైనర్ జుహి షా రూపొందించారు. ఇక అంజలిని అందంగా తీర్చిద్దింది సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ నిషి సింగ్. సచిన్ సైతం ఆ మేకప్ ఆర్టిస్ట్ నైపుణ్యాన్ని కొనియాడారు. మీరు అంజలి లుక్ని చాలా అందంగా చూపించారని మెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Nishi Singh (@nishisingh_muah)ఇక అంజలీ కూడా మేకప్ ఎప్పుడూ హెవీగా ఉండకూడదని సహజత్వాన్ని అందంగా చూపిస్తే చాలని, అందుకే తాను మినిమల్ లైట్ మేకప్నే ఎంచుకుంటానని అన్నారామె. ఇక ఈ వేడుకలో సచిన్ క్రీమ్ ఎంబ్రాయిడరీ షేర్వానీలో కనిపించగా, వధువరులు అర్జున్ సానీయాలు ఎరుపు రంగును ఎంచుకున్నారు. అర్జున్ టెండూల్కర్ దుస్తులను మనీష్ మల్హోత్రా, సానియా లెహంగాను తరుణ్ తహిలియానిలు రూపొందించారు. (చదవండి: తొలి మహిళా తవిల్ కళాకారిణి..! ఏ ఆర్ రెహమాన్ సైతం..)
బతుకులో జీవం నింపే కళ
‘మనసుకు నచ్చిన పని ఎంతటి సంతృప్తిని ఇస్తుందో హస్తకళల ద్వారానే అర్థం చేసుకోవచ్చు అంటారు’ మరియా క్లారా. సికింద్రాబాద్లోని నాగోల్లో ఉంటున్న మరియా ఉద్యోగాన్ని వదిలేసి, కలంకారి, బాతిక్ పెయింటింగ్ నేర్చుకొని కలంబాతిక్ మరియా క్లారా గా తన కళకు గుర్తింపు తెచ్చుకున్నారు. మహిళ జీవితంలో తగిలే ఎదురుదెబ్బలు ఆమె మనసును ఎలా గాయపరుస్తాయో, తిరిగి ఆమె జీవితం కొత్తగా ఎలా మార్పు చెందుతుందో ఈ కళ కూడా వస్త్రం మీద అలాగే కళ్లకు కడుతుంది’ అంటూ కళాత్మకమైన విశేషాలను పంచుకున్నారు...‘‘కరోనా నా జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. రెండు దశాబ్దాల పాటు ప్రైవేట్ ఉద్యోగంలో యాంత్రికంగా రోజులు గడిచిపోయాయి. జీవితంలో జీవం ఉండేదెలాగో అన్వేషిస్తుండగా హస్త కళలు నన్ను ఆకట్టుకున్నాయి. ఆ సమయంలో బాతిక్ ఆర్ట్తో గొప్ప అనుభూతిని పొందాను. మావారు ప్రైవేట్ జాబ్ చేసి, రిటైర్ అయ్యారు. మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఎవరి ప్రయాణం వాళ్లదే. నేను వాళ్లకు సపోర్ట్ చేస్తాను. వాళ్లు నాకు సపోర్ట్ చేస్తారు. నా ఇష్టాన్ని వాళ్లు కాదనరు.అర్థమెంతో...వ్యాక్స్తో క్లాత్ మీద ముందుగా గీతలను డిజైన్ వచ్చేలా గీస్తాం. తర్వాత దానిని ముందే సిద్ధం చేసుకున్న రంగులలో ముంచుతాం. దాంతో ఆ క్లాత్మీద ఉన్న వ్యాక్స్ లైన్ అంతా విరిగిపోతుంది. ఆ గీతల స్థానంలో రంగు లైన్లు లైన్లుగా ఇంకిపోయి, ఒక చెప్పలేని అందం కనిపిస్తుంది. ఎక్కడైతే ఎవరి వల్లనైతే మనం బాధపడతామో, ఆ తర్వాత అదే బాధ అవతలి వారు పడుతున్నప్పుడు దానిని తొలగించాలని చూస్తాం. ఎందుకంటే ఆ నొప్పిని అనుభవించిన వాళ్లకే ఆ బాధ ఏంటో అర్థం అవుతుంది. అంటే, ‘నువ్వు నొప్పిని అనుభవిస్తేనే, అవతలి వారికి ఉపశమనం ఇవ్వగలవు..’. అని ఈ బాతిక్ ద్వారా జీవితపు అర్థం ఏంటో తెలిసి వచ్చింది. అంటే నొప్పిని అనుభవించిన స్త్రీయే, నొప్పికి మందుకూడా వేయగలదు. అది ఈ బాతిక్ చూపుతుంది. మనసుకు అయిన గాయాలకు రంగులు పూసి, మనకే అందంగా చూపించే కళ ఇది.ఆసరా అయ్యేలా కూడా ఉండాలిమన గురించి బయటివారికి చెప్పలేని భావాలను ఆర్ట్ రూపంలో చెప్పవచ్చు. నటించాల్సిన అవసరం లేకుండా చేసేవి హస్తకళలే. నేను చేసేది కమర్షియల్ వర్క్ కాదు. ఎవరైనా తమకు నచ్చిన అంశం డిజైన్లో వచ్చేలా చేసి ఇవ్వమని అడిగితే దానికి తగినట్టు చేసి ఇస్తాను. ఉదాహరణకు.. ‘మా ఇంట్లో పెళ్లి ఉంది, వధూవరుల డిజైన్ చేసి ఇవ్వాలి’ అని అడిగితే అలాగే చేసి ఇస్తాను. మనసుకు నచ్చిన పని చేస్తున్నప్పుడు పది మందికి ఆసరా అయ్యేలా కూడా ఉండాలని కోరుకుంటాం.ఉపాధి కల్పిస్తున్నాను..కొన్ని చీరలు, డ్రెస్సులు కలం బాతిక్ పెయింటింగ్ చేసి, బొటిక్స్కి ఇస్తాను. ఈ వర్క్ని కొంతమంది మహిళలకు నేర్పి, వారికి ఉపాధిని కల్పిస్తున్నాను. గుజరాతీ, బెంగాల్ రాష్ట్రాలలో ఈ బాతిక్ పెయింటింగ్ బాగా ్రపాచుర్యంలో ఉంది. మన దగ్గర బ్లాక్ ప్రింట్ అచ్చులతో వేస్తారు. నేను మాత్రం పూర్తిగా చేతితోనే వేస్తాను. కాలేజీలు, స్కూళ్లకు కూడా వెళ్లి అక్కడి విద్యార్థులకు ఈ వర్క్ నేర్పిస్తున్నాను. ఈ కళ గురించి ఏమీ తెలియని వారు కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఈ పనిని నేర్చుకోవచ్చు. హైదరాబాద్లోని ఇందిరా మహిళా శక్తి బజార్లో జరిగే కార్యక్రమంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఈ వర్క్ నేర్పించే అవకాశం లభించింది. ఇష్టంతో నేర్చుకున్న పని నన్ను ఎంతో మంది కళాకారులకు చేరువ చేసింది. భావోద్వేగాల సమతుల్యతను నేర్పించింది’ అంటూ హస్తకళల గొప్పతనాన్ని అందంగా వివరించారు ఈ కళాకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
స్త్రీ సాధికారతను సానుకూలంగా చూడాలి
ఎంపవర్మెంట్ కుటుంబ బాధ్యతల నుంచి స్త్రీ సాధికారత వరకు, ఆధునిక కాలంలో కుటుంబ బంధాల నుంచి స్త్రీ శక్తి వరకు... జస్టిస్ బీవీ నాగరత్న ఏది మాట్లాడినా... అది ఆణిముత్యమే. ఆత్మావలోకన దృశ్యమే. ఆమె మాటలు స్త్రీ సాధికారత, చైతన్యానికి వెలుగు బాటలు. మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళా విముక్తి... మొదలైన విషయాలపై వివిధ సందర్భాలలో జస్టిస్ బీవీ నాగరత్న వెలువరించిన అభ్రిపాయాలు.→ వివాహం లేదా ప్రసవం తరువాత మహిళలు తమ కెరీర్ను వదులుకోకూడదు. ఆర్థిక స్వయంప్రతిపత్తి అనేది మహిళలకు సంబంధించి పఠిష్టమైన భద్రతావలయం.→ పురుషాధిక్య రంగాలలో మహిళల సంఖ్య పెరగడం ‘చొరబాటు’ కాదు. చారిత్రాత్మకంగా వారికి నిరాకరించబడిన స్థలాలను తిరిగి పొందడం.→ ప్రభుత్వ, చట్టపరమైన స్థానాల్లో మహిళలకు 30 శాతం ప్రాతినిధ్యం ఉండాలి.→ భారతదేశంలో మహిళలు ఎదుర్కొనే మొదటి అడ్డంకి... ఆడపిల్లగా పుట్టడమే!→ ఎన్ఎఫ్హెచ్ఎస్–డేటా ప్రకారం 15–19 సంవత్సరాల వయస్సుగల ఆడపిల్లల్లో 59 శాతం మంది తగిన పోషకాహారం లేకుండా, రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది ఆడపిల్లల అభ్యున్నతికి ఆటంకంగా మారవచ్చు.→ బాలికలపై పెరుగుతున్న డిజిటల్, లైంగిక హింసను నిరోధించడానికి న్యాయ, చట్ట విధానాలను మరింత విస్తరించాలి. 2018–2022ల మధ్య పదివేలకు పైగా కేసులు నమోదైతే వాటిలో శిక్షార్హత రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. సకాలంలో బాధితులకు న్యాయం జరగాలి. పరిహారం అందాలి.→ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ వేగంగా మార్పు చెందుతోంది. ఈ మార్పులు కుటుంబ నిర్మాణాన్ని మాత్రమే కాదు న్యాయవ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చదువు ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం బలపడడం కూడా ఈ మార్పుల్లో ఒకటి. విద్య, ఉపాధి ద్వారా మహిళలు పొందే సామాజిక–ఆర్థిక విముక్తిని సమాజం సానుకూలంగా చూడాలి. ప్రోత్సహించాలి. అలాంటి మహిళలు కుటుంబ శ్రేయస్సుకు మాత్రమే కాదు దేశశ్రేయస్సుకు కూడా దోహదపడతారు.→ కోర్టులలో ఉన్న కుటుంబ వివాదాల్లో ఎక్కువ కేసులు రెండు పార్టీలు రెండు అడుగులు వేస్తే పరిష్కారం అవుతాయి. భార్యాభర్తలలో ఒకరికొకరు ఆసక్తి, ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక సమస్య ఉత్పన్నం అయినప్పుడు భార్యాభర్తలు ఎవరికి వారు అవతలి వ్యక్తి దృష్టి నుంచి కూడా ఆలోచించాలి. వారి మనసును అర్థం చేసుకోవాలి.→ భార్యాభర్తల మధ్య వివాదాలు పెరగడానికి కారణం మహిళల ఆర్థిక, సామాజిక విముక్తి కాదు. మారుతున్న సామాజిక–ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మన అభి్రపాయాలు, వైఖరులను మార్చుకోకపోవడమే.→ మహిళలకు స్వతంత్రం ఇవ్వండి. సలహాలు, సూచనల నెపంతో వారిని నిరంతరం పర్యవేక్షించకండి. వారు స్వతంత్రంగా ఎదగడాన్ని కోరుకోండి. ఈ దేశ మహిళలందరూ అదే కోరుకుంటున్నారు.→ వీధిలోకి వెళ్లినా, బస్సు లేదా రైల్వేస్టేషన్లో అడుగు పెట్టినా తన భద్రతకు సంబంధించిన ఆలోచనల భారాన్ని స్త్రీ మోయాల్సి ఉంటుంది. ఇల్లు, పని, సమాజంలో తన బాధ్యతలకు సంబంధించిన మానసిక భారానికి ఇది అదనపు భారం. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, బేటీ బచావోలాంటి కార్యక్రమాల ద్వారా గత దశాబ్ద కాలంలో పురోగతి సాధించాం. చెడుకు అడ్డుకట్ట వేసే ప్రతి నివారణ చర్య, రక్షణ వ్యవస్థ హాని చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. బాలికలు అభివృద్ధి చెందడానికి ఒక మార్గాన్ని నిర్మిస్తాయి.
అంతర్జాతీయం
యుద్ధం వేళ.. ఇరాన్లో మళ్లీ భూకంపం
టెహ్రాన్: ఇరాన్లోని బందర్ అబ్బాస్కు పశ్చిమాన శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. బందర్ అబ్బాస్కు పశ్చిమాన 74 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడంతో పశ్చిమాసియా అంతటా యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇరాన్ ప్రతీకార దాడులతో దాదాపు వారం రోజులుగా ఘర్షణలు జరుగుగున్న నేపథ్యంలో ఇవాళ మళ్లీ భూకంపం సంభవించడం గమనార్హం. మరోవైపు, గత మంగళవారం కూడా ఇరాన్ దక్షిణ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇరాన్లోని ఫార్స్ ప్రావిన్స్ దక్షిణ భాగంలో ఉన్న గెరాష్లో భూకంపం వచ్చింది. ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల (6.21 మైళ్లు) లోతులో ఉందని యూఎస్జీఎస్ తెలిపింది. కాగా, అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతుంది. తమ మాట వినకపోతే ఇరాన్ సైన్యాన్ని లేకుండా చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.BREAKING 🚨 4.1 earthquake hits IranNuclear test ? pic.twitter.com/nB3DJxgvAm— AsiaWarZone (@AsiaWarZone) March 7, 2026
Nepal: ‘ఆర్ఎస్పీ’ ప్రభంజనం.. ప్రధానిగా ‘బాలెన్’?
ఖాట్మండు : హిమాలయ దేశం నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోనుంది. దశాబ్దాలుగా ఆ దేశాన్ని శాసిస్తున్న హేమాహేమీలను కాదని, ప్రజలు నవతరం వైపు మొగ్గు చూపుతున్నారు. 275 స్థానాలు కలిగిన నేపాల్ ప్రతినిధుల సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో మాజీ మేయర్, మాజీ రాపర్ బాలేంద్ర షా (బాలెన్) నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. తాజా ఫలితాల సరళిని చూస్తే బాలెన్ షా నేపాల్ తదుపరి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.గత ఏడాది సెప్టెంబరులో ‘జెన్-జీ’ (Gen Z) యువత చేపట్టిన భారీ ఆందోళనల నేపథ్యంలో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయగా, పార్లమెంటు రద్దయిన విషయం తెలిసిందే. ఆ అల్లకల్లోలం తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంప్రదాయ రాజకీయ పక్షాలైన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్, మావోయిస్టు సెంటర్లపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆర్ఎస్పీకి వరంగా మారింది. ముఖ్యంగా రాజధాని ఖాట్మండులో ఆర్ఎస్పీ మద్దతుదారులు ‘గంట (పార్టీ గుర్తు) మోగిస్తూ సంబరాల్లో మునిగితేలుతున్నారు.మొత్తం 165 ప్రత్యక్ష ఎన్నికల స్థానాల్లో ఆర్ఎస్పీ ఇప్పటికే 20 స్థానాలను కైవసం చేసుకోగా, మరో 98 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. స్వయంగా బాలేంద్ర షా తన ప్రత్యర్థి, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై ఆయన సొంత గడ్డ అయిన ఝాపా-5 నియోజకవర్గంలో 15 వేల ఓట్ల భారీ ఆధిక్యంలో ఉండటం విశేషం. మరోవైపు, ఆర్ఎస్పీ అధ్యక్షుడు రబీ లామిచానే చిత్వాన్-2 స్థానం నుంచి 54,402 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు.నేపాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. సరిహద్దు దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని భారత్ ఆకాంక్షిస్తోంది. న్యూఢిల్లీలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. నేపాల్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు.నేపాల్ ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 9వ తేదీ నాటికి ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. 165 ప్రత్యక్ష ఎన్నికల స్థానాలతో పాటు, మిగిలిన 110 స్థానాలను దామాషా పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అవినీతి, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న నేపాల్లో బాలెన్ షా రాకతో ఒక కొత్త శకం మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన పాటలతో వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిన బాలెన్, ఇప్పుడు దేశ గమనాన్ని ఎలా మారుస్తారనేది వేచి చూడాలి.ఇది కూడా చదవండి: యువకుని హత్యతో రణరంగం.. వాహనాల దహనం, రాస్తారోకో
నైజీరియాలో దారుణం.. 300 మంది అపహరణ
నైజీరియాలో దారుణం జరిగింది. నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఇస్లామిక్ మిలిటెంట్లు తెగబడ్డారు. ఓ గ్రామంపై దాడి చేసి 300 మందికి పైగా ప్రజలను అపహరించారు. అయితే ఈ దాడి ఏ గ్రూపుకు చెందిన టెర్రరిస్టులు చేశారనే సంగతి ఇంకా తెలియలేదు. నార్త్ ఈస్ట్ ప్రాంతంలోని బార్నో రాష్ట్రంలో శుక్రవారం ఇస్లామిక్ మిలిటెంట్లు విరుచుకపడ్డారు. నాగోషి ప్రాంతంపై దాడిచేసి మహిళలు, చిన్నపిల్లలతో సహా దాదాపు 300 మందిని కిడ్నాప్ చేశారు. కాగా ఇటీవల టెర్రరిస్ట్ గ్రూపు బొకోహరమ్కు చెందిన తీవ్రవాదులను అక్కడి భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దానికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిగి ఉండవచ్చని ఆ దేశ అధికారులు భావిస్తున్నారు.అయితే గత వారం రోజులుగా తరచుగా అక్కడి గ్రామాలపై ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని అక్కడి అధికారి తెలిపారు. స్థానికంగా ఉన్న కొండుగ, మార్టే, జకానా, మైనాక్, అనే జాతుల సమూహాలపై మిలీషియా గ్రూపులు దాడులకు తెగబడుతున్నాయన్నారు. వారిని అంతమెుందించడంలో అనేక మంది భద్రతా అధికారులు ప్రాణాలు అర్పించారన్నారు. అయితే నైజీరియాలో ఉగ్రవాదుల దాడులు సర్వ సాధారణంగా మారాయి. అక్కడ మైనింగ్పై అధిపత్యం కోసం అక్కడ స్థానికంగా ఉన్న మిలీషియా గ్రూపుల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతాయి. ఈ దాడులలో వందలమంది ప్రాణాలు వదిలారు. దీంతో అక్కడ శాంతి భద్రతలను కాపాడడానికి అమెరికా తన బలగాలను నైజీరియాలో మోహరించింది
యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. అమెరికా దాడులకు పుతిన్ చెక్?
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు రష్యా చాటుగా సాయపడుతోందా? అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల కదలికలతో పాటు గల్ఫ్లోని ఆ దేశ సైనిక స్థావరాలు తదితరాలకు సంబంధించిన సున్నితమైన నిఘా సమాచారాన్ని వారం రోజులుగా ఎప్పటికప్పుడు ఇరాన్కు అందిస్తూ వస్తోందా? తద్వారా వాటిపై దాడులకు సహకరిస్తోందా? అంటే, అవునని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్టు వార్తా సంస్థ సంచలనాత్మక కథనం వెలువరించింది.‘యుద్ధం మొదలైన ఒకట్రెండు రోజుల్లోనే ఇరాన్ నిఘా సామర్థ్యం దాదాపుగా కుప్పకూలింది. అయినా అమెరికా యుద్ధ నౌకలు, గల్ఫ్ దేశాల్లోని స్థావరాలు, రాయబార కార్యాలయాలపై ఇరాన్ కచ్చితత్వంతో దాడులు చేయగలిగింది. రష్యా అందించిన నిఘా సమాచారంతోనే ఇది సాధ్యమైందనడం సుస్పష్టం’ అని సదరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ దీనిపై ఎలా స్పందిస్తారోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాపైనా ఆయన తీవ్ర చర్యలకు దిగితే ఇప్పటికే పశ్చిమాసియా అంతటా కుంపట్లు రాజేస్తున్న యుద్ధం మరింతగా విస్తరించే ప్రమాదముంది.ఇరాన్కు కావాల్సింది.. ఓ మంచి నాయకుడు: ట్రంప్ మరోవైపు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కు ఒక మంచి నాయకుడు కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పలువురు నేతల పేర్లు తమ దృష్టిలో ఉన్నట్టు చెప్పారు. ‘ఇరాన్కు మంచి భవిష్యత్తుంటుంది. ఇతర దేశాల సాయంతో ఆ దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేస్తాం. ఆర్థికంగా అత్యంత బలోపేతం చేస్తాం’ అని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)’తరహాలో ‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్’అంటూ అధ్యక్షుడు ముక్తాయించడం విశేషం! మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధానికి తెర దించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నట్టు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధ నౌకను ముంచేశాం: అమెరికా డ్రోన్లు, ఇతర ఆయుధాలతో కూడిన ఇరాన్ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ షహీద్ బఘేరీని ముంచేసినట్టు అమెరికా ప్రకటించింది. అది మంటల్లో తగలబడిపోతున్న ఫుటేజీని యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ శుక్రవారం విడుదల చేసింది. ఇరాన్ సైన్యం మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. 180 మీటర్ల పొడవైన షహీద్ నిజానికి రవాణా నౌక. యుద్ధ అవసరాల రీత్యా ఇరాన్ దాన్ని తాత్కాలికంగా డ్రోన్ క్యారియర్గా మార్చినట్టు సమాచారం. ఇది రీ ఫ్యూయలింగ్ కోసం ఆగకుండా ఏకబిగిన 22 వేల నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు!.
జాతీయం
ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సీఎం మమత ధర్నా
కోల్కతా: ఓటరు జాబితా సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం టీఎంసీ అధినేత్రి, పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెంట్రల్ కోల్కతాలో ధర్నాకు పూనుకున్నారు. ఏప్రిల్లో జరగనున్న కీలకమైన ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా వివాదాన్ని టీఎంసీ ప్రచారంలో ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకోనున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు. రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఎస్ప్లానెడ్ ప్రాంతంలోని మెట్రో చానల్ వద్ద మమత మధ్యాహ్నం 2.15 గంటలకు ధర్నా ప్రారంభించారు. బీజేపీ, ఈసీలు కలిసి బెంగాలీ ఓటర్ల పేర్లను తొలగించాలని కుట్ర పన్నాయన్నారు. ఈ కుట్రను తాను బయటపెడతానని ఆమె ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన జాబితాలో బతికున్న వారిని కూడా చనిపోయిన వారి కిందకి చేర్చారని ఆరోపించారు. అలాంటి వారిని ధర్నా వేదికపైకి తీసుకొచి్చ, ఈసీ పాల్పడిన అవకతవకలను బయటపెడతామన్నారు. ఇదే అంశంపై శనివారం మరికొన్ని వివరాలను బయటపెడతామన్నారు. బీజేపీ, ఈసీలోని ఆ పార్టీ ఏజెంట్లు బరి తెగించారని, వారికి ఏమాత్రం సిగ్గు లేదంటూ తిట్టిపోశారు. ఇటీవల ఈసీ వెల్లడించిన తుది ఓటరు జాబితాలో 63.66 లక్షల పేర్లను, అంటే మొత్తం ఓటర్లలో 8.3 శాతం మందిని తొలగించడం తెల్సిందే. మరో 60 లక్షల పేర్లను న్యాయపరమైన పరిశీలన కోసం ఉంచారు. త్వరలో న్యాయాధికారులు వీటిని పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ ఎన్నికల సమీకరణాలను తీవ్రంగా ప్రభావితం చేయనుండగా మమత పోరాటానికి దిగారు. అయితే, ధర్నా ఎన్ని రోజులు కొనసాగనుందనే విషయాన్ని మమత వెల్లడించలేదు.
ఎల్పీజీ ఉత్పత్తి పెంచండి
న్యూఢిల్లీ: పశి్చమాసియాలో సంక్షోభం నేపథ్యలో దేశీయంగా వంట గ్యాస్ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కంపెనీలను ఆదేశించింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా) ఈ ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వం రంగ చమురు సంస్థలకు అందజేయాలని పేర్కొంది. పెట్రోకెమికల్స్ తయారీకి ప్రొపేన్, బ్యూటేన్ ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. వాటితో కేవలం ఎల్పీజీని మాత్రమే ఉత్పత్తి చేయాలని తేల్చిచెప్పింది. ఎల్పీజీని దేశీయంగా వంట అవసరాలకు మాత్రమే వాడుకోవాలని వెల్లడించిది. ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. 2024–25లో దేశంలో 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని ఉపయోగించారు. ఇందులో 12.8 మిలియన్ టన్నులను దేశీయంగా ఉత్పత్తి చేయగా, మిగతా గ్యాస్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. దాదాపు 90 శాతం ఎల్పీజీ గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఇరాన్ సహా పశి్చమాసియాలో యుద్ధం కారణంగా చమురు సహా ఎల్పీజీ దిగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మద్యం ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
బెంగళూరు: మద్యం ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం పాలసీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇక నుంచి మద్యం ధరలపై ప్రభుత్వ నియంత్రణను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మద్యం ధరల నిర్ణయాన్ని లిక్కర్ కంపెనీలే నిర్ణయించేలా అవకాశం కల్పించింది. ఈ మేరకు 2026-27 బడ్జెట్లో మద్యం పాలసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది సిద్ధరామయ్య సర్కారు. ఏప్రిల్1 వ తేదీ నుండి మద్యం ధరలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించి, లిక్కర్ కంపెనీలే ధరలను నిర్ణయించుకునే అవకాశం కల్పించింది. ఆరు దశాబ్దాల నుంచి ఉన్న మద్యం ధరల నియంత్రణను ప్రభుత్వం తొలగించింది. దీంతో డిస్టిలరీలు మరియు బ్రూవరీస్ తమ ఉత్పత్తుల ధరలను నిర్ణయించుకోవచ్చు. ఇది వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. మరొకవైపు ఆల్కహాల్ శాతం ఆధారంగా ఎక్సైజ్ సుంకం ఉండనుంది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం పెరగడమే కాకుండా, పరిశ్రమలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మూడెకరాలు, రూ. 35 కోట్లు : అయోధ్యలో ప్లాట్ కొన్న బిగ్బీ
బిగ్బీ అమితాబ్ బచ్చన్ విలువైన ప్లాట్ను కొనుగోలు చేశారు. అమితాబ్ బచ్చన్ అయోధ్యలో 2.67 ఎకరాల భూమిని రూ. 35 కోట్లకు దక్కించుకున్నారు. అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రామ జన్మ భూమి ఆలయాన్ని నిర్మించిన తరువాత ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ ప్లాట్ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని HoABL హౌస్ ఆఫ్ అభినందన్లో ఉంది. ఇక్కడే బచ్చన్ మరో రెండు ప్లాట్లను కలిగి ఉండటం విశేషం. HoABL ప్రకటన ప్రకారం, ఈ అమ్మకాన్ని బచ్చన్ కుటుంబ యాజమాన్యంలోని సంస్థ AB Corp ప్రతినిధి నిర్వహించారు. HoABL తో బచ్చన్ చేసిన నాల్గవ కొనుగోలు ఇది, మహారాష్ట్రలోని అలీబాగ్ సముద్ర రిసార్ట్లో సోల్ దే అలీబాగ్ ప్రాజెక్ట్లో అమితాబ్కు ఒక స్థలం ఉంది. భూమిపై పెట్టుబడుల తరతరాల విశ్వాసాన్ని బచ్చన్ పెట్టుబడి ప్రతిబింబిస్తుందనీ, అయోధ్యపై విశ్వాసం అనేది తరతరాలుగా పంచుకున్న వారసత్వం అన్నారు. HoABLలో, భూమిని కేవలం సంపదగా కాకుండా వారసత్వంగా చూస్తామని HoABL చైర్మన్ అభినందన్ లోధా వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్ , ఉబ్బితబ్బిబ్బైన యజమానికాగా ఆయోల్య ఆలయ నిర్మాణం, అలాగే విశాలమైన రోడ్లు, మెరుగైన రైల్వే స్టేషన్లు మరియు కనెక్షన్లు మరియు నగరానికి ప్రత్యేక విమానాశ్రయం వంటి అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాత అయోధ్యలో భూమి ధరలు గణనీయంగా పెరిగాయి. HoABL, తదితర స్థానిక డెవలపర్లు, ప్రాజెక్టులతో పాటు రానున్న రోజుల్లో టూరిజం అభివృద్ధిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. అందుకే పర్యాటకుల రద్దీని క్యాష్ చేసుకునేందుకు కల్పించడానికి హోటళ్ళు,రిసార్ట్లను కూడా నిర్మిస్తున్నారు. HoABL ప్రస్తుత ప్రాజెక్ట్, సరయులో, బ్రూక్ఫీల్డ్ యాజమాన్యంలోని హోటల్ చైన్ ది లీలా ప్యాలెస్లు, హోటల్స్ , రిసార్ట్స్ నిర్వహించే హోటల్ కూడా ఉంది.ఇదీ చదవండి: పెట్రోల్ , డీజిల్ ధరల షాక్ తప్పదా? వైరల్ వీడియో(రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్)
ఎన్ఆర్ఐ
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది కూడా శివాలయాల సందర్శన యాత్ర ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు నిర్వహించారు. సింగపూర్లోని జురాంగ్ ఈస్ట్ ,బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్రను నిర్వహించారు. సుమారు 230 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. భక్తుల శివనామస్మరణలతో ప్రముఖ దేవాలయాలు కిటకిటలాడాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష, ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవ, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల మరియు ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మొదలగు వారు ఉన్నారు.వీరితో పాటు యాత్రలో సహాయపడిన పెరుకు శివ రామ్ ప్రసాద్,సమ్మయ్య మొలుగూరి, లక్ష్మణ్ రాజు కల్వ, వేణు గోపాల్ ఐరేని, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు అందరికి కృతజ్ణతలు తెలియజేశారు. ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్ గారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి , చల్ల కృష్ణ మొదలగు వారు గత సంవత్సరం లాగే ఈ సారి కూడా భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
అమెరికాలోని కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి ఉదంతం విషాదాంతమైంది. తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభ్యమైంది. పోలీసులు అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.అతని మృతదేహాన్నివీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యంత క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి, ప్రియమైనవారికి తమ హృదయపూర్వక సానుభూతిని తెలియ జేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.Consulate General of India in San Francisco is deeply concerned about the disappearance of Saketh Sreenivasaiah, an Indian post-graduate student of UC Berkeley, hailing from the State of Karnataka. The Consulate is in touch with the family and also is in contact with the…— India in San Francisco (@CGISFO) February 14, 2026 కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు.మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. తమ కొడుకు ఎలాగైనా క్షేమంగా తిరిగి వస్తాడని ఎదురు చూసిన కుటుంబీకుల్లో శ్రీనివాసయ్య మరణవార్త తీరని విషాదాన్ని మిగిల్చింది.
అమెరికాలో కర్నాటక విద్యార్థి అదృశ్యం
న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోరి్నయాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా పోయారు. కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) అమెరికాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్కిలీలో కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ పీజీ చేస్తున్నాడు. మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. సాకేత్ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆచూకీ కనుగొనే విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కర్నాటకలోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని శనివారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి సాకేత్ కనిపించకుండాపోయాడంటూ అతడి రూమ్మేట్ బనీత్ సింగ్ ఈ నెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని చోట్లా వాకబు చేసిన తను ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపినట్లు బనీత్ తెలిపాడు. ప్రభుత్వానికి సాకేత్ తండ్రి వినతి అమెరికాలో గల్లంతైన తమ కుమారుడిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందజేసినట్లు తండ్రి శ్రీనివాసయ్య తెలిపారు. చివరిసారిగా తమ కుమారుడితో ఈ నెల 9వ తేదీన ఫోన్లో మాట్లాడామన్నారు. 12వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ అతడి రూమ్మేట్ తమకు తెలిపాడన్నారు. కుమారుడి కోసం అమెరికా వెళ్లే విషయమై తాము ఆలోచిస్తున్నామన్నారు. సాకేత్ విషయంలో కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్ అధికారులు అక్కడి పోలీసులతో మాట్లాడాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కర్నాటక ప్రభుత్వం శనివారం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది.
అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం
అమెరికాలోని సియాటిల్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన గ్రాడ్యుయేట్ జాహ్నవి కందులకుటుంబానికి భారీ పరిహారం లభించనుంది. జాహ్నవి మృతి చెందిన దాదాపు మూడేళ్ల తర్వాత, ఆమె కుటుంబానికి గణనీయమైన ఆర్థిక పరిహారం అందనుంది.ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిది ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోటి కలలతో సియాటెల్లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు 2021లో అమెరికాకు వెళ్లింది.కానీ 2023, జనవరి 23వ తేదీ రాత్రి ఒక మలుపు దగ్గర రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని, కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏముంది మామూలు మనిషేగా...11 వేల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మరిచిపోయాడు. అతని మాటలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.మరోవైపు సియాటిల్లో ప్రమాదం, తమ బిడ్డ మృతిపై జాహ్నవి కుటుంబం దావా వేసింది. ఈ సంఘటన తెలుగు, భారతీయ వర్గాల నుండి మాత్రమే కాకుండా, స్థానికులు కూడా ప్రజల ఆగ్రహాన్ని వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో భారీ పరిహారంతో ఈ కేసును పరిష్కరించు కుంది. సియాటిల్ నగరం దాదాపు రూ. 262 కోట్ల (28 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి ఎటువంటి నేరారోపణలు లేకుండా, 5000 డాలర్లు జరిమానా విధించారు. అలాగే విధుల నుండి గత ఏడాది సస్పెండ్ చేశారు. సియాటెల్ ప్రకటనకందుల మరణం "హృదయ విదారకం" అని సియాటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె నష్టం ఊహించలేని బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు మరియు మా సమాజానికి కూడా జాహ్నవి కందుల జీవితం చాలా ముఖ్యమైనదే అంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని నగరం ఆ శాభావాన్ని వ్యక్తం చేసింది. కందుల దుర్మరణం జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ (ICS)తో సహా న్యాయవాద సంఘాలు విస్తృత పోలీసు సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి. 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ పోలీసు అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరికాదని, స్పష్టమైన మార్గదర్శకాలను డిమాండ్ చేస్తున్నామని IACS లలితా ఉప్పల అన్నారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
క్రైమ్
ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ.. 15 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు
విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారి ఇంద్రకీలాద్రి కొండపై చోరీ జరిగింది. ఓ భక్తురాలి వద్ద 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు పెళ్లికి వచ్చిన మహిళా భక్తురాలు నగలు పొగొట్టుకుంది. ఇవాళ కుంభాభిషేకం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో దర్శనానికి వెళ్లిన ఆమె బ్యాగ్లో ఉన్న బంగారు చోరీకి గురైంది.దీంతో విజయవాడలోని వన్ టౌన్ పోలీసులకు మహిళా భక్తురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. కుంభాభిషేకం ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రాంగణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. దీంతో సీసీ కెమెరాలకు అడ్డంగా టెంట్స్ ఉండడంతో దొంగను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది.
ఎప్స్టీన్ ఫైల్స్ : మైనర్పై దారుణం, ట్రంప్కు మరో షాక్
ఇరాన్పై భీకర దాడులు వరుసగా 7వ రోజు కూడా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ తగింది. ట్రంప్పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన మరికొన్ని కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ (Department of Justice) తాజాగా విడుదల చేసింది. దివంగత లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ (Epstein Files) కేసులో భాగంగా వీటిని బహిర్గతంచేసింది.తాజాగా విడుదలలైన ఈ పత్రాలు ప్రకారం ఎప్స్టీన్ ద్వారా ట్రంప్కు పరిచయమైన ఒక మహిళను, ఆమె మైనర్గా ఉన్నప్పుడు (13 -15 ఏళ్ల వయస్సులో) ట్రంప్ లైంగికంగా వేధించారని పేర్కొంటున్నాయి.ఎప్స్టీన్ ఆ బాలికను న్యూయార్క్ లేదా న్యూజెర్సీకి తీసుకెళ్లి ట్రంప్కు పరిచయం చేశాడు. ఆ సమయంలో ట్రంప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, తాను అతణ్ని కొరికి గాయపరిచినట్టు ఆ మహిళ దర్యాప్తు అధికారులకు వివరించిందని 2019లో FBI జరిపిన ఇంటర్వ్యూల ప్రకారం తెలుస్తోంది.అంతేకాదు ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని తనకు, తన కుటుంబ సభ్యులకు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆమె ఆరోపించింది.రాజకీయ దుమారంఈ పత్రాలు గతంలోనే విడుదల కావాల్సి ఉన్నా, పొరపాటున "డూప్లికేట్" (నకలు) అని మార్క్ చేయబడటం వల్ల అప్పట్లో బయటకు రాలేదని న్యాయశాఖ తెలిపింది. దీనిపై స్పందించిన డెమోక్రాట్లుట్రంప్ ప్రభుత్వం ఎప్స్టీన్ కేసులో కీలక వివరాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించిందని డెమోక్రాట్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టడానికి అటార్నీ జనరల్ పామ్ బాండీకి సమన్లు (Subpoena) జారీ చేయాలని హౌస్ కమిటీ నిర్ణయించింది.అయితే ఈ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ పత్రాల్లో ఉన్నవి అవాస్తవాలు, సంచలనం కోసం సృష్టించిన ఆరోపణలని గతంలోనే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఎప్స్టీన్ కేసులో వాస్తవాలు బయటికి రాకుండా ఉండేందుకు ఇరాన్పై దాడులకు పూనుకున్నాడని ట్రంప్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!
నకిలీ ఫేస్బుక్ ఖాతా.. వివాహితకు అసభ్య మెసేజ్లు..
విశాఖపట్నం జిల్లా: నకిలీ ఫేస్బుక్ ఖాతాతో ఓ వివాహితకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని నగర సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ వివాహితకు ఒక వ్యక్తి నకిలీ ఫేస్బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అనంతరం ఆమె ఖాతాలోని ఫొటోలను డౌన్లోడ్ చేసి మారి్ఫంగ్ చేశాడు. ఆ ఫొటోలను ఆమెకు పంపిస్తూ, తనతో చాటింగ్ చేయకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. అసభ్య పదజాలంతో మెసేజ్లు చేస్తూ తీవ్ర వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని కొబ్బరితోటకు చెందిన గరుబిల్లి భాస్కరరావుగా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అపరిచిత వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తే అంగీకరించవద్దని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీహోర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బోర్డ్ ఎగ్జామ్స్కు వెళ్తున్న ఇద్దరు తోబుట్టువులను వారి సొంత బాబాయే దారుణంగా కొట్టి చంపాడు. అక్కా తమ్ముళ్లు శీతల్ (20), కుల్దీప్ (18) తమ అడ్మిట్ కార్డులతో పరీక్షా కేంద్రం వైపు నడుచుకుంటూ వెళుతుండగా కాపుకాసి అత్యంత పాశవికంగా వారిని కొట్టి చంపాడు. రక్తపు మడుగులో వారి మృతదేహాలు ఒక పక్క, వారి అడ్మిట్ కార్డులు ఒకపక్క పడిపోయిన ఘటన పలువురి కంట కన్నీరు తెప్పించింది. ఈ జంట హత్యలు తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:పోలీసులు అందించిన సమాచాం ప్రకారం ఇది ఆవేశపూరితంగా జరిగిన హత్యలు కావు. పాతకక్షలతో ప్లాన్ చేసిన మరి వారసులను హతమార్చిన దుర్మార్గ ఘటన ఇది.పిల్లలిద్దరూ ఉదయాన్నే పరీక్షకు వెళ్తారని తెలిసి, నిందితుడు, బాబాయి హరిసింగ్ మాలవీయ రోడ్డుపై కాపు కాశాడు. మార్గమధ్యలో కర్రతో బలంగా తలలపై బాదడంతో వారిద్దరూ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.సీహోర్ జిల్లా ధరంపురి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్కుటుంబ కలహాలే కారణమని మృతుల తండ్రి జగదీష్ మాలవీయ ఆరోపించారు. తమ ఇంటి దీపాలను ఆర్పేశాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. పరీక్షలు రాసి ఉన్నత స్థాయికి ఎదుగుతారనుకున్న పిల్లలు, ఇలా సొంత బాబాయి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇదీ చదవండి : కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్యమరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధీఖ్గంజ్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారైన నిందితుడు హరిసింగ్ కోసం పోలీసులు అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.అతనిని పట్టుకోవడానికి టీమ్లను ఏర్పాటు చేశామని, రహస్య ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తున్నట్లు ఎఎస్పీ సునీతా రావత్ తెలిపారు.గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత దృష్ట్యా ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని స్టేషన్ ఇన్చార్జ్ రాజు సింగ్ బాఘేల్ తెలిపారు.
వీడియోలు
ఫైనల్ కి ముందే బయటపడిన టీమిండియా డొల్లతనం ఫైనల్లో ఈ ముగ్గురిని తప్పించకుంటే ఓటమి పక్కా..?
సూర్య VS సాంట్నర్..రికార్డ్స్ చూస్తే..టీమిండియాకు మళ్లీ నిరాశేనా..?
ఆ పేరు చెప్తేనే వణికిపోతున్న టీం ఇండియా
10th క్లాస్ స్టూడెంట్ చేసిన పని చూడండి
లొంగిపోయేందుకు బయల్దేరిన మావోయిస్టులు
ఖమేనీ బంకర్ ధ్వంసం చేశాం ఇక మిగిలింది..!
భీకర యుద్ధం వేళ ఇరాన్ అధ్యకుడికి పుతిన్ ఫోన్
విజయ్ కు బిగ్ షాక్ బయటకు వెళ్లకూడదంటూ పిటిషన్
ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ క్రీడా ఉత్సవాలపై జడ శ్రవణ్ సెటైర్లు
వెంకీ మూవీలో కీర్తి సురేష్..?


