సీమకు తలమానికం తిరునగరి
చరిత్రను తెలుసుకోవడం అంటే గతాన్ని గుర్తుచేసుకుని భవిష్యత్తును నిర్ణయించు కోవడం. గతం లేనిదే వర్తమానం ఉండదు, వర్తమానం లేని భవిష్యత్తును ఊహించుకోలేము. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుపతి నగరానికి ఘనమైన నేపథ్యం ఉన్నది. అలాంటి తిరుపతికి అంకురార్పణ జరిగి నేటికి 896 సంవత్సరాలు. తిరుపతి నగరానికి అనుకుని ఉన్న ప్రస్తుత తిరుచానూరులోని వేంకటేశ్వర స్వామి ఆలయం, పార్థసారథి ఆలయం చోళుల కాలంలో రూపొందితే, అటుపిమ్మట పద్మావతి అమ్మవారి ఆలయం వెలసింది. శ్రీ శుకమహర్షి ఆశ్రమాన్ని ఏర్పరచుకుని తపస్సు చేసిన కారణంగా తిరుశుకనూరుగా పిలిచే వారనీ, అటుపిమ్మట కాలక్రమంలో తిరుచానూరుగా మారిందనీ అంటారు. నారాయణవనం కేంద్రంగా పాలన సాగించిన ఆకాశ రాజు కుమార్తె పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నారు. వివాహమనంతరం 6 నెలల దీక్షా కాలాన్ని శ్రీనివాస మంగాపురంలో గడిపారు. దీక్షా కాలం తర్వాత శ్రీనివాసుడు తిరుమల వెళ్ళారు. ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి కాలంలో శ్రీనివాస మంగాపురం ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మిక అనుబంధమే పునాదిచారిత్రక ఆధారాల ప్రకారం, 1130 ఫిబ్రవరి 24న రామా నుజాచార్యుల నిర్ణయం మేరకు గోవింద రాజపురం ఆగ్రహారం నిర్మాణానికి పునాది వేశారు. అంటే నేటి తిరుపతి... గోవింద రాజపురంగా పునాది వేసుకుంది. అటు పిమ్మట గోవిందరాజ ఆలయం, దాని చుట్టూ అగ్రహారం నిర్మాణం నారాయణవనం రాజ్య పాలకుడు గట్టురాజు చేపట్టారు. తర్వాత 100 సంవత్సరాలకు ఇది తిరుపతిగా రూపాంతరం చెందింది. తిరుమల శ్రీవారి ఆలయ గోపురం, శ్రీనివాస మంగాపురంతో సహా అనేక ఆలయాలకు గోపురాలు, అభివృద్ధి పనులు యాదవ రాజుల కాలంలో జరిగాయి. అందుకే టీటీడీ ఆలయాలలో యాదవులకు తొలి దర్శన అవకాశం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.తిరుపతి రూపుదిద్దుకుంటున్న ప్రారంభంలో తాళ్ళపాక వాసుల కృషి మరువలేనిది. శ్రీవారి ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో అన్నమయ్య కీర్తనలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే తాళ్ళపాకకు చెందిన తాతయ్య తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద వెలిసిన గంగమ్మ ఆలయానికి ఆద్యులు. అందుకే ఈ ఆలయాన్ని తాళ్ళపాక పెద్ద గంగమ్మ ఆలయం అని అంటారు. తాళ్ళపాక వాసులు శ్రీనివాస మంగాపురం ఆలయ అభివృద్ధిలో కూడా పాలుపంచుకున్నట్లు చెపుతారు. తాతాచార్య వంశస్థులు తాతయ్య గుంట గంగమ్మ ఆల యానికి ఆద్యులు. వీరికి తొలి తీర్థం ఇస్తారు. తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు ఏడుసార్లు తిరుపతి పర్యటన చేశారు. తిరుపతి, తిరుమల, తాను పర్యటించిన నాగలాపురం, నారాయణవనంలో ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారి తల్లి నాగులాంబ పేరుతో నాగులాపురం ఆలయాన్ని నిర్మించారు.మహానగరంగా మార్చే అవకాశంతిరుపతి, తిరుమల అంటూ ప్రస్తుతం పిలుచుకుంటున్నాం. కానీ చరిత్రను పరిశీలిస్తే రెండూ వేరు వేరు కాదని అర్థం చేసు కోవచ్చు. తిరుపతి నగరం స్వతంత్రం వచ్చే వరకు నార్త్ ఆర్కాట్ జిల్లా పరిధిలో ఉన్నది. నేటి కొండను పురాణాలలో వెంగడం అని పిలిచేవారు. పులికాట్ పరిసరాలను పాలించిన ప్రాంతానికి వెంగో రాష్ట్రం అన్న పేరు కూడా ఉంది. తిరుపతి, తిరుమలపై తమిళ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో తిరుపతి గానే పిలిచేవారు. తిరు అంటే శ్రీ అని అర్థం. పతి అంటే శ్రీనివాసుడు యజమాని అని. ఆ రకంగా శ్రీనివాసుడి అజమాయిషీలో తిరుపతి ఉంటుంది. ఎంత బాగుంది ఈ పిలుపు! చాలా కాలం వరకు తమిళంలో మేల్ తిరుపతి, కీల్ తిరుపతి (కింద తిరుపతి, పైన తిరుపతి) అని పిలిచే వారు. క్రమేణా కొండ అర్థం వచ్చేలా తిరుమలగా మారింది. తిరుపతిని అభివృద్ధి చేయడం అంటే శ్రీనివాసుడి అజమాయిషీలో ఉన్న ఆధ్యాత్మిక నగరాన్ని అభివృద్ధి చేయడమే. చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం తెలియనివారు తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు వెచ్చిస్తే అనవసర వివాదం చేస్తుంటారు. ఏపీ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ తన పరిశీలనలో రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం లేదు, ఉన్నవన్నీ గ్రామీణ పరిధి దాటని పట్టణాలు అని పేర్కొంది. ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతోంది అనడానికి మంచి నగరాలుండటం ఒక కొలమానం. వెనుకబడిన రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం కూడా లేకపోతే ఇక అభివృద్ధికి ఆస్కారం ఎక్కడిది? ఈ వెలితిని తీర్చి మహానగరంగా మార్చగలిగే అవకాశం తిరుపతికి ఉన్నది. తిరుపతి నగరానికి అనుకుని చెన్నై, బెంగళూరు మహా నగరాలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు, భూమి సమస్య ఆ రెండు నగరాలకు ప్రతిబంధకంగా మారింది. ఆ ప్రతిబంధకమే తిరుపతి నగర అభివృద్ధికి అవకాశంగా మారుతుంది. తిరుపతి చుట్టూ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో పాటు... దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రోడ్డు, రైల్వే, విమాన మార్గాలు ఉన్నాయి. చెన్నై నగరానికి సమీపంలో మాజీ ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసిన శ్రీసిటీ ప్రత్యేక అర్థిక మండలి ఆసియా ఖండంలోనే అత్యంత విజయవంతం అయిన సెజ్గా మారింది. వాతావరణ సమతుల్యత అదనపు అనుకూలత. అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తిరుపతిని అత్యంత సౌకర్యవంతమైన నివాస యోగ్య నగరంగా గుర్తించాయి. తిరుపతి నగర పాలక సంస్థ తీర్మానం చేసినట్లు... చంద్రగిరి, కళ్యాణి డ్యామ్, వడమాల పేట, రాయలచెరువు, ఐఐటీ వరకు తిరుపతిని గ్రేటర్గా మార్చి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే అనతి కాలంలోనే మరో హైదరాబాద్గా మారుతుంది.తొలి దర్శనం నుంచి ప్రథమ పౌరురాలి వరకు...వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను ప్రస్తావించడానికి ఇది సరైన సమయం. విజయనగర రాజుల తర్వాత యాదవ రాయలు తిరుపతి ఆలయాల అభివృద్ధిలో గొప్ప పాత్ర పోషించారు. శ్రీవారి ఆలయం ముందు భాగాన గొల్లమండపం నిర్మించి, గోవుల పెంప కంతో శ్రీవారి నైవేద్యానికి ఆ పాలను వినియోగించే వారని అంటారు. వివిధ కొలనులను వారి హయాంలోనే నిర్మించినట్లు ఆధారాలు కనిపిస్తాయి. దైవ దర్శనంలో కోనేటి స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిందే. అందుకే శ్రీవారి ఆలయాలలో తొలి దర్శనం యాదవ వంశస్థులకు ఇస్తారు. అయితే ఈ సంప్ర దాయానికి సాధికారత ఇచ్చింది మాత్రం జగన్ గారే. అదే సామాజిక వర్గానికి చెందిన శిరీష యాదవ్ను తిరుపతి నగరానికి తొలి మేయర్గా చేసిన ఘనత కూడా జగన్కే దక్కుతుంది. అది కూడా జనరల్ మేయర్ స్థానంలో బీసీలకు ఇవ్వాలనే నిర్ణయమూ, తిరు పతి అంకురార్పణలో కీలక భూమిక పోషించిన యాదవ సామాజిక వర్గానికి రాజకీయ గుర్తింపు ఇవ్వడమూ సముచిత నిర్ణయం. ఎంతో స్ఫూర్తినిచ్చే తిరుపతి నగర ఆవిర్భావ చారిత్రక సత్యాన్ని తన అధ్యయనం ద్వారా అందించిన చరిత్రకారుడు దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, ఈ చారిత్రక సత్యాన్ని గుర్తించి ఆవిర్భావ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించిన నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అభినందనీయులు. మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డివ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త
Hyd: హౌసింగ్ బోర్డు స్థలాలకు మరోసారి భారీ డిమాండ్
హైదరాబాద్: నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో హౌసింగ్ బోర్డు స్థలాలు మళ్లీ హాట్ టాపిక్గా మారాయి. తాజాగా జరిగిన వేలంపాటల్లో ఈ స్థలాలకు ఊహించని స్థాయిలో పోటీ కనిపించింది. గచ్చిబౌలిలో 263 గజాల ఫ్లాట్కు రికార్డు ధర పలికింది. ఈ ప్లాట్కు సంబంధించి చదరపు గజం రూ.1.76 లక్షల ధర పలికింది. ఇక కూకట్పల్లి బాలాజీ నగర్లో చదరపు గజం రూ.1.64 లక్షల ధరకు అమ్ముడుపోయింది. చింతల్లో గజానికి రూ.84 వేలు, రూ.74 వేలు ధర పలకగా, నిజాంపేట సిద్ధి ఫ్లాట్ రూ.17.70 లక్షలకు విక్రయించారు. బౌరంపేట 2600 గజాల భూమి గజానికి రూ.61 వేల అమ్ముడుపోగా, ఎంఐజి, హెఐజి ప్లాట్లకు కొనుగోలుదారుల పోటీ నెలకొంది. ఇలా బహిరంగ వేలం ద్వారా రూ. 34. 27 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 14 భూములను వేలం ద్వారా విక్రయించగా, వాటికి రికార్డు ధరలు పలికాయి. ఈ వేలాన్ని కెపిహెచ్బి కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఇందులో సుమారు 50 మంది బిడ్డర్లు పాల్గొన్నారు.
హమాస్ ఉగ్రవాదుల సొరంగాలు పూర్తిగా ధ్వంసం
గాజాలోని రఫాలో హమాస్ ఉగ్రవాదుల సొరంగాలను ఇజ్రాయిల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్లో డజన్ల కొద్దీ ఉగ్రవాదులను నిర్మూలించి, సొరంగాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. హమాస్ ఉగ్రవాదులు తమ ఆయుధాలను సొరంగాల్లో దాచారనే సమాచారంతో వాటిని పూర్తిగా నిర్వర్యం చేయడానికి రంగంలోకి దిగి, విజయవంతంగా ముగించినట్లు తెలిపింది.రఫాలో ఒక కిలోమీటర్ పొడవైన హమాస్ సొరంగాన్ని ధ్వంసం చేసిన వీడియోలను ఐడీఎఫ్ సోమవారం విడుదల చేసింది.. ఈ సొరంగంలో హమాస్ ఉగ్రవాదులు దాగి ఉండే గదులు, అలాగే ఆయుధాలు కూడా కనుగొన్నారు. ఈ ఆపరేషన్లో పదుల సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులు చనిపోయినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఈ సొరంగాన్ని యహలోమ్ ఎలైట్ ఇంజినీరింగ్ యూనిట్ పూర్తిగా కూల్చివేసినట్లు పేర్కొంది. 2025 అక్టోబరు 28న జరిగిన దాడిలో మాస్టర్ సర్జెంట్ (రిజర్వ్) యోనా ఎఫ్రైమ్ ఫెల్డ్బౌమ్ వీరమరణం పొందిన చోటుగా గుర్తించబడిన సొరంగాన్ని కూడా ధ్వంసం చేశారు.గత వారం రఫాలోని మరో సొరంగ ద్వారం వద్ద తొమ్మిది మంది ఉగ్రవాదులను ఐడీఎఫ్ దళాలు నిర్మూలించాయి. వారు సొరంగం నుంచి బయటకు వచ్చి కాల్పులు జరిపినప్పుడు వీరిని హతమార్చాయి ఐడీఎఫ్ దళాలు. రఫా ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదుల మౌలిక వసతులను పూర్తిగా కూల్చివేయడమే లక్ష్యంగా ఐడీఎష్ దళాలు తమ దాడులు ముమ్మరం చేశాయి.
ముడవప్రపంచ యుద్ధం.. జెలెన్స్కీ ఏమన్నారంటే?
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడవ ప్రపంచ యుద్ధాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ప్రారంభించారన్నారు. మాస్కో దండయాత్రను అడ్డుకోవడం ద్యారా ఉక్రెయిన్ పూర్తి స్థాయి ప్రపంచ యుద్ధాన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.ఉక్రెయన్- రష్యా యుద్ధం ప్రారంభమై ఇటీవలే నాలుగు సంవత్సరాలు పూర్తైంది. 2022లో ప్రారంభమైన ఈ యుద్ధం మూలంగా ఇప్పటికే పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధాన్ని నిరోధించడానికి పెద్ద ఎత్తున యత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి జెలెన్స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు.యుద్ధం ముగించడానికి అమెరికా అధ్యక్షుని నుంచి స్పష్టమైన హామీలు ఆశిస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. కేవలం అధ్యక్షుని మాట పూర్వక హామీ కాకుండా దానికి రాజ్యాంగ పరమైన అనుమతి ఉండాలని కోరారు. 1991లో ఉక్రెయిన్ స్వాతంత్రం పొందినప్పుడు ఉన్న సరిహద్దులే తమ అంతిమ లక్షమని అయితే ఇప్పుడు రష్యా సైనిక పరంగా ఎంతో బలంగా ఉన్నందున అది సాధ్యం కాదని జెలెన్స్కీ ఒప్పుకున్నారు.అయితే రష్యా తమ భూభాగం నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని విషయం తనకు తెలుసన్నారు. తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని రష్యా విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని జెలెన్స్కీ తన అభిప్రాయాలు ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
బీజేపీ కుట్రలను సాగనీయం
నోటమాట రావట్లే!
ట్రంప్ అరాచకానికి బ్రేక్
రుబరూ రెడీ
బ్యాక్ టు హైదరాబాద్
చరిత్ర సృష్టించిన బూంగ్
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కుట్ర కోణం తెరపైకి?
సీమకు తలమానికం తిరునగరి
ఒలెక్ట్రాకు 1,085 బస్సుల భారీ ఆర్డరు
బ్యాంకులూ..మీ పని మీరు చూసుకోండి
టీమిండియా కొంపముంచిన గంభీర్.. నెటిజన్లు ఫైర్
కరెంటు పనికి వచ్చి.. యువతిపై కన్నేసి..
మా ఓటమికి కారణమదే.. మళ్లీ బలంగా తిరిగొస్తాం: సూర్యకుమార్
పవిత్ర ఉన్నప్పుడు నాన్న సైలెంట్: నరేశ్ కుమారుడు
విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే..?
రెడ్బుక్ వర్కవుట్ కాక ఎల్లోబుక్ తెరిచారన్న మాట!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
విజయవంతంగా గుండె మార్చిడి శస్త్ర చికిత్స
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. టీమిండియాలో కీలక మార్పు
అసలు అన్న అని పిలవను.. రాజీవ్ కనకాల నాకు బావ!
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
ఏక సభ్య కమిషన్
జిరాక్స్ షాప్ నుంచి ఏకంగా రూ.6 వేల కోట్ల బ్రాండ్..!
రైతు భరోసా ఏదీ?
బంగారం, వెండి ధరలు.. మళ్లీ కొత్త మార్క్లు
ఈ రాశి వారికి శుభవార్తలు.. రాబడి పెరుగుతుంది
సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. అయినా, టీమిండియాదే వరల్డ్కప్..!
ట్రంప్ టారిఫ్ టాప్ లేపిన భారతీయ న్యాయవాది
మా ఆయన తేడా..
T20 WC 2026: టీమిండియాలో కలకలం
బీజేపీ కుట్రలను సాగనీయం
నోటమాట రావట్లే!
ట్రంప్ అరాచకానికి బ్రేక్
రుబరూ రెడీ
బ్యాక్ టు హైదరాబాద్
చరిత్ర సృష్టించిన బూంగ్
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కుట్ర కోణం తెరపైకి?
సీమకు తలమానికం తిరునగరి
ఒలెక్ట్రాకు 1,085 బస్సుల భారీ ఆర్డరు
బ్యాంకులూ..మీ పని మీరు చూసుకోండి
టీమిండియా కొంపముంచిన గంభీర్.. నెటిజన్లు ఫైర్
కరెంటు పనికి వచ్చి.. యువతిపై కన్నేసి..
మా ఓటమికి కారణమదే.. మళ్లీ బలంగా తిరిగొస్తాం: సూర్యకుమార్
పవిత్ర ఉన్నప్పుడు నాన్న సైలెంట్: నరేశ్ కుమారుడు
విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే..?
రెడ్బుక్ వర్కవుట్ కాక ఎల్లోబుక్ తెరిచారన్న మాట!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
విజయవంతంగా గుండె మార్చిడి శస్త్ర చికిత్స
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. టీమిండియాలో కీలక మార్పు
అసలు అన్న అని పిలవను.. రాజీవ్ కనకాల నాకు బావ!
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
ఏక సభ్య కమిషన్
జిరాక్స్ షాప్ నుంచి ఏకంగా రూ.6 వేల కోట్ల బ్రాండ్..!
రైతు భరోసా ఏదీ?
బంగారం, వెండి ధరలు.. మళ్లీ కొత్త మార్క్లు
ఈ రాశి వారికి శుభవార్తలు.. రాబడి పెరుగుతుంది
సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. అయినా, టీమిండియాదే వరల్డ్కప్..!
ట్రంప్ టారిఫ్ టాప్ లేపిన భారతీయ న్యాయవాది
మా ఆయన తేడా..
T20 WC 2026: టీమిండియాలో కలకలం
ఫొటోలు
'D/o ప్రసాదరావు' ప్రీ రిలీజ్ (ఫొటోలు)
కొచ్చిలో 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్.. ట్రెండింగ్ ఫోటోలు చూశారా?
విజయవాడలో నోరూరించే రంజాన్ రుచులు.. మీరూ ఓ లుక్కేయండి (ఫొటోలు)
అమలాపురంలో సందడి చేసిన 'రాకాస' మూవీ టీమ్ (ఫొటోలు)
జ్యోతిరాయ్ 'కిల్లర్' మూవీ టీజర్ రిలీజ్ (ఫొటోలు)
చిరంజీవికి సన్మానం.. టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
వైభవంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)
లాంచనంగా మొదలైన రిషభ్ శెట్టి 'జై హనుమాన్' (ఫొటోలు)
లక్కీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్-1 లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
సినిమా
సమంత నయా గ్లామర్.. 'కోర్ట్' శ్రీదేవి వయ్యారాలు!
గ్లామరస్ పోజులతో సరికొత్త సమంత హంగామాలంగా ఓణీలో అందంగా 'కోర్ట్' ఫేమ్ శ్రీదేవిదుబాయిలో చిల్ అయిపోతున్న రాయ్ లక్ష్మిక్యూట్ అండ్ స్వీట్ లుక్స్లో ఆషికా రంగనాథ్అందం చూపిస్తూ రచ్చ లేపుతున్న అంజలిరాణీ ముఖర్జీ, రేఖతో కలిసి కీర్తి సురేశ్ ఫొటోలు View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Jabili 🌝 (@srideviactor) View this post on Instagram A post shared by Namitha Vankawala (@namita.official) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi)
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. అధికారిక ప్రకటన
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. దాదాపు ప్రతి భాషకు చెందిన సినిమాలని డబ్బింగ్ రూపంలో తెలుగులో రిలీజ్ చేసేస్తున్నారు. అలాంటిది ఈ కాలంలోనూ రీమేక్ చేస్తున్నారంటే సాహసమనే చెప్పొచ్చు. ఆ సాహసం చేసి తీసిన చిత్రమే 'ఓం శాంతి శాంతి శాంతిః'. థియేటర్లలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. పోస్టర్ కూడా వదిలారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)దర్శకుడు తరుణ్ భాస్కర్ అప్పుడప్పుడు నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. అలా హీరోగా చేసిన మూవీ 'ఓం శాంతి శాంతి శాంతిః'. ఈషా రెబ్బా హీరోయిన్. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. 2022లో మలయాళంలో వచ్చిన 'జయ జయ జయహే' చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ చిత్రాన్నే తెలుగు డబ్బింగ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. అయినా సరే ఈ సినిమా నిర్మాతలు సాహసం చేశారు. కానీ అది బెడిసికొట్టింది.ఒరిజినల్ సినిమా నుంచి సీన్ టూ సీన్ దింపేశారు. కాస్త నేటివిటీ మార్చినప్పటికీ మరీ స్టార్ కాస్టింగ్ లేకపోవడంతో జనాలు దీన్ని చూసేందుకు పెద్దగా థియేటర్లలోకి రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు మార్చి 4 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. గోల్డ్ సబ్స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే అందుబాటులోకి రానుంది.'ఓం శాంతి శాంతి శాంతిః' విషయానికొస్తే.. మంచిగా చదువుకుని ఉద్యోగం చేయాలనుకునే మధ్యతరగతి అమ్మాయి ప్రశాంతి(ఈషా రెబ్బా). కాలేజీలో జరిగిన ఓ సంఘటన వల్ల చదువు ఆపేసి ఈమెని ఓంకార్ నాయుడు(తరుణ్ భాస్కర్) అనే చేపల వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వివాహం తర్వాత కూడా చదువుకోవచ్చనే ఆలోచనతో కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కానీ అత్తారింట్లో ఊహించనివి జరుగుతాయి. భర్త తన అహంకారాన్ని, కోపాన్ని ఈమెపై చూపిస్తుంటాడు. ప్రతిసారీ చెంపపగలగొట్టేస్తుంటాడు. ఓ రోజు కోపం పట్టలేక ప్రశాంతి, భర్తకు ఎదురుతిరుగుతుంది. భర్తని కుక్కని కొట్టినట్లు కొడుతుంది. తర్వాత ఏమైంది? భార్యభర్తలిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 8 ఏళ్ల తర్వాత గడ్డం తీసేసిన 'కేజీఎఫ్' యష్.. ఇలా ఉన్నాడేంటి?)
అసలు అన్న అని పిలవను.. రాజీవ్ కనకాల నాకు బావ!
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన గాయత్రి భార్గవి.. తర్వాత తెలుగులోనూ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. లేటెస్ట్గా ఈమె.. 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు' అనే వెబ్ సిరీస్ చేసింది. జీ5 ఓటీటీలో ఇది ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ప్రీమియర్ ఈవెంట్ జరగ్గా, ఇందులో మాట్లాడిన నటి గాయత్రి భార్గవి.. నటుడు రాజీవ్ కనకాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈయనే నాకు తొలి క్రష్ అని అప్పటి సంగతులని గుర్తుచేసుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'ఈ అమ్మాయి టీవీకి పనికొస్తుందని అప్రూవ్ చేసింది రాజీవ్ కనకాల ద్వారానే. నాకు బాగా గుర్తు. ఓసారి రాజీవ్, బెన్నం ఓ బైక్పై.. నా కాలేజీకి వచ్చారు. నా ఫొటో, నన్ను చూసి వెళ్లిపోయారు. కట్ చేస్తే కొన్నాళ్లకు ఓ యాడ్లో నటించే అవకాశం దక్కింది. అప్పటినుంచి రాజీవ్ నాకు తెలుసు. ఈయనే నాకు ఫస్ట్ క్రష్. మేం దూరదర్శన్ లో రకరకాల ప్రోగ్రామ్స్ చూసిన రాజీవ్.. మా అందరికీ మొదటి క్రష్. అందుకే సుమ అక్క, రాజీవ్ బావగారు అంటాం. అసలు అన్న గిన్న అని మేం పిలవం' అని గాయత్రి భార్గవి చెప్పుకొచ్చింది.అయితే గాయత్రి భార్గవి చెబుతున్నప్పుడు రాజీవ్ కనకాల తెగ సిగ్గుపడిపోయాడు. పక్కనే ఉన్న ఉదయభానుతో సహా అక్కడున్న వాళ్లందరూ నవ్వేశారు. ఇక సిరీస్ విషయానికొస్తే.. థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. నటి వాసంతిక టైటిల్ రోల్ చేసింది. రాజీవ్ కనకాల.. ఈమెకు తండ్రిగా నటించాడు. కనిపించకుండా పోయిన కూతురిని వెతికేందుకు తండ్రి ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరకు ఏమైందనే కాన్సెప్ట్తో ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకప్పటి యాంకర్ ఉదయభాను.. పోలీస్ పాత్ర చేయడం విశేషం.(ఇదీ చదవండి: నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య)
గోవాలో నాగచైతన్య సందడి.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో నాగచైతన్య గోవాలో సందడి చేశారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్కు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈ పోటీల్లో తన మోటార్స్పోర్ట్స్ టీమ్ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్కు మద్దతుగా పాల్గొన్నారు. రౌండ్-4లో భాగంగా నిర్వహించిన రేసింగ్ ఈవెంట్లో తమ డ్రైవర్లను ఉత్సాహపరుస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. తండేల్ సూపర్ హిట్ తర్వాత సరికొత్త మైథలాజికల్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఈ మూవీకి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్సీ24 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. Yuvasamrat @chay_akkineni Cheering for his team #HyderabadBlackBirds at the #GoaStreetRace2026 🔥💨#IndianRacingLeague pic.twitter.com/BB4EZZ4wCa— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 22, 2026
క్రీడలు
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ మొన్జురుల్ ఇస్లాంపై వేటు వేసింది. తమ పరిధిలోకి వచ్చే క్రికెట్ సంబంధిత వ్యవహారాలన్నింటికీ దూరంగా ఉండాలని అతడిని ఆదేశించింది. ఈ మేరకు అతడిపై నిషేధం విధిస్తూ ప్రకటన జారీ చేసింది.అసలేం జరిగిందంటే.. ప్రపంచకప్-2022 సందర్భంగా మొన్జురుల్ ఇస్లాం తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బంగ్లా మహిళా క్రికెట్ జట్టు నాటి కెప్టెన్ జహనారా ఆలం సంచలన ఆరోపణలు చేసింది. స్వతంత్ర విచారణ కమిటీఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన బోర్డు.. ఆదివారం తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది. షేర్-ఏ- బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో సమావేశమైన బోర్డు సభ్యులు.. స్వతంత్ర విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించారు.జహనారా ఆరోపించినట్లుగానే మొన్జురెల్కు సంబంధించి తమకు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ‘‘బీసీబీ నియమించిన స్వతంత్ర విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు... మహిళా జట్టు కెప్టెన్ జహనార ఆలం ఆరోపణలు నిజమేనని తేలాయి.నిషేధం విధిస్తున్నాంఈ క్రమంలో మొన్జురుల్ ఇస్లాంపై నిషేధం విధిస్తున్నాం. బీసీబీ పరిధిలోని క్రికెట్ సంబంధిత వ్యవహారాలతో ఇకపై అతడికి ఎలాంటి సంబంధాలు ఉండవు. కమిటీ చేసిన సిఫారసులను బీసీబీ సమీక్షిస్తుంది. ఈ విషయంలో అదనపు చర్యలకు సంబంధించి త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తాం’’ అని బీసీబీ తమ ప్రకటనలో పేర్కొంది.కాగా బంగ్లాదేశ్ మహిళల జట్టు సెలక్టర్, మేనేజర్గా మొన్జురుల్ వ్యవహరించాడు. గతేడాది జూన్ 30న అతడి పదవీకాలం ముగిసింది. ఇదిలా ఉంటే.. మహిళా జట్టు సెలక్షన్ ప్యానెల్ చైర్మన్ ఘాజి ఆష్రఫ్ హొసేన్ పదవీకాలాన్ని నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు బీసీబీ ఈ సందర్భంగా వెల్లడించింది. ఘాజి స్థానాన్ని త్వరలోనే భర్తీ చేస్తామని.. అందుకోసం కాస్త సమయం పడుతుంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.చారిత్రాత్మక ముందుడుగుబంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చారిత్రాత్మక ముందడుగు వేసింది. మహిళల క్రికెట్ను ప్రోత్సహించే క్రమంలో వుమెన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (WBPL) నిర్వహణకు పచ్చజెండా ఊపింది. తొలి ఎడిషన్కు ఏప్రిల్ 4- 14 వరకు షెడ్యూల్ ఫిక్స్ చేయగా.. బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఢాకా, ఛట్టోగ్రామ్ వేదికగా ఈ మ్యాచ్లు జరుగనున్నాయి.చదవండి: మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా స్టార్
అతడొక అద్భుతం.. కానీ: పాక్ మాజీ క్రికెటర్ యూటర్న్
టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో మాత్రం తేలిపోతున్నాడు. కెరీర్లో తొలిసారి వరల్డ్కప్ ఈవెంట్లో ఆడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.హ్యాట్రిక్ డకౌట్లులీగ్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్లతో ఆడిన మ్యాచ్లలో అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ అభిషేక్ బ్యాటింగ్ శైలిని విమర్శించాడు. కేవలం పవర్ హిట్టింగ్పైనే ఆధారపడతాడని.. అతడి టెక్నిక్ సరిగ్గా లేదని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా అతడిని ‘స్లాగర్’గా అభివర్ణించాడు.పరుగులు చేయాలనే తొందరలో వికెట్ పారేసుకుంటున్నాడని.. టెక్నిక్తో ఆడటం అతడికి చేతకాదని ఆమిర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీమిండియా అభిమానులు అతడిపై ఫైర్ అయ్యారు. అభిషేక్ శర్మ టీ20 ర్యాంకింగ్స్లో ప్రస్తుతం ప్రపంచ నంబర్వన్ బ్యాటర్ అని.. ఆటగాడి కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమంటూ భారత ఆటగాడికి మద్దతుగా నిలిచారు.మరోసారి విఫలంఇక సూపర్-8 దశలో తొలి మ్యాచ్లోనూ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి పోరులో ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 12 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాది 15 పరుగులు చేశాడు. మార్కో యాన్సెన్ బౌలింగ్లో కార్బిన్ బాష్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఆమిర్ యూటర్న్!ఈ నేపథ్యంలో మహ్మద్ ఆమిర్ మరోసారి అభిషేక్ శర్మ గురించి వ్యాఖ్యలు చేశాడు. తన మాటలను అందరూ అపార్థం చేసుకున్నారంటూ యూటర్న్ తీసుకున్నాడు. ‘‘బౌలర్ వైపు నుంచి నేను అభిషేక్ శర్మ ఆటను విమర్శించాను. అతడి టెక్నిక్ గురించి మాత్రమే నేను మాట్లాడాను.కానీ నేను స్లాగర్ అన్న పదం వాడటం చాలా మందికి నచ్చలేదు. పటిష్ట జట్టు, బౌలర్లను ఎదుర్కోవాల్సి వచ్చినపుడు కాస్త ఓపికగా ఉండాలని చెప్పాను. ఎందుకంటే అభిషేక్ శర్మ బలహీనత ఏమిటో అందరికీ తెలిసిపోయింది. వాళ్లు అతడిని ఈజీగా ట్రాప్ చేయగలరు.అద్భుతమైన నైపుణ్యాలు.. కానీతాజా మ్యాచ్లో అతడు పద్నాలుగు పరుగులను ఒకే వైపు నుంచి రాబట్టాడు. అవి కూడా చెత్త బంతుల ద్వారా వచ్చిన పరుగులే. రబడ బౌలింగ్ మొదలుపెట్టాగానే.. అభిషేక్ శర్మ తెల్లముఖం వేశాడు.సీనియర్ ఆటగాడిగా నేను అభిషేక్ శర్మకు ఓ సలహా ఇస్తున్నా. నీ టెక్నిక్ గురించి ప్రత్యర్థులకు తెలిసిపోయింది. కాస్త ఓపికగా ఉండి.. బంతి ఎలా వస్తుందో అర్థం చేసుకుని ఆడితే నువ్వు మళ్లీ మునుపటిలా విజృంభించగలవు.అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అయితే, వాటిని అతడు ఎలా ఉపయోగించుకుంటాడన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేను చెప్పాలనుకుంది ఇదే. కానీ చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అని మహ్మద్ ఆమిర్ చెప్పుకొచ్చాడు. చదవండి: కెప్టెన్, హెడ్కోచ్ ఏం చేస్తున్నారు?.. భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం
వెస్టిండీస్తో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే
టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో భాగంగా ముంబై వేదికగా వెస్టిండీస్, జింబాబ్వే జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సూపర్-8 పోరులో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి.జింబాబ్వే జట్టులోకి నగరవ రాగా.. విండీస్ జట్టులోకి రొమారియో షెపర్డ్ వచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఇరు జట్లు కూడా అజేయంగా నిలిచాయి. మరి సూపర్-8లో ఎవరు బోణీ కొడతారో వేచి చూడాలి.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, టోనీ మునియోంగా, తాషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్, రిచర్డ్ న్గరవ, బ్లెస్సింగ్ ముజారబానీవెస్టిండీస్: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షామర్ జోసెఫ్
సఫారీ బ్యాటర్తో సుందర్ ఫైట్.. కారణమిదే?
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 188 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతికల పడింది. లక్ష్య చేధనలో మెన్ ఇన్ బ్లూ 111 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, సఫారీ సూపర్ స్టార్ డేవిడ్ మిల్లర్ మధ్య వాగ్వదం చోటు చేసుకుంది.అసలేమి జరిగిందంటే?సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసేందుకు కెప్టెన్ సూర్యకుమార్ స్పిన్నర్ సుందర్ను ఎటాక్లోకి తీసుకొచ్చాడు. అయితే నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న డేవిడ్ మిల్లర్ క్రీజు వదిలి ముందుకు రావడంపై సుందర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అవుట్ఫీల్డ్ గ్రాస్ కాస్త తడిగా ఉండడంతో, పరుగు తీసేటప్పుడు జారిపోకుండా ఉండేందుకు మిల్లర్ క్రీజు లైన్ అంచున నిలబడ్డాడు.దీంతో బౌలింగ్ వేసే క్రమంలో సుందర్ మధ్యలోనే ఆగిపోయి, మిల్లర్ క్రీజు దాటుతున్నాడంటూ అంపైర్ క్రిస్ గఫానీకి ఫిర్యాదు చేశాడు. ఇది 'మన్కడింగ్' (రనౌట్)లా అన్పించింది. దీంతో మిల్లర్ అసహనం వ్యక్తం చేస్తూ ఏదో ఉన్నాడు. ఓవర్ ముగిసిన తర్వాత కూడా వారిద్దరి మధ్య మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.The zen masters lost it! Miller vs Sundar explodes 🤬Both are usually the calmest on the field, but this time even they couldn’t keep their cool 🔥 Backing up too far?#INDvsSA #CricketFever #T20WorldCup2026 #Cricket pic.twitter.com/OWStXaB1PY— Cricket Update (@sportshourly) February 23, 2026 మిల్లర్ నేరుగా సుందర్ వద్దకు వెళ్లి సీరియస్గా మాట్లాడు. అంపైర్లు వెంటనే జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్లో సుందర్ బంతితో పాటు బ్యాట్తో కూడా విఫలమయ్యాడు. ఈ ఓటమితో భారత్ తమ సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ కుంభకోణం.. అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ
తాత్కాలిక సుంకాలు 10 శాతం నుంచి 15 శాతానికి పెంపు... వెంటనే అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు చెల్లవ్... పన్ను విధింపు కాంగ్రెస్ అధికారం మాత్రమే... అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
చంద్రబాబుదే కల్తీ పాపం.. కల్తీ నెయ్యి సరఫరా జరిగింది, వినియోగించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బాబు సర్కారు దగా... ఉప ప్రణాళిక నిధుల్లో 27 వేల కోట్ల రూపాయలు కోత
హెరిటేజ్తో ఇందాపూర్ డెయిరీ బంధంపై అట్టుడికిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి
నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచల తీర్పు.. లొంగిపోవాల్సిందే..!
ఏపీలో వ్యవసాయం.. బాబు సర్కారులో అపాయం
ఆంధ్రప్రదేశ్లో శైవక్షేత్రాల్లో భక్తుల భద్రతను గాలికొదిలేసిన బాబు సర్కారు
పన్నుల బాదుడు, అప్పుల పద్దు తప్ప సంపద సృష్టి, సూపర్ సిక్స్ అమలు జాడలేని ఏపీ బడ్జెట్
బిజినెస్
రూ.7 కోట్ల ఫ్రాడ్లో ఇరుక్కున్న ఇంజినీరింగ్ విద్యార్థి
స్నేహితుడికి సాయం చేద్దామని బ్యాంక్ ఖాతా వివరాలు పంచుకున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి.. ఏకంగా రూ.7 కోట్ల సైబర్ మోసం కేసులో చిక్కుకున్నాడు. ఈ ఘటన బ్యాంకు ఖాతాల విషయంలో యువతకు పెద్ద హెచ్చరికగా మారింది. బ్యాంక్ ఖాతా వివరాలను నిర్లక్ష్యంగా పంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టం చేస్తోందిబెంగళూరులోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థికి ఆయుష్ అనే వ్యక్తితో దాదాపు ఏడాది కాలంగా స్నేహం ఉంది. 2025 నవంబర్లో ఆయుష్ బ్యాలెన్స్ లేకపోవడంతో తన బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని, తాత్కాలికంగా విద్యార్థి ఖాతాను ఉపయోగించుకుంటానని అభ్యర్థించాడు.స్నేహితుడిని పూర్తిగా నమ్మిన విద్యార్థి.. తన కర్ణాటక గ్రామీణ బ్యాంక్ (Karnataka Gramin Bank) ఖాతాకు లింక్ అయిన ఏటీఎం కార్డ్తో పాటు ఎయిర్టెల్ సిమ్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లతో సహా అన్ని యాక్సెస్ వివరాలను పంచుకున్నాడు. ఈ వివరాలను పోస్ట్ ద్వారా పంపగా.. అందుకున్నట్లు ఆయుష్ వాట్సాప్లో ధ్రువీకరించాడు కూడా.అయితే, కొన్ని నెలల తర్వాత షాకింగ్ నిజం బయటపడింది! బ్యాంకు అధికారులు సదరు విద్యార్థిని సంప్రదించి.. అతడి ఖాతా ద్వారా భారీ అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని తెలిపింది. దాదాపు రూ.7 కోట్లు ఈ ఖాతా ద్వారా బదిలీ అయినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల్లోనే ఈ మొత్తం లాండరింగ్ జరిగినట్లు సమాచారం.తన ఖాతా సైబర్ నేరస్థుల 'మ్యూల్ అకౌంట్'గా దుర్వినియోగం అయినట్లు తెలిసిన విద్యార్థి వెంటనే ఖాతాను బ్లాక్ చేయించాడు. అనంతరం నార్త్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆయుష్తో పాటు ఇతరులపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది ఓ హెచ్చరికే!స్నేహితులు అయినా.. బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్లు, ఓటీపీలు ఎవరితోనూ షేర్ చేయవద్దు. అత్యంత నమ్మకమైన వ్యక్తుల నుంచే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. బ్యాంక్ లేదా పోలీసులు అడిగినా.. ఫోన్లో ఇలాంటి వివరాలు ఇవ్వవద్దు. జాగ్రత్తలు తీసుకోండి.. సైబర్ మోసాల నుంచి దూరంగా ఉండండి!బ్యాంక్ అకౌంట్ దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలుఏటీఎం పిన్, సీవీవీ, ఓటీపీలు, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, ఖాతా వివరాలు స్నేహితులు/బంధువులు అయినా ఎవరికీ ఇవ్వవద్దు. బ్యాంకులు కూడా ఎప్పుడూ ఇలాంటివి ఫోన్ ద్వారా అడగవు."తాత్కాలికంగా ఖాతా ఉపయోగించుకోవాలి", "ఈజీ మనీ", "కమిషన్ ఇస్తాం", "జాబ్ ఫ్రమ్ హోమ్" అని ఎవరైనా అడిగితే నిరాకరించండి. ఇవి మనీ మ్యూల్ స్కామ్లే!స్ట్రాంగ్ పాస్వర్డ్ (అప్పర్+లోయర్+నంబర్+స్పెషల్) పెట్టుకోండి. దీన్ని రెగ్యులర్గా మారుస్తూ ఉండండి. ట్రాన్సాక్షన్ అలర్ట్స్ (SMS/ఈమెయిల్) ఆన్ చేసుకోండి. దీని వల్ల అనుమానాస్పద లావాదేవీలు వెంటనే తెలుస్తాయి.అన్నోన్ SMS/వాట్సాప్ లింకులు క్లిక్ చేయవద్దు. బ్యాంకు యాప్/వెబ్సైట్ నేరుగా టైప్ చేసి వెళ్లండి. పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ చేయవద్దు.ఖాతా స్టేట్మెంట్ తరచూ చెక్ చేయండి. అనుమానాస్పద ట్రాన్సాక్షన్ కనిపిస్తే వెంటనే బ్యాంకుకు, 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్లైన్) లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి.
ట్రంప్ సుంకాలు రేపటి నుంచి బంద్
అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాల (టారిఫ్స్)కు బ్రేక్ పడింది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని.. ఆ దేశ సుప్రీంకోర్టు సంచనల తీర్పునిచ్చింది. దీంతో టారిఫ్స్ వసూళ్లు రేపటి (మంగళవారం) నుంచి నిలిపివేస్తున్నట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారికంగా వెల్లడించింది.ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ (IEEPA) కింద విధించిన సుంకాలను, వసూలు చేయడాన్ని అమెరికా మంగళవారం ఉదయం 12:01 EST (0501 GMT) నుంచి నిలిపివేయనుంది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని US సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మూడు రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. దీంతో సంబంధిత కోడ్లు సాఫ్ట్వేర్ నుంచి డియాక్టివేట్ చేయనున్నారు.అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. ఎలాగైనా 15 శాతం సుంకాలను అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన ఆదేశాలు అధికారికంగా వెలువడలేదు. రేపటి నుంచే అమల్లోకి రానున్నట్లు సమాచారం. అయితే.. ఆదేశాలను ఎప్పుడు విడుదల చేయనున్నారు, వాటిని ఎప్పటి నుంచి అమలు చేయనున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.యూఎస్ సుప్రీంకోర్టు తీర్పుటారిఫ్లను విధించే అధికారం అధ్యక్షుడికి కానీ, వైట్హౌస్కు కానీ లేదని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వాణిజ్యం, పన్నులకు సంబంధించిన అంశాలపై పూర్తి అధికారం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉందని వెల్లడించింది. ఇప్పటి వరకూ వసూలు చేసిన వందల బిలియన్ డాలర్ల సుంకాలను.. దిగుమతి దారులకు తిరిగి ఇవ్వాల్సి రావొచ్చని కూడా సుప్రీం తెలిపింది.ట్రంప్ అసంతృప్తిగ్లోబల్ టారిఫ్ విధానాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తనను తీవ్ర నిరాశపరిచిందని ఆయన అన్నారు. అదేవిధంగా కొంతమంది న్యాయమూర్తులు విదేశీ శక్తుల ప్రభావానికి లోనయ్యారని ట్రంప్ ఆరోపించారు.ఇదీ చదవండి: 2026లో జీతాల పెరుగుదల.. ఈ రంగాల వారికే ఎక్కువ!
మ్యూచువల్ ఫండ్స్.. ‘న్యూ ఆఫర్స్’..
ఎల్ఐసీ ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్: సంప్రదాయ ఐటీ సర్వీసుల పరిధికి మించి విస్తరిస్తున్న టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల అవకాశాలను అందించే దిశగా ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా టెక్నాలజీ ఫండ్ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 6తో ముగుస్తుంది. సెమీకండక్టర్ ఆధారిత కంపెనీలు, డేటా సెంటర్ ఆపరేటర్లు, డిజిటల్ కామర్స్ ప్లాట్ఫాంలు, ఇంటర్నెట్ బిజినెస్లు, వర్ధమాన టెక్నాలజీ సంస్థలు సహా సాంకేతికతతో ముడిపడి ఉన్న వివిధ రంగాల సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి బీఎస్ఈ టెక్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ రూపంలోనైతే వ్యవధిని బట్టి రూ.100 నుంచి కట్టొచ్చు. కరణ్ దోషి, జైప్రకాశ్ తోషి్నవాల్ దీనికి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ‘బరోడా బీఎన్పీ’ ఈఎస్జీ స్ట్రాటజీ ఫండ్ పర్యావరణహితంగా వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బరోడా బీఎన్పీ పారిబా మ్యుచువల్ ఫండ్ తాజాగా ఈఎస్జీ బెస్ట్–ఇన్–క్లాస్ స్ట్రాటెజీ ఫండ్ని ఆవిష్కరించింది. దీనికి నిఫ్టీ100 ఈఎస్జీ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. సెబీలో నమోదు చేసుకున్న రేటింగ్ కంపెనీలు ఇచ్చే ఈఎస్జీ రేటింగ్స్, అలాగే, కంపెనీ అంతర్గతంగా నిర్వహించే ఫండమెంటల్ రీసెర్చ్, అనాలిసిస్ ఆధారంగా ఎంపిక చేసిన సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టే విధంగా ఈ ఫండ్ ఉంటుంది. గడిచిన పదేళ్లలో ఏడేళ్ల పాటు నిఫ్టీ 100 టీఆర్ఐకి మించి నిఫ్టీ 100 ఈఎస్జీ టీఆర్ఐ మెరుగైన పనితీరు కనపర్చిందని సంస్థ సీఈవో సంజయ్ గ్రోవర్ తెలిపారు. బజాజ్ లైఫ్ బీఎస్ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ జీవిత బీమా సంస్థ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా బీఎస్ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 15 వరకు ఈ న్యూ ఫండ్ ఆఫర్లో (ఎన్ఎఫ్వో) ఇన్వెస్ట్ చేయొచ్చు. స్థిరంగా ఆదాయాలు ఆర్జిస్తూ, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న దేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. కంపెనీకి చెందిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలైన (యులిప్స్) బజాజ్ లైఫ్ స్మార్ట్ వెల్త్ గోల్, బజాజ్ లైఫ్ సుప్రీం, బజాజ్ లైఫ్ గెయిన్లతో దీన్ని తీసుకోవచ్చు. ఇటు జీవిత బీమా కవరేజీని పొందుతూనే అటు దీర్ఘకాలంలో సంపదను కూడా పంచుకునేలా ఇది రెండిందాల ప్రయోజనాలు అందిస్తుందని కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు.వెల్త్ కంపెనీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఈక్విటీ, డెట్ సాధనాల్లో క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని పెంచుకునే అవకాశం కల్పించేలా ది వెల్త్ కంపెనీ మ్యుచువల్ ఫండ్ ..తాజాగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 10న ముగుస్తుంది. మార్కెట్ పరిస్థితులు, వేల్యుయేషన్లు, రిస్క్ ఇండికేటర్లను బట్టి ఈక్విటీ, డెట్ సాధనాల మధ్య పెట్టుబడులను సర్దుబాటు చేస్తూ మెరుగైన రాబడులు అందించడంపై ఇది దృష్టి పెడుతుంది. కనీసం 65 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సాధనాల్లోనూ, 35 శాతం భాగాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి క్రిసిల్ హైబ్రిడ్ 50+50 మోడరేట్ ఇండెక్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది.
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 479.95 పాయింట్ల లాభంతో 83,294.66 వద్ద, నిఫ్టీ 132.70 పాయింట్ల లాభంతో 25,703.95 వద్ద నిలిచాయి.అక్మే ఫిన్ట్రేడ్ (ఇండియా) లిమిటెడ్, మోర్పెన్ లాబొరేటరీస్ లిమిటెడ్, అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, డీఈఈ డెవలప్మెంట్ ఇంజనీర్స్ లిమిటెడ్, ఇండో టెక్ ట్రాన్స్ఫార్మర్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, యూపీఎల్ లిమిటెడ్, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్, ఈ2ఈ నెట్వర్క్స్ లిమిటెడ్, 63 మూన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
ఫ్యామిలీ
కథాకళి: మేడమెట్లు
‘డిటెక్టివ్ పెద్దబ్బాయి’ అనే బోర్డ్ ఉన్న ఇంట్లో ఆయన తన అసిస్టెంట్ చిన్నబ్బాయితో పేకాడుతున్నాడు.‘‘రెండో డైమండ్ ఆసు బల్ల మీదకి ఎలా వచ్చింది సార్?’’ చిన్నబ్బాయి కోపంగా అడిగాడు.‘‘మోటివ్ నీకు తెలుసు. గెలిస్తే వెయ్యి రూపాయలు. ఎలా వచ్చాయో పరిశోధన చేసి కనుక్కోవాల్సిన బాధ్యత నీదే.’’ పెద్దబ్బాయి నవ్వుతూ చెప్పాడు.‘‘మీరు డిటెక్టివ్గా, నేను అసిస్టెంట్ డిటెక్టివ్గా ఒకరి కలంలోంచి పుట్టిన పాత్రలం. మన సృష్టికర్త ప్రతీ కేస్ని మీరే పరిశోధించేలా రాస్తున్నారు. కాబట్టి అది మీ పని.’’పెద్దబ్బాయి మొబైల్ మోగింది. అతను ఎవరి నుంచో చూసి ఆన్సర్ చేశాడు.‘‘ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయిని. దయచేసి ఈ ఎడ్రస్కి రాగలరా?’’ ‘‘ఎందుకు?’’అవతలివైపు నుంచి చెప్పింది విని చెప్పాడు.‘‘సరే. లొకేషన్ పంపించండి. వెంటనే బయలుదేరుతాం.’’లైన్ కట్ చేశాక తన వంక ప్రశ్నార్థకంగా చూసే తన అసిస్టెంట్తో డిటెక్టివ్ పెద్దబ్బాయి చెప్పాడు.‘‘ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి. హత్య. డూప్లెక్స్ ఇంట్లో మెట్ల మీంచి కిందపడి ఒకరు మరణించారు.’’‘‘ప్రతి మరణం హత్య కానవసరం లేదు.’’ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘మనం ఇంతదాకా పరిశోధించిన ఏ కేస్ అయినా హత్య కాకుండా పోయిందా?’’పెద్దబ్బాయి లేచి షెర్లాక్ హోమ్స్ పైప్ని నోట్లో ఉంచుకుని, ఆయన పెట్టుకునేలాంటి టోపీని పెట్టుకున్నాడు. ఇద్దరూ బయటికి వచ్చారు. బీఎండబ్ల్యూ కారు ఎక్కాక చిన్నబ్బాయి డ్రైవ్ చేస్తూ చెప్పాడు.‘‘థ్రిల్, సస్పెన్ ్స పేరిట మన సృష్టికర్త మనల్ని ఎన్ని బాధలు పెడుతున్నాడు! నా నెత్తి మీద రివాల్వర్ పిడితో విలన్లు ఎన్నిసార్లు బాదారో. నేను నిజం మనిషినైతే ఎప్పుడో చచ్చేవాడిని. లేదా పిచ్చెక్కేది. ఇవాళ్టి కేస్లో అలాంటిది కాని, మారువేషాలు కాని ఉండవని ఆశిస్తాను. పెట్టుడు గడ్డం జిగురు భయంకరమైన దురదని పుట్టిస్తుంది.’’వారి కారు ఓ డూప్లెక్స్ ఇంటికి చేరుకుంది. బయట పోలీస్ కార్లు ఉన్నాయి.పెద్దబ్బాయిని చూసి పోలీస్ కాన్ స్టబుల్ సెల్యూట్ చేసాడు. ఇద్దరూ లోపలికి నడిచారు. ఇద్దరూ శవాన్ని చూశారు.‘‘ఆయనకి రేచీకటి. మెట్ల మీంచి కాలుజారి పడ్డాడు. అయినా మీ అభిప్రాయం తెలుసుకుందామని రమ్మన్నాను.’’ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి చెప్పాడు.‘‘ఇది హత్య.’’ పెద్దబ్బాయి పైప్ గుప్పుగుప్పున పీలుస్తూ చెప్పాడు.‘‘ఎలా కనుక్కున్నారు?’’‘‘సింపుల్. ఇంతదాకా మేము ఎన్నడైనా ‘ఇది హత్య కాదు. ప్రమాదకర మరణం’ అని వెనక్కి తిరిగామా? హత్య అయితేనే మన పాత్రలకి ప్రయోజనం.’’ చిన్నబ్బాయి వివరించాడు.హతుడి వయసు అరవై పైనే ఉండొచ్చు. బట్టతల. సరిగ్గా తల మధ్యలో అయిన పెద్ద గాయం నుంచి రక్తం కారుతోంది. పైన నాలుగో మెట్టు మీంచి కింది మెట్టు దాకా కారిన రక్తపు చుక్కలు కనిపించాయి.‘‘ఇతను సంపన్నుడు. ఇతని వారసుల గురించి వాకబు చేశారా?’’ పెద్దబ్బాయి అడిగాడు.ఇన్స్పెక్టర్ సైగ చేస్తే సర్వెంట్ మెయిడ్ చెప్పింది.‘‘ఈరికి మనవడు తప్ప ఇంకెవరూ లేరు. కరోనాలో అంతా పోయారు. ఇందాక ఫోన్ చేస్తే ఆయన ఆన్సర్ చెయ్యలేదు.’’‘‘ఇవాళ అతను ఇక్కడికి వచ్చి వెళ్ళాడా?’’‘‘ఇవాళ మంగళవారం. ఇక్కడ రైతు బజార్ నుంచి కూరలబండి వస్తుంది. నేను కూరలకి వెళ్ళి వచ్చినప్పుడు వచ్చాడేమో తెలీదు. నేను తిరిగి రాగానే ఈయన ఇలా నేల మీద...’’ ఏడుపు వల్ల ఆవిడ మిగిలిన వాక్యాన్ని పూర్తి చేయలేదు.‘‘ఆ వారసుడి దగ్గర ఈ ఇంటి డూప్లికేట్ తాళంచెవి ఉందా?’’‘‘ఉంది.’’పెద్దబ్బాయి అతని నంబర్ అడిగి ఫోన్ చేశాడు.‘‘నా పేరు పెద్దబ్బాయి. డిటెక్టివ్ని. మీ తాతగారిని ఎవరో చంపారు.’’‘‘అరెరే. ఏమైంది?’’ అవతల నుంచి మనవడు ఆదుర్దాగా అడిగాడు.‘‘తల మీద గాయమై మరణించారు. అది హత్య. మీరు వెంటనే రండి.’’‘‘అది హత్య అని ఎందుకు అనుకుంటున్నారు?’’‘‘మీరు హంతకుడు కాబట్టి. ప్రతి కథలోనూ డిటెక్టివ్ ఎవరు హంతకుడో ఇట్టే కనుక్కుంటాడు.’’‘‘మా తాతయ్యకి రేచీకటి. మెట్లు దిగుతూ కాలుజారి మరణించి ఉండచ్చు.’’‘‘రాగానే ఆ హంతకుడిని అరెస్ట్ చేయండి.’’ పెద్దబ్బాయి ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయికి చెప్పాడు.‘‘అది మీరు గంభీరంగా ఓసారి పైప్ని తీసి దానివంక చూసి చెప్పాలి. అతనే హంతకుడనే ఆధారం ఏమిటి?’’ బుల్లెబ్బాయి అడిగాడు.‘‘అతనికి ఎవరూ అతని తాత ఎలా మరణించారో చెప్పలేదు. అయినా మెట్ల మీంచి జారిపడ్డాడని తెలిసిందంటే అతనే హంతకుడు. ఎవరైనా ఆస్తిని వీలైనంత త్వరగా అనుభవించాలని అనుకుంటారు. అందుకే ఈ దురాగతం చేశాడు.’’ఇంటికి వెళ్ళాక మళ్ళీ పేకాటకి కూర్చున్న చిన్నబ్బాయి చెప్పాడు.‘‘నాకు తెలీలేదు. మీరు నా బాస్ కాబట్టి ఈ బల్ల మీదకి రెండు డైమండ్ ఆసులు ఎలా వచ్చాయో మీరే కనుక్కోవాలి.’’ ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి
ఆటోలో పూలు బదులు..చెవిపోగులు..!
కొన్ని పనులు చూసేందుకు చిన్నగా ఉన్నా.. అందరి హృదయాలను దోచుకుంటుంది. కాస్త మనసుపెడితే..పెద్దపనులతోనే మన ప్రేమను వ్యక్తం చేయాల్సిన పనిలేదు. చాలా చిన్నపాటి వాటితో కూడా అనంతమైన ప్రేమను చాలా సునిశితంగా వ్యక్తం చేయొచ్చు. అందుకు ఈ ఆటో డ్రైవరే నిదర్శనం. బెంగళూరులోని ఒక ఆటో డ్రైవర్ తన ఆటోలో వేలాడిదీసిన చెవిపోగులు కారణంగా ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అవి ఆయన భార్య చెవిపోగులు. రోజంతా ఆమెతో ఉన్నట్లుగా ఫీలయ్యేలా ఆటోలో అద్దానికి వేలాడదీయడంతో అవి ప్రతి ఒక్కర్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి. నిజానికి చాలామంది ఆ అద్దం ముందు పూలు వంటి ఇతర డెకరేటెడ్ ఐటెమ్స్ పెట్టుకుంటారు. భార్య గుర్తొచ్చేలా..ప్రతి నిమిషం ఆమెతో ఉన్నట్లుగా ఎదురుగా అలా వేలాడదీయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రేమను వ్యక్తపరుస్తారు. స్వచ్ఛమైన ప్రేమ మాత్రం చాలా అద్భుతంగా బయటపడుతుంది అనేందుకు ఈ ఆటోడ్రైవర్ చేసిన పనే ఉదాహరణ. సింపుల్గా చెప్పాలంటే అతడి ప్రేమ చూస్తే..మనుషులెరగలేరు మాములు ప్రేకాదు..అగ్నికంటే స్వచ్ఛమైనది..అనే పాట గుర్తొస్తోంది కదూ..! నెటిజన్లు సైతం సదరు డైవర్పై ప్రశంసలు కురిపిస్తు పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sula (@marilyn.sultana.akand) (చదవండి: ఆ అమ్మకు దక్కిన వెలకట్టలేని గొప్ప అనుభూతి..!
ఆ అమ్మకు దక్కిన వెలకట్టలేని గొప్ప అనుభూతి..!
ఏ తల్లిదండ్రులు పిల్లల నుంచి పెద్దగా ఏమి ఆశించారు. పిల్లల క్షేమమే సదా ఆ కాక్షించే ఆ పేరెంట్స్ రుణం ఏమిచ్చినా..తీర్చుకోలేం. వాళ్ల ప్రేమ అనంతం, అజరామరం. వాళ్లకు ఎంతో ఇష్టమైన పని, లేదా వాళ్ల లైఫ్ డ్రీమ్ని నెరవేరిస్తే..ఏ పిల్లలకైనా అంతకు మించిన గొప్ప విజయం మరొకటు ఉండదు. అలాంటి గొప్ప సక్సెస్ని సాధించాడు ఈ కొడుకు. తన అమ్మకు ఎంత గొప్ప అనుభూతిని ఇచ్చాడో తెలిస్తే..హృదయం ద్రవించిపోతుంది. ఏ తల్లైన ఇంతకుమించి ఇంకేం కోరుకుంటుంది పిల్లల నుంచి అనిపిస్తుంది కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మనీష్ అనే వ్యక్తి విమానం ఎక్కడం అనేది తనతల్లి చిరకాల కోరిక అని. అది ఈ రోజు నెరవేరబోతుందంటూ..తల్లి కొడుకులిద్దరూ విమానం ఎక్కుతున్న దగ్గర నుంచి లోపల కూర్చొని విండోని వీక్షిస్తున్న ప్రతీది వివరంగా చూపించాడు. తన తల్లి మొత్తం కుటుంబంలోనే విమానం ఎక్కిన ఏకైక మహిళ అని భావోద్వేగంగా అన్నాడు. ఆమె కూడా తన కొడుకుతో విమానం ఎక్కుతూ భావోద్వేగంగా చుట్టూ పరికిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి వీడియోలో. ఆమె ఆ ఫ్టైట్లో భోజనం తింటూ సిగ్గుపడుతున్న క్షణాలు, కొడుకుని చూస్తూ..తన కల నెరవేర్చినందుకు కన్నీళ్లు పెట్టుకున్న కమనీయ దృశ్యాలు చూస్తుంటే ఒక్కసారిగా ఏ తల్లిందడ్రులైనా..ఇంతకు మించి పిల్లల నుంచి ఏమి ఆశించరేమో అనిపిస్తుంది. View this post on Instagram A post shared by MK (@manishh_mk_) (చదవండి: బ్యాండ్ లేదు.. బరాత్ లేదు..సింపుల్గా పెళ్లిచేసుకున్న ఐఏఎస్ జంట)
నేడు ప్రపంచ కవలల దినోత్సవం
అనంతపురం కల్చరల్/గుత్తి రూరల్: ఒకే పోలిక.. ఒకే డ్రెస్. అచ్చం ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే! జిరాక్స్ టూ జిరాక్స్... ఇలా చెప్పుకుంటూ పోతే కవలల గురించి ఎన్నో అంశాల్ని పోల్చి చెప్పినా తక్కువే అవుతుంది. తల్లిగర్భంలో ఒకేసారి, ఒకే రూపంతో మొదలై.. క్షణాల వ్యవధిలో బయటి ప్రపంచానికి పరిచయమై.. ఒకే ముఖకవళికలతో అందరినీ అమితంగా ఆకట్టుకోవడం కవలల ప్రత్యేకత. ముద్దులొలికే పసికందులను చూడగానే వారి పేర్లను కూడా దరిదాపు ఒకేలా పెట్టేయడం పరిపాటిగా మారింది. రామయ్య.. లక్ష్మయ్య, రమేష్.. నరేష్ జలజ.. శైలజ లాంటి పేర్లతోనూ తికమక పట్టించేస్తుంటారు. ప్రపంచ కవలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సైన్స్ ఏమి చెబుతోందంటే.. సృష్టి లోని ఎన్నో వింతలు, అద్భుతాల్లో కవలల జననం కూడా ఒకటిగా ఉంటోంది. బాగా తెలిసిన వారు సైతం కవలలను ఎవరెవరో పోల్చుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఫలదీకరణ సమయంలో వచ్చే మార్పుల కారణంగా కవలల జననం సంభవిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రత్యుత్పత్తి ప్రక్రియలో అండం ఏర్పడిన తర్వాత శుక్రకణం రెండుగా విడిపోయి జని్మంచిన కవలలను మోనోజైగోటిక్ లేదా యూని ఓవిలార్ ట్విన్స్ అంటారు. వీరిలో ఇద్దరూ ఆడ లేదా, మగ అయి ఉంటారు. వీరికి చాలా దగ్గర పోలికలుంటాయి. రెండు శుక్ర కణాలు ఏర్పడి జని్మంచే కవలలను ‘డై జైగోటిక్ లేదా బైనోవిలార్ ట్విన్స్ అంటారు. వీరిలో ఒకరు ఆడ, మరొకరు మగ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కవలల దినోత్సవ ఆవిర్భావమిలా.. ప్రథమంగా కవలల దినోత్సవాన్ని పోలెండు దేశస్థులు 1976లో నిర్వహించారు. మోజెస్, విల్కాక్స్ అనే కవల సోదరులు తాము నిసిస్తున్న ఊరికి ‘ట్విన్స్ బర్గ్’ అని పేరుపెట్టుకున్నారు. కవలలనే పెండ్లాడి, మళ్లీ కవలలకే జన్మనిచ్చారు. దురదృష్టమైన విషయమేమంటే ఒకే రకమైన వ్యాధి సోకి వారిద్దరూ ఒకే రోజు మరణించారు. వీరి గుర్తుగా ప్రతి ఫిబ్రవరి 22న అంతర్జాతీయ కవలల దినం జరపడం పరిపాటిగా మారింది. అభిరుచులు ఒక్కటే అనంతపురం నగరానికి చెందిన మల్లికార్జునరెడ్డి, రాధ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఓ బాబు తర్వాత 2012లో కవలలు జన్మించారు. సాయి సహస్ర, సాయి సమన్వి అని పేర్లు పెట్టారు. పెరుగుతున్న కొద్దీ కాసింత పోలికలు వేరైనా అభిరుచులు, ఇష్టాలు మాత్రం ఒక్కటేనని తల్లిదండ్రులు అంటున్నారు. ఇద్దరూ మొండిఘటాలే తాడిపత్రి పట్టణానికి చెందిన షేక్ నాజియా, షేక్ బాబాఫకృద్ధీన్ దంపతుల పిల్లలు మన్నత్ అఫ్రా, మన్నత్ అష్మరాను చూస్తే ఎవరు ఎవరో గుర్తు పట్టడం చాలా కష్టం. ఇద్దరూ మొంటి ఘటాలే. డ్రస్సులు, ఆభరణాలు ఏదీ కొన్నా ఇద్దరికీ ఒకేలా ఉండాలి. భోజనం, అల్పాహారం కూడా సేమ్ టు సేమ్ ఉండాలి. లేకపోతే గొడవ చేసేస్తారు. ఇద్దరూ ఒకేసారి అస్వస్థతకు గురవుతుంటారు. ఏ పని చేసినా ఇద్దరు ఒకేలా చేస్తారు.పెరుగుతున్న కొద్దీ మార్పులొచ్చాయిఅనంతపురానికి చెందిన మెహబూబా, అబ్ధుల్ షమీ దంపతుల కుమారులు మహమ్మద్ అజ్మల్, మహమ్మద్ అక్మల్ చిన్నప్పుడు బాగా దగ్గరి పోలికలుండడంతో గుర్తు పట్టడం కష్టమయ్యేది. పెరుగుతున్న కొద్ది కాసింత గుర్తు పట్టేలా మారిపోయారు. ఆటల్లో అక్మల్, అందరినీ ఆట పట్టించడంలో అజ్మల్ చురుగ్గా ఉంటారు. అయితే ఆలోచనల్లో మాత్రం ఇద్దరూ ఒకేలా ఉంటారని తల్లిదండ్రులంటున్నారు.
అంతర్జాతీయం
యూఎస్ పట్టభద్రుల్లో హిందువులే ఎక్కువ
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు, పట్టభద్రులు ఏ మతస్థులో తెలుసా? అందరూ అనుకుంటున్నట్లు క్రైస్తవులు కాదు. హిందువులే అగ్రస్థానంలో ఉన్నారు. వాషింగ్టన్కు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజాగా ఈ విషయం వెల్లడించింది. నాలుగేళ్ల కాలేజీ డిగ్రీ పూర్తిచేసిన పట్టభద్రులు ఏ మతానికి చెందిన వారన్న దానిపై 2023–24 రిలీజియస్ ల్యాండ్స్కేప్ స్టడీ (ఆర్ఎల్ఎస్) పేరిట ఈ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసింది. ఉన్నత విద్యావంతుల్లో అగ్రస్థానంలో హిందువులు, ఆ తర్వాతి స్థానంలో యూదులున్నట్లు తన నివేదికలో పేర్కొంది. → అమెరికాలో ప్రతి 10 మంది హిందువుల్లో కనీసం ఏడుగురు బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఉన్నత విద్య అభ్యసించారు. అంటే 70 శాతం శాతం మంది ఉన్నత విద్యావంతులే. యూదుల్లో ఈ సంఖ్య 65 శాతం. → స్థానిక అమెరికన్లలో కేవలం 35 శాతం మంది ఉన్నత విద్య అభ్యసించారు. → ఇతర మతస్థులు సగటు కంటే కొద్దిగా పైస్థానంలో నిలిచారు. వీరిలో ముస్లింలు, బౌద్ధులు, ఆర్థోడాక్స్ క్రైస్తవులున్నారు. ఆయా మతస్థుల్లో ప్రతి పది మందిలో కనీసం నలుగురు బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేశారు. ప్రొటెస్టంట్ క్రైస్తవులు కూడా ఈ జాబితాలో నిలిచారు. → ఎవెలాంజికల్ ప్రొటెస్టంట్లు, క్యాథలిక్స్ సగటు కంటే దిగువ స్థాయిలో ఉన్నారు. వీరు చాలావరకు నల్లజాతివారే. → మొత్తం స్థానిక అమెరికా జనాభాలో పరిశీలిస్తే ప్రతి పది మందిలో నలుగురు మాత్రమే బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించారు. → అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం విషయంలో మతాల మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. → వలసలు, తద్వారా స్థానిక జనాభా స్థితిగతుల్లో మార్పులు రావడమే ఈ వ్యత్యాసాలకు కారణమని ప్యూ రీసెర్చ్ సెంటర్ తమ నివేదికలో అభిప్రాయపడింది. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు చాలావరకు ఇతర దేశాల అమెరికాకు వలసవచి్చనవారే కావడం గమనార్హం. వీరు ఉన్నత విద్య లేదా ఉద్యోగాల కోసం, జీవనోపాధి కోసం వచ్చారు. → అమెరికాలో ఉద్యోగాల కోసం భారతీయులు అధికంగా తరలివస్తున్నారు. ఇందుకు హెచ్–1బీ వీసాలు వారికి తోడ్పడుతున్నాయి. ఈ వీసాలో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది భారతీయులే కావడం గమనార్హం. అమెరికాలో టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలను భారతీయులు ప్రభావితం చేస్తున్నారు.
ట్రంప్ నివాసంలోకి చొరబాటుకు యత్నం.. సిబ్బంది కాల్పులు
ఫ్లోరిడాలోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసం మార్-ఎ-లాగో వెలుపల కాల్పులు జరిగాయి. ఆయుధంతో లోపలికి చొరబడడానికి ఓ దుండగుడు యత్నించగా అతనిపై సీక్రెట్ ఏజెంట్ కాల్పులు జరిపారు. అతనికి గాయాలపై అక్కడే కుప్పకూలారు. కాల్పులకు యత్నించిన సదరు దుండగుడు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు.ఈ ఘటన అనంతరం అధ్యక్షుడి నివాసం ఎదుట భద్రత కట్టుదిట్టం చేశారు. ట్రంప్ నివాస ప్రాంతం మార్-ఎ-లాగో పరిసరాలను FBI అదుపులోకి తీసుకుంది. దాడి నేపథ్యంలో ఫామ్ బీచ్ ప్రాంతంలో రాకపోకలను తాత్కాలికంగా అధికారులు నిలిపివేసారు. అయితే అధ్యక్షుడు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని తెలిపారు. అయితే ట్రంప్ నివాసంలోకి ఆ దుండగుడు ఎందుకు చొరబడటానికి యత్నించాడనే కారణాలు తెలియాల్సి ఉంది.
ట్రంప్నకు షాకిచ్చిన అమెరికన్లు?..సర్వేలో ఏముందంటే..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా గ్రేట్ ఎగేన్ అంటూ నానా హాడావిడీ చేస్తూ.. అధిక పన్నులు పెంచుతూ ఇలా పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలని ఇబ్బందులకు గురిచేశారు. అయితే తాజాగా ఆయన నిర్ణయాలపై అమెరికాలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిపిన సర్వేలలో 60 శాతం అమెరికన్లు ట్రంప్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దెబ్బమీద దెబ్బ తాకుతుంది. ఇటీవల ఆయన పలు దేశాలపై విధించిన అధిక పన్నులు చెల్లవని అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు నిర్ణయంపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు మరో షాక్ తగిలింది. అక్కడి ప్రముఖ మీడియా సంస్థలైన ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్, ఐపీవోస్ నిర్వహించిన సర్వేలలో ప్రతి ముగ్గురు అమెరికన్లు ఆయన పాలనపై వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం విషయంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆయనకు వ్యతిరేకంగా ఉండగా, ఇతర దేశాలతో సంబంధాల విషయంలో 62 శాతం ప్రజలు ఆయన పాలనను నిరాకరిస్తున్నారు. అదే సమయంలో ఇటు పన్నుల విషయంలో పది మందిలో ఆరుగురు ఆయన విధానాలను నిరాకరిస్తున్నట్లు సర్వేలో అవగతమైంది. మెుత్తంగా ట్రంప్ పాలన పట్ల 60 శాతం ప్రజలు వ్యతిరేకతతో ఉండగా.. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికా పరిస్థితులు మరింత దిగజారాయని దాదాపు 50 శాతం మంది అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్నవారి అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీ డెమోక్రట్ల నేతలపై సైతం అక్కడి ప్రజలు విశ్వసనీయతతో లేరు. ఓవరాల్ గా ట్రంప్ కు 33 శాతం, డెమోక్రట్స్ కి 31శాతం, ఇతరులకు 31శాతం మంది మెుగ్గుచూపారు.
‘మూన్ మిషన్’కు బ్రేక్..‘నాసా’ కీలక ప్రకటన
వాషింగ్టన్: అంతరిక్ష పరిశోధనల్లో అగ్రరాజ్యం అమెరికాకు అవాంతరం ఎదురయ్యింది. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత మానవుణ్ని తిరిగి చంద్రుడి చెంతకు చేర్చాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. మార్చి నెలలో జరగాల్సిన ఈ ప్రయోగాన్ని ప్రస్తుతానికి విరమించుకుంటున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్మన్ ప్రకటించారు.స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) రాకెట్లోని హీలియం ప్రవాహ వ్యవస్థలో (Helium Flow) తలెత్తిన లోపాన్ని గుర్తించిన నిపుణులు.. మార్చి నెలలో అందుబాటులో ఉన్న ‘లాంచ్ విండో’ లోపు దాన్ని సరిదిద్దడం అసాధ్యమని తేల్చిచెప్పారు. దీంతో ఈ కీలక ప్రయోగం మరింత ఆలస్యం కానుంది. ఈ పరిణామంపై స్పందించిన జారెడ్ ఐజాక్మన్.. ఈ వాయిదా శాస్త్రవేత్తలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష ప్రేమికులను నిరాశకు గురిచేస్తున్నదని అన్నారు.అయితే 1960వ దశకంలో అసాధ్యమనుకున్న అంశాలను నాసా తన పరిశోధనలతో సుసాధ్యం చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్పై ఉన్న భారీ ఎస్ఎల్ఎస్ రాకెట్తో పాటు ఓరియన్ వ్యోమనౌకను తిరిగి వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్కు (వీఏబీ) తరలించి, పరిశీలన జరపనున్నారు. ఈ సాంకేతిక సమస్యపై పూర్తిస్థాయి వివరాలను వెల్లడించేందుకు నాసా త్వరలోనే ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.ముగ్గురు అమెరికన్లు, ఒక కెనడియన్ వ్యోమగామితో తలపెట్టిన ఈ 10 రోజుల యాత్ర, భవిష్యత్తులో చంద్రుడిపై మానవ ఆవాసాల ఏర్పాటుకు అత్యంత కీలకంగా మారనుంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సాగుతున్న ఈ మిషన్, చైనా నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఫిబ్రవరిలో వెట్ డ్రెస్ రిహార్సల్ జరిగింది. ఈ సమయంలో ద్రవ హైడ్రోజన్ లీకేజీ వంటి సమస్యలు తలెత్తినప్పటికీ, ఇటీవలే విజయవంతంగా పరీక్షలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ తాజా లోపం వెలుగు చూసింది. కేవలం చంద్రుడే కాకుండా, భవిష్యత్తులో అంగారక గ్రహం (Mars) పైకి మానవ సహిత యాత్రలు చేపట్టేందుకు ఈ ఆర్టెమిస్ ప్రయోగాలు పునాదిగా నిలవనున్నాయి.ఇది కూడా చదవండి: ‘టూ వీక్ రూల్’: ప్రాణాలను కాపాడే 14 రోజుల సూత్రం!
జాతీయం
Kerala: భారీ శబ్ధాలతో మూడు బస్సులు దగ్ధం
తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలోని చెంకోట్టుకోణం ప్రాంతంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి త్రివేండ్రం స్కాటిష్ స్కూల్లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలో నిలిపి ఉంచిన మూడు బస్సులు మంటలకు ఆహుతి కాగా, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతతో మరో వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది.తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో వాహనాల నుంచి పెద్ద శబ్ధాలతో పాటు మంటలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. కజకూట్టం, చాకై ఫైర్ స్టేషన్ల నుంచి అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని, రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనపై కజకూట్టం అగ్నిమాపక కేంద్ర అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో రెండు పాఠశాల బస్సులతో పాటు ఒక ట్రావెలర్ వాహనం పూర్తిగా కాలిబూడిదయ్యింది.ఈ ఘటనకు గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా బస్సులకు ఎదురుగా పార్క్ చేసి ఉండాల్సిన ట్రావెలర్ వాహనం, ప్రమాదం జరిగిన సమయంలో బస్సుల వైపునకు కదిలి ఉండటాన్ని అక్కడి సిబ్బంది గుర్తించారు. ఎవరో కావాలనే ఆ వాహనాన్ని నెట్టి ఉండవచ్చని, మంటలు కూడా ఆ ట్రావెలర్ నుంచే ప్రారంభమైనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.ఇది కూడా చదవండి: Nepal: నదిలో పడిన బస్సు.. 18 మంది మృతి
భర్తను కోల్పోయిన మహిళకు పోలీసు అధికారి వేధింపులు!
శివమొగ్గ(కర్ణాటక): భర్త ఆత్మహత్య చేసుకుని దుఃఖంలో ఉన్న యువతిని పోలీసు వేధించడంతో ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. వారం రోజులకే దంపతులు పరలోకానికి చేరారు. ఈ విషాదం శివమొగ్గ జిల్లాలోని భద్రావతి నగరంలోని హోస సిద్ధాపురలో జరిగింది. వివరాలు.. స్వాతి (26), పోలీసు శాఖ ఆఫీసులో డీ–గ్రేడ్ ఉద్యోగి అయిన జగదీష్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జగదీష్ శివరాత్రి రోజున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రావతిలోని న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం అతని భార్య స్వాతి కూడా ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. అంతకుముందు స్వాతి తన తల్లికి వాట్సాప్ సందేశం పంపింది, తీర్థహళ్లి తాలూకాలోని మలూరు ఠాణాకు చెందిన ఓ పోలీసు అధికారి నీ భర్త మరణానికి నువ్వే కారణమని బెదిరించాడని, పలు రకాలుగా ఒత్తిడి చేశాడని వాపోయింది. ఇది జిల్లాలో చర్చనీయాంశమైంది. తన కూతురి మృతిపై విచారణ జరిపి కారకులను శిక్షించాలని ఆమె తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అల్లుని ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు
మండ్య( కర్ణాటక): యువతి ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆమె తండ్రి రౌద్రరూప దాల్చాడు, అల్లుని ఇంటికి నిప్పంటించిన సంఘటన మండ్య తాలూకాలోని చుంచగహళ్లి గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. అదే గ్రామంలో ఒకే వీధిలో నివసించే చెందిన వినోద్, కావ్య ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం. కానీ యువతి తండ్రి చన్నేగౌడకు ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదు. నవంబర్ 19న ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని దగ్గర్లోనే ఓ చోట కాపురం పెట్టారు. డబ్బు, బంగారం బూడిద.. కుమార్తె, అల్లుడు ఏ ఇంటిలో ఉన్నారో తెలుసుకున్న మామ చన్నేగౌడ శనివారం ఉదయం వెళ్లి ఇంటిలోకి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో దంపతులు లేరు. మంటలు వ్యాపించి, ఇంట్లో ఉన్న వస్తువులు, ఫరి్నచర్, టీవీ తదితరాలు కాలిపోయాయి. ఇల్లు పూర్తిగా దెబ్బతినింది. ఇంట్లోని రూ.10 లక్షల నగదు, 250 గ్రాముల బంగారం కూడా కాలిపోయినట్లు వినోద్ కుటుంబీకులు విలపించారు. ఈ సమయంలో చన్నేగౌడ కూడా గాయపడ్డాడు, అతనిని చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు, క్లూస్ టీం చేరుకుని ఆధారాలను సేకరించారు. డీఎస్పీ యశ్వంత్ కుమార్, సీఐ నవీన్ కేసు నమోదు చేశారు. భార్యాభర్తలను మద్దూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత యువతి కుటుంబం గ్రామం వదిలి వెళ్లిపోయింది.
మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
కోల్కతా: భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నేత, మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ముకుల్ రాయ్ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, సోమవారం తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో కోల్కతాలోని సాల్ట్ లేక్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు శుభ్రాంషు రాయ్ మీడియాకు తెలిపారు.గడచిన రెండు, మూడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముకుల్ రాయ్ మృతిపై పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్ రాయ్, యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో కేంద్ర షిప్పింగ్, రైల్వే శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, మమతా బెనర్జీ వెన్నంటి ఉండి టీఎంసీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు.అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 నుండి 2021 వరకు భారతీయ జనతా పార్టీలో కొనసాగిన ఆయన, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల అనంతరం తిరిగి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీ గూటికి చేరారు. ఈ ఫిరాయింపు అంశంపై ఆయనపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్షాలు న్యాయపోరాటం చేశాయి. ముకుల్ రాయ్ మృతిపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ స్పందిస్తూ, ఆయన ఒక అనుభవజ్ఞుడైన నాయకుడని, బీజేపీలో ఉన్న సమయంలో ఆయనకు తగిన గౌరవం లభించిందని గుర్తు చేసుకున్నారు.
ఎన్ఆర్ఐ
టీడీపీది రాక్షసానందం.. జగనన్న మాకు ధైర్యం చెప్పారు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల దాడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శ్రీజ.. జగనన్న తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని.. మా తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ‘‘టీడీపీ వాళ్లు మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. కానీ నిన్న వేలమంది అభిమానంతో మా ఇంటికి వచ్చారు. మా నాన్న చెప్పినట్టే మాకు అండగా వెంకటేశ్వరస్వామి ఉన్నారు’’ అని శ్రీజ పేర్కొన్నారు.‘‘దేవుడి అండ ఉన్నంతవరకు మాపై వేసే ప్రతీ రాయి పువ్వుగా మారుతుంది. ఆయనే మాకు ఓ రక్షణ కవచంలా ఉంటారు. మా ఇంటిపై అత్యంత దారుణంగా అటాక్ చేశారు. 9 గంటల పాటు తండోపతండాలుగా జనం దాడి చేశారు. ఉదయం గుడికి వెళ్లిన నాన్నపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేశారు. టీడీపీ మహిళలు బూతులతో ఆయనను తిట్టారు. ఆ సమయంలోనే మా నాన్న అలా మాట్లాడారు. దానికి ఆయన రియలైజ్ అయ్యి ఆ మాట అనకూడదన్నారు. లీగల్గా ఎదుర్కొంటానని కూడా చెప్పారు..కానీ మా ఇంట్లో ఆడవాళ్లని దారుణంగా తిడుతూ అటాక్ చేశారు. కాపు కులంకి బూతులు జోడించి తిట్టారు. ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి దీనిని నడిపించడం దారుణం. ఆయన మేథస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోంది. అంబటి రాంబాబుని నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం దారుణం. ఆయనను వేధించి రాక్షసానందం పొందారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలుసుకొవాలి. దాడి చేసిన దానికంటే.. నాలుగు రెట్ల జనం అభిమానంతో వచ్చారు’’ అని శ్రీజ చెప్పారు.
ఎవరీ వంది వర్మ...? మార్స్ రోవర్స్ తొలి ప్లాన్ డ్రైవ్..
అంగారక గ్రహంపై నాసా తొలి ఏఐ ప్లాన్ డ్రైవ్ వెనుక ఉన్న ప్రధాన శాస్త్రవేత్తగా భారత సంతతి మహిళ వంది వర్మ చరిత్ర సృష్టించారు. భారత్కి చెందిన ఈ రోబోటిక్స్ ఇంజనీర్ వంది వర్మ విమానాయనానికి సంబంధించిన కుటుంబంలోనే పెరగడంతో సాంకేతికను అన్వేషించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. నాసా ప్రకారం..వర్మ జేపీఎల్ ప్రిన్సిపాల్ ఇంజనీర్గా, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో మొబిలిటీ అండ్ రోబోటిక్స్ విభాగానికి డిప్యూటీ సెక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థకు ముందు, అధికారికంగా ధృవీకరించిన ప్లాన్ అములు చేసే భాష PLEXIL, రోవర్లు, మానవ అంతరిక్ష ప్రయాణ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతికతను డెవలప్చేయడానికి రూపొందించిన బృందానికి ఆమె నాయకత్వం వహించినట్లు నాసా పేర్కొంది. ఆ కారణంతోనే రోబోటిక్ ఇంజనీరింగ్నే కెరీర్గా ఎంచుకుంది..వర్మ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. విమానాలు,ఇంజనీరింగ్ వాతావరణాలతో ఆమెకు తొలి దశలో పరిచయం ఉండటం వల్ల ఆమెకు టెక్నాలజీపై ఆసక్తి పెరిగింది. చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి, తర్వాత కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి రోబోటిక్స్లో మాస్టర్స్ అండ్ పిహెచ్డి పొందారామె. ఇక వర్మ డిసెంబర్ 8 నుంచి 10 తేదీల్లో ఏఐ ప్లాన్ పెర్సెవరెన్స్ మార్స్ రోవర్ మొదటి డ్రైవ్లను పూర్తి చేసినట్లు నాసా ధృవీకరించింది. ఈ ప్రదర్శనం మన సామర్త్యాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయో చెబుతుండటమే గాక, ఇతర ప్రపంచాలను ఎలా అన్వేషించాలో తెలుపుతుందని నాసా అడ్మినిస్ట్రేర్ జారెడ్ ఐజాక్మాన్ చెబుతున్నారు. (చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!)
పావురాలకు దాణా వేస్తే 2.2 లక్షల జరిమానా
సింగపూర్: భారత్లో పలు నగరాల్లో విపరీతంగా కన్పించే పావురాలను అమితంగా ఇష్టపడుతూ వాటికి జొన్నల వంటి తిండి గింజలను దాణాగా వేస్తూ పిల్లలుపెద్దలు ఎంతో ఆనందపడతారు. అచ్చం అదే పని చేసి సింగపూర్లో ఓ భారతీయ వృద్ధురాలు లక్షల రూపాయల జరిమానా కట్టాల్సి వచ్చింది. పావురాల రెట్ట, వ్యర్థాల్లో పలు రకాల శ్వాసకోశ వ్యాధికారక క్రిములు ఉంటాయి.గాలిలో ఇవి కలిశాక మనుషులు పీలిస్తే ఇబ్బందుల్లో పడతాము. దీంతో పావురాల సంతతి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవద్దనే ఉద్దేశంతో వీటికి దాణా వేసి ప్రక్రియపై సింగపూర్లో నిషేధం విధించారు. ఈ విషయం తెలీక 71 ఏల్ల షణ్ముగనాథన్ శ్యామల అనే పెద్దావిడ గత ఆరు నెలల్లో తొమ్మిదిసార్లు పావురాలకు దాణా వేశారు. విషయం తెల్సి అధికారులు ఈమెపై కేసు నమోదుచేశారు. విచారించిన కోర్టు ఈమెకు 2,518 డాలర్ల(దాదాపు రూ.2,27,753) జరిమానా విధించింది.
ఎన్నారైలకు గుడ్న్యూస్.. అంత బంగారంపై నోట్యాక్స్
భారత ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ఎన్నారైలకు బంగారంపై కలిపించిన వెసులుబాటు పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఎన్నార్లైలకు విధించిన బంగారం పరిమితి నిబంధనలను మారుస్తున్నట్లు తెలిపింది.ఇదివరకూ ప్రవాస భారతీయులు భారత్ వచ్చే సమయంలో వారి వెంట ఉన్న బంగారు ఆభరణాలకు విలువ ఆధారంగా సుంకం ఉండేది. మహిళలకు రూ. లక్షలోపు, పురుషులకు రూ. 50 వేల లోపు విలువ ఉన్న పసిడికి ఎటువంటి సుంకం ఉండేది కాదు. ఆ పైన విలువ ఉన్న వాటికి మత్రమే సుంకం చెల్లించే విధంగా నియమాలు ఉండేవి.అయితే ప్రస్తుత బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం పరిమితిపై వెసులుబాటును మార్చుతున్నట్లు ప్రకటించింది. ప్రవాస భారతీయులు స్వదేశానికి వచ్చే సమయంలో మహిళలకు 40 గ్రాములు, పురుషులకు 20 గ్రాముల బంగారాన్ని ఎటువంటి సుంకం లేకుండా తీసుకరావచ్చని పేర్కొంది. ఆ పైన ఉన్న వాటికి మాత్రమే పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదివరకూ ఉన్న ద్రవ్య విలువ ఆధారంగా రూ. లక్షకు కేవలం ఆరు గ్రాములు, రూ. 50 వేలకు మూడు గ్రాముల పరిమితే ఉంటుంది. ప్రస్తుతం అది 20 నుంచి 40 గ్రాములకు చేరుకుంది. భారత ప్రభుత్వం ఆ పరిమితిని గణనీయంగా పెంచడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
క్రైమ్
9 నెలల గర్భవతి అని కూడా చూడకుండా..!
తొమ్మిది నెలల గర్భిణి అని కూడా చూడకుండా భర్త అత్తమామలు వేధింపులకు పాల్పడి, ఇంట్లోంచి గెంటేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సహనం నశించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరింది.ఫిర్యాదు ప్రకారం, జ్యోతి పాండే (34)కు 2017లో ఉత్తరప్రదేశ్లోని బనారస్లో అనురాగ పాండేతో వివాహం జరిగింది. వివాహం తర్వాత భర్తతో కలిసి బెంగళూరుకు వెళ్లింది. తొలి నాలుగేళ్లు వీరి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. అయితే తొలిసారి గర్భం దాల్చింది మొదలు వివాదాలు ప్రారంభమైనాయి. అనుమానంతో భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. తమిళనాడులో ఉన్నప్పుడు, తన భర్త, అత్త మామలు తనతో గొడవపడి శారీరకంగా దాడి చేశారని కూడా జ్యోతి ఆరోపించింది. ఇదీ చదవండి: పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకిఇంతలో జ్యోతి రెండోసారి గర్భం దాల్చింది. తనపై వేధింపుల్లో భాగంగా మళ్లీ,తనపై దాడి చేశాడని, ఇంటి నుండి వెళ్ళగొట్టాడని ఆరోపించింది. తొమ్మిది నెలల గర్భవతిని అయినా, తన ఆరోగ్యం గురించి పట్టించు కోకుండా మానసిక, శారీరక హింసకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కొంతకాలం తన తల్లి ఇంట్లో ఉండి బెంగళూరుకు తిరిగి వచ్చింది. అయినా తనను అవమానించి, వేధిస్తున్నారంటూ దక్షిణ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళల హెల్ప్లైన్లో కుటుంబ కౌన్సెలింగ్ తరువాత, కేసు నమోదు చేసిన పోలీపులు దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్
ఘోర ప్రమాదం: రెయిలింగ్లోకి దూసుకెళ్లిన కారు
తూర్పు గోదావరి జిల్లా: మండలంలోని సింగన్నగూడెం వద్ద జాతీయ రహదారి–30లో ఆదివారం కారు అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొంది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన పురేష్గౌడ్ (22) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన 9 మంది కూలీలు తమిళనాడుకు కూలి పనుల నిమిత్తం వెళ్లి కారులో తిరిగి స్వరాష్ట్రం వెళుతున్న క్రమంలో సింగన్నగూడెం వద్ద కొత్తగా నిర్మించిన రహదారి పక్కనే ఉన్న రెయిలింగ్ను బలంగా ఢీకొన్నారు. రెయిలింగ్ విరిగిపోవడంతో పాటు కారు ముందు భాగం నుంచి మధ్యలోని సీటు భాగంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో పురేష్ గౌడ్ కడుపులోకి రెయిలింగ్ గుచ్చుకోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలు కాగా, ఇందులో జన్మతి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం నిమిత్తం భద్రాచలం తరలించారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ బొడ్డు హేమంత్, ఎస్ఐ సురేష్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణం చోటు చేసుకుంది. ఒక స్నూకర్ క్లబ్లో మైనర్ల మధ్య వివాదం, ప్రతీకార దాడి తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. అక్కడితో వారి ప్రకోపం చల్లారలేదు. నిందితులే స్వయంగా సీసీటీవీ ఫుటేజ్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది.పోలీసుల సమాచారం ప్రకారం టీనేజర్ల మధ్య వివాదం పెరిగి ప్రాణాంతక దాడికి దారితీసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. గౌతమ్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్నబాధిత 16 ఏళ్ల 10వ తరగతి విద్యార్థి స్నూకర్ క్లబ్కు రెగ్యులర్గా వెళ్లేవాడు. నిందితులు, బాధితుడు ఇద్దరూ ఒకే కోచింగ్ సెంటర్లోనే చదువుకుంటున్నారు. సినిమా ఫక్కీలో దాడి, 30 సెకన్లలో 27 సార్లుఇద్దరు మైనర్లు క్లబ్లోకి ప్రవేశించి సినిమా ఫక్కీలో దాడిచేశారు. 30 సెకన్లలో 27సార్లు కత్తితో పొడిచారు. అనంతరం అంతే వేగంగా అక్కడి నుండి పారిపోయారు. 10 కంటే ఎక్కువ లోతైనగాయాలయ్యాయి. రెండు వేళ్లు తెగి పోయాయి. భుజం, వీపుపై కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి తరువాత ఏదో విధంగా తప్పించుకున్నాడు. ప్రస్తుతం చికిత్స పొందు తున్నాడు. ఇదీ చదవండి: పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకిదర్యాప్తు అధికారుల ప్రకారం, ఈ దాడికి కారణం ప్రతీకారమే కారణం. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు, పూల్ గేమ్ సందర్భంగా ఆధిపత్యం కోసం గొడవ జరిగింది. ఈ సమయంలో బాధితుడు ఇద్దరు నిందితులను చెంపదెబ్బ కొట్టాడట. దీంతో కక్ష పెంచుకున్న విద్యార్థులు ఫిబ్రవరి 15 రాత్రి పథకం ప్రకారం దాడి చేశారు. ఈ ఫుటేజ్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసు కున్నారు. నోటీసుల అనంతరం విడుదల చేశారు. వైద్య నివేదిక ఆధారంగా మరిన్ని అభియోగాలు నమోదు చేస్తామని సబ్-ఇన్స్పెక్టర్ మణిపాల్ సింగ్ భడోరియా తెలిపారు.ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం
కరీంనగర్లో విషాదం: వారం వ్యవధిలో దంపతుల మృతి
కరీంనగర్రూరల్/గోదావరిఖని: అత్తింటి వేధింపులను భరించలేక భార్య ఆత్మహత్య చేసుకోగా.. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త ఆదివారం మృతిచెందాడు. వారం రోజుల వ్యవధిలో దంపతులు మరణించడం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు..గోదావరిఖనికి చెందిన సింగరేణి ఉద్యోగి కంబాల నరేశ్(30) ఏడాదిక్రితం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపలి్లకి చెందిన లింగంపల్లి మమత(29)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గోదావరిఖనిలోని గంగానగర్లో నివాసముండగా వరకట్నం కోసం కుటుంబంలో గొడవలేర్పడ్డాయి. సోదరుడు మహేశ్కు చెప్పడంతో రూ.లక్ష ఇచ్చినప్పటికి మమతపై కుటుంబసభ్యుల వేధింపులు ఆగకపోవడంతో ఈ నెల 15న నస్పూర్కాలనీలోని బంధువుల ఇంటికి మమత వెళ్లింది. మరుసటిరోజు ఇంటి యజమాని ఫోన్ చేసి నరేశ్ మెట్లమీదనుంచి కిందపడిపోయి ఆపస్మారకస్థితిలో ఉన్నాడని చెప్పడంతో మమత గోదావరిఖనికి వచ్చింది. సింగరేణి ఆస్పత్రిలో చేర్పించగా నరేశ్ పరిస్థితి సీరియస్గా ఉండటంతో వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 17న ఆస్పత్రిలో ఉన్న మమతను అత్తింటివాళ్లు దూషించడంతో మనస్తాపానికి గురై తీగలగుట్టపలి్లలోని రైల్వేట్రాక్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. మమత తండ్రి పోషం ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు. ఆదివారం వేకువజామున 4గంటలకు చికిత్స పొందుతూ భర్త నరేశ్ మృతిచెందాడు. దంపతులకు గోదావరిఖనిలో గొడవలు కావడంతోపాటు నరేశ్ శరీరంపై గాయాలుండటంతో తదుపరి విచారణ నిమిత్తం మృతదేహాన్ని గోదావరిఖనికి పంపించినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. నరేశ్ మృతిపై తండ్రి కంబాల భూమయ్య ఇచ్చిన ఫిర్యాదుతో గోదావరిఖని వన్టౌన్ ఎస్సై మనోహర్ కేసు నమోదు చేశారు.
వీడియోలు
మెక్సికోలో మాఫియా గ్యాంగ్ బీభత్సం..
Ram Charan: మళ్లీ బుచ్చిబాబుతోనే..!
యుద్ధం తధ్యం.. ఇరాన్లోని ఇండియన్స్ కు పిలుపు
నన్ను, నా కుటుంబాన్ని కాల్చేయమని.. బాబు, లోకేష్ పై అంబటి సంచలన కామెంట్స్
ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్.. పెళ్లిపై విజయ్ ఎమోషనల్
4 రోజులుగా షాకిస్తున్న గోల్డ్ రేట్స్... రూ.7 వేల పైనే పెరిగిన బంగారం ధర..
విఎస్ఆర్ వెంచర్స్ వెనుక హెరిటేజ్ ఫిన్ లీజ్ ! అజిత్ పవార్ మృతిపై రామ్మోహన నాయుడు కామెంట్స్
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాక్..!
హెరిటేజ్ పై చర్చకు ఎందుకు భయపడుతున్నావ్.. చంద్రబాబు?
ఎండాకాలం వాన.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

