శూన్యమే మిగిలింది..! పహల్గామ్ బాధితురాలి మనో వ్యథ
సరిగ్గా ఏడాది క్రితం జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ నెత్తురోడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం పేరుతో 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ఆ చీకటి రోజును యావత్ దేశం ఇంకా మర్చిపోలేదు. ఆనాటి ఉగ్రదాడికి ఏప్రిల్ 22తో ఏడాది పూర్తవుతున్న తరుణంలో బాధిత కుటుంబాలను పలకరించగా..ఇంకా ఆ దృశ్యం కళ్లముందు మెదులుతూనే ఉందంటున్నారు. ఆ ఘటన మిగిల్చిన కన్నీళ్లని అంతతేలిగ్గా మర్చిపోలేమంటున్నారు భర్తలను పోగోట్టుకున్న మహిళలు. అంతేగాదు తమ కళ్లలోని కన్నీటి చెమ్మ తడి ఆరదు అని గద్గద హృదయంతో చెబుతోంది ఆ పహల్గామ్ బాధితుల్లో ఒకరైన డాక్టర్ సుజాత. గుండెల్ని పిండేసే ఆమె మనో వ్యథ వింటే ప్రతి ఒక్కరి మనసు ద్రవించిపోవడమే కాదు ఈ ఉగ్రవాదం సమూలంగా పోయేదెప్పుడూ అన్న ఆక్రోశం కట్టలుతెచ్చుకుంటుంది.నాటి పహల్గామ్ దాడిలో డాక్టర్ సుజాత ఎంబీఏ పట్టభద్రుడైన భర్త భరత్ భూషణ్ని పోగొట్టుకుంది. అతడికి ప్రపంచం గురించి తెలిస్తే..ఆమెకు రోగుల గురించి తెలుసు. అలా ఒకరికొకరం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేవాళ్లం అని భోరున విలపిస్తున్నారు సుజాత. ఆ దాడిని తన నాలుగేళ్ల కుమారుడు ప్రత్యక్ష్యంగా చూశాడంటూ నాటి భయంకర ఘటనను గుర్తుచేసుకున్నారు. నాన్నకు దెబ్బ తగిలింది, చాలా రక్త కారింది అన్నమాటలు ఇంకా తన చెవిలో వినిపిస్తూనే ఉన్నాయంటున్నారు. ఆ దాడి నీలి నీడలా వెంటాడుతూనే ఉందంటున్నారామె. ఆ బాధను తట్టుకోవడం అంత ఈజీకాదు. ఆ ఘటన తన భావోద్వేగాల నుంచి చిరునవ్వు వరకు అన్నింటి దూరం చేసిందని, కేవలం శూన్యమే మిగిలిందని చాలా నిర్వేదంగా చెప్పుకొచ్చారామె. అంత తేలిగ్గా మర్చిపోలేను ఆ విషాదకరమైన రోజుని, తాను, తన కుమారుడు రక్తంతో తడిచిపోయిన ఆ భయంకపితమైన క్షణాలు బతుకున్నంత వరకు మర్చిపోలేనంటున్నారామె. ఆ కన్నీటి దృశ్యం ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉందన్నారామె. అందుకే తాను ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా పనిలో నిమగ్నమయ్యేలా చూసుకుంటూ ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారామె. కాస్త ఖాళీ దొరికినా..ఆ బాధ వెన్నాడుతుంటుందని ఆవేదనగా చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు ఎంత భయానకమైనవంటే..మనం అనుభవించిన సంతోషకరమైన క్షణాల కంటే ..ఆ బాధే అత్యంత భారంగా అధికంగా ఉంటుందని కన్నీటి పర్యంతమయ్యారు. అన్నేసి గంటలు ఆస్పత్రిలో పనిచేసినా..ఒక్క ఆదివారం మాత్రం కొడుకు కోసం కేటాయించుకుంటానని చెప్పారు. భతవంతుడి దయవల్ల తన కొడుడు చాలా మంచివాడని అంటున్నారు. ఎందుకుంటే ఆ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారి కూడా తండ్రి గురించి అడగలేదు. ప్రశాంతంగా ఉన్నాడని అన్నారు. పైగా తాను లేనప్పుడూ అస్సలు అల్లరి చేయడు, తాను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నాతో అల్లరి చేస్తుంటాడని నవ్వుతూ చెప్పారు. ఈ విషయంలో భగవంతుడికి సదా కృతజ్ఞతతో ఉంటానని అన్నారు. అంతేగాదు తన కొడుకుకి తండ్రిన కోల్పోయినట్లు తెలుసు, కానీ ఆ లోటు వాడికి కనపడకుండా అన్నీతానై పెంచుకుంటున్నానని చెప్పారామె. నిజానికి ఏప్రిల్ నెల ఎప్పుడూ పండుగ మాసం, కానీ అది మాకు సర్వం కోల్పోయేలా చేసిన విషాదకరమైన మాసంగా మిగిలిందన్నారు. "ఈ పహల్గామ్ దాడికి కొన్ని రోజుల ముందు తన భర్త పుట్టినరోజు వేడుకులు చేసుకున్నాం అని అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 14న విహారయాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాం. నిజానికి తాము ఎప్పుడు గుడికి వెళ్లి..ఆ తర్వాత బయటకు వెళ్లేవాళ్లం. ఆరోజు తన తల్లిదండ్రలు కూడా కాశ్మీర్లో గట్టి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పినప్పుడూ కూడా అంతగా ఆందోళన చెందలేదు. పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంటే టపాసులు అనుకున్నా..భద్రతా సిబ్బంది అంతా చూసుకుంటారిని అనుకున్నా. కానీ ఆ ప్రాంతంలో భద్రత లేదు, ఒక్క మనిషి గానీ, సాయుధగార్డు గానీ ఉంటే ఆ ఘటనను నివారించి ఉండేవారంటూ". ఆ విపత్కర పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. బహుశా తీవ్రవాద భావజాలం ఈ దాడులు చేసేవాళ్ల మెదడులను పూర్తిగా బ్రెయిన్ వాష్ చేశారన్నారు. తాము చేస్తుంది తప్పు కాదు సరైనదే అన్నంత క్రూరంగా మార్చేశారన్నారు. అయితే ఈ ఉగ్రవాదాన్ని ఎలా మట్టుపెట్టాలో తనకు తెలియదు గానీ..ఇక్కడితో ఈ మారణకాండ ఆగిపోవాలి అని ఉద్విగ్నంగా అన్నారామె. ఆ దాడి జరిగిన రోజు తమ పెళ్లిరోజు అని, ఆయనతో తనకు అదే చివరి భయానక జ్ఞాపకమని కన్నీళ్లుపెట్టుకున్నారామె. కాగా, పహల్గామ్ సంఘటన జరిగినప్పుడు ఆ దంపతులకు పెళ్లై ఆరేళ్లయింది. ప్రస్తుతం ఆమె తనను ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నా..కానీ ఈ నష్టం ఏ స్త్రీకైనా పూడ్చలేనది అని గద్గద స్వరంతో అన్నారు డాక్టర్ సుజాత.#PahalgamTerroristAttackDr. Sujatha, a pediatrician from Bengaluru, witnessed the tragic killing of her husband, Bharath Bhushan, during a terrorist attack in Pahalgam, Jammu and Kashmir, on April 22, 2025. #DrSujatha, her husband, and their three-year-old son were vacationing… pic.twitter.com/Wn5D9ZnMuL— Dr Parveen Yograj (@ParveenYograj) April 24, 2025 (చదవండి: ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ)
రేపటి నుండి మేం ఏంటో చూపిస్తాం: వర్మ వార్నింగ్
కాకినాడ: జనసేన నాయకులకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేపటి నుండి తామేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు వర్మ. ‘ వెనుక నుండి టీడీపీ గిల్లితే ఎవరు ఊరుకుంటారు. టీడీపీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు. టీడీపీ బలంగా ఉంది కనుకే పవన్కు 70 వేల మెజార్టీ ఇచ్చాం. టీడీపీ బలహీనంగా లేదు.. రేపటి నుండి తామేంటో చూపిస్తాం’ అని హెచ్చరించారు వర్మ.కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోజనసేన, టీడీపీల మధ్య చిచ్చు రాజుకుంది. ఫ్లెక్సీ గొడవతో ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. ఈ క్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మని జనసేన నేత పెండెం దొరబాబు దాదాపు కొట్టినంత పని చేశారు. ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫొటో లేదు. పవన్ కల్యాణ్ ఫొటో మాత్రం హైలైట్ అయ్యింది. ఇది గమనించిన మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఫొటో ఎందుకు పెట్టలేని అక్కడున్న నేతల్ని నిలదీశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జనసేన నేత తుమ్మలబాబు దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో ఇరు నేతల మధ్య మాటామాటా పెరిగింది. అక్కడే ఉన్న పెండెం దొరబాబు వర్మతో వాగ్వాదానికి దిగారు. వర్మపైకి దూసుకొస్తూ దాడి చేసే ప్రయత్నం చేయబోయారు. అది గమనించిన తోటి నేతలు ఆయన్ని నిలవరించారు. ఈలోపు టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.దీనిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ.. తమ మద్దతుతోనే జనసేన అధ్యక్షుడు పవన్ గెలిస్తే.. తమపైకే దాడి చేయడానికి వస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుండి తామేంటో చూపిస్తామంటూ జనసేన నాయకుల్ని తీవ్రంగా హెచ్చరించారు.
Telangana : డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించని లబ్ధిదారుల ఇళ్లను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేటాయించిన ఇళ్లలో తప్పనిసరిగా నివసించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పూర్తి అయిన, నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. టూ బీహెచ్కే ఇండ్లు పొందిన వారు వాటిలో నివసించకపోతే, వారికి ఇచ్చిన ఇళ్లను నోటీసులు ఇచ్చి రద్దు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రద్దు చేసిన ఇళ్లను కొత్త లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. సంబంధిత ఆర్డీఓలు, డిప్యూటీ కమిషనర్లు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎల్2 లిస్ట్ నుండి పేదవారిని ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
బాయ్ఫ్రెండ్ కళ్లకు గంతలు కట్టి.. నిప్పంటించిన అమ్మాయి
బెంగళూరు: టెలికాం స్టోర్లో పని చేసే ఓ యువతి తన ప్రియుడిని ఇంటికి పిలిచి, కొత్త తరహా ప్రపోజల్ అంటూ కళ్లకు గంతలు కట్టింది. ఆ తర్వాత అతడిని కుర్చీకి కట్టేసి, అతడికి నిప్పు అంటించింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. తన ప్రియుడు తనను పట్టించుకోలేదని కోపంతో ఆ యువతి ఈ ఘటనకు పాల్పడింది. అతడు కాలిపోతోంటే కెమెరాలో చిత్రీకరించి, అతను చనిపోయే వరకు చూస్తూ ఉండిపోయింది.ఆ అమ్మాయి పేరు ప్రేర్నా(27). కిరణ్ (27)తో అదే టెలికాం స్టోర్లో పనిచేస్తోంది. వారిద్దరు ఏడాది పైగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఇటీవలి కాలంలో కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, తనను పెళ్లి చేసుకోడని ప్రేర్నాకు అనిపించింది. మంగళవారం ప్రేర్నా తన తల్లి, అన్నతో కలిసి నివసించే దక్షిణ బెంగళూరు అంజనాపుర ప్రాంతంలోని ఇంటికి కిరణ్ను పిలిచింది. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో కిరణ్ ఆమె ఇంటికి వచ్చాడు. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఆ యువతి అతని కళ్లకు గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ యువకుడు అభ్యంతరం చెప్పినప్పుడు.. విదేశాల్లో ప్రాచుర్యం పొందుతున్న విధంగా ప్రపోజ్ చేయాలనుకుంటున్నానని ఆ యువతి చెప్పింది. కిరణ్ ప్రపోజల్ కోసం ఎదురు చూశాడు. అప్పటికే ముందుగా సిద్ధం చేసుకున్న పెట్రోల్ వంటి ద్రావణాన్ని అతడిపై పోసింది ప్రేర్నా. “ప్రేర్నాను అదుపులోకి తీసుకున్నాం. అతనికి ఆమె నిప్పు పెట్టి హత్య చేసినట్టు నిర్ధారణ అయ్యింది. ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. అతను తనను పట్టించుకోలేదని ఆమె భావించింది” అని పోలీసులు తెలిపారు.
Telangana : డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్?
ఈ 8 మంది అమ్మాయిలను వదిలేయండి: ట్రంప్
అందరిచూపు.. ఆసియా దేశాలవైపు!
ముంబై ఇండియన్స్కు శుభవార్త.. బిగ్ బూస్ట్
జోర్దార్ సుజాతకు మా సభ్యత్వం.. మంచు విష్ణు అందజేత
రేపటి నుండి మేం ఏంటో చూపిస్తాం: వర్మ వార్నింగ్
కోహ్లి ‘టేస్ట్’పై కామెంట్.. మాజీ ‘గర్ల్ఫ్రెండ్’ స్పందన ఇదే!
ఒక్క నాటకంతో బంగళాలు, ఖరీదైన కార్లు!
పెళ్లి విందులో మ్యాంగో జ్యూస్? 400మందికి అస్వస్థత
'2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': కియోసాకి
హైదరాబాద్కు గుడ్బై.. షిఫ్ట్ అవుతున్న అల్లు అర్జున్!
మీతో పని ఉంది సార్.. రాత్రి ఇంటికి రండి!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. సరికొత్త ప్రపంచ రికార్డు
ముంబైలో స్థిరపడనున్న అల్లు అర్జున్.. స్పందించిన అరవింద్
ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్ నినో’
షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్బాస్' ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా
అతని టార్గెట్ బంజారాహిల్స్ అమ్మాయిలే..!
‘మరో జలసంధిని మూసేస్తాం.. తెరవడం ఎవ్వరితరం కాదు’
ఓటుకు నోటు ‘బంధం’ వీడడం లేదు మరి!
గరికపాటికి లీగల్ నోటీసు
సార్ మనమిప్పుడు తమిళనాడులో ఉన్నాము!
'సారీ చరణ్.. మగధీర సినిమాలో చేయొద్దని చెప్పా'
హార్మూజ్పై ఇరాన్ భారీ ట్విస్ట్.. దిమ్మ తిరిగే ప్లాన్!
ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు!
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
చైనాలో రివర్స్ మైగ్రేషన్..
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
ట్రంప్, మునీర్ దోస్తీ.. అమెరికా నిఘా వర్గాల్లో టెన్షన్
వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్!
ఇరాన్కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
Telangana : డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్?
ఈ 8 మంది అమ్మాయిలను వదిలేయండి: ట్రంప్
అందరిచూపు.. ఆసియా దేశాలవైపు!
ముంబై ఇండియన్స్కు శుభవార్త.. బిగ్ బూస్ట్
జోర్దార్ సుజాతకు మా సభ్యత్వం.. మంచు విష్ణు అందజేత
రేపటి నుండి మేం ఏంటో చూపిస్తాం: వర్మ వార్నింగ్
కోహ్లి ‘టేస్ట్’పై కామెంట్.. మాజీ ‘గర్ల్ఫ్రెండ్’ స్పందన ఇదే!
ఒక్క నాటకంతో బంగళాలు, ఖరీదైన కార్లు!
పెళ్లి విందులో మ్యాంగో జ్యూస్? 400మందికి అస్వస్థత
'2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': కియోసాకి
హైదరాబాద్కు గుడ్బై.. షిఫ్ట్ అవుతున్న అల్లు అర్జున్!
మీతో పని ఉంది సార్.. రాత్రి ఇంటికి రండి!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. సరికొత్త ప్రపంచ రికార్డు
ముంబైలో స్థిరపడనున్న అల్లు అర్జున్.. స్పందించిన అరవింద్
ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్ నినో’
షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్బాస్' ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా
అతని టార్గెట్ బంజారాహిల్స్ అమ్మాయిలే..!
‘మరో జలసంధిని మూసేస్తాం.. తెరవడం ఎవ్వరితరం కాదు’
ఓటుకు నోటు ‘బంధం’ వీడడం లేదు మరి!
గరికపాటికి లీగల్ నోటీసు
సార్ మనమిప్పుడు తమిళనాడులో ఉన్నాము!
'సారీ చరణ్.. మగధీర సినిమాలో చేయొద్దని చెప్పా'
హార్మూజ్పై ఇరాన్ భారీ ట్విస్ట్.. దిమ్మ తిరిగే ప్లాన్!
ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు!
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
చైనాలో రివర్స్ మైగ్రేషన్..
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
ట్రంప్, మునీర్ దోస్తీ.. అమెరికా నిఘా వర్గాల్లో టెన్షన్
వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్!
ఇరాన్కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
ఫొటోలు
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన (ఫోటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
కూతురు, కుమారుడితో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి (ఫొటోలు)
మృణాల్ ఠాకుర్ 'ఫ్లవర్' లవ్.. ఎన్నో వెరైటీస్ (ఫొటోలు)
హీరోయిన్ ఈషా రెబ్బా బర్త్ డే మూమెంట్స్ (ఫొటోలు)
కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)
పశ్చిమగోదావరి : నరసాపురంలో సినీనటి అనసూయ సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
'కపుల్ ఫ్రెండ్లీ' బ్యూటీ మానస వారణాసి లేటెస్ట్ ఫోటోలు
సింహాచలం : స్వామి నిజరూప దర్శనం.. భక్తులకు అష్టకష్టాలు (ఫొటోలు)
సినిమా
ముంబైలో స్థిరపడనున్న అల్లు అర్జున్.. స్పందించిన అరవింద్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు ముంబైలో స్థిరపడనున్నారని వచ్చిన వార్తలపై అల్లు అరవింద్ స్పందించారు. ఈ మేరకు అధికారికంగా డెక్కన్ క్రానికల్లో ఒక కథనం వచ్చింది. బన్నీ- అట్లీ మూవీ రాకా షూటింగ్ ఎక్కువగా ముంబైలోనే జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్నారని నెట్టింట కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.అల్లు అర్జున్ ముంబైకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదని ఆయన తండ్రి అల్లు అరవింద్ డెక్కన్ క్రానికల్తో తెలిపారు. 'బన్నీ కొత్త సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ముంబైలో జరుపుకుంటున్నందున చాలామందికి అలా అనిపించవచ్చు. కానీ, అర్జున్ మనసు హైదరాబాద్ చుట్టే ఉంటుంది. అతనికి సొంత ఇల్లు ఇక్కడే ఉంది. పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. తన స్నేహితులందరూ హైదరాబాద్లోనే నివసిస్తున్నారు. అలాంటప్పుడు ముంబైకి ఎందుకు వెళ్తారు..? ముంబైలో స్థిరపడాలనే ప్రణాళికలు బన్నీకి లేవు. అయితే, ప్రస్తుతం షూటింగ్ పనుల వల్ల ఎక్కువ సమయం ముంబైలో ఉంటున్నాడు.' అని అరవింద్ క్లారిటీ ఇచ్చారు.రాబోయే రోజుల్లో 'రాకా' సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్ హైదరాబాద్, ముంబైల మధ్య ఎక్కువ రాకపోకలు సాగించే అవకాశం ఉంది. తెలుగు సినిమాకు మించి తన సూపర్స్టార్డమ్ను విస్తరించుకోవాలనే ప్రణాళికలు లేవని తెలుస్తోంది. టాలీవుడ్లోనే ఉంటూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్లాన్తో అల్లు అర్జున్ ఉన్నట్లు అర్థం అవుతుంది.
'పెద్ది' ఇంకెన్నాళ్లు? అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా షూటింగ్ సాగుతూ..నే ఉంది. లెక్క ప్రకారం గత నెలలో రిలీజ్ అని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. తీరా డేట్ దగ్గరపడేసరికి నెల తర్వాత అంటే ఏప్రిల్ 30 పక్కా విడుదల చేస్తామని ఏకంగా పోస్టర్ వదిలారు. కొన్నిరోజుల ముందు మళ్లీ వాయిదా అని షాకిచ్చారు. జూన్లో వస్తుందని ప్రకటించారు కానీ డేట్ చెప్పలేదు. జూన్ కూడా వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ టైంలో దర్శకుడు బుచ్చిబాబు.. షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు. పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా)మరో ఆరు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందని చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు.. 'మై పెద్ది' అని క్యాప్షన్ ఇచ్చి రామ్ చరణ్తో దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ చివరలో పెట్టుకున్నారనమాట. ఈ పాటలో చరణ్తో డ్యాన్స్ చేసేందుకు హీరోయిన్ సంయుక్తని తీసుకున్నారని రూమర్స్ వచ్చాయి. బహుశా ఈమెనే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయితే రెహమాన్ వర్క్ మొదలవుతుంది. ఈయన టైంకి ఔట్పుట్ డెలివరీ చేస్తేనే జూన్కి సినిమా వస్తుంది. లేదంటే మళ్లీ వాయిదా తప్పదు.విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా తీస్తున్న 'పెద్ది'లో చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లు. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులోని ఐటమ్ సాంగ్ కోసం మృణాల్ ఠాకుర్, మానస వారణాసి తదితరుల పేర్లు వినిపించాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం బ్యూటీ దొరక్కే షూటింగ్ ఇన్నాళ్ల పాటు ఆలస్యమైందనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఏదైతేనేం ఎట్టకేలకు షూటింగ్ అయితే ముగించేస్తున్నారనమాట.(ఇదీ చదవండి: అందరూ ఫెయిల్! మలయాళీ సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?) View this post on Instagram A post shared by Buchi babu sana (@buchibabu_sana)
అందరూ ఫెయిల్! మలయాళీ సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?
టాలీవుడ్ రేంజు పెరిగిపోయింది. అబ్బో పాన్ ఇండియా సినిమాలు తీసేస్తున్నాం అని చాలామంది సంబరపడిపోతున్నారు గానీ గ్రౌండ్ లెవల్ పరిస్థితి అస్సలు బాగోలేదు. మిగతా విషయాల్ని కాసేపు పక్కనబెడితే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఒకటి రెండు సినిమాలు తప్పితే తర్వాత నుంచి వరసపెట్టి ఫ్లాపులే. కొన్ని చిత్రాలు యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోతున్నాయి. గత మూడు నెలలుగా టాలీవుడ్లో సరైన హిట్ లేదు. అలాంటిది మలయాళంలో మాత్రం చిన్న చిత్రాలు వరసపెట్టి వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ అందరూ అవాక్కయ్యేలా చేస్తున్నాయి? ఇంతకీ ఇదెలా సాధ్యం? వాళ్ల సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?(ఇదీ చదవండి: ఆరో క్లాస్ నుంచి చేస్తున్నా.. నా దగ్గర 1000 పాటలున్నాయి)ఒకప్పుడు మలయాళ సినిమా అంటే చిన్నచూపు ఉండేది కానీ గత కొన్నేళ్లుగా ఈ ఇండస్ట్రీకి రీచ్ బాగా పెరిగింది. లాక్డౌన్ తర్వాత అన్ని భాషల ప్రేక్షకులు ఈ భాష చిత్రాల్ని చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి తగ్గట్లే మలయాళీ దర్శకులు.. అందరరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్లతో సినిమాలు తీస్తున్నారు. గత నెలలో 'ధురంధర్ 2'తో పాటు రిలీజై 'ఆడు 3' అనే చిత్రం సెన్సేషన్ సృష్టించింది. రూ.100 కోట్లకు పైనే వసూళ్లు సాధించింది. తాజాగా 'భరతనాట్యం 2', 'వాలా 2' అనే చాలా చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా వరసగా రూ.100, రూ.200 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాయి.తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో రీసెంట్ టైంలో సక్సెస్ కోసం అందరూ ఇబ్బంది పడుతుంటే మలయాళంలో మాత్రం వరస హిట్స్ కొడుతున్నారు. దీనికి కారణాలు ఏంటా అని చూస్తే చాలా సింపుల్. మలయాళీ దర్శకులు.. అనవసర ఆర్భాటాలు పేరిట గిమ్మిక్కులు చేయరు. వందల కోట్ల బడ్జెట్ పెట్టి ఏళ్లకు ఏళ్లు మూవీస్ తీయరు. పరిమిత బడ్జెట్, తక్కువ వర్కింగ్ డేస్లో ఎలాంటి చిత్రాన్ని అయినా పూర్తి చేస్తారు. కథను నమ్మి, వైవిధ్యమైన ఐడియాలతో ప్రేక్షకులకు కొత్తదనం పంచాలని చూస్తారు. సహజమైన వాతావరణంలోనే ఎక్కువగా సినిమాలు తీయడం ఇంకో ప్లస్. అందుకే ఆ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయిమరోవైపు టాలీవుడ్ పరిస్థితి చూస్తే.. ఓటీటీ మార్కెట్ దారుణంగా పడిపోతూ వస్తోంది. దీంతో భారీ బడ్జెట్ సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. కొందరు మిడ్ రేంజ్ హీరోలకు పెద్ద మార్కెట్ లేకపోయినా వీళ్లపై కొందరు నిర్మాతలు.. భారీతనం పేరిట, హంగులు, ఆర్భాటాల పేరిట కోట్లకు కోట్లు ఖర్చు చేసేస్తున్నారు. బిజినెస్ మాత్రం దానికి తగ్గట్లు జరగట్లేదు. సరేలే ఎలాగోలా కానిచ్చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తే.. చూసేందుకు ప్రేక్షకులు రావట్లేదు. వీటిలో ప్లానింగ్ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.తెలుగు ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసే కంటెంట్ కాకుండా పాన్ ఇండియా పేరిట గిమ్మిక్కులు చేద్దామని చాలామంది దర్శకనిర్మాతలు అనుకుంటున్నారు. అలాంటివి పసిగట్టేస్తున్న ఆడియెన్స్.. సదరు సినిమాల్ని లైట్ తీసుకుంటున్నారు. అందుకే తెలుగు దర్శకులు ఇకపై కంటెంట్ని నమ్ముకుని మూవీస్ తీస్తే బెటర్. లేదంటే ముందుముందు పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. మలయాళం లాంటి పరభాషా చిత్రాలకు ఆదరణ పెరగడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా)
ఓటీటీకి బోల్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సందడి చేసేందుకు మరో సినిమా వచ్చేస్తోంది. తమిళంలో రిలీజైన ప్రేక్షకులను మెప్పించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. సుదర్శన్ గోవింద్, అర్చన రవి జంటగా నటించిన నీ ఫరెవర్ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మూవీ ఏప్రిల్ 24 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. గత నెలలో థియేటర్లలో కేవలం తమిళంలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ సినిమాకు అశోక్కుమార్ కలైవాణి దర్శకత్వం వహించారు. అశ్విన్ హేమంత్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో వై జీ మహేంద్రన్, రవి, ఎం.జె.శ్రీరామ్, రేతిక శ్రీనివాస్, శ్రీజ రవి, చెల్లా, డాక్టర్ విద్య, వీజే ప్రతు, నోబుల్ కె జేమ్స్, స్నేహ శక్తి కీలక పాత్రల్లో మెప్పించారు. Indha love fake ah thaan thodanguchu, but the feelings got all too real ♥️😢 pic.twitter.com/1vg34zTrlb— Netflix India South (@Netflix_INSouth) April 21, 2026
క్రీడలు
‘ఎవరిని.. ఎలా.. వాడుకోవాలో.. నాకు తెలుసు’
జస్ప్రీత్ బుమ్రా విషయంలో తనను విమర్శిస్తున్న వారికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఎవరి సేవలను ఎప్పుడు ఎలా వాడుకోవాలో తనకు తెలుసు అన్నాడు. బుమ్రా వికెట్లు తీయకపోతే తనను విమర్శించడం ఏమిటని ప్రశ్నించాడు.ఐపీఎల్-2026లో ముంబై ప్రధాన పేసర్ బుమ్రా (Jasprit Bumrah) దారుణంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్ల వరకు ఒక్క వికెట్ తీయలేకపోయిన అతడు.. గుజరాత్ టైటాన్స్ (MI vs GT)తో సోమవారం నాటి మ్యాచ్లో మాత్రం మెరుగ్గా రాణించాడు. తొలి ఓవర్లో రంగంలోకి దిగి గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ను గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపాడు.Guess who’s back? 🔥#JaspritBumrah makes a statement with his first wicket of the season, putting #MI on 🔝#TATAIPL 2026 | #GTvMI | LIVE NOW 👉 https://t.co/EXwHuATomY pic.twitter.com/eQJ9QHheuX— Star Sports (@StarSportsIndia) April 20, 2026బుమ్రా తొలి వికెట్.. హార్దిక్పై విమర్శలుతద్వారా ఈ సీజన్లో బుమ్రా తొలి వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా మూడు ఓవర్లలో 15 పరుగులు ఇచ్చిన అతడు కీలక వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. బుమ్రాకు కొత్త బంతిని ఇచ్చి ఆరంభంలో రంగం దించితే ఫలితం ఇలా ఉంటుందని.. కానీ పాండ్యా అతడిని నిర్లక్ష్యం చేస్తూ మూల్యం చెల్లిస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.బుమ్రా ఎప్పుడూ అంతేగాఈ నేపథ్యంలో గుజరాత్పై విజయానంతరం హార్దిక్ పాండ్యా ఘాటుగా స్పందించాడు. ‘‘చాలా మంది జస్ప్రీత్ బుమ్రాకు తొలి ఓవర్లోనే బంతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇది నాకు కూడా ఆసక్తికరంగానే ఉంది. అయితే, ఇప్పటికి ముంబై తరఫున 151 మ్యాచ్లు ఆడితే అందులో ఎనిమిది లేదంటే తొమ్మిదిసార్లు మాత్రమే బుమ్రా తొలి ఓవర్ బౌల్ చేయడం మీరు గమనించాలి.నా వల్ల ఎలాంటి సమస్యా లేదుఇందులో నా వల్ల వచ్చిన సమస్య ఏమీ లేదు. జస్ప్రీత్ ప్రత్యేకమైన బౌలర్. జట్టుకు అవసరమైన వేళ అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసు. ఈరోజు అతడి సేవలు ఆరంభంలోనే అవసరం అని భావించాము. కొత్త బంతితో ప్రభావం చూపగలడని భావించాము. జట్టులో అతడి కంటే ఉత్తమమైన బౌలర్ ఎవరూ లేరు’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.కాగా అహ్మదాబాద్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్లో ముంబై గుజరాత్ జట్టును 99 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 100 పరుగులకే ఆలౌట్ అయి చిత్తుగా ఓడింది. కాగా ఈ సీజన్లో ముంబైకి ఆరింట ఇదే రెండో గెలుపు.చదవండి: తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా సీరియస్.. స్పందించిన స్టార్
పిచ్చి పట్టినట్లుగా పిచ్ తొక్కించేశాడు.. మ్యాచ్ రద్దు!
క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ట్రాక్టర్తో మైదానంలోకి దూసుకువచ్చాడు.. పిచ్చి పట్టినట్లుగా క్రికెట్ పిచ్ మొత్తాన్ని ట్రాక్టర్తో తొక్కించేశాడు.. ఫలితంగా.. ఫలితం తేలకుండానే మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన మహారాష్ట్రలోని జలగావ్లో జరిగింది. జలగావ్ రూరల్ ఎంఎల్ఏ కప్ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ యువకుడు ట్రాక్టర్పై అకస్మాత్తుగా మైదానంలోకి వచ్చాడు.నిస్సహాయంగాఏం జరుగుతుందో అర్థం కాక ఆటగాళ్లు చెల్లాచెదురై పోయారు. ఇంతలో అతడు వేగంగా పిచ్ మీదకు దూసుకువచ్చి.. ట్రాక్టర్తో పిచ్ మొత్తాన్ని ధ్వంసం చేశాడు. ఆటగాళ్లు, అంపైర్లు ఏమీ చేయలేక నిస్సహాయంగా అలా చూస్తుండిపోయారు. దీంతో మైదానంలో గందరగోళం నెలకొంది.కాగా ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక వ్యక్తి ఒకరిని ఫైనల్ మ్యాచ్కు ఆహ్వానించకపోవడంతో సదరు వ్యక్తి ఇలా చేయించినట్లు సమాచారం. అనూహ్య ఘటనతో మ్యాచ్ రద్దైపోగా.. పిచ్ను తొక్కించిన వ్యక్తిపై మాత్రం ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఇక ఈ దృశ్యాలు వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఎవరిది బాధ్యత‘‘బహుశా ఆ మైదానం అతడిదే అయి ఉంటుంది. ఓనర్నే మ్యాచ్కు ఆహ్వానించకపోతే ఎలా? అందుకే ఇలా చేశాడు’’ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదు. ట్రాక్టర్తో వేగంగా దూసుకువచ్చిన సమయంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత. ఇలాంటి వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందే’’ అని పేర్కొంటున్నారు. Tractor Driver plows the cricket pitch mid-final in Jalgaon after the driver wasn’t invited to the tournament 😭 pic.twitter.com/LLS61mkRWJ— Ghar Ke Kalesh (@gharkekalesh) April 18, 2026
సీఎస్కేకు భారీ షాక్.. టోర్నీ నుంచి అతడు అవుట్
వరుస ఓటములతో నిరాశలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్న ఏకైక ఆటగాడు ఆయుశ్ మాత్రే టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇందుకు సంబంధించి సీఎస్కే మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.టోర్నీ మొత్తానికి దూరం‘‘సన్రైజర్స్ హైదరాబాద్తో ఏప్రిల్ 18 నాటి మ్యాచ్ సందర్భంగా ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) తొడ కండరాలు పట్టేశాయి. ఆయుశ్ ఈ గాయం నుంచి కోలుకోవడానికి సుమారు 6-12 వారాల సమయం పడుతుంది. కాబట్టి ఐపీఎల్-2026లో మిగిలిన సీఎస్కే మ్యాచ్లన్నింటికీ అతడు దూరమయ్యాడు’’ అని సీఎస్కే తమ ప్రకటనలో పేర్కొంది.కాగా తాజా ఎడిషన్లో సీఎస్కే తరపున వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన ఆయుశ్ మాత్రే.. ఆరు మ్యాచ్లు ఆడి 201 పరుగలు సాధించాడు. అత్యధిక స్కోరు 73. ముంబైకి చెందిన ఆయుశ్ మాత్రే భారత అండర్-19 జట్టుకు కెప్టెన్గా ఇటీవలే వరల్డ్కప్ అందించాడు.గతేడాది రీప్లేస్మెంట్ ప్లేయర్గా సీఎస్కేలో చేరిన ఆయుశ్ మాత్రే ఓపెనర్గా రాణించాడు. ఈ ఏడాది సంజూ శాంసన్- రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా రాగా.. ఆయుశ్ వన్డౌన్లో బ్యాటింగ్కు దిగి అదరగొట్టాడు. చివరగా సన్రైజర్స్తో మ్యాచ్లో 13 బంతుల్లోనే 30 పరుగులతో దుమ్ములేపాడు.ఆయుశ్ స్థానంలో ఎవరు?అయితే, ఆ సమయంలోనే అతడి తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ కాసేపు క్రీజులో ఉన్న ఆయుశ్.. ఆ తర్వాత నొప్పి తాళలేక మైదానం వీడాడు. ఇక మంచి ఫామ్లో ఉన్న ఆయుశ్ సేవలను కోల్పోయిన సీఎస్కేకు.. అతడి బ్యాటింగ్ స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలికేమీ కాదు. ఆయుశ్ స్థానంలో ఉర్విల్ పటేల్ లేదంటే కార్తిక్ శర్మను తుదిజట్టులో ఆడించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఎంఎస్ ధోని ఫిట్నెస్ లేక ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు ఖలీల్ అహ్మద్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ఇలాంటి తరుణంలో ఆయుశ్ కూడా జట్టును వీడటంతో సీఎస్కేకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికి ఈ సీజన్లో సీఎస్కే.. ఆరు మ్యాచ్లు ఆడి రెండే గెలిచింది.చదవండి: టీమిండియాలోకి సంచలన ఫాస్ట్ బౌలర్!
తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా సీరియస్.. స్పందించిన స్టార్
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ తిలక్ వర్మ అదరగొట్టాడు. విధ్వంసకర అజేయ సెంచరీ (45 బంతుల్లో 101)తో రాణించి తమ జట్టుకు విజయం అందించాడు. అయితే, అహ్మదాబాద్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్లో పేలవ ఆరంభం... పవర్ప్లేలో సాధారణ స్కోరు... గత మ్యాచ్ల తరహాలోనే మరోసారి ముంబై ఇన్నింగ్స్ పతనం దిశగా సాగిపోతున్నట్లుగా అనిపించింది... ఇలాంటి స్థితిలో తిలక్ వర్మ ఒక్కసారిగా ఆటను మార్చేశాడు.తీవ్ర ఒత్తిడి మధ్య నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆఖర్లో ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తూ తొలి సెంచరీతో కదం తొక్కాడు. 19 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో ఏ బ్యాటర్కూ సాధ్యం కాని రీతిలో చివరి 6 ఓవర్లలో ఒక్కడే 82 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరును అందించాడు. అనంతరం ఛేదనలో మొదటి బంతికే వికెట్ కోల్పోయిన గుజరాత్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో తిలక్ స్కోరును కూడా అందుకోలేక మూడు వరుస విజయాల తర్వాత ఓటమిని ఆహ్వానించింది.తిలక్ వర్మపై హార్దిక్ సీరియస్ఇదిలా ఉంటే.. గుజరాత్తో ఈ మ్యాచ్ను కూడా జాగ్రత్తగా మొదలు పెట్టిన తిలక్ వర్మ వేగంగా ఆడటంలో బాగా ఇబ్బంది పడ్డాడు. 14వ ఓవర్ ముగిసేసరికి అతను 22 బంతులు ఆడితే చేసింది 19 పరుగులే... ఒక్క బౌండరీ కూడా లేదు!.. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఎండ్లో ఉన్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది. Tilak Varma-ಗೆ ಹುರಿದುಂಬಿಸುತ್ತಿರುವ Hardik Pandya! 🗣️🤝🏻ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL2026 👉 #GTvsMI | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TATAIPL pic.twitter.com/0TDzA1kNzM— Star Sports Kannada (@StarSportsKan) April 20, 2026‘‘ఇలా ఆడితే ఎలా? అసలేం ఏం చేస్తున్నావు? ఇలా ఆడితే గెలుపు సాధ్యమేనా?’’ అన్నట్లుగా హార్దిక్ బాగా సీరియస్ అయినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో ఎంతో సంయమనం పాటించిన తిలక్ వర్మ.. ప్రసిధ్ వేసిన 15వ ఓవర్తో గేమ్ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ ఓవర్లో తొలి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 4 బాదిన తిలక్... రషీద్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టాడు.దంచికొట్టిన తిలక్ఆ తర్వాత యువ పేస్ అశోక్ శర్మ ఓవర్లో తిలక్ చెలరేగిపోయాడు. ఈ ఓవర్ తొలి బంతికి సిక్స్ బాది 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అతను... ఇదే ఓవర్ తర్వాతి నాలుగు బంతుల్లో వరుసగా 4, 4, 6, 6తో ఆధిపత్యం ప్రదర్శించాడు. 19వ ఓవర్ ముగిసేసరికి అతను 80 పరుగుల వద్ద ఉన్నాడు. ఐపీఎల్లో తిలక్ మొదటి సెంచరీ సాధిస్తాడా అనే ఉత్కంఠ నెలకొన్న సమయంలో దూకుడైన బ్యాటింగ్తో తిలక్ దానిని చేసి చూపించాడు.ప్రసిధ్ వేసిన చివరి ఓవర్ తొలి రెండు బంతుల్లో 4, 6 కొట్టిన అతను ఆఖరి రెండు బంతుల్లో కూడా మళ్లీ 6, 4 బాదాడు. షార్ట్ బంతికి స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీకి తరలించడంతో తిలక్ శతకం పూర్తయింది. ఒక్క ప్రసిధ్ బౌలింగ్లోనే అతను 43 పరుగులు రాబట్టాడు. తాను ఆడిన చివరి 23 బంతుల్లో తిలక్ ఏకంగా 82 పరుగులు బాదడం విశేషం.నాలో కసి పెంచేందుకే అలాఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తనతో వ్యవహరించిన తీరుపై తిలక్ వర్మ తాజాగా స్పందించాడు. ఐపీఎల్ వైబ్సైట్తో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్ భాయ్ ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. మరోవైపు.. నేనేమో ప్రశాంతంగా పనిచేసుకుపోయే రకం.అందుకే భాయ్ అప్పుడు నాలో కసిని పెంచాలని అలా చేశాడు. ‘నువ్వు చేయగలవు. నువ్విది చేస్తేనే మనం గెలుస్తాము’ అని నన్ను ఉత్సాహపరిచాడు. అందుకు నేనేమో.. ‘పర్లేదు.. ఇది జరిగితీరుతుంది. జట్టు కోసం చేయగలిగినదంతా చేస్తాను.. కచ్చితంగా చేస్తాను’ అని భాయ్కు చెప్పాను’’ అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2026లో తొలి ఐదు మ్యాచ్లలో తిలక్ వర్మ వరుసగా 20, 0, 14, 1, 8 స్కోర్లు చేశాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సమష్టి వైఫల్యంలో భాగంగా ఉన్న తిలక్పై కూడా విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ సెంచరీ ఇన్నింగ్స్తో తిలక్ బదులిచ్చినట్లు అయింది.చదవండి: టీమిండియాలోకి సంచలన ఫాస్ట్ బౌలర్
న్యూస్ పాడ్కాస్ట్
ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా... అమెరికా నౌకలపై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరణ..
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న పాపం ప్రతిపక్షాలదే... భ్రూణ హత్యతో పాపం మూటగట్టుకున్నాయి... ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
లోక్సభలో గట్టెక్కని మహిళా బిల్లు... అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు... మూడింట రెండొంతుల మెజారిటీ సాధనలో మోదీ సర్కారు విఫలం
డీలిమిటేషన్ దంగల్కు రంగం సిద్ధం... మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్
మత్స్యకారుల కడుపుపై తంతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు కుట్ర... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
చట్టసభల్లో చారిత్రక మలుపు... లోక్సభ స్థానాలు 850కి పెంపు... రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం... డిమాండ్లపై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్... అణ్వాయుధాలు, హార్మూజ్పైనే పీటముడి
ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు షురూ. మరో దఫా చర్చించే అవకాశం
బిజినెస్
టెస్లా మాస్టర్ ప్లాన్.. అందుకే భారత్లో ఉద్యోగాలు!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా కంపెనీ.. భారతదేశంలో నియామకాలను చేపడుతోంది. ఈ నియామకాలు కేవలం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు మాత్రమే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హార్డ్వేర్ ఇంజనీరింగ్, సప్లై చైన్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ రంగాలలో కూడా తన స్థాయిని విస్తరించాలనే లక్ష్యంతో చేపడుతోంది.ముంబై, ఢిల్లీ, పూణే, కొచ్చి, బెంగళూరులలో టెస్లా తన నియామకాలు చేపడుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న విషయాన్ని గమనిస్తే.. కంపెనీ భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్గా కాకుండా, తన గ్లోబల్ టెక్నాలజీ, ఉత్పత్తి వ్యవస్థలో భాగస్వామిగా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.భారీ పెట్టుబడులుటెస్లా ప్రస్తుతం ఏఐ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇవి ఏఎస్ఐసీ ఆర్టీఎల్ (ASIC RTL) డిజైన్ ఇంజనీర్లు, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్లు వంటి ఉద్యోగాలు, అటానమస్ డ్రైవింగ్, రోబోటిక్స్ కోసం అవసరమైన సిస్టమ్స్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి డోజో సూపర్ కంప్యూటర్ వంటి శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ సిస్టం పెద్ద స్థాయి న్యూరల్ నెట్వర్క్లను ట్రైన్ చేయడానికి ఉపయోగపడతాయి.తయారీ రంగంలో టెస్లాటెస్లా బ్యాటరీ తయారీకి సంబంధించిన నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC), లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP), గ్రాఫైట్ వంటి పదార్థాలపై పని చేసే ఇంజనీర్లను నియమిస్తోంది. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయాలనే సంస్థ లక్ష్యాన్ని చూపిస్తోంది. వైర్ హార్నెస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ వంటి భాగాల తయారీలో సరఫరాదారులతో కలిసి పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి సరఫరా వ్యవస్థను స్థానికంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసంపీసీబీ లేఅవుట్ ఇంజనీర్ల నియామకం ద్వారా వాహనాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, ఇన్ఫోటైన్మెంట్, కంప్యూటింగ్ హార్డ్వేర్ అభివృద్ధి జరుగుతుంది. అదే సమయంలో ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసం కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇది టెస్లా భారతదేశాన్ని తన గ్లోబల్ ఆపరేషన్లకు సాఫ్ట్వేర్ అభివృద్ధి కేంద్రంగా ఉపయోగించాలనే యోచనను సూచిస్తోంది.ఆపరేషన్స్, రిటైల్ప్రోటోటైప్ వాహనాలను నడిపి.. డేటా సేకరించే డ్రైవర్లు, అలాగే సేల్స్, సర్వీస్ ఉద్యోగులు నియామకాలు కూడా జరుగుతున్నాయి. ఇవి టెస్లా భారతదేశంలో తన రిటైల్ కార్యకలాపాలను ప్రారంభించడానికి చేస్తున్న ఏర్పాట్లను చూపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే టెస్లా భారతదేశంలో చేస్తున్న నియామకాలు కేవలం కార్ల అమ్మకాలకే పరిమితం కాకుండా, ఏఐ, తయారీ, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, సరఫరా గొలుసు వంటి విభిన్న రంగాలలో సమగ్ర స్థాయిలో విస్తరించాలనే ప్రణాళికను తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు!
ప్రపంచంలోనే టాప్ కంపెనీకి కొత్త బాస్
ప్రపంచంలోనే నం 1 టెక్ కంపెనీ యాపిల్ తన నాయకత్వంలో మార్పులు ప్రకటించింది. దశాబ్ద కాలానికిపైగా సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్ ఈ ఏడాది చివర్లో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన వారసుడిగా ప్రస్తుతం హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగం బాధ్యతలు చూస్తున్న జాన్ టెర్నస్ సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు. అదే సమయంలో యాపిల్ చిప్ డిజైన్లలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జానీ స్రూజీకి సంస్థ అత్యంత కీలకమైన చీఫ్ హార్డ్వేర్ ఆఫీసర్ బాధ్యతలను అప్పగించింది. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా టిమ్ కుక్సుమారు రెండు దశాబ్దాలుగా యాపిల్లో అంతర్భాగంగా ఉన్న జాన్ టెర్నస్ ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఫ్లాగ్షిప్ ఉత్పత్తుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. టిమ్ కుక్ వారసుడిగా ఆయన ఎంపిక సంస్థ అంతర్గత వారసత్వ ప్రణాళికలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో టెర్నస్ సీఈఓగా బాధ్యతలు చేపడతారు. పదవీ విరమణ తర్వాత కుక్ పూర్తిగా తప్పుకోకుండా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉంటూ దిశానిర్దేశం చేయనున్నారు.హార్డ్వేర్ చీఫ్గా జానీ స్రూజీయాపిల్ చిప్ల సృష్టికర్తగా పేరొందిన జానీ స్రూజీ పాత్ర ఇప్పుడు మరింత విస్తృతమైంది. ఇప్పటివరకు హార్డ్వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన ఇకపై చీఫ్ హార్డ్వేర్ ఆఫీసర్ హోదాలో పూర్తిస్థాయి హార్డ్వేర్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. ఈ హోదాలో ఆయన బాధ్యతలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!స్రూజీ పర్యవేక్షణలో ఉండే విభాగాలుసిలికాన్, ప్రాసెసర్లు: ఏ-సిరీస్ (iPhone), ఎం-సిరీస్ (Mac) చిప్ల అభివృద్ధి.డిస్ప్లేలు, కెమెరా సెన్సార్లు, బ్యాటరీ టెక్నాలజీ, స్టోరేజ్ కంట్రోలర్లు.సెల్యులార్ మోడెమ్ల తయారీ, ఇంటిగ్రేషన్.
ఉలుకు పలుకు లేని ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఇతరుల ఆకాంక్షలకు బందీ కావొద్దు!
‘మీ సమయం పరిమితం. కాబట్టి వేరొకరి జీవితం కోసం దాన్ని వృథా చేయవద్దు’ అని స్టీవ్ జాబ్స్ చెప్పిన మాట నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో మరింత ఎక్కువగా వినిపిస్తోంది. సమాజం నిర్ణయించిన బాటలోనే నడవాలా? లేక మనకంటూ ఒక కొత్త పంథాను నిర్మించుకోవాలా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టీవ్జాబ్స్ తత్వాన్ని విశ్లేషిస్తూ ప్రత్యేక కథనం.పరిమిత సమయం.. అపరిమిత లక్ష్యాలుజీవితం అనేది ఒకసారి మాత్రమే లభించే అవకాశం. స్టీవ్ జాబ్స్ తన కోట్లో ‘సమయం పరిమితం’ అని నొక్కి చెప్పడంలో అంతరార్థం ఏమిటంటే.. మరణం అనేది తథ్యం, కాబట్టి ఉన్న కొద్ది కాలంలోనే మనం ఎంచుకున్న రంగంలో ప్రత్యేకంగా నిలవాలి. కెరీర్ ఎంపికల నుంచి వ్యక్తిగత నిర్ణయాల వరకు మనకు నచ్చని పనులను కేవలం ఇతరుల కోసం చేస్తూ పోతే మన అంతరాత్మను చంపుకున్నట్లే.మన దేశంలో ముఖ్యంగా విద్య, వృత్తి పరమైన విషయాల్లో కుటుంబం, సమాజం ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి. ఫలానా చదువే చదవాలి, ఫలానా ఉద్యోగమే చేయాలి అనే నిబంధనల మధ్య వ్యక్తిత్వం మరుగున పడిపోతోంది. స్టీవ్ జాబ్స్ ఈ విధానాన్ని తీవ్రంగా ఖండించారు. ‘ఇతరుల సలహాలను వినడం తప్పు కాదు, కానీ వాటిని విమర్శనాత్మకంగా అంచనా వేయాలి. సమాజం నిర్ణయించిన విజయ సూత్రాలను ప్రశ్నించినప్పుడే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి’ అన్నారు.స్వీయ అవగాహన.. విజయానికి తొలిమెట్టుమన బలాలు ఏంటి? బలహీనతలు ఏంటి? మనకు అసలు ఏం కావాలి? అనే విషయాలపై స్పష్టత లేనప్పుడు ఇతరుల అభిప్రాయాలే మన నిర్ణయాలను శాసిస్తాయి. స్వీయ అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే బాహ్య ఒత్తిళ్లను తట్టుకొని నిలబడగలడు. సోషల్ మీడియా యుగంలో తోటివారిని పోల్చుకొని బతుకుతున్న నేటి యువతకు తమను తాము తెలుసుకోవడం అత్యంత అవసరం.స్టీవ్ జాబ్స్ జీవితం ఆచరణాత్మక పాఠంజాబ్స్ జీవితమే ఆయన సిద్ధాంతానికి నిదర్శనం. రీడ్ కాలేజీ నుంచి డ్రాపౌట్ అయినప్పటికీ కాలిగ్రఫీ వంటి కోర్సులను నేర్చుకోవడం ద్వారా డిజైనింగ్లో కొత్త ఒరవడిని సృష్టించారు. యాపిల్ సంస్థ నుంచి బహిష్కరణకు గురైనా నీరసించకుండా ‘నెక్స్ట్’, ‘పిక్సర్’ వంటి సంస్థలను స్థాపించి మళ్లీ శిఖరాగ్రానికి చేరారు.నిర్ణయాధికారానికి కావాల్సిన నైపుణ్యాలుభావోద్వేగాలకు లోనుకాకుండా వాస్తవాలను విశ్లేషించడం.పరిస్థితులు మారినప్పుడు మనల్ని మనం మలచుకోవడం.వైఫల్యాలు ఎదురైనప్పుడు విశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగడం.‘డిజైన్ అంటే కేవలం అది ఎలా కనిపిస్తుంది అనేదే కాదు, అది ఎలా పనిచేస్తుంది అనేదే ముఖ్యం’ అని జాబ్స్ అన్నట్లుగా.. మన జీవితం కూడా బయటకు ఎలా కనిపిస్తుందనే దానికంటే, లోపల మనమెంత తృప్తిగా ఉన్నామనేదే ముఖ్యం. నిరంతరం నేర్చుకుంటూ, మనకంటూ ఒక సొంత మార్గాన్ని ఏర్పరచుకోవడమే స్టీవ్ జాబ్స్కు మనం ఇచ్చే నిజమైన నివాళి.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
ఫ్యామిలీ
ఆలయాన్ని తలపించే కేఫ్..! ఏకంగా ప్రపంచంలోనే..
ఎన్నో కేఫ్లు చూసుంటాం. ఇలాంటి కేఫ్ చూసే ఛాన్సే లేదు. ఎందుకంటే..మనసుకి హాయినిచ్చే ఆధ్యాత్మికత, కడుపు నింపే కమ్మని భోజనం ఒకే చోట లభించే హోటల్ లేదా రెస్టారెంట్ గురించి ఇంతవరకు చూడలేదు. అలాంటి అపురూపమైన దృశ్యం ఆ కేఫ్లో చూడొచ్చు. ఆలయానికి వెళ్తున్నామా లేక కేఫ్కి వెళ్తున్నామా అనే గందరగోళానికి గురి చేసే అద్భుతమైన కేఫ్ ఇది. ఎక్కడ ఉందంటే..బొమ్మసంద్రలోని బెంగళూరు కొత్త రామేశ్వరం కేఫ్, 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో 'ప్రపంచంలోనే అతిపెద్ద కేఫ్'గా అలరారుతోంది. ఇందులో 600 మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉంది. ఆదియోగి విగ్రహంతో కూడిన ఒక జలాశయం కూడా ఉంది. బొమ్మసంద్రలో రామేశ్వరం కేఫ్ సరికొత్త అతిపెద్ద అవుట్లెట్తో బెంగళూరు పాక ప్రపంచాన్ని ఓ రేంజ్కి తీసుకెళ్లింది. ఆలయ ప్రాంగణాన్ని తలపించే ప్రవేశ ద్వారం అత్యంత ఆకర్షణీయంగా ఆకట్టుకుంటుంది. అతిథులు రాగానే, మధ్యలో ఆదియోగి విగ్రహం, ఫౌంటెన్తో కూడిన ప్రశాంతమైన జలాశయం వారికి స్వాగతం పలుకుతుంది. దక్షిణ భారత దేవాలయ వాస్తుశిల్పాన్ని ఆధునికతను జోడించి..భోజనాన్ని కేవలం ఒక పూట భోజనంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక ఆచారంగా అందంగా మార్చారు. 'దైవ స్పర్శ' అనే థీమ్తో ఈ కేఫ్ని నిర్మించారట. ఈ కేఫ్లో హైలెట్గా దేవి లింగ భైరవి ఆలయం, అలాగే కర్ణాటక వారసత్వానికి ప్రతీక అయిన భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు, వీణా కచేరీలతో సహా సంగీత ప్రదర్శనల కోసం రూపొందించిన ఒక యాంఫీథియేటర్ కూడా ఉంది. అలాగే అక్కడ సేవ కౌంటర్ల వద్ద విత్ర చిహ్నాల క్లిష్టమైన చెక్క శిల్పాలు చూపురులను ఆకర్షిస్తాయి. ఇక్కడ ఒక ప్రత్యేక గోశాల కూడా ఉంది. ఆధ్యాత్మిక దృశ్యాలను ప్రదర్శించే హై-టెక్ డిజిటల్ స్క్రీన్లు, పురాతన రాతి విగ్రహాల వైభవంతో చాలా అందంగా తీర్చిదిద్దారు. 'ది రామేశ్వరం కేఫ్' వ్యవస్థాపకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఈ భారీ ప్రాజెక్ట్ వెనుక ఉన్న తత్వాన్ని గురించి వెల్లడించారు. ఇది సంస్కృతి, నమ్మకం, ఆహారం ఏకమై ఉండే ఒక ప్రదేశాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఇలా కేఫ్ని తీర్చిదిద్దామని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అంతేగాదు పోస్ట్లో రామేశ్వరం కేఫ్ ఇలా పేర్కొంది. ఇక్కడ ప్రతి దేవాలయం, ప్రతి విగ్రహం, ప్రతి వివరం ఒక ఉద్దేశ్యంతోనే ఉంచాం. కేవలం సర్వీస్ మాత్రమే కాదు సంస్కృతి, నమ్మకం, ఆహారం కలగలిసిన అనుభూతికి కేంద్రబిందువుగా ఒక దేవాలయ అనుభూతిని తీసుకొచ్చే.. ఒక దివ్యమైన భోజన అనుభవం అని ప్రకటించింది. View this post on Instagram A post shared by Aditya Raj | Dev & Creator (@addywithlens) (చదవండి: లండన్ వ్లాగర్ మదిని దోచిన వంటకం..! అత్యంత ఆరోగ్యకరం కూడా..)
వృథా కానీ ఎకనమీగా వెదురు.. సాగు ఒక్కటే చాలదు!
వెదురు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఔషధ గుణాల దగ్గరి నుంచి సౌందర్య సాధనాల తయారీలోనూ దీని వినియోగిం పెరిగింది. దీంతో భారత్ సహా చాలా దేశాలు సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. అయితే పంటకు ప్రాముఖ్యత ఇచ్చినంత మాత్రన సరిపోదంటున్నారు శాస్త్రవేత్తలు. వెదురు విప్లవం సాగుకే పరిమితం కాకూడదని, దాన్నో ఎకానమీగా మారాలంటే రీసెర్చ్ అవసరమని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతిఆయోగ్)–ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఆదర్శ గౌడ. మరి అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం..వెదురు ఇండస్ట్రీని తీసుకురావాలంటే.. కేవలం భావోద్వేగ ప్రచారాలు, హ్యాష్ ట్యాగులు కాదని.. రీసెర్చులు జరిగితేనే ఆ పరిశ్రమలు నిలబడతాయని చెబుతున్నారు ఆదర్శ గౌడ. ఆ అవసరం ఎందుకో ఆయన వివరించారు. ఐరన్ వెదురు (Guadua) షూట్స్లోని చేదు రుచి కారణమైన బయో–యాక్టివ్ ఫ్లేవనోయిడ్లు, ఫెనాలిక్ కంపౌండ్లు, ప్రాసెసింగ్ చేయకపోతే హానికరమైన సైనోజెనిక్ గ్లైకోసైడ్లను సూచిస్తుందని చెబుతున్నారాయన. ఈ చేదులో ఆంటీ–డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయని.. రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడే ఫంక్షనల్ ఫుడ్గా నిలిచే అవకాశాలు ఉన్నప్పటికీ, శాస్త్రీయ ధృవీకరణ, సేఫ్ ప్రాసెసింగ్ కీలకమని ఆయన హెచ్చరించారు.అలాగే ఐరన్ వెదురులో తక్కువ సిలికా కంటెంట్ ఉండటంతో ఎకో–టూరిజం పార్కులు, వినోద అరణ్యాలు వంటి పర్యావరణ హితమైనవి తీసుకురావొచ్చని అన్నారు. దీంతోపాటు వెదురు ఫైబర్తో తయారయ్యే ఎండీఎఫ్ బోర్డులు రైలు మార్గాల సౌండ్ బ్యారియర్లు, భవనాల ఇన్సులేషన్, అకౌస్టిక్ ప్యానెల్స్ వంటి రంగాల్లో భారీ మార్కెట్ను ఆకర్షించే సామర్థ్యం ఉందన్నారు. అలాగే వెదురు ఆకులు, కొమ్మలతో తయారయ్యే బయోడిగ్రేడబుల్ ఎగ్ ట్రేస్, ప్లేట్లు, ప్యాకేజింగ్ పల్ప్ ప్లాస్టిక్కి అడ్డుకట్ట వెయ్యొచ్చు. పైగా అగ్రికల్చరల్ వ్యర్థాన్ని ఆదాయంగా మార్చే గొనంన అవకాశం కూడా అని అన్నారు. ఆఖరికి వెదురు ఆకులు, కొమ్మలతో తయారయ్యే బయోడిగ్రేడబుల్ ఎగ్ ట్రేస్, ప్లేట్లు, ప్యాకేజింగ్ పల్ప్ ప్లాస్టిక్కి అడ్డకట్ట వెయ్యొచ్చుని చెప్పారు. అలాగే వెదురు షూట్స్(తినదగిని వెదురు లేత రెమ్మలు) స్నాక్స్గా, ఫ్లవర్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, అలాగే టెక్స్టైల్ ఫైబర్లు, పశువుల మేత, మెడికల్ ఎక్స్ట్రాక్టుల వరకు దీన్ని విస్తరించవచ్చని చెబుతున్నారు. ఇవన్నీ జరగాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ వల్లే సాధ్యమని, ఇది కేవలం ల్యాబ్ కాదని పరిశ్రమకు బ్రెయిన్ లాంటిదని చెబుతున్నారు. ఈ సెంటర్ ద్వారా ఉపయోగాలేంటంటే..ఎలాంటి చోట వెదురు పెంచాలో రైతులకు చెప్పడంఎలాంటి వెదురు మొక్కలను పెంచాలో రైతులకు సూచనలు ఇవ్వడం..ఏ పొడక్ట్లకు మార్కెట్ సుస్థిరమో ఇన్వెస్టర్లకు క్లారిటీ ఏ రంగాల్లో సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలో ప్రభుత్వానికి గైడ్స్టాండర్డ్స్, క్వాలిటీ కంట్రోల్, పేటెంటబుల్ ఇన్నొవేషన్లు సిస్టమాటిక్గా బయటకు రావడంఅంతేగాదు ఈ ఆర్ అండ్ డీ సెంటర్ వల్ల నేరుగా ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ప్రోడక్ట్ డెవలపర్లు, డేటా అనలిస్టులకు ఉద్యోగాలు వస్తాయని, పక్కనే రైతులు, ఇండస్ట్రీ వర్కర్లు, లాజిస్టిక్స్, మార్కెటింగ్, ఎక్స్పోర్ట్ రంగాల్లో కూడా కొత్త ఉపాధి అవకాశాలు తెరుచుకుంటాయని తెలిపారు. ఇది “లైవ్లీహుడ్ ప్రాజెక్ట్” స్థాయిలో ఉండే వెదురు సాగును, నిజమైన ఆర్థిక రంగంగా మారుస్తుందని డా. గౌడ అభిప్రాయపడ్డారు. అందువల్ల వీటిని సాగు ఒక్కటే భవిష్యత్తు కాదని, మరింత లోతుగా అధ్యయనం చేయడం దాని వాల్యూ తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు. అందువల్ల ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో వెదురు విప్లవం మొదలైంది. గ్రామీణ సమాజాన్ని పేదరికం నుంచి బయటపడేసే హీరోగా, భూమిని రక్షించే మొక్కగా, అలాగే నిర్మాణ రంగానికి ఆయువు పట్టుగా కీర్తిస్తున్నారు. అలాంటి వెదురు కలప పరిశ్రమ వాస్తవికతలోకి రావాలంటే పరిశోధనల్లో పెట్టుబడులు పెడితేనే సాధ్యమని లేదంటే ప్రచారంగానే మిగిలిపోతుందని హెచ్చరించారాయన.(చదవండి: ముంచుకొస్తున్న వ్యవసాయ, ఆహార విపత్తు! ఎఫ్ఏఓ ఆందోళన)
కండలు తిరిగిన దేహంతో నిర్మాణ కార్మికుడు..! కేవలం ఆ ఆహారంతోనే..
సల్మాన్లాంటి శరీరాకృతి, కండలు తిరిగిన దేహం కోసం యువత ఎంతలా పరితపిస్తూ జిమ్లో కష్టపడుతుంటారో చూస్తుంటాం. కొందరు స్టెరాయిడ్ల వంటి షార్టకట్లను ఆశ్రయిస్తుంటారు. అలా ఉంటేనే తమకు క్రేజ్, స్టార్డమ్ అన్నట్లుగా ఫీలయ్యేవాళ్లు ఉన్నారు. కానీ ఓ సాధారణ భవన నిర్మాణ కూలీ కండలతిరిగి దేహంతో ఉండటం అనేది అత్యంత అరుదు. పైగా అంత పోషకాహారంతో కూడిన భోజనం తినే అవకాశం, వ్యాయామాలు చేసే అవకాశం ఉండదు. కానీ ఆ కార్మికుడిని చూస్తే మన ఆలోచన తీరు మారుతుంది. తనకున్న వనరుల రీత్యా..తన బాడీని ఎలా ఫిట్గా ఉంచాలో కేర్ తీసుకుంటూ కండలు తిరిగిన దేహంతో అబ్బురపరుస్తున్నాడు. అతడి అనుసరిస్తున్న డైటింగ్ విధానం, వర్కౌట్లు గురించి తెలిస్తే విస్తుపోతారు. అన్నింట్లకంటే ఆశ్చర్యకరమైనది అతడు జిమ్కే వెళ్లడట. అలాంటప్పడు అతడికి ఇంతలా కండలు పెంచడం ఎలా సాధ్యమైంది అంటే ..కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ తమిళరసన్ ఇటీవల ఓ చెన్నై కార్మికుడి శరీర సౌష్టవాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తమ మధ్య జరిగిన సంభాషణ మొత్తం వీడియో రూపంలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో భవన నిర్మాణ పనులు చేసే అతడికి ఇలాంటి దేహం ఎలా సాధ్యమైందని కుతూహలంతో అడుగడం సష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి తన శరీరాకృతికి సహాయపడిని వ్యాయామ దినచర్య, ఆహారపు అలవాట్లు గురించి కూడా ప్రశ్నిస్తాడు కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్. తాను నిర్మాణ కార్మికుడుగా మండుటెండలో తీవ్రమైన శ్రమతో కూడిన పనలు చేస్తుంటానని తెలిపాడు. తనకు రోజు కఠినమైన దినచర్య, ఎక్కువ పనిగంటలు ఉన్నప్పటికీ..వారానికి కనీసం ఐదుసార్లు వ్యాయామం చేసేలా చూసుకుంటానని చెప్పాడు. సోమవారం ఛాతీ వ్యాయామం, మంగళవారం భుజాల వ్యాయామం, బుధవారం వీపు వ్యాయామం, గురువారం బైసెప్స్, ట్రైసెప్స్ కోసం కేటాయిస్తుంటానని అన్నారు. శుక్రవారం కాళ్ల వ్యాయామం చేస్తుంటానని చెప్పారు. అతడు చేసేది శ్రమతో కూడిన పని కాబట్టి తీవ్రమైన కాళ్ల వ్యాయమాలు చేయనని అన్నారు. తన పనిలో కష్టపడ్డాక తన బాడీ కోసం ఎలా కేర్ తీసుకువాలో అలాగే దాన్ని ఎలా అమలు చేయాలో అనే దానిపై అతనికి ఉన్న స్పష్టత స్ఫూర్తిని కలిగిస్తోంది. డైటింగ్..కండలు తిరిగిన దేహం కోసం ప్రయత్నిస్తున్న వారికి అధిక కార్బోహైడ్రేట్ల ఆహారం సాధారణంగా ప్రతికూల ఫలితాలనిస్తుందని భావిస్తారు. అందుకే వాళ్లంతా తరుచుగా ప్రోటీన్ అధికంగా ఉండే భోజనాన్ని ఎంపిక చేసుకుంటారు. కానీ చెన్నైకి చెందిన ఈ నిర్మాణ కార్మికుడు అందుకు భిన్నంగా ఎంచుకోవడం విశేషం. అతడికి వృత్తిపరంగా అధిక కార్బోహైడ్రేట్లు అవసరం. అందుకే రోజుకు మూడుసార్లు అధిక కార్బోహైడ్రేట్లు ఉండే భోజనాన్ని ఎంచుకుంటాడు. అందులో అన్నం, అరటిపండ్లు, గంజి ఉంటాయి. పండ్లు తినడం కూడా అరుదని చెప్పాడు. అయితే వారానికి ఒకసారి మాంసాహారం తింటానని చెప్పాడు. తాను చికెన్ లేదా చేపలు మాత్రం తీసుకోనని చెప్పుకొచ్చాడు. అలాగే తాను కండలు కోసం ఎలాంటి స్టెరాయిడ్లు తీసుకోలేదని వెల్లడించాడు. అలాగే ఎలాంటి వాణిజ్య డైట్ప్లాన్లు లేదా వే ప్రోటీన్లు గానీ తీసుకోనని, కేవలం శుభ్రమైన ఆహారమే తీసుకుంటానని అన్నారు. ప్రతిరాత్రి కనీసం ఏడు గంటలు నిద్రపోయేలా చూసుకుంటానని చెప్పారు. తాను ఇంట్లో వండిన ఆహారమే తింటానని అన్నాడు. చివరగా అందర్నీ జండ్ ఫుడ్ తినొద్దని, మధ్యం, ధూమపానానికి దూరంగా ఉండమని సూచించాడు. ఆ కార్మికుడు నిబద్ధత ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది, పైగా అతడిని చూస్తే..ఏ పనైనా నూటికి నూరు శాతం కష్టపడితే సాధ్యం కానిది అంటూ ఉండదు అని చెబుతోంది కదూ అంటూ వీడియోని ముగిస్తాడు కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ ..!. View this post on Instagram A post shared by Jayachandran Tamilarasan (@fit.blog.by.jc) (చదవండి: దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం)
రామ చరిత మానసం
బంగారు వ్యాపారం చేసే ఒక యువకుడు తన భార్యా బిడ్డలతో కలిసి అయోధ్య వెళ్ళదలిచాడు. మూడు నెలల ముందే రైలు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రయాణించే రోజు రానే వచ్చింది. భార్యా పిల్లలతో పాటు లగేజీ తీసుకుని రైల్వే స్టేషన్ చేరాడు. వారు ఎక్కాల్సిన రైలు వచ్చి ప్లాట్ మీద ఆగింది. వెంటనే పిల్లల్ని ఎక్కించి తను ఎక్కాడు.భార్య ప్లాట్ ఫాం మీద నిలబడి ఒక్కొక్క లగేజీ అందిస్తోంది. అతడు అందుకుంటున్నాడు. ఇంతలో రైలు కదిలింది. భార్య ప్లాట్ ఫాం మీదనే ఉంది. అమ్మకోసం పిల్లలు ఏడవటం ప్రారంభించారు. అతడిలో గాబరా మొదలయ్యింది. రైలు మరింత వేగం పుంజుకుంది. ఏం చేయాలో తెలియలేదు అతడికి. చైనులాగి రైలు ఆపమని తోటి ప్రయాణీకులు కొందరు సలహా ఇచ్చారు. అతడు అలాగే చేశాడు.రైలు ఆగింది. భార్య పరుగులు తీస్తూ వచ్చి రైలు పెట్టెలోకి వచ్చి చేరింది. వారి పక్క సీటులోనే ఒక వృద్ధ జంట కూర్చుని ఉంది. వృద్ధుడు సుందరకాండ చదువుతూ ఉన్నాడు. వృద్ధురాలు– ‘మన పక్క సీటు ఆమె, రైలు ఎక్క లేకపోవడం, ఆమె భర్త చైను లాగడం లాంటి హడావుడి జరుగుతున్నా మీకు చీమ కుట్టినట్లు కూడా లేదు. రైల్వే సిబ్బంది కూడా వచ్చి వెళ్ళారు’ అని నిష్టూర పోయింది. ఆ వృద్ధుడు చిన్న నవ్వు నవ్వి ‘అంతా గమనించాను. ఈ యువకుడు భక్తి భావంతో అయోధ్యకు బయలుదేరాడు కానీ, రామ చరిత మానసం చదివినట్లు లేడు’ అన్నాడు. పక్కనే ఉన్న ఆ యువకుడు ‘అలా అంటున్నారేమిటి? దానికీ దీనికీ సంబంధం ఏమిటి?’ అని ప్రశ్నించాడు. యువకుడి కళ్ళలోకి చూస్తూ ఆ వృద్ధుడు ‘అరణ్య వాసం వెళ్ళేటప్పుడు గంగానది దాటే సమయంలో పడవలోకి మొదటగా సీతను, తర్వాత లక్ష్మణుడినీ ఎక్కించి ఆ తర్వాత రాముడు ఎక్కుతాడు. మనం రామాయణం చదివితే ఇలాంటి మంచి మంచి సూక్ష్మ విషయాలెన్నో తెలుసుకోవచ్చు. వాటిని మన నిత్యజీవితంలోకి అన్వయించుకుని సుఖమైన జీవితాన్ని అనుభవించవచ్చు’ అన్నాడు. ‘నిజమే... ఎప్పుడూ రైలు ప్రయాణాల్లో ఆడవారిని మొదటగా ఎక్కించి మగవారు ఆ తర్వాత ఎక్కాలి. చీరలు కట్టుకునే స్త్రీలు రైలు వెనుక పరుగులు తీసి వాహనాన్ని అందుకోలేరు కదా’ అని వృద్ధురాలు హితవు మాటలు చెప్పింది.అప్పుడు గుర్తుకొచ్చింది ఆ యువకుడికి– చాలా నెలల క్రితం గోస్వామి తులసీదాస్ రచించిన రామ చరిత మానసం తెలుగు అనువాదం ఇంట్లో తెచ్చి పెట్టుకున్న విషయం. ప్రయాణం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా చదివి తీరాలని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాడు. అందరూ రామ నామ స్మరణలు చేస్తూ అయోధ్య ప్రయాణం కొనసాగించారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు
అంతర్జాతీయం
అగ్రరాజ్యంతో అదిరిపోయే డీల్.. భారత్కు బహుళ ప్రయోజనం!
న్యూఢిల్లీ: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైంది. అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య, రక్షణ, సాంకేతిక రంగాలలో కొత్త శకానికి నాంది పలుకుతూ, వాషింగ్టన్ డీసీ వేదికగా జరుగుతున్న తాజా చర్చలు అత్యంత వేగంగా, విజయవంతంగా ముగింపు దశకు చేరుకున్నాయి.ముగింపు దశలో కీలక చర్చలువాషింగ్టన్ డీసీలో భారత్, అమెరికా ప్రతినిధుల మధ్య జరుగుతున్న తాజా వాణిజ్య చర్చలు అత్యంత సానుకూలంగా, ఉత్పాదక దిశగా కొనసాగుతున్నాయని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక చర్చల్లో భారత బృందానికి దర్పణ్ జైన్ నాయకత్వం వహిస్తుండగా, అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం తరపున బ్రెండన్ లించ్ నేతృత్వం వహిస్తున్నారు. ఒప్పందానికి సంబంధించిన ప్రధాన సమస్యలన్నీ ఇప్పటికే పరిష్కారమయ్యాయని, కేవలం కొన్ని చిన్నపాటి అంతరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు తెలిపారు. ‘ఎక్కువ భాగం పూర్తయింది, ఇక మిగిలి ఉన్నవి చాలా తక్కువే’ అని వారు పేర్కొన్నారు.ఇరు దేశాలకు భారీ ప్రయోజనంఈ వాణిజ్య ఒప్పందం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతగానో మేలు చేస్తుందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిని ఇరువురికి లాభదాయకమైన ‘విన్-విన్’ ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. సుంకాలు తగ్గించడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా చాలా కాలంగా ఈ చర్చలు సాగుతున్నాయి. కాగా తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్పై ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు దేశాలు అంగీకారం తెలపడం ఈ డీల్లో కీలక ముందడుగు.భవిష్యత్తును మార్చేలా బహుముఖ బంధంఈ ఒప్పందంలో భారతదేశ ప్రయోజనాలను పూర్తిగా కాపాడామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. మొదటి దశ ఒప్పందం దాదాపు సిద్ధమైందని తెలిపిన ఆయన.. పోటీ దేశాలతో పోలిస్తే ఇది అత్యుత్తమ డీల్స్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడగలదని అన్నారు. భారత్-అమెరికా సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాదని, సాంకేతికత, కీలక ఖనిజాలు, రక్షణ రంగాలలో భాగస్వామ్యంతో కూడిన బహుముఖ బంధమని ఆయన పేర్కొన్నారు. ఇది భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే రెండు బలమైన దేశాల కలయిక అని అన్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ సంచలన వార్నింగ్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
ఇరాన్కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
ఇరాన్, అమెరికా యుద్ధంలో నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేశాల దృష్టి హార్మూజ్ జలసంధిపైనే ఉంది. జలసంధిని తెరిచి నౌకల రాకపోకలు జరగాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. కానీ, ఇరాన్ మాత్రం.. హార్మూజ్ అంతర్జాతీయ జలమార్గం కాదని.. అది తమ భూభాగానికి చెందిన సముద్ర ప్రాంతమంటూ కొత్త పలుకు ఎత్తుకుంది. అందువల్ల నౌకలు వెళ్లడానికి ఇరాన్ అనుమతి అవసరమని, అలాగే టోల్ వసూలు చేసే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. ఇలాంటి తరుణంలో మొట్టమొదటి సారిగా హార్మూజ్ అంశంపై ఇరాన్ మిత్ర దేశం చైనా స్పందించింది. ఇరాన్కు షాక్ ఇచ్చే విధంగా జిన్పింగ్ వ్యాఖ్యానించారు.హార్మూజ్పై ఇరాన్ వ్యాఖ్యల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా జిన్పింగ్.. హర్మూజ్ను అంతర్జాతీయ జలమార్గంగా అభివర్ణించారు. హార్మూజ్ జలసంధిని సాధారణ రాకపోకలకు తెరిచి ఉంచాలి. వెంటనే జలసంధిని తెరవాలని ఇరాన్కు సూచించారు. ఇది ప్రాంతీయ దేశాలు, అంతర్జాతీయ సమాజ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. తక్షణ, సమగ్ర కాల్పుల విరమణను చైనా సమర్థిస్తుందన్నారు. శాంతిని పునరుద్ధరించడానికి దోహదపడే అన్ని ప్రయత్నాలకు చైనా మద్దతు ఇస్తుంది. రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని సూచిస్తోందని పేర్కొన్నారు. కాగా, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం, ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన తర్వాత చైనా అధ్యక్షుడు తొలిసారిగా ప్రకటన చేయడం విశేషం.అయితే, హార్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియాలో తీవ్రమైన ఇంధన కొరతకు దారితీసింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇరాన్ చమురును ప్రధానంగా దిగుమతి చేసుకునే చైనా, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది.నౌకపై దాడులు.. చైనా ఆందోళనమరోవైపు అమెరికా నావికా దిగ్బంధాన్ని ధిక్కరిస్తూ, చైనా నుంచి ఇరాన్ ఓడరేవుకు వెళ్తున్న ఒక సరకు రవాణా నౌకపై అమెరికా నేవీ కాల్పులు జరపడంపైనా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటాయని, ఘర్షణలను రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలను పెంచడం వంటివి మానుకుంటాయని భావిస్తున్నాం. అలాగే హార్మూజ్ జలసంధిలో సాధారణ నౌకాయానాన్ని పునఃప్రారంభించడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తాయని మేము ఆశిస్తున్నాం’ అని పేర్కొంది.హార్మూజ్ మూసివేతతో చైనాకు నష్టాలు👉ఎనర్జీ సరఫరా అంతరాయం: చైనా క్రూడ్ ఆయిల్లో సుమారు 50% గల్ఫ్ దేశాల నుండి వస్తుంది. హార్మూజ్ మూసివేయడం లేదా దాడులు పెరిగితే, చైనాకు రోజుకు లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా ఆగిపోతుంది.👉ఆర్థిక ప్రభావం: ఇంధన ధరలు పెరగడం వల్ల చైనా పరిశ్రమలు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. ఇది GDP వృద్ధిని మందగింపజేస్తుంది. చైనా ఆర్థిక వృద్ధి 0.5–1% వరకు తగ్గే అవకాశం ఉంది.👉వాణిజ్య నష్టం: ఇరాన్, గల్ఫ్ దేశాలతో చైనా వాణిజ్యం 40–50% వరకు తగ్గింది. ఇది చైనా ఎగుమతులు, దిగుమతులపై నేరుగా ప్రభావం చూపుతోంది. వాణిజ్యం తగ్గడం వల్ల చైనాకు బిలియన్ల డాలర్ల నష్టం జరుగుతుంది.👉జియోపాలిటికల్ ఒత్తిడి: అమెరికా-ఇరాన్ ఘర్షణల కారణంగా హార్మూజ్ అస్థిరత పెరిగింది. చైనా తన నౌకలు, వాణిజ్య మార్గాలను రక్షించుకోవడానికి అదనపు ఖర్చు పెట్టాలి.చైనా ప్రధాన ప్రత్యామ్నాయ మార్గాలు..1. పైప్లైన్లురష్యా–చైనా పైప్లైన్లు: సైబీరియా నుండి చైనాకు నేరుగా ఆయిల్, గ్యాస్ సరఫరా.మధ్య ఆసియా పైప్లైన్లు: కజకిస్తాన్, టుర్క్మెనిస్తాన్ నుండి గ్యాస్ సరఫరా. ఇవి హార్మూజ్ మీద ఆధారాన్ని తగ్గిస్తాయి.2. ఆర్కిటిక్ సముద్ర మార్గంరష్యా "నార్తర్న్ సీ రూట్" ద్వారా చైనాకు ఆయిల్, LNG సరఫరా పెరుగుతోంది. ఈ మార్గం హార్మూజ్, మలక్కా వంటి "చోక్పాయింట్"లను తప్పించగలదు.3. స్ట్రాటజిక్ రిజర్వులుచైనా వద్ద 90 రోజులకు సరిపడే ఆయిల్ రిజర్వులు ఉన్నాయి. హార్మూజ్ మూసివేత వంటి తక్షణ షాక్లను ఎదుర్కోవడానికి వీటిని ఉపయోగిస్తోంది.4. ఎనర్జీ డైవర్సిఫికేషన్పునరుత్పాదక శక్తి (సోలార్, విండ్)లో భారీ పెట్టుబడులు.సూపర్గ్రిడ్ ప్రాజెక్ట్: దేశీయ విద్యుత్ ఉత్పత్తి పెంచి, ఆయిల్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటోంది.
వైరల్ వీడియో: గురుద్వారాలో తుపాకీ కాల్పులు.. పెప్పర్ స్ప్రే..
బెర్లిన్: జర్మనీలోని మోయర్స్ (Moers) నగరంలోని డ్యూయిస్బర్గ్ ప్రాంతంలోని ఓ గురుద్వారాలో చోటుచేసుకున్న ఘర్షణలో 11 మంది గాయపడ్డారు. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. సుమారు 40 మంది ఈ ఘర్షణలో పాల్గొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జర్మనీ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కత్తులు, పెప్పర్ స్ప్రేతో పాటు తుపాకీని కూడా వాడినట్లు సమాచారం.ప్రాథమిక సమాచారంలో ప్రకారం గురుద్వారా కొత్త పాలక మండలి ఎన్నికల విషయంలో తలెత్తిన విభేదాలే ఈ ఘర్షణకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. గురుద్వారా నిధుల నిర్వహణ, ఆ నిధులపై పట్టు సాధించేందుకు వివిధ వర్గాల మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. "ఇది ముందే ప్లాన్ చేసినట్లు ఉంది. ప్రార్థనలు మొదలవ్వడానికి కొద్దిసేపటి ముందే, దాడి చేసిన వారు అకస్మాత్తుగా పెప్పర్ స్ప్రే కొట్టారు. ఆ తర్వాత ఒకరు పిస్టల్తో కాల్పులు జరిపారు. తాను అక్కడ కత్తులను కూడా చూశానని ఆయన తెలిపారు. ఈ ఘర్షణలో మొత్తం 11 మంది గాయపడగా.. పారా మెడికల్ సిబ్బంది వారికి అక్కడే చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ ఎవరి ప్రాణానికీ ప్రమాదం లేదు. పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఖాళీ బుల్లెట్ షెల్స్ లభించాయి. అవి 'బ్లాంక్-ఫైరింగ్ పిస్టల్' (శబ్దం మాత్రమే వచ్చే తుపాకీ) కి సంబంధించినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. ఆ తుపాకీ ఇంకా లభించలేదు.🤯🇩🇪 Shocking scenes from Gurdwara Duisburg, Germany:Sikhs fighting inside sacred space, turbans flying, kirpans drawn on each other over Golak money, and a forced takeover by the previous management, who lost the election.This violence isn't random. It's the direct result of… pic.twitter.com/47h4lni6w1— Allen Hampton (@Hamp_Allen) April 20, 2026
ట్రంప్ సంచలన వార్నింగ్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
వాషింగ్టన్: ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన అమెరికా-ఇరాన్ రెండో విడత శాంతి చర్చలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఓ వైపు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు, మరోవైపు ఏమాత్రం వెనక్కి తగ్గని ఇరాన్ మొండి పట్టుదలతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.ముగియనున్న డెడ్ లైన్ఇరు దేశాల మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగియనుంది. ఈ డెడ్ లైన్ సమీపిస్తున్నప్పటికీ జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందాన్ని తదుపరి చర్చల కోసం పాకిస్తాన్కు పంపాలని ట్రంప్ యోచిస్తున్నారు. అయితే అమెరికా తన కఠిన వైఖరిని మార్చుకుంటే తప్ప తాము చర్చల్లో పాల్గొనేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఇదే సమయంలో కాల్పుల విరమణను పొడిగించే అవకాశం లేదని ట్రంప్ స్పష్టం చేయడం గమనార్హం. ترامپ با اعمال محاصره و نقض آتشبس میخواهد تا به خیال خود این میز مذاکره را به میز تسلیم تبدیل کند یا جنگافروزی مجدد را موجّه سازد. مذاکره زیر سایهٔ تهدید را نمیپذیریم و در دو هفتهٔ اخیر برای رو کردن کارتهای جدید در میدان نبرد آماده شدهایم.— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 20, 2026ట్రంప్ సంచలన హెచ్చరికచర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, సైనికపరమైన చర్యలు కూడా ఉండొచ్చని డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. తమ లక్ష్యం కేవలం తాత్కాలిక శాంతి కాదని, ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్మూలించడమేనని ఆయన తెలిపారు. తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.బెదిరింపులకు భయపడం: ఇరాన్ఒత్తిడి తెచ్చి ఒప్పందాలకు తమకు ఒప్పించాలని చూస్తే అంగీకరించబోమని ఇరాన్ అధికారులు తేల్చిచెప్పారు. ‘అమెరికా బెదిరింపుల నీడలో మేము చర్చలు జరపబోము’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఖలీబాఫ్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. అవసరమైతే కొత్త వ్యూహాలతో బదులిస్తామని హెచ్చరించారు. మరోవైపు, ఈ పరిణామాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్తో సోమవారం చర్చించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్లో జరిగిన తొలి విడత చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిసిన నేపథ్యంలో తాజా పరిణామాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి.ఇది కూడా చదవండి: Manipur: తెల్లవారుజామున భారీ భూకంపం
జాతీయం
తెల్ల టవల్ జారిపోతే.. అధికారం ఊడినట్లేనా?
లక్నో: ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినప్పుడు అధికారుల కుర్చీలపై తళతళలాడే తెల్లటి టవల్స్ను ఎప్పుడైనా గమనించారా? ఇవి కేవలం పరిశుభ్రతకు మాత్రమే కాదు, ప్రభుత్వ వ్యవహారాల్లో ‘అధికారానికి నిదర్శనం’గా కూడా మారాయి. ఇంటర్నెట్లో నెటిజన్లను తీవ్రంగా ఆశ్చర్యపరుస్తున్న ఈ ‘తెల్ల టవల్’ సంస్కృతి వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన, వాస్తవిక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.అధికారానికి కేరాఫ్ అడ్రస్ప్రభుత్వ ఆఫీసుల్లో తెల్ల టవల్స్ను కేవలం ఒక వస్త్రంగా కాకుండా, ఒక అధికారిక చిహ్నంగా భావిస్తారు. కేతన్ అనే ఒక నెటిజన్ పెట్టిన ట్వీట్తో ఆన్లైన్లో ఈ చర్చ మొదలైంది. ఉన్నతాధికారులు తెల్లని టవల్స్ వేసిన కుర్చీలలో కూర్చుని దర్పాన్ని ప్రదర్శిస్తుంటే, చట్టసభలకు ఎన్నికైన తమకు అలాంటి ఆ గౌరవం దక్కలేదని ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు గతంలో ఫిర్యాదు చేసినట్లు ఆ నెటిజన్ తన పోస్ట్లో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.టవల్స్ కోసం అత్యవసర సమావేశంఈ టవల్స్ వ్యవహారం ఎంత తీవ్ర స్థాయికి వెళ్లిందంటే, 2024లో యూపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ దీనిపై ఏకంగా ఒక అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి వచ్చింది. ప్రభుత్వ ప్రొటోకాల్స్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా జరిగే అధికారిక సమావేశాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం అధికారులతో సమానంగా తెల్లటి టవల్స్ కప్పిన కుర్చీలనే ఖచ్చితంగా కేటాయించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.వారానికి వెయ్యికి పైగా టవల్స్ మార్పుఈ తెల్ల టవల్స్ వినియోగం ఏ స్థాయిలో ఉందో లక్నోలోని ఉత్తరప్రదేశ్ సచివాలయాన్ని చూస్తే అర్థమవుతుంది. అక్కడ ఏకంగా వారానికి రెండు సార్లు (సోమవారం, గురువారం) కుర్చీలపై ఉన్న దాదాపు 1,000 టవల్స్ను మారుస్తుంటారని సమాచారం. ప్రస్తుత ఆధునిక కాలంలోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలకు టవల్ వేసే ఆచారం కొనసాగుతుండటం ఉండటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఇది కూడా చదవండి: ‘ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ
‘టీవీకే’ రోబోను చూశారా? సందడి మాములుగా లేదుగా!
చెన్నై: కోయంబత్తూరులో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. రోబోతో ఓట్ల వేట మొదలుపెట్టింది. టీవీకే కండువా ధరించిన ఒక రోబోను రంగంలోకి దించారు. సౌత్ చెన్నై అభ్యర్థి సెంథిల్ కుమార్కు మద్దతుగా రోబో ప్రజలకు అభివాదం చేస్తూ.. వారితో కరచాలనం చేస్తూ సందడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత విజయ్ క్షేత్రస్థాయి ప్రచారంలో తక్కువగా పాల్గొంటుండటంతో అభ్యర్థులు వినూత్న పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు తిరువెరుంబూర్లో అభ్యర్థి విజయ్ కార్డ్బోర్డ్ కటౌట్ను ఉపయోగించారు. కుంభకోణంలో హోలోగ్రామ్ ఏఐ సాంకేతికతతో ప్రచారం నిర్వహించారు. కొలత్తూరులో విజయ్ పోలికలతో ఉన్న వ్యక్తితో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కోయంబత్తూరు సౌత్లో ఇప్పుడు రోబో ప్రచారం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి విజయ్ కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే పర్యటించడంతో విపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.ఈ విమర్శలపై విజయ్ స్పందిస్తూ.. పోలీసులు, కొందరు అధికారులు చివరి నిమిషంలో టీవీకే కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తున్నారంటూ ఆరోపించారు. కేవలం సంప్రదాయ ప్రచార పద్ధతులపైనే తాము ఆధారపడలేదని, ఇప్పటికే తమిళనాడులోని ప్రతి ఇంటిలోనూ సానుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా.. నేటితో(ఏప్రిల్ 21, మంగళవారం) ప్రచార గడువు ముగియనుంది.ఈ చివరి రోజున విజయ్ సౌత్ చెన్నైలో రోడ్షో నిర్వహించడంతో పాటు చెన్నైలోని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పోలింగ్ ఏప్రిల్ 23 (గురువారం) ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరగనుంది. ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సంగీత కచేరీలు, థియేటర్ ప్రదర్శనలు లేదా ఇతర వినోద కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయకూడదన్నారు. ఎన్నికల అంశాలను టీవీలు, సినిమాలు, ఎఫ్.ఎమ్. రేడియోలు, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్(ట్విట్టర్) వంటి ఏ మాధ్యమం ద్వారా కూడా ప్రసారం చేయకూడదన్నారు. ఎల్రక్టానిక్ రూపంలో వచ్చే సంక్షిప్త సందేశాల, ఇంటర్నెట్ ప్రచారాలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. गजब,अभिनेता विजय चुनाव प्रचार में एडवांस टेक्नोलॉजी का बखूबी इस्तेमाल कर रहे है....अब चुनाव प्रचार में रोबोट को उतार दिया है....यह शायद भारत में संभवत पहला चुनाव होगा, जिसमें रोबोट वोट मांग रहा है....कोयंबटूर साउथ सीट में यह रोबोट विजय की पार्टी के लिए कैंपेन कर रहा है... pic.twitter.com/UmSmlk1Vh9— Dinesh Dangi (@dineshdangi84) April 20, 2026
‘ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ
పహల్గామ్: సరిగ్గా ఏడాది క్రితం జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ నెత్తురోడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం పేరుతో 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ఆ చీకటి రోజును యావత్ దేశం ఇంకా మర్చిపోలేదు. ఆనాటి ఉగ్రదాడికి ఏప్రిల్ 22తో ఏడాది పూర్తవుతున్న తరుణంలో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఒకపక్క ఆత్మీయులను కోల్పోయిన ఆవేదన, మరోపక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరక పోవడం వారిని మరింత కుంగదీస్తున్నాయి.ఆఖరి శ్వాస వరకు వెంటాడే పీడకలపహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కౌస్తుభ్ గన్బోటే భార్య సంగీత మాట్లాడుతూ.. ఆ భయానక ఘటనను తన ఆఖరి శ్వాస వరకు మర్చిపోలేనని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులను చంపడం ద్వారా ఉగ్రవాదులు సాధించేదేమీ లేదని, ప్రభుత్వంతో పోరాటం ఉంటే నేరుగా వారితోనే తేల్చుకోవాలని ఆమె హితవు పలికారు. మరో బాధితురాలు ప్రియదర్శిని ఆచార్య (ప్రశాంత కుమార్ శత్పథి భార్య) తన భర్త లేని లోటును ప్రతీ రోజు తలచుకుంటున్నానని, ఇంటికి పెద్దదిక్కును కోల్పోయి, ప్రస్తుతం తాత్కాలిక ఉద్యోగంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థిక సాయం అందినప్పటికీ, ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగం మాత్రం ఇంకా రాలేదని, ఆ మాట నిలబెట్టుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.‘ఆపరేషన్ సిందూర్’ పేరిట..ఏప్రిల్ 22, 2025న పహల్గామ్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు బాధితుల మతం అడిగి మరీ దారుణ మారణకాండకు ఒడిగట్టారు. ఈ మారణహోమానికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు మే 7, 2025న ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్ గడ్డపైకి చొచ్చుకెళ్లాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన తొమ్మిది భారీ ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్ర నష్టం వాటిల్లడంతో దిగివచ్చిన పాక్ ఆర్మీ.. భారత డీజీఎంఓను ఆశ్రయించి మే 10న కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుంది.భయాలు వీడి.. మళ్లీ పర్యాటకుల రాకకశ్మీర్ లోయలో ఇప్పుడు అనూహ్య మార్పు కనిపిస్తోంది. పహల్గామ్తో పాటు ఇతర ప్రాంతాలకు పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. ఇది సందర్శకుల్లో తిరిగి చిగురించిన భద్రతా భావానికి అద్దం పడుతోంది. శ్రీనగర్ను సందర్శించిన విశాల్ అనే పర్యాటకుడు మాట్లాడుతూ.. గతంలో జరిగిన దురదృష్టకర ఘటనల ఆధారంగా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయలేమని, కశ్మీర్ ఇప్పుడు అత్యంత సురక్షితమైన ప్రాంతమని, ఇక్కడి ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: 51 క్వింటాళ్ల పూలతో కేదార్నాథ్ ముస్తాబు
ఎలుకను తరిమి.. బోరుబావిలో పడి..
ఆదివారం ఆటవిడుపులో భాగంగా.. కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ సరదాగా పోలో మ్యాచ్ ఆడారు. ఆరు గోల్స్ చేసి కురక్షేత్ర టీం కెప్టెన్గా విజయంలో ఆయన కీలకపాత్ర పోషించారు కూడా. అయితే మ్యాచ్ మధ్యలో సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చి.. ఓ పాతికేళ్ల కుర్రాడిని పరిచయం చేసి దేశం దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు.నవీన్ జిందాల్తో ఉన్న ఆ యువకుడి పేరు ప్రిన్స్. ఆర్మీలో చేరాలనే కసితో పరీక్షలు రాశాడు. కానీ, ఎత్తు రూపంలో అతని కల చెదిరిపోయింది. ఐటీఐ కోర్స్ పూర్తి చేసిన ప్రిన్స్.. ప్రస్తుతం అంబాల నగరంలో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే అతనిలో అంత ప్రత్యేకత ఏముందా? అనుకుంటున్నవాళ్లకు నవీన్ జిందాల్ ఆ కుర్రాడితోనే అసలు విషయం చెప్పించాడు.అది 2006 జులై 21.. కురుక్షేత్ర జిల్లా షాహబాద్ మండలం హల్ధేరీ గ్రామం. తన స్నేహితుడు అంగ్రెజ్తో కలిసి పంట పొల్లాల్లో ఆడుకుంటున్నాడు నాలుగేళ్ల చిన్నోడు ప్రిన్స్. ఇంతలో ఓ ఎలుక వాళ్ల కంట పడింది. దాని వెంట పడుతూ పరుగులు తీశారు ఆ ఇద్దరు. ఇంతలో అది ఓ సంచిని దాటుకుని కలుగులోకి దూరింది. ఆ పాలిథీన్ సంచిపై ఒక్క దూటున దూకారా పిల్లలు. అంగ్రెజ్ పక్కకు పడిపోగా.. ప్రిన్స్ మాత్రం క్షణాల్లో 60 అడుగుల బోరుబావిలోకి జారిపోయాడు. అయితే..అంగ్రెజ్ ఆలస్యం చేయలేదు. పరుగున వెళ్లి అందరినీ తీసుకొచ్చాడు. జనం, పోలీసులు, అధికారులు, బుల్డోజర్లు.. కాసేపటికే రెస్క్యూ వాతావరణంతో అక్కడి వాతావరణం మారిపోయింది. హర్యానా కావడంతో ఆర్మీ అక్కడికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే నేల స్వభావం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా సాగింది. ఈలోపు దేశం మొత్తం ఆ చిన్నారి క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనలు చేసింది. ఈ మధ్యలో..చిన్నా.. భయపడకు. ఎలాగైనా నిన్ను బయటకు తీస్తాం అంటూ తల్లిదండ్రుల మాటలు, అధికారుల పిచ్చాపాటి సంభాషణలతో ప్రిన్స్ ఏడవకుండా ధైర్యంగా ఉండిపోయాడు. సుమారు 50 గంటల తర్వాత పిల్లాడిని సజీవంగా బయటకు తీయగలిగింది సైన్యం. అంతే దేశం మొత్తం భావోద్వేగానికి లోనైంది.అలా బోర్వెల్ బాయ్గా స్థిరపడిన ఆ చిన్నారి ప్రిన్సే.. ఇప్పుడు పాతికేళ్ల కుర్రాడిగా నవీన్ జిందాల్తో లైవ్లో కనిపించాడు. ఆనాడు బోరుబావిలో పడ్డాక ఆ చిన్నారి ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తు చేసుకున్న జిందాల్ పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఆ టైంలో ప్రిన్స్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. సరైన తిండి లేక ప్రిన్స్ నీరసంగా కనిపించాడు. బోరుబావిలో పడిన సమయంలో.. దేశం నలుమూలల నుంచి ఆ కుర్రాడి కోసం చాక్లెట్లు, బిస్కెట్లు.. ఇతర తినుబండారాలు వచ్చాయి. అదలా కొన్నాళ్లపాటు కొనసాగింది అని గుర్తు చేశారాయన. తాను ఎవరి నుంచి ఎలాంటి సాయం ఆశించడం లేదని.. దేవుడిచ్చిన జీవితం.. సైన్యం ప్రసాదించిన పునర్జన్మతో తన కాళ్ల మీద తాను నిలబడతానని చెబుతున్నాడా మృత్యుంజయుడు.
ఎన్ఆర్ఐ
టోక్యోలో ఘనంగా ఉగాది పండుగ
జపాన్లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా (Komatsugawa) పార్క్లో ఉగాది పండుగను భారతీయులు ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్కు చెందిన స్థానికులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఉగాది సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఉగాది పచ్చడిని తయారు చేసి, దాని ప్రాముఖ్యతను పాల్గొన్న వారికి వివరించారు. అలాగే రాశి ఫలాలను వినిపిస్తూ కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అనంతరం వివిధ రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి అందరూ కలిసి భోజనం చేశారు.పిల్లల కోసం బ్యాగ్ జంపింగ్ వంటి వినోదాత్మక పోటీలు నిర్వహించగా, పెద్దల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమం అనంతరం కొత్తగా వచ్చిన కుటుంబాలు పరస్పరం పరిచయం చేసుకుని, విదేశాల్లో భారతీయ సంప్రదాయాలను ఎలా కొనసాగించాలన్న దానిపై చర్చించారు. ఈ వేడుకల ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు. వివిధ దేశాల ప్రజలు కలిసి సంస్కృతులను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన TAJ(Telugu association of Japan)కమిటీ సభ్యులకు, అలాగే పాల్గొన్న అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్లోని తెలుగు వాసులు ఈ ఏడాది ఉగాది పండుగను సంప్రదాయానికి అనుగుణంగా, ఆత్మీయంగా మరియు వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20, 2026 తేదీలలో ఈ ఉత్సవాలు చాంగీ రామర్ దేవాలయం, సెంగ్కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం మరియు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రత్యేకంగా, టీమ్ శివ ప్రసాద్ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాలయాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి మరియు ప్రసాదాన్ని పంపిణీ చేశారఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆనందం, ఐక్యత మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది.ఈ ఉత్సవాల ద్వారా సాంప్రదాయం, సంస్కృతి, భక్తి మరియు ఐక్యత మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో, సింగపూర్లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు.
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు)
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
క్రైమ్
కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకి
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్, కిద్వాయ్ నగర్లో చోటుచేసుకున్న దారుణ ఘటన సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భార్య మీద అనుమానంతో 11 ఏళ్ల కవల కుమార్తెల గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ విషాదకర ఘటనలో మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యల కోసం అతను ఒక రోజు ముందే కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల క్రితం తల్లి మరణించినప్పటి నుండి శశి రంజన్ తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడు. మద్యానికి , నిద్రమాత్రలకు బానిసయ్యాడు. దీనికితోడు భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భార్యమీద అనుమానం పెంచుకున్నాడు. భార్యను ఇంటి నుండి వెళ్ళిపోమని, కుమార్తెలను తనే పెంచు కుంటానంటూ తరచూ గొడవ పడేవాడు. ఆర్థిక ఇబ్బందులునిందితుడు ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. భార్య కూడా నిరుద్యోగి కావడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.UP man kiII twin daughters, wife demands death penalty Shashi Ranjan Mishra, a resident of UP's Kanpur slit throat and kiIIed his 11-year-old twin daughters- Riddhi and Siddhi. He has a 6-year-old son who was sleeping with her mother in separate room. Domestic dispute is… pic.twitter.com/X86b4vvxSC— Piyush Rai (@Benarasiyaa) April 19, 2026ఉరితీయండి - తల్లి కన్నీరుమున్నీరుసీతాకోక చిలుకల్లా కళ్లముందే తిరుగాడే 11 ఏళ్లు ఎదిగిన ఆడపిల్లల్ని పోగొట్టుకున్న తల్లి తీరని శోకంతో తల్లిడిల్లిపోతోంది. "అతన్ని వెంటనే ఉరి తీయండి" అంటూ తల్లి రేష్మ కన్నీరుమున్నీరవుతోంది. గతంలోనే అతను పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని వాపోయింది. ఘటన పూర్వాపరాలు కాన్పూర్కు చెందిన శశి రంజన్ మిశ్రా (45), రేష్మ దంపతులకు 11 ఏళ్ల కవల కుమార్తెలు రిద్ధి, సిద్ధి, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. రాత్రి అందరూ కలిసి భోజనం చేసి, ఎప్పటిలాగానే నిద్రపోయారు. కానీ తెల్లవారేసరికి తన బిడ్డలు ప్రాణాలతో లేరన్న వార్త తల్లి గుండెల్ని బద్దలు చేసింది. తన కుమారుడితో కలిసి వేరే గదిలో పడుకోగా, తెల్లవారుజామున పోలీసులు తలుపు తట్టే వరకు ఇంట్లో ఇంతటి ఘోరం జరిగిందన్న సంగతి తెలియదు.నిందితుడు శశి రంజన్ తన కుమార్తెల ఆహారంలో నిద్రమాత్రలు కలిపి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత మొదట గొంతు పిసికి, ఆపై మాంసం కోసే కత్తితో (Cleaver) వారి గొంతులు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత, అతనే స్వయంగా ఉదయం 4:30 గంటలకు 112 హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులుసీసీటీవీ నిఘా, దృశ్యాలు మరో షాకింగ్ విషయం ఏమిటంటే భార్యపై అనుమానంతో శశి రంజన్ ఇల్లంతా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. వీరి కుమార్తెలకు సాధారణంగా తండ్రితోనే నిద్రపోవడం అలవాటు. అయితే తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో నిందితుడు ఒక కుమార్తెను బాత్రూమ్కు తీసుకెళ్లి, తిరిగి వచ్చి గదిలో లైట్లు ఆపివేయడం భార్య తన గదిలోని సీసీటీవీ ఫీడ్లో చూసింది. ఆ తర్వాత ఆమె నిద్రపోయింది. కానీ ఇంత ఘోరం జరుగు తుందని ఊహించలేదు.మనసెలా ఒప్పింది..ఈ ఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కన్న కూతుళ్లను మట్టు బెట్టేందుకు మనసెలా ఒప్పిందిరా నాయనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. నిందితుడు ఏదైనా మానసిక చికిత్స పొందుతున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి : విషాదం : టీవీ నటుడు సిద్ధార్థ్ కన్నుమూత
Banjara Hills: తెలుగు మీడియం రెస్టారెంట్లో దారుణం!
హైదరాబాద్: బంజారాహిల్స్ ఆదివారం పూట సరదాగా హోటల్ నుంచి నాన్ వెజ్ ఐటమ్ తెప్పించుకున్న ఓ పోలీసు అధికారికి చేదు అనుభవం ఎదురైంది. కుళ్లిపోయిన మాంసంతో తయారు చేసిన ఖీమాతో వచ్చిన పార్సల్ చూసి ఆ అధికారి షాక్ కు గురయ్యారు. వివరాలకు వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46 లో తెలుగు మీడియం పేరుతో రెస్టారెంట్ ఉంది. ఆదివారం మధ్యాహ్నం ఓ పోలీస్ అధికారి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి ఈ హోటల్ నుంచి మటన్ కీమా తో పాటు మరికొన్ని నాన్ వెజ్ ఐటమ్ లు తెప్పించుకున్నాడు. పార్సల్ విప్పి చూడగా మటన్ ఖీమా కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించాడు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలుగు మీడియం రెస్టారెంట్ కి చేరుకొని ఆహార పదార్థాలను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు. మిగిలిపోయిన ఖీమా తదితర ఆహార పదార్థాలను స్వా«దీనం చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఈ శాంపిల్స్ అందజేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
స్లీపర్తో శాశ్వత నిద్రే
సాక్షి,హైదరాబాద్: వరుస ప్రమాదాలతో స్లీపర్ బస్సులు ఠారెత్తిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. ఈ బస్సుల అనుమతిపై ఆర్టీఏ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నగరం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు, ముంబై, షిరిడీ, చెన్నై, బెంగళూర్ తదితర ప్రాంతాలకు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. స్లీపర్ బస్సుల్లో మంటలంటుకొని పదుల సంఖ్యలో ప్రయాణికులు విగతజీవులైన ఘటనలు గతంలో జరిగాయి. ఇటీవల కేపీహెచ్బీలోనూ స్లీపర్ బస్సులో మంటలంటుకున్నాయి. అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టడంతో ముప్పు తప్పింది. అంతకుముందు మియాపూర్ నుంచి బయలుదేరిన మరో బస్సు సైతం ఏపీలోని కర్నూలు వద్ద ఇలాగే ప్రమాదానికి గురైంది. ఇలా తరచూ.. స్లీపర్ బస్సులతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అడ్డగోలుగా అనుమతులు.. కొంతకాలంగా ప్రైవేట్ బస్సులు నాగాలాండ్, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో నమోదై హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉన్న పర్మిట్ రుసుములను తప్పించుకొనేందుకు నాగాలాండ్ వంటి ఇతర రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. అడ్డగోలుగా అనుమతులు పొంది హైదరాబాద్లో రోడ్డెక్కిస్తున్నారు. నగరం నుంచి విజయవాడ, ఏలూరు, గుంటూరు, కాకినాడ, విశాఖ, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 1,100కు పైగా ప్రైవేట్ బస్సులు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నట్లు అంచనా. వీటిలో 40 శాతం వరకు స్లీపర్ బస్సులే ఉన్నాయి. ప్రమాద ఘంటికలు..స్లీపర్ బస్సులు ఏ మాత్రం సురక్షితం కాదని ఇప్పటికి పలుమార్లు నిపుణులు సూచించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలోనూ ఆస్కీ ఇదే అంశాన్ని సూచించింది స్లీపర్ బెర్తులతో పాటు అదనపు హంగులను ఏర్పాటు చేయడం, వివిధ రకాల అవసరాల కోసం ఎలక్ట్రిక్ వైర్లను వినియోగించడంతో ఎక్కడో ఒక చోట అవి తెగి షార్ట్సర్క్యూట్కు గురవుతున్నాయి. స్లీపర్ బెర్తులను తొలగించి ఫుష్బ్యాక్ సీట్లను ఏర్పాటు చేయాలని, డ్రైవర్కు, ప్రయాణికులకు మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా సీటింగ్ ఏర్పాటు చేయాలని నిపుణులు పేర్కొంటున్నారు.
లారీని ఢీకొట్టిన కారు.. తల్లి, బిడ్డ దుర్మరణం!
మహబూబ్ నగర్: అతివేగం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. వెనక నుంచి ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో తల్లి, ఐదు నెలల కుమారుడు మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున అడ్డాకుల శివారులోజాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లికి చెందిన ప్రకాష్రెడ్డి భార్య నందిని (21), ఐదు నెలల కుమారుడు కన్నయ్యతో కలిసి యాదగిరిగుట్ట దైవదర్శనానికి తెల్లవారుజామున కారులో బయలుదేరాడు. మార్గమధ్యలో అడ్డాకుల శివారులోని స్నేహ పరిశ్రమ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు అతివేగంగా ఢీకొట్టుకుంది. ప్రమాదంలో కారు ఎడమ సీట్లో కూర్చున్న నందిని తల భాగం పూర్తిగా ఛిద్రమై రోడ్డుపై పడింది. నందిని ఒళ్లో కూర్చున్న బాలుడు కారు ముందు భాగంలో ఇరుక్కుని ప్రాణాలు వదిలాడు. ఇక కారు డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రకా‹Ùరెడ్డి సీటు బెల్టు ధరించడంతో ఎయిర్ బెలూన్ తెరుచుకున్నప్పటికీ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని తల్లీకొడుకుల మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ప్రకాష్ రెడ్డిని అంబులెన్స్లో వనపర్తి జిల్లా కేంద్రానికి పంపించారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఏదైనా వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో ఎడమ వైపు వచ్చినప్పుడు ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీ వెనుక ఢీకొట్టాడా.. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. మెరుగైన చికిత్స కోసం ప్రకాష్రెడ్డిని హైదరాబాద్లోని నిమ్స్కు తరలించినట్లు తెలిసింది. బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చెప్పులే ప్రమాదానికి కారణమా! కారు నడిపేటప్పుడు ప్రకాష్రెడ్డి తాను ధరించిన శాండిల్స్ను డ్రైవింగ్ సీటు వద్దే వదిలాడు. వేగంగా వెళ్తున్న క్రమంలో ముందు వెళ్తున్న వాహనాన్ని దాటే ప్రయత్నంలో బ్రేక్ వేయడానికి ప్రయతి్నంచిన సమయంలో శాండిల్స్ బ్రేక్ పెడాల్ కిందకి వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనివల్లే బ్రేక్ వేయడానికి వీలు కాకపోవడంతో కారు వెళ్తున్న వేగంతోనే లారీని ఢీకొట్టి ఉంటుందని, అందువల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. లారీని కారు తగిలే సమయంలో బ్రేక్ వేసి ఉంటే ప్రమాద తీవ్రత ఇంత ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో కాళ్ల వద్ద చెప్పులు, వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులు పెట్టొద్దని, గతంలో కూడా ఇలాగే పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని నిపుణులు అంటున్నారు.
వీడియోలు
పహల్గామ్ దాడి కీలక ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ భట్ హతం
పసిడి ధరల దూకుడుకు బ్రేక్.. వెండి రూ.5 వేలు ఢమాల్..!
కాపులను నరికేస్తాం! బుచ్చయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
ఛాలెంజ్ చేసి చెప్తున్నా... బాబు కంటే జగన్ ప్రభుత్వమే మంచిది
పెండెం దొరబాబుకు వర్మ మాస్ వార్నింగ్
AI రోబో స్పీడ్ రికార్డు బీజింగ్ లో హవా
అన్న క్యాంటీన్పై రిపోర్టర్ ప్రశ్న,అంబటి అదిరిపోయే రిప్లై
పాక్ ధురంధర్ కి పోటీగా సినిమా ట్రోలింగ్ జోరు
కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా..?
MGNREGA అమలులో నిర్లక్ష్యం.. చంద్రబాబుపై జగన్ ఫైర్



