టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ సినిమాలకు కష్టకాలం?
టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ ఆధారిత సినిమాలు వరుసగా రెడీ అవుతున్నాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు నిర్మాతలకు తలనొప్పిగా మారాయి. ఒకవైపు ఓటిటి సంస్థలు ఇలాంటి సినిమాలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఫైనల్ కాపీ చూపించకపోతే ఒప్పందాలు కుదిరే పరిస్థితి లేదు. గతంలో వచ్చిన పలు విఎఫ్ఎక్స్ చిత్రాలు నాసిరకమైన గ్రాఫిక్స్ కారణంగా ప్రేక్షకుల నిరాకరణకు గురైన విషయం తెలిసిందే. ఆ అనుభవం వల్లే ఇప్పుడు ఓటిటి సంస్థలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. సినిమా ఫైనల్ వెర్షన్ చూపిస్తేనే రేటు నిర్ణయిస్తామని ఓటిటిలు స్పష్టంగా చెబుతున్నాయి.మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర, నిఖిల్ స్వయంభు, నాగ్ చైతన్య వృషకర్మ వంటి భారీ విఎఫ్ఎక్స్ ప్రాజెక్టులు ఓటిటి డీల్స్ కోసం వెయిటింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పటికే పూర్తయిన సినిమాలు మాత్రం సులభంగానే అమ్ముడవుతున్నాయి. కానీ ఇంకా మేకింగ్ దశలో ఉన్నవాటికి ఫైనల్ కాపీ చూపించకపోతే ఒప్పందాలు ముందుకు సాగట్లేదు. ఇలాంటి వాటిలో పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ కాంబినేషన్లు కూడా ఉన్నాయి. కానీ నిర్మాతలు మాత్రం కొత్తగా విఎఫ్ఎక్స్ సినిమాలు ప్లాన్ చేయడంలో ముందుకు వెనుకకు ఆలోచిస్తున్నారు. ఓటిటి మార్కెట్ బలహీనంగా ఉండటం వల్ల రిస్క్ ఎక్కువగా కనిపిస్తోంది.
చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ, పనితీరు తక్కువ అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్ జగన్ ఫైరయ్యారు. రాష్ట్రంలో పన్నుల రాబడి, ఆర్ధిక స్థితిగతులపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పన్నుల రాబడిలో ఏపీ దేశంలోనే 22 వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ లెక్కలే దీనికి నిదర్శనంగా నిలిచాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కల్పిత జీఎస్డీపీ (GSDP) లెక్కలతో ప్రజలను మభ్యపెడుతోంది. రాష్ట్రం శర వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రజలను భ్రమ కల్పిస్తున్నారు.2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75% గా ఉందననీ.. జాతీయ వృద్ధిరేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు ప్రకటించారు. అలాగే 2025–26లో రాష్ట్ర వృద్ధి 10.75%గా ఉంటుందనీ..జాతీయ వృద్ధిరేటు 8.0% మాత్రమేనని ప్రకటించారు. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 మధ్య రెండేళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధిరేటు 11.09%గా చూపిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవేవీ స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు. ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారుచేసిన అంకెలే. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు.ఈ గణాంకాలు నిజమైతే, ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలల కాగ్ నివేదికలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో తెలుస్తుంది. నిజానికి ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 1.97% మాత్రమే. 11.09% వంటి భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం.. పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97% వృద్ధిని సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వంలో తయారుచేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఏపీ 22వ స్థానంలో ఉంది. అంటే చివర నుంచి రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64% పెరగ్గా.. ఏపీ పన్ను ఆదాయాలు మాత్రం 1.97% మాత్రమే పెరిగాయి. అయినప్పటికీ ఏపీ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైనదట!. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ ఏదైనా విషయాల్లో మొదటి స్థానం సాధించిందంటే.. అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్షసాధింపు చర్యలు, తప్పుడు ప్రచారాల్లోనే’ అంటూ దుయ్యబట్టారు.𝗖𝗕𝗡'𝘀 𝗧𝗵𝗲 𝟮𝟮𝗻𝗱 𝗥𝗮𝗻𝗸 𝗩𝗶𝘀𝗶𝗼𝗻: 𝗛𝗶𝗴𝗵 𝗼𝗻 𝗛𝘆𝗽𝗲, 𝗟𝗼𝘄 𝗶𝗻 𝗣𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲- 𝗟𝗜𝗘𝗦 𝗮𝗻𝗱 𝗗𝗘𝗖𝗘𝗜𝗧 𝗰𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲 𝗨𝗻𝗮𝗯𝗮𝘁𝗲𝗱At a time when State is confronting a worrying economic slowdown, very clearly evident from the Government… pic.twitter.com/lkeEp84jOQ— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026
ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. హెచ్-1బీ వీసా రద్దుకు బిల్లు
వాషింగ్టన్ డీసీ: హెచ్-1బీ వీసాల అమలులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. హెచ్-1బీ వీసాలను రద్దు చేయాలని అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ ఎంపీ స్టూబ్ బిల్లును ప్రవేశ పెట్టారు. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వడం అమెరికాకు నష్టమన్న స్టూబ్.. అమెరికా యువతకు ఉద్యోగాలు రావడం లేదని వాదించారు. అమెరికా కాంగ్రెస్లో ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్ట్యూబ్ ఒక సంచలనాత్మక బిల్లు ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు పేరు Ending Exploitative Imported Labour Exemptions Act (EXILE Act). దీని ద్వారా అమెరికాలో ఉన్న హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ను పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించారు.‘విదేశీ కార్మికులను ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అమెరికా పౌరుల సంక్షేమం, అభివృద్ధి దెబ్బతింటోంది. ఇది జాతీయ ప్రయోజనాలకు విరుద్ధం’అని అన్నారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ కారణంగా అమెరికా యువత, కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. మన పిల్లలకు అమెరికన్ డ్రీమ్ను కాపాడాలంటే విదేశీయులకు పెద్దపీఠ వేయకూడదని స్పష్టం చేశారు.అదే సమయంలో గ్రెగ్ స్ట్యూబ్ బిల్లులో హెచ్-1బీ వీసా దుర్వినియోగం వల్ల అమెరికా కార్మికులు ఎలా నష్టపోయారో ఉదాహరణలు ఇచ్చారు. ఉదాహరణకు, 2015లో డిస్నీ 250 మంది ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో విదేశీ కార్మికులను హెచ్-1బీ వీసా ద్వారా తీసుకువచ్చింది. 2014లో సదర్న్ కాలిఫోర్నియా ఎడిసన్ 540 మంది ఉద్యోగులను తొలగించి, భారతీయ ఔట్సోర్సింగ్ కంపెనీల ద్వారా వచ్చిన కార్మికులను నియమించింది. మైక్రోసాఫ్ట్లో 16,000 మంది ఉద్యోగులు తొలగింపులకు గురి కాగా.. ఆ సమయంలో 9వేల హెచ్-1బీ వీసాలు మంజూరయ్యాయని ఆయన గుర్తు చేశారు.ఈ బిల్లుతో అమెరికాలోని ఐటీ రంగం, ముఖ్యంగా భారతీయ వృత్తిపరులు దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే హెచ్-1బీ వీసాలు లేకుండా అమెరికాలో ఉద్యోగాలు పొందడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికే భారతదేశంలో వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడుతున్నాయి. వీసా స్టాంపింగ్ కోసం వెళ్లిన అనేక మంది భారతీయులు అమెరికాకు తిరిగి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.
DSCలో అక్రమ నియామకాలు.. ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,విజయవాడ: డీఎస్సీలో అక్రమ నియామకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజనుల చేత పూరించవలసిన 3వేల అధ్యాపక పోస్టులను జనరల్లో పూరించడంపై సీరియస్ అయ్యింది.గిరిజన యువతీ యువకులకు అన్యాయం చేయడమే రాష్ట్రప్రభుత్వ ఉద్దేశమా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. గిరిజన నిరుద్యోగులకు చెందాల్సిన పోస్టులను ఏ అధికారంతో డీఎస్పీలో కలిపారంటూ నిలదీసింది.ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల వల్ల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఖాళీలున్నాయి. ఎంతమంది అభ్యర్థుల చేత ఖాళీలు పూరించబడ్డాయి. ఇంకా ఎన్నిపోస్టులు పూరించాలో ప్రమాణపత్రం దాఖలు చేయాలని.. ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది.రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల గిరిజన నిరుద్యోగులు తమ హక్కులు కోల్పోతున్నారన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
పాటలు పాడే రోడ్డు.. కారు నడిపితే రోడ్డుపై నుంచి మ్యూజిక్
టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ సినిమాలకు కష్టకాలం?
లైసెన్స్ లేకపోతే రోడ్డుపైకి రావొద్దు.. మార్చి 1 నుంచి కఠిన చర్యలు
టీ20 ప్రపంచకప్: అమెరికాపై గెలిచిన పాకిస్తాన్
T20 WC 2026: పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించిన అమెరికా పేసర్
ఉప్పు లోడింగ్: స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ల ప్రయోగం విజయవంతం
డిఫరెంట్ రోల్లో రాధిక.. మేకప్ తీయడానికే రెండు గంటలా?
మళ్లీ పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇలా..
మరింత హాట్గా జ్యోతి పూర్వాజ్.. శారీలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల..!
శివభక్తులపై లాఠీచార్జ్ బాధాకరం: వైఎస్ జగన్
అజిత్ను కలిసేందుకు క్యూ కడుతున్న సెలబ్రిటీలు
ఐటీ అన్నదమ్ములు.. భలే కట్టారు ఇల్లు!
లక్కుండిలో సర్పబంధం?
చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్
కియోసాకీకి కోపమొచ్చింది!
బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా: ప్రిన్స్ యావర్
సార్! అలవాటులో పొరపాటు! ఆ కంపెనీ మనదే!
అల్లు అర్జున్ చేతికి గీతా ఆర్ట్స్.. కీలక మార్పులు!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ప్రశ్నించే అధికారం లేకుండా చట్టాలు ఎలా చేయాలో వీళ్లు అధ్యయనం చేస్తార్సార్!
శ్రీలంక కెప్టెన్ ప్రపంచ రికార్డు
టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న బంగ్లా జట్టుకి రిలీఫ్
అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ఓపెనింగ్ ఫిక్స్.. మొదటి సినిమా ఇదే..!
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఒమన్ ఆటగాడు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది
అమ్మా.. ఎందుకిలా చేశావ్?
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
తమన్నాతో పోలిక.. అస్సలు నచ్చట్లేదు: 'ధురంధర్' బ్యూటీ
ఓటీటీలో 'రాజాసాబ్'.. మారుతిపై దారుణమైన ట్రోలింగ్
క్రికెట్ అభిమానులకు శుభవార్త
పాటలు పాడే రోడ్డు.. కారు నడిపితే రోడ్డుపై నుంచి మ్యూజిక్
టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ సినిమాలకు కష్టకాలం?
లైసెన్స్ లేకపోతే రోడ్డుపైకి రావొద్దు.. మార్చి 1 నుంచి కఠిన చర్యలు
టీ20 ప్రపంచకప్: అమెరికాపై గెలిచిన పాకిస్తాన్
T20 WC 2026: పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించిన అమెరికా పేసర్
ఉప్పు లోడింగ్: స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ల ప్రయోగం విజయవంతం
డిఫరెంట్ రోల్లో రాధిక.. మేకప్ తీయడానికే రెండు గంటలా?
మళ్లీ పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇలా..
మరింత హాట్గా జ్యోతి పూర్వాజ్.. శారీలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల..!
శివభక్తులపై లాఠీచార్జ్ బాధాకరం: వైఎస్ జగన్
అజిత్ను కలిసేందుకు క్యూ కడుతున్న సెలబ్రిటీలు
ఐటీ అన్నదమ్ములు.. భలే కట్టారు ఇల్లు!
లక్కుండిలో సర్పబంధం?
చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్
కియోసాకీకి కోపమొచ్చింది!
బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా: ప్రిన్స్ యావర్
సార్! అలవాటులో పొరపాటు! ఆ కంపెనీ మనదే!
అల్లు అర్జున్ చేతికి గీతా ఆర్ట్స్.. కీలక మార్పులు!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ప్రశ్నించే అధికారం లేకుండా చట్టాలు ఎలా చేయాలో వీళ్లు అధ్యయనం చేస్తార్సార్!
శ్రీలంక కెప్టెన్ ప్రపంచ రికార్డు
టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న బంగ్లా జట్టుకి రిలీఫ్
అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ఓపెనింగ్ ఫిక్స్.. మొదటి సినిమా ఇదే..!
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఒమన్ ఆటగాడు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది
అమ్మా.. ఎందుకిలా చేశావ్?
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
తమన్నాతో పోలిక.. అస్సలు నచ్చట్లేదు: 'ధురంధర్' బ్యూటీ
ఓటీటీలో 'రాజాసాబ్'.. మారుతిపై దారుణమైన ట్రోలింగ్
క్రికెట్ అభిమానులకు శుభవార్త
ఫొటోలు
ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల అందాలు (ఫొటోలు)
రెండోసారి ప్రెగ్నెన్సీ.. నటి పూర్ణ బేబీ బంప్ (ఫొటోలు)
ప్రతి రోజు నిన్నే ఎంచుకుంటా.. మహేశ్ బాబుకు నమ్రత పెళ్లి రోజు విషెస్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
రేసులో అజిత్.. సపోర్ట్గా నిలిచిన సెలబ్రిటీలు (ఫోటోలు)
శ్రీశైలంలో స్వాముల పై లాఠీ ఛార్జ్.. ‘శివ’మెత్తిన స్వాములు (ఫొటోలు)
'ఎర్ర చీర' మూవీ హీరోయిన్ కారుణ్య చౌదరి స్టన్నింగ్ స్టిల్స్
దట్టమైన నల్లమల అడవిలో వేలమంది..శ్రీశైలం యాత్ర ప్రారంభం (ఫొటోలు)
‘హై’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
సినిమా
యశ్ టాక్సిక్.. రిలీజ్కు ముందే రికార్డ్స్.. మరో బిగ్ డీల్..!
శాండల్వుడ్ హీరో యశ్ నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. కేజీఎఫ్-2 తర్వాత రాకింగ్ స్టార్ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ సీన్ పెట్టడంపై దర్శకురాలిపై విమర్శలు చేశారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహంచారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్ల డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి మరో బిగ్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో ఇండియన్ లాంగ్వేజేస్కి దాదాపు రూ.105 కోట్లకు బిజినెస్ ఓకే అయినట్లు సమాచారం. ప్రముఖ విదేశీ పంపిణీదారు అయిన ఫార్స్ ఫిల్మ్స్తో ఈ డీల్ చేసుకుంది. దీంతో ఒక ఇండియన్ సినిమాకు అత్యధిక డీల్ సాధించిన చిత్రంగా టాక్సిక్ నిలవనుంది. రూ. 105 కోట్ల విదేశీ డీల్ రావడం భారతీయ సినిమాకు దక్కిన ఘనతగా భావిస్తున్నారు.ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్తో ఓవర్సీస్లో ఇండియన్ భాషల్లో ఫార్స్ ఫిల్మ్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ బిగ్ డీల్ భారతీయ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అంతర్జాతీయ విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం నేపాల్, జపాన్, చైనా మినహా దాదాపు అన్ని ప్రపంచ దేశాల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రాన్ని ఓకేసారి కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది.
కమిట్మెంట్ అడిగేదంతా అంకుల్స్ బ్యాచే : నటి షాకింగ్ కామెంట్స్
క్యాస్టింగ్ కౌచ్పై నటి ఎస్తర్ నోరోన్హా కీలక వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటికీ కొనసాగుతుందని, కమిట్మెంట్ ఇస్తేనే చాన్స్లు ఇస్తామని చెప్పే దర్శకనిర్మాతలు చాలా మంది ఉన్నారని ఆరోపించింది. ఆడియన్స్ మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ని కంట్రోల్ చేయగలరని ఎస్తర్ చెబుతోంది. ఆమె కీలకపాత్ర పోషించిన చిత్రం అమరావతికి ఆహ్వానం చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్పై మాట్లాడింది.పేరు చెప్పరు..క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటికే టాలీవుడ్లో కొనసాగుతూనే ఉంది. రెండ్రోజుల క్రితమే నాకు ఓ కాల్ వచ్చింది. కమిట్మెంట్కి ఓకేనా అడిగారు. నో చెప్పడంతో వదిలేశారు. చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూలలో నేను కష్టపడి వచ్చాను.. టాలెంట్తోనే పైకి వచ్చాను, ఒక్కరు కూడా నన్ను కమిట్మెంట్ అడగలేదని చెబుతారు. కానీ అదంతా అబద్దం. చాలా మంది కాంప్రమైజ్ అయినవాళ్లే. నటన రానివాళ్లు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఎలా ఉంటారు? వాళ్లకు ఉన్న లోపాన్ని కప్పిపుచ్చాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే. అయితే ఎవరు అడిగారు అనేది ముందే చెప్పరు. ముందుగా మీడియేటర్ ద్వారా కమింట్మెంట్ గురించి అడిగిస్తారు. ఓకే అంటే రెమ్యునరేషన్ ఇలా, లేదంటే అలా చెబుతారు. మనసైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. అడిగింది ఎవరనే పేరుని చెబుతారు. అందుకే ముందుగానే కమిట్మెంట్ అడిగింది ఎవరు అని కనిపెట్టలేం.నా గురించి క్లారిటీ రాలేదుసినిమాలలో ఎప్పుడు చీరలో కనిపించి.. బయటికి దేవతలా కనిపించేవాళ్లు కూడా అలాంటి పనులు చేస్తారు. అయితే నేను ఏ కేటగిరీలో ఉన్నాను అనేది వారికి క్లారిటీ రావడం లేదు. కొంతమంది ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడి.. తర్వాత అలాంటి పనులు చేస్తుంటారు. నేను కూడా అదే క్యాటగిరీ అనుకొని కాల్ చేస్తుంటారు. ఆడియన్స్ కూడా ‘ఈవిడ బాగానే మాట్లాడుతుంది, కానీ ఏదో ఒకటి చేసే ఉంటుందని‘ అనుకుంటారు. అలాంటి వాళ్లు నా ఫిల్మోగ్రఫీ చూడాలి. ఒకవేళ నేను కూడా కమిట్మెంట్కి ఓకే చెబితే.. ఇన్నేళ్లలో ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా నా దగ్గరకు రాదా? నన్ను జనం ఇంతలా ప్రేమిస్తున్నారు.. నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ను ఆదరిస్తున్నారు. ఆడియన్స్, మీడియా సపోర్ట్ నాకుంది. అలాంటప్పుడు ఎందుకు నాకు అవకాశం రాలేదో ఆలోచించాలి.వాళ్లంతా అంకుల్స్ బ్యాచ్ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న యువతరం.. కమిట్మెంట్ గురించి అడగడం లేదు. వాళ్ల చాలా ఫ్యాషన్తో పని చేస్తున్నారు. అలాంటి పనులు చేసేవాళ్లంతా పాత బ్యాచ్. వారందరిని నేను అంకుల్స్ బ్యాచ్ అని పిలుచుకుంటాను. వాళ్ల ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మనలోని లోపాలను ఆసరాగా చేసుకొని కమిట్మెంట్ గురించి అడుగుతారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కనిపించకుండే చేసే అవకాశం ఆడియన్స్కి మాత్రమే ఉంది. వాళ్లు ఫిక్స్ అయితే.. ఇక్కడ అలాంటి పనులు జరుగవు. హాలీవుడ్, బాలీవుడ్లో లాగా.. ఇక్కడ కూడా కాంప్రమైస్ అయి నటించే నటీనటులను బ్యాన్ చేయాలి. అలాంటి వాళ్లు ఎంత పెద్ద సినిమా చేసినా బాయికాట్ చేయాలి. అప్పుడే క్యాస్టింగ్ కౌచ్ ఆగిపోతుంది’ అని ఎస్తర్ చెప్పుకొచ్చింది.
బిగ్బాస్ ఆదిరెడ్డి కూతురి అన్నప్రాసన వేడుక.. వీడియో వైరల్
బిగ్బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా బిగ్బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.గతేడాది మరోసారి తండ్రైన ఆది రెడ్డి దంపతులకు కూతురు పుట్టింది. తాజాగా తమ ముద్దుల కూతురికి అన్నప్రాశన వేడుక నిర్వహించారు. మా బిడ్డకి మీ ఆశీర్వాదాలు కావాలంటూ అన్నప్రాసన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. మొదటి వీరిద్దరికీ ఓ కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో ఆయన సతీమణి రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆదిరెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రెండోసారి కూడా కూతురు పుట్టడం సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Kavitha Bondala (@kavitha_bondala)
'ఐకాన్ స్టార్తో షూట్.. ఈ రూల్స్ పాటించాల్సిందేనట'.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 తర్వాత మరో స్టార్ డైరెక్టర్తో జతకట్టారు. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. జవాన్ డైరెక్టర్ అట్లీతో బన్నీ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంచితే అల్లు అర్జున్పై ప్రముఖ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ కావేరి బారువా చేసిన కామెంట్స్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆమె.. అల్లు అర్జున్ను కలవాలంటే కఠిన నిబంధనలు ఉంటాయని తెలిపింది. దాదాపు 42 రూల్స్ పాటించాలని ఆమె పేర్కొంది. అంతేకాకుండా అల్లు అర్జున్ కళ్లలోకి చూడకూడదని.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని వెల్లడించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.కావేరి బారువా పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. "నా మరో ఆసక్తికరమైన ఇంటర్వ్యూ హైదరాబాద్ మెగా స్టార్ అల్లు అర్జున్తో జరిగింది. ఈ సౌత్ స్టార్ను కలవడానికి ముందు మాకు దాదాపు 42 రూల్స్కు సంబంధించిన నోట్ ఇచ్చారు. మీరు సార్ కళ్లలోకి చూడకూడదు.. అలాగే షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వకూడదని మేనేజర్లు సూచించారని" ఆమె అన్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కావేరి బారువా చేసిన వాదనలు నిజమో కాదో తెలియాలంటే.. అల్లు అర్జున్ బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.Yeh hai Pushpa ka rule : Massive respect to @alluarjun Sir for setting strict rules before meeting any media person! North has always treated their stars like gods with endless protocols, but when South's Icon sets his own in Bombay? Suddenly it's 'too much' and shocking?… pic.twitter.com/FALbtiv1Dn— AnandTanniru (@ceoyktv) February 10, 2026
క్రీడలు
న్యూజిలాండ్ ఓపెనర్ల ఊచకోత.. సరికొత్త చరిత్ర
టీ20 వరల్డ్కప్ 2026లో న్యూజిలాండ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఈ జట్టు.. తాజాగా (ఫిబ్రవరి 10) యూఏఈపై 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో యూఏఈ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్లే ఊదేశారు. ఫిన్ అలెన్ (50 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), టిమ్ సీఫర్ట్ (42 బంతుల్లో 89 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) ఊచకోత ధాటికి న్యూజిలాండ్ కేవలం 15.2 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. సీఫర్ట్-అలెన్ దెబ్బకు యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వీరిద్దరు పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదారు. అలెన్ కాస్త నిదానంగా ఆడినా, సీఫర్ట్ మాత్రం బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. విన్నింగ్ రన్స్ను కూడా సీఫర్ట్ సిక్సర్తోనే సాధించాడు. అలెన్ తన హాఫ్ సెంచరీని 27 బంతుల్లో పూర్తి చేస్తే, సీఫర్ట్ కేవలం 23 బంతుల్లోనే పని కానిచ్చేశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన గత మ్యాచ్లోనూ సీఫర్ట్ ఇదే తరహా విధ్వంసం (42 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సృష్టించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సీఫర్ట్ ధాటికి ఆ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 17.5 ఓవర్లలోనే ఛేదించింది. సీఫర్ట్ విధ్వంసకర ఫామ్ చూస్తుంటే, ఈ ప్రపంచకప్లో న్యూజిలాండ్ను ఆపడం కష్టమేమో అనిపిస్తుంది. అతనికి ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్ లాంటి బ్యాటర్లు తోడైతే, బ్యాటింగ్కు స్వర్గధామమమైన ఉపఖండపు పిచ్లపై న్యూజిలాండ్ను ఆపడం కష్టమే. బ్యాటింగ్ విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుత న్యూజిలాండ్ జట్టు బౌలింగ్లో మరింత ప్రమాదకరంగా ఉంది. ఆ జట్టులో డఫీ, హెన్రీ, ఫెర్గూసన్, నీషమ్ లాంటి ప్రమాదకర ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అలాగే స్పిన్ విభాగంలో మిచెల్ సాంట్నర్ లాంటి టాప్ స్పిన్నర్ ఉన్నాడు. ఈ గెలుపుతో గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్ సూపర్-8 బెర్త్ దాదాపుగా ఖరారైనట్లే.అసాధారణ ప్రదర్శనఈ మ్యాచ్లో యూఏఈ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ జట్టు బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. పటిష్టమైన న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్ను ఎదుర్కొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేశారు. టీ20 వరల్డ్కప్ చరిత్రలో యూఏఈకి ఇదే అత్యధిక టీమ్ స్కోర్.కెప్టెన్ ముహమ్మద్ వసీం (66 నాటౌట్), అలీషాన్ షరాఫు (55) కలిసి యూఏఈకి ఈ రికార్డు స్కోర్ అందించారు. ఆఖర్లో మయాంక్ కుమార్ (21) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీయగా.. డఫీ, ఫెర్గూసన్, సాంట్నర్, ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.బెంబేలెత్తిపోయిన యూఏఈ బౌలర్లు174 పరుగుల లక్ష్య ఛేదనను న్యూజిలాండ్ ఓపెనర్లు ఆచితూచి ప్రారంభించారు. అయితే వీరిద్దరు క్రమంగా గేర్ మార్చి వీలు చిక్కనప్పుడల్లా యూఏఈ బౌలర్లును ఉతికి ఆరేశారు. వీరి ధాటికి రోహిద్ ఖాన్ 3.2 ఓవర్లలో 51 పరుగులు, జునైద్ సిద్దిఖీ 4 ఓవర్లలో 47 పరుగులు, అర్ఫాన్ 3 ఓవర్లలో 36 పరుగులు సమర్పించుకున్నారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ (4-0-27-0) ఒక్కడు కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. మొత్తంగా టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ ధాటికి యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు.
T20 WC 2026: గ్లెన్ ఫిలిప్స్కు ఘోర పరాభవం
న్యూజిలాండ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్కు ఘోర పరాభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ అసోసియేట్ దేశంపై ఓ ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన (27 పరుగులు) ఫుల్ మెంబర్ జట్టు బౌలర్గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. 2026 ఎడిషన్లో భాగంగా యూఏఈతో ఇవాళ (ఫిబ్రవరి 10) జరుగుతున్న మ్యాచ్లో ఫిలిప్స్ ఈ అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. యూఏఈ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఇది జరిగింది. ఆ ఓవర్లో ఫిలిప్స్ వరుసగా 1, 4, 6, 1wd, 4nb, 6, 1, 2 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం, మయాంక్ కుమార్ ఫిలిప్స్ను చెడుగుడు ఆడుకున్నారు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ అసోసియేట్ దేశంపై ఓ ఫుల్ మెంబర్ జట్టు బౌలర్ ఓ ఓవర్లో సమర్పించుకున్న అత్యధిక పరుగులు27 పరుగులు – గ్లెన్ ఫిలిప్స్ (NZ) vs UAE, చెన్నై, 202622 పరుగులు – కైల్ అబ్బాట్ (SA) vs ఆఫ్ఘనిస్తాన్, 201622 పరుగులు – తబ్రైజ్ షంసీ (SA) vs USA, 202422 పరుగులు – జోఫ్రా ఆర్చర్ (ENG) vs నేపాల్, 2026ఇదిలా ఉంటే, యూఏఈతో మ్యాచ్లో ఫిలిప్ ఒక్క ఓవర్లో తడబడినా, ఫీల్డ్లో మ్యాజిక్ చేశాడు. మూడు కీలక క్యాచ్లు పట్టడంతో పాటు, పలు అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలు చేసి యూఏఈని 200 పరుగుల మార్కును తాకకుండా కట్టడి చేశాడు. తాను బౌలింగ్ చేసిన 2 ఓవర్లలో ఓ ఓవర్లో 27 పరుగులిచ్చినా, మరో ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ కూడా తీశాడు.అసాధారణ ప్రదర్శనఈ మ్యాచ్లో యూఏఈ బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. పటిష్టమైన న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్ను ఎదుర్కొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేశారు. టీ20 వరల్డ్కప్ చరిత్రలో యూఏఈకి ఇదే అత్యధిక టీమ్ స్కోర్. కెప్టెన్ ముహమ్మద్ వసీం (66 నాటౌట్), అలీషాన్ షరాఫు (55) కలిసి యూఏఈకి ఈ రికార్డు స్కోర్ అందించారు. ఆఖర్లో మయాంక్ కుమార్ (21) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీయగా.. డఫీ, ఫెర్గూసన్, సాంట్నర్, ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.
శ్రీలంక జట్టుకు అతి భారీ షాక్
టీ20 ప్రపంచకప్కు సహా అతిథ్యమిస్తున్న శ్రీలంకకు అతి భారీ షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు వనిందు హసరంగ హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఐర్లాండ్ మ్యాచ్లో హసరంగ గాయంతో బాధపడుతూనే బౌలింగ్ చేశాడు. అయితే మ్యాచ్ అయిపోయాక తీసిన ఎంఆర్ఐ స్కానింగ్లో హసరంగ ఎడమ కాలి హ్యామ్స్ట్రింగ్లో తీవ్రమైన చీలక ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో అతను ఉన్నపళంగా ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. ఐర్లాండ్ మ్యాచ్లో హసరంగ గాయంతో బాధపడుతూనే తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి 3 వికెట్లు (25 పరుగులిచ్చి) తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే ఆ మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించింది. హసరంగ విషయాన్ని లంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అతనికి ప్రత్యామ్నాయంగా 31 ఏళ్ల లెగ్ స్పిన్నర్ దుషన్ హేమంతను ఎంపిక చేసింది. హేమంత బౌలింగ్ శైలి హసరంగను పోలి ఉంటుంది. హేమంత శ్రీలంక ఆడబోయే తదుపరి మ్యాచ్లో బరిలోకి దిగవచ్చు. శ్రీలంక ఫిబ్రవరి 12న జరిగే మ్యాచ్లో ఒమన్తో తలపడనుంది. హసరంగ స్థానాన్ని హేమంత భర్తీ చేసినా, ఆ స్థాయి ప్రదర్శనలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. హసరంగ లేని లోటు శ్రీలంకకు సూపర్-8 దశలో స్పష్టంగా కనిపించవచ్చు. గత కొంతకాలంగా హసరంగ తరుచూ గాయాల బారిన పడుతూ కీలక సమయాల్లో జట్టుకు అందుబాటులో ఉండలేకపోతున్నాడు. హసరంగ వైవిధ్యభరితమైన బౌలర్గానే కాకుండా బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించగల సమర్దుడు. హసరంగ స్థాయి ఆటగాడిని శ్రీలంక త్వరలో తయారు చేసుకోలేకపోతే, చాలా నష్టపోవాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్లో శ్రీలంక.. ఐర్లాండ్, ఒమన్, ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. ఈ జట్టు తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై ఘన విజయం సాధించి, సూపర్-8 దిశగా సాగుతోంది. గ్రూప్ దశలో శ్రీలంకకు ఎలాంటి ఇబ్బందులు (ఆస్ట్రేలియా మినహా) ఎదురుకాకపోయినా, సూపర్-8లో మాత్రం ఇబ్బందిపడాల్సి ఉంటుంది.
IND VS NAM: భారత తుదిజట్టు ఇదే.. సిరాజ్ అవుట్!
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 ఆరంభ మ్యాచ్లో టీమిండియా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయింది. పసికూన అమెరికా పటిష్ట భారత జట్టుకు కఠిన సవాలు విసిరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ ఝులిపించడం.. బౌలర్లు రాణించడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.సూర్యకుమార్ ధనాధన్ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఇషాన్ కిషన్ (20) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ అనూహ్య రీతిలో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. మిగిలిన వారిలో తిలక్ వర్మ (25) ఫర్వాలేదనిపించగా.. సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ (49 బంతుల్లో 84 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది టీమిండియా. లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు ముఖ్యంగా మొహమ్మద్ సిరాజ్ ఆదిలోనే వికెట్లు తీసి అమెరికాను కష్టాలోకి నెట్టాడు. ఓపెనర్లు ఆండ్రీస్ గౌస్ (6), సాయితేజ ముక్కామల్ల (2)ల వికెట్లను సిరాజ్ పడగొట్టగా.. కెప్టెన్ మోనాంక్ పటేల్ (0)ను అర్ష్దీప్ సింగ్ డకౌట్గా వెనక్కి పంపాడు.రాణించిన సిరాజ్మొత్తంగా సిరాజ్ మూడు, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టాడు. తద్వారా 20 ఓవర్లలో అమెరికాను 132-8 పరుగులకే పరిమితం చేసి టీమిండియా 29 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో మ్యాచ్లో గురువారం ఢిల్లీ వేదికగా నమీబియాతో టీమిండియా తలపడనుంది.వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకిఈ మ్యాచ్కు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకి వచ్చాడు. అయితే, అతడికి తుదిజట్టులో చోటు దక్కడం కష్టమేనని టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. అదే విధంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాకతో సిరాజ్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఉండదని అభిప్రాయపడ్డాడు.సిరాజ్పై వేటు తప్పదుకాగా హర్షిత్ రాణా గాయపడటంతో అనూహ్య రీతిలో సిరాజ్ వరల్డ్కప్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అమెరికాతో మ్యాచ్కు ముందు బుమ్రా జ్వరంతో బాధపడిన కారణంగా ఏకంగా తుదిజట్టులోకి వచ్చే గోల్డెన్ ఛాన్స్ రాగా.. మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే, బుమ్రా తిరిగి వస్తే మాత్రం సిరాజ్పై వేటు తప్పదని బంగర్ అన్నాడు.నమీబియాతో మ్యాచ్ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని జట్టుతో చేరడం శుభసూచకం. అతడి నైపుణ్యాలపై టీమిండియా యాజమాన్యానికి గట్టి నమ్మకం ఉంది. టోర్నీ ఆరంభం నుంచి అందుబాటులో లేకపోయినా అతడిని జట్టులో కొనసాగించడం ఇందుకు నిదర్శనం.స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా వాషీకి ఆ ప్రాధాన్యం ఉంటుంది. అయితే, ఢిల్లీలో జరిగే మ్యాచ్లో వాషీ తుదిజట్టులోకి రాలేడు. ఇక బుమ్రా తిరిగి వస్తాడు కాబట్టి ఫామ్లో ఉన్న సిరాజ్ను పక్కనపెట్టక తప్పదు’’ అని సంజయ్ బంగర్ అభిప్రాయప్డాడు. ఇదిలా ఉంటే.. ఓపెనర్గా సంజూ శాంసన్ను తప్పించిన యాజమాన్యం.. అతడి స్థానంలో ఇషాన్ను తీసుకువచ్చింది. మున్ముందు మ్యాచ్లలోనూ అతడినే ఓపెనర్గా కొనసాగించే అవకాశం ఉంది.నమీబియాతో మ్యాచ్కు భారత తుదిజట్టు అంచనాఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా/మొహమ్మద్ సిరాజ్.చదవండి: భారత్తో మ్యాచ్కు అంగీకరించిన పాక్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్ ఆయకట్టు ఎడారే!. ఆల్మట్టి ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్ దూకుడు ఆంధ్రప్రదేశ్లో ‘ఆప్కాస్’ ఉద్యోగాలకు మంగళం
అమరావతి సైతం ప్రైవేట్ పరం... అందినకాడికి బాదుడే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు
పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ... వియ్యంకుల సంస్థలకు పనుల అప్పగింత
జంగిల్రాజ్పై ప్రశ్నిస్తున్నందుకే గూండా దాడులు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు అరాచకాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
‘లిఫ్ట్’ తాకట్టుపై రాయలసీమ కన్నెర్ర... ఆపిన పనులు రెండు నెలల్లో మళ్లీ మొదలుపెట్టాలని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ... చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
రెడ్బుక్కే రాజ్యాంగం, చంద్రబాబే ‘సుప్రీం’... తిరుమల శ్రీవారి లడ్డూపై సొంత విచారణ చేపట్టాలని ఏపీ సీఏం నిర్ణయం
కొలిక్కివచ్చిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం. అమెరికా టారిఫ్లు 18 శాతానికి తగ్గింపు
దేశానికి వికసిత విజన్... 2026-27 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్లో గూండారాజ్... పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. శనివారం రాత్రి అరెస్టు
బిజినెస్
వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో తాను 600 సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చారు.ఇటీవల నేను మరో 600 యూఎస్ సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేశాను. ఈ రోజు వెండి స్పాట్ ధర ఒక ఔన్సుకు 82 డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను గమనిస్తే, భవిష్యత్తులో వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉందని నా నమ్మకం. ముఖ్యంగా 2026లో వెండి ధర ఒక్క ఔన్సుకు 200 డాలర్లకు చేరుకోవచ్చు, లేదా దానికంటే కూడా ఎక్కువ కావచ్చు అని నేను భావిస్తున్నాను.ఇప్పటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికన్ డాలర్ స్థితి ఆందోళనకరంగా మారుతోంది. అధిక రుణాలు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల డాలర్ విలువ క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కాగితపు కరెన్సీ (ఫియట్ కరెన్సీ)పై మాత్రమే ఆధారపడే వారు భవిష్యత్తులో నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.Just purchased another 600 US Silver Eagles.Today’s spot is $82 an ounce. Still believe silver will reach $200 an ounce….or more…. in 2026.The US dollar is in trouble.Savers of fiat currency (fake $) biggest losersTake care.— Robert Kiyosaki (@theRealKiyosaki) February 9, 2026ఫియట్ కరెన్సీ విలువ అనేది.. కేవలం ప్రభుత్వ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కానీ వెండి, బంగారం వంటి విలువైన లోహాలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇవి ద్రవ్యోల్బణం నుంచి సంపదను కాపాడే సాధనాలుగా పని చేస్తాయి. అందుకే కరెన్సీ విలువ తగ్గుతున్న సమయంలో నిజమైన ఆస్తులైన.. వెండి వంటి లోహాల్లో పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం అని కియోసాకి పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో ఆర్థిక అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం డబ్బును దాచుకునేవారి కంటే.. నిజమైన విలువ ఉన్న ఆస్తుల్లో (బంగారం, వెండి మొదలైనవి) పెట్టుబడి పెట్టినవారే లాభపడతారు. ఈ విషయాన్ని గమనించి, భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉండండి, అని కియోసాకి ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కియోసాకి ఒకేసారి 600 యూఎస్ సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేయడంతో.. వెండి రేటు తప్పకుండా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. కాగా.. ఇండియన్ మార్కెట్లో కూడా వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. నేడు (ఫిబ్రవరి 10) కేజీ రేటు రూ.3 లక్షలకు చేరుకుంది. అంటే ఒక గ్రాము 300 రూపాయలన్నమాట. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
జీఎస్టీ అంటే భయమేలా?
దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చి ఏడేళ్లు దాటినా సామాన్య పన్ను చెల్లింపుదారులు, చిరు వ్యాపారుల్లో దీనిపై నెలకొన్న ఆందోళనలు తగ్గడం లేదు. జీఎస్టీ అంటే కేవలం పన్ను విధానం మాత్రమే కాదు, అది ఒక క్లిష్టమైన సవాల్ అనే భావన బలంగా నాటుకుపోయింది. నిజాయితీగా వ్యాపారం చేసే వారు కూడా నోటీసులు వస్తాయేమోనని భయపడే పరిస్థితి ఎందుకు ఉంది? ప్రభుత్వం నుంచి అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం అసలు వాస్తవాలేంటో ఇక్కడ చూద్దాం.జీఎస్టీ ఎందుకు భారంగా అనిపిస్తోంది?చాలా మంది వ్యాపారులు జీఎస్టీ వ్యవస్థను తమకు సహకరించే వ్యవస్థగా కాకుండా కేవలం పన్ను వసూలు చేసే యంత్రాంగంగా మాత్రమే చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు..ఆదాయపన్ను రిటర్న్ దాఖలులో చిన్న పొరపాటు జరిగినా లేదా ఆలస్యమైనా ఏటా 18% వడ్డీ భారం పడుతుంది. ఇది చిన్న వ్యాపారుల లాభాలను దెబ్బతీస్తోంది.కొనుగోలుదారు, విక్రేత ఇచ్చే లెక్కల్లో స్వల్ప తేడాలున్నా (జీఎస్టీఆర్-2బీ vs 3బీ) సిస్టమ్ వెంటనే అప్రమత్తం చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతోంది.క్షేత్రస్థాయిలో తప్పులు జరిగినప్పుడు సరిదిద్దే మార్గాల కంటే శిక్షించే నిబంధనలే ఎక్కువగా ప్రచారంలో ఉండటం భయానికి కారణం.నోటీసు అంటే భయపడాలా?వ్యాపారులకు జీఎస్టీ నోటీసు అందగానే అదొక క్రిమినల్ కేసులా భావిస్తుంటారు. అధిక శాతం నోటీసులు అధికారులు స్వయంగా పంపేవి కావు. సాఫ్ట్వేర్ ద్వారా డేటాలో తేడాలను గుర్తించి జారీ అయ్యే స్క్రూటినీ నోటీసులు ఎక్కువగా ఉంటాయి. నోటీసు అంటే కేవలం వివరణ కోరడం మాత్రమే. సరైన ఆధారాలు చూపిస్తే చాలా వరకు సమస్యలు అక్కడితోనే ముగుస్తాయి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. జీఎస్టీ ప్రారంభ దశలో (2017-19) జరిగిన చిన్న పొరపాట్లకు వడ్డీ, జరిమానాల నుంచి మినహాయింపులు కూడా ఇచ్చారు.జీఎస్టీ చట్టం కింద విధించే జరిమానాల విషయంలో పన్ను చెల్లింపుదారులు అనవసర ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే చట్టం పొరపాట్లకు, మోసాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. సాధారణంగా ఉద్దేశపూర్వకంగా కాకుండా అవగాహన లోపం వల్ల జరిగే సాధారణ తప్పుల విషయంలో శిక్షలు తక్కువగా ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 10 శాతం లేదా రూ.10,000.. వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. ఇది కేవలం పన్ను చెల్లింపుదారుడిని క్రమశిక్షణలో ఉంచడానికి ఉద్దేశించిన చర్య మాత్రమే.అయితే, పన్నును ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టాలని చూసినా లేదా తప్పుడు లెక్కలతో వ్యవస్థను మోసం చేయాలని ప్రయత్నించినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 100 శాతం వరకు, అంటే పన్నుకు సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధించే అధికారం ఉంటుంది. దీనివల్ల నిజాయితీగా ఉండే వ్యాపారులకు రక్షణ కలుగుతుండగా, అక్రమాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక అందుతుంది.చాలా మందిలో ఉన్న మరొక ప్రధాన అపోహ ఏమిటంటే.. అధికారులు విధించిన జరిమానాపై అప్పీల్కు వెళ్తే అది మరింత పెరుగుతుందని భయపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పన్ను చెల్లింపుదారుడి వద్ద సరైన ఆధారాలు ఉండి, చట్టబద్ధంగా వారి వాదన బలంగా ఉంటే అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ద్వారా ఉపశమనం పొందే హక్కు వారికి ఉంటుంది. కాబట్టి చట్టంపై సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఇటువంటి అపోహల నుంచి బయటపడవచ్చు.తెర వెనుక ఏం జరుగుతుంది?జీఎస్టీ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా డేటా అనలిటిక్స్ ఆధారంగా నడుస్తోంది. ఒక వ్యాపారి నిరంతరం తప్పుడు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేస్తున్నా లేదా పదే పదే రిటర్న్లు ఎగ్గొడుతున్నా వారిని మాత్రమే వ్యవస్థ హై రిస్క్ కేటగిరీలో ఉంచుతుంది. అధికారుల జోక్యం తగ్గించేందుకు ‘ఫేస్లెస్ అసెస్మెంట్’(పన్ను చెల్లింపుదారుడు, పన్ను అధికారి ప్రత్యక్షంగా ముఖాముఖి కలవాల్సిన అవసరం లేకుండానే పన్ను మదింపు ప్రక్రియను పూర్తి చేసే ఒక ఆధునిక విధానం) వంటి విధానాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.అవగాహనే రక్షణజీఎస్టీ అనేది చట్టం కంటే దానిపై సమాచార లోపం వల్లే ఎక్కువగా క్లిష్టంగా కనిపిస్తోంది. సకాలంలో రిటర్న్లు దాఖలు చేయడం, నోటీసులకు వెంటనే స్పందించడం, నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు. వ్యవస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.- దవనం శ్రీకాంత్
నాటి విమర్శలకు పిచాయ్ సమాధానం
టెక్ ప్రపంచంలో ఎవరైతే ముందుగా కొత్త సాంకేతికతను అందిస్తారో వారే విజేతలని అందరూ భావిస్తారు. 2023 ప్రారంభంలో జనరేటివ్ ఏఐ రంగంలో గూగుల్ ప్రత్యర్థుల కంటే వెనుకబడిందని విమర్శలు వెల్లువెత్తినప్పుడు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ తన ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత ఈమెయిల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆనాడు ఆయన చెప్పిన మాటలు, నేడు గూగుల్ సాధిస్తున్న రికార్డు స్థాయి విజయాల్లో ప్రతిబింబిస్తున్నాయి.తొందరపాటు వద్దు..ఏఐ రేసులో గూగుల్ వెనుకబడిందన్న వార్తల నేపథ్యంలో సుందర్ పిచాయ్ తన సిబ్బందికి ధైర్యాన్నిస్తూ ఒక సందేశం పంపారు. ‘గూగుల్ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండటానికి తొందరపడలేదు. కానీ అత్యుత్తమంగా నిలవడానికి ప్రయత్నించింది’ అని ఆయన గుర్తు చేశారు. జీమెయిల్, క్రోమ్, ఆండ్రాయిడ్ వంటివి మార్కెట్లోకి వచ్చిన తొలి ఉత్పత్తులు కావు, కానీ వినియోగదారుల సమస్యలను అత్యంత సమర్థవంతంగా పరిష్కరించడం వల్లే అవి ప్రపంచాన్ని శాసించగలిగాయని ఆయన వివరించారు. నాణ్యత, సాంకేతిక బలం, దీర్ఘకాలిక ప్రభావంపైనే దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.జెమిని 3సుందర్ నమ్మిన వ్యూహం నేడు సత్ఫలితాలను ఇస్తోంది. గూగుల్ అత్యాధునిక ఏఐ మోడల్ ‘జెమిని’ విడుదలైన తర్వాత కంపెనీ దశ మారిపోయింది. ప్రస్తుతం గూగుల్ సెర్చ్లో ‘ఏఐ ఓవర్వ్యూ’ ద్వారా జెమిని అన్నింట్లో పాగా వేసింది. ప్రతి నెలా మిలియన్ల మంది వినియోగదారులు జెమిని యాప్ను ఉపయోగిస్తుండగా వ్యాపార సంస్థలు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి గూగుల్ ఏఐ సాధనాలను స్వీకరిస్తున్నాయి.రికార్డు ఆదాయంఈ వ్యూహాత్మక మార్పుల ఫలితంగా గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చరిత్ర సృష్టించింది. ఇటీవల కంపెనీ వార్షిక ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాకుండా ఏఐ కోసం ప్రత్యేక చిప్లు, అత్యాధునిక డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా గూగుల్ ఒక పూర్తిస్థాయి ఏఐ ఎకోసిస్టమ్ను సిద్ధం చేసింది. ఇది నిర్వహణ ఖర్చులను తగ్గించడమే కాకుండా పనితీరులో ప్రత్యర్థుల కంటే ముందుండడానికి సహాయపడిందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్
‘కంపెనీలకు వ్యాపారమే ముఖ్యం’
కార్పొరేట్ ప్రపంచంలో లాయల్టీ (నమ్మకంగా పని చేయడం) కంటే అడాప్టబిలిటీ (మార్పుకు అనుగుణంగా మారడం) ముఖ్యమని ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ చెబుతున్నారు. ఒకే సంస్థలో దాదాపు 15 ఏళ్ల పాటు సేవలందించి అనూహ్యంగా ఉద్యోగం కోల్పోయిన ఓ 40 ఏళ్ల భారతీయ టెక్కీ తన ఆవేదనను, తాను నేర్చుకున్న పాఠాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.‘దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు’ అనే శీర్షికతో రెడ్డిట్లో ఓ వ్యక్తి అప్లోడ్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. కొవిడ్-19 తర్వాత సదరు కంపెనీ నిధుల కోసం తీవ్రంగా ప్రయత్నించిందని, అయితే జులైలో నిధులు నిలిచిపోవడంతో పరిస్థితి తలకిందులైందని ఆయన పేర్కొన్నారు. అధికారికంగా లేఆఫ్ ప్రకటించే కంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయమని మేనేజ్మెంట్ డిమాండ్ చేయడంతో ఆయన కంపెనీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు.‘నేను అక్కడ చాలా సౌకర్యవంతంగా ఉన్నాను. కొత్త సవాళ్లు ఉన్నాయి. చాలా సమర్థంగా పని చేసేవాడిని. అందుకే 15 ఏళ్లలో కేవలం బయట ఒకటి రెండు ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చాను. కానీ ఇప్పుడు వాస్తవం అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. మళ్లీ ఉద్యోగ వేటలో భాగంగా 60-70 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత మార్కెట్ పరిస్థితిని విశ్లేషిస్తూ తోటివారి కోసం ఆయన కొన్ని అంశాలు తెలియజేశారు.కంపెనీకి వ్యాపారమే ముఖ్యం. మిమ్మల్ని ఎప్పుడైనా రీప్లేస్ చేయవచ్చు.ఒకే చోట ఎక్కువ కాలం ఉండకండి.కంపెనీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆరా తీస్తూ ఉండండి.కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపకండి.మీ మార్కెట్ విలువ తెలుసుకోవడానికి ఇంటర్వ్యూలకు హాజరవుతుండాలి.మీ విజయాలను, ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకోండి.ప్రతి 6-12 నెలలకు లింక్డ్ఇన్, సీవీ అప్డేట్ చేయండి.పరిచయాలను పెంచుకోండి. అవి కష్టకాలంలో ఆదుకుంటాయి.కంపెనీలు రెజెక్ట్ చేస్తున్నా పెద్ద రోల్స్ కోసం ప్రయత్నించండి.ఇంటర్వ్యూ తర్వాత లోపాలను అడిగి తెలుసుకోండి.మీ ఉద్యోగం మాత్రమే మీ గుర్తింపు కాదు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి ఉండటం వల్ల మీరు రీప్లేస్ కోసం ఉన్న పాత ఫర్నిచర్లా మారిపోతారని ఒక యూజర్ స్పందించారు. మరో యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. ‘నేను 11 ఏళ్లలో 11 ఉద్యోగాలు మారాను. ప్రతిసారీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూనే ఉన్నాను. కంపెనీ కుటుంబంలా అనిపించవచ్చు కానీ, మన నిజమైన కుటుంబం ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడూ అప్డేటెడ్గా ఉండటమే మనుగడకు మార్గం’ అని సలహా ఇచ్చారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్
ఫ్యామిలీ
ఫిట్స్ వస్తే.. ఏం చేయాలి?
ఫిట్స్, సీజర్స్, ఎపిలెప్సీ అంటూ పిలిచే ఈ వ్యాధిని చాలా సాధారణ సమస్యగా పరిగణించాలి. చికిత్సతో పూర్తిగా తగ్గే సమస్య ఇది. అయితే దీని గురించి ఇంకా ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి. నేడు (ఫిబ్రవరి 9) ఎపిలెప్సీ డే (International Epilepsy Day) సందర్భంగా ఫిట్స్పై అవగాహన కోసమే ఈ కథనం. 90 శాతంలో పూర్తి తగ్గుదల 10 శాతంలోనే మాటిమాటికీ... తీవ్రత ఆధారంగా మందును, మోతాదును నిర్ణయిస్తారు. దాదాపు 70 శాతం మందిలో కేవలం ఒకే ఒక మందుతో నియంత్రణలోకి వస్తాయి. కొద్దిమందిలో... అంటే మరో 10 శాతం బాధితులకు రెండు మందులు, ఇంకో 10 శాతం మందిలో మూడు మందులను వాడాల్సి రావచ్చు. దాదాపు 70 శాతం మంది బాధితులు రెండేళ్ల తర్వాత మందును ఆపేయవచ్చు. దీనికోసం డాక్టర్లు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులు ఇక ఆపేయవచ్చనే నిర్ణయానికి వస్తారు. కానీ మరో 10 శాతం మందికి నాలుగు రకాల మందులు వాడినా కూడా ఫిట్స్ పదే పదే వస్తుండవచ్చు.6.5 కోట్ల మందిప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల మంది ఫిట్స్తో బాధపడుతుండగా మనదేశంలో దాదాపు కోటి నుంచి 1.2 కోట్ల మంది బాధితులున్నారు. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ 50 లక్షల మంది కొత్త పేషెంట్స్ ఈ జాబితాలో చేరుతున్నారు. 26 మందిలో ఒకరికి... చూడ్డానికి ఎంతో భయంకరంగా, ఆందోళన గొలిపేలా ఉండే లక్షణాలూ, అపోహల కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. దేశంలోని ప్రతి 26 మందిలో ఒకరికి ఫిట్స్ కనిపిస్తున్నాయి. ఇందులో 80% అల్పాదాయ, మధ్యతరగతివారే. ఇదేమీ భయంకరమైన వ్యాధి కాదు. మానసిక వ్యాధి అంతకంటే కాదు. అంటువ్యాధి కానే కాదు. చికిత్స తీసుకుంటే పూర్తిగా తగ్గిపోయే నిరపాయకరమైన వ్యాధి. అనేక అపోహల కారణంగా దేశంలోని 50% పైగా బాధితులు ఇంకా చికిత్సకు దూరంగా ఉన్నారు.70% మందిలో.. ఫిట్స్ / ఎపిలెప్సీ వచ్చినవాళ్లలో దాదాపు 70 శాతం మందిలో కారణాలు తెలియవు. మిగతా 30 శాతం మందిలో ఏవైనా నిర్దిష్టమైన కారణాలతో ఫిట్స్ వస్తుంటాయి. ఉదాహరణకు... కొందరిలో వంశపారంపర్యంగా, తలకు దెబ్బతగలడం, పక్షవాతం, మెదడులో గడ్డలుగానీ లేదా ఇన్ఫెక్షన్గానీ రావడం వల్ల అలాగే మరికొందరిలో పక్షవాతం (స్ట్రోక్) కారణంగా రావచ్చు.ప్రస్తుతం ఫిట్స్ కోసం దాదాపు 15 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు బాధితుల బరువు ఆధారంగా వీటి మోతాదును నిర్ణయిస్తారు. ఫిట్స్ మళ్లీ మాటిమాటికీ రాకుండా ఉండాలంటే పూర్తి కోర్సు వాడాల్సిందే.మరికొన్ని మార్గాలు ఫిట్స్ తగ్గించేందుకు కొన్ని మార్గాలూ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో... శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా ఫిట్స్ ఆవిర్భావ కేంద్రాన్ని గుర్తించినట్లయితే... దాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించుకుని, శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఇక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ మరొకటి. ఇక కొందరు చిన్నపిల్లలకు కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం (కీటోజెనిక్ డైట్) ఇవ్వడం ద్వారా ఫిట్స్ను అదుపు చేయవచ్చ. మరికొందరిలో ‘వేగస్ నర్వ్’ అనే నరాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా కూడా ఫిట్స్ను అదుపుచేయవచ్చు.ఫిట్స్ వచ్చినప్పుడు... ఫిట్స్ వచ్చినవారికి తాళం చేతులు అందించడం, ఏదైనా లోహపు వస్తువును చేతిలో పెట్టడం చేస్తుంటారు. వాస్తవానికి ఇవేవీ చేయకూడదు. ఫిట్స్రాగానే ఆ వ్యక్తిని.. ∙సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. ఎక్కువగా కదిలించకూడదు. ∙నోటిలోగాని చేతిలోగాని బలమైన లోహపు వస్తువులను ఉంచకూడదు. ∙ఒక పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి. ∙కాళ్లూ, చేతులు కొట్టుకుంటుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా ఫిట్స్ వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో అతడు తనంతట తానే మామూలు స్థితికి వస్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా లేదా మళ్లీ వెంటనే ఫిట్స్ రావడం ప్రారంభమైనా వీలైనంత త్వరగా అతడిని ఆసుపత్రికి తరలించాలి.చదవండి: అవాంఛిత రోమాలకు పరిష్కారంచివరగా... ఎపిలెప్సీ అనేది ఉన్నతికి ఏమాత్రం ప్రతిబంధకం కాదు.మహిళల్లో ఎపిలెప్సీ వచ్చినా అది సాధారణ జీవితానికి ఏమాత్రం అడ్డంకి కాదు. అందరిలానే వీళ్లూ పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలను కనవచ్చు.
మొబైల్ చాయ్.. ఉపాధికి హాయ్..
ఒక ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది.. ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాదు.. నిజ జీవితంలో విజయాలకు పునాది వేసిన ఆనవాళ్లు అనేకం.. ఒక వినూత్న ఆలోచనతో, తక్కువ పెట్టుబడితో వ్యాపారాలు చేస్తున్నవారు అనేకమంది ఉన్నారు.. అలాంటి వారిలో ఒకరు సనత్నగర్కు చెందిన లక్ష్మణ్. 30 ఏళ్ల క్రితమే మొబైల్ వ్యాపార కాన్సెప్్టకు అంకురార్పణ చేశారు. ప్రస్తుతం అనేక మంది ఈ రంగంలో ఉపాధి పొందుతోన్న విషయం తెలిసిందే.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురవన్నపేటకు చెందిన బచ్చల లక్ష్మణ్ బతుకుదెరువు కోసం 30 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. మొదట రిక్షా తొక్కుకుంటూ జీవనం ప్రారంభించాడు. గిట్టుబాటు లేకపోవడంతో సాయంత్రానికి నిరాశా నిస్పృహలే మిగిలేవి. అప్పుడే.. టీ కోసం అనేకమంది దూరం వెళ్లడాన్ని గమనించాడు. రిక్షానే మొబైల్ టీ స్టాల్గా మారిస్తే.. అన్న ఆలోచన తట్టింది. అకున్నదే తడవు ఆచరణలో పెట్టాడు. 1996లో ఎస్ఆర్ నగర్, అమీర్పేట ప్రాంతంలో రిక్షాలో మొబైల్ టీ స్టాల్ ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎక్కడ పది మంది గుమికూడితే అక్కడ టీ అందిస్తూ జీవన ప్రయాణాన్ని సాగించారు. సంవత్సరం తిరక్కముందే రిక్షా నుంచి మూడు చక్రాల బైక్కు అప్గ్రేడ్ అయ్యాడు. ఒకటిగా ప్రారంభమై.. అలా ఒక్క మొబైల్ టీ స్టాల్ కాస్తా.. ప్రస్తుతం 22 మొబైల్ టీ స్టాల్స్ను స్వయంగా తీర్చిదిద్ది ఉపాధి కోసం వెతుక్కునే వారికి అండగా నిలుస్తున్నాడు. లక్ష్మణ్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న మొబైల్ టీ పరిమళం ఎస్ఆర్నగర్, అమీర్పేట దాటుకుని నగరం అంతటా వ్యాపించింది. తెల్లవారుజామున 4 గంటలకే అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద దిగే ప్రయాణికులకు అల్లం, గ్రీన్, లెమన్, బూస్ట్, హార్లిక్స్, కాఫీ, టీ కాషన్.. ఇలా అనేక రకాల తేనీటిని అందిస్తుంటాడు.రూపాయి నుంచి.. ‘అప్పట్లో అమీర్పేట కేంద్రంగా సాఫ్ట్వేర్ సంస్థల కార్యకలాపాలు కొనసాగేవి. ఇద్దరు సహాయకులతో నడిపేవాడిని.. వారికి రోజుకు రూ.50లు ఇచ్చేవాణ్ణి. ప్రారంభంలో రూపాయికే టీ.. అలా రోజుకు 700–800 టీలు విక్రయించేవాణ్ణి. దీనిమీదే ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు చేశా. సొంతిల్లు కొనుక్కున్నా. నాకులా వ్యాపారం చేసుకునేందుకు వీలుగా 22 మందికి మొబైల్ టీ స్టాల్స్ ఇస్తున్నా. ఇంతగా విస్తృతమవుతుందని అప్పుడు అనుకోలేదు’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.
అనంతగిరి హిల్స్.. ది బ్రీజ్
ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పద్మనాభస్వామి దేవాలయం, కొలను, టీబీ హస్పిటల్ ఇతర పర్యాటక ప్రాంతాలు నగరవాసులకు సుపరిచితమే. అటవీ ప్రాంతంలో కర్ణాటకలో ‘జంగల్ లాడ్జెస్ అండ్ రిసార్ట్స్’ తరహలో ఎకో టూరిజం బ్రాండ్గా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ‘డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయల్స్’ పేరిట ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. పర్యాటకుల కోసం వికారాబాద్లోని అనంతగిరి హిల్స్లో ‘ది బ్రీజ్’ను తిర్చిదిద్దింది. అనంతగిరిని విజిట్ చేయాలనుకునే పర్యాటకులకు ఓ కొత్త అనుభూతిని అందించనున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. పర్యాటకుల కోసం ది బ్రీజ్లో జంగిల్ కాటేజెస్ నిర్మించారు. ట్రెక్కింగ్, బర్డ్స్ వాక్, నైట్ క్యాంప్స్, సఫారీ, బుష్ బ్రెక్ఫాస్ట్ వంటి వినూత్న కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. అటవీ విజ్ఞాన శాస్త్రం, హోటల్ మేనేజ్మెంట్ చదివిన నేచురలిస్ట్లు అడవులు, వృక్ష వైవిధ్యం, జంతు విజ్ఞానం, వాటి సంరక్షణ, హస్పిటాలిటీ తదితర అంశాలను ఇందులో భాగంగా వివరిస్తారు. ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులను మధ్యాహ్నం 1 గంటకు ది బ్రీజ్లో మేనేజర్/ నేచురలిస్ట్ బృందం రిసీవ్ చేసుకుంటుంది. మధ్యాహ్నం 10 రకాల వంటలతో భోజనం అందిస్తారు. షెడ్యూల్ ఇలా.. విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 4 గంటలకు ట్రెక్కింగ్, బర్డ్ వాక్ చేస్తూ సూర్యాస్తమయం వ్యూ తిలకిస్తారు. నాలుగు కిలోమీటర్ల ప్రయాణంలో చెట్లు, పక్షులు, గడ్డి, జంతువుల గురించి వివరిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు రిసార్ట్లో స్నాక్స్ అందిస్తారు. రాత్రి 7.30 గంటలకు క్యాంప్ ఫైర్ వేసి వైల్డ్ లైఫ్ గురించి అనేక విషయాలు వివరిస్తారు. రాత్రి 8.45 గంటలకు నాన్వెజ్ డిన్నర్ అందిస్తారు. రాత్రి టెంట్లో బస చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు మొదలయ్యే సఫారీ దాదాపు 10 కిలో మీటర్లు అడవీలో తిరుగుతారు. 8.45 గంటలకు అడవిలో బుష్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. తిరిగి ఉదయం 11 గంటలకు చెక్ అవుట్ ఉంటుంది.ప్యాకేజీ వివరాలకు.. సందర్శించాలనుకునే పర్యాటకులు వివిధ ప్యాకేజీలను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాల కోసం వెబ్ సైట్ : deccanwoodsandtrails. com/ 9493549399, 9885298980 నెంబర్లలో సంప్రదించవచ్చు.
నీతా అంబానీ ధరించిన చానెల్ బ్లేజర్ ..అంత ఖరీదా!?
రిలయన్స్ ఫౌండేషన్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ లగ్జరీ దుసులకు, ఆభరణాలకు కేరాఫ్ ఆమె. నీతా ధరించి ప్రతి చీర ఓ అద్భుతం. కళ్లుచెదరిపోయే ఖరీదు చేసే ఆభరణాలతో తన ఫ్యాషన్ శైలిని చెబుతుంటారామె. భారతీయ వారసత్వానికి ప్రతీకగా నిలిచే సంప్రదాయ చేనేత చీరలు, అలానాటి రాజుల కాలం నాటి ఆభరణాలతో మన పూర్వవైభవాన్ని తెలుసుకునేలా లేదా గుర్తుచేసేలా అద్భుతమైన లుక్తో కనిపించే నీతా ఈసారి వెస్ట్రన్ వేర్లో అదుర్స్ అనిపించుకున్నారు. తను ఏది ధరించిన సెన్సెషన్గానే ఉంటుంది. ఎందుకంటే వాటి ధర, డిజైన్ కూడా ఊహకందనిది. ఇక నీతా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)లో భారత ప్రతినిధిగా మిలానో-కోర్టినా వింటర్ ఒలింపిక్ గేమ్స్ 2026కి ముందు 145వ IOC సెషన్కు హాజరయ్యారు. ఏ వేదికపై భారత సంప్రదాయం ఉట్టిపడేలా చీరలే ఎంచుకునే నీతా ఈసారి బాస్లా కనిపించే పవర్ బ్లేజర్, చిక్ కోట్తో ఎంటర్ అవ్వడం విశేషం. నీతా అంబానీ చానెల్ స్ప్రింగ్ సమ్మర్ 2026 ప్రీ కలెక్షన్ స్టైలిష్ నేవి బ్లూ బ్లేజర్ ధరించింది. పైగా ఈ బ్లేజర్కి డబుల్ కాలర్లు, ఫుల్ స్లీవ్స్, నాచ్ లాపెల్స్, రెండు సైడ్ పాకెట్స్ ఉన్నాయి. అధునాతన నేవీ బ్లూ రంగులో ఉన్న బ్లేజర్పై కుడివైపు కాలర్పై ఎరుపు పూల డైమండ్ బ్రూచ ఆ బ్లేజర్ని మరింత అద్భుతంగా కనిపించేలా చేసింది. దానికి నల్లటి ఫార్మల్ ప్యాంటుని జత చేసి..సింపుల్గా డైమండ్ ఆకారపు చెవిపోగులు ధరించి స్టైలిష్గా కనిపించారామె. ఇంతకీ ఈ బ్లేజర్ ఎంతో తెలిస్తే నోటమాటరాదు. ఇది అక్షరాలు రూ. 738,800/-. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: దుపట్టాను రూపొందించినందుకు థ్యాంక్యూ)
అంతర్జాతీయం
కౌన్సిలర్ ఎన్నికల బరిలో ఉగ్రవాది
బ్రిటన్లోని బర్మింగ్హామ్లో రాబోయే మే నెలలో నగర కౌన్సిలర్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో ఓ ఉగ్రవాది పోటీ చేస్తుండటం షాకింగ్గా అనిపిస్తోంది. 1999లో యెమెన్లోని బ్రిటీష్ కాన్సులేట్, ఓ మసీదు, స్విస్ హోటల్పై బాంబు దాడులు జరగ్గా.. వీటిలో భాగమైన షాహిద్ భట్ దోషిగా తేలాడు. ఉగ్రవాద సంఘాలతో సంబంధాలు కారణంగా జైలుశిక్ష అనుభవించాడు.ఉగ్రవాది అబూ హమ్జాకు గతంలో అనుచరుడిగా ఉన్న భట్.. అప్పట్లోనే అఫ్ధానిస్తాన్, బోస్నియా, తర్వాత యెమెన్కు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తనపై వచ్చిన విమర్శలను షాహిద్ ఖండించాడు. బర్మింగ్హామ్ కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తనని తాను సమర్థించుకున్నాడు.యెమెన్ కోర్టులో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా నాకు శిక్ష విధించారు. కౌన్సిలర్ ఎన్నికల్లో నాకే ఓటేయాలని ఎవరినీ బలవంతం చేయను. నచ్చకపోతే నాకు ఓటు వేయొద్దు అని షాహిద్ భట్ క్లారిటీ ఇచ్చాడు. షాహిద్ భట్.. ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూటమి తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. దీనికి అఖ్మద్ యాకుబ్, షకీల్ అఫ్జర్ నాయకత్వం వహిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గాజా, పాలస్తీనా అంశాలపై లేబర్ పార్టీ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ఓటర్లపై ఈ కూటమి ప్రభావం చూపగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే కౌన్సిల్ ఎన్నికల్లో లేబర్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుని ఈ స్వతంత్ర అభ్యర్థులు దెబ్బతీయగలదని అంచనా వేస్తున్నారు.బ్రిటన్ చట్టాల ప్రకారం, విదేశాల్లో లేదా దశాబ్దాల క్రితం జరిగిన నేరాల్లో శిక్ష అనుభవించినవారికి కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. ఈ నిబంధనలు భట్కు అనుకూలంగా మారాయి. ఈ వ్యవహారంపై ప్రముఖ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లేబర్ ఎంపీ జెస్ ఫిలిప్స్ మాట్లాడుతూ.. ఉగ్రవాద దోషిగా తేలిన వ్యక్తి ప్రజాప్రతినిధిగా పోటీపడటం అత్యంత దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు.
జిమ్మీ లాయ్కి 20 ఏళ్ల జైలు
హాంకాంగ్: చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించే ప్రజాస్వామ్య అనుకూల, హాంకాంగ్ మీడియా మాజీ అధిపతి జిమ్మీ లాయ్(78)కి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. దేశ భద్రతకు ప్రమాదం కలిగించేందుకు విదేశీ శక్తులతో చేతులు కలిపారని, విద్రోహ వార్తా కథనాలను ప్రచురించారని బ్రిటిష్ పౌరుడు కూడా అయిన లాయ్పై అభియోగాలున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక కుట్రలన్నిటికీ జిమ్మీ లాయ్ని ముఖ్య సూత్రధారిగా తీర్పు సందర్భంగా జడ్జిలు పేర్కొన్నారు. లాయ్ వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, కఠినమైన ఏకాంత కారాగారవాసం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని, జరిమానా తగ్గించామన్నారు. అక్రమాలకు సంబంధించిన వేర్వేరు కేసుల్లో ఆయన ఐదేళ్ల 9 నెలలపాటు శిక్ష అనుభవించాల్సి ఉన్నందున ఇది పూర్తయ్యాకే తాజాగా విధించిన జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హాంకాంగ్లో అసమ్మతిని అణచివేసేందుకు చైనా ప్రభుత్వం తీసుకు వచి్చన కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద విధించిన మొట్టమొదటి దీర్ఘకాలం శిక్ష ఇదే కావడం గమనార్హం. లాయ్తోపాటు ఆయన స్థాపించిన యాపిల్ డైలీ వార్తాపత్రికలోని ఆరుగురు ఉద్యోగులు, ఇద్దరు ఉద్యమకారులకు కూడా పదేళ్లు, ఆరేళ్లు, మూడు నెలల జైలు శిక్షలు విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది నేరం అంగీకరించడంతోపాటు ప్రభుత్వం పక్షానికి మారడంతో శిక్షల తీవ్రత తగ్గింది. కాగా, సోమవారం కోర్టుకు వచ్చే సమయంలో అక్కడున్న మద్దతుదారుల వైపు చేతులు ఊపుతూ నవ్వుతూ కనిపించిన లాయ్...తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం సీరియస్గా ఉన్నారు. తీర్పు విన్న తర్వాత పబ్లిక్ గ్యాలరీలో ఉన్న కొందరు రోదించారు. ఈ తీర్పుపై అప్పీల్కు వెళతారా అని ప్రశ్నించగా జిమ్మీ లాయర్ ‘నో కామెంట్’అంటూ బదులిచ్చారు. కాగా, తన తండ్రి జైలులోనే అమరుడవుతారని లాయ్ కుమార్తె గద్గద స్వరంతో అన్నారు. ‘మా గుండె బద్దలైంది’అని ఆయన కుమారుడు సెబాస్టియన్ అన్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం 2019లో హాంకాంగ్లో నిరసనలు తీవ్రతరమయ్యాయి. ఆ సమయంలో చైనా ప్రభుత్వం వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం కింది 2020లో హాంకాంగ్ అధికారులు లాయ్తోపాటు కొన్ని నెలల వ్యవధిలోనే యాపిల్ డైలీ సీనియర్ జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేశారు. దీంతో, 2021లో ఆ పత్రిక మూతబడింది.
ఎప్స్టీన్ ఫైల్స్: కష్టాల్లో కీర్ స్టార్మర్
లండన్: అమెరికాలో మొదలైన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం బ్రిటన్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా కీర్ స్టార్మర్ ప్రభుత్వ పునాదులనే కదిలిస్తోంది! సంపన్నులు, రాయబారులు, అగ్రనేతలు, రాజకుటుంబీకుల లైంగికావసరాలు తీర్చేందుకు అమాయక యువతులు, ముఖ్యంగా మైనర్లను అక్రమంగా సరఫరా చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఎప్స్టీన్ బతికున్నప్పటి కంటే చనిపోయాక ఈ అంశం మరింత ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రిటన్ ప్రభుత్వ పెద్దల పదవులకు ఎసరుపెడుతోంది. ఇప్పటికే ఒకరిని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్వయంగా తొలగించగా పశ్చాత్తాపంతో మరొకరు రాజీనామా చేశారు. తాజాగా సోమవారం స్టార్మర్ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్ విభాగ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిమ్ అలాన్ తన పదవికి రాజీనామాచేశారు. పదవి చేపట్టిన కేవలం 5 నెలలకే ఆయన తప్పుకోవాల్సి రావడం గమనార్హం. ‘‘స్టార్మర్ ప్రభుత్వంలో కొత్త బృందం కొలువు తీరేందుకు మార్గం సుగమం చేస్తూ నేను వైదొలగుతున్నా.ప్రధానికి, ఆయన కొత్త బృందానికి విజయం చేకూరాలని కోరుకుంటున్నా’’అని టిమ్ వ్యాఖ్యానించారు. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంతో సంబంధమున్న అమెరికాలో బ్రిటన్ రాయబారి పీటర్ మాండెల్సన్ను గతేడాది సెపె్టంబర్లో స్టార్మర్ తొలగించారు. మాండెల్సన్ను ఆ పదవికి ఎంపిక చేయడానికి తన సిఫార్సే కారణమని చింతిస్తూ స్టార్మర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్ స్వీనీ ఆదివారం రాజీనామా చేశారు.గోర్డన్ బ్రౌన్ ప్రధానిగా ఉన్న కాలంలో వాణిజ్య శాఖ మంత్రి హోదాలో మాండెల్సన్ బ్రిటన్ విధానపర నిర్ణయాలను ఎప్స్టీన్కు రహస్యంగా ముందే చేరవేసినట్లు ఎప్స్టీన్ పత్రాల్లో తాజాగా తేలింది. దీంతో కీలక పదవుల్లో సమర్థుల నియామకంలో ప్రధానిగా స్టార్మర్ ఘోరంగా విఫలమయ్యారని విపక్ష పారీ్టలతో పాటు సొంత లేబర్ పార్టీ ఎంపీలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనకు ప్రధానిగా కొనసాగే అర్హత లేదని తిట్టిపోస్తున్నారు. స్టార్మర్ రాజీనామా చేయాల్సిందే ప్రధానిగా స్టార్మర్ తప్పుకోవాలని స్కాట్లాండ్లో లేబర్ పార్టీ నేత అనాస్ సర్వార్ డిమాండ్చేశారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ వంటి కీలక పదవుల నుంచే రాజీనామాల పర్వం మొదలవడంతో స్టార్మర్ వెంటనే నష్ట నివారణ చర్యలు ఆరంభించి కేబినెట్ను పునర్ వ్యవస్థీకరించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మాండెల్సన్ నియామకంలో తప్పిదం చేశానని స్టార్మర్ క్షమాపణలు చెప్పినా విమర్శలు ఆగడం లేదు. ఈ వారం జరగబోయే పార్లమెంటరీ లేబర్ పార్టీ సమావేశంలో స్టార్మర్ మరోసారి తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే సోమవారం లండన్లోని వెస్ట్మినిస్టర్ ప్రాంతానికి చేరుకున్న కేబినెట్ మంత్రులు పలువురు స్టార్మర్కు మద్దతు పలకడం విశేషం. ‘‘ఆయన పదవిలోకి వచ్చి 18 నెలలే అవుతోంది. ఆయన పనిని సవ్యంగా చేయనిస్తాం’’అని విద్యా శాఖ మంత్రి బ్రిగ్జెడ్ ఫిలిప్సన్, హోం మంత్రి షబానా మహ్మూద్ అన్నారు.తొలిసారిగా స్పందించిన రాజకుటుంబం ఎప్స్టీన్ వ్యవహారానికి యూకే అధికార వర్గాలతో సంబంధం ఉండటంపై బ్రిటన్ రాజకుటుంబం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు యువరాజు ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ నివసించే అధికారిక రాజప్రాసాదం ‘కెన్సింగ్టన్ ప్యాలెస్’సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది.‘‘యువరాజు కుటుంబం తాజా పరిణామాలపై చాలా మనస్తాపం చెందింది. అధికార వర్గాలతో సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడటం విస్మయం కల్గిస్తోంది. ఈ పరిణామాలను విలియం, కేట్ గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉదంతంలో ఆనాడు బాధితులుగా మిగిలిపోయిన అమాయక టీనేజర్లు, యువతుల పోరాటానికి రాజకుటుంబం తమ సంఘీభావం వ్యక్తం చేస్తోంది’’అని కెన్సింగ్టన్ ప్యాలెస్ పేర్కొంది. అయితే రాజు చార్లెస్–3కు తమ్ముడు, ఇటీవల రాజకుటుంబ హోదా వదలుకున్న ఆండ్రూపై విచారణ జరిపే విషయాన్ని ప్రకటనలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఎప్స్టీన్కు చెందిన ద్వీపాల్లోని విలాసవంత ఎస్టేట్లకు పలుమార్లు ఆండ్రూ వెళ్లినట్లు వెల్లడైన విషయం విదితమే.
వింటర్ ఒలింపిక్స్ వేళ ఇటలీలో భారీ విషాదం
ఇటలీ వేదికగా ప్రస్తుతం వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అయితే ఈ క్రీడలు ప్రారంభ సమయంలోనే భారీ విషాదం చోటుచేసుకుంది. గతవారం ఈ ప్రమాదం జరగ్గా.. ఇప్పుడిది వెలుగులోకి వచ్చింది. బ్యాక్ కంట్రీ స్కీయర్స్, హైకర్స్, పర్వతారోహకులు దాదాపు 13 మంది మృతి చెందారు. వీరిలో 10 మంది అవలాంచి కారణంగానే మరణించారు. ఇవి ఒలింపిక్స్ జరుగుతున్న చోటుకి చాలా దూరంలోనే సంభవించాయి.ఇటలీ పర్వత రక్షణ బృందం చెప్పిన దాని ప్రకారం.. ఈ మధ్య తుపానుల కారణంగా కొత్త మంచు పొరలు ఏర్పడటం, బలహీనమైన లోపలి పొరల్లో మంచు కదలడం వల్ల అల్ఫైన్ ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా సరిహద్దు ప్రాంతాలని ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలోనే పర్యాటకులు, స్కీయర్స్, పర్వతారోహకులు అప్రమత్తంగా ఉండమని అధికారులు హెచ్చరించారు.గతవారం చోటుచేసుకున్న మరణాలు.. లోంబార్డీ, ట్రెంటినో, సౌత్ టైరోల్, మార్మొలాడా గ్లేసియర్, మాంటే గ్రప్పా, అపెన్నైన్స్, వాలే డోస్టా ప్రాంతాల్లో జరిగాయాని చెప్పిన అధికారులు.. ఒలింపిక్ జరుగుతున్న స్థలాలు భద్రంగా ఉన్నాయని, ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. అవలాంచి హెచ్చరికలని గమనిస్తూ, పరిస్థితి చక్కబడే వరకు పర్వతారోహకులు.. ప్రయాణాలకు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.
జాతీయం
ట్రాక్టర్లు ఢీకొని మహిళ మృతి
రాయచూరు రూరల్: బెళగావి జిల్లాలో చెరకు ట్రాక్టర్లు ఢీకొన్న ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆదివారం రాయబాగ తాలూకా హారోగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో బాను మీరా(29) అనే మహిళ ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ట్రాక్టర్ వెనుక భాగాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది. భర్త అల్లావుద్దీన్, కుమారుడు శోయబ్లకు గాయాలయ్యాయి. మరో ఘటనలో ఘటప్రభ పోలీస్ స్టేషన్ పరిధిలో లొళసూరు బస్టాండ్ వద్ద చెరకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీకొని వడ్డరహట్టి అనిత(26) మరణించింది. అనిత భర్త ఎలక్ట్రిక్ వాహనంలో ఓవర్టేక్ చేయబోగా వెనుక నుంచి తగలడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై హోరోగేరి, ఘటప్రభ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రెండు కార్లు ముఖాముఖీ ఢీసాక్షి,బళ్లారి: రెండు కార్లు ముఖాముఖీ ఢీకొనడంతో పూర్తిగా కాలిపోయాయి. సోమవారం బీదర్ జిల్లా బసవ కళ్యాణ తాలూకా నారాయణపుర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న కార్లు అదుపు తప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారు త్రుటిలో తప్పించుకోగా, కొన్ని నిమిషాల్లో రెండు కార్లు కాలిపోయాయి. అగి్నమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపు కార్లు పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై బసవ కళ్యాణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బొలెరో వాహనానికి మంటలు కాగా సోమవారం బళ్లారి నగరంలో మోతీ సర్కిల్ వద్ద బొలెరో వాహనంలో మంటలు వ్యాపించాయి. ఉన్నఫళంగా మంటలు రావడంతో స్థానికులు వెంటనే అగి్నమాపక సిబ్బందికి తెలిపారు. రోడ్డు పక్కనే నిలిపిన వాహనంలో మంటలు రావడంతో ఎందుకు వ్యాపించాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
‘మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెప్పరు’: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ‘అన్పబ్లిష్డ్ మెమోయిర్’ పుస్తకం చుట్టూ నెలకొన్న వివాదంపై తీవ్రంగా స్పందించారు. ఈ పుస్తక ప్రచురణ కర్త పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఇచ్చిన వివరణను ఆయన తప్పుబట్టారు. ఢిల్లీ పోలీసులు ఈ పుస్తక ప్రతుల చలామణిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదన్న పెంగ్విన్ సంస్థ వాదనలో పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నాయని ఆరోపించారు.జనరల్ నరవణే గతంలో చేసిన ఒక ట్వీట్ను ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రదర్శించారు. ‘తన పుస్తకాన్ని కొనుగోలు చేయడానికి ఈ లింక్ను అనుసరించండి’ అని నరవణే స్వయంగా ట్వీట్ చేశారని ఆయన గుర్తు చేశారు. తాను చెప్పదలుచుకున్న పాయింట్ ఒక్కటేనని, అయితే నరవణే అబద్ధం చెబుతున్నారు లేదా పెంగ్విన్ సంస్థ అబద్ధం చెబుతోంది.. అయితే దేశ మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెబుతారని తాను అనుకోవడం లేదన్నారు. నరవణే మాటలకే తాను ప్రాధాన్యత ఇస్తానని రాహుల్ స్పష్టం చేశారు.ఈ పుస్తకం గతంలో ‘అమెజాన్’లో అందుబాటులో ఉందని, 2023లోనే దీనిని కొనమని నరవణే కోరారని రాహుల్ పేర్కొన్నారు. ఈ మెమోయిర్లో ఉన్న కొన్ని అంశాలు భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రికి ఇబ్బందికరంగా మారాయని, అందుకే వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా దీనిపై స్పందిస్తూ.. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తక ప్రచురణ హక్కులు తమకే ఉన్నాయని, అయితే దానిని తాము ఇంకా మార్కెట్లోకి విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఏవైనా డిజిటల్ లేదా ప్రింట్ కాపీలు కాపీరైట్ ఉల్లంఘన కిందకే వస్తాయని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త.. ఇకపై మార్కుల్లో పొరపాట్లకు చెల్లు!
నరవణే పుస్తక వివాదం.. పెంగ్విన్ కీలక ప్రకటన
ఢిల్లీ: నరవణే పుస్తకం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ బుక్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ‘‘తన బుక్ అందుబాటులోకి వచ్చిందని నరవణె చెప్పారు. బుక్ విడుదలపై నరవణే అయినా అబద్ధం చెప్పాలి.. లేకపోతే పెంగ్విన్ అయినా అబద్ధం చెప్పాలి. మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెబుతున్నారని అనుకోను’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.కాగా, ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకం ఉదంతంపై లోక్సభలో కొనసాగుతోంది. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు విపక్ష నేత రాహుల్గాంధీ ప్రయత్నించడం.. అందుకు మంత్రులు రాజ్నాథ్సింగ్, అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలపడం రగడకు దారితీసింది. నాటినుంచి సభలో ఆందోళనలు మినహా కార్యకలాపాలేవీ సాగడం లేదు.పెంగ్విన్ ఏం చెప్పిందంటే?ఇదిలాఉండగా.. నరవణే పుస్తక వివాదంపై పెంగ్విన్ సంస్థ వివరణ ఇచ్చింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన జ్ఞాపకాల సంకలనం 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'పై పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ పుస్తక ప్రచురణకు సంబంధించి తమకే ప్రత్యేక హక్కులు ఉన్నాయని, ఇది ఇప్పటివరకు ఏ రూపంలోనూ అధికారికంగా విడుదల కాలేదని స్పష్టం చేసింది.ముద్రణ రూపంలో గానీ, డిజిటల్ రూపంలో గానీ ఈ పుస్తకాన్ని తాము ఇప్పటివరకు పంపిణీ చేయలేదని.. డిజిటల్ కాపీలు చట్టవిరుద్ధమని, అవి కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తాయని సంస్థ హెచ్చరించింది. ఇలాంటి అనధికారిక పంపిణీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఢిల్లీ పోలీసుల విచారణమరోవైపు, అధికారికంగా విడుదల కాకముందే ఈ పుస్తకంలోని అంశాలు బయటకు ఎలా వచ్చాయనే దానిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. స్పెషల్ సెల్ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది.
విద్యార్థులకు శుభవార్త.. ఇకపై మార్కుల్లో పొరపాట్లకు చెల్లు!
న్యూఢిల్లీ: దేశంలోని విద్యార్థులకు శుభవార్త. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి బోర్డు పరీక్షల మూల్యాంకన విధానంలో కీలక మార్పును ప్రకటించింది. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న 2026 బోర్డు పరీక్షల సమాధాన పత్రాలను ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్’ (OSM) విధానంలో దిద్దనున్నట్లు బోర్డు తెలిపింది. ఈ నూతన విధానంతో మార్కుల లెక్కింపులో పారదర్శకత పెరుగుతుందని సీబీఎస్ఈ పేర్కొంది. భారతదేశంతో పాటు 26 దేశాల్లోని దాదాపు 46 లక్షల మంది విద్యార్థుల కోసం ప్రతి ఏటా సీబీఎస్ఈ బోర్టు పరీక్షలు నిర్వహిస్తుంటుంది.సీనియర్ సెకండరీ స్థాయికి పూర్తి డిజిటల్ మూల్యాంకనాన్ని అమల్లోకి తీసుకువచ్చిన సీబీఎస్ఈ ప్రస్తుతానికి 10వ తరగతి సమాధాన పత్రాలను పాత పద్ధతిలోనే (ఫిజికల్ మోడ్) దిద్దుతారని స్పష్టం చేసింది. డిజిటల్ మార్కింగ్ విధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని సీబీఎస్ఈ పరీక్షల నియంత్రణాధికారి సన్యం భరద్వాజ్ తెలిపారు. ఈ పద్ధతి ద్వారా మార్కుల లెక్కింపులో జరిగే పొరపాట్లు పూర్తిగా తొలగిపోతాయని, ఆటోమేటెడ్ వ్యవస్థ వల్ల మానవ ప్రమేయం తగ్గి, సమన్వయం వేగవంతం అవుతుందని ఆయన తెలిపారు.ఉపాధ్యాయులు సమాధాన పత్రాలను దిద్దడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ పాఠశాలల్లోనే ఉంటూ విధులకు ఆటంకం కలగకుండా మూల్యాంకనం చేయవచ్చని భరద్వాజ్ తెలిపారు. దీనివల్ల రవాణా ఖర్చులు, సమయం ఆదా అవడమే కాకుండా, ఫలితాల తర్వాత మార్కుల ధృవీకరణ అవసరం కూడా ఉండదని స్పష్టం చేశారు. ఈ నూతన విధానాన్ని విజయవంతంగా అమలు చేయడానికి వీలుగా అనుబంధ పాఠశాలలన్నీ తగిన సాంకేతిక సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని సీబీఎస్ఈ ఆదేశించింది. సీబీఎస్ఈ తీసుకున్న ఈ నిర్ణయంపై ఢిల్లీలోని ఐటీఎల్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సుధా ఆచార్య స్పందిస్తూ, ఇది మానవ తప్పిదాలను తగ్గించే అద్భుతమైన పని విధానం అని అన్నారు.
ఎన్ఆర్ఐ
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే వలస కార్మికుల ఉచిత వీసాల కోసం అక్కడి ఏడీఎన్హెచ్ సంస్థ, తెలంగాణలోని జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నాలుగు చోట్ల ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. క్లీనింగ్ విభాగంలో పనిచేసేందుకు ఉచితంగా వీసాలను జారీ చేసి, ఉచిత విమాన టికెట్, వసతి, భోజన సదుపాయం కల్పించి.. మన కరెన్సీలో రూ.23 వేల వరకు వేతనాలను చెల్లించనున్నారు. వచ్చే నెల 6న జగిత్యాల, సిరిసిల్లలో, 7న నిజామాబా ద్, ఆర్మూర్లలోని జీటీఎం సంస్థ కార్యాలయాలలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. వివ రాల కోసం ఆర్మూర్ (8332062299), నిజామాబాద్ (8686860999), జగిత్యాల (83320422 99), సిరిసిల్ల (9391661522) నంబర్లలో సంప్రదించవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దళారుల్ని నమ్మొద్దు ఈనెల 9, 10 తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరైన వంద మందిని రెండు మూడు రోజుల్లో యూఏఈకి పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దళారులను నమ్మి మోసపోవద్దు. – చీటీ సతీశ్రావు, చైర్మన్, జీటీఎం ఇంటర్నేషనల్ (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!)
వైభవంగా తానా మిడ్-అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలను చూడటానికి వచ్చిన జనసందోహం, మరోవైపు తమ ఆట, పాటలతో మైమరపింపజేసిన చిన్నారులతో తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సూపర్ హిట్టయింది. వెస్ట్ చెస్టర్ లో జనవరి 17వ తేదీన జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దాదాపు 1500మందికిపైగా వచ్చిన జనసందోహం నిర్వాహకులకు, కళాకారులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికితోడు సంక్రాంతి థీమ్ ను ప్రతిబింబించేలా చేసిన కార్యక్రమాలు, పోటీలు అందరిలోనూ పాల్గొనేలా చేశాయి.తానా మిడ్ అట్లాంటిక్ కు చెందిన బోర్డ్ డైరెక్టర్ రవిపొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు చిన్నారులు పాడిన సినిమా పాటలు ఎంతోమందిని అలరింపజేశాయి. యాంకర్లు శ్వేత కొమ్మోజి, మనీషా మేక కూడా కార్యక్రమాల విజయానికి తమవంతుగా వ్యాఖానాలను జోడించి ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. సాంప్రదాయ భోగిపళ్లు కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు వారిపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు, కిడ్స్ విలేజ్ థీమ్ కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారిని తానా నాయకులు అభినందించారు. ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకుల కోసం 7,000 పౌండ్లకు పైగా ఆహారాన్ని విరాళంగా సేకరించడంలో ప్రతిభ కనబరిచిన యువ వలంటీర్లను ఈ సంక్రాంతి వేడుకల్లో సత్కరించడం హైలైట్ గా నిలిచింది. వెస్ట్ వైట్ ల్యాండ్ టౌన్ షిప్ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ వైస్-ఛైర్ మిస్టర్ రాజేష్ కుంభార్దరే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి వలంటీర్లను సత్కరించారు.తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తదితరులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ను అభినందించారు. ఈవెంట్ కోఆర్డినేటర్లు సురేష్ యలమంచిలి, కృష్ణ నందమూరితోపాటు మిడ్ అట్లాంటిక్ టీమ్ నాయకులు, వలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన క్రాస్ రోడ్స్, గోల్డెన్ స్పాన్సర్స్ గా ఉన్న శ్రీధర్ అంచూరి మరియు సురేష్ బందుగులకు, కమలం ది డెకర్ కంపనీకి, అతిథులకు, వలంటీర్లకు కమ్యూనిటీ నాయకులకు, ఈ వేడుకకు సహకరించిన అందరికీ తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.తానా మిడ్ అట్లాంటిక్ టీమ్`సరోజ పావులూరి, దీప్తి కోక, మనీషామేక, శైలజ కస్తూరి, సునీత వాగ్వాల, మైత్రి నూకల, బిందు ఆలపాటి, రమ్య మాలెంపాటి, ఇందు సందడి, రాణి తుమ్మల, భవానీ క్రొత్తపల్లి, అనుపమ యలమంచి, భవానీమామిడి, నీలిమ వోలేటి, రవీన తుమ్మల, శ్రావణి రాయలతోపాటు, విశ్వనాథ్ కోగంటి, శ్రీధర్ సాధినేని, శ్రీకాంత్ గూడురు, గోపి వాగ్వాల, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, వెంకట్ ముప్పా, రమేష్ గుట్ట, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి, ప్రసాద్ కస్తూరి, రంజిత్ కోమటి, రంజిత్ మామిడి, మూర్తి నూతనపాటి, చందు భాతుస్కర్, సంతోష్ రౌతు, సత్య పొన్నగంటి, రాజు గుండాల, రాధాకృష్ణ మూల్పూరి, నాయుడమ్మ యలవర్తి, చలం పావులూరి, మోహన్ మల్ల ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు.
భార్యను, బంధువులను కాల్చి చంపాడు!
న్యూయార్క్: అమెరికాలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ భారత సంతతి వ్యక్తి క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. భార్య, ఆమె తరఫు ముగ్గురు బంధువులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్లముందే జరిగిన దారుణం చూసి బెంబేలెత్తిపోయిన అతని 12 ఏళ్ల కొడుకు, బంధువుల తాలూకు మరో ఇద్దరు పిల్లలు వెంటనే ఓ గదిలోకి దూరి గడియ పెట్టుకుని బతికిపోయారు. కొడుకు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే పారిపోయిన నిందితున్ని కొద్ది దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం అందరినీ కలచివేస్తోంది. నిందితున్ని విజయ్కుమార్ (51)గా, మృతులను అతని భార్య మీమూ డోగ్రా (43), మిగతా వారిని గౌరవ్ కుమార్ (33), నిధీ చందర్ (37), హరీశ్ చందర్ (38)గా గుర్తించారు. ఇది మాటలకందని ఘోరమని అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది. బాధిత కుటుంబానికి అన్నివిధాల సాయమూ అందిస్తున్నట్టు పేర్కొంది. గదిలో దాక్కున్న పిల్లలు విజయ్కుమార్ దంపతులు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నివసిస్తుండేవారు. శుక్రవారం అర్ధరాత్రి ఏదో విషయమై ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఘర్షణ నడుమే కొడుకుతో కలిసి శివారు నగరమైన లారెన్స్విలేలోని బ్రూక్స్ ఐవీ కోర్ట్లో ఉంటున్న డోగ్రా తాలూకు బంధువులు గౌరవ్, నిధి, హరీశ్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఘర్షణ శ్రుతిమించి కాల్పులకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవకు దారితీసిన కారణమేమిటో తెలియాల్సి ఉందని చెప్పారు. ‘‘విజయ్ దంపతుల 12 ఏళ్ల కొడుకు తెల్లవారుజాము 2:30 ప్రాంతంలో మాకు కాల్ చేసి దారుణం గురించి చెప్పాడు. రాపిడ్ రెస్పాన్స్ బృందం నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది. నలుగురు వ్యక్తు లు ఇంట్లో తూటా గాయాలతో పడిపోయి కన్పించారు. ముగ్గురు పిల్లలు సకాలంలో స్పందించి పక్క గదిలోకి పరుగెత్తి దాక్కోవడంతో దాడి నుంచి బయ ట పడ్డట్టున్నారు’’అని పోలీసులు వివరించారు.
TPAD అధ్యక్షురాలిగా వరుసగా మూడోసారీ మహిళకే పట్టం
డల్లాస్, టెక్సాస్లో శక్తివంతమైన, ప్రభావవంతమైన తెలుగు సంస్థగా అక్కడి తెలుగు ప్రజల మన్ననలు పొందుతున్న “డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (TPAD)”.. 2026 సంవత్సరానికి గాను తన నూతన కార్యవర్గ బృందానికి బాధ్యతలు అప్పగించింది. గత 12 ఏళ్లలో టీప్యాడ్, డల్లాస్లోని తెలుగు సమాజంలో స్వచ్ఛంద సేవకులు, కమ్యూనిటీ సభ్యులను విస్తృతంగా ఆకర్షిస్తూ అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. బలమైన సంస్థాగత నిర్మాణం ద్వారా అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దింది.సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణతో పాటు మంచి నాయకులను తీర్చిదిద్దడంలో అద్భుతమైన చరిత్ర కలిగిన టీప్యాడ్, ఫ్రిస్కో, టెక్సాస్లోని ఎలిగెన్స్ బాల్రూమ్లో స్థానిక కమ్యూనిటీ నాయకులు, మద్దతుదారుల సమక్షంలో తన 13 వ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో ప్రమాణస్వీకారం చేయించింది. టీప్యాడ్ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహిళలే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. మహిళా సాధికారతకు, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి టీప్యాడ్ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం.టీప్యాడ్ చరిత్ర, నేపథ్యంపై విస్తృత అవగాహన కలిగిన వీణా యలమంచిలి కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించారు. సీనియర్ టీప్యాడ్ నాయకులు మరియు ఫౌండేషన్ కమిటీ సభ్యుడు రావు కల్వాల — రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్)లతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీప్యాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు సుధాకర్ కలసాని — కార్యవర్గ సభ్యులు మరియు పదాధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు.కొత్త కమిటీ సభ్యులు లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), శ్రీనివాస్ అన్నమనేని (ఉపాధ్యక్షుడు), గాయత్రి గిరి (కార్యదర్శి), శివ కొడిత్యాల (సహ కార్యదర్శి), ఆదిత్య రెడ్డి (ఖజాంచీ), దీపిక దీపికా రెడ్డి (సహ ఖజాంచీ) .నూతన ఈసీ సభ్యులు:బాల గణపవరపు, మాధవి ఓంకార్, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, తిలక్ కుమార్ వన్నంపుల.రవికాంత్ మామిడి, అశోక్ పొద్దుటూరి, రోజా అడెపు, మాధవి సుంకిరెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండాల, పాండురంగ రెడ్డి పల్వాయి, బుచ్చి రెడ్డి గోలితో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రవికాంత్ మామిడి (BOT ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్)లకు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకార అనంతరం మాట్లాడిన FC ఛైర్ రఘువీర్ బండారు, BOT ఛైర్ రవికాంత్ మామిడి, అధ్యక్షురాలు లక్ష్మి పోరెడ్డి, కోఆర్డినేటర్ లింగా రెడ్డి ఆల్వా, BOT వైస్ ఛైర్ రోజా అడెపు-రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక వేడుకల నిర్వహణ, బతుకమ్మ, దసరా సంబరాలను డీఎఫ్డబ్ల్యూ తెలుగు సమాజం ఆశించే స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు నూతన బృందం కట్టుబడి ఉందని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా టీప్యాడ్కు నిరంతర మద్దతు అందిస్తున్న సపోర్టర్లు, స్పాన్సర్లకు టీప్యాడ్ నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.టీప్యాడ్ 2026 కార్యవర్గం:ఎగ్జిక్యూటివ్ కమిటీ:లక్ష్మి పోరెడ్డి (President), అనురాధ మేకల (Past President), శ్రీనివాస్ అన్నమనేని (Vice President), గాయత్రి గిరి (Secretary), శివ కొడిత్యాల (Joint Secretary), ఆదిత్య రెడ్డి (Treasurer), దీపిక దీపికా రెడ్డి (Joint Treasurer), స్వప్న తుమ్మపాల, నిఖిల్ కందుకూరి, ప్రశాంత్ నిమ్మని, మాధవి ఓంకార్, స్నేహా రెడ్డి, సంతోష్ రెగొండ, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, తిలక్ కుమార్ వన్నంపుల, రత్న వుప్పల, బాల గణపవరపు.బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్:రవికాంత్ మామిడి (BOT ఛైర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), మాధవి సుంకిరెడ్డి, రమణ లష్కర్, పాండురంగ రెడ్డి పల్వాయి, రామ్ అన్నాడి, బుచ్చి రెడ్డి గోలి, అశోక్ కొండాల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, అశోక్ పొద్దుటూరి.ఫౌండేషన్ కమిటీ:రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్), జనకిరామ్ మండాది, ఉపేందర్ తెలుగు, రాజ్ గోంధి, మహేందర్ కమిరెడ్డి
క్రైమ్
మద్యం మత్తులో అత్తపై అల్లుడు అత్యాచారం
నాగర్కర్నూల్ జిల్లా: మద్యం మత్తులో వృద్ధురాలు అయిన అత్తను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మండలంలోని రఘుపతిపేటలో జరిగింది. కల్వకుర్తి సీఐ నాగార్జున కథనం ప్రకారం.. పసుపుల చెన్నమ్మ (65) భర్త మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు చనిపోగా మరో కుమారుడు వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న కుమార్తె రేణుక, అల్లుడు బైరంపల్లి రాఘవేందర్ ఇంట్లో చెన్నమ్మ ఉంటోంది. రాఘవేందర్ మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. రెండు రోజుల క్రితం గొడవపడి రేణుక వెల్దండ మండలంలోని తన అక్క ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి అతిగా మద్యం తాగిన రాఘవేందర్ అత్త చెన్నమ్మపై అత్యాచారం చేసి, హత్య చేశాడని సీఐ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
భర్తను బలి చేసి ప్రియుడితో జీవితం.. రోజీ దుర్మార్గపు కుట్ర
బెంగళూరు: అక్రమ సంబంధాల మోజులో పడిన భార్య.. భర్తను వదిలించుకోవాలని షాకింగ్ పథకం వేసింది. అతన్ని హంతకున్ని చేయాలని కుట్ర చేసింది. ఈ సంఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పట్టణంలో జరిగింది. భార్య కుట్ర ఫలితంగా భర్త జైలు పాలయ్యాడు. వివరాలు.. ఆనేకల్ తాలూకాలో ఆంథోనీ, రోజి భార్యాభర్తలు. రోజికి రాజేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఇది తెలిసి భర్త ఆమెను మందలించేవాడు. తమ సంతోషానికి భర్త అడ్డంకిగా ఉన్నాడు, తరచూ తాగి వచ్చి వేధిస్తున్నాడనే నెపంతో భార్య తన భర్తను పునరావాస కేంద్రంలో చేర్పించింది. 18 నెలల తర్వాత, భర్త ఆంథోనీ తిరిగి వచ్చాడు. భర్త లేని సమయంలో ఆమె ప్రియునితో సహజీవనం సాగించింది. భర్త రాగానే పథకాన్ని అమలు చేసింది. తమ బావ బాలరాజు మీద లేనిపోని మాటలు చెప్పి చంపేయాలని ప్రేరేపించింది. భార్య మాట విని ఆంథోనీ, తన అన్నయ్య బాలరాజ్ను కత్తితోపొడిచి హత్య చేశాడు. దీంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో ఆంథోనీపై కేసు నమోదైంది. అరెస్టు చేసి చెరసాలకు తరలించారు. రోజి మళ్లీ ప్రియునికి దగ్గరైంది. అయితే రోజినే అసలు నిందితురాలని తెలిసి కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
నా చావుకు భార్య, అత్తామామలే కారణం
హైదరాబాద్: తన చావుకు భార్య, అత్తా, మామలే కారణమంటూ ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లేక్పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేకరు.. మార్కాపురానికి చెందిన సీతారాంరెడ్డి (36), రేణుక దంపతులు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. గతంలో భార్య రేణుక ఇన్స్ట్రాగాంలో పరిచయమైన వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొద్దిరోజుల తరువాత వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంటోంది. అయితే గత జనవరి నెల 24 న మళ్లీ అదృశ్యమైంది.భార్య కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు బాచుపల్లికి వచ్చి ఇక్కడికే ఉంటున్నారు. అత్తామామలు ఆదివారం పిల్లలను తీసుకుని సొంత ఊరు నంద్యాలకు వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాంరెడ్డి ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర్లో దూకాడు. సోమవారం ఉదయం నుంచి హైడ్రా, లేక్ పోలీసులు గాలించగా సాయంత్రం మృతదేహం బయటపడింది. తన తన చావుకు భార్య, అత్తా, మామలతో పాటు రమణారెడ్డి అనే వ్యక్తి కారణం అని ఫోన్లో స్టేటస్ పెట్టుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.చదవండి: వాడ్ని ఊరికే వదిలిపెట్టకండి
తరగతి గదిలో కాల్పుల కలకలం
చంఢీగడ్: లా కాలేజీ తరగదిలో కాల్పులు కలకలం చోటు చేసుకున్నాయి. న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని తోటి విద్యార్థి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. తరగతి గదికి గన్తో వచ్చిన ఓ విద్యార్థి.. తోటి విద్యార్థినిపై కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం, తనని తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన పంజాబ్లో తరన్ తారన్ జిల్లాలో చోటు చేసుకుందిపోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటన పంజాబ్ ఉస్మాలోని మై భాగో లా కాలేజీలో జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని మల్లియన్ గ్రామానికి చెందిన ప్రిన్స్ రాజ్గా, మరణించిన విద్యార్థినిని నౌషెహ్రా పన్నువాన్కు చెందిన సందీప్ కౌర్గా గుర్తించారు. కౌర్ అక్కడికక్కడే మరణించగా, ప్రిన్స్ రాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియోలో ప్రిన్స్ రాజ్ కాలేజీ బ్యాగ్తో తరగతి గదిలోకి ప్రవేశించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో సందీప్ కౌర్ తన స్నేహితురాలితో మాట్లాడుతుండగా, ప్రిన్స్ రాజ్ వారిద్దరి దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. కొద్దిసేపటికి ముగ్గురూ వెనుక సీట్లలో కూర్చున్నారు. అయితే కొన్ని క్షణాల తర్వాత ప్రిన్స్ రాజ్ అకస్మాత్తుగా లేచి, బ్యాగ్లోని తుపాకీని బయటకు తీసి, సందీప్ కౌర్పై నేరుగా కాల్పులు జరిపాడు. కౌర్ నేలపై కుప్పకూలగా, మరో క్లాస్మేట్ షాక్తో వెనక్కి తగ్గింది. వెంటనే ప్రిన్స్ రాజ్ తనపై తానే కాల్పులు జరిపి నేలకొరిగాడు.కాల్పులు జరిగిన వెంటనే తరగతి గదిలోని విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. తరగతులు ప్రారంభం కానున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత కలకలం రేపింది. సందీప్ కౌర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విద్యార్థిని సందీప్ కౌర్ తల్లి కాల్పుల ఘటనపై స్పందించారు. ప్రిన్స్ రాజ్ తుపాకీతో కళాశాలలోకి ఎలా ప్రవేశించాడని ప్రశ్నించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. 🚨 First-year law college student allegedly shot a fellow student inside a classroom in Punjab’s Tarn Taran district Accused identified as Prince Raj opened fire on Sandeep Kaur, he died on the spot. Prince later shot himself with the same weapon and was taken to hospital in… pic.twitter.com/sDghCJiYr0— Nabila Jamal (@nabilajamal_) February 9, 2026
వీడియోలు
22 వ స్థానానికి పడిపోయిన ఏపీ.. పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ
సీఎం గారు.. మీకు మానవత్వం ఉందా? బండి సంజయ్ లేఖ
Sachivalayam: 550 మందికి పైగా మరణించారు.. మేము మనుషులమే మాకు కుటుంబాలు ఉన్నాయి..
శ్రీశైలంలో భక్తులపై లాఠీ ఛార్జి... హోంమంత్రి అనిత పై సంచలన కామెంట్స్
రెబల్ ఫ్యాన్స్ మజాకా... జియో హాట్ స్టార్కి బిర్యానీ ఆర్డర్లు
బైక్ పై పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే .. హైదరాబాద్ యువతకు సజ్జనార్ వార్నింగ్
జగన్ దమ్మున్న మొనగాడు.. మీలా చేతకాని రాజకీయాలు YSRCP చేయదు
తప్పు చేసి దొరికిపోయి కవర్ చేసేందుకు హార్పిక్ డ్రామా
Hyd: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన అంబులెన్స్
నా కోసం మా నాన్న పోలీస్ జాబ్ వదిలేశాడు.. నా ఇన్స్పిరేషన్ ఎవరంటే..?

