బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. దాంతోపాటు తాజాగా కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో బంగారం ఒకేరోజు భారీగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
విజయ్పై ప్రేమలతా విజయ్కాంత్ ఎదురుదాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బల నిరూపణ ఎదుర్కొంటున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్కాంత్(విజయ్కాంత్ సతీమణి) విజయ్పై ఎదురు దాడికి దిగారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు.‘‘మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టడం మంచిదే. కానీ, యువత మీకు ఓటేసి గెలిపించారు. కానీ, మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా ఎందుకు నియమించుకున్నారు?. ఈ నియామకంతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. సీఎంను కలవడానికి వేరు ముఖం వేసుకుని రావొద్దు’’ అని విజయ్కు చురకలంటించారామె. ఆ వెంటనే ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్ చేశారు. முதல்வர் விஜயை பார்த்து கேட்ட பிரேமலதா #premalatha pic.twitter.com/ei8tNlTIJi— Way2News Tamil (@way2news_) May 13, 2026Video Source: Way2News Tamil మరోవైపు.. బల నిరూపణ వేళ విజయ్ సర్కార్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విడుదల చిరుతైగల్ కట్చి(VCK) పార్టీ సైతం జ్యోతిష్యుడిని నమ్ముకుని పాలన చేయొద్దని విజయ్కు హితవు పలికింది. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తు.. 108 సీట్లు గెల్చుకుంది. ఆ సమయంలో డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయ్కు అభినందనలు తెలియజేశారు. విజయ్ తన బిడ్డలాంటోడని.. మొదటి నుంచి తన భర్త విజయ్కాంత్కు దగ్గరగా ఉండేవాడని.. ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మద్దతు ఇస్తారా? అనే అంశంపై మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఎన్డీయే కూటమిలో భాగంగా విరుదాచలం నుంచి పోటీ చేసిన ఆమె.. ఆ పార్టీ నుంచి పోటీ నెగ్గిన ఏకైక అభ్యర్థిగా నిలిచారు.
ఉదయనిధికి సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త అసెంబ్లీలో పొలిటికల్ పంచులు పేలడం అప్పుడే ప్రారంభమైంది. టీవీకే ప్రభుత్వ బలనిరూపణ వేళ.. ప్రతిపక్ష డీఎంకే సంచలన ఆరోపణలకు దిగింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం విజయ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలకు సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ బలనిరూపణ చర్చ వేళ విమర్శలు గుప్పించారు. ‘‘65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు. టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడింది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు’’ అని ఆరోపించారాయన. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం టీవీకే తీరుకు నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్ ప్రసంగించారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం.. .. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు. మున్ముందు ఆ ప్రయత్నం చేయబోం. మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. కాబట్టి వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అనేది చూడం.. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. అలాగే గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో విజయ్ టీవీకే సర్కార్ నెగ్గింది.
ఎవరీ లారెన్ వాసర్..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్గా మార్చింది..
మెట్గాలా 2026లో ఎందరో ట్రెండ్ సెట్టింగ్, రికార్డ్ మేకింగ్ లుక్స్ని అందించారు. చాలామంది వివిధ రకాల ఫ్యాషన్ వేర్లతో సందడి చేశారు. ఎందరో సెలబ్రిటీలు, ప్రముఖులు ధరించిన యాక్సెసరీలు, కళాత్మక డిజైనర్ వేర్లు చర్చనీయాంశంగా మారాయి. వారిలో ఒక మహిళ మాత్రం అందర్నీ ఆకర్షించేలా సన్సేషన్గా మారింది. ఈ అమ్మాయి లుక్ని చూడగానే టాలీవుడ్ మూవీ మురారీలోని "బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో" అనే పాట ఠక్కున గుర్తుస్తోంది. అయితే ఆమె కథ తెలిస్తే మాత్ర కన్నీళ్లు జలజల వచ్చేస్తాయ్. ఆ బాధను దిగమింగి అజేయంగా నిలబడి ఎదగాలన్న ఆమె తపన చూస్తే స్థైర్యం అంటే ఇది కదా అనిపిస్తుంది. చిన్నచిన్న సమస్యలకే సతమతమై ప్రాణాలకు తీసుకునే యవతకు ఆమె కథ ఓ స్ఫూర్తి.ఆ ధీర మహిళే అమెరికన్ మోడల్ లారెన్ వాసర్. ఆమె మే4న న్యూయార్క్ నగరంలోని మెట్ గాలా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో బంగారు రంగు ప్రబల్ గురుంగ్ సూట్ ధరించి వచ్చింది. ఇందులో పెద్ద సన్సేషన్ ఏముంది అనుకోకండి. ఆమె ఈ వేడుకలో నిజమైన బంగారు కృత్రిమ కాళ్లతో వచ్చింది. అందరు ఈ వేడుకలో ఆర్టిఫిషయల్ యాక్సెసరీలతో రెడ్కార్పెట్పైకి రాగా ఆమె మాత్రం నిజమైన "బంగారు కాళ్ల"తో వచ్చి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. పైగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. అంతేగాదు దీని కారణంగానే లారెన్కు "బంగారు కాళ్ల అమ్మాయి" ముద్దు పేరు కూడా వచ్చింది.లారెన్ వాసర్ ఎవరు?లారెన్ వాసర్ అమెరికాలో ప్రసిద్ధిగాంచిన మోడల్. 38 ఏళ్ల లారెన్ వోగ్, గ్లామర్ అండ్ హార్పర్ బజార్ వంటి ఫ్యాషన్ పత్రికల ముఖచిత్రంగా ఫోజులిచ్చింది కూడా. అంతేగాదు 2017లో ఫోర్బ్స్ అండర్ 30 పురస్కార గ్రహీతగా కూడా ఎంపికైంది అలాగే 2023లో గ్లామర్ జర్మనీ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా కూడా నిలిచారామె. 2023లో 'ది డైరీ ఆఫ్ ఎ సీఈఓ' పాడ్కాస్ట్లో మాట్లాడుతూ..లారెన్ తన కథను పంచుకోవడంతో ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది. సడెన్గా ఒక రోజు నిద్రలోనే కోమాలోకి వెళ్లి మృత్యువు అంచులదాక వెళ్లింది. సకాలంలో ఆమె కుటుంబ సభ్యులు చూడకపోతే లారెన్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయుండేవి. ఏం జరిగిందో తెలియదు. లారెన్ గదిలోకి వచ్చేప్పటికీ అపస్మారక స్థితలో బెడ్పై పడి ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా...అక్కడ ఆమె బతికే అవకాశాలు చాల తక్కువని తేల్చేశారు వైద్యులు. పాదాలు నల్లగా మారిపోవడం వంటి ఆకస్మిక మార్పులన్నీ లారెన్స్ శరీరంలో చూస్తుండగానే చోటుచేసుకోవడం మొదలైంది. ఆమె పాదాలు నల్లగా అయిపోవడం ప్రారంభించింది. కానీ ఆమె తల్లిదండ్రుల తమ కూతర్ని ఏదోలా బతికించమని వైద్యులని వేడుకోవడంతో డాక్టర్లు తమ సాయశక్తులా కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ నేపథ్యంలోనే ఆమె ప్రాణం కాపాడేందుకే మొదట నీలం రంగులోకి మారిపోతున్న కుడికాలుని తొలగించారు. ఆమెకు టాక్సిక్ షాక్ సిండ్రోమ్(టీఎస్ఎస్)గా పిలిచే వ్యాధి బారిన పడ్డట్లు వెల్లడించారు వైద్యులు. ఇది ఒక నిర్ధిష్టమైన బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషపదార్థాల వల్ల కలిగే అరుదైన ప్రాణాంతక వ్యాధి. ఆ తర్వాత ఆమె శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి కొన్ని రకాల ద్రవాలను పంపించారు వైద్యులు. దాంతో జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎడమ కాలుని కూడా తొలగించారు వైద్యులు. దాంతో సుదీర్ఘంగా ఎనిమిది నెలల పాలు వీల్చైర్కి పరిమితమైపోయిందది. జీవితం ముగిసిపోయింది ఇంకేమి లేదనుకున్న నైరాశ్యంలో ఉన్న లారెన్కు 14 ఏళ్ల తమ్ముడిని చూడగానే కొత్త ఆశ రేకెత్తింది. కనీసం వాడి బాగోగులు చూసుకోవడం కోసమైన బతకాలని నిర్ణయించుకుని తన సమస్యను అంగీకరించడం మొదలుపెట్టింది. అలా మోడల్లో నెమ్మది నెమ్మదిగా రాణిస్తూ..దివ్యాంగుల్లో స్ఫూర్తిని రగులుస్తోందామె. ఇంతకీ లారెన్కి సోకిన టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే..టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే?టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (టీఎస్ఎస్) అంటే టాంపోన్ వాడకంతో సంబంధం కలిగి వ్యాధి. ఇక్కడ టాంపోన్ అంటే టాంపోన్ (Tampon) అనేది ఋతుస్రావం సమయంలో (Periods) వెలువడే రక్తాన్ని పీల్చుకోవడానికి యోనిలోకి చొప్పించే ఒక చిన్న, పత్తి లేదా ఇతర శోషక పదార్థాలతో చేసిన స్త్రీ పరిశుభ్రత ఉత్పత్తి. ఇది ప్యాడ్లకు భిన్నంగా, ఇది శరీరం లోపల ఉంటుంది. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది గంటలకు మించి ఉంచకూడదు. లేదంటే దీనిలో ఉండే స్టెఫిలోకాకస్ ఆరియస్ బాక్టీరియా రక్తప్రవాహంలో విషపదార్థాలను విడుదల చేసి టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వ్యాధికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికారణంగా తీవ్రమైన అవయవ నష్టం లేదా మరణానికి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.🇬🇧🩸🦿 Beaucoup l’ont vue au Met Gala sans savoir qu’elle a PERDU ses 2 jambes à cause d’un TAMPON HYGIÉNIQUE.Lauren Wasser était une mannequin de 24 ans en pleine ascension lorsqu’un simple tampon a failli lui coûter la vie. En octobre 2012, elle s’est couchée fiévreuse et a… pic.twitter.com/bJcysI84Ah— Cultination (@Cultination1) May 11, 2026 ఈ సిండ్రోమ్ లక్షణాలు:తక్కువ రక్తపోటుతల తిరగడం, మగతగా ఉండటం లేదా స్పృహ కోల్పోవడంనీళ్ల విరేచనాలుఅకస్మాత్తుగా అధిక జ్వరం, చలి, ఒళ్ళు నొప్పులు మరియు ఇతర ఫ్లూ వంటి లక్షణాలువికారం లేదా వాంతులుపాదాల అరికాళ్ళు లేదా చేతుల అరచేతులపై చర్మం పొట్టులా ఊడిపోవడంకళ్ళు, గొంతు ఎర్రబడటంతీవ్రమైన ఎండదెబ్బలాంటి దద్దుర్లు లేదా చర్మంపై ఎర్రటి చుక్కలుఆ ఘటనతో రాబిన్ డేనియల్సన్ చట్టంఆ వ్యాధి తన జీవితాన్ని మార్చేయడంతో లారెన్ రాబిన్ డేనియల్సన్ అనే ఋతుస్రావ సంరక్షణ ఉత్పత్తుల భద్రతా చట్టాన్ని తీసుకొచ్చేలా పాటుపడింది. పైగా దానికి మద్దతుదారిగా మారింది. ఇది ఋతుస్రావ ఉత్పత్తులలో తరచుగా కనిపించే రసాయనాలు, సింథటిక్ ఫైబర్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై పరిశోధన చేయమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH)ను ఆదేశించే లక్ష్యంతో ప్రతిపాదించబడిన ఒక US బిల్లు.(చదవండి: అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?)
సూపర్ స్టార్ మనవడి శ్రీనివాస మంగాపురం.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
పోక్సో కేసు.. సిట్ విచారణకు బండి భగీరథ్ డుమ్మా
ఆగని చంద్రబాబు దుబారా ఖర్చులు
మహారాష్ట్రలో కుప్పకూలిన ట్రైనీ విమానం
పండు తెంపితే లక్షల్లో జరిమానా.. జైలుకు!
తమిళనాడు అసెంబ్లీలో 'పుష్ప' గురించి చర్చ
ప్రపంచకప్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
జనరల్ మోటార్స్ సాఫ్ట్వేర్ ప్రక్షాళన
Sufiya Sufi: 88 రోజులు.. 5 వేల కిలోమీటర్లు
నరేంద్ర.. రైతులపై దౌర్జన్యం చేస్తారా?: అంబటి ఫైర్
ఫ్రాంచైజీని కొనేసిన రాహుల్ ద్రవిడ్
ఇంటి అద్దె రూ.56 వేలు.. ఖర్చు రూ.1.3 లక్షలు
ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్
ఎలాగూ మోస్తున్నావుగా.. ఇది కూడా భరించు !!
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్!
టీ ఇలా చేయాలి.. అలా కాదు!
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్టు!
తమిళనాడు సీఎం విజయ్ బిగ్ సర్ప్రైజ్
రూ.200-300 కోట్ల కలెక్షన్స్ వస్తాయనుకున్నా.. కానీ
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు
జాక్ పాట్ కొట్టేసిన త్రిష.. రూ. 12 కోట్లు ఆఫర్!
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం
క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు!
సుప్రీం ఆదేశంతో ఎన్నికల ఫలితం రివర్స్!
కేరళ కాంగ్రేస్ సీఎం ఎంపికపై కొనసాగుతున్న సంక్షోభం
ముంబై ఇండియన్స్ కొంపముంచిన సూర్యకుమార్
ఒకప్పుడు ఫ్రెండ్స్.. కానీ ఇప్పుడు మారిపోయిన సీన్
‘ప్రధాని విమానాన్ని అమ్మేయండి’
సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్: చక్రం తిప్పనున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది!
సూపర్ స్టార్ మనవడి శ్రీనివాస మంగాపురం.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
పోక్సో కేసు.. సిట్ విచారణకు బండి భగీరథ్ డుమ్మా
ఆగని చంద్రబాబు దుబారా ఖర్చులు
మహారాష్ట్రలో కుప్పకూలిన ట్రైనీ విమానం
పండు తెంపితే లక్షల్లో జరిమానా.. జైలుకు!
తమిళనాడు అసెంబ్లీలో 'పుష్ప' గురించి చర్చ
ప్రపంచకప్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
జనరల్ మోటార్స్ సాఫ్ట్వేర్ ప్రక్షాళన
Sufiya Sufi: 88 రోజులు.. 5 వేల కిలోమీటర్లు
నరేంద్ర.. రైతులపై దౌర్జన్యం చేస్తారా?: అంబటి ఫైర్
ఫ్రాంచైజీని కొనేసిన రాహుల్ ద్రవిడ్
ఇంటి అద్దె రూ.56 వేలు.. ఖర్చు రూ.1.3 లక్షలు
ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్
ఎలాగూ మోస్తున్నావుగా.. ఇది కూడా భరించు !!
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్!
టీ ఇలా చేయాలి.. అలా కాదు!
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్టు!
తమిళనాడు సీఎం విజయ్ బిగ్ సర్ప్రైజ్
రూ.200-300 కోట్ల కలెక్షన్స్ వస్తాయనుకున్నా.. కానీ
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు
జాక్ పాట్ కొట్టేసిన త్రిష.. రూ. 12 కోట్లు ఆఫర్!
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం
క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు!
సుప్రీం ఆదేశంతో ఎన్నికల ఫలితం రివర్స్!
కేరళ కాంగ్రేస్ సీఎం ఎంపికపై కొనసాగుతున్న సంక్షోభం
ముంబై ఇండియన్స్ కొంపముంచిన సూర్యకుమార్
ఒకప్పుడు ఫ్రెండ్స్.. కానీ ఇప్పుడు మారిపోయిన సీన్
‘ప్రధాని విమానాన్ని అమ్మేయండి’
సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్: చక్రం తిప్పనున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది!
ఫొటోలు
అరుణాచలం ట్రిప్లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)
తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆలియా భట్ (ఫొటోలు)
గంగరంగ వైభవం గంగమ్మ జాతర...పోటెత్తిన జనం (ఫొటోలు)
హనుమాన్ జయంతి... భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు (ఫొటోలు)
అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన (ఫొటోలు)
తిరుపతి గంగమ్మ జాతర...'బైరాగి వేషంలో మొక్క చెల్లించుకున్న భక్తులు (ఫొటోలు)
సూర్య 'వీరభద్రుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో రాజశేఖర్ కుటుంబం (ఫొటోలు)
నారా రోహిత్ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
సినిమా
సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు
సినిమాలకు సంబంధించిన వ్యక్తి.. ప్రభుత్వంలో ఉంటే పలు నిర్ణయాలు ఇండస్ట్రీకి కలిసొచ్చేలా ఉంటాయి. విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కోలీవుడ్కి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు తమిళనాడులో ఆ ట్రెండ్ మొదలైంది. ఎన్నాళ్లుగానో లేని స్పెషల్ షోలకు అనుమతి లభించింది. త్రిష హీరోయిన్గా నటించిన మూవీతోనే దీనికి శ్రీకారం చుట్టడం విశేషం.(ఇదీ చదవండి: టాలీవుడ్కి బిగ్షాక్.. ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది)తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమకు తొలిసారి ఊరట లభించింది. సూర్య, త్రిష జంటగా నటించిన 'కరుప్పు' మూవీకి మే 14,15 తేదీల్లో ఉదయం 9 గంటల స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు విజయ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమిళనాడులో చాన్నాళ్ల నుంచి స్పెషల్ షోలు లేవు. దీంతో ఈ నిర్ణయంపై నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్టర్స్.. సీఎం విజయ్కి థ్యాంక్స్ చెప్పింది. తెలుగులో ఈ చిత్రం 'వీరభద్రుడు' పేరిట రిలీజ్ కానుంది. విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమిళనాడులో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 2 వరకు రెండు రోజుల పాటు మొత్తం 5 షోలు వేయనున్నారు.సూర్య,త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన 'కరుప్పు' సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించాడు. ట్రైలర్ అయితే పర్లేదనిపించేలా ఉంది. కోర్టులో సామాన్యులకు న్యాయం అందకుండా చేసే ఓ అవినీతి లాయర్ భరతం పట్టేందుకు దేవుడే దిగివస్తే ఏం జరిగింది అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత రెండు మూడు సినిమాలతో బాగా డీలాపడిపోయిన సూర్య.. ఇది హిట్ అవ్వడం చాలా కీలకం. మరి ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
టాలీవుడ్కి బిగ్షాక్.. ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది
తెలుగు సినీ పరిశ్రమకు బిగ్ షాక్ తగిలింది. ఒకప్పుడు తీవ్రంగా ఇబ్బంది పెట్టి, వదిలి వెళ్లిపోయిన పైరసీ బూతం ‘ఐబొమ్మ ’మళ్లీ వచ్చేసింది. తాజాగా రిలీజ్ అయిన కొత్త సినిమాలన్నీ ఈ వెబ్సైట్లో కనినిపిస్తున్నాయి. ఈ సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్ కావడంతో ఇక ఈ సమస్య తీరిపోయిందని భావించిన సినీ పెద్దలకు తాజా పరిణామాలు షాక్ ఇస్తున్నాయి.కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు ఈ నెట్వర్క్ను ఛేదించి, కీలక సూత్రధారిగా భావిస్తున్న రవిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఆయన బెయిల్పై విడుదలైన కొద్ది రోజులకే సైట్ మళ్లీ ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఐబొమ్మ తన డొమైన్లను మార్చుకుంటూ మళ్లీ రంగ ప్రవేశం చేసింది. థియేటర్లలో ఉన్న తాజా చిత్రాలు, ఓటీటీలో విడుదలైన కొత్త కంటెంట్ ఈ సైట్లో ప్రత్యక్షమవుతుండటంతో సినీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నిర్వాహకుడు బెయిల్పై ఉన్న సమయంలోనే సైట్ మళ్లీ యాక్టివ్ అవ్వడం వెనుక ఉన్న నెట్వర్క్ను పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు.
ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అంటే థియేటర్లలో రిలీజైన సినిమాలు ఒకటి రెండు నెలల్లోనే స్ట్రీమింగ్లోకి వచ్చేస్తున్నాయి. అలాంటి జేమ్స్ కామెరూన్ తీసిన 'అవతార్' మూడో భాగం మాత్రం ఆరు నెలల తర్వాత అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'టైటానిక్' లాంటి మూవీ తీసిన జేమ్స్ కామెరూన్.. లాంగ్ గ్యాప్ తీసుకుని 2009లో 'అవతార్' అనే సినిమా తీశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. రూ.14-15 వేల కోట్ల వసూళ్లు రాగా.. 2022లో రిలీజైన పార్ట్ 2 కూడా రూ.18 వేల పైచిలుకు కలెక్షన్స్ సాధించింది. గతేడాది డిసెంబరులో మూడో పార్ట్ (అవతార్: ఫైర్ అండ్ యష్) రిలీజ్ కాగా దీనికి ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే వచ్చింది.మూడో పార్ట్ కూడా వేలకోట్లు కలెక్షన్స్ సాధించినప్పటికీ ఓటీటీలోకి మాత్రం త్వరగా తీసుకురాలేదు. మార్చి 31న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇంగ్లీష్ వెర్షన్ వచ్చినప్పటికీ అద్దె విధానంలోనే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు జూన్ 24 నుంచి హాట్స్టార్లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.'అవతార్: ఫైర్ అండ్ యాష్' విషయానికొస్తే.. రెండో పార్ట్ 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' సంఘటనల తర్వాత జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) జంట తమ పెద్ద కొడుకు కోల్పోయిన బాధలో ఉంటారు. పిల్లలతో కలిసి జీవిస్తుంటారు. తన వల్లే సోదరుడు చనిపోయాడనే అపరాధ భావంతో జేక్ కొడుకు లోక్ ఉంటాడు. రెండో భాగంలో చనిపోయిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్).. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ వచ్చి జేక్పై ప్రతీకారానికి సిద్ధమవుతాడు. ఈసారి కల్నల్కి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. వీళ్లకు ఆర్డీఏ బృందం కూడా తోడవుతుంది. మరి ఇంతమంది శత్రువుల్ని జేక్ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్)
పావలా కోసం కొట్టుకుంటున్నాం.. బన్నీవాసు సంచలన ట్వీట్
టాలీవుడ్లో ‘పర్సెంటేజీ’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబీటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ పెద్దలు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, పర్సెంటేజీ విధానం అమలు చేయకపోతే సినిమాలను ప్రదర్శించబోమని హెచ్చరించారు. దీనిపై నిర్మాత బన్నీవాసు స్పందించాడు. ఇప్పటికే ప్రేక్షకులు థియేటర్స్ రాకపోవడంతో ఆదాయం తగ్గిందని..దానికి గల కారణాలను తెలుసుకొని సరి చేయకుండా.. తగ్గిపోయిన ఆదాయం మీద పోరాటం చేస్తే ఏం లాభం అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు.అంతకంటే తెలివితక్కువతనం ఇంకొకటి లేదురూపాయి ఆదాయం అందరికీ పోయింది, పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది. ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని మనం చూస్తున్నాం. కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదు; టికెట్ రేట్లు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని మనందరం అర్థం చేసుకోవాలి. అంటే, సగటు ప్రేక్షకుడు థియేటర్కు రావడం తగ్గిపోయింది. వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని, దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు.పావలా కోసం కొట్టుకుంటున్నాంచిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది; వారి ఆదాయం పావలా స్థాయికి పడిపోయింది. ఇప్పుడు ఆ పావలాలో ఎవరు ఎంత తీసుకోవాలి అని మనం కొట్టుకుంటున్నాం కానీ, అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందో మాత్రం మర్చిపోతున్నాం.ఇక్కడ నిర్మాతలు నష్టపోతున్నారు. అదే విధంగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారు, ఇది వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ పరిస్థితికి అసలు మూలకారణం ఏమిటి? ఉన్న ఆదాయంలో ఎవరు ఎంత పంచుకోవాలి అని వాదించుకోవడం కంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గుర్తించి దాన్ని సరిచేసుకోవడం ముఖ్యమా కాదా?నా అభిప్రాయం ప్రకారం ప్రధాన కారణాలు ఇవి1. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడం. సగటు ప్రేక్షకుడిని థియేటర్కు తీసుకురావడంలో హీరోల పాత్ర చాలా ముఖ్యమని ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుడిని థియేటర్కు రప్పించడంలో హీరోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తే, ప్రేక్షకుడికి సినిమాలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. దాని ప్రభావం కేవలం పెద్ద సినిమాలపైనే కాదు, చిన్న సినిమాల మీద కూడా పడుతుంది.2. సినిమాలను కేవలం 27 రోజుల్లోనే OTTలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడం.3. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో రావడం.4. మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరలు.ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదు.ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలి అని వాదించుకున్నా ఉపయోగం లేదు. రేపు వచ్చే ఆ పావలా ఆదాయంలో ఎవరు ఎంత తీసుకోవాలి అని కొట్టుకోవడం తప్ప, దాంతో ఎవరికీ నిజమైన లాభం ఉండదు.మూల సమస్యను సరిచేయకుండా, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీదే పోరాడటం వల్ల ఏం లాభం చేకూరుతుంది? అని బన్నీవాసు ప్రశ్నించాడు.
క్రీడలు
సునామీ శతకం.. చరిత్ర సృష్టించిన పాక్
పాక్ మహిళల టీ20 జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా తమ అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. నిన్న (మే 12) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించింది. 153 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను మట్టికరిపించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను పాక్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. జింబాబ్వే మహిళల జట్టు తొలిసారి పాక్లో పర్యటిస్తూ ఆడుతున్న చారిత్రక సిరీస్ ఇది.సునామీ శతకంకరాచీ వేదికగా జరిగిన తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అయేషా జాఫర్ (47 బంతుల్లో 102 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ మహిళల జట్టు అంతర్జాతీయ స్థాయిలో 200 పరుగుల మార్కు తాకడం ఇదే తొలిసారి.ఈ మ్యాచ్లో అయేషా జాఫర్ చేసిన సెంచరీ మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మూడో వేగవంతమైన సెంచరీగా రికార్డైంది. అలాగే మునీబా అలీ తర్వాత పాక్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా అయేషా జాఫర్ నిలిచింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. 18.2 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఫాతిమా సనా (3-0-7-3), సదియా ఇక్బాల్ (3.2-0-14-2), నతాలియా పర్వేజ్ (2-0-3-2), రమీన్ షమీమ్ (3-0-18-1) జింబాబ్వే ఇన్నింగ్స్ను నేలమట్టం చేశారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 కరాచీ వేదికగా మే 14న జరుగనుంది.
రసవత్తరంగా మారిన ప్లే ఆఫ్స్ సమీకరణలు
ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకున్న వేళ, ప్లే ఆఫ్స్ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. సీజన్ ప్రారంభంలో చెలరేగి ఆడిన జట్లు ప్రస్తుతం మెత్తబడగా.. అడపాదడపా ప్రదర్శనలతో ప్రారంభించిన జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి.దశ తిరగబడి, అనూహ్యంగా పుంజుకున్న జట్ల జాబితాలో గుజరాత్ టైటాన్స్ ముందుంది. ఈ జట్టు రెండు వరుస పరాజయాలతో సీజన్ ప్రారంభించి, ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు, ఆతర్వాత మళ్లీ రెండు వరుస పరాజయాలు, వాటి తర్వాత వరుసగా ఐదు మ్యాచ్ల్లో విజయాలు సాధించి, ప్రస్తుతం పాయింట్ట పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. సీజన్ ప్రారంభంలో ఏమాత్రం అంచనాలు లేని గుజరాత్ ఒక్కసారిగా టైటిల్ ఫేవరెట్గా మారిపోయిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ జట్టు తదుపరి ఆడాల్సిన 2 మ్యాచ్ల్లో (కేకేఆర్, సీఎస్కే) ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారరవుతుంది. గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 8 విజయాలు, 4 అపజయాలతో 16 పాయింట్లు కూడగట్టుకుంది. ఈ జట్టు రన్రేట్ (0.551) కూడా మెరుగ్గా ఉంది.అంచనాలు తల్లకిందులైన జట్లలో పంజాబ్, రాజస్థాన్ ముందువరుసలో ఉన్నాయి. ఈ రెండు జట్లు సీజన్ ప్రారంభంలో వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్-2 జట్లుగా చలామణి అయ్యాయి. అయితే అనూహ్యంగా ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో వెనుకపడ్డాయి. వీటిలో పంజాబ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ జట్టు తొలి ఏడు మ్యాచ్ల్లో ఒక్క అపజయం కూడా ఎదుర్కోలేదు. అయితే ఆతర్వాత అనూహ్యంగా వరుసగా నాలుగు మ్యాచ్ల్లో పరాజయంపాలై, నాలుగో స్థానానికి పడిపోయింది. తద్వారా ప్లే ఆఫ్స్ అవకాశాలను సంకటంలో పడేసుకుంది. ఇకపై ఆడబోయే 3 మ్యాచ్ల్లో (ముంబై, ఆర్సీబీ, లక్నో) కనీసం రెండైనా గెలవకపోతే పంజాబ్ ప్లే ఆఫ్స్ అశలను వదులుకోవాల్సిందే. పంజాబ్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 6 విజయాలు, 4 అపజయాలతో 13 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. కేకేఆర్తో జరగాల్సిన ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ లభించింది. నాలుగు వరుస పరాజయాలు ఎదుర్కొన్నా, రన్రేట్ (0.428) ఇంకా మెరుగ్గానే ఉండటం పంజాబ్కు ఊరట కలిగించే విషయం.ఆరంభంలో అదరగొట్టి, ఆతర్వాత ఢిలా పడిపోయిన మరో జట్టు రాజస్థాన్. ఈ జట్టు సీజన్ ప్రారంభంలో నాలుగు వరుస విజయాలు సాధించి, ఆతర్వాత 7 మ్యాచ్ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి, ప్లే ఆఫ్స్ రేసులో బాగా వెనుకపడిపోయింది. ఈ జట్టు ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్ల్లో (ఢిల్లీ, లక్నో, ముంబై) కనీసం రెండైనా గెలవకపోతే, ప్లే ఆఫ్స్ బెర్త్పై ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో ఈ జట్టు 6 విజయాలు సాధించి, 5 అపజయాలు ఎదుర్కొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. రన్రేట్ (0.082) మెరుగ్గానే ఉంది.హ్యాట్రిక్ పరాజయాలు.. హ్యాట్రిక్ విజయాలుఈ సీజన్లో అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన జట్టు సీఎస్కే. ఈ జట్టు హ్యాట్రిక్ పరాజయాలతో సీజన్ ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. చివరి 8 మ్యాచ్ల్లో హ్యాట్రిక్ విజయాలు సహా 6 విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్ల్లో రెండు గెలిచినా ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. సీఎస్కేకు రన్రేట్ (0.185) కూడా మెరుగ్గా ఉండటం కలిసొచ్చే అంశం. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 6 విజయాలు, 5 అపజయాలు నమోదు చేసి, ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది.ప్లే ఆఫ్స్ రేసులో స్థిరంగా కొనసాగుతున్న మరో రెండు జట్లు ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్. సీజన్ ప్రారంభం నుంచి స్థిరంగా రాణిస్తున్న ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 7 విజయాలు, 4 అపజయాలు ఎదుర్కొని 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఈ జట్టు రన్రేట్ అన్ని జట్లకంటే మెరుగ్గా (1.103) మెరుగ్గా ఉంది. ఆర్సీబీ తదుపరి ఆడాల్సిన 3 మ్యాచ్ల్లో (కేకేఆర్, పంజాబ్, ఎస్ఆర్హెచ్) రెండు గెలిస్తే సునాయాసంగా ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది.ఎస్ఆర్హెచ్ విషయానికొస్తే.. ఈ జట్టు 12 మ్యాచ్ల్లో 7 విజయాలు, 5 అపజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో (14 పాయింట్లు, 0.331 రన్రేట్) కొనసాగుతోంది. ఈ జట్టు ఇకపై ఆడాల్సిన 2 మ్యాచ్లు (సీఎస్కే, ఆర్సీబీ) గెలిస్తే, మిగతా జట్లతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. అధికారికంగా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్న మరో రెండు ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్. ఈ రెండు జట్లు టెక్నికల్గా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నా, అది జరిగే పని కాదు. ఢిల్లీతో పోలిస్తే కేకేఆర్కు కాస్త మెరుగైన అవకాశాలే ఉన్నా, అది కూడా అంత ఈజీ కాదు. ప్రస్తుతం కేకేఆర్ ఖాతాలో 9 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు ఇకపై ఆడాల్సిన 4 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఢిల్లీ విషయానికొస్తే.. ఈ జట్టు ఇకపై ఆడాల్సిన 2 మ్యాచ్ల్లో ఒక్కదాంట్లో ఓడినా లీగ్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. ఇప్పటివరకు లక్నో, ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
‘మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు’
ఐపీఎల్ 2026 సీజన్ను ఘనంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ తొలి అంచె పోటీలు ముగిసేసరికి ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచింది. అయితే రెండో అంచె పోటీల్లో మాత్రం పంజాబ్ తడబడుతూ వస్తోంది. వరుసగా నాలుగు పరాజయాలతో పంజాబ్ పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. బౌలింగ్లో విఫలమవ్వడంతో పాటు పేలవమైన ఫీల్డింగ్ ఆ జట్టు ప్రమాణాలను దెబ్బ తీస్తున్నాయి. పంజాబ్ ఆటగాళ్లు క్యాచ్ డ్రాప్లు ఎక్కువగా చేయడం కూడా ఆ జట్టు కొంపముంచుతోంది. మైదానంలో పరిస్థితి ఇలా ఉంటే బయట కూడా పంజాబ్ జట్టు చిక్కుల్లో పడింది. ఇటీవలే విమానంలో పంజాబ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ వేప్ (ఈ-సిగరేట్) పీల్చడం వివాదంగా మారింది. వేప్ను అందించిన అర్ష్దీప్తో పాటు చాహల్, మరికొంత మంది పంజాబ్ ఆటగాళ్లపై వేటు పడనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు పంజాబ్ ఓపెనర్ ప్రబ్సిమ్రన్ బరువు పెరిగాడన్న వార్తలతో పాటు జట్టు ఆటగాళ్ల ప్రవర్తనపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా స్పందించింది. ఎక్స్ వేదికగా ప్రీతి జింటా మాట్లాడుతూ..'మాటలు జాగ్రత్త. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది వాగొద్దని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు కథనాల వల్ల ఆటగాళ్లు, ఫ్రాంచైజీ ప్రతిష్టకు నష్టం కలుగుతోంది. విమర్శలకు, తప్పుడు కథనాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆటలో తప్పులకు సంబంధించి ఎలాంటి చర్చనైనా స్వాగతిస్తాం. కానీ వ్యక్తులకు, జట్టుకు, ఫ్రాంచైజీ బ్రాండ్కు నష్టం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తే ఎంతమాత్రం సహించము. వీటిని తేలికగా తీసుకోలేము. సమాచారాన్ని ప్రచారం చేసే ముందు వ్యక్తులు, మీడియా నిపుణులు, సోషల్ మీడియా ప్రతినిధులు వాస్తవాలు తెలుసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను కోరుతున్నా' అని పేర్కొంది. There’s a difference between criticism & calculated misinformation. Healthy debate around the game is welcome, but the deliberate spread of fake narratives to damage individuals, the team, or the brand should not & will not be taken lightly. I urge everyone including verified… https://t.co/yeqbsTwLBd— Preity G Zinta (@realpreityzinta) May 12, 2026ఇదే విషయమై పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా ఎక్స్ వేదికగా స్పందించిది. 'విమర్శలు, సరదా సంభాషణలు, అభిప్రాయాలు క్రీడలో భాగమే. కానీ టీఆర్పీ, వ్యూస్ కోసం నకిలీ వార్తలు, కథనాలు రాయడం సరికాదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ముందు వాస్తవాలు ఏంటన్నది గ్రహించాలని మేము కోరుతున్నాము' అని తెలిపింది.Criticism, banter, and opinions are part of sport. Fake stories and made-up narratives for cheap engagement are not. We urge everyone to verify facts before spreading misinformation for attention or traction.— Punjab Kings (@PunjabKingsIPL) May 12, 2026చదవండి: హార్దిక్ నిజంగా గాయపడ్డాడా?
హార్దిక్ నిజంగా గాయపడ్డాడా? కావాలని తప్పించారా?
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం అయిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో దారుణ ఆటతీరుతో మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ముంబై ఆడిన గత రెండు మ్యాచ్లకు వెన్నునొప్పి గాయంతో పాండ్యా దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా మే 14న (గురువారం) పంజాబ్ కింగ్స్తో మ్యాచ్కు పాండ్యా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పంచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పాండ్యా నిజంగా గాయపడ్డాడా లేక కావాలని అతడిని జట్టు నుంచి తప్పించారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పాండ్యా తన ప్రాక్టీస్లో బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటూ కసితీరా బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నంతసేపు పాండ్యాకు ఏమాత్రం అసౌకర్యంగా కనిపించలేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ హెడ్కోచ్ మహేల జయవర్దనే మాత్రం పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు. అంతేకాదు పాండ్యా త్వరగా కోలుకునేందుకు తమ మెడికల్ టీం ప్రయత్నాలు చేస్తుందని తెలిపాడు. పాండ్యా పూర్తిగా కోలుకునేంతవరకు రిస్క్ చేయకూడదని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. పాండ్యా తాను ఫిట్గా ఉన్నట్లు ఒకవైపు వీడియో రిలీజ్ చేయడం, అదే సమయంలో జయవర్దనే పాండ్యా కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పడం చూస్తుంటే పాండ్యా నిజంగా గాయపడ్డాడా లేక కావాలనే జట్టు నుంచి తప్పించారా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పాండ్యా కూడా తన అగ్రెసివ్ ప్రవర్తనతో జట్టులో పూర్తిగా నెగెటివిటీని మూటగట్టుకోవడం కూడా అతడికి ప్రతికూలంగా మారిందని చెప్పొచ్చు.ఇటీవలే పాండ్యా.. ముంబై ఇండియన్స్ ప్రాంచైజీని అన్ఫాలో చేయడం అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఇదే విషయమై ముంబై ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి 'ఈ సీజన్లో పాండ్యా ముంబై తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడని, వచ్చే సీజన్లో వేరే జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడంటూ' కామెంట్లు చేస్తున్నారు. 'పాండ్యా జట్టులోకి రావడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ జట్టు ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. అతడి రాక వల్ల ఉపయోగం లేదు' అని మరికొందరు పేర్కొన్నారు. ఈ సీజన్లో 11 మ్యాచ్లాడిన ముంబై ఇండియన్స్ కేవలం ఆరు పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. ముంబై తన తర్వాతి మ్యాచ్లు పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్తో ఆడనుంది.Hardik pandya practicing in the nets. He just put a stop on alll the rumours 🌚 pic.twitter.com/AjG8Fg9gW9— Gagan Choudhary (@trigguuuu) May 12, 2026చదవండి: ఓటమిలోనూ ఎస్ఆర్హెచ్ రికార్డుల వెల్లువ!
న్యూస్ పాడ్కాస్ట్
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
నేడు తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం... మెజార్టీ దక్కడంతో ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్సిగ్నల్
తమిళనాట ప్రతిష్టంభనలో విజయ్ ప్రమాణ స్వీకారం... మద్దతు ప్రకటించినా అధికారికంగా లేఖ ఇవ్వని వీసీకే
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ మరోసారి అభ్యర్థించిన విజయ్.. మళ్లీ వెనక్కి పంపేసిన గవర్నర్
తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పొత్తు వార్తలతో వేడెక్కిన పాలిటిక్స్.
సీఎంగా రాజీనామా ప్రసక్తే లేదు. తెగేసి చెప్పిన మమతా బెనర్జీ
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది.
అందరి చూపు బెంగాల్ పైనే.. పశ్చిమ బెంగాల్ సహా తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో నేడే ఓట్ల లెక్కింపు
బిజినెస్
మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 57 పాయింట్లు తగ్గి 23,325 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 202 పాయింట్లు నష్టపోయి 74,344 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.32బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.16 శాతం తగ్గింది.నాస్డాక్ 0.71 శాతం నష్టపోయింది.Today Nifty position 13-05-2026(time: 09:46 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
సబ్బు నుంచి బిస్కెట్ వరకు.. అన్నింటిపై ధరల మోత
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల నేపథ్యంలో వినియోగదారులపై ధరల భారం పడుతోంది. ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ సంస్థలు కొన్ని ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను కొంత మేర పెంచడంతోపాటు.. ప్యాక్ల బరువును (పరిమాణం/గ్రాములు) సైతం తగ్గించాయి. ఇప్పుడు మరో విడత, తమ ఉత్పత్తుల ధరలను పెంచడానికి అవి సిద్ధమవుతున్నాయి. దీంతో సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాల ధరలు మరింత పెరగనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధంతో ముడి చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడడం తెలిసిందే. దీంతో వీడి ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి ఫలితంగా రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ వ్యయాలు పెరిగిపోయాయి. దీంతో కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడుతోంది. ముఖ్యంగా ప్లాస్టిక్, ఇతర ప్యాకేజింగ్ వస్తువుల ధరలు 20 నుంచి 40 శాతం వరకు పెరగడం కంపెనీలకు భారంగా మారింది. వీటి తయారీలోకి వినియోగించే ముడిసరుకులకు ముడిచమురు ఆధారం కావడం గమనార్హం. మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూపాయి విలువ క్షీణతతో ముడి సరుకుల వ్యయాలు పెరిగాయి. దీంతో కంపెనీలు లాభాల మార్జిన్లపై ఒత్తిడి పెరిగింది. తమ లాభాల మార్జిన్లను కాపాడుకోవడానికి అవి రేట్ల పెంపుతోపాటు, ప్యాక్ సైజులను తగ్గించేస్తున్నాయి. మొత్తానికి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంటి బడ్జెట్ మరింత భారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ధరల పెంపు.. ఇప్పటికే డాబర్, హెచ్యూఎల్, బ్రిటానియా తదితర సంస్థలు 3 నుంచి 5 శాతం వరకు ధరలను పెంచేశాయి. మరింత పెంచే అవకాశం కూడా ఉందని ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఫలితాల వెల్లడి అనంతరం అనలిస్ట్ల కాల్లో పేర్కొన్నాయి. అలాగే, ప్రాచుర్యం పొందిన చిన్న ప్యాకెట్ల (రూ.5, 10, 15 రూపాయల ప్యాకెట్లు) ధరను మార్చకుండా, వాటి పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి. తద్వారా తమ విక్రయాలు ప్రభావితం కాకుండా, మార్జిన్లను కాపాడుకునేందుకు ఎఫ్ఎంసీజీ సంస్థలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. డాబర్ ఇండియా ఇప్పటికే ఉత్పత్తుల ధరలను 4 శాతం వరకు పెంచింది. తమపై 10 శాతం మేర ద్రవ్యోల్బణం (ముడి సరుకుల వ్యయాల పెరుగుదల) ప్రభావం ఉన్నట్టు సంస్థ సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. వ్యయ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని, అమ్మకాల్లో డబుల్ డిజిట్ వృద్ధి (ధరల పెంపు, అమ్మకాల పెంపు రూపంలో) నమోదు చేస్తామని చెప్పారు. ప్యాకేజింగ్, ఇంధన ఖర్చులు 20 శాతం వరకు పెరిగినందున ధరల పెంపుతోపాటు, పరిమాణం తగ్గింపు తప్పనిసరని అని బ్రిటానియా పేర్కొంది. ప్యాకేజింగ్లోకి వాడే లామినేట్స్ ధరల మంట సంస్థపై పడుతోంది. దీనికితోడు ఎల్పీజీ, పీఎన్జీపై ఆధారపడి ఉండడంతో మార్జిన్లపై ఒత్తిడిని ఎదుర్కొంటోంది. తమ ముడి పదార్థాల ధరలు 40–50% పెరిగాయని, ఈ భారాన్ని క్రమంగా వినియోగదారులపై వేయక తప్పదని పిడిలైట్ స్పష్టం చేసింది. ప్రముఖ బ్రాండ్ ఫెవికాల్ ధరలను 12–15% మేర పెంచింది. ఈ సంస్థ ఉత్పత్తులకు ముడిచమురు డెరివేటివ్స్ కీలకం కాగా, వాటి ధరలు సగటున 40–50% వరకు పెరిగాయి. వరుణ్ బెవరేజెస్ వినియోగదారులకు ఇచ్చే రాయితీలను తగ్గిస్తూ వ్యయాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. తమకు కొబ్బరి ధరలు దిగిరావడం కలిసొచి్చందని.. ఇతర ముడి సరుకుల ధరల ఒత్తిళ్లను ఉత్పత్తుల ధరలను క్రమంగా పెంచడం, వ్యయ నియంత్రణ చర్యలతో అధిగమిస్తామని మారికో ఎండీ, సీఈవో సౌగత గుప్తా ప్రకటించారు. ప్యాకేజింగ్, ఎల్పీజీ ధరలు పెరిగిపోవడంతో మార్జిన్లపై ఒత్తిళ్లు ఉన్నట్టు టాటా కన్జ్యూమర్ ఎండీ, సీఈవో సునీల్ డిసౌజ తెలిపారు. వైవిధ్యమైన ఉత్పత్తుల పోర్ట్ఫోలియో కలిగి ఉన్నందున ఈ ఒత్తిళ్లను ప్రస్తుతానికి అధిగమించగలమని చెప్పారు.
బంగారం, వెండిపై కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ: బంగారం, వెండి విషయంలో కేంద్రం షాకిచ్చింది. దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ (మే 13) అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల బంగారం, వెండి, ఫ్లాటినం.. ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరగనున్నాయి. భారత్ ప్రపంచంలో చైనా తర్వాత రెండవ అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉంది. ప్రస్తుతం దిగుమతి సుంకం 6 శాతంగా ఉంది. అయితే తాజా నిర్ణయంతో దాన్ని 16 శాతానికి పెంచింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వివాహాలు, పండుగల కోసం ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం బంగారం ధర రూ. 1,53,990 ఉంది. కిలో వెండి ధర రూ.3 లక్షలుగా ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.రెవెన్యూ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బంగారం, వెండి, ప్లాటినంతో పాటు ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, క్లాప్స్, క్లాంప్స్, పిన్లు, స్క్రూ బ్యాక్స్ వంటి వాటిపైనా సుంకాలు పెరిగాయి. బంగారం, వెండి ఫైండింగ్స్పై 5% కస్టమ్స్ సుంకం, ప్లాటినం ఫైండింగ్స్పై 5.4% సుంకం విధించారు. అదే సమయంలో, రీసైక్లింగ్, విలువైన లోహాల రికవరీకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఉపయోగించిన ఉత్ప్రేరకాలు, బూడిదతో కూడిన విలువైన లోహాల దిగుమతులపై సుంకాన్ని 4.35%కి తగ్గించారు. అయితే ఇందుకు నిర్దిష్ట నిబంధనలు, అనుమతులు తప్పనిసరిగా పాటించాలి.2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ బంగారం దిగుమతులు 24% పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 9 శాతంగా ఉంది. ఇక బంగారం సరఫరాలో స్విట్జర్లాండ్ 40% వాటాతో మొదటి స్థానంలో ఉండగా, యూఏఈ 16%, దక్షిణాఫ్రికా దాదాపు 10% వాటాతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
జొకోవిచ్ సరసన సినెర్
రోమ్: ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫయర్ ఆండ్రియా పెలెగ్రినో (ఇటలీ)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–2, 6–3తో గెలిచాడు. తద్వారా మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో వరుసగా 31వ విజయంతో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ పేరిట ఉన్న రికార్డును సినెర్ సమం చేశాడు. 2011లో జొకోవిచ్ కూడా మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో వరుసగా 31 మ్యాచ్ల్లో నెగ్గాడు. క్వార్టర్ ఫైనల్లో సినెర్ గెలిస్తే మాస్టర్స్ టోర్నీల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన ప్లేయర్గా రికార్డు సృష్టిస్తాడు.
ఫ్యామిలీ
అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?
వాషింగ్టన్, డి.సి.లోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం, ప్రసిద్ధ విమానాలు , అంతరిక్షయానానికి సంబంధించి పరికరాల ప్రదర్శనకు ప్రసిద్ధిగాంచింది. అయితే తాజాగా ఆ ప్రదర్శనలో ఒక సాధారణ భారతీయ మహిళా శాస్త్రవేత్త చీర దర్శనమిస్తోంది. ఆ చీర భూ వాతారణాన్ని దాటి వెళ్లకపోయినా..ఆ శారీని ధరించిన మహిళ భారతదేశం మరో గ్రహాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషించింది. ఈ చీర ఇస్రోకి చెందిన ప్రఖ్యాత మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్ది. ఎవరామె అంటే..భారతదేశపు మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళ్యాన్)లో నందిని నాయకత్వం కీలక పాత్ర పోషించింది. ఆమె తండ్రి గణిత ఇంజనీర్ కాగా, తల్లి గణిత ఉపాధ్యాయురాలు. ఇస్రోలో చేరడానికి ముందు ఇంజనీరింగ్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. భారత అంతరిక్ష సంస్థలో 20 ఏళ్లకు పైగా సాగిన కెరీర్లో ఆమె 14కు పైగా మిషన్లకు మద్దతునిచ్చారు. ఒక ఇంటర్వ్యూలో నందిని తన మిషన్ల గురించి మాట్లాడుతూ.. "తాము పనిచేసే ప్రతి మిషన్ అత్యంత ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. అయితే వాటిలో మంగళ్యాన్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే చాలా మంది ప్రజలు ఒక్కసారిగా మావైపు చూశారు. అది మా నైపుణ్యానికి, లభించిన గుర్తింపుగా, గర్వంగా అనిపిస్తుందని అన్నారు. అంతేగాదు ఆ మిషన్ విజయవంతం అవ్వడంతో సాక్షాత్తు ప్రధాని మంత్రి కరచాలనం చేసి అభినందించారు. అలాగే నాసా కూడా మమ్మల్ని అభినందించింది. అంతేగాదు ఈ గెలుపు కారణంగా నాసాతో మాతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చింది. పైగా సోషల్ మీడియాలో కూడా చాలామంది మమ్మల్ని ఫాలో అవుతున్నారంటూ". సంతోషంగా చెప్పుకొచ్చారామె.ఆ సీరియల్ కారణంగానే..అంతరిక్ష పరిశోధనలంటే ఎందుకు నందిని ఇష్టమో ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా వివరించారు. ఒక ప్రముఖ టీవీ సీరియల్ చూడటం ద్వారా తనకు అంతరిక్షంపై ఆసక్తి మొదలైందన్నారు. అప్పట్లో టీవీలో 'స్టార్ ట్రెక్' అనే చాలా ప్రజాదరణ పొందిన సీరియల్ ఒకటి ఉండేది, దాని కారణంగానే అంతరిక్ష ఫరిశోధనాలంటే ఇష్టం ఏర్పడిందని ఈటీ ఎంటర్ప్రైజ్ ఏఐ 'మేకింగ్ ఏఐ వర్క్ సమ్మిట్ 2025'లో చెప్పారామె. తమ కుటుంబం మొత్తం ఆ సీరియల్కి వీరాభిమానులమని, ఒక్క ఎపిసోడ్ని మిస్ అయ్యేవాళ్లం కాదంటు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారామె. అలాగే తాను పదేపదే ఇష్టంగా చూసే సినిమా అపోలో 13 అని, అందులో టీమ్గా పనిచేసి విజయం సాధించడం తదితరాలు తన మదిలో శాశ్వతంగా నిలిచిపోయానని అన్నారామె.ఆ చీర ఎందుకు?భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చెందిన మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్ అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి సహాయపడ్డారు. ఇస్రో మంగళయాన్ మిషన్ని నవంబర్ 5, 2013న ప్రారంభించింది. సెప్టెంబర్ 24, 2014న విజయవంతంగా భూమికక్ష్యను విడిచిపెట్టి విజయవంతంగా అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. అంటే సుమారు 300 రోజుల ప్రయాణాన్ని విజయంవతం చేసేందుకు ఆమె ఈ చీరను ధరించి పనికి వచ్చారని స్మిత్సోనియన్ మ్యూజియం ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది అంతేగాదు ఆ పోస్ట్లో.."ఒక రాకెట్ శాస్త్రవేత్తగా, మార్స్ ఆర్బిటర్ మిషన్ డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా నందిని హరినాథ్ మిషన్ ప్రణాళిక, కార్యకలాపల్లో కీలక పాత్ర షోషించారు. దాదాపు ఆరు నుంచి పది నెలల కాలపరిమిత గల తన మిషన్ను ఏకంగా ఎనిమిదేళ్లు అంగారక కక్ష్యలో గడిపి అక్కడి ఉపరితల వాతావరణ పరిస్థితుల్ని నమోదు చేయడం విశేషం. ఆ నేపథ్యంలోనే ఈ మిషన్లోని మహిళా నాయకులు ధరించిన చీరలు వారి జాతీయ గుర్తింపు, అంతరిక్షంలో భారతదేశం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచాయి" అని సదరు మ్యూజియం పేర్కొంది. అంతేగాదు ఆ చీరకు సంబంధించిన వీడియో, ఫోటోలను కూడా మ్యూజియం పంచుకుంది. ఈ చీరలో నీలం రంగు జాకెట్, ఎరుపు-నీలంతో కలగలసిన డ్రేప్డ్ ఫాబ్రిక్ ఉన్నాయి. View this post on Instagram A post shared by Smithsonian (@smithsonian) (చదవండి: జేఈఈలో రెండుసార్లు ఫెయిల్, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్..! చివరికి..)
కరువు కాలపు పంట బ్రహ్మజెముడు
ముళ్ళు లేని బ్రహ్మజెముడు (స్పైన్లెస్ కాక్టస్) కరువుప్రాంతాల్లో రైతులకు చక్కని పశుగ్రాసం సహా 5 రకాలుగా ఉపయోగపడే ఒక చక్కని పంట. వాతావరణ మార్పులను తట్టుకోగల పంట. తక్కువ నీటితో పెరుగుతుంది. సారహీనమైన నేలల్లో కూడా (చౌడు భూముల్లో తప్ప) పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న తోటల్లో మధ్యలో వరుసలుగా దీన్ని పెంచవచ్చు. ఇది చిన్న రైతులను ఆదుకునే పంట. కరువు పీడిత రైతులకు బహుళ ఆదాయ మార్గాలను సృష్టిస్తుంది. సుస్థిర జీవనోపాధిని కల్పిస్తుంది.హెక్టారుకు 80 నుంచి 100 టన్నులుముళ్ళు లేని బ్రహ్మజెముడు ఒక్కసారి నాటితే 25 సంవత్సరాలకు పైగా ఫలసాయాన్నిచ్చే దీర్ఘకాలిక పంట. చిన్న పండ్లతో సహా ఈ చెట్టులోని ప్రతి భాగం విలువైన పశువుల మేతగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో సమకూరే పచ్చిమేతను అందిస్తుంది. సంవత్సరానికి హెక్టారుకు 80 నుంచి 100 టన్నుల వరకు బ్రహ్మజెముడు ఆకుల దిగుబడి వస్తుంది. కరువు సమయంలో నమ్మకంగా, తక్కువ ఖర్చుతో కూడిన పశుగ్రాసాన్ని అందిస్తుంది. తద్వారా పశుగ్రాస ఖర్చులను తగ్గిస్తుంది. దీని ఆకులను అంగుళం ముక్కలుగా కోసి పశువులకు మేపాలి. పాలిచ్చే పశువులకు రోజుకు 10–15 కిలోలు (రోజువారీ పచ్చిమేతలో 25% వరకు) మేపవచ్చని కర్నాల్లోని ఎన్డీఆర్ఐ నిపుణులు చెబుతున్నారు. ఇతర పశువులకు రోజుకు 8–12 కిలోల వరకు, ఆర్నెల్లు పైబడిన దూడలకు 2–4 కిలోలు మేతగా ఇవ్వొచ్చు. క్రమంగా అలవాటు చెయ్యాలి.బయోగ్యాస్ తయారీకి ఉపయోగంముళ్ళు లేని బ్రహ్మజెముడు బయోగ్యాస్ తయారీకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీని ఆకులకు 60–65% మీథేన్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. బయోగ్యాస్ తయారీ తర్వాత వెలువడే స్లర్రీ విలువైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. 3 కిలోల బ్రహ్మజెముడు ఆకులతో 3.38 చదరపు అడుగుల విస్తీర్ణం గల బయో–లెదర్ షీట్ను తయారు చేయొచ్చు. దీనితో రెండు జతల బూట్లు లేదా మూడు చిన్న బ్యాగులు తయారు చేయవచ్చు. దీని పండ్లు పోషక విలువలతో కూడి ఉంటాయి. దీని ఆకులను కూరగానూ వండుకొని తినొచ్చు.ఎవరిని సంప్రదించాలి?ముళ్లులేని బ్రహ్మజెముడు పంట సాగును వ్యాప్తిలోకి తేవాలంటే రైతులకు దీని గురించి తెలియజె΄్పాలి. నాటుకునే బ్రహ్మజెముడు ఆకులను అందించాలి. మార్కెట్ను అనుసంధానం అవసరం. పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు కలసి పనిచేస్తే ఈ కరువు కాలపు పంటను వేగంగా రైతులకు అందించవచ్చు.ఉత్తరప్రదేశ్లోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అనుబంధ సంస్థ ఇండియన్ గ్రాస్ల్యాండ్ అండ్ ఫాడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీనిపై విస్తృతంగా పరిశోధనలు చేసింది. అదనపు సమాచారం కోసం డా. శివ్ కుమార్ అగర్వాల్ను సంప్రదించవచ్చు. sk.agrawal@cgiar.org
వేడి ఒత్తిడి నివారణ ఎలా?
పాడి ఆవులు, గేదెల పెంపకంలో వేడి ఒత్తిడి ఒక కీలకమైన సమస్య. ఇది పాల దిగుబడిపై, పునరుత్పత్తిపై, మొత్తం పశువుల శ్రేయస్సుపై గణనీయ ప్రభావం చూపుతుంది. పశువులు తమ శరీరంలోని అధిక వేడిని బయటకు పంపటానికి ఇబ్బంది పడినప్పుడు ఒత్తిడికి గురవుతాయి. ఆవులు, గేదెలు 5 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉంటే సౌకర్యంగా ఉంటాయి. ఆపైన పెరిగే వేడితో పాటు గాలిలో అధిక తేమ శాతం కూడా వేడి ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా మేత తీసుకోవటం తగ్గుతుంది. పాల ఉత్పత్తి పడిపోతుంది. ఆవులు, గేదెలలో వేడి ఒత్తిడిని తగ్గించడానికి పోషకాహార నిర్వహణ, నివాస మార్పులు, మెరుగైన నిర్వహణ పద్ధతులతో కూడిన బహుముఖ విధానం పాటించటం అవసరమని అక్షయకల్ప ఆర్గానిక్కు చెందిన పశువైద్య నిపుణులు డాక్టర్ తేజేశ్వర రెడ్డి (63669 59100) అంటున్నారు.వేడిమి ఒత్తిడి అంటే ఏమిటి?పశువులు శరీరంలోని వేడిని బయటకు సమర్థవంతంగా వదలలేనప్పుడు శరీరంలో వేడి భారం పెరిగి ఒత్తిడి ఏర్పడుతుంది. ఎక్కువ పాలు ఇచ్చే ఆవులు/గేదెలపై వేడి ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.వేడిమి ఒత్తిడితో పశువులకు నష్టాలు:→ మేత తీసుకోవటం 10–20% తగ్గుతుంది. → ఆ మేరకు పశువుల ఒంట్లో శక్తి తగ్గుతుంది.→ పాల ఉత్పత్తి తగ్గుతుంది.→ దూడల్లో పెరుగుదల మందగిస్తుంది.→ చూడి కట్టే అవకాశాలు తగ్గుతాయి. → రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.→ అబార్షన్లు, వడదెబ్బ, మరణం సంభవించవచ్చు.వేడిమి భారం సూత్రంశరీరంలో పుట్టిన వేడి + వాతావరణం నుంచి గ్రహించిన వేడి – శరీరం నుంచి బయటికి వదిలే వేడి = మొత్తం వేడి భారం→ వాతావరణ మార్పు, తీవ్రమైన వేడి పశువుల ఆరోగ్య రక్షణకు కీలకమైన సవాళ్లుగా మారాయి.→ ఇతర పశువుల కన్నా అధిక పాల దిగుబడినిచ్చే పాడి పశువులు ఎక్కువగా వేడి ఒత్తిడికి గురవుతాయి.→ శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరుగుతుంది.→ ఆవుల కన్నా గేదెలు వేడి ఒత్తిడికి ఎక్కువగా గురవుతాయి. ఎందుకంటే గేదెలకు వేడిని శరీరం నుంచి బయటకు వదిలేందుకు స్వేద గ్రంధులు తక్కువగా ఉంటాయి. వాటి నలుపు శరీర రంగు ఎక్కువ వేడిని గ్రహిస్తుంది.మేత నిర్వహణ:→ ఉదయం/ రాత్రి చల్లటి సమయాల్లో మాత్రమే మేత వెయ్యండి. → అధిక పీచు పదార్థాలు (ఎండు గడ్డి) మేపటం తగ్గించాలి. → పచ్చిమేత/ సైలేజ్ ఇవ్వాలి. → ఎలక్ట్రోలైట్లు, విటమిన్ సి, ఇ, సెలీనియం.. ఇవ్వాలి.→ ప్రొ బయోటిక్స్– ఎంజైమ్లు ఇవ్వాలి.చల్లపూటే పనులు→ పశువులపై ఒత్తిడిని తగ్గించడానికి పాలు పితకటం, మేత పెట్టటం, వాటిని పట్టుకొని కడగటం వంటి పనులను పగటి పూట చల్లగా ఉండే సమయాల్లోనే చేయండి.→ మధ్యాహ్నం ఎండు మేత ఇవ్వకూడదు.పర్యవేక్షణ:→ అధికంగా ఆయాస పడుతున్నాయా? శ్వాస రేటు పెరిగిందా? మేత తినటం తగ్గిందా? వంటి వేడి ఒత్తిడి సంకేతాల కోసం పశువుల శరీర పరిస్థితిని, ప్రవర్తనను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండండి.అత్యవసర ప్రణాళికలు:→ అతి తీవ్రమైన వేడి పరిస్థితుల్లో ఇబ్బంది వస్తే ఏం చెయ్యాలో అత్యవసర ప్రణాళికలను రూపొందించుకోండి.→ పశువులను త్వరగా చల్లబరిచే మార్గాలు ఆలోచించిపెట్టుకోండి. → అత్యవసరమైన వైద్య సహాయం అందించండిగాలి ప్రసరణ – శీతలీకరణ→ పశువుల షెడ్డులో నిలువు ఫ్యాన్లు అమర్చాలి ∙మిస్టర్లు/ స్ప్రింక్లర్లు వినియోగించాలి.→ పశువుల శాల లేదా షెడ్లోకి గాలి బాగా వచ్చి ΄ోయేలా చూసుకోండి. → పశువుల శరీరంపై నేరుగా నీటిని చల్లండి. → తడిపిన గోనె సంచులను పశువుల శరీరంపై కప్పండి. → షెడ్లో ఎక్కువ పశువులను ఉంచకుండా రద్దీగా లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది వాటి శరీరంలో వేడి ఉత్పత్తి తగ్గటానికి, గాలి ప్రసరణ పెరగటానికి దోహదపడుతుంది.షెడ్డు నిర్వహణ→ పశువులకు షెడ్కు పక్కనే అదనంగా చెట్ల నీడ ఉండేలా చూడాలి లేదా షేడ్ నెట్ను కట్టి నీడ ఏర్పాటు చెయ్యటం ద్వారా వేడిమి ఒత్తిడిని తగ్గించవచ్చు. → షెడ్ పైకప్పుపై తెల్లని పెయింట్ వేస్తే వేడి తక్కువగా ఉంటుంది. → షెడ్ ఎత్తు 12–14 అడుగులు; ΄÷డవు 8–10 అడుగులు ఉంటే గాలి ΄ారాడుతూ వేడి తీవ్రత తగ్గుతుంది. నీటి నిర్వహణ→ శుభ్రమైన నీటిని పశువులకు ఇవ్వాలి. రోజంతా నిరంతరాయంగా అందించాలి.→ వేడి వాతావరణంలో ఆవులు/ గేదెలు ఆయాసం, చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవటానికి ఎక్కువ నీరు తాగుతాయి. → 24 గంటలూ చల్లని నీరు ఇవ్వాలి. నీటి ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండాలి. → వేసవిలో నీటి తొట్టెల సంఖ్య పెంచాలి. → గేదెలు నీటిలో మునగటానికి ఇష్టపడతాయి.→ అందుకోసం వాలో ట్యాంకులు ఏర్పాటు చెయ్యాలి. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
మాటంటే మనిషి తీరే!
పిల్లలు మన ఎదురుగా మాట్లాడే మాటలు వేరు. ఫ్రెండ్స్తో మాట్లాడే మాటలు వేరు. వారు ఏయే మాటలు వింటున్నారో ఏయే మాటలు మాట్లాడుతున్నారో గమనించారా? ఇటీవల సి.బి.ఎస్.ఇ.బోర్డు కూడా స్కూల్లో పిల్లలు బూతు మాట్లాడటాన్ని కంట్రోలు చేయమంది. ఈ సెలవుల్లో మన పిల్లల మాటను సరిచేద్దామా?పిల్లల నోట ‘బీప్’ మాటలు ‘ఫ్యాషన్’గా మారిపోయాయి. రీల్స్లో, గేమ్స్లో, ఫ్రెండ్స్ గ్రూప్లో– ఎక్కడ చూసినా అవే. పల్లెల్లో అయితే ‘నా మనవడు తిడితే భలే ముద్దొస్తాడు’ అని మురిసిపోయే తాత, ‘అబ్బో ఇంగ్లిష్ బూతులు కూడా నేర్చేసాడు’ అని గర్వపడే నాన్న... వీళ్లే మొదటి ముద్దాయిలు. ఎప్పుడైనా సరే మాటే మనిషి. నోటిని అదుపులో పెట్టుకోలేకపోతే జీవితాన్ని అదుపులో పెట్టుకోవడం కష్టం. ఈ సెలవులు ‘టూర్’కి కాదు ‘ట్యూనింగ్’కి వాడండి. పిల్లాడి ‘మైండ్సెట్’ ట్యూనింగ్. ‘మాట’ ట్యూనింగ్.బీప్ మాటలు మాట్లాడితే ఏమవుతుంది?చెడ్డ మాటలు అలవాటైతే పిల్లల వ్యక్తిత్వం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. బూతు అనేది కేవలం తిట్టు కాదు, అదొక ఆలోచనా ధోరణి. అలా మాట్లాడే పిల్లలు ఎదుటివాళ్లను గౌరవించడం మానేస్తారు. తిట్లతో మాట్లాడే పిల్లలతో మంచి పిల్లలు స్నేహం చేయడానికి ఇష్టపడరు, దానివల్ల వీళ్లు ఒంటరి అయిపోతారు. చాలామంది పిల్లలకు తిట్లు తప్ప మంచి మాటలే రావడం లేదు. దానివల్ల వాళ్లు తమ భావాలను సరిగ్గా వ్యక్తపరచలేక కోపం, చిరాకు పెంచుకుంటున్నారు.ఎందుకునేర్చుకుంటున్నారు?పిల్లలు ఈ చెడ్డమాటలు ఎందుకు నేర్చుకుంటున్నారు అంటే దానికి కారణం ఓటీటీ వెబ్ సిరీస్లు, సినిమాలు. కథకు అవసరం లేకపోయినా ఇరికిస్తున్నారు. దాన్నే పిల్లలు ఫాలో అవుతున్నారు. రెండోది ఫ్రెండ్స్ మధ్య పీర్ ప్రెషర్. ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు కదా నేను కూడా అంటేనే కూల్ అనే ఫీలింగ్. మూడోది ఇంట్లో వాతావరణం. పెద్దలు కోపంలో తిడుతుంటే విని పిల్లలు నేర్చుకుంటారు. మరి ఎలా మాన్పించాలి?‘సబ్స్టిట్యూట్’ చెప్పాలిఅదేదో సినిమాలో ‘మైదాపిండి’ అనేది తిట్టుగా వాడతాడు హీరో. చెడ్డమాటకు బదులు ఇలా కూడా వాడొచ్చు. ఏ చెడ్డ అర్థం లేని ‘జ΄్ఫా’ లాంటి సౌండ్స్ కూడా వాడొచ్చని చెప్పోచ్చు. ఇలాంటి టెక్నిక్ వాడిన సినిమా జంధ్యాల ‘హైహై నాయకా’ను వీలైతే చూపించాలి. పెద్దవాళ్లు, గొప్పవాళ్లు ఎలా మాట్లాడతారో ఉదాహరణ ఇవ్వాలి. బాగా కోపం వచ్చినప్పుడు ఎవరికి వారు ఒక మాట అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు ‘ఫినిష్’ అనే మాట పిల్లాడు తన తిట్టుగా పెట్టుకున్నాడనుకోండి. వాడు ‘ఫినిష్’ అన్నాడంటే బాగా కోపం వచ్చినట్టు. అందుకు చెడ్డమాటే మాట్లాడాల్సిన పని లేదు.మన పిల్లలు మాట్లాడే ప్రతి మాటా వాళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని పేరెంట్స్గా మనం గుర్తుంచుకోవాలి. మాట తీరు మనిషి స్థాయి చెబుతుంది. ఈ వేసవిలో ఈ మాటను గుర్తుపెట్టుకుని పిల్లల భవిష్యత్తుకు బాట వేద్దాం.తిట్టొద్దుపిల్లాడు చెడ్డమాట మాట్లాడితే ‘నోర్ముయ్’ అని అరవొద్దు. అలా చేస్తే మీ ముందు ఆపేసి వెనక పది రెట్లు మాట్లాడతాడు. దాని బదులుగా ‘ఆ మాట అర్థం తెలుసారా?’ అని కూల్గా అడగాలి. 90 శాతం పిల్లలకి అర్థం తెలీదు. ట్రెండ్ కోసం వాడతారు. అర్థం చెప్తే వాడే సిగ్గుపడతారు. సెలవుల్లో రోజుకో ముప్పై నిమిషాలు పిల్లాడి ‘గ్యాంగ్’తో కూర్చోవాలి. సరదాగా మాట్లాడాలి. వాళ్ల భాష ఏంటో తెలుసుకుంటూ మెల్లగా అందరికీ నచ్చజెప్పాలి. ఇది అందరూ మారాల్సిన విషయం. సెటైర్ నేర్పాలి‘మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడతారు డాడీ’ అంటే ‘సరేలే’ అని వదిలేయకూడదు. ‘ముందు ఇంట్లో మానెయ్. మెల్లగా బయట కూడా మానేయ్’ అని హద్దు గీస్తేనే విలువ తెలుస్తుంది. ఇంట్లో ప్రతి ‘బీప్’ మాటకి ‘ఫైన్’ పెట్టాలి. ఒక తప్పు మాటకు 10 రూపాయలు. ఆ డబ్బు వాడి పిగ్గీ బ్యాంక్ నుండి తీసి, ఎవరికైనా దానం చేయాలని చెప్పాలి. తిట్టాలంటే వ్యంగ్యంతో వెటకారంతో కూడా తిట్టొచ్చు అని చెప్పాలి. పిల్లాడు మంచి మాట మాట్లాడినప్పుడు భలే మాట్లాడావు అని మెచ్చుకోవాలి. మీ మెప్పే వాళ్లకు పెద్ద రివార్డ్.
అంతర్జాతీయం
ఇరాన్కు ట్రంప్ ‘ఏఐ వార్నింగ్’..
వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ మేఘాలను కమ్ముకొనేలా చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఇరాన్ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసిన ఏఐ (కృత్రిమ మేధ) చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ యుద్ధ విమానాలపై అమెరికా దళాలు విరుచుకుపడుతున్నట్లు ఉన్న ఈ కాల్పనిక చిత్రాలు మళ్లీ యుద్ధం తప్పదా? అన్న సంకేతాలను పంపుతున్నాయి.‘బింగ్.. బింగ్.. గాన్!’ట్రంప్ షేర్ చేసిన ఒక చిత్రంలో.. అమెరికా యుద్ధనౌక హై-పవర్ లేజర్ ఆయుధంతో ఇరాన్ జెండా ఉన్న విమానాన్ని గాలిలోనే పేల్చివేస్తున్నట్లు ఉంది. దీనికి "లేజర్స్: బింగ్, బింగ్, గాన్!!" అనే శీర్షికను ఆయన జోడించారు. మరో చిత్రంలో ఇరాన్కు చెందిన 'ఫాస్ట్ బోట్ల' సమూహంపై అమెరికా డ్రోన్లు బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు చిత్రీకరించారు. దీనికి "బై బై, ఫాస్ట్ బోట్స్" అని క్యాప్షన్ ఇచ్చారు.‘లైఫ్ సపోర్ట్’పై కాల్పుల విరమణ!గల్ఫ్ రీజియన్లో గత నెల రోజులుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఇక ఎంతో కాలం నిలవదని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. చర్చల పునరుద్ధరణ కోసం ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. "ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ‘లైఫ్ సపోర్ట్’ మీద ఉంది. తన ప్రియమైన వారు బతికే అవకాశం కేవలం ఒక శాతమే ఉందని డాక్టర్ చెప్పే పరిస్థితిలో ఆ ఒప్పందం ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.యుద్ధానికే మొగ్గు?హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మాటిమాటికీ మూసివేయడం, చర్చల పట్ల టెహ్రాన్ మొండి వైఖరితో ట్రంప్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై అమెరికా 'పూర్తి విజయం' సాధిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఇరాన్పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించే అంశాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ (CNN) కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా శాంతి ప్రతిపాదనలను ఇరాన్ తోసిపుచ్చిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
పాకిస్థాన్లో భారీ పేలుడు, ఏడుగురి మృతి
లక్కీ మార్వాట్: పాకిస్థాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురి మృతి చెందారు. వాయువ్య పాకిస్థాన్లోని లక్కీ మార్వాట్ ప్రాంతంలోని ఓ మార్కెట్లో జరిగిన శక్తిమంతమైన పేలుడులో ఇద్దరు పోలీసు అధికారులతో సహా ఏడుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.కాగా, గత శనివారం రాత్రి.. పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 21 మంది భద్రతా సిబ్బంది మృతిచెందిన సంగతి తెలిసిందే. బన్ను జిల్లాలోని ఫతే ఖేల్ పోలీస్ పోస్ట్ను ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో ఢీకొట్టారు. ఈ భారీ పేలుడుతో పోలీస్ పోస్ట్ భవనం నేలమట్టమైంది. మొత్తం 21 మంది జవాన్లు చనిపోయారు. బలగాల కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారన్నారు. దాడి చేసింది తామేనని ఎవరూ ప్రకటించుకోలేదు. ఇది తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా ఇరాన్కు పాక్ ఆశ్రయం
ఇస్లామాబాద్: అమెరికా-ఇరాన్ యుద్ధంలో శాంతిదూతగా, మధ్యవర్తిగా నటిస్తున్న పాకిస్తాన్ భారీ మోసానికి పాల్పడిందా? అమెరికా వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు ఇరాన్ యుద్ధ విమానాలకు పాకిస్తాన్ తన గడ్డపై రహస్యంగా ఆశ్రయం కల్పించిందని తాజాగా అమెరికన్ అధికారులు వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. సీబీఎస్ న్యూస్ ప్రచురించిన ఈ కథనం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.నూర్ ఖాన్ బేస్లో ఇరాన్ విమానాలుఏప్రిల్ ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది రోజులకే, ఇరాన్కు చెందిన పలు విమానాలు పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్కు చేరుకున్నాయని అమెరికన్ అధికారులు వెల్లడించారు. ఇందులో నిఘా సమాచారాన్ని సేకరించే ఇరాన్ వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన ఆర్సీ-130 (ఆర్సీ-130) విమానం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలను పాకిస్తాన్ ఉన్నతాధికారులు తీవ్రంగా ఖండించారు. నగరానికి నడిబొడ్డున ఉండే నూర్ ఖాన్ బేస్లో ఇన్ని విమానాలను దాచడం ప్రజల కళ్లుగప్పి సాధ్యం కాదని వారు ఈ వార్తలను కొట్టిపారేశారు.ఆఫ్ఘనిస్తాన్లోనూ రహస్య ఆశ్రయం?కేవలం పాకిస్తాన్లోనే కాకుండా పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్కు కూడా ఇరాన్ తన పౌర విమానాలను తరలించినట్లు ఈ నివేదిక పేర్కొంది. యుద్ధం ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందే ఇరాన్కు చెందిన మహాన్ ఎయిర్ పౌర విమానం కాబూల్లో దిగిందని ఆఫ్ఘన్ ఏవియేషన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఎలాంటి ఇరాన్ విమానాలు లేవని, ఇరాన్కు అలా చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.పాక్ ద్వంద్వ వైఖరిపై అమెరికా సెనేటర్ ఫైర్ఈ సంచలన నివేదికపై రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలు నిజమైతే, అమెరికా-ఇరాన్ మధ్యవర్తిగా పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రను పూర్తిగా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ పట్ల పాక్ గతంలో చేసిన వ్యాఖ్యల దృష్ట్యా, ఈ ఆరోపణలు నిజమైనా తాను ఆశ్చర్యపోనని ఆయన అన్నారు. ఇటు అమెరికాతో సంబంధాలు నెరపుతూనే, అటు ఇరాన్కు, దాని మిత్రదేశమైన చైనాకు దూరం కాకుండా పాకిస్తాన్ అత్యంత చాకచక్యంగా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: సోఫాలో గుట్టల కొద్దీ కరెన్సీ.. సౌతాఫ్రికా అధ్యక్షుడి పదవికే ఎసరు?
సోఫాలో గుట్టల కొద్దీ కరెన్సీ.. సౌతాఫ్రికా అధ్యక్షుడి పదవికే ఎసరు?
ప్రెటోరియా: ఒక దేశ అధ్యక్షుడి ఫామ్హౌస్లోని సోఫాలో చోరీకి గురైన భారీ నగదు వ్యవహారం ఇప్పుడు ఆయన పదవికే ముప్పు తెచ్చిపెట్టింది. ‘ఫామ్గేట్’ స్కామ్గా సంచలనం సృష్టించిన ఈ కేసులో సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా చుట్టూ మళ్లీ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంపై విచారణను నిలిపివేస్తూ, గతంలో ఆ దేశ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని అక్కడి రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వడంతో, రామఫోసాపై అభిశంసన ప్రక్రియకు మరోసారి వార్తల్లోకి వచ్చింది.కుదిపేస్తున్న ‘ఫామ్గేట్’ స్కామ్2020లో రామఫోసాకు చెందిన ‘ఫల ఫల’ (Phala Phala) ఫామ్హౌస్లోకి చొరబడిన దొంగలు, అక్కడి సోఫాలో దాచిన భారీ విదేశీ నగదును ఎత్తుకెళ్లారు. అది గేదెల విక్రయం ద్వారా వచ్చిన 5.8 లక్షల డాలర్ల చట్టబద్ధమైన ఆదాయమేనని అధ్యక్షుడు చెబుతుండగా, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు మాత్రం ఆ మొత్తం సుమారు నాలుగు మిలియన్ డాలర్లు(రూ. 38 కోట్ల పైమాటే) ఉంటుందని ఆరోపించారు. అంత భారీ నగదు దేశంలోకి ఎలా వచ్చింది? బ్యాంకులో కాకుండా సోఫాలో ఎందుకు దాచారు? అనే ప్రశ్నలు తీవ్ర దుమారం రేపాయి.అభిశంసనకు మళ్లీ ప్రాణం2022లో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఒక స్వతంత్ర ప్యానెల్.. రామఫోసా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ప్రాథమిక ఆధారాలతో సహా నివేదిక ఇచ్చింది. కానీ అధికార ఏఎన్సీ పార్టీ తనకున్న మెజారిటీతో పార్లమెంట్లో విచారణను అడ్డుకుంది. అయితే పార్లమెంట్ చర్య రాజ్యాంగ విరుద్ధమని తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సెక్షన్ 89 కింద నేషనల్ అసెంబ్లీలో అధ్యక్షునిపై అభిశంసన ప్రక్రియను తప్పనిసరిగా పునఃప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం రాబోయే మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.తగ్గేదే లేదంటున్న రామఫోసాకోర్టు తీర్పు నేపథ్యంలో తనపై వెల్లువెత్తుతున్న రాజీనామా డిమాండ్లను రామఫోసా తీవ్రంగా తోసిపుచ్చారు. తాను ప్రజాధనాన్ని దోచుకోలేదని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్యానెల్ నివేదిక ఆధారాలు లేనిదని, దానిని న్యాయస్థానాల్లో సవాల్ చేస్తానని వెల్లడించారు. కాగా, అభిశంసన నెగ్గాలంటే పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం అధికార పార్టీకి 40 శాతం సీట్లు ఉండటంతో అధ్యక్షుడి పదవికి తక్షణ ముప్పు లేదని, ఆయన ఈ గండం గట్టెక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: రగిలిపోయిన ఇరాన్.. యూఏఈపై మిస్సైళ్ల వర్షం
జాతీయం
నీట్ స్కామ్ @ 2026: తనిఖీల్లో చిక్కిన ‘సాల్వర్ గ్యాంగ్’
నలంద: వైద్య వృత్తిని చేపట్టాలనే కలలు కనే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న భారీ కుంభకోణం ఒకటి తాజాగా వెలుగుచూసింది. రాజస్థాన్ నీట్ పేపర్ లీక్ కలకలం సద్దుమణగక ముందే, బీహార్లోని నలందలో ఒక ‘నీట్ సాల్వర్ గ్యాంగ్’ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. రద్దయిన నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్షకు ముందు పోలీసులు అత్యంత అప్రమత్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ దిగ్భ్రాంతికర ఉదంతం వెలుగుచూసింది.రెండు అనుమానాస్పద వాహనాలలో..మే 3న జరగాల్సిన నీట్ పరీక్ష నేపథ్యంలో నలంద జిల్లా అంతటా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాజ్గిర్ డీఎస్పీ సునీల్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా రాత్రింబవళ్లు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సాధారణ తనిఖీల్లోనే రెండు అనుమానాస్పద వాహనాలను గుర్తించిన పోలీసులు వాటిని అడ్డుకున్నారు. అందులో ఉన్నవారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో విచారణ చేపట్టారు.నగదుతో దొరికిన ఎంబీబీఎస్ విద్యార్థిపట్టుబడిన వారిలో ఒకరు తాను ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నానని పోలీసుల ముందు అంగీకరించాడు. అనుమానంతో పోలీసులు ఆ వాహనాల్లో సోదాలు నిర్వహించగా, కట్టల కొద్దీ నగదు బయటపడింది. ఆ డబ్బు గురించి ప్రశ్నించగా, అది మొత్తం రెండు లక్షల రూపాయలు ఉంటుందని నిందితులు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఆ రెండు వాహనాల్లో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.ఫోన్లలో నకిలీ అడ్మిట్ కార్డుల గుట్టుమరుసటి రోజు ఉదయం అరెస్ట్ అయిన ఆ ముగ్గురి మొబైల్ ఫోన్లను పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. ఈ డిజిటల్ దర్యాప్తులో నీట్ సహా పలు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన అనేక నకిలీ అడ్మిట్ కార్డులు బయటపడటం అందరినీ షాక్కు గురిచేసింది. దీనికి తోడు, ఈ భారీ రాకెట్కు సంబంధించిన అనేక ఆర్థిక లావాదేవీల రికార్డులు, ఇతర కీలక ఆధారాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.ఇది కూడా చదవండి: మూడు రోజులు తిండి మానేస్తే ఏమవుతుంది?
ములాయం చిన్నకొడుకు హఠాన్మరణం
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాజ్వాదీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్(38) హఠాన్మరణం చెందాడు. ప్రతీక్ అఖిలేష్ యాదవ్కు సవతి సోదరుడు. ప్రతీక్ అనారోగ్యంతో కొన్ని వారాల కిందట ఆస్పత్రిలో చేరారు. ఈ మధ్యే డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ వేకువజామున ప్రతీక్ మరోసారి అస్వస్థతకు గురి కాగా.. లక్నోలోని ఓ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అయితే చికిత్స కంటే ముందే ఆయన మరణించినట్లు వైధ్యులు ప్రకటించారు. ఆయన మృతికి గల కారణంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ములాయం సింగ్ మొదటి భార్య మాలతి దేవి తనయుడు అఖిలేష్ యాదవ్. ప్రతీక్ యాదవ్ ములాయం రెండో భార్య సాధనా గుప్తా తనయుడు. యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ (UK)లో చదువుకుని రాజకీయాలకు దూరంగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవారు. లక్నోలో “ది ఫిట్నెస్ ప్లానెట్” పేరిట ఓ జిమ్ కూడా నడిపారు. జీవ్ ఆశ్రయ్ అనే సంస్థ ద్వారా వీధి కుక్కల సంరక్షణ, ఇతర పశు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ నేత, యూపీ మహిళా కమిషన్ వైస్ చైర్పర్సన్ అపర్ణా యాదవ్ ప్రతీక్ భార్య. ఆమె 2022లో బీజేపీలో చేరినప్పటి నుంచి ఆ కుటుంబంలో రాజకీయ విబేధాలు మొదలయ్యాయి. అయితే ఆ అన్నదమ్ముల మధ్య మాత్రం బంధం వ్యక్తిగతంగా కొనసాగేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రధాని మోదీ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చెప్పిన పొదుపు సూత్రాలను పాటించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే.. ప్రభుత్వ వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని సూచించారు.సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్(తెలంగాణ) వేదికగా జరిగిన బీజేపీ బహిరంగ సభ నుంచి దేశ ప్రజలకు ప్రధాని మోదీ పలు పొదుపు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంధన వినియోగాన్ని తగ్గించాలని.. సొంత వాహనాలకు బదులు కార్పూలింగ్, ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని.. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొత్సహించాలని అన్నారు. అయితే దానిని ఆచరించడంలో భాగంగా.. ప్రధాని మోదీ ఇప్పుడు తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలనుకుంటున్నారు. ఇంధన పొదుపు, మితవ్యయ (austerity) చర్యలలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఈ మేరకు ఎస్పీజీ (Special Protection Group)కి కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించాలని.. భద్రతా ప్రమాణాలు తగ్గకుండా, అవసరమైన వాహనాలు మాత్రమే ఉండాలని పీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. అలాగే కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలి కానీ కొత్త వాహనాలు కొనరాదని సూచించినట్లు సమాచారం అందుతోంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు పలు బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంలు ఆచరణలోకి దిగారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 13 నుంచి 8కి తగ్గించమని ఆదేశించారు. రాజస్థాన్ సీఎం భజన్లాల్శర్మ తన కాన్వాయ్లో అనవసరపు వాహనాలు ఉండకూడదని సిబ్బందికి సూచించారు. మరోవైపు.. కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా ఇంధన పొదుపు చర్యలు పరిశీలిస్తున్నాయి. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కూడా తన ఎస్కార్ట్ వాహనాన్ని వాడకూడదని నిర్ణయించారు.
హాఫ్ రేట్కే వందే భారత్ టికెట్లు!
రేటు కాస్త ఎక్కువై అయినా.. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఎక్కుతున్నారు. అయితే ఈ ‘స్పీడ్ రైలు’లో పరిస్థితులు కొత్తలో ఉన్నట్లు కనిపించడం లేదు. కోచ్ల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం.. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడం.. నాణ్యతలేని ఆహారం.. ఇలా ఏదో ఒక అంశంతో వివాదాలతో విమర్శల పాలవుతోంది. తాజాగా..మరో వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. వందేభారత్ టికెట్ను ఓ టీసీ సగం రేటుకే అమ్మే ప్రయత్నం చేయగా.. ఓ ప్రయాణికుడు ఆ తతంగాన్ని రికార్డు చేసి నెట్లో వదిలాడు. అదేంటి?.. ఆ టికెట్ ఆన్లైన్లోనే కదా దొరికేది అనుకుంటున్నారా?.. అసలేం జరిగిందో చదివేయండి.. ఫ్లాట్ఫారమ్ మీద కూర్చున్న కొందరు ప్రయాణికుల దగ్గరకు వెళ్లిన టీసీ.. టికెట్ చూపించడమని అడిగాడు. మిగతా వాళ్ల దగ్గర టికెట్ ఉందని.. తన దగ్గర టికెట్ లేదని ఒకతను బదులిచ్చాడు. దీంతో వందే భారత్ ఎక్కాలని ఉందా? అని అడిగాడు. రేటు ఎంత అని అడిగితే.. రూ.700 విలువైన వందే భారత్ టికెట్ను రూ.380కే ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యపోయిన ఆ ప్రయాణికుడు.. అదంతా రికార్డు చేశాడు.. ఇది అధికారికం కాదు, కానీ, నా చేతుల్లో పని. రైలు ప్రయాణానికి అనుమతిస్తాను అంటూ ఆ టీటీఈ వ్యాఖ్యానించాడు. అయితే వద్దని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. బీహార్ దానాపూర్ డివిజన్ పరిధిలో నడిచే వందే భారత్ రైలులో ఈ ఘటన జరిగింది. పాట్నా రైల్వే డివిజన్లో పని చేసే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) ఈ పని చేయబోయాడు. సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించారు.Vande Bharat ₹750 ticket was being arranged by the TTE for just ₹380.⁰This guy records it and made it viral😭 pic.twitter.com/hjHH35rPAC— Ghar Ke Kalesh (@gharkekalesh) May 12, 2026రైల్వే సేవా (Railway Seva), దానాపూర్ డీఆర్ఎం ఈ వైరల్ వీడియోపై అధికారికంగా స్పందించింది. సంబంధిత టీటీఈని విచారించి.. అతన్ని సస్పెండ్ చేసింది. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఈ చర్యను అవినీతి, అధికార దుర్వినియోగంగా విమర్శించారు. మరికొందరు వ్యంగ్యంగా "ఇలాంటి సంఘటనలు సాధారణమైపోయాయి" అంటున్నారు. ఇంకొందరు మాత్రం టీటీఈ ఆ ప్రయాణికుడికి సహాయం చేయాలనుకున్నాడని.. కానీ, అతను ఇలా చేస్తాడని ఊహించలేదని అభిప్రాయపడ్డారు.వందే భారత్ ఎక్స్ప్రెస్ టికెట్లు అధికారికంగా కేవలం ఐఆర్సీటీసీ IRCTC వెబ్సైట్ లేదంటే మొబైల్ యాప్ ద్వారానే లభిస్తాయి. కొన్ని రూట్లలో బయలుదేరే 15 నిమిషాల ముందు వరకు సీట్లు(కరెంట్ బుకింగ్) లభించవచ్చు. ఆన్లైన్ బుకింగ్ తప్ప ఇతర మార్గం లేదు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.చదవండి: మలి విడత చర్చలు.. పాక్కు వెళ్లని జేడీ వాన్స్!
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు
న్యూయార్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న 2026న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో స్మారక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నైతికతపై దార్శనికత మరియు బహుపాక్షికవాదానికి దాని ప్రాసంగికత’ అనే థీమ్తో ఈ ఈవెంట్ను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి,అంబాసిడర్ హరీష్ పార్వతనేని స్వాగతోపన్యాసం చేశారు. భారత పౌరులలో రాజ్యాంగ నైతికత స్ఫూర్తిని నింపడంలో డాక్టర్ అంబేద్కర్ కృషి చాలా ముఖ్యమైందన్నారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్కు మధ్య ఉన్న ఉమ్మడి అంశాలను వివరించారు. రాజకీయ విభజన, నిరంతర సంఘర్షణలతో కూడిన ఈ క్లిష్ట సమయాల్లో రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాలన్న డాక్టర్ అంబేద్కర్ పిలుపు ఎంతో సందర్భోచితమైనదని, ఇది బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడానికి, ఐక్యరాజ్యసమితిలో సమర్థవంతమైన సంస్కరణలు తీసుకురావడానికి, దాని ప్రధాన విభాగాలకు పునరుజ్జీవం పోయడానికి, ఐక్యరాజ్యసమితిని దాని ఉద్దేశ్యానికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుందని రాయబారి హరీష్ చెప్పారు.ప్రముఖ సివిల్ సర్వెంట్, ప్రముఖ అంబేద్కర్ పండితుడు అయిన డాక్టర్ రాజా శేఖర్ వుండ్రు కీలకోపన్యాసం చేశారు. రెండు ప్రపంచ యుద్ధాలను, ఐక్యరాజ్యసమితి ఏర్పాటును ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, డాక్టర్ అంబేద్కర్ బహుపాక్షికవాదం ప్రాముఖ్యతను గుర్తించారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం యొక్క కేంద్ర సూత్రాలను రూపొందించడంలో డాక్టర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్లో పొందుపరిచిన అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అనే ప్రాథమిక స్ఫూర్తి భారత రాజ్యాంగంలో కూడా ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ అంబేద్కర్ నొక్కిచెప్పారని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో, బహుపాక్షికవాదం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా అంతర్జాతీయ రాజ్యాంగ నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని రాజా శేఖర్ వుండ్రు అన్నారు.డాక్టర్ అంబేద్కర్ జీవితం ఒక నైతిక నిదర్శనమని, అందులో ఆయన కేవలం బాధ నుండి తప్పించుకోవడమే కాకుండా, దానిని రూపాంతరం చెందించి, ఆ గాయాన్ని జ్ఞానంగా మార్చారని హార్వర్డ్ డివినిటీ స్కూల్ విజిటింగ్ ప్రొఫెసర్, అతిథి వక్త డాక్టర్ సంతోష్ రౌత్, అభిప్రాయపడ్డారు. నేటి ప్రపంచంలో, ముఖ్యంగా బహుపాక్షికత (multilateralism) విషయంలో, డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆదర్శాల గాఢమైన ఔచిత్యాన్ని డాక్టర్ రౌత్ విశదీకరించారు. ఐక్యరాజ్యసమితి ఛార్టర్ వంటి లిఖితపూర్వక గ్రంథాల స్ఫూర్తిని ఆచరణలో పెట్టడానికి దోహదపడే శక్తిగా ఆయన నైతికతను అభివర్ణించారు.వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరయ్యారు.
తానా మిడ్ అట్లాంటిక్ నిర్వహణలో ఈస్టర్ ఎగ్ హంట్
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం చిన్న పిల్లలకోసం ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 12వతేదీన కాలేజ్విల్లేలోని ఎవాన్స్బర్గ్ స్టేట్ పార్క్లో విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వేర్వేరుచోట్ల నివసిస్తున్న తెలుగువాళ్లు తమ కుటుంబాలతో ఈ వేడుకల్లో పాల్గొని తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ వేడుక తెలుగువాళ్ళను ఒక వేదికపైకి తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఫుడ్, ఫన్, గేమ్స్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలోనే పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు.తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మద్దతుతో తానా మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు సమన్వయంతో మిడ్ అట్లాంటిక్ తానా నాయకులు, కమ్యూనిటీ లీడర్లు, వలంటీర్ల సహకారంతో విజయవంతంగా జరిగింది.ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ పిల్లల ఈస్టర్ ఎగ్ హంట్. రంగురంగుల గుడ్లు, ప్రత్యేక ‘గోల్డెన్ ఎగ్స’ కోసం పిల్లలు ఎంతో ఉత్సాహంగా వెతికారు. వారి నవ్వులు, కేరింతలు వేడుకల్లో అసలైన పండుగ వాతావరణాన్ని తలపింపజేసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరికీ పిజ్జా వడ్డించారు, ఇది వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపింది.ఈవెంట్ కోఆర్డినేటర్లు దీప్తి కోకా, భవాని మామిడి అద్భుతమైన ప్రణాళికతో ఈ ఆటలను నిర్వహించి, కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. వీరు పెద్దలకు, పిల్లలకు నిర్వహించిన ఆటలు అందరినీ అలరించాయి.మిడ్-అట్లాంటిక్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్లబ్ వారు అందించిన సహకారం మరువలేనిది. ఫుడ్ స్టాల్స్, నిధుల సేకరణ కోసం ఆటలను నిర్వహించడంలో వీరి ఉత్సాహం మరియు టీమ్ వర్క్ ప్రశంసనీయమని తానా నాయకులు అన్నారు. వాలంటీర్లు, పాల్గొనేవారి చెక్-ఇన్, చెక్-అవుట్ ప్రక్రియను సురేష్ యలమంచి ఎంతో సులభతరం చేశారు. అలాగే ఎంసీ గా తన వ్యాఖ్యానంతో అందరినీ ఉత్తేజపరిచారు. విశ్వనాథ్ కోగంటి ఈ వేడుకలోని మధుర క్షణాలను తన కెమెరాలో ఎంతో చక్కగా బంధించారు. తానా ఈస్టర్ బన్నీతో పిల్లలు ఫోటోలు దిగుతూ, ఆడుకుంటూ గడిపిన సమయం కుటుంబాలకు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లందరికీ వారి నిరంతర కృషికి గుర్తింపుగా ‘వాలంటీర్ అవర్ సర్టిఫికేట్లు’ అందజేశారు.ఈ కార్యక్రమంలో బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు కేవలం ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా, సమాజంతో మన సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనవిజయం చేసిన తానా ఫిలడెల్ఫియా టీమ్ కు వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సేవ, సంతోషం మరియు సంఘీభావంతో మనం కలిaసి ముందుకు సాగుదామని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ తానా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.
క్రైమ్
యువతితో ఎస్ఐ వివాహేతర సంబంధం..!
కర్నూలు: కర్నూలు నగరంలో ట్రాఫిక్ ఎస్ఐగా పని చేస్తున్న హరిప్రసాద్ను డిస్మిస్ చేస్తూ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐకి వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు హరిప్రసాద్ను విధుల నుంచి తొలగించారు. వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలేనికి చెందిన హరిప్రసాద్ 2013లో ఎస్ఐగా పోలీసు శాఖలో చేరారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించారు. పది రోజుల క్రితం నంద్యాల జిల్లా నుంచి కర్నూలు ట్రాఫిక్ విభాగానికి బదిలీపై వచ్చారు. హరిప్రసాద్కు యువతితో వివాహేతర సంబంధం విషయంలో రెండు నెలలుగా ఇరు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది. చివరకు యువతి కుటుంబ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అంతర్గత విచారణ జరిపించి డిస్మిస్ చేశారు.కాగా, హరిప్రసాద్ ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐగా పనిచేసే సమయంలో కూడా ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా చాగలమర్రి టోల్ప్లాజా వద్ద పట్టుకుని పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఎస్ఐ హరిప్రసాద్ను వీఆర్కు పంపారు.
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన బండి సంజయ్ తనయుడి కేసు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఈ కేసులో భగీరథ్ను విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించిన మరుసటిరోజే ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు, ఆమె కుటుంబం స్టేట్మెంట్లు నమోదు అయ్యాయి. అయితే సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి రికార్డు చేయాలని అనుకుంటోంది. తద్వారా ఎఫ్ఐఆర్లోని సెక్షన్లు మార్చే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే బండి భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడన్న ప్రచారం నేపథ్యంలో నోటీసులు ఇచ్చి మరీ విచారణ జరిపొచ్చని తెలుస్తోంది. మైనర్ బాలిక కేసుతో పాటు గతంలో జరిగిన ఘటనలు, సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా విచారణ జరిపే చాన్స్ ఉంది. అలాగే కేసుల్లో సంబంధం ఉన్నవారిని సైతం సిట్ విచారించవచ్చని తెలుస్తోంది. కేసు విచారణను వేగవంతం చేయడానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఇప్పటికే సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.ఈ కేసుపై ఆమె స్పందిస్తూ.. ‘‘పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నంబర్ 684/2026 కింద దర్యాప్తు జరుపుతున్నాం. ఈ కేసులో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను ఇప్పటికే అధ్యయనం చేశాం. చట్టప్రకారం అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోన్ కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ఇతర ముఖ్యమైన ఆధారాలు కూడా సమీకరిస్తున్నాం. నేరం రుజువైతే నిందితుడిని తప్పకుండా అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితురాలికి న్యాయం చేస్తాం’’ అని వెల్లడించారామె.
పట్టపగలే పంజాగుట్టలో రూ.15లక్షల మాయం
సాక్షి, హైదరాబాద్: పట్టపగలే పంజాగుట్టలో రూ.15 లక్షలు ఉన్న బ్యాగ్ మాయమైంది. నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంక్కు వచ్చిన ఆఫ్షద్ అనే వ్యక్తి.. గణేష్ స్టాంప్స్ అండ్కో వద్ద ఆగి బ్యాగ్ను కుర్చీలో పెట్టారు. రూ.15 లక్షలు నగదు ఉన్న బ్యాగ్ను క్షణాల్లో చోరీచేశారు. బాధితుడు పోలీస్స్టేషన్లో పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీపీఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఆత్మహత్య
మియాపూర్: మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజయ్ మెగా పోలీస్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న కృష్ణప్రియ (30), మైత్రీనగర్లోని ఫేజ్– 2లో నివాసముంటున్న మాధురి (32) బలవన్మరణం చెందారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. కృష్ణ ప్రియ (35), మైనేని మోనిల్ సింహ దంపతులు నివాసముంటున్నారు. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిని ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కృష్ణప్రియ హైటెక్సిటీలో పనిచేస్తుండగా భర్త కొద్ది రోజులు బెంగళూరులో, కొద్దిరోజులు స్థానికంగా పనిచేస్తాడు.వేసవి సెలవులు కావడంతో భర్త, కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవాయం సాయంత్రం కృష్ణ ప్రియ సోదరి ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో వాచ్మన్కు సమాచారం ఇచి్చంది. వాచ్ మెన్ వెళ్లి తలుపు తలుపులు బద్దల కొట్టి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేయనుకోని మృత దేహాన్ని గాంధీకి తరలించామని తెలిపారు. విజయనగరం జిల్లా, నల్లబెల్లి గ్రామానికి చెందిన హరిపాక బ్రహ్మ, చిన్న అమ్ములు కూతురు మాధురి (35)కి 12 ఏళ్ల క్రితం సత్యనారాయణతో వివాహం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మియాపూర్ మదీనాగూడలోని మైత్రీనగర్లోని ఫేజ్– 2లో నివాసముంటున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. 6 నెలల క్రితం మాధురి భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటినుంచి కుమారుడితో కలిసి ఉంటోంది. 5 రోజుల క్రితం మాధురి తల్లిదండ్రులు మనుమడిని తీసుకుని ఊరికి వెళ్లారు. సోమవారం ఉదయం నుంచి తండ్రి కాల్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో సాయంత్రం 4 గంటలకు ఇంటి పక్కనున్న వ్యక్తికి కాల్ చేసి తమ ఇంట్లో చూడమని చెప్పాడు. అతను వెళ్లి కిటికి నుంచి చూడగా మాధురి బెడ్రూంలో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే మియాపూర్ పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వీడియోలు
రైతుల ఉసురు పోసుకుంటున్న... కూటమి ప్రభుత్వ పతనం తప్పదు
TVKలో షణ్ముగం వర్గం విలీనం..!? AIADMK చాప్టర్ క్లోజ్!
TVK సంచలన నిర్ణయం.. OSD రాధన్ పండిట్ నియామకం రద్దు
CM విజయ్ కి కత్తి మీద సాములా ఉదయనిధి
వరుస ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈ బైపాసులు
బంగారం బ్లాస్ట్.. ఒక్కరోజే 13 వేలకు పైగా..
అల్లు అర్జున్ Reach మాములుగా లేదు..!
144 Seats.. విజయ్ ను వరించిన విజయం
NEET క్యూస్షన్ పేపర్ లీక్.. పేపర్ లీక్ వ్యవహారం..!
CM విజయ్ ని చూసి బాబు, పవన్ నేర్చుకోవాలి..


