మహిళలందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటుంది.. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితో పాటు, మహిళా సాధికారత లక్ష్యంగా మా హయాంలో పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేశాం...అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాం. దాదాపు 32కు పైగా పథకాల ద్వారా మహిళలకు భరోసా కల్పించాం. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్ర పోషిస్తున్నారు. మహిళల అభ్యున్నతే.. ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం’’ అని వైఎస్ జగన్ అన్నారు.
సినిమాల కౌంట్ ఫుల్.. కలెక్షన్ నిల్
వీకెండ్కి టాలీవుడ్లో ఒకేసారి 10 సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఒక్కటీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లు వెలవెలబోతూ, బుక్ మై షోలో టికెట్ల అమ్మకాలు పెద్దగా జరగట్లేదు. ఇటు చూస్తే ప్రచారం మాత్రం హోరెత్తిపోతోంది. ఎక్స్ ఓపెన్ చేస్తే చాలు సినిమాల సందడి. ఇనస్టాగ్రామ్ తెరిస్తే చాలు రీల్స్ రీల్స్ తో ప్రచారం హోరెత్తింది.గివ్-ఎవే పేరిట ఉచిత పొందిన వారు మాత్రమే మొహమాటానికి ట్వీట్లు వేస్తున్నారు. థియేటర్లలో మాత్రం ప్రేక్షకులు కనిపించడం లేదు. వచ్చిన సినిమాల్లో శ్రీవిష్ణు సినిమా ప్రయత్నమైతే గట్టిదే. నిలబడుతుందని ఊహించారు, కానీ కలెక్షన్ పరంగా ఏ మేరకు చేస్తుందో చూడాలి. సరస్వతి సినిమా పెద్దగా చప్పుళ్లు చేయలేదు. ప్రచారం గట్టిగా చేసిన సంప్రదాయిని సుప్పిని.. సినిమా అంతగా పరిస్థితి కూడా అంతే. మిగతా సినిమాల పేర్లు కూడా గుర్తు పెట్టుకోవడం కష్టమే. వీకెండ్ అయినప్పటికీ థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. వచ్చే వారం కూడా పెద్దగా మార్పు ఉండదని అంచనా. ఎందుకంటే మరో 11 రోజులు తర్వాత పెద్ద సినిమా విడుదల కానుంది.
యుద్ధ ఆయుధాలు బంగారంతో.. కియోసాకి ట్వీట్
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం వల్ల ఎంతో నష్టం జరుగుతోంది. ఈ సమయంలో ఎప్పడూ బంగారం, వెండి, బిట్కాయిన్ గురించి సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు యుద్ధం వల్ల ఏమి జరుగుతుందో?, శాంతి స్థాపన ఎలా జరుగుతుందో? అనే విషయాలను వివరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను వియత్నాంలో రెండుసార్లు ఉన్నాను. ఒకసారి 1966-67లో విద్యార్థిగా, ఆ తరువాత 1971-72లో యూఎస్ మెరైన్ కార్ప్స్ పైలట్గా. అయితే 2026లోనూ వియత్నాంతో ఎందుకు పోరాడామో నాకు ఇప్పటికీ తెలియదు, ఇంకా సమాధానం దొరకలేదు. యుద్ధం వల్ల దాదాపు అందరికీ నష్టమే.ఇప్పుడు ఇరాన్ లేదా ఇజ్రాయెల్పైకి వెళ్తున్న ప్రతి రాకెట్ లోపల నాలుగు ఫౌండ్స్ వరకు వెండి ఉంటుంది. రాకెట్ పేలిపోయినప్పుడు సిల్వర్ విచ్చిన్నమవుతుంది. ఇది వెండి సేకరించేవారికి మాత్రమే లాభం. యుద్ధంలో పాల్గొనేవారికి మిగిలేది కన్నీళ్లు, ధన నష్టం మాత్రమే అని కియోసాకి పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనంయుద్ధ ఆయుధాలను బంగారంతో తయారుచేస్తే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు యుద్ధం చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆయుధాలు ఖరీదైనప్పుడు కొనుగోలు చేయడం తగ్గవచ్చు. కాబట్టి ఇలా శాంతి స్థాపనకు సాధ్యమవుతుందని భావిస్తున్నాను. నేను ఈ రోజు యుద్ధం కోసం కాదు, శాంతి & నిజమైన ఆర్థిక విద్య కోసం పోరాడుతున్నాను అని కియోసాకి వెల్లడించారు.TRAGICALLY: War is profitable.Still in Vietnam seeking personal answers to a war we should never have entered.FYI: I served in Vietnam twice, once in 1966-67 as a student and 71-72 as a US Marine Corps pilot. In 2026 I still do not know why we fought in Vietnam.I know…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 7, 2026
12 రోజెస్
30 వయసుకి ముందు ‘ఏం చేశారు?’ అనడిగితే, పాత జెనరేషన్ ఆలోచిస్తుంది. కాని, ఈ జెనరేషన్ అమ్మాయిలు అప్పటికే సాధిస్తారు! చిన్న వయసులోనే ఎవరిపైనా ఆధారపడకుండా, ఆధిక్యతను నిరూపించుకుంటున్నారు. కలలకు డెడ్లైన్ పెట్టకుండా, తమ జీవితానికి తామే సింహాసనం వేసుకుంటున్నారు. అలా ‘ఫోర్బ్స్ 30 అండర్ 30– 2026’ జాబితాలో ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న మహారాణులు వీళ్లే!ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్ లో ‘భోజనాలు ఎక్కడ?’ అని తెలుసుకునే లోపే,ముప్పై ఏళ్లు దాటిన వారిని ‘పెళ్లి ఎప్పుడు?’ అని అడిగే బంధువుల కోసం ఈసారి కొంతమంది అమ్మాయిలు స్పెషల్ సమాధానం రెడీ చేశారు. ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 – 2026’ బ్యాచ్ని చూపిస్తూ, ఇది కేవలం లిస్ట్ కాదు, యాంబిషన్ కు ఆధార్ కార్డు; డ్రీమ్స్కు రేషన్ కార్డు; సక్సెస్కు అడ్రెస్ ప్రూఫ్. వయసుతో సంబంధం లేకుండా, ఫెయిల్యూర్కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, సక్సెస్తో సెల్ఫీ తీసుకున్న బ్యాచ్ ఇది.అందుకే ఇకపై ‘సెటిల్ అయ్యావా?’ అని అడిగే ముందు,‘మీరు స్కేల్ అప్ అయ్యారా?’ అంటూ మోటివేషన్ ఇస్తున్నారు. ఇలా ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఈ యంగ్ అచీవర్స్ గురించి,మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ. కలలు కనడం ఒక ఎత్తు, ‘అయ్యో, అవి నిజమవుతాయా?’ అని అనుమానం పెట్టుకోవడం మరో ఎత్తు. కాని, ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 – 2026’ జాబితాలో చోటు సంపాదించిన వాళ్లు మాత్రం కలలు కనే దశ దాటేసి, వాటికి గడువు పెట్టుకుని, నెరవేర్చుకుని, ఫ్రేమ్ కట్టేసిన బ్యాచ్. ఈ జాబితాలో వ్యాపారవేత్తలు, నిపుణులు, క్రీడాకారులు, సంగీతం, సినిమా కళాకారులు, రూపకర్తలు ఇలా రంగుల మేళవింపే కనిపించినా, వారిది ఒకే లక్షణం– అదే సాధించాలనే తపన! ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, ఆర్థిక రంగాల్లో పేరొందిన ఫోర్బ్స్ సంస్థ.భారత్లో ప్రతి ఏడాది విడుదల చేసే ఈ ప్రత్యేక జాబితా ఇప్పుడు పదమూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసే ఈ జాబితాలో ఈసారి పదిహేను విభాగాల్లో యువ ప్రతిభను గుర్తించగా, అందులో నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులు అందించే వ్యాపారాలు, దేశ రక్షణ, అంతరిక్ష రంగాలు, ప్రకటనలు, మార్కెటింగ్ వంటి కొత్త విభాగాలు చేర్చారు. ఇలా చిన్న వ్యాపారం నుంచి అంతరిక్ష ప్రయోగం దాకా ప్రతిభకు విస్తృత వేదిక సిద్ధమైంది. అసాధ్యాలను సాధించిన ఆణిముత్యాలుఈ యువ సైన్యం ‘సెటిల్ అవ్వడం’ అంటే కుర్చీలో కూర్చోవడం కాదు, కుర్చీని సృష్టించేవారిగా ఎదగడం అనే ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. సుమారు వెయ్యికి పైగా వచ్చిన దరఖాస్తులను జల్లెడ పట్టి, నిపుణుల కమిటీ చర్చలు, వాదోపవాదాల తర్వాత ఎంపికైన ఈ ముప్పై మందిలో పన్నెండు మంది మహిళలు తమ ప్రతిభతో వెలుగొందగా, మిగిలిన స్థానాలను యువకులు కైవసం చేసుకున్నారు. అమ్మాయిల దూరదృష్టి, అబ్బాయిల వినూత్న ఆలోచనలు కలగలిసి కృత్రిమ మేధస్సు నుంచి వ్యవసాయ సాంకేతికత వరకు, అజ్రక్–కాంతా వంటి సంప్రదాయ కళల నుంచి క్రీడలు, సినిమా, రక్షణ–అంతరిక్ష రంగాల వరకు పదిహేను విభాగాల్లో సంచలనం సృష్టించాయి. పన్నెండు ప్రేరణ గాథలు! ముప్పైమంది సభ్యులతో మెరిసిన ఈ జాబితాలో, అసలైన స్పాట్లైట్ మాత్రం ఆ పన్నెండుమంది మహిళలదే! కలలకు క్యాలెండర్ ఉండదని, విజయానికి డెడ్లైన్ పెడితే చాలు సాధ్యమవుతుందని వారు నిరూపించారు. కాంతా కుట్టుతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న మౌమితా బసాక్, అజ్రఖ్కు ఆధునిక ఊపు తెచ్చిన ముబస్సిరా ఖలిద్ ఖత్రి సంప్రదాయం కూడా స్టయిలిష్గా మెరవొచ్చని నిరూపించారు. దృశ్య కథలతో సమాజానికి కొత్త కళ్లద్దాలు పెట్టిస్తున్న ప్రియా దాలి, కళ అంటే కేవలం వినోదం కాదని గుర్తు చేశారు.పద్దెనిమిదేళ్లకే స్టార్టప్ స్టీరింగ్ పట్టిన కాజల్ భేడా, చికంకారీకి ఫ్యాషన్ ఫ్రేమ్ ఇచ్చిన ఆకృతి రావల్, పర్యాటకానికి కొత్త అడ్రస్ రాసిన సిమోనా మోహన్ , మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం తీసుకొచ్చిన రమ్య ఎల్లాప్రగడ, సంరక్షణ కేంద్రాల నుంచి బయటికొచ్చిన యువతకు దిక్సూచి అయిన అనీషా శర్మ ఇలా ప్రతి పేరు ఒక కథ, ప్రతి కథ ఒక ప్రేరణ. చెస్బోర్డుపై చక్రం తిప్పిన దివ్యా దేశ్ముఖ్, విలువిద్యలో లక్ష్యాన్ని ఛేదించిన శీతల్ దేవి క్రీడల్లో భారత ప్రతిష్ఠను ఎగరేశారు. ముప్పైమందిలో అందరూ ప్రతిభావంతులే! కాని, ఈ మహిళలు మాత్రం ‘ముందు మేముంటాం, మిగతావాళ్లు ఫాలో అవుతారు!’ అన్నట్టు నిలిచారు.సంక్షోభమైనా సరైన సమయమే! కాజల్ భేడాప్రపంచం మొత్తం మాస్కులు కట్టుకుని భయంతో కూర్చున్న రోజుల్లో కాజల్ భేడా, ఒక కొత్త ఆలోచనకు ముసుగు తీసేసింది. ‘బ్రాండ్ అంటే కేవలం ప్రకటన కాదు, అది ఒక కథ’ అనే ఆలోచనే 2020లో ముంబై నేలపై ‘స్క్రిబ్బల్డ్’ సంస్థ స్థాపించింది. బ్రిటన్ లో మీడియా నిర్మాణంలో పొందిన శిక్షణ, నమ్మకాన్ని బలంగా చేసుకొని, సంస్థలు చెప్పాలనుకునే అసలైన సందేశం, ప్రకటన ఏజెన్సీలు అందించే సాధారణ పనుల మధ్య ఉన్న ఖాళీని భర్తీ చేయాలనే సంకల్పంతో ముందడుగు వేసింది. బయట పెట్టుబడుల కోసం తలుపులు తట్టకుండా, తన శ్రమనే మూలధనంగా మార్చి లాభాల్లో నడిచే సంస్థగా తీర్చిదిద్దింది. నేడు ఆమె నైకా, అమెజాన్, అదానీ వంటి ప్రముఖ సంస్థల కథలను కొత్త శైలిలో చెప్తోంది. ఇలా సంక్షోభం వచ్చినా, కలలకు స్టార్ట్ బటన్ నొక్కడానికి సరైన సమయమే అని చెప్తోంది.భావాలే బలం, ధైర్యమే దారి: అనీత్ పడ్డాచిన్నప్పటి నుంచి ఇంట్రావర్ట్గా మెలిగిన ఆ అమ్మాయి, ఒక రోజు అందరి చూపులు తనవైపు తిప్పుకుంటుందని ఎవరైనా ఊహించి ఉంటారా? అదే అనీత్ పడ్డా కథ. ‘నటనలో చేతి కదలికలకన్నా హృదయ స్పందన ముఖ్యం’ అని తల్లి చెప్పిన మాటలను గుండెల్లో దాచుకుని, నటనను సాధన చేసింది. ప్రకటన రంగంలో ప్రారంభించి, భావోద్వేగ ప్రధాన పాత్రలతో గుర్తింపు పొందింది. సామాజిక అంశాలపై అవగాహన కలిగించే కథలను ఎంచుకోవడం ఆమె ప్రత్యేకత. కేవలం 23 ఏళ్ల వయసులోనే తనదైన ముద్ర వేసిన ఈ యువ నటి, తదుపరి చిత్రంలో మరో కొత్త అవతారంలో కనిపించేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో మరింత విభిన్న పాత్రలు, ప్రతి కథలోనూ కొత్త అనుభూతి పంచాలనే తపనతో ముందుకు సాగుతోంది.కథలతో కట్టిపడేసే సృజనశీలి: ప్రియా దాలిరూపకల్పన అంటే రంగులు మాత్రమే కాదు; కథనం అంటే మాటలు మాత్రమే కాదు; సమాజం అంటే జనాలు మాత్రమే కాదు అంటూ ఈ మూడింటినీ ఒకే తాడుతో కట్టి అందమైన గాలిపటంలా ఎగరేసింది ప్రియా దాలి. వివిధ దృశ్య కథనాల ద్వారా అణగారిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చింది. అలాగే, వివిధ సామాజిక అంశాలపై అవగాహన కలిగించే ప్రాజెక్టులు రూపొందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. టిండర్, గోద్రేజ్ గ్రూప్ వంటి సంస్థలతో కలిసి దీర్ఘకాలిక సహకారాల్లో భాగమైంది. పిల్లల పుస్తకాల ప్రచురణలోనూ తన ముద్ర వేసి, 2023లో ‘ఆర్ యూ సీరియస్?’ అనే సృజనాత్మక సంస్థను స్థాపించింది. ఆమె కథ చూస్తే అనిపిస్తుంది. నవ్వుతూ చెప్పిన కథ కూడా సమాజాన్ని ఆలోచింప జేయగలదని!స్టయిల్కు సవాల్!: ఆకృతి రావల్‘అమ్మా! ఈ చేతిపని చీరలు యువత కూడా కట్టుకుంటారా?’ అనే ప్రశ్నే ఆకృతి రావల్ కథకు ఆరంభం. 2020లో వాట్సాప్నే దుకాణంగా మార్చి ‘హౌస్ ఆఫ్ చికంకారీ’ని ప్రారంభించింది. లక్నో చుట్టుపక్కల కళాకారుల ఇళ్లలో మోగే సూదుల శబ్దాన్ని నేరుగా యువత అల్మరాలోకి తీసుకొచ్చింది. అసలైన చికంకారీకి తోడు కశ్మీరీ ఆరికారీ వంటి మరిన్ని చేతివృత్తులను చేర్చి, సంప్రదాయాన్నే ట్రెండ్గా మార్చేసింది. కళాకారులకు నెలకొక స్థిరమైన ఆదాయం కల్పిస్తూ, అసంఘటిత మార్కెట్లో ఒక క్రమశిక్షణను తీసుకొచ్చింది. ఆమె ప్రయాణం షార్క్ టాంగ్ వేదికపై మెరిసి, పలువురు పెట్టుబడిదారుల మద్దతును సంపాదించింది. అలా సంప్రదాయానికి స్టయిల్ అద్దిన ఈ యువ పారిశ్రామికవేత్త కథ చేతిపనికీ క్లాప్స్ కొట్టేలా చేస్తోంది.కథలు నేస్తున్న కళాకారిణి: మౌమితా బసాక్పశ్చిమ బెంగాల్ పల్లెలో పెరిగిన మౌమితా బసాక్ చేతిలో సూది పడితే అది కేవలం కుట్టు కాదు, ఒక కథ మొదలవుతుంది! మనం సాధారణంగా పాత బట్ట అని పక్కన పెట్టేసేదాన్ని, ఆమె ‘ఇదే నా కాన్వాస్’ అంటూ రంగుల కలలు నేస్తుంది. సంప్రదాయ కాంతా కుట్టును ఆధునిక భావాలతో కలిపి, చీరపై చిన్న చిన్న ముచ్చట్లు కుట్టేస్తుంది. టీ, కాఫీ రంగుల సహజ మరకలు, మిగిలిపోయిన వస్త్రాల ముక్కలు ఇవన్నీ ఆమె చేతిలో పడితే వినూత్న డిజైన్లుగా మారతాయి.ఆమె డిజైన్స్ దేశం దాటి స్పెయిన్ , బ్రిటన్ , పోలండ్ వరకు చేరి ప్రశంసలు అందుకున్నాయి. రాష్ట్ర, అంతర్జాతీయ వేదికల వరకు అనేక అవార్డులు, పురస్కారాలు ఆమె ఖాతాలో చేరాయి. మహిళా సాధికారత, గ్రామీణ జీవితం, అసమానతలపై తన కుట్టులోనే సందేశాలు నేస్తూ ‘సూది చిన్నదైనా, సందేశం పెద్దది!’ అని నవ్వేస్తుంది. స్థానిక మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం ఆమెకు మరో గర్వకారణం. అలా పాతబట్టలలో కూడా కొత్త ప్రపంచం దాగి ఉంటుందని నిరూపిస్తోంది.ఇంటివద్దే సెలవుల మజా!: సిమోనా మోహన్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ఇరవై ఎనిమిది ఏళ్ల సిమోనా మోహన్, ఇప్పుడు పర్యాటక రంగంలో కొత్త పంథాను చూపిస్తోంది. పర్యావరణ హిత పర్యాటకానికి ప్రాధాన్యం ఇచ్చే సంస్థను నిర్వహిస్తోందామె. అతిథులకు కేవలం వసతి మాత్రమే కాదు, స్థానిక ప్రకృతి, సంస్కృతి, ఆహారం అన్నీ కలిసిన ప్రత్యేక అనుభవాన్ని అందిస్తోంది. నీలగిరుల మధ్య మూడు పడకగదుల కాటేజీలో కేవలం మూడువేల రూపాయలకే బస చేసే సౌకర్యంతో పాటు భోజనం, స్థానిక కొనుగోళ్లు, వాహన సదుపాయాలన్నీ ఒకే ప్యాకేజీలో ఏర్పాటు చేస్తోంది. ముందుగా ఒక ప్రాంతంలో బలపడిన తర్వాతే కొత్త మార్కెట్లలో అడుగుపెట్టాలనే స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది.చెస్ వేదికపై మహారాణి: దివ్యా దేశ్ముఖ్ఇరవై ఏళ్ల వయసులోనే చెస్ బోర్డుపై తన మేధస్సుతో ఆకాశాన్ని తాకేసింది దివ్య దేశ్ముఖ్! మహారాష్ట్రకు చెందిన ఈమె, అంతర్జాతీయ గ్రాండ్మాస్టర్ హోదా సాధించిన కొద్దిమంది భారతీయ మహిళల్లో ఒకరు. అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తనదైన ముద్ర వేసి, యువతలో చదరంగంపై ఆసక్తిని పెంచుతోంది. బోర్డుపై ఆమె నడిపే ప్రతి పావు ఒక వ్యూహం, ప్రతి కదలిక ఒక లెక్క, ప్రతి ఆట చివరికి చెక్మేట్ వైపు దారి తీసే తెలివైన అడుగు. ఎక్కడా తడబడకుండా, పాయింట్ టు పాయింట్గా ప్రత్యర్థిని కట్టడి చేస్తూ ముందుకు సాగే ఈ చిన్న మేధావి, ఇప్పుడు 2026 కాండిడేట్స్ టోర్నీపైనే ఉంది. ఆమె ఆటతీరు చూస్తే, చదరంగ బోర్డుపై రాజు, రాణి, కోట అన్నీ ఉన్నా, ఆ ఆటకు ప్రాణం పోసేది దివ్య చేతులే అనే భావన కలిగిస్తుంది.అజ్రక్కి ఆడపడుచుగా!: ముబస్సిరా ఖలీద్ ఖత్రిమూడు తరాలుగా ఆ ఇంట్లో మోగేది చెక్క ముద్రల శబ్దమే, కాని, ఆ ముద్రలు వేసేది మాత్రం మగవాళ్లే! ఆ సంప్రదాయానికి చిన్న నవ్వుతో ‘ఇప్పుడు నా వంతు’ అంటూ రంగంలోకి దిగింది ముబస్సిరా ఖలీద్ ఖత్రి. గుజరాత్ కచ్ ప్రాంతానికి చెందిన ఈమె, అజ్రక్ అనే ఆ క్లిష్టమైన ముద్రణ కళలో తొలి మహిళా కళాకారిణిగా అడుగుపెట్టి అడ్డుగోడలను బద్దలుకొట్టడమే కాదు, ఆంక్షల సరిహద్దులను కూడా చెరిపేసింది! సంప్రదాయ పద్ధతికి తన స్వేచ్ఛా చిత్రణను, హస్తకళా నైపుణ్యాన్ని జోడించి, చెక్క ముద్రల మధ్యలో కొంచెం తన స్టయిల్ చల్లి కొత్త డిజైన్స్ని చూపించింది. తర్వాత వ్యాపార నైపుణ్యాలను అభ్యసించి, కళకు వ్యాపార దక్షతను కూడా జోడించింది. ‘శ్రీ గౌరవ కిలారు సన్మాన్’ అందుకుంది. ఆమె డిజైన్స్ వస్త్రాలు దేశీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్నాయి. అనంతరం ‘ఎలీషియన్ ’ అనే తన బ్రాండ్ ద్వారా అజ్రక్ కూడా ఆధునికంగా మెరిసేలా చేసింది.మరచిపోయిన ధనం, మళ్లీ చేతిలోకి: పూజా మాలిక్, సరితా జైన్ డబ్బు పోతే బాధే కాని, ఎప్పుడో పెట్టి మరచిపోయిన డబ్బు ఒక్కసారిగా తిరిగి చేతిలో పడితే? ఆ ఆనందానికి మాటలు సరిపోవు! అదే ఆనందాన్ని అందిస్తున్న సంస్థే ‘ఈక్విట్రేసర్స్ వెల్త్ అడ్వైజర్స్’. స్థాపకురాలు పూజా మాలిక్, సహస్థాపకురాలు సరితా జైన్ కలిసి ఆర్థిక రంగంలో ఓ విభిన్న మార్గాన్ని ఎంచుకున్నారు. పెట్టుబడిదారుల విద్య, రక్షణ నిధుల పరిధిలో పనిచేస్తూ, ఎప్పుడో మరచిపోయిన బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, లాభాంశాలు వంటి ఆస్తులను గుర్తించి, వాటి అసలైన హక్కుదారులకు తిరిగి అందించే బాధ్యత తీసుకున్నారు.‘ఇది ఎక్కడో ఉంది. కానీ ఎవరిది?’ అనే గందరగోళానికి ముగింపు పలుకుతూ, వారసులను గుర్తించడం నుంచి మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, సులభంగా పూర్తి చేయడం వరకూ అండగా నిలుస్తున్నారు. వందకు పైగా వినియోగదారులతో, ముఖ్యంగా అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, విదేశాల్లో నివసించే భారతీయులతో పనిచేస్తూ, 2025 ఆర్థిక సంవత్సరంలో యాభై లక్షల రూపాయల ఆదాయం సాధించారు. మరచిపోయిన సంపదకు మళ్లీ చిరునవ్వు తెప్పిస్తున్నారు ఈ ఇద్దరూ.వైకల్యం విజయానికి అడ్డుకాదు: శీతల్ దేవి జమ్మూ కశ్మీర్ పర్వత గ్రామం నుంచి వచ్చిన పారా ఆర్చర్ శీతల్ దేవి కథ, అసాధ్యాన్ని సాధ్యం చేసిన సాహసగాథ. చేతులు లేకున్నా, తన పాదాలనే చేతులుగా మార్చుకొని విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించే ఈ క్రీడాకారిణి, ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. ఆమెలోని సహజ సమతౌల్యాన్ని గమనించిన కోచ్లు ఆర్చరీకి దారి చూపించారు. అలా పవర్ఫుల్గా ట్రైనింగ్ తీసుకొని, పదిహేడేళ్లకే భారత యువతుల్లో అతిపెద్ద ప్యారాలింపిక్ పతకాన్ని గెలిచి, ప్రపంచ చాంపియన్ గా ఎదిగింది. డిసెంబర్లో సాధారణ దేశీయ ట్రయల్స్లో మూడవ స్థానం సాధించి, సాధ్యం కేవలం ఒక పదం మాత్రమే కాదు, కష్టపడి, ధైర్యంగా ముందుకు పోయినవారి ఆస్తి అని నిరూపించింది.మెదడు ఆరోగ్యానికి, సాంకేతిక స్పర్శ: రమ్య ఎల్లాప్రగడ, లక్షయ్ సాహ్నీరమ్య ఎల్లాప్రగడ, లక్షయ్ సాహ్నీ కలిసి 2020లో ప్రారంభించిన ‘మార్బుల్స్ హెల్త్’ మెదడు ఆరోగ్యానికి కొత్త దారిని చూపుతోంది. న్యూరాకిల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ, శస్త్రచికిత్స అవసరం లేకుండా మెదడు సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టింది. మందులు, మానసిక చికిత్సలకు తోడ్పడే విధంగా వైద్య అనుమతి పొందిన నాడీ ఉత్తేజక వ్యవస్థలను అభివృద్ధి చేసింది. వీరి ప్రధాన ఉత్పత్తి ‘ఈజ్’ దేశంలోనే తొలి వైద్య అనుమతి పొందిన నాడీ ఉత్తేజక పరికరంగా గుర్తింపు పొందింది. ఇది ప్రస్తుతం ఆసుపత్రుల్లో, వైద్య పర్యవేక్షణలో, గృహ సంరక్షణలోనూ వినియోగంలో ఉంది. ప్రధానంగా మానసిక వైద్యులు, ఆసుపత్రులతో కలిసి పనిచేస్తున్న ఈ సంస్థ,‘ఆరోగ్యం అంటే శరీరానికే కాదు, మనసుకు కూడా’ అని గుర్తుచేస్తోంది.అనాథాశ్రమం తర్వాత తోడుగా!: అనీషా శర్మ, గిరీశ్ మెహతాఅనాథాశ్రమంలో పెరిగి, పద్దెనిమిదేళ్లు నిండగానే బయట ప్రపంచం ముందు నిలబడ్డప్పుడు వచ్చే ఆ గందరగోళం గిరీశ్ మెహతా, అనీషా శర్మకు బాగా తెలుసు. ‘ఇక ఇల్లు లేదు, మార్గం ఎక్కడ?’ అన్న అనుభవమే వీరిని ఒక వేదికగా మలిచింది. అదే ‘ కేర్ లీవర్స్ ఇన్నర్ సర్కిల్ సంస్థ’. సంరక్షణ గృహాల నుంచి బయటకు వచ్చే యువతే, తమలాంటి వారికోసం నడిపే ఈ సమూహం ‘మన వాళ్లు మన కోసం’ అన్న భావనను కలిగిస్తుంది.ఓటరు కార్డ్ కోసం ఏ కార్యాలయానికి వెళ్లాలి? ఆధార్ ఎలా పొందాలి? ప్రభుత్వ పథకాల సాయం ఎలా అందుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు వీరు సమాధానం మాత్రమే కాదు, తోడుగా కూడా నిలుస్తారు. వారి సహాయవాణికి అప్పటి మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మద్దతు తెలపడం మరింత ఉత్సాహం ఇచ్చింది. ఇప్పటి వరకు మూడువేల మందికి పైగా యువత ఈ వేదికతో అనుసంధానమై ఉండగా, ఐదువందల మందికి పైగా అవసరమైన పత్రాల సాధనలో నేరుగా సహాయం అందించారు. ఒక చిన్న తోడు కూడా జీవితాన్ని ఎంత పెద్దగా మార్చగలదో చాటి చెప్తోంది.ఒకప్పుడు ముప్పై ఏళ్లు అంటే ‘సెటిల్ అయ్యే వయసు’. కాని ఈ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ బ్యాచ్ చూస్తే అర్థమవుతుంది, ముప్పై అంటే సెటిల్ అవ్వడం కాదు, ప్రపంచాన్ని స్కేలప్ చేయడం అని! కాబట్టి, కలలకు డెడ్లైన్ పెట్టి, కష్టానికి కమిట్ అవ్వండి. అప్పుడు సక్సెస్ మీ అడ్రస్ వెతుక్కుంటూ వస్తుంది! - దీపిక కొండి
ట్రిపుల్ టైటిల్ వేటలో...
ప్రపంచకప్ బెర్త్ లక్ష్యంగా...
పరాజయం పలకరిస్తోంది!
లక్ష్య సేన్ అదరహో
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలలో లాభాలు
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు
ఏపీ సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘన
మమతా బెనర్జీ (ముఖ్యమంత్రి) రాయని డైరీ
ఫార్మాకు రూ.5,000 కోట్ల నష్టం
కలుపు మొక్కలకు భయపడొద్దు
T20 WC 2026: అదే మా కొంపముంచింది.. బ్రూక్ ఆవేదన
పడిపోతున్న పసిడి ధరలు.. ఈసారి తులం..
T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
విజయ్తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
మరో దేశంపై యుద్ధం ప్రకటించిన ట్రంప్
'లడ్డూ'పై సమాధానం చెప్పలేక చంద్రబాబు సతమతం
యుద్ధంతో ధరలకు రెక్కలు
T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్!
డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ
ఇరాన్, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన
T20 WC Final: బుమ్రా కూడా మనిషే కదా!: కివీస్ స్టార్
ఈ రాశి వారికి ధనలాభం.. వస్తువులు లాభం
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్తో యుద్ధం.. ఇజ్రాయెల్కు వారానికి ఎంత నష్టమంటే..!
మరో ఫ్లాట్ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే?
పాలు పోసి పెంచితే చివరకు.. ఇరాన్కు భారీ షాక్!
కథ వినగానే నిర్మించాలనుకున్నాం: సుకుమార్
T20 WC 2026: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
ట్రిపుల్ టైటిల్ వేటలో...
ప్రపంచకప్ బెర్త్ లక్ష్యంగా...
పరాజయం పలకరిస్తోంది!
లక్ష్య సేన్ అదరహో
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలలో లాభాలు
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు
ఏపీ సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘన
మమతా బెనర్జీ (ముఖ్యమంత్రి) రాయని డైరీ
ఫార్మాకు రూ.5,000 కోట్ల నష్టం
కలుపు మొక్కలకు భయపడొద్దు
T20 WC 2026: అదే మా కొంపముంచింది.. బ్రూక్ ఆవేదన
పడిపోతున్న పసిడి ధరలు.. ఈసారి తులం..
T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
విజయ్తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
మరో దేశంపై యుద్ధం ప్రకటించిన ట్రంప్
'లడ్డూ'పై సమాధానం చెప్పలేక చంద్రబాబు సతమతం
యుద్ధంతో ధరలకు రెక్కలు
T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్!
డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ
ఇరాన్, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన
T20 WC Final: బుమ్రా కూడా మనిషే కదా!: కివీస్ స్టార్
ఈ రాశి వారికి ధనలాభం.. వస్తువులు లాభం
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్తో యుద్ధం.. ఇజ్రాయెల్కు వారానికి ఎంత నష్టమంటే..!
మరో ఫ్లాట్ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే?
పాలు పోసి పెంచితే చివరకు.. ఇరాన్కు భారీ షాక్!
కథ వినగానే నిర్మించాలనుకున్నాం: సుకుమార్
T20 WC 2026: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
ఫొటోలు
తమిళనాడు డివోషనల్ ట్రిప్లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)
హైదరాబాద్లో గ్రాండ్గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)
రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)
మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు
జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)
సినిమా
'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!
'ధురంధర్' సినిమాని చూసి తెలుగు దర్శకనిర్మాతలు చాలా అంటే చాలా నేర్చుకోవాలి. కేవలం కంటెంట్ అనే కాదు మిగతా విషయాల్లోనూ ఈ మూవీ ఓ గైడ్ లాంటిది అని చెప్పొచ్చు. తాజాగా సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ విషయం మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఏంటా విషయాలు? టాలీవుడ్ దీనిని చూసి ఏమేం నేర్చుకోవాలి?(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)గత కొన్నాళ్ల నుంచి పాన్ ఇండియా, సీక్వెల్ అనే ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగులోనే చిన్నపెద్ద అనే తేడా లేకుండా ప్రతి దర్శకుడు ఓ సినిమా తీసేయడం, సీక్వెల్ ఉంటుంది అన్నట్లు చివరలో స్టోరీని అర్థంతరంగా వదిలేయడం లాంటివి చాలానే చూశాం. వీటన్నింటికి భిన్నంగా కంటెంట్పై నమ్మకంతో 'ధురంధర్' టీమ్ రెండు భాగాల షూటింగ్ ఒకేసారి పూర్తి చేసింది. తొలి భాగం హిట్టయితేనే రెండో పార్ట్ తీస్తాం అనే ట్రెండ్ని బ్రేక్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ల కంటెంట్పై వాళ్లకు అంత బలమైన నమ్మకం ఉండటమే దీనికి కారణం.టాలీవుడ్ ఓ సినిమాకు సీక్వెల్ అంటే అది ఎన్నేళ్ల తర్వాత వస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిది 'ధురంధర్' టీమ్ ఎంత ఫెర్ఫెక్ట్ ప్లానింగ్తో వచ్చారంటే.. తొలి పార్ట్ రిలీజైన మూడు నెలల్లో రెండో పార్ట్ రిలీజ్ చేస్తామని మాటిచ్చారు. ఇప్పుడు దానికే కట్టుబడ్డారు. ఈ నెల 19న 'ధురంధర్ 2'ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. చాలామంది తెలుగు దర్శకనిర్మాతలు.. తమ సినిమాలో కంటెంట్ అంతంత మాత్రంగానే ఉన్నా ఏదో ఉంది అనేంత హడావుడి చేస్తుంటారు. 'ధురంధర్' టీమ్ మాత్రం ఎక్కువ హడావుడి చేయలేదు. ప్రమోషన్స్ లాంటివి కూడా పెద్దగా చేయలేదు. కేవలం ప్రేక్షకుల్ని మాత్రమే నమ్ముకుంది.(ఇదీ చదవండి: ‘ధురంధర్2’కి పెయిడ్ ప్రీమియర్స్.. రన్టైమ్ ఎంతంటే?)తెలుగులో చాలా సినిమాల పాటలు, టీజర్, ట్రైలర్స్ లాంటివి నేరుగా రిలీజ్ చేయకుండా.. మొదట ఓ అప్డేట్ అంటారు. తర్వాత సాంగ్కి టీజర్ అంటారు. తీరా రిలీజ్ టైంకి వచ్చేసరికి సాంకేతిక కారణాలు చెప్పి వాయిదా వేస్తుంటారు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటారు. ఈ విషయంలోనూ 'ధురంధర్' టీమ్ని మెచ్చుకోవాలి. ఓ టైమ్ చెప్పారు. సరిగ్గా అదే సమయానికి ట్రైలర్ రిలీజ్ చేసేశారు.తొలి భాగం దేశవ్యాప్తంగా అద్భుతమైన హిట్ అయినా సరే ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ల పెంపులాంటివి అడగలేదు. మూవీ రిలీజ్కి 10-12 రోజులు ముందుగానే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసేశారు. అదీ సాధారణ ధరలతోనే. టికెట్పై రూ.50-100 అదనం చెప్పి ప్రేక్షకుడి నుంచి దోచుకునే ప్రయత్నం చేయలేదు. పైన చెప్పిన విషయాల్లో చాలావరకు టాలీవుడ్లో చాలామంది పాటించరు.తీసిన సినిమాకు పెట్టిన బడ్జెట్కి టికెట్ ధరలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఒకవేళ ఏమైనా అంటే వింత వింత కారణాలు చెబుతారు. థియేటర్లకు జనాలు రావట్లేదని బాధపడతారు. చెప్పాలంటే ప్రేక్షకులని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. ఏం తీసినా సరే చూస్తారులే అని అనుకుంటున్నారు. అందుకే తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు సైతం డిజాస్టర్ టాక్లు తప్పట్లేదు.(ఇదీ చదవండి: మరింత వైలెంట్గా ధురంధర్ 2 ట్రైలర్)
మిమ్మల్ని కలిసే ఛాన్స్ రాలేదు.. ఆ ప్రేమని జీవితాంతం కొనసాగిస్తూ
అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్నాడు. నయనిక మెడలో శుక్రవారం రాత్రి మూడు ముళ్లు వేశాడు. ఏడడుగులు నడిచాడు. ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే నయనికతో పెళ్లి తర్వాత శిరీష్.. తొలిసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈమె తండ్రి శరత్ చంద్రారెడ్డిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)'మావయ్యా.. మిమ్మల్ని కలిసే అవకాశం నాకు రాలేదు. కానీ నేను ఇప్పుడు భార్యగా పిలుచుకునే ఆ మహిళని మీరు పెంచినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఆమెను ప్రేమించడం మొదలుపెట్టారు. ఈ భూమిపై నేను ఉన్నంత వరకు ఆ ప్రేమని నేను ఆమెకు అందిస్తాను' అని శిరీష్ ఎమోషనల్ అయ్యాడు. అలానే ఆయన ఫొటోతో పాటు కొన్ని పెళ్లి ఫొటోలని కూడా షేర్ చేశాడు.శిరీష్ విషయానికొస్తే నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు. ఇతడి సోదరుల్లో అల్లు అర్జున్ స్టార్ హీరో కాగా బాబీ నిర్మాతగా ఒకటి రెండు సినిమాలు చేశారు. శిరీష్ కూడా హీరోగా పలు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. నయనిక విషయానికొస్తే.. హైదరాబాద్కి చెందిన ఈమెది బిజినెస్ ఫ్యామిలీ. ఈమె కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తనే. వరుణ్-లావణ్య బ్యాచిలర్ పార్టీ టైంలో శిరీష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమించుకున్నారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish)
సీరియల్ నటి చెల్లిని పెళ్లి చేసుకున్న ఆర్జే సూర్య
ఆర్జేగా కొందరికి తెలిసిన సూర్య.. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొని మరింతగా పేరు తెచ్చుకున్నాడు. గతేడాది అక్టోబరులో నిశ్చితార్థం చేసుకోగా.. ఇప్పుడు శుక్రవారం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ నటి సుధీర చెల్లి, ఆర్జే శౌర్యతో సూర్య ఏడడుగులు వేశాడు. ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)ఆంధ్రప్రదేశ్కి చెందిన సూర్య.. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మధ్యలోనే ఆపేశాడు. చిన్నప్పటి నుంచి పలు పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ వచ్చాడు. ఓ అమ్మాయి బ్రేకప్ చెప్పిన బాధలో ఉన్నప్పుడు ఆర్జేగా ఆఫర్ రావడంతో దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోల గొంతులని మిమిక్రీ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఆర్జేగా ఫేమస్ అయిన ఇతడు.. బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొని 8 వారాల పాటు హౌసులో ఉన్నాడు. తర్వాత తన తోటి కంటెస్టెంట్ ఫైమాతో కలిసి బీబీ జోడీ తొలి సీజన్(డ్యాన్స్ కాంపిటీషన్) లో పాల్గొని విజేతగానూ నిలిచాడు. తన తోటి ఆర్జే, సీరియల్ నటి సుధీర చెల్లి శౌర్యతో ప్రేమలో పడ్డ సూర్య.. గతేడాది అక్టోబరులో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ వేడుకకు సీరియల్ బ్యూటీస్ అన్షు, ఆషికా తదితరులు వచ్చారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.(ఇదీ చదవండి: విజయ్తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత)
విరోష్ రిసెప్షన్లో అల్లు అర్జున్ బౌన్సర్లు ఎందుకలా చేశారంటే?
కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జోడీ ఇటీవలే పెళ్లిపీటలెక్కింది. ఈ లవ్బర్డ్స్ ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. తర్వాత మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టేజీపై ఫోటో దిగేందుకు వెళ్తుండగా ఆయన వెనకాల ఉన్న ఓ వ్యక్తిని అడ్డుకుని ఆపేశారు.ఏం జరిగిందంటే?కొందు ఆయన్ను సైడ్ యాంగిల్లో చూసి జూనియర్ ఎన్టీఆర్ అనే భ్రమపడ్డారు. అల్లు అర్జున్ బౌన్సర్లు ఎన్టీఆర్ను ఆపేశారా? అని ఆశ్చర్యపోయారు. కానీ, అక్కడున్నది తారక్ కాదు, ఆయనకు డూప్గా నటించే ఈశ్వర్. తాజాగా ఈశ్వర్ అక్కడేం జరిగిందో క్లారిటీ ఇచ్చాడు. అల్లు అర్జున్తో పాటు వీడియోలో ఉన్నది నేనే.. ఆ రోజు ఏం జరిగిందంటే? అల్లు అర్జున్ సర్ లోపలకు వచ్చే సమయంలో నేను కూడా లోనికి వెళ్తున్నాను. జూమ్ చేస్తూ పెద్దగా..స్టేజీపై ఫోటో దిగడం కోసం ఆయన సడన్గా ఆగిపోయారు. ఆయన బౌన్సర్లు ఏమనుకున్నారంటే నేను ఆయనతో ఫోటో దిగడానికి వెళ్తున్నానని భ్రమపడ్డారు. లేదంటే కెమెరాకు అడ్డొస్తానని భావించి నన్ను ఆపేశారు. అది చాలా చిన్న విషయం. దాన్ని జూమ్ చేస్తూ చాలా పెద్దగా చూపించారు. అలా వీడియో చాలా వైరల్ చేశారు. దానివల్ల నాకు కూడా మంచి రీచ్ వచ్చింది. థాంక్యూ సోమచ్ అని వీడియో షేర్ చేశాడు. ఇతడు ఆర్ఆర్ఆర్ మూవీలోని కొన్ని సన్నివేశాల్లో తారక్కు డూప్గా నటించాడు. View this post on Instagram A post shared by Eshwar Harris (@eshwarharris_1) చదవండి: అణిగిమణిగి ఉండాలి.. లేదంటే సైడ్ చేస్తారు: అషూ
క్రీడలు
T20 WC Final: సాంట్నర్కు ఇచ్చిపడేసిన సూర్యకుమార్
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్కు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. సాంట్నర్ అబద్ధం చెబుతున్నాడని.. తమను కట్టడి చేయడం అంత తేలికేమీ కాదని చురకలు అంటించాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్కు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం.. భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ఉండబోతున్న అంశం చర్చనీయాంశంగా మారింది.ఎర్రమట్టి పిచ్!అహ్మదాబాద్లో ఈసారి ఎర్రమట్టి పిచ్ తయారు చేస్తున్నారని.. బ్యాటర్లకు అనుకూలించే వికెట్ ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో టీమిండియా 253 పరుగుల భారీ స్కోరు చేసినా.. లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఆఖరి బంతి వరకు పోరాడాల్సి వచ్చింది.220 పరుగులకే కట్టడి చేస్తేఈ పరిణామాల నేపథ్యంలో సాంట్నర్ మాట్లాడుతూ.. ‘‘అహ్మదాబాద్లో ఫ్లాట్ పిచ్ ఉంటుంది. టీమిండియాను 250కి బదులు 220 పరుగులకే కట్టడి చేస్తే.. మాకు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి’’ అని పేర్కొన్నాడు.అబద్ధం చెబుతున్నాడుఈ క్రమంలో శనివారం మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. సాంట్నర్కు గట్టిగానే ఇచ్చిపడేశాడు. ‘‘అతడు అబద్ధం చెబుతున్నాడు. మేము గొప్పగా బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాం. 225 లేదంటే 250 పరుగులు చేస్తే బాగుంటుంది.అయితే, కొన్నిసార్లు అనుకున్న దాని కంటే వికెట్ భిన్నంగా ఉంటుంది. అందుకు అనుగుణంగానే మేము ఆడాల్సి ఉంటుందిఇ. డ్రెస్సింగ్రూమ్లో కూర్చుని ఎంత స్కోరు చేయగలమని అంచనా వేయడం కష్టం. పిచ్ డిమాండ్కు తగ్గట్లే ఆడాల్సి ఉంటుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
IND vs NZ: అభిషేక్ శర్మ వద్దు.. అతడిని ఆడించండి!
న్యూజిలాండ్తో ఫైనల్లో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ నడుస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత కూడా అభిషేక్ శర్మను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కీలక మ్యాచ్కు ముందు తుదిజట్టులో మార్పులు చేసి రిస్క్ తీసుకోవద్దని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. వైఫల్యాలు అభిషేక్ శర్మ మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని.. కాబట్టి అతడికి విశ్రాంతినివ్వడమే ఉత్తమమని పేర్కొన్నాడు. ఇందుకు వెస్టిండీస్ ఆటగాళ్లను ఉదాహరిస్తూ పోలిక తెచ్చాడు.విశ్రాంతినివ్వాలి‘‘అభిషేక్ శర్మకు మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వాలి. ఇప్పటికే అతడు చాలా మ్యాచ్లు ఆడేశాడు. అన్నింటిలోనూ విఫలం అయ్యాడు. ఫైనల్లో తుదిజట్టులో మార్పులు చేయడం ఏమంత హానికరం కాదు. పొట్టి ఫార్మాట్లో ఎప్పటికప్పుడు ఇలాంటి మార్పులు సహజమే.టీమిండియాతో సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్.. ఫామ్లో లేని బ్రాండన్ కింగ్కు బదులు.. రోస్టన్ ఛేజ్ను ఓపెనర్గా ఆడించింది. బ్రాండన్రు ఐదు- ఆరు మ్యాచ్లు ఆడించినా ఫలితం లేకుండా పోయింది. అందుకే కీలక మ్యాచ్ అయినా సరే అతడికి బ్రేక్ ఇచ్చారు.టీమిండియా కూడా ఆదిలో సంజూను పక్కన పెట్టింది. కీలక మ్యాచ్లలో ఆడించి అనుకున్న ఫలితం రాబట్టింది. అతడు గొప్ప ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. జట్టుకు ప్రయోజనం చేకూర్చాడు. భారత జట్టులో ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు.రింకూను ఆడించండిటెస్టులు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్.. ఇలా టోర్నీ ఏదైనా రింకూ సింగ్ పరుగులు రాబట్టగలడు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ కీలక సమయాల్లో వికెట్లు కూల్చి జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్లేయర్లు డగౌట్లో కూర్చుని ఉండటం చూస్తే.. అభిషేక్ శర్మకు బదులు వీరిలో ఒకరిని ఆడించవచ్చు కదా అనిపిస్తుంది.అవును.. ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మకు బదులు డగౌట్లో కూర్చోబెడుతున్న రింకూ సింగ్ను తుదిజట్టులోకి తీసుకోండి. బాగా ఆడని ఆటగాడికి చోటు ఇస్తూ.. అద్భుతంగా ఆడే ప్లేయర్ను బెంచ్కే పరిమితం చేయడం సరికాదు. అభిషేక్ శర్మ గొప్ప నైపుణ్యాలు ఉన్న ఆటగాడే. కానీ ఐసీసీ టోర్నీలు అతడికి కొత్త. ఏదేమైనా సంజూతో అతడిని పోల్చవద్దు. సంజూతో పోలిక వద్దుఇప్పటికే సంజూ అంతర్జాతీయ స్థాయిలో, ఐపీఎల్లో తానేంటో నిరూపించుకున్నాడు. టాప్-10 బ్యాటర్లలో అతడూ ఉంటాడు’’ అని మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఫైనల్లో అభిషేక్ శర్మను తప్పించి రింకూను ఫైనల్లో ఆడించాలని కైఫ్ సూచించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్- న్యూజిలాండ్ ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
T20 WC Final: హృదయాలు ముక్కలు చేస్తాం: సాంట్నర్
అహ్మదాబాద్ పిచ్పై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఇప్పటి వరకు వికెట్ను పరిశీలించలేదని.. అయితే, ఫ్లాట్ పిచ్నే రూపొందించి ఉంటారని భావిస్తున్నామన్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల వరద ఖాయమని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2026 తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం భారత్- న్యూజిలాండ్ ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మిచెల్ సాంట్నర్ పలు విషయాలపై స్పందించాడు.హై స్కోరింగ్కు అవకాశంపిచ్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు మేము వికెట్ ఎలా ఉందో చూడలేదు. ఇప్పటికీ కవర్లు కప్పే ఉన్నాయి. అయితే, ఈ పిచ్ ఫ్లాట్గా ఉంటుందని అనుకుంటున్నా. ఇక్కడ హై స్కోరింగ్కు అవకాశం ఉంటుంది’’ అని సాంట్నర్ (Mitchell Santner) పేర్కొన్నాడు.మా లక్ష్యం అదే..అదే విధంగా.. ‘‘టీమిండియాకు మద్దతుగా వచ్చే ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండేలా చేయడమే మా లక్ష్యం (Goal to silence the crowd). అందుకు అనుగుణంగానే మా ఆట ఉంటుంది. అయితే, క్రికెట్లో ఎన్నో సవాళ్లు ఉంటాయి. టీ20 క్రికెట్ వైవిధ్యంతో కూడుకున్నది.హృదయాలు ముక్కలు చేస్తాంఏదేమైనా సొంతగడ్డపై ఫైనల్ గెలవాలన్న ఒత్తిడి టీమిండియాపై కచ్చితంగా ఉంటుంది’’ అని సాంట్నర్ అన్నాడు. టోర్నీ ఆసాంతం తాము నిలకడగా ఆడామని.. ట్రోఫీ గెలవడం సాధ్యమేనని పేర్కొన్నాడు. కొంతమంది హృదయాలు ముక్కలు చేసేందుకు తామేమీ వెనుకాడమని టీమిండియా అభిమానులను ఉద్దేశించి సాంట్నర్ కామెంట్ చేశాడు.కాగా సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్ చేరగా.. ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్పై గెలిచి టీమిండియా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇదిలా ఉంటే.. వరల్డ్కప్ టోర్నీకి ముందు భారత్.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో 4-1తో ఏకపక్ష విజయం సాధించింది. చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
వైభవ్ సూర్యవంశీ మామకు సివిల్స్లో బెస్ట్ ర్యాంక్
భారత క్రికెట్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. మైదానంలో పరుగుల వరద పారించడం ఈ పిల్లాడికి పరిపాటి అయిపోయింది. పద్నాలుగేళ్ల వయసులోనే ఎన్నెన్నో ప్రపంచ రికార్డులు సాధించాడు ఈ బిహారీ అబ్బాయి.యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో అతి పిన్న వయసులోనే విధ్వంసకర శతకాలు బాదిన బ్యాటర్గా వైభవ్ చరిత్రకెక్కాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున మొదలైన అతడి పరుగుల ప్రవాహం.. భారత్ అండర్-19 జట్టు తరఫునా కొనసాగుతోంది.ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్కప్ టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్పై 175 పరుగులు చేసి.. భారత్ను గెలిపించాడు వైభవ్ (Vaibhav Suryavanshi). తద్వారా టీమిండియా వైపు తొలి అడుగు వేశాడు. ఇక ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 కోసం రాజస్తాన్ రాయల్స్తో కలిసి నెట్స్లో చెమటోడుస్తున్నాడు.పదో తరగతి పరీక్షలు డుమ్మాఇదిలా ఉంటే.. ఆటతో కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఇటీవల వైభవ్ సూర్యవంశీ పేరు వైరల్ అవుతోంది. క్రికెట్తో బిజీగా ఉన్నందున అతడు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయలేకపోయాడు. ఈ విషయాన్ని వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ధ్రువీకరించారు.102వ ర్యాంకుమరోవైపు.. తాజాగా సంజీవ్ సూర్యవంశీ చేసిన పోస్టు వైరల్గా మారింది. వైభవ్ సూర్యవంశీకి వరుసకు మేనమామ అయిన అభిషేక్ చౌహాన్ (Abhishek Chauhan) యూపీఎస్సీ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 102వ ర్యాంకు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. తొలి ప్రయత్నంలోనే అభిషేక్ ఈ మేర ర్యాంకు సాధించడం మరో విశేషం. ఆయన ఐపీఎస్ సర్వీస్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.ఉన్నత విద్యావంతుల కుటుంబంబిహార్లోని సమస్తిపూర్లో గల మొహియుద్దీన్నగర్ బ్లాక్లో గల రాజాజన్ గ్రామంలో 1999లో అభిషేక్ చౌహాన్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు డాక్టర్ అభయ్ కుమార్ సింగ్, తల్లి అనురాధా రాజ్పుత్. అభయ్ కుమార్ సింగ్ నలంద ఓపెన్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు. ఇక ఎంటెక్లో గోల్డ్ మెడల్ సాధించిన అభిషేక్ 2022 నుంచి సివిల్స్ పరీక్షకు సన్నద్ధం అయ్యారు. 2025లో తొలిసారి పరీక్ష రాయగా.. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 102వ ర్యాంకు సాధించారు. దీంతో సమస్తిపూర్లో సంతోషకర వాతావరణం నెలకొంది. బంధువులు, స్నేహితుల రాకతో హడావుడిగా మారింది. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ.. అభిషేక్ చౌహాన్కు శుభాకాంక్షలు తెలిపారు.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
న్యూస్ పాడ్కాస్ట్
భవిష్యత్ అభివృద్ధి శూన్యం... ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్. సెమీస్లో 7 పరుగులతో ఇంగ్లండ్పై గెలుపు
హాజరైన సెలబ్రిటీలు... విరోష్ రిసెప్షన్ కు
‘లడ్డూ’పై బాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. శాసన మండలిలో చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు
స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెద్ది
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలపై ఆటవిక దాడి... మహిళా దినోత్సవ వేళ చంద్రబాబు మార్కు గిఫ్ట్
తీవ్రరూపం దాలుస్తున్న పశ్చిమాసియా యుద్ధం... ఇరాన్కు అండగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు...
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. కుటుంబ సభ్యులతోపాటు ఆర్మీ చీఫ్ ముసావీ కూడా మృతి... క్షిపణి దాడుల్లో హత్య చేసిన ఇజ్రాయెల్
భగ్గుమన్న పశ్చిమాసియా... ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు... భారీగా ప్రతిదాడులకు దిగిన ఇరాన్
బిజినెస్
యుద్ధ ఆయుధాలు బంగారంతో.. కియోసాకి ట్వీట్
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం వల్ల ఎంతో నష్టం జరుగుతోంది. ఈ సమయంలో ఎప్పడూ బంగారం, వెండి, బిట్కాయిన్ గురించి సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు యుద్ధం వల్ల ఏమి జరుగుతుందో?, శాంతి స్థాపన ఎలా జరుగుతుందో? అనే విషయాలను వివరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను వియత్నాంలో రెండుసార్లు ఉన్నాను. ఒకసారి 1966-67లో విద్యార్థిగా, ఆ తరువాత 1971-72లో యూఎస్ మెరైన్ కార్ప్స్ పైలట్గా. అయితే 2026లోనూ వియత్నాంతో ఎందుకు పోరాడామో నాకు ఇప్పటికీ తెలియదు, ఇంకా సమాధానం దొరకలేదు. యుద్ధం వల్ల దాదాపు అందరికీ నష్టమే.ఇప్పుడు ఇరాన్ లేదా ఇజ్రాయెల్పైకి వెళ్తున్న ప్రతి రాకెట్ లోపల నాలుగు ఫౌండ్స్ వరకు వెండి ఉంటుంది. రాకెట్ పేలిపోయినప్పుడు సిల్వర్ విచ్చిన్నమవుతుంది. ఇది వెండి సేకరించేవారికి మాత్రమే లాభం. యుద్ధంలో పాల్గొనేవారికి మిగిలేది కన్నీళ్లు, ధన నష్టం మాత్రమే అని కియోసాకి పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనంయుద్ధ ఆయుధాలను బంగారంతో తయారుచేస్తే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు యుద్ధం చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆయుధాలు ఖరీదైనప్పుడు కొనుగోలు చేయడం తగ్గవచ్చు. కాబట్టి ఇలా శాంతి స్థాపనకు సాధ్యమవుతుందని భావిస్తున్నాను. నేను ఈ రోజు యుద్ధం కోసం కాదు, శాంతి & నిజమైన ఆర్థిక విద్య కోసం పోరాడుతున్నాను అని కియోసాకి వెల్లడించారు.TRAGICALLY: War is profitable.Still in Vietnam seeking personal answers to a war we should never have entered.FYI: I served in Vietnam twice, once in 1966-67 as a student and 71-72 as a US Marine Corps pilot. In 2026 I still do not know why we fought in Vietnam.I know…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 7, 2026
స్మార్ట్ఫోన్ ఉంటే.. అయిపోతుంది ఇల్లు స్మార్ట్గా!
మనం ఇంట్లో లేని సమయంలో అతిథులు ఇంటికి వస్తున్నారు.. గుమ్మలోకి రాగానే ఇంటి తలుపులు తెరుచుకుంటాయి.. హాల్లోకి అడుగు పెట్టగానే లైట్లు వెలుగుతాయి.. సోఫాలో కూర్చోగానే ఏసీ ఆన్ అవుతుంది. బాల్కనీ వైపు ఉన్న కర్టెన్లు తెరుచుకుంటాయి. ఇవన్నీ చేసేందుకు మెయిడ్(పనిమనిషి) అవసరం లేకుండా స్మార్ట్ఫోన్ నుంచే ఇవన్నీ సాధ్యం.. ప్రస్తుతం ఇంట్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత భద్రతా ఉపకరణాల వినియోగం పెరిగింది.రియల్ టైమ్లో ట్రాక్ చేసే స్మార్ట్ కెమెరాలు, డిజిటల్ లాక్స్, స్మార్ట్ వీడియో డోర్ బెల్స్, లైట్లు, కర్టెన్లు ప్రతిదీ స్మార్ట్గా మారిపోయాయి. వేలిముద్ర, ఐరిష్ చూపిస్తే చాలు ఆటోమెటిక్గా ఇంటి తలుపులు తెరుచుకుంటాయి. చాలా మంది బిల్డర్లు ఇంటి నిర్మాణ సమయంలోనే ఈ స్మార్ట్ ఉపకరణాలను జోడిస్తున్నారు.కోకాపేట, మాదాపూర్, గచ్చిబౌలి వంటి పశ్చిమ హైదరాబాద్లోని హైఎండ్ ప్రాజెక్ట్లలో ఈ తరహా ఐఓటీ ఉపకరణాల ప్రాజెక్ట్లు ఎక్కువగా నిర్మాణంలో ఉన్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలు ఉండే వారు వ్యక్తిగత గృహాలలో సైతం వీటిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరిగా మారింది.
ఇలా చేస్తే తప్ప.. హైదరాబాద్లో ఇల్లు కొనలేమా?
నగరంలో రూ.45 లక్షలలోపు ధర ఉన్న ‘అఫర్డబుల్ హౌసింగ్’కు ఏటా గిరాకీ పెరుగుతూనే ఉంది. సులువైన గృహ రుణాలు, వడ్డీ రాయితీ కారణంగా కస్టమర్ల నుంచి అందుబాటు గృహాలపై ఆసక్తి పెరుగుతోంది. కానీ, భూముల ధరలు, నిర్మాణ వ్యయ భారం, కార్మికుల కొరత తదితర కారణాలతో వీటి నిర్మాణానికి డెవలపర్లు ఆసక్తి చూపించడం లేదు. దాంతో వాటి కొరత ఏర్పడింది. – సాక్షి, సిటీబ్యూరోగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకూ విస్తరించింది. ఇలాంటి తరుణంలో గ్రేటర్లో అందుబాటు గృహాల నిర్మాణం డెవలపర్లకు లాభసాటిగా లేకపోవడంతో క్రమంగా అఫర్డబుల్ హౌసింగ్ తగ్గుముఖం పట్టింది. మరోవైపు పెరిగిన ధరల నేపథ్యంలో 90 శాతం మంది ఉద్యోగ వర్గాలు ఇల్లు కొనలేని పరిస్థితి.కనీసం రూ.కోటి లేనిదే ఇల్లు రావడం లేదు. దీంతో అద్దె గృహాలకు డిమాండ్ పెరగడంతో ఓనర్లు అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు. ఉద్యోగులు తమ సంపాదనలో దాదాపు 40 శాతం అద్దెకే వెచ్చిస్తున్నారు. రీ–డెవలప్మెంట్ అవసరం.. ముంబై తరహాలో హైదరాబాద్లోనూ పాత స్థలాలు, ప్రాంతాలను రీ–డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పాత పౌర మౌలిక సదుపాయాలు నగరాభివృద్ధికి అత్యంత కీలకం. అందుకే ఆయా ప్రాంతాలను క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలి. రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లకు నిర్మాణ రుసుములు, పన్ను రాయితీలు, జీఎస్టీ మినహాయింపుతో ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులు ఉత్సాహంగా ముందుకొస్తారు.
భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం
ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ గూగుల్.. సీఈఓ సుందర్ పిచాయ్ వేతనాన్ని రాబోయే మూడు సంవత్సరాలలో 692 మిలియన్ డాలర్లకు (రూ. 63,61,79,82,000) పెంచింది. దీంతో ఈయన ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకునే ఎగ్జిక్యూటివ్లలో ఒకరిగా నిలిచారు.సీఈఓ సుందర్ పిచాయ్ మొత్తం ప్యాకేజీలో ఎక్కువ భాగం (126 మిలియన్ డాలర్లు) పర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్స్ ద్వారా వస్తుంది. అదనంగా పిచాయ్ మూడేళ్లలో నెలవారీగా 84 మిలియన్ డాలర్ల రిస్ట్రిక్టెడ్ స్టాక్ పొందతారు. వీటితో పాటు ఆయన యాన్యువల్ సాలరీ 2 మిలియన్ డాలర్లను కూడా పొందుతారుగూగుల్.. వేమో & వింగ్ ఏవియేషన్ వంటి ఆటోనమస్ విభాగాలలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి కొత్త స్టాక్ ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించింది. దీనిద్వారా మొత్తం 350 మిలియన్ డాలర్ల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.2015 ఆగష్టులో సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. ఆయన నాయకత్వంలో గూగుల్ మార్కెట్ కాపిటలైజేషన్ 535 బిలియన్ డాలర్ల నుంచి 3.6 ట్రిలియన్ డాలర్ల వరకు పెరిగింది. కొన్నిసార్లు నాలుగు ట్రిలియన్ డాలర్లను సైతం అధిగమించింది. పిచాయ్ గూగుల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు 2004లో గూగుల్ కంపెనీలో చేరిన తరువాత క్రోమ్ను అభివృద్ధి చేయడం & ఆండ్రాయిడ్ను నడిపించడం ద్వారా ఉన్నత స్థానానికి ఎదిగారు.
ఫ్యామిలీ
అత్యంత విషపూరితమైన గడ్డిమందు పారాక్వాట్..!
అత్యంత విషపూరితమైన (హై అక్యూట్ టాక్సిసిటీ) గడ్డి/కలుపు మందు పారాక్వాట్ను నిషేధించాలన్న డిమాండ్ ఊపందుకుంది. దీన్ని 9 పంటల్లో గడ్డి/కలుపు నివారణకు వినియోగించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, 25 పంటల్లో దీన్ని తెలిసో తెలియకో వాడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మందును చల్లేటప్పుడు జాగ్రత్తలు తగిన రీతిలో తీసుకోకపోవటం వల్ల రైతులు, రైతుకూలీలు ఆ విషప్రభావానికి తీవ్రఅస్వస్థతకు గురై చనిపోతున్నారు. ఈ ప్రమాదకరమైన రసాయనం గాలి ద్వారా పీల్చినా, క్షణికావేశంలో తాగినా, దీన్ని చల్లిన నేలపై నడిచేటప్పుడు ముల్లు గుచ్చుకున్నా శరీరం విషపూరితమవుతుంది. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె దెబ్బతింటాయి. దీని ప్రభావాన్ని అడ్డుకోవటానికి ఇప్పటి వరకు విరుగుడు చికిత్స అందుబాటులో లేదు. ఈ కారణంగా పారాక్వాట్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిషేధించాలన్న డిమాండ్ నానాటికీ బలపడుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డాక్టర్స్ ఎగెనెస్ట్ పారాక్వాట్ పాయిజన్ సంస్థలు సంయుక్తంగా హైదరాబాద్లో నిర్వహించిన రౌండ్టేబుల్లో పలువురు పాల్గొని నిషేధం కోసం పోరాడతామన్నారు. ఇప్పటికే ఒడిషా, కేరళ రాష్ట్రాల్లో నిషేధించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ నిషేధించాల్సిన అవసరం ఉంది. పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా కొన్ని సంవత్సరాల క్రితమే రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించి నిషేధించాలని కోరింది. ఈ నేపథ్యంలో అసలు పారాక్వాట్ కలుపు/గడ్డి మందు పూర్వాపరాలేమిటో తరచి చూద్దాం...పారాక్వాట్ డైక్లోరైడ్.. నాన్–సెలెక్టివ్ కాంటాక్ట్ హెర్బిసైడ్. అంటే.. ఏదో ఒక రకం కలుపు మొక్కనో లేదా ఏవో కొన్ని రకాల కలుపు మొక్కల్నో నిర్మూలించడానికి ఉద్దేశించింది కాదు. ఇది తాకిన అన్ని ఆకుపచ్చ మొక్కల కణజాలాలను చంపుతుంది లేదా దెబ్బతీస్తుంది. వేగంగా పనిచేసే రసాయనం. ఇలాంటి కలుపు మందులు పారిశ్రామిక ప్రాంతాల్లో, రోడ్ల పక్కన చెట్లు, గడ్డిని నియంత్రచడానికి.. తేయాకు, పత్తి, బంగాళాదుంపలు తదితర పంటల్లో కలుపు మొక్కలను తొలగించడానికి పయోగిస్తారు.ఇటువంటి గడ్డి మందులు మొక్కల కణ త్వచాలను నాశనం చేయడం ద్వారా, కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలిగించడం ద్వారా ఆ మొక్కలు ఎండిపోయేలా చేస్తాయి. దీనివల్ల గంటల్లోనే మొక్కల భాగాలు వేగంగా, స్పష్టంగా ఎండిపోతాయి, వాడిపోతాయి. పారాక్వాట్ను గడ్డి, పెద్ద ఆకులతో కూడిన కలుపు మొక్కలను వేగంగా నాశనం చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు.1964 నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తిపారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందుకు 140 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ప్రపంచంలో అత్యంత విసృతంగా ఉపయోగంలో ఉన్న, వివాదాస్పదమైన కలుపు మందులలో ఒకటి. 19వ శతాబ్దం చివరలో మొదటిసారిగా సంశ్లేషణ చేయబడినప్పటికీ, కలుపును చంపే దీని సామర్థ్యాన్ని 20వ శతాబ్దం మధ్యలో మాత్రమే గుర్తించారు. ఆస్ట్రియన్ రసాయన శాస్త్రవేత్తలు హ్యూగో వీడెల్, ఎం. రస్సోలు 1882లో మొదట అయోడైడ్ ఉప్పుగా సంశ్లేషణ చేశారు. 1955లో ఇంగ్లాండ్లోని ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ (ఐఇఐ) శాస్త్రవేత్తలు వ్యవసాయ రసాయనంగా దాని సామర్థ్యాన్ని గుర్తించారు. 1962 నుంచి వాణిజ్య పరంగా ఉత్పత్తి చెయ్యటం ్ర΄ారంభమైంది. 1964 మొదట అమెరికాలో పురుగుమందుగా ఉపయోగించడానికి నమోదైంది. 1970 దశకం చివరలో మెక్సికన్ గంజాయి పొలాలపై పారాక్వాట్ను అమెరికా స్ప్రే చేయించింది. 1985లోజూన్లో వెండింగ్ మెషిన్ ద్వారా విక్రయించిన పానీయాలలో ఈ రసాయనం కలవటం ఫలితంగా కనీసం 10 మంది మరణించారు. 2007లో నిషేధించిన ఈయూఅమెరికా 1978లో పారాక్వాట్ను అధిక విషపూరిత స్వభావం కారణంగా గుర్తించి, పరిమితంగా వాడే పురుగుమందుగా వర్గీకరించింది. 1980–90 దశకాల్లో అనేక దేశాలు దీన్ని నియంత్రించటం ప్రారంభించాయి. పారాక్వాట్ వల్ల ప్రజారోగ్యానికి తీరని హాని జరుగుతోందని స్వీడన్, తదితర ఐరోపా దేశాలు పట్టుబట్టటంతో 2007లో యూరోపియన్ యూనియన్ నిషేధించింది. ప్రస్తుతం చైనా (దేశీయ వినియోగం మాత్రమే), బ్రెజిల్, థాయిలాండ్తో సహా 70కి పైగా దేశాల్లో పారాక్వాట్ గడ్డి మందు వాడకాన్ని నిషేధించాయి లేదా దశలవారీగా వాడకాన్ని నిలిపివెయ్యటానికి నిర్ణయాలు తీసుకున్నాయి. అయినప్పటికీ అమెరికాతో పాటు భారత్ సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పటికీ విస్తృతంగా ఉపయోగిస్తూనే ఉన్నారు.అమెరికాలో త్వరలో ఉత్పత్తి నిలిపివేతపారాక్వాట్ గడ్డి మందు ప్రభావానికి గురైన వారికి పార్కిన్సన్స్ వ్యాధి వస్తోందని నమ్ముతున్నారు. దీని తయారీదారులపై ప్రస్తుతం అమెరికాలో వేలాది వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ నాటికి పారాక్వాట్ గడ్డి మందు తయారీని నిలిపివేస్తానని సింజెంట బహుళ జాతి కంపెనీ ప్రకటించినట్లు ద గార్డియన్లో తాజాగా కథనం ప్రచురితమైంది. ఈ నిర్ణయం ప్రజారోగ్యంలో ఒక మైలురాయి వంటిదని ఫ్లోరిడా యూనివర్సిటీలోని ఫిక్సెల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ మైఖేల్ ఓకున్ వ్యాఖ్యానించారు. యూరప్ దేశాలు సహా అనేక దేశాలు నిషేధించినప్పటికీ అమెరికాలో సోయాబీన్స్, పత్తి, మొక్కజొన్న, ద్రాక్ష, పిస్తా, వేరుశనగ వంటి ఎన్నో పంటల్లో ఇప్పటికీ దీన్ని వాడుతూనే ఉన్నారు.భారత్లో పరిస్థితులుభారతదేశంలో పారాక్వాట్ డైక్లోరైడ్ వాడకాన్ని నిషేధించాలన్న డిమాండ్ ప్రబలంగా ఉంది. దీన్ని ఉపయోగించడానికి జాతీయ స్థాయిలో అనుమతి ఉంది. అయినప్పటికీ.. దీని అత్యధిక విషపూరిత స్వభావం, దీన్ని తాగటం ద్వారా ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో ఒడిషా, కేరళ వంటి రాష్ట్రాలు నిషేధించాయి. ఒడిశా రాష్ట్రంలో ΄ారాక్వాట్ అమ్మకం, పంపిణీ, వాడకంపై నిషేధం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2023 చివరిలో నిషేధించింది. ప్రతి ఆరు నెలలకోసారి నిషేధాన్ని పొడిగిస్తోంది. కేరళ గతంలో నిషేధాన్ని అమలు చేసింది. కానీ, పురుగుమందుల తయారీదారులు చట్టబద్ధంగా సవాలు చేసిన తర్వాత 2022లో దాన్ని రద్దు చేసింది.ఈ నేపధ్యంలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పారాక్వాట్ విష ప్రభావంతో వందలాది మంది మరణిస్తున్నందున దీన్ని నిషేధించాలని పిటిషనర్లు కోరుతున్నారు. కలుపు మందుపై మీ వైఖరేమిటో వివరించమని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.9 పంటలకే అనుమతిపారాక్వాట్ కలుపు మందును టీ, కాఫీ, పత్తితో సహా తొమ్మిది నిర్దిష్ట పంటలపై మాత్రమే ఉపయోగించడానికి కేంద్ర క్రిమిసంహారకాల బోర్డు రిజిస్ట్రేషన్ కమిటీ అనుమతించింది. అయితే, దేశంలో 25 రకాల పంటలపై ఉపయోగించబడుతున్లట్లు పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా సర్వే నివేదికలు సూచిస్తున్నాయి. ఇలా వాడటం భారతీయ క్రిమిసంహారకాల చట్టాన్ని ఉల్లంఘించటమే. భారత దేశంలో 1,500 కంటే ఎక్కువ తయారీ యూనిట్లు పారాక్వాట్ను ఉత్పత్తి చేయడానికి లైసెన్స్ పొందగా, వీటిలో 35 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన అనుపమ్ వర్మ కమిటీ 2015లో పారాక్వాట్ను సమీక్షించి, ‘కఠినమైన పరిమితులు’, మెరుగైన ప్యాకేజింగ్ పద్ధతులు పాటిస్తూ వినియోగాన్ని కొనసాగించడానికి అనుమతించింది. అయితే ఈ చర్యలు సమర్థంగా అమలు కావటం లేదని నిపుణులు వాదిస్తున్నారు.సైనైడ్ కన్నా ప్రమాదకరంవైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు పారాక్వాట్ను ‘సైనైడ్ కంటే ప్రమాదకరమైనది‘ అని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే దీనికి విరుగుడు లేదు. అందువల్ల పొలాల్లో దీన్ని పిచికారీ చేసే క్రమంలో దాని విషప్రభావానికి గురైన వారు లేదా దీన్ని క్షణికావేశంలో తీసుకున్న వారికి చికిత్స చేసి రక్షించటం కష్టసాధ్యమైంది. దీంతో మరణాలు రేటు పెరుగుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి వైద్య సంఘాలు దీన్ని వెంటనే పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి.దేశవ్యాప్తంగా నిషేధించాలిపారాక్వాట్ వంటి అత్యంత విషతుల్యమైన వ్యవసాయ రసాయనాల వాడాకాన్ని వదిలించుకోవడానికి, వాటి వల్ల కలిగే హానిని నిలువరించటానికి పనిచేస్తున్నాం. క్లోర్పైరిఫోస్, ఫి్ర΄ోనిల్ పురుగుమందులు, అలాగే అట్రాజిన్, పారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందులపై అధ్యయనం చేశాం. పారాక్వాట్ను 9 పంటల్లో వాడటానికి ప్రభుత్వ అనుమతి ఉంటే 25 పంటల్లో వాడుతున్నట్లు మా అధ్యయనంలో తేలింది. దీన్ని వాడే క్రమంలో చాలా మంది దీని విషప్రభావానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని క్షణికావేశంలో తాగి ఆత్మహత్యల పాలవుతున్న రైతులు, రైతు కూలీల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రాథమికంగా ప్రాణాలను చంపడానికి రూపొందించబడిన పురుగుమందుల దీర్ఘకాలిక పరిణామాలను రైతులు, వినియోగదారులు అర్థం చేసుకోవాలి. పురుగుమందుల హానికరమైన ప్రభావాలపై శాస్త్రవేత్తలు మరింత పరిశోధన చేయాలి. విధాన నిర్ణేతలు కూడా తమ అవగాహనను పెంచుకోవాలి. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఈ విష రసాయనాలను నియంత్రించడంపై దృష్టి పెట్టాలి. వాతావరణ మార్పుకు ప్రధాన కారకాల్లో విధ్వంసక పురుగుమందులు కూడా ఉన్నాయి. అత్యంత విషతుల్యమైన పారాక్వాట్ గడ్డి మందును దేశవ్యాప్తంగా నిషేధించాలి. – డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, విధాన నిపుణుడు, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా స్టీరింగ్ కమిటీ సభ్యుడు
ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్’
ఎండలు ఏటేటా అంతకంతకూ మండిపోతున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తోపుడు బండ్ల ద్వారా వినియోగదారుల ఇళ్ల దగ్గరకు తెచ్చి చిరు వ్యాపారులు (కొందరు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయదారులు కూడా) అమ్ముతూ ఉంటారు. అయితే, ఇలా పండిన పంట తినేవారి ఇంటికి చేర్చే లోగా రోజువారీగా 10–15% వరకు ఎండకు వడపడి, రంగు మారి, దుమ్మూ ధూళి పడి పాడైపోయి వృథా అవుతున్నాయని అంచనా. ఈ వృథాను అరికట్టగలిగితే విలువైన ఆహారం వృథా కాకుండా ఉంటుంది. రిటైల్ విక్రయదారుల ఆదాయమూ పెరుగుతుంది. సాధారణ తోపుడు బండ్ల వల్ల జరిగే ఈ నష్టాన్ని అరికట్టడానికి బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) సౌర విద్యుత్తుతో నడిచే ట్రైసైకిల్ను రూపొందించింది. దీనికి ‘అర్క ట్రైసైకిల్’ అని పేరు పెట్టారు (కర్ణాటకలో ‘అర్కావతి’ నది ఒడ్డున ఐఐహెచ్ఆర్ ఉంది. అందుకే ఈ సంస్థలో రూపొందే కొత్త వంగడాలు, ఇతర ఉత్పత్తులకు కూడా ముందు అర్క అని పెడుతూ ఉంటారు. అర్క అని ఏ వంగడం, ఉత్పత్తి పేరులో ఉంటే అది బెంగళూరు ఐఐహెచ్ఆర్ అభివృద్ధి చేసిందని తెలుసుకోవచ్చు). అందంగా, సౌకర్యవంతంగా ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ట్రైసైకిల్.. సౌర విద్యుత్తుతో నడుస్తుంది. ఇందులో ఉంచే కూరగాయలు, పండ్లు తదితర ఉత్పత్తులు పాడైపోకుండా ఉష్ణోగ్రత, తేమలను ‘ఎవాపరేటివ్ కూలింగ్’ పద్ధతిలో నియంత్రించవచ్చు. కూరగాయల బరువుతో కూడిన తోపుడు బండిని నెట్టుకుంటూ వెళ్లే చాకిరీని అర్క ట్రైసైకిల్ చాలా వరకు తగ్గిస్తుంది. సాధారణ తోపుడు బండితో తిరిగే ప్రాంతాల కన్నా ట్రైసైకిల్ ద్వారా ఎక్కువ ప్రాంతాల్లో వేగంగా తిరుగుతూ.. తక్కువ కాలంలోనే ఎక్కువ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. సౌర విద్యుత్తు ద్వారా చల్లగాలి ప్రసరించే ఏర్పాటు ఉండటం వల్ల అర్క ట్రైసైకిల్ ద్వారా తీసుకెళ్లే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పుట్టగొడుగులను కోత తర్వాత 36–48 గంటల పాటు తాజాగా ఉంచుకుంటూ అమ్ముకోవడానికి వీలవుతుంది. తక్కువ కష్టంతో తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాంతాల్లో ట్రైసైకిల్ తిరుగుతుంది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరల నాణ్యత, నిల్వ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన వ్యవసాయోత్పత్తులను నాణ్యంగా, తాజాగా వినియోగదారుల ఇళ్లకు తీసుకెళ్లి ఇవ్వటం అర్క ట్రైసైకిల్ వల్ల సాధ్యమవుతుందని దీన్ని రూపొందించిన ఐఐహెచ్ఆర్ ప్రధాన శాస్త్రవేత్త డా. జి. సెంథిల్ కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. అర్క ట్రైసైకిల్ ప్రత్యేకతలుభారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్) కు అనుబంధ సంస్థ అయిన బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపకల్పన చేసినది. దీని పైనే సౌర ఫలకాలు ఉంటాయి. ఎండలో తిరిగేటప్పుడే బ్యాటరీ చార్జ్ అవుతూ ఉంటుంది. ఆ శక్తితోనే ట్రైసైకిల్ నడుస్తుంది. దీన్ని నడిపే వ్యక్తి సైకిల్ తొక్కనవసరం లేదు. నెట్టుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ కష్టం తప్పుతుంది. బ్యాటరీ ఫూర్తిగా చార్జి అయితే 50 కిలోమీటర్ల దూరం నిరాటంకంగా ప్రయాణిస్తుంది.ఇందులో 20 ప్లాస్టిక్ క్రేట్స్ను పెట్టుకునే ఏర్పాటు ఉంది. ఒక్కో క్రేట్లో 10 కిలోల సరుకును పెట్టవచ్చు. 200 కిలోల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పుట్టగొడుగులను తీసుకెళ్లవచ్చు.సౌరవిద్యుత్తుతో ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టం ద్వారా గాలిని చల్లబరిచి ఈ ట్రైసైకిల్లోని పచ్చి సరుకు పాడవకుండా ఉండేందుకు సరిపోయే చల్లదనాన్ని ఇచ్చే వ్యవస్థ ఉంది. రాత్రి పూట అమ్మకాలు చేయడానికి వీలుగా ఎల్ఇడి బల్బులు ఉన్నాయి. డిజిటల్ కాటా ఉంది. ప్రజలకు వినిపించేలా ఉత్పత్తుల వివరాలు పెద్దగా వినపడేలా చెప్పడానికి సోలార్ విద్యుత్తో నడిచే మైక్ ఉంటుంది. మబ్బులున్నప్పుడు దీన్ని విద్యుత్తో చార్జ్ చేసుకోవచ్చు.వినియోగదారుల భద్రత కోసం ఆటోమేటిక్గా శానిటైజర్ పరికరం ఉంది. తోపుడు బండ్ల వ్యాపరులకు కూరగాయలు, పండ్ల వృథాను తగ్గించుకొని అధిక ఆదాయం పొందేందుకు ట్రైసైకిల్ ఉపయోగపడుతుంది. తమ ఇళ్ల దగ్గరకే వచ్చి పరిశుభ్రంగా, తాజాగా ఉండే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పుట్టగొడుగులు అమ్ముతున్నందున అర్క ట్రైసైకిల్ పట్ల వినియోగదారులు ఆకర్షితులవుతారు. అర్క ట్రైసైకిల్ ధర రూ. లక్షన్నర. తోపుడు బండిపై అమ్మితే వృథా అయ్యే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ట్రైసైకిల్ ద్వారా నిక్షేపంగా అమ్ముకోవచ్చు కాబట్టి రెండేళ్లలో దీని ఖర్చును తిరిగి రాబట్టుకోవచ్చు. నిర్వహణ పతంగి రాంబాబుసాక్షి, సాగుబడి డెస్క్(చదవండి: జస్ట్ మూడు నెలల్లో 14 కిలోలు బరువు తగ్గాలంటే..!)
జస్ట్ మూడు నెలల్లో 14 కిలోలు బరువు తగ్గాలంటే..!
శీతాకాలం కంటే వేసవికాలంలో బరువు తగ్గడం చాలా సులభం. అందులోనూ ప్రస్తుతం చలికాలం ముగిసి.. వేసవికాలంలోకి ప్రవేశిస్తున్నాం. ఇన్నాళ్లు చలికి భయపడి ముసుగుతన్ని పడుకున్న వాళ్లంతా ఒక్కసారిగా ఈ మండే ఎండల్లో అయినా కొలెస్ట్రాల్ తగ్గించుకుని బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటివాళ్లు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ డాన్ గో నెట్టింట షేర్ చేసిన పదహారు రూల్స్ తప్పక ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన వేసవి సమీపించగానే చాలామంది వెయిట్లాస్కు ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం ఇన్స్టాగ్రామ్ వేదికగా వెయిట్లాస్ టిప్స్ షేర్ చేశారు ఫిట్నెస్ కోచ్ డాన్గో. ఆరోగ్యప్రదంగా తక్కువ టైంలో కిలోల కొద్ది బరువు తగ్గి.. మెరుగైన ఫలితాలు సత్వరమే అందుకోవాలంటే ఈ పదహారు రూల్స్ తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!.నిద్రకు కొన్ని గంటల ముందు తినకపోవడం..నిద్రవేళకు కనీసం మూడు నుంచి ఐదు గంటలు ముందు తినడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎక్కువగా ఆహారం తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీలు తీసుకోవడంలో కేర్.. శరీర బరువుని 12తో గుణించగా వచ్చిన మొత్తంని మీ రోజువారీ కేలరీలుగా కేటాయించండి. ఈ అసాధారణ సూత్రాన్ని తప్పక అనుసరించమని కోరారు ఫిట్నెస్ కోచ్.ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం..రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ అవనసం. శరీర బరవుని ఏడుతో గుణిస్తే వచ్చిన మొత్తం మీర రోజువారిగా తీసుకోవాల్సిన ప్రోటీన్గా గుర్తించండి. ఈ విధానం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గించుకుంటూ..కండరాలను నిర్మించడానికి, నిర్వహించొచ్చని చెబుతున్నారు. అందుకు ఈ మాత్రం ప్రోటీన్ తప్పనిసరి అని అన్నారు.ఆహారంలో జోడించాల్సిన ఆహారాలురోజువారీ ఆహారంలో ఏం చేర్చుకోవాలంటే..గ్రీకు పెరుగునీరు, కాఫీ, టీలీన్ గ్రౌండ్ బీఫ్ (వీలైతే అదనపు లీన్)చికెన్ బ్రెస్ట్ టర్కీ (గ్రౌండ్ లేదా బ్రెస్ట్)కొవ్వు చేపగుడ్లు, గుడ్డులోని తెల్లసొనకాటేజ్ చీజ్లీఫీ గ్రీన్స్బంగాళాదుంపలుషెల్ఫిష్బీన్స్, కాయధాన్యాలుబెర్రీలుఆపిల్, నారింజ, కివి, ద్రాక్షపండు వంటి అధిక ఫైబర్ పండ్లుఆకుపచ్చ క్రూసిఫెరస్ కూరగాయలుకాలీఫ్లవర్, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, మిరియాలు, ఆస్పరాగస్, దోసకాయలు వంటి ఇతర అధిక-పరిమాణ కూరగాయలురోజుకు రెండు పూటల భోజనం..ఫిట్నెస్ కోచ్ రోజుకు రెండు పూటలా భోజనం తీసుకునేలా చూసుకోమని సూచించారు.భోజన షెడ్యూల్లో తీసుకోవాల్సిన కేర్..ఫిట్నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన భోజన షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంటుంది:పడుకునే ముందు 3 నుంచి 5 గంటల ముందు చివరి భోజనంనిద్రలేచిన 1 నుంచి 2 గంటల ముందు మొదటి భోజనంరెండవ భోజనం మధ్యలో ఉండాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలి అనేది ఇక్కడ ఉంది:గ్రీకు పెరుగు - ప్రేగులకు మంచిదిప్రోటీన్ పౌడర్ - ఆకలిని నియంత్రిస్తుంది, కండరాలను మెరుగుపరుస్తుందిబ్లూబెర్రీస్ - ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. అలాగే వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.హైడ్రేటెట్గా ఉండండిశరీరానికి తగిప హైడ్రేషన్ కూడా అవసరం. దీని కోసం, ఫిట్నెస్ కోచ్ ఉదయం 500 మి.లీ నీరు, అలాగే భోజనానికి ముందు తర్వాత త్రాగాలని సూచిస్తున్నారు. అయితే, పడుకునే రెండు గంటల ముందు నీరు త్రాగడం మానేయాలని చెబుతున్నారు.శక్తిమంతమైన వ్యాయామాలు..ఆహారంతో పాటు, ఒక రోజు విశ్రాంతితో వారానికి మూడు సార్లు కాస్త ఫోర్స్తో కూడిన వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. అవసరైమతే కాస్త అధిక ఫోర్స్తో చేసే వర్కౌట్లు మరింతగా చేసేలా ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు.శరీరాన్ని కదిలిస్తూ ఉండండిశక్తి శిక్షణ తర్వాత, శరీరానికి సరైన కదలిక కూడా అవసరం. రోజుకు కనీసం 8 వేల నుంచి 10 వేల అడుగులు వేయండి" అని ఫిట్నెస్కోచ్ సిఫార్సు చేస్తున్నారు. డెస్క్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన ప్రణాలికకు అంతరాయం కలగకుండా..డెస్క్ కింద ట్రెడ్మిల్ తీసుకోవడం, వాక్ చేస్తూ మీటింగ్లు ప్లాన్ చేయడం వంటివి చేయాలి.నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండిచక్కటి సౌకర్యవంతమైన బెడ్రూమ్లో నిద్రపోవాలి. బెడ్రూమ్ చూడగానే నిద్ర వచ్చేలా ఆహ్లాదంగా ఉంచుకోవాలి.స్థిరమైన నిద్ర దినచర్య..మంచి నిద్ర తోపాటు ఇవి కూడా ఉండాలి.ఉదయం నిద్ర లేవగానే సూర్యరశ్మిని పొందండిముఖ్యంగా వారాంతాల్లో ఒకే సమయంలో నిద్రపోండి, మేల్కొనండిశరీరాన్ని చల్లబరచడానికి వేడి స్నానం లేదా స్నానం చేయండిమంచానికి ఒక గంట ముందు స్క్రీన్లను చూడటం మానుకోండిసూర్యుడు అస్తమించేటప్పుడు మసకబారిన లైట్లు లేదా ఎరుపు రంగు ప్రకాశించే బల్బులను ఉపయోగించండిపురోగతిని ట్రాక్ చేయండివార గడిచినప్పుడల్లా..బరువు, శరీరం కొలతల్లో వచ్చిన మార్పులు గమనించాలి. అందుకు తగ్గట్లుగా పోషకాహారం తీసుకుంటుండాలి. అలాగే ఆ మార్పులను ఫోటోలు తీస్తూ..గమనించుకోవాలన్నారు.పరివర్తనను గుర్తించి..మెయింటైయిన్ చేయాలి..కేవలం ట్రాక్ చేయడమే కాకుండా, బాడీలోని మార్పులను గమనిస్తూ..ఆ దిశగా ప్లాన్లో మార్పులు చేర్పులు చేసుకుంటుండాలి. ఈ సమయంలో ఆల్కహాల్ను నివారించండిమెరుగైన ఫలితాలు అందుకుంటున్నప్పుడు ఆల్కహాల్ జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు.నిరాశను దరిచేరనివ్వకుండా యాక్టివ్గా ఉండటం..అద్దంలో మార్పులు చూస్తూ..మరింత ఆత్మవిశ్వాసంతో డైట్ని, రూల్స్నిన స్థిరత్వంతో పాటించాలి. ఇలా చేస్తే..ఈ సమ్మర్లో సత్వరమే బరువు తగ్గడం పెద్ద కష్టం కాదని చెబుతున్నారు డాన్గో. అంతేగాదు నియమానుసారంగా సూచించిన ఈ రూల్స్ అన్నింటిని క్రమం తప్పకుండా ఫాలో అయితే ఈజీగా 14 కిలోలు తగ్గుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Dan Go | High Performance Health Coach (@coachdango)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Arjun-Saaniya Chandhok Wedding: అంజలి, సారా ఆ చీరలే ఎందుకు ఎంచుకున్నారంటే..)
అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో కుందనపు బొమ్మలా సారా..!
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సానియా చందోక్ల వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు క్రికెట్ దిగ్గజాల నుంచి బాలీవుడ్ తారలు, పలువురు ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు. తమ్ముడి పెళ్లిలో అక్క సారా కుందనపు బొమ్మలా మెరిసింది. మొత్తం వేడుకలో సారా లుక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయతను ఆధునికతను కలగలసిన స్టైలిష్ లుక్లో కనిపించింది. సింపుల్గా చెప్పాలంటే దివి నుంచి భువికి వచ్చిన దేవతాలో అత్యద్భుతంగా ఉంది సారా. తల్లి అంజలి సైతం గులాబీ రంగు చీరనే ఎంచుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో సారా, అంజలీలు పెళ్లి వేడుకలో ధరించిన చీరలు, ఆభరణాల స్పెషాల్టీ గురించి సవివరంగా చూద్దామా..!.సారా తన తమ్ముడి పెళ్లి వేడుక కోసం పింక్ బంధానిని ఎంచుకుంది. అద్భుతమైన జర్దోజి రేషమ్ ఎంబ్రాయిడరీకి తగ్గా కట్వర్క్ రోసెట్ బోర్డర్. జ్యువెల్డ్ టాసెల్స్తో డెకరేట్ చేసిన హాట్పింక్ సిల్క్ బ్లౌజ్తో మరింత అందంగా కనిపించింది. ఆ చీరపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ అత్యంత హైలెట్గా కనిపించడమే గాక ఆ శారీ అందాన్ని రెట్టింపు చేసింది. ఆ చీరకు దగ్గ భారీ సాంప్రదాయ ఆభరణాలు సారాను మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆకుపచ్చ పూసల బహుళ స్టెప్స్ ఎంబెడెడ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు, పాపిడి బొట్టు, ఆమె లుక్ని మరింత హైలెట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే మేకప్ కూడా చాలా నేచురల్గా కనిపించిన తీరు..సహజత్వానికి ప్రతిక సారా అని చెప్పకనే చెబుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)ఇక కూతురు సారా అందానికి తగ్గట్టుగా తల్లి అంజలి ఈ వేడుకలో రాజరికపు గులాబీ రంగు చేనేత పట్టు చీరను ఎంచుకుంది. ఆమె అత్యంత విలాసవంతమైన లగ్జరీని అంతగా ఇష్టపడరు. సచిన్ భార్య అంజలి ధరించిన చీరను డిజైనర్ జుహి షా రూపొందించారు. ఇక అంజలిని అందంగా తీర్చిద్దింది సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ నిషి సింగ్. సచిన్ సైతం ఆ మేకప్ ఆర్టిస్ట్ నైపుణ్యాన్ని కొనియాడారు. మీరు అంజలి లుక్ని చాలా అందంగా చూపించారని మెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Nishi Singh (@nishisingh_muah)ఇక అంజలీ కూడా మేకప్ ఎప్పుడూ హెవీగా ఉండకూడదని సహజత్వాన్ని అందంగా చూపిస్తే చాలని, అందుకే తాను మినిమల్ లైట్ మేకప్నే ఎంచుకుంటానని అన్నారామె. ఇక ఈ వేడుకలో సచిన్ క్రీమ్ ఎంబ్రాయిడరీ షేర్వానీలో కనిపించగా, వధువరులు అర్జున్ సానీయాలు ఎరుపు రంగును ఎంచుకున్నారు. అర్జున్ టెండూల్కర్ దుస్తులను మనీష్ మల్హోత్రా, సానియా లెహంగాను తరుణ్ తహిలియానిలు రూపొందించారు. (చదవండి: తొలి మహిళా తవిల్ కళాకారిణి..! ఏ ఆర్ రెహమాన్ సైతం..)
అంతర్జాతీయం
యుద్ధం వేళ.. ఇరాన్లో మళ్లీ భూకంపం
టెహ్రాన్: ఇరాన్లోని బందర్ అబ్బాస్కు పశ్చిమాన శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. బందర్ అబ్బాస్కు పశ్చిమాన 74 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడంతో పశ్చిమాసియా అంతటా యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇరాన్ ప్రతీకార దాడులతో దాదాపు వారం రోజులుగా ఘర్షణలు జరుగుగున్న నేపథ్యంలో ఇవాళ మళ్లీ భూకంపం సంభవించడం గమనార్హం. మరోవైపు, గత మంగళవారం కూడా ఇరాన్ దక్షిణ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇరాన్లోని ఫార్స్ ప్రావిన్స్ దక్షిణ భాగంలో ఉన్న గెరాష్లో భూకంపం వచ్చింది. ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల (6.21 మైళ్లు) లోతులో ఉందని యూఎస్జీఎస్ తెలిపింది. కాగా, అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతుంది. తమ మాట వినకపోతే ఇరాన్ సైన్యాన్ని లేకుండా చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.BREAKING 🚨 4.1 earthquake hits IranNuclear test ? pic.twitter.com/nB3DJxgvAm— AsiaWarZone (@AsiaWarZone) March 7, 2026
Nepal: ‘ఆర్ఎస్పీ’ ప్రభంజనం.. ప్రధానిగా ‘బాలెన్’?
ఖాట్మండు : హిమాలయ దేశం నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోనుంది. దశాబ్దాలుగా ఆ దేశాన్ని శాసిస్తున్న హేమాహేమీలను కాదని, ప్రజలు నవతరం వైపు మొగ్గు చూపుతున్నారు. 275 స్థానాలు కలిగిన నేపాల్ ప్రతినిధుల సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో మాజీ మేయర్, మాజీ రాపర్ బాలేంద్ర షా (బాలెన్) నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. తాజా ఫలితాల సరళిని చూస్తే బాలెన్ షా నేపాల్ తదుపరి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.గత ఏడాది సెప్టెంబరులో ‘జెన్-జీ’ (Gen Z) యువత చేపట్టిన భారీ ఆందోళనల నేపథ్యంలో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయగా, పార్లమెంటు రద్దయిన విషయం తెలిసిందే. ఆ అల్లకల్లోలం తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంప్రదాయ రాజకీయ పక్షాలైన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్, మావోయిస్టు సెంటర్లపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆర్ఎస్పీకి వరంగా మారింది. ముఖ్యంగా రాజధాని ఖాట్మండులో ఆర్ఎస్పీ మద్దతుదారులు ‘గంట (పార్టీ గుర్తు) మోగిస్తూ సంబరాల్లో మునిగితేలుతున్నారు.మొత్తం 165 ప్రత్యక్ష ఎన్నికల స్థానాల్లో ఆర్ఎస్పీ ఇప్పటికే 20 స్థానాలను కైవసం చేసుకోగా, మరో 98 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. స్వయంగా బాలేంద్ర షా తన ప్రత్యర్థి, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై ఆయన సొంత గడ్డ అయిన ఝాపా-5 నియోజకవర్గంలో 15 వేల ఓట్ల భారీ ఆధిక్యంలో ఉండటం విశేషం. మరోవైపు, ఆర్ఎస్పీ అధ్యక్షుడు రబీ లామిచానే చిత్వాన్-2 స్థానం నుంచి 54,402 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు.నేపాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. సరిహద్దు దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని భారత్ ఆకాంక్షిస్తోంది. న్యూఢిల్లీలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. నేపాల్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు.నేపాల్ ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 9వ తేదీ నాటికి ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. 165 ప్రత్యక్ష ఎన్నికల స్థానాలతో పాటు, మిగిలిన 110 స్థానాలను దామాషా పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అవినీతి, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న నేపాల్లో బాలెన్ షా రాకతో ఒక కొత్త శకం మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన పాటలతో వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిన బాలెన్, ఇప్పుడు దేశ గమనాన్ని ఎలా మారుస్తారనేది వేచి చూడాలి.ఇది కూడా చదవండి: యువకుని హత్యతో రణరంగం.. వాహనాల దహనం, రాస్తారోకో
నైజీరియాలో దారుణం.. 300 మంది అపహరణ
నైజీరియాలో దారుణం జరిగింది. నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఇస్లామిక్ మిలిటెంట్లు తెగబడ్డారు. ఓ గ్రామంపై దాడి చేసి 300 మందికి పైగా ప్రజలను అపహరించారు. అయితే ఈ దాడి ఏ గ్రూపుకు చెందిన టెర్రరిస్టులు చేశారనే సంగతి ఇంకా తెలియలేదు. నార్త్ ఈస్ట్ ప్రాంతంలోని బార్నో రాష్ట్రంలో శుక్రవారం ఇస్లామిక్ మిలిటెంట్లు విరుచుకపడ్డారు. నాగోషి ప్రాంతంపై దాడిచేసి మహిళలు, చిన్నపిల్లలతో సహా దాదాపు 300 మందిని కిడ్నాప్ చేశారు. కాగా ఇటీవల టెర్రరిస్ట్ గ్రూపు బొకోహరమ్కు చెందిన తీవ్రవాదులను అక్కడి భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దానికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిగి ఉండవచ్చని ఆ దేశ అధికారులు భావిస్తున్నారు.అయితే గత వారం రోజులుగా తరచుగా అక్కడి గ్రామాలపై ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని అక్కడి అధికారి తెలిపారు. స్థానికంగా ఉన్న కొండుగ, మార్టే, జకానా, మైనాక్, అనే జాతుల సమూహాలపై మిలీషియా గ్రూపులు దాడులకు తెగబడుతున్నాయన్నారు. వారిని అంతమెుందించడంలో అనేక మంది భద్రతా అధికారులు ప్రాణాలు అర్పించారన్నారు. అయితే నైజీరియాలో ఉగ్రవాదుల దాడులు సర్వ సాధారణంగా మారాయి. అక్కడ మైనింగ్పై అధిపత్యం కోసం అక్కడ స్థానికంగా ఉన్న మిలీషియా గ్రూపుల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతాయి. ఈ దాడులలో వందలమంది ప్రాణాలు వదిలారు. దీంతో అక్కడ శాంతి భద్రతలను కాపాడడానికి అమెరికా తన బలగాలను నైజీరియాలో మోహరించింది
యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. అమెరికా దాడులకు పుతిన్ చెక్?
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు రష్యా చాటుగా సాయపడుతోందా? అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల కదలికలతో పాటు గల్ఫ్లోని ఆ దేశ సైనిక స్థావరాలు తదితరాలకు సంబంధించిన సున్నితమైన నిఘా సమాచారాన్ని వారం రోజులుగా ఎప్పటికప్పుడు ఇరాన్కు అందిస్తూ వస్తోందా? తద్వారా వాటిపై దాడులకు సహకరిస్తోందా? అంటే, అవునని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్టు వార్తా సంస్థ సంచలనాత్మక కథనం వెలువరించింది.‘యుద్ధం మొదలైన ఒకట్రెండు రోజుల్లోనే ఇరాన్ నిఘా సామర్థ్యం దాదాపుగా కుప్పకూలింది. అయినా అమెరికా యుద్ధ నౌకలు, గల్ఫ్ దేశాల్లోని స్థావరాలు, రాయబార కార్యాలయాలపై ఇరాన్ కచ్చితత్వంతో దాడులు చేయగలిగింది. రష్యా అందించిన నిఘా సమాచారంతోనే ఇది సాధ్యమైందనడం సుస్పష్టం’ అని సదరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ దీనిపై ఎలా స్పందిస్తారోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాపైనా ఆయన తీవ్ర చర్యలకు దిగితే ఇప్పటికే పశ్చిమాసియా అంతటా కుంపట్లు రాజేస్తున్న యుద్ధం మరింతగా విస్తరించే ప్రమాదముంది.ఇరాన్కు కావాల్సింది.. ఓ మంచి నాయకుడు: ట్రంప్ మరోవైపు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కు ఒక మంచి నాయకుడు కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పలువురు నేతల పేర్లు తమ దృష్టిలో ఉన్నట్టు చెప్పారు. ‘ఇరాన్కు మంచి భవిష్యత్తుంటుంది. ఇతర దేశాల సాయంతో ఆ దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేస్తాం. ఆర్థికంగా అత్యంత బలోపేతం చేస్తాం’ అని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)’తరహాలో ‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్’అంటూ అధ్యక్షుడు ముక్తాయించడం విశేషం! మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధానికి తెర దించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నట్టు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధ నౌకను ముంచేశాం: అమెరికా డ్రోన్లు, ఇతర ఆయుధాలతో కూడిన ఇరాన్ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ షహీద్ బఘేరీని ముంచేసినట్టు అమెరికా ప్రకటించింది. అది మంటల్లో తగలబడిపోతున్న ఫుటేజీని యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ శుక్రవారం విడుదల చేసింది. ఇరాన్ సైన్యం మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. 180 మీటర్ల పొడవైన షహీద్ నిజానికి రవాణా నౌక. యుద్ధ అవసరాల రీత్యా ఇరాన్ దాన్ని తాత్కాలికంగా డ్రోన్ క్యారియర్గా మార్చినట్టు సమాచారం. ఇది రీ ఫ్యూయలింగ్ కోసం ఆగకుండా ఏకబిగిన 22 వేల నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు!.
జాతీయం
యుద్ధం వేళ.. మరో ఇరాన్ నౌకకు భారత్ ఆశ్రయం
న్యూఢిల్లీ: ఇరాన్ నావికా దళానికి చెందిన ఒక యుద్ధ నౌకకు భారత్ అత్యవసర ఆశ్రయం కల్పించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐఆర్ఐఎస్ లవాన్ నౌకలో(IRIS Lavan) సాంకేతిక సమస్య ఏర్పడటంతో మార్చి 4న దాన్ని కోచి నౌకాశ్రయంలోకి అనుమతించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ నౌకలో 183 మంది సిబ్బంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే, ఇటీవల విశాఖ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్కు ఇరాన్కు చెందిన నౌక ఐరిస్ లవన్ వచ్చింది. అయితే తిరుగు ప్రయాణంలో నౌకలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కొచ్చిలో దీన్ని నిలిపేందుకు అనుమతి ఇవ్వాలని ఇరాన్ ఫిబ్రవరి 28న భారత ప్రభుత్వాన్ని కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అందుకు మార్చి 1నే అనుమతి లభించిందని అధికారులు తెలిపారు. దీంతో ఐరిస్ లావన్ మార్చి 4న కొచ్చి ఓడరేవుకు చేరింది.మరోవైపు, ఇటీవల విశాఖపట్నంలో భారత నౌకాదళంతో సంయుక్త విన్యాసాల్లో పాల్గొని తిరుగుముఖం పట్టిన ఇరాన్ యుద్ధ నౌక ఓఆర్ఐఎస్ దేనాను బుధవారం శ్రీలంక సముద్ర జలాల సమీపంలో అమెరికా దాడి చేసి ముంచేయడం తెలిసిందే. దాంతో అందులోని 87 మంది నావికులు దుర్మరణం పాలయ్యారు. అందుకు ప్రతీకారంగా మర్నాడే పర్షియన్ గల్ఫ్లో అమెరికా చమురు నౌకపై ఇరాన్ దాడికి దిగింది.
పెరిగిన గ్యాస్ ధరలు.. డొమెస్టిక్ సిలిండర్ ఎంతంటే?
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భారత్పై పడింది. దీంతో వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్పై రూ.60 పెంపు జరగగా వాణిజ్య సిలిండర్పై రూ. 115 పెరిగింది. ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వ పథకం ఉజ్వల ద్వారా అందించే సిలిండర్ ధరలు మాత్రం యథాతథంగా ఉండనున్నట్లు తెలిపింది.ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో చమురు రవాణా చేసే నౌకలు నిలిచిపోయాయి. ఈ ప్రభావంతో చమురు ధరలు పెరిగాయి. ఈ ధరలతో హైదరాబాద్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 965కు చేరుకుంది. ఢిల్లీలో డొమెస్టిక్ ధర ప్రస్తుతం రూ. 913 ఉండగా, ముంబైలో రూ. 852 చెన్నైలో రూ.928 కి చేరుకుంది. అయితే యుద్ధప్రభావంతో భవిష్యత్తులో కొరత ఏర్పడకుండా ఉండేందుకు చమురు ఉత్పత్తులను భారీగా పెంచాలని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే భారత్ వద్ద తాత్కాలికంగా చమురు నిల్వలు ఉన్నాయని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది వరకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సీఎం మమత ధర్నా
కోల్కతా: ఓటరు జాబితా సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం టీఎంసీ అధినేత్రి, పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెంట్రల్ కోల్కతాలో ధర్నాకు పూనుకున్నారు. ఏప్రిల్లో జరగనున్న కీలకమైన ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా వివాదాన్ని టీఎంసీ ప్రచారంలో ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకోనున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు. రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఎస్ప్లానెడ్ ప్రాంతంలోని మెట్రో చానల్ వద్ద మమత మధ్యాహ్నం 2.15 గంటలకు ధర్నా ప్రారంభించారు. బీజేపీ, ఈసీలు కలిసి బెంగాలీ ఓటర్ల పేర్లను తొలగించాలని కుట్ర పన్నాయన్నారు. ఈ కుట్రను తాను బయటపెడతానని ఆమె ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన జాబితాలో బతికున్న వారిని కూడా చనిపోయిన వారి కిందకి చేర్చారని ఆరోపించారు. అలాంటి వారిని ధర్నా వేదికపైకి తీసుకొచి్చ, ఈసీ పాల్పడిన అవకతవకలను బయటపెడతామన్నారు. ఇదే అంశంపై శనివారం మరికొన్ని వివరాలను బయటపెడతామన్నారు. బీజేపీ, ఈసీలోని ఆ పార్టీ ఏజెంట్లు బరి తెగించారని, వారికి ఏమాత్రం సిగ్గు లేదంటూ తిట్టిపోశారు. ఇటీవల ఈసీ వెల్లడించిన తుది ఓటరు జాబితాలో 63.66 లక్షల పేర్లను, అంటే మొత్తం ఓటర్లలో 8.3 శాతం మందిని తొలగించడం తెల్సిందే. మరో 60 లక్షల పేర్లను న్యాయపరమైన పరిశీలన కోసం ఉంచారు. త్వరలో న్యాయాధికారులు వీటిని పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ ఎన్నికల సమీకరణాలను తీవ్రంగా ప్రభావితం చేయనుండగా మమత పోరాటానికి దిగారు. అయితే, ధర్నా ఎన్ని రోజులు కొనసాగనుందనే విషయాన్ని మమత వెల్లడించలేదు.
ఎల్పీజీ ఉత్పత్తి పెంచండి
న్యూఢిల్లీ: పశి్చమాసియాలో సంక్షోభం నేపథ్యలో దేశీయంగా వంట గ్యాస్ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కంపెనీలను ఆదేశించింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా) ఈ ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వం రంగ చమురు సంస్థలకు అందజేయాలని పేర్కొంది. పెట్రోకెమికల్స్ తయారీకి ప్రొపేన్, బ్యూటేన్ ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. వాటితో కేవలం ఎల్పీజీని మాత్రమే ఉత్పత్తి చేయాలని తేల్చిచెప్పింది. ఎల్పీజీని దేశీయంగా వంట అవసరాలకు మాత్రమే వాడుకోవాలని వెల్లడించిది. ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. 2024–25లో దేశంలో 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని ఉపయోగించారు. ఇందులో 12.8 మిలియన్ టన్నులను దేశీయంగా ఉత్పత్తి చేయగా, మిగతా గ్యాస్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. దాదాపు 90 శాతం ఎల్పీజీ గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఇరాన్ సహా పశి్చమాసియాలో యుద్ధం కారణంగా చమురు సహా ఎల్పీజీ దిగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఎన్ఆర్ఐ
13 ఏళ్ల టీనేజర్ అమెరికాలో మైనర్లపై వేధింపులు, దొంగతనాలు
అమెరికాలో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఒక భారతీయుడిని అరెస్టు చేశారు. ఓదెల యశస్వి కొత్తపల్లిగా గుర్తించబడిన నిందితుడు అక్రమ వలసదారు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రకటించింది. న్యూజెర్సీలో పిల్లలపై లైంగిక వేధింపులతోపాటు, దొంగతనానికి సంబంధించిన ఆరోపణలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించింది.సరైన పత్రాలు లేకుండా అమెరికాలోని ప్రవేశించిన నిందితుడు యశస్విని చైల్డ్ రేపిస్తూ అని పేర్కొంది. అతడిపై యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం తొలగింపు చర్యలు పెండింగ్లో ఉన్నాయని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఈసీఇ) ఎక్స్లో ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుమైనర్లపై లైంగిక నేరాలకుపాల్పడినట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, దొంగతనం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే నిందితుడిపై కేసు ఎప్పుడు, ఎక్కడ నమోదైంది, ఎప్పుడు అరెస్టు చేశారనే విషయాలపై స్పష్టతనివ్వలేదు.—SEXUAL ASSAULT OF A CHILD UNDER 13 —SHOPLIFTING —PUBLIC DISORDER Vodela Yashaswi Kottapalli, a criminal illegal alien from India, has pending charges for sexual assault and larceny in New Jersey. We’ll keep him in custody pending removal proceedings. pic.twitter.com/VM97e9KUD9— U.S. Immigration and Customs Enforcement (@ICEgov) February 16, 2026 ఇదీ చదవండి: పెళ్లయ్యి ఆరునెలలే.. వాలెంటైన్స్డే రోజే హత్య
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది కూడా శివాలయాల సందర్శన యాత్ర ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు నిర్వహించారు. సింగపూర్లోని జురాంగ్ ఈస్ట్ ,బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్రను నిర్వహించారు. సుమారు 230 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. భక్తుల శివనామస్మరణలతో ప్రముఖ దేవాలయాలు కిటకిటలాడాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష, ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవ, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల మరియు ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మొదలగు వారు ఉన్నారు.వీరితో పాటు యాత్రలో సహాయపడిన పెరుకు శివ రామ్ ప్రసాద్,సమ్మయ్య మొలుగూరి, లక్ష్మణ్ రాజు కల్వ, వేణు గోపాల్ ఐరేని, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు అందరికి కృతజ్ణతలు తెలియజేశారు. ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్ గారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి , చల్ల కృష్ణ మొదలగు వారు గత సంవత్సరం లాగే ఈ సారి కూడా భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
అమెరికాలోని కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి ఉదంతం విషాదాంతమైంది. తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభ్యమైంది. పోలీసులు అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.అతని మృతదేహాన్నివీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యంత క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి, ప్రియమైనవారికి తమ హృదయపూర్వక సానుభూతిని తెలియ జేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.Consulate General of India in San Francisco is deeply concerned about the disappearance of Saketh Sreenivasaiah, an Indian post-graduate student of UC Berkeley, hailing from the State of Karnataka. The Consulate is in touch with the family and also is in contact with the…— India in San Francisco (@CGISFO) February 14, 2026 కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు.మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. తమ కొడుకు ఎలాగైనా క్షేమంగా తిరిగి వస్తాడని ఎదురు చూసిన కుటుంబీకుల్లో శ్రీనివాసయ్య మరణవార్త తీరని విషాదాన్ని మిగిల్చింది.
అమెరికాలో కర్నాటక విద్యార్థి అదృశ్యం
న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోరి్నయాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా పోయారు. కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) అమెరికాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్కిలీలో కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ పీజీ చేస్తున్నాడు. మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. సాకేత్ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆచూకీ కనుగొనే విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కర్నాటకలోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని శనివారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి సాకేత్ కనిపించకుండాపోయాడంటూ అతడి రూమ్మేట్ బనీత్ సింగ్ ఈ నెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని చోట్లా వాకబు చేసిన తను ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపినట్లు బనీత్ తెలిపాడు. ప్రభుత్వానికి సాకేత్ తండ్రి వినతి అమెరికాలో గల్లంతైన తమ కుమారుడిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందజేసినట్లు తండ్రి శ్రీనివాసయ్య తెలిపారు. చివరిసారిగా తమ కుమారుడితో ఈ నెల 9వ తేదీన ఫోన్లో మాట్లాడామన్నారు. 12వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ అతడి రూమ్మేట్ తమకు తెలిపాడన్నారు. కుమారుడి కోసం అమెరికా వెళ్లే విషయమై తాము ఆలోచిస్తున్నామన్నారు. సాకేత్ విషయంలో కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్ అధికారులు అక్కడి పోలీసులతో మాట్లాడాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కర్నాటక ప్రభుత్వం శనివారం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది.
క్రైమ్
యువతితో అసభ్య వీడియోలు తీసిన దర్శకుడు
హైదరాబాద్: వెండితెరపై వెలిగిపోవాలని నగరానికి వచ్చిన ఆ యువతిని ఓ దర్శకుడు ట్రాప్ చేసి సినిమా షూటింగ్ పేరుతో ఆమెను కారులో కూర్చుండబెట్టుకొని అసభ్యకరమైన సీన్లు తీసి సోషల్ మీడియాలో పోస్టే చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... శ్రీకృష్ణానగర్లో నివసిస్తున్న శంకర్(25) రీల్స్తో పాటు వెబ్సిరీస్లకు దర్శకత్వం వహిస్తుంటాడు. కాకినాడకు చెందిన యువతి(23) సినిమాల్లో వేషాల కోసం హైదరాబాద్కు వచ్చి యూసుఫ్గూడలోని తన స్నేహితురాలి వద్ద ఉంటున్నది. ఇటీవల ఓ వెబ్ సిరీస్లో వేషం ఉందంటూ శంకర్ ఆ యువతిని పిలిపించుకున్నాడు. కారులో కూర్చుండబెట్టుకొని కెమెరాతో షూట్ చేయసాగాడు. అసభ్యకరమైన డైలాగ్తో పాటు ఆమె చేత అసభ్య చేష్టలతో షూటింగ్ నిర్వహించి దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. ఇలాంటి వేషాలు వేస్తున్నావేంటంటూ ఆమెను ప్రశ్నించారు. ఆ వీడియో తొలగించాలని శంకర్కు చెప్పగా నిర్లక్ష్యం చేశాడు. మిగతా సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఆమె చేత పలికించిన డైలాగ్లు సన్నివేశాలను పోస్ట్ చేయడమే కాకుండా బ్లాక్ మెయిల్ చేయసాగాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు యువ దర్శకుడు శంకర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ.. 15 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు
విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారి ఇంద్రకీలాద్రి కొండపై చోరీ జరిగింది. ఓ భక్తురాలి వద్ద 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు పెళ్లికి వచ్చిన మహిళా భక్తురాలు నగలు పొగొట్టుకుంది. ఇవాళ కుంభాభిషేకం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో దర్శనానికి వెళ్లిన ఆమె బ్యాగ్లో ఉన్న బంగారు చోరీకి గురైంది.దీంతో విజయవాడలోని వన్ టౌన్ పోలీసులకు మహిళా భక్తురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. కుంభాభిషేకం ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రాంగణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. దీంతో సీసీ కెమెరాలకు అడ్డంగా టెంట్స్ ఉండడంతో దొంగను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది.
ఎప్స్టీన్ ఫైల్స్ : మైనర్పై దారుణం, ట్రంప్కు మరో షాక్
ఇరాన్పై భీకర దాడులు వరుసగా 7వ రోజు కూడా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ తగింది. ట్రంప్పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన మరికొన్ని కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ (Department of Justice) తాజాగా విడుదల చేసింది. దివంగత లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ (Epstein Files) కేసులో భాగంగా వీటిని బహిర్గతంచేసింది.తాజాగా విడుదలలైన ఈ పత్రాలు ప్రకారం ఎప్స్టీన్ ద్వారా ట్రంప్కు పరిచయమైన ఒక మహిళను, ఆమె మైనర్గా ఉన్నప్పుడు (13 -15 ఏళ్ల వయస్సులో) ట్రంప్ లైంగికంగా వేధించారని పేర్కొంటున్నాయి.ఎప్స్టీన్ ఆ బాలికను న్యూయార్క్ లేదా న్యూజెర్సీకి తీసుకెళ్లి ట్రంప్కు పరిచయం చేశాడు. ఆ సమయంలో ట్రంప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, తాను అతణ్ని కొరికి గాయపరిచినట్టు ఆ మహిళ దర్యాప్తు అధికారులకు వివరించిందని 2019లో FBI జరిపిన ఇంటర్వ్యూల ప్రకారం తెలుస్తోంది.అంతేకాదు ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని తనకు, తన కుటుంబ సభ్యులకు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆమె ఆరోపించింది.రాజకీయ దుమారంఈ పత్రాలు గతంలోనే విడుదల కావాల్సి ఉన్నా, పొరపాటున "డూప్లికేట్" (నకలు) అని మార్క్ చేయబడటం వల్ల అప్పట్లో బయటకు రాలేదని న్యాయశాఖ తెలిపింది. దీనిపై స్పందించిన డెమోక్రాట్లుట్రంప్ ప్రభుత్వం ఎప్స్టీన్ కేసులో కీలక వివరాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించిందని డెమోక్రాట్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టడానికి అటార్నీ జనరల్ పామ్ బాండీకి సమన్లు (Subpoena) జారీ చేయాలని హౌస్ కమిటీ నిర్ణయించింది.అయితే ఈ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ పత్రాల్లో ఉన్నవి అవాస్తవాలు, సంచలనం కోసం సృష్టించిన ఆరోపణలని గతంలోనే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఎప్స్టీన్ కేసులో వాస్తవాలు బయటికి రాకుండా ఉండేందుకు ఇరాన్పై దాడులకు పూనుకున్నాడని ట్రంప్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!
నకిలీ ఫేస్బుక్ ఖాతా.. వివాహితకు అసభ్య మెసేజ్లు..
విశాఖపట్నం జిల్లా: నకిలీ ఫేస్బుక్ ఖాతాతో ఓ వివాహితకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని నగర సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ వివాహితకు ఒక వ్యక్తి నకిలీ ఫేస్బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అనంతరం ఆమె ఖాతాలోని ఫొటోలను డౌన్లోడ్ చేసి మారి్ఫంగ్ చేశాడు. ఆ ఫొటోలను ఆమెకు పంపిస్తూ, తనతో చాటింగ్ చేయకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. అసభ్య పదజాలంతో మెసేజ్లు చేస్తూ తీవ్ర వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని కొబ్బరితోటకు చెందిన గరుబిల్లి భాస్కరరావుగా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అపరిచిత వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తే అంగీకరించవద్దని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
వీడియోలు
ఫైనల్ కి ముందే బయటపడిన టీమిండియా డొల్లతనం ఫైనల్లో ఈ ముగ్గురిని తప్పించకుంటే ఓటమి పక్కా..?
సూర్య VS సాంట్నర్..రికార్డ్స్ చూస్తే..టీమిండియాకు మళ్లీ నిరాశేనా..?
ఆ పేరు చెప్తేనే వణికిపోతున్న టీం ఇండియా
10th క్లాస్ స్టూడెంట్ చేసిన పని చూడండి
లొంగిపోయేందుకు బయల్దేరిన మావోయిస్టులు
ఖమేనీ బంకర్ ధ్వంసం చేశాం ఇక మిగిలింది..!
భీకర యుద్ధం వేళ ఇరాన్ అధ్యకుడికి పుతిన్ ఫోన్
విజయ్ కు బిగ్ షాక్ బయటకు వెళ్లకూడదంటూ పిటిషన్
ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ క్రీడా ఉత్సవాలపై జడ శ్రవణ్ సెటైర్లు
వెంకీ మూవీలో కీర్తి సురేష్..?


