ప్రేమలు పండిన తీరం భీమిలి లోగిలి సారం
భీమునిపట్నం: ప్రేమకథా చిత్రాలకు భీమిలి తీరానికి విడదీయలేని అనుబంధం ఉంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఇక్కడ రూపుదిద్దుకుని ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా 1978లో విడుదలైన దర్శక శిఖరం కె. బాలచందర్ దృశ్యకావ్యం ‘మరోచరిత్ర’ ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. కమల్ హాసన్, సరిత జంటగా నటించిన ఈ చిత్రంలోని మెజారిటీ సన్నివేశాలు భీమిలి తీరంలోనే చిత్రీకరించారు. అప్పట్లో అంటే సుమారు 1850 ప్రాంతంలో బ్రిటీష్ గవర్నర్ నివాసం కోసం సముద్ర తీరాన నిర్మించిన అరుదైన బంగ్లా ‘గాలిమేడ’ ఈ సినిమాతోనే ప్రజలకు చేరువైంది. డచ్ గవర్నర్ బంగ్లాగా పిలవబడే ఈ కట్టడం సినిమా హిట్ అయ్యాక ఒక పర్యాటక కేంద్రంగా మారిపోయింది. అయితే దురదృష్టవశాత్తూ 1990వ దశకంలో ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఆ చారిత్రక గాలిమేడను కూల్చివేసినప్పటికీ, నేటికీ పాతతరం ప్రేక్షకులు ఆ ఖాళీ స్థలాన్ని చూసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉంటారు. బాలచందర్ మెచ్చిన తీరం బాలచందర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘కోకిలమ్మ’ సినిమాతో మొదలైన ఈ సినీ ప్రస్థానం ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలకు వేదికైంది. 1986లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా సత్యరాజ్, రేఖలతో తీసిన ‘కడలోర కవిదైగళ్’ చిత్రాన్ని భీమిలిలోని గ్రంథాలయం ఎదురుగా ఉన్న సరస్వతి సమాజం పరిసరాల్లోనే చిత్రీకరించారు. ఇదే సినిమాను 1987లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆరాధన’ పేరుతో రీమేక్ చేసినప్పుడు కూడా భీమిలినే ప్రధాన లొకేషన్గా ఎంచుకున్నారు. సుహాసిని టీచర్గా ఉన్న స్కూల్, ఆమె బడికి రావద్దని చెబితే చిరంజీవి ఒంటికాలిపై నిలబడే దిమ్మ, లైట్ హౌస్ కీపర్ క్వార్టర్స్లో ఉన్న చిరంజీవి ఇల్లు.. ఇవన్నీ ఇప్పటికీ అలాగే ఉండి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఎన్నో చిత్రాల నిర్మాణం శుభలేఖ, ముద్దమందారం, మహర్షి వంటి క్లాసిక్ చిత్రాలే కాకుండా హిందీ, తమిళ సినిమాలు కూడా ఈ తీరంలో సందడి చేశాయి. 1992లో నటి రోజా, ఆమె భర్త సెల్వమణి కాంబినేషన్లో వచ్చిన ‘చామంతి’, నాగార్జున ‘రావోయి చందమామ’, ప్రభుదేవా ‘టైమ్’ వంటి సినిమాల చిత్రీకరణ బ్యాంక్ రోడ్డులోని ‘ఓషన్ వ్యూ’ బంగ్లా వద్ద జరిగింది. అయితే మారుతున్న కాలంతో పాటు ఆ బంగ్లా కూడా కూలి్చవేతకు గురైంది. గాలిమేడ, ఓషన్ వ్యూ బంగ్లా వంటి కొన్ని కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయినా, ‘ఆరాధన’ సినిమా స్కూల్, ఆనాటి దిమ్మ, నరసింహస్వామి ఆలయ పరిసరాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. భీమిలి అందాలు వెండితెరపై ఎంతటి మాయాజాలాన్ని సృష్టించాయో చెప్పడానికి ఈ లొకేషన్లే సజీవ సాక్ష్యాలు.సందడిగా ఉండేది ఇక్కడ షూటింగ్లు జరగడవల్ల ఎంతో సందడిగా ఉండేది, ముఖ్యంగా ఆరాధన షూటింగ్ రెండు నెలలకు పైనే జరిగింది. ఇందులో చిరంజీవి హీరోకావడంతో విశాఖ, విజయనగరం ప్రాంతాల నుంచి ప్రతి రోజు భారీ ఎత్తున జనం వచ్చేవారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు, చిత్ర యూనిట్ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. –రాంబోతు సత్యనారాయణ, భీమిలికాలేజ్కు వెళ్లేవాళ్లం కాదు ఆరాధన షూటింగ్ ఇక్కడే ఎక్కువ రోజులు జరిగింది. చిరంజీవి, సుహాసిని, రాధికను చూడాలని ఎంతో ఆసక్తి ఉండేది. స్నేహి తులంతా కలిసి కాలేజ్కి డుమ్మా కొట్టి షూటింగ్ చూడడానికి వెళ్లేవాళ్లం. –అయ్యగారి లలితారమేష్ భీమిలిభీమిలికి మంచి గుర్తింపు ఇక్కడ షూటింగ్లు తరచూ జరుగుతుండడంతో భీమిలి ప్రాంతానికి మంచి గుర్తింపు వచ్చింది. దీనికి చారిత్రిక, పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఉండడంతో వివిధ రాష్ట్రాల నుంచి సందర్శకులు వస్తున్నారు. సినిమా షూటింగ్ల వల్ల ఈ ప్రాంతం మరింత గుర్తింపు లభించింది. ప్రభుత్వం చారిత్రక కట్టడాలకు మెరుగులు దిద్దాలి.–కంటుభుక్త ముత్యాలరావు, భీమిలి
అసంతృప్తులకు రేవంత్ వార్నింగ్!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని ప్రకటించి తెలంగాణ కాంగ్రెస్లో తనకు ఎదురు లేదన్న సంకేతం ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా రేవంత్ ధీమాకు తగ్గట్టుగానే ఉన్నా.. బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలే కైవసం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.రెండు కార్పొరేషన్ స్థానాలు సాధించగలిగిన బీజేపీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా ముందంజ వేయలేదు. మిగిలిన పార్టీల మాటెలా ఉన్నా.. కాంగ్రెస్లో మాత్రం తనకు ఎవరూ సాటిరారన్న సంకేతం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేయగలిగారు. సీనియర్లు కొందరు అసంతృప్తితో ఉన్నప్పటికీ చెప్పుకోలేని పరిస్థితి కల్పించారు. ఢిల్లీ వెళ్లి తనపై ఫిర్యాదులు చెప్పే కొంతమంది నేతలకు కూడా రేవంత్ మీ పప్పులు ఉడకవు అని చెప్పకనే చెప్పారనుకోవచ్చు.రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు సంగతి, ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ, పార్టీపై పట్టు ఉందన్న భావన ఉంటే, తనకు తిరుగు ఉండదని అనుకుంటున్నారు. దీనికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా ఆయన నాయకత్వాన్ని కొంతమేర బలోపేతం చేస్తాయి. అయితే 36 చోట్ల హంగ్ రావడం, బీఆర్ఎస్ 13 మున్సిపాల్టీలు గెలుచుకోవడం కాంగ్రెస్కు ప్రమాదకర సంకేతమన్న విశ్లేషణలు ఉన్నాయి. కాకపోతే ఆ విషయాన్ని కాంగ్రెస్లోని ఇతర వర్గాలు ఇప్పటికిప్పుడు రచ్చ చేయకపోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి సీనియారిటీ సంపాదించిన నేతలు కొందరైతే, ఇతర పార్టీలు ముఖ్యంగా టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరి పార్టీపై ఆధిపత్యాన్ని సంపాదించుకున్న నేతలు మరికొందరు కనిపిస్తారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ రెండో టర్మ్లో అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా పని చేశారు. అలాగే పాదయాత్ర కూడా చేశారు. ఈలోగా టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పక్షాన ఎంపీ అయిన రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంలో పలుకుబడి పెంచుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. దానికి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ద్వారా పరోక్ష సహకారం పొందారని చెబుతారు. ఇతరత్రా సామాజిక అంశాలు కూడా కలిసి వచ్చి కాంగ్రెస్ గెలవగానే సీఎం రేసులో ముందంజలో నిలబడ్డారు. ఫలితంగా మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు పార్టీలో సీనియర్లయినా రేవంత్ రాజకీయ వ్యూహం ముందు నిలబడలేకపోయారు. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినా, మూలాలు టీడీపీలోనే ఉన్నాయి. మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చినా అంతకుముందు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో ఉండేవారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వంలో మంత్రులపై తన పట్టు పెంచుకోవడానికి పలు వ్యూహాలు అమలు చేశారని చెబుతారు.ఉదాహరణకు కొంతకాలం క్రితం వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న మల్లు భట్టి కొంత స్వతంత్రంగా బిల్లులు మంజూరు చేయడానికి చొరవ తీసుకునేవారట. కానీ, ఇటీవలి కాలంలో సీఎంకు తెలియకుండా బిల్లులకు నిధులు విడుదల చేసే పరిస్థితి లేదట. ఢిల్లీ వెళ్లి కొందరు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానంతో తమ గోడు మొరబెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అధిష్టానం పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. పార్టీ నిర్వహణకు అవసరమైన నిధుల కోసం తాము పవర్లో ఉన్న మూడు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉంది. ఆ విషయంలో రేవంత్ బాగానే ఉపకరిస్తుండవచ్చన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఆ ధైర్యంతోనే రేవంత్ నేనే రాజు, నేనే మంత్రి అన్న డైలాగును వాడి కాంగ్రెస్ లోని ఇతర ముఖ్య నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారనుకోవచ్చు. అయితే, ఇది అహంకార పూరితమైందా? అన్న చర్చ వస్తుంది. కొందరు అలా చూడవచ్చు. మరికొందరు రేవంత్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా కుంపట్లు పెట్టే సీన్ లేకుండా చేసుకోవడానికి కూడా ఈ డైలాగు ఉపయోగపడవచ్చు. బీజేపీ వారే గట్టిగా నిర్ధారించలేకపోతున్నప్పటికీ, జమిలి ఎన్నికల గురించి రేవంత్ మాట్లాడడం, ఈ టర్మ్లో ఆరు నెలల అదనపు పదవీకాలం, తదుపరి మరో టర్మ్లోనూ తానే సీఎం అని అంటున్నారు. ఇది కేడర్లో ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. తాను ఎవరితోనూ పోల్చుకోనని, తనకు తానే పోటీ అని కూడా ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఇలానే మాట్లాడుతుండేవారు. రాజకీయాలలో ఎవరు పొగిడినా, పొగడకపోయినా, తన గురించి తాను బాగా చెప్పుకోవాలి. అదంతా మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరగాలి. ఈ స్ట్రాటజీలో చంద్రబాబు మొనగాడు. ఇప్పుడు రేవంత్ కూడా ఆ బాటలో ఉన్నారనపిస్తుంది.మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాక రేవంత్కు మద్దతు ఇస్తున్న ఎల్లో మీడియా నువ్వే రాజు, నువ్వే మంత్రి అని కీర్తించడం కూడా గమనార్హమే. ఇది రేవంత్కు ఎంత ప్రయోజనమో తెలియదు కాని, ఆ మీడియాకు బాగానే గిట్టుబాటు అవుతుందన్న భావన కలుగుతుంది. ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరడం వెనుక కూడా ఒక ఉద్దేశం ఉన్నట్లు అనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న టీడీపీ అభిమానులు, ఒక సామాజికవర్గ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన ఈ మాటలు చెబుతుండవచ్చు. ఈ రకంగా పలు వ్యూహాలు అమలు చేస్తున్న రేవంత్ మున్సిపల్ ఎన్నికలలో విజయం అంతటిని తన ఖాతాలోనే వేసుకుంటారు. రాష్ట్రం అంతటా తిరిగి ప్రచారం చేసింది ఆయన ఒక్కరే కనుక ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఈ వెసులుబాటు తక్కువగా ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో రేవంత్ నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షుడుగా మరీ అంత బలమైన నేత లేకుండా చూసుకోవడం కూడా ప్లస్ పాయింటే అని చెప్పాలి.ఇక మున్సిపల్ ఎన్నికలలో విజయాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ను మరోసారి గెలిపిస్తాయన్న భావన రేవంత్ తదితర కాంగ్రెస్ నేతలలో ఉండవచ్చు. కానీ, ఈ స్థానిక ఎన్నికలే కొలమానంగా తీసుకోలేం. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడుతుంది. బీఆర్ఎస్, బీజేపీలను నైతికంగా దెబ్బతీయడానికి ఉపయోగపడతాయి. కేసీఆర్ రెండో టర్మ్లో బీఆర్ఎస్ అన్ని జెడ్పీలను, 90 శాతం మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. కానీ, ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైంది. లోక్సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయింది. బీజేపీ సడన్గా ఎనిమిది సీట్లలో విజయం సాధించింది. కానీ, స్థానిక ఎన్నికలలో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేకపోయింది. బీఆర్ఎస్కు కాస్త మెరుగైన ఫలితాలే వచ్చినా అవి కొంత ధైర్యాన్ని ఇవ్వవచ్చు కానీ, పూర్తి విశ్వాసాన్ని ఇవ్వలేకపోవచ్చు.ఒకప్పుడు స్థానిక ఎన్నికలు కూడా ప్రజాభిప్రాయానికి ఒక ప్రాతిపదికగా ఉండేవి. ఉదాహరణకు 2001లో ఉమ్మడి ఏపీలో జరిగిన జెడ్పీ ఎన్నికలలో 11 చోట్ల టీడీపీ, 10 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మున్సిపాల్టీలలో కూడా హోరాహోరీగా ఎన్నికలు సాగేవి. కానీ, విభజన తర్వాత స్థానిక ఎన్నికలలో 70 నుంచి 90 శాతం వరకు అధికారంలో ఉన్న పార్టీలే గెలుచుకుంటున్నాయి. ఈ ఎన్నికలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిపోతామని అనుకుంటే అది ఒక్కోసారి భ్రమ అవుతుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒక రీతిలో ఉండవు. ఈ మున్సిపల్ ఎన్నికలతోనూ, పార్టీ హైకమాండ్ లోను, అలాగే పార్టీ ఇతర సీనియర్ నేతలపైన పట్టు సాధించినంత వరకు రేవంత్కు సంతోషమే. అసెంబ్లీ ఎన్నికలలో విజయానికి ఇవి సరిపోతాయని అనుకోజాలం. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తిస్తే ఆయనకే మంచిది. రాజకీయాలలో ఎప్పుడు ఎవరు రాజు అవుతారో, ఎప్పుడు ఎవరు మంత్రి అవుతారో, ఎప్పుడు అడ్రస్ లేకుండా పోతారో చెప్పజాలం. ఆ విషయాన్ని రాజకీయ నేతలు విస్మరించరాదని చెప్పక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
AP Budget 2026-27: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్
సాక్షి,అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్లో టోకరా పెట్టింది. పీఆర్సీ, ఐఆర్పై ప్రస్తావన లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో సీపీఎస్ రద్దుపైనా ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించ లేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చింది. మూడు బడ్జెట్ లవుతున్నా ఐఆర్ ఇవ్వకపోవడంపై ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు.
క్రికెట్కు బ్రేక్.. పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ
నిన్నటివరకు మైదానంలో బౌలర్లను బెంబేలెత్తించిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు క్లాస్రూమ్లో కూర్చుని పరీక్షలు రాసేందుకు సిద్దమయ్యాడు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు పరీక్షలకు అతడు హాజరు కానున్నాడు. బిహార్లోని సమస్తిపుర్లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్లో వైభవ్ ఈ పరీక్షలు రాయనున్నాడు.వైభవ్ సూర్యవంశీ మా పాఠశాలలో 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కానున్నాడు. అతడికి ఇప్పటికే అడ్మిట్ కార్డ్ అందించాము. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు వైభవ్ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అతడు ఇంకా విద్యార్ధి కాబట్టి ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదు. అందరితో కలిసే పరీక్షలు రాయనున్నాడు. అందుకు తగ్గట్టు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోడార్ స్కూల్ ప్రిన్సిపాల్ నీల్ కిషోర్ సిన్హా పేర్కొన్నారు.కాగా 14 ఏళ్ల వైభవ్ ఐపీఎల్-2025లో రాజస్తాన్ తరపున కేవలం 15 బంతుల్లో సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కూడా భారత్-ఎ జట్టు, అండర్-19 జట్టు తరపున సంచలన ప్రదర్శనలు చేశాడు. ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్లో సైతం దుమ్ములేపాడు. ఇంగ్లండ్తో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 175 పరుగులతో సత్తాచాటిన వైభవ్.. భారత్ను ఛాంపియన్గా నిలిపాడు. మొత్తంగా 439 పరుగులు చేసిన వైభవ్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' గా నిలిచాడు.చదవండి: వారెవ్వా జింబాబ్వే
అడుక్కుంటున్నా పట్టించుకోవట్లే.. హీరోయిన్ మేకప్ ఆర్టిస్ట్
‘ప్రజా తీర్పును కాలరాస్తే.. వారిని తిరగనివ్వను’
ఒమన్ను చిత్తు చేసిన ఐర్లాండ్.. సెమీస్ ఆశలు సజీవం
కాబోయే భార్యకు ముద్దుపేరు.. వాలంటైన్స్ డే వీడియో
పవన్పై అంబటి రాంబాబు కుమార్తె ఫైర్
‘నారా వారి నకిలీ బడ్జెట్ ప్రవేశపెట్టారు’
రూ.100, రూ.500 నోట్ల రద్దు!.. నిజమేనా?
బన్నీని చూసి బాలీవుడ్ రగిలిపోతోందా?
ఎప్స్టీన్ను గొంతు నులిపి చంపేశారు : ఫోరెన్సిక్ నిపుణుడు సంచలన వ్యాఖ్యలు
ఏపీ బడ్జెట్ అభూత కల్పన: వైఎస్సార్సీపీ
ఎయిరిండియా విమానం దోషి... పైలట్ సుమీత్ సబర్వాల్!
పతనమైన పసిడి విలువ.. కారణాలు..
T20 WC 2026: బాంబు పేల్చిన సూర్యకుమార్ యాదవ్
రాజీనామా చేసిన వారికి ఆహ్వానం
రామ్చరణ్ ట్విన్స్ బారసాల.. చిరంజీవి పేరు కలిసొచ్చేలా..
ICC: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్ ఆరోపణలు
IND vs PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్న్యూస్!
భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే..
ఓటీటీలో 'జీవా' హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మనం శిక్షించడం దేనికి దేవి! ప్రజలే శిక్షిస్తారు!!
బంగారం లాంటి న్యూస్.. భారీగా తగ్గిందోచ్..
ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!
ఒక్కరోజే రూ. 20వేలు డౌన్.. తగ్గుతున్న వెండి రేటు!
ఈ రాశి వారికి స్థిరాస్తివృద్ధి.. నూతన ఉద్యోగయోగం
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడటానికి ప్రజల నుంచి వచ్చిన ఇష్యూస్ సార్
ఈ రాశి వారికి వ్యాపారవృద్ధి.. ఉద్యోగులకు పదోన్నతులు
ఆసీస్ను చిత్తు చేసిన ఆనందంలో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్
T20 WC 2026: భారీ లక్ష్య ఛేదన.. చరిత్ర సృష్టించిన ఒమన్ ప్లేయర్
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
అడుక్కుంటున్నా పట్టించుకోవట్లే.. హీరోయిన్ మేకప్ ఆర్టిస్ట్
‘ప్రజా తీర్పును కాలరాస్తే.. వారిని తిరగనివ్వను’
ఒమన్ను చిత్తు చేసిన ఐర్లాండ్.. సెమీస్ ఆశలు సజీవం
కాబోయే భార్యకు ముద్దుపేరు.. వాలంటైన్స్ డే వీడియో
పవన్పై అంబటి రాంబాబు కుమార్తె ఫైర్
‘నారా వారి నకిలీ బడ్జెట్ ప్రవేశపెట్టారు’
రూ.100, రూ.500 నోట్ల రద్దు!.. నిజమేనా?
బన్నీని చూసి బాలీవుడ్ రగిలిపోతోందా?
ఎప్స్టీన్ను గొంతు నులిపి చంపేశారు : ఫోరెన్సిక్ నిపుణుడు సంచలన వ్యాఖ్యలు
ఏపీ బడ్జెట్ అభూత కల్పన: వైఎస్సార్సీపీ
ఎయిరిండియా విమానం దోషి... పైలట్ సుమీత్ సబర్వాల్!
పతనమైన పసిడి విలువ.. కారణాలు..
T20 WC 2026: బాంబు పేల్చిన సూర్యకుమార్ యాదవ్
రాజీనామా చేసిన వారికి ఆహ్వానం
రామ్చరణ్ ట్విన్స్ బారసాల.. చిరంజీవి పేరు కలిసొచ్చేలా..
ICC: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్ ఆరోపణలు
IND vs PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్న్యూస్!
భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే..
ఓటీటీలో 'జీవా' హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మనం శిక్షించడం దేనికి దేవి! ప్రజలే శిక్షిస్తారు!!
బంగారం లాంటి న్యూస్.. భారీగా తగ్గిందోచ్..
ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!
ఒక్కరోజే రూ. 20వేలు డౌన్.. తగ్గుతున్న వెండి రేటు!
ఈ రాశి వారికి స్థిరాస్తివృద్ధి.. నూతన ఉద్యోగయోగం
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడటానికి ప్రజల నుంచి వచ్చిన ఇష్యూస్ సార్
ఈ రాశి వారికి వ్యాపారవృద్ధి.. ఉద్యోగులకు పదోన్నతులు
ఆసీస్ను చిత్తు చేసిన ఆనందంలో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్
T20 WC 2026: భారీ లక్ష్య ఛేదన.. చరిత్ర సృష్టించిన ఒమన్ ప్లేయర్
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఫొటోలు
సాహసం శ్వాసగా సాగిపో: విశాఖలో నేవీ విన్యాసాలు (ఫొటోలు)
విశ్వక్సేన్ 'ఫంకీ' సక్సెస్ మీట్ (ఫోటోలు)
ట్రావెల్ అడ్వెంచర్ టాక్ షో 'సోల్ ట్రిప్' (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో నరేశ్- పవిత్ర (ఫోటోలు)
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ ! (ఫొటోలు)
డాక్టర్గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)
క్రిస్టల్ ఐవరీ లెహంగాలో పాలరాతి శిల్పంలా రాధికా స్టన్నింగ్ లుక్స్ ..! (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)
బ్యూటీ విత్ బ్రెయిన్.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? (ఫోటోలు )
సినిమా
కొడుకు, కోడల్ని అభినందించిన చిరంజీవి
కవల పిల్లల రాకతో మెగా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. రామ్చరణ్- ఉపాసన దంపతులకు మూడేళ్ల క్రితం కూతురు క్లీంకార పుట్టగా ఈ ఏడాది జనవరి 31న కవలలు (బాబు, పాప) జన్మించారు. వీరికి ఫిబ్రవరి 11న బారసాల చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు మెగా, కామినేని కుటుంబసభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. అర్థవంతమైన పేర్లుకుమారుడికి శివరామ్ కొణిదెల అని, కుమార్తెకు అన్వీరా దేవి కొణిదెల అని నామకరణం చేశారు. ఈ రోజుల్లో పిల్లలకు నోరు తిరగని పేర్లు పెడుతున్నారు. ఎంత వెరైటీగా ఉంటే అంత బాగుంటుందని ఆలోచిస్తున్నారు. కానీ రామ్చరణ్ దంపతులు మాత్రం ఆధ్యాత్మిక భావనకు పెద్ద పీట వేస్తూ మంచి అర్థవంతమైన పేర్లు పెట్టారు. ఈ విషయంపై తమను చాలామంది అభినందిస్తున్నారంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.కొడుకు- కోడల్ని అభినందించిన చిరంజీవిస్నేహితులు, బంధువులు, అభిమానులు... ఇలా అందరూ కవలల పేర్లు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. ఈ విషయంలో చరణ్, ఉపాసనను అభినందించాల్సిందే! ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా, దేవుడి ఆశీర్వాదం లభించేలా ఎంతో పవిత్రమైన పేర్లను ఎంచుకున్నారు. అందుకు నాకెంతో గర్వంగా ఉంది. మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది.ముందు తరాలకు మార్గనిర్దేశంభక్తి, సంస్కృతి మేళవించిన ఈ పేర్లు ముందు తరాలకు మార్గనిర్దేశం చేసేలా ఉన్నాయి. అలాగే చరణ్.. అతడి నానమ్మ అంజనాదేవి పేరు వచ్చేలా కూతురికి అన్వీరా 'దేవి' పేరు పెట్టడం నా మనసును కదిలించింది. చరణ్, ఉపాసనతో పాటు మీ పిల్లలకు కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్కు ఉసాపన.. లవ్యూ మామయ్య అని కామెంట్ పెట్టింది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) చదవండి: రాజాసాబ్లో డూప్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
లోకేశ్ హీరోగా 'డీసీ'.. వాలంటైన్స్ స్పెషల్ గ్లింప్స్
దర్శకులందరూ హీరోలవుతున్నారు. అలా తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూడా 'డీసీ' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయాన్ని గతేడాది ప్రకటించారు. నేడు (ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజు సందర్భంగా.. బ్లడీ వాలంటైన్ అంటూ డీసీ గ్లింప్స్ వదిలారు. అందులో ప్రేమ కన్నా రక్తపాతమే ఎక్కువ చూపించారు. లోకేశ్ పీకలు కోస్తూ కనిపించాడు. చివర్లో కారుపై కూడా రక్తమే కనిపిస్తోంది. చిన్న వీడియోలోనే ఇంత వయొలెన్స్ ఉంటే సినిమాలో ఎంతుంటుందో చూడాలి!డీసీ విషయానికి వస్తే.. లోకేశ్ దేవదాస్గా, వామిక గబ్బి.. చంద్ర పాత్రలో కనిపించనున్నారు. వీరి పేర్ల కలయిక ఆధారంగానే డీసీ (దేవదాస్ + చంద్ర) అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకతత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు. కాగా ఖైదీ, విక్రమ్, కూలీ సినిమాలతో దర్శకుడిగా క్రేజ్ అందుకున్న లోకేశ్ హీరోగా ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి! చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివ జ్యోతి
రాజాసాబ్లో డూప్? క్లారిటీ ఇచ్చిన మాళవిక
ప్రభాస్- మారుతి కాంబినేషన్లో 'ది రాజాసాబ్' సినిమా ప్రకటించినప్పటి నుంచి విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి. తీరా సినిమా రిలీజయ్యాక కూడా ట్రోలింగ్స్ మరింత పెరిగాయే తప్ప ఆగలేవు. ముఖ్యంగా ప్రభాస్కు చాలాచోట్ల డూప్ ఉపయోగించడంపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఓ ఫైట్ సీన్ కోసం హీరోయిన్ మాళవిక మోహనన్కు కూడా డూప్ ఉపయోగించడంతో తనను కూడా ట్రోల్ చేశారు.ట్రోలింగ్పై స్పందించిన హీరోయిన్తాజాగా ఈ వివాదంపై మాళవిక మోహనన్ స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. ది రాజాసాబ్ సినిమాలో నేనే స్వతాహాగా స్టంట్స్ చేశానని చెప్పుకున్నాను. అయితే నా బాడీ డబుల్ (డూప్) యాక్షన్ సీన్లో ఉన్నట్లుగా ఓ ఫోటో వైరలవుతోంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి స్టంట్ ఆర్టిస్ట్.. అలాగే నా డూప్ కూడా!చిన్నతనం నుంచే..ముందుగా నేను చెప్పొచ్చేదేంటంటే.. నాకు యాక్షన్ అంటే ఇష్టం. ఫైట్ సన్నివేశాల్లో పాల్గొనడాన్ని ఆస్వాదిస్తాను. చిన్నతనం నుంచే నేను స్పోర్టివ్ అమ్మాయిని. కొత్త విషయాలు నేర్చుకోవడం, శరీరాన్ని ఛాలెంజ్ చేయడం అంటే చాలా ఇష్టం. రెండో విషయం.. సెట్లో ఎప్పుడూ స్టంట్ డబుల్స్ సిద్ధంగా ఉంటారు. నటీనటులు సొంతంగా యాక్షన్ సీన్స్ చేసినా సరే వారు అందుబాటులోనే ఉంటారు.రిస్కీ షాట్స్ మాత్రం..వారు అనుభవజ్ఞులు కాబట్టి.. యాక్షన్ డైరెక్టర్ వారిని ఫైట్ రిహార్సల్స్ చేయమని చెప్తాడు. ఫైనల్ షాట్ మాత్రం మాపై చిత్రీకరిస్తారు. అయితే కొన్ని సన్నివేశాలు చాలా ప్రమాదకరం అని భావించినప్పుడు నటులకు బదులుగా స్టంట్ డబుల్ను సీన్ పూర్తిచేయమని అడుగుతారు. ఎందుకంటే ప్రొఫెషనల్స్ అయితే ఏ సమస్యా లేకుండా వాటిని ఈజీగా చేయగలరు.వివరణ అక్కర్లేదుఫైనల్గా.. నేను ఫైట్ సీన్స్ సమర్థవంతంగా చేసేందుకు నా స్టంట్ డబుల్ ఎంతగానో తోడ్పడింది అంటూ వీడియోలు షేర్ చేసింది. ఒక్క ట్వీట్ ద్వారా యాక్షన్ సీన్స్ తానే చేసినట్లు క్లారిటీ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు టాలెంటెడ్ అని మాకు తెలుసు.. నువ్వు ఎలాంటి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది. Been seeing a lot of tweets and articles about how I claimed to do my own stunts for ‘The Rajasaab’ but a body double did it as there’s a photo circulating online of a stunt artist who was my stunt double on the film.Firstly, I do action because I really enjoy doing action.… pic.twitter.com/9ePwlLpti4— Malavika Mohanan (@MalavikaM_) February 13, 2026 చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
యాంకర్, బిగ్బాస్ ఫేమ్ శివజ్యోతి గుడ్న్యూస్ చెప్పింది. తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 12న బేబీ జన్మించగా రెండు రోజులు ఆలస్యంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ పోస్ట్కు ఓ అందమైన ఫోటో జత చేసింది. అందులో శివజ్యోతి కుర్చీలో కూర్చుని నవ్వులు చిందిస్తుండగా ఆమె భర్త గంగూలీ బిడ్డను ఎత్తుకున్నాడు. ఈరోజు (ఫిబ్రవరి 14న) శివజ్యోతి బర్త్డే సందర్భంగా బేబీ రాకను వెల్లడించారు.ఇద్దరి గుండెచప్పుడు ముగ్గురిగా..తనకు ఇంత అందమైన బహుమతిచ్చిన శివజ్యోతికి గంగూలీకి కృతజ్ఞతలు తెలిపాడు. 'హ్యాపీ బర్త్డే, చిన్ని. నీ 33వ పుట్టినరోజుకు ఎంతో అందమైన బహుమతిని తీసుకొచ్చావ్. మన ఇద్దరి గుండెచప్పుడు ఇప్పుడు ముగ్గురిగా మారింది. మాకు పుట్టింది పాప? బాబు? అన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు శివజ్యోతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Ganguly Mantri (@ganguly_manthri) చదవండి: కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ
క్రీడలు
‘చిన్నస్వామి’లో కుంబ్లే, ద్రవిడ్ స్టాండ్స్
బెంగళూరు: చిన్నస్వామి క్రికెట్ స్టేడియం కొత్త స్టాండ్లతో ముస్తాబవుతోంది. భారత దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే పేర్లతో చిన్నస్వామి స్టేడియంలో స్టాండ్లను ఏర్పాటు చేయాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) నిర్ణయించింది. మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కేఎస్సీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో కమిటీ భారత్ తరఫున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన కుంబ్లే, టెస్టు క్రికెట్లో సచిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన పరుగుల వీరుడు ద్రవిడ్లు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ స్టాండ్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మాజీ మహిళా క్రికెటర్ శాంతా రంగస్వామి పేరిట మరో స్టాండ్ను ఏర్పాటు చేస్తారు. అనిల్ కుంబ్లే కేఎస్సీఏ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సహచరులు ద్రవిడ్, శాంతా రంగస్వామిలతో స్టాండ్లను పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు.
భారత పోలో జట్టు పైచేయి
సాక్షి, హైదరాబాద్: రాధా టీఎంటీ అంతర్జాతీయ ఎరీనా పోలో చాంపియన్షిప్లో భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. లక్సెంబర్గ్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత జట్టు 15–5 గోల్స్ తేడాతో నెగ్గింది. తొలి చక్కర్ ముగిశాక భారత్ 6–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్ తరఫున యూసుఫ్ అజ్మీ 2 గోల్స్, కున్వల్ విశాల్ సింగ్ 3 గోల్స్, మొహమ్మద్ నయీముద్దీన్ ఒక గోల్ చేశారు. రెండో చక్కర్లో భారత్ ఐదు గోల్స్ చేసి, రెండు గోల్స్ సమరి్పంచుకుంది. ఈ చక్కర్లో భారత్కు చెతానియా 2 గోల్స్, యూసుఫ్ అజ్మీ 2 గోల్స్ చేయగా, పెనాల్టీ ద్వారా మరో గోల్ వచి్చంది. చివరిదైన మూడో చక్కర్లో భారత్ నాలుగు గోల్స్ సాధించింది. చెతానియా, యూసుఫ్ అజ్మీ రెండు గోల్స్ చొప్పున చేశారు.
వారెవ్వా జింబాబ్వే
ఆ్రస్టేలియా సొంతగడ్డపై ఆడినా... గడప దాటినా... ఫార్మాట్ ఏదైనా... చాంపియన్ జట్టు. ప్రొఫెషనలిజానికిమారుపేరు. అలాంటి జట్టు జింబాబ్వేలాంటి చిన్న జట్టుతో ఓడటం ఎవరి అంచనాలకూ అందని సంచలనమే! ఓ దుర్బేధ్యమైన జట్టు మళ్లీ అదే ప్రత్యర్థి చేతిలో రెండోసారి ఓడితే సంచలనానికి సీక్వెలే కదా! అవును... దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టి20 ప్రపంచకప్లో జింబాబ్వే... ఆస్ట్రేలియాపై సీక్వెల్ బొమ్మ చూపించింది. 2007లో మొదలైన టి20 వరల్డ్కప్లో అప్పటి వన్డే వరల్డ్ చాంపియన్ను కంగుతినిపించి ఔరా అనిపించిన జింబాబ్వే... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రస్తుత వన్డే విశ్వవిజేత ఆస్ట్రేలియాను మట్టికరిపించి తాజా టి20 ప్రపంచకప్లో పెను సంచలనం నమోదు చేసింది. కొలంబో: జింబాబ్వే జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో టి20 ప్రపంచకప్లో ఆ్రస్టేలియాను మరోసారి ‘0’ను చేసింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో జింబాబ్వే తమ ఆధిక్యాన్ని ‘2’తో రెట్టింపు చేసుకుంది. 2007 టి20 ప్రపంచకప్లో కంగారూ జట్టుపై సాధించిన సంచలన విజయాన్ని 19 ఏళ్ల తర్వాత జింబాబ్వే తాజాగా రిపీట్ చేసింది. అప్పుడు మొదటి ప్రపంచకప్ అయితే ఇది పదోది. మధ్యలో 8 మెగా ఈవెంట్లు జరిగినా... ఇరుజట్లు తలపడలేదు. శుక్రవారం గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను కంగుతినిపించింది. టాస్ నెగ్గిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (56 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. క్రీజులోకి వచ్చిన ముగ్గురు బ్యాటర్లు తదివనషె మరుమని (21 బంతుల్లో 35; 7 ఫోర్లు), రియాన్ బర్ల్ (30 బంతుల్లో 35; 4 ఫోర్లు), కెప్టెన్ సికందర్ రజా (13 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు. ఆసీస్ ఈ 120 బంతులు ఆడలేదా? జింబాబ్వే లాంటి కూన జట్టు బ్యాటర్లు 120 బంతులెదుర్కొని ఇద్దరే అవుటైతే... జగజ్జేత కంగారు పడటమేంటి? పది మంది బ్యాటర్లు 117 బంతులకే అవుట్ కావడమేంటి? హెడ్ బృందానికి 170 లక్ష్యఛేదన ఏమాత్రం కష్టమైంది కాదు. కఠినమైంది కాదు. కానీ 19.3 ఓవర్లలోనే 146 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్లెసింగ్ ముజరబాని (4/19), బ్రాడ్ ఇవాన్స్ (3/23) ధాటికి ఓపెనర్లు ఇన్గ్లిస్ (8), కెప్టెన్ హెడ్ (17) గ్రీన్ (0), టిమ్ డేవిడ్ (0)... ఇలా టాప్–4 స్పెషలిస్టు బ్యాటర్లంతా పవర్ప్లేలో 29 పరుగులకే పెవిలియన్కు వెళ్లి ప్రేక్షకులైపోయారు.ఒకే ఒక్కడు మ్యాట్ రెన్షా (44 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్వెల్ (32 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్) ఐదో వికెట్కు 77 పరుగులు జోడించడంతో 100 పైచిలుకు స్కోరు చేయగలిగింది. లేదంటే తర్వాతి బ్యాటర్లు స్టొయినిస్ (6), డ్వార్షుయిస్ (6), ఎలిస్ (7 నాటౌట్), జంపా (2), కునెమన్ (0)ల స్కోర్లు చూస్తే ఏ అత్యల్ప స్కోరుకో పరిమితమయ్యేదేమో! ఔరా మన్యొంగా... జింబాబ్వే ఫీల్డర్ మన్యొంగా కళ్లు చెదిరే క్యాచ్తో ఆకట్టుకున్నాడు. ఇవాన్స్ వేసిన 18వ ఓవర్లో డ్వార్షుయిస్ మిడ్వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. మున్యొంగా దూరంగానే ఉన్నప్పటికీ డీప్ మిడ్వికెట్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి అదే వేగంతో డైవ్ చేసి అందుకున్న క్యాచ్ ఔరా అనిపించింది. టేలర్ స్థానంలో బెన్ కరన్... జింబాబ్వే సీనియర్ ప్లేయర్ బ్రెండన్ టేలర్ గాయం కారణంగా టోర్నీనుంచి తప్పుకున్నాడు. ఒమన్తో మ్యాచ్లో గాయపడిన అతను ఆసీస్తో పోరులో బరిలోకి దిగలేదు. టేలర్ స్థానంలో ఐసీసీ అనుమతితో బెన్ కరన్కు జింబాబ్వే చోటు కల్పించింది. బెన్ కరన్ తమ్ముడు స్యామ్ కరన్ ఇప్పటికే వరల్డ్ కప్లో ఇంగ్లండ్ తరఫున ఆడుతున్నాడు.2 ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టుతో జింబాబ్వే నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడింది. ఇందులో రెండింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. ఆసీస్పై జింబాబ్వే సాధించిన రెండు విజయాలు ప్రపంచకప్లోనే రావడం విశేషం.టి20 ప్రపంచకప్లో నేడుఐర్లాండ్ X ఒమన్వేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి ఇంగ్లండ్ X స్కాట్లాండ్వేదిక: కోల్కతా; మ.గం. 3 నుంచి దక్షిణాఫ్రికా X న్యూజిలాండ్ వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
సూపర్ స్నేహిత్...
చెన్నై: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చెన్నై స్టార్ కంటెండర్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ సంచలన ప్రదర్శనతో మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 100వ ర్యాంకర్ స్నేహిత్ 9–11, 15–17, 11–4, 11–6, 18–16తో ప్రపంచ 61వ ర్యాంకర్ మిజుకి ఒయ్కావా (జపాన్)ను బోల్తా కొట్టించాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో తొలి రెండు గేమ్లు కోల్పోయినప్పటికీ స్నేహిత్ పట్టువదలకుండా పోరాడాడు. వరుసగా మూడు గేమ్లు నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. నిర్ణాయక ఐదో గేమ్లో స్నేహిత్ 8–10తో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నాడు. వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన స్నేహిత్ 10–10తో స్కోరును సమం చేశాక 11–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఆరుసార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 16–16 వద్ద స్నేహిత్ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ మంటలు... విద్యార్థుల ఫీజుల కోసం చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు
ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి, ప్రజా సమస్యలపై గొంతెత్తాలి... వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం
ఏపీలో సూపర్ సిక్స్ మోసాల ఖరీదు లక్షన్నర కోట్ల రూపాయలు.. రాష్ట్ర గవర్నర్తోనూ అవే అబద్ధాలు చెప్పించిన సీఎం చంద్రబాబు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నోటీసుపై 120 మంది విపక్ష ఎంపీల సంతకాలు
ఆంధ్రప్రదేశ్ ఆయకట్టు ఎడారే!. ఆల్మట్టి ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్ దూకుడు ఆంధ్రప్రదేశ్లో ‘ఆప్కాస్’ ఉద్యోగాలకు మంగళం
అమరావతి సైతం ప్రైవేట్ పరం... అందినకాడికి బాదుడే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు
పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ... వియ్యంకుల సంస్థలకు పనుల అప్పగింత
జంగిల్రాజ్పై ప్రశ్నిస్తున్నందుకే గూండా దాడులు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు అరాచకాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
‘లిఫ్ట్’ తాకట్టుపై రాయలసీమ కన్నెర్ర... ఆపిన పనులు రెండు నెలల్లో మళ్లీ మొదలుపెట్టాలని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ... చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
బిజినెస్
ఐటీ రంగంలో ఖర్చుల సెగ..
గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలు సాఫ్ట్వేర్ సేవల కంటే హార్డ్వేర్ మౌలిక సదుపాయాలకే పెద్దపీట వేస్తున్నాయి. దీనివల్ల భారతీయ ఐటీ సేవల కంపెనీలు తాత్కాలిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ స్టాక్ ధరల తగ్గింపు దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఒక అద్భుతమైన కొనుగోలు అవకాశాన్ని అందిస్తోందని క్వాంటం ఏఎంసీ ఫండ్ మేనేజర్ (ఈక్విటీస్) క్రిస్టీ మథాయ్ చెబుతున్నారు.మారిన వ్యయాల ప్రాధాన్యతప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. దీంతో కంపెనీలు తమ బడ్జెట్ను డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, హై-ఎండ్ ప్రాసెసర్ల వైపు మళ్లిస్తున్నాయి. ఎన్విడియా వంటి హార్డ్వేర్ కంపెనీలు లాభపడుతుంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (SaaS), సంప్రదాయ ఐటీ సర్వీస్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ మార్పుల వల్ల లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఇటీవల భారీగా క్షీణించాయి.సెంటిమెంట్ కంటే ఫండమెంటల్స్ బలంగా..మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ ఐటీ కంపెనీల ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల నుంచి ఐటీ ఆర్డర్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. కంపెనీలు ఇప్పుడు నేరుగా ఏఐ ప్రాజెక్టుల ద్వారా ఆదాయాన్ని పొందడం ప్రారంభించాయి. కీలక రంగాల్లో ఆర్డర్ బుక్స్ ఆశాజనకంగా ఉన్నాయని, ఇది భవిష్యత్తు వృద్ధికి సంకేతమని మథాయ్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..
ఇల్లు.. పిల్లలకు నచ్చేలా..
కొత్త ఆలోచనలు, ఆసక్తి, కుతూహలం వంటి లక్షణాలన్నీ చిన్నారుల్లో అధికంగా ఉంటాయి. వారికంటూ ఒక ప్రత్యేక ప్రపంచం ఉంటే ఇవి మరింత ఇనుమడిస్తాయి. వారిలో సృజనాత్మక శక్తి ఊపిరి పోసుకుంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంట్లోనూ వారి కోసం ఓ ప్రత్యేక ప్రపంచం ఉండాలని భావిస్తున్నారు. చిల్డ్రన్ స్పెషల్ రూమ్లు ఈ భావనతోనే ఆవిర్భవించాయి. కాన్సెప్ట్ బాగుండటంతో ఇంటీరియర్ డెకరేటర్స్ సలహాలు తీసుకుంటున్నారు. సరైన ప్రణాళికను అనుసరిస్తే భేషుగ్గా మీరే మీ పిల్లల గదిని తీర్చిదిద్దుకోవచ్చు. ఆసక్తి, అభిరుచి, వయస్సు.. పిల్లల రూమ్ ఇలాగే ఉండాలని రూల్ ఏమీ లేదు. వారి ఆసక్తి, అభిరుచి, వయస్సు, జెండర్ దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. దీనికితోడు పిల్లల ఆరోగ్యం, చదువు, ప్రవర్తనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న వయసులో అందరు పిల్లలకు ఉండే ఉత్సాహానికి ఊతమిచ్చేలా కొంచెం సృజనాత్మకత, ఆడంబరాన్ని జోడిస్తే ఆ గదికి తిరుగే ఉండదు. అయితే క్షణానికో కొత్త ఇంటీరియర్ పుట్టుకొస్తున్న తరుణంలో అన్ని హంగులు అమర్చుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారమే..రంగులే కీలకం.. పిల్లలను ఆకట్టుకొనేలా గదిని రూపొందించడంలో రంగులకు కావాల్సినంత ప్రాధాన్యం ఉంది. మానసిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చిన్న పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్ కూడా ఓకే. ఇక వయోలెట్, పింక్ కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగు ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేరు చోట్ల రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు. ఒక్కో రంగు ఒక్కో విధమైన ప్రేరణ కల్పిస్తుందని కలర్ సైకాలజీ చెబుతోంది. కాబటి తేలిక రంగులు వేస్తే మంచిది. పిల్లలకు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగచేయవచ్చు. సీలింగ్కు చీకట్లో కూడా మెరిసే విధంగా ఉండే మెటాలిక్ రంగులు వేస్తే చీకట్లోనూ హాయిగా నిద్రపోతారు.కంటికి శ్రమ కలిగించని లైటింగ్.. లైట్ల విషయానికి వస్తే బాగా వెలుతురు అందించే ఫ్లోరోసెంట్ బల్బులను వాడాలి. కంటిపై ఎలాంటి ప్రభావం చూపకుండా, చదువుకొనేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండాలి. పిల్లల గది కదా అని హంగామా చేసి అన్ని వస్తువులను పేర్చేయకుండా అవసరమైన మేరకు ఉంచాలి. వారి అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తూనే ఆకట్టుకొనే విధంగా రూపొందించాలి.
బంగారం కొనబోతే షాక్! ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశంలో బంగారం, వెండి ధరలు షాక్ ఇచ్చాయి. రెండు రోజులుగా వరుస తగ్గుదలతో ఆనందంలో ఉన్న కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
భారత్లో రోల్స్-రాయ్స్ విస్తరణ చర్యలు
ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్, ఇంజినీరింగ్ దిగ్గజం రోల్స్-రాయ్స్ భారత్లో తన కార్యకలాపాలను భారీ స్థాయిలో విస్తరించనున్నట్లు ప్రకటించింది. బ్రిటన్కు చెందిన ఈ సంస్థ భారత రక్షణ రంగ అవసరాల కోసం అత్యాధునిక సాంకేతికతను అందించడమే కాకుండా స్థానికంగా ఇంజిన్ల తయారీకి సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రోల్స్-రాయ్స్ సీఈఓ తుఫాన్ ఎర్గిన్ బిల్గిక్ ఇటీవల సమావేశమైన నేపథ్యంలో ఈ కీలక ప్రకటన వెలువడటం విశేషం.ప్రకటనలోని అంశాలు..భారత తదుపరి తరం యుద్ధ విమానాల కోసం 120 కేఎన్ క్లాస్ కాంబాట్ జెట్ ఇంజన్ను అభివృద్ధి చేసేందుకు రోల్స్-రాయ్స్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశానికి పూర్తి మేధో సంపత్తి హక్కులతో పాటు వంద శాతం సాంకేతిక బదిలీ జరుగుతుంది. ఇది స్వదేశీ రక్షణ పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. భారత ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ కోసం అవసరమైన ఇంజన్లను భాగస్వామ్య సంస్థలతో కలిసి ఇక్కడే తయారు చేయడంపై కంపెనీ దృష్టి సారించింది.వికసిత్ భారత్ దిశగా అడుగులుప్రధాని మోదీతో భేటీ సందర్భంగా భారత ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల్లో పాలుపంచుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఎర్గిన్ బిల్గిక్ వెల్లడించారు. ‘మా అత్యాధునిక సాంకేతికతతో భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాం’ అని సీఈఓ అన్నారు.ఉపాధి, ఆర్థిక వృద్ధిఈ విస్తరణ ప్రణాళికల వల్ల భారత్లో భారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ప్రస్తుతం రోల్స్-రాయ్స్, దాని భాగస్వామ్య సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను సుమారు 10,000 కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రస్తుత సంఖ్య కంటే రెట్టింపు. భారత్ నుంచి కంపెనీ చేసే ఔట్ సోర్సింగ్ సర్వీసులు రాబోయే కాలంలో 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ లబ్ధి చేకూరుతుంది. రక్షణ రంగమే కాకుండా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అవసరమైన పవర్ సొల్యూషన్లను అందించడానికి కూడా సంస్థ సిద్ధమవుతోంది.ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..
ఫ్యామిలీ
గుండెను కోసే గాయం…
ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి అయితే, అది విఫలమైనప్పుడు కలిగే బాధ ఒక నరకం. "ఆమె లేకపోతే నా ప్రపంచం శూన్యం", "ఆమె లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేను" అనే భావన ఒక వ్యక్తిని ఆత్మహత్య అనే అగాధం వైపు నడిపిస్తుంది.'అజయ్' (పేరు మార్చాను) అనే 26 ఏళ్ల యువకుడి జీవితంలో జరిగిన సంఘర్షణ ద్వారా ఈ మరణపు అంచులను స్పృశించే మనస్తత్వాన్ని అర్థం చేసుకుందాం.‘‘నేను మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటున్నాను, నన్ను మర్చిపో' అని ఆమె పంపిన పది పదాల ఆఖరి మెసేజ్ చదవడానికి నాకు గంట పట్టింది సర్. నా కళ్ల ముందు ప్రపంచం తిరుగుతున్నట్లు అనిపించింది. అప్పటిదాకా నా భవిష్యత్తు గురించి నేను వేసుకున్న ప్లాన్స్, ఆమెతో కలిసి కన్న కలలు అన్నీ ఒక్క నిమిషంలో బూడిద అయిపోయాయి.ఆమె వెళ్ళిపోయింది కానీ, ఆమె జ్ఞాపకాలు నా రూమ్ నిండా దెయ్యాల్లా తిరుగుతున్నాయి. ఆమె వాడిన పర్ఫ్యూమ్ వాసన వచ్చినా, ఆమెకు ఇష్టమైన పాట విన్నా నా ఒళ్ళు వణికిపోతోంది. ఫోన్ లో ఆమె పాత మెసేజ్ లు, వాయిస్ నోట్స్ చదువుతూ రాత్రంతా పిచ్చోడిలా ఏడుస్తుంటాను.ఆమె ఆన్లైన్ లో ఉంటే.. ఎవరితో మాట్లాడుతోంది? నాకంటే మంచివాడు దొరికాడా? తనకి నా బాధ అస్సలు గుర్తు లేదా? అని నా మెదడు నన్ను వెయ్యి ప్రశ్నలతో వేధిస్తోంది.ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన ఎంగేజ్మెంట్ ఫోటో చూసినప్పుడు.. నా ప్రాణం పోయిందనిపించింది సర్. 'ఆమె లేని ఈ లోకం నాకెందుకు?' అనే ఆలోచన నా మనసులో ఒక వైరస్ లా నాటుకుపోయింది. నేను చనిపోతేనే ఆమెకు నా విలువ తెలుస్తుందని, నా సమాధి దగ్గరకు వచ్చి ఆమె ఏడుస్తుంటే చూడాలని ఒక రకమైన వికృతమైన కోరిక.నేను ఫెయిల్యూర్ ని అని, నా ప్రేమను కూడా నేను కాపాడుకోలేకపోయానని నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఫ్యాన్ కు తాడు వేసుకుని గంట సేపు చూస్తూ కూర్చున్నాను సార్.. కానీ నా తల్లిదండ్రుల ముఖాలు గుర్తొచ్చి ఆగిపోయాను. అయినా నా మనసు వినడం లేదు.. 'నువ్వు బ్రతకడం వేస్ట్' అని ఒకటే అరుస్తోంది.ఆకలి చచ్చిపోయింది. ఆఫీసులో పని మీద ఏకాగ్రత లేదు, బాస్ తిడుతున్నా నాకు ఏమీ అనిపించడం లేదు. నిద్ర లేని కళ్లు, చిందరవందరగా ఉన్న గది.. నేను నాలా లేను సార్. బ్రతికి ఉన్న శవంలా ఉన్నాను.ఆమె నా కాల్స్ ఎత్తడం లేదు, బ్రతిమాలినా కనీసం ఒక్కసారి కూడా మాట్లాడటం లేదు. ఇంత నిర్లక్ష్యం చూశాక కూడా ఆమె కోసం నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలియడం లేదు సార్" అని కన్నీళ్లు పెట్టుకున్నాడు అజయ్.అజయ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. నాలుగేళ్లుగా తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి తనను కాదని వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. దాంతో అజయ్ జీవితం నరకంలా మారింది. అజయ్ పడే బాధ కేవలం ఎమోషనల్ కాదు, అతని మెదడులో జరుగుతున్న రసాయనిక మార్పుల వల్ల కలిగే శారీరక హింస.బ్రేకప్ అంటే కేవలం ఒక వ్యక్తి దూరమవ్వడం కాదు.. శరీరాన్ని, మనసును మొద్దుబారిన కత్తితో కోసినట్లు ఉంటుంది. ఆ నొప్పి కంటికి కనిపించదు, కానీ ప్రతి సెకను చంపేస్తుంటుంది.బ్రేకప్ అనేది ఒక 'డ్రగ్ విత్ డ్రాయల్' (The Neurological Agony) అజయ్ అనుభవిస్తున్న ఈ స్థితి వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాలను గమనిస్తే, ఇది కేవలం బలహీనత కాదని అర్థమవుతుంది.🔹ది బ్రైన్ ఇన్ విత్ డ్రాయల్ (The Addictive Loop): ప్రేమలో ఉన్నప్పుడు మెదడులో Dopamine (Happy Hormone), Oxytocin (The Cuddle Hormone) విపరీతంగా విడుదలవుతాయి. బ్రేకప్ అయినప్పుడు, మెదడు ఒక్కసారిగా ఈ హార్మోన్ల సరఫరాను ఆపేస్తుంది. ఇది ఒక మాదక ద్రవ్యానికి బానిసైన వ్యక్తికి ఆ డ్రగ్అందకపోతే ఎంత బాధ కలుగుతుందో (Withdrawal Symptoms), అంతటి నొప్పిని కలిగిస్తుంది.🔹సోషల్ పెయిన్ ఈజ్ ఫిజికల్ పెయిన్: సైకాలజీ ప్రకారం, మనసు పడే బాధను మెదడులోని Anterior Cingulate Cortex అనే భాగం గుర్తిస్తుంది. విచిత్రం ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని కొట్టినప్పుడు కలిగే శారీరక నొప్పిని గుర్తించే మెదడు భాగమే, మనసు గాయపడినప్పుడు కూడా స్పందిస్తుంది. అంటే, అజయ్అనుభవిస్తున్న మనోవేదన ఒక ఎముక విరిగినప్పుడు కలిగే నొప్పి కంటే తక్కువేమీ కాదు.🔹The Amygdala Hijack: అజయ్ మెదడులోని Amygdala (భయం, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసే భాగం) పూర్తిగా అతని లాజికల్ మెదడును (Prefrontal Cortex)డామినేట్ చేస్తోంది. అందుకే అతనికి సూసైడ్ అనేది ఒకే ఒక్క పరిష్కారంలా కనిపిస్తోంది. దీన్నే 'టన్నెల్ విజన్' అంటారు. 🔹Obsessive Rumination: ‘‘నా తప్పు ఏంటి? ఆమె ఎందుకు మారింది?’’ అని పదే పదే ఆలోచించడం వల్ల మెదడులో Default Mode Network (DMN) అతిగా పని చేస్తుంది. దీనివల్ల బాధితుడు తన గతాన్ని వదలలేక పోతాడు.🔹The Revenge Fantasy: చాలా మంది "నేను చనిపోతే ఆమె బాధపడుతుంది" అని అనుకుంటారు. ఇది ఒక తప్పుడు రివెంజ్ ఫాంటసీ. చనిపోయిన తర్వాత వారు చూసే బాధను చూడటానికి మీరు ఉండరు అనే నిజాన్ని మెదడు ఆ సమయంలో గ్రహించలేదు. ఇది కేవలం క్షణికావేశంలో మెదడు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం (Executive Dysfunction).దీనివల్ల కలిగే తీవ్ర నష్టాలు… 🔸Clinical Depression: కేవలం బాధగా ఉండటం కాదు, ఇది తీవ్రమైన క్లినికల్ డిప్రెషన్ కు దారితీసి మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. 🔸Self-Harm: తనని తాను కోసుకోవడం లేదా ఆత్మహత్యకు ప్రయత్నించడం ద్వారా మానసిక నొప్పి నుండి ఉపశమనం పొందాలని చూడటం. 🔸Future Anxiety: "నేను మళ్ళీ ఎవరినీ ప్రేమించలేను", "ఎవరు వచ్చినా నన్ను వదిలేస్తారు" అనే భయంతో మిగిలిన జీవితాన్ని నాశనం చేసుకోవడం.ఆవేదన నుండి ఆనందం వైపు (The Path to Recovery) అజయ్ ను ఆత్మహత్య నుండి కాపాడి, అతని జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇవ్వడానికి మేము Multimodal Therapy ఉపయోగించాము. అజయ్ దగ్గర ఉన్న పదునైన వస్తువులను, ప్రమాదకరమైన మెడిసిన్స్ను తొలగించమని అతని స్నేహితులకు చెప్పాము. ఒంటరిగా ఉండనివ్వలేదు."ఈ బాధ శాశ్వతం కాదు, ఇది కేవలం మెదడులోని రసాయనాల చర్య" అని అతనికి అర్థమయ్యేలా వివరించాము. అతని ఫోన్ నుండి ఆమె ఫోటోలు, నంబర్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ డిలీట్ చేయించాము.అజయ్ లో డోపమైన్, సెరోటోనిన్ పెంచడానికి రోజూ జిమ్ కి వెళ్లేలా చూశాము. తన పాత హాబీలను మళ్ళీ మొదలుపెట్టేలా ప్రోత్సహించాము. CBT, NLPt, Grief Counseling ద్వారా అతని ఆలోచనలను మార్చుకునేలా చేశాం .The Transformation ఆరు నెలల చికిత్స తర్వాత, అజయ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఆఫీసులో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అందుకున్నాడు.🏆"సార్, ఆ రోజు మీ దగ్గరకు రాకపోయి ఉంటే నేను ఒక జ్ఞాపకంగా మిగిలిపోయేవాడిని. ఇప్పుడు నా జీవితం నాది. ప్రేమ కంటే నా ప్రాణం, నా కెరీర్ చాలా పెద్దవని నాకు అర్థమైంది" అని నవ్వుతూ చెప్పాడు.అజయ్ కథ మీ కథేనా? బ్రేకప్ బాధ మీ ప్రాణం తీస్తోందా? గుర్తుంచుకోండి.. మీరు ప్రేమించిన వ్యక్తి మీ జీవితం కావచ్చు, కానీ వాళ్ళు మీ ఊపిరి కాదు. ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రాన మీ జీవితం ముగిసిపోదు. ఆ నల్లని మేఘాల వెనుక ప్రకాశవంతమైన సూర్యుడు ఉన్నాడని గుర్తించండి. మీ మనసు గాయాన్ని మాన్పించడానికి, మీకు మళ్ళీ బ్రతకాలనిపించేలా చేయడానికి శాస్త్రీయమైన చికిత్స ఉంది.మీ వివరాలు 100 శాతం గోప్యంగా ఉంటాయి. సహాయం కోసం ఈ రోజే సంప్రదించండి.— మీ సైకాలజిస్ట్,Psy. Vishesh
శెభాష్ బామ్మ..! ఆ ధైర్యమే అందరికీ కావాల్సింది..
కొన్ని విషయాలు చూడటానికి సాధారణ చిన్న చిన్న తప్పులుగా కనిపిస్తున్నా ..అవే ఒకరకంగా ఘోర ప్రమాదాలకు మూలం కూడా. పోనీలే అని వదిలేయడం కూడా ఒక కారణం. ఎవ్వరు అనడం లేదు కదా మనం ఒక్కరమే వ్యతిరేకించడం దేనికని వదిలేస్తుంటాం. కానీ కొందరు విభిన్నంగా ఉంటారు. డిఫెరెంట్గా ఆలోచించడమే కాదు..ఒక్కరిగా.. హీరోలా వీరోచితంగా పోరాడి శెభాష్ అని ప్రశంసలందుకుంటారు. ఔను కదా..! మనమెందుకు అలా చేయలేకపోయాం అని ఆలోచింపచేసేలా స్ఫూర్తిని కలిగిస్తారు కూడా. ఇంతకీ ఏం జరిగిందంటే..కేరళకు చెందిన ఓ వృద్ధ మహిళ రద్దీగా ఉండే రోడ్డుకి ఒకపక్కను ఉన్న ఫుట్పాత్పై నడుస్తుంటుంది. ఇంతలో ఒక ద్విచక్ర వాహనదారుడు స్కూటీపై దర్జాగా ఫుట్పాత్పై వచ్చేస్తుంటాడు. అది గమనించిన మహిళ అతడిని వెళ్లనివ్వకుండా అడ్డగిస్తుంది. పాదాచారులు నడవకుండా మీది నుంచి వెళ్లిపోతావా అని అరుస్తూ అతడిని వెళ్లనివ్వకుండా అడ్డుకునే యత్నం చేస్తుంది. ఇక్కడ ఆ స్కూటర్ రైడర్ కూడా ఏదో విధంగా ఆమెను తప్పించి వెల్లిపోయే సాహసం చేస్తుంటాడు ఓ పక్కన. అయితే ఆ వృద్ధ మహిళ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అతడి స్కూటర్ని ఫోటోతీసి భయపెట్టి ప్రయత్నం చేస్తుండగా..దెబ్బకు చేసేది లేక వెనక్కి తగ్గి.. నెమ్మదిగా స్కూటర్ని టర్న్ చేసుకుంటూ రోడ్డ మీదకు వెళ్లిపోతాడు. చివర్లో బొటనవేలుని చూపిస్తూ..యాహు గెలిచా..! అన్నట్లుగా చిరునవ్వు చిందించింది ఆ బామ్మ. అలా మనలో ఎంతమంది సాహసం చేయగలం అని ఆలోచిస్తే..సమాధానమే రాదు కదా..!. నిజానికి మనందరికీ కావాల్సింది ఇలాంటి ధైర్యమే అప్పుడు పెను రోడ్డు ప్రమాదాలను కొంతైనా నివారించగలుగుతాం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కానీ చాలామంది అవతల వ్యక్తి దూకుడుగా ప్రవర్తిస్తే మనం ఇబ్బదుల్లో పడే అవకాశం లేకపోలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. చాలామటుకు ఇలా చేయడం వల్ల కాస్త భయంతో అయినా..అలా ఫుట్పాత్పై వెళ్లేందుకు జంకుతారని కొందరు వాదిస్తూ పోస్టులు పెట్టారు. కాగా, ఫుట్పాత్పై ద్విచక్ర వాహనాన్ని నడపడం చట్టవిరుద్ధం. ఫుట్పాత్లు కేవలం పాదచారుల కోసం మాత్రమే. దీన్ని ఉల్లంఘిస్తే..జరిమానా, ఆరు నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ కేరళ మోటార్ వాహనాల నియమాలు, 1989 ప్రకారం, ఫుట్పాత్పై ద్విచక్ర వాహనాన్ని నడపడం చట్టవిరుద్ధం కూడా. View this post on Instagram A post shared by Aflah E (@aflu__stories_) (చదవండి: గిఫ్ట్గా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు..! ఎక్కడంటే..)
ఆల్‘ఇంటి’యా రేడియో!
వన్స్ అ పాన్ ఏ టైమ్ రేడియో అంటే... ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కాదు. మన కుటుంబసభ్యురాలు! ΄÷ద్దుటే సుప్రభాతంతో నిద్ర లేపి, ప్రపంచంలో, దేశంలో ఏ మూలన ఏం జరుగుతుందో చెప్పి, బుర్ర హీటెక్కి పోకుండా చల్లని పాటలు వినిపించి... ఒక్కటా రెండా... రేడియో అంటే అంతులేని అపురూపమైన జ్ఞాపకాల సంపద....ఆకాశవాణి–రజనిమన ఆకాశవాణిని జనరంజకం చేసిన వారిలో బాలాంత్రపు రజనీకాంతరావు ఒకరు. ఆకాశవాణిలో స్వరకర్తగా, గీతరచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వహించారు. లలిత సంగీతాన్ని ఆకాశవాణి వేదికగా జనరంజకం చేశారు. 1947 ఆగస్ట్ 15 భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి, ప్రధాని నెహ్రూ ప్రసంగం తరువాత రజని రచించి, స్వర పరిచిన ‘మాదీ స్వతంత్రదేశం’ ప్రసారం అయింది.99%: ఆకాశవాణిగా ప్రసిద్ధమైన ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) ప్రపంచంలో అతి పెద్ద ప్రసార సంస్థలలో ఒకటి. 23 భాషలలో, 179 మాండలికాలలో మన దేశంలోని 99 శాతం మందికి చేరువైంది.ఆకాశవాణి – ఆధ్యాత్మికం – ఉషశ్రీరామాయణ, భారత, భాగవతాలను ఆకాశవాణి వేదికగా సామాన్యులకు చేరువ చేశారు ఉషశ్రీ. భగవద్గీత, సుందరకాండలను అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఆయన నిర్వహించిన ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం చాలా జనాదరణ పొందింది. పౌరాణికాలకు సంబంధించి ఎంత జటిలమైన విషయాన్ని అయినా సులభంగా అర్థమయ్యేలా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి.1923: బాంబే రేడియో క్లబ్ కార్యక్రమాలతో 1923లో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. మొదటి న్యూస్ బులెటిన్ జనవరి 19, 1936లో ప్రసారం అయింది.ఆకాశవాణి–మహానటిమహానటి సావిత్రి సమర్పించిన జనరంజని ప్రత్యేక కార్యక్రమం 1979లో ఉగాది రోజున ప్రసారం అయింది.సిగ్నేచర్ ట్యూన్ శివరంజనిశివరంజని రాగం ఆధారంగా వాల్టర్ కౌప్మన్ ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్ను స్వరపరిచారు. వయోలిన్పై వాయించారు.జనం మెచ్చిన జనరంజనిశ్రోతలు కోరిన పాటల కార్యక్రమం ‘జనరంజని’ అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమాలలో ఒకటి. ఆదివారాలు, పండగ రోజుల్లో ప్రత్యేక జనరంజని కార్యక్రమాలు ప్రసారమయ్యేవి.బారిష్టర్ పార్వతీశం రాకతో రేడియో నవ్వింది!మొక్క పాటి ప్రసిద్ధ హాస్య నవల ‘బారిస్టర్ పార్వతీశం’ ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన నాటకాల్లో ఒకటి.రేడియోలో వేటూరి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమైన వేటూరి సంగీత రూపకం ‘సిరికాకొలను చిన్నది’ అద్భుతమైన ఆడియో నాటిక. ఈ సంగీతక రూపకానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు.థీమ్ 2026ఈ సంవత్సరం ‘వరల్డ్ రేడియో డే’ థీమ్...‘రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏఐ ఈజ్ ఏ టూల్, నాట్ ఏ వాయిస్’
రెట్రో క్వీన్ కల్పనా ఈజ్ బ్యాక్
ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉండే నేటి డిజిటల్ కాలంలో కూడా కానీ కొన్ని క్లాసిక్స్కు ఎప్పటికీ కాలం చెల్లదన డానికి 1981లో ఒక వెలుగు వెలిగిన రంభ హో పాట, ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్తం గా మార్మోగి పోతోంది. కారణం ఒరిజినల్ రంభా హో గర్ల్ కల్పనా అయ్యర్ తన 69 ఏళ్ల వయసులో చేసిన ఒక అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్. పశ్చిమ బెంగాల్ సిలిగురిలోని ఒక పెళ్లి వేడుకలో ఈ మ్యాజిక్ జరిగింది. తన స్నేహితురాలి కుమారుడి పెళ్లికి వెళ్లిన కల్పనా, అక్కడివారి కోరిక మేరకు ఏమాత్రం ΄్లాన్ చేయకుండానే స్టేజ్ ఎక్కారు. లెజెండరీ సింగర్ ఉషా ఉతుప్ పాడిన అత్యంత ప్రసిద్ధ పాటల్లో ఒకటైన రంభహో పాటకు ఆమె తనదైన శైలిలో స్టెప్పులేసి సందడి చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అవ్వడంపై కల్పనా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అభిమానులంతా తనపట్ల చూపిస్తున్న ప్రేమకి ఎంతో సంతోషంగా ఉందని ఆమె కృతజ్ఞతలు తెలి పారు. కల్పనా అయ్యర్ 1980లలో బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన డాన్సర్, నటి. ఆమె 1978లో మిస్ ఇండియా రన్నరప్గా నిలిచారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా డిస్కో డాన్సర్ సినిమాలోని ఔవా ఔవా, అర్మాన్ చిత్రంలోని రంభ హో వంటి పాటలతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమెను అప్పట్లో క్యాబరే క్వీన్ అని పిలిచేవారు. ఈ పాట మళ్ళీ ఇంతలా వైరల్ అవ్వడానికి మరో కారణం బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ధురంధర్ సినిమా కోసం ఈ ఐకానిక్ సాంగ్ను రీమిక్స్ వెర్షన్ లో ఉపయోగించారు. 80ల నాటి ఈ ఎనర్జిటిక్ పాటను నేటి జెన్జెడ్ యువత కూడా ఇష్టపడటం విశేషం.
అంతర్జాతీయం
మాజీ ప్రధాని హసీనా మరణ శిక్షపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)అధికారంలోకి రానుండటంతో, భారత్లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యం చర్చనీయాంశంగా మారింది. 2024 జూలై నాటి విద్యార్థి ఉద్యమంపై ఉక్కుపాదం మోపినందుకు.. 2025 నవంబర్లో బంగ్లాదేశ్లోని ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో బీఎన్పీ ఇటీవలి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు హసీనాను బంగ్లాదేశ్కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం న్యూఢిల్లీలో ప్రవాస జీవితం గడుపుతున్న షేక్ హసీనా.. బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికలను ఒక ప్రహసనంగా అభివర్ణించారు. జనవరి 2026లో ఆమె ఢిల్లీ నుండి చేసిన ఒక ఒక ప్రసంగంలో.. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చి, బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. కాగా మానవత్వానికి వ్యతిరేకంగా హసీనా నేరాలకు పాల్పడినట్లు రుజువైనందున, ఆమెను ‘భారత్-బంగ్లాదేశ్ అప్పగింత ఒప్పందం’ కింద తిరిగి తమ దేశానికి పంపాలని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఇప్పటికే భారత్ను కోరింది.మరణశిక్ష పడిన వ్యక్తికి ఆశ్రయం కల్పించడం న్యాయవ్యవస్థను అవమానించడమేనని బంగ్లాదేశ్ నేతలు అంటున్నారు. ఈ సున్నిత అంశంపై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్ 2025లో ఆయన మాట్లాడుతూ, హసీనా ‘కొన్ని విలక్షణమైన పరిస్థితులలో’ భారత్కు వచ్చారని, ఆమె భవిష్యత్తు గురించి తుది నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. ట్రిబ్యునల్ తీర్పును భారత్ గమనించిందని చెబుతూనే, హసీనా అప్పగింత విషయంలో భారత్ ఆచి తూచి అడుగులు వేస్తున్నదన్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం
‘బంగ్లా’ ఎన్నికల్లో హిందూ అభ్యర్థి ఘన విజయం
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో హిందువులకు సంతోషాన్ని పంచే పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)కి చెందిన హిందూ అభ్యర్థి గయేష్వర్ చంద్ర రాయ్ ఢాకా-3 నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన తన సమీప ప్రత్యర్థి, జమాతే ఇస్లామీ నేత మహమ్మద్ షాహినూర్ ఇస్లాంను ఓడించారు. గయేష్వర్ చంద్ర రాయ్కు మొత్తం 98,785 ఓట్లు రాగా, జమాత్ అభ్యర్థికి 82,232 ఓట్లు మాత్రమే లభించాయి. రాయ్ సాధించిన ఈ విజయం బంగ్లాదేశ్ పార్లమెంటులో హిందువుల గళాన్ని వినిపిండానికి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.గయేష్వర్ చంద్ర రాయ్ 1951, నవంబర్ ఒకటిన ఢాకాలోని కెరానిగంజ్లో జ్ఞానేంద్ర చంద్ర రాయ్, సుమతి రాయ్ దంపతులకు జన్మించారు. 1990వ దశకంలో బీఎన్పీ నేతృత్వంలోని ప్రభుత్వాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రిగా, మత్స్య , పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు. రాజకీయాలతో పాటు ఆయన కుటుంబానికి బీఎన్పీ అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాయ్ కుమారుడు అమితాబ్ రాయ్, బీఎన్పీ నేత నితాయ్ రాయ్ చౌదరి కుమార్తె నిపున్ రాయ్ చౌదరిని వివాహం చేసుకున్నారు.ఈ ఎన్నికల ఫలితాలలో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 200 కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకున్న బీఎన్పీ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఫలితాలతో జమాతే ఇస్లామీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో గత 18 నెలలుగా కొనసాగుతున్న ముహమ్మద్ యూనస్ తాత్కాలిక పాలనకు ముగింపు పలికేలా ఈ ఎన్నికల తీర్పు వెలువడింది.బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, బీఎన్పీ విజయం దాదాపు ఖాయమైంది. ఆగస్టు 2024లో అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పడిన ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం స్థానంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఈ పోలింగ్ జరిగింది. మొత్తం 12.7 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉండగా, అందులో సగం మంది 18-37 ఏళ్ల మధ్య వయస్సు గల యువతే కావడం గమనార్హం. 299 నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 59 పార్టీల నుంచి 1,700 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడగా, బీఎన్పీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
1600 BC... ఈజిప్టు- తమిళ్ ట్రేడ్..!
భారత ప్రాచీన నాగరికత కాలంలో ఈజిప్టుతో జరిపిన వ్యాపార సంబంధాల గురించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. తమిళనాడుకు చెందిన ఓ వాణిజ్య యాత్రికుడికి సంబంధించిన పేరు అక్కడి పిరమిడ్స్లో చెక్కబడింది. అంతేకాకుండా మరికొన్ని చారిత్రక సంబంధిత విషయాలు తెలిశాయి.ప్రపంచంలోని అతికోద్ది పురాతన నాగరికలో భారత్ ఒకటిగా భావిస్తారు. సింధూ కాలం నుంచే మన దేశ నాగరికత ప్రపంచంలోని వివిధ నాగరికతలతో వాణిజ్యం ఉండేదని చరిత్రకారులు భావిస్తారు. తాజాగా ఆ వాదనకు మరింత బలం చేకూర్చేలా కీలక ఆదారాలు ఈజిప్టి పిరమిడ్స్( రాజసమాధుల్లో) లభ్యమయ్యాయి. అందులో 16 BC కి చెందిన వాణిజ్య వేత్త "సికాయి కొట్రాన్" పేరు చెక్కబడింది. వాటితో పాటు తమిళ తమిళ-బ్రహ్మీ శాసనాలు, ఐదు వేర్వేరు పిరమిడ్లలో ‘సికాయి కొట్రాన్’ అనే తమిళ వాణిజ్యవేత్త పేరు ఎనిమిది సార్లు చెక్కి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ వివరాలను స్విట్జర్లాండ్లోని లౌసాన్ యూనివర్సిలీ ప్రొఫెసర్ ఇంగో స్ట్రౌచ్ వెల్లడించారు. ఇక్కడి పిరమిడ్లలోని ఆరు రాతి సమాధుల్లో తమిళ బ్రహ్మీ, ఆరు పాకృత భాషల్లో సుమారు 30 శాసనాలను వారు గుర్తించినట్లు తెలిపారు. చెన్నైలో జరిగిన అంతర్జాతీయ తమిళ ఎపిగ్రఫీ కాన్ఫరెన్స్లో వారు తమ పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. అయితే దీనిపై తమిళనాడు మంత్రి తంగం తెన్నరసు ఆనందం వ్యక్తం చేశారు. " రోమన్ ఈజిప్టు కాలంలోనే (క్రీ.శ. 1 నుండి 3వ శతాబ్దం మధ్య) తమిళులు కేవలం వర్తకానికే పరిమితం కాకుండా, అక్కడ నివసించారని మరియు రాజ సమాధులపై తమ ముద్ర వేశారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయని ఎక్స్లో పేర్కొన్నారు.ఈ అద్భుతమైన ఆవిష్కరణ తమిళ ప్రజలు గర్వంచదగ్గదని ఆ కాలంలోనే వారు సముద్రాలు దాటి ప్రపంచ సంస్కృతులపై తమ ముద్ర వేసారని ప్రపంచానికి చాటిచెబుతోందన్నారు.
బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం
ఢాకా: ఉవ్వెత్తున ఎగసిన విద్యార్థుల ఉద్యమం(2024) మధ్య బంగ్లాదేశ్ శాంతి స్థాపన కోసం నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రధాని హసీనా పదవీచ్యుతురాలై దేశం విడిచిన తర్వాత, దేశ వ్యవస్థను చక్కదిద్దడంలో యూనస్ కీలక పాత్ర పోషించారు. అయితే తన పాత్ర కేవలం ఎన్నికల వరకు మాత్రమేనని, ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగే ఉద్దేశం తనకు లేదని యూనస్ గతంలోనే స్పష్టం చేశారు.ముహమ్మద్ యూనస్ 2006లో గ్రామీణ బ్యాంక్ ద్వారా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చేసిన కృషికి గాను నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. 1983లో ఆయన స్థాపించిన ఈ బ్యాంక్, పేదలకు అతి తక్కువ వడ్డీకే మైక్రో క్రెడిట్ రుణాలు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 1974లో బంగ్లాదేశ్లో సంభవించిన కరువు సమయంలో ఆయన పేదల కోసం దీర్ఘకాలిక రుణాలను ప్రవేశపెట్టి వారి సాధికారతకు కృషి చేశారు. పేదరికాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించే యూనస్, ఇప్పుడు అదే చిత్తశుద్ధితో దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే బాధ్యతను నెరవేర్చారు.ఈ ఎన్నికలు బంగ్లాదేశ్ చరిత్రలో కీలకమైనవిగా నిలిచాయి. ఒకప్పుడు దేశ రాజకీయాలను నడిపిన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్, అల్లర్ల సమయంలో జరిగిన హింస, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో పోటీకి దూరమైంది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) హసీనాకు మరణశిక్ష విధించగా, ఆమె ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) జమాత్-ఏ-ఇస్లామీ ప్రధాన పార్టీలుగా అవతరించాయి. మైనారిటీలపై దాడులు, మతపరమైన ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంలో పట్టుదలతో వ్యవహరించింది. తాజాగా యూనస్ తాను ఇకపై రాజకీయాల్లో కొనసాగబోననని మరోమారు స్పష్టం చేసినట్లు సమాచారం.ఫిబ్రవరి 12న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్పీ (బీఎన్పీ) భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రాథమిక గణాంకాల ప్రకారం 300 స్థానాలకు గాను బీఎన్పీ ఇప్పటికే 150 మార్కును దాటి మెజారిటీని దక్కించుకుంది. 17 ఏళ్ల ప్రవాసం తర్వాత తిరిగి వచ్చిన తారిఖ్ రెహ్మాన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ రెహ్మాన్కు అభినందనలు తెలిపారు.ఇది కూడా చదవండి: షట్డౌన్ చేస్తే చంపేస్తా’.. ఇంజినీర్కు ‘ఏఐ’ హెచ్చరిక!
జాతీయం
మణిపూర్ హింసపై నివేదిక ఇవ్వండి
న్యూఢిల్లీ: మణిపూర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. అదేవిధంగా, సుప్రీంకోర్టుకు బదులుగా మణిపూర్ హైకోర్టు లేదా గౌహతి హైకోర్టు లేదా రెండు కోర్టులు కలిపి అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ఇతర పరిణామాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. మణిపూర్ హింసాత్మక ఘటనల బాధితుల పునరావాసం, సంక్షేమంపై ఏర్పాటైన జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ సిఫారసులను తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. జాతుల మధ్య వైరంతో 2023లో మణిపూర్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి దాఖలైన 11 ఎఫ్ఐఆర్లపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘బాధితులకు న్యాయం చేకూర్చేందుకు, పునరావాసం కల్పించేందుకు ఏర్పాటు చేసిన రెండు కమిటీలు 27 నివేదికలను కోర్టుకు అందజేశాయి. మా చేతికి ఒక్కటీ అందలేదు. అయితే, ఆ నివేదికల్లోని అత్యంత సున్నితమైన అంశాలు లీకవుతాయేమోనని ఆందోళన చెందుతున్నాం’అని ధర్మాసనం పేర్కొంది. బాధితుల తరఫు లాయర్ గొన్జాల్వెస్ స్పందిస్తూ సున్నితమైన అంశాలను తొలగించడం లేదా నల్లటి గీతతో మూసివేయవచ్చని సూచించారు. అదేవిధంగా, గ్యాంగ్ రేప్నకు గురైన కుకీ వర్గానికి చెందిన బాధితురాలు ఇటీవలే చనిపోయారని సీనియర్ లాయర్ వృందా గ్రోవర్ తెలిపారు. ఈ కేసులో చార్జిషీట్ వేసిన సీబీఐ అధికారులు బాధితురాలి కుమార్తెకు అందుకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ‘దిగువ కోర్టులో ఈ కేసు విచారణకు రాగా సీబీఐ ప్రతినిధి రాలేదు. ప్రధాన నిందితుడిని హాజరుపర్చలేదు. అధికారుల నిర్లక్ష్యం చూసి షాకవుతున్నాం’అని వ్యాఖ్యానించారు. తక్షణమే ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
చైనా సరిహద్దు సమీపాన రన్వేగా హైవే!
న్యూఢిల్లీ: హైవేయే రన్వేగా మారితే? ఆ అద్భుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో రూపుదిద్దుకుంది. దిబ్రూగఢ్–మోరాన్ జాతీయ రహదారిపై 4.2 కి.మీ. పొడవైన ప్రాంతం అత్యాధునిక రన్వేగా కొత్త రూపు సంతరించుకుంది. ఇలాంటి ‘హైవే–రన్వే’లను ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్ఎఫ్)గా పిలుస్తారు. ఇది ఈశాన్య భారతంలో తొట్టతొలి ఈఎల్ఎఫ్గా రికార్డులకెక్కింది. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆయన ఢిల్లీ నుంచి దిబ్రూగఢ్ సమీపంలోని చబువా ఎయిర్ఫోర్స్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా మోరాన్ బైపాస్ సమీపంలోని ఈఎల్ఎఫ్పై దిగుతారు. అనంతరం అక్కడ జరిగే మెగా ఎయిర్ షోను ఆయన తిలకిస్తారు. రఫేల్, సుఖోయ్లతో పాటు వాయుసేనకు చెందిన మొత్తం 16 యుద్ధ విమానాలు ఈఎల్ఎఫ్పై ల్యాండవడమే గాక పలు విన్యాసాలతో అలరించనున్నాయి. అనంతరం మోదీ అస్సాంలో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. గువాహటి వద్ద బ్రహ్మపుత్ర నదిపై రూ.3,030 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల కుమార్ భాస్కర్వర్మ సేతు, కామపూర్ జిల్లాలో నేషనల్ డేటా సెంటర్, ఐఐటీ–గువాహటి తదితరాలు వీటిలో ఉన్నాయి. చైనాకు దగ్గర్లో... చైనా సరిహద్దుకు కేవలం 150 కి.మీ. సమీపంలో నిర్మించిన ఈ ఈఎల్ఎఫ్ రక్షణ అవసరాల దృష్ట్యా భారత్కు చాలా ముఖ్యమైనది. విపత్తు, ఎమర్జెన్సీ సమయాల్లో సాధారణ, యుద్ధ విమానాల రాకపోకలకు ఇది వీలు కలి్పస్తుంది. భారత వాయుసేన సహకారంతో దీన్ని నిర్మించారు. యుద్ధ విమానాలే గాక సీ–17 గ్లోబ్ మాస్టర్ వంటి భారీ రవాణా విమానాల ల్యాండింగ్కు కూడా అనువుగా దీన్ని రూపొందించారు. 40 టన్నుల బరువున్న యుద్ద విమానాలతో పాటు 74 టన్నుల బరువుండే రవాణా విమానాలు సైతం దీనిపై సులువుగా దిగగలవు. దేశ పశ్చిమ, ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ఇప్పటికే పలు ఈఎల్ఎఫ్లు అందుబాటులో ఉన్నాయి.
‘సేవా తీర్థ్’లోకి మోదీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయ చిరునామా మారిపోయింది. బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్ నుంచి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’లోకి ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. ఢిల్లీని దేశ ఆధునిక రాజధానిగా మార్చి 95 ఏళ్లయిన సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయ(పీఎంఓ) నూతన భవనం సేవా తీర్థ్ను ప్రధాని మోదీ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై ఇక్కడి నుంచే ఆయన అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. మోదీ పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో కలిసి సేవా తీర్థ్ కాంప్లెక్స్కు చేరుకున్నారు. సేవా తీర్థ్తోపాటు కర్తవ్య భవన్–1, 2లను ప్రారంభించారు. పీఎంఓలో గణేశుడి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. సేవా తీర్థ్ ఫలకాన్ని ఆవిష్కరించారు. ఫలకంపై దేవనాగరి లిపిలో సేవా తీర్థ్ అని లిఖించగా, దాని కింద నాగరిక్ దేవో భవ(పౌరుడే దేవుడు) అని లిఖించారు. సేవా తీర్థ్ ప్రారం¿ోత్సవాన్ని పురస్కరించుకొని రూ.100 ప్రత్యేక నాణెం, పోస్టల్ స్టాంప్ సైతం ప్రధానమంత్రి విడుదల చేశారు. కొత్త భవనంలో మోదీ తొలి రోజు అధికారిక విధులు ప్రారంభించారు. మహిళలు, రైతులు, యువతతోపాటు వృద్ధుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి పౌరుడికి జీవన భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ‘పీఎం రాహత్’ పథకానికి అనుమతి ఇస్తూ ఫైల్కు సంతకం చేశారు. లఖ్పతీ దీదీల సంఖ్యను ఆరు కోట్లకు పెంచడానికి మరో ఫైల్పై సంతకం పెట్టారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాన కార్యదర్శులు పి.కె.మిశ్రా, శక్తికాంత దాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీఎం రాహత్ పథకం కింద.. ప్రమాదాలకు గురైనవారికి రూ.1.5 లక్షల దాకా నగదు రహిత చికిత్స అందిస్తారు. డబ్బు లేకపోయినా బాధితులకు అత్యవసర చికిత్స తప్పనిసరిగా అందించాలన్నదే ఈ పథకం లక్ష్యమని అధికారులు వెల్లడించారు. మూడు కోట్ల మంది మహిళలను 2027 మార్చి నెల నాటికి లఖ్పతీ దీదీలుగా తీర్చిదిద్దాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే అది పూర్తయ్యింది. ఒక ఏడాది ముందే మూడు కోట్ల మంది లఖ్పతీ దీదీలుగా మారారు. 2029 మార్చి నెల నాటికి మొత్తం ఆరుకోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. అధికారులకు టార్గెట్ విధించారు. మరోవైపు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని రూ.2 లక్షల కోట్లకు పెంచారు. ఈ నిధికి గతంలో రూ.లక్ష కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు రెట్టింపు చేశారు. అలాగే రూ.10,000 కోట్లతో ‘స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్(ఎఫ్ఓఎఫ్) 2.0’కు మోదీ అనుమతి మంజూరు చేశారు. ఈ నిధితో నూతన ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం అందించబోతున్నారు. బ్రిటిష్ ఆనవాళ్లకు మంగళం ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) సేవా తీర్థ్లో కొలువు దీరగా, కేబినెట్ సెక్రెటేరియట్ ఆఫీసు, జాతీయ భద్రతా మండలి సచివాలయ కార్యాలయంతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ శాఖలను కర్తవ్య భవన్–1, 2లలోకి తరలిస్తున్నారు. ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆయా కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరబోతున్నాయి. బ్రిటిష్ వలస పాలకుల ఆనవాళ్లను క్రమంగా వదిలించుకొనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ 2014 నుంచే ఆరంభించారు. ఇందులో భాగంగా అత్యాధునిక వసతులతో నూతన పార్లమెంట్ భవనంతోపాటు సేవా తీర్థ్ భవనం నిర్మించారు. రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చారు. బ్రిటిష్ పాలకులు మన మనసును బానిస మనస్తత్వంతో నింపేశారని, దాన్ని తప్పనిసరిగా వదిలించుకోవాలని మోదీ తరచుగా చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇకపై సేవా తీర్థ్గా పిలవాలని అధికారులు స్పష్టంచేశారు. ప్రధానమంత్రి అధికారిక నివాసమైన రేస్ కోర్స్ రోడ్ను కూడా లోక్ కల్యాణ్ మార్గ్గా ప్రభుత్వం ఇప్పటికే మార్చింది. రాష్ట్రాల్లో గవర్నర్లు నివాసం ఉండే రాజ్ భవన్లను లోక్ భవన్లుగా, లోక్ నివాస్లుగా మార్చేసింది. వికసిత్ భారత్ ప్రయాణంలో మైలురాయి: మోదీసేవా తీర్థ్, కర్తవ్య భవనాలు వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణంలో కీలకమైన మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. దేశ ప్రగతితోపాటు ‘పౌరులే కేంద్రంగా ప్రభుత్వ పాలన’కు ఇవి ప్రతీకలు అని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో సేవా తీర్థ్, కర్తవ్య భవన్–1, 2ల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రిమాట్లాడారు. ఇప్పటిదాకా పీఎంఓగా, ప్రభుత్వ శాఖల కార్యాలయాలుగా సేవలందించిన నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లు బ్రిటిష్ సామ్రాజ్య ఆలోచనలు, ఆశయాలను ప్రతిబింబించేలా నిర్మించినవేనని తెలిపారు. కానీ, నేడు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ధ్యేయంగా సేవా తీర్థ్, కర్తవ్య భవనాలు నిర్మించామని చెప్పారు. ఇకపై ఇక్కడ తీసుకొనే నిర్ణయాలు 140 కోట్ల మంది భారతీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పునాదిగా తోడ్పడుతాయని పేర్కొన్నారు.
కొన్ని క్యాన్సర్లను నివారించొచ్చు
సాక్షి, స్పెషల్ డెస్క్: క్యాన్సర్.. ప్రపంచాన్ని వణికిస్తున్న అత్యంత భయంకరమైన వ్యాధి. ఏటా ఒక కోటి మంది ఈ వ్యాధి బారినపడి కన్నుమూస్తున్నారంటే ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కొత్త క్యాన్సర్ కేసుల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ నివారించదగినవే. అంటే ఏటా 71 లక్షల మందిని ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడవచ్చన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం.. 2022లో 1.87 కోట్ల మందికి కొత్తగా క్యాన్సర్ సోకింది. ఇందులో సుమారు 38% కేసులు ఇన్ఫెక్షన్లు (అంటువ్యాధులు), జీవనశైలి అలవాట్లు, పర్యావరణ కాలుష్య కారకాల వల్ల సంభవించాయని అంచనా. ఇవన్నీ నివారించదగినవే. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే గర్భాశయ క్యాన్సర్లను సకాలంలో టీకాలు వేయడం ద్వారా అడ్డుకోవచ్చు. అలాగే స్మోకింగ్ వల్ల కలిగే అనేక కణితులను ధూమపానం మాన్పించడం ద్వారా చెక్ పెట్టవచ్చు. ఇలా లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చడానికి ‘శక్తివంతమైన అవకాశం’ఉందని పరిశోధకులు అంటున్నారు. కొన్ని క్యాన్సర్లు అనివార్యం.. వయసు పెరిగే కొద్దీ మన డీఎన్ఏలో అనివార్యంగా జరిగే నష్టం లేదా వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచే జన్యువులు వారసత్వంగా రావడం వల్ల కొన్ని క్యాన్సర్లు అనివార్యం. అయితే 10లో దాదాపు నాలుగు కేసులను నివారించవచ్చన్న అంశం జనంలో ఆసక్తి రేకెత్తిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే 30 నివారించగల కారకాలను డబ్ల్యూహెచ్ఓలో భాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అనే సంస్థ విశ్లేషించింది. ధూమపానం, అతినీలలోహిత (అ్రల్టావయోలెట్) కిరణాలు వీటిలో ఉన్నాయి. ఇవి మన డీఎన్ఏను నేరుగా దెబ్బతీస్తాయి. ఊబకాయం, శరీరంలో వాపు, హార్మోన్లను మార్చే అతి తక్కువ శారీరక శ్రమ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోంది. వాయు కాలుష్యం వల్ల నిద్రాణమైన క్యాన్సర్ కణాలు మేల్కొంటాయని ఏజెన్సీ వెల్లడించింది. ధూమపానం ప్రధాన కారణం క్యాన్సర్కు దారితీసే తొమ్మిది ఇన్ఫెక్షన్లను కూడా ఏజెన్సీ నివేదించింది. వీటిలో హెచ్పీవీ, కాలేయ క్యాన్సర్కు దారితీసే హెపటైటిస్ వైరస్లు, కడుపు నొప్పి, అల్సర్స్, తీవ్రమైన గ్యాస్ సమస్యలకు కారణం అయ్యే హెలికోబాక్టర్ పైలోరి బ్యాక్టీరియా ఉన్నాయి. పరిశోధన బృందం 2022 నుండి 36 రకాల క్యాన్సర్ కేసుల డేటాను.. అలాగే 185 దేశాలలో 2012–22 మధ్య ఈ వ్యాధికి మూలమైన 30 ప్రమాద కారకాల సమాచారాన్ని విశ్లేషించి నివేదికను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్యాన్సర్ కేసులకు ధూమపానం ప్రధాన కారణమని వెల్లడించింది. ఆ తరువాతి స్థానాల్లో ఇన్ఫెక్షన్లు, మద్యపానం ఉన్నాయి. భవిష్యత్తులో క్యాన్సర్ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రమాద కారకాలను నివారించడం అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి అని పరిశోధన వెల్లడించింది. దేశాలకు అనుగుణంగా.. పురుషుల క్యాన్సర్లలో 45% నివారించదగినవిగా ఉండగా.. మహిళల్లో ఇది 30% ఉంది. నివారణ స్థాయి పురుషులలో అధిక స్థాయిలో ఉండడానికి కారణం.. ధూమపాన ప్రియులు పురుషుల్లో ఎక్కువగా ఉండడమే. యూరప్లో నివసించే మహిళల్లో క్యాన్సర్ దరి చేరకుండా ఫుల్స్టాప్ పెట్టే మొదటి మూడు కారణాల్లో ధూమపానం, ఇన్ఫెక్షన్లు, ఊబకాయం ఉన్నాయి. సబ్–సహారా ఆఫ్రికాలో మహిళల్లో నివారించగల క్యాన్సర్లలో ఇన్ఫెక్షన్ల వాటా దాదాపు 80% ఉంది. అంటే ఈ క్యాన్సర్లను పరిష్కరించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు తీసుకునే చర్యలు ప్రతి ప్రాంతం లేదా దేశానికి అనుగుణంగా ఉండాలని నివేదిక వివరించింది. సగం వాటా వాటిదే.. నేచర్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం ధూమపానం, వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్, హెలికోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్తో ముడిపడి కడుపు క్యాన్సర్, హ్యూమన్ పాపిలోమా వైరస్తో గర్భాశయ క్యాన్సర్.. నివారించగల మొత్తం క్యాన్సర్ కేసుల్లో ఇవి దాదాపు సగం ఉంటాయి. ధూమపానం నియంత్రణ, హెచ్పీవీ వ్యాక్సినేషన్ చేపట్టిన దేశాల్లో క్యాన్సర్ కేసులు తగ్గాయని నివేదిక తెలిపింది. ధూమపానం ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో అతిపెద్ద ముప్పుగా పరిణమించింది. మహిళల్లో 30% నివారించవచ్చు.. ⇒ నివేదిక ప్రకారం.. మహిళల్లో 92 లక్షల కొత్త క్యాన్సర్ కేసుల్లో సుమారు 30% నివారించవచ్చు. ⇒ సబ్ సహారా ఆఫ్రికా వంటి తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాల్లో సరై్వకల్ క్యాన్సర్ కేసులు అధికం. ⇒ అధిక ఆదాయ దేశాలైన ఉత్తర అమెరికా, యూరప్లో మహిళల్లో క్యాన్సర్కు స్మోకింగ్ ప్రధాన కారణం. ⇒ పురుషుల్లో 43 లక్షల నివారించదగ్గ క్యాన్సర్ కేసుల్లో 25% ధూమపానం కారకంగా నిలిచింది. ⇒ ఇన్ఫెక్షన్తో కూడిన క్యాన్సర్ కేసులు పురుషుల్లో ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలో ఎక్కువ.
ఎన్ఆర్ఐ
లండన్లో పానీ పూరీ అమ్ముతున్న ఐఐటీ గ్రాడ్యుయేట్..!
కార్పోరేట్ లైఫ్ని వద్దనుకుని మరి ఆతిథ్య రంగాన్ని ఎంచుకుంది భారత సంతతి మహిళ. ఒకప్పుడు శామ్మ్సంగ్ డిజైనర్గా పనిచేసిన ఆమె లండన్లో తన భర్తతో కలిసి సప్పర్ క్లబ్ని రన్ చేస్తుంది. అక్కడ ఆమె పానీపూరితో అపరిచిత భారతీయలును ఒకచోటకుకు చేర్చడమే కాదు వివిధ భారతీయ వంటకాలను పరిచయం చేస్తోంది, లాభాలు ఆర్జిస్తోంది కూడా. అయినా ఐఐటీ చదివి ఇలాఇదే ఎందుకంటే..ఆ దంపతులే అంకిత ఖాంతే, భర్త అమన్ కృష్ణ కలిసి 'ది బౌజీ క్లబ్' అనే సప్పర్ క్లబ్ను నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో పుట్టిన ఖాంతే నాగ్పూర్లో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేసి, ఐఐటీ గుహతిలో మాస్టర్ డిగ్రిని పూర్తి చేసింది. ఆ తర్వాత 2024లో అమన్ కృష్ణను వివాహం చేసుకుని యూకేకి వెళ్లి స్థిరపడింది. ఇక ఆమె భర్త కృష్ణ ఉత్తరప్రదేశ్లోని ఓబ్రాలో జన్మించాడు. అతడు ఐఐటీ ధన్బాద్ కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ, ఐఐఐటీ హైదరాబాద్లో మాస్టర్ డిగ్రీని పూర్తిచేశాడని చెప్పుకొచ్చింది. తామిద్దరం లండన్ స్థిరపడ్డాక జాబ్ మార్కెట్ని పూర్తిగా స్టడీ చేశాం. అంతకుముందు తాను బెంగళూరులో శామ్సంగ్లో ప్రొడక్ట్ డిజైనర్గా మూడేళ్లు పనిచేసినట్లు పేర్కొంది. స్నేహితులను అందరికి ఒక చోటకు చేర్చి హోస్టింగ్ చేయడం తనకు హాబీ అని ఆ అలవాటే..ఇలా 'ది బౌజీ క్లబ్' నిర్వహించాలనే ఆలోచనకు నాందిపలికిందన్నారు. పైగా దీని సాయంతో ఇంకా కొత్తవారు పరిచయమవ్వక ఇబ్బంది పడుతున్న భారతీయ ఎన్నారైలకు ఇది హెల్ప్ అవ్వడమే కాకుండా ఆహారంతోనే సులభంగా అందర్నీ ఒకచోటకు చేర్చగలమని దీన్ని ప్రారంభించినట్లు వివరించింది. మొదట్లో కొంతమంది స్నేహితులతో ప్రారంభించామని, ఆ తర్వాత టిక్కెట్టు పొందాక సప్పర్ క్లబ్గా మారిందని చెప్పుకొచ్చింది. కొన్ని ఈవెంట్ల తర్వాత ప్రతి మొదటి పదినిమిషాలు చాలా ముఖ్యమైనవి అర్థమైందో దాంతో ..పానీపూరిని ఐస్ బ్రేకర్గా పరిచయం చేశాం. అలా ప్రతి విందులో ఇది సిగ్నేచర్ విందుగా పానీపూరితోనే ప్రారంభిస్తామని చెప్పుకొచ్చింది అంకిత. నెలకు సుమారు పది నుంచి 12 మంది ఆతిథ్యం ఇస్తామని..ఇక్కడ ఏడు కోర్సుల ఇండియన్-ఫ్యూజన్ మెనూను అందిస్తున్నట్లు వెల్లడించింది. టికెట్ట ధర ఒక్కొక్కరికి రూ. 6000. అయితే ఈ జంట ఎంత టర్నోవర్ వస్తుందో మాత్రం వెల్లడించలేదు. పండుగ సమయల్లో ఆ పండు నేపథ్య సిరీస్తో ఫుడ్ని అందిస్తారట కూడా. అంతేగాదు తాము ఐఐటీ గ్రాడ్యుయేట్లు కావడంతోనే వేగంగా అర్థంచేసుకోవడం, రిస్క్ తీసుకోవడం వంటివి చేయగలిగామని సగర్వంగా చెబుతోంది అంకిత. సప్పర్ క్లబ్ అంటే ఏమిటి?ప్రైవేట్ డిన్నర్ పార్టీ, రెస్టారెంట్కి మాధ్యమంగా ఉంటుంది ఈ సప్పర్ క్లబ్. దీన్ని సామాజికి భోజన అనుభవంగా చెప్పొచ్చు. విభిన్న నేపథ్యాలున్న వ్యక్తులంతా ఒకచోట చేరి హాయిగా నచ్చిన ఆహారాన్ని ఆస్వాదించే అనుభూతిని అందిస్తుంది. రెస్టారెంట్లో కూడా ఇలానే ఉన్నా..అక్కడ వేరువేరుగా డైనింగ్ టేబుల్పై కూర్చొని ఆస్వాదిస్తాం. ఇక్కడ అలా కాదు ఒకచోట సమావేశమైన వ్యక్తుల్లా సహపంక్తి భోజనంలా తింటారు ఈ సప్పర్ క్లబ్లో. (చదవండి: బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..! ఆ ఎనిమిది మార్పులు..)
Budget 2026 : NRIలకు గుడ్న్యూస్, మార్కెట్లకు ఊతం, డైరెక్ట్ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా 2026-27 బడ్జెట్లో విదేశీ పెట్టుబడిదారులకు శుభ వార్త చెప్పారు. లోక్సభలో తొమ్మిదో బడ్జెట్ను ప్రవేశ పెడుతున్న ఆమె భారతదేశ ఆర్థిక మార్కెట్లను మరింత బలోపేతం చేయడానికి, మరింత ప్రపంచ మూల ధనాన్ని ఆకర్షించేందుకు సీతారామన్ ఈ రోజు మూడు కీలక అంశాలను ప్రకటించారు కార్పొరేట్ బాండ్లకు మార్కెట్-మేకింగ్ ఫ్రేమ్వర్క్, విదేశీ వ్యక్తులు భారతీయ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి కొత్త మార్గం, లిస్టెడ్ కంపెనీలలోఅటువంటి పెట్టుబడిదారులకు యాజమాన్య పరిమితులను పెంచడం.NRI లకు గుడ్న్యూస్పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (PIS) ద్వారా NRIలు ఇప్పుడు భారతీయ స్టాక్లలో పెట్టుబడి పెట్టవచ్చు. విదేశీ పెట్టుబడిదారులు RBI ఆమోదించిన ప్రత్యేక బ్యాంక్ ఖాతా ద్వారా భారతీయ స్టాక్లను కొనుగోలు చేయడానికి , విక్రయించడానికి అనుమతిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా భారతీయ స్టాక్లలో పెట్టుబడి పెట్టవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ముఖ్యంగా భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత పెంచే లక్ష్యంతో విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు (PROI) ఇకపై భారతీయ లిస్టెడ్ కంపెనీల ఈక్విటీ షేర్లలో నేరుగా పెట్టుబడి పెట్టేందుకు ఉన్న పరిమితిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత పరిమితిని 5 శాతం పెట్టుబడి పరిమితిని 10 శాతానికి పెంచుతూ ప్రతిపాదించారు. అయితే అటువంటి పెట్టుబడిదారులందరికీ కలిపి పరిమితిని 10శాతం నుంచి 24శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఈ మార్పు తీవ్రమైన విదేశీ వ్యక్తిగత పెట్టుబడిదారులు భారతీయ కంపెనీలలో మరింత అర్థవంతమైన వాటాలను తీసుకోవడానికి వీలు ల్పిస్తుంది. ధరల ఆవిష్కరణను, వాటాలను మరింతగా పెంచుతుంది. దీర్ఘకాలిక మూలధన నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. పోర్ట్ఫోలియో పెట్టుబడి పథకం ద్వారా నేరుగా భారతీయ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం అనుమతించాలని కూడా భావిస్తోంది. ప్రస్తుతం, చాలా విదేశీ పోర్ట్ఫోలియో ప్రవాహాలు రిజిస్టర్డ్ విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (FPIలు) లేదా నిర్దిష్ట నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) మార్గాల ద్వారా వస్తాయి. ఇది సాధారణ విదేశీ వ్యక్తికి సంక్లిష్టంగా ఉంటుంది. అటువంటి పెట్టుబడిదారులకు నియంత్రిత, ప్రామాణిక ఈక్విటీ పెట్టుబడి మార్గాలను సులభ తరం చేస్తుంది.అలాగే కార్పొరేట్ బాండ్ల కోసం ప్రతిపాదిత మార్కెట్-మేకింగ్ ఫ్రేమ్వర్క్ భారత రుణ మార్కెట్లోని అతిపెద్ద సమస్యలలో ఒకటైన పూర్ లిక్విడిటీని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫ్రేమ్వర్క్ కింద, నియమిత సంస్థలు ఎంపిక చేసిన కార్పొరేట్ బాండ్లలో నిరంతర కొనుగోళ్లు, అమ్మకాల కోట్లను అందించేలా సాయపడతాయి. పెట్టుబడిదారులు మరింత సులభంగా మరియు సరసమైన ధరలకు స్థానాల్లోకి ఎంట్రీకి, ఎగ్జిట్కి సహాయపడుతుంది. ఇది సేవర్లు , సంస్థలకు సమానంగా, కార్పొరేట్ బాండ్లను బ్యాంకు రుణాలు, స్థిర డిపాజిట్లకు చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కంపెనీలు మరింత పోటీ ధరల వద్ద డబ్బును సేకరించడంలో సహాయపడుతుంది.
కుక్క కోసం రూ. 15 లక్షలా..? ఎన్నారై దంపతులు..
శునకాలను చాలమంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని ఎంత ప్రేమగా, లాలనగా చూస్తోరో తెలిసిందే. కానీ మరీ ఇంతలా పెంపుడు జంతువు కోసం డబ్బు ఖర్చే చేసిన వాళ్లను చూసుండరు. అది కూడా లక్షల్లో అంటే..ఇదేం పిచ్చిరా బాబు అనేస్తాం. కానీ ఈ ఎన్నారై దంపతులు అది కేవలం కుక్క కాదు తమ బిడ్డ అని చెబుతుండటం విశేషం. ఇంతకీ ఆ ఎన్నారై దంపతులు ఆ కుక్క కోసం ఎందుకు అంతలా ఖర్చు చేశారంటే..ఎన్నారై దంపతులు దివ్య, జాన్లు తమ కుక్క కోసం ఎంతలా కష్టపడి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు తెచ్చుకున్నామో 'కహానీ ఆఫ్ టేల్స్' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఈ జంట ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నప్పుడూ..తామెంతో ప్రేమగా పెంచుకున్న స్కై అనే కుక్కని కూడా తమతోపాటే తెచ్చుకోవాలని అనుకున్నారు. అయితే భారత్ నుంచి కుక్క నేరుగా ఆస్ట్రేలియాకు తెచ్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించదు. భారతదేశం నుంచి వచ్చే కుక్కలు ర్యాబిస్ లేని దేశంలో ఆరు నెలలపాటు ఉంచాలి. అప్పుడే దాన్ని ఆస్ట్రేలియాకి తీసుకురావడానికి అనుమితిస్తుంది అక్కడ ప్రభుత్వం. పైగా ఆ తతంగం అంతా చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. అయినప్పటికీ తగ్గేదే లే అంటూ..ఈ జంట దుబాయ్లో తమ ప్రియమైన కుక్కతో కలిసి ఆరు నెలలు ఉన్నారు. మొత్తం ప్రక్రియకు 190 రోజులు పట్టింది. చాలా పేపర్ వర్క్, పలు పశువైద్య పరీక్షలు, టీకాలు, క్వారంటైన్ ఫీజులు అన్ని పూర్తయ్యాక..తాము ముగ్గురం కలిసి అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా వెళ్లే క్షణం రానే వచ్చింది. ఆక్షణం తమకెంతో అపురూపమైనదని, ఎన్నో త్యాగాలు, వ్యయప్రయాసాలు తర్వాత దక్కిన ఉద్విగ్నభరిత క్షణం అంటూ ఇన్స్టాగ్రామ్లో తమ భావోద్వేగ ప్రయాణాన్ని షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆ ఎన్నారై జంట ఆ కుక్క కోసం ఎంత ఖర్చు చేశారో వింటే షాకవ్వడం ఖాయం. ఎందుకంటే ఆ కుక్క కోసమే దాదాపు రూ. 15 లక్షలకు పైనే ఖర్చు చేశారట. పైగా ఆ దంపతులు ఇదేం పిచ్చి వ్యామోహం అనుకోవచ్చు. కానీ అది తమకు కేవలం కుక్క కాదని..తమ బిడ్డేనని..అందువల్ల ఇలా చేశామని ఆ దంపతులు పోస్ట్లో పేర్కొనడం విశేషం. View this post on Instagram A post shared by Kahaanioftails (@kahaanioftails) (చదవండి: ఎవరీ సోఫీ రెయిన్? సోషల్ మీడియా సాయంతో అన్ని కోట్లా..!)
చాట్జీపీటీతో చిక్కుల్లో పడ్డ గొట్టుముక్కల మధు
ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వీలైనన్ని ఎక్కువ మార్గాల్లో వినియోగించుకుంటున్నారు యూజర్లు. ఈ క్రమంలో అమెరికాలో సంచలనం చోటు చేసుకుంది. అమెరికా సైబర్ ఏజెన్సీ అధికారి ఒకరు చాట్జీపీటీ వినియోగంతో చిక్కుల్లో పడ్డారు. ఆయన భారతీయ మూలాలు, అందునా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి కావడం ఇక్కడ విశేషం. అమెరికా ప్రభుత్వ నెట్వర్క్లను రక్షించే బాధ్యత కలిగిన సీఐఎస్ఏ(Cybersecurity & Infrastructure Security Agency) చూసుకుంటుంది. దానికి తాత్కాలిక డైరెక్టర్ ఉన్న డాక్టర్ మధు గొట్టుముక్కల(Madhu Gottumukkala) ఏఐతో కొత్త తలనొప్పి తెచ్చి పెట్టుకున్నారు. చాట్జీపీటీలో ఆయన సంస్థకు చెందిన కీలకమైన పత్రాలను అప్లోడ్ చేశారట. అది పబ్లిక్ వెర్షన్లో కావడంతో వివాదం రాజుకుంది. పొలిటికో నివేదిక ప్రకారం.. కిందటి ఏడాది జులై-ఆగస్టు మధ్యకాలంలో మధు గొట్టుముక్కల కాంట్రాక్టింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పత్రాలను చాట్జీపీటీకి అప్లోడ్ చేశారు. అవి అంత గోప్యమైనవి కాకపోయినా.. కేవలం అధికారిక సంబంధిత పత్రాలే(For Official Use Only) కావడంతో రచ్చ మొదలైంది. ఆయన అలా అప్లోడ్ చేయగానే.. ఆటోమేటెడ్ సెక్యూరిటీ అలర్ట్ మోగింది. దీంతో డీహెచ్ఎస్ (Department of Homeland Security) అప్రమత్తమైంది. మధు గొట్టుముక్కల చేసిన పని వల్ల ఏదైనా నష్టం జరిగిందా? అనేదానిపై డీహెచ్ఎస్ సమీక్ష జరిపింది. అయితే ఆ ఇంటర్నల్ రివ్యూలో ఏం తేలిందో మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆయనపై ఏమైనా చర్యలు ఉంటాయా? అనేదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. సాధారణంగా.. డీహెచ్ఎస్ పరిధిలోని ఉద్యోగులకు చాట్జీపీటీ, ఇతర ఏఐ టూల్స్ను ఉపయోగించడానికి యాక్సెస్ ఉండదు. కానీ, మధు గొట్టుముక్కల మాత్రం ప్రత్యేక అనుమతి తీసుకున్నారట. ప్రత్యేక అనుమతులతో పరిమితంగా ఉపయోగించేందుకు వీలుందట. అయితే అందులో డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడం అభ్యంతరాలకు దారి తీసింది. ఈ క్రమంలో ఆయనపై సస్పెన్షన్ వేటు లేదంటే బదిలీ వేటులాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లేదంటే.. ఏఐ టూల్స్ వినియోగంపై మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మధు గొట్టుముక్కల.. భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ అధికారి. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంగా తెలుస్తోంది. కుటుంబం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. రష్యా, చైనా వంటి దేశాల నుండి వచ్చే అధునాతన సైబర్ ముప్పులను సీఐఎస్ఏ డైరెక్టర్ ఎదుర్కోవడం ఆయన బాధ్యత. డకోటా స్టేట్ యూనివర్సిటీలో పీహెచ్డీ, డల్లాస్లో ఎంబీఏ, అర్లింగ్టన్లో ఎంఎస్, విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో బీఈ చేశారు. ఆయన చేసిన పని అమెరికా సైబర్ సెక్యూరిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ సున్నితమైన పత్రాలను AI ప్లాట్ఫారమ్లలో ఉపయోగించడం ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న ముందుకు తెచ్చింది.
క్రైమ్
స్పా ముసుగులో వ్యభిచారం.. 30 మంది యువతుల అరెస్ట్
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్పై కేపీహెచ్బీ పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ లింగం తెలిపిన మేరకు.. కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని 6వ ఫేజులోని ఆవాస స్పాలో నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 18 మంది యువతులతో పాటు, 15 మంది పురుషులను, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నాడు కొడుకు.. నేడు తండ్రి..!
నెల్లిమర్ల రూరల్: ఒక ఇంటిపై విధి ఎంత క్రూరంగా విరుచుకుపడిందన్నది సారిపల్లి గ్రామం కన్నీళ్లతో చెబుతోంది. ఎనిమిది నెలల కిందట కొడుకును రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఆ తండ్రి... ఇంకా ఆ బాధ నుంచి కోలుకోకముందే అదే తరహా ప్రమాదంలో ప్రా ణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. కాశీయాత్ర నుంచి తిరిగి వస్తూ నాడు కొడుకు, నేడు తండ్రి... అనే మాట గ్రామస్తుల హృదయాలను కలిచివేస్తోంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన నడిపేన శ్రీనివాసరావు(58) వృత్తి రీత్యా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగి స్తున్నాడు. మండలంలోని కొండవెలగాడ, చంద్రంపేట, సారిపల్లి గ్రామాలకు చెందిన సుమారు 40 మంది భక్తులతో ఈ నెల 8న కాశీయాత్రకు వెళ్లిన బస్సుకు ఆయనే డ్రైవర్. తిరుగు ప్రయాణంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో ఒడిశా రాష్ట్రం బాలాసోర్ జిల్లా బాహానాగ్ జాతీయ రహదారిపై బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఆ దాటికి బస్సు ముందు భాగంలోని అద్దాలు పగిలి సుమారు 20 అడుగులు ఎత్తు నుంచి బ్రిడ్జి కిందకు పడిపోయాడు. దీంతో తల, కంటి భాగంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కాగా, కొండవెలగాడ గ్రామానికి చెందిన ఎ.సూర్యనారాయణ అనే వ్యక్తి కాలు విరిగిపోయింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ శ్రీనివాసరావు మృతిపై కుండాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పగబట్టిన ప్రమాదాలు.. మృతుడు శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హరీష్ భోగాపురం పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా డ్రైవర్ వృత్తి చేస్తున్నాడు. చిన్న కుమారుడు పురుషోత్తం కూడా తండ్రివలే డ్రైవర్ వృత్తి చేస్తూ భక్తులను సుదూర ప్రాంతాల్లో తీర్ధ యాత్రలకు తీసుకువెళ్లేవాడు. సుమారు ఎనిమిది నెలల కిందట భక్తులను కాశీ యాత్రకు తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుడిని కోల్పోయిన బాధ నుంచి కోలుకోకముందే తండ్రి కూడా ఇదే విధంగా మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. మరో రెండు రోజుల్లో యాత్ర ముగించుకుని వస్తాడనే లోపే పెనువిషాదం జరగడంతో స్వగ్రామమైన సారిపల్లిలో విషాదం అలుముకుంది. ఓ వైపు గుండె సంబంధిత సమస్య, మరోవైపు కొద్ది నెలల వ్యవధిలోనే కుమారుడు, భర్త మృతితో నడిపేన కాసులమ్మ కన్నీరు మున్నీరుగా విలపించడం.. అక్కడి వారిని కంటతడి తెప్పించింది.
ఊయలే ఉరి తాడైంది
వెల్దుర్తి: ఊయలే ఆ బాలుడికి ఉరి తాడైంది. ఏడేళ్లకే అందని లోకాలకు చేర్చింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కలుగొట్లలో గురువారం చోటు చేసుకుంది. వివరాలివీ.. గ్రామానికి చెందిన అహ్మద్బాషా, హసీనాబీలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. చిన్న కుమారుడు అఫ్రోజ్(7) రెండో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా తట్టు వ్యాధితో బాధపడుతూ ఇంట్లో ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన అఫ్రోజ్ ఇంటి ఆవరణలోని రేకుల షెడ్కు కట్టిన చీర ఊయలలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ చీర మెడకు బిగుసుకుంది. భోజనం ముగించుకుని బయటకు వచ్చిన తల్లిదండ్రులు కుమారుడి మెడకు ఊయల బిగుసుకుని కనిపించడంతో ఆందోళన చెందారు. చీరను తప్పించి చూడగా మృతి చెందినట్లు గుర్తించారు. కళ్ల ముందు విగతజీవిగా మారిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
హాల్ టికెట్ తీసుకొస్తూ.. అనంత లోకాలకు..
తూర్పు గోదావరి జిల్లా: పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్ తీసుకుని తిరిగి వస్తుండగా, జాతీయ రహదారి 216లోని పోలేకుర్రు చెక్పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం పాలైంది. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ, స్థానికుల కథనం ప్రకారం.. యానాం పెదపూడి వీధికి చెందిన మహ్మద్ మోమినా తన్వీర్ (21), సయ్యద్ అఫ్రీన్ సుల్తానాలు పటవల పైడా విద్యా సంస్థలో ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్నారు. శుక్రవారం నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరూ ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళ్లి హాల్ టికెట్లు తీసుకున్నారు. తిరిగి వస్తుండగా పోలేకుర్రు చెక్పోస్టు వద్ద టిప్పర్ ఢీకొనడంతో తన్వీర్ కింద పడిపోయింది. ఆమె తలపై నుంచి టిప్పర్ వెళ్లిపోవడంతో నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా సుల్తానా రెండో వైపునకు పడడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతురాలి తండ్రి జిలానీ యానాం మార్కెట్లో చికెన్ షాపు నిర్వహిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె అర్ధాంతరంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తనీ్వర్ సోదరుడికి రెండు నెలల క్రితం వివాహమైందని, ఇంతలోనే ఇంతటి విషాదం జరగడం దారుణమని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చెక్పోస్టు నిర్వహణ వల్లే.. జాతీయ రహదారిలోని మలుపులో చెక్పోస్టు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు. అటు అమలాపురం నుంచి, ఇటు యానాం నుంచి వాహనాలు వేగంగా వచ్చే ప్రాంతం, చెక్పోస్టు వద్ద అనేక బారికేడ్లు ఏర్పాటు చేయడం, నిర్వహణ సక్రమంగా చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, ప్రజాప్రతినిధులు స్పందించి చెక్పోస్టును సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
వీడియోలు
బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?
ఇది రాష్ట్రం కోసం పెట్టిన బడ్జెట్ కాదు జగన్ కోసం పెట్టిన బడ్జెట్..
చెయ్యి ఆయనది, గడ్డం ఆయనది.. మీకేంటి నొప్పి?
అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్
కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్
పవన్ వారసుడు అకీరా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?
చంద్రబాబు లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి అసలు కారణం ఇదే..
నీకు అంత దమ్ముంటే హెరిటేజ్ నాది కాదు అని చెప్పు
ఛత్తీస్ గఢ్ లోని దాంతరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
పంచారామ క్షేత్రంలో అపచారం

