ఏపీ కేబినెట్ భేటీ..పవన్ సహా ఆరుగురు మంత్రుల డుమ్మా!
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి మంత్రుల గైర్హాజరు చర్చాంశనీయంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఆరుగురు మంత్రులు హాజరు కాకపోవడం విశేషంశుక్రవారం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి, అమరావతి రాజధాని పురోగతి వంటి కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. అయితే, ఈ సమావేశానికి పలువురు మంత్రులు డుమ్మా కొట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సుకు కూడా పవన్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. నాదెండ్ల మనోహర్ సమావేశానికి దూరంగా ఉన్నారు. అనారోగ్య కారణంగా హోమ్ మంత్రి అనిత, మంత్రి టీజీ భరత్, మంత్రి గొట్టిపాటి రవి.. కుటుంబ కార్యక్రమం కారణంగా మరో మంత్రి ఫరూక్ హాజరు కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.మొత్తం ఆరుగురు మంత్రులు గైర్హాజరు కావడంతో ఈ కేబినెట్ సమావేశం చుట్టూ రాజకీయ చర్చలు వేడెక్కాయి. ముఖ్యంగా పవన్ వరుసగా రెండు కీలక సమావేశాలకు హాజరు కాకపోవడంపై వివిధ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అధికార వర్గాలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
‘చంద్రబాబు.. ఇరాన్లో మాత్రమే ఆ పదవి ఖాళీ ఉంది’
విస్సన్నపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ధ్వజమెత్తారు. తాను జైలు నుంచి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడనని చంద్రబాబు అనుకున్నారని, నిక్కర్లు వేసుకున్నప్పటి నుండి తాను రాజకీయం చేస్తున్నానని, ఇటువంటి బెదిరింపులకు భయపడనని జోగి రమేష్ స్పష్టం చేశారు. తాను జైలు నుంచి వచ్చిన తర్వాత తగ్గుతా అనుకున్నావా.. వైఎస్సార్సీపీ జెండాను భుజం దింపుతా అనుకున్నావా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్న పేటలో మీడియాతో మాట్లాడారు జోగి రమేష్. ‘ తిరువూరు గడ్డ అంటే వైఎస్సార్సీపీ అడ్డా. గ్రామాల్లో ఏ ఊరికి వెళ్ళినా కూడా చంద్రబాబు ఎప్పుడు దిగిపోతాడు.. జగనన్న ఎప్పుడు సీఎం అవుతాడు అంటున్నారు. నేను చంద్రబాబును ఒక మాటే కదే అన్నాను. కల్తీ లిక్కర్ నారా వారి సారా ఏరులై పారుతుంది అనే కదా అన్నాను. ఒక్క మాటకే 83 రోజులు జైలుకు పంపించావు. చంద్రబాబు విద్య,వైద్యాన్ని పడకెత్తించాడు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అంటూ మోసగించావు. లోకేష్ ఏమన్నాను చిప్ దొబ్బిందా అన్నాను అంతేగా. దానికై ఇంటిపై యాసిడ్ బాంబులతో దాడులు చేశారు. కల్తీ నెయ్యి గురించి నానా యాగీ చేస్తున్నారే. సుప్రీంకోర్టు సైతం చెంప చెల్లుమనిపించింది’ అని మండిపడ్డారు.ఇరాన్లో మాత్రమే ఖాళీ ఉంది..చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలా. చంద్రబాబు ప్రధానమంత్రి అవకాశం వస్తేనే వదిలేసుకున్నాడట. ఉపప్రధాని పదవి చాలా చీప్ అట.. మోదీ స్థాయి అయితేనే కావాలట. మోదీ స్థాయి పదవి కావాలంటే చంద్రబాబుకు ఇరాన్లో మాత్రమే ఖాళీ ఉంది’ అని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయం.. వ్యాపారి అరెస్ట్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్లోని జెమ్ ఫుడ్స్ గోడౌన్పై పోలీసులు దాడి చేశారు. అక్కడ నిల్వ ఉంచిన 30 బాక్సులకు పైగా కుళ్లిపోయిన డ్రై ఫ్రూట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మనీష్ అనే డ్రై ఫ్రూట్స్ వ్యాపారి బూజు పట్టిన జీడిపప్పు, బాదంలను నాణ్యమైనవిగా చూపించి ప్రజలకు విక్రయిస్తున్నాడు. దాంతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేసే సమయంలో వాటి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. ఈ ఘటనతో కల్తీ ఆహార పదార్థాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తీవ్ర గాయాలతో కోమాలో ఖమేనీ? సంచలనంగా బ్రిటీష్ మీడియా కథనాలు
ఇరాన్ కొత్త అత్యున్నత నాయకుడు మోజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపైపలు అనుమానాలు హల్చల్ చేస్తున్నాయి. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న భిన్నమైన కథనాల ప్రకారం శత్రు పక్షం దాడిలో మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని కాలు తీసేసారని, కోమాలో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ధృవీకరణఘేదీ లేనప్పటికీ ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడం ఈ అనుమానాలను బలపరుస్తోంది.ది సన్ నివేదిక ప్రకారం, మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని బ్రిటీష్ పత్రిక 'ద సన్' (The Sun) నివేదించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 56 ఏళ్ల కుమారుడు మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడి ,ప్రస్తుతం టెహ్రాన్లో చికిత్స పొందుతున్నాడని నివేదించింది. తండ్రిమరణానికి దారి తీసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఖమేనీకి ఒక కాలు (లేదా రెండు కాళ్లు) తొలగించారని, కాలేయం లేదా కడుపు భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఆయన టెహ్రాన్లోని సినా యూనివర్సిటీ హాస్పిటల్లో కోమాలో ఉన్నట్లు ఆ వార్తలు పేర్కొంటున్నాయి.దీనికి తోడు ఇరాన్ సుప్రీంగా ఎన్నికైన తరువాత తొలిసారి మొజ్తబా ఖమేనీ పేరుతో ఒక ప్రకటన జారీ అయింది. ఈ కొత్త ఫోటోలను ఇరాన్ మీడియా విడుదల చేసినప్పటికీ, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సృష్టించినవి లేదా పాత ఫోటోలను ఎడిట్ చేసినవనీ చాలా సంస్థలు అనుమానిస్తున్నాయి.అయితే ఏఐ ఫోటో అన్న ఆరోపణలను ఇరాన్ ప్రభుత్వ అధికారులు, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కుమారుడు యూసుఫ్ ఖండించారు. మొజ్తబా ఖమేనీ "సురక్షితంగా, ఆరోగ్యంగా" ఉన్నారని , భద్రతా కారణాల దృష్ట్యా రహస్య ప్రదేశంలో ఉన్నారని పేర్కొన్నారు. (ఇరాన్ వార్ : ట్రంప్ సరికొత్త వార్నింగ్)మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై స్పందిస్తూ, ఖమేనా గాయపడి ఉండవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో బ్రతికే ఉన్నారని భావిస్తున్నానంటూ వ్యాఖ్యానించడంతో అసలు మొజ్తబా ఖమేనీ సజీవంగా ఉన్నారా లేదా అనుమానాలు మరింతగా చెలరేగాయి. అయితే ఖమేనీ కోమాలో ఉన్నట్లు వస్తున్న వార్తలకు అదికారిక ధృవీకరణ ఏదీ లేదుకాగా ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో (Operation Epic Fury) మొజ్తబా ఖమేనీ తండ్రి అలీ ఖమేనీనికోల్పోయిన సంగతి తెలిసిందే. అలాగే తల్లి, భార్యను, కొడుకును, అక్కను, ఆమె భర్తను, వారి పిల్లలు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు
అదే భయం... అదే పతనం
హైదరాబాద్లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయం.. వ్యాపారి అరెస్ట్
దుబాయ్లో జరిమానాలపై కొత్త చట్టానికి ఆమోదం
రైతు సంక్షేమమే ధ్యేయం
రాజేంద్రప్రసాద్ క్షమాపణలు.. విశాల్ కృతజ్ఞతలు
‘చంద్రబాబు.. ఇరాన్లో మాత్రమే ఆ పదవి ఖాళీ ఉంది’
కల్తీ అల్లం- వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
‘ఇరాన్ గగనతలం పూర్తిగా మా గుప్పిట్లోకి వచ్చింది’
సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!
బ్యాండ్ మేళం: ఏంటో ఏమో.. సాంగ్ విన్నారా?
ఇంటి పేరు మార్చుకున్న విజయ్ వారసుడు
సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
దొరికినవి.. దేవతల నగలు
నాలుగు పెళ్లిళ్లు.. మీ కన్నా హిందువులే నయం: ముంతాజ్
42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు
దేశంలో గ్యాస్ సంక్షోభం
పాక్ వివాదాస్పద బౌలర్కు జాక్పాట్
శాంసన్ కాదు.. అతడే అందుకు అర్హుడు: డివిలియర్స్
ఏ పని చేయకుండా నిత్యం అవే ఆలోచిస్తున్నారు!
రాజేంద్ర ప్రసాద్ గారు.. సారీ చెప్పండి : విశాల్ ట్వీట్
షాహీన్ అఫ్రిది సంచలన నిర్ణయం
సిలిండర్ డెలివరీపై కఠిన నియమం
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
మొట్టమొదటి మెసేజ్.. మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన
'ఆ రోజు మా వాళ్లు వణికిపోయారు.. అందుకే గెలిచే మ్యాచ్లో ఓడాం'
T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్
AUS Vs SA: అసాధ్యం సుసాధ్యమైన రోజు!
ఓటీటీని షేక్ చేసేలా విజయ్ సేతుపతి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
అదే భయం... అదే పతనం
హైదరాబాద్లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయం.. వ్యాపారి అరెస్ట్
దుబాయ్లో జరిమానాలపై కొత్త చట్టానికి ఆమోదం
రైతు సంక్షేమమే ధ్యేయం
రాజేంద్రప్రసాద్ క్షమాపణలు.. విశాల్ కృతజ్ఞతలు
‘చంద్రబాబు.. ఇరాన్లో మాత్రమే ఆ పదవి ఖాళీ ఉంది’
కల్తీ అల్లం- వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
‘ఇరాన్ గగనతలం పూర్తిగా మా గుప్పిట్లోకి వచ్చింది’
సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!
బ్యాండ్ మేళం: ఏంటో ఏమో.. సాంగ్ విన్నారా?
ఇంటి పేరు మార్చుకున్న విజయ్ వారసుడు
సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
దొరికినవి.. దేవతల నగలు
నాలుగు పెళ్లిళ్లు.. మీ కన్నా హిందువులే నయం: ముంతాజ్
42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు
దేశంలో గ్యాస్ సంక్షోభం
పాక్ వివాదాస్పద బౌలర్కు జాక్పాట్
శాంసన్ కాదు.. అతడే అందుకు అర్హుడు: డివిలియర్స్
ఏ పని చేయకుండా నిత్యం అవే ఆలోచిస్తున్నారు!
రాజేంద్ర ప్రసాద్ గారు.. సారీ చెప్పండి : విశాల్ ట్వీట్
షాహీన్ అఫ్రిది సంచలన నిర్ణయం
సిలిండర్ డెలివరీపై కఠిన నియమం
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
మొట్టమొదటి మెసేజ్.. మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన
'ఆ రోజు మా వాళ్లు వణికిపోయారు.. అందుకే గెలిచే మ్యాచ్లో ఓడాం'
T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్
AUS Vs SA: అసాధ్యం సుసాధ్యమైన రోజు!
ఓటీటీని షేక్ చేసేలా విజయ్ సేతుపతి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఫొటోలు
‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, బన్నీ (ఫోటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)
హైదరాబాద్ : ఓ షాపింగ్ మాల్లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)
హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ కార్యకలాపాలు (ఫోటోలు)
వాళ్లిద్దరి వల్లే ట్రిప్ ఎంతో స్పెషల్: మెహరీన్ (ఫోటోలు)
తాడేపల్లి : వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్ జగన్ (ఫొటోలు)
నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ HD వర్కింగ్ స్టిల్స్
అడివి శేష్ 'డెకాయిట్' మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)
సినిమా
MGRపై చౌకబారు వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
తెలుగు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానన్నాడు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, అనుకోకుండా దొర్లాయని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపాడు.కొద్దిగా నోరు జారా..ఆ వీడియోలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. తమిళ సినీ ప్రేక్షకులు ఎంజీఆర్ను దైవంలా భావిస్తారు. నేను కూడా ఆయన్ను దేవుడిలాగే భావిస్తాను. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో కొద్దిగా నోరు జారాను. అది కావాలని అనలేదు. కొందరు దీన్ని పెద్దది చేశారు. ఆయనపై కామెంట్స్ చేసేంత ధైర్యం నాకెక్కడిది? నేను చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము నటిస్తుంటే వచ్చి చూసేవారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను తప్పుగా మాట్లాడతానా? ఏదేమైనా నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలాంటి కామెంట్స్ చేయను అని క్షమాపణలు తెలిపాడు.ఏం జరిగింది?కాగా ఇటీవల ఓ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ కాస్త నోరు జారాడు. తెలుగు నటుడు కాంతారావును పొగిడే క్రమంలో ఎంజీఆర్పై చులకన వ్యాఖ్యలు చేశాడు. కాంతారావును చూసి ఎంజీఆర్ ప్యాంటు తడుపుకునేవాడని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్ సెలబ్రిటీలు విశాల్, నాజర్ మండిపడ్డారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ప్రతి తమిళుడి మనసును నొచ్చుకునేలా ఉన్నాయన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు. வருத்தம் தெரிவித்த நடிகர் ராஜேந்திர பிரசாத்!#ActorRejendraprasad #mgr #nadigarsangam #nasser#vishal pic.twitter.com/8dpyBRPW5Z— FridayCinema (@FridayCinemaOrg) March 13, 2026
66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఏమందంటే?
సెలబ్రిటీలు ఎలా రెడీ అవుతున్నారు? బరువు పెరిగారా? తగ్గారా? ముఖం కళకళలాడుతోందా? కళ తప్పిందా? హుషారుగా ఉన్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఇలా ప్రతీది కళ్లతోనే స్కానింగ్ చేస్తున్నారు సోషల్ మీడియా నెటిజన్స్. వారి కంటికి ఏదైనా ఫోటో, వీడియో కనిపిస్తే చాలు.. ఏవేవో ఊహించుకుంటున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా విషయంలోనూ అలాగే అతిగా ఊహించుకున్నారు.విరోష్ రిసెప్షన్లో..ఇటీవల హైదరాబాద్లో జరిగిన విరోష్ (విజయ్ దేవరకండ- రష్మిక మందన్నా) రిసెప్షన్కు నీనా గుప్తా, భర్త వివేక్తో కలిసి హాజరైంది. స్టైలిష్గా తెల్ల చీర కట్టుకున్న ఆమె మెడకు బంగారు నెక్లెస్ ధరించింది. కాకపోతే కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించింది. ఇంకేముంది సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. 66 ఏళ్ల వయసులో నీనా గర్భం దాల్చిందా? ఇది నిజమేనా? అని ఆరా తీస్తున్నారు.ప్రెగ్నెన్సీ రూమర్స్పై క్లారిటీదీంతో ఈ రూమర్స్పై తాజాగా నీనా గుప్తా స్పందించింది. ఇదేమైనా బదాయి హో సినిమా (ఈ మూవీలో లేటు వయసులో ఓ మహిళ తల్లవుతుంది) అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. నేను గర్భవతిని కాదు. చీర కాస్త బరువుగా ఉంది. అందువల్లే నేను కూడా మీకు లావుగా కనిపించానంతే! ఏదేమైనా ఈ ప్రచారం నన్ను బాధపెట్టడానికి బదులుగా ఆశ్చర్యపరిచింది. ఈ వయసులో ప్రెగ్నెంట్ అనుకున్నారంటే మన దేశం ముందుకు పోతున్నట్లే అని పేర్కొంది. నీనా చివగా వధ్ 2 మూవీలో యాక్ట్ చేసింది.ప్రేమ- పెళ్లినీనా గుప్తా వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ను ప్రేమించింది. అయితే అప్పటికే అతడికి భార్యాబిడ్డలున్నారు. అయినప్పటికీ నీనాతో ప్రేమాయణం సాగించాడు. వీరి ప్రేమకు గుర్తుగా 1989లో మసాబా గుప్తా జన్మించింది. కానీ నీనా- రిచర్డ్స్ మాత్రం పెళ్లి బంధం వరకు వెళ్లకుండానే విడిపోయారు. దాంతో నీనా.. సింగిల్ పేరెంట్గా మసాబాను పెంచి పెద్ద చేసింది. 2008లో వివేక్ మెహ్రాను పెళ్లాడింది. Is Neena Gupta pregnant? pic.twitter.com/AlCeWzpvlG— Sapna Madan (@sapnamadan) March 5, 2026 చదవండి: గుండె ముక్కలు.. హీరో బ్రేకప్ పోస్ట్
'ఆయా షేర్' కోసం ఇంత కష్టమా?.. మేకింగ్ విశేషాలివే!
‘ఆయా షేర్..’ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’లోని ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ని షేక్ చేస్తోంది. నాని వేసిన హుక్ స్టెప్కి చిన్న, పెద్దా, ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తున్నారు. సాహిత్యంపై పట్టున్నవాళ్లు లిరిక్స్పై, డ్యాన్స్పై అవగాహన ఉన్నవాళ్లు..నాని స్టెప్పులపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఈ పాటలో కనిపించిన విజువల్స్ మరోఎత్తు. ఈ పాటలో హీరోని మురికివాడకు చక్రవర్తిగా చూపించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. హీరోను మురికివాడకు చక్రవర్తిగా చూపించడానికి 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ సెట్ను నిర్మించారట. ఇందులో ప్రధాన ఆకర్షణగా హీరో హౌస్ (కమాన్ సెట్) నిలిచింది. దీన్ని 60 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు, 25 అడుగుల లోతుతో నిర్మించారట. అంతేకాదు ఇందులో చూపించిన ఇళ్లను నిజంగానే నిర్మించారట. సాధారణంగా సినిమాల్లో ఇళ్ల సెట్లు అంటే డమ్మీ స్ట్రక్చర్స్ వాడుతుంటారు. కానీ ఈ సాంగ్లో వాటర్ బాడీ విలేజ్ సెట్ కోసం 60 అసలైన ఇళ్లను నిర్మించినట్లు మేకర్స్ తెలిపారు. దాదాపు 50 మంది పనివారు 30 రోజుల పాటు శ్రమించి ఈ విలేజ్ సెట్ను రూపొందించారు. ఇక ఈ పాటలో కనిపించే భారీ బిర్యానీ బౌల్ని రెడీ చేయడానికి ఏడు మంది దాదాపు ఐదు రోజుల పాటు కష్టపడ్డారట. దీనికి పాత కాలపు లుక్ రావడం కోసం ప్రత్యేకమైన 'ఏజింగ్ టెక్నిక్స్' వాడటం విశేషం. సినిమాలోని సహజత్వం కోసం 120 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో ఒక డంప్ యార్డ్ సెట్ను కూడా వేశారు. దీనికోసం 25 మంది సభ్యులు 30 రోజుల పాటు పనిచేశారు. ఇక్కడ నీటి కొలను సృష్టించడానికి 100 ట్యాంకర్ల నీటిని వినియోగించారు. ఇది నిండటానికే ఏడు రోజుల సమయం పట్టిందంటే సెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక పాట కోసమే ఈ రేంజ్లో సెట్ వేశారంటే..ఇక సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చదు. సీనియర్ నటుడు మోహన్ బాబు విలన్గా నటిస్తున్నాడు. తనికెళ్ల భరణి,కిల్' ఫేమ్ రాఘవ్ జూయెల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
'అవకాశాలు తర్వాత.. బరువు తగ్గు'.. ఏడ్చుకుంటూ వెళ్లా!
నటి సంభావన సేత్.. భోజ్పురి సినిమాల్లో ఎన్నో ఐటం సాంగ్స్ చేసింది. హిందీలోనూ నటిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్పెషల్ సాంగ్స్లో స్టెప్పులేసింది. అటు బుల్లితెరపై బిగ్బాస్, రాజ్ పిచ్లే జనం కా, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్కె ఖిలాడీ 4 ఇలా అనేక రియాలిటీ షోలలో పాల్గొంది.రెండో సీజన్లో పార్టిసిపేషన్అయితే తనకు ఓ స్టార్ హీరో అవకాశాలిస్తానని చెప్పి ఆ తర్వాత తన ఆశలపై నీళ్లు చల్లాడంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంభావన సేత్ మాట్లాడుతూ.. నేను హిందీ బిగ్బాస్ రెండో సీజన్లో పాల్గొన్నాను. నాలుగో సీజన్లో స్టేజీపై పర్ఫామెన్స్ చేశాను. అప్పుడు నటుడు రవికిషన్.. నేను భోజ్పురిలో మంచి పేరున్న డ్యాన్సర్ అని సల్మాన్ ఖాన్కు పరిచయం చేశాడు. ఫోన్ నెంబర్ కూడా..అందుకాయన.. ఇప్పుడే చూశాగా.. డ్యాన్స్ చాలా బాగా చేస్తోందని మెచ్చుకున్నాడు. నేను కొంత ధైర్యం తెచ్చుకుని తన సినిమాల్లో ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగాను. వెంటనే ఆయన తప్పకుండా ఇస్తానన్నాడు. తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. షో అయిపోయిన కొంతకాలానికి నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లాను. అప్పుడతడు కాస్త చిరాకుగా ఉన్నాడు. కానీ బానే మాట్లాడాడు. ఏడ్చుకుంటూ వెళ్లా.సినిమా అవకాశం ఇస్తానన్నారు కదా అని గుర్తు చేశాను. అందుకు సల్మాన్.. నాకు గుర్తు లేదు కానీ మీరు కాస్త బరువు తగ్గాలి.. మరో విషయమేంటంటే ఇండస్ట్రీలో నేనెవర్నీ ప్రమోట్ చేయను అని ముక్కుసూటిగా చెప్పాడు. ఆ మాటలు నన్నెంతో బాధపెట్టాయి. ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. కానీ, ఇప్పటికీ నేను సల్మాన్ ఖాన్ అభిమానినే అని చెప్పుకొచ్చింది.చదవండి: 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఏమందంటే?
క్రీడలు
’నా చిన్ని తమ్ముడు.. ఇకపై ఆమెకు మాత్రమే సొంతం’
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. కొత్త కోడలి రాకతో పరివారంలో సందడి నెలకొంది. ఈ క్రమంలో సచిన్ కుమార్తె సారా టెండుల్కర్ తమ్ముడు అర్జున్ టెండుల్కర్- మరదలు సానియా చందోక్లను ఉద్దేశిస్తూ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సానియా పాపిట్లో అర్జున్ తిలకం దిద్దుతున్న ఫొటోను పంచుకున్న సారా.. ‘‘నా చిన్ని తమ్ముడు.. ఇకపై సానియాకే సొంతం. ఈ విశ్వం మీపై అంతులేని ప్రేమ, ఆశీర్వచనాలు కురిపించాలి. మీ హృదయం కోరుకున్న ప్రతి ఒక్కటి మీకు దక్కాలి.మీకు ఎవరి దిష్టి తగలకూడదు. మీ ఇద్దరిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నా జీవితంలోని అత్యంత సంతోషకరమైన రోజు మీ పెళ్లి రోజే అని చెప్పడంలో సందేహంలేదు’’ అని తమ్ముడు, మరదలిపై ప్రేమను కురిపించింది. తనకు సోదరిలేని లోటు తీర్చేలా సానియాను ఇచ్చినందుకు అర్జున్కు ఈ సందర్భంగా సారా ధన్యవాదాలు కూడా తెలిపింది.కాగా సచిన్- అంజలి దంపతుల ఏకైక కుమారుడు అర్జున్ టెండుల్కర్ వివాహం మార్చి 5న సానియా చందోక్తో జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఈ వేడుకకు భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ తదితరులు సతీసమేతంగా తరలివచ్చారు. ముకేశ్ అంబానీ కుటుంబం కూడా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించింది.ఇదిలా ఉంటే.. తమ్ముడి పెళ్లిలో సారా కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. సంగీత్, మెహందీ వేడుకలో సంప్రదాయ దుస్తుల్లో సారా టెండుల్కర్ మరింత అందంగా కనిపించింది. ఇక అర్జున్- సానియా సంగీత్ ఫొటోలను షేర్ చేస్తూ.. వారి పట్ల మరోసారి సారా ప్రేమ చూపగా.. సానియా ఇందుకు.. ‘‘ధన్యవాదాలు.. లవ్ యూ సోదరి’’ అంటూ జవాబు ఇచ్చింది. కాగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలు సానియా. ఆమె కూడా ఎంటర్ప్రెన్యూర్గా రాణిస్తోంది.
IPL 2026: జింబాబ్వే బౌలర్కు బంపరాఫర్?
ఐపీఎల్-2026 సీజన్ మరో రెండు వారాల్లో షురూ కానుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. దీంతో కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో పడింది. అతడి స్దానంలో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీని తీసుకోవాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం.ముజరబానీ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. జింబాబ్వే సూపర్-8 స్టేజ్కు చేరుకోవడంలో ఈ రైట్ ఆర్మ్ పేసర్ది కీలక పాత్ర. ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్లో ముజరబానీ నాలుగు వికెట్లు పడగొట్టి జింబాబ్వేకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.అతడికి పవర్ప్లేతో డెత్ ఓవర్లలో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే సత్తా ఉంది. ఈ క్రమంలోనే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు కేకేఆర్ సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ముజరబానీ ఇప్పటివరకు ఐపీఎల్లో అరంగేట్రం చేయలేదు. గత సీజన్ ఆఖరిలో ఆర్సీబీ జట్టులోకి వచ్చినప్పటికి.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు.ముస్తాఫిజుర్పై వేటు..కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మన్ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ వేలం అనంతరం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరిగిపోవడంతో ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిని జట్టు నుంచి రిలీజ్ చేయాలని కేకేఆర్ సూచింది.బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్ను కేకేఆర్ విడుదల చేసింది. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే కేకేఆర్ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రూ.18 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్ మతీషా పతిరానా, భారత ఆల్రౌండర్ హర్షిత్ రాణా గాయాలతో పోరాడుతున్నారు. వీరిద్దరి అందుబాటుపై ఇంకా స్పష్టత రాలేదు.కేకేఆర్ పూర్తి జట్టు:అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ (కీపర్), అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణ్దీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కామెరాన్ గ్రీన్, మతీషా పతిరానా, తేజస్వి సింగ్, ఫిన్ అలెన్ (కీపర్), కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, టిమ్ సీఫెర్ట్ (కీపర్), రాహుల్ త్రిపాఠి, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్, సార్థక్ రంజన్.చదవండి: భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్ ఆటగాళ్ల లిస్టు
భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్ ఆటగాళ్ల లిస్టు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రశాంత పహల్గామ్ లోయలో అమాయకులను కాల్చి చంపిన ఉగ్రమూకలపై భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’తో ఉక్కుపాదం మోపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాక్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది.కరచాలనానికి నిరాకరించిఇందుకు ప్రతిగా పాక్ సైన్యం రంగంలోకి దిగగా.. భారత ఆర్మీ వారి దాడుల్ని విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్-2025లో భారత క్రికెట్ జట్టు పాక్ జట్టుతో కరచాలనానికి నిరాకరించి నిరసన తెలియజేసింది. దీంతో పాక్ బోర్డు రాద్ధాంతం చేయగా ఐసీసీ రంగంలోకి దిగి చివాట్లు పెట్టింది.మొట్టికాయలు వేసిన ఐసీసీఅదే విధంగా టీమిండియాతో మ్యాచ్లో అతి చేసిన పాక్ ఆటగాళ్లకు గట్టిగానే మొట్టికాయలు కూడా వేసింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వగా.. పాక్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు.చెలరేగిన వివాదంఅయినా సరే బంగ్లాదేశ్ను అడ్డుపెట్టుకుని పాక్ బోర్డు మరోసారి డ్రామాలు ఆడి.. బొక్కబోర్లా పడింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ‘ది హండ్రెడ్ లీగ్-2026’ వేలంలో సన్ గ్రూపునకు చెందిన కావ్యా మారన్ నేతృత్వంలోని సన్రైజర్స్ లీడ్స్ పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడం వివాదానికి దారితీసింది.టీమిండియాతో మ్యాచ్లో అతి చేస్తూ.. ఆపరేషన్ సిందూర్ను కించపరిచే విధంగా వ్యవహరించిన అబ్రార్ కోసం సన్రైజర్స్ రూ. 2.34 కోట్లు వెచ్చించడంతో.. భారతీయ నెటిజన్లు లీడ్స్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ‘ది హండ్రెడ్ (ఇంగ్లండ్)’ విదేశీ లీగ్ కాబట్టి.. తాము ఈ విషయంలో జోక్యంచేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరమీదకు వచ్చింది. సన్రైజర్స్ తాజాగా విదేశీ లీగ్లో పాక్ ఆటగాడిని ఎంచుకోగా.. ఇంతకు ముందే పలు భారత టీ20 ఫ్రాంఛైజీలు పాక్ ప్లేయర్లకు తమ జట్టులో చోటు ఇచ్చాయి. అవేమిటంటే..భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్ ఆటగాళ్ల లిస్టు👉పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్, టీ20 ప్రపంచకప్ టోర్నీ-2026లో తన బౌలింగ్ యాక్షన్తో వార్తల్లోకి ఎక్కిన స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ట్రిన్బాగో నైట్ రైడర్స్కు ఆడారు. ఈ జట్టుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్ రైడర్స్ యజమానులైన షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతానే ఓనర్లు.👉ఇక అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ (MCL)లో గతేడాది పాక్ ఆల్రౌండర్ ఇమాద్ వసీం సీటెల్ ఆర్కాస్కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ జట్టు ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంలో భాగమైన GMR గ్రూప్నకు చెందినది. 👉కాగా ఇమాద్ వసీం 2023-24 ILT20 సీజన్లో కేకేఆర్కు చెందిన అబు దాబి ఫ్రాంఛైజీకి ఆడాడు. ఇక పాక్ మరో క్రికెటర్ ఉస్మాన్ ఖాన్ ILT20 2025 సీజన్లో.. ముంబై ఇండియన్స్కు చెందిన ఎంఐ ఎమిరేట్స్కు ప్రాతినిథ్యం వహించాడు. 👉ఇదిలా ఉంటే.. ది హండ్రెడ్ వేలంలో అబ్రార్ను సన్రైజర్స్ కొనగా.. మరో పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ను బర్మింగ్హామ్ ఫొనిక్స్ కొనుగోలు చేసింది. ఈసారి ఈ వేలంలో పాక్ నుంచి వీరిద్దరే అమ్ముడుపోగా.. సయీమ్ ఆయుబ్, హ్యారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్ వంటి వాళ్లు అన్సోల్డ్గా మిగిలిపోయారు. చదవండి: T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
ఇరాన్ ఆడకపోవడమే మంచిది.. ట్రంప్ వార్నింగ్!
మరో రెండు నెలల్లో ఫుట్బాల్ సాకర్ ఫీవర్ మొదలుకానుంది. అమెరికా,మెక్సికో,కెనడా దేశాలు సంయుక్తంగా 2026 ఫిపా వరల్డ్కప్కు ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ ఏడాది జూన్ 11 నుంచి జూలై 19 వరకు సాకర్ మెగాటోర్నీ జరగనుంది. అయితే పశ్చిమాసియాలో ఇరాన్తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం ప్రస్తుతం భీకరరూపం దాల్చింది. దీంతో ఇరాన్ జట్టు ఫిఫా వరల్డ్కప్ ఆడలేమని ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ జట్టు ఫిపా వరల్డ్కప్ ఆడేందుకు స్వాగతిస్తామని ఫిఫా చీఫ్ జియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. తాజాగా జియాని వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్సోషల్ వేదికగా స్పందించారు. ‘ఇరాన్ ఫుట్బాల్ జట్టు సాకర్ ప్రపంచకప్లో ఆడడం, ఆడకపోవడమనేది వారిష్టం. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ఆటగాళ్లు అమెరికాకు వస్తే మాత్రం వారి ప్రాణాలకు, భద్రతకు మేము ఎంతమాత్రం గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి వీలైనంత వరకు ఇరాన్ వరల్డ్కప్కు దూరంగా ఉండడమే మంచిది’ అని సున్నితంగా హెచ్చరించారు.2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో (4-2) ఫ్రాన్స్ను ఓడించింది. తద్వారా 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్కప్ జూలై 19 వరకు జరగనుంది. మొత్తం 48 జట్లు పాల్గొననుండగా.. నాలుగేసి జట్లు 12గ్రూపులుగా విడిపోయి మ్యాచ్లు ఆడనున్నాయి. మొత్తం 104 మ్యాచ్లు జరగనుండగా, అందులో 78 మ్యాచ్లు అమెరికాలో, కెనడా, మెక్సికోలు చెరో 13మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనున్నాయి. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్.. బెల్జియం, ఈజిప్టు, న్యూజిలాండ్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది.చదవండి: మా అన్న పెళ్లికి ధూంధాం చేస్తా!
న్యూస్ పాడ్కాస్ట్
విలువలు, విశ్వసనీయతకు వైఎస్సార్సీపీ మారుపేరు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఆదాయం... కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఇక్కడ బాబు, అక్కడ BR నాయుడు కోట్లల్లో భారీ స్కాం
పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు..ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
భవిష్యత్ అభివృద్ధి శూన్యం... ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్. సెమీస్లో 7 పరుగులతో ఇంగ్లండ్పై గెలుపు
బిజినెస్
వాట్సాప్లో కొత్త ఫీచర్.. పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్
వాట్సాప్ చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఒక కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇది ముఖ్యంగా 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించిన 'పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్'. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.గతంలో వాట్సాప్ను పిల్లలు కూడా పెద్దవాళ్ల మాదిరిగానే ఉపయోగించేవారు. అప్పుడు తల్లిదండ్రులకు వారి చాట్స్ లేదా కాంటాక్ట్స్పై ఎక్కువ నియంత్రణ ఉండేది కాదు. ఇప్పుడు వచ్చిన పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ ద్వారా తల్లిదండ్రులు నేరుగా పిల్లల ఖాతాను పర్యవేక్షించవచ్చు. ఎవరు పిల్లలకు మెసేజ్ చేయాలి, ఏ గ్రూపుల్లో చేరాలి, ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉండాలి వంటి విషయాలను తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు.పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ సెటప్● ముందుగా పిల్లల ఫోన్లో వాట్సాప్ యాప్ను ఇన్స్టాల్ చేయాలి. ● తరువాత యాప్ను ఓపెన్ చేసి భాషను ఎంచుకుని అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికపై క్లిక్ చేయాలి.● తరువాత మోర్ ఆప్షన్స్లోకి వెళ్లి.. క్రియేట్ పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ అనే ఎంపికను ఎంచుకోవాలి● పిల్లల ఫోన్ నంబర్ను నమోదు చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.● తరువాత పిల్లల పుట్టిన తేదీ నమోదు చేయాలి. దీని ద్వారానే వారి వయస్సు 13 సంవత్సరాల కంటే తక్కువ అని వాట్సాప్ నిర్ధారిస్తుంది.● ఇవన్నీ పూర్తయిన తరువాత.. పిల్లల ఖాతాను తల్లిదండ్రుల ఖాతాతో లింక్ చేయడానికి కంటిన్యూపై క్లిక్ చేయాలి.పిల్లల ఖాతాతో ఎలా లింక్ చేయాలిపిల్లల ఫోన్ స్క్రీన్పై ఒక QR కోడ్ కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఫోన్తో ఆ కోడ్ను స్కాన్ చేయాలి. ఆ తరువాత వాట్సాప్ తల్లిదండ్రుల పర్యవేక్షణను నిర్ధారించడానికి అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికను చూపిస్తుంది. తరువాత తల్లిదండ్రులు ఒక 6 అంకెల పేరెంట్ పిన్ సెట్ చేసుకోవాలిసెట్ చేయాలి. ఈ పిన్ ద్వారా మాత్రమే పిల్లల ఖాతాకు సంబంధించిన ప్రైవసీ & సేఫ్టీ సెట్టింగ్స్ను మార్చగలుగుతారు. ఈ పిన్ నెంబరును పిల్లలతో షేర్ చేసుకోకూడదు.
రెండోసారి పెరగనున్న బెంజ్ కార్ల ధరలు
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ.. మెర్సిడెస్-బెంజ్ భారతదేశంలో విక్రయించే తమ వాహనాలపై 2 శాతం ధరల పెంపును ప్రకటించింది. కొత్త ధరలు ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ ప్రకటించింది.2026 ప్రారంభమైన తరువాత బెంజ్ కంపెనీ తన వాహనాల ధరలను పెంచడం ఇది రెండో సారి. సంస్థ జనవరిలో కూడా ధరలను పెంచింది. ఇప్పుడు మరోమారు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ధరల పెరుగుదలకు ఫారెక్స్లో అస్థిరత మరియు వాహనాల తయారీలో పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు కారణమని పేర్కొంది.ధరల పెరుగుదల C-క్లాస్, EQS, E-క్లాస్ LWB, S-క్లాస్, EQA, EQB, EQS, EQE, GLC, GLA, GLE, GLS, CLE క్యాబ్రియోలెట్ వంటి కార్ల మీద మాత్రమే కాకుండా కొత్తగా ప్రారంభించిన V-క్లాస్ వంటి మోడళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి.
మర్చంట్ బ్యాంకర్ల ఎంపిక.. ఎన్ఎస్ఈ ఐపీవో సన్నాహాలు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా స్టాక్ ఎక్స్చేంజ్ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా 20 మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది. అంతేకాకుండా పలు లా, ఇంటర్మీడియెరీ సంస్థలను సైతం ఎంపిక చేసుకుంది. శ్రీనివాస్ ఇంజేటి అధ్యక్షతన ఎన్ఎస్ఈ ఐపీవో కమిటీ ఇందుకు అనుమతించింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్ఎస్ఈ బోర్డ్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఐపీవోపై ముందుకెళ్లేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తాజా ఎంపికలను చేపట్టింది. ఎంపికైన మర్చంట్ బ్యాంకర్లలో కొటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ తదితరాలున్నాయి.
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజులు రిజర్వేషన్లు బంద్!
కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న భారత రైల్వే.. టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి PRS అనే కంప్యూటరైజ్డ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా దేశంలోని ఏ రైల్వే స్టేషన్ నుంచైనా రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ సిస్టమ్ పనితీరును మెరుగుపరచడానికి.. సాంకేతిక నిర్వహణ పనులు చేపట్టాల్సి వచ్చింది.సిస్టమ్ అప్గ్రేడ్ కారణంగా కొన్ని గంటల పాటు ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ప్రయాణికులు ముందుగా ఈ విషయాన్ని తెలుసుకొని తమ ప్రయాణ ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఢిల్లీ పీఆర్ఎస్ సిస్టమ్తో అనుసంధానమైన సేవలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.రైల్వే అధికారుల ప్రకారం.. మార్చి 14 అర్ధరాత్రి నుంచి, మార్చి 15 అర్ధరాత్రి వరకు.. అంటే ఈ రెండు రోజులు నిర్వహణ పనులు జరుగుతాయి. ప్రతి రాత్రి సుమారు మూడు గంటల పాటు PRS సేవలు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో కొన్ని ఆన్లైన్ & టెలిఫోన్ సేవలు పనిచేయవు.ఆన్లైన్ టికెట్ బుకింగ్, టికెట్ రద్దు, పీఎన్ఆర్ స్టేటస్ చెక్, కరెంట్ రిజర్వేషన్ సమాచారం, టికెట్కు సంబంధించిన ఇతర విచారణలు మాత్రమే కాకుండా.. ఇండియన్ రైల్వేస్ అందించే 139 పీఎన్ఆర్ విచారణ సేవ కూడా పనిచేయదు.PRS అంటే?PRS (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం) అనేది భారతీయ రైల్వే రూపొందించిన కంప్యూటరైజ్డ్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా రైల్వే టికెట్కు సంబంధించిన.. టికెట్ బుకింగ్, టికెట్ క్యాన్సిల్, తత్కాల్ టికెట్ జారీ, వెయిటింగ్ లిస్ట్ స్టేటస్, ట్రైన్ చార్ట్ తయారీ మొదలైన సేవలను అందిస్తుంది.రెండు రోజుల అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. అవసరమైన టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవడం, అత్యవసర ప్రయాణాలకు ముందస్తు ప్రణాళిక చేయడం వంటివి ముందుగానే చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచనలు జారీ చేశారు. ఈ తాత్కాలిక నిలిపివేత అనేది సిస్టమ్ పనితీరును మెరుగుపరచడం కోసం మాత్రమేనని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ప్రయాణికులకు మరింత వేగవంతమైన మరియు సులభమైన సేవలను అందించడమే ఈ నిర్వహణ పనుల లక్ష్యమని చెప్పారు.
ఫ్యామిలీ
నీలాల కన్నుల్లో మెలమెల్లగా....
బాగా నిద్ర పోండి... హాయిగా జీవించండి⇒ ప్రపంచ నిద్ర దినోత్సవం 2026 థీమ్: స్లీప్ వెల్, లివ్ బెటర్ శారీరక, మానసిక ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర అవసరం అని వరల్డ్ స్లీప్ సొసైటీ నొక్కి చెబుతోంది. ⇒ 3–3–3 రూల్ అనేది నిద్ర నాణ్యతను విశ్లేషించుకునే రూల్.⇒ ఒకటి... మూడు రోజులుగా మీకు సరిగా నిద్ర పట్టడం లేదా?⇒ రెండు... మూడు నెలలుగా మీకు సరిగా నిద్ర పట్టడం లేదా?⇒ మూడు... నిద్ర లేమి అనేది మూడు సమస్యల (అలసట, మూడ్ సరిగా లేకపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం)కు కారణం అవుతుందా? అని ఎవరికి వారు విశ్లేషించుకోవడమే 3–3–3 రూల్.‘నిద్ర సుఖమెరగదు’ అని అంటారు గానీ...మొద్దు నిద్రకు మించిన భాగ్యం లేదని నిద్ర పట్టనివారు వగస్తుంటారు. ఎంత వైభవం ఉన్నా. కంటి నిండా నిద్ర... అసలైన భాగ్యం. అందుకే పెద్దలు ‘జోకొట్టే’ పాటలు పాడేవారు పసిపిల్లలకు. మరి పెద్దలకు? సినిమా పాటలు ఉన్నాయిగా. వినండి. కంటి నిండా నిద్రపోండి.‘నీలాల కన్నుల్లో మెలమెల్లగానిదురా రావమ్మ రావే నిండారా రావే’....నిద్రను కూడా బుజ్జగించి లాలించాలేమో. ముద్దు చేస్తూ ఆహ్వానించాలేమో. నిద్రను ప్రతి మనిషి తన మనసు పాదులో మొక్కలా చేసి రోజూ కాసిని నీళ్లు పోసి పెంచుకుంటూ రావాలేమో. పచ్చటి చెట్టులా అది ఎదిగితే కోరినన్ని నిద్రాఫలాలు ఇస్తుందేమో. రోజూ కొన్ని ఆరగించి బజ్జోవాలేమో.ఉన్నప్పుడు విలువ తెలీదు. లేనప్పుడు ఏం చేసినా పొందడానికి రాదు. కష్టాలు లేని జీవితం కోసం పోరాడాల్సిందే. మరి కలత ఎరుగని నిద్ర కోసం ఏం చేయాలి? పాట వినాలి.కరుణ లేని ఈ జగానా కలత నిదురే మేలురా...కలలు పండే కాలమంతా కనుల ముందే కదలిపోయేలేత మనసున చిగురుటాశ పూతలోనే రాలిపోయేనిదుర పోరా తమ్ముడా...ఎవరైనా ఉండాలి స్నేహానికో. మాట సాయానికో. మనసుకు దగ్గరగానో. మనెద పంచుకోవడానికో. ఉండాలి ఒకరు. మనల్ని గమనించి, మన కొరకు అక్కర ప్రదర్శించి వారొక ఆలంబనగా ఉంటా పాటగా ఉంటే నిదురెందుకు రాదు?పాడుతా తీయగా సల్లగాపసిపాపలా నిదురపో తల్లిగాబంగారు తల్లిగా...సడి సేయకో గాలి సడి సేయబోకేబడలి ఒడిలో రాజు పవళించెనేసడి సేయకో గాలి...శిశుర్వేత్తి పశుర్వేత్తి... గానం విలువ అది. పసిపాపకు జోల పాడితే జోలకు మాత్రమే కాదు నిదుర పట్టేది. పెరిగి పెద్దదయ్యి జీవన లాలిత్యం ఏర్పరుచుకుంటే అందుక్కూడా నిదురపడుతుంది. గాలి తగిలే శయ్య ఉంటే సరిపోదు.. స్వీయ జీవితంలోగాని, ఎదుటివారి జీవితంలోగాని తెలిసి తెలిసి కర్కశపు చప్పుళ్లు, సద్దులూ చేయకపోతే ఆ మనసుకు తప్పక హాయిగా నిదుర పడుతుంది.ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడుసద్దు చేశారంటే ఉలికులికి పడతాడు....అందాల పసిపాప అన్నయ్యకు కనుపాపబజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకేనీకన్నా నాకెవరే...పసి పిల్లల్ని చూసినప్పుడు చిరునవ్వు మీకు రాలేదంటే మీకు నిదుర కూడా రాదు. సుకూమారమైనవి కదా కన్నులు. అంతటి సుకుమారమైన కన్నుల్లో నిదుర రావాలంటే ఎంతటి కరుణ మీలో ఉండాలి. జగతి పట్ల ఎంతటి కారుణ్యం కలిగి ఉండాలి.ముద్దుముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వుజాజిమల్లె పూవు బజ్జోమ్మ నువ్వు...నిదుర పట్టాలంటే స్థిమితత్వం కూడా ఉండాల్లేంటి. అంటే ఏమిటి? స్థితికి సంబంధించిన మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, చక్కటి కుటుంబం... ఇవి సరే. బాంధవ్యాలు? ఒకప్పటి బంధుత్వాలు ఇప్పుడు సన్నగిల్లిపోయాయి. తల్లిదండ్రులతో, అవ్వా తాతలతో కలిసి ఉండలేని స్థితి. పెదనాన్న, బాబాయి, మేనమామ, మేనత్త... వీరు మనకు ఉన్నారు అనే భావన కూడా మొద్దు నిద్ర పట్టడానికి మంచి టాబ్లెట్ ఏమో.అత్త ఒడి పువ్వు వలే మెత్తనమ్మాఆదమరిచి హాయిగా ఆడుకొమ్మాఆడుకొని ఆడుకొని అలసిపోతివాఅలుపుతీర బజ్జొమ్మ అందాల బొమ్మ...పిల్లల్ని బాగా పెంచుకోవాలి. ప్రేమగా అక్కున చేర్చుకోవాలి. వారి మంచి అలవాట్లు తల్లిదండ్రులకు మంచి నిద్ర. వారి పట్ల ఆర్తి, వారితో గడిపే సమయం తిరిగి మనల్ని సంతోష సమీరంగా తాకుతుంది. మన కోసం పాడి మురిపాల నిద్రను ప్రసాదిస్తుంది.పచ్చని చెట్టు ఒకటివెచ్చని చిలుకలు రెండుపాటలు పాడి జోకొట్టాలిజో...జో... జో...నిదుర రావడం లేదంటే అది కేవలం భౌతిక ఆరోగ్యానికి సంబంధించిన సంగతి కాదు. మీ నిద్ర మీ అందమైన ΄÷దరింట్లో ఉంది. తప్పులకు బలహీనతలకు వ్యసనాలకు లొంగని జీవనంలో ఉంది. మీరు నిలబెట్టుకునే బాంధ్యవాల్లో ఉంది. మీ మంచి స్నేహాల్లో ఉంది. మీ కళాభిరుచుల్లో ఉంది. పిసరంత సాయగుణం... చిటికెడంత ఆర్ద్రత... ఇవి ఉంటే నిదుర మీకే తోకాడించే బుజ్జి కుక్కపిల్ల.– కె
పేద గుండెల అందెల రవళి
మట్టిలో మాణిక్యాలకుప్రోత్సాహం తోడైతే ఎలాంటి ఫలితం వస్తుందో ఆచరణా త్మకంగా చూపిస్తోంది నృత్య పరిచయ్.ముంబైలోని మురికివాడలో నివసించే పేదింటి బిడ్డ మానస్ అహిరేకు డ్యాన్స్ నేర్చుకోవడం అనేది ఒకప్పుడు కలలో మాట. డ్యాన్స్ అంటే అతడికిప్రాణం. కాని చాలామంది పిల్లలలాగే మానస్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి డబ్బు, సరైన వేదిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ) మానస్ కలను నిజం చేసింది. సంగీత నాటక అకాడమీ అవార్డ్ అందుకున్న లతసనాదేవి ఆధ్వర్యంలో మానస్ మణిపురి నేర్చుకోవడంప్రారంభించాడు. శిక్షణ ఉచితం. ఈ నృత్యశిక్షణ అభిరుచికి మాత్రమే కాదు క్రమశిక్షణ విషయంలోనూ మానస్లాంటి విద్యార్థులకు బాగా ఉపయోగపడింది. మూడు సంవత్సరాల డి΄÷్లమా పూర్తి చేసిన తరువాత, మానస్ అసిస్టెంట్ టీచర్గా ఎంపికయ్యాడు. ఈ ఉద్యోగం ద్వారా వచ్చే జీతం తన ఇంజినీరింగ్ చదువుకు ఉపయోగపడుతోంది. ‘నృత్యం నాలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అంటున్నాడు మానస్.‘ఎన్సీపీఏ’ నృత్య పరిచయ్ కార్యక్రమం ద్వారా పేదపిల్లలకు నృత్యంలో ఉచిత శిక్షణ ఇస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మానస్లాంటి ఎంతోమంది పేదింటి పిల్లలు లబ్ధి పొందుతున్నారు. ముంబై శివారులోని నెరూల్కు చెందిన సిద్ది మాత్రే 2019లో తన నృత్యప్రస్థానాన్నిప్రారంభించింది. నెరూల్లోని ధ్యాన్దీప్ సేవా మండపంలో గురు శర్మిష్ఠ చటోపాధ్యాయ ఆధ్వర్యంలో ఒడిస్సీలో శిక్షణ పొందింది. ఇప్పుడు సిద్ధి అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తోంది. ఖజురహో ఉత్సవంలో ఏడు వందల మంది విద్యార్థులతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వనుంది సిద్ది మాత్రే.నృత్య పరిచయ్ కార్యక్రమంలో భాగంగా వెయ్యి మందికి పైగా పేదింటి విద్యార్థులు నృత్యం నేర్చుకున్నారు. ‘నృత్యం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచన నుంచి పుట్టిందే నృత్య పరిచయ్’ అంటారు ఎన్సీపీఏ నృత్యవిభాగం అధిపతి స్వ΄్నోకల్పదాస్ గుప్తా.‘పిల్లలకు ప్రతిభ ఉండవచ్చు. సరిౖయెన ఆదరణ,ప్రోత్సాహం లేకపోతే తమ అభిరుచి నుంచి దూరం జరుగుతారు. దీన్ని నివారించడానికి నృత్య పరిచయ్ పేద పిల్లలకు చేరువ అవుతుంది’ అంటారు గుప్తా. నృత్యపరిచయ్తో పాటు ఎన్సీపీఏ ‘నృత్య గురుకుల్’ అనే అధునాతన మార్గదర్శక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ‘నృత్యగురుకుల్’ కార్యక్రమం క్రింద ఇరవైనాలుగు మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ప్రతిభ, అంకితభావం, నిబద్ధత ఆధారంగా ఎనిమిది మంది గురువులు వీరిని ఎంపిక చేశారు. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకుప్రాధాన్యత ఇస్తారు.
గోల్ఫ్కి అమూల్యం
మాజీ ఐఆర్ఎస్ అధికారి, గోల్ఫ్ ప్రేమికుడు డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి టీ గోల్ఫ్ ఫౌండేషన్ స్థాపించి అమెచ్యూర్ గోల్ఫర్లనుప్రోత్సహిస్తున్నారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు టోర్నీల్లో ఆడేందుకు వీలుగా టికెట్లు, వసతి సౌకర్యం వంటి వాటిని అందిస్తున్నారు.గోల్ఫ్ అంటే ఖరీదైన క్రీడ కదా మనకెందుకులే అని ఆమె అనుకోలేదు. రైతులం కదా అంతటి ఖరీదైన ఆటకు శిక్షణ ఇప్పించడం మన తరమవుతుందా అని ఆమె తల్లిదండ్రులూ వెనకడుగు వేయలేదు.. తండా అమ్మాయి కదా గోల్ఫ్కిప్రోత్సహించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అని ఆమె కోచ్ కూడా భావించలేదు. పట్టుదలతో ఆటపై పట్టు సాధిస్తే, అవకాశాలు వాటంతట అవే వస్తాయి అని ఆమె.. బిడ్డ ఆసక్తి, పట్టుదలే వెన్నుదన్నుగా నిలవడం ఖాయమని ఆమె తల్లిదండ్రులు.. వెన్నుతట్టిప్రోత్సహిస్తే ఆమె అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి కావడం తథ్యమని ఆమె కోచ్ బలంగా విశ్వసించారు.వారి నమ్మకం నిజమైంది. తండా నుంచి వచ్చిన ఓ సాధారణ అమ్మాయి.. గోల్ఫ్లో అదరగొడుతోంది. ఎందరో దిగ్గజ గోల్ఫర్లను వెనక్కి నెట్టి ఇటీవల జరిగిన హైదరాబాద్ ఓపెన్ కప్ని కైవసం చేసుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. ఆమె పేరు జి.అమూల్య. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం ఎర్ర సోమ్లా తండాకు చెందిన రైతులు జి.రవికుమార్, సునీత దంపతుల కుమార్తె. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతోంది.వాస్తవానికి మన దేశంలో బాగా క్రేజ్ ఉండేది క్రికెట్కే... తర్వాత బ్యాడ్మింటన్ , టెన్నిస్, హాకీ.. గత కొంతకాలంగా ఒలింపిక్స్ పతకాలు వస్తున్న రెజ్లింగ్, బాక్సింగ్, షూటింగ్ వంటి వాటినీ క్రీడాభిమానులు ఫాలో అవుతున్నారు. దీంతో చాలామంది తల్లిదండ్రులు దాదాపుగా ఇవే క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ధనవంతుల క్రీడగా భావించే గోల్ఫ్ పట్ల ఎవరూ ఆసక్తి చూపించరు. ఎందుకంటే ఈ ఆటలో ఉపయోగించే గోల్ఫ్ స్టిక్, బాల్స్ వంటివన్నీ ఇతర క్రీడలతో పోలిస్తే చాలా ఖరీదు. అయినా అమూల్య మాత్రం గోల్ఫ్ పై ఆసక్తి పెంచుకుంది.స్థానికంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆమెలో గోల్ఫ్ ఆటపై ఉన్న ఆసక్తిని, నైపుణ్యాన్ని కోచ్ భాస్కర్ గుర్తించారు. కెరీర్ ఆరంభం నుంచే అమూల్యను వెన్నుతట్టిప్రోత్సహించారు. రాష్ట్రస్థాయి, సౌత్ జోన్ లెవెల్ టోర్నీల్లో ఆడేలాప్రోత్సహించారు. అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అమూల్యను హైదరాబాద్ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్సు, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో శిక్షణ తీసుకునేలా సిఫార్సు చేశారు. ఈప్రోత్సాహానికి తగ్గట్టే అమూల్య పలు టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా 2022–23 మధ్యలో పలు జూనియర్, సౌత్ జోన్ స్థాయి టోర్నీల్లో ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది.మలుపు తిప్పిన హైదరాబాద్ ఓపెన్మాజీ ఐఆర్ఎస్ అధికారి, గోల్ఫ్ ప్రేమికుడు డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి టీ గోల్ఫ్ ఫౌండేషన్ స్థాపించి అమెచ్యూర్ గోల్ఫర్లనుప్రోత్సహిస్తున్నారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు టోర్నీల్లో ఆడేందుకు వీలుగా టికెట్లు, వసతి సౌకర్యం వంటి వాటిని అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనే తొలిసారి అమెచ్యూర్ గోల్ఫర్ల కోసం హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ పేరుతో జాతీయస్థాయి టోర్నీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 300 మందికి పైగా గోల్ఫర్లు దీనిలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అమూల్య కూడా ఎన్ఆర్ఎన్ రెడ్డిని కలిసి టోర్నీలో ఆడతానని అడగడంతో.. ఆమె నేపథ్యం తెలుసుకున్న ఆయన ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా అవకాశమిచ్చారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అమూల్య క్వాలిఫైయింగ్ రౌండ్లో అదరగొట్టి, ప్రధాన రౌండ్లో పెద్ద పెద్ద గోల్ఫర్లను వెనక్కి నెట్టి ఓవరాల్ గ్రాస్ విన్నర్గా నిలిచింది. తద్వారా రూ.90వేల ప్రైజ్ మనీతో పాటు గవర్నర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఓపెన్ ట్రోఫీ, గోల్ఫర్లు ధరించే గ్రీన్ జాకెట్ అందుకుంది. గోల్ఫ్ ట్రిప్ సంస్థ ద్వారా బ్యాంకాక్లో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్సులో ఆడే అవకాశాన్ని కూడా గెలుచుకుంది. గోల్ఫ్ కిట్ను టీ గోల్ఫ్ ఫౌండేషన్ అందించింది. భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి సహకారం కావాలన్నా తమ ఫౌండేషన్ కు రావొచ్చని ఎన్ఆర్ఎన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓ మారుమూల తండా నుంచి వచ్చి గోల్ప్ లో అదరగొడుతున్న అమూల్య భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – సత్య కిషోర్ కొండ్రెడ్డి
అంకిత అద్భుత విజయం
ఎప్పుడూ నడిచే దారిలో నడిస్తే కొత్తేముంది! కొత్త దారులు వెదకాలి. అప్పుడే కొత్త వెలుగు కనిపిస్తుంది. అలాంటి వెలుగును చూసింది అంజలి. ఇన్వెస్టర్గా ప్రయాణం ప్రారంభించిన అంజలి ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంది. తన ఆలోచనలకు సృజన, శ్రమలను జోడించి విజయకేతనం ఎగరేసింది.కొన్ని నెలల క్రితంప్రారంభమైన 10–మినిట్ హోమ్ సర్వీసెస్ స్టార్టప్ 'ప్రొంటో’కు ఇన్వెస్టర్లు, వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. తక్షణ గృహ సహాయాన్ని ఆర్డర్ చేయడానికి వినియోగదారులకు 'ప్రొంటో’ వీలు కల్పిస్తుంది. బెంగళూరు కేంద్రంగా మొదలైన ఈ స్టార్టప్ ఆ తరువాత ఎన్నో నగరాలకు విస్తరించింది. 23 సంవత్సరాల అంజలి సర్దానా 'ప్రొంటో’కు వ్యవస్థాపకురాలు, సీయీవో.'ప్రొంటో’ అనేది శిక్షణ పొందిన డొమెస్టిక్ వర్కర్లతో వినియోగదారులను అనుసంధానించే వేదిక. వినియోగదారులు ఈ యాప్ ద్వారా స్వీపింగ్, పాత్రలు కడగడం, వంటగది, బాత్రూమ్ శుభ్రపర్చడం, లాండ్రీ... మొదలైన ఇంటి పనుల కోసం స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. మరిన్ని నగరాల్లోకి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న'ప్రొంటో’ రాబోయే రోజుల్లో వంట, కార్ వాషింగ్, సెలూన్ సేవలపై కూడా దృష్టి పెట్టనుంది.భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడం, సుదీర్ఘమైన పనిగంటలు, బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో'ప్రొంటో’లాంటి హౌస్–హోల్డ్ యాప్లకు డిమాండ్ పెరుగుతోంది.ప్లాట్ఫామ్లో రోజుకు 18,000 బుకింగ్స్ జరుగుతున్నాయి. మంచి వేతనం,ప్రోత్సాహకాలు, నాణ్యతతో కూడిన పని విధానం ద్వారా పట్టణ భారతదేశంలో గృహ సేవలకు సంబంధించి కొత్త అధ్యయనాన్ని సృష్టించింది ప్రొంటో. పనుల ఒత్తిడిలో ఆఫీసులోనే నిద్రించడం నుంచి ఒక సంవత్సరం లోపు కంపెనీని పై స్థాయికి తీసుకువెళ్లడం వరకు అంజలి కృషి ఎంతో ఉంది. జార్జ్టౌన్ యూనివర్శిటీలో జీవశాస్త్రంలో డిగ్రీ చేసిన అంజలి బెయిన్ క్యాపిటల్, బీవిసిలలో ఇన్వెస్టర్గా పనిచేసింది.
అంతర్జాతీయం
అమెరికాలో కాల్పుల కలకలం
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో కలకలం చోటుచేసుకుంది. మిచిగాన్లోని వెస్ట్ బ్లూమ్ సిటీ ప్రాంతంలో యూదుల ప్రార్థనామందిరం వద్దకు పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో వచ్చి ఢీకొట్టాడు. అనంతరం అగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా అతడిని కాల్చి చంపారు. ఇక కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి దాడులు మరోసారి జరగొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రారంభదశలోనే నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, నిందితుడు కాల్పులకు ఎందుకు తెగబడ్డాడు? కుట్రకోణం ఉందా? లేదా అనే ఇతర కారణాలు తెలియాల్సి ఉంది.
ఇరాన్పై మళ్లీ ఉరిమిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పట్ల మరోసారి తన కఠిన వైఖరి ప్రదర్శించారు. ఇరాన్తో నెలకొన్న సంఘర్షణ ‘అత్యంత వేగంగా’ క్లైమాక్స్కు చేరుకుంటోందని, ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. శ్వేతసౌధంలో జరిగిన ‘ఉమెన్స్ హిస్టరీ మంత్’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ప్రస్తుత యుద్ధ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక పటిమను కొనియాడారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు తాము చరమగీతం పాడుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికా సైనిక బలగాలు క్షేత్రస్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయని ట్రంప్ ప్రశంసించారు. ‘ఇరాన్ విషయంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మా సైనిక శక్తి అజేయమైనది. చరిత్రలో ఇలాంటి శక్తివంతమైన సైన్యాన్ని ఎవరూ చూసి ఉండరు. ప్రస్తుతం ఏం చేయాలో అదే చేస్తున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. గడిచిన 47 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ చేయలేని ధైర్యసాహసాలను తమ ప్రభుత్వం ప్రదర్శిస్తోందని, గత పాలకులు వదిలేసిన సమస్యలను తాము పరిష్కరిస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. President Trump on Iran: 🇮🇷🇺🇸"Situation with Iran is moving along very rapidly..They really are a nation of terror and hate (regime)...They are paying a big price." pic.twitter.com/BHwApCfpLJ— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) March 12, 2026ఇరాన్ పాలకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ట్రంప్, ఆ దేశాన్ని ‘విద్వేషానికి, ఉగ్రవాదానికి నిలయం’గా అభివర్ణించారు. ఆ ప్రాంతంలో అశాంతిని రేకెత్తిస్తున్న ఇరాన్ పాలక యంత్రాంగం ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తోందని వ్యాఖ్యానించారు. తన మొదటి పదవీకాలంలో అమెరికా సైన్యాన్ని ఆధునీకరించడం కారణంగానే ఇప్పుడు ఈ స్థాయిలో విజయాలు సాధిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ‘మేము సైన్యాన్ని పునర్నిర్మించాం. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాం. సైన్యాన్ని ఇంత భారీగా ఉపయోగించాల్సి వస్తుందని నేను అనుకోలేదు, కానీ ప్రస్తుత ప్రపంచ పరిణామాలు ఆ అవసరాన్ని కల్పించాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. వివరించారు.ఇది కూడా చదవండి: అమెరికాకు ఇరాన్ షాక్: 12 రోజుల్లో వేల కోట్ల సైనిక సంపత్తి బుగ్గి
ఆక్రమణదారుల రక్తం పారిస్తాం
దుబాయ్: ఇరాన్కు చెందిన ద్వీపాలను ఆక్రమించాలని చూస్తే ఆయా దురాక్రమణదారుల రక్తంతో పర్షియన్ గల్ఫ్ను నింపేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘీర్ ఖాలీబాఫ్ హెచ్చరించారు.1971లో యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ను స్థాపించడానికంటే ముందే ఆ ప్రాంతం నుంచి ఇరాన్ మూడు ద్వీపాలను తన వశం చేసుకుంది. ఇరాన్ కీలక చమురు టెర్మినల్ ఉన్న ఖార్గ్ ద్వీపాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకోవచ్చన్న వార్తల నడుమ బఘీర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కోమాలో మొజ్తాబా ?
దుబాయ్: తండ్రి అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ నూతన సుప్రీంనేత పీఠంపై కూర్చున్న మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంగా నీలినీడలు తొలగిపోవట్లేదు. ఫిబ్రవరి 28నాటి దాడిలో తండ్రి, తల్లి, సోదరి, భార్య, కుమారుడు చనిపోగా మొజ్తాబా ఒక కాలును కోల్పోయారని గురువారం అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.బాంబుదాడిలో ఆయన పొత్తి కడుపు లేదా లివర్ తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆ కారణంగా ప్రస్తుతం కోమాలోకి వెళ్లిపోయారని ‘ది సన్’ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. కోమాలోంచి ఆయన కోలుకోవడం కష్టమేనని విశ్వసనీయ వర్గాలు చెప్పాయని, ప్రస్తుతం టెహ్రాన్ నగరంలోని సినా విశ్వవిద్యాలయ ఆస్పత్రిలోని ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారని ఆ కథనంలో వెల్లడించింది. ఆస్పత్రిలోని వ్యక్తులు లండన్లోని తమ వర్గీయులకు పంపిన సందేశంలో ఈ సమాచారం లీక్ అయినట్లు భోగట్టా.
జాతీయం
సిలిండర్లు దాచారో.. జైలుకే!
మధురై: ఎల్పీజీ కొరతను ఆసరాగా చేసుకుని, అక్రమంగా వంట గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసిన ఇద్దరు వ్యక్తులపై తమిళనాడు ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు నడుం బిగించింది. మధురైలో భారీ ఎత్తున వంట గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినట్లు సివిల్ సప్లైస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించారు. ఈ ఉదంతంలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిపై అత్యంత కఠినమైన ‘ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్’ (గుండా చట్టం) కింద కేసు నమోదు చేశారు. సిలిండర్ల నిల్వపై రాష్ట్రంలో ఈ తరహా కఠిన చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు మధురై సమీపంలోని కోవిల్పాపాకుడి ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పళని అనే వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన 100 సబ్సిడీ సిలిండర్లు, 109 కమర్షియల్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆనందం నగర్లోని మదన్ కుమార్ (27) నివాసంలో సోదాలు నిర్వహించి, మరో 189 సిలిండర్లను గుర్తించారు. మొత్తం కలిపి 398 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.పి. మురళి మాట్లాడుతూ.. ప్రజలు భయాందోళనతో ముందస్తు కొనుగోళ్లు చేయవద్దని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 టెర్మినల్స్లో 7,000 పైగా పెట్రోల్ బంకులకు సరిపడా నిల్వలు ఉన్నాయని, కనీసం మూడు వారాలకు సరిపడే స్టాక్ అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ బంకుల్లో నిల్వలు అయిపోవడం వల్ల ఇటువంటి వదంతులు వ్యాపించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటల్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తమిళనాడు వణిగర్ సంఘంగళిల్ పేరమైపు అధ్యక్షుడు విక్రమరాజా ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఏజెంట్లు ఒక్కో సిలిండర్ను రూ. 4,000 వరకు విక్రయిస్తున్నారని, దీనివల్ల సామాన్యులకు ఆహార పదార్థాల లభ్యత భారంగా మారుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో అంతకంతకూ ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయుల వంటగది ముఖచిత్రాన్ని మార్చివేశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మున్ముందు ఎల్పీజీ (LPG) సరఫరాకు విఘాతం కలగవచ్చనే భయాందోళనలు అందరిలో నెలకొన్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఒక సరికొత్త ‘ఎలక్ట్రిక్ విప్లవానికి నాంది పలికింది. గ్యాస్ సిలిండర్ల కొరత భయం సామాన్యుడిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు నడిపిస్తున్నది. ఈ నేపధ్యంలో గత రెండు రోజుల్లో ఇండక్షన్ స్టౌల విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో పెరగడం మార్కెట్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.హాట్ కేకుల్లా ఇండక్షన్ స్టౌలుయుద్ధం పశ్చిమాసియాలో జరుగుతుంటే, ఆ సెగ భారతీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. గత 48 గంటల్లో ఇండక్షన్ స్టౌల విక్రయాలు ఏకంగా 30 రెట్లు పెరిగి సరికొత్త రికార్డు సృష్టించాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలతో పాటు, బ్లింకిట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ యాప్స్లో కూడా ఇండక్షన్ స్టౌల ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. వీటికోసం జనం ఎంతలా ఎగబడుతున్నారంటే, ఆర్డర్ ఇచ్చిన నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అయిపోయి ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు, మెసేజ్లు కనిపిస్తున్నాయి. కేవలం ఇండక్షన్ స్టౌలే కాకుండా, రైస్ కుక్కర్లు, ఎయిర్ ఫ్రైయర్ల అమ్మకాలు కూడా నాలుగు రెట్లు పెరగడం విశేషం.బ్లాక్ మార్కెట్ దందాయుద్ధ భయాన్ని ఆసరాగా చేసుకుని పలువురు అక్రమార్కులు గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి, సామాన్యుడిని నిలువునా దోచేస్తున్నారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో గృహ అవసరాల సిలిండర్ ధర బ్లాక్ మార్కెట్లో ఏకంగా ₹1,800 కి చేరగా, మధ్యప్రదేశ్లో కమర్షియల్ సిలిండర్ ధర ₹4,000 పలుకుతోంది. ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, అక్రమ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల ధరల సెగ కంటే ఎలక్ట్రిక్ వంట సురక్షితమని భావిస్తున్న గృహిణులు, స్టార్ హోటళ్ల నిర్వాహకులు కూడా ఇప్పుడు ఇండక్షన్ కుకింగ్నే ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా..భారత్లోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా ఇండక్షన్ స్టౌల వినియోగం పెరుగుతోంది. ఇంధన భద్రతపై ఆందోళనలు ఉన్న అనేక దేశాల్లో ప్రజలు గ్యాస్ ఆధారిత వంట నుంచి ఎలక్ట్రిక్ వంట వైపు మళ్లుతున్నారు. ఐరోపా దేశాల్లో ఇప్పటికే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించే దిశగా ప్రజలు ఇండక్షన్ స్టౌలను ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు ఈ మార్పును మరింత వేగవంతం చేశాయి. ఇతర ఆసియా దేశాల్లోని ప్రజల కూడా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో ఎలక్ట్రిక్ వంట పరికరాలవైపు దృష్టి సారిస్తున్నారు.పొదుపుతో కూడిన భవిష్యత్తుప్రస్తుతం మార్కెట్లో బేసిక్ ఇండక్షన్ స్టౌలు ₹1,200 నుండి లభిస్తుండగా, అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఎలక్ట్రిక్ కుక్కర్లు ₹14,000 వరకు అమ్ముడవుతున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్ల వినియోగాన్ని సమయం, డబ్బు ఆదా చేసేదిగా వినియోగదారులు గుర్తిస్తున్నారు. యుద్ధ భయం ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో సంప్రదాయ గ్యాస్ స్టౌల స్థానాన్ని స్మార్ట్ ఎలక్ట్రిక్ పరికరాలు పూర్తిగా ఆక్రమించే అవకాశం కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ద్రవిడ కోటలో టీవీకే గర్జన.. షాకిస్తున్న సర్వే ఫలితాలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై అభిశంసన తీర్మానానికి నోటీసు?
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్పై అభిశంసన తీర్మానానికి నోటీసు ఇవ్వాలని విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్తో పాటు ఇతర భాగస్వామ్య పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ (ఓటరు ప్రత్యేక సవరణ)కు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీతో పాటు ఇండియా కూటమి విపక్షాలు ఈ తీర్మానాన్ని ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ అభిశంసన తీర్మానంపై మొత్తం 193 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో 130 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ (సర్) పేరుతో ఎన్నికల సంఘం ఏకపక్షంగా విపక్ష పార్టీల ఓటర్లను తొలగిస్తోందని. ఈ చర్య ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తోందని ఇండియా కూటమి నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్పై అభిశంసన తీర్మానం విపక్షాల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచింది. ఈ తీర్మానం ద్వారా విపక్షాలు ఎన్నికల సంఘం తీరుపై తమ అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇకపై ఈ అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ఎలా ముందుకు సాగుతుందో, ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కు మోదీ ఫోన్
ఢిల్లీ:ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త దాడులు తీవ్రతరంగా కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధం ఇరు వైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తుండడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.ఈమేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో ప్రాంతీయ పరిస్థితులపై గంభీరమైన చర్చ జరిపాను. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను’అని ప్రధానమంత్రి మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘భారతీయ పౌరుల భద్రత, వస్తువులు, ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగడం భారత్ ప్రాధాన్యతలు. అంతేకాదు, శాంతి, స్థిరత్వానికి దేశం నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్యపరమైన జోక్యం అవసరమని అన్నట్లు ’ప్రధాని మోదీ తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీఖమేనీ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు యుద్ధానికి దారి తీసిన నేపథ్యంలో గత 10 రోజుల్లో ప్రధాని మోదీ అనేక పశ్చిమాసియా దేశాల నాయకులతో మాట్లాడారు. గత నెల ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన తరుణంలో ఇరాన్ ప్రధాని మసూద్ తొలిసారి మాట్లాడారు. తాజాగా మరోసారి మసూద్తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. Had a conversation with Iranian President, Dr. Masoud Pezeshkian, to discuss the serious situation in the region. Expressed deep concern over the escalation of tensions and the loss of civilian lives as well as damage to civilian infrastructure. The safety and security of…— Narendra Modi (@narendramodi) March 12, 2026అంతకుముందు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత నేతృత్వంలోని ఓ నౌక వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటింది. జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాత మార్చి 1న రాస్ తనురా నుంచి ముడి చమురుతో బయలుదేరిన షెన్లాంగ్ సూయెజ్మాక్స్ నౌక బుధవారం ముంబయికి చేరుకుందని పోర్ట్ ట్రస్ట్ వెల్లడించింది.ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులతో హర్మూజ్ సంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దీంతో జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఎన్ఆర్ఐ
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు భారత్కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్ ఎవరు? ఆ వివరాలు మీకోసం.లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలోజన్మించారు నిత్య రామన్. ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య కుటుంబం, అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కరెన్ బాస్కు గట్టి పోటీప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!
అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత
అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..
అమెరికాలో ఉండే మన భారతీయులు ఏ రేంజ్లో ప్యాకేజ్లు అందుకుంటారో తెలిసిందే. అంతలా వేతనాలు వస్తాయనే..విదేశాలంటే మోజు మనవాళ్లకు. కానీ ఆ వ్యక్తి కోట్లలో వచ్చే వేతనం కాదనుకుని మరి భారత్కి వచ్చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాదు దానికి గల కారణాన్ని వివరిస్తూ..అది సరైనదో కాదో సలహా ఇవ్వండి అంటూ రెడ్డిట్లో పోస్ట్ పెట్టాడు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అతడి ఉద్దేశానికి ఫిదా అవ్వతూ ప్రశంసలజల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.ఇంతకీ కారణం ఏంటేంటే..అమెరికాలో 12 ఏళ్లకు పైగా గడిపిన తర్వాత తిరిగి కుటుంబంతో సహా భారత వచ్చేయాలనకుంటున్నట్లు ఓ ఎన్నారై పోస్ట్లో తెలిపాడు. ఈ జూన్ కల్లా తాము ఐదుగురు ముంబైకి వచ్చేయాలని నిర్ణయించుకున్నామని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు. తన వయసు 36 ఏళ్లు అని, 2018లో నవంబర్ నుంచి హెచ్1బీ విసాతో అమెరికాలో నివశిస్తున్నట్లు తెలిపాడు. పైగా తన వార్షిక ఆదాయం రూ. 2.9 కోట్లు అని, నెట్వర్త్ వచ్చేసి రుణ రహిత ఇల్లుతో కలిపి దగ్గర దగ్గర రూ. 9 కోట్లు అని వెల్లడించారు. భారత్ తన ఉద్యోగ ఆఫర్ ఏడాదికి రూ. 1.5 కోట్ల ప్యాకేజ్ అని కూడా వివరించాడు. అయితే తన తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉన్నారని, కుటుబానికి దగ్గరగా ఉండటమే మేలని ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అందులోనూ తన పిల్లలు తాతయ్య నానమ్మల, దగ్గర బంధువులతో పెరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు పోస్ట్లో. అక్కడ అమెరికాలో ఇంటి అద్దె చెల్లించకుండా లగ్జరియస్గా గడిపినా తన కుటుంబానికి ఈ నిర్ణయం కారణంగా.. చాలా పెద్ద మార్పుని స్వాగతించాల్సి ఉంటుందని అంటున్నాడు. ఎందుకంటే ముంబైలో అద్దె చెల్లిస్తూ..ఏడాదికి రూ. 1.5 కోట్లతో బతకడం సాధ్యమేనా? అని సందేహం వ్యక్తం చేశాడు. అలాగే యూఎస్లో పుట్టి..అక్కడే పెరిగిన పిల్లలు ఇక్కడ జీవనశైలికి, ఎడ్యుకేషన్కి సులభంగా అలవాటుపడగలరా, అసలు తన నిర్ణయం సరైనదేనా..? ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని పోస్ట్ పెట్టాడు. అయితే నెటిజన్లు అది మంచి ప్యాకేజీ అని, ముంబైలో ధీమాగా బతకొచ్చు అని అన్నారు. పైగా ఇలా భారత్కి రావాలనుకుంటున్న మీ నిర్ణయానికి స్వాగతం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తల్లిదండ్రలు గురించి ఆలోచిస్తున్నందుకు మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: లే ఆఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే..?: మాజీ అమెజాన్ టెక్కీ)
క్రైమ్
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ దంపతుల దుర్మరణం
కర్నూలు జిల్లా: సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ.. సొంతిల్లు కట్టుకుని ఆనందంగా జీవిస్తున్న దంపతులను మృత్యువు మింగేసింది. కర్ణాటక సరిహద్దు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరిని మింగేసింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పట్టణంలోని తిరుమలనగర్ కాలనీకి చెందిన కార్పొరేషన్ బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి అమరేష్ సుమతి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు అనురాగ్(31), బళ్లారికి చెందిన ఐశ్యర్య కూడా ఒక్కగానొక్క కుమార్తె. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వీరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తూ సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. అనురాగ్ భార్యతో కలసి తల్లిదండ్రులను చూసేందుకు రెండు రోజుల క్రితం ఆదోనికి చేరుకున్నారు. బెంగళూరుకు తిరిగివెళ్తూ బళ్లారిలో ఉన్న ఐశ్యర్య తల్లిదండ్రులను పలకరించి వెళ్లాలనుకున్నారు. ఈ మేరకు ఇద్దరు బుధవారం సాయంత్రం కారులో వెళ్తుండగా కర్ణాటక రాష్ట్రం మోకా సమీపంలో శివపుర గ్రామశివారులో కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలపాలైన అనురాగ్ను వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు రెఫర్ చేశారు. కాగా మార్గమధ్యలో అనురాగ్ మృతి చెందాడు. బళ్లారిలో పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాలను ఆదోనికి తరలించారు. గురువారం ఆదోని లో అంత్యక్రియలు పూర్తి చేశారు. తిరుమలనగర్లో విషాదం అలుముకుంది.
కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
హైదరాబాద్: చార్మ్ బ్యూటీ స్పా సెంటర్పై దాడి చేసి ఆరుగురు మహిళలను, ఒక విటుడుని, నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్పల్లి పోలీసులు, యాంటి ఉమెన్ ట్రాఫిక్ సైబరాబాద్ టీం ఆధ్వర్యంలో దాడి చేశారు. భాగ్యనగర్కాలనీలోని చార్మ్ బ్యూటీ స్పా సెంటర్ను నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా విటులను ఆకర్షించి స్పా సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసుల దాడి చేసి ఆరుగురు మహిళలను, విటుడిని, ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేశారు. వారి నుంచి 4 స్మార్ట్ ఫోన్లు, రూ.9100 నగదు స్వా«దీనం చేసుకున్నారు. మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. జగద్గిరిగుట్టకు చెందిన నిర్వాహకురాలు (31), మలక్ పేటకు చెందిన సబ్ ఆర్గనైజర్ (36)ని, గుంటూరుకు చెందిన జయప్రకాష్ (25)లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
టెస్ట్ డ్రైవ్ పేరుతో బెంజ్ కారుతో జంప్
హైదరాబాద్: టెస్ట్ డ్రైవ్ పేరుతో తీసుకెళ్లిన విలాసవంతమైన కారును తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... 2024 డిసెంబర్ 16న అక్బర్ఖాన్ అనే వ్యక్తి సయ్యద్ అషా్ఫక్ అహ్మద్(66)కు చెందిన మెర్సిడెస్బెంజ్ జీఎల్ఏ 200డి (టీఎస్ 09 ఈఎక్స్ 8199) కారును టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకువెళ్లాడు. అనంతరం కారును తిరిగి ఇవ్వకపోగా మహమ్మద్ సఫీర్ అహ్మద్, కార్స్ గలోర్లతో కలిసి అక్బర్ఖాన్ ఆ కారును విక్రయించాడు. అయితే ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన రూ. 25 లక్షల్లో కేవలం రూ. 2.50 లక్షలు మాత్రమే చెల్లించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోవడంతో పాటు కారును కూడా తిరిగి ఇవ్వలేదు. పైగా సయ్యద్ అషా్ఫక్ అహ్మద్ను బెదిరించాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
‘ఆ రోజే చనిపోతాననుకున్నా’
హైదరాబాద్: ఉద్యోగంలో చేరిన రోజే చనిపోతానేమోనని భయమేసిందని టెలీకాలర్ కీర్తన ఆందోళన వ్యక్తం చేసింది. మధురానగర్లోని వారాహి కన్సెల్టెన్సీలో మంగళవారం జరిగిన శశికిరణ్రెడ్డి హత్యకు సంబంధించిన వివరాలను ఆమె పోలీసులకు తెలిపింది. వివరాలివీ... వారాహి కన్సెల్టెన్సీ నిర్వాహకులు శశికిరణ్రెడ్డిని కత్తితో పొడిచి... కత్తితో స్టాఫ్ను బెదిరిస్తూ బయటికొచి్చన ప్రభుకుమార్ ఎదురుగా ఉన్న రిసెప్షనిస్టు లయ (అక్షయ)ను కత్తితో పొడిచినట్టు పేర్కొంది. మక్తల్ మండలం సంగంబండ గ్రామానికి చెందిన కీర్తన అదే రోజు (మంగళవారం) ఉద్యోగంలో చేరింది. ఉదయం 9 గంటలకు ఉద్యోగంలో చేరిన ఆమె మధ్యాహ్నం లంచ్ పూర్తి చేసిన కొద్ది నిమిషాలకే ఈ సంఘటన జరగడం భయమేసిందని తెలిపింది. శశికిరణ్రెడ్డి గదిలోంచి పెద్దగా కేకలు వినిపించాయి. రిసెప్షనిస్టు లయ తలుపులు కొడుతూ ఉందని, కొంత సేపటికి తర్వాత యువకుడు కత్తితో బయటకు వచ్చాడని తెలిపింది. లయను కూడా పొడిచాడంది. నిందితుడు కిందకు పరిగెత్తగానే కీర్తన శశికిరణ్రెడ్డి ఆఫీస్లోకి పరిగెత్తి చూడగా ఆయన ఒళ్లంతా రక్తంతో నిండిపోయిందని, ఆయన ఏదో చెబుతున్నాడని అర్థం కాలేదని పేర్కొంది. ధైర్యం చేసి 100కు ఫోన్ చేసినట్టు తెలియజేసింది. వివరాలను మధురానగర్ పీఎస్ ఎస్హెచ్ఓ ప్రభాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు
ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టి మరి ... బాబు అప్పుల చిట్టా ఆధారాలతో చూపించిన పేర్ని నాని
లీటర్ పెట్రోల్ Rs.115 ఖాళీ ఖాళీగా పెట్రోల్ బంకులు
బాబు సంపద పెంచేందుకు హెరిటేజ్ కి భారీ రాయితీలు
ఇక సిలిండర్లతో పరేషాన్ వద్దు... 5 బెస్ట్ ఇండక్షన్ స్టౌవ్ లు
థాంక్యూ రేవంతన్న.... బన్నీ ఎమోషనల్
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన
ఏపీలో గ్యాస్ ఉందా, లేదా..? ఏది నిజం
ఒక్క రోజులో 10 లక్షల కోట్లు ఆవిరి కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
పొరపాటున MGR గురించి అలా మాట్లాడా..! నన్ను క్షమించండి
Minister Sridhar Babu: గ్యాస్ కొరత లేకుండా చూడండి
