ఇరాన్పై ట్రంప్ గేమ్ ప్లాన్ మారింది..!
ఇరాన్తో అంత ఈజీ కాదనే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పదే పదే బోధపడుతూనే ఉంది. ఇటీవల పాకిస్తాన్లో ఇరాన్తో జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో ట్రంప్కు ఈ విషయం బాగానే అర్థమైంది. బెదిరింపులతో ఇరాన్ను దారి తెచ్చుకోవాలనుకుంటే ఏదీ కూడా వర్కౌట్ కావడం లేదు కాదు కదా.. కనీసం మిత్ర దేశాల సహకారం కూడా లభించడం లేదు. దాంతో సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇరాన్ను యుద్ధంతో వశపరుచుకోవడం వల్ల కాదు అనుకున్నారో ఏమో కానీ ట్రంప్ మాత్రం తన రూట్ మార్చుకున్నారు. ఇప్పటివరకూ సర్వనాశనం అంటూ ఇరాన్పై యుద్ధభేరీ మోగిస్తూ వచ్చిన ట్రంప్.. ప్రస్తుతం ఆర్థిక యుద్ధ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇరాన్తో యుద్ధాన్ని పక్కకు పెట్టి వారిపై ఆర్థిక ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. గత రాత్రి వైట్హౌస్లో డచ్ రాజు, డచ్ రాణిలతో జరిగిన ప్రైవేట్ డిన్నర్ కార్యక్రమంలో ఇదే విషయాన్ని ట్రంప్ చెప్పినట్లు సమాచారం. ఇరాన్ యుద్ధాన్ని త్వరితగతిన ముగించడానికి టెహ్రాన్పై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే ఏకైక మార్గమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. పాకిస్తాన్లో ఇరాన్తో జరిగిన మొదటి విడత చర్చలు చేదు అనుభవంతో ముగిసిన తర్వాత,తి రిగి చర్చలను మళ్లీ పట్టాలు ఎక్కించాలంటే కచ్చితంగా ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే ఒక్కటే మార్గమని ట్రంప్ ఓ స్పష్టతకు వచ్చారని, ఇదే విషయాన్ని డచ్ రాజు విల్లెం-అలెగ్జాండర్, రాణి మాక్సిమాలకు చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అనేది అత్యంత ఆందోళనకరమని, ఇది మరొక ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉండటంతో డచ్ ప్రభుత్వం.. యుద్ధంలో అమెరికాకు సహకరించడానికి నిరాకరించింది. యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే హర్మూజ్ జలసంధి విషయంలో ఓ స్పష్టతకు రావాలని, అందుకు ఇరాన్తో చర్చలు అవసరమని డచ్ ప్రభుత్వ ప్రతినిధులు.. ట్రంప్కు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచడమే ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. సైనిక దాడులకన్నా ఆర్థిక యుద్ధం మీద దృష్టి పెట్టడమే సరైనదిగా ట్రంప్ యోచిస్తున్నారు. దీనిలో భాగంగా ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచడానికి ప్రధానంగా చమురు ఎగుమతులను అడ్డుకోవడం, బ్యాంకులపై ఆంక్షలు విధించడంతో, మరియు నావికాదళ నిర్బంధం వంటి వ్యూహాలను ఉపయోగించి వారిని కట్టడి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి 'రహ్మాన్ డకాయత్' అడుగులు
‘ధురంధర్-1’లో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా పోషించిన రహ్మాన్ డకాయత్ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్రతో అక్షయ్కు ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఈ సీనియర్ నటుడు తన రెండో ఇన్నింగ్స్ను మరింత జోరుగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్ నుంచి అక్షయ్ ఖన్నాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. అది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చిన ఆఫర్ అని సినీ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. విక్టరీ వెంకటేశ్తో తీస్తున్న సినిమా సెట్స్పై ఉంది. అలాగే జూ.ఎన్టీఆర్ హీరోగా ఓ మైథలాజికల్ కథను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండిటిలో ఏదో ఒక సినిమా కోసం అక్షయ్ ఖన్నా పేరు పరిశీలనలో ఉందని సమాచారం.అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ.. టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఖచ్చితమని తెలుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ నటులు ఇప్పుడు టాలీవుడ్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మి వంటి పలువురు నటులు ఇప్పటికే తెలుగు ప్రాజెక్టుల్లో నటించారు. మరికొందరు బాలీవుడ్ నటులు కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి అక్షయ్ ఖన్నా లాంటి ప్రతిభావంతుడైన నటుడిని టాలీవుడ్ వదులుకోదు. ఆయనకు మంచి పాత్రలు దక్కడం ఖాయం.
గర్జించిన శ్రేయస్, ప్రబ్సిమ్రన్.. పంజాబ్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో జోరు కనబరుస్తోంది. గురువారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ప్రబ్సిమ్రన్ (80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (65) వీరవిహారం చేయడంతో 196 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఛేదించడం విశేషం. ముంబై బౌలర్లలో గజన్ఫర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ఒక దశలో డికాక్, నమన్ ధిర్ల జోరుతో ముంబై ఇండియన్స్ 200 ప్లస్ పరుగులు చేస్తుందనిపించింది. కానీ నమన్ ధిర్ ఔటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 పరుగుల వద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇక ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు ప్రబ్సిమ్రన్, శ్రేయస్ అయ్యర్ పోటీపడి మరీ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. పంజాబ్ దూకుడు ముందు ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముంబై బౌలర్లలో బుమ్రా సహా అందరూ దారాళంగా పరుగు లిచ్చుకున్నారు. సీజన్లో పంజాబ్ వరుసగా నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్ల్లో 4 పరాజయాలతో 9వ స్థానంలో కొనసాగుతోంది.The winning momentum refuses to stop 🌪️A flawless record remains perfectly intact 🛡️Punjab Kings conquer the Wankhede to climb up to the top spot in the table! ❤️Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/LUuZx5nlbf— IndianPremierLeague (@IPL) April 16, 2026
వీధి దీపాల కింద చదివి.. బోర్డు ఎగ్జామ్లో టాపర్గా..!
మురికివాడల్లో పెరిగే నిరుపేద బాలబాలికల్లో అపారమైనే తెలివితేటలు ఉంటాయనేందుకు మరో నిదర్శనం ఇది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుర్భర పరిస్థితుల్లో బతుకుతూ..ఊహకే అందని విధంగా బోర్డు ఎగ్జామ్లో టాపర్గా నిలవడం మామాలు విషయం కాదు కదా. బహుశా ఈ అమ్మాయి భవిష్యత్తులో మరో స్లమ్డాగ్ మిలియనీర్గా అవతరిస్తుందేమో..!. ఇంతకీ ఎవరా ఆ అమ్మాయ్ అంటే..బోఫాల్లోని భీమ్ నగర్ అనే ఒక మురికవాడకు చెందిన అమ్మాయి 18 ఏళ్ల చాందిని విశ్వకర్మ. మధ్యప్రదేశ్ బోర్డు ఎగ్జామ్2026లో కామర్స్ విభాగంలో ఆమెకు వచ్చిన మార్కులు తెలిస్తే విస్తుపోతారు. ఆ అమ్మాయి మురికివాడలకు చెందిందేనా అనే అనుమానం వస్తుంది. కటిక దారిద్య్రం మధ్య కష్టపడి చదివి విజయం సాధించిన ఆమె కథ ప్రతిఒక్కరికి స్ఫూర్తి. చాందిని తండ్రి రోజువారీ కూలీ. వడ్రంగి పనిచేస్తూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన సంపాదన అరకొరగానే సరిపోతుంది ఇంటికి. చెప్పాలంటే కొద్దిపాటి అవసరాలకు కూడా అక్కరకు రాదు అతడి సంపాదన. ఇంట్లో ఇంతటి ఆర్థిక బాధలు ఉన్నా.. చదువుపైనే అచంచలంగా దృష్టి సారించింది. ఇంటర్లో విద్యార్థులంతా వివిధ కోచింగ్ సెంటర్లు, ఇతర వనరులపై ఆధారపడగా, ఆమె మాత్రం నిరుపేద పిల్లల కోసం ఉద్దేశించిన ఉచిత పాఠశాల అయిన గురుదేవగుప్త శిక్షా కేంద్రం చదువుకుంది. ఆమె అధ్వాన్నమైన జీవన పరిస్థితులు కారణంగా మిణుకుమిణుకుమనే వీధి దీపాలు, దోమల బెడద మధ్య అహర్నిశలు కష్టపడి చదివింది. ఆ కష్టమే ఆమెను మధ్యప్రదేశ్ ఇంటర్ బోర్డు ఎగ్జామ్లో 98.8% మార్కులతో టాపర్గా నిలిచేలా చేసింది. ఆమె కామర్స్ విభాగంలో 500 మార్కులకు 494 మార్కులతో (98.8%) అసాధారణమైన స్కోరు సాధించి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆమె గెలుపు అసాధారణమైనది. పెద్దపెద్ద కాలేజీల్లో చదువుకునే విద్యార్థులందర్ని వెనక్కి నెట్టి మూరిక వాడల నేపథ్యం నుంచి వచ్చిన నిరుపేద అమ్మాయి అగ్రస్థానంలో నిలవడం మాటలకందని విజయం కదూ..!.(చదవండి: ఇద్దరు పిల్లలతో నిస్సహాయ స్థితి నుంచి మున్సిపల్ కమిషనర్గా..!)
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
రుతుపవనాల దగా?
TCS నాసిక్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు!
కథ కొత్తగా అనిపించింది: వరుణ్ సందేశ్
రాష్ట్ర జనాభా ఎంత?
పవర్ పేటకి శ్రీకారం
నాటో కూటమి కథ కంచికేనా?
మేకప్కే ఐదు గంటలు పట్టేది: సత్యదేవ్
సముద్రం నేపథ్యంలో...
'10వ యుద్ధాన్ని ఆపుతున్నా': ట్రంప్ పోస్ట్ వైరల్
వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా
‘ఏ క్షణమైనా బ్రెయిన్స్ట్రోక్.. సిగరెట్లు అడుక్కుంటున్నాడు’
కీలక పదవి దక్కిన వెంటనే ఈడీ రైడ్స్!
వార్డుల్లో పోటీ చేయడానికే అభ్యర్థులు దొరక్కపోతే రేపు ఎమ్మెల్యే ఎన్నికల్లో మన పరిస్థితి ఏంటి సార్!!
ఇదేం పెద్ద విశేషం! ఇప్పటికే వర్కింగ్ సీఎం కదా!!
తినడానికి కూడా లేనప్పుడే నా చేయి పట్టుకుంది: కిరణ్ అబ్బవరం
వారెవ్వా.. అటునుంచి షాక్.. ఇటునుంచి గుడ్న్యూస్
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్!
కంజూస్ డాక్టర్
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
‘ట్రంప్ రండి.. కూర్చొని మాట్లాడుకుందాం’ : ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్లో అడుగుపెట్టిన పాక్ సైన్యాధిపతి మునీర్
బంగారం ధరలు సలసల!
PSL: పీసీబీ పరువు తీసిన పాకిస్తాన్ క్రికెటర్
ఏసీ లేకుండానే ఇల్లు కూల్గా..! ఎలాగో తెలుసా..?
టీసీఎస్ నాసిక్ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్ ఘటన!
కాలేయం కొవ్వెక్కుతోంది
మామ్ వెయిట్లాస్ జర్నీ..! 82కేజీల నుంచి 60 కేజీలకు..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
రుతుపవనాల దగా?
TCS నాసిక్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు!
కథ కొత్తగా అనిపించింది: వరుణ్ సందేశ్
రాష్ట్ర జనాభా ఎంత?
పవర్ పేటకి శ్రీకారం
నాటో కూటమి కథ కంచికేనా?
మేకప్కే ఐదు గంటలు పట్టేది: సత్యదేవ్
సముద్రం నేపథ్యంలో...
'10వ యుద్ధాన్ని ఆపుతున్నా': ట్రంప్ పోస్ట్ వైరల్
వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా
‘ఏ క్షణమైనా బ్రెయిన్స్ట్రోక్.. సిగరెట్లు అడుక్కుంటున్నాడు’
కీలక పదవి దక్కిన వెంటనే ఈడీ రైడ్స్!
వార్డుల్లో పోటీ చేయడానికే అభ్యర్థులు దొరక్కపోతే రేపు ఎమ్మెల్యే ఎన్నికల్లో మన పరిస్థితి ఏంటి సార్!!
ఇదేం పెద్ద విశేషం! ఇప్పటికే వర్కింగ్ సీఎం కదా!!
తినడానికి కూడా లేనప్పుడే నా చేయి పట్టుకుంది: కిరణ్ అబ్బవరం
వారెవ్వా.. అటునుంచి షాక్.. ఇటునుంచి గుడ్న్యూస్
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్!
కంజూస్ డాక్టర్
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
‘ట్రంప్ రండి.. కూర్చొని మాట్లాడుకుందాం’ : ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్లో అడుగుపెట్టిన పాక్ సైన్యాధిపతి మునీర్
బంగారం ధరలు సలసల!
PSL: పీసీబీ పరువు తీసిన పాకిస్తాన్ క్రికెటర్
ఏసీ లేకుండానే ఇల్లు కూల్గా..! ఎలాగో తెలుసా..?
టీసీఎస్ నాసిక్ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్ ఘటన!
కాలేయం కొవ్వెక్కుతోంది
మామ్ వెయిట్లాస్ జర్నీ..! 82కేజీల నుంచి 60 కేజీలకు..
ఫొటోలు
ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్
వైట్ డ్రెస్ ఔట్ఫిట్లో జాన్వీ కపూర్ (ఫోటోలు)
మహేశ్బాబు బ్యానర్ సినిమా ‘రావు బహదూర్’.. సాంగ్ ఈవెంట్ (ఫోటోలు)
ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్ ఎక్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)
సినిమా
శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్..!
అప్పుడే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడే సందడి. ఈ ఫ్రైడే నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్, తెరచాప, గాలి లాంటి చిత్రాలతో పాటు మలయాళ డబ్బింగ్ సినిమా పల్లి చట్టంబి థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. వీటిలో బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలపై ఆడియన్స్లో బజ్ ఏర్పడింది.ఇక ఓటీటీల విషయానికొస్తే తెలుగులో పోచమ్మ వెబ్ సిరీస్, హిందీ నుంచి అస్సీ, దో దివానే షహర్ మే, మట్కా కింగ్ వెబ్ సిరీస్లు ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. ఇవే కాకుండా కొన్ని చిత్రాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఏ ఓటీటీకి రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..దో దివానే షహర్ మే(బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17ఆల్ఫా మేల్స్ సీజన్-5(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17180(మూవీ)- ఏప్రిల్ 17రూమ్మేట్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17గోరిల్లా స్టోరీ(డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 17ఫుల్ స్వింగ్- సీజన్-4(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 17ట్విస్టెడ్(హాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 17లెగో — ఫ్రెండ్స్ ది నెక్ట్స్ చాప్టర్-(హాలీవుడ్ సిరీస్) -ఏప్రిల్ 17బెబెఫిన్సింగ్-ఎలాంగ్మూవీ ఇన్ టూ ద పింక్ఫాంగ్ వరల్డ్(కొరియన్ మూవీ)- ఏప్రిల్ 19అమెజాన్ ప్రైమ్మట్కా కింగ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17బాలిస్టిక్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17బ్రదర్స్ అండర్ ఫైర్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 17ది నాపాబాయ్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17ది విజిలర్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17జీ5..అస్సీ (హిందీ సినిమా)- ఏప్రిల్ 17ఆశకల్ అయిరామ్(మలయాళసినిమా)- ఏప్రిల్ 17ఆహా..పోచమ్మ(తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17బుక్ మై షోది బ్రైడ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17హెచ్బీవో మ్యాక్స్..డస్ట్ బన్నీ(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17హులు..షెల్బీ ఓక్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17లయన్స్ గేట్ ప్లేగుడ్ బాయ్(హాలీవుడ్)- ఏప్రిల్ 17
'అదే నాన్నలో చాలా ప్రత్యేకం'.. మెగాస్టార్పై తనయుడి ప్రశంసలు
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా మరోసారి వాయిదా వేశారు. జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఒక పాట మినహాయిస్తే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. మరింత థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమే వాయిదా వేస్తున్నామని నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేసింది.అయితే ఇటీవలే గ్లోబల్ స్టార్ మరో అరుదైన ఘనత సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈ ఘనత అందుకున్న హీరోగా నిలిచాడు. ప్రముఖ ఈ స్క్వేర్ ఇండియా మ్యాగజైన్పై రామ్ చరణ్ ఫోటోను ముద్రించారు. అంతకుముందు కేవలం ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఈ మ్యాగజైన్లో ప్రచురించారు. తాజాగా ఈ ఘనతను మన రామ్ చరణ్ అందుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. నాన్న ఎంతో మందిపై ప్రభావం చూపారని అన్నారు. ప్రతిరోజు ఆయనను చూస్తూ పెరగడం వల్ల నాపై ప్రభావం మరింత ఎక్కువగా ఉందన్నారు. నా జీవితంలో రియల్ హీరో నాన్నే అని వెల్లడించారు. కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే.. ముందు స్పందించే వ్యక్తి ఆయనేనని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు వెళ్లడం నాన్న నైజమన్నారు.నాన్న వారసత్వాన్ని మేము చాలా సులభంగానే అందిపుచ్చుకున్నామని రామ్ చరణ్ తెలిపారు. ఎంత స్టార్డమ్ ఉన్నా ఇంటి దగ్గర అందరి తండ్రుల్లాగే సింపుల్గా ఉండేవారని.. అదే ఆయనతో చాలా ప్రత్యేకమైన విషయమన్నారు. ఇక సినిమా కోసం రోజులో కేవలం నాలుగు గంటలే నిద్రపోయిన సందర్భాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. అదే సమయంలో వరుస షూటింగ్ల నుంచి మూడు రోజులు విరామం తీసుకుని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవారని అన్నారు. ఆయన అటు పని.. ఇటు ఫ్యామిలీని సమన్వయం చేసేవారని చెర్రీ పేర్కొన్నారు. ఈ విషయంలో తాను కూడా నాన్ననే ఫాలో అవుతున్నానని రామ్ చరణ్ స్పష్టం చేశారు.
'ముంబయిలో ఆడిషన్.. సౌత్ డైరెక్టర్ చాలా అసభ్యంగా..'
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కొత్త కాదు. ఇండస్ట్రీలోకి వచ్చినవారిలో చాలామందికి దాదాపు ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఈ విషయాన్ని కొందరు హీరోయిన్స్ బయటికి చెబుతుంటారు. మరికొందరు తమ బాధను చెప్పేందుకు భయపడుతూ ఉంటారు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణమైపోయింది.తాజాగా మరో హీరోయిన్ తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. బాలీవుడ్ బ్యూటీ డైసీ షా తాను ఎదుర్కొన్న సంఘటనను వివరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. దక్షిణాది డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. కాస్టింగ్ సెషన్ జరుగుతున్నప్పుడు.. అనుచితంగా తన శరీరాన్ని తాకాడని వెల్లడించింది. ఆ సమయంలో తాను చాలా ఇబ్బందికి గురయ్యానని పేర్కొంది. ముంబయిలో జరిగిన క్యాస్టింగ్ మీట్లో ఈ సంఘటన జరిగిందని పంచుకుంది.డైసీ షా మాట్లాడుతూ..'దక్షిణాదికి చెందిన ఒక డైరెక్టర్ నన్ను చాలా అసభ్యంగా తాకారు. ఆయన కాస్టింగ్ కోసం ఓసారి ముంబైకి వచ్చారు. అతన్ని కలవడానికి ఆరు నుంచి ఏడుగురు అమ్మాయిలం వెళ్లాం. అక్కడ ఆయన మమ్మల్ని ఒక్కొక్కరిని విడివిడిగా కలుస్తున్నారు. అది నాకు నచ్చలేదు. ఆ సమయంలో నా శరీరాన్ని తాకారు.. నా చేయి కూడా పట్టుకున్నారు. నన్ను ఎవరైనా తాకితే చాలా భయంగా ఉంటుంది. అందుకే నేను మసాజ్ కూడా చేయించుకోను. ఒక మహిళ కూడా నన్ను తాకడం ఇష్టం లేదు. అదే ఒక పురుషుడు నన్ను తాకితే ఎలా ఉంటుంది. అందుకే నాకు అది నచ్చలేదు. ఆ తర్వాత అతనికి తిరిగి ఫోన్ చేస్తానని చెప్పా. కానీ చేయలేదు' అని వెల్లడించింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.కాగా.. డైసీ షా.. సల్మాన్ ఖాన్ సరసన 'జై హో' (2014) చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'హేట్ స్టోరీ 3' (2015)లో కనిపించింది. మొదట కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వద్ద సహాయకురాలిగా తన కెరీర్ను ప్రారంభించింది. 'భద్ర', 'బాడీగార్డ్' వంటి చిత్రాలతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటనతో పాటు, డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొంది. పలు టెలివిజన్ కార్యక్రమాలలో కనిపించింది. ఇటీవలే 'రెడ్ రూమ్' అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం పలాష్ ముచ్చల్ దర్శకత్వంలో వస్తోన్న థ్రిల్లర్ మూవీలో డైసీ హీరోయిన్గా నటిస్తోంది.
OTT: ‘థ్రాష్’ రివ్యూ.. ముచ్చెమటలు పట్టించే థ్రిల్లరి సినిమా
భయం....నవరసాలలో ఈ భయానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ సినిమాలలో భయం అనే ఎమోషన్ ను రకరకాలుగా రక్తగట్టిస్తుంటారు దర్శకులు. ఇప్పుడొచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ, సౌండ్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుడిని ముచ్చమటలు పట్టించడం నల్లేరు మీద నడకే. చాలా సినిమాలలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి కాని కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. పైగా హాలివుడ్ లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు కొదవే ఉండదు. గడచిన కొన్నేళ్ళలో నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అని చెప్పుకునే హాలివుడ్ సినిమాలు ఎన్ని వచ్చినా అలరించినవి కొన్నే. కాని ఇటీవల నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయిన థ్రాష్ సినిమా మాత్రం చూసే ప్రేక్షకులను కుర్చీ అంటుకుపెట్టుకునేలానే కాదు ఒళ్ళంతా ముచ్చెమటలు పోయించినా ఆశ్చర్యపోనక్కరలేదు. హాలివుడ్ టామీవిర్కోలా రాసిన కథను తానే దర్శకత్వం వహించి తెరకెక్కించిన విధానం నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చు. అంతలా ఈ థ్రాష్ సినిమాలో ఏముందో ఓసారి చూద్దాం.అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో అనీవిలే అనే నగరంపై కాటగిరీ5 తో హరికేన్ హెన్రీ విరుచుకుపడుతుంది. ఇంత పెద్ద తుఫాను వస్తుంది అని తెలిసినా తన తన తల్లి ఇల్లుని వదలలేక ఒంటరిగా ఉండిపోతుంది డకోటా.మరో పక్క లీసా తన డెలీవరీ కోసం వెళుతూ డకోటా ఇంటి ముందే నీటిలో చిక్కుకుపోతుంది. ఇంకో వైపు డీ, రాన్ తమ చెల్లేలితోపాటు డబ్బులు కోసం ఆశపడే జంట దగ్గర ఆశ్రయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అనుకున్నట్టుగానే హరికేన్ ధాటికి అనీవిలే రిజర్వాయర్ గోడ కూడా కూలి నీళ్ళు నగరాన్ని ముంచెత్తుతాయి. నీటి తో పాటు తుఫాను సముద్రంలోని సొర చేపలను కూడా నగరంలోకి తీసుకువస్తుంది. ఇక్కడే ఉంది పెద్ద ట్విస్టు. ఓ పక్క నీళ్ళు, మరో పక్క సొరచేపలు వీటి మధ్య డకోటా, లీసా, అలాగే డీ రాన్ లు ఎలా బ్రతికి బట్టకడతారో అన్నదే థ్రాష్ సినిమా. మొత్తం సినిమాలో ఒకే ఒక దగ్గర దర్శకుడు సినిమా లిబర్టీ తీసుకున్నాడు. మిగతా అంతా మనకు యదార్ధంగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అయ్యాక చాలా కాలం తరువాత మంచి థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అప్పట్లో హాలివుడ్ సినిమా సెన్సేషన్ ట్విస్టర్ తరువాత అంతకన్నా ఎక్కువ థ్రిల్లింగ్ కలిగించే సినిమా ఈ థ్రాష్ అవుతుంది. మస్ట్ వాచ్ ఫర్ థ్రిల్లర్ లవర్స్.- హరికృష్ణ ఇంటూరు
క్రీడలు
ఐపీఎల్ చరిత్రలో అరుదైన దృశ్యం..
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ ముంబైని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ దూరం కావడంతో అతడి స్థానంలో క్వింటన్ డికాక్ జట్టులోకి వచ్చాడు. డికాక్తో కలిసి రియాల్ రికెల్టన్ ముంబై ఇన్నింగ్స్ను ఆరంభించాడు. గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ఇద్దరు సౌతాఫ్రికాకు చెందిన వారే కావడం విశేషం. ఐపీఎల్లో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ముంబై ఇండియన్స్ తరఫున ఇద్దరు సౌతాఫ్రికా బ్యాటర్లు ఓపెనింగ్ చేయడం ఐపీఎల్లో ఇదే తొలిసారి. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్ మార్కో యాన్సెన్ వేశాడు. ఈ సమయంలో స్ట్రైకింగ్లో, నాన్ స్ట్రైకింగ్ ఎండ్తో పాటు బౌలర్ కూడా సౌతాఫ్రికాకు చెందిన వారే ఉండడం మరో గమనించదగ్గ అంశం.
షోయబ్ అక్తర్ ఒక ‘పిచ్చివాడు’.. అతడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
షోయబ్ అక్తర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా పేరు గాంచాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్టెస్ట్ బాల్(161.3 కి.మీ/గం) రికార్డు ఇప్పటికే అక్తర్ పేరిటే ఉంది. తన ఫాస్ట్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించిన అక్తర్.. 2011లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. తాజాగా ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్పై భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ ప్రశంసల వర్షం కురిపించాడు. అక్తర్కు బౌలింగ్ పట్ల ఉన్న అంకితభావాన్ని మునాఫ్ పటేల్ కొనియాడాడు. "షోయబ్ అక్తర్కు ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలి. దాదాపు 15 ఏళ్ల పాటు ఆసియా లాంటి పరిస్థితుల్లో 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అతడి పట్టుదలకు హ్యాట్సాఫ్. వేగంగా బౌలింగ్ చేయడం వల్ల అక్తర్ రెండు మోకాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.రిటైర్మెంట్ తర్వాత అతడు సరిగ్గా నడవడానికి నాలుగైదు సంవత్సరాలు పట్టింది. అక్తర్ చాలా మొండోడు. ఫాస్ట్ బౌలింగ్ అంటే పిచ్చి. అలాంటి పిచ్చి ఉన్నవాడు మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలడు"అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మునాఫ్ పటేల్ పేర్కొన్నాడు.అక్తర్ చివరగా 2011 ప్రపంచకప్లో ఆడాడు. పాక్ తరపున 46 టెస్టులు ఆడి 178 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా అతడి పేరిట 247 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి. కాగా షోయబ్ తన కెరీర్లో నిలకడగా ఒకే వేగంతో బౌలింగ్ చేసేందుకు ఎన్నో సవాళ్లును ఎదుర్కొన్నాడు. మ్యాచ్లకు ముందు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకునేవాడినని అతడే చాలా సార్లు చెప్పాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీకి సంబంధించి బిగ్ న్యూస్!
IPL 2026: పంజాబ్ కింగ్స్ ఘన విజయం
ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సీజన్లో పంజాబ్కు ఇది నాలుగో విజయం. ఓపెనర్ ప్రబ్సిమ్రన్ (80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (65) వీరవిహారంతో 196 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించడం విశేషం. ముంబై బౌలర్లలో గజన్ఫర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ప్రబ్సిమ్రన్ హాఫ్ సెంచరీముంబై ఇండియన్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం దిశగా సాగుతుంది. ఓపెనర్ ప్రబ్సిమ్రన్ అర్థసెంచరీతో చెలరేగగా, అయ్యర్ (34) దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం పంజాబ్ 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. శ్రేయస్ (12), ప్రబ్సిమ్రన్ (16) క్రీజులో ఉన్నారు. అంతకముందు కూపర్ కన్నోలి (17) రెండో వికెట్గా వెనుదిరిగాడు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య గజన్ఫర్ బౌలింగ్లో దీపక్ చాహర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. అంతకముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్లో పంజాబ్ 21 పరుగులు పిండుకోవడం విశేషం.పంజాబ్ టార్గెట్ 196 పరుగులుపంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ఒక దశలో డికాక్, నమన్ ధిర్ల జోరుతో ముంబై ఇండియన్స్ 200 ప్లస్ పరుగులు చేస్తుందనిపించింది. కానీ నమన్ ధిర్ ఔటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 పరుగుల వద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు.బార్ట్లెట్ కళ్లు చెదిరే క్యాచ్.. పాండ్యా (14)ఔట్14 పరుగులు చేసిన పాండ్యా మార్కో యాన్సెస్ బౌలింగ్లో గ్జేవియర్ బార్ట్లెట్ అద్భుత క్యాచ్కు వెనుదిరిగాడు. డికాక్ సెంచరీపంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీ బాదాడు. 53 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న డికాక్కు ఐపీఎల్లో ఇది మూడో సెంచరీ. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.నమన్ ధిర్ ఔట్.. మూడో వికెట్ డౌన్పంజాబ్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. అర్థసెంచరీ సాధించిన నమన్ ధిర్ శశాంక్ సింగ్ బౌలింగ్లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. డికాక్ (82), పాండ్యా (3) క్రీజులో ఉన్నారు.7 ఓవర్లలో ముంబై 67/2ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. నమన్ ధిర్ (34), డికాక్ (25) క్రీజులో ఉన్నారు.సూర్యకుమార్ గోల్డెన్ డక్.. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. సూర్యకుమార్ యాదవ్ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చిన అర్షదీప్ సింగ్ అంతకముందు రియాన్ రికెల్టన్ను ఔట్ చేశాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది.బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గురువారం వాంఖడే వేదికగా 24వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్ శర్మ, మిచెల్ సాంట్నర్ స్థానం డికాక్, మయాంక్ రావత్ తుది జట్టులోకి వచ్చారు. పంజాబ్ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.ముఖాముఖి పోరులో ఇరుజట్లు 35 సార్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ 17 సార్లు, పంజాబ్ కింగ్స్ 17 సార్లు నెగ్గాయి. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. ఇక వాంఖడే స్టేడియంలో మాత్రం పంజాబ్ కింగ్స్ రికార్డు మెరుగ్గా ఉంది. వాంఖడేలో పంజాబ్ ముంబై పై 5 సార్లు గెలిచింది. గత ఐదు మ్యాచ్ల్లో ముంబై మూడింటింలో, పంజాబ్ రెండు మ్యాచ్ల్లో గెలిచాయి.ముంబై ఇండియన్స్ తుదిజట్టు: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా( కెప్టెన్), రూథర్ఫోర్డ్, నమన్ ధీర్, మయాంక్ రావత్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.పంజాబ్ కింగ్స్ తుదిజట్టు: ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), కూపర్ కొన్నోలీ, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్కుమార్ వైశాక్, అర్ష్దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్.
హైదరాబాద్లో అడుగుపెట్టిన ధోని!
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆరంభంలో తడబడినప్పటికీ వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన సీఎస్కే గాడిన పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), సీఎస్కే మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో ధోని బరిలోకి దిగుతాడా లేదా అనేది స్పషత రాలేదు. కానీ ధోని మాత్రం జట్టుతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతకముందు చెన్నై నుంచి హైదరాబాద్కు బయల్దేరిన సీఎస్కే జట్టు ఫొటోలు, ధోని వీడియోనూ చెన్నై సూపర్కింగ్స్ ప్రత్యేకంగా పంచుకుంది. ‘మేము వస్తున్నాం, హైదరాబాద్’ అని తెలుగులో క్యాప్షన్ జత చేసింది. ఆ వీడియోలో ధోని సింహంలా నడుచుకుంటూ రాగా.. ధోని ముందు, వెనుక సెక్యూరిటీ బందోబస్తు గట్టిగా కనిపిస్తోంది. ఇక ఎస్ఆర్హెచ్, సీఎస్కే మ్యాచ్కు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. కేవలం ధోనిని చూసేందుకే అభిమానులు భారీగా తరలిరానున్నారు. మ్యాచ్లో ఆడినా ఆడకపోయినా తలా ఒక్కసారి మైదానంలో దర్శనమిస్తే చాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో మాత్రం ధోని బరిలోకి దిగనున్నట్లు అధికారికంగా సమాచారం అందింది. ఒకవేళ ధోని జట్టులోకి వస్తే మాత్రం సర్ఫరాజ్ఖాన్ డగౌట్కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక సీఎస్కే ఈ సీజన్లో 5 మ్యాచ్ల్లో 2 విజయాలు, మూడు ఓటములతో 8వ స్థానంలో ఉంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ కూడా 5 మ్యాచ్ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో ఉన్నప్పటికీ, మెరుగైన రన్రేట్ కారణంగా పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.🚨 IT'S OFFICIAL MS DHONI IS TRAVELING TO HYDERABAD WITH THE CSK TEAM pic.twitter.com/lXc4qHavBp— ` (@WorshipDhoni) April 16, 2026𝙈𝙚𝙢𝙪 𝙫𝙖𝙨𝙩𝙪𝙣𝙣𝙖𝙢, Hyderabad 🥳🦁#WhistlePodu #Yellove pic.twitter.com/oIT9uwxnTm— Chennai Super Kings (@ChennaiIPL) April 16, 2026చదవండి: ఎంసీఏ కీలక నిర్ణయం.. క్రికెట్ చరిత్రలో తొలిసారి!
న్యూస్ పాడ్కాస్ట్
మత్స్యకారుల కడుపుపై తంతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు కుట్ర... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
చట్టసభల్లో చారిత్రక మలుపు... లోక్సభ స్థానాలు 850కి పెంపు... రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం... డిమాండ్లపై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్... అణ్వాయుధాలు, హార్మూజ్పైనే పీటముడి
ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు షురూ. మరో దఫా చర్చించే అవకాశం
భారీగా పడిపోతున్న బంగారం ధరలు
అమరావతిలో నీకింత.. నాకింత... ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన ‘బీఎస్సార్’కు రాజధానిలో భారీగా పనుల అప్పగింత
ఆంధ్రప్రదేశ్లో ‘సీఎంఆర్ఎఫ్’ నిధులు స్వాహా... టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి సీఎంవో వరకూ వసూళ్ల పర్వం
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మావిగన్.. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు: వైఎస్ జగన్
ఇరాన్ను తుడిచిపెట్టేస్తాం, వారి నాగరికతను నాశనం చేస్తాం. తీవ్రంగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
బిజినెస్
లాభాలకు బ్రేక్.. పడిపోయిన బ్యాంక్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. బ్యాంక్, ఆటో షేర్లకు అమ్మకాల ఒత్తిడితో నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలు తమ గరిష్టాలను కోల్పోయాయి.బీఎస్ ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 122.56 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టపోయి 77,988.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 34.55 పాయింట్లు లేదా 0.14 శాతం క్షీణించి 24,196.75 వద్ద ముగిసింది.నిఫ్టీ 50 ఇండెక్స్ లో హెచ్డీఎఫ్ సీ బ్యాంక్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్ సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.63 శాతం, 0.83 శాతం పెరిగాయి.రంగాల వారీగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ మెరుగైన పనితీరు కనబరిచగా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్ లూజర్స్ గా ఉద్భవించాయి.
మారుతి పాపులర్ చిన్న కారు నిలిపివేత!
భారతీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తన పాపులర్ టాల్బాయ్ హ్యాచ్బ్యాక్ 'ఇగ్నిస్' (Ignis) ఉత్పత్తిని నిశ్శబ్దంగా నిలిపివేసింది. మార్కెట్లో డిమాండ్ తగ్గడం, అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితమే దీని ఉత్పత్తి నిలిచిపోయినట్లు డీలర్ వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం డీలర్లు ఈ కారు కోసం కొత్త బుకింగ్లను తీసుకోవడం నిలిపివేసినప్పటికీ, అధికారిక నెక్సా (NEXA) వెబ్సైట్లో మాత్రం ఈ మోడల్ ఇంకా లిస్టింగ్లో కనిపిస్తోంది.2017లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఇగ్నిస్, తన విభిన్నమైన డిజైన్, డ్రైవింగ్ డైనమిక్స్తో యువతను ఆకట్టుకుంది. 2020లో ఫేస్లిఫ్ట్ వెర్షన్ ద్వారా మరిన్ని అప్డేట్లను పొందిన ఈ కారు, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో 83bhp శక్తిని, 113Nm టార్క్ను అందించేది. ఫీచర్ల పరంగా 7-అంగుళాల స్మార్ట్ప్లే టచ్స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, క్లైమేట్ కంట్రోల్, ఎయిర్క్రాఫ్ట్ స్టైల్ స్విచ్లు దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. భద్రత కోసం ఏబీఎస్, ఈబీడీ, ఐసోఫిక్స్ మౌంట్ల వంటి ప్రామాణిక ఫీచర్లతో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉండేది.పంచ్కు పోటీ వస్తోందా?ఇగ్నిస్ నిష్క్రమణతో మారుతి సుజుకి తన దృష్టిని ఇప్పుడు సరికొత్త మైక్రో ఎస్యూవీ వైపు మళ్లించింది. ప్రస్తుతం 'Y43' అనే కోడ్నేమ్తో అభివృద్ధి చెందుతున్న ఈ కొత్త కారు, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది నేరుగా టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి బలమైన మోడళ్లతో పోటీ పడనుందని చెబుతుతున్నారు. ఇగ్నిస్ స్థానాన్ని భర్తీ చేయనున్న ఈ కొత్త ఎస్యూవీ, మారుతి సుజుకి పోర్ట్ఫోలియోలో బ్రెజ్జా కంటే దిగువన ఉండి, నెక్సా ప్రీమియం డీలర్షిప్ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది.రాబోయే Y43 మోడల్ 1.2 లీటర్ 'డ్యూయల్ జెట్' పెట్రోల్ ఇంజిన్తో వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇగ్నిస్ కేవలం హై-రైడింగ్ హ్యాచ్బ్యాక్గా మాత్రమే పరిమితమవ్వగా, కొత్త మోడల్ పూర్తిస్థాయి మైక్రో ఎస్యూవీ లుక్, ఫీచర్లతో రానుంది. పంచ్ వంటి కార్లు ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న నేపథ్యంలో, మారుతి కూడా తన కొత్త ఉత్పత్తితో గట్టి పోటీ ఇవ్వాలని ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట!
సాంకేతిక ప్రపంచంలో పారదర్శకత, భద్రత గురించి గొప్పలు చెప్పుకునే యాపిల్, గూగుల్ సంస్థల అసలు రంగు బయటపడిందని కొందరు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అశ్లీలతను, ఏకాభిప్రాయం లేని లైంగిక కంటెంట్ను ప్రోత్సహించబోమని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఈ టెక్ దిగ్గజాలు వాస్తవానికి ‘న్యూడిఫై’(లైంగిక పరమైన) యాప్ల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాయని ‘టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్’ (టీటీపీ) తాజా నివేదికలో బయటపెట్టింది.కోట్లలో డౌన్లోడ్లు.. వందల కోట్లలో ఆదాయం!టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం, యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లలో కృత్రిమ మేధ సాయంతో సాధారణ వ్యక్తుల, సెలబ్రిటీల ఫొటోల నుంచి దుస్తులను తొలగించి నగ్నంగా మార్చే అన్డ్రెస్ లేదా న్యూడిఫై యాప్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ తరహా యాప్లు ఇప్పటివరకు సుమారు 483 మిలియన్ల సార్లు డౌన్లోడ్ అయ్యాయి. యాప్ మ్యాజిక్ గణాంకాల ప్రకారం, వీటి ద్వారా ఈ కంపెనీలు 122 మిలియన్ డారల్లు (సుమారు రూ.1,000 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించాయి. యాపిల్ స్టోర్లో 18, గూగుల్ ప్లే స్టోర్లో 20 ఇలాంటి యాప్లను పరిశోధకులు గుర్తించారు.సెర్చ్ చేస్తే చాలు.. ప్రకటనలే స్వాగతం!వినియోగదారులు యాప్ స్టోర్ల్లో న్యూడిఫై వంటి పదాల కోసం వెతికినప్పుడు ఈ యాప్లు కనిపించడమే కాకుండా కంపెనీలు స్వయంగా వాటికి సంబంధించిన ప్రకటనలను కూడా ప్రదర్శిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా ఆటోకంప్లీట్ ఫీచర్ ద్వారా వినియోగదారులను నేరుగా ఇటువంటి అశ్లీల యాప్ల వైపు మళ్లిస్తున్నాయని నివేదిక తీవ్రంగా విమర్శించింది. ‘ఈ కంపెనీలు కేవలం యాప్లను ఆమోదించడమే కాదు, వాటి ద్వారా లాభం పొందుతూ వినియోగదారులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి’ అని టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేటీ పాల్ అన్నారు.నిబంధనలు ఏం చెబుతున్నాయి?యాపిల్ మార్గదర్శకాలు బహిరంగ లైంగిక లేదా అశ్లీల కంటెంట్ను స్పష్టంగా నిషేధిస్తున్నాయి. గూగుల్ సైతం వ్యక్తులను దిగజార్చే ‘ప్రాంక్’ పేరుతో బట్టలు విప్పినట్లు చూపే యాప్లను అనుమతించబోమని చెబుతోంది. అయితే, ఫొటో ఎడిటింగ్ యాప్లుగా ముసుగు వేసుకుని వచ్చే ఇటువంటి సాఫ్ట్వేర్లను గుర్తించడంలో ఈ కంపెనీలు విఫలమవుతున్నాయి.అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడినగ్నత్వ యాప్ల వల్ల మహిళలు, చిన్నారుల భద్రత ప్రమాదంలో పడుతోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ‘టేక్ ఇట్ డౌన్’ చట్టంపై సంతకం చేశారు. ఇది ఏకాభిప్రాయం లేని లైంగిక చిత్రాలను ప్రచురించడాన్ని నేరంగా పరిగణిస్తుంది. అశ్లీల చిత్రాలను తొలగించని టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లను విచారించేలా యూకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది.దిద్దుబాటా? కంటితుడుపు చర్యలా?బ్లూమ్బెర్గ్, టీటీపీ నివేదికల అనంతరం, యాపిల్ సుమారు 15 యాప్లను తొలగించినట్లు తెలిపింది. గూగుల్ కూడా పలు యాప్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. అయితే, ఒకసారి తొలగించిన యాప్లు కొన్ని నెలలకే మళ్లీ కొత్త పేర్లతో ప్రత్యక్షమవుతున్నాయని, టెక్ దిగ్గజాల పర్యవేక్షణ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం లాభాల కోసం నైతికతను పక్కన పెడుతున్న ఇలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: కాకమీదున్న పసిడి ధరలు
సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్.. సీఈఓ వివరణ
ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్కార్ట్ ప్రస్తుతం తీవ్రమైన సోషల్ మీడియా విమర్శలను ఎదుర్కొంటోంది. కంపెనీకి చెందిన ‘స్టాఫ్ యూనిఫాం అండ్ గ్రూమింగ్ గైడ్’ పేరుతో వైరల్ అవుతున్న ఒక డాక్యుమెంట్ మతపరమైన వివక్షకు తావిచ్చేలా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. హిందూ సంప్రదాయాలైన బిందీ, తిలకంపై నిషేధం విధిస్తూ హిజాబ్కు అనుమతినివ్వడంపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఈ వివాదం ముదరడంతో సంస్థ వ్యవస్థాపకుడు పీయూష్ బన్సాల్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు.వివాదానికి కారణం ఏమిటి?ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న వివరాల ప్రకారం.. లెన్స్కార్ట్ అంతర్గత మార్గదర్శకాల్లో స్టోర్ ఉద్యోగులకు సంబంధించి కొన్ని వివాదాస్పద నిబంధనలు వెలుగులోకి వచ్చాయి. ముస్లిం మహిళా ఉద్యోగులు విధుల్లో ఉన్నప్పుడు నలుపు రంగు హిజాబ్, అలాగే సిక్కు ఉద్యోగులు నల్లటి తలపాగాలను ధరించవచ్చని గైడ్లో పేర్కొన్నారు. అదే సమయంలో మహిళా ఉద్యోగులు బిందీలు (స్టిక్కర్లు) పెట్టుకోకూడదని, పురుషులు లేదా మహిళలు ఎవరూ మతపరమైన తిలకం లేదా టిక్కా ధరించకూడదని నిబంధనలు స్పష్టం చేశాయి. భారతీయ సంస్కృతిలో భాగమైన బిందీ, తిలకాలను నిషేధించి ఇతర మతపరమైన గుర్తులను అనుమతించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Hi, all. I’ve been seeing an inaccurate policy document going viral about Lenskart.I want to speak directly that this document does not reflect our present guidelines.Our policy has no restrictions on any form of religious expression, including bindi and tilak, and we…— Peyush Bansal (@peyushbansal) April 15, 2026పీయూష్ బన్సాల్ సంజాయిషీఈ వివాదంపై ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందించిన కంపెనీ సీఈఓ పీయూష్ బన్సాల్, వైరల్ అవుతున్న పత్రం తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొన్నారు. ‘మా వస్త్రధారణ విధానం సంవత్సరాలుగా మారుతూ వస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్నది పాత డాక్యుమెంట్. ఇది మా కంపెనీ ప్రస్తుత వైఖరిని ప్రతిబింబించదు. బిందీ లేదా తిలకం ధరించడంపై మా ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. దీనివల్ల కలిగిన గందరగోళానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఆయన వివరించారు.
ఫ్యామిలీ
...ఆల్ ది బెస్ట్
భారతీయ మహిళలకు ఆల్ ది బెస్ట్. చైతన్యవంతమైన తెలుగింటి మహిళలకు ఆల్ ది బెస్ట్. మేధస్సులో, దార్శనికతలో, భవిష్యత్తు నిర్మాణంలో గొప్ప దక్షత, దీక్ష కలిగిన మన నారీశక్తికి ఆల్ ది బెస్ట్. అదిగో... చట్టసభల్లో స్త్రీలకు సంబంధించిన గొప్ప ఘట్టానికి తెర లేవనుంది. నేటి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది. ఎన్నాళ్ల కల ఇది! ఎన్నో తరాల కల. అందుకే ఇది చారిత్రాత్మక ఘట్టం. ప్రజాస్వామ్యంలో స్త్రీలకు సమాన భాగస్వామ్యం ఉందని చాటే అపురూప ఘట్టం. ఇక చట్టసభల్లో స్త్రీల గళం మరింత బలంగా వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది. విధాన నిర్ణయాల్లో స్త్రీ దృక్పథం చేరితే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని స్త్రీలు చూపబోతున్నారు. ఇంటిని నడిపిన అనుభవంతో దేశాన్ని నడిపే సామర్థ్యం స్త్రీలకు ఉంది. ఈ బిల్లు కేవలం సీట్ల గురించి కాదు, గౌరవం గురించి. ఆత్మగౌరవం గురించి. స్త్రీలు ద్వితీయశ్రేణి పౌరులు కాదని ఎలుగెత్తి చాటడం గురించి. ఈ సందర్భం స్త్రీల పోరాటానికి, పట్టుదలకు తార్కాణం. చర్చ సజావుగా సాగి, బిల్లు కార్యరూపం దాల్చాలని ఆకాంక్షిద్దాం. ఒక కొత్తప్రారంభానికి సిద్ధమవుదాం. భారత నారీ శక్తికి మరోసారి ఆల్ ది బెస్ట్. ... మీరు గెలవాలి!మహిళలకు అధికారం ఇస్తే వారు ఎంత అద్భుతంగా పనిచేస్తారో అనడానికి మన గ్రామ పంచాయతీలే నిదర్శనం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 14.5 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులుగా పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. తాగునీటిప్రాజెక్టుల అమలులో సుమారు 60% పైగా మెరుగుదల కనిపించినట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది మహిళా నాయకత్వం స్థానిక పాలనను ప్రజల అవసరాలకు మరింత దగ్గరగా తీసుకువస్తుందని స్పష్టంగా చూపిస్తుంది.అప్పుడే సంపూర్ణ ప్రజాస్వామ్యంప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, పార్లమెంటులో మహిళలప్రాతినిధ్యం సగటున 27.5%గా ఉంది. మహిళ లప్రాతినిధ్యం పెరిగిన దేశాల్లో సమాజం ఎంతోవేగంగా అభివృద్ధి చెందిందని గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, ప్రపంచంలోనే అత్యధికంగా 64% మంది మహిళలు పార్లమెంటులో ఉన్న రువాండాలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అక్కడ మహిళా నాయకత్వం వల్ల భూమిపై మహిళలకు సమాన హక్కులు కల్పించే చట్టాలు వచ్చాయి, ప్రస్తుతం అక్కడ 26% భూమి మహిళల పేరు మీదనే ఉంది. తల్లి మరణాల రేటు సగానికి పైగా తగ్గడమే కాకుండా, ఆడపిల్లలందరికీప్రాథమిక విద్య అందేలా అక్కడి మహిళా నాయకులు అద్భుతమైన కృషి చేశారు. అర్జెంటీనా వంటి దేశాల్లో 42.4% మంది మహిళలు చట్టసభల్లో ఉండటం వల్ల మహిళల హక్కులకు సంబంధించిన బిల్లుల సంఖ్య భారీగా పెరిగింది. కుటుంబాల్లో మహిళలు చేసే అప్రకటిత సేవలకు (అన్పెయిడ్ కేర్ వర్క్) గుర్తింపు తెచ్చేలా వారు విధానాలను మార్చగలిగారు.సామాజిక జీవనం మారి పోయిందిస్వీడన్, నార్వే వంటి నార్డిక్ దేశాల్లో మహిళలప్రాతినిధ్యం 45% పైగా ఉండటం వల్ల అక్కడ సామాజిక జీవనమే మారి పోయింది. పిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవడమే కాకుండా, తండ్రులకు కూడా సమానంగా పేరెంటల్ లీవ్స్ ఇచ్చేలా చట్టాలను రూపొందించారు. దీనివల్ల మహిళలు ఉద్యోగాల్లో, వ్యా పారాల్లో రాణించడానికి గొప్ప అవకాశం దక్కింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా 21% పైగా మహిళాప్రాతినిధ్యం ఉండటం వల్ల పేద కుటుంబాల సంక్షేమంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. జనాభాలో సగం ఉన్న మహిళలు నిర్ణయాధికారంలో భాగస్వాములు కావడం ద్వారా మాత్రమే సమ్మిళిత ప్రజాస్వామ్యం సంపూర్ణమవుతుంది. ఎన్ని సవాళ్లు ఉన్నా...ఈ రిజర్వేషన్ల విధానం సమాన అవకాశాలు అనే రాజ్యాంగప్రాథమిక సూత్రాన్ని దెబ్బతీస్తుందని కొందరు విమర్శకులు భావిస్తారు. రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక వారి అర్హతలు, ప్రజాబలం, సిద్ధాంతాల ఆధారంగా జరగాలి కానీ, కేవలం జెండర్ ఆధారంగా జరగకూడదని వారు వాదిస్తారు. చట్టసభల్లో మహిళలకు స్థానాలు కేటాయించినప్పటికీ, వాస్తవంగా వారి కుటుంబాల్లోని పురుషులే పెత్తనం చెలాయించే అవకాశం ఉందనే విమర్శలు బలంగా ఉన్నాయి. అలాగే, ఓటర్ల స్వేచ్ఛ పరిమితం అవుతుందని, పార్టీల అంతర్గత విభేదాలు తలెత్తి భవిష్యత్తులో ఇతర వర్గాల నుండి కూడా ఇలాంటి కోటా డిమాండ్లు పుట్టుకొచ్చి వ్యవస్థను సంక్లిష్టం చేస్తాయనే ఆందోళనలు ఉన్నాయి. పలువురు మహిళా నాయకులు సైతం తమను కేవలం ఒక మహిళగా కాకుండా, తమ నాయకత్వ పటిమతో గుర్తింపు పొందాలని కోరుకోవడం కూడా గమనించాల్సిన అంశం. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, మహిళలకుప్రాతినిధ్యం కల్పించే విధానం కేవలం రాజకీయ స్థానాలను పెంచే సాధారణ చర్య కాదు. ఇది భారతీయ సమాజాన్ని మరింత సమానత్వపూర్వకంగా మలిచే ఒక గొప్ప నిర్మాణాత్మక సంస్కరణ. చట్టసభల్లో మహిళలు అడుగుపెట్టడం వల్ల విధానాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా మానవీయ కోణాన్ని సంతరించుకుంటాయి. చట్టసభల వేదికగా మహిళలు ధైర్యంగా మాట్లాడటం, బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువతులకు వారు సజీవ ఆదర్శంగా, మార్గదర్శకులుగా నిలుస్తారు.– బాల లత మల్లవరపు సివిల్స్ మెంబర్, డైరెక్టర్, ధనిక్ భారత్ప్రోత్సాహం అవసరంమామూలుగా ఒక బిల్లు అమలు చేయనున్నారనే వార్త రాగానే అందరం థ్యాంక్స్ చెబుతాం... ఎన్నో మాట్లాడతాం. కానీ ఆ బిల్లు పాస్ అవ్వాలి.. అంతటితో ఆగకూడదు... అమలు చేశాక దాని తాలూకు పనులు సరిగ్గా జరుగుతున్నాయా... లేదా అనేది ముఖ్యం. ఎన్నికలు దగ్గర పడుతున్న ప్రతిసారీ మహిళల కోసం ఏదో చేస్తాం అని మాటలు చెబితే చాలామంది నమ్మే పరిస్థితుల్లో లేరు. చెప్పినది అమలు చేయాలి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇలాంటివి అమలు చేసినా... చేయక పోయినా అన్ని రంగాల్లో మహిళలు తమను నిరూపించుకుంటున్నారు. పాలిటిక్స్, జర్నలిజమ్, డాక్టర్స్, పైలట్స్... ఇలాంటి రంగాల్లో ముందుంటున్నారు. కష్టమైనా, ఒడిదుడుకులు ఎదురైనా తమ కలలను నిజం చేసుకుంటున్నారు. అయితే జనరల్గా మహిళల శాతం ఏ రంగంలో అయినా తక్కువే ఉంటోంది. అంతెందుకు? పొలిటికల్ మీటింగ్స్ తీసుకోండి... 20 మంది మగవాళ్లు ఉంటే అందులో ఓ ముగ్గురు లేదా నలుగురు మహిళలు ఉంటే అది పెద్ద విషయం. అదే ఒక బిల్లు పాస్ అయినప్పుడు, అది ఒక ‘లా’ అయినప్పుడు కేటాయించిన ‘శాతం’లో మహిళలకు పూర్తి అవకాశం దక్కుతుంది. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మహిళలదే. రూరల్ ఏరియాస్లో కొన్ని చోట్ల ఇంకా మహిళల పట్ల కాస్త వివక్ష ఉందనిపిస్తోంది. చె΄్పాలంటే ఈ విషయంలో నార్త్ కంటే సౌత్ కొంత బెస్ట్. అక్కడితే పోలిస్తే ఇక్కడ మహిళలకు ప్రోత్సాహం కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే ‘గ్రాస్ రూట్’ లెవల్లో ఉన్న అమ్మాయిలకు ఇంకా ఎంకరేజ్మెంట్ అవసరం. ఇప్పుడు మారుమూలప్రాంతాల్లో కూడా అమ్మాయిలను చదివిస్తున్నారు. ఆ తర్వాత కూడా వాళ్లను ఎంకరేజ్ చేయాలి. ‘గ్రాస్ రూట్’ లెవల్ నుంచి ఆ నెక్ట్స్ లెవల్ వరకూ అందరూ ముందుకు వస్తే అప్పుడు మొత్తం 33 శాతం రిజర్వేషన్ ఫుల్ అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఆ చట్టం అమలులోకి తెచ్చినా మహిళలు సద్వినియోగం చేసుకోక పోతే ఇక ఉపయోగం ఏం ఉంటుంది? అందుకే ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పదలచుకున్నాను. కాస్త ధైర్యంగా మాట్లాడే మహిళలను ఎలా ఎదగనివ్వకుండా చేయాలా... అని కొంతమంది చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడి, అనుకున్నది సాధించిన మహిళలు ఉన్నారు. వాళ్లని స్ఫూర్తిగా తీసుకోవాలి. మహిళలకు కేటాయించినవి దక్కించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ముందుకు రండి... నిరూపించుకుని నిలబడండి. – జయసుధ, నటిఇదో గొప్ప ముందడుగుఈ 33 శాతం రిజర్వేషన్ బిల్లు మహిళా సాధికారతకు భరోసా ఇస్తుంది. నారీ శక్తి కేవలం మాటలకే పరిమితం కాదు, ప్రధాని దానిని మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, చెందుతుంది అంటే మహిళలకు సాధికారత కల్పించినప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ బిల్లు వ్యవస్థపై, పాలకవర్గంపై విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది. ఈ బిల్లు ఒక గొప్ప ముందడుగు, ఒక కల నిజమైన క్షణం. – ఖుష్బూ, నటిస్ఫూర్తిదాయకం33 శాతం బిల్లు అనేది కచ్చితంగా ఆహ్వానించదగ్గది. మహిళలకు ఎక్కువ అవకాశం కల్పించే ఇలాంటి నిర్ణయాలు స్వాగతించదగ్గవి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటే బాగుంటుంది. రాజకీయాలైనా, సినిమా అయినా... ఏ రంగం అయినా మనకు వచ్చిన చాన్స్ని ఉపయోగించుకోవాలి. సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడాలి. క్రియేటివ్ ఫీల్డ్లో ఇలాంటి రిజర్వేషన్లు ఉండవు. కానీ, 33 శాతం అనేది ఇతర రంగాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాలి. ప్రతిభకు తగ్గ గుర్తింపు ఇవ్వాలి. అలాగే ఎవరో ఒకరు ప్రోత్సహించాలని ఆశించకుండా అమ్మాయిలు తమకు తాముగా కూడా ముందడుగు వేయాలి. – మానస శర్మ, యువ దర్శకురాలుఐపీయూ (ఇంటర్– పార్లమెంటరీ యూనియన్) అనేది ప్రపంచవ్యాప్తంగా జాతీయ పార్లమెంట్లకు సంబంధించిన సంస్థ. దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఏర్పాటైంది. పార్లమెంట్లు మరింత బలంగా, పర్యావరణహితంగా ఉండడానికి, లింగసమానత్వం సాధించడానికి కృషి చేస్తోంది ఐపీయూ. ∙ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకత్వంలో మహిళలప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందనీ, అత్యంత శక్తిమంతమైన నిర్ణయాలు ఇప్పటికీ పురుషులే తీసుకుంటున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.ఐపీయూ, యూఎన్ ఉమెన్ విడుదల చేసిన గణాంకాలలో ముఖ్యాంశాలు...27.5%ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ సీట్లలో 27.5 శాతం మహిళలు ఉన్నారు. ఇది 2025 నాటి 27.2 శాతం కంటే కొద్దిగా ఎక్కువ. రాజకీయప్రాతినిధ్యానికి సంబంధించి మహిళలు ఎంత నెమ్మదిగా పురోగమిస్తున్నారో ఇది తెలియజేస్తుంది.19.9%జనవరి 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా 54 మంది మహిళలు పార్లమెంట్ స్పీకర్లుగా ఉన్నారు. మొత్తం స్పీకర్లలో ఇది 19.9 శాతం.76%రాజకీయాల్లోని మహిళలు ఆన్లైన్, ఆఫ్లైన్లో వివిధ రకాలుగా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. మహిళా పార్లమెంటేరియన్లలో 76 శాతం మంది బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. సమాన రాజకీయ అధికారం దిశగా మహిళల పురోగతిని మందగింపచేసే ప్రయత్నాల్లో భాగమే ఈ బెదిరింపులు.మహిళలు నాయకత్వ స్థానాలకు చేరుకున్నప్పటికీ తరచుగా అ్ర పాధాన్య శాఖలకే పరిమితమవుతున్నారురక్షణ, హోం, న్యాయ, ఆర్థిక, ఆరోగ్య, విద్య వంటి మంత్రిత్వశాఖలను దాదాపుగా పురుషులే నిర్వహిస్తున్నారు. 14 దేశాలుప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల క్యాబినెట్లో లింగసమానత్వాన్ని సాధించాయి. సమానప్రాతినిధ్యం సాధ్యమేనని నిరూపించాయి. ఎనిమిది దేశాలలో ఇప్పటికీ ఒక్క మహిళా మంత్రి కూడా లేరు.
నెర్రెలిస్తున్న నేలతల్లికై... అక్షర చైతన్య యాత్ర!
అంతకంతకూ క్షీణిస్తున్న భూసారాన్ని మనకు మనమే తక్షణం కాపాడుకోవాలి. లేదంటే, మరో నాలుగైదు దశాబ్దాల్లో మానవ జాతికి మనుగడే ఉండదు. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు... ప్రపంచ వ్యాప్తంగా భూసార పరీక్షలు సాగించిన పరిశోధకుల మాట. కానీ, అత్యంత కీలకమైన ఈ అంశం పట్ల ఎంతమందికి చైతన్యం ఉంది? పెరుగుతున్న భూతాపం, అంతకంతకూ ఎక్కువవుతున్న చెట్ల నరికివేత లాంటి అంశాలపై జనంలో ఎంతో కొంత అవగాహన కలిగించే ప్రయత్నం జరుగుతోంది. మరి, మనకు ఆహారం అందించే పుడమి తల్లి చేవ చచ్చి, చేష్టలుడిగి, జీవచ్ఛవమవుతున్న దుఃస్థితి గురించి ఎవరికి పడుతోంది? భవిష్యత్ మానవ జాతి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ పరిస్థితిపై సాగిన ఓ ప్రజా ఉద్యమమే... ‘సేవ్ సాయిల్’. ఉద్యమ స్థాయిలో సాగిన ఈ ప్రజా చైతన్య కార్యక్రమం.. ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గీవాసుదేవ్ మానస పుత్రిక.100 రోజులు.. 27 దేశాలు.. 30 వేల కిలోమీటర్లు...‘సేవ్ సాయిల్’ ఉద్యమం చేపట్టిన ఆయన అందులో భాగంగా నాలుగేళ్ళ క్రితం 2022లో 100 రోజుల పాటు 27 దేశాల మీదుగా దాదాపు 30 వేల కిలోమీటర్లు మోటార్ సైకిలుపై ప్రయాణించారు. భారతదేశంతో పాటు ఐరోపా, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యాల మీదుగా ఆ యాత్ర సాగింది. అదో ప్రపంచవ్యాప్త బృహత్తర ప్రయత్నం. అయితే, వివిధ దేశాల్లోని వైవిధ్యభరితమైన వాతావరణ, భౌగోళిక పరిస్థితులతో ముడిపడిన ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావాలంటే, కొన్ని పదులు, వందలమంది తెర వెనుక ఉండి శ్రమిస్తే కానీ సాధ్యం కాదు.యాత్రలో భాగంగా మొత్తం 691 కార్యక్రమాలుగా సాగిన ‘సేవ్ సాయిల్’ (Save Soil) విషయంలోనూ అదే జరిగింది. ఈ ప్రజాచైతన్య ఉద్యమంలో తెర వెనుక హీరోలు ఎందరో. అలాంటి పదుల మంది స్వచ్ఛంద సేవకులు, కార్యకర్తల వ్యక్తిగత అనుభవాలు, అనుభూతులు, ఆ వంద రోజుల ప్రయాణంలో జరిగిన పలు సంఘటనలు... అన్నీ అనేక విధాలుగా మానవాసక్తికరమైన కథనాలే. ‘సేవ్ సాయిల్’ ఉద్యమంలోని అలాంటి తెలియని తెర వెనుక కథలు తాజాగా పుస్తకరూపం సంతరించుకున్నాయి. ‘సేవ్ సాయిల్ – 100 డేస్ దట్ మూవ్డ్ ది వరల్డ్’ అన్న పేరుతో పెంగ్విన్ బుక్ హౌస్ వారు ప్రచురించారు.నాలుగేళ్ళలో.. 410 కోట్ల మందికి...హైదరాబాద్లో ఏప్రిల్ 14వ తేదీ, మంగళవారం సాయంత్రం వినూత్న రీతిలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ప్రముఖ భరతనాట్య కళాకారిణి, సద్గురు కుమార్తె అయిన రాధే జగ్గీ (Radhe Jaggi) ఈ సంకలన గ్రంథానికి సంపాదకత్వం వహించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు – సంగీత దర్శకుడు రామ్ మిరియాల, పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ – మోడల్ శిల్పారెడ్డితో కలసి పుస్తక సంపాదకురాలి చర్చా గోష్ఠి ఫక్కీలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం సాగింది. “ప్రపంచవ్యాప్తంగా గత నాలుగేళ్ళలో దాదాపు 410 కోట్ల మందికి చేరువైన ‘సేవ్ సాయిల్’ ఇవాళ అతి పెద్ద ప్రజా చైతన్య ఉద్యమం” అని రాధే వివరించారు.‘సేవ్ సాయిల్’ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న అనుభవం రాధేది. భారతీయ సంప్రదాయ కళల పరిరక్షణ, ప్రచారం కోసం స్థాపించిన ‘ప్రాజెక్ట్ సంస్కృతి’తో కలిసి ఆ యాత్రలో అనేక వేదికలపై ఆమె ప్రదర్శనలు ఇచ్చారు. మట్టితో ముడిపడిన కథాంశంతో రాధే బృందం చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఉద్యమ సందేశాన్ని మరింత వ్యాపింపజేశాయి. అలా యాత్రలో ప్రత్యక్ష భాగస్వామి అయిన రాధే తన అనుభవంతో పాటు పలువురు స్వచ్ఛంద సేవకుల అనుభూతులనూ, వారు ఎదుర్కొన్న సంఘటనలనూ సంకలించారు. వెరసి, విభిన్న వర్గాలకు చెందిన 86 మంది వేర్వేరు వ్యక్తుల విభిన్న అనుభవాల సమాహార రూపం... ‘సేవ్ సాయిల్’ గ్రంథం. ఆ వాలంటీర్ల కథలు, అప్పటి ఫోటోలతో పుస్తకాన్ని ఆసక్తిగా తీర్చిదిద్దారు. ఎక్కడ, ఏ పేజీ అయినా తీసుకొని చదువుకొనేలా అనుభవాలను రాశిపోసిన ఈ రచన నేలతల్లి పరిరక్షణ ఉద్యమం వెనుక ఉన్న విస్తృతి, ఉత్సాహం, సవాళ్లను పరిచయం చేస్తుంది.ఎండకు ఎండి, వానకు తడిసి, మంచులో వణికి... యూరోపియన్ ప్రాంతాల్లో వర్షంలో తడుస్తూ, ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో గడ్డకట్టే చలిలో వణుకుతూ, ఎర్రటి ఎండలో ఎడారి తుపానులకు ఎదురొడ్డుతూ సాగిన ఉద్యమ యాత్ర ఇది. ఐక్యరాజ్య సమితి హాళ్ళ నుంచి రోడ్డు పక్క టీ షాపుల దాకా ఆగిన ప్రతిచోటా నేలతల్లిని కాపాడుకోవాలన్నదే ప్రధాన సందేశం. ఓ దేశంలో అసలు కార్యక్రమానికి ముందు కిచెన్లో ఇరుక్కుపోయిన క్షణాలు, డ్రోన్ను నోట కరుచుకొని ఓ వాలంటీర్ చెట్టెక్కిన సంగతులు, వాహనం క్లచ్ పాడైపోయి బాగు చేయాల్సిన క్షణంలో చిమ్మచీకటి వేళ అపరిచిత వ్యక్తులు అందించిన సాయాలు, ఈ ఉద్యమం కోసం తెలుగునాట ఓ వ్యక్తి కాలినడకన కొన్ని పదుల కి.మీ.లు నడక సాగించడం... ఇలా ఎన్నెన్నో కథలు ఈ పుస్తకంలో చదవవచ్చు.“పలువురిని ఇంటర్వ్యూ చేసి, వారి అనుభవాలను వారి మాటల్లోనే అందించాం. ఈ పుస్తకం చదువుతుంటే, ఆ సంఘటలన్నీ కళ్ళ ముందు కదలాడి, ‘సేవ్ సాయిల్’ ప్రపంచ యాత్రలో మీరూ స్వయంగా పాల్గొన్న అనుభూతి కలుగుతుంది’’ అని రాధే వివరించారు. “రైతులు తమ జీవనోపాధి కోసం పోరాడుతుంటారు. అలాంటి సమయంలో పర్యావరణ బాధ్యతను కూడా వాళ్ళ మీదే పెట్టడం సరైంది కాదు. మనందరం సహజసిద్ధంగా మట్టిలో సేంద్రియ పదార్థాలను పెంచాలి. రైతులకు అండగా నిలవాలి. అదే సమయంలో ప్రభుత్వాలు సైతం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని, కట్టుదిట్టంగా అమలు చేస్తేనే, నేలతల్లి సంరక్షణ నిజంగా సాధ్యమవుతుంది” అని ఆమె అభిప్రాయపడ్డారు.ఏం చేస్తున్నామని సిగ్గేసింది: రామ్ మిరియాల ‘వ్యవసాయ భూముల్లో సేంద్రియ పదార్థాల పరిమాణాన్ని కనీసం 3 నుంచి 6 శాతానికి పెంచే విధానాలను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా నేలతల్లి ఎదుర్కొంటున్న సార సంక్షోభాన్ని ఎదుర్కోవడం ‘సేవ్ సాయిల్’ ఉద్యమ లక్ష్యం. శాస్త్రవేత్తలు, రైతులు, అంతర్జాతీయ సంస్థలు, సామాన్య పౌరుల నుంచి పాలకుల దాకా అందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి, ఆహార భద్రత, నీటి భద్రత, జీవ వైవిధ్యం, వాతావరణ స్థిరత్వానికి నేలలో జీవం ఎంత ముఖ్యమైనదో చాటుతోంది. ఈ లక్ష్యాలన్నీ నచ్చి దీనిలో నేనూ భాగమయ్యాను’ అని సినీ గాయకుడు రామ్ మిరియాల వివరించారు.“వయసు మీద పడినవారే ఎంతో చేస్తుంటే, వయసులో ఉన్న మనం ఏం చేస్తున్నామని నాకే సిగ్గేసింది. అందుకే, నా వంతుగా ఈ ప్రజా చైతన్య ఉద్యమం కోసం స్వయంగా ఓ పాట రాసి, స్వరపరిచి పాడాను” అని రామ్ చెప్పుకొచ్చారు. మనిషికీ, మట్టికీ ఉన్న బంధాన్నీ, అలాగే మనం మట్టిని కాపాడుకోవలసిన అవసరాన్నీ చెప్పిన “నిలువెల్లా పురుడోసుకొని నేలమ్మ...” అనే ఆ పాట పాడి, వినిపించారు. “దేశమంటే మట్టేనోయ్... మట్టి లేకపోతే మనిషెక్కడోయ్...” అంటూ వినూత్న ధోరణితో ఆలోచింపజేశారు. మట్టిని ప్రాణమున్న బంగారంగా వర్ణిస్తూ సాగిన రామ్ మిరియాల పాట ఆహూతులను అలరించడమే కాక, మట్టిపై ప్రేమను మరింత పెంచేలా సాగింది.అందుకే... సమంతను భాగస్వామిని చేశా: శిల్పారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ, “సేవ్ సాయిల్ ఉద్యమం తాలూకు లక్ష్యం నన్నెంతో ప్రేరేపించింది. ఇప్పుడు మనం కళ్ళు తెరవకపోతే, మహా ఉపద్రవం తప్పదు. అందుకే, మానవాళి భవిష్యత్తు కోసం నా వంతుగా ఇందులో నేనూ భాగమయ్యాను. సినీ నటి సమంత లాంటి నా ఆత్మీయ మిత్రులనూ, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులనూ ఈ కృషిలో భాగం చేశాను. స్వయంగా స్విట్జర్లాండ్ వెళ్ళి, యాత్రలో పాల్గొన్నాను. మహా సముద్రం లాంటి ఈ ప్రయత్నంలో నేను ఓ నీటిబిందువును మాత్రమే” అని వినయంగా పేర్కొన్నారు. ఆహూతుల సందేహాలకు సైతం సమాధానాలిస్తూ, చర్చా గోష్ఠిగా సాగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జంట నగరాలలోని వివిధ వర్గాల ప్రజలు పెద్దయెత్తున పాల్గొనడం విశేషం.చదవండి: వాత్స్యాయన కామసూత్రాలకు కూచిపూడి నృత్యభాష్యంఏమైనా, ‘మనం ఈ నేల నుంచి పుట్టాం. ఈ నేలపైనే జీవిస్తాం. ఇక్కడే కన్నుమూస్తాం. చివరకు ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఆ వాస్తవం ఇప్పటికైనా గుర్తించి, మన నేలతల్లి జవజీవాలను మనమే పరిరక్షించుకోవాలన్న ఆలోచన ఇప్పటికైనా తెచ్చుకుందాం. లేదంటే భావితరానికి బతుకే లేదు’. ఈ సద్గురు సందేశం ఆలోచించి తీరాల్సిందే కాదు... తక్షణమే ఆచరణలోకి దిగాల్సినది. ‘సేవ్ సాయిల్’ పుస్తకంలోని విభిన్న అనుభవాలు అక్షరాలా అందుకు మరో ప్రేరణ.- రెంటాల జయదేవ
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే..? ప్రాణాలకే ప్రమాదమా?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు నగరానికి చెందిన ఓ గర్భిణి తీవ్ర కడుపు నొప్పితో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వెంటనే అడ్మిట్ చేయించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఎక్టోఫిక్ ప్రెగ్నెన్సీగా గుర్తించి ఆఫరేషన్ చేశారు. ఈ క్రమంలో ఆ తల్లి మృత్యువాత పడింది. ట్యూబ్ పగిలిపోవడంతోనే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో తరచూ నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. తల్లి గర్భాణికి గండం తప్పనంటోంది. గర్భసంచిలో గర్భం దారి తప్పుతోంది. ఇందుకు ఇన్ఫెక్షన్లు, వరుస అబార్షన్లే ప్రధాన కారణమని తెలుస్తోంది. అండాశయం, గర్భాశయ నాళాల్లో గర్భం(ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) ఏర్పడుతోంది. మాతృమరణానికి దారి తీస్తోంది. ఈ విషయంలో తల్లులు అప్రమత్తంగా వ్యవహరించకుంటే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాణిపాకం జిల్లాలో ఎక్టోఫిక్ ప్రెగ్నెన్సీ కేసులు పెరుగుతున్నాయి. గర్భం సరైన స్థానమైన కాకుండా గర్భాశయ నాళాలు (ఫాలోపియన్ ట్యూబ్స్), అండాశయం లేదా పొత్తికడుపులో ఏర్పడుతోంది. దీన్ని గుర్తించడంలో ఆలస్యం చేస్తే తల్లి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. జిల్లాలో ఒక జిల్లా ప్రభు త్వ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు 4, సీహెచ్సీలు 8, పీహెచ్సీలు 50, ప్రైవేటు ఆస్పత్రులు వెయ్యి వరకు ఉన్నాయి. వీటిలో ప్రతి నెలా 7వేలకు పైగా గర్భణులు గుర్తిస్తుండగా.. 5వేల ప్రసవ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రతి 100 గర్భధారణల్లో కనీసం 1–2 కేసులు ఎక్టోఫిక్గా నమోదవుతున్నాయని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదం మరింత తీవ్రమవుతోందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రారంభంలో ఇది సాధారణ గర్భంలా కనిపిస్తుంది. కడుపులో ఒక వైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. అసాధారణ రక్తస్రావం, తల తిరగడం, బలహీనత, భుజం లేదా వెన్ను నొప్పి, చికిత్స ఆలస్యం అయితే ట్యూబ్ పగిలిపోవడం, అంతర్గత రక్తస్రావం, అత్యవసర శస్త్రచికిత్స అవసరం, తల్లి ప్రాణానికి ప్రమాదం తప్పదు. పెరుగుదలకు ప్రధాన కారణాలు గర్భాశయ నాళాల్లో ఇన్ఫెక్షన్లు ఏర్పడడం.. వరుసగా అబార్షన్లు, సేఫ్టీ లేకుండా లైంగిక సంబంధాలు, గతంలో ట్యూబ్ సర్జరీలు, ఆలస్యంగా పెళ్లిళ్లు, గర్భధారణలో ఆలస్యం, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ల పెరుగుదల తదితర కారణాలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయకూడదు. సేఫ్ సెక్స్ పాటించాలి. వరుస అబార్షన్లను నివారించాలి. గర్భం అనుమానం వచ్చిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి. రెగ్యులర్ చెకప్లు తప్పనిసరి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే! గర్భం దాల్చాల్సిన చోట కాకుండా వేరే చోట ఏర్పడితే దాన్ని ఎక్టోíపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాన్ని ఎక్టోపిక్ గర్భం అంటారు. వందలో ఒకరికి ఇలా జరుగుతుంది. ఇలా ఎందుకు అవుతుందో..అంతు చిక్కదు. అండవాహికకు ఇన్ఫెక్షన్, ఆఫరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా స్కాన్ చేసినప్పుడే తెలుస్తుంది. అజాగ్రత్త వద్దు అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాని ఎక్టోఫిక్ గర్భం అంటాం. వందలో ఒకరికి జరుగుతుంది. అండవాహికకు ఇన్ఫెక్షన్, ఆఫరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈ విషయంలో అజాగ్రత్త వద్దు. వైద్యులను తక్షణమే సంప్రదించాలి. – షాలిని, గైనిక్ వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో), చిత్తూరు వైద్యులను సంప్రదించాలి నెలసరి రక్తస్రావం ఆగినా, తిరిగి అడపాదడపా రక్త స్రావం కనిపిస్తూ ఉన్నా.. పొత్తి కడుపులో ఒక పక్క భరించలేనంత నొప్పి బలహీనత, కళ్లు తిరగడం, గర్భధారణ అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ చూస్తున్నాం. ఈ కేసుల్లో చాలా వరకు మాతృమరణాలకు దారితీస్తున్నాయి. – ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, చిత్తూరు (చదవండి: తొలి అంధ-బధిర న్యాయవాది: చిమ్మచీకటి నుంచే సక్సెస్ అందుకుంది..!)
చిమ్మ చీకటి నుంచే సక్సెస్ అందుకుంది..!
మనదేశంలో ఉన్న ప్రతి సౌకర్యం సక్రమంగా ఉన్నవారికే. పుట్టుకతో దివ్యాంగులు లేదా ప్రమాదవశాత్తు దివ్యాంగులైన వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించే యత్నం చేయడం లేదనేది చాలామంది నిపుణుల వాదన. ఇంతలా ఏఐ సాంకేతికత వేగంగా దూసుకొస్తున్నప్పటికీ.. వాళ్ల విషయంలో ఇంకా పక్షపాత బుద్ధి, చిన్నచూపు మారడం లేదు. దాన్ని మార్చేందుకు కంకణం కట్టుకోవడమే కాదు ఆ దిశగా అడుగులు వేస్తూ..అందర్నీ చైతన్యవంతుల్ని చేసేలా ఆలోచింప చేసింది ఈ మహిళ. పైగా అందర్నీ బలవంతులుగా మార్చుదాం అనే సరికొత్త నినాదం ప్రతి ఒక్కరి మనసులో నాటేలా చేస్తోంది. ఆ అమ్మాయే హబెన్ గిర్మా. అమెరికాకు చెందిన గిర్మాది ఎరిట్రియన్ వలస కుటుంబ నేపథ్యం. ఆమె పుట్టుకతో చెవిటి అంధ వ్యక్తి. కాలక్రమేణ అవయవాలు క్షీణించే సమయానికి తన బాల్యం గురించి క్షణ్ణంగా అర్థం చేసుకుంది. నెమ్మది..నెమ్మదిగా కనుమరుగవ్వుతున్న దృష్టి, కోల్పోవుతున్న వినికిడి శక్తికి భయపడలేదామె. తన సవాళ్లకు అనుగుణంగా తనను తాను మార్చుకుంది. అలాగే ఆమె తన సహాయక సాధనాలను అదనపు వస్తువులుగా కాకుండా తన జీవితంలో ఒక భాగంగా భావించడం నేర్చుకుంది. సాధారణ పాఠశాలలో చదువుకుంది, బ్రెయిలీ నేర్చుకుంది. చాలామంది అంధ బధిరలకు లభించని అన్ని సౌకర్యాలతో పెరిగిందామె. ఇలాంటివి తనలాంటి వాళ్లందరికీ అందుబాటులో ఉంటే..వాళ్లు కూడా శక్తిమంతులవుతారనేది ఆమె ఆకాంక్ష. స్వతహగా చదువులో అపార ప్రతిభ కనబర్చే గిర్మా హార్వార్డ్ యూనివర్సిటీలో చదివే ఛాన్స్ కొట్టేసింది. అంతకుముందెన్నడూ అంధ బధిరలు లేని ఆ ప్రదేశంలో హెచ్ఎల్ఎస్లో చేరిన 'తొలి అంధ బధిర విద్యార్థి' గిర్మానే. అక్కడ పాఠాలు వినేందుకు డిజిటల్ రీడింగ్లను, బ్రెయిలీ డిస్ప్లేను ఉపయోగించింది. సోక్రటిస్ పద్ధతిలో వేగవంతంగా అర్థం చేసుకునే తర్కాన్ని అవపోశన పట్టింది. అలాగే తరగతిగది చర్చలను వాయిస్ ట్రాన్స్లిటర్ల సాయంతో తన ఇయర్ఫోన్లో వినిపించేలా ఒక వ్యవస్థను రూపొందించింది. అలాగే ఎక్కువ శబ్దం ఉన్న ప్రదేశాలలో ప్రజలు నేరుగా తనకు చెప్పలేని వాటిని టైప్ చేసేందుకు బ్రెయిలీ డిస్ప్లేకు బ్లూటూత్ కీబోర్డుని జత చేసింది. ఇలా ఇన్ని సౌకర్యాలతో తాను లా చదివి ఉత్తీర్ణురాలయ్యా..మరి నాలాంటి మిగతా వాళ్ల పరిస్థితి ఏంటనే ఆమె మదిని తొలిచేస్తున్న ప్రశ్న అది. ఆ నేపథ్యంలోనే ఆమె లా అనంతరం బర్కిలీలోని డిసేబిలిటీ రైట్స్ అడ్వకేట్స్లో స్కాడెన్ ఫెలోగా చేరి, ఆ తర్వాత అక్కడ స్టాఫ్ అటార్నీగా పనిచేశారు. పైగా అక్కడ వికలాంగులకు సాంకేతికత అందుబాటులో ఉంచేలా చేయడంలో సహాయ సహకారాలు అందించింది. అంతేగాదు వర్చువల్ వ్యాపారాలకు అమెరికన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ వర్తిస్తుందని వాదించారామె. దివ్యాంగులకు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేలా అన్నింట సాంకేతికత అందుబాటులో ఉండేందుకు కృషి చేశారామె. ఆమె కృషిని గుర్తించిన అమెరికా వైట్హౌస్ 2013లో ఆమెను ఛాంపియన్ ఆఫ్ చేంజ్గా ప్రకటించింది. ఆ తర్వాత ఆమె పబ్లిక్ స్పీకర్గా, యాక్సెస్ అడ్వకేట్గా మారారు. దివ్యాంగులకు విద్యను చేరువ చేసే సాంకేతికతను పొందడంలో ఉండే అడ్డంకులను తొలగించడానికి తన జీవితాన్ని అంకితం చేశారామె. 2019లో తన ఆత్మకథ హబెన్: ది డెఫ్బ్లైండ్ వుమన్ హూ కాంకర్డ్ హార్వర్డ్ లా'ను ప్రచురించారు. ఇదే ఆమె తొలి పుస్తకం కూడా. అది వైకల్యం చుట్టూ ఉన్న ప్రజల భాషను మార్చేందుకు ఉపకరించింది. అంతేగాదు వికలాంగులు స్ఫూర్తికోసమే ఉన్నారనే భావనను గిర్మా పదే పదే వ్యతిరేకించేవారు. దానికి బదులుగా వాళ్లను గౌరవంగా బతికేలా సౌకర్యాలు అందివ్వండని విజ్ఞప్తి చేస్తోంది. ఆమె పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ వ్యవస్థలలో దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని రూపొందించినప్పుడు ప్రతిభ అసాధారణంగా ఉండదని, తాము కూడా మీలాంటి వాళ్లమనే భావన ఇరువురిలో కలుగుతుందని అంటోందామె. దయచేసి ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించమని విజ్ఞప్తి చేస్తోంది. పైగా తాను సవాళ్లను అధిమించిన గొప్ప వ్యక్తిని కాదని, సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండటంతో సాధారణ వ్యక్తులు సాధించిన విజయంగా పరిగణించండి చాలు అని అంటోంది. అంతేగాదు మనం మాత్రమే బలవంతులం అవ్వడం కాదు, అందరూ ఇదే కోవకు చెందుతారు అని గుర్తురెగండి అని కోరుతోందామె.(చదవండి: 98 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా బామ్మ..!)
అంతర్జాతీయం
యుద్ధమైనా.. శాంతి చర్చలైనా.. మేం ఒక్కటే
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా గౌరవించి తీరాల్సిందేనని పేర్కొంది. అదే సమయంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి చర్చల ప్రతినిధి మహ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అయినా.. శాంతి చర్చలైనా.. ఇరాన్, దాని మిత్ర శక్తులు ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాయని స్పష్టం చేశారు. హెజ్బొల్లా ధైర్యం, రెసిస్టెన్స్ ఐక్యత వల్లే లెబనాన్లో కాల్పుల విరమణను సాధ్యమైందని అన్నారాయన. యుద్ధం జరిగినా, శాంతి ఒప్పందం వచ్చినా.. ఇరాన్, రెసిస్టెన్స్(మిత్ర శక్తుల) శక్తులు ఒక్కటిగానే ఉంటాయని.. ఈ శక్తులు కలకాలం ముందుకు సాగుతాయన్నారు. అలాగే.. ఇజ్రాయెల్కు ప్రాధాన్యత ఇవ్వడమే పనిగా పెట్టుకున్న అమెరికా ఆ విధానాన్ని వదిలేయాలని సూచించారు. శాంతి ఒప్పందాన్ని గౌరవించాలని అమెరికాకు హితవు పలికారు. హర్ముజ్ జలసంధి అమెరికా దిగ్బంధనం(బ్లాకేడ్) కొనసాగుతోంది. ఈ చర్య అంతర్జాతీయ చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఈ జోక్యాన్ని చూస్తూ ఊరుకోబోమని చెబుతోంది. లెబనాన్లో కాల్పుల విరమణ ఇంకా ఆచరణలోకి రాలేదు. అమెరికా మధ్యవర్తితత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తగ్గినా.. చిన్నపాటి దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఘలీబాఫ్ వ్యాఖ్యలు పశ్చిమాసియా సంక్షోభంలో రెసిస్టెన్స్ శక్తుల ఐక్యతను బలపరిచే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇరాన్ చెబుతున్నట్లు.. అమెరికా గనుక ఇజ్రాయెల్ ఫస్ట్ విధానాన్ని వీడి శాంతి ఒప్పందాన్ని గౌరవించకపోతే ప్రాంతీయ స్థిరత్వం మళ్లీ దెబ్బతినే అవకాశం ఉంది. ఇక అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు త్వరలో మళ్లీ ఇస్లామాబాద్లోనే జరగనున్నాయి. తొలి దఫా చర్చలు విఫలం కావడంతో.. ఎవరో ఒకరు దిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అటు అమెరికా.. ఇటు ఇరాన్ తగ్గేదే లే అంటున్నాయి. బంతి ఇరాన్ కోర్టులోనే ఉందని అమెరికా అంటుంటే.. తమ డిమాండ్లలో ఏ ఒక్కటి తగ్గినా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ అంటోంది. పాక్ మధ్యవర్తిత్వంలో తొలుత ఇరాన్, అమెరికా ప్రతినిధులు పరోక్ష చర్చలు జరుపుతారు. ఫలితాలు సానుకూలంగా ఉంటే ప్రత్యక్ష చర్చలు జరగొచ్చు.
ట్రంప్ దెబ్బ: బీబీసీలో భారీ లేఆఫ్స్
లండన్: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రభావవంతమైన వార్తా సంస్థగా పేరొందిన ‘బీబీసీ’ మునుపెన్నడూ లేని విధంగా పెను సంక్షోభంలో కూరుకుపోయింది. ఆర్ధిక కష్టాలు, కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ దిగ్గజ సంస్థ, తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 2,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని నిర్ణయించుకుంది. దశాబ్ద కాలంలో బీబీసీ తీసుకున్న అత్యంత కఠినమైన, అతిపెద్ద లేఆఫ్స్ నిర్ణయం ఇదే కావడం గమనార్హం.ఆర్థిక లోటు.. భారీగా కోతలుద్రవ్యోల్బణం, తగ్గుతున్న వాణిజ్య ఆదాయం, లైసెన్స్ ఫీజులపై పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో బీబీసీ తన వార్షిక బడ్జెట్లో దాదాపు 10 శాతం ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రాబోయే రెండేళ్లలో ఈ 2,000 ఉద్యోగాల కోతలను అమలు చేయనుంది. 2027 ఏప్రిల్ నాటికి ఈ ప్రభావం పూర్తిగా కనిపించనుంది. తాత్కాలిక డైరెక్టర్ జనరల్ రోడ్రి టాల్ఫన్ డేవిస్ ఈ విషయాన్ని ఉద్యోగులకు తెలియజేస్తూ, సంస్థ ముందున్న కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకే అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.ట్రంప్ 10 బిలియన్ డాలర్ల దావాఒకవైపు ఆర్థిక ఇబ్బందులు పీడిస్తున్న వేళ, బీబీసీకి భారీ చట్టపరమైన చిక్కులు తోడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత జనవరి ఆరున క్యాపిటల్ దాడికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీలో బీబీసీ తప్పుదోవ పట్టించేలా ఎడిటింగ్ చేసిందని ఏకంగా 10 బిలియన్ డాలర్ల (రూ. 93,359.43 కోట్లు) పరువునష్టం దావా వేశారు. ఈ వివాదం కారణంగానే గత డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, వార్తా విభాగం అధిపతి డెబోరా టర్నెస్ తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సంక్షోభ సమయంలో వచ్చే నెలలో మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ మ్యాట్ బ్రిట్టిన్ కొత్త డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.ప్రశ్నార్థకంగా మారిన మనుగడ1922లో స్థాపించిన బీబీసీకి ప్రధాన ఆదాయ వనరు వీక్షకులు చెల్లించే వార్షిక లైసెన్స్ ఫీజు . అయితే, స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ల రాకతో ప్రజల వీక్షణ అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. చాలా కుటుంబాలు సాంప్రదాయక టీవీలకు దూరమవుతుండటంతో బీబీసీ ఆర్థిక నమూనా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బ్రిటన్ లేబర్ పార్టీ ప్రభుత్వం కూడా ఈ లైసెన్స్ ఫీజు విధానాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడంతో, బహుళ టీవీ, రేడియో ఛానెళ్లు నడుపుతున్న బీబీసీ భవిష్యత్తు మనుగడపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి.ఇది కూడా చదవండి: ఖరగ్పూర్: సెకనుకో మలుపు.. ఓటరు నాడి ఎటు?
భారత్కు అమెరికా ఎనర్జీ షాక్
అమెరికా తన మిత్రదేశం భారత్కు షాకిచ్చింది. రష్యా, ఇరాన్ చమురుపై ఇప్పటివరకు ఇచ్చిన ఆంక్షల మినహాయింపును రద్దు చేసింది. ఈ ప్రభావం భారత్కు లభిస్తున్న తక్కువ ధరల క్రూడ్ ఆయిల్ సరఫరాపై పడే అవకాశం కనిపిస్తోంది.ఆ రెండు దేశాల నుంచి మార్చి 11కి ముందు లోడ్ చేసిన చమురు సరఫరాకు మాత్రమే అమెరికా భారత్ సహా కొన్ని దేశాలకు మినహాయింపు ఇచ్చింది. అయితే ఆ స్టాక్ ఇప్పుడు పూర్తయింది. ఇకపై రష్యా, ఇరాన్ చమురు కొనుగోలు చేసే దేశాలు(భారత్ సహా) సెకండరీ సాంక్షన్స్(ద్వితీయ శ్రేణి ఆంక్షలు) ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది భారత్కు ఒక ఎనర్జీ షాక్ లాంటిదే. ఇప్పటివరకు రష్యా నుండి తక్కువ ధరల క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి భారత్ తన ఇంధన ఖర్చులను తగ్గించుకుంది. అమెరికా ఆంక్షల మినహాయింపు రద్దు చేయడంతో ఆ సరఫరా తగ్గిపోవచ్చు. దీని వల్ల దేశీయ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.భారత్ ప్రస్తుతం రష్యా నుండి భారీగా డిస్కౌంట్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాది గణాంకాల ప్రకారం.. రోజుకు సుమారు 2.08 మిలియన్ బ్యారెల్స్ వరకు చేరింది. అయితే కొన్నినెలలపాటు రష్యా నుండి దిగుమతులు తగ్గినా.. డిస్కౌంట్ ధరలు కారణంగా మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది మార్చిలో భారత్ రష్యా నుండి 5.3 బిలియన్ యూరోల విలువైన(47,700 కోట్ల రూపాయల) క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి మాత్రం 7 సంవత్సరాల తర్వాత 2026లో మొదటిసారి సుమారు 4 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసింది.తాజా పరిణామాల దృష్ట్యా భారత్ తన ఎనర్జీ పాలసీని మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. విభిన్న సరఫరా మార్గాలు (పశ్చిమాసియా.. గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా) అన్వేషించుకోవాల్సి ఉంటుందని.. దీర్ఘకాలంలో పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి పెట్టడం తప్పనిసరి అవుతుందని చెబుతున్నారు.హర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు రవాణా మార్గాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయి. అమెరికా "మాక్సిమమ్ ప్రెషర్" విధానాన్ని మళ్లీ అమలు చేస్తూ, ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం ప్రపంచ చమురు ధరలపై కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు..అమెరికా ఇరాన్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్పై కొత్త ఆంక్షలు విధించింది. సుమారు రెండు డజన్ల కంపెనీలు, వ్యక్తులు, నౌకలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో కొందరు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ సలహాదారుడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని సమాచారం.
లాటరీలో చవకగా పికాసో పెయింటింగ్
పారిస్: అదృష్టం ఉండాలేగానీ సంపద అయినా అంతకంటే విలువైన వస్తువైనా మనల్నే వెతుక్కుంటూ వస్తుందని మరోమారు నిరూపితమైంది. ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో కుంచె నుంచి జాలువారిన కళాఖండాలకు చిత్రకారులు, సంపన్నుల ప్రపంచంలో భలే డిమాండ్ ఉంది. సంపన్నులు మొదలు సాధారణ కళాకారుల దాకా ఎంతో మంది పికాసో ఒరిజినల్ పెయింటింగ్లను తమ సొంతం చేసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. అలాంటిది ఒక ఫ్రాన్స్ సేల్స్ ఇంజనీర్కు కేవలం 117 డాలర్లకే అంటే 10,915 రూపాయలకే ఏకంగా రూ.9.33 కోట్ల విలువైన పికాసో పెయింటింగ్ దక్కింది. పెయింటింగ్ విక్రయం కోసం దాని యాజమాన్యం చేపట్టిన లక్కీ డ్రాలో 58 ఏళ్ల అరీ హొదారా అనే వ్యక్తి ఈ ‘హెడ్ ఆఫ్ ఏ ఉమెన్’పెయింటింగ్ను సొంతం చేసుకున్నారు. అల్జీమర్స్ వ్యాధి సంబంధ పరిశోధనకు కావాల్సిన నిధుల సమీకరణ కోసం రఫెల్ అనే సంస్థ ఈ పెయింటింగ్ను ‘క్రిస్టీస్’అనే వేలంసంస్థకు అప్పగించి అమ్మిపెట్టాలని సూచించింది. లక్కీ డ్రా టికెట్ ధరను 117 డాలర్లు నిర్ణయించారు. మొదారా కొన్న టికెట్కే లక్కీ డ్రా తగలడంతో అతను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ‘‘ఎవరో నన్ను ఆటపట్టించడానికి ఫోన్చేశారనుకున్నా. వేలంసంస్థ ఒకటికి రెండు సార్లు విషయం చెప్పడంతో నాకు ఇది అబద్ధం కాదు అని అర్ధమైంది’’మొదారా తెగ సంతోషం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా టికెట్ల అమ్మకాల ద్వారా రూ.130 కోట్లు సమకూరాయని రఫేల్ సంస్థ తెలిపింది. పికాసో తన ప్రేయసి డోరా మార్ను ఊహించుకుంటూ విభిన్నంగా 1941లో ఈ పెయింటింగ్వేశారు.
జాతీయం
ఈవీఎం బటన్పై పెర్ఫ్యూమ్.. ఎన్నికల సంఘం సీరియస్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలింగ్ బూత్లలో అనూహ్య పరిణామాలకు సంబంధించిన బెదిరిపులు వెలుగుచూస్తున్నాయి. ఓటర్లను భయపెట్టేందుకు, నిఘాను తప్పించుకునేందుకు దుండగులు వేస్తున్న కొత్త ఎత్తుగడలు తెలుసుకున్న ఎన్నికల సంఘం (ఈసీ) అవాక్కవుతోంది. ఈవీఎం బటన్లకు పెర్ఫ్యూమ్ పూయడం, వెబ్కాస్టింగ్ కెమెరాలకు చూయింగ్ గమ్ అంటించడం వంటి చర్యలపై ఈసీ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని, వెంటనే ఆయా బూత్లలో రీపోలింగ్ నిర్వహిస్తామని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.ఓటర్లకు పెర్ఫ్యూమ్ బెదిరింపులుఓటర్లను ప్రభావితం చేసేందుకు కొందరు అగంతకులు దారుణమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. ‘మీరు ఏ పార్టీకి ఓటు వేశారో మాకు ఇట్టే తెలిసిపోతుంది, ఎందుకంటే ఈవీఎం బటన్లపై మేము పెర్ఫ్యూమ్ పూస్తాం’ అంటూ ఓటర్లను భయాందోళనలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల్లో రికార్డింగ్ జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలకు చూయింగ్ గమ్ అంటిస్తూ, నిఘా వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాలపై దృష్టి సారించిన ఎన్నికల సంఘంఓటర్లను బెదిరించినా, నిఘా వ్యవస్థను ట్యాంపరింగ్ చేసినా రీపోలింగ్ తప్పదని స్పష్టం చేసింది.విద్యుత్ కోతలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లుపోలింగ్ సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) మనోజ్ అగర్వాల్ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. పోలింగ్ సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా జనరేటర్లను సైతం సిద్ధం చేస్తున్నారు. నెట్వర్క్ సమస్యలు ఉన్న డార్జిలింగ్, కాలింపాంగ్ సహా 642 'షాడో జోన్ల'లో వెబ్కాస్టింగ్ ఆగకుండా టెలికాం ఆపరేటర్ల ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. పోలింగ్కు 7 రోజుల ముందే బూత్లలో కెమెరాల ఏర్పాటు, 2 రోజుల ముందే లైవ్ వెబ్కాస్టింగ్ ప్రారంభం కానుంది.అడుగడుగునా భారీ భద్రతఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 152 నియోజకవర్గాల్లో జరిగే తొలి దశ పోలింగ్ కోసం ఏకంగా 2,404 కేంద్ర బలగాల కంపెనీలను మోహరిస్తున్నారు. అత్యధికంగా ముర్షిదాబాద్లో 316 కంపెనీలు రంగంలోకి దిగుతుండగా.. ఆ తర్వాత తూర్పు మేదినీపూర్ (273), పశ్చిమ మేదినీపూర్ (272) జిల్లాల్లో భారీగా బలగాలను నియమించారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సాయుధులైన కేంద్ర బలగాలతో పాటు లాఠీలు ధరించిన రాష్ట్ర పోలీసు సిబ్బంది అప్రమత్తంగా కాపలా ఉండనున్నారు.ఇది కూడా చదవండి: లష్కరే టాప్ కమాండర్పై దాడి.. పరిస్థితి విషమం
ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువకుడు, 40ఏళ్ల వితంతువు చేసిన పని నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సోషల్మీడియా పరిచయం పెళ్లికి దారి తీసింది. మరి వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? నెటిజన్లు ఏమంటున్నారు? సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ఉదంతం గురించి తెలుసుకుందాంఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. 'రీల్స్' చాటింగ్ ద్వారా వీరి పరచయం కాస్తా ప్రణయంగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి జీవించాలని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇరు కుటుంబ సహ్యులకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా, రహస్యంగా, గుడిలో పెళ్లి చేసుకున్నారు.కలిసి జీవితం మొదలుపెట్టారు. చివరికి ఈ విషయం అబ్బాయి తల్లికి తెలిసింది. ఆగ్రాలోని మహిళ ఇంట్లో ఇద్దరినీ గుర్తించారు. కానీ కుటుంబ సభ్యులు ఈ యువకుడిని ఇంట్లో ఉంచుకోవడానికి నిరాకరించారు.ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్దీనిపై నెటిజనులలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఇది నిజమైన ప్రేమా లేక కేవలం తాత్కాలిక ఆకర్షణా? 19 ఏళ్ల వయసు వ్యత్యాసం, రహస్య వివాహం ఎంతవరకు నిలబడుతుంది అని కొందరు ప్రశ్నించగా, కుటుంబ మద్దతు లేకుండా ఇంత పెద్ద అడుగు వేయడం కష్టమే, అని ఒకరు వర్చువల్ చాటింగ్, రీల్స్ను చూసి నిజజీవితంలో నిజమని నమ్మితే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయని కొందరు వ్యాఖ్యానించారు. ఇన్స్టాలో పరిచయం అయిన ఒక మహిళ కోసం తన కుటుంబాన్ని, ఇంటిని త్యాగం చేశాడు. సోషల్ మీడియాలో కలిసిన ఒక అపరిచితుడి కోసం ఏ అబ్బాయి లేదా అమ్మాయైనా తమ తల్లిదండ్రులను, విలువలను పణంగా పెట్టడం పచ్చి అవివేకం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎంత దూరమైనా వెళతాయి అనేందుకు ఈ ఘటనే నిదర్శనం అని మరికొందరు వ్యాఖ్యానించారు ఇద్దరూ చట్టపరంగా వయోజనులే, కాబట్టి వారి వివాహం చట్టబద్ధమే. ఎలాంటి కష్టనష్టాలొచ్చినా వారే భరిస్తారు. కానీ వీరి సంబంధం కలకాలం నిలబడాలంటే అధిక భావోద్వేగ పరిపక్వత, బలమైన విశ్వాసం అవసరమని నిపుణులు చెబుతున్న మాట.ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!
డీలిమిటేషన్ బిల్లులపై చర్చకు లైన్ క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: 131 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్సభలో గురువారం ఓటింగ్ జరిగింది. డీలిమిటేషన్ బిల్లులపై చర్చకు విపక్షాలు డివిజన్ కోరాయి. అందుకు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. సభలో ఉన్న మొత్తం 333 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొన్నారు. అనుకూలంగా 207, వ్యతిరేకంగా 126 మంది ఓటు వేశారు. మరో 86 మంది సభకు హాజరే కాలేదు. దీంతో డీలిమిటేషన్ బిల్లులపై సభలో చర్చకు మార్గం సుగమమైంది. అంతకు ముందు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాక.. మూడు కీలక బిల్లులను లోక్సభలో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘావాల్, అమిత్ షాలు ప్రవేశపెట్టారు. అయితే.. రాజ్యాంగ విరుద్ధంగా 131 సవరణ బిల్లు తీసుకొచ్చారని.. తక్షణమే దానిని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లుపై చర్చకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ డివిజన్ కోరగా.. చివరకు అత్యధిక ఓట్లు చర్చకు అనుకూలంగా పడ్డాయి.చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్సభ సీట్లను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు.. అలాగే లోక్సభ- అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు ఉన్నాయి.
వింత ప్రచారాలు: జిలేబీలు వేస్తూ.. గడ్డాలు గీస్తూ..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. కేవలం రాజకీయ విమర్శలు, సవాళ్లతోనే కాకుండా, ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు అనుసరిస్తున్న వినూత్న వ్యూహాలు ఇప్పుడు బెంగాల్ వీధుల్లో హాట్ టాపిక్గా మారాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న పోలింగ్ కోసం ప్రధాన పార్టీలైన టీఎంసీ, బీజేపీ అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు వింత విన్యాసాలతో ప్రజల ముందుకు వస్తున్నారు.బన్స్బేరియాలో ‘స్వీట్’ పాలిటిక్స్సప్తగ్రామ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి స్వరాజ్ ఘోష్ తనదైన శైలిలో ప్రచార బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. బన్స్బేరియాలో ప్రచారంలో ఉన్న ఆయన అకస్మాత్తుగా ఓ స్థానిక స్వీట్ షాపులోకి వెళ్లారు. అక్కడ హల్వాయి అవతారమెత్తి వేడి వేడి నూనెలో జిలేబీలు వేయడం, రసగుల్లాలను తయారు చేయడం మొదలుపెట్టారు. తనకు పన్నీరుతో స్వీట్లు చేయడం బాగా తెలుసని, ఫలితాలు వెలువడే మే 4వ తేదీన తాను గెలిచినా, ఓడినా తన ప్రత్యర్థులకు కూడా ఈ రసగుల్లాలు తినిపిస్తానని ఆయన ప్రకటించడం విశేషం.చేపతో చెక్ పెట్టిన బీజేపీ అభ్యర్థిమరోవైపు బిధాన్నగర్ బీజేపీ అభ్యర్థి శారద్వత్ ముఖోపాధ్యాయ్ ప్రచారం చర్చనీయాంశమైంది. బెంగాలీల ఆహారపు అలవాట్లపై బీజేపీ ఆంక్షలు విధిస్తుందన్న మమతా బెనర్జీ విమర్శలకు కౌంటర్గా, ఆయన ఏకంగా ఒక పెద్ద చేపను చేతితో పట్టుకుని ప్రచారం నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా బెంగాలీలు తమకు ఇష్టమైన చేపల కూరను ఆస్వాదించవచ్చని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు.గృహిణులతో కలిసి రొట్టెలు.. ఉట్టి కొట్టే వేడుకలుఅధికార టీఎంసీ అభ్యర్థులు కూడా ప్రజలతో మమేకం కావడంలో వెనకడుగు వేయడం లేదు. పుర్సురాయ్ టీఎంసీ అభ్యర్థి పార్థా హజారీ ఒక ఇంటికి వెళ్లి కట్టెల పొయ్యిపై గృహిణి చేస్తున్న రొట్టెలను స్వయంగా కాల్చారు. అలాగే, బీర్భూమ్ జిల్లాలో టీఎంసీ అభ్యర్థి నరేశ్ చంద్ర బౌరీ ఈద్ సందర్భంగా జరిగిన ‘హాండీ ఫోడ్’ (ఉట్టి కొట్టే) కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని ఆయన కుండను పగలగొట్టిన తీరు ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది.బార్బర్గా ఎమ్మెల్యే.. యాగంలో కమ్యూనిస్ట్ నేతప్రచార పర్వం పతాక స్థాయికి చేరడంతో అభ్యర్థులు తమ ఇమేజ్ను పక్కన పెట్టి సామాన్యుల్లో కలిసిపోతున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనూప్ కుమార్ సాహా ఏకంగా ఓ గ్రామస్థుడికి గడ్డం గీసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇక కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఎం) అభ్యర్థి మీనాక్షి ముఖర్జీ ఉత్తరపరాలో ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొని తనదైన శైలిలో అక్కడున్నవారికి ఆకట్టుకున్నారు. మరోవైపు, సీనియర్ నేత సువేందు అధికారి ప్రచారం ముగిసిన తర్వాత ఒక సాధారణ ఓటరు ఇంట్లో మధ్యాహ్న భోజనం చేసి తన సామాన్య జీవితాన్ని చాటుకున్నారు. వంట చేయడం, గడ్డం గీయడం, మసాలా దినుసులు నూరడం, రైతుల పక్కన పొలంలో పనిచేయడం వంటి రోజువారీ పనులతో అభ్యర్థులు సరికొత్త ప్రచార పర్వాన్ని సృష్టించారు. ఓటర్ల మదిలో చెరగని ముద్ర వేసేందుకు సాగుతున్న ఈ 'వినూత్న యుద్ధం'లో చివరకు ఎవరిని విజయం వరిస్తుందో తెలియాలంటే మే 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇది కూడా చదవండి: ‘ఇంతకు తెగిస్తారా?’.. నిర్మలపై మమత ఫైర్
ఎన్ఆర్ఐ
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు)
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’
అల్ఫారెట్టా, జార్జియా: స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి-2026’ అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు.ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. నాలుగేళ్ల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ(యూఎస్ఏ) సేవా సంస్థలకు అందజేయనున్నారు.ఈ వేడుకల్లో బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి (శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రతినిధులు), గిరిధర్ కొటగిరి (ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు), జ్యోత్స్న పాలకుర్తి (గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ చైర్మన్), రమణ గంద్ర (గేట్స్ అధ్యక్షులు), సునీత పోట్నూరు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు), ఆది శ్రీనివాసన్ (ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు), శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ (ప్రెసిడెంట్ అండ్ సీఈఓ), జనార్ధన్ పన్నెల (శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధి) పాల్గొన్నారు.
క్రైమ్
షాకింగ్ : కోతిని తరమబోయి.. సజీవ దహనం!
మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్లో విషాదం చోటు చేసుకుంది. కోతులను తరమబోయి ఒక రిసార్ట్ ఉద్యోగి మరణించిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. విద్యుత్ షాక్తో అక్కడి కక్కడే మరణించాడు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పోలీసుల కథనం ప్రకారం, ఖజురహో రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక రిసార్ట్ పైకప్పుపైకి కోతి వచ్చింది. దీంతో ఇనుప రాడ్తో కోతిని తరమడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో కోతిని భయపెట్టి, దాన్ని తరిమికొట్టడానికి రాడ్ను పైకి ఎత్తినప్పుడు, అది రిసార్ట్ పైకప్పుపై ఉన్న హై-వోల్టేజ్ విద్యుత్ తీగకు తగిలింది. 33 kV హై-టెన్షన్ తీగ కావడంతో తీవ్రమైన విద్యుదాఘాతానికి రాను రైక్వార్ చనిపోయాడు. ఖజురహో నివాసి అయిన రాను ఐదు రోజుల క్రితమే ఆ రిసార్ట్లో చేరాడు.బమితా పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. రిసార్ట్ పైకప్పుకు సమీపంలో హై-టెన్షన్ లైన్ ఉండటం నిబంధనలను ఉల్లంఘించిందా లేదా ఈ సంఘటన రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే దానిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని బమితా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ వాల్మీకి చౌబే తెలిపారు. ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్An employee of the Pradeep Raikwar Hotel in Bamitha village, Chhatarpur district, Madhya Pradesh, India, lost his life instantly after being electrocuted by a 33 kV power line while attempting to drive a monkey away from the hotel grounds with an iron pipe. pic.twitter.com/W1J5IqOdfj— T_CAS videos (@tecas2000) April 15, 2026 రిసార్ట్ యజమాని జయ్ తివారీ మాట్లాడుతూ, కోతిని తరిమికొట్టే ప్రయత్నంలో ఈ విషాద సంఘటన జరిగింది. రిసార్ట్ పైనుంచి నేరుగా 33 కేవీ రైల్వే లైన్ వెళుతుంది. దానిని తరలించడానికి అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, రైల్వే అధికారులు తొలగించడానికి నిరాకరించారు. మృతుడికిను రైక్వార్కు ఇద్దరు చిన్న పిల్లలన్నారని తెలిపారు.
టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్లో జరిగిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తు కొత్త మలుపు తీసుకుంది. అరెస్టు అయిన ఉద్యోగులలో ఒకరి భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ కేసులో ప్రధాన నిందితుడు డానిష్ షేక్ భార్య ఫిర్యాదుదారులలో ఒక మహిళకు, తన భర్తకు మధ్య ఉన్న చెడిపోవడంతోనే ఈ పరిమాణానికి దారి తీసిందని, అదే ఇతరుల జీవితాలను నాశనం చేసిందని ఆరోపించింది ఈ కేసులో తన భర్తతో సహా ఇతర పురుషులందరూ నిర్దోషులని, వేర్వేరు సమస్యలు, కేసులను కలిపివేశారని ఆమె ఆరోపించింది.నిందితుడి భార్య సంచలన ఆరోపణలుకేవలం వారి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం విఫలం కావడంవల్ల తలెత్తిన వివాదమని ఆమె పేర్కొంది. డానిష్ షేక్, బాధితురాలిగా చెబుతున్న మహిళకు మధ్య సంబంధం ఆఫీసులో అందరికీ తెలుసంటూ ఆమెపై పలు ఆరోపణలు చేసింది. ఆ మహిళ తన భర్త (నిందితుడు) కోసం గంటల తరబడి వేచి చూసేదని, ఆమె అతనిపై ఇష్టంతోనే తన ఆహార్యాన్ని, అలవాట్లను మార్చుకుందని ఆరోపించారు.ఉపవాసాలు చేయడం, దుస్తులు మార్చుకోవడం లాంటి ప నులెన్నో చేసిన తన భర్తకు ఆకర్షించిదని తెలిపింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కలత చెందారని ఆమె పేర్కొంది. ఆ సంబంధం ముగిసిన తర్వాత, ఫిర్యాదుదారురాలి తల్లిదండ్రులు కొంతమంది రాజకీయ నాయకులను సంప్రదించి, ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని ఇతర పురుషుల పేర్లను కూడా చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆమెను ఒప్పించారని ఆమె ఆరోపించింది.కేసు పూర్వాపరాలు, అరెస్టుల పర్వంపెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తన సహోద్యోగి ఒకరు తనతో సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళా ఉద్యోగి ఆరోపించడంతో ఈ కేసు ప్రారంభమైంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, ఇలాంటి అనుభవాలే ఎదురైన మరో ఏడుగురు మహిళలు ముందుకు రావడంతో ఈ కేసు మరింత ముదిరింది.మొత్తం 8 మంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో, 8 మంది ఉద్యోగులపై మొత్తం 9 FIRలు నమోదయ్యాయి.ఇప్పటివరకు 7 గురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్, రజా మెమోన్, షారూఖ్ ఖురేషీ, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీ ,ఒక మహిళా ఆపరేషన్స్ మేనేజర్ ఉన్నారు. ప్రధానంగా రేప్, మానసిక , లైంగిక వేధింపులతో మత మార్పిడికి ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు సంచలనం రేపాయి. అలాగే ఫిర్యాదులను పట్టించుకోలేదనే కారణంతో HR ఎగ్జిక్యూటివ్ నిదా ఖాన్పై కూడా కేసు నమోదైంది.ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులందరినీ టీసీఎస్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ COO ఆర్తి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సమగ్ర అంతర్గత విచారణకు ఆదేశించారు. ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!సిట్ విచారణఈ కేసు తీవ్రత దృష్ట్యా నాసిక్ పోలీసులు ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. కేవలం ఒక మహిళా ఫిర్యాదుతో మొదలైన ఈ కేసు, విచారణ కొనసాగుతున్న కొద్దీ మరికొంతమంది బాధితులు ముందుకు రావడంతో మరింత విస్తృతమైంది.ఈ కేసులో ఒకవైపు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు, మరోవైపు వ్యక్తిగత కక్షలనే వాదనలు వినిపిస్తుండటంతో సిట్ విచారణ కీలకంగా మారింది.ఇదీ చదవండి: ఎల్పీజీ యథాస్థితికి రావాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?నిదా ఖాన్పై ఆరోపణలుబాధితుల నుండి వచ్చిన 70కి పైగా ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా, హెచ్ఆర్ మేనేజర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) వాటిని పట్టించుకోలేదని సిట్ వెల్లడించింది. కార్యాలయంలోని లైంగిక వేధింపుల నివారణ (పోష్) కమిటీలో సభ్యురాలిగా ఉన్నప్పటికీ, ఫిర్యాదులను పక్కన పెట్టి, నిందితులను రక్షించడానికి ప్రయత్నించిన హెచ్ఆర్ మేనేజర్ నిదాఖాన్ను పోలీసులు కీలక 'సూత్రధారి'గా గుర్తించారు. నిందితుల మధ్య జరిగిన సుమారు 78 అనుమానాస్పద కాల్ రికార్డులు, ఈమెయిళ్లు, చాట్ సంభాషణలతో సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆర్థిక లావా దేవీలు జరిగినట్లు కూడా అనుమానిస్తున్నారు.
గూగుల్ పేలో ‘పాకెట్మనీ’ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ..!
పెద్దపల్లిరూరల్: సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తులు వేస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నిత్యజీవితంలో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గూగుల్ పే ద్వారా చెల్లింపులు చేసేందుకు యాప్ ఓపెన్ చేయగానే తొలుత ‘పాకెట్మనీ’ అనే సింబల్ కనిపిస్తోంది. దానిని నొక్కితే బ్యాంకు ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతున్నాయట. డిజిటల్ పేమేంట్ చేసే వారంతా తమకు అవసరం లేనియాప్, లింకుల జోలికి వెళ్లక పోవడమే మంచిదని పోలీసు అధికారులు పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఔటర్పై రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా: ఔటర్ రింగ్రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి వచి్చన కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తితోపాటు రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ హనుమకొండకు చెందిన వేద ప్రకాష్ రెడ్డి (37) భార్య హిమబిందు, కుమారుడు అర్జున్ (2)తోపాటు బ«ంధువైన దుర్గాప్రసాద్రెడ్డి, అతని భార్య శ్రీజతో కలిసి మంగళవారం హనుమకొండ నుంచి కారులో హైదరాబాద్లోని బొంగ్లూర్కు బయలుదేరారు. ఈ క్రమంలో ఘట్కేసర్లో ఔటర్ రింగ్రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న వీరి కారు సాయంత్రం 4గంటల సమయంలో పెద్దఅంబర్పేట టోల్ గేటు దాటి కొంత దూరంగా వెళ్లగానే అప్పటికే డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి ఢీ కొట్టారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న వేద ప్రకాశ్రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, అతని కుమారుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య హిమబిందు, బంధువైన దుర్గాప్రసాద్రెడ్డి, శ్రీజకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సంతో‹Ùనగర్లోని డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
వీడియోలు
"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!
Breaking News: పూడి శ్రీహరికి బెయిల్
BC నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక సమావేశం
Delhi Airport: ఢీకొన్న రెండు విమానాలు
వడదెబ్బకు విరుగుడు! ఈ 3 తింటే సేఫ్ .. బాడీని కూల్ చేసే ఫుడ్స్
హీరోలు అంత ఫిట్ గా ఎలా ఉంటున్నారో తెలుసా? వీరి డైట్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు!
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు వల్లభనేని వంశీ ఫిర్యాదు
మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయం చేయొద్దు
LIVE:లష్కరే టాప్ కమాండర్పై కాల్పులు...
YSRCP శ్రీహరి అరెస్ట్, కుప్పం పోలీసుల తీరుపై అనుమానాలు


