వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి: సజ్జల
తాడేపల్లి: వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించి కీలక సూచనలు చేశారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంపై సమీక్ష జరిపారు. రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.ప్రజాసంఘాలు, వివిధ వర్గాల ప్రతినిధులు, కలిసివచ్చే రాజకీయ పార్టీలను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. డీఎస్సీ అంశంపై పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరింతగా తీసుకెళ్లాలి. దీనిపై పార్టీ కమిటీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలపై తీర్మానాలు చేసి వాటిని డిజిటల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి. ఇంటింటి సర్వే సమయంలో పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. సర్వే ప్రారంభమయ్యేలోగా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. జూన్ 1న యువజన విభాగం ఆధ్వర్యంలో డీఎస్సీ అంశంపై చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి’’ అని చెప్పారు.
9 రోజుల్లో రూ. 40 కోట్ల కలెక్షన్స్.. మరాఠీ సినిమా ఊచకోత!
ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్స్ ఎంత దారుణంగా ఉంటున్నాయో అందరికి తెలిసిందే. కంటెంట్ సంగతి ఎలా ఉన్న సరే.. రిలీజ్ ముందు వరకు‘ రికార్డులు బద్దలు కొట్టడం పక్కా’ అంటూ ప్రచారం చేసి మరీ ప్రేక్షకులను థియేటర్స్కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓ చిన్న సినిమా మాత్రం ఎలాంటి చడీచప్పుడు లేకుండా వచ్చి.. బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. కేవలం 9 రోజుల్లోనే రూ. 40 కోట్లు వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సృష్టించింది. అదే మరాఠి చిత్రం ‘దేవూల్ బంద్ 2’.స్నేహల్ తార్డే, మోహన్ జోషిక కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ తార్డే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. మౌత్ టాక్తోనే మొదటి వీకెండ్లో రూ. 5.90 కోట్లు వసూలు చేసింది. రిలీజ్ అయిన 9 రోజుల్లోనే రూ. 40.80 కోట్లు(గ్రాస్) వసూలు చేసి, అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 మరాఠి చిత్రాల్లో ఒక్కటిగా నిలిచింది.దేవూల్ బంద్ 2 కథేంటంటే.. మహిళ రైతు సంగీత పేగుడే(స్నేహల్)కు వరుస కష్టాలు వస్తుంటాయి. తన బాధలను తీర్చమని నిత్యం దేవుడిని వేడుకుంటుంది. అయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీంతో ఒకరోజు తీవ్ర అసహనానికి గురై పక్కనే ఉన్న పుట్టపై రాయి విసిరేస్తుంది. వెంటనే అందులో నుంచి శ్రీస్వామి సమర్థ్ దర్శనమిస్తాడు. ఆమెతో కలిసి గ్రామానికి కూడా వెళ్తాడు. దేవుడు రాకతో సంగీత జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి? అనేదే ఈ సినిమా కథ. ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు.#DeoolBand2 Movie 9 Days Box-office update :🔹Maharashtra : 39.77 Cr🔹Goa : 45 Lakhs🔹Karnataka : 35 Lakhs🔹Gujarat : 21 Lakhs🔹Rest : 2 LakhsTotal Domestic : 40.80 CroresTotal India Gross — 40.80 CroresTotal India Net — 34.37 CroresDistributor Share… pic.twitter.com/OGnzHdwAhb— Jerin Georgekutty (@jerinGeorgekut2) May 30, 2026
అలాగైతే మేం ఎన్నికల్లో పోటీ చేయం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మోటర్లకు మీటర్లు పెట్టినా.. రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేం ఎన్నికల్లో పోటీ చేయం.. ఒక వేళ మోటర్లకు మీటర్లు పెట్టకపోయినా.. ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా? అంటూ ఆ పార్టీకి సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిచేందుకే రైతు డిస్కం. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కమ్కు కనెక్ట్ చేస్తున్నాం. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఎక్కడాలేని విధంగా రైతు డిస్కంను ఏర్పాటు చేశాం. రైతు డిస్కం ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రభుత్వానికి అవసరాన్నిబట్టి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి’’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు.‘‘కిషన్రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. వడ్లు కొనంది మీరు.. రైతు పండించిన ప్రతీ గింజను మా ప్రభుత్వం కొంటుంది. మేం కొంటున్నది ఎంత.. కేంద్రం కొనేది ఎంత?. కేంద్రం ఎంఎస్పీ నిర్ణయించింది కానీ ఒక్క గింజనైనా కొంటున్నారా?. వరి, జొన్న, మొక్కజొన్నలు మొత్తం మా ప్రభుత్వం కొంటుంది. మేం కొన్న మొత్తం పంట కేంద్రం కొనాలి. కేంద్రం కొనకపోవడం వల్లే రాష్ట్రంలో రైతు గోస పడుతున్నాడు. కేంద్రం కొనకపోతే బస్సులు వేసుకుని వెళ్లిన వాళ్ల దగ్గరికే ట్రాక్టర్లు వేసుకుని వెళతాం. జల వివాదాలను రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు. కానీ తుమ్మిడిహట్టి కోసం కలిసి మాట్లాడటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరినా స్పందించడంలేదు’’ అంటూ రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు.
విషాదం: తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతైన విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంత్రాలయంలోని బంంధువుల ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి పూజకు బంధువులు హాజరయ్యారు. పూజ అయిపోయిన తర్వాత సమీపంలో ఉన్న తుంగభద్ర నదికి వెళ్లారు వారు. వారిలో ఆరుగురు ఈత కొట్టడం కోసం దిగగా, వారిలో ఆదోనికి చెందిన అపర్ణ ముందుగానే సురక్షితంగా బయటకొచ్చేసింది. మిగతా ఐదుగురు నదిలో చిక్కుకుపోయి గల్లంతయ్యారు. అక్కడ నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయలేక పోవడంతో ప్రమాదం చోటు చేసుకుని ఐదుగురు గల్లంతయ్యారు. దాంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. గల్లంతైన వారిలో ఇద్దకు హైదరాబాద్కు చెందిన యువన్ చంద్ర, సతీష్లుగా గుర్తించగా మరో ఇద్దరిని మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర, ధనులుగా గుర్తించారు, ఉరవకొండకు చెందిన సంధ్య అనే యువతి కూడా ఉంది. వీరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ధను మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు, మత్య్సకారులు గాలిస్తున్నారు.
ఆసీస్ కొంపముంచిన పాక్ సంచలనం.. 4 దశాబ్దాల రికార్డు బద్దలు
విమానం ఎగిరితే.. కోట్లాది రూపాయలు ఇలా కురుస్తాయ్?
డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాం
ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి గ్లామర్.. చిన్నపిల్లలా యషిక ఆనంద్ పోజులు..!
ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన తెలుగు అమ్మాయి
వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి: సజ్జల
ఏపీ డీఎస్సీ అక్రమాలు.. ఈ ప్రశ్నలకు బదులేదీ?
ఫైనల్కు వాన గండం..! మ్యాచ్ రద్దైతే విజేత ఎవరంటే?
దళపతికి రామ్ చరణ్ అభినందనలు.. వీడియో వైరల్
3 నెలల తర్వాత బీజేపీ గేట్లు తెరిస్తే..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ నగదు పట్టివేత
ఓ కూతురు హీరోయిన్.. మరో కూతురు నిర్మాత
విషసర్పాలకే వణుకు పుట్టించే ధైర్యం.. వైల్డ్ వెంకట్
మన కన్నా, మన పార్టీకన్నా జగన్ గురించే ఎక్కువ మాట్లాడుకున్నామేమోననిపిస్తుంది సార్!
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 16 సినిమాలు
స్వామీ క్షమించండీ! మహానాడు కోసం మిమ్మల్ని కూడా వాడేశారు!
బంగారం ఖరీదవడం లేదు.. కియోసాకి కామెంట్స్
'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్
కోర్టు చెబితే ఇచ్చేయాలా?
కర్ణాటక కాబోయే సీఎం.. కుటుంబం గురించి తెలుసా?
పాతిక వేల సాయం.. ఇప్పుడు దాని విలువ రూ.5 కోట్లు
3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
సౌదీ కొత్త వ్యూహం.. ప్రపంచానికే బిగ్ అలర్ట్
ఎప్స్టెయిన్ సెక్స్స్కాండల్.. స్టాన్ఫోర్డ్ హిస్టరీ! ఇక్కడ డీఎస్సీ స్కాండల్ మిస్టరీ! ఔను సార్ అదే మీ బ్యాచ్!
3,500 ఏళ్ల క్రితం ప్రజల తెలివి.. నేటి టెక్నాలజీకే సవాల్!
టా టా త్రిమూర్తులు!
కూటమిపై ఆధారపడడం ఇష్టం లేకనే ప్లాన్ బీ?
ఈ రాశి వారికి మిత్రుల నుంచి దనలబ్ధి
ఈ వెహికల్ తెచ్చిన లక్ : నెలకు రూ. 45 వేలు
అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్
ఆసీస్ కొంపముంచిన పాక్ సంచలనం.. 4 దశాబ్దాల రికార్డు బద్దలు
విమానం ఎగిరితే.. కోట్లాది రూపాయలు ఇలా కురుస్తాయ్?
డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాం
ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి గ్లామర్.. చిన్నపిల్లలా యషిక ఆనంద్ పోజులు..!
ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన తెలుగు అమ్మాయి
వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి: సజ్జల
ఏపీ డీఎస్సీ అక్రమాలు.. ఈ ప్రశ్నలకు బదులేదీ?
ఫైనల్కు వాన గండం..! మ్యాచ్ రద్దైతే విజేత ఎవరంటే?
దళపతికి రామ్ చరణ్ అభినందనలు.. వీడియో వైరల్
3 నెలల తర్వాత బీజేపీ గేట్లు తెరిస్తే..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ నగదు పట్టివేత
ఓ కూతురు హీరోయిన్.. మరో కూతురు నిర్మాత
విషసర్పాలకే వణుకు పుట్టించే ధైర్యం.. వైల్డ్ వెంకట్
మన కన్నా, మన పార్టీకన్నా జగన్ గురించే ఎక్కువ మాట్లాడుకున్నామేమోననిపిస్తుంది సార్!
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 16 సినిమాలు
స్వామీ క్షమించండీ! మహానాడు కోసం మిమ్మల్ని కూడా వాడేశారు!
బంగారం ఖరీదవడం లేదు.. కియోసాకి కామెంట్స్
'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్
కోర్టు చెబితే ఇచ్చేయాలా?
కర్ణాటక కాబోయే సీఎం.. కుటుంబం గురించి తెలుసా?
పాతిక వేల సాయం.. ఇప్పుడు దాని విలువ రూ.5 కోట్లు
3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
సౌదీ కొత్త వ్యూహం.. ప్రపంచానికే బిగ్ అలర్ట్
ఎప్స్టెయిన్ సెక్స్స్కాండల్.. స్టాన్ఫోర్డ్ హిస్టరీ! ఇక్కడ డీఎస్సీ స్కాండల్ మిస్టరీ! ఔను సార్ అదే మీ బ్యాచ్!
3,500 ఏళ్ల క్రితం ప్రజల తెలివి.. నేటి టెక్నాలజీకే సవాల్!
టా టా త్రిమూర్తులు!
కూటమిపై ఆధారపడడం ఇష్టం లేకనే ప్లాన్ బీ?
ఈ రాశి వారికి మిత్రుల నుంచి దనలబ్ధి
ఈ వెహికల్ తెచ్చిన లక్ : నెలకు రూ. 45 వేలు
అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్
ఫొటోలు
విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)
చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)
ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)
విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్ ఆర్ట్స్ (ఫొటోలు)
సిస్టమ్ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)
హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)
ఫ్యామిలీ ట్రిప్లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)
టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ (ఫొటోలు)
ఎన్టీఆర్ పార్టీకి ఇదేం దుస్థితి? (చిత్రాలు)
సినిమా
చెల్లి ఇంటి కోసం డబ్బు సాయం చేసిన కాజోల్
దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కొంతకాలంగా యూట్యూబ్పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. తన వంటమనిషి దిలీప్తో కలిసి రకరకాల వీడియోలు చేస్తోంది. అతడిని వెంటేసుకుని సెలబ్రిటీల హోంటూర్స్ కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ ఇంటిని సందర్శించింది ఫరా. ముంబైలో ఉన్న ఈ ఇంట్లో అడుగుపెడితే కోల్కతాకు వెళ్లినట్లుగానే ఉందని అబ్బురపడిపోయింది.14 ఏళ్లుగా ముంబైలో..ఇలాంటి ఇల్లు ముంబైలో ఎక్కడా ఉండదని కితాబిచ్చింది. ఇక తనీషా మాట్లాడుతూ.. ఈ ఇంట్లోని సామాను చాలామటుకు తన తల్లి ఇంటి నుంచి వచ్చినవే అని పేర్కొంది. 14 ఏళ్ల క్రితం ముంబైలో అడుగుపెట్టానని, తర్వాత ఇక్కడే సెటిలైపోయానంది. ఈ ఇంటి కోసం మీ అక్క, హీరోయిన్ కాజోల్ ఏమైనా సాయం చేసిందా? అని ఫరా ఆతృతగా అడిగింది. అందుకు తనీషా అవునని బదులిచ్చింది. తను చెక్లపై సంతకం చేసి ఇచ్చేదని, అలా డబ్బు సాయం చేసిందని పేర్కొంది.తెలుగులోనూ..బాలీవుడ్ సెలబ్రిటీలు తనూజ- షోము ముఖర్జీల సంతానమే కాజోల్, తనీషా. తక్కువ కాలంలోనే కాజోల్ స్టార్ హీరోయిన్గా రాణించింది. కానీ, తనీషా ఆ స్టార్డమ్ అందుకోలేకపోయింది. ష్, సర్కార్, వన్ టూ త్రీ, సర్కార్ రాజ్, కోడ్ నేమ్ అబ్దుల్ వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో కంత్రి మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. హిందీ బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొని ఫస్ట్ రన్నరప్గా నిలిచింది.చదవండి: బోల్డ్ వీడియో.. తప్పయిపోయింది, క్షమించండి: నటుడి కూతురు
దారుణ స్థితిలో దాసరి సమాధి.. రంగంలోకి మంచు మనోజ్..!
టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు కోసం హీరో మంచు మనోజ్ ముందుకొచ్చారు. ఆయన సమాధి చుట్టు అడవిలా మారిపోవడంతో రంగంలోకి దిగారు. తన టీమ్తో కలిసి దాసరి సమాధి వద్ద క్లీనింగ్ పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న గీతా ఆర్ట్స్ సంస్థ కూడా తమ టీమ్ను పంపింది. దాసరి వర్ధంతి సందర్భంగా ముళ్ల పొదలను, చెట్లను తొలగించారు. తెలుగు సినిమాకు విశేష సేవలందించిన దిగ్గజ దర్శక, నటుడి సమాధి ఈ స్థితిలో ఉండడంపై సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే చేవేళ్లలోని ఆయన సమాధి చుట్టూ చెట్లు మొలిచి ఉన్నాయని ఓ యాంకర్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేసి, ఎందరికో లైఫ్ ఇచ్చిన దాసరి నారాయణరావు సమాధి ఈ స్థితిలో ఉండటం బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన మంచు మనోజ్ తన టీమ్తో కలిసి సమాధి వద్ద క్లీనింగ్ పనులు చేపట్టారు. ఈ సమాధి పునరుద్ధరణ పనుల్లో గీతా ఆర్ట్స్ సైతం పాల్గొంది. ఇవాళ దాసరి వర్ధంతి కావడంతో ఆయనకు నివాళులర్పించారు మంచు మనోజ్. View this post on Instagram A post shared by gouthaminaidu (@anchor_gouthami) దాసరి సమాధి దుస్థితిపై స్పందించిన మంచు మనోజ్, గీతా ఆర్ట్స్మంచు మనోజ్ అనుచరులు అక్కడికి చేరుకుని క్లీనింగ్ పనులు ప్రారంభించారు. మరోవైపు గీతా ఆర్ట్స్ సంస్థ కూడా వెంటనే రంగంలోకి దిగి, తమ టీమ్ను పంపి సమాధి పునరుద్ధరణ పనులను వేగవంతం చేసింది.. #Dasarinarayana #Manchumanoj pic.twitter.com/07E6iAzTl8— Telugu Stride (@TeluguStride) May 30, 2026
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేస్తుంటాయి. వీటిలో ఆడియన్స్ ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ లాంటి మూవీస్ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగానే ప్రతివారం బోలెడ్ చిత్రాలు, సిరీస్లు రానే వస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.అలీ ఫజల్, సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ కీలక పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'రాఖ్'. ఈ వెబ్ సిరీస్కు ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ను పంచుకున్నారు. ఇందులో ఫజల్ పోలీస్ యూనిఫాంలో కనిపించగా.. అతనిముందు ఓ శవం ఉన్న కొత్త పోస్టర్ను ఈ సిరీస్పై ఆసక్తిని మరింత పెంచేసింది. పాతిపెట్టిన నిజాలు ఎప్పుడూ తిరిగి బయటపడతాయి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.'రాఖ్' అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సిరీస్. ఇద్దరు టీనేజర్లు అదృశ్యం కావడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ సంఘటన ఒక అన్యోన్యమైన కుటుంబాన్ని తీవ్రంగా, మానసిక వేదనకు గురిచేస్తుంది. అంతేకాకుండా మొత్తం నగరాన్ని ఆందోళనకు గురవుతుంది. ఈ కేసును చేధనే లక్ష్యంగా దర్యాప్తు కోణంలో ఈ సిరీస్ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్కు ఆయుష్ త్రివేది డైలాగ్స్ అందించగా.. ఎండెమోల్ షైన్ ఇండియా బ్యానర్పై దీపక్ ధర్, రిషి నేగి, మృణాలిని జైన్, శ్యామ్ రాఠీ నిర్మించారు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)
బోల్డ్ వీడియో.. డబ్బు కోసం కాదు, క్షమించండి: నటుడి కూతురు
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ప్రముఖ నటుడి కూతురు చేస్తున్న పని అలాగే ఉంది. అసలే ఇది డిజిటల్ యుగం. సెలబ్రిటీలు చిన్న పొరపాటు చేస్తే చాలు దాన్ని భూతద్దంలో పెట్టి మరీ ట్రోల్ చేస్తుంటారు. అలాంటిది ఒక వీడియోను కావాలనే సబ్స్క్రిప్షన్స్ మెంబర్స్ కోసం పోస్ట్ చేయడమేంటో, అది వైరల్ అవడంతో తప్పయిందంటూ క్షమాపణలు చెప్పడమేంటో తనకే తెలియాలి! ఇంతకీ ఏం జరిగిందో చూసేద్దాం..బోల్డ్ వీడియోమలయాళ నటుడు కృష్ణ కుమార్కు నలుగురు కూతుర్లు సంతానం. వీరిలో అహానా, ఇషాని కృష్ణలు యాక్టర్స్గా చెలామణీ అవుతున్నారు. దియా, హన్సికలు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లుగా ఫేమస్ అయ్యారు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో డబ్బులు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నవారి కోసం ప్రత్యేకంగా ఫోటోలు, వీడియోలు వదులుతున్నారు. అలా హన్సిక కూడా కాస్త బోల్డ్ వీడియో ఒకటి తన సబ్స్క్రైబర్ల కోసం పోస్ట్ చేసింది. డబ్బు కోసం దిగజారాలా?అది కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోకు ముందు తన ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ధర రూ.299గా ఉంటే ఆ వీడియో తర్వాత రూ.399గా ధర ఫిక్స్ చేసింది. దీంతో డబ్బు కోసం ఇంతకు దిగజారాలా? ఇలాంటి వీడియోలు పెట్టాలా? అని జనం తిట్లదండకం అందుకున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న హన్సిక.. పొరపాటు జరిగింది, క్షమించండి అంటూ ఓ లేఖ వదిలింది. 'ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఫీచర్ కింద మూడు వారాల క్రితం ఓ వీడియో షేర్ చేశాను. బుద్ధి లేక, నిర్లక్ష్యంగా ఆ పని చేశాను. అందుకు నెల రోజులుగా బాధపడుతున్నాను.ఐదు నిమిషాల్లో డిలీట్.. అయినా!అసలు ఆ వీడియో ఎందుకు పోస్ట్ చేశానో నాకే అర్థం కావడం లేదు. తప్పు జరిగిపోయింది. కేవలం పోస్ట్ చేసిన ఐదు నిమిషాల్లోనే దాన్ని డిలీట్ చేశాను. కానీ, అప్పటికే కొందరు దాన్ని రికార్డు చేసి వైరల్ చేశారు. డబ్బు కోసం, పబ్లిసిటీ కోసం ఇలా చేశానని కొందరు దారుణంగా మాట్లాడుతున్నారు. నాకు నిజంగా అలాంటి ఉద్దేశం లేదు. 20 ఏళ్లకే నా బాగోగులు నేను చూసుకునేంత సంపాదించడం మొదలుపెట్టాను. చాలా భయపడ్డా..ఎన్నో ఏళ్లుగా మీరందరూ నాపై, నా కుటుంబంపై ప్రేమాభిమానాలు కురిపిస్తూనే ఉన్నారు. కాబట్టి కొత్తగా నేను పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన అవసరం లేదు. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే.. నేను, నా సోదరి ఏడాదికాలంగా ఓ మ్యూజిక్ వీడియో కోసం ఎంతగానో కష్టపడ్డాం. అందులో నేను యాక్ట్ చేశాను. ఈ వివాదం చెలరేగిన మూడు రోజులకే ఆ పాట రిలీజైంది. నా వల్ల తనకు ఇబ్బంది కలుగుతుందేమోనని చాలా భయపడ్డాను. అదృష్టవశాత్తూ అలాంటిదేం జరగలేదు.భరించలేకున్నా..ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అయింది నేను, నా కుటుంబం. దీనికితోడు ఆన్లైన్లో వేధింపులు, విద్వేషపూరిత కామెంట్లు మరింత బాధిస్తున్నాయి. విమర్శించకూడదని నేను అనడం లేదు, కానీ ఆ విమర్శలు హద్దులు దాటుతున్నాయి. వారి కంటెంట్ కోసం నన్ను వాడుకుంటున్నారు. నా బాధ వారికి సంతోషంగా ఉంది. మనుషులు అవతలివారిని ఇట్టే ద్వేషిస్తారని ఈ సంఘటన వల్లే తెలిసొచ్చింది. పూర్తిగా ఎత్తేయాలనుకున్నా..నేను సింపతీ కోసం ఇదంతా చెప్పడం లేదు. నా మనసులో భారాన్ని దించుకోవడానికి చెప్తున్నాను. మరి సబ్స్క్రిప్షన్ ధర ఎందుకు పెంచావని అడుగుతున్నారు. నిజానికి ఈ సబ్స్క్రిప్షన్ను పూర్తిగా ఎత్తేయాలనుకున్నాను. కానీ, దానివల్ల ఈ వివాదం మరింత ముదురుతుందనిపించింది. ఈ సమయంలో కొత్త సబ్స్క్రైబర్లను తగ్గించాలన్న ఉద్దేశంతోనే ధర పెంచాను.క్షమించండిఈ వివాదం తర్వాత సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని సామాజిక సేవకు వినియోగిస్తాను. అందులో ఒక్క రూపాయి కూడా నేను వాడను. నేను చేసిన పిచ్చి పని వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఈ సమయంలో నాకు అండగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు థాంక్స్' అని హన్సిక రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Hansika Krishna 🐣 (@hansubeeeey) చదవండి: నాన్న కొడతాడేమోనని భయంతో చెప్పలేదు: రామ్చరణ్
క్రీడలు
సూర్యకుమార్ కీలక నిర్ణయం.. ఆఖరి నిమిషంలో?
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. సారథిగా భారత్కు పొట్టి ప్రపంచకప్ను అందించిన సూర్యకుమార్.. వ్యక్తిగత ప్రదర్శన పరంగా మాత్రం విఫలమవుతున్నాడు. ఐపీఎల్-2026లోనూ సూర్య అదే తీరును కనబరిచాడు. ఈ ముంబై ఆటగాడు 13 మ్యాచ్లలో 20.77 సగటుతో కేవలం 270 పరుగులు మాత్రమే చేశాడు.దీంతో భారత జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. కెప్టెన్గానే కాకుండా పూర్తిగా టీ20 జట్టు నుంచే అతడిని పక్కన పెట్టాలనే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు సమాచారం.అయితే సూర్యకు తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి ముంబై టీ20 లీగ్ రూపంలో మరో అవకాశం లభించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టీ20 టోర్నీలో ట్రయంఫ్ నైట్ ముంబై నార్త్ ఈస్ట్కు సారథ్యం వహించనున్నాడు.అయితే అంతకంటే ముందు శనివారం(మే 30)న ఉగాండాతో జరగనున్న మ్యాచ్లో ట్రయంఫ్ నైట్ జట్టు తరపున సూర్యకుమార్ బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సూర్య మాత్రం ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. స్కై గైర్హాజరీలో అఖిల్ హెర్వాడ్కర్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.కాగా ఉగాండా జట్టు ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా వారు 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు ఆడుతున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ను ఉగాండా సొంతం చేసుకుంది. అనంతరం ముంబై టీ20 లీగ్లోని నాలుగు వేర్వేరు జట్లతో ఉగాండా టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలోనే డివై పాటిల్ స్టేడియం వేదికగా ఉగాండా, ట్రయంఫ్ నైట్ జట్లు తలపడతున్నాయి.చదవండి: IPL 2027: రోహిత్ శర్మ వద్దు.. ముంబై కెప్టెన్గా అతడే సరైనోడు
అరుదైన ఫీట్.. టీమిండియా సరసన పాకిస్తాన్
రావల్పిండి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఆసీస్తో జరుగుతున్న తొలి వన్డే పాకిస్తాన్కు 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో వన్డే క్రికెట్లో వెయ్యి మ్యాచ్లు పూర్తి చేసుకున్న మూడో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. 1075 వన్డే మ్యాచ్లతో భారత్ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, 1020 మ్యాచ్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఈ రెండు దేశాల సరసన పాకిస్తాన్ చోటు సంపాదించింది. ఇక 1000వ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా పాక్ కెప్టెన్ షాహిన్ అఫ్రిది ఆస్ట్రేలియా స్టాండ్ ఇన్ కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ చేతుల మీదుగ2ఆ ప్రత్యేక మెమొంటో అందుకున్నాడు. ఇక పాక్ ఆడుతున్న 1000వ మ్యాచ్ ద్వారా అరాఫత్ మిన్హాస్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయడం మరో విశేషం. వెయ్యి వన్డేలు ఆడిన మూడు జట్లు విజయాల శాతాన్ని పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా (1019 మ్యాచ్ల్లో 617 విజయాలు, 52.7 శాతం) తొలి స్థానంలో ఉండగా, టీమిండియా (1075 మ్యాచ్ల్లో 571 విజయాలు), పాకిస్తాన్ (999 మ్యాచ్ల్లో 527 విజయాలు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 23 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (49), మాట్ రెన్షా (21) పరుగులతో ఆడుతున్నారు. Josh Inglis presented a souvenir to Shaheen Afridi on Pakistan’s 1000th ODI match. ❤️ - A lovely gesture by Inglis. 🇵🇰🇦🇺pic.twitter.com/T1SzeQH8PV— Sheri. (@CallMeSheri1_) May 30, 2026చదవండి: వినేశ్కు షాక్.. ఆసియా క్రీడల రేసు నుంచి ఔట్!
వినేశ్కు షాక్.. ఆసియా క్రీడల రేసు నుంచి ఔట్!
ఆసియా గేమ్స్లో పాల్గొనాలన్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కల చెదిరింది. ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్కు సంబంధించి నిర్వహిస్తున్న పోటీల్లో వినేశ్ సెమీస్లో ఓటమిపాలయ్యింది. శనివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్స్లో వినేశ్ ఫొగాట్ 4-6 తేడాతో మీనాక్షి గోయత్ చేతిలో పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో వినేశ్ ఫొగాట్ ఆసియా క్రీడల 2026 ఎంపిక ట్రయల్స్ నుంచి నిష్క్రమించడంతో పాటు క్రీడలకు దూరమైంది. ట్రయల్స్లో బాగా రాణించి.. అంతర్జా తీయ స్థాయిలో పునరాగమనం చేయాలన్న వినేశ్ ఆశలకు, అలాగే ఈ ఏడాది చివర్లో జపాన్లోని ఐచి నగోయాలో జరగనున్న ఆసియా క్రీడలలో స్థానం సంపాదించుకోవాలన్న ఆమె అవకాశాలకు బ్రేక్ పడినట్లయింది. గత మ్యాచ్లో నిషుతో హోరాహోరీగా జరిగిన బౌట్లో వినేశ్ తనకున్న ఎన్నో ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించి సెమీఫైనల్స్కు చేరుకున్నారు. ఫైనల్ ముంగిట ఆమెకు మీనాక్షి చేతిలో పరాజయం ఎదురైంది. ఆసియా క్రీడల ట్రయల్స్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కిన వినేశ్ అక్కడి పోరాటంలో విజయం సాధించినప్పటికీ, తాజాగా సెమీస్లో ఓటమి పాలవ్వడంతో రెజ్లింగ్లో మాత్రం పరాజయం తప్పలేదు. ట్రయల్స్లో ఓటమి అనంతరం వినేశ్ ఫొగాట్ స్పందించింది. నేను ఓడిపోలేదు. ఈ వ్యవస్థతో ఒంటరిపోరాటం చేస్తున్నా. ప్రతిదాని కోసం పోరాడాల్సి వస్తోంది. నాకు న్యాయం జరగలేదు. మళ్లీ తిరిగి వస్తాను. రెజ్లర్ వినేశ్కు తొలుత రెజ్లింగ్ సమాఖ్య సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించింది. అయితే 53 కేజీల కేటగిరీలో వినేశ్ ఆడేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: అతడు లక్కీ హ్యాండ్.. ఆ జట్టుదే ఐపీఎల్ టైటిల్!
అతడు లక్కీ హ్యాండ్.. ఆ జట్టుదే ఐపీఎల్ టైటిల్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ మరోసారి చాంపియన్గా నిలవడానికి మరో అడుగు దూరంలో ఉంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మెగాటోర్నీ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ ఆధిక్యంలో ఉంది. లీగ్ దశలో చెరో మ్యాచ్ గెలిచినప్పటికీ, క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ను 92 పరుగుల భారీ తేడాతో ఓడించి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలవనున్నట్లు, అందుకు జోష్ హాజిల్వుడ్ కారణం కానున్నట్లు ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకు హాజిల్వుడ్ ఐదు టీ20 టోర్నీ ఫైనల్స్ ఆడితే.. ప్రతీసారి తాను ప్రాతినిధ్యం వహించిన జట్టే చాంపియన్గా నిలిచింది. ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్కింగ్స్ విజేతగా నిలిచింది. ఆ జట్టులో హాజిల్వుడ్ ఉన్నాడు. 2012లో చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన సిడ్నీ సిక్సర్, 2019 బీబీఎల్ విజేత సిడ్నీ సిక్సర్స్, 2021 టీ20 ప్రపంచకప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టు, 2021 ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన సీఎస్కే, 2025 ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టు.. ఇలా ఐదుసార్లు హాజిల్వుడ్ సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు 2015, 2023 వన్డే వరల్డ్కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోనూ హాజిల్వుడ్ సభ్యుడిగా ఉండడం విశేషం.దీంతో హాజిల్వుడ్ లక్కీ హ్యాండ్ అని.. అతను ఏ జట్టులో ఉంటే ఆ జట్టు చాంపియన్గా నిలుస్తుందని అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అతడు లక్కీహ్యాండ్ మాత్రమే కాదు, తాను ఆడిన ఐదు ఫైనల్స్లోనూ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆడిన ఐదు ఫైనల్స్ కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్తో పాటు 2012 చాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్లో మూడు వికెట్లు తీసి బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ చాంపియన్గా నిలవడంలో హాజిల్వుడ్ కీలకపాత్ర పోషించాడు. ఆ సీజన్లో 12 ఇన్నింగ్స్ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్ల్లో కేవలం 13 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే భువనేశ్వర్, రసిక్ సలామ్లు రాణిస్తుండడంతో హాజిల్వుడ్కు పెద్దగా ఇబ్బంది ఎదుర్కోవడం లేదు.చదవండి: ‘ఈసారి హిట్ వికెటవ్వను.. విరుగుడు మంత్రమదే!’
న్యూస్ పాడ్కాస్ట్
చేతికి వచ్చి చేజారిన ఉద్యోగం... ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో బయటపడుతున్న లీలలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా... కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
చంద్రబాబు రాక్షస పాలనపై పోరుబాట... వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పునకు సంకేతాలు.. సిద్ధరామయ్య రేపు రాజీనామా చేసే అవకాశం
మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా?... చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన మాజీ సీఎం వైఎస్ జగన్
యుద్ధమా? ఒప్పందమా?... ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో పగిలిన అక్రమాల పుట్ట... ఎస్సీఆర్టీ నుంచే కుంభకోణం..
అమరావతిలో చంద్రబాబు లూటీ... అవినీతి, దోపిడీతో ఎప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు.
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
బిజినెస్
బంగారం రేట్లు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
దేశంలో బంగారం ధరలు పెరిగినట్టే పెరిగి మళ్లీ దిగివచ్చాయి. మూడు రోజులు వరుసగా తగ్గి మళ్లీ క్రితం రోజున పసిడి ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. అయితే బంగారం ధరలు నేడు (Today Gold Rate) ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి. దీంతో పసిడి ప్రియుల్లో మళ్లీ ఉత్సాహం పెరిగింది.ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
బ్యాంకులకు వెళ్లేవాళ్లకు అలర్ట్: 11 రోజులు సెలవులు!
బ్యాంకులు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మారిపోయాయి. ప్రతిఒక్కరూ ఏదో ఒక పని మీద బ్యాంకు బ్రాంచిలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో బ్యాంకులు ఏ రోజుల్లో పనిచేస్తాయి.. ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయి.. అనే విషయాలను తెలుసుకోవడం అవసరం. దేశవ్యాప్తంగా బ్యాంకులకు జూన్ నెలలో గత నెలలతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే సెలవులు ఉండనున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా కొన్ని ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులు మూసివేస్తున్నందున ఖాతాదారులు తమ బ్యాంకింగ్ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జూన్ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. వీటిలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉండగా, మిగిలిన రోజులు రాష్ట్రాల వారీగా అమలయ్యే ప్రత్యేక సెలవులు.మొహర్రం ప్రధాన సెలవుజూన్ 26న మొహర్రం (అషూరా) సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకులు మూసిఉంటాయి. ఇది జూన్ నెలలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపే ప్రధాన సెలవుగా భావించవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో మొహర్రం సెలవు జూన్ 25న ఉండగా, ఇతర చాలా రాష్ట్రాల్లో జూన్ 26న అమలులో ఉంటుంది.జూన్లో బ్యాంకు సెలవులుజూన్ 7 - ఆదివారంజూన్ 13 - రెండో శనివారంజూన్ 14 - ఆదివారంజూన్ 15 – మిజోరాంలో వైఎంఏ దినోత్సవం, ఒడిశాలో రాజ సంక్రాంతి సందర్భంగా సెలవుజూన్ 21 - ఆదివారంజూన్ 25 – ఆంధ్రప్రదేశ్లో మొహర్రం సెలవుజూన్ 26 – మొహర్రం/అషూరా సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవుజూన్ 27 - నాలుగో శనివారంజూన్ 28 - ఆదివారంజూన్ 29 – హిమాచల్ ప్రదేశ్లో సంత్ గురు కబీర్ జయంతిజూన్ 30 – మిజోరాంలో రెమ్నా నీ శాంతి దినోత్సవంఅందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకు శాఖలు మూసిఉన్నప్పటికీ, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎంలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అయితే నగదు డిపాజిట్లు, చెక్ క్లియరెన్స్, పాస్బుక్ అప్డేట్లు, ఖాతా సంబంధిత సేవలు వంటి బ్రాంచ్ ఆధారిత పనులు సెలవు రోజుల్లో అందుబాటులో ఉండకపోవచ్చు.అనేక సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుండటంతో ఖాతాదారులు తమ ప్రాంతీయ బ్యాంకు శాఖల సెలవుల జాబితాను ముందుగానే పరిశీలించడం మంచిది. ఏవైనా అత్యవసర బ్యాంకింగ్ పనులు ఉంటే సెలవుల తేదీలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే పూర్తి చేసుకోవాలని ఆర్బీఐ సూచిస్తోంది.
బంగారం రుణాలకు డిమాండ్ పైపైకి..
ముంబై: రుణదాతలకు పసిడి రుణాలు ఇక ముందూ కీలక ప్రాధాన్యంగా కొనసాగుతాయని ఎక్స్పీరియన్ నివేదిక తెలిపింది. భారత రిటైల్ రుణ మార్కెట్లో సెక్యూర్డ్ రుణాలకు ప్రాధాన్యం పెరిగినట్టు పేర్కొంది. పసిడి రుణాల సోర్సింగ్ విలువ (కొత్త రుణాలు) 2025–26 క్యూ4లో రెట్టింపునకు పైగా పెరిగి రూ.7.6 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపింది. నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 47 శాతం పెరిగి రూ.11.9 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది.సగటు రుణ పరిమాణం రూ.1.4 లక్షల నుంచి రూ.2.1 లక్షలకు చేరినట్టు వెల్లడించింది. ఇదే ధోరణి కొనసాగితే ఇక మీదటా తనఖా రుణాలు రిటైల్ రుణాల వృద్ధిలో కీలకంగా ఉంటాయని ఈ నివేదిక తెలిపింది. 2025–26లో కొత్త రుణాల్లో 68 శాతం సెక్యూర్డ్ రూపంలోనే ఉన్నాని, మొత్తం అన్సెక్యూర్డ్ రుణాల్లో 22 శాతం వృద్ధితో పోల్చితే ఎంతో ఎక్కువని వివరించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) పసిడి రుణాల డిమాండ్ నుంచి ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నట్టు తెలిపింది.2025–26 క్యూ4లో కొత్త రుణాల్లో 40 శాతం ఎన్బీఎఫ్సీల నుంచే ఉన్నట్టు వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 28 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. ఇదే కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా మోస్తరు స్థాయిలోనే కొనసాగినట్టు వివరించింది. బంగారం రుణాల ఆస్తుల నాణ్యత సైతం మెరుగ్గా ఉందంటూ.. 90 రోజులకు పైన చెల్లింపుల్లేని రుణాల వాటా 0.3 శాతం నుంచి 0.2 శాతానికి తగ్గినట్టు ఎక్స్పీరియన్ నివేదిక వెల్లడించింది.
ఐపీవోకు 3 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో రోడెక్ ఫార్మా, రెన్నీ స్ట్రిప్స్, కృష్ణా బిల్డ్స్పేస్ చేరాయి. లిస్టింగ్కు అనుమతించమంటూ రెన్నీ స్ట్రిప్స్ 2025 డిసెంబర్లో, రోడెక్ ఫార్మా, కృష్ణా బిల్డ్స్పేస్ 2026 జనవరిలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. ఓఎఫ్ఎస్ ద్వారా వెటర్నరీ ఫార్మా ప్రొడక్టుల కంపెనీ రోడెక్ ఫార్మా పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) బాటలో సాగనుంది. ప్రమోటర్ ముకేష్ కుమార్ గుప్తా 56.5 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. దీంతో నిధులు కంపెనీకికాకుండా ప్రమోటర్లకు చేరనున్నాయి. 1997లో ఏర్పాటైన కంపెనీ జంతు ఆహార సంబంధ(యానిమల్ ఫీడ్) సప్లిమెంట్స్ తయారీతోపాటు వెటర్నరీ ఫార్మాస్యూటికల్ ప్రొడక్టుల మార్కెటింగ్ చేపడుతోంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో తయారీ ప్లాంటు కలిగి ఉంది. ఈక్విటీ జారీసహా.. వివిధ పరిశ్రమలలో వినియోగించే మైల్డ్ స్టీల్ బిల్లెట్స్సహా.. విభిన్న స్ట్రక్చురల్ ప్రొడక్టులు రూపొందించే రెన్నీ స్ట్రిప్స్ ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను లూధియానాలో స్కఫోల్డింగ్, ఫామ్వర్క్ సిస్టమ్స్, ఈఆర్డబ్ల్యూ పైపులు, ట్యూబుల తయారీ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది. అంతేకాకుండా ప్రస్తుత ప్లాంట్ల ఆధునీకరణ, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం కేటాయించనుంది. నిర్మాణ రంగ సంస్థ నిర్మాణ రంగ గుజరాత్ కంపెనీ కృష్ణా బిల్డ్స్పేస్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 90 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు 9 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. 1995లో ఏర్పాటైన కంపెనీ కాంట్రాక్టింగ్, బిల్డింగ్ సరీ్వసులందిస్తోంది. ఐపీవో చేపట్టడం ద్వారా మూడు కంపెనీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానున్నాయి.
ఫ్యామిలీ
‘ఓపెన్’గా మాట్లాడితే!
ఆ బ్యాంక్ పేరు... భద్రం బీకేర్ఫుల్ బ్రదర్. ఒకరోజు ఆ బ్యాంకులో సేఫ్టీలాకర్ ఎంతకీ ఓపెన్ కావడం లేదు. నగరంలో పేరున్న మెకానిక్లను పిలిపించారు. నో... ఫలితమ్. ‘సేఫ్టీ లాకర్ను సేఫ్గా ఓపెన్ చేయడం ఎలా?’ అని యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూసి ట్రై చేశారు. నో.... ఫలితమ్. ‘ఇలా కాదుగానీ అతడిని పిలిపించాల్సిందే’ అన్నాడు బ్యాంకులో సీనియర్ ఉద్యోగి శీనయ్య పటేల్. ‘ఎవరు అతడు?’ అని అడిగాడు కొత్త మేనేజర్.‘అతడి పేరు... ఓపెనర్ కుమార్ (ఓ.కె) అసలు పేరేమిటో తెలియదు కానీ అందరూ ఓ.కే అని పిలుస్తారు’ అని చెప్పాడు శీనయ్య. మారుమూల పల్లెటూరులో ఉండే ఓ.కే.ను పిలిపించారు. సేఫ్ లాకర్ను ఓ.కె. అవలీలగా ఓపెన్ చేశాడు. ఆనందం తట్టుకోలేక అందరూ చప్పట్లు కొట్టారు. ‘నీది మామూలు టాలెంట్ కాదు తమ్ముడూ! ఇదిగో పదివేలు...గిఫ్ట్గా ఇస్తున్నాను’ అని ఆప్యాయంగా ఓ.కె భుజం తట్టాడు మేనేజర్. అంతే...ఓ.కే.లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అతడి కళ్లలో అగ్నిపర్వతాలు ఢమాల్, ఢమాల్ అని రెండుసార్లు పేలాయి. వీరావేశంతో బ్యాంక్ మేనేజర్ను మ«ధ్యయుగాల నాటి కిరాతకమైన తిట్లు తిట్టడం ప్రారంభించాడు.ఆ తరువాత ఇలా అన్నాడు: ‘................ ....... ......... .............. ......... ............ ........’ ‘విక్రమార్కా.... ఆ బ్యాంక్ మేనేజర్ ఓ.కే.ను పల్లెత్తు మాట అనలేదు. పైగా ప్రశంసించాడు. అంతేకాదు, గిఫ్ట్క్యాష్ ఇవ్వబోయాడు. మరి అతడిని పట్టుకొని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టడమేమిటి? ఇంతకీ ఓ.కె. కోపానికి కారణం ఏమిటి? పనిలో పనిగా పై ఖాళీని పూరించు. ఓ..కె ఏమన్నాడో చెప్పు. చెప్పకపోయావో...’ అని ఎప్పటిలాగే హెచ్చరించాడు భేతాళుడు. ‘పై ఖాళీలో ఓ.కె. చెప్పిన డైలాగ్ చెబుతాను. అందులోనే నీకు సమాధానం దొరుకుతుంది’‘అలాగే చెప్పు’ అన్నాడు భేతాళుడు.సీన్ రీకన్స్ట్రక్షన్‘ఏమయ్యా బ్యాంకు మేనేజర్, నేను ఇంట్లో సుఖంగా ఉండడం, హాయిగా ఇంటి భోజనం చేయడం నీకు నచ్చడం లేదా! మళ్లీ ఆ జైల్లో చిప్పకూడు తినాలా? ఈ డబ్బులకు ఆశపడే కదయ్యా చిప్పకూడు తిన్నాను. గతంలో ఒకసారి సేఫ్ లాకర్ ఓపెన్ చేసినందుకే చా...లా సంవత్సరాలు జైల్లో ఉండి చచ్చాను’ ఆవేశంగా, ఆవేదనగా, ఆందోళనగా అన్నాడు ఓ.కె.‘మరి అప్పుడు నిన్ను ఏ బ్యాంక్ వాళ్లు పిలిచారు?’ అడిగాడు అక్కడున్న ఒక వ్యక్తి. ‘ఎవరూ పిలవలేదు. ఒక అర్ధరాత్రి నేనే సరదాగా వచ్చాను. పోలీసులకు దొరికిపోయాను’ అసలు విషయం చెప్పాడు ఓ.కె. ఎలియాస్ ఓపెనర్ కుమార్.–యాకుబ్ పాషా
పరుగు ఆపితే... మెరుగైన లైఫ్!
బ్రష్... ఫోన్... టిఫిన్.. ట్రాఫిక్... మీటింగ్... జొమాటో... నెట్ఫ్లిక్స్... నిద్ర...మధ్యలో మనిషి ఎక్కడ? ప్రఖ్యాత పర్యావరణవేత్త వందన శివ అదే అడుగుతున్నారు...‘ఈ స్పీడ్లో పడి బతకడాన్నిమర్చిపోతున్నారా?’ వందనా శివ తాజా పుస్తకం ‘స్లో లివింగ్’ నవీన జీవన సూత్రాన్ని బోధిస్తోంది.పరుగు తగ్గించమని, భూమికి మేలు చేయమని హితవు చెప్తోంది.‘ఆగండి. ఊపిరి పీల్చుకోండి. మీరు మిషన్ కాదు, మనిషి’ అంటున్నారు వందనా శివ. పర్యావరణ యోధురాలుగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వందనా శివ తన స్నేహితురాలు, పీస్ ఎడ్యుకేటర్ శ్రేయ జానీతో కలిసి రాసిన పుస్తకం ‘స్లో లివింగ్: వాట్ యూ కెన్ డూ అబౌట్ క్లయిమేట్ ఛేంజ్’ తాజాగా విడుదలై ఆలోచనలు రేకెత్తిస్తోంది. ‘నేటి మనిషి నిరంతర పరుగులో జీవన ఆనందాన్ని కోల్పోతున్నాడు. భూమిని ప్రమాదంలో నెడుతున్నాడు. నేటి మనిషి అన్నీ తొందరగా జరిగిపోవాలనుకుంటున్నాడు. అందుకే ఫాస్ట్ఫుడ్ తిని పొట్ట పాడు చేసుకుంటున్నారు. ఫాస్ట్ లైఫ్తో మనసు పాడు చేసుకుంటున్నారు. నిద్ర లేదు, నవ్వులేదు, నాన్నతో మాట్లాడే టైమ్ లేదు, అమ్మ చేతి ముద్ద రుచి తెలియదు, చివరికి సంపాదించింది హాస్పిటల్ బిల్లులకి సరిపోతుంది. అందుకే నెమ్మదిగా బతకండి. దాని వల్ల భూమి కూడా ప్రాణం పోసుకుంటుంది’.... అనే సారం అందజేస్తోంది ‘స్లో లివింగ్’ పుస్తకం. 73 ఏళ్ల వందనా శివ మనిషినీ, భూమినీ కాపాడుకోవడానికి ‘స్లో లివింగ్’ను ప్రతిపాదిస్తున్నారు.మనిషి స్పీడ్ వల్ల ఏమైంది?ఐ.ఎం.డి.లెక్కల ప్రకారం 2026లో హీట్ వేవ్స్కి వందల మంది చనిపోయారు. వానలు రావడం లేదు. కారణం? మన ఫాస్ట్ లైఫ్. ఎక్కువ కొనడం, ఎక్కువ పడేయడం, ఎక్కువ కాలుష్యం సృష్టించడం. ఫ్యాక్టరీలు నీళ్లని పాడు చేస్తున్నాయి. పండించే తిండిలో ముప్పై శాతం వేస్ట్ చేస్తున్నాం. అది ఎనిమిది శాతం గ్లోబల్ ఎమిషన్స్ కి కారణమవుతోంది. ప్రతి దానికీ ప్లాస్టిక్ వాడటం వల్ల 2050 నాటికి సముద్రంలో చేపల కంటే ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది. వన్యమృగాల ఆవాసాలను నాశనం చేయడం వల్ల గత యాభై ఏళ్లలో 300 కొత్త వ్యాధికారక క్రిములు వచ్చాయి. రెడీమేడ్ దుమారంలో ఉత్పత్తిదారులు బట్టలను వాడి పారేసేవిగా తయారు చేస్తూ రీసైక్లింగ్ వీలుగాని దిబ్బలను రాసి పోస్తున్నారు. అందుకే వందన శివ ‘ఆగు’ అంటున్నారు. ‘నెమ్మదించడం అంటే వెనక్కి వెళ్లడం కాదు, నిన్ను నువ్వు కాపాడుకోవడం’ అంటున్నారు. ‘ఫాస్ట్ లివింగ్ ఎంత చేయగలవు అని నిలదీస్తుంది. స్లో లివింగ్ మరింతకాలం నిలబడేలా సాయం చేస్తుంది’ అంటారామె.ఇది శ్రీమంతులకే పాఠమా?మధ్యతరగతికి సవాలక్ష బాదరబందీలు. రోజుకి పన్నెండు గంటలు పనిచేస్తే తప్ప నాలుగువేళ్లు నోట్లోకెళ్లవు. ఇలాంటప్పుడు ‘స్లో లివింగ్’ సాధ్యమా? ఇది శ్రీమంతులకైతే సరేగాని అనుకోవచ్చు. కాని వందన శివ ‘స్లో లివింగ్’ అందరికీ అంటున్నారు. మధ్యతరగతికి స్లో లివింగ్ అంటే ఏమిటో చెప్తున్నారు.→ ఇంట్లో కూరగాయల తొక్కు చెత్తలో వేయకుండా మొక్కకి వేయడం → వారానికి ఒకసారి కారు కాకుండా సైకిల్ తొక్కడం → ప్లాస్టిక్ కవర్ బదులు గుడ్డ సంచి పట్టుకెళ్లడం → యాప్ తిండి మాని అమ్మ చేతి వంట తినడం → పండగలకి, ఫంక్షన్లకి మాత్రమే కొత్త బట్టలు కొనడం. మిగతా టైం ఉన్నవి ఆల్టర్ చేయించుకోవడం... ‘మిక్స్ అండ్ మ్యాచ్’ అంటే అమ్మచీరకి కొత్త బ్లౌజ్ కుట్టించుకోవడం. ఇవి చేయడానికి కోటీశ్వరుడు అవ్వక్కర్లేదు. కావాల్సింది ఒక్కటే – ఓపిక.మాల్స్, మార్ట్ల నుంచి బయటపడండివీధి చివర పచారి కొట్టుకు వెళితే ‘పద్దు’ ఇచ్చి ‘ఇవి చాలు’ అంటాం. అదే మార్ట్కు వెళితే కనపడినవి అన్నీ బుట్టలో వేస్తాం. దీనిని ‘స్లో లివింగ్’ పుస్తకం కోరైటర్ శ్రేయ జానీ ‘కలోనియల్ జాయ్’ అంటారు. వలస పాలనలో మనం కొనడంలో ఆనందం వెతుక్కున్నాం. అదే అలవాటైంది. అది ‘కలోనియల్ జాయ్’. ఆ కృత్రిమ ఆనందం నుంచి అసలైన ఆనందంలోకి రావాలి. ‘డీకలోనియల్ జాయ్’ పొందాలి. స్థానిక ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, స్థానిక మనుషుల అనుబంధాలు... వీటిలోనే ఆనందం ఉందని తెలుసుకోవాలి. ఏసీ రూంలో కూర్చుని నెట్ఫ్లిక్స్ చూసినా రాని హాయి మొదటి వాన చినుకు అరచేతిలో పడితే వస్తుందని తెలుసుకోగలగాలి. అదే స్లో లివింగ్.పెద్దలు చెప్పినా పుస్తకం చెప్పినా హెచ్చరిక ఒకటే... ‘అతి వేగం చంపుతుంది. నెమ్మది బతికిస్తుంది’.... మనల్నే కాదు. భూమిని కూడా. స్లో లివింగ్ అంటే?స్లో లివింగ్ను వందనా శివ ఇలా నిర్వచిస్తున్నారు. → తినే తిండి ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకోవాలి. ΄్యాకెట్ చూసి కొనడం కాదు, పొలం చూసి కొనాలి. రైతు దగ్గర కొనాలి. → అనవసరంగా ఏదీ కావాలనుకోకూడదు. కొనే ప్రతి వస్తువు అవసరమా కాదా అని 10 సెకన్లు ఆలోచించాలి. → ‘ఫాస్ట్ ఫ్యాషన్ ’ అంటే నాలుగుసార్లు వాడి పడేసే బట్టలు కొనకూడదు. ‘స్లో ఫ్యాషన్ ’ ఫాలో కావాలి. అంటే అమ్మమ్మలా ఒక నాణ్యమైన చీరను 20 ఏళ్లు కట్టుకోవడం. → భూమిని గౌరవించాలి. చెట్టు నరకడం కాదు, చెట్టు నాటాలి. నీళ్లని వృథా చేయడం కాదు, ఒడిసి పట్టాలి. → మనతో మనం గడపాలి. ఫోన్ లేకుండా రోజైనా ఒక గంటైనా మనతో మనం గడపడం. కుటుంబంతో మాట్లాడాలి. ఆకాశం ఒకటుందని గుర్తు చేసుకుని దాని వైపు చూడాలి. – కె.
60 ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! దెబ్బకు థైరాయిడ్, షుగర్..
పెద్దవాళ్లు అందులోనూ ఇంట్లోనే ఉండే తల్లులు బరువు తగ్గే ప్రయత్నాలు చేసేందుకు సిగ్గుపడుతుంటారు. అందులోనూ ఈ వయసులోనా..! అనే భయం వాళ్లను వెంటాడుతుంటుంది. ఓ అమ్మ ఆ మూసధోరణిని బద్దలుకొట్టేలా..జిమ్కి వెళ్లి ఏకంగా 18 కిలోలు తగ్గింది. అంతేగాదు ఎన్నాళ్లుగానో వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులకు సైతం చెక్ పెట్టింది. అదెలాగో తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ హరీష్ ఠాకూర్ తన తల్లి స్ఫూర్తిదాయకమైన వెయిట్లాస్ జర్నీని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాను ఎన్నోసార్లు తన తల్లికి వ్యాయామాలు చేయమని చెప్పినా..ఆమె సామాజిక ఒత్తిడి, ఇతరులు ఏమనుకుంటారో అన్న భయంతో ఎలా వెనకాడుతూ ఉండేదో చెప్పుకొచ్చారు. తన బలవంతంపైనే ఏదోలా జిమ్కి వచ్చిందని నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. అలా ఒక ఏడాదిపాటు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసిన తర్వాత ఆమె తల్లిలో వచ్చిన మార్పుని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఆమె కూడా తనంతాటే ఇష్టంగా వ్యాయామాలు చేయడం ప్రారంభించిందని అన్నారు. ఫలితంగా రక్తపోటు, థైరాయిడ్ ఆరోగ్యం మెరుగపడిందని అన్నారు. ఈ మేరకు హరీష్ తల్లి సైతం జిమ్కి వెళ్లాక ఆరోగ్యం బాగుందని, ఏకంగా 18 కిలోలు తగ్గానని అంటోంది. అంతేగాదు షుగర్, రక్తపోటు, థైరాయిడ్ సమస్యలన్నీ తగ్గిపోయాయని ఆనందంగా చెబుతోంది. అలాగే కంటెంట్ క్రియేటర్ హరీష్ కూడా అందరు తమ తల్లిదండ్రుల ఆరోగ్యానికే ప్రాదాన్యత ఇవ్వాలని కోరాడు. అంతేగాదు తల్లి వ్యాయమాలు చేస్తున్న వీడియోలను కూడా షేర్ చేశారు. ఆమె ఫిట్నెస్ చర్యలో భాగంగా డెడ్లిఫ్ట్లను కూడా ఎత్తుతారామె. ఆమె కూడా తనలా ఇతరులు ఏమనుకుంటారో అని భయపడే వాళ్లు తమ పిల్లలు మాట విని ఆరోగ్యంగా ఉండాలని అన్నారామె.పెద్దలకు మంచిదేనా..?60 ఏళ్ల అనంతరం సరైన మార్గదర్శకత్వంలో వ్యాయామం చేయడం వల్ల బలం, సమతుల్యత, చలనశీలత తదితరాలన్ని మెరుగుపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. క్రమం తప్పని వ్యాయామాలు కండరాల క్షీణతను తగ్గించి, ఎముకలను బలోపేతం చేసి పడిపోయే ప్రమాదాన్ని నివారిస్తుందన్నారు. View this post on Instagram A post shared by HotFix | Harish Thakur (@itshotfix) (చదవండి: 30 రోజుల్లో ఏడు కిలోలు..! ఆ 15 రూల్స్ మస్ట్)
పిల్లల డ్రీమ్ హౌజ్..!
పిల్లలతో ఊహాశక్తి, బాధ్యత, అలంకరణ పట్ల అభిరుచిని పెంచేది వారి డ్రీమ్ హౌస్. అందులో గోడలు, ఫర్నిచర్, వాతావరణం.. ప్రతిదీ పరిచయం చేయవచ్చు. పిల్లల్లో వచ్చే సృజనాత్మక ఆలోచనలకు మీరే ఆశ్చర్యపోతారు.వెల్కమ్ చెప్పే డోర్..మన ఇంటి తలుపు ఎప్పుడూ శుభ్రంగా, అందంగా, ఆకర్షణీయంగా ఆహ్వానించేలా ఉండాలి. దాంతోపాటు మెయిన్ డోర్ ఎలా ఉండాలో చూపమనండి.లివింగ్ – డైనింగ్..కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని ఆనందించే ప్రదేశం, అందరూ కలిసి భోజనం చేసే చోటు ఎలా ఉంటే వారికి నచ్చుతుందో చెప్పమనవచ్చు. గది గోడల రంగు, లైటింగ్, వాల్ పేపర్స్ .. ఇలా ప్రతిదీ క్రియేటివ్గా వారి మైండ్లో నుంచి వచ్చినదై ఉండాలి. రంగులు మన మూడ్ను ఏ విధంగా మార్చుతాయి... ఎక్కువ వస్తువులు కాకుండా ఇంటిని నీటుగా ఎలా సర్దుకోవడం, ప్రతి వస్తువు ఉపయోగం.. ఇలా ప్రతిదీ పాఠమే అవుతుంది.‘పిల్లలను ఇంటి బొమ్మ డ్రా చేయమని సాధారణంగా అడుగుతుంటాం. వాళ్లు ఒక ఇంటి రూపాన్ని డ్రాయింగ్ చేసి చూపుతారు. దీనివల్ల పిల్లల్లో క్రియేటివిటీ అక్కడితో ఆగిపోతుంది. అలా కాకుండా వారి డ్రీమ్ హౌజ్.. దానితో పాటు కిచెన్, బెడ్రూమ్, లివింగ్, స్టడీ రూమ్, రంగులు, ఆర్కిటెక్చర్, అలంకరణ, ఇండోర్– ఔట్డోర్ మొక్కలు... ఇలా ఇంటికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఎలా ఉండాలో చెప్పమనవచ్చు. డ్రా చేసి చూపమనవచ్చు. ఇల్లు.. పిల్లల్లో ఎన్నో క్రియేటివ్ ఐడియాలకు రూపకల్పన ఇస్తుంది. వారి క్రియేటివ్ ఐడియాలను మాకు పంపించండి. మెయిల్ ఐడి : sakshisummerkids@gmail.com- గీతాభాస్కర్, నటి, ఆర్ట్ టీచర్బెడ్రూమ్ – చదువుకునే ప్లేస్పిల్లల గది ఆలోచనల పుట్టకు ప్రతిరూపం అని చెప్పవచ్చు. శుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి. వాళ్ల చెప్పిన విధానం, డ్రాయింగ్లో చూపిన విధానం.. వారికి పదే పదే గుర్తుకు వస్తుంది. దీని వల్ల గదులను శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు అవుతుంది. కాంతి ఎక్కువగా, ప్రశాంతంగా ఉండాలి. ప్రతిరోజూ ఒకే దగ్గర, ఒకే సమయంలో చదువుకోవడం అలవాటుగా మార్చుకుంటే ఏకాగ్రత క్రమశిక్షణ అలవడతాయి. రీడింగ్ ప్లేస్ను ఎలా ఉంచుకోవాలో బాధ్యత పెరుగుతుంది.మొక్కలు – అలంకరణ..ఇండోర్ ΄్లాంట్స్ అమర్చితే ఇల్లు జీవకళతో ఆకట్టుకుంటుంది. ప్రకృతిపట్ల ప్రేమ పెరుగుతుంది. ఇంటి లోపల పెంచే మొక్కలు ఎన్ని రకాలు, వాటికి గాలి, వెలుతురు, నీరు .. ఎంతవరకు అవసరమో తెలుసుకుంటారు. మన జీవనానికి ఉపయోగపడే వాటి గురించి కొత్తగా ఆలోచించగలుగుతారు.‘నీ గది ఎలా ఉండాలని అనుకుంటావు? ఏ రంగు అయితే బాగుంటుంది?’, ‘‘పుస్తకాలను ఎలా సెట్ చేద్దాం?,’ ‘చిన్నమొక్కలు ఎక్కడ పెడతావు..’ ఇలా అడిగితే వాళ్లు తమ చిన్న చేతులతోనే చేసి చూపుతారు. ప్రేమ, పరిశుభ్రత, ప్రశాంతత ఉన్న ఇల్లు నిజమైన డ్రీమ్ హౌస్ అంటూ ఒక వ్యాసం రాసి చూపమనవచ్చు.నిర్వహణ : నిర్మలా రెడ్డి
అంతర్జాతీయం
ఇరాన్ రహస్య అస్త్రం.. అసలేంటి ఆరాష్-ఎ-కమాంగిర్?
టెహ్రాన్: హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన 'MQ-9 రీపర్' డ్రోన్ను కూల్చివేయడానికి తాము సరికొత్త వైమానిక రక్షణ వ్యవస్థను (air defence system) ఉపయోగించినట్లు ఇరాన్ పేర్కొంది. ఒక్కో యూనిట్కు 16 మిలియన్ డాలర్ల నుండి 30 మిలియన్ డాలర్ల వరకు ఖర్చయ్యే అమెరికా డ్రోన్ను, హార్ముజ్ జలసంధిలోని 'ఖేష్మ్' (Qeshm) ద్వీపం సమీపంలో.. స్థానికంగా అభివృద్ధి చేసిన 'ఆరాష్-ఎ-కమాంగిర్' (Arash-e-Kamangir) అనే వ్యవస్థను ఉపయోగించి కూల్చివేసినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా తెలిపింది.ఒకవేళ ఇదే నిజమైతే, ఇరాన్ పురాణాలలోని వీరుడు ఆరాష్-ది-ఆర్చర్ (విలుకాడు) పేరు మీదుగా నామకరణం చేసిన ఈ అరాష్ గగనతల రక్షణ వ్యవస్థను యుద్ధంలో ఉపయోగించడం ఇదే మొదటిసారి అవుతుంది. ఈ సాంకేతికపై ఇరాన్ ప్రభుత్వం, ఐఆర్జీసీ నుంచి అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. మధ్యప్రాచ్యంలో నెలల తరబడి యుద్ధం జరుగుతున్నప్పటికీ, అమెరికా-ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడానికి అవసరమైన సైనిక సామర్థ్యాన్ని టెహ్రాన్ ఇంకా నిలుపుకుందనే విషయం స్పష్టమవుతోంది.ఇరాన్ చేస్తున్న ఈ ప్రకటనను జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు భావిస్తున్నారు. స్వతంత్రంగా ధృవీకరించడానికి వీలుపడని సైనిక పురోగతిని ప్రచారం చేసుకోవడం ఇరాన్ అధికారులకు అలవాటే అయినప్పటికీ.. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న విస్తృత ఆలోచన మాత్రం నమ్మదగినదిగానే ఉందని వారు పేర్కొన్నారు. ఎందుకంటే, సులభంగా గుర్తింపునకు గురయ్యే పెద్ద పెద్ద స్థిర రేడార్ సైట్లపై ఆధారపడకుండా.. డ్రోన్లు, విమానాలను ముప్పునకు గురిచేసే చౌకైన, మొబైల్, స్వదేశీ రక్షణ వ్యవస్థలపై టెహ్రాన్ భారీగా పెట్టుబడి పెడుతోంది.కింగ్స్ కాలేజ్ లండన్లోని స్కూల్ ఆఫ్ సెక్యూరిటీ స్టడీస్ సీనియర్ లెక్చరర్ మార్క్ హిల్బోర్న్ అల్ జజీరాతో మాట్లాడుతూ.. వివిధ రకాల క్షిపణి రూపకల్పనలో ఇరాన్ స్వయం సమృద్ధి సాధించిందని, ఉక్రెయిన్ మాదిరిగానే యుద్ధ ఆర్థిక శాస్త్రాన్ని మార్చడంలో ఇరాన్ చాలా తెలివిగా వ్యవహరించిందని చెప్పారు. తక్కువ బడ్జెట్లో ఇరాన్ అభివృద్ధి చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తి శక్తి సామర్థ్యాలు పూర్తిగా వెలుగులోకి రాలేదు.ఆరాష్-ఎ-కమాంగిర్ అనేది ఒక విప్లవాత్మకమైన కొత్త ఆయుధమేమీ కాకపోవచ్చని.. కానీ మొబైల్ మరియు తక్కువ ఖర్చుతో కూడిన వైమానిక రక్షణను విస్తృతం చేయడంలో ఇరాన్ సాధించిన మరో అడుగు మాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు. సాంప్రదాయ వైమానిక రక్షణ నెట్వర్క్లు రేడార్లు, లాంచ్ బ్యాటరీలపై ఆధారపడతాయి. వాటిని గుర్తించడం చాలా సులువు. కానీ వీటికి భిన్నంగా. ఈ చిన్న, చౌకైన ప్రత్యామ్నాయాలను సులభంగా తరలించవచ్చు.. దాచవచ్చు.. వేగంగా ప్రయోగించవచ్చు. సులభంగా భర్తీ చేయవచ్చని పేర్కొన్నారు.ఈ కొత్త ఇంటర్సెప్టర్ వ్యవస్థకు పర్షియన్ పురాణాల వీరుడి పేరు పెట్టారు. జానపద కథల ప్రకారం.. ఆరాష్-ఎ-కమాంగిర్ అనే ఓ యోధుడు పశ్చిమ దేశాల ప్రభావం ఇరాన్పై పడకుండా ఆయన పోరాడినట్లు చెబుతారు. ఈ క్రమంలోనే ఆయన ఇరాన్-మధ్య ఆసియా మధ్య సరిహద్దును గీయడానికి ఒక బాణాన్ని సంధించాడు. ఆ వీరుడు పేరు మీదుగానే ఇరాన్ తమ సరికొత్త గగనతల రక్షణ వ్యవస్థకు ఆరాష్-ఎ-కమాంగిర్ అని పేరు పెట్టింది.
ప్రపంచం దూరమవుతున్నా.. భారత్ మా వెంటే
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. మరోసారి భారత్పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇజ్రాయెల్పై వ్యతిరేక భావనలు పెరుగుతున్నా.. భారత్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇండియాలో ఇజ్రాయెల్కు అసాధారణమైన ఆదరణ ఉంది అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.వెస్ట్ బ్యాంక్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు.. భారత్తో ఇజ్రాయెల్కు ప్రత్యేక సంబంధం ఉందన్నారు. “ప్రపంచంలో చాలా చోట్ల మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ భారత్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ ఇజ్రాయెల్కు విపరీతమైన మద్దతు ఉంది” అని పేర్కొన్నారు. అంతేకాదు.. “నాకు ప్రపంచంలో ఎక్కడా లేనంత భారత్లోనే ఎక్కువ ఫాలోవర్లు ఉండొచ్చు” అంటూ కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.నెతన్యాహు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా భారత్పై నెతన్యాహు ఇదే తరహాలో స్పందించారు. 2018లో తన భార్యతో కలిసి భారత్ పర్యటనకు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. “అది లవ్ ఫెస్ట్లా అనిపించింది” అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత ప్రజల్లో ఇజ్రాయెల్పై అపార గౌరవం ఉందని కూడా వ్యాఖ్యానించారు.Netanyahu:I’ll say this: we face delegitimization in much of the world — but not in India. In India, there is an absolutely crazy love for Israel, truly crazy. I think I have more followers from India than from anywhere else. pic.twitter.com/FRIo2cdVb3— Clash Report (@clashreport) May 28, 2026ఇదిలా ఉండగా.. అమెరికాలో మాత్రం ఇజ్రాయెల్పై వ్యతిరేక భావనలు పెరుగుతున్నట్లు ఇటీవల వెలువడిన సర్వేలు చెబుతున్నాయి. తాజా ప్యూ రీసెర్చ్ సర్వే ప్రకారం అమెరికన్లలో 60 శాతం మంది ఇజ్రాయెల్పై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని నెతన్యాహుపై నమ్మకం లేదని చాలామంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు మరో సంచలన ఆరోపణ కూడా చేశారు. అమెరికాలో ఇజ్రాయెల్ వ్యతిరేక భావనలు పెరగడానికి పాకిస్థాన్కు చెందిన సోషల్ మీడియా బాట్ నెట్వర్క్లు కారణమని ఆరోపించారు. “అమెరికన్లలా నటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ పరిశీలిస్తే వాళ్లు పాకిస్థాన్లోని బేస్మెంట్ల్లో కూర్చున్నవాళ్లని తేలుతోంది” అంటూ వ్యాఖ్యానించారు.
భారీ పేలుడు.. అగ్నిగోళంగా మారి బూడిదైన రాకెట్
అమెరికాలో మరో భారీ రాకెట్ ప్రయోగం విఫలమైంది. బ్లూ ఆరిజిన్ కంపెనీకి చెందిన న్యూ గ్లెన్ రాకెట్ టెస్టింగ్ సమయంలో ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా అగ్నిగోళంలా భయానక వాతావరణం ఏర్పడింది. అందుకు సంబంధించిన దృశ్యాలు కింద చూడొచ్చు.. బ్లూ ఆరిజిన్ కంపెనీ ప్రముఖ బిలియనీర్ జెఫ్ బెజోస్ స్థాపించిన ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అనే సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం శుక్రవారం వేకువజామున ఫ్లోరిడాలోని లాంచ్ ఫెసిలిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కీలకమైన “హాట్ ఫైర్ టెస్ట్” సందర్భంగా ఇంజిన్లు ఆన్ చేసిన క్షణాల్లోనే అనూహ్యంగా భారీ పేలుడు సంభవించి రాకెట్ ముక్కలు చెక్కలైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.#BREAKINGA Blue Origin rocket exploded into a massive fireball during a hotfire test at Cape Canaveral, FloridaThe company confirmed an “anomaly” during testing and said all personnel have been accounted for safelyAuthorities say no threat to public.Blue Origin founder… pic.twitter.com/8ndAsxCukC— Nabila Jamal (@nabilajamal_) May 29, 2026ఈ ఘటనను కంపెనీ సాంకేతిక లోపంగా పేర్కొంటూ వెంటనే విచారణ ప్రారంభించింది. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని బ్లూ ఆరిజిన్ వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనతో కంపెనీ అధినేత జెఫ్ బెజోస్కు పెద్ద షాక్ తగిలినట్లుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ ప్రయోగ విఫలంతో బ్లూ ఆరిజిన్కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. రాకెట్ పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు లాంచ్ ప్యాడ్ కూడా దెబ్బతిన్న అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఖర్చు వివరాలు అధికారికంగా వెల్లడించకపోయినా, ఇది అత్యంత ఖరీదైన పరీక్షల్లో ఒకటి కావడంతో భారీ నష్టం వాటిల్లి ఉంటుందని చెబుతున్నారు. హాట్ ఫైర్ టెస్ట్ అనేది రాకెట్ ప్రయోగానికి ముందు అత్యంత కీలక దశ. ఇందులో రాకెట్ను నేలపై స్థిరంగా ఉంచి ఇంజిన్ల పనితీరును పూర్తి స్థాయిలో పరీక్షిస్తారు. ఈ దశలోనే జరిగిన వైఫల్యం మొత్తం ప్రాజెక్ట్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.న్యూ గ్లెన్ రాకెట్ ద్వారా భారీ వాణిజ్య మిషన్లు, నాసా సంబంధిత ఉపగ్రహాలు కక్ష్యలోకి పంపాలని బ్లూ ఆరిజిన్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తాజా పేలుడు కారణంగా ప్రాజెక్ట్ టైమ్లైన్ ఆలస్యం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.మరోవైపు..ఈ ఫెయిల్యూర్తో బ్లూ ఆరిజిన్పై ఒత్తిడి మరింత పెరిగింది. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్తో గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న సంస్థకు ఇది మరో పెద్ద ఎదురు దెబ్బగా మారింది. టెక్నికల్ సమస్యలు, షెడ్యూల్ ఆలస్యాలు కంపెనీ పోటీ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు, ప్రైవేట్ స్పేస్ రేస్ ఎంత ఖరీదైనదో, ఎంత కఠినమో ఈ ఘటన మరోసారి చూపిందని నిపుణులు పేర్కొంటున్నారు.
ట్రంప్ చెత్త నిర్ణయం.. మానవాళికి కొత్త గండం!
డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) తూర్పు ప్రాంతంలోని ఇటూరి (Ituri) ప్రావిన్స్లో ఒక చిన్న గ్రామంలో ఏప్రిల్ నెలలో వైరస్ వ్యాప్తి మొదలైంది. ఒక స్థానిక రైతు వింతైన జ్వరం, వాంతులు, మరియు అంతర్గత రక్తస్రావంతో మరణించాడు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే అతని కుటుంబ సభ్యులు, అతనికి చికిత్స చేసిన నర్సు కూడా అదే లక్షణాలతో చనిపోయారు.ఈ క్రమంలో స్థానిక ల్యాబ్ టెక్నీషియన్లు వెంటనే అలర్ట్ అయ్యి రక్తం నమూనాలను సేకరించారు. అయితే, వారి వద్ద ఉన్న టెస్టింగ్ కిట్లు కేవలం 'జైర్' (Zaire) అనే పాత ఎబోలా వైరస్ స్ట్రెయిన్ను మాత్రమే గుర్తించగలవు. వారు చేసిన పరీక్షల్లో ఫలితం 'నెగిటివ్' అని వచ్చింది. దాంతో అధికారులు దీనిని సాధారణ టైఫాయిడ్ లేదా మలేరియా అని భావించి వదిలేశారు. కానీ, అక్కడ వ్యాపిస్తోంది సాధారణ వైరస్ కాదు... అత్యంత ప్రమాదకరమైన, వ్యాక్సిన్ లేని 'బుండిబుగ్యో' (Bundibugyo) స్ట్రెయిన్ అని వారికి తెలియలేదు. ఈ తప్పుడు నివేదికల వల్ల వైరస్ దాదాపు మూడు వారాల పాటు ఎవరికీ తెలియకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా వైరస్ సమాజంలోకి చొచ్చుకుపోయింది.ఇటూరి ల్యాబ్ సిబ్బందికి బుండిబుగ్యో స్ట్రెయిన్ను పరీక్షించే పరికరాలు లేకపోవడంతో, వారు నమూనాలను రాజధాని కిన్షాసాకు పంపాల్సి వచ్చింది. కానీ, నిధుల కొరత వల్ల ఆ నమూనాలను ఐస్ బాక్సులలో (సరైన ఉష్ణోగ్రత వద్ద) రవాణా చేయలేకపోయారు. ఫలితంగా కిన్షాసా చేరేసరికి ఆ శాంపిల్స్ పాడైపోయాయి. మళ్లీ కొత్త నమూనాలు సేకరించి, పరీక్షించి, అది ఎబోలా అని నిర్ధారించేసరికి మే 15 అయిపోయింది. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది.మెట్రో నగరాలకు వ్యాప్తి.. తూర్పు కాంగో ప్రాంతం దశాబ్దాలుగా సాయుధ తిరుగుబాటుదారులు, అంతర్యుద్ధాలతో నలిగిపోతోంది. ఈ అశాంతి వైరస్కు అనుకూలంగా మారింది.ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు లేవు: నిధుల కోత వల్ల ఆసుపత్రుల్లో డాక్టర్లకు వేసుకునే గ్లోవ్స్, మాస్కులు, ప్రొటెక్టివ్ సూట్లు (PPE Kits) కూడా లేవు. దీంతో రోగుల నుండి డాక్టర్లకు, నర్సులకు వైరస్ వేగంగా సోకింది.నగరాలకు వ్యాప్తి: మే మూడవ వారం నాటికి, ఈ వైరస్ సరిహద్దులు దాటి 20 లక్షల జనాభా ఉన్న గోమా (Goma) నగరానికి, అక్కడి నుండి పొరుగు దేశమైన ఉగాండా రాజధాని కంపాలా (Kampala) నగరానికి పాకింది. కిక్కిరిసిన నగరాల్లో ఎబోలా ప్రవేశించడంతో పరిస్థితి చేతులు దాటిపోయింది.మే 17, 2026న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని "అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి"గా ప్రకటించింది. మే చివరి నాటికి 900 కి పైగా కేసులు, 220 కి పైగా మరణాలు నమోదయ్యాయి.వ్యాక్సిన్ లేని యుద్ధం..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎబోలా అనగానే ఇచ్చే 'ఎర్బోవో' (Ervebo) వ్యాక్సిన్ కేవలం 'జైర్' స్ట్రెయిన్పై మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు వ్యాపిస్తున్న 'బుండిబుగ్యో' స్ట్రెయిన్పై అది ప్రభావం చూపించలేదు. ఈ స్ట్రెయిన్కు అధికారికంగా ఎలాంటి వ్యాక్సిన్ లేదా యాంటీవైరల్ డ్రగ్స్ లేవు. దీని బారిన పడిన రోగుల్లో మరణాల రేటు 33% కంటే ఎక్కువగా ఉంది. అంటే వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు అత్యవసరంగా కొత్త వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినప్పటికీ, అవి ప్రజల్లోకి రావడానికి కనీసం కొన్ని నెలల సమయం పడుతుంది.నిధుల కోత వల్లే..ఈ ఘోర తప్పిదానికి వైరస్ను గుర్తించడంలో జరిగిన ఆలస్యానికి అసలు కారణం ఆఫ్రికాలో లేదు.. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంది. గతంలో అమెరికా అంతర్జాతీయ సహాయ సంస్థ (USAID) ఆఫ్రికాలోని ఇటువంటి ప్రమాదకరమైన వైరస్లను కనిపెట్టడానికి "ప్రిడిక్ట్" (PREDICT) వంటి అత్యాధునిక నిఘా కార్యక్రమాలను నడిపేది. స్థానిక హెల్త్ వర్కర్లకు కొత్త వైరస్లను గుర్తించే శిక్షణ ఇచ్చేవారు. ల్యాబ్లకు అన్ని రకాల ఎబోలా స్ట్రెయిన్లను పరీక్షించే మల్టీ-ప్లెక్స్ కిట్లను సరఫరా చేసేవారు. అత్యవసర రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచేవారు.ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం..అయితే, అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ నిధుల్లో కోత విధించారు. ట్రంప్ ప్రభుత్వం "అమెరికా ఫస్ట్" (America First) పాలసీలో భాగంగా విదేశీ సహాయ నిధులను భారీగా తగ్గించింది. దీంతో, కాంగో దేశానికి ఇచ్చే ఆరోగ్య నిధులు ఒకే సంవత్సరంలో 33 మిలియన్ డాలర్ల నుండి 10 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. నిధులు లేకపోవడంతో కాంగోలోని అనుభవజ్ఞులైన నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. ల్యాబ్లలో ఆధునిక కెమికల్స్ (Reagents) కొరత ఏర్పడింది.ఈ సంక్షోభంపై అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందించారు. అయితే ఆయన మాటలు ఆఫ్రికా దేశాలను మరింత బాధించాయి. రూబియో మాట్లాడుతూ.. అమెరికా మొదటి ప్రాధాన్యత మా దేశ సరిహద్దులను కాపాడుకోవడం మరియు ఏ ఒక్క ఎబోలా కేసు కూడా అమెరికా గడ్డపైకి రాకుండా చూసుకోవడమే అని ప్రకటించారు. అయినప్పటికీ, నష్టం తీవ్రతను గమనించిన అమెరికా... తాను గతంలో కట్ చేసిన నిధుల కంటే రెట్టింపు మొత్తం, అంటే 23 మిలియన్ డాలర్లను అత్యవసర సహాయంగా ప్రకటించింది.ఆరోగ్య నిపుణుల హెచ్చరిక.. ఆరోగ్య నిపుణులు ఒకే ఒక్క మాట చెబుతున్నారు. వైరస్ ఒక దేశంలో పుడితే అది అక్కడే ఆగిపోదు. ప్రపంచంలో ఏ ఒక్క మూల వైరస్ ఉన్నా, అది ప్రపంచ మొత్తానికి ప్రమాదకరమే. విదేశీ సహాయాన్ని కేవలం ‘దానం’ లాగా చూడకుండా, ప్రపంచ భద్రత కోసం చేసే పెట్టుబడిగా చూడాలని, నిధులు కట్ చేస్తే ఎలాంటి విపత్తులు వస్తాయో చెప్పడానికి ఈ 2026 ఎబోలా సంక్షోభమే ఒక సజీవ ఉదాహరణ అని హెచ్చరిస్తున్నారు.
జాతీయం
అద్భుత చికిత్సల పేరుతో మోసం.. పతంజలి ఉత్పత్తులు సీజ్
ముంబై: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వ్యక్తులు, సంస్థలపై ఇకపై కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (FDA) స్పష్టం చేసింది. తప్పుడు వైద్య ప్రకటనలు, అద్భుత చికిత్సల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.73 లక్షల మందులను అధికారులు స్వాధీనం చేశారు. తనిఖీల్లో భాగంగా 33 మంది అరెస్ట్ చేసి 27 సంస్థలను సీజ్ చేశారు. కాగా, పతంజలి బ్రాండ్తో విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులు కూడా ఈ దాడుల్లో పట్టుబడటం గమనార్హం.ఈ సోదాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలో ఇటీవల ఎఫ్డీఏ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తుకారం ముండే ప్రజారోగ్య పరిరక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మే 25న బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, చట్టవిరుద్ధ ఔషధ తయారీ, విక్రయాలు, ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆ ఆదేశాల మేరకు మే 29న మహారాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి భారీ తనిఖీలు నిర్వహించారు. ముంబై, కొంకణ్, పూణే, నాసిక్, అమరావతి, నాగపూర్, శంభాజీనగర్ ప్రాంతాల్లో డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్) యాక్ట్-1954ను ఉల్లంఘిస్తున్న సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపారు.నివారణ పేరుతో మోసంపలు సంస్థలు తమ ఆయుర్వేద, హెర్బల్ ఔషధాలను ప్రచారం చేస్తూ క్యాన్సర్, మధుమేహం, లైంగిక సమస్యలు, స్థూలకాయం, వంధ్యత్వం వంటి తీవ్రమైన వ్యాధులను పూర్తిగా నయం చేస్తామని ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు "100 శాతం ఫలితం", "శస్త్రచికిత్స అవసరం లేదు", "కొద్ది రోజుల్లో వ్యాధి మాయం" వంటి వాదనలతో ప్రజలను ఆకర్షిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, సరైన వైద్య చికిత్సకు దూరం చేసే ప్రమాదం ఉందని ఎఫ్డీఏ పేర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్, స్థానిక టీవీ ఛానళ్లు, పత్రికలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ఈ ప్రచారం సాగుతున్నట్లు గుర్తించారు.భారీగా స్వాధీనం..రాష్ట్రవ్యాప్తంగా అధికారులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో మొత్తం రూ.73.24 లక్షల విలువైన ఆయుర్వేద, అల్లోపతి ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు.కొంకణ్ విభాగంలో – రూ.18.58 లక్షలుపుణే విభాగంలో – రూ.14.68 లక్షలునాగ్పూర్ విభాగంలో – రూ.7.26 లక్షలునాసిక్ విభాగంలో – రూ.7.10 లక్షలుగ్రేటర్ ముంబైలో – రూ.1.85 లక్షల మందులుఅదనంగా రూ.21.83 లక్షల విలువైన మిస్ బ్రాండెడ్ అల్లోపతి మందులు కూడా స్వాధీనం చేశారు.పతంజలి ఉత్పత్తులపైనా చర్యలుహరిద్వార్కు చెందిన దివ్యా ఫార్మసీ తయారు చేసిన, పతాంజలి బ్రాండ్తో విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులు కూడా ఈ దాడుల్లో పట్టుబడ్డాయి. తీవ్రమైన వ్యాధులకు హామీ చికిత్స ఇస్తామని ప్రచారం చేసిన నేపథ్యంలో వాటిపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 60 రకాల ఉత్పత్తులను కలిపి రూ.28.78 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేశారు.కఠిన హెచ్చరికఈ సందర్భంగా కమిషనర్ తుకారం ముండే మాట్లాడుతూ..‘ప్రజల ఆరోగ్యంతో ఆటలాడేవారిని వదిలిపెట్టం. తప్పుడు ప్రకటనలు, అక్రమ ఔషధాలు, కల్తీ ఆహారంపై మరింత కఠిన చర్యలు తీసుకుంటాం’ అనిహెచ్చరించారు. మొత్తంగా కమిషనర్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడులు కల్తీ ఆహారం, తప్పుడు వైద్య ప్రకటనల మాఫియాకు గట్టి హెచ్చరికగా మారాయి.
రూ.2 లక్షల బైక్.. కేవలం రూ.500కే అమ్మేశాడు!
తిరువొత్తియూరు: చెన్నై సమీపం అయపాక్కంలో ఇంటి ముందు పార్క్ చేసిన మోటార్ సైకిల్ను దొంగిలించి, దాని భాగాలను విడదీసి కేవలం 500 రూపాయలకే పాత ఇనుప సామా న్ల కొట్టులో అమ్మేసిన వింత ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయపాక్కం ప్రాంతానికి చెందిన భరత్ వేల్ ఒక ప్రైవేట్ కంపెనీ లో పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాత్రి సమయంలో తన బైక్ను ఎప్పటిలాగే ఇంటి ముందు నిలిపి ఉంచారు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో షాక్కు గురయ్యారు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో అయపాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భరత్ వేల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో బైక్ దొంగిలించిన వ్యక్తి దానిని నేరుగా అమ్మకుండా, విడిభాగాలను వేరు చేసి ఒక పాత ఇనుప సామాన్ల అంగడిలో కేవలం 500 రూపాయలకే అమ్మినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిని అనుసరించి పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అర్ధరాత్రి బైక్ దొంగిలించిన వ్యక్తి దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులను బురిడీ కొట్టించి తక్కువ ధరకే బైక్ అమ్మేసిన ఆ గుర్తుతెలియని వ్యక్తి కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
ఒక్కసారి సీఎం కాదు, డీకేకు తిరుగే లేదు : గురూజీ జోస్యం
సాక్షి, చెన్నై: కర్ణాటకలో నాయకత్వ మార్పుకు సన్నాహాలు జరుగుతున్న వేళ, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ శాసనసభాపక్ష (CLP) నాయకుడిగా ఎన్నికవడం, సీఎం పదవిని దక్కించుకోవడం ఇక లాంఛనప్రాయమేననిఅందరూ భావిస్తున్నారు ఈ క్రమంలో డీకే రాజకీయ ప్రస్థానం సుదీర్ఘకాలం కొనసాగుతుందని జ్యోతిష్యుడు ద్వారకానాథ్ గురూజీ జోస్యం, ఆసక్తికరంగా మారింది.ప్రమాణ స్వీకారానికి సూచించిన తేదీలుమనీ కంట్రోల్ కథనం ప్రకారం డీకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ద్వారకానాథ్ గురూజీ మూడు అనుకూలమైన తేదీలుగా మే 31 (ఆదివారం), లేదంటే జూన్ 5, 6 శుక్ర, శని) సూచించారట.గురూజీ అంచనాలు డీకే శివకుమార్ కేవలం తాత్కాలిక లేదా ఒక్కసారి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి కాదని, ఆయన జాతకం చాలా బాగుందని గురూజీ తెలిపారు. ఆయన కర్ణాటక రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు కీలక పాత్ర పోషిస్తారని ప్రశంసించారు. శివకుమార్కు కాంగ్రెస్ అధిష్ఠానం (హైకమాండ్) పూర్తి మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: సీఎంగా డీకే.. జూన్ 3 ముహూర్తం : ఎందుకలా?2028 ఎన్నికల్లోనూ విజయంశివకుమార్ నాయకత్వంలోని దూరదృష్టి వల్ల కర్ణాటక రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుందని గురూజీ జోస్యంచెప్పారు. అయితే, వచ్చే (2028) అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన అసలైన ముఖ్యమంత్రి అవుతారని, ప్రస్తుతానికి ఆయనపై కేవలం బాధ్యతలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఇప్పుడు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, తదుపరి విడతలో ముఖ్యమంత్రి పదవిని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలని సూచించారు.కాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదించి, మంత్రివర్గాన్ని రద్దు చేసిన తర్వాత కర్ణాటకలో రాజకీయ వ్యూహాలు వేగవంతమయ్యాయి.శనివారం సాయంత్రం బెంగళూరులోని విధానసౌధలో జరగనున్న కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకో నున్నారు. ఈ రేసులో డీకే శివకుమార్ అందరికంటే ముందు వరుసలో ఉన్నారు, ఆయన ఎన్నిక దాదాపు ఖాయమని అందరూ భావిస్తున్నారు.
సీబీఎస్ఈ పోర్టల్పై సైబర్ దాడి!
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్ఈ రీవాల్యూయేషన్ పోర్టల్పై సైబర్ దాడి జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పేమెంట్ సిస్టమ్ హ్యాక్ కావడంతో.. కొంతసేపు అనధికారిక యాక్సెస్ జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది సైబర్ దాడేంకాదని.. సాంకేతిక సమస్య మాత్రమేనని ఇటు అధికారులు అంటున్నారు.పోర్టల్ లైవ్ అయిన సమయంలో ఈ సమస్య తలెత్తగా.. సుమారు 50 మంది విద్యార్థులు సిస్టమ్లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు సమాచారం. దీంతో కొన్ని సందర్భాల్లో చెల్లించాల్సిన ఫీజు రూ.1 నుంచి ఏకంగా రూ.67,000–రూ.68,000 వరకు మారిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ ఘటన సంబంధిత బ్యాంక్ పేమెంట్ గేట్వేతో అనుసంధానమైన వ్యవస్థలో గ్లిచ్ కారణంగా(సిస్టమ్లో బగ్ వల్ల వచ్చిన ఇష్యూ) జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సిస్టమ్ను నిలిపివేసి సమస్యను సమీక్షించారు.ఈ వ్యవహారంపై ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్ నిపుణులతో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బృందం కూడా దర్యాప్తు ప్రారంభించింది. పోర్టల్ కోడ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ను సమీక్షిస్తూ భద్రతను మరింత బలోపేతం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇకపై హెచ్డీఎఫ్సీతో పాటు ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను కూడా అదనపు పేమెంట్ గేట్వేలుగా అనుసంధానించినట్లు అధికారులు తెలిపారు. సిస్టమ్ను మరింత సురక్షితంగా, గ్లిచ్లేని విధంగా మార్చేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఎన్ఆర్ఐ
మేయర్ పీఠంపై ఇండియన్.. ఎవరీ తుషార్ కుమార్?
లండన్: తూర్పు ఇంగ్లాండ్లో 23 ఏళ్ల తుషార్ కుమార్ మేయర్ ఎన్నికల్లో గెలిచి యునైటెడ్ కింగ్డమ్ (UK) చరిత్రలోనే మేయర్ పీఠాన్ని అధిరోహించి అత్యంత పిన్నవయస్కుడైన భారతీయునిగా చరిత్ర సృష్టించారు. కింగ్స్ కాలేజ్ లండన్ నుండి పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన తుషార్ కుమార్, గత వారం జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్' (Elstree and Borehamwood) టౌన్ కౌన్సిల్ మేయర్గా బాధ్యతలు స్వీకరించారు.రాజకీయ ప్రస్థానంలేబర్ పార్టీకి చెందిన ఈ కౌన్సిలర్ 2023లో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్' టౌన్ కౌన్సిల్లో చేరారు. మేయర్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన డిప్యూటీ మేయర్గా కూడా సేవలందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తుషార్ కుమార్ మాట్లాడుతూ.. "23 ఏళ్ల వయసులో, యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ సంతతి మేయర్గా అధికారికంగా బాధ్యతలు చేపట్టడం నాకొక అద్భుతమైన గౌరవం" అని ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన స్థానిక ప్రజలకు, కౌన్సిలర్లకు, కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.మాజీ మేయర్ డాన్ ఓజారోవ్ అందించిన మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు తెలిపిన తుషార్.. కొత్త డిప్యూటీ మేయర్గా ఎన్నికైన కౌన్సిలర్ లిండా స్మిత్కు స్వాగతం పలికారు.లక్ష్యాలు లండన్లో విద్యార్థిగా ఉన్నప్పుడే కౌన్సిలర్గా ఎన్నికైన తుషార్, నిజమైన మార్పు అనేది స్థానిక సంఘాల స్థాయి నుంచే మొదలవుతుందని, యువతను ప్రజా సేవ వైపు, సామాజిక జీవితం వైపు ప్రేరేపించడమే తన ప్రధాన లక్ష్యమని తుషార్ పేర్కొన్నారు. తన మేయర్ పదవీ కాలంలో స్థానికంగా ఉన్న పేద ప్రజలకు సహాయం చేసే 'WD6 ఫుడ్ సపోర్ట్' (WD6 Food Support) అనే స్వచ్ఛంద సంస్థకు ప్రధాన చారిటీగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుతెలిపారు. తుషార్ కుమార్ తనలో ఆత్మవిశ్వాసాన్ని, పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కింగ్స్ కాలేజ్ లండన్లోని 'సివిక్ లీడర్షిప్ అకాడమీ' ఎంతగానో సహాయపడిందని చెప్పారు. అలాగే విద్యార్థిగా ఉన్నప్పుడు 'యూనివర్శిటీ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్' లో కూడా ఆయన అనుభవాన్ని గడించారు. గతంలో ఆయన బ్రిటన్ ప్రభుత్వ 'డిపార్ట్మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్' (DWP) లో పాలసీ అడ్వైజర్గా, అలాగే ఒక జాతీయ LGBTQ చారిటీ సంస్థలో రీసెర్చ్ అనలిస్ట్గా పనిచేశారు. 'బుక్మార్క్ రీడింగ్ చారిటీ' ద్వారా అక్షరాస్యత కార్యక్రమాలకు కూడా ఆయన మద్దతు అందించారు.
ఆమె ఐస్క్రీమ్ బ్రాండ్కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..
ఫుడ్తో కొంగొత్త పరిచయాలే కాదు..ఓ దేశాన్నే మైమరిపించొచ్చు. ఎంతటి శత్రుత్వాలు, కోపతాపలు..ఒక్క విందుతో సమసిపోతాయి. అలాంటి టేస్టీ ఫుడ్తో ఇతర దేశాల మనసును దోచుకుని కోట్లు ఆర్జించడం మాటలు కాదుకదా. అలాంటి ఘన విజయాన్నే అందుకుంది ఈ భారత సంతతి మహిళ. మన భారతీయ రుచులను జోడించి తయారు చేసిన ఐస్క్రీమ్ బ్రాండ్తో దూసుకుపోతూ..శెభాష్ అనిపించుకుంటోంది పూజా బావిషి. ఎవరామె అంటే..భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పూజా బావిషి, 'మలై' అనే ఐస్ క్రీమ్ బ్రాండ్తో అమెరికన్లను ఆకట్టుకుంటోంది. ఇది ఏడాదికి రూ. రెండు వేల కోట్లు టర్నోవర్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఇద హోల్సేల్ ఈ కామర్స్ వ్యాపారంగా మారింది. 46 ఏళ్ల వ్యవస్థాపకురాలు, సీఈఓ 2015లొ ఈ మలైని ప్రారంభించారు. ఈ వ్యాపారం న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలలో నాలుగు దుకాణాలను నిర్వహిస్తోంది. చాలామటుకు ఐస్క్రీమ్లలో చాక్లెట్, వెనిలా వంటి ఫ్లేవర్లు చూశాం. కానీ అంతకుమించిన రుచి కోసం మలై వంటి వెరైటీ టేస్ట్ని పరిచయం చేశారు. దీని తయారీలో ఉపయోగించిన యాలకులు, గులాబీ, కుంకుమపువ్వు, జాజికాయ వంటి రుచులను జోడించడంతో అమెరికా వాసుల మనసులను దోచుకుంది ఈ మలై ఐస్ క్రీమ్. ఈ కంపెనీ 2025లోనే సుమారు రూ. రెండు వేల కోట్లు పైనే ఆర్జించేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతకుముందు ఏడాది 2024, 2025 సంత్సరాలలో సంస్థ లాభదాయకంగా సాగింది. ఇక పూజా విద్యా నేపథ్యం వచ్చేసి..బావిషి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అర్బన్ ప్లానింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే ఆమె ఆమె వాషింగ్టన్ డిసి-ఆధారిత లాభాపేక్షలేని సంస్థ అయిన ఈక్వల్ రైట్స్ సెంటర్లో పౌర హక్కుల ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేశారు.వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చిందిలా..స్నేహితులకు ఇంట్లో తయారు చేసిన ఐస్క్రీంల రుచి చూపించినప్పుడు వ్యాపారం చేయాలనే ఆలోచనకు అంకురార్పణ చేసినట్లు గుర్తు చేసుకుంది. అల్లం-స్టార్ సోంపు ఐస్ క్రీమ్ - ఒక డిన్నర్ పార్టీలో తక్షణమే అందర్నీ ఆకట్టు కోవడంతో..ఇలాంటి టేస్టే టేస్టీ ఐస్క్రీం షాపు పెట్టాలని భావించారట ఆమె. అయితే తన ఉత్పత్తులు మార్కెట్లో క్లిక్ అవుతాయో లేతో అన్న సందేహం మాత్రం బాగా ఉండేదని చెప్పుకొచ్చారామె. అయితే తన షాపుకు వచ్చే కస్టమర్ ఎలాంటి ఫ్లేవర్ కోరుకుంటున్నారు అనేది నిశితంగా గమనిస్తూ..టేస్టీ, టేస్టీ..మలై ఐస్క్రీమ్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే తన షాపు కి వచ్చే కస్టమర్ ఎవరు?, వాళ్లకేం కావాలన్నదే పూర్తిగా అవగాహన ఉండాలని, లేదంటే వ్యాపారం లాభదాయకంగా ఉండదని అంటోంది. అలాగే తాను కేవలం లాభాల మీదే గాక, వ్యాపార విస్తరణపై కూడా దృష్టిపెట్టానని అన్నారు. అలాగే తాను వ్యాపారాన్ని చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి..అన్ని విధాల క్లిక అవుతుందని నమ్మకం కొనసాగేక ముందుకు తీసుకెళ్లానని అన్నారు. అలాగే భారతీయ రుచులు ప్రయోగాత్మకమైనవి కావు, ఈ రుచులను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఎంతో ఇష్టంగా ఆస్వాదించడం విశేషం. పైగా మార్కెట్ పరంగా అగ్రస్థానంలో ఉంది. అందుకు చాలా గర్వకారణంగా ఉందంటోంది పూజ. View this post on Instagram A post shared by Malai (@malai_icecream) (చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..)
నో వీసా, నో సిటిజన్షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?
లండన్: విద్యాభ్యాసం కోసం స్టూడెంట్ వీసాపై స్కాట్లాండ్కు వచ్చిన తమిళనాడు విద్యార్థి క్యూ మణివణ్ణన్ రాజకీయపథంలో పయనించి పార్లమెంట్లో అడుగుపెట్టడం ఇప్పుడు అక్కడ సరికొత్త చర్చకు దారితీసింది. విదేశీ విద్యార్థులు విదేశీగడ్డపై చదువుకుని ఉన్నతస్థాయిలో స్థిరపడాల్సిందిపోయి విదేశీ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గతేడాది తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో విదేశీ విద్యార్థులూ ఎన్నికల రణక్షేత్రంలో పోటీపడేందుకు అవకాశం చిక్కింది. ఈ సువర్ణావకాశాన్ని మణివణ్ణన్ అందిపుచ్చుకుని స్కాటిష్ గ్రీన్పార్టీ తరఫున ఎడిన్బర్గ్ అండ్ లూథియన్స్ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. దీంతో మెంబర్ ఆఫ్ స్కాటిష్ పార్లమెంట్(ఎంఎస్పీ) సభ్యుడయ్యాడు. తాత్కాలిక వీసాపై వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన తొలి విదేశీ అభ్యర్థిగా మణివణ్ణన్ చరిత్రసృష్టించాడు. తమిళనాడులో పుట్టిన ఇతను 2021లో స్కాట్లాండ్కు వచ్చాడు. ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు కోర్సులో పీహెచ్డీ విద్యారి్థగా చేరాడు. కనీసం మూడేళ్లుగా బ్రిటన్లో ఉంటున్న, శాశ్వత స్థిరనివాస హోదా లేని విదేశీ పీహెచ్డీ విద్యార్థులూ స్కాట్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయొచ్చని గతేడాది చట్టసవరణ తీసుకొచ్చారు. దీంతో పరిపాలనలో వైవిధ్యం చూపేందుకు తానూ ఎన్నికల యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టానని ట్రాన్స్జెండర్ అయిన మణివణ్ణన్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. గ్రీన్స్ పార్టీ పాలస్తీనా సంఘీభావ విభాగానికి కో–కన్వీనర్గా పనిచేశాడు. గతంలో ఐక్యరాజ్యసమితి ఆరోగ్య, దివ్యాంగ కార్యకర్తగా పనిచేశాడు. తానో తమిళ వలసదారుడినని ప్రచారం చేసుకున్నాడు. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనువిదేశీయుడు మనకు ఎలా ప్రాతినిథ్యం వహించగలడని ప్రత్యర్థి పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా కాలపరిమితి ముగిసేలోపే అతని వీసా గడువు ముగిస్తే బ్రిటన్ గడ్డపై ఉండేందుకు అతను అర్హత కోల్పోతాడు. అప్పుడు అతను స్కాట్లాండ్ను వీడక తప్పదు. అప్పుడు ఎడిన్బర్గ్, లూథియన్స్ ప్రాంతవాసుల బాగోగులను ఎవరు పట్టించుకుంటారు? ఎంపీ లేకుండా ఒక నియోజకవర్గం అలా నిస్సహాయంగా మిగిలిపోవాలా? దీనిని పరిష్కారం ఏంటి? స్కాట్లాండ్ స్థానిక ప్రజల సంస్కృతి, సంప్ర దాయాలు, అవసరాలకు అనుగుణంగా జరిగే చట్టాలు, విధాన నిర్ణయాల్లో మణివణ్ణన్ మేరకు క్రియాశీలక పాత్ర పోషించగలడు? అంటూ ప్రశ్నల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. విదేశీ విద్యార్థుల మార్గదర్శకంలో నడవడమేంటి? అంటూ వలసల వ్యతిరేక యూకే విభాగ షాడో చాన్స్లర్, మాజీ ఎంపీ రాబర్ట్ జెన్రిక్ అన్నారు. అయితే ఈ అంశంలో మణివణ్ణన్కు గ్రీన్స్ పార్టీ అండగా నిలిచింది. అతని వీసా ఖచి్చతంగా రెన్యూవల్అయ్యేలా చూస్తామని పార్టీ నేత గిలియన్ మెకే తెలిపారు. వామపక్ష భావాలున్న గ్రీన్స్ పార్టీ తాజా ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఇదీ చదవండి: విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం
ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి, భారత సంతతికి చెందినకమలా ప్రసాద్-బిస్సెసర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని తన పూర్వీకుల మూలాల పట్ల ప్రగాఢమైన గర్వాన్ని వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన ఆమె, తన మూలాలను గుర్తుచేసుకుంటూ, ఒకప్పుడు అవమానకరంగా భావించిన పదాన్ని ఆత్మగౌరవానికి చిహ్నంగా ఎలా మార్చుకున్నారో వివరించారు.భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ట్రినిడాడ్లో (మే 8-9 తేదీలలో) పర్యటన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కమలా మాట్లాడుతూ, తన భారతీయ గుర్తింపు కారణంగా ఇప్పటికీ తనను అవమానించాలని ప్రయత్నిస్తున్న వారికి కమలా ప్రసాద్ తగిన విధంగా సమాధానమిచ్చారు.ట్రినిడాడ్లో నేటికీ అనేక చోట్ల భారతీయులను 'కూలీలు' అని పిలుస్తారని, ఇది ఒక అవమానకరమైన పదంగా పరిగణించబడుతుందని కమలా ప్రసాద్ అన్నారు. "కానీ నేను ఈ విషయంలో ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఆ 'కూలీల' కష్టం, రక్తం, చెమట వల్లే ఈ దేశం అభివృద్ధి చెందింది. ఈ రోజు ఒక కూలీ కూతురు ట్రినిడాడ్ ప్రధానమంత్రి అయినందుకు గర్వపడుతున్నాను" అని ఆమె ఎంతో గర్వంగా చెప్పారు. ఆమె ప్రకారం, తన భారతీయ గుర్తింపు పట్ల ఆమెకు ఎలాంటి కలత గానీ, సిగ్గు గానీ లేదు.ట్రినిడాడ్లోని జనాభాలో సుమారు 45 శాతం మంది భారతీయ సంతతికి చెందినవారని ప్రధానమంత్రి కమలా ప్రసాద్ అన్నారు. బ్రిటిష్ వారు భారతీయ కార్మికులను బానిసలుగా ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు, వారు తమతో పాటు రామాయణం, గీత, ఖురాన్ను కూడా తీసుకొచ్చారని చెప్పారు. వారికి ఆంగ్లం తెలియకపోయినా, ఎన్నో అఘాయిత్యాలను ఎదుర్కొన్నప్పటికీ, వారు తమ ప్రాచీన భారతీయ నాగరికత, భాష, సంస్కృతిని పరిరక్షించుకున్నారని ఆమె వెల్లడించారు.అంతేకాదు చారిత్రాత్మక పర్యటన సందర్భంగా కమలా ప్రసాద్ ఒక సంచలన ప్రకటన చేశారు. భారతీయుల గౌరవార్థం నెల్సన్ ఐలాండ్ పేరును మార్చనున్నట్లు తెలిపారు. 1866 నుండి 1917 వరకు, ఈ ద్వీపాన్ని భారతీయ ఒప్పంద కార్మికుల కోసం ఒక ల్యాండింగ్ స్టేషన్గా, క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించారు. భారతీయ పూర్వీకులను గౌరవిస్తూనే, ప్రజలను సంప్రదించి, కొత్త పేరును సూచించమని కోరతామని ఆమె అన్నారు. ప్రధానమంత్రి కమలా ప్రసాద్తో పాటు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా నెల్సన్ ఐలాండ్ను సందర్శించారు. భారత్-ట్రినిడాడ్ మధ్య 150 ఏళ్ల సంబంధాలకు ఇది కొత్త బలాన్ని చేకూరుస్తున్నందున, ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.కేంద్ర మంత్రి జై శంకర్ పర్యటన చారిత్రాత్మకమైన నెల్సన్ ద్వీపంలో ఉండటం నిజంగా చాలా ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి జై శంకర్సంతోషం వ్యక్తం చేశారు. సరిగ్గా 180 సంవత్సరాల క్రితం, భారతదేశం మరియు ట్రినిడాడ్-టొబాగోల చరిత్రలో తొలి అడుగు ఇక్కడే పడిందని గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు, ధైర్యవంతులైన భారతీయులు తమ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొని, కొత్త జీవితాలను ఎలా నిర్మించుకున్నారో ఆలోచించడం సహజమనీ అంటూ వారి ధైర్యసాహసాలకు, వారి సంకల్పానికి , వారి దృఢ నిశ్చయానికి నమస్సులు అందజేశారు.వారు జీవన విధానాన్ని, సంప్రదాయాలను , విశ్వాసాన్ని తమతో పాటు తీసుకువచ్చారు. నిజానికి, తమతో పాటు ఒక సంపూర్ణ నాగరికతను తీసుకువచ్చారు. వీటిని ఒక వారసత్వ ప్రదేశంగా భవిష్యత్ తరాల కోసం నమోదు చేయడం ఎంతైనా సముచితమని తెలిపారు. భారతదేశ గ్రాంట్ సహాయంతో నెల్సన్ ద్వీపంలోని సాంస్కృతిక వారసత్వాన్ని ఉన్నతీకరించడానికి ఉద్దేశించిన ఒక క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలోకార్యక్రమంలో జై శంకర్ పాల్గొన్నారు. కమలా ప్రసాద్ ఘనతభారత సంతతికి చెందిన కమలా ప్రసాద్-బిస్సేసర్ 2010లో ట్రినిడాడ్ మరియు టొబాగోకు మొదటి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. 2010లో మొదటిసారి, ఆ తరువాత 2026లో కూడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.ఆమె వ్యక్తి. బ్రిటీష్ పాలనలో భారతదేశం నుండి చెరకు తోటలలో పనిచేయడానికి 'గిర్మిటియా' కార్మికులుగా వెళ్లిన వారి వారసురాలు ఆమె. 19వ శతాబ్దంలో బ్రిటీష్ వారు భారతదేశం నుండి ఒప్పంద కార్మికులను (Indentured Labourers) కరేబియన్ దేశాలకు తరలించారు. వారిని తక్కువ చూపు చూస్తూ "కూలీ" అని పిలిచేవారు. ఇది ఒక జాతి వివక్షతో కూడిన పదంగా (Racial Slur) ఉండేది. View this post on Instagram A post shared by Ministry of Health T&T (@minhealthtt)
క్రైమ్
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు డిలీట్ చేశారు?
సాక్షి, హైదరాబాద్: పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి సాయి భగీరథ్ మూడు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. చివరి రోజైన శుక్రవారం పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్ను లోతుగా విచారించారు. గత డిసెంబర్ 31న ఓ మైనర్ బాలికకు బలవంతంగా మద్యం తాగించి, ఆమె అపస్మారక స్థితిలో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో భగీరథ్పై ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. కేసు నమోదైన రోజునే భగీరథ్ తన సెల్ఫోన్ను ఫార్మాట్ చేయడంతో పాటు ఇన్స్ట్రాగామ్ అకౌంట్ను డిలీట్ చేశాడని సాంకేతిక విచారణలో పోలీసులు గుర్తించారు. ఈ సాంకేతిక ఆధారాలను నిందితుడి ముందుంచిన పోలీసులు.. డేటా డిలీట్ చేయడంలో అతనికి సహకరించిన వారు ఎవరు? అనే కోణంలో ఆరా తీశారు. బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించిన సమయంలో భగీరథ్ ఎక్కడున్నాడనే అంశంపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. భగీరథ్పై పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదైన రోజునే, కరీంనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేశాడా? లేక పోలీసులు వచ్చి ఫిర్యాదు తీసుకున్నారా? అనే కోణంలో ప్రశ్నలు అడిగారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ నిందితుడు సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు తెలిసింది. కస్టడీ అనంతరం భగీరథ్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
రూ.2 లక్షల బైక్.. కేవలం రూ.500కే అమ్మేశాడు!
తిరువొత్తియూరు: చెన్నై సమీపం అయపాక్కంలో ఇంటి ముందు పార్క్ చేసిన మోటార్ సైకిల్ను దొంగిలించి, దాని భాగాలను విడదీసి కేవలం 500 రూపాయలకే పాత ఇనుప సామా న్ల కొట్టులో అమ్మేసిన వింత ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయపాక్కం ప్రాంతానికి చెందిన భరత్ వేల్ ఒక ప్రైవేట్ కంపెనీ లో పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాత్రి సమయంలో తన బైక్ను ఎప్పటిలాగే ఇంటి ముందు నిలిపి ఉంచారు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో షాక్కు గురయ్యారు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో అయపాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భరత్ వేల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో బైక్ దొంగిలించిన వ్యక్తి దానిని నేరుగా అమ్మకుండా, విడిభాగాలను వేరు చేసి ఒక పాత ఇనుప సామాన్ల అంగడిలో కేవలం 500 రూపాయలకే అమ్మినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిని అనుసరించి పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అర్ధరాత్రి బైక్ దొంగిలించిన వ్యక్తి దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులను బురిడీ కొట్టించి తక్కువ ధరకే బైక్ అమ్మేసిన ఆ గుర్తుతెలియని వ్యక్తి కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
ప్రియురాలిని చంపి.. భర్తకు ఫోన్ చేసిన ప్రియుడు..!
ఏలూరు టౌన్: అనుమానం పెనుభూతంగా మారింది... ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధం కాస్తా... పగ, ప్రతీకారానికి దారితీశాయి... డబ్బులు ఇస్తానని నమ్మబలికి ఊరు తీసుకువెళ్ళి అత్యంత కిరాతకంగా చంపేశాడు... ఐదు రోజుల అనంతరం మృతదేహాన్ని గుంతతవ్వి పూడ్చిపెట్టాడు. ఈ ఘోరహత్యకు సంబంధించి ఏలూరు త్రీటౌన్లో నమోదైన మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులకు విస్తుగొలిపే నిజాలు వెలుగుచూశాయి. ఏలూరు త్రీటౌన్ పోలీసులు అత్యంత చాకచక్యంగా, అత్యాథునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏలూరు పోలీస్సబ్ డివిజన్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఏలూరు శివారు శౌరీపురం గ్రామానికి చెందిన మల్లపల్లి విశాలి (36) ఏప్రిల్ 18న గుడివాడలోని బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లింది. విశాలి ఇంటికి రాకపోవటంతో భర్త, బంధువులు కంగారుపడ్డారు. ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో భర్త ఆందోళనతో ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్రైమ్నెంబర్ 81/2026, విమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఏలూరు త్రీటౌన్ సీఐ వి.కోటేశ్వరరావు, ఎస్సై పి.రాంబాబు బృందాలుగా మహిళ కదలికలపై నిఘా ఉంచారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దర్యాప్తు చేపట్టగా... శౌరీపురం గ్రామానికే చెందిన ఫ్రాన్సిస్ శౌరి (36) పాలవ్యాపారితో ఆమె నిత్యం ఫోన్ మాట్లాడినట్లు గుర్తించారు. మిస్సింగ్ కేసు విచారణ సమయంలో ఫ్రాన్సిస్ గ్రామంలో లేకపోవడంతో పోలీసుల అనుమానం బలపడింది. పాలవ్యాపారి ఫ్రాన్సిస్ విశాలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ రూ.2 లక్షలు వడ్డీకి అప్పు ఇచ్చినట్లు గుర్తించారు. ఇద్దరి మద్య వివాహేతర సంబంధం కొనసాగుతూ ఉండగానే, మరోవైపు విశాలి ఇతర వ్యక్తులతో ఫోన్ మాట్లాడుతుందనే అనుమానాన్ని పెంచుకున్నాడు. ప్రియురాలిపై మోహం కాస్తా, కక్షగా మారింది. ఆమెను హతమార్చాలని పథకం రచించాడు. చున్నీతో గొంగు బిగించి... పెద్దరాయితో మోది హత్య ప్రియురాలిని హత్య చేయాలనే పధకంతో ఏప్రిల్ 18న డబ్బులు ఇస్తానని నమ్మించి విశాలిని హనుమాన్ జంక్షన్కు రావాలని చెప్పాడు. ఆమెను మోటారు సైకిల్పై నూజివీడు మండలం పల్లెర్లమూడి, పోలవరం కాలువ గట్టు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. విశాలి చున్నీతో ఆమె గొంతు బిగించి ఊపిరాడకుండా చేశాడు. కిందపడిపోయిన ఆమెపై పెద్దరాయితో ఛాతీపై బలంగా మోదాడు. కిరాతకమైన దాడిలో విశాలి ప్రాణాలు కోల్పొయింది. హత్య చేసిన అనంతరం పొదల్లో పడేసి మెల్లగా జారుకున్నాడు. ఐదు రోజుల అనంతరం ఏప్రిల్ 23న సంఘటనా స్థలానికి వెళ్లిన ఫ్రాన్సిస్ ఆమె మృతదేహాన్ని లోతుగా గుంతతవ్వి పూడ్చిపెట్టాడు. ఆమె బట్టలు, వస్తువులను దగ్ధం చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించేందుకు ఆమె బతికే ఉందనే భ్రమ కలి్పస్తూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ విశాలి ఫోన్ నుంచి భర్తకు వాట్సాప్ చాటింగ్ చేయటం, ఫోన్ చేసి లిఫ్ట్ చేశాక మాట్లాడకుండా ఉంటూ వారితో ఆటలాడాడు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ పగులగొట్టి, చెరువులో పడేశాడు. ఎట్టకేలకు ఛేదించిన పోలీసులు ఏలూరు త్రీటౌన్ పోలీసులు పక్కా సమాచారంతో ఈనెల 28న ఏలూరు హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో నిందితుడు ఫ్రాన్సిస్ను మోటారు సైకిల్తో అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని అంగీకరిస్తూ నూజివీడు పల్లెర్లమూడి శివారులో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశానికి పోలీసులు వెళ్ళిన అనంతరం నూజివీడు తహసీల్దార్ సమక్షంలో శవాన్ని వెలికితీశారు. మహిళ మిస్సింగ్ కేసును హత్య కేసు, ఆధారాల నిర్మూలన సెక్షన్లు 103(1), 238(ఏ)బీఎన్ఎస్ గా మార్పు చేశారు. బంధువుల అదనపు స్టేట్మెంట్లు రికార్డు చేసి, నేరస్థలంలో పక్కా ఆధారాలు సేకరించి, నిందితుడ్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించిందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ తెలిపారు. ఈ కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన త్రీటౌన్ సీఐ వి.కోటేశ్వరరావు, ఎస్సై పి.రాంబాబు, సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.
నా కోడిని చంపినోళ్లను వదలొద్దు
నల్గొండ జిల్లా: ఆ నిరుపేద మహిళకు అది కేవలం ఒక పక్షి కాదు. ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంది. ఆ కోడి హఠాత్తుగా కళ్లముందే ప్రాణాలు విడుస్తుంటే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఎవరో పెట్టిన విషానికి ఆ జీవి బలైందని తెలిసి, ఆవేదనతో చనిపోయిన తన కోడిపుంజును పట్టుకుని న్యాయం కోసం పోలీస్స్టేషన్ మెట్లెక్కింది. జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం గ్రామానికి చెందిన ఎల్లమళ్ల చంద్రకళ తన ఇంట్లో ఒక కోడిపుంజును పెంచుకుంటుంది. గురువారం ఉదయం వరకు చురుగ్గా తిరిగిన ఆ కోడిపుంజు హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఎవరో దానికి కావాలనే విషం పెట్టి చంపేశారని ఆమెకు అర్థమైంది. ‘నా కోడి నాకు కావాలి.. దాన్ని చంపినోళ్లను వదలొద్దు’ అంటూ రోదించింది. చనిపోయిన కోడిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలో కొంతమందిపై తనకు ఉన్న అనుమానాలను పోలీసులకు వివరించింది.
వీడియోలు
దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో
MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు
REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే
భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం
రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు
గుర్తుపెట్టుకో.. మాకూ ఒక రోజొస్తుంది, హైపర్ ఆదికి గుబాపగిలేలా వార్నింగ్
ఖర్జూరనాయుడు లేదా చంద్రబాబులా ఉండాలి! బాగా ప్లాన్ చేశావ్ బాబు..
కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం
Weather Update: వర్షాలు ఇప్పట్లో లేవు
సామ్రాజ్యాన్ని కూల్చేసిన గిల్-సుదర్శన్..!


