తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..
చాలామంది కెరీర్లో చాలా ఓటములు, నిరాశను ఎదుర్కొన్నవారే. ఆశించినట్లుగా ఉన్నత చదువును అందుకోలేక..నచ్చలేంది చదవలేక సతమతమవుతుంటారు. ముఖ్యంగా ఇతరులు సాధిస్తే..తానొక్కడే ఫెయిల్ అవ్వడం, ప్రతిదాంట్లో నిరాశ, నైరాశ్యం వెంటాడుతుంటే కుంగిపోతాం. కానీ ఇక్కడ ప్రయత్నం ఆగిపోకూడదు. ఈ రోజు ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఏదో ఒకరోజు తప్పక ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటాం అనేందుకు ఈ వ్యక్తే కథే ఉదాహరణ. నెట్టింట అతడి స్టోరీ వైరల్గా మారడమే కాదు స్ఫూర్తిగా నిలిచింది.వ్యవస్థాపకుడు, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్మీడియా వేదికగా 26 ఏళ్ల శౌర్య శిఖర్ విజయవంతమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఇది మొక్కవోని స్థైర్యంతో చివరికి సక్సెస్ని ఒడిసిపట్టుకున్న అందమైన విజయగాథ. ఐదేళ్ల క్రితం వరకు శౌర్య కెరీర్లో సెటిల్ అవ్వలేక చాలా ఇబ్బందిపడ్డ వ్యక్తి. అతను అందరిలా ఐఐటీ-జేఈఈ సాధించాలని కలలుగన్న వ్యక్తి. అయితే అతడు అందులో సక్సెస్ అవ్వలేకపోయాడు. తన తండ్రి ఐఐటీ అయ్యి ఉండి, తాను సాధించలేక పోవడం అతడ్ని మరింత కుంగదీసింది. తీవ్ర నిరాశతో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిబిఎ) డిగ్రీలో జాయిన్ అయ్యాడు. అదీ చదవలేక నానా పాట్లు పడ్డాడు. ఆ క్రమంలో ఏకంగా 110 కేజీల అధిక బరువుతో ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. కాలేజ్లో చదువుతున్నప్పుడే శౌర్య అంకుర్ వారికూ బృందంలో చేరాడు. కానీ శౌర్య నిరాశ, కెరీర్లో అనిశ్చితి, వ్యక్తిగత పోరాటాల మధ్య చిక్కుకుని తనకు భవిష్యత్తు అనేది ఉందా అని భయపడుతుండేవాడు. చెప్పాలంటే తను ఎందుకు పనిరానని భావంతో ఉండేవాడు. తనకెంతో ఇష్టమైన ఇంజనీరింగ్ కోర్సు చేయలేకపోయానని, బీబీఏ చేస్తున్న ఫూల్ని అని బాగా బాధపడేవాడు. ఇక ఎప్పటికీ తన లైఫ్ మంచిగా ఉండదేమో అని దిగులుతో ఉండేవాడు. కట్చేస్తే..సరిగ్గా ఐదేళ్ల తర్వాత అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 26 ఏళ్ల వయసులో శౌర్య మంచి కెరీర్ను నిర్మిచుకుని నెలకు లక్షల్లో జీతం ఆర్చించే స్థాయికి చేరుకున్నాడు. అంతేగాదు తన తండ్రి పదవీ విరమణ సందర్భంగా ఆయనకు ఏకంగా రూ. 55 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ కారుని కొనిచ్చాడు. విలాసవంతమైన కారు కోసం చెల్లించిన డౌన్ పేమెంట్ శౌర్య నికర ఆస్తిలో 5% కంటే తక్కువగా ఉందని, అలాగే ఈఎంఐ అతని నెలవారీ సంపాదనలో 7% కంటే తక్కువగా ఉంటుందని వారికూ వెల్లడించారు. అతనిలో వచ్చిన మార్పు కేవలం డబ్బుకే పరిమితం కాలేదు, ఏళ్లు గడిచే కొద్దీ..శౌర్య ఆరోగ్యం, ఫిట్నెస్పై దృష్టి సారించి ఫిట్గా మారాడు. ఇక్కడ శౌర్య కథ విలాసవంతమైన కారు, సంపద గురించి చెప్పడం లేదు. ఎదురు దెబ్బలు ఒక వ్యక్తి భవిష్యత్తుని నిర్దేశించవు, జీవితంలో ఒక దశ దారుణమైన వైఫల్యం ఎదుర్కొని ఉండొచ్చు. కానీ అదే క్రమంగా విభిన్నమైన మార్గానికి నాంది పలికి ఉన్నతమైన స్థానానికి చేరుకునేలా చేస్తుంది అనేందుకు శౌర్యనే ఉదాహరణ. కానీ ఇక్కడ జీవితంలో ఎదురయ్యే గడ్డుపరిస్థితులకు చేతులెత్తేయకుండా ముందుకు సాగడమే జీవితం అని నమ్మి..ప్రయత్నం ఆపకూడదనేది గ్రహించాలని అంటున్నారు అంకుర్ వారికూ. అలాంటి స్థితిలో ధైర్యంగా ముందుకు సాగినవాడు తప్పకుండా ఏదో ఒకనాటికి జీవితం మంచిగా సెటిల్ అవుతుందని అన్నారు. ఈ స్టోరీ నెటిజన్ల మనసుని తాకడమే కాదు..అత్యంత నిరాశ నిస్ప్రుహల మధ్య ఆశావాదం హాస్యస్పదంగా అనిపించినా.. ఇక్కడ శౌర్య కార్యాచరణలో నిమగ్నమే ముందుకు సాగాలనే దృక్పథాన్ని ఎంచుకోవడం నిజంగా అభినందనీయం. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా..ముందుకు సాగే వారే విజేతలు అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు.(చదవండి: చాయ్-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఏమన్నారంటే..)
అన్నంత పని చేసిన ఇరాన్.. ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. లెబనాన్ బీరూట్ శివార్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే.. ఇరాన్ రంగంలోకి దిగింది. నేరుగా బాలిస్టిక్ క్షిపణులతో ప్రతీకార దాడికి దిగింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతాల్లో సైరన్లు మోగగా, క్షిపణి నిరోధక వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. దీంతో ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగాయి. ఆదివారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం (IDF) వెల్లడించింది. క్షిపణుల ప్రయోగాన్ని గుర్తించిన వెంటనే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగించడంతో పాటు వైమానిక రక్షణ వ్యవస్థలను రంగంలోకి దింపింది. లక్షలాది మంది ప్రజలు అత్యవసర ఆశ్రయ కేంద్రాలు, బంకర్లకు పరుగులు తీశారు. ఉత్తర ఇజ్రాయెల్లో పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను వైమానిక దళం విజయవంతంగా అడ్డుకుందని తెలిపింది. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని పేర్కొంది. అయితే అదనపు క్షిపణుల ప్రయోగాలను కూడా గుర్తించినట్లు వెల్లడించింది.ప్రతీకారమే!ఈ క్షిపణి దాడులు జరగడానికి కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ శివార్లపై వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హిజ్బుల్లా ప్రభావం ఎక్కువగా ఉన్న దహియెహ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీరూట్పై దాడులు చేస్తే ప్రతీకారం తప్పదని ఇప్పటికే హెచ్చరించిన టెహ్రాన్, తాజాగా రంగంలోకి దిగినట్లే స్పష్టమవుతోంది.10 క్షిపణులు అడ్డుకున్న ఇజ్రాయెల్అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన కనీసం 10 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా మీడియా సంస్థ CNN తన నివేదికలో పేర్కొంది.ఇజ్రాయెల్ ప్రతీకార హెచ్చరికఇరాన్ దాడిపై స్పందించిన ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ Effie Defrin, "ఇరాన్ తీవ్రమైన తప్పు చేసింది" అని వ్యాఖ్యానించారు. అలాగే ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎయల్ జమీర్ మాట్లాడుతూ.. అవసరమైతే శత్రువుపై గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.ఏప్రిల్ తర్వాత..ఏప్రిల్ 8న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేయడం ఇదే మొదటిసారి. దీంతో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సున్నితమైన శాంతి వాతావరణం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇజ్రాయెల్-హెజ్బుల్లా ఘర్షణల నేపథ్యంలో అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను కూడా ఇరాన్ నిలిపివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో పాక్షిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, అదే రోజున రెండు పక్షాలు పరస్పరం దాడులు కొనసాగించడంతో ఆ ఒప్పందం నిలవలేదు.రమత్ డేవిడ్ ఎయిర్బేస్ లక్ష్యంగా..ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, తమ ఏరోస్పేస్ దళాలు ఇజ్రాయెల్లోని రమత్ డేవిడ్ ఎయిర్బేస్ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయి. ఇరాన్కు చెందిన ఖాతమ్ అల్-అన్బియా కమాండ్ అధికారి మాట్లాడుతూ, బీరూట్ దక్షిణ శివార్లపై దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్ అన్ని "రెడ్లైన్లను" దాటిందని ఆరోపించారు.అన్నంత పని చేసిన ఇరాన్"బీరూట్ శివార్లపై దాడులు విస్తరిస్తే ఆక్రమిత భూభాగాల్లోని లక్ష్యాలపై దాడి చేస్తామని ముందే హెచ్చరించాం. ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు ఆపకపోతే మరింత తీవ్రమైన, విధ్వంసకర దెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని ఇరాన్ సైనికాధికారులు హెచ్చరించారు.గగనతలం మూసివేతఇజ్రాయెల్పై క్షిపణి దాడుల అనంతరం ప్రతీకార చర్యలు ఉండొచ్చన్న అంచనాతో ఇరాన్ తన పశ్చిమ గగనతలాన్ని (Western Airspace) తాత్కాలికంగా మూసివేసింది. అదే సమయంలో ఇరాక్, సిరియా కూడా భద్రతా కారణాల దృష్ట్యా తమ గగనతలాన్ని మూసివేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో ప్రాంతీయ విమాన రాకపోకలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.అమెరికా లక్ష్యాలకూ హెచ్చరికఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) మరింత ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతమైతే కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా అమెరికా ప్రయోజనాలు, అమెరికా మద్దతు ఉన్న లక్ష్యాలపై కూడా దాడులు విస్తరించే అవకాశం ఉందని ప్రకటించింది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి పరిసరాల్లో జరిగిన ఘటనలను కూడా ప్రస్తావించింది.ట్రంప్ భిన్నాభిప్రాయంఅయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్ మరింత ప్రతీకార చర్యలకు వెళ్లాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రసార సంస్థ నివేదించింది. ఇది ఇజ్రాయెల్ సైన్యం వ్యక్తం చేస్తున్న కఠిన వైఖరికి భిన్నంగా కనిపిస్తోంది.మళ్లీ యుద్ధ భయాలుఇరాన్-ఇజ్రాయెల్ తాజా ఘర్షణతో మిడిల్ఈస్ట్ దేశాలు మరోసారి అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే గాజా, లెబనాన్, సిరియా ప్రాంతాల్లో కొనసాగుతున్న అస్థిర పరిస్థితులకు ఈ పరిణామం మరింత మంటలు రాజేసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘తమ్ముడూ విజయ్.. ప్రాణం ఒక్కసారే పోతుంది!’
సాక్షి, చైన్నై: తమిళనాడు సీఎం విజయ్పై అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.బి. ఉదయకుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాకముందు కూటమి కోసం ఎంతగానో మొత్తుకున్నారని, అప్పుడు ఒక చిన్న లెటర్ ప్యాడ్ పార్టీ గానీ, తమర్ని నమ్మి రాలేదరన్నారు. అయితే, ఇప్పుడు ఏదో మాయాజాలం జరిగి అధికారం దక్కేసరికి.. ఆ పవర్ను చూసి అందరూ తమరి వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్నారని విజయ్ను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. మదురై తెప్పకుళం మరియమ్మన్ ఆలయ కుంభాభిషేకం సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఉదయకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ వీడుతున్న అన్నాడీఎంకే నేతలపై, సీఎం విజయ్ రాజకీయ వ్యూహాలపై ఘాటుగా స్పందించారు. అన్నాడీఎంకే చావలేదు.. మళ్లీ పుంజుకుంటుందిపారీ్టలో కొన్ని విభేదాల వల్ల నేతలు శత్రువుల వైపు వెళ్తున్నారని, గతంలో ఎంజీఆర్, జయలలిత హయాంలోనూ నెడుంచెజియన్, ఎస్టీఎస్ వంటి పెద్ద నేతలు పార్టీని వీడి మళ్లీ తిరిగి వచ్చారని ఉదయకుమార్ గుర్తుచేశారు. సొంత పార్టీ విలువ తెలియక కొందరు ప్రేమ, ఆదరణ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్తుండటం బాధాకరమన్నారు. కొందరు చిల్లర గాళ్లు తమను చూసి నవ్వుతున్నారని, తాము కేవలం ఎన్నికల్లో ఓడిపోయామే కానీ, చచ్చిపోలేదన్నారు. అన్నాడీఎంకే ఎన్నో శోధనలు, వేదనలను తట్టుకుని నిలబడిన పార్టీ అని, కోట్ల మంది కార్యకర్తలే ఈ పార్టీకి బలమైన పునాదిగా పేర్కొన్నారు. విజయ్లు ఎంతమంది వచ్చినా తాము చూస్తాం్ఙ అని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ ఏదేని జరిగిన పక్షంలో అందుకు అన్నాడీఎంకేమాత్రం బాథ్యులు కాదన్నారు. విజయ్ తమ్ముడూ.. నీకు హెచ్చరిక ముఖ్యమంత్రి విజయ్ను ‘తమ్ముడు’ అని సంబోధిస్తూ ఉదయకుమార్ కీలక హెచ్చరికలు చేశారు ‘విజయ్ తమ్ముడూ.. ప్రాణం ఒక్కసారే పోతుంది. నీకు హెచ్చరికగా, ప్రేమతో చెబుతున్నాను. జీవితం అనేది ఒకవృత్తం, పైన ఉన్నది కిందకు రావడం ప్రకృతి నియమం. కష్టపడి నమ్ముకున్న వాళ్లతో పార్టీ నడిపితే ఫలితం ఉంటుంది కానీ, దొరికిన వాళ్లనల్లా చేర్చుకుని పార్టీ నడిపితే లాభం లేదు. భవిష్యత్తులో నీకు ఏమైనా జరిగితే దానికి అన్నాడీఎంకే బాధ్యత వహించదు’ అని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఎందుకు? ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి నిర్మల్ కుమార్ గతంలో ఏఎంఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే.. ఇప్పుడు టీవీకేలో చేరారని గుర్తుచేస్తూ, రేపు అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని తెలిస్తే మళ్లీ ఆయన జంప్ జిలానీ తథ్యమన్నారు. అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలను విజయ్ కలిసి శాలువాలు కప్పడం.. ఆయన తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలు విజయ్ వద్దు అని ఓటేశారని ,ఈ విషయం అర్థమైతే ఆయన ఇలా ఆపరేషన్ ఆకర్ష్ పనులు చేయరని ఎద్దేవా చేశారు. లెక్కలు తెలియక కొందరు చేతికూలీలను పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. ఆ మంత్రికి పిచ్చి పట్టింది తమ పారీ్టలో 50 శాతం మందిని లాగేసుకున్నామని టీవీకే మంత్రి ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలపై ఉదయకుమార్ మండిపడ్డారు. ఆధవ్ అర్జున అనే ఆ పిచ్చి మంత్రికి నిజంగానే మైండ్ పాడైందా అనిపిస్తుందన్నారు. ఇలాంటి సగం తెలివితేటల ముఖాలను తీసుకెళ్లి కేబినెట్లో కూర్చోబెట్టారని, ఇలాంటి వాళ్లను చూడాల్సి రావడం మన దురదృష్టం అంటూæ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృత్రిమ మాయలో మనిషి
‘కృత్రిమ మేధ’గా మనం చెప్పుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ‘కపటి’ అనే అర్థంలో నిజంగానే కృత్రిమంగా మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తెలుగులో ‘నకిలీ తెలివి’ లాంటి మాటల్ని వెతుక్కునే లోపలే అది నకిలీ విన్యాసాలలో చిత్రవిచిత్రమైన లోతులు చూస్తోంది. ఒక చేత్తో సానుకూలపు పూల బాణాలనూ, ఇంకోచేత్తో ప్రతికూలపు వాడిబాణాలనూ ప్రయోగిస్తూ జనాన్ని ఏకకాలంలో మోహపారవశ్యంలోనూ, భయవిభ్రమాల్లోనూ ముంచెత్తుతోంది. అనుకూల ఫలితాలపై ఆశపడుతూనే, ప్రతికూల ప్రభావాలనుంచి తప్పించుకునే మార్గాల వేటలో ప్రపంచం తలమునకలవుతోంది. భారత్, చైనా, రష్యా సహా పది దేశాలు సభ్యులుగా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి కృత్రిమ మేధో వినియోగంలో, అభివృద్ధిలో, దానితో ముడిపడిన నైతిక సమస్యల నివారణలో, మేధో హక్కులూ, డేటా పరిరక్షణలో కలసి పనిచేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా, సాంస్కృతిక రంగంలో కృత్రిమ మేధో దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుపుతోంది; ఒక సమావేశానికి ప్రపంచ పురాతన నగరాలలో ఒకటైన వారణాసి వేదిక కాబోతోంది. కృత్రిమ మేధ ఏం చేస్తోందంటే, ఒక సాంకేతిక మహాద్భుతంగా మాయామేయ మాంత్రిక జగత్తును సృష్టిస్తూ పురాణ, ఇతిహాస, జానపద కథల కాలంలోకి తీసుకెడుతోంది. రామాయణంలో భర్త శాపానికి గురై అహల్య శిలగా మారిపోవడం, రాముని పాదాలు తాకగానే పూర్వరూపం తెచ్చుకోవడం గురించి చదివాం; ‘జగదేకవీరుని కథ’ సినిమాలో జలక్రీడలాడుతున్న దేవకన్యలను చూసిన పాపానికి వారి శాపానికి ఎరై కథానాయకుడు శిలగా మారిపోవడం, ఒక వృద్ధ మహిళ అతనికి శాపవిముక్తి కలిగించడం చూశాం. త్రిశంకుని స్వర్గానికి పంపించే ప్రయత్నంలో అతణ్ణి మధ్యలోనే స్తంభింపజేసి ‘త్రిశంకు స్వర్గా’న్ని సృష్టించిన విశ్వామిత్రుని పునఃసృష్టి పాటవాన్ని కథల్లో దర్శించాం. రామాయణంలో ఇంద్రజిత్తు చేసే మబ్బుచాటు మాయావి యుద్ధాన్నీ, మహాభారతంలో సైంధవుని వధ సందర్భంలో కృష్ణుడు చక్రం అడ్డేసి కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టించడాన్నీ తిలకించాం. తన అర్ధాంగి పార్వతి అభ్యంగన స్నానానికి వెడుతూ నలుగుపిండి నుంచి సృష్టించి కాపలాపెట్టిన బాలుడు తనను అడ్డగించినందుకు శివుడు ఆగ్రహించి అతని శిరస్సును ఖండించడం; నిజం తెలిసి అతనికి ఏనుగు తలను అతికించి, బతికించడం గురించి విన్నాం. తలలు తీసి తలలు పెట్టడంతో సహా కృత్రిమ మేధ ఇలాంటి చిత్రవిచిత్ర సన్నివేశాలను అవలీలగా సృష్టించగలుగుతోంది. అవి కపటత్వపు అంచులు తాకుతూ ప్రసిద్ధ వ్యక్తుల శీలహననానికి పాల్పడుతూ వివాదాస్పదమవుతున్నాయి; నిజమో, అబద్ధమో తెలియని త్రిశంకు స్థితికి జనాన్ని నెడుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీనటులతో సహా ప్రముఖుల రూపాలనూ, గొంతులనూ వాడుకుంటూ అభ్యంతరకర సన్నివేశాలను సృష్టించడం, వారు న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తున్నాం. పూర్తి సాంకేతిక నైపుణ్యాలూ, సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడుకోవాలనే స్పృహ లేనివారికి కూడా కృత్రిమ మేధ అందుబాటులోకి రావడం వల్ల తలెత్తే ఇలాంటి వైపరీత్యాలతో కూడా పురాణ, ఇతిహాస కథలతో పోలిక కుదరడం మరో వైచిత్రి. ఉదాహరణకు, మహాభారతంలోని అశ్వత్థామతో ముడిపడిన ఒక ఉదంతాన్నే చూస్తే, కురుక్షేత్ర యుద్ధాంతంలో అతను ఉపపాండవులను వధించి పారిపోయినప్పుడు అతణ్ణి పట్టుకోవడానికి భీముడు బయలుదేరివెడతాడు; అశ్వత్థామ క్రూరుడనీ, చపలచిత్తుడనీ; అతని దగ్గర ‘బ్రహ్మశిరోనామక’మనే దివ్యాస్త్రం ఉందనీ, దాని ప్రయోగమే తప్ప ఉపసంహారం అతనికి తెలియదనీ కృష్ణుడు అర్జునుడితో చెప్పి భీముని కాపాడుకోవడానికి తక్షణమే వెళ్ళాలంటాడు; ఊహించినట్టే అశ్వత్థామ దానిని ప్రయోగించడం, ప్రయోగోపసంహారాలు రెండూ తెలిసిన అర్జునుడు అదే అస్త్రంతో దానిని శాంతింపచేయబోవడం చూస్తాం. మనిషి– తన మేధ సృష్టించిన కృత్రిమ మేధముందు తనే చిత్తవుతున్నాడు. మాంత్రికతనుంచి వాస్తవికతవైపు వెడుతున్న భ్రమలో ఉన్న మనిషిని కృత్రిమ మేధ తిరిగి మాంత్రికతవైపు మళ్ళిస్తూ పైచేయిని చాటుకుంటోంది. తను సృష్టించిన సాంకేతికత చేతిలో తనే ఓడి దిక్కులు చూసే పరిస్థితిని తెచ్చుకోవడం మనిషిని తొలినుంచి వెంటాడుతున్న శాపం.
కాచిగూడాలో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్ ఆత్మహత్య
తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..
ఊరి ఆడబిడ్డల సందడి.. వినూత్న సమ్మేళనం
శ్రీలంక, వెస్టిండీస్ రెండో వన్డే వర్షార్పణం
ఆపరేషన్ టేబుల్ పేషెంట్.. నాగుపాము
భారతదేశంలోని 5 విశిష్ట గ్రామాలు
టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే
స్టాక్ మార్కెట్ క్రాష్.. వణికిపోతున్న సూచీలు!
సీఎం విజయ్కి ‘ఇండియా’ కూటమి షాక్!
ఒక్క రోజులో పది ఆలయాల సందర్శన..
విద్యార్థిని ప్రొఫెసర్ ప్రేమాయణం
‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’
కెప్టెన్సీ నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే 'స్కై' వీరంగం
.. మనం కొన్ని పదాల మీద పేటెంట్ రైట్స్ తీసుకోవాలి సార్!
అపచారం... దైవద్రోహం
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
దురంధర్కు అలా.. పెద్దికేమో ఇలా.. అసలు టాలీవుడ్కు ఏమైంది?
ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇక ఏఐని ఆపేద్దాం-అగ్రశ్రేణి సంస్థలకు ఆంద్రోపిక్ పిలుపు
తొలి క్యాబినేట్ భేటీలోనే దుమ్మురేగొట్టిన విజయ్
లగ్జరీ ఇల్లు, కారు.. ఏవి ధనవంతుల ఆస్తులు?
ఊళ్లో నెమళ్ల బెడద
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్.. భువీ, షమీకి చోటు!
రేపే ఎన్నికలు.. రష్యా, అమెరికాకు టెన్షన్
30 ఏళ్ల నాటి కేసు.. నటికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే
రూ.4000 తగ్గిన రేటు.. బంగారం ధరలు ఇలా..!
అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత?
గ్రీన్కార్డ్ దరఖాస్తుదారులకు గుడ్న్యూస్
మెగా మామ్!
కాచిగూడాలో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్ ఆత్మహత్య
తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..
ఊరి ఆడబిడ్డల సందడి.. వినూత్న సమ్మేళనం
శ్రీలంక, వెస్టిండీస్ రెండో వన్డే వర్షార్పణం
ఆపరేషన్ టేబుల్ పేషెంట్.. నాగుపాము
భారతదేశంలోని 5 విశిష్ట గ్రామాలు
టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే
స్టాక్ మార్కెట్ క్రాష్.. వణికిపోతున్న సూచీలు!
సీఎం విజయ్కి ‘ఇండియా’ కూటమి షాక్!
ఒక్క రోజులో పది ఆలయాల సందర్శన..
విద్యార్థిని ప్రొఫెసర్ ప్రేమాయణం
‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’
కెప్టెన్సీ నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే 'స్కై' వీరంగం
.. మనం కొన్ని పదాల మీద పేటెంట్ రైట్స్ తీసుకోవాలి సార్!
అపచారం... దైవద్రోహం
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
దురంధర్కు అలా.. పెద్దికేమో ఇలా.. అసలు టాలీవుడ్కు ఏమైంది?
ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇక ఏఐని ఆపేద్దాం-అగ్రశ్రేణి సంస్థలకు ఆంద్రోపిక్ పిలుపు
తొలి క్యాబినేట్ భేటీలోనే దుమ్మురేగొట్టిన విజయ్
లగ్జరీ ఇల్లు, కారు.. ఏవి ధనవంతుల ఆస్తులు?
ఊళ్లో నెమళ్ల బెడద
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్.. భువీ, షమీకి చోటు!
రేపే ఎన్నికలు.. రష్యా, అమెరికాకు టెన్షన్
30 ఏళ్ల నాటి కేసు.. నటికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే
రూ.4000 తగ్గిన రేటు.. బంగారం ధరలు ఇలా..!
అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత?
గ్రీన్కార్డ్ దరఖాస్తుదారులకు గుడ్న్యూస్
మెగా మామ్!
ఫొటోలు
చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం (ఫొటోలు)
టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు
క్యూట్నెస్తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
హైదరాబాద్: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..
కదం తొక్కిన కాక్రోచ్.. జంతర్ మంతర్ వద్ద ధర్నా (చిత్రాలు)
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
పంజగుట్టలో అందాల నటి రాశీసింగ్ సందడి (ఫొటోలు)
నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు
'బిగ్బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
సినిమా
వరలక్ష్మి వ్రతానికి ఇరుముడి
అయ్యప్ప స్వామి భక్తుడిగా హీరో రవితేజ నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీశంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ‘ఇరుముడి’ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆదివారం నిర్మాతలు తెలిపారు.‘‘భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా రూపొందిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో అంకితభావం గల తండ్రి పాత్రలో రవితేజ నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. భక్తి, మానవ సంబంధాలు, కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథలో కమర్షియల్ అంశాలను కూడా జోడించి శివ నిర్మాణ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
సింగర్ సునీత తనయుడి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా వస్తోన్న చిత్రం కొత్త మలుపు. ఈ మూవీలో భైరవి అర్ధ్యా హీరోయిన్గా నటిస్తోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించగా.. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ..'ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చింది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద విజయంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు.ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పెన్స్, వినోదం ఉండేలా కనిపిస్తోంది. ఇందులో ఆకాష్, భైరవి బావ, మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు.దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లాడుతూ..' మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శక దిగ్గజం కోదండరామి రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదములు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అని తెలిపారు.
దురంధర్కు అలా.. పెద్దికేమో ఇలా.. అసలు టాలీవుడ్కు ఏమైంది?
ప్రస్తుతం థియేటర్లలో రామ్ చరణ్ పెద్ది మూవీ సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ మూవీపై సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కథ అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. తనయుడి టాలెంట్ను చూసి చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. పెద్ది కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డారంటూ పొగిడారు.అయితే పెద్దికి మాత్రం టాలీవుడ్ హీరోల నుంచి సపోర్ట్ కరువైంది. కేవలం చిరంజీవి, కొందరు మెగా హీరోలు మాత్రమే రివ్యూలు ఇచ్చారు. సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్స్ వీక్షించి మరి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అయితే మిగిలిన స్టార్ హీరోల నుంచి మాత్రం పెద్దికి ఎలాంటి మద్దతు రావడం లేదు. రణ్వీర్ సింగ్ దురంధర్పై ఒక్కసారిగా ట్వీట్ల వర్షం కురిపించిన తెలుగు హీరోలు.. పెద్ది విషయానికి వచ్చేసరికి గప్చుప్ అయిపోయారు. పెద్ది సినిమాపై ఇప్పటి వరకూ టాలీవుడ్ స్టార్స్ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు తమ అభిప్రాయాలను పంచుకోవడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఇదే చర్చ హాట్ టాపిక్గా మారింది. దర్శకధీరుడు రాజమౌళి సైతం ఇప్పటి వరకు పెద్దిపై ఎలాంటి ట్వీట్ చేయలేదు. దురంధర్ సినిమాను సపోర్ట్ చేసిన మన హీరోలు.. టాలీవుడ్ మూవీని ఎందుకు పట్టించుకోవడం లేదన్న చర్చ మొదలైంది. ఇకనైనా మన హీరోలు.. మన సినిమాలకు మద్దతుగా నిలుస్తారో.. లేదో వేచి చూడాల్సిందే.
రెబల్ స్టార్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. కల్కి-2 క్రేజీ అప్డేట్
కల్కి మూవీతో హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి-2 అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇవాళ చెన్నైలో జరిగిన సింగ్ గీతం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగ్ అశ్విన్ క్రేజీ న్యూస్ షేర్ చేశారు. కల్కి-2 సీక్వెల్ షూటింగ్ షెడ్యూల్పై క్లారిటీ ఇచ్చారు.కల్కి-2 ఇప్పటికే ప్రారంభమైందని నాగ్ అశ్విన్ తెలిపారు. తదుపరి షెడ్యూల్ వచ్చేనెలలో మొదలు కానుందని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీని వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ మూవీని మరింత వేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నాగ్ అన్నారు. ఏప్రిల్ 2027 నాటికి మెయిన్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.కాగా.. మొదటి భాగం కల్కి 2898 ఏడీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. దీపికా పదుకొణె సైతం అభిమానులను మెప్పించింది. కల్కిలో విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రభాస్ కోసం నిర్మాతలు మరింత భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
క్రీడలు
మనదే జోరు...
న్యూ చండీగఢ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత క్రికెట్ జట్టు... సొంతగడ్డపై అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టుపై పట్టు బిగించింది. తొలుత బ్యాటింగ్లో భారీ స్కోరు చేసిన టీమిండియా... ఆ తర్వాత తమకు అలవాటైన రీతిలో ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో బిగించింది. ఓవర్నైట్ స్కోరు 368/3తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 127 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 564 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (177 బంతుల్లో 126; 15 ఫోర్లు, 1 సిక్స్) శతకం తర్వాత ఎక్కువసేపు నిలవలేకపోగా... రిషబ్ పంత్ (121 బంతుల్లో 81; 6 ఫోర్లు, 3 సిక్స్లు), వాషింగ్టన్ సుందర్ (68 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో సత్తా చాటారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో సలీమ్ 140 పరుగులిచ్చి 6 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గాన్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 39.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. రహమత్ షా (81 బంతుల్లో 43 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20) సహా టాపార్డర్ మొత్తం విఫలమైంది. భారత బౌలర్లలో అరంగేట్ర లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ 15.5 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్ కృష్ణకు రెండు వికెట్లు దక్కాయి. చేతిలో ఐదు వికెట్లు ఉన్న అఫ్గానిస్తాన్... టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 451 పరుగుల దూరంలో ఉంది. ఫాలోఆన్ ఇన్నింగ్స్ తప్పించుకోవాలంటే అఫ్గానిస్తాన్ మరో 252 పరుగులు సాధించాలి. మెరిసిన మానవ్ ఈ మ్యాచ్ ద్వారానే అరంగేట్రం చేసిన మానవ్ సుతార్... తొలి టెస్టులోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. పిచ్ స్పిన్కు సహకరిస్తున్న మాట వాస్తవమే అయినా... మానవ్ తన వైవిధ్యంతో కట్టిపడేశాడు. పదేపదే ఒకే చోట బంతిని వేస్తూ ఫలితం రాబట్టాడు. వరుసగా ఒకే ఎండ్ నుంచి 13 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన 23 ఏళ్ల మానవ్... తాను టెస్టు క్రికెట్కు పూర్తిగా సిద్ధమయ్యే వచ్చినట్లు నిరూపించుకున్నాడు. రవీంద్ర జడేజా తరహాలోనే లెఫ్టార్మ్ స్పిన్ వేయగలగడంతో పాటు... అవసరమైతే కింద వరుసలో బ్యాటింగ్కు వచ్చి ధాటిగా ఆడటంలో మానవ్ దిట్ట. ఈ మ్యాచ్లో అతడు బ్యాట్తోనూ మెరిశాడు. ఏడో స్థానంలో క్రీజులో అడుగుపెట్టి 41 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 28 పరుగులు చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) అఫ్సర్ (బి) సలీమ్ 24; రాహుల్ (సి) రహ్మనుల్లా (బి) జియాఉర్ రహమాన్ 100; సాయి సుదర్శన్ (సి) అఫ్సర్ (బి) సలీమ్ 81; గిల్ (సి) అఫ్సర్ (బి) సలీమ్ 126; పంత్ (సి) అజ్మతుల్లా (బి) హష్మతుల్లా 81; జురేల్ (బి) సలీమ్ 19; సుందర్ (నాటౌట్) 52; మానవ్ (సి) అఫ్సర్ (బి) సలీమ్ 28; సిరాజ్ (బి) సలీమ్ (22); కుల్దీప్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు: 22;మొత్తం (127 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్డ్) 564. వికెట్ల పతనం: 1–41, 2–180, 3–247, 4–416, 5–452, 6–456, 7–510, 8–540. బౌలింగ్: జియాఉర్ రహమాన్ 24–2–91–1; అజ్మతుల్లా 22–5–67–0; సలీమ్ 27–3–140–6; ఖరోటె 23–0–115–0; అబ్దుల్ 7–0–43–0; హష్మతుల్లా 24–1–91–1. అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్: అబ్దుల్ (సి) సిరాజ్ (బి) మానవ్ 16; సాదిఖుల్లా (బి) ప్రసిధ్ 17; రహ్మానుల్లా (సి) సుదర్శన్ (బి) మానవ్ 12; రహమత్ షా (బ్యాటింగ్) 43; హష్మతుల్లా (ఎల్బీ) ప్రసిధ్ 20; అఫ్సర్ (సి అండ్ బి) మానవ్ 3; ఎక్స్ట్రాలు 2; మొత్తం (39.5 ఓవర్లలో 5 వికెట్లకు) 113. వికెట్ల పతనం: 1–28, 2–40, 3–62, 4–98, 5–113. బౌలింగ్: సిరాజ్ 6– 1–24–0; ప్రసిధ్ 7–0–27–2; మానవ్ 15.5–7–21–3; కుల్దీప్ 7–0–29–0; సుందర్ 4–0–12–0.
పూర్వ వైభవం కోసం!
ఫుట్బాల్ ప్రపంచకప్ చరిత్రలో అత్యంత నిలకడగా రాణిస్తున జట్లలో జర్మనీ జట్టు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటి వరకు 22 సార్లు ప్రపంచకప్ జరగ్గా... అత్యధికసార్లు ఫైనల్ చేరుకున్న జట్టుగా జర్మనీకి పేరుంది. నాలుగుసార్లు (1954, 1974, 1990, 2014) విశ్వవిజేతగా నిలిచిన జర్మనీ జట్టు... మరో నాలుగుసార్లు ఫైనల్లో ఓడిపోయి రన్నరప్గా (1966, 1982, 1986, 2002) నిలిచింది. మరో నాలుగుసార్లు మూడో స్థానం (1934, 1970, 2006, 2010) సంపాదించింది. 2014లో బ్రెజిల్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్లో నాలుగోసారి చాంపియన్గా నిలిచిన జర్మనీ... ఆ తర్వాత అనూహ్యంగా వెనుకబడిపోయింది. పలువురు స్టార్ ఆటగాళ్లు రిటైర్ కావడం... వారి స్థానాలను భర్తీ చేసేవాళ్లు ఇంకా తయారు కాకపోవడం... వెరసి జర్మనీ జట్టు తొలిసారి వరుసగా రెండు ప్రపంచకప్లలో (2018, 2022) గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. రెండేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన ‘యూరో’ టోర్నీలో జర్మనీ క్వార్టర్ ఫైనల్లో చాంపియన్ స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక ప్రపంచకప్ క్వాలిఫయింగ్లో గ్రూప్ ‘ఎ’లో ఉన్న జర్మనీ 15 పాయింట్లతో టాపర్గా నిలిచి మెగా ఈవెంట్కు అర్హత సాధించింది. పూర్వ వైభవం కోసం తాపత్రయపడుతున్న జర్మనీ ఈసారి గ్రూప్ దశ సులువుగానే దాటే అవకాశం ఉంది. గ్రూప్ ‘ఇ’లో కురసావ్, ఐవరీకోస్ట్, ఈక్వెడార్ జట్లతో జర్మనీకి చోటు కల్పించారు. జర్మనీ తొలి మ్యాచ్ను జూన్ 14న కురసావ్తో, రెండో మ్యాచ్ను జూన్ 20న ఐవరీకోస్ట్తో, జూన్ 25న ఈక్వెడార్తో ఆడుతుంది. మిడ్ఫీల్డర్లు జమాల్ ముసియాలా, ఫ్లోరియన్ విట్జ్, లెనార్ట్ కార్ల్, కాయ్ హావెట్జ్లతోపాటు వెటరన్ గోల్కీపర్ మాన్యుయెల్ న్యూయెర్ ప్రదర్శనపై జర్మనీ ముందంజ వేసే ఆశలు ఆధారపడి ఉన్నాయి. జర్మనీ జట్టుకు నాకౌట్ దశ ప్రిక్వార్టర్ ఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ ఫ్రాన్స్ ఎదురయ్యే అవకాశముంది. ఫ్రాన్స్ అడ్డంకిని అధిగమిస్తే జర్మనీ నుంచి అద్భుత ఫలితం ఆశించవచ్చు. – సాక్షి క్రీడావిభాగం
రన్నరప్ అనిరుధ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్ టైటిల్ సాధించాలని ఆశించిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్కు నిరాశ ఎదురైంది. ఇంగ్లండ్లో ఆదివారం ముగిసిన బర్మింగ్హామ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో అనిరుధ్ (భారత్)–టకెరు యుజుకి (జపాన్) ద్వయం రన్నరప్గా నిలిచింది. బెన్ జోన్స్–జోషువా పారిస్ (బ్రిటన్) జంటతో జరిగిన ఫైనల్లో అనిరు«ద్–టకెరు జోడీ 4–6, 6–7 (4/7)తో పోరాడి ఓడిపోయింది. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అనిరుధ్–టకెరు ఏడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. తొలి సర్వీస్లో 37 పాయింట్లు, రెండో సర్వీస్లో ఆరు పాయింట్లు సాధించారు. తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశారు. అంతకుముందు తొలి రౌండ్లో అనిరు«ద్–టకెరు 4–6, 7–6 (7/5), 10–1తో ఫిన్ బాస్–స్కాట్ డంకన్ (బ్రిటన్)లపై, క్వార్టర్ ఫైనల్లో 7–6 (7/3), 6–3తో ఫిన్ రేనాల్డ్స్–జేమ్స్ వాట్ (న్యూజిలాండ్)లపై, సెమీఫైనల్లో 7–5, 7–6 (7/5)లతో డీగో హిడాల్గో (ఈక్వెడార్)–ప్యాట్రిక్ ట్రహక్ (అమెరికా)లపై గెలుపొందారు. రన్నరప్ అనిరుద్–టకెరులకు 5,220 (రూ. 4 లక్షల 95 వేలు) డాలర్ల ప్రైజ్మనీతోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది అనిరు«ద్–టకెరు ద్వయం బుసాన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచింది.
వీల్చైర్ నుంచి విక్టరీ పోడియం వరకు...
రాకెట్ పట్టిన ప్రతి చిన్నారి కల ఒక్కటే... ఏనాటికైనా ఏ విభాగంలోనైనా గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించాలని... అయితే తమ లక్ష్యం నెరవేరకుండానే... దానికి సమీపంలోకి రాకుండానే... ఎంతోమంది రాకెట్ వదిలేస్తారు.... కానీ కొందరుంటారు... ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా... ఎన్నిసార్లు విఫలమైనా... తమకంటూ ఒక రోజు వస్తుందనే నమ్మకంతో టైటిల్ వేటను కొనసాగిస్తుంటారు. ఆలస్యమైనా వారు జీవిత లక్ష్యం అందుకుంటారు... జీవన స్వప్నం సాకారం చేసుకుంటారు... ఆ కోవలోకే వస్తాడు జర్మనీకి చెందిన 29 ఏళ్ల అలెగ్జాండర్ జ్వెరెవ్. పుష్కరకాలం నుంచి ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడుతున్న జ్వెరెవ్ నాలుగో ప్రయత్నంలో తన గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ కలను నిజం చేసుకున్నాడు. పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదని నిరూపించాడు. నాలుగేళ్ల క్రితం ఏ వేదిక నుంచి గాయపడి వీల్చైర్లో బయటకు వెళ్లాడో... ఇప్పుడు అదే వేదికపై సగర్వంగా విన్నర్స్ ట్రోఫీని ఎత్తుకున్నాడు. – సాక్షి క్రీడా విభాగంఆరేళ్ల క్రితమే తొలి ప్రయత్నంలోనే అలెగ్జాండర్ జ్వెరెవ్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ ట్రోఫీని ముద్దాడాల్సింది. డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా)తో జరిగిన 2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్ తొలి రెండు సెట్లు గెల్చుకున్నాడు. విన్నర్స్ ట్రోఫీకి కేవలం ఒక్క సెట్ దూరంలో ఉన్నాడు. అయితే జ్వెరెవ్ కలను థీమ్ భగ్నం చేశాడు. తొలి రెండు సెట్లు కోల్పోయినా... పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన థీమ్ వరుసగా మూడు సెట్లు గెలిచి యూఎస్ ఓపెన్ చాంపియన్గా అవతరించాడు. జ్వెరెవ్ నిరాశగా వెనుదిరిగాడు. నాలుగేళ్లు గడిచాయి... 2024లో జ్వెరెవ్కు మరో ‘గ్రాండ్’ టైటిల్ అవకాశం లభించింది. ఈసారి ఫ్రెంచ్ ఓపెన్లో... కానీ స్పెయిన్ రైజింగ్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ అసాధారణ ప్రదర్శన ముందు జ్వెరెవ్ ఎదురునిలువ లేకపోయాడు. చివరి రెండు సెట్లు చేజార్చుకున్న జ్వెరెవ్ టైటిల్ను కూడా వదులుకున్నాడు. ఏడాది తిరిగేలోపు 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్లో జ్వెరెవ్ ముచ్చటగా మూడో ‘గ్రాండ్’ చాన్స్ లభించింది. కానీ ఇటలీ స్టార్ యానిక్ సినెర్ ధాటికి జ్వెరెవ్ వరుస సెట్లలో చేతులెత్తేశాడు. మూడోసారి నిరాశతో ఇంటిదారి పట్టాడు. ఈసారి వదల్లేదు... కెరీర్లో 41వసారి గ్రాండ్స్లామ్ ఆడేందుకు జ్వెరెవ్ 11వసారి పారిస్కు వచ్చాడు. డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. సెర్బియా దిగ్గజం, 24 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. దాంతో జ్వెరెవ్ గ్రాండ్స్లామ్ టైటిల్ ఈసారి నెరవేరడం లాంఛనమే అనిపించింది.అనుకున్నట్లే... తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన జ్వెరెవ్ కెరీర్లో ఆడిన 41వ గ్రాండ్స్లామ్ టోర్నీలో విజేత ట్రోఫీని అందుకున్నాడు. 2022 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్ సందర్భంగా స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్థో సెమీఫైనల్ ఆడుతూ జ్వెరెవ్ జారిపడ్డాడు. గాయంతో చక్రాల కుర్చీతో మైదానాన్ని వీడాడు. ఇప్పుడు అదే మట్టికోర్టులో కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ గెలిచాడు. జ్వెరెవ్ అద్భుత ప్రస్థానంలో కొన్ని ఆసక్తికర విషయాలను పరిశీలిస్తే... టెన్నిస్ ఫ్యామిలీ... జ్వెరెవ్ది అసలు సిసలు టెన్నిస్ కుటుంబం. అతడి తల్లిదండ్రులు ఇరినా జ్వెరెవా, అలెగ్జాండర్ జ్వెరెవ్ సీనియర్ ఇద్దరూ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్లే. ఈ జంట సోవియట్ యూనియన్ తరఫున ఆడింది. ఇక జ్వెరెవ్ సోదరుడు మిషా జ్వెరెవ్ కూడా ప్రొఫెషనల్ ఆటగాడే. అతడు ఏటీపీ టూర్లో పలు విజయాలు సాధించాడు. అతడి కుటుంబం భిన్న సంస్కృతులకు నెలవు. జ్వెరెవ్ ఇంట్లో మూడు భాషలు మాట్లాడుతారు. జర్మనీలో పుట్టి పెరగడంతో జర్మన్తో పాటు మూలాల కారణంగా రష్యన్, ఇంగ్లిష్ లో ధారాళంగా మాట్లాడగలరు. అమ్మ దిద్దిన చాంపియన్... ఇంట్లో అందరూ టెన్నిస్ ప్లేయర్లే కాగా... జ్వెరెవ్ ఆది గురువు మాత్రం తల్లే! శరీర దారుఢ్యంపై తండ్రి దృష్టి పెడితే... తల్లి ఇరినా మాత్రం అతడికి టెన్నిస్లో ఓనమాలు నేర్పింది. సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగాలంటే తనకంటూ కొన్ని ప్రత్యేక షాట్లు ఉండాలని బలంగా నమ్మిన ఇరినా... జ్వెరెవ్కు బ్యాక్హ్యాండ్ షాట్ను పదేపదే ప్రాక్టీస్ చేయించేది. ఆమె కృషి వల్లే బ్యాక్హ్యాండ్ పవర్ ఫుల్ షాట్ తనకు అలవడిందని జ్వెరెవ్ గతంలో పలుమార్లు వెల్లడించాడు. చిన్నప్పుడు బాగా చురుకుగా ఉండే జ్వెరెవ్... ఓటమిని అస్సలు అంగీకరించలేకపోయేవాడని సోదరుడు మిషా తెలిపాడు. పసితనంలో జ్వెరెవ్ తన చేతిలో ఓడిపోతే... గెలిచే వరకు టెన్నిస్ కోర్టు వీడేవాడు కాదని గుర్తుచేసుకున్నాడు. హాకీ, ఫుట్బాల్ వదిలేసి... అందరు పిల్లల్లాగే చిన్నప్పుడు వేర్వేరు క్రీడలను ఇష్టపడ్డ జ్వెరెవ్.. టెన్నిస్తో పాటు హాకీ, ఫుట్బాల్ కూడా ఆడేవాడు. అయితే 12 ఏళ్ల ప్రాయంలో ఫ్లోరిడాలో జరిగిన ఒక జూనియర్ టోర్నమెంట్లో జ్వెరెవ్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. దీంతో టెన్నిస్పై కసి పెంచుకున్న అతడు ... మిగిలిన క్రీడలను పక్కనపెట్టి వంద శాతం టెన్నిస్పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఫ్యాషన్లోనూ తనదైన శైలి కోర్టులో ఆటతో పాటు... కోర్టు బయట ఫ్యాషన్తోనూ జ్వెరెవ్ భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 2017 యూఎస్ ఓపెన్ సందర్భంగా అతడి ఫ్యాషన్... సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. 1970 నాటి స్టయిల్లో అతడి డ్రెస్సింగ్ స్టయిల్కు అభిమానులు ఫిదా అయ్యారు. ప్రముఖ సంగీత కళాకారుడు, డిజైనర్ ఫారెట్ విలియమ్స్ జ్వెరెవ్ కోసం ప్రత్యేకంగా దుస్తువులు డిజైన్ చేస్తాడు. ప్రత్యేక అతిథిలా....జ్వెరెవ్కు కుక్కలంటే చాలా ఇష్టం. ఏటీపీ టూర్ టోర్నమెంట్లలో జ్వెరెవ్ తరచూ తన పెంపుడు కుక్క ‘లోవిక్’తో దర్శనమిస్తాడు. లోవిక్కు అతడి జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంతగానంటే... తనతో పాటు కోర్టులో తిరగడానికి దానికి ప్రత్యేక అతిథిగా అనుమతి పత్రాలు సైతం తీసుకున్నాడు.ముందే ఒలింపిక్ స్వర్ణంగ్రాండ్స్లామ్ టైటిల్ గెలవడానికి ముందే జ్వెరెవ్... ఒలింపిక్ స్వర్ణం నెగ్గాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో జ్వెరెవ్ పసిడి పతకం సాధించి... పురుషుల సింగిల్స్లో ఈ ఘనత సాధించిన తొలి జర్మనీ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో సెమీఫైనల్లో అతడు... సెర్బియా దిగ్గజం జొకోవిచ్ను ఓడించి ముందంజ వేశాడు. డయాబెటీస్తో పోరాడుతూనాలుగేళ్ల వయసు నుంచే టైప్–1 డయాబెటీస్తో ఇబ్బందిపడుతున్న జ్వెరెవ్... ఆ విషయాన్ని 2022లో బహిరంగంగా వెల్లడించాడు. కెరీర్లో చాలా వరకు మ్యాచ్ల విరామంలో వైద్యుల సూచన మేరకు ఇన్సులిన్ తీసుకున్నట్లు తెలిపాడు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పిల్ల్లలకు ఇన్సులిన్తో పాటు మరికొన్ని అత్యవసర మందులు అందించాలనే లక్ష్యంతో అతడు ‘అలెగ్జాండర్ జ్వెరెవ్’ ఫౌండేషన్ను స్థాపించాడు.
న్యూస్ పాడ్కాస్ట్
విష ప్రచారం చేయడం దుర్మార్గం.. మేం రైతులం కాదా?... సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న అక్రమాల రాకెట్
మనోడే.. ఇచ్చేద్దాం. ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్్సకు పోలవరం పనులు
ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
ఐపీఎల్ బాద్షా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై జయకేతనం
ఏపీ మెగా డీఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి సర్కార్ యత్నాలు... తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యా శాఖ
చేతికి వచ్చి చేజారిన ఉద్యోగం... ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో బయటపడుతున్న లీలలు
బిజినెస్
ఫిక్స్డ్ డిపాజిట్.. ఫటాపట్!
దశాబ్దాలుగా, కోట్లాది కుటుంబాలకు విశ్వసనీయమైన పెట్టుబడి సాధనాల్లో మొదటి ఎంపిక ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)కే. బ్యాంకు శాఖకు వెళ్లి ఎఫ్డీ వేయడం, కావాల్సినప్పుడు వెనక్కి తీసుకోవడం.. రాబడి తక్కువే అయినా అందులోని సౌలభ్యం, నమ్మకం ఎఫ్డీకి అంత ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడంతా డిజిటల్ సేవల యుగం. దాదాపు అన్ని బ్యాంకు సేవలు డిజిటల్గానే లభిస్తున్నాయి. ఎఫ్డీ కంటే అధిక రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్స్, ఏఐఎఫ్ తదితర సాధనాలను స్మార్ట్ఫోన్ నుంచే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు. దీంతో గతంతో పోల్చితే ఎఫ్డీలకు డిమాండ్ కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి వేగం నిదానించడం దీన్నే తెలియజేస్తోంది. దీంతో బ్యాంక్లు సైతం డిజిటల్ ఎఫ్డీలతో పోటీ పడుతున్నాయి. సొంత మొబైల్ అప్లికేషన్లు, నెట్బ్యాంకింగ్ ద్వారానే కాకుండా.. ఫిన్టెక్ల రూపంలోనూ డిజిటల్ ఎఫ్డీ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. వీటికి డిమాండ్ కూడా బ్రహా్మండం. మొదటిసారి ఇన్వెస్టర్లు సైతం సులభంగా డిజిటల్ ఎఫ్డీ చేసుకోవచ్చు. వీటి సేవలను ఎలా పొందొచ్చో తెలియజేసే కథనమే ఇది. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని బ్యాంక్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) సొంతంగానూ డిజిటల్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు వీటిని ఇన్వెస్టర్లకు మరింత చేరువ చేస్తున్నాయి. డిపాజిట్కు సరిపడా సొమ్మును స్వీకరించడం, ఎఫ్డీగా మార్చడం, ఉపసంహరణ తదితర సేవలన్నింటినీ ఫిన్టెక్ సంస్థలు అందిస్తాయి. డిపాజిట్ రిసీప్్టలు బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీల నుంచే జారీ అవుతాయి. అంటే డిపాజిట్ మొత్తం బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలకే వెళుతుంది. ఒకే చోట డిపాజిట్లన్నీ.. → తమకు ఖాతా ఉన్న బ్యాంక్లోనే డిజిటల్ ఎఫ్డీ వేసుకోవచ్చు. → అధిక రాబడిని (వడ్డీ రేటు) ఆఫర్ చేసే చోటే ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు ఎంతో అనుకూలం. → దాదాపు అన్ని ప్రముఖ బ్యాంక్లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. → అన్ని డిపాజిట్లు ఒకే చోటు కనిపించడం వల్ల ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే డిపాజిట్లను సులభంగా గుర్తించొచ్చు. → కనీసం రూ.1,000 నుంచి డిపాజిట్కు అవకాశం ఉంది. కావాలంటే అక్కడే రెన్యువల్ చేసుకోవచ్చు.డిపాజిట్ చిటికెలో పని→ డిజిటల్ ఎఫ్డీ కోసం పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. నిమిషాల్లోనే ఈ పని పూర్తి చేయొచ్చు. → ఈ–కేవైసీ లేదా వీడియో కేవైసీ ద్వారా తమ గుర్తింపు వివరాలను ఇస్తే సరిపోతుంది. → అనంతరం తమకు నచ్చిన సంస్థ డిపాజిట్ను ఎంపిక చేసుకుని, నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. → గడువు ముగిసిన తర్వాత ఉపసంహరణ కూడా సులభమే. నిమిషాల్లోనే డిపాజిట్ మొత్తం వడ్డీ సహా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. → కావాలంటే ఆ డిపాజిట్ను అక్కడికక్కడే రెన్యువల్ ( పునరుద్ధరణ) చేసుకోవచ్చు. → ఈ సేవలన్నీ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్ పోర్టల్ నుంచి పొందొచ్చు. రెండూ ఒకటే.. → భౌతికంగా బ్యాంకులో చేసే ఫిక్స్డ్ డిపాజిట్, ఆన్లైన్లో డిజిటల్గా చేసే ఎఫ్డీ రెండూ ఒక్కటే. వడ్డీ రేటు, భద్రత, పన్ను తదితర అంశాల్లో ఎలాంటి మార్పుల్లేవు. → ఆర్బీఐ నియంత్రణల పరిధిలో రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం కూడా లేదు. → చాలా ఫిక్స్డ్ డిపాజిట్లలో ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక డిపాజిట్ పథకాలలో ఈ సౌకర్యం ఉండకపోవచ్చు. → ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద ఒక బ్యాంకు పరిధిలో ఒక్కో ఇన్వెస్టర్కు గరిష్టంగా రూ.5. లక్షల ఎఫ్డీకి బీమా వర్తిస్తుంది. రిస్కుల్లేవా..→ సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లలో రిస్క్ చాలా తక్కువ. → బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ సంక్షోభంలో పడినప్పుడే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. → ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని అన్ని వాణిజ్య బ్యాంక్లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ల్లో ఒక్కో డిపాజిటర్కు గరిష్టంగా రూ.5 లక్షల మొత్తానికి బీమా ఉంటుంది. → ఉదాహరణకు ఒక వ్యక్తి రెండు వేర్వేరు బ్యాంకుల్లో రూ.5 లక్షల చొప్పున డిపాజిట్ చేశాడనుకుందాం. రెండు బ్యాంకులూ సంక్షోభంలోకి వెళ్లాయనుకుంటే.. అప్పుడు రెండు బ్యాంకుల నుంచి డిపాజిటర్కు రూ.5 లక్షల చొప్పున వెనక్కి వస్తుంది. → కనుక ఒక బ్యాంకు పరిధిలో గరిష్ట డిపాజిట్ను రూ.5 లక్షలకు పరిమితం చేయడం ద్వారా రిస్్క తగ్గించుకోవచ్చు. → ఎన్బీఎఫ్సీల డిపాజిట్లపై వడ్డీ రేటు బ్యాంకుల కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ, బ్యాంకుల్లో మాదిరి ఎన్బీఎఫ్సీల డిపాజిట్లకు డీఐసీజీసీ బీమా సదుపాయం లేదు. ఎన్బీఎఫ్సీ సంక్షోభంలో పడితే డిపాజిట్ పూర్తిగా రిస్్కలోకి వెళ్లినట్లే. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ సేవలు మెరుగ్గా ఉన్నాయేమో విచారించుకోవాలి. → మెచ్యూరిటీ అనంతరం ఆటో రెన్యువల్ అయినా, కొత్తగా అమల్లో ఉన్న వడ్డీ రేటే వర్తిస్తుంది. గతంలో పొందిన అధిక వడ్డీ రేటు కొనసాగదు. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ కేవలం మధ్యవర్తి గా మాత్రమే పనిచేస్తుంది. డిపాజిట్ భద్రత పూర్తిగా సంబంధిత బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందే డిపాజిట్ ఏ సంస్థ వద్ద నమోదవుతోందో పరిశీలించాలి.అధిక రాబడి→ తమ ఖాతా ఉన్న బ్యాంకులో డిపాజిట్ అయితే, మెరుగైన రేటుపై చేసే అవకాశం ఉండదు. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ల ద్వారా అయితే ఏ బ్యాంక్ ఎక్కువ రేటు ఆఫర్ చేస్తుందో తెలుసుకుని, అందులోనే డిపాజిట్ చేసుకోవచ్చు. → కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు 0.5–2 శాతం వరకు అధిక రేటును ఆఫర్ చేస్తుంటాయి. → గతంలో పోల్చితే డిపాజిట్లకు పోటీ పెరగడంతో ప్రముఖ బ్యాంకులు సైతం ఆకర్షణీయమైన రేటును అందిస్తున్నాయి. → సీనియర్ సిటిజన్ (60 ఏళ్లు నిండిన) డిపాజిట్లపై అరశాతం వరకు అదనపు రాబడిని అందుకోవచ్చు. → అధిక రాబడి కోసం దీర్ఘకాలాన్ని ఎంపిక చేసుకునే ముందు.. అంతకాలం పాటు వేచి ఉండగలమా? అన్నది ఆలోచించుకోవాలి.డిపాజిట్పై రుణం → చాలా బ్యాంకులు డిపాజిట్పై రుణం లేదా ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఎఫ్డీ విలువలో 75–80 శాతం మేర రుణంగా లభిస్తుంది. → ఎఫ్డీ రేటు కంటే 1–3 శాతం అధికంగా రుణానికి చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా వెనక్కి తీసుకుంటే.. → డిపాజిట్లు ఏవైనా వాటి నిర్ణీత కాల వ్యవధికి ముందుగానే ఉపసంహరించుకుంటే రాబడి విషయంలో రాజీ పడక తప్పదు. → ఉదాహరణకు రూ.3 ఏళ్లకు డిపాజిట్ చేసి, ఏడాదికే వెనక్కి తీసుకుంటే.. ఏడాది కాలానికి వర్తించే వడ్డీ రేటు ప్రకారమే చెల్లింపులు లభిస్తాయి. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ల్లో ముందస్తుగా డిపాజిట్ నుంచి తప్పుకుంటే 0.5–1 శాతం వరకు పెనాల్టీని కూడా చెల్లించాల్సి రావొచ్చు. → కాలవ్యవధి ముగిసేలోపు అత్యవసరాల్లో తీసుకోవచ్చని భావించే వారు.. ఒకే డిపాజిట్ కాకుండా ఒకటికి మించి వేర్వేరు డిపాజిట్లుగా, వేర్వేరు కాల వ్యవధిపై చేసుకోవడం వల్ల రాబడి నష్టపోకుండా, పెనాల్టీ భారం ఎక్కువ లేకుండా చూసుకోవచ్చు. పన్ను భారం మరవొద్దు..→ ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. ఇది ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి వెళ్లి కలుస్తుంది. కనుక ఆదాయానికి అనుగుణంగా పన్ను రేటు చెల్లించాల్సి ఉంటుంది. → ఉదాహరణకు 30 శాతం పన్ను శ్లాబులో ఉన్న వ్యక్తి 8.5 శాతం రేటుపై ఎఫ్డీ చేశాడని అనుకుందాం. అప్పుడు పన్ను పోను ఎఫ్డీపై నికర రాబడి 6 శాతం మించదు. → బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్పై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తికి రూ.50,000 మించితే (60 ఏళ్లలోపు), 60 ఏళ్లు నిండిన వారికి రూ.లక్ష మించితే టీడీఎస్ అమలు చేస్తారు. పాన్ నంబర్ సమరి్పంచిన వారికి 10 శాతం, అది లేని వారికి 20 శాతం టీడీఎస్ మినహాయిస్తారు. → పన్ను వర్తించేంత ఆదాయం లేని వారు టీడీఎస్ అమలు చేయకుండా ఫారమ్ 15జీ (60 ఏళ్లలోపు), ఫారమ్ 15హెచ్ (60 ఏళ్లు నిండిన) సమర్పిస్తే సరిపోతుంది. డిజిటల్ ఎఫ్డీ వేదికలు..→ జియోఫైనాన్స్ → స్టెబుల్ మనీ → జెరోదా కాయిన్ → ఫైబ్ → పైసా బజార్→ ఐఎన్డీ మనీ → క్రెడ్ → ఫోన్పే → నవీ → పేటీఎం
మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్!
హ్యుందాయ్ కంపెనీ తన కార్లపై ఆఫర్స్ ప్రకటించగా.. టాటా మోటార్స్ కూడా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపులు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ తరుణంలో మారుతి సుజుకి.. ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ మీద డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు పేర్కొంది.మారుతి సుజుకి విక్టోరిస్ఎంపిక చేసిన విక్టోరిస్ వేరియంట్లపై రూ. 90,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు మారుతి సుజుకి వెల్లడించింది. స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్లకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్లు, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ డిస్కౌంట్లతో సహా అత్యధిక ప్రయోజనాలు లభిస్తాయి.విక్టోరిస్ CNG వేరియంట్లు రూ. 80,000 వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉండగా, పెట్రోల్ వేరియంట్లను రూ. 60,000 వరకు తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి విక్టోరిస్ ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది.మారుతి సుజుకి స్విఫ్ట్దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్పై కూడా ఈ నెలలో మారుతి సుజుకి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఆటోమాటిక్ వేరియంట్ మీద రూ.45000 తగ్గింపు.. మాన్యువల్, CNG వేరియంట్లపై రూ. 40,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.మారుతి సుజుకి స్విఫ్ట్ అనేది చాన్నాళ్లుగా బ్రాండ్ యొక్క అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్బ్యాక్లలో ఒకటి. దీని ధర ప్రస్తుతం రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.మారుతి బ్రెజ్జా, వ్యాగన్ ఆర్మారుతి సుజుకి బ్రెజ్జాను కొనుగోలు చేయాలనుకునే వారు పెట్రోల్, CNG వేరియంట్లపై రూ. 55,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లలో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్లు మరియు కార్పొరేట్ పథకాలు ఉన్నాయి. వ్యాగన్ ఆర్ కొనుగోలుపై రూ. 52,500 వరకు తగ్గింపులు కూడా లభిస్తున్నాయి.ఆల్టో కే10, సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఈకోవేరియంట్ను బట్టి మారుతి సుజుకి ఆల్టో కే10పై రూ. 52,500 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. అదే సమయంలో.. సెలెరియో, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, ఈకోలపై రూ. 37,500 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి డిజైర్, ఎర్టిగా మోడళ్లపై కంపెనీ ఈ నెలలో ఎలాంటి అధికారిక డిస్కౌంట్లు అందించడం లేదు. ఈ రెండు మోడళ్లకు ఉన్న బలమైన డిమాండ్ కారణంగా సంస్థ ఆఫర్స్ అందించకపోవడానికి కారణం కావచ్చని తెలుస్తోంది. అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కంపెనీ అందిస్తున్న ఆఫర్లు నగరం, డీలర్షిప్, స్టాక్ లభ్యత, వేరియంట్ను బట్టి మారే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ ఆఫర్స్ అన్నీ జూన్ చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
రూ.20 వేలు తగ్గిన వెండి రేటు!
గడిచిన వారం రోజులు (మే 31 నుంచి జూన్ 6)గా భారతదేశంలో బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి రేటు కూడా గణనీయంగా తగ్గింది. ఈ కథనంలో దేశంలో ప్రధాన నగరాల్లో సిల్వర్ రేటు ఎలా ఉంది?, అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో మే 31న (ఆదివారం) రూ.2.90 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు జూన్ 6 (శనివారం) నాటికి రూ.2.70 లక్షలకు చేరింది. అంటే ఏడు రోజుల్లో రూ.20 వేలు తగ్గిందన్నమాట. ఇదే ధరలు బెంగళూరు, చెన్నైలలో కూడా కొనసాగుతాయి.అయితే.. ముంబైలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.65 లక్షల వద్ద ఉంది. ఢిల్లీలో కూడా ఇదే ధర కొనసాగుతుంది. దీన్నిబట్టి చూస్తే.. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీ, ముంబైలలో సిల్వర్ రేటు కొంత తక్కువని స్పష్టమవుతోంది.2026లో వెండి రేటు గరిష్టంగా రూ.3 లక్షలు దాటేసింది. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ నేడు జూన్ 7 (ఆదివారం) రూ.2.75 లక్షల వద్ద స్థిరంగా ఉంది. అంటే.. సిల్వర్ రేటు భారీగా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.వెండికి ఎందుకు డిమాండ్!వెండి కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. ఇది పారిశ్రామిక రంగంలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. వెండి ఎలక్ట్రానిక్స్లో సర్క్యూట్ బోర్డులు, మైక్రోచిప్లలో, విద్యుత్ పరిశ్రమలో కేబుల్స్, టర్మినల్స్, కనెక్టర్లలో ముఖ్యంగా వినియోగించబడుతుంది. ఆప్టికల్ పరికరాలు, లెన్స్లు, రిఫ్లెక్టర్లు, కొన్ని వైద్య పరికరాలు, డెంటల్ టూల్స్లో కూడా వెండి ఉపయోగం ఉంది. కాబట్టి వెండికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది.ఇదీ చదవండి: తండ్రి మాట.. అంబానీ విజయ రహస్యం!
మే నెలలో ఎక్కువ మంది ఈ కార్లనే కొన్నారు!
మే 2026లో దేశీయ విఫణిలో ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అమ్మకాల్లో మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయించింది. ఈ బ్రాండ్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా, దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితాలో ఆరు మోడళ్లకు స్థానం కల్పించింది. టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్ కూడా మంచి అమ్మకాలను నమోదు చేశాయి.అమ్మకాల్లో మారుతి సుజుకి డిజైర్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కాంపాక్ట్ సెడాన్ మే 2026లో 24,546 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మంచి మైలేజ్, సౌకర్యం, తక్కువ ధర కారణంగా ఇది వినియోగదారుల మొదటి ఎంపికగా మారింది.రెండవ స్థానంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ నిలిచింది. ఈ మోడల్ 20,686 యూనిట్ల అమ్మకాలతో 52 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. వేగంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది మార్కెట్లో హాట్ సెల్లింగ్ మోడల్గా మారింది.మూడవ స్థానంలో మారుతి సుజుకి ఎర్టిగా నిలిచింది. కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉండే ఈ ఎంపీవీ 20,350 యూనిట్ల అమ్మకాలతో 26 శాతం వృద్ధిని సాధించింది.నాలుగవ స్థానంలో టాటా పంచ్ నిలిచింది. టాప్ 10 అమ్మకాల జాబితాలో ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ చోటు సంపాదించుకుంది. దీనికి కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ మోడల్ 20,208 యూనిట్ల అమ్మకాలు చేసి 54 శాతం వృద్ధిని నమోదు చేసింది.ఐదవ స్థానంలో టాటా నెక్సాన్ నిలిచింది. పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ కారు మొత్తమ్ 19,100 యూనిట్ల అమ్మకాలతో 46 శాతం వృద్ధిని చూపింది.ఆరవ స్థానంలో మారుతి సుజుకి బాలెనో నిలిచింది. ఇది 18,396 యూనిట్లు అమ్ముడై, టాప్ 10లోనే అత్యధిక వృద్ధి రేటు (58%) సాధించింది.ఏడు, ఎనిమిది స్థానాల్లో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి స్విఫ్ట్ చోటు సంపాదించుకున్నాయి. వీటి అమ్మకాలు వరుసగా 18,076.. 17,519 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎంట్రీ లెవల్, యూత్ సెగ్మెంట్లో ఇవి ఇప్పటికీ బలమైన డిమాండ్ను కొనసాగిస్తున్నాయి.తొమ్మిదవ స్థానంలో మహీంద్రా స్కార్పియో నిలిచింది. దీని క్లాసిక్, కొత్త వెర్షన్లు కలిపి 15,774 యూనిట్లు అమ్ముడయ్యాయి. పదవ స్థానంలో హ్యుందాయ్ క్రెటా నిలిచింది. కఠినమైన పోటీ ఉన్నప్పటికీ ఇది 15,253 యూనిట్ల అమ్మకాలతో స్థిరమైన పనితీరు చూపించింది.ఇదీ చదవండి: కస్టమర్ల కోసం TVS కొత్త కాన్సెప్ట్!
ఫ్యామిలీ
ప్లీజ్ అంతా అయిపోయాక కాదు..! ముందుగానే తెలుసుకుందాం..
ఏ విషయంలోనైన అశ్రద్ధ ఉన్నా..పర్లేదు కానీ..ఆరోగ్య విషయంలో అలా కాదు. ఒక్కసారి పెద్దయ్యాక..చూద్దాంలే అనుకుంటూ..ఉంటే..కథే అడ్డం తిరుగుతుంది. మనం యంగ్ ఏజ్లో తీసుకున్న ఆహారాలు, జీవనశైలి వంటివే నాలుగుపదుల వయసులో మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వృద్ధాప్యం సమీపించే సమయానికి రకరకాల వ్యాధుల బారినపడి..ఆరోగ్యాన్ని చేజాతులారా పాడు చేసుకుంటారని అంటున్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. అంతేగాదు. ముందుగానే ఈవిషయాలు తెలిసి ఉంటే బాగుండును అనుకునే ఐదు శక్తిమంతమైన ఆరోగ్య పాఠాలపై అందరికీ అవగాహన ఉండాలంటున్నారు. అవేంటంటే..యంగ్ ఏజ్లో ఉండగా..ఆ తర్వాత అంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారని అన్నారు. నిశబ్దంగా నష్టం జరిగిపోయాక గానీ మేల్కోరని అంటున్నారామె. నిద్ర అలవాట్ల నుంచి తీసుకునే ఆహారం వరకు ప్రతిదాంట్లో కేర్ఫుల్గా ఉండాలని అంటున్నారు.తెలుసుకోవాల్సిన ఐదు శక్తిమంతమైన పాఠాలు..తన 20 ఏళ్ల వయసులో తనకు తెలిసి ఉంటే బాగుండేదని అతను భావించే ఐదు శక్తివంతమైన పాఠాలు ఇక్కడ ఉన్నాయి:జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మిగతా అన్నింటినీ నిర్ధారిస్తుంది..శక్తి, మానసిక స్థితి, చర్మం, రోగనిరోధక శక్తి, మానసిక స్పష్టత అన్నీ జీర్ణవ్యవస్థలోనే మొదలవుతాయని అంటున్నారు వైద్యులు. ఇదంతా జీర్ణవ్యవస్థలో నిశ్శబ్దంగా ఉంటుంది,నిద్ర అనేది మీరు తర్వాత భర్తీ చేసుకోగలిగేది కాదుచాలా మంది అనుకున్నట్లుగా నిద్రలేమిని పూడ్చలేము. ప్రతి రాత్రి సరిగా నిద్రపోకపోవడం కాలక్రమేణా పేరుకుపోతుంది. కోల్పోయిన నిద్రకు బ్యాంకు ఖాతా లేదు,అని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక నిద్రలేమి వేగవంతమైన జీవసంబంధమైన వృద్ధాప్యం, అధిక జీవక్రియ ప్రమాదంతో ముడిపడి ఉందని పరిశోధనలు చెబుతున్నాయని చెబుతున్నారు.ఆహారం కంటే.. ఒత్తిడి ఆరోగ్యాన్ని చిత్తు చేస్తుంది..దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంపై ప్రత్యక్ష జీవసంబంధమైన ప్రభావాన్ని చూపుతుంది. మానసిక ఒత్తిడి కొన్ని గంటల్లోనే జీర్ణవ్యవస్థ, శరీరాన్ని ప్రభావితం చేయగలదు. నాడీ వ్యవస్థ నియంత్రణ గురించి మంచి అవగాహన ఉండాలి.ఇష్టంగా తినే అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం..ఇవాల్టి ఆహారపు అలవాట్లు దీర్ఘకాలిక కాలేయం, జీవక్రియ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అంటున్నారు. ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి సమస్యలు అకస్మాత్తుగా రావు, దశాబ్దాల తరబడి పునరావృతమయ్యే ఆహారపు అలవాట్ల వల్ల వచ్చేవని అంటున్నారు.అత్యంత శక్తిమంతమైన పదార్థం ఫైబర్అందరు రోజుకు కేవలం పది నుంచి 15 గ్రాముల ఫైబరే తీసుకుంటున్నారు. తగినంత ఫైబర్ పెద్ద ప్రేగు కేన్సర్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Saurabh Sethi MD MPH | Gastroenterologist (@doctor.sethi) (చదవండి: భారత్ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!)
కథాకళి: ప్రేమ పండు
క్రీ.శ. 1772. అది యశీరప్లో ఒలోనా నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం. పెరూ రెస్కాల్డా.ఆ గ్రామస్థురాలైన లవీనియాకి నిద్ర లేవగానే ఉత్కంఠ పెరిగిపోతోంది. తన శరీరం సాధారణంగా ఉందా లేక ఏదైనా మార్పు వచ్చిందా అన్న ఆందోళన ఆమెని వేధిస్తోంది.పదహారేళ్ళ లవీనియా– మాంసం కొట్టు యజమాని కొడుకు ఫ్రెడినోతో ప్రేమలో పడింది. అతని వయసు పద్దెనిమిది. ఆమె వారానికి రెండుసార్లు మాంసం కొనడానికి అతని కొట్టుకి వెళ్ళేది. ఫ్రెడినో తన తండ్రితోపాటు అక్కడ పని చేసేవాడు. తండ్రి చూడకుండా తనకి ఎక్కువ మాంసం తూచడాన్ని లవీనియా గమనించింది. ఆమె గమనించినట్లు అతను గ్రహిస్తే నవ్వుతూ కన్నుకొట్టేవాడు. ఆదివారాలు చర్చిలో కూడా ఒకరికొకరు తారసపడేవారు.ఓ రోజు ఫ్రెడినో లవీనియాకి మాంసం ఇస్తూ గుసగుసగా చెప్పాడు.‘‘ఇంకో గంట తర్వాత నది ఒడ్డున కలుద్దాం. మూడు పైన్ చెట్ల దగ్గర.’’అతను చెప్పిన సమయానికి వెళ్ళాలని అనుకుంది. కాని తల్లి ఊలు నించి దారం తీసే పని చెప్పడంతో కుదరలేదు.రెండు రోజుల తర్వాత మళ్ళీ మాంసం కొనడానికి వెళ్ళినప్పుడు ఆమె అతను వినేలా మరో కస్టమర్తో చెప్పింది.‘‘మొన్న నాకు మా అమ్మ చాలా పెద్ద పని ఇచ్చింది. అందువల్ల బయటకి వెళ్ళలేదు.’’అతను లవీనియాతో రహస్యంగా చెప్పాడు.‘‘రేపు అక్కడే సూర్యుడు కొండ మీదకి వెళ్ళే సమయంలో కలుద్దామా?’’‘‘నీ ఆహ్వానం కోసమే నేను ఎదురు చూస్తున్నాను.’’ సిగ్గుగా చెప్పింది.మొదటిసారి వారిద్దరూ ఏకాంతంలో కలిశారు. ఒకరినొకరు కౌగిలించుకుని చాలాసేపు అలాగే నిలబడ్డారు. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగం పెరిగింది.‘‘నువ్వు చాలా అందగత్తెవి.’’ ఫ్రెడినో చెప్పాడు.లవీనియా నవ్వుతూ చెప్పింది.‘‘అందం కాలంతో వచ్చి కాలంతో వెళ్ళిపోతుందని మా నాయనమ్మ చెప్తూంటుంది.’’‘‘అవును. అందుకే ఈ వయసులో ప్రేమించుకుంటారు. ముసలి వయసులో కాదు.’’ఆమె ఫక్కున నవ్వింది. తర్వాతి కలయికల్లో గర్భవతి అవుతానన్న భయంతో లవీనియా అతన్ని అందుకు అనుమతించలేదు. ఆమె మనసులో మాత్రం ఆ తహతహ ఉంది. చివరికి అది ఆమె మానసిక శక్తిని లొంగదీసింది. ‘‘నేను రేపు రోమ్కి వెళ్ళాల్సి వచ్చింది.’’ ఓ రోజు ఫ్రెడినో ఆమెతో చెప్పాడు.‘‘మళ్ళీ ఎప్పుడు వస్తావు?’’ లవీనియా ఆందోళనగా అడిగింది.‘‘మన రాజు జోసెఫ్ ది సెకండ్ రాజప్రసాదంలో మా నాన్న నాకు ఉద్యోగం సంపాదించారు. రాజుగారి వంటశాలలో మాంసం కోసే పని.’’‘‘వెళ్ళక తప్పదా? మానేయచ్చుగా?’’ లవీనియా బాధగా అడిగింది.‘‘వెళ్ళకపోతే రాజు ఊరుకుంటాడా?’’ ఫ్రెడినో నిస్సహాయంగా చెప్పాడు.వారి ఆ చివరి కలయికలో కన్నీళ్ళు చాలానే కారాయి. ఫ్రెడినో రోమ్కి వెళ్ళాక లవీనియాకి జీవితం వెలితిగా మారింది. ఏ పని మీద ఉత్సాహం లేదు.మూడు నెలలు గడిచాక తను గర్భవతైందని గ్రహించింది. ఆ కాలంలో పెళ్ళి కాకుండా తల్లి అవడం పెద్ద అపరాధం. ఊరి ప్రజలకి అలాంటి వారిని రాళ్ళతో కొట్టి శిక్షించే హక్కు కూడా ఉండేది. అది తన కుటుంబానికి తీరని మచ్చ. బలవంతంగా కడుపు తీయించుకునే ప్రయత్నంలో చాలామంది మరణించడం గురించి కూడా ఆమె విన్నది. తల్లి కఠినురాలు. తండ్రికి తను గర్భవతినని చెప్పే ధైర్యం లేదు.చివరికి ఆమెకి ఒకటే పరిష్కారం కనిపించింది. ఆత్మహత్య.ఆరోజు చర్చికి వెళ్ళి మేరీ మాతని ప్రార్థించింది. తరువాత నది ఒడ్డుకి వెళ్ళి అక్కడి మొక్కల నుంచి ఎర్రటి విషపు పళ్ళని చాలా కోసుకుంది. తమ కలయిక జరిగిన మూడు పైన్ చెట్ల మధ్య కూర్చుని వాటిని తినసాగింది. వాటి రసం ఆమె దుస్తుల మీదకి కారింది. దాదాపు పాతిక పళ్ళు తిన్నాక ఆమె కళ్ళు మూసుకుని మృత్యువు కోసం ఎదురుచూస్తూ పడుకుంది.అప్పుడే అక్కడికి ఫ్రెడినో వచ్చాడు. పక్కన ఉన్న పళ్ళని చూసి భయంగా అడిగాడు.‘‘వీటిని తిన్నావా? అయ్యో! ఫ్రెంచ్ ప్రభుత్వం వీటిని నిషేధించింది కూడా. ఎందుకు తిన్నావు?’’‘‘నేను గర్భవతిని. మరో మార్గం లేదు. నువ్వు కొద్దిగా ముందు వచ్చి ఉంటే వీటిని తినేదాన్ని కాదు.’’ లవీనియా కన్నీళ్ళతో చెప్పింది.‘‘నువ్వు లేకుండా నేను బతకలేను.’’ ఫ్రెడినో ఆమె చేతిని పట్టుకుని చెప్పాడు.అతనూ ఆ పళ్ళని కోసుకుని తిన్నాడు. కొన్ని గంటలు గడిచినా ఇద్దరికీ ఏమీ కాలేదు.‘‘మేరీ మాత అనుగ్రహం.’’ లవీనియా భక్తిగా చెప్పింది.ఫ్రెడినో ఇరువురి తల్లిదండ్రుల అనుమతితో ఆమెని పెళ్ళి చేసుకుని రోమ్కి తీసుకెళ్ళాడు.అక్కడ రాజుగారి వంటవాడికి ఆ పళ్ళ గురించి చెప్తే నమ్మలేదు. కాని ఫ్రెడినో తన ముందే వాటిని తిన్నా ఏమీ కాకపోవడం చూసి చెప్పాడు.‘‘ఇది విషపు పండు కాదు. ప్రేమ పండు. దీన్ని వంటల్లో వాడుతాను.’’అలా ఆ పండు క్రమంగా యూరప్, సౌత్ అమెరికాలోని దేశాలకి, అమెరికాకి కూడా వ్యాపించింది. యురోపియన్ సలాడ్లో తప్పనిసరి భాగంగా మారిన ఆ పండు పేరు టొమాటో.(నైట్షేడ్ అనే విషపుజాతికి చెందిన టొమాటోలని యూరోపియన్ 16వ శతాబ్దం దాకా విషపు పళ్ళుగా నమ్మేవారు. ‘ఎప్పటి నించి ఆ అపనమ్మకం తొలగింది?’ అనే ఆలోచన వచ్చాక)
వినూత్నంగా పెళ్లి రోజు వేడుక
జగిత్యాలరూరల్: పెళ్లి చేయాలంటే.. ఆకాశమంతా పందిరి.. భూదేవి అంతా పీట.. పురోహితులు.. బంధువులు.. బలగం తరలిరావాలంటారు. కానీ ఈ పెళ్లి వేడుకకు తోటి ఉపాధిహామీ కూలీలే పెళ్లి పెద్దలుగా మారారు. తట్ట.. పార పట్టిన వారే పురోహితులుగా అవతారం ఎత్తి పెళ్లి తంతు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ వినూత్న పెళ్లి వేడుక సోషల్మీడియాలో వైరల్గా మారింది. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల, బాలపల్లి గ్రామాలకు చెందిన 225 మంది శుక్రవారం ఉపాధిహామీ పనులకు హాజరయ్యారు. పనులు ముగిసిన తర్వాత పని స్థలంలో రెండు గ్రామాల కూలీలు ఒక్కచోట చేరారు. ఈ సమయంలోనే పొరండ్ల గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి–సత్తమ్మ దంపతుల 41వ పెళ్లి రోజు అని చర్చకు వచ్చింది. వెంటనే తోటి కూలీలు ఘనంగా వేడుకలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మామిడితోటనే పెళ్లి వేదికగా మార్చుకున్నారు. మామిడి ఆకులతో బాసింగాలు తయారు చేసి వారిద్దరికి కట్టి పెళ్లి జరిపించారు. నిజమైన వివాహ వేడుకలను మైమరిపించేలా తలంబ్రాలు, అరుంధతి నక్షత్ర దర్శనం, అప్పగింతలు నిర్వహించారు. అక్కడే ఉన్న వారందరికీ కూరగాయలు, మటన్, బగార అన్నం, మక్కగుడాలతో విందు ఏర్పాటు చేశారు. పెళ్లికి హాజరైన కూలీలందరూ కట్నకానుకలు సమర్పించారు. ఈ పెళ్లి తతంగం అంతా సోషల్మీడియాలో వైరల్గా మారింది.
భారత్ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!
మన మాతృగడ్డని ఎందరో విదేశీయలు ప్రశంసించారు. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు ఫిదా అయ్యి ఇక్క్కడే స్థిరనివాసం ఏర్పరుచుకున్న వాళ్లు కోకొల్లలు. అలాంటి ఈ భారత్ నేలను విడిచి వెళ్లడం అంటేనే కన్నీళ్లు వచ్చేస్తాయంటున్నాడు ఒక విదేశీయుడు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఆ వీడియోలో యూకే ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ డేవ్ ఫ్లూకు ప్రతి పర్యటలనో భారత్ని విడిచి వెళ్లడమే అత్యంత కష్టంగా ఉంటుందని చెబుతుండటం కనిపిస్తుంది. మంబై నుంచి బయలుదేరే ముందు రికార్డ్ చేసిన వీడియో అది. ఈ దేశంతో ఏర్పరచుకున్న అనుబంధం అలాంటిదని, ఇక్కడి స్నేహితులకు వీడ్కోలు చెప్పడం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ వీడియోలో ముంబైలోని సాకినాకా వీధుల్లో నడుస్తూ.. భారతదేశాన్ని విడిచి వెళ్లే సమయం వచ్చినప్పుడల్లా తాను అనుభవించే భావాలను ఫ్లూ గుర్తుచేసుకున్నారు. ఏళ్లుగా తాను గాఢంగా అనుబంధం పెంచుకున్న దేశాన్నివిడిచి వెళ్లడం అనే ఆలోచన తలుపుకు రాగానే..గుండ పగిలిపోతుందన్నారు. అలాగే భారతదేశంపై తనకున్న అభిమానం గురించి కూడా ప్రస్తవించారు. తాను మరే దేశాన్ని ప్రేమించనంతగా ఈ దేశాన్ని ప్రేమిస్తున్నానని, ప్రతిసారి దీన్ని విడిచి వెళ్లడం అంటే మానసికంగా చాలా కష్టపడాల్సి వస్తుందన్నారు. జీవితం అంటే ముందుకు సాగడం అని తెలిసినప్పటికీ..ఈ వీడ్కోలు వద్దకు వచ్చేటప్పటకీ హృదయం ద్రవించిపోతోందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చివరగా మళ్లీ తిరిగి ఇక్కడకు వస్తానని చెబుతూ.."జై హింద్" అంటూ తన పోస్ట్ని ముగించారు. ఈ వీడియోకి ప్రసారి వెళ్లడం తన గుండెని పిండేస్తుందంటూ క్యాప్షన్ ఇచ్చి మరీ షేర్ చేశారు. నెటిజన్లు అతడి పోస్ట్కి ఫిదా అవ్వుతూ బ్రో త్వరగా తిరిగి రండి, ఇది తాత్కాలికి వీడ్కోలే అని భరోసా ఇస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Dave Flew (@flewy86) (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!)
అంతర్జాతీయం
అమెరికాలో కాల్పుల కలకలం: వేడుకల్లో బుల్లెట్ల వర్షం!
ఓహియో: అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో కలకలం చెలరేగింది. టోలెడో నగరంలోని ఒక ప్రాంతంలో వేడుకలు జరుగుతుండగా, గుర్తుతెలియని ఆగంతకుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఉత్సాహంగా సాగుతున్న వేడుకల్లో ఒక్కసారిగా వినిపించిన తుపాకీ శబ్దాలు..అక్కడి వాతావరణాన్ని ఆందోళనకరంగా మార్చివేశాయి. జనం ప్రాణభయంతో అటూఇటూ పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.పండుగ వేళ బుల్లెట్ల వర్షంఓహియోలో ‘ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్’ జరుగుతుండగా కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులకు రక్తపు మడుగులో పలువురు క్షతగాత్రులు కనిపించారు. ఈ ఘటనపై నగర కౌన్సిల్ సభ్యురాలు థెరిసా మోరిస్ స్పందిస్తూ.. ఈ కాల్పుల్లో కనీసం ఎనిమిది మంది గాయపడ్డారని, రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ఇలాంటి దారుణం జరగడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా నౌకాదళంలో పనిచేసిన కెవిన్ బెర్రీ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం, కాల్పుల అనంతరం ఎవరో గన్ను కింద పడేసి వెళ్లడం తాను చూశానని, అర్బోరేటమ్ ప్రాంతంలో ఐదుగురు గాయపడి పడి ఉండటాన్ని గమనించానని పేర్కొన్నారు.నిందితుడి కోసం ముమ్మర గాలింపుఈ హింసాత్మక ఘటనకు పాల్పడిన నిందితుని కోసం టోలెడో పోలీస్ డిపార్ట్మెంట్ ముమ్మరంగా గాలిస్తోంది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోలీసులు స్పందిస్తూ.. డెలావేర్ అవెన్యూ, రాబిన్వుడ్ అవెన్యూ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు, దర్యాప్తుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు స్థానికులు, సందర్శకులు ఎవరూ ఆ ప్రాంతానికి రావద్దని హెచ్చరించారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై ఆధారాలు సేకరిస్తున్నారు.‘బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ఈ ఉదంతంపై ఓహియో గవర్నర్ మైక్ డివైన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేసవి ఉత్సవాలు అనేవి సంతోషంగా గడపడానికి ఉద్దేశించినవని, ఇలాంటి చోట్ల హింస చోటుచేసుకోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కాల్పుల శబ్దాలు వినగానే జనం ప్రాణాలు కాపాడుకోవడానికి చెల్లాచెదురుగా పరుగులు తీయడం కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ‘వాస్తవంలో బతకండి మిస్టర్ ట్రంప్’.. నీళ్లు చల్లిన టెహ్రాన్!
‘వాస్తవంలో బతకండి మిస్టర్ ట్రంప్’.. నీళ్లు చల్లిన టెహ్రాన్!
టెహ్రాన్: వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో భవిష్యత్తులో సమావేశం కావచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి భేటీ ఆశించడం ముమ్మాటికీ అవాస్తవికమని, అమెరికా అధ్యక్షుడు ఇకనైనా ‘వాస్తవంలో బతకడం’ అలవాటు చేసుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ట్రంప్ ఆశావాదం - ఇరాన్ తిరుగుబాటుఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ముందుకు సాగితే, ఇరాన్ అగ్ర నాయకత్వంతో నేరుగా చర్చలు జరపవచ్చని డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భద్రత, ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత ఒప్పందాన్ని కుదుర్చుకునే వ్యూహంలో భాగంగా, మొజ్తబా ఖమేనీతో చారిత్రాత్మక భేటీకి తాను సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చారు. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని లెబనాన్ ఛానల్ ‘అల్ మయాదీన్’ ఇంటర్వ్యూలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కొట్టిపారేశారు.అసలు ఎవరీ మొజ్తబా ఖమేనీ?2026 మార్చిలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఆ తర్వాత ఆయన కుమారుడైన మొజ్తబా ఖమేనీ ఇరాన్ అత్యున్నత రాజకీయ, మతపరమైన పదవిని చేపట్టారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన ప్రజల్లో ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ, ఇరాన్ అంతర్గత, విదేశాంగ విధానాలను శాసించడంలో ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం నాల్గవ నెలలోకి ప్రవేశించిన ఈ తరుణంలో ఆయనతో భేటీ కావడం ట్రంప్కు ప్రతిష్టాత్మకంగా మారింది.కొనసాగుతున్న తీవ్ర విభేదాలుఅమెరికా ఎంతగా చర్చల ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నా, ఇరు దేశాల మధ్య నమ్మకరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు దౌత్యపరమైన పురోగతికి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం బహిరంగ ప్రకటనల ద్వారా కాకుండా, ఆచరణాత్మక రాజకీయ పరిణామాల ఆధారంగానే భవిష్యత్తు చర్చలు ఉంటాయని ఇరాన్ గట్టిగా చెప్తోంది. నానాటికీ క్షీణిస్తున్న ఈ సంబంధాల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడం ఇప్పట్లో సాధ్యం కాదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: కరోనా నాటి ఘోర తప్పిదం.. నేడు వేలాది ప్రాణాలకు ముప్పు!
చంపినా.. చావనంటోంది!
గోడ మీది బల్లి తోక తెగిపోతే... తోక మళ్లీ పెరుగుతుంది. ఇది మనకు తెలుసు. కానీ.. తెగిన తోకలోంచి సరికొత్త బల్లి పుట్టుకొస్తే? అట్లాంటిక్ మహా సముద్రం అట్టడుగున ఈ అద్భుతమే ఆవిష్కృతమైంది!! కెనడాలోని మెమోరియల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అ మధ్య అట్లాంటిక్ మహా సముద్రంలో కొన్ని అన్వేషణలు జరిపారు. మంచుముద్దల అడుగున చాలా లోతులో వారికి ఓ సముద్రపు దోస దొరికింది. దోస అంటే ముళ్ల దోసకాయ వంటి రూపమున్న జీవి. శాస్త్రీయ నామం సోలస్ ఫాబ్రిచీ. సరే... దీనిపై పరిశోధనలు చేద్దామనుకున్నారు వాళ్లు. ల్యాబ్కు తీసుకొచ్చి ఒక ముక్క కత్తిరించి సముద్రపు నీటిలోనే పాతి పెట్టారు. కుళ్లి, కృషించి పోవడానికి ఎంత టైమ్ పడుతుందో చూద్దామనుకున్న ఆ శాస్త్రవేత్తలకు భారీ షాకే తగిలింది. ఎందుకంటే.. రోజులు, వారాలు, గడుస్తున్నా ఆ ముక్క చావనంటోంది. పైగా గాయం మానిపోవడం మొదలైంది. కణాలు చురుకుగానే ఉన్నాయి. రోగ నిరోధక వ్యవస్థ కూడా పని చేయడం మొదలైంది. కొన్ని నెలల తరువాత గమనిస్తే... కత్తిరించిన ముక్క కంటే పెద్దది అయిపోయింది. మూడేళ్లు గడిచాయి. ఆ ముక్కలో జీవం తొణికిసలాడుతూనే ఉంది. సముద్రపు నీటిలోంచి పోషకాలు పీల్చేసుకుని ఎంచక్కా బతికేస్తోంది. పునరుత్పత్తి జరగలేదు కానీ.. కత్తిరించినా అది ఇంకో జీవిలా బతికేసింది అన్నమాట! ఎందుకో.. ఏమో... ప్రకృతిలో ఎన్నో వింతలు ఉంటాయి కానీ ఇలాంటిది మాత్రం ఇదే మొదటిది అంటున్నారు రేచల్ సైప్లర్ అనే మెరీన్ బయోజియోకెమిస్ట్. బల్లి తోకలు మళ్లీ పెరిగినట్లే కొన్ని ఇతర జీవజాతుల్లోనూ అవయవాల పునరుత్పత్తి జరుగుతూంటుంది. సాల్మాండర్స్లో కీళ్లు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూంటాయి. అలాగే జెల్లీఫిష్ వృద్ధాప్యం నుంచి యవ్వన స్థితికి వెళ్లిపోగలదు. ఒక కీటకం రెండుగా విడిపోయి కూడా బతకగలదు. కానీ ఇలా అస్సలు చావని శరీర భాగాన్ని మాత్రం గతంలో ఎక్కడ చూడలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. తెగిపోయిన ఒక భాగం ఇలా చావకుండా ఏళ్లపాటు ఉంటే మనకేంటి ప్రయోజనం? చాలానే అంటున్నారు శాస్త్రవేత్తలు. కణజాలాన్ని పెంచడం, సూక్ష్మజీవుల సాయంతో గాయాలు మాన్పడం వంటివి ఈ సముద్రపు దోసపై పరిశోధనలు చేయడం ద్వారా సాధ్యం కావచ్చునని అంచనా. సుదూర భవిష్యత్తులోనైనా తెగిన చేతులను మళ్లీ మొలిపించవచ్చునేమో??? వెన్నెముక లేని జీవజాతి అకశేరుకాలకు చెందిన ఈ సముద్రపు దోసపై ఎలాంటి నైతిక, న్యాయపరమైన నియంత్రణలు లేకుండా పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉంది. తద్వారా జీవం విషయంలో సరికొత్త విషయాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెమోరియల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూడేళ్ల తరువాత తమ పరిశోధనలు నిలిపివేశారు. ఇటీవలే సైన్స్ అడ్వాన్స్లో వివరాలు ప్రచురితమయ్యాయి. కొసమెరుపు ఏమిటంటే.. ఆ ముక్క ఇప్పటికీ చురుకుగానే అంటే జీవంతోనే ఉండటం! – సాక్షి, నేషనల్ డెస్క్
ఇరాన్ రాడార్లను ధ్వంసం చేసిన అమెరికా
బ్రిడ్జివాటర్: అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. తమ రాడార్ స్టేషన్లను అమెరికా ధ్వంసం చేసినందుకు ప్రతీకారంగా కువాయిట్, బహ్రెయిన్లలోని అమెరికా స్థావరాలపైకి క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ శనివారం ప్రకటించింది. అయితే, తమ గల్ఫ్ అరబ్ మిత్ర దేశాలపైకి ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా మిలటరీ తెలిపింది. శుక్రవారం రాత్రి కువైట్, బహ్రెయిన్ భూభాగాల్లోకి ప్రవేశించిన ఏడింటికిగాను ఆరు బాలిస్టిక్ మిస్సైళ్లను మధ్యలోనే కూల్చినట్లు తెలిపింది. మరో క్షిపణి దారి తప్పి, లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైందని పేర్కొంది. వీటి కారణంగా అమెరికా బలగాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని తెలిపింది. హార్మూజ్ జలసంధిపైకి ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అంతకుముందు అమెరికా ఆర్మీ కూల్చివేసింది. ఆ ప్రాంతంలో నౌకల సంచారానికి ముప్పుగా పరిణమించినందునే ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది. అదేవిధంగా, మరిన్ని దాడులకు పాల్పడకుండా ఇరాన్ రాడార్ కేంద్రాలను నిరీ్వర్యం చేసినట్లు పేర్కొంది. అదేవిధంగా, తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నాయని కువైట్ తెలిపింది. క్షిపణుల దాడిని ముందుగానే పసిగట్టి సైరన్ల ద్వారా తమ పౌరులను సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించినట్లు బహ్రెయిన్ వివరించింది. కాగా, ఖెష్మ్ దీవి, ఆ సమీపంలోని సిరిక్లో ఏర్పాటు చేసుకున్న నిఘా వ్యవస్థల్ని అమెరికా ధ్వంసం చేసినందుకే తాము కువైట్లోని అమెరికా బలగాలున్న అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్ను, బహ్రెయిన్లోని అమెరికా నేవీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని, మిస్సైళ్లు ప్రయోగించినట్లు అనంతరం ఇరాన్ ఆర్మీ తెలిపింది. ఇరాన్ హార్మూజ్ను మూసివేయడంతో, బదులుగా ఇరాన్ నౌకాశ్రయాల్లో అమెరికా ఆర్మీ దిగ్బంధనం అమలు చేస్తుండటం తెల్సిందే. ఇలా ఉండగా, అమెరికాలోని విస్కాన్సిన్లో శుక్రవారం అధ్యక్షుడు ట్రంప్ కొందరు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ..ఇరాన్తో యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరలో ముగించబోతున్నామని ప్రకటించారు. తద్వారా ఎరువుల ధరలు నాలుగు నెలల క్రితం స్థాయికి దిగి వస్తాయని వారికి చెప్పారు. అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులు చాలామటుకు ధ్వంసం అయినప్పటికీ ఇంకా 22 శాతం వరకు భద్రంగానే ఉన్నట్లు సమాచారముందన్నారు.
జాతీయం
నీట్ రీటెస్ట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ జారీ
న్యూఢిల్లీ: ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్–యూజీ 2026 రీ టెస్ట్కు సంబంధించిన ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్లను ఆదివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది. రీ టెస్ట్ రాసే అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉందనే సమాచారాన్ని ఈ స్లిప్ ద్వారా చూసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ను ఉపయోగించుకుని ఈ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ ఎక్స్లో కోరింది. ఈ స్లిప్ అడ్మిట్ కార్డు కాదు, కేవలం అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉన్నదీ తెలుసుకునేందుకు మాత్రమేనని తెలిపింది. దాదాపు అభ్యర్థులందరికీ మొదటి ప్రాధాన్యంగా పేర్కొన్న నగరాల్లోనే పరీక్ష కేంద్రాలను కేటాయించామని తెలిపింది. త్వరలోనే రీ టెస్ట్ అడ్మిట్ కార్డులను జారీ చేయనున్నట్లు ఎన్టీఏ వివరించింది. పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలు, అడ్మిట్ కార్డు విడుదల అప్డేట్ వివరాల కోసం అధికారిక వెబ్సైట్లలో వచ్చే ప్రకటనలను చూడాలని సూచించింది. నీట్ రీ టెస్ట్ 21వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న 551 నగరాలతోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు జరగనుండటం తెల్సిందే.
విజయ్ ప్రభుత్వం 3 నెలలైనా ఉంటుందా?
చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వంపై డీఎంకే చీఫ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే ప్రభుత్వం మూడు నెలలు కూడా కొనసాగడం కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు 60 ఏళ్ల కాలంలో ఏర్పడిన ఏకైక డీఎంకేయేతర, అన్నాడీఎంకేయేతర ప్రభుత్వం విజయ్ జోసెఫ్ సారథ్యంలో మేలో ఏర్పడటం తెల్సిందే. ఆదివారం చెన్నైలో వీసీకే ఎమ్మెల్యే పనైయూర్ బాబు డీఎంకేలో చేరిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో స్టాలిన్ ప్రసంగించారు. ‘‘ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటిదో నేను చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, మరో ఆరు నెలల వరకు ఎలాంటి విమర్శలు చేయబోనని చెప్పా. ప్రస్తుత పరిస్థితులను చూసి మాట్లాడక తప్పడం లేదు. ఈ ప్రభుత్వం ఎన్ని నెలలు ఉంటుందనికాదు, కనీసం మూడు నెలలయినా మనుగడ సాగిస్తుందా అన్నదే అసలు ప్రశ్న’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమ పార్టీలోకి కొత్తగా వచ్చే వారు తాము వచ్చిన పార్టీని విమర్శించవద్దని కోరారు.
మానవ తార్కికతకు సహాయకంగానే సాంకేతికత
న్యూఢిల్లీ: స్వదేశీ న్యాయశాస్త్రం అభివృద్ధికి మనం గణనీయమైన ప్రాధాన్యత ఇచ్చినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. న్యాయపరమైన అంశాల్లో స్వతంత్ర ఆలోచనకు ప్రత్యామ్నాయంగా కాకుండా, మానవ తార్కికతకు సహాయకంగానే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు. ఆక్స్ఫర్డ్ యూనియన్, ఆక్స్ఫర్డ్ లా సొసైటీలో ‘డిజిటల్ వాస్తవికతకు రాజ్యాంగ వాగ్దానం: ఏఐ, సాంకేతిక పురోగతి యుగంలో న్యాయాన్ని పరిరక్షించడం’ అనే అంశంపై జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సాంకేతిక కార్యక్రమాలకు అదనంగా న్యాయవ్యవస్థ కోసం స్వదేశీ కృత్రిమ మేధ(ఏఐ) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కేవలం దిగుమతి చేసుకున్న సాంకేతిక నమూనాలు లేదా అంచనాలపై ఆధారపడకుండా, మన సొంత రాజ్యాంగ విలువలు, సంస్థాగత వాస్తవాలు, భాషా వైవిధ్యం, సామాజిక పరిస్థితుల పట్ల శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. న్యాయ వ్యవస్థలో నేడు సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయ వ్యవస్థలను ఒకదానితో ఒకటి మరింత సన్నిహితంగా సంభాషించుకునేలా చేసిందన్నారు. ప్రపంచ న్యాయ సమాజం టెక్నాలజీతో పరస్పరం అనుసంధానం అవుతోందని వెల్లడించారు. న్యాయవ్యవస్థ సాంకేతిక పరివర్తనకు యువ న్యాయవాదులు, న్యాయాధికారులు, న్యాయ నిపుణులు దోహదపడుతున్నారని పేర్కొన్నారు. సాంకేతికత అనేది మానవ విచక్షణను ఎన్నటికీ భర్తీ చేయలేదని తేల్చిచెప్పారు.
మీనాక్షికి క్రాస్ఓటింగ్ గండం
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. అధికార బీజేపీకి కచ్చితంగా రెండు సీట్లు దక్కే పరిస్థితి ఉన్నప్పటికీ, ఇప్పుడు చర్చ అంతా మూడో స్థానం చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ‘మూడో సీటు వస్తుంది.. లేదంటే ఎక్కడికి వెళ్తుంది?’ అంటూ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ వ్యూహాలపై కొత్త చర్చకు తెరతీశాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ పోటీ చేస్తున్నారు. మూడో స్థానం కోసం ఆమె పోటీపడుతున్నారు. మూడో స్థానం గెలిచేందుకు బీజేపీకి కేవలం 9 ఓట్లే అవసరం. దాంతో కాంగ్రెస్ను క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్ పోటీకి దిగారు. కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకొనే అవకాశాలు ఉండటంతో మీనాక్షి నటరాజన్ బరిలో నిలిచారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 230 స్థానాలుండగా, బీజేపీకి సొంతంగా 165 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒక స్థానం ఖాళీగా ఉంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి సుమారు 58 ఓట్లు అవసరం. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు సులువుగా విజయం సాధించగలరు. ఆ పార్టీ వద్ద మరో 49 ఓట్లు మిగులుతాయి. ఒకవేళ బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపితే విజయానికి 9 ఓట్లు ప్రతిపక్షం నుంచి రావాల్సి ఉంటుంది. ‘పార్టీ ఆదేశిస్తే మూడో అభ్యర్థిని గెలిపించగలం’ అని బీజేపీ సీనియర్ మంత్రి కైలాష్ విజయవర్గీయ తేల్చిచెప్పారు. దీంతో క్రాస్ ఓటింగ్ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్లో కలకలం మొదలైంది. మీనాక్షీ నటరాజన్ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత నరేష్ జ్ఞానచందానీ బహిరంగంగా ప్రశ్నించారు. ‘క్రాస్ ఓటింగ్ ప్రమాదం పొంచి ఉంది’ అని ఆయన హెచ్చరించడం కాంగ్రెస్లో ఆందోళనను మరింత పెంచింది.
ఎన్ఆర్ఐ
కువైట్ ఎయిర్పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
కువైట్: ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం పట్ల కువైట్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైకి డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కువైట్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందినట్లు భారత ఎంబసీ వెల్లడించింది.మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోందని.. బాధిత కుటుంబానికి.. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాయం అందించడానికి కువైట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ అమెరికా (US) మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మరణించడమే కాకుండా.. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకిన ఇరాన్ డ్రోన్లతో ప్యాసింజర్ టెర్మినల్కు భారీ నష్టం కలిగింది.Embassy of India in Kuwait expresses its deepest condolences at the tragic demise of an Indian national due to an attack on the airport in Kuwait today. The Embassy is in touch with the bereaved family and is closely coordinating with the Kuwaiti authorities to render all…— India in Kuwait (@indembkwt) June 3, 2026కాగా, కువైట్లోని అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పలు డ్రోన్లను తాము అడ్డుకున్నామని.. ఆ దేశం వైపు ప్రయోగించిన ఇరాన్ క్షిపణులు మార్గమధ్యంలోనే కూలిపోయాయని అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఐదో విమాన దళం ఉన్న బహ్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూడా అమెరికా, బహ్రెయిన్ బలగాలు అడ్డుకున్నట్లు పేర్కొంది. దీనికి ప్రతిచర్యగా, హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై అమెరికా దాడులు చేసింది.
అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో బేత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో ఈ ఉత్సవాలు జరిగాయి.ప్రవాస తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్ఆర్ఐ ప్రముఖులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, వెంకట్ మారోజు, నారాయణస్వామి పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్, సింగర్ అద్వైత్ బొందుగుల తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అశోక్ చింతకుంట కొమరం భీమ్ ఏకపాత్రాభినయం అలరించింది. చిన్నారులు అదిరిపోయే ఫ్యాషన్ షోను ప్రదర్శించారు.ప్రజల ఆంకాక్షలకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ మరింత అభివృద్ది జరగాలని, అందుకోసం తమవంతు పాత్రపోషిస్తామని నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల తెలిపారు. నైటా కార్యవర్గం, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సలహాసంఘం సభ్యులు కుటంబాలతో సహా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.(చదవండి: ఐరోపాలో ఘనంగా శ్రీ అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు)
ముగ్గురు స్నేహితులను కాపాడి! చివరికి..
అబ్దుల్లాపూర్మెట్: అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులను కాపాడిన అనురూప్రెడ్డి.. నీట మునిగి మృతి చెందాడు.మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోడూరి రాజేందర్రెడ్డి–దుర్గాభవాని దంపతులు కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆశ్రిత్రెడ్డితోపాటు అనురూప్రెడ్డి (22) సైతం ఐదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అనురూప్రెడ్డి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో ఇటీవల మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు.శనివారం లూసియానాలోని టోరోడో పార్క్లో ఉన్న సెబాన్ రివర్లో సరదాగా స్నేహితులతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో అతనితోపాటు మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. హఠాత్తుగా ముగ్గురూ లోతు ప్రదేశంలోకి వెళుతూ రక్షించండి అంటూ కేకలు వేశారు. అనురూప్రెడ్డి ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఒడ్డుకు చేర్చారు. తను పైకి వచ్చే క్రమంలో చెరువులో ఉన్న ఫిషింగ్ వైర్ కాలికి చుట్టుకోవడంతోపాటు నీటి ప్రవాహం పెరగడంతో పైకి రాలేకపోయాడు. అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే నీటిని ఎక్కువగా మింగడంతో మృత్యువాత పడ్డాడు.ఉన్నత చదువుల కోసం వెళ్లిన కుమారుడు ఇలా విగతజీవిగా మారుతాడని అనుకోలేదని కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగారు. అనురూప్రెడ్డికి ఫొటోగ్రఫీ ఎంతో ఇష్టమని, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని అతని సోదరుడు తెలిపారు. టీం ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ, ఇండియన్ ఎంబసీ, లూసియానా కాన్సులేట్ సంయుక్త సహకారం అందించి వారం రోజుల్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సమాచారం.
యూట్యూబ్ను షేక్ చేస్తున్న ఎన్నారై రాపోలు నందు..!
ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ చిత్ర పరిశ్రమలో వేలాది మంది అవకాశాల కోసం తిరుగుతుంటారు. చాలా మందిలోని కళ కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ, డ్యాన్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అతడికి లక్షలాది మంది అభిమానులు దొరికారు. సినిమాపై ఉన్న మక్కువే అతడికి అవకాశాలు వెతుక్కుంటూ తెచ్చింది. కోలీవుడ్లో హీరోగా అరంగేట్రం చేసిన జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు నందు రాపోలుపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ..పాలకుర్తి టౌన్: ఎన్నారై రాపోలు నందు బాల్యం మొత్తం పాలకుర్తి పరిసర ప్రాంతంలోనే గడిచింది. ఉద్యోగ రీత్యా ఆయన సింగపూర్లో సెటిలయ్యారు. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేసూ్తనే తెలుగు ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన నందు సరదాగా రీల్స్ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తన బంధువు సురేఖ నున్నతో కలిసి చేసిన వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇద్దరూ వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ, ఒకే పాటలో హీరోహీరోయిన్ పాత్రలను విభజించుకుని, ఎక్కడా తేడా తెలియకుండా సింక్ చేస్తూ చేసిన వీడియోస్ బాగా పాపులరయ్యాయి. వారు చేసిన 25 రీల్స్లో 20 వీడియోలు ఒక మిలియన్ (10 లక్షలు) వ్యూస్ దాటాయి. నందు ఆత్మవిశ్వాసంతో కూడిన డాన్స్, సినిమాపై ఆయనకున్న ప్రేమ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నిర్మాత కోన వెంకట్ సైతం నందు చేసిన ఒక రీల్ను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో నందుకు మంచి గుర్తింపు వచ్చింది. కోలీవుడ్ హీరోగా..నందు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి హీరో పాత్రకు ఎంపిక చేశారు. మలేషియా, తమిళనాడులో చిత్రీకరించిన ‘13/13 లక్కీ నన్’ చిత్రంలో నందు లవర్ బాయ్ పాత్రలో నటించారు. ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాడు, సింగపూర్, అమెరికా, మలేషియాలో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, నందు 2014 నుంచి సింగపూర్లో తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక పంపిణీదారులతో కలిసి ఇప్పటివరకు 25కు పైగా సినిమాలు విడుదల చేశారు. సరదాగా చేసిన రీల్స్తో హీరోగా అవకాశం..కోవిడ్ సమయంలో సరదాగా చేసిన రీల్స్ నా జీవితాన్నే మార్చేస్తాయని అస్సలు ఊహించలేదు. ఐటీ ఉద్యోగం చేసూ్తనే నటనపై అభిరుచిని కొనసాగించాను. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే నాకు కోలీవుడ్లో హీరో అవకాశం తెచ్చింది. ఉద్యోగం నా జీవనాధారం. సినిమాలు నా ఫ్యాషన్, ప్రేక్షకుల ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది.– రాపోలు నందు, సింగపూర్
క్రైమ్
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో..
మెదక్: మరో మహిళతో వివాహేత ర సంబంధం పెట్టుకు న్నాడనే నెపంతో కట్టు కున్న భార్య, ఆమె తల్లి దండ్రులు, తమ్ముడితో కలిసి భర్తను దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా మెదక్ మండలంలో వెలుగులోకి వచ్చింది.ర్యాలమడుగు గ్రామానికి చెందిన పుంటికూర కుమార్గౌడ్ (50) ఆర్మీలో జవాన్గా విధులు నిర్వహిస్తు న్నారు. అతనికి కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన పద్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిద్దరి మధ్య గొడవ కారణంగా కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నారు. కుమార్గౌడ్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో ఉంటున్నారు.మరో మహిళతో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో శనివారం రాత్రి అతడి భార్య పద్మ, ఆమె తల్లిదండ్రులు రామకృష్ణగౌడ్–ఎల్లమ్మ, సోదరుడు సంతోష్తో పాటు మరికొందరు కుమార్గౌడ్పై విచక్షణారహితంగా ఇనుప రాడ్స్, కర్రలతో కొట్టి చంపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పద్మతో పాటు ఆమె తల్లిదండ్రులు, తమ్ముడిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
కుమార్తెకు పెళ్లి కుదుర్చుకుని వస్తూ అనంత లోకాలకు
సామర్లకోట / పిఠాపురం : కుమార్తెకు పెళ్లి సంబంధం ఖాయమైందన్న ఆనందంతో ఇంటికి వస్తున్న ఆ దంపతులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ జంక్షన్ సత్తెమ్మ ఆలయం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. సామర్లకోట అప్పయ్య చెరువు ప్రాంతానికి చెందిన జూరెడ్డి సూర్యనారాయణ (45) స్థానిక ఎఫ్సీఐ గోదాములో కాంట్రాక్టు లేబర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం భార్య అరుణ కుమారి (40)తో కలిసి స్కూటీపై తుని వద్దనున్న తాళ్లూరికి వెళ్లారు. కుమార్తె ధరణికి వివాహ సంబంధం మాట్లాడేందుకు వెళ్లిన వీరు.. సంబంధం ఖాయం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. దుర్గాడ రోడ్డు జంక్షన్లోని సత్తెమ్మ ఆలయం సమీపంలోకి వచ్చేసరికి వారి స్కూటీని లారీ ఢీకొట్టింది. సూర్యనారాయణ హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ లారీ చక్రం తలపై నుంచి వెళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. అరుణకుమారిని కాపాడేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లాలని స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఆమె కూడా చనిపోయింది. దంపతులిద్దరూ ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచారు. లారీ డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. తమ ఏకైక కుమార్తెను డాక్టర్ను చేయాలనే ఆశతో సూర్యనారాయణ, అరుణకుమారి చదివిస్తున్నారని బంధువులు తెలిపారు. అయితే నీట్లో సీటు రాకపోవడంతో మరో ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం రాజమహేంద్రవరంలో బీఎస్సీలో చేర్చి హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారని... ఇంతలో మంచి సంబంధం రావడంతో పెళ్లి ఖాయం చేసుకుని వస్తున్న సమయంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని బంధువులు విలపిస్తున్నారు. దంపతుల హఠాన్మరణంతో అయ్యప్పచెరువు ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు.
సెల్ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య
గూడూరు: సెల్ఫోన్ కొనివ్వలేదని క్షణికా వేశంలో ఓ యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టెవాడలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన బొడ్డు రాములు–కరుణశ్రీ దంపతులకు కూతురు బిందు (22), ఇద్దరు కుమారులు న్నారు. కూతురు పీజీ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. శనివారం రాత్రి సెల్ఫోన్ కొనివ్వాలని బిందు తండ్రిని అడగడంతో డబ్బులు లేవన్నాడు. దీంతో క్షణికావేశానికి గురైన ఆమె రాత్రి బయటికి వెళ్లింది. రాత్రి నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. తండ్రి బొడ్డు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు.
విద్యార్థిని ప్రొఫెసర్ ప్రేమాయణం
హుబ్లీ: విద్యాను బోధించే గురువు స్థానం అత్యున్నతమైనదని భారత సంప్రదాయాలు చాటి చెబుతున్నాయి. అయితే విద్యా బోధన చేసే గురువే విద్యార్థినితో ప్రేమాయణం సాగించిన ఘటన కర్ణాటక విశ్వవిద్యాలయంలో జరిగింది. ఇక్కడి శాస్యశాస్త్రం విభాగం ఫ్రొఫెసర్ దేవరాజ సంగుదొరై విజయపురకు చెందిన అదే వి«భాగంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినితో ప్రేమ వ్యవహారం జరిపారు. ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు. వీరిద్దరి ప్రేమ గొడవ తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె పీహెచ్డీని సంగంలోనే ఆపేసి ఇంటికి తిరిగి తీసుకెళ్లి పోయారు. కొన్ని రోజుల తర్వాత విజయపురకు చెందిన విద్యార్థి తన వద్దకు పీహెచ్డీ చేయడానికి రాగా గతంలో మధ్యలోనే పీహెచ్డీని ఆపేసి వెళ్లిన విద్యారి్థని తిరిగి కళాశాలకు తీసుకొని వస్తే నీ పీహెచ్డీ పూర్తి చేసేందుకు అవకాశం ఇస్తానని ఆంక్షలు పెట్టారని తెలిసింది. దీంతో ఆ విద్యార్థి ఈ విషయంపై వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ ప్రొఫెసర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
వీడియోలు
కారు అడ్డం పెట్టాం అని నన్ను నా భార్యను తీసుకెళ్లి చంపైబోయారు
ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పేలిపోయిన విమానం
నన్నే కాదంటారా.. కడప రెడ్డెమ్మ భర్త తిరుగుబాటు
సర్కార్ మాటలు నమ్మం.. ఏకతాటిపైకి రైతులు
టార్గెట్ 2029.. ఢిల్లీలో 23 పార్టీల భేటీ
నా ఇంటిపై దాడి చేసిన వాడిని ఒక్కడినైనా అరెస్ట్ చేశారా..! ఛీ.. మీరు పోలీసులా..?
జగన్ ను కలిసిన రైతులపై ఎల్లో మీడియా ట్రోలింగ్
ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడులు
మహిళలను కించపరిచిన వ్యక్తికి రాజ్యసభ సీటు..!
కాక్రోచ్ జనతా పార్టీపై అడ్వకేట్ రజని ఆసక్తికర వ్యాఖ్యలు!

