వింత ప్రవర్తన: రేబిస్తో కుక్కలా అరుస్తున్న యువకుడు
లక్నో: ఓ 17ఏళ్ల యువకుడు అచ్చం కుక్కలా ప్రవర్తిస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలోని కచ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం, ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలుడి తల్లిదండ్రులు అందించిన వివరాల మేరకు.. కుక్క కరవడం వల్లే తమ కుమారుడు వింతగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్క కరవడం వల్ల రేబిస్ వ్యాధి సోకుతుంది. రేబిస్కు సరైన వైద్యం అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఈ బాలుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడనే అంశంపై వైద్యులు ఆరా తీశారు. రేబిస్కు సరైనా చికిత్స తీసుకోకపోవడం వల్లే బాలుడి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు గుర్తించారు. నాలుగు నెలల క్రితం, ఆ గ్రామంలో నివసించే భాయ్ లాల్ అనే 17 ఏళ్ల యువకుడికి కుక్క కరిచింది. ఈ సమయంలో, అతనికి మొదటి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. రేబిస్ సోకితే ఐదు టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ బాధిత బాలుడు రెండు టీకాలు మాత్రమే తీసుకున్నాడు. పూర్తి స్థాయిలో వైద్యం తీసుకోకుండా మధ్యలో వదిలేయడం వల్ల కొంత కాలంగా బాలుడు కుక్కలా ప్రవర్తించడం ప్రారంభించాడు. వైద్య చికిత్స కోసం ఆస్పత్రులు తిరిగినా ఫలితం కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వైద్యం అందిస్తే తగ్గిపోతుందని బాలుడి కుటుంబ సభ్యులు తమని తాము సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైద్యులు మాత్రం బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు చెప్పారు. మరోవైపు,స్థానిక వైద్యులు సైతం బాలుడికి టీకా పూర్తిస్థాయిలో వేయలేదని చెబుతున్నారు. కాబట్టే బాలుడు మాట్లాడే విధానం, నడక, కూర్చునే తీరు మారిపోయింది. అంతేకాకుండా, అతను బతికే అవకాశాలు దాదాపు లేనట్లేనని అంటున్నారు. బాలుడి పరిస్థితిని వైద్య పరిభాషలో హైడ్రోఫోబియా అని డికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పంకజ్ పాండే వివరించారు. రేబిస్ లక్షణాలు కనిపించినప్పుడు, శ్వాసకోశ మార్గం కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా వ్యక్తి కుక్కలా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు’ అని తెలిపారు. Mirzapur Boy Bitten by Dog 4 Months Ago, Took Only 2 Rabies Shots – Now Acting Like a Dog 😨#mirzapur #rabies #kiranyadav pic.twitter.com/ZuTZTCfJ5Z— Kiran yadav (@Thekiranyadavvv) March 15, 2026
వంట గ్యాస్ వినియోగదారులకు షాక్
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయుల వంటింట్లో సెగలు రేపుతున్నాయి. ఒకవైపు గ్యాస్ కొరత, మరోవైపు బ్లాక్ మార్కెట్ దందా సామాన్యుడి నడ్డి విరుస్తుండటంతో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని గృహ వినియోగదారులందరికీ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (ఈ-కేవైసీ) తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తమ మొబైల్ నుండే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ) యాప్తో పాటు, ‘ఆధార్ ఫేస్ ఆర్డీ) (Aadhaar FaceRD) యాప్ను ఉపయోగించి ఇంట్లోనే ఈ-కేవైసీ వెరిఫికేషన్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏవైనా సందేహాలుంటే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించాలని లేదా టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలని సూచించింది.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపధ్యంలోనే కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ఓడల రాకపోకలు నిలిచిపోయాయి. భారత్ తన గ్యాస్ అవసరాల కోసం 90% దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. ఫలితంగా ఢిల్లీలో 14.2 కిలోల గృహ సిలిండర్ ధర ₹60 పెరిగి ₹913కు చేరగా, కమర్షియల్ సిలిండర్ ధర ₹1,884.50కు పెరిగింది.గ్యాస్ కొరతను సాకుగా చూపి అక్రమంగా నిల్వ చేసే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కర్ణాటకలోని కెంఘేరిలో బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఢిల్లీలో గ్యాస్ డిపోల వద్ద నిరంతరం పోలీసు పహారా ఏర్పాటు చేశారు. అటు ఢిల్లీ ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సరఫరాపై 20 శాతం క్యాపింగ్ విధించి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు గ్యాస్ సరఫరా ఇబ్బందులు, మరోవైపు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు సతమతమవుతున్నాడు.ఇది కూడా చదవండి: UAE:19 మంది భారతీయుల అరెస్ట్.. కారణం ఇదే..
అట్టుడుకుతున్న దుబాయ్ : విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడి
మధ్యప్రాచ్య వివాదం ప్రారంభమైనప్పటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై 1,800కి పైగా క్షిపణులు, డ్రోన్లను ఇరాన్ ప్రయోగిచింది. ఇరానియన్ డ్రోన్ దాడి తర్వాత దుబాయ్ విమానాశ్రయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పలు విమానాలు రద్దయ్యాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) సమీపంలో జరిగిన డ్రోన్ ఇంధన ట్యాంక్ను ఢీకొట్టిన తర్వాత సోమవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మంటలు చెలరేగాయి అత్యవసర బృందాలు వేగంగా స్పందించి విమానాలను తాత్కాలికంగా నిలిపివేసాయి. యుఎఇ అత్యంత లక్ష్య దేశంగా మారిందని అధికారులు తెలిపారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బందిని వెంటనే మంటలను అదుపు చేశారు. సమీపంలో భద్రతా చర్యలు చేపట్టడంతో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈమేరకు దుబాయ్ మీడియా ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. దుబాయ్ విమానాశ్రయం దుబాయ్ విమానాశ్రయం నుండి అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొన్ని విమానాలను మళ్లిస్తున్నట్లు కూడా ప్రకటించింది. విమానాశ్రయ రోడ్డు, విమానాశ్రయ సొరంగంను పోలీసులు మూసివేశారు.Large fire reported in the vicinity of Dubai International Airport after an Iranian drone attack tonight. pic.twitter.com/XmIvEq2KTu— OSINTtechnical (@Osinttechnical) March 16, 2026విమానాలు తిరిగి ప్రారంభంమరోవైపు ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత దుబాయ్ విమానాలను క్రమంగా తిరిగి ప్రారంభమైనాయి. ఇక్కడి నుండి కొన్ని విమానాలు క్రమంగా ఎంపిక చేసిన గమ్యస్థానాలకు తిరిగి ప్రారంభ మవుతున్నా యని దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎక్స్ ద్వారా సమాచారం అందించింది. ప్రయాణీకులు తమ విమానాలకు సంబంధించిన వివరాలకోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని పేర్కొంది.విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడి ఇదే మొదటిసారి కాదు. వరుస దాడుల మధ్య తమ సేనలు ఈ దాడులు తిప్పికొడుతున్న తరుణంగా లేటెస్ట్ అప్డేటట్స్ను ఫాలో కావాలని అధికారులు సూచించారు. ప్రస్తుత దాడులు ఈ ప్రాంతంలో కీలకమైన మౌలిక సదుపాయాల భద్రతపై పెరుగుతున్న ఆందోళనలను మరింత పెంచుతోంది.#WATCH | Dubai authorities brought under control a fire caused by a drone attack near the city's international airport that forced a temporary suspension of flights, though no injuries were reported, they said: Reuters (Video Source: Reuters) pic.twitter.com/tVEDxDqtFN— ANI (@ANI) March 16, 2026
ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. మరో జలసంధి బంద్!
టెహ్రాన్: హార్మూజ్ జలసంధిని అంతర్జాతీయ షిప్పింగ్కు వీలుగా తెరిచే ఉంచుతామని ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను మాత్రమే దాని గుండా అనుమతించబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వెల్లడించారు. ‘ఈ మార్గాన్ని ఇతర దేశాల నౌకలకు తెరిచే ఉంచుతాం. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా పలు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా వెళ్లాయి. కొన్ని షిప్పింగ్ కంపెనీలు భద్రతా కారణాలతో వేరే మార్గాలు ఎంచుకుంటున్నాయి’ అని ఆయన తెలిపారు.మరో జలసంధి బంద్..!మరోవైపు.. ఇరాన్ అండదండలున్న యెమన్ హౌతీ మిలిటెంట్లు ఆ దేశానికి మద్దతుగా అతి త్వరలో రణరంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఆసియా–యూరప్ వాణిజ్యానికి ప్రధాన మార్గమైన బాబ్ ఎల్–మాండెబ్ జలసంధి కూడా మూతపడేలా కనిపిస్తోంది. ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రాలను మధ్యదరా సముద్రంతో అనుసంధానించే మాండెబ్పై హౌతీలకు గట్టి పట్టుంది. ప్రపంచ దేశాలపై ఒత్తిడి పెంచడానికి దాన్ని మూసేస్తామని హౌతీలు చెబుతున్నారు. ప్రపంచ చమురు రవాణాకు ఆయువుపట్టు వంటి హార్మూజ్ జలసంధి మూతపడటంతో ఇప్పటికే చమురు, గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. మాండెబ్ నుంచి కూడా రవాణా ఆగితే సరుకుల ధరలకు రెక్కలు రావడం ఖాయం. భారత్ వైపు చమురు నౌక.. భారత్కు చెందిన మరో నౌక ‘జగ్ లాడ్కీ’ భారీ చమురుతో యూఏఈలోని పుజైరా చమురు కేంద్రం నుంచి స్వదేశానికి బయల్దేరింది. పశ్చిమాసియా యుద్ధక్షేత్రం నుంచి క్షేమంగా బయటపడిన నాలుగో భారత నౌకగా నిలిచింది. పుజైరాపై భీకర దాడులు జరుగుతున్నా 80,800 టన్నుల ముడి చమురు నింపుకొని క్షేమంగా వస్తున్నట్లు కేంద్రం అదివారం వెల్లడించింది.
గేల్ రికార్డు బద్దలు కొట్టడమే లక్ష్యం: వైభవ్ సూర్యవంశీ
సల్మాన్ ఖాన్ దేశభక్తి సినిమా పేరు మారింది.. కారణం?
దేశ చిత్రపటాన్నే పునర్లిఖించినవాడు!
ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
‘బాబూ.. ఎంపీ మహేష్ తాట తీస్తావా?.. కేవలం డైలాగులేనా?’
నడవలేని స్థితిలో టీమిండియా స్టార్ క్రికెటర్.. వీడియో
ఆస్కార్ రెడ్ కార్పెట్పై మెరిసిన భారత డిజైనర్ వేర్లు, ఆభరణాలు..!
అసెంబ్లీలో చిరునవ్వులు.. రాజాసింగ్ను ఆటపట్టించిన కేటీఆర్
లక్షన్నర జీతం.. రూ.15 వేలు కూడా మిగల్లేదు!
‘గ్రేటర్ ఇజ్రాయెల్’ దిశగా నెతన్యాహు కుట్ర?
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
శ్రీ పరాభవ నామ సంవత్సర (2026 – 27) రాశిఫలాలు
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
భారత యుద్ధనౌకల మోహరింపు
Hyderabad: మూతపడనున్న బావర్చి రెస్టారెంట్..!
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
నా కూతుర్ని సినిమాల్లో ఊహించలేదు.. నాగార్జున వల్లే..
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
ఏమీ తినకున్నా షుగర్ ఎందుకు పెరుగుతుంది?
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!
నెతన్యాహు ఎక్కడ?
రూ. 60వేల పెట్టుబడి.. రూ. 25కోట్ల ఆదాయం!
ఆ మూవీ అప్పుడే తేడా కొట్టింది, కరెక్ట్ కాదన్నాను: రాశీ
మీరు ధర్మం సేయకున్నా పర్వాలేదు కానీ అప్పులు సేసి మానెత్తిన మాత్రం వేయకండి సార్.. పుణ్యముంటుంది!!
గేల్ రికార్డు బద్దలు కొట్టడమే లక్ష్యం: వైభవ్ సూర్యవంశీ
సల్మాన్ ఖాన్ దేశభక్తి సినిమా పేరు మారింది.. కారణం?
దేశ చిత్రపటాన్నే పునర్లిఖించినవాడు!
ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
‘బాబూ.. ఎంపీ మహేష్ తాట తీస్తావా?.. కేవలం డైలాగులేనా?’
నడవలేని స్థితిలో టీమిండియా స్టార్ క్రికెటర్.. వీడియో
ఆస్కార్ రెడ్ కార్పెట్పై మెరిసిన భారత డిజైనర్ వేర్లు, ఆభరణాలు..!
అసెంబ్లీలో చిరునవ్వులు.. రాజాసింగ్ను ఆటపట్టించిన కేటీఆర్
లక్షన్నర జీతం.. రూ.15 వేలు కూడా మిగల్లేదు!
‘గ్రేటర్ ఇజ్రాయెల్’ దిశగా నెతన్యాహు కుట్ర?
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
శ్రీ పరాభవ నామ సంవత్సర (2026 – 27) రాశిఫలాలు
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
భారత యుద్ధనౌకల మోహరింపు
Hyderabad: మూతపడనున్న బావర్చి రెస్టారెంట్..!
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
నా కూతుర్ని సినిమాల్లో ఊహించలేదు.. నాగార్జున వల్లే..
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
ఏమీ తినకున్నా షుగర్ ఎందుకు పెరుగుతుంది?
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!
నెతన్యాహు ఎక్కడ?
రూ. 60వేల పెట్టుబడి.. రూ. 25కోట్ల ఆదాయం!
ఆ మూవీ అప్పుడే తేడా కొట్టింది, కరెక్ట్ కాదన్నాను: రాశీ
మీరు ధర్మం సేయకున్నా పర్వాలేదు కానీ అప్పులు సేసి మానెత్తిన మాత్రం వేయకండి సార్.. పుణ్యముంటుంది!!
ఫొటోలు
‘ఉస్తాద్ భగత్సింగ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
OSCARS 2026 : ఆస్కార్ విజేతల జాబితా (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
వైట్ డ్రెస్లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
తెలంగాణ వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు (ఫొటోలు)
అల్లు సినిమాస్ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)
సినిమా
‘ఆస్కార్ 2026’లో అరుదైన ఘటన.. 14 ఏళ్ల తర్వాత తొలిసారి..
సినిమా ప్రపంచంలో ప్రతిష్టాత్మక భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో అంగరంగ వైభవంగా జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా వ్యహరించాడు. భారత కాలమానం ప్రకారం మార్చి 16న ఉదయం 4:30 గంటలకు ఈ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం అయింది. అయితే ఈ సారి అస్కార్ వేదికపై అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓకే కేటగిరీలో ఇద్దరు విజేతలుగా నిలిచారు. 14 ఏళ్ల తర్వాత ఇలా ‘టై’ చోటు చేసుకోవడం గమనార్హం.ఏ కేటగిరీలో?ఒక్కో కేటగిరీ విజేతలకు ఒక్కో గెస్ట్తో అవార్డులను అందించారు. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలోని విజేతలకు అవార్డులను అందించాల్సిందిగా నటుడు కుమాయిల్ నంజియాను స్టేజ్పైకి పిలిచారు. ఆయన వెళ్లి..తనకిచ్చిన ఎన్వలప్ ఓపెన్ చేసి ఏం మాట్లాడలేదు. దీంతో కాసేపు వేదికంతా సైలెంట్ అయిపోయింది. ఆయన ఎందుకలా సైలెంట్ అయిపోయాడో తెలియదు. కొన్ని క్షణాల తర్వాత.. . ఈ జాబితా టై అయిందని చెప్పడంతో డాల్బీ థియేటర్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. ఈ అవార్డుకు ‘ది సింగర్స్’, ‘టూ పీపుల్ ఎక్ఛ్సేంజ్ సలైవా’ చిత్రాలు ఎంపికైనట్లు ఆయన ప్రకటించడంతో అందరు గట్టిగా అరిచేశారు. ఈ సందర్భంగా నంజియా ఓ కామెడీ పంచ్ కూడా వేశాడు. ‘షార్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వడానికి రెట్టింపు సమయం పడుతుంది’అని ఆయన అనడం.. దానికి కొనసాగింపుగా ‘ఈ టై వల్ల బెట్టింగ్ చేసినవారి పరిస్థితి ఏంటో’ అని హోస్ట్ కోనన్ ఓబ్రియన్ చమత్కరించడంతో థియేటర్లో కాసేపు నవ్వులు పూశాయి.ఏడు సార్లు ‘టై’ఆస్కార్ చరిత్రలో ఇప్పటి వరకు ఏడు సార్లు వివిధ కేటగిరీలో ‘టై’ అయింది. తొలిసారి 1932లో ఉత్తమ నటుడు విభాగంలో (వాలెస్ బిరీ, ఫ్రెడ్రిక్ మార్చ్) టై అయింది. చివరిగా 14 ఏళ్ల క్రితం అంటే.. 2012లో ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో స్కైఫాల్, జీరో డార్క్ థర్టీ చిత్రాలకు అవార్డులను అందించారు. అలాగే 1994లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్గా లైవ్ యాక్షన్, ఫ్రాంక్ కాఫ్కాస్ ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్, ట్రెవర్ చిత్రాలు నిలిచాయి. అంతకు ముందు 1986లో ఉత్తమ ఫీచర్ డాక్యుమెంటరీ విభాగాల్లో ఆర్టీ షా: టైమ్ ఈజ్ ఆల్ యూ హావ్ గాట్, డౌన్ అండ్ అవుట్ ఇన్ అమెరికా చిత్రాలకు అవార్డులు లభించాయి. ఇక 1968లో ఉత్తమ నటి విభాగంలో (కేథరిన్ హెప్బర్న్, బార్బరా స్ట్రీసాండ్), 1949లో ఉత్తమ డ్యాక్యుమెంటరీ కేటగిరీ (ఏ ఛాన్స్ టు లివ్, సో మచ్ ఫర్ సో లిటిల్)లో ‘టై’అయింది.
అజిత్ కేరవాన్లో వంట చేసిపెట్టాడు: తమన్నా
సినిమారంగంలో భాషాబేధాలకు తావుండదు. ప్రతిభే కొలమానం. అలా స్వశక్తితో ఎదిగిన నటీమణుల్లో మిల్కీబ్యూటీ తమన్నా భాటియా ఒకరు. ఈ ఉత్తరాది బ్యూటీ దక్షిణాదిలో అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కథానాయికగా సత్తా చాటుతూనే మరోపక్క ఐటమ్ సాంగ్స్లో నటిస్తూ అలరిస్తోంది. అలా ప్రత్యేక పాటల కోసం తమన్నా దాదాపు రూ.6 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్!ఆ మూవీ ఎంతో స్పెషల్ఇకపోతే ఈ హీరోయిన్ ఇటీవల చెన్నైలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను తమిళంలో కల్లూరి చిత్రంలో నటించానని, అది తన సినీజీవితంలో చాలా ముఖ్యమైనదని పేర్కొంది. ఆ సినిమాలోలాగే కాలేజీ లైఫ్ను విద్యార్థులు ఎంజాయ్ చేయాలంది. కాలేజీడేస్ మళ్లీ తిరిగిరావంది.స్వయంగా వంట చేసి..తాను సినీ పరిశ్రమలో 21 ఏళ్లుగా కొనసాగుతున్నానని, ఇంతలా ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని సంతోషం వ్యక్తం చేసింది. తమిళంలో విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల సరసన నటించినట్లు తెలిపింది. నటుడు విజయ్ చాలా నిరాడంబరుడు, మంచి మనసు కలవాడంది. విజయ్, జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్స్ అని కితాబిచ్చింది. అజిత్ గురించి చెప్పాలంటే వీరం సినిమా సమయంలో తనకు ఆయన కేరవాన్లో ఇడ్లీ వండిపెట్టారని గుర్తు చేసుకుంది. ఆయనకు వంట చేయడం చాలా ఇష్టమని, మంచి కుటుంబ సభ్యుడిలా ఉంటాడని పేర్కొంది.చదవండి: ఆస్కార్ పండగ.. అత్యధికంగా ఆ చిత్రానికే ఎక్కువ అవార్డులు
98వ ఆస్కార్: ఆ సినిమాకు అత్యధికంగా 6 అవార్డులు
హాలీవుడ్లో ఆస్కార్ పండగ సందడి కనిపించింది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో మార్చి 16న ఉదయం ఘనంగా జరిగింది. ప్రతిసారి 23 విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తారు. కానీ ఈసారి కొత్తగా బెస్ట్ కాస్టింగ్ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు. అలా ఈసారి 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు. 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' మూవీకి అత్యధికంగా 6 పురస్కారాలు వరించాయి. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు విడుదలైన సినిమాలను ఈ అవార్డుల కోసం పరిగణించారు. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో రెండు చిత్రాలకు పురస్కారాలు వరించడం విశేషం! ఆస్కార్ స్టేజీపై తళుక్కుమన్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రంగా 'సెంటిమెంటల్ వాల్యూ'ని ప్రకటించింది.ఆస్కార్ విజేతల జాబితాఉత్తమ చిత్రం : వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ఉత్తమ నటుడు: మైఖెల్ బి. జోర్డాన్ (సిన్నర్స్)ఉత్తమ నటి: జెస్సీ బక్లే (హామ్నెట్)ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)ఉత్తమ సహాయ నటి : అమీ మాడిగన్ (వెపన్స్)ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ సాంగ్ (కె-పాప్ డిమాన్ హంటర్స్)ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: సెంటిమెంటల్ వాల్యూ (నార్వే దేశపు సినిమా)ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటమ్ డురాల్డ్ అర్కపా (సిన్నర్స్)ఉత్తమ ఎడిటింగ్: యాండీ జుర్గెన్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)ఉత్తమ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్ (సిన్నర్స్)ఉత్తమ సౌండ్: గరేత్ జాన్, ఏఐ నెల్సన్, గ్వెన్డాలిన్ యేట్స్ విర్టల్, గేరీ ఎ.రిజో, జాన్ పెరల్ట (ఎఫ్ 1)ఉత్తమ కాస్టింగ్: కసాండ్రా కులుకుందిస్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: మిస్టర్ నోబడీ ఎగైన్స్ట్ పుతిన్ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ఆల్ ద ఎంప్టీ రూమ్స్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: జో లెటరి, రిచర్డ్ బనెహం, ఎరిక్ సైండన్, డేనియల్ బారెట్ (అవతార్: ఫైర్ అండ్ యాష్)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తమర డేవెరల్, షేన్ వ్యూ (ఫ్రాంకెన్స్టీన్)ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ప్లే: ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే: పాల్ థామస్ అండర్సన్ (వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్)ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మైక్ హిల్, జోర్డాన్ సామ్యూల్, క్లియోనా ఫ్యూరే (ఫ్రాంకెన్స్టీన్)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: కేట్ హాలే (ఫ్రాంకెన్స్టీన్)ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ద గర్ల్ హు క్రైడ్ పర్ల్స్ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం: కె-పాప్ డిమాన్ హంటర్స్ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ద సింగర్స్, టూ పీపుల్ ఎక్స్చేంజింగ్ సలైవాచదవండి: ఉత్తమ చిత్రంగా నిలిచిన "వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్" సినిమా రివ్యూ
రెండో ఆస్కార్కి ఆస్కారం ఉందా?
ఆస్కార్ అవార్డు వేడుకలో ఎవరెవరు అవార్డులు అందుకుంటారు? అనే చర్చ జరగడంతో పాటు ఎలాంటి ప్రత్యేకతలు జరగనున్నాయి? సెంటరాఫ్ ఎట్రాక్షన్గా ఎవరు నిలుస్తారు? అనేవి హాట్ టాపిక్స్ అయ్యాయి. ప్రధానంగా చాలామంది దృష్టి ‘టైటానిక్’ ఫేమ్ లియోనార్డో డికాప్రియో, ఇటాలియన్ మోడల్ విట్టోరియా సెరెట్టిపై ఉంది. 51 ఏళ్ల లియోనార్డో, 27 ఏళ్ల విట్టోరియా మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు 98వ ఆస్కార్ అవార్డు వేడుకలో జంటగా పాల్గొననున్నారనే ప్రచారం జరుగుతోంది.అమెరికాలోని లాస్ ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్ వేదికగా ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆరంభమయ్యే (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16 సోమవారం వేకువ జామున 4.30 గంటలకు) ఆస్కార్ అవార్డ్స్ వేడుకను వీక్షించడానికి సినీ ప్రియులు రెడీ అయిపోయారు. స్టార్ మూవీస్, జియో హాట్స్టార్ యాప్లోనూ ఈ వేడుక ప్రసారం కానుంది.ఈ వేడుకలో విట్టోరియాతో కలిసి లియోనార్డో రెడ్ కార్పెట్పై సందడి చేసి, ఆ విధంగా తమ ప్రేమను అధికారికంగా వెల్లడించనున్నారని టాక్. ఈ సంగతి పక్కన పెడితే... ఈసారి ఉత్తమ నటుడి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు లియోనార్డో. కాగా అతనికి ఉత్తమ నటుడిగా తొలి ఆస్కార్ అవార్డు దక్కేలా చేసిన చిత్రం ‘ది రెవెనెంట్’ (2015). 2016 ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఆ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికిగానూ ఉత్తమ నటుడి విభాగంలో రేసులో ఉన్నారు. మరి... మరో ఆస్కార్ అవార్డు సాధిస్తారా? అనేది ఇవాళ తెలుసుకుందాం.
క్రీడలు
మ్యాచ్లు గెలవరు.. మరి ట్రోఫీలను దొంగలిస్తారా?
టీ20 ప్రపంచకప్-2026 తర్వాత పాకిస్తాన్కు మరో ఘోర పరభావం ఎదురైంది. ఆదివారం ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 11 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 279 పరుగులకు ఆలౌటైంది.దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో పాక్ కోల్పోయింది. బంగ్లాపై పాక్ ఓ వన్డే సిరీస్ ఓడిపోవడం 11 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో పాక్ జట్టపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ విమర్శల వర్షం కురిపించాడు.పాక్ క్రికెట్ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారిపోతుందని అక్మల్ మండిపడ్డాడు. టీ20 ప్రపంచకప్లో కూడా పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. కనీసం సెమీస్కు కూడా చేరకుండా సూపర్-8 స్టేజ్లోనే ఇంటిముఖం పట్టింది."ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి దారుణంగా ఉంది. నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్లు కూడా పాక్తో సిరీస్ ఆడి, మనల్ని ఓడించి టెస్ట్ హోదా పొందాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 350 పరుగుల మార్క్ సులువుగా దాటేలా కన్పించింది. కానీ లిట్టన్ దాస్ నెమ్మదిగా ఆడడంతో 290 పరుగులకే పరిమితమైంది. అయినప్పటికీ మన జట్టు లక్ష్యాన్ని అందుకోలేకపోయింది" అని అక్మల్ ఓ ఛానల్ డిబేట్లో పేర్కొన్నాడు.అదేవిధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీపై కూడా అతడు పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. మైదానంలో మ్యాచ్లు గెలవనప్పుడు.. ఐసీసీ ట్రోఫీలను దొంగిలించి ఇంటికి తీసుకువస్తారా? అంటూ ఎద్దేవా చేశాడు. కాగా ఆసియాకప్-2025 ట్రోఫీని నఖ్వీ చేతుల మీదగా భారత్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ట్రోఫీని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు. ఇప్పటికీ ట్రోఫీ ఛాంపియన్ భారత్ వద్దకు చేరలేదు.చదవండి: చరిత్ర చెరిగిపోదు: బీసీసీఐపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్
NZ vs SA: న్యూజిలాండ్కు మరో షాక్!
సౌతాఫ్రికాతో తొలి టీ20లో ఓడిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ ఇష్ సోధికి గాయమైంది. సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్కు ముందు నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సోధి బొటనవేలుకు గాయం కాగా.. స్కానింగ్లో భాగంగా వేలు విరిగిపోయినట్లు తేలింది.నాలుగు వారాల విశ్రాంతి ఫలితంగా ఇష్ సోధికి నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో తొలి టీ20కి దూరమైన ఈ రైటార్మ్ స్పిన్నర్.. మిగిలిన రెండు టీ20 మ్యాచ్లకూ దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. సఫారీలతో రెండో టీ20 సందర్భంగా కివీస్ స్పీడ్స్టర్ లాకీ ఫెర్గూసన్ జట్టుతో చేరనున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టీమిండియా చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా మౌంట్ మాంగనీ వేదికగా ఆదివారం తొలి టీ20లో సఫారీ జట్టుతో తలపడింది.91 పరుగులకే ఆలౌట్ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... 14.3 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. నీషమ్ (21 బంతుల్లో 26 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. కాన్వే (1), లాథమ్ (7), రాబిన్సన్ (6), అరంగేట్ర ఆటగాడు నిక్ కెల్లీ (2), జాకబ్స్ (10), సాంట్నర్ (15) విఫలమయ్యారు.ఎన్కబని మొకొనాకు 3 వికెట్లుఇక ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టి20 అరంగేట్రం చేసిన నలుగురు సఫారీ ప్లేయర్లు విజయంలో కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎన్కబని మొకొనా (Nqobani Mokoena) 3 వికెట్లు పడగొట్టగా... కోట్జీ, బార్ట్మన్, కెప్టెన్ కేశవ్ మహరాజ్ తలా రెండు వికెట్లు తీశారు.సాంట్నర్ 4 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చిఅనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో సఫారీ జట్టు 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కానర్ ఎస్తెర్హుజెన్ (48 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ 4 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ ద్వారా నలుగురు (కానర్ ఎస్లుర్హుజెన్, డియాన్ ఫారెస్టర్, జోర్డాన్ హెర్మన్, ఎన్కబరి మొకొనా) సౌతాఫ్రికా ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఇరు జట్ల మధ్య హామిల్టన్లో మంగళవారం రెండో టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్పై ద్రవిడ్ ప్రశంసలు
ఇదేం పద్ధతి?.. బీసీసీఐపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీరుపై టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అసలు ఇదేం పద్ధతి.. చరిత్ర చెరిగిపోదు.. మీ కుట్రలు ఫలించవు’’ అంటూ తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం ‘నమన్-2026’లో దొర్లిన తప్పిదమే ఇందుకు కారణం.రెండు ఐసీసీ టైటిళ్లువిరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ 2024లో టీ20 ప్రపంచకప్, 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని భారత్కు అందించాడు. తద్వారా మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni-3)తర్వాత టీమిండియాకు అత్యధిక టైటిళ్లు అందించిన సారథిగా చరిత్రకెక్కాడు.ఇక 2024లో టీ20 వరల్డ్కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. గతేడాది టెస్టులకూ గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న హిట్మ్యాన్కు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది,వన్డే కెప్టెన్గా ఇప్పటికీ సిరీస్ గెలవని గిల్గతేడాది.. అనూహ్య రీతిలో ఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి.. శుబ్మన్ గిల్ను సారథిగా నియమించింది. గిల్ కెప్టెన్సీలో భారత్ ఇప్పటి వరకు ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవలేదు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతిలో ఓడిన గిల్ సేన.. సొంతగడ్డపై మరీ దారుణంగా న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది.ఇదిలా ఉంటే.. నమన్ అవార్డుల పురుషుల విభాగంలో భారత అత్యుత్తమ క్రికెటర్ అవార్డు గిల్కు దక్కింది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో 754 పరుగులు చేసి అటు బ్యాటర్గా, ఇటు సారథిగా గిల్ అత్యుత్తమ ఆటతీరు కనబరిచినందుకు ఈ అవార్డు వరించింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 విన్నింగ్ కెప్టెన్?ఈ నేపథ్యంలో గిల్ మాట్లాడుతున్న సమయంలో.. నిర్వాహకులు.. ‘శుబ్మన్ గిల్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 విన్నింగ్ కెప్టెన్’’ అని అతడి పేరును స్క్రీన్పై వేశారు. ఇదే రోహిత్ శర్మ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.ఇంత వరకు ఒక్క వన్డే సిరీస్ గెలవని కెప్టెన్కు ఏకంగా చాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ అని వేయడం ఏమిటని, రోహిత్ శర్మ ఘనత చెరిపేసినా చెరిగిపోదని బీసీసీఐకి చురకలు అంటిస్తున్నారు. మరికొందరు మాత్రం పొరపాటున తప్పు దొర్లి ఉంటుందని కామెంట్ చేస్తుండగా.. రోహిత్ను అవమానించేందుకే ఇలా చేశారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.చదవండి: : అతడికి 6 ఓవర్లు చాలు.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడుReally???? pic.twitter.com/R0w8hrjFZq— Rohan💫 (@rohann__45) March 15, 2026
ఆఖరి ఓవర్లో హైడ్రామా.. అంపైర్ నిర్ణయంపై పాక్ సీరియస్
ఢాకా వేదికగా ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో 11 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో పాక్ కోల్పోయింది. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 279 పరుగులకు ఆలౌటైంది.వైస్ కెప్టెన్ సల్మాన్ అఘా(106), షాహీన్ అఫ్రిది(37) ఆఖరి పోరాడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. దీంతో 11 ఏళ్ల తర్వాత బంగ్లాకు వన్డే సిరీస్ను పాక్ సమర్పించుకుంది. అయితే ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది.ఏమి జరిగిందంటే?పాకిస్తాన్ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు కావాలి. ఆ ఓవర్ వేసే బాధ్యతను బంగ్లా కెప్టెన్ స్పిన్నర్ రిషాద్కు అప్పగించాడు. రిషాద్ తొలి రెండు బంతులకు ఎలాంటి పరుగులు రాలేదు. ఆ తర్వాత మూడో బంతికి రెండు పరుగులు వచ్చాయి. నాలుగో బంతి డాట్ అయింది.ఐదో బంతిని రిషాద్ లెగ్ సైడ్ వేశాడు. ఆ బంతిని షాహీన్ డౌన్ ది లెగ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ షాట్ కనక్ట్ కాలేదు. దీంతో అంపైర్ వైడ్గా ప్రకటించాడు. అయితే వికెట్ కీపర్ లిట్టన్ దాస్ సూచన మేరకు బంగ్లా కెప్టెన్ రివ్యూకు వెళ్లాడు. అయితే ఇక్కడే వివాదం చోటు చేసుకుంది.రూల్స్ ప్రకారం ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయం ప్రకటించిన 15 సెకన్లలోపే డీఆర్ఎస్ కోరాలి. కానీ నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా రివ్యూకు అంపైర్ అనుమతించడంపై పాక్ అసహనం వ్యక్తం చేసింది. బంగ్లా కెప్టెన్ స్క్రీన్పై రీప్లే చూసిన తర్వాతే రివ్యూ కోరాడని పాక్ ఆరోపిస్తోంది. ఇదే విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్పై ద్రవిడ్ ప్రశంసలు
న్యూస్ పాడ్కాస్ట్
తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ గుట్టు రట్టు... డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్గా నిర్ధారణ
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రం... ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా భీకర దాడులు
రైతులతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొండాట.. పేరుకే అన్నదాత సుఖీభవ, ఆచరణలో అంతా మోసం
విలువలు, విశ్వసనీయతకు వైఎస్సార్సీపీ మారుపేరు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఆదాయం... కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఇక్కడ బాబు, అక్కడ BR నాయుడు కోట్లల్లో భారీ స్కాం
పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు..ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
బిజినెస్
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 81 పాయింట్లు పెరిగి 23,227 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 244 పాయింట్లు ఎగబాకి 74,823 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.26బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 104.12 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.61 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.93 శాతం నష్టపోయింది.Today Nifty position 16-03-2026(time: 9:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
మహిళలకు ప్యాసివ్ పెట్టుబడుల దన్ను
దేశీయంగా పర్సనల్ ఫైనాన్స్ వ్యవహారాల్లో నెమ్మదిగానే అయినా, గమనించతగ్గ మార్పులే జరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. డేటా ప్రకారం గత ఐదేళ్లలో కుటుంబాల ఆర్థిక ప్రణాళికల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది. ప్రతి నలుగురు ఫండ్ మదుపరులలో ఒకరు మహిళే ఉంటున్నారు. ఇది పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటాన్నే కాకుండా, వివిధ అసెట్స్, స్కీముల విషయంలో మారుతున్న వారి దృక్పథాన్ని కూడా తెలియజేస్తోంది.పెట్టుబడుల విషయంలో మహిళలు సాధారణంగా చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారు. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని, తమ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాలకు తగ్గ అవకాశాలు పరిశీలిస్తారు. అవసరమైతే నమ్మకమైన ఆర్థిక సలహాదారులను కూడా సంప్రదిస్తారు. ఈ నేపథ్యంలో మహిళలకు ప్యాసివ్ ఇన్వెస్టింగ్, అంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టడం ఒక సులభతరమైన, సరైన ప్రారంభంగా నిలుస్తోంది. తక్కువ ఖర్చుతో, స్పష్టమైన నియమాల ఆధారంగా ఉండే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది కోర్ పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకోవడంతో పాటునిర్దిష్ట రంగాలు లేదా థీమ్లలో విస్తృతంగాఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటిపై ఆసక్తి పెరుగుతోంది. తాజా యాంఫీగణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్యాసివ్ ఫండ్ల నిర్వహణలో దాదాపు రూ. 15 లక్షల కోట్ల ఆస్తులు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇందులోరంగాలవారీ ఇండెక్స్లు, గోల్డ్, సిల్వర్లాంటి కమోడిటీ ఇండెక్స్లు, వేల్యూ .. క్వాలిటీ థీమ్ ఆధారిత ఫండ్స్లో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా..డిజిటల్ మౌలిక సదుపాయాల పురోగతితో మహిళలకు పెట్టుబడి సాధనాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వివిధ సాధనాలవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేయగలిగే సామర్థ్యాలు వచ్చినప్పుడే సిసలైన సాధికారత లభించినట్లవుతుంది. విదేశీ పర్యటన కోసం లేదా ఉన్నత విద్య కోసం నిధులను సమకూర్చుకోవడం, కొత్త వాహనం కొనుగోలు చేయడం, పిల్లల చదువులు, ఆరోగ్యం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత.. ఇలా అనేక లక్ష్యాలు ఉండొచ్చు. ఇలాంటివాటిని సాకారం చేసుకునేందుకు వివిధ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల్లాంటి ప్యాసివ్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉంటున్నాయి. బ్లూచిప్, లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 50 ఇండెక్స్ను అనుసరించే ఈక్విటీ ఇండెక్స్ ఫండ్ లేదా ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల ప్రస్థానాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఇది బలమైన పునాదిగా కూడా నిలుస్తుంది. అలాగే, మరింత మెరుగైన ఫలితాల కోసం ఫ్యాక్టర్ ఆధారిత ప్యాసివ్ ఫండ్స్ను పరిశీలించవచ్చు. వేల్యూ, క్వాలిటీ, లో వోలటాలిటీ లేదా మొమెంటంలాంటి లక్షణాల ఆధారంగా ఇవి ఉంటాయి. తరతరాలుగా భారత మహిళలకు పసిడి, వెండితో ఎనలేని అనుబంధం ఉంటోంది.ఈ నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో వీటికి కూడా చోటు కల్పించవచ్చు. సరైన స్థాయిలో కేటాయిస్తే, అనిశ్చితుల్లో ఈక్విటీలు నెమ్మదించినా, పోర్ట్ఫోలియోపై తీవ్ర ప్రభావం పడకుండా హెడ్జింగ్ సాధనంగా కూడా ఇవి రక్షణ కలి్పస్తాయి. ఇండెక్స్ ఫండ్లలో బాండ్స్లాంటి స్థిరాదాయాన్ని ఇచ్చే సాధనాలకు సంబంధించిన ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీలాగా, ముందుగా నిర్ణయించిన మెచ్యూరిటీ తేదీతో ఉంటాయి. ఇలాంటివి సమీప భవిష్యత్తులో నిర్దిష్ట ఆరి్థక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి.సిప్ శ్రేయస్కరం..ఇక సిప్ విధానం ద్వారా ప్యాసివ్ ఫండ్స్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. దీనితో పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ పెరుగుతుంది. అలాగే, రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా క్రమంగా పెట్టుబడిని పెంచుకోవచ్చు. మార్కెట్ టైమింగ్ గురించి ఆందోళన చెందనక్కర్లేదు. రోజువారీ వార్తల ప్రభావంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితీ ఉండదు.చివరిగా చెప్పేదేమిటంటే దేశీయంగా మహిళలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయి లో సంపదను నిర్వహిస్తున్నారు. వారిలో ఖర్చులపై అవగాహన పెరిగింది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఫోకస్ పెరిగింది. వారి పెట్టుబడులు ఇప్పుడు మరింత ప్రణాళికాబద్ధంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండెక్స్ ఫండ్స్ అనేవి మహిళా ఇన్వెస్టర్లు తమ సామర్థ్యాలను, తెలివైన పెట్టుబడి నిర్ణయాలుగా మార్చుకునేందుకు ఒక చక్కని, సరళమైన అవకాశాన్ని కల్పిస్తాయి. మారే లక్ష్యాలు, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా పెట్టుబడులను మల్చుకునేందుకు పునాదిగా నిలుస్తాయి.
రూ. 3,000 కోట్ల ఐపీవోకి ట్రూహోమ్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 3,000 కోట్ల నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ట్రూహోమ్ ఫైనాన్స్ (గతంలో శ్రీరాం హౌసింగ్ ఫైనాన్స్) ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వీటి ప్రకారం తాజాగా రూ. 1,500 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా. ప్రమోటర్ మ్యాంగో క్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రూ. 1,500 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనుంది.తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించి నిధులను వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కార్యకలాపాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2010లో ఏర్పాటైన ట్రూహోమ్ ఫైనాన్స్ గతంలో శ్రీరామ్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్గా కార్యకలాపాలు సాగించేది. 2024 డిసెంబర్లో దాన్ని గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పింకస్ కొనుగోలు చేసింది. గృహ రుణాలు, ప్రాపర్టీపై రుణాలు మొదలైనవి అందిస్తున్న కంపెనీకి దేశవ్యాప్తంగా 216 శాఖలు ఉన్నాయి. 2025 డిసెంబర్ 31 నాటికి రూ. 21,124 కోట్ల అసెట్స్తో దేశీయంగా మూడో అతి పెద్ద అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా ఉంది.
ఎఫ్డీ కన్నా బెటర్ గురూ..
ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నింటిదీ ఒడిదుడుకుల దారే. మన మార్కెట్లదీ అదే తీరు. నిన్న మొన్నటి వరకూ ట్రంప్ టారిఫ్లు రోజుకో టర్న్ తీసుకుంటూ ఇన్వెస్టర్లను స్థిమితంగా ఉండనివ్వలేదు. ఇపుడేమో పశ్చిమాసియా సంక్షోభం దావానలంలా చుట్టేస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ఆరంభించిన యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో ఇంకా స్పష్టత లేదు. దీంతో రోజురోజుకూ చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా తీవ్రంగానే ఉంటోంది. గరిష్ఠ స్థాయిల నుంచి చూస్తే మన మార్కెట్లు ఇప్పటికే దాదాపు 10 శాతం పతనమయ్యాయి. ఇది ఎక్కడ ఆగుతుందో తెలియదు. మరి ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్న మదుపరులు ఇపుడేం చేయాలి? సాధారణంగా అయితే ఇలాంటి సందర్భాల్లో మార్కెట్లు కాస్త కిందికి వచ్చాక కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లటమే మంచిదని నిపుణులు చెబుతారు. మరి అలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎక్కడుంచాలి? సేవింగ్స్ ఖాతాల్లో అయితే వడ్డీ ఏమీ రాదు. ఎఫ్డీల్లో అయితే బ్రేక్ చేస్తే వచ్చేది తక్కువ. ఇక మ్యూచ్వల్ ఫండ్స్లో అయితే స్వల్ప కాలానికి పెద్దగా రాబడులేమీ రావు. దీనికి నిపుణులు చెబుతున్న సమాధానమే ఓవర్నైట్, లిక్విడ్ మ్యూచ్వల్ ఫండ్లు. వార్షికంగా 6–7 శాతం రాబడినిస్తూ... తక్కువ ఛార్జీలతో ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు వెనక్కి తీసుకోగలిగే అవకాశం ఉండటమే వీటి ప్రత్యేకత. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటానికి వేచి చూసే వారే కాదు... స్వల్ప కాలానికి తమ డబ్బుల్ని ఎక్కడైనా ఉంచాలనుకునే వారందరికీ ఇవి అత్యుత్తమ పెట్టుబడి సాధనాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనక వీటిలో రిస్కూ తక్కువే.ఓవర్నైట్.. లిక్విడ్ ఫండ్స్.. ఈ రెండూ భిన్నమైన ఫండ్స్. ఓవర్నైట్ ఫండ్స్ కేవలం ఒక్క రోజు మెచ్యూరిటీ ఉండే డెట్ సాధనాల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఆ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో అత్యంత సురక్షితమైన కేటగిరీల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. ప్రధాన ప్రత్యేకతలేమిటంటే... వడ్డీ రేట్ల మార్పులపరంగా చాలా తక్కువ రిసు్క. అత్యధిక లిక్విడిటీ ఉంటుంది. కొద్ది రోజుల నుంచి కొన్ని వారాల వ్యవధి వరకు ఇన్వెస్ట్ చేసేందుకు ఇవి అనువుగా ఉంటాయి. ఇవి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిధిలో ఉంటాయి. ఇక లిక్విడ్ ఫండ్స్ని తీసుకుంటే ఇవి 91 రోజుల వరకు మెచ్యూరిటీలు ఉండే డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఓవర్నైట్ ఫండ్స్తో పోలిస్తే కాస్తంత ఎక్కువ రాబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే లిక్విడిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కొద్దివారాల నుంచి కొద్ది నెలల వ్యవధి వరకు షార్ట్ టర్మ్ పెట్టుబడులకు ఇవి అనువైనవి.రాబడి ఇలా.. సాధారణంగా వడ్డీ రేట్ల సైకిల్ను బట్టి రాబడులు మారుతుంటాయి. ఓవర్నైట్ ఫండ్స్ విషయం తీసుకుంటే వార్షికంగా సుమారు 5– 6 శాతం రాబడినిస్తాయి. అదే లిక్విడ్ ఫండ్స్ అయితే సుమారు 6–7 శాతం స్థాయిలో ఉంటుంది. అయితే కచి్చతంగా ఇంత రాబడులే వస్తాయని లేదు కానీ, స్వల్పకాలిక వడ్డీ రేట్లను బట్టి ఇవి ఉంటాయి. ఎవరికి అనువైనవి స్టాక్ మార్కెట్లలో మదుపు చేసేందుకు సన్నద్ధమవుతున్నవారు, ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు తమ దగ్గర ఉన్న నగదును ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే, స్వల్పకాలికంగా, కొద్ది నెలల వ్యవధిలో అవసరం పడే మిగులు డబ్బును కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎమర్జెన్సీ ఫండ్గా ఉపయోగించుకోదల్చుకునే నిధులను కూడా కొందరు ఇన్వెస్టర్లు, లిక్విడ్ ఫండ్స్లో ఉంచుతారు.ఇందులోనూ రిసు్కలు ఉంటాయి.. ఈ తరహా పెట్టుబడుల్లో రిస్కులు తక్కువగా ఉంటాయే తప్ప పూర్తి రిస్క్– ఫ్రీగా మాత్రం ఉండవు. వీటిల్లో ప్రధానంగా పొంచి ఉండే రిసు్కలను చూస్తే.. వడ్డీ రేట్లలో మార్పులు: స్వల్పకాలిక వడ్డీ రేట్లు బట్టి రాబడులు హెచ్చుతగ్గులకు లోను కావచ్చు. క్రెడిట్ రిస్కు (లిక్విండ్ ఫండ్స్లో): కొన్ని లిక్విడ్ ఫండ్స్, కార్పొరేట్ డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలాంటి వాటిలో పరిమిత స్థాయిలో క్రెడిట్ రిస్కు ఉంటుంది. ట్యాక్సేషన్: పన్నులపరంగా చూస్తే ఇన్వెస్టర్ ఆదాయ శ్లాబ్ని బట్టి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది.ఏం చేయొచ్చంటే.. ఇలాంటి ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేందుకు నిపుణులు మూడు సింపుల్ రూల్స్ సూచిస్తున్నారు. అవేంటంటే.. ⇒ రెగ్యులర్ ప్లాన్లు కాకుండా డైరెక్ట్ ప్లాన్లు తీసుకుంటే చార్జీల మోత తగ్గుతుంది. ⇒ ఇన్వెస్ట్ చేయడానికి ముందే వ్యయ నిష్పత్తిని చూసుకోవాలి. ⇒ మాటిమాటికీ ఎంట్రీ, ఎగ్జిట్ చేయకుండా ఉంటే ఎగ్జిట్ లోడ్ భారాలు తగ్గుతాయి. ⇒ అత్యంత నాణ్యమైన పోర్ట్ఫోలియో ఉండే ఫండ్స్ని ఎంచుకోవాలి. ⇒ ఇంకా ఎక్కువ ఈల్డ్పై అత్యాశతో నాసిరకం ఫండ్స్ని ఎంచుకోకూడదు. ⇒ స్వల్పకాలిక అవసరాల కోసమే ఈ సాధనాన్ని ఉపయోగించుకోవాలి. ⇒ దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలుగా పరిగణించకూడదు.ఖర్చులూ చూసుకోవాలి .. సాధారణంగా ఓవర్నైట్, లిక్విడ్ ఫండ్స్ అనేవి చౌకైన పెట్టుబడి సాధనాలే అయినప్పటికీ, కొన్ని చార్జీలు ఉంటాయని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. అవేంటంటే.. వ్యయ నిష్పత్తి: స్కీమును నిర్వహించేందుకు ఫండ్ హౌస్ వార్షికంగా విధించే ఫీజును ఎక్స్పెన్స్ రేషియోగా వ్యవహరిస్తారు. ఓవర్నైట్ ఫండ్స్లో ఇది ఏడాదికి 0.6 నుంచి 0.25 శాతం శ్రేణిలో, లిక్విడ్ ఫండ్స్లో 0.8 నుంచి 0.40 శాతంగా శ్రేణిలోను ఉంటుంది. ఈ ఫీజును ఆటోమేటిక్గా ఫండ్ రిటర్నుల్లో నుంచి డిడక్ట్ చేస్తారు కనక ఇన్వెస్టర్లు విడిగా చెల్లించనక్కర్లేదు.ఈ చార్జీలు సెబీ పరిధిలో ఉంటాయి. ఉదాహరణకు రూ. 10 లక్షలను 0.30 శాతం ఎక్స్పెన్స్ రేషియో ఉన్న లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే వార్షికంగా సుమారు రూ. 3,000 చార్జీ వర్తిస్తుంది. అయితే మనం ఎన్ని రోజులు ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ను ఉంచితే అన్ని రోజులకే చార్జీలు వర్తిస్తాయి. ఎగ్జిట్ లోడ్: పెట్టుబడులను సత్వరం రిడీమ్ చేసుకుని, వైదొలిగితే కొన్ని ఫండ్లు కొంత ఎగ్జిట్ లోడ్ని వసూలు చేస్తాయి. లిక్విడ్ ఫండ్స్ విషయాన్ని చూస్తే, మొదటి రోజు రిడీమ్ చేసుకుంటే సుమారు 0.007 శాతం, రెండో రోజైతే 0.0065 శాతం.. అలా 7 రోజుల తర్వాత జీరో స్థాయికి లోడ్ తగ్గుతుంది. చాలా మటుకు ఓవర్నైట్ ఫండ్స్లో సాధారణంగా ఎగ్జిట్ లోడ్ ఉండదు. బ్రోకరేజ్ లేదా లావాదేవీ ఫీజులు: కొన్ని ప్లాట్ఫాంలు లేదా డి్రస్టిబ్యూటర్ల ద్వారా ఫండ్స్ తీసుకుంటే కొంత ట్రాన్సాక్షన్ చార్జీలు వర్తించవచ్చు. అయితే, ప్రస్తుతం చాలా మటుకు ఆన్లైన్ ప్లాట్ఫాంలు ఇలాంటి ఫీజుల బాదరబందీ లేకుండా డైరెక్ట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. ట్యాక్సేషన్: ఈ ఫండ్స్ నుంచి రాబడులపై పన్నులు వర్తిస్తాయి. ఇటీవల పన్ను విధానాల్లో మార్పుల అనంతరం, ఇన్వెస్టర్ ఆదాయ పన్ను శ్లాబ్ బట్టి స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తోంది. స్టాక్ మార్కెట్లు ఇటీవలి కాలంలో తీవ్ర హెచ్చుతగ్గులకు, కరెక్షన్లకు లోనవుతున్నాయి. ఇప్పటికే కొంత వరకూ మార్కెట్ల నుంచి ఎగ్జిట్ అయిన వారు, ఇంకా కొంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారు ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేసి, బీపీ తెచ్చుకోవడం కంటే డబ్బును సురక్షితంగా ఉంచుకోవటానికి ప్రాధాన్యమిస్తున్నారు. అలా చేస్తే పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొచ్చని భావిస్తున్నారు. మరి బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై 2.5 – 4 శాతం వడ్డీ రేటే ఉంటోంది. అందుకే వీరు ఎంట్రీ, ఎగ్జిట్ రెండూ సులభంగా ఉండే ఓవర్నైట్, లిక్విడ్ ఫండ్స్ను ఆశ్రయించవచ్చు.
ఫ్యామిలీ
చెప్పుకోకుంటే ముప్పు అవుతుంది!
మహిళలకు అది బయటకు చెప్పుకోలేని ఓ సమస్య. ఎవరితోనూ పంచుకోలేని ఓ పెను ఇబ్బంది. ఇప్పటి తరానికి ఒక తరం ముందున్న వారు కావడంతో వీళ్లంతా ఓపెన్గా చర్చించాలంటే కొంతైనా అసౌకర్యంగా, ఇంకాస్త బిడియంగా ఫీలయ్యే ఈ సమస్య పేరు ‘జెనైటో యూరినరీ సిండ్రోమ్ ఆఫ్ మెనోపాజ్’. సంక్షిప్తంగా దీన్ని ‘జీఎస్ఎమ్’గా పేర్కొంటారు. సమస్య ఎప్పటినుంచో ఉన్నదే అయినప్పటికీ... ఇటీవల ఆధునిక జీవనశైలితో వచ్చే హార్మోన్ల అసమతౌల్యపు సమస్యలు ఎక్కువ కావడంతో ఇంతకుముందు కంటే ఇప్పుడు మరికాస్త ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం పీరియడ్స్ ఆగిపోయిన ముందు తరానికే కాకుండా అండాశయాలు తొలగించుకున్న ఈతరం వారినీ వేధిస్తూ ఇటీవల ఈ కేసులు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. జస్ట్... ఒక్కసారి తమ బిడియం వీడి... గైనకాలజిస్టులనూ, యూరో గైనకాలజిస్టులను సంప్రదిస్తే నూరుశాతం తగ్గి΄ోయే ఈ సమస్య ఇది. మరెవరితోనో అంత ఓపెన్గా మాట్లాడే అవకాశం లేకపోయినా మహిళలు చదువుకొని తెలుసుకోగలిగే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా మెనోపాజ్ తర్వాత దాదాపు 40 నుంచి 60 శాతం మహిళల్లో కనిపించే ఈ సమస్య ఇప్పుడు మనదేశంలో ప్రతి ఇద్దరు మహిలల్లో ఒకరికి తప్పక ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంటే మెనోపాజ్ వచ్చివారిలో 50% మంది జీఎస్ఎమ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇక మెనోపాజ్ నుంచి కాలం గడుస్తున్నకొద్దీ జీఎస్ఎమ్ బారిన పడే మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక అధ్యయనం ప్రకారం మహిళలకు తమ చివరి పీరియడ్ నుంచి కేవలం ఐదేళ్ల వ్యవధిలోపే ఆ సంఖ్య 65% చేరుకుంటోంది. ఇక పూర్తిగా మోనోపాజ్ వచ్చిన వాళ్లలో చూస్తే వారిలో ఐదేళ్లలోపే 74% మందిలో జీఎస్ఎమ్ కనిపిస్తోంది. పేరును బట్టి కేవలం మెనోపాజ్ వచ్చినవారిలోనే కనిపిస్తుందా అంటే అది కూడా అపోహే. ఈతరం మహిళల్లోనూ... అంటే 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. కేవలం మెనోపాజ్ వచ్చినవారిలోనే కాకుండా ఏదైనా మెడికల్ కారణాల వల్ల అండాశయాలు తొలగించుకున్నవారిలో లేదా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారిలోనూ కనిపించే సమస్య ఇది.తొలుత శారీరకమైన సమస్యే... కానీ తర్వాత మానసికంగా కూడా... సాధారణంగా ఇది శారీరకంగా ఇబ్బంది పెట్టే సమస్యే అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇది మహిళను కుంగదీస్తుంది. చికిత్స తీసుకోకపోవడం వల్ల భర్త నుంచి దూరం జరుగుతుండటంతో భార్యాభర్తల మధ్య ఏడబాటు, బయటకు వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో సామాజికంగా నలుగురికీ దూరం అవ్వడం, ప్రయాణాలకు దూరంగా ఉండటం, ఏ పనిలోనూ ఆసక్తిలేకపోవడం వంటి కారణాలతో సమాజం నుంచి దూరంగా జరుగుతూ కుంగుబాటుకూ (డిప్రెషన్కూ) లోనయ్యే అవకాశాలు లేక΄ోలేదు.గుర్తించడమెలా (డయాగ్నసిస్) జీఎస్ఎమ్కు ఎలాంటి నిర్దిష్టమైన వైద్య పరీక్ష ఉండదు. కానీ మహిళలు తమ బిడియం విడిచి డాక్టర్ను సంప్రదిస్తే తేలిగ్గా తెలుసుకోగల వైద్య సమస్య ఇది. పైగా వైద్య చికిత్సతో నూటికి నూరు΄ాళ్లు నయం చేయగల (ట్రీటబుల్) సమస్య ఇది. చేయాల్సిందల్లా మహిళలు ఈ సమస్యనలా భరిస్తూ ఉండేందుకు బదులు డాక్టర్ దగ్గర చెప్పుకుంటే చాలు.చికిత్స ఈ సమస్యకు చికిత్స అన్నది అందరికీ ఒకేరకంగా కాకుండా వ్యక్తిగత ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని వ్యక్తిగతంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొందరిలో ఇన్ఫెక్షన్ / ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్తో పాటు జీవనశైలి మార్పులు సూచించడం, పెల్విక్ ఫ్లోర్ కండరాలకు వ్యాయామాన్ని ఇచ్చే వర్కవుట్స్ సూచించడం వంటివి. అలాగే సమస్య తీవ్రతను బట్టి పూతమందులుగా ఇచ్చే మాయిశ్చరైజర్లు, ల్యూబ్రికెంట్లతో పాటు సిస్టమేటిక్ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీగా హార్మోన్లు ఇవ్వడంలాంటి వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్ ఇస్తూ సలహా సూచనలందిస్తూ పేషెంట్లలో ధైర్యం, స్థైర్యం పాదుగొలిపేలా మాట్లాడటమూ అవసరమవుతుంది.సమస్య ఎందుకొస్తుందంటే... సాధారణంగా మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్... వారి ప్రైవేట్ పార్ట్స్ను తేమగా ఉంచుతుంది. కానీ మెనోపాజ్ తర్వాత ప్రైవేట్ పార్ట్స్ పొడిబారిపోవడం (ఇలా పొడిబారడం వల్ల ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి), సాగే గుణం తగ్గడంతో కండరాలు స్టిఫ్గా మారడంతో మూత్రవిసర్జనలో నొప్పి, మంట, తీవ్రమైన అసౌకర్యం వంటివి కనిపిస్తాయి.డాక్టర్ సిందూరి గోరంట్ల, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్
రూ. 9 వేలతో దుస్తుల వ్యాపారం ప్రారంభించి..ఇవాళ ఏకంగా రూ. 57 కోట్లు..
సింగల్ మదర్ సక్సెస్ స్టోరీ ఇది. ఓ సాధారణ వీధి దుకాణం నుంచి బ్రాండ్ని నిర్మించే స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు బట్టలు అమ్ముడైతే చాలు అనుకునే స్థాయి నుంచి ఇవాళ ఏకంగా ఓ బ్రాండ్ వ్యస్థాపకురాలిగా కోట్లు గడిస్తూ..సక్సెస్కి చిరునామాగా మారిందామె. ఎవరామె అంటే..చైనాలో డాంగ్ అనే మహిళ కేవలం రూ. 9,240లతో వీధి దుకాణం నడుపుతుండేది. 1990లలో హెనాన్ ప్రావిన్స్లోని జెంగ్జౌలో నిర్మించిన డాంగ్ తన విజయవంతమైన దుస్తుల వ్యాపారం కారణంగా ప్రజలందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. 2012లో డాంగ్ వద్ద ఎలాంటి పొదుపులు, ఆదాయం లేక ఒంటిరి తల్లిగా రోడ్డుపై నిలబడిపోయింది. కనీసం తన బిడ్డకు పాలపొడిని కొనడానికి కూడా డబ్బులు లేని దారిద్యాన్ని అనుభవించింది. ఇరవైల వయసులో తన బిడ్డను పోషించుకోవాల్సిన పరిస్థితి ఆమెది. ఆ నేపథ్యంలో చిన్నగా వీధి వస్త్ర దుకాణాన్ని ప్రారంభించింది. అయితే వ్యాపారం అంతగా లాగాక.. ఇబ్బందిపడింది. ఒక్కోసారి ఈ వ్యాపారం తన వల్ల కాదేమో అన్నంతగా చేతులెత్తేసి దిగాలు పడేది. మళ్లీ ఆ క్షణంలోనే నేడు ఓడిపోతే..నా బిడ్డ బాధ్యతను ఎవరు చూసుకుంటారని భయపడేది. అయినా తాను పేదదాన్ని అయ్యిండొచ్చు, కానీ తన బిడ్డ ఎందుకు పేదవాడిగా ఉండాలన్న ఆలోచన తనకు వెనుకడగు వేయనివ్వని పట్టుదలను ఇచ్చేదట. అదే తనకు కఠినమైన ఆ పరిస్థితులను తట్టుకునే శక్తిని అందించిందట. తన వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రాత్రి మార్కెట్ల వైపుకి మొగ్గు చూపేదట. తక్కువ పెట్టుబడితో ఆదాయం పొందాలంటే మంచి పరిచయాలు కూడా అవసరమని తెలుసుకుంది డాంగ్. అలా డబ్బు ఆదా చేస్తూ..స్టాక్ కొనడానికి ఉదయం ఐదుగంటల కల్లా మేల్కొనేది. తర్వాత రాత్రి కూరగాయల మార్కెట్ వెలుపల బట్టలు అమ్ముతుండేది. రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేది. బేరమాడటం, భారీ వస్తువులను తక్కువ ధరకే తీసుకెళ్లగలిగే మాట చాతుర్యం అన్నింటిని స్వయంగా నేర్చుకుంది. ఈ పనుల బిజీలో బిడ్డ ఆలనాపాలనా చూడటం కష్టంగా ఉండేది. ఒక్కోసారి రాత్రిపూట వీధుల్లో బిడ్డను ఒంటరిగా వదిలేసి వ్యాపారం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. అలా కష్టాలను ఓర్చుకుంటూ..నెమ్మదిగా రిటైల్ దుకాణాలను నడిపే స్థాయికి చేరుకుంది. అప్పుడే చైనీస్ సంప్రదాయాన్ని సమకాలీన డిజైన్తో మిళితం చేస్తూ ఒక ప్రసిద్ధ బ్రాండ్ను నిర్మించింది. ఈ బ్రాండ్కి చైనా దేశ్యవాప్తంగా గుర్తింపు వచ్చేలా అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో ఆమె ఏకంగా ఏడాదికి రూ. 54 కోట్లు పైనే గడించే స్థాయికి చేరుకుంది. నెటిజన్లు సైతం ఆమె కథ విని ఒంటిరి తల్లి చాలా శక్తిమంతమైనది. ఎన్ని కష్టాలు ఓర్చుకుందో ఆమెకే తెలుసు అంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: 76 రోజుల్లో ఏడు కిలోల బరువు..!)
76 రోజుల్లో ఏడు కిలోల బరువు..!
బరువు తగ్గడంలో కొందరు అనుసరించే ఆరోగ్యకరమైన విధానాలు ఎందరికో ప్రేరణగా ఉంటాయి. అలాంటి వెయిట్లాస్ జర్నీ గురించి మహారాష్ట్ర వైద్యుడు చూసిన ఒక కేసు గురించి చెప్పుకొచ్చారు. ఒక రియల్ జంట అద్భుతంగా బరువు తగ్గినం విధానాన్ని షేర్చేసుకున్నారు. మొదట తన వద్దకు కాస్త తగ్గితే చాలని వచ్చిన వాళ్లు ఎంతలా అనూహ్యంగా బరువు తగ్గారో చెప్పారు. జస్ట్ రెండున్నర నెలలో ఇంతలా బరువు తగ్గుతారని అస్సలు ఊహించలేదని అంటున్నారు. మరి అదెలాగో చూద్దామా..!పిసిఒఎస్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఊబకాయం తదితరాల హోపియోపతిక్ ప్రాక్టీషనర్ డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్ తన అనుభవంలో చూసిన ఒక జంట కేసు గురించి చెప్పుకొచ్చారు. ఆ దంపతులు సాధారణ వెయిట్లాస్ కోసం వచ్చారని అన్నారు. సూచించిన కొద్ది ఆహారపు మార్పులతో ఇద్దరూ జస్ట్ రెండున్నరనెలల్లోనే ఏకంగా ఏడు కిలోలు తగ్గారని చెప్పారు. భర్త 71 కిలోల నుంచి 64 కిలోలకు, భార్య 82 నుంచి 75 కిలోలకు తగ్గారని చెప్పుకొచ్చారు. ఇలా బరువు తగ్గడంతో ఇద్దరికి వాపు, ఎల్డీఎల్ స్థాయిలు, బొడ్డుకొవ్వు కూడా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. మలబద్దక సమస్య కూడా చాలావరకు తగ్గిందని అన్నారు. అయితే ఈ దంపతులు ఎలాంటి క్రాష్డైట్ అనుసరించలేదని, స్థిరమైన ఆహార విధానాన్ని అనుసరించారని చెప్పారు. ఈ ఇద్దరు ఉపకరించిన ఆ ఏడు ఆహారపు అలవాట్ల గురించి వెల్లడించారు.రెండుపూటలా తినడం..ప్రతి రోజు రెండు పూటలా తింటే చాలని అన్నారు. అలాగని అల్పాహారం ఎక్కువగా తీసుకోవద్దని సూచించారు.ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వండినిపుణుడి ప్రకారం, ప్రతి భోజనంలో ప్రోటీన్ను కీలకమైన భాగంగా చేసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని అన్నారు. ముఖ్యంగా గుడ్లు, పప్పులు, పెరుగు, పనీర్ను వారి ఆహారంలో చేర్చుకోవాలని ఆయన దంపతులకు సలహా ఇచ్చారు.శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించారుతరువాత, హోమియోపతి నిపుణుడు ఆహారం నుంచి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించాలని సూచించారు. ఈ జంట స్వీట్లు, చక్కెర, బేకరీ ఆహారాలను తినకుండా ఉండాలని చెప్పానని అన్నారు.ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు చేర్చుకోవడం..నిపుణుడు దంపతులకు ప్రతిరోజూ వారి భోజనంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఆ ఆహార ప్రణాళికలో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరి అయిన అంశం. ఇది కడుపు నిండిన భావనను పెంచుతుంది. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించండిబర్గర్లు, పిజ్జాలు, సమోసాలు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు దరిచేరనివ్వదని సూచించారు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లు సదా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ సాయాజీరావు గైక్వాడ్ దంపతులు ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినాలని, అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించాలని చెప్పారు.రోజుకు 30-40 నిమిషాలు నడవండినిపుణుడు దంపతులను రోజుకు 30-40 నిమిషాలు నడవమని సూచించారు. అది కూడా ముఖ్యంగా భోజనం తర్వాత.స్థిరంగా ఉండండిబరువు తగ్గడం అనేది ఒక్కసారిగా జరిపోయేది కాదు. క్రమంత తప్పకుండా బరువు తగ్గడానికి ఏర్పాటు చేసుకున్న నియమాలను ఉల్లంఘించకుండా చూసకోవడం అత్యంత కీలకం. ఇక్కడ బరువు తగ్గడం అంత తేలికై పని కాకపోవచ్చు. కానీ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటూ..ఆకలి కోరికలు తగ్గేలా ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకుంటే..వెయిట్లాస్ అనేది అత్యంత ఈజీ. అన్నింట్లంకంటే ముఖ్యమైనది స్థిరత్వాన్ని మెయింటైన్ చేయడమే అన్ని నొక్కి చెబుతున్నారు డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్. 2.5 months.One couple.Simple home-cooked food.✅ Results:• Weight ↓ 7 kg (both)• HbA1c improved• LDL cholesterol ↓• Waist ↓ ~3 inches• Constipation resolved• Energy levels ↑No crash diets.No supplements.Just disciplined nutrition. pic.twitter.com/d2302h5Iti— Dr.Sayajirao Gaikwad (@DietDrsayajirao) March 9, 2026 (చదవండి: ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..)
ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..
పేరెంట్స్ పిల్లలకు గిఫ్ట్ల ఇవ్వడం అనేది సర్వసాధారణం. అదే పిల్లలు పెరిగి పెద్దయ్యాక..తల్లిదండ్రులు తమ కోసం చేసిన ప్రతి పనిని గుర్తించుకుని తోచిన రీతిలో గిఫ్ట్ ఇచ్చే అద్భుతమైన రోజు ఎంతమంది పెద్దలకు వస్తుంది ఈ అదృష్టం. అలాంటి అదృష్టాన్నే పొందారు ఈ తల్లిదండ్రులు. అంతేకాదండోయ్ అమ్మో ఇద్దరూ కూతుళ్ల అనే వారికి ఈ ఘటన చెంపపెట్టు. ఇద్దరు టీనేజ్ కూతుళ్లు తమ తల్లిదండ్రులకు జీవితకాలం గుర్తుండిపోయే మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటా సర్ప్రైజ్ అంటే..తమ తల్లిదండ్రల కళ్లకు గంతలుగట్టి మరి రోడ్డు మీదకు నడిపిస్తారు. కుటుంబ సభ్యులు చుట్టూ గుమిగూడి నవ్వుతూ..ఉంటారు. ఒకపక్క ఈ తల్లిదండ్రలుకు మనసులో ఏం జరుగుతుంది, ఏంటని ఆత్రం..ఏంటా అద్భుతమని కుతుహలంతో ఉంటారు. అంతే ఆ తర్వాత కూతుళ్ల గంతలు విప్పి పార్క్ చేసిన కొత్త కారుని చూపిస్తారు. వారి చేసిన ఆ సడెన్ సర్ప్రైజ్కి నోట మాట రాక భావోద్వేగం చెందుతున్న ఆ తల్లిదండ్రుల ఆనందం మాటలకందనిది. చుట్టుపక్క ఉన్న కుటుంబ సభ్యులంతా చప్పట్లతో సంతోషం వ్యక్తం చేస్తారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేస్తూ ‘జీవితకాలానికి ఒక చిన్న ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ను జోడించారు. అంతేగాదు ఆ పోస్ట్లో మీరు మాకు ఎప్పుడు ఇది చేయలేరు అన్న మాటలు చెప్పలేదు. హాయిగా ఎరిగిపోండి అని మాత్రమే చెప్పేవారు. ఈ కారు మీరు మాకిచ్చిన జీవితకాల భద్రత, మద్దతు, నమ్మకానికి చిన్న పాటి ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తున్నదే అంటూ పోస్ట్ ముగించారు. చాలామంది నెటిజన్లు ఇది కన్నీళ్లు పెట్టించే ఘటన అని, తల్లిదండ్రులకు ఇంతకు మించిన ఆనందం ఇంకొకటి ఏముంటుంది అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Varsha (@varshhaa.n) (చదవండి: నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్..!)
అంతర్జాతీయం
పిల్లలను చంపే నేరస్థున్ని లేపేస్తాం: ఇరాన్
టెహ్రాన్: ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఉనికిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన ప్రాణాలతో ఉన్నారా, లేరా? ఉంటే ఎందుకు బయిటకి రావడం లేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కీలక ప్రకటన చేసింది. బెంజిమిన్ నెతన్యాహు బ్రతికే ఉంటే ఎట్టిపరిస్థితుల్లో ఆయనను చంపి తీరుతామని హెచ్చరించింది.పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం నెతన్యాహు క్షేమంగా ఉన్నారా లేరా అనుమానాలు తీవ్రతరమవుతున్నాయి. ఇటీవలే ఆయన ప్రసంగంతో ఒక వీడియో వచ్చినా అది ఏఐ జనరేటెడ్ వీడియో అంటూ పలువురు కొట్టిపడేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది.ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రకటనలో " పిల్లలను చంపిన నేరస్థుడు బతికి ఉన్నాడో లేరో తెలియదు ఒక వేళ బతికి ఉంటే మేము పూర్తి శక్తితో అతనిని వెంటాడి చంపేస్తాము" అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభంలో ఇరాన్లోని ఓ బాలికల పాఠశాలపై దాడి చేశాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 180 కిపైగా అభం శుభం తెలియని పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా ఈ దాడి అనుకోకుండా జరిగిందని అమెరికా చెబుతుండగా తెలిసే చేశారని ఇరాన్ అంటుంది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహుని పిల్లలను చంపే నేరస్థుడు అని ఇరాన్ పిలుస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీని అంతం చేసిన ఇజ్రాయెల్ తదుపరి ఆ బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీపైన దాడి చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధినేతలను లేపేస్తాం అని పరస్పరం హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇప్పటి వరకూ ఈ యుద్ధంలో దాదాపు రెండువేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
సరదా కోసమైనా ఖార్గ్ దీవిపై దాడి చేస్తాం : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం మరింత తీవ్రమైంది. ఈ యుద్ధం ప్రాంతీయ స్థిరత్వాన్ని, ఇంధన భద్రతను, అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలను కుదిపేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చేయని చర్యలను ఇకపై చేపట్టబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ ఇంధన ఎగుమతిలో కీలకమైన ఖార్గ్ ఐలాండ్పై సరదా కోసమైనా దాడులు చేస్తామని ఇరాన్ను హెచ్చరించారు.అదే సమయంలో హర్మూజ్ జలసంధిని కాపాడేందుకు యుద్ధనౌకలను పంపాలని ప్రపంచ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ప్రతిగా, ఇరాన్ దాడుల్ని మరింత ముమ్మరం చేసింది. తాను విధించిన షరతులకు లోబడి ఇరాన్ నడుచుకోవాలని, లేదంటే యుద్ధం తీరుతెన్నులు, లక్ష్యాల్ని ఎప్పటికప్పుడూ మారుస్తుంటామని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్పై కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేలా పశ్చిమాసియా దేశాలు ట్రంప్తో సంప్రదింపులు జరిపాయి. ట్రంప్తో జరిగిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ తన హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో, ఆ దేశానికి ఆర్థిక ఆయువుపట్టైన ఖార్గ్ దీవిపై దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఖార్గ్ దీవిని లక్ష్యంగా చేసుకుని పదేపదే దాడులు చేస్తామని ఆయన ఎన్బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.వాస్తవానికి అమెరికా ఇప్పటి వరకు ఖార్గ్ దీవిలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. కానీ చమురు కేంద్రాలపై దాడులు చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఇరాన్ తన డిమాండ్లకు తలొగ్గకపోవడంతో ఇప్పు ట్రంప్ ఖార్గ్ ఐలాండ్పై పడినట్లు సమాచారం.ఖార్గ్ ఐలాండ్పై దాడులు జరగడం వల్ల ఇరాన్తో పాటు ప్రపంచంలోని పలు దేశాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధికి సమీపంలో ఖార్గ్ ద్వీపం ఉండటం.. చమురు దిగుమతులకు ఆటంకం ఏర్పడనుంది. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండగా.. గ్యాస్ కొరత ప్రజలను మరింతగా వేధించనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్ మాజీ యువరాజు సంచలన ప్రకటన
వాషింగ్టన్ డీసీ: ప్రస్తుతం ఇరాన్ యుద్ధంతో అట్టుడికి పోతుంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఆ దేశం అతలాకుతలంగా మారింది. సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణంతో రాజకీయంగా సైతం సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ నేపథ్యంలోనే ఇరాన్ బహిష్కృత రాజు రెజా పహ్లావి సంచలన ప్రకటన చేశారు. ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం కూలిపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని సంచలన ప్రకటన చేశారు.టెహ్రాన్ మునుపెన్నడూ లేని సంక్షోభాలని చూస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతమవుతున్న ఆ దేశం రాజకీయంగా తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటుంది. యుద్ధం ప్రారంభం కావడానికి అణుచర్చల విఫలంతో పాటు ఆ దేశంలో ప్రజలు జరిపిన నిరసనలు సైతం ఒక కారణం. ఇస్లామిక్ ప్రభుత్వ కఠిన చట్టాలు, అవినీతిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై నిరసనలతో రోడ్లెక్కారు. దీంతో ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో వారిని అణిచివేసింది. వేలాది మందిని కాల్చి చంపింది. ఈ విషయంలో మెుదటి నుంచి ఇరాన్ను వ్యతిరేకిస్తూ వచ్చిన ట్రంప్ ఇదే సాకుగా భావించి యుద్ధాన్ని ప్రకటించారు.అయితే యుద్దం ప్రారంభంలోనే ఆ దేశ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీని హతమార్చారు. ప్రస్తుతం సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీని సైతం లేపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ బహిష్కృత యువరాజు రెజాపహ్లవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ప్రకటనలో ఆయన మాట్లాడుతూ"ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం కూలిపోతే వెను వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. నా నాయకత్వంలో ఇరాన్ని పాలించడానికి ప్రతినిధి వర్గం సిద్ధంగా ఉంది. కొద్దికాలంలోనే ఇరాన్లో శాంతి భద్రతలు, స్వేచ్ఛా తిరిగి పునరుద్ధరిస్తాం." అని ప్రకటనలో తెలిపారు.దేశంలో తిరిగి శాంతిని పునరుద్ధరించడానికి స్థానికంగా ఉన్న వారితో పాటు విదేశాలలో ఉన్న నిపుణులను నియమించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశ అభివృద్ధి కోసం “ఇరాన్ ప్రాస్పెరిటీ ప్రాజెక్ట్” అనే కార్యక్రమం కూడా రూపొందించబడిందని ఇస్లామిక్ ప్రభుత్వం పడిపోయిన మొదటి 180 రోజుల్లో చేపట్టాల్సిన చర్యలు, కొత్త రాజ్యాంగం రూపకల్పన, ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) వంటి అంశాలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య పాలనతోనే ఇరాన్లో అభివృద్ధి సాధ్యం అని రెజా పహ్లవీ పేర్కొంటున్నారు.రెజా పహ్లవీ నేపథ్యంకాగా ప్రస్తుతం రెజా పహ్లవీ అమెరికాలో నివాసం ఉంటున్నారు. 1979లో మెుహమ్మద్ రెజా షా పహ్లవీకి వ్యతిరేకంగా ఇరాన్లో పెద్దఎత్తున ఉద్యమం జరిగింది.దీంతో అక్కడ రాజరిక వ్యవస్థ రద్దై రెజా షా పహ్లవీ దేశాన్ని విడిచి పారిపోయాడు. అనంతరం అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆసమయంలో రెజా పహ్లవీ అమెరికాలో ఫైలట్ శిక్షణ పొందుతున్నారు. అప్పటి నుంచి నేటి వరకూ ఆయన అమెరికాలోనే నివసిస్తున్నారు.
ట్రంప్ కోడలా మజాకా.. షాకిస్తున్న ఐదు సంచలనాలు..
అమెరికా రాజకీయ రంగంలో ‘ట్రంప్’ అనేది ఒక బ్రాండ్. ఇప్పుడు ఆ కుటుంబం నుండి మరో శక్తివంతమైన గొంతు ప్రపంచానికి వినిపిస్తోంది. ఆమెనే లారా ట్రంప్. కేవలం డోనాల్డ్ ట్రంప్ కోడలిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న లారా గురించి ఇప్పుడు ప్రపంచమంతటా చర్చ జరుగుతోంది. ఫోక్స్ న్యూస్ హోస్ట్గా, రాజకీయ విశ్లేషకురాలిగా ఆమె ప్రస్థానం దూసుకుపోతోంది. ఆమెకు సంబంధించిన ఐదు షాకిచ్చే సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం..ట్రంప్ కుటుంబంలో కీలకంలారా ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మూడవ కుమారుడు ఎరిక్ ట్రంప్ను 2014లో వివాహం చేసుకున్నారు. అలా ట్రంప్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన ఆమె, అనతి కాలంలోనే ఆ కుటుంబంలో అత్యంత కీలకమైన, నమ్మకస్తురాలైన మనిషిగా మారారు.రాజకీయాల్లో చక్రం తిప్పుతూ..కేవలం ఇంటికే పరిమితం కాకుండా, రిపబ్లికన్ పార్టీలో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2024లో రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్సీ) కో-చైర్గా బాధ్యతలు చేపట్టి, పార్టీ నిధుల సేకరణలో, ఎన్నికల వ్యూహరచనలో తనదైన ముద్ర వేశారు.ఫోక్స్ న్యూస్ స్టార్ హోస్ట్గా..మీడియా రంగంలోనూ లారా తన సత్తా చాటుతున్నారు. 2025 ఫిబ్రవరిలో ఆమె ఫోక్స్ న్యూస్లో ‘మై వ్యూ విత్ లారా ట్రంప్’ (My View with Lara Trump) అనే సొంత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి శనివారం ప్రసారమయ్యే ఈ షోలో జాతీయ భద్రత, రాజకీయ పరిణామాలపై ఆమె చేసే విశ్లేషణలకు విపరీతమైన క్రేజ్ ఉంది.పబ్లిక్ లైఫ్ ఒత్తిడిపై ఓపెన్ కామెంట్స్రాజకీయాల్లోకి రాకముందు ఉన్న సాధారణ జీవితాన్ని తాము అప్పుడప్పుడు మిస్ అవుతుంటామని లారా గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్ష బరిలోకి దిగిన తర్వాత తమ కుటుంబంపై పెరిగిన నిఘా, విమర్శల కారణంగా తమ పాత రోజులను గుర్తుచేసుకుంటామని ఆమె చెబుతుంటారు.వ్యక్తిగత జీవితంలారా, ఎరిక్ దంపతులకు ల్యూక్, కరోలినా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి బహిరంగ వేడుకల్లో ఆమె తరచూ కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ట్రంప్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో లారా ట్రంప్ ఇప్పుడు ఒక బలమైన శక్తిగా కనిపిస్తున్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: మొజ్తబా ఖమేనీ ముఖం చిద్రమైందా?
జాతీయం
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఎర
బెంగళూరు: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ కర్నాటక నేతలు ‘ఆపరేషన్ లోటస్’కు తెరతీశారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల చొప్పున ఇస్తామంటూ కొందరు ప్రయత్నించారని తెలిపారు.దీనికి సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. బిడది రిసార్టులో ఉంచిన తమ ఎమ్మెల్యేల వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చి నగదు ఆఫర్ ఇచ్చినట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా తెలిపారు.
నేపాల్లో బస్సు ప్రమాదం ఏడుగురు భారతీయులు మృతి
కఠ్మాండు: భారతీయ తీర్థయాత్రికులతో కూడిన మినీ ఎలక్ట్రిక్ బస్సు నేపాల్లో ప్రమాదానికి గురైంది. ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గండకి ప్రావిన్స్లోని గూర్ఖా జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.మనకామన ఆలయం నుంచి వస్తున్న ఈ అదుపుతప్పి రోడ్డు పక్క ఏటవాలుగా ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఏడుగురు మృత్యువాతపడగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పాంచ్ పటాకా.. ఐదు రాష్ట్రాల్లో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కీలకమైన పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీతో కలిసి ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29ల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. కేరళ (140), అస్సాం (126), పుదుచ్చేరి (30) అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు జ్ఞానేశ్ తెలిపారు. అన్నిచోట్లా మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. ఇప్పటికే పార్టీల నేతలు, రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై సలహాలు స్వీకరించామని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో ప్రవర్తన నియామవళి అమల్లోకి వచ్చింది. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు, 17.4 కోట్ల మంది ఓటర్లున్నట్టు సీఈసీ తెలిపారు. ‘‘మొత్తం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 750 నుంచి 900 మంది ఓటర్లున్నారు. సుమారు 25 లక్షల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని తెలియజేశారు. యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని, గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఈసీ పదవి నుంచి తనను తొలగించడానికి పార్లమెంటులో ప్రతిపక్షాలు నోటీసివ్వడంపై స్పందించేందుకు నిరాకరించారు.8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలుదేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో రెండేసి, గోవా, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో ఒక్కో స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గోవా, కర్నాటక, నాగాలాండ్, త్రిపురల్లో ఏప్రిల్ 9న, గుజరాత్, మహారాష్ట్రలో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది.
పార్లమెంట్ మెట్లపై మీరు టీ తాగి, పకోడీ తిని..: అమిత్ షా
గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. అసోం ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆ రాష్ట్రంలోని గువాహటిలో పర్యటించిన అమిత్ షా బీజేపీ నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు. భారత్కు, మన ప్రజాస్వామ్య వ్యవస్థలకు అపకీర్తి తెచ్చిపెట్టేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ మెట్లపై కూర్చుని “టీ, పకోడీలు” తింటారని పేర్కొన్నారు.“ఒక్కోసారి ఆయన పార్లమెంట్ ద్వారం వద్ద కూర్చొని టీ తాగుతారు, పకోడీలు తింటారు. అల్పాహారం తినే చోటు ఏది? ఈ విషయం ఆయనకు తెలియదా? భారత ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అత్యున్నత వ్యవస్థ. అక్కడ కూర్చొని నిరసనకు దిగడం కూడా ప్రజాస్వామ్య పద్ధతి కాదు. కానీ, మీరు అక్కడ నిరసనకు దిగడమే కాకుండా మరో రెండు అడుగులు వేసి టీ తాగుతూ, పకోడీలు కూడా తింటున్నారు. దీనివల్ల ప్రపంచం ముందు భారత్ అపకీర్తి పాలవుతుంది” అని అమిత్ షా అన్నారు.ఏఐ సదస్సులో ఇలాగేనా చేసేది? మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే రాహుల్ గాంధీ ఇప్పుడు భారత్ దేశానికే వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారని అన్నారు. పార్లమెంట్ చర్చల్లో రాహుల్ గాంధీ పాల్గొనడం లేదని విమర్శించారు. ఇటీవల ఢిల్లీ నగరంలో జరిగిన కృత్రిమ మేధస్సు సదస్సు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ మేధస్సు సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించారని చెప్పారు. ఆ కార్యక్రమానికి 80 దేశాల కంపెనీల ప్రధాన కార్యనిర్వాహక అధికారి స్థాయి అధికారులు హాజరయ్యారని తెలిపారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆ సదస్సును ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కృత్రిమ మేధస్సు సదస్సని పేర్కొన్నారని అమిత్ షా అన్నారు. ఆ కార్యక్రమంలో అనేక అవగాహన ఒప్పందాలు జరిగాయని చెప్పారు. అయితే, అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు నిరసనలు నిర్వహించి భారతదేశాన్ని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సదస్సు సమయంలో అర్ధనగ్నంగా నిరసన తెలిపిన వారికి రాహుల్ గాంధీ మద్దతు పలికారని కూడా విమర్శించారు.ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు భారత శక్తిని, యువత సామర్థ్యాన్ని చూడటానికి వచ్చే ఇటువంటి సదస్సుల్లో నిరసన ప్రదర్శలు చేస్తే.. ఇటువంటి వాటిల్లో మనకు అవకాలు తగ్గుతాయని చెప్పారు. భారత ప్రజలు అలాంటి చర్యలను క్షమించరని అన్నారు. దాదాపు దశాబ్దం క్రితం ఈశాన్య ప్రాంతం, అసోంలో ఆరోగ్య వ్యవస్థ చాలా దయనీయ స్థితిలో ఉందని చెప్పారు. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యం కన్నా తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ఎక్కువ దృష్టి పెట్టిందని ఆరోపించారు.
ఎన్ఆర్ఐ
వాషింగ్టన్ డీసీలో శంకర నేత్రాలయ నిధుల సేకణ కార్యక్రమం
గతేడాది డిసెంబర్ 6. 2025న వాషింగ్టన్ డి.సి. మెట్రో ప్రాంతంలో నిర్వహించిన శంకర నేత్రాలయ (SN) నిధుల సేకరణ కార్యక్రమం విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మక నేత్ర వైద్య సంస్థ కోసం మొత్తం $150,000 నిధులు సమీకరించారు. సంస్కృతి,కరుణను ప్రతిబింబించే ఈ వేడుకకు చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రమణ రెడ్డి మడ్డికుంట CapEx సభ్యుడు తిరుమల రెడ్డి మునుకుంట్ల నాయకత్వం వహించారు.ఆ సాయంత్రం థీమ్ కరుణ ప్రతిధ్వనులు: కళ హృదయాన్ని కలిసే స్థలం (Echoes of Compassion: Where Art Meets Heart)గా నిర్వహించబడింది. శాస్త్రీయ మరియు సాంప్రదాయ నృత్య కళలతో సేవా భావాన్ని మేళవిస్తూ ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక అకాడమీలు పాల్గొని యువ వయోజన నర్తకుల అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సాంస్కృతిక బృంద సభ్యురాలు లక్ష్మి బాబు సమన్వయంతో నృత్య ప్రదర్శనలు అత్యంత కన్నులపండుగగా నిర్వహించారుఈ వేడుకకు గౌరవ అతిథిగా ఎస్. వి. ఆచార్య గారు హాజరై తమ ప్రోత్సాహకర సందేశంతో కార్యక్రమానికి మరింత గౌరవాన్ని చేకూర్చారు. అలాగే 11 మంది MESU స్పాన్సర్ల మద్దతు ఈ కార్యక్రమ విజయానికి కీలకమైంది.ఉదార హృదయంతో సహకరించిన MESU స్పాన్సర్లు:సెల్వ, ప్రతిభ జయరామన్, భువనేశ్ బూజాల, భానుమతి రామకృష్ణ, శ్రవణ్ పడూరు, కృష్ణకాంత్ కుచ్చలకంటి, ప్రవీణ్ పాల్రెడ్డి, రఘు పాల్రెడ్డి, వెంకట్ దోమా, తిరుమల మునుకుంట్ల, రఘు జువ్వాది గారు. వీరి ఆర్థిక కార్యనిర్వహణ సహకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.ఇంకా SNUSA నేషనల్ మరియు డి.సి. మెట్రో చాప్టర్ సభ్యులు విశేషంగా సహకరించారు. ముఖ్యంగా శ్రీమతి నీలిమ గడ్డమనుగు, కృష్ణ రాజ్ భట్, సౌమ్య నారాయణన్, డి.సి. చాప్టర్ నాయకులు — బాలాజీ రాధాకృష్ణన్, హరిత రెడ్డి, అర్జున్ కామిసెట్టి, దిలీరాజ్ చాంతివేలు, రూపేష్ చిన్నకంపల్లి, కార్తిక్ గౌడ్ తదితరుల కృషి ప్రశంసనీయం.SNUSA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి గారి నాయకత్వం తోపాటు బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యుల మార్గదర్శకత్వం ఈ విజయానికి బలమైన ఆధారంగా నిలిచాయి. ట్రెజరర్ మూర్తి రేకపల్లి గారు లాజిస్టిక్స్ నిర్వహణలో విశేష కృషి చేయగా, మీడియా సహకారం అందించిన శ్రీగిరి కోటగిరి సేవలు అభినందనీయం. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువ వాలంటీర్లు, మీడియా,ఫోటోగ్రఫీ బృంద సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మాస్టర్ ఆఫ్ సెరిమనీగా వ్యవహరించిన శ్రియా బాబు తన చక్కని వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని చురుకుగా, సమర్థవంతంగా ముందుకు నడిపించారు.ఈ కార్యక్రమంలో సమీకరించిన నిధులు శంకర నేత్రాలయ లక్ష్యమైన అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించేందుకు వినియోగించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ముగిసే సమయానికి సేవా భావం, ఐక్యత, సామాజిక బాధ్యత స్పష్టంగా ప్రతిఫలించాయి. ఈ వేడుక కేవలం కళలు, సంస్కృతిని మాత్రమే కాకుండా, సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరి హృదయంలో మరింత బలంగా నాటింది.(చదవండి: అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..)
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు భారత్కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్ ఎవరు? ఆ వివరాలు మీకోసం.లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలోజన్మించారు నిత్య రామన్. ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య కుటుంబం, అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కరెన్ బాస్కు గట్టి పోటీప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!
అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత
క్రైమ్
చెల్లిని చూడాలని వెళ్తూ.. అనంతలోకాలకు
మేడ్చల్ జిల్లా: మల్కాజిగిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెల్లిని చూడా లని బైక్పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గోదావరిఖనికి చెందిన మర్రి ప్రశాంత్ (35) మెడికల్ రిప్రజెంటేటివ్. భార్య శ్రావణి (33), కుమారుడు సహస్రన్ (10)తో కలిసి రాంనగర్లో నివసిస్తున్నారు. ఆదివారం మేడిపల్లిలో నివాసం ఉంటున్న తన చెల్లి ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా స్పార్క్ ఆస్పత్రి సమీపం వరంగల్ హైవేలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కియా కారు అదుపుతప్పి బైక్ను బలంగా ఢీకొట్టి కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య శ్రావణికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కుమారుడు సహస్రన్కు స్వల్పగాయాలు కాగా అత న్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నా రు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపా రు. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్, యజమాని ఉన్నారు. వీరిని మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని కార్ను సీజ్చేసి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.
రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఎమ్మెల్యే వెలగపూడి అనుచరుడు
విశాఖపట్నం: విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు, కరకచెట్టు పోలమాంబ ఆలయ కమిటీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ వివాహేతర సంబంధంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం కలకలం రేపింది. కొద్ది రోజులుగా టీడీపీ నాయకుల లైంగిక వేధింపుల ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండగా తాజాగా మద్ది శ్రీనివాస్ ఆ జాబితాలో చేరాడు. పోలీసులు, బాధిత మహిళ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...! బుద్ధి చెప్పాల్సింది పోయి.. వెలగపూడి వత్తాసు.. మద్ది శ్రీనివాస్ కొన్నాళ్లుగా భార్య వసుంధరను వదిలించుకోవాలని చూస్తున్నాడు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో శ్రీనివాస్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంపై అతడి భార్య న్యాయ పోరాటానికి దిగారు. దీనిపై భీమిలి పోలీసు స్టేషన్తో పాటు విశాఖ త్రీటౌన్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అతడి వ్యవహారాన్ని పలు సందర్భాల్లో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దృష్టికి తెచ్చారు. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ప్రాథేయపడ్డారు. అయితే శ్రీనివాస్కు బుద్ధి చెప్పాల్సింది పోయి వెలగపూడి అతడిని వెనకేసుకురావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భార్యా బిడ్డలను పట్టించుకోని శ్రీనివాస్ను ప్రసిద్ధ గ్రామ దేవత పోలమాంబ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్గా నియమించడం వివాదాస్పమైంది. ఈ వ్యవహారాన్ని శ్రీనివాస్ భార్య ప్రభుత్వం దృష్టికి కూడా తెచ్చినా పట్టించుకోలేదు. శ్రీనివాస్ అనైతిక సంబంధాలను రుజువు చేస్తే ఆలయ కమిటీ చైర్మన్గా తొలగిస్తామని ఎమ్మెల్యే వెలగపూడి గతంలో మీడియా సాక్షిగా ప్రకటించారు. అడ్డంగా చిక్కిన శ్రీనివాస్.. కేసులు నమోదైనప్పటికీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్థానిక టీడీపీ నాయకుడు పోతన్నరెడ్డి తదితరుల సహకారంతో శ్రీనివాస్ తప్పించుకుని తిరుగుతున్నాడు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకుని బరితెగించి తిరుగుతున్నట్లు భార్య పలు దఫాలు వాపోయారు. ఈ క్రమంలో శ్రీనివాస్ శనివారం అర్ధరాత్రి పెదవాల్తేర్లోని ఓ ఇంట్లో ఓ మహిళతో కలిసి ఉండగా భార్య వసుంధర రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాళ్లిద్దరూ ఉన్న గదికి కుటుంబ సభ్యుల సహకారంతో తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శ్రీనివాస్ గది బయట కాపుకాసిన తన భార్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై తన అనుచరులతో దాడి చేయించాడు. తన అనుచరుల సాయంతో గది తాళం పగలగొట్టించి బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ వారు రాకపోవడంతో శ్రీనివాస్ మరోసారి తప్పించుకున్నాడని, ఓ మహిళతో రెడ్ హ్యాండెడ్గా దొరికిన అతడిపై చర్యలు తీసుకోవాలని వసుంధరతోపాటు ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో పోలీసులు అతడిని ఎంవీపీ స్టేషన్కు తరలించారు. అయితే ఎమ్మెల్యే వెలగపూడి ఒత్తిడితో పోలీసులు శ్రీనివాస్ను విడిచిపెట్టినట్లు తెలిసింది. తాజా ఘటనపై వసుంధర రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై ఎంవీపీ సీఐని వివరణ కోరగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదు అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అక్రమ సంబంధం, రాసలీలల ఘటనలో నేరుగా దొరికినప్పటికీ పోలీసులు, టీడీపీ నాయకులు శ్రీనివాస్కు తొత్తులుగా వ్యవహరించారని వసుంధర ఆక్రోశించారు. తనకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు. వెలగపూడీ.. ఆడబిడ్డ ఉసురు పోసుకోకు.. మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని రుజువుచేస్తే శ్రీనివాస్పై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే వెలగపూడి ఇప్పుడు అతడు రెడ్హ్యాండెడ్గా దొరికినా వత్తాసుగా నిలవడంపై వసుంధర మండిపడ్డారు. నీ పార్టీ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఓ ఆడబిడ్డ ఉసురుపోసుకోవద్దంటూ వెలగపూడిపై దుమ్మెత్తిపోశారు. నీ ఇంట్లో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి వస్తే నిందితుడిని ఇలాగే వెనకేసుకొస్తావా..? అంటూ ఆక్రోశించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల జీవితాలను నాశనం చేయవద్దంటూ హితవు పలికారు. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై కలగజేసుకుని తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఉరి వేసుకునేలా ప్రేరేపించింది భర్తే
రాజంపేట: ఉరి ఎలా వేసుకోవాలో చెప్పి భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని వైఎస్సార్ కడప జిల్లా మన్నూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సీఐ లింగప్ప కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నందలూరుకు చెందిన రైల్వే లోకో పైలెట్ శ్రీరాం శ్రీనివాస్ 2017లో కృష్ణవేణి(30)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరు బోయనపల్లెలోని శ్రీరామ్నగర్లో నివాసం ఉండేవారు. శ్రీరాం మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈనెల 11న కారు మరమ్మతుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న శ్రీరాం శ్రీనివాస్ కృష్ణవేణిని బెల్టుతో కొట్టాడు. ఆమెను చనిపోవాలని తీవ్రంగా ప్రేరేపించాడు. మనోవేదనకు గురైన మృతురాలు బెడ్రూంలోకి వెళ్లి లోపలి నుంచి గడియపెట్టుకొని ఉరి వేసుకుంటుండగా, నిందితుడు ఆమెను కాపాడకపోగా , ఆ దృశ్యాన్ని కిటికీలో నుంచి భార్య సెల్ఫోన్లోనే వీడియో తీశాడు. ఉరి అలా కాదు.. కృష్ణా.. సరిగ్గా వేసుకో అంటూ వికృతంగా నవ్వుతూ పైశాచికత్వం ప్రదర్శించాడు. ఆమె ఉరివేసుకుని మరణించిన తర్వాత ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టి, మరుసటి రోజు తన తల్లిదండ్రులు వచి్చన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం సెక్షన్ 108 బీఎన్ఎస్ కింద కేసుగా మార్చి నిందితుడు శ్రీరాం శ్రీనివాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
అమ్మా.. ఎందుకిలా..!
భువనగిరి : కుటుంబాలలో నెలకొనే చిన్నచిన్న తగాదాలు, సమస్యలతో చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో తమతో పాటు నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డలను సైతం చంపుతున్నారు. ఫలితంగా వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఇటీవల ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ట్రైన్కు ఎదురెళ్లి దుర్మరణం చెందగా, ఇద్దరు పిల్లలను ఊపిరాగకుండా చేసి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మరవకముందే తాజాగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలపై కత్తితో దాడికి పాల్పడి తాను ఆత్మహత్య చేసుకుంది. నెలన్నర వ్యవధిలోనే చోటుచేసుకున్న ఈ మూడు ఘటనల్లో బాధితులు బీబీనగర్ మండలానికి చెందిన వారు కావడం గమనార్హం. పిల్లలపై కత్తితో దాడి చేసి..బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జం నరేందర్రెడ్డి భార్య రత్నకళ (నీలిమ) మానసిక స్థితి సరిగా లేక పిల్లలతో తల్లిగారి గ్రామమైన భువనగిరి మండలం తుక్కాపురానికి వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున నిద్రలో ఉన్న కుమార్తె కృతిరెడ్డి(14)పై కత్తితో దాడి చేసి చంపింది. అనంతరం పన్నెండేళ్ల కుమారుడి అక్షిత్రెడ్డిపై దాడికి యత్నంచగా అతడు తప్పించుకుని కేకలు పెట్టుకుంటూ బయటకు వచ్చాడు. అనంతరం ఆమె అదే గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. ఈ ఘటన బీబీనగర్ మండలంలో కలకలం సృష్టించింది.గతంలో రెండు ఘటనలు ఇలా..అయితే బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన పిన్నింటి విజయశాంతిరెడ్డి అనే మహిళ జనవరి 31న ఘట్కేసర్ వద్ద తన ఇద్దరు పిల్లలు చేతన, విశాల్రెడ్డితో కలిసి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే ఈ నెల 2న ఇదే మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన మహిళ ఐశ్వర్య కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలైన ఝాన్సీ, పండును ఊపిరాడకుండా చేసి చంపింది. తర్వాత తాను ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నెలన్నర వ్యవధిలోనే ఒకే మండలానికి ఇద్దరు మహిళలు తమ పిల్లలను చంపి తాము చావాలనుకోవడం లాంటి ఘటనలు మరువక ముందే ఇదే మండలానికి చెందిన తమ మరో మహిళ తన తల్లి గారి ఊరిలో తన కుమార్తెను చంపి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడం చర్చనీయాంశంగా మారింది.
వీడియోలు
కీచక డాక్టర్ కి బడితపూజ.. చెప్పులతో దేహశుద్ధి చేసిన మహిళలు
బాబు, పవన్ ఫోటోలు లేవని.. బీజేపీ ఫ్లెక్సీలు చింపేసిన టీడీపీ నేతలు
చంద్రబాబు అరెస్ట్.. రమణ రియాక్షన్.. KSR దిమ్మతిరిగే కౌంటర్
గ్యాస్ సిలిండర్ పై కేంద్రం కీలక ప్రకటన రెండున్నర రోజుల్లోనే డెలివరీ
చేపల వేటకు వెళ్లి.. మూసీలో మునిగిన ముగ్గురు యువకులు
నాని & వెంకీ మూవీ ఫిక్స్..!
పిన్నెల్లి సోదరులను హింసిస్తున్నారు. బాబుపై మిథున్ రెడ్డి హాట్ కామెంట్స్
చంద్రబాబు, లోకేష్ అంతకు అంత అనుభవిస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
ట్రంప్ కు బిగ్ షాక్.. యుద్ధానికి నో చెప్పిన మిత్రదేశాలు
ప్రత్యేక రాష్ట్రం సాధించిన పొట్టి శ్రీరాములుకు జగన్ నివాళులు
