తెలుగువారి పరువు తీస్తున్న బాబూ అండ్ కో!
తమిళనటుడు కమల్హాసన్ తెలుగువారి కీర్తి దశదిశలా మారుమోగేలా చేశారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో చేసిన తొలి ప్రసంగంలో తెలుగువారు గర్వించదగ్గ కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కవిత ‘వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్’’ను చదివి వినిపించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ కవితకు ఆర్థం తెలుగువారికి బాగా తెలుసంటూ ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు అది వేరే సంగతి.ఒక పక్క ఓ తమిళ నటుడు తెలుగువారి సాహితీ వైభవాన్ని చాటిచెబితే ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అందరి ఆరాధ్యదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మాట్లాడటం మాత్రం తెలుగువారికి ఏమంత గర్వకారణం కాదు. అంతేకాదు.. ఈ రాజకీయ బురదలోకి బాబు అండ్ కో బీజేపీ నేత మాధవ్ను కూడా దింపేశారు. కల్తీ మకిలిని మాజీ సీఎం జగన్పైకి నెట్టేందుకు టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నించినా విఫలం కావడం.. జగన్ జనాల్లో తిరుగుతూ ప్రభంజనాన్ని సృష్టిస్తుండడంతో చంద్రబాబుకు ఎటూ పాలుపోవడంలేదుఅందుకేనేమో.. పవన్కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మరికొందరు మంత్రులతో మూకుమ్మడిగా ప్రెస్మీట్ పెట్టి జగన్, వైసీపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు. మత కోణాన్ని తెచ్చి జగన్ను దెబ్బతీయాలని ప్రయత్నించి బోర్లాపడ్డారు. ఈ క్రమంలోనే పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ చంద్రబాబు హిందూ ధర్మంలో విడాకులు ఉండవని, పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయని వింత వ్యాఖ్యలు చేస్తూ విడాకులు తీసుకోవడాన్ని తప్పుపట్టారు. సహజంగానే ఈ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు తీవ్ర అసహనం కలిగింది.అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అప్పుడే చంద్రబాబు తప్పు మాట్లాడుతున్నారని ధైర్యంగా చెప్పగలిగి ఆయన గౌరవం పెరిగేది జనసైనికులలో ఆయనపై నమ్మకం కలిగేది. కాని ఆయన మౌనంగా కూర్చోవడం వారి గుండె మంటకు కారణమైంది. ఎందుకంటే హిందూ ధర్మం అయినా, మరే మత ధర్మమైనా అవి విశ్వాసాలే. కాని దేశానికి ఒక రాజ్యాంగం, చట్టం ఉంటాయి.రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రి విడాకుల గురించి అలాంటి మాటలు మాట్లాడితే మరి చట్టం మాటేమిటి? ఏ కారణం వల్లనైనా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినా, మహిళలు హింసను కూడా భరించాలని చంద్రబాబు చెప్పదలిచారా? సంసారాలు విడాకుల వరకు వెళ్లగూడదని చెప్పడం వేరు. అసలు విడాకులు తీసుకోవమే నేరం అన్నట్లు మాట్లాడడం వేరు.ఇది ఒక కోణమైతే వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేందుకు వైసీపీ ప్రభుత్వంలో కుట్ర జరిగిందని చంద్రబాబు ఇంకో దిక్కుమాలిన వాదన తీసుకువచ్చారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న తన ఆరోపణలో నిజం లేదని వెల్లడయ్యాక, ప్రజలలో వచ్చిన అప్రతిష్టను డైవర్ట్ చేయడానికి మరో కుట్ర చేసినట్లు కనిపిస్తుంది. నిజానికి రాజకీయ ప్రత్యర్థి జగన్పై బురద రాయాలన్న తాపత్రయంలో, ఓట్ల రాజకీయంలో భాగంగా చంద్రబాబు ఈ ఆరోపణ చేశారన్న విషయం అందరికి తెలుసు.విశేషం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏమో తిరుమలకు అపవిత్రత రాకూడదన్న లక్ష్యంతో పాకులాడుతుంటే, తాను స్వామివారి భక్తుడిని అంటూ ఆయనకే అపచారం చేసే విధంగా మాట్లాడడానికి చంద్రబాబు వెనుకాడడం లేదు. తన హయాంలో జరిగిన తప్పులను సైతం వైసీపీపై తోసివేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం వికటిస్తున్నా, గోబెల్స్ మాదిరి అదే తప్పుడు ప్రచారం పదే, పదే చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనికి ఎల్లో మీడియా డైరెక్షన్ ఎటూ ఉంది.పవన్ కళ్యాణ్ తాను గతంలో చేసిన కొన్ని ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపించింది. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడానికి సీఎంకు ఏమి సంబంధం ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబుతో భేటీ తర్వాత పాతపాటే పాడారు. చంద్రబాబు బతిమలాడారా? బెదిరించారా? ఈ వివాదంలో బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అంటీ అంటనట్లే ఉంటున్నారు. కాని చంద్రబాబు ఆయన్నూ పనికట్టుకుని ప్రెస్మీట్లో పాల్గొనేలా చేశారు. తద్వారా ఆ బురదను ఈయనకు కూడా అంటించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు లడ్డూ వివాదాన్ని సృష్టించడానికి ఏ రకంగా పనిచేసింది వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఒక క్రమ పద్ధతిలో వివరించారు. అదంతా వింటే జగన్పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశారని స్పష్టమవుతుంది. లడ్డూ ప్రసాదం కల్తీపై దర్యాప్తునకు సిట్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దాంతో ఈ విచారణ చాలావరకు చంద్రబాబు చేతి నుంచి జారి పోయింది. రాష్ట్ర పోలీసు అధికారులు ఇద్దరు సిట్లో ఉన్నా ప్రధాన పాత్ర సీబీఐది కావడం వల్లనే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టమైన నివేదిక ఇవ్వగలిగారు.ఈ పరిణామంతో తాము జనంలో బాగా పలుచనయ్యామన్న సంగతిని అర్థం చేసుకున్న చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని ఏకంగా ఫ్లెక్సీలు కట్టి జగన్, సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిలపై దుష్ప్రచారం చేయించారు. జంతు కొవ్వు ఆరోపణ చేయడం, అరాచకపు ఫ్లెక్సీలు కట్టించడం, లడ్డూకు ఏదో అయిందన్నట్లు అదే పనిగా ప్రచారం చేయించడం.. వీటిని కదా వెంకన్నకు మకిలి అంటించే కుట్ర అనేది? జగన్ గుంటూరు పర్యటనకు జనం విశేషంగా రావడం, అక్కడ లడ్డూ అంశాన్ని ప్రస్తావించి చంద్రబాబును తీవ్రంగా తప్పుపట్టడంతో చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టి మరింత గందరగోళంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని ప్రశ్నలు సంధించారు. నెయ్యి కల్తీ జరిగినట్లు చెబుతున్న నెయ్యి శాంపిల్స్ తీసింది కూటమి ప్రభుత్వంలోనా? కాదా? వెనక్కి పంపించిన నాలుగు ట్యాంకర్లు కొన్నాళ్లు శ్రీకాళహస్తిలో ఉంచడం, తదుపరి ఆ నెయ్యిని కూడా స్వీకరించారని సిట్ తెలిపిందా? లేదా? బోలేబాబా కంపెనీ వచ్చింది 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనా? కాదా? చంద్రబాబు హయాంలోనే కిలో నెయ్యి రూ.291లకే టీటీడీ ఎలా కొనుగోలు చేసింది?ఈ ప్రశ్నలకు చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్లు ఎక్కడా జవాబు ఇవ్వలేదు. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సిట్ తేల్చింది కదా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించినప్పుడు చంద్రబాబులో కనిపించిన అసహనం అన్నిటికి జవాబు చెబుతోంది. ప్రెస్మీట్ లో పాల్గొన్నవారిలో ఒక్కరి ముఖంలో నెత్తురు చుక్క కనిపించడం లేదని, తప్పు చేశామన్న గిల్టితో ఉండి దబాయింపు చేసి బయటపడాలన్న వారి తాపత్రయం కనబడుతోందని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అనిపిస్తుంది.ఇక పవన్ కళ్యాణ్ మరోసారి మాట మార్చి భగవంతుడిపైనే పగబట్టారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.దానికి పేర్నినాని జవాబు ఇస్తూ పవన్ కళ్యాణ్ ఒకసారి క్రిస్టియన్ అని, బాప్టిజం తీసుకున్నానని చెబుతారు. మరోసారి ముస్లిం అని అంటారు. ఇంకోసారి తన తండ్రి దీపారాధన వత్తుల మంటలో సిగరెట్ వెలిగించుకుంటారని అంటారు..ఇక ఆయన సోదరుడు తాను నాస్తికుడనని చెబుతారు.. మళ్లీ హిందూ సనాతని అన్నట్లు మాట్లాడుతున్నారు..అని మండిపడ్డారు.వీరంతా రాజకీయ అవసరాల కోసం రకరకాల అవతారాలు ఎత్తుతున్నారని వైసీపీ ధ్వజమెత్తుతోంది.నిజంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితర కూటమి నేతలు హిందూ ధర్మం పట్ల నిబద్దత ఉంటే నిత్యం అబద్దాలు చెబుతారా? మోసపూరిత హామీలు ఇచ్చి జనాన్ని మభ్య పెడతారా? అన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేరు. తనపై తనకు నమ్మకం లేనప్పుడు, తమ అసమర్ధతను ప్రజలు బాగా గుర్తిస్తున్నారని భయపడినప్పుడే పాలకులు మతాన్ని తెరపైకి తెస్తారని ఒక రచయిత అంటారు. నిజమే కావచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
ఆటోడ్రైవర్ బ్యాంక్ అకౌంట్లో వందల కోట్లు..!
బెంగళూరు: ఆటోడ్రైవరు బ్యాంకు ఖాతాలో కోట్లాది రూపాయల బ్యాలెన్సు ఉంది. భారీగా డబ్బులు వచ్చిపడుతున్నాయి. చివరికి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథకు బ్రేక్ పడింది. ఈ సంఘటన హుబ్లీ నగరంలో జరిగింది. కేశ్వాపురలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఒక ఖాతాదారు అకౌంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది రూపాయల అక్రమ నగదు బదిలీ అయినట్లుగా వెలుగు చూసింది. ఈ ఖాతా ఓ ఆటో డ్రైవర్ ఇర్ఫాన్ది. సమాచారం అందుకున్న హుబ్లీ– ధార్వాడ పోలీసులు, సైబర్ క్రైం పోలీసులు అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. అతని ఖాతాకు దేశంలోని వివిధ బ్యాంక్ల ఖాతాల నుంచి డబ్బులు వరదలా వచ్చి పడ్డాయి. గత రెండేళ్ల నుంచి ఈ ఖాతా చురుగ్గా ఉండగా, స్కాం వెలుగు చూడగానే ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతా సంఖ్య– 54910200000346 గా తెలిపారు.ఖాతాదారుల ఫిర్యాదుతో కదిలిన డొంక సైబర్ నేరాల్లో డబ్బులు పొగొట్టుకున్న పలువురు బాధితులు 1930 సైబర్క్రైం హెల్ప్లైన్కు కాల్ చేసి ఫలానా ఖాతాకు తమ డబ్బులు అక్రమంగా జమ అయినట్లు ఫిర్యాదులు చేయసాగారు. దీంతో ఆరా తీయగా ఇర్ఫాన్ డొంక కదిలింది. కుక్కింగ్ విత్ కేటరింగ్ అనే పేరుతో ఈ ఖాతా ఉంది. సుమారు 50 సార్లకు పైగా వివిధ ఖాతాల నుంచి డబ్బు జమ అయింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, ఒడిశా తదితర రాష్ట్రాల్లో సైబర్ మోసాల బాధితుల డబ్బు ఈ ఖాతాకే చేరింది. తనిఖీలో 16 పాస్ పుస్తకాలు దొరికాయి ఏసీపీ శివరాజ్ కటకబావి మీడియాతో మాట్లాడుతూ గోపనకొప్ప ఇర్ఫాన్ కాగినెలె అనే వ్యక్తి ఖాతాకు ఎక్కడెక్కడి నుంచో డబ్బు వస్తోందన్నారు. అతని ఇంట్లో తనిఖీ చేయగా 16 బ్యాంక్ పాస్ పుస్తకాలు దొరికాయని చెప్పారు. ఎంత మేర డబ్బులు బదిలీ అయ్యాయి. ఏయే మార్గాల్లో వచ్చాయి? అని బ్యాంక్ అధికారులను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.
ఓటీటీ ట్రెండింగ్లో ఎప్స్టీన్ వెబ్ సిరీస్
గత కొన్నిరోజులుగా ఎప్స్టీన్ అనే వ్యక్తి పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దానికి చాలానే కారణాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ఈయన.. అగ్రరాజ్యాన్ని కుదిపేసిన భారీ సెక్స్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి. 1980-90ల్లో పేద, మధ్య తరగతి బాలికలకు, అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి..ఫ్లోరిడా,న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆరోపణ. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి, మరో యువతిని ఆ బంగ్లాకు తీసుకొస్తే మరికొంత కమీషన్ ఇస్తానని ఆశ చూపేవాడు. ఇది అప్పట్లో బయటపడింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం 2005లో బట్టబయలైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)2005లో ఎప్స్టీన్ని అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైలులో ఉంచారు. 2019లో మీటూ ఉద్యమం సమయంలో మరోసారి ఆరోపణలు వచ్చేసరికి అరెస్ట్ చేశారు. అదే ఏడాది ఆగస్టులో.. జైలులోనే అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అది ఆత్మహత్య అని పోలీసులు తేల్చినప్పటికీ.. ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. అయితే ఎప్స్టీన్ మరణించిన ఏడాది తర్వాత ఇతడి జీవితం ఆధారంగా 'జెఫ్రీ ఎప్స్టీన్ : ఫిల్తీ రిచ్' పేరుతో నెట్ఫ్లిక్స్లో ఓ డాక్యుమెంటరీ రిలీజైంది. 4 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్కి లిసా బ్రయంట్ దర్శకత్వం వహించారు.తాజాగా ఎప్స్టీన్ ఫైల్స్ మరోసారి వైరల్ అవుతుండటంతో ఆరేళ్ల క్రితం రిలీజైన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఇందులో టీచర్ స్థాయి నుంచి ఫైనాన్షియర్గా ఎప్స్టీన్ ఎలా ఎదిగాడు? లైంగిక నేరాలకు ఎలా పాల్పడ్డాడు? నిందితుని చేతిలో మోసపోయిన వారి వ్యథలు ఏంటి? చివరకు జైలులోనే ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల ఏంటనేది చూపించారు.అయితే ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, ట్రంప్, బిల్ గేట్స్ తదితరుల పేర్లు ఉండటం పెద్ద చర్చకు దారి తీసింది.(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీలో ట్విన్స్.. వీడియో పోస్ట్ చేసిన ఉపాసన)
ట్రంప్తో ఒప్పందం.. వైట్ హౌస్ కీలక ప్రకటన
వాషింగ్టన్: భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై తాజాగా వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ఈ ఒప్పందం కేవలం ఈ రెండు దేశాలకు మాత్రమే గరిష్ట ప్రయోజనాలను చేకూర్చేలా రూపొందుతున్నదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ద్వైపాక్షిక మార్కెట్ సౌలభ్యం, టారిఫ్ తగ్గింపులు, కఠినమైన ‘రూల్స్ ఆఫ్ ఆరిజిన్’ (వస్తువుల మూల స్థాన నిబంధనలు) ద్వారా కేవలం భారతీయ, అమెరికన్ ఉత్పత్తులు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య జరిగిన చర్చల అనంతరం విడుదలైన ఈ ముసాయిదా, ఇరు దేశాల ఆర్థిక, జాతీయ భద్రతా ప్రయోజనాలను ఏకీకృతం చేయనుంది.కీలకంగా ‘రూల్స్ ఆఫ్ ఆరిజిన్’ ఈ ఒప్పందంలో భాగంగా సుంకాల విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయని తెలుస్తోంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించడంతో, భారతీయ దిగుమతులపై గతంలో ఉన్న 25 శాతం అదనపు టారిఫ్ను తొలగించడానికి ట్రంప్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీనితో పాటు, పరస్పర వాణిజ్య సమతుల్యత కోసం భారత్పై విధిస్తున్న సుంకాలను 25 శాతం నుండి 18 శాతానికి తగ్గించనున్నారు. ఇతర దేశాలు వేరే మార్గాల్లో ఈ రాయితీలను పొందకుండా అడ్డుకోవడమే ఈ ‘రూల్స్ ఆఫ్ ఆరిజిన్’ ప్రధాన ఉద్దేశమని వైట్ హౌస్ పేర్కొంది.భారత మార్కెట్లోకి అమెరికన్ ఉత్పత్తుల జోరుఈ ఒప్పందం కారణంగా అమెరికాలోని పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు భారత్లోని వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం సోయాబీన్ ఆయిల్, పండ్లు, డ్రై ఫ్రూట్స్, వైన్, స్పిరిట్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించనుంది. దీనికి ప్రతిగా రాబోయే ఐదేళ్లలో ఇంధనం, విమానయాన రంగాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బొగ్గు తదితర రంగాల్లో అమెరికా నుండి సుమారు 500 బిలియన్ డాలర్ల (రూ. 45,37,000 కోట్లు)విలువైన కొనుగోళ్లు జరపాలని భారత్ నిర్ణయించుకుంది. ఇది ఇరు దేశాల మధ్య సరఫరా వ్యవస్థను మరింతగా బలోపేతం చేయనుంది.డిజిటల్ వాణిజ్యం- భవిష్యత్ ప్రణాళికకేవలం వస్తువులే కాకుండా డిజిటల్ వాణిజ్యంపై కూడా ఈ ఒప్పందం ప్రత్యేక దృష్టి సారించింది. భారత్ తన డిజిటల్ సేవల పన్నులను తొలగించడంతో పాటు, ఎలక్ట్రానిక్ లావాదేవీలపై కస్టమ్స్ డ్యూటీలు లేకుండా చేసేందుకు ద్వైపాక్షిక నిబంధనలపై చర్చలు సాగించనుంది. త్వరలోనే ఈ మధ్యంతర ఒప్పందాన్ని అమలులోకి తెచ్చి, తదుపరి దశలో సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని (బీటీఏ) ఖరారు చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఫలితంగా మేధో సంపత్తి, కార్మిక రంగాల్లో కూడా పారదర్శకత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: పుతిన్తో భేటీకి ఎప్స్టీన్ తహతహ? షాకిస్తున్న తాజా పత్రాలు..
పన్నెండేళ్లకోసారి నీలి సముద్రంలా మెరిసే కొండలు… నీలకురింజి మాయ!
ప్రతి రోజు నిన్నే ఎంచుకుంటాను.. నమ్రత ఎమోషనల్ పోస్ట్
శరీరంలో షుగర్ లెవల్స్ తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ తప్పనిసరి
'తన కెరీర్లోనే అతిపెద్ద సినిమా'..వారణాసిపై ప్రియాంక భర్త కామెంట్స్
జీఎస్టీ అంటే భయమేలా?
పావురాల రెట్టలతో పరువు పోయినా.. ఓ శుభవార్త
Weight Loss: తూచా తప్పకుండా ఈ ఏడు సూత్రాలు..!
వ్యభిచారం కేసులో చంద్రకళకు 10సంవత్సరాల జైలు
నాటి విమర్శలకు పిచాయ్ సమాధానం
‘లడ్డూ కల్తీ పేరుతో చంద్రబాబు వికృత రాజకీయాలు’
అజిత్ను కలిసేందుకు క్యూ కడుతున్న సెలబ్రిటీలు
ఐటీ అన్నదమ్ములు.. భలే కట్టారు ఇల్లు!
చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్
కియోసాకీకి కోపమొచ్చింది!
సార్! అలవాటులో పొరపాటు! ఆ కంపెనీ మనదే!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
అల్లు అర్జున్ చేతికి గీతా ఆర్ట్స్.. కీలక మార్పులు!
శ్రీలంక కెప్టెన్ ప్రపంచ రికార్డు
బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా: ప్రిన్స్ యావర్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది
అమ్మా.. ఎందుకిలా చేశావ్?
తమన్నాతో పోలిక.. అస్సలు నచ్చట్లేదు: 'ధురంధర్' బ్యూటీ
టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న బంగ్లా జట్టుకి రిలీఫ్
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
ఓటీటీలో 'రాజాసాబ్'.. మారుతిపై దారుణమైన ట్రోలింగ్
క్రికెట్ అభిమానులకు శుభవార్త
అందరూ ఒకటే! మనమే వేరు!!
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఒమన్ ఆటగాడు
వికృత ‘కాస్టింగ్ కౌచ్’ క్రీడకు మూలం!
ప్రశ్నించే అధికారం లేకుండా చట్టాలు ఎలా చేయాలో వీళ్లు అధ్యయనం చేస్తార్సార్!
పన్నెండేళ్లకోసారి నీలి సముద్రంలా మెరిసే కొండలు… నీలకురింజి మాయ!
ప్రతి రోజు నిన్నే ఎంచుకుంటాను.. నమ్రత ఎమోషనల్ పోస్ట్
శరీరంలో షుగర్ లెవల్స్ తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ తప్పనిసరి
'తన కెరీర్లోనే అతిపెద్ద సినిమా'..వారణాసిపై ప్రియాంక భర్త కామెంట్స్
జీఎస్టీ అంటే భయమేలా?
పావురాల రెట్టలతో పరువు పోయినా.. ఓ శుభవార్త
Weight Loss: తూచా తప్పకుండా ఈ ఏడు సూత్రాలు..!
వ్యభిచారం కేసులో చంద్రకళకు 10సంవత్సరాల జైలు
నాటి విమర్శలకు పిచాయ్ సమాధానం
‘లడ్డూ కల్తీ పేరుతో చంద్రబాబు వికృత రాజకీయాలు’
అజిత్ను కలిసేందుకు క్యూ కడుతున్న సెలబ్రిటీలు
ఐటీ అన్నదమ్ములు.. భలే కట్టారు ఇల్లు!
చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్
కియోసాకీకి కోపమొచ్చింది!
సార్! అలవాటులో పొరపాటు! ఆ కంపెనీ మనదే!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
అల్లు అర్జున్ చేతికి గీతా ఆర్ట్స్.. కీలక మార్పులు!
శ్రీలంక కెప్టెన్ ప్రపంచ రికార్డు
బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా: ప్రిన్స్ యావర్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది
అమ్మా.. ఎందుకిలా చేశావ్?
తమన్నాతో పోలిక.. అస్సలు నచ్చట్లేదు: 'ధురంధర్' బ్యూటీ
టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న బంగ్లా జట్టుకి రిలీఫ్
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
ఓటీటీలో 'రాజాసాబ్'.. మారుతిపై దారుణమైన ట్రోలింగ్
క్రికెట్ అభిమానులకు శుభవార్త
అందరూ ఒకటే! మనమే వేరు!!
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఒమన్ ఆటగాడు
వికృత ‘కాస్టింగ్ కౌచ్’ క్రీడకు మూలం!
ప్రశ్నించే అధికారం లేకుండా చట్టాలు ఎలా చేయాలో వీళ్లు అధ్యయనం చేస్తార్సార్!
ఫొటోలు
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
రేసులో అజిత్.. సపోర్ట్గా నిలిచిన సెలబ్రిటీలు (ఫోటోలు)
శ్రీశైలంలో స్వాముల పై లాఠీ ఛార్జ్.. ‘శివ’మెత్తిన స్వాములు (ఫొటోలు)
'ఎర్ర చీర' మూవీ హీరోయిన్ కారుణ్య చౌదరి స్టన్నింగ్ స్టిల్స్
దట్టమైన నల్లమల అడవిలో వేలమంది..శ్రీశైలం యాత్ర ప్రారంభం (ఫొటోలు)
‘హై’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
‘గాయపడ్డ సింహం’ సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
గ్లామర్తో పడేస్తున్న శ్రద్ధా దాస్.. నెట్టింట ఫోటోలు వైరల్
కుటుంబ వివాహ వేడుక.. తమిళనాడు ప్రముఖులకు వైఎస్ జగన్ ఆత్మీయ పలకరింపు (ఫొటోలు)
సినిమా
డబ్బు చెల్లిస్తారా.. జైలుకెళ్తారా రజనీకాంత్ నిర్మాతకు కోర్టు ఆదేశాలు
చెక్ బౌన్స్ కేసులో రజనీకాంత్ ‘కొచ్చడైయాన్’ సినిమా నిర్మాతకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి రూ.2.5 కోట్లు చెల్లిస్తారా.. లేదా జైలుకు వెళ్తారా అనేది తేల్చుకోవాలని చిత్ర నిర్మాతకు కోర్టు హుకూం జారీ చేసింది. రజనీకాంత్ హీరోగా 3డీ మోషన్ క్యాప్చర్ మూవీగా కొచ్చడైయాన్ ( Kochadaiiyaan) 2014లో విడుదలైంది. ఈ మూవీకి ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాత జె. మురళి మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విస్తృతమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వల్ల ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. చివరి దశలో ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసేందుకు బెంగుళూరుకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆయన రుణం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో నిర్మాత మురళి మనోహర్ విఫలం కావడంతో చట్టపరమైన వివాదానికి మూలంగా మారింది. అయితే, కొంత కాలం తర్వాత తిరిగి చెల్లింపులో భాగంగా చిత్ర నిర్మాత కొన్ని చెక్కులు ఇచ్చాడు. అందులో ఒకటి బౌన్స్ అయింది. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి కోర్టులో కేసు దాఖలు చేశాడు. అనేక సంవత్సరాల పాటు విచారణ తర్వాత, ట్రయల్ కోర్టు నిర్మాతను దోషిగా నిర్ధారించి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన గడవులోపు చెల్లించకపోతే జైలు శిక్షను అమలు చేయవచ్చని కోర్టు పేర్కొంది.
'బాలకృష్ణ' ఫ్యాన్స్ను పదేపదే నిరాశపరుస్తున్న తమన్
సంగీత దర్శకుడు తమన్ కొట్టే బీజీఎమ్కు ఫ్యాన్స్కు పూనకాలు వస్తుంటాయి.. కొన్ని చోట్ల థియేటర్ సౌండ్ బాక్స్లు బద్దలవుతాయి. డాల్బీ థియేటర్ అయితే మరింత కిక్ ఇస్తుందని అభిమానులు అంటుంటారు. తమన్ కొట్టే మ్యూజిక్కు డెసిబుల్ స్థాయి మారిపోతుందని తన వర్క్ ఔట్పుట్ గురించి చెబుతుంటారు. అయితే, తమన్ ఏడాది క్రితం బాలకృష్ణ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేపోయాడు. దీంతో బాలయ్య అభిమానులు మరోసారి నిరాశ చెందుతున్నారు.డాకు మహారాజ్ మూవీ OST/BGM విడుదల చేస్తానని సరిగ్గా ఏడాది క్రితం థమన్ అభిమానులకు హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం గడిచిపోయింది. ఇప్పటికే పలుమార్లు ఈ అంశం గురించి హామీలు ఇచ్చినప్పటికీ, అతను దానిని అమలు చేయలేదు. ఇది బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ, డాకు మహారాజ్ తర్వాత వచ్చిన అనేక సినిమాలకు సంబంధించిన OSTని కూడా ఆయన విడుదల చేశారు. ఇదీ బాలయ్య ఫ్యాన్స్ను మరింత నిరాశ చెందేలా చేసింది. కొద్దిరోజుల క్రితం 2026 జనవరిలో విడుదల చేస్తానని మరోసారి మాట ఇచ్చాడు. ఆ తేదీ కూడా దాటిపోవడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.డాకు మహారాజ్లో డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా... ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా'అంటూ సాగిన ఈ సాంగ్ చాలా పాపులర్ అయింది. దీంతో పాటు 'సర్కారు రా' అంటూ సాగిన ఈ రెండు ఈ పాటలలో తమన్ కొట్టిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉంటుంది. అందుకే ఫ్యాన్స్ ఈ ట్రాక్ కావాలని చాలాసార్లు కోరుతున్నారు. గతేడాది సంక్రాంతి విడుదలైన ఈ మూవీని దర్శకుడు బాబీ తెరకెక్కించారు. కలెక్షన్స్ పరంగా పెద్దగా రాబట్టలేకపోయినప్పటికీ ఫ్యాన్స్ను మాత్రం ఈ మూవీ మెప్పించింది. డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో పాటు ‘డాకు మహారాజ్’కు తమన్ సంగీతం అందించాడు. ఇవన్నీ కూడా ఆదరణ పొందాయి. దీంతో తమన్కు ఖరీదైన కారును గిఫ్ట్గా బాలకృష్ణ ఇచ్చిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ఓపెనింగ్ ఫిక్స్.. మొదటి సినిమా ఇదే..!
మల్టీఫ్లెక్స్ థియేటర్స్ నిర్మించడంలో అల్లు అర్జున్ దూకుడుగా ఉన్నారు. హీరోగా ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో కూడా జోరు చూపిస్తున్నారు. మొదట మహేష్ బాబు ఏఎమ్బీతో ఈ ట్రెండ్ క్రియేట్ చేయగా.. ఈ తర్వాత బన్నీ, విజయ్ దేవరకొండ, రవితేజ అదే దారిలో కొనసాగుతున్నారు. వీరందరూ కూడా ఏషియన్ గ్రూప్స్తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని అమిర్పేట్లో ఏఏఏ పేరుతో మల్టీఫ్లెక్స్ నిర్మించిన అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు సినిమాస్ పేరుతో వరల్డ్ క్లాస్ థియేటర్ను ప్రేక్షకులకు అందిస్తున్నారు.అల్లు సినిమాస్ పేరుతో హైదరాబాద్లోని కోకాపేటలో ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయింది. ఈ థియేటర్లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో పాటు డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్ వంటి కొత్త సాంకేతికతలను పరిచయం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద (75 అడుగుల) వెడల్పు గల డాల్బీ స్క్రీన్ను ఏర్పాటు చేయడంతో హైదరబాద్ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే, 4 స్క్రీన్లతో ఉన్న ఈ మల్టీప్లెక్స్ను మార్చి 19న ప్రారంభించాలనే ఆలోచనలో అల్లు సినిమాస్ టీమ్ ఉన్నట్లు సమాచారం. ఇందులో తొలి సినిమాగా 'ధురంధర్ 2, టాక్సిక్' ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రదర్శించడంతో దేశవ్యాప్తంగా అల్లు సినిమాస్ బ్రాండ్ విస్తరిస్తుందని ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ సినీప్రియులకు అంతర్జాతీయ స్థాయి సినిమా అనుభవం అల్లు సినిమాస్తో లభించనుంది. విశాఖపట్నంలో కూడా అతిపెద్ద మల్టీఫ్లెక్స్ నిర్మాణ పనులను అల్లు అర్జున్ ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఎన్నో హిట్లు.. కానీ, స్కిన్ షో తప్పడం లేదా?
చిత్రపరిశ్రమలో కథానాయికలు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చేది అందాల ప్రదర్శనకే అని చెప్పవచ్చు. అవకాశాల కోసం స్కిన్ ప్రదర్శనతో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తుంటారు. టాప్ హీరోయిన్గా ఎదిగినా, ఆ స్థానాన్ని నిలుపుకోవడానికి వారికి ఒకే ఒక్క ఆయుధం అందాలారబోతే. నటి రాశీఖన్నా ఇందుకు ఆతీతం కాదు. చూడ చక్కని నటి ఈ బ్యూటీ. అంతే కాదు పాన్ ఇండియా నటి అన్నది అదనపు గుర్తింపు. 2013లో మెడ్రాస్ కఫే అనే చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత తెలుగు, తమిళం తదితర భాషల్లో నటిస్తు మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలోకి ఇమైకా నొడిగల్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే అందులో హీరో అక్కగా నటించిన నయనతార ఆ క్రెడిక్ట్ను కొట్టేశారు. అయితే నటి రాశీఖన్నాకు ఆ చిత్రం మంచి ఎంట్రీనే అయ్యింది. అలా నటుడు రవిమోహన్కు జంటగా అడంగుమరు అనే చిత్రంలో నటించారు. ధనుష్తో కలిసి తిరుచిట్రంఫలం (తిరు) చిత్రంలో క్యామియో పాత్రలో నటించారు. సర్ధార్ చిత్రంలో నటుడు కార్తీకి జంటగా నటించారు. సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై 4 చిత్రంలో తమన్నతో పోటీ పడి అందాలను ఆరబోశారు. విశేషం ఏమిటంటే కోలీవుడ్లో ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. తెలుగులోనూ హిట్ చిత్రాల్లో నటించారు. అలా నటిగా పుష్కర కాలాన్ని అధిగమించారు. అయినా ఈమెకు స్టార్ ఇమేజ్ రాకపోవడం గమనార్హం. అంతే కాదు ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ప్రత్కేక ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని హాట్హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి ఇవి ఎంత వరకు అవకాశాలను తీసుకొస్తాయో చూడాలి. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna)
క్రీడలు
వైభవ్ సూర్యవంశీతో ఆడటం మంచి కిక్
‘జీవితంలో ఏదీ ఈజీ కాదు. దేనినైనా కఠోర శ్రమతోనే సాధించగలం. నేను కూడా పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగినట్లు కష్టపడ్డా. స్కూల్కు వెళ్తూనే రెగ్యులర్గా ప్రాక్టీస్ కొనసాగించా’ అని చెప్పాడు అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు ఓపెనర్, నగర యువకుడు అరోన్ జార్జి. జింబాబ్వే–నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టి–20 ప్రపంచ కప్ను గెలిచిన అనంతరం స్వదేశానికి చేరుకున్న జార్జిని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ప్రపంచకప్ వరకు తన ప్రయాణం, ఆ మెగా టోర్నీలో అనుభవాలను పంచుకున్నాడు. ప్రాక్టీస్కు తోడు నిత్యం తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకుసాగానని తెలిపాడు. తన విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఉందని, జీవిత లక్ష్యం టీమ్ఇండియాకు ఆడటమేనని వివరించాడు. హైదరాబాద్ క్రికెట్ దిగ్గజాలు అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయన్నాడు. లక్ష్మణ్ మెంటార్షిప్ తనకు ప్రేరణ ఇచ్చిందని పేర్కొన్నాడు. అరోన్ జార్జి ఇంకా ఏమన్నాడో అతడి మాటల్లోనే...! సచిన్ టెండూల్కర్ ప్రేరణతోనే క్రికెటర్ను కావాలని నిర్ణయించుకున్నా. నాలుగో ఏట నుంచే బ్యాట్ పట్టా. ప్లాస్టిక్ బ్యాట్తో ప్రాక్టీస్ మొదలుపెట్టా.. నా బ్యాటింగ్ స్టైల్ చూసి మా నాన్న క్రికెట్ వైపు మళ్లించాడు. ప్రాక్టీస్, మ్యాచ్లకు వెళ్లే సపమయంలో తెల్లవారు జామున మూడున్నరకే అమ్మ నిద్ర లేచి అన్నీ సిద్ధం చేసేది. నాన్న ఈసో వర్గీస్ విశ్రాంతి పోలీస్ అధికారి. అమ్మ ప్రీతి గృహిణి. అక్క నల్సార్లో లా చదువుతోంది. ఈ ముగ్గురూ నాకోసం చాలా కష్టపడ్డారు. అతడితో ఓపెనింగ్ మంచి అనుభవం 14 ఏళ్ల బిహార్ కుర్ర సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం మంచి కిక్ ఇచ్చింది. అతడు మంచి హిట్టర్. ఇద్దరం సమన్వయంతో ఆడాం. సాలిడ్ షాట్స్ కొట్టాం. రన్ రేట్ పడిపోకుండా చూశాం. అండర్–19 ప్రపంచ కప్ జట్టులో అనేక రాష్ట్రాల వారున్నా.. క్రీడా స్ఫూర్తితో.. భారత జట్టుగా మందుకుసాగాం.నైపుణ్యం పెంచుకోవడమే అతిపెద్ద సవాలు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవడమే అతిపెద్ద సవాలు. నాకు నేనే కొత్త సవాళ్లను పెట్టుకునేవాడిని. అందుకు అనుగుణంగా ప్రాక్టీస్ చేసి వాటిని అధిగమించేవాడిని. భారత అండర్–19 జట్టుకు ఎంపిక కావడం నాలో మరింత ఉత్సాహం పెంచింది. టీమ్ ఇండియాకు ఆడాలన్న జీవిత లక్ష్యానికి దగ్గరయ్యాననే ఆనందం కలిగింది. చిన్న ప్రాంతమైన మల్లాపూర్ నుంచి ప్రపంచ కప్నకు చేరుకోవడం అంతా కలగా ఉంది. గత ఏడాది నా కెపె్టన్సీలోనే హైదరాబాద్ జట్టు వినూ మన్కడ్ ట్రోఫీని నెగ్గింది. ఇదే టోరీ్నలో అంతకుముందు రెండు సీజన్లు 300 పైగా పరుగులు చేయడం నా కెరీర్ను మలుపు తిప్పింది.నాన్న స్నేహితుడే.. తొలి శిక్షకుడు నాకు నాలుగేళ్ల వయసు ఉండగా.. చాలా చిన్నగా ఉండేవాడిని. ఎక్కడకు వెళ్లినా చిన్న పిల్లవాడివంటూ ఎవరూ తీసుకోలేదు. నా ఆట తీరును చూసి.. ప్రతిభ ఉందని నాన్న స్నేహితుడు సుభాష్ చందర్ గుర్తించారు. నాకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. నా తొలి గురువు ఆయనే. వర్షం వచి్చనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాక్టీస్కు డుమ్మా కొట్టలేదు. లెక్కకు మించి గాయాలు అయ్యాయి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యం, పట్టుదలతో ముందుకుసాగాను. తార్నాక వీజే క్రికెట్ అకాడమీ కోచ్ విజు నాయర్ మెళకువలు నేర్పారు. నన్ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం భారత అంతర్జాతీయ జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాను.పిల్లలూ చదువును మరువొద్దు.. ఇప్పుడు పెద్ద ఎత్తున పిల్లలు క్రికెట్ అకాడమీలలో చేరుతున్నారు. ఇది మంచిదే. కానీ, క్రికెట్తో పాటు చదువుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. పైస్థాయికి వెళ్లినప్పుడు, ఇంటర్వ్యూల సమయంలో విద్య మన వ్యక్తిత్వాన్ని చెబుతుంది.
T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లతో కుటుంబాలను అనుమతించకూడదన్న నిబంధనకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.గతంలో అనుమతికాగా నలభై ఐదు రోజుల్లోపు విదేశీ పర్యటనలో భాగంగా క్రికెటర్లు, సహాయక సిబ్బంది తమ కుటుంబ సభ్యులను వారం రోజుల పాటు అక్కడే ఉండేలా బీసీసీఐ గతంలో అనుమతించేది. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో దారుణ ప్రదర్శనతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆసీస్ చేతిలో 3-1తో టీమిండియా ఓడిపోవడంతో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది.కొంతమంది ఆటగాళ్లు కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కొన్నిసార్లు సమావేశాలకు కూడా డుమ్మా కొట్టడంతో.. ఇకపై విదేశీ పర్యటనలకు కుటుంబాన్ని అనుమతించబోమని ప్రకటించింది. అయితే, ఈ విషయంలో బీసీసీఐ తాజా వైఖరి ఏమిటన్న అంశంపై ప్రస్తుత యాజమాన్యం బోర్డును సంప్రదించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది.తాజా వైఖరి ఇదే..‘‘టీమిండియా మేనేజ్మెంట్ బీసీసీఐని సంప్రదించింది. ఆటగాళ్ల భార్యలు, ఫియాన్సీలు వారితో ప్రయాణం చేయవచ్చా? వారితోనే ఉండవచ్చా? అని అడిగింది. ఇందుకు బోర్డు స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కుటుంబాలు ఆటగాళ్లతో స్టే చేయవద్దని చెప్పింది.వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని.. అది కూడా వారు కోరితే మాత్రమే ఈ వెసలుబాటు ఉంటుందని తెలిపింది’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు వెల్లడించింది. వరల్డ్కప్ టోర్నీతో బిజీకాగా టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉంది. భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ లీగ్ దశలో సూర్య సేన లీగ్ దశలో మూడు మ్యాచ్లో సొంతగడ్డపై.. పాకిస్తాన్తో ఫిబ్రవరి 15 నాటి మ్యాచ్ కొలంబోలో ఆడుతుంది.ఇదిలా ఉంటే.. వరల్డ్కప్ టోర్నీ ఆసాంతం టీమిండియా ప్రైవేటు చార్టర్లోనే ప్రయాణిస్తుందని సమాచారం. అదే విధంగా.. ఆటగాళ్లు తమ వ్యక్తిగత చెఫ్లను తీసుకువచ్చేందుకు అనుమతించిన యాజమాన్యం.. ఆటగాళ్లు బస చేసే హోటల్కు సమీపంలో వారు ఉండేలా చూసుకోమన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే భోజనాన్ని ఆటగాళ్లకు పంపేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక వరల్డ్కప్ టోర్నీలో తొలుత అమెరికాతో తలపడ్డ టీమిండియా.. ఐసీసీ ఈవెంట్ను విజయంతో ఆరంభించింది. రెండోమ్యాచ్లో గురువారం నమీబియాతో భారత్ తలపడుతుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదిక.చదవండి: Bangladesh Cricket: ఐసీసీ మీటింగ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్కి ఉపశమనం
పాక్ కోసం బంగ్లాను ఒప్పించారా?: నీళ్లు నమిలిన పీసీబీ చీఫ్
ఊహాగానాలే నిజమయ్యాయి. టీమిండియాతో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని పాకిస్తాన్ మార్చుకుంది. క్రికెట్ స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశంతో తమ జట్టు భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది.యూటర్న్ వెనుక గల కారణాలు?ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ సోమవారం ధ్రువీకరించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ మీడియా సమావేశం సందర్భంగా నక్వీ ‘బాయ్కాట్’ నిర్ణయాన్ని తాము వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఓ రిపోర్టర్.. యూటర్న్ వెనుక గల కారణాలు, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)తో చర్చల వల్ల పాక్కు ప్రయోజనం చేకూరిందా? అని అడిగాడు.శుభవార్తలే అందిస్తాంఇందుకు బదులుగా.. ‘‘కొన్ని నిమిషాల ముందే మా నిర్ణయం మార్చుకున్నాం’’ అని నక్వీ సమాధానమిచ్చాడు. మరి అయితే శుభవార్త ఉందా? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. ‘‘మేము ఎల్లప్పుడూ శుభవార్తలే అందిస్తాం కదా!.. బంగ్లాదేశ్ ఈ విషయంలో ఏం చెప్పిందో అందరూ చూశారు కదాపాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడాలని బంగ్లాదేశ్ అభ్యర్థించింది. వాళ్ల సమస్యలు తొలగిపోయాయి. అందుకే వాళ్లు మమ్మల్ని భారత్తో మ్యాచ్ ఆడమని చెప్పారు’’ అని నక్వీ పేర్కొన్నాడు.మన కోసం ఏమీ అడగలేదా?అయితే, మన (పాకిస్తాన్) సొంత ప్రయోజనాల కోసం వారు ఈ విషయంలో అంగీకరించేలా చేశామా? అని రిపోర్టర్ అడుగగా.. ‘‘కేవలం బంగ్లాదేశ్కు మద్దతుగా మాత్రమే మనం నిలబడ్డాం. ఇది వాళ్ల సొంత విషయం. మనకోసం మనం ఏమీ అడగలేదు’’ అని నక్వీ నీళ్లు నమిలాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. భారత్లో తమకు భద్రత లేదంటూ ఆరోపించిన బంగ్లాదేశ్.. తమ వేదికను కూడా లంకకు మార్చాలని ఐసీసీని కోరింది.అయితే, బంగ్లాదేశ్ చెప్పినదాంట్లో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. నిర్ణయం మార్చుకోవాల్సిందిగా గడువు ఇచ్చింది. కానీ బంగ్లా పట్టువీడలేదు. దీంతో ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది ఐసీసీ.పాకిస్తాన్ జోక్యం..ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటూ తొలుత తాము బంగ్లాకు మద్దతుగా టోర్నీని బహిష్కరిస్తామని లీకులు ఇచ్చి.. ఆ తర్వాత కేవలం భారత్తో మాత్రమే మ్యాచ్ ఆడమని మాట మార్చింది. ఒకవేళ భారత్- పాక్ మ్యాచ్ రద్దయితే ఐసీసీతో పాటు సభ్య దేశాలన్నీ ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది.రంగంలోకి లంక బోర్డుఈ క్రమంలో శ్రీలంక బోర్డు సైతం పాక్ నిర్ణయం పట్ల ఘాటుగా స్పందించింది. గతంలో పాక్ పర్యటనలో తమపై ఉగ్రదాడి జరిగినా.. ఇంకా ఆ దేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ తమ జట్టు అక్కడ పర్యటించేలా చేస్తున్నామని పేర్కొంది. కానీ ఇప్పుడు తమ దేశంలో భారత్తో ఆడే మ్యాచ్ను పాక్ బహిష్కరిస్తే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినందున భారీగా నష్టపోవాల్సి ఉంటుందని పాక్కు లేఖ రాసింది.బంగ్లాకు రిలీఫ్యూఏఈ సైతం ఇదే తరహాలో పీసీబీకి లేఖ రాయగా.. బంగ్లాదేశ్ సైతం భారత్తో మ్యాచ్ ఆడాలని కోరింది. ఈ నేపథ్యంలో ఐసీసీ బృందం లాహోర్ వెళ్లి పీసీబీ చైర్మన్తో చర్చించగా.. బంగ్లాదేశ్కు ఊరట లభించింది. టోర్నీ నుంచి తప్పుకొన్నందుకు ఎలాంటి ఆంక్షలు ఉండవని ఐసీసీ పేర్కొంది.ఇదిలా ఉంటే.. పాక్ బంగ్లాదేశ్ను అడ్డుపెట్టుకుని భారత్తో ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్ధరణ, తమ ఆటగాళ్లతో భారత జట్టు కరచాలనం చేయడం.. తదితర షరతులు పెట్టినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఐసీసీ ఇందుకు నిరాకరించి కేవలం బంగ్లా విషయంలో మాత్రమే సానుకూలంగా స్పందించిందని తెలిసింది. ఈ విషయం నెట్టింట వైరల్గా మారగా.. నక్వీ తమ కోసం ఐసీసీని ఏమీ అడగలేదని ప్రత్యేకంగా నొక్కివక్కాణించడం గమనార్హం. కాగా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్- పాక్ తలపడటం ఖాయమైంది.చదవండి: Bangladesh Cricket: ఐసీసీ మీటింగ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్కి ఉపశమనంMohsin Naqvi Statement on India Vs Pakistan match #PAKvIND #Pakistan pic.twitter.com/Mm523Uldb3— Ravish Bisht (@ravishbofficial) February 9, 2026
IPL 2026: బెంగళూరు స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు!
ఎన్నో ప్రఖ్యాత క్రికెట్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఓ ఘోరం తరువాత అపఖ్యాతి పాలైంది. అక్కడ మ్యాచ్లను చూడాలనే క్రికెట్ అభిమానులు, నగర వాసుల ఆకాంక్ష ఎప్పుడు తీరేనా? అని ఎదురు చూస్తున్నారు. బుధవారం ఏదో ఒకటి నిర్ధారణ కానుంది.సాక్షి బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో ఐపీఎల్ క్రికెట్ పోటీల నిర్వహణపై అనుమతి గురించి బుధవారం ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో ఆర్సీబీ విజయోత్సవాలలో చిన్నస్వామి క్రికెట్ మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడడంతో అప్పటినుంచి ఐపీఎల్ సహా అన్నిరకాల మ్యాచ్లను నిర్వహించడం లేదు. ఆ ఘోర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మైకేల్ కున్హా నేతృత్వంలో ఒక కమిటీతో విచారణ జరిపించింది. ఆ కమిటీ తనిఖీలు చేసి క్రికెట్ పోటీలు నిర్వహించాలంటే ఏమేమి భద్రతా చర్యలు తీసుకోవాలో పలు సిఫారసులు చేసింది. ఇందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) కూడా ఆమోదించింది. రేపు సీఎంతో భేటీలో తీర్మానం: హోంమంత్రి ఈ నేపథ్యంలో బుధవారం జరిగే ముఖ్య సమావేశంలో ఐపీఎల్ పోటీల నిర్వహణపై ఒక నిర్ణయానికి వస్తామని రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర తెలిపారు. బెంగళూరు సదాశివనగరలో మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం అధ్యక్షుడు వెంకటేశ్ప్రసాద్, అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ, ఆర్సీబీ ప్రతినిధి రాజేశ్ మీనన్ తనను కలసి మ్యాచ్ల నిర్వహణపై చర్చించినట్లు తెలిపారు. బెంగళూరులో ఐపీఎల్ నిర్వహణకు అనుమతివ్వాలని కోరినట్లు, ఇదే సమయంలో ఈ ఏడాది ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నామో వివరించారన్నారు. తాను సీఎం సిద్ధరామయ్యతో ఈ విషయంపై చర్చించాల్సి ఉందని, అందుకే బుధవారం ఐపీఎల్ నిర్వహణపై తుది దఫా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజల భద్రత ప్రభుత్వం బాధ్యత అని, తొక్కిసలాటలు వంటివి పునరావృతం కాకూడదని, జీబీఏ కమిషనర్, నగర పోలీసు కమిషనర్, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులతో చర్చిస్తామని తెలిపారు. తీయని వార్త రావచ్చు: వెంకటేశ్ అభిమానులకు త్వరలోనే తీయని వార్త వస్తుందని ఆశిస్తున్నట్లు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు. హోంమంత్రిని కలసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. వీలయినంత త్వరగా పోటీల నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోవాలని హోం మంత్రిని కోరినట్లు తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం సూచించిన సిఫార్సులన్నింటినీ తమ అసోసియేషన్ పూర్తిగా పాటిస్తుందని చెప్పారు.
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్ ఆయకట్టు ఎడారే!. ఆల్మట్టి ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్ దూకుడు ఆంధ్రప్రదేశ్లో ‘ఆప్కాస్’ ఉద్యోగాలకు మంగళం
అమరావతి సైతం ప్రైవేట్ పరం... అందినకాడికి బాదుడే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు
పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ... వియ్యంకుల సంస్థలకు పనుల అప్పగింత
జంగిల్రాజ్పై ప్రశ్నిస్తున్నందుకే గూండా దాడులు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు అరాచకాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
‘లిఫ్ట్’ తాకట్టుపై రాయలసీమ కన్నెర్ర... ఆపిన పనులు రెండు నెలల్లో మళ్లీ మొదలుపెట్టాలని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ... చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
రెడ్బుక్కే రాజ్యాంగం, చంద్రబాబే ‘సుప్రీం’... తిరుమల శ్రీవారి లడ్డూపై సొంత విచారణ చేపట్టాలని ఏపీ సీఏం నిర్ణయం
కొలిక్కివచ్చిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం. అమెరికా టారిఫ్లు 18 శాతానికి తగ్గింపు
దేశానికి వికసిత విజన్... 2026-27 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్లో గూండారాజ్... పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. శనివారం రాత్రి అరెస్టు
బిజినెస్
వాతావరణ విపత్తుల ధాటికి చెక్
భారత్లో పెరుగుతున్న వాతావరణ ముప్పులను ఎదుర్కోవడానికి, డేటా ఆధారంగా పట్టణాల రక్షణను మెరుగుపరచడానికి గాంధీనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కీలక ఆవిష్కరణ చేసింది. తన రీసెర్చ్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏఐ రెసిలియన్స్ అండ్ కమాండ్ (ఏఆర్సీ) సెంటర్ను విద్యావేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో ఇటీవల ప్రారంభించింది.ఈ సెంటర్ ప్రధానంగా ‘రెయిన్-టు-రెసిలియన్స్’ (వర్షం నుంచి తట్టుకునే పరిస్థితులు) అనే ఫ్రేమ్వర్క్పై పనిచేస్తుంది. ఇది భౌతిక శాస్త్ర నమూనాలను కృత్రిమ మేధతో (ఏఐ) అనుసంధానిస్తుంది. దీని ద్వారా ఐఐటీ గాంధీనగర్ చెప్పిన అంశాల ప్రకారం.. నగరాల్లో వరదలను ముందే అంచనా వేయవచ్చు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలపై పడే ప్రభావాన్ని విశ్లేషించవచ్చు. విపత్తు సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులకు వేగంగా సమాచారాన్ని అందించవచ్చు.అత్యాధునిక సాంకేతికతఈ కేంద్రంలో వినియోగిస్తున్న సాధనాలను ఐఐటీ గాంధీనగర్ ఇంక్యుబేటెడ్ డీప్-టెక్ స్టార్టప్ ‘AIResQ ClimSols’ అభివృద్ధి చేసింది. ఇవి వాతావరణ మార్పులకు సంబంధించిన సంక్లిష్ట పరిస్థితులకు అత్యంత వేగంగా స్పందించగలవు. విపత్తు జరగకపోయినా ‘ఒకవేళ ఇలా జరిగితే పరిస్థితి ఏంటి?’ అనే అత్యవసర అంశాలకు ప్రణాళికలను ముందే సిద్ధం చేసుకోవడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.పట్టణాల్లో..ఐఐటీ గాంధీనగర్లోని మెషీన్ ఇంటెలిజెన్స్ అండ్ రెసిలియన్స్ (ఎంఐఆర్) ల్యాబ్ పరిశోధనల ఫలితంగా ఈ కేంద్రం ఏర్పాటైంది. నగరాల్లో నీటి ఎద్దడి లేదా వరదలు వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ సాంకేతికత కీలకం కానుంది. కేవలం విపత్తు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందే ఊహించి నష్టాన్ని నివారించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.సమన్వయంతో..ప్రభుత్వం, టెక్నాలజీ భాగస్వాములను ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా పరిశోధనలను క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడే సాధనాలుగా ఈ కేంద్రం మారుస్తోంది. ఇది భారతీయ నగరాలను మరింత సురక్షితంగా, వాతావరణ మార్పులను తట్టుకోగల సుస్థిర పట్టణాలుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనుంది.ఇదీ చదవండి: సరికొత్త లుక్లో మార్కెట్లోకి కొత్త ఈవీ
భారత టెక్ రంగానికి భారీ ఊతం
భారత దేశాన్ని గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 2025లో ప్రకటించిన పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ (ఆర్డీఐ) పథకం 2026-27 ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.1 లక్ష కోట్ల నిధిని సిద్ధం చేస్తోంది.నిధుల కేటాయింపు.. పురోగతిగత బడ్జెట్లో ఈ పథకం కోసం రూ.20,000 కోట్లు కేటాయించినప్పటికీ సవరించిన అంచనాల ప్రకారం కేవలం రూ.3,000 కోట్లు మాత్రమే వినియోగంలోకి వచ్చాయి. అయితే తాజా బడ్జెట్లో ప్రభుత్వం రూ.20,000 కోట్లను మూలధన వ్యయం కింద కేటాయించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంకి కేటాయించిన మొత్తం రూ.28,049 కోట్లలో అధిక భాగం ఈ పథకానికే దక్కడం విశేషం.ఈ పథకం అమలుకు సంబంధించి కొన్ని అంశాలు..అక్టోబర్ 11న ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు, పాలన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ‘అనుసంధాన్’ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కింద ప్రాథమికంగా నిధిని ఏర్పాటు చేశారు. సెకండ్ లెవల్ ఫండ్ మేనేజ్మెంట్(ఎస్ఎల్ఎఫ్ఎం) నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ (టీడీబీ), బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బైరాక్)లు ఇప్పటికే నామినేషన్ ప్రాతిపదికన మేనేజర్లుగా నియమితులయ్యాయి.పథకం ప్రధాన ఉద్దేశంప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా డీప్-టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఈ ఆర్డీఐ పథకం లక్ష్యం. ఈ విభాగంలోని కంపెనీలకు చాలా తక్కువ లేదా సున్నా వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు అందిస్తారు. స్టార్టప్ల్లో నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. అయితే, ఈ పథకం ద్వారా గ్రాంట్లు లేదా స్వల్పకాలిక రుణాలు మంజూరు చేయరని గమనించాలి. ఈ పథకంలో భాగంగా నేషనల్ క్వాంటం మిషన్, సెమీకండక్టర్ ల్యాబ్ (మొహాలీ), ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీ, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ వంటివాటికి నిధులు కేటాయించనున్నారు.సెమీకండక్టర్ రంగానికి బూస్ట్భారతదేశాన్ని సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం రూ.8,000 కోట్లను ‘మోడిఫైడ్ ప్రోగ్రామ్ ఫర్ సెమీకండక్టర్స్’ కోసం కేటాయించింది. గతేడాది ఇది రూ.7,000 కోట్లుగా ఉంది. అయితే, భారీ ఎలక్ట్రానిక్స్ తయారీకి ఇచ్చే పీఎల్ఐ పథకానికి కేటాయింపులను రూ.8,885 కోట్ల నుంచి రూ.1,345 కోట్లకు తగ్గించడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 2026 నాటికి భారత టెక్, రీసెర్చ్ రంగం కొత్త పుంతలు తొక్కేందుకు సిద్ధంగా ఉందని అర్థమవుతోంది.ఇదీ చదవండి: సరికొత్త లుక్లో మార్కెట్లోకి కొత్త ఈవీ
అరబిందో ఫార్మా లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 8 శాతం ఎగసి రూ. 910 కోట్లను తాకింది. యూరప్, యూఎస్లలో అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో హైదరాబాద్ కంపెనీ రూ. 846 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,979 కోట్ల నుంచి రూ. 8,646 కోట్లకు బలపడింది. ప్రధాన బిజినెస్లలో పటిష్ట ఎగ్జిక్యూషన్, నిలకడైన డిమాండ్, యూఎస్, యూరప్ తదితర కీలక మార్కెట్లలో విస్తరించిన బలమైన డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో వంటి అంశాలు క్యూ3 ఫలితాలను ప్రతిబింబిస్తున్నట్లు కంపెనీ వైస్చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 1 శాతం లాభంతో రూ. 1,201 వద్ద ముగిసింది.
మళ్లీ వెండి వేడి
న్యూఢిల్లీ: విలువైన లోహాల ధరలు మళ్లీ జోరందుకున్నాయి. తాజాగా వెండి కిలో ధర దాదాపు 7 శాతం(రూ. 17,000) జంప్చేసింది. అన్ని పన్నులు కలుపుకుని రూ. 2,72,000కు చేరింది. ఇదే బాటలో బంగారం ధరలు సైతం మెరిశాయి. స్థానిక బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్చతగల 10 గ్రాములు రూ. 1,300 బలపడింది. రూ. 1,58,500ను తాకింది. వారాంతాన వెండి కేజీ రూ. 2,55,000 వద్ద, పసిడి 10 గ్రాములు రూ. 1,57,200 వద్ద నిలిచిన విషయం విదితమే. ధరల తాజా పెరుగుదలకు యూఎస్ డాలరు బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పుంజుకోవడం కారణమైనట్లు బులియన్ వర్గాలు తెలియజేశాయి. అంతేకా కుండా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో కొనసాగుతున్న అనిశ్చితికితోడు.. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న అనూహ్య రాజకీయ, భౌగోళిక చర్యలు వెండి, పసిడి తదితర విలువైన లోహాలకు డిమాండును పెంచుతున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. విదేశీ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ స్పాట్ ధర ఔన్స్ 2.8 శాతం(2.2 డాలర్లు) ఎగసింది. 80.21 డాలర్లను తాకింది. మరోపక్క పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 1 శాతం పుంజుకుని 5,013 డాలర్లకు చేరింది.
ఫ్యామిలీ
సహనం: సంక్షోభంలో స్థిరత్వం
భారతీయ జీవన దర్శనం సహనాన్ని కేవలం ఒక సామాన్య గుణంగా కాకుండా, ఒక మహోన్నత తపస్సుగా అభివర్ణించింది. కష్ట సమయాల్లో చలించకుండా ఉండటమే సహనం. నేటి వేగవంతమైన ప్రపంచంలో మనిషి ప్రతిదీ తక్షణమే జరిగిపోవాలని కోరుకుంటున్నాడు. ఈ అత్యుత్సాహం అసహనాన్ని పెంచి, చిన్న విషయాలకే ఒత్తిడికి గురిచేస్తోంది. సహనం అంటే చేతకానితనం కాదు; అది మన మనస్సుపై మనకు ఉండే అద్భుత నియంత్రణ.విత్తనం విత్తిన వెంటనే ఫలాలు అందవు కదా! ఆ విత్తనం మట్టిలో కలిసి, అంకురించి, మొక్కగా ఎదిగి, వృక్షమై, చివరకు పండ్లను అందించడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలో ఆ విత్తనం ఎదుర్కొనే ఎండలు, వానలు, గాలివానలు అన్నీ ఓర్పుకు నిదర్శనాలు. జీవితంలో మన శ్రమకు తగ్గ ఫలితం దక్కాలంటే ఈ నిరీక్షణ తప్పనిసరి.ఆర్ష విజ్ఞానంలో సహనానికి భూదేవిని మించిన నిదర్శనం మరొకటి లేదు. సమస్త జీవరాశి తనపై సంచరిస్తున్నా, తనను తవ్వుతున్నా ఆమె చలించకుండా అందరినీ భరిస్తుంది. అలాగే వనవాస సమయంలో పాండవులు చూపిన నిగ్రహం అద్భుతం. రాజభోగాలను వీడి, ఎన్నో అవమానాలను భరిస్తూ సరైన సమయం కోసం వేచి చూశారు. ఆ ఓర్పే వారిని ధర్మ యుద్ధంలో విజేతలుగా నిలబెట్టింది. కోపం క్షణికావేశంలో కలిగే వినాశనం అయితే, సహనం శాశ్వతమైన విజయాన్ని అందించే మౌన శక్తి. పాలు పెరుగుగా మారాలన్నా, రాయి శిల్పంగా మారాలన్నా ఆ ప్రక్రియలో సహనం అంతర్లీనంగా ఉంటుంది. మన సంస్కృతిలో సహనం కలిగిన వాడిని మాత్రమే ధీరుడు అని పిలుస్తారు. నిశ్చలత్వమే నిత్య సత్యమని గుర్తించినప్పుడు ఏ కల్లోలమూ మనల్ని చలింపజేయదు. నిత్య జీవితంలోని ఆచరణాత్మక అంశాన్ని గమనిస్తే, మనకు ఇష్టమైన ఫలితం ఆలస్యమైనప్పుడు మనసు ఆందోళన చెందుతుంది. అటువంటి సమయంలో ప్రకృతిని గమనించాలి. ఋతువులు తమ క్రమం తప్పకుండా వస్తాయి, నదులు సుదీర్ఘ ప్రయాణం తర్వాతే సముద్రాన్ని చేరుతాయి. మనం చేసే ప్రయత్నం సరైనదైనప్పుడు, కాలం మనకు సానుకూల ఫలితాన్ని అందిస్తుందనే నమ్మకమే సహనం. కుటుంబ సంబంధాల్లో కానీ, వృత్తి పరమైన సవాళ్లలో కానీ ఆవేశంతో స్పందించే కంటే, సహనంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అనర్థాలు తప్పుతాయి. సహనం మనలో విచక్షణను పెంచుతుంది. ఇది ఒక రకమైన మానసిక పరిపక్వత; ఇది మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.విశ్వజనీన ధర్మం అందించిన ఈ సహన మార్గం వ్యక్తిని స్థితప్రజ్ఞుడిగా తీర్చిదిద్దుతుంది. తొందరపాటు నిర్ణయాలు అపజయాన్ని ఇస్తే, ఓర్పుతో కూడిన అడుగులు విజయతీరాలకు చేరుస్తాయి. మన హృదయంలో సహనం అనే జ్యోతి వెలుగుతున్నంత కాలం ఏ సవాలునైనా అధిగమించవచ్చు. లోకంలో మార్పు అనేది క్రమంగా జరుగుతుంది; ఆ మార్పులో మనం భాగస్వాములవ్వాలంటే సహనం అత్యంత అవసరం. అందుకే మనలో ఉన్న ఓర్పును పెంచుకుంటూ, ప్రశాంతమైన చిత్తంతో లక్ష్యం వైపు సాగిపోదాం. సహనమే శక్తి, సహనమే శాంతి. సర్వం సుమంగళం!వ్యక్తిత్వ వికాస నిపుణులువైదిక సంంస్కృతి బోధించిన తితిక్ష అంటే సుఖదుఃఖాలను, శీతోష్ణాలను సమానంగా భరించే శక్తి. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కుంగిపోకుండా, విమర్శలు ఎదురైనప్పుడు ఉలిక్కిపడకుండా ఉండటమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. సహనం ఉన్న చోట శాంతి ఉంటుంది. శాంతి ఉన్న చోట దైవత్వం విరాజిల్లుతుంది. మన అంతరంగంలో సహనం అనే వృక్షం పెరిగినప్పుడు, బయటి తుఫానులు మనల్ని ఏమీ చేయలేవు. ఈ గుణం అలవడిన మనిషికి ప్రతి కష్టం ఒక పాఠంగా, ప్రతి ఓటమి ఒక అనుభవంగా కనిపిస్తుంది. సహనం అనేది మన ఆత్మకు ఉండే కవచం వంటిది; అది మనల్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది. – కె. భాస్కర్ గుప్తా
దుపట్టాను రూపొందించినందుకు థ్యాంక్యూ
మన వస్త్రధారణ, సంస్కృతి విదేశీయలును ఎంతగా ఆకట్టుకుట్టుందో పలు ఘటనల్లో చూశాం. వాళ్లు మన సంస్కృతి, వేషధారణని ఇష్టపడి మరి ఇక్కడే ఉండిపోతున్న వాళ్లు ఉన్నారు. ఇంకొందరు మన దుస్తులను ఇష్టపడటమేగాక..వారి ఆహార్యాన్ని కూడా మార్చుకుంటున్నారు. పైగా మనలా నిండుగా కప్పుకునే దుస్తులే వేసుకునేందుకు ఇష్టపడటం విశేషం. ఇక్కడొక యూఎస్ మహిళ ఆ విషయమే చెబుతూ..ధన్యవాదాలని చెబుతోంది. ఇంతకీ దేనికి ఈ ధన్యవాదాలంటే..భారత సాంప్రదాయ వస్త్రమైన దుపట్టాపై తన ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ కేమి అను అమెరికన్ మహిళ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో భారత ప్రజలారా మీకు చాలా చాలా ధన్యవాదాలు. స్కార్ఫ్ లాంటి దుపట్టాను వారు తమ భుజం లేదా ఛాతీపై కప్పుకుంటారు. అది తన దుస్తులను అక్షరాల పదిరెట్లు మెరుగుపరిచిందంటూ సంబరపడింది. తాను ఈ దుపట్టాను భారతీయులే కనిపెట్టారని నమ్ముతున్నా..ఒకవేల్ల తప్పు అయితే రిచేయండి అని పేర్కొంది కేమి. నెటిజన్లు కూడా అవును మీరు చెప్పింది నిజమే. దీనిని భారతీయులే కనుగొన్నారు. కానీ దక్షిణాసియా అని ఏడుస్తున్నవారు ఉన్నారు. అయితే వాళ్లు భారతదేశంలో భాగమేనని మర్చిపోవడం బాధకరం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by KEMI (@eczema.bread) (చదవండి: weight loss Tips: సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు తగ్గాడు..!)
ఫ్యాటీలివర్తో బీకేర్ఫుల్..!
ఆల్కహాల్తో ఫ్యాటీలివర్ ముప్పు ఉందన్న విషయం తెలిసిందే. అయితే నిత్యం తాగేవారిలోనే ఈ ఫ్యాటీ లివర్ ముప్పు ఎక్కువ అనే అ΄ోహ గతంలో ఉండేది. తాజా తార్కాణాలూ, అనేక అధ్యయనాల ప్రకారం ఎప్పుడో ఒకసారి (అకేషనల్గా) తాగేవారికీ ఫ్యాటీలివర్ ముప్పు తప్పదని తెలుస్తోంది. దీనికి తోడు మగవాళ్లకు దీటుగా తాము ఆల్కహాల్కు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న మహిళల్లో ఈ ముప్పు మరింత ఎక్కువ అంటూ పేర్కొంటున్నారు అధ్యయనవేత్తలు. సోషల్ డ్రింకింగ్, వీకెండ్ కాక్టెయిల్ పార్టీస్ అంటూనో లేదా ఇంట్లోనైనా ఎప్పుడో ఒకసారి అంటూ తాగేవారికి సైతం ఫ్యాటీలివర్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేమిటో చూద్దాం...చాలామందిలో ఓ అపోహ ఉంటుంది. అదేమిటంటే... చాలా కొద్దిమోతాదులో అంటే ప్రతిరోజూ 30 మి.లీ.కు మించకుండా ఆల్కహాల్... అందులోనూ రెడ్వైన్ తీసుకునేవారిలో గుండెజబ్బులు నివారితమవుతాయనీ, రక్తనాళాల్లోని కొవ్వు కొట్టుకు΄ోతుందనీ, అంత తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటే అది ఫ్యాటీలివర్కు దారితీయదనీ... ఇలాంటి అ΄ోహలు ఎక్కువే ఉన్నాయి. అవన్నీ వాస్తవం కాదంటూ ఇటీవలి అనేక అధ్యయనాల్లో తేలింది. ఆల్కహాల్ ఎంత తక్కువ మోతాదులో తాగినా... అది కూడా చాలా అడపాదడపా(అకేషనల్గా) తీసుకున్నప్పటికీ ఫ్యాటీలివర్ ముప్పు తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఇటీవలే మన దేశంలోని మహిళలూ ఆల్కహాల్కు దగ్గరవుతున్న నేపథ్యంలో వాళ్లలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉందంటూ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.ఫ్యాటీలివర్ అంటే?మన రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శక్తి కోసం రక్తంలోని చక్కెర ఉపయోగపడుతుంది. అటు తర్వాత మిగతా చక్కెర కొవ్వురూపంలో కాలేయంలో నిల్వ అవుతుంటుంది. ఒకవేళ మనం తీసుకున్న ఆహారం కంటే మన రోజువారీ కార్యకలాపాలు తగ్గుతూ పోతున్న కొద్దీ ఈ కొవ్వు నిల్వలు అలా పేరుకుపోతూ ఉండటంతో పాటు కాలేయ కణాలూ కొవ్వు కణాల్లా మారుతూ ఉంటాయి. ఇలా కాలేయ కణాల్లో కొవ్వు మోతాదులు పెరుగుతూ పోవడాన్ని ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ఇందుకు ప్రధానంగా రెండు అంశాలు కారణమవుతాయి. అందులో మొదటిది ఆల్కహాల్ వినియోగం. రెండోది ఆల్కహాల్ కాకుండా ఇతరత్రా అంశాలు ఫ్యాటీలివర్కు కారణం కావడం. ఈ కారణాలను బట్టి ఫ్యాటీలివర్లోని రకాలివి... ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ డిసీజ్ (ఏఎఫ్ఎల్డీ) : ఆల్కహాల్ వినియోగం వల్ల కాలేయంలో కొవ్వు చేరి ‘ఫ్యాటీలివర్’కు దారితీయడం. నాన్ ఆల్కహాలివ్ ఫ్యాటీలివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్డీ) : దీనికి ఆల్కహాలిక్ ప్రధాన కారణం కాదు. అయితే జీవక్రియల తేడా కారణంగా వచ్చే వ్యాధులు (మెటబాలిక్ సిండ్రోమ్స్), స్థూలకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి కారణాల వల్ల ఈ ఫ్యాటీలివర్ సమస్య వస్తుంది.నిర్ధారణ బాధితుల స్థూలకాయం, పొట్ట (సెంట్రల్ ఒబేసిటీ) చూసి డాక్టర్లు పరిస్థితిని కొంత తెలుసుకోగలరు. కొన్ని రక్తపరీక్షలు, వాటితోపాటు డయాబెటిస్, కొలెస్ట్రాల్ మోతాదులు, ట్రైగ్లిజరైడ్ స్థాయులు పెరిగాయా అన్నది చూడాలి. అల్ట్రా సౌండ్ స్కానింగ్లో ఫ్యాటీలివర్ కండిషన్ బయటపడుతుంది. కొందరిలో లివర్ బయాప్సీ (అంటే కాలేయం తాలూకు చిన్న ముక్కను సేకరించి చేసే) పరీక్ష అవసరం. లివర్ బయాప్సీతో ఎన్ఏఎఫ్ఎల్డీలో అది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ (ఎన్ఏఎఎఫ్ఎల్) కండిషనా, లేక నాన్ ఆల్కహాలిక్ స్టియటో–హెపాటిక్ (నాశ్) కండిషనా అన్నది నిర్ధారణ చేయవచ్చు. ఇప్పుడు ‘ఫైబ్రోస్కాన్’ అనే వైద్యపరీక్ష ద్వారా లివర్లో ఏ మేరకు కొవ్వు పేరుకుంది, ఫైబ్రోసిస్ ఎంత ఉందన్న విషయంతో పాటు, మూడు నెలల తర్వాత మళ్లీ సమీక్షించి, కొవ్వు మోతాదులు పెరిగాయా, తగ్గాయా కూడా తెలుసుకోవచ్చు. మహిళల్లో మరింత ఎక్కువ ముప్పు ఎందుకంటే... ఆల్కహాలిక్ ఫాటీలివర్ ముప్పు మహిళల్లో మరింత ఎక్కువ. ఎందుకంటే వీళ్లలో పురుషులతో ΄ోలిస్తే వాళ్ల కాలేయం సైజు తక్కువ. అలాగే వాళ్ల ఒంట్లోని నీటి మోతాదులు కూడా తక్కువే. ఇక మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ కారణంగా ఆల్కహాల్ వాళ్ల రక్తంలో చాలా ఎక్కువగా గాఢతతో చాలాసేపు ఉంటుంది. అలా అరుదుగానే అప్పుడప్పుడూ తాగినా ఆ ఇంటర్మిట్టెంట్ ఆల్కహాల్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం, కొవ్వులు పేరుకుపోవడంతో పాటు ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కూడా పెరుగుతుందని ఈ అంశాలన్నీ మహిళల్లో ఫ్యాటీలివర్ను పెంచడంతోపాటు లివర్ ఫైబ్రోసిస్ ముప్పునూ చాలా ఎక్కువగా పెంచేస్తాయి. అందుకే 20 – 35 ఏళ్లున్న మహిళల్లో వాళ్ల ఆల్కహాల్ తీసుకునే మోతాదు ఎంత తక్కువైనప్పటికీ లివర్ ఫైబ్రోసిస్ రేటు చాలా పెరిగి΄ోతోంది. అందుకే పురుషులూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్లలో ΄ోలిస్తే మహిళలు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆల్కహాల్ దుష్ప్రభావాలు మహిళల్లో కేవలం కాలేయాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ల రుతుక్రమం దెబ్బతినడం, హార్మోనల్ బ్యాలెన్స్ అతలా కుతలం కావడం, సంతానలేమి వంటి అనేక సమస్యలకు దారితీయవచ్చు.లక్షణాలు ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో పొట్ట బాగా పెరిగిపోతుంటుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో ఇలా కొద్దిమేరకు లక్షణాలు కనిపించవచ్చేమోగానీ...నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో చాలావరకు లక్షణాలు కనిపించవు.అయితే కొన్ని అంశాలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ను సూచిస్తాయి. ఉదాహరణకు వీళ్లలోనూ పొట్ట బాగా పెరిగి, సెంట్రల్ ఒబేసిటీతో ముందుకు వచ్చి కనిపిస్తుంది. ∙ కొద్దిమందిలో కుడివైపు పొట్ట పైభాగంలో (ఉరఃపంజరం / రిబ్కేజ్ కింద) పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. క్రమంగా కాలేయం పెరుగుతుండటం వల్ల ఇలా జరుగుతుంటుంది. నివారణ / చికిత్సఆల్కహాల్ అలవాటును పూర్తిగా మానేయడం. డైట్ : ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం. ఇందులో చక్కెర, కొవ్వుల మోతాదులను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవడం, షుగర్–స్వీటెన్డ్ డ్రింక్స్ వంటి కూల్డ్రింక్స్ దూరంగా ఉండటం. అలాగే పొట్టుతో ఉండే ధాన్యాలూ (హోల్గ్రెయిన్స్), తాజా పండ్లు, కూరగాయల వంటి పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం. వ్యాయామం : రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. దేహానికి వారంలో కనీసం 150 నిమిషాల వ్యాయామాన్ని ఇవ్వడం. నివారణ నియమాలు పాటించడంతో పాటు ఫ్యాటీ లివర్ దశను బట్టి డాక్టర్లు సూచించిన మందులు వాడాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న జాగ్రత్తలతోపాటు క్రమం తప్పకుండా అవసరమైన వైద్య పరీక్షలు (అల్ట్రా సౌండ్, మెటబాలిక్ మార్కర్ పరీక్షలు) చేయించుకుంటూ ఉండటం. చివరగా... సోషల్ డ్రింకింగ్ లేదా వీకెండ్ పార్టీస్ అంటూ పార్టీ కల్చర్ పేరిట పరిమితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల దేహానికి అత్యంత కీలకమైన భాగమైన కాలేయంపై పడే దుష్ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆల్కహాల్కు దూరంగా ఉండటం, ఈ అవగాహనను అందరిలోనూ కల్పించడం అన్నది ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతైన అవసరమని గుర్తించాలి. డాక్టర్ పవన్ కె. అడ్డాల, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ (చదవండి: weight loss Tips: సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు తగ్గాడు..!)
సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు ..!
వెయిట్లాస్ కోసం ఎన్నో రకాల డైట్లు ఫాలో అవుతుంటాం. కానీ కొందరు సంప్రదాయ ఆహారాన్ని తింటూనే స్లిమ్గా మారతారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ ఫిట్నెస్కోచ్ కాగివన్ ప్రభాహరణ్. అమ్మలాంటి సాంప్రదాయ వంట తింటూనే బరువు తగ్గొచ్చని అంటున్నారు. తాను ఒకప్పుడు అధిక బరువుతో బానలాంటి పొట్టతో ఉండేవాడినని..కానీ ఇప్పుడు సిక్స్ప్యాక్ శరీరంతో స్మార్ట్గా మారానని చెప్పుకొచ్చాడు. అయితే రైస్కి దూరంగా ఉండలేదని..సంప్రదాయ వంటను ఆస్వాదిస్తూనే వెయిట్లాస్ అయ్యినట్లు తెలిపాడు. అందుకోసం డైట్ ఎలా ఫాలో అవ్వాలో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరించాడు.తమిళులు చాలామంది సిక్స్ ప్యాక్ కోసం డైట్ వేరుగా ఉంటుందని భావిస్తారు. కానీ తాను తమిళ వారసత్వంలో పాతుకుపోయిన పప్పు వంటి వంటకాలను తింటూనే బరువు తగ్గానని అంటున్నాడు. వాటిని తీసుకుంటూనే సిక్స్ ప్యాక్ సాధించానని చెబుతున్నాడు. అమ్మలాంటి సంప్రదాయ వంటకాన్ని, రుచిని వదులుకుని వెయిట్లాస్ అవ్వాల్సిన పనిలేదని, కేవలం స్మార్ట్గా తింటే చాలట. వాస్తవానికి తమిళ భోజనాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. అందువల్ల అధిక కేలరీలు తీసుకోకుండానే శక్తిని ఇచ్చే వాటిని తీసుకునేవాడినని వీడియోలో తెలిపాడు. ఆ మూడు తప్పనిసరి..సంతృప్తికరమైన భోజనం ఆస్వాదిస్తూనే బరువు తగ్గేందుకు ఈ మూడు మార్పులు చాలా హెల్ప్ అయ్యాయని చెబుతున్నాడు. మొదటి ప్లేట్లో అన్నాన్ని తక్కువ పరిమాణంలో పెట్టుకోవడం. ఎందుకంటే కొలస్ట్రాల్ కరిగేలా..కండరాలను నిర్మించడానికి కార్మోహైడ్రేట్లు అవసరం అందువల్ల ఇలా తీసుకున్నట్లు తెలిపారు. రెండోది సాంప్రదాయ తమిళ ఆహారంలో ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ల నిమిత్తం..చికెన్, చేపలు, గ్రీకు పెరుగు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఇక మూడోది..వీటితోపాటు ఫైబర్ కోసం ఆకుకూరలను కూడా చేర్చుకున్నట్లు తెలిపారు. అలాగే ఫిట్నెస్ ప్రపంచంలో తెల్లబియ్యాన్ని దగ్గరకు రానీయరు, కానీ ఇది వెయిట్లాస్కి అడ్డంకి కాదని అన్నారు. ముఖ్యంగా వర్కౌట్ల సమయంలో కండరాలకు ఇంధనంలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక్కడ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల బియ్యం తక్కువగా ఉన్నా..కడుపు నిండిన అనుభూతి మిస్ చేసుకోవాల్సిన పని ఉండదని చెబుతున్నారు. ఎప్పుడైనా నచ్చిన ఆహారం ఆస్వాదిస్తూనే..తెలివిగా కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకుంటే వెయిట్లాస్ అవుతామని చెబుతున్నాడు కాగివన్ View this post on Instagram A post shared by Kagivan Prabaharan | Tamil Transformation Coach (@kagsfit) (చదవండి: శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!)
అంతర్జాతీయం
ట్రంప్ భయం.. 37 ఏళ్ల రికార్డు బ్రేక్
ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తన నివాస రహస్యం ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా తలదాచుకుంటున్నారు. అమెరికా శాటిలైట్స్ సైతం కనిపెట్టకుండా ప్రత్యేకమైన బంకర్లలో ఆయన తలదాచుకుంటున్నట్లు సమాచారం .ఈ నేపథ్యంలో ఖమేనీ 37 ఏళ్లుగా ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశారు.1989లో షియా మత గురువు ఆదేశ సుప్రీం లీడర్ రుహోల్లా ఖోమేని మరణాంతరం ఆయతుల్లా అలీ ఖమేనీ బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజు నుంచి నేటి వరకూ దాదాపుగా 37 ఏళ్లుగా ఇరాన్ సుప్రీంగా ఖమేనీ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దశాబ్ధాలుగా ఉన్న ఓ సంప్రదాయాన్ని అమెరికా ఉద్రికత్తల నేపథ్యంలో వదులుకోవాల్సి వచ్చింది.1979 ఫిబ్రవరి 8వ తేదీ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది, ఆ రోజున ఒక బృందం వైమానిక దళ అధికారులు పహ్లావీ రాజవంశాన్ని కూలదోసినందుకు గాను రుహోల్లా ఖొమేనీకి విధేయత ప్రకటించారు. అనంతరం అప్పటి నుంచి ఆ రోజున ఆ దేశ వైమానిక అధికారులతో ఇరాన్ సుప్రీం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. కరోనాతో ప్రపంచం మంతా ఆంక్షలు ఉన్న సమయంలోనూ ఈ సమావేశం నిర్వహించారు.అయితే ప్రస్తుతం అమెరికాతో హాని పొంచి ఉన్న నేపథ్యంలో తొలిసారిగా ఆ దేశ సుప్రీం ఆ భేటీకి హాజరుకానట్లు ఇరాన్ అధికారులు ప్రకటించారు. ఈ సారి ఆయనకు బదులుగా ఆ సమావేశానికి ఆర్మీ ఫోర్స్ చీఫ్ అబ్ధుల్ రహీం మౌస్వీ హాజరైనట్లు అధికారులు తెలిపారు. దీంతో 37 ఏళ్లుగా ఇరాన్ సుప్రీం పాటిస్తున్న సంప్రదాయానికి తొలిసారిగా బ్రేక్ పడినట్లయింది.అయితే అమెరికాతో ముంపు పొంచి ఉన్న నేపథ్యంలోనే ఖమేనీ బయిటకి రాలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాలు వెనక్కితగ్గేలా కనిపించడం లేదు. అణు కార్యక్రమాల్లో భాగంగా చేపడుతున్న యురేనియం శుద్ధి ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో నిలిపేది లేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. తమ దేశ సౌర్వభౌమాధికారం విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.అటు అమెరికా తన యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ను అరేబియా సముద్రంలో మెుహరించింది. కొద్దిరోజుల క్రితం ఇరాన్ డ్రోన్ను కూల్చివేసిన యుఎస్ ఇప్పుడు ఆ దేశంపైకి ఏ క్షణానైనా దాడి చేసేలా మరింత దగ్గరగా అబ్రహం లింకన్ను తీసుకవచ్చింది. దీంతో పశ్చిమాసియాలో ఏం జరగనుందా? అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టనుందా?
ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక గ్రహశకలాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. దాని పేరు-2024 YR4. మరి ఇంత జాగ్రత్తగా శాస్త్రవేత్తలు ఎందుకు గమనిస్తున్నారు? అంటే..ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉందా?ఉంటే.. ఒక వేళ అలా జరిగితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది? భూమికి ఏమైనా ప్రమాదమా? ఇప్పుడిదే చర్చ ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తల మధ్య జరుగుతోంది.శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం, 2024 YR4 అనే ఈ ఆస్టరాయిడ్ చంద్రుడిని ఢీకొట్టే అవకాశం సుమారు 4 శాతం ఉందని చెబుతున్నారు. 4 శాతం అంటే చిన్న సంఖ్యలా అనిపించొచ్చు… కానీ అంతరిక్ష లెక్కల్లో ఇది గమనించాల్సిన స్థాయి. సింగువా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం ..ఒకవేళ ఇది నిజంగా చంద్రుడిని ఢీకొట్టితే? చంద్రునిపై భారీ విస్ఫోటనం సంభవించే అవకాశం ఉంది.ఈ విస్ఫోటనం ఎలా ఉంటుందంటే .హిరోషిమాపై పడిన అణుబాంబు శక్తికి 400 రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావంతో చంద్రుడిపై సుమారు ఒక కిలోమీటరు వ్యాసార్థంలో భారీ గొయ్యి ఏర్పడుతుంది. చంద్రుడి ఉపరితలం రెక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో కంపించవచ్చని చెబుతున్నారు. ఇక్కడి వరకు వినగానే… “అది చంద్రుడిపై కదా, మనకు ఏముంది?” అనిపించొచ్చు. కానీ అసలు ఆందోళన అక్కడే మొదలవుతోంది. ఈ విస్ఫోటనం వల్ల ఎగసి పడే దుమ్ము, శకలాలు భూమి వైపు ప్రయాణించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వాటిలో కొన్ని భూమి వాతావరణంలోకి ప్రవేశించి ఉల్కలుగా పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఉల్కాపాతం కనిపించవచ్చు. మరికొన్ని చోట్ల అవి నిర్మాణాలను ఢీకొని ఆస్తి నష్టం కలిగించవచ్చు. ఇంకా పెద్ద ఆందోళన ఏంటంటే ..ఈ శకలాలు భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్స్ను ఢీకొట్టే అవకాశం. ఒక వేళ అలా జరిగితే…కమ్యూనికేషన్ వ్యవస్థలు, GPS, నావిగేషన్ సిస్టమ్స్, బ్యాంకింగ్ నెట్వర్క్స్ ..ఇవన్నీ దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ గ్రహశకలం గమనంపై నిశితంగా నిఘా పెట్టాయి.NASA, ESAతో పాటు ఇతర దేశాల స్పేస్ ఏజెన్సీలు కూడా దీని ట్రాజెక్టరీని క్షణక్షణం ట్రాక్ చేస్తున్నాయి. అయితే… ఇప్పటికీ ఇది కేవలం సంభావ్యత మాత్రమే. ఖచ్చితంగా ఢీకొడుతుందని ఎవరూ చెప్పలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం గా తెలుస్తోంది..మన ఆకాశం ప్రశాంతంగా కనిపించినా.. అక్కడ జరిగే ప్రతి కదలికను శాస్త్రవేత్తలు జాగ్రత్తగా గమనిస్తున్నారు.
పుతిన్తో భేటీకి ఎప్స్టీన్ తహతహ? షాకిస్తున్న తాజా పత్రాలు..
న్యూఢిల్లీ: అమెరికా గూఢచారిగా ముద్రపడిన జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించి తాజాగా వెల్లడైన మరో విషయం చర్చనీయాంశంగా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సహా పలువురు ఉన్నత స్థాయి రష్యా అధికారులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎప్స్టీన్ ప్రయత్నించినట్లు అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన తాజా పత్రాలు వెల్లడిస్తున్నాయి.సీఎన్ఎన్ కథనం ప్రకారం ఎప్స్టీన్ న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి రష్యా రాయబారి విటాలీ చుర్కిన్తో తరచూ సమావేశమయ్యేవారు. చుర్కిన్ కుమారుడు మాగ్జిమ్కు న్యూయార్క్లోని ఒక వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలో ఉద్యోగం ఇప్పించేందుకు కూడా ఎప్స్టీన్ ప్రతిపాదించినట్లు ఈ పత్రాల్లో వెల్లడయ్యింది. 2017లో రాయబారి విటాలీ చుర్కిన్ ఆకస్మిక మరణం తర్వాత, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సంబంధాలు పెంచుకోవడానికి ఎప్స్టీన్ ప్రయత్నించారు. 2018 జూన్ 24న నోర్వే రాజకీయ నేత థోర్బ్జోర్న్ జగ్ల్యాండ్కు పంపిన ఈమెయిల్లో, ‘నాతో మాట్లాడటం ద్వారా పలు కీలక విషయాలు తెలుసుకోవచ్చని మీరు పుతిన్కు సూచించవచ్చు’ అని ఎప్స్టీన్ పేర్కొన్నారు.రష్యాలో పాశ్చాత్య దేశాల పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అవసరమైన ప్రణాళికలను వివరించే నెపంతో పుతిన్ను కలవాలని ఎప్స్టీన్ భావించారు. 2013లో మాజీ ఇజ్రాయెల్ ప్రధాని ఎహుద్ బరాక్కు రాసిన ఈమెయిల్లో నార్వే నేత ఒకరు జగ్ల్యాండ్ సోచిలో పుతిన్ను కలవబోతున్నారని, ఆ సమయంలో తన గురించి ప్రస్తావించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. తాను బిల్ గేట్స్ లాంటి ప్రముఖులకు సలహాదారునని, పుతిన్తో కనీసం రెండు మూడు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు ఎప్స్టీన్ విన్నవించారు. అయితే సెయింట్ పీటర్స్బర్గ్ ఆర్థిక సదస్సులో పుతిన్ కోరిన భేటీని తానే తిరస్కరించానని ఎప్స్టీన్ చెప్పుకున్నప్పటికీ, దానికి సరైన ఆధారాలు లేవు.ఎప్స్టీన్ వ్యవహారంపై పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ స్పందించారు. ఈ లైంగిక వేధింపుల కుంభకోణాన్ని రష్యా నిఘా సంస్థలే వ్యవస్థీకృతం చేసి ఉండవచ్చనే అనుమానంతో తమ దేశం దర్యాప్తు చేపడుతుందని ప్రకటించారు. ప్రపంచ దేశాల నేతలను బ్లాక్ మెయిల్ చేసేందుకు రష్యా వద్ద కీలక సమాచారం ఉండే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను రష్యా కొట్టిపారేసింది. ఎప్స్టీన్ రష్యా గూఢచారి అనే దానిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని, అటువంటి నిరాధారమైన విషయాలపై సమయం వృథా చేయవద్దని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ‘నో ఫోన్ ఛాలెంజ్’.. రెండు వారాల్లో అనూహ్య మార్పు!
ట్రంప్నకు భారీ విజయం.. వలసదారులకు ఎదురుదెబ్బ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అప్పీల్స్ కోర్టు భారీ ఊరట దక్కింది. వలసదారులను నిర్బంధించే విషయంలో ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని అప్పీల్స్ కోర్టు సమర్థించింది. దీంతో, కోర్టులో భారీ విజయం దక్కింది. ఈ మేరకు ధర్మాసనం తరఫున 2-1 మెజారిటీతో జడ్జి ఎడిత్ హెచ్ జోన్స్ తీర్పు రాశారు.కాగా, అమెరికాలో ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వలసదారులను అరెస్టు చేసినప్పుడు హోంలాండ్ భద్రతాధికారులు బాండ్ హియరింగ్ను నిరాకరిస్తున్నారు. బాండ్ హియరింగ్కు అనుమతి ఇవ్వకుండానే వలసదారులను నిర్భందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వలసదారుల నిర్భందాలపై పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఐదో సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు.. ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని సమర్థించింది. ధర్మాసనం తరఫున 2-1 మెజారిటీతో జడ్జి ఎడిత్ హెచ్ జోన్స్ తీర్పు రాశారు. ఈ సందర్భంగా.. బాండ్ హియరింగ్ నిర్భందాలకు అనేక కోర్టులు వ్యతిరేకంగా తీర్పులిస్తున్నాయి. కానీ ఇది రాజ్యాంగం, ఫెడరల్ వలస చట్టాలకు అనుగుణంగానే ఉంది. వలస, జాతీయ చట్టాలకు ప్రభుత్వం సరిగానే అర్థం చెప్పిందని అభిప్రాయపడ్డారు. అనుమతిలేని విదేశీయులు దేశంలో ఎక్కడ పట్టుబడినా బాండ్పై విడుదలకు అనర్హులని స్పష్టం చేశారు. వారు ఎంతకాలం దేశంలో ఉన్నారన్నదీ అప్రస్తుతమని పేర్కొన్నారు.అయితే, గతంలో విదేశీయులు సరిహద్దుల్లో అరెస్టయితే.. వారికి ఎటువంటి నేర చరిత్రా లేకపోతే వలసదారుల కోర్టులో బాండ్ హియరింగ్ను కోరేవారు. కోర్టులూ వారికి బాండ్లను మంజూరు చేసేవి. కానీ, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసదారులపై ఉక్కుపాదం మోపారు. అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేశారు.ఈ నేపథ్యంలో మెక్సికోకు చెందిన ఇద్దరు వలసదారులు అమెరికాలో పదేళ్లుగా ఉంటున్నారు. గత ఏడాది వారు తమను నెలలపాటు నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు వేశారు. వారికి గత అక్టోబరులో టెక్సాస్ కోర్టు బాండ్లు మంజూరు చేసింది. గత జులైలో ట్రంప్ యంత్రాంగం బాండ్ల విధానాన్ని తిరగదోడింది. తాజాగా అప్పీల్స్ కోర్టు ఆ విధానాన్ని సమర్థించింది. కాగా, ఇలాంటి నిర్బంధాలను ఇటీవల దిగువ కోర్టులు తప్పుబడుతున్న నేపథ్యంలో ఈ తీర్పు ట్రంప్నకు భారీ న్యాయ విజయంగా చెప్పవచ్చు.
జాతీయం
ఒక్కనైట్ హోటల్ రూ. 11 లక్షలు..?
ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ (AI)కి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బడాబడా కార్పోరేట్ కంపెనీలతో పాటు సాధారణ ప్రజలు సైతం ఏఐని ఉపయోగిస్తున్నారు. అయితే భారత్ ఈనెలలో దీనికి సంబంధించి ఏఐ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. దీంతో దీని కున్న క్రేజ్ దృష్యా ఢిల్లీలో హోటళ్ల ధరలు ఆకాశాన్నంటాయి.సాధారణంగా న్యూఇయర్ సందర్భంగానో లేదా క్రికెట్ మ్యాచులు, సెలబ్రేటీల ఈవెంట్స్ సాధారణంగా ఇటువంటి సందర్భంలోనే హోటళ్ల ధరలు ఆకాశాన్నంటుతాయి. అది కూడా వేలల్లో లేదా రూ. లక్ష ఉంటుంది. అయితే ఫిబ్రవరి 16 నుంచి 20 వరకూ ఢిల్లీలోని భరత మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ ప్రముఖులు రానున్నారు. ఇందులో పెద్ద ఆశ్చర్యమేముంది అనుకుంటున్నారా? ఏఐ సమ్మిట్ దృష్ట్యా ఆ రోజుల్లో అక్కడి ఢిల్లీలోని హోటళ్ల ధరలు మైండ్ బ్లాక్ అయ్యే విధంగా పెరిగిపోయాయి. ది ఇంపీరియల్ అనే ఫైవ్స్టార్ హోటల్లో బాత్హాబ్తో ఉన్న లగ్జరీ సూట్ ధర అక్షరాల రూ. 11.64 లక్షలుగా ఉంది. దీంతో కస్టమర్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. లీలా మహాల్లోని మహారాజ సూట్ ధర రూ.7.34 లక్షలు పలికింది. అదేవిధంగా ఒబేరాయిలో రూ.5.84లక్షలు, తాజ్ ప్యాలెస్లో రూ.4 లక్షలుగా ఉంది. ఈ కామర్స్ వెబ్సైట్ మేక్ మైట్రిప్లో ధరలు ఈ విధంగా చూపించాయి దీంతో యూజర్స్ ఆ ధరలు చూసి కంగుతిన్నారు.అయితే ఏఐ సమ్మిట్ దృష్యా ఆ ప్రాంతంలోని అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లలో విపరీతంగా పెరిగాయని ఇక్సిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలోక్ బాజ్పేయ్ తెలిపారు.కాగా ఫ్రాన్స్లో జరిగిన AI యాక్షన్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్లో AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈసమ్మిట్ గ్లోబల్ సౌత్లో నిర్వహించబడుతున్న మొట్టమొదటి గ్లోబల్ AI సమ్మిట్.
లోక్సభ: అవిశ్వాస తీర్మానంపై విపక్షాల్లో చీలిక?
న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై విపక్షాల్లో చీలిక ఏర్పడింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరించింది. అయితే కాంగ్రెస్ ఇప్పటికే వందమందికి పైగా ఎంపీల సంతకాలను సేకరించింది. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానిపై దాడి చేశారన్న స్పీకర్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ముందు లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్ష సభ్యులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ నేడు (మంగళవారం) స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఫిబ్రవరి 4న సభా మర్యాదలను కాపాడేందుకు స్పీకర్ చేసిన ప్రయత్నాలను గుర్తుచేస్తూ, గందరగోళం సృష్టించిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రతిష్టను దిగజార్చేలా కొందరు సభ్యులు వ్యవహరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతిపక్ష ఎంపీలు మునుపెన్నడూ లేని విధంగా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని బీజేపీ ఎంపీలు తమ లేఖలో వివరించారు. కొందరు సభ్యులు వెల్లోకి దూసుకురావడమే కాకుండా, స్పీకర్ టేబుల్పైకి ఎక్కి కాగితాలు చింపి, విసిరారని ఆరోపించారు. మరికొందరు మహిళా ఎంపీలు దూకుడుగా వ్యవహరిస్తూ, ప్లకార్డులు పట్టుకుని ట్రెజరీ బెంచీల వైపు వెళ్లారని, ఏకంగా ప్రధానమంత్రి కూర్చునే సీటును కూడా చుట్టుముట్టారని వారు పేర్కొన్నారు. ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు.బీజేపీ లేఖకు ఒకరోజు ముందే కాంగ్రెస్ మహిళా ఎంపీలు కూడా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రధాని మోదీ సభకు గైర్హాజరు కావడాన్ని సమర్థించుకునేందుకు పాలకపక్షం ఒత్తిడికి లొంగి, స్పీకర్ తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. తమపై బురద చల్లడం ద్వారా వారిలోని లోపాలను కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. ప్రియాంక గాంధీ వాద్రా, జ్యోతిమణి సహా పలువురు నేతలు సంతకం చేసిన ఈ లేఖలో.. తమపై చేస్తున్న ఆరోపణలను వారు పూర్తిగా తోసిపుచ్చారు. తాము రాజ్యాంగ విలువలపై నమ్మకం ఉన్నవారమని, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
భర్తను బలి చేసి ప్రియుడితో జీవితం.. రోజీ దుర్మార్గపు కుట్ర
బెంగళూరు: అక్రమ సంబంధాల మోజులో పడిన భార్య.. భర్తను వదిలించుకోవాలని షాకింగ్ పథకం వేసింది. అతన్ని హంతకున్ని చేయాలని కుట్ర చేసింది. ఈ సంఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పట్టణంలో జరిగింది. భార్య కుట్ర ఫలితంగా భర్త జైలు పాలయ్యాడు. వివరాలు.. ఆనేకల్ తాలూకాలో ఆంథోనీ, రోజి భార్యాభర్తలు. రోజికి రాజేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఇది తెలిసి భర్త ఆమెను మందలించేవాడు. తమ సంతోషానికి భర్త అడ్డంకిగా ఉన్నాడు, తరచూ తాగి వచ్చి వేధిస్తున్నాడనే నెపంతో భార్య తన భర్తను పునరావాస కేంద్రంలో చేర్పించింది. 18 నెలల తర్వాత, భర్త ఆంథోనీ తిరిగి వచ్చాడు. భర్త లేని సమయంలో ఆమె ప్రియునితో సహజీవనం సాగించింది. భర్త రాగానే పథకాన్ని అమలు చేసింది. తమ బావ బాలరాజు మీద లేనిపోని మాటలు చెప్పి చంపేయాలని ప్రేరేపించింది. భార్య మాట విని ఆంథోనీ, తన అన్నయ్య బాలరాజ్ను కత్తితోపొడిచి హత్య చేశాడు. దీంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో ఆంథోనీపై కేసు నమోదైంది. అరెస్టు చేసి చెరసాలకు తరలించారు. రోజి మళ్లీ ప్రియునికి దగ్గరైంది. అయితే రోజినే అసలు నిందితురాలని తెలిసి కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
10 ఏళ్లుగా అన్నం ముట్టుకోని ‘టార్జాన్’ యువకుడు!
దొడ్డబళ్లాపురం( కర్ణాటక): మనిషి జీవించాలంటే ఆహారం తినాలి. ఇది అందరికీ తెలిసిందే. కానీ కర్ణాటకలోని బెళగావికి చెందిన బుడన్ఖాన్ అలియాస్ బుడన్ మాలిక్ హొసమణి (25) ఆకులు, చిన్న చిన్న మొక్కలు తింటూ బతుకుతున్నాడు. సవదత్తి తాలూకా ఉగరగోళ గ్రామానికి చెందిన ఇతడు 10 ఏళ్లుగా అన్నం ముట్టుకోలేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే గ్రామ శివారులోని హెగ్గొళ్ల గుట్ట మీద ఉంటున్నాడు. ఆకలైతే చుట్టుపక్కల చెట్ల ఆకులు, మొక్కలు తింటాడు. దాహం వేస్తే కుంటల్లో నీటిని తాగుతాడు. తరచూ ధ్యానం చేస్తాడు. మనుషులు తినే ఎటువంటి ఆహార పదార్థాలనూ ఇతడు తినడు. కోతులు ఆకులు, కాయలు తిని బతకడం చూసి తానూ నేర్చుకున్నానని, ఇప్పటి వరకూ ఎటువంటి రోగాలు రాలేదని చెబుతున్నాడు. ఇతడి ఆహార పద్ధతి వైద్యులకు సవాలుగా మారింది. ఖాన్ను అందరూ టార్జాన్ అని ముద్దుగా పిలుస్తున్నారు.
ఎన్ఆర్ఐ
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే వలస కార్మికుల ఉచిత వీసాల కోసం అక్కడి ఏడీఎన్హెచ్ సంస్థ, తెలంగాణలోని జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నాలుగు చోట్ల ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. క్లీనింగ్ విభాగంలో పనిచేసేందుకు ఉచితంగా వీసాలను జారీ చేసి, ఉచిత విమాన టికెట్, వసతి, భోజన సదుపాయం కల్పించి.. మన కరెన్సీలో రూ.23 వేల వరకు వేతనాలను చెల్లించనున్నారు. వచ్చే నెల 6న జగిత్యాల, సిరిసిల్లలో, 7న నిజామాబా ద్, ఆర్మూర్లలోని జీటీఎం సంస్థ కార్యాలయాలలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. వివ రాల కోసం ఆర్మూర్ (8332062299), నిజామాబాద్ (8686860999), జగిత్యాల (83320422 99), సిరిసిల్ల (9391661522) నంబర్లలో సంప్రదించవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దళారుల్ని నమ్మొద్దు ఈనెల 9, 10 తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరైన వంద మందిని రెండు మూడు రోజుల్లో యూఏఈకి పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దళారులను నమ్మి మోసపోవద్దు. – చీటీ సతీశ్రావు, చైర్మన్, జీటీఎం ఇంటర్నేషనల్ (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!)
వైభవంగా తానా మిడ్-అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలను చూడటానికి వచ్చిన జనసందోహం, మరోవైపు తమ ఆట, పాటలతో మైమరపింపజేసిన చిన్నారులతో తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సూపర్ హిట్టయింది. వెస్ట్ చెస్టర్ లో జనవరి 17వ తేదీన జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దాదాపు 1500మందికిపైగా వచ్చిన జనసందోహం నిర్వాహకులకు, కళాకారులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికితోడు సంక్రాంతి థీమ్ ను ప్రతిబింబించేలా చేసిన కార్యక్రమాలు, పోటీలు అందరిలోనూ పాల్గొనేలా చేశాయి.తానా మిడ్ అట్లాంటిక్ కు చెందిన బోర్డ్ డైరెక్టర్ రవిపొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు చిన్నారులు పాడిన సినిమా పాటలు ఎంతోమందిని అలరింపజేశాయి. యాంకర్లు శ్వేత కొమ్మోజి, మనీషా మేక కూడా కార్యక్రమాల విజయానికి తమవంతుగా వ్యాఖానాలను జోడించి ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. సాంప్రదాయ భోగిపళ్లు కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు వారిపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు, కిడ్స్ విలేజ్ థీమ్ కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారిని తానా నాయకులు అభినందించారు. ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకుల కోసం 7,000 పౌండ్లకు పైగా ఆహారాన్ని విరాళంగా సేకరించడంలో ప్రతిభ కనబరిచిన యువ వలంటీర్లను ఈ సంక్రాంతి వేడుకల్లో సత్కరించడం హైలైట్ గా నిలిచింది. వెస్ట్ వైట్ ల్యాండ్ టౌన్ షిప్ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ వైస్-ఛైర్ మిస్టర్ రాజేష్ కుంభార్దరే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి వలంటీర్లను సత్కరించారు.తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తదితరులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ను అభినందించారు. ఈవెంట్ కోఆర్డినేటర్లు సురేష్ యలమంచిలి, కృష్ణ నందమూరితోపాటు మిడ్ అట్లాంటిక్ టీమ్ నాయకులు, వలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన క్రాస్ రోడ్స్, గోల్డెన్ స్పాన్సర్స్ గా ఉన్న శ్రీధర్ అంచూరి మరియు సురేష్ బందుగులకు, కమలం ది డెకర్ కంపనీకి, అతిథులకు, వలంటీర్లకు కమ్యూనిటీ నాయకులకు, ఈ వేడుకకు సహకరించిన అందరికీ తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.తానా మిడ్ అట్లాంటిక్ టీమ్`సరోజ పావులూరి, దీప్తి కోక, మనీషామేక, శైలజ కస్తూరి, సునీత వాగ్వాల, మైత్రి నూకల, బిందు ఆలపాటి, రమ్య మాలెంపాటి, ఇందు సందడి, రాణి తుమ్మల, భవానీ క్రొత్తపల్లి, అనుపమ యలమంచి, భవానీమామిడి, నీలిమ వోలేటి, రవీన తుమ్మల, శ్రావణి రాయలతోపాటు, విశ్వనాథ్ కోగంటి, శ్రీధర్ సాధినేని, శ్రీకాంత్ గూడురు, గోపి వాగ్వాల, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, వెంకట్ ముప్పా, రమేష్ గుట్ట, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి, ప్రసాద్ కస్తూరి, రంజిత్ కోమటి, రంజిత్ మామిడి, మూర్తి నూతనపాటి, చందు భాతుస్కర్, సంతోష్ రౌతు, సత్య పొన్నగంటి, రాజు గుండాల, రాధాకృష్ణ మూల్పూరి, నాయుడమ్మ యలవర్తి, చలం పావులూరి, మోహన్ మల్ల ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు.
భార్యను, బంధువులను కాల్చి చంపాడు!
న్యూయార్క్: అమెరికాలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ భారత సంతతి వ్యక్తి క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. భార్య, ఆమె తరఫు ముగ్గురు బంధువులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్లముందే జరిగిన దారుణం చూసి బెంబేలెత్తిపోయిన అతని 12 ఏళ్ల కొడుకు, బంధువుల తాలూకు మరో ఇద్దరు పిల్లలు వెంటనే ఓ గదిలోకి దూరి గడియ పెట్టుకుని బతికిపోయారు. కొడుకు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే పారిపోయిన నిందితున్ని కొద్ది దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం అందరినీ కలచివేస్తోంది. నిందితున్ని విజయ్కుమార్ (51)గా, మృతులను అతని భార్య మీమూ డోగ్రా (43), మిగతా వారిని గౌరవ్ కుమార్ (33), నిధీ చందర్ (37), హరీశ్ చందర్ (38)గా గుర్తించారు. ఇది మాటలకందని ఘోరమని అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది. బాధిత కుటుంబానికి అన్నివిధాల సాయమూ అందిస్తున్నట్టు పేర్కొంది. గదిలో దాక్కున్న పిల్లలు విజయ్కుమార్ దంపతులు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నివసిస్తుండేవారు. శుక్రవారం అర్ధరాత్రి ఏదో విషయమై ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఘర్షణ నడుమే కొడుకుతో కలిసి శివారు నగరమైన లారెన్స్విలేలోని బ్రూక్స్ ఐవీ కోర్ట్లో ఉంటున్న డోగ్రా తాలూకు బంధువులు గౌరవ్, నిధి, హరీశ్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఘర్షణ శ్రుతిమించి కాల్పులకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవకు దారితీసిన కారణమేమిటో తెలియాల్సి ఉందని చెప్పారు. ‘‘విజయ్ దంపతుల 12 ఏళ్ల కొడుకు తెల్లవారుజాము 2:30 ప్రాంతంలో మాకు కాల్ చేసి దారుణం గురించి చెప్పాడు. రాపిడ్ రెస్పాన్స్ బృందం నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది. నలుగురు వ్యక్తు లు ఇంట్లో తూటా గాయాలతో పడిపోయి కన్పించారు. ముగ్గురు పిల్లలు సకాలంలో స్పందించి పక్క గదిలోకి పరుగెత్తి దాక్కోవడంతో దాడి నుంచి బయ ట పడ్డట్టున్నారు’’అని పోలీసులు వివరించారు.
TPAD అధ్యక్షురాలిగా వరుసగా మూడోసారీ మహిళకే పట్టం
డల్లాస్, టెక్సాస్లో శక్తివంతమైన, ప్రభావవంతమైన తెలుగు సంస్థగా అక్కడి తెలుగు ప్రజల మన్ననలు పొందుతున్న “డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (TPAD)”.. 2026 సంవత్సరానికి గాను తన నూతన కార్యవర్గ బృందానికి బాధ్యతలు అప్పగించింది. గత 12 ఏళ్లలో టీప్యాడ్, డల్లాస్లోని తెలుగు సమాజంలో స్వచ్ఛంద సేవకులు, కమ్యూనిటీ సభ్యులను విస్తృతంగా ఆకర్షిస్తూ అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. బలమైన సంస్థాగత నిర్మాణం ద్వారా అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దింది.సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణతో పాటు మంచి నాయకులను తీర్చిదిద్దడంలో అద్భుతమైన చరిత్ర కలిగిన టీప్యాడ్, ఫ్రిస్కో, టెక్సాస్లోని ఎలిగెన్స్ బాల్రూమ్లో స్థానిక కమ్యూనిటీ నాయకులు, మద్దతుదారుల సమక్షంలో తన 13 వ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో ప్రమాణస్వీకారం చేయించింది. టీప్యాడ్ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహిళలే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. మహిళా సాధికారతకు, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి టీప్యాడ్ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం.టీప్యాడ్ చరిత్ర, నేపథ్యంపై విస్తృత అవగాహన కలిగిన వీణా యలమంచిలి కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించారు. సీనియర్ టీప్యాడ్ నాయకులు మరియు ఫౌండేషన్ కమిటీ సభ్యుడు రావు కల్వాల — రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్)లతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీప్యాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు సుధాకర్ కలసాని — కార్యవర్గ సభ్యులు మరియు పదాధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు.కొత్త కమిటీ సభ్యులు లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), శ్రీనివాస్ అన్నమనేని (ఉపాధ్యక్షుడు), గాయత్రి గిరి (కార్యదర్శి), శివ కొడిత్యాల (సహ కార్యదర్శి), ఆదిత్య రెడ్డి (ఖజాంచీ), దీపిక దీపికా రెడ్డి (సహ ఖజాంచీ) .నూతన ఈసీ సభ్యులు:బాల గణపవరపు, మాధవి ఓంకార్, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, తిలక్ కుమార్ వన్నంపుల.రవికాంత్ మామిడి, అశోక్ పొద్దుటూరి, రోజా అడెపు, మాధవి సుంకిరెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండాల, పాండురంగ రెడ్డి పల్వాయి, బుచ్చి రెడ్డి గోలితో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రవికాంత్ మామిడి (BOT ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్)లకు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకార అనంతరం మాట్లాడిన FC ఛైర్ రఘువీర్ బండారు, BOT ఛైర్ రవికాంత్ మామిడి, అధ్యక్షురాలు లక్ష్మి పోరెడ్డి, కోఆర్డినేటర్ లింగా రెడ్డి ఆల్వా, BOT వైస్ ఛైర్ రోజా అడెపు-రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక వేడుకల నిర్వహణ, బతుకమ్మ, దసరా సంబరాలను డీఎఫ్డబ్ల్యూ తెలుగు సమాజం ఆశించే స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు నూతన బృందం కట్టుబడి ఉందని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా టీప్యాడ్కు నిరంతర మద్దతు అందిస్తున్న సపోర్టర్లు, స్పాన్సర్లకు టీప్యాడ్ నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.టీప్యాడ్ 2026 కార్యవర్గం:ఎగ్జిక్యూటివ్ కమిటీ:లక్ష్మి పోరెడ్డి (President), అనురాధ మేకల (Past President), శ్రీనివాస్ అన్నమనేని (Vice President), గాయత్రి గిరి (Secretary), శివ కొడిత్యాల (Joint Secretary), ఆదిత్య రెడ్డి (Treasurer), దీపిక దీపికా రెడ్డి (Joint Treasurer), స్వప్న తుమ్మపాల, నిఖిల్ కందుకూరి, ప్రశాంత్ నిమ్మని, మాధవి ఓంకార్, స్నేహా రెడ్డి, సంతోష్ రెగొండ, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, తిలక్ కుమార్ వన్నంపుల, రత్న వుప్పల, బాల గణపవరపు.బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్:రవికాంత్ మామిడి (BOT ఛైర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), మాధవి సుంకిరెడ్డి, రమణ లష్కర్, పాండురంగ రెడ్డి పల్వాయి, రామ్ అన్నాడి, బుచ్చి రెడ్డి గోలి, అశోక్ కొండాల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, అశోక్ పొద్దుటూరి.ఫౌండేషన్ కమిటీ:రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్), జనకిరామ్ మండాది, ఉపేందర్ తెలుగు, రాజ్ గోంధి, మహేందర్ కమిరెడ్డి
క్రైమ్
మద్యం మత్తులో అత్తపై అల్లుడు అత్యాచారం
నాగర్కర్నూల్ జిల్లా: మద్యం మత్తులో వృద్ధురాలు అయిన అత్తను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మండలంలోని రఘుపతిపేటలో జరిగింది. కల్వకుర్తి సీఐ నాగార్జున కథనం ప్రకారం.. పసుపుల చెన్నమ్మ (65) భర్త మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు చనిపోగా మరో కుమారుడు వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న కుమార్తె రేణుక, అల్లుడు బైరంపల్లి రాఘవేందర్ ఇంట్లో చెన్నమ్మ ఉంటోంది. రాఘవేందర్ మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. రెండు రోజుల క్రితం గొడవపడి రేణుక వెల్దండ మండలంలోని తన అక్క ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి అతిగా మద్యం తాగిన రాఘవేందర్ అత్త చెన్నమ్మపై అత్యాచారం చేసి, హత్య చేశాడని సీఐ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
భర్తను బలి చేసి ప్రియుడితో జీవితం.. రోజీ దుర్మార్గపు కుట్ర
బెంగళూరు: అక్రమ సంబంధాల మోజులో పడిన భార్య.. భర్తను వదిలించుకోవాలని షాకింగ్ పథకం వేసింది. అతన్ని హంతకున్ని చేయాలని కుట్ర చేసింది. ఈ సంఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పట్టణంలో జరిగింది. భార్య కుట్ర ఫలితంగా భర్త జైలు పాలయ్యాడు. వివరాలు.. ఆనేకల్ తాలూకాలో ఆంథోనీ, రోజి భార్యాభర్తలు. రోజికి రాజేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఇది తెలిసి భర్త ఆమెను మందలించేవాడు. తమ సంతోషానికి భర్త అడ్డంకిగా ఉన్నాడు, తరచూ తాగి వచ్చి వేధిస్తున్నాడనే నెపంతో భార్య తన భర్తను పునరావాస కేంద్రంలో చేర్పించింది. 18 నెలల తర్వాత, భర్త ఆంథోనీ తిరిగి వచ్చాడు. భర్త లేని సమయంలో ఆమె ప్రియునితో సహజీవనం సాగించింది. భర్త రాగానే పథకాన్ని అమలు చేసింది. తమ బావ బాలరాజు మీద లేనిపోని మాటలు చెప్పి చంపేయాలని ప్రేరేపించింది. భార్య మాట విని ఆంథోనీ, తన అన్నయ్య బాలరాజ్ను కత్తితోపొడిచి హత్య చేశాడు. దీంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో ఆంథోనీపై కేసు నమోదైంది. అరెస్టు చేసి చెరసాలకు తరలించారు. రోజి మళ్లీ ప్రియునికి దగ్గరైంది. అయితే రోజినే అసలు నిందితురాలని తెలిసి కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
నా చావుకు భార్య, అత్తామామలే కారణం
హైదరాబాద్: తన చావుకు భార్య, అత్తా, మామలే కారణమంటూ ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లేక్పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేకరు.. మార్కాపురానికి చెందిన సీతారాంరెడ్డి (36), రేణుక దంపతులు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. గతంలో భార్య రేణుక ఇన్స్ట్రాగాంలో పరిచయమైన వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొద్దిరోజుల తరువాత వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంటోంది. అయితే గత జనవరి నెల 24 న మళ్లీ అదృశ్యమైంది.భార్య కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు బాచుపల్లికి వచ్చి ఇక్కడికే ఉంటున్నారు. అత్తామామలు ఆదివారం పిల్లలను తీసుకుని సొంత ఊరు నంద్యాలకు వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాంరెడ్డి ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర్లో దూకాడు. సోమవారం ఉదయం నుంచి హైడ్రా, లేక్ పోలీసులు గాలించగా సాయంత్రం మృతదేహం బయటపడింది. తన తన చావుకు భార్య, అత్తా, మామలతో పాటు రమణారెడ్డి అనే వ్యక్తి కారణం అని ఫోన్లో స్టేటస్ పెట్టుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.చదవండి: వాడ్ని ఊరికే వదిలిపెట్టకండి
తరగతి గదిలో కాల్పుల కలకలం
చంఢీగడ్: లా కాలేజీ తరగదిలో కాల్పులు కలకలం చోటు చేసుకున్నాయి. న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని తోటి విద్యార్థి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. తరగతి గదికి గన్తో వచ్చిన ఓ విద్యార్థి.. తోటి విద్యార్థినిపై కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం, తనని తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన పంజాబ్లో తరన్ తారన్ జిల్లాలో చోటు చేసుకుందిపోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటన పంజాబ్ ఉస్మాలోని మై భాగో లా కాలేజీలో జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని మల్లియన్ గ్రామానికి చెందిన ప్రిన్స్ రాజ్గా, మరణించిన విద్యార్థినిని నౌషెహ్రా పన్నువాన్కు చెందిన సందీప్ కౌర్గా గుర్తించారు. కౌర్ అక్కడికక్కడే మరణించగా, ప్రిన్స్ రాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియోలో ప్రిన్స్ రాజ్ కాలేజీ బ్యాగ్తో తరగతి గదిలోకి ప్రవేశించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో సందీప్ కౌర్ తన స్నేహితురాలితో మాట్లాడుతుండగా, ప్రిన్స్ రాజ్ వారిద్దరి దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. కొద్దిసేపటికి ముగ్గురూ వెనుక సీట్లలో కూర్చున్నారు. అయితే కొన్ని క్షణాల తర్వాత ప్రిన్స్ రాజ్ అకస్మాత్తుగా లేచి, బ్యాగ్లోని తుపాకీని బయటకు తీసి, సందీప్ కౌర్పై నేరుగా కాల్పులు జరిపాడు. కౌర్ నేలపై కుప్పకూలగా, మరో క్లాస్మేట్ షాక్తో వెనక్కి తగ్గింది. వెంటనే ప్రిన్స్ రాజ్ తనపై తానే కాల్పులు జరిపి నేలకొరిగాడు.కాల్పులు జరిగిన వెంటనే తరగతి గదిలోని విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. తరగతులు ప్రారంభం కానున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత కలకలం రేపింది. సందీప్ కౌర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విద్యార్థిని సందీప్ కౌర్ తల్లి కాల్పుల ఘటనపై స్పందించారు. ప్రిన్స్ రాజ్ తుపాకీతో కళాశాలలోకి ఎలా ప్రవేశించాడని ప్రశ్నించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. 🚨 First-year law college student allegedly shot a fellow student inside a classroom in Punjab’s Tarn Taran district Accused identified as Prince Raj opened fire on Sandeep Kaur, he died on the spot. Prince later shot himself with the same weapon and was taken to hospital in… pic.twitter.com/sDghCJiYr0— Nabila Jamal (@nabilajamal_) February 9, 2026
వీడియోలు
DGP ఆఫీస్ రౌండప్ 200 మందితో బీజేపీ ముట్టడి
లోక్ సభలో యుద్ధం మొదలు 100 ఎంపీలతో కాంగ్రెస్ సిద్ధం
చంద్రబాబు పాలన సక్కగ లేదంటున్న టీడీపీ ఎమ్మెల్యే
ఈ అన్న మనసు బంగారం
గొప్ప మనసు చాటుకున్న పోలీస్
రోడ్డుపై స్నాక్స్ తింటున్నారా? జాగ్రత్త..మొత్తం కల్తీ నూనెలే..!
భూ కబ్జాకోరుగా మారిన జనసేన ఎమ్మెల్యే తిరగబడుతున్న ప్రజలు
Attapur: సర్వీస్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం.. 3 కార్లు బూడిద
మీ కక్ష రాజకీయాలతో.. సొంత కంపెనీలోనే ఇంత కల్తీ చేశాడు ..
డబ్బులు పంచుతూ పట్టుబడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే..!

