అంబటిపై కక్ష సాధింపు.. 52 కేసులు, పిటీ వారెంట్లు..
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అంబటిపై నమోదు చేసిన మరో అక్రమ కేసులో భాగంగా పట్టాభిపురం పోలీసులు.. ఆయనను నేడు గుంటూరు కోర్టులో హాజరుపర్చనున్నారు. మరోవైపు.. అంబటి ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఏడాది నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి నిరసిస్తూ అంబటి రాంబాబు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీని అడ్డుకుని అంబటి రాంబాబుపై దౌర్జన్యానికి దిగారు. దీంతో, తమ విధులకు అంబటి ఆటంకం కలిగించారని రాంబాబుపై అక్రమంగా కేసు నమోదు చేశారు. రాంబాబుపై నమోదైన కేసులో పిటీ వారెంట్ ద్వారా పట్టాభిపురం పోలీసులు నేడు గుంటూరు కోర్టులో అంబటిని హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో పట్టాభిపురం పోలీసులు రాజమండ్రి జైలు నుంచి అంబటిని తీసుకొని గుంటూరు బయలుదేరారు.ఇక, ఇప్పటికే రాజమండ్రి, అనపర్తి, చిత్తూరు, బాపట్లతో సహ రాష్ట్రంలో పలుచోట్ల అంబటిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 52 కేసులు నమోదయ్యాయి. మరో మూడు పిటీ వారంట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటికి ప్రత్యేక సదుపాయాలు సైతం ప్రభుత్వం కల్పించకపోవడం గమనార్హం. అంబటితో పాటు అదే బ్యారక్లో మరో ముగ్గురు ఖైదీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అంబటి భద్రతపై అడ్వకేట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, అంబటి రాంబాబు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయనపై నమోదైన మరికొన్ని కేసుల్లో పిటీ వారెంట్లు వేయటానికి పోలీసులు రెడీ అవుతున్నారని సమాచారం. మరోవైపు.. అంబటి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు కావాలనే అంబటిని మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నారని మండిపడుతున్నారు. ప్లాన్ ప్రకారమే కక్షగట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే పోలీసులు నడుస్తున్నారని ఆరోపించారు.
కర్ణాటక రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కర్ణాటకలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద ఈ ప్రమాదం జరగ్గా.. ఏపీకి చెందిన నలుగురు కూలీలు మరణించడం విషాదకరమని వైయస్ జగన్ అన్నారు. మృతులంతా అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందినవారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు కూడా. మృతుల కుటుంబాలకు జగన్.. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ట్రంప్నకు భారీ విజయం.. వలసదారులకు ఎదురుదెబ్బ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అప్పీల్స్ కోర్టు భారీ ఊరట దక్కింది. వలసదారులను నిర్బంధించే విషయంలో ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని అప్పీల్స్ కోర్టు సమర్థించింది. దీంతో, కోర్టులో భారీ విజయం దక్కింది. ఈ మేరకు ధర్మాసనం తరఫున 2-1 మెజారిటీతో జడ్జి ఎడిత్ హెచ్ జోన్స్ తీర్పు రాశారు.కాగా, అమెరికాలో ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వలసదారులను అరెస్టు చేసినప్పుడు హోంలాండ్ భద్రతాధికారులు బాండ్ హియరింగ్ను నిరాకరిస్తున్నారు. బాండ్ హియరింగ్కు అనుమతి ఇవ్వకుండానే వలసదారులను నిర్భందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వలసదారుల నిర్భందాలపై పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఐదో సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు.. ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని సమర్థించింది. ధర్మాసనం తరఫున 2-1 మెజారిటీతో జడ్జి ఎడిత్ హెచ్ జోన్స్ తీర్పు రాశారు. ఈ సందర్భంగా.. బాండ్ హియరింగ్ నిర్భందాలకు అనేక కోర్టులు వ్యతిరేకంగా తీర్పులిస్తున్నాయి. కానీ ఇది రాజ్యాంగం, ఫెడరల్ వలస చట్టాలకు అనుగుణంగానే ఉంది. వలస, జాతీయ చట్టాలకు ప్రభుత్వం సరిగానే అర్థం చెప్పిందని అభిప్రాయపడ్డారు. అనుమతిలేని విదేశీయులు దేశంలో ఎక్కడ పట్టుబడినా బాండ్పై విడుదలకు అనర్హులని స్పష్టం చేశారు. వారు ఎంతకాలం దేశంలో ఉన్నారన్నదీ అప్రస్తుతమని పేర్కొన్నారు.అయితే, గతంలో విదేశీయులు సరిహద్దుల్లో అరెస్టయితే.. వారికి ఎటువంటి నేర చరిత్రా లేకపోతే వలసదారుల కోర్టులో బాండ్ హియరింగ్ను కోరేవారు. కోర్టులూ వారికి బాండ్లను మంజూరు చేసేవి. కానీ, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసదారులపై ఉక్కుపాదం మోపారు. అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేశారు.ఈ నేపథ్యంలో మెక్సికోకు చెందిన ఇద్దరు వలసదారులు అమెరికాలో పదేళ్లుగా ఉంటున్నారు. గత ఏడాది వారు తమను నెలలపాటు నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు వేశారు. వారికి గత అక్టోబరులో టెక్సాస్ కోర్టు బాండ్లు మంజూరు చేసింది. గత జులైలో ట్రంప్ యంత్రాంగం బాండ్ల విధానాన్ని తిరగదోడింది. తాజాగా అప్పీల్స్ కోర్టు ఆ విధానాన్ని సమర్థించింది. కాగా, ఇలాంటి నిర్బంధాలను ఇటీవల దిగువ కోర్టులు తప్పుబడుతున్న నేపథ్యంలో ఈ తీర్పు ట్రంప్నకు భారీ న్యాయ విజయంగా చెప్పవచ్చు.
అజిత్ను కలిసేందుకు క్యూ కడుతున్న సెలబ్రిటీలు
హీరో అజిత్.. వివాదాలకు చోటు ఇవ్వని అరుదైన నటుడు. అందుకే ఆయనంటే తోటి నటీనటులందరికీ ఇష్టం. ఇకపోతే అభిమానం పేరుతో వెర్రితలలు వేయకుండా కుటుంబం కోసం శ్రమించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభిమానులకు పదేపదే హితవు చెబుతుంటారు. కాగా ఈయన ఇటీవల నటనతో పాటూ కార్ రేస్ పోటీలపైనా అధిక మక్కువ చూపుతున్న విషయం తెలిసిందే. అజిత్ అంతర్జాతీయ కార్ రేస్ పోటీల్లో పాల్గొంటూ పథకాలను గెలుస్తున్నారు. అలా దుబాయ్, బెల్జియం మొదలగు పలు దేశాల్లో జరిగిన అంతర్జాతీయ కార్ రేస్ పోటీల్లో పాల్గొన్నారు. కాగా ప్రస్తుతం దుబాయిలోని అబిదబిలో జరగనున్న కార్రేస్ పోటీల్లో పాల్గొనడానికి సిద్దం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ను అబిదబిలో కలవడానికి మన సినీ స్టార్స్ క్యూ కడుతున్నారు. ఇప్పటికే నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్, జీవి.ప్రకాశ్కుమార్, దర్శకుడు వెంకట్ప్రభు, మాదవన్, నటి నయనతార, శ్రీలీల వంటి పలువురు అజిత్ను కలిసి తమ అనందాన్ని వ్యక్తం చేయడంతో పాటూ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా నటుడు శివకార్తీకేయన్ ప్రత్యేకంగా దుబాయ్కి వెళ్లి అజిత్ను కలిశారు. అక్కడ వారు దిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆ చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలోనే మరో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు.ఈ చిత్రం త్కరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈచిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.
'మీనా' నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు
సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్
కారును ఢీకొని.. హెల్మెట్తో దాడి..
ప్రియురాలి మోసం.. బాడీబిల్డర్ ఆత్మహత్య
జగిత్యాల జిల్లాలో కరపత్రాల కలకలం
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
‘మైనస్’కూ పీజీ సీటా?.. కడిగిపారేస్తున్న వైద్య నిపుణులు!
నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా?
IND vs PAK: పాపం బంగ్లాదేశ్!.. బుద్ధి చూపించిన పాకిస్తాన్!
వైభవ్ సూర్యవంశీ అరెస్ట్కు డిమాండ్
ఈ రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.. ధనలబ్ధి పొందుతారు
అర్జున్ రెడ్డిని గుర్తు చేసేలా కొత్త సినిమా ట్రైలర్..
కరుగుతున్న వెండి.. బంగారం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇలా వారానికొకసారి కనిపించి వెళ్లు!
నా మూవీ చూడరేమో అని భయపడ్డా.. ఏడ్చేసిన చంద్రహాస్
శంషాబాద్కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్!
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది
భయంకరమైన భవిష్యత్తు! రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా?
కియోసాకీకి కోపమొచ్చింది!
ఇక ఆర్ఆర్ఆర్ 161 ఏఏ
చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్
చాలామంది మోసం చేశారు.. నా బుర్రకే ఎక్కలేదు: అర్జున్
అమ్మా.. ఎందుకిలా చేశావ్?
IND vs PAK: పాకిస్తాన్ యూటర్న్?
ఓటీటీలో 'రాజాసాబ్'.. మారుతిపై దారుణమైన ట్రోలింగ్
టామ్ & జెర్రీ
క్రికెట్ అభిమానులకు శుభవార్త
తమన్నాతో పోలిక.. అస్సలు నచ్చట్లేదు: 'ధురంధర్' బ్యూటీ
'మీనా' నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు
సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్
కారును ఢీకొని.. హెల్మెట్తో దాడి..
ప్రియురాలి మోసం.. బాడీబిల్డర్ ఆత్మహత్య
జగిత్యాల జిల్లాలో కరపత్రాల కలకలం
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
‘మైనస్’కూ పీజీ సీటా?.. కడిగిపారేస్తున్న వైద్య నిపుణులు!
నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా?
IND vs PAK: పాపం బంగ్లాదేశ్!.. బుద్ధి చూపించిన పాకిస్తాన్!
వైభవ్ సూర్యవంశీ అరెస్ట్కు డిమాండ్
ఈ రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.. ధనలబ్ధి పొందుతారు
అర్జున్ రెడ్డిని గుర్తు చేసేలా కొత్త సినిమా ట్రైలర్..
కరుగుతున్న వెండి.. బంగారం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇలా వారానికొకసారి కనిపించి వెళ్లు!
నా మూవీ చూడరేమో అని భయపడ్డా.. ఏడ్చేసిన చంద్రహాస్
శంషాబాద్కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్!
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది
భయంకరమైన భవిష్యత్తు! రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా?
కియోసాకీకి కోపమొచ్చింది!
ఇక ఆర్ఆర్ఆర్ 161 ఏఏ
చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్
చాలామంది మోసం చేశారు.. నా బుర్రకే ఎక్కలేదు: అర్జున్
అమ్మా.. ఎందుకిలా చేశావ్?
IND vs PAK: పాకిస్తాన్ యూటర్న్?
ఓటీటీలో 'రాజాసాబ్'.. మారుతిపై దారుణమైన ట్రోలింగ్
టామ్ & జెర్రీ
క్రికెట్ అభిమానులకు శుభవార్త
తమన్నాతో పోలిక.. అస్సలు నచ్చట్లేదు: 'ధురంధర్' బ్యూటీ
ఫొటోలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల, థమన్, తేజ సజ్జా (ఫోటోలు)
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. జననేతకు ఆత్మీయ పలకరింపులు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
ఫ్రెండ్ బర్త్ వేడుకల్లో మన్మధుడు హీరోయిన్ అన్షు.. (ఫొటోలు)
సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
'అమరావతికి ఆహ్వానం' హారర్ థ్రిల్లర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
సినిమా
హైదరాబాద్లో సమావేశమైన 'అల్లు అర్జున్' ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్లో సమావేశం అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్ , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు స్టేట్ లెవల్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్, టౌన్ లెవల్ కమిటీల ఏర్పాటుపై తాజాగా చర్చించారు. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు ఉండాలని వారు సూచించారు.టాలీవుడ్లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారందరికీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ అసోసియేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా సొంతంగా తన అభిమానుల సైన్యాన్ని రెడీ చేసుకోనున్నాడు. పుష్ప2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తనకు అండగా ఫ్యాన్స్ లేరనే చెప్పాలి. ఆ సమయంలో తను చెప్పాలనుకున్న విషయాలను ప్రజలకు చేరవేయడంలో విఫలమయ్యాడు. బన్నీ తరుపున ప్రజలకు చెప్పాల్సిన విషయాన్ని సమర్థవంతంగా రీచ్ చేసేవారు లేరు. అందుకే ఫ్యాన్స్ కొరతను ఆయన గ్రహించారని తెలుస్తోంది.
Prabhas Kalki 2 Update: కమల్.. అమితాబ్ రెడీ.. మరి ప్రభాస్?
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు పెంచుకున్న కల్కి సినిమా మొదటి భాగం సూపర్ హిట్ అయింది. దాంతో త్వరలో రానున్న రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ముగింపు దగ్గర మైథలాజికల్ టచ్ ఇవ్వడంతో కర్ణుడు, అర్జునుడు ఎంట్రీ ఇచ్చారు. దీంతో కల్కి 2లో కథ ఎలా మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ పెరిగింది. ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', హనుతో 'ఫౌజీ' సినిమాల పనిలో బిజీగా ఉన్నారు. ఫౌజీ చిత్రం ఈ ఏడాది దసరాకు, స్పిరిట్ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలకు రెడీ అవుతున్నాయి. కల్కి 2కు ప్రభాస్ డేట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఆయన పాత్రకు సంబంధించిన షూట్ జరుగుతుంది. దాంతో ప్రభాస్ లేని కాంబినేషన్ సీన్లను ముందుగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తమ డేట్స్ను కేటాయించారు. దీంతో కల్కి 2 షూటింగ్ వర్క్ త్వరలోనే మొదలుకానుంది. హీరో ప్రభాస్ షెడ్యూల్స్, ఇతర ప్రాజెక్టుల విడుదలల మధ్య గ్యాప్ను కూడా దృష్టిలో పెట్టుకుని కల్కి 2 విడుదల 2027 దసరా సమయంలో జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విశ్వక్ సేన్కు భవిష్యత్ ఉంది.. గొడవకు 'అర్జున్' ఫుల్స్టాప్
ప్రముఖ నటుడు అర్జున్ చాలా ఏళ్ల తర్వాత దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా 'సీతాపయనం'.. ఇదే మూవీతో తన కూతురు ఐశ్వర్య తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో నిరంజన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ను మొదట విశ్వక్ సేన్ హీరోగా ప్రకటించారు. కానీ, పలు విభేదాల కారణంగా అతను వాకౌట్ చేశాడు. అయితే, యాదృచ్చికంగా, విశ్వక్ చిత్రం ఫంకీతో పాటు 'సీతాపయనం' కూడా వాలెంటైన్స్ డే స్పెషల్గా విడుదలవుతోంది. తాజాగా తమ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో విశ్వక్ సేన్ గురించి అర్జున్ పలు వ్యాఖ్యలు చేశారు.గతంలో విశ్వక్తో జరిగిన వివాదాన్ని గుర్తు చేస్తూ అడిగిన ప్రశ్నకు అర్జున్ ఇలా సమాధానం ఇచ్చారు. మా సినిమా సీతాపయనంతో పాటు విశ్వక్ సేన్ మూవీ ఫంకీ కూడా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అతనొక యువకుడు.. తనకు చాలా భవిష్యత్ ఉంది. ఏదో మనకు కుదరలేదని అతనిపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. వారి అమ్మగారి చేతి భోజనం తిన్నాను. వాళ్లు బాగుండాలని కోరుకుంటాను. కాలంతో పాటు కొన్ని మరిచిపోతూ సంతోషంగా ముందుకు సాగాలి. మా రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను అని అర్జున్ అన్నారు.విశ్వక్పై అర్జున్ చేసిన వ్యాఖ్యలకు ఫ్యాన్స్ నుంచి అభినందనలు వస్తున్నాయి. పెద్దరికం ఎలా ఉంటుందో చూపించావ్ అంటూ అర్జున్ను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. అర్జున్ కూతురు హీరోయిన్గా విశ్వక్ సేన్తో ఒక సినిమాను ప్రకటించారు. అయితే, షూటింగ్ కొంత జరిగిన తర్వాత పలు కారణాలతో విశ్వక్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో అర్జున్, విశ్వక్ మధ్య మాటల గొడవ జరిగిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Crazziee Stuff (@crazziee_stuff)
వెయిట్ చేస్తా!.. ఆకట్టుకునేలా గ్లింప్స్
‘ఎనిమిది కోట్లు కట్నం ఇస్తే ఎన్ని కాలాలు అయినా వెయిట్ చేస్తా’ అనే డైలాగ్తో నరేష్ స్వభావం ఏంటో అర్థమైపోతుంది. ఇంతకీ ఎవరీ నరేష్ అంటే... ‘వాట్స్ అప్ నరేష్’ చిత్రంలో హీరో అన్వేష్ మైఖేల్ చేసిన పాత్ర పేరు ఇది. ఈ చిత్రం గ్లింప్స్లో పై సంభాషణతోపాటు బ్యాక్గ్రౌండ్లో ‘లోకం తీరింతే... నువ్వే మారాలంతే’ అనే లిరిక్స్ వినిపిస్తాయి.‘కొత్తపోరడు’ తర్వాత అన్వేష్ మైఖేల్ హీరోగా, ‘బలగం’ ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం ‘వాట్స్ అప్ నరేష్’. సీవీ విశాల్ దర్శకత్వంలో భాగ్యలక్ష్మీ చింతా నిర్మించారు. ‘‘సాఫ్ట్వేర్ లైఫ్, ప్రేమ, ఫ్యామిలీ... ఇలా అన్ని అంశాలను జోడించి ఈ సినిమా రూపొందించాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు.
క్రీడలు
ఇలవేనిల్–అర్జున్ జోడీకి స్వర్ణ పతకం
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇలవేనిల్ వలారివన్–అర్జున్ బబూతా ద్వయం భారత్కు పసిడి పతకాన్ని అందించింది. నాలుగు జోడీల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇలవేనిల్–అర్జున్ జోడీ 505 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. 10 మీటర్ల జూనియర్ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో హిమాన్షు–శాంభవి ద్వయం 502.4 పాయింట్లు స్కోరు చేసి భారత్ ఖాతాలో పసిడి పతకాన్ని చేర్చింది. ముకేశ్కు రజతం, తనిష్క్ కు కాంస్యం 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ సీనియర్ పురుషుల ఈవెంట్లో భారత షూటర్లు గుర్ప్రీత్ (575 పాయింట్లు), హర్‡్ష (571), అమన్ ప్రీత్ (569) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ జూనియర్ పురుషుల ఈవెంట్లోనూ భారత షూటర్లు క్లీన్స్వీప్తో అదరగొట్టారు. సూరజ్ శర్మ (576 పాయింట్లు)స్వర్ణం నెగ్గగా... ఆంధ్రప్రదేశ్కు చెందిన ముకేశ్ నేలవల్లి (559) రజతం... తెలంగాణకు చెందిన కొడవలి తనిష్క్ మురళీధర్ నాయుడు (557) కాంస్య పతకం సాధించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో కలిపి ఇప్పటి వరకు భారత షూటర్లు 30 స్వర్ణాలు, 12 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 50 పతకాలు గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
దక్షిణేశ్వర్ ధమాకా
బెంగళూరు: దేశం కోసం ఆడే సమయంలో భారత టెన్నిస్ ఆటగాళ్ల ర్యాంక్లను పట్టించుకోవద్దని మరోసారి నిరూపితమైంది. దక్షిణేశ్వర్ సురేశ్... ప్రపంచ సింగిల్స్లో 465వ ర్యాంక్... భారత్లో నాలుగో ర్యాంక్... ప్రపంచ డబుల్స్లో 457వ ర్యాంక్... అయినా సొంతగడ్డపై ఈ ఆజానుబాహుడు అద్భుత ఆటతీరు ప్రదర్శించాడు.నెదర్లాండ్స్ లాంటి పటిష్ట జట్టుతో జరిగిన వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్లో అన్నీతానై ఈ తమిళనాడు ప్లేయర్ భారత్కు 3–2తో సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. ఫలితంగా డేవిస్కప్ పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో టీమిండియా వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్ రెండో రౌండ్కు అర్హత సాధించింది. 2004లో జపాన్ జట్టుపై లియాండర్ పేస్ తర్వాత భారత్ నుంచి ఒక ప్లేయర్ రెండు సింగిల్స్లో, ఒక డబుల్స్లో ఆడి గెలవడం ఇదే ప్రథమం. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 78 కేజీల బరువున్న దక్షిణేశ్వర్ ఆదివారం ముందుగా డబుల్స్ మ్యాచ్లో భారత డబుల్స్ నంబర్వన్, ప్రపంచ 20వ ర్యాంకర్ యూకీ బాంబ్రీతో జతకట్టి బరిలోకి దిగాడు. 3 గంటలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో దక్షిణేశ్వర్–యూకీ ద్వయం 7–6 (7/0), 3–6, 7–6 (7/1)తో సాండెర్ అరెండ్స్–డేవిడ్ పెల్ జోడీని ఓడించింది. దాంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం రివర్స్ సింగిల్స్ తొలి మ్యాచ్లో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ 7–5, 1–6, 4–6తో ప్రపంచ 73వ ర్యాంకర్ జెస్పెర్ డి జాంగ్ చేతిలో ఓడిపోయాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్గా జరిగిన రివర్స్ సింగిల్స్ రెండో మ్యాచ్లో దక్షిణేశ్వర్ బరిలోకి దిగాడు. సాధికారిక ఆటతీరును ప్రదర్శించి 99 నిమిషాల్లో 6–4, 7–6 (7/4)తో ప్రపంచ 160వ ర్యాంకర్ గయ్ డెన్ ఉడెన్ను ఓడించి భారత్కు 3–2తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఉత్తరాఖండ్ సంచలనం
జంషెడ్పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ఉత్తరాఖండ్ జట్టు సంచలనం సృష్టించింది. ఈ మెగా టోర్నీ చరిత్రలో తొలిసారి ఉత్తరాఖండ్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. జార్ఖండ్ జట్టుతో ఇక్కడి కీనన్ స్టేడియంలో ఆదివారం ముగిసిన క్వార్టర్ ఫైనల్లో ఉత్తరాఖండ్ జట్టు ఇన్నింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం నమోదు చేసుకుంది. 136 పరుగుల తేడాతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జార్ఖండ్ జట్టు ఒకదశలో 100/2తో పటిష్టంగానే కనిపించింది. అయితే ఉత్తరాఖండ్ వెటరన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మయాంక్ మిశ్రా మాయాజాలానికి... అభయ్ నేగి పేస్ ధాటికి జార్ఖండ్ జట్టు చివరి 8 వికెట్లను 30 పరుగుల తేడాలో కోల్పోయింది. చివరకు 130 పరుగులకే ఆలౌటై ఇన్నింగ్స్ ఓటమిని చవిచూసింది. జార్ఖండ్ కెప్టెన్ విరాట్ సింగ్ (55; 6 ఫోర్లు, 1 సిక్స్), కుమార్ కుశాగ్ర (34; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. మయాంక్ మిశ్రా 22 పరుగులిచ్చి 5 వికెట్లు, అభయ్ నేగి 36 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ఉత్తరాఖండ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అంతకుముందు మూడో రోజు ఓవర్నైట్ స్కోరు 282/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఉత్తరాఖండ్ జట్టు 122.3 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటై 136 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కెపె్టన్ కునాల్ చండేలా (68; 8 ఫోర్లు), జగదీశ సుచిత్ (70; 6 ఫోర్లు), అభయ్ నేగి (46; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులకు ఆలౌటైంది. తొలిసారి రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ చేరిన ఉత్తరాఖండ్ జట్టుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అభినందనలు తెలిపారు. కర్ణాటక లక్ష్యం 325 ముంబై జట్టుతో ముంబైలో జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక జట్టు విజయానికి 212 పరుగుల దూరంలో నిలిచింది. ముంబై నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక... మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60 బ్యాటింగ్; 7 ఫోర్లు), కరుణ్ నాయర్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మయాంక్ అగర్వాల్ (3), కెప్టెన్ దేవదత్ పడిక్కల్ (39; 5 ఫోర్లు, 1 సిక్స్) పెవిలియన్ చేరుకున్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 189/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై జట్టు 98.3 ఓవర్లలో 377 పరుగులకు ఆలౌటైంది. తనుశ్ కొటియాన్ (48 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), తుషార్ దేశ్పాండే (47; 7 ఫోర్లు, 2 సిక్స్లు) తొమ్మిదో వికెట్కు 89 పరుగులు జోడించారు. వీరిద్దరి బ్యాటింగ్ కారణంగా ముంబై జట్టు కర్ణాటకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కష్టాల్లో మధ్యప్రదేశ్ జమ్మూ కశ్మీర్ జట్టుతో ఇండోర్లో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ కష్టాల్లో పడింది. 291 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 204 పరుగులు చేయాలి. ప్రస్తుతం శుభం శర్మ (11 బ్యాటింగ్), వెంకటేశ్ అయ్యర్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జమ్మూకశ్మీర్ బౌలర్లలో ఆఖిబ్ నబీ 3 వికెట్లు, ఆబిద్ ముస్తాక్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 84/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశ్మీర్ జట్టు 70.3 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.
సర్వీసెస్ సూపర్...
గువాహటి: జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీలో సర్వీసెస్ జట్టు చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సర్వీసెస్ 1–0 గోల్స్ తేడాతో కేరళపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. సంతోష్ ట్రోఫీలో సర్వీసెస్ జట్టు విజేతగా నిలవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. సర్వీసెస్ స్ట్రయికర్ అభిõÙక్ పవార్ (109వ నిమిషంలో) మ్యాచ్లో నమోదైన ఏకైక గోల్ చేశాడు. నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లగా... అందులో సర్వీసెస్ సత్తా చాటింది. 2012–13లోనూ ఈ రెండు జట్ల మధ్యే సంతోష్ ట్రోఫీ ఫైనల్ జరగగా... అప్పుడు కూడా సర్వీసెస్నే విజయం వరించింది. ఆ మ్యాచ్లోనూ నిర్ణీత సమయంలో గోల్స్ నమోదు కాకపోగా... పెనాల్టీ షూటౌట్లో ఫలితం తేలింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ఫైనల్లో అలాంటి ప్రదర్శనే పునరావృతం అయింది. అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణి అవలంభించాయి. కేరళ జట్టు కొన్ని ప్రయత్నాలు చేసినా... సర్వీసెస్ గోల్కీపర్ గగన్దీప్ సింగ్ వాటిని చక్కగా అడ్డుకున్నాడు. అదనపు సమయంలో అభిõÙక్ గోల్తో సర్వీసెస్ ఖాతా తెరవగా... ఆఖర్లో స్కోరు సమం చేసేందుకు కేరళ ఎంత ప్రయతి్నంచినా ఫలితం లేకపోయింది. గ్రూప్ దశలోనూ ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అభిõÙక్ ఏకైక గోల్ చేసి సర్వీసెస్ను గెలిపించగా... ఇప్పుడూ అదే సీన్ రిపీట్ చేశాడు.
న్యూస్ పాడ్కాస్ట్
అమరావతి సైతం ప్రైవేట్ పరం... అందినకాడికి బాదుడే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు
పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ... వియ్యంకుల సంస్థలకు పనుల అప్పగింత
జంగిల్రాజ్పై ప్రశ్నిస్తున్నందుకే గూండా దాడులు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు అరాచకాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
‘లిఫ్ట్’ తాకట్టుపై రాయలసీమ కన్నెర్ర... ఆపిన పనులు రెండు నెలల్లో మళ్లీ మొదలుపెట్టాలని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ... చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
రెడ్బుక్కే రాజ్యాంగం, చంద్రబాబే ‘సుప్రీం’... తిరుమల శ్రీవారి లడ్డూపై సొంత విచారణ చేపట్టాలని ఏపీ సీఏం నిర్ణయం
కొలిక్కివచ్చిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం. అమెరికా టారిఫ్లు 18 శాతానికి తగ్గింపు
దేశానికి వికసిత విజన్... 2026-27 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్లో గూండారాజ్... పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. శనివారం రాత్రి అరెస్టు
జీవీఎంసీలో రౌడీ రాజ్యం... గీతం కబ్జాకు పచ్చజెండా... కనీస చర్చ లేకుండానే భూముల క్రమబద్దీకరణకు ఆమోదం
బిజినెస్
కారు మైలేజ్ కోసం.. ముఖ్యం ఈ వేగం!
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సమయంలో.. చాలామంది కార్ల కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఎంత మైలేజ్ ఇచ్చే కారును కొనుగోలు చేసినప్పటికీ.. కొన్ని రోజుల తరువాత తగ్గిపోతుంటుంది. మైలేజ్ తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నపటికీ.. ఒక నిర్దిష్టమైన వేగం, డ్రైవింగ్ విధానం ఫాలో అయితే బెస్ట్ మైలేజ్ లభిస్తుంది.సాధారణంగా కార్లు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే స్థిరమైన వేగంలో డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కారును 50 నుంచి 80 కిమీ వేగంతో నడిపితే ఇంధనం కొంత పొదుపు అవుతుంది, తద్వారా కొంత ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ఇంజిన్ మీద ఎక్కువ ప్రభావం చూపించదు. కాబట్టి ఇంధన వృథా తగ్గుతుంది.కారును 100 కిమీ వేగంతో డ్రైవ్ చేస్తే.. ఎయిర్ డ్రాగ్ ఎక్కువ అవుతుంది. దీంతో ఇంజిన్ ఎక్కువ శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. తద్వారా.. మైలేజ్ కొంత ఎక్కువ లభిస్తుంది. అయితే చాలా నెమ్మదిగా లేదా తక్కువ గేర్లో కారును నడపడం కూడా మంచిది కాదు. అలా చేస్తే ఇంజిన్పై అదనపు ఒత్తిడి పడుతుంది.స్థిరమైన వేగం మైలేజ్కు చాలా ముఖ్యం. తరచూ స్పీడ్ పెంచడం, తగ్గించడం వంటివి ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. కాబట్టి ఒకే స్పీడ్ను కొనసాగిస్తూ డ్రైవ్ చేయడం మంచిది. ముఖ్యంగా హైవే ప్రయాణాల్లో 60-70 కిలోమీటర్ల వేగం చాలా కార్లకు ఉత్తమ మైలేజ్ ఇస్తుంది.ఎక్కువ మైలేజ్ కోసం కేవలం వేగాన్ని మాత్రమే కాకుండా.. టైర్లలో కూడా ఉండాల్సిన మోతాదులో గాలి ఉండేలా చూసుకోవాలి. కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ బరువు వేయకపోవడం ఉత్తమం. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువసేపు ఇంజిన్ ఆన్లో ఉంచకూడదు.
నెలకు రూ. 5వేలుతో.. రూ. 8లక్షలు చేతికి!
ఎంత డబ్బు సంపాదించే వారికైనా పొదుపు చేయడం తప్పనిసరి. ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా.. దుబారా ఖర్చు చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం పెట్టుబడికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో కొంత రిస్క్ కూడా ఉంటుంది. అయితే రిస్క్ లేకుండా.. ప్రభుత్వ హామీతో సురక్షితమైన లాభం ఆశించేవారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఓ మంచి ఎంపిక అవుతుంది.నెలకు రూ.5000 చొప్పున పోస్టాఫీస్ రికరింగ్ ఖాతాలో జమ చేస్తూ.. ఐదేళ్లు ఇన్వెస్ట్ చేయలి. ఇలా చేసుకుంటూ పోతే.. మీ పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. ప్రభుత్వం దీనికి 6.7 శాతం వార్షిక వడ్డీ ఇస్తుంది. ఐదేళ్ల కాలం మీరు చేసిన డబ్బుకు మొత్తం రూ. 3,56,830 లభిస్తుంది.దీనిని మీరు పదేళ్లు పొడిగించుకుంటే.. మొత్తం పెట్టుబడి రూ. 6,00,000 (5000 x 120 నెలలు). దీనికి 6.7 శాతం వడ్డీ అనుకుంటే రూ. 2,54,272 వస్తుంది. వడ్డీ, అసలు కలిపితే మొత్తం రూ. 8,54,272 అవుతుంది.నిజానికి ఒక సాధారణ వ్యక్తికి లేదా ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారికి ఈ పోస్టాఫీస్ రికరింగ్ స్కీమ్ బెస్ట్ అనే చెప్పాలి. పిల్లల చదువుకు, పెళ్లి వంటి అవసరాలకు ఇది కొంత ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: 2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగా
‘అమెరికాకు భారత్ తలొగ్గలేదు’
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వస్తున్న విమర్శలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు. 18 శాతం సుంకానికి అంగీకరించడం ద్వారా భారత్ అమెరికాకు తలొగ్గిందన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. చైనా ఎగుమతులు 35 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత ఎగుమతులకు లభించే 18 శాతం సుంకం దేశానికి పెద్ద ఊరటనిస్తుందని విశ్లేషించారు. ఇటీవల కుదిరిన ఈ ఒప్పందం అనంతరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గోయల్ కొన్ని అంశాలను వెల్లడించారు.బలమైన ఆర్థిక శక్తిగా భారత్ప్రస్తుతం భారత్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎంతో ఆత్మవిశ్వాసంతో చర్చల్లో పాల్గొంటోందని గోయల్ అన్నారు. ‘2047 నాటికి భారత్ 30-35 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. భవిష్యత్తులో మనం అందించే భారీ మార్కెట్ అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో దేశానికి అతిపెద్ద బలం’ అని ఆయన అభివర్ణించారు.అమెరికా నుంచి కొనుగోళ్లువచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయడంపై భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘భారతదేశం పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఈ లక్ష్యం చాలా తక్కువ. మొత్తం రెండు ట్రిలియన్ డాలర్ల దిగుమతి డిమాండ్లో అమెరికా వాటా కొంత భాగమే. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి కొంటున్న 300 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను, పోటీతత్వాన్ని బట్టి అమెరికా సరఫరాదారుల నుంచి తీసుకునే అవకాశం ఉంది. విమానయాన రంగం, ఇంధనం, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్ వంటి వాటికి భారత్ ప్రాధాన్యత ఇస్తుంది’ అన్నారు.వ్యూహాత్మక చర్చలువాణిజ్య చర్చలంటే కేవలం అంకెలు కాదని, అవి దేశ ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని గోయల్ పేర్కొన్నారు. ‘మేము వివిధ దేశాలతో ఇప్పటివరకు కుదుర్చుకున్న తొమ్మిది ఒప్పందాల్లో ఎక్కడా జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడలేదు. చర్చల్లో ప్రశాంతత ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం’ అని ఆయన వెల్లడించారు.భారత్-ఈయూ ఒప్పందంపై మాట్లాడుతూ, ప్రధాని మోదీకి ప్రపంచ దేశాధినేతలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కూటమిలోని 27 దేశాల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. ప్రధాని మార్గదర్శకత్వంలో హోం మంత్రి అమిత్ షా, కేబినెట్ సహకారంతో గ్లోబల్ ట్రేడ్ మార్కెట్లో భారత్ కీలకంగా మారుతుందని గోయల్ అన్నారు.ఇదీ చదవండి: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం
జియో రూ.198 రీఛార్జ్ ప్లాన్: రోజుకు 2 జీబీ డేటా..
భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో.. తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త 5జీ రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.రూ.198 రీఛార్జ్ ప్లాన్ఇది రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాలింగ్ వంటివి పొందవచ్చు. అయితే దీని వ్యాలిడిటీ కేవలం 14 రోజులు మాత్రమే.రూ.349 రీఛార్జ్ ప్లాన్ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజులు. జియో హాట్స్టార్, జియోసావన్ ప్రో సబ్స్క్రిప్షన్లతో పాటు.. మూడు నెలలు జొమాటో గోల్డ్ కూడా పొందవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఫిబ్రవరి 24 వరకే!
ఫ్యామిలీ
శ్రుతి మించిన ఆశావాదం టాక్సిక్ పాజిటివిటీ
వ్యక్తిత్వ వికాసం అంటే... గెలుస్తూ ఉండటమే అనే భావన పూర్తిగా స్థిరపడింది. అయితే సైకిల్కు గాలి కొట్టినట్టుగా ఇలా ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటాన్ని ‘టాక్సిక్ పాజిటివిటి’ అంటారనీ ఇది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ‘హెల్దీ ఆప్టిమిజమ్’ (వాస్తవిక ఆశావాదం) కలిగి ఉండి... నిరాశ, ఓటములను అంగీకరించే మానసిక పరిణితి ఉంటే మేలని వారు సూచిస్తున్నారు. ‘టాక్సిక్ పాజిటివిటీ’ ఎందుకు వద్దో చదవండి.మన దగ్గర ‘అంతా మన మంచికే’ అనే తాత్త్వికత ఉంది. అంటే మంచైనా చెడైనా మంచికే దారి తీస్తుందనే ఒక ఆశావాదాన్ని ఇది కలిగిస్తుంది. దీనిచుట్టూ ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి. అలాగే చైనాలో ‘ఇన్ యాంగ్’ అనే భావన ఉంది. అంటే దుఃఖం–సంతోషం, ఆశ–నిరాశ, గెలుపు–ఓటమి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, ఇంకా చెప్పాలంటే ఒకదానిలోనే మరొకటి ఉంటాయని వారు నమ్ముతారు.జీవితంలో ముందుకు సాగాలంటే లక్ష్యం, గెలుపు మీద దృష్టి ఉండాల్సిందే. అయితే ఆ దారిలో కలిగి ఉండాల్సింది ‘వాస్తవిక ఆశావాదమే’ తప్ప ‘కేవల గెలుపువాదం’ మాత్రం కాదు. ఈ సృష్టిలో అంతా గెలుపునకే అవకాశాలు ఉన్నాయని ప్రయత్నిస్తే అన్నివేళలా గెలుపు అందుకోవచ్చని, ఆ విధంగా పాజిటివ్ యాటిట్యూడ్ను కలిగి ఉండాలని ఆధునిక వ్యక్తిత్వ వికాసం ప్రబోధిస్తుంది.అయితే దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువని అంటున్నారు మానసిక నిపుణులు.హద్దుల్లేని ఆశావాదంఒక విద్యార్థి యావరేజ్ మార్కులతో ఉన్నా ‘నువ్వు జెఇఇలో ర్యాంకు సాధించగలవు’ అనే పాజిటివ్ యాటిట్యూడ్ నూరిపోసినా, ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో ర్యాంకు వస్తుందని విద్యార్థి నమ్మినా చివరకు ఫలితాలు భంగపరిచే తీరుతాయి. అప్పుడు ఓటమి, నిరాశను తట్టుకోవడం కష్టమవుతుంది. సమయానికి చేరుకుంటే ఫ్లయిట్ అందుకుంటాం గానీ మనం లేటవుతూ ‘ఏం పర్లేదు.. ఫ్లయిట్ దొరుకుతుందిలే’ అనుకోవడం శ్రుతి మించిన ఆశావాదమే. మనల్ని మనం మోసం చేసుకోవడమే. లోకంలో గెలుపు, వెలుతురు ఉంటాయి. అలాగే మనం వద్దనుకున్నా ఓటమి, చీకటి కూడా ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయడం ముఖ్యమని అంటున్నారు మానసిక నిపుణులు. టాక్సిక్ పాజిటివిటీ వల్ల నిరంతరం సంతోషంగా ఉండాలేమో, సంతోషంగా ఉంటే తప్ప జీవితానికి విలువ లేదేమో అనేది కండీషనింగ్గా మారి సమస్యలకు దారి తీస్తోందని అంటున్నారు. ఆరు రుచులు... అన్ని భావాలుఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఉప్పు, పులుపు, తీపి, చేదు, కారం, వగరులతో కలిపిన పదార్థం. జీవితంలో కూడా అటువంటి అన్ని అంశాలు కలిసే ఉంటాయని చెప్పేందుకు ఉగాది పచ్చడి తినిపిస్తుంటారు. అయితే జీవితంలో పాజిటివిటీ ఎక్కువైపోతే కేవలం తీపిని తప్ప చేదుని రుచి చూడలేని పరిస్థితి తలెత్తుతుందని, దీని వల్ల చిన్న విషయాలకే మనసును తీవ్రంగా గాయపరుచుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. అన్ని రకాల భావాలకూ మనసులో చోటివ్వకుండా, కేవలం మంచి మాత్రమే జరగాలని కోరుకోవడం వల్ల భిన్న దృక్కోణాల్లో సమస్యను పరిశీలించి, పరిశోధించే అవకాశం దక్కడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే కొందరు తొందరగా డిప్రెషన్ బారిన పడుతున్నారంటున్నారు.పాజిటివ్గా ఆలోచించడం తప్పా?ఇదంతా విన్నాక ‘పాజిటివ్గా ఆలోచించడం తప్పా? అలా ఆలోచించడం ముప్పు తెస్తుందా?’ అనే సందేహం రావచ్చు. పాజిటివ్గా ఆలోచించడం తప్పు కాదు. అందులో దోషం లేదు. అయితే పాజిటివిటీతోపాటు జీవితంలో నెగిటివిటీ కూడా ఉంటుందని గుర్తించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు సమస్యలుగా పరిణమిస్తాయి. కొందరు ఎల్లప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తుంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చినా ‘ఇంత బాగా ఆలోచించే నాకు ఎందుకీ కష్టం వచ్చింది? నాకెందుకు ఇలా జరిగింది?’ అని ఆలోచించి ఆలోచించి మరింత మధనపడుతుంటారు. రాన్రానూ ఇదొక తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆనందం శాశ్వతం కాదు...పాజిటివ్ థింకింగ్లో ఉన్న మరో ప్రధాన సమస్య ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకోవడం. మనిషికి సహజంగా ఆనందంతోపాటు దు:ఖం, కోపం, చిరాకు, అలసట వంటివి వస్తుంటాయి. అయితే పాజిటివ్ థింకింగ్ కారణంగా కేవలం ఆనందంగా మాత్రమే ఉండాలని అనుకుంటే మిగిలిన భావాలు లోలోపలే పేరుకుపోయి మానసిక సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యమైన సందర్భాల్లో భావోద్వేగాలు బయటకు రాక ఇబ్బంది పడుతుంటారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువైందని మానసిక నిపుణులు అంటున్నారు. బలవంతంగా సంతోషాన్ని నటించడం వల్ల ఇబ్బందులు తప్ప ఫలితాలు ఉండవని హెచ్చరిస్తున్నారు.
వినువీథిలో సారథులు
ప్రపంచంలోనే అధిక శాతం మహిళా పైలట్లు ఉన్న దేశంగా భారత్ మారుతోంది. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిబంధనల సరళీకరణ మన దేశాన్ని మహిళా పైలట్ల హబ్గా మార్చాయి. విమానయాన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వేసిన అడుగులే భారత్ను నేడు ప్రపంచానికి ఆదర్శంగానిలబెట్టాయి.ఇటీవల పార్లమెంటులో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం..→ 2021 నుంచి 2025 మధ్యకాలంలో మహిళా పైలట్ల సంఖ్య 90% మేర పెరిగింది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, భారతీయ మహిళల ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. → 2021లో మహిళలకు 243 లైసెన్సులు జారీ చేయగా, 2025 నాటికి ఆ సంఖ్య 461కి పెరిగింది. అంటే ఈ నాలుగేళ్లలో సుమారుగా 89.71% వృద్ధిని సూచిస్తోంది. → డిసెంబర్ 31, 2025 నాటికి భారతదేశంలో మొత్తం మహిళా పైలట్ల సంఖ్య 3,327.→ ప్రపంచవ్యాప్తంగా మహిళా పైలట్ల సగటు కేవలం 5% నుంచి 6% మాత్రమే ఉండగా, భారతదేశంలో ఇది 15% గా ఉంది. అంటే ప్రపంచ సగటు (5%) కంటే మూడు రెట్లు ఎక్కువ. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల కంటే కూడా భారత్ ఈ విషయంలో ఎంతో ముందుంది.→ ఒక్క ఏడాదిలోనే అంటే 2025 లో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు 61 కొత్త శిక్షణ విమానాలను ప్రవేశపెట్టడం విమానయాన రంగంలో ఒక పెద్ద అడుగు. ప్రస్తుతం దేశంలో మొత్తం 385 శిక్షణ విమానాలు ఉన్నాయి.→ సాంకేతిక విభాగాల్లోనూ మహిళల ప్రాధాన్యత పెరుగుతోంది. గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ విభాగాల్లో మహిళల వాటా 14% వరకు ఉంది.→ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్లో మహిళల సంఖ్య సుమారు 2.6% మాత్రమే ఉన్నప్పటికీ, ఇటీవల ఇండిగో వంటి సంస్థలు కేవలం మహిళలతో కూడిన మెయింటెనెన్స్ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.→ 2025 నాటికి విమానయాన రంగంలో మహిళల వాటాను 25 శాతానికి పెంచాలని పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డిజిసిఏ) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మహిళలకు ప్రత్యేక హ్యూమన్ రిసోర్స్ పాలసీలు, ప్రసూతి సెలవులు, శిక్షణ తర్వాత తిరిగి విధుల్లో చేరేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని నిర్ణయించింది.అంతర్జాతీయంగానూ..చాలా మంది భారతీయ మహిళా పైలట్లు ఇప్పుడు అంతర్జాతీయ రూట్లలో కూడా విమానాలను నడుపుతున్నారు. దీనివల్ల రాబోయే కాలంలో విమానయాన రంగంలో మహిళలు మరింత ఎత్తుకు ఎదగనున్నారు. పలు ఎయిర్లైన్స్లో మహిళా పైలట్ల శాతం అలయన్స్ ఎయిర్... అత్యధికంగా 17.36% మంది మహిళా పైలట్లు ఉన్నారు.ఇండిగో... గరిష్ట సంఖ్యలో మహిళా పైలట్లను (సుమారు 791 మంది) కలిగి ఉన్న సంస్థ.స్పైస్జెట్... 16.39% మహిళాపైలట్లతో రెండోస్థానంలో ఉంది.ఎయిర్ ఇండియా... 15.62% మహిళా పైలట్లు ఉన్నారు.
పెళ్లంత థ్రిల్లింతలు
ఒకప్పుడు పెళ్లి అనగానే ‘ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి’ అనే పాటందుకునేవారు వధూవరులు. ఏ పెళ్లిలోనైనా పీటలపై కూర్చున్న జంట ఒకే రకం పెళ్లి చీర, ఒకేరకం పట్టు లాల్చీతో కనిపించగానే, సంప్రదాయం ఉట్టిపడేది. పురోహితుడి మంత్రాల దగ్గర నుంచి గట్టిమేళం వరకు ఇంచుమించు ఒకే తీరులో పెళ్లివేడుక నడిచేది. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు ఊహల్లో ఊగులాడుతూ– ఊరంత పందిరినీ, ఊరంతా సందడినీ కోరుకునేవారు. కాని, ట్రెండ్ మారింది. ఇప్పటి యువత ఎక్కువగా స్పెషల్ అండ్ యూనిక్ మ్యారేజెస్కే ఓటేస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో సాహసాలను కోరుకుంటున్నారు. శుభాశుభాలను, తిథి నక్షత్రాలను పక్కనపెట్టి, పెళ్లిని వ్యక్తిగత వేడుకగా మార్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి నడుస్తోంది. ఆచారాలు, ఆత్మీయ ఆహ్వానాలు తగ్గిపోయాయి. ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన యువత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం, ట్రెండీ లుక్ కోసం సరికొత్త వివాహ పద్ధతుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు.ప్రస్తుతం ట్రెడిషన్ ఫాలోవర్స్ కంటే ట్రెండ్ సెట్టర్స్ ఎక్కువైపోతున్నారు. వైరల్ కావాలనే కుతూహలం కొందరిది; తమ యవ్వనంలోనే ఏదో ఒక ప్రత్యేకతను చాటుకోవాలన్న తాపత్రయం మరికొందరిది; మరపురాని మధుర క్షణాలను సృష్టించుకోవాలన్న ఆరాటం ఇంకొందరిది. ఈ క్రమంలోనే చాలామంది పెళ్లికి సిద్ధమయ్యే యువత– సంప్రదాయాలను పక్కనపెట్టి అనూహ్యంగా ఆలోచిస్తున్నారు. విస్మయకరంగా విచిత్రరీతుల్లో వివాహాలు చేసుకుంటూ ‘ద్యావుడా’ అనిపిస్తున్నారు. తమ పెళ్లి అందరిలా కాకుండా– అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని తపిస్తున్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా పెళ్లి మండపాలు– వింత పందిళ్లను వేçస్తూ, విడ్డూరాలకు తెరలేపుతున్నాయి.పెళ్లి అంటే ప్రమాణం. నీకు నేను, నాకు నువ్వు అనే ప్రమాణం. ఆ ప్రమాణాన్ని ప్రపంచంలోని ఒక్కో ఆచారం– ఒక్కో తంతుతో నిర్వహిస్తుంది. ప్రతి ఆచారంలోనూ పెళ్లి పేరుతో ఏకమైన జంటకు దైవమే సాక్ష్యమంటూ బంధుగణం ఆశీర్వదిస్తుంది. అలాంటి పవిత్రమైన వేడుక రానురాను ట్రెండ్ మార్చుకుంటోంది. కొన్నిసార్లు గతి తప్పుతోంది. మరికొన్నిసార్లు మతులు పోగొడుతోంది.అడ్వెంచరస్ వెడ్డింగ్స్‘సంసార జీవితమంటేనే ఓ సాహసం’ అనే అనుభవజ్ఞుల మాటల్ని ఫాలో అవుతున్నారో ఏమో కాని, చాలామంది యువత తమ పెళ్లి జీవితాన్ని అదే సాహసంతో ప్రారంభిస్తున్నారు. అలాంటి అడ్వెంచరస్ వెడ్డింగ్స్ ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. అవేంటో చూద్దాం!స్కైడైవింగ్ వెడ్డింగ్అడ్వెంచరస్ వెడ్డింగ్స్లో స్కైడైవింగ్తో కూడిన బేస్ జంపింగ్ పెళ్లిళ్లు చేసుకుని వైరల్ అవుతున్నాయి కొన్ని కొత్త జంటలు. నిజానికి ఇలాంటి పెళ్లిళ్లు యునైటెడ్ స్టేట్స్లోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా, హవాయి, మొజూరి వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. అలాస్కా మంచుదారుల్లో ఇలాంటి సాహసాలు అధికంగా తారసపడతాయి. స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వత ప్రాంతాలతో పాటు ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఆయా ప్రాంతాలన్నీ స్కైడైవింగ్తో పాటు బేస్ జంపింగ్ వెడ్డింగ్స్కు అనుకూలంగా ఉంటాయి.నిజానికి ఆస్ట్రేలియా, న్యూజీలండ్ దేశాలు సాహస క్రీడలకు కేంద్రం కావడంతో పాటు– అక్కడ బీచ్లు, పర్వతాలు స్కైడైవింగ్కి అనుకూలంగా ఉండటంతో ఈ రకమైన వివాహాలు తరచుగా జరుగుతాయి. మరోవైపు యూకేలో కొందరు వధూవరులు పెళ్లి వేదికకు విమానం, స్కైడైవింగ్ చేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంటారు. 2023లో ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే జంట తమ వివాహ వేడుకను థ్రిల్లింగ్గా నిర్వహించుకుని ప్రపంచాన్ని అవాక్ చేశారు.ఎత్తైన కొండ అంచున పెళ్లి చేసుకుని, వివాహం పూర్తయిన వెంటనే, ఆ కొండ అంచు నుంచి బేస్ జంపింగ్/ స్కైడైవింగ్ చేశారు. అప్పట్లో ఆ వీడియో నెట్టింట భీకరంగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఈ ట్రెండ్ 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఉన్నప్పటికీ సోషల్ మీడియా ప్రభావంతో ఈ మధ్యకాలంలోనే త్వరగా పాపులర్ అయ్యింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా సాహస ప్రియులైన వ«ధూవరులు– ఈ విధానాన్ని ఎంచుకోవడం మొదలుపెట్టారు.స్పేస్నెట్ వెడ్డింగ్స్ ఈ స్పేస్నెట్ వెడ్డింగ్ సాహసానికి పరాకాష్టగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కిమ్ వెగ్లిన్, ర్యాన్ జెంక్స్ అనే జంటను ఈ వివాహానికి ట్రెండ్ సెట్టర్స్గా చెబుతుంటారు. వీరు అమెరికాలోని ఉటా రాష్ట్రంలోని మోయాబ్ ఎడారిలో 400 అడుగుల ఎత్తులో లోయ పైభాగంలో కట్టిన స్పేస్నెట్పై వివాహం చేసుకున్నారు. కిమ్, ర్యాన్ ఇద్దరూ ప్రొఫెషనల్ స్లాక్లైనర్లు. వీరు మోయాబ్లో జరిగే ప్రసిద్ధ హై–లైనింగ్ ఫెస్టివల్లో కలుసుకుని ప్రేమించుకున్నారు. అందుకే, తమ వివాహాన్ని కూడా అదే స్పేస్నెట్లో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పదిమంది బేస్ జంపర్లు టూటూ దుస్తులు ధరించి, పారాషూట్లలో పూల రేకులను వదులుతూ ఈ వివాహాన్ని అంగరంగవైభవంగా జరిపారు. ఈ వివాహం 2017లో జరిగింది. అంతకు ముందు పర్పుల్, మిక్కీ అనే మరో జంట మోయాబ్లోనే స్పేస్నెట్పై వివాహం చేసుకున్నట్లు సమాచారముంది. ఇంతటి సాహసం చేసి పెళ్లి చేసుకుంటున్న జంటలు అరుదుగా ఉన్నప్పటికీ ఈ పెళ్లితంతు ప్రపంచ యువత దృష్టిని ఆకట్టుకుంది.అండర్ వాటర్ వెడ్డింగ్స్సాహస ప్రియులైన జంటలకు అండర్ వాటర్ వెడ్డింగ్ అనేది తమ ప్రేమలోని లోతును ప్రకటించుకునే ఒక అద్భుత అవకాశం. షాంపేన్ కంటే ఎక్కువ బుడగలతో, ప్రశాంతమైన సముద్రపు అడుగున, రంగురంగుల పగడపు దిబ్బలు, చిన్నాపెద్దా చేపల సాక్షిగా వివాహం చేసుకోవడం ఇవన్నీ ఈ ట్రెండ్ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. భారతదేశంలో నీటి అడుగున వివాహాలకు ప్రధాన కేంద్రం అండమాన్ దీవులు. ఇక్కడ హేవ్లాక్ ఐలాండ్ ఈ వినూత్న వేడుకలకు వేదికగా మారుతోంది. ఇది దేశంలోనే నీటి అడుగున వివాహాలకు ఆదరణ పొందుతున్న ఏకైక ప్రదేశం. వధూవరులు స్కూబా గేర్ లేదా ఆడియో సిస్టమ్ ఉన్న అండర్ వాటర్ హెల్మెట్లు ధరించి నీటి అడుగుకు వెళ్తారు.ఇక్కడ నోటి మాటలకు బదులు, డైవింగ్ స్లేట్లు ఉపయోగించి ప్రమాణాలు చేసుకుంటారు. అనంతరం ఉంగరాలు మార్చుకుంటారు. అండమాన్ లో ఈ వివాహ ఏర్పాట్లకు ఖర్చు సుమారుగా రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంటుంది. డైవింగ్ మాస్టర్లు, భద్రతా సిబ్బంది, కెమెరామెన్ వివాహం చేసుకోబోయే జంట వెంటే ఉంటారు. నిజానికి అండర్ వాటర్ వెడ్డింగ్స్ గ్లోబల్ ట్రెండ్. అయితే ఈ వివాహానికి మురికి లేని స్వచ్ఛమైన నీరు, పగడపు దిబ్బలు కలిగిన సుందరమైన వాతావరణం ఉండాలి. థాయ్లాండ్ ఈ వివాహాలకు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నీటి అడుగున సామూహిక వివాహాలు జరుగుతాయి. 2001లో క్రాదాన్ ద్వీపంలో 22 దేశాల నుంచి 34 జంటలు ఒకేసారి వైవాహిక జీవితాన్ని ప్రారంభించి, ప్రపంచ రికార్డును కూడా సృష్టించారు.అక్కడ కొన్ని రిసార్ట్లలో ప్రత్యేకంగా నీటి అడుగున వివాహాల కోసం చాపెల్స్ అందుబాటులో ఉంటాయి. కైమాన్ దీవులు, మాల్దీవులు, మారిషస్, ఇండోనేషియా కూడా ఈ డైవింగ్కు అనుకూలమైన ప్రాంతాలు కాబట్టి, ఈ ట్రెండ్ను అక్కడ కూడా అనుసరిస్తున్నారు. థాయ్లాండ్లోని ట్రాంగ్ ప్రావిన్స్లో 1997లో వార్షిక సామూహిక జలాంతర వివాహ వేడుక ప్రారంభమవడంతో ఈ కాన్సెప్ట్కు ప్రపంచవ్యాప్తంగా పెద్ద గుర్తింపు, ప్రజాదరణ లభించింది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ ట్రెండ్ తరచుగా అత్యంత విలాసవంతమైన లేదా సాహసోపేతమైన గమ్యస్థానాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. డైవింగ్ అనుభవం ఉన్న లేదా శిక్షణ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న జంటలు ఈ పద్ధతిలో వివాహం చేసుకోవడానికి ఎగబడుతున్నారు.హాట్ ఎయిర్ బెలూన్ వెడ్డింగ్స్నిజానికి చాలామంది జంటలు పెళ్లి ప్రతిపాదనలు చేసుకోవడానికి ఈ హాట్ ఎయిర్ బెలూన్ను ఎక్కుతుంటారు. ఈ వివాహం ఆకాశంలో తేలియాడుతూ, భూమిపై అద్భుతమైన దృశ్యాలను చూస్తూ జరుపుకునే సాహస వేడుక. ఈ రకమైన వివాహం– కేవలం వధూవరులు, పూజారి, ఫొటోగ్రాఫర్ల సమక్షంలో మాత్రమే జరుగుతుంది. ఈ వేడుకకు పెద్ద బెలూన్ బాస్కెట్ ఉపయోగిస్తారు. ఈ సాహసానికి టర్కీలోని కప్పడోసియా ప్రత్యేకం. అక్కడి రాతి నిర్మాణాలు, లోయలను పైన హాట్ఎయిర్ బెలూన్ నుంచి చూస్తే కళ్లు చెదురుతాయి.దాంతో చాలామంది ఈ వివాహాలను చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఈజిప్ట్లోని లక్సర్లో పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాల మీదుగా సూర్యోదయాన్ని చూస్తూ బెలూన్ ప్రయాణం చేస్తే అదిరిపోతుంది. అలాగే ఇటలీలోని టస్కనీలో పచ్చని కొండలు, ద్రాక్ష తోటలు, పురాతన కోటల మీదుగా బెలూన్పై ప్రయాణించే అనుభూతి చాలా బాగుంటుంది. అందుకే చాలామంది జంటలు ఆయాప్రాంతాల్లో ఈ ప్రయాణం చేస్తూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక భారత్లో కూడా ఈ వివాహాల ట్రెండ్ పెరుగుతోంది. సాధారణంగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లు జరిగే ప్రదేశాలలోనే ఈ వివాహాలను ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా రాజస్థాన్ (జైపూర్), గోవా ఈ జాబితాలోకి వస్తాయి.హాట్ ఎయిర్ బెలూన్ చరిత్ర 18వ శతాబ్దంలోనే కనిపిస్తుంది. మొట్టమొదటి మానవ ప్రయాణంతో కూడిన హాట్ ఎయిర్ బెలూన్ విమానం, 1783 నవంబర్ 21న ఫ్రాన్స్లోని పారిస్లో ప్రయోగించారు. ఆధునిక, సురక్షితమైన ప్రొపేన్ బర్నర్లు కలిగిన హాట్ ఎయిర్ బెలూన్ లు 1950ల చివరలో అభివృద్ధి చెందాయి. అప్పటి నుంచి, బెలూనింగ్ ఒక వినోద కార్యక్రమంగా, ఆపై ఒక రొమాంటిక్ వేదికగా మారింది.డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండ్ పెరిగిన తరువాతే, హాట్ ఎయిర్ బెలూన్ లలో వివాహాలు కూడా క్రమంగా మొదలయ్యాయి. అంటే, సాంకేతికంగా బెలూన్లు చాలా పాతవి అయినప్పటికీ, వాటిలో వివాహాలు జరుపుకోవడం అనేది కొత్త ట్రెండ్ అనే చెప్పుకోవాలి. భారత్లో, కొన్ని కొత్త జంటలు వివాహ వేడుక పూర్తయిన తర్వాత పుట్టింటి నుంచి అత్తింటికి కారుకు బదులుగా హాట్ ఎయిర్ బెలూన్ లో ప్రయాణిస్తూ వైరల్ అవుతున్నారు.మంచుశిఖరాల్లో..ఎవరెస్ట్ శిఖరం పైన, మంచుతో నిండిన అంటార్కిటికాలో, మంచు ఎడారులలో లేదా అడవుల లోపల వివాహాలు సాహసోపేతమైన ట్రెండ్ కూడా ప్రస్తుతం నడుస్తోంది. ఈ రకమైన వివాహాలకు అతిథులు చాలా తక్కువ మంది ఉంటారు. లేదా అసలు ఉండరు.ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (నేపాల్)– ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన వివాహ వేదికలలో ఇదొకటి. ఇక్కడ చాలామంది యువత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.అంటార్కిటిక్ క్రూయిజ్–భూమిపై అతి తక్కువ మంది అడుగుపెట్టిన ప్రదేశాలలో ఒకటి అంటార్కిటిక్ ఖండం. అయితే ఇప్పటి ట్రెండీ యూత్కి అటుగా ప్రయాణించే క్రూజ్ షిప్స్ కూడా వివాహ వేదికలే. పెంగ్విన్స్, మంచు దిబ్బల మధ్యలో తీరానికి దగ్గరల్లో క్రూయిజ్ నుంచి ఒక చిన్న పడవలోకి మారతారు. అందులో తీరానికి చేరుకుని అక్కడ వివాహం చేసుకుంటున్నారు.ఎడారుల్లో..ఎడారి పెళ్లిళ్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండీగా మారిన సాహసోపేతమైన వివాహ వేడుకల్లో ఒకరకం. కాలిఫోర్నియా, జోషువా ట్రీ, పామ్ స్ప్రింగ్స్ వంటి ప్రదేశాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే అరిజోనా, దుబాయ్ ఎడారిలో లగ్జరీ రిసార్ట్లు లేదా ప్రైవేట్ క్యాంపుల్లో విలాసవంతమైన వివాహ వేడుకలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక భారత్లోని రాజస్థాన్లో జైసల్మేర్, జోధ్పూర్ వంటి నగరాల్లోని ప్యాలెస్లు, డెసర్ట్ క్యాంపులు వివాహవేదికలుగా నిలుస్తున్నాయి. ఇలాంటి చోట్ల పగటిపూట వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సూర్యాస్తమయం సమయంలో లేదా నక్షత్రాల కింద రాత్రిపూట ఈ వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి.‘హడలెత్తించే’ పెళ్లిళ్లుప్రస్తుత పెళ్లిళ్ల నిర్వహణలో సంప్రదాయాలకు ఆధునికత, వ్యక్తిగత ఆశలు తోడై– కొత్త ధోరణులు పుట్టుకొస్తున్నాయి. సాంప్రదాయ వివాహ వేదికలకు బదులుగా, కొంతమంది జంటలు తమ వైవాహిక జీవితంలో కొత్త సాహసాన్ని కోరుకుంటూ అసాధారణమైన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు.వనాల మధ్యలో..దట్టమైన అడవిలో లేదా పచ్చని చెట్ల తోటల్లో వివాహం చేసుకోవడం ఇప్పుడు యువత మెచ్చిన ట్రెండ్లో ఒకటి. ఈ ఫారెస్ట్ వెడ్డింగ్స్ కాలిఫోర్నియా, యోసెమిటీ నేషనల్ పార్క్లో పొడవాటి చెట్లు, గ్రానైట్ కొండల మధ్య పెళ్లి చేసుకోవడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కెనడాలోని కొలంబియా కూడా ఇలాంటి పెళ్లిళ్లకు పందిళ్లు వేస్తోంది. ప్రపంచ యువతను ఆకర్షిస్తోంది. ఇక భారత్లో ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్, కర్ణాటకలోని కూర్గ్, కబిని వంటి ప్రాంతాల్లో ఈ పెళ్లిళ్లు అధికంగా జరుగుతున్నాయి.హాంటెడ్ వెడ్డింగ్స్కొన్ని దేశాల్లో, ముఖ్యంగా హాలీవుడ్ థీమ్ల ప్రభావంతో, దయ్యాల కోటలు, పాత జైళ్లు, పాడుబడిన పట్టణాలు లేదా చారిత్రక శ్మశానవాటికల పక్కన వివాహాలు చేసుకుంటున్నారు. సంప్రదాయ వివాహాలకు భిన్నంగా, తమ ప్రత్యేకతను చాటుకోవాలనుకునే జంటలు ఇలాంటి ప్రత్యేక వేదికలను ఎంచుకుంటున్నారు. హారర్ సినిమాలు, హడలెత్తించే నవలలు, హాలోవీన్ థీమ్ల పట్ల ఆసక్తి పెరగడంతో ఈ రకమైన వివాహాలు ప్రాచుర్యం పొందాయి. పాత కోటలు, పాడుబడిన భవనాలు వేదికలుగా మారి, దయ్యాల కథలు జతచేర్చి చిత్రవిచిత్రమైన అనుభవాన్నిస్తాయి. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇతర యూరోపియన్ దేశాల్లో ఈ ధోరణిఎక్కువగా కనిపిస్తుంది.కొలరాడోలోని ‘ది స్టాన్లీ హోటల్’– ‘ది షైనింగ్’ నవలకు స్ఫూర్తినిచ్చిన ప్రదేశం, ఇక్కడ దయ్యాలు తిరుగుతాయని చాలామంది నమ్ముతారు. ఈ ప్రాంతాన్నే వివాహ వేదికగా మార్చుకుంటున్నారు చాలామంది వధూవరులు.కాలిఫోర్నియాలో పర్మనెంట్గా డాక్ చేసిన ‘ది క్వీన్ మేరీ’ అనే లగ్జరీ నౌకలో ఒకప్పటి సిబ్బంది, ప్రయాణికులంతా దయ్యాలుగా మారారని, అక్కడే సంచరిస్తున్నారని స్థానికుల నమ్మకం. హడలెత్తించే ఈ ప్రాంతం కూడా వివాహ వేదికే. ఇక కాలిఫోర్నియాలో చారిత్రక గోస్ట్ టౌన్ లోని పాత చర్చిలు లేదా ఆయా పరిసరప్రాంతాలు యువతను పెళ్లి చేసుకోమని ఆహ్వానం పలుకుతున్నాయి. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి.భారతదేశంలో పాత మిల్లులు/పాత భవనాలుకొన్ని ఈవెంట్ సంస్థలు పాత మిల్లులు లేదా పాడుబడిన భవనాలను థీమ్డ్ డెకరేషన్తో వివాహ వేదికలుగా మారుస్తున్నాయి. అందులోనే వివాహాలు చేసుకోవడానికి యువత ఇష్టపడుతున్నారు.‘సోలో వెడ్డింగ్స్’తమ సంతోషానికి మరొకరిపై ఆధారపడకుండా, తమ జీవితాన్ని తామే నియంత్రించుకుంటామని ప్రకటిస్తూ.. చాలామంది యువత– సోలో వెడ్డింగ్స్కి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది అన్నింటికంటే ప్రత్యేకమైన ట్రెండ్. పెళ్లి చేసుకోమని ఇతరులు ఒత్తిడి చేస్తున్నప్పుడు, తమ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి తామేనని చెప్పుకోవడానికి కొందరు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ సోలో పెళ్లిళ్లు కూడా సంప్రదాయ పెళ్లిళ్లకు మాదిరిగానే అంగరంగ వైభవంగా, అతిథులతో, కేక్తో, రిసెప్షన్ తో జరుగుతాయి. కాని, పార్టనర్ మాత్రమే ఉండరు. ఈ వివాహాలు ప్రస్తుతం జపాన్లో ఎక్కువగా జరుగుతున్నాయి.పెళ్లి అనేది ట్రెడిషనల్ ట్రాక్ నుంచి ట్రెండీ ట్రాక్ ఎక్కి చాలాకాలమే అయింది. కొన్ని వెడ్డింగ్స్ ‘అరే భలే జరిగాయి కదా!’ అనిపిస్తుంటే, కొన్ని వెడ్డింగ్స్ మాత్రం ‘అరే పాపం, ఎందుకురా ఇంత కష్టం.. ఏంట్రా ఈ పిచ్చి?’ అనిపించక మానడం లేదు!చైనా వినూత్న ప్రయత్నం..చైనా ప్రభుత్వం తగ్గుతున్న జననాల రేటును అరికట్టడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. అక్కడి పెళ్లి నిబంధనలను సరళతరం చేసింది. పలు సంప్రదాయేతర ప్రదేశాలలో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలను, వివాహ వేదికలను ఏర్పాటు చేసింది. సబ్వే స్టేషన్ దగ్గర నుంచి నైట్ క్లబ్స్ వరకూ జనసంచారం ఉన్న ప్రతిచోట పెళ్లి బూత్లను ప్రారంభించింది. దాంతో అక్కడ పెళ్లి చేసుకునే ట్రెండ్ క్రమంగా మారుతోంది. సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ట్రెండ్ని కోరుకునే యువత ఈ విధానానికి అట్రాక్ట్ అవుతోంది.సంహిత నిమ్మన
నా జీవితంలో స్టార్ ఉన్నాడు!
సొసైటీ ఇచ్చే స్టేట్మెంట్ లేబుల్స్ అంటే అలర్జీ. ఇతరుల అంచనాలన్నింటినీ లైట్గా స్కిప్ చేస్తూ, తనదైన దారిలో తన సొంత ప్రపంచంలో జీవిస్తోంది ఫారియా అబ్దుల్లా. ఇప్పుడు ఆ ప్రపంచం గురించిన విషయాలన్నీ ఆమె మాటల్లోనే...⇒ నా పేరు ఫారియా. చాలామంది ‘ఫైరియా’ అని పిలుస్తారు. నటనకు ముందు ఆరు సంవత్సరాలు హైదరాబాద్లో థియేటర్ ఆర్టిస్ట్గా పని చేశాను. అక్కడే నటిగా పునాది పడింది. అంతకంటే ముందే నేను డాన్సర్, మ్యూజీషియన్ , క్రియేటివ్ ఆర్టిస్ట్ని.⇒ ‘జాతి రత్నాలు’ వచ్చాక నా జీవితం ఫుల్ టర్న్ తీసుకుంది. ఎంతలా అంటే ‘ఎవరు ఈ అమ్మాయి?’ నుంచి, ‘మన చిట్టి!’ అంటూ ప్రతి కుటుంబం నన్ను వాళ్ల అమ్మాయిలా దగ్గరకు తీసుకుంది.⇒ అవును, నేను రిలేషన్ లో ఉన్నాను. ఇది సీక్రెట్ కాదు, ప్రైవేట్. అతను ఒక కొరియోగ్రాఫర్. నేను ముస్లిం, అతను హిందువు. కాని, మా మధ్య ఇవన్నీ ఎప్పుడూ సమస్య కాలేదు. మాది ప్రేమకథ అనడం కన్నా పార్ట్నర్షిప్ అనడమే నాకు ఇష్టం. నా డాన్స్, నా ర్యాప్లో కనిపించే ఎనర్జీ వెనుక అతని సపోర్ట్ బోనస్లా పనిచేస్తుంది.⇒ ఇప్పటివరకు అతని పేరు, ముఖం రివీల్ చేయలేదు. కాని, నా వీడియోల్లో క్లూస్ వెతుకుతున్న ఇంటర్నెట్ డిటెక్టివ్లను చూస్తే నవ్వొస్తుంది. ‘సారీ గైస్’ మీరు ఇంకా లెవెల్ అప్ కాలేదు.⇒ ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తు ఒకప్పుడు మైనస్ అన్నారు. కేవలం గెస్ట్ రోల్స్కే సరిపోతావు అని కామెంట్స్ చేసేవారు. నేను మాత్రం నా సినిమాలతోనే వాళ్లకు సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నా.⇒ డాన్స్ నా ఫస్ట్ లవ్. నన్ను నేను ‘మూవ్మెంట్ ప్రాక్టీషనర్’గా పిలుచుకుంటాను. హిప్హాప్, కథక్, బెల్లీ, బీ–బాయింగ్ ఇలా నా శరీరమే నా భాష.⇒ ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’, ‘రావణాసుర’, ‘మత్తు వదలరా 2’, ‘కల్కి’ ఇలా ప్రతి సినిమా నాకు కొత్త పాఠం నేర్పింది. ఇప్పుడు తమిళంలో ‘వల్లి మయిల్’. అందులో స్టంట్స్ కూడా చేశాను. ఈసారి కొత్త ఫారియాను చూడబోతున్నారు.⇒ నటనతో పాటు సంగీతం కూడా నా ప్రాణం. నేను పాడుతాను, రాస్తాను, కంపోజ్ చేస్తాను. ‘డ్రామా నక్కో మామ’ పాట పూర్తిగా నా మ్యూజికల్ ఎక్స్పెరిమెంట్.⇒ నా బ్యూటీ రొటీన్ చాలా సింపుల్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, కాన్షస్ ఈటింగ్ అదే నా గ్లో సీక్రెట్. మేకప్ తీసేయడానికి బేబీ ఆయిల్, హెయిర్కు వారానికి రెండు మూడుసార్లు ఆయిల్ మసాజ్ తప్పనిసరి.⇒ తినడంలో బిర్యానీ నా బలహీనత. దోశ, ఇడ్లీ లాంటి సింపుల్ ఫుడ్ అంటే కూడా ఇష్టం. ట్రావెల్ చేసినప్పుడు మక్బూస్, లుకైమాత్ లాంటి రుచులు కూడా ట్రై చేశాను.⇒ నా జీవితంలో ఇంకొక స్టార్ ఉన్నాడు. అదే నా పిల్లి ‘సెబాస్టియన్ ’. అతను లేకపోతే నా సోషల్ మీడియా అకౌంట్ అసంతృప్తిగానే ఉంటుంది.
అంతర్జాతీయం
పాక్కు పుతిన్ మెసేజ్..భారత్కు దూరం కానున్న రష్యా?
భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ రష్యాకు కోపం తెచ్చిందా?. భారత్కు ఎల్లవేళలా అపన్న హస్తం అందించే చిరకాల మిత్రుడు ఇప్పుడు ఇండియాకి దూరం కానున్నారా? ఈ రెండు దేశాల మధ్య డిస్టెన్స్ ఇప్పుడు మాస్కోని పాకిస్థాన్కు చేరువచేస్తుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ని ఇంతకాలం పక్కకు పెట్టిన వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఆ దేశంలో బాంబు దాడి జరిగితే స్వయంగా స్పందించారు.రష్యా- భారత్ మైత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. "రష్యా సుఖ-దుఃఖ కాలంలో భారత్కు సహాయకారిగా ఉండే గొప్ప మిత్రుడు" అని భారత ప్రధాని మోదీ అన్నారంటే ఇరుదేశాల మధ్య మైత్రి ఎంతగొప్పదో అర్థం చేసుకోవచ్చు. భారత్ సైతం రష్యాకు ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించింది. ఈయూతో పాటు ఇతర దేశాలు రష్యాతో ఆర్థిక బంధాలు తెంచుకున్న సమయంలో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించింది.అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇంతకాలం చిరకాల మిత్రులుగా ఉన్న దేశాలను దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల భారత్పై అధిక పన్నులు తగ్గించారు. ఫలితంగా భారత్ రష్యానుంచి చమురు కొనుగోలు చేయదని మాటిచ్చిందన్నారు. అయితే ఇక్కడ తుంటరి ట్రంప్ మాటలను నమ్మేవారు అధికంగా లేకున్నా.. ఇండియా ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. పైగా ట్రంప్ని ప్రశంసిస్తూ మోదీ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై రష్యా సైతం సానుకూలంగా స్పందించింది. భారత్ ఎవరి నుంచైనా చమురు కొనుగోలు చేయచ్చని దానిలో పెద్ద ఆశ్చర్యమేమి లేదని తెలిపింది.ఇదిలా ఉండగా రష్యా పాక్తో దగ్గరయ్యే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం రష్యా పాకిస్థాన్ను పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ సమావేశంలో సైతం పాక్ ప్రధాని షెహబాజ్, పుతిన్ కోసం 40 నిమిషాలు ఎదురుచూసి అసహనానికి గురయ్యారు. కాగా ఇప్పుడు రష్యా పాక్తో మైత్రికి చేయి చాపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఇస్లామాబాద్లో బాంబుదాడి జరిగి 36 మంది మృతిచెందారు. దాని పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానికి మెసేజ్ పెట్టారు.పుతిన్ మెసేజ్లో.. మతపరమైన వేడుకల్లో ప్రజలను చంపడం ఉగ్రవాదుల క్రూరమైన, అమానవీయమైన మనస్థత్వాన్ని తెలియజేస్తుందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహాబాజ్ షరీప్లకు సంతాప సందేశం పంపారు. అంతే కాకుండా భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాక్తో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అని తెలిపారు. దీంతో పాకిస్తాన్తో కలిసి పుతిన్ కొత్త కూటమి ఏర్పాటు చేసే అవకాశాలున్నాయా అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రష్యానుంచి చమురు కొనుగోలు భారత్ ఆపేసిందని ట్రంప్ ప్రకటనలపై భారత్ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ నిజంగా అలా చేస్తే మాత్రం ఎల్లవేళలా అండగా ఉన్న గొప్పమిత్రున్ని భారత్ దూరం చేసుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
Bangladesh: కీలక నేత కన్నుమూత.. ఎన్నికల ముందు విషాదం
ఢాకా: కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న బంగ్లాదేశ్లో విషాదం అలముకుంది. సీనియర్ నేత, అవామీ లీగ్ మాజీ మంత్రి రమేష్ చంద్ర సేన్ (86) కన్నుమూశారు. దినాజ్పూర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురికాగా, జైలు అధికారులు ఆయనను దినాజ్పూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో రమేష్ చంద్ర సేన్ మృతి ప్రాధాన్యత సంతరించుకుంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్లో కీలక నేతగా ఉన్న రమేష్ చంద్ర సేన్, గతంలో నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 17న ఆయనను అదుపులోకి తీసుకున్నప్పటి నుండి దినాజ్పూర్ జైలులో ‘డివిజన్ ప్రిజనర్’గా ఉంచారు. జైలుకు తరలించక ముందు నుంచే ఆయన అనారోగ్యంతో ఉన్నారని, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారని జైలు సూపరింటెండెంట్ ఫర్హాద్ సర్కార్ పేర్కొన్నారు.1940 ఏప్రిల్ 30న ఠాకూర్ గావ్ జిల్లాలో జన్మించిన రమేష్ చంద్ర సేన్, అవామీ లీగ్ పార్టీలో అనుభవజ్ఞుడైన నేతగా పేరుపొందారు. మొత్తం ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1997లో ఉపఎన్నిక ద్వారా తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 2008, 2014, 2018, 2024 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. షేక్ హసీనా ప్రభుత్వంలో 2009 నుండి 2014 వరకు మంత్రిగా సేవలు అందించడమే కాకుండా, పార్టీ సలహాదారుగా కూడా వ్యవహరించారు.బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత జరుగుతున్న ఈ సాధారణ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పర్యవేక్షణలో ఫిబ్రవరి 12న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే వెలువడిన పలు సర్వేల ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో అవామీ లీగ్ సీనియర్ నేత మృతిచెందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.ఇది కూడా చదవండి: ‘ఎప్స్టీన్’ ఆరోపణలు.. దలైలామా ఏమన్నారంటే..
‘ఎప్స్టీన్’ ఆరోపణలు.. దలైలామా ఏమన్నారంటే..
ధర్మశాల: లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్తో ఆధ్యాత్మిక గురువు దలైలామాకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో దలైలామా ఎన్నడూ ఎప్స్టీన్ను కలవలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆయన తరపున మరెవరూ కూడా ఎప్స్టీన్తో సమావేశం అయ్యేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని కార్యాలయం పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని, వాటిలో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది.అమెరికాలో సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ ఫైల్స్ బహిర్గతం కావడంతో పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఉన్నత స్థాయి వ్యక్తులకు ఎప్స్టీన్తో ఉన్న సంబంధాలు, సంభాషణల వివరాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దలైలామా పేరు కూడా ప్రస్తావనకు రావడంతో చర్చ మొదలైంది. అయితే తమ గౌరవానికి భంగం కలిగించేలా సాగుతున్న ఈ ప్రచారాన్ని దలైలామా కార్యాలయం తోసిపుచ్చింది. Press StatementSome recent media reports and social media posts concerning the “Epstein files” are attempting to link His Holiness the Dalai Lama with Jeffrey Epstein.We can unequivocally confirm that His Holiness has never met Jeffrey Epstein or authorised any meeting or… pic.twitter.com/QtV6B3Wr0u— Dalai Lama (@DalaiLama) February 8, 2026అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇటీవల జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన సుమారు 30 లక్షల ఫైళ్లను విడుదల చేసింది. ఇందులో 2,000కు పైగా వీడియోలు, దాదాపు లక్షా ఎనభై వేల ఫోటోలు ఉన్నట్లు సమాచారం. ఈ పత్రాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తదిర ప్రముఖుల పేర్లు ఉన్నాయి.పేర్లు ఉన్నంత మాత్రాన వారు తప్పు చేసినట్లు కాదని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ జాబితాలో దలైలామా పేరు ఉండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాకు చెందిన ఒక సంపన్న ఆర్థికవేత్త, బాలికలు, యువతులపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణా కేసుల్లో దోషిగా తేలి జైలుకు వెళ్లాడు. 2008లో ఫ్లోరిడాలో మొదటిసారి శిక్ష అనుభవించిన ఆయన, 2019లో ఫెడరల్ దర్యాప్తులో తిరిగి అరెస్టయ్యాడు. అయితే విచారణ ఎదుర్కొంటున్న సమయంలో జైలులోనే ఆయన స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు.ఇది కూడా చదవండి: ఓపెన్ ఏఐ మరో షాక్.. ఇక స్మార్ట్ ఫోన్లకు చెక్!
ఓపెన్ ఏఐ మరో షాక్.. ఇక స్మార్ట్ ఫోన్లకు చెక్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తన నూతన ఆవిష్కరణలతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ సాఫ్ట్వేర్ వరకే పరిమితమైందనుకుంటున్న ఓపెన్ ఏఐ ఇప్పుడు హార్డ్వేర్ రంగంలోకీ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ‘డైమ్’ (Dime) అనే కోడ్ నేమ్తో కంపెనీ తన మొట్టమొదటి హార్డ్వేర్ ఉత్పత్తిగా ఏఐ ఆధారిత ఇయర్బడ్స్ను తీసుకురానున్నట్లు ‘మింట్’తన కథనంలో పేర్కొంది.‘డైమ్’ ఇయర్ బడ్స్ కేవలం సంగీతం వినడానికే పరిమితం కాకుండా, వాయిస్ కమాండ్స్ ద్వారా ఏఐ మోడళ్లను నియంత్రించేలా, హ్యాండ్స్-ఫ్రీ అసిస్టెన్స్ను అందించేలా రూపొందించారు. ఈ ఏడాది చివరిలో వీటిని ప్రపంచానికి పరిచయం చేసి, 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ‘స్మార్ట్ పికాచు’ అందించిన సమాచారం ప్రకారం చైనాలో ఇటీవల దాఖలైన ఒక పేటెంట్ ఫైలింగ్లో ‘డైమ్’ అనే పేరు వెలుగులోకి వచ్చింది.భారీ స్థాయిలో హార్డ్వేర్ పరికరాలను నేరుగా మార్కెట్లోకి తెచ్చే కంటే, వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ఇయర్బడ్స్ లాంటి సాధారణ పరికరంతో రంగప్రవేశం చేయాలని ఓపెన్ ఏఐ భావిస్తోంది. తక్కువ ఖర్చుతో సాంకేతిక ఇబ్బందులు లేకుండా హార్డ్వేర్ మార్కెట్ను చేజిక్కించుకోవడమే కంపెనీ వ్యూహమని తెలుస్తోంది. ఇవి వాయిస్ ఇంటరాక్షన్లపై దృష్టి సారిస్తూ, వినియోగదారులకు రియల్ టైమ్ ఏఐ సేవలను నేరుగా చెవి దగ్గరికే చేర్చనున్నాయి.గతంలో ఓపెన్ ఏఐ స్మార్ట్ఫోన్ తరహాలో ఉండే శక్తివంతమైన ఏఐ డివైజ్ను తీసుకువస్తుందనే ప్రచారం జరిగింది. అయితే హై బ్యాండ్విడ్త్ మెమరీ (హెచ్బీఎం)కొరత కారణంగా విడిభాగాల ధరలు విపరీతంగా పెరగడంతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం వాయిదా పడినట్లు సమాచారం. తయారీ వ్యయం కారణంగా కంపెనీ ప్రస్తుతానికి తన నిర్ణయాన్ని మార్చుకుని, 2026లో సరళమైన వెర్షన్ (డైమ్ ఇయర్బడ్స్)ను లాంచ్ చేయాలని నిశ్చయించుకుందని సమాచారం.ఓపెన్ ఏఐ చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ క్రిస్ లెహనే గతంలోనే కంపెనీ తొలి హార్డ్వేర్ ఉత్పత్తిపై పనిచేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అప్పట్లో దాని ఆకారం లేదా ఫీచర్ల గురించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ ఏడాదిలోనే ఆ పరికరాన్ని ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నప్పటికీ, లాంచ్ తేదీని వెల్లడించలేదు. ప్రస్తుతం ‘డైమ్’ బ్రాండింగ్తో వస్తున్న ఇయర్బడ్స్ వార్తలపై ఓపెన్ ఏఐ ఇంకా స్పందించాల్సి ఉంది. ఆపిల్ మాజీ డిజైన్ హెడ్ జోనీ ఐవ్ నేతృత్వంలో ఈ నూతన పరికరాలు రూపుదిద్దుకుంటున్నాయనే వార్తలు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారాయి. కాగా డైమ్ ఇయర్బడ్స్ అందుబాటులోకి వస్తే, అవి స్మార్ట్ ఫోన్ల వినియోగానికి చెక్ పెట్టనున్నాయనే వాదన వినిపిస్తోంది.ఇది కూడా చదవండి: ‘వాషింగ్టన్ పోస్ట్’లో మరో సంచలనం.. ఇప్పుడు సీఈఓ వంతు..
జాతీయం
సర్వం భారతీయం!
ప్రపంచ టెక్ గమనాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఇన్నాళ్లూ అగ్రరాజ్యాలదే ఆధిపత్యం. కానీ, ఆ గతాన్ని తిరగరాస్తూ భారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’అద్భుతాలు సృష్టిస్తోంది. కేవలం అనుకరణలతో సరిపెట్టుకోకుండా, మట్టి వాసన తెలిసిన ‘సొంత’సాంకేతికతతో అంతర్జాతీయ దిగ్గజాలైన గూగుల్ జెమిని, చాట్ జీపీటీనీ వెనక్కి నెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. గూగుల్, చాట్ జీపీటీలకే సవాల్ భారతీయ మేధస్సు గ్లోబల్ టెక్ మ్యాప్పై తన ముద్రను బలంగా వేస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘సర్వం ఏఐ’అభివృద్ధి చేసిన సరికొత్త ఏఐ మోడల్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా రెండు టూల్స్ ద్వారా ఈ సంస్థ టెక్ దిగ్గజాలకు గట్టి పోటీనిస్తోంది. 93.28 శాతం కచ్చితత్వం ఇది అద్భుతమైన ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రికగి్నషన్ టూల్). భారత భాషల్లోని పత్రాలను చదవడంలో అమోఘమైన పనితీరును కనబరుస్తోంది. ఓఎల్ఎంఓసీఆర్ బెంచ్మార్క్లో 84.3 శాతం స్కోరును సాధించి, గూగుల్ జెమిని 1.5 ప్రో, చాట్ జీపీటీలను మించిపోయింది. సంక్లిష్ట పట్టికలు, గణిత ఫార్ములాలనూ 93.28 శాతం కచ్చితత్వంతో విశ్లేషించగలగడం దీని విశిష్టత. బుల్ బుల్ వి3 ఇది అచ్చమైన భారతీయ గొంతుకలతో కూడిన వాయిస్ ఏఐ మోడల్. ప్రస్తుతం 11 భారతీయ భాషల్లో 35కు పైగా సహజసిద్ధమైన స్వరాలను ఇది అందిస్తోంది. త్వరలో దీనిని 22 భాషలకు విస్తరించనున్నారు. అంతర్జాతీయ టూల్స్ భారతీయ భాషల విషయంలో తడబడుతున్న వేళ, సర్వం ఏఐ అత్యంత స్పష్టమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను అందిస్తోంది. ‘సర్వం’ పనితీరుకు ఫిదా ఒకప్పుడు భారతీయ ఏఐ నమూనాల సామర్థ్యాన్ని శంకించిన విమర్శకులు సైతం ‘సర్వం’ పనితీరుకు ఫిదా అవుతున్నారు. గ్లోబల్ ఏఐ ల్యాబ్లు విస్మరించిన భారతీయ భాషా వైవిధ్యాన్ని శక్తిగా మలుచుకుంటూ ఏఐ రంగంలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోందనడానికి ఈ విజయమే నిదర్శనం. – సాక్షి, నేషనల్ డెస్క్
114 రఫేల్ జెట్ల ఒప్పందం ఖరారు!
న్యూఢిల్లీ: అత్యంత అధునాతన, శక్తిమంతమైన రఫేల్ యుద్ధ విమానాలతో భారత గగనతలాలను శత్రు దుర్భేద్యంగా మార్చే ప్రక్రియను రక్షణ శాఖ వేగవంతం చేసింది. రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో ఒకేసారి 114 రఫేల్ ఫైటర్జెట్లను కొనుగోలుచేసేందుకు ఉద్దేశించిన సమీకరణ ఒప్పంద ప్రతిపాదనలకు సాయుధ ఉపకరణాల సమీకరణ బోర్డ్ ఇటీవల పచ్చజెండా ఊపగా, రక్షణ కొనుగోళ్ల మండలి వాటికి ఆమోద ముద్ర వేయనుందని సమాచారం. ఈ నెల చివరికల్లా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన రక్షణరంగ ప్రైవేట్ దిగ్గజం డసాల్ట్ ఏవియేషన్ నుంచి ఈ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయనుండటం గమనార్హం. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ సారథ్యంలోని రక్షణ కొనుగోళ్ల మండలి త్వరలో రోజుల్లో సమావేశమై లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ ‘కనీస అనుమతి’ప్రతిపాదనకు అంగీకారం తెలపనుంది. ఒప్పందం సాకారమైతే కేవలం 18 విమానాలు మాత్రమే ఫ్రాన్స్లో తయారై నేరుగా భారత్కు ఎగిరొస్తాయి. మిగతా వాటిని భారత్లోనే ఉత్పత్తి కర్మాగారాలను నెలకొల్పి దేశీయంగా తయారు చేయనున్నారు. ఈ లెక్కన దాదాపు 80 శాతం విమానాలు భారత్లోనే తయారుకానున్నాయి. అంతేకాదు, వాటిల్లో 60 శాతం విడిభాగాలను మేకిన్ ఇండియా ఆత్మనిర్భరత కార్యక్రమంలో భాగంగా ఇక్కడే అభివృద్ధి చేయనున్నారు. రఫేల్ యుద్ధవిమానాలను దేశీయంగా తయారు చేయాలని భారత్ నిర్ణయించుకున్న నేపథ్యంలో స్థానిక ప్రైవేట్ కంపెనీలతో దసాల్ట్ ఏవియేషన్ ఒప్పందాలు చేసుకోవాల్సి రావొచ్చు. అసెంబ్లింగ్, తయారీ యూనిట్లను నెలకొల్పాల్సి ఉంటుంది.
శత్రు శాటిలైట్లపై నిఘా
భూతలం మీదకు దూసుకొచ్చే శత్రు క్షిపణులను మార్గమధ్యంలో, గాల్లో ధ్వంసంచేసే గగనతల రక్షణ వ్యవస్థలు భారత్కు ఉన్నాయి. అయితే మన సైనిక స్థావరాల జాడ కనిపెట్టేందుకు నింగిలో సంచరించే శత్రుదేశాల కృత్రిమ ఉపగ్రహాల జాడ పసిగట్టి అప్రమత్తం చేసే వ్యవస్థ గతంలో భారత్కు లేదు. తాజాగా ఆ శక్తిసామర్థ్యాల సముపార్జనలో భారత్ కీలక ముందడుగువేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఆరంభమైన అంకుర సంస్థ ఒకటి కొత్త తరహా పరిశోధనలు చేస్తూ ఈ అప్రమత్త వ్యవస్థ అందిపుచ్చుకుంటోంది. అంతరిక్షంలో ఒకరకంగా అతిపెద్ద ఉపగ్రహంగా పేరొందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) జాడను కనిపెట్టి ‘అజిస్టా స్పేస్’తన సత్తా చాటింది. కక్ష్య మార్చుకుని భారత గగనతలంపై చక్కర్లు కొడుతూ కీలక సమాచారాన్ని సేకరించే అనుమానాస్పద శత్రు ఉపగ్రహాల జాడను కనిపెట్టేందుకు ఈ కొత్త స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్(ఎస్ఎస్ఏ) పరిజ్ఞానం ఎంతగానో సాయపడుతుందని అజిస్టా స్పేస్ పేర్కొంది. గుర్తు తెలియని ఉపగ్రహాల జాడను గుర్తించడంతోపాటు వాటి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పర్యవేక్షణ పనులను పూర్తిచేసే పరిజ్ఞానాన్నే ఎస్ఎస్ఏగా పిలుస్తారు. తాజాగా భారత్ మీదుగా ఐఎస్ఎస్ పయనిస్తున్న సమయంలో దాని ఫొటోలను తమ ఏఎఫ్ఆర్ సెన్సార్ సాయంతో సేకరించామని అజిస్టా స్పేస్ ప్రకటించింది. భూమి ఫొటోలు తీయడానికి బదులు ఆకాశంలో నిర్దేశిత ప్రాంతం గుండా పయనించే, నిర్దేశిత ప్రాంతంపై నిఘా పెట్టే ఉపగ్రహాలను కనిపెట్టేందుకు నాన్–ఎర్త్ ఇమేజింగ్(ఎన్ఈఐ) పనుల కోసం ఈ అంకుర సంస్థ ఒక చిన్న ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. దానిపై బిగించిన ఎలక్ట్రో–ఆప్టికల్ కెమెరా సాయంతో ఈ ఫొటోలను తీయగలిగింది. అత్యంత కచ్చితత్వంతో ఫొటోలు ఈనెల మూడో తేదీన రెండు వేర్వేరు సందర్భాల్లో ఐఎస్ఎస్ జాడను అత్యంత కచ్చితత్వంతో గుర్తించామని సంస్థ పేర్కొంది. ఈ మేరకు అప్పుడు తీసిన ఫొటోలను విడుదలచేసింది. 300 కిలోమీటర్లు, 245 కిలోమీటర్ల దూరాల నుంచి దాని ఫొటోలను తీసింది. దాని గమనానికి సంబంధించి మొత్తం 15 ఛాయాచిత్రాలను సేకరించింది. ఎదురుగా దేదీప్యమానంగా వెలిగిపోతున్న సూర్యుని సూర్యకిరణాలు తీక్షంగా తగులుతున్నా, అత్యంత వేగంగా అంతరిక్ష కేంద్రం ప్రయాణిస్తున్నాసరే దాని పొజిషన్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తిస్తూ ఫొటోలు తీయడం విశేషం. ఫొటోల సేకరణలో తమ ట్రాకింగ్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేసిందని కంపెనీ వెల్లడించింది. 2.2 మీటర్ల రెజల్యూషన్తో ఫొటోలు తీయడం గమనార్హం. అంటే ఒక్కో పిక్సెల్ను పరిగణనలోకి తీసుకుంటే ఫొటో తీసే సమయానికి అది కచ్చితంగా ఎంత దూరంలో ఉందనేది తేల్సిపోతుందని కంపెనీ పేర్కొంది. ఇంతటి కచ్చితత్వంతో ఫొటోలు తీసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవడం కీలక ముందుడుగుగా నిపుణులు పేర్కొన్నారు. ఇది భవిష్యత్తులో ఇతర అనుమానాస్పద ఖగోళ వస్తువులు, గ్రహశకలాలు, శత్రు శాటిలైట్ల స్థితిగతులను అంచనా వేసే శక్తిసామర్థ్యాల మెరుగుకు ప్రేరణగా నిలుస్తుందని ఖగోళ నిపుణులు చెప్పారు. శాటిలైట్ ట్రాకింగ్ అల్గారిథమ్ను మరింతగా మెరుగుపర్చుకుంటే అంతర్జాతీయ స్థాయి సామర్థ్యాలను సముపార్జించడం త్వరలోనే సాకారమవుతుందని వాళ్లు ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్లో తయారై, భారత్ నుంచి పర్యవేక్షణలో ఉన్న ఒక బుల్లి ఉపగ్రహం ఐఎస్ఎస్ ఫొటోను తీయడం ఇదే తొలిసారి అని అజిస్టా స్పేస్ ప్రకటించింది. ఇది భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో మైలురాయిగా నిలిచిపోనుంది. భూకక్షల్లో వేలాదిగా కృత్రిమ ఉపగ్రహాలు పోగుబడుతుండటం, పాడైన, కాలంచెల్లిన ఉపగ్రహాలు ఢీకొని అంతరిక్ష చెత్త ఎక్కువవడం, వీటి మధ్య శత్రుదేశాల ఉపగ్రహాలు భారత్పై నిఘా పెట్టడం వంటి భిన్న పరిస్థితుల్లో ఆకాశంపై పెద్ద నిఘా కన్ను వేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్(ఎస్ఎస్ఏ) పరిజ్ఞానంలో అగ్రగామిగా మారడం తక్షణావసరంగా మారింది. అజిస్టా స్పేస్ సంస్థ ఎలక్ట్రో–ఆప్టికల్ పేలోడ్లతోపాటు శాటిలైట్ వ్యవస్థలు, ఇమేజ్–ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్లు, నిఘా, పర్యవేక్షణ ఉపగ్రహాలకు సంబంధించిన విడిభాగాలనూ తయారుచేస్తోంది. ఇవి పౌర, రక్షణ, వాతావరణ సంబంధ ఉపగ్రహాలకు అక్కరకొస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
ఓటీసీ 'మందు'
చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుల దగ్గరకు వెళ్లడం గతం. ఇప్పుడు ముందుగా గూగుల్లో సెర్చ్ చేయడం.. లేదంటే బంధువులు, సన్నిహితుల సలహా తీసుకుని సమీపంలోని ఫార్మసీకి వెళ్లి కావాల్సిన మందులు తెచ్చుకోవడం. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలైతే ఒక అడుగు ముందుకేసి ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అందుకే భారత్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) ఔషధాల వినియోగం పెరుగుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్వినియోగదార్లకు అవగాహన పెరగడం, అందుబాటు ధర.. వెరసి ఓటీసీ ఔషధాల వినియోగం క్రమంగా అధికం అవుతోంది. మన దేశంలో ఓటీసీ మందుల వ్యాపారం 2020–24 మధ్య సగటున ఏటా 10% పెరిగింది. 2026–30 మధ్య ఇది 13% వృద్ధి చెందుతుందని ఈవై పాథనాన్ నివేదిక చెబుతోంది. భారత్లో 2024లో రూ.47 వేల కోట్ల విలువైన ఓటీసీ మందులు అమ్ముడయ్యాయి. అయిదేళ్లలో ఈ విలువ రెండింతలు దాటుతుందని అంచనా.అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లో వీటి వ్యాపారం చాలా తక్కువ. కానీ వృద్ధి వేగం ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఏటా రూ.17.37 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతోంది. అమెరికా, పశ్చిమ యూరప్, జపాన్ ప్రధాన మార్కెట్లు. ఈ దేశాల్లో ఏటా సగటున ఒక్కో వ్యక్తి ఓటీసీ మందులకు రూ.6,300–11,700 ఖర్చు చేస్తున్నారు. భారత్లో ఇది కేవలం రూ.270–360 మధ్య ఉంది. జాగ్రత్తగా వాడితేనే..ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) మెడిసిన్ అంటే ప్రి్రస్కిప్షన్ లేకుండా వినియోగదారులకు నేరుగా ఫార్మసీల్లో విక్రయించే ఔషధాలు. తలనొప్పి, జలుబు, అలెర్జీలు, నొప్పి వంటి చిన్న చిన్న సమస్యల చికిత్సలకు ఆసుపత్రులకు వెళ్లడానికి బదులుగా నేరుగా మందుల షాపు నుంచి జనం కొనుగోలు చేస్తారు. ఊళ్లలో అయితే స్థానిక మందుల షాపు యజమానితో నేరుగా పరిచయం ఉండటంతో సమస్య చెబితే మందులు ఇస్తారన్న నమ్మకమూ ఉంటుంది. నిర్దేశించిన సూచనలకు అనుగుణంగా వీటిని జాగ్రత్తగా వినియోగిస్తేనే ప్రభావవంతంగా ఉంటాయి. అతిగా వాడితే దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. చిన్న సమస్యలు ఎక్కువకాలం ఇబ్బంది పెడితే వైద్యులను సంప్రదించాల్సిందే. దేశంలో ఓటీసీ ఔషధాలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నియంత్రిస్తుంది. ప్రివెంటివ్ కేర్కు ప్రాధాన్యం జబ్బులు రాకుండా జనం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జీవనశైలి మారడంతో మధుమేహం, అధిక బరువు, రక్తపోటు వంటి రోగాలు పెరుగుతున్నాయి. వీరితోపాటు కేన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలున్న వారు సపోర్ట్ థెరపీలో భాగంగా సప్లిమెంట్స్ వాడుతున్నారు. వీరికి ఎక్కువ కాలంపాటు సప్లిమెంట్స్ అవసరం. అందుకే న్యూట్రాస్యూటికల్స్కు డిమాండ్ బాగా పెరిగింది. ఎంతో కాలంగా ఔషధ రంగంలో ఉన్న కంపెనీల నాణ్యమైన ఓటీసీ ఉత్పత్తులను కొనేందుకే జనం మొగ్గు చూపుతున్నారు. – ఆళ్ల లీలా రాణి, డైరెక్టర్, లీ హెల్త్ డొమెయిన్ 2024లో ఆరోగ్యం కోసం.. ⇒ స్కిన్కేర్, వెయిట్ మేనేజ్మెంట్, ఫిట్నెస్కు సంబంధించి 2.7 కోట్ల ఆన్లైన్ సెర్చ్లు నమోదయ్యాయి⇒ 25 లక్షల మంది ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.⇒ ఆరోగ్య స్థితిని పర్యవేక్షించేందుకు 40% మంది వేరబుల్స్ వాడుతున్నారు
ఎన్ఆర్ఐ
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే వలస కార్మికుల ఉచిత వీసాల కోసం అక్కడి ఏడీఎన్హెచ్ సంస్థ, తెలంగాణలోని జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నాలుగు చోట్ల ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. క్లీనింగ్ విభాగంలో పనిచేసేందుకు ఉచితంగా వీసాలను జారీ చేసి, ఉచిత విమాన టికెట్, వసతి, భోజన సదుపాయం కల్పించి.. మన కరెన్సీలో రూ.23 వేల వరకు వేతనాలను చెల్లించనున్నారు. వచ్చే నెల 6న జగిత్యాల, సిరిసిల్లలో, 7న నిజామాబా ద్, ఆర్మూర్లలోని జీటీఎం సంస్థ కార్యాలయాలలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. వివ రాల కోసం ఆర్మూర్ (8332062299), నిజామాబాద్ (8686860999), జగిత్యాల (83320422 99), సిరిసిల్ల (9391661522) నంబర్లలో సంప్రదించవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దళారుల్ని నమ్మొద్దు ఈనెల 9, 10 తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరైన వంద మందిని రెండు మూడు రోజుల్లో యూఏఈకి పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దళారులను నమ్మి మోసపోవద్దు. – చీటీ సతీశ్రావు, చైర్మన్, జీటీఎం ఇంటర్నేషనల్ (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!)
వైభవంగా తానా మిడ్-అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలను చూడటానికి వచ్చిన జనసందోహం, మరోవైపు తమ ఆట, పాటలతో మైమరపింపజేసిన చిన్నారులతో తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సూపర్ హిట్టయింది. వెస్ట్ చెస్టర్ లో జనవరి 17వ తేదీన జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దాదాపు 1500మందికిపైగా వచ్చిన జనసందోహం నిర్వాహకులకు, కళాకారులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికితోడు సంక్రాంతి థీమ్ ను ప్రతిబింబించేలా చేసిన కార్యక్రమాలు, పోటీలు అందరిలోనూ పాల్గొనేలా చేశాయి.తానా మిడ్ అట్లాంటిక్ కు చెందిన బోర్డ్ డైరెక్టర్ రవిపొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు చిన్నారులు పాడిన సినిమా పాటలు ఎంతోమందిని అలరింపజేశాయి. యాంకర్లు శ్వేత కొమ్మోజి, మనీషా మేక కూడా కార్యక్రమాల విజయానికి తమవంతుగా వ్యాఖానాలను జోడించి ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. సాంప్రదాయ భోగిపళ్లు కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు వారిపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు, కిడ్స్ విలేజ్ థీమ్ కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారిని తానా నాయకులు అభినందించారు. ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకుల కోసం 7,000 పౌండ్లకు పైగా ఆహారాన్ని విరాళంగా సేకరించడంలో ప్రతిభ కనబరిచిన యువ వలంటీర్లను ఈ సంక్రాంతి వేడుకల్లో సత్కరించడం హైలైట్ గా నిలిచింది. వెస్ట్ వైట్ ల్యాండ్ టౌన్ షిప్ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ వైస్-ఛైర్ మిస్టర్ రాజేష్ కుంభార్దరే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి వలంటీర్లను సత్కరించారు.తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తదితరులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ను అభినందించారు. ఈవెంట్ కోఆర్డినేటర్లు సురేష్ యలమంచిలి, కృష్ణ నందమూరితోపాటు మిడ్ అట్లాంటిక్ టీమ్ నాయకులు, వలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన క్రాస్ రోడ్స్, గోల్డెన్ స్పాన్సర్స్ గా ఉన్న శ్రీధర్ అంచూరి మరియు సురేష్ బందుగులకు, కమలం ది డెకర్ కంపనీకి, అతిథులకు, వలంటీర్లకు కమ్యూనిటీ నాయకులకు, ఈ వేడుకకు సహకరించిన అందరికీ తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.తానా మిడ్ అట్లాంటిక్ టీమ్`సరోజ పావులూరి, దీప్తి కోక, మనీషామేక, శైలజ కస్తూరి, సునీత వాగ్వాల, మైత్రి నూకల, బిందు ఆలపాటి, రమ్య మాలెంపాటి, ఇందు సందడి, రాణి తుమ్మల, భవానీ క్రొత్తపల్లి, అనుపమ యలమంచి, భవానీమామిడి, నీలిమ వోలేటి, రవీన తుమ్మల, శ్రావణి రాయలతోపాటు, విశ్వనాథ్ కోగంటి, శ్రీధర్ సాధినేని, శ్రీకాంత్ గూడురు, గోపి వాగ్వాల, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, వెంకట్ ముప్పా, రమేష్ గుట్ట, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి, ప్రసాద్ కస్తూరి, రంజిత్ కోమటి, రంజిత్ మామిడి, మూర్తి నూతనపాటి, చందు భాతుస్కర్, సంతోష్ రౌతు, సత్య పొన్నగంటి, రాజు గుండాల, రాధాకృష్ణ మూల్పూరి, నాయుడమ్మ యలవర్తి, చలం పావులూరి, మోహన్ మల్ల ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు.
భార్యను, బంధువులను కాల్చి చంపాడు!
న్యూయార్క్: అమెరికాలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ భారత సంతతి వ్యక్తి క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. భార్య, ఆమె తరఫు ముగ్గురు బంధువులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్లముందే జరిగిన దారుణం చూసి బెంబేలెత్తిపోయిన అతని 12 ఏళ్ల కొడుకు, బంధువుల తాలూకు మరో ఇద్దరు పిల్లలు వెంటనే ఓ గదిలోకి దూరి గడియ పెట్టుకుని బతికిపోయారు. కొడుకు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే పారిపోయిన నిందితున్ని కొద్ది దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం అందరినీ కలచివేస్తోంది. నిందితున్ని విజయ్కుమార్ (51)గా, మృతులను అతని భార్య మీమూ డోగ్రా (43), మిగతా వారిని గౌరవ్ కుమార్ (33), నిధీ చందర్ (37), హరీశ్ చందర్ (38)గా గుర్తించారు. ఇది మాటలకందని ఘోరమని అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది. బాధిత కుటుంబానికి అన్నివిధాల సాయమూ అందిస్తున్నట్టు పేర్కొంది. గదిలో దాక్కున్న పిల్లలు విజయ్కుమార్ దంపతులు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నివసిస్తుండేవారు. శుక్రవారం అర్ధరాత్రి ఏదో విషయమై ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఘర్షణ నడుమే కొడుకుతో కలిసి శివారు నగరమైన లారెన్స్విలేలోని బ్రూక్స్ ఐవీ కోర్ట్లో ఉంటున్న డోగ్రా తాలూకు బంధువులు గౌరవ్, నిధి, హరీశ్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఘర్షణ శ్రుతిమించి కాల్పులకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవకు దారితీసిన కారణమేమిటో తెలియాల్సి ఉందని చెప్పారు. ‘‘విజయ్ దంపతుల 12 ఏళ్ల కొడుకు తెల్లవారుజాము 2:30 ప్రాంతంలో మాకు కాల్ చేసి దారుణం గురించి చెప్పాడు. రాపిడ్ రెస్పాన్స్ బృందం నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది. నలుగురు వ్యక్తు లు ఇంట్లో తూటా గాయాలతో పడిపోయి కన్పించారు. ముగ్గురు పిల్లలు సకాలంలో స్పందించి పక్క గదిలోకి పరుగెత్తి దాక్కోవడంతో దాడి నుంచి బయ ట పడ్డట్టున్నారు’’అని పోలీసులు వివరించారు.
TPAD అధ్యక్షురాలిగా వరుసగా మూడోసారీ మహిళకే పట్టం
డల్లాస్, టెక్సాస్లో శక్తివంతమైన, ప్రభావవంతమైన తెలుగు సంస్థగా అక్కడి తెలుగు ప్రజల మన్ననలు పొందుతున్న “డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (TPAD)”.. 2026 సంవత్సరానికి గాను తన నూతన కార్యవర్గ బృందానికి బాధ్యతలు అప్పగించింది. గత 12 ఏళ్లలో టీప్యాడ్, డల్లాస్లోని తెలుగు సమాజంలో స్వచ్ఛంద సేవకులు, కమ్యూనిటీ సభ్యులను విస్తృతంగా ఆకర్షిస్తూ అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. బలమైన సంస్థాగత నిర్మాణం ద్వారా అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దింది.సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణతో పాటు మంచి నాయకులను తీర్చిదిద్దడంలో అద్భుతమైన చరిత్ర కలిగిన టీప్యాడ్, ఫ్రిస్కో, టెక్సాస్లోని ఎలిగెన్స్ బాల్రూమ్లో స్థానిక కమ్యూనిటీ నాయకులు, మద్దతుదారుల సమక్షంలో తన 13 వ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో ప్రమాణస్వీకారం చేయించింది. టీప్యాడ్ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహిళలే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. మహిళా సాధికారతకు, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి టీప్యాడ్ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం.టీప్యాడ్ చరిత్ర, నేపథ్యంపై విస్తృత అవగాహన కలిగిన వీణా యలమంచిలి కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించారు. సీనియర్ టీప్యాడ్ నాయకులు మరియు ఫౌండేషన్ కమిటీ సభ్యుడు రావు కల్వాల — రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్)లతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీప్యాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు సుధాకర్ కలసాని — కార్యవర్గ సభ్యులు మరియు పదాధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు.కొత్త కమిటీ సభ్యులు లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), శ్రీనివాస్ అన్నమనేని (ఉపాధ్యక్షుడు), గాయత్రి గిరి (కార్యదర్శి), శివ కొడిత్యాల (సహ కార్యదర్శి), ఆదిత్య రెడ్డి (ఖజాంచీ), దీపిక దీపికా రెడ్డి (సహ ఖజాంచీ) .నూతన ఈసీ సభ్యులు:బాల గణపవరపు, మాధవి ఓంకార్, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, తిలక్ కుమార్ వన్నంపుల.రవికాంత్ మామిడి, అశోక్ పొద్దుటూరి, రోజా అడెపు, మాధవి సుంకిరెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండాల, పాండురంగ రెడ్డి పల్వాయి, బుచ్చి రెడ్డి గోలితో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రవికాంత్ మామిడి (BOT ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్)లకు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకార అనంతరం మాట్లాడిన FC ఛైర్ రఘువీర్ బండారు, BOT ఛైర్ రవికాంత్ మామిడి, అధ్యక్షురాలు లక్ష్మి పోరెడ్డి, కోఆర్డినేటర్ లింగా రెడ్డి ఆల్వా, BOT వైస్ ఛైర్ రోజా అడెపు-రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక వేడుకల నిర్వహణ, బతుకమ్మ, దసరా సంబరాలను డీఎఫ్డబ్ల్యూ తెలుగు సమాజం ఆశించే స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు నూతన బృందం కట్టుబడి ఉందని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా టీప్యాడ్కు నిరంతర మద్దతు అందిస్తున్న సపోర్టర్లు, స్పాన్సర్లకు టీప్యాడ్ నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.టీప్యాడ్ 2026 కార్యవర్గం:ఎగ్జిక్యూటివ్ కమిటీ:లక్ష్మి పోరెడ్డి (President), అనురాధ మేకల (Past President), శ్రీనివాస్ అన్నమనేని (Vice President), గాయత్రి గిరి (Secretary), శివ కొడిత్యాల (Joint Secretary), ఆదిత్య రెడ్డి (Treasurer), దీపిక దీపికా రెడ్డి (Joint Treasurer), స్వప్న తుమ్మపాల, నిఖిల్ కందుకూరి, ప్రశాంత్ నిమ్మని, మాధవి ఓంకార్, స్నేహా రెడ్డి, సంతోష్ రెగొండ, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, తిలక్ కుమార్ వన్నంపుల, రత్న వుప్పల, బాల గణపవరపు.బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్:రవికాంత్ మామిడి (BOT ఛైర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), మాధవి సుంకిరెడ్డి, రమణ లష్కర్, పాండురంగ రెడ్డి పల్వాయి, రామ్ అన్నాడి, బుచ్చి రెడ్డి గోలి, అశోక్ కొండాల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, అశోక్ పొద్దుటూరి.ఫౌండేషన్ కమిటీ:రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్), జనకిరామ్ మండాది, ఉపేందర్ తెలుగు, రాజ్ గోంధి, మహేందర్ కమిరెడ్డి
క్రైమ్
కారులోనే పద్మ మృతదేహం.. భర్త కోసం గాలింపు
నల్గొండ జిల్లా: ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సుమారు 15 గంటలపాటు శ్రమించి నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద శనివారం రాత్రి సాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లిన కారును తాళ్ల సహాయంతో ఆదివారం ఉదయం బయటకు వెలికితీశారు. కారులో తల్లం పద్మ(60) మృతదేహాన్ని గుర్తించగా.. ఆమె భర్త పుల్లయ్య ఆచూకీ లభించలేదు. పద్మ మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్(జాతీయ విపత్తు దళం) సిబ్బంది, నిడమనూరు పోలీసులు పుల్లయ్య ఆచూకీ కోసం ముకుందాపురం బ్రిడ్జి నుంచి పెద్దదేవులపల్లి రిజర్వాయర్ వరకు సాగర్ ఎడమ కాల్వలో, తూముల వెంట వెతుకుతున్నారు. ప్రమాదం జరిగింది ఇలా..త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య, అతడి భార్య పద్మ శనివారం రాత్రి మిర్యాలగూడలోని తమ చిన్న కుమారుడు తల్లం శివ నివాసం నుంచి కారులో డ్రైవర్ను తీసుకుని స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలో నిడమనూరు మండలం ముకుందాపురం వద్దకు రాగానే డ్రైవర్ రసూల్ కాలుకు ఉన్న చెప్పు సరిచేసుకుంటుండగా.. కారు యాక్సిలేటర్కు చెప్పు తగలి వేగం పెరిగి కారు సాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లింది. ఘటన జరిగిన వెంటనే స్థానికుల సహాయంతో కారు డ్రైవర్ కాల్వలో నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న హాలియా సీఐ సతీష్రెడ్డి, నిడమనూరు ఎస్ఐ ఉప్పు సురేష్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో పుల్లయ్య దంపతులను రక్షించేందుకు నాలుగు గంటలకు పైగా శ్రమించారు. కారును గుర్తించినప్పటికీ బయటకు తీయడానికి సాధ్యం కాలేదు. ఆదివారం ఉదయం కలెక్టర్, నిడమనూరు తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, ఇతర ఉన్నతాధికారులు ఎన్ఎస్పీ అధికారులకు పరిస్థితిని వివరించి నీటి ప్రవాహాన్ని తగ్గించడంతో క్రేన్, తాళ్ల సహాయంతో కారును బయటకు వెలికితీశారు. ముకుందాపురం సర్పంచ్ సలికంటి పద్మాసత్యం అధికారులకు కావాలి్సన సామగ్రి, తాళ్లతో పాటు లైటింగ్, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ పరిశీలించారు. బ్రిడ్జి వెంట ఎటువంటి ఇనుప కంచె, రాతి స్తంభాలు, లైటింగ్ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు కలెక్టర్కు వివరించారు.నాన్నా.. మందులు వేసుకోమిర్యాలగూడలోని తన ఇంటి నుంచి కారులో బయల్దేరే ముందు తన తండ్రికి ‘సకాలంలో మందులు వేసుకోండి.. బై’ అని చివరిసారిగా చెప్పానని పుల్లయ్య, పద్మ దంపతుల చిన్న కుమారుడు శివ కన్నీరు మున్నీరయ్యాడు. కాల్వలో నుంచి కారును బయటకు తీయగానే పద్మ మృతదేహం మాత్రమే కన్పించడంతో ‘మా నాన్న ఎక్కడ అని’ వారి కుమార్తె నాగసంధ్య రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. పుల్లయ్య పెద్ద కుమారుడు తల్లం శ్రీనివాస్ అమెరికాలో ఉంటున్నాడని, అతడికి వీసా లభించడం కూడా కష్టమని బంధువులు వాపోతున్నారు.సీసీ కెమెరాలతో కారును గుర్తించి..కాల్వలో పడిపోయిన కారును గుర్తించడంలో త్రిపురారం మండలం దుగ్గేపల్లికి చెందిన బోరు మెకానిక్ ఎన్. అశోక్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి సహాయం చేశారు. సీసీ కెమెరాలతో బోర్లలో ఇరుక్కుపోయిన మోటార్లను గుర్తించడంలో అశోక్ సిద్ధహస్తుడు కాగా.. ఘటన జరిగిన వెంటనే అధికారులు ఆయనను సంప్రదించగా, బోరు పైపులను ఉపయోగించి సీసీ కెమెరాల సాయంతో రెండు గంటలకు పైగా శ్రమించి కాల్వలో కారును గుర్తించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నీటి అడుగులోకి వెళ్లి తాళ్లతో కారును కట్టి ఉంచారు. ఆదివారం కారును బయటకు తీశారు.కొబ్బరి మట్ట ఇచ్చి.. డ్రైవర్ ప్రాణం కాపాడి..ముకుందాపురం గ్రామానికి చెందిన ముద్దాల వెంకన్న శనివారం రాత్రి సాగర్ ఎడమ కాల్వకు అవతలి వైపు పొలం వద్ద మోటారు ఆఫ్ చేసి వస్తుండగా కారు కాల్వలోకి దూసుకెళ్లడం గమనించాడు. వెంటనే అతడు కాల్వ వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే డ్రైవర్ రసూల్ కారు కిటికీలో నుంచి బయటకు వస్తుండటం గుర్తించాడు. వెంటనే కాల్వ పక్కన ఉన్న కొబ్బరి మట్ట ఇచ్చి డ్రైవర్ రసూల్ను కాల్వలో నుంచి బయటకు లాగాడు.
‘నంబర్’ ప్లేట్ ఫిరాయించాడు
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ ధరించకపోడం సహా పలు ఉల్లంఘనలకు పాల్పడుతున్న వ్యక్తి ఈ–చలాన్లు తప్పించుకోవడానికి తన వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లో ఓ సంఖ్యను మార్చేశాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ఈ– చలాన్లు మరో వాహనం యజమానికి వెళ్లాయి. ఆయన ఫిర్యాదుతో ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్కు పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నారు. ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. మలక్పేటకు చెందిన సయ్యద్ అలీవుద్దీన్ ద్విచక్ర వాహనం అసలు రిజిస్ట్రేషన్ నంబర్ టీఎస్11ఈజెడ్ 2936. ఈ–చలాన్లు తప్పించుకుపోవడానికి ఉద్దేశపూర్వకంగా దాన్ని టీఎస్11ఈజెడ్ 2836గా మార్చాడు. దీంతో ఇతడు చేసిన ఉల్లంఘనలకు సంబం«ధించిన చలాన్లు ‘2836’ వాహన యజమాని ఫహీమ్ అలీకి వెళ్లాయి. ఇలా దాదాపు 23 చలాన్లు అందుకున్న ఆయన చివరకు నగర ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధ్యుడిని పట్టుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగి సీసీ కెమెరాలను పరిశీలించి అలీవుద్దీన్ ఆచూకీ కనిపెట్టారు. నిందితుడిపై చాదర్ఘాట్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు కోర్టులో నిరూపితమైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తమ వాహనం నంబర్ ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తిస్తే వెబ్సైట్: ఈ– చలాన్ తప్పించుకోవడానికి ఎత్తుగడ ఈమెయిల్: echallan helpdesk.hyd@gmail.com, వాట్సాప్: 87126 61690లకు ఫిర్యాదు చేయవచ్చని ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ సూచించారు.
ప్రియురాలికి వీడియో కాల్ చేసి ఉరి
మేడిపల్లి: ప్రియురాలితో వీడియోకాల్ మాట్లాడుతూ.. ఒక బాలుడు ఉరి వేసుకుని మృతి చెందాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. బోడుప్పల్లోని అయ్యప్ప దేవాలయం సమీపంలో ఓ ప్రయివేట్ ఉద్యోగి నివసిస్తున్నాడు. అతని కుమారుడు గంగాధరి అభినవ్ (17) ఐటీఐ చదువుతున్నాడు. మేడిపల్లిలోని మహేంద్ర కార్ షోరూంలో ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్నాడు. ఈ నెల 5న తల్లిదండ్రులు రాత్రి షాపింగ్ కోసమని బయటకు వెళ్లారు. ఇంట్లో ఉన్న బాలుడు క్లాస్మేట్ అయిన ప్రియురాలికి వీడియోకాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని బెదిరించాడు. చున్నీతో అభినవ్ ఉరి వేసుకోవడం చూసిన బాలిక.. వెంటనే అతని స్నేహితులకు సమా చారం అందించింది. స్నేహితులు వెంటనే బాలుని ఇంటికి చేరుకుని తలుపు బలవంతంగా తెరిచి.. అతన్ని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. అభి నవ్ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు ఆదివారం రాత్రి తెలిపారు.
చీర చూపించి పెళ్లి ఆహ్వానించిన ప్రియురాలు.. తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య
బెంగళూరు: వాళ్లిద్దరూ ప్రేమికులు. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో ప్రేమికుల రోజుని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం అబ్బాయి.. తన ప్రియురాలి కోసం ఖరీదైన గిఫ్ట్లు సైతం కొనుగోలు చేశాడు. కానీ అనూహ్యంగా అమ్మాయి వేరే యువకుడితో పెళ్లి సంబంధం కుదుర్చుకుంది. ‘త్వరలోనే నా పెళ్లి. నా పెళ్లికి నువ్వు రావాలి. ఇదిగో చూడు నా పెళ్లి నగలు, పెళ్లి చీర చూపించింది. ఆ పెళ్లి చీర చూసి తట్టుకోలేని ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరులో కిరణ్ అనే యువకుడు బిల్డర్,జిమ్ ట్రైనర్గా విధులు నిర్వహిస్తున్నారు. కిరణ్..ఓ యువతిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.ఉన్నట్లుండి ఏమైందో ఏమో.. ఆ యువతి మరో యువకుడితో వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. ఆ విషయం తెలిసిన కిరణ్కు గుండె పగిలింది. తానెంతో గాఢంగా ప్రేమిస్తున్న యువతి మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుందని తెలిసి తట్టుకోలేకపోయాడు. గత రెండు వారాలుగా మనిషి మనిషిలా లేడు. ఉల్లాసంగా,ఉత్సాహం ఉండే కిరణ్లో డిప్రెషన్ పెరిగింది.ఈ క్రమంలో శనివారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఆత్మహత్యకు ముందు పేపర్,పెన్ను కావాలని తల్లిని అడగ్గా.. ఎందుకు అని అనుమానంగా అడిగింది. ఆర్ధిక వివరాలు రాయాలని,పెన్ను,పేపర్ అడిగి తీసుకున్నాడు. అనంతరం ఇంటి గదిలోకి వెళ్లి సూసైడ్ లెటర్ రాశాడు. ప్రాణం తీసుకున్నాడు. గదిలోకి వెళ్లిన కిరణ్ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది.డోర్లు బలవంతంగా ఓపెన్ చేసి చూడగా.. తాడుకు వేలాడుతూ నిర్జీవంగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సూసైడ్ నోటీను స్వాధీనం చేసుకున్నారు.అందులో తన చావుకు తాను ప్రేమించిన అమ్మాయి, ఆమె తల్లే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా యువతిని గాఢంగా ప్రేమిస్తున్నానని, ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. తనని సైతం పెళ్లికి రావాలని, ఇందుకోసం కొనుగోలు చేసిన నగదు,దుస్తులు కిరణ్కి చూపించడంతో తట్టుకోలేని ప్రాణం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
వీడియోలు
అంబటి రాంబాబుపై PT వారెంట్.. గుంటూరుకు తరలింపు
తండ్రి బాటలో జగన్..
వర్గపోరులో చిక్కిన ఐపీఎస్ ల బదిలీల ప్రక్రియ
ఇక్కడితో ఆపేయ్.. తప్పు అయ్యిందని లెంపలేసుకోని..
ట్రంప్ కు భారీ విజయం.. అప్పీల్ కోర్టు సంచలన తీర్పు
కల్తీ మహారాజు.. ముందు నీ హెరిటేజ్ చూసుకో.. ఆ స్వామి నీ నాలుకని..
బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన లేదు
అందినకాడికి బాదుడే లక్ష్యం.. ప్రైవేట్ కు రాజధాని..!
కర్ణాటకలో ఏపీ కూలీల మృతి.. జగన్ దిగ్భ్రాంతి
కిలారు రాజేష్ కు ఎంపీ పోస్ట్! లోకేష్ పై సీనియర్లు సీరియస్

