మంచు మనోజ్కి మరో కీలక పాత్ర
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్లో విలన్ పాత్రలతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా మరో భారీ చిత్రంలో నటించబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాలో ఆయనను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇప్పటికే భైరవం, మిరాయి వంటి చిత్రాల్లో విలన్గా కనిపించి మెప్పించిన మనోజ్, ఈసారి బాలయ్యతో కలిసి తెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో నటించారు.ఈ చిత్రంలో విలన్ పాత్రలో మనోజ్ కనిపించనున్నాడని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో అధికారికంగా మనోజ్ ఎంట్రీని ప్రకటిస్తూ..'మీ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది'అని పేర్కొన్నారు. ఇది ఆయనకు మనోజ్తో మొదటి కాంబినేషన్. గోపీచంద్ గతంలో బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. ఇక ఎప్పట్లానే ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం.
ట్రంప్ అల్టిమేటం.. అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. “రెండు మూడు రోజుల్లో శాంతి ఒప్పందానికి రాకపోతే, కొత్త దాడులు తప్పవు” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు. గల్ఫ్ దేశాల అభ్యర్థనతో మంగళవారం జరగాల్సిన దాడిని వాయిదా వేశానని.. ఇరాన్ దిగి రాకుంటే వారాంతంలో దాడులు తప్పవని సంకేతాలిచ్చారాయన. ఈ అల్టిమేటంపై ఇరాన్ స్పందించింది. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి స్పందించారు. అదే జరిగితే తామేంటో చూపిస్తామని అంటున్నారాయన. ‘‘మళ్లీ యుద్ధం జరిగితే అమెరికాను మామూలుగా దెబ్బ తీయం. మరిన్ని సర్ప్రైజ్లు ఉంటాయి. అందుకు ఆ దేశం సిద్ధంగా ఉండాలి’’ అని ఘాటు హెచ్చరికలు జారీ చేశారాయన. అలాగే.. ఇరాన్ తొలిసారిగా అమెరికా F-35 జెట్ను కూల్చివేసిందని చెప్పిన అరగ్చి.. అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ నివేదికలోనే జరిగిన నష్టాలు బయటపడ్డాయని గుర్తుచేశారు.అరగ్చి చెప్పిన “మరిన్ని సర్ప్రైజ్లు” అంచనా వేయడం కాస్త కష్టమే. అయితే యుద్ధంలో ఇరాన్ వ్యూహాలు, దాడుల స్వభావం చూసుకుంటే మాత్రం.. అధునాతన డ్రోన్ దాడులు: ఇరాన్ ఇప్పటికే అమెరికా MQ-9 రీపర్ డ్రోన్లను కూల్చివేసింది. భవిష్యత్తులో మరింత శక్తివంతమైన, స్వార్మ్ (గుంపులుగా వచ్చే) డ్రోన్ దాడులు జరిగే చాన్స్ లేకపోలేదు.మిసైల్ దాడులు: సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్పై ఇరాన్ క్షిపణి దాడులు చేసి KC-135 ట్యాంకర్లు, E-3 AWACSను దెబ్బతీసింది. ఇలాంటి దీర్ఘశ్రేణి క్షిపణి దాడులే మళ్లీ జరగవచ్చు.సైబర్ దాడులు: ఇరాన్ గతంలో అమెరికా నెట్వర్క్లపై సైబర్ దాడులు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. కొత్త యుద్ధంలో సైబర్ రంగంలో పెద్ద ఎత్తున దాడులు జరగవచ్చు.సముద్ర మార్గాల అడ్డంకులు: హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ కుదేలవుతుంది.అనూహ్యమైన ఆయుధ వినియోగం: అరగ్చి చెప్పిన “సర్ప్రైజ్”లో కొత్త రకం యుద్ధ సాంకేతికత, లేదంటే ఇప్పటివరకు బయటపడని ఆయుధాలు ఉండే అవకాశం ఉంది.కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక ప్రకారం.. ఈ యుద్ధంలో అమెరికా కనీసం 42 సైనిక విమానాలను కోల్పోయింది. వీటిలో 24 MQ-9 రీపర్ డ్రోన్లు, నాలుగు F-15E ఫైటర్ జెట్లు, ఒక A-10 థండర్బోల్ట్, రెండు MC-130J ప్రత్యేక ఆపరేషన్ విమానాలు, ఒక KC-135 ట్యాంకర్, ఒక MQ-4C ట్రిటాన్ డ్రోన్ ఉన్నాయి. అదనంగా.. F-35A జెట్, E-3 సెంట్రీ AWACS, HH-60W హెలికాప్టర్ వంటి విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రక్షణ విభాగం పెంటగాన్ అంచనా ప్రకారం.. ఈ యుద్ధం అమెరికాకు ఇప్పటివరకు 29 బిలియన్ డాలర్ల ఖర్చు తెచ్చింది.ఫిబ్రవరి 28, 2026న “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” పేరుతో అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. బదులుగా ఇరాన్ మిత్రపక్షాల సాయంతో కౌంటర్కు దిగింది. అయితే.. ఏప్రిల్లో తాత్కాలిక కాల్పుల విరమణ, ఆపై పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలకు అడుగులు పడడంతో యుద్ధం ముగియవచ్చని అంతా భావించారు. అయితే అలా జరగలేదు. శాంతి చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఓవైపు చర్చల ప్రభావంతో యుద్ధ తీవ్రత కొంత తగ్గినా.. ఇప్పుడు మళ్లీ ఇరు దేశాల కవ్వింపు చర్యలతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ అల్టిమేటం, అరఘ్చి హెచ్చరికలతో యుద్ధం మరోసారి మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్త ఘర్షణలు ఏ సంక్షోభానికి దారి తీస్తాయోనని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మళ్లీ యుద్ధం: ఇప్పుడు ట్రంప్ ముందున్న 2 మార్గాలివే..
ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? ఇది అమెరికా బలహీనతా? లేక దౌత్య చర్చల దిశగా అడుగా? ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? దాడులు చేస్తామని చెప్పిన ట్రంప్ మరోసారి యూ-టర్న్ ఎందుకు తీసుకున్నారు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి కొన్ని గంటల్లోనే భిన్న సంకేతాలు వచ్చాయి. మొదట ఇరాన్పై దాడి చేస్తామని చెప్పారు. తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ విజ్ఞప్తి చేయడంతో జరగాల్సిన దాడిని వాయిదా వేశారు. దీనిపై పలువురు విశ్లేషకులు వివరించిన అంశాలను చూద్దాం.. ట్రంప్ ముందున్న మార్గాలు రెండు మాత్రమే. ఒకటి ఇరాన్కు రాయితీలు (ఆంక్షల ఎత్తివేత వంటి వెసులుబాట్లు) ఇవ్వడం. అంటే యుద్ధంలో ఓడిపోయామని చెప్పకనే చెప్పడం. గతంలో వియత్నాం, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో కూడా ఇటువంటిదే జరిగింది. కానీ, ఓటమిని అంగీకరించడం అమెరికాకు కష్టమే. మరో మార్గం మళ్లీ దాడులు మొదలుపెట్టడం. అమెరికాలోని నియోకాన్ (కఠిన విదేశాంగ విధానాన్ని సమర్థించే రాజకీయ వర్గం) వర్గాలు, ఇజ్రాయెల్ మరింత ఒత్తిడి పెడితే ఇరాన్ వెనక్కి తగ్గుతుందని భావిస్తున్నాయి. కానీ అది అంత సులువు కాదు.ట్రంప్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇలాంటి మార్పులు పలుసార్లు చేశారు. ఫిబ్రవరి 28న 48 గంటల్లో ఇరాన్ ప్రజా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ప్రకటించారు. తర్వాత గడువు పెంచారు. అనంతరం మళ్లీ పెంచారు. ఈ సారి మాత్రం పాకిస్థాన్ వల్ల కాదు.. యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా విజ్ఞప్తి కారణంగా ట్రంప్ నిర్ణయం వాయిదా పడింది.ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే మొత్తం పరిస్థితిని చూడాలి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం మొదలుపెట్టాయి. అప్పట్లో ట్రంప్ లక్ష్యాల్లో ఇరాన్ పాలనా మార్పు, క్షిపణి సామర్థ్యాల నిర్మూలన కూడా ఉన్నాయి. కానీ దాడుల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ ఏ లక్ష్యాన్నీ సాధించలేకపోయాయి.అంతేకాదు, ఇరాన్ హార్మూజ్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించింది. దీంతో ఇప్పటికే ఉన్న సమస్యలకు మరో పెద్ద సమస్య చేరింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ట్రంప్ ఒప్పందం కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఏప్రిల్ 11న ఇస్లామాబాద్లో నేరుగా చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడే అక్కడికి వెళ్లారు.మార్చి 6న ట్రంప్ “ఇరాన్ నుంచి షరతుల్లేని లొంగుబాటు తప్ప మరేదీ అంగీకరించను” అన్నారు. అదే ట్రంప్ తర్వాత ఉపాధ్యక్షుడిని ఇస్లామాబాద్ పంపించారు. ఎందుకంటే “ఉపాధ్యక్షుడితోనే మాట్లాడతాం” అని ఇరాన్ స్పష్టం చేసింది.కాల్పుల విరమణ ప్రకటనలో హార్మూజ్ ప్రాంతాన్ని తెరవాలని అమెరికా డిమాండ్ చేసింది. కానీ, ఆ ప్రాంతం ఇప్పటికీ మూసే ఉంది. అయినా కాల్పుల విరమణ కొనసాగుతోంది. కారణం ట్రంప్ మళ్లీ ప్రత్యక్ష యుద్ధంలోకి వెళ్లాలని అనుకోవడం లేదు. ఏప్రిల్ 8 నుంచి ట్రంప్ దౌత్య చర్చల ద్వారా ఒప్పందం సాధించాలని చూస్తున్నారు. కానీ ఇరాన్ అమెరికా కోరుతున్న షరతులకు ఒప్పుకోవడం లేదు. దీంతో చర్చలు స్థంభించాయి.ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాలియుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కూడా ట్రంప్నకు ఉంటుంది. అయితే, యుద్ధం మొదలైనప్పుడు బ్యారెల్ చమురు ధర 75 నుంచి 77 డాలర్ల మధ్య ఉండేది. ఇప్పుడు 115 డాలర్ల వరకు చేరింది. భారత్లో ఇప్పటికే పెట్రోల్ ధరలు రెండుసార్లు పెరిగాయి. ఇంకా పెరుగుతాయి. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు అందరూ పొదుపు పాటించాలని చెబుతోంది. రూపాయి విలువ పడిపోతోంది. కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతోంది. కరెంట్ అకౌంట్ లోటు అంటే విదేశీ లావాదేవీల్లో దేశ ఖర్చులు ఆదాయాల కంటే ఎక్కువ కావడం.ఈ యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యులు అని విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ మళ్లీ యుద్ధం మొదలుపెడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇన్ని చిక్కులు ట్రంప్ను చుట్టుముట్టాయి. అమెరికా 40 రోజుల దాడులతో ఫలితం సాధించలేకపోయింది. మళ్లీ దాడులు చేస్తే మరింత తీవ్రతరంగా వైమానిక దాడులు చేయాల్సి వస్తుంది.అలా జరిగితే ఇరాన్ కూడా యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్ ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అమెరికా, గల్ఫ్ దేశాలు ఎదుర్కోగలవా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి ముందుంది.
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్లో నెగ్గిన బిల్లు
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్తో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన తీర్మానం 50-47 ఓట్లతో నెగ్గింది. దీంతో ఇరాన్తో యుద్ధం విషయంలో కాంగ్రెస్ ట్రంప్పై పై చేయి సాధించింది. అయితే ఇది చట్టంగా మారడానికి ఇంకా అనేక దశలు దాటాల్సి ఉంది.ఇరాన్తో యుద్ధం ట్రంప్ పాలిట శాపంగా మారింది. ఈ తొందరపాటు నిర్ణయంతో ఇంటా, బయిటా ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. టెహ్రాన్పై దాడితో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తి అనేక దేశాలు ట్రంప్ను విమర్శిస్తుండగా.. మరోవైపు స్వంత దేశంలోనూ యుద్ధానికి వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశపెట్టారు.ఇరాన్పై యుద్ధం ఆపే ప్రతిపాదనను వర్జీనియా డెమెక్రట్స్ సెనేటర్ టిమ్ కెయిన్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మాణానికి అనుకూలంగా 50 ఓట్లు రాగా వ్యతిరేకంగా 47 ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఓటింగ్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు సైతం ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం విశేషం. మరో ముగ్గురు సభ్యులు ఓటింగ్లో పాల్గొనలేదు. దీంతో ట్రంప్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికన్ కాంగ్రెస్లో నెగ్గింది.అయితే ఇది కేవలం ప్రారంభదశ మాత్రమే ఇది పూర్తిస్థాయిలో అమలులోకి రావాలంటే సెనేట్లో ఓటింగ్ జరగాలి అనంతరం రిపబ్లికన్ల అధిక్యం ఉన్న ప్రతినిధుల సభలోనూ నెగ్గాలి అయినప్పటికీ అధ్యక్షుడు తన విచక్షణ అధికారాలను ఉపయోగించి వీటో చేసి దీనిని ఆపవచ్చు. ఒకవేళ వీటోని ఆపాలని అమెరికా కాంగ్రెస్ అనుకుంటే సెనెట్, ప్రతినిధుల సభ రెండింటిలోనూ 2/3 వంతు మెజార్టీతో నెగ్గాల్సి ఉంటుంది. అప్పుడు ఇరాన్పై యుద్ధాన్ని నియంత్రించేలా చట్టం చేయవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంలా కనిపిస్తోంది.అమెరికా చట్టం ఏం చెబుతుంది.అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్ ఆమోదం లేకుండా కేవలం 60 రోజులు మాత్రమే సైనిక చర్యలను ప్రారంభించగలరు. ఆ తర్వాత, ఆయన యుద్ధాన్ని ముగించడమో, కాంగ్రెస్ అనుమతి కోరడమో, లేదా దళాల సురక్షిత ఉపసంహరణను నిర్ధారించడానికి అదనంగా 30 రోజులు అభ్యర్థించడమో చేయాలి. అయితే ప్రస్తుతం సీజ్ ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో ట్రంప్ ఈ చట్టం ఇరాన్ యుద్ధానికి వర్తించదని పేర్కొన్నారు. ఏదైమైనా ట్రంప్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికా కాంగ్రెస్లో నెగ్గడం ప్రతిపక్షాలు అతిపెద్ద విజయంగా భావిస్తున్నాయి.
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
అహ్మదినెజాద్ను అధికారపీఠంపై కూర్చోబెట్టాలని చూశారు
బక్రీద్ కానుక.. 1400 మందికి పైగా ఖైదీల విడుదల!
టెట్రా ప్యాక్ల్లో మద్యం.. మోసపూరితం
బడ్జెట్ బాబు.. ఖాళీ జేబు
మౌలిక రంగాల జోరు
మ్యూచువల్ ఫండ్స్పై రుణాలిస్తాం
ముంబైపై ఘన విజయం.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
స్వాగతించదగిన తీర్పు
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్లో గెలిచాము: సన్రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
ఇరాన్తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే..
పెరిగిన వంట నూనె ధరలు.. కారణం ఇదే!
నీట్లో ప్రశ్నలన్నీ మా క్వశ్చన్ బ్యాంకులోనివే : ఎవరీ కెమిస్ట్రీ టీచర్
ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ సినిమా.. కానీ
పవర్ఫుల్ సావిత్రి
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
అహ్మదినెజాద్ను అధికారపీఠంపై కూర్చోబెట్టాలని చూశారు
బక్రీద్ కానుక.. 1400 మందికి పైగా ఖైదీల విడుదల!
టెట్రా ప్యాక్ల్లో మద్యం.. మోసపూరితం
బడ్జెట్ బాబు.. ఖాళీ జేబు
మౌలిక రంగాల జోరు
మ్యూచువల్ ఫండ్స్పై రుణాలిస్తాం
ముంబైపై ఘన విజయం.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
స్వాగతించదగిన తీర్పు
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్లో గెలిచాము: సన్రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
ఇరాన్తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే..
పెరిగిన వంట నూనె ధరలు.. కారణం ఇదే!
నీట్లో ప్రశ్నలన్నీ మా క్వశ్చన్ బ్యాంకులోనివే : ఎవరీ కెమిస్ట్రీ టీచర్
ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ సినిమా.. కానీ
పవర్ఫుల్ సావిత్రి
ఫొటోలు
ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఆధ్యాత్మికతలో అంబానీలు.. బెంగళూరు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సెంటర్లో సందడి (ఫొటోలు)
మెలోనీతో కలిసి మోదీ పలు ప్రాంతాల సందర్శన (ఫోటోలు)
శ్రీవారి సేవలో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ దంపతులు (ఫోటోలు)
వరుసగా శుభవార్తలు చెప్తున్న షణ్ముఖ్ జశ్వంత్ (ఫోటోలు)
ఆంధ్రప్రదేశ్ : మనసు దోచే సిద్ధలయ్య కోన ఎక్కడో తెలుసా ?
#HBDJrNTR : జూ.ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ HD స్టిల్స్
'రమణి కళ్యాణం' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
పాయల్ రాజ్పుత్ ముఖ్య అతిథిగా 'ఫస్ట్ టైమ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
సినిమా
OTT: ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్ రివ్యూ
ఓ కుటుంబం బావుండాలన్నా, ఓ ఊరు బావుండాలన్నా లేదా దేశం బావుండాలన్నా,చదువుకుని ఉండాలి. నేటి సమాజంలో మనం సజావుగా బ్రతకాలి అంటే భాష ఏ విధంగా అవసరమో అదే విధంగా చదువు కూడా అంతే అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. కాని ఇప్పటి పరిస్థితులలో చదువుకునే వారు తక్కువయ్యారు చదువు కొనే వారు ఎక్కువయ్యారు. రాత్రింబవళ్ళూ కష్టపడి చదివి పరీక్ష రాస్తే, కష్టపడని కుట్రదారులు కొందరు దొడ్డిదారిన అసలైన వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇదే నేపధ్యంలో అల్లుకున్న కథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన సిరీస్ ఎగ్జామ్. ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ 7 భాగాలతో లభ్యమవుతోంది.దాదాపుగా వాస్తవిక ఘటనలతో , చిన్నపాటి సినీ లిబర్టీతో ఓ నిజమైన సమస్యను మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు దర్శకులు సర్కుణమ్.ఈ సిరీస్ మొత్తం గ్రిప్పింగ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. కథాంశానికొస్తే తమిళనాడు లోని తైకారా ప్రాంతానికి కొత్తగా ఎంపికైన డిఎస్ పి మారుమల్లి ఛార్జి తీసుకోవడానికి తన కారులో బయలుదేరుతుంది. దారిలో ఝాన్సీ మారుమల్లిని కిడ్నాప్ చేసి తైకారాకు తాను డిఎస్ పిగా వెళుతుంది. ఓ డిఎస్ పి స్థాయి వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ తన స్థానంలో వెళ్ళడమనేది సినిమా లిబర్టీ అనుకున్నా కాస్త ఎక్కువైందని చెప్పవచ్చు.కాకపోతే ఇక అక్కడి నుండి మెల్ల మెల్లగా కథలోకి తీసుకువెళతాడు దర్శకుడు. అసలు మారుమిల్లిని ఝాన్సీ ఎందుకు కిడ్నాప్ చేసింది, స్టేషన్ కి చేరుకున్న ఝాన్సీని ఎవరైనా గుర్తుపట్టారా లేదా అన్న అంశాలను మాత్రం సిరీస్ లోనే చూడాలి. ఈ సిరీస్ మొత్తం అయిపోయాక మన విద్య వ్యవస్థ లో ఉన్న చీకటి కోణాలు స్పష్టంగా అర్ధం అవుతాయి. ఒక దశలో ఏ ఎగ్జామ్ అయినా పాసవ్వాలా ఫెయిలవ్వాలా అన్నది తామిచ్చే పైసలమీదే ఆధారపడుతుందన్న విషయం తెలుస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరి చూసి తెలుసుకోవాల్సిన సిరీస్ ఇది. మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీవన్.
ఎప్సెట్ టాపర్కు ‘మెగా’ సర్ప్రైజ్
తెలంగాణ ఎప్సెట్ (TG EAPCET) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో టాపర్గా నిలిచిన విద్యార్థిని ఎం. రుషికి మెగాసార్ స్టార్ చిరంజీవి సర్ప్రైజ్ ఇచ్చారు. పరీక్షల ముందు ఆమెకు తండ్రి ఓ మాట ఇస్తే.. దాన్ని మెగాసార్ట్ నిజం చేశారు. అభిమాన హీరో ఇచ్చిన సర్ప్రైజ్కి రుషితో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా షాకవ్వడంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. అసలు తండ్రి ఇచ్చిన మాటేంటి? చిరంజీవి చేసిన సర్ప్రైజ్ ఏంటి?చిరంజీవి కోసం ఫస్ట్ ర్యాంకుతెలంగాణ ఎప్సెట్కు సన్నద్దమవుతున్న సమయంలో ‘స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధిస్తే మెగాస్టార్తో మాట్లాడిస్తా’ అని రుషి తండ్రి మాట ఇచ్చారు. అనుకున్నట్లుగానే ఆమె కష్టపడి చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. ఈ విషయం చిరంజీవికి తెలియడంతో, ఆ యంగ్ అచీవర్ను స్వయంగా తన ఇంటికి పిలిపించుకొని సన్మానించారు.ల్యాప్టాప్ బహుమతిబుధవారం ఉదయం రుషి ఫ్యామిలీని చిరంజీవి ఇంటికి పిలిపించుకున్నారు. తన నివాసానికి వచ్చిన రుషిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం శాలువాతో సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఉన్నత చదువుల నిమిత్తం ప్రోత్సాహకంగా ఆమెకు ఒక ల్యాప్టాప్ను బహుమతిగా అందజేశారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కష్టపడి చదివి టాపర్గా నిలవడమే కాకుండా, తన అభిమాన హీరోను స్వయంగా కలుసుకుని సత్కారం అందుకోవడంతో రుషి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కల నెరవేరినందుకు ఆమె చాలా సంతోషించింది. #TGEAPCET లో State Top Rank సాధించిన M. Rushi కలను నిజం చేసిన Megastar #Chiranjeevi 🤩❤️Her father had promised that she would get to meet Megastar #Chiranjeevi if she secured the State Top Rank in the prestigious TG EAPCET exam ✨Today, that promise was fulfilled as… pic.twitter.com/y97hKTjSDO— Team Megastar (@MegaStaroffl) May 20, 2026
తిరుపతిలో కాలేజీ కడతా.. 25 శాతం డిస్కౌంట్ ఇస్తా!
ఈరోజు ఎన్టీఆర్తో పాటు మంచు మనోజ్ పుట్టినరోజు కూడా. ఈ క్రమంలోనే మనోజ్ చేయబోయే కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని మూవీలో కీలక పాత్ర చేయబోతున్నట్లు వెల్లడించారు. అలానే 'వడ్డీకాసులవాడ' పేరితో మనోజ్ హీరోగా మరో చిత్రాన్ని ప్రకటించారు. రెండు నిమిషాలున్న వీడియోతో మూవీ ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేశారు.(ఇదీ చదవండి: గ్రేట్ డైరెక్టర్ ఓటీటీ ఎంట్రీ.. ఏటీఎం దొంగతనం స్టోరీతో)నటుడిగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత 'భైరవం', 'మిరాయ్' సినిమాల్లో విలన్ పాత్రలతో ఆకట్టుకున్న మంచు మనోజ్.. కామెడీ జానర్లో గతంలో మూవీస్ చేశాడు. హిట్స్ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి, బాలయ్య మూవీలోనూ నెగిటివ్ టచ్ ఉన్న రోల్స్ చేయబోతున్నాడు. కానీ 'వడ్డీకాసులవాడ' సినిమాలో మాత్రం ఈఎంఐలు, వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడే మధ్యతరగతి వ్యక్తిగా కనిపించబోతున్నాడని అనౌన్స్మెంట్ వీడియోలో చూపించారు. పూర్తిగా ఫన్ జానర్లోనే ఈ సినిమా ఉండబోతుంది.ఏఐ ఉపయోగించి ఈ వీడియోని రూపొందించారు. అయితే ఇందులో మనోజ్ పాత్ర చెప్పే.. అప్పులన్నీ తీర్చేసి కోటీశ్వరుడిని చేస్తే తిరుపతిలో కాలేజీ కట్టిస్తా, అందరికీ 25 పర్సంటేజీ డిస్కౌంట్ ఇస్తా లాంటి డైలాగ్స్ మంచు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా అనిపించాయి. తేజ్ ఉప్పాలపాటి దర్శకుడు కాగా మనోజ్, అనిల్ సుంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి నా భార్య.. మంచు మనోజ్ స్టేట్మెంట్)
గ్రేట్ డైరెక్టర్ ఓటీటీ ఎంట్రీ.. ఏటీఎం దొంగతనం స్టోరీతో
హిందీ సినిమాలు కూడా చూసే తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, సంజు, డంకీ తదితర మూవీస్ తీశారు. వీటిలో షారూక్తో 'డంకీ' తప్పితే మిగిలినవన్నీ బ్లాక్బస్టర్ సక్సెస్ అయ్యాయి. ఈయన నుంచి కొత్త మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్లకు చిన్నపాటి షాకిచ్చారు. ఓ వెబ్ సిరీస్తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: కళ్లు లేని హీరోయిన్.. కాళ్లు లేని హీరో)'ప్రీతమ్ అండ్ పెడ్రో' పేరుతో తీస్తున్న ఈ సిరీస్.. ఓ ఏటీఎం దొంగతనం చుట్టూ జరిగే కథతో తెరకెక్కిస్తున్నారు. దీనికి రాజ్ కుమార్ హిరానీ.. షో రన్నర్, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అవినాశ్ అరుణ్ దర్శకుడు. ఈ సిరీస్తోనే తన కొడుకు వీర్ హిరానీని నటుడిగానూ పరిచయం చేస్తున్నారు. ఇందులో అర్షద్ వార్సీ, విక్రాంత్ మస్సే లాంటి స్టార్స్ ఇతర కీలక పాత్రలు చేశారు. జూలై 3 నుంచి హాట్స్టార్లో సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)
క్రీడలు
ముంబైపై ఘన విజయం.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగల్గింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.ముంబై ఇన్నింగ్స్లో టాపర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(26), కార్భిన్ బాష్(32) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే, కామోరూన్ గ్రీన్, కార్తీక్ త్యాగి తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా 6 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో మనీష్ పాండే(45) టాప్ స్కోరర్గా నిలవగా.. రావ్మన్ పావెల్(40) రాణించాడు ముంబై బౌలర్లలో కార్భిన్ బాష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఘజన్ఫర్ తలా వికెట్ సాధించారు.కేకేఆర్ ఫ్లే ఆఫ్స్ చేరాలంటే?ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్(13) ఆరో స్దానంలో ఉంది. కేకేఆర్ తమ ఆఖరి మ్యాచ్లో మే 24న ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో కేకేఆర్ భారీ విజయం సాధిస్తే 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. అంతేకాకుండా కేకేఆర్ భవితవ్యం రాజస్తాన్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంది. పంజాబ్, రాజస్తాన్ కూడా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచ్లో ఓడిపోయి, ఢిల్లీపై కేకేఆర్ గెలిస్తే వారి ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.చదవండి: పాక్ మాజీ క్రికెటర్కు బంపరాఫర్.. ఐపీఎల్కు అర్హత!
పంత్ డిమోషన్ వెనుక అతడిదే కీలకపాత్ర!
అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు మ్యాచ్కు గిల్ నేతృత్వంలో 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే పంత్ డిమోషన్ వెనుక గిల్ కీలకపాత్ర పోషించాడంటూ ఒక అభిమాని సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తి రేపింది. పంత్ వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఒక అభిమాని ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టుకు పంత్ సోదరి సాక్షి లైక్ కొట్టింది. 'పంత్ వైస్ కెప్టెన్సీ పదవి ఊడిపోవడానికి తెర వెనుక కెప్టెన్ శుబ్మన్ గిల్ పెద్ద రాజకీయమే నడిపాడు. తన పదవికి ఉన్న ముప్పును తొలగించుకోవడానికే వైస్ కెప్టెన్సీకి పంత్ను కాదని రాహుల్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది’ అంటూ పోస్టు పెట్టాడు. పంత్ భవిష్యత్తులో టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశం ఉండడంతోనే గిల్ ఇలా చేసి ఉండొచ్చని సదరు అభిమాని ఆరోపించాడు. అయితే ఇదంతా ఒక అభిమాని ఎలాంటి ఆధారాలు లేకుండా తన అభిప్రాయంగా పోస్టును పెట్టడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే పంత్ సోదరి సాక్షి అభిమాని పెట్టిన పోస్టును లైక్ చేస్తూ ‘ఇది నిజమే అయి ఉండొచ్చు’ అని పేర్కొనడం ఆసక్తిని రేపింది. అయితే అభిమాని పెట్టిన పోస్టుకు లైక్ కొట్టింది నిజంగా పంత్ సోదరి సాక్షినా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ పోస్టుపై సోషల్మీడియాలో అభిమానులు రెండు విధాలుగా స్పందించారు. కొందరు పంత్కు సపోర్ట్ చేస్తే, మరికొందరు గిల్కు మద్దతుగా పోస్టులు పెట్టారు. ఈ సంగతి పక్కనబెడితే యాక్సిడెంట్ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పంత్ పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. 2025లో ఇంగ్లండ్ టూర్లో పంత్ సరైన ప్రదర్శన చేయలేదు. దీంతో వన్డే, టీ20 జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. అయితే టెస్టుల్లో పంత్కు మంచి రికార్డు ఉండడంతో ఆఫ్గన్తో టెస్టుకు ఎంపిక చేశారు. కానీ తుది జట్టులో ఉంటాడా లేడా అన్నది చూడాలి. ఇక ఐపీఎల్ 2026 సీజన్లోనూ పంత్ పెద్దగా రాణించలేదు. 132 మ్యాచ్లాడి కేవలం 286 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు లక్నో సూపర్జెయింట్స్ కెప్టెన్గా పంత్ జట్టును ప్లేఆఫ్స్ చేర్చడంలోనూ విఫలమయ్యాడు. వరుస ఓటములతో ఈ సీజన్లో లక్నో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.🚨 Rishabh Pant’s sister has liked an Instagram reel that says Shubman Gill has played politics with Rishabh Pant and removed him from the Vice Captaincy so that he don't have any competition in Test captaincy. 🚨Someone should tell her, that India lost 2-0 vs South Africa at… pic.twitter.com/DpNs4ACLKu— Ahmed Says (@AhmedGT_) May 20, 2026 View this post on Instagram A post shared by Pahul Walia (@cricketwithpahul)చదవండి: ప్లేఆఫ్స్ ముంగిట ఆర్సీబీకి గుడ్న్యూస్!
ప్లేఆఫ్స్ ముంగిట ఆర్సీబీకి గుడ్న్యూస్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి ఒక శుభవార్త అందింది. గాయం కారణంగా దాదాపు నెల రోజుల పాటు ఐపీఎల్కు దూరంగా ఉన్న బెంగళూరు జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఈ వారం చివర్లో భారత్కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 18న ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో బౌండరీని అడ్డుకునే ప్రయత్నంలో అతడి ఎడమ చేతి వేలికి గాయం అయింది. ఆ గాయం కారణంగా అతడు మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అనంతరం జరిగిన మూడు పోటీల్లో కూడా అతడు జట్టుకు దూరంగానే ఉన్నాడు. గాయం తీవ్రతను పరీక్షించేందుకు మే మొదటి వారంలో ఫిల్ సాల్ట్ స్వదేశానికి వెళ్లాడు. అక్కడ నిర్వహించిన వైద్యపరీక్షల్లో గాయం పెద్దది కాదని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. అయితే మే 22న హైదరాబాద్ జట్టుతో జరగనున్న బెంగళూరు చివరి లీగ్ మ్యాచ్కు ఫిల్ సాల్ట్ అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇప్పటికే 13 మ్యాచ్ల్లో 18 పాయింట్లు సాధించిన బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్లో స్థానం ఖాయం చేసుకుంది. ఈ సీజన్లో ఓపెనర్గా ఫిల్ సాల్ట్ దూకుడైన ఆటతో జట్టుకు మంచి ఆరంభాలు అందించాడు. విరాట్ కోహ్లీతో కలిసి ఆర్సీబీకి శుభారంభాలను అందించాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన ఫిల్ సాల్ట్ 202 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: బంగ్లాదేశ్ కెప్టెన్ ప్రపంచ రికార్డు!
బంగ్లాదేశ్ కెప్టెన్ ప్రపంచ రికార్డు!
పాకిస్తాన్ను తమ సొంతగడ్డపై ఓడించి టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసి బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొసెన్ షాంటో కూడా ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్పై గెలుపుతో బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా నజ్ముల్ షాంటో రికార్డులకెక్కాడు. షాంటో సారథ్యంలో బంగ్లాదేశ్ 18 టెస్టు మ్యాచ్లు ఆడితే అందులో 8 విజయాలు, 9 ఓటములు, ఒక డ్రా ఉన్నాయి. షాంటో కంటే ముందు ముష్ఫికర్ రహీమ్ కెప్టెన్సీలో బంగ్లా సాధించిన ఏడు టెస్టు విజయాలే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండేది. తాజాగా షాంటో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ముష్ఫికర్ రహీమ్ సారథ్యంలో బంగ్లాదేశ్ 34 టెస్టులు ఆడింది. ఇందులో 7 విజయాలు, 18 ఓటములు, 9 డ్రాలు ఉన్నాయి. స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ నేతృత్వంలో 19 టెస్టులు ఆడిన బంగ్లా 4 విజయాలు, 15 ఓటములు చవిచూసింది. మోమినుల్ హక్ సారథ్యంలో 17 మ్యాచ్లాడిన బంగ్లాదేశ్ మూడు విజయాలు సాధించి, 12 ఓటములు, రెండు డ్రాలు చేసుకుంది. ఈ లెక్కన నజ్ముల్ హసన్ షాంటో సారథ్యంలో బంగ్లాదేశ్ టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించడంతో అతడి కెప్టెన్సీ విన్నింగ్ శాతం అందరికంటే అధికంగా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే సిల్హెట్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్ట్లో 78 పరుగుల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్ 2-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.437 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 316-7 స్కోర్ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. కొద్దిసేపటిలోనే మిగిలిన 3 వికెట్లు కోల్పోయి 358 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ (94) పాక్ను గట్టెక్కించే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అతని పోరాటం వృధా అయ్యింది. తైజుల్ ఇస్లాం (34.2-4-120-6) అద్భుత ప్రదర్శనలతో పాక్ పతనాన్ని శాసించాడు.Sylhet witnesses a memorable triumph. pic.twitter.com/Vbi39tQpih— Bangladesh Cricket (@BCBtigers) May 20, 2026చదవండి: పాక్ మాజీ క్రికెటర్కు బంపరాఫర్.. ఐపీఎల్కు అర్హత!
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో దోపిడీ విజన్, స్కామ్కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
బిజినెస్
ఈవీలకు మారే ఉద్యోగులకు హైదరాబాద్ ఐటీ కంపెనీ ఆఫర్
ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు , హైదరాబాద్కు చెందిన టెక్ సంస్థ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసే తమ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది.ఈవీ కార్లు కొనుగోలు చేసే ఉద్యోగులకు రూ.10 వేల ప్రోత్సాహకం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ.5 వేల ప్రోత్సాహకం అందజేస్తామని ఆ కంపెనీ సీఈఓ ఫణిరాజ్ జలిగామ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో పర్యావరణ హితమైన ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.ఇటీవల ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయని, దాంతో ప్రధాన మంత్రి కార్ పూలింగ్ను ప్రోత్సహించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారాలని, ప్రజా రవాణా వ్యవస్థను విస్త్రృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారని ఫణిరాజ్ తెలిపారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా దేశ విదేశీ మారక నిల్వలను ఆదా చేయవచ్చన్నారు.ప్రధాని విజన్కు అనుగుణంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలో ‘గ్రీన్ పాలసీ’ /‘ఈవీ పాలసీ’ను అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఉద్యోగులు స్వచ్ఛమైన, ఇంధన పొదుపు కలిగిన రవాణా మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
పడిలేచిన స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ ట్రేడింగ్ చివరి గంటలో అన్ని ఇంట్రాడే నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వచ్చేశాయి.నిఫ్టీ 50 ఇండెక్స్ 41 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 23,659 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 23,690.90 వద్ద గరిష్టం, 23,397.30 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది.బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 117.54 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 75,318.39 వద్ద ట్రేడింగ్ సెషన్ ను ముగించింది. ఈ ఇండెక్స్లో గరిష్టం 75,406.18 పాయింట్లు, కనిష్టం 74,529.41 వద్ద నమోదైంది.హిందాల్కో ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో నిఫ్టీ 50లో టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.49 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.04 శాతం పెరిగాయిరంగాల వారీగా, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్, నిఫ్టీ ఆటో మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ చాలా క్షీణించాయి.
భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు!
ప్రపంచవ్యాప్తంగా ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ దేశీయ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - బాంబే’ (ఐఐటీ-బీ) తన సత్తాను చాటుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్లేస్మెంట్ నివేదికను ఐఐటీ బాంబే తాజాగా విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మొత్తం ఉద్యోగ ఆఫర్ల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ విద్యార్థులకు లభించిన సగటు, మధ్యస్థ వేతన ప్యాకేజీలు మాత్రం 10 శాతానికి పైగా పెరగడం విశేషం. జులై 2024 నుంచి జూన్ 2025 మధ్య రెండు విడతలుగా ఈ ప్లేస్మెంట్ ప్రక్రియ సాగింది.తగ్గిన ఆఫర్లు.. పెరిగిన డిమాండ్ఈ ఏడాది ప్లేస్మెంట్ సీజన్లో విద్యార్థులు మొత్తం 1,422 ఉద్యోగ ఆఫర్లను అంగీకరించారు. ఇందులో అంతర్జాతీయ కంపెనీలు ఆఫర్ చేసిన 65 గ్లోబల్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐఐటీ-బీలో ఈసారి రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య స్వల్పంగా 2% పెరిగి 2,469 కి చేరింది. వీరిలో 2,040 మంది విద్యార్థులు రెండు దశల్లోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. అయితే, కొన్ని గ్లోబల్ కంపెనీలు నియామకాల్లో ఆచితూచి వ్యవహరించడంతో మొత్తం ఆఫర్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే సుమారు 3.5% మేర తగ్గింది. భారీ ప్యాకేజీలు సాధించిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉద్యోగం సాధించిన వారి సగటు వార్షిక వేతనం రూ.26.45 లక్షలుగా ఉంది.రంగాల వారీగా నియామకాలుఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు ఎప్పటిలాగే సింహభాగాన్ని ఆక్రమించగా.. కన్సల్టింగ్, ఫైనాన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రంగాలు గట్టి పోటీనిచ్చాయి.రంగంకంపెనీల సంఖ్యలభించిన ఆఫర్లుఇంజినీరింగ్ విభాగం96429ఐటీ124393గమనిక: ఐటీ రిక్రూటర్లలో 99 కంపెనీలు కేవలం కోర్ సాఫ్ట్వేర్ పాత్రల కోసమే విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి.బీటెక్, కంప్యూటర్ సైన్స్దే జోరుకోర్సుల వారీగా చూస్తే బీటెక్, డ్యూయల్ డిగ్రీ విద్యార్థులకు కంపెనీల నుంచి భారీ డిమాండ్ వ్యక్తమైంది. బీటెక్కు సంబంధించి దాదాపు 82 శాతం ప్లేస్మెంట్ రేటు నమోదైంది. డ్యూయల్ డిగ్రీ పరంగా 80 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు.72 శాతానికి పైగా ఎంటెక్ విద్యార్థులు ప్లేస్మెంట్లు పొందారు. అత్యంత డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో రిజిస్టర్ చేసుకున్న 277 మంది విద్యార్థులలో 258 మంది అత్యుత్తమ ప్యాకేజీలు పొందారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలు కూడా మెరుగైన ప్లేస్మెంట్ గణాంకాలను నమోదు చేశాయి.పీహెచ్డీల చూపు.. స్టార్టప్ల వైపు!ఇతర రెగ్యులర్ కోర్సులతో పోలిస్తే పీహెచ్డీ విద్యార్థుల ప్లేస్మెంట్ గణాంకాలు తక్కువగా ఉన్నాయి. అయితే దీనికి కారణం ఉద్యోగాలు లేకపోవడం కాదు; గ్రాడ్యుయేటింగ్ పరిశోధకులు కార్పొరేట్ ఉద్యోగాల కంటే పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్లు, సొంతంగా స్టార్టప్ వెంచర్లను ప్రారంభించడానికే మొగ్గు చూపడం వల్లనేనని నివేదిక స్పష్టం చేసింది.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!
ఫ్యామిలీ
ఆ మూవీ ప్రభావంతో ఉద్యోగానికి రిజైన్ చేసింది..! కట్చేస్తే..
సినిమాలోలా రియల్ లైఫ్ ఎప్పటికీ ఉండదు. మూడు గంటల సినిమా ఎంతో ప్రభావం చూపిస్తుంది. కానీ వాస్తవిక ప్రపంచంలో అందులోలా వర్కౌట్ అవడం అంత సులభం కాదు. అదే చాలామంది తెలుసుకోలేక..ఆ సినీ మాయలో పడి ఊహాలోకంలో తేలుతుంటారు. చివరికి హాయిగా ఉన్న లైఫ్ని రిస్క్లో పడేసుకుంటుంటారు. అలాంటి సంఘటనే ఈ మహిళ లైఫ్లో చోటుచేసుకుంది. హర్ష్ అనే యూజర్ సోష్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. తాను ఉద్యోగ ఇంటర్వ్యూలో ఓ మహిళను కలిసినట్లు చెబుతూ..ఆమె చేసిన పని గురించి వివరిస్తూ పోస్టు పెట్టడంతో ఒక్కసారిగా సినిమా ఎంత పనిచేసింది అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ మహిళ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం సంపాదించి స్థిరమైన కార్పొరేట్ ఉద్యోగంతో బిందాస్గా లైఫ్ సాగిపోయిందామెకు. సుమారు ఆరేళ్లు ఆ లైఫ్ని ఎంజాయ్ చేసింది. సరిగ్గా 2015లో తమాషా మూవీ చూడటంతో ఒక్కసారిగా ఆమె లైఫ్ అనూహ్యమైన మలుపు తీసుకుంది. ఆ తమాషా మూవీని..ఆర్ట్కి ఉన్న పవర్, చిన్ననాటి అభిరుచులను ఎలా వదులుకుని కెరీర్పై ఫోకస్ పెడతాం వంటివి ఇతి వృత్తంగా తీసుకుని తీశారు. ఈ మహిళ ఆ మూవీని చూసి స్ఫూర్తి పొంది.. కార్పొరేట్ లైఫ్ అంటే టార్గెట్లు, పనిఒత్తిడి ఇదేనా జీవితం? అదే నచ్చిన అభిరుచిలో కొనసాగడంలో ఉన్న ఆనందమే వేరు అంటూ చేస్తున ఉద్యోగానికి రిజైన్ చేసింది. చక్కగా ఆర్ట్స్ డిప్లొమా కోర్సులో చేరి, ప్రదర్శనలు నిర్వహించడం, తన పేయింటింగ్స్ని అమ్మడం వంటి కెరీర్ని నిర్మించుకోవాలని కలలు కనింది. ఆ మహిళ తాను అనుకున్నట్లుగానే క్రియేటివిటీ రంగంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించినప్పటికీ.. ఆ క్రమంలో చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు సవాలుగా మారాయి. అప్పటిదాక పొదుపు చేసిన డబ్బు అయిపోవడంతో ఆ అభిరుచి నుంచి తప్పుకోక తప్పలేదు. చివరికి రెండేళ్ల కెరీర్ విరామం తర్వాత మళ్లీ అనూహ్యంగా కార్పొరేట్ స్థిరత్వమే బెటర్ అంటూ జాబ్ సర్చింగ్ మొదలు పెట్టారామె. అలా ఓ జాబ్ ఇంటర్వ్యూకి వచ్చి.. తనతో ఆ మహిళ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నట్లు రాసుకొచ్చారు హర్ష్. అంతేగాదు హర్ష్ ఆమె నిర్ణయం వెనుకున్న భావోద్వేగ పరిస్థితిని ప్రస్తావిస్తూ అభిరుచి వెంట పరుగులు తీసి..కెరీర్ని రిస్క్లో పెట్టుకోకూడదని అన్నారు. మంచి విషయం ఏంటంటే తన కళా అభిరుచిని వదులుకున్నా అనే పశ్చాత్తాపం ఎప్పటికీ ఎదురవ్వద్దు కానీ ఇంకోరకంగా అది కాస్త చెడ్డ నిర్ణయం ఎలా అంటే..మళ్లీ 30 ఏళ్ల అనంతరం కార్పొరేట్ ఉద్యోగం సంపాదించటం ఈ రోజుల్లో అదెంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంటూ పోస్ట్ని ముగించారు. నిజానికి ఈ కథలో నీతి అభిరుచి కోసం ఉద్యోగ జీవితాన్నే రిస్క్లో పెట్టడం కంటే..అందులో సాధకబాధలు బేరీజు వేసుకుంటూ..చేస్తున్న ఉద్యోగాన్ని సాగిస్తూనే ఆ కళాత్మక రంగంలో సాగాలి. మొదట పార్ట్టైంగా సాగించి..బాగుంది ధైర్యంగా పూర్తి స్థాయిలో దీనిలో దిగొచ్చు అన్న నమ్మకం వచ్చాక..దిగితే ఎలాంటి ఆర్థిక సమస్య ఉండదు. అన్నింట్లకంటే ఆర్థిక భద్రత ముఖ్యం అనేది గ్రహించాలి.(చదవండి: కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..)
కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో శరవేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి ప్రపంచ దేశాలు. కొంగొత్త ఆవిష్కరణలు, రోజుకో సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది యువత. అలాంటి ఈ కాలంలో వెట్టిచాకిరి వ్యవస్థ, బానిసలు అనేవి ఇంకా ఉన్నాయంటే నమ్ముతారా?. పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో చదివిన ఘటనలు ఇంకా కళ్లముందు కదలాడటమే కాదు, ఆ దురాగతలకే బలి అవుత్ను వాళ్లు ఇంకా మన మధ్యే ఉన్నారు. అలాంటి భావోద్వేగ ఘటనే పాకిస్తాన్లో చోటుచేసుకుంది. ఓ కుటుంబం అప్పులో ఊబిలో చిక్కుకుని, తరతరాలు వెచ్చిచాకిరిలో మగ్గిపోయింది. సింపుల్గా చెప్పాలంటే ఆధునిక బానిసలు. బాధలనే చీకట్లో మగ్గిపోతున్న వాళ్ల బతుకుల్లోకి ఓ విదేశీయుడి కారణంగా వెలుగు సంతరించుకుంది. అసలేం జరిగిందంటే..పాకిస్తాన్లోని పంజాబ్లోని కసూర్ ప్రాంతంలో ఇటుక బట్టీలలో దాదాపు 130 ఏళ్లుగా వెట్టిచాకిరిలో చిక్కుకుంది ఓ కుటుంబం. ఆ ఫ్యామిలీని విడిపించేందుకు ఓ మానవతావాది ముందుకొచ్చారు. నివేదికల ప్రకారం..తరతరాల క్రితం వారి పూర్వీకులు తీసుకున్న 'పేష్కి' అనే అప్పు భారంతో పనిచేస్తూ ఉండేది. ఆ అప్పు ఎన్నడూ తీరకపోవడంతో తర్వాత తరాలు వేతనాలు లేకుండా పనిచేస్తూ జీవితాంత బానిసలుగా బతుకీడుస్తున్నారు. వాళ్లకు విముక్తి కలిగించే రక్షణ చర్యను ఆరోన్ హచింగ్స్ అనే విదేశీయుడు చేపట్టారు. 'జూబ్లీ క్యాంపెయిన్' అనే మానవహక్కుల సంస్థ సభ్యుడైన ఆరోన్ వారి జీవితాలకు బానిసత్వం నుంచి విముక్తి కల్పించి, కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఈ 'జూబ్లీ క్యాంపెయిన్' సంస్థ పలు దేశాలలో బానిసత్వం, మతపరమైన హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక మానవ హక్కుల సంఘం. హచింగ్స్ ఆ కుటుంబం బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుందని తెలుసుకుని ఎలా భావోద్వేగంగా స్పందించారో రికార్డు చేసి మరీ వీడియోని పంచుకున్నారు. అంతేగాదు ఆ వీడియోకి ఐదో రోజు గుడ్న్యూస్ తెలుసుకున్న ఆ కుటుంబం..కన్నీళ్లు పెట్టుకున్న క్షణం అనే క్యాప్షన్ జోడించి మరి పోస్టు చేశారు. కాగా, ఈ జూబ్లీ క్యాంపెయిన్ ప్రపంచవ్యాప్తంగా జాతి, మత మైనారిటీల కోసం మానవ హక్కులు, మత స్వేచ్ఛను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. ఈ క్యాంపెయిన్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, మయన్మార్, నైజీరియా, పాకిస్తాన్, ఇరాన్, ఈజిప్ట్ వంటి దేశాలలో బలవంతపు చాకిరీ, వెట్టిచాకిరి,మానవ అక్రమ రవాణా వంటి సమస్యలపై పనిచేస్తోంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి..ఆ విదేశీయుడు హచింగ్స్ని ప్రశంసించగా, ఇంకా ఇలాంటివి కొనసాగుతున్నాయా అని విస్తుపోస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Aaron Hutchings (@aaronhutchings77) (చదవండి: ఆ కేఫ్ మొత్తం ఆడవాళ్లే..!)
కేన్స్లో ప్రజక్తా మాలి ట్రెడిషనల్ లుక్! సగర్వంగా భారతీయత..
ఫ్యాషన్ ప్రపంచంలో ఇది ‘కేన్స్’ సీజన్! పేరుకి ఫిల్మ్ ఫెస్టివల్... కానీ ప్రపంచమంతా సెలెబ్రిటీల దుస్తులు, రెడ్ కార్పెట్ మీద వారి లుక్స్ తదితరాలే హాట్టాపిక్గా నిలుస్తుంటాయి. అందుకోసం తారలు, సెలబ్రిటీలు తల నుంచి పాదాల వరకు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చూపుతిప్పుకోని విధంగా రెడి అయ్యేందుకు కొన్ని నెలల ముందు నుంచే సన్నద్ధమవుతుంటారు. అయితే ఈ ప్రపంచ వేదిక కేన్స్ రెడ్ కార్పెట్పై మెరిసే లాంగ్ గౌనులు, పాశ్చాత్య స్టైలిష్ వేర్లే సందడి చేస్తుంటాయి. అలాంటిది ఈసారి భారతీయ డిజైనర్లు మన భారతీయ సంప్రదాయ వారసత్వానికే పెద్దపీట వేశారు. ఒక్కో ప్రాంతంలో ఉన్న సంప్రదాయ చీరలు, ఆభరణాలతో తారలు, ప్రముఖులు సందడి చేయడం విశేషం. తాజాగా ఆ కోవలోకి మరాఠి నటి ప్రజక్తా మాలి కూడా చేరిపోయారు. ఆమె ఈ ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ రెడ్ కార్పెట్పై మహారాష్ట్ర సంస్కతిని సగర్వంగా చూపించారామె. తన మూలాలను చాటి చెప్పేలా సాంప్రదాయ నీలి రంగు నౌవారీ చీరలో మెరిశారామె. రిచ్ బ్లూ, పర్పుల్ రంగుల మేళవింపుతో ఉన్న మహారాష్ట్రలో చీరలో వయ్యారంగా నడుస్తూ..అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచం మొత్తాన్ని తనవైపుకి తిప్పుకునేలా ప్రత్యేకంగా కనిపించింది. ఆమె రూపం సంప్రదాయ సాంస్కృతికి గర్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఆఖరికి తన ఆహార్యానికి తగ్గట్టుగా చక్కగా జుట్టు ముడివేసి, సాంప్రదాయ బిందీ, ప్రత్యేకమైన నాథ్, చోకర్, గాజులు, కమర్బంద్ వంటి యాక్సెసరీలు ధరించారామె. మరాఠి సంప్రదాయలో రాజసమైన లుక్లో ఆకర్షించారామె. అంతేగాదు ప్రజక్తా కెమెరాలకు చేతులు జోడించి అభివాదం చేస్తూ ఇచ్చిన ఫోజులు ఆత్మీయత, ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పుతున్నట్లుగా ఉంది. ఇలా ప్రపంచ వేదికపై సగర్వంగా భారతీయతను చాటడం ముఖ్యంగా మరాఠీ ప్రేక్షకులను ఎంతోగానో అలరించడం కాదు, గర్వించే క్షణంగా మారింది. కాగా, ప్రజక్తా మాలి, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్కార్పెట్పై అరంగేట్రం చేసిన దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..సాంప్రదాయ నౌవారీ చీర, మరాఠీ నాథ్తో కేన్స్లో నడవం ఎంతో గర్వంగా ఉందని పోస్ట్లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Prajaktta Mali (@prajakta_official) (చదవండి: బ్రాండ్స్ కాదు..పర్ఫెక్ట్ కలర్ గేమ్ ఛేంజర్ తెలియాలి !)
సమతుల్య పోషణతోనే సేంద్రియ దిగుబడులు
సేంద్రియ కూరగాయల సాగులో ఒకటికి నాలుగు రకాల సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు కలిపి వాడినప్పుడు మాత్రమే అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా అందుతాయని, తద్వారా అత్యుత్తమ దిగుబడులు సాధించగలమని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, పరివృద్ధి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పాలీహౌస్లో రెడ్ క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలను ప్రయోగాత్మకంగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ 2025–26 శీతాకాల పంటలో ఉత్తమ ఫలితాలు సాధించారు. మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ డీన్ డాక్టర్ ఎ. రాజారెడ్డి పర్యవేక్షణలో హార్టికల్చర్ అసిస్టెంట్ ్రపొఫెసర్లు డా. సీహెచ్ షణ్ముఖి, డా. టి. శిరీష నిర్వహిస్తున్న ఈ మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ కిసాన్ సంఘ్కు చెందిన సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.కాలీఫ్లవర్ ఎకరానికి 8 టన్నులుపూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్లో ఎత్తు మడులపై కాలీఫ్లవర్ను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 9 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడుతూ పాలీహౌస్లో కాలీఫ్లవర్ సాగు చేస్తే 5.8 టన్నుల దిగుబడి వచ్చింది. అయితే, కోళ్ల ఎరువుతో పాటు 3 రకాల జీవన ఎరువులు వాడితే అత్యధికంగా హెక్టారుకు 8 టన్నులకుపైగా సేంద్రియ కాలీఫ్లవర్ దిగుబడి వచ్చింది. హెక్టారుకు 7.5 టన్నుల కోళ్ల ఎరువుతో పాటు వామ్ 5 కిలోలు, అజోస్పిరిల్లం 2 కిలోలు, పీఎస్బీ 5 కిలోలు వాడినప్పుడు అత్యధికంగా ఒక్కో కాలీఫ్లవర్ బరువు 825 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 8టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. అయితే, జీవన ఎరువులతో పాటు వర్మీ కంపోస్టు లేదా జీవామృతం లేదా లిగ్నైట్ కలిపి వాడినప్పుడు.. కోళ్ల ఎరువుతో పాటు జీవన ఎరువులు వాడినప్పటికన్నా తక్కువ దిగుబడి రావటం విశేషం.రెడ్ క్యాబేజీ ఎకరానికి 9 టన్నులుపూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్లో ఎత్తు మడులపై రెడ్ క్యాబేజీ పంటను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 6 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. పాలీహౌస్లో హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడితే హెక్టారుకు 5 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడి వచ్చింది. అయితే, హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువుతో పాటు మరో 4 రకాల సేంద్రియ ఎరువులు వాడితే హెక్టారుకు అత్యధికంగా 9 టన్నులకుపైగా సేంద్రియ రెడ్ క్యాబేజీల దిగుబడి వచ్చింది. హెక్టారుకు 5 టన్నుల పశువుల ఎరువు, వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడారు. ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 962 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 9 టన్నులకు పైగా దిగుబడి రావటం విశేషం. అయితే, పశువుల ఎరువు అసలు వాడకుండా.. హెక్టారుకు వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడినప్పుడు ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 935 గ్రాములకు మాత్రమే పెరిగింది.సమతుల్య పోషణే కీలకంసేంద్రియ సాగులో పంటలకు అవసరమైన అన్ని పోషకాలనూ సమతుల్యంగా తగు పాళ్లలో అందించగలిగినప్పుడే రసాయన సేద్యంతో సమానంగా దిగుబడులు సాధించటం సాధ్యమవుతుందని మల్లారెడ్డి యూనివర్సిటీలో తాజా పరిశోధనలు తేల్చాయి. పాలీహౌస్ ప్రయోగాత్మక సాగులో ఎకరానికి 8 టన్నుల కాలీఫ్లవర్, 9 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడులు మాకు సంతృప్తి కలిగించాయి. అన్ని యూనివర్సిటీలూ ఈ దిశగా పరిశోధనలు చేస్తే రైతులకు మంచి ఆదాయంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యదాయకమైన ఆహారం లభిస్తుంది. – ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు (76598 55588), సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులుసేంద్రియ పరిశోధనలు కొనసాగిస్తాంపూర్తిగా సేంద్రియ కూరగాయల సాగులో మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టు తొలి ఏడాది ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మరో రెండు సంవత్సరాలు ఈ ప్రయోగాలు కొనసాగిస్తాం. సేంద్రియ ఎరువుల యాజమాన్యం, దిగుబడుల స్థిరీకరణ చేసి పూర్తి ఫలితాలు ఆ తర్వాత ప్రకటిస్తాం. – డాక్టర్ ఎ. రాజారెడ్డి, డీన్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, మల్లారెడ్డి యూనివర్సిటీనిర్వహణ: పంతంగి రాంబాబు
అంతర్జాతీయం
పుతిన్ పర్యటనతో చమురు సంక్షోభం తీరుతుందా..?
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది భారత్లో పర్యటించనున్నారు. బ్రిక్స్ సదస్సుకు హాజరుకావడానికి ఆయన భారత్ వస్తున్నప్పటికీ ఈ పర్యటనలో పలు కీలకమైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటన ఎంతో కీలకం కానుంది.ప్రస్తుతం మిడిల్ఈస్ట్లో యుద్ధపరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 నుంచి 110 డాలర్ల పైమాటకు చేరి తీవ్రంగా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. దీనికి తోడు హర్ముజ్ను మూసివేయడంతో చమరు రవాణా దెబ్బతిని తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్లో సైతం పెట్రో డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెరగవచ్చనే ఆందోళన ప్రజలలో నెలకొంది.ఈ నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చమురు సంక్షోభం తీరేలా ఇరు దేశాల మధ్య ఏదైనా ఒప్పందం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి బలం చేకూర్చేలా ఇటీవలే ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ "భారతదేశానికి ఇంధన సరఫరా ఒప్పందాల విషయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా రష్యా అన్ని బాధ్యతలను నెరవేరుస్తుంది. బాహ్య శక్తుల నుండి వచ్చే ఎలాంటి అనైతిక పోటీల వల్ల భారత్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లనివ్వం." అని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ మాటలతో భారత్కు ఎంతో ఊరట లభించింది.ఇతర ఇంధన రంగాలు కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా, భారత్కు అవసరమైన ఎల్.ఎన్.జి బొగ్గు సరఫరాలను పెంచడం, తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల విస్తరణపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.రూపాయి-రూబుల్ చెల్లింపులుఅంతే కాకుంగా చమురు కొనుగోళ్లకు సంబంధించి డాలర్ల కొరత లేదా అంతర్జాతీయ ఆంక్షల ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, స్వదేశీ కరెన్సీలలో (రూపాయి - రూబుల్) సురక్షితమైన బ్యాంకింగ్ మరియు ఆర్థిక ఛానళ్లను ఏర్పాటు చేయడంపై ఈ పర్యటనలో మోదీ, పుతిన్ తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో ఓ సమస్య ఉంది. రష్యా నుంచి చమరుదిగుమతులతో భారత్ తన స్వంత కరెన్సీలో చెల్లింపులు చేస్తే ఆ డబ్బులు వారి వద్ద అధికంగా నిల్వ ఉంటున్నాయి. ఎందుకంటే రష్యా భారత్కు ఎగుమతులు చేస్తున్నంతగా ఆ దేశానికి భారత ఎగుమతులు లేవు అందుకే వారి వద్ద కరెన్సీ నిల్వలు అధికంగా ఉంటున్నాయి. దీంతో రష్యా ఆ డబ్బను తిరిగి భారత ప్రభుత్వ బాండ్లు, షేర్లు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతుంది.భారత్కు రష్యా పూర్తి స్థాయిలో చమురు సరఫరా చేయగలదా?రష్యా రోజుకు సుమారు 10.3 మిలియన్ బ్యారెళ్ల (1 కోటి 3 లక్షల బ్యారెళ్లు) ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇందులో దాదాపు 4.5 నుండి 4.9 మిలియన్ బ్యారెళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. భారత్కు సగటున రోజుకు సుమారు 5.3 మిలియన్ బ్యారెళ్ల వరకూ చమురు అవసరం కనుక రష్యా భారత్ అవసరాలను దాదాపు తీర్చగలదు.ప్రధాన సమస్యలులాజిస్టిక్స్, రవాణా సవాళ్లు గల్ఫ్ దేశాలు (సౌదీ, ఇరాక్, యూఏఈ) భారత్కు భౌగోళికంగా చాలా దగ్గరగా ఉన్నాయి. అక్కడి నుండి చమురు నౌకలు కేవలం 4 నుండి 7 రోజుల్లో భారత్ చేరుకుంటాయి. కానీ రష్యా నుండి చమురు రావాలంటే చాలా దూరం ప్రయాణించాలి. రష్యా పశ్చిమ నౌకాశ్రయాల నుండి వచ్చే నౌకలు భారత్ చేరడానికి 30 నుండి 35 రోజులు పడుతుంది.పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా చమురును రవాణా చేయడానికి అంతర్జాతీయ నౌకలు, భీమా సంస్థలు ముందుకు రావడం లేదు. రష్యా తన స్వంత 'షాడో ఫ్లీట్' (పాత నౌకలు) ద్వారానే సరఫరా చేస్తోంది. భారత్కు కావాల్సినంతగా ఇందులో చమురు రవాణా చేయడం కొద్దిగా కష్టమైన పని.రిఫైనరీల సాంకేతికత భారతదేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే 'సౌర్ క్రూడ్' (సల్ఫర్ ఎక్కువగా ఉండే చమురు) ను శుద్ధి చేసేలా డిజైన్ చేయబడ్డాయి. రష్యా నుంచి వచ్చే 'ఉరల్స్ క్రూడ్' రకం కొద్దిగా భిన్నంగా ఉంటుంది.భారతీయ రిఫైనరీలు రష్యా చమురును 100% వాడలేవు; సాంకేతిక బ్యాలెన్స్ కోసం మిడిల్ ఈస్ట్ చమురును కూడా కలిపి వాడాల్సి ఉంటుంది.భారత్కు ఇష్టం లేదు వ్యూహాత్మకంగా భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ఏ ఒక్క దేశం పైనా పూర్తి స్థాయిలో ఆధారపడదు. రేపు రష్యాతో ఏదైనా సమస్య వస్తే భారత్ ఇరుక్కుపోతుంది. అందుకే భారత్ తన రిస్క్ను తగ్గించుకోవడానికి రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, అమెరికా దేశాల నుండి చమురును విడివిడిగా కొనుగోలు చేస్తుంది. అయితే ఈ పర్యటనతో భారత చమురు సమస్య పూర్తిగా తీరుతుంది అని చెప్పడం అతిశయోక్తే అయినప్పటికీ ప్రస్తుత చమురు సంక్షోభ పరిస్థితులను అరికట్టడానికి ఎంతో కొంత సహకరిస్తుందనేది మాత్రం చెప్పవచ్చు.
పాక్, ఇమ్రాన్ ఆరోపణలు.. అమెరికా రియాక్షన్ ఇదే..
వాషింగ్టన్: పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ఆరోపణలపై ఎట్టకేలకు అమెరికా విదేశాంగశాఖ స్పందించింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను పదవి నుంచి తొలగించిన విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. పాక్ రాజకీయాలు అక్కడి ప్రజలకు సంబంధించినవే అంటూ ట్విస్ట్ ఇచ్చింది.కాగా, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను పదవి నుంచి తొలగించడం వెనుక అగ్ర రాజ్యం అమెరికా హస్తం ఉందని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోపణలపై తాజాగా అమెరికా విదేశాంగశాఖ స్పందిస్తూ..‘పాకిస్తాన్ రాజకీయాలతో అమెరికాకు సంబంధం లేదు. పాకిస్తాన్, అమెరికా కేవలం మిత్ర దేశాలు మాత్రమే. ఇమ్రాన్ను పదవి నుంచి తొలగించిన విషయంలో మాకు ఎలాంటి ప్రమేయం లేదు. పాక్ రాజకీయాలు ఆ దేశ ప్రజలకు మాత్రమే సంబంధించినవి’ అని క్లారిటీ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. 2022, ఏప్రిల్లో ఇమ్రాన్ఖాన్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అంతకుముందు అమెరికాలోని పాక్ రాయబారి అసద్ మజీద్ ఖాన్తో అమెరికా హోంశాఖలోని దక్షిణ- మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ సమావేశమయ్యారు. అందులో వారు ఇమ్రాన్ను పదవి నుంచి తొలగించి జైల్లో పెట్టాలని.. అప్పుడే ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని మాట్లాడుకున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం విషయంలో ఇమ్రాన్ తటస్థ వైఖరిని అవలంభించడం వల్లే ఆయన్ను పదవి నుంచి తప్పించాలని యూఎస్ నిర్ణయించినట్లు పాక్లో లీకైన దౌత్య సమాచారం వెల్లడించింది.డ్రాప్ సైట్ న్యూస్ నివేదిక ప్రకారం2022 ఫిబ్రవరి 24న ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలిశారు. యాదృచ్చికంగా అదే రోజు రష్యా ఉక్రెయిన్పై దాడిని ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధంపై పాకిస్తాన్ రష్యాను బహిరంగంగా విమర్శించాలని కోరుకున్నారు. కానీ ఇమ్రాన్ అలా చేయలేదు యుద్ధం పట్ల తటస్థ వైఖరి ప్రదర్శించారు. అనంతరం 2022 మార్చి 7న, వాషింగ్టన్లోని అప్పటి పాకిస్తాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్కు, అమెరికా సహాయ విదేశాంగ కార్యదర్శి డోనాల్డ్ లూకు మధ్య సంభాషణ జరిగింది. అవిశ్వాస తీర్మానం నుండి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగితే, అమెరికా అన్నింటినీ క్షమిస్తుందని లూ మజీద్తో చెప్పారు. ముప్పై మూడు రోజుల తరువాత, 2022 ఏప్రిల్ 9న, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయింది. అని డ్రాప్ సైట్ న్యూస్ కథనం ప్రచురించింది.ఇమ్రాన్ తొలగింపు అనంతర పరిణామాలుఏప్రిల్ 2022, ఇమ్రాన్ను తొలగించిన మరుసటి రోజే షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయ్యారు. అనంతరం కొద్ది నెలలకు నవంబర్లో ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో అసిమ్ మునీర్ కొత్త ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. నవాజ్ షరీఫ్తో సంప్రదించిన తర్వాతే ఈ నియామకం జరిగిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 2024 ఎన్నికల సమయంలో ఇమ్రాన్ పార్టీ PTI ఎన్నికల చిహ్నమైన గబ్బిలాన్ని తొలగించారు. దీంతో అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయవలసి వచ్చింది. PTI మద్దతు ఉన్న అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. అయినప్పటికీ, PML-N, PPP పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.అమెరికా-పాక్ సంబంధాలుఇమ్రాన్ ఖాన్ అధికారం నుండి వైదొలగిన తర్వాత, పాకిస్తాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇరు దేశాల సంబంధాలు వ్యూహాత్మక మరియు వ్యాపార ఒప్పందాల వరకు విస్తరించాయి. పాక్లో ఒక క్రిప్టో కౌన్సిల్ ఏర్పడింది. ట్రంప్ కుటుంబానికి చెందిన ఎల్ఎఫ్ కంపెనీతో 36 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ పైప్లైన్ ఒప్పందం కుదిరింది. 500 మిలియన్ డాలర్ల విలువైన అరుదైన ఖనిజాల ఒప్పందం కూడా కుదిరింది. గాజా స్ట్రిప్కు సైనికులను పంపేందుకు ఒక ప్రతిపాదన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అసిమ్ మునీర్ మరియు షాబాజ్ షరీఫ్లను బహిరంగంగా ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.
ఇది కదా లక్ అంటే : పాత ప్యాంట్లో రూ. 57 కోట్ల జాక్పాట్
మనకు రాసిపెట్టి ఉండాలే గానీ అదృష్టం ఎలాగైనా మన తలుపు తడుతుంది. ఒక అమెరికన్ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. ఒక అమెరికా వ్యక్తి తన పాత ప్యాంట్ జేబులో మర్చిపోయిన లాటరీ టికెట్ను జస్ట్ దాని గడువు తీరడానికి కొన్నిరోజుల ముందు గుర్తించాడు కట్ చేస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అదెలా అని ఆశ్చర్య పోతున్నారా? పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.పీపుల్ మ్యాగజైన్ కథనం ప్రకారం, న్యూజెర్సీకి చెందిన ఆ వ్యక్తి గత ఏడాది మే నెలలో, తాను తరచుగా వెళ్లే ఒక గ్యాస్ స్టేషన్ (పెట్రోల్ బంక్)లో పిక్-6 లాటరీ టిక్కెట్ను కొనుగోలు చేశాడు. అయితే, టిక్కెట్ కొన్న తర్వాత, దానిని ఎక్కడ పెట్టాడో గుర్తులేదు. దాదాపు ఒక ఏడాది పాటు దాని సంగతే పూర్తిగా మర్చిపోయాడు. గడువు ముగియ డానికి కొన్ని రోజుల ముందు, 5.9 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 57.11 కోట్లు) విలువైన లాటరీ టిక్కెట్ను కనుగొన్నాడు. అంతే జాక్పాట్ కొట్టాడు.కథ ఎలా మలుపు తిరిగిందంటే?గత నెలలో లాటరీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. జాక్పాట్ గెలుచుకున్న టికెట్ ఇంకా ఎవరూ క్లెయిమ్ చేయలేదని, త్వరలోనే దాని గడువు ముగిసిపోతుంతని వెల్లడించారు. అలాగే ఆ టికెట్ అమ్మిన పెట్రోల్ బంక్ పేరును కూడా పేర్కొన్నారు. దీంతో తాను రెగ్యులర్గా వెళ్లే బంక్ పేరు వినడంతో ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి సిబ్బందిని విచారించాడు. ఆ బంక్లో 'పిక్-6' గేమ్ ఆడేది కేవలం కొద్దిమంది రెగ్యులర్ కస్టమర్లు మాత్రమేనని సిబ్బంది చెప్పారు. ఒకసారి బాగా వెతకండి సామీ కోట్ల రూపాయల లాటరీ అంటే మాటలా? అని సలహా ఇచ్చారు.పాత ప్యాంటులో దొరికిన అదృష్టంఇంటికి వచ్చిన ఆ వ్యక్తి తన ఇల్లంతా జల్లెడ పట్టేశాడు. డ్రాయర్లు, అల్మారాలు, స్టోరేజ్ రూమ్లు అన్నీ వెతికేశాడు. ఇక చివరగా తన క్లోసెట్ (కబోర్డ్)లో ఉన్న పాత బట్టల్లో వెతకడం మొదలు పెట్టాడు. సరిగ్గా అపుడే అదృష్ట దేవత పలకరించింది. ఒక పాత ప్యాంట్ జేబులో నలిగిపోయి ఉన్న లాటరీ టికెట్ అతనికి దొరికింది.రూ. 57 కోట్లు సొంతంఆ టికెట్ నంబర్లను చెక్ చేయగానే రూ. 57 కోట్ల భారీ జాక్పాట్ తనదేనని ఎగిరి గంతేశాడు. టికెట్ గడువు ముగియడానికి కేవలం 8 రోజులు మాత్రమే సమయం. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే లాటరీ హెడ్క్వార్టర్స్కు పరుగులు తీసి తన బహుమతిని క్లెయిమ్ చేసుకున్నాడు. ఈ ఘటన తర్వాత లాటరీ అధికారులు ప్రజలకు ఒక ముఖ్య సూచన చేశారు. చాలామంది టికెట్లు కొని ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారని, దీంతో ఒక్కోసారి లాటరీ సొమ్మును ఎవరూ తీసుకోకుండానే ఉండిపోతాయని అందువల్ల పాత టికెట్లను జాగ్రత్తగా దాచుకుంటూ, అప్పుడప్పుడు సరిచూసుకుంటూ ఉండాలని కోరడం విశేషం.
మోదీకి ప్రశ్నా.. నార్వే మహిళా జర్నలిస్టు దుస్సాహసం!
ఇంటా బయటా విలేకరులతో మాట్లాడడానికి ఇష్టపడని మన ప్రధాన మంత్రి మోదీ నిన్న నార్వే టూర్లో Dagsavisan అనే పత్రిక మహిళా జర్నలిస్టు (Helle Lyng Svendsen) నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కున్నారు. "Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world?" అని ఆ జర్నలిస్టు అడిగారు.నార్వే ప్రధానితో కలిసి జాయింట్ ప్రెస్ మీట్ ముగించుకుని కరచాలనం చేసి వెళ్తుండగా అది వినిపించిందో, లేదో గానీ మోదీ గారు ఆ ప్రశ్న పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత, ఎక్స్ వేదికగా ఆమె రచ్చ చేశారు. "It is our job to question the powers we cooperate with," అని ఆమె రాశారు. దీని మీద సోషల్ మీడియాలో హంగామా జరుగుతోంది. కాషాయ సోషల్ మీడియా బృందం ఆమె వెంటపడి కామెంట్స్తో కుమ్ముతోంది. దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఈ క్రమంలో దాచడానికి ఏమీ లేనప్పుడు భయపడటం ఎందుకు?. తన విశ్వసనీయతపైనే సందేహాలున్న ఒక ప్రధానమంత్రి, కేవలం కొన్ని ప్రశ్నలకు భయపడి వెళ్లిపోవడాన్ని ప్రపంచం చూసినప్పుడు, భారతదేశ ప్రతిష్ట ఏమవుతుంది? అని ప్రశ్నించారు.కాగా, 2015లో బ్రిటన్లో, 2023లో అమెరికాలో మాత్రమే మోదీ విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత జర్నలిస్టులకు దూరంగా ఉంటున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన మీడియాను ఏ మాత్రం పట్టించుకోకుండా మూడు సార్లు ప్రధానమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కింది. నార్వేలో ఇద్దరు ప్రధానులు చేసింది press briefing మాత్రమే అనీ, అది press conference కాదు కాబట్టి ఆయన సమాధానం చెప్పకుండా వెళ్ళారని భారత అధికారులు అంటున్నారు. It is indeed a point!When there is nothing to hide, there is nothing to fear.What happens to India’s image when the world sees a compromised PM panic and run from a few questions? https://t.co/tOO8vzESpf— Rahul Gandhi (@RahulGandhi) May 18, 2026సమాధానం ఇస్తే బాగుండేది..ప్రోటోకాల్లో లేకపోయినా, మన ప్రధాని ఆ జర్నలిస్టు నుంచి ఒక ప్రశ్న తీసుకుని చక్కగా నవ్వుతూ సమాధానం ఇస్తే బాగుండేది. మహా అయితే.. మానవ హక్కుల ఉల్లంఘన, ముస్లిం వ్యతిరేకత, వ్యవస్థల నిర్వీర్యం, రెండు యుద్ధాల (ఇరాన్, ఉక్రెయిన్) వంటి వివాదాస్పద ప్రశ్న ఒకటి అడిగి ఉండేది ఆమె. ఆ ప్రశ్నకు నేరుగా కాకపోయినా, డొంక తిరుగుడుగా సూపర్ సమాధానాలు చెప్పవచ్చు. దానికి కూడా మంచి పాజిటివ్ కవరేజ్ వచ్చేది. నాకు ఆసక్తి కలిగించిన అంశం ఏమిటంటే, ఒక మహిళా జర్నలిస్టు ధైర్యంగా ప్రశ్న అడిగితే ఆమె ఘోర అపరాధం చేసినట్లు ఆ దేశ అధికారులు, భద్రతా సిబ్బంది ఎవ్వరూ స్పందించలేదు. మన దగ్గర అయితే సీన్ వేరుగా ఉంటుంది. అందుకే మహిళా జర్నలిస్టులు గ్రేట్.ఇక, ఫ్రాన్స్ కేంద్రంగా ఉండే అంతర్జాతీయ NGO రిపోర్టర్స్ విత్అవుట్ బోర్డర్స్ ప్రతి ఏడాదీ World Press Freedom Index విడుదల చేస్తుంది. వివిధ కొలబద్దల ఆధారంగా దేశాలకు ర్యాంకింగ్ ఇస్తారు. 180 దేశాలలో మీడియా స్వేచ్ఛలో ఫస్ట్ ప్లేస్లో నార్వే ఉండగా, భారత్ ర్యాంకు 157గా కొనసాగుతోంది. - డాక్టర్ ఎస్.రాము, సీనియర్ జర్నలిస్ట్. ఇదిలా ఉండగా.. ఓస్లోకు చెందిన డగ్సావిసెన్ అనే పత్రికలో హెల్లి లింగ్ పనిచేస్తున్నది. మోదీ నార్వే విజిట్ను కవర్ చేసే బృందంలో ఆమె కూడా ఉన్నారు. గతంలో MSN మరియు ఇతర నార్వేజియన్ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారు. తమ ప్రభుత్వంతో సహకరించే అధికారులను ప్రశ్నించడం తన కర్తవ్యం అని ఆమె తెలిపారు. అనంతరం, ఈ పరిణామాల కారణంగా తన ఇన్స్స్టాగ్రామ్, ఫేస్బుక్ బ్లాక్ అయినట్టు ఆమె పేర్కొంది. లింగ్ ప్రశ్నల వర్షం.. ఇక భారత విదేశాంగ మంత్రిత్వశాఖ నిర్వహించిన మీడియా సమావేశంలోనూ లింగ్ మళ్లీ ప్రశ్నలు కురిపించారు. భారత్లో ఉన్న ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ, మానవ హక్కుల గురించి ఆమె ప్రశ్నించారు. అంతర్జాతీయ సమాజం ఇండియాను ఎందుకు నమ్మాలని ఆమె అడిగారు. సంక్లిష్టమైన అంశాల్లో ప్రధాని మోదీ స్పందించడం లేదని ఆమె ఆరోపించారు. లింగ్ చేసిన ఆరోపణలకు విదేశాంగ శాఖ ప్రతిని సిబి జార్జ్ స్పందించారు. భారతీయ ప్రజాస్వామ్యాన్ని, మీడియాను ఆమె సమర్ధించారు. అయితే ఏమీ తెలియని ఎన్జీవోలు ఇచ్చే నివేదికలను విదేశీ విమర్శకులు పరిశీలిస్తుంటారని జార్జ్ అన్నారు. విదేశాంగ శాఖ, జర్నలిస్టు మధ్య జరిగిన సంభాషణకు చెందిన వీడియోలు వైరల్ అయ్యాయి.
జాతీయం
ధరలు పెరుగుతాయ్.. ఎరువులు కూడా దొరకవ్
సాక్షి, రాయ్బరేలీ: దేశంలో ఆర్థిక తుపాను ముంచుకొస్తుందన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి అదే తరహా ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని వ్యాఖ్యానించారాయన. తన సొంత నియోజకవర్గం రాయ్బరేలీలో బుధవారం నిర్వహించిన బహుజన్ స్వాభిమాన్ సభలో పాల్గొన్న ఆయన మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.ద్రవ్యోల్బణం మనిషి(మోదీని ఉద్దేశించి..) తన వసూళ్లను ఇప్పటితోనే ఆపరు. ఆయన జనాల్ని మభ్యపెట్టడానికి ప్రతీసారి టీవీల ముందుకు వచ్చి భావోద్వేగంతో ఏడుస్తారు. త్వరలో మరోసారి అలా జరగొచ్చు. కొన్ని నెలల్లో ద్రవ్యోల్బణం ఎక్కడికి వెళ్తుందో చూడండి. నిత్యావసర ధరలు భారీగా పెరిగి ఆకాశాన్నంటుతాయి. రాబోయే రోజుల్లో రైతులకు ఎరువులు కూడా దొరకవు. విదేశాలకు వెళ్లొద్దని మోదీ చెప్తారు. కానీ ఆయన వేల కోట్ల విలువైన విమానాల్లో విదేశాలకు వెళ్తారు అని రాహుల్ మండిపడ్డారు.ప్రధాని మోదీ తాను పిలుపునిచ్చిన పొదుపు చర్యలను తానే పాటించడం లేదని మంగళవారం బఛ్రావా సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. ప్రస్తుత ప్రభుత్వం మారేంతవరకూ ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారాయన.‘‘ప్రపంచం మొత్తం త్వరలో తీవ్ర చమురు, ఎరువుల కొరతను ఎదుర్కోబోతోంది. ఈ సంక్షోభాన్ని మన జీవితాల్లో మనం ఎప్పుడూ చూసి ఉండం. దీనినెవరూ ఆపలేరు. దీని ప్రభావం ఎవరిపై పడుతుంది.. అదానీ, అంబానీలు వారి ప్యాలెస్లలో భద్రత మధ్య బాగానే ఉంటారు. కానీ మన రైతులు, యువత, చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమల వారు తీవ్రంగా నష్టపోతారు అంటూ రాహుల్ ప్రసంగించారు. ఇదిలా ఉంటే.. పెట్రోల్ ధరల పెంపుపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో సహా అన్నిచోట్లా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ప్రదర్శలు నిర్వహిస్తోంది.
ఆగని మణిపూర్ హింస: ముగ్గురు కాల్చివేత, పలువురు కిడ్నాప్!
కాంగ్పోక్పి: మణిపూర్లో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. జాతుల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు మరిన్ని ఉద్రిక్తతలకు దారితీశాయి. కాంగ్పోక్పి జిల్లాలో జరిగిన ఒక ఆకస్మిక దాడిలో కుకీ-జో వర్గానికి చెందిన ముగ్గురు చర్చి ప్రతినిధులు తూటాలకు బలయ్యారు. ఈ దారుణం జరిగిన కొన్ని గంటల్లోనే, సాయుధ ముఠాలు పదుల సంఖ్యలో స్థానికులను బందీలుగా పట్టుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ తాజా హింసాత్మక సంఘటనలతో మణిపూర్లో భయాందోళనలు మరింతగా పెరిగాయి.కాంగ్పోక్పిలో ఘాతుకం: శాంతిదూతలపై కాల్పులుమే 13న కాంగ్పోక్పి జిల్లాలో జరిగిన ఒక ఆకస్మిక దాడిలో ముగ్గురు కుకీ-జో చర్చి నాయకులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ దాడిలో మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఒకరు స్థానిక తెగల మధ్య శాంతి స్థాపన కోసం చురుగ్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ హత్యల వెనుక కారణాలను అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ, దీనిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘాతుకంతో ఇప్పటికే తీవ్రంగా నలిగిపోతున్న మైనారిటీ వర్గాల్లో మరింత అభద్రతాభావం నెలకొంది.రంగంలోకి దిగిన రక్షణ దళాలుచర్చి నేతల హత్యలు జరిగిన కొద్ది గంటల్లోనే, కాంగ్పోక్పి, సేనాపతి జిల్లాల పరిధిలో సుమారు 38 మందిని సాయుధ ముఠాలు అపహరించి, బందీలుగా ఉంచినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా దళాలు భారీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి, ఇప్పటివరకు 31 మందిని రక్షించాయి. అయితే, మిగిలిన వారి ఆచూకీ ఇంకా లభించలేదు. లీలోన్ వైఫే, సోంగ్తున్, ఖుంఖో, పి మోల్డింగ్ తదితర మారుమూల కొండ ప్రాంతాల్లో స్నిఫర్ డాగ్స్ సహాయంతో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.తెగల మధ్య పెరుగుతున్న అపనమ్మకంమరోవైపు తెగల మధ్య నెలకొన్న తీవ్ర అపనమ్మకం ఈ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. మిస్సింగ్ అయిన వారి మృతదేహాలైనా కుటుంబాలకు అప్పగించేలా చూడాలని లియాంగ్మై నాగా కమ్యూనిటీ నేత ముఖ్యమంత్రి వై. ఖేమ్చంద్ సింగ్ను కోరారు. అదే సమయంలో నాగా గ్రూపులు తమ కుకీ సమాజానికి చెందిన 14 మందిని బందీలుగా ఉంచాయని ‘కుకీ ఇన్పి మణిపూర్’ ఆరోపించింది. మే 2023 నుండి భూహక్కులు, గిరిజన హోదా అంశాలపై మేతీ, కుకీ-జో వర్గాల మధ్య జరుగుతున్న ఈ సుదీర్ఘ పోరు వేలాది మందిని నిరాశ్రయులను చేస్తూ వస్తోంది.
వివాదంపై టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వివరణ
సాక్షి, చెన్నై : తన పాత జ్యోతిష్య కార్యాలయంలో ప్రభుత్వ అధికారులతో నిర్వహించిన సమావేశం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీయడంతో, తమిళగ వెట్రి కళగం మహిళా ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంపై ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ సోషల్ మీడియా ట్రోల్స్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. వివాదం ఏమిటంటే..? ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ పరిధిలోని గౌండంపాళయం నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున కనిమొళి సంతోష్ విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రముఖ జ్యోతిష్యురాలిగా ప్రాచుర్యం పొందారు. ఇటీవల ఆమె ప్రజారోగ్యశాఖ అధికారులతో తన కార్యాలయంలో సమావేశమై, అందుకు సంబంధించిన మూడు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోల్లో ఎమ్మెల్యే కనిమొళి పెద్ద లగ్జరీ సోఫాలో కూర్చోగా, ఆమెకు ఎదురుగా ప్రభుత్వ అధికారులు ప్లాస్టిక్ కురీ్చలలో కూర్చోవడం కనిపించింది. ప్రభుత్వ అధికారులను ఆమె అవమానించారంటూ నెటిజన్లు, ప్రతిపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వివరణ: ఈ వివాదంపై ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే, అందులోని అసలు నిజాన్ని వివరించారు. తాను రాజకీయాల్లోకి రాకముందు చాలా ఏళ్లుగా జ్యోతిష్యురాలిగా ప్రజలను కలుస్తున్న కార్యాలయం అని, తన జీవిత ప్రయాణంలో అది ఎంతో ముఖ్యమైన స్థలంగా పేర్కొన్నారు. తన కొత్త ఎమ్మెల్యే ఆఫీస్ పనులు (పెయింటింగ్, ఇతర పనులు) ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కొత్త ఆఫీస్ పనులు పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత ఆఫీస్ నుంచే ప్రజల సమస్యలను, అధికారులను కలిసి వినతులను స్వీకరిస్తున్నానని తెలిపారు. తనకు ప్రజాసేవే ముఖ్యం, ఆఫీస్ ఎక్కడ ఉందనేది కాదని వివరించారు. తాను అధికారులను ఇంటికి పిలిపించుకుని, ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చోబెట్టి అవమానించానని కొందరు కావాల నే ట్రోల్ చేస్తుండడం అవాస్తవంగా పేర్కొన్నారు.
సరిహద్దుల్లో డ్రోన్ కలకలం: పాక్ జారవిడిచిన హెరాయిన్ స్వాధీనం
బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ మరోసారి తన కుయుక్తులను ప్రదర్శించింది. జమ్ము కశ్మీర్లోని బిష్ణ పరిధిలో గల బహదూర్పూర్ పంచాయతీలో డ్రోన్ సాయంతో హెరాయిన్ తరలించేందుకు జరిగిన సరిహద్దు అక్రమ రవాణా యత్నం తాజాగా వెలుగుచూసింది. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన ఒక అనుమానాస్పద డ్రోన్, భారత భూభాగంలోకి హెరాయిన్ ప్యాకెట్లను జారవిడిచినట్లు అధికారులు గుర్తించారు.స్థానికుల అప్రమత్తత.. పోలీసుల రంగప్రవేశంబహదూర్పూర్ పంచాయతీ పరిధిలోని స్థానికులు అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న కొన్ని ప్యాకెట్లను గమనించారు. ఆ ప్రాంతంలో డ్రోన్ సంచరించినట్లు అనుమానం రావడంతో, వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు చూపిన చొరవతో భారీ అక్రమ రవాణా నెట్వర్క్ గుట్టు రట్టయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, అక్కడ లభ్యమైన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నాయి. ప్రాథమిక తనిఖీల్లో ఆ ప్యాకెట్లలో ఉన్నది నిషేధిత మత్తుపదార్థం ‘హెరాయిన్’ అని తేలింది.దర్యాప్తు ముమ్మరంఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఈ డ్రోన్ పాకిస్థాన్ లోని ఏ ప్రాంతం నుండి వచ్చింది? ఏ సమయంలో సరిహద్దు దాటింది? అనే విషయాలపై సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. సరిహద్దు అవతల నుంచి డ్రోన్ ద్వారా డ్రాప్ చేసిన ఈ మత్తుపదార్థాలను ఇక్కడ అందుకోవడానికి స్థానికంగా ఎవరైనా సహకరించారా? ఈ ముఠా వెనుక ఉన్న కీలక సూత్రధారులు ఎవరు? అనే కోణంలో నిఘా విభాగం వివరాలు సేకరిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, స్వాధీనం చేసుకున్న హెరాయిన్ బరువు, దాని అంతర్జాతీయ మార్కెట్ విలువ వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇది కూడా చదవండి: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ vs ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’?
ఎన్ఆర్ఐ
షాకింగ్ : పక్కా ప్లాన్తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్రే టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
డబ్లిన్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
ఈ అనుభవంతో భారత్ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
క్రైమ్
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
సాక్షి, హైదరాబాద్: బండి సాయి భగీరథ్ పక్కా పథకం ప్రకారమే పోలీసులకు చిక్కాడని కేసు దర్యాప్తులో పాల్గొన్న కీలక పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. విచారణలో ఆధారాలు దొరకకుండా చేయాల్సిన పనులన్నీ పరారీలో ఉండగానే పూర్తి చేసిన తర్వాతే పోలీసుల అదుపులోకి వచ్చాడని చెప్పారు. ఈనెల 16న భగీరథ్ను అరెస్టు చేసిన తర్వాత నిందితుడిని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఠాణాలో రెండున్నర గంటలపాటు కేసు పర్యవేక్షణాధికారిణి రితిరాజ్ నిందితుడిని సుదీర్ఘంగా విచారించా రు. అయితే విచారణ సమయంలో భగీరథ్ పోలీసులకు ఖాళీ సెల్ఫోన్ మాత్రమే అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఫోన్లో సిమ్ లేదని, ఎక్కడుందని విచారణాధికారి నిందితుడిని ప్రశ్ని ంచగా.. సిమ్ కార్డ్ ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్పినట్లు తెలిసింది. విచారణాధికారులు న్యా యనిపుణులతో చర్చించిన అనంతరం పోక్సో కేసులో కీలకమైన సాక్ష్యాధారాలు ధ్వంసం చేశాడని గుర్తించి, భగీరథ్పై కొత్తగా ‘ఆధారాలు మాయం’సెక్షన్ను జోడించారు. ఈ మేరకు ఛార్జ్ షీట్లో భగీరథ్పై బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 238ను జోడించారు. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని వారం రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు మేడ్చల్ న్యాయస్థానంలో కస్టడీ పిటీషన్ను దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకొని నార్సింగిలోని సర్వీస్ అపార్ట్మెంట్, మెయిన్బాద్ ఫామ్హౌస్, పరిసర ప్రాంతాలలో సీన్ రీకన్స్ట్రక్షన్స్ చేయాలని పోలీసులు నిర్ణయించారు.
అమీర్పేట గర్ల్స్ హాస్టల్లో.. చొరబడ్డ వ్యక్తులు..!
హైదరాబాద్: గర్ల్స్ హాస్టల్లో గుర్తుతెలియని వ్యక్తులు కనిపించారని చెప్పిన యువతులపై దుర్భాషలాడిన హాస్టల్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు.. అమీర్పేటలో ఏషియన్ పీజీ గర్ల్స్ హాస్టల్ను శివపార్వతి, ఆమె కుమారుడు వీరారెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న తెల్లవారు జామున ఓ గదిలో ఎవరో ఉన్నట్లు అనుమానం రావడంతో యువతి లేచి చూడగా బాత్రూమ్లో దూరాడు. గట్టిగా అరవడంతో పరారయ్యాడు. ఈ విషయం నిర్వాహకుడు వీరారెడ్డికి చెబితే దుర్భాషలాడాడు. ఇలా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చినట్లు యువతులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం రాత్రి వీరారెడ్డిని అరెస్టు చేశారు. శివపార్వతి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
లక్ష్మీకుమార్ నివాసంలో గుట్టలుగా నోట్ల కట్టలు, భారీగా బంగారం!
మల్లాపూర్/నాంపల్లి: హైదరాబాద్ జలమండలిలో ఓ భారీ అవినీతి జలగ ఏసీబీకి చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ సంస్థ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) రెడ్హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ సగ్గం అనంత లక్ష్మీకుమార్ (58) నివాసం సహా బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సహచరులకు చెందిన 8 ప్రదేశాల్లో ఏసీబీ డీఎస్పీ మజీత్ అలీఖాన్ ఆధ్వర్యంలో 16 గంటలపాటు సోదాలు జరిగా యి. హైదరాబాద్ మల్లాపూర్లోని వెంకటరమణ కాలనీలో ఉన్న అనంత లక్ష్మీకుమార్ నివాసంలో చేపట్టిన తనిఖీల్లో కళ్లు చెదిరే స్థాయిలో ఏకంగా రూ. 1.10 కోట్ల నగదు, 2.1 కేజీల బంగారం, 9.2 కేజీల వెండి లభ్యమైంది. అలాగే నిజామాబాద్, సంగారెడ్డిలో 18 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఇళ్లు, మారుతీ కారు, బజాజ్ మోటార్ బైక్ సహా మొత్తం రూ. 5.88 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అనంత లక్ష్మీకుమార్ భార్య రాధమ్మ పేరిట మూడు బ్యాంకు లాకర్లలో భద్రపర్చిన ఆభరణాలు, ఇళ్ల పత్రాలను కూడా ఏసీబీ అధికారులు తెరిపించి స్వా«దీనం చేసుకున్నారు. రెడ్హిల్స్లోని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించి కొన్ని రికార్డులను తీసుకెళ్లారు. ఆయా ఆస్తుల మార్కెట్ విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. అనంత లక్ష్మీకుమార్పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన్ను బంజారాహిల్స్లోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)కు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాధు చేయాలని సూచించారు. ఫిర్యాధుల వివరాలు పూర్తింగా గోప్యంగా ఉంచుతామన్నారు. కాగా, నోట్ల కట్టలను లెక్కించేందుకు తీసుకొచ్చిన కౌంటింగ్ మెషీన్లు కాసేపు మొరాయించాయి. సోదాల్లో 15 మంది అధికారులు పాల్గొన్నారు. ఉలిక్కిపడిన మల్లాపూర్...: మల్లాపూర్ వెంకరమణ కాలనీలో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నట్లు టీవీల్లో చూసి ఉలిక్కిపడిన స్థానికులు.. ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి అనంత లక్ష్మీకుమార్ నివాసం వద్ద గుమిగూడారు. గత నెలలో చిన్న కుమార్తె వివాహాన్ని ఆయన ఆరంఘర్ సమీపంలో అంగరంగ వైభవంగా చేశారని చర్చించుకున్నారు.
స్పా సెంటర్లో భార్యను చంపిన భర్త..!
హైదరాబాద్: కుటుంబ కలహాలతో పాటు అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపాడు భర్త. ఈ ఘటన మంగళవారం గాం«దీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, ఎస్ఐ నర్సింహ, బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం. ఆటో డ్రైవర్ రాజు, బంగి దేబోరా (25) 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బహదూర్పురా కిషన్బాగ్ ఎంఎన్ గూడెంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కవాడిగూడ ప్రధాన రహదారిలోని ఓ సూపర్ మార్కెట్ 4వ అంతస్తులోని స్పా సెంటర్లో దేబోరా బ్యూటీషియన్గా పని చేస్తోంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. పెద్ద మనుషులు సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరు ఎంఎన్ గూడెంలో వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త వేధింపులు ఎక్కువయ్యాయంటూ రాజుపై దేబోరా అత్తాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం కేసు పెట్టింది. అప్పటి నుంచి రాజు కక్ష పెంచుకుని ఆమెను అంతమొందించేందుకు సమయం కోసం వేచి చూస్తున్నాడు. మంగళవారం ఉదయం దేబోరా విధుల్లో భాగంగా ఆటోలో కవాడిగూడలోని స్పా సెంటర్కు చేరుకుంది. ఆమెను వెంబడించిన రాజు కవాడిగూడకు చేరుకున్నాడు. ఆమె లిఫ్టులోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చాడు. వీరిద్దరూ లిప్టులోనే గొడవ పడుతూ 4వ అంతస్తుకు చేరుకున్నారు. ఆగ్రహానికి గురైన నిందితుడు వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె శరీరంపై అనేక చోట్ల పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో దేబోరా మృతి చెందింది. నిందితుడు రాజు అత్తాపూర్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. రాజును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వీడియోలు
పాస్టర్ కాదు.. పెద్ద యాక్టర్ కావాలనే యాక్షన్
బాబు విజన్.. గ్యాస్ లేకుండానే చేపల ఫ్రై
తప్పు చేస్తే ఎవరిని వదలొద్దు.. POCSO మీద అందుకే.. మంచు మనోజ్ రియాక్షన్
YSR శిష్యులం భయపెడితే భయపడతామా?
అత్తాపూర్ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
కష్టపడి స్పూన్ తో చేపలు తింటున్న బాబు.. చంద్రబాబు పులిహోర
ఆమె కోసమే A సింబల్.. అసలు సీక్రెట్ భయపెట్టిన బుడ్లోడు
బీటెక్ సర్టిఫికెట్ నమ్ముకుంటే కష్టమే.. ఈ కోర్సులు కూడా పక్కా ఉండాలి..!
షాక్ ఇచ్చిన బంగారం.. శాంతించిన వెండి..
మోదీ-మెలోని ద్వైపాక్షిక భేటీ


