ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం..అవసరాలకు డబ్బు అందక ఇబ్బందులు ఎదురైనా అధిగిస్తారు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు. ఆత్మీయులతో విభేదాలు నెలకొనవచ్చు. కాంట్రాక్టర్లు నిరాశ చెందుతారు. సన్నిహితులు వ్యవహారాలలో ఒత్తిడులు పెంచుతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. విద్యార్థులు కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కక నిరుత్సాహం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కళారంగం వారికి సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. నీలం, గులాబీ రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.వృషభం...ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. స్థిరాస్తి విషయంలో ఒత్తిడులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలను అధిగమిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. ఎరుపు, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మిథునం...ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థుల శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ఇంట్లో శుభకార్యాలపై చర్చలు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాలబాట పడతారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు కొన్ని విజయాలు వరిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కర్కాటకం...సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. వ్యాపారాలు సమయానికి విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మానసిక ఆందోళన. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.సింహం...ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. గతం నుంచి వెంటాడుతున్న కొన్ని సమస్యలు తీరతాయి. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కవచ్చు. వారం చివరిలో బంధువిరోధాలు. ఇంటాబయటా ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి.కన్య...రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వాహన, గృహయోగాలు. ప్రత్యర్థులను సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. దీక్షతో ముందుకు సాగి విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలం. వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. లాభాలు తథ్యం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. పసుపు, నేరేడు రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.తుల...అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం మరింత తగ్గుతుంది. కళాకారులకు అన్ని విధాలా అనుకూలం. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. పనిఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. శివారాధన మంచిది.వృశ్చికం...అనుకున్న ఆదాయం లభించి ముందడుగు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయం. అందరిలోనూ మీ ప్రత్యేకత చాటుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాలలో విధులు ప్రశాంతంగా సాగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు. వారం మధ్యలో మిత్రులతో కలహాలు. అనారోగ్య సూచనలు. శ్రమాధిక్యం. ఎరుపు, గులాబీ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.ధనుస్సు...అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు సమకూర్చుకుంటారు. ఇంట్లో శుభకార్యాల సందడి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ధననష్టం. అనారోగ్య సూచనలు. గులాబీ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.మకరం..రావలసిన డబ్బు అంది ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలలో విజయం. ఆప్తులతో వివాదాలు తీరతాయి. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో బంధువులతో కలహాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. పసుపు, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.కుంభం...దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి సహాయం అందుతుంది. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలు లాభాలదిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాల శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. అనుకోని ధనవ్యయం. గులాబీ, పసుపు రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.మీనం....ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని ముఖ్య సమావేశాలకు హాజరవుతారు. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలలో సమస్యలు, చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక ఆందోళన. నేరేడు, పసుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
నేపాలీ గ్యాంగ్స్పై ఆర్జీవీ కన్ను?
హైదరాబాద్తో పాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో నేపాలీ గ్యాంగ్స్ సృష్టించిన హత్యలు, దోపిడీలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన ఘటనతో ఈ నేపాలీ ముఠాల ఆగడాలు మరింతగా వెలుగులోకి వచ్చాయి. దాంతో ఈ పరిణామాలపై దర్శకుడు రామ్గోపాల్ వర్మ దృష్టి పడింది. ఎప్పుడూ రియల్ లైఫ్ కథలను తనదైన శైలిలో సినిమాగా మలచడంలో ఆసక్తి చూపుతుంటాడు వర్మ. తాజాగా ఈ దర్శకుడు నేపాలీ ముఠాల కథను తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడని సమాచారం. దీనికి సంబంధించి సరైన పాయింట్ కోసం ఆయన వెతుకుతున్నాడని తెలుస్తోంది. గతేడాది తన సూపర్ హిట్ చిత్రం 'సత్య' సినిమాను మళ్లీ చూశాడు వర్మ. అనంతరం ఎందుకు దానిని బెంచ్మార్క్గా పెట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై తన ప్రతిభకు తగ్గ గొప్ప సినిమాలు తీస్తానని ప్రతిజ్ఞ కూడా చేశాడు. అయితే ఆ తర్వాత తాను ప్రకటించిన 'సిండికేట్' సహా పలు ఇతర ప్రాజెక్టులు సైతం కార్యరూపం దాల్చలేదు.
మన మహిళలు రెడీ
బర్మింగ్హామ్: మహిళల వన్డే వరల్డ్ కప్ చాంపియన్ భారత్ తొలి సారి టి20 ప్రపంచకప్ను కూడా అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. టోర్నీలో నేడు జరిగే తమ తొలి మ్యాచ్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. ప్రస్తుత ఫామ్, ఓవరాల్గా ఆటగాళ్ల రికార్డులను బట్టి చూస్తే అన్ని రంగాల్లో పాక్కంటే పటిష్టంగా కనిపిస్తోంది. వరల్డ్ కప్కు ముందు ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లను వారి సొంతగడ్డపై ఓడించిన హర్మన్ప్రీత్ సేన... స్వదేశంలో శ్రీలంకను 5–0తో చిత్తు చేసింది. ఇటీవల దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ల చేతుల్లో సిరీస్లు కోల్పోయినా... జట్టు కూర్పులో భాగంగా చేసిన పలు ప్రయోగాల్లో ఈ ఫలితాలు వచ్చాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇప్పటి వరకు టి20 ప్రపంచకప్లలో పాక్పై భారత్ 6–2తో ఆధిక్యంలో ఉండగా... ఓవరాల్గా టి20ల్లో కూడా భారత్ 13–3తో పైచేయి సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ దూకుడుగా ఆరంభిస్తే భారత్ భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. మూడో స్థానంలో యస్తిక భాటియా, భారతి ఫుల్మలిలలో ఎవరికి అవకాశం లభిస్తుందనేది చూడాలి. మిడిలార్డర్లో జెమీమా, హర్మన్ తమ స్థాయికి తగ్గి ప్రదర్శన చేయాల్సి ఉంది. ఎప్పటిలాగే ఫినిషింగ్లో రిచా ఘోష్ మెరుపు బ్యాటింగ్ కనబర్చగల సమర్థురాలు. ప్రధాన పేసర్గా క్రాంతి గౌడ్ ఖాయం కాగా...అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్లలో ఒకరికే రెండో పేసర్గా చాన్స్ లభిస్తుంది. ముగ్గురు స్పిన్నర్లు శ్రీచరణి, నందిని శర్మ, దీప్తి శర్మలతో భారత్ ఆడటం ఖాయమైంది. మరో వైపు 2024 వరల్డ్ కప్లో భారత్ చేతిలో చిత్తయిన పాక్ జట్టు ఈ సారైనా పోటీనివ్వాలని భావిస్తోంది. జట్టు కెపె్టన్ ఫాతిమా సనా ఆల్రౌండ్ ప్రదర్శనపై జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా బంతి తగలడంతో సనా మోకాలికి గాయమైంది. అయితే ఇది ప్రమాదకరమైందని కాదని, ఆమె బరిలోకి దిగుతుందని పాక్ మేనేజ్మెట్ ప్రకటించింది. సీనియర్ ఓపెన్ మునీబా, గుల్ ఫెరోజా ఎలాంటి ఆటతీరు కనబరుస్తారనేది చూడాలి. పాక్ జట్టులో ఈ సారి కొత్త ప్లేయర్ ఇమాన్ ఫాతిమాపై అందరి దృష్టీ నిలిచింది. అండర్–19 స్థాయినుంచి వచ్చిన ఆమె టి20ల్లో 150కు పైగా స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేయగల సమర్థురాలు. ఫినిషర్గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఇమాన్పై పాక్ ఆశలు పెట్టుకుంది.డానీ వ్యాట్ సెంచరీమహిళల టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ శుభారంభం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్–2 మ్యాచ్లో ఇంగ్లండ్ 87 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 219 పరుగులు చేసింది. మహిళల టి20 ప్రపంచకప్ చరిత్రలో ఒక జట్టు అత్యధిక స్కోరు ఇదే. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ఓపెనర్ డానీ వ్యాట్ (62 బంతుల్లో 105 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగింది. అమీ జోన్స్ (38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సీవర్ బ్రంట్ (22 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరవడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షిక (39; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెయా కెంప్ 4 వికెట్లు పడగొట్టింది.ఆ్రస్టేలియా అదరహో...మాంచెస్టర్: మహిళల టి20 ప్రపంచకప్లో అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్లో ఆసీస్ 65 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా ఫోబ్ లిచ్ఫీల్డ్ (24 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), ఎలైస్ పెరీ (36), వేర్హామ్ (32) మెరుపులతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 172 పరుగులు సాధించగా... దక్షిణాఫ్రికా 16.4 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్లో స్కాట్లాండ్ 40 పరుగులతో ఐర్లాండ్పై ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేయగా, ఐర్లాండ్ 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది.
కాంగ్రెస్లో ‘ఆడియో’ కలకలం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఓ ఆడియో తీవ్ర కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడితో ఆ పార్టీ సీనియర్ నేత, సీఎం రేవంత్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ మాట్లాడినట్టుగా ఉన్న ఈ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంలో పార్టీలోని కోవర్టుల వ్యవహారం ఇంకా ముగియక ముందే..పార్టీని, పీసీసీ అధ్యక్షుడిని ఉద్దేశించి షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్న ఆ ఆడియో గాందీభవన్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. రంగంలోకి దిగిన టీపీసీసీ షబ్బీర్ అలీని వివరణ కోరింది. ఢిల్లీ పెద్దలు సైతం దీనిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఏముందా ఆడియోలో.. ఆవేదన, పరామర్శ కోణంలోనే ఆ ఆడియోలోని మాటలు ఉన్నప్పటికీ పార్టీలో చర్చనీయాంశమయ్యింది. ఆ ఆడియోలో ఉన్న మాటల ప్రకారం.. తనకు కాకుండా ఎవరో చంద్రశేఖర్రెడ్డి అనే వ్యక్తికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడాన్ని తప్పుపడుతూ తాను ఉరి పెట్టుకుంటానంటూ ఓ నాయకుడు షబ్బీర్ అలీకి ఫోన్ చేయగా, సదరు నాయకుడిని ఓదారుస్తూ షబ్బీర్ అలీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. డబ్బులు పెడుతున్నారని, మహిళలను ఎరగా వేసి పదవులు తీసుకుంటున్నారనే కోణంలో వ్యాఖ్యలు ఉండటంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ పేరు కూడా ఉచ్ఛరించారు. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా మారిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆడియో ఎప్పటిదో అయినా..అది కాస్తా ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అయ్యింది. నేనేంటో అందరికీ తెలుసు: మహేశ్గౌడ్ ఈ ఆడియో వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ స్పందించారు. శనివారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంలో దీనిపై ప్రశ్నించగా.. ఎలాంటి ఆరోపణల విషయంలోనైనా తొందరపడేది లేదని స్పష్టం చేశారు. ‘నా వ్యక్తిత్వం, ఆస్తిపాస్తులు, నా పుట్టుక ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. నిజామాబాద్ ప్రజలకు ఇంకా బాగా తెలుసు. 40 ఏళ్లుగా లేని అవినీతి ఇప్పుడెక్కడ నుంచి వస్తుంది? షబ్బీర్ అలీనే ఆ వ్యక్తిని రేవంత్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి్పంచారు. ఎందుకు చేరి్పంచారో ఆయనే సమాధానం చెప్పాలి. రేవంత్రెడ్డి సిఫారసు చేసినందుకే చంద్రశేఖర్రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది. షబ్బీర్ అలీ అయినా, ఎవరైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మహిళల పరువు తీసేలా వ్యాఖ్యానాలు చేయకూడదు. దీనిపై ఆయన్ను వివరణ కోరాం. ఈ వ్యవహారం పార్టీ చూసుకుంటుంది..’ అని చెప్పారు. పీసీపీ చీఫ్ను టార్గెట్ చేశారా? పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీ కాలం ముగియకముందే మహేశ్కుమార్గౌడ్ను పార్టీలోని కొందరు టార్గెట్ చేశారా? అనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ చర్చకు ఇటీవలి కొన్ని పరిణామాలు కూడా ఊతమిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్గౌడ్ ఫెయిల్ అయ్యారంటూ ఇటీవలే ఓ చానెల్లో పెద్ద ఎత్తున వార్తలు రాగా, సీఎం రేవంత్కు సన్నిహితంగా ఉండే ఓ నాయకుడే ఇలా చేశారనే ప్రచారం కూడా జరిగింది. ఈ వ్యవహారం పూర్తిగా సమసిపోక ముందే ఎప్పుడో మాట్లాడిన ఆడియోను ఇప్పుడు బయటకు తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది. అది కూడా సీఎం రేవంత్కు సన్నిహితుడైన నాయకుడే మాట్లాడినట్టు అందులో ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్గౌడ్ బలహీనపడ్డారా? లేదంటే పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారా..అన్నది అర్థం కావడం లేదని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వండి పీసీసీ అధ్యక్షుడి ప్రతిష్టకు భంగం కలిగేలా, పార్టీలో పనిచేస్తున్న మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. మీడియాలో వచ్చిన కథనాలు, పార్టీ కార్యకర్తతో మాట్లాడిన సంభాషణపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి, వైస్చైర్మన్ అనంతుల శ్యాంమోహన్, సభ్యుడు జాఫర్ జావేద్లు శనివారం షబ్బీర్ అలీకి లేఖ రాశారు. వివరణపై ఎలాంటి ఆలస్యం చేయకూడదని సూచించారు.
యుద్ధతంత్రాన్ని సాంకేతికత మార్చింది
ఫస్ట్ హాఫ్ ఫెయిల్
గుండెల్లో బెంబేళ్లు
నారాయణ.. నారాయణ.. జిత్తులమారి 'లెక్కలు'!
మా ఏఐ మాకే సొంతం..
కూటమిది నమ్మకద్రోహ సభ
ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అనుచరులతో మాకు ప్రాణహాని
మహిళా రైతులు, రైతు కూలీలపై ఆ దౌర్జన్యం ఏంటి?
ఇళ్లు కూల్చివేశారు.. కన్నీళ్లు మిగిల్చారు
రేపు సింగపూర్కు చంద్రబాబు
స్పోర్ట్స్ సర్టిఫికెట్ల దుకాణం.. టీడీపీ ఆఫీసు
విజయ్ ఎఫెక్ట్.. స్టాలిన్ కళ్లు తెరిపించిన నివేదిక
సాక్షి కార్టూన్ 13-06-2026
ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
మరికొన్ని గంటల్లో మ్యాచ్.. అంతలోనే స్టార్ క్రికెటర్ తండ్రి మరణం
చరిత్రలో ఇలాంటి చిత్రం రాలేదు..!
వరల్డ్కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.. ఇంగ్లండ్ దెబ్బకు లంక కుదేల్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
కాకపెంచుతున్న పసిడి ధరలు
AIతో కాదు… రూ.370 బిర్యానీతో ఉద్యోగం ఊడింది
వైభవ్ సూర్యవంశీ తమ్ముడి వీరవిహారం.. 10 ఏళ్లకే సూపర్ సెంచరీ
సాక్షి కార్టూన్ 13-06-2026
వడ్డే నవీన్ ఎంత పవర్ఫుల్ అంటే.. వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో..
ఆ సినిమాను ఇంత లేట్గా చూడడం నా తప్పే!
వరలక్ష్మి, నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే?
వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్ బంకులకు కేంద్రం కొత్త ఆదేశాలు
వచ్చే ఐదు రోజులు వర్షాలు
నిన్నటి మిత్రులు.. నేటి ప్రత్యర్థులా?
యుద్ధతంత్రాన్ని సాంకేతికత మార్చింది
ఫస్ట్ హాఫ్ ఫెయిల్
గుండెల్లో బెంబేళ్లు
నారాయణ.. నారాయణ.. జిత్తులమారి 'లెక్కలు'!
మా ఏఐ మాకే సొంతం..
కూటమిది నమ్మకద్రోహ సభ
ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అనుచరులతో మాకు ప్రాణహాని
మహిళా రైతులు, రైతు కూలీలపై ఆ దౌర్జన్యం ఏంటి?
ఇళ్లు కూల్చివేశారు.. కన్నీళ్లు మిగిల్చారు
రేపు సింగపూర్కు చంద్రబాబు
స్పోర్ట్స్ సర్టిఫికెట్ల దుకాణం.. టీడీపీ ఆఫీసు
విజయ్ ఎఫెక్ట్.. స్టాలిన్ కళ్లు తెరిపించిన నివేదిక
సాక్షి కార్టూన్ 13-06-2026
ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
మరికొన్ని గంటల్లో మ్యాచ్.. అంతలోనే స్టార్ క్రికెటర్ తండ్రి మరణం
చరిత్రలో ఇలాంటి చిత్రం రాలేదు..!
వరల్డ్కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.. ఇంగ్లండ్ దెబ్బకు లంక కుదేల్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
కాకపెంచుతున్న పసిడి ధరలు
AIతో కాదు… రూ.370 బిర్యానీతో ఉద్యోగం ఊడింది
వైభవ్ సూర్యవంశీ తమ్ముడి వీరవిహారం.. 10 ఏళ్లకే సూపర్ సెంచరీ
సాక్షి కార్టూన్ 13-06-2026
వడ్డే నవీన్ ఎంత పవర్ఫుల్ అంటే.. వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో..
ఆ సినిమాను ఇంత లేట్గా చూడడం నా తప్పే!
వరలక్ష్మి, నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే?
వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్ బంకులకు కేంద్రం కొత్త ఆదేశాలు
వచ్చే ఐదు రోజులు వర్షాలు
నిన్నటి మిత్రులు.. నేటి ప్రత్యర్థులా?
ఫొటోలు
హైదరాబాద్లో జోరు వాన (ఫొటోలు)
ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫొటోలు)
పచ్చని కొండల్లో శ్రీలీల జాలీ ట్రిప్ (ఫొటోలు)
సముద్రంలో స్వర్గం.. దూరం కాదు, మన పక్కనే! (ఫొటోలు)
'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
'కాక్టెయిల్ 2' మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్నా సందడి (ఫొటోలు)
‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
ఫిఫా ప్రపంచకప్ 2026 : అందరి కళ్లు వీరిపైనే..(ఫొటోలు)
వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
హైలైఫ్ ఎగ్జిబిషన్ లో...అందమైన భామలు లేత మెరుపు తీగలు (ఫొటోలు)
సినిమా
హైదరాబాద్లో భారీ వర్షం.. తమన్ లైవ్ కన్సర్ట్ రద్దు
హైదరాబాద్లో ప్రతిష్టాత్మక లైవ్ కన్సర్ట్ రద్దయింది. భారీ వర్షాల కారణంగా బీజీఎం కింగ్ తమన్ ఆధ్వర్వంలో జరగాల్సిన 'ఓజీ టూర్ ఇండియా' లైవ్ కాన్సర్ట్ను రద్దు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ రోజు జరగాల్సిన ఈవెంట్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో తమన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.భారీ వర్షంతో వేదిక వద్ద పెద్దఎత్తున నీరు నిలిచి ఉందని నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాకుండా ఈవెంట్కు సంబంధించిన సామగ్రి, పరికరాలు కూడా తడిసి ముద్దైపోయాయని తెలిపారు. అందుకే ఈవెంట్ను పూర్తిగా రద్దు చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మ లైవ్ కాన్సర్ట్ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్లో జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్ నిర్వహణకు కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. It’s Heartbreaking for Me & My 56 Member Team To Work on this #OgtourIndia .. from last 45 days Tirelessly Taking all the Feedback backs In A positive Manner We as a Team Took all the Good Energy in this World to Make this Concert happen In a Positive Manner . Sometimes It has…— thaman S (@MusicThaman) June 13, 2026 #OGTourIndia show which was supposed to happen today was cancelled due to heavy rains and a storm!! #Thaman pic.twitter.com/C642kt20Wo— LAKSHMIVENUGOPAL 🌞 (@venupro) June 13, 2026
హీరోయిన్ పేరుతో ఫేక్ అకౌంట్.. ఫ్యాన్స్కు అలర్ట్
ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా, విపరీతంగా సామాజిక మాధ్యమాలను వాడేస్తున్నారు. అదే సమయంలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేయడం సులభమైపోయింది. ముఖ్యంగా ఫేమ్ ఉన్న వారి పేర్లతో ఐడీలు క్రియేట్ సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటితో బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించారు.ఈ నకిలీ ఖాతాలపై హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించింది. ఇటీవల తన పేరు, ఫొటో, ఫేక్ నంబర్తో మోసం చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని అభిమానులను అలర్ట్ చేసింది. దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ పెట్టింది. ఎవరికైనా ఈ ఫేక్ నంబర్తో వస్తే కాల్ రిపోర్ట్ చేయాలని సూచించింది. అది తన అకౌంట్ కాదని.. ఈ సమాచారాన్ని అందించిన వారికి ధన్యవాదాలు అని రాసుకొచ్చింది.ఇక సినిమాల విషయానికొస్తే గుంటూరు కారంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య సరసన వృషకర్మ కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
'నాపై గే అంటూ ట్రోల్స్'.. బాలీవుడ్ నటి ఆవేదన
బాలీవుడ్ భామ మౌనీ రాయ్ బాలీవుడ్లో సుపరిచమైన పేరు. ఇటీవలే ఆమె తన భర్త సూరజ్ నంబియార్తో విడిపోతున్నట్లు ప్రకటించింది. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కానీ ఆ తర్వాత మౌనీ రాయ్పై పెద్దఎత్తన ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. చాలా దారుణంగా కొందరు కామెంట్స్ చేశారు. ఆమెను గే అంటూ రూమర్స్ సృష్టించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మౌనీ రాయ్ తనపై వచ్చిన రూమర్స్, ట్రోల్స్పై స్పందించింది. ఓ యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడిన ఆమె.. తనపై గే అన్న రూమర్పై రియాక్ట్ అయింది. తాను విన్న వాటిలో అత్యంత అసంబద్ధమైన రూమర్ ఇదేనని మౌనీ రాయ్ వెల్లడించింది.విడాకుల ప్రకటన తర్వాత తన చుట్టూ బలమైన మద్దతుగా నిలబడే వాళ్లు ఉండడం తన అదృష్టమని మౌనీ రాయ్ చెప్పింది. నాకు ఎల్లప్పుడూ ఒక కొండంత అండగా నిలిచే స్నేహితులు, కుటుంబం ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. కష్ట సమయాల్లో నాకు సహాయం చేయడంలో నా స్నేహితులు ముఖ్యమైన పాత్ర పోషించారని మౌని చెప్పుకొచ్చింది. నా ఫ్రెండ్స్ మంచి, చెడు సందర్భాల్లోనూ నాకు తోడుగా నిలిచారని మౌనీ రాయ్ పంచుకున్నారు.కాగా.. నాలుగేళ్ల డేటింగ్ తర్వాత 2022లో సూరజ్ను వివాహం చేసుకున్నారు. ఇటీవలే 2026లో అతనితో విడిపోయారు. మౌని, సూరజ్ ఇద్దరూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (2026) చిత్రంలో కనిపించారు.
‘దృఢం’ రివ్యూ.. ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!
టైటిల్ : దృఢంనటీనటులు: షేన్ నిగమ్, శోభి తిలకన్, కొట్టాయం రమేశ్, నందన్ ఉన్ని తదితరులుదర్శకత్వం : మార్టిన్ జోసెఫ్ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక: జియో హాట్స్టార్తమిళ, మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్కి ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది.థియేటర్స్లో సరిగా ఆడలేకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి విజయాన్ని సాధించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఆ చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే ప్రతివారం ఓటీటీలో ఇలాంటి చిత్రాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ వారం కూడా ఓ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘దృఢం’. జియో హాట్స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కుజినీలం పోలీస్స్టేషన్ పరిధిలో పెద్దగా క్రైమ్ అనేదే జరగదు. పోలీసులంతా ఊరివాళ్లతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అలాంటి ప్రశాంతమైన స్టేషన్కి ఎస్సైగా వస్తాడు విజయ్(షేన్ నిగమ్). శిక్షణ పూర్తయిన తర్వాత ఎస్సైగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందని తెలిసి ఎంతో సంతోషంగా ఉంటాడు. స్టేషన్లోని పోలీసులందరితో సరదాగా ఉంటూ తన డ్యూటీ తాను చేస్తుంటాడు. అయితే ఆయన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే ఊరిలో గుర్తు తెలియని యువకుడి శవం బయటపడుతుంది. కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగానే.. అదే ప్రాంతంలో ఉన్న ఫైనాన్స్ కంపెనీలో దోపిడీ జరుగుతుంది. భారీ బంగారంతో పాటు రూ. 50 లక్షల నగదు కూడా దోచేస్తారు.దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుండగానే స్థానికంగా ఉన్న డ్యామ్లో మరో శవం బయటపడుతుంది. ప్రశాంతమైన ప్రాంతంలో ఇలా ఒక్కసారిగా వరుస హత్యలు, దోపిడీ జరుగుతుండడంతో ఉన్నతాధికారుల నుంచి విజయ్పై ఒత్తిడి పెరుగుతుంది. వారంలో ఈ కేసులను ఛేదించాలని,లేదంటే ఆ బాధ్యతలను మరో అధికారికి అప్పగిస్తామని హెచ్చరిస్తారు. మరి ఈ కేసుని విజయ్ ఛేదించాడా? అసలు ఆ శవాలు ఎవరివి? ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేసిందెవరు? విచారణ క్రమంలో విజయ్కి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కథలు అన్ని దాదాపు ఒకేలా ఉంటాయి. క్రైమ్ జరగడం.. అది పోలీసులకు అది సవాలుగా మారడం..ఇన్వెస్టిగేషన్లో ట్విస్టులు బయటకు రావడం..ఇలా అన్ని కథలు ఇదే ఫార్మాట్లో సాగుతాయి. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ ఎంత ఉత్కంఠంగా సాగింది? అదేదానిపైనే సినిమా ఫలితం ఆధారణ పడుతుంది. ‘అరే..ఇదేం ట్విస్టురా..అస్సలు ఊహించలేదు’ అని ప్రేక్షకుడు నోటితో అనిపిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే. ‘దృఢం’ సినిమా చూస్తే చివరిలో కచ్చితంగా మన నోట అలాంటి మాట వస్తుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ని అస్సలు ఊహించలేరు. చివరిలో కొత్త క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చూశామనే ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది.సినిమా ప్రారంభ సన్నివేశాలు రొటీన్గానే ఉంటాయి. శిక్షణ పూర్తి చేసుకొని ఎస్సైగా కుజినీలం పోలీస్స్టేషన్కు రావడం..తోటి పోలీసులతో సరదగా కలిసి ఉండడం.. చిన్న చిన్న క్రైమ్ కేసులు వస్తే సాల్వ్ చేయడం.. దాదాపు అరగంట వరకు ఇలా సింపుల్గానే కథనం సాగుతుంది. ఎప్పుడైనే మొదటి శవం బయటపడుతుందో అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఒకవైపు గుర్తు తెలియని శవం ఎవరిదని విచారణ చేస్తుండగానే.. ఫైనాన్స్ కంపెనీతో దోపిడీ ఘటన బయటపడడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా వరుసగా క్రైమ్ జరగడంతో ఎస్సై విజయ్ ఈ కేసులను ఎలా ఛేదిస్తాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అసలు హత్యలు ఎవరు చేశారనేది ప్రేక్షకుడు కూడా అంచనా వేయలేడు. ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే ట్విస్టులు అయితే అదిరిపోతాయి. హంతకులు ఎవరనేది తెలిసిన తర్వాత షాకవ్వడం ఖాయం. ప్రేక్షకుడు ఆ షాక్లో ఉండగానే మరో ట్విస్ట్ రివీల్ చేసి సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలు థ్రిల్లింగ్కు గురి చేస్తాయి. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా, రొటీన్గా సాగినా.. సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే..షేన్ నిగమ్ తప్ప మిగిలిన నటీనటులెవరు తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగానూ ఈ సినిమా బాగానే ఉంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్ షార్ప్గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్వాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
క్రీడలు
ఆఫ్గన్తో తొలి వన్డే.. భారత ఓపెనర్ల అరుదైన రికార్డు!
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్తో తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్మన్ గిల్ వేర్వేరుగా అరుదైన రికార్డులు సాధించారు. రోహిత్ శర్మ విషయానికొస్తే మ్యాచ్లో రోహిత్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఓపెనర్గా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి 16 వేల పరుగుల మార్క్ను దాటడం విశేషం. అయితే మంచి ఈజ్తో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గిల్తో సమన్వయం లోపం వల్ల రనౌట్గా వెనుదిరిగాడు. మరోవైపు ఇదే మ్యాచ్లో ఓపెనర్ గిల్ కూడా వన్డేల్లో 3వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 3వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్గా గిల్ నిలిచాడు. గిల్ 67 ఇన్నింగ్స్లో 3వేల పరుగుల మార్క్ను అందుకొని రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక షై హోప్, ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్లు 67 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించారు.Scaling Mt. 16,000 🗻A monumental milestone unlocked by Rohit Sharma as an opener in international cricket 👏🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/vyC4C0oPvg— BCCI (@BCCI) June 13, 2026 Major Milestone for our Captain 🫡Shubman Gill becomes the fastest Indian and 2⃣nd fastest player overall to amass 3⃣0⃣0⃣0⃣ ODI runs 🙌🔝He also brings up his fifty!Updates ▶️ https://t.co/lCuohEZYAl#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/tdxL7cvo7X— BCCI (@BCCI) June 13, 2026
గిల్, రాహుల్ విధ్వంసం.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాటింగ్లో కెప్టెన్ శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో యాంకర్ రోల్ పోషించాడు. చివర్లో కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్తో తనదైన శైలిలో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ఖాన్, రెహమాన్ షరిఫీ చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.ఆఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. హస్మతుల్లా (26), భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగనుంది.Picture-Perfect 🙌#TeamIndia wrap a comprehensive victory by 7️⃣ wickets in Dharamshala ✅They lead the #INDvAFG ODI series by 1️⃣-0️⃣ 👌Scorecard ▶️ https://t.co/lCuohEZYAl @IDFCFIRSTBank pic.twitter.com/RNy13a0PHX— BCCI (@BCCI) June 13, 2026
గిల్ స్టన్నింగ్ క్యాచ్కు నోరెళ్లబెట్టాల్సిందే!
అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో శుబ్మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. హర్ష్దూబే వేసిన బంతిని అల్లా గజన్ఫర్ ఆఫ్ స్టంప్ ఔట్సైడ్ దిశగా ఆడాడు. అయితే స్లిప్లో ఉన్న గిల్ ఒక్క ఉదుటున డైవ్ చేసి సెకన్ల వ్యవధిలో ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవడం విశేషం. ఇక గిల్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్కు గజన్ఫర్ నోరెళ్లబెట్టాడు.అయితే గిల్ పట్టిన క్యాచ్ను చాలా మంది టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పోలుస్తున్నారు. ధోని తన ప్రైమ్టైమ్లో సెకన్ల వ్యవధిలోనే స్టంపింగ్లు చేసిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. 🔹 1st ODI | IND 🇮🇳 vs AFG 🇦🇫 🔹IND 🇮🇳 : 4️⃣0️⃣-0️⃣ (5 Overs)Rohit* : 1️⃣5️⃣¹⁴Gill* : 1️⃣7️⃣¹⁷INDIA 🇮🇳 NEED 1️⃣5️⃣5️⃣ RUNS MORE TO WIN#INDvAFG #TeamIndia #INDvsAFG #ODI #Cricketpic.twitter.com/z9dUJRGKlK https://t.co/oL8hQj02gs— Cricket Lover 🏏 (@Crick97924Lover) June 13, 2026 What. A. Catch 🤯Captain Shubman Gill with an absolute stunner of a grab 🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/jX2rAfSbtq— BCCI (@BCCI) June 13, 2026
ఉతికారేసిన గుర్బాజ్.. సెంచరీతో పలు రికార్డులు బద్దలు!
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ శతకంతో అదరగొట్టాడు. వర్షం అంతరాయంతో 25 ఓవర్లకు కుదించిన ఆటలో ఆఫ్గన్ ఓపెనర్ ఆరంభం నుంచే టీ20 ఆటను ప్రదర్శించాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ ఒక ఎండ్లో బ్యాటింగ్ కొనసాగించిన గుర్బాజ్ బౌలింగ్కు వచ్చిన ప్రతీ భారత బౌలర్ను ఉతికారేశాడు. ఈ క్రమంలోనే గుర్బాజ్ 48 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా గుర్బాజ్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం.👉అఫ్గానిస్తాన్ తరఫున వన్డేల్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ బాదిన క్రికెటర్ల జాబితాలో రహ్మనుల్లా గుర్బాజ్ తొలి స్థానంలో నిలిచాడు. 48 బంతుల్లోనే గుర్బాజ్ ఈ ఫీట్ అందుకున్నాడు. అంతకముందు మహ్మద్ షెహజాద్ (2010లో స్కాట్లాండ్పై 72 బంతుల్లో), కరీమ్ సాదిక్ (2012లో నెదర్లాండ్స్పై, 72 బంతుల్లో), నౌరోజ్ మంగల్ (2013లో స్కాట్లాండ్పై, 85 బంతుల్లో), మహ్మద్ షెహజాద్ (2019లో ఐర్లాండ్పై, 85 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.👉ఇక వన్డేల్లో భారత్పై ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్రికెటర్ల జాబితాలో రహ్మనుల్లా గుర్బాజ్ రెండో స్థానంలో నిలిచాడు. 2005లో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ ఫాల్కనర్ (57 బంతుల్లో), ఏబీ డివిలియర్స్ (57 బంతుల్లో), మైఖెల్ బ్రాస్వెల్ (57 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.👉వన్డేల్లో గుర్బాజ్కు ఇది తొమ్మిదో సెంచరీ. ఆఫ్గన్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు గుర్బాజ్ పేరిటే ఉంది. ఇబ్రహీం జర్దన్, మొహమ్మద్ షెహజాద్లు చెరో ఆరు సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.👉వన్డేల్లో ఆఫ్గన్ తరఫున ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదడం రహ్మనుల్లా గుర్బాజ్కు ఇది నాలుగోసారి. టీమిండియాతో మ్యాచ్లో 8 సిక్సర్లు బాదిన గుర్బాజ్.. గతంలో 2021లో ఐర్లాండ్తో మ్యాచ్లో 9 సిక్సర్లు, 2023లో బంగ్లాదేశ్పై 8 సిక్సర్లు, 2024లో బంగ్లాదేశ్పై 7 సిక్సర్లు కొట్టాడు.
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీలో చంద్రబాబు దగా పాలనపై ప్రజా ఉద్యమం... ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ ర్యాలీల్లో ఉప్పొంగిన జనహోరు
దగా ‘డీఎస్సీ’.. ‘మెగా’ స్కామ్!. చంద్రబాబు సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్...
నేడు విశాఖకు వైఎస్ జగన్మోహన్రెడ్డి... స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి... ఆరుగురికి తీవ్ర గాయాలు
విష ప్రచారం చేయడం దుర్మార్గం.. మేం రైతులం కాదా?... సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న అక్రమాల రాకెట్
మనోడే.. ఇచ్చేద్దాం. ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్్సకు పోలవరం పనులు
ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
బిజినెస్
ఓవైపు ఉద్యోగ భయం.. మరోవైపు భారీ వాడకం!
అన్నింటా ఏఐ వినియోగం పెరిగింది. దీంతో రోజుకొక కొత్త ఏఐ టూల్ పుట్టుకొస్తోంది. ఇదే క్రమంలో ఏఐ విస్తృతితో కంపెనీలు ఉద్యోగాలను తగ్గిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రాబోయే మరింతగా ఉద్యోగాల కోత ఉంటుందన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఉద్యోగుల భయాలను తొలగిస్తూ హమ్మయ్య అనిపించే తాజా నివేదిక ఒకటి వెల్లడైంది. ఉద్యోగాల తొలగింపుల భయాలు ఒకవైపు ఉన్నా మరోవైపు ఏఐ వినియోగంలో మనోళ్లు దూసుకెళ్తున్నారు.ఏఐ వినియోగంలో అగ్రస్థానంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని సుమారు 41 శాతం మంది ఉద్యోగులు ప్రతిరోజూ ఏఐని ఉపయోగిస్తుండగా, 80 శాతం మంది వారంలో నాలుగైదు సార్లు వాడుతున్నారు. సర్వేలో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇది అత్యధికం. ఇటువంటి పరిస్థితుల్లో సంస్థలు తమ ఉద్యోగులకు స్పష్టమైన కెరీర్ మార్గాలను చూపాలని, నిరంతర నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాలని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ తెలిపారు. సేవా రంగం విస్తృతంగా ఉన్న భారత్ వంటి దేశాల్లో ఆపరేషనల్, ప్రాసెస్ ఆధారిత పనుల్లో లక్షలాది మంది ఉన్నారు. అందువల్ల ఏఐ సాంకేతికతతో పాటు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పించడం సంస్థల బాధ్యత’’ అని రాహుల్ గోయల్ పేర్కొన్నారు.ఏఐతో ఉద్యోగాలు పోవు..‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు. ఏఐ వాడకంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంస్థల ఉత్పాదకత మరింత పెరుగుతుంది’ అని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు రోజువారీ పనుల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. దైనందిన జీవితంలో సాంకేతికత ఎంత వేగంగా భాగమైందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని పరిశోధనా సంస్థ ‘ఏడీపీ రీసెర్చ్’ తాజాగా విడుదల చేసిన ‘పీపుల్ అట్ వర్క్ 2026’ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు ఏడీపీ రీసెర్చ్ సంస్థ 36 దేశాల్లోని 39,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ వార్షిక గ్లోబల్ వర్క్ఫోర్స్ సర్వేను నిర్వహించింది.
లక్ష రూపాయల ఫోన్.. ఇప్పుడు సగం ధరకే!
ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలని చాలా మందికి ఉంటుంది. అయితే అందుకు వారి బడ్జెట్ సహకరించదు. ఎందుకంటే వాటి ధరలు రూ.లక్ష వరకు ఉంటాయి. ఇలాంటి కస్టమర్లకు శామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ (Samsung Galaxy S25 Edge) ఇప్పుడు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. భారత్లో ఈ ఫోన్ను గతేడాది మేలో రూ.1,09,999 ప్రారంభ ధరతో విడుదల చేసిన శామ్సంగ్, ప్రస్తుతం ఈ మోడల్పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అధికారిక లాంచ్ సమయంలో రూ.1 లక్షకు పైగా ధర కలిగిన ఈ ఫోన్, ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో రూ.60 వేల పరిధిలోనే లభిస్తోంది.ప్రస్తుతం 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ.59,999కు, 512GB వేరియంట్ రూ.71,999కు అందుబాటులో ఉన్నట్లు ఆన్లైన్ ఆఫర్లు సూచిస్తున్నాయి. దీంతో అసలు లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు రూ.50,000 వరకు తగ్గింపు (Samsung S25 Edge Discount) లభిస్తోంది. కొన్ని బ్యాంక్ కార్డులపై అదనపు ఇన్స్టంట్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.గెలాక్సీ S25 ఎడ్జ్ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని అల్ట్రా-స్లిమ్ డిజైన్. కేవలం 5.8 మిల్లీమీటర్ల మందం, 163 గ్రాముల బరువుతో ఇది శామ్సంగ్ గెలాక్సీ S సిరీస్లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత సన్నని ఫోన్గా గుర్తింపు పొందింది. టైటానియం ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 రక్షణతో ప్రీమియం లుక్తో పాటు మన్నికను కూడా అందిస్తోంది.స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఇందులో 6.7 అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ ప్రాసెసర్, 12GB ర్యామ్ ఉన్నాయి. కెమెరా విభాగంలో 200 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించబడింది. అలాగే గేలాక్సీ ఏఐ ఫీచర్లు, IP68 వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం సౌకర్యాలు కూడా ఉన్నాయి.అయితే ఈ ఫోన్లో 3,900mAh బ్యాటరీ మాత్రమే ఉండటం కొంతమందికి ప్రతికూల అంశంగా భావించవచ్చు. అయినప్పటికీ, స్లిమ్ డిజైన్, ఫ్లాగ్షిప్ పనితీరు, 200MP కెమెరా కలయికను ప్రస్తుతం లభిస్తున్న తగ్గింపు ధరలో పరిశీలిస్తే, గెలాక్సీ S25 ఎడ్జ్ ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్ నుంచి ‘వాల్యూ ఫర్ మనీ ఫ్లాగ్షిప్’ కేటగిరీలోకి మారినట్లే కనిపిస్తోంది.
మల్టీప్లెక్స్ల టార్గెట్.. జెన్ జీ ఆడియన్స్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మల్టీప్లెక్స్ థియేటర్ల ముఖచిత్రం వేగంగా మారుతోంది. కేవలం భారీ బడ్జెట్, అగ్ర హీరోల పెద్ద సినిమాలపైనే ఆధారపడకుండా నిరంతరం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సరికొత్త వ్యూహాలను తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ‘జెన్ జీ’ వినియోగదారులను తమ ప్రధాన ఆడియన్స్ గ్రూప్గా మల్టీప్లెక్స్ పరిశ్రమ టార్గెట్ చేస్తోంది. ఓటీటీలు, రీల్స్ వంటి ఆన్లైన్ వేదికలపై విరక్తి (డిజిటల్ అలసట) చెందిన యువత.. మళ్లీ థియేటర్ల వైపు అడుగులు వేస్తుండటం ఇండస్ట్రీలో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది.మరోవైపు, పెద్ద సినిమాల విడుదలకు మధ్య ఉండే గ్యాప్లో మల్టీప్లెక్స్ల్లో ఆక్యుపెన్సీ రేటు పడిపోకుండా ప్రాంతీయ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు, ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లే చిన్న చిత్రాలు (స్లీపర్ హిట్లు) కీలక పాత్ర పోషిస్తున్నాయి.బాక్సాఫీస్ను శాసిస్తున్న యూత్!ఇటీవల విడుదలైన ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా టోబర్ 2026 నివేదిక ప్రకారం.. భారతీయ బాక్సాఫీస్ వసూళ్లలో యువత పాత్ర ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది. హిందీ బాక్సాఫీస్ మొత్తం కలెక్షన్లలో 30 ఏళ్ల లోపు ఉన్న యువత వాటా ఏకంగా 57% గా ఉంది. ఇక ఒక సినిమా విడుదలైన మొదటి రోజు (ఫస్ట్ డే) వచ్చే రెవెన్యూలో ఈ యువ తరం వాటా అత్యధికంగా 70% గా నమోదు కావడం విశేషం.‘ప్రస్తుతం సినిమా థియేటర్లకు వస్తున్న వారిలో జెన్ జీ తరం వారే అత్యధికంగా ఉంటున్నారు. ఆన్లైన్ వేదికలతో విసిగిపోయిన యువత, మళ్లీ వెండితెర అనుభూతిని ఆస్వాదించేందుకు థియేటర్లకు తిరిగి వస్తున్నారు’ అని పీవీఆర్ ఐనాక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ బిజ్లీ అన్నారు.ఒరిజినల్ కథలకే జై కొడుతున్న యువతఏదో ఒక సూపర్ హీరో ఫ్రాంచైజీలనో, పాత హిట్ చిత్రాల రీమేక్లనో లేదా రీబూట్లనో కాకుండా.. సరికొత్త లైన్లతో, ఒరిజినల్ కథాంశాలతో వచ్చే సినిమాలను చూసేందుకే యువత మక్కువ చూపుతున్నారని సంజీవ్ బిజ్లీ పేర్కొన్నారు. యువ దర్శకులు రూపొందించిన సరికొత్త చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎలా కనెక్ట్ చేస్తున్నాయనే దానికి కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ హారర్ చిత్రం ‘అబ్సెషన్’, కేన్ పార్సన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘బ్యాక్రూమ్స్’ చిత్రాల విజయాలే నిదర్శనమని ఉదహరించారు.భవిష్యత్తు ట్రెండ్స్ ఇవే..సినిమా ఎగ్జిబిషన్ రంగాన్ని రాబోయే రోజుల్లో కొన్ని అంశాలు శాసించనున్నాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అవి..థియేటర్లలో అధునాతన స్క్రీన్లు, మెరుగైన సీటింగ్, లగ్జరీ అనుభూతిని అందించడం.ద్వితీయ, తృతీయ శ్రేణి (టైర్2, టైర్3) పట్టణాలు, నగరాలకు మల్టీప్లెక్స్లను విస్తరించడం.కేవలం ఈవెంట్ సినిమాలు, పెద్ద చిత్రాలపైనే ఆధారపడకుండా.. విభిన్నమైన కంటెంట్తో వచ్చే స్లీపర్ హిట్ చిత్రాల ద్వారా థియేటర్లను నిరంతరం నిర్వహించడం.ఇదీ చదవండి: కాకపెంచుతున్న పసిడి ధరలు
కాకపెంచుతున్న పసిడి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇటీవల కొంత తగ్గిన బంగారం ధరలు నిన్న, ఈరోజు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
ఫ్యామిలీ
ఆటో డ్రైవర్ నుంచి రూ. 900 కోట్ల కంపెనీ రేంజ్కి..! జస్ట్ దేశీ బ్రాండ్తోనే..
జీరో నుంచి మొదలు పెట్టి కోట్లు గడించే రేంజ్కి చేరుకున్నాడు. అదికూడా తన చుట్టు ఉన్న అవసరాలే వ్యాపారంగా మలిచాడు. ఆఖరికి విలాసవంతమైన కారు కొన్నా..అది తన స్థాయి చూపించుకోవడానికి కాకుండా..సొంతూరు గర్వించే స్థాయిలో ఉన్నాను అని చూపేందుకు అని చెబుతుంటాడు. గెలుపుకి పెద్ద పెద్ద డిగ్రీలు, బ్యాగ్రౌండ్తో పనిలేదని చాటిచెప్పే అసామాన్యుడి కథ ఇది. సాధారణ ఆటో రిక్షా డ్రైవర్గా మొదలైన జీవితం ఏకంగా రూ. 900 కోట్లు టర్నోవర్ చేసే కంపెనీకి యజమానిగా మారి యవతకు ప్రేరణగా నిలిచిన విజయగాథ ఇది. అతడే కర్ణాటకలోని బళ్లారికి చెందిన సత్య శంకర్. అతడు ఇంటర్ డ్రాపౌట్. తండ్రి సాధారణ పూజరి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే కావడంతో చదువుకి మధ్యలోనే స్వస్తి చెప్పాల్సి వచ్చింది. దాంతో కుటుంబ పోషణ కోసం కష్టపడి డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి..ఆటో రిక్షా నడుపుతుండే వాడు. ఆ తర్వాత ప్రభుత్వ పథకం కింద రుణంపై సొంతంగా ఆటో కొనుక్కుని నడపడం మొదలు పెట్టాడు. కొన్నాళ్లకు ఆ రుణాన్ని తీర్చేసి..వెంటనే తన ఆటోని కారుగా మార్చాడు.ట్యాక్సీ డ్రైవర్గా తనుండే జిల్లా చుట్టూనే కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటి ముందుకెళ్లాడు. ఆ క్రమంలో తరచుగా విదేశీ పర్యాటకులను తన వాహనంలో తీసుకువెళ్లేవాడు. వాళ్లంతా ఎక్కడ నుంచి వచ్చినా..మొదటగా కొనేది ప్యాక్ చేసిన మంచినీటి సీసానే అని గమనించాడు శంకర్. తాను రోడ్డుపై దృష్టిపెడితే..విదేశీ పర్యాటకులంతా ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఇలా చేస్తున్నారని గ్రహించాడు. అప్పుడే ఇదేదో పనికొచ్చే బిజినెస్లా ఉందే అని అతడి బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమంది కానీ ఆచరణలోకి తీసుకురాలేదు. ఆ తర్వాత కారు నడపడం కంటే..కారు విడిభాగాలను అమ్మే వ్యాపారమే బెటర్ అని గ్రహించి ఆటోమొబైల్ వ్యాపారం ప్రారంభించాడు. విడిభాగాలు కొనే ప్రతి కస్టమర్కు టైర్ కూడా అవసరం అని గ్రహించి టైర్ల దుకాణాన్ని కూడా తెరిచాడు. అంతేగాదు తన వద్ద రైతులు, స్థానికులు అరువుపై వస్తువులు కొనుగోలు చేసేవారు. చిన్న చిన్న వాయిదాలలో తిరిగి చెల్లించేవారు. దాంతో తను కూడా బ్యాంకుకు విడతల వారీగా డబ్బు చెల్లించొచ్చని తెలుసుకున్నాడు శంకర్. అలా 1994లో ప్రవీణ్ క్యాపిటల్ అనే ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడు. ఇతర ఫైనాన్షియర్లు పాత వాహనాలను పట్టించుకోనప్పటికీ, శంకర్ సెకండ్ హ్యాండ్ ఆటోలు,కార్లకు రుణాలు ఇచ్చాడు. అతను కూడా ఒక కష్టపడే డ్రైవరే కాబట్టి, కష్టాల్లో ఉన్న డ్రైవర్ను పరిస్థితిని అర్థం చేసుకుని ఈ సాహసానికి పూనుకున్నాడు. ఇక ఆ తర్వాత తనలో ఆనాడు విదేశీ పర్యాటకుల కారణంగా తన బ్రెయిన్లో తట్టిన ఆ వ్యాపార ఆలోచనను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేశాడు. భారీ వర్షాలు కురిసే పుత్తూరు సమీపంలోని నరిమొగేరు అనే గ్రామంలో అతను మంచినీటి ఫ్యాక్టరీని స్థాపించాడు. అతను ఆ బ్రాండ్కు బిందు (‘కన్నడలో చుక్క’) అని పెట్టారు. అక్కడితో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆపలేదు. శంకర్ ఉత్తర్ భారత దేశ పర్యటనలో ఓ చిన్న సోడా దుకాణం వద్దకు వచ్చాడు. అక్కడ సర్వ్ చేసిన సోడా పానీయం అతడికి మరో వ్యాపారాన్ని నిర్మించేదుకు దారితీసింది. అలా తన సొంతూరు పుత్తూరులో బిందు ఫిజ్ జీరా మసాల అనే కూల్డ్రింక్ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. మొదట్లో వంద సేల్ అవ్వడమే కష్టంగా ఉండేది. అయితే దేశీ రుచి కచ్చితంగా విజయవంతమవ్వుతుందన్న ఆశతో వెనక్కి తగ్గకుండా హైవేలపై ఉండే గోడలనే ప్రచార బోర్డులుగా మార్చి ఆ డ్రింక్ ప్రకటనలను ఇచ్చేవాడు. నోటి మాటతో దాని రుచి ప్రజలకు చేరువయ్యేలా చేశాడు. దాంతో గ్రామీణ శైలి ఆహారంతో ప్రజలు కోరుకునే పానీయంగా ప్రజల మదిలో నిలిచే చల్లని పానీయంగా బిందు ఫిజ్ని స్థిరపడేలా చేశాడు. మార్చి 2025 నాటికి 60 ఏళ్లు శంకర్కి. కానీ ఆయన వ్యాపార విస్తరణ ఆగలేదు. ఇప్పటికీ అంతే ఉత్సాహంతో సాగిపోతున్నాడయన. అంతేగాదు ఆయన ఎస్జీ కార్పొరేట్స్, ఇప్పుడు రూ. 900 కోట్ల టర్నోవర్ ఆర్జిస్తుండగా, హౌస్ ఆఫ్ బిందు (పానీయాలు , స్నాక్స్) రూ. 570 కోట్ల ఆదాయం, ప్రవీణ్ క్యాపిటల్ (ఫైనాన్స్ విభాగం) రూ. 330 కోట్లను ఆర్జిస్తోంది. ఆయన ప్రసిద్ధ జీరా మసాలా నుంచి మామిడి రసాలు, స్నాక్స్ వరకు 55 రకాల ఉత్పత్తులను అమ్ముతారు. ఆయనకు తెలంగాణ, కర్ణాటకలో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి. పైగా ఆంధ్రలో కొత్తవి రానున్నాయి కూడా. ఆయన వద్ద ప్రస్తుతం రోల్స్ రాయిస్ కారు కూడా ఉంది. అది తన స్టేటస్ ఆఫ్ సింబల్ కోసం కాదని, బళ్లారికి చెందిన వ్యక్తి ఎంత దూరం వెళ్లగలడు అని చెప్పడానికని గర్వంగా అంటాడు శంకర్. తన వ్యాపారాలన్నీ..సామాన్య ప్రజలు కోరుకునేది, వారి అవసరాల దృష్టి నుంచి మొదలైనవేనని, అదే తన సక్సెస్మంత్ర అని అంటాడాయన. అంతేగాదు అంతా ఇంగ్లీష్ పానియాలతో వ్యాపారం చేస్తే..స్థానిక భాషకు ప్రాధాన్యత ఇచ్చి..దేశీ రుచిని అందించే పానీయాలను తీసుకొచ్చారు. ఓపిక, నిశిత పరిశీలన ఉంటే..ఎప్పటికైనా గెలుపు తథ్యం అంటాడు కర్ణాటకకు చెందిన సత్య శంకర్.(చదవండి: అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల వయసులో ఆమె ..)
అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల వయసులో ఆమె ..
చాలామంది యువకులు సైతం ప్రయత్నించడానికి సంకోచించే డేరింగ్ ఫీట్ ఇది. నేర్చుకోవాలనుకున్నా లేదా ఏదైనా సాహసం చేయాలన్న వయసు ఎన్నటికీ అడ్డంకి కాదు అనే చెప్పే సంఘటన ఇది. ఓ కూతురు తల్లి కలను నెరవేర్చి ఆమె కళ్లలో ఉబికి వచ్చిన ఆనందం చూసి ఉప్పొంగింది. వాళ్లను బాగా కేర్గా చూసుకోవడం కాదు..వాళ్ల కలలను కూడా నెరవేర్చే ప్రయత్నం చేయండి అంతకన్న ఇంకేం ఆశించరు అన్న అంశాన్ని నొక్కి చెప్పింది ఈ ఘటన. అందుకు సంబంధించిన వీడియోని రూపాలి జన్బంధు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో ఆమె 53 ఏళ్ల తల్లి తన కూతురుతో కలిసి ఒక స్కైడైవింగ్ క్లిప్ని చూస్తూ..కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె కూతురితో తాను కూడా ప్రయత్నించొచ్చా అని సరదాగా అడుగుతుంది. ఏదో సరదాగా అన్న ఆమాటను కూతురు నిజం చేస్తుందని ఆ క్షణం ఆమె అనుకోలేదు. కానీ ఆ తర్వాత కూతురు ఆ సాహసాన్నే తల్లికి ఊహించని సర్ప్రైజ్ గిప్ట్లా ఇచ్చింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ చాలా ఉత్సాహంతో ఎప్పడెప్పుడు ఆకాశంలోకి ఎగిరిపోతానో అన్నట్లుగా స్కైడైవింగ్ దుస్తులతో ఆత్రుగా ఉందామె. ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా ఎగరడానికి సిద్ధం అన్నట్లుగా డేరింగ్ చేసింది ఆ స్టంట్. పైగా ఆ స్కైడైవింగ్ని ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్న ఆమెను చూస్తే..ఎవ్వరికైన జీవితాన్ని అందంగా ఆస్వాదించేలా తప్ప వయసు, భయాలను అడ్డంకిగా చేసుకోకూడదనిపిస్తుంది. అంతేగాదు ఈ వీడియోకి కూతురు రూపాలి..“73 ఏళ్లకే ఎగరడానికి సిద్ధం. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది అమ్మా” అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా ప్రేమిస్తున్నా అని చెప్పే బదులు..వారి కలలను నెరవేర్చేలా చూడండి..ఉన్నది ఒక్కటే జీవితం..హాయిగా జీవించనివ్వండి అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Rupali Janbandhu (@nofussfitness_rup) (చదవండి: అందుకే అంత లావు..! భావోద్వేగంలో నటుడు అనుపమ్ ఖేర్)
ప్లీజ్ రూపాన్ని చూసి అంచనా వేయొద్దు..!: అనుపమ్ ఖేర్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గోవా నుంచి ముంబై వెళ్లే విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ ఘటన నెట్టింట హాట్టాపిక్గా మారింది. తప్పు చేయడం సహజమే అయినా..దాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం తోపాటు తనలా చేయొద్దని హితవు పలకడానికి చాలా ధైర్యం కావాలి. ఇక్కడ నటుడు అనుపమ్ సరిగ్గా అలాంటి పనే చేశారు అసలేం జరిగిందంటే..గోవా నుంచి ముంబై వెళ్లే విమానంలో ఓ అధిక బరువు ఉన్న వ్యక్తితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ..అతడితో తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు అనుపమ్ ఖేర్. ఆ విమానంలో డేవిడ్ అనే వ్యక్తి పెద్ద మొత్తంలో చాక్లెట్లు, స్వీట్లు పట్టుకుని రావడం చూస్తారు. నిజానికి డేవిడ్ విమానంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే ప్రయాణికుల అందరి చూపులు అతని మీదే ఉంటాయి. నటుడు అనుపమ్ కూడా పక్క వ్యక్తివైపు చూస్తూ అతను అంతలా స్వీట్లు, చాక్లెట్లు తినకూడదని అంటాడు. అది కూడా కేవలం ఒక శ్రేయోభిలాషిలానే చెప్పినట్లు తెలిపారు ఖేర్. దానికి ఆ వ్యక్తి నవ్వి..బహుశా అందుకే అతడు అంతలా కనిపిస్తున్నాడేమో అని సమాధానమిచ్చారని రాసుకొచ్చారు సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో. అయితే కాసేపటి తర్వాత డేవిడ్ తిరిగి వచ్చి ఆ స్వీట్లన్నింటిని తీసుకుని క్యాబిన్ సిబ్బందికి ఇచ్చాడు. అది చూసి తాను ఆశ్చర్యపోయానంటూ రాసుకొచ్చారు ఖేర్. వెంటనే ఆ తర్వాత తాను ఆ చాక్లెట్లన్నీ చూసి మీరు తింటారనుకున్నా, అందుకే ఇంత అధిక బరువు ఉన్నారని అనుకున్నా అంటూ అసలు విషయం చెప్పాడు ఖేర్. అందుకు డేవివ్ నవ్వి, తనకు అనారోగ్య సమస్య ఉందని, అందువల్లే ఇలా లావుగా కనిపిస్తున్నట్లు తెలిపాడు. తాను గతంలో ఎయిర్లైన్లో పనిచేశానని, ప్రయాణికులకు సేవ చేయడానికి క్యాబిన్ సిబ్బంది ఎంతలా కష్టపడతారో తనకు బాగా తెలుసునని అన్నారు. అందుకే వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇలా ప్రయాణించిన ప్రతిసారీ వారికి ఏదైన తీపి పదార్థాన్ని ఇవ్వడం ఒక అలవాటుగా మార్చుకున్నానని అన్నాడు. ఒక్కసారిగా ఖేర్ ఇతడు ఎంత గొప్ప మనిషి, నాకెంత గొప్ప పాఠం నేర్పాడు అని ఆశ్చర్యపోయానంటూ ఆ సంఘటన గురించి వివరించారు ఖేర్. ఈ ఘటన ఇతరుల రూపాన్ని బట్టి ఒక అంచనాకు రావడం ఎంత ప్రమాదకరమైందో తెలియజేసిందన్నారు. ఒక్కసారిగా రూపంబట్టి చాలా సులభంగా అంచనా వేసి, కథలు అల్లేస్తుంటాం..వాళ్లు ఆ మార్గంలో పయనించడానికి దాని వెనుకున్న కారణం, వారి జీవితాల గురించి ఏమి తెలియకుండానే తేలిగ్గా అంచనాకు వచ్చేస్తాం అన్నారు. దయచేసి తనలా అలా చేయొద్దు అని చెబుతూ డేవిడ్తో ఒక సెల్ఫీ కూడా దిగినట్లు తెలిపారు. అలాగే అతడికి ఇంత మంచి జీవిత పాఠం నేర్పినందుకు ధన్యవాదాలు చెప్పినట్లు రాసుకొచ్చారు పోస్ట్లో. అయితే నెటిజన్లు ఖేర్ మీరు చాలాగ్రేట్ తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, అలాగే బాహ్య రూపం బట్టి అంచనాకు రాకూడదనే లోతైన జీవిత పాఠం ఇది అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఈ ఘటన "డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్" అనే సామెతకు అసలైన అర్థం కదూ..!.THANK YOU DAVID FOR THE LESSON! 🥹❤️Life is full of lessons. Last week, on a flight from Goa to Mumbai, I learned one.In the picture is David.When David boarded the flight, many people looked at him because he was overweight. He came and sat across the aisle from me. In the… pic.twitter.com/Yw7rjm4qcu— Anupam Kher (@AnupamPKher) June 11, 2026 (చదవండి: పిల్లలను మానసికంగా స్ట్రాంగ్గా మార్చే ‘10-10-10’ రూల్..!)
గృహిణి సేవలకు ‘సుప్రీం’ విలువ!
ఇంటికి దీపం అని భావించే ఇల్లాలి సేవల విలువ ఎంత? భార్య రోడ్డు ప్రమాదంలో మరణిస్తే భర్తకు జరిగే లోటును ఎంత మొత్తంతో భర్తీ చేయవచ్చు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం సమాధానమిచ్చింది. మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద చెల్లించే నష్ట పరిహారంలో భార్య అందించే కుటుంబ సేవలకు వేరుగా విలువకట్టి చెల్లించాలని చెప్పింది. ఈ మొత్తం నెలకు రూ.30,000గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు ప్రమాద కేసుల్లో ఏడాది లోగా నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కే సింగ్లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు పూర్వాపరాలు...రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే నష్టపరిహారం విషయంలో 2017 నాటి సుప్రీంకోర్టు తీర్పు (ప్రణయ్ సేథీ తీర్పుగా పిలుస్తారు) మార్గదర్శకాలకు ఇది అదనం అని తెలిపింది. ‘‘ప్రణయ్ సేథీ కేసు విషయంలో చెప్పిన వాటికి భార్య మరణం వల్ల కుటుంబ సేవలకు కలిగే నష్టాన్ని అదనంగా చేరుస్తున్నాం. గృహిణికి ఇప్పుడైనా నేషన్ బిల్డర్ హోదా లభిస్తుందని నమ్ముతున్నాం’’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని రాష్ట్ర హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కూడా మోటార్ వెహికల్ యాక్ట్ కేసుల ప్రగతిని పర్యవేక్షించాలని సత్వర న్యాయం దక్కేలా చేయాలని కోరింది.సెక్షన్ 169 కింద ఇచ్చిన సమ్మరీ ప్రోసీజర్ను కచ్చితంగా అనుసరించడం ద్వారా బాధిత కుటుంబాలు సుదీర్ఘ న్యాయ పోరాటం నుంచి ఉపశమనం పొందవచ్చునని తెలిపింది. నష్ట పరిహారానికి సంబంధించిన మార్గదర్శకాలను అక్షర, భావ స్ఫూర్తితో అనుసరించాలని కోరింది. హోం మేకర్ అనగానే అందరికీ ఓ మహిళ రూపం కళ్ల ముందు మెదులుతుందని అయితే ఇది అన్ని సందర్భాలకూ వర్తించక పోవచ్చునని సుప్రీంకోర్టు బెంచ్ తన తీర్పులో పేర్కొంది. కొన్ని అసాధారణ పరిస్థితుల్లోనో, దురదృష్టవశాత్తో పురుషుడు కూడా హోం మేకర్ పాత్ర పోషించే అవకాశాలు లేక పోలేదని తెలిపింది. వీరికి దక్కాల్సిన గౌరవం ఇస్తూనే ప్రస్తుత కేసులో మాత్రం భార్య అందించే కుటుంబ సేవలకు మాత్రమే విలువ కట్టామని వివరించింది.ప్రణయ్ సేథీ తీర్పు ప్రకారం...రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నష్ట పరిహారం చెల్లింపు విషయంలో 2017 నాటి ప్రణయ్ సేథీ కేసు తీర్పు నిర్ణయాత్మకమైంది. ఈ కేసులో జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడం బీమా కంపెనీలకు తప్పనిసరిగా మారింది ఈ తీర్పుతోనే. చని పోయిన వారు భవిష్యత్తులో ఎంత ఆదాయం సంపాదించగలరు అన్నదాన్ని ఎలా లెక్కించాలో ఈ తీర్పులో స్పష్టంగా వివరించారు. ఏ ఏ విషయాల్లో నష్టపరిహారం చెల్లించాలి, వేటిని మినహాయించాలి అన్నది కూడా ఈ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ.కే.సేక్రీ, జస్టిస్ ఏ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ డాక్టర్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు ప్రకారం...⇒ నలభై ఏళ్ల లోపు వయసుండి శాశ్వత ఉద్యోగం కలిగి ఉన్న వారైతే...నష్టపరిహారంలో వారి వేతనంలో సగాన్ని ఆదాయంగా పరిగణించాలి (వేతనమంటే అన్ని రకాల పన్నులు మినహాయించిన తరువాతి మొత్తం)⇒ నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్కులైతే వేతనంలో 30 శాతాన్ని, యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య వయసు వారైతే 15 శాతాన్ని ఆదాయంగా పరిగణించాలి. ⇒ స్థిరమైన వేతనంతో సొంతంగా ఉద్యోగం కలిగి ఉండి నలభై ఏళ్ల కంటే తక్కువ వయసు ఉంటే వేతనంలో 40 శాతాన్ని ఆదాయానికి జోడించాలి. ⇒ 2009 నాటి సరళ వర్మ, డీటీసీ కేసు మార్గదర్శకాల ప్రకారం నష్ట పరిహారం నుంచి వ్యక్తిగత ఖర్చులను మినహాయిస్తారు. ⇒ లాస్ ఆఫ్ ఎసెట్స్ (బతికి ఉంటే సంపాదించే అవకాశమున్న ఆస్తులు, ఆదాయం) కింద రూ.15,000, అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కింద రూ.15,000, భార్య/భర్త సాంగత్యాన్ని కోల్పోయినందుకు రూ.40,000 కూడా చెల్లించాల్సిన నష్టపరిహారాల జాబితాలోకి చేరుతుంది.⇒ ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ప్రతి మూడేళ్ల కాలానికి పది శాతం చొప్పున పరిహారం పెరగాలి.శిశుపాల్ వర్సెస్ సుర్జీత్మోటారు వాహన ప్రమాద పరిహారానికి సంబంధించిన ‘శిశుపాల్ వర్సెస్ సుర్జీత్’ కేసులో దాఖలైన అప్పీలును సుప్రీంకోర్టు విచారించింది. ప్రమాదాల్లో గృహిణులు మృతి చెందినప్పుడు లేదా వికలాంగులుగా మారినప్పుడు వారి సేవలకు తగిన ఆర్థిక విలువ కట్టడం లేదన్న వాదనలు న్యాయస్థానం ముందుకొచ్చాయి. గృహిణులకు ఎలాంటి ప్రత్యక్ష ఆదాయం లేనందున కింది కోర్టులు, ట్రిబ్యునళ్లు పరిహారం చెల్లింపుల్లో తక్కువ మొత్తాలను ఖరారు చేస్తున్న తీరును కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీనిపై స్పందించిన న్యాయస్థానం... గృహిణుల సేవలకు కచ్చితమైన, గౌరవప్రదమైన విలువను ఆపాదించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.పరిహారం లెక్కింపుపై స్పష్టమైన తీర్పు బాధిత కుటుంబం కోల్పోయే ‘గృహ సంరక్షణ’ను ఇకపై ఒక స్వతంత్ర ప్రాతిపదికగా పరిగణించి పరిహారం లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతంలో ప్రణయ్ సేథీ కేసులో ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన పరిహారాలకు అదనంగా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే, ప్రమాద పరిహార క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 169 ప్రకారం సత్వర చర్యలు తీసుకోవాలని, దీనిని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించింది. పరిహార కేసుల విచారణలు సకాలంలో పూర్తయ్యేలా, తీర్పులోని సూత్రాలు అమలయ్యేలా అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పర్యవేక్షించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. – సాక్షి, న్యూఢిల్లీపాతికేళ్ల క్రితం నాటి కేసు...2001లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఈ కేసులో చివరకు 2026 జూన్ నెలలో తీర్పు వెలువడింది. జీపులు రెండు ఢీకొన్న ప్రమాదంలో కక్షిదారు భార్య మరణించింది. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు 2024లో తీర్పునిస్తూ... బాధితుడికి, ముగ్గురు పిల్లలకు ఎనిమిది లక్షల రూపాయల పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అయితే బాధితుడు ఈ తీర్పును సవాలు చేస్తూ గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అంతర్జాతీయం
ట్రంప్ వేట.. వెనిజువెలా డ్రగ్ లార్డ్ హతం
వాషింగ్టన్: అంతర్జాతీయ నేర సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ లీడర్ హెక్టార్ ‘నినో’ గెరెరోను అమెరికా సైన్యం మట్టుబెట్టింది. వెనిజువెలాకు చెందిన ‘ట్రెన్ డి అరాగువా’ ట్రాన్స్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ హెడ్ గెరెరోను సైనిక దాడిలో హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన వీడియో ఫుటేజీని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ - సంచలన వీడియోఅమెరికా సదరన్ కమాండ్ మెరుపు వేగంతో నిర్వహించిన ఈ ‘కైనెటిక్ స్ట్రైక్’లో గెరెరో హతమయ్యాడని ట్రంప్ పేర్కొన్నారు. ‘మా నాయకత్వంలో, ఈ క్రూరమైన హంతకులను, డ్రగ్ లార్డ్లను ఎక్కడైనా, ఎప్పుడైనా సరే వేటాడి పట్టుకుంటాం’ అని ట్రంప్ హెచ్చరించారు. వెనిజువెలా అధికారులతో సంపూర్ణ సమన్వయంతోనే ఈ వ్యూహాత్మక ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం వెనిజువెలా ప్రభుత్వంతో అమెరికా కలిసికట్టుగా పనిచేస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు.𝗗𝗼𝗻𝗮𝗹𝗱 𝗝. 𝗧𝗿𝘂𝗺𝗽 𝗣𝗼𝘀𝘁𝘀 𝗩𝗶𝗱𝗲𝗼 𝗼𝗻 𝗧𝗿𝘂𝘁𝗵 𝗦𝗼𝗰𝗶𝗮𝗹 - 𝟬𝟮:𝟬𝟯 𝗣𝗠 𝗘𝗦𝗧 𝟬𝟲.𝟭𝟮.𝟮𝟲At my direction, the United States Southern Command delivered a swift and lethal kinetic strike to successfully execute Niño Guerrero, the infamous leader of… pic.twitter.com/IMj9iZzTYM— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) June 13, 2026బైడెన్ సరిహద్దు విధానాలపై తీవ్ర విమర్శలుఈ అద్భుతమైన విజయాన్ని ప్రకటిస్తూనే, ట్రంప్ తన పూర్వ అధ్యక్షుడు జో బైడెన్ అనుసరించిన సరిహద్దు విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బైడెన్ హయాంలో సరిహద్దులను అదుపులేకుండా వదిలేయడం వల్లే ‘ట్రెన్ డి అరాగువా’ వంటి విదేశీ క్రిమినల్ ముఠాలు అమెరికాలోకి చొరబడ్డాయని ఆరోపించారు. గతంలో అమెరికాలో కలకలం రేపిన 12 ఏళ్ల జోస్లిన్ నుంగారే, 22 ఏళ్ల లాకెన్ రైలీల హత్యలను ప్రస్తావిస్తూ, ఈ సైనిక చర్య ద్వారా బాధిత కుటుంబాలకు న్యాయం చేకూరిందని, అమెరికా సైన్యం వారి తరఫున ప్రతీకారం తీర్చుకుందని ట్రంప్ ఉద్ఘాటించారు. ‘ట్రెన్ డి అరాగువా’ నేరచరిత్రవెనిజువెలాలో పుట్టిన ఈ ‘ట్రెన్ డి అరాగువా’ గ్యాంగ్ ప్రస్తుతం లాటిన్ అమెరికా అంతటా విస్తరించి ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ ముఠా దోపిడీలు, మానవ అక్రమ రవాణా, వలసదారుల స్మగ్లింగ్, డ్రగ్స్ మాఫియా, అనేక క్రూరమైన హింసాత్మక నేరాలకు పాల్పడుతున్నట్లు పలు దేశాల అధికారులు గుర్తించారు. ట్రంప్ ప్రభుత్వం తమ వలస విధానాలు, జాతీయ భద్రతా ఎజెండాలో భాగంగా ఈ గ్యాంగ్ను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది.ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెన
నిన్నటి మిత్రులు.. నేటి ప్రత్యర్థులా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కలిసి ఇరాన్పై యుద్ధాన్ని ప్రారంభించినప్పటికీ, ఇప్పుడు అదే యుద్ధం ముగింపుపై ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఒకే వ్యూహంతో ముందుకెళ్లిన ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం తమ తమ దేశీయ రాజకీయ అవసరాల కారణంగా వేర్వేరు దారుల్లో నడుస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.యుద్ధం ఎలా మొదలైంది?ఫిబ్రవరి 28, 2026న అమెరికా-ఇజ్రాయెల్ మద్దతుతో ఇరాన్పై భారీ సైనిక చర్య ప్రారంభమైంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం, ప్రాంతీయ భద్రతా ముప్పులను తగ్గించడం, టెహ్రాన్ ప్రభావాన్ని కట్టడి చేయడం ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు. ప్రారంభ దశలో ట్రంప్, నెతన్యాహు ఒకే వైఖరితో ముందుకు సాగారు.ఇప్పుడు ఎందుకు విభేదాలు?ప్రస్తుతం ట్రంప్ ప్రధానంగా యుద్ధాన్ని ముగించి ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) దాదాపు సిద్ధమైందని, త్వరలోనే సంతకాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే, నెతన్యాహు మాత్రం ఇరాన్పై ఒత్తిడిని కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అణు సామర్థ్యం, క్షిపణి కార్యక్రమం, హెజ్బొల్లా వంటి మిత్ర బలగాలపై మరింత కఠిన చర్యలు అవసరమని ఇజ్రాయెల్ వాదిస్తోంది.ట్రంప్ రాజకీయ లెక్కలునవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు (Midterm Elections) ట్రంప్కు కీలకం. యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగడం, చమురు ధరల అస్థిరత, ప్రజల్లో యుద్ధ వ్యతిరేక భావన పెరగడం ఆయనకు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే యుద్ధాన్ని ముగించిన నాయకుడు అనే గుర్తింపుతో ఎన్నికల్లోకి వెళ్లాలని ట్రంప్ భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.నెతన్యాహు లక్ష్యం వేరుఇక నెతన్యాహు కూడా దేశీయ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్లో భద్రతా అంశం అత్యంత కీలకమైన రాజకీయ అంశం కావడంతో, ఇరాన్పై పూర్తి స్థాయి వ్యూహాత్మక ఆధిపత్యం సాధించకుండానే యుద్ధాన్ని ముగించడం ఆయనకు రాజకీయంగా ప్రమాదకరంగా మారవచ్చని భావిస్తున్నారు. అందువల్ల ఆయన మరింత కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.బయటపడుతున్న ఉద్రిక్తతఇటీవల ట్రంప్ ఇరాన్పై ప్రణాళికాబద్ధమైన దాడులను రద్దు చేసి, చర్చలకు ప్రాధాన్యం ఇచ్చిన నిర్ణయం నెతన్యాహును ఆశ్చర్యానికి గురి చేసిందని వార్తలు వెలువడ్డాయి. ఆ నిర్ణయం గురించి ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాకుండా, ఇరాన్పై మరోసారి యుద్ధాన్ని ప్రారంభించవద్దని ట్రంప్ నెతన్యాహును హెచ్చరించినట్లు కూడా రాయిటర్స్ వెల్లడించింది. "మరింత జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఒంటరిగా మిగిలిపోతారు" అని ట్రంప్ హెచ్చరించినట్లు కథనాలు పేర్కొన్నాయి.శాంతి చర్చలపై విభేదాలుప్రస్తుతం అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇజ్రాయెల్ పాత్ర పరిమితంగా ఉండటం, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా కొంత సడలింపు చూపుతుందనే అనుమానాలు నెతన్యాహు వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొత్తంగా ట్రంప్నకు యుద్ధం ముగింపు రాజకీయ లాభం అయితే, నెతన్యాహుకు ఇరాన్పై మరింత ఒత్తిడి కొనసాగించడం రాజకీయ అవసరంగా మారింది. ఈ విభిన్న లక్ష్యాలే ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల్లో కనిపిస్తున్న చీలికకు ప్రధాన కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొరాయించిన స్టీరింగ్.. లోయలో పడ్డ బస్సు
నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి వందల అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయాలు కాగా.. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.కవ్రేపలాంచోక్ జిల్లాలో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. బనేపా నుంచి రోషి గ్రామీణ మున్సిపాలిటీ వైపు వెళ్తున్న ప్రయాణికుల బస్సు నమోబుద్ధ మున్సిపాలిటీ పరిధిలోని సెల్ఫీ డాండా ప్రాంతంలో అదుపుతప్పి సుమారు 300 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే.. నేపాల్ సైన్యం, పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిపోయిన బస్సు నుంచి క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.జిల్లా పోలీసు కార్యాలయం వివరాల ప్రకారం.. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొందరిని గుర్తించగా.. మరికొందరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన 16 మందిని ధులిఖేల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. #Nepal | Eight dead and 15 injured in bus accident in KavreThe bus fell some 200 m off the road in Namobudhha municipality. The 15 injured are undergoing treatment at the Dhulikhel hospital.A passenger bus heading to Sungure of Roshi Rural Municipality from Banepa had met… pic.twitter.com/aWrSS4U1Wu— DD News (@DDNewslive) June 12, 2026ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు స్టీరింగ్లో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ ప్రయాణికుడు.. బస్సు సాధారణ వేగంతోనే ప్రయాణిస్తోందని చెప్పాడు. అయితే ఓ మలుపు వద్ద ఎదురుగా వచ్చిన వాహనానికి దారి ఇవ్వడానికి ప్రయత్నించే సమయంలో బస్సు రోడ్డు నుంచి జారి లోయలోకి దూసుకెళ్లిందని చెప్పాడు.దీంతో స్టీరింగ్ జామ్ కావడం వల్లే.. డ్రైవర్ వాహనంపై కంట్రోల్ తప్పి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏమిటన్నది దర్యాప్తు అనంతరమే వెల్లడించనున్నారు. మరోవైపు.. నిన్న నేపాల్లోని ధన్కుటా జిల్లాలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. రహదారిపై బస్సు బోల్తాపడటంతో 12 మందికి గాయాలయ్యాయి.
యుద్ధానికి ముగింపు? కీలక ప్రకటన చేసిన ఇరాన్!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా-ఇరాన్ ఘర్షణ ముగింపుకు చేరువైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరే దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటిదాకా ట్రంప్ ప్రకటనలను ఖండిస్తూ వచ్చిన ఇరాన్.. ఈసారి కాస్త సానుకూలంగానే స్పందించింది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన హర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనున్న నేపథ్యంలో.. అసలు ఈ ఒప్పందంలో ఏం ఉండబోతోంది? యుద్ధం ముగిస్తే ఎవరు గెలిచినట్లు?.. అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) ముసాయిదాపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా పరిపాలనలోని ఓ సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే కొద్ది రోజుల్లో తొలి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ కూడా చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ దాదాపు ఖరారైందని ప్రకటించింది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. చర్చలు తుది దశకు చేరాయని అన్నారు. "అమెరికాతో ఒప్పందం ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదు" అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆ పోస్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. ట్రంప్ మరో ట్విస్ట్ ఇచ్చారు.ఇరాన్ మీడియా ప్రచురించిన 14 అంశాల అవగాహన ఒప్పందం వివరాలను ట్రంప్ ఖండించారు. ఇటు అసలు షరతులపై ఊహాగానాలు చేయొద్దని అరాఖ్చీ మీడియాను కోరారు. చర్చలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు ఈ యుద్ధంలో తామే గెలిచినట్లు ఇరాన్ ప్రకటించుకోవడం.. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.అదే కీలకంఈ ప్రతిపాదిత ఒప్పందంలో.. అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి ఉండబోతోందని తెలుస్తోంది. ప్రపంచ చమురు, సహజవాయు సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. యుద్ధం తర్వాత ఇరాన్ మూసివేసిన ఈ జలసంధిని మళ్లీ తెరవడానికి అంగీకరించినట్లు సమాచారం. ప్రతిగా అమెరికా ఇరాన్పై విధించిన కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు, నిలిపివేసిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడదీయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.అణు ఒప్పందం.. ఆగాల్సిందే!అయితే అణు కార్యక్రమం అంశం మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. 60 రోజులపాటు ప్రత్యేక చర్చలు జరిపి దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఒప్పందంలో ప్రతిపాదించినట్లు సమాచారం. అమెరికా వాదన ప్రకారం ఇరాన్ అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించి, అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ మాత్రం యురేనియాన్ని పూర్తిగా వదులుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. దాన్ని తక్కువ శుద్ధి స్థాయికి మార్చే (డౌన్బ్లెండింగ్) మార్గానికే తాము సిద్ధమని అరాఖ్చీ ఓ అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం.ఈ ఒప్పందంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. యుద్ధ నష్టాలకు పరిహారం, అలాగే ఇరాన్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా చాలా కాలంగా చేస్తున్న డిమాండ్లను పక్కన పెట్టే అవకాశాలపై కూడా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా అధికారులు ఈ అంశాలను ఖండిస్తున్నారు.ఇది ఇంకో ట్విస్ట్ఇక ఈ చర్చల్లో ఇజ్రాయెల్ భాగస్వామి కాకపోవడం మరో కీలక పరిణామం. అమెరికాతో కలిసి ఇరాన్పై సైనిక చర్యలకు దిగిన ఇజ్రాయెల్.. తుది ఒప్పందంలో భాగం కాదని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే లెబనాన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలుగుతుందని ఇరాన్ కోరుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాత్రం అలాంటి ఆలోచన లేదని ప్రకటించింది.ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు సరఫరాలపై భయాలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు రెండు నెలల కనిష్ఠానికి చేరాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం తన ప్రధాన లక్ష్యాలను నెరవేర్చిందని చెబుతున్నప్పటికీ, ఒప్పంద నిబంధనలు ఇరాన్కు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు “యుద్ధంలో విజేత ఇరానే” అని టెహ్రాన్ ప్రకటించడం ఈ ఒప్పందం చుట్టూ మరింత రాజకీయ ఆసక్తిని పెంచుతోంది.ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా ఒక్క విషయంపైనే ఉంది. నిజంగానే యుద్ధానికి ముగింపు పలికే చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందా? లేదంటే చివరి క్షణంలో మళ్లీ కొత్త మలుపులు తిరుగుతుందా?..
జాతీయం
శబరిమలలో రద్దీ నియంత్రణకు ఏఐ టెక్నాలజీ
తిరువనంతపురం: వచ్చే శబరిమల యాత్రా సీజన్లో జనసమూహ నిర్వహణ , డిజిటలైజేషన్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో సహా పలు కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ శుక్రవారం తెలిపారు.ఇక్కడ జరిగిన టీడీబీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అనేక సన్నాహక పనులు చాలా ముందుగానే చేపడుతున్నామని జయకుమార్ తెలిపారు.‘మేము వివిధ వ్యవస్థలను డిజిటలైజ్ చేసే దిశగా కృషి చేస్తున్నాము. శబరిమలలో నగదు లావాదేవీలకు తావు ఉండదు; ప్రతిదీ ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీలకే పరిమితం కాదు, పరిపాలనా ప్రక్రియలకు కూడా వర్తిస్తుంది’ అని ఆయన అన్నారు.జనసమూహ నిర్వహణకు సంబంధించిన మరో ముఖ్యమైన కార్యక్రమం ఉందని ఆయన అన్నారు. ‘జూన్ 20న, పోలీసు శాఖ సహకారంతో, జన సమూహాల నిర్వహణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించడంపై కొచ్చిలో ఒక ప్రధాన వర్క్షాప్ను నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో సుమారు ఆరుగురు గుర్తింపు పొందిన ఏఐ నిపుణులు పాల్గొంటారు’ అని ఆయన అన్నారు.వాస్తవ రద్దీ పరిస్థితుల ఆధారంగా నీలక్కల్, పంపా, మరకూట్టం మరియు సన్నిధానానికి యాత్రికుల రాకపోకలను నియంత్రించే ఒక ప్రొటోకాల్ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. ‘ రియల్ టైమ్లో ఏఐని ఉపయోగించి, ఏ సమయంలోనైనా ఎంత మందిని ముందుకు వెళ్లడానికి అనుమతించాలనే దానిపై నిర్ణయాలు తీసుకోబడతాయి. ఈ వర్క్షాప్ జూన్ 20న కొచ్చిలోని ఐఎంఏ హాల్లో జరుగుతుంది’అని స్పష్టం చేశారు. జూన్ 14న టీడీబీ హరిత శబరిమల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారం శబరిమల యాత్రకు సంబంధించి దానికి అనుగుణంగా జల ప్రాధికార సంస్థ, విద్యుత్ బోర్డు, అటవీ శాఖ, పోలీస్ శాఖ మరియు ఇతర ఏజెన్సీల అధికారులతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ టీడీబీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జయకుమార్ పేర్కొన్నారు. ‘అన్ని విభాగాలను సమన్వయం చేసి, శబరిమల కోసం సమగ్రమైన గ్రీన్ ప్రోటోకాల్స్ను అమలు చేయడమే లక్ష్యం. గ్రీన్ ప్రోటోకాల్తో పాటు, మేము ప్రత్యేక పారిశుధ్య ప్రోటోకాల్ను కూడా ప్రవేశపెడుతున్నాము. సుచిత్వ మిషన్తో కూలంకషంగా చర్చలు జరిగాయి," అని ఆయన అన్నారు.తగినంత పారిశుధ్య సౌకర్యాలు లేకపోవడమే అతిపెద్ద ఫిర్యాదులలో ఒకటిగా ఉందని జయకుమార్ అన్నారు. ‘ఇప్పటివరకు కొన్ని ప్లాస్టిక్ డబ్బాలను పెట్టడమే సాధారణ పద్ధతిగా ఉండేది, కానీ అది సరిపోలేదు. మేము మూడు డబ్బాల విధానానికి మారుతున్నాము," అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి మద్దతుగా టీడీబీ తగినన్ని స్టీల్ వ్యర్థాల డబ్బాలను సమకూరుస్తుంది. వ్యర్థాలను వాటి మూలం వద్దనే జీవవిచ్ఛిన్నమయ్యేవి, జీవవిచ్ఛిన్నం కానివి మరియు ప్రమాదకర వ్యర్థాలు అనే మూడు వర్గాలుగా విభజిస్తారు.‘సరైన వ్యర్థాల విభజన బాధ్యతను దుకాణ యజమానులకు అప్పగిస్తాము, ఇందుకోసం ఇప్పటికే ఒప్పందాలు సిద్ధం చేశాము. మేము వ్యర్థాల సరైన శుద్ధిని కూడా నిర్ధారించి, బయో-ట్రీట్మెంట్ సౌకర్యాలను పూర్తిస్థాయిలో పనిచేసేలా చేస్తాము’ అని ఆయన అన్నారు. ఈ దిశగా గణనీయమైన పురోగతి సాధించబడుతోందని అన్నారు. ‘ ఈ ఏడాది శబరిమల యాత్రను అత్యంత వృత్తిపరంగా నిర్వహించాలన్నదే మా కల, దానిని సాధించేందుకు బోర్డు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది’ అని ఆయన అన్నారు.
భారత్ తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్
సాక్షి,ఢిల్లీ: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ను నియమించింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ కాలం జూన్ 30 నుంచి ముగుస్తుంది. ఆరోజే ఆర్మీ చీఫ్గా ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరిస్తారించనున్నట్లు తెలుస్తోంది.ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవీకాలం మూడు సంవత్సరాలు లేదా ఆయనకు 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు, ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ సేవలందిస్తున్నారు, ఖడక్ వాస్లాలోని ప్రతిష్టాత్మక 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ' (NDA) పూర్వ విద్యార్థి. ఆయన డిసెంబర్ 1986లో ఆయన భారత సైన్యంలో చేరారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత ఆర్మీకి సేవలందిస్తున్నారు. విస్త్రతశ్రేణి కమాండ్, స్టాఫ్,లాంటి పలు వ్యూహత్మక బాధ్యతలు నిర్వహించారు. గతంలో లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ గతంలో సాయుధ రెజిమెంట్కు, సాయుధ బ్రిగేడ్ తిరుగుబాటు నిరోధక దళానికి కమాండర్గా పనిచేశారు. ప్రతిష్టాత్మక సుదర్శన్ చక్ర కార్ప్స్కు నాయకత్వం వహించారు. ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ జీవోసీగా పని చేశారు. కాగా ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 2024 లో బాధ్యతలు స్వీకరించారు.
బీజేపీకి బై చెప్పి.. టీవీకేలో చేరిన బీజేపీ నాయకురాలు
చెన్నై: తమిళనాడులో అధికార పార్టీ తమిళగ వెట్రీ కళగం (టీవీకే)లోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు.. సీఎం విజయ్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎస్ విజయధరణి, అన్నాడీఎంకే నేత బాలగంగ తదితరులు శనివారం టీవీకేలో చేరారు. వీరికి పార్టీ కండువాలతో మంత్రులు ఎన్. ఆనంద్, ఆధవ్ అర్జున స్వాగతం పలికారు.టీవీకే చేరడం సంతోషంగా ఉందని ఎస్ విజయధరణి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "తమిళనాడులో టీవీకే మార్పును తీసుకువచ్చింది. జోసఫ్ విజయ్ నాయకత్వంలోని ప్రభుత్వం అవినీతిని రూపుమాపుతూ, మహిళలకు భద్రతను కల్పిస్తోంది. ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చారు. ప్రజల కోసం పనిచేసే అవకాశాన్ని టీవీకే నాకు కల్పించింది, ఆ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు.మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి..విజయధరణి ఇటీవల జరిగిన శానససభ ఎన్నికల్లో కన్యాకుమారి జిల్లాలోని విలవంకోడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అంతకుముందు ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేశారు. 2016లో ఆమె కర్ణాటక వ్యవహారాల బాధ్యతతో కూడిన అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చదవండి: రంగస్వామితో విజయ్ దూత రహస్య భేటీ!2011లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత వరుసగా 2016, 2021లోనూ గెలిచారు. 2024, ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కన్యాకుమారి లోక్సభ టికెట్ కోసం ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఆమెకు బీజేపీ లోక్సభ టికెట్ ఇవ్వలేదు. తాజాగా ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా విజయం దక్కలేదు. దీంతో బీజేపీని వీడి టీవీకే పార్టీలోకి వచ్చారు.
పురుషుల ప్రైవేట్ పార్ట్స్పై ప్రేలాపనలు : సేజల్ పవార్కు భారీ షాక్
పురుషులు ప్రైవేట్ పార్ట్స్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముంబై కేఈఎమ్ (KEM) హాస్పిటల్ వైద్య విద్యార్థిని సేజల్ పవార్ భారీ షాక్ తగిలింది. స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే షోలో ‘పురుషుల శవాల’ (Male Cadavers) పై వివాదాస్పద వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ముంబైలోని సేథ్ జీఎస్ మెడికల్ కాలే, కేఈఎమ్ హాస్పిటల్లో చివరి సంవత్సరం ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్న సేజల్ పవార్ను హాస్పిటల్ యాజమాన్యం 15 రోజుల పాటు నిర్బంధ సెలవుపై పంపింది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన అంతర్గత కమిటీ, సేజల్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని తేల్చింది. ఒక వైద్య విద్యార్థినికి ఉండాల్సిన గౌరవం, వృత్తిపరమైన బాధ్యతలకు భిన్నంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని సంస్థ పేర్కొంది. నిర్బంధ సెలవు అనేది తాత్కాలిక నిర్ణయం మాత్రమే. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకునేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేశారు. శనివారం సేజల్ తల్లిదండ్రులను హాస్పిటల్కు పిలిపించి, ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించేలా చర్యలు తీసుకున్నారు.అసలు వివాదం ఏమిటి?దాదాపు మూడు నెలల క్రితం రికార్డ్ అయిన ప్రణీత్ మోరే కామెడీ షోకు సంబంధించిన వీడియో క్లిప్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ షోలో ప్రేక్షకురాలిగా ఉన్న సేజల్ పవార్, తన అనాటమీ (శరీర నిర్మాణ శాస్త్రం) శిక్షణ సమయంలో ఎదురైన అనుభవాలను వివరిస్తూ, మృతదేహాల పురుషాంగాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం తీవ్రమవ్వడంతో సేజల్ ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ సేజల్, ప్రణీత్ మోరే, అదే షోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన హిమాన్షు జంగ్రాపై కూడా మహారాష్ట్ర సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి: విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?ఎన్సీడబ్ల్యూ: మరోవైపు కనీస మర్యాద లేకుండా, లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా మాట్లాడినందుకు గాను జాతీయ మహిళా కమిషన్ (NCW), కమెడియన్ ప్రణీత్ మోరే , హిమాన్షు జంగ్రాలకు సమన్లు జారీ చేసింది.ఇదీ చదవండి: మైనర్పై ఫుట్బాల్ కోచ్ లైంగిక దాడి : వీడియోలతో బ్లాక్మెయిల్రెసిడెంట్ డాక్టర్ల సంఘం స్పందనకేఈఎమ్ హాస్పిటల్కు చెందిన మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ కూడా సేజల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. ఇలాంటి మాటలు వైద్య వృత్తికి తగనివని పేర్కొంది. అలాగే సోషల్మీడియాలో ఆమెపై జరుగుతున్న దాడి , వ్యక్తిగత దూషణలను ఆపాలని కోరింది.ఇదీ చదవండి: డేంజరస్ స్టంట్ : యెమెన్ స్పైడర్ మ్యాన్ దుర్మరణం
ఎన్ఆర్ఐ
యూట్యూబర్ నందు కేసులో కొత్త మలుపు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: యూట్యూబర్ రమా నందన(అలియాస్ నందు), ఆమె భర్త మధుకర్ జాగర్లమూడిలకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. యూకే వీసాల రెన్యువల్ పేరుతో నందన దంపతులు కోట్లలో మోసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేసిన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు.. ఆ దంపతులకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట యూకే వీసా రిన్యూవల్లో మోసం చేశారంటూ నందు దంపతులపై వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూకేలో వీసా గడువు ముగియడంతో, భారత్లోని బ్రాంచ్ ద్వారా వీసా ప్రాసెస్ చేస్తామని నందు కుటుంబ సభ్యులు నమ్మించడంతో, యూట్యూబ్లో ఉన్న ఫేమ్ కారణంగా వారి మాటలను విశ్వసించి రూ.15 లక్షలు చెల్లించాడు. అయితే, నెలలు గడిచినా వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గ్రహించి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు.యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్(సీవోఎస్) ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25లక్షల వరకు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. బాధితుల సంఖ్య 50 నుంచి 100 వరకు ఉండొచ్చని, మొత్తం లావాదేవీలు 10 నుంచి 20 కోట్ల వరకు ఉండొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.యూకే వీసా రెన్యువల్ కోసం రూ.15లక్షలు చెల్లించానని, కానీ వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానాలు ఇవ్వలేదని క్రాంతి కుమార్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద మధుకర్, నందనతో పాటు మధుకర్ తండ్రి పేరు కూడా నిందితులు జాబితాలో చేర్చారు. బ్యాంక్ లావాదేవీలు, వాట్సాప్ చాట్, ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ ఇలా డాక్యుమెంట్లను బాధితులు పోలీసులకు అందించినట్లు సమాచారం. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు.
23 ఏళ్ల పోరాటం.. రూ.85 కోట్లు.. అసలేంటి ఈ కథ?
యూకేలో భారతీయ సంతతి మహిళ 23 ఏళ్ల విడాకుల పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. యూకేలోనే అత్యంత అరుదైన.. సుదీర్ఘమైన విడాకుల పోరాటంలో భారత సంతతికి చెందిన వర్షా గోహిల్ ఏకంగా 6.6 మిలియన్ పౌండ్ల(సుమారు రూ. 85 కోట్లు) పరిహారాన్ని సాధించారు. ఈ కేసు 2002లో ప్రారంభమైంది. తన భర్త భద్రేష్ గోహిల్ వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని.. అతని ప్రవర్తన సరిగ్గా లేదని వర్షా గోహిల్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఆనాటికి ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అప్పట్లో వీరిద్దరి మధ్య ఆర్థిక సెటిల్మెంట్ చాలా సాదాసీదాగా ముగిసినట్లు కనిపించింది. వర్షా దాదాపు 2,70,000 పౌండ్లు (సుమారు రూ. 3.5 కోట్లు) నగదుతో పాటు కుటుంబానికి చెందిన ప్యుజో (Peugeot) కారును తీసుకోవడానికి అంగీకరించారు. కానీ, తన భర్త తన ఆస్తులన్నింటినీ నిజాయితీగా వెల్లడించలేదని ఆమె పేర్కొంది.నైజీరియా మాజీ గవర్నర్ జేమ్స్ ఇబోరి అనుచరులతో ముడిపడి ఉన్న భారీ మనీలాండరింగ్ (అక్రమ ద్రవ్య చలామణి) కేసులో భద్రేష్ గోహిల్ ప్రధాన నిందితుడిగా అధికారులు విచారణ చేపట్టారు. దీంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆఫ్షోర్ కంపెనీలు, క్లయింట్ ఖాతాల ద్వారా భద్రేష్ మిలియన్ల కొద్దీ పౌండ్లను అక్రమంగా బదిలీ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. సుదీర్ఘ విచారణ అనంతరం మనీలాండరింగ్, ఫోర్జరీ, మోసపూరిత కుట్రకు పాల్పడినట్లు రుజువు కావడంతో 2011లో భద్రేష్ గోహిల్ 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.విచారణలో మొదటి విడాకుల కేసు సమయంలో బయటపడని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వివిధ దేశాల్లో విస్తరించి ఉన్న నెట్వర్క్ కంపెనీల ద్వారా భద్రేష్ దాదాపు 28 మిలియన్ పౌండ్లను దాచాడనే కారణంగా అధికారులు ఆ ఆస్తులను ఫ్రీజ్ చేశారు. ఈ కొత్త ఆధారాలు వర్షా గోహిల్కు తన పాత విడాకుల సెటిల్మెంట్ను తిరిగి సవాలు చేయడానికి కొండంత బలాన్ని ఇచ్చాయి.ఈ కేసు చివరకు యూకే కోర్టుకు చేరింది. భర్తకు చెందిన జప్తు చేసిన ఆస్తుల నుంచి తనకు మరింత భరణాన్ని ఇవ్వలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. జప్తు చేసిన మొత్తం యావత్తూ అక్రమార్జన కాదని.. అందులో కష్టపడి సంపాదించిన మొత్తం కూడా ఉందని ఆమె కోర్టుకు తెలిపారు. దీంతో వర్షా గోహిల్ వాదనతో అంగీకరించిన కోర్టు.. జప్తు చేసిన మొత్తంలో 66 లక్షల పౌండ్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఇకపై ఎలాంటి అప్పీళ్లకు అవకాశం లేదని కోర్టు స్పష్టం చేయడంతో ఈ 23 ఏళ్ల సుదీర్ఘ సమరానికి ఎట్టకేలకు తెరపడింది.
న్యూజిల్యాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరంలో న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ప్రముఖ గాయని దాసరి మేఘన నాయుడు, యువ గాయకుడు సుస్వర తరంగ్ పాల్గొని తెలంగాణ ఉద్యమ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రవాస తెలుగు ప్రజలను ఉర్రూతలూగించారు. అసోసియేషన్ అధ్యక్షులు కోడూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ మోహన్ కుమార్ సేథి ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో, రాష్ట్ర సాధనలో అమరులైన ఉద్యమ వీరులను త్యాగాలను స్మరించుకుని తెలుగు ప్రజల ఐక్యత గొప్పతనాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కి ఇంతకాలం నుంచి మద్దతు అందిస్తున్న ట్రాన్స్ పసిఫిక్ డైరెక్టర్ తమ్మినేని రోహిత్ రెడ్డిని సన్మానించారు. గాయని గాయకులు వందేమాతరం శ్రీనివాస్, దాసరి మేఘన నాయుడు, సుస్వర తరంగ్ని ఘనంగా సత్కరించారు.ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు పట్లోళ్ల నరేందర్ రెడ్డితో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన రోహిత్ తమ్మినేని, దయానంద్ కటకం, జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల, విజేత యాచమనేని, మధు ఎర్ర, వర్ష పట్లోళ్ల, స్వాతి మేకల,కావ్యా మాశెట్టి, కిరణ్మయి పద్మ, విశ్వనాథ్ అవిటి, మహమ్మద్ బిలాలుద్దీన్, హరీష్ గోపాల్, మనోహర్ కన్నం, శ్రీనివాస్ పందిళ్ళ, రమేష్ రెడ్డి రామిండ్ల, శ్రీరామ్ విజయ్, శ్రీనివాస్ గాజుల, ప్రమోద్ ఇరుగు, అనిల్ మెరుగు, రమేష్ ఆడెపు, రవి కుమార్ వట్టం, మారుతి జెల్ల, మహేందర్ రెడ్డి ద్యావ, శ్రీనివాస్ కలకోట తదితరులు హాజరయ్యారు.
భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!
భారత సంతతి విద్యార్థి అవని అహుజాకి ప్రతిష్టాత్మక హెన్నీ ఫోర్డ్II స్కాలర్ అవార్డుని గెలుచుకుంది. ఎంఐటీలో అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ఈ అవార్డుని సాధించిన ఎన్నారైగా ఘనత సృష్టించింది. అసాధారణమైన విద్యా ప్రతిభ, ఇంజనీరింగ్లలో బలమైన నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించే సీనియర్ అండర్ గ్రాడ్యుయేట్లకు ఈ పురస్కారన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డుతో ప్రతిష్టాత్మక ఎంఐటీ విద్యార్థుల ప్రత్యేక బృందంలో చేరారు. ఈ పురస్కారం ఇటీవల కోడే రీసెర్చ్ గ్రూప్లో ఆమె చేసి వర్క్ కెపాసిటివ్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ పరిశోధనకు గానూ లభించింది. ఈ సాంకేతికతను భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వైర్లెస్గా ఛార్జ్ చేయడానికి, శరీరంలో అమర్చే వైద్య పరికరాలకు శక్తిని అందించడానికి ఉపయోగించవచ్చు. ఈ మేరకు అవని మాట్లాడుతూ.."ఈ అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా, ఆనందంగా ఉంది. ముఖ్యంగా డీన్ హామండ్ను కలవడం ఒక గొప్ప గౌరవం." అని అన్నారామె. నిజానికి హెల్త్కేర్ టెక్నాలజీలు, రోబోటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లలో పనిచేయగల సామర్థ్యమే, ఆమెను ఎంఐటీ అత్యంత ప్రతిభావంతులైన అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధకులలో ఒకరిగా నిలబెట్టింది. అలాగే అవనికి అత్యంత ఆసక్తి ఉన్న రంగాలలో మహిళల ఆరోగ్య పరిశోధన ఒకటి. అంతేగాదు ఆమె రొమ్ము కేన్సర్ స్క్రీనింగ్ను మరింత సులభతరం చేయడానికి రూపొందించిన, ధరించగలిగే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ ప్యాచ్కు సంబంధించిన పరిశోధనలలో కూడా కీలకపాత్ర పోషించారామె. తాను పీహెచ్డీ పూర్తి అయిన వెంటనే మహిళల ఆరోగ్య పరిశోధన రంగంలో పవర్ ఎలక్ట్రానిక్స్ను అన్వయించాలని చూస్తున్నట్లు తెలిపారు.(చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!)
క్రైమ్
ఏంటి నాన్నా..! పిక్నిక్ అని చెప్పి.. బిర్యానీ తినిపించి.. చివరికి మమ్మల్ని?
నిజాంసాగర్: సాగర తీరంలో ఘోరం పిల్లలను తోసేసి తనువు చాలించిన తండ్రి ‘‘ నాన్నా.. ఇంటి దగ్గర ఆడుకుంటున్న మమ్మల్ని పిక్నిక్కు వెళ్దామని నిజాంసాగర్ ప్రాజెక్టుకు తీసుకొచ్చావు. హోటల్ నుంచి బిర్యానీ తెచ్చి ఆప్యాయంగా తినిపించావు. నీళ్లలో సరదాగా ఆడించావు. ఫోన్లో సెల్ఫీ ఫొటోలు తీశావు. తెప్పపై జలాశయం మధ్యలోకి తీసుకొచ్చావు. అప్పటి వరకు మాతో బాగానే ఉన్నావు. ఏమైంది నాన్న.. అంతలోనే మా ఇద్దరినీ నీళ్లలోకి తోసేశావు. నోట్లోకి నీళ్లు పోతున్నాయ్ నాన్న.. మునిగిపోతున్నాము నాన్న.. అమ్మకు, నీకు మధ్య గొడవలైతే మేమేం పాపం చేశాం.. నీ దగ్గర డబ్బులు లేకపోతే కారం బువ్వ పెట్టినా తింటాం..మీ కడుపున పుట్టడమే మేము చేసిన నేరమా?’’ అని ఎంత వేడుకున్నాయో ఆ పసి హృదయాలు. వారి వేదన వినిపించుకోలేని స్థితిలో ఉన్నా ఆ తండ్రి.. క్షణికావేశంలో తాను సైతం నీళ్లలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.పిల్లలను తోసేసి తనువు చాలించిన తండ్రి..నిజాంసాగర్ ప్రాజెక్టు 20 గేట్ల ప్రాంతంలో ఇద్దరు పిల్లలను నీటిలో తోసేసి, తండ్రి సైతం తనువు చాలించిన ఘటన కలకలం రేపింది. పిల్లల ఆలనా, పాలన చూసుకోవాల్సిన తండ్రి తనతోపాటు తన పేగుబంధం లేకుండా చేశాడు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన బోయి కృష్ణ (34), సవిత దంపతులకు కుమారుడు రక్షిత్(9), కూతురు అనన్య(5) ఉన్నారు. సరైన ఉపాధి లేక దంపతులిద్దరూ పిల్లలతో కలిసి నాలుగు నెలల క్రితం రామచంద్రాపురానికి వలస వెళ్లారు. కృష్ణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా సవిత హోటల్లో లేబర్ పనిచేస్తోంది. కృష్ణ మద్యం సేవించడం, సరిగా పనిచేయకపోవడంతో భార్య, భర్తలు తరుచూ గొడవలు పడేవారు.ఆర్థిక ఇబ్బందులు, పిల్లలకు చదువులకు చేతిలో డబ్బులు లేకపోవడంతో కృష్ణ జీవితంపై విరక్తి చెందాడు. గురువారం పిల్లలను పిక్నిక్కు వెళ్దామని బైక్పై నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చాడు. మత్స్యకారులు ఉపయోగించే తెప్పపై ప్రాజెక్టు మధ్యభాగంలోకి వెళ్లి పిల్లలను తోసేసి, తాను సైతం నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం వరకు పిల్లలతోపాటు భర్త ఇంటికి రాకపోవడంతో సవిత బంధువులకు ఫోన్ చేయగా ఆత్మహత్య విషయం తెలిసింది. నిజాంసాగర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై శివకుమార్ ఘటన స్థలానికి చేరుకొని రెస్క్యూటీం, జాలర్లు కలిసి నీటిలో గాలించి ముగ్గురి మృతదేహాలు బయటికి తీశారు.ప్రాజెక్టు నీటిలో నుంచి పిల్లలు, తండ్రి మృతదేహాలను బయటికి తెస్తున్న సమయంలో కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసెలా విలపించారు. ఆత్మహత్యకు ముందు పిల్లలతో కలిసి తండ్రి తీసిన సెల్ఫీ ఫొటోలు, మృతదేహాలను చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.
తల్లిదండ్రులూ దూరం.. ప్రియుడి ఇంటి వద్ద ఏమైందో ఏమో?
కాకినాడ క్రైం: ఏమైందో ఏమో.. ప్రియుడి ఇంటి వద్ద ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. కంపా లాఫీ (17) అనే బాలిక తల్లిదండ్రులు పీతా నాగదేవి, కంపా బంగారయ్యలు విడిపోయి కుమార్తెను స్థానిక తారకరామ నగర్లో పిన్ని జయవాణి వద్ద వదిలేసి వెళ్లిపోయారు.మూడేళ్ల క్రితం నరసింహ రోడ్డుకు చెందిన తన వయసున్న బాలుడితో లాఫీకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పిన్ని, బాబాయ్లకు తెలియడంతో వారు మందలించారు. మనస్తాపం చెందిన బాలిక ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది నెలలుగా అక్కడే ఉంటోంది.ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఆ బాలుడితో పాటు అతని తల్లి లోవలక్ష్మి ఓ టైలరింగ్ షాప్లో, తండ్రి శివకుమార్రాజు దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరితో పాటే లాఫీ నివసిస్తోంది. గురువారం రాత్రి శివకుమార్రాజు ఇంటికి వచ్చి చూసేసరికి అప్పటికి కుమారుడు, భార్య ఇంటికి చేరలేదు. లాఫీ ఇంట్లో ఉండడంతో తలుపు కొట్టాడు. ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి వంట గది కిటికీ లోంచి చూస్తే ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని లాఫీ వేలాడుతోంది.కంగారు పడిన శివకుమార్రాజు స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూసేసరికి బాలిక అచేతనంగా ఉంది. ఆమెను జీజీహెచ్కు తరలించాడు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. లాఫీ మృతికి ఆ బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులు, మరో వ్యక్తి కారణమని బాబాయ్, పిన్ని ఆరోపించారు. మృతురాలి బాబాయ్ నూకరాజు ఫిర్యాదుతో కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎనిమిది నెలల క్రితమే హత్యకు కుట్ర..
సాక్షి, సిటీబ్యూరో: హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డ్ ప్యానెల్ సభ్యుడు ఖాజా మొయిజుద్దీన్ హత్యకేసులో ముజాహిద్ ఆలంఖాన్తో పాటు కీలక నిందితులు కిషన్ సింగ్, అభిజీత్లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం నుంచి మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించగా... రెండు రోజుల విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. మరోపక్క పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు హసన్, మునీర్లపై నగర పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు.ముజాహిద్ ఆలంఖాన్ గతంలోనూ ఖాజా మొయిజుద్దీన్పై దాడి చేయాలంటూ పలుమార్లు కిషన్ సింగ్కు చెప్పాడు. అయితే అది సాధ్యం కాలేదు. ఓ దశలో ముజాహిద్ ఆలంఖాన్ ఓ మహిళ ద్వారా ఖాజా మొయిజుద్దీన్పై దాడి చేయించారు. ఆయన్ను తీవ్రంగా భయపెట్టాలనే ఈ పని చేయించారు. అబిడ్స్ పోలీసుల వరకు వెళ్లిన ఈ విషయం ఠాణాలో సెటిల్ అయింది.ఏడాది క్రితం ముజాహిద్, మహబూబ్ ఆలంఖాన్లు కిషన్ను పిలిచి ఖాజా మొయిజుద్దీన్తో మాట్లాడాలని, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించాలని కోరారు. న్యాయవాది హత్య జరగడానికి దాదాపు ఎనిమిది నెలల ముందు కిషన్ సింగ్ను ఆలంఖాన్లు తమ కార్యాలయానికి పిలిచారు. ఖాజా మొయిజుద్దీన్ను హత్య చేయాలని, అయితే అది రోడ్డు ప్రమాదంలా కనిపించాలని చెప్పారు. అందుకు అవసరమైన డబ్బుతో పాటు పని పూర్తి అయిన తర్వాత కిషన్ సింగ్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆలంఖాన్లు హామీ ఇచ్చారు.ఖాజా మొయిజుద్దీన్ హత్య కుట్ర అమలును పర్యవేక్షించే బాధ్యతల్ని ముజాహిద్ ఆలంఖాన్ తన వద్ద పని చేసే హసన్ అలీతో పాటు మునీర్కు అప్పగించారు. హత్య చేయడానికి స్కార్పియో వాహనం కావాలంటూ కిషన్ గత ఏడాది డిసెంబర్లో ముజాహిద్కు చెప్పాడు. దీంతో ఆ వాహనం ఖరీదు చేయడానికి హసన్, మునీర్ ద్వారా రూ.2 లక్షలు కిషన్కు పంపారు.మలక్పేటలో ఉన్న పది వేల గజాల వక్ఫ్ భూమి కొత్త కమిటీ గత ఏడాది డిసెంబర్లో ఆటో ఫిన్ కంపెనీకి లీజుకు ఇచి్చంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆలంఖాన్లు సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనికి కొనసాగింపుగా ఏప్రిల్లో ఆటోఫిన్ కంపెనీ యజమాని గౌతం చాంద్జైన్పై ఆలంఖాన్లు కేసు పెట్టగా... ఆ కంపెనీ మేనేజర్ ఎన్.నర్సింగ్రావు వీరి పైన కేసు పెట్టారు. ఈ కేసును ముజాహిద్ ఆలంఖాన్ కోర్టులో సవాల్ చేశారు. దీని విచారణ సందర్భంలో నర్సింగ్రావు తరఫున ఖాజా మొయిజుద్దీన్ హాజరుకావడాన్ని ఆలంఖాన్లు జీరి్ణంచుకోలేకపోయారు. దీంతో ఆయన హత్య కుట్ర అమలును వేగవంతం చేశారు.అప్పటికే స్కారి్పయో వాహనాన్ని అభిజిత్ తాకట్టు పెట్టగా దాన్ని వినిపించడానికి కిషన్ సింగ్ రూ.లక్ష ఇచ్చారు. న్యాయవాది ఖాజా మెహిజుద్దీన్ను మే 23 తెల్లవారుజామున హత్య చేయగా.. దానికి ఒక రోజు ముందే అభిజీత్, వినయ్, మణిదీ్వప్లు స్కారి్పయో వాహనం నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేశారు. దీనికోసం దానిపై గ్రేజు, మట్టి పూశారు. ఈ వాహనాన్ని వినియోగించే అభిజీత్ మే 23న ఖాజా మొయిజుద్దీన్ను ఆయన ఇంటి వద్దే ఢీ కొట్టి చంపాడు.ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న హసన్, మునీర్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్న పోలీసులు విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా ఎల్ఓసీ జారీ చేశారు. దీని ప్రతుల్ని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు పంపారు. ముజాహిద్, కిషన్, అభిజీత్ పోలీసు కస్టడీ గడువు ముగియనుండటంతో వీరిని శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు.
కుక్కే క్లూ అనుకున్నారు.. కానీ!
రెండేళ్ల చిన్నారి. పెంపుడు కుక్కతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ వారమైనా తిరిగి రాలేదు. తల్లిదండ్రుల కన్నీళ్లు, బంధవులు.. గ్రామస్తుల ఆందోళన, పోలీసుల విస్తృత గాలింపు.. ఏదీ ఇప్పటివరకు జ్ఞానేశ్వరి ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. పెంపుడు కుక్క తిరిగి వచ్చినా.. దానికి హైటైక్ టెక్నాలజీ తగిలించి ఆచూకీ కనిపెట్టాలని ప్రయత్నించినా.. పాప జాడ మాత్రం దొరక్కపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ వారమైనా చిక్కలేదు. తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు..చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే 10 పోలీసు టీంలు, 40 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందం.. మరికొందరు అధికారులు పాప కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో భాగమయ్యారు. అడవులు, కొండలు, గ్రామాలన్నీ నిర్విర్వామంగా జల్లెడ పడుతున్నారు. దీంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించింది.ఈ నెల 6న ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైంది. పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఈ కేసులో పెంపుడు కుక్క కీలక ఆధారంగా మారొచ్చని పోలీసులు భావించారు. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత కుక్క గ్రామానికి తిరిగి వచ్చింది. అయితే ఇంటి వద్ద ఉన్న హడావుడి చూసి మళ్లీ పారిపోయింది. ఈ క్రమంలో అది పలువురిపై దాడి చేసింది. అనంతరం డాగ్ క్యాచర్ సాయంతో అతికష్టం మీద దానిని పట్టుకుని ఇంటికి తీసుకువచ్చారు. ఓ తాడుతో కట్టేసి.. దానికి పోలీసును కాపలా ఉంచారు. నీరసంగా ఉన్న దానికి.. వెటర్నరీ సిబ్బంది వైద్య సేవలు అందించి కోలుకున్న తర్వాత పోలీసులు ప్రత్యేక చర్యలకు దిగారు.పెద్దాపురం డీఎస్పీ తిలక్ పర్యవేక్షణలో పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, ఏఎన్ఎస్, క్యూఆర్టీ బృందాలు విస్తృత గాలింపు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీపీఎస్ ట్రాకర్ను కుక్కకు అమర్చి వదిలారు. ట్రాకర్ ద్వారా కుక్క సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎక్కడా ఏ క్లూ లభించలేదు!.ఇక చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్లను వినియోగిస్తున్నారు. జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే చిన్నారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ టవర్ డంప్ డేటా, కాల్ డిటైల్ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు సన్నిహితులైన వ్యక్తులతో పాటు చుట్టుపక్కలకు కొత్తగా వచ్చిన వ్యక్తులు, గంజాయి అలవాటు ఉన్న వారిపై కూడా నిఘా పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగుతోంది.ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి క్షేమంగా తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా స్పందిస్తూ, జ్ఞానేశ్వరి ఆయురారోగ్యాలతో ఇంటికి చేరాలని ఆకాంక్షించారు.
వీడియోలు
నంధుస్ కపుల్ ని ఏమి చెయ్యలేరు..
పెద్ది టీంను అభినందించిన చిరంజీవి, బుచ్చి బాబుకు ప్రత్యేక అభినందనలు
"రాత్రికి రాత్రే ఇళ్లన్నీ కూల్చేశారు..! రాజమండ్రిలో పేదల కన్నీరు
అసలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? అడ్వకేట్ బాల షాకింగ్ కామెంట్స్!
తప్పెవరిదో తెలుసుకో... టీడీపీ నేత ఆవేదన
బిడ్డతో పాటు బిల్డింగ్ పైనుంచి దూకిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్
స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య
బిగ్ షాక్ #RC17 ఇప్పట్లో కష్టమే..!
చేతకానప్పుడు సీఎం అవ్వడం ఎందుకు? బాబుపై మహిళ ఫైర్
రెండు రోజులు హైదరాబాద్ లో భారీ వర్షాలు

