ఘోర ప్రమాదం.. పదిమంది మృతి
కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాల్పారైలో వ్యాను బోల్తాపడింది. ఈ ఘటనలో దురదృష్టవశాత్తు 10మంది మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకొనికేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులంతా కేరళ రాష్ట్రానికి చెందిన వారిగా సమాచారం.
ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం!
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ ఓటుమల పరంపర కొనసాగుతోంది. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ ఏడాది సీజన్లో ముంబైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం కావడం గమనార్హం. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. అయితే పంజాబ్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా తీసుకున్న ఓ నిర్ణయంపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది.ఏమి జరిగిదంటే?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. అర్ష్దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్లో ముంబై ర్యాన్ రికెల్టన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వెంట వెంటనే పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో ముంబై తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న క్వింటన్ డికాక్, యువ ఆటగాడు నమన్ ధీర్ తమ అద్బుత బ్యాటింగ్తో ముంబైని ఆదుకున్నాడు. డికాక్ సెంచరీతో చెలరేగగా.. నమన్ధీర్ ఆర్ధ శతకంతో సత్తాచాటాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరి దూకుడు చూసి ముంబై 230కి పైగా స్కోర్ సాధిస్తుందని అంతా భావించారు. కానీ నమన్ ధీర్ ఔటయ్యాక సీన్ రివర్స్ అయిపోయింది. నమన్ ధీర్ ఔటయ్యాక, అద్భుతమైన ఫామ్లో ఉన్న షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ను కాదని హార్దిక్ పాండ్యా స్వయంగా క్రీజులోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాస్త ముందుగా బ్యాటింగ్కు వచ్చిన పాండ్యా తీవ్ర నిరాశపరిచాడు. పాండ్యా 12 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే ఔటయ్యాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత ఈ లక్ష్యాన్ని పంజాబ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. తాజాగా హార్దిక్ తీసుకున్న ఈ చెత్త నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మండిపడ్డాడు.హార్దిక్ చెత్త కెప్టెన్సీ?కెప్టెన్ ఎల్లప్పుడూ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్ ఈ ఒక్క సీజన్ కాదు, గత రెండు సీజన్లలో కూడా ఇదే తీరును కనబరిచింది. ఈ వైఫల్యాలకు మూల కారణాలను వెతకాలి. 2013 నుంచి 2023 మధ్య కెప్టెన్గా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కు ఐదు టైటిల్స్ను అందించాడు. ఆ తర్వాత ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ కనీసం ఒక్కసారి కూడా ఫైనల్కు చేరలేకపోయింది. ఇప్పుడు ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. హార్దిక్ కెప్టెన్సీ బాగోలేదు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లోహార్దిక్ ముందుగా బ్యాటింగ్కు రావాల్సిన అవసరం ఏముంది? 12 బంతుల్లో 14 పరుగులు పరుగులు మాత్రమే చేశాడు. షెర్ఫేన్ రూథర్ఫోర్డ్కు కేవలం ఐదు బంతులు మాత్రమే లభించాయి. ఒకవేళ రూథర్ఫోర్డ్ కూడా అన్ని బంతులు ఆడి ఉంటే, అతను 3-4 సిక్సర్లు కొట్టి ఉండేవాడు. అంతేకాకుండా జస్ప్రీత్ బుమ్రాతో తొలి ఓవర్ వేయించాల్సింది. ఇలా ముంబై ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్సీతో పంజాబ్ను విజయ పథంలో నడిపిస్తుంటే, ముంబై ఇండియన్స్ కెప్టెన్ మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇందుకు ఒకే పరిష్కరం ఉంది. హార్దిక్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోని, ఆ బాధ్యతను తిరిగి రోహిత్కు అప్పగించాలని నేను భావిస్తున్నాను," అని తివారీ క్రిక్బజ్ డిబేట్లో పేర్కొన్నాడు. కాగా ఈ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ హార్దిక్ సీజన్ మధ్యలోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వైఫల్యం కూడా ముంబై జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. బుమ్రా ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా సాధించలేదు. వికెట్ల విషయం పక్కన పెడితే పరుగులను కట్టడం చేయడంలో బుమ్రా విఫలమవుతున్నాడు.చదవండి: IND vs IRE: సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
ఇది ట్రైలర్ మాత్రమే: సీఎం స్టాలిన్
చెన్నై: లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడం తమ విజయమని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. లోక్సభలో తమిళనాడు.. ఢిల్లీని ఓడించిందన్నారు స్టాలిన్. ఇది తమిళనాడుకు వ్యతిరేకంగా వచ్చిన బిల్లు అని, అది వీగిపోయిందన్నారు సీఎం స్టాలిన్. ఇదిట్రైలర్ మా త్రమేనని, ముందు అసలు సినిమా ఉందని సెటైర్లు వేశారు సీఎం స్టాలిన్.ఇక తెలంగాణ సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఐక్యత ముందు కేంద్రం తలవంచిందన్నారు. నల్ల బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నారు. భారతదేశ చరిత్రలో ఈరోజు చిరస్మరణీయమని రేవంత్ పేర్కొన్నారు. బిల్లును ఓడించిన ప్రతిపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్.. దేశంలో ప్రజాస్వామ్య శక్తుల ఏకీకరణ జరిగిందని కొనియాడారు.ఇదీ చదవండి:ఓడిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
ఆట పూర్తి
కూకట్పల్లిలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ బస్సు దగ్ధం!
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
బంగ్లా 221 ఆలౌట్.. న్యూజిలాండ్దే తొలి వన్డే
'మహిళలకు న్యాయం జరగలేదు': వైఎస్ జగన్ ట్వీట్
అజయ్ తెలుసు.. కానీ అజయ్ ఘోష్ అనుకోలేదు: రాశి ఆసక్తికర కామెంట్స్
2026 నవంబర్ 13 శుక్రవారం.. ప్రపంచం అంతమవుతుందా?..ఇవే ఆధారాలు
ఇది ట్రైలర్ మాత్రమే: సీఎం స్టాలిన్
హమ్మయ్య.. ఇన్నాళ్లకు న్యాయం చేశాడు!
టాప్ 3 మార్కెట్లలో భారత్
వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా
ఇదేం పెద్ద విశేషం! ఇప్పటికే వర్కింగ్ సీఎం కదా!!
రుతుపవనాల దగా?
గేమ్ చేంజర్ X నేమ్ చేంజర్
ఆరు పదుల వయసులో అదే జోష్.. చిరంజీవి హీరోయిన్ డ్యాన్స్ చూశారా?
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్..!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా
మామ్ వెయిట్లాస్ జర్నీ..! 82కేజీల నుంచి 60 కేజీలకు..
టీసీఎస్ నాసిక్ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్ ఘటన!
T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ
‘తస్సాదియ్యా’.. సమంత డ్యాన్స్ అదిరిందయ్యా!
ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
శుభవార్త చెప్పిన తెలుగు హిట్ సీరియల్ హీరోయిన్
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం!
‘మా తొలి క్షిపణికే.. మీ నౌకలు ముంచేస్తాం’
ఆట పూర్తి
కూకట్పల్లిలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ బస్సు దగ్ధం!
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
బంగ్లా 221 ఆలౌట్.. న్యూజిలాండ్దే తొలి వన్డే
'మహిళలకు న్యాయం జరగలేదు': వైఎస్ జగన్ ట్వీట్
అజయ్ తెలుసు.. కానీ అజయ్ ఘోష్ అనుకోలేదు: రాశి ఆసక్తికర కామెంట్స్
2026 నవంబర్ 13 శుక్రవారం.. ప్రపంచం అంతమవుతుందా?..ఇవే ఆధారాలు
ఇది ట్రైలర్ మాత్రమే: సీఎం స్టాలిన్
హమ్మయ్య.. ఇన్నాళ్లకు న్యాయం చేశాడు!
టాప్ 3 మార్కెట్లలో భారత్
వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా
ఇదేం పెద్ద విశేషం! ఇప్పటికే వర్కింగ్ సీఎం కదా!!
రుతుపవనాల దగా?
గేమ్ చేంజర్ X నేమ్ చేంజర్
ఆరు పదుల వయసులో అదే జోష్.. చిరంజీవి హీరోయిన్ డ్యాన్స్ చూశారా?
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్..!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా
మామ్ వెయిట్లాస్ జర్నీ..! 82కేజీల నుంచి 60 కేజీలకు..
టీసీఎస్ నాసిక్ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్ ఘటన!
T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ
‘తస్సాదియ్యా’.. సమంత డ్యాన్స్ అదిరిందయ్యా!
ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
శుభవార్త చెప్పిన తెలుగు హిట్ సీరియల్ హీరోయిన్
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం!
‘మా తొలి క్షిపణికే.. మీ నౌకలు ముంచేస్తాం’
ఫొటోలు
ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)
ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)
భూత్ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్ (ఫోటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్
వైట్ డ్రెస్ ఔట్ఫిట్లో జాన్వీ కపూర్ (ఫోటోలు)
సినిమా
'సెట్లో నేను ఏడ్చిన సందర్భం అదొక్కటే'.. హన్సిక కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ దేశముదురు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తన అమాయకపు మాటలతో అభిమానులను కట్టిపడేసింది. ఈ చిత్రంలో సన్యాసని పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది ముద్దుగుమ్మ. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలుస్తోంది. తన భర్తతో విడాకులు తీసుకున్న హన్సిక తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి హన్సిక మాట్లాడింది. ఆయన చాలా అరుదైన వ్యక్తి అని కొనియాడింది. ఎవరితోనైనా చాలా మర్యాదగా ప్రవర్తిస్తారని తెలిపింది. స్నేహపూర్వకంగా ఉండడం అతనిలోని సహజ గుణమని ప్రశంసలు కురిపించింది. తాను ఓ మూవీ సెట్లో ఏడ్చిన సందర్భం నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. దేశముదురు సెట్లో టీమ్తో సెండాఫ్ టైమ్లో ఏడ్చేశానని హన్సిక తెలిపింది. ఆ తర్వాత ఏ మూవీ సెట్లోనూ తాను ఏడ్వలేదని చెప్పింది. కాగా.. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన దేశముదురు చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. 2007లో వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్కు జంటగా హన్సిక హీరోయిన్గా నటించింది. Hansika Motwani says, “The only time I CRIED ON SET was ‘DesaMuduru’.”“#AlluArjun is an amazing person and very respectful. He has a Natural Charm of being a friend. I remember I cried on set for a Crew during #DesaMuduru, After that, I never cried for leaving any film set.” pic.twitter.com/Xx3dxdta4D— Whynot Cinemas (@whynotcinemass_) April 17, 2026
గ్లామరస్ రితిక.. చీరలో కాయదు
వైట్ డ్రస్లో గ్లామరస్గా రితిక నాయక్ఫారిన్ బ్యూటీలా జాన్వీ కపూర్చీరలో అందంగా కాయదు లోహర్మొరాకో ట్రిప్లో సింగర్ జోనితాహోటల్ రూంలో రుక్మిణి చిల్ మోడ్ View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by JONITA (@jonitamusic) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Bandhavi Sridhar (@bandhavisridhar) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official)
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా
ఈ వారం బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. వాటిలో సంభవం అధ్యాయం ఒన్ను, ఉస్తాద్ భగత్ సింగ్, యూత్, సుయోధన, అస్సీ, సన్నాఫ్ చిత్రాలతో పాటు పోచమ్మ, మట్కా కింగ్ తదితర వెబ్ సిరీస్లు కూడా జాబితాలో ఉన్నాయి. ఇక వచ్చేవారం కూడా మరిన్ని తెలుగు మూవీస్ అందుబాటులోకి రానున్నాయి. అలా ఓ తెలుగు కామెడీ చిత్రం ఓటీటీ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ, శ్రీరామ చంద్ర తదితరులు నటించిన తెలుగు సినిమా 'లేచింది మహిళా లోకం'. గత నెల 26న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇదొకటి రిలీజైన సంగతి కూడా తెలియనంతగా వచ్చి వెళ్లిపోయింది. ఇప్పుడిదే వచ్చే బుధవారం(ఏప్రిల్ 22) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.భార్యభర్తల రిలేషన్, స్త్రీ పురుషుల మధ్య వివక్ష, విడాకులు, కోర్టు కేసులు తదితర ట్రెండీ అంశాలతో ఈ సినిమాని తీశారు. అయితే ఈ సీరియస్ విషయాల్ని కామెడీ, సెటైరికల్గా చూపించే ప్రయత్నం చేశారు. కార్తిక్-అర్జున్ దర్శకత్వం వహించారు. పాయింట్ బాగున్నప్పటికీ లాజిక్ లేని సీన్లతో విసిగించారు.'లేచింది మహిళా లోకం' విషయానికొస్తే.. నలుగురు మహిళలు (మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ) తన రోజూవారీ జీవితంలో పురుషాధిక్యత వల్ల చిన్న చిన్న అవమానాలు, ఆంక్షలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకానొక టైంలో వీళ్ల జీవితంలో జరిగిన సంఘటనలు, తీవ్రంగా ఆలోచించేలా చేస్తాయి. అప్పటివరకు మౌనంగా భరిస్తూ వచ్చిన వీళ్లు.. అసలు ఇలానే ఎందుకు ఉండాలి? అని తిరగబడతారు. వీరిలోని ఈ మార్పు వల్ల ఇళ్లల్లో భర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పశ్చాత్తాపం లేదు.. విడాకులపై తొలిసారి స్పందించిన హన్సిక)
పశ్చాత్తాపం లేదు.. విడాకులపై స్పందించిన హన్సిక
తెలుగులో పలు సినిమాలు చేసిన హీరోయిన్ హన్సిక.. గత నెలలో విడాకులు తీసుకుంది. నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ భర్త సొహెల్ కతురియా నుంచి విడిపోయింది. అధికారికంగా ఈమె ఈ విషయం బయటపెట్టనప్పటికీ.. ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టులో మార్చి 11న పరస్పర అంగీకారంతో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్న విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు తొలిసారి హన్సిక.. విడాకుల గురించి స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'వరూధిని పరిణయం' హీరోయిన్)'ప్రజలకు కావాల్సింది హెడ్ లైన్స్, క్లిక్ బైట్స్. అవి వచ్చాయి. కానీ నేను ఎప్పుడూ ఏ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇవ్వను కూడా. ఇందులో(విడాకులు తీసుకోవడంలో) నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. మనం తప్పు ట్రైన్ ఎక్కామని తెలిసినప్పుడు అది దిగిపోవడమే మంచిది. ప్రస్తుతం నేను మానసికంగా బాగానే ఉన్నాను. నా వ్యక్తిగత జీవితంపై ప్రజల అభిప్రాయాల కంటే నా ఆరోగ్యం, శ్రేయస్సే ముఖ్యం. విడాకుల కారణాలు పూర్తిగా వ్యక్తిగతం. అవి మా మధ్యే ఉండాలి. ఈ కష్ట సమయంలో తల్లి, సోదరుడు అండగా నిలిచారు. విడాకులు తర్వాత విశ్రాంతి కోసం జపాన్ వెళ్లొచ్చాను' అని హన్సిక చెప్పుకొచ్చింది.బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి, టీనేజీలోనే 'దేశముదురు' సినిమాతో హీరోయిన్గానూ ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాలు చేసింది. 2022 డిసెంబరులో సొహెల్ కతురియాని పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. ఈమె వివాహాన్ని.. 'హన్సిక లవ్ షాదీ డ్రామా' పేరిట ఓటీటీలోనూ విడుదల చేశారు. కానీ ఇప్పుడు నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. హన్సిక స్నేహితురాలితోనే తొలుత సొహెల్కి వివాహమైంది. ఆమెకి విడాకులిచ్చేసిన తర్వాత హన్సికని పెళ్లాడాడు. కానీ ఈ బంధం కూడా ఎక్కువ రోజులు నిలబడలేదు.(ఇదీ చదవండి: చెల్లి ఆలియా భట్ పెళ్లయిన నాలుగేళ్లకు అక్క ఎంగేజ్మెంట్)
క్రీడలు
చెన్నై జట్టులోకి చిచ్చరపిడుగు!
ఐపీఎల్ 2026 సీజన్కు సీఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఖలీల్ అహ్మద్ స్థానంలో ఆకాశ్ మధ్వల్ను తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్కు ఆకాశ్ మధ్వల్ ప్రాతినిధ్యం వహించాడు. ఇక మంగళవారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. అతను కోలుకోవడానికి 10 నుంచి 12 వారాల సమయం పట్టనుండడంతో ఖలీల్ అహ్మద్ దాదాపు సీజన్ మొత్తానికి దూరమైనట్లే. అందుకే సీఎస్కే ఖలీల్ స్థానంలో ఆకాశ్ను జట్టులోకి తీసుకోనుంది. అయితే శనివారం సీఎస్కే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆడనుంది. ఇక తొలుత ముంబై ఇండియన్స్కు నెట్ బౌలర్గా వ్యవహరించిన ఆకాశ్ మధ్వల్ 2023 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు కీలక బౌలర్గా ఉన్నాడు. ఆ సీజన్లో 8 మ్యాచ్లాడిన ఆకాశ్ 14 వికెట్లు పడగొట్టాడు. లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన ప్లేఆఫ్స్ మ్యాచ్లో ఆకాశ్ మధ్వల్ 5 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి సంచలన ప్రదర్శన నమోదు చేశాడు.చదవండి: అచ్చిరాని జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ!
అచ్చిరాని జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2011 సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఒక మ్యాచ్లో గ్రీన్జెర్సీలో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. 'గో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా ఆర్సీబీ దీనిని పాటిస్తూ వస్తోంది. పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే తమ రెగ్యులర్ జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకుంది. ఈ సంప్రదాయాన్ని ఆర్సీబీ 2026 సీజన్లోనూ కంటిన్యూ చేయనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరగనున్న పోరులో ఆర్సీబీ ఆటగాళ్లు గ్రీన్ జెర్సీలతో దర్శనమివ్వనున్నారు. ఈ సీజన్లో మంచి జోష్ మీదున్న ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో4 విజయాలతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.అచ్చిరాని జెర్సీ..అయితే ఆర్సీబీకి ఈ గ్రీన్ జెర్సీ మ్యాచ్లు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పటివరకు 15మ్యాచ్ల్లో ఆర్సీబీ గ్రీన్జెర్సీతో బరిలోకి దిగింది. కానీ ఇందులో ఐదు మ్యాచ్ల్లోనే విజయం సాధించి.. మరో 9 మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యింది. మరొక మ్యాచ్ మాత్రం రద్దయ్యింది. 2015లో ఢిల్లీ క్యాపిటల్స్తో గ్రీన్ డే మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది.2011 నుంచి 'గ్రీన్ జెర్సీ' మ్యాచ్లను ఆడడం ప్రారంభించిన ఆర్సీబీకి పెద్దగా కలిసిరాలేదు. గత సీజన్లో రాజస్తాన్తో జరిగిన మ్యాచ్ వరకు 15 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్ల్లో ఆర్సీబీ గెలిచినప్పటికీ విరాట్ కోహ్లి రెండుసార్లు డకౌట్ కాగా, ఒక మ్యాచ్లో సెంచరీ, మరో మ్యాచ్లో కీలకమైన 27 పరుగులు చేశాడు.గ్రీన్జెర్సీతో ఆర్సీబీ విజయాలు..ఐపీఎల్ 2011లో కొచ్చి టస్కర్స్తో మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కొచ్చి 125/9 స్కోరుకే పరిమితం కాగా.. ఆర్సీబీ 13.1 ఓవర్లలోనే 128/1 స్కోరు చేసి గెలుపొందింది. విరాట్ (27*) నాటౌట్గా నిలిచాడు.2016 సీజన్లో గుజరాత్ లయన్స్పై 144 పరుగుల భారీ తేడాతో ఆర్ సీబీ గెలిచింది. ఈ మ్యాచ్లోనే విరాట్ కోహ్లి (109) సెంచరీ బాదాడు. ఏబీ డివిలియర్స్ (129*) కూడా శతకం చేయడంతో ఆర్సీబీ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 248 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం గుజరాత్ లయన్స్ 104 పరుగులకే ఆలౌటైంది.2022 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 67 పరుగుల తేడాతో విజయం సాధించి మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో కోహ్లి గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అయితే డుప్లెసిస్ (73*), రజత్ పటీదార్ (48) రాణించడంతో 192 పరుగుల చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 125 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.2023 సీజన్లో రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్లోనూ కోహ్లి గోల్డెన్ డక్ అవ్వడం విశేషం. అయితే మ్యాక్స్వెల్ (77*), డుప్లెసిస్ (62) విజృంభణతో రాజస్తాన్ ముందు 190 పరుగుల టార్గెట్ను ఉంచింది. అయితే ఛేదనలో రాజస్తాన్ పోరాడినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులకు పరిమితమైంది.గత సీజన్లోనూ రాజస్తాన్ రాయల్స్తోనే గ్రీన్ జెర్సీలో ఆర్సీబీతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 17.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. విరాట్ కోహ్లి (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించి ఆర్సీబీని గెలిపించాడు.𝗜𝘁’𝘀 𝘁𝗵𝗮𝘁 𝘁𝗶𝗺𝗲 𝗼𝗳 𝘁𝗵𝗲 𝘆𝗲𝗮𝗿 𝗮𝗴𝗮𝗶𝗻 - 𝗹𝗲𝘁’𝘀 𝗚𝗼 𝗚𝗿𝗲𝗲𝗻! 😍💚More than a tradition. A purpose we wear with pride. 🙌Tomorrow, our boys take the field donning the Green Jersey against Delhi, to raise awareness by pledging to protect the… pic.twitter.com/UzvgUdXllf— Royal Challengers Bengaluru (@RCBTweets) April 17, 2026 చదవండి: వైభవ్ సేఫ్.. రోమి భిందర్కు బీసీసీఐ షాక్!
IPL 2026: ఉత్కంఠపోరులో గుజరాత్ విజయం
Gujarat Titans Vs KKR Updates..ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గిల్ 86 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, సునీల్ నరైన్, రమన్దీప్, వైభవ్ అరోరాలు ఒక్కో వికెట్ పడగొట్టారు. కేకేఆర్ 180 పరుగులకు ఆలౌటైంది. కామెరున్ గ్రీన్ (79) పరుగులతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మలు చెరో 2 వికెట్లు పడగొట్టారు.86 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ వైభవ్ అరోరా బౌలింగ్లో కామెరున్ గ్రీన్ అద్భుత క్యాచ్కు వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. గిల్ 81, పిలిప్స్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వాషింగ్టన్ సుందర్ (13) వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో వెనుదిరిగాడు.గిల్ అర్థశతకం.. గుజరాత్ 101/2కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అర్థశతకం సాధించాడు. గిల్ 27 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అంతకముందు గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన జాస్ బట్లర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో గ్రీన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్కేకేఆర్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన సాయి సుదర్శన్ సునీల్ నరైన్ బౌలింగ్లో కార్తిక్ త్యాగికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది.దంచికొడుతున్న గుజరాత్181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఛేదనను దూకుడుగిఆ ఆరంభించింది. 5 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (22), గిల్ (34) క్రీజులో ఉన్నారు.గుజరాత్ టార్గెట్ 181 పరుగులుగుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ 180 పరుగులకు ఆలౌటైంది. కామెరున్ గ్రీన్ (79) పరుగులతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. రోవ్మెన్ పావెల్ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఒక దశలో 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులతో పటిష్టంగా కనిపించిన కేకేఆర్ చివరి ఐదు ఓవర్లలో కేవలం 32 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మలు చెరో 2 వికెట్లు పడగొట్టారు.16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అంతకముందు రింకూ సింగ్ రబాడ బౌలింగ్లో ఆరో వికెట్గా వెనుదిరిగాడు.ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేకేఆర్ 147 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన అనుకుల్ రాయ్ ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కామెరున్ గ్రీన్ 75 పరుగులతో బ్యాటింగ్ ఆడుతున్నాడు.87 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. పావెల్ (27).. అశోక్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు.8 ఓవర్లలో కేకేఆర్ 59/38 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. పావెల్ (21), గ్రీన్ (8) క్రీజులో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన సీఫెర్ట్ రబాడ బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్8 పరుగులు చేసిన అంగ్క్రిష్ రఘువంశీ రబాడ బౌలింగ్లో జాస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కేకేఆర్ 2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది.రహానే గోల్డెన్ డక్గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానే సిరాజ్ బౌలింగ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం 25వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఈ మ్యాచ్కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫిన్ అలెన్ స్థానంలో టిమ్ సీఫెర్ట్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు గుజరాత్ మాత్రం జట్టులో ఏ మార్పు చేయలేదు. ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. ఐదు మ్యాచ్ల్లో నాలుగింటి పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దు కావడంతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఆడిన 4 మ్యాచ్ల్లో రెండు విజయాలతో ఐదో స్థానంలో ఉంది. ముఖాముఖి పోరులో నాలుగుసార్లు తలపడగా గుజరాత్ మూడుసార్లు, కేకేఆర్ ఒకసారి గెలుపొందాయి.కోల్కతా నైట్ రైడర్స్: టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్),వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ.
గుజరాత్ టైటాన్స్లోకి సౌతాఫ్రికా నయా సంచలనం
ఐపీఎల్-2026 మధ్యలో గుజరాత్ టైటాన్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్కు దూరమైన ఇంగ్లండ్ ఆటగాడు టామ్ బాంటన్ స్థానాన్ని దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్హుయిజెన్తో గుజరాత్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది.గతేడాది జరిగిన మినీ వేలంలో టామ్ బాంటన్ను రూ.2 కోట్ల బేస్ప్రైస్కు కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్లో బాంటన్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు గుజరాత్ ఆడిన తొలి నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. అయితే బాంటన్ తన గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టనుండడంతో.. ఇప్పుడు మొత్తం సీజన్కే దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఎస్టర్హుయిజెన్ రూ. 75 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుందిఎవరీ ఎస్టర్హుయిజెన్?24 ఏళ్ల కానర్ ఎస్టర్హుయిజెన్ గత నెలలో న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన మొదటి సిరీస్లోనే అద్బుత ప్రదర్శలనతో అందరిని ఆకట్టుకున్నాడు. 5 మ్యాచ్లలో 145.98 స్ట్రైక్ రేట్తో 200 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.అతడికి అద్బుతమైన హిట్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడి రాకతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. జోస్ బట్లర్కు బ్యాకప్ వికెట్ కీపర్గా ఎస్టర్హుయిజెన్ ఉండనున్నాడు. ఈ ఏడాది సీజన్లో గుజరాత్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడి రెండింట విజయం సాధించింది. గిల్ సేన ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: IPL 2026: వరుస ఓటములు.. హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం!
న్యూస్ పాడ్కాస్ట్
డీలిమిటేషన్ దంగల్కు రంగం సిద్ధం... మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్
మత్స్యకారుల కడుపుపై తంతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు కుట్ర... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
చట్టసభల్లో చారిత్రక మలుపు... లోక్సభ స్థానాలు 850కి పెంపు... రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం... డిమాండ్లపై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్... అణ్వాయుధాలు, హార్మూజ్పైనే పీటముడి
ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు షురూ. మరో దఫా చర్చించే అవకాశం
భారీగా పడిపోతున్న బంగారం ధరలు
అమరావతిలో నీకింత.. నాకింత... ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన ‘బీఎస్సార్’కు రాజధానిలో భారీగా పనుల అప్పగింత
ఆంధ్రప్రదేశ్లో ‘సీఎంఆర్ఎఫ్’ నిధులు స్వాహా... టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి సీఎంవో వరకూ వసూళ్ల పర్వం
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మావిగన్.. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు: వైఎస్ జగన్
బిజినెస్
అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే!
సాంకేతిక ప్రపంచంలో ఏఐ విప్లవం రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం ఇంటర్నెట్లో చదివే సమాచారంలో సగానికి పైగా కంటెంట్ మనుషులు రాసింది కాదు. ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2026 వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.50 ప్లస్ వరకు..కేవలం మూడేళ్ల కాలంలో అంతర్జాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నివేదిక ప్రకారం, 2025 ప్రారంభం నుంచి ఇంటర్నెట్లో కొత్తగా పుట్టుకొస్తున్న కంటెంట్లో 51.72 శాతం వాటా ఏఐ సొంతం చేసుకోగా మానవ మేధస్సుతో సృష్టించిన కంటెంట్ 48.28 శాతానికి పరిమితమైంది.నవంబర్ 2022: చాట్జీపీటీ రాకతో ఏఐ కంటెంట్ ప్రస్థానం దాదాపు సున్నా వద్ద మొదలైంది.2023-24: అధునాతన టూల్స్ అందుబాటులోకి రావడంతో గ్రాఫ్ వేగంగా పెరిగింది.2025-26: మొదటిసారిగా మానవ కంటెంట్ను ఏఐ అధిగమించింది.ఎందుకీ పరుగు?కంపెనీలు, క్రియేటర్లు, చిన్న వ్యాపార సంస్థలు ఏఐ వైపు మొగ్గు చూపడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఒక రచయిత గంటల తరబడి శ్రమించి రాసే వ్యాసాన్ని ఏఐ సెకన్ల వ్యవధిలో సిద్ధం చేస్తోంది. వెబ్సైట్లకు అవసరమైన భారీ సమాచారాన్ని క్షణాల్లో అందిస్తుంది. పెద్ద సంఖ్యలో కంటెంట్ రైటర్లను నియమించుకోవడం కంటే ఏఐ టూల్స్ వాడటం సంస్థలకు ఆర్థికంగా లాభదాయకంగా మారింది. ముఖ్యంగా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లు, ఎస్ఈఓ పేజీలు, సాధారణ ఈమెయిల్స్ వంటి వాటికి ఇప్పుడు ఏఐకే ప్రాధాన్యత ఇస్తున్నారు.విస్తరిస్తున్న ఏఐ సామ్రాజ్యంకేవలం బ్లాగులకే పరిమితం కాకుండా ఏఐ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ విస్తరించింది. మార్కెటింగ్ కాపీలు, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ల నుంచి ఫేస్బుక్ యాడ్స్ వరకు, కస్టమర్ సపోర్ట్ విభాగంలో రోబోటిక్ మెసేజ్లతోపాటు సహజంగా అనిపించే ఏఐ సమాధానాలు.. ఇలా చాలా వాటికి ఏఐ టూల్స్ వాడుతున్నారు.మానవ మేధస్సు పాత్ర ముగిసినట్లేనా?ఏఐ ఆధిపత్యం పెరిగినప్పటికీ మానవ పర్యవేక్షణ ఇంకా కీలకంగానే ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వస్తున్న కంటెంట్లో ఎక్కువ భాగం ఒక మిశ్రమ ప్రక్రియ (హైబ్రిడ్ ప్రాసెస్). ఏఐ ఒక డ్రాఫ్ట్ సిద్ధం చేస్తే మనుషులు దాన్ని ఎడిట్ చేయడం, వాస్తవాలను తనిఖీ చేయడం, భాషాలోపాలు సరిదిద్దడం వంటి పనులు చేస్తున్నారు. కంటెంట్లో సృజనాత్మకత, భావోద్వేగాల కోసం మనిషి అవసరం ఇంకా ఉందని సాంకేతిక నిపుణుల విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!
మాక్ యూజర్ల కోసం పెర్ప్లెక్సిటీ ‘పర్సనల్ కంప్యూటర్’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ‘పెర్ప్లెక్సిటీ’ టెక్ ప్రపంచంలో మరో సంచలనానికి తెరలేపింది. మాక్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ‘పర్సనల్ కంప్యూటర్’ అనే సరికొత్త సాఫ్ట్వేర్ను కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. ఇది కంప్యూటర్లోని ఫైళ్లు, అప్లికేషన్లతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే ఒక ఏఐ ఏజెంట్ అని కంపెనీ తెలిపింది.మల్టీ-మోడల్ ఆర్కెస్ట్రేషన్ఫిబ్రవరిలో కంపెనీ పరిచయం చేసిన ‘పెర్ప్లెక్సిటీ కంప్యూటర్’ అధునాతన ఆర్కెస్ట్రేషన్ ఫీచర్లను ఇప్పుడు నేరుగా యూజర్ల పర్సనల్ కంప్యూటర్లలో తీసుకువచ్చారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కంప్యూటర్లోని లోకల్ ఫైల్స్, ఇన్స్టాల్ చేసిన యాప్లు, వెబ్ కంటెంట్ను ఒకే చోట అనుసంధానిస్తుంది. సంక్లిష్టమైన పనులను పూర్తి చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఏకకాలంలో మల్టీ ఏఐ ఏజెంట్లను రంగంలోకి దించుతుంది.మాక్ మినీతో నిరంతర సేవలుఈ సాఫ్ట్వేర్ అత్యంత ఆకర్షణీయమైన అంశం దాని ‘రిమోట్ యాక్సెస్’ సామర్థ్యం. ఒకవేళ మీరు మాక్ మినీలో ఈ సాఫ్ట్వేర్ను రన్ చేస్తుంటే అది 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు ఇంటి బయట ఉన్నప్పుడు కూడా మీ స్మార్ట్ఫోన్ ద్వారా వాయిస్ కమాండ్స్ ఇచ్చి మీ కంప్యూటర్లోని పనులను పూర్తి చేయవచ్చు లేదా పర్యవేక్షించవచ్చు.పర్సనల్ కంప్యూటర్ చేసే పనులు ఇవే..ఈ ఏఐ అసిస్టెంట్ కేవలం సమాధానాలు చెప్పడమే కాకుండా క్రియేటివ్ పనులను కూడా చక్కబెడుతుంది.మీ 'టూ-డూ లిస్ట్' సమీక్షించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తుంది. యాపిల్ నోట్స్ లేదా మెసేజెస్ వంటి యాప్లను తెరిచి మీకు కావాల్సిన సమాచారాన్ని పంపడం లేదా నోట్స్ సిద్ధం చేయడం వంటివి చేస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఫోల్డర్లను క్రమబద్ధీకరించడం, ఫైళ్లకు అర్థవంతమైన పేర్లు పెట్టడం వంటి పనులను క్షణాల్లో పూర్తి చేస్తుంది.మొబైల్ నుంచే వాయిస్ ద్వారా పనులను పూర్తి చేసే వెసులుబాటు ఉంది.భద్రతే ప్రాధాన్యంవినియోగదారుల డేటా భద్రత విషయంలో పెర్ప్లెక్సిటీ కఠినమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ‘పర్సనల్ కంప్యూటర్ అప్లికేషన్ అత్యంత సురక్షితమైన ‘శాండ్బాక్స్’ వాతావరణంలో పనిచేస్తుంది. ఇది చేసే ప్రతి చర్యను యూజర్లు పర్యవేక్షించవచ్చు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే మార్పులు చేసే సదుపాయం కూడా ఉంది’ అని కంపెనీ స్పష్టం చేసింది.ప్రస్తుతానికి ఈ ‘పర్సనల్ కంప్యూటర్’ ఫీచర్ పెర్ప్లెక్సిటీ ప్రో చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వెయిట్లిస్ట్లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ త్వరలోనే సాధారణ వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!
దేశంలో నిలిచిన బంగారం, వెండి దిగుమతులు!
దేశీయ బులియన్ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అధికారిక అనుమతుల్లో జాప్యం కారణంగా భారతీయ బ్యాంకులు విదేశీ సరఫరాదారుల నుంచి బంగారం, వెండి దిగుమతి ఆర్డర్లను నిలిపివేశాయి. ఇప్పటికే దిగుమతి అయిన టన్నుల కొద్దీ విలువైన లోహాలు కస్టమ్స్ క్లియరెన్స్ లేక విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయాయి. ఈ పరిణామం అటు ఆభరణాల రంగాన్ని, ఇటు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.అసలేం జరిగింది?ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. బంగారం, వెండి దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఉన్న బ్యాంకుల జాబితాను ఇందులో పేర్కొంటుంది. గత ఏప్రిల్ 2025లో జారీ చేసిన ఉత్తర్వుల గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్ ప్రారంభంలోనే కొత్త ఉత్తర్వులు వస్తాయని బ్యాంకులు ఆశించినప్పటికీ ఇప్పటివరకు డీజీఎఫ్టీ నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం సుమారు 5 టన్నుల బంగారం, 8 టన్నుల వెండి కస్టమ్స్ వద్ద క్లియరెన్స్ కోసం ఉంది.‘మునుపటి సరుకులే క్లియర్ కానప్పుడు కొత్త ఆర్డర్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. అందుకే బ్యాంకులు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేశాయి’ అని ముంబైకి చెందిన ఒక బులియన్ డీలర్ వ్యాఖ్యానించారు.సరఫరా కొరత - అక్షయ తృతీయపై ప్రభావం?ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా, అతిపెద్ద వెండి కొనుగోలుదారుగా ఉన్న భారత్.. తన అవసరాల కోసం పూర్తిగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతుంది. ప్రస్తుత దిగుమతుల నిలిపివేత వల్ల మార్కెట్లో భారీ సరఫరా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా స్పందిస్తూ, ‘త్వరలోనే అక్షయ తృతీయ రాబోతోంది. ఈ సమయంలో దిగుమతులు పునప్రారంభం కాకపోతే మార్కెట్లో ప్రీమియంలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి’ అని కోరారు.వాణిజ్య లోటును తగ్గించే వ్యూహమా?మరోవైపు, ఈ జాప్యం వెనుక ప్రభుత్వం ఆర్థిక వ్యూహం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసియా కరెన్సీల్లో ఈ ఏడాది రూపాయి బలహీనంగా ఉంది. బంగారం దిగుమతులు తగ్గితే డాలర్లకు డిమాండ్ తగ్గి, రూపాయి విలువ స్థిరపడే అవకాశం ఉంది. ఇరాన్ వివాదం కారణంగా గ్లోబల్ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. దీనివల్ల దేశ వాణిజ్య లోటు పెరిగే ప్రమాదం ఉంది. ఈ లోటును సమతుల్యం చేయడానికి విలాస వస్తువులైన బంగారం, వెండి దిగుమతులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నియంత్రిస్తుండవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!
29 ఏళ్ల తర్వాత నెట్ఫ్లిక్స్కు బైబై చెప్పిన కోఫౌండర్
ఆన్లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ను దాదాపు మూడు దశాబ్దాల పాటు అగ్రపథంలో నడిపిన సహ-వ్యవస్థాపకుడు, ప్రస్తుత ఛైర్మన్ రీడ్ హేస్టింగ్స్ (65) తన 29 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలికారు. ఆయన సంస్థ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ కీలక పరిణామం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది. బలమైన ఆదాయ గణాంకాలు నమోదైనప్పటికీ హేస్టింగ్స్ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు వచ్చిన వార్తతో సంస్థ షేరు విలువ ఒక్కరోజులో ఏకంగా 9% పడిపోయింది.కీలక సమయంలో వీడ్కోలువార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో కంపెనీ విలీన చర్చలు విఫలమై పోటీ పెరిగిన క్లిష్ట సమయంలో హేస్టింగ్స్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది. రాబోయే జూన్ వార్షిక సమావేశంలో ఆయన తిరిగి ఎన్నికలకు నిలబడబోరని, ఇకపై తన సమయాన్ని దాతృత్వ కార్యక్రమాలకు, ఇతర వ్యాపారేతర కార్యకలాపాలకు కేటాయిస్తానని స్పష్టం చేశారు.డీవీడీ అద్దె నుంచి స్ట్రీమింగ్ సామ్రాజ్యం వరకు..1997లో ఒక చిన్న డీవీడీ-బై-మెయిల్ సర్వీస్గా నెట్ఫ్లిక్స్ను ప్రారంభించిన హేస్టింగ్స్ ప్రపంచ వినోద రంగం గమనాన్ని మార్చేశారు. 2011లో ‘క్విక్ స్టార్’ నిర్ణయం వంటి వైఫల్యాలు ఎదురైనా, కొవిడ్ మహమ్మారి వంటి కీలక సమయాల్లో సంస్థను లాభాల బాట పట్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన పుస్తకం ‘నో రూల్స్ రూల్స్’లో పేర్కొన్నట్లుగా ఉత్పాదకతతో కూడిన పని సంస్కృతిని ఆయన సృష్టించారు.భవిష్యత్తు లక్ష్యాలుహేస్టింగ్స్ వారసుడు కంపెనీ కో-సీఈఓ గ్రెగ్ పీటర్స్ సంస్థ వృద్ధిపై ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక బిలియన్ మంది ప్రేక్షకులను చేరుకునే సామర్థ్యం తమకుందని ఆయన పేర్కొన్నారు. 2026 నాటికి ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 3 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. కేవలం సినిమాలు, సిరీస్ లే కాకుండా జపాన్ వరల్డ్ బేస్ బాల్ క్లాసిక్ వంటి ప్రత్యక్ష క్రీడలు, వీడియో పాడ్కాస్ట్లపై సంస్థ దృష్టి పెడుతోంది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!
ఫ్యామిలీ
అక్షయ తృతీయ దానాలు అంతులేనంతటి ఫలాలు
వైశాఖ మాస శుక్ల పక్ష తదియని అక్షయ తృతీయ (Akshaya Tritiya 2026) అంటారు.. ఇది హైందవ పండుగ లలో విశిష్టమైనది.. విశేషమైనది... ఈ రోజు ఏ పుణ్యకార్యం చేపట్టిన దానధర్మాలు చేసినా, దాని వలన ఫలితం క్షయం కాకుండా ఉంటుంది, అందుకే ఈ పర్వం అక్షయ తృతీయగా ప్రసిద్ధికెక్కింది... 19, ఆదివారం అక్షయ తదియ సందర్భంగా ఆ విశేషాలు... ఒడిస్సాలో పూరి రధా యాత్ర నిర్మాణం ఈ రోజు మొదలు పెడుతారు. సింహచ లం అప్పన్న స్వామి నిజరూప దర్శనం మరియ చందనోత్సవం ఈ రోజే. భక్తులు తండోపతండాలుగా దర్శనంచేసే ఛార్ ధామ్ యాత్రలో కేదారేశ్వరుడు, బద్రీనాధ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరిచిన రోజు. భారతంలో పాండవులు అరణ్యవాసంలో వున్నపుడు, సూర్యదేవుడు ఇచ్చిన అక్షయపాత్ర మహిమలు విన్నాం. క్రోధపూరితం అయిన నరసింహస్వామిని శాంతింప చేయడానికి చందన పూత పూస్తారు. ఈ రోజు సింహాచలంలో చందనోత్సవం జరుగు తుంది.దానధర్మాల మహిమఈ రోజు ఏ వ్రతం అయినా జపం అయినా హోమం అయినా, దానధర్మాలు చేసినా, మరేమైనా పుణ్యకార్యం చేపట్టినా, ఫలితాలు క్షయం లేకుండా అంతం లేకుండా వుంటాయని విశ్వాసం. దానధర్మాలు చేస్తే చేసిన వారికీ నిరంతర సంపద కలుగుతుందని నమ్మకం. వైశాఖ మాసంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వస్త్రాలు, గొడుగు, చెప్పులు, మంచి నీరు, ఆహారం, పళ్ళు ఇవ్వాలని అంటారు. అలా ఇచ్చినందుకు మన ఇంట్లో వాటి కొరత ఉండదని, అక్షయమవుతాయని పెద్దల మాట. వీలైతే గోవు, భూమి, బంగారం వంటివి దానం చేస్తే ఎంతో ఫలం ఉంటుంది.చివరగా....ఈ రోజు ఏం చేసినా అక్షయంగా ఉంటుందనడానికి నిదర్శనాలు జీవనది గంగ. పంచమవేదంగా పరిగణించ బడి ప్రజలలో శాశ్వతంగా పదిలంగా వున్న మహా భారతం. ధనవంతులని కుబేర నామంతో వ్యవహరిస్తారు. అన్నపూర్ణ అవతరణతో అన్నం కొదవలేకుండా ఉండడం, మన తెలుగు రాష్ట్రాలని అన్నపూర్ణ అని అంటారు. ఈ రోజు పాపం చేస్తే ఆ పాపం కూడా అక్షయంగా అంటుకుంటుంది. అందుచేత ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డ పనులు చేయరాదు. పర్వాలకే పర్వం కృతయుగం వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తదియ నాడే ప్రారంభం అయినట్లు పురాణాలలో ప్రస్తావన... భగీరథుడు గంగకోసం తపస్సు చేసి మెప్పించి తరువాత ఆకాశం నుండి గంగ ఉగ్రరూపంతో ఉరికిన రోజు ఇదే. పరశురాముడు పుట్టినరోజు. వీరశైవ మత వ్యవస్థాపకుడు బసవేశ్వరుడు జన్మించిన రోజు. వేదవ్యాసుడు వినాయకుని చేత మహాభారతం వ్రాయడానికి పూనుకున్న రోజు.కుబేరుని శివుడు ధనాధిపతిగా నియమించిన రోజు. మహాలక్ష్మి విష్ణుమూర్తుల వివాహం జరిగిన రోజు. కుచేలుడిని కృష్ణుడు అను గ్రహించిన రోజు. బ్రహ్మ పుత్రుడు అక్షయడు జన్మించినరోజు. పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్ర అందించిన రోజు. అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు. శంకరాచార్యులు కనక ధారా స్తోత్రం ద్వారా అమ్మవారిని మెప్పించి కటిక దరిద్రురాలైన భక్తురాలి ఇంట్లో కనకవర్షాన్ని కురిపించిన రోజు. – కె. అన్నపూర్ణ
డోంట్ వర్రీ..ప్రశాంతంగా కూర్చోండి..!
ప్రజా రవాణాలలో ఆటో, క్యాబ్లనగానే కాస్త భయం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లేటప్పుడు చాలా భయం ఉంటుంది. నలుగురైదుగురు కలిసి వెళ్తుంటే ఎలాంటి భయం ఆందోళన ఉండదు. కానీ ఈ ఆటో అంకుల్ అలాంటి భయలేం వద్దు అంటూ చక్కగా తన సీటు వెనుక రాసిన సందేశం ఎంతలా ఉందంటే..బ్రో నువ్వు గ్రేట్ అని మెచ్చుకోకుండా ఉండలేరు.అసలేం జరిగిందంటే..ఉన్నతి దేవాలియా అనే మహిళ తన ముంబైలో ఒక ఆటో రైడ్ బుక్ చేసుకున్నప్పుడు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారామె. ఆ డ్రైవర్ వెనుక సీటుపై ఉన్న సందేశం చూడగానే ప్రజా రవాణాపై ఉన్న అభిప్రాయం మారిపోతుందని పేర్కొంది పోస్ట్లో. ఒక చిన్న సానుభూతి చర్య ఎంతగా ప్రభావితం చేస్తుందో అని చెప్పే ఘటన ఇది అని అంటోందామె. ఇంతకీ ఆ డ్రైవర్ సీటు వెనుకు ఏం ఉందంటే.."నేను కూడా ఒకరి తండ్రిని , సోదరుడిని. మీ భద్రతే నాకు ముఖ్యం. ఎలాంటి ఆందోళన లేకుండా కూర్చోండి. అలాగే ప్రతి వ్యక్తి ప్రమాదకారి కాదు. కొందరు మీకు సురక్షితమైన ఆశ్రయం ఇస్తారని గుర్తించండి." అని రాసి ఉంది. నిజంగా ఆ చిన్న పని ఆ డ్రైవర్ మంచి మనుసుని, ఉదారతను తెలియజేస్తుంది. అందరు అతడిలా ఉంటే బావుండేది కదూ..ఈ రోజు రైడ్లో వెళ్లడం నా రోజుని ఆనందమయంగా మారించి అంటూ తన పోస్ట్ని ముగించింది ఉన్నతి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం ఆడ్రైవర్ని ప్రశంసిస్తూ పోస్టుల పెట్టారు.(చదవండి: 'నాన్న'గా గర్వించే క్షణం..! పిల్లల నుంచి ఆశించేది ఇదేకదా..)
మామ్ వెయిట్లాస్ జర్నీ..! 82కేజీల నుంచి 60 కేజీలకు..
బరువు పెరడం ఆధునిక కాలంలో చాలామందిని వేధిస్తున్న తీవ్ర సమస్య. ముఖ్యంగా ముఖం, కాళ్లు చేతులలో ఫ్యాట్ పేరుకుపోయి..ఊబకాయంతో కనపించేలా చేస్తుంది ఈ అధిక బరువు. తగ్గాలన్నా ఆలోచన రావడం, దానిపై నిలకడతో సాగడంతోనే ఈ సమస్యకు చెక్పెట్టగలరు. లేదంటే తగ్గినట్లే తగ్గి..మళ్లీ యథాస్థితికి వచ్చేస్తుంటారు. అందులోనూ మహిళలు పెళ్లి ముందు వరకు సన్నజాజిలా అందంగా కనిపించనవాళ్లు..పిల్లలు పుట్టడంతోనే ఈ సమస్య బారినపడుతుంటారు. అందుకు మాతృత్వం, ఇంటి బాధ్యతలు నడుమ తన శరీరంపై కేర్ ఉండక ఈ అధిక బరువు బారిన సునాయాసంగా పడిపోతుంటారు. అలాంటి వాళ్లు కూడా కాస్త పిల్లలు తమ పనులు చేసుకునే స్థాయికి చేరుకున్నాక..తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుని వెయిట్లాస్ అయ్యి..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ మామ్ కూడా.ఆ తల్లే నూపుర్ కల్రా. చెన్నైకి చెందిన ఫ్యాషన్ బ్రాండ్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఆమె. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ వేదిక తన వెయిట్లాస్ జర్నీ గురించి షేర్ చేసుకున్నారు. తాను 22 కేజీల వరకు అధిక బరువుని ఎలా తగ్గించుకుందో వెల్లడించారు. తాను ఎలాంటి క్రాష్ డైట్ పాటించలేదని అన్నారు.ప్రోటీన్ తప్పనిసరిగా..ఆహారం, ప్రోటీన్ సప్లిమెంట్లు తన లైఫ్లో పెద్ద గేమ్ ఛేంజర్ అని అంటోంది. ప్రోటీన్ తృప్తికి, శక్తికి, క్రమబద్ధతకు సహాయపడుతుందట. అయితే ఏ ప్రోటీన్ మీకు సరిపోతుందనేది పోషకహార నిపుణులను సంప్రదించే పాటించమని నొక్కి చెబుతోంది.ఇంటి భోజనంఆ ఇన్ఫ్లుయెన్సర్ స్విగ్గీ, జొమాటో, డెలివరీ ఫ్లాట్ఫాంల నుంచి ఆర్డర్ చేసిన భోజనాల కంటే ఇంట్లో వండిన ఆహారాన్నే ఎంచుకన్నట్లు తెలిపింది. ఎప్పుడైనా..బరువు తగ్గాలనుకునేవారు ఇంట్లో వండిన భోజనాన్నే ప్రిఫర్ చేయడం ముఖ్యం.ఎక్కువగా నీరు తాగడం..డీహైడ్రేషన్ బారినపడటం వల్లే తినాలనే కోరికలు ఎక్కువవుతాయట. అందుకే తగినంత నీరు తాగితే తీపి పదార్థాలు, వేయించిన ఆహారాల జోలికి పోరు అని అంటోంది.అలాగని స్వీట్లకు దూరం కాలేదట..ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ..నచ్చిన స్వీట్లు తినేదట. అయితే ఎంత మోతాదులో తినాలనేది నిర్ణయించుకుని మరి ప్లాన్ ప్రకారం తినేదాన్ని అంటోంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ సూచనుల పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Noopur Kalra (@noopurkalra) (చదవండి: చలువ చేసే మారేడు పానకం..!)
'నాన్న'గా గర్వించే క్షణం..!
పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటే ఏ తల్లిదండ్రులకైనా.. అంతకు మించి కావాల్సింది ఏముంటుంది. అలాంటి క్షణం ఏ నాన్న అంత తేలిగ్గా మర్చిపోలేని జ్ఞాపకం కూడా. అలాంటి అనుభూతినే ఓ టెకీ తండ్రి పొందాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ తన తండ్రికి అమెజాన్ ఆఫర్ లెటర్ చూపిస్తూన్న వీడియో ఇది. అది అందరి దృష్టిని అమితంగా ఆకర్షించడమే గాక ప్రతితల్లిదండ్రులు పిల్లల నుంచి ఆశించేది ఇదే కదా అని నెటిజన్లు అంటుడంటం విశేషం. ఆ వీడియోని శైలేంద్ర యాదవ్ అనే టెకీ పంచుకున్నారు. ఆయన ఆ వీడియోకి మా నాన్న నా ఆఫర్ లెటర్ చదవుతున్నారు అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. ఆ వీడియోలో టెకీ తండ్రి ఆఫర్ లెటర్ చదువుతూ కనిపిస్తారు. ఇది నాన్నగా గర్వించే క్షణం, హృదయానికి హత్తుకునే ఘటన కూడా అని నెటిజన్లు అభివర్ణిస్తూ పోస్టులు పెట్టారు. ఇక టెకీ శైలేంద్ర పోస్ట్లో తాను రైతు కుటంబం నుంచి వచ్చాననని. సరైన విద్యకు అవకాశాలు పరిమితులుగా ఉండే మా కుటుంబంలో ఇంజనీర్ అయిన మొదటి వ్యక్తిని తానేనని అన్నారు. తన చదువు కోసం తన తండ్రి ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేశారో కూడా చెప్పాడు. తనకు ఉత్తమ అవకాశాలు రావడం కోసం చాలా కష్టపడ్డారని అన్నారు. చివరికి అమెజాన్ నుంచి ఎస్డిఇ-2 ఆఫర్ను సంపాదించాను. అయితే ఈ విషయాన్ని మాములుగా చెప్పకూడదనిపించి వాలెంటైన్స్ డే రోజున చాల సర్ప్రైజ్ ఇచేలా చెప్పాను. ఈ గుడ్న్యూస్ చెప్పడం కోసమే బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లానని అన్నాడు. ఆయన నాకోసం చేసిన వాటన్నింటిలో చాలా చిన్న మొత్తంలో ఇలా తిరిగి ఇచ్చినట్లుగా నాకనపించిందన్నారు. (చదవండి: జస్ట్ రూ.11 వేల లాటరీ టికెట్కి ఏకంగా రూ. 9.3 కోట్లు..!)
అంతర్జాతీయం
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో కీలక పురోగతి దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. గురువారం వైట్హౌజ్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయన్నారు. శుద్ధిచేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించేందుకు టెహ్రాన్ అంగీకరించింది. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాం. ఒప్పందం కుదిరితే.. పాకిస్థాన్కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో నేనూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. అంతటితో ఆగకుండా.. ఈ డీల్ కుదిరితే అమెరికాకు ఉచితంగా చమురుతో పాటు హర్ముజ్ జలసంధి నుంచి స్వేచ్ఛా రవాణాకు వీలు ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే.. ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగింపు ఉండబోదన్న ఇంతకు ముందు ప్రకటించిన ట్రంప్ కాస్త చల్లబడ్డారు. పొడిగింపునకు తాను సిద్ధమేనని ఇప్పుడు చెబుతున్నారు. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ల యుద్ధ విరమణ గడువు ఈ నెల 22న ముగియనుంది.మరోవైపు.. ఇరాన్ ఎన్నటికీ అణ్వస్త్రాన్ని పొందకుండా తాము నిలువరిస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఉద్ఘాటించారు. తమతో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోవడం మినహా వాళ్లు ముందు మరో దారిలేదన్నారు. ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులకు దిగుతామని హెచ్చరించారు. ఇరాన్ తన అణు శుద్ధి ప్రయత్నాలను విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమేనని మొదటి నుంచి చెబుతున్నా.. అణ్వాయుధాల తయారీకి వీలుగా యురేనియం నిల్వలు ఉన్నాయని ఇజ్రాయెల్ సహా అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో భూగర్భంలో దాచిన యురేనియం నిల్వలను బయటకు తీయాలని.. అణు ఒప్పందానికి ముందుకు రావాలని అమెరికా ఇరాన్ను డిమాండ్ చేస్తోంది. “ఇకపై యురేనియం ఎన్రిచ్మెంట్ ఉండదు” అన్నది ట్రంప్ తాజా మాట. దీనిపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. 2025 జూన్లో అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. అయితే.. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) అంచనా ప్రకారం.. ఇరాన్ వద్ద దాదాపు 400 కిలోల 60% శుద్ధి యురేనియం, అలాగే 200 కిలోల 20% యురేనియం నిల్వ ఉంది. ఈ నిల్వలను సులభంగా 90% ఆయుధ స్థాయి యురేనియంగా మార్చుకోవచ్చు!.పశ్చిమాసియా యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు అడుగులు పడ్డాయి. ఇస్లామాబాద్లో ఈ నెల 11న జరిగిన తొలి దఫా చర్చలకు ముందు.. యురేనియం శుద్ధి పూర్తిగా ఆపే ఉద్దేశ్యం లేదని ఇరాన్ స్పష్టంగా పేర్కొంది. ట్రంప్ తాజా ప్రకటనతో అమెరికా–ఇరాన్ ‘అణు’ వివాదం కొత్త మలుపు తిరిగే చాన్స్ ఉంది.
విషమంగా నర్గీస్ మహ్మదీ ఆరోగ్యం
టెహ్రాన్: ఇరాన్లోని జైలులో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మహ్మదీ(53) ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం. జన్జాన్ జైలులో ఉన్న ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు నర్గీస్ మహ్మదీ ఫౌండేషన్ బుధవారం ఎక్స్లో వెల్లడించింది. బరువు కోల్పోయారని, పాలిపోయి చాలా బలహీనంగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 24వ తేదీన జైలులో గుండెపోటుకు గురయ్యారని, ఆమెను పరీక్షించిన వైద్యుడు తెలిపారని ఫౌండేషన్ వెల్లడించింది.గుండెపోటుకు గురైన ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో దాదాపు గంటపాటు అపస్మారక స్థితిలోనే ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. నర్గీస్ను గత నెలలో రెండు పర్యాయాలు కుటుంబసభ్యులు, లాయర్లు కలిసి మాట్లాడారని తెలిపింది. హక్కుల లాయర్ అయిన నర్గీస్కు 2023లో జైలులో ఉండగానే నోబెల్ కమిటీ శాంతి పురస్కారం ప్రకటించింది. ఇరాన్లోని మషాద్లోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారన్న ఆరోపణలపై గతేడాది డిసెంబర్లో అరెస్ట్ చేసిన ప్రభుత్వం అదనంగా మరో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
ఉక్రెయిన్పై రోజంతా దాడులు
కీవ్: రష్యా మరోసారి ఉక్రెయిన్లోని జనావాసాలే లక్ష్యంగా భారీ దాడులకు తెగబడింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు వందలాదిగా డ్రోన్లు, పదుల సంఖ్యలో క్షిపణులతో విధ్వంసం సృష్టించింది. అయితే, రష్యా ప్రయోగించిన 703 డ్రోన్లకు గాను 667 డ్రోన్లను అడ్డుకున్నామని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. కనీసం 20 డ్రోన్లు, 12 క్షిపణులు మొత్తం 26 ప్రాంతాల్లో తీవ్ర నష్టం కలిగించాయంది. ఈ దాడుల్లో చిన్నారి సహా 18 మంది చనిపోగా, 118 మంది క్షతగాత్రుల య్యారు. ఈ ఏడాదిలో రష్యా చేపట్టిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని చెబుతున్నారు. రాజధాని కీవ్తోపాటు ఖరీ్కవ్, నీప్రో, ఒడెసా, జపొరిఝియా నగరాల్లో తీవ్ర నష్టం సంభవించింది. కీవ్లో 12 ఏళ్ల బాలుడు సహా నలుగురు చనిపోగా, 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాజధానిలో 17 అపార్టుమెంట్ భవనాలు, 10 వరకు ప్రైవేట్నివాసాలతోపాటు గ్యాస్ స్టేషన్, షాపింగ్ మాల్, హోటల్, ఒక కార్యాలయం భవనం తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. తీరప్రాంత నగరం ఒడెసాలోని ఓ అపార్టుమెంట్ భవనంపై జరిగిన డ్రోన్, బాలిస్టిక్ మిస్సైల్ దాడుల్లో 9 మంది చనిపోయారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను అగ్ని మాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యూజిక్ అకాడమీ భవనంపై జరిగిన దాడిలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పౌరులే లక్ష్యంగా రష్యా బాలిస్టిక్, క్రూ యిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అండ్రీ సిబిహా పేర్కొన్నారు.
ఇజ్రాయెల్, లెబనాన్ కాల్పుల విరమణ
కైరో/వాషింగ్టన్/దుబాయ్/ఇస్లామాబాద్: దశాబ్దాలుగా శత్రుత్వంతో రగిలిపోయిన ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య ఎట్టకేలకు శాంతి పవనాలు వీచాయి. పదిరోజులపాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇరుదేశాల మధ్య అమల్లోకి రానుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. భారతకాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకిరానుంది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా అమెరికా వేదికగా ఇజ్రాయెల్, లెబనాన్ జరిపిన చర్చలు ఫలించాయని ట్రంప్ తన సొంత సామాజికమధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ప్రకటించారు. ‘‘లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్తో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఇప్పుడు చక్కటి సంభాషణ పూర్తయింది. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు ఇద్దరూ అంగీకరించారు. 34 ఏళ్ల తర్వాత వాషింగ్టన్ వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ డేన్ రెజీన్ కెయిన్లు ఇరుదేశాల నేతలను సమన్వయ పరుస్తూ శాశ్వత శాంతికి కృషిచేస్తారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 9 యుద్దాలను ఆపే అదృష్టం నాకు దక్కింది. ఇది పదోది. తదుపరి చర్చల కోసం శ్వేతసౌధానికి రావాలని ఔన్, నెతన్యాహూలను ఆహ్వానించా’’అని ట్రంప్ ప్రకటించారు. ఆగని కాల్పులు! ఓవైపు కాల్పులు మరికొన్ని గంటల్లో ఆగిపోతాయని ట్రంప్ చెబుతుంటే మరోవైపు లెబనాన్లోని హెజ్బొల్లా, ఇజ్రాయెల్ బలగాలు పరస్పర కాల్పుల్లో బిజీగా మారాయి. గురువారం సైతం ఇరువైపులా కాల్పులు, బాంబుల మోత మోగింది. ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దులోని ప్రాంతాలపై హెజ్»ొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడిచేసింది. లెబనాన్లోని బీరూట్ సహా టైర్, నబాతేహ్, బిన్ట్ జబేయిల్లపై ఇజ్రాయెల్ దాడులను ఉధృతంచేసింది. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య తొలి దఫా శాంతి చర్చలు విఫలంకావడంతో మరో దఫా చర్చలకు పాకిస్తాన్ ప్రయత్నాలు ముమ్మరంచేసింది. పాక్ సాయుధబలగాల చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ గురువారం ఇరాన్లోని టెహ్రాన్కు చేరుకుని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్తో చర్చలు జరిపారు. ఈయన వెంట పాక్ అంతర్గత మంత్రి మొహ్సీన్ నఖ్వీ సైతం చర్చల్లో పాల్గొన్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కారŠప్స్(ఐఆర్జీసీ) ప్రధానకార్యాలయం ‘ఖాతమ్ అల్–అన్బియా’ను మునీర్ బృందం వెళ్లి ఆర్మీ కమాండర్లతో కాల్పుల విరమణపై చర్చించారు. తర్వాత మునీర్ నేరుగా అమెరికా వెళ్లి ట్రంప్తో చర్చిస్తారని వార్తలొచ్చాయి. మరోవైపు ఖతర్ ద్వారా మధ్యవర్తిత్వాన్ని మరింత ఉధృతంగా కొనసాగించేందుకు పాక్ ప్రయతి్నస్తోంది. ఇందుకోస పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం ఖతర్కు వచ్చారు. 10వేల సైన్యంతో దిగ్బంధం 10వేల మంది నావికులు, మెరైన్లు, యుద్దవిమాన పైలట్లు, యుద్ద విమానాలు, నిఘా నౌకలు, హెలికాప్టర్లను హార్మూజ్ దిగ్బంధం కోసం అమెరికా రంగంలోకి దింపింది. ‘‘వేల సైన్యం, ఆయుధాలు, నౌకలు, హెలికాప్టర్లను మొహరించాం. ఏ ఒక్క విదేశీ సరకు రవాణా నౌక హారూŠమ్జ్ను దాటడానికి వీల్లేదు. మా బెదిరింపులకు భయపడి ఇప్పటికే 15 నౌకలు వెనక్కి వెళ్లిపోయాయి’’అని అమెరికా జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డేన్ కెయిన్ ప్రకటించారు. హార్మూజ్ జలసంధి సహా తమ నౌకాశ్రయాల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తేయకపోతే గల్ఫ్ దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తామని ఇరాన్ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. అయితే కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగించాలని అమెరికా, ఇరాన్ సూత్రపాయ ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
జాతీయం
‘విద్యార్థినులు షార్ట్స్ ధరించి క్లాసులకు అటెండ్ కావొద్దు’
సాక్షి,చెన్నై: ‘నేను ఈ మధ్య ఓ విషయాన్ని గమనించాను. విద్యార్థినులు తరుచుగా షార్ట్స్ ధరించి క్లాసులకు అటెండ్ అవుతున్నారు. ఇలాంటి వస్త్రధారణ పట్ల అటు విద్యార్థులు, ఇటు ప్రొఫెసర్లు ఆకర్షణకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైంగిక వేధింపులకు ఆస్కారం కలిగిస్తాయంటూ తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ వి. నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.వైస్ ఛాన్సలర్ వి.నాగరాజు వ్యాఖ్యలపై యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వైస్ చాన్సలర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శించారు. యూనివర్సిటీ అధికారులు మాత్రం.. విద్యార్థులకు ఓ తండ్రిలా మాట్లాడారే తప్పా.. విద్యార్థునులను కించ పరిచే ఉద్దేశం కాదని అన్నారు. ప్రస్తుతం ఛాన్సలర్ చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయమయ్యాయి.విద్యార్థినులు షార్ట్స్ ధరించడం లైంగిక వేధింపులను ఆహ్వానిస్తుంది అంటూ వైస్ ఛాన్సలర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు షార్ట్స్ ధరించి ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే వీసీ మాత్రం తాను చేసి వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు గర్వకారణంగా ఉందని చెప్పుకొచ్చారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బుధవారం యూనివర్సిటీ న్యాయవాద విద్యార్థులతో జరిగిన ఓ సాధారణ సమావేశంలో వైస్ ఛాన్సలర్ నాగరాజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశానికి ఆయనతో పాటు, రిజిస్ట్రార్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ల డీన్లు, మహిళా సంక్షేమ కేంద్రానికి అధిపతిగా ఉన్న అధ్యాపకులతో సహా పరిపాలనలోని ఇతర సభ్యులు కూడా హాజరయ్యారు.తనపై విద్యార్థులు చేస్తున్న ఆరోపణల్ని వీసీ నాగరాజు ఖండించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ఏ వైస్-ఛాన్సలర్ కూడా డ్రెస్ కోడ్ పెట్టలేరు. కానీ నా అభిప్రాయం ప్రకారం, సంస్థ ప్రతిష్టను మెరుగుపరిచే విషయంలో విద్యార్థుల వస్త్రధారణ ఒక అంశం కావొచ్చని అన్నారు. విద్యార్థుల ప్రశ్నలను వారి అభిప్రాయాలుగా ఆయన కొట్టిపారేశారు. నేను ఏం మాట్లాడానో అర్థం చేసుకోకుండా విద్యార్థులు మీడియాతో మాట్లాడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార డీఎంకే ప్రభుత్వానికి వైస్ ఛాన్సలర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కళ్లు చెమర్చే దృశ్యం.. హృదయాన్ని తాకిన చిన్నారి వీడియో
సోషల్ మీడియాలో ఓ చిన్నారి వీడియో కదిలిస్తోంది. తోటి స్నేహితులు ఆడుతుంటే చూసి మురిసిపోయిన ఓ దివ్యాంగ చిన్నారి నెటిజన్ల మనసు గెలుచుకుంది. హృదయాలను తాకిన ఈ దృశ్యానికి ఎమోషనల్గా కనెక్టయిపోతున్నారు. పిల్లల మధ్య ఉండే స్వచ్ఛమైన స్నేహానికి సంబంధించిన ఈ సంఘటన కళ్లు చెమర్చేలా చేస్తోంది. మనం స్వయంగా ఆటల్లో పాల్గొనకపోయినా.. ఇతరుల ఆనందాన్ని చూస్తూ కూడా సంతోషాన్ని పొందవచ్చని ఈ వీడియో నిరూపిస్తోంది. ఒక దివ్యాంగ చిన్నారి తన స్నేహితులు ఆడుకుంటుంటే చూసి.. వారితో పాటు నవ్వుతూ ఆనందాన్ని పంచుకుంది. ఆమె శారీరక స్థితి వల్ల వారితో కలిసి పరిగెత్తలేకపోయినా.. ఆమె ముఖంలోని చిరునవ్వు నెటిజన్లను ఒకేసారి భావోద్వేగానికి, ఆనందానికి గురిచేసింది. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో ఓ చిన్నారి మెట్ల వద్ద కూర్చుని ఉండటం కనిపిస్తుంది. ఆమె దగ్గర్లోనే ఇద్దరు అబ్బాయిలు ఒకరినొకరు తరుముకుంటూ.. కుస్తీ పడుతూ ఆడుకుంటున్నారు. వారు అటు ఇటు పరిగెడుతూ నవ్వుతుంటే.. ఆ చిన్నారి అక్కడే కూర్చుని వారిని గమనిస్తూ.. వారితో పాటు కేరింతలు కొడుతూ ఆ క్షణాలను ఆస్వాదించింది.ఈ వీడియో నిడివి తక్కువైనా.. అది పంచిన భావోద్వేగం మాత్రం చాలా పెద్దది. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ.. తన చుట్టూ ఉన్న ఆనందాన్ని ఆమె మనస్ఫూర్తిగా స్వీకరించడం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ చిన్నారి తన బాధను మర్చిపోయి.. కేవలం తన స్నేహితుల ఆటను చూస్తూ వారితో కలిసి నవ్వుతోందని ఆ వీడియో వివరించింది. ఇది ఆ దృశ్యానికి మరింత ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. ఆమె చిరునవ్వు చూస్తుంటే ఒక పక్కన మనసు నిండిపోతోంది. మరోపక్క కళ్లు చెమర్చుతున్నాయి. చాలా ధైర్యవంతురాలైన అమ్మాయి. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చల్లగా చూడాలి’’ అంటూ నెటిజన్లు దీవెనలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by diva choudhary (@deeva_2024)
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతుండగా మైక్ కట్
సాక్షి, ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతున్న మహిళా ఎంపీ మైక్ కట్ చేయడంపై వైఎస్సార్సీపీ ఎంపీలు తనూజ రాణి, గురుమూర్తి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మైక్ కట్ చేసిన సభాస్థానంలో టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఉన్నారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున చర్చలో ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజారాణి పాల్గొన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై కొనసాగుతున్న హింసను ఆమె ప్రస్తావించారు. ఏపీలో మహిళను తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిని చేసిన ఘనత వైఎస్ జగన్ది. నామినేటెడ్ పోస్టుల్లో, కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ది. అమ్మ ఒడి, మహిళల పేరుపైనే ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 2019-24 వైఎస్ జగన్ పరిపాలనా కాలం మహిళలకు స్వర్ణయుగం లాంటిది. ఏపీలో మహిళలపై హింస జరుగుతుంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన ఘటన తీవ్ర ఆందోళనకరం. అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులు మహిళలను వేధిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు’’ అని తనూజరాణి మండిపడ్డారు.
ఈ బిల్లు అందుకే.. ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుంటాం: రాహుల్
ఢిల్లీ: నారిశక్తి వందన్ అధినియం పేరుతో కేంద్రం తీసుకవచ్చిన బిల్లు వాస్తవానికి మహిళల రిజర్వేషన్కు సంబంధించిన బిల్లు కానేకాదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లు చర్చపై ఆయన ఈ రోజు( శుక్రవారం) పార్లమెంటులో మాట్లాడారు. 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని ఇది మహిళలను అడ్డుగా పెట్టి తీసుకొచ్చిన షేమ్ ఫుల్ యాక్ట్ అన్నారు.మా నానమ్మ ఇందిర వల్లే నాలో ఆత్మ విశ్వాసం పెరిగిందని నిన్న సభలో తన సోదరి ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగం తనకు ఎంతో గర్వంగా అనిపించిందన్నారు.మన జీవితంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తల్లులు చెల్లెలు , భార్య బిడ్డల రూపంలో వారు ఎంతో కీలక పాత్ర పోషిస్తారన్నారు. కాగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో కేంద్రం ఎంతో కుట్ర చేస్తోందన్నారు. ఇది రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చాలనుకుంటున్న బిల్లు అని రాజ్యాంగాన్ని బైపాస్ చేసి నియోజకవర్గాలని పెంచాలనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు.ఈ బిల్లు వెనుక ఉన్న అసలు ఉద్దేశం కులగణన లెక్కలు లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నదే అన్నారు. ఓబీసీలకు 15 ఏళ్ల పాటు రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్ర ఇదన్నారు. బీజేపీ సభ్యులు రాజ్యాంగం కంటే మనువాదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారుల్లో , న్యాయవ్యవస్థలో ఓబీసీలు గిరిజనులు లేరని, ప్రేవేటు రంగంలో కూడా రంగంలో కూడా ఓబీసీ ఎస్సీ ఎస్టీల ప్రాధాన్యత లేదన్నారు. హిందుత్వం పేరుతో బీజేపీ పార్టీ బీసీ, ఎస్సీ,ఎస్టీలకు చేసిందేమీ లేదన్నారు.కులగణనను బైపాస్ చేసేందుకే కేంద్ర యత్నిస్తోందని అస్సోం, జమ్మూలో చేసినట్లు డీలిమిటేషన్ చేయాలనుకంటున్నారని ఆరోపించారు. ఈ బిల్లు దేశవ్యతిరేఖ బిల్లని ఇది ఎట్టిపరిస్థితుల్లో ఆమోదం పొందేలా చేయడానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. దేశ ఆత్మని చంపే బిల్లుని ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకొని తీరాతమని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. కాగా రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎన్ఆర్ఐ
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు)
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’
అల్ఫారెట్టా, జార్జియా: స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి-2026’ అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు.ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. నాలుగేళ్ల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ(యూఎస్ఏ) సేవా సంస్థలకు అందజేయనున్నారు.ఈ వేడుకల్లో బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి (శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రతినిధులు), గిరిధర్ కొటగిరి (ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు), జ్యోత్స్న పాలకుర్తి (గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ చైర్మన్), రమణ గంద్ర (గేట్స్ అధ్యక్షులు), సునీత పోట్నూరు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు), ఆది శ్రీనివాసన్ (ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు), శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ (ప్రెసిడెంట్ అండ్ సీఈఓ), జనార్ధన్ పన్నెల (శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధి) పాల్గొన్నారు.
క్రైమ్
టీసీఎస్ కేసు.. ‘కడుపుతో ఉన్నా.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి’
మహారాష్ట్ర నాసిక్లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) యూనిట్లో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు వెలుగులోకి రావడంతో దేశం ఉలిక్కి పడింది. గత నాలుగేళ్లుగా సీనియర్ ఉద్యోగులు ఈ ఘాతుకాలకు పాల్పడ్డారంటూ మొత్తం తొమ్మిది మంది ఫిర్యాదులు చేశారు. సంచలన కేసు కావడంతో సిట్ లోతుగా దర్యాప్తు జరుపుతుండగా.. సంస్థపై మచ్చ పడడంతో టీసీఎస్ ఈ అంశాన్ని తీవ్రంగానే పరిగణిస్తోంది. ఈ తరుణంలో.. సిట్కు ఈ కేసు నిందితురాలు నిదా ఖాన్(Nida Khan) ఝలక్లు ఇస్తోంది. ఇప్పటికే పరారీలో ఉన్న ఆమె.. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ నాసిక్ లోకల్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. తాను గర్భవతినని, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అందులో పేర్కొంది. ప్రస్తుతం ఆమె ముంబైలో తలదాచుకున్నట్లు సిట్కు సమాచారం అందింది. ఈ మొత్తం వ్యవహారంలో నిదా ఖానే ప్రధాన నిందితురాలు అయ్యి ఉండొచ్చని సిట్ భావిస్తోంది. యాంటీసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేలోగా.. వీలైనంత త్వరగా ఆమెను అదుపులోకి తీసుకోవాలని సిట్ ప్రయత్నిస్తోంది. మరోవైపు.. వేధింపుల వ్యవహారంలో హెచ్ఆర్ హెడ్గా నిదా ఖాన్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు బృందం భావించింది. అయితే.. ఈ విషయంలోనూ పోలీసులకు మరో ఝలక్ తగిలింది. ఆమె అసలు హెచ్ఆర్ హెడ్ కాదని టీసీఎస్ ప్రకటించింది. ఆమె సాధారణ టెలికాలర్ అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో ఆమెను హెచ్ఆర్ హెడ్గా పేర్కొనడం గమనార్హం.హైబ్రిడ్ టెర్రరిస్ట్ కుట్ర?నిదా ఖాన్కి ఢిల్లీ పేలుళ్ల నిందితులతో సంబంధం ఉందంటూ పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. జైషే (Jaish-e-Mohammed) ఉగ్రవాదిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ షాహీన్ షాహిద్తో సంబంధం ఉందని ఆ కథనాల సారాంశం. దీంతో.. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రంగంలోకి దిగింది.నాసిక్ టీసీఎస్ బీపీవో యూనిట్లో పని చేసే ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు, ఒక పురుష ఉద్యోగి తమపై జరిగిన మానసిక, శారీరక వేధింపులు, మత అవమానాలు, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల ప్రకారం.. టీమ్ లీడర్లు, కొంతమంది సీనియర్ ఉద్యోగులు.. ‘‘మహిళా ఉద్యోగులను మానసికంగా, శారీరకంగా వేధించారు. తప్పుడు హామీలతో ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకున్నారు.హిందూ దేవతలను అవమానించారు, పండుగల సమయంలో సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలను ఎగతాళి చేశారు.నమాజ్ చేయమని బలవంతపెట్టారు, మతాన్ని అవమానించారు. ఉద్యోగులను హోటళ్లకు, రిసార్ట్స్కి రావాలని ఒత్తిడి చేశారు. వీటన్నింటికి తోడు.. చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్ విభాగం ఫిర్యాదులను పట్టించుకోకుండా నిందితులనే ప్రొత్సహించింది.ఈ కేసులో ఇప్పటిదాకా ఏడుగురిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఇందులో ఆరుగురు పురుష ఉద్యోగులు, ఒక మహిళా ఉద్యోగిణి ఉన్నారు. నిదా ఖాన్ ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉపేక్షించేది లేదని TCS అంటోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను కంపెనీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసు విచారణకు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం అన్నారు. కంపెనీ సీవోవో ఆరతి సుబ్రహ్మణియన్ ఆధ్వర్యంలో అంతర్గత విచారణ కొనసాగుతుందని తెలిపారాయన.ఈ కేసు దేశవ్యాప్తంగా.. మరీ ముఖ్యంగా ఐటీ రంగంలో మత మార్పిడి, లైంగిక వేధింపులపై చర్చలకు దారితీసింది. సుప్రీం కోర్టులో కూడా బలవంతపు మత మార్పిడి నియంత్రణపై పిటిషన్ దాఖలైంది. ఈ ఉదంతం దేశంలోని సార్వభౌమత్వం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, ఐక్యతకు ముప్పుగా అభివర్ణించిన పిటిషనర్ లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్.. బలవంతపు మత మార్పిడిని ‘టెర్రరిస్ట్ యాక్ట్’గా ప్రకటించాలని కోర్టును కోరారు.
బోగస్ హిందూ సర్టిఫికెట్తో పెళ్లి.. జ్యూస్లో మత్తుమందు ఇచ్చి..
పంజాగుట్ట: నెల్లూరుకు చెందిన నవాజ్ అనే వ్యక్తి మతం మారినట్లు బోగస్ సర్టిఫికెట్ చూపించి తనను మోసగించి పెళ్లి చేసుకుని, కోటి రూపాయల వరకు కాజేశాడని ఓ బాధితురాలు (26) ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూకట్పల్లికి చెందిన బాధితురాలు మాట్లాడుతూ తాను సాఫ్ట్వేర్ ఉద్యోగిని అని, కూకట్పల్లిలో తన ఇంటి కింద ఉన్న షాపులో నవాజ్ ట్రేడింగ్ సొల్యూషన్ ఆఫీస్ పెట్టుకుంటానని 2025 మే నెలలో వచ్చి పరిచయం చేసుకున్నాడని తెలిపింది.కొన్ని రోజులకే వివాహం చేసుకుంటానని తన వెంటపడ్డాడని పేర్కొంది. హిందువుగా మతం మారానని బోగస్ సర్టిఫికెట్ చూపించడంతో నమ్మి గత ఏడాది జూలైలో వివాహం చేసుకున్నట్లు చెప్పింది. వివాహమైనరోజే బేగంపేటకు తీసుకువెళ్లి తనకు జ్యూస్లో మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయాక నవాజ్ సోదరులతో సామూహిక అత్యాచారం చేయించాడని తెలిపింది. శంషాబాద్లో ఉన్న తమ ఫ్లాట్ అమ్ముకున్నాడని, తమ బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నాడని, మొత్తం కోటి రూపాయల వరకు మోసం చేశాడని బాధితురాలు పేర్కొంది. అతనికి అంతకు ముందే రెండు వివాహాలైనట్లు, పిల్లలు కూడా ఉన్నట్లు ఆ తర్వాత తెలిసిందన్నారు. గట్టిగా ప్రశ్నించగా, తన చెల్లిని కూడా ఇలానే గ్యాంగ్ రేప్ చేయిస్తానని, అమ్మను చంపి సహజ మరణంగా చిత్రీకరిస్తానని బెదిరించాడని తెలిపింది. దీంతో తాను కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, నిందితునిపై కేసు నమోదైందని పేర్కొంది. నవాజ్తోపాటు మరో ఇద్దరి అరెస్టు కాగా, యువతిని మోసగించిన కేసులో నవాజ్తోపాటు అతని సోదరులు ఇస్మాయిల్, లీలాపుద్దీన్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న స్నేహితులు షారూక్, మునావర్ల కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో నవాజ్ తల్లి, ఇతర కుటుంబ సభ్యుల పాత్రపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే రిమాండ్లో ఉన్న నవాజ్, ఇస్మాయిల్, లీలాపుద్దీన్లను కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి తీసుకున్న అనంతరం అన్ని కోణాల్లో పోలీసులు విచారించనున్నారు. బాధితురాలి తల్లి పేరుపై ఉన్న ఇంటిని నవాజ్ వేరొకరికి విక్రయించిన విషయంపై ఇప్పటికే రిజి్రస్టేషన్ కార్యాలయానికి పోలీసులు లేఖ రాసినట్లు తెలిసింది.
గంజాయ్కి యువత చిత్తు !
గంజాయి అంగడి సరుకుగా మారింది. మత్తుతో యువత చిత్తవుతున్నారు. విద్యాసంస్థలే లక్ష్యంగా కొందరు గంజాయి సరఫరా చేస్తున్నారు. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశం. వారాంతపు రోజుల్లో తీర ప్రాంతానికి గంజాయి దిగుమతి అవుతోంది. సంబంధిత శాఖల అధికారుల తనిఖీల్లో పట్టుబడేది గోరంతయితే.. వినియోగం కొండంతగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చీరాల అర్బన్: చంద్రబాబు సర్కార్ ఏర్పాటు అయ్యాక గంజాయి వినియోగం పెరిగింది. ఏడాదిలో గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితలు పదేపదే చెప్పారు. అయితే సాధారణ తనిఖీల్లోనే పెద్ద మొత్తంలో గంజాయి, చాక్లెట్లు పట్టుబడుతుంటే నియంత్రణ ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా విజనరీ ముందు చూపనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎక్కడంటే అక్కడే... గతంలో గంజాయి వినియోగించే వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉండేది. అది కూడా ఎంతో రహస్యంగా వినియోగించేవారు. రైలు మార్గం ఉన్న ప్రాంతాల్లో ఒకింత ఎక్కువగా వినియోగం ఉండేది. అయితే బాబు పాలనలో గంజాయి దొరకని ప్రాంతం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నిషేధిత గంజాయి సాగు చేసేది ఒకరు... రవాణా చేసేది మరొకరు. దాన్ని స్థానికంగా అందిపుచ్చుకునేది ఇంకొకరు. అక్కడి నుంచి నిర్ణీత ప్రదేశాలకు తరలించేది వేరొకరు. అంతిమంగా విక్రయించేది మరికొందరు. ఇది ఒక చైన్లా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో కట్టడి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణకుæ అధికారులు దిగారు. స్థానికంగా గంజాయి రవాణా, విక్రయాలను కట్టడి చేయటంతోపాటు మూలాలలోకి వెళ్లి సాగును సమూలంగా నాశనం చేసేందుకు దిశా నిర్దేశం చేశారు. ఆ క్రమంలో పోలీస్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఎస్బీ, సెబ్ తదితర విభాగాల నుంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతాలు, ఒడిశా సరిహద్దుల వరకు గంజాయి సాగు ఎక్కడ ఉందో ప్రత్యేక బృందాలు జల్లెడ పట్టాయి. గంజాయి లభ్యం కాకుండా ఉక్కుపాదం మోపారు. దాదాపు గంజాయి సాగు, రవాణా, విక్రయాలు తగ్గాయి. విద్యార్థులే లక్ష్యంగా.. గంజాయి విక్రేతలు విద్యార్థులను లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల స్థానంలో గంజాయిని వారికి అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక తీర ప్రాంతాలలో వారాంతపు రోజుల్లో గంజాయి విక్రయాలు జోరుగా ఉంటున్నాయనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. కట్టడి చేయటం సాధ్యం కాదా..? ‘పాలకులు, అధికారుల్లో చిత్తశుద్ధి ఉంటే కట్టడి చేయటం కష్టమేమీ కాదు. యాక్షన్ ప్లాన్ లీక్ కాకూడదు. రాజకీయ జోక్యం ఉండకూడదు. అందుకు ప్రజల సహకారం కూడా అవసరంమని’ ఓ అధికారి తెలిపారు. అయితే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయ జోక్యం ఏదో ఒక స్థాయిలో ఉంది. కట్టడి అనేది మాటలకే పరిమితం అవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెప్పపాటులో ఘోర రోడ్డు ప్రమాదం..
మంత్రాలయం/ మంత్రాలయం రూరల్: రెప్పపాటులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎనిమిది మందిని బలితీసుకుంది. 13 మందిని క్షతగాత్రులను చేసింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున గూడ్స్ వాహనం, ఫ్లైయాష్ మిల్లర్ వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. వ్యవసాయ పనులు ముగియడంతో కర్ణాటకలోని హాసన్, చిక్మంగళూరు జిల్లాలకు చెందిన రైతు, సాగు కూలీలు తమ ఇష్టదైవం రాఘవేంద్రస్వామిని దర్శించుకోవాలనుకున్నారు. దీంతో చిక్మంగళూరు జిల్లా తారికెర తాలూకా ఉదేవ గ్రామం, చిక్మంగళూరు, కన్నైనతళ్లి హళ్లి, అన్నేరడు గ్రామం, బూతుపల్లి, హాసన్ జిల్లా బెన్నూరు తాలూకా శెట్టిగెర, దావణగేరి గ్రామాలకు చెందిన 22 మంది రాఘవేంద్రస్వామి దర్శనానికి గూడ్స్ వాహనంలో ఉదేవా గ్రామం నుంచి బుధవారం సాయంత్రం పయనమయ్యారు. మంత్రాలయం వైపు వస్తుండగా.. గమ్యస్థానానికి 9 కిలోమీటర్ల దూరంలో చిలకలడోణ దాటగానే రాయచూరు నుంచి ఎదురుగా వస్తున్న ప్లైయాష్ కాంక్రీటు మిల్లర్ వాహనాన్ని యాత్రికుల వాహనం ఢీకొట్టింది. ఫ్లైయాష్ మిల్లర్ రోడ్డు పక్క పొలంలోకి బోల్తా పడింది. యాత్రికుల వాహనం రోడ్డుపైనే బోల్తా పడి నుజ్జునుజ్జయింది. ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన 16 మందిని పోలీసులు అంబులెన్స్లలో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు, ఆస్పత్రిలో మరొకరు మరణించారు. 13 మంది క్షతగాత్రులను కర్నూలు పెద్దాస్పత్రికి తరలించారు. మృతులు వీళ్లే.. ప్రమాదంలో సునీల్ (29), మీనాక్షమ్మ (52), పుట్టమ్మ (60), లోలాక్షమ్మ (38), ఎస్.కె.వీణ (25), ఆమె కూతురు చిన్నారి నిషిత (3), సుశీల్ కుమార్ (45), జయమ్మ (60) చనిపోయారు. ఇందులో డ్రైవర్ సునీల్, అతని తండ్రి, చెల్లెలు, సుశీల్కుమార్, ఎస్.కె. వీణ, ఆమె కూతురు చిన్నారి నిషితతోపాటు సునీల్ అత్త జయమ్మ, అవ్వ లోలాక్షమ్మ ఒకే కుటుంబానికి చెందిన వారు. ఘోర ప్రమాదానికి డ్రైవర్ సునీల్ నిద్రమత్తే కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున సాయం చేయనున్నట్టు ప్రధాని కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది. వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవదర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 13 మంది గాయపడటం, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వీడియోలు
బట్టతల రాదు నాది గ్యారెంటీ వైరల్ డాక్టర్ చిట్కాలు
జాక్ పాట్ కొట్టిన 3 రాశులు, అదృష్ట రాశులు ఈ వారం మీది
ఇది కదా పాలన...
LIVE: డీలిమిటేషన్ తో... రాష్ట్రాల మధ్య యుద్ధం .?
ఉత్తర ఇజ్రాయెలపై హెజ్బొల్లా రాకెట్, డ్రోన్ దాడులు
ఐటీ ఉద్యోగులకు.. AI టెన్షన్..
ఉస్మానియా మెడికల్ కాలేజీలో తీవ్ర విషాదం వైద్య విద్యార్థి ఆత్మహత్య
తెలవారుజామున చాయ్ దొరుకుతుందో లేదో కానీ..మద్యం మాత్రం విచ్చలవిడిగా..
జర్మనీలో జాబ్ కోసం ఇలా అప్లై చేసుకోండి
మహిళా సెంటిమెంట్స్ ను దెబ్బతీయొద్దు ఎంపీలకు పీఎం మోదీ విజ్ఞప్తి..



