బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..
బంగారం ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. గడచిన వారం రోజుల్లో గోల్డ్, సిల్వర్ రేటు గణనీయంగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో, పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేట్లలో జరిగిన మార్పు గురించి, నేటి ధరల గురించి తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 9(సోమవారం)న 1,61,680 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, ఈ రోజుకి (మార్చి 15) 1,59,660 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు రూ. 2020 తగ్గిందన్న మాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. వారం రోజుల్లో 1,48,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,46,350 వద్దకు (రూ.1850 తగ్గింది) చేరింది.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వారం రోజుల్లో గణనీయంగా తగ్గింది. మార్చి 9న.. అంటే సోమవారం రోజు 1,61,830 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. నేటికి (మార్చి 15) రూ.1,59,810 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఏడు రోజుల్లో రూ.2020 తగ్గింది. 22 క్యారెట్ల పసిడి రేటు 1,48,350 రూపాయల నుంచి రూ.1850 తగ్గి 1,46,500 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర వారం రోజుల్లో 1,63,090 రూపాయల దగ్గర నుంచి 1,61,020 రూపాయల దగ్గరకు చేరింది. వారం రోజుల్లో రూ. 2070 తగ్గిందన్నమాట. తులం 22 క్యారెట్ల బంగారం రేటు 1,49,500 రూపాయల నుంచి రూ. 1,47,600 వద్దకు (రూ.1900 తగ్గింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. మార్చి 9న రూ.2.90 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు నేటికి (మార్చి 15) రూ.2.80 లక్షలకు చేరింది. వారం మధ్యలో రేట్ల పెరుగుదల, తగ్గుదల ఉన్నప్పటికీ.. మొత్తం మీద కేజీ రేటు 10,000 రూపాయలు తగ్గిందని తెలుస్తోంది.
తెలంగాణ రైతులకు శుభవార్త
హైదరాబాద్: తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల చేయనుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో నిధులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్రెడ్డి. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నిధుల్ని మొత్తం మూడు విడతల్లో విడుదల చేయనున్నారు . తొలి విడతగా రూ. 3, 590 కోట్ల నిధులు విడుదల చేయనుండగా, రెండో విడతగా రూ. 2, 650 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. ఈ నెల 22వ తేదీన తొలి విడత, ఆపై 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం మూడు విడతల్లో రూ. 9 వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు.డైలమాకు తెర..!గత యాసంగిలో రైతు భరోసా పెట్టుబడి సాయం ముందుగానే రైతుల ఖాతాల్లో ఎకరానికి 6 వేల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత యాసంగిలో రైతు భరోసా ఇంకా రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తమైంది. చెందుతున్నారు. ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేస్తుందో చేయదో అన్న ఆందోళనలో ఉన్న సమయంలో ప్రభుత్వం శుభవార్త చెప్పడంతో రైతుల డైలమాకు తెరపడింది.ప్రస్తుత యాసంగి సీజన్ జిల్లా వ్యాప్తంగా 5,16,327 ఎకరాల్లో వరితో పాటు వివిధ పంటలు సాగయ్యాయి. వరి సుమారు 5 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పెట్టుబడుల సమయంలో రైతుభరోసా అందక రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. పొలాలు దున్నకం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వరి నాట్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడి కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని యాసంగి సాగును పూర్తి చేశారు. రైతు భరోసా వస్తుందనే ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. తాజాగా రైతు భరోసా నిధులపై ప్రభుత్వ ప్రకటనతో రైతులకు ఊరట లభించింది.
ఎక్సైజ్ మంత్రి ఊర్లో రూల్స్ గీల్స్ జాన్తా నై..!
మచిలీపట్నం: ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఎక్సైజ్ చట్టాలను తుంగలో తొక్కి, బార్ రూల్స్కి విరుద్ధంగా టెంట్లు వేసి మరీ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. పందిర్ల కింద బార్ లైసెన్స్ మంజూరు చేసి, మద్యం సిండికేట్ల అవినీతి మత్తులో మునిగితేలుతున్నారు కృష్ణాజిల్లా ఎక్సైజ్ అధికారులు. రాష్ట్రం మొత్తం ఒక రూల్.. మచిలీపట్నం మరొక రూల్ అన్నట్లు ఇక్కడ మద్యం అమ్మకాల నిర్వహణ సాగుతోంది. ‘ ఎక్సైజ్ మంత్రి ఊర్లో రూల్స్ గీల్స్ జాన్తా నై’ అన్నట్లుగా సాగుతున్నాయి మద్యం విక్రయాలు. బార్ రూల్స్కు విరుద్ధంగా ఖాళీ స్థలంలో టెంట్లు, పందిర్లు వేసి మచిలీపట్నం బీచ్ రోడ్లో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు నిర్వహకులు. నిబంధనలు పాటించని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులపై కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దాంతో స్థానికుల నుంచి తిరుగుబాటు ఎదురైంది. టెంట్లు, పందిళ్ళ కింద బార్ లైసెన్సులు ఎలా మంజూరు చేశారని ప్రశ్నిస్తున్న స్థానికులు.గుడారాల్లోనే బార్లుజనసేనకు చెందిన కొరియర్ శ్రీను గుడారాల్లోనే బార్ నిర్వహిస్తున్నారు. తన అనుచరులతో బార్ టెండర్లు పొందిన మచిలీపట్నంకు చెందిన జనసేన నేత కొరియర్ శ్రీను.. భవన నిర్మాణాలు చేపట్టకుండానే గుడారాలు వేసి మద్యం విక్రయాలు జరుపుతున్నారు.ఇది ఆబ్కారీ శాఖ వింతపోకడలకు అద్దం పడుతోంది. ఇలా గుడారాల్లో బార్ నిర్వహించడం రూల్స్కి విరుద్ధమైనా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.అబ్కారీశాఖ మంత్రి ఇలాకాలో మద్యం పరవళ్లు..కృష్ణా జిల్లాలో పరిస్థితి ఎలా ఉన్నా సాక్షాత్తూ అబ్కారీశాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలో మాత్రం మద్యం పగలు, రాత్రి పరవళ్లు తొక్కుతుంది. అదేమంటే మేమింతే అడ్డుకుంటే అంతే అంటూ కూటమి నాయకులు (మద్యం వ్యాపారులు) సంబంధిత అధికారులపై అధికారం చెలాయిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే మద్యం వ్యాపారాన్ని నియత్రించలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకేమి కట్టడి చేయగలుగుతారంటూ జనం ప్రశ్నిస్తున్నారు.
‘పుట్టా మహేష్ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు’
హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగిల్) ఫోర్స్ పోలీసుల ప్రకటించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి స్పందిస్తూ పుట్టా మహేష్ తీరుపై మండిపడ్డారు.‘చంద్రబాబు బ్రాండ్.. డ్రగ్స్ బ్రాండ్. డ్రగ్స్ మాఫియాను చంద్రబాబు పెంచి పోషిస్తున్నారు. సామాన్యుడికి ఒక రూల్.. ఎంపీకి మరో రూల్ ఉండకూడదు. పుట్టా మహేష్ను రక్షించడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. పుట్టా మహేష్కు ఎంపీగా కొనసాగే అర్హత లేదు’ అని కాకాణి అన్నారు. కాగా, వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫాంహౌస్లో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు.
TG: బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్కు ఆహ్వానం
ఏపీలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
అమెరికా అంచనాలు ఎలా తప్పాయ్? గల్ఫ్ భవిష్యత్తు ఏంటి?
రహానేకు మరోసారి అవకాశం!
బిగ్బాస్ దివి గ్లామరస్ లుక్.. బ్లూ శారీలో త్రిష అందాలు..!
నవనాయక ఫలితాలు (2026– 2027)
శ్రీ పరాభవ నామ సంవత్సర కర్తరీ నిర్ణయం
బిగ్బాస్ అశ్విని శ్రీకి గాయాలు.. అసలేం జరిగిందంటే?
కోహ్లీ అత్యుత్తమ టీ20 ఓపెనర్ అతడే!
భారత ఆర్థిక వ్యవస్థ ప్రోగ్రెస్ రిపోర్ట్
సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
శ్రీ పరాభవ నామ సంవత్సర (2026 – 27) రాశిఫలాలు
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
భారత యుద్ధనౌకల మోహరింపు
Hyderabad: మూతపడనున్న బావర్చి రెస్టారెంట్..!
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
సిలిండర్ డెలివరీపై కఠిన నియమం
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
ఏ పని చేయకుండా నిత్యం అవే ఆలోచిస్తున్నారు!
T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్
సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!
ఏమీ తినకున్నా షుగర్ ఎందుకు పెరుగుతుంది?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
నెతన్యాహు ఎక్కడ?
TG: బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్కు ఆహ్వానం
ఏపీలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
అమెరికా అంచనాలు ఎలా తప్పాయ్? గల్ఫ్ భవిష్యత్తు ఏంటి?
రహానేకు మరోసారి అవకాశం!
బిగ్బాస్ దివి గ్లామరస్ లుక్.. బ్లూ శారీలో త్రిష అందాలు..!
నవనాయక ఫలితాలు (2026– 2027)
శ్రీ పరాభవ నామ సంవత్సర కర్తరీ నిర్ణయం
బిగ్బాస్ అశ్విని శ్రీకి గాయాలు.. అసలేం జరిగిందంటే?
కోహ్లీ అత్యుత్తమ టీ20 ఓపెనర్ అతడే!
భారత ఆర్థిక వ్యవస్థ ప్రోగ్రెస్ రిపోర్ట్
సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
శ్రీ పరాభవ నామ సంవత్సర (2026 – 27) రాశిఫలాలు
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
భారత యుద్ధనౌకల మోహరింపు
Hyderabad: మూతపడనున్న బావర్చి రెస్టారెంట్..!
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
సిలిండర్ డెలివరీపై కఠిన నియమం
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
ఏ పని చేయకుండా నిత్యం అవే ఆలోచిస్తున్నారు!
T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్
సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!
ఏమీ తినకున్నా షుగర్ ఎందుకు పెరుగుతుంది?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
నెతన్యాహు ఎక్కడ?
ఫొటోలు
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
వైట్ డ్రెస్లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
తెలంగాణ వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు (ఫొటోలు)
అల్లు సినిమాస్ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)
కూకట్పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)
ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)
‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, బన్నీ (ఫోటోలు)
సినిమా
ఆ సినిమాలన్నీ ఫ్లాప్.. లాభమే లేదు: విజయ్ సేతుపతి
సినిమాలు తీయడమంటే ఆషామాషీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా బాక్సాఫీస్ వద్ద వైఫల్యం మూటగట్టుకోవడం తథ్యం. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది నిర్మాతలే.. కొడితే కుంభస్థలాన్ని కొడతారు.. లేదంటేనేమో తీవ్ర నష్టాలు చూస్తారు. అలా తాను నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదంటున్నాడు తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి.ఆ నాలుగు ఫ్లాప్తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. నా బ్యానర్లో సంగుతేవన్ అనే సినిమా స్టార్ట్ చేశాను. కానీ, అది మధ్యలోనే ఆగిపోయింది. దానివల్ల రూ.1.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత నాలుగు సినిమాలు తీశాను. అవే.. ఆరెంజ్ మిఠాయి, మేకు తొడర్చి మలై, జుంగ, లాభం. వీటిలో ఒక్కటి కూడా నాకు లాభాల్ని తెచ్చిపెట్టలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కు తీసుకురావడంలో కూడా విఫలమయ్యాయి. సినిమాబాక్సాఫీస్ లెక్కలపరంగా అవి ఫ్లాప్ అయినప్పటికీ నాకు మాత్రం ఆ సినిమాలన్నీ ఇష్టం. కాబట్టి వాటిని నిర్మించినందుకు నేనేం బాధపడటం లేదు అన్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి నటుడిగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ మూవీ చేస్తున్నాడు. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్ చేస్తున్నాడు. ఇది కాకుండా పాకెట్ నోవెల్, జైలర్ 2, అరసన్తో పాటు మణిరత్నం మూవీ ఒకటి ఆయన చేతిలో ఉన్నాయి.చదవండి: నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి: ప్రియదర్శన్
ఆనంద్ దేవరకొండ బర్త్ డే.. వదినమ్మ రష్మిక స్పెషల్ విషెస్
ఇటీవలే టాలీవుడ్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్పూర్ వేదికగా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్లో ఈ లవ్ బర్డ్స్ ఒక్కటయ్యారు. ఇరువురి సంప్రదాయ పద్ధతుల్లో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే సందడి చేశారు.తాజాగా ఇవాళ విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ బర్త్ డే కావడంతో వదినమ్మ రష్మిక స్పెషల్ విషెస్ తెలిపింది. మరిది ఆనంద్ దేవరకొండతో కలిసి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత ఆనంద్ జరుపుకుంటోన్న తొలి పుట్టనరోజు కావడం మరో విశేషం. A sweet and joyful birthday wish from #RashmikaMandanna to #AnandDeverakonda!🥳🫶#TFNReels #TeluguFilmNagar pic.twitter.com/AOXFsiogYv— Telugu FilmNagar (@telugufilmnagar) March 15, 2026
నా కూతుర్ని సినిమాల్లో ఊహించలేదు.. నాగార్జున వల్లే..
మలయాళ టాప్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కల్యాణి తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. 2017లో తెలుగు సినిమా హలోతో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కొద్దికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాలు చేసింది. గతేడాది లోక చాప్టర్ 1 చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించింది.కలలో కూడా అనుకోలేఅయితే ఆమె హీరోయిన్ అవడానికి కింగ్ నాగార్జునే ప్రధాన కారణం అంటున్నాడు ప్రియదర్శన్. పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా కూతురు కెమెరా ముందుకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే సినిమా సెట్కు రావడానికి తనెప్పుడూ ఇష్టపడలేదు. తను ఆర్కిటెక్చర్ చదివింది. ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంది. నాగార్జున ఫోన్ చేయడంతో..కానీ, సడన్గా ఒకసారి నాగార్జున ఫోన్ చేసి కల్యాణిని సినిమాలో తీసుకోవాలనుకుంటున్నాం అన్నాడు. తనకు నటించడం రాదని చెప్పాను. కానీ నా కూతురు ఒకసారి ట్రై చేస్తే పోలా అంది. ఇక్కడ నేను కోల్పోయేదేం లేదు, నాకు సినిమాలు సెట్టవకపోతే మళ్లీ ఆర్కిటెక్చర్ వైపు వెళ్లిపోతానంది. అలా తను సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తండ్రిగా తన సినీజర్నీ చూస్తుంటే సంతోషంగా ఉంది. కాకపోతే నా సినిమాల గురించి తనతో మాట్లాడను. తను చేసే ప్రాజెక్టుల గురించి నాతో చర్చించదు. సినిమా తప్ప..ఎందుకంటే తను ఇప్పటి జెనరేషన్ అమ్మాయి. ఈతరం వాళ్లు సినిమాను ఒకలా చూస్తారు. నేనేమో పాత స్కూల్కు చెందినవాడిని. మేమిద్దరం సినిమా తప్ప అన్నింటిగురించి మాట్లాడుకుంటాం అని ప్రియదర్శన్ చెప్పుకొచ్చాడు. కాగా హలో మూవీతో కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా పరిచయమయ్యాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతోనే కల్యాణి ప్రియదర్శన్ కూడా కథానాయికగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.చదవండి: దేవుడు నాకిలా రాసిపెట్టాడు: డిమాన్ పవన్
అసలు ఈ సుయోధన ఎవడు?.. ఆసక్తిగా టీజర్
ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం సుయోధన. ఈ సినిమాకు వైఎస్ మాధవరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అసలు ఈ స్టోరీ నీకు ఎక్కడ దొరికింది? అనే డైలాగ్తో టీజర్ మొదలైంది. టీజర్ చూస్తుంటే దుర్యోధనుడిలా కనిపించే ఓ వ్యక్తి వల్ల హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
క్రీడలు
12 కోట్ల కారుతో తళుక్కుమన్న హార్దిక్
టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త కారుతో దర్శనమిచ్చాడు. 12 కోట్ల విలువ చేసే ఫెరారీ 12 సిలిండ్రీ కారును తన గ్యారేజీలోకి తీసుకొచ్చాడు. నలుపు రంగులో ఉన్న ఫెరారీ కారును తానే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాడు. కారులో అతడి పక్కనే తన గర్ల్ఫ్రెండ్ మిహికా శర్మ కూడా ఉండడం గమనార్హం. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ అభిమాని తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ వేదికగా షేర్ చేయడంతో వైరల్గా మారింది. కాగా హార్దిక్ పాండ్యా వద్ద ఇప్పటికే రోల్స్ రాయ్స్ ఫాంటమ్, లంబోర్గిని హురాకాన్ ఈవీవో, లంబోర్గిని యూరస్, మెర్సిడెస్ -ఏజీఎం జీ63, రేంజ్ రోవర్., ఆడీ ఏ6 కార్లు ఉన్నాయి.తాజాగా వీటి సరసన ఫెరారీ కారు వచ్చి చేరింది. ఇక హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొమ్మిది మ్యాచ్ల్లో 160 స్ట్రైక్రేట్ 217 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్లోనూ తన ప్రతిభ చూపిన హార్దిక్ 9 వికెట్లు పడగొట్టి తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో హార్దిక్ పాండ్యా జాతీయజెండాను శరీరానికి కప్పుకొని ఉన్న సమయంలోనే అతడి ప్రేయసి మిహికా శర్మ అతని చెంపపై ముద్దులు పెట్టడం వివాదాస్పదంగా మారింది. పాండ్యా జాతీయ జెండాను అవమానించాడని పుణేకు చెందిన వాజిద్ ఖాన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.చదవండి: తంజిద్ తొలి శతకం.. బంగ్లా భారీస్కోరు! Hardik Pandya’s new Ferrari 12Cilindri worth 12cr. pic.twitter.com/QovLNVB8kY— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2026
అభిషేక్ను చూసి అసూయపడేవారు!
టీమిండియా స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ ఆల్రౌండర్ అభిషేక్ శర్మతో ఉన్న స్నేహ బంధాన్ని బయటపెట్టాడు. ఇండియా టుడే కాన్క్లేవ్ వేదికగా శాంసన్ అభిషేక్తో ఉన్న కెమిస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తమది నిప్పు-నీరు కాంబినేషన్ కాదని, ఇద్దరం నిప్పుకణికలమేణని శాంసన్ పేర్కొన్నాడు.అభిషేక్ పట్ల భారత ఆటగాళ్లు అసూయ పడేవారని తెలిపాడు.‘మేమిద్దరం ఐస్ అండ్ ఫైర్ కాదు.. ఫైర్ అండ్ ఫైర్. ఒకసారి అభిషేక్ మెరిస్తే, మరోసారి నేను మెరుస్తాను. 2024 నుంచే మా కాంబినేషన్ అలా కొనసాగుతూ వస్తోంది. దీనికి తోడు కేరళ-పంజాబ్ ఫ్రెండ్షిప్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. మా మధ్య బంధం అంతా సహజంగా సాగిపోతుంది. దానిని కాంప్లికేట్ చేయదలచుకోలేదు. ఇక మైదానంలో మేమిద్దరం కలిసి బరిలోకి దిగినప్పుడు అభిషేక్ బంతి ఎలా వస్తుంది అని అడుగుతాడు. దానికి నేను సాధారణంగా వస్తుంది అని చెప్పడం, ఆ మరుసటి బంతిని అభిషేక్ సిక్స్ కొట్టడం జరిగిపోతాయి. పెళ్లి చేసుకో భాయ్..అభిషేక్ శర్మ చాలా ధైర్యవంతుడు, సమర్థుడు. మైదానం లోపల, వెలుపల అభిషేక్తో మంచి అనుబంధముంది. అయితే అభిషేక్ శర్మీ టీమిండియాకు ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో భారత ఆటగాళ్లే అతన్ని చూసి అసూయ పడేవారు. ఎందుకంటే అప్పట్లో ఎక్కడ చూసినా అభిషేక్.. అభిషేక్ అని వినిపిస్తుండేది. ఒకప్పుడు అభిషేక్ సాధారణ ఆటగాడు కావొచ్చు.. కానీ ఇప్పుడు అతనొక సూపర్స్టార్. అందుకే త్వరగా పెళ్లి చేసుకో బాయ్ అని సలహా ఇచ్చాను.’ అని పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వచ్చి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి వికెట్కు 98 పరుగులు జోడించడంతో భారత్ 255 పరుగుల భారీ స్కోరు చేయడం, ఆపై న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ను అందుకుంది.ఇద్దరి కథ ఒకటే..అయితే టీ20 ప్రపంచకప్ ఆరంభంలో ఇద్దరి కథ దాదాపు ఒకటే అని చెప్పొచ్చు. ఫామ్ కోల్పోయి అభిషేక్ శర్మ సతమతమవ్వగా, శాంసన్ కూడా అభిషేక్ స్థానంలో తొలుత వచ్చిన అవకాశాలను వృథా చేసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు విఫలమైతున్నా కూడా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారన్న విమర్శలు పెరిగిపోయాయి. అయితే సూపర్-8లో వెస్టిండీస్తో మ్యాచ్లో ఫామ్ను అందుకున్న శాంసన్ దానిని ఫైనల్ వరకు అలాగే కొనసాగించి విమర్శకుల నోళ్లు మూయించాడు. మరోవైపు అభిషేక్పై నమ్మకంతో జట్టు మేనేజ్మెంట్ వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. చివరకు ఫైనల్లో అభిషేక్ శర్మ తన మార్క్ ఆటతో అలరించడమే గాక టీమిండియా టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
అల్కరాజ్కు ఊహించని షాక్!
స్పెయిన్ టెన్నిస్ స్టార్ ఆటగాడు, ప్రపంచ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఇండియానా వెల్స్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి జరిగిన పురుషుల సెమీఫైనల్లో రష్యా స్టార్ డానిల్ మెద్వదెవ్ చేతిలో 6-3, 7-6(7/3)తో అల్కరాజ్ ఓటమి చవిచూశాడు. కేవలం రెండు సెట్ల పాటు జరిగిన మ్యాచ్లో మెద్వదెవ్ను అల్కరాజ్ ప్రతిఘటించలేకపోయాడు. తొలి సెట్ను మెద్వదెవ్ సులువుగా కైవసం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో అల్కరాజ్, మెద్వదెవ్ మధ్య రసవత్తరపోరు సాగింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టైబ్రేక్కు దారి తీసింది. అయితే టైబ్రేక్లో మెద్వదెవ్ మరోసారి తన స్ట్రోక్ పవర్ చూపించి అల్కరాజ్ దెబ్బకొట్టడంతో పాటు టోర్నీ ఫైనల్లో ప్రవేశించాడు. అయితే అల్కరాజ్ ఇండియన్ వెల్స్ టోర్నీ సెమీఫైనల్ వరకు వరుసగా 16 మ్యాచ్ల్లో విజయం సాధించి ఒక టైటిల్ ఫెవరెట్గా నిలిచాడు. ఈ ఏడాది వరుస విజయాలతో దుమ్మురేపిన అల్కరాజ్ కాలిఫోర్నియన్ డెసెర్ట్లో వరుసగా మూడో టైటిల్ సాధిస్తాడని అనుకన్నప్పటికీ అతని ఆశలకు మెద్వదెవ్ గండి కొట్టాడు. మరోవైపు మెద్వదెవ్కు ఇది వరుసగా తొమ్మిదో విజయం కావడం విశేషం. గత నెలలో దుబాయ్ వేదికగా జరిగిన టోర్నీలో మెద్వదెవ్ విజయం సాధించాడు. ఇక ఇండియన్ వెల్స్ టోర్నీలో మెద్వదెవ్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. గతంలో 2023, 2024లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్కే పరిమితమయ్యాడు. తాజాగా మూడో ప్రయత్నంలోనైనా టైటిల్ సాధించాలనే కసితో మెద్వదెవ్ ఉన్నాడు. మరో సెమీస్లో ప్రపంచ రెండో ర్యాంకర్ జానిక్ సిన్నర్ 6-2, 6-4తో అలెగ్జాండర్ జ్వెరెవ్ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. సోమవారం జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో సిన్నర్తో మెద్వదెవ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.చదవండి: ‘పాక్, బంగ్లా నాటకం ఫలించలేదు’
‘పాక్, బంగ్లా నాటకం ఫలించలేదు’
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్కు బంగ్లాదేశ్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. భారత్లో భద్రతా కారణాల రీత్యా తమ ఆటగాళ్లను పంపలేమంటూ సాకులు చెప్పి వరల్డ్కప్కు దూరంగా ఉండిపోయింది. వేదికలను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఐసీసీ ఆటగాళ్లు, సిబ్బంది భద్రతకు ముప్పు లేదని, తాము భరోసా కల్పిస్తామని పేర్కొంది. అయినా కూడా బంగ్లాదేశ్ జట్టు మాట వినకుండా టోర్నీ నుంచి వైదొలిగింది అయితే బంగ్లాదేశ్కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ జట్టు అప్పట్లో కొత్త డ్రామాకు తెరతీసింది. అయితే ఐసీసీ హెచ్చరికలు, మాజీ ఆటగాళ్ల విమర్శలతో వెనక్కి తగ్గిన పాకిస్థాన్ టీమిండియాతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. తాజాగా టీ20 ప్రపంచకప్ ముంగిట పాకిస్థాన్, బంగ్లాదేశ్లు ఆడిన డ్రామాల గురించి ఐసీసీ చైర్మన్ జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వరల్డ్కప్ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలనేది ఐసీసీ ఉద్దేశం. కొన్ని జట్లు పాల్గొనబోమని బెదిరింపులకు దిగాయి. వాటన్నింటినీ అధిగమించి విజయవంతంగా మెగాటోర్నీని నిర్వహించాం. పాక్, బంగ్లాదేశ్ నాటకాలు ఫలించలేదు.ఐసీసీ చైర్మన్గా నేను ఒకటే మాట చెప్పదలచుకున్నా.. ఐసీసీ కంటే కూడా ఏ జట్టూ గొప్పది కాదు. కేవలం ఒక్క జట్టుతో సంస్థ ఏర్పడదు. ఇక ఈసారి ప్రపంచకప్ వ్యూయర్షిప్ పరంగానూ కొత్త రికార్డులకు నాంది పలికింది. ఓవరాల్ వీక్షణలోనూ పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. భారత్కు అమెరికా, పాకిస్థాన్కు నెదర్లాండ్స్ గట్టిపోటీనిస్తే, పటిష్ఠమైన ఆస్ట్రేలియాను జింబాబ్వే మట్టికరిపించింది. మరోవైపు ఇంగ్లండ్కు నేపాల్ ఓటమి భయం చూపించింది. కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గౌతమ్ గంభీర్కు ప్రత్యేక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఉన్నతస్థాయి నుంచి అథమ స్థాయికి పడిపోవడానికి నెలల సమయం చాలు. కానీ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి మాత్రం సంవత్సరాలు పడతాయి. శ్రమిస్తూనే ఉండాలి. విజయాలు సాధిస్తూనే ఉండాలి.’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: న్యూజిలాండ్పై సౌతాఫ్రికా ఘన విజయం
న్యూస్ పాడ్కాస్ట్
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రం... ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా భీకర దాడులు
రైతులతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొండాట.. పేరుకే అన్నదాత సుఖీభవ, ఆచరణలో అంతా మోసం
విలువలు, విశ్వసనీయతకు వైఎస్సార్సీపీ మారుపేరు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఆదాయం... కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఇక్కడ బాబు, అక్కడ BR నాయుడు కోట్లల్లో భారీ స్కాం
పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు..ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
భవిష్యత్ అభివృద్ధి శూన్యం... ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
బిజినెస్
యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న వేళ, శాంతి మంత్రం కన్నా శతఘ్నుల మోతకే ప్రాధాన్యత పెరుగుతోంది. దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, అంతర్యుద్ధ భయాలు సామాన్యుడిని భయపెడుతుంటే.. ఆయుధాలు ఎగుమతి చేసే దేశాలకు మాత్రం ఇది కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా 2021-2025 మధ్య కాలానికి సంబంధించి ఎస్ఐపీఆర్ఐ(స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్) తాజాగా వెలువరించిన గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచ ఆయుధ మార్కెట్ ఏ విధంగా అగ్రరాజ్యాల గుప్పిట్లోకి వెళ్తోందో స్పష్టమవుతోంది.అమెరికా ఏకఛత్రాధిపత్యంప్రపంచ ఆయుధ విక్రయాల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. మొత్తం ఎగుమతుల్లో 42% వాటాను సొంతం చేసుకోవడం ద్వారా తన సమీప ప్రత్యర్థి కంటే నాలుగు రెట్లు అధికంగా ఆయుధాల వ్యాపారం చేస్తోంది. అమెరికా ఇంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి కొన్ని కారణాలున్నాయి.అత్యాధునిక యుద్ధ విమానాలు (ఎఫ్-35 వంటివి), క్షిపణి రక్షణ వ్యవస్థలు, నిఘా సాంకేతికతలో అమెరికాకు సాటిలేదు.నాటో దేశాలతో పాటు ఆసియా, మిడిల్ఈస్ట్ దేశాలతో ఉన్న రక్షణ ఒప్పందాలు అమెరికా ఆయుధాలకు నిరంతర డిమాండ్ను కల్పిస్తున్నాయి.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరోపియన్ దేశాలు తమ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవడానికి అమెరికా వైపు మొగ్గు చూపడం వల్ల ఈ వ్యాపారంలో మరింత వృద్ధి నమోదైంది.ఎస్ఐపీఆర్ఐ నివేదిక ప్రకారం.. ప్రపంచ దేశాల ఆయుధ ఎగుమతుల వాటా (2021–25)దేశంఎగుమతుల వాటా (%)యూఎస్42ఫ్రాన్స్10రష్యా7జర్మనీ6చైనా6ఇటలీ5ఇజ్రాయెల్4యూకే3దక్షిణ కొరియా3స్పెయిన్2ఇతర దేశాలు12 చైనాను వెనక్కి నెట్టిన జర్మనీ.. యూరప్ జోరుఆయుధ ఎగుమతుల్లో జర్మనీ చాలా పురోగతి సాధిస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది. మొత్తంగా 6% వాటాతో జర్మనీ ఇప్పుడు చైనాను అధిగమించి నాలుగో అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్లో భద్రతా ఆందోళనలు పెరగడం, నాటో దేశాలు స్వదేశీ (యూరోపియన్) పరికరాల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడం జర్మనీకి కలిసొచ్చింది. మరోవైపు, చైనా తన ఎగుమతులను ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా, మిడిల్ఈస్ట్ దేశాలకే పరిమితం చేస్తోంది. భౌగోళిక రాజకీయ కారణాల వల్ల పాశ్చాత్య దేశాలు చైనా ఆయుధాల పట్ల విముఖత చూపడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.దక్షిణ కొరియాప్రస్తుతం ఆయుధ మార్కెట్లో దక్షిణ కొరియా చాలా దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తంగా కేవలం 3% వాటా ఉన్నప్పటికీ అది వేగంగా వృద్ధి చెందుతోంది. ఇతర దేశాల కంటే తక్కువ సమయంలో ఆయుధాలను డెలివరీ చేయగల సామర్థ్యాన్ని ఇది సొంతం చేసుకుంటోంది. అత్యాధునిక ట్యాంకులు, ఫిరంగి వ్యవస్థలను తక్కువ ధరకు అందిస్తోంది. తూర్పు యూరప్, ఆగ్నేయాసియా దేశాలు దక్షిణ కొరియా ఆయుధాల కోసం ఆర్టర్లు పెడుతున్నాయి.ఆయుధాల ఎగుమతి కేవలం వ్యాపారం మాత్రమే కాదు, అది ఒక దేశం భౌగోళిక రాజకీయ ప్రాబల్యానికి నిదర్శనం. అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటుండగా, దక్షిణ కొరియా వంటి కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి. శాంతి చర్చల కంటే ఆయుధ ఒప్పందాలే వేగంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ ‘మారణాయుధాల వ్యాపారం’ ప్రపంచాన్ని ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి.ఇదీ చదవండి: ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ!
బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..
బంగారం ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. గడచిన వారం రోజుల్లో గోల్డ్, సిల్వర్ రేటు గణనీయంగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో, పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేట్లలో జరిగిన మార్పు గురించి, నేటి ధరల గురించి తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 9(సోమవారం)న 1,61,680 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, ఈ రోజుకి (మార్చి 15) 1,59,660 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు రూ. 2020 తగ్గిందన్న మాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. వారం రోజుల్లో 1,48,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,46,350 వద్దకు (రూ.1850 తగ్గింది) చేరింది.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వారం రోజుల్లో గణనీయంగా తగ్గింది. మార్చి 9న.. అంటే సోమవారం రోజు 1,61,830 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. నేటికి (మార్చి 15) రూ.1,59,810 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఏడు రోజుల్లో రూ.2020 తగ్గింది. 22 క్యారెట్ల పసిడి రేటు 1,48,350 రూపాయల నుంచి రూ.1850 తగ్గి 1,46,500 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర వారం రోజుల్లో 1,63,090 రూపాయల దగ్గర నుంచి 1,61,020 రూపాయల దగ్గరకు చేరింది. వారం రోజుల్లో రూ. 2070 తగ్గిందన్నమాట. తులం 22 క్యారెట్ల బంగారం రేటు 1,49,500 రూపాయల నుంచి రూ. 1,47,600 వద్దకు (రూ.1900 తగ్గింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. మార్చి 9న రూ.2.90 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు నేటికి (మార్చి 15) రూ.2.80 లక్షలకు చేరింది. వారం మధ్యలో రేట్ల పెరుగుదల, తగ్గుదల ఉన్నప్పటికీ.. మొత్తం మీద కేజీ రేటు 10,000 రూపాయలు తగ్గిందని తెలుస్తోంది.
రూ.10 కోట్ల ఫెరారీ కారు: దీని గురించి తెలుసా?
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ.. భారతదేశంలో కొత్త ఫెరారీ 849 టెస్టరోస్సాను ఆవిష్కరించింది. దీని ధర రూ. 10.37 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది గ్లోబల్ లైనప్లో ఫెరారీ SF90 స్ట్రాడేల్ స్థానంలో ఉంటుంది.ఫెరారీ 849 టెస్టరోస్సా కారు మూడు ఎలక్ట్రిక్ మోటార్లు & లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్తో జత చేయబడిన 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్ పొందుతుంది. ఇది దాదాపు 1,050 Bhp పవర్ అందిస్తుంది. కాబట్టి ఈ కారు ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన ఫెరారీగా నిలిచింది. 849 టెస్టరోస్సా 2.3 సెకన్ల కాలంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 330 కిలోమీటర్లు. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టం ద్వారా 25 కిమీ పరిధి లభిస్తుంది.కొత్త మోడల్ క్లాసిక్ టెస్టరోస్సా నుంచి ప్రేరణ పొందటం వల్ల కొత్త ఫెరారీ కారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. లేటెస్ట్ ఏరోడైనమిక్ ఎలిమెంట్స్, షార్ప్ బాడీవర్క్తో వస్తుంది. ఛాసిస్ కూడా అప్గ్రేడ్లను పొందింది. ఈ కొత్త మోడల్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.
ఆహ్లాదకర వాతావరణం.. ల్యాండ్ స్కేపింగ్ అనివార్యం!
వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణ సముదాయాలతో హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్గా మారిపోతోంది. దీంతో నివాసితులకు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం అనుభూతి కలిగించాలంటే ల్యాండ్ స్కేపింగ్ అనివార్యమైపోయింది. కనుచూపు మేర పచ్చదనం, సేఫ్టీ, సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటున్నారు.పురుగు మందులు, రసాయనాలతో గాలి, నేల కలుషితమవుతుంది. దీంతో సేంద్రీయ, సస్టయినబుల్ గార్డెనింగ్కు ఆదరణ పెరుగుతోంది. సువాసన, ఆకర్షణీయమైన పూలమొక్కలు, చెట్లు, గడ్డితో నివాస సముదాయంలో వాక్, రన్వేలు, డెక్లు, టెర్రస్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ స్కేపింగ్లను చేపడుతున్నారు. విశ్రాంతి, సమావేశాల కోసం వినూత్న లైట్లతో ప్రత్యేకమైన థీమ్లతో అందంగా అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ల్యాండ్ స్కేపింగ్తో బార్బిక్యూ వంటి ఔట్డోర్ ఈవెంట్లు, పార్టీలు చేసుకునేందుకు అనువైన వేదికగా ఉంటుంది.క్లబ్హౌస్లో కో-వర్కింగ్ ప్లేస్కరోనాతో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ అక్కడక్కడా ఇప్పటికీ కొనసాగుతోంది. ఉద్యోగుల ఆసక్తి, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, మెరుగైన ఉత్పాదకత కారణంగా కొన్ని బహుళ జాతి కంపెనీలు ఇప్పటికీ ఇంటి నుంచి పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఇంట్లో ప్రత్యేకంగా కొంత స్పేస్ ఆఫీస్ కోసం వినియోగిస్తే గృహ కొనుగోలుదారులు ఒప్పుకోవడం లేదు.ఇంట్లో పిల్లల అల్లరి, పెద్దల అవసరాలు, బంధువులు వస్తే హడావుడి తదితర కారణాలతో ఇంట్లోనే ఆఫీస్ స్పేస్ ఇస్తే ఇష్టపడటం లేదు. దీంతో నిర్మాణ సంస్థలు క్లబ్హౌస్లో ప్రత్యేకంగా కో–వర్కింగ్ స్పేస్, హై నెట్వర్క్ స్పీడ్తో వైఫై సేవలను అందిస్తున్నాయి. కూర్చునేందుకు వీలుగా మంచి కుర్చీలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో అంతా కలిసి ఒకే చోట ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేసుకుంటున్నారు. పైగా అవసరమైనప్పుడు వెంటనే ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది.
ఫ్యామిలీ
భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం మీనమాస పూజలు
ఆ మణికంఠుని అపార కృపాకటాక్షాలతో, అత్యంత పవిత్రమైన మీనమాస పూజలు, శబరిమల ఉత్సవం 2026 కొరకు అయ్యప్ప సన్నిధాన ద్వారాలు తెరుచుకున్నాయి. "స్వామియే శరణం అయ్యప్ప" అనే నామస్మరణతో ఆ దివ్య దర్శనానికి తరలి వెళ్దాం.మీనమాస పూజల షెడ్యూల్నడ తెరిచే సమయం: మార్చి 14, 2026 (శనివారం) సాయంత్రం 5:00 గంటలకు.నడ మూసివేత: మార్చి 19, 2026 (గురువారం) రాత్రి 10:00 గంటలకు (అత్తాజ పూజ, హరివరాసనం అనంతరం).శబరిమల ఉత్సవం, పంగుని ఉత్తరం 2026వార్షిక ఉత్సవాల నిమిత్తం మార్చి 22 సాయంత్రం 5:00 గంటలకు ఆలయ ద్వారాలు తిరిగి తెరవబడతాయి.మార్చి 23: కొడియేట్టు (ధ్వజారోహణం)మార్చి 24: ఉత్సవ బలిమార్చి 31: పళ్ళివేట (రాజవేట)ఏప్రిల్ 01: పంపా ఆరాట్టు & పంగుని ఉత్తరం – భగవాన్ అయ్యప్ప స్వామి వారి దివ్య జన్మదినోత్సవం.ముగింపు: ఏప్రిల్ 1, 2026.ఏప్రిల్ 1వ తేదీన సన్నిధానం ఉదయం 5:00 నుండి 8:00 వరకు మాత్రమే తెరవబడుతుంది. తిరిగి పంపా ఆరాట్టు ముగిసిన తర్వాత సాయంత్రం 6:00 గంటలకు తెరిచి, రాత్రి 10:00 గంటలకు మూసివేస్తారు.(చదవండి: మహిళల శబరిమల..! ఆటుకాల్ భగవతి)
వడగండ్లా... బండరాళ్లా...
పిల్లలూ...వడగండ్ల వాన అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. మన దేశంలో వేసవిలో ఎక్కువ పడుతుంటుంది. చిన్న చిన్న గోలీల వంటి వడగళ్లు (Hailstones) పడుతుంటాయి. కొన్ని చోట్ల ఇంకాస్త పెద్ద వడగండ్లు పడుతుంటాయి. వడగండ్లు ఎందుకు పడతాయి? వడగళ్ల వర్షానికి ప్రధాన కారణం వాతావరణంలో ఎత్తులో ఉండే మేఘాలు. భూమి ఎక్కువగా వేడెక్కి, ఆ వేడిగాలి తేమతో సహా బాగా ఎత్తుకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఏర్పడే మేఘాలను క్యుములోనింబస్ మేఘాలు అంటారు.అంతటి ఎత్తులో ఆ మేఘాల్లోని తేమ వల్ల చిన్న చిన్న మంచు ముక్కలతో కూడిన ఫలకాలు ఏర్పడతాయి. అక్కడ గాలులు కిందకూ, పైకి కదులుతూ ఉండటం వల్ల ఫలకాలుగా ఉన్న మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటాయి. అప్పుడు ఆ ఫలకాలు మంచు ముక్కలుగా విడిపోయి నేలపై పడతాయి. ఇలా కురిసే వాననే మనం వడగళ్ల వాన అంటాం.ఇదీ చదవండి: షాకింగ్ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్షఅయితే అమెరికాలోని ఇలినాయిస్లో ఎంత పెద్ద వడగండ్లు పడ్డాయో. ఒక్కోటి పెద్ద రాయంత ఉంది. నాలుగు అంగుళాల వెడల్పుతో ఉంది. కంకాకీలో 6 అంగుళాల వడగళ్లను గుర్తించారు. రాష్ట్రంలోనే ఒక కొత్త రికార్డు వడగండ్లుగా NWS బుధవారం తెలిపింది. అందుకే వడగండ్ల వానలో చిక్కుకుని చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఇదీ చదవండి: ఆరు వేళ్లు.. నెతన్యాహూ సేఫేనా? రూమర్లు హల్చల్(మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్)
రసభరితం : 40 రసాల మాధుర్యం
సాధారణంగా పెద్దలు మనకు నవరసాల చాతుర్యం గురించి చెబుతుంటారు. సంధ్య రాణి లింగ చెప్పే 40 రసాల మాధుర్యం గురించీ తప్పక తెలుసు కోవాల్సిందే! తెలుగు రాష్ట్రాలలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయ రసాల తయారీ గురించి ‘ఫ్రమ్ మై కిచెన్ టు యువర్స్’ బుక్ ద్వారా వివరించారు సంధ్య రాణి లింగ. ఐదు తరాల నుంచి వచ్చిన వారసత్వ వంటలు, వాటి వెనక వెనక దాగి ఉన్న సాంస్కృతిక కథనాలనూ పరిచయం చేస్తున్నారు. హైదరాబాద్ వాసి సంధ్య లింగ చెబుతున్న తెలుగింటి వారసత్వ వంటకాల పరిచయం గురించి ఆమె మాటల్లోనే... ‘‘వంట చేయడం, వడ్డించడమే కాదు కొత్త రుచులను సృష్టించడమూ చాలా ఇష్టం. పుట్టింటి–అత్తింటివారసత్వ వంటకాలను, మూలాలను మర్చిపోకుండా ముందు తరాలకు అందించాలన్నది నా ఆలోచన. ఆ ప్రయత్నమే ఇలా మీ అందరి ముందుకు వచ్చేలా చేసింది. రోజూ పండగే! రసం అనేది భోజనంలోకి ఉపయోగించే వంటకం మాత్రమే కాదు. అనారోగ్యంలో ఉపశమనం ఇచ్చే ఔషధం కూడా. రసాలు, వాటిలో ఉపయోగించే మసాలాలు కూడా విభిన్నమే. సికింద్రాబాద్లోని లింగ పేరుతో ఉండే ఉమ్మడి కుటుంబం మాది. మా మామయ్య వాళ్లు ఎనిమిది మంది అన్నదమ్ములు. అందరూ కుటుంబాలతో కలిసే ఉండేవారు. నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టేనాటికి యాభైమందికి పైగా ఉండేవాళ్లు. అందరికీ కలిపి ఒకే వంటగది. అక్కడ ఉదయం లేచింది మొదలు రోజూ పదిహేను మంది వంటల తయారీలోనే ఉండేవారు. మా అత్తగారు వారి పుట్టింటి నుంచి నేర్చుకున్న వంటకాలతోపాటు, మిగతా కోడళ్లందరమూ కలిసి వంటలలో ఎన్నో వెరైటీలు చేసేవాళ్లం. ప్రతిరోజూ పండగ వాతావరణం లాగే ఉండేది. కొబ్బరి చారు, కట్టుచారు, చుక్కకూర, బలుసాకు, పాలక్, క్యాలీఫ్లవర్, పప్పులతో రసాలు, నిమ్మ, ఉసిరి, ఉల్లి, టొమాటో ... ఇలాంటి ఒక్కోప్రత్యేక కూరగాయలు, ఆకుకూరలతో 40 రకాల రసాలు ఉంటాయి. వీటిని నేరుగా సూప్గా సేవించవచ్చు. ప్రయోగాల వంటిల్లు... పిల్లల చిన్నతనంలో ఉమ్మడి కుటుంబం నుంచి మేం విడిగా జూబ్లీహిల్స్కు వచ్చేశాం. అప్పటివరకు నేర్చుకున్నవే చేసేదాన్ని. అయితే, పిల్లలు కూరగాయలతో చేసిన వంటకాలను తినడానికి ఇష్టపడేవారు కాదు. దీంతో ప్రతి కూరగాయ, ఆకుకూరతో రసాలు చేయడం మొదలుపెట్టాను. వాటిలో మా అత్తగారు, అమ్మ చెప్పిన దినుసులను నోట్ చేసుకున్నాను. నెలలో నేను 40 రసాలు చేసేదాన్ని. పిల్లలు బాగా ఇష్టపడేవారు. దూరంగా ఉండే బంధువులు కూడా ఈ రసాల తయారీ గురించి అడిగేవారు. మా కూతురు నిఖిత ‘చాలా హెల్తీగా, కొత్తగా వంటలు చేస్తావు కదా, బుక్ తీసుకురావచ్చు కదమ్మా’ అనేది. బంధువులు కూడా చెప్పేవారు. కానీ, పిల్లలకు పెళ్లిళ్లు అయ్యి, వారి జీవితాల్లో స్థిరపడటంలో ఆ ఆలోచన పక్కకు వెళ్లిపోయింది. ఇదీ చదవండి: కోడలు వచ్చాక, తను నా వంటకాల రుచిని ఆస్వాదించడంతో పాటు వంటల బుక్ ఆలోచనను తీసుకువచ్చింది. మొత్తం రాసుకున్నాక, రెండు రోజులు ఫోటోషూట్ చేశాం. దీని నిర్వహణ అంతా ప్రియే చూసుకుంది. ఈ తరం వాళ్లకు ఇన్ని రసాలు ఉంటాయని తెలియదు. వారు స్వయంగా తెలుసుకొని, చేసుకునే విధంగా సిద్ధం చేశాం. దీనిని కిందేటేడాది తీసుకువచ్చాం.పండగకు ప్రత్యేకం... తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ఒక్కో పండగకు ఒక్కో ప్రత్యేకరసాలు, వంటకాల తయారీలు ఉంటాయి. ఇక ఊరగాయలు, రోటి పచ్చళ్లు, పులావ్, బిర్యానీలలో విభిన్న రుచులు ఉన్నాయి. అలాగే, తెలుగు ప్రాతాల్లోని మూలాల్లోకి వెళితే చాలా వైవిధ్యమైన వంటకాలు పరిచయం అవుతాయి. వాటిని అందించడానికి ప్రిపరేషన్ మొదలుపెట్టాను’’ అని వివరించారు ఈ పాకశాస్త్ర నిపుణురాలు.వంటే ఔషధంగా...‘మా అత్తమ్మ ఆలోచనలు చాలా మోడర్న్గా ఉంటాయి. తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని, వారసత్వ వంటకాలు ముందు తరాలకు పరిచయం చేస్తే బాగుంటుందనుకున్నాం. సోషల్ మీడియాలో చూస్తే చాలా వంటకాలు కనిపిస్తాయి. కానీ, వాటిలో వారసత్వ వంటకాల గురించి, వంట మెడిసిన్లా ఎలా ఉపయోగపడుతుందో అంత వివరంగా చెప్పలేక΄ోతున్నారు. అందుకే, మేం కలిసి ఈ ప్రయత్నం చేశాం. – ప్రియ, కోడలు – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
సినిమా ఇన్సెక్ట్స్ అసోసియేషన్ అంటే సీఐఏ గురించి తెలుసా?
సినిమా అసోసియేషన్ ఫర్ చిన్న చిన్న పురుగులూ...జిందాబాద్! : సంగతేమిటంటే... చీమలూ, బొద్దింకలూ, బల్లులూ... ఆఖరికి దోమల వంటి చిన్న చిన్న కీటకాలన్నీ కలిసి ‘‘సినిమా అసోసియేషన్ ఫర్ చిన్నచిన్న పురుగులు’’ సంఘం (సినిమా ఇన్సెక్ట్స్ అసోసియేషన్ అంటే సీఐఏ) పెట్టుకున్నాయి. ఆ సంఘ ప్రారంభ సమావేశం సందర్భంగా... ప్రెస్ మీట్లో పత్రికల, టీవీ ఛానెళ్ల రిపోర్టర్లు అడుగుతున్న పలు ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాయి. అవి ఇవి... రిపోర్టర్ : ఈ సంఘం ప్రెసిడెంటుగా ఎన్నికైనందుకు కంగ్రాచ్యులేషన్స్ దోమగారూ... అయినా మీ కీటకాలన్నీ ఎందుకండీ ఈ ‘చిన్న పురుగుల’ అసోసియేషన్ పెట్టాయి? అసోషియేషన్ ప్రసిడెంట్ దోమ (స్పీచ్ ఇస్తున్న ధోరణిలో) : ఇప్పుడూ... పున్నమినాగు ఫార్మూలాతో బోల్డన్ని సూపర్హిట్టుపాముల మూవీస్ వచ్చేశాయి. కొండవీటి ‘సింహాలూ’, ‘చిరుత’ల్లాంటి పేర్ల మీద బంపర్హిట్లూ ఉన్నాయి. ఇక అడవిరాముడూ, వేటగాడులాంటి బ్లాక్బస్టర్లలో ఏనుగులూ, సింహాలూ, పులులూ, ఎలుగుబంట్లూ ఎట్సెట్రాలు తెగ యాక్టింగు చేసేశాయి. ముత్యాలముగ్గు సినిమాలో కోతి, ఆఖరికి పొట్టేలు పున్నమ్మల్లో పొట్టేలు సైతం తెగ పెర్ఫార్మెన్సు చూపించేశాయి. మరి ఇంకా చెప్పాలంటే... ‘అద్దమంటి మనసు ఉందీ... అందమైనా వయసు ఉందీ’ పాటలో మా ప్రియతమ సోదరీమణి అయిన బర్రెగారు సాక్షాత్తూ పెద్ద ఎన్టీఆర్ను తన వీపు మీద కూర్చోబెట్టుకుని యాక్షనింగు కుమ్మేసింది. వాళ్లంటే పెద్ద పెద్ద జీవులు. అవన్నీ పెద్ద జీవుల అసోసియేషన్ పెట్టుకున్నాయి. మరి... ఈ నేపథ్యంలో మాకూ ఓ సంఘం ఉండొద్దా మరి? రిపోర్టర్ : అవంటే పెద్ద జీవులూ... పెద్ద హీరోలకు దీటుగా వాటి పేర్ల మీదే డైరెక్టుగా మూవీలొచ్చేశాయి. సినిమాల విజయంలో మరి మీ చిన్న పురుగుల పాత్ర ఏమిటి? చీమ (గొంతు సవరించుకుంటూ గొట్టం ముందుకు వస్తూ) : ‘సింహాద్రి’ సినిమా చూశారా సార్? హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి మా చీమనే యూజ్ చేసుకున్నారు. మాకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఏకంగా ఓ లవ్సాంగ్ రాయాల్సి వచ్చిందీ... తీయాల్సి వచ్చింది...చీమ చీమ చిమ చీమా చీమా చీమ చీమ చిమ చీమ చీ...ఈ...ఈ...మా... చీమ తీపి చిరునామా ప్రేమా... తెలుసుకోవె భామా... అంటూ సదరు డ్యూయెట్టులో హీరోహీరోయిన్లు చీమ చుట్టూ చిందులు తొక్కితేగానీ మూవీ హిట్టవ్వలేదు మరి! రిపోర్టర్ : సినిమాలకు మీరెలా కంట్రిబ్యూట్ చేస్తున్నారు బొద్దింకగారూ, బల్లిగారూ?బొద్దింక : హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి ఈ సినిమా రంగానికి ఇతోధికంగా మేము చేసుకుంటున్న పవిత్రమైన సేవలు ఇన్నని చెప్పడానికి లేదండీ. చాలా మూవీస్లో మమ్మల్ని చూసి... ‘‘అమ్మో బొద్దింక...’’ అంటూ అరుస్తూ హీరోయిన్... హీరో ఒళ్లోకి దూకుతుంది. అంతే... లవ్వూ... డ్యూయెట్టూ!! (అంటూ గర్వంగా తన పొడవాటి కాక్రోచు మీసాల్ని దువ్వుకుంది). అంతేకాదండి... మేమిలా నటించినా హిట్టే... మమ్మల్ని చంపాలన్నా ‘హిట్టే’! (కప్బోర్డులోని హిట్ మందును సీసా కేసి చూపిస్తూ అన్నది).బల్లి : మేము కూడా ఏమీ తక్కువ కాదండి. బొద్దింకల్లాగే మమ్మల్ని చూసి హీరో మీదకు గెంతే హీరోయిన్లకు కొదవలేదండీ. ఇప్పుడంటే పెద్దగా లేదుగానీ... పాత సినిమాటాకీసుల్లో వెండితెర మీద మా బంగారు పాదాలు మోపుతూ... హీరో హీరోయిన్ల ముఖాలమీదా, ఒంటిమీదా పాకుతూ తెగ తిరిగేవాళ్లం. తెరమీద ఒక్కోసారి స్ప్రింటూ, మరోసారి మారథానూ ఇంకోసారి ఫోర్,ఫోర్ మీటర్సు రిలేలాంటి రన్నింగు రేసులూ చేసేవాళ్లం. ఇక ‘ఒక రాధా ఇద్దరు కృష్ణులు’ లాంటి సినిమాలో పరకాయ ప్రవేశం చేసే హీరోయిన్ గారు తన బాత్రూమ్లో పాకుతున్న బల్లిని చూసి... పరకాయ ప్రవేశం చేసిన హీరోయేమో అనుకుంటుంది. బల్లిని చూసి హీరో అనుకుందంటే... దీన్ని బట్టి తెలియడం లేదూ మేం ‘హీరో మెటీరియల్’ అనీ! చదవండి: కూరగాయ హీరోల 'పోకిరి' కిరిరిపోర్టర్ : (కొద్దిగా వ్యంగ్యం ధ్వనిస్తూ...) అన్నట్టూ దోమగారూ!! మలేరియాలూ, డెంగీలు తీసుకొచ్చే మీరు ఈ అసోసియేషన్కు ప్రెసిడెంట్ ఎలా అయ్యారు సార్? దోమ : (కోపంగా...) హేం మాహాడుతున్నారు మీరు? రోబో సినిమాలో హీరోయిన్ ఐశ్వర్యారాయ్ అండ్ రోబో చిట్టీల మధ్య ప్రేమకు కారణం మేమే. ‘రోబోకు ఐశ్వర్యారాయ్ పెట్టే ‘ప్రేమ పరీక్ష’ ఏమిటో తెల్సా మీకు? తనను కుట్టిన దోమను పట్టుకొచ్చి దాంతో సారీ చెప్పించమనే కదా! మొత్తం ప్రపంచ సినిమా చరిత్రలో ఇంతవరకూ మిస్ వరల్డు ఐశ్వర్యారాయ్ను కుట్టిన జీవేదైనా ఉందా... ఒక్క దోమ తప్ప? మరి ఈ నేపథ్యంలో చూస్తే... ఈ చిన్న పురుగుల సంఘానికి నేను తప్ప ప్రెసిడెంట్గా ఉండటానికి అర్హులెవరైనా ఉన్నాయా సార్? ...అంటూ అరుస్తూ ‘‘చిన్న పురుగుల సంఘం పట్ల మీ కానొర్టర్ల వివక్ష నశించాలీ... మా సీఐఏ అదే... సినిమా ఇన్సెక్ట్స్ అసోసియేషన్ వర్థిల్లాలి... చిన్న చిన్న సినీ పురుగులూ జిందాబాద్’’ అని నినాదాలిస్తూ కోపంగా ప్రెస్మీట్ నుంచి వాకౌట్ చేసింది దోమ. దాంతోపా టే మిగతా ఇన్సెక్ట్స్ కూడా!– యాసీన్
అంతర్జాతీయం
నెతన్యాహు ఎక్కడ?
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు క్షేమమేనా? ఆయన ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అసలు బతికే ఉన్నారా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు, పుకార్లతో శనివారం సోషల్ మీడియా హోరెత్తిపోయింది. నెతన్యాహు ఎక్స్ ఖాతా నుంచి శుక్రవారం విడుదల చేసిన అధికారిక వీడియోనే వీటన్నింటికీ కారణంగా మారడం విశేషం. ఇరాన్పై తలపెట్టిన యుద్ధం గురించి ఇజ్రాయెలీలను ఉద్దేశించి అందులో ఆయన ప్రసంగించారు. అయితే వీడియోలో ఒకచోట నెతన్యాహు కుడి చేతికి ఆరు వేళ్లున్నట్టుగా కన్పించింది. అది నెటిజన్లను వెంటనే ఆకర్షించింది. చూస్తుండగానే ఆ వీడియోకు 10 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. వాస్తవానికి నెతన్యాహు రెండు చేతులకూ ఐదు వేళ్లే ఉంటాయి.దాంతో ఆ అధికారిక వీడియో పలు అనుమానాలకు తావిచి్చంది. దానిపై రకరకాల విశ్లేషణలూ తెరపైకొచ్చాయి. అందులో ఉన్నది నెతన్యాహు కాదని, అది ఏఐ జెనరేటెడ్ వీడియో అని నెటిజన్లు అనుమానం వెలిబుచ్చారు. మార్చి 2వ తేదీన నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడిని పలువురు గుర్తు చేశారు. ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, బహుశా మరణించి ఉంటారని ఇరాన్ అప్పుడే ప్రకటించింది. కానీ కాసేపటికే నెతన్యాహు బాహాటంగా కన్పించారు. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న వీడియోలను ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. దాంతో ఆయన మరణించారన్న వార్తలకు తెరపడింది. కానీ మార్చి 2 నాటి దాడిలో నెతన్యాహు నిజంగానే మరణించడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని తాజాగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.యుద్ధం మధ్యలో ఆ విషయం బయటికొస్తే ఇరాన్కు నైతిక బలంగా మారుతుందనే భయంతో ఇజ్రాయెల్ గోప్యంగా ఉంచి ఉంటుందన్నది వారి విశ్లేషణ. అందుకే నాటినుంచీ ఏఐ సాయంతో నెతన్యాహు వీడియోలను రూపొందిస్తూ ప్రపంచాన్ని మభ్యపెడుతోందన్నది వాటి సారాంశం. కానీ నెతన్యాహు తాజా వీడియో నిజమైనదేనని పలు ఫ్యాక్ట్ చెకింగ్ సైట్లు అంటున్నాయి. వీడియో నిజమే గానీ కుడి చేతికి ఆరు వేళ్లు వాస్తవం కాదని గ్రోక్ తేల్చింది. ఒకానొక ఫ్రేమ్లో నిర్దిష్ట కోణంలో అరచేతికి ఆరో వేలున్నట్టు కేవలం దృశ్యభ్రాంతి కలుగుతోందని పేర్కొంది.అయినా ఆన్లైన్ రగడకు తెర పడకపోవడం విశేషం! ‘నెతన్యాహు ఎక్కడ?’, ‘బిబి (నెతన్యాహు ముద్దుపేరు) క్షేమమేనా?’అంటూ సోషల్ మీడియాలో పోస్టుల వరద కొనసాగుతూనే ఉంది. నెటిజన్లు తమ వాదనకు మద్దతుగా శుక్రవారం నాటి అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ ఇంటర్వ్యూను కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. వైట్హౌస్లో ఓ మీడియా ప్రతినిధికి బెసెంట్ ఇంటర్వ్యూ ఇస్తుండగా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ‘అత్యవసర’పిలుపు రావడంతో ఉన్నపళంగా ‘సిచ్యుయేషన్ రూమ్’కేసి పరుగెత్తారు. ఏకంగా రెండు గంటల అనంతరం తిరిగొచ్చారు.తర్వాత ఇంటర్వ్యూ కొనసాగించినా బెసెంట్లో తడబాటు, గొంతులో వణుకు కనిపించాయి. ‘‘నెతన్యాహు ఇక లేరని బహుశా ట్రంప్కు ఉప్పంది ఉంటుంది. అదే విషయాన్ని బెసెంట్తో పంచుకున్నారు. తడబాటుకు అదే కారణం కావచ్చు’’అని సోషల్ మీడియా యూజర్లు విశ్లేíÙస్తున్నారు. ప్రఖ్యాత రాజకీయ వ్యాఖ్యాత జోహనస్ ఎం.కొన్రాడ్త్ కూడా నెతన్యాహు మరణించారని సదరు వీడియోను ఉటంకిస్తూ పేర్కొనడం విశేషం. ఆ విషయం తెలియడం వల్లే బెసెంట్ అంతగా దిగ్భ్రాంతికి లోనైనట్టు కన్పించారని ఆయన కూడా చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్
చమురు సింహద్వారం
ఖర్గ్ ఐలాండ్. ఇరాన్ ప్రధాన భూభాగానికి దక్షిణంగా 25 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ సముద్రజలాల్లో ఉన్న అతిచిన్న దీవి ఇది. ఇరాన్ ముడిచమురుకు సంబంధించి ఈ దీవి దశాబ్దాలుగా అంతర్జాతీయ ఎగుమతుల రాజధానిగా భాసిల్లుతోంది. దేశ ఎగుమతుల్లో ఇక్కడి నుంచే 90 శాతం జరుగుతున్నాయి. ఇరాన్ ఆర్థికజీవనాడిగా వినతికెక్కిన ఖర్గ్ ద్వీపంపై అమెరికా శనివారం దాడి చేయడంతో ఈ దీవి భద్రతపై ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకున్నాయి. దీవిని కాపాడుకునేందుకు ఇరాన్ శతథా ప్రయత్నించడం ఖాయం. ఇరాన్లో ఈ ద్వీపాన్ని కిరీటంలో రత్నంగా పిలుస్తారు. ఇరాన్ చమురు కిరీటంగానూ ఘనకీర్తిని సాధించిన ఖర్గ్ దీవిని నాశనం చేయాలని ఇజ్రాయెల్, అమెరికా కంకణం కట్టుకున్నాయి. ఈ పోరులో గెలుపెవరిదో వెనువెంటనే చెప్పడం కష్టమని యుద్ధరంగ నిపుణులు వ్యాఖ్యానించారు. భారీ భద్రత.. అంతకంటే పెద్ద పైప్లైన్లు.. ఇరాన్లోని అతిపెద్ద ముడిచమురు, సహజవాయు క్షేత్రాలు అన్నింటి నుంచీ ఈ దీవికి పైప్లైన్ వ్యవస్థ ఉంది. అబూజార్, ఫొరైజాన్, దారూద్, అవాజ్, మరూన్, గచ్చరన్ చమురు క్షేత్రాల నుంచి భారీ పైప్లైన్లు ఏర్పాటుచేసి క్రూడ్ ఆయిల్, గ్యాస్ను దీవికి సరఫరా చేస్తుంటారు. ఇక్కడ చమురు డిపోల్లో నిల్వచేసి అంతర్జాతీయ డిమాండ్కు తగ్గట్లుగా నౌకల్లో విదేశాలకు సరఫరా చేస్తుంటారు. ఈ దీవి విస్తీర్ణం కేవలం 20 చదరపు కిలోమీటర్లు. సమీప సముద్రజలాల వెంట ఒడ్డు లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో భారీ చమురు రవాణా నౌకలు సైతం సులభంగా తీరందాకా వచ్చి సరుకును ఎక్కించుకునే అవకాశం ఉంది.దీంతో రోజుకు 70 లక్షల బ్యారెళ్ల ముడిచమురును లోడింగ్ చేసే సామర్థ్యంతో ఇక్కడి నౌకాశ్రయాన్ని ఆధునీకరించారు. ఇక్కడి చమురు డిపోల్లో ఏకంగా 3 కోట్ల బ్యారెళ్ల చమురును నిల్వచేసే అవకాశం ఉంది. ఇరాన్ రోజూ 4.5 శాతం ప్రపంచ చమురు అవసరాలను తీరుస్తోంది. రోజూ 33 లక్షల బ్యారెళ్ల ముడి చమురును, 13 లక్షల బ్యారెళ్ల తక్కువ గాఢత ఉన్న ద్రవరూప హైడ్రోకార్బన్ మిశ్రమాన్ని ఎగుమతిచేస్తోంది. ఆర్థికంగా అత్యంత కీలకమైన ప్రదేశం కావడంతో ఇక్కడ సైనిక మోహరింపు అనూహ్యస్థాయిలో ఉంటుంది.ముందస్తు అనుమతి లేకుండా ఎంత పెద్ద అధికారి అయినా దీవిలోకి అడుగుపెట్టడం అసాధ్యం. యుద్ధం మొదలయ్యాక ఈ దీవి నుంచి ఎగుమతులు చరిత్రలో ఎన్నడూలేనంత గరిష్ట స్థాయికి పెరిగాయని అమెరికా పెట్టుబడుల బ్యాంక్ ‘జేపీ మోర్గాన్’ఇటీవల పేర్కొంది. రెండేళ్ల క్రితమే ఇరాన్ కేవలం ముడిచమురు అమ్మకాలతో 80 బిలియన్ డాలర్ల లాభాలు గడించింది. 1960 దశకం నుంచే అభివృద్ధి ఈ దీవిలో క్రీస్తుపూర్వం 550 నుంచి 330 కాలంలో ఇక్కడ ప్రాచీననాగరికత వెల్లివిరిసిందని పురాతత్వశాస్త్రవేత్తలు చెబుతున్నారు. అచమెనిడ్ సామ్రాజ్య కాలం నాటి శాసనాలు, సమాధులు ఇక్కడ లభించాయి. సుమేరియన్ల కాలంనాటి క్యూనిఫామ్ సంజ్ఞల రూప రాతలూ ఇక్కడ వెలుగుచూశాయి. శతాబ్దాల క్రితం ఇక్కడి నుంచి వ్యాపారాలు జరిగేవి. ఇక్కడి ముత్యాలు అత్యంత నాణ్యమైనవని 982 సంవత్సరంలో రచించిన ‘హుదుద్ అల్ ఆలమ్’రచనలో పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో డచ్ వలసపాలనలో ఈ దీవి భాగంగా ఉండేది. శతాబ్దాల క్రితమే ఇక్కడ చర్చిలు నిర్మించారు. 1830వ దశకంలో ఈ దీవిని కొంతకాలం బ్రిటన్ తన అ«దీనంలో ఉంచుకుంది. తర్వాత రెజా షా పహ్లావీ రాజరికపాలనలో దీవి అభివృద్ధి నెమ్మదిగా మొదలైంది.భారీ నౌకలు సైతం లంగరువేసేందుకు అనువుగా ఉండటం, హార్మూజ్ జలసంధికి సైతం సమీపంగా ఉండటంతో ఈ దీవి సరుకు రవాణాకు అత్యంత ఉత్తమమని ఇరాన్ పాలకులు భావించారు. దీంతో నాటి షా పాలకుల కాలంలో అమెరికాకు చెందిన ఆమోకో కంపెనీ సహకారంతో 1960 దశకంలోనే దీవిలో ఆయిల్ టరి్మనల్ను తొలిసారిగా నిర్మించారు. తర్వాత అత్యంత వేగంగా దీవి కీలకమైన చమురు టర్మినల్గా విస్తరించింది.ఇక్కడ చిన్న విమానాశ్రయం సైతం ఉంది. దీవిని దిగ్బంధించి ఇరాన్తో బేరసారాలు మొదలెట్టాలని అమెరికా ఆశపడుతోంది. హార్మూజ్ జలసంధి గుండా రాకపోకలకు ఇరాన్ అనుమతించేలా ఆ దేశంపై ఒత్తిడిచేయాలని అమెరికా చూస్తోంది. ఒప్పుకోకుంటే దీవిలో ఒక్క చమురుచుక్క మిగలకుండా తగలబెడతామని ఇటీవలే వైట్హౌస్ సమావేశంలో ట్రంప్ తెగేసిచెప్పడంతో ఇప్పుడీ దీవి పరిస్థితి ఏంటనే చర్చ కొనసాగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్
దద్దరిల్లిన ‘ఖర్గ్’
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపు దాలుస్తోంది. ఇరాన్కు ఆర్థిక ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై అమెరికా దాడులు, ప్రతీకారంగా పలు గల్ఫ్ దేశాల్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ తీవ్రస్థాయి ప్రతిదాడులతో శనివారం పోరు కీలక మలుపు తిరిగింది. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలనే గాక ఆ దేశంతో సంబంధమున్న చమురు వ్యవస్థలన్నింటినీ ఇకపై లక్ష్యం చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. తమపై అమెరికా దాడులకు ఉపయోగపడుతున్న గల్ఫ్ నగరాలన్నింటిపైనా ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది.అమెరికా సేనలు మోహరించిన ప్రదేశాల నుంచి పౌరులంతా తక్షణం వెళ్లిపోవాలని సూచించింది! మరోవైపు ఖర్గ్పై భూతల దాడులకు కూడా అమెరికా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. 2,500 మందితో కూడిన నావికా దళాన్ని, మరిన్ని ఆంఫీబియస్ యుద్ధ నౌకలను హుటాహుటిన గల్ఫ్కు తరలిస్తుండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. వీటికి తోడు ఇరాన్తో యుద్ధం నిర్ణాయక దశలోకి ప్రవేశించిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో యుద్ధ పరిధి మరింతగా విస్తరించడం ఖాయమని, తద్వారా మరింత జనహననం, ఆస్తి నష్టం తప్పవని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చమురు వ్యవస్థలు బుగ్గే: ట్రంప్ఇరాన్ చమురు నెట్వర్క్కు జీవనాడి వంటి ఖర్గ్ దీవిపై అమెరికా భారీ స్థాయిలో దాడులకు దిగింది. అక్కడ పదులకొద్దీ సంఖ్యలో భారీ పేలుళ్లు విని్పంచాయి. సముద్రంలో అమర్చే మందుపాతరల నిల్వ కేంద్రం, క్షిపణి నిల్వ కేంద్రం, బంకర్లతో పాటు మొత్తం 90కి పైగా సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. దీవిలోని కీలకమైన సైనిక స్థావరాలను పూర్తిస్థాయిలో ధ్వంసం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే కీలకమైన చమురు వ్యవస్థల జోలికి మాత్రం పోలేదని తెలిపారు.హార్మూజ్ గుండా నౌకల ప్రయాణాన్ని ఇరాన్ నిరోధిస్తే వాటిని కూడా తుడిచి పెట్టేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఆయన పోస్టులు చేశారు. జపాన్ నుంచి తక్షణం పశ్చిమాసియాకు తరలాలంటూ 31వ మరీన్ ఎక్స్పెడిషనరీ యూనిట్, యాంఫిబియస్ షిప్ యూఎస్ఎస్ ట్రిపోలీకి ఆదేశాలు జారీ అయ్యాయి. యూఎస్ఎస్ అబ్రహంలింకన్తో పాటు అమెరికా ఇప్పటికే 12 యుద్ధ నౌకలను, 8 డి్రస్టాయర్లను గల్ఫ్లో మోహరించింది. అమెరికా దాడిలో ఖర్గ్లోని తమ చమురు వ్యవస్థలకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని ఇరాన్ పేర్కొంది.ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, నావల్ బేస్, విమానాశ్రయ కంట్రోల్ టవర్, ఒక చమురు కంపెనీ తాలూకు హెలికాప్టర్ హ్యాంగర్పై దాడులు జరిగినట్టు తెలిపింది. శనివారం ఇరాన్లో 200 పై చిలుకు లక్ష్యాలను తుడిచిపెట్టినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. వాటిలో క్షిపణి కేంద్రాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఆయుధ తయారీ కేంద్రాలున్నట్టు తెలిపింది. అయితే ఖర్గ్ నుంచి చమురు ఎగుమతులు నిర్నిరోధంగా కొనసాగుతున్నట్టు వెల్లడించింది. లెబనాన్లో మృతులు 826 మంది లెబనాన్పైనా ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. బీరూట్, శివార్లపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణులతో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 826 మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వం పేర్కొంది. వారిలో 31 మంది వైద్య సిబ్బందేనని తెలిపింది. దాడుల తీవ్రతకు ఐదు ఆస్పత్రులను మూసేయాల్సి వచ్చినట్టు వివరించింది. దేశవ్యాప్తంగా 8.5 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. మొజ్తబాపై 92 కోట్ల రివార్డు ఇరాన్ నూతన సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ జాడ తెలిపిన వారికి కోటి డాలర్ల (రూ.92.5 కోట్ల) రివార్డును అమెరికా ప్రకటించింది. విదేశాంగ శాఖ ఎక్స్లో ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ఖమేనీతో పాటు ఆయన కార్యాలయ చీఫ్ అలీ హస్గర్ హెజాజీ, భద్రతా విభాగం ఉన్నతాధికారి అల లరిజానీ తదితరుల పేర్లను కూడా పేర్కొంది. వాళ్లకు సంబంధించిన సమాచారం అందించే వారికి తగిన పారితోíÙకంతో పాటు పునరావాసం కూడా కలి్పస్తామని పేర్కొంది.గల్ఫ్పై క్షిపణుల వర్షంఖర్గ్పై అమెరికా దాడులకు తమ ప్రతీకారం ఊహించని స్థాయిలో ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘెర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. కనీవిని ఎరుగని రీతిలో పూర్తిస్థాయి దాడులకు దిగుతామన్నారు. అందుకు తగ్గట్టే ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపైనా దాడుల తీవ్రతను ఇరాన్ యథాతథంగా కొనసాగించింది. శనివారమంతా వాటిపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో అమెరికా రాయబార కార్యాలయ ప్రాంగణంలోని హెలిప్యాడ్పై క్షిపణి దాడికి దిగింది. తీవ్ర నష్టానికి సంకేతంగా అక్కడినుంచి భారీగా పొగలు వెలువడ్డాయి.ఇరాన్ డ్రోన్ దాడిలో యూఏఈలో ఒక చమురు కేంద్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అక్కడి నుంచి వెలువడే పొగలు ఆకాశాన్నంటుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బ్యాంకులు, ఇతర వ్యవస్థలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు జరుపుతోంది. దుబాయ్లోని జెబెల్ అలీ, అబుదాబిలోని ఖలీఫా, పుజైరా నౌకాశ్రయాలను విడిచి వెళ్లాల్సిందిగా సిబ్బందిని, ప్రజలను ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాటిపైనా భారీ దాడులు తప్పవని భావిస్తున్నారు. 9 బాలిస్టిక్ క్షిపణులను, 33 డ్రోన్లను అడ్డుకున్నట్టు యూఏఈ ప్రకటించింది.నిమిషాల్లో 1,430 క్షిపణులు! ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డ ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా దాడితో ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్పై శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 1,430 క్షిపణులు ప్రయోగించింది! ఇజ్రాయెల్ వైద్య సేవా విభాగానికి చెందిన మాగెన్ డేవిడ్ ఆడొమ్ దీన్ని ధ్రువీకరించారు. ఈలట్ నగరంలో చాలా ప్రాంతాలపై దాడులు జరిగాయి. ఎంతోమంది గాయపడ్డారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు పలు ఇజ్రాయెలీ నగరాలు కూడా క్షిపణుల మోతతో దద్దరిల్లిపోయాయి.హార్మూజ్కు యుద్ధనౌకలు పంపండి ప్రపంచ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తిహార్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రపంచ దేశాలు యుద్ధ నౌకలు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పలు దేశాలు ఇప్పటికే అమెరికాకు దన్నుగా తమ యుద్ధ నౌకలను పంపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయని చెప్పారు. హార్మూజ్ను త్వరలో తెరిపించి అక్కడినుంచి అంతర్జాతీయ రవాణా యథావిధిగా సాగేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.గల్ఫ్ దేశాలపై దాడులొద్దు ఇరాన్కు హమాస్ పిలుపు గల్ఫ్ దేశాలపై దాడులకు ఇరాన్ స్వస్తి పలకాలని పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ విజ్ఞప్తి చేసింది! పొరుగు దేశాలపై దాడులు మానుకోవాలని హితవు పలికింది. యుద్ధానికి తక్షణం తెర దించేలా దేశాలన్నీ కృషి చేయాలని కూడా పిలుపునిచి్చంది. ఇరాన్కు హమాస్ అత్యంత సన్నిహితమన్నది తెలిసిందే. దానికి ఇరాన్ పూర్తిస్థాయిలో సాయుధ, ఆర్థిక సాయం చేస్తుంటుంది. హమాస్ ప్రకటనపై ఇరాన్ ఇప్పటిదాకా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.మరో ఐదు విమానాలను నష్టపోయిన అమెరికా! ఇరాన్ దాడుల్లో అమెరికా గత రెండు రోజుల్లో మరో ఐదు రీ ఫ్యూయలింగ్ విమానాలను నష్టపోయినట్టు తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడుల్లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఐదు కేసీ–135 స్ట్రాటో ట్యాంకర్ రీ ఫ్యూయలింగ్ విమానాలకు భారీ నష్టం వాటిల్లినట్టు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. యుద్ధ ప్రాతిపదికన వాటికి మరమ్మతులు చేపట్టారని ఇద్దరు అమెరికా సైనికాధికారులను ఉటంకిస్తూ కథనం వెలువరించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వార్తలను పూర్తిగా తోసిపుచ్చారు. ఇదంతా అమెరికా ఓటమిని కోరుకునే కొన్ని పనికిమాలిన మీడియా సంస్థల దిగజారుడు ప్రచారమేనంటూ మండిపడ్డారు. ‘‘నాలుగు విమానాలకు ఎలాంటి నష్టమూ జరగలేదు. ఇరాన్పై దాడుల్లో అవి చురుగ్గా పాల్గొంటున్నాయి. ఒక్క రీ ఫ్యూయలింగ్ విమానానికి స్వల్ప నష్టం జరిగింది. మా సైన్యం దానికి వెంటనే మరమ్మతు చేసింది కూడా’’అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
నేపాల్లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయులు మృతి
నేపాల్లోని గోర్ఖా జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మంకమ్నా ఆలయంలో దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.పోలీసుల సమాచారం ప్రకారం, సాహిద్ లఖన్ గ్రామీణ మునిసిపాలిటీ పరిధిలోని కాంతర్ ప్రాంతంలో భక్తులను తీసుకెళ్తున్న ఎలక్ట్రిక్ మైక్రోబస్ నియంత్రణ తప్పి కొండ రహదారి నుంచి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు యాత్రికులు గాయపడగా, వారిని చికిత్స కోసం చిత్వాన్ జిల్లాలోని భరత్పూర్ పట్టణంలోని చిత్వాన్ మెడికల్ కాలేజీకి తరలించారు.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్కుమార్ శ్రేష్ఠ తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాద సమయంలో మైక్రోబస్లో డజనుకు పైగా ప్రయాణికులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.గోర్ఖా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తులసి బహదూర్ శ్రేష్ఠ మాట్లాడుతూ, ఈ మైక్రోబస్ మంకమ్నా ఆలయం నుంచి పశ్చిమ దిశగా తనహు జిల్లాలోని అన్బుఖైరేని ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలిపారు. అయితే దర్శనం అనంతరం యాత్రికులు అసలు ఏ ప్రాంతానికి వెళ్తున్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదన్నారు.ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. కొండ ప్రాంత రహదారిపై ప్రయాణిస్తుండగా మైక్రోబస్ అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఇదే ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 2024లో భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు అన్బుఖైరేని సమీపంలో ప్రమాదానికి గురై కనీసం 27 మంది మరణించిన విషయం తెలిసిందే.
జాతీయం
నమాజ్ చేసే వారి సంఖ్యపై పరిమితులా?
సాక్షి, న్యూఢిల్లీ: రంజాన్ మాసంలో మసీదులో నమాజ్ చేసుకునే వారి సంఖ్యపై పరిమితులు విధించడాన్ని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. శాంతిభద్రతల నెపంతో ఇటువంటిఆంక్షలు విధించలేరని స్పష్టం చేసింది. శాంతిభద్రతలను కాపాడలేకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేయడమో లేక వేరే జిల్లాకు బదిలీ చేయించుకోవాలని సంభాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ సిద్ధార్థ్ నందన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.‘శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న కారణంతో నమాజ్ చేసుకునే వారి సంఖ్యను పరిమితం చేస్తూ ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా తిరస్కరిస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చట్టబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఒకవేళ సంభాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఈ బాధ్యతను నిర్వర్తించలేమని, చట్టాన్ని అమలు చేసే సామర్థ్యం తమకు లేదని భావిస్తే.. వెంటనే పదవులకు రాజీనామా చేయాలి లేదా సంభాల్ జిల్లా నుంచి బయటకు బదిలీ కోరుకోవాలి’అని తీవ్ర స్థాయిలో మందలించింది. ప్రైవేట్ స్థలమైతే అనుమతి అక్కర్లేదుసంభాల్ జిల్లాలోని సర్వే నంబర్– 291లో ఉన్న మసీదులో ప్రార్థనలు చేసుకోకుండా అధికారులు అడ్డుకుంటున్నారంటూ మునాజిర్ ఖాన్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ వేశారు. రంజాన్ సమయంలో ఎక్కువ మంది భక్తులు ప్రార్థనలకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అధికారులు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారని ఆయన కోర్టు దష్టికి తీసుకెళ్లారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందునే ఆంక్షలు విధించినట్లు కోర్టుకు తెలిపారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రతి వర్గానికి తమ నిర్దేశిత ప్రార్థనా మందిరాల్లో ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకునే హక్కు ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రైవేట్ ఆస్తిలో ప్రార్థనలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ గతంలో ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. అయితే, ప్రభుత్వ స్థలాల్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు లేదా పబ్లిక్ స్థలాల్లోకి ఆ కార్యక్రమాలు విస్తరించినప్పుడు మాత్రమే అధికారుల అనుమతి తప్పనిసరి అని స్పష్టత ఇచ్చింది.ఆ స్థలం ఎవరిది?విచారణ సందర్భంగా పిటిషనర్ వాదనను యూపీ ప్రభుత్వం ఖండించింది. రెవెన్యూ రికా ర్డుల ప్రకారం మసీదు ఉన్న భూమి సుఖీ సింగ్ కుమారులైన మోహన్ సింగ్, భూరాజ్ సింగ్ల పేరిట ఉందని ప్రభుత్వం తెలిపింది. అలాగే, అక్కడ మసీదు లేదా ప్రార్థనా స్థలం ఉన్నట్లుగా పిటిషనర్ ఎలాంటి ఫొటోలను సమర్పించలేదని కోర్టు గమనించింది. ఆధారాలు, ఫొటోలు, రెవెన్యూ రికార్డులు సమర్పించేందుకు పిటిషనర్ సమయం కోరగా.. తదుపరి వివరాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం కూడా గడువు అడిగింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
హార్మూజ్ను దాటేసిన... రెండు భారత నౌకలు
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల నుంచి ఎల్పీజీ నిల్వలతో వస్తున్న మరో రెండు భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. భారీస్థాయిలో ఎల్పీజీ నిల్వలతో భారత్ వైపు బయల్దేరాయి. ‘‘శివాలిక్, నందాదేవి అనే రెండు నౌకలు శనివారం ఉదయం హార్మూజ్ను దాటుకుని వచ్చాయి. గుజరాత్లోని ముంద్రా, కాండ్లా రేవులకేసి బయల్దేరాయి’’అని నౌకాయాన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్కుమార్ సిన్హా మీడియాకు తెలిపారు. వాటిలో 92,700 టన్నుల ఎల్పీజీ ఉన్నట్టు వెల్లడించారు. శివాలిక్ సోమవారం ముంద్రాకు, ఆ మర్నాడు నందాదేవి కాండ్లాకు చేరే అవకాశముందన్నారు. హార్మూజ్కు పశి్చమాన మరో 22, తూర్పున 4 భారత నౌకలు ఇంకా వెయిటింగ్లోనే ఉన్నట్టు ఆయన వివరించారు.వాటిని కూడా సురక్షితంగా దాటించేలా ఇరాన్ వర్గాలతో కేంద్రం ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. పశి్చమాన నిలిచిన 22 నౌకల్లో ఆరింట్లో ఎల్పీజీ, ఒకదాంట్లో ఎల్ఎన్జీ, నాలుగింట్లో చమురు నిల్వలున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎలీ్పజీకి తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో రెండు నౌకల్లో భారీగా నిల్వల రాక ఉపశమనం కల్పించనుంది. టాంజానియాకు గ్యాసోలిన్ నిల్వలు తీసుకెళ్తున్న జగ్ప్రకాశ్ అనే భారత చమురు నౌక శుక్రవారమే హార్మూజ్ను దాటడం తెలిసిందే. మన దేశీయ ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. వాటిలో 90 శాతం దిగుమతులు గల్ఫ్ దేశాల నుంచే జరుగుతున్నాయి. మార్చి 1 నుంచి హార్మూజ్ మూతపడటంతో గల్ఫ్ నుంచి చమురు, ఎల్పీజీ సరఫరా నిలిచిపోయాయి. మళ్లీ రష్యా నుంచే కొనాలని అడుక్కుంటోంది ఇరాన్ ఎద్దేవాదుబాయ్: రష్యా నుంచి ముడిచమురు కొనొద్దని భారత్ను నెలల తరబడి బెదిరించిన అమెరికా ఇప్పుడు గతిలేక భారత్ను బతిమిలాడుతోందని ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘యుద్ధం మొదలుకాకమునుపేమో రష్యా నుంచి చమురు అస్సలు కొనకూడదని భారత్ను అమెరికా బాగా బెదిరించింది. తీరా యుద్ధం మొదలయ్యాక మార్చి ఐదో తేదీన అమెరికా మాటమార్చింది. యుద్ధం దెబ్బకు హార్మూజ్ మూతబడటంతో రష్యాకాకుండా ఇతర దేశాల నుంచి చమురు కొనాలంటే సాధ్యపడట్లేదు. అందుకే మరో 30 రోజుల సడలింపు ఇస్తున్నాం.. రష్యా నుంచి కొనుక్కోండి అని అమెరికా భారత్కు అడగకపోయినా గడువు పెంచుతూపోతోంది’’అని అబ్బాస్ వెటకారంగా మాట్లాడారు.
తృణమూల్ ప్రభుత్వానికి కౌంట్డౌన్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో చొరబాటుదార్లను కాపాడేందుకే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను వ్యతిరేకిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. చొరబాటుదార్ల కారణంగా రాష్ట్రంలో చాలాప్రాంతాల్లో జనాభా సమతూకంలో విపరీతమైన మార్పులు వచ్చాయని ఆందోళన వ్యక్తంచేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే బెంగాలీ హిందువులను మైనార్టీ లుగా మార్చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహించిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ శనివారం పశ్చిమ బెంగాల్లో పర్యటించారు.రూ.18,680 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. రెండు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఓడరేవుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోల్కతాలో బహిరంగ సభకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిర్వహించిన పరివర్తన్ యాత్ర ముగింపు సందర్భంగా ఈ సభ నిర్వహించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలపై దాడి చేసిందని ఆరోపించారు. ఈ అరాచక ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని అన్నారు.రాజకీయ మార్పు తీసుకురావాలని ప్రజలకు సూచించారు బెంగాల్ ఆత్మను కాపాడేందుకు, కట్ మనీ సంస్కృతిని అంతం చేసేందుకు, భయం నుంచి విముక్తి కోసం ఈ ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టంచేశారు. రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఈ ఎన్నికలు నిర్ణయాత్మక పోరాటమని అభివర్ణించారు. బెంగాల్లో జంగిల్ రాజ్ అంతం కాక తప్పదన్నారు. ఎస్ఐఆర్తో ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదార్ల పేర్లుతొలగిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. మృతి చెందినవారి పేర్లు కూడా తొలగించకూడదా? అని నిలదీశారు. నేరగాళ్లు ఉండాల్సింది జైల్లోనే.. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఇన్నాళ్లూ ప్రజలను భయపెట్టారని, ఇక ఆ గూండాలే భయపడే రోజులు వచ్చాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేరగాళ్లు, చొరబాటుదార్లు, బుజ్జగింపు రాజకీయాలు చేసేవాళ్లు చట్టానికి భయపడాల్సిందేనని ఉద్ఘాటించారు. నేరగాళ్లు ఉండాల్సిన చోటు జైలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. బెంగాల్లో తాము అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తామన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారిపై, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన వచ్చే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినవారిని, అరాచకాలకు పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. పొరుగుదేశాల్లో మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్న మనదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించడం తృణమూల్ కాంగ్రెస్కు ఇష్టం లేదని ఆక్షేపించారు. ఎందుకంటే హిందువులను ఆ పార్టీ ఓటు బ్యాంకుగా భావించడం లేదన్నారు. కేవలం నేరస్థుల అండతోనే మమతా బెనర్జీ సర్కారు మనుగడ సాగిస్తోందని విమర్శించారు.ఎస్ఐఆర్ నిర్వహించినందుకు రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ ప్రధానమంత్రి మండిపడ్డారు. దళిత మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును తృణమూల్ కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. కేవలం రాష్ట్రపతినే కాకుండా.. దేశంలోని గిరిజనులు, రాజ్యాంగాన్ని అవమానించినట్లు ధ్వజమెత్తారు. ఆ పార్టీ అన్ని హద్దులూ దాటేసిందన్నారు. తృణమూల్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ కోల్కతాలో ప్రధాని మోదీ హాజరైన సభ కంటే అరగంట ముందు అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. తమ పార్టీలకు అనుకూలంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ ఘటనలో బీజేపీ నాయకుడితోపాటు ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. బహిరంగ సభకు వస్తుండగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమను రెచ్చగొట్టి దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం సిల్చార్: మన దేశంపై ప్రపంచ సంక్షోభాలు, యుద్ధాల ప్రభావాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి మోదీ స్పష్టంచేశారు. పశ్చిమాసియా పరిణామాల పట్ల మన దేశంలో ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరైంది కాదని సూచించారు. మోదీ వరుసగా రెండోరోజు శనివారం కూడా అస్సాంలో పర్యటించారు.రూ.23,550 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. సిల్చార్లో బహిరంగ సభలో ప్రసంగించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. పశ్చిమాసియా యుద్ధాన్ని అడ్డంపెట్టుకొని ప్రజల్లో అలజడి సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్కు అభివృద్ధి గురించి ఏమీ తెలియదన్నారు. మోదీని దూషించడం, పుకార్లు వ్యాప్తి చేయడం, అబద్ధాలు చెప్పడం, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.
ఎట్టకేలకు వాంగ్చుక్ విడుదల
లేహ్/న్యూఢిల్లీ/జోద్పూర్: లద్దాఖ్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని, ఆ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ పరిధిలో చేర్చాలని ఉద్యమించి చివరకు జైలుపాలైన పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్ ఎట్టకేలకు స్వేచ్ఛా వాయువులు పీల్చారు. గత ఆరునెలలుగా కారాగారానికే పరిమితమైన వాంగ్చుక్పై కొనసాగుతున్న నిర్బంధాన్ని తక్షణం రద్దుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక ప్రకటన విడుదలచేసింది. తక్షణం ఆయనను విడుదలచేస్తున్నట్లు వెల్లడించింది. వెనువెంటనే ఆయనను జోధ్పూర్ కేంద్ర కారాగారం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు విడుదలచేశారు. భర్త విడుదల కోసం కొంతకాలంగా న్యాయస్థానాల్లో పోరాడుతున్న గీతాంజలి ఆంగ్మో జోధ్పూర్ కేంద్ర కారాగారానికి వచ్చి ఆయనను వెంట తీసుకెళ్లారు.వాంగ్చుక్ను అరెస్ట్ను సవాల్చేస్తూ భార్య వేసి న పిటిషన్ మార్చి 17వ తేదీన సుప్రీంకోర్టులో తదుపరి విచారణకు రాబోతున్న వేళ కేంద్రం ఆయనను విడుదలచేయడం గమనార్హం. ‘‘తాజా పరిస్థితులు, లద్దాఖ్లో శాంతిస్థాపనే ధ్యేయంగా వాంగ్చుక్ నిర్బంధాన్ని రద్దుచేయాలని నిర్ణయించాం. లద్దాఖ్లో శాంతి, సుస్థిరత, పరస్పర విశ్వాసం పాదుగొల్పడమే మా లక్ష్యం. రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ వంటి అంశాల్లో అన్ని భాగస్వామ్య పక్షాలతో అర్థవంతమైన చర్యల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటుచేశాం. ఎన్ఏసీ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో ఆయనను తక్షణం వదిలేస్తున్నాం’’అని కేంద్రం శనివారం విడుదలచేసిన ప్రకటనలో పేర్కొంది.లద్దాఖ్కు రాష్ట్ర ప్రతిపత్తి, ఆరో షెడ్యూల్లో చేర్చడం సహా పలు డిమాండ్ల సాధన కోసం 59 ఏళ్ల వాంగ్చుక్ సారథ్యంలో యువత చేపట్టిన ఉద్యమం ఆనాడు లేహ్ పరిధిలో హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఉద్యమకారులతోపాటు 22 మంది పోలీసులు సహా ఆనాడు 90 మంది గాయపడ్డారు. చైనాతో సరిహద్దు పంచుకుంటున్న లద్దాఖ్లో ఉద్యమం లేవదీసి అత్యంత సున్నితమైన సరిహద్దు భద్రతా అంశాన్ని ఆయన ప్రమాదంలో పడేశారంటూ కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద గత ఏడాది సెపె్టంబర్ 26వ తేదీన ఆయనను లద్దాఖ్ పాలనాయంత్రాంగం అదుపులోకి తీసుకుంది. భద్రతా కారణాలతో ఆయనను తర్వాత జోధ్పూర్ జైలుకు మార్చిన విషయం తెల్సిందే. మిగతా వారినీ విడుదలచేయండి వాంగ్చుక్ విడుదలను కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు స్వాగతించాయి. వాంగ్చుక్తోపాటు ఉద్యమించి జైలుపాలైన తమ తోటి వారిని తక్షణం విడుదలచేయాలని ఉద్యమకారుల నుంచి డిమాండ్లు ఊపందుకున్నాయి. ‘‘సోనమ్ రాక మాకు ఆనందమే. కానీ ఉద్యమం వేళ జైలుపాలైన ఉద్యమకారులనూ విడుదలచేయాలి. వాళ్లపై మోపిన అక్రమ కేసులను ఎత్తేయాలి. ఉద్యమం చేయడమనేది రాజ్యాంగబద్ధ హక్కు. మా రాష్ట్ర హోదా డిమాండ్ను మోదీ సర్కార్ నెరవేర్చాల్సిందే’’అని లద్దాఖ్ లోక్సభ సభ్యుడు మొహమ్మద్ హనీఫా డిమాండ్చేశారు.‘‘వాంగ్చుక్ విడుదల లద్దాఖ్ ప్రజల విజయం. లద్దాఖ్ వాసులపై మోపిన జాతీయవ్యతిరేక ముద్ర తప్పు అని వాంగ్చుక్ విడుదలతో తేలిపోయింది’’అని ది లేహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ) సహ చైర్మన్ చెరింగ్ డోర్జే అన్నారు. ‘‘దిల్దాన్ నామ్గియాల్, స్మాన్లా డోర్జీలనూ విడుదలచేయాలి. ఉద్యమం ఆగదు’’అని కార్గిల్ ప్రాంత రాజకీయనేత, కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్(కేడీఏ) సభ్యుడు సజ్జద్ కార్గిలీ అన్నారు. ‘‘లద్దాఖ్ భద్రత, సుస్థిరతలో జాతీయవాది వాంగ్చుక్ పాత్ర అత్యంత కీలకమైంది’’అని అతని లాయర్, కాంగ్రెస్ నేత వివేక్ తన్ఖా వ్యాఖ్యానించారు. వాంగ్చుక్ విడుదలను జమ్మూకశీ్మర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. హింసను ఆపేయాలి: ఎల్జీ ‘‘లద్దాఖ్ ప్రాంత సమస్యలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి. వాంగ్చుక్ విడుదల తర్వాత మళ్లీ హింసాత్మక మార్గంలో ఉద్యమిస్తామంటూ ఊరుకునేది లేదు. ఉద్యమాలకు ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవు. లద్దాఖ్ పౌరులు, నేతలు, వివిధ వర్గాల భాగస్వాములతో సంప్రదింపుల మార్గంలోనే సమస్యలకు పరిష్కారం వెతుకుదాం’’అని లద్దాఖ్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వ్యాఖ్యానించారు. పది రోజుల క్రితం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సారథ్యంలోని హైపవర్ కమిటీ సమావేశం కాగా అందులో వాంగ్చుక్ను తక్షణం విడుదలచేయాలని ఎల్ఏబీ, కేడీఏ నేతలు కోరడం తెల్సిందే.
ఎన్ఆర్ఐ
వాషింగ్టన్ డీసీలో శంకర నేత్రాలయ నిధుల సేకణ కార్యక్రమం
గతేడాది డిసెంబర్ 6. 2025న వాషింగ్టన్ డి.సి. మెట్రో ప్రాంతంలో నిర్వహించిన శంకర నేత్రాలయ (SN) నిధుల సేకరణ కార్యక్రమం విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మక నేత్ర వైద్య సంస్థ కోసం మొత్తం $150,000 నిధులు సమీకరించారు. సంస్కృతి,కరుణను ప్రతిబింబించే ఈ వేడుకకు చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రమణ రెడ్డి మడ్డికుంట CapEx సభ్యుడు తిరుమల రెడ్డి మునుకుంట్ల నాయకత్వం వహించారు.ఆ సాయంత్రం థీమ్ కరుణ ప్రతిధ్వనులు: కళ హృదయాన్ని కలిసే స్థలం (Echoes of Compassion: Where Art Meets Heart)గా నిర్వహించబడింది. శాస్త్రీయ మరియు సాంప్రదాయ నృత్య కళలతో సేవా భావాన్ని మేళవిస్తూ ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక అకాడమీలు పాల్గొని యువ వయోజన నర్తకుల అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సాంస్కృతిక బృంద సభ్యురాలు లక్ష్మి బాబు సమన్వయంతో నృత్య ప్రదర్శనలు అత్యంత కన్నులపండుగగా నిర్వహించారుఈ వేడుకకు గౌరవ అతిథిగా ఎస్. వి. ఆచార్య గారు హాజరై తమ ప్రోత్సాహకర సందేశంతో కార్యక్రమానికి మరింత గౌరవాన్ని చేకూర్చారు. అలాగే 11 మంది MESU స్పాన్సర్ల మద్దతు ఈ కార్యక్రమ విజయానికి కీలకమైంది.ఉదార హృదయంతో సహకరించిన MESU స్పాన్సర్లు:సెల్వ, ప్రతిభ జయరామన్, భువనేశ్ బూజాల, భానుమతి రామకృష్ణ, శ్రవణ్ పడూరు, కృష్ణకాంత్ కుచ్చలకంటి, ప్రవీణ్ పాల్రెడ్డి, రఘు పాల్రెడ్డి, వెంకట్ దోమా, తిరుమల మునుకుంట్ల, రఘు జువ్వాది గారు. వీరి ఆర్థిక కార్యనిర్వహణ సహకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.ఇంకా SNUSA నేషనల్ మరియు డి.సి. మెట్రో చాప్టర్ సభ్యులు విశేషంగా సహకరించారు. ముఖ్యంగా శ్రీమతి నీలిమ గడ్డమనుగు, కృష్ణ రాజ్ భట్, సౌమ్య నారాయణన్, డి.సి. చాప్టర్ నాయకులు — బాలాజీ రాధాకృష్ణన్, హరిత రెడ్డి, అర్జున్ కామిసెట్టి, దిలీరాజ్ చాంతివేలు, రూపేష్ చిన్నకంపల్లి, కార్తిక్ గౌడ్ తదితరుల కృషి ప్రశంసనీయం.SNUSA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి గారి నాయకత్వం తోపాటు బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యుల మార్గదర్శకత్వం ఈ విజయానికి బలమైన ఆధారంగా నిలిచాయి. ట్రెజరర్ మూర్తి రేకపల్లి గారు లాజిస్టిక్స్ నిర్వహణలో విశేష కృషి చేయగా, మీడియా సహకారం అందించిన శ్రీగిరి కోటగిరి సేవలు అభినందనీయం. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువ వాలంటీర్లు, మీడియా,ఫోటోగ్రఫీ బృంద సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మాస్టర్ ఆఫ్ సెరిమనీగా వ్యవహరించిన శ్రియా బాబు తన చక్కని వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని చురుకుగా, సమర్థవంతంగా ముందుకు నడిపించారు.ఈ కార్యక్రమంలో సమీకరించిన నిధులు శంకర నేత్రాలయ లక్ష్యమైన అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించేందుకు వినియోగించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ముగిసే సమయానికి సేవా భావం, ఐక్యత, సామాజిక బాధ్యత స్పష్టంగా ప్రతిఫలించాయి. ఈ వేడుక కేవలం కళలు, సంస్కృతిని మాత్రమే కాకుండా, సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరి హృదయంలో మరింత బలంగా నాటింది.(చదవండి: అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..)
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు భారత్కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్ ఎవరు? ఆ వివరాలు మీకోసం.లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలోజన్మించారు నిత్య రామన్. ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య కుటుంబం, అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కరెన్ బాస్కు గట్టి పోటీప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!
అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత
క్రైమ్
కొట్టుకున్న డ్వాక్రా మహిళలు
జోగిపేట(అందోల్): వాయిదాల డబ్బులు బ్యాంకులో చెల్లించలేదని డ్వాక్రా సంఘం మహిళలు కొట్టుకున్నారు. వివరాలు ఇలా... జోగిపేటకు చెందిన లక్ష్మినర్సింహ డ్వాక్రా గ్రూపునకు చెందిన మహిళలు స్థానిక బ్యాంకు నుంచి వనిత వ్యాపార వృత్తి పేర రుణాలు తీసుకున్నారు. సభ్యురాలు మళ్లీశ్వరి కూడా రుణం తీసుకొని ఆమె అత్త వెంకమ్మకు ఇవ్వగా వాడుకొని వాయిదాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు రుణం తీసుకున్న మహిళలకు ఫోన్ చేశారు. దీంతో సభ్యురాలు అనిత, ఆమె బంధువులు వెంకమ్మను పిలిపించి డబ్బుల విషయమై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి కట్టెలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. వెంకమ్మకు గాయాలయ్యాయి. స్థానికులు 100కు డయల్ చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గాయపడ్డ వారిని జోగిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం మళ్లీశ్వరి, అనిత మాత్రమే డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా ఉన్నారని మెప్మా అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్లో భారీ చోరీ
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో భారీ చోరీ జరిగింది. అన్నం పెట్టిన ఇంటికే ఓ నేపాలీ దంపతులు కన్నం వేశారు. పనిమనుషులుగా చేరిన నెలన్నరకే చేతివాటం ప్రదర్శించారు. యజమాని లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి 8 డైమండ్ నెక్లెస్లు, బంగారు ఆభరణాలు, 10 రోలెక్స్ వాచీలను దోచుకుని పరారయ్యారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు... జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–25లోని ప్లాట్ నెంబర్ 305లో పింగళి అనురు««ద్రెడ్డి అనే వ్యాపారి, భార్య దీపికారెడ్డితో కలిసి ఉంటున్నాడు. నగరంలోని పేరు మోసిన హోటల్ యజమాని కుమార్తె అయిన దీపికారెడ్డి దంపతులు శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళాలు వేసి విమానంలో ఊటీకి వెళ్లారు. 45 రోజుల క్రితమే ఈ ఇంట్లో నేపాల్కు చెందిన మహేష్ షాయి(30), అప్సర(25) దంపతులు పనిమనుషులుగా చేరారు. యజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించారు. పక్కా పథకంతో ఇంట్లో చేరిన నేపాలీ దంపతులు అవకాశం కోసం ఎదురుచూశారు. నాలుగైదు రోజుల నుంచి ఇంట్లోకి ఎలా వెళ్లాలి.. నగలు, నగదు ఎక్కడ భద్రపరిచారు.. వంటి వాటిపై రెక్కీ నిర్వహించారు. రాత్రంతా అల్మారా, లాకర్లను పగులకొడుతూ.. యజమానులు అనిరు«ధ్రెడ్డి, దీపికారెడ్డి ఊటికి వెళ్లడంతో శుక్రవారం రాత్రి 12.30 గంటల సమయంలో కత్తులు, కటార్లు, రాడ్ల సహాయంతో నేపాలీ దంపతులు ప్రధాన ద్వారం తాళం పగులగొట్టారు. బెడ్రూమ్లోకి వెళ్లి అల్మారాను, లాకర్లను శనివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు పగులగొట్టారు. 8 డైమండ్ నెక్లెస్లు, 10 రోలెక్స్ వాచీలు, బంగారు నగను బ్యాగ్లో సర్దుకుని ఉడాయించారు. ఉదయం ఇంటికి వచ్చిన డ్రైవర్ గమనించి యజమానికి సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వేలిముద్రలు తీసుకున్నారు. ఈ దంపతులను పనిలో కుదిర్చిన పాత పనిమనుషులు హరత్సింగ్, రీమాసింగ్ల కోసం గాలిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితులు పేరు మోసిన కుటుంబానికి చెందినది కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం సాయంత్రం నేపాల్ సరిహద్దులకు ముంబై, బిహార్లకు పోలీసు బృందాలు చేరుకుని నిఘా పెట్టాయి. కాగా, హరత్సింగ్ గదిలో కూడా మహేశ్సాయి దంపతులు కొంత సామాను తస్కరించడం గమనార్హం.
ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి
మలికిపురం: రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో రోజూ చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై మేడిద రాంబాబు(45) లైంగిక దాడికి పాల్పడినట్లు ఎస్ఐ పి.వి.వి సురేష్ శనివారం తెలిపారు.బాలిక తల్లిదండ్రులు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాలిక ఇంటి వద్దకు తరచూ వచ్చే రాంబాబు శుక్రవారం కూడా ఇంటికి వచ్చాడు. రాంబాబు బాలికను ఇంటి పక్కకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతుండగా బాలిక నానమ్మ చూసి కేకలు వేసింది. దీంతో రాంబాబు పరారయ్యాడు.
క్షణికావేశం.. తీరని శోకం
రహమత్నగర్: క్షణికావేశంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో విషాదం నింపింది. తాను లేని బతుకు పిల్లలకు ఎందుకనుందోగానీ ముక్కుపచ్చలారని చిన్న పిల్లల గొంతు నులిమేసింది. ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ ఘటనలో తల్లి, కొడుకు మృతి చెందగా పాప మృత్యువుతో పోరాడుతోంది. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తగూడెంకు చెందిన మురళివేణుకు మందమర్రికి చెందిన సత్యవాణి (33)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రుద్రాన్‡్ష (5), తన్విక(2) పిల్లలున్నారు. ప్రైవేటు పనులు చేసుకునే మురళి వేణు తన భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో బోరబండ డివిజన్లోని పెద్దమ్మగుడి నగర్లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. మురళివేణు తండ్రికి కిడ్నీలు పాడైపోవడంతో రెండు రోజులకుకోమారు డయాలసిస్ చేయిస్తుంటాడు.తల్లి హౌస్ కీపింగ్ పనికి వెళ్తోంది. ఐదు సంవత్సరాల క్రితం మురళివేణుకు ట్రాన్స్కో జూనియర్ లైన్మెన్గా ప్రైవేటు ఉద్యోగం వచ్చింది. గత కొన్ని రోజులుగా సత్యవాణి, మురళిల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. తనతో, పిల్లలతో గడపడం లేదంటూ, బయట పనులే ఎక్కువయ్యాయని ఇంట్లో గొడవ పడేవారని తెలిసింది. ఈ క్రమంలోనే తమ పెళ్లి రోజైన శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన సత్యవాణి తన పిల్లలు రుద్రాన్‡్ష, తన్వికల గొంతు నులిమేసింది. వారు చనిపోయారని భావించాక తానూ ఉరి వేసుకుని బలవర్మణం చెందింది.ఆమె అత్త హౌస్ కీపింగ్ పని ముగించుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాక గమనించి 100 డయల్కు సమాచారం అందించింది. సంఘటన స్థలానికి చేరుకున్న బోరబండ ఎస్హెచ్ఓ సురేందర్ గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే తల్లి సత్యవతి, కొడుకు రుద్రాన్‡్ష మృతి చెందారు. కూతురు తన్విక కొన ఊపిరితో ఉండగా చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పాప పరి«స్థితి విషమంగా ఉందని సమాచారం. బోరబండ పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వీడియోలు
పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్
డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!
ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు
పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు
నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్
ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు
నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు
మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు
డ్రగ్స్ కేసు నుండి తప్పించేందుకు రంగంలోకి పెద్ద తలకాయలు
