ఖాజీపేట ప్రేమోన్మాది వెంకటేష్పై కాల్పులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఖాజీపేట విద్యార్థిని చంపిన ప్రేమోన్మాదిపై పోలీసులు కాల్పులు జరిపారు. బాసాపురం చెక్పోస్ట్ దగ్గర పారిపోయేందుకు నిందితుడు యత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడి కాలికి గాయమైంది. కడప రిమ్స్కు తరలించారు. ఘటనలో పోలీసులకూ గాయాలయ్యాయి.ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో బాలిక దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. అగ్రహారంలో ఇళ్లూరు శ్రీనివాసులు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె రామకీర్తన (16) ఉన్నారు. కీర్తన ఖాజీపేటలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివి ఇటీవలే పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటుంది.నిన్న(శుక్రవారం, ఏప్రిల్ 10) ఉదయం కీర్తన తండ్రి శ్రీనివాసులు తన పెద్ద కుమారునితో కలిసి మైదుకూరుకు జీవాల కొనుగోలుకు వెళ్లాడు. తల్లి నాగమణి కూలి పనులకు వెళ్లారు. కీర్తన తమ్ముడు బడికి వెళ్లాడు. దీంతో కీర్తన ఒంటరిగా ఇంటి వద్ద ఉండడంతో ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ వచ్చి కొడవలితో గొంతుకోసి పరారయ్యాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి, అతడి పెద్దకుమారుడు రక్తపుమడుగులో పడి ఉన్న రామకీర్తనను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.అప్పటికి రామకీర్తన మాట్లాడు తుండడంతో విషయం తెలుసుకుని పోలీసు లకు సమాచారం ఇచ్చారు. కీర్తన గొంతు నుంచి రక్తస్రావం జరగకుండా టవల్ను చుట్టి ఆమెను చేతులతో ఎత్తుకుని ఆటో వరకు తీసుకెళ్లారు. అనంతరం కడపకు తీసుకెళ్తుండగా హైవేపైకి రాగానే 108 ఎదురవడంతో అందులో కడప రిమ్స్కు తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందింది.ఆవుల వెంకటేష్ రెండేళ్ల నుంచి ప్రేమ పేరుతో రామకీర్తన వెంటపడుతున్నాడు. ప్రేమించాలని వేధిస్తున్నాడు. పలుమార్లు బాలిక తండ్రితో మీ కూతురు ఇతరులతో ఫోన్ మాట్లాడుతోందంటూ ఫిర్యాదు చేశాడు. దీనికి ఆమె సంగతి మేం చూసుకుంటాం.. నీవు కలగజేసుకోవద్దని శ్రీనివాసులు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రామకీర్తనపై కక్ష పెంచుకున్న వెంకటేష్ శుక్రవారం ఉదయం ఆమెతో ఫోన్లో మాట్లాడే యత్నం చేశాడు. బాలిక స్పందించక పోవడంతో ఆవేశంతో ఇంటికి వెళ్లి కొడవలితో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు.
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు.
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.నవమి రా.8.42 వరకు తదుపరి దశమి, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.10.20 వరకు తదుపరి శ్రవణం, వర్జ్యం: ప.2.34 నుండి 4.16 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.50 నుండి 7.28 వరకు, అమృత ఘడియలు: రా.12.45 నుండి 2.27 వరకు.సూర్యోదయం : 5.50సూర్యాస్తమయం : 6.10రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాల వృద్ధి. ఉద్యోగాలలో ఉత్సాహం.వృషభం: అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాల యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.మిథునం: వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.కర్కాటకం: మిత్రులతో మరింత సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.సింహం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో ఆదరణ. విద్యార్థులకు అనుకూలస్థితి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.కన్య: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువులతో విభేదాలు. ధనవ్యయం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.తుల: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. వాహనాలు కొంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభం. ఉద్యోగాలలో హోదాలు.ధనుస్సు: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.మకరం: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. వాహనసౌఖ్యం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు.కుంభం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.మీనం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో అనుకూలత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.
అన్నా.. దేవుడే పంపిండు!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించిండు. అన్నా.. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది..’ అని ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీమంత్రి టి.జీవన్రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావుతో అన్నారు. బీఆర్ఎస్లో చేరుతున్నట్టు గురువారం ప్రకటించిన జీవన్రెడ్డి శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్తో భేటీ అయ్యారు.తొలుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి జీవన్రెడ్డికి స్వాగతం పలికారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే డా.కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్, మాజీ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. జీవన్రెడ్డి వెంట ఆయన కుమారులు రామచంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి, చంద్రకృష్ణారెడ్డితో పాటు జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేశ్ కూడా ఎర్రవల్లికి వచ్చారు.కాగా జీవన్రెడ్డిని ఆత్మియ ఆలింగనం చేసుకున్న కేసీఆర్.. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి తన నివాసంలోకి ఆహ్వానించారు. ఈ సమయంలోనే జీవన్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ నేతల సమక్షంలో ఇష్టాగోష్టి అనంతరం జీవన్రెడ్డి బృందానికి కేసీఆర్ ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం కేసీఆర్, జీవన్రెడ్డి నడుమ సుదీర్ఘ చర్చ జరిగింది. బీఆర్ఎస్లో జీవన్రెడ్డి చేరికకు తేదీ ఖరారైంది. రాజకీయ పరిస్థితులపై చర్చ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కేసీఆర్, జీవన్రెడ్డి చర్చించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకోవడంతో పాటు, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమం, పదేళ్ల బీఆర్ఎస్ పాలన వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి పాలనా తీరు తదితరాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రస్తుతం తిరోగమన దిశలో ఉందనే కోణంలో సుదీర్ఘ చర్చ జరిగినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యంతో తెలంగాణకు నష్టం జరుగుతోందని ఇరువురు నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. జగిత్యాలలో 2 లక్షల మందితో సభ జీవన్రెడ్డి ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో జరిగే బహిరంగ సభ వేదికగా కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన సన్నాహాలు ప్రారంభించాల్సిందిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు ఆదేశాలు అందాయి. సభ నిర్వహణ బాధ్యతను మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్రెడ్డితో పాటు స్థానిక నేతలకు అప్పగించినట్లు సమాచారం. సభ నిర్వహణకు అనువైన ప్రదేశాన్ని శనివారం బీఆర్ఎస్ నేతలు సందర్శించి ఖరారు చేయనున్నారు. సుమారు 2 లక్షల మందితో సభ నిర్వహించేలా మైదానం ఎంపిక చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. జీవన్రెడ్డికి సెక్రటరీ జనరల్ హోదా జీవన్రెడ్డికి బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవరావు ఈ పదవిలో కొనసాగారు. కాగా జీవన్రెడ్డికి ఉన్న రాజకీయ అనుభవం, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ముఖాముఖి సమావేశం సందర్భంగా పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉంటుందని జీవన్రెడ్డికి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయింది ⇒ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ⇒ మీడియాతో జీవన్రెడ్డి సాక్షి, సిద్దిపేట: తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం పట్టు కోల్పోయిందని మాజీమంత్రి టి.జీవన్రెడ్డి విమర్శించారు. అయితే తన విషయంలో పీసీసీ తప్పు చేసింది కానీ ఏఐసీసీని నిందించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తోందన్నారు. శుక్రవారం కేసీఆర్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఒకప్పుడు పీసీసీ ఏది చెబితే ముఖ్యమంత్రులు అది చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. సీఎం రేవంత్రెడ్డి ఒక్కడే ఏకపక్షంగా, రూలర్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అనేది కేవలం సీఎం అదేశాలను అమలు చేసే ఒక విభాగంగా మారిపోయింది.మరోవైపు రేవంత్రెడ్డి పాలనతో ప్రజలు విసిగిపోయారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి న వాగ్దానాలను నెరవేర్చలేదు. ఈ విషయంలో ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నా..’ అని జీవన్రెడ్డి తెలిపారు. తనకు 14 సార్లు బీ ఫామ్ ఇచ్చారంటే కంటెంట్ ఉన్న నాయకుడినే కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఆయన అన్నారు. కాగా జీవన్రెడ్డి ఈ నెల 20న బీఆర్ఎస్లో చేరుతున్నట్లు మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణలు మీడియాకు తెలిపారు.
వారాలకు వారాలు.. వాకిట్లో ఎదురుచూపులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట గ్యాస్ సంక్షోభం సామాన్య గృహ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్యాస్ బుకింగ్ చేసి వారాలు గడుస్తున్నా డెలివరీ చేయకపోవడంతో నిత్యం ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. క్షేత్ర స్థాయిలో ఓటీపీ సమస్య వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఫలితంగా గ్యాస్ లోడ్ల కోసం సామాన్యులు ఆశగా ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది. మరోవైపు వాణిజ్య గ్యాస్ కొరత హోటల్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా హోటళ్లు, చిరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో 14.2 కిలోల సిలిండర్ను రూ.2వేలు, 19 కిలోల వాణిజ్య సిలిండర్ను రూ.4 వేలు పెట్టి అధికరేట్లకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ఈ ఆర్థిక భారాన్ని పూడ్చుకునేందుకు వ్యాపారులు టిఫిన్లు, కర్రీలపై రూ.10 చొప్పున పెంచి విక్రయిస్తున్నారు. దీంతో రోజువారీ కూలి పనులు చేసుకునే బడుగు జీవులకు నెలకొచ్చే స్వల్ప ఆదాయంలో రూ.2వేల నుంచి రూ.3 వేల వరకూ చిల్లుపడుతోంది. వెరసి సామాన్య ప్రజలు ఇంటిలోవంట చేసుకోలేక.. బయట అధిక రేట్లకు కొని, తినలేక నరకయాతన అనుభవిస్తున్నారు.మూడు వారాలకుపైనే బ్యాక్ లాగ్స్రాష్ట్రంలో గ్యాస్ బుకింగ్స్ బ్యాక్ లాగ్స్ మూడు వారాలకు పైనే ఉంటున్నాయి. అంటే, బుకింగ్ చేసుకున్న 10 నుంచి 21 రోజుల తర్వాత కూడా డెలివరీ అవుతుందన్న గ్యారెంటీ లేదు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే గ్యాస్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 4 వేల టన్నుల గ్యాస్ అవసరం కాగా మూడున్నర రోజులకు మించి నిల్వలు ఉండట్లేదు. రోజువారీ బుకింగ్లతో పోలిస్తే డెలివరీలు పెంచామని ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు సైతం గ్యాస్ సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విద్యార్థులు, వృద్ధులు, చిన్నారులకు పెట్టే ఆహారంలో మెనూలు కుదించడంతో కడుపునిండా తిండి దొరకట్లేదు. ఇక సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారుల పరిస్థితి దయనీయంగా మారింది.బ్లాక్ మార్కెట్ దందాదేశవ్యాప్తంగా గ్యాస్ డెలివరీలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఓటీపీ విధానం ఏపీలో ఘోరంగా విఫలమైంది. గ్యాస్ బుక్ చేసుకున్న వారికి రోజులు గడిచినా ఓటీపీలు రాకపోవడంతో గ్యాస్ కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఇక స్థానిక అధికారులు కొందరు దగ్గరుండి ఓటీపీ లేకుండా గ్యాస్ పంపిణీ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అనుకూల ఏజెన్సీలు, కొందరు ప్రజా ప్రతినిధులు గ్యాస్ను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ జేబులు నింపుకోవడం సమస్యకు మరోకోణం. ఇక్కడ ఓటీపీతో పాటు ఈ–కేవైసీ సమస్య జటిలంగా మారింది. ప్రభుత్వం 90 శాతానికిపైగా ఈ–కేవైసీ చేశామని ఆర్భాటంగా ప్రకటిస్తే.. గ్యాస్ ఏజెన్సీల అసోసియేషన్ 75 శాతం మాత్రమే ఈ–కేవైసీ పూర్తయినట్టు చెప్పడం గమనార్హం.పీఎన్జీ కోసమే ఎల్పీజీ జాప్యం..!రాష్ట్రంలో 1.61 కోట్ల గృహ వినియోగ గ్యాస్ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు సగటున 84 లక్షల వరకు గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసేవారు. ఇప్పుడు అది కాస్త పడిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం వినియోగదారులను పైప్డ్ నేచ్యురల్ గ్యాస్ (పీఎన్జీ)కు మారాలని ఉచిత సలహా ఇస్తోంది. వాస్తవానికి 3 లక్షల పీఎన్జీ కనెక్షన్ల సామర్థ్యం ఉన్న నెట్వర్క్లో కేవలం 65 వేల కనెక్షన్లు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. అధిక డిపాజిట్లు, నెలవారీ బిల్లు కట్టాల్సి రావడంతో ఇది సామాన్యులకు భారంగా మారుతోంది. అందుకే పెద్దగా ఇష్టపడట్లేదు. కానీ, ప్రభుత్వం మాత్రం బలవంతంగా 6 నెలల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో.. ఎల్పీజీ సరఫరాలను కావాలనే జాప్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1.61 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లలో కనీసం 2 శాతం కూడా లేని పీఎన్జీకి విస్తృత ప్రచారం చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకోవడం విస్తుగొలుపుతోంది. దీపం–2.0లో లబ్ధిదారులకు ఖేదంచంద్రబాబు ప్రభుత్వం సామాన్యులను మోసం చేయడమే అజెండాగా పాలన సాగిస్తోంది. ముఖ్యంగా దీపం.–2.0 పథకంలో మహిళలను తీవ్రంగా వంచించింది. ఏపీలో 1.48 కోట్ల రైస్ కార్డుదారులు ఉన్నారు. వీళ్లందరూ అల్పాదాయ, పేద వర్గాలే. ఇక్కడ 1.61 కోట్ల ఎల్పీజీ గృహ కనెక్షన్లలో పేదలే ఎక్కువగా గ్యాస్ వినియోగిస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఏటా 85–90 లక్షల మందికి మాత్రమే ఉచిత గ్యాస్ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. దాదాపు 60 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ఎగనామం పెడుతోంది.
‘అతడు ఇలాగే రెచ్చిపోతే మా పని సులువు’
West Bengal: ‘పీకే’ లేని పందెం.. మమత హ్యాట్రిక్ కొడతారా?
స్విగ్గీకి నందన్ రెడ్డి గుడ్బై.. తప్పుకొంటున్న కోఫౌండర్
మరో 24 గంటల్లో.. ట్రంప్ హాట్ కామెంట్స్
అనూహ్య మార్పు.. జూనియర్ హాకీ జట్టుకు కొత్త కోచ్
పెర్కిట్ ఉదంతంపై కలెక్టర్ సీరియస్
తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు మూడు బస్సు ప్రమాదాలు
హెల్మెట్ పట్టీ పెట్టుకోకపోయినా చలానా!
‘బంతి మీదే దృష్టి.. బౌలర్ వైపు కన్నెత్తి చూడను!’
ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీ ఒలెక్ట్రా కొత్త బ్రాండ్ ఐడెంటిటీ
అవన్నీ పీరియడ్స్లో ఉండగానే చేశా: శ్రీలీల
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
ఆంటీ అనకూడదు
అంతకాలం సీఎంగా ఉండి ఆమె ఇంకేం పనిచేసినట్లు సార్!
చంద్రబాబు సర్కార్ మళ్లీ అప్పు
రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సీజ్ఫైర్ ప్రకటన
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
సముద్ర గర్భంలో రష్యా దుష్ట కార్యక్రమాలు
చారిత్రక ద్వైపాక్షిక సిరీస్ను ప్రకటించిన పాకిస్తాన్
దానికి టైమ్ ఉంది.. కొంచెం ఓపిక పట్టాలి!
బంగారం ధరలు రివర్స్.. కొనేవారికి గుడ్న్యూస్
'విశ్వంభర' విడుదల తేదీ వైరల్
'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం'
అనుష్క శెట్టి.. నమ్మశక్యం కాని రూమర్
బీసీబీ నూతన అధ్యక్షుడి సంచలన నిర్ణయం
ఇరాన్ అణుసంస్థ అధిపతి కీలక వ్యాఖ్యలు
ఉద్యోగం - ఆర్థిక స్వేచ్ఛ: కియోసాకి సూచన
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
హర్మూజ్పై ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన
పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు
‘అతడు ఇలాగే రెచ్చిపోతే మా పని సులువు’
West Bengal: ‘పీకే’ లేని పందెం.. మమత హ్యాట్రిక్ కొడతారా?
స్విగ్గీకి నందన్ రెడ్డి గుడ్బై.. తప్పుకొంటున్న కోఫౌండర్
మరో 24 గంటల్లో.. ట్రంప్ హాట్ కామెంట్స్
అనూహ్య మార్పు.. జూనియర్ హాకీ జట్టుకు కొత్త కోచ్
పెర్కిట్ ఉదంతంపై కలెక్టర్ సీరియస్
తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు మూడు బస్సు ప్రమాదాలు
హెల్మెట్ పట్టీ పెట్టుకోకపోయినా చలానా!
‘బంతి మీదే దృష్టి.. బౌలర్ వైపు కన్నెత్తి చూడను!’
ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీ ఒలెక్ట్రా కొత్త బ్రాండ్ ఐడెంటిటీ
అవన్నీ పీరియడ్స్లో ఉండగానే చేశా: శ్రీలీల
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
ఆంటీ అనకూడదు
అంతకాలం సీఎంగా ఉండి ఆమె ఇంకేం పనిచేసినట్లు సార్!
చంద్రబాబు సర్కార్ మళ్లీ అప్పు
రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సీజ్ఫైర్ ప్రకటన
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
సముద్ర గర్భంలో రష్యా దుష్ట కార్యక్రమాలు
చారిత్రక ద్వైపాక్షిక సిరీస్ను ప్రకటించిన పాకిస్తాన్
దానికి టైమ్ ఉంది.. కొంచెం ఓపిక పట్టాలి!
బంగారం ధరలు రివర్స్.. కొనేవారికి గుడ్న్యూస్
'విశ్వంభర' విడుదల తేదీ వైరల్
'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం'
అనుష్క శెట్టి.. నమ్మశక్యం కాని రూమర్
బీసీబీ నూతన అధ్యక్షుడి సంచలన నిర్ణయం
ఇరాన్ అణుసంస్థ అధిపతి కీలక వ్యాఖ్యలు
ఉద్యోగం - ఆర్థిక స్వేచ్ఛ: కియోసాకి సూచన
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
హర్మూజ్పై ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన
పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు
ఫొటోలు
గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ (ఫొటోలు)
సీతామహాలక్ష్మిలా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)
తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
మిస్ తెలుగు యూఎస్ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)
తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)
గ్రాండ్గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)
సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)
సినిమా
రాకా మూవీ.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తొలిసారి వస్తోన్న మూవీ రాకా. బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేశారు. రాకా పేరుతో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తోడేలు లుక్లో ఉన్న అల్లు అర్జున్ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఐకాన్ స్టార్ నెగెటివ్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా టైటిల్ రివీల్ వేళ టాలీవుడ్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ మూవీలో బన్నీ పారితోషికంపై తెగ చర్చ జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి ఐకాన్ స్టార్ ఎంత ఛార్జ్ చేస్తున్నారనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ నివేదిక ప్రకారం ఈ సినిమాకు అల్లు అర్జున్కు దాదాపు రూ.175 కోట్ల పారితోషికం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా చేస్తోన్న బాలీవుడ్ భామ దీపికా పదుకొణెకు రూ.25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీలో మరో హీరోయిన్గా రష్మిక కనిపించనున్నారని టాక్. నేషనల్ క్రష్కు దాదాపు రూ. 5-7 కోట్లు చెల్లించనున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. షారుఖ్ ఖాన్తో 'జవాన్' తర్వాత అట్లీ డైరెక్ట్ చేస్తోన్న మూవీ కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను దాదాపు రూ. 700 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా దీపిక పదుకొణె, రష్మికలతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఈ చిత్రంలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
‘డెకాయిట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: డెకాయిట్ నటీనటులు: అడివి శేష్,మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల తదితరులునిర్మాత: సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్కథ, స్క్రీన్ప్లే: అడివి శేష్ దర్శకత్వం: షానియల్ డియోసంగీతం: భీమ్స్ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్విడుదల తేది: ఏప్రిల్ 10, 2026అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన చిత్రం ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. టీజర్, ట్రైలర్తో అంచనాలు పెంచేసిన ఈ టీం మరి ఆడియెన్స్ని మెప్పించిందా? లేదా? అన్నది చూద్దాం.కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ.ఎలా తీశారంటే?..ప్రేమ కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రేమ కథల్ని ఎంత కొత్తగా, ఎంత అట్రాక్టివ్గా చెప్పామన్నదే విజయంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఆ విషయంలో డెకాయిట్ కొంత వరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రేమకు కులం అడ్డు అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇందులోనే అదే పాయింట్ను చూపించారు. కానీ ఇందులోని ప్రేమ కథను, ప్రేమికుల్ని కాస్త కొత్తగా, భిన్న శైలిలో చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రేయసి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు హీరో. ఇద్దరూ కలిసి దొంగ తనాలు కూడా చేస్తుంటారు. ఇంటర్వెల్కు ఓ చిన్న పాటి ట్విస్ట్లాంటిది ఇస్తారు.ఇక సెకండాఫ్లో హీరోకి అసలు విషయం తెలియడం, గతానికి సంబంధించిన నిజం, తన కోసం ప్రేయసి చేసిన త్యాగం ఇవన్నీ తెలుస్తాయి. ఇక ప్రేయసికి ఉన్న ఇబ్బందిని తీర్చేందుకు ప్రియుడు చేసే త్యాగంతో క్లైమాక్స్ కాస్త బరువెక్కినట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ ట్విస్ట్ కూడా ఆడియెన్స్ ముందే పసిగట్టేస్తారు. కాబట్టి చివరకు అదేదో పెద్ద ట్విస్ట్, త్యాగంలా అనిపించదు. పైగా ఇది వరకు సినిమాల్లో చూసేసి ఉండటంతో ఇక్కడ ఆ ట్విస్ట్ అంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు.అయితే ఈ చిత్రంలో కరోనా సమయంలో హాస్పిటల్స్ చేసిన దోపిడి, వ్యవహరించిన తీరుని మాత్రం బాగానే చూపించారు. ఈ సినిమాలో చాలా వరకు కరోనా నాటి పరిస్థితులు, అప్పటి వైద్య వ్యవస్థ గురించే చర్చించారు. ఆ పార్ట్ వరకు డెకాయిట్ ఆడియెన్స్ని మెప్పించే ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు.ఎలా చేశారంటే?అడివి శేష్ ఈ సారి కాస్త కొత్తగా కనిపించాడు. యాసలోనూ చాలా వరకు మాడ్యులేషన్ చూపించాడు. ఆ యాస వల్లే కొన్ని డైలాగ్స్ కూడా అర్థం కాకపోవచ్చు. లుక్స్, యాక్షన్ పరంగా అడివి శేష్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. ఇక మృణాల్కి మరోసారి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. సరస్వతి అలియాస్ జూలియట్గా మృణాళ్ ఆడియెన్స్ మరోసారి మెస్మరైజ్ చేస్తుంది. ఇక అనురాగ్ కశ్యప్ పాత్ర ఇంపాక్ట్ చూపిస్తుంది. సునీల్, ప్రకాష్ రాజ్ కారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. ఆర్ఆర్ సైతం సరికొత్తగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అయితే విజువల్స్ గురించి చెప్పుకోవాలి. కెమెరా వర్క్ టాప్ నాచ్లో ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా అనిపిస్తాయి. ప్రతీ పైసాకి తగ్గ వర్క్ తెరపై కనిపిస్తుంది.
భర్తతో విడాకులు.. అందుకే భరణం వదులుకున్నా: బుల్లితెర నటి
ప్రముఖ బాలీవుడ్ నటి డెల్నాజ్ ఇరానీ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. హిందీలో పలు సీరియల్స్తో పాటు మూవీస్లో మెప్పించిన నటి వైవాహిక బంధం, విడాకులపై నోరు విప్పారు. తన భర్త రాజీవ్ పాల్తో విడాకుల సమయంలో తాను భరణం కంటే మనశ్శాంతికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. అందుకే తనకు డివోర్స్ తర్వాత ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆమె వెల్లడించారు. తాజాగా 'ది మేల్ ఫెమినిస్ట్' కార్యక్రమానికి హాజరైన ఈ విషయాన్ని పంచుకున్నారు.తన విడాకుల వ్యవహారం చాలా కష్టంగా సాగిందని డెల్నాజ్ ఇరానీ తెలిపారు. పార్సీ కుటుంబం నుంచి వచ్చిన తాను మొదట్లో విడిపోవాలని అస్సలు అనుకోలేదని చెప్పింది. ఆ తర్వాత ఒకరినొకరు తేలికగా తీసుకోవడంతోనే మా బంధం విచ్ఛిన్నమైందని పంచుకుంది. వ్యక్తిగత సవాళ్ల వల్ల నా పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందన్నారు. అదే సమయంలో నా తండ్రి గుండెపోటుకు గురై మరుసటి ఏడాదే మరణించారని తెలిపింది.మాలో ఒకరు విడాకుల కోసం ఒత్తిడి చేయగా.. మరొకరు పూర్తిగా సిద్ధంగా లేరని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ నేను ఎలాంటి భరణం కోరకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. వివాదాల కంటే శాంతినే కోరుకున్నా.. స్వతంత్రంగా తన జీవితాన్ని మళ్లీ జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నానని ఆమె స్పష్టం చేశారు.కాగా.. డెల్నాజ్, రాజీవ్ 1993లో 'పరివర్తన్' సీరియల్ సెట్స్లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దశాబ్దానికి పైగా సాగిన తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ 2010లో వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. 2012లో ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకులు తీసుకున్న కొద్దికాలానికే ఇద్దరు కలిసి బిగ్ బాస్ షోలో కనిపించారు. ప్రస్తుతం నటి డెల్నాజ్.. డీజే పెర్సీ కర్కారియా అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నారు. ఇటీవలే వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
'మిమ్మల్ని చూసి నిజంగా గర్వపడుతున్నా'.. ఐకాన్ స్టార్ ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులపై ప్రశంసలు కురిపించారు. సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టడాన్ని అభినందించారు. ప్రతి ఏటా ఒక మంచి పని చేయడం.. హెచ్పీవీ వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించిన అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. మీరంతా కలిసి అద్భుతమైన పని చేశారని కొనియాడుతూ ట్వీట్ చేశారు.అల్లు అర్జున్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే కార్యక్రమాన్ని స్వీకరించి.. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా ప్రోగ్రామ్ చేపట్టిన నా అభిమానులందరినీ చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నా. మీరందరూ అద్భుతమైన పని చేశారు. మీ ప్రతి కార్యాచరణ చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోతోంది. మీ శక్తి అంతా మంచి పనులకే కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూసి నిజంగా గర్వపడుతున్నా. ఈ గొప్ప కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తమ అమూల్యమైన మద్దతు, ప్రోత్సాహం అందించిన గౌరవనీయ మంత్రులు, నాయకులు, ప్రభుత్వ అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల్లో శాశ్వతమైన సానుకూల ప్రభావాన్ని సృష్టించే కార్యక్రమాల కోసం మనమందరం కలిసికట్టుగా నిలబడదాం.' అంటూ పోస్ట్ చేశారు. I am truly soo proud of all my fans for embracing the “One Good Deed Every Year” initiative and taking up a meaningful programme like the #HPVVaccine Awareness Drive. You guys have outdone yourself and it truly fills my heart seeing every activity . Soo glad all of your energy is…— Allu Arjun (@alluarjun) April 10, 2026
క్రీడలు
వారెవ్వా వైభవ్
విజయలక్ష్యం ఎంతైతేనేమి... ప్రత్యర్థి ఎవరైతేనేమి... 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి లెక్కే లేదు... అతనికి తెలిసిందల్లా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటమే... ఐపీఎల్లో మరోసారి అతను తన విధ్వంసక రూపాన్ని ప్రదర్శించాడు. ఫలితంగా రాజస్తాన్ రాయల్స్కు వరుసగా నాలుగో విజయం దక్కగా, బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. 202 పరుగుల ఛేదనలో వైభవ్ 78 పరుగుల సహాయంతో 49 బంతుల్లోనే 129కి చేరిన రాజస్తాన్కు మిగిలిన 73 పరుగులు రాబట్టడంలో ఇబ్బంది రాలేదు. ధ్రువ్ జురేల్ కూడా అర్ధ సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. గువాహటి: ఐపీఎల్లో మాజీ విజేత రాజస్తాన్ రాయల్స్ దూసుకుపోతోంది. శుక్రవారం దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో రాజస్తాన్ ఆరు వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయంకంటే 70 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.కెప్టెన్ రజత్ పాటీదార్ (40 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా, విరాట్ కోహ్లి (16 బంతుల్లో 32; 7 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. అనంతరం రాజస్తాన్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి గెలిచింది. వైభవ్ సూర్యవంశీ (26 బంతుల్లో 78; 8 ఫోర్లు, 7 సిక్స్లు) చెలరేగిపోగా, ధ్రువ్ జురేల్ (43 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. రాణించిన కోహ్లి... ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే సాల్ట్ (0) వెనుదిరిగినా.... కోహ్లి కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. ఆర్చర్ తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను సందీప్ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. పడిక్కల్ (14) విఫలం కాగా, చక్కటి బంతితో కోహ్లిని బౌల్డ్ చేసి బిష్ణోయ్ దెబ్బ తీశాడు. పవర్ప్లేలో ఆర్సీబీ 61 పరుగులు చేయగా, తక్కువ వ్యవధిలో కృనాల్ పాండ్యా (1), జితేశ్ శర్మ (5), టిమ్ డేవిడ్ (13) అవుటయ్యారు. షెఫర్డ్ (11 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుకు జడేజా అడ్డుకట్ట వేశాడు. ఆఖరి 6 ఓవర్లలో 76 పరుగులు... ఆర్సీబీ స్కోరు 14 ఓవర్లలో 125/7... తడబడుతూ ఆడిన కెపె్టన్ పాటీదార్ 26 బంతుల్లో 27 పరుగులే చేయగా... తప్పనిసరి స్థితిలో బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (15 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు)ను ఇంపాక్ట్ సబ్గా జట్టు బరిలోకి దిగింది. ఈ దశలో పాటీదార్ చెలరేగిపోయాడు. తర్వాతి 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో అతను 36 పరుగులు రాబట్టాడు. బర్గర్, బిష్ణోయ్ ఓవర్లలో అతను రెండేసి సిక్సర్లు బాది 35 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అతను అవుటైన తర్వాత వెంకటేశ్ బాధ్యత తీసుకున్నాడు. సందీప్ వేసిన చివరి ఓవర్లో వెంకటేశ్ ఫోర్, 2 సిక్స్లు బాదడంతో స్కోరు 200 దాటింది. జురేల్ జోరు... భారీ ఛేదనలో రాజస్తాన్ వేగంగా దూసుకుపోయింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన హాజల్వుడ్ ఓవర్లో 2 సిక్స్లు బాదిన యశస్వి జైస్వాల్ (13) అదే ఓవర్లోనే వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్ వైభవ్ తనదైన శైలిలో చెలరేగిపోగా, జురేల్ కూడా దూకుడు ప్రదర్శించాడు. అభినందన్ ఓవర్లో జురేల్ వరుసగా 4, 6, 4, 0, 6, 4తో ఏకంగా 24 పరుగులు సాధించడంతో పవర్ప్లే ముగిసేసరికే స్కోరు 97కు చేరింది. ఎట్టకేలకు కృనాల్ వరుస బంతుల్లో వైభవ్, హెట్మైర్ (0)లను అవుట్ చేయగా, పరాగ్ (3) విఫలమయ్యాడు. ఈ దశలో రాయల్స్ కాస్త నెమ్మదించింది. వరుసగా 25 బంతుల పాటు బౌండరీనే రాలేదు. అయితే జురేల్, రవీంద్ర జడేజా (25 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్) సంయమనంతో ఆడి జట్టును గెలిపించారు. మళ్లీ అదే బాదుడు... వైభవ్ సూర్యవంశీ మరోసారి తన స్థాయిని, సత్తాను ఈ మ్యాచ్లోనూ ప్రదర్శించాడు. భువీ వేసిన మొదటి ఓవర్లో 2 ఫోర్లతో మొదలు పెట్టిన అతను అభినందన్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. గత మ్యాచ్లో బుమ్రాపై చెలరేగిన తరహాలోనే ఈసారి మరో అంతర్జాతీయ స్టార్ బౌలర్ హాజల్వుడ్ పని పట్టాడు. హాజల్వుడ్ ఓవర్లో వైభవ్ వరుసగా 4, 4, 4, 6తో చెలరేగిపోయాడు. భువీ వేసిన తర్వాతి ఓవర్లోనూ 2 సిక్స్లు, ఫోర్ బాదిన అతను 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాజస్తాన్ను నిలువరించే ప్రయత్నంలో పార్ట్టైమర్ డేవిడ్ను ఆర్సీబీ బౌలింగ్కు దింపగా, వైభవ్ వరుసగా రెండు సిక్సర్లతో దాడి చేశాడు. సెంచరీ దిశగా దూసుకుపోతున్న అతడిని చివరకు కృనాల్ నిలువరించగలిగాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 0; కోహ్లి (బి) బిష్ణోయ్ 32; పడిక్కల్ (సి) హెట్మైర్ (బి) ఆర్చర్ 14; పాటీదార్ (సి) ఫెరీరా (బి) సందీప్ 63; కృనాల్ (సి) హెట్మైర్ (బి) బిష్ణోయ్ 1; జితేశ్ (ఎల్బీ) (బి) బ్రిజేశ్ 5; డేవిడ్ (సి) హెట్మైర్ (బి) బ్రిజేశ్ 13; షెఫర్డ్ (సి) బ్రిజేశ్ (బి) జడేజా 22; వెంకటేశ్ (నాటౌట్) 29; భువనేశ్వర్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–0, 2–45, 3–58, 4–62, 5–76, 6–94, 7–125, 8–166. బౌలింగ్: ఆర్చర్ 3–0–33–2, బర్గర్ 3–0–32–0, సందీప్ 4–0–47–1, రవి బిష్ణోయ్ 4–0–32–2, జడేజా 2–0–14–1, బ్రిజేశ్ 4–0–37–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 13; వైభవ్ (సి) కోహ్లి (బి) కృనాల్ 78; జురేల్ (నాటౌట్) 81; హెట్మైర్ (సి) హాజల్వుడ్ (బి) కృనాల్ 0; పరాగ్ (సి) కృనాల్ (బి) హాజల్వుడ్ 3; జడేజా (నాటౌట్) 24 ; ఎక్స్ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో 4 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–21, 2–129, 3–129, 4–134. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–37–0, హాజల్వుడ్ 4–0–44–2, అభినందన్ 3–0–54–0, కృనాల్ పాండ్యా 4–0–30–2, డేవిడ్ 1–0–18–0, షెఫర్డ్ 2–0–18–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X హైదరాబాద్ వేదిక: న్యూ చండీగఢ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచిచెన్నై X ఢిల్లీ వేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
నాన్న త్యాగం...ధోనిపై అభిమానం
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ ముకుల్ చౌదరీ గురువారం కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో ఏడు సిక్సర్లతో మోత మోగించి తన జట్టును గెలిపించాడు. అయితే ఈ ఏడింటిలో తాను కొట్టిన మొదటి సిక్సర్ అన్నింటికంటే ఎక్కువగా నచ్చిందని ముకుల్ మ్యాచ్ తర్వాత చెప్పాడు. వైభవ్ అరోరా వేసిన 17వ ఓవర్లో ఈ సిక్స్ వచ్చింది. అరోరా వేసిన యార్కర్ను హెలికాప్టర్ షాట్తో లాంగాన్ మీదుగా సిక్స్ బాదిన ముకుల్ తాను ఆరాధించే ధోనిని గుర్తుకు తెచ్చాడు. ధోనిపై ఇష్టంతో క్రికెట్లోకి వచ్చిన ముకుల్ ఇప్పుడు ఒక్క ఐపీఎల్ మ్యాచ్తో స్టార్గా మారిపోయాడు. – సాక్షి క్రీడా విభాగంరాజస్తాన్కు చెందిన ముకుల్ ఐపీఎల్లో తన తొలి సీజన్ ఆడుతున్నాడు. మొదటి మ్యాచ్లో 14 పరుగులకే పరిమితమైన అతను రెండో మ్యాచ్లో 2 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో ఆడిన ఐదు బంతుల్లోనూ అతను కాస్త తడబడ్డాడు. అయితే ఎక్కువగా ఆందోళన చెందవద్దని, నచ్చినట్లుగా ఆడమని కెపె్టన్ రిషభ్ పంత్ ధైర్యాన్నందించాడు. దాంతో కోల్కతాతో మ్యాచ్కు ముందు తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ముకుల్ అన్నాడు. ‘ఐదు మ్యాచ్లు ఆడినా 50 మ్యాచ్లు ఆడినా ఎవరిపైనైనా ఒత్తిడి సహజం. అందులోనూ నేను తొలిసారి ఐపీఎల్లో ఆడుతున్నాను. కాబట్టి జట్టు మనపై నమ్మకం ఉంచినప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్లలో కూడా ఒత్తిడి ఉంటుంది. దేశవాళీ క్రికెట్లో కూడా మంచి ప్రదర్శన తర్వాతే ఇక్కడి వరకు వచ్చాం. అయితే ఇక్కడ బాగా ఆడినప్పుడు వచ్చే గుర్తింపు, పేరు ఎంతో భిన్నం. బయటి అంశాల గురించి పట్టించుకోకుండా మనపై మనం నమ్మకం ఉంచి ఆడటం ముఖ్యం’ అని ముకుల్ వ్యాఖ్యానించాడు. ఆ షాట్ అంటే ఇష్టం... అరోరా బౌలింగ్లో ముకుల్ కొట్టిన హెలికాప్టర్ షాట్పై అన్ని వైపుల నుంచి నుంచి ప్రశంసలు కురిశాయి. ‘మొదటి నుంచి నేను ధోనికి వీరాభిమానిని. వికెట్ కీపర్ అయిన నేను ధోనిలాగే ఏడో స్థానంలో ఆడుతున్నా. ఆయన మ్యాచ్లను ముగించే తీరు నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచే హెలికాప్టర్ షాట్ను ఎంతో ప్రాక్టీస్ చేశాను. ఆ షాట్ నాకు చాలా నచ్చేది. యార్కర్ను ధోని సిక్సర్గా మలిచేవాడు. అలాంటి బంతిని సిక్స్ కొట్టడం అంటే బౌలర్పై మన ఆధిపత్యం ఏమిటో తెలుస్తుంది. భారీ షాట్లు కొట్టే విధంగా బలమైన శరీర నిర్మాణం నాకుంది. నేను సాధన కూడా చాలా చేస్తాను. ప్రతీ రోజూ దాదాపు 100–150 సిక్సర్లు ప్రాక్టీస్ చేస్తా. గత ఐదారు నెలలుగా ఇదే తరహాలో ఆడటం ఇప్పుడు ఫలితం చూపించింది’ అని 21 ఏళ్ల ముకుల్ వివరించాడు. దేశవాళీలో చెలరేగి... నాలుగు నెలల క్రితం సరిగ్గా ఇదే తరహా ఆటతో ముకుల్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో దృష్టిలో పడ్డాడు. దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో అప్పటికే సత్తా చాటిన ముకుల్ ఢిల్లీతో జరిగిన పోరులో మరింతగా చెలరేగాడు. ఐపీఎల్లో గురువారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లాగానే రాజస్తాన్ 176 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.ముకుల్ 26 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లతో అజేయంగా 62 పరుగులు చేసి చివరి బంతికి సిక్స్తో జట్టును గెలిపించాడు. ఆయుశ్ బదోని వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి కావాల్సిన 25 పరుగులను అతను రాబట్టడం విశేషం. ఈ ఇన్నింగ్స్ తర్వాతే వేలంలో లక్నో రూ.2 కోట్ల 60 లక్షలకు తీసుకుంది. గతంలో ఈ ఫీట్ నమోదు చేసిన కారణంగానే తనపై తనకు నమ్మకం ఉందని, ఇప్పుడు దానిని పునరావృతం చేశానని అతను చెప్పాడు. లాంగర్ ప్రోత్సాహంతో... ఐపీఎల్లో లక్నో జట్టుకు ఎంపికైన తర్వాత టీమ్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఈ కుర్రాడిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. తన బ్యాటింగ్పై నమ్మకంతో పాటు భారీ సిక్స్లు కొట్టగల సామర్థ్యం కోచ్ను ఆకట్టుకున్నాయి. రాబోయే కొన్ని రోజుల్లో ‘అత్యంత ప్రమాదకర’ మిడిలార్డర్ బ్యాటర్గా ముకుల్ను తీర్చిదిద్దుతానని చెప్పి కోచ్ ప్రోత్సాహాన్నందించాడు. ‘అంత పెద్ద కోచ్ నా గురించి ఇలా మాట్లాడాడంటే నాలో ఏదో ప్రత్యేకత ఆయనకు కనిపించి ఉండవచ్చు. ప్రతీ రోజూ 15 నిమిషాల పాటు నా కోసం ప్రత్యేకంగా కేటాయించి సాధన చేయించడమే కాకుండా నేను ఆడాల్సిన ఆట శైలి గురించి వివరించేవారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చెలరేగాలని నేనూ గట్టిగా కోరుకున్నా. ఇప్పుడు నా ఆటను చూపించాను’ అని ముకుల్ వెల్లడించాడు. రెండేళ్ల క్రితం బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా తొందరపాటు ప్రదర్శించే వాడినని... అయితే సాధన తర్వాత చివరి వరకు నిలబడి మ్యాచ్ను గెలిపించాలనే పట్టుదల తనలో పెరిగిందని ముకుల్ గుర్తు చేసుకున్నాడు. కోల్కతాతో పోరులో బౌలర్ ఏదో ఒక దశలో తప్పు చేస్తాడనే నమ్మకంతోనే వేచి చూశానని చెప్పాడు. తన ఈ ప్రదర్శనను తండ్రికి అంకితం ఇస్తున్నట్లు అతను చెప్పాడు.కుటుంబ త్యాగాలతో... ముకుల్ తండ్రి దలీప్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన తన పెళ్లి కూడా కాకముందే కొడుకు పుడితే క్రికెటర్ను చేయాలని నిర్ణయించుకున్నాడు. ముకుల్ను 10 ఏళ్ల వయసులో క్రికెట్లోకి తీసుకొచ్చిన సమయంలో తండ్రి ఆరి్థక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. కొడుకు శిక్షణలో అండగా నిలిచేందుకు ముందుగా ఆయన తన ఉద్యోగాన్ని వదిలేశాడు. తనకు వాటాగా వచ్చిన ఇంటిని అమ్మేసి ముకుల్ శిక్షణ కోసం వెచ్చించాడు. రాజస్తాన్లోని స్వస్థలం ఝన్ఝునులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో జైపూర్లోని ఆరావళి అకాడమీలో చేరి్పంచాడు. ఆరంభంలో మీడియం పేసర్గా మొదలు పెట్టినా... అకాడమీలో వికెట్ కీపర్లు ఎవరూ లేకపోవడంతో అవకాశాల కోసం అటువైపు మళ్లాడు. అయితే భారీ షాట్లు ఆడే ముకుల్ శైలిని గుర్తించిన కోచ్లు ఆ దిశగా బ్యాటింగ్లో ప్రోత్సహించారు. ఆరంభంలో సరైన అవకాశాలు రాకపోయినా ఆ తర్వాత అతని ఆట పదునెక్కింది. బీసీసీఐ అండర్–23 టోర్నీలో రాజస్తాన్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా కెరీర్ దూసుకుపోయింది. టి20ల్లో మారిన పవర్ హిట్టింగ్ను మరింత సాధన చేసేందుకు వీలుగా మధ్యలో కొన్ని నెలల పాటు అతను ఢిల్లీలోని గుర్గావ్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అతని కఠోర శ్రమ, పట్టుదల ఇప్పుడు ఐపీఎల్లో ఫలితం చూపించింది.
ఆయుశ్ సంచలనం
నింగ్బో (చైనా): బరిలోకి దిగిన తొలిసారే భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో పోటీపడుతున్న ఈ కర్ణాటక షట్లర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2024 ఆసియా చాంపియన్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ ఆయుశ్ 23–21, 21–17తో సంచలన విజయం సాధించాడు. 54 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో ఆయుశ్ నిలకడగా ఆడుతూ క్రిస్టీని కట్టిపడేశాడు. తొలి గేమ్లో 18–20తో వెనుకబడ్డ ఆయుశ్ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి 21–20తో ముందంజ వేశాడు. ఆ తర్వాత క్రిస్టీ 21–21తో స్కోరును సమం చేయగా... ఆయుశ్ ఈసారి వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్ను దక్కించుకున్నాడు. తొలి గేమ్ను సొంతం చేసుకున్న ఉత్సాహంలో ఆయుశ్ రెండో గేమ్లో మరింత జోరు పెంచాడు. తొలుత 5–2తో, ఆ తర్వాత 8–6తో, 14–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. క్రిస్టీ కోలుకునే ప్రయత్నం చేసినా ఆయుశ్ ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా సాధించిన ఆధిక్యాన్ని కాపాడుకొని చివరకు రెండో గేమ్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, 2023 విశ్వవిజేత కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్)తో ఆయుశ్ తలపడతాడు. 7 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో పతకం గెలిచిన ఏడో భారతీయ ప్లేయర్ ఆయుశ్ శెట్టి. గతంలో హెచ్ఎస్ ప్రణయ్ (2018లో కాంస్యం), అనూప్ శ్రీధర్ (2007లో కాంస్యం), పుల్లెల గోపీచంద్ (2000లో కాంస్యం), ప్రకాశ్ పదుకొనే (1976లో కాంస్యం), దినేశ్ ఖన్నా (1965లో స్వర్ణం, 1969లో కాంస్యం), సురేశ్ గోయల్ (1965లో కాంస్యం) ఈ ఘనత సాధించారు.
దానికి టైమ్ ఉంది.. కొంచెం ఓపిక పట్టాలి!
ముంబై: ఐపీఎల్లో మెరుపులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీపై మరింత ఒత్తిడి పెంచడం సరికాదని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నాడు. 15 ఏళ్ల కుర్రాడిని అలా అతడి ఇష్టానికి వదిలేయాలని ఇప్పటి నుంచే అతడి మనసులో జాతీయ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఒత్తిడిని నింపొద్దని ఈ స్పిన్ దిగ్గజం హితవు పలికాడు. ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ కూడా టీనేజ్ వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి... ఆ తర్వాత బ్యాటింగ్ లెజెండ్గా ఎదగగా... ఇప్పుడు ఆ అవకాశం సూర్యవంశీకి ఉందని పలువురు విశ్లేషిస్తున్న నేపథ్యంలో కుంబ్లే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘అసాధారణ ప్రతిభ గల వైభవ్ సూర్యవంశీ దూకుడును ఆపడం కష్టతరమే. అయితే తొందరపాటు అంచనాలు యువ క్రీడాకారుడిపై అనవసర ఒత్తిడి పెంచుతాయి. ఈ వయసులోనే అతడు చక్కగా ఆడుతున్నాడు. అయితే మరో రెండు నెలల్లో నువ్వు టీమిండియాకు ఆడాలి అని చెప్పడం మాత్రం అతడిపై కచ్చితంగా ఒత్తిడి పెంచుతుంది. మరో పదేళ్ల తర్వాత కూడా వైభవ్ వయసు ఇంకా పాతికేళ్లే ఉంటుంది’ అని కుంబ్లే అన్నాడు. క్రికెట్లో విజయవంతం కావడానికి ఒక నిర్దిష్టమైన మార్గం అంటూ ఏదీ లేదని... నిరంతరం శ్రమిస్తూ ఎప్పటికప్పుడు మెరుగవుతూ ముందుకు సాగితే ఫలితాలు అనుకూలంగా వస్తాయని కుంబ్లే పేర్కొన్నాడు. ‘ఈ ఏడాదో, వచ్చే ఏడాదో అతడి పేరు సెలెక్టర్ల పరిశీలనకు రావడం ఖాయం. ఇప్పటికే అతడి ఆటతీరును అంతా నిశితంగా పరిశీలిస్తున్నారు. కాస్త ఓపిక పట్టడం ముఖ్యం’ అని వివరించాడు. క్రీడా సంస్కృతి పెరగాలి... భారత్కు ఒలింపిక్స్ ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కితే అది దేశ క్రీడారంగంలో కీలక మలుపుగా నిలుస్తుందని కుంబ్లే అన్నాడు. మౌలిక వసతులు పెంపొందడంతో పాటు... కొత్త తరం అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. ‘భారీ క్రీడా పోటీలతో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. 1982లో జరిగిన ఆసియా క్రీడలు నాపై చాలా ప్రభావం చూపాయి. దీంతో దేశంలో క్రీడా సంస్కృతి పెంపొందుతుంది’ అని కుంబ్లే అన్నాడు. ఏదో ఒక రోజు భారత ఫుట్బాల్ జట్టు కూడా ఫిఫా ప్రపంచకప్లో పాల్గొంటుందని జంబో ఆశాభావం వ్యక్తం చేశాడు.
న్యూస్ పాడ్కాస్ట్
అమరావతిలో నీకింత.. నాకింత... ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన ‘బీఎస్సార్’కు రాజధానిలో భారీగా పనుల అప్పగింత
ఆంధ్రప్రదేశ్లో ‘సీఎంఆర్ఎఫ్’ నిధులు స్వాహా... టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి సీఎంవో వరకూ వసూళ్ల పర్వం
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మావిగన్.. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు: వైఎస్ జగన్
ఇరాన్ను తుడిచిపెట్టేస్తాం, వారి నాగరికతను నాశనం చేస్తాం. తీవ్రంగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
మళ్లీ పెరిగిన వెండి, బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీకి దినదిన గండం... ఐదో రోజూ స్తంభించిన ఓపీ, అత్యవసర వైద్యసేవలు
లోక్సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ... రెండు ఫైటర్ జెట్లను కూల్చివేసిన ఇరాన్
వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా చర్చ...
అవినీతి కోసమే అమరావతి... కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం..
బిజినెస్
బంగారం ధరల్లో మార్పు.. అమాంతం తగ్గిన రేటు!
శుక్రవారం ఉదయం.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు సాయంత్రానికే ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేటులో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈ కథనంలో లేటెస్ట్ పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,40,250 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి 1,39,650 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే రేటు రూ.600 తగ్గినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ.1,53,000 నుంచి రూ.152350 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పు జరిగింది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల తులం బంగారం 1,53,150 రూపాయల నుంచి రూ.1,52,500 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,40,400 రూపాయల నుంచి 1,39,800 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల తులం రేటు 1,41,250 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,54,090 రూపాయల వద్ద ఉంది. అంటే ఈ రోజు ఉదయం ధరలకు, సాయంత్రం ధరలకు ఎలాంటి తేడా లేదు.వెండి ధరలువెండి ధరలు ఈ రోజు పెరుగుదల దిశగా పయనించాయి. దీంతో కేజీ సిల్వర్ ధర హైదరాబాద్లో 2.65 లక్షలు. కాగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.60 లక్షలు వద్ద ఉంది.
'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం'
అమెరికాలో నివసిస్తున్న ఒక ఎన్నారై జంట.. తాము పనిచేసే కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత భారతదేశానికి తిరిగి రావాలని ప్లాన్ వేసుకున్నారు. 2025 అక్టోబర్లో మహిళ ఉద్యోగం కోల్పోగా, ఇటీవల ఒరాకిల్ లేఆఫ్స్ సమయంలో ఆమె భర్తకు కూడా ఉద్యోగం పోయింది. 60 రోజుల గడువులో.. ఇండియాకు రావాలనుకుంటున్న సమయంలో జాబ్ కోసం నెటిజన్ల సలహాలు అడిగారు. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన తరువాత నుంచి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, H4 వీసా కోసం ఎదురుచూశానని ఆమె పోస్టులో వెల్లడించారు. అయితే సరైన అవకాశాలు లేకపోవడంతో పరిస్థితి కష్టంగా మారింది. ఇదే సమయంలో తన భర్త కూడా ఉద్యోగం కోల్పోయారు. అతని H1B వీసాకు సంబంధించి PERM, I-140 ప్రాసెస్ లేకపోవడంతో, వీసా రిన్యూవల్ లేదా దీర్ఘకాలికంగా అమెరికాలో ఉండే అవకాశం లేకుండా పోయింది. దీంతో అతనికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే మిగిలింది.ఈ పరిస్థితుల్లో.. ఆ దంపతులు అమెరికాలో కొనసాగడం సాధ్యం కాదని భావించి, భారతదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జూలై నాటికి ఇండియాకు వెళ్లి అక్కడ కొత్తగా జీవితం ప్రారంభించాలని వారు ఆలోచిస్తున్నారు. “ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగం ఎలా దొరుకుతుంది? ఎంత సమయం పడుతుంది? కెరీర్ను ఎలా మళ్లీ ప్రారంభించాలి?” వంటి ప్రశ్నలు అడిగారు. దీనికి నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి.ఇదీ చదవండి: 'యాప్లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓకొంతమంది ''భారతదేశంలో స్కిల్స్ ఉంటే ఉద్యోగ అవకాశాలు బాగానే ఉంటాయి'' అని ప్రోత్సహించారు. మరికొందరు ''ఇక్కడ కూడా ఉద్యోగ మార్కెట్ కఠినంగానే ఉంది, కానీ అమెరికాతో పోలిస్తే స్థిరత్వం మెరుగ్గా ఉండొచ్చు'' అని చెప్పారు. ఇంకొందరు మాత్రం ''ముందు మానసికంగా స్థిరపడండి, తర్వాత ప్లానింగ్ చేసుకోండి'' అని సలహా ఇచ్చారు.
'యాప్లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓ
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతూ.. దాదాపు అన్ని రంగాల్లోనూ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు తీసుకొస్తోంది. 2007లో యాపిల్ కంపెనీ ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు.. ఫోన్ పరిశ్రమలో ఒక మహత్తర మార్పు చోటుచేసుకుంది. అప్పటివరకు మనం ఉపయోగించిన కీప్యాడ్ ఫోన్లు నెమ్మదిగా అంతరించిపోయి, టచ్స్క్రీన్ ఫోన్లు వచ్చేశాయి. ఇప్పడూ స్మార్ట్ఫోన్లను మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి.నథింగ్ సీఈఓ 'కార్ల్ పీ' అభిప్రాయం ప్రకారం.. గత ఇరవై సంవత్సరాలుగా స్మార్ట్ఫోన్ల వినియోగంలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. మనం ఇంకా లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్, యాప్లు, యాప్ స్టోర్లకు పరిమితమై ఉన్నాం. ఏ చిన్న పని చేయాలన్నా మనం అనేక యాప్లను ఉపయోగిస్తూ.. సమయం వృధా చేస్తున్నాం. ఇది కొంత క్లిష్టంగా మారింది.ప్రస్తుతం ఏఐ ఒక కొత్త విప్లవానికి దారితీయనుంది. భవిష్యత్తులో యాప్లు పూర్తిగా మాయమైపోయి.. వాటి స్థానంలో ఏఐ ఏజెంట్స్ రానున్నాయి. అలవాట్లు, ఇష్టాలు, అవసరాలను అర్థం చేసుకుని మన తరఫున పనులను స్వయంగా నిర్వహిస్తాయి. ఉదాహరణకు, ఒక స్నేహితుడితో కాఫీకి వెళ్లాలని అనుకుంటే, మనం వేర్వేరు యాప్లను ఉపయోగించకుండా, ఏఐ మన కోసం సమయం నిర్ణయించి, స్థలం ఎంపిక చేస్తుందన్నమాట.ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇచ్చే ఆదేశాలపై ఆధారపడి పనిచేస్తుంది. కానీ భవిష్యత్తులో రానున్న ఏఐ మన ఆలోచనలను కూడా ముందుగానే అర్థం చేసుకుని సూచనలు ఇవ్వగలదు. ఇది మన జీవితాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, టెక్నాలజీపై మన ఆధారాన్ని కూడా పెంచుతుంది.ఈ మార్పు స్టార్టప్ కంపెనీలకు ఒక సవాలుగా మారవచ్చు. ఇప్పటివరకు యాప్లపై ఆధారపడిన వ్యాపార నమూనాలు భవిష్యత్తులో పనిచేయకపోవచ్చు. అందువల్ల.. కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుని, ఏఐ ఆధారిత పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. లేకుంటే.. వారు ఇతర సంస్థలతో వెనుకబడే అవకాశం ఉంది.ఇప్పటికే కొన్ని కంపెనీలు ఏఐను తమ ఉత్పత్తుల్లో అమలు చేయడం ప్రారంభించాయి. నథింగ్ వంటి సంస్థలు వినియోగదారులకు ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తూ, కొత్త అనుభవాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో ఏఐ ఎంతగా పనిచేస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
హ్యుందాయ్ వైబ్ ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?
హ్యుందాయ్ ఇండియా.. తన గ్రాండ్ ఐ10 నియోస్ కొత్త వైబ్ ఎడిషన్ను పరిచయం చేసింది. దీని ధరలు రూ. 7.09 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్పెషల్ ఎడిషన్ స్పోర్ట్జ్, స్పోర్ట్జ్ (O) వేరియంట్ల ఆధారంగా నిర్మితమైంది.గ్రాండ్ ఐ10 నియోస్ వైబ్ ఎడిషన్ స్పోర్ట్జ్ వైబ్, స్పోర్ట్జ్ (ఓ) వైబ్ అనే రెండు ట్రిమ్లలో మాత్రమే లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లలోనూ ఎరుపు రంగు ఇన్సర్ట్లతో కూడిన నలుపు రంగు ఇంటీరియర్, అలాగే నలుపు రంగులో పెయింట్ చేసిన 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. లెదర్-ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి.స్పోర్ట్జ్ (ఓ) వైబ్ వేరియంట్లో పుష్-బటన్ స్టార్ట్తో కూడిన స్మార్ట్ కీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, ఆరు ఎయిర్బ్యాగ్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇందులో లభిస్తాయి.పవర్ట్రెయిన్ ఎంపికల విషయానికొస్తే, వైబ్ ఎడిషన్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్తో కొనసాగుతుంది, దీనికి 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్ లభిస్తుంది. కాబట్టి పనితీరు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.
ఫ్యామిలీ
హ్యాపీ హప్చీ
గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాడీ సేఫ్టీ... మొదలైన వాటి గురించి ఒకటికి రెండుసార్లు చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఉండదని గ్రహించిన డా. కనిక, అన్నిరకాలుగా పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని ‘హాప్చి’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ‘హప్చి’ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎన్నో పాఠశాలల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది...ఒకరోజు కుమారుడితో సరదాగా మాట్లాడుతూ...‘స్కూల్లో ఏం నేర్చుకుంటున్నావు?’ అని అడిగారు కనిక. ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ అని క్యాజువల్గా చెప్పి పరుగెత్తాడు ఆ పిల్లాడు. ఆ సమయంలో ఆమె ఆలోచనలన్నీ ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ చుట్టే తిరిగాయి. ‘అక్కడ ఏమి నేర్చుకున్నారు? అది మాత్రమే సరిపోతుందా? నిజజీవిత పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యం పిల్లలకు చేరుతుందా?’... ఇలా ఎన్నోరకాలుగా ఆలోచించారు. ఆ ఆలోచనలే ‘హప్చీ’ ఆవిర్భావానికి కారణం అయ్యాయి.హప్చి అంటే హ్యాపీ చిల్డ్రన్2020లో ఐఐఎం బెంగళూరులోని ఎన్ఎస్ఆర్సిఇఎల్లోని ఉమెన్ స్టార్టప్ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకున్నారు కనిక. ఒక సంవత్సరం తరువాత కనిక నేతృత్వంలో పిల్లల భద్రత, జీవన నైపుణ్యాలు, మానసిక శ్రేయస్సుపై దృష్టి సారించే ప్రత్యేక సంస్థ ‘హప్చి’ ఆవిర్భవించింది. ‘హప్చి అంటే హ్యాపీ చిల్డ్రన్ అని అర్థం. పిల్లలు సంతోషంగా, భద్రంగా ఉండేలా చూడడమే మా లక్ష్యం’ అంటున్న కనిక పిల్లల భద్రతపై ‘స్మార్ట్ బీ సేఫ్’ ‘టైమ్ టు వాయిస్ మై ఛాయిస్’లాంటి ఎన్నో పుస్తకాలు రాశారు. వర్క్షాప్లు నిర్వహించారు.స్పందన లేదు...వన్–టైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కు పరిమితం కాకుండా ఏడాదిపాటు రకరకాల డిజిటల్ టూల్స్తో స్కూల్ ప్రోగ్రామ్స్లో భాగమయ్యే మోడల్ని ‘హప్చి’ ప్రవేశ పెట్టింది.మొదట్లో పాఠశాలల నుంచి కనికకు పెద్దగా స్పందన లభించలేదు. బాడీ సేఫ్టీ, వేధింపుల వంటి అంశాలపై చర్చలు నిర్వహించడానికి చాలా పాఠశాలలు విముఖత చూపాయి. కొన్ని పాఠశాలల వారు వర్క్షాప్లకు అనుమతించినా ఆ తరువాత పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఈ నేపథ్యంలో పిల్లల భద్రతకు సంబంధించిన చొరవ ఒకేవైపు నుంచి కాకుండా ఇరువైపులా ఉండాలని ఆలోచించారు కనిక.వారి సహకారంతో...మార్పు రావాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం కూడా అవసరం అని ఆలోచించిన కనిక ఆ వైపుగా దృష్టి పెట్టి విజయం సాధించారు. ‘హ్యాప్సేఫ్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘హ్యాప్సేఫ్’ ప్రోగ్రామ్లో భాగంగా 1 నుంచి 11 తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అబ్యూజ్ ప్రివెన్షన్, బుల్లీయింగ్ ప్రివెన్షన్, ఆన్లైన్ భద్రత, ఒత్తిడి, మానసిక ఆరోగ్యం... మొదలైన కీలక అంశాలపై పాఠ్యప్రణాళిక రూ΄÷ందించారు. కేవలం ఒకసారి అవగాహన కల్పించే స్థాయిని దాటి విద్యాభ్యాసంలో ప్రతి దశలోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగమయ్యేలా ఆచరణాత్మక నైపుణ్యాలను అందించే పాఠ్యప్రణాళిక రూ΄÷ందించారు.ఎంతో మార్పుఎన్నో పాఠశాలలపై ‘హప్చి’ ఎంతో ప్రభావాన్ని చూపించింది. అలాంటి పాఠశాలల్లో ‘హోరైజన్ గురుకుల్’ ఒకటి. ‘మా స్కూల్లో హప్చి ఎంతో మార్పు తెచ్చింది. పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడడానికి సంబంధించి, శరీర భద్రత, భావోద్వేగ అవగాహన విషయాలలో మార్పు ప్రత్యేకంగా కనిపించింది’ అంటుంది న్యూహోరైజన్ గురుకుల్ టీచర్ జాస్మిన్ పడ్డా. ఫరీదాబాద్(హరియాణా)లోని సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన కనిక మెడిసిన్ చేశారు. తండ్రి కోరుకున్నట్లే డాక్టర్ అయ్యారు. ఆ తరువాత హెల్త్కేర్ మేనేజ్మెంట్లోకి మారారు.
దోమలకూ ఓ టేస్ట్ ఉంది!
వేమన చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ అన్నాడు గాని చెవిలో దోమ అనాలి. దోమల బాధలు మనిషికి ఇంతింత గాదయా అని అందరూ రాత్రయితే అనుకోవడమే. దోమలది సర్వసమాన దృష్టి. ఇంటి యజమానినైనా, ఇంటికొచ్చిన అతిథినైనా ఒకేలాగా చూస్తాయి. అంతు చూస్తాయి. అయితే గమనించి చూస్తే కొందరి దగ్గర ఏవో సిఫార్సు లెటర్సు ఉన్నట్టుగా వారిని తక్కువ కుట్టడం... మరికొందరిని రేషన్ క్యూలో నిలుచున్నవారిలా లెక్కలేనట్టుగా చూసి ఎక్కువ కుట్టడం చేస్తుంటాయి. ‘నా రక్తం తియ్యగా ఉన్నట్టుంది దోమలకి’ అంటూ ఉంటారు ఇలాంటి వాళ్లు. కాని దోమలు కొందరిని ఎక్కువగా కుట్టడం రక్తం తీయగా ఉండటం వల్ల కాదు. దోమలకు మనిషి రుచి రక్తం గురించి పట్టింపు లేదు అయితే అవి మానవ శరీరం నుండి వెలువడే అనేక రకాల జీవసంకేతాలపై ఆధారపడతాయి. వాటిని అధికంగా వెదజల్లే వారిని సులభంగా గుర్తించి వారిని ఎక్కువగా కుడతాయి.మీ నిశ్వాసే మీ గూగుల్ లొకేషన్దోమలు అదేదో గూగుల్ మ్యాప్లో చూసి మిమ్మల్ని గుర్తుపట్టి కుట్టడానికి కారణం మీరు వదిలే నిశ్వాస. అందులోని కార్బన్ డయాక్సైడ్ (íసీఓ2) లో దోమలు గుర్తు పట్టే ప్రత్యేకమైన సెన్సర్లు ఉంటాయి, ఈ సెన్సర్లు వాటికి దారి చూపి మీ దాకా తీసుకొస్తాయి. అంటే మీ నిశ్వాసలో ఎక్కువ మొత్తంలో సీఓ2 ఉంటే మిమ్మల్ని ఈజీగా గుర్తు పట్టి వెంట పడతాయి. పిల్లల కంటే పెద్దలను దోమలు ఎక్కువగా కుట్టడానికి కారణం పిల్లల కంటే పెద్దలు ఎక్కువ సిఓ2 వదులుతారు. గర్భిణీ స్త్రీల శరీరం నుంచి కూడా ఎక్కువ సీఓ2 విడుదలవుతుంది కాబట్టి వారు దోమల్ని ఎక్కువగా ఆకర్షించవచ్చు. అదేవిధంగా వ్యాయామం చేసిన వారు లేదా మంచి మెటబాలిజం ఉన్న వారు దేహ రసాయనాలు విడుదల చేస్తూ దోమలకు తమ ఆచూకీ ఇస్తారు. ఒకసారి ఆచూకీ తెలుసుకున్నాక ఇక అక్కడే అవి రొద పెడుతూ తిరుగుతాయి.మీది వేడి శరీరమా?దోమలు నిశ్వాసలోని సీఓ2ను గుర్తించి దగ్గరగా వచ్చినట్టే మీది వేడి శరీరం అయితే దానిని కూడా బాగా గుర్తు పడతాయి. దోమలు సూక్ష్మమైన ఉష్ణోగ్రతలను గుర్తిస్తాయి. మానవ చర్మంలో వెచ్చదనాన్ని అవి సులభంగా గుర్తించగలవు. రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉన్న చోట వాటికి వేడి తెలుస్తుంది. అదీగాక కదులుతున్న శరీరం గాలిలోకి ఎక్కువ వేడిని, వాసనను విడుదల చేస్తుంది. దీనిని ఫోన్ కాల్లాగా అందుకుని దోమలు వాలి కుట్టగల కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించి కుడతాయి. మనం ఎంత దుప్పటి కప్పుకున్నా కాపు కాచి అందుకే కుడతాయి.మరి బ్లడ్ గ్రూప్ సంగతేంటి?దోమలు కొన్ని నిర్దిష్ట బ్లడ్ గ్రూప్లను ఇష్టపడతాయనే ఒక సాధారణప్రతిపాదన ఉంది. ఏ, బీ, ఏబీ ఇలా ఈ గ్రూపులు ఉన్నావారి కంటే ‘ఓ’ గ్రూప్ ఉన్నవారిని ఎక్కువగా కుడతాయని కొన్ని అధ్యయనాలు సూచించాయి. అయితే ఈ విషయం ఇంకా సాధికారికంగా నిరూపణ కాలేదు. శాస్త్రవేత్తలు ఈ సంగతి గురించి అధ్యయనం చేస్తూ ఉన్నారు. ముందు చెప్పినట్టు దోమలు ఒక వ్యక్తిపై వాలడానికి రక్తాన్ని గుర్తించడం కంటే శ్వాసలోని కార్బన్ డయాక్సైడ్ను శరీర వేడి, చర్మం నుండి వెలువడే రసాయన వాసనలనే ఎక్కువ గుర్తిస్తాయి.మీ చర్మం.. దాని మీది బ్యాక్టీరియామిమ్మల్ని దోమలు కుట్టడానికి, మీ చర్మంపైన ఉండే బ్యాక్టీరియాకు సంబంధం ఉంది. మానవ చర్మం సహజంగానే శరీరంలో నివసించే ట్రిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాకు నిలయం. ఈ సూక్ష్మజీవులు చెమట, ఇతర జీవన క్రియల సమయంలో రకరకాల రసాయన వాసనలను ఉత్పత్తి చేస్తాయి. ప్రతి వ్యక్తికీ వేరు వేరు బ్యాక్టీరియా స్థాయి వేరు వేరు చర్మ వాసనలు ఉంటాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాలు దోమలను ప్రత్యేకంగా ఆకర్షించే వాసనలను ఉత్పత్తి చేయగలవని పరిశోధనలు సూచిస్తున్నాయి, దీనివల్ల కొందరిని ఇతరుల కంటే ఎక్కువగా కుట్టే అవకాశం ఉంది.దోమ గారి యమా సంగతులు→ దోమలు చాలా వేగంగా రెక్కలు కొడతాయి. ఒక దోమ సెకనుకు సుమారు 500 సార్లు తన రెక్కలను ఆడిస్తుంది. అందుకే అది చెవి దగ్గరకు వచ్చినప్పుడు మనకు ‘కుయ్’మనే రొద వినిపిస్తుంది. దోమ కుట్టునైనా భరించడం సులభమేమో కానీ ఈ రొద వినడం కష్టం. మనకు సుపరిచితమైనది ఆ గుయ్.. కారం.→ దోమలు పులి, సింహం కంటే ప్రాణాంతకమైన జీవులు. సైజులో చాలా చిన్నగా ఉన్నప్పటికీ మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేసి ప్రాణాలు కబళిస్తాయి. మోటుగా చెప్పాలంటే యుద్ధాల్లో చనిపోయేవారి కంటే దోమకాటుకు చనిపోయేవారి సంఖ్య ఎక్కువ.→ శునకాలే కాదు దోమలు కూడా మిమ్మల్ని దూరం నుంచే వాసన పసిగట్టగలవు. మనుషులు వదిలే కార్బన్ డయాక్సైడ్ ద్వారా 10 నుండి 15 మీటర్ల దూరం నుంచే ఇక్కడ మనిషి ఉన్నాడని అవి గ్రహిస్తాయి. ఎగురుకుంటూ వచ్చి కసక్కున కుట్టి వదలుతాయి.→ దోమల్లో మగవి సాధుజీవులు. పాపం ఇవి చెట్ల మీద పుట్ల మీద ఎగురుతూ తేనె లాంటివి తాగి బతుకుతాయి. ఆడ దోమలు అలా కాదు. వాటికి బ్లడ్ కావాలి. గుడ్లు పెట్టడానికి మన రక్తం నుండి ప్రోటీన్ అవసరం కాబట్టి అవి మన రక్తం కోసం వెంట పడతాయి. → దోమలకు చూపు చాలా తక్కువ. కాబట్టి అవి కంటి పరిధిలో అడ్డంగా స్పష్టంగా కనిపించే ఆకారాలను వెతుకుతాయి. ముదురు రంగు దుస్తులు ధరించిన మనిషి వాటికి స్పష్టంగా కనిపిస్తాడు.→ దోమలకు పాదాలు ఇష్టం. అందుకే దోమలు కుట్టే మనిషి కాళ్లు గీరుకుంటూ కనిపిస్తాడు. దోమలు తరచుగా చీలమండలు, పాదాలను కుడతాయి, ఎందుకంటే అక్కడ ఉండే బ్యాక్టీరియా వాటికి నచ్చిన బలమైన వాసనలను ఉత్పత్తి చేసి వాటికి మనిషి ఆచూకి ఇస్తుంది. ఐస్లాండ్లో దోమ–ప్రమాదంఐస్లాండ్లో దోమలు ఉండవు. కాని ఇటీవల ఒక దోమ కనబడటం ఆ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. దోమలు జీవించి, పునరుత్పత్తి చేయడానికి వెచ్చని ఉష్ణోగ్రతలు కావాలి. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, ఐస్లాండ్ వంటి చల్లని ప్రాంతాలు కూడా వాటికి మరింత అనుకూలంగా మారుతున్నాయి. దీనివల్ల డెంగ్యూ జ్వరం, మలేరియా, చికున్ గున్యా వంటివి దోమల ద్వారా ఎక్కడెక్కడకు వ్యాపిస్తాయా అని సైంటిస్ట్లు ఆందోళన చెందుతున్నారు.ఎండాకాలం... దోమల కాలం. మనిషికి మహమ్మారుల నుంచైనా విముక్తి ఉందేమోగాని దోమ నుంచి లేదు. రాత్రయ్యి లైట్ ఆఫ్ చేయగానే ఈ దండు బయలుదేరి చుక్కలు చూపించడం నిత్యకృత్యం. అయితే ఇవి కొందరిని ఎక్కువ కుడతాయి. కొందరిని క్షమించి వదిలిపెడతాయి. కారణాలు తెలిస్తే మీరు ఔరా అంటారు.
ఆ రైడ్కి ఐదు స్టార్లు..! కించెత్తు సంభాషణకు నో ఛాన్స్..
అత్యంత అరుదుగా ఎదురయ్యే రైడ్ ఇది. దీనికి మాటలతో పనిలేదు. ఈ అసాధారణమైన రైడ్ని టెక్నాలజీ మాటలతో పనిలేకుండానే సమన్వయం అయ్యేలా చేసింది. ఎలా సాగుతుందో అనుకున్న జర్నీ కాస్తా సాంకేతికత అద్భుతమైన ముగింపు ఇచ్చి దివ్యాంగుల్లో ధైర్యాన్ని నూరిపోసింది. అందుకు సంబంధించని పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఈ పోస్ట్ని గ్రెయిల్మేకర్ ఇన్నోవేషన్స్ సహ-వ్యవస్థాపకురాలు ఐశ్వర్య టి వి పిళ్లై లింక్డ్ఇన్లో షేర్ చేశారు. ఆ పోస్ట్లో ఆమె తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె ఒక రోజు రైడ్ని బుక్ చేసినట్లు తెలిపారు. అది కన్ఫర్మ్ అయ్యింది. డ్రైవర్ చెవిటివాడని, అర్థమైంది. తాను అంధురాలు కాబట్టి ఆ రైడ్ ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉందామెకు. ఆ రైడ్ని రద్దు చేద్దామనుకుంది కానీ ఆ తర్వాత ఏ జరుగుతుందో చూడాలనే కుతుహలంతో ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. అనుకున్నట్లుగానే క్యాబ్ వచ్చింది. తాను చేతికర్రతో సహా లోపలికి ఎక్కాను కాబట్టి ఆ డ్రైవర్కి తన పరిస్థితి అర్థమయ్యే ఉంటుందని భావించింది. తాను ఫోన్లో ఏదో టైప్ చేస్తున్నట్లుగా ఓపెన్ చేసి అతడికి ఓటీపీ చూపించింది. ఆ తర్వాత ఆమె తాను వెళ్లే ఆఫీస్ ఎంట్రీ వద్ద నేరుగా దించమని టెక్స్ట్ మెసేజ్ పంపింది. ఆ ఉబర్ డ్రైవర్ అర్థం చేసుకున్నాడు. గమ్యస్థానం రాగానే అతను కారు దిగి ఎవరినో పిలిచాడు. ఆ తర్వాతన ఆమె కారు దిగింది. ఇంతలో సెక్యూరిటీ గార్డు వచ్చి ఆమెన ప్రవేశ ద్వారం వద్దకు నడిపించాడు. కించెత్తు సంభాషణ కూడా లేకుండా అంతా అర్థమయ్యేలా సాఫీగా సాగిపోయిందా ఆజర్నీ. ఆ రైడ్కి నిజంగా ఐదు స్టార్లు అంటూ పోస్ట్ని ముగించింది పిళ్లై. నెజిజన్లు కూడా ఈ పోస్ట్పై ప్రశంసల జల్లు కురిపించడమే గాక, వైకల్యాలను అధిగమించేలా చేసిన సాంకేతిక అద్భుతం అని కొనియాడారు.(చదవండి: ఆ ఐపీఎస్ జంట వివాహంలో..హాట్టాపిక్గా ‘దూద్ పిలాయ్’ ఆచారం!)
ఆ ఐపీఎస్ జంట వివాహంలో..హాట్టాపిక్గా ఆ ఆచారం!
మన దేశంలో పెళ్లికి సంబంధించి ప్రాంతాల వారీగా విభిన్న ఆచారాలు ఉన్నాయి. ఇటీవల మార్చి 29న వైవాహిక బంధంతో ఒక్కటైన ఐపీఎస్ జంట పెళ్లి వేడుకలో జరిగిన ‘దూద్ పిలాయ్’ తంతు అందరి దృష్టిని ఆకర్షించడమే గాక చర్చనీయాంశంగా మారింది. పెళ్లికొడుకు ఊరేగింపునకు ముందు జరిపే ఈ తంతు అత్యంత విలక్షణంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో దూద్ పిలాయ్ అంటే ఏంటి? ఎందుకు నిర్వహిస్తారో సవివరంగా తెలుసుకుందామా..!.రాజస్థాన్లోని భార్మర్కు చెందిన ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ మార్చి 29న జోధ్పూర్ ఐపీఎస్ అధికారి అన్షిక వర్మను వివాహం చేసుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు కేకే బిష్ణోయ్ , ఐపీఎస్ అన్షికా వర్మ 2023లో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ జంట పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్ర పెళ్లికొడుకు ఊరేగింపు వేడుకలో జరిగిన తంతు. ఇక్కడ ఐపీఎస్ అధికారి దూద్ పిలాయ్ ఆ ఆచారంలో పాల్గొనడం. అందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ తంతుపై ఆసక్తిని రేకెత్తించింది. ‘దూద్ పిలాయ్’ అంటే..దూద్ పిలాయ్ అనేది రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలలో పాటించే ఒక సాంప్రదాయ ఆచారం. ఇక్కడ తల్లి తనపల్లు (కొంగు) కింద నుండి కొడుకుకు ప్రతీకాత్మకంగా పాలు ఇచ్చి, ఆశీర్వదించి, బాధ్యతలను గుర్తుచేస్తుంది. ఇది భావోద్వేగపూరితమైన సంప్రదాయం. ఇది కేవలం ప్రతీకాత్మకమైన చర్య. తల్లి కొంగు కింద పాలు తినిపించడం ద్వారా తన పాలు ఇచ్చి పెంచిన ప్రేమను, ఆశీర్వాదాన్ని అందిస్తుంది. కొడుకు చిన్నతనం నుంచి, వైవాహిక బాధ్యతల్లోకి ప్రవేశిస్తున్నాడని, అతనికి ఆ తల్లి ఆశీస్సులు సదా ఉంటాయని సూచిస్తుంది. ఈ ఆచారం పూర్వకాలం నాటిదట. ఒకప్పుడూ పురాతన కాలంలో, సైనికులు యుద్ధభూమికి వెళ్లే ముందు తల్లి ప్రేమను గుర్తుచేసుకోవడానికి, తల్లి పాలకు గౌరవం ఇస్తూ ఈ ఆచారాన్ని ఆచరించేవారని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ ఆచారాన్ని ఎక్కువగా హర్యానా, బీహార్, పశ్చిమ నేపాల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఆచారిస్తారట. View this post on Instagram A post shared by Mo (@mo.of.everything) (చదవండి: ఐఐటీ,గేట్లలో టాపర్, పీహెచ్డీ పట్టభద్రుడు కానీ..!)
అంతర్జాతీయం
అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రతిష్టంభన
పశ్చిమాసియా యుద్ధం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. లెబనాన్ అంశంపై తేల్చేంత వరకు తాము చర్చలకు వెళ్లబోమని ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ మీడియా ఫార్స్ న్యూస్ అధికారికంగా ధృవీకరించింది. రెండు వారాల యుద్ధ విరమణ ప్రకటించిన ఇరు దేశాలు.. ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఇందుకోసం పాకిస్తాన్ ఏర్పాట్లు కూడా చేసింది. ఉభయ పక్షాలను వేర్వేరు చోట్ల కూర్చోబెట్టి చర్చలు జరపాలని భావించింది. అయితే.. లెబనాన్కు కాల్పుల విరమణ వర్తించబోదని చెబుతూ ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడులను ఖండిస్తున్న ఇరాన్.. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము చర్చలకు ముందుకు వస్తామని మెలిక పెట్టింది.
హర్మూజ్పై ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన
టెహ్రాన్: హర్మూజ్ నిర్వహణను కొత్త దశలోకి తీసుకువెళ్తామంటూ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో ఇప్పటివరకు మేమే విజయం సాధించాం. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అలాగని మా హక్కులను వదులుకోం. అలీ ఖమేనీతో పాటు ఇరాన్ అమరవీరుల కోసం ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని ప్రభుత్వ మీడియా ద్వారా ఆయన హెచ్చరించారు.హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకోబోతోందని మొజ్తబా ఖమేనీ సంకేతాలు ఇచ్చారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాలలో ఒకటైన హోర్ముజ్ నిర్వహణలో ఇది ఒక ముఖ్యమైన అధ్యాయంగా ఆయన అభివర్ణించారు. అలాగే తమకు జరిగిన నష్టాలకు పరిహారం కోరాలని టెహ్రాన్ భావిస్తోందని కూడా స్పష్టం చేశారు.కాగా, హర్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే, కాస్తంత మెత్తబడిన ఇరాన్.. అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా వెళ్లేందుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రోజుకు 15 నౌకలను మాత్రమే అనుమతిస్తామన్న ఇరాన్.. పన్నులు కట్టిన నౌకలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇరాన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుందంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. ‘‘ఇరాన్ చర్య అగౌరవమైనది. మన మధ్య ఉన్న ఒప్పందం ఇదికాదు. ఇరాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’’ ట్రంప్ హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. యుద్ధంవేళ అనుమతిలేకుండా హార్మూజ్ గుండా వెళ్లే నౌకలను నాశనంచేసేందుకు పర్షియన్ గల్ఫ్ జలాల్లో అమర్చిన సముద్ర మందుపాతరల జాడను వెల్లడిస్తూ ఇరాన్ తాజాగా ఒక చిత్రపటాన్ని విడుదల చేసింది. నలుపు, తెలుపురంగుల్లో ఉన్న ఈ చిత్రపటంలో పేర్కొన్న వృత్తాకార ప్రాంతం(డేంజర్ జోన్) నుంచి కాకుండా కాస్తంత దూరంగా జరిగి నౌకలు రాకపోకలు సాగించాలని ఇరాన్ ప్రకటించింది.చార్జ్ ప్రకారం చూస్తే సీమైన్స్ను ఇరాన్ తీరంవైపు కాకుండా ఆవలివైపునకు అత్యధికంగా అమర్చినట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ తీరం వెంబడి దాడుల నుంచి తప్పించుకునేందుకు తీరానికి దూరంగా నౌకలు వెళ్తాయని ముందే ఊహించి, వాటి రాకపోకలను అడ్డుకునేందుకే ఇరాన్ ఇలాంటి ఎత్తుగడ వేసిందని స్పష్టమవుతోంది.
ఇంత అసహ్యంగా మాట్లాడతారా?.. పాక్ మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్
ఇరాన్-అమెరికా శాంతి చర్చల వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లెబనాన్ అంశం తేల్చే వరకు చర్చలు సజావుగా సాగవంటూ ఓపక్క ఇరాన్ కొత్త పాట పాడుతోంది. మరోపక్క ఈ చర్చలకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్పై ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బాహాటంగానే ఇరు దేశాలు తీవ్ర విమర్శలు గుప్పించుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. లెబనాన్ దాడుల విషయంలో ఇజ్రాయెల్పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారాయన. ఇజ్రాయెల్ అనే దేశం క్యాన్సర్లాంటిదని, ప్రపంచానికి పట్టిన శాపమన్న రీతిలో వ్యాఖ్యానించారు. ‘‘ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ.. అటు లెబనాన్లో అమాయకుల్ని ఇజ్రాయెల్ చంపుతోంది. గాజా, ఇరాన్ తర్వాత.. లెబనాన్లో రక్తపాతం కొనసాగిస్తోంది. అలాంటి దేశాన్ని పుట్టించినవాళ్లు నరకంలో కాలిపోతూ చిత్రహింసలు అనుభవించాలని కోరుకుంటున్నా’’ అంటూ సోషల్ మీడియాలో ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆసిఫ్ వ్యాఖ్యలకు గట్టి కౌంటరే పడింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం స్పందిస్తూ.. ఇజ్రాయెల్ నాశనం కోరుకుంటున్న పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలు అసహ్యకరంగా ఉన్నాయని అన్నారు. ఏ దేశం ఇలాంటి వ్యాఖ్యలను స్వాగతించబోదని.. పైగా శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న దేశం నుంచి ఇలాంటివి ఊహించలేం అంటూ పేర్కొంది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సర్ కూడా పాక్ నాయకత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇజ్రాయెల్ను క్యాన్సర్ జబ్బుతో పోల్చడం అంటే.. ఒక దేశ నాశనాన్ని కోరుకోవడమేనని, ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం మంచివి కావని అన్నారు. ఇజ్రాయెల్-పాకిస్తాన్ మధ్య ఏనాడూ అధికారిక సంబంధాలు లేవు. అయితే.. ఇరాన్-అమెరికా యుద్ధంలో చైనాతో పాటు పాక్ మధ్యవర్తిత్వం వహించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కానీ ఈ వ్యవహారంలో పాక్ పాత్ర ఏమీ ఉండకపోవచ్చని.. అసలు ఆ దేశాన్ని నమ్మడానికే వీల్లేదని ఇజ్రాయెల్ అంటోంది. గతంలో గాజా విషయంలో గల్ఫ్ దేశాల సాయం తీసుకున్న ట్రంప్.. ఇప్పుడు పాక్ను కూడా వాడుకుంటున్నట్లు కనిపిస్తోందని చెబుతోంది. ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరగాల్సిన టైంలో.. పాక్-ఇజ్రాయెల్ మధ్య దౌత్యపరంగా మాటల యుద్ధం ఎటు దారి తీస్తుందో చూడాలి.
ఎప్స్టీన్తో లింకులు.. పెదవి విప్పిన అమెరికా ఫస్ట్ లేడీ
అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్.. జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను ఖండించారు. తనపై వస్తున్న కథనాలు అబద్ధాలుగా ఆమె కొట్టిపారేశారు. మెలానియా తన పరువు తీసేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్స్టీన్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని.. అతని నేరాల గురించి కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను కుట్రగా ఆమె అభివర్ణించారు.ఎప్స్టీన్తో నన్ను ముడిపెడుతూ చేస్తోన్న అసత్య ప్రచారం వెంటనే ఆగాలి. నాపై దుష్ప్రచారం చేసే వ్యక్తులు నైతిక విలువలు లేనివారు. వారి అజ్ఞానాన్ని నేను వ్యతిరేకించను. కానీ నా ప్రతిష్టను దెబ్బతీయాలనే వారి దురుద్దేశాన్ని నేను ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఎప్స్టీన్ నేరాల బాధిత మహిళలను బహిరంగ విచారణ నిర్వహించి.. వారు తమ ఆవేదనను చెప్పుకునే అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ప్రతి మహిళకు తన కథను బహిరంగంగా చెప్పే హక్కు ఉండాలి. అప్పుడు మాత్రమే వాస్తవం వెలుగులోకి వస్తుందని మెలానియా అన్నారు.మోడల్గా ఉన్న మెలానియాను డొనాల్డ్ ట్రంప్నకు పరిచయం చేయడంలో జెఫ్రీ ఎప్స్టీన్ కీలక పాత్ర పోషించాడంటూ ట్రంప్ జీవిత విశేషాలను రాస్తున్న మైఖెల్ వోల్ఫ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మెలానియా ఈ ఆరోపణలను గతంలోనే ఖండించారు. తాను ట్రంప్ను తొలిసారి న్యూయార్క్లోని కిట్కాట్ క్లబ్లో కలుసుకొన్నట్లు ఆమె పేర్కొన్నారు.కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన మరిన్ని కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో భాగంగా వీటిని బహిర్గతం చేసింది. ఎప్స్టీన్ ద్వారా ట్రంప్కు పరిచయమైన ఒక మహిళను, ఆమె మైనర్గా ఉన్నప్పుడు ట్రంప్ లైంగికంగా వేధించారని తాజాగా ఆ పత్రాల్లో వెల్లడైంది. ఎప్స్టీన్ ఆ బాలికను న్యూయార్క్కి తీసుకెళ్లి ట్రంప్కు పరిచయం చేశాడు.ఆ సమయంలో ట్రంప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, తాను అతడ్ని గాయపరిచినట్టు ఆ మహిళ దర్యాప్తు అధికారులకు వివరించిందని 2019లో FBI జరిపిన ఇంటర్వ్యూల ప్రకారం తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని తనకు, తన కుటుంబ సభ్యులకు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆమె ఆరోపించింది.
జాతీయం
పశ్చిమబెంగాల్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల
కోల్కాతా: పశ్చిమబెంగాల్లో మహిళలు, యువత లక్ష్యంగా బీజేపీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. పలు వర్గాలను ఆకట్టుకునేలా బీజేపీ హామీలు ఇచ్చింది. ఇంటికి పెద్దగా ఉన్న మహిళకు నెలకు రూ.3 వేలు ఆర్థిక ప్రోత్సాహకం ప్రకటించింది. ప్రభుత్వ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని బీజేపీ హమీ ఇచ్చింది. మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనపై ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నా అమిత్ షా.. బెంగాల్లో చీకటి పాలన ముగుస్తుందన్నారు.వికసిత్ బెంగాల్ రోడ్మ్యాప్ను మేనిఫెస్టోలో పెట్టాం. పేదలకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేస్తామన్న అమిత్ షా.. రైతుల సంక్షేమం, యువత ఉపాధి అవకాశాలపై కీలక హామీలు ఇచ్చారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక బెంగాల్లో యూసీసీ అమలు చేస్తామని తెలిపారు.భయం లేని బెంగాల్.. పునర్నిర్మాణమే తమ లక్ష్యం అన్న అమిత్ షా.. బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చొరబాటుదారుల ఏరివేత.. 7వ పే కమిషన్ అమలు చేస్తామని తెలిపారు. ‘‘ఆరు నెలల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ చెల్లిపులు. మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్. రాజకీయ హింస కేసులపై ముమ్మర దర్యాప్తు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ కోసం భూముల కేటాయింపు. ఆవుల స్మగ్లింగ్ నిలిపివేస్తాం. దుర్గా సురక్ష స్క్వాడ్ ఏర్పాటు’’ చేస్తామని అమిత్ షా తెలిపారు.
నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!
క్రైమ్ థ్రిల్లర్లా, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్లోని ధార్లో చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన సంఘటన కలకలం రేపింది. అంతేకాదు ఏమీ తెలియనట్టు నేరాన్ని దోపిడీలా చిత్రీకరించడానికి కపట నాటకమాడింది. అందర్నీ నమ్మించాలని మొసలి కన్నీళ్లు కార్చింది. చివరికి పోలీసులు విచారణలో ఆమె దారుణం వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలోని గొండికోట చరణ్ గ్రామంలో ఏప్రిల్ 7వ తేదీ రాత్రి హత్య జరిగింది . సుగంధ ద్రవ్యాల వ్యాపారి 28 ఏళ్ల పురోహిత్ దేవకృష్ణ, తన ఇంట్లో హత్యకు గురైనాడు. అతని శరీరంపై పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దేవకృష్ణకు 12 ఏళ్ల క్రితం ప్రియాంకతో వివాహం జరిగింది. ప్రారంభంలో సవ్యంగా సాగిన వారి దాంపత్య జీవితంలో కలతలు మొదలయ్యాయి. ప్రియాంక, కమలేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి మోజులో భర్త అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది.ఇదీ చదవండి: పార్కింగ్ కోసం తల నరికేస్తే : బంధువులు అతడిని కొట్టి చంపేశారుప్రియుడు కమలేష్తో కలిసి కుట్ర పన్నింది. కమలేష్, సురేంద్ర అనే వ్యక్తికి సుమారు లక్ష రూపాయల సుపారీ ఇచ్చి దేవకృష్ణను హత్య చేయించేలా పథకం వేశారు. ప్రియాంక ఇంటికి కమలేష్, సురేంద్ర వచ్చి దేవకృష్ణపై దాడి చేసి చంపేశారు. అనంతరం ప్రియాంక దొంగలు ఇంట్లోకి చొరబడి, రూ. 3.5 లక్షల విలువైన వస్తువులను దోచుకుని, తన భర్త ప్రతిఘటించడంతో అతడిని చంపేశారని పోలీసుల ముందు వాపోయింది. మొదట్లో ఇది దోపిడీ, హత్యగానే భావించిన పోలీసులుసంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇంట్లోనే నగలు, డబ్బు అలాగే ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు, ప్రియాంక పదేపదేమాట మారుస్తూ ఉండటంతో అనుమానం పెరిగింది. తమదైన శైలిలో విచారించడంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. ఈ విషయాన్నిమొబైల్ ఫోన్ డేటాతో సహా సాంకేతిక ఆధారాలు, కమలేష్తో ఆమెకున్న సంబంధాన్ని, హత్య జరిగిన సమయంలో ఆమె చేసిన కాల్స్ ఆధారంగా దీన్ని మరింత నిర్ధారించుకున్నారు. అటు ప్రియాంక కూడా చేసిన నేరాన్ని ఒప్పుకుంది. దీంతో పోలీసులు ప్రియాంకతో పాటు కమలేష్, సురేంద్రలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?
Elections: తమిళనాడు తెలుగు యువశక్తి కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడులో నివసిస్తున్న తెలుగు ప్రజల హక్కులు, గౌరవం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ జరగబోయే ఎన్నికల నేపథ్యంలో కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా తమిళనాడులో తెలుగు ప్రజల సమగ్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, తాను తాళి నియోజకవర్గం నుండి పోటీ చేయకుండా.. ప్రజా ప్రయోజనాల కోసం, సమాన హక్కుల కోసం మరింత బలంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.‘‘తమిళనాడులో సుమారు 70–80 లక్షల తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాల్లో అధిక ప్రభావం ఉంది. చెన్నై, తిరువల్లూర్, కాంచీపురం, తిరువన్నామలై, వెల్లూర్, కృష్ణగిరి, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, మధురై, తిరుచ్చి, తంజావూరు, చెంగల్పట్టు ఈ ప్రాంతాలు అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తిగా ఉన్నాయి...సీఎం స్టాలిన్ నాయకత్వంలో తెలుగు సంతతికి చెందిన నాయకులకు గౌరవప్రదమైన స్థానం లభించింది. సుమారు నలుగురు తెలుగు మంత్రులు మంత్రివర్గంలో ఉన్నారు. దాదాపు 20–25 మంది ఎమ్మెల్యేలు తెలుగు ప్రజలను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది తెలుగు ప్రజలకు సమాన అవకాశాలు, గౌరవం కల్పించే సమగ్ర పాలనకు నిదర్శనం’’అని కేతిరెడ్డి పేర్కొన్నారు.సినీ నటి కస్తూరి... తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో, తమిళనాడు ప్రభుత్వం తక్షణమే స్పందించి.. తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకుంది. ఈ సంఘటన ద్వారా తెలుగు ప్రజల గౌరవం, స్వాభిమానం కాపాడటంలో ప్రస్తుత ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో స్పష్టమవుతుంది. తమిళనాడు తెలుగు యువశక్తి.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. తెలుగు ఓటర్లను ఏకతాటిపైకి తీసుకువస్తుంది. డీఎంకే, ఆ పార్టీ కూటమి అభ్యర్థుల విజయానికి కట్టుబడి పనిచేస్తుంది. తమిళనాడులో తెలుగు ప్రజల భద్రత, గౌరవం, ప్రాతినిధ్యం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వం డీఎంకే మాత్రమే. ఈ ఎన్నికల్లో డీఎంకే విజయం ఖాయం’’ అని కేతిరెడ్డి పేర్కొన్నారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా
ఢిల్లీ: నోట్ల కట్టల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం ఆయన రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. పార్లమెంట్లో ఆయన అభిశంసన పెండింగ్లో ఉండగానే.. ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. కిందటి ఏడాది మార్చిలో యశ్వంత్ వర్మ ఢిల్లీ జడ్జిగా ఉన్న టైంలో.. ఆయన నివాసంలో అగ్నిప్రమాదం జరగ్గా భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అప్పుడు ఆయన హోలీ సెలవుకు సొంతూరు వెళ్లారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ‘న్యాయవ్యవస్థలో అవినీతి..’ అంటూ ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఒకానొక టైంలో ఆయన ఇచ్చిన తీర్పులన్నింటిపైనా రివ్యూ జరగాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఈ తరుణంలో.. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు స్వయంగా సుప్రీం కోర్టు రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది. మునుపెన్నడూ లేని రీతిలో వెబ్సైట్లో కాలిన ఆ నోట్ల ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేసింది. ముగ్గురు జడ్జిలతో కూడిన ఇన్హౌజ్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయించింది. అటుపై దర్యాప్తు నేపథ్యంలో ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే అలాంటి వ్యక్తి తమకు వద్దంటూ ఆ టైంలో అలహాబాద్ బార్ అసోషియేషన్ నిరసనలకు దిగింది. దీంతో ఆయనకు ఎలాంటి పని అప్పగించకుండానే ఖాళీగా కూర్చోబెట్టారు. మరోవైపు.. ఆయనపై పార్లమెంట్లో అభిశంసన ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈలోపు.. ‘సుప్రీం’ కమిటీ తన నివేదికను అప్పటి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించగా.. ఆయన దానిని లేఖ రూపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఆ నివేదిక ప్రకారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతికి పాల్పడ్డారని, స్వచ్ఛందంగా రాజీనామాకు ఆయన అంగీకరించలేదని, కాబట్టి ఆయన్ని తొలగించాలని ఇన్-హౌజ్ కమిటీ సిఫార్సు చేసింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా ఆయనపై రాజీనామా ఒత్తిడి పెరిగింది. అయితే ఎప్పటికప్పుడు ఆయన వాటిని ఆరోపణలు తోసిపుచ్చుతూ వచ్చారు. కమిటీ నివేదిక.. అభిశంసన.. వీటి నుంచి బయటపడేందుకు ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించగా.. అక్కడా ఆయన చుక్కెదురైంది. చివరకు స్వచ్చందంగా తన జడ్జి పోస్టుకి రాజీనామా చేశారు.గతంలోనూ.. జస్టిస్ సౌమిత్ర సేన్ ( కలకత్తా హైకోర్టు) ఇంపీచ్మెంట్ ప్రక్రియ దగ్గరి దాకా వెళ్లి రాజీనామా చేశారు. జస్టిస్ పి.డి. దినకరన్ (సిక్కిం హైకోర్టు), జస్టిస్ వి. రమణ (మద్రాస్ హైకోర్టు) మాత్రం ఆరోపణలు రాగానే రాజీనామా చేసేశారు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’
అల్ఫారెట్టా, జార్జియా: స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి-2026’ అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు.ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. నాలుగేళ్ల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ(యూఎస్ఏ) సేవా సంస్థలకు అందజేయనున్నారు.ఈ వేడుకల్లో బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి (శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రతినిధులు), గిరిధర్ కొటగిరి (ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు), జ్యోత్స్న పాలకుర్తి (గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ చైర్మన్), రమణ గంద్ర (గేట్స్ అధ్యక్షులు), సునీత పోట్నూరు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు), ఆది శ్రీనివాసన్ (ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు), శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ (ప్రెసిడెంట్ అండ్ సీఈఓ), జనార్ధన్ పన్నెల (శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధి) పాల్గొన్నారు.
న్యూయార్క్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయుల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్టర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరంలోని ఇండియా హౌస్లో ఘనంగా నిర్వహించారు.గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వ్యాపారం, మీడియా, ఫైనాన్స్, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అమెరికాలో భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు.FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తమ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు.కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో', 'ఉజ్వల యోజన' వంటి పథకాల ద్వారా భారత్ మహిళా సాధికారతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అలాగే 100 మిలియన్ కుటుంబాలను మహిళల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థికంగా శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరఫున గుర్తింపు సర్టిఫికెట్లు, FIA శాలువాలు, ట్రోఫీలు అందజేశారు.నార్త్స్టార్ స్ట్రాటజీస్ COO జోడి లిన్ హెర్క్లోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల్ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాన్సుల్ జనరల్ సతీమణి మోనాలిసా శువదర్షిణి ప్రధాన్ కూడా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్ మాట్లాడుతూ, కమ్యూనిటీ నిర్మాణంలో FIA పాత్రను కొనియాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అమెరికన్ నటి రేష్మా శెట్టి.. మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ తానియా కిన్సెల్లా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం ఇస్తూ.. అడ్డంకులను అధిగమించిన వైనాన్ని వివరించారు.కార్యక్రమ ప్రారంభంలో దివంగత అవార్డు గ్రహీత రాధా సుబ్రమణ్యం జ్ఞాపకార్థం మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం ముగింపులో FIA ప్రధాన కార్యదర్శి సృష్టి కౌల్ నరులా ధన్యవాదాలు తెలిపారు. FIA జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల వందన సమర్పణతో వేడుకలను ముగిశాయి.ఎఫ్ఐఏ సంస్థ 1970 నుండి భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారతీయ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఇండో–అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తోంది.
సింగపూర్లో ఘనంగా ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి తనయులు కే నాగేంద్రనాథ్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం 43, బర్గండీ క్రిసెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 70 మంది దర్శకుడు కె. విశ్వనాథ్ అభిమానులు హాజరయ్యారు.సంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ, కె. నాగేంద్రనాథ్తో తనకు దాదాపు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తెలిపారు. సామవేదం షణ్ముఖ శర్మ 2017లో సింగపూర్ విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన శివపదం కార్యక్రమానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో సందేశాలు అందించిన పుస్తక రచయిత, ప్రముఖ దర్శకులు సీనియర్ డైరెక్టర్ వంశీకి, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయులు ఏడిద రాజాకి ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్య అతిథి కె. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ శంకరాభరణం’ చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం అప్పట్లో తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందిందని తెలిపారు. ప్రస్తుతం పుస్తక రచయిత వంశీని సంప్రదించి పునర్ముద్రణ చేయించామని చెప్పారు. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న హైదరాబాద్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామని, దానికి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలు, విశేషాలు వినిపించడంతో ఇది ఒక అచ్చ తెలుగు పండుగలా అనిపించిందని తెలిపారు.ఈ సందర్భంగా తొలి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినసంస్కార భారతి అధ్యక్షులు రమణమూర్తి కి, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు బి.వి.ఆర్. చౌదరి దంపతులకు, తంగిరాల రాజశేఖర్, సౌభాగ్యలక్ష్మి దంపతులకు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు.కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి ఆలపించగా, శేషశ్రీ వీణపై ఒక గీతాన్ని వాయించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ప్రేక్షకులతో పంచుకోగా, చిత్ర మరియు పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం రాజశేఖర్–సౌభాగ్యలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో భోజనాన్ని సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లలో శ్రీలలిత, మాధవి పాలకుర్తితోపాటు, సుబ్బు పాలకుర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ్, సత్య జాస్తి, రాజ్ కుమార్ తదితరులు సహాయ సహకారాలను అందించారు.
క్రైమ్
చిలకలూరిపేటలో న్యాయవాది హత్య
చిలకలూరిపేట: పల్నాడు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ న్యాయవాది హత్యకు గురయ్యాడు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామానికి చెందిన శ్రీరామ హరిప్రసాద్(37) ఒంగోలులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇతనికి భార్య నాగజ్యోతి, ఏడేళ్ల బాబు ఈశ్వర అకీర, ఆరేళ్ల పాప నవనీత ఉన్నారు. ప్రసాద్ తల్లి తిరుపతమ్మ ఒంగోలు న్యాయస్థానంలో అటెండెంట్గా పనిచేస్తున్న క్రమంలో ముందుగా మార్కాపురంలో ప్రాక్టీస్ చేసిన ఆయన నాలుగేళ్లుగా ఒంగోలులో ఉంటున్నారు. గురువారం సాయంత్రం హైకోర్టుకు వెళ్లాలంటూ ఇంటి నుంచి స్కూటీపై ఆయన బయలుదేరారు. రాత్రికి పల్నాడు జిల్లా నరసరావుపేట చేరుకొని శుక్రవారం తెల్లవారుజామున కోటప్పకొండ రోడ్డులో చిలకలూరిపేట వైపు స్కూటీపై వెళ్లారు. ఆ తర్వాత యడవల్లి గ్రామ సమీపంలో రోడ్డు మార్జిన్ పక్కన సుమారు ఐదు అడుగుల పల్లపు ప్రదేశంలో న్యాయవాది మృతదేహంపై స్కూటీ పడి ఉంది. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, ఎస్ఐ జి అనిల్కుమార్ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఎన్నో అనుమానాలు... ముందుగా అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు అక్కడ లభించిన ఆధారాలను, మృతుడి తలపై గాయాలను గుర్తించి హత్య కేసుగా నమోదు చేశారు. మృతదేహంపై ఎవరో స్కూటీని పడవేసినట్లుగా ఉండడం, మృతదేహం పూర్తిగా వాహనం కింద పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిచ్చింది. దీనికి తోడు స్కూటీ పడిపోయిన ప్రదేశానికి సమీపంలో రోడ్డు మార్జిన్లో బండరాయి రక్తంలో తడిసిపోయి ఉండటం న్యాయవాదిని ఎవరైనా బండరాయితో మోది చంపారా అనే అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నిపుణులను పిలిపించి ఆధారాలు సేకరించారు. దీంతో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను పిలిపించి విచారణ చేపట్టారు. హైకోర్టుకు వెళతానన్న న్యాయవాది యడవల్లి రూట్లోకి ఎందుకు వచ్చారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కోటప్పకొండ వద్ద నుంచి సీసీ పుటేజీల పరిశీలన చేపట్టారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధితో వివాదం భూ వివాదాల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధితో న్యాయవాదికి వివాదం ఉన్నట్టు తెలుస్తోంది. తన బంధువుల పక్షం నిలబడిన విషయమై ఆయనతో విభేదాలు తలెత్తినట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. మృతుడు అందరితో కలుపుగోలుగా ఉంటాడని, స్నేహభావంతో మెలిగే ఆయనను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని మరి కొందరి వాదన. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఉన్మాద ఘటనలో విషాదం.. హెచ్ఐవీ ఇంజెక్షన్ బాధితురాలి సూసైడ్
పోచారం ఐటీ కారిడార్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిడ్స్ ఉందన్న కారణంతో ఓ వ్యక్తితో యువతి పెళ్లికి నిరాకరించగా.. సదరు ఉన్మాది కోపంతో ఆమెకు సిరంజీతో రక్తం ఎక్కించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో.. బాధితురాలు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ శివారు పోచారంలో గత నెల అమానుష ఘటన వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు.. సదరు యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చాడు. అయితే.. ఈ ఉదంతం తర్వాత కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చేరిన సదరు యువతి తర్వాత ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కఠోర నిజాన్ని దాచి.. పోచారానికి చెందిన మనోహర్కు ఆ మధ్య బాధిత యువతితో పెళ్లి ఖాయమైంది. గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవడంతో పాటు షాపింగ్, పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశారు కూడా. పెళ్లికి టైం దగ్గర పడుతున్న టైంలో.. మనోహర్కు ఎయిడ్స్ ఉన్నట్లు యువతి కుటుంబానికి తెలిసింది. దీంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ కోపంలో.. ఆమెపై పగ పెంచుకున్నాడు. మార్చి11వ తేదీన యువతి ఇంటికి వెళ్లిన మనోహర్.. అమ్మాయితో గొడవకు దిగాడు. తనను పెళ్లి ఎందుకు చేసుకోవంటూ నిలదీస్తూ ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత ముందే తెచ్చికున్న సిరంజితో ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకొని మనోహర్ను పట్టుకున్నారు.అనంతరం బాధితురాలిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బలవంతంగా ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన నిందితుడు మనోహర్ను అరెస్టు చేశారు. యువతి బలవన్మరణంతో ఈ ఉదంతం విషాదాంతంగా మారింది. నిందితుడు మనోహర్కు కఠిన శిక్ష పడాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!
క్రైమ్ థ్రిల్లర్లా, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్లోని ధార్లో చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన సంఘటన కలకలం రేపింది. అంతేకాదు ఏమీ తెలియనట్టు నేరాన్ని దోపిడీలా చిత్రీకరించడానికి కపట నాటకమాడింది. అందర్నీ నమ్మించాలని మొసలి కన్నీళ్లు కార్చింది. చివరికి పోలీసులు విచారణలో ఆమె దారుణం వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలోని గొండికోట చరణ్ గ్రామంలో ఏప్రిల్ 7వ తేదీ రాత్రి హత్య జరిగింది . సుగంధ ద్రవ్యాల వ్యాపారి 28 ఏళ్ల పురోహిత్ దేవకృష్ణ, తన ఇంట్లో హత్యకు గురైనాడు. అతని శరీరంపై పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దేవకృష్ణకు 12 ఏళ్ల క్రితం ప్రియాంకతో వివాహం జరిగింది. ప్రారంభంలో సవ్యంగా సాగిన వారి దాంపత్య జీవితంలో కలతలు మొదలయ్యాయి. ప్రియాంక, కమలేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి మోజులో భర్త అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది.ఇదీ చదవండి: పార్కింగ్ కోసం తల నరికేస్తే : బంధువులు అతడిని కొట్టి చంపేశారుప్రియుడు కమలేష్తో కలిసి కుట్ర పన్నింది. కమలేష్, సురేంద్ర అనే వ్యక్తికి సుమారు లక్ష రూపాయల సుపారీ ఇచ్చి దేవకృష్ణను హత్య చేయించేలా పథకం వేశారు. ప్రియాంక ఇంటికి కమలేష్, సురేంద్ర వచ్చి దేవకృష్ణపై దాడి చేసి చంపేశారు. అనంతరం ప్రియాంక దొంగలు ఇంట్లోకి చొరబడి, రూ. 3.5 లక్షల విలువైన వస్తువులను దోచుకుని, తన భర్త ప్రతిఘటించడంతో అతడిని చంపేశారని పోలీసుల ముందు వాపోయింది. మొదట్లో ఇది దోపిడీ, హత్యగానే భావించిన పోలీసులుసంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇంట్లోనే నగలు, డబ్బు అలాగే ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు, ప్రియాంక పదేపదేమాట మారుస్తూ ఉండటంతో అనుమానం పెరిగింది. తమదైన శైలిలో విచారించడంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. ఈ విషయాన్నిమొబైల్ ఫోన్ డేటాతో సహా సాంకేతిక ఆధారాలు, కమలేష్తో ఆమెకున్న సంబంధాన్ని, హత్య జరిగిన సమయంలో ఆమె చేసిన కాల్స్ ఆధారంగా దీన్ని మరింత నిర్ధారించుకున్నారు. అటు ప్రియాంక కూడా చేసిన నేరాన్ని ఒప్పుకుంది. దీంతో పోలీసులు ప్రియాంకతో పాటు కమలేష్, సురేంద్రలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?
ఆమె.. అలా మోసపోయింది
సోషల్ మీడియా స్నేహాలు ఎంత ప్రమాదకరమైనవో తెలియజేసే మరో ఘటన ఇది. పథకం ప్రకారం ఫేస్బుక్లో పరిచయమైన వివాహిత (36)ను హనీట్రాప్ చేసి తాను పెద్ద వ్యాపారినని నమ్మబలికి, మాయమాటలతో లోబర్చుకుని ఆమె వద్ద రూ. కోటి విలువైన బంగారు వజ్రాభరణాలు తీసుకుని ఉడాయించాడో ఓ వ్యక్తి. పోలీసుల కళ్లుగప్పి సుమారు నాలుగేళ్లుగా తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ డీఐ సత్యనారాయణ తెలిపిన మేరకు.. మూసారాంబాగ్కు చెందిన సూరజ్శర్మ అలియాస్ నితిన్ డైమా (30) కింగ్కోఠిలోని ఓ ఆటోమొబైల్ షాపులో పనిచేస్తుంటాడు. 2022లో ఫేస్బుక్లో జూబ్లీహిల్స్కు చెందిన ఓ వివాహిత పరిచయమైంది. దీంతో తరచూ ఇద్దరూ కలుసుకోసాగారు. ఈ క్రమంలో సూరజ్శర్మ.. తాను పెద్ద వ్యాపారినని..అంతేకాక తనకు అతీంద్రీయశక్తులు ఉన్నాయని నమ్మించాడు. పలుమార్లు ఆమె వద్ద నుంచి రూ.50 లక్షల నగదు, రూ.10 లక్షల విలువ చేసే వజ్రాభరణాలు, రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. కొద్ది రోజుల దాకా ఆమెతో సన్నిహితంగా ఉండడంతో నామె భర్త, పిల్లలను వదిలి సూరజ్తోనే సహజీవనం చేసింది. అయితే.. పథకం ప్రకారం నిందితుడు ఆమెను వదిలేసి పరారయ్యాడు. పోలీసులకు దొరక్కుండా ఫోన్ను స్విచ్ఛాఫ్ చేశాడు. ఫేస్బుక్ ఖాతాను మూసేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదేళ్లుగా సూరజ్ కదలికలపై నిఘా పెట్టారు. ఐదేళ్లుగా ఫోన్ వాడకుండా ఫేస్బుక్ను ఉపయోగించకుండా ఉన్న నిందితుడు.. ఇక తనను అందరూ మరిచిపోయారని భావించి పాత ఫోన్ నెంబరును యాక్టివేట్ చేయించాడు. అనంతరం ఫేస్బుక్లో కూడా యాక్టివ్ అయ్యాడు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులు.. నిందితుడు మూసారాంబాగ్లో ఓ ఇంట్లో ఉన్నాడని గుర్తించి గురువారం అరెస్టు చేశారు. ఆరా తీయగా నిందితుడి అసలు పేరు నితిన్ డైమా అని తేలింది. అతనికి వివాహం జరిగినట్లు కూడా గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. :::సాక్షి, బంజారాహిల్స్
వీడియోలు
హార్ముజ్ నీ సొంతం కాదు.. ఇరాన్ కు బిగ్ షాక్
పాఠశాలలు, ఆసుపత్రులపై టార్గెట్.. ఇరాన్ లో యుద్ధ విధ్వంసం బట్టబయలు
ఏపీలో మావిగన్ ట్రెండ్.. రగిలిపోతున్న ఎల్లో మీడియా..
నిన్న జగన్ గారిని కలిశాను.. మావిగన్ పై ఆయన చెప్పింది ఒక్కటే
భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్-2.. పసిఫిక్ లో సేఫ్ ల్యాండింగ్
360 లక్షల కోట్లు..! వాటే విజన్
మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ కు 6 నెలల జైలు శిక్ష.. కారణం ఇదే
వాటర్ తో గేమ్స్ వద్దు.. ఒక సెల్ఫీ మూడు ప్రాణాలు
నల్లగా ఉన్నాడని లవర్తో మొగుణ్ణే లేపించేసింది
మీ అన్నను చంపించింది నువ్వే అని టాక్... అచ్చెన్నకు గుబాపగిలేలా సజ్జల కౌంటర్


