హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)
హీరో రాజ్తరుణ్ మాజీ లవర్ లావణ్య హల్చల్
సాక్షి, సంగారెడ్డి: మద్యం మత్తులో సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య హల్చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పాజిటివ్ రావడంతో లావణ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. మల్కాపూర్ మండలం మల్లెపల్లి వద్ద బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని కారుతో లావణ్య ఢీ కొట్టింది. ఆగకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేయగా కారును మల్లెపల్లి పోలీసులు అడ్డుకున్నారు.సారీ చెప్పాలని గ్రామస్థులు చెప్పడంతో వారితో లావణ్య వాగ్వాదానికి దిగింది. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకున్నారు. పోలీసులతోనూ కాసేపు లావణ్య వాగ్వాదానికి దిగింది. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, తాడేపల్లి: మహిళా రిజర్వేషన్ చట్టానికి వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. 2029 ఎన్నికల నుంచి ఈ చట్టాన్ని అమలు చేయటాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతించారు. మహిళా రిజర్వేషన్ అమలు మంచి నిర్ణయం అంటూ ఆయన ట్వీట్ చేశారు. మహిళల సాధికారతకు మా పార్టీ ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. స్థానిక సంస్థల్లో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్ అమలు చేశాం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు 50 శాతం అవకాశం కల్పించాం. నామినేషన్ ద్వారా ఇచ్చే పనులు, కాంట్రాక్టుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేశాం. అసెంబ్లీ, లోక్సభలో 33% మహిళా ప్రాతినిధ్యం కల్పిస్తూ కేంద్రం చట్టం చేయటాన్ని స్వాగతిస్తున్నాం. ప్రతి స్థాయిలో మహిళలు నాయకులుగా ఎదగాలనేది మా పార్టీ ఆకాంక్ష’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.The YSR Congress Party wholeheartedly supports the proposed amendments to the Women's Reservation Act, 2023, enabling its implementation in 2029. Our party has always placed utmost emphasis on the empowerment of women. We have already led the way by implementing 50% reservation…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 25, 2026
ఎవరిదో గెలుపు? బలాలు.. బలహీనతలు ఇవే..!
తమిళనాడు ఎన్నికలంటేనే.. నీలగిరిలో రాజకీయాలు వేడెక్కిపోతాయి. శీతల విడిదికి కేంద్రాలుగా ఉన్న నీలగిరి కొండల్లో వేడి రాజుకుంటుంది. తూర్పు, పశ్చిమ కనుమల కలయికకు కేంద్రబిందువైన నీలగిరుల్లో.. ఊటీ, కున్నూరు, కూడలూరు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఎన్నికలు ఏవైనా కానీ.. ఈ మూడు నియోజకవర్గాల్లో గెలుపోటములను అంచనా వేయడం తలలు పండిన విశ్లేషకులకు కూడా సాధ్యం కాదనే విషయం ఇక్కడి అభ్యర్థులను కల్లోలపరుస్తోంది. ఈ మూడు నియోజకవర్గాలపై విశ్లేషణను ఎక్కడా మిస్సవ్వకుండా చదివేయండి..అంత ఈజీ కాదు..ఊటీ, కున్నూరు, కూడలూరు నియోజకవర్గాల్లో ప్రస్తుతం డీఎంకే-కాంగ్రెస్ కూటమి రెండు చోట్ల.. అన్నాడీఎంకే ఒకచోట బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఇక్కడ గెలుపోటములను అంచనా వేయడం అంత ఈజీ కాదు. ఊటీ నియోజకవర్గాన్ని ఇక్కడ అధికారికంగా ఉదగై అంటారు. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.గణేశ్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పర్యాటకమే ప్రధాన ఆర్థిక వ్యవస్థ. టీ-కాఫీ తోటలకు నెలవు. అయితే.. కీలకమైన పరిశ్రమలు మూతపడడంతో ఇక్కడ నిరుద్యోగిత పెరుగుతోంది. స్థానిక సమస్యలు తోడవ్వడం యాంటీ-ఇన్కంబెన్సీకి దారితీసే ప్రమాదాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీకి కలిసివచ్చే అంశమే..! ఇక కున్నూరు నియోజకవర్గం డీఎంకేకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతం. టీ-కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులకు ఈ నియోజకవర్గం నిలయం. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా డీఎంకేకు కలిసివచ్చే అంశమే..! అయితే.. తేయాకును సేకరణకు ఇచ్చే కూలీ సమస్య పరిష్కారం కాకపోవడంతో.. ఇక్కడి కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని అన్నాడీఎంకే అడ్వాంటేజ్గా తీసుకుంటే.. పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.ఆ మూడు వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే..ఇక కూడలూరు నియోజకవర్గంలో గిరిజన ఓటర్లదే ఆధిపత్యం. అనూహ్య ఫలితాలకు ఈ నియోజకవర్గం వేదిక. ఇక్కడ ఇరులర్, కురుంబర్ వర్గాలు గెలుపోటములను శాసిస్తాయి. వీరితోపాటు.. పడుగర్ వర్గానికి పెద్దమొత్తంలోనే ఓటుబ్యాంకు ఉంది. ఈ మూడు వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే.. ఆ పార్టీ అభ్యర్థి విజయం కరతలామలకమే..! గిరిజనుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇచ్చే అభ్యర్థికే ఇక్కడి ఓటర్లు పట్టంకడతారు.ఆ నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే..మొత్తానికి నీలగిరిలోని మూడు నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే.. ఏ పార్టీ అయినా.. ఉపాధి, పరిశ్రమల కల్పన, తేయాకు సేకరణ కూలీ ధర, కార్మికుల సంక్షేమం వంటి అంశాలు కీలక భూమిక పోషిస్తాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా పడుగర్ వర్గం ఓటు బ్యాంకు అత్యంత కీలకం. డీఎంకే, కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలకు వేర్వేరుగా ఓటు బ్యాంకులు ఉన్నప్పటికీ.. ఈసారి పెరిగిన యువ ఓటు బ్యాంకు ప్రస్తుత ఎన్నికల్లో గెలుపోటములను శాసించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.ఏది ఏమైనా.. ఊటీలో విజయానికి కాంగ్రెస్ ఈసారి చమటోడ్చాల్సిందే..! కున్నూరును తిరిగి నిలబెట్టుకోవాలంటే.. కార్మికుల కూలీ ధరలపై డీఎంకే స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇక కూడలూరులో అన్నాడీఎంకే బలంగా కనిపిస్తున్నా.. నెక్-టు-నెక్ పోటీ తప్పదని తెలుస్తోంది.
చరణ్కు గాయం..'పెద్ది' సంబరాలకు ఆటంకం?
మనం దళారులం కాదు.. పాక్కు జైశంకర్ కౌంటర్..!
అక్కడ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు
దేశాల్లో పెట్రోల్ మంటలు.. దారుణంగా ధరలు!
కేడీ సాంగ్ వివాదం.. నాకు అర్థం కాదన్న డైరెక్టర్..!
దురంధర్-2లో చిన్న రోల్.. కానీ మూవీ చూడలేకపోతున్నా..!
ఆర్సీబీ మాజీ పేసర్కు ఊహించని అవకాశం
3 గంటలు పని.. రూ.40 లక్షలు సంపాదన
నియోజకవర్గాల పునర్విభజన.. అనివార్యం
హీరో రాజ్తరుణ్ మాజీ లవర్ లావణ్య హల్చల్
వలపు వల.. విశ్రాంత ఉద్యోగి విలవిల
ఇక ఆరంభం.. తారుమారైన గోల్డ్ రేటు!
చరిత్రలో తొలిసారి చికెన్ ధర రికార్డు స్థాయికి..!
మంచు లక్ష్మి కూతురి ఓణీ ఫంక్షన్లో మోహన్బాబు
జపాన్ డేంజర్ బెల్: సముద్రంలో యుద్ధానికి సిద్ధం?
తీవ్ర సంక్షోభం తప్పదు.. కియోసాకి హెచ్చరిక
సౌతాఫ్రికా టూర్కు భారత జట్టు ప్రకటన
రింకూ సింగ్కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే?
ఉక్రెయిన్కు అమెరికా మద్దతు నిలిపివేస్తేనే ఇరాన్కు మా సహాయం ఆపేస్తాం - పుతిన్
గంటల వ్యవధిలో కుప్పకూలిన పసిడి.. కొత్త ధరలు ఇవే!
విద్యార్థులందరూ ‘‘ఆర్కిటెక్చర్లో’’ చేరాలని పోటీపడుతున్నారు సార్!
జాక్పాట్.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. శుభవర్తమానాలు
‘అది వివక్ష కాదు.. ఆచారం’
ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్!
గ్యాస్ బుకింగ్ టైమ్లో మార్పు.. కేంద్రం క్లారిటీ
హార్మూజ్లో మన నౌకలకు ఇరాన్ ఎందుకు అనుమతిచ్చిందంటే?
ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు
కూటమి ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన విజయవాడ ఎంపీ
కాషాయ పార్టీదే హవా.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
చరణ్కు గాయం..'పెద్ది' సంబరాలకు ఆటంకం?
మనం దళారులం కాదు.. పాక్కు జైశంకర్ కౌంటర్..!
అక్కడ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు
దేశాల్లో పెట్రోల్ మంటలు.. దారుణంగా ధరలు!
కేడీ సాంగ్ వివాదం.. నాకు అర్థం కాదన్న డైరెక్టర్..!
దురంధర్-2లో చిన్న రోల్.. కానీ మూవీ చూడలేకపోతున్నా..!
ఆర్సీబీ మాజీ పేసర్కు ఊహించని అవకాశం
3 గంటలు పని.. రూ.40 లక్షలు సంపాదన
నియోజకవర్గాల పునర్విభజన.. అనివార్యం
హీరో రాజ్తరుణ్ మాజీ లవర్ లావణ్య హల్చల్
వలపు వల.. విశ్రాంత ఉద్యోగి విలవిల
ఇక ఆరంభం.. తారుమారైన గోల్డ్ రేటు!
చరిత్రలో తొలిసారి చికెన్ ధర రికార్డు స్థాయికి..!
మంచు లక్ష్మి కూతురి ఓణీ ఫంక్షన్లో మోహన్బాబు
జపాన్ డేంజర్ బెల్: సముద్రంలో యుద్ధానికి సిద్ధం?
తీవ్ర సంక్షోభం తప్పదు.. కియోసాకి హెచ్చరిక
సౌతాఫ్రికా టూర్కు భారత జట్టు ప్రకటన
రింకూ సింగ్కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే?
ఉక్రెయిన్కు అమెరికా మద్దతు నిలిపివేస్తేనే ఇరాన్కు మా సహాయం ఆపేస్తాం - పుతిన్
గంటల వ్యవధిలో కుప్పకూలిన పసిడి.. కొత్త ధరలు ఇవే!
విద్యార్థులందరూ ‘‘ఆర్కిటెక్చర్లో’’ చేరాలని పోటీపడుతున్నారు సార్!
జాక్పాట్.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. శుభవర్తమానాలు
‘అది వివక్ష కాదు.. ఆచారం’
ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్!
గ్యాస్ బుకింగ్ టైమ్లో మార్పు.. కేంద్రం క్లారిటీ
హార్మూజ్లో మన నౌకలకు ఇరాన్ ఎందుకు అనుమతిచ్చిందంటే?
ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు
కూటమి ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన విజయవాడ ఎంపీ
కాషాయ పార్టీదే హవా.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
ఫొటోలు
నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)
డిఫరెంట్ లుక్స్తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)
వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)
ఇదేం బిల్డప్ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్ జగన్ (ఫోటోలు)
యువ నటుడు కెన్ కరుణాస్ 'యూత్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
హైదరాబాద్ : పెట్రోల్ బంక్ల వద్ద భారీ క్యూ.. వదంతులతో జనం పరుగులు (ఫొటోలు)
హైదరాబాద్లో జోరు వాన (ఫోటోలు)
నటిని పెళ్లాడిన ప్రముఖ ర్యాపర్ బాద్షా (ఫోటోలు)
సినిమా
శోభిత షాకింగ్ లుక్.. మృణాల్ ఏమో ఇలా
ఓ మ్యాగజైన్ కోసం శోభిత షాకింగ్ లుక్స్బ్లాక్ డ్రస్లో మనసు దోచేస్తున్న మృణాల్చీరలో అందాల ముద్దుగుమ్మలా నేహాశెట్టి'మేడిన్ కొరియా' జ్ఞాపకాలతో ప్రియాంక మోహన్చీరలో నాభి అందాలతో నభా నటేశ్మంచు దేశంలో నైట్ టైమ్ కృతి సనన్ చిల్ View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon)
'ధురంధర్ 2'.. టాలీవుడ్ ఏం నేర్చుకోవాలి?
'ధురంధర్ 2' వచ్చింది. దేశంలో ప్రతిచోట బాక్సాఫీస్ కళకళలాడిపోయేలా చేస్తోంది. ఇప్పటికే రూ.1000 కోట్ల కలెక్షన్స్కి చేరువలో ఉంది. కొన్ని సినిమాలు కేవలం వచ్చి వెళ్లడం మాత్రమే కాదు. ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేస్తాయి. 'ధురంధర్ 2' ఆ రేంజ్ మూవీలానే అనిపిస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో అన్ని ఇండస్ట్రీలపై దీని ప్రభావం గట్టిగానే ఉండబోతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' కోసం రణవీర్ సింగ్ ఆరు వారాల్లోనే)ఎందుకంటే ఏదైనా సినిమా హిట్టయి, వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తే చాలు.. టాలీవుడ్లో కావొచ్చు బాలీవుడ్లో కావొచ్చు అదే తరహాలో మూవీస్ తీసే ప్రయత్నం చేస్తుంటారు. రాబోయే కొన్నేళ్లలో 'ధురంధర్' తరహా మూవీస్ ఎక్కువగా రావడం గ్యారంటీ. గతంలో బాహుబలి, కేజీఎఫ్ వచ్చినప్పుడు ఇలానే చాలామంది డైరెక్టర్స్ వాటిని అనుకరించి సినిమాలు తీశారు. అడ్డంగా బోల్తా కొట్టారు. టాలీవుడ్, 'ధురంధర్' మాయలో పడకపోతేనే బెటర్. లేదు మేం కూడా ఇలాంటి మూవీసే తీస్తాం, హిట్ కొడతాం అనుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది.టాలీవుడ్లో చాలామంది దర్శకులు.. స్టోరీ కంటే హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వాలి, అవసరం లేకపోయినా కామెడీ పెట్టాలి, ఐటమ్ సాంగ్స్ ఇరికించాలి అనే ఆలోచనలతోనే ఉంటారు. ఇలాంటివన్నీ చూసి బోర్ కొట్టడం వల్లే 'ధురంధర్'కి అదే తెలుగు ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. కాబట్టి 'ధురంధర్' లాంటి సినిమాలు తీయాలంటే హీరోలని అనుకుని స్టోరీలు రాయడం కాకుండా స్టోరీ రాసి, దానికి తగ్గ నటీనటుల్ని వెతుక్కోవాలి. అప్పుడే సరైన ఫలితం దక్కే అవకాశముంటుంది.ఏదైనా సినిమాకు సీక్వెల్ అంటే చాలు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాలనేలా టాలీవుడ్ని భ్రష్టుపట్టించారు. ఆ ట్రెండ్ బ్రేక్ చేసిన ఆదిత్య ధర్.. తొలి పార్ట్ వచ్చిన మూడంటే మూడు నెలల్లో సీక్వెల్ తీసుకొచ్చాడు. ప్రేక్షకుల అంచనాలని అందుకోవడమే కాదు వాటిని దాటేసి మెప్పించాడు. ఒకవేళ తెలుగులో ఈ తరహా ప్రయత్నాలు ఎవరైనా చేద్దామనుకుంటే ఇదే ట్రెండ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.టాలీవుడ్లో ఉన్న ఇంకో సమస్య టికెట్ రేట్స్. సినిమాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టికెట్ ధరలు పెంచేయాలని తాపత్రయపడుతుంటారు. దీని కారణంగానే థియేటర్లకు వచ్చే చాలామంది ప్రేక్షకులని ఓటీటీలు, పైరసీలకు అలవాటు పడేలా చేశారు. ఈ విషయంలో 'ధురంధర్' టీమ్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. తొలి పార్ట్ గానీ రెండో పార్ట్కి గానీ టికెట్ రేట్లు పెంచలేదు. ఆయా థియేటర్ లేదా మల్టీప్లెక్స్ల్లో ఎంత రేటు అయితే ఉందో దానితోనే సినిమా చూసే అవకాశం కల్పించారు. ఇలా చేయడం వల్లే అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. టాలీవుడ్ దీన్నిచూసి చాలా నేర్చుకోవాలి.'ధురంధర్' రెండు భాగాలని కలిపి రూ.300 కోట్ల కంటే తక్కువ బడ్జెట్తోనే పూర్తి చేశారని టాక్. ఈ విషయంలో టాలీవుడ్ ఎంత నేర్చుకుంటే అంత బెటర్. స్టార్ హీరోలకు వందల కోట్లు గుమ్మరించడం లాంటివి కాకుండా కంటెంట్కి ఏం కావాలి? దేనికి ఎంత ఖర్చుపెట్టాలి అనే విషయాలపై కాస్త దృష్టిపెట్టాలి అప్పుడే తెలుగు ఇండస్ట్రీలో కొంతైనా మార్పు వస్తుంది. లేదు మేం ఇలానే రొటీన్, మూస స్టోరీలు తీస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రేక్షకులు అలాంటి వాటిని చూడటం మానేశారు. మానేస్తున్నారు. నిర్మాతలు ఈ విషయం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత బెటర్.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'అవతార్ 3' సినిమా)
షార్ట్ ఫిల్మ్తో ఎంట్రీ.. ఇప్పుడేమో వరుస ఆఫర్లు.. ఎవరీమె?
సినీరంగంలోకి దూసుకెళ్తన్నారు ప్రముఖ నటి ద్రిషికా చందర్. న్యూయార్క్లోని ప్రతిష్ఠాత్మక పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్లో చదువుకున్న ఆమె నటిగా మంచి మార్కులు కొట్టేశారు. అంతేకాదు.. సమర్థవంతమైన వక్తగా కూడా రాణిస్తున్నారు. థియేటర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ద్రిషికా.. తక్కువ కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించడం మరో విశేషం.ద్రిషికా చందర్ తెలుగు భాషలో 'మనసానమః' షార్ట్ ఫిల్మ్ ద్వారా తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. 2022లో ఆస్కార్ అర్హత పొందిన ఈ చిత్రంలోని ఆమె నటనకు అంతర్జాతీయ స్థాయిలో నలభైకి పైగా 'ఉత్తమ నటి అవార్డులు' పొందారు. అంతేకాదు మనసానమః చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం. తెలుగులో 'బుచ్చి నాయుడు కండ్రిగ', 'ఎ బ్యూటిఫుల్ గర్ల్' తదితర చిత్రాలతో సినీ ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆమె నటించిన 'సుయోధన' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.ఇప్పటికే తెలుగులో నాలుగు, హిందీలో రెండు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. అంతేకాకుండా మలయాళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ఇటీవలే జియో సినిమాలో రిలీజైన హిందీ మూవీ 'హే కమీనీ'లో ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ద్రిషికా నటిస్తోన్న మరిన్ని మలయాళ, తెలుగు భాషా చిత్రాలు నిర్మాణానంతర పనుల్లో ఉన్నాయి.ఆమె వెండి తెరపైనే కాకుండా నాటక రంగంలోనూ ఆమెకు ప్రవేశం ఉంది. 'ఏవం ఇంద్రజిత్' అనే హిందీ నాటికలో ఆరు విభిన్న కోణాలున్న మహిళా పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషలపై మంచి పట్టున్న ద్రిషికా చందర్.. రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయారు. View this post on Instagram A post shared by DRISHIKA CHANDER (@drishikachander)
ఎంటర్టైనింగ్గా 'రాకాస' ట్రైలర్
'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో ఎంటర్టైన్ చేసిన సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా 'రాకాస'. మెగా డాటర్ నిహారిక నిర్మించగా.. మానస శర్మ అనే అమ్మాయి దర్శకురాలిగా పరిచయమవుతోంది. హారర్ కామెడీ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. టాలీవుడ్ ఏం నేర్చుకోవాలి?)ట్రైలర్ బట్టి చూస్తే.. ఇదివరకు వచ్చిన హారర్ సినిమాల్లానే ఇందులో స్టోరీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఏ మాత్రం సంబంధం లేని హీరో, ఓ పల్లెటూరికి వస్తాడు. అక్కడే ఉండే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అనుకోని విధంగా హీరో సమస్యల్లో చిక్కుకుంటాడు. బ్రహ్మ రాక్షసుడికి ఆహారంగా ఊరంతా కలిసి ఇతడిని పాడుబడ్డ కోటలోకి పంపిస్తారు. అక్కడ హీరోకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: రేలంగి మామయ్యగా ఒకవేళ రాజశేఖర్ చేసుంటే?)
క్రీడలు
ఆస్ట్రేలియా ఆజానుబాహుడికి బంపరాఫర్
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్లో (CSK) కీలక మార్పు చోటు చేసుకుంది. నాథన్ ఇల్లిస్ గాయంతో సీజన్ మొత్తానికి దూరం కావడంతో, అతని స్థానంలో మరో ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ జట్టులో చేరాడు. ఎడమ చేతి వాటం పేసర్ అయిన జాన్సన్ను సీఎస్కే రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకుంది.జాన్సన్కు ఇదివరకే ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. 2024లో గుజరాత్ టైటాన్స్ అతన్ని రూ. 10 కోట్ల భారీ బిడ్తో దక్కించుకుంది. ఆ తర్వాత 2025లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున నాలుగు మ్యాచ్లు ఆడాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో తొమ్మిది మ్యాచ్లు ఆడిన జాన్సన్.. ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ రేట్ (10.39) చాలా దారుణంగా ఉంది. అయినా, సీఎస్కే అతన్ని తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.జాన్సన్కు ఐపీఎల్లో మంచి రికార్డు లేకపోయినా, ఆస్ట్రేలియా తరఫున ఓ మోస్తరు రికార్డు ఉంది. ఆసీస్ తరఫున అతను 8 టీ20ల్లో 14 వికెట్లు, 5 వన్డేల్లో 4 వికెట్లు తీశాడు. ఈ ఐపీఎల్ ఆఫర్కు ముందు జాన్సన్కు పాకిస్తాన్ సూపర్ లీగ్లో క్వెట్టా గ్లాడియేటర్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. గ్లాడియేటర్స్ ఇతన్ని నేరుగా సంతకం చేసుకున్నా, వ్యక్తిగత కారణాలతో అతను ఆ లీగ్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్ రావడంతో అన్నీ పక్కకు పెట్టి ఓకే చెప్పేశాడు. ఆజానుబాహుడైన జాన్సన్ బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించగలడు.కాగా, ఐపీఎల్ 2026లో సీఎస్కే ప్రయాణం మార్చి 30 నుంచి మొదలవుతుంది. గౌహతిలొ జరిగే మ్యాచ్లో సీఎస్కే రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ఈ ఐపీఎల్ సీజన్ మార్చి 28న ఆర్సీబీ-సన్రైజర్స్ మ్యాచ్తో మొదలవుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్కు వేదిక కానుంది. ఐపీఎల్-2026లో సీఎస్కే జట్టుఎంఎస్ ధోని (వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, సంజూ శాంసన్ (ట్రేడింగ్ ద్వారా, వికెట్ కీపర్), గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ముఖేష్ చౌదరి, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, స్పెన్సర్ జాన్సన్ , శ్రేయాస్ గోపాల్, ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), ఖలీల్ అహ్మద్, అకీల్ హొసేన్, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, జాక్ ఫౌల్క్స్, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చహర్, మ్యాట్ హెన్రీ.
ఆ స్టుపిడ్ వీడియోలు వద్దు: కోచ్ ఫైర్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేసన్ గిల్లెస్పి మరోసారి పాకిస్తాన్ క్రికెట్లో భాగమయ్యాడు. గతేడాది పాక్ టెస్టు జట్టు హెడ్కోచ్ పదవి నుంచి ఈ మాజీ పేసర్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీని కూడా తీవ్ర స్థాయిలో విమర్శించాడు. తనకు చెప్పకుండానే సీనియర్ అసిస్టెంట్ కోచ్పై వేటు వేశారని.. అవమానాన్ని భరించలేకే తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు.హైదరాబాద్ కింగ్స్మెన్ కోచ్గాఅయితే, అనూహ్య రీతిలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో గిల్లెస్పి భాగం కావడం విశేషం. మార్చి 26న తాజా ఎడిషన్ ఆరంభం కానున్న తరుణంలో కొత్త ఫ్రాంఛైజీ హైదరాబాద్ కింగ్స్మెన్ కోచ్గా అతడు బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో జట్టుతో చేరిన అతడు హోటల్లో కెమెరామెన్తో సంభాషించిన తీరు వైరల్గా మారింది.ఫ్రాంఛైజీ క్రికెట్లో స్వాగత వీడియోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆటగాళ్లు, కోచ్ల ఆగమనం నేపథ్యంలో వీడియోలు తీసి వాటికి ఎలివేషన్లు ఇవ్వడం పరిపాటి. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఫ్రాంఛైజీ వెల్కమ్ వీడియో తీస్తున్న క్రమంలో గిల్లెస్పి కీలక వ్యాఖ్యలు చేశాడు.స్టుపిడ్ వెల్కమ్ వీడియోలు వద్దు‘‘నేనేమీ కిందకు రావడం లేదు. నాకు చాలా పని ఉంది. ఇలాంటి స్టుపిడ్ వెల్కమ్ వీడియోలు నేను చేయను’’ అంటూ పై అంతస్తులో ఉన్న గిల్లెస్పి వ్యాఖ్యానించాడు. తనకు పని ఎక్కువగా ఉందని.. కాబట్టి ఇలాంటి వాటిలో తాను భాగం కాలేనని తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.🚨 ANOTHER EMBARRASSMENT FOR PSLJason Gillespie refuses to shoot CRINGE 'WELCOME VIDEOS'"I am not coming down. I have a lot of work to do. I'm not gonna shoot those stupid welcome videos."Man chose actual work over scripted cringe. Priorities. 🤣🤡 pic.twitter.com/iYmDhcFRKN— Brutal Truth (@sarkarstix) March 24, 2026ఇదిలా ఉంటే.. హైదరాబాద్ ఫ్రాంఛైజీతో కలిసి పనిచేసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు గిల్లెస్పి పేర్కొన్నాడు. జట్టును విజయపథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నాడు. అందుకు తగ్గట్లుగానే ఏమాత్రం సమయం వృథా చేయకుండా శిక్షణపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్ వార్న్ వాటా ఎంతంటే?
సౌతాఫ్రికాకు మరో క్లాసెస్ దొరికాడు..!
న్యూజిలాండ్కు సొంతగడ్డపై పరాభవం ఎదురైంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను పర్యాటక సౌతాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఇవాళ (మార్చి 25) జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్లో సఫారీ జట్టు 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నాలుగో నంబర్ ఆటగాడు, వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్హ్యూజన్ (33 బంతుల్లో 75; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.మిగతా ఆటగాళ్లలో వియాన్ ముల్దర్ (31), రూబిన్ హెర్మన్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో డియాన్ ఫార్రెస్టర్ (21 నాటౌట్; ఫోర్, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టోని డి జోర్జి (12) నిరాశపర్చగా.. జేసన్ స్మిత్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సియర్స్ 2, జకరీ ఫౌల్క్స్, జోష్ క్లార్క్సన్ తలో వికెట్ తీశారు.అనంతరం 188 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. సఫారీ బౌలర్ల ధాటికి తడబడింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేసి పరాజయంపాలైంది. గెరాల్డ్ కొయెట్జీ, వియాన్ ముల్దర్, ఓట్నీల్ బార్ట్మన్ తలో 2, కెప్టెన్ కేశవ్ మహారాజ్ ఓ వికెట్ తీసి న్యూజిలాండ్ను కట్టడి చేశారు. వికెట్లు తీయకపోయినా ప్రెనెలన్ సుబ్రాయెన్ (4-0-22-0) అద్బుతంగా బౌలింగ్ చేశాడు. కివీస్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 36 పరుగులతో బెవాన్ జాకబ్స్ టాప్ స్కోరర్గా నిలిచాడు. టిమ్ రాబిన్సన్ 25, డేన్ క్లీవర్ 22, నిక్ కెల్లీ 14, కేటీన్ క్లార్క్ 2, కెప్టెన్ జిమ్మీ నీషమ్ 24, జోష్ క్లార్క్సన్ 13, కోల్ మెక్కోంచి 1, జకరీ ఫౌల్క్స్, కైల్ జేమీసన్ తలో 4 పరుగులతో అజేయంగా నిలిచారు.మరో క్లాసెస్ దొరికాడు..!ఈ సిరీస్తో సౌతాఫ్రికాకు మరో క్లాసెన్ దొరికాడు. క్లాసెన్ లాగే వికెట్కీపర్ బ్యాటర్ అయిన కానర్ ఎస్టర్హ్యూజన్ విధ్వంసకర బ్యాటింగ్ శైలితో క్లాసెన్కు తలపించాడు. కానర్ వికెట్ల వెనకాల కూడా పర్వాలేదనిపించాడు. నేటి మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో తన జట్టుకు సిరీస్ విజయాన్ని అందించిన కానర్.. దీనికి ముందు మ్యాచ్లోనూ ఇదే తరహాలో చెలరేగాడు. ఆ మ్యాచ్లో 36 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. ఇదే సిరీస్తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కానర్.. 5 మ్యాచ్ల్లో 145కు పైగా స్ట్రయిక్ రేట్తో 200 పరుగులు చేశాడు. తద్వారా ఐదో టీ20లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. క్లాసెన్ రిటైరయ్యాక సౌతాఫ్రికాకు ఆ స్థాయి బ్యాటర్గా కానర్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
‘అదే జరిగితే.. టీమిండియా సెలక్టర్లు పట్టించుకోరు’
గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు టీమిండియా స్టార్ రిషభ్ పంత్. మెగా వేలంలో లక్నో ఫ్రాంఛైజీ రికార్డు స్థాయిలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు.కెప్టెన్గానూ ఫెయిల్అయితే, ఐపీఎల్-2025లో పంత్ (Rishabh Pant) దారుణంగా విఫలమయ్యాడు. పదమూడు మ్యాచ్లలో కలిపి కేవలం 269 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్గానూ పంత్ ఫెయిలయ్యాడు. అతడి సారథ్యంలో లక్నో గతేడాది పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో పంత్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.టీమిండియా రీఎంట్రీ కష్టమేముఖ్యంగా ఫామ్లేమితో సతమతమవుతున్నా రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించిన తీరుపై మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పంత్ను ఉద్దేశించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికైనా పంత్ ఆట తీరు మారకపోతే.. భారత టీ20 జట్టులో అతడు తిరిగి స్థానం దక్కించుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.‘‘రిషభ్ పంత్ విషయంలో విమర్శలు రావడం సరైందే. సంప్రదాయ విరుద్ధ, రిస్కీ షాట్లు ఆడటం అనే చట్రంలో అతడు ఇరుక్కుపోయాడు. ఫామ్ను తిరిగి పొందే ప్రయత్నమే చేయడం లేదు. గతేడాది మొత్తం రిస్కీ షాట్లతో విమర్శలు మూటగట్టుకున్నాడు.సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదుటీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత టీ20 జట్టుకు అతడు దూరమయ్యాడు. మిడిలార్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్గా సేవలు అందించే పంత్ గురించి ఇప్పుడు సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదు.ఓపెనర్-వికెట్ కీపర్గా ఓ ఆటగాడు రాణిస్తుంటే (సంజూ), ఓపెనర్- వికెట్ కీపర్ లేదంటే వన్డౌన్లో ఆడే వికెట్ కీపర్గా మరొకరు (ఇషాన్) దుమ్ములేపుతున్నారు. కాబట్టి ఈసారి ఐపీఎల్లో సత్తా చాటితేనైనా తిరిగి జాతీయ జట్టులో పునరాగమనం చేసే అవకాశం అయినా పంత్కు దక్కుతుంది. ఏదేమైనా జాతీయ జట్టుకు ఆడటమే ప్లేయర్ అంతిమ లక్ష్యం కదా! యువరాజ్ సింగ్ మార్గదర్శనంలో పంత్ ప్రాక్టీస్ చేయడం శుభసూచకం. ఈసారైనా పంత్ ఉత్తమంగా రాణించాలి. లేదంటే భవిష్యత్ కష్టమే’’ అని ఆకాశ్ చోప్రా జియోహాట్స్టార్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా మార్చి 28 నుంచి ఐపీఎల్-2026 షురూ కానుంది.చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్ వార్న్ వాటా ఎంతంటే?
న్యూస్ పాడ్కాస్ట్
రాజధాని మాస్టర్ ప్లాన్లో లోపం... ఆంధ్రప్రదేశ్ ఖజానాపై ఒక వెయ్యి 472 కోట్ల రూపాయలకుపైగా భారం
ఇరాన్పై దాడులకు 5 రోజుల విరామం. చర్చలు జరుపుతున్నామన్న ట్రంప్. అదేం లేదన్న ఇరాన్
డిజైన్లకు ఏకంగా 401 కోట్ల 54 లక్షల రూపాయలు... ‘అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్’ డిజైన్ల వ్యయంలో రికార్డు బద్ధలు కొట్టిన చంద్రబాబు సర్కారు
ఏపీలో సైదాపురం గనుల లీజుకు కూటమి సర్కారు సై... ఎన్జీటీలో కేసు నడుస్తున్నా లెక్క చేయని ప్రభుత్వ పెద్దలు
రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చాం, ప్రగతి చూపిస్తాం.. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
జాబులు దాచిపెట్టి క్యాలెండర్ విడుదల... ఏపీలో 22 నెలల్లో ఒక లక్ష 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ.. కేవలం 10 వేల 60 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్
పూటకో మాటతో నిరుద్యోగులతో చంద్రబాబు సర్కారు ఆటలు... జాబ్ కేలండర్ పేరిట లీకులిస్తూ మోసం
చంద్రబాబు హామీలన్నీ మోసాలే... ఒంగోలు నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల భేటీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
కూటమి ప్రభుత్వంలో దేశ డ్రగ్స్ రాజధానిగా మారిన ఏపీ
తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ గుట్టు రట్టు... డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్గా నిర్ధారణ
బిజినెస్
30 రోజుల రీఛార్జ్ తప్పనిసరి!
మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా టెలికాం రంగంలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో రాజ్యమేలుతున్న 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ల స్థానంలో పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టెలికాం ఆపరేటర్లపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారు.పార్లమెంటులో చర్చసాధారణంగా నెల అంటే 30 లేదా 31 రోజులు ఉంటుంది. కానీ, టెలికాం కంపెనీలు నెలవారీ ప్లాన్ పేరిట 28 రోజుల వ్యాలిడిటీనే ఇస్తున్నాయి. దీనివల్ల వినియోగదారుడు ఏడాదికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని రాఘవ్ చద్దా పార్లమెంటులో గళమెత్తారు. ఆయన లేవనెత్తిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఒకరోజుకు 2 జీబీ డేటా ఇస్తే వినియోగదారుడు 1.5 జీబీ మాత్రమే వాడితే మిగిలిన 0.5 జీబీ అర్ధరాత్రికి మాయమైపోతోంది.ఇది వినియోగదారుడిని వంచించడమే. ఉపయోగించని డేటాను మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి.రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేయడం సరికాదు. కనీసం ఏడాది పాటు ఇన్కమింగ్ సదుపాయం ఉండాలి.మూడేళ్ల గ్రేస్ పీరియడ్ తర్వాతే నంబర్లను రద్దు చేయాలి. (ప్రస్తుతం 90 రోజుల నిబంధన అమలులో ఉంది).మంత్రి స్పందనటెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనల ప్రకారం.. ప్రతి ఆపరేటర్ తమ ప్లాన్ల జాబితాలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ను చేర్చాలని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ‘కంపెనీలు అందించే ప్లాన్ ఆప్షన్లలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ ఉండాలి. ఈ నిబంధనను కంపెనీలు పాటిస్తున్నప్పటికీ వాటిని వినియోగదారులకు తెలిసేలా మరింతగా మార్కెటింగ్ చేయాలని కోరుతున్నాం’ అని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.ట్రాయ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?2022లోనే ట్రాయ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతి టెలికాం సంస్థ ప్లాన్ వోచర్లు, ప్రత్యేక టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్ల రూపంలో కనీసం ఒక 30 రోజుల ప్లాన్ను అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం ‘టారిఫ్ ఫోర్బేరెన్స్’ విధానం అమలులో ఉండటంతో ధరలు, సర్వీసు నిబంధనలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆపరేటర్లకు ఉంది. అయినప్పటికీ, వినియోగదారులను ఇబ్బంది పెట్టకుండా ట్రాయ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది.త్వరలో కీలక నిర్ణయం?పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. రీఛార్జ్ వ్యాలిడిటీ పీరియడ్, ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేత అంశాలను ట్రాయ్ ప్రస్తుతం పునసమీక్షిస్తోంది. ఒకవేళ రెగ్యులేటర్ కఠిన నిర్ణయం తీసుకుంటే ఇకపై మొబైల్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా డేటా వినియోగంలోనూ పారదర్శకత వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?
సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిన్నటి నుంచి వాహనదారులు బారులు తీరుతున్నారు. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ముడి చమురు సరఫరా నిలిచిపోతుందన్న ఆందోళన, చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ పరిమితులను తగ్గించాయన్న వార్తలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, ఈ పరిణామాలపై తెలంగాణ పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ స్పష్టతనిచ్చింది.ఓఎంసీలు - డీలర్లు.. క్రెడిట్ విధానం అంటే ఏమిటి?ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి ప్రధాన కారణం చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ (అప్పు) సౌకర్యంపై జరుగుతున్న చర్చ. సాధారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు డీలర్లకు ఇంధనాన్ని సరఫరా చేసినప్పుడు దానికి సంబంధించిన సొమ్ము చెల్లించడానికి కొంత సమయం (క్రెడిట్ పీరియడ్) ఇస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరత వల్ల ఓఎంసీలు తమ రిస్క్ను తగ్గించుకోవడానికి డీలర్ల క్రెడిట్ పరిమితులను తగ్గించడం లేదా ‘క్యాష్ అండ్ క్యారీ’ (నగదు చెల్లించి స్టాక్ తీసుకోవడం) విధానాన్ని అమలు చేస్తున్నాయి. చేతిలో నగదు లభ్యత తక్కువగా ఉన్న చిన్న డీలర్లు క్రెడిట్ దొరకకపోవడంతో స్టాక్ను తక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. దీనివల్ల కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి తప్ప కంపెనీల వద్ద స్టాక్ లేక కాదని నిపుణులు చెబుతున్నారు.యుద్ధ ప్రభావం ఎంతవరకు?పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. అయితే, భారత ప్రభుత్వం వద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు ఉండటం వల్ల తక్షణమే ఇంధన సరఫరా నిలిచిపోయే అవకాశం లేదు. డీలర్లకు, కంపెనీలకు మధ్య ఉన్న అంతర్గత చెల్లింపుల వ్యవహారాలను వాహనదారులు కొరతగా భావించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వాహనదారులు అనవసరంగా బంకుల వద్ద క్యూ కట్టి సమయాన్ని వృథా చేసుకోవద్దని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరఫరా సజావుగానే సాగుతోందని అధికారులు నిర్ధారించారు.కొరత లేదు.. ఆందోళన వద్దుతెలంగాణలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని రాష్ట్ర పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్) డిపోల వద్ద రాష్ట్ర అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల సరఫరా ఆగిపోతుందనేది కేవలం ఊహాగానమేనని, ప్రస్తుతానికి దిగుమతులకు ఎలాంటి ఆటంకం లేదని తెలిపారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని, ఆందోళనతో కొనుగోలు చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.కంపెనీల స్పందన..వదంతులను నమ్మొద్దు: బీపీసీఎల్భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) బుధవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ‘దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. భారత్లో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయి. మా రిఫైనరీలు, సరఫరా కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి’ అని సంస్థ పేర్కొంది.చమురు కంపెనీల ఉమ్మడి ప్రకటనబీపీసీఎల్, హెచ్పీసీఎల్ (హెచ్పీసీఎల్), ఇండియన్ ఆయిల్ (ఐఓసీఎల్) సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎల్పీజీ (ఎల్పీజీ) సరఫరా కూడా సుస్థిరంగా ఉందని వెల్లడించాయి. అందులోని వివరాల ప్రకారం.. ప్రస్తుత డిమాండ్ను తట్టుకోవడానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. లాజిస్టిక్స్, రవాణా నెట్వర్క్ ఎక్కడా ఆగకుండా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.ఇరాన్ నుంచి రిలయన్స్ చమురు కొనుగోలుమరోవైపు, అంతర్జాతీయ చమురు మార్కెట్లో భారత్కు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఆంక్షల సడలింపు నేపథ్యంలో భారత దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 50 లక్షల బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురును కొనుగోలు చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.ఇదీ చదవండి: ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్!
రవి అస్తమించినా సౌర కాంతులు!
సాధారణంగా సూర్యుడు అస్తమిస్తే సోలార్ ప్లాంట్ల పని ముగిసిపోతుంది. కానీ చైనాలోని గోబీ ఎడారిలో ఉన్న దున్హువాంగ్ సోలార్ ప్లాంట్ను చూస్తే అది నిజం కాదనిపిస్తుంది. నిప్పులు కురిపించే ఎడారి ఎండను ఒడిసిపట్టి రాత్రి వేళ కూడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఈ ప్లాంట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 12,000 భారీ అద్దాలతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన రంగంలో ఒక సరికొత్త విప్లవమని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఏమిటీ ప్లాంట్ ప్రత్యేకత?ఈ ప్లాంట్ మనం చూసే సాధారణ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్లతో పనిచేసేది కాదు. దీన్ని ‘మొల్టెన్ సాల్ట్ కాన్సంట్రేటెడ్ సోలార్ పవర్’ (సీఎస్పీ) ప్లాంట్ అని పిలుస్తారు. దీని నిర్మాణం చూస్తే మధ్యలో ఒక భారీ టవర్, దాని చుట్టూ వేల సంఖ్యలో అద్దాలు అమర్చి ఉంటాయి. ఇక్కడ ఉన్న 12,000 అద్దాలు సూర్యుడు కదులుతున్న దిశకు అనుగుణంగా వాటికి అవే పొజిషన్ను సర్దుబాటు చేసుకుంటాయి. ఇవి సూర్యరశ్మిని పరావర్తనం చెందించి సరిగ్గా 260 మీటర్ల ఎత్తున్న సెంట్రల్ టవర్పైకి కేంద్రీకరిస్తాయి.ఆ టవర్ పైభాగంలో ఉండే రిసీవర్లో ‘ద్రవ ఉప్పు’(మొల్టెన్ సాల్ట్) ఉంటుంది. అద్దాల నుంచి వచ్చే తీవ్రమైన వేడి వల్ల ఈ ఉప్పు సుమారు 565 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది.రాత్రి పూట విద్యుత్తు ఎలా సాధ్యం?ఈ ప్లాంట్లోని అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. పగటిపూట వేడెక్కిన ఈ ద్రవ ఉప్పును భారీ ఇన్సులేటెడ్ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఈ ఉప్పు తనలోని వేడిని చాలా కాలం పాటు కోల్పోదు. సూర్యుడు లేని సమయంలో లేదా రాత్రి వేళల్లో ఈ వేడి ఉప్పును ఉపయోగించి నీటిని ఆవిరిగా మారుస్తారు. ఆ ఆవిరి ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. తద్వారా 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. ఈ టవర్ ద్వారా ఏటా సుమారు 390 మిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా సుమారు 3.5 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను దీని ద్వారా తగ్గిస్తున్నారు.China’s solar plant in Dunhuang uses 12,000 mirrors to focus sunlight onto a central tower, heating molten salt to extreme temperatures.The real magic? It stores that heat so that power can be generated even after the sun goes down. pic.twitter.com/lDq0NB8jWl— Harsh Goenka (@hvgoenka) March 24, 2026భవిష్యత్తుకు మార్గదర్శిప్రపంచం ప్రస్తుతం శిలాజ ఇంధనాల నుంచి స్వచ్ఛమైన ఇంధనం వైపు మళ్లుతోంది. బ్యాటరీ స్టోరేజ్ ఖరీదైన వ్యవహారంగా ఉన్న తరుణంలో ‘మొల్టెన్ సాల్ట్’ ద్వారా ఉష్ణాన్ని నిల్వ చేయడం అనేది అత్యంత చౌకైన, సమర్థవంతమైన మార్గం. దున్హువాంగ్ ప్రాజెక్టు కేవలం చైనాకే కాదు, ఎడారి ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాలకు కూడా ఒక గొప్ప అవకాశం అని కొందరు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్!
ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా భారీగా పడిన పసిడి, వెండి ధరలు ఈరోజు మార్కెట్లో తిరిగి పుంజుకుంటున్నట్లు తెలుస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కాకుండా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు, అమ్మకాల ర్యాలీలో పాల్గొంటేనే ధరలు అధికంగా ప్రభావితం అవుతాయని కొందరు అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ
ఐదుగురు పిల్లల తల్లి!.. ఏకంగా 67 కిలోల బరువు తగ్గి ఇలా..
కొన్ని వెయిట్లాస్ స్టోరీలు వెనుక ఎడతెగని ఎగతాళి, విమర్శలు, కంటిమీద కునుకు పట్టని బాధరకమైన వేదన ఉంటుంది. వాటిన్నంటి తట్టుకుని బరువు తగ్గి చూపించడమే కాకుండా ఆ క్రమంలో తామేంటో చూపించి విజేతలుగా, స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ అరుణాచల్ప్రదేశ్కు చెందిన మహిళ. ఎవరామె..? ఏమా కథ సవివరంగా చూద్దామా..!.అరుణాచల్ప్రదేశ్కి చెందిన ఐదుగురు పిల్లల తల్లి అయిన అమోమ్ సోకి యెకర్ ఒకప్పుడు అధిక బరువుతో ఉండేది. ఈ 39 ఏళ్ల వ్యాపారవేత్త 130 కిలోల అధిక బరువుతో ఇబ్బందిపడుతుండేది. ఆమె ఆకారం, బరువు చూసి సన్నిహితులే ఎగతాళి చేస్తూ ఇబ్బందిపెడుతుండేవారు. అంత బరువుతో కనీసం బయటకు అడుగుపెట్టడానికి కూడా ఇబ్బంది పడేది. సదా నిరాశనిస్ప్రుహలతో నిరుత్సాహంగా ఉండేదామె. కనీసం స్నేహితులను కూడా కలవలేకపోయేది. పైగా లోలోన అభద్రతా భావంతో కుమిలిపోతూ ఉండేది. కానీ ఏదో విధంగా ఈ అధిక బరువుని తగ్గించుకోవాలి, తానేంటోప్రూవ్ చేసుకోవాలన్న ఆరాటం మాత్రం యెకర్కి అపారంగా ఉండేది. అదే ఆమెను..స్లిమ్గా మారేందుకు ఉపక్రమించేలా చేసింది. అచంచలమైన దృఢసంకల్పంతో బరువు తగ్గే ప్రయత్రాలు చేసింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చిన్నగా మొదలు పెట్టి ప్రభావవంతంగా ఉండేలా చేసుకుంది. అలా తగ్గుతూనే మోడల్గా ప్రయత్నిస్తుంటే..నువ్వా మోడల్గానా అంటూ ఛీత్కారాలు, అవమానాలు ఎక్కువయ్యాయి. బాగా నాజూకుగా మారితే ఒక్కసారైనా అరుణాచల్ అందాలపోటీల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తన కోరికను వ్యక్తం చేయగా..ఒక్కసారిగా అందరూ నోఛాన్స్ అనేశారు. పైగా ఆమె కారణంగా ఆ అందాల పోటీలను సైతం తిట్టిపోశారు. ఇక ఈ మాటలు వింటూ డిప్రెషన్లోకి వెళ్లకూడదని, కేవలం వాళ్లు అనే మాటలు మూగబోయేలా తాను స్లిమ్గా మారాలన్నేదే లక్ష్యంగా పెట్టుకుని మరి ఏకంగా 130 కిలోల నుచి 67 కిలోలకు చేరుకుంది. అనుకున్నట్లుగానే అరుణాచల్ప్రదేశ్ అందాల పోటీల్లో పాల్గొని, మిసెస్ అరుణాచల్ 2026గా కిరీటాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం మిసెస్ ఇండియాగా టైటిల్ దక్కించుకోవడమే తన లక్ష్యం అని చెబుతోంది యోకర్. ఫిట్నెస్ జర్నీ మొదలైందిలా..తాను స్వతహాగా బాగా తిండిబోతునని, అదే తన ఊబకాయానికి ప్రధాన కారణమని చెబుతోంది. తాను ఈ వెయిట్లాస్ జర్నీని..ప్రభావవంతమైన చిన్న అలవాట్లను జీవనశైలిలో జోడించి సన్నగా మారినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు యోగ, శుద్ధి చేసిన పిండితో చేసే ఆహారాలకు దూరంగా ఉంటూ బరువు తగ్గినట్లు తెలిపింది. తాను టీని పూర్తిగా మానేశానని, శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మారడంతోనే ఇంతలా స్లిమ్గా మారానని సంతోషంగా చెబుతోందామె. సత్వర ఫలితాల కోసం వెంపర్లాడకుండా..స్థిరమైన ఆరోగ్యకరమైన జీవినశైలిని అవర్చుకోవడంతో బరువు తగ్గానని అంటోంది. చిన్న అలవాట్లే చాలా ప్రభావవంతంగా ఉంటాయని చెబుతోంది. ఐదుగురు పిల్లల తల్లివి, బాగా ఏజ్డ్గా కనిపిస్తున్నావ్.. అన్న మాటలు చెవికెక్కించుకోలేదని..తనలాంటి వాళ్లు ఏం చేయగలరో చూపించడంపైనే ఫోకస్ పెట్టా, స్ఫూర్తిగా నిలిచానని సంతోషంగా చెబుతోంది. అంతేగాదు మన కథను మనమే తిరగరాయాలని,..అప్పుడే లైఫ్ అనుహ్యమైన టర్న్ తీసుకుని విజేతలుగా నిలుస్తామని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది అమోమ్ సోకి యెకర్. View this post on Instagram A post shared by Leyu Abom Soki Yekar (@abomsokiyekar) (చదవండి: దంపతుల ఫిట్నెస్ కోసం..! మిలింద్ సోమన్ టిప్స్)
పెళ్లి రోజే ఉద్యోగానికి దరఖాస్తు..!
సోషల్ మీడియా పుణ్యామా కొన్ని హాస్యభరితమైన సన్నివేశాలు, సంఘటనలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇదేం విడ్డూరం అని అంతా అనుకునేలా ఆ ఘటనలు కాసింత ముఖంపై నవ్వులు మెరిపిస్తున్నాయి. అలాంటి ఫన్నీ వైరల్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అదికూడా ఓ వధువుకి సంబంధించింది కావడంతో ఏమ్మా ఆ టైంలో కూడా ఇదేంటని అంతా తలోమాట అనుకునేలా చేసిన ఈ వీడియో చూస్తే నవ్వు ఆగదు.ఈ వీడియోని సాంచి-శివం అనే దంపతులు నెట్టింట పంచుకున్నారు. ఆ వీడియలో వధువు పూర్తి పెళ్లి కూతురి దుస్తులో కారులో కూర్చొని కనిపిస్తుంది. ఆమె ఫోన్తో ఉద్యోగ దరఖాస్తు కోసం ఈమెయిల్ని పంపుతూ కనిపిస్తోంది. జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టం జరుగుతున్న రోజునే ఆమె ఈ పనిలో బిజీగా ఉండటం కాసింత ఆగ్రహం, నవ్వు తెప్పించేలా ఉంటుంది. కానీ ఆ వధువు మాత్రం పెళ్లి దుస్తుల్లో ఉండి కూడా చాలా ప్రశాంతంగా ఏకాగ్రతతో జాబ్కి దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఇది జీవితంలోని ముఖ్య ఘట్టాలను, వృత్తిపరమైన బాధ్యతలను సమన్వయం చేసుకోవడానికి తరుచుగా ఇబ్బందిపడే చాలామంది యువనిపుణులకు ఈ ఘటన ఓ చక్కటి సందేశానిచ్చేలా ఉంది కదూ.!. అంతేగాదు సాధారణంగా పెళ్లిళ్లు అంటే అట్టహాసమైన ఆచారాలు, వేడుకలతో ముడిపడి ఉన్నప్పటికీ..జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటనలలో కొన్నిసార్లు ఉద్యోగ బాధ్యతలు ఎలా ప్రాధాన్యత సంతరించుకుంటాయో ఈ క్లిప్ హాస్యభరితంగా చూపిస్తోంది. ఈ వీడియోకి "పెళ్లికూతురి మోడ్ ఆన్, హస్టల్ మోడ్ నెవర్ ఆఫ్" అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Sanchi & Shivam (@sanchi_shivam_twoheartsonesoul) (చదవండి: పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!)
దంపతుల ఫిట్నెస్ కోసం..! మిలింద్ సోమన్ టిప్స్
భారత్లో ఫిట్నెస్ అందరికీ అందుబాటులో ఉండేలా అవగాహన కల్పిచే వ్యక్తుల్లో ప్రముఖులు మిలింద్ సోమన్. ఆయన 90వ దశకపు పాప్ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి నుంచి..ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్కు పోస్టర్ బాయ్గా మారే వరకు సోమన్ ప్రయాణం..కండరాల నిర్మాణం కంటే..క్రమశిక్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన చేసే మారథాన్లు, లాంగ్ వాక్లు అన్ని ఆర్భాటానికి తావివ్వకుండా చెప్పులు కూడా లేకుండా నిశబ్దంగా సాగుతాయి. అలాంటి సోమన్ దంపతులు హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలంటే ఆహరంతో కాకుండా, కదలికలతో బంధాన్ని ఏర్పాటు చేసుకోండి అని పిలుపునిస్తూ..పలు ఆసక్తికర ఫిట్నెస్ సలహాలు ఇచ్చారు. అవేంటంటే..సోమన్ దృష్టిలో, ఫిట్నెస్ అంటే ఒకేసారి చేసే వ్యాయామాలు లేదా ఒకే రకమైన దినచర్యలు కాదని అంటారు. ఇది ఉమ్మడి లక్ష్యానికి సంబంధించినదిగా చేసుకుంటే దంపతులు ఇరువురు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. జంటలు కలసి వ్యాయామాలకు సంబంధించి..సింపుల్ వాటిని ఎంచుకుంటూ సాగితే..వారి మధ్య బంధం మరింత బలపడుతుందని అంటున్నారు. అంతేగాదు జీవితం నుంచి ఇరువురు ఏం ఆశిస్తున్నారో ఇద్దరికీ స్పష్టత వస్తుంది. ఇక్కడ సోమన్ తాను ఎక్కువసేపు శ్రమించే కార్యకలాపాలవైపు మొగ్గు చూపితే..ఆమె యోగా ద్వారా ప్రశాంతతను తీసుకువస్తుందట. ఈ వైరుధ్యం వారిని విభజించకుండా, ఇద్దరి విధానాలను మరింతగా బలపరించిందని చెబుతున్నారు సోమన్. ప్రతిసారి ఒకే వర్కౌట్లని చేయడం కాదు, ఆరోగ్యంగా ఉండటానికి ఒకరి విధానాన్ని మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) జంక్ ఫుడ్ డేట్స్కు అతీతంగాచాలామటుకు దంపతులు భోజనానికి బయట ప్రాధాన్యత ఇస్తారు. అర్థారాత్రి వరకు చిరుతిండ్లు తినడం, వారాంతపు విలాసాలతో బిజీగా ఉంటారు. అయితే దంపతులు ఈ అలవాట్లను శారీరక కార్యకలాపాలతో భర్తీ చేస్తే..ఇద్దరి ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుతుందని పిలుపునిస్తున్నారు. అవి సరదా సరదాగా సాగే విహారయాత్రలు, వాకింగ్, ఈత కొట్టడం, తదితర మార్గాల్లో కొత్తదనంతో కూడిన వ్యాయామ కదలికలను అన్వేషించాలి. ఇవి శారీరక మానిసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసే మంచి అలవాట్లకు మారతాయట. ఈ జీవనశైలితో జంటలు మరింత బలంగా, సంతోషంగా, పైగా ఒకరికొకరు అనేలా అనుబంధంగా ఉంటారని బలంగా నమ్ముతానని చెబుతున్నారు సోమన్. సోమన్ ఫిట్నెస్..తరచుగా ఫిట్నెస్ ఐకాన్గా పిలిచే సోమన్ దినచర్య ఎంతమాత్రం కఠినంగా ఉండదు. ఆయన జిమ్కి వెళ్లరు, పర్సనల్ ట్రైనర్ కూడా లేరు. కానీ కొన్ని వారాలు లేదా మూడు, నాలుగుసార్లు పరుగెట్టడం, మరికొన్ని వారాలు అస్సలు పరిగెత్తకుండా ఉంటారు. తీవ్రత వ్యాయామాల కంటే..నిలకడకు ప్రాధాన్యత ఇస్తారు సోమన్. ఎక్కువగా పుష్-అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వంటి ప్రాథమిక వ్యాయామాలు చేస్తుంటారు. ప్రయాణిస్తున్నప్పుడూ కూడా కదలకలు ఉండేలా చూసుకుంటారాయన.ఫిట్నెస్ ప్రయాణంపై మహిళలకు సూచనలు..బిజీగా ఉండే పట్టణ జీవనశైలిలో ఉన్న మహిళలకు సోమన్ ఆచరణాత్మకమైన సలహాలందించారు. అవేంటంటే..మూడు కిలోల మీటర్ల దూరం నుంచి క్రమంగా ఐదు లేదా పది కిలోమీటర్లకు నడక పెంచడం. అలాగే అతివేగంగా వ్యాయామాలు చేయొద్దని సూచించారు. అన్నింటికంటే నిలకడను నేర్చుకోమని చెబుతున్నారు. తాను తొమ్మిదేళ్ల వయసులో జాతీయ స్థాయి ఈతగాడిగా లైఫ్ని ప్రారంభించి..కదలికల చుట్టూ కేంద్రీకృతమైన జీవితానికి పునాది వేశానని చెబుతున్నారు. ఆయన క్రీడాకారుడి నుంచి సూపర్మోడల్గా, చివరికి ఫిట్నెస్ కోసం బహిరంగంగా ప్రచారం చేసే వ్యక్తిగా మారడం వరకు చూస్తే..అదంగా అసాధారణంగా కనిపిస్తుందని అన్నారు. సోమన్ దార్శనికతను ప్రతిబింబించే కార్యక్రమం ఏదైనా ఉందంటే అది పింకాథాన్ మాత్రమే. కేవలం మహిళల కోసం ఒక పరుగు పోటీగా ప్రారంభమైన ఇది, క్రమంగా మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చేలా ప్రోత్సహించే ఒక దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దుకోవడం విశేషం.మొదటిసారి పరుగెత్తేవారి నుంచి దృష్టి లోపం ఉన్నవారి వరకు, పసిపిల్లలతో పరుగెత్తే తల్లుల నుంచి చీరలు కట్టుకున్న అమ్మమ్మల వరకు, ఫిట్నెస్ ఎవరి కోసం అనే మూస ధోరణులను పింకాథాన్ నిరంతరం సవాలు చేస్తూ వస్తోంది.దాని ఎదుగుదల కూడా అంతే స్పష్టంగా ఉంది. వివిధ నగరాల్లో పాల్గొనేవారి సంఖ్య పెరగడంతో, వేలాది మంది మహిళలు ఇందులో చేరడంతో, ఈ కార్యక్రమం కేవలం ఒక మారథాన్ స్థాయిని దాటిపోయింది. ఇది ఇప్పుడు శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించే ఒక సమాజంగా మారింది. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) (చదవండి: పూనకాలకు కారణం ఏంటో తెలుసా..!)
పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!
ఒక్కోసారి మనకు వచ్చే కష్టాలే దారి చూపేలా బతుకుతెరువును కూడా అందిస్తాయి. మనకే ఈ కష్టాలు అనుకుంటాం గానీ, ఒక్కోసారి మనలోని టాలెంట్, సృజనాత్మకతను వెలికితీస్తాయి అవి . కష్టం మనల్ని వదలకపోవచ్చు గానీ దానిపై సవారీ చేసేలా బతుకు మార్గం చూసుకోవాలి అని ఈ మహిళని చూస్తే అర్థమవుతుంది. ఆమె కథ వింటే కన్నీళ్లు వచ్చినా..గెలవాలని మాత్రం కచ్చితంగా ఆకాక్షిస్తారు.నెట్టింట వైరల్గా మారిన కోమల్ అనే మహిళ కథ ప్రతి ఒక్కరిని కదలించేలా మనసులను తాకుతుంది. మహారాష్ట్రకు చెందిన కోమల్ గైక్వాడ్ అనే మహిళ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. ఇందులో పెద్ద వింత ఏముంది అని తీసిపారేయకండి. ఇక్కడే ఉంది అసలు కథ..!. ఆమె కళ్యాణ్ వీధుల్లో ఆటో నడుపుతూ..అటు జీవనాన్ని, ఇటు మాతృత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగుతోంది. అదెలా అంటే..ఆమె కథ ఏంటో తెలుసుకోవాల్సిందే మరి..!.కోమల్ ఆర్థిక కష్టాలు కారణంగా పదోతరగతితోనే చదువు ఆపేసింది. 2018లో వివాహం తర్వాత కళ్యాణ్ నగర్కు మారింది. అక్కడ ఆమె భర్త ఆటో నడిపేవాడు. కానీ తేజు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే..అతడు తన సొంతూరికి వెళ్లిపోయి తిరిగి రాలేదు. దాంతో కోమల్ తన బిడ్డను ఒంటరిగా పెంచాల్సి వచ్చింది. ఎలాంటి ఆసరా లేకపోవడంతో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరింది. కానీ ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం, దీనికి తోడు తేజును చూసుకునేవారు ఎవ్వరూ లేకపోవడంతో ఉద్యోగంలో కొనసాగడం అసాధ్యంగా మారింది. తన బిడ్డకు దూరంగా ఉండని పనిచూసుకోవాలని డిసైడ్ అయ్యి..డైవింగ్ నేర్చుకుంది. అలా అద్దె ఆటోతో మొదలుపెట్టిన కోమల్ ఎప్పుడూ తేజును పక్కనే ఉంచుకుని నగర రోడ్లుపై ప్రయాణించడం ప్రారంభించింది. మొదట్లో ఆటో వెనుకభాగంలో బిడ్డను పడుకునేలా సీటింగ్ ఏర్పాటుచేయాలనుకుంది. కానీ ఆ దూరం తన కూతురుకి ఇబ్బందిగా ఉండటంతో..తన సీటు పక్కనే చిన్న సీటు ఏర్పాటు చేసేలా ఉపాయం ఆలోచించి..అలా సెటప్ చేసింది. దాంతో తేజు రోజంతా తన దగ్గరే ఉండేలా..ఆటో నడపుకోవడం సులభమైంది కోమల్కు. ప్రస్తుతం కోమల్ రోజుకు రూ. 400 నుంచి రూ. 500 దాక సంపాదిస్తోంది. అంతేగాక ఈఎంఐ పద్ధతిలో తన సొంతంగా ఆటోరిక్షాను కొనుగోలు చేసి, మరో అడుగు ముందుకు వేసింది. కోమల్కి ఏమి పెద్దపెద్ద లక్ష్యాలు లేవు కేవలం తన కూతురుకి మంచి విద్యను అందించేలా, పాఠశాలకు పంపించడం తోపాటు తాను మరింతగా సంపాదించడమే ఆమె ఆకాంక్షలు. నిజంగా కోమల్ గ్రేట్ కదూ..భారం వదిలేసి పారిపోయిన భర్త గురించి పక్కనపెట్టి..కూతురు ఆలన పాలనా చూసుకునేలా నడుబిగించిన స్త్రీమూర్తి కదూ..!. నిజంగా ఆ అమ్మ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..!. View this post on Instagram A post shared by India Cultural Hub (@indiaculturalhub) (చదవండి: బ్యాంకు ఉద్యోగం, 4BHK ఇంటిని వద్దనుకున్నాడు! కట్చేస్తే..)
అంతర్జాతీయం
ఇరాన్ ఆ విషయంలో హామీ ఇచ్చింది : ట్రంప్
పశ్చిమాసియా యుద్దంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ భవిష్యత్తులో ఎప్పుడూ అణ్వాయుధాలు తయారు చేయమని హామీ ఇచ్చిందన్నారు. ఇది చర్చలలో కీలక ముందడుగుగా ఆయన పేర్కొన్నారు. వైట్హౌస్లో మాట్లాడుతూ ట్రంప్ ఈ వివరాలు వెల్లడించారు.పశ్చిమాసియా యుద్ధం తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే ఈ విషయంలో ఇరాన్తో చర్చలు జరుపుతున్నామని అమెరికా తరచుగా చెబుతున్నప్పటికీ టెహ్రాన్ మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు ఈ నేపథ్యంలోనే ట్రంప్ వైట్హౌస్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు.ట్రంప్ మాట్లాడుతూ "ప్రస్తుతం ఇరాన్లో సరైన వ్యక్తులతో మాట్లాడుతున్నాం వారు ఒప్పందం చేసుకోవడానికి చాలా ఆతృతగా ఉన్నారు ఈ చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco పాల్గొంటున్నారు అని ఆయన తెలిపారు. అదేవిధంగా ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు ఎప్పటికీ అణు ఆయుధాలను తయారు చేయబోమని అంగీకరించిందని తెలిపారు.అదేవిధంగా ఇరాన్పై అమెరికా చేసిన దాడుల వల్ల అక్కడి పాలనలో మార్పు జరగబోతుందని తెలిపారు. కాగా ఈ యుద్ధం ముగిసినట్టేనా?: ఇరాన్తో శాంతి ఒప్పందం ఎంతవరకు సఫలమవుతుందని ట్రంప్ను ప్రశ్నించగా.. "ఈ యుద్ధంలో విజయం సాధించాం" అని సమాధానమిచ్చారు. అయితే చర్చల విషయంలో ఇరాన్ ఇదివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
అత్యంత కాలుష్య దేశంగా పాక్.. నగరాల్లో మాత్రం?
2025 సంవత్సరాలనికి గానూ ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నగరాల జాబితాను ఐక్యూ ఎయిర్ విడుదల చేసింది. ఇందులో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్ నిలిచింది. అదే విధంగా అత్యంత కాలుష్య నగరంగా భారత్లోని లోనీ నగరం ఉన్నట్లు నివేదిక తెలిపింది.ప్రపంచంలోని వాయి నాణ్యతపై స్విట్జర్లాండ్కు లోని ఐక్యూఎయిర్ సంస్థ నివేదిక విడుదల చేసింది. అందులో అత్యంత కాలుష్యం దేశంగా పాకిస్థాన్ నిలువగా, రెండవ స్థానంలో బంగ్లాదేశ్, మూడవ స్థానంలో కజకిస్థాన్ నిలిచింది. ఈ జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచినట్లు నివేదిక పేర్కొంది. మెుత్తంగా 143 దేశాల్లో వాయు నాణ్యత పరీక్షలు నిర్వహించగా వాటిలో 130 దేశాలు WHO వాయు నాణ్యత ప్రమాణాలు చేరుకోలేక పోయాయి.ఈ నేపథ్యంలోనే భారత్లోని లోనీ నగరం ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన నగరంగా నిలిచింది. ఘజియాబాద్కు సమీపంలో, ఢిల్లీ సరిహద్దులో ఉండే ఈ పట్టణంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇక్కడ పీఎం2.5 కణాల సాంద్రత 112.5 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే 22 రెట్లు ఎక్కువ. అదే విధంగా రెండవ స్థానంలో చైనా హోటన్ ,3. బర్నీహత్ (మేఘాలయ) - 4. న్యూఢిల్లీ (భారత్) నిలిచాయి. మెుత్తంగా ప్రపంచంలోని టాఫ్ 10 కాలుష్య నగరాల్లో ఐదు భారతీయ నగరాలే ఉండడం ఆందోళన కలిగించే విషయం
లండన్లో యూదు అంబులెన్సులు దగ్ధం
లండన్లో యూదు స్వచ్ఛంద సంస్థకు చెందిన నాలుగు అంబులెన్సులను గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. దీంతో అందులోని సిలిండర్లు పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనను ఆదేశ ప్రధాని కీర్ స్మార్టర్ ఖండించారు.యూదు జనాభా ఎక్కువగా ఉండే లండన్లోని గోల్డర్స్ గ్రీన్ ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. గత సోమవారం తెల్లవారు జామున దుండగులు ఈచర్యకు పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో అత్యవసర సమయంలో వైద్య సహాయం అందించే నాలుగు అంబులెన్స్లు దగ్ధమయ్యాయి. వాహనాల్లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో పక్కనే ఉన్న భవనాల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి.ఈ ఘటనను ఆదేశ్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా గత రెండేళ్లలో బ్రిటన్లో యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు భారీగా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. 2022లో 1,662 ఘటనలు నమోదు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య 3,700కు పెరిగిందని నివేదికలు పేర్కొన్నాయి.
హర్మూజ్ ప్రయాణంపై భారత్ కీలక వ్యాఖ్యలు: భారత్
ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎవరి నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అది అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని తెలిపారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. హార్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో సప్లై చైన్ దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే ఈ అంశాలపై భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడారు.హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. భద్రత, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే షిప్పింగ్ కంపెనీలు, వాటి కాంట్రాక్టు సంస్థలు ఈ జలసంధి గుండా ప్రయాణం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ జలసంధి అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందాల పరిధిలోకి వస్తుంది. దీని గుండా నౌకాయానానికి స్వేచ్ఛ ఉంది. ఆ జలసంధి ఇరుకుగా ఉన్నందున, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మాత్రమే గుర్తించారు, వాటిని నౌకా రవాణా సంస్థలు అనుసరించాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా జలసంధి గుండా ప్రయాణించాలనే నిర్ణయం షిప్పింగ్ కంపెనీకి, ఓడను అద్దెకు తీసుకున్న కంపెనీకి మధ్య ఉంటుంది. ఎప్పుడు ప్రయాణించాలి, ఎప్పుడు ప్రయాణించకూడదు అనేది వారి నిర్ణయం అని తెలిపారు. అయితే ప్రస్తుతం యుద్ధం నడుస్తున్నందున వారు నిర్ణయం తీసుకునే ముందు భద్రత మొదలైన వాటికి సంబంధించి పరిస్థితిని అంచనా వేస్తారు. అంతేగాని హార్మూజ్ గుండా ప్రయాణానికి ఎటువంటి ప్రత్యేక అనుమతి అవసరం లేదు అని ఆయన తెలిపారు. కాగా నిన్న (సోమవారం) మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లు హార్మూజ్ జలసంధిని దాటాయి. ఇవి ఈ నెల 26 లేదా 27 తేదీలలో భారత్ను చేరుకుంటాయి. వీటివల్ల దేశానికి దాదాపు ఒక రోజు వంటగ్యాస్ సరఫరా చేయవచ్చు.
జాతీయం
లాటరీ కింగ్ కొడుకు.. పుదుచ్చేరిలో కోట్లకు పడగలెత్తాడు
సాక్షి, చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న లక్ష్య జన నాయగ కట్చి పార్టీ అధ్యక్షుడు జోస్ చార్లెస్ మార్టిన్ తన ఆస్తి రూ.537 కోట్లుగా ప్రకటించారు. కామరాజర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల సంఘానికి అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల వివరాలు చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. జోస్ చార్లెస్ మార్టిన్ వద్ద రూ.25.67 కోట్ల విలువైన 17.5 కిలోల బంగారం, రూ.44 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి. ఆయన పేరిట రూ.328 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. రూ.1.29 కోట్ల విలువైన వాహనాలు ఉన్నాయి. రూ.1.77 కోట్ల విలువైన వాచ్, రూ.38.53 కోట్ల విలువైన ముత్యాల హారాలు కూడా ఉన్నాయి. లండన్లో రూ. 5.64 కోట్లు, దుబాయ్లో రూ.1.50 కోట్లు విలువైన నివాసాలున్నాయని పేర్కొన్నారు. అరుణాచల్ప్రదేశ్, గోవా, నాగాలాండ్, పంజాబ్లో లాటరీ అమ్మకాలలో 4.53 శాతం వాటా, బెంగాల్లో 3 లాటరీ కేసులు, ఎర్నాకుళంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో 3 కేసులున్నాయని తన అఫిడవిట్లో వివరించారు. షేర్లలో రూ.14.28 కోట్లు, వివిధ బ్యాంకుల్లో రూ.200 కోట్లు డిపాజిట్లు ఉన్నట్టు వివరించారు. అలాగే, రూ. 210 కోట్లు అప్పులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం తన ఆస్తి రూ.537 కోట్లుగా లెక్క చూపించారు. చార్లెస్ లాటరీ అధినేత మార్టిన్ కుమారుడు కావడం గమనార్హం.
కొండచరియల బీభత్సం.. వందల మంది పర్యాటకులు విలవిల
గ్యాంగ్టక్: సిక్కింలో కురుస్తున్న భారీ వర్షాలు పర్యాటకులను బెంబేలెత్తిస్తున్నాయి. ఉత్తర సిక్కింలోని చుంగ్థాంగ్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో సుమారు 200 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.మంగన్ జిల్లా కలెక్టర్ అనంత్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. కీలక చుంగ్థాంగ్-లాచెన్ మార్గంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో లాచెన్కు వెళుతున్న పర్యాటకులు మార్గం మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. చిక్కుకుపోయిన పర్యాటకులకు చుంగ్థాంగ్లోని ఐటిబిపి (ఐటీబీపీ) క్యాంప్, స్థానిక గురుద్వారాలో ఆశ్రయం కల్పించారు. ప్రస్తుతం సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్ఓ)రంగంలోకి దిగి, రహదారిని క్లియర్ చేసే పనులను వేగవంతం చేసింది. అయితే వాతావరణం ఇంకా అనుకూలించకపోవడంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రహదారులు ప్రయాణానికి సురక్షితమని నిర్ధారించిన తర్వాతే పర్యాటకులను అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.ఈ పరిస్థితుల్లో కొంతమంది పర్యాటకులు తమ పర్యటనలను రద్దు చేసుకుని వెనుదిరుగుతున్నారు. మరోవైపు మంగళవారం రాత్రి మూసుకుపోయిన లాచుంగ్ మార్గాన్ని అధికారులు బుధవారం ఉదయం పునరుద్ధరించారు. అక్కడ చిక్కుకున్న వారిని సురక్షితంగా గాంగ్టక్కు తరలించారు. గత ఏడాది సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న లాచెన్ మార్గం, మరమ్మతుల తర్వాత ఈ ఏడాది మార్చి 9నే తిరిగి ప్రారంభమైంది. ఇంతలోనే మళ్లీ ప్రకృతి విపత్తు సంభవించడం పర్యాటక రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.అటు తూర్పు సిక్కింలో కూడా భారీగా మంచు కురుస్తుండటంతో ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలైన చోమ్గో సరస్సు, నాథులా పాస్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. సమీపంలోని డార్జిలింగ్లో కూడా వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడి 10 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పర్యాటకులు వాతావరణ హెచ్చరికలను గమనించి, తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: బర్డ్ ఫ్లూ కలకలం.. 4,400 కోళ్లు మృతి.. హై అలర్ట్
‘మామిడి’ వివాదం
సాక్షి, చైన్నె: పార్టీ పేరు, జెండా, మామిడి పండు గుర్తుపై హక్కుల కోసం పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుచైన్నె సివిల్ కోర్టును మంగళవారం ఆశ్రయించారు. ఈ వివాదంపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. పార్టీలో చీలిక వచ్చినప్పుడు గుర్తును కేటాయించే విష యంలో ఎన్నికల సంఘం తీరును కోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంపై తక్షణమే చైన్నె సివిల్ కోర్టును ఆశ్రయించాలని రాందాసును ఆదేశించింది. సివిల్ కోర్టు పిటిషన్ను స్వీకరించిన మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.నేడు విచారణ..సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాందాసు తరపు న్యాయవాదులు చైన్నె సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎం. ధర్మప్రభు ముందు అప్పీల్ చేశారు. రాందాసు తరపున దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం విచారించేందుకు న్యాయమూర్తి నిర్ణయించారు. అలాగే ఈ పిటిషన్ కాపిని అన్బుమణి వర్గానికి అందజేయాలని కోర్టు ఆదేశించింది. కాగా తమ విషయంలో ఎన్నికల సంఘం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించలేదని రాందాసు మద్దతు దారులు ఆరోపిస్తున్నారు.వివాద నేపథ్యంపీఎంకే పార్టీపై ఆధిపత్యం కోసం తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ’మామిడి పండు’ గుర్తును అన్బుమణి వర్గానికి కేటాయించింది. పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నప్పుడు గుర్తును స్తంభింపజేయాలి లేదా లాటరీ పద్ధతిలో కేటాయించాలే గానీ, ఏక పక్షంగా అన్బుమణికి ఇవ్వడం సరైన పద్ధతి కాదంటూ రాందాసు కోర్టు తలుపు తట్టారు.
బర్డ్ ఫ్లూ కలకలం.. 4,400 కోళ్లు మృతి.. హై అలర్ట్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుయెంజా) కలకలం సృష్టిస్తోంది. స్థానిక ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో కేవలం ఐదు రోజుల వ్యవధిలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.బిలాస్పూర్లోని కోని ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో మార్చి 19 నుండి 24 మధ్య సుమారు 4,400 కోళ్లు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. మొత్తం 5,037 కోళ్లు ఉన్న ఈ కేంద్రంలో ఒక్కసారిగా అధిక సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మృతి చెందిన కోళ్ల నమూనాలను భోపాల్, పూణేలోని ప్రయోగశాలలకు పంపగా, భోపాల్ ల్యాబ్ నివేదికలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఉన్నట్లు ధృవీకరించారు.రెడ్ జోన్గా ఒక కిలోమీటర్ పరిధివైరస్ నిర్ధారణ కావడంతో జిల్లా కలెక్టర్ సంజయ్ అగర్వాల్ తక్షణమే నివారణ చర్యలకు అధికారులను ఆదేశించారు. ఫారం చుట్టూ ఒక కిలోమీటర్ పరిధిని 'ఇన్ఫెక్టెడ్ జోన్' (వ్యాధి ప్రభావిత ప్రాంతం)గా, పది కిలోమీటర్ల పరిధిని 'సర్వైలెన్స్ జోన్' (పర్యవేక్షణ ప్రాంతం)గా ప్రకటించారు. నిబంధనల ప్రకారం, ఇన్ఫెక్టెడ్ జోన్లోని కోళ్లు, గుడ్లు, మేతను పూర్తిగా నాశనం చేయనున్నారు. ఈ ప్రాంతంలో పక్షుల రవాణాను పూర్తిగా నిషేధించారు. నష్టపోయిన పౌల్ట్రీ యజమానులకు పశుసంవర్థక శాఖ ద్వారా పరిహారం అందజేస్తామని వెల్లడించారు.మనుషులకు ముప్పు పొంచి ఉందా?పరిస్థితిని పర్యవేక్షించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను రంగంలోకి దించారు. పౌల్ట్రీ ఫారంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే పరీక్షలు నిర్వహించి, యాంటీ వైరల్ మందులు అందించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఇప్పటివరకు మనుషులకు ఈ వైరస్ సోకిన దాఖలాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా పౌల్ట్రీ విక్రయ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలని, ప్రజలు వదంతులను నమ్మకుండా, అధికారులకు సహకరించాలని జిల్లా మెజిస్ట్రేట్ విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: కమల్ మరో సంచలనం.. స్టాలిన్కు మద్దతుగా..
ఎన్ఆర్ఐ
అమెరికాలో ఘనంగా మహిళా దినోత్సవం
అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. శివరాత్రితో పాటు మహిళా దినోత్సవం రెండు వేడుకలను కలిపి నైటా సంబరాలను అద్వితీయంగా జరిపారు. న్యూయర్క్, న్యూజెర్సీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారందరూ పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ కన్సర్ట్ అందరినీ అలరించింది. భక్త కన్నప్ప స్కిట్, టీ&టీ సిస్టర్స్ నృత్య ప్రదర్శన, ఘర్షణ బ్యాండ్, అంజనా సౌమ్య, సృష్టి చిల్లాల ఫెర్మార్మెన్స్లు ఆహుతులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలు, వివిధ స్కిట్లు ఆహా అనిపించాయి. నైటా ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల సమాహారంతో రూపొందించిన ప్రత్యేక నైటా సంబరాల సావనీర్-2026ను ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, వితరణశీలి డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. సంస్కృతీ సంప్రదాయాల కలబోతగా న్యూయార్క్ వేదికగా నైటా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ ప్రత్యేక సందేశాలు పంపారు. అమెరికాలో స్థిరపడినా పుట్టినప్రాంత పండగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ కొనసాగిస్తున్నామని, వేడుకల విజయాన్ని ఆకాంక్షిస్తూ సహకరించిన అందరికీ నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ హరిచరణ బొబ్బిలి, సెక్రటరీ మహేష్ బాబు, ట్రెజరర్ డాక్టర్ సౌమ్య శ్రీ, ఇతర కార్యకవర్గ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.(చదవండి: లండన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
చాయ్వాలాగా ఐటీ ఉద్యోగి..!
ఐఐటీ విద్యార్థి చాయ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అది కూడా అమెరికాలో. ఈ భారత సంతతి వ్యక్తి కథ నెట్టింట సెన్సేషన్గా మారింది. ఈ టెకీ కథ ప్రతి ఒక్కర్ని కదలించడమే కాదు, ఆలోచింపచేసేలా చేసింది. అతడే చాయ్వాలా లేదా చాయ్గుయ్గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్ ప్రసాద్. బిహార్ పాట్నా సమీపంలోని బార్ అనే చిన్న పట్టణానికి చెందిన ప్రభాకర్ ఈ ఫిబ్రవరి 2025లో టెక్ లేఆఫ్లు నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో చాయ్స్టాల్ని ప్రారంభించి ఒక్కో టీ కప్పుని రూ. 780లకు విక్రయిస్తున్న అతడి కథ నెట్టింట వైరల్ అవ్వడంతో..ఒక్కసారిగా అతడి బిజినెస్ కూడా లాభాసాటిగా పుంజుకోవడం విశేషం. ఎక్కడో బిహార్ నుంచి అగ్రరాజ్యం అమెరికాకు ఎలా వలస వచ్చాడంటే.. నిజానికి ప్రభాకర్ కుటుంబం కడు పేదరికంతో ఇక్కట్లు పడుతుండేది. కనీసం దుప్పట్లు కూడా కొనుక్కోలేని దారుణ పరిస్థితి. దాంతో వాళ్లు శీతాకాలం వచ్చిందంటే చాలు వెచ్చదనం కోసం పప్పుబస్తాల కింద నిద్రించేవారట. ప్రభాకర్ తండ్రి అనేక వ్యాపారాలు చేసినా..ఎందులోనే విజయం సాధించలేకపోయేవాడట. కానీ అతడి తల్లిదండ్రులు విద్య శక్తిని మాత్రం గట్టిగా విశ్వసించేవారట. ఇక ప్రభాకర్ చిన్నతనంలో బిహార్లోని ఓ హిందీ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ప్రభాకర్ క్లాస్ ఫస్ట్, లీడర్ కూడా. క్రికెట్ దగ్గర నుంచి పాటలు పాడటం వరకు అన్నింట్లోనూ మనోడే ఫస్ట్. అయితే తన సోదరుడు కిడ్నాప్కి గురవ్వడంతో తన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగిందని చెబుతున్నాడు. తన కుటుంబం అకస్మాత్తుగా బీహార్ వదిలి భోపాల్కు వెళ్లిపోయింది. ఆ మార్పుని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ప్రభాకర్కి. భోపాల్లో తోటి విద్యార్థులంతా ఇంగ్లీస్లో అనర్గళంగా మాట్లాడంతో..తన ఆంగ్లయాసను చూసుకుని అంత నవ్వేవారంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. బిహార్ బోర్డు స్కూల్ నుంచి ఇంగ్లీష్ సీబీఎస్ఈ స్కూల్ వరకు కనీసం ప్రాథమిక పదాలు అర్థమయ్యేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే కష్టపడి ఏదో రకంగా నేర్చుకున్నానని, అలా ఐఐటీ స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని చెప్పుకొచ్చారు. ఐఐటీ అడ్మిషన్ తన జీవిత గమనాన్ని మార్చిందని చెబుతున్నాడు. ఐఐటీ పూర్తి అయిన వెంటనే 2008లో మొట్టమొదటి ఉద్యోగాన్నిపొందాను, అయితే టెక్ ప్రపంచం నాకెందుకో అంతగా నచ్చలేదు. కోడింగ్ నన్ను ఎప్పుడు ఉత్సాహపరచలేదని అంటున్నాడు. దాంతో అక్కడి కార్పొరేట్ ఒత్తిడి తట్టుకునేందుకు జిమ్లో గడుపుతుండేవాడినని, అలా బాడీబిల్డింగ్ తన అభిరుచిగా మారిందని అంటున్నాడు. దాంతో కొత్తగా వేరే ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ముంబైకి వెళ్లి మోడలింగ్ ఆడిషన్లకు వెళ్తుండేవాడినని చెప్పుకొచ్చాడు. అలా మోడలింగ్లో రాణించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా అతడి స్నేహితురాలు అమెరికా వెళ్లిపోయింది. దాంతో ప్రభాకర్ కూడా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీసా రెండుసార్లు తిరస్కరణకు గురైంది. చివరికి 2014లో మాత్రమే ఎంబిఏ చేయడానికి యూఎస్ వెళ్లగలిగానంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే అనుకున్నంత అందంగా అమెరికా జీవితం ఉండదు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని ఇబ్బందులు తదితరాలన్నింటిని ఎదుర్కొన్నాడు. దాదాపు పదేళ్లు అమెరికాలో ఒక నగరం నుంచి మరొక నగరానికి తిరుగుతూనే ఉన్నానని, ఎన్నో కార్పొరేట్ ఉద్యోగాలు కూఆ చేశానని, అయితే తాను లేఆఫ్ వేటుకి గురయ్యానంటూ బాధగా చెప్పుకొచ్చాడు. ఇంతలో తన ఆరోగ్యం కూడా కుదుటపడింది. అయితే నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియని ఈ అస్థిరతకు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుండగా..ఒక స్నేహితుడి సూచన మేరకు చాయ్వాలాగా మారినట్లు చెప్పుకొచ్చాడు. తాను బిహారీ శైలి చాయ్ అమ్ముతూ ఓ వీడియోని నెట్టింట పోస్ట్ చేశాను. ఇది తన వ్యాపార ప్రచారంలో భాగంగా చేశానని, అనుకున్నట్లుగా చాలామందికి ఆ వీడియో చేరువై వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నాడు ప్రభాకర్. అయితే కార్పొరేట్ జాబ్లలో పనిచేస్తున్నప్పుడు చేతినిండా డబ్బు ఉంది..స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయాయి. కానీ ఇవాళ్ల తన వద్ద డబ్బు తక్కువగానే ఉంది, కానీ స్వేచ్ఛ ఆనందం చాలా గరిష్టస్థాయిలో ఉన్నాయని అంటున్నాడు. అంతేగాదు తన స్వంత ఇష్టానికి తానే యజమానిని అని చెబుతున్నాడు కూడా. తాను కార్పొరేట్ బానిసను కాదని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. గౌరవంగా బతకాలనుకుంటే..ఎంత చిన్న ఉద్యోగమైనా.. మంచిదే..అదే స్వేచ్ఛ, ఆనందం నిల్ అయితే కోట్లు గడించే ఉద్యోగమైనా వేస్టే కదా అని ప్రభాకర్ గాథ చూస్తే తెలుస్తోంది కదూ..!.(చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..)
లండన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
లండన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘‘సహకారం, స్నేహం, సిస్టర్హుడ్-మహిళల విజయానికి మూడు బలమైన స్థంభాలు.” అనే భావంతో యూకేలో నివసిస్తున్న తెలుగు మహిళలు “తెలుగు లేడీస్ యుకే” ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. మహిళా సాధికారత, పరస్పర సహకారం, సోదరీమణుల ఐక్యతకు ప్రతీకగా ఈ వేడుక నిలిచింది.సాయం కోరే వారికి, సహాయం అందించే వారికి వారధిగా నిలిచిన తెలుగు లేడీస్ ఇన్ యుకే గ్రూపున శ్రీదేవి మీనావల్లి 15 ఏళ్ల క్రితం స్థాపించారు. ప్రస్తుతం ఈ గ్రూపులో యూకేలో నివసిస్తున్న ఐదు వేలకుపైగా తెలుగు మహిళలు సభ్యులుగా ఉన్నారు. యూకేకు కొత్తగా వచ్చిన తెలుగు ఆడపడుచులకు ఆదరణగా నిలిచి, వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తూ విద్య, వైద్యం, ఉద్యోగ రంగాలలో సహాయం చేయడం ఈ గ్రూప్ ప్రధాన ఆశయమని శ్రీదేవి తెలిపారు. మహిళలు ఒకరికొకరు అండగా నిలిచి ముందుకు సాగాలనే సంకల్పంతో ఈ వేదిక అనేకమందికి ధైర్యం, మార్గదర్శనం అందిస్తోంది.ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో, ఫ్యాషన్ షో తో సందడి చేశారు. కార్యక్రమంలో నిర్వహించిన ఇన్స్పైరింగ్ స్టోరీస్ సెగ్మెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, మహిళలు తమ జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, విజయ కథలను పంచుకుని అందరికీ స్ఫూర్తినిచ్చారు. అలాగే ప్రముఖ బ్రాండ్స్తో జరిగిన ఫ్యాషన్ షో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమ ప్రాంగణంలో షాపింగ్ స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జ్యోతి సిరపు, లక్ష్మి చిరుమామిళ్ల, సువర్చల మాదిరెడ్డి, స్వాతి డోలా, స్వరూప పంతంగి, శిరీష టాటా, దీప్తి నాగేంద్ర, , సవిత గుంటుపల్లి, చరణి, జ్యోతి బాలుసు తదితరులు పాల్గొన్నారు.
గత 23 ఏళ్లుగా రంజాన్ దీక్ష చేస్తున్న 56 ఏళ్ల ఎన్ఆర్ఐ
పవిత్ర రంజాన్ (Ramadan) మాసం వేళ మత సామరస్యానికి సంబంధించి అపురూపమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రంజాన్మాసం అంతా ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేస్తారు ఇది అందరికీ తెలిసిందే. కానీ దుబాయ్లో 56 ఏళ్ల నాన్ ముస్లిం గత 23 ఏళ్లు ఉపవాస దీక్ష చేస్తుండటం విశేషంగా నిలుస్తోంది. 2002 నుండి సతీష్ కుమార్న దుబాయ్లో ఉంటున్నారు. స్వయంగా తాను హిందువు అయినప్పటికీ పవిత్ర రంజాన్ నెలలో ఉపవాసం పాటిస్తున్నారు. రంజాన్ అంటే మంచి పనులను పంచుకుంటూ, జీవించడం అంటే సమాజంతో ఐక్యంగా ఉండటం అంటారు సతీష్. తన చుట్టూ ఉన్న ప్రజల పట్ల గౌరవం ఉందని, వారిమీద ప్రేమతోనే ఈ దీక్ష చేస్తానని చెప్పుకొచ్చారు. గల్ఫ్ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, కుమార్ రోజువారీ ఉపవాసం కేవలం శారీరక సవాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రక్రియగా విశ్వసిస్తానని తెలిపారు. ఇది ఆహారం, పానీయం, పాప ప్రవర్తనకు దూరంగా ఉండటంతోపాటు స్వీయ-క్రమశిక్షణ, ఆధ్యాత్మిక శుద్ధిని పెంపొందించుకునే మార్గం ఇదని చెప్పారు.ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!దీంతోపాటు, వారి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడే వ్యక్తుల ఇబ్బందులను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి చూడటానికి ఉపవాసం తనకు సహాయపడిందన్నారు. ఆకలిదప్పుల బాధను అనుభవించడం వల్ల పేదల దుస్థితిని అర్థం చేసు కోచ్చని, తద్వారా మనలో దాతృత్వం,కరుణ అనే భావం పెరుగుతుందని తెలిపారు. ఉపవాసంతో అనేక శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయన్నారు. ముఖ్యంగా ఉపవాసంద్వారా జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడం అంటే శారీరక ప్రయోజనాలను పొందమే అన్నారు. దీంతో మానసిక బలం పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది అనేది తన అనుభవంలో తెలిసిందన్నారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్ : మైనర్పై దారుణం, ట్రంప్కు మరో షాక్
క్రైమ్
Rapido: వామ్మో.. వీళ్ల తెలివి మామూలుగా లేదుగా!
హైదరాబాద్: ర్యాపిడో డ్రైవర్కు, ప్రయాణికురాలికి మధ్య జరిగిన గొడవలో గుర్తుతెలియని వ్యక్తులు మధ్యవర్తుల్లా వ్యవహరించి వారి ఫోన్లు దోచుకెళ్లిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగర్కర్నూల్ జిల్లా టూడుకుర్తి గ్రామానికి చెందిన రేణుక(32) నగరంలో కొండాపూర్లో నివసిస్తోంది. ఈ నెల 22న షేక్పేటలోని తన బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె రాత్రి 8 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో ర్యాపిడో బుక్ చేసేందుకు ప్రయతి్నంచింది. ఈ సమయంలో తనను మహ్మద్ ఖాలిద్గా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి తాను ర్యాపిడో డ్రైవర్నని చెప్పి ఆమెను బైక్పై తీసుకువెళ్లేందుకు ముందుకువచ్చాడు. నమ్మకంతో రేణుక అతని బైక్పై ఎక్కింది. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ ఆలయం వద్దకు చేరుకున్న తర్వాత చార్జీల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అటుగా వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు మధ్యవర్తుల్లా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి రేణుక, ఖాలిద్ల ఫోన్లు తీసుకుని పికప్, డ్రాప్ వివరాలు చెక్ చేస్తున్నట్లు నటించారు. ఈ క్రమంలో వారిద్దరి దృష్టి మరల్చి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత తమ ఫోన్లు దొంగిలించినట్లు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
కూతురును కడతేర్చి... తానూ ఆత్మహత్యాయత్నం
సంస్థాన్ నారాయణపురం: భార్యాభర్తల మధ్య కలహాలతో కుమార్తెకు ఎలుకల మందు పెట్టి కడతేర్చాడు ఓ తండ్రి. అనంతరం తానూ నీళ్లలో ఎలుకల మందు కలుపుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లచ్చమ్మగూడెం గ్రామానికి చెందిన వరికుప్పల రవి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రవికి నాలుగేళ్ల క్రితం మాడుగులపల్లికి చెందిన స్వాతితో వివాహం జరిగింది. వీరికి మేఘన(2)తో పాటు 9 నెలల వయసున్న మయూరి అనే కుమార్తె ఉన్నారు. గత ఆరు నెలల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మూడు నెలల క్రితం స్వాతి తన చిన్న కుమార్తె మయూరిని తీసుకుని తల్లిగారింటికి వెళ్లింది. మేఘన తండ్రి దగ్గరే ఉంటుంది. అయితే పెద్ద కుమార్తె మేఘనను కూడా తన దగ్గరికి పంపించాలని స్వాతి మాడుగులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై భార్యాభర్తలు పెద్దమనుషుల సమక్షంలో సోమవారం మాట్లాడుకోవాల్సి ఉంది. కాగా.. తన చిన్న కుమార్తెను తీసుకుని భార్య తల్లిగారింటికి వెళ్లిందనే కోపంతో రవి తన పెద్ద కుమార్తె మేఘనకు మంగళవారం సపోట పండులో ఎలుకల మందు కలిపి ఇచ్చాడు. మేఘన ఆ సపోట పండు తిని వాంతులు చేసుకుంది. అనంతరం రవి కూడా ఎలుకల మందు నీళ్లలో కలుపుకొని తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి మేఘనను హైదరాబాద్కు, రవిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మేఘన మృతిచెందింది. రవి పరిస్థితి విషమంగా ఉంది. రవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫోన్ లాక్ కోడ్ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్ మిస్టరీ
ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘాజియాబాద్లోని ఒక హై-రైజ్ సొసైటీలో 42 ఏళ్ల జ్యోతిష్కుడు రాజ్వీర్ ఆత్మహత్య మిస్టరీ వీడింది. జ్యోతిష్కుడిగా ఉంటూ ఇతరుల జాతకాలు చెప్పే వ్యక్తి, అప్పుల భారం, కుటుంబ సమస్యలతో ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. రాజ్వీర్ 13వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్వీర్ ఆత్మహత్య తర్వాత, పోలీసులు అతని ఇంటిని తనిఖీ చేయగా గ్రౌండ్ ఫ్లోర్లోని ఫ్లాట్లో దుప్పటిలో చుట్టి ఉన్న అతని 70 ఏళ్ల తల్లి సత్నాం మృతదేహం కనిపించింది. బాడీమీద ఎలాంటి గాయాలు లేకపోవడంతో హత్య అనేకోణాన్ని పోలీసులు కొట్టిపారేశారు. కనీసం రెండు రోజుల క్రితమే ఆమె చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్మార్టం నివేదిక తర్వాతే ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.అమ్మతో పాటే నేనుతల్లి చనిపోతే తాను కూడా చనిపోతానని రాజ్వీర్ గతంలో సన్నిహితులతో చెప్పేవాడని సమాచారం. తల్లి మృతదేహంతో రెండు రోజులు గడిపిన తర్వాతే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. లక్షల అప్పు, భార్యతో విభేదాలురాజ్వీర్కు సుమారు 15 - 16 లక్షల రూపాయల వరకు అప్పులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే భార్య, కుమారుడికి దూరంగా ఉంటున్నాడు. గత నాలుగు నెలలుగా అతను ఇంటి ఖర్చులకు ఎటువంటి ఆర్థిక సాయం చేయడం లేదని అతని భార్య తెలిపింది.ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు రాజ్వీర్ తన మొబైల్ ఫోన్ లాక్ కోడ్ను భార్యకు మెసేజ్ చేశాడు. పోలీసులు ఆ ఫోన్ను తనిఖీ చేయగా, హర్యానాకు చెందిన ఒక మహిళతో అతను ప్రేమలో ఉన్నాడని, తనకు విడాకులు అయ్యాయని చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని తెలిసింది. రాజ్వీర్ తండ్రిని, సోదరుడిని కోల్పోయాడు. పొరుగువారితో పెద్దగా మాట్లాడేవాడు కాదని స్థానికులు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే తీవ్ర నిరాశకు లోనైన అతను కఠిన నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.
భర్తను చంపి చెరువులో పడేసిన భార్య..!
గుంటూరు: ఈనెల 19వ తేదీన యనమదల / ఈదులపాలెం గ్రామాల పరిధిలోని ఎన్హెచ్ 16 సమీపానున్న చెరువులో నడుముకు రాయికట్టి గోనెసంచిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహం తాలూకా మిస్టరీ వీడింది. మద్యం మత్తులో ఉన్న భర్తను తాడుతో కట్టేసి, కర్రలతో కొట్టి భార్యే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసులో మృతుడి భార్య, మరో ముగ్గుర్ని ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈనెల 19న మృతుడి నడుంకు రాయిని తాడుతో కట్టి, గోనెసంచిలో పెట్టిఉంచారని అందిన సమాచారం మేరకు.. ప్రత్తిపాడు పీఎస్ సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతన్ని ఎవరైనా హత్య చేసి ఉంటారని, ఆ దిశగా దక్షిణ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ మధుసూదన్రావు పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గుంటూరు దాసరిపాలెం గ్రామంలోని ఓ కుటుంబం ఇంటి సామగ్రి, పశువులతో పరారవుతున్నట్లు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెం ప్లాట్స్లో ఉంటున్న తెనాలి ఐతానగర్ బత్తులవారివీధికి చెందిన ఉప్పుతల్ల లక్ష్మి అలియాస్ తన్నీరు తిరుపతమ్మ, ప్రస్తుతం తెనాలి పెదరావూరులో ఉంటున్న చౌడవరం సీఆర్నగర్కు చెందిన భార్యభర్తలు సిద్ధి అంకమ్మ, సురేష్ పేరేచర్ల లక్ష్మీనరసింహకాలనీ ఐదో వీధికి చెందిన ఓ మైనర్గా గుర్తించారు. చెరువులో మృతదేహం తన్నీరు వెంకటేశ్వర్లు (30)గా గుర్తించి, మృతురాలి భార్య తిరుపతమ్మ, ఆమె సోదరి అంకమ్మ, భర్త సురేష్, సోదరుడు మైనర్ను అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన కరల్రు, ఇనుప పలుగు, పారలు, మోటార్సైకిళ్లు స్వా«దీనం చేసుకున్నారు. హత్య చేశారిలా.. వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై, భార్య తిరుపతమ్మను శారీరక, మానసికంగా వేధించేవాడు. పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేసినా అతనిలో మార్పురాలేదు. ఈనెల 17న వెంకటేశ్వర్లు, తిరుపతమ్మకు మళ్లీ వివాదం నెలకొంది. దీంతో తిరుపతమ్మ ఆతన సోదరి, బావ, మైనర్లకు సమాచారం అందించింది. దీంతో భార్య, ఆ ముగ్గురు కల్సి వెంకటేశ్వర్లను తాడుతో కట్టేసి, కరల్రతో తీవ్రంగా కొట్టగా మృతిచెందాడు. తొలుత భర్త మృతదేహన్ని ఇంట్లో పూడ్చాలని అనుకున్నా, స్థానికులకు అనుమానం వస్తుందని భావించారు. దీంతో మిరపకాయల గోనె సంచిలో మృతదేహం వేసుకుని మోటార్సైకిళ్లపై తీసుకెళ్లి చెరువులో పడవేశారు. అయితే మృతదేహాం పైకి తేలకుండా నడుముకు రాయిని తాడుతో కట్టేసి చెరువులో వేశారని దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసుని చేధించిన సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి, సిబ్బందిని జిల్లాఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు. సమావేశంలో దక్షిణ ఇన్ఛార్జ్ డీఎస్పీ మధుసూదన్రావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
వీడియోలు
ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...
KCR మంచి దోస్త్ నాకు..
తొందర పడకు.. ప్రతి రోజు సినిమా చూపిస్తా..
BJP MLA రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..
పరిస్థితుల్ని అదుపుచేయ్యాలి అంటే లాక్ డౌన్ తప్పదా..?
పూరీలా ఒక్క రోజు బతికితే చాలు..
ఆ బిల్లుకు పూర్తి మద్దతు మోదీకి జగన్ ట్వీట్
కూటమి వేధింపులు.. IAS, IPSలను కూడా వదలరా!
యుద్ధం పేరుతో గ్యాస్ మాటలు... కిరోసిన్ ఇస్తావు సరే... స్టవ్ లు సంగతేంటి
ఇబ్బందులు ఉంటాయి తెలిసినా అశోక్ బాబు మాత్రం...

