Hyderabad: మూతపడనున్న బావర్చి రెస్టారెంట్..!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత, ఖర్చులు పెరగడంతో చిన్న హోటళ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ధరల పట్టికలను సవరిస్తున్నాయి. టిఫిన్¯ సెంటర్లు రూ.10 నుంచి 20, హోటళ్లు బిర్యానీ, మీల్స్పై రూ.50 వరకు పెంచేశాయి. సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలుతుండడంతో పాటు కొందరు డీలర్లు కృత్రిమ కొరత సష్టిస్తున్నారు. దీంతో హోటల్ నిర్వహకులు ఒక్కో సిలిండర్పై అదనంగా రూ.300–500 చెల్లించాల్సి వస్తోంది. కాగా, గ్యాస్ మాత్రమే కాక రవాణా చార్జీలు కూడా పెరగడంతో కిరాణం సరుకులు, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఇది హోటల్ యజమానులకు భారంగా మారింది. మేడ్చల్ జిల్లాలోని హాస్టళ్లలో టిఫిన్లు బంద్ చేశారు. మూడు పూటలా భోజనమే వడ్డిస్తున్నారు. బావర్చి... పార్సిళ్లకే పరిమితం హైదరాబాద్ బిర్యానీ అంటే.. బావర్చి అనేంతగా ప్రసిద్ధి చెందిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బావర్చి హోటల్పైనా సిలిండర్ కొరత ప్రభావం పడింది. నిర్వాహకులు బిర్యానీని పార్సిళ్లకు మాత్రమే పరిమితం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్ నడపడం చాలా కష్టమేనని బావర్చి హోటల్ నిర్వాహకుడు సల్మాన్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో పార్సిల్ సెంటర్ కూడా మూతపడేలా ఉంది. క్రాస్ రోడ్స్లోని మరో ప్రముఖ రెస్టారెంట్ కూడా మూతపడింది. రైల్వేస్టేషన్లో పెరుగుతున్న రద్దీ సికింద్రాబాద్: ఎండలు ముదరడం.. గ్యాస్ కొరత వల్ల వీధి వ్యాపారాలు మూతపడటం.. కాలేజీ విద్యార్థుల పరీక్షలు ముగియడం, శుభముహూర్తాలకు అనువైన వాతావరణం ఉండటంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు రెండు రోజులుగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్యాస్ కొరతతో ఫుట్పాత్ వ్యాపారాలు ఇప్పటికే మూతపడ్డాయి. హాస్టళ్లు, హోటళ్లు కూడా మెను ఐటమ్స్ను తగ్గించి నేడోరేపో మూసివేసే స్థితికి చేరే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కారి్మకులు సైతం సొంత ఊర్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్కు వస్తున్నారు. జనరల్ ప్రయాణికులను అదుపు చేసేందుకు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
కృష్ణవేణి మరణం వెనుక దారుణాలు!
వైఎస్ఆర్ కడప జిల్లా: నందలూరు రైల్వేలోకోపైలెట్ శ్రీరామ్ శ్రీనివాస్ రెండో భార్య కృష్ణవేణి మరణం వెనుక అనేక దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణవేణి ఆత్మహత్య చేసుకున్న రాత్రంతా మద్యం సేవించి ఇంటిలోనే ఉన్నట్లు, గురువారం అటు పోలీసులకు, ఇటు మృతురాలి కుటుంబసభ్యులకు తెలియజేశాడు.శ్రీరామ్ శ్రీనివాస్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు అమ్మ చచ్చిపోయింది అని కిటికీలోంచి ఉరి వేసుకున్న కృష్ణవేణిని చూపించినట్లు తెలిసింది. అనంతరం పిల్లలకు భోజనాలు పెట్టి, తను మద్యం సేవించి, మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఇంట్లోనే పిల్లలతోనే భర్త ఉండిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణవేణి వేధింపులకు గురిచేసి ఆమె మృతికి కారణమయ్యాడని బంధువులు ఆరోపించారు.పది సంవత్సరాల క్రితం ఆయన మొదటి భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఆరుసంవత్సరాల కిందట మృతురాలిని వివాహం చేసుకున్నాడు. కాగా శ్రీనివాస్ మరో అమ్మాయి ప్రేమలో పడి భార్యకు చిత్రహింసలు పెడుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఈ కారణంగా రెండోభార్యతో తరుచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం. కాల్చి వాత పెడుతున్నట్లు, ఆ గాయాలను పుట్టింటి వారికి చూపించి బాధపడేదని బంధువులు చెబుతున్నారు. మృతురాలి వంటిపై గాయాలు కూడా ఉన్నట్లుగా సంబంధీకులు ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడు నాగరాజు మీడియా ఎదుట ఆరోపణలు చేస్తూ శ్రీరామ్ శ్రీనివాస్కు తగిన శిక్ష వేసి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు.
నియామకాల పండగే!
న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాలు వచ్చే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో గణనీయంగా పెరగనున్నట్లు మ్యాన్పవర్ గ్రూప్ తాజా సర్వే తెలిపింది. వ్యాపారాల్లో పెరిగిన విశ్వాసం, దేశీ డిమాండ్ బలంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. మ్యాన్పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ సర్వే ప్రకారం.. 2026 సంవత్సరం రెండో త్రైమాసికానికి నెట్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ (ఎన్ఈవో) 68 శాతానికి చేరి రికార్డు స్థాయిని తాకింది. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 17 పాయింట్లు, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 24 పాయింట్లు ఎక్కువ.జనవరి 1 నుంచి ఫిబ్రవరి 3 మధ్య దేశవ్యాప్తంగా 3,000కిపైగా సంస్థల యజమానుల అభిప్రాయాలను మ్యాన్పవర్ గ్రూప్ తెలుసుకుని ఈ వివరాలు విడుదల చేసింది. గతేడాది చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు, 2026 సంవత్సరానికి బలమైన ఆర్థిక వృద్ధి అంచనాలు వ్యాపారాలకు మద్దతునిస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. అలాగే భారత్– ఐరోపా సమాఖ్య (ఈయూ) వాణిజ్య ఒప్పందం, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం వంటివి మెరుగైన ఎగుమతులకు సహాయపడతాయని పేర్కొంది. నియామకాలు పెరుగుతాయన్న సంస్థల అంచనాల నుంచి, నియామకాలు తగ్గుతాయని చెప్పిన కంపెనీల అంచనాలను మినహాయించగా వచి్చందే నెట్ ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ (ఎన్ఈవో). ఫైనాన్స్, బీమాలో ఎక్కువ.. ⇒ మ్యాన్పవర్ గ్రూప్ సర్వే ప్రకారం.. ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంలోని కంపెనీలు గరిష్ట నియామక అంచనాలతో ఉన్నాయి. ఇది 71 పాయింట్లుగా ఉంది. గత త్రైమాసికం నుంచి 8 పాయింట్లు పెరిగింది. అదే గతేడాది క్యూ2తో పోలి్చతే ఏకంగా 26 పాయింట్లు పెరిగింది. అంతేకాదు ఫైనాన్స్, బీమా రంగంలో నియామక అంచనాల పరంగా అంతర్జాతీయంగానూ భారత్ మొదటి స్థానంలో ఉంది. ⇒ ఆటోమోటివ్ రంగం సైతం పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగులను ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో తీసుకోనుంది. ఆ తర్వాత టెక్నాలజీ, ఐటీ రంగంలో ఎక్కువ అవకాశాలు రానున్నాయి. ⇒ ఆతిథ్య రంగంలో నియామకాల అంచనా 31 శాతంగా ఉంది. ఈ రంగంలో కొంత అప్రమత్త ధోరణి కనిపించింది. ⇒ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉద్యోగ నియామకాలు పెరగనుండగా, ఉత్తర భారత్లో మాత్రం 70 పాయింట్లతో బలమైన అంచనాలు కనిపించాయి. ⇒ ఇప్పటికే 87 శాతం సంస్థలు నియామకాలు, శిక్షణ విషయంలో ఏఐని వినియోగిస్తున్నాయి. ఏఐ తమ అంచనాలను పూర్తిగా అందుకుంటున్నట్టు 11 శాతం సంస్థలే చెప్పాయి.వేధిస్తున్న నిపుణుల కొరత..‘‘నియామకాల ఉద్దేశ్యం బలంగా ఉంది. ఇది యాజమాన్యాల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం. అదే సమయంలో నిపుణుల కొరత సైతం వేధిస్తోంది. తమకు కావాల్సిన నైపుణ్యాలను గుర్తించడం కష్టంగా ఉందని 82 శాతం సంస్థలు అంటున్నాయి. రానున్న రోజుల్లో నియామక నిర్ణయాలను కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావితం చేయనుంది’’అని మ్యాన్పవర్ గ్రూప్ ఎండీ సందీప్ గులాటీ తెలిపారు.
యాద్రాద్రి భువనగిరి జిల్లాలో దారుణం
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మండలం తొక్కాపురం దారుణం జరిగింది. మానసికంగా బాగాలేక కూతురు, కుమారుడిపై తల్లి కత్తితో దాడి చేసింది. అనంతరం తల్లి నీలిమ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నీలిమను ఉప్పల్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి దాడిలో కూతురు కృతికరెడ్డి మృతి చెందింది.బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నరేందర్రెడ్డితో 15 ఏళ్ల క్రితం వివాహమయ్యింది. నిన్న(శనివారం) సాయంత్రం నీలిమ.. తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఘటనకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది.
‘ఉస్తాద్.. ’ కోసం శ్రీలీల అంత తీసుకుందా?
కృష్ణవేణి మరణం వెనుక దారుణాలు!
ఐదు రాష్టాల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్?
మా జట్లను చూస్తుంటే గర్వంగా ఉంది: రోహిత్ శర్మ
భారీ ఎన్కౌంటర్.. పాక్ ఉగ్రవాది హతం
వేరే యువతితో ఉండగా ఇంటికి తాళం వేసిన భార్య
ఆహ్లాదకర వాతావరణం.. ల్యాండ్ స్కేపింగ్ అనివార్యం!
94వ ‘గ్రాండ్మాస్టర్’ మయాంక్ చక్రవర్తి
‘ఆ ఇళ్లలో సిలిండర్లు కనిపిస్తే చర్యలు’
మోజ్తాబా ప్రాణాలతో లేడు.. ట్రంప్ సంచలన ప్రకటన
సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
సిలిండర్ డెలివరీపై కఠిన నియమం
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
ఏ పని చేయకుండా నిత్యం అవే ఆలోచిస్తున్నారు!
T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్
సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!
శ్రీ పరాభవ నామ సంవత్సర (2026 – 27) రాశిఫలాలు
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
ఆ మూవీ అప్పుడే తేడా కొట్టింది, కరెక్ట్ కాదన్నాను: రాశీ
నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ముందే అనుకుంటే చాలనుకుంటా సార్!
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!
పెళ్లికి ముందే పిల్లల విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాం: అల్లు శిరీష్
‘ఉస్తాద్.. ’ కోసం శ్రీలీల అంత తీసుకుందా?
కృష్ణవేణి మరణం వెనుక దారుణాలు!
ఐదు రాష్టాల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్?
మా జట్లను చూస్తుంటే గర్వంగా ఉంది: రోహిత్ శర్మ
భారీ ఎన్కౌంటర్.. పాక్ ఉగ్రవాది హతం
వేరే యువతితో ఉండగా ఇంటికి తాళం వేసిన భార్య
ఆహ్లాదకర వాతావరణం.. ల్యాండ్ స్కేపింగ్ అనివార్యం!
94వ ‘గ్రాండ్మాస్టర్’ మయాంక్ చక్రవర్తి
‘ఆ ఇళ్లలో సిలిండర్లు కనిపిస్తే చర్యలు’
మోజ్తాబా ప్రాణాలతో లేడు.. ట్రంప్ సంచలన ప్రకటన
సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
సిలిండర్ డెలివరీపై కఠిన నియమం
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
ఏ పని చేయకుండా నిత్యం అవే ఆలోచిస్తున్నారు!
T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్
సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!
శ్రీ పరాభవ నామ సంవత్సర (2026 – 27) రాశిఫలాలు
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
ఆ మూవీ అప్పుడే తేడా కొట్టింది, కరెక్ట్ కాదన్నాను: రాశీ
నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ముందే అనుకుంటే చాలనుకుంటా సార్!
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!
పెళ్లికి ముందే పిల్లల విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాం: అల్లు శిరీష్
ఫొటోలు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
వైట్ డ్రెస్లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
తెలంగాణ వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు (ఫొటోలు)
అల్లు సినిమాస్ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)
కూకట్పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)
ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)
‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, బన్నీ (ఫోటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)
సినిమా
హీరో రాజశేఖర్కు గోటీల బిజినెస్.. ఆయన ఏమన్నారంటే?
టాలీవుడ్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తోన్న బైకర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి అభిలాశ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజైన సాంగ్ ఆడియన్స్ను మెప్పించింది.అయితే ఈ సినిమా సంగతి పక్కనపెడితే హీరో రాజశేఖర్పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. గతంలో ఆయన గోటీల బిజినెస్ ప్రారంభించారని నెట్టింట మీమ్స్ వైరలయ్యాయి. ఈ వ్యాపారంలో ఆయన కోట్లు సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. కొందరైతే ఏకంగా రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగాలు వచ్చాయంటూ మరీ హాస్యంగా పోస్టులు పెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ ఇదంతా నిజమేనా అని ఆరా తీయడం మొదలెట్టారు.తాజాగా తనపై వచ్చిన మీమ్స్పై హీరో రాజశేకర్ స్పందించారు. ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. తనకు అలాంటి వ్యాపారాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. తనకు గోటీల ఫ్యాక్టరీ ఉందని అందరు మాట్లాడుకుంటుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. కొందరు అది నిజమే అనుకుని నాకు కాల్ చేసి అడిగారని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీడియో చూడగానే నాకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? నేనెక్కడ రూ.3 కోట్లు సంపాదిస్తున్నా? అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
నీరా ఆర్య బయోపిక్లో?
బాలీవుడ్ హీరోయిన్, భార తీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ప్రస్తుతం నీరా ఆర్యగా ఒదిగిపోవడానికి కసరత్తులు చేస్తున్నారని టాక్. ఎందుకంటే నీరా ఆర్య బయోపిక్లో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తన కెరీర్లో ఎన్నో సవాల్తో కూడిన పాత్రలు చేసిన కంగన ప్రస్తుతం ఆచి తూచి పాత్రలు ఎంపిక చేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఆమె లోక్సభ సభ్యురాలు కావడమే. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న ఆమె గతంలోలా కాకుండా పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే నీరా ఆర్య బయోపిక్లో నటించడానికి అంగీకరించారట.స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’కు అనుబంధంగా రాణీ ఆఫ్ ఝాన్సీ మహిళా రెజిమెంట్ ఉండేది. ఇందులో కీలక సభ్యురాలిగా నీరా ఆర్య వ్యవహరించారు. భారతదేశ తొలి మహిళా గూఢచారిగా ఆమెకు పేరుంది. బ్రిటిష్ అధికారిని పెళ్లాడి, సిద్ధాంత విభేదాలతో విడిపోయిన నీరా ఆర్యని బ్రిటీష్ అధికారులు అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేశారట.1998 జూలై 26న ఆమె మృతి చెందారు. స్వాతంత్య్ర సంగ్రామంలో చూపించిన ధైర్యసాహసాలు, గూఢచారిగా అద్భుతంగా పని చేసిన వైనం... ఇలా ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన జీవితం ఆమెది. అలాంటి నీరా జీవితకథతో శివమ్ నాయర్ దర్శకత్వంలో ఓ సినిమా రానుందని సమాచారం. కంగనాని కలిసి ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి వివరించగా ఆమె పచ్చజెండా ఊపారని టాక్. కంగన ప్రస్తుతం ‘భారత భాగ్య విధాత’ అనే సినిమా చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ట్రైలర్ రిలీజ్
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్సింగ్. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. అదేరోజున ధరంధర్-2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.
వివాదాస్పద లిరిసిస్ట్పై ప్రశంసలు.. కమల్ హాసన్కు చిన్మయి చురకలు..!
వివాదాస్పద లిరిసిస్ట్ వైరముత్తును ఏకంగా జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. దీంతో ఆయనకు తమిళనాడు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలతో ముంచెత్తుతున్నారు. సీఎం స్టాలిన్, హీరో కమల్ హాసన్ సైతం వైరముత్తుకు అభినందనలు తెలిపారు. దేశంలోని సాహిత్య రంగంలో అందించే అత్యున్నత పురస్కారమే జ్ఞానపీఠ్ అవార్డు. ఈ అవార్డ్తో జ్ఞాన్పీఠ్ అవార్డ్ అందుకున్న మూడో తమిళ వ్యక్తిగా వైరముత్తు నిలిచాడు.చిన్మయి చురకలు..వైరముత్తుకు జ్ఞాన్పీఠ్ అవార్డ్ రావడంపై సింగర్ చిన్మయి స్పందించింది. కమల్ హాసన్ వైరముత్తును ప్రశంసించడంపై ట్విటర్ వేదికగా మండిపడింది. కమల్ హాసన్ కూడా వైరముత్తును అభినందించారని ఎద్దేవా చేసింది. సినిమాల్లో ఉన్న మగవాళ్లు రాజకీయాలకు మారడం, తన మామ-గురువు తమను లైంగికంగా వేధించాడని చెప్పిన మహిళలను పూర్తిగా పట్టించుకోకపోవడం ఆయనకే చెల్లుతుందని పోస్ట్ చేసింది. పురుషులు ఎప్పటికీ మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తు పెట్టుకోవాలని సూచించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన సొంత పార్టీలోని మహిళ బహిరంగంగా కవి పేరును ప్రస్తావించినా పట్టించుకోకపోవడం మరి దారుణమని చిన్మయి తెలిపింది. చివరగా పురుషులు కేవలం సోదరులు, మామలు, నాన్నలు, స్నేహితులు, సలహాదారులకు మాత్రమే అండగా నిలుస్తారని.. మహిళలను ఎవరు పట్టించుకోరని వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో సింగర్ చిన్మయి శ్రీపాద ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే వైరముత్తుకు భారతీయ సాహిత్యానికి చేసిన కృషికి జ్ఞానపీఠ్ అవార్డు రావడంపై సింగర్ చిన్మయి తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. For God’s sake 🤦🏽♀️🤦🏽♀️🤦🏽♀️🤦🏽♀️🤦🏽♀️P.S.: Men in such power in cinema transitioning to politics completely turning a deaf ear to women who come on record to say they were molested by “his uncle-mentor” must remind women who vote - that men will never be on our side.The weirdest thing -… https://t.co/KB7VNAevu5— Chinmayi Sripaada (@Chinmayi) March 14, 2026
క్రీడలు
రన్నరప్గా ముగింపు
సాక్షి, హైదరాబాద్: హాకీ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నిలో వరుసగా నాలుగు మ్యాచ్లలో చెలరేగి ఆడిన భారత మహిళల జట్టు చివరి మెట్టుపై నిరాశాజనక ప్రదర్శన కనబర్చింది. గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 0–2 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ తరఫున 13వ నిమిషంలో గ్రేస్ బాల్స్డన్, 43వ నిమిషంలో ఎలిజబెత్ నీల్ గోల్స్ సాధించారు. అయితే ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత మహిళల బృందం ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచ కప్కు అర్హత సాధించింది. మ్యాచ్ ఆరంభంనుంచి భారత్ దూకుడు ప్రదర్శించింది. రెండో నిమిషంలోనే జట్టుకు పెనాల్టీ కార్నర్ అవకాశం లభించింది. అయితే దీనిని నిలువరించడంలో ఇంగ్లండ్ గోల్ కీపర్ సఫలమైంది. తొలి క్వార్టర్ ముగియడానికి కొద్ది సేపు ముందు లి క్వార్టర్లో భారత్ జోరు ప్రదర్శించినా...రెండో క్వార్టర్ నుంచి ఇంగ్లండ్కు ఆటపై పట్టు చిక్కి ఆ జట్టు వరుసగా దాడులు చేసింది. చివరకు పెనాల్టీ సాధించిన టీమ్కు బాల్స్డన్ గోల్ అందించింది. ఈ టోర్నికి ఆమెకిది ఐదో గోల్ కావడం విశేషం. రెండో క్వార్టర్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా ఎవరికీ గోల్ సాధించే అవకాశం దక్కలేదు. 23వ నిమిషంలో దక్కినా పెనాల్టీని భారత్ వాడుకోలేకపోయింది.అయితే మూడో క్వార్టర్ చివర్లో భారత డిఫెన్స్ను ఛేదించి దూసుకుపోయిన ఎలిజబెత్ గోల్ కీపర్ బిచ్చుదేవిని ఏమార్చడంలో సఫలమై ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. ఈ ఆధిక్యాన్ని సరైన డిఫెన్స్తో కాపాడుకోవడంలో ఇంగ్లండ్ సఫలమైంది. మ్యాచ్ ముగియడానికి ఒక నిమిషం ముందు కూడా భారత్కు పీసీ దక్కినా అదీ వృథా అయింది. దాంతో గోల్ లేకుండా ఓటమి తప్పలేదు. భారత్ మొత్తంగా నాలుగు పెనాల్టీ కార్నర్లను కూడా ఉపయోగించుకోలేకపోయింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో స్కాట్లాండ్ 1–0తో ఇటలీని ఓడించింది. భారత్కు చెందిన నవనీత్ కౌర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు దక్కింది.
ద్రవిడ్, మిథాలీలకు ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్’
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతీ ఏటా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లకు ఇచ్చే ‘నమన్’ అవార్డుల వివరాలను 2026 సంవత్సరానికిగాను ప్రకటించింది. భారత క్రికెట్కు చేసిన సేవలకుగాను అందించే కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఈ సారి ముగ్గురు క్రికెటర్లకు ప్రకటించారు. రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్లతో పాటు భారత మహిళల జట్టు మాజీ కెపె్టన్ మిథాలీ రాజ్ కూడా ఈ పురస్కారానికి ఎంపికైంది. పురుషుల విభాగంలో ఇచ్చే అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్ ‘పాలీ ఉమ్రీగర్ అవార్డు’ భారత టెస్టు, వన్డే కెపె్టన్ శుబ్మన్ గిల్కు దక్కింది. మహిళల విభాగంలో అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్ పురస్కారం స్మృతి మంధాన గెలుచుకుంది. ఆమె కెరీర్లో ఈ అవార్డు సాధించడం ఐదో సారి కావడం విశేషం. నేడు (ఆదివారం) న్యూఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్య క్రమంలో ఈ అవార్డులను అందజేస్తారు. యువ క్రీడాకారులకూ... వర్ధమాన క్రికెటర్లకు ప్రోత్సాహకాన్ని అందించే ఇతర అవార్డులను కూడా బోర్డు ప్రకటించింది. దేశవాళీ మహిళల క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ప్లేయర్లకు ఇచ్చే ‘జగ్మోహన్ దాల్మి యా’ అవార్డును ఇద్దరు ప్లేయర్ అందుకోనున్నారు. ముంబైకి చెందిన ఇరా జాదవ్, హరియాణా ప్లేయర్ షఫాలీ వర్మలకు ఈ అవార్డు దక్కింది. పురుషుల విభాగంలో దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్ ‘లాలా అమర్నాథ్’ అవార్డు పరిమిత ఓవర్ల టోరీ్నల్లో ఆయుశ్ మాత్రేకు, రంజీ ట్రోఫీలో ప్రదర్శనకుగాను హర్‡్ష దూబేకు దక్కింది. దేశవాళీ క్రికెట్లో సీజన్లో నాలుగు ట్రోఫీలు గెలుచుకోవడంతో పాటు రెండు టోరీ్నల్లో రన్నరప్గా నిలిచిన ముంబై జట్టుకు ఉత్తమ క్రికెట్ అసోసియేషన్ అవార్డు లభించింది. ఐదు టీమ్లకు సత్కారం... ‘నమన్’ అవార్డుల వేడుకలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీసీఐ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జత చేసింది. ఇటీవల ఐదు వేర్వేరు అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ (ఐసీసీ) ట్రోఫీలు గెలిచిన భారత జట్లను ఒకేసారి ప్రత్యేకంగా సన్మానించనుంది. పురుషుల విభాగంలో 2025 చాంపియన్స్ ట్రోఫీ, 2026 టి20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్లు... మహిళల విభాగంలో 2025 వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమ్... అండర్–19 స్థాయిలో పురుషుల వరల్డ్ కప్ 2026, మహిళల వరల్డ్ కప్ 2025 గెలిచిన టీమ్లను సత్కారం దక్కనుంది. రోజర్ బిన్నీ: 1983 వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసి భారత జట్టు చారిత్రాత్మక విజయంలో బిన్నీ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 1985 వరల్డ్ చాంపియన్షిప్ గెలిచిన జట్టులో కూడా బిన్నీ సభ్యులు. ఆల్రౌండర్గా భారత్ తరఫున 27 టెస్టులు, 72 వన్డేలు ఆడిన బిన్నీ రెండు ఫార్మాట్లలో కలిపి 1459 పరుగులు చేసి 124 వికెట్లు పడగొట్టారు. 2000లో అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా ఉన్న బిన్నీ ఆ తర్వాత నాలుగేళ్ల పాటు సెలక్టర్గా, 2022–25 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. రాహుల్ ద్రవిడ్: బ్యాటింగ్లో అసాధారణ సాంకేతిక నైపుణ్యం, పదునైన డిఫెన్స్తో భారత క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా ద్రవిడ్ గుర్తింపు పొందాడు. 164 టెస్టుల్లో 13,288 పరుగులు, 344 వన్డేల్లో 10,889 పరుగులు చేసిన ఘనత ద్రవిడ్ సొంతం. ద్రవిడ్ కోచ్గా ఉన్న భారత అండర్–19 జట్టు 2018లో వరల్డ్ కప్ గెలుచుకోగా ... అతని కోచింగ్లో 2024లో భారత సీనియర్ టీమ్ టి20 వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది.
ట్రంప్పై నిషేధం యోచనలో ఫిఫా!
పశ్చిమాసియాలోని ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ తగలనుంది. ప్రపంచక ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) ఆయనపై నిషేధం విధించాలనే ఆలోచనతో ఉంది. పిఫా వరల్డ్కప్ పోటీలతో పాటు లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028కు హాజరవ్వకుండా ట్రంప్పై నిషేధం పడే అవకాశముంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోవడమే అందుకు కారణమని సమాచారం. గత కొన్నేళ్లుగా యూఎస్ఏ ప్రభుత్వానికి, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు పొసగడం లేదు. దాంతో.. మూడేళ్ల నుంచి వాడాకు యూఎస్ ప్రభుత్వం ఒక్క డాలర్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం యూఎస్ఏ చెల్లించాల్సిన బకాయిల మొత్తం 7.3 మిలియన్ డాలర్ల(రూ.67 కోట్లకు పైగా)గా ఉన్నాయి. దాంతో.. వాడాకు బాకీపడిన దేశాలకు చెందిన అధ్యక్షులను, ప్రతినిధులను ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ వంటి ప్రధాన క్రీడలకు, స్పోర్ట్స్ ఈవెంట్లకు అనుమతించకూడదనే ప్రతిపాదన ఉంది. కాబట్టి.. ఫిఫా వరల్డ్కప్తో పాటు లాస్ ఎంజెలెస్ ఒలింపిక్స్లో ఈవెంట్లో పాల్గొనకుండా అమెరికా అధినేతపై నిషేధం విధించే అవకాశముందని సమాచారం. అయితే.. వాడా అధికార ప్రతినిధి జేమ్స్ ఫిట్జెరాల్డ్ మాత్రం అదేమీ లేదని అంటుండడం గమనార్హం.చదవండి: IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్!
IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్!
ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వడానికి మరో రెండు వారాల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ కెవిన్ పీటర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు మెంటార్గా వ్యవహరిస్తున్న పీటర్సన్ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. త్వరలో ఇంగ్లండ్ ప్రధాన కోచ్గా పీటర్సన్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ పదవి నుంచి వైదొలగడానికి కారణం కూడా ఇదే కావొచ్చు. ‘నేను ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్గా ఉండటం లేదు. ఆ బాధ్యతలకు కావాల్సినంత సమయం కేటాయిం చలేకపోతున్నా. అయితే ఈ సీజన్లో ఆటగాళ్లంతా అద్భుతంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే మిమ్మల్ని (ఫ్యాన్స్) కామెంట్రీ బాక్స్లో నుంచి చూస్తా. ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్ ఐపీఎల్. కొత్త సీజన్ కోసం వేచి చూడలేకపోతున్నా’ అని పీటర్సన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపాడు. బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ సత్ఫలితాలు సాధించలేకపోతోంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్లో సెమీస్ వరకు చేరుకున్న ఇంగ్లండ్ నాకౌట్లో భారత్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మెక్కల్లమ్ కోచ్గా వచ్చిన కొత్తలో బజ్బాల్ ఆటతో ఇంగ్లండ్ దూకుడు ప్రదర్శించింది. కానీ క్రమంగా బజ్బాల్ ఆటే ఇంగ్లండ్ కొంపముంచింది. దీంతో మెక్కల్లమ్ను కోచ్ పదవి నుంచి తొలగించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ పీటర్సన్ ఇంగ్లండ్కు కోచ్గా ఎంపికైతే ఇతర బాధ్యతలు చూడడం కష్టతరమవుతుందనే ఉద్దేశంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక 2025 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ స్టేజీకే పరిమితమైన సంగతి తెలిసిందే.చదవండి: రోహిత్ బాటలో రిషబ్ పంత్!
న్యూస్ పాడ్కాస్ట్
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రం... ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా భీకర దాడులు
రైతులతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొండాట.. పేరుకే అన్నదాత సుఖీభవ, ఆచరణలో అంతా మోసం
విలువలు, విశ్వసనీయతకు వైఎస్సార్సీపీ మారుపేరు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఆదాయం... కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఇక్కడ బాబు, అక్కడ BR నాయుడు కోట్లల్లో భారీ స్కాం
పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు..ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
భవిష్యత్ అభివృద్ధి శూన్యం... ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
బిజినెస్
ప్రమాదంలో యూపీఐ సెక్యూరిటీ!
న్యూఢిల్లీ: ఆన్లైన్ మోసగాళ్లు కొత్త టెక్నాలజీతో యూపీఐ యూజర్లనూ బురిడీ కొట్టిస్తున్నారు. యూపీఐ భద్రతా ఫీచర్లను ఛేదించుకుని మరీ, ఆర్థిక లావాదేవీలు కానిచ్చేస్తున్నారని, సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ క్లౌడ్సెక్ ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. టెలీగ్రామ్లో 20 గ్రూప్లు చురుగ్గా పనిచేస్తున్నట్టు, ప్రతీ బృందంలో 100కు పైగా సభ్యులున్నుట్టు తెలిపింది. ఈ గ్రూప్లు ‘డిజిటల్ లూటెరా’ పేరుతో చర్చించుకోవడం, పంపిణీ చేయడం, నిర్వహించడం చేస్తున్నట్టు వెల్లడించింది. ‘‘ఇది కేవలం మరొక యూపీఐ మాల్వేర్ రకమే కాదు.డివైజ్పై ఉన్న నమ్మకంపైనే డిజిటల్ లూటెరా దాడి చేస్తోంది. ఆపరేటింగ్ సిస్టమ్నే మార్చివేస్తున్నప్పుడు.. సంప్రదాయ రక్షణలైన సిమ్ బైండింగ్ యాప్ (సిమ్కు అనుసంధానమైన) సిగ్నేచర్ తనఖీ కూడా పనికిరాకుండా పోతుంది. దీనికి పరిష్కారం కనుగొనకపోతే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అంతటినీ తన చేతుల్లోకి తీసుకునే ప్రమాదం ఉంటుంది’’అని హెచ్చరించింది. ఒక టెలిగ్రామ్ గ్రూప్ రెండు రోజుల్లోనే రూ.25–30 లక్షల లావాదేవీలను పూర్తి చేసిందని క్లౌడ్సెక్ విశ్లేషణలో తేలింది. ఈ మోసపూరిత వ్యవస్థ ఎంత వేగంగా విస్తరించగలదు, ఎంత మంది మోసం చేయగలదన్నదానికి ఇది నిదర్శమని పేర్కొంది. మోసం ఇలా... మొబైల్ ఫోన్ యూజర్ తనకు తెలియకుండా హానికారక ఏపీకే ఫైల్ను ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు.. డిజిటల్ లూటెరా కిట్ ఇన్స్టాల్ అయిపోతుంది. వెంటనే సైబర్ నేరస్థులకు ఫోన్పై నియంత్రణ వెళుతుంది. దీంతో బ్యాంక్ ఓటీపీలు అటాకర్ల టెలీగ్రామ్ ఛానళ్లకు వెళతాయి. భద్రతకు ఢోకాలేదు: ఎన్పీసీఐ దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యూపీఐ నిర్వహణ సంస్థ/ఎన్పీసీఐ) స్పందించింది. డిజిటల్ చెల్లింపుల నిర్వహణకు సంబంధించి బలమైన తనిఖీలున్నట్టు స్పష్టం చేసింది. ‘‘సంబంధిత నివేదికను ఎన్పీసీఐ పరిశీలించింది. ఆ విధమైన రిస్క్లను పరిష్కరిచేందుకు తగినన్ని రక్షణలు ఉన్నాయి. బహుళ అంచల రక్షణలతో, గుర్తింపు ధ్రువీకరణలతో లావాదేవీలను సురక్షితంగా, భద్రంగా చేసుకునే విధంగా యూపీఐని రూపొందించడమైంది’’అని ఎన్పీసీఐ వివరణ ఇచ్చింది.
కాలేజీ స్టూడెంట్స్ కోసం ఐక్యూ జెడ్11ఎక్స్ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ తాజాగా కాలేజీ విద్యార్థుల కోసం జెడ్11ఎక్స్ ఫోన్ని ఆవిష్కరించింది. దీని ధర డిస్కౌంట్ల అనంతరం రూ. 17,499 నుంచి ప్రారంభమవుతుంది. అమెజాన్, ఐక్యూ పోర్టల్స్తో పాటు వివో స్టోర్స్, ఇతర ఔట్లెట్స్లో మార్చి 16 మధ్యాహ్నం నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.మల్టీటాస్కింగ్కి ఉపయోగపడేలా 7200 ఎంఏహెచ్, మీడియాటెక్ డైమెన్సిటీ టర్బో చిప్, సోనీ ఏఐ ఆధారిత 50 ఎంపీ కెమెరా, ముందు..వెనుక కెమెరాలతో 4కే వీడియో రికార్డింగ్, 6.76 అంగుళాల డిస్ప్లే, రెండేళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉంటాయని సంస్థ సీఈవో నిపుణ్ మార్యా తెలిపారు. నిర్దిష్ట ఎస్బీఐ, యాక్సిస్ క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్లు లభిస్తాయి. మేకిన్ ఇండియా నినాదానికి కట్టుబడి ఉంటూ గ్రేటర్ నోయిడాలోని వివో ప్లాంటులో వీటిని తయారు చేస్తారు.
నియామకాల పండగే!
న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాలు వచ్చే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో గణనీయంగా పెరగనున్నట్లు మ్యాన్పవర్ గ్రూప్ తాజా సర్వే తెలిపింది. వ్యాపారాల్లో పెరిగిన విశ్వాసం, దేశీ డిమాండ్ బలంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. మ్యాన్పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ సర్వే ప్రకారం.. 2026 సంవత్సరం రెండో త్రైమాసికానికి నెట్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ (ఎన్ఈవో) 68 శాతానికి చేరి రికార్డు స్థాయిని తాకింది. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 17 పాయింట్లు, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 24 పాయింట్లు ఎక్కువ.జనవరి 1 నుంచి ఫిబ్రవరి 3 మధ్య దేశవ్యాప్తంగా 3,000కిపైగా సంస్థల యజమానుల అభిప్రాయాలను మ్యాన్పవర్ గ్రూప్ తెలుసుకుని ఈ వివరాలు విడుదల చేసింది. గతేడాది చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు, 2026 సంవత్సరానికి బలమైన ఆర్థిక వృద్ధి అంచనాలు వ్యాపారాలకు మద్దతునిస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. అలాగే భారత్– ఐరోపా సమాఖ్య (ఈయూ) వాణిజ్య ఒప్పందం, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం వంటివి మెరుగైన ఎగుమతులకు సహాయపడతాయని పేర్కొంది. నియామకాలు పెరుగుతాయన్న సంస్థల అంచనాల నుంచి, నియామకాలు తగ్గుతాయని చెప్పిన కంపెనీల అంచనాలను మినహాయించగా వచి్చందే నెట్ ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ (ఎన్ఈవో). ఫైనాన్స్, బీమాలో ఎక్కువ.. ⇒ మ్యాన్పవర్ గ్రూప్ సర్వే ప్రకారం.. ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంలోని కంపెనీలు గరిష్ట నియామక అంచనాలతో ఉన్నాయి. ఇది 71 పాయింట్లుగా ఉంది. గత త్రైమాసికం నుంచి 8 పాయింట్లు పెరిగింది. అదే గతేడాది క్యూ2తో పోలి్చతే ఏకంగా 26 పాయింట్లు పెరిగింది. అంతేకాదు ఫైనాన్స్, బీమా రంగంలో నియామక అంచనాల పరంగా అంతర్జాతీయంగానూ భారత్ మొదటి స్థానంలో ఉంది. ⇒ ఆటోమోటివ్ రంగం సైతం పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగులను ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో తీసుకోనుంది. ఆ తర్వాత టెక్నాలజీ, ఐటీ రంగంలో ఎక్కువ అవకాశాలు రానున్నాయి. ⇒ ఆతిథ్య రంగంలో నియామకాల అంచనా 31 శాతంగా ఉంది. ఈ రంగంలో కొంత అప్రమత్త ధోరణి కనిపించింది. ⇒ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉద్యోగ నియామకాలు పెరగనుండగా, ఉత్తర భారత్లో మాత్రం 70 పాయింట్లతో బలమైన అంచనాలు కనిపించాయి. ⇒ ఇప్పటికే 87 శాతం సంస్థలు నియామకాలు, శిక్షణ విషయంలో ఏఐని వినియోగిస్తున్నాయి. ఏఐ తమ అంచనాలను పూర్తిగా అందుకుంటున్నట్టు 11 శాతం సంస్థలే చెప్పాయి.వేధిస్తున్న నిపుణుల కొరత..‘‘నియామకాల ఉద్దేశ్యం బలంగా ఉంది. ఇది యాజమాన్యాల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం. అదే సమయంలో నిపుణుల కొరత సైతం వేధిస్తోంది. తమకు కావాల్సిన నైపుణ్యాలను గుర్తించడం కష్టంగా ఉందని 82 శాతం సంస్థలు అంటున్నాయి. రానున్న రోజుల్లో నియామక నిర్ణయాలను కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావితం చేయనుంది’’అని మ్యాన్పవర్ గ్రూప్ ఎండీ సందీప్ గులాటీ తెలిపారు.
మస్క్ టీమ్లో చేరిన ఇండియన్: ఎవరీ దేవేంద్ర చాప్లోట్?
ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాలలో భారతీయుల ప్రతిభ ఎంతో గుర్తింపు పొందుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు.. ఇండియన్ రోబోటిక్స్ ఎక్స్పర్ట్ & ఏఐ పరిశోధకుడు అయిన దేవేంద్ర చాప్లోట్.. ఎలాన్ మస్క్ కంపెనీలో చేరారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దేవేంద్ర చాప్లోట్ తన సోషల్ మీడియా ఖాతాలో.. ఎలాన్ మస్క్తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. సూపర్ ఇంటెలిజెన్స్ నిర్మించడానికి మస్క్ టీమ్లో చేరుతున్నాను అని వెల్లడించారు. దీనికి స్పందిస్తూ.. xAIలోకి స్వాగతం అంటూ మస్క్ ట్వీట్ చేశారు.ఎవరీ దేవేంద్ర చాప్లోట్?IIT-బాంబే పూర్వ విద్యార్థి అయిన చాప్లోట్, AI & రోబోటిక్స్ రంగంలో పనిచేస్తున్నారు. ఈయన 2014లో IIT-బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్లో B.Tech & అప్లైడ్ స్టాటిస్టిక్స్లో మైనర్ పట్టభద్రుడయ్యారు. ఆ తరువాత కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ మెషిన్ లెర్నింగ్ విభాగం నుంచి పీహెచ్డీ పూర్తి చేసాడు. అక్కడే బిల్డింగ్ ఇంటెలిజెంట్ అటానమస్ నావిగేషన్ ఏజెంట్లపై పనిచేశారు.చాప్లోట్ దక్షిణ కొరియాలోని శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్లో దాదాపు ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. తరువాత అతను ఫేస్బుక్ AI రీసెర్చ్లో చేరాడు. AI రీసెర్చ్ సైంటిస్ట్గా, అతను ఆ సంస్థలో కంప్యూటర్ విజన్ అండ్ రోబోటిక్స్లో పనిచేశాడు. 2020లో, రోబోటిక్స్ నిపుణుడు మిస్ట్రాల్ AIలో చేరారు.Welcome to @xAI! https://t.co/5tAdHPJmfx— Elon Musk (@elonmusk) March 13, 2026సాధించిన పురస్కారాలుదేవేంద్ర చాప్లోట్ తన పరిశోధనలకు అనేక పురస్కారాలు అందుకున్నారు. 2020లో ఫేస్బుక్ ఫెలోషిప్ పొందారు. అలాగే కంప్యూటర్ విజన్ రంగంలో నిర్వహించే సీవీపీఆర్ AI హాబిటాట్ ఆబ్జెక్ట్ నావిగేషన్ ఛాలెంజ్ & 2018లో CVPR 2018 డీప్ లెర్నింగ్ ఫర్ విజువల్ SLAM వర్క్షాప్లో బెస్ట్ పేపర్ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు.
ఫ్యామిలీ
తొక్కతో తింటే... తలనొప్పి తగ్గుతుందా?
ఇటీవల ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల మీద ఆహార సలహాలు చాలా వస్తున్నాయి. ఫలానా ఆహారం ఇలా తింటే ఈ లాభాలనీ, ఫలానా పదార్థాలతో ఇవీ ప్రయోజనాలంటూ రకరకాల సలహాలూ, సూచనలూ నెటిజనులను నిత్యం ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అందులో ఒకటి... ఆపిల్ను తొక్కతో సహా పరగడుపునే తీసుకుంటే దీర్ఘకాలికంగా వచ్చే తలనొప్పులు తగ్గుతాయన్నది. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో చూద్దాం! వాస్తవాలేమిటంటే... ఆపిల్ స్కిన్లో చాలారకాల పోషకాలున్న మాట వాస్తవమే. ఉదాహరణకు మలబద్ధకాన్ని తొలగించే పీచు, వ్యాధి నిరోధకశక్తిని సమకూర్చే విటమిన్ సి, ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి నివారణనిచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలుంటాయి. ముఖ్యంగా ఆపిల్ తొక్కలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివల్ల ఇతరత్రా ఆరోగ్య ప్రయోజనాలకు అవకాశాలున్నాయి. అయితే సాధారణంగా ఆపిల్ తొక్క మెరిసేలా చేయడానికి చాలామంది ఒక రకం మైనపుపూత (వ్యాక్స్)తో ఆపిల్కు మెరుపు తెప్పించి ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తారు కాబట్టి తొక్కతో తినాలనుకునేవారు వీలైనంతగా కడిగి తినడం మేలు. అదో అపోహ మాత్రమే... పరగడుపున పొట్టుతోనే ఆపిల్ తినడం వల్ల తలనొప్పులు తగ్గుతాయనుకోవడం అపోహ మాత్రమే. తలనొప్పులు అనేక కారణాల వల్ల వస్తుంటాయి. ఉదాహరణకు ఒంట్లో నీటి మోతాదు తగ్గడం, తీవ్రమైన ఒత్తిడి వంటివి. తొక్కతో సహా తినడం వల్ల దేహం రీహైడ్రేట్ కావడం, ఒత్తిడి తగ్గడం వంటివేమీ జరగవు. కాబట్టి తొక్క వల్ల తలనొప్పులు తగ్గడమనేది అపోహేనని నిపుణుల అభిప్రాయం.అయితే తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి వాటిలో ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ’ గుణాలు కూడా ఉన్నందువల్ల నొప్పి తగ్గడంలో అవి కొంత ఉపయోగపడవచ్చు గానీ... ఉదయం పరగడుపున తొక్కతో ఆపిల్ తినడం వల్లనే తలనొప్పుల నుంచి పూర్తి విముక్తి కలుగుతుందనుకోవడం మాత్రం అపోహ అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే అయినా ‘ప్రతి రోజూ ఆపిల్ తింటే... వైద్యుడి దగ్గరకు వెళ్లక్కర్లేదు’ (ఏన్ ఆపిల్ ఏ డే... కీప్స్ ద డాక్టర్ అవే) అనే సూక్తి ప్రకారం ఆపిల్ను బాగా కడిగాక తొక్కతో తినడంలో ప్రయోజనమే తప్ప నష్టమీదీ ఉండదనేది ఆహార నిపుణుల మాట.
నదులకు లాలపోసే తల్లులు!
ప్రాణం పోసే శక్తి స్వరూపిణి స్త్రీ. మనుషులకే కాదు దైవసమానమైన నదులకు కూడా ప్రాణం పోస్తోంది ఆ శక్తి. జీవం కోల్పోయి, మృత్యుదిబ్బలుగా మారిన ఎన్నో నదులకు దేశవ్యాప్తంగా ప్రాణం పోస్తున్నారు మహిళలు. సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నారు...తమిళనాడులోని వెల్లూరు, తిరువణ్ణామలై జిల్లాల గుండా ప్రవహించే పాలార్ నది ఉపనది నాగనది పూర్వవైభవం కోల్పోయింది. ఎండిపోయి నిర్జీవంగా మారింది. వర్షాలు పడినా సరే ఆ మృత నదిలో నీటి గలగలలు లేవు. ఈ నది ఎండి పోవడం పంట పొలాలపై, అక్కడి ప్రజల ఉపాధిపై ప్రభావం చూపింది. ఎంతోమంది పొట్ట చేతపట్టుకొని పట్టణాల బాట పట్టారు.ఈ నేపథ్యంలో నదిని పునర్జీవింపజేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయింది. ఈ కార్యక్రమంలో మహిళలు క్రియాశీల పాత్ర పోషించడం విశేషం. వెయ్యిమంది మహిళలు సంవత్సరం పాటు 21 గ్రామ పంచాయతీలలో రీఛార్జ్ బావులు, రెండు వందల బౌల్డర్ చెక్లను నిర్మించారు. బౌల్డర్ చెక్లతో నీటి ప్రవాహాన్ని నెమ్మదింపజేయడానికి, నీటి కోతను నివారించడానికి, భూగర్బ జల మట్టాలను పెంచడానికి ఎంతో కష్టపడ్డారు.వారి శ్రమ ఫలించిందిభూగర్భ జలాలు పెరిగాయి. అవి నాగనదిలోకి వెళ్లాయి. నది మెల్లగా ప్రాణం పోసుకోడం మొదలైంది. ఈ వార్త తెలిసిన మరింతమంది మహిళలు నాగనది పునర్జీవనోద్యమంలో భాగం అయ్యారు.ఇప్పుడు..నాగనది ఏడాది పొడవునా ప్రవహిస్తోంది. ఈ సజీవ ప్రవాహం ఈ ప్రాంతంలోని సామాజిక, ఆర్థిక దృశ్యాన్ని మార్చివేసింది. వ్యవసాయం తిరిగి మొదలైంది. తమిళనాడులోని పదిహేను జిల్లాలలో ఇరవై అయిదు నదులను పునర్జీవింప చేయడానికి నాగనది స్ఫూర్తిగా మారింది.కోసీ నది కోసం...అటవీ నిర్మూలన పెరగడం వల్ల కోసీ నది ప్రమాదంలో ఉందని గ్రహించిన సామాజిక కార్యకర్త బసంతిదేవి బాధపడడానికి మాత్రమే పరిమితం కాలేదు. తన బాధ్యతగా గట్టిపని ఏదైనా చేయాలని అనుకుంది. నదితోపాటు సమీపంలోని అడవులను కాపాడాలని నిర్ణయించుకుంది.‘నదిని రక్షించుకుందాం’ అనే నినాదంతో ఉద్యమంలో మహిళలను భాగం చేయడానికి ఊరూ వాడా తిరిగింది ఉత్తరాఖండ్కు చెందిన బసంతి. ఎన్నో సంవత్సరాలు అలుపెరుగని కృషి చేసింది. వందలాది మంది మహిళలను కోసి నది పరిరక్షణ ఉద్యమంలో భాగం చేసింది. వందలాది గ్రామ మహిళలు చెట్లను రక్షించడానికి, మొక్కలను నాటడానికి, నదిని కాపాడుకోవడానికి నడుం కట్టారు.ప్రతి గ్రామంలో ఏర్పడిన మహిళా సంఘాల సమష్టి కృషి ద్వారా అడవుల నరికివేత ఆగిపోయింది. మొక్కలు చెట్లు అయ్యాయి. కోసి నది ప్రాంతంలో ఎండిపోయిన ప్రదేశాలలో నీరు సమృద్ధిగా దొరకడం మొదలైంది. నీటి ఊటలు పునర్జీవనం పొందాయి. దీంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.‘సేవ్ కోసీ ఉద్యమం’ నేటికీ కొనసాగుతుండడం విశేషం.‘మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజులలో చాలా సందేహాలు ఉండేవి. అయితే ఉద్యమకారులకు సంకల్పబలం తప్ప సందేహాలు ఉండకూడదు అనే మాట మాకు చాలా బలాన్ని ఇచ్చింది. ఉద్యమాన్ని విజయవంతం చేసింది’ అంటుంది ఉత్తరాఖండ్లోని చోప్రియాలి గ్రామానికి చెందిన భువనేశ్వరీ. ఆమె ‘మహిళా మంగళ్ దళ్’ సభ్యురాలు.నదుల నేస్తం... నీతా పటేల్గుజరాత్లోని వెనకబడిన జిల్లాలలో డాంగ్ ఒకటి. ఈ జిల్లాలోని గిరిజన గ్రామాలను సందర్శిస్తున్న క్రమంలో నర్మదా, బహ్రూచ్ కొండ ప్రాంతాల్లో జూన్ అక్టోబర్ మాసాల మధ్య సమృద్ధిగా వర్షాలు కురిసిన్పటికీ ఆ ప్రాంతాలలో పచ్చదనం లేకపోవడాన్ని గమనించింది నీతా పటేల్. గ్రామస్తులు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది పటేల్.గ్రామాలు తిరుగుతూ ఎంతోమందిని సమీకరించింది. వందలాదిమందితో వేలాది మొక్కలు నాటించింది. డాంగ్ జిల్లాలో ప్రవహించే పూర్ణ, ఖాప్రి, అంబికా, గిరా, దోధాద్ నదులపై ఎన్నో చెక్ డ్యామ్లు, గ్రూప్ వెల్స్, చెక్ వాల్స్, బోరీ బంద్లు (ఇసుక నిండిని సంచుల) ఏర్పాటు చేసింది. ఎన్నో గ్రామాలలో మహిళలతో నీటి సంఘాలు ఏర్పాటు చేయించింది. సౌరశక్తితో నడిచే నీటిపారుదల వ్యవస్థలను నీతా అభివృద్ధి చేసింది. దీనివల్ల వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ‘నది పరిరక్షణ ఉద్యమంలో విజయం సాధించడానికి ఈ ఉద్యమంలో భాగమైన ఎంతోమంది గిరిజన మహిళలు కారణం’ అంటుంది నీతా పటేల్....వీరు మాత్రమే కాదు జయశ్రీ వెంకటేశన్(తమిళనాడు), గౌరీ మిరాషి (కామ్ నది, ఔరంగాబాద్), కిరణ్ కౌర్ (బహ్మపుత్ర/వారద బేసిన్, అస్సాం), శాంతిరాయ్ (తీస్తా నది, పశ్చిమ బెంగాల్), జల్ సహేలి (ఉత్తర్ప్రదేశ్)... ఎంతో మంది వాటర్ ఛాంపియన్లు మృత్యుశయ్యపై ఉన్న నదులకు జీవం పోస్తున్నారు. నదుల కళ్లలో కొత్త వెలుగు తీసుకు వస్తున్నారు.సేవ్ గంగోత్రిపర్వతారోహకురాలు అయిన డాక్టర్ హర్షవంతి ‘సేవ్ గంగోత్రి’ ప్రాజెక్ట్తో ఎంతోమందిలో అవగాహన కలిగిస్తోంది. భోజ్ అడవిని పునరుద్ధరించే పని చేపట్టింది. వేలాది మొక్కలు నాటించింది. ఉత్తరాఖండ్లోని గంగోత్రి ప్రాంతంలో ప్రధాన జల వనరుల దగ్గర పరిస్థితులను మెరుగు పరచడానికి విశేష కృషి చేసింది. నదుల రక్షణ, పర్యావరణంపై అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ‘మహిళా శక్తితో ఎన్ని విజయాలు అయినా సాధించవచ్చు’ అంటుంది హర్షవంతి.మన నదులు మన భవిష్యత్విధ్వంసక నీటి అభివృద్ధి ప్రాజెక్ట్లను (పెద్ద డామ్లు) వ్యతిరేకించడానికి, నదులకు జీవం పోసి కాపాడుకోవడానికి నదుల పరిరక్షణ దినం మొదలైంది. ఈ సంత్సరం థీమ్: మన నదులు–మన భవిష్యత్. నదీ పర్యావరణ వ్యవస్థలను రక్షించడం, పునరుద్ధరించడం లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఎన్నో సమావేశాలు, సదస్సులు, నదులను శుభ్రపరిచే కార్యక్రమాలు జరుగుతాయి, బ్రెజిల్లోని కురిటిబాలో 1997లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో నదుల పరిరక్షణ దినోత్సవానికి బీజం పడింది.
పువ్వులే డ్రెస్సులు!
సంప్రదాయ వివాహ వేడుకలలో పువ్వుల అలంకరణకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ పూల అందం అమ్మాయిల డ్రెస్సులుగా మారితే మరింత ఆకర్షణీయం అవుతుంది. పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకకైనా... మాతృత్వపు మధురిమను పొందే బేబీ షవర్కైనా.. పువ్వుల దుపట్టా, పువ్వుల కేప్, పువ్వుల బ్లౌజ్... చీరకు కొంగుగా, లెహంగాకు డిజైన్గా అమరే పువ్వుల అందం ఇప్పుడు వేడుకలకు ప్రత్యేకతను తీసువస్తుంది.సుగంధాలు వెదజల్లే మల్లెలతో చేసిన దుపట్టా, బ్లౌజ్ డిజైన్స్ ఇప్పుడు పెళ్లిళ్లు, హల్దీ, మెహందీ వంటి ఫంక్షన్స్లో చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. ఇవి ఫ్రెష్ పూలతో తయారు చేసిన కావడంతో ఒక నేచురల్, రాయల్ లుక్ను తీసుకువస్తున్నాయి.ఫ్రెష్ ఫ్లవర్ దుపట్టా...గులాబీలతో.. రెడ్ లేదా పింక్ రోజ్ పూలను ఈ దుపట్టా తయారీలో ఉపయోగిస్తారు. రెడ్ లేదా పింక్ గులాబీలతో చేసిన దుపట్టాను ధరిస్తే రాయల్ లుక్తో కనిపిస్తారు. మల్లెపూలతో – సన్నని కాడ మల్లెలతో చేసే ఈ డిజైన్ సింపుల్గానూ, క్లాసీ లుక్తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కలర్ డ్రెస్ ఎంచుకున్నా మల్లెల దుపట్టాతో ప్రత్యేకత నింపుకుంటుంది. వివిధ రకాల పువ్వులు – గులాబీ, బంతి, జిప్సీ వంటి పూల మిక్స్తో దుపట్టాను అలంకరిస్తారు. ∙హల్దీ స్పెషల్ దుపట్టా – పసుపు రంగు వచ్చేలా బంతిపూలు, మల్లెలతో కలిపి దీనిని తయారుచేస్తారు. ఈ దుపట్టాలను ఎక్కువగా హల్దీ, మెహందీ ఫంక్షన్స్ కోసం వాడతారు.పువ్వుల బ్లౌజ్ డిజైన్స్...ఫ్రంట్ ఫ్లోరల్ టాప్ స్టైల్లో బ్లౌజ్ మొత్తం పూలతో కవర్ చేస్తారు. పువ్వులను బ్లౌజ్ బోర్డర్కి మాత్రమే అలంకరిస్తారు. పువ్వులను దారం లేదా వైర్ థ్రెడ్తో నెటెడ్ మెటీరియల్ మీద ఫిక్స్ చేస్తారు. వీటిలో ఎక్కువ శాతం బంతి, గులాబీ, మల్లెలతో పాటు అలంకరణకు తామర మొగ్గలను కూడా ఉపయోగిస్తుంటారు. ఈ డిజైన్స్ వేడుకకు రెండు గంటల ముందు లేదా ఆర్డర్ మీద డిౖజైన్ చేస్తున్నారు. డిజైన్ను బట్టి, పువ్వుల ఎంపికను బట్టి వీటి ధరలు ఉంటున్నాయి.
కాఫీకి ఒక రోజు..!
కాఫీ అంటే ఉదయించే ఉత్సాహం. సరికొత్త రోజుకు కాఫీ సేవనంతో ఉత్సాహంగా స్వాగతం చెప్పటం తప్పనిసరైన ఇష్టమని గాఢంగా భావించే కాఫీ ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు. ఒక మహత్తరమైన ఆహార సాంస్కృతిక వారసత్వానికి కాఫీ ఒక ప్రతీక. అటువంటి కాఫీకి ఇప్పటి వరకు ఒక ప్రత్యేక రోజంటూ లేదు. ఇప్పుడా కొరత తీరింది. అక్టోబర్ 1వ తేదీన ఇక ఏటా అంతర్జాతీయ కాఫీ డే (International Coffee Day) జరుపుకోవచ్చు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ నెల 10వ తేదీన ఈ మేరకు తీర్మానించింది. తన సువాసనలతో ఉత్తేజపరిచే కాఫీకి జేజేలు చెప్పని వారు ఈ విశాల భూతలమ్మీద ఎవరుంటారు? కమ్మటి కాఫీని సిప్ చేస్తూ మైమరచే వినియోగదారులతో పాటు కాఫీ గింజలను ఆరుగాలం కష్టించి పండించే రైతుల వరకూ కాఫీ దినోత్సవ ప్రకటన ఒక ఉత్తేజకరమైన వార్తే కదూ! ఆహార భద్రతకు దోహదపడే కాఫీ పంట సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత గురించి అవగాహన పెంపొందించడానికి కాఫీకి ఒక రోజును కేటాయిస్తున్న ఐక్యరాజ్యసమితి తీర్మానం పేర్కొంది. ఈ సందర్భంగా కాఫీ కబుర్లు మీ కోసం!కాఫీకి ఉన్న సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాముఖ్యతను ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఇదొక ముఖ్యమైన వ్యవసాయక ఉత్పత్తి మాత్రమే కాదు, కోట్లాది మంది వ్యవసాయ సమూహాలకు జీవనోపాధి కూడా. సామాజిక ఆతిథ్యం, సాంస్కృతిక వ్యక్తీకరణ, రోజువారీ సంప్రదాయానికి చిహ్నంగా కూడా కాఫీ మారింది అని ఐరాస తీర్మానం పేర్కొంది. ఆకలికి వ్యతిరేకంగా పోరాటం, తీవ్ర పేదరికాన్ని తగ్గించడం, మహిళల సాధికారత, మంచి పనిని ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం వంటి అనేక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కాఫీ సాగు, ప్రాసెసింగ్ దోహదపడుతున్నాయని ఐరాస పేర్కొంది.2.5 కోట్ల రైతుల పంట ప్రపంచంలో అత్యంత విస్తృతంగా సేవించే పానీయాలలో కాఫీ ఒకటి. గత దశాబ్దంలో ప్రపంచ తలసరి వినియోగం సంవత్సరానికి 1.2 శాతం పెరుగుతోంది. ఈ రంగం సుమారు 2.5 కోట్ల రైతుల జీవనోపాధికి తోడ్పడుతోంది. తోటల సాగు నుంచి ప్రాసెసింగ్, వినియోగం వరకు విస్తరించిన విలువ గొలుసు అంతటా ఎందరికో ఉపాధి అవకాశాలను కాఫీ కల్పిస్తోంది. మొత్తం మీద, ప్రపంచ కాఫీ పరిశ్రమ వార్షిక ఆదాయం 20,000 కోట్ల డాలర్లు.3,400 కోట్ల డాలర్ల వాణిజ్యంప్రపంచంలోనే అత్యధికంగా క్రయవిక్రయాలు జరిగే వస్తువులలో కాఫీ ఒకటిగా ఉంది. 2024లో ప్రపంచ కాఫీ ఉత్పత్తి 1.1 కోట్ల టన్నులను అధిగమించింది. అంతర్జాతీయంగా సుమారు 80 లక్షల టన్నుల కాఫీ గింజల వర్తకం జరుగుతోంది. 2024లో ప్రపంచ కాఫీ ఉత్పత్తి విలువ దాదాపు 2,500 కోట్ల డాలర్లని అంచనా, అయితే, కాఫీ గింజల ప్రపంచ వాణిజ్యం సుమారు 3,400 కోట్ల డాలర్లకు చేరుకుంది.పుట్టిల్లు ఇథియోపియాఅనేక తక్కువ ఆదాయ దేశాలు విదేశీ మారకద్రవ్యం ఆర్జనకు కాఫీ ఎగుమతులు కీలకంగా మారాయి. కాఫీ పుట్టిల్లు ఇథియోపియా. 2024లో ఇథియోపియా మొత్తం వస్తువుల ఎగుమతుల్లో కాఫీ వాటా 27.9 శాతం. ఉగాండాలో 20.1 శాతం, బురుండిలో 19.5 శాతం. ఇథియోపియా, ఉగాండా రెండింటిలోనూ, కాఫీ ఎగుమతి ఆదాయాలు ఆహార దిగుమతి బిల్లులను మించిపోయాయి. 2024లో బ్రెజిల్, వియత్నాం ప్రముఖ కాఫీ ఎగుమతిదారులుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా అతిపెద్ద దిగుమతిదారులుగా ఉన్నాయి.కాఫీ రైతులు ఎదుర్కొంటున్న వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఆహార – వ్యవసాయ సంస్థ ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ కార్యక్రమం ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఫీల్డ్ స్కూల్స్ ద్వారా తూర్పు ఆఫ్రికాలో, క్యూబాలో సహకార కాఫీ సాగు నమూనాలను ఎఫ్ఏవో బలోపేతం చేసింది. ప్రపంచ కాఫీ మార్కెట్కు అవసరమైన బలమైన ట్రేసబిలిటీ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి రైతులు, ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. ఏడో స్థానంలో భారత్కాఫీ సాగులో ప్రపంచంలో ఏడో స్థానంలో, ఎగుమతిలో ఐదో స్థానంలో భారత్ ఉంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర దక్షిణాది రాష్ట్రాల్లోనే 90% కాఫీ గింజలు పండుతాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ కనుమల్లోని కొండ్రప్రాంతాల్లో కాఫీ సాగు విస్తరించింది. అరకు కాఫీ ఘుమఘుమలకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. కాఫీ రకాల్లో అరబిక 30%, రోబస్ట 70% మన దేశంలో సాగవుతున్నాయి. 17వ శతాబ్దంలో బాబా బుడాన్ ఎమెన్ నుంచి ఏడంటే ఏడు కాఫీ గింజల్ని మన దేశానికి రహస్యంగా తీసుకొచ్చారు. బ్రిటీష్ పాలనలో 19వ శతాబ్దం మధ్య నుంచి వాణిజ్యపరంగా కాఫీ పంట సాగు మన దేశంలో డచ్ వారి చొరవతో ప్రారంభమైంది. మన దేశంలో ఉత్పత్తయ్యే కాఫీ గింజల్లో 70% ఇటలీ, రష్యా, జర్మనీ కొనుగోలు చేస్తున్నాయి. 6 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్న కాఫీ పరిశ్రమ కార్యకలాపాలను కాఫీ బోర్డు పర్యవేక్షిస్తోంది.చదవండి: మహిళా రైతులకు మద్దతిస్తే..!కాఫీ అనేది ఒక పానీయం కంటే ఎక్కువ. ఇది ప్రపంచవ్యాప్త వాణిజ్య వస్తువు. గింజల నుండి కాఫీ సేవనం వరకు – కోట్లాది వ్యవసాయ కుటుంబాల జీవనోపాధిని నిలబెడుతోంది. గ్రామీణులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం చేస్తోంది. కాఫీ రంగానికి గల విలువను గుర్తించటం, దాని సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుతుంది. పేదరిక నిర్మూలనకు దాని సహకారాన్ని బలోపేతం చేస్తుంది. కాఫీ దినోత్సవాన్ని, దాని విలువలను సంబరంగా జరుపుకోటానికి ఎదురుచూస్తున్నాం.– క్యూ.యూ. డోంగ్యు, డైరెక్టర్ జనరల్, ఐరాస ఆహార–వ్యవసాయ సంస్థ, రోమ్.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
అంతర్జాతీయం
క్షిపణులతో కిమ్ కవ్వింపులు
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన క్షిపణులకు పనిజెప్పారు. ఉత్తర సముద్ర జలాల్లో ఒకేసారి 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులను తీసుకొచ్చారు. ఉ.కొరియా కవ్వింపు చర్యలను పొరుగున ఉన్న వైరిదేశం దక్షిణకొరియా తీవ్రంగా తప్పుబట్టింది. అమెరికాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలకు సిద్ధమవుతున్నవేళ కిమ్ ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందని దక్షిణకొరియా ఆగ్రహం వ్యక్తంచేసింది.ఉ.కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ సమీప ప్రాంతం నుంచి శనివారం ఈ 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారని, అయితే అవి ఎంత దూరం ప్రయాణించాయనే వివరాలపై స్పష్టత లేదని ద.కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ప్రకటించారు.ఉ.కొరియా దుందుడుకు చర్యలను నిశితంగా గమనిస్తున్నామని నిఘాతోపాటు సైనిక సన్నద్ధతతో ముందుకెళ్తున్నామని ద.కొరి యా ప్రకటించింది. ఇరాన్లో యావత్దేశంలోని సెక్యూరిటీ కెమె రాలను హ్యాక్ చేసి ఖమేనీ హత్యను అమెరికా సులభతరం చేసిన నేపథ్యంలో తమ దేశంలోనూ అమెరికా ఇదే పనిచేస్తోందా? అన్న అనుమానాలు సగటు దక్షిణ కొరియన్లలో ఎక్కువయ్యాయని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
పాక్ ప్రభుత్వోద్యోగుల వేతనాల్లో కోత
ఇస్లామాబాద్: ఇరాన్–అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం పాకిస్తాన్పై తీవ్రంగా పడింది. దీంతో, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం వేతనాల్లో కోత సహా పలు పొదుపు చర్యలను ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల ఉద్యోగుల వేతనాల్లో 5 నుంచి 30 శాతం వరకు కోత విధించాలని నిర్ణయించింది. ప్రభుత్వ వాహనాలకు కేటాయించే ఇంధనంలో 50 శాతం కోత విధించడంతోపాటు, వచ్చే రెండు నెలల్లో 60 శాతం వరకు ప్రభుత్వ వాహనాలను రోడ్లపై తిరగకుండా నిలిపివేయనుంది.అంతేకాకుండా, కొత్త వాహనాల కొనుగోళ్లను నిలిపివేయడంతోపాటు, ఇతర అన్ని రకాల కొనుగోళ్లపైనా నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. వివిధ కార్పొరేషన్లు, సంస్థల బోర్డుల ప్రభుత్వ ప్రతినిధులకు ఇకపై పార్టిసిపేషన్ ఫీజు ఇవ్వరాదని సమావేశంలో నిర్ణయించింది. ఈ నిధులను కూడా ప్రభుత్వ పొదుపులో భాగంగానే పరిగణించనుంది.వచ్చే రెండు నెలల కాలంలో మంత్రి వర్గ సభ్యులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకుల వేతనాల నిలిపివేసి, ఆ మొత్తాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మళ్లిస్తారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులు, సహాయ మంత్రులు, ప్రత్యేక సలహాదారుల విదేశీ పర్యటనలపై పూర్తి నిషేధం అమలు కానుంది. ఇరాన్ యుద్ధం ప్రభావంతో పాకిస్తాన్లో పెట్రోలియం ధరలు లీటరుకు రూ.55 మేర పెరిగాయి.
మీ యుద్ధ నౌకలను పంపండి..!
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్త యుద్ధం. ఇది గత కొన్ని రోజులుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ప్రభావంతో ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా-ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తూ సహకరిస్తున్న అరబ్ దేశాలపై ఇప్పటికే ఇరాన్ విరుచుకుపడుతూ ఉంది. తమతో యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్కు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరిస్తే వారు తమ శత్రువులేనని ఇప్పటికే ఇరాన్ స్పష్టం చేసింది. ఆ క్రమంలోనే వారిపై భీకరమైన దాడులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. విదేశాలకు సరఫరా అయ్యే చమురు విషయంలో కూడా ఇరాన్ కఠినంగానే ఉంది. ఇరాన్కు నచ్చిన దేశాలను మినహాయించి మిగతా దేశాలను కట్టడి చేస్తోంది. ప్రధానంగా హర్మూజ్ జలసంధి నుంచి వచ్చే చమురు నౌకల విషయంలో ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది. అయితే దీన్ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లో ఆందోళన మొదలైంది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ జలసంధి ద్వారా వెళ్తుంది. ప్రపంచ ఇంధన భద్రతకు కీలకమైన చోక్పాయింట్గా చెప్పుకుంటారు. మరి దీన్ని ఇరాన్ పూర్తిగా క్లోజ్ చేస్తే ఏంటనేది పరిస్థితి. ఇదే ఇప్పుడు ట్రంప్లో మొదలైన భయం. మీ నౌకలను పంపండిహర్మూజ్ జలసంధి భద్రతపై తీవ్ర ఆందోళనలు నడుమ ట్రంప్.. ప్రపంచ దేశాలకు ఒక పిలుపునిచ్చారు. హర్మూజ్ జలసంధి భద్రతకు సంబంధించి పలు ఇతర దేశాల నౌకలను పంపమని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకేలకు ఆయన తన సందేశాన్ని పంపారు. ఈ జలసంధితో ఇబ్బంది తలెత్తితే ఎక్కువగా ప్రభావితమయ్యేది ఆయా దేశాలేనని అందుచేత ముందస్తు జాగ్రత్తగా ఆ జలసంధి భద్రతకు నౌకాదళాన్ని సిద్ధం చేసుకుని పంపాలన్నారు. ఇలా చేస్తే ముప్పు ఉండదని, లేకపోతే అతి తీవ్రమైన సంక్షోభాన్ని కూడా చూడాల్సి రావచ్చన్నారు. వారంతా హర్మూజ్ జలసంధి అంశంలో ముందుకొస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
వీళ్లను పట్టిస్తే కోటీశ్వరులైపోవచ్చు.. ఏకంగా రూ.93 కోట్లు
వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సహా ఆ దేశంలోని పలువురు ఉన్నతాధికారుల గురించి సమాచారం ఇచ్చిన వారికి 10 మిలియన్ డాలర్లు (రూ.92,47,48,000) బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది. యుద్ధం మరింత ముదురుతున్న పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రోత్సాహకాన్ని అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించే “రివార్డ్స్ ఫర్ జస్టిస్” కార్యక్రమం ద్వారా ప్రకటించింది.రివార్డు ఉన్న వ్యక్తుల జాబితాలో మొజ్తబా ఖమేనీతో పాటు కీలక నేతలు, అధికారులు అలీ అస్గర్ హిజాజీ, యాహ్యా రహీమ్ సఫవి, అలీ లరిజాని, ఎస్మాయిల్ ఖతీబ్ ఎస్కందర్ మొమెని ఉన్నారు. ఈ నాయకులపై సమాచారం ఇచ్చే వారికి అమెరికా బహుమతి ప్రకటించింది.అమెరికా ఈ నాయకులకు వేర్వేరుగా కచ్చితమైన మొత్తాన్ని బహుమతిగా ప్రకటించలేదు. అమెరికా చెప్పింది ఒక్కటే.. ఎవరైనా తమకు ఇచ్చే సమాచారం ఉపయోగపడితే “గరిష్ఠంగా $10 మిలియన్ (సుమారు రూ.92-93 కోట్లు) వరకు” బహుమతి ఇవ్వవచ్చు.రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం అంటే అమెరికా మీద ఉగ్రదాడులు చేసినట్లు అనుమానించే వ్యక్తులను గుర్తించేందుకు సమాచారం ఇచ్చిన వారికి డబ్బు బహుమతి ఇచ్చే కార్యక్రమం. మొజ్తబా ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులను “ఇరానియన్ టెర్రరిస్టులు”గా పేర్కొంటూ అమెరికా ఒక ప్రకటనలో వివరాలు తెలిపింది.“ఈ వ్యక్తులు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)లో వివిధ విభాగాలను నడిపిస్తున్నారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర చర్యలకు ప్రణాళికలు వేసి, అమలు చేస్తుంది” అని చెప్పింది.“ఈ ఐఆర్జీసీ నాయకులు లేదా దాని విభాగాలపై సమాచారం తెలిసినవారు ఆ విషయాన్ని టోర్ ఆధారిత టిప్లైన్ లేదా సిగ్నల్ ద్వారా మాకు పంపండి. సమాచారం ఇచ్చిన వారికి బహుమతి లభించే అవకాశం ఉంటుంది” అని తెలిపింది.టోర్ అంటే ఇంటర్నెట్లో గుర్తింపును దాచుతూ సమాచారాన్ని పంపే సాంకేతిక వ్యవస్థ. సిగ్నల్ అంటే గోప్యంగా సందేశాలు పంపే ఎన్క్రిప్షన్ ఆధారిత మెసేజింగ్ యాప్.
జాతీయం
ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు కేంద్రం అనుమతి
న్యూఢిల్లీ: గ్యాస్ కొరత వేళ కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలు వాడుకోవచ్చని ప్రకటించింది. ఢిల్లీలో కాలుష్యం ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం మరింత పెరగకుండా ప్రభుత్వం ఎన్నో నిబంధనలను తీసుకొచ్చింది. అయినప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్లో గ్యాస్ కొరత నెలకొనడంతో ఇప్పుడు కట్టెల పొయ్యి వాడక తప్పడం లేదు. దీంతో దానిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. కమర్షియల్ సిలిండర్ల కొరత నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కొన్ని రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిపై వంటలు మొదలయ్యాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో జిల్లాలోనూ గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలుపుదల చేశాయి. కొందరికి మాత్రం పాత స్టాక్ ఉండడంతో ఎలాగోలా రెండు రోజులు నెట్టుకొచ్చారు. స్టాక్ లేని వారు కట్టెల పొయ్యిపై వంటలు చేయడం ప్రారంభించారు. ఇంకొందరు సుదూర ప్రాంతాల నుంచి గ్యాస్ తెచ్చుకొని రెస్టారెంట్లను నడుపుతున్నారు.మరోవైపు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, హాస్టళ్ల వంటివి మూడపడకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎల్పీజీలను వాడకుండా విద్యుత్ స్టౌలను వాడుకోవాలని.. ఇలా చేసే హోటళ్లు, టీ స్టాళ్ల వంటివాటికి విద్యుత్ బిల్లులో యూనిట్కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇవాళ ప్రకటన చేశారు.తమిళనాడులో ఏర్పడిన ఎల్పీజీ కొరత వల్ల పరిశ్రమలు, ఫుడ్ సెక్టార్ సహా అనేక రంగాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు శనివారం తమిళనాడు సచివాలయంలో స్టాలిన్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. ‘గ్యాస్ కొరత సమయంలో ఎల్పీజీలు వాడకుండా విద్యుత్ స్టౌలను వాడడం ప్రారంభించే హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్లు, ఇతర ఆహార తయారీ యూనిట్లు.. అదనంగా వినియోగించే విద్యుత్కు యూనిట్కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ వినియోగంపై విధించిన పరిమితులు అమల్లో ఉన్నంత కాలం ఈ సబ్సిడీ కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
గ్యాస్ కొరత వేళ హోటళ్లు, టీ స్టాళ్లు మూత పడకుండా..
చెన్నై: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్లో గ్యాస్ కొరత నెలకొనడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, హాస్టళ్ల వంటి వాటిని నడపలేని పరిస్థితి వస్తోంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీలను వాడకుండా విద్యుత్ స్టౌలను వాడుకోవాలని.. ఇలా చేసే హోటళ్లు, టీ స్టాళ్ల వంటివాటికి విద్యుత్ బిల్లులో యూనిట్కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.తమిళనాడులో ఏర్పడిన ఎల్పీజీ కొరత వల్ల పరిశ్రమలు, ఫుడ్ సెక్టార్ సహా అనేక రంగాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు శనివారం తమిళనాడు సచివాలయంలో స్టాలిన్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. హోటళ్ల వంటివాటిలో కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జె.రాధాకృష్ణన్ వివరాలు తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో తమిళనాడు ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.‘గ్యాస్ కొరత సమయంలో ఎల్పీజీలు వాడకుండా విద్యుత్ స్టౌలను వాడడం ప్రారంభించే హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్లు, ఇతర ఆహార తయారీ యూనిట్లు.. అదనంగా వినియోగించే విద్యుత్కు యూనిట్కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ వినియోగంపై విధించిన పరిమితులు అమల్లో ఉన్నంత కాలం ఈ సబ్సిడీ కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.ప్రస్తుతం ఉన్న ఎల్పీజీ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో విద్యుత్ పరికరాలు కొనుగోలు చేయించేందుకు సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. అర్హత ఉన్న వ్యాపారులు రూ.3.75 లక్షల వరకు రుణాలకు 25 శాతం సబ్సిడీ పొందవచ్చు. మహిళా వ్యాపార అభివృద్ధి పథకం కింద మహిళలు నడిపే వ్యాపారాలకు రూ.10 లక్షల వరకు రుణంపై గరిష్ఠంగా రూ.2 లక్షలపై 25 శాతం సబ్సిడీ ఇస్తారు.అదనంగా ఎస్సీ, ఎస్టీ వ్యాపారులను ప్రోత్సహించేందుకు అన్నై అంబేడ్కర్ బిజినెస్ ఛాంపియన్స్ పథకం కింద గరిష్ఠంగా రూ.కోటి వరకు 35 శాతం మూలధన సబ్సిడీ ఇస్తారు. అధిక సామర్థ్య విద్యుత్ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం. తమిళనాడులో తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో 60,698 కర్మాగారాలు ఎల్పీజీ, సీఎన్జీ, డీజిల్, ఫర్నేస్ ఆయిల్, కట్టెలు వంటి వాటిని ఉపయోగిస్తూ పనిచేస్తున్నాయి.
గ్యాస్ కష్టాలు: పనుల్లేక సొంతూళ్లకు వలస కూలీలు
తిరువనంతపురం: దేశాన్ని ఎల్పీజీ కొరత అతలాకుతలం చేస్తోంది. వంట గ్యాస్ దొరక్క వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో మరో పెను సంక్షోభం తెరపైకి వచ్చింది. ఉపాధి కోల్పోయిన వేలాది మంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు తిరుగుపయనం అవుతున్నారు. కేరళలోని హోటల్ రంగం ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలపైనే ఆధారపడి నడుస్తోంది.ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, మరోవైపు రంజాన్ పండుగ దగ్గరపడుతుండటంతో వీరంతా ముందస్తుగానే ఇళ్లకు తరలి వెళుతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయానికి వారం ముందు వెళ్లే వీరు, ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల హోటళ్లు మూతపడటంతో పనులు లేక ముందుగానే సొంతూళ్లకు తరలివెళ్లిపోతున్నారు. ‘ఎల్పీజీ సంక్షోభం మధ్య చిన్న తరహా హోటల్ యజమానులు తమ సిబ్బందిని కాపాడుకోలేకపోతున్నారు. ఒక్కసారి వీరు తమ గ్రామాలకు వెళ్తే మళ్లీ రెండు మూడు నెలల వరకు తిరిగి రారు. ఇది కేరళలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది’ అని కేరళ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. జయపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.కేరళలోని వలస కార్మికులలో సుమారు 50 శాతం మంది ఎన్నికలు జరగబోయే బెన్సాం, అస్సాం ప్రాంతాల వారేనని గణాంకాలు చెబుతున్నాయి. కొందరు యజమానులు గ్యాస్కు బదులు ఇతర ఇంధనాలను వాడుతూ పనివారిని ఆపే ప్రయత్నం చేస్తున్నా, పరిస్థితులు ఆశాజనకంగా లేవు. తిరువనంతపురంలోని ప్రముఖ మాల్స్కు సిబ్బందిని సరఫరా చేసే ఏజెన్సీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో 25 మంది పనిచేసే చోట ఇప్పుడు కేవలం ఐదుగురు మాత్రమే మిగిలారు. ప్రస్తుతానికి స్థానిక మహిళలతో పనులు కానిస్తున్నా, వలస కూలీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గ్యాస్ సమస్య త్వరగా పరిష్కారం అయితేనే కేరళ ఆతిథ్య రంగం తిరిగి కోలుకునే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: కాంగ్రెస్ విదేశీ శక్తుల కీలుబొమ్మ: ప్రధాని మోదీ
LPG cylinder అదను చూసి చార్జీలు బాదుడు
చెన్నై/బెంగళూరు: దేశవ్యాప్తంగా నానాటికీ తీవ్రతరమవుతున్న వాణిజ్య సిలిండర్ల (Commercial LPG cylinder) కొరత పలు గమ్మత్తైన పరిణామాలకు కూడా దారి తీస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉన్న బెంగళూరు, చెన్నై వంటి పలు నగరాల్లో బ్లాక్ మార్కెటింగ్ జోరుగా సాగుతోంది. దాంతో పలు హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే ప్రయత్నం చేస్తున్నాయి. ‘గ్యాస్ చార్జీ’ పేరిట కస్టమర్ల నుంచి బిల్లులో అదనంగా వసూలు చేసేస్తున్నాయి! అలా చెన్నైలోని ఒక హోటల్ ఇచ్చిన బిల్లు ఇప్పుడు వైరల్గా మారింది. ఇదీ చదవండి: మండిస్తున్న ఎండలు, పైకప్పు చల్లగా ఇలా..!బెంగళూరులో కూడా ఒక హోటల్ తన కస్టమర్ నుంచి గ్యాస్ బిల్లు రూపంలో ఏకంగా 30 రూపాయలు వసూలు చేసింది. దాంతో చిర్రెత్తుకొచ్చిన కస్టమర్ ఆ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నగర పోలీస్ కమిషనర్ను కూడా ట్యాగ్ చేస్తూ, ఈ వసూళ్ల దందాను కట్టడి చేయాల్సిందిగా కోరాడు. బెంగళూరు హోటళ్ల సంఘం అధ్యక్షుడు పి.సి.రావు దీనిపై వెంటనే స్పందించారు. సదరు హోటల్ యాజమాన్యంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. బెంగళూరు తదితర నగరాల్లో సిలిండర్ల చోరీలు కూడా పెరిగి పోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్
ఎన్ఆర్ఐ
వాషింగ్టన్ డీసీలో శంకర నేత్రాలయ నిధుల సేకణ కార్యక్రమం
గతేడాది డిసెంబర్ 6. 2025న వాషింగ్టన్ డి.సి. మెట్రో ప్రాంతంలో నిర్వహించిన శంకర నేత్రాలయ (SN) నిధుల సేకరణ కార్యక్రమం విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మక నేత్ర వైద్య సంస్థ కోసం మొత్తం $150,000 నిధులు సమీకరించారు. సంస్కృతి,కరుణను ప్రతిబింబించే ఈ వేడుకకు చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రమణ రెడ్డి మడ్డికుంట CapEx సభ్యుడు తిరుమల రెడ్డి మునుకుంట్ల నాయకత్వం వహించారు.ఆ సాయంత్రం థీమ్ కరుణ ప్రతిధ్వనులు: కళ హృదయాన్ని కలిసే స్థలం (Echoes of Compassion: Where Art Meets Heart)గా నిర్వహించబడింది. శాస్త్రీయ మరియు సాంప్రదాయ నృత్య కళలతో సేవా భావాన్ని మేళవిస్తూ ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక అకాడమీలు పాల్గొని యువ వయోజన నర్తకుల అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సాంస్కృతిక బృంద సభ్యురాలు లక్ష్మి బాబు సమన్వయంతో నృత్య ప్రదర్శనలు అత్యంత కన్నులపండుగగా నిర్వహించారుఈ వేడుకకు గౌరవ అతిథిగా ఎస్. వి. ఆచార్య గారు హాజరై తమ ప్రోత్సాహకర సందేశంతో కార్యక్రమానికి మరింత గౌరవాన్ని చేకూర్చారు. అలాగే 11 మంది MESU స్పాన్సర్ల మద్దతు ఈ కార్యక్రమ విజయానికి కీలకమైంది.ఉదార హృదయంతో సహకరించిన MESU స్పాన్సర్లు:సెల్వ, ప్రతిభ జయరామన్, భువనేశ్ బూజాల, భానుమతి రామకృష్ణ, శ్రవణ్ పడూరు, కృష్ణకాంత్ కుచ్చలకంటి, ప్రవీణ్ పాల్రెడ్డి, రఘు పాల్రెడ్డి, వెంకట్ దోమా, తిరుమల మునుకుంట్ల, రఘు జువ్వాది గారు. వీరి ఆర్థిక కార్యనిర్వహణ సహకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.ఇంకా SNUSA నేషనల్ మరియు డి.సి. మెట్రో చాప్టర్ సభ్యులు విశేషంగా సహకరించారు. ముఖ్యంగా శ్రీమతి నీలిమ గడ్డమనుగు, కృష్ణ రాజ్ భట్, సౌమ్య నారాయణన్, డి.సి. చాప్టర్ నాయకులు — బాలాజీ రాధాకృష్ణన్, హరిత రెడ్డి, అర్జున్ కామిసెట్టి, దిలీరాజ్ చాంతివేలు, రూపేష్ చిన్నకంపల్లి, కార్తిక్ గౌడ్ తదితరుల కృషి ప్రశంసనీయం.SNUSA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి గారి నాయకత్వం తోపాటు బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యుల మార్గదర్శకత్వం ఈ విజయానికి బలమైన ఆధారంగా నిలిచాయి. ట్రెజరర్ మూర్తి రేకపల్లి గారు లాజిస్టిక్స్ నిర్వహణలో విశేష కృషి చేయగా, మీడియా సహకారం అందించిన శ్రీగిరి కోటగిరి సేవలు అభినందనీయం. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువ వాలంటీర్లు, మీడియా,ఫోటోగ్రఫీ బృంద సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మాస్టర్ ఆఫ్ సెరిమనీగా వ్యవహరించిన శ్రియా బాబు తన చక్కని వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని చురుకుగా, సమర్థవంతంగా ముందుకు నడిపించారు.ఈ కార్యక్రమంలో సమీకరించిన నిధులు శంకర నేత్రాలయ లక్ష్యమైన అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించేందుకు వినియోగించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ముగిసే సమయానికి సేవా భావం, ఐక్యత, సామాజిక బాధ్యత స్పష్టంగా ప్రతిఫలించాయి. ఈ వేడుక కేవలం కళలు, సంస్కృతిని మాత్రమే కాకుండా, సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరి హృదయంలో మరింత బలంగా నాటింది.(చదవండి: అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..)
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు భారత్కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్ ఎవరు? ఆ వివరాలు మీకోసం.లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలోజన్మించారు నిత్య రామన్. ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య కుటుంబం, అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కరెన్ బాస్కు గట్టి పోటీప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!
అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత
క్రైమ్
జూబ్లీహిల్స్లో భారీ చోరీ
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో భారీ చోరీ జరిగింది. అన్నం పెట్టిన ఇంటికే ఓ నేపాలీ దంపతులు కన్నం వేశారు. పనిమనుషులుగా చేరిన నెలన్నరకే చేతివాటం ప్రదర్శించారు. యజమాని లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి 8 డైమండ్ నెక్లెస్లు, బంగారు ఆభరణాలు, 10 రోలెక్స్ వాచీలను దోచుకుని పరారయ్యారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు... జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–25లోని ప్లాట్ నెంబర్ 305లో పింగళి అనురు««ద్రెడ్డి అనే వ్యాపారి, భార్య దీపికారెడ్డితో కలిసి ఉంటున్నాడు. నగరంలోని పేరు మోసిన హోటల్ యజమాని కుమార్తె అయిన దీపికారెడ్డి దంపతులు శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళాలు వేసి విమానంలో ఊటీకి వెళ్లారు. 45 రోజుల క్రితమే ఈ ఇంట్లో నేపాల్కు చెందిన మహేష్ షాయి(30), అప్సర(25) దంపతులు పనిమనుషులుగా చేరారు. యజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించారు. పక్కా పథకంతో ఇంట్లో చేరిన నేపాలీ దంపతులు అవకాశం కోసం ఎదురుచూశారు. నాలుగైదు రోజుల నుంచి ఇంట్లోకి ఎలా వెళ్లాలి.. నగలు, నగదు ఎక్కడ భద్రపరిచారు.. వంటి వాటిపై రెక్కీ నిర్వహించారు. రాత్రంతా అల్మారా, లాకర్లను పగులకొడుతూ.. యజమానులు అనిరు«ధ్రెడ్డి, దీపికారెడ్డి ఊటికి వెళ్లడంతో శుక్రవారం రాత్రి 12.30 గంటల సమయంలో కత్తులు, కటార్లు, రాడ్ల సహాయంతో నేపాలీ దంపతులు ప్రధాన ద్వారం తాళం పగులగొట్టారు. బెడ్రూమ్లోకి వెళ్లి అల్మారాను, లాకర్లను శనివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు పగులగొట్టారు. 8 డైమండ్ నెక్లెస్లు, 10 రోలెక్స్ వాచీలు, బంగారు నగను బ్యాగ్లో సర్దుకుని ఉడాయించారు. ఉదయం ఇంటికి వచ్చిన డ్రైవర్ గమనించి యజమానికి సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వేలిముద్రలు తీసుకున్నారు. ఈ దంపతులను పనిలో కుదిర్చిన పాత పనిమనుషులు హరత్సింగ్, రీమాసింగ్ల కోసం గాలిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితులు పేరు మోసిన కుటుంబానికి చెందినది కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం సాయంత్రం నేపాల్ సరిహద్దులకు ముంబై, బిహార్లకు పోలీసు బృందాలు చేరుకుని నిఘా పెట్టాయి. కాగా, హరత్సింగ్ గదిలో కూడా మహేశ్సాయి దంపతులు కొంత సామాను తస్కరించడం గమనార్హం.
ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి
మలికిపురం: రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో రోజూ చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై మేడిద రాంబాబు(45) లైంగిక దాడికి పాల్పడినట్లు ఎస్ఐ పి.వి.వి సురేష్ శనివారం తెలిపారు.బాలిక తల్లిదండ్రులు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాలిక ఇంటి వద్దకు తరచూ వచ్చే రాంబాబు శుక్రవారం కూడా ఇంటికి వచ్చాడు. రాంబాబు బాలికను ఇంటి పక్కకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతుండగా బాలిక నానమ్మ చూసి కేకలు వేసింది. దీంతో రాంబాబు పరారయ్యాడు.
క్షణికావేశం.. తీరని శోకం
రహమత్నగర్: క్షణికావేశంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో విషాదం నింపింది. తాను లేని బతుకు పిల్లలకు ఎందుకనుందోగానీ ముక్కుపచ్చలారని చిన్న పిల్లల గొంతు నులిమేసింది. ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ ఘటనలో తల్లి, కొడుకు మృతి చెందగా పాప మృత్యువుతో పోరాడుతోంది. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తగూడెంకు చెందిన మురళివేణుకు మందమర్రికి చెందిన సత్యవాణి (33)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రుద్రాన్‡్ష (5), తన్విక(2) పిల్లలున్నారు. ప్రైవేటు పనులు చేసుకునే మురళి వేణు తన భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో బోరబండ డివిజన్లోని పెద్దమ్మగుడి నగర్లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. మురళివేణు తండ్రికి కిడ్నీలు పాడైపోవడంతో రెండు రోజులకుకోమారు డయాలసిస్ చేయిస్తుంటాడు.తల్లి హౌస్ కీపింగ్ పనికి వెళ్తోంది. ఐదు సంవత్సరాల క్రితం మురళివేణుకు ట్రాన్స్కో జూనియర్ లైన్మెన్గా ప్రైవేటు ఉద్యోగం వచ్చింది. గత కొన్ని రోజులుగా సత్యవాణి, మురళిల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. తనతో, పిల్లలతో గడపడం లేదంటూ, బయట పనులే ఎక్కువయ్యాయని ఇంట్లో గొడవ పడేవారని తెలిసింది. ఈ క్రమంలోనే తమ పెళ్లి రోజైన శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన సత్యవాణి తన పిల్లలు రుద్రాన్‡్ష, తన్వికల గొంతు నులిమేసింది. వారు చనిపోయారని భావించాక తానూ ఉరి వేసుకుని బలవర్మణం చెందింది.ఆమె అత్త హౌస్ కీపింగ్ పని ముగించుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాక గమనించి 100 డయల్కు సమాచారం అందించింది. సంఘటన స్థలానికి చేరుకున్న బోరబండ ఎస్హెచ్ఓ సురేందర్ గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే తల్లి సత్యవతి, కొడుకు రుద్రాన్‡్ష మృతి చెందారు. కూతురు తన్విక కొన ఊపిరితో ఉండగా చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పాప పరి«స్థితి విషమంగా ఉందని సమాచారం. బోరబండ పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
షాకింగ్ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన భారతీయ సంతతికి చెందిన సోదరులు భాస్కర్ సవానీ(60), అరుణ్ సవానీ(58)లకు 835 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మనీలాండరింగ్, హెచ్1బీ వీసా, పన్ను ఎగవేత సహా వివిధ రకాల మోసాలకు పాల్పడ్డారన్న కేసులో సుమారు $30 మిలియన్ల (రూ. 250 కోట్లకు పైగా) కుంభకోణానికి పాల్పడి, రికార్డ్ స్థాయిలో సుదీర్ఘ జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు. అసలేంటీ కుంభకోణం వివరాలు తెలుసుకుందాం.US అటార్నీ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, భారతీయ సంతతికి చెందిన సోదరులు దంతవైద్యుడు భాస్కర్ సవానీ , అతని సోదరుడు అరుణ్ సవానీ "సవానీ గ్రూప్" పేరుతో పలు రకాల వ్యాపారాలు నడిపారు. తద్వారా మిలియన్ల డాలర్లను అక్రమంగా సంపాదించారు. వీటితోపాటు అమెరికాలో మెడికైడ్ ప్రోగ్రామ్ ద్వారా 30 మిలియన్ల డాలర్లకు పైగా మోసం, H-1B వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసినందుకు దోషులుగా నిర్ధారించబడ్డారు ఈ కుంభకోణంలోని ప్రధానాంశాలను ఒక సారి పరిశీలిస్తే...హెచ్-1బి (H-1B) వీసా స్కాంవీరు 'సవాని గ్రూప్' పేరుతో ఒక నేరపూరిత సంస్థను నడిపారు. భారత్ నుండి విదేశీ కార్మికులను తీసుకురావడానికి తప్పుడు పత్రాలతో H-1B వీసాల కోసం దరఖాస్తు చేశారు. అక్కడికి వచ్చిన కార్మికులను వేధించి, వారికి ఇచ్చే జీతాల్లో కొంత భాగాన్ని తిరిగి తమకే ఇవ్వాలని (కిక్బ్యాక్స్) బలవంతం చేసేవారని ప్రాసిక్యూటర్లు తెలిపారు.మెడికేడ్ (Medicaid) కుంభకోణంభాస్కర్ సవాని ఒక దంతవైద్యుడు. వీరి దంత వైద్యశాలలను మెడికేడ్ ప్రోగ్రామ్ నుండి తొలగించినప్పటికీ, వీరు ఇతర వ్యక్తుల పేర్లతో (Nominee owners) దొంగ కంపెనీలను సృష్టించి ప్రభుత్వానికి తప్పుడు బిల్లులు పంపారు. ఈ విధంగా అమెరికా ప్రభుత్వ ఆరోగ్య పథకం ‘మెడికేడ్’ను ఉపయోగించుకొని సుమారు రూ. 250 కోట్లకు పైగా మోసం చేశారు.మనీ లాండరింగ్ , పన్నుల ఎగవేతవచ్చిన అక్రమ సొమ్మును దాచడానికి అనేక బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి మనీ లాండరింగ్కు పాల్పడ్డారు. దాదాపు 1.6 మిలియన్ల డాలర్లను వ్యక్తిగత ఆదాయాన్ని 1.1 మిలియన్ల డాలర్ల మేర ఉద్యోగుల ఆదాయాన్ని దాచిపెట్టి ప్రభుత్వానికి పన్నులు చెల్లించ కుండా ఎగవేశారు.దారుణమైన వైద్య ప్రయోగాలుఅంతేకాదు వీరు చేసిన అత్యంత దారుణమైన పని ఏమిటంటే, FDA అనుమతి లేని, "మనుషులపై వాడకూడని" (Not For Human Use) అని రాసి ఉన్న ప్రోటోటైప్ డెంటల్ ఇంప్లాంట్స్ను రోగులకు తెలియకుండానే వారి శరీరాల్లో అమర్చారు.మనీలాండరింగ్ ద్వారా కార్పొరేట్ బ్యాంక్ల్లోకి తరలించారని 2023లో వారిపై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ తర్వాత, భాస్కర్ సవానీ అరుణ్ సవానీ రాకెటీరింగ్ కుట్రకు సంబంధించిన అనేక ఆరోపణలపై దోషులుగా తేలారు.వీరితో పాటు అలెగ్జాండ్రా రాడోమియాక్ (48)ని కూడా దోషిగా తేల్చింది కోర్టు.శిక్షలు ఇలా ఉండబోతున్నాయిభాస్కర్కు 420 ఏళ్లు, అరుణ్ సవానీకి 415 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానాలు ఎదుర్కొంటున్నారు. అలెగ్జాండ్రా రాడోమియాక్ కూడా 40 సంవత్సరాల వరకు జైలు శిక్ష , జరిమానాలు విధించింది. ఈ ఏడాది జూలో (2026) లో శిక్ష అమలు కానుంది.
వీడియోలు
వేరే మహిళతో.. వెలగపూడి అనుచరుడి రాసలీలలు
యాదాద్రిలో దారుణం.. కూతురు, కొడుకుపై తల్లి దాడి
50వ పెళ్లి రోజు వేడుకలో భార్యతో డాన్స్ చేసిన మల్లారెడ్డి
డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ రేపటి నుండి భారీ వర్షాలు
ఏపీ బడ్జెట్ లో చంద్రబాబు తప్పుడు లెక్కలు ఆధారాలతో బయటపెట్టిన బుగ్గన
భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు.. యుద్ధ ప్రభావం
99 పైసలకి కాకపోతే ఊరికే ఇస్తా, నా ఇష్టం అంటున్న నారా లోకేష్
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ వెలవెలబోతున్న దుబాయ్
రాజీనామాపై జీవన్ రెడ్డి క్లారిటీ.. నా నెక్స్ట్ స్టెప్ అక్కడికే
