అక్షయ్ ఖన్నా బట్టతల ట్రామాతో కుంగిపోయారు: ఫరా ఖాన్
బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నెగిటివ్ రోల్స్లో వరుసగా హిట్స్ అందుకుంటూ హీరోలకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. 'ధురంధర్', ‘చావా' వంటి సినిమాలతో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే కొరియోగ్రాఫర్-డైరెక్టర్ ఫరా ఖాన్ ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్కాస్ట్లో పాల్గొని అక్షయ్ ఖన్నా గురించి చేసిన పలు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 'తీస్ మార్ ఖాన్' చిత్రంలో ‘ఆతిష్ కపూర్’ పాత్ర కోసం మొదట షర్మాన్ జోషిని సంప్రదించానని, ఆయన తిరస్కరించడంతో చివరికి అక్షయ్ ఖన్నానే లాస్ట్ ఛాయిస్గా ఎంపికయ్యారని ఫరా వెల్లడించారు. ఫరా ఖాన్ మాటల్లో 90వ దశకంలో అక్షయ్ ప్రవర్తన అంతగా బాగాలేదు. ఆయన చాలా చిరాకుగా ఉండేవారు. చేతిలో వున్న వస్తువులు విసిరేసేవారు. డైలాగుల విషయంలో గొడవపడేవారు. ఆ సమయంలో బట్టతల సమస్యతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. అదే ఆయన కోపానికి కారణమని తెలిపారు. తాల్ సినిమాలో వర్షం పాటలో కూడా టోపీ ధరించి నటించారని గుర్తుచేశారు. 'దిల్ చాహ్తాహై’ సినిమా తర్వాత అక్షయ్ పూర్తిగా మారిపోయారు. తన లుక్, బట్టతల గురించి స్పష్టత వచ్చి, కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. 'కోయి కహే కెహతా రహే' పాటలో ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఇటీవల 'ధురంధర్' సినిమాలో అక్షయ్ నటన చూసి ఫిదా అయ్యాను. వెంటనే ఆయనకు ఫోన్ చేసి అలీబాగ్లోని ఇంటికి వెళ్లి అభినందించాను. అక్షయ్కు అనవసర హడావిడి, షో ఆఫ్ చేయడం అంటే నచ్చదు. తన నటనపై మాత్రమే దృష్టి పెడతారని ఆమె అన్నారు. మొత్తానికి గతంలో హీరోగా ఉన్నప్పుడు కూడా రాని క్రేజ్ ఇప్పుడు నెగిటివ్ రోల్స్తో అక్షయ్ ఖన్నా సంపాదించుకోవడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్లోకి జీవన్రెడ్డి..?
జగిత్యాల: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి.. బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి.. కారు ఎక్కేందుకు జీవన్రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20లోపే కాంగ్రెస్ రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఉగాది పండుగ లోపే కొత్త నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కార్యకర్తలతో జీవన్రెడ్డి మాట్లాడారని, ఈ క్రమంలోనే ఆయన అనుచరుల సోషల్ మీడియా డీపీలు కూడా మారిపోవడంతో రాజీనామా వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. అదే సమయంలో జీవన్రెడ్డి సోషల్ మీడియా గ్రూపుల డీపీలు, ప్రొఫైల్స్ కూడా మారిపోతున్నాయి. తాను కాంగ్రెస్లో సీనియర్గా ఉండి కూడా ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడాన్ని జీవన్రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇచ్చి.. ఆయన్ను పెద్దగా పట్టించుకోకపోవడంతో జీవన్రెడ్డి వేరే స్టెప్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు కూడా. ఇదే జీవన్రెడ్డిలో అసంతృప్తి జ్వాలలు పుట్టడానికి ప్రధాన కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాల తర్వాతే జీవన్రెడ్డి పార్టీ మారే యోచనకు వచ్చారనే చర్చ నడుస్తోంది. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి ఇప్పటికే జీవన్రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 16వేల మంది ఇంటికి!
అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలు ఇటీవల తమ ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించాయి. ఇప్పుడు తాజాగా.. మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థలోని 20శాతం లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలగించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.గత సంవత్సరం నుంచి కంపెనీ సీఈఓ జుకర్బర్గ్ ఏఐలో పెట్టుబడులను విపరీతంగా పెంచుతున్నారు. మెటా ఉత్పాదకను పెంచడంలో భాగంగా.. తగిన చర్యలు తీసుకుంటోంది. ఇది సంస్థలోని 16,000 ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే లేఆఫ్స్ ఎప్పుడు ఉంటాయనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. కాగా కంపెనీలో డిసెంబర్ 31 నాటికి దాదాపు 79,000 మంది పనిచేస్తున్నట్లు సమాచారం.మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని సంస్థ ఏఐ స్టార్టప్లను కొనుగోలు చేయడానికి బిలియన్ల కొద్దీ ఖర్చు చేసింది. చైనీస్ ఏఐ స్టార్టప్, మనుస్ను కొనుగోలు చేయడానికి కంపెనీ కనీసం 2 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది. మానవులు పోస్ట్ చేయడానికి అనుమతించని ఏఐ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన మోల్ట్బుక్ను కొనుగోలు చేయాలనే ప్రణాళికలను కూడా ఇటీవల ప్రకటించింది.ఏఐ కారణంగా లేదా ఏఐను ఉపయోగించుకోవడంలో భాగంగా.. ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మెటా మాత్రమే కాకుండా.. అమెజాన్, యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, SaaS దిగ్గజం అట్లాసియన్ కూడా ఉన్నాయి. జనవరిలో అమెజాన్ తన శ్రామిక శక్తిలో 1 శాతం లేదా దాదాపు 16,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అట్లాసియన్ కూడా AIపై ఎక్కువ ఖర్చు చేయడానికి 1,600 మంది కార్మికులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
మాయావతి (బీఎస్పీ అధ్యక్షురాలు) రాయని డైరీ
ఒంటికి ‘నీలి’ రంగును పులుముకున్నంత మాత్రాన ‘అసలు రంగు’ దాగుతుందా?! గొంతుకు ఘీంకారాన్ని మెడలో గంటలా తగిలించుకుంటే మాత్రం ఏనుగు నడిచి వెళుతున్నట్లుగా ఉంటుందా?! సడి లేని పిడికిలి పూరించే బహుజన సమైక్య శంఖారావం దిక్కులను దద్దరిల్లిస్తుందా?! పెళ్లిళ్లకు ఫంక్షన్ హాళ్లను ముందే బుక్ చేసుకున్నట్లుగా, పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే కాన్షీజీని మెల్లిగా ‘ఓన్ ’ చేసుకుంటున్నాయి!! కాంగ్రెస్ ‘సామాజిక పరివర్తన్ దివస్’ జరుపుతోంది. సమాజ్వాదీ ‘పిచ్డా దళిత్ అల్ప్సంఖ్యాక్ దివస్’ అంటోంది. బీజేపీ కాన్షీజీ విగ్రహాలకు పూలదండలు వేసి, రోడ్ షోలు ఇచ్చేందుకు తయారైంది! లక్నో వీధుల్లో ఎవరెన్ని షోలు చేసినా, ర్యాలీలు తీసినా మాన్యవర్ కాన్షీ రామ్జీ కి ఎవరూ వారసులు అవలేరు. బహుజనుల బంధు మిత్రులు అసలే కాలేరు. కాన్షీజీ వెళ్లి ఇరవై ఏళ్లు! నేటికీ ఆయన స్వరం వింటున్నట్లే ఉంటుంది నాకు! అది గర్జన కాదు. గాండ్రింపు కాదు. ధరామండల జ్వాలారవం! నిన్న – నేడు – రేపు అనేవే ఉండని అనంత జీవన ఝరి. ఆకాశమే ఎందుకు ఉరమాలి అనేవారు కాన్షీజీ! భూమిపైన ఉన్న ప్రతి అట్టడుగు మనిషీ ఆకాశం వైపు ఉరిమి చూడాలి అని ఆకాంక్షించేవారు. ‘‘ధ్వనికి ప్రతిధ్వని అవొద్దు, ధ్వనిని మింగేసే మహాధ్వనివి నువ్వు’’ అనేవారు.‘‘అధికారానికి మాస్టర్ ‘కీ’ ఢిల్లీ డ్రాయింగ్ రూమ్లలో ఉండదు, అది బండబారిన బహుజనుల చేతుల్లో ఉంటుంది...’’ అని చెప్పేవారు. ‘‘ఎవరూ మనల్ని ఏదీ అవనివ్వరు మాయావతీ! చదువుల్లో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో మనకై మనమే ఫస్ట్ బెంచీలోకి వచ్చి కూర్చోవాలి...’’ అనేవారు!! పార్టీని పెట్టకముందే కాన్షీజీ నన్ను ఫస్ట్ బెంచ్లోకి తెచ్చేశారు. ఆ రోజు – ఢిల్లీలో, ఇందర్పుర్లోని మా ఇంటిని వెతుక్కుంటూ ఆయన వచ్చినప్పుడు, నా పుస్తకాల గుట్టల్లోంచి తలెత్తి మొదటిసారిగా నేను ఆయన్ని చూశాను.‘‘అమ్మాయీ... నా పేరు కాన్షీరామ్. యూనియన్ హెల్త్ మినిస్టర్ రాజ్ నారాయణ్ అంతటివారితోనే కాన్ స్టిట్యూషన్ క్లబ్లో వాదించావట కదా! మాతో కలుస్తావా? దళిత ఉద్యమానికి నీ ఆవేశం, నీ మాటల ప్రవాహం అవసరం...’’ అన్నారు! ‘‘కానీ కాన్షీ రామ్జీ! శ్రీ రాజ్ నారాయణ్తో నేను వాదించలేదు. దళితులను ఆయన గౌరవంగా ‘హరిజనులు’ అనటం పైన మాత్రమే నా అభ్యంతరం తెలిపాను. ‘దళితులను దళితులు అనే అనండి, అదే మీరు వారికిచ్చే గౌరవం’ అన్నాను. ఆ రోజు ఆడియెన్స్లో మీరున్నా అదే మాట అని ఉండేవారు కాన్షీజీ. అంబేద్కర్ కూడా ‘దళితులు’ అనే అన్నారు తప్పితే, మృదువుగా ‘హరిజనులు’ అనలేదు కదా...’’ అని నేను అన్నాను. కాన్షీజీ కళ్లు మెరిశాయి. ‘‘నువ్వు మాతో ఉంటే బాగుంటుంది అమ్మాయీ...’’ అని మళ్లీ అన్నారు. ‘‘నేను ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నాను కాన్షీజీ. ఐఏఎస్ ఆఫీసర్ని అవాలి’’ అన్నాను. ‘‘మంచి విషయమే అనుకో! కానీ, ఒక ఐఏఎస్ కాదు, మొత్తం ఐఏఎస్లంతా నీ ఆదేశాల కోసం వరుసలో నిలబడేంత పెద్ద నాయకురాలిని చేస్తాను నిన్ను... మాతో వస్తావా...’’ అన్నారాయన! ఆ మాట నాకు ఇన్ స్పైరింగ్గా అనిపించింది. ఒకవేళ ఆయన, ‘‘పెద్ద నాయకు రాలు అవటం ఏముంది? పెద్ద నాయకురాలి ఆదేశాల కోసం వరుసలో నిలబడే ఐఏఎస్లలో ఒకరిగా ఉండటమే గొప్ప...’’ అని అన్నా కూడా ఆ మాట నాకు ఇన్ స్పైరింగ్గానే ఉండేది. కాన్షీజీ మాటల్లోని అదను, పదును అది! ఇవాళ కాన్షీజీ జయంతి! మిగతా పార్టీల్లా, కాన్షీజీ జయంతి రోజు మాత్రమే బహుజన్ సమాజ్ పార్టీకి సూర్యోదయం నీలి వర్ణంలో అవదు.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
‘ఒక్క మిసైల్తో లేపేస్తాం’.. కిమ్ వైరల్ వార్నింగ్ నిజమేనా?
రన్నరప్గా ముగింపు
ఈ రాశి వారికి ఆస్తి, ధనలాభాలు
యూఏఈ పోర్టులపై ఇరాన్ హెచ్చరిక.. భారీ దాడుల ముప్పు
ద్రవిడ్, మిథాలీలకు ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్’
నమాజ్ చేసే వారి సంఖ్యపై పరిమితులా?
హార్మూజ్ను దాటేసిన... రెండు భారత నౌకలు
నెతన్యాహు ఎక్కడ?
‘మూసీ’.. కాంగ్రెస్ భూ ఆక్రమణ పథకం : కేటీఆర్
సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
సిలిండర్ డెలివరీపై కఠిన నియమం
ఏ పని చేయకుండా నిత్యం అవే ఆలోచిస్తున్నారు!
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ముందే అనుకుంటే చాలనుకుంటా సార్!
రోహిత్-కోహ్లి అభిమానులకు శుభవార్త
పెళ్లికి ముందే పిల్లల విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాం: అల్లు శిరీష్
ఆ మూవీ అప్పుడే తేడా కొట్టింది, కరెక్ట్ కాదన్నాను: రాశీ
పాక్ ఆటగాడి ఎంపికపై సన్రైజర్స్ కోచ్ వివరణ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
‘ఒక్క మిసైల్తో లేపేస్తాం’.. కిమ్ వైరల్ వార్నింగ్ నిజమేనా?
రన్నరప్గా ముగింపు
ఈ రాశి వారికి ఆస్తి, ధనలాభాలు
యూఏఈ పోర్టులపై ఇరాన్ హెచ్చరిక.. భారీ దాడుల ముప్పు
ద్రవిడ్, మిథాలీలకు ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్’
నమాజ్ చేసే వారి సంఖ్యపై పరిమితులా?
హార్మూజ్ను దాటేసిన... రెండు భారత నౌకలు
నెతన్యాహు ఎక్కడ?
‘మూసీ’.. కాంగ్రెస్ భూ ఆక్రమణ పథకం : కేటీఆర్
సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
సిలిండర్ డెలివరీపై కఠిన నియమం
ఏ పని చేయకుండా నిత్యం అవే ఆలోచిస్తున్నారు!
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ముందే అనుకుంటే చాలనుకుంటా సార్!
రోహిత్-కోహ్లి అభిమానులకు శుభవార్త
పెళ్లికి ముందే పిల్లల విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాం: అల్లు శిరీష్
ఆ మూవీ అప్పుడే తేడా కొట్టింది, కరెక్ట్ కాదన్నాను: రాశీ
పాక్ ఆటగాడి ఎంపికపై సన్రైజర్స్ కోచ్ వివరణ
ఫొటోలు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
వైట్ డ్రెస్లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
తెలంగాణ వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు (ఫొటోలు)
అల్లు సినిమాస్ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)
కూకట్పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)
ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)
‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, బన్నీ (ఫోటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)
సినిమా
వివాదాస్పద లిరిసిస్ట్పై ప్రశంసలు.. కమల్ హాసన్కు చిన్మయి చురకలు..!
వివాదాస్పద లిరిసిస్ట్ వైరముత్తును ఏకంగా జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. దీంతో ఆయనకు తమిళనాడు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలతో ముంచెత్తుతున్నారు. సీఎం స్టాలిన్, హీరో కమల్ హాసన్ సైతం వైరముత్తుకు అభినందనలు తెలిపారు. దేశంలోని సాహిత్య రంగంలో అందించే అత్యున్నత పురస్కారమే జ్ఞానపీఠ్ అవార్డు. ఈ అవార్డ్తో జ్ఞాన్పీఠ్ అవార్డ్ అందుకున్న మూడో తమిళ వ్యక్తిగా వైరముత్తు నిలిచాడు.చిన్మయి చురకలు..వైరముత్తుకు జ్ఞాన్పీఠ్ అవార్డ్ రావడంపై సింగర్ చిన్మయి స్పందించింది. కమల్ హాసన్ వైరముత్తును ప్రశంసించడంపై ట్విటర్ వేదికగా మండిపడింది. కమల్ హాసన్ కూడా వైరముత్తును అభినందించారని ఎద్దేవా చేసింది. సినిమాల్లో ఉన్న మగవాళ్లు రాజకీయాలకు మారడం, తన మామ-గురువు తమను లైంగికంగా వేధించాడని చెప్పిన మహిళలను పూర్తిగా పట్టించుకోకపోవడం ఆయనకే చెల్లుతుందని పోస్ట్ చేసింది. పురుషులు ఎప్పటికీ మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తు పెట్టుకోవాలని సూచించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన సొంత పార్టీలోని మహిళ బహిరంగంగా కవి పేరును ప్రస్తావించినా పట్టించుకోకపోవడం మరి దారుణమని చిన్మయి తెలిపింది. చివరగా పురుషులు కేవలం సోదరులు, మామలు, నాన్నలు, స్నేహితులు, సలహాదారులకు మాత్రమే అండగా నిలుస్తారని.. మహిళలను ఎవరు పట్టించుకోరని వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో సింగర్ చిన్మయి శ్రీపాద ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే వైరముత్తుకు భారతీయ సాహిత్యానికి చేసిన కృషికి జ్ఞానపీఠ్ అవార్డు రావడంపై సింగర్ చిన్మయి తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. For God’s sake 🤦🏽♀️🤦🏽♀️🤦🏽♀️🤦🏽♀️🤦🏽♀️P.S.: Men in such power in cinema transitioning to politics completely turning a deaf ear to women who come on record to say they were molested by “his uncle-mentor” must remind women who vote - that men will never be on our side.The weirdest thing -… https://t.co/KB7VNAevu5— Chinmayi Sripaada (@Chinmayi) March 14, 2026
సూర్య లేటేస్ట్ మూవీ.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయగా ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది. పోస్టర్ చూస్తే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈనెల 16న సాయంత్రం 04:06 నిమిషాలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ను సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. A journey filled with heart. ❤️The teaser of #VishwanathAndSons is on its way.🥳Sanjay Vishwanath arrives on March 16th @ 04:06 PM! 😎In cinemas from this JULY 2026. 🤩@Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NavinNooli… pic.twitter.com/FKoOht3Oz0— Sithara Entertainments (@SitharaEnts) March 14, 2026
హీరో రాజశేఖర్కు గోటీల బిజినెస్.. ఆయన ఏమన్నారంటే?
టాలీవుడ్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తోన్న బైకర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి అభిలాశ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజైన సాంగ్ ఆడియన్స్ను మెప్పించింది.అయితే ఈ సినిమా సంగతి పక్కనపెడితే హీరో రాజశేఖర్పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. గతంలో ఆయన గోటీల బిజినెస్ ప్రారంభించారని నెట్టింట మీమ్స్ వైరలయ్యాయి. ఈ వ్యాపారంలో ఆయన కోట్లు సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. కొందరైతే ఏకంగా రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగాలు వచ్చాయంటూ మరీ హాస్యంగా పోస్టులు పెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ ఇదంతా నిజమేనా అని ఆరా తీయడం మొదలెట్టారు.తాజాగా తనపై వచ్చిన మీమ్స్పై హీరో రాజశేకర్ స్పందించారు. ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. తనకు అలాంటి వ్యాపారాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. తనకు గోటీల ఫ్యాక్టరీ ఉందని అందరు మాట్లాడుకుంటుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. కొందరు అది నిజమే అనుకుని నాకు కాల్ చేసి అడిగారని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీడియో చూడగానే నాకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? నేనెక్కడ రూ.3 కోట్లు సంపాదిస్తున్నా? అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
గంపెడాశలతో ఇండస్ట్రీలో అడుగుపెడదామని వస్తున్న ఎంతోమంది తప్పుదారి పడుతున్నారంటోంది బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. అవకాశాల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నవారిని కొన్ని అదృష్య శక్తులు నిలువునా ముంచేస్తున్నాయంటోంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో తనుశ్రీ దత్తా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో మొదట అందానికి ప్రాధాన్యతనిస్తారు. వారికి టాలెంట్ ఉందా? లేదా? అనేది ఆలోచించరు. అందాన్ని చూసి పొగడ్తలు కురిపిస్తారు. కానీ అది విని మీరు బోల్తా కొట్టకూడదు. ముందు పొగడ్తలునా చిన్నతనంలో నా తల్లి అపరిచితులతో మాట్లాడకూడదని, వారిచ్చే చాక్లెట్లు తీసుకోకూడదని చెప్పేది. ఇండస్ట్రీలో అలాంటి అపరిచితులు, వారిచ్చే చాక్లెట్లు చాలా రకాలుగా ఉంటాయి. వారి కోరిక తీర్చుకునేందుకు ముందు మిమ్మల్ని పొగుడుతారు. తర్వాత మీ కలల్ని, ఆశయాల్ని ఆసరా చేసుకుని మిమ్మల్ని వాడుకుంటారు. ఈ క్రమంలో అవకాశాలు అందుకుని ముందడుగు వేసిన కొందరు విజయం సాధిస్తారు, మరికొందరు బాధతో ఇంటికి తిరిగెళ్లిపోతారు. నన్ను నేను అమ్ముకోనుఇంకొంతమందైతే ముందుకు వెళ్లలేక, వెనక్కూ వెళ్లలేక వ్యభిచారంలోకి నెట్టబడతారు. ఇలాంటి రహస్యాలు బయటకు ఎప్పుడూ రావు. ఎందుకంటే సక్సెస్ స్టోరీలు మాత్రమే బయటకు వస్తాయి, వాటి గురించే అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే నా మాటల వల్ల నలుగురు అలర్ట్ అయి వారిని వారు కాపాడుకున్నా అదే నాకు సంతోషం. ఇండస్ట్రీలో కాంప్రమైజ్ సాధారణమే అని ఓ నటి అన్నందుకు ఆమెతో స్నేహాన్నే తెంచుకున్నాను. నేను ఆర్టిస్ట్ను.. ఒకరికి నా జీవితాన్ని అమ్ముకునేదాన్ని కాదు అని చెప్పుకొచ్చింది.మీటూమీటూ ఉద్యమం సమయంలో తను కూడా బాధితురాలినేనంటూ మీడియా ముందుకు వచ్చింది తనుశ్రీ దత్తా. నానాపటేకర్ లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమాలోని ఓ పాట షూటింగ్లో నానా పటేకర్ సహా మరో ముగ్గురు తనను వేధించారని ఆరోపించింది. అయితే ఘటన జరిగిన మూడేళ్లలోపు ఫిర్యాదు చేస్తేనే విచారిస్తామని, ఇది పదేళ్ల కిందటినాటి ఘటన కావడంతో విచారణ కుదరదని న్యాయస్థానం కేసు కొట్టివేసింది. బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన తనుశ్రీదత్తా.. తెలుగులో వీరభద్ర చిత్రంలో యాక్ట్ చేసింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.చదవండి: తెలుసు కదా.. షూటింగ్లోనే తేడా కొట్టింది: రాశీ ఖన్నా
క్రీడలు
రోహిత్ బాటలో రిషబ్ పంత్!
టీమిండియా వికెట్కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 18వ సీజన్లో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నాడు. ఇందులో భాగంగా బరువు తగ్గే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే ఫిట్నెస్పై దృష్టి సారించిన పంత్ బరువు తగ్గే విషయమై భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మను అనుసరిస్తున్నాడు. గతంలో రోహిత్ శర్మ కూడా తన బరువు తగ్గే క్రమంలో కఠినమైన డైట్ పాటించాడు. తాజాగా పంత్ కూడా బరువు తగ్గేందుకు మిత ఆహారం మాత్రమే తీసుకుంటున్నాడు. ఇక పంత్ ఐపీఎల్లో లక్నో సూపర్జెయింట్స్కు కెప్టెన్గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా పంత్ వర్కౌట్స్కు సంబంధించిన వీడియోలను, ఫోటోలను లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ‘పంత్.. మీరు ఎంత బరువు తగ్గారో చెప్పగలరా?’ అని మీడియా ప్రశ్నించింది. అందుకు పంత్ ‘ఆ విషయం మాత్రం అడగొద్దు’ అంటూ బదులిచ్చాడు. ఒకవైపు గాయాలు, మరోవైపు ఫామ్లేమీ పంత్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ద్వారా తిరిగి గాడిలో పడేందుకు టీమిండియా మాజీ డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సలహాలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా యూవీ పంత్కు పలు సలహాలు, బ్యాటింగ్ నైపుణ్యానికి సంబంధించి మెలుకువలు అందించాడు. అయితే గతంలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు కూడా ఇదే తరహాలో ఫామ్ కోల్పోయినప్పుడు యూవీ ఇలాగే సాయం చేశాడు. 2025 ఐపీఎల్లో రూ. 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన లక్నో యాజమాన్యం ఈ ఏడాది అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్కు ముందు వికెట్కీపర్ కమ్ బ్యాటర్ కోసం బీసీసీఐ పంత్ను పరిగణలోకి తీసుకుంది. కానీ అనూహ్యంగా పంత్ గాయపడడంతో జితేశ్ శర్మ పేరు తెర మీదకు వచ్చింది. కానీ అతను కూడా గాయంతో బాధపడుతుండడంతో ఆ అవకాశం ఇషాన్ కిషన్ను వరించింది. గతేడాది ఐపీఎల్లో పంత్ లక్నో సూపర్జెయింట్స్ తరఫున 14 మ్యాచ్లాడి 269 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్థసెంచరీ ఉండడం విశేషం. ఇక ఐపీఎల్ 18వ సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ తన తొలి మ్యాచ్ను ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.చదవండి: బుమ్రాతో పోల్చడానికి సిగ్గుండాలి!
బుమ్రాతో పోల్చడానికి సిగ్గుండాలి!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సెలెక్టర్ ఆకిబ్ జావేద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను పాక్ వివాదాస్పద బౌలర్ ఉస్మాన్ తారిఖ్తో పోల్చడం క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం మీడియా సమావేశంలో ఆకిబ్ జావేద్ మాట్లాడుతూ.. ‘నేటి తరంలో బుమ్రా ఒక అసాధారణ బౌలర్. అతని బౌలింగ్ యాక్షన్ కూడా భిన్నంగానే ఉంటుంది. బుమ్రా బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడల్లా మా పాక్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్లాగే కనిపిస్తాడు. బుమ్రా వేగంతో బంతిని విసరడంలో దిట్ట అయినప్పటికీ అతని బౌలింగ్ శైలి ప్రత్యర్థి బ్యాటర్లను గందరగోళానికి గురి చేస్తుంది. స్మిన్నర్ తారిఖ్ కూడా బ్యాటర్లను తికమక పెట్టేందుకే బంతిని కాస్త ఆలస్యంగా విసురుతుంటాడు. ఈ టెక్నిక్ను ఉపయోగించే తారిఖ్ టీ20 ప్రపంచకప్లో 10వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 ప్రపంచకప్లో బుమ్రా కాకుండా వేరే బౌలర్ ఎవరైనా మంచి ప్రదర్శన చేశారని చెప్పడం కష్టమే. ముఖ్యంగా టోర్నీ సెకండ్ హాఫ్లో భారీ స్కోర్లు నమోదైనప్పటికీ బుమ్రా మాత్రం తన వినూత్న బౌలింగ్తో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అంతేకాదు బుమ్రా తన బౌలింగ్తో మేటి బౌలర్లు వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్ల ప్రతిబింబాన్ని గుర్తుకు తెచ్చాడని చెప్పొచ్చు. ఇకపై బుమ్రా లాంటి బౌలర్ దొరకడు’ అని పేర్కొన్నాడు. కాగా ఆకిబ్ జావేద్ బుమ్రాను పొగడడం వరకు బాగానే ఉన్నప్పటికీ తన స్థాయికి ఏమాత్రం తూగని ఉస్మాన్ తారిఖ్తో పోల్చడమే క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘బుమ్రాతో అతడికి పోలికేంటి?’, ‘బుమ్రా ఎక్కడ.. తారిఖ్ ఎక్కడ? స్థాయి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో’, ‘బుమ్రా లాంటి నంబర్వన్ బౌలర్ను పెద్దగా గుర్తింపు లేని ప్లేయర్తో పోల్చడానికి సిగ్గు ఉండాలి’ అని కామెంట్లు చేశారు.ఇక టీ20 ప్రపంచకప్లో టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా 14 వికెట్లు పడగొట్టి మరో భారత స్పిన్నర్ వరుణ్చక్రవర్తితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు వివాదాస్పద బౌలర్గా పేరు పొందిన ఉస్మాన్ తారిఖ్ టీ20 ప్రపంచకప్లో 10 వికెట్లు పడగొట్టాడు.Jasprit Bumrah Is The Usman Tariq Of Fast Bowling. Aqib Javed #pakistancricketteam pic.twitter.com/eEotIXvyt5— Shreyas Iyer Fan Page (@IyerFanPage) March 14, 2026చదవండి: ముమ్మాటికీ అఘాదే తప్పు.. ఐసీసీ సీరియస్
ముమ్మాటికీ అఘాదే తప్పు.. ఐసీసీ సీరియస్
పాకిస్థాన్ క్రికెటర్ సల్మాన్ అఘా రనౌట్ క్రికెట్లో పెను దుమారాన్ని రేపుతుంది. బంగ్లాదేశ్తో రెండో వన్డే సందర్భంగా సల్మాన్ ఔటైన తీరు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. తనను ఔట్ చేశాడన్న కోపంతో సల్మాన్ అఘా తన హెల్మెట్, గ్లౌవ్స్, బ్యాట్ను నేలకేసి కొట్టడమే గాక కెప్టెన్ మిరాజ్తో పాటు వికెట్ కీపర్ లిట్టన్ దాస్తో గొడవపడ్డాడు. అఘా ఔటైన తీరు వివాదాస్పదమే అయినప్పటికీ అతడి చర్య మాత్రం క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ పలువురు క్రీడా నిపుణులు పేర్కొన్నారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా సల్మాన్ అఘాపై చర్యలు తీసుకుంది. ఔట్ నిర్ణయం రాగానే మైదానంలో అనుచిత ప్రవర్తనకు దిగడమే గాక మ్యాచ్ రిఫరీ నీయముర్ రషీద్ ఫిర్యాదు మేరకు లెవల్ 1 నేరానికి అఘా పాల్పడినట్లు ఐసీసీ తేల్చింది.‘క్రికెట్ పరికరాలను అగౌరవపరిచినట్లు పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాపై ఫిర్యాదు అందింది. మైదానంలోనే అతను హెల్మెట్, గ్లౌవ్స్, బ్యాట్ను విసిరేసినట్లు తేలింది. గతంలో సల్మాన్ అఘా నుంచి ఇలాంటి ప్రవర్తన ఎన్నడూ చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం అఘా చేసిన పనిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ జత చేశాం. అయితే బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్తో జరిగిన వాగ్వాదంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిని కేవలం అపార్థంగా పరిగణించాం. మేం చట్టం ప్రకారమే నడుచుకుంటూనే ఇలాంటి తీర్పును ఇచ్చాం’ అని ఐసీసీ స్పష్టం చేసింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది.మాజ్ సదాఖత్ (75), సల్మాన్ అఘా (64) రాణించారు. అనంతరం మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 243 పరుగులుగా నిర్దేశించారు. అయితే బంగ్లాదేశ్ 23.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుతం ఇరుజట్లు చెరో వన్డే గెలవగా, మూడో వన్డే ఆదివారం జరగనుంది.చదవండి: ఐదేళ్ల ప్రయాణం.. దిగ్గజాల సరసన సూర్యా భాయ్!Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026
ఐదేళ్ల ప్రయాణం.. దిగ్గజాల సరసన సూర్యా భాయ్!
క్రికెట్ అభిమానులంతా అతడిని ముద్దుగా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అని పిలుస్తుంటారు. ప్రత్యర్థి బౌలర్ ఏ యాంగిల్లో బంతి వేసినా బౌండరీ లేదా సిక్సర్ బాదడం అతడి నైజం. దూకుడైన ఆటతీరుకు మారుపేరు. ఐదేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్లు గెలిచిన టీమిండియా జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇందులో ఒకసారి కెప్టెన్గా ఐసీసీ టైటిల్ అందుకొని దిగ్గజాల సరసన నిలిచి అరుదైన ఘనత సాధించాడు. అతడే భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మార్చి 14 (శనివారం)తో సూర్యకుమార్ తన క్రికెట్ కెరీర్లో ఐదేళ్ల ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ టీమిండియాతో ఐదేళ్ల ప్రయాణాన్ని తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నాడు. ‘ఐదేళ్ల ఏళ్ల క్రితం టీమిండియాకు ఆడాలన్న ఒక కల నిజమైంది. భారత జెర్సీని ధరించడమనేది ఇప్పటికీ నేను మాటల్లో పూర్తిగా వర్ణించలేని ఒక అద్భుతమైన అనుభూతి. ఈ నేపథ్యంలో ఒక ఆటగాడిగా, జట్టు కెప్టెన్గా నేను పొందిన జ్ఞాపకాలను మరోసారి పంచుకుంటున్నా.’ అంటూ ట్వీట్ చేశాడు.టీ20 క్రికెట్లో భారత తరఫున అత్యుత్తమ ఆటగాడిగా పేరు పొందిన సూర్యకుమార్ యాదవ్ 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం విశేషం. మార్చి 14, 2021లో ఇంగ్లండ్తో మ్యాచ్ ద్వారా సూర్య తన కెరీర్లో తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. సూర్యకుమార్ ఇప్పటివరకు టీమిండియా తరఫున 113 టీ20 మ్యాచ్లు ఆడి 162.94 స్ట్రైక్రేట్తో 3,272 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలతో పాటు 25 అర్థసెంచరీలున్నాయి.ప్రస్తుతం సూర్యకుమార్ టీ20 క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి రెండు స్థానాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఈ ఇద్దరు 2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్న సూర్యకుమార్ ఆ ప్రపంచకప్లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్లో బౌండరీ వద్ద క్యాచ్ అందుకోవడం ఎన్నటికీ మరిచిపోలేని సంఘటన. సూర్య క్యాచ్ అందుకోవడంతో మ్యాచ్ భారత్వైపు తిరగడం, ఆ తర్వాత టీమిండియా టైటిల్ గెలవడం చకచకా జరిగిపోయాయి.రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనంతరం కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న సూర్యకుమార్ జట్టును విజయపథంలో నడిపించడంలో విజయవంతమయ్యాడు. ఇప్పటివరకు సూర్య సారథ్యంలో 40 మ్యాచ్ల్లో గెలిచి, కేవలం ఎనిమిదింట మాత్రమే ఓడిపోయింది. అంతేకాదు టీ20 క్రికెట్లో సూర్య చేసిన నాలుగు సెంచరీలు నాలుగు వివిధ దేశాల్లో (భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్) రావడం విశేషం. 2022 ఏడాదిలో సూర్యకుమార్ టీమిండియా తరఫున 31 మ్యాచ్ల్లో 187 స్ట్రైక్రేట్తో 1164 పరుగులు సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్గా సూర్య రికార్డులకెక్కాడు. చదవండి: తూచ్.. అదంతా ఉత్తిదే!5 years ago, a dream turned into reality. Wearing the India jersey is a feeling I can still never fully put into words 🇮🇳Here’s to many more memories that we’re going to create, for team 🇮🇳 pic.twitter.com/qhis2f44tQ— Surya Kumar Yadav (@surya_14kumar) March 14, 2026
న్యూస్ పాడ్కాస్ట్
రైతులతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొండాట.. పేరుకే అన్నదాత సుఖీభవ, ఆచరణలో అంతా మోసం
విలువలు, విశ్వసనీయతకు వైఎస్సార్సీపీ మారుపేరు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఆదాయం... కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఇక్కడ బాబు, అక్కడ BR నాయుడు కోట్లల్లో భారీ స్కాం
పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు..ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
భవిష్యత్ అభివృద్ధి శూన్యం... ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
బిజినెస్
రూ. 60వేల పెట్టుబడి.. రూ. 25కోట్ల ఆదాయం!
సాధారణంగా పెద్దలు తమ పిల్లలకు ఆస్తులు ఇవ్వాలని ఆలోచిస్తారు. ఇందులో భాగంగానే కొందరు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతుండటారు. ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి లెక్కేలేనన్ని మార్గాలు ఉన్నప్పటికీ.. చాలామంది భూములను కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.స్వాప్నిల్ కొమ్మావర్ అనే ఎక్స్ (ట్విటర్) యూజర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా.. ఒక విషయం వెల్లడించారు. 1990లో నా మామ ఏకంగా 15000 రూపాయల చొప్పున, నాలుగు ఎకరాలను రూ. 60వేలుతో కొన్నారు. క్రమంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇప్పుడు అది ఒక జిల్లా స్థాయికి చేరింది. రిటైల్ దిగ్గజం డీమార్ట్ రెండు ఎకరాలు భూమిని రూ. 25 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. దీన్నిబట్టి చూస్తే.. భూమిపై పెట్టే పెట్టుబడి ఎంత లాభదాయకంగా ఉంటుందో తెలుస్తుందని పేర్కొన్నారుభూమిని అమ్మగా వచ్చిన డబ్బును నా మామ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టారు. ఇప్పుడు ప్రతి నెలలో రూ. 14.5 లక్షల వడ్డీ ఆదాయం వస్తోంది. ఇంకా, ఆయన దగ్గర రెండు ఎకరాల భూమి కూడా ఉంది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రూ. 60,000 నుంచి రూ. 25 కోట్లకు ఎంత అద్భుతమైన ప్రయాణం! అని ఒకరు కామెంట్ చేయగా, అన్ని భూములకు ఒకే విలువ ఉంటుందని దీని అర్థం కాదు; ఇది ప్రాంతం మరియు అదృష్టంపై ఆధారపడి ఉంటుందని మరొకరు పేర్కొన్నారు.A true story from my hometown!In 1990, my uncle bought 4 acres of land for 15,000 per acre.Total investment: 60,000.The town developed over the years. and now even a district.Now, DMart bought 2 acres of that land from him for 25 crores.He has now put the 25 crores in a…— Swapnil Kommawar (@KommawarSwapnil) March 12, 2026
ఈ కారును జనం ఎగబడి కొనేస్తున్నారు!
భారతదేశంలో అత్యంత విజయవంతమైన, అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇందులో ఒకటి మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి 30 లక్షల సేల్స్ సాధించింది. అదే మారుతి సుజుకి డిజైర్.2008లో మార్కెట్లో లాంచ్ అయిన ఈ మోడల్.. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతోంది. ఒక్క 2025లోనే ఇది 2.14 లక్షల సేల్స్ సాధించి.. అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ కారు పెట్రోల్, CNG రూపాల్లో అందుబాటులో ఉంది.మారుతి డిజైర్ కారు ప్రారంభ ధర రూ. 6.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పెట్రోల్ & CNG పవర్ట్రెయిన్ ఎంపికలలో LXi, VXi, ZXi, ZXi ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. మంచి మైలేజ్ కోసం ఇప్పుడు కూడా ఎక్కువమంది ఈ కారునే కొనుగోలు చేస్తున్నారు.
నగరంలో విల్లా లైఫ్: ఇప్పుడంతా ‘అప్’ర్ట్మెంట్ ట్రెండ్!
దేశ రియల్ ఎస్టేట్ రంగంలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చిన్న అపార్ట్మెంట్ల నుంచి ఆకాశహర్మ్యాలను నిర్మించే స్థాయికి ఎదిగింది. అభివృద్ధి చెందిన దేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా మన నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతోంది.సాధారణంగా అపార్ట్మెంట్లకు అప్డేట్ వెర్షన్గా అపార్ట్మెంట్ల పోకడను బిల్డర్లు ప్రమోట్ చేస్తున్నారు. ప్రధానంగా మెట్రో నగరాల్లోని యువ ఐటీ ప్రొఫెషనల్స్, చిన్న కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వీటిని నిర్మిస్తున్నారు. ‘యూ’ అంటే అప్గ్రేటెడ్ అని అర్థం వచ్చేలా ఈ కొత్త కాన్సెప్ట్నకు శ్రీకారం చుట్టారు. సాధారణ ఫ్లాట్లలో ఉండే రొటీన్ సౌకర్యాల కంటే కాస్త భిన్నంగా హోటల్ తరహాలో లగ్జరీ, స్మార్ట్ ఫీచర్లను కలిపి అందించడమే ఈ కొత్త కాన్సెప్ట్ ‘అప్’ర్ట్మెంట్ ప్రాజెక్ట్ల ప్రధాన లక్ష్యం.‘అప్’ర్ట్మెంట్ అంటే?విల్లాలో నివాస అనుభూతిని అపార్ట్మెంట్లలో కల్పించడమే ఈ ‘అప్’ర్ట్మెంట్ల ప్రత్యేకత. గ్రీనరీతో పాటు వెల్నెస్ ఆధారిత వసతులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నేటి ఆహారపు, జీవనశైలి నేపథ్యంలో నివాసితులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం వీటి ఉద్దేశం. ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలు..ఈ తరహా ప్రాజెక్ట్లలో ప్లగ్ అండే ప్లే తరహాలో సదుపాయాలుంటాయి.కేవలం దుస్తులు, ఇతర అవసరమైన వస్తువుల్ని తీసుకెళ్తే చాలు.. ఫ్లాట్లోనే అన్ని సౌకర్యాలు ఉంటాయి. పూర్తిస్థాయిలో ఫర్నిచర్, మాడ్యులర్ కిచెన్, అత్యాధునిక ఎల్రక్టానిక్ గాడ్జెట్ల్తో ఈ గృహాలు మీకు స్వాగతం పలుకుతాయి. అంతేకాకుండా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండీషనర్, వాయిస్ కమాండ్తో పనిచేసే లైటింగ్ సిస్టమ్, ఫ్యాన్లు వంటి స్మార్ట్ హోమ్ టెక్నాలజీని అమరుస్తారు. వీటితో పాటు చాలా చోట్ల కామన్ వర్క్ ప్లేస్, మినీ జిమ్, లాండ్రీ సర్వీస్లను కూడా బిల్డర్లు ఈ నిర్మాణాల్లో ఏర్పాటు చేస్తారు.అధిక కార్పెట్ ఏరియా..ప్రస్తుతం ఈ కొత్త ట్రెండ్ బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో వేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా స్టార్టప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు, మోడ్రన్ యువ బిల్డర్లు వీటికి శ్రీకారం చుడుతున్నారు. ఈ అపార్ట్మెంట్ల నిర్మాణంలో లే–అవుట్, ఫ్లాట్ల డిజైనింగ్ ప్రతి అంశంలోనూ లోతైన అధ్యయనం ఉంటుంది. ఇంటి లోపల కార్పెట్ ఏరియా సామర్థ్యం పెరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారు. సంప్రదాయ అపార్ట్మెంట్లతో పోలిస్తే ఈ తరహా యూనిట్లలో కార్పెట్ ఏరియా 4 శాతం అధికంగా ఉంటుంది.ధర ఎక్కువే అయినా..లేఅవుట్ విస్తీర్ణంలో పెద్దగానే ఉన్నప్పటికీ అపార్ట్మెంట్లను పరిమిత సంఖ్యలో నిర్మిస్తారు. నివాసితులకు ప్రైవసీతో పాటు అధిక వసతులను అనుభవించేందుకు వీలు కల్పిస్తారు. అపార్ట్మెంట్ బ్లాక్లు ఒకదానికొకటి దూరంగా ఉండటంతో ఫ్లాట్లకు విస్తారమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వస్తుంది. అలాగే కిటికీలో నుంచి చూస్తే కనుచూపు మేర పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంటుంది. దీంతో నివాసితులకు మానసిక, శారీరక సంతృప్తి చేకూరుతుంది.సాధారణ అపార్ట్మెంట్లు, ఆకాశహర్మ్యలతో పోలిస్తే ఈ తరహా అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధరలు కొంత ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ వీటికి అద్దె డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డబ్బులు ఉండి ఆధునిక సదుపాయాలు అనుభవించాలని కోరుకునే వారికి ఈ ఫ్లాట్లు అమితంగా నచ్చుతాయి. ఇందులో నిర్వహణ బాధ్యతలను చాలా వరకు బిల్డర్లే చూసుకుంటారు.
అజిత్కు ఖరీదైన కానుక.. ఫార్ములా ఈ కారు గిఫ్ట్!
ఇరాన్తో.. అమెరికా-ఇజ్రాయెల్ వివాదం కారణంగా దుబాయ్లో కొంతకాలం చిక్కుకుపోయిన ప్రముఖ నటుడు & రేసర్ 'అజిత్ కుమార్' ఈ వారం ప్రారంభంలో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత.. కొత్త ''మహీంద్రా బీఈ 6 ఫార్ములా ఈ'' కారును సొంతం చేసుకున్నారు. దీనిని మహీంద్రా అండ్ మహీంద్రా గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తోంది.మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీస్.. తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో BE 6 ఫార్ములా E కారుతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. రెండు వెర్షన్లలో లభించే ఈ కారు ధరలు రూ. 23.69 లక్షల నుంచి రూ.24.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉన్నాయి. అజిత్ కుమార్ టాంగో రెడ్ వేరియంట్ BE 6 ఫార్ములా E కొనుగోలు చేశారు. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 202 కిమీ అని తెలుస్తోంది.మహీంద్రా ఫార్ములా కారుతో ఉన్న అజిత్ కుమార్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ''సూపర్ స్టార్ అజిత్ కుమార్ & మహీంద్రా BE 6 ఫార్ములా E ఎడిషన్ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ వెల్లడిస్తూ.. త్వరలో ఒక రోజు నేను ఆయనకు వ్యక్తిగతంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయడానికి ఎదురు చూస్తున్నాను'' అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.Can’t help quoting the old ad: ‘Made for each other’Superstar Ajith Kumar & the Mahindra BE 6 Formula E edition.I look forward to congratulating and thanking him in person one day soon… https://t.co/wmkjABNhQu— anand mahindra (@anandmahindra) March 14, 2026
ఫ్యామిలీ
తొక్కతో తింటే... తలనొప్పి తగ్గుతుందా?
ఇటీవల ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల మీద ఆహార సలహాలు చాలా వస్తున్నాయి. ఫలానా ఆహారం ఇలా తింటే ఈ లాభాలనీ, ఫలానా పదార్థాలతో ఇవీ ప్రయోజనాలంటూ రకరకాల సలహాలూ, సూచనలూ నెటిజనులను నిత్యం ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అందులో ఒకటి... ఆపిల్ను తొక్కతో సహా పరగడుపునే తీసుకుంటే దీర్ఘకాలికంగా వచ్చే తలనొప్పులు తగ్గుతాయన్నది. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో చూద్దాం! వాస్తవాలేమిటంటే... ఆపిల్ స్కిన్లో చాలారకాల పోషకాలున్న మాట వాస్తవమే. ఉదాహరణకు మలబద్ధకాన్ని తొలగించే పీచు, వ్యాధి నిరోధకశక్తిని సమకూర్చే విటమిన్ సి, ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి నివారణనిచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలుంటాయి. ముఖ్యంగా ఆపిల్ తొక్కలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివల్ల ఇతరత్రా ఆరోగ్య ప్రయోజనాలకు అవకాశాలున్నాయి. అయితే సాధారణంగా ఆపిల్ తొక్క మెరిసేలా చేయడానికి చాలామంది ఒక రకం మైనపుపూత (వ్యాక్స్)తో ఆపిల్కు మెరుపు తెప్పించి ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తారు కాబట్టి తొక్కతో తినాలనుకునేవారు వీలైనంతగా కడిగి తినడం మేలు. అదో అపోహ మాత్రమే... పరగడుపున పొట్టుతోనే ఆపిల్ తినడం వల్ల తలనొప్పులు తగ్గుతాయనుకోవడం అపోహ మాత్రమే. తలనొప్పులు అనేక కారణాల వల్ల వస్తుంటాయి. ఉదాహరణకు ఒంట్లో నీటి మోతాదు తగ్గడం, తీవ్రమైన ఒత్తిడి వంటివి. తొక్కతో సహా తినడం వల్ల దేహం రీహైడ్రేట్ కావడం, ఒత్తిడి తగ్గడం వంటివేమీ జరగవు. కాబట్టి తొక్క వల్ల తలనొప్పులు తగ్గడమనేది అపోహేనని నిపుణుల అభిప్రాయం.అయితే తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి వాటిలో ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ’ గుణాలు కూడా ఉన్నందువల్ల నొప్పి తగ్గడంలో అవి కొంత ఉపయోగపడవచ్చు గానీ... ఉదయం పరగడుపున తొక్కతో ఆపిల్ తినడం వల్లనే తలనొప్పుల నుంచి పూర్తి విముక్తి కలుగుతుందనుకోవడం మాత్రం అపోహ అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే అయినా ‘ప్రతి రోజూ ఆపిల్ తింటే... వైద్యుడి దగ్గరకు వెళ్లక్కర్లేదు’ (ఏన్ ఆపిల్ ఏ డే... కీప్స్ ద డాక్టర్ అవే) అనే సూక్తి ప్రకారం ఆపిల్ను బాగా కడిగాక తొక్కతో తినడంలో ప్రయోజనమే తప్ప నష్టమీదీ ఉండదనేది ఆహార నిపుణుల మాట.
నదులకు లాలపోసే తల్లులు!
ప్రాణం పోసే శక్తి స్వరూపిణి స్త్రీ. మనుషులకే కాదు దైవసమానమైన నదులకు కూడా ప్రాణం పోస్తోంది ఆ శక్తి. జీవం కోల్పోయి, మృత్యుదిబ్బలుగా మారిన ఎన్నో నదులకు దేశవ్యాప్తంగా ప్రాణం పోస్తున్నారు మహిళలు. సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నారు...తమిళనాడులోని వెల్లూరు, తిరువణ్ణామలై జిల్లాల గుండా ప్రవహించే పాలార్ నది ఉపనది నాగనది పూర్వవైభవం కోల్పోయింది. ఎండిపోయి నిర్జీవంగా మారింది. వర్షాలు పడినా సరే ఆ మృత నదిలో నీటి గలగలలు లేవు. ఈ నది ఎండి పోవడం పంట పొలాలపై, అక్కడి ప్రజల ఉపాధిపై ప్రభావం చూపింది. ఎంతోమంది పొట్ట చేతపట్టుకొని పట్టణాల బాట పట్టారు.ఈ నేపథ్యంలో నదిని పునర్జీవింపజేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయింది. ఈ కార్యక్రమంలో మహిళలు క్రియాశీల పాత్ర పోషించడం విశేషం. వెయ్యిమంది మహిళలు సంవత్సరం పాటు 21 గ్రామ పంచాయతీలలో రీఛార్జ్ బావులు, రెండు వందల బౌల్డర్ చెక్లను నిర్మించారు. బౌల్డర్ చెక్లతో నీటి ప్రవాహాన్ని నెమ్మదింపజేయడానికి, నీటి కోతను నివారించడానికి, భూగర్బ జల మట్టాలను పెంచడానికి ఎంతో కష్టపడ్డారు.వారి శ్రమ ఫలించిందిభూగర్భ జలాలు పెరిగాయి. అవి నాగనదిలోకి వెళ్లాయి. నది మెల్లగా ప్రాణం పోసుకోడం మొదలైంది. ఈ వార్త తెలిసిన మరింతమంది మహిళలు నాగనది పునర్జీవనోద్యమంలో భాగం అయ్యారు.ఇప్పుడు..నాగనది ఏడాది పొడవునా ప్రవహిస్తోంది. ఈ సజీవ ప్రవాహం ఈ ప్రాంతంలోని సామాజిక, ఆర్థిక దృశ్యాన్ని మార్చివేసింది. వ్యవసాయం తిరిగి మొదలైంది. తమిళనాడులోని పదిహేను జిల్లాలలో ఇరవై అయిదు నదులను పునర్జీవింప చేయడానికి నాగనది స్ఫూర్తిగా మారింది.కోసీ నది కోసం...అటవీ నిర్మూలన పెరగడం వల్ల కోసీ నది ప్రమాదంలో ఉందని గ్రహించిన సామాజిక కార్యకర్త బసంతిదేవి బాధపడడానికి మాత్రమే పరిమితం కాలేదు. తన బాధ్యతగా గట్టిపని ఏదైనా చేయాలని అనుకుంది. నదితోపాటు సమీపంలోని అడవులను కాపాడాలని నిర్ణయించుకుంది.‘నదిని రక్షించుకుందాం’ అనే నినాదంతో ఉద్యమంలో మహిళలను భాగం చేయడానికి ఊరూ వాడా తిరిగింది ఉత్తరాఖండ్కు చెందిన బసంతి. ఎన్నో సంవత్సరాలు అలుపెరుగని కృషి చేసింది. వందలాది మంది మహిళలను కోసి నది పరిరక్షణ ఉద్యమంలో భాగం చేసింది. వందలాది గ్రామ మహిళలు చెట్లను రక్షించడానికి, మొక్కలను నాటడానికి, నదిని కాపాడుకోవడానికి నడుం కట్టారు.ప్రతి గ్రామంలో ఏర్పడిన మహిళా సంఘాల సమష్టి కృషి ద్వారా అడవుల నరికివేత ఆగిపోయింది. మొక్కలు చెట్లు అయ్యాయి. కోసి నది ప్రాంతంలో ఎండిపోయిన ప్రదేశాలలో నీరు సమృద్ధిగా దొరకడం మొదలైంది. నీటి ఊటలు పునర్జీవనం పొందాయి. దీంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.‘సేవ్ కోసీ ఉద్యమం’ నేటికీ కొనసాగుతుండడం విశేషం.‘మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజులలో చాలా సందేహాలు ఉండేవి. అయితే ఉద్యమకారులకు సంకల్పబలం తప్ప సందేహాలు ఉండకూడదు అనే మాట మాకు చాలా బలాన్ని ఇచ్చింది. ఉద్యమాన్ని విజయవంతం చేసింది’ అంటుంది ఉత్తరాఖండ్లోని చోప్రియాలి గ్రామానికి చెందిన భువనేశ్వరీ. ఆమె ‘మహిళా మంగళ్ దళ్’ సభ్యురాలు.నదుల నేస్తం... నీతా పటేల్గుజరాత్లోని వెనకబడిన జిల్లాలలో డాంగ్ ఒకటి. ఈ జిల్లాలోని గిరిజన గ్రామాలను సందర్శిస్తున్న క్రమంలో నర్మదా, బహ్రూచ్ కొండ ప్రాంతాల్లో జూన్ అక్టోబర్ మాసాల మధ్య సమృద్ధిగా వర్షాలు కురిసిన్పటికీ ఆ ప్రాంతాలలో పచ్చదనం లేకపోవడాన్ని గమనించింది నీతా పటేల్. గ్రామస్తులు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది పటేల్.గ్రామాలు తిరుగుతూ ఎంతోమందిని సమీకరించింది. వందలాదిమందితో వేలాది మొక్కలు నాటించింది. డాంగ్ జిల్లాలో ప్రవహించే పూర్ణ, ఖాప్రి, అంబికా, గిరా, దోధాద్ నదులపై ఎన్నో చెక్ డ్యామ్లు, గ్రూప్ వెల్స్, చెక్ వాల్స్, బోరీ బంద్లు (ఇసుక నిండిని సంచుల) ఏర్పాటు చేసింది. ఎన్నో గ్రామాలలో మహిళలతో నీటి సంఘాలు ఏర్పాటు చేయించింది. సౌరశక్తితో నడిచే నీటిపారుదల వ్యవస్థలను నీతా అభివృద్ధి చేసింది. దీనివల్ల వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ‘నది పరిరక్షణ ఉద్యమంలో విజయం సాధించడానికి ఈ ఉద్యమంలో భాగమైన ఎంతోమంది గిరిజన మహిళలు కారణం’ అంటుంది నీతా పటేల్....వీరు మాత్రమే కాదు జయశ్రీ వెంకటేశన్(తమిళనాడు), గౌరీ మిరాషి (కామ్ నది, ఔరంగాబాద్), కిరణ్ కౌర్ (బహ్మపుత్ర/వారద బేసిన్, అస్సాం), శాంతిరాయ్ (తీస్తా నది, పశ్చిమ బెంగాల్), జల్ సహేలి (ఉత్తర్ప్రదేశ్)... ఎంతో మంది వాటర్ ఛాంపియన్లు మృత్యుశయ్యపై ఉన్న నదులకు జీవం పోస్తున్నారు. నదుల కళ్లలో కొత్త వెలుగు తీసుకు వస్తున్నారు.సేవ్ గంగోత్రిపర్వతారోహకురాలు అయిన డాక్టర్ హర్షవంతి ‘సేవ్ గంగోత్రి’ ప్రాజెక్ట్తో ఎంతోమందిలో అవగాహన కలిగిస్తోంది. భోజ్ అడవిని పునరుద్ధరించే పని చేపట్టింది. వేలాది మొక్కలు నాటించింది. ఉత్తరాఖండ్లోని గంగోత్రి ప్రాంతంలో ప్రధాన జల వనరుల దగ్గర పరిస్థితులను మెరుగు పరచడానికి విశేష కృషి చేసింది. నదుల రక్షణ, పర్యావరణంపై అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ‘మహిళా శక్తితో ఎన్ని విజయాలు అయినా సాధించవచ్చు’ అంటుంది హర్షవంతి.మన నదులు మన భవిష్యత్విధ్వంసక నీటి అభివృద్ధి ప్రాజెక్ట్లను (పెద్ద డామ్లు) వ్యతిరేకించడానికి, నదులకు జీవం పోసి కాపాడుకోవడానికి నదుల పరిరక్షణ దినం మొదలైంది. ఈ సంత్సరం థీమ్: మన నదులు–మన భవిష్యత్. నదీ పర్యావరణ వ్యవస్థలను రక్షించడం, పునరుద్ధరించడం లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఎన్నో సమావేశాలు, సదస్సులు, నదులను శుభ్రపరిచే కార్యక్రమాలు జరుగుతాయి, బ్రెజిల్లోని కురిటిబాలో 1997లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో నదుల పరిరక్షణ దినోత్సవానికి బీజం పడింది.
పువ్వులే డ్రెస్సులు!
సంప్రదాయ వివాహ వేడుకలలో పువ్వుల అలంకరణకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ పూల అందం అమ్మాయిల డ్రెస్సులుగా మారితే మరింత ఆకర్షణీయం అవుతుంది. పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకకైనా... మాతృత్వపు మధురిమను పొందే బేబీ షవర్కైనా.. పువ్వుల దుపట్టా, పువ్వుల కేప్, పువ్వుల బ్లౌజ్... చీరకు కొంగుగా, లెహంగాకు డిజైన్గా అమరే పువ్వుల అందం ఇప్పుడు వేడుకలకు ప్రత్యేకతను తీసువస్తుంది.సుగంధాలు వెదజల్లే మల్లెలతో చేసిన దుపట్టా, బ్లౌజ్ డిజైన్స్ ఇప్పుడు పెళ్లిళ్లు, హల్దీ, మెహందీ వంటి ఫంక్షన్స్లో చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. ఇవి ఫ్రెష్ పూలతో తయారు చేసిన కావడంతో ఒక నేచురల్, రాయల్ లుక్ను తీసుకువస్తున్నాయి.ఫ్రెష్ ఫ్లవర్ దుపట్టా...గులాబీలతో.. రెడ్ లేదా పింక్ రోజ్ పూలను ఈ దుపట్టా తయారీలో ఉపయోగిస్తారు. రెడ్ లేదా పింక్ గులాబీలతో చేసిన దుపట్టాను ధరిస్తే రాయల్ లుక్తో కనిపిస్తారు. మల్లెపూలతో – సన్నని కాడ మల్లెలతో చేసే ఈ డిజైన్ సింపుల్గానూ, క్లాసీ లుక్తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కలర్ డ్రెస్ ఎంచుకున్నా మల్లెల దుపట్టాతో ప్రత్యేకత నింపుకుంటుంది. వివిధ రకాల పువ్వులు – గులాబీ, బంతి, జిప్సీ వంటి పూల మిక్స్తో దుపట్టాను అలంకరిస్తారు. ∙హల్దీ స్పెషల్ దుపట్టా – పసుపు రంగు వచ్చేలా బంతిపూలు, మల్లెలతో కలిపి దీనిని తయారుచేస్తారు. ఈ దుపట్టాలను ఎక్కువగా హల్దీ, మెహందీ ఫంక్షన్స్ కోసం వాడతారు.పువ్వుల బ్లౌజ్ డిజైన్స్...ఫ్రంట్ ఫ్లోరల్ టాప్ స్టైల్లో బ్లౌజ్ మొత్తం పూలతో కవర్ చేస్తారు. పువ్వులను బ్లౌజ్ బోర్డర్కి మాత్రమే అలంకరిస్తారు. పువ్వులను దారం లేదా వైర్ థ్రెడ్తో నెటెడ్ మెటీరియల్ మీద ఫిక్స్ చేస్తారు. వీటిలో ఎక్కువ శాతం బంతి, గులాబీ, మల్లెలతో పాటు అలంకరణకు తామర మొగ్గలను కూడా ఉపయోగిస్తుంటారు. ఈ డిజైన్స్ వేడుకకు రెండు గంటల ముందు లేదా ఆర్డర్ మీద డిౖజైన్ చేస్తున్నారు. డిజైన్ను బట్టి, పువ్వుల ఎంపికను బట్టి వీటి ధరలు ఉంటున్నాయి.
కాఫీకి ఒక రోజు..!
కాఫీ అంటే ఉదయించే ఉత్సాహం. సరికొత్త రోజుకు కాఫీ సేవనంతో ఉత్సాహంగా స్వాగతం చెప్పటం తప్పనిసరైన ఇష్టమని గాఢంగా భావించే కాఫీ ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు. ఒక మహత్తరమైన ఆహార సాంస్కృతిక వారసత్వానికి కాఫీ ఒక ప్రతీక. అటువంటి కాఫీకి ఇప్పటి వరకు ఒక ప్రత్యేక రోజంటూ లేదు. ఇప్పుడా కొరత తీరింది. అక్టోబర్ 1వ తేదీన ఇక ఏటా అంతర్జాతీయ కాఫీ డే (International Coffee Day) జరుపుకోవచ్చు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ నెల 10వ తేదీన ఈ మేరకు తీర్మానించింది. తన సువాసనలతో ఉత్తేజపరిచే కాఫీకి జేజేలు చెప్పని వారు ఈ విశాల భూతలమ్మీద ఎవరుంటారు? కమ్మటి కాఫీని సిప్ చేస్తూ మైమరచే వినియోగదారులతో పాటు కాఫీ గింజలను ఆరుగాలం కష్టించి పండించే రైతుల వరకూ కాఫీ దినోత్సవ ప్రకటన ఒక ఉత్తేజకరమైన వార్తే కదూ! ఆహార భద్రతకు దోహదపడే కాఫీ పంట సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత గురించి అవగాహన పెంపొందించడానికి కాఫీకి ఒక రోజును కేటాయిస్తున్న ఐక్యరాజ్యసమితి తీర్మానం పేర్కొంది. ఈ సందర్భంగా కాఫీ కబుర్లు మీ కోసం!కాఫీకి ఉన్న సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాముఖ్యతను ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఇదొక ముఖ్యమైన వ్యవసాయక ఉత్పత్తి మాత్రమే కాదు, కోట్లాది మంది వ్యవసాయ సమూహాలకు జీవనోపాధి కూడా. సామాజిక ఆతిథ్యం, సాంస్కృతిక వ్యక్తీకరణ, రోజువారీ సంప్రదాయానికి చిహ్నంగా కూడా కాఫీ మారింది అని ఐరాస తీర్మానం పేర్కొంది. ఆకలికి వ్యతిరేకంగా పోరాటం, తీవ్ర పేదరికాన్ని తగ్గించడం, మహిళల సాధికారత, మంచి పనిని ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం వంటి అనేక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కాఫీ సాగు, ప్రాసెసింగ్ దోహదపడుతున్నాయని ఐరాస పేర్కొంది.2.5 కోట్ల రైతుల పంట ప్రపంచంలో అత్యంత విస్తృతంగా సేవించే పానీయాలలో కాఫీ ఒకటి. గత దశాబ్దంలో ప్రపంచ తలసరి వినియోగం సంవత్సరానికి 1.2 శాతం పెరుగుతోంది. ఈ రంగం సుమారు 2.5 కోట్ల రైతుల జీవనోపాధికి తోడ్పడుతోంది. తోటల సాగు నుంచి ప్రాసెసింగ్, వినియోగం వరకు విస్తరించిన విలువ గొలుసు అంతటా ఎందరికో ఉపాధి అవకాశాలను కాఫీ కల్పిస్తోంది. మొత్తం మీద, ప్రపంచ కాఫీ పరిశ్రమ వార్షిక ఆదాయం 20,000 కోట్ల డాలర్లు.3,400 కోట్ల డాలర్ల వాణిజ్యంప్రపంచంలోనే అత్యధికంగా క్రయవిక్రయాలు జరిగే వస్తువులలో కాఫీ ఒకటిగా ఉంది. 2024లో ప్రపంచ కాఫీ ఉత్పత్తి 1.1 కోట్ల టన్నులను అధిగమించింది. అంతర్జాతీయంగా సుమారు 80 లక్షల టన్నుల కాఫీ గింజల వర్తకం జరుగుతోంది. 2024లో ప్రపంచ కాఫీ ఉత్పత్తి విలువ దాదాపు 2,500 కోట్ల డాలర్లని అంచనా, అయితే, కాఫీ గింజల ప్రపంచ వాణిజ్యం సుమారు 3,400 కోట్ల డాలర్లకు చేరుకుంది.పుట్టిల్లు ఇథియోపియాఅనేక తక్కువ ఆదాయ దేశాలు విదేశీ మారకద్రవ్యం ఆర్జనకు కాఫీ ఎగుమతులు కీలకంగా మారాయి. కాఫీ పుట్టిల్లు ఇథియోపియా. 2024లో ఇథియోపియా మొత్తం వస్తువుల ఎగుమతుల్లో కాఫీ వాటా 27.9 శాతం. ఉగాండాలో 20.1 శాతం, బురుండిలో 19.5 శాతం. ఇథియోపియా, ఉగాండా రెండింటిలోనూ, కాఫీ ఎగుమతి ఆదాయాలు ఆహార దిగుమతి బిల్లులను మించిపోయాయి. 2024లో బ్రెజిల్, వియత్నాం ప్రముఖ కాఫీ ఎగుమతిదారులుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా అతిపెద్ద దిగుమతిదారులుగా ఉన్నాయి.కాఫీ రైతులు ఎదుర్కొంటున్న వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఆహార – వ్యవసాయ సంస్థ ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ కార్యక్రమం ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఫీల్డ్ స్కూల్స్ ద్వారా తూర్పు ఆఫ్రికాలో, క్యూబాలో సహకార కాఫీ సాగు నమూనాలను ఎఫ్ఏవో బలోపేతం చేసింది. ప్రపంచ కాఫీ మార్కెట్కు అవసరమైన బలమైన ట్రేసబిలిటీ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి రైతులు, ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. ఏడో స్థానంలో భారత్కాఫీ సాగులో ప్రపంచంలో ఏడో స్థానంలో, ఎగుమతిలో ఐదో స్థానంలో భారత్ ఉంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర దక్షిణాది రాష్ట్రాల్లోనే 90% కాఫీ గింజలు పండుతాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ కనుమల్లోని కొండ్రప్రాంతాల్లో కాఫీ సాగు విస్తరించింది. అరకు కాఫీ ఘుమఘుమలకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. కాఫీ రకాల్లో అరబిక 30%, రోబస్ట 70% మన దేశంలో సాగవుతున్నాయి. 17వ శతాబ్దంలో బాబా బుడాన్ ఎమెన్ నుంచి ఏడంటే ఏడు కాఫీ గింజల్ని మన దేశానికి రహస్యంగా తీసుకొచ్చారు. బ్రిటీష్ పాలనలో 19వ శతాబ్దం మధ్య నుంచి వాణిజ్యపరంగా కాఫీ పంట సాగు మన దేశంలో డచ్ వారి చొరవతో ప్రారంభమైంది. మన దేశంలో ఉత్పత్తయ్యే కాఫీ గింజల్లో 70% ఇటలీ, రష్యా, జర్మనీ కొనుగోలు చేస్తున్నాయి. 6 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్న కాఫీ పరిశ్రమ కార్యకలాపాలను కాఫీ బోర్డు పర్యవేక్షిస్తోంది.చదవండి: మహిళా రైతులకు మద్దతిస్తే..!కాఫీ అనేది ఒక పానీయం కంటే ఎక్కువ. ఇది ప్రపంచవ్యాప్త వాణిజ్య వస్తువు. గింజల నుండి కాఫీ సేవనం వరకు – కోట్లాది వ్యవసాయ కుటుంబాల జీవనోపాధిని నిలబెడుతోంది. గ్రామీణులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం చేస్తోంది. కాఫీ రంగానికి గల విలువను గుర్తించటం, దాని సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుతుంది. పేదరిక నిర్మూలనకు దాని సహకారాన్ని బలోపేతం చేస్తుంది. కాఫీ దినోత్సవాన్ని, దాని విలువలను సంబరంగా జరుపుకోటానికి ఎదురుచూస్తున్నాం.– క్యూ.యూ. డోంగ్యు, డైరెక్టర్ జనరల్, ఐరాస ఆహార–వ్యవసాయ సంస్థ, రోమ్.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
అంతర్జాతీయం
జెరూసలేం మీదుగా పేలుళ్లు
US-Israel War on Iran day 15: భీకర దాడులతో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం 15 రోజు కూడా తీవ్రంగా కొనసాగుతోంది. ప్రధానంగా ఇరాన్లోని కీలకమైన ఖార్గ్ ద్వీపంపై అమెరికా దళాలు (CENTCOM) అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులు నిర్వహించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఖార్గ్ ద్వీపం బాంబు దాడి తర్వాత అమెరికా మద్దతు ఉన్న చమురు కేంద్రాలపై దాడులు చేస్తామని ఇరాన్ గట్టి కౌంటరిచ్చింది.2,500 మంది అమెరికన్ మెరైన్లు, నౌకలు గల్ఫ్కు పయనమవుతుండగా టెహ్రాన్ ‘మరింత విధ్వంసక’ క్షిపణులను సిద్ధం చేస్తోంది.ఇరాన్ నుండి వస్తున్న క్షిపణులను గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శనివారం ఇజ్రాయెల్రాజదాని నగరం జెరూసలేం మీదుగా భారీ పేలుళ్లు వినిపించాయని AFP నివేదించింది. ఇది ఇలా ఉంటే యుఎఇ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) వైమానిక రక్షణ దళాలు మార్చి 13న 7 బాలిస్టిక్ క్షిపణులు , 27 యుఎవిలను అడ్డుకున్నాయి. UAE ఈ రోజు 9 క్షిపణులు , 33 డ్రోన్లను అడ్డుకుంది. దీంతో వీటి సంఖ్య 285 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు , 1,567 యుఎవిలకు చేరుకున్నాయి. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతంలోని యుఎఇ కాన్సులేట్ జనరల్ను లక్ష్యంగా చేసుకుని వారం రోజుల్లో రెండవసారి జరిగిన ఉగ్రవాద డ్రోన్ దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడగా, కాన్సులేట్ భవనం దెబ్బతింది.45 మంది అరెస్ట్ మరోవైపు యుఎఇలో, తప్పుదారి పట్టించే లేదా ఏఐ వీడియోలను ఆన్లైన్లో పంచుకున్నందుకు 10 మంది నిందితులకు భారీ షాక్ తగలనుంది. వీరిపై విచారణణు వేగవంతం చేశారు. సంఘటనాస్థలాలను చిత్రీకరించడం, లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు 45 మందిని అబుదాబి అధికారులు అరెస్టు చేశారు. ఇది తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి, జాతీయ భద్రతను రక్షించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగమని అక్కడి అధికారులు తెలిపారు. కాగా ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం మధ్యప్రాచ్య వివాదం మూడవ వారంలోకి ప్రవేశించింది. దాదాపు 43,000 నివాస, వాణిజ్య యూనిట్లు దెబ్బతిన్నాయని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ వెల్లడించారు. ప్రభుత్వ నిర్వహణలోని IRNA వార్తా సంస్థ ప్రకారం, దెబ్బతిన్న నిర్మాణాలలో 36,469 నివాసాలు, 6,179 వాణిజ్య సౌకర్యాలు ఉన్నాయి..అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని, 223 మంది మహిళలు , బాలికలు మరణించారని మరియు 2,129 మంది గాయపడ్డారని మొహజెరానీ చెప్పారు. ఆమె మొత్తం మరణాల సంఖ్యను ప్రకటించలేదు కానీ గతంలో అధికారులు 1,230 మంది మరణించారని చెప్పారు.సైనిక నష్టం గురించి ఇరాన్ ఎటువంటి సమాచారం అందించలేదు.
రోజూ వైన్, మాంసం : షాకిస్తున్న 102 ఏళ్ల బామ్మ
తూర్పు చైనాకు చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు తన ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జీవితంపై ఆమె దృక్పథం, లైఫ్స్టైల్, ఫుడ్ తదితర వివరాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వందేళ్లు జీవించినవారు కఠినమైన ఆహార నియమాలు, చక్కటి జీవనశైలి, నియమ నిబద్ధతతో ఉంటారని అనుకుంటాం కదా. కానీ ఈమె అలవాట్లు అందుకు భిన్నం. ప్రస్తుతం సెంచరీ దాటేసింది తైజౌ గ్రామీణ ప్రాంతంలో నివసించే జిన్ బావోలింగ్ (Jin Baoling).సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ 102 ఏళ్ల జిన్ బావోలింగ్ కొడుకు, కోడలు మనవరాలు సహా సన్నిహిత కుటుంబ సభ్యులతో జీవిస్తోంది. వృద్ధురాలి. దీర్ఘాయువు రహస్యాలు, దినచర్యఏంటో తెలిస్తే షాకవ్వక మానరు.తైజౌ ఈవినింగ్ న్యూస్ నివేదిక ప్రకారం, వందేళ్లు నిండిన ఆమె మానసికంగా చురుగ్గా, సాధారణంగా మంచి శారీరక స్థితిలో ఉంటుంది. గత 50 ఏళ్లుగా ఆమె ఆసుపత్రి మెట్లు ఎక్కకపోవడం విశేషం.జిన్ బావోలింగ్ రోజులో దాదాపు 15 గంటలు నిద్రపోతుందట. ఉదయం 9 గంటలకు నిద్రలేచి, తన తోటలో సూర్యరశ్మిలో కూర్చుని సమయం గడుపుతుంది.గటిపూట కూడా అప్పుడప్పుడు కునుకు తీస్తుంది. రాత్రి 7 గంటలకల్లా పడుకుంటుంది. ప ఆమె ఆరోగ్యంలో ఈ విశ్రాంతి కీలక పాత్ర పోషిస్తుందని ఆమె కుమారుడు చెబుతున్నారు.ఆహారపు అలవాట్లలో మాంసాహారం ఎక్కువ, కూరగాయలు తక్కువ ఉండటం మరో విశేషం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కూరగాయలు తినాలని చెబుతుంటారు, కానీ ఈమె మాత్రం కూరగాయలను అస్సలు ఇష్టపడరు. పైగా 'పిగ్ ట్రాటర్స్' (పంది కాళ్లు) అంటే చాలా ఇష్టం. దీన్ని చైనాలో చాలా రుచికరమైనవిగా భావిస్తారు. కొల్లాజెన్లో సమృద్ధిగా ఉండే ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే కొన్నిసాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఉపయోగిస్తారట. జిన్ దీన్ని దాదాపు ప్రతిరోజూ తింటుంది. ఇంకా డంప్లింగ్స్, స్టీమ్డ్ బన్స్ లేదా వంటోన్స్ తోపాటు,రోజుకు మూడు ఆరెంజ్ పండ్లు, రెండు గుడ్లు తీసుకుంటారు. వీటితో పాటు కేకులు, బ్రెడ్ , బ్రౌన్ షుగర్, ఖర్జూరాలతో చేసిన టీని ఎంజాయ్ చేస్తారు. ఏమి తిన్నా అన్నీ టైం ప్రకారం తినాల్సిందే.ప్రతీ పూట మందు ఉండాల్సిందే ఆమె ఆహారంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జిన్ ప్రతీ భోజనంతో పాటు రైస్ వైన్ (బియ్యంతో చేసిన మద్యం) తాగుతుంది. ఖర్జూరాలు, లిచీ వంటి పండ్లతో నిల్వ చేసిన ప్రత్యేకమైన వైన్ ఆమె కోసం ఇంట్లోనే సిద్ధంగా ఉంటుంది.ఇంకా ఈమె కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఖర్జూరం, లాంగన్, లీచీ , యమ్బెర్రీస్, రైస్ వైన్ జాడిలు ఉంటాయి.కాళ్ళ కీళ్ళు సమస్యల కారణంగా నడిచేటప్పుడు జిన్కు సహాయం అవసరం కానీ 102 ఏళ్లు ఉన్నప్పటికీ ఆమె చూపు ఇంకా స్పష్టంగానే ఉంది. చేతులు కూడా వణకవు. ఖాళీ సమయంలో సాక్సులు కుట్టడం, చెప్పుల సోల్స్ రిపేర్ చేయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ చురుగ్గా ఉంటుంది. ఆమెలోని పాజిటివ్ మైండ్సెటే దీర్ఘాయువుకు ప్రధాన కారణం అంటారు ఆమె కుమారుడు. అలాగే ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పడకుండా, మనసులో కుళ్లు,కుతంత్రాలు లేకుండా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుం దని చెప్పారు. దృఢత్వం, ఉల్లాసమైన వ్యక్తిత్వం కారణంగా, స్థానికులు ఆమెను ఆప్యాయంగా "ఓల్డ్ బేబీ" అని పిలుచుకుంటున్నారు.నెటిజన్లు స్పందనతమకు నచ్చినట్లు జీవించడమే అసలైన ఆరోగ్యం" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఆమె అలవాట్లను ప్రశంసించారు. “ఆయుర్దాయం కోసం ఉత్తమ ఔషధం ఏమిటంటే, మీరు చాలా సుఖంగా ఉండే విధంగా జీవించడం, అతిగా ఆలోచించని హృదయంతో జీవించడం.” అని ఒకరు, “అమ్మమ్మ జిన్ సుదీర్ఘ నిద్ర , చక్కటి విశ్రాంతితో యువకులను మించిపోయింది.”అని మరొకరు వ్యాఖ్యానించారు.. “ఒక వందేళ్లు దాటిన వ్యక్తి అసాధారణ ఆరోగ్య అలవాట్లతో తన సొంతనిబంధనల ప్రకారం జీవితాన్ని గడుపుతున్నందుకు చాలా సంతోషం. నా తాతకు 94 సంవత్సరాలు, అతను తాగడం, ఆలస్యంగా మేల్కొని ఉండటం, ఎక్కువ పాటలు పాడటం, చెస్ ఇష్టపడతాడు.” అంటూ మరొక నెటిజన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఇంటర్వ్యూ ఆపండి.. మీకు ట్రంప్ నుంచి కాల్ వచ్చింది!
ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై యుద్ధంలో ఉన్నాయి. ఇరాన్ను తమ గుప్పిట్లోకి తీసుకునే వరకూ యుద్ధం ఆపేది లేదంటోంది అమెరికా. అదే సమయంలో ఇరాన్ కూడా తాము కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. ఈ యుద్ధం ఎంతవరకూ వెళుతుందో అనే భయం సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇరాన్ గగనతలం తమ గుప్పిట్లోకి వచ్చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ చెబుతున్నా.. పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదు. ఇరాన్ సైతం అంతే ధీటుగా బదులిస్తూ ఉండటంతో అటు గల్ఫ్ దేశాలతో పాటు అమెరికాలో కూడా ఆందోళన చాయలు కనిపిస్తూనే ఉన్నాయి. ట్రంప్ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఇంకా ఇరాన్ లొంగిపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంచితే, ఒక లైవ్ షోలో ఉండగా అమెరికా ఆర్థికశాఖ కార్యదర్శి స్కాట్ బీసెంట్కు ఉన్నపళంగా అధ్యక్షుడు ట్రంప్ నుంచి కాల్ రావడం చర్చనీయాంశమైంది. బీసెంట్ స్కై న్యూస్ స్టూడియోలో లైవ్ ప్రోగ్రామ్లో ఉండగా పిలుపు వచ్చింది. ఆ స్టూడియోకు ట్రంప్ నుంచి కాల్ రావడంతో ఉన్నపళంగా బీసెంట్ మధ్యలోనే వెళ్లిపోయారు.ఆ కాల్ సారాంశం ఏంటంటే.. ‘ఇంటర్వ్యూ ఆపండి.. మీకు ట్రంప్ నుంచి కాల్ వచ్చింది.. మిమ్మల్ని ట్రంప్ వెంటనే కలవాలట. వైట్హౌస్ సిట్యువేషన్ రూమ్కి రమ్మన్నారు’ అని లైవ్ ప్రోగ్రామ్ మధ్యలో సందేశం వెళ్లింది. దాంతో బీసెంట్ తన ఇంటర్వ్యూను అక్కడే వదిలేసి పరుగు పరుగున వెళ్లి ట్రంప్ను కలిశారు. అయితే ఆ తర్వాత బీసెంట్ తన లైవ్ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు బీసెంట్ ప్రోగ్రామ్ వాయిదా పడిన తర్వాత కొనసాగించారు. దీనిలో భాగంగా బీసెంట్ మాట్లాడుతూ.. ‘అధ్యక్షుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇరాన్ మిషన్ షెడ్యూల్కి ముందుగానే విజయవంతంగా కొనసాగుతోంది. అలాగే ప్రభుత్వ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని ట్రంప్ను కొనియాడారు.U.S. Treasury Secretary Scott Bessent was abruptly pulled from a live interview after being told “the President wants you right away.” After returning, his voice was noticeably shaken. pic.twitter.com/jx5CamFi03— Clash Report (@clashreport) March 13, 2026 ఇదీ చదవండి: ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కిమ్
ఆరు వేళ్లు.. నెతన్యాహూ సేఫేనా? రూమర్లు హల్చల్
Iran war ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ భీకరదాడులు, ఇరాన్ సుప్రీం నేత హత్య తరువాత ఇరాన్కూడా అదే స్థాయిలో ప్రతిదాడులకు దిగింది. దీంతో సోషల్ మీడియాలో పలు అసత్య ప్రచారాలు, ఫేక్ వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) గురించి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు వాస్తవం ఏంటి?ఇజ్రాయెల్ ప్రధాని అధికారికసోషల్ మీడియా ఖాతా నుండి ఆయన మరణించారని ప్రకటించిన సందేశానికి పోస్ట్ కావడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లు వైరల్గా మారాయి. అంతేకాదు ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడిన వీడియో ఏఐతో రూపొందించారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. పాత వీడియోకు కొత్త వాయిస్ను జోడించారనే పుకార్లు షికారు చేశాయి.నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నాయా? నెతన్యాహు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వీడియో వైరల్ అయింది. దీంతో వీడియోలు నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నట్టు కనిపించిందనీ, ఇది ఏఐతో సృష్టించిన వీడియో అని రూమర్లు వ్యాపించాయి. అసలు ఆయన బతికే ఉన్నారా అనే ఆందోళన రేగింది. జియోనిస్ట్ నాయకుడు ఎక్కడ ఉన్నాడనేది సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది.అసలు నిజం ఏమిటంటేఇజ్రాయెల్ నాయకుడి మరణం గురించి ఆన్లైన్లో వ్యాపించిన పుకార్లను అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు, ఫ్యాక్ట్-చెకర్లు , వార్తా సంస్థలు ఇప్పటికే తోసిపుచ్చాయి.నెతన్యాహు సురక్షితంగా ఉన్నారనీ, సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వీడియో AI సృష్టి అని తేలింది. ఈ వీడియోలు ఫేక్ వీడియోలు అని ఫ్యాక్ట్ చెక్ నిపుణులు తేల్చారు.ది సండే గార్డియన్ ఉటంకించిన విశ్లేషకుల ప్రకారం, ఈ పుకార్లు ఎక్కువగా నకిలీ స్క్రీన్షాట్లు, తప్పుడు దృశ్యాలు. తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కాలంలో ఇవి ధృవీకరించని కంటెంట్ ఆధారంగా రూపొందించినవి. ఈ వాదనలకు ధృవీకరించబడిన ఆధారాలు లేవు.ఇదీ చదవండి: షాకింగ్ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్షఅలాగే ఆరువేళ్లున్నాయనే విషయంపై కూడా ఫ్యాక్ట్ చెకర్లు స్పందించారు. అది ఆప్టికల్ భ్రమ అనీ, ఒకే ఫ్రేమ్ను విడిగా పరిశీలించినప్పుడు కెమెరా కోణాలు, మోషన్ బ్లర్చ హ్యాండ్ పొజిషనింగ్ లాంటి తప్పుదారి పట్టించే దృశ్యాలను ఉత్పత్తి చేస్తాయని నిపుణులు అంటున్నారు.(మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్)
జాతీయం
ఇక ‘టోల్’ తీసే బాధ్యత మహిళలకే..
న్యూఢిల్లీ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారతకు బాటలు వేస్తూ, టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులను నియమించనున్నట్లు ప్రకటించింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 1,140కి పైగా టోల్ ప్లాజాల వద్ద సుమారు 5,100 మంది మహిళలను పగటిపూట షిఫ్టుల్లో నియమించనున్నారు.నేషనల్ హైవేస్ అథారిటీ నిర్ణయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన మహిళలకు నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హైవే మౌలిక సదుపాయాల రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. టోల్ బూత్ల వద్ద మహిళా సిబ్బంది ఉండటం వల్ల వాహనదారులకు మరింత మర్యాదపూర్వకమైన సేవలు అందుతాయని నేషనల్ హైవేస్ అథారిటీ భావిస్తోంది.సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య జరిగే వాగ్వాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం దోహదపడనుంది. ప్రశాంతమైన, వృత్తిపరమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు నేషనల్ హైవేస్ అథారిటీ పలు కీలక భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపింది. ఎన్హెచ్బీఎఫ్, హెచ్ఓఏఐ, ఏఐటీయూసీ తదితర సంఘాలతో పాటు టోల్ ఆపరేటర్లు కూడా ఈ ప్రతిపాదనకు పూర్తి మద్దతు ప్రకటించారు.ఈ వినూత్న కార్యక్రమం అమలునునేషనల్ హైవేస్ అథారిటీ నిరంతరం పర్యవేక్షించనుంది. విధులు నిర్వహించే మహిళా సిబ్బందికి ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా వారికి ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించడం, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడం, టోల్ ఆపరేషన్లలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించడం, భద్రతా నియమాలపై అవగాహన తదితర అంశాల్లో శిక్షణ అందించనున్నారు.ఇది కూడా చదవండి: సోనమ్ వాంగ్చుక్ విడుదల
మండిస్తున్న ఎండలు, పైకప్పు చల్లగా ఇలా..!
నగర/పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లు అధిక ఉష్ణంతో సెగలు కక్కుతున్నాయి. ఇరుకు రేకుల ఆవాసాల్లో తలదాచుకునే పేదల నుంచి పక్కా ఇళ్లలో ఉండే మధ్యతరగతి ప్రజల వరకు వేడిఒత్తిడి (హీట్ స్ట్రెస్)కి లోనవుతున్నారు. తమ ఇళ్లు వేడెక్కిపోతుంటే ఏసీలు కొనే స్తోమత లేని వారు అల్లాడుతున్నారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనం ప్రకారం.. ఆరు భారతీయ నగరాల్లో 80% విస్తీర్ణంలోని గృహవాసులు వేడి ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇంటి పైకప్పులను ఇన్సులేట్ చెయ్యటమే, ఏసీలు/కూలర్ల వాడకం కన్నా, మేలైన పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. వేడి ఒత్తిడి నుంచి కాపాడు కోవటానికి ఉపయోగపడే కూల్ రూప్ పద్ధతులేమిటో చూద్దాం.. హీట్ స్ట్రెస్కు మూల కారణాలు ఇవి.. అర్బన్ ప్రాంతాలు ఇళ్లతో నిండిపోవటం, పచ్చదనం తగ్గిపోవటం, వాహన కాలుష్యం పెరిగిపోవటంతోపాటు వేడిని అతిగా గ్రహించే స్వభావం గల (హీట్ ట్రాపింగ్ మెటీరియల్) సామగ్రితో ఇళ్లు నిర్మించటం ఈ వేడి ఒత్తిడి పెచ్చుమీరటానికి ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. కాంక్రీటు, ఇటుకలు, రాళ్లు పగటి పూట సూర్యరశ్మి నుంచి వేడిని గ్రహించుకొని, రాత్రి పూట నెమ్మదిగా ఆ సెగను వదులుతూ ఉంటాయి. దీంతో కాంక్రీటు భవనాలు రాత్రిళ్లు కూడా సెగలు కక్కుతూనే ఉంటాయి. అందువల్ల అర్బన్ ప్రాంతాల్లో ముఖ్యంగా రేకుల ఇళ్లు, మండు వేసవిలో నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. మెరుగైన పైకప్పులు.. మూడు రకాలు బయటి వేడిని అతి తక్కువగా గ్రహించటంతోపాటు అతి తక్కువగా ఇంటి లోపలికి వదిలే పై కప్పులు ముఖ్యంగా మూడు రకాలు. వీటినే థర్మల్లీ ఎఫిషియెంట్ రూఫ్స్ అని వ్యవహరిస్తున్నారు. కూల్ రూఫ్స్ : ఎండ కాచే సమయంలో సోలార్ రేడియేషన్ను ఎక్కువగా గ్రహించకుండా తిరిగి వాతావరణంలోకి తిప్పికొట్టే (రిఫ్లెక్టివ్) సామర్థ్యం, గ్రహించిన కొద్దిపాటి వేడిని కూడా గది లోపలికి కాకుండా పైకప్పు నుంచే అతి త్వరగా బయటకు వదిలి వేసి చల్లబడే సామర్థ్యం గల టైల్స్, పెయింట్లు, మెంబ్రెయిన్లు ఈ కోవలోకి వస్తాయి. గ్రీన్ రూఫ్స్ : ఆర్సీసీ శ్లాబ్పైన వాటర్ ప్రూఫింగ్ చేసి మట్టి పోసి మొక్కలు పెంచితే అదే గ్రీన్ రూఫింగ్. సూర్యరశి్మని గ్రహించి మొక్కలు పెరుగుతుంటాయి. అవి ఆకుల ద్వారా వాతావరణంలోకి వదిలే నీటి తేమ వల్ల పైకప్పు, పరిసరాలు చల్లగా ఉంటాయి. పచ్చని లాన్/ మొక్కలు/ చిన్న చెట్లు పెంచాలంటే 300 ఎంఎం లోతులో మట్టి పొర వేసుకోవాలి. రూఫ్ పార్కులు, సేదదీరే స్థలాలు, కమ్యూనిటీ గార్డెన్లకు ఈ ఇంటెన్సివ్ గ్రీన్ రూఫ్ అనువైనది. ఎక్స్టెన్సివ్ గ్రీన్ రూఫ్ పద్ధతిలో అయితే 25–125 ఎంఎం లోతు మట్టి పొర వేస్తే చాలు. నీటి ఎద్దడిని తట్టుకునే సక్యులెంట్స్, గడ్డి, తీగజాతి మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇంటి పైకప్పులను ఇన్సులేట్ చెయ్యటమే ఏసీల వాడకం కన్నా మేలైన పరిష్కారం మట్టి పాత్రలతో ఇన్సులేషన్: ఆర్సీసీ శ్లాబ్పైన మట్టి పాత్రలను బోర్లించి, వాటిపైన సున్నం లేదా సిమెంట్ కాంక్రీటు వేసి, దానిపైన సెరామిక్ టైల్స్ వంటి వాటితో వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి. బోర్లించిన మట్టిపాత్రలో ఉండే గాలి శ్లాబ్కు వేడి చేరకుండా అడ్డుకుంటుంది. తద్వారా ఎండ వేడి కిందకు దిగకుండా ఉంటుంది. ఇన్సులేటెడ్ రూఫ్స్: రూఫ్ శ్లాబ్ ద్వారా గది లోపలికి దిగే వేడిని మూడింట రెండొంతులు పైకప్పుపై వేసే ఇన్సులేటెడ్ రూఫ్ అరికడుతుంది. ఇన్సులేషన్ పొరగా ఎక్స్ట్రూడెడ్ పాలిస్టైరెన్ షీట్ (ఎక్స్పీఎస్), సెల్యులోజ్ పైబర్, థర్మోక్రేట్, లైమ్ కాంక్రీట్, హాలో టెర్రకోట టైల్స్, గ్లాస్ వూల్ షీట్లను వాడుతున్నారు. దీని మందం 20–50 ఎం.ఎం. ఉంటుంది. షీట్ ధర రూ. 275–695 మధ్యలో ఉంటుంది. ఆర్సీసీ శ్లాబ్ పైన ఇన్సులేషన్ (ఓవర్ డెక్ ఇన్సులేషన్) పొర వేసుకొని, దానిపై వాటర్ ప్రూఫింగ్ చెయ్యాలి. ‘అండర్ డెక్ ఇన్సులేషన్’అనే మరో పద్ధతి ఉంది. ఆర్íసీసీ శ్లాబ్ అడుగున, ఈ బోర్డ్/జిప్సం లేయర్కు మధ్యలో ఈ ఇన్సులేషన్ వేస్తారు. పై కప్పు నుంచి కిందికి వచ్చే వేడిని ఇది కొంత మేరకు ఆపుతుంది.
సోనమ్ వాంగ్చుక్ విడుదల
లేహ్/జోధ్పూర్: లడఖ్ పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న ప్రముఖ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. గత ఏడాది సెప్టెంబర్లో లేహ్లో జరిగిన హింసాత్మక నిరసనల దరిమిలా ఆయనను జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ)కింద అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి రాజస్థాన్లోని జోధ్పూర్ జైలులో ఉన్న వాంగ్చుక్ నిర్బంధాన్ని రద్దు చేస్తూ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.శాంతి స్థాపన కోసమే ఈ నిర్ణయంలడఖ్లో శాంతి, స్థిరత్వం పెంపొందించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను, ఆందోళనలను పరిష్కరించేందుకు, అన్ని వర్గాలతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం పేర్కొంది. గతంలో ప్రజా శాంతికి భంగం కలగకుండా ఉండేందుకే వాంగ్చుక్ను నిర్బంధించాల్సి వచ్చిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది.పరిశ్రమలు, పర్యాటకంపై ప్రభావంలడఖ్లో నిరంతర బంద్లు, నిరసనల వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారవేత్తలు, పర్యాటక రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపిందని, ఈ వాతావరణాన్ని మార్చేందుకే వాంగ్చుక్ విడుదలకు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.‘న్యాయ పోరాటం ఫలించింది’వాంగ్చుక్ భార్య గీతాంజలి జె ఆంగ్మో తన భర్త నిర్బంధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్త ఎప్పుడూ అహింసా మార్గాన్నే కోరుకున్నారని అన్నారు. హింస వల్ల లడఖ్లో తన ఐదేళ్ల ‘తపస్సు’ వృథా అవుతుందని ఆయన సామాజిక మాధ్యమాల్లో కూడా పేర్కొన్నారని ఆమె కోర్టుకు విన్నవించారు. వాంగ్చుక్ విడుదలపై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆయన మద్దతుదారులకు ఆనందాన్నిచ్చింది.
గ్యాస్ లేక.. స్మశానంలో మృతదేహాల వెయిటింగ్..
కోజికోడ్: దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు స్మశానవాటికల వరకూ పాకింది. కేరళలోని కోజికోడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే ‘స్మృతిపథం’ స్మశానవాటికలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు పూర్తిగా అయిపోవడంతో, శుక్రవారం నుంచి గ్యాస్ ఆధారిత దహన సంస్కారాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.సంప్రదాయ పద్ధతులే శరణ్యంగత రెండు రోజులుగా సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఎన్నిసార్లు ప్రయత్నించినా సరఫరాదారులు కొత్త స్టాక్ పంపలేదని స్మృతిపథం సిబ్బంది వాపోతున్నారు. దీంతో గ్యాస్ ఫర్నేస్లను మూసివేసి, ప్రత్యామ్నాయంగా కొబ్బరి పీచు, చిప్పలను ఉపయోగిస్తూ, సంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ క్రీమెటోరియం కూడా సాంకేతిక కారణాలతో గత నాలుగు నెలలుగా మూలనపడింది. వారం రోజుల్లోగా దీనికి మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.సామాన్యులపై అదనపు భారంసాధారణంగా మిగతా చోట్ల కంటే స్మృతిపథంలో అంతిమ సంస్కారాల ఖర్చు తక్కువ. ఇక్కడ గ్యాస్ ఆధారిత దహనానికి ₹2,000, ఎలక్ట్రిక్ పద్ధతికి ₹2,500 వసూలు చేస్తారు. గ్యాస్ కొరత కారణంగా దహన సంస్కారాల కోసం ఇప్పుడు కుటుంబ సభ్యులు పుతియాపాలం లేదా వెస్ట్ హిల్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ఒక్కో కుటుంబంపై అదనంగా ₹500 నుండి ₹1,500 వరకు ఆర్థిక భారం పడుతోంది.ఒక మృతదేహానికి 25 కిలోల గ్యాస్సాధారణంగా ఒక మృతదేహాన్ని గ్యాస్ ద్వారా దహనం చేయడానికి సుమారు 25 కిలోల గ్యాస్ అవసరమవుతుంది. అంటే దాదాపు ఒకటిన్నర కమర్షియల్ సిలిండర్లు ఖర్చవుతాయి. దహన ప్రక్రియలో తగినంత ఒత్తిడి కొనసాగించాలంటే ఒకేసారి 12 సిలిండర్లను ఫర్నేస్కు అనుసంధానించాల్సి ఉంటుంది. గ్యాస్ సరఫరా తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే ఇక్కడ సేవలు పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ఆకలి తీరుస్తున్న ‘గ్యాస్ అన్డూ’.. టెక్కీల క్రేజీ ఆవిష్కరణ
ఎన్ఆర్ఐ
వాషింగ్టన్ డీసీలో శంకర నేత్రాలయ నిధుల సేకణ కార్యక్రమం
గతేడాది డిసెంబర్ 6. 2025న వాషింగ్టన్ డి.సి. మెట్రో ప్రాంతంలో నిర్వహించిన శంకర నేత్రాలయ (SN) నిధుల సేకరణ కార్యక్రమం విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మక నేత్ర వైద్య సంస్థ కోసం మొత్తం $150,000 నిధులు సమీకరించారు. సంస్కృతి,కరుణను ప్రతిబింబించే ఈ వేడుకకు చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రమణ రెడ్డి మడ్డికుంట CapEx సభ్యుడు తిరుమల రెడ్డి మునుకుంట్ల నాయకత్వం వహించారు.ఆ సాయంత్రం థీమ్ కరుణ ప్రతిధ్వనులు: కళ హృదయాన్ని కలిసే స్థలం (Echoes of Compassion: Where Art Meets Heart)గా నిర్వహించబడింది. శాస్త్రీయ మరియు సాంప్రదాయ నృత్య కళలతో సేవా భావాన్ని మేళవిస్తూ ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక అకాడమీలు పాల్గొని యువ వయోజన నర్తకుల అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సాంస్కృతిక బృంద సభ్యురాలు లక్ష్మి బాబు సమన్వయంతో నృత్య ప్రదర్శనలు అత్యంత కన్నులపండుగగా నిర్వహించారుఈ వేడుకకు గౌరవ అతిథిగా ఎస్. వి. ఆచార్య గారు హాజరై తమ ప్రోత్సాహకర సందేశంతో కార్యక్రమానికి మరింత గౌరవాన్ని చేకూర్చారు. అలాగే 11 మంది MESU స్పాన్సర్ల మద్దతు ఈ కార్యక్రమ విజయానికి కీలకమైంది.ఉదార హృదయంతో సహకరించిన MESU స్పాన్సర్లు:సెల్వ, ప్రతిభ జయరామన్, భువనేశ్ బూజాల, భానుమతి రామకృష్ణ, శ్రవణ్ పడూరు, కృష్ణకాంత్ కుచ్చలకంటి, ప్రవీణ్ పాల్రెడ్డి, రఘు పాల్రెడ్డి, వెంకట్ దోమా, తిరుమల మునుకుంట్ల, రఘు జువ్వాది గారు. వీరి ఆర్థిక కార్యనిర్వహణ సహకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.ఇంకా SNUSA నేషనల్ మరియు డి.సి. మెట్రో చాప్టర్ సభ్యులు విశేషంగా సహకరించారు. ముఖ్యంగా శ్రీమతి నీలిమ గడ్డమనుగు, కృష్ణ రాజ్ భట్, సౌమ్య నారాయణన్, డి.సి. చాప్టర్ నాయకులు — బాలాజీ రాధాకృష్ణన్, హరిత రెడ్డి, అర్జున్ కామిసెట్టి, దిలీరాజ్ చాంతివేలు, రూపేష్ చిన్నకంపల్లి, కార్తిక్ గౌడ్ తదితరుల కృషి ప్రశంసనీయం.SNUSA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి గారి నాయకత్వం తోపాటు బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యుల మార్గదర్శకత్వం ఈ విజయానికి బలమైన ఆధారంగా నిలిచాయి. ట్రెజరర్ మూర్తి రేకపల్లి గారు లాజిస్టిక్స్ నిర్వహణలో విశేష కృషి చేయగా, మీడియా సహకారం అందించిన శ్రీగిరి కోటగిరి సేవలు అభినందనీయం. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువ వాలంటీర్లు, మీడియా,ఫోటోగ్రఫీ బృంద సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మాస్టర్ ఆఫ్ సెరిమనీగా వ్యవహరించిన శ్రియా బాబు తన చక్కని వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని చురుకుగా, సమర్థవంతంగా ముందుకు నడిపించారు.ఈ కార్యక్రమంలో సమీకరించిన నిధులు శంకర నేత్రాలయ లక్ష్యమైన అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించేందుకు వినియోగించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ముగిసే సమయానికి సేవా భావం, ఐక్యత, సామాజిక బాధ్యత స్పష్టంగా ప్రతిఫలించాయి. ఈ వేడుక కేవలం కళలు, సంస్కృతిని మాత్రమే కాకుండా, సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరి హృదయంలో మరింత బలంగా నాటింది.(చదవండి: అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..)
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు భారత్కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్ ఎవరు? ఆ వివరాలు మీకోసం.లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలోజన్మించారు నిత్య రామన్. ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య కుటుంబం, అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కరెన్ బాస్కు గట్టి పోటీప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!
అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత
క్రైమ్
‘ఉరి అలా కాదు, ఇలా వేసుకోవాలి‘
వైఎస్ఆర్ కడప జిల్లా: ఓ పైశాచిక భర్త కట్టుకున్న భార్యను చిత్రవధకు గురిచేశాడు. మానసికంగా వేధించి.. ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఆమె బలవన్మరణానికి పాల్పడబోతే నివారించాల్సింది పోయి సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిస్తూ ఉరి ఇలా వేసుకోవాలంటూ మానసికంగా మరింత కుంగదీశాడు. ఉరి బిగుసుకుని బాధితురాలు దుర్మరణం పాలైంది. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలంలోని బోయనపల్లెలో జరిగిన ఈ అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ నందలూరు రైల్వే కేంద్రంలో లోకోపైలట్గా పనిచేస్తున్నారు. ఆయన రెండో భార్య కృష్ణవేణి తన నివాసంలో గురువారం ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. అయితే, భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సిన భర్త, ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించడం అతనిలోని క్రూరత్వాన్ని బయటపెట్టింది. శ్రీరామ్ శ్రీనివాస్, కృష్ణవేణి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం కూడా ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఆత్మహత్య చేసుకుంటానని ఉరితాడు సిద్ధం చేసుకుంది. భర్త ఆమెను ఆపడానికి బదులు.. ‘ఉరి అలా కాదు, ఇలా వేసుకోవాలి‘ అంటూ సూచనలు చేస్తూ ఆ ఘటనను తన మొబైల్లో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలోని సెల్ఫోన్ ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడిని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహోదగ్రులైన కృష్ణవేణి బంధువులు నిందితుడిపై దాడికి యతి్నంచారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. గతంలో శ్రీనివాస్ తొలి భార్య కూడా తిరుపతిలో రైలు కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. కృష్ణవేణి మృతిపై మన్నూరు సీఐ లింగప్ప మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిన సమయంలో కృష్ణవేణి తలుపు వేసుకుని ఆత్మహత్యకు యతి్నంచిందని, దానిని భర్త కిటికీలో నుంచి వీడియో తీసినట్లు అందులోని మాటలను బట్టి అర్థమవుతోందని చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.
హైదరాబాద్లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయం.. వ్యాపారి అరెస్ట్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్లోని జెమ్ ఫుడ్స్ గోడౌన్పై పోలీసులు దాడి చేశారు. అక్కడ నిల్వ ఉంచిన 30 బాక్సులకు పైగా కుళ్లిపోయిన డ్రై ఫ్రూట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మనీష్ అనే డ్రై ఫ్రూట్స్ వ్యాపారి బూజు పట్టిన జీడిపప్పు, బాదంలను నాణ్యమైనవిగా చూపించి ప్రజలకు విక్రయిస్తున్నాడు. దాంతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేసే సమయంలో వాటి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. ఈ ఘటనతో కల్తీ ఆహార పదార్థాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్
ఆగ్రాలో ఒక మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. నాలుగేళ్లు సహజీవనంచేసి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఇప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని ఒక పోలీస్ కానిస్టేబుల్పై ఆరోపణలు గుప్పిస్తూ చనిపోయే ముందు ఆమె ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు కూడా విజ్ఞప్తి చేయడంతో ఇది వైరల్గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సంచలనంగా మారడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అసలు స్టోరీ ఏంటంటే..ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధిత మహిళది స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లా. ఆమె అంతకుముందే విడాకులు తీసుకుని, ఆగ్రాలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో తాజ్గంజ్ పోలీస్ స్టేషన్లోపనిచేస్తున్న జేవీ గౌతమ్ అనే కానిస్టేబుల్తో పరిచయమైంది. దీంతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కుటుంబం ఒప్పుకోదు అంటూ పెళ్లికి నిరాకరించాడు. చివరికి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో వివాదం రేగింది. తీవ్ర ఆవేదనతో వీడియో సందేశం రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వీడియోలో ఇలా పేర్కొంది..తాను కలిసి జీవించిన గౌతమ్ చేతిలో ఏళ్ల తరబడి శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఆ తర్వాత మాట తప్పాడని పేర్కొంది. గౌతమ్తో జీవించిన కాలంలో తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆమె పేర్కొంది. ఫిర్యాదు చేయడానికి తాను పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు, తమ చేతుల్లో ఏమీ లేదని, ఆ కానిస్టేబుల్పై ఎటువంటి చర్యలూ తీసుకోలేమని అక్కడివారు చెప్పినట్లు ఆమె తెలిపింది. తాను బతికి ఉన్నప్పుడు తనకు న్యాయం జరగలేదని, కనీసం తన మరణం తర్వాత అయినా తనకు న్యాయం జరగాలని ఆశించింది. అంతేకాదు గౌతమ్, అతని కుటుంబ సభ్యులు తనను ఎంతో మోసం చేశారని, మానసికంగా వేధించారని, చివరికి ఈ దారుణ నిర్ణయం తీసుకునేలా తనను నెట్టారని ఆమె ఆరోపించింది. ఏళ్ల తరబడి అతనితో కలిసి జీవించిన తర్వాత, ఇప్పుడు అతను వేరొక మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని ఆమె వాపోయింది."నా మరణానికి జేవీ గౌతమ్, అతని కుటుంబం మొత్తం కారణం. వారు నన్ను ఎంతగానో మోసం చేశారు. మానసికంగా ఎంతగా వేధించారంటే, చివరికి నేను చనిపోయేలా నన్ను బలవంతం చేశారు." అని చెప్పింది. అలాగే ‘‘అతని అన్నయ్య ఒకవైపు నన్ను పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు. మరోవైపు, నా కుటుంబం నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదని జేవీ గౌతమ్ నాతో చెబుతున్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ కనీసం ఏ అమ్మాయినీ మోసం చేయకు," అని పేర్కొంది."Don't get married to anyone, but don't keep any girl in deception either"The young woman who made a video before suicide in Agra leveled serious allegations of deception against police constable Jitendra Gautam!!Constable is arrested and send to Jail.99 percent of Live in… pic.twitter.com/OCDlXiEbLb— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 13, 2026 ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో కానిస్టేబుల్ జె.వి. గౌతమ్ను సస్పెండ్ చేశారు. మరోవైపు ఆమె మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుమార్తెకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు. బాధిత మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆ కానిస్టేబుల్పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.
బామ్మర్ది పెళ్లి.. బావ బలవన్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా: మరికాసేపట్లో బామ్మర్ది పెళ్లి జరగాల్సి ఉండగా.. కుటుంబ సమస్యలతో ఉరేసుకుని బావ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచమ్మగుడి ప్రాంతానికి చెందిన చిన్నం రమేష్(32) టోయింగ్ వెహికిల్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య ఉమారాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. రమేష్ కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఇటీవల అతడి తల్లి మృతిచెందడంతో మానసికంగా మరింత కుంగిపోయాడు. గురువారం రమేష్ సొంత బామ్మర్ది వివాహం జరగాల్సి ఉండగా.. బుధవారం చిన్నరామచర్ల గ్రామంలో జరిగిన హాల్ది వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం రాత్రి కారులో రమేష్ ఆలేరులోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. గురువారం ఉదయం భార్య, కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రమేష్ స్పందించలేదు. దీంతో పక్కింటి వారికి చెప్పడంతో వారు వెళ్లి చూడగా.. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని రమేష్ కనిపించాడు. మృతుడి సోదరి చిన్నం స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. ఇదిలా ఉండగా రమేష్ ఆత్మహత్యతో గురువారం జరగాలి్సన అతడి బావమర్ది పెళ్లి నిలిచిపోయింది.
వీడియోలు
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ రేపటి నుండి భారీ వర్షాలు
ఏపీ బడ్జెట్ లో చంద్రబాబు తప్పుడు లెక్కలు ఆధారాలతో బయటపెట్టిన బుగ్గన
భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు.. యుద్ధ ప్రభావం
99 పైసలకి కాకపోతే ఊరికే ఇస్తా, నా ఇష్టం అంటున్న నారా లోకేష్
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ వెలవెలబోతున్న దుబాయ్
రాజీనామాపై జీవన్ రెడ్డి క్లారిటీ.. నా నెక్స్ట్ స్టెప్ అక్కడికే
అన్నదాత సుఖీభవ పేరుతో. చంద్రబాబు భారీ మోసం
ఇరాన్ గుండెపై అమెరికా మిస్సైల్స్
పశ్చిమాసియా యుద్ధం కారణంగా కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత
ఏలూరు జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ కష్టాలు... అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
