రోజ్డే సెలబ్రేట్ చేస్తే.. పోలీసుల విచారణ..!
పాట్నా: ఆ మహిళ తన భర్తకు రోజ్డే సందర్భంగా ఓ సర్ఫ్రైజ్ ప్లాన్ చేసింది. సెలబ్రేషన్స్ చేసి ఆ రోజును తనకు తీపి జ్ఞాపకంలా మలచుకోవాలని భావించింది. అనుకున్న విధంగానే చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆమె రోజ్డే కోసం చేసిన సెలబ్రేషన్స్ఇప్పుడు ఆమెకు చట్టపరంగా చిక్కులు తెచ్చిపెట్టాయి.బీహార్ ముంగూర్ జిల్లాకు చెందిన కంచనా దేవి అనే మహిళ రోజ్డేను తన భర్తతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని భావించింది. అనుకున్నదే తడవుగా తన భర్తకు రోజాపూలను ఇచ్చింది. అయితే అంతకు ముందు తన భర్తకు గ్లాసులో మద్యం పోసి ఇచ్చింది. ఈ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. ఆ వీడియోలలో ఆమె మద్యం ఇవ్వడం వివాదాస్పదమైంది. ఎందుకంటే అక్కడ 2016నుంచి మధ్యంపై బ్యాన్ విధించారు. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ముంగేర్ జిల్లా ఎస్పీ సయ్యద్ ఇమ్రాన్ మసూద్ స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఆ వీడియాలో పిస్తోల్ ఉన్నట్లు గుర్తించామని విచారణలో అది లైసెన్స్డ్ రివాల్వార్ అని తేలినట్లు పేర్కొన్నారు. రోజ్డే సందర్బంగా భర్తతో కలిసి సరదాగా గడుదామనుకుంటే ఇప్పుడు తనకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రోజ్ డే (Rose Day) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న జరుపుకునే వాలెంటైన్ వారంలో మొదటి రోజు. ఇది ప్రేమ, ఆప్యాయత మరియు స్నేహానికి చిహ్నంగా భావిస్తారు. ప్రియమైన వారికి గులాబీలను బహుమతిగా ఇచ్చి తమ మనసులోని భావాలను వ్యక్తపరుస్తారు.
కోటలు దాటిన మాటలు.. కోట్లు తేలేకపోయాయి ...!
ఈ ఏడాది బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఒరిగిందేమిటి? ఈ ప్రశ్నకు ఎన్డీయే భాగస్వామి పక్షాలైన టీడీపీ, జనసేనలు కూడా సమాధానం చెప్పలేకున్నాయి. ప్రత్యేక కేటాయింపు లేవీ లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్లు ముక్తసరిగా ‘హర్షం’ వ్యక్తం చేశారు. ఏపీ దృష్టిపెట్టిన అంశాలపై దూకుడుగా వెళ్లేందుకు ఉపయోగపడుతుందని సీఎం, అభివృద్ధికి ఊతమని పవన్కళ్యాణ్, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందని లోకేశ్లు పొడిపొడిగా వ్యాఖ్యానించారు.ఫలానా రంగానికి ఇన్ని నిధులు వచ్చాయని మాత్రం చెప్పలేకపోయారు. పదే పదే ఢిల్లీకి చక్కర్లు కొట్టినా.. వేర్వేరు మంత్రులను కలిసి అధిక నిధులు కోరామని ప్రకటనలు గుప్పించినా లభించింది హళ్లికిహళ్లి.. సున్నకు సున్నా! అంతే! కానీ.. ఎల్లో మీడియా మాత్రం తెగ హడావుడి పడిపోయింది.ఈనాడు పత్రిక కథనంలో.. అభివృద్ది బుల్లెట్ పరుగులేనట. అవేమిటంటే రేర్ ఎర్త్ మినరల్ కారిడార్, ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏపీ గుండా వెళతాయట. సెమీ కండక్టర్ 2.0తో ఏపీకి ప్రయోజనం అంటోంది. అదేసమయంలో ఏపీ సమస్యలు, ఆర్థికలోటు వంటివి గాలికొదిలేసింది. పోలవరానికి రూ.3320 కోట్లు, అమరావతికి రూ.2000 కోట్లు వస్తాయని సంబరపడిపోయింది. అప్పుగా అమరావతికి డబ్బులిచ్చినా ఈనాడు చంకలు గుద్దుకుందన్నమాట. అమరావతికి చట్టబద్ధతపై ఏపీ ప్రతిపాదనకు కేంద్రం కొర్రీ పెట్టడంతో ఆలస్యమవుతోందని లేకుంటే ఎప్పుడో అయిపోయేదని కూడా చెప్పుకొచ్చింది ఈ పత్రిక చంద్రబాబు ఈ అంశంపై కూడా అమిత్ షాకు విన్నవించారని తెలిపింది.కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత కూడా చంద్రబాబు ఒకసారి ఢిల్లీకి వెళ్లారు. ఎందుకెళ్లారో స్పష్టత లేదు. పథకాలకు నిధుల కోసమా? తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై బీజేపీ పెద్దలకు వివరణ ఇచ్చుకునేందుకా? ఇదీ కాకుండా.. ఇతరత్రా వ్యక్తిగత పనుల కోసమా? అన్నది తెలియదు. సహజంగానే బాకా పత్రికలు ప్రాజెక్టుల కోసమని, రాష్ట్ర ప్రయోజనాల కోసమని కథనాలు ఊదాయి. చంద్రబాబు స్టైలు కూడా ఇలా లీకులివ్వడమే. కానీ పోలవరం విషయంలో ఈయన గారు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలిస్తే ఈ డొల్ల వ్యవహారం బట్ట బయలవుతుంది. కేంద్ర ప్రాయోజిత పథకమైన పోలవరానికి కేంద్రం బడ్జెట్లో రూ.మూడు వేల కోట్లు కేటాయించింది. ఇంత తక్కువ ఇచ్చారేమిటని కనీసం ప్రశ్నించలేని చంద్రబాబు రెండో దశకు రూ.32 వేల కోట్లు అడిగామని చెప్పుకుంటున్నారు. గత ఏడాది పోలవారినికి రూ.5000 కోట్లు కేటాయించినా.. అంచనాలను సవరించిన తరువాత దక్కింది రూ.మూడు వేల కోట్లే. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే.. చంద్రబాబు అండ్ కో అంకమ్మ శివాలెత్తేది. ‘రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు’’, ‘‘ఆంధ్రుల ఆత్మగౌరవం మంటకలిసింది’’ అంటూ ఊగిపోయేది. గత ఢిల్లీ పర్యటనలోనూ రాయలసీమలో ఉద్యానవన హబ్ ఏర్పాటుకు రూ.41 వేల కోట్లు అడిగామని చంద్రబాబు ప్రకటించారు కానీ ఆ తరువాత ఈ విషయం అయిపు అజా లేకుండా పోయింది.పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేయడం ఏపీకి నష్టం. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా కష్టమతుంది. తొలిదశలో ఇలా ఉంటుంది, ఆ తర్వాత దానిని యథా ప్రకారం 45.72 మీటర్లకు పెంచుతామని కేంద్రం ప్రకటించితే బాగుంటుంది. కాని అలా చేయడం లేదు. ఎందుకంటే పునరావసానికి అధిక నిధులు అవసరం అవుతాయి. నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కనీసం రూ.30 వేల కోట్లు అయినా కావాలి. కాని కేవలం మూడువేల కోట్లతో సరిపెడితే ఏపీ అభివృద్దికి కేంద్ర బడ్జెట్ ఊతమిస్తుందని చంద్రబాబు, పవన్ లు చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలన్నమాట. ఈ పరిస్థితిలో వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా చెబుతున్నారు? తూతూ మంత్రం చేసి అంతా అయిపోయిందని అంటారా అన్నది నీటి పారుదల రంగ నిపుణుల అనుమానంగా ఉంది.కేంద్రంలో మోడీ ప్రభుత్వం మనుగడకు టీడీపీ, జనసేనలకు ఉన్న పదిహేడు మంది ఎంపీల మద్దతు కీలకం. అయినా వీరు రాష్ట్రానికి సంబంధించి తగినన్ని నిధులూ సాధించలేకపోయారు.. కొత్త పథకాలూ వచ్చింది లేదు. ఏంటో వీరి బలహీనత! శీతకన్నేసినా... పట్టించుకోకపోయినా కేంద్రం సహకరిస్తోందన్న ప్రచారం చేసుకోవాల్సిన దౌర్భాగ్యమెందుకో? స్కిల్స్కామ్లో ఈడీతో కూడా క్లీన్ చిట్ ఇప్పించుకున్నట్లు ఎల్లోమీడియాలో కథనాలు వచ్చాయని.. ఢిల్లీ యాత్రల మర్మం ఇదేనని వైసీపీ నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూండటం గమనార్హం. గతంలో ప్రధానిని కలిసిన తర్వాత 2026 నాటికి విశాఖ- తిరుపతి బుల్లెట్ ట్రైన్ లు వచ్చేస్తాయని చెప్పారన్న విషయాన్ని మీడియా గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఏపీకిప్రత్యేక రైల్ కారిడార్ ఏర్పాటు కూడా లేదు. విశాఖ ఉక్కు కర్మాగారానికి గత ఏడాది మూడువేల కోట్లు కేటాయించినా, ఈసారి కేవలం వంద కోట్లకే పరిమితం చేయడం ఆందోళన కలిగించే అంశమే. ఏదో రకంగా దానిని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయన్న సందేహం రావడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఇప్పటికే విభాగాల వారీగా ప్రైవేటువారికి అప్పగిస్తున్నారు. విశాఖ పోర్టుకు గత ఏడాది 750 కోట్లు బడ్జెట్ లో పెట్టగా, ఈసారి అది 450 కోట్లకు తగ్గింది. ఆర్థిక సంఘం నిధులలో కోత,గ్రామీణ ఉపాధి హామీ నిధులలో కోత వంటివి కూడా అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీని కూడా ప్రభావితం చేస్తాయి.మరో వైపు తెలంగాణ కు కూడా అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి వాపోయారు. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసి పునరుజ్జీవ ప్రాజెక్టుకు కాని, మెట్రో విస్తరణకు కాని నిధులు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బడ్జెట్ లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రస్తావనే లేదు. తామంతా ప్రధానమంత్రిని నిధుల కోసం కలిసినా ప్రయోజనం దక్కలేదని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక కొంత శీతకన్ను వేశారని అనుకోవచ్చు. ఈ ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది.కేంద్రంలో టీడీపీ ఎంపీల మద్దతు లేకపోతే ప్రభుత్వం నడవడమే కష్టం అని చెప్పుకుంటారు. చంద్రబాబు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నారని ప్రచారం జరుగుతుంది. అయినా బడ్జెట్ లో ఏపీకి దక్కింది ఏమీ లేకుండా పోయింది. దీనిని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఉండడం ఏపీకి మరింత నష్టం చేస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం
ఢాకా: ఉవ్వెత్తున ఎగసిన విద్యార్థుల ఉద్యమం(2024) మధ్య బంగ్లాదేశ్ శాంతి స్థాపన కోసం నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రధాని హసీనా పదవీచ్యుతురాలై దేశం విడిచిన తర్వాత, దేశ వ్యవస్థను చక్కదిద్దడంలో యూనస్ కీలక పాత్ర పోషించారు. అయితే తన పాత్ర కేవలం ఎన్నికల వరకు మాత్రమేనని, ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగే ఉద్దేశం తనకు లేదని యూనస్ గతంలోనే స్పష్టం చేశారు.ముహమ్మద్ యూనస్ 2006లో గ్రామీణ బ్యాంక్ ద్వారా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చేసిన కృషికి గాను నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. 1983లో ఆయన స్థాపించిన ఈ బ్యాంక్, పేదలకు అతి తక్కువ వడ్డీకే మైక్రో క్రెడిట్ రుణాలు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 1974లో బంగ్లాదేశ్లో సంభవించిన కరువు సమయంలో ఆయన పేదల కోసం దీర్ఘకాలిక రుణాలను ప్రవేశపెట్టి వారి సాధికారతకు కృషి చేశారు. పేదరికాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించే యూనస్, ఇప్పుడు అదే చిత్తశుద్ధితో దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే బాధ్యతను నెరవేర్చారు.ఈ ఎన్నికలు బంగ్లాదేశ్ చరిత్రలో కీలకమైనవిగా నిలిచాయి. ఒకప్పుడు దేశ రాజకీయాలను నడిపిన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్, అల్లర్ల సమయంలో జరిగిన హింస, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో పోటీకి దూరమైంది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) హసీనాకు మరణశిక్ష విధించగా, ఆమె ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) జమాత్-ఏ-ఇస్లామీ ప్రధాన పార్టీలుగా అవతరించాయి. మైనారిటీలపై దాడులు, మతపరమైన ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంలో పట్టుదలతో వ్యవహరించింది. తాజాగా యూనస్ తాను ఇకపై రాజకీయాల్లో కొనసాగబోననని మరోమారు స్పష్టం చేసినట్లు సమాచారం.ఫిబ్రవరి 12న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్పీ (బీఎన్పీ) భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రాథమిక గణాంకాల ప్రకారం 300 స్థానాలకు గాను బీఎన్పీ ఇప్పటికే 150 మార్కును దాటి మెజారిటీని దక్కించుకుంది. 17 ఏళ్ల ప్రవాసం తర్వాత తిరిగి వచ్చిన తారిఖ్ రెహ్మాన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ రెహ్మాన్కు అభినందనలు తెలిపారు.ఇది కూడా చదవండి: షట్డౌన్ చేస్తే చంపేస్తా’.. ఇంజినీర్కు ‘ఏఐ’ హెచ్చరిక!
అర్జున్ సర్జా కామెంట్స్పై స్పందించిన విశ్వక్సేన్
విశ్వక్ సేన్, అర్జున్ సర్జాల సినిమాలు ఒక్కరోజు గ్యాప్తో రిలీజవుతున్నాయి. ఫంకీ ఫిబ్రవరి 13న విడుదలవగా సీతా పయనం ఫిబ్రవరి 14న రిలీజవుతోంది. అన్నీ కుదిరితే "సీతా పయనం"లోనూ విశ్వకే హీరోగా ఉండేవాడు. అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు, షూటింగ్ కూడా మొదలుపెట్టారు! కానీ అనివార్య కారణాల వల్ల అతడు సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో అర్జున్, విశ్వక్ మధ్య మాటల యుద్ధం జరిగింది.విశ్వక్పై పాజిటివ్ రియాక్షన్అయితే విశ్వక్తో వివాదం గురించి ఇటీవల అర్జున్ సానుకూలంగా స్పందించాడు. తను యువకుడు అని, తనకు చాలా భవిష్యత్తు ఉందన్నాడు. ఏదో కుదర్లేదని ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదన్నాడు. విశ్వక్ తల్లి చేతి భోజనం తిన్నానని, అతడు బాగుండాలని కోరుకుంటానని తెలిపాడు. కాలంతో పాటు కొన్ని మర్చిపోవాలని, రెండు సినిమాలు బాగా ఆడాలని ఆకాంక్షించాడు.స్పందించిన విశ్వక్సేన్ఈ వ్యాఖ్యలపై తాజాగా విశ్వక్ స్పందించాడు. ఆయన మాట్లాడింది నాకు చాలా మంచిగా అనిపించింది. ఈరోజు ఉన్న కోపం రేపు ఉండదు. అదే కదా జీవితం! పైగా రెండు సినిమాలు ఒకేరోజు రిలీజవుతున్నాయి. ఆయన చాలా మంచి విషయాలు మాట్లాడాడు. అది విని నాకు మంచిగా అనిపించింది. సీతాపయనం, కపుల్ ఫ్రెండ్లీ సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు. కాగా సీతాపయనం మూవీలో విశ్వక్ స్థానంలో నిరంజన్ నటించాడు.చదవండి: రూ.45 కోట్లు పెడితే రూ.1 లక్షలోపు వసూళ్లు.. గుండె ముక్కలైందన్న హీరోయిన్
మాజీ ప్రధాని హసీనా మరణ శిక్షపై ఉత్కంఠ
IND vs NAM: అంపైర్తో నమీబియా కెప్టెన్ గొడవ.. తప్పెవరిది?
నటి ఆలియా భట్ చెప్పే జీవిత పాఠాలు..!
‘బంగ్లా’ ఎన్నికల్లో హిందూ అభ్యర్థి ఘన విజయం
గుండెను కోసే గాయం…
మంత్రి లోకేష్కు బొత్స సవాల్.. దద్దరిల్లిన మండలి..
పాక్తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్!
1600 BC... ఈజిప్టు- తమిళ్ ట్రేడ్..!
బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం
అల్లు శిరీష్ పెళ్లి సందడి షురూ.. వీడియో వైరల్
ఎయిరిండియా విమానం దోషి... పైలట్ సుమీత్ సబర్వాల్!
Exit Poll: మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా!
T20 WC 2026: బాంబు పేల్చిన సూర్యకుమార్ యాదవ్
దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లందరూ కలసి ఏర్పాటు చేశార్సార్! రోజూ ఓ రెండు గంటలు కోచింగ్ ఇవ్వాలట!
మనం శిక్షించడం దేనికి దేవి! ప్రజలే శిక్షిస్తారు!!
ఓటీటీలో 'జీవా' హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
60 దాటిన బంగారం-వెండి నిష్పత్తి.. ఇక ధరలు తారుమారు!
ఈ రాశి వారికి వ్యాపారవృద్ధి.. ఉద్యోగులకు పదోన్నతులు
పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీ
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ప్రముఖులతో పరిచయాలు
బంగారం లాంటి న్యూస్.. భారీగా తగ్గిందోచ్..
ICC: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్ ఆరోపణలు
బాగా చూసుకోక పోతే నీ మర్యాదను బజారుకు ఈడ్చుతా..!
ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!
పతనమైన పసిడి విలువ.. కారణాలు..
వరల్డ్కప్ జట్టులోకి స్టీవ్ స్మిత్
ఇది వరకు లక్ష తీసుకుంటే ఇప్పుడు డెబ్బయ్ వేలే తీసుకుంటున్నారు!!
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!
భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే..
T20 WC 2026: భారీ లక్ష్య ఛేదన.. చరిత్ర సృష్టించిన ఒమన్ ప్లేయర్
మాజీ ప్రధాని హసీనా మరణ శిక్షపై ఉత్కంఠ
IND vs NAM: అంపైర్తో నమీబియా కెప్టెన్ గొడవ.. తప్పెవరిది?
నటి ఆలియా భట్ చెప్పే జీవిత పాఠాలు..!
‘బంగ్లా’ ఎన్నికల్లో హిందూ అభ్యర్థి ఘన విజయం
గుండెను కోసే గాయం…
మంత్రి లోకేష్కు బొత్స సవాల్.. దద్దరిల్లిన మండలి..
పాక్తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్!
1600 BC... ఈజిప్టు- తమిళ్ ట్రేడ్..!
బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం
అల్లు శిరీష్ పెళ్లి సందడి షురూ.. వీడియో వైరల్
ఎయిరిండియా విమానం దోషి... పైలట్ సుమీత్ సబర్వాల్!
Exit Poll: మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా!
T20 WC 2026: బాంబు పేల్చిన సూర్యకుమార్ యాదవ్
దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లందరూ కలసి ఏర్పాటు చేశార్సార్! రోజూ ఓ రెండు గంటలు కోచింగ్ ఇవ్వాలట!
మనం శిక్షించడం దేనికి దేవి! ప్రజలే శిక్షిస్తారు!!
ఓటీటీలో 'జీవా' హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
60 దాటిన బంగారం-వెండి నిష్పత్తి.. ఇక ధరలు తారుమారు!
ఈ రాశి వారికి వ్యాపారవృద్ధి.. ఉద్యోగులకు పదోన్నతులు
పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీ
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ప్రముఖులతో పరిచయాలు
బంగారం లాంటి న్యూస్.. భారీగా తగ్గిందోచ్..
ICC: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్ ఆరోపణలు
బాగా చూసుకోక పోతే నీ మర్యాదను బజారుకు ఈడ్చుతా..!
ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!
పతనమైన పసిడి విలువ.. కారణాలు..
వరల్డ్కప్ జట్టులోకి స్టీవ్ స్మిత్
ఇది వరకు లక్ష తీసుకుంటే ఇప్పుడు డెబ్బయ్ వేలే తీసుకుంటున్నారు!!
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!
భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే..
T20 WC 2026: భారీ లక్ష్య ఛేదన.. చరిత్ర సృష్టించిన ఒమన్ ప్లేయర్
ఫొటోలు
టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)
బ్యూటీ విత్ బ్రెయిన్.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? (ఫోటోలు )
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
కశ్మీర్ అందాలు ఆస్వాదిస్తోన్న హీరోయిన్ లక్ష్మీరాయ్ (ఫోటోలు)
శ్రీశైలం: నల్లమల అడవుల్లో భక్తుల పాదయాత్ర (ఫోటోలు)
హీరోయిన్ స్నేహ బిజినెస్.. సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
థాయ్లాండ్లో ఎంజాయ్ చేస్తోన్న ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)
'హే భగవాన్' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
మహారాణిలా మెరిసిపోతున్న హీరోయిన్ నభా నటేష్ (ఫొటోలు)
సినిమా
రామ్చరణ్ కవలల బారసాల.. ఏం పేర్లు పెట్టారంటే?
మెగా హీరో రామ్చరణ్ దంపతులు ఇటీవలే (జనవరి 31న) కవల పిల్లలకు జన్మనిచ్చారు. తాజాగా వారికి నామకరణం చేశారు. మొదటి కూతురికి క్లీంకార అని నామకరణం చేసిన మెగా ఫ్యామిలీ ఈసారి కవలలకు కూడా అలాగే ప్రత్యేకమైన పేర్లను పెట్టింది. కొడుక్కి శివరామ్, కూతురికి అన్వీరా దేవి అని నామకరణం చేశారు.కవలలకు నామకరణంఈ బారసాల ఫంక్షన్ గురించి రామ్చరణ్ వెరైటీ ఇండియాతో మాట్లాడుతూ.. పిల్లలకు పేర్లు పెట్టడం అనేది ఒక ఆచారం. ఏ పేరు పెట్టాలని ఉపాసన, నేను ఎంతగానో ఆలోచించాం. ఈ జర్నీలో మా తల్లిదండ్రులు, వారి ఆశీర్వాదాలున్నాయి. నా పిల్లల విషయానికి వస్తే.. కొడుకు పేరు శివరామ్ అని పెట్టాం. శివుడు, రాముడి బలం, నీతి నిజాయితీల ప్రతిబింబానికి నిదర్శనమే ఈ పేరు. అలాగే ఇది నా తండ్రి జన్మపేరు శివ శంకర వరప్రసాద్ను సూచిస్తుంది.పేరు వెనక కథకూతురి పేరు అన్వీరా దేవి.. ఇది అపరిమిత ధైర్యం, స్త్రీ శక్తిని సూచిస్తుంది. వీర అంటే ధైర్యం, అన్ అంటే అపరిమితం అని అర్థం. దేవి అనేది ఉద్దేశపూర్వకంగా పెట్టాం. బలం, ధైర్యం రెండింటి కలయికే అన్వీరా దేవి. ఈ పేర్లు కేవలం గుర్తింపు కోసం కాదు, బలం, ప్రేమ, ధైర్యానికి ప్రతీకలు అని చెప్పుకొచ్చాడు.చదవండి: చికిరి చికిరి హుక్ స్టెప్ సాంగ్ కంపోజ్ చేసింది రామ్చరణా?
'చికిరి చికిరి' బ్యాట్ స్టెప్ ఐడియా రామ్చరణ్దా?
గతేడాది బాగా హిట్టయిన సాంగ్స్లో 'చికిరి చికిరి' ఒకటి. ఇందులో రామ్చరణ్ డ్యాన్స్ స్టెప్స్ బాగా వైరలయ్యాయి. ఆ పాట రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ హుక్ స్టిప్ క్రేయేట్ చేసిన వీడియోలే దర్శనమిచ్చాయి. సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చిన ఈ పాటను ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేయగా మోహిత్ చౌహాన్ ఆలపించాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.కంపోజ్ ఎవరు చేశారంటే?తాజాగా జానీ మాస్టర్ ఓ డ్యాన్స్ షోలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. కూర్చుని లేసే స్టెప్స్ తాను కంపోజ్ చేశానని.. కానీ, క్రికెట్ బ్యాట్ స్టెప్ మాత్రం చరణ్ కంపోజ్ చేశాడని తెలిపాడు. జానీ మాట్లాడుతూ.. హుక్ స్టెప్ చరణ్ అన్న వేరేలా కంపోజ్ చేశారు. బ్యాట్ స్టెప్, దాన్ని పట్టుకునేముందు వచ్చే డ్యాన్స్ స్టెప్ ఆయనే క్రియేట్ చేశారు. ఏరోజూ ఆయన క్రెడిట్ తీసుకోరు, మనకే ఇచ్చేస్తారు. సినిమాఎందుకలా అని అడిగితే.. ఐడియా నాది, కానీ దాన్ని ఇంకాస్త బెటర్గా మార్చి.. ఇది వర్కవుట్ అవుతుందని నమ్మినందుకు ఆ క్రెడిట్ మీకే చెందాలి అన్నారు. రామ్చరణ్ విషయానికి వస్తే.. ఆయన చివరగా నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం పెద్ది అనే స్పోర్ట్స్ డ్రామా మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. చదవండి: రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు
చిన్నతనం నుంచే నాకు గుర్తింపు లేదు: సింగర్
గాయని కెనిషా పేరు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఈమె మల్టీ టాలెంటెడ్ బ్యూటీ. గాయని, గీత రచయిత, డాన్సర్, నటి ఇలా పలు టాలెంట్స్ కలిగిన బెంగళూరు భామ కెనిషా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల నటుడు రవిమోహన్ స్నేహితురాలిగా వార్తల్లో నానుతున్న గాయని ఈమె. అంతే కాదు నటుడు రవిమోహన్కు ఆయన భార్యకు మధ్య మనస్పర్థలకు, వారు విడిపోవడానికి కారణం ఈమె అనే ప్రచారం జరుగుతోంది. వీటన్నింటికి బలం చేకూర్చే విధంగా రవిమోహన్, కెనిషా జంటగా తిరున్నారు.రవి మోహన్పై పొగడ్తలుఇలాంటి పరిస్థితుల్లో నటి కెనిషా సందర్భం వచ్చినప్పుడల్లా రవిమోహన్పై పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇటీవల శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రంలో రవిమోహన్ ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో రవిమోహన్ హీరో అయినా విలన్ అయినా ఆయన వల్లే ఈ చిత్రం ఆడుతోంది. ఎవర్ గ్రీన్ రవిమోహన్ ముందు తన కళ్లకు ఎవరు కనిపించలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రవితో బర్త్డే సెలబ్రేషన్స్రవిమోహన్కు నీడలా ఉంటున్న కెనిషా గత 7వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా రవిమోహన్ హాజరై పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇటీవల ఈ గాయని తన ఎక్స్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో తనకు చిన్న వయసులోనుంచే గుర్తింపు లేదంది. ప్రపంచమే మారిపోయిందితాను ఇతరుల నుంచి చిన్న గుర్తింపు, ప్రేమనే ఆశించానని తెలిపింది. అలాంటిది రవిమోహన్ వచ్చిన తర్వాత తన ప్రపంచమే మారిపోయిందని, తన ఆలోచనలు, భావాలు, ప్రేమ తదితర విషయాలు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయంది. ఎవరేమనుకున్నా తాను బాధ పడనని, తాము నిజంగా చాలా ప్రశాంతంగా ఉన్నామంది. ఈ విషయం తమను అర్థం చేసుకున్న వారికి తెలుసని, కష్టాల్లో అండగా నిలబడినవారికి, రవిమోహన్కు ధన్యవాదాలని కెనిషా పేర్కొంది.
దిల్ రాజు డ్రీమ్స్లో మార్కండేయ
‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించిన 23 ఏళ్లలో 60 చిత్రాలు పూర్తి చేసిన మా సంస్థకు ‘దిల్ రాజు డ్రీమ్స్’ మరో విభాగం. ‘మార్కండేయ’ మూవీ కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని మా దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్లో తొలి సినిమాగా నిర్మించడం సంతోషంగా ఉంది’’ అని ‘దిల్’ రాజు తెలిపారు. విక్రాంత్ హీరోగా సిస్ట్లా వీఎంకే తెరకెక్కిస్తున్న చిత్రం‘మార్కండేయ’. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్గా డబ్బు పోగొట్టుకున్నాను. ఆ తర్వాత ‘పెళ్లి పందిరి’ సినిమా నిలబెట్టింది.‘మార్కండేయ’ మూవీని 2027 మహాశివరాత్రికి విడుదల చేస్తాం. ఈ బ్యానర్లో మరో నాలుగు చిత్రాలు నిర్మిస్తున్నాం. వాటిలో రెండు ఓటీటీ, మరో రెండు థియేట్రికల్గా రిలీజ్ అవుతాయి. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో ‘ఎల్లమ్మ, రౌడీ జనార్థన, దేత్తడి’ వంటి సినిమాలు నిర్మిస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘మాలాంటి కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చి నిలబెడుతున్న రాజుగారికి థ్యాంక్స్’’ అని సిస్ట్లా వీఎంకే పేర్కొన్నారు. ‘‘ఇతిహాసాల నుంచి తీసుకున్న కథతో మేం చేస్తున్న ఒక మిస్టిక్ థ్రిల్లర్ మూవీ ‘మార్కండేయ’’ అన్నారు విక్రాంత్. ఈ కార్యక్రమంలో కెమెరామేన్ జగదీశ్ వర్మ భూపతిరాజు, మ్యూజిక్ డైరెక్టర్ హరి ఎస్ఆర్ మాట్లాడారు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
టీ20 ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా తన జోరును కొనసాగిస్తోంది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో 93 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్లో రెండింటిలోనూ మెన్ ఇన్ బ్లూ సత్తాచాటింది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో టీమిండియా ఓ ప్రపంచ రికార్డును తమపేరిట లిఖించుకుంది.టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా 10 మ్యాచ్ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా వరుసగా 8 విజయాలు సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఇప్పుడు వరుసగా రెండు విజయాలు నమోదు చేయడంతో ఈ అరుదైన భారత్ తమ ఖాతాలో వేసుకుంది. ఈ పొట్టి ప్రపంచకప్లో భారత్ తర్వాత దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు వరుసగా 8 విజయాలు నమోదు చేశాయి.టీ20 ప్రపంచకప్లో వరుసగా అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్లు ఇవేభారత్-10ఆస్ట్రేలియా-8దక్షిణాఫ్రికా-8ఇంగ్లండ్-7చదవండి: T20 WC 2026: అరుదైన మైలురాయిని తాకిన అర్షదీప్ సింగ్
ఇషాన్, పాండ్యా చెలరేగగా...
బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్, చిన్న బౌండరీలు కాబట్టి భారత జట్టు ఈసారి ‘300’ కొడుతుందా అనే చర్చ మధ్య నమీబియాతో మ్యాచ్ మొదలైంది. ఆరంభంలో ఆట చూస్తే అది సాధ్యమే అని కూడా అనిపించింది. చివరకు వచ్చేసరికి ఇది జరగకపోయినా గత మ్యాచ్తో పోలిస్తే భారత బ్యాటింగ్ పదును పెరిగింది. అమెరికాతో ఆశించిన స్కోరుకంటే చాలా తక్కువగా నమోదు చేసిన టీమిండియా ఈసారి మాత్రం 200 దాటింది. ఆపై సమష్టి ప్రదర్శనతో బలహీన ప్రత్యర్థిని కట్టడి చేసిన జట్టు తమ టి20 ప్రపంచకప్ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్ మెరుపులు, వరుణ్ చక్రవర్తి పొదుపైన బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శన జట్టును గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్తో జరిగే అసలు పోరుపైనే అందరి దృష్టీ నిలిచింది. న్యూఢిల్లీ: టి20 వరల్డ్కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ గ్రూప్ ‘ఎ’లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్స్లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించారు. నమీబియా కెప్టెన్, ఆఫ్స్పిన్నర్ గెరార్డ్ ఎరాస్మస్ (4/20) పొదుపైన బౌలింగ్ సహా 4 వికెట్లు పడగొట్టడం విశేషం. భారత్ చివరి 11 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు చేజార్చుకుంది. అనంతరం నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. లౌరెన్ స్టీన్కాంప్ (20 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా...వరుణ్ చక్రవర్తి 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. అభిషేక్ శర్మ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజు సామ్సన్కు అవకాశం దక్కగా... బుమ్రా తిరిగి రావడంతోసిరాజ్ను తప్పించాల్సి వచ్చింది. తమ తర్వాతి మ్యాచ్లో భారత్ ఈ నెల 15న కొలంబోలో పాకిస్తాన్తో తలపడుతుంది. ఇషాన్ 6, 6, 6, 6, 4... అభిషేక్ గైర్హాజరులో అదృష్టవశాత్తూ మ్యాచ్ అవకాశం దక్కించుకున్న సంజు సామ్సన్ (8 బంతుల్లో 22; 1 ఫోర్, 3 సిక్స్లు) సిక్స్తో స్కోరింగ్ మొదలు పెట్టినా అది ఎక్కువసేపు సాగలేదు. షికోంగో ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. మరో ఎండ్లో ఇషాన్ తన జోరును మొదలు పెట్టాడు. 8 బంతుల వ్యవధిలో 4 ఫోర్లు కొట్టిన అతను... స్మిట్ వేసిన ఓవర్లో సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 4 బాదిన అతను 20 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. పవర్ప్లే ముగిసేసరికి 86 పరుగులు చేసిన భారత్... 6.5 ఓవర్లలోనే 100 పరుగులను అందుకుంది. టి20 వరల్డ్ కప్లో అతి తక్కువ బంతుల్లో (35 బంతుల్లో) వంద పరుగులు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇషాన్ అవుటైన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ (12), హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) కూడా తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. అయితే పాండ్యా, శివమ్ దూబే (16 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) భారీ భాగస్వామ్యంతో స్కోరు 200 దాటింది. వీరిద్దరు 39 బంతుల్లో 81 పరుగులు జత చేశారు. షికోంగో ఓవర్లో వరుసగా సిక్స్, 2 ఫోర్లు కొట్టిన హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. చివర్లో వేగంగా ఆడే ప్రయత్నంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. టపటపా... ఛేదనలో దాదాపు సగం ఓవర్ల వరకు నమీబియా ప్రదర్శన మెరుగ్గానే ఉంది. పవర్ప్లేలో జట్టు 57 పరుగులు చేసింది. స్టీన్కాంప్తో పాటు ఫ్రైలింగ్ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), ఎరాస్మస్ (11 బంతుల్లో 18; 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. 9.1 ఓవర్లలో జట్టు 86/2 వద్ద నిలిచింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిది. భారత బౌలర్లు చెలరేగడంతో నమీబియా బ్యాటర్లు ఎవరూ నిలవలేకపోయారు. 8 పరుగుల వ్యవధిలో తర్వాతి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్ కోలుకోలేకపోయింది. ఒకే స్కోరు వద్ద జట్టు చివరి 3 వికెట్లు పడ్డాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) షికోంగో (బి) ఎరాస్మస్ 61; సామ్సన్ (సి) స్టీన్కాంప్ (బి) షికోంగో 22; తిలక్ (సి) స్మిట్ (బి) ఎరాస్మస్ 25; సూర్యకుమార్ (స్టంప్డ్) గ్రీన్ (బి) స్కాల్ 12; పాండ్యా (సి) (సబ్) లీషర్ (బి) ఎరాస్మస్ 52; దూబే (రనౌట్) 23; రింకూ (సి) ఎరాస్మర్ (బి) స్మిట్ 1; అక్షర్ (బి) ఎరాస్మస్ 0; వరుణ్ (నాటౌట్) 1; అర్‡్షదీప్ (రనౌట్) 2; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–25, 2–104, 3–120, 4–124, 5–205, 6–205, 7–206, 8–206, 9–209. బౌలింగ్: రూబెన్ 4–0–38–0, షికోంగో 3–0–41–1, స్మిట్ 4–0–50–1, హీన్గో 1–0–18–0, ఎరాస్మస్ 4–0–20–4, స్కాల్ 4–0–41–1. నమీబియా ఇన్నింగ్స్: స్టీన్కాంప్ (బి) వరుణ్ 29; ఫ్రైలింక్ (సి) దూబే (బి) అర్‡్షదీప్ 22; జాన్ నికోల్ (సి) అక్షర్ (బి) వరుణ్ 13; ఎరాస్మస్ (సి) తిలక్ (బి) అక్షర్ 18; స్మిట్ (బి) వరుణ్ 0; గ్రీన్ (హిట్వికెట్) (బి) దూబే 11; క్రూగర్ (సి) బుమ్రా (బి) అక్షర్ 5; రూబెన్ (బి) బుమ్రా 6; స్కాల్ (సి) అక్షర్ (బి) పాండ్యా 4; షికోంగో (ఎల్బీ) (బి) పాండ్యా 0; హీన్గో (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 116. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–86, 4–86, 5–88, 6–94, 7–111, 8–116, 9–116, 10–116. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 4–0–21 –2, అర్‡్షదీప్ సింగ్ 3–0–36–1, శివమ్ దూబే 2.2–0–11–1, జస్ప్రీత్ బుమ్రా 4–0–20–1, వరుణ్ చక్రవర్తి 2–0–7–3, అక్షర్ పటేల్ 3–1–20–2. టి20 ప్రపంచకప్లో నేడుఆ్రస్టేలియా x జింబాబ్వేవేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి కెనడా x యూఏఈవేదిక: న్యూఢిల్లీ; మ.గం. 3 నుంచి నెదర్లాండ్స్ x అమెరికావేదిక: చెన్నై; రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
మూడు పతకాలూ మనవే
న్యూఢిల్లీ: స్వదేశంలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్లో గురువారం సీనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ క్లీన్స్వీప్ చేసింది. వ్యక్తిగతవిభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు టీమ్ ఈవెంట్లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు స్కోరును సాధించాడు. స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. భారత్కే చెందిన నీరజ్ కుమార్ 361.8 పాయింట్లతో రజతం కైవసం చేసుకోగా... అఖిల్ షెరాన్ 343.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఐశ్వర్య ప్రతాప్, నీరజ్, అఖిల్లతో కూడిన భారత బృందం 1769 పాయింట్లతో టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్లు అడ్రియన్ కర్మాకర్ 353.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... మానవేంద్ర సింగ్ షెఖావత్ 338.6 పాయింట్లతో కాంస్య పతకాన్ని నెగ్గారు. అడ్రియన్ కర్మాకర్, మానవేంద్ర సింగ్, ప్రిన్స్లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1741 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించింది. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు భారత షూటర్లు 38 స్వర్ణాలు, 16 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి 70 పతకాలు సాధించారు.
సెమీస్లో రష్మిక జోడీ
పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక–అంకిత రైనా (భారత్) ద్వయం 7–6 (9/7), 6–3తో భారత్కే చెందిన వైష్ణవి–వైదేహి జంటపై గెలుపొందింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక–అంకిత రెండు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేశారు. హైదరాబాద్కే చెందిన సహజ యామలపల్లికి మాత్రం నిరాశ ఎదురైంది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ (భారత్)–జుజానా పావ్లీకౌస్కా (పోలాండ్) జంట 6–4, 3–6, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో పొలీనా బఖ్ముత్కినా (బెల్జియం)–మరియా గొలోవినా (రష్యా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది.
న్యూస్ పాడ్కాస్ట్
ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి, ప్రజా సమస్యలపై గొంతెత్తాలి... వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం
ఏపీలో సూపర్ సిక్స్ మోసాల ఖరీదు లక్షన్నర కోట్ల రూపాయలు.. రాష్ట్ర గవర్నర్తోనూ అవే అబద్ధాలు చెప్పించిన సీఎం చంద్రబాబు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నోటీసుపై 120 మంది విపక్ష ఎంపీల సంతకాలు
ఆంధ్రప్రదేశ్ ఆయకట్టు ఎడారే!. ఆల్మట్టి ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్ దూకుడు ఆంధ్రప్రదేశ్లో ‘ఆప్కాస్’ ఉద్యోగాలకు మంగళం
అమరావతి సైతం ప్రైవేట్ పరం... అందినకాడికి బాదుడే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు
పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ... వియ్యంకుల సంస్థలకు పనుల అప్పగింత
జంగిల్రాజ్పై ప్రశ్నిస్తున్నందుకే గూండా దాడులు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు అరాచకాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
‘లిఫ్ట్’ తాకట్టుపై రాయలసీమ కన్నెర్ర... ఆపిన పనులు రెండు నెలల్లో మళ్లీ మొదలుపెట్టాలని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ... చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
రెడ్బుక్కే రాజ్యాంగం, చంద్రబాబే ‘సుప్రీం’... తిరుమల శ్రీవారి లడ్డూపై సొంత విచారణ చేపట్టాలని ఏపీ సీఏం నిర్ణయం
బిజినెస్
వసూల్ రాజాలకు వార్నింగ్
ముంబై: రికవరీ ఏజెంట్ల ఆగడాలకు కళ్లెం దిశగా రిజర్వ్ బ్యాంక్ గురువారం కొన్ని ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం లోన్ రికవరీ బాధ్యతలు నిర్వర్తించే ఏజెంట్లు తప్పనిసరిగా దానికి సంబంధించిన శిక్షణ పొందాలి. బ్యాంకు ఉద్యోగి లేదా రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతతో గౌరవప్రదంగా మాట్లాడాలి. వసూలు కోసం వెళ్లినప్పుడు కూడా మర్యాదకరంగా వ్యవహరించాలి. రుణగ్రహీతలకు ఏజెంట్లు చేసే ఫోన్ కాల్స్ అన్నీ కూడా తప్పకుండా రికార్డ్ అయ్యేలా బ్యాంక్ చర్యలు తీసుకోవాలి. ఏజెంట్లు లేదా ఉద్యోగుల దగ్గరున్న కస్టమర్ల వివరాలు దురి్వనియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రికవరీ ప్రయత్నాల్లో భాగంగా ఏజెంట్లు దుర్భాషలాడటం, అనుచిత మెసేజీలు పంపించడంలాంటివి చేయకూడదు. రుణ గ్రహీత కుటుంబం దుఃఖంలో ఉన్న పరిస్థితుల్లో, వివాహ వేడుకలు, పండుగల్లాంటి సందర్భాల్లో లోన్ రికవరీ ప్రయత్నాలు చేయకూడదు. రికవరీ ఏజెంట్లుగా వ్యవహరించే వారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్) నిర్వహించే ’డెట్ రికవరీ ట్రైనింగ్’ తీసుకోవడాన్ని తప్పనిసరి చేసే అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోంది. రికవరీ ఏజెన్సీలు తాము నియమించుకునే ఏజెంట్ల పూర్వచరిత్ర గురించి కూడా తెలుసుకునేలా బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ రుణ బాకీల అంశం న్యాయస్థానం పరిధిలో ఉంటే ఆ వ్యవహారాన్ని ఉద్యోగులకు లేదా రికవరీ ఏజెంట్లకు రిఫర్ చేసే విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మానిటరీ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రికవరీలపై నిర్దిష్ట ప్రకటన చేసిన మీదట రిజర్వ్ బ్యాంక్ తాజా ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించడం గమనార్హం.
ఇక ధరల లెక్క కొత్తగా
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ సూచీ.. క్షేత్రస్థాయిలో వాస్తవ ధరలను ప్రతిఫలించడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటికి సమాధానంగానా అన్నట్టు.. కేంద్ర ప్రభుత్వం వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ)లో కీలక మార్పులు, చేర్పులు చేసింది. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్)కు ఇప్పటివరకు 2012 బేస్ ఇయర్గా ఉండగా దీన్ని 2024కు మార్చింది. గృహ వినియోగ, వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) 2023–24ను ఇందుకు పరిగణనలోకి తీసుకుంది. సీపీఐలో కొన్ని వినియోగ వస్తువులను, సేవలను చేరుస్తూ.. అదే సమయంలో కొన్నింటిని తొలగించింది. కొన్నింటి వెయిటేజీ తగ్గిస్తూ.. కొన్నింటికి పెంచింది. కొత్త బేస్ సంవత్సరం ఆధారంగా చూస్తే ఈ ఏడాది జనవరిలో నిత్యావసర ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2.75 శాతానికి ఎగిసింది. 2012 బేస్ సంవత్సరం ప్రకారం డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.33 శాతమే. సీక్వెన్షియల్గా (నెలవారీ) పెరగ్గా.. 2025 జనవరిలో ఉన్న 4.26 శాతంతో పోలి్చనప్పుడు తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం జనవరిలో 2.77 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 2.73 శాతంగా నమోదైంది. ముఖ్యంగా ఆహారం, మెటల్స్ ధరలు పెరగడం ద్రవ్యోల్బణం ఎగిసేందుకు దారితీసింది. దీంతో ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలోనూ పెరిగినట్టయింది. అయినప్పటికీ ఆర్బీఐ నియంత్రిత లక్ష్యం 4 శాతానికి దిగువనే ఉండడం గమనార్హం. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసింది. → కొత్త సిరీస్ ప్రకారం దేశంలో అత్యధికంగా 4.92 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైంది. ఆ తర్వాత కేరళ, తమిళనాడులో అధిక ద్రవ్యోల్బణం కనిపించింది. → జనవరిలో ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం 2.13 శాతంగా, హౌసింగ్లో 2.05 శాతం చొప్పున నమోదైంది. వ్రస్తాలు, పాదరక్షల విభాగంలో 2.98 శాతంగా ఉంది. → వెల్లుల్లి, ఉల్లి, ఆలుగడ్డలు, కందిపప్పు, శనగపప్పు ధరలు తగ్గాయి. → వెండి, బంగారం, వజ్రం, ప్లాటినం ఆభరణాలు, టమాటాలు, కొబ్బరి, కొబ్బరి నూనె ధరలు పెరిగాయి. → కొత్త సిరీస్లో వస్తువులు 259 నుంచి 308కి పెరిగాయి. సేవలు సైతం 40 నుంచి 50కు చే రాయి. ధరల ప్రభావం మరింత వాస్తవికంగా ఉండేందుకు ఈ చేరికలు సాయపడనున్నాయి. → సూచీలో ఆహారం, పానీయాలకు ఇప్పటి వరకు 45.86 శాతం వాటా ఉంటే, కొత్త సిరీస్లో 36.75 శాతానికి తగ్గింది. సీపీఐలో చేరినవి → గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు (అద్దెలు, నిర్వహణ వ్యయాలు) → ఆన్లైన్ మీడియా సర్వీస్ ప్రొవైడర్లు/స్ట్రీమింగ్ సేవలు → విలువ ఆధారిత పాడి ఉత్పత్తులు → బార్లీ, సంబంధిత ఉత్పత్తులు → పెన్ డ్రైవ్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ → వ్యాయామ పరికరాలు → అటెండెంట్, బేబీ సిట్టర్ (ఇళ్లలో సహాయకులు)సీపీఐ నుంచి తొలగించినవి → వీసీఆర్/వీసీడీ/డీవీడీ ప్లేయర్లు → రేడియో, టేప్రికార్డర్ → వినియోగించిన వ్రస్తాలు → సీడీ/డీవీడీలు, ఆడియా/వీడియో క్యాసెట్లు → కాయిర్/రోప్ → హైరింగ్ చార్జీలు (బాడుగకు తీసుకున్న వాటికి చెల్లించేవి)
ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఫ్లిప్కార్ట్!
ఈ కామర్స్ విభాగంలో ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తున్న ఫ్లిప్కార్ట్.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలో అడుగుపెట్టనుంది. కంపెనీ ఎప్పటి నుంచి ఫుడ్ డెలివరీ స్టార్ట్ చేయనుంది?,.. ఈ రంగంలో జొమాటో & స్విగ్గీ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఫ్లిప్కార్ట్ 2026 మే-జూన్ నాటికి బెంగళూరులో ప్రయోగాత్మకంగా డెలివరీలను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ ఏడాది చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఫుడ్ డెలివరీ ప్రారంభించనున్నట్లు సమాచారం.వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్.. ఫుడ్ డెలివరీ ప్రారభించినట్లయితే.. ఇప్పుడు ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న జొమాటో & స్విగ్గీ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఫ్లిప్కార్ట్ మార్కెట్ విలువ 2025 ఆర్థిక సంవత్సరంలో 9 బిలియన్ డాలర్లు, కాగా ఇది 2030 నాటికి 25 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.ఫుడ్ డెలివరీ చేయడానికి ఫ్లిప్కార్ట్ ఇప్పటికే టీమ్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రెండేళ్ల క్రితమే ఈ కంపెనీ ఓలా, పేటీఎం సంస్థలతో కలిసి ఓఎన్డీసీ ద్వారా ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టాలని యోచించింది. అయితే ఈ చర్చలు ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ ఫుడ్ డెలివరీ విషయం తెరమీదికి వచ్చింది. కానీ దీనిపై ఫ్లిప్కార్ట్ అధికారిక ప్రకటన వెల్లడించలేదు.ఫుడ్ డెలివరీ చేయడానికి చాలా కంపెనీలే పుట్టుకొచ్చాయి. కానీ జొమాటో,స్విగ్గీ మాదిరిగా పాపులర్ కాలేదు. ఇప్పుడు ఈ రంగంలో అడుగుపెట్టనున్న ఫ్లిప్కార్ట్ సక్సెస్ సాధిస్తుందా?, లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది. కాగా.. ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీ విభాగంలో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపించగానే జొమాటో, స్విగ్గీ షేర్స్ తగ్గుముఖం పట్టాయి.
బీఎండబ్ల్యూ రీకాల్.. లక్షల కార్లపై ఎఫెక్ట్!
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, సమస్యను పరిష్కరించుకోవడానికి కస్టమర్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.వాహనాల్లోని స్టార్టర్ మోటార్ లోపభూయిష్టంగా ఉండటం వల్ల.. ఒకానొక సందర్భంలో వాహనంలో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. దీనిని పరిష్కరించడానికే బీఎండబ్ల్యూ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య సుమారు 5,75,000 కార్లలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్!జూలై 2020 నుంచి జూలై 2022 మధ్య ఉత్పత్తి అయిన సుమారు 16 మోడల్స్ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య గురించి కంపెనీ.. తన కస్టమర్లకు ఈమెయిల్స్ లేదా మెసేజస్ రూపంలో వెల్లడించనుంది. దీనికోసం కస్టమర్లు ప్రత్యేకించి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
ఫ్యామిలీ
'నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను'
నా వయసు 34 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి నాకు కోపం ఎక్కువ. చిన్న విషయాలకే ఒళ్లు తెలియని కోపంతో చేతిలో ఏది ఉంటే దానితో కొట్టడం, ఖరీదైన ఫోన్లు, టీవీలు పగలగొట్టడం జరుగుతోంది. కోపావేశంలో నా ముందున్న వ్యక్తి ఎవరు అనే ఆలోచన లేకుండా దాడి చేసే పరిస్థితి వస్తోంది. దీనివల్ల నా భార్య, పిల్లలు చాలా భయపడుతున్నారు. కోపం తగ్గిన తరువాత చాలా బాధ, పశ్చాత్తాపం ఉంటాయి. కానీ ఆ సమయంలో మాత్రం నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. నాకు ఇతర మానసిక, శారీరక సమస్యలు ఏవీ లేవు. ఒకసారి మానసిక వైద్యుడిని కలవాలని అనుకుంటున్నాను. నాకు ఉన్న ఈ సమస్యకు సరైన చికిత్స లేదా పరిష్కారం ఉందా?– రవికుమార్, హిందూపూర్మీ సమస్యను ఇతరుల మీద నెట్టకుండా, మీరే బాధ్యత తీసుకుని మారాలనుకోవడం నిజంగా అభినందనీయం. మీరు వివరించిన లక్షణాలను వైద్య పరిభాషలో ఇగో డిస్కంట్రోల్ సిండ్రోమ్ (ego dyscontrol syndrome) లేదా ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోసివ్ డిసార్డర్ అని అంటారు. ఈ సమస్య ఉన్నవారు చాలా చిన్న విషయాలకే అసాధారణమైన కోపం, ఆవేశానికి గురవుతారు. ఆ సమయంలో తనపై పూర్తిగా నియంత్రణ కోల్పోయి విలువైన వస్తువులను పగలగొట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, మాటలతో లేదా చర్యలతో ఇతరులపై దాడి చేయడం వంటి ప్రవర్తనలు చేస్తాడు. కోపం తగ్గిన తరువాత మాత్రం పశ్చాత్తాపం, తప్పు చేశాననే భావన ఎక్కువగా ఉంటుంది. పరిశోధనల ప్రకారం, ఇలాంటి వ్యక్తుల మెదడులో సెరటోనిన్ (Serotonin) అనే రసాయనం తక్కువ స్థాయిలో ఉండటం గమనించవచ్చు. ఇది చాలా సందర్భాల్లో జన్యుపరంగా వచ్చే సమస్యగా కూడా ఉండవచ్చు. అంటే, సెరటోనిన్ తయారు చేసే వ్యవస్థలోనే లోపం ఉండే అవకాశం ఉంది.అలాగే వారు పెరిగిన వాతావరణం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, కొన్ని అలవాట్లు కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే అమీగ్డాలా, ఫ్రాంటల్ కార్టెక్స్ వంటి భాగాలు సరిగా పనిచేయకపోయినా కూడా ఈ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమస్యకు పూర్తిగా చికిత్స ఉంది. సైకోథెరపీ, కోప నియంత్రణ చికిత్స లతోపాటు, మెదడులో సెరటోనిన్ స్థాయిని పెంచేందుకు తగిన మందులను, మనసుని స్థిమితపరిచే మూడ్ స్టెబిలైజర్స్ వంటి మందుల్ని వైద్యుల పర్యవేక్షణలో వాడడం వలన మంచి మెరుగుదల కనిపిస్తుంది.చదవండి: కొలీగ్పై ఫీలింగ్స్ వస్తున్నాయి.. ఏం చేయాలి?సమయానికి చికిత్స తీసుకుంటే, కోపాన్ని నియంత్రించుకోవడం సాధ్యం అవుతుంది. దీనిద్వారా కుటుంబ జీవితం, వ్యక్తిగత సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి రావచ్చు. ఈ సందర్భంగా మనసుకవి ఆత్రేయ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా’. విరిగిన వస్తువుల్ని అతికించవచ్చు, లేదా మళ్ళీ సంపాదించొచ్చు. కానీ విరిగిన మనసులని, దూరం అయిన బంధాలని మళ్ళీ దగ్గరగా చేసుకోవాలంటే దానికి చాలా శ్రమ అవసరం. కోపాన్ని జయించినవాడే తన జీవితాన్ని జయిస్తాడు అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసినమెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!
విదేశాలకు వెళ్లడం అక్కడే స్థిరపడటం చాలామంది డ్రీమ్. 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా విదేశాల్లోని అక్కడి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం రా..రమ్మని ఆకర్షిస్తుంటుంది. తీరా వెళ్లాక గానీ తెలియదు. అక్కడి సమస్యలు..పరిస్థితులు. ఇక్కడొక భారత మహిళకు కూడా అలా అనిపించే తక్షణమే భారత్కు కుటుంబంతో సహా వచ్చి వాలిపోయింది. ఎందువల్ల తాను ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కానీ ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపదగినవిగానూ విదేశాలకు చెక్కేద్దామనే ఔత్సాహుకులకు గొప్ప పాఠాలుగానూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎందవల్ల ఇలా కుటుంబంతో సహా ఆమె భారత్కు వచ్చేసిందో తెలుసా..!?..లీబా సుబిన్ అనే మహిళ కుటుంబం దుబాయ్ నుంచి భారత్లోని తన స్వస్థలం కేరళకు వచ్చేసింది. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఆమె కారణాన్ని వివరిస్తూ..ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా చేశానని అంటోంది. ఈ నిర్ణయాన్ని సమయా పాలన, మానసిక శాంతికి సంబంధించిన విషయంగా పేర్కొంది. అదీగాక తమ ఫ్యామిలీ వీసా రెన్యువల్, అలాగే ఇంటి అద్దె రెన్యువల్ చేయాల్సి ఉండగానే.. చకచక ఈ నిర్ణయం తీసుకుని వచ్చేసినట్లు తెలిపారు. అలాగని ఏదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదని, బాగా ఆలోచించి, తన భాగస్వామితో, పిల్లలతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇలా వెనక్కి వచ్చేసి కేరళలో తమ సొంతింటిలో నివశించడం వల్ల దుబాయ్లోని అద్దె టెన్షన్ తగ్గింది, అలాగే ఇక్కడి సమాజంలో నివశించడం వల్ల సామాజిక సంబంధాలు పునరుద్ధరింపబడతాయి. పైగా ఎలాంటి అప్పులు, ఈఎంఐల బెడద లేకుడా మానసిక ప్రశాంతతో గడపొచ్చు అని చెప్పుకొచ్చిందామె. పైగా పిల్లవాడికి కేరళలో అంతర్జాతీయ స్కూల్ ఇంటికి సమీపంలోనే ఉంది పదినిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ దుబాయ్లో 90 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుందని జోడించారామె. బహుశా మాకు అనిపించింది..మీకు వర్కౌట్ కాకపోవచ్చు, పైగా మీరు విదేశాల్లోనే కంఫర్ట్ లైఫ్ని లీడ్ చేస్తుండొచ్చని, అది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ..మొత్తం కుటుబ సభ్యులు కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అన్ని విధాల శ్రేయస్కరం అంటూ తన పోస్ట్ని ముగించింది లీబా సుబిన్. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయంతో ఏకభవించారు, పైగా తిరిగి వెళ్లకూదనుకుంటున్న ఆమె నిర్ణయానికి స్వాగతం, శుభాకాంక్షలు అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by leeba (@unfilteredvoiceswithinme) (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!
జిమ్లోనూ వేధింపులా!
ఆరోగ్య స్పృహ పెరగడంతో గతంతో పోల్చితే జిమ్కు వస్తున్న మహిళల సంఖ్య పెరిగింది. ఇది సానుకూల కోణం అయితే, ప్రతికూల కోణం... జిమ్లో వివిధ రూపాల్లో మహిళల భద్రతకు, డిగ్నిటీకి ఎదురవుతున్న ముప్పు. దే«శవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలోని జిమ్, ఫిట్నెస్ కేంద్రాలలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు, టీనేజర్లకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) జిమ్లు, ఫిట్నెస్ సెంటర్ల పనితీరు, నియంత్రణపై నివేదికను కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత మార్గదర్శకాలు, పర్యవేక్షణ విధానాలపై సమాచారాన్ని సమర్పించాలని క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది..మన దేశంలో ఫిట్నెస్ సంస్కృతి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు తమ కంఫర్ట్ జోన్ల నుంచి బయటికి వస్తున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామమే అయినప్పటికీ భద్రతాపరంగా మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయి.→ అలహాబాద్ హైకోర్ట్ ఆందోళనజిమ్లోకి వచ్చే అమ్మాయిలను అశ్లీల దృష్టితో చూడడం, అసభ్యంగా కామెంట్ చేయడం, రహస్యంగా సెల్ఫోన్తో వీడియోలు తీయడంలాంటివి దేశవ్యాప్తంగా చాలా జిమ్లలో జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మేరuЇకు చెందిన జిమ్ ట్రైనర్ నితిన్ సైనీ కేసు విచారణ సందర్భంగా, తగిన రక్షణ చర్యలు లేకుండా జిమ్లలో పురుష ట్రైనర్ ద్వారా శిక్షణ ΄÷ందుతున్న మహిళల భద్రత, ప్రైవసీలపై అలహాబాద్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాధితురాలు ట్రయల్ కోర్టు ముందు వినిపించిన తన వాంగ్మూలంలో నితిన్ సైనీ ఒక మహిళను అశ్లీలంగా వీడియో తీశాడని, తనలాంటి మహిళలకు అశ్లీల వీడియోలు పంపుతున్నాడని ఆరోపించింది.ఈ నేపథ్యంలో నితిన్ సైనీ జిమ్ చట్ట ప్రకారం సక్రమంగా నమోదు చేయబడిందా... లేదా? జిమ్లో మహిళా ట్రైనర్లు ఉన్నారా లేదా?... తెలియజేసే వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని మేరuЇలోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారిని కోర్టు ఆదేశించింది.→ మహిళా ట్రైనర్లు తప్పనిసరిఫ్రభుత్వ, ప్రైవేట్ జిమ్లలో మహిళా ట్రైనర్లను తప్పనిసరిగా నియమించాలని హరియాణా రాష్ట్ర మహిళా కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. లైంగిక వేధింపులను నివారించడానికి మహిళా ట్రైనర్ల నియామకం ఉపకరిస్తుందని చెప్పింది. పురుషులు మాత్రమే ట్రైనర్లుగా ఉండే జిమ్లలో మహిళల అసౌకర్యానికి, లైంగిక వేధింపులకు సంబంధించి పలు ఫిర్యాదులు అందాయని కమిషన్ తెలియజేసింది. జిమ్లో తమకు అసౌకర్యంగా అనిపిస్తే, లైంగిక వేధింపులు ఎదురైతే ఉమెన్ కమిషన్ అధికారిక వెబ్సైట్కు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరింది. హరియాణాలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలోని మహిళా కమిషన్లు ప్రైవేట్, ప్రభుత్వ జిమ్లలో మహిళా ట్రైనర్ల నియామకాన్ని తప్పనిసరి చేయాలని కోరుతున్నాయి.→ నిజమేనంటారా?!‘మిగిలిన విషయాల మాట ఎలా ఉన్నా జిమ్లో బ్యాక్గ్రౌండ్ చెకప్ స్ట్రిక్ట్గా ఉండాలి. సీసీటీవి నిఘా ఉండాలి’ అంటున్నాడు గురుగ్రామ్లోని ‘సెక్టర్ 29 ఫిట్నెస్ సెంటర్’కు చెందిన ఒక పర్సనల్ ట్రైనర్.‘మార్కెట్లో సర్టిఫైడ్ ఉమెన్ ట్రైనర్ల కొరత చాలా ఉంది’ అంటున్నాడు మరో ట్రైనర్.అయితే ఈ కొరత నిజమేనా? కృత్రిమమా... అనేది తెలియాల్సి ఉంది.‘ఉమెన్ ట్రైనర్లు ఉంటే సౌకర్యంగా ఫీల్ అవుతారు. ప్రతి విషయాన్ని మేల్ ట్రైనర్లతో పంచుకోవడం, చర్చించడం మహిళలకు సౌకర్యంగా అనిపించదు’ అంటుంది ఫిట్నెస్ ట్రైనర్ చారు సేథ్.→ ఇలా అయితే కష్టమే!నమోదవుతున్న కేసుల కంటే జిమ్లలో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని, ‘నలుగురికి తెలిస్తే పరువు పోతుంది’లాంటి భయాల వల్ల, రకరకాల ఒత్తిళ్ల వల్ల ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతుంది మానవ హక్కుల కమిషన్. ఫిట్నెస్ కేంద్రాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై స్పందించడానికి, పరిష్కార మార్గాలు కనుగొనే నిర్మాణాత్మక వ్యవస్థ లేకపోవడంపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.అనేక రాష్ట్రాలలో జిమ్ల స్థాపన, నిర్వహణకు సంబంధించి ఒకే రకమైన నిబంధనలు లేవు. దీంతో చాలామంది జిమ్ నిర్వాహకులకు జవాబుదారీతనం లేకుండా పోతోంది. జిమ్లపై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలు అందించాలని మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సి) రాష్ట్రాలను కోరింది. భద్రతా సమస్యలతో పాటు జిమ్లలో ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఎన్హెచ్ఆర్సి గుర్తించింది. సరైన అనుమతులు, నాణ్యత తనిఖీలు లేకుండా కొన్ని జిమ్లు ఫుడ్ సప్లిమెంట్లను విక్రయిస్తున్నాయని కమిషన్ గమనించింది. అనుమతిలేని ఫుడ్సప్లిమెంట్లను విక్రయించడం వల్ల టీనేజర్లు, యువతీయువకులలో హార్మోన్ల అసమతుల్యత, ఇతర శారీరక సమస్యలు వస్తున్నాయి.రాష్ట్రాల నుంచి నివేదికలు అందిన తరువాత జిమ్లు, ఫిట్నెస్ కేంద్రాల పనితీరును నియంత్రించడానికి దేశవ్యాప్తంగా ఒకేరకమైన నిబంధలను ప్రవేశపెట్టాలని కమిషన్ సిఫారసు చేసే అవకాశం ఉంది. జిమ్క్రిప్ ట్రెండ్వేధింపుల ఫిర్యాదుపై నటుడు, ఫిట్నెస్ కోచ్ భాస్కర్ తములీని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంజన్ అనే సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్పై మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదు రావడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది... ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి కొన్ని సంఘటనలు మాత్రమే. జిమ్లోని మహిళలపై జరిగే కనిపించే, కనిపించని వేధింపులకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా అవగాహన పెంచడానికి టిక్ టాక్లో జిమ్క్రిప్ ట్రెండ్ మొదలైంది. ఈ ట్రెండ్లో కీలక పాత్ర పోషిస్తోంది నటాలీ. తాను వివిధ సందర్భాలలో జిమ్లో లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పింది లండన్కు చెందిన 23 ఏళ్ల ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ నటాలీ టార్నెట్. ‘జిమ్లో ఎదురైన లైంగిక వేధింపుల వల్ల నేను చాలా బాధపడ్డాను. అందుకే జిమ్ వేధింపుల గురించి మాట్లాడడం, అవగాహన పెంచడాన్ని నా లక్ష్యంగా చేసుకున్నాను’ అంటుంది నటాలీ.
ప్రతి స్కూల్ లో ఉండాలి టీచర్ల బుక్క్లబ్స్
టీచర్లు టెక్ట్స్బుక్స్ చదువుతారు. సిలబస్ మారితే కొత్త పాఠ్యపుస్తకాలు చదువుతారు. సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉన్నవారు ఆ సబ్జెక్ట్కు సంబంధించిన పుస్తకాలు చదువుతుంటారు. కాని పుస్తకాలు చదువుతున్నారా?పుస్తకాలంటే...సాహిత్యం, చరిత్ర, రాజకీయాలు, జీవిత చరిత్రలు, సినిమా, సంగీతం, సైకాలజీ, యాత్రాకథనాలు... ఈ పుస్తకాలు చదువుతున్నారా? హెచ్ఆర్ఏ అందుకునే టీచర్లు తమ నివాసంలో కనీసం ఒక బుక్షెల్ఫ్ అయినా మెయిన్టెయిన్ చేస్తున్నారా? ఎందుకంటే పుస్తక పఠనం ఉపాధ్యాయులకు చాలా మేలు చేస్తుందని విద్యావేత్తలు అంటున్నారు. బెంగళూరు నగరంలో టీచర్ల బుక్క్లబ్స్ ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి.→ రెండు విధాలా మేలు..పుస్తకాలు చదవడం వ్యక్తిగతంగా, వృత్తిగతంగా మేలు కలిగిస్తున్నాయి. బెంగళూరులోని క్రేయన్ ప్రీస్కూల్ అకాడమిక్ కోఆర్డినేటర్ మధు ప్రకాశ్ కొన్నిరోజుల నుంచి ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. ఏ అనారోగ్య సమస్యా లేదు. అయినా జీవితంలో ఏదో వెలితి. ఆ వెలితిని పుస్తక పఠనం ద్వారా అధిగమించారు. రోజూ కనీసం అరగంట సేపు పుస్తకాలు చదవడం ద్వారా ఒత్తిడి దూరమవడంతోపాటు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తోందని, దానివల్ల ఉద్యోగం మీద ఏకాగ్రత పెరిగిందని వివరిస్తున్నారామె. ఆమె అనుభవం తెలుసుకున్న మరికొందరు టీచర్లు పుస్తకాలు అందుకున్నారు. విద్యావేత్త నీలమ్ దీక్షిత్ పరిశీలనలో రోజుకో అరగంటపాటు పుస్తకాలు, దినపత్రికలు చదివే టీచర్లు ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు నమోదు చేస్తున్నారని వివరిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని పాఠశాల యాజమాన్యాలు బుక్ క్లబ్లు ఏర్పాటు చేసి టీచర్లను అందులో భాగస్వాములను చేస్తున్నారు. వారానికో పుస్తకం చొప్పున చదివేలా ప్రోత్సహిస్తున్నారు. తమతోపాటు టీచర్లు కూడా కూర్చొని పుస్తకాలు చదువుతుండటంతో పిల్లలకు అది ఉత్సాహం కలిగిస్తోందని పాఠశాల యాజమాన్యాలు అంటున్నాయి. → అభి్రపాయాలను మారుస్తూ..‘అకాడమిక్ పుస్తకాలతో కుస్తీ పట్టడానికే సమయం చాలడం లేదు. ఇక బయట దొరికే పుస్తకాలు చదివే వీలెక్కడిది?’ అని కొందరు ఉపాధ్యాయులు పెదవి విరిస్తే ఈ అభి్రపాయాన్ని మార్చేందుకు మధు ప్రకాశ్ ఓ పని చేశారు. జొనాథన్ హైడ్ రాసిన ‘ది ఆంక్షియస్ జనరేషన్’ అనే పుస్తకం గురించి ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. అది ఇతర టీచర్లకు ఆసక్తి కలిగించడంతో వారు ఆ పుస్తకం చదివేందుకు ముందుకొచ్చారు. స్టాన్లీ గ్రీన్ స్పాన్ రాసిన ‘ప్లేగ్రౌండ్ పాలిటిక్స్’ పుస్తకం చదవడం ద్వారా తాను బోధించే విధానం మారిందని వాణి అనే ఉపాధ్యాయిని చెప్పడంతో ఇతర టీచర్లకూ ఆ పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగింది. వర్జీనియా ఆక్స్లైన్ రాసిన ‘డిబ్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ సెల్ఫ్’, ఇ.ఆర్.బ్రెత్వెయిట్ రాసిన ‘టు సర్, విత్ లవ్’ పుస్తకాలు చదవడం వల్ల పిల్లలతో తాను ప్రవర్తించే విధానంగా సమూలంగా మారిందని ప్రతిమా అనే ఉపాధ్యాయిని వివరిస్తున్నారు.→ ఎలాంటి పుస్తకాలు మేలు?టీచర్ బుక్క్లబ్లో ఎలాంటి పుస్తకాలు చదవాలనేదానిపైనా కొందరు టీచర్లు సూచనలు చేస్తున్నారు. హెలెన్ కెల్లర్, ఐన్ స్టీన్, మేరీ క్యూరీ, అన్నా ఫ్రాంక్, మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్ వంటి మహనీయుల జీవితచరిత్రలతోపాటు సైన్స్, చరిత్ర, సాంస్కృతిక అంశాలపై పుస్తకాలకుప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. పాఠాల్లో ఉన్న అంశాలపై మరింత లోతైన సమాచారం అందించే పుస్తకాలనూ టీచర్లు చదువుతూ విద్యార్థుల చేత చదివిస్తున్నారు. బెంగళూరులో కొన్ని స్కూళ్లలో పాటిస్తున్న ఈ విధానం చూసి ఇతర స్కూళ్లలోనూ టీచర్స్ బుక్క్లబ్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. టీచర్లు పాఠకులేనా?టెట్సుకో కురొయానాగి రాసిన ‘టొటొ చాన్ ’ చదివితే పిల్లల సామర్థ్యాలేమిటో అర్థమయ్యాయి అంది ఒక ఉపాధ్యాయిని. స్టాన్లీ గ్రీన్స్పాన్ రాసిన ‘ప్లే గ్రౌండ్ పాలిటిక్స్’ చదివితే పిల్లల మధ్య అనుబంధాలు తెలిసొచ్చాయి అంది మరో ఉపాధ్యాయిని. ప్రభుత్వాలు పిల్లల చేత న్యూస్పేపర్లు చదివించే నిబంధనలను తెస్తున్నాయి.కాని టీచర్లు పాఠకులుగా ఉంటున్నారా? టీచర్లు పుస్తకాలు చదివితే వృత్తి నైపుణ్యంతోపాటు పిల్లల వికాసం మరింత బాగుంటుందని బెంగళూరు టీచర్లు నిర్వహిస్తున్న వాట్సప్ టీచర్స్ బుక్ క్లబ్స్ నిరూపిస్తున్నాయి. టీచర్లూ... ఏం చదువుతున్నారు?
అంతర్జాతీయం
కొంపముంచిన కోతుల రవాణా : ఇండియన్ టూరిస్ట్ అరెస్ట్
రక్షిత వన్యప్రాణులను అక్రమంగా రవాణా చేయడం తీవ్రమైన నేరం. ఈ నేపథ్యంలోనే థాయ్లాండ్ లోని బ్యాంకాక్లోని సువర్ణభూమి విమానాశ్రయంలో భారతీయ టూరిస్ట్ అడ్డంగా బుక్కయ్యాడు. థాయిలాండ్ నుండి రెండు సజీవ కోతులను అక్రమంగా రవాణి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.నేషన్ థాయిలాండ్ నివేదించిన ప్రకారం ముంబైకి విమానం ఎక్కడానికి సిద్ధమవుతున్నప్పుడు కస్టమ్స్ అధికారులు అతని సామానులో దాచిన జంతువులను కనుగొన్నారు. ఈ సంఘటన ఫిబ్రవరి 3న రాత్రి చోటు చేసుకుంది. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణులు మరియు మొక్కల సంరక్షణ విభాగం ప్రైమేట్లు థాయిలాండ్లోని రక్షిత జాతి అయిన ఇండోచైనీస్ లుటుంగ్లు అని నిర్ధారించింది. ఈ ప్రైమేట్ల విలువ దాదాపు 100,000 భాట్ (సుమారు రూ. 2.9 లక్షలు) ఉంటుంది. విమానాశ్రయంలోని వన్యప్రాణుల తనిఖీ కేంద్రంతో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ స్వాధీనం జరిగింది.థాయ్ ఎయిర్లైన్స్ విమానం TG351 బ్యాంకాక్ రూట్ (BKK)లో 28 ఏళ్ల భారతీయుడు కార్తీక్ను అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. తనిఖీల్లో భాగంగా ఇండో-చైనీస్ లుటుంగ్లు బయటపడ్డాయనీ, వాటిని స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలు, సంరక్షణ కోసం వన్యప్రాణి నిపుణులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే నిందితుడిపై చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సువర్ణభూమి విమానాశ్రయం లోని ప్యాసింజర్ ఇన్స్పెక్షన్ కస్టమ్స్ ఆఫీస్ డైరెక్టర్ శాంటానీ ఫైరట్టనకోర్న్ ప్రకటించారు. వైల్డ్ యానిమల్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ (2019) మరియు కస్టమ్స్ యాక్ట్ (2017) కింద కేసులు నమోదు చేశారు.ఇదీ చదవండి: అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారంఇండోచైనీస్ లుటుంగ్జర్మైన్ లంగూర్ (ట్రాచీపిథెకస్ జెర్మైన్) అని కూడా పిలిచే ఇండోచైనీస్ లుటుంగ్ థాయ్ చట్టం మరియు అంతర్జాతీయ పరిరక్షణ ఒప్పందాల ప్రకారం రక్షిత జాతి. ఇవి ప్రకాశవంతమైన నారింజ రంగు బొచ్చుతో చిన్నగా ఉంటాయి. పెరిగేకొద్దీ బూడిద లేదా నలుపు రంగులోకి మారుతాయి. ఇవి ప్రధానంగా థాయిలాండ్, కంబోడియా, మయన్మార్ మరియు వియత్నాంలో కనిపిస్తాయి.ఈ జాతి అంతరించిపోతున్న జాతిగా వర్గీకరించబడింది. దాని వ్యాపారం అంతరించిపోతున్న జాతుల అడవి జంతువులు, వృక్షజాలం (CITES)లో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం ప్రకారం ఖచ్చితంగా నియంత్రించబడుతుంది. అనుమతి లేకుండా అటువంటి జంతువులను దేశం నుండి బయటకు రవాణా చేయడం చట్టవిరుద్ధం. ఇందుకు భారీ జరిమానాలు విధించవచ్చు.అనుమానితుడు ఇప్పుడు అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. మొదటి చట్టం రక్షిత వన్యప్రాణులను అనధికారికంగా ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తుంది, రెండవది కస్టమ్స్ ఫార్మాలిటీలను పూర్తి చేయకుండా థాయిలాండ్ నుండి వస్తువులను ఎగుమతి చేయడానికి ప్రయత్నించడం చట్టవిరుద్ధం.ఇదీ చదవండి: కానిస్టేబుల్స్ పెళ్లి : వధువు నేరగాడితో పారిపోయింది
కెనడా కాల్పుల ఘటన: నిందితుని ఉన్మాదం వెనుక..
వాంకోవర్: కెనడాలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో నిందితునికి సంబంధించిన విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ‘జెస్సీ’ అనే యువకుడు సృష్టించిన బీభత్సానికి పదిమంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. మృతుల్లో జెస్సీ కన్నతల్లి, సోదరితో పాటు ఒక ఉపాధ్యాయురాలు, అభం శుభం తెలియని పసిపిల్లలు ఉండటం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురు ఆస్పత్రులలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 🔥 BREAKING 🔥This is Jesse.Jesse shot 35 innocent people yesterday including his mother, sister, a teacher & young children.10 are dead & many are fighting for their lives.The Government decided that instead of supporting Jesse’s mental health & helping a disturbed child… pic.twitter.com/RDS6ruOcGa— Lozzy B 🇦🇺𝕏 (@TruthFairy131) February 12, 2026ఈ ఉన్మాదానికి వెనుక ఉన్న కారణాలు ఇప్పడు వార్తల్లో నిలిచాయి. జెస్సీ గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతను ఎప్పుడైనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వానికి, సంబంధిత ఏజెన్సీలకు ముందే తెలుసని సమాచారం. అయినప్పటికీ అతడిని ఒక రోగిగా గుర్తించి, సరైన మానసిక చికిత్స అందించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం జెస్సీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సింది పోయి, అతడిని ఒక అమ్మాయిగా పరిగణించి కృత్రిమమైన పద్ధతులను ప్రోత్సహించిందనే మాట వినిపిస్తోంది. అతనికి ‘క్రాస్ సెక్స్ హార్మోన్లు’, ఇతర మందులను ఇవ్వడం ద్వారా అతని శరీరాన్ని, ఆలోచనా తీరును విషపూరితం చేశారని తెలుస్తోంది. ఒక మానసిక రోగి భ్రమలను సరిదిద్దకుండా, వాటిని మరింతగా ప్రేరేపించిన కారణంగానే అతను తనపై తాను నియంత్రణ కోల్పోయి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Bangladesh: మరో హిందూ యువకుని దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ మౌల్వీబజార్ జిల్లాలో ఒక హిందూ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. చంపారా టీ గార్డెన్ కార్మికుడైన 28 ఏళ్ల రతన్ శుభోకర్ పోలీసులకు విగతజీవిగా కనిపించాడు. అతని కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గురువారం ఓటింగ్ జరగడానికి కొద్దిసేపటి ముందే ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.స్థానిక పత్రిక 'డైలీ స్టార్' నివేదిక ప్రకారం రతన్ శుభోకర్ మృతదేహం రక్తంతో తడిసి ఉండటాన్ని గమనించిన కార్మికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. మృతుడి సోదరుడు లక్ష్మణ్ కర్ మాట్లాడుతూ, మంగళవారం రాత్రి నుండి రతన్ కనిపించకుండా పోయాడని, తరువాత తోటలో శవమై కనిపించాడని తెలిపారు. ఈ హత్యకు గల కారణాలు తమకు తెలియవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, నిందితులను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.బంగ్లాదేశ్లో ఎన్నికల వేళ మైనారిటీల భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నది. గత జనవరి నెలలోనే జైలు కస్టడీలో దాదాపు 15 మంది మరణించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదించింది. మరణించిన వారిలో అవామీ లీగ్ సీనేయర్ నేత రమేష్ చంద్ర సేన్, ప్రముఖ సంగీత విద్వాంసుడు ప్రళయ్ చకి తదితరులు ఉన్నారు. డిసెంబర్ 2024లో విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన అశాంతిలో పలువురు హిందూ యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతల గురించి హామీలు ఇస్తున్నప్పటికీ, మతోన్మాద శక్తుల ప్రాబల్యం పెరుగుతుండటంపై మైనారిటీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
Bangladesh: ఉత్కంఠ మధ్య కొనసాగుతున్న పోలింగ్
ఢాకా: బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య ప్రారంభమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడం, విపక్ష నేత ఖలీదా జియా మృతి తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా 299 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. నోబెల్ విజేత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. దాదాపు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల కోసం వివిధ ప్రాంతాల్లో మోహరించారు.ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)తరఫున ప్రధాని రేసులో ముందున్న తారిఖ్ రెహమాన్ ఢాకాలోని గుల్షన్ మోడల్ స్కూల్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 17 ఏళ్ల సుదీర్ఘ ప్రవాసం తర్వాత గత ఏడాది డిసెంబర్లో స్వదేశానికి తిరిగొచ్చిన ఆయన, ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతమే తమ లక్ష్యమని అన్నారు. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పోటీకి దూరంగా ఉన్న నేపథ్యంలో, బీఎన్పీకి భారీ విజయావకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇస్లామిక్ జమాతే ఇస్లామీ నేతృత్వంలోని కూటమి నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవుతోంది.ఈ ఎన్నికలను ప్రపంచంలోనే మొట్టమొదటి ‘జెన్-జీ’ ప్రేరిత ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు. 2024లో షేక్ హసీనా పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థి నాయకులు ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తం ఓటర్లలో నాలుగో వంతు మంది యువత ఉండటం విశేషం. ముఖ్యంగా ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ పేరుతో విద్యార్థి నాయకులు జమాతే ఇస్లామీతో చేతులు కలిపి ఎన్నికల బరిలోకి దిగారు. దేశంలో అవినీతి నిర్మూలన, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం యువత పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు ఉత్నాహం చూపిస్తున్నారు. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ఈ ఎన్నికల ప్రక్రియను తీవ్రంగా విమర్శించారు. తన పార్టీని అనుమతించకుండా జరుగుతున్న ఈ ఎన్నికలు దేశంలో అస్థిరతకు దారితీస్తాయని ఆమె అన్నారు. హసీనాకు కంచుకోటగా భావించే గోపాల్గంజ్ తదితర ప్రాంతాల్లో ఓటర్ల రాక చాలా తక్కువగా కనిపిస్తోంది. VIDEO | Bangladesh Elections 2026: A woman voter is overwhelmed after casting her vote at a polling booth in Dhaka. The Election Commission has made elaborate security arrangements, deploying nearly 1 million security personnel -- the largest-ever in the country's electoral… pic.twitter.com/rWii0EGv6x— Press Trust of India (@PTI_News) February 12, 2026
జాతీయం
వివాహమా?.. ఇప్పుడే వద్దులే!
న్యూఢిల్లీ: వివాహం చేసుకోవడానికి యువత తొందరపడడం లేదు. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి అంటున్నారు. కెరీర్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగంలో లేక వ్యాపారంలో నిలదొక్కుకున్నాక పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. భారత్లో సగటు వివాహ వయసు పదేళ్ల క్రితం 27 ఏళ్లు కాగా.. అది ఇప్పుడు 29 ఏళ్లకు చేరుకుంది. అంటే సగటున 29 ఏళ్లకు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి యువత ఆసక్తి చూపుతోంది. వివాహ పరిచయ వేదిక ‘జీవన్సాథీ’నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. వివాహాలపై 2016 నుంచి 2025 దాకా ప్రజల్లో మారిన ధోరణిని అధ్యయనం చేశారు. అలాగే ఈ ఏడాది 30 వేల మంది అభిప్రాయాలు సైతం సేకరించారు. ‘అతిపెద్ద మార్పు: జీవిత భాగస్వామి ఎంపిక, పెళ్లి విషయలో నిబంధనలు తిరగరాస్తున్న భారత్’ఒక నివేదికను జీవన్సాథీ తాజాగా విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి. → పెళ్లంటే యువతలో అయిష్టత ఏమీ లేదు. ఒక ఇంటివారు కావాలనే కోరుకుంటున్నారు. కానీ, అందుకోసం తొందర పడడం లేదు. 29 ఏళ్లు వచ్చాక తోడు కోసం అన్వేషిస్తున్నారు. → ఈ మార్పు రావడం వెనుక ఆర్థిక కోణమే కీలకంగా కనిపిస్తోంది. ఉద్యోగంలో కుదురుకొని ఆర్థికంగా స్థిరపడితే జీవిత భాగస్వామితో ఆనందంగా గడపొచ్చన్నది యువత ఆలోచన. సాధారణంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాపురంలో కలతలు రేగుతుంటాయి. ఆ పరిస్థితి రావొద్దని నేటి యువత భావిస్తోంది. → పెళ్లిని వ్యక్తిగత ఎదుగుదలకు అవరోధంగా కొందరు భావిస్తున్నారు. అందుకే అనుకున్న లక్ష్యం సాధించిన తర్వాత పెళ్లి ఆలోచన తీసుకొస్తున్నారు. → జీవిత భాగస్వామి మృతిచెందడం లేదా తొలి వివాహం విఫలమైన సందర్భాల్లో మరో పెళ్లి కోసం ఆరాటపడుతున్నవారి సంఖ్య దేశంలో పెరుగుతోంది. → 2016లో 11 శాతం మంది రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు సాగించారు. ఇప్పుడు వారి సంఖ్య 16 శాతం పెరిగింది. → విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని చాలామంది భావిస్తున్నారు. తొలిసారి పెళ్లికి సిద్ధమైనవారు కూడా అప్పటికే ఒకసారి విడాకులు తీసుకున్న వారిని వివాహమాడేందుకు ముందుకొస్తుండడం గమనార్హం. → సరైన జీవిత భాగస్వామి కోసం అన్వేషించే వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. పెళ్లి విషయంలో వయసు, ఆదాయం వంటి వాటికి ప్రాధాన్యం లేదని, ‘రైట్ పర్సన్’కావాలని, అందుకోసం ఎన్నాళ్లయినా వేచి చూస్తామని అంటున్నారు. → కులం పట్టింపు తగ్గిపోతుండడం మరో శుభ పరిణామం. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో కులం ముఖ్యం కాదని కొందరు చెబుతున్నారు. 2016తో పోలిస్తే ఇప్పుడు ఇలాంటివారి సంఖ్య మరింత పెరిగింది. గ్రామాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో ఈ ధోరణి అధికంగా ఉంది. → పెళ్లి అనేది వ్యక్తిగత వ్యవహారమని, భార్య/భర్తను తామే ఎంపిక చేసుకుంటామని యువత వాదిస్తోంది. వీరి సంఖ్య 2016లో 67 శాత ఉండగా, ప్రస్తుతం 77 శాతానికి చేరుకుంది. పెళ్లి కుదిర్చే పనిని తమ కుటుంబ సభ్యులకు అప్పగించే పరిస్థితి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. → భార్య తమ కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ యువకులు పెద్దగా ఇబ్బంది పడడం లేదు. ఎక్కువ సంపాదించే భార్య రావాలని 87 శాతం మంది కోరుకుంటున్నట్లు అధ్యయనంలో తేలింది. భర్త తమ కంటే తక్కువ సంపాదించినప్పటికీ తమకు అంగీకారమేనని 15 శాతం మంది యువతులు చెప్పారు.
సినిమా పేరు మార్చండి.. లేదా రిలీజ్ చేయకండి!
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన ‘ఘూస్ఖోర్ పండట్’సినిమా టైటిల్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఓ కులాన్ని లేదా వర్గాన్ని కించపరచ లేరని స్పష్టం చేసింది. ఆ పేరును మార్చేదాకా సినిమాను విడుదల చేయవద్దంటూ ఆదేశించింది. ఈ అంశంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖకు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సరి్టఫికేషన్(సీబీఎఫ్సీ)కి, సినిమా నిర్మాత నీరజ్ పాండేకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పేయి నటించిన ‘ఘూస్ఖోర్ పండట్’సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు నిర్మాత ఇటీవల ప్రకటించారు. అయితే, సినిమా టైటిల్ తమ వర్గం ప్రజలను కించపరిచేలా ఉందంటూ బ్రాహ్మణ్ సమాజ్ ఆఫ్ ఇండియా నేషనల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ అతుల్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదలపై స్టే విధించాలంటూ ఆయన పిల్ వేశారు. సినిమా పేరుతోపాటు కథాంశం బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా ఉందని ఆయన ఆరోపించారు. కులాన్ని, మతాన్ని సూచించే పండిత్ అనే పదాన్ని, అవినీతిని సూచించే ’ఘూస్ఖోర్(లంచగొండి)’తో కలిపి వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్పై గురువారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘జాగృతం చేయడం, ప్రజలను కించపరుస్తూ అశాంతిని సృష్టించడం అనేవి రెండు వేర్వేరు అంశాలు. ఇప్పటికే ఉన్న విభేదాలు చాలవన్నట్లు, మీరు కొత్తగా ఇలాంటి వాటితో మరింతగా అలజడులను ఎందుకు సృష్టిస్తున్నారు’అంటూ నిర్మాతపై మండిపడింది. ‘రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్యాన్ని మేం గౌరవిస్తున్నాం. అదే సమయంలో దానికీ హద్దులున్నాయి. మీరు ఎవరినైనా ఎందుకు కించపర్చాలి? ఇటువంటి పేరుపెట్టి ఓ వర్గం వారిని ఎందుకు తక్కువ చేయాలని చూస్తున్నారు?’అని ప్రశ్నించింది. ‘దీనిని భావ ప్రకటన స్వేచ్ఛగా భావించలేం. ఆ హక్కు ఇతరులను కించపరిచేందుకు ఇచి్చన లైసెన్సు కాదు. ఇలాంటివి నైతికతకు, సమాజానికి వ్యతిరేకం. పేరు మార్చకుండా సినిమాను విడుదల చేయడానికి మేం అనుమతించం. సినీ నిర్మాతలు, జర్నలిస్టులు తదితరులు ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నాం’అని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా, చిత్రనిర్మాత తరపు న్యాయవాది.. కొత్త టైటిల్ను ఇంకా ఖరారు చేయలేదని, ఎలాంటి వివాదాలకు తావులేని విధంగా టైటిల్ను ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారు. సినిమా టైటిల్ వివాదంపై మంగళవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా..ఆ పేరును మారుస్తామంటూ నెట్ఫ్లిక్స్ హామీ ఇచ్చింది. కథాంశాన్ని, ఉద్దేశాన్ని ప్రతిబించేలా మరో పేరు పెడతామంది.
ఎనిమిదేళ్ల తర్వాత బయటపడ్ట షాకింగ్ విషయాలు
కోర్బా: ఛత్తీస్గఢ్లోని కోర్బాకు చెందిన జర్నలిస్ట్ సల్మా సుల్తానా హత్య కేసులో ఎనిమిదేళ్ల తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో ప్రత్యక్ష సాక్షి కోమల్ సింగ్ రాజ్పుత్ చెప్పిన నిజాలతో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉన్న ఆ దారుణాన్ని ఆమె కోర్టులో వివరించారు.పాట పాడుతూ..2018లో తన లివ్-ఇన్ భాగస్వామిని గొంతు నులిమి చంపిన తర్వాత నిందితుడు మధుర్ సాహులో ఎలాంటి భయం, పశ్చాత్తాపం కనిపించలేదు.. సల్మాను హత్య చేసిన సమయంలో మధుర్ చేతిలో కాలుతున్న సిగరెట్ ఉంది. అతను మృతదేహం పక్కనే కూర్చుని సిగరెట్ తాగుతూ, సల్మాకు ఇష్టమైన "తుఝ్ సే నారాజ్ నహీ జిందగీ, హైరాన్ హూ మై.’’ అనే పాటను పాడినట్లు కోర్టుకు కోమల్ సింగ్ రాజ్పుత్ తెలిపారు.ఆ రోజు ఏం జరిగింది?మధుర్ సాహు జిమ్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే కోమల్ సింగ్.. ఘటన జరిగిన రోజున శారదా విహార్లోని సల్మా ఇంటికి తనను పిలిచారని చెప్పాడు. దంపతుల మధ్య మొదలైన చిన్న వాగ్వాదం.. కాసేపటికే హింసాత్మకంగా మారిందన్నారు. వాగ్వాదం జరుగుతుండగానే మధుర్ మొదట సల్మా గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని.. ఘర్షణ తీవ్రం కావడంతో ఆమెను మంచంపైకి నెట్టి గొంతు గట్టిగా నొక్కినట్లు తెలిపారు. సల్మా అరవకుండా ఉండేందుకు మరో నిందితుడు కౌశల్ శ్రీవాస్ ఆమె నోటిపై దిండు పెట్టి అదిమి పట్టుకున్నాడు. కోమల్ అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. నోరు మూసుకుని ఉండు.. లేదంటే నీకు కూడా ఇదే గతి పడుతుంది" అంటూ నిందితులు ఆమెను బెదిరించారు.నమ్మించేలా ప్లాన్..హత్య తర్వాత, సల్మా ఫోన్ నుండి ఆమె కుటుంబ సభ్యులకు ఒక మెసేజ్ పంపాలని మధుర్ తనను, ఇంట్లో పనిచేసే సవితను బలవంతం చేసినట్లు కోమల్ తెలిపింది. ‘‘నేను వెళ్లిపోతున్నాను.. నన్ను వెతకకండి అంటూ మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆమె తనంతట తానుగా వెళ్ళిపోయిందని నమ్మించేలా ప్లాన్ చేశారు. నిందితుడు తన కంప్యూటర్లో పలువురు మహిళలకు సంబంధించిన అభ్యంతరకర ఫోటోలను దాచిపెట్టి, వారిని బ్లాక్మెయిల్ చేసేవాడని కూడా కోర్టుకు కోమల్ సింగ్ తెలిపారు. తాను ఈ విషయం గురించి పోలీసులకు మరియు సల్మా బంధువులకు చెప్పాలని ప్రయత్నించినప్పటికీ, ఆ విషయం నిందితుడికి తెలిసి తనను చంపేస్తానని బెదిరించాడని ఆమె చెప్పారు.రోడ్డుకింద ఆస్థి పంజరం..హత్య అనంతరం సల్మా మృతదేహాన్ని భవానీ దబ్రీ వద్ద నిర్మాణంలో ఉన్న రహదారి కింద పాతిపెట్టారు. ఐదేళ్లపాటు ఆ రోడ్డుపై వాహనాలు వెళ్తూనే ఉన్నాయి.. కానీ దాని కింద ఒక జర్నలిస్ట్ శవం ఉందనే విషయం ఎవరికీ తెలియదు. 2023లో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR), శాటిలైట్ మ్యాపింగ్ సాంకేతికతను ఉపయోగించిన పోలీసులు రహదారిని తవ్వి అస్థిపంజరాన్ని వెలికితీశారు. డీఎన్ఏ పరీక్షలో అది సల్మాదేనని తేలింది.తుది దశలో విచారణప్రభుత్వ న్యాయవాది సునీల్ సోన్వానీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 41 మంది సాక్షులను విచారించారు. మరో 10 మంది మిగిలి ఉన్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు కూడా బలంగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే, హత్య తర్వాత నిందితుడు పాట పాడాడనే కోమల్ సింగ్ రాజ్పుత్ సాక్ష్యం ఈ కేసులో అత్యంత కీలకమైన అంశంగా మారింది.
లంబోర్ఘిని ప్రమాదం : బిజినెస్ టైకూన్ కొడుకు అరెస్ట్, గంటల్లో బెయిల్
లంబోర్గిని కారు ప్రమాదం కేసులో టుబాకో టైకూన్ కుమారుడు శివం మిశ్రా కుమారుడు 26 ఏళ్ల శివం మిశ్రాను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని కాన్పూర్ (Kanpur) లో గత ఆదివారం జరిగిన లగ్జరీ లంబోర్ఘిని కారు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా టుబాకో టైకూన్ కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా (Shivam Mishra) ను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో హాజరుపర్చిన కేవలం గంటల వ్యవధిలోనే శివం మిశ్రాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఖరీదైన , హైస్పీడ్ కారు ఢీకొని ముగ్గురు ఆస్పత్రిపాలైన నాలుగు రోజుల తర్వాత ఈ అరెస్ట్ జరిగింది.గత ఆదివారం రింగ్ వాలా చౌరాహా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన లంబోర్ఘిని కారు ఝూలా పార్కు దగ్గర ముందుగా ఆటోరిక్షాను, బుల్లెట్ బైకును ఢీకొని, ఆ తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోరిక్షా డ్రైవర్ తౌసీఫ్ అహ్మద్, ఇద్దరు మోటార్ సైకిల్ రైడర్లు విశాల్, సోను త్రిపాఠి గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది శివమ్ కాదని, డ్రైవర్ మోహన్ యాదవ్ అని శివమ్ తండ్రి కేకే మిశ్రా చెప్పారు. డ్రైవర్ మోహన్ యాదవ్ కూడా తానే డ్రైవ్ చేశానని తొలుత ఒప్పుకున్నాడు.అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారును శివం మిశ్రానే నడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, తమ దర్యాప్తులో తేలిందని , ఆస్పత్రి నుంచే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. శివమ్ మిశ్రా కాన్పూర్లో ఉన్నట్లు సమాచారం అందగానే ఐదు బృందాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కన్పూర్ డీసీపీ తెలిపారు.శివం మిశ్రా అరెస్ట్ అక్రమని న్యాయవాది నరేష్ చంద్ర త్రిపాఠి వాదించారు. అందుకే అతని రిమాండ్ను కోర్టు తిరస్కరించిందన్నారు. రూ.20,000 అండర్ టేకింగ్ , మరో రూ.20 వేల వ్యక్తిగత బాండ్పై విడుదలైనట్టు తెలిపారు.
ఎన్ఆర్ఐ
Budget 2026 : NRIలకు గుడ్న్యూస్, మార్కెట్లకు ఊతం, డైరెక్ట్ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా 2026-27 బడ్జెట్లో విదేశీ పెట్టుబడిదారులకు శుభ వార్త చెప్పారు. లోక్సభలో తొమ్మిదో బడ్జెట్ను ప్రవేశ పెడుతున్న ఆమె భారతదేశ ఆర్థిక మార్కెట్లను మరింత బలోపేతం చేయడానికి, మరింత ప్రపంచ మూల ధనాన్ని ఆకర్షించేందుకు సీతారామన్ ఈ రోజు మూడు కీలక అంశాలను ప్రకటించారు కార్పొరేట్ బాండ్లకు మార్కెట్-మేకింగ్ ఫ్రేమ్వర్క్, విదేశీ వ్యక్తులు భారతీయ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి కొత్త మార్గం, లిస్టెడ్ కంపెనీలలోఅటువంటి పెట్టుబడిదారులకు యాజమాన్య పరిమితులను పెంచడం.NRI లకు గుడ్న్యూస్పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (PIS) ద్వారా NRIలు ఇప్పుడు భారతీయ స్టాక్లలో పెట్టుబడి పెట్టవచ్చు. విదేశీ పెట్టుబడిదారులు RBI ఆమోదించిన ప్రత్యేక బ్యాంక్ ఖాతా ద్వారా భారతీయ స్టాక్లను కొనుగోలు చేయడానికి , విక్రయించడానికి అనుమతిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా భారతీయ స్టాక్లలో పెట్టుబడి పెట్టవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ముఖ్యంగా భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత పెంచే లక్ష్యంతో విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు (PROI) ఇకపై భారతీయ లిస్టెడ్ కంపెనీల ఈక్విటీ షేర్లలో నేరుగా పెట్టుబడి పెట్టేందుకు ఉన్న పరిమితిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత పరిమితిని 5 శాతం పెట్టుబడి పరిమితిని 10 శాతానికి పెంచుతూ ప్రతిపాదించారు. అయితే అటువంటి పెట్టుబడిదారులందరికీ కలిపి పరిమితిని 10శాతం నుంచి 24శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఈ మార్పు తీవ్రమైన విదేశీ వ్యక్తిగత పెట్టుబడిదారులు భారతీయ కంపెనీలలో మరింత అర్థవంతమైన వాటాలను తీసుకోవడానికి వీలు ల్పిస్తుంది. ధరల ఆవిష్కరణను, వాటాలను మరింతగా పెంచుతుంది. దీర్ఘకాలిక మూలధన నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. పోర్ట్ఫోలియో పెట్టుబడి పథకం ద్వారా నేరుగా భారతీయ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం అనుమతించాలని కూడా భావిస్తోంది. ప్రస్తుతం, చాలా విదేశీ పోర్ట్ఫోలియో ప్రవాహాలు రిజిస్టర్డ్ విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (FPIలు) లేదా నిర్దిష్ట నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) మార్గాల ద్వారా వస్తాయి. ఇది సాధారణ విదేశీ వ్యక్తికి సంక్లిష్టంగా ఉంటుంది. అటువంటి పెట్టుబడిదారులకు నియంత్రిత, ప్రామాణిక ఈక్విటీ పెట్టుబడి మార్గాలను సులభ తరం చేస్తుంది.అలాగే కార్పొరేట్ బాండ్ల కోసం ప్రతిపాదిత మార్కెట్-మేకింగ్ ఫ్రేమ్వర్క్ భారత రుణ మార్కెట్లోని అతిపెద్ద సమస్యలలో ఒకటైన పూర్ లిక్విడిటీని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫ్రేమ్వర్క్ కింద, నియమిత సంస్థలు ఎంపిక చేసిన కార్పొరేట్ బాండ్లలో నిరంతర కొనుగోళ్లు, అమ్మకాల కోట్లను అందించేలా సాయపడతాయి. పెట్టుబడిదారులు మరింత సులభంగా మరియు సరసమైన ధరలకు స్థానాల్లోకి ఎంట్రీకి, ఎగ్జిట్కి సహాయపడుతుంది. ఇది సేవర్లు , సంస్థలకు సమానంగా, కార్పొరేట్ బాండ్లను బ్యాంకు రుణాలు, స్థిర డిపాజిట్లకు చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కంపెనీలు మరింత పోటీ ధరల వద్ద డబ్బును సేకరించడంలో సహాయపడుతుంది.
కుక్క కోసం రూ. 15 లక్షలా..? ఎన్నారై దంపతులు..
శునకాలను చాలమంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని ఎంత ప్రేమగా, లాలనగా చూస్తోరో తెలిసిందే. కానీ మరీ ఇంతలా పెంపుడు జంతువు కోసం డబ్బు ఖర్చే చేసిన వాళ్లను చూసుండరు. అది కూడా లక్షల్లో అంటే..ఇదేం పిచ్చిరా బాబు అనేస్తాం. కానీ ఈ ఎన్నారై దంపతులు అది కేవలం కుక్క కాదు తమ బిడ్డ అని చెబుతుండటం విశేషం. ఇంతకీ ఆ ఎన్నారై దంపతులు ఆ కుక్క కోసం ఎందుకు అంతలా ఖర్చు చేశారంటే..ఎన్నారై దంపతులు దివ్య, జాన్లు తమ కుక్క కోసం ఎంతలా కష్టపడి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు తెచ్చుకున్నామో 'కహానీ ఆఫ్ టేల్స్' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఈ జంట ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నప్పుడూ..తామెంతో ప్రేమగా పెంచుకున్న స్కై అనే కుక్కని కూడా తమతోపాటే తెచ్చుకోవాలని అనుకున్నారు. అయితే భారత్ నుంచి కుక్క నేరుగా ఆస్ట్రేలియాకు తెచ్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించదు. భారతదేశం నుంచి వచ్చే కుక్కలు ర్యాబిస్ లేని దేశంలో ఆరు నెలలపాటు ఉంచాలి. అప్పుడే దాన్ని ఆస్ట్రేలియాకి తీసుకురావడానికి అనుమితిస్తుంది అక్కడ ప్రభుత్వం. పైగా ఆ తతంగం అంతా చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. అయినప్పటికీ తగ్గేదే లే అంటూ..ఈ జంట దుబాయ్లో తమ ప్రియమైన కుక్కతో కలిసి ఆరు నెలలు ఉన్నారు. మొత్తం ప్రక్రియకు 190 రోజులు పట్టింది. చాలా పేపర్ వర్క్, పలు పశువైద్య పరీక్షలు, టీకాలు, క్వారంటైన్ ఫీజులు అన్ని పూర్తయ్యాక..తాము ముగ్గురం కలిసి అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా వెళ్లే క్షణం రానే వచ్చింది. ఆక్షణం తమకెంతో అపురూపమైనదని, ఎన్నో త్యాగాలు, వ్యయప్రయాసాలు తర్వాత దక్కిన ఉద్విగ్నభరిత క్షణం అంటూ ఇన్స్టాగ్రామ్లో తమ భావోద్వేగ ప్రయాణాన్ని షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆ ఎన్నారై జంట ఆ కుక్క కోసం ఎంత ఖర్చు చేశారో వింటే షాకవ్వడం ఖాయం. ఎందుకంటే ఆ కుక్క కోసమే దాదాపు రూ. 15 లక్షలకు పైనే ఖర్చు చేశారట. పైగా ఆ దంపతులు ఇదేం పిచ్చి వ్యామోహం అనుకోవచ్చు. కానీ అది తమకు కేవలం కుక్క కాదని..తమ బిడ్డేనని..అందువల్ల ఇలా చేశామని ఆ దంపతులు పోస్ట్లో పేర్కొనడం విశేషం. View this post on Instagram A post shared by Kahaanioftails (@kahaanioftails) (చదవండి: ఎవరీ సోఫీ రెయిన్? సోషల్ మీడియా సాయంతో అన్ని కోట్లా..!)
చాట్జీపీటీతో చిక్కుల్లో పడ్డ గొట్టుముక్కల మధు
ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వీలైనన్ని ఎక్కువ మార్గాల్లో వినియోగించుకుంటున్నారు యూజర్లు. ఈ క్రమంలో అమెరికాలో సంచలనం చోటు చేసుకుంది. అమెరికా సైబర్ ఏజెన్సీ అధికారి ఒకరు చాట్జీపీటీ వినియోగంతో చిక్కుల్లో పడ్డారు. ఆయన భారతీయ మూలాలు, అందునా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి కావడం ఇక్కడ విశేషం. అమెరికా ప్రభుత్వ నెట్వర్క్లను రక్షించే బాధ్యత కలిగిన సీఐఎస్ఏ(Cybersecurity & Infrastructure Security Agency) చూసుకుంటుంది. దానికి తాత్కాలిక డైరెక్టర్ ఉన్న డాక్టర్ మధు గొట్టుముక్కల(Madhu Gottumukkala) ఏఐతో కొత్త తలనొప్పి తెచ్చి పెట్టుకున్నారు. చాట్జీపీటీలో ఆయన సంస్థకు చెందిన కీలకమైన పత్రాలను అప్లోడ్ చేశారట. అది పబ్లిక్ వెర్షన్లో కావడంతో వివాదం రాజుకుంది. పొలిటికో నివేదిక ప్రకారం.. కిందటి ఏడాది జులై-ఆగస్టు మధ్యకాలంలో మధు గొట్టుముక్కల కాంట్రాక్టింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పత్రాలను చాట్జీపీటీకి అప్లోడ్ చేశారు. అవి అంత గోప్యమైనవి కాకపోయినా.. కేవలం అధికారిక సంబంధిత పత్రాలే(For Official Use Only) కావడంతో రచ్చ మొదలైంది. ఆయన అలా అప్లోడ్ చేయగానే.. ఆటోమేటెడ్ సెక్యూరిటీ అలర్ట్ మోగింది. దీంతో డీహెచ్ఎస్ (Department of Homeland Security) అప్రమత్తమైంది. మధు గొట్టుముక్కల చేసిన పని వల్ల ఏదైనా నష్టం జరిగిందా? అనేదానిపై డీహెచ్ఎస్ సమీక్ష జరిపింది. అయితే ఆ ఇంటర్నల్ రివ్యూలో ఏం తేలిందో మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆయనపై ఏమైనా చర్యలు ఉంటాయా? అనేదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. సాధారణంగా.. డీహెచ్ఎస్ పరిధిలోని ఉద్యోగులకు చాట్జీపీటీ, ఇతర ఏఐ టూల్స్ను ఉపయోగించడానికి యాక్సెస్ ఉండదు. కానీ, మధు గొట్టుముక్కల మాత్రం ప్రత్యేక అనుమతి తీసుకున్నారట. ప్రత్యేక అనుమతులతో పరిమితంగా ఉపయోగించేందుకు వీలుందట. అయితే అందులో డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడం అభ్యంతరాలకు దారి తీసింది. ఈ క్రమంలో ఆయనపై సస్పెన్షన్ వేటు లేదంటే బదిలీ వేటులాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లేదంటే.. ఏఐ టూల్స్ వినియోగంపై మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మధు గొట్టుముక్కల.. భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ అధికారి. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంగా తెలుస్తోంది. కుటుంబం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. రష్యా, చైనా వంటి దేశాల నుండి వచ్చే అధునాతన సైబర్ ముప్పులను సీఐఎస్ఏ డైరెక్టర్ ఎదుర్కోవడం ఆయన బాధ్యత. డకోటా స్టేట్ యూనివర్సిటీలో పీహెచ్డీ, డల్లాస్లో ఎంబీఏ, అర్లింగ్టన్లో ఎంఎస్, విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో బీఈ చేశారు. ఆయన చేసిన పని అమెరికా సైబర్ సెక్యూరిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ సున్నితమైన పత్రాలను AI ప్లాట్ఫారమ్లలో ఉపయోగించడం ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న ముందుకు తెచ్చింది.
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే వలస కార్మికుల ఉచిత వీసాల కోసం అక్కడి ఏడీఎన్హెచ్ సంస్థ, తెలంగాణలోని జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నాలుగు చోట్ల ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. క్లీనింగ్ విభాగంలో పనిచేసేందుకు ఉచితంగా వీసాలను జారీ చేసి, ఉచిత విమాన టికెట్, వసతి, భోజన సదుపాయం కల్పించి.. మన కరెన్సీలో రూ.23 వేల వరకు వేతనాలను చెల్లించనున్నారు. వచ్చే నెల 6న జగిత్యాల, సిరిసిల్లలో, 7న నిజామాబా ద్, ఆర్మూర్లలోని జీటీఎం సంస్థ కార్యాలయాలలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. వివ రాల కోసం ఆర్మూర్ (8332062299), నిజామాబాద్ (8686860999), జగిత్యాల (83320422 99), సిరిసిల్ల (9391661522) నంబర్లలో సంప్రదించవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దళారుల్ని నమ్మొద్దు ఈనెల 9, 10 తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరైన వంద మందిని రెండు మూడు రోజుల్లో యూఏఈకి పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దళారులను నమ్మి మోసపోవద్దు. – చీటీ సతీశ్రావు, చైర్మన్, జీటీఎం ఇంటర్నేషనల్ (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!)
క్రైమ్
రూ.500 కోట్ల రియల్ స్కాం, సీఈవో అరెస్ట్
హరియాణాలోని గురుగ్రామ్లో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. ప్రముఖ లగ్జరీ హబ్ ‘32 అవెన్యూ’ CEO ధ్రువ్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.500 కోట్ల రియల్ ఎస్టేట్ కుంభకోణం చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి పోలీసుల ప్రకారం, శర్మ ఒక వాణిజ్య భవనంలోని ఒకే అంతస్తును దాదాపు 25 మంది విక్రయించాడు. భారీ మోసపూరిత ఆపరేషన్కు సంబంధించి గురుగ్రామ్ పోలీసులు శుక్రవారం శర్మను అరెస్టు చేశారు. ఈ ఫిర్యాదుల విలువ మొత్తం రూ. 500 కోట్ల దాకా ఉంటుందని దర్యాప్తు అధికారుల అంచనా. నకిలీ ఒప్పందాలు, తప్పుదారి పట్టించే హామీలు, లాభాల ఆశ జూపి విక్రయించాడనేది ఆరోపణ.అయితే కొనుగోలుదారులకు సంబంధిత ఆస్తిని స్వాధీనం చేయకుండా ఏవేవో సాకులు చెబుతూ జాప్యం చేయడం, యాజమాన్య పత్రాలు ఇవ్వలేదని ఫిర్యాదు చేయడంతో ఈ మెగా స్కాం వెలుగులోకి వచ్చింది. ప్రతి లావాదేవీని చట్టబద్ధంగా కనిపించేలా చేయడానికి అనేక నకిలీ పత్రాలను సృష్టించి కొనుగోలు దారులను మోసం చేశాడు. ఈ విధంగా 2022 - 2023 మధ్యకాలంలో ఈ కాంప్లెక్స్లోని 3,000 చదరపు అడుగుల మొదటి అంతస్తు యూనిట్ను విక్రయించి, శర్మ వివిధ వ్యక్తుల నుండి సుమారు రూ. 500 కోట్ల మేర మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. జనవరిలో ట్రామ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి ఒకరు అప్రా మోటెల్స్, 32 మైల్స్టోన్ విస్టాస్ ప్రైవేట్ లిమిటెడ్పై ఫిర్యాదు చేశారని గురుగ్రామ్ పోలీసుల ప్రతినిధి తెలిపారు. దీంతో పాటు ఇతర ఫిర్యాదుల మేరకు పలు కేసులు నమోదయ్యాయి. అధికారులు బ్యాంకు రికార్డులు, ఆర్థిక లావాదేవీలు మరియు ప్రాజెక్టుకు సంబంధించిన షెల్ ఎంటిటీలను పరిశీలిస్తున్నారు. ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు తర్వాత, ధ్రువ్ దత్ శర్మను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని అరెస్టులు చేసేఅవకాశంఉందని పేర్కొన్నారు. నిందితుడిని నగర కోర్టులో హాజరుపరిచి ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. మరోవైపు రూ.64 లక్షలు మోసం చేశారని ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక జంట ఆరోపించారు. వారి ఫిర్యాదుమేరకు డిసెంబర్లో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో సీఈఓ ధ్రువ్ శర్మ, అతని సోదరి, తల్లిదండ్రులు, ఇతరులపై నేరపూరిత కుట్ర, నేరపూరిత నమ్మక ద్రోహం, మోసం, ఫోర్జరీ లాంటి అభియోగాలు మోపడం గమనార్హం. అంతేకాదు 32వ అవెన్యూ ఉద్యోగి కార్మికులకు గత కొన్ని నెలలుగా జీతం చెల్లించలేదట.గతంలో ఫోర్బ్స్ 30 అండర్ 30లో చోటు సంపాదించుకున్న ధ్రువ్ శర్మ అవినీతి వ్యవహారం, భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, నియంత్రణ, పెట్టుబడిదారుల రక్షణ గురించి ఆందోళనలను మరింత పెంచింది.
బాగా చూసుకోక పోతే నీ మర్యాదను బజారుకు ఈడ్చుతా..!
యశవంతపుర(బెంగుళూరు): ఉత్తర కన్నడ జిల్లా కారవార సిద్ధాపురలో వసంత నాయక్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రియుడు కమలాకర భట్ను నిందితురాలు సుచిత్ర హనీట్రాప్ చేసి బెదిరించిన విషయం వెలుగులోకి వచ్చింది. హనీట్రాప్ చేసిన విషయాన్ని భర్త మహేశ్ నాయక్ వెల్లడించారు. జ్యోతిష్యుడు కమలాకర భట్ను సుచిత్ర హనీట్రాప్ చేయటంతో పాటు ప్రైవేట్ వీడియో రికార్డ్ చేసుకుని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించారు. కమలాకర్ భట్ సుచిత్రకు దగ్గర అయిన తరువాత ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసుకుంది. పిల్లలు, తాను నీ జతలోనే ఉంటామని కమలాకర భట్తో చెప్పి, తమను బాగా చూసుకోవాలని డిమాండ్ చేసింది. బాగా చూసుకోక పోతే నీ మర్యాదను బజారుకు ఈడ్చుతానంటూ కమలాకర భట్ను బెదిరించినట్లు సమాచారం. మర్యాద పోతుందనే భయంతో సుచిత్ర, ఆమె పిల్లలను కమలాకర భట్ తన వద్దనే ఉంచుకున్నాడు. ఈ విషయాన్ని తన కుమార్తెలు చెప్పినట్లు మహేశ్ నాయక్ విలేకరులకు వెల్లడించారు. ఫస్ట్లుక్కు రూ.10 వేలు.. సుచిత్ర బుట్టలో పడిన కమలాకర్ భట్.. ఫస్ట్ లుక్లో రూ.36 వేలు చెల్లించాడు. ఫస్ట్లుక్లో రూ.10 వేలు వస్తే చాలు అనుకున్న సుచిత్రకు ఒక్కసారిగా 36 వేలు రావడంతో సంతోష పడింది. ఇందులో ఆమె వేతనం కింద రూ.25 వేలు, షాపింగ్కు రూ.10 వేలు తీసుకున్నట్లు సుచిత్రా భర్త మహేశ్ నాయక్ చెబుతున్నారు.
సోషల్ మీడియా సెలబ్రిటీ రేష్మా ఆత్మహత్య!
బెంగుళూరు: అనుమానాస్పదంగా సోషల్ మీడియా కార్యకర్త ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయిన ఘటన కేరళ– కర్ణాటక సరిహద్దుల్లోని కాసరగోడులో జరిగింది. చిన్న పాప అనే పేరుతో రేష్మా (24) సోషల్ మీడియా కార్యకర్తగా ప్రజాదరణ పొందింది. ఉళియత్తడ్కలో బాడుగ ఇంటిలో నివాసం ఉంటోంది. అదే ఇంటిలో మంగళవారం మధ్యాహ్నం ఆమె ఉరి వేసుకొన్న స్థితిలో ఉండగా, స్థానికులు చూసి కిందికి దించి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించింది. ప్రజుల్లా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రేష్మాకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవలే విడాకులు అయితే తీవ్రమైన గొడవలు కావడంతో నెల కిందటే భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె ఒక్కరే జీవిస్తోంది. కొడుకును కాసరగోడులో తల్లిదండ్రుల వద్ద ఉంచింది. రేష్మా ఇంటికి ఆమె ప్రేమికుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడని తెలిసింది. రేష్మా ముబైల్ ఫోన్ను పోలీసులు స్వా«దీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. రేష్మా తల్లిదండ్రులు గంగాధరన్, శైలజ కాగా, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆమె తండ్రి జీపు డ్రైవరు. ఇన్స్టాలో రేష్మాకు 2 లక్షలకు పైగా ఫోలోయర్లు ఉన్నారు. డ్యాన్సులు, స్కిట్లు వంటి కార్యక్రమాలతో ఆదరణ పొందుతోంది. గ్రామీణ జీవితం, వంటకాల పోస్టులు చేసేది. చిన్నపాప మరణంతో సోషల్ మీడియాలో ఆవేదన, సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. కుటుంబ గొడవలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానాలున్నాయి. View this post on Instagram A post shared by Real Time Malayali (@realtime_malayali)
8 కేజీలకు పైగా బంగారమిచ్చినా కట్న వేధింపులే
రాయచూరు( కర్ణాటక ): కేజీల కొద్దీ బంగారం, లక్షల రూపాయల డబ్బు తీసుకుని పెళ్లి చేసుకున్న తరువాత కూడా మరింత కట్నం తేవాలని వేధిస్తున్న ధనదాహపు భర్త, అత్తమామల ఉదంతమిది. నవ వివాహితను వేధిస్తున్న కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ఈ విషయంపై సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరారెడ్డి వివరాలను వెల్లడించారు. కళ్లుచెదిరే కట్న కానుకలు.. జిల్లాలోని సింధనూరులోని రామ్ కిశోర్ కాలనీలో నివాసముంటున్న సూర్యబాబు కుమార్తెకు బళ్లారి జిల్లా కృష్ణా నగర క్యాంప్ నివాసి ఆలపాటి కృష్ణ చైతన్యతో గత ఏడాది జూన్ 7న వివాహమైంది. కృష్ణచైతన్య బెంగళూరులో టెక్కీగా పనిచేస్తున్నాడు. పెళ్లి సమయంలో కృష్ణ చైతన్యకు అక్షరాలా 8.5 కేజీల బంగారం, 4.5 కేజీల వెండి, రూ.6 లక్షల నగదు, రూ.8 లక్షలు దుస్తులకు, రూ.15 లక్షలు విలువ చేసే కారు, వంట సామగ్రి కోసం రూ.3 లక్షలు, కుటుంబ సభ్యుల ఖర్చులకు రూ.15 లక్షలు ఇచ్చి అత్యంత ఆర్భాటంగా పెళ్లివేడుకను జరిపించారు. నవంబరు నుంచి నరకం అయితే నవంబర్ నెలలో మరింత కట్నం తేవాలని భర్త, అత్తమామలు, అతని అక్క, బావ, మరిది తదితరులు నవ వధువును చిత్రహింసలు పెట్టసాగారు. ఇది తట్టుకోలేక ఆమె పుట్టింటికి వచ్చేసి ఉంటోంది. పుట్టింటి నుంచి ఆస్తిలో సగ భాగం తెచ్చేవరకు ఇంటికి రావద్దంటూ భర్త హుకుం జారీ చేశాడని సీఐ తెలిపారు. వారి సతాయింపులను తట్టుకోలేక సూర్యబాబు, కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై గృహ హింస కేసు నమోదు చేశామన్నారు. భర్త కృష్ణచైతన్య, అత్త అనంతలక్ష్మి, మామ ఆలపాటి శ్రీనివాస్, కుటుంబ సభ్యులు గీతాశ్రీ, వెంకటకృష్ణ, శ్రీకాంత్, కృష్ణవంశీలను అరెస్ట్ చేశామని తెలిపారు.
వీడియోలు
మధిర, హాలియాలో కాంగ్రెస్ కైవసం
MRF ఇన్వెస్టర్లపై కాసుల వర్షం..
మీ వారణాసి కోసం వెయిటింగ్ సార్
నాకు శ్రీధర్ కి జరిగింది ఇదే.. బాధితురాలి కొత్త వీడియో
కరీంనగర్ లో బీజేపీ డామినేషన్..
కారుపై పడిన కంటైనర్.. అక్కడికక్కడే..!
ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నా.. ఆ స్థలం YSRCP దే..
అసెంబ్లీలో కీచకుడు.. సస్పెండ్ చేయకుండా సపోర్ట్..
పవన్ కు బిగ్ షాక్.. అసెంబ్లీలో దేవాన్ష్ పై పొగడ్తలు.. జనసేన MLA ఓవరాక్షన్
20 వేల మందితో కౌంటింగ్.. కరీంనగర్ లో BJP జోష్

