బుమ్రాపై పాక్ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్లో జన్మించి, యూఏఈ తరఫున ఆడిన జహూర్ ఖాన్ అనే పేస్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు తానే కోచింగ్ ఇచ్చానంటూ గొప్పలకు పోయాడు. స్లో డెలివరీ వేరియేషన్ను బుమ్రా తన వద్దనే నేర్చుకున్నాడని అన్నాడు.జహూర్ మాటల్లో.. 2019లో నేను ఓ టీ10 లీగ్లో లెండిల్ సిమ్మన్స్కు ఐదు స్లో డెలివరీలతో మెయిడిన్ ఓవర్ వేసాను. ఆ వీడియో చూసిన బుమ్రా.. ఇవి ఎలా వేసావు.. హ్యాండ్ గ్రిప్ ఎలా ఉంటుందని నన్ను అడిగాడు. ఆతర్వాత ముంబై ఇండియన్స్ కోచింగ్ క్యాంప్లో నేను ఆయనకు అలాంటి బంతులే వేసి చూపించాను. జహూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. జహూర్కు అంత సీన్ లేదని భారత క్రికెట్ అభిమానులు అంటున్నారు. బుమ్రా నిరంతర అభ్యాసంతో ప్రపంచంలో అత్యుత్తమ పేసర్గా ఎదిగాడని కితాబునిస్తున్నారు.వాస్తవానికి స్లో బాల్ అనేది బుమ్రా అమ్ములపోదిలో ఓ అస్త్రం. స్లో బంతులను అతను అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. చాలా సందర్భాల్లో ఇలాంటి బంతులతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించాడు. ఈ స్లో బాల్స్ను కూడా బుమ్రా అందరికీ భిన్నంగా వేస్తాడు. మణికట్టు సాయంతో సంధిస్తాడు. బ్యాటర్లు వీటిని పసిగట్టడం కష్టమవుతుంది. తాజాగా జరిగిన ప్రపంచకప్లోనూ బుమ్రా ఇలాంటి బంతులను చాలాసార్లు ప్రయోగించాడు. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో జేకబ్ బేతెల్ జోరు మీద ఉన్నప్పుడు వీటితోనే అతని ఆట కట్టించాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లోనూ యార్కర్లతో పాటు ఈ స్లో డెలివరీలను ప్రయోగించాడు. ఫైనల్లో బుమ్రా అద్వితీయ ప్రదర్శన (4 వికెట్లు) కారణంగా భారత్ వరుసగా రెండో పొట్టి ప్రపంచకప్ సాధించింది. ఈ ప్రపంచకప్లో బుమ్రా 8 మ్యాచ్ల్లో 12.43 సగటున, 6.21 ఎకానమీతో 14 వికెట్లు తీసి భారత్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు.
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడతారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
దా‘రుణ’మైన ‘పెళ్లి కానుక’
అనంతపురం టౌన్: నిరుపేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు పెళ్లి కానుకలను అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ‘పెళ్లి కానుక’ పథకానికి మంగళం పాడారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రూ.లక్ష, బీసీ వర్గాలకు రూ.50వేలు, కులాంతార వివాహాలకు రూ.లక్ష చొప్పున అందిస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయలేక చేతులేత్తేశారు. కల్యాణలక్ష్మి పేరిట రుణ పథకానికి శ్రీకారం ఈ నెలలో ఉగాది పండుగ తర్వాత ‘ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి’ పథకాన్ని అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పెళ్లి కానుకైతే ఉచితంగా ఇవ్వాల్సి వస్తుందని, ఆ భారం నుంచి తప్పించుకునేందుకు ‘కల్యాణలక్ష్మి’ పేరుతో రుణ పథకాన్ని అమలు చేస్తోంది. ఆడబిడ్డ పెళ్లి కోసం బ్యాంక్ల ద్వారా రూ.10 వేల నుంచి రూ.లక్ష మేర రుణం మంజూరు చేయనుంది. తీసుకున్న రుణాన్ని 48 వాయిదాల్లో 4 శాతం వడ్డీతో బ్యాంక్లకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంతో నిరుపేదలకు ‘పెళ్లి కానుక’ ఇవ్వకుండా రుణాలు ఇవ్వడం ఏంటని మహిళా సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. గతంలో అమలు చేసిన విధంగా ‘పెళ్లికానుక’ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. కల్యాణలక్ష్మి రుణ పథకానికి అర్హతలు ఇవే.. పెళ్లికూతురికి కచ్చితంగా 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. కూతురు పెళ్లికి రుణం పొందే మహిళలు డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలల సభ్యత్వం కలిగి ఉండాలి. పెళ్లి కూతురు ఆధార్కార్డు, పెళ్లి పత్రిక, పెళ్లికి అయ్యేఖర్చు అంచనాతో కూడిన పత్రం సమరి్పంచాలి. అన్ని రకాల వర్గాల ప్రజలకు ఈ పథకం వర్తిస్తుంది. మండల పరిషత్ కార్యాలయాలు, డీఆర్డీఏ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలి పెళ్లికి రెండు రోజుల ముందు పెళ్లి కూతురు తల్లి ఖాతాలో రుణం మొత్తాన్ని జమ చేస్తారు. మార్గదర్శకాలు రావాల్సి ఉంది ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి రుణ పథకం ఈ నెలలో ఉగాది పండుగ తర్వాత అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. – శైలజ, డీఆర్డీఏ ఇన్చార్జ్ పీడీ
రైల్లో రీల్స్తో రచ్చ రచ్చ : హెల్ప్ లైన్కు కాల్ చేస్తే...!
రైలు ప్రయాణం అనేక ప్రాంతాలను పరిచయం చేస్తుంది. అందమైన ప్రకృతి.. పచ్చని చెట్లు, ఏపుగా ఎదిగిన పైరులు..ఇలా చాలా అనుభవాలను మిగులుస్తుంది. దీంతో పాటు ఒక్కోసారి కొన్ని చేదు అనుభవాలు కూడా తప్పవు. అలా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి భయంకరమై అనుభవం ఎదురైంది. చివరికి రైల్వే హెల్ప్ లైన్కి కాల్ చేసేంతగా ఆయన ఓపిక నశించింది. దీనికి సంబంధించి ఆయన షేర్ చేసిన నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తన ప్రయాణాన్ని "లైవ్ రియాలిటీ షో"గా మార్చేసారని అభివర్ణిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు.ఇంతకీ ఏమి జరిగిందంటే మన్మోహన్ వర్మ అనే ప్రయాణీకుడు చేసిన వివరాల ప్రకారం ఇటీవల ఆయన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో బిలాస్పూర్ నుండి లక్నోకు ప్రయాణిస్తున్నారు. ఈయన ప్రయాణిస్తున్న బోగీలోనే 20-30 మంది సభ్యులు గల ఒక కుటుంబం కూడా చేరింది. రైలు ఎక్కింది మొదలు ఒకటే గోల. బోగిని అరుపులు, కేకలు, పాటలతో "రీల్ స్టూడియో"గా మార్చింది. కోచ్ లోపల డ్యాన్స్ చేస్తూ రీల్స్తో రచ్చ రచ్చ చేశారు. వ్యక్తి తన తలపై రైల్వే బెడ్షీట్ పెట్టుకుని ఇతరులతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇతర ప్రయాణీకుల అసౌకర్యాన్ని అస్సలు పట్టించుకోకుండా, వారి ప్రశాంతతకు భంగం కలిగిస్తూ గంటల తరబడి ఇలా నానా యాగీ చేశారు. దీంతో చిర్రెత్తు కొచ్చిన వర్మ రైల్వే హెల్ప్లైన్కు (139)ను సంప్రదించారు. దీంతో రైల్వే పోలీసులు ఫిర్యాదుపై స్పందించి, కోచ్లోకి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. View this post on Instagram A post shared by Manmohan Verma (@bioeducator_manmohan) ‘‘రైల్వే కోచ్ అనేది పబ్లిక్ ప్లేస్. మన సొంత స్థలం కాదు.. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది ప్రయాణీకుల్లో కనీస సివిక్ సెన్స్ లేకుండా పోయిందంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైలు కోచ్ ఒక ప్రైవేట్ లివింగ్ రూమ్ కాదూ, రీల్-మేకింగ్ సెట్ అంతకన్నా కాదన్నారు. పెద్ద పెద్దగా శబ్దాలు చేయకుండా కనీస మర్యాదతో మెలగాలి. తోటి ప్రయాణీకులను గౌరవించాలి. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అపుడు మాత్రమే ప్రయాణం ఆనందంగా ఉంటుందంటూ తన పోస్ట్లో చెప్పారు. నెటిజన్లు స్పందనదీనిపై నెటిజన్లు కూడా స్పందించి తన అనుభవాలు పంచకున్నారు. రైళ్లలో పుట్టిన రోజు జరుపుకోవడం, బిగ్గరగా ఆడిపాటం లాంటి భయంకరమైన అనుభవం తనకూ ఎదురైందంని ఒక యూజర్ పేర్కొన్నారు.ఇలాంటి అనుభవాలు రైళ్లలో ప్రయాణించే వారికి చాలా ఎదురవుతూ ఉంటాయి. తాజా వీడియో పబ్లిక్ ప్రదేశాల్లోఎలా ప్రవర్తించాలి, ఇతర ప్రయాణీకులను ఎలా గౌరవించాలి అనేదానిపై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. (చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ : తెలుగు రాష్ట్రాల రూట్ గైడ్)
ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్కు మరో కీలక పదవి
'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే?
లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయి..
ఘనంగా గోదావరి పుష్కరాలు.. తేదీలు ఖరారు
ఇండిగో సీఈఓ రాజీనామా
గద్దర్ అవార్డుల్లో సత్తా చాటిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్
రైల్లో రీల్స్తో రచ్చ రచ్చ : హెల్ప్ లైన్కు కాల్ చేస్తే...!
హర్మూజ్ జలసంధిపై.. ట్రంప్ కీలక ప్రకటన
ఊహకందని విధంగా పెరిగిన బీసీసీఐ నజరానా
బాక్సర్లా నభా నటేశ్.. గ్లామరస్గా డస్కీ బ్యూటీ డింపుల్
గ్యాస్ సిలిండర్ బుకింగ్.. కొత్త రూల్స్!
ఆయన్ని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా
100 ఎకరాలు ఉంటే చెప్పండి: మీనాక్షి
మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..
ఉగాదికి 'అల్లు సినిమాస్' ప్రారంభం.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
వరల్డ్కప్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
భారీగా పెరిగిన గ్యాస్ ధరలు - యుద్ధంతో భగ్గుమన్న ధరలు
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ పేసర్
పతనమైన వెండి.. రూ.35 వేలు తగ్గిన రేటు!
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్లో నీటి యుద్ధం మొదలైందా?
ప్రేమలో పడ్డ కోర్ట్ జంట? రోషన్, శ్రీదేవి రియాక్షన్ ఇదే!
మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
దా‘రుణ’మైన ‘పెళ్లి కానుక’
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
సూపర్ సిక్స్ అమలు చేయకపోగా ఉన్న పథకాలు ఎత్తేయడానికి మీరు భలే ప్లాన్లు వేస్తున్నారు సార్!
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు!
పాత బంగారు లోకం
ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్కు మరో కీలక పదవి
'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే?
లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయి..
ఘనంగా గోదావరి పుష్కరాలు.. తేదీలు ఖరారు
ఇండిగో సీఈఓ రాజీనామా
గద్దర్ అవార్డుల్లో సత్తా చాటిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్
రైల్లో రీల్స్తో రచ్చ రచ్చ : హెల్ప్ లైన్కు కాల్ చేస్తే...!
హర్మూజ్ జలసంధిపై.. ట్రంప్ కీలక ప్రకటన
ఊహకందని విధంగా పెరిగిన బీసీసీఐ నజరానా
బాక్సర్లా నభా నటేశ్.. గ్లామరస్గా డస్కీ బ్యూటీ డింపుల్
గ్యాస్ సిలిండర్ బుకింగ్.. కొత్త రూల్స్!
ఆయన్ని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా
100 ఎకరాలు ఉంటే చెప్పండి: మీనాక్షి
మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..
ఉగాదికి 'అల్లు సినిమాస్' ప్రారంభం.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
వరల్డ్కప్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
భారీగా పెరిగిన గ్యాస్ ధరలు - యుద్ధంతో భగ్గుమన్న ధరలు
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ పేసర్
పతనమైన వెండి.. రూ.35 వేలు తగ్గిన రేటు!
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్లో నీటి యుద్ధం మొదలైందా?
ప్రేమలో పడ్డ కోర్ట్ జంట? రోషన్, శ్రీదేవి రియాక్షన్ ఇదే!
మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
దా‘రుణ’మైన ‘పెళ్లి కానుక’
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
సూపర్ సిక్స్ అమలు చేయకపోగా ఉన్న పథకాలు ఎత్తేయడానికి మీరు భలే ప్లాన్లు వేస్తున్నారు సార్!
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు!
పాత బంగారు లోకం
ఫొటోలు
విజయ్-రష్మిక మెహందీ సెలబ్రేషన్ ఫొటోలు
బాక్సర్లా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
సినిమా ఈవెంట్లో మెరిసిన అనన్య నాగల్ల (ఫొటోలు)
విశాఖపట్నంలో వైభవంగా పైడిమాంబ తొలేళ్ల సంబరం (ఫొటోలు)
'లేచింది మహిళా లోకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
కాబోయే భార్యని పరిచయం చేసిన హీరో బెల్లంకొండ (ఫొటోలు)
చీరలో పవర్ఫుల్గా హీరోయిన్ ధన్సిక (ఫొటోలు)
సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు (ఫొటోలు)
సినిమా
ఓటీటీకి మలయాళ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అక్కడ సూపర్ హిట్ అయినా సినిమాలను డబ్ చేసి అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో మలయాళ హిట్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన మూవీ పెన్నుమ్ పోరాట్టమ్.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 13 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.ఈ సినిమాకు రాజేశ్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాజేశ్ మాధవన్, రైనా రాధాకృష్ణన్, సుభాష్ చంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కేరళలోని ఓ గ్రామం చుట్టూ తిరిగే కథాంశంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ గ్రామంలోని రూల్స్ను ఓ యువతి, ఓ కుక్క ఎలా బ్రేక్ చేశారనే కోణంలో సెటైరికల్గా తెరకెక్కించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Watch Pennum Porattum on Netflix, out 13 March, in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada#PennumPorattumOnNetflix@dawn1720 @ArunCThampi22 @stkframes @binugeorgealex@akhilvishnu_vs— Netflix India South (@Netflix_INSouth) March 10, 2026
ఆయన్ని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా
ఇండస్ట్రీలో నటీనటులు అందరూ ఒకేలా ఉండరు. కొందరు వచ్చామా పనిచేశామా వెళ్లిపోయామా అన్నట్లు ఉంటారు. మరికొందరు మాత్రం తమ చర్యలతో తోటి నటీనటుల్ని చాలానే ఇబ్బందులు పెడుతుంటారు. తాజాగా తమిళ నటి సోనా.. ప్రముఖ కమెడియన్ వడివేలు గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన వల్ల నరకం చూశానన చెప్పుకొచ్చింది. అందుకే 16 సినిమాల్లో ఆయనకు జంటగా నటించే అవకాశమొచ్చినా తిరస్కరించినట్లు మరోసారి స్పష్టం చేసింది.(ఇదీ చదవండి: మరోసారి నోరుజారిన రాజేంద్ర ప్రసాద్)'కుశేలన్ (తెలుగులో 'కథానాయకుడు') తర్వాత వడివేలుతో కలిసి నటించమని నాకు 16కు పైగా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అయితే వాటిని మర్యాదపూర్వకంగా తిరస్కరించాను. ఎందుకంటే నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం నాకు ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే ఆయనని నేను తట్టుకోలేనేమో అనిపించింది. ఓ రకంగా నరకం చూశాను. అందుకే ఆయనతో కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నాను. దీని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడకపవడమే మంచిదని అనుకుంటున్నాను' అని సోనా చెప్పుకొచ్చింది.తమిళంలో నటి, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సోనా.. ఎక్కువగా శృంగార తరహా పాత్రలే చేసింది. రజనీకాంత్ హీరోగా నటించిన కుశేలన్ చిత్రం తెలుగులో కథానాయకుడు పేరుతో రిలీజైంది. మూవీ ఇక్కడ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇందులో కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి. సోనా-వడివేలు కాంబినేషన్లోని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అయితే సెట్లో సోనాని వడివేలు ఎంతలా ఇబ్బంది పెట్టాడో ఏమో గానీ ఇలా ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వడివేలుపై గతంలోనూ పలువురు నటీనటులు ఇలాంటి ఆరోపణలే చేశారు. అందుకే చాన్నాళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాడు. కొన్నాళ్ల క్రితమే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అడపాదడపా మూవీస్ చేస్తున్నారు. మళ్లీ ఇలాంటి టైంలో సోనా, వడివేలుపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సోనా తెలుగులోనూ ఆయుధం, వీడే, విలన్, ఆంధ్రావాలా తదితర సినిమాలు చేసింది. ప్రస్తుతానికైతే తమిళ, మలయాళ మూవీస్లోనే కనిపిస్తోంది.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన)
బిగ్బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం
టాప్-3 బిగ్బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట విషాదం నెలకొంది. ఈ విషయాన్ని పవన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీ నాన్న నీతో లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని ధైర్యం చెప్పారు. బిగ్బాస్ షో సమయంలో కూడా తన తండ్రి ఆరోగ్యం బాగలేదని డీమాన్ పవన్ చెప్పారు. వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇంతలోనే ఆ కుటుంబంలో ఈ విషాదం నెలకొంది. అయితే పవన్ తండ్రి నోటి క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.కాగా.. బిగ్బాస్ 9 నుంచి డీమాన్ పవన్ టాప్-3లో నిలిచాడు. రీతూతో బంధంపై విమర్శలు వచ్చినప్పటికీ టాస్కుల పరంగా తన టాలెంట్తో అదరగొట్టేశాడు. రెండుసార్లు కెప్టెన్ కూడా అవ్వడమే కాకుండా తెలివిగా మాస్ మహారాజ రవితేజ ఆఫర్ చేసిన రూ.15 లక్షల సూట్కేస్ తీసుకుని బయటకు వచ్చేశాడు. సీజన్ అంతా పవన్ను తొక్కేసిన బిగ్బాస్.. జర్నీ వీడియోలో మాత్రం వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు.
గిరిజన యువతిగా క్రేజీ హీరోయిన్.. ఫస్ట్ లుక్ విడుదల
టాలీవుడ్ నటి రీతూ వర్మ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించింది. హీరో గోపీచంద్ ప్రతిష్టాత్మక చిత్రంలో ఆమె అలరించేందుకు సిద్ధమయింది. ప్రస్తుతానికి టైటిల్ ఖరారు కాని ఈ మూవీని దర్శకుడు సంకల్ప్రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఘాజీ, ఐ.బి 71, అంతరిక్షం చిత్రాలతో భిన్నమైన చిత్రాలతో మెప్పించిన సంకల్ప్ రెడ్డి... ఈసారి భారతదేశ చరిత్రలో మరిచిపోయిన ఓ కీలకఘట్టాన్ని వెండతెరపై చూపించనున్నాడు. ఈ క్రమంలో తాజాగా రీతూ వర్మ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. (Gopichand 33) పేరుతో ప్రారంభమైనే ఈ ప్రాజెక్ట్లో సత్యవతి అనే గిరిజన యువతిగా రీతూ వర్మ పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్లో ఆమె అత్యంత కీలకమైన పాత్రలోనే నటిస్తున్నట్లు పోస్టర్ సూచిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ దీనిని సమర్పిస్తున్నారు. 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించనున్నారు.భారతదేశ చరిత్రలో అందరూ మరిచిపోయిన ఓ కీలకఘట్టాన్ని ఈ చిత్రంతో తెరపై చూపించనున్నారు. ఇప్పటివరకూ ఎక్కడా కూడా చర్చల్లోలేని ఈ కథను చెప్పబోతున్నామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా కోసం గోపీచంద్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ మణికందన్ ఎస్ (హిట్ 1, హిట్ 2, గీత గోవిందం, సైంధవ్), ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా, యాక్షన్ కొరియోగ్రాఫర్ పృథ్వీ మాస్టర్ ఉన్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. View this post on Instagram A post shared by Srinivasaa Silver Screen (@srinivasaasilverscreenoffl)
క్రీడలు
ఇంగ్లండ్ యువ కెరటానికి జాక్పాట్
టీ20 ప్రపంచకప్-2026 సెమీఫైనల్లో భారత్పై మెరుపు శతకం సాధించిన ఇంగ్లండ్ యువ కెరటం జేకబ్ బేతెల్కు తగిన నజరానా లభించింది. హండ్రెడ్ లీగ్లో బర్మింగ్హామ్ ఫీనిక్స్ ఫ్రాంచైజీ 2026 ఎడిషన్ కోసం అతన్ని కెప్టెన్గా నియమించింది. లియామ్ లివింగ్స్టోన్ స్థానంలో బేతెల్కు కెప్టెన్గా ఎంపిక చేసినట్లు ఫీనిక్స్ యాజమాన్యం ప్రకటించింది. 22 ఏళ్ల బేతెల్కు గతంలో ఇంగ్లండ్ కెప్టెన్గా పని చేసిన అనుభవం కూడా ఉంది. గతేడాది అతను ఐర్లాండ్ పర్యటనలో సారధిగా వ్యవహరించాడు. ఆ పర్యటనలో బేతెల్ నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఆ సిరీస్ తర్వాత అతి పిన్న వయసులో ఇంగ్లండ్ కెప్టెన్గా పని చేసిన రికార్డు బేతెల్ వశమైంది.ఫీనిక్స్ కెప్టెన్గా ఎంపిక కావడంపై బేతెల్ స్పందించాడు. ఇది నాకు దక్కిన గౌరవమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ జట్టును నడిపిన అనుభవం నాకు చాలా నేర్పింది. ఇప్పుడు కొత్త బాధ్యతను స్వీకరించాడని సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. బేతెల్ తాజాగా భారత్తో జరిగిన పొట్టి ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో పేట్రేగిపోయాడు. కేవలం 48 బంతుల్లో 105 పరుగులు చేసి తన జట్టును గెలుపుకు దగ్గరగా తీసుకెళ్లాడు. భారీ లక్ష్య ఛేదనలో ఓ పక్క వికెట్లు పడుతున్నా, ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ను ఓడించిన భారత్.. ఆతర్వాత ఫైనల్లో న్యూజిలాండ్ను కూడా చిత్తు చేసి వరుసగా రెండో ఎడిషన్లో జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్లో బేతెల్ 8 ఇన్నింగ్స్ల్లో 35 సగటున 280 పరుగులు చేశాడు.ఐపీఎల్లో సవాలుహండ్రెడ్ లీగ్లో బేతెల్కు కెప్టెన్సీ దక్కినా ఐపీఎల్ మాత్రం తుది జట్టు స్థానం దక్కడమే గగనంగా మారింది. గత ఎడిషన్లో బేతెల్ను ఆర్సీబీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీలో అప్పటికే ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జోష్ హేజిల్వుడ్ వంటి విదేశీ ఆటగాళ్లు ఉండటంతో బేతెల్కు తుది జట్టులో స్థానం దక్కలేదు. మరి ఈ సీజన్లో అయినా అవకాశాలు లభిస్తాయో లేదో చూడాలి.
ఐపీఎల్ 2026పై బిగ్ అప్డేట్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఎడిషన్పై బిగ్ అప్డేట్ వచ్చింది. మార్చి 12న లీగ్ తొలి 20 రోజుల షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు.దేశంలో పలు రాష్ట్రాల్లో (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం) ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్ ప్రకటించడంలో ఆలస్యం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మిగతా షెడ్యూల్ను ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా, ఐపీఎల్ 2026 ఎడిషన్ తొలుత మార్చి 26న ప్రారంభమవుతుందని ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల రెండు రోజులు వాయిదా పడింది. ఈ ఎడిషన్ మార్చి 28న ప్రారంభమై, మే 31న జరిగే ఫైనల్తో ముగుస్తుంది.ఓపెనింగ్ మ్యాచ్లో ఎవరెవరు..? సాంప్రదాయం ప్రకారం గత సీజన్ విజేతలు, రన్నరప్ జట్లు సీజన్ తొలి మ్యాచ్ ఆడతాయి. ఈ లెక్కన ఆర్సీబీ (విజేతలు), పంజాబ్ కింగ్స్ (రన్నరప్) మధ్య తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటీవల స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్లో ఐపీఎల్ ట్రోఫీ చుట్టూ పసుపు, గులాబీ రంగు రిబ్బన్లు ఉండటంతో సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే విజేతలు, రన్నరప్ అనే సాంప్రదాయానికి బ్రేక్ పడినట్లే. దీనిపై స్పష్టత రావాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.
పెళ్లిపీటలెక్కనున్న స్టార్ స్పిన్నర్.. ఎప్పుడంటే?
భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే ఒక ఇంటివాడు కానున్నాడు. మార్చి 14న తన చిన్ననాటి స్నేహితురాలైన వనిష్కను కుల్దీప్ వివాహమాడనున్నాడు. కాగా వీరి వివాహం ఉత్తరాఖండ్లోని ముసోరిలో ఒక రిసార్ట్ వేదికగా జరగనుంది. గతేడాది జూన్ 4న లక్నోలోని ఒక హోటల్లో వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఇప్పటికే పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా మార్చి 13న ప్రీ-వెడ్డింగ్ జరగనుంది. అయితే వీరి పెళ్లి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. ఇక మార్చి 17న లక్నోలోని హోటల్ సెంట్రమ్లో గ్రాండ్గా రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు భారత క్రికెటర్లు, బీసీసీఐ బోర్డు సభ్యులు సహా ఉత్తర్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కూడా హాజరు కానున్నారు. అయితే వాస్తవానికి కుల్దీప్ వివాహం గతేడాని నవంబర్లోనే జరగాల్సి ఉండగా, టీ20 ప్రపంచకప్ జట్టులోకి కుల్దీప్ ఎంపిక కావడంతో పెళ్లి వాయిదా పడింది. ఇక కుల్దీప్ యాదవ్ టీ20 ప్రపంచకప్లో కేవలం పాకిస్థాన్తో మ్యాచ్లో మాత్రమే ఆడాడు. ఇక భారత క్రికెట్ జట్టు ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ను అందుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. చదవండి: 30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!
క్రికెటర్ అమిత్ మిశ్రాపై గృహహింస కేసు
భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాపై గృహహింస కేసు నమోదైంది. ఈ అమిత్ మిశ్రా అందరికీ తెలిసిన టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కాదు. ఇతను ఉత్తరప్రదేశ్కు చెందిన 34 ఏళ్ల పేసర్ అమిత్ మిశ్రా. ఈ అమిత్ మిశ్రా భారత్ తరఫున ఎప్పుడూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఐపీఎల్లో మాత్రం ఆడాడు.2013-14 రంజీ సీజన్లో ఉత్తర్ప్రదేశ్ తరఫున రెండో మ్యాచ్లోనే 7 వికెట్లు తీసి గుర్తింపు పొందిన ఈ అమిత్ మిశ్రాను 2014 ఐపీఎల్ ఎడిషన్లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఆతర్వాత గుజరాత్ లయన్స్లో చేరినా, కెరీర్ పెద్దగా ముందుకు సాగలేదు. 2018లో ఆంధ్రపై చివరి మ్యాచ్ ఆడిన తర్వాత క్రికెట్కు గుడ్బై చెప్పిన మిశ్రా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందాడు. ఈ అమిత్ మిశ్రాపై అతని భార్య గరిమా తివారి గృహహింస ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీవ్ర గృహహింస, వేధింపులు, దౌర్జన్యం అలాగే ఆత్మహత్యకు ప్రేరేపించే పరిస్థితులు సృష్టించాడని ఫిర్యాదులో పేర్కొంది. మోడల్ అయిన గరిమాకు 2019లో ఇన్స్టాగ్రామ్ ద్వారా అమిత్ మిశ్రాతో పరిచయం ఏర్పడింది. 2021లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. గరిమా ఆరోపణల ప్రకారం.. పెళ్లి తర్వాత అమిత్ మిశ్రా, అత్తమామలు నిరంతరం వేధింపులకు గురి చేశారు. రూ.10 లక్షలు, హోండా సిటీ కారు రూపంలో కట్నం కోరారని, ఆమె కుటుంబం రూ.2.5 లక్షలు ఇచ్చినా, మరింత డబ్బు కోసం వేధింపులు కొనసాగించారని తెలిపారు. మిశ్రా తరచూ మద్యం తాగి వచ్చి దుర్భాషలాడేవాడని, తిండి కూడా పెట్టకుండా వేధించేవాడని పేర్కొన్నారు. తాను మోడలింగ్ చేసిన సంపాదించిన డబ్బును కూడా బలవంతంగా లాక్కునేవాడని, అతని కారణంగా మోడలింగ్ కెరీర్ను కూడా వదిలేయాల్సి వచ్చిందని ఆరోపించారు. ఈ వేధింపుల కారణంగా ఫినైల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించానని ఆవేదన చెందారు. కాగా, గరిమా అమిత్ మిశ్రాపై ఇప్పటికే పలు కేసులు వేసింది. ఏప్రిల్ 21, 2025న గృహహింస కేసు, ఏప్రిల్ 23న నెలకు రూ.50,000 భరణం, రూ.1 కోటి పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, మిశ్రా ప్రభావం వల్ల కేసులు ముందుకు సాగలేదని ఆరోపించారు. ప్రస్తుతం వేసిన కేసు విచారణ దశలో ఉంది.
న్యూస్ పాడ్కాస్ట్
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
భవిష్యత్ అభివృద్ధి శూన్యం... ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్. సెమీస్లో 7 పరుగులతో ఇంగ్లండ్పై గెలుపు
హాజరైన సెలబ్రిటీలు... విరోష్ రిసెప్షన్ కు
‘లడ్డూ’పై బాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. శాసన మండలిలో చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు
స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెద్ది
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలపై ఆటవిక దాడి... మహిళా దినోత్సవ వేళ చంద్రబాబు మార్కు గిఫ్ట్
బిజినెస్
గ్యాస్ కష్టాలు.. మూతపడుతున్న రెస్టారెంట్లు!
అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయం కారణంగా దేశీయంగా వాణిజ్య ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఫలితంగా ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఇప్పటికే ముంబయిలో 20 శాతం హోటళ్లు మూసివేశారు. పరిస్థితి చక్కబడకపోతే మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని హోటళ్లు స్తంభించే ప్రమాదం ఉంది.నగరాల వారీగా క్షేత్రస్థాయి పరిస్థితిదేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఇండియన్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఏహెచ్ఏఆర్) అధ్యక్షుడు విజయ్ శెట్టి తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే నగరంలోని 20% హోటళ్లు మూతపడ్డాయి. మరో రెండు రోజుల్లో సరఫరా పునరుద్ధరించకపోతే కనీసం 50% రెస్టారెంట్లు కార్యకలాపాలు నిలిపివేయక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం ఒక కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,950 పలుకుతుండటం అదనపు భారంగా మారింది.సిలిండర్ల సరఫరా నిలిచిపోతుందనే పుకార్ల మధ్య బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ స్పందించింది. ప్రస్తుతానికి రెస్టారెంట్లు తెరిచే ఉంటాయని, అయితే అనిశ్చితిని తట్టుకోవడానికి పనివేళలు తగ్గించాలని, మెనూలో వంటకాలను పరిమితం చేయాలని సూచించింది.హైదరాబాద్లో గ్యాస్ పంపిణీదారులు ఉన్నస్టాక్ను రేషనింగ్ పద్ధతిలో విడుదల చేస్తున్నారు. ఇక పంజాబ్లో ఎల్పీజీ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల సరఫరాను దాదాపు నిలిపివేశాయి. జైపూర్లో వెడ్డింగ్ క్యాటరింగ్ సేవలకు కనీసం 7 రోజుల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది.అసలు కారణం ఏమిటి?భారతదేశం ఏటా 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని వినియోగిస్తుండగా అందులో 62 శాతం దిగుమతుల ద్వారానే వస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూతపడటంతో సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి రావాల్సిన 85-90 శాతం దిగుమతులు నిలిచిపోయాయి. ప్రభుత్వం అందుబాటులో ఉన్న పరిమిత స్టాక్ను గృహ వినియోగానికి, ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర విభాగాలకు మళ్లిస్తుండటంతో వాణిజ్య రంగం తీవ్రంగా నష్టపోతోంది.రంగంలోకి చమురు మంత్రిత్వ శాఖవాణిజ్య ఎల్పీజీ కొరతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ఈ కమిటీ ఓఎంసీల ద్వారా సరఫరా పునరుద్ధరణను పర్యవేక్షించనుంది.ఆతిథ్య రంగం కేవలం ఆహార అవసరాలనే కాక లక్షలాది మందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది. గ్యాస్ సరఫరాలో జాప్యం జరిగితే అది ఆహార ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దిగుమతులను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు
బంగ్లాదేశ్కు భారత్ ఆపన్నహస్తం
పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు దక్షిణ ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాంతో తీవ్ర ఇంధన సంక్షోభంలో కూరుకుపోయిన బంగ్లాదేశ్ తన అవసరాల కోసం ఇప్పుడు పూర్తిగా భారత్ వైపు చూస్తోంది. గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడంతో తలెత్తిన కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి అత్యవసరంగా డీజిల్ దిగుమతులను వేగవంతం చేసింది.బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ) ఛైర్మన్ ముహమ్మద్ రెజానుర్ రెహ్మాన్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్తో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా 5,000 టన్నుల డీజిల్ సరుకు బంగ్లాదేశ్కు చేరుతోంది. భారత్ నుంచి ఏటా 1.8 లక్షల టన్నుల డీజిల్ను పైప్లైన్ ద్వారా దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఆరు నెలల్లో కనీసం 90 వేల టన్నుల డీజిల్ను దిగుమతి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అందుతున్న 5,000 టన్నులతో పాటు రాబోయే రెండు నెలల్లో ఆరు నెలలకు సరిపడా కోటాను పూర్తిగా భారత్ నుంచి దిగుమతి చేస్తామని రెహమాన్ తెలిపారు.మూతపడుతున్న యూనివర్సిటీలుబంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం 95 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ధరలు ఆకాశాన్ని తాకడం, సరఫరా నిలిచిపోవడంతో దేశంలో ఇంధన పరిమితులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను మూసివేసింది. ల్యాబ్లు, ఏసీలు, హాళ్లలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండటమే దీనికి కారణం. ప్రజలు ఇంధనాన్ని నిల్వ చేయకుండా ఉండేందుకు రోజువారీ విక్రయాలపై పరిమితులు విధించారు. స్పాట్ మార్కెట్ నుంచి అత్యధిక ధరలకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ) కొనుగోలు చేస్తోంది.భారత్ పాత్ర కీలకంఅంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండుతున్న వేళ పొరుగు దేశానికి భారత్ అందిస్తున్న ఈ సహకారం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ‘వినియోగాన్ని తగ్గించడానికి, ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని బంగ్లాదేశ్ విద్యుత్, ఇంధన శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం మరింత కాలం కొనసాగితే బంగ్లాదేశ్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు భారత్ వంటి దేశాలు భరోసాగా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు
ఏడాది కాలంలోనే సీన్ రివర్స్!
అమెరికా రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న భారత సంతతి ప్రజలు (ఇండో అమెరికన్లు) డొనాల్డ్ ట్రంప్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారా? భారత్తో సంబంధాలను నెరపడంలో ట్రంప్ కంటే అంతకుముందు అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయాలు మెరుగని భావిస్తున్నారా? అంటే అవుననే అంటోంది ప్రతిష్టాత్మక ‘కార్నెగీ ఎండోమెంట్’ సర్వే. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే ఇండో-అమెరికన్లలో ఆయనపై వ్యతిరేకత పెరగడం చర్చనీయాంశమైంది.సర్వే ఏం చెబుతోంది?‘ఇండియన్–అమెరికన్ యాటిట్యూడ్ సర్వే’ పేరుతో ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ చేసిన ఈ సర్వేలో ఫలితాల ప్రకారం.. దాదాపు 71 శాతం మంది భారత సంతతి ప్రజలు ట్రంప్ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్తో సంబంధాల విషయంలోనూ 55 శాతం మంది ఆయన తీరును తప్పుబడుతున్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే ట్రంప్ విదేశాంగ విధానాన్ని సమర్థిస్తుండటం గమనార్హం.బైడెన్ ఎందుకు మెరుగనిపిస్తున్నారు?జో బైడెన్ తన పదవీ కాలంలో భారత్తో సంబంధాలను కేవలం వ్యాపార కోణంలో కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యంగా చూశారని మెజారిటీ ఇండో-అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (ఐ-సీఈటీ) ద్వారా రక్షణ, అంతరిక్ష రంగాల్లో భారత్కు బైడెన్ అండగా నిలిచారు. బైడెన్ హయాంలో వీసా విధానాలు (హెచ్1బీ), కమలాహారిస్ వంటి వారిని కీలక పదవుల్లో కూర్చోబెట్టడం ద్వారా భారత సంతతికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.ట్రంప్ 2.0.. పెరిగిన ఆందోళనలుట్రంప్ మొదటి హయాంతో పోలిస్తే ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇండో-అమెరికన్లలో అసహనాన్ని పెంచుతున్నాయి.భారతీయ ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు విధించడం, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై భారత్ను హెచ్చరించడం వంటి అంశాలు కేవలం ఇచ్చిపుచ్చుకోవడమనే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.‘అమెరికా ఫస్ట్’ నినాదంతో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడం భారతీయ టెక్కీలను ఆందోళనకు గురిచేస్తోంది.ట్రంప్ హయాంలో ఆన్లైన్ విద్వేషం, వర్ణ వివక్ష పెరిగిందని సగం మందికి పైగా భారత సంతతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు
డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ
తండ్రైన క్షణం..! ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడైనా..
కొన్ని క్షణాల్లో ఎంతటి బలంగా ఉండే వ్యక్తికైనా..ఒక్కసారిగా చేతులు వణుకుతాయి. అప్పుడే మనకు ధైర్యం విలువ గొప్పదనం తెలుస్తుంది కూడా. ప్రతి తండ్రికి ఎదురయ్యే ఈ గొప్ప మధుర క్షణాల్లో చేతులు వణుకుతాయోమో!?..ఇలానే భయపడతారేమో..!?. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోని డాక్టర్ సుగన్య శరవణకుమార్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. డాక్టర్ శరవణ కుమార్ నవజాత శిశువుని తండ్రికి అప్పగిస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి చాలా భయపడిపోయాడు. తన బిడ్డను పట్టుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు అతని చేతులు వణుకుతున్నాయి. డాక్టర్ అతనికి భరోసా ఇస్తూ చేతుల్లోకి ఇచ్చినవప్పుడూ తీవ్రమైన భావోద్వేగంలో మునిగిపోతూ..చేతుల్లోకి శిశువుని తీసుకున్నాడు. అయినప్పటికీ బిగిసుకుపోతున్నట్లుగా షాక్లోనే ఉన్న అతన్ని డాక్టర్ ప్లీజ్ టెన్షన్ పడొద్దు ఫ్రీగా ఉండండి అని సూచనలిస్తూ..తండ్రైన క్షణాన్ని అనుభవించేలా చేశారు. అంతేగాదు ఆ క్షణాలను కెమెరాలో బంధించి "బలమైన వ్యక్తి చిన్న ఆనందాన్ని పట్టుకున్నప్పుడు చేతులు వణుకుతాయి. కొత్త ఆనందం కుటుంబంలో చేరినప్పుడు క్షణాలు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ప్రతి నిమిషం, ప్రతి సెకను ఎంతో విలువైంది". అనే క్యాప్షన్ని జోడించి మరి పోస్ట్ చేశారు. ప్రతి తండ్రికి ఈ అనుభూతి తెలుసు, ఆ క్షణం భయంతో కూడిన ప్రేమ బయటకొస్తుంది అని పోస్టులు పెట్టారు.(చదవండి: ఎండిపోయిన నదికి ప్రాణం పోసిన మహిళా శక్తి..!)
చాయ్వాలాగా ఐటీ ఉద్యోగి..!
ఐఐటీ విద్యార్థి చాయ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అది కూడా అమెరికాలో. ఈ భారత సంతతి వ్యక్తి కథ నెట్టింట సెన్సేషన్గా మారింది. ఈ టెకీ కథ ప్రతి ఒక్కర్ని కదలించడమే కాదు, ఆలోచింపచేసేలా చేసింది. అతడే చాయ్వాలా లేదా చాయ్గుయ్గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్ ప్రసాద్. బిహార్ పాట్నా సమీపంలోని బార్ అనే చిన్న పట్టణానికి చెందిన ప్రభాకర్ ఈ ఫిబ్రవరి 2025లో టెక్ లేఆఫ్లు నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో చాయ్స్టాల్ని ప్రారంభించి ఒక్కో టీ కప్పుని రూ. 780లకు విక్రయిస్తున్న అతడి కథ నెట్టింట వైరల్ అవ్వడంతో..ఒక్కసారిగా అతడి బిజినెస్ కూడా లాభాసాటిగా పుంజుకోవడం విశేషం. ఎక్కడో బిహార్ నుంచి అగ్రరాజ్యం అమెరికాకు ఎలా వలస వచ్చాడంటే.. నిజానికి ప్రభాకర్ కుటుంబం కడు పేదరికంతో ఇక్కట్లు పడుతుండేది. కనీసం దుప్పట్లు కూడా కొనుక్కోలేని దారుణ పరిస్థితి. దాంతో వాళ్లు శీతాకాలం వచ్చిందంటే చాలు వెచ్చదనం కోసం పప్పుబస్తాల కింద నిద్రించేవారట. ప్రభాకర్ తండ్రి అనేక వ్యాపారాలు చేసినా..ఎందులోనే విజయం సాధించలేకపోయేవాడట. కానీ అతడి తల్లిదండ్రులు విద్య శక్తిని మాత్రం గట్టిగా విశ్వసించేవారట. ఇక ప్రభాకర్ చిన్నతనంలో బిహార్లోని ఓ హిందీ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ప్రభాకర్ క్లాస్ ఫస్ట్, లీడర్ కూడా. క్రికెట్ దగ్గర నుంచి పాటలు పాడటం వరకు అన్నింట్లోనూ మనోడే ఫస్ట్. అయితే తన సోదరుడు కిడ్నాప్కి గురవ్వడంతో తన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగిందని చెబుతున్నాడు. తన కుటుంబం అకస్మాత్తుగా బీహార్ వదిలి భోపాల్కు వెళ్లిపోయింది. ఆ మార్పుని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ప్రభాకర్కి. భోపాల్లో తోటి విద్యార్థులంతా ఇంగ్లీస్లో అనర్గళంగా మాట్లాడంతో..తన ఆంగ్లయాసను చూసుకుని అంత నవ్వేవారంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. బిహార్ బోర్డు స్కూల్ నుంచి ఇంగ్లీష్ సీబీఎస్ఈ స్కూల్ వరకు కనీసం ప్రాథమిక పదాలు అర్థమయ్యేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే కష్టపడి ఏదో రకంగా నేర్చుకున్నానని, అలా ఐఐటీ స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని చెప్పుకొచ్చారు. ఐఐటీ అడ్మిషన్ తన జీవిత గమనాన్ని మార్చిందని చెబుతున్నాడు. ఐఐటీ పూర్తి అయిన వెంటనే 2008లో మొట్టమొదటి ఉద్యోగాన్నిపొందాను, అయితే టెక్ ప్రపంచం నాకెందుకో అంతగా నచ్చలేదు. కోడింగ్ నన్ను ఎప్పుడు ఉత్సాహపరచలేదని అంటున్నాడు. దాంతో అక్కడి కార్పొరేట్ ఒత్తిడి తట్టుకునేందుకు జిమ్లో గడుపుతుండేవాడినని, అలా బాడీబిల్డింగ్ తన అభిరుచిగా మారిందని అంటున్నాడు. దాంతో కొత్తగా వేరే ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ముంబైకి వెళ్లి మోడలింగ్ ఆడిషన్లకు వెళ్తుండేవాడినని చెప్పుకొచ్చాడు. అలా మోడలింగ్లో రాణించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా అతడి స్నేహితురాలు అమెరికా వెళ్లిపోయింది. దాంతో ప్రభాకర్ కూడా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీసా రెండుసార్లు తిరస్కరణకు గురైంది. చివరికి 2014లో మాత్రమే ఎంబిఏ చేయడానికి యూఎస్ వెళ్లగలిగానంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే అనుకున్నంత అందంగా అమెరికా జీవితం ఉండదు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని ఇబ్బందులు తదితరాలన్నింటిని ఎదుర్కొన్నాడు. దాదాపు పదేళ్లు అమెరికాలో ఒక నగరం నుంచి మరొక నగరానికి తిరుగుతూనే ఉన్నానని, ఎన్నో కార్పొరేట్ ఉద్యోగాలు కూఆ చేశానని, అయితే తాను లేఆఫ్ వేటుకి గురయ్యానంటూ బాధగా చెప్పుకొచ్చాడు. ఇంతలో తన ఆరోగ్యం కూడా కుదుటపడింది. అయితే నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియని ఈ అస్థిరతకు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుండగా..ఒక స్నేహితుడి సూచన మేరకు చాయ్వాలాగా మారినట్లు చెప్పుకొచ్చాడు. తాను బిహారీ శైలి చాయ్ అమ్ముతూ ఓ వీడియోని నెట్టింట పోస్ట్ చేశాను. ఇది తన వ్యాపార ప్రచారంలో భాగంగా చేశానని, అనుకున్నట్లుగా చాలామందికి ఆ వీడియో చేరువై వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నాడు ప్రభాకర్. అయితే కార్పొరేట్ జాబ్లలో పనిచేస్తున్నప్పుడు చేతినిండా డబ్బు ఉంది..స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయాయి. కానీ ఇవాళ్ల తన వద్ద డబ్బు తక్కువగానే ఉంది, కానీ స్వేచ్ఛ ఆనందం చాలా గరిష్టస్థాయిలో ఉన్నాయని అంటున్నాడు. అంతేగాదు తన స్వంత ఇష్టానికి తానే యజమానిని అని చెబుతున్నాడు కూడా. తాను కార్పొరేట్ బానిసను కాదని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. గౌరవంగా బతకాలనుకుంటే..ఎంత చిన్న ఉద్యోగమైనా.. మంచిదే..అదే స్వేచ్ఛ, ఆనందం నిల్ అయితే కోట్లు గడించే ఉద్యోగమైనా వేస్టే కదా అని ప్రభాకర్ గాథ చూస్తే తెలుస్తోంది కదూ..!.(చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..)
వసంతాన్ని ఎక్స్పీరియెన్స్ చేయాలనుకుంటే.. అక్కడకు వాలిపోవాల్సిందే..!
కొన్ని ప్రదేశాలను కళ్లతో చూస్తాం. కొన్ని ప్రదేశాలను మనసులో అనుభూతి చెందుతాం. అలాంటి ఒక అందమైన ప్రదేశమే జూన్లోని క్యోటో. క్యోటోలో వసంతాన్ని ఎక్స్పీరియెన్స్ అయితేదానిని జీవితాంతం ఒక మెమోరీగా దాచుకుంటాం. జూన్లో ఉన్న క్యోటో అనే ప్రాచీన నగరం మార్చి నుంచి సమ్మర్ ప్రారంభం వరకు ఒక అందమైన రంగుల కథలా మారిపోతుంది. సకూరా లేదా చెర్రీ బ్లాసమ్ చెట్ల గులాబీ పుష్పాలతో విరిసిన సమయంలో వీధులు, చెరువులు, సరస్సులు, ఆలయాలు ఇవన్నీ కలిసి ఒక లైవ్ పెయింటింగ్లా అనిపిస్తాయి. ఇక్కడ ప్రయాణం అంటే చెక్లిస్ట్ టూరిజం కాదు ఒక స్లో వాక్ం ఒక సైలెంట్ ఫీలింగ్.వసంత వెలుగుల్లో క్యోటో రిథమ్మార్నింగ్ టైమ్లో? లైట్ మిస్ట్ మధ్య నడుస్తే గాలిలో ఒక ఆహ్లాదకరమైన సువానస గుండెల్ని మీటుతుంది. రోడ్ సైడ్లో చిన్న చిన్న కేఫేలు ఉదయమే తెరుచుకుంటాయి. సైకిల్పై డిసిప్లెన్గా స్కూల్కు వెళ్లే పిల్లలు కనిపిస్తారు. అలాగే పక్కనే ఓల్డ్ వుడెన్ హౌసెస్ సైలెంట్గా గంభీరంగా నగరంలో జరిగే మార్పులను గమనిస్తూ ఉంటాయి. ఇక్కడ లైఫ్ అంటే వేగం కాదు. ప్రశాంతంగా జీవించాలే వేదంలాంటిది. మధ్యాహ్నం సమయంలో కెనాల్ పక్కనే కూర్చుంటే నీటిపై పడిన చెర్రీ బ్లాసమ్ పెటల్స్ స్లోగా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఆ సీన్ చూస్తే టైమ్ కూడా స్లో మోషలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. క్యోటోలో సమ్మర్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ వసంత కాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.లోకల్ ఫీల్ ఇచ్చే ప్రాచీన కల్చర్క్యోటో అంటే జూన్ కల్చరల్ క్యాపిటల్ లాంటిది. జియాన్ ఏరియాలో సాయంత్రం సమయంలో వాక్ చేస్తే అక్కడి ట్రెడిషనల్ కిమోనో వేసుకున్న అమ్మాయిలు చాలా మంది కనిపిస్తారు. ఓల్డ్ టీ హౌసెస్ నుంచి వచ్చే వార్మ్ లైట్ స్ట్రీట్ మీద పడితే సిటీ ఒక వింటేజ్ సినిమా ఫ్రేమ్లో మనం ΄ాత్రధారులం అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ టీ సెర్మనీ అనుభవం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సింపుల్గా టీ సర్వ్ చేసే విధానంలో కూడా ఒక డిసిప్లిన్, ఒక గౌరవం ఉంటుంది. లోకల్ మార్కెట్లో ఫ్రెష్ ఫ్రూట్స్, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్సŠ, సీజనల్ స్వీట్స్ లభిస్తాయి. ఇక్కడి ప్రజలు ప్రకతితో మమేకం అయ్యి జీవిస్తారు. అది మీరు బాగా గమనించవచ్చు.సందర్శనీయ స్థలాలుక్యోటోలో ప్రయాణం అంటే ప్లేస్ నుంచి ప్లేస్కు ట్రావెల్ కాదు. ఫీలింగ్ నుంచి ఫీలింగ్కి మూవ్ అవ్వడం లాంటిది.ఫుషిమీ ఇనారీ తైషా దగ్గర రెడ్ టోరీ గేట్స్ మధ్య నడవటం అంటే ఒక స్పిరిచువల్ టన్నెల్లో వెళ్తున్నట్టు ఉంటుంది. ప్రతీ అడుగులో నిశ్శబ్దానికి, ప్రశాంతతకు మరింత చేరువ అవుతున్నట్టు అనిపిస్తుంది.కింకాకు–జి, అంటే గోల్డెన్ పెవిలియన్. దీని ప్రతిబింబం సరస్సులో కనిపిస్తే వెంటనే ఫోటోలు తీయాలని అనిపిస్తుంది. కానీ అలా చేయకుండా మౌనంగా ఆ నిమిషాన్ని ఎంజాయ్ చేయడమే కరెక్ట్ అని మనసు కూడా చెబుతుంది.అరాషియామా బాంబూ గ్రోవ్లో గాలి తనువుతోపాటు మనసును తాకుతూ వెళ్తుంది. ఆ గాలికి వినిపించే నేచురల్ సౌండ్స్ ఇవన్నీ ఒక మ్యూజికల్ ఎక్స్పీరియెన్స్లా మిగిలిపోతాయి.ఫిలాసఫర్స్ పాత్ కెనాల్ పక్కన సకూరా ఛాయలో నడుస్తే ప్రతీ టర్న్లో గులాబీ పెటల్స్ పడుతున్న భావన కలుగుతుంది. ఇక్కడ వాక్ పూర్తయ్యాక కూడా ఆ సీన్ మనసులో కొనసాగుతూనే ఉంటుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి టోక్యో లేదా ఒసాకాకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. అక్కడి నుంచి ట్రైన్ ద్వారా క్యోటోకి ఈజీగా చేరుకోవచ్చు. జూన్ రైల్వే సిస్టమ్ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ట్రావెల్ ఎక్స్పీరియెన్స్ కూడా జర్నీ భాగంగా అనిపిస్తుంది.ఎక్కడ ఉండాలి?సిటీ సెంటర్ దగ్గర్లో ట్రెడిషనల్ ర్యోకన్ స్టైల్ స్టేలు అందుబాటులో ఉంటాయి. సింపుల్ వుడెన్ రూమ్స్, తతామీ మ్యాట్స్, స్లైడింగ్ డోర్స్ ఇలా స్టే కూడా ఒక కల్చరల్ ఎక్స్పీరియెన్స్లా ఉంటుంది. మోడర్న్ హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కానీ ఓల్డ్ స్టైల్ అకామడేషన్లో ఉంటేనే క్యోటో వైబ్ బాగా ఫీల్ అవుతుంది.ఏం చూడాలి?ఆలయాలు, చిన్న చిన్న మందిరాలు, కెనాల్ వాక్స్, బాంబూ ఫారెస్ట్, ఈవినింగ్ లాంటర్న్ స్ట్రీట్స్ ఇవన్నీ రష్ లేకుండా స్లోగా చూడాలి. ఇక్కడ బ్యూటీ కేవలం కళ్లకు ఇంపుగానే కాదుం మెమోరీస్లో సింక్ అయ్యేలా ఉంటుంది.ఏం తినాలి?క్యోటోలో మీరు తప్పకుండా లోకల్ రామెన్ ట్రై చేయండి. దీంతోపాటు మాచా బేస్డ్ స్వీట్స్, తాజా సుషీ, సీజనల్ సకూరా ఫ్లేవర్ ఉన్న డెజర్ట్స్ మిస్ చేయకండి. అలాగే చిన్న స్ట్రీట్ కేఫేలో సింపుల్ టీ తాగితే కూడా ఎక్స్పీరియెన్స్ కంప్లీట్ అవుతుంది.ఎప్పుడు వెళ్లాలి?క్యోటో వెళ్లేందుకు వసంతమే ఉత్తమ సమయం. మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో సకూరా పీక్ సీజన్ ఉంటుంది. సమ్మర్ ప్రారంభం అవ్వడానికి ముందే వాతావరణం కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ట్రిప్ ప్లాన్ చేయడం మంచిది. సమ్మర్ మొదలయ్యాక కూడా పచ్చదనంతో క్యోటో అందంగా కనిపిస్తుంది.క్యోటో ప్రయాణం పూర్తయ్యాక ఫోటోల కన్నా మెమోరీస్ ఎక్కువగా మిగులుతాయి. గులాబీ పెటల్స్ పడిన ఆ మూమెంట్స్, బాంబూ సౌండ్స్, ఆలయ గంటల శబ్దాలు ఇవన్నీ కలిసి ఒక పీస్ఫుల్ చాప్టర్లా మనసులో నిలిచిపోతాయి. ఎందుకంటే క్యోటోలో వసంతం ఒక సీజన్ కాదు. ఆనందానికి ఒక రీజన్ కూడా. (చదవండి: మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్ మహీంద్రా)
ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..
ప్రసవానంతరం బరువు తగ్గడం చాలా సవాలుగా ఉంటుంది. మాములుగా బరువు తగ్గడానికి గర్భధారణ అనంతరం తగ్గడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పైగా శరీరంలో వచ్చే మార్పులకు తోడు నవజాత శిశువుని హ్యాండిల్ చేస్తూ బరువు తగ్గడం తదితరాలన్ని చాలా సవాలుగా ఉంటాయి. ముందుగా శరీరం మునపటి పటుత్వం లేక..కొద్దిపాటి వ్యాయామాలను ఓర్చుకునే శక్తి స్వతహాగా కొత్త తల్లులకు ఉండదు. మరి అలాంటప్పుడు ఎలాంటి తేలిక పాటి వ్యాయామాలు చేయాలి..? కొత్త తల్లులు నిజంగానే తీవ్రమైన వ్యాయామాల జోలికి పోకపోవడమే మంచిదా..? తదితరాల గురించి కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిధి త్యాగి చెప్పే సలహాలు సూచనలే గురించి సవివరంగా చూద్దామా..!.ప్రసవానంతరం బరువు తగ్గం అనేది సాధారణ విషయం కాదని అంటోంది నిధి త్యాగి. దీని గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అమూల్యమైన సలహాలు సూచనలు షేర్ చేశారు. ఇక్కడ కొత్త తల్లులు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కంటే..కేలరీలలోటు, కదలికలపై దృష్టిపెట్టాలని అంటోంది. చాలామంది డెలివరీ తర్వాత పాలిస్తారు కాబట్టి బరువు తగ్గిపోతారని అనుకుంటుంటారు. కానీ అది ముమ్మాటికీ అబద్ధమని అంటోంది. తాను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మామిడపండ్లు అధికంగా తినేదాన్ని అని ఆ టైంలో ఏకంగా 20 కిలోలకు పైగా అదనపు బరువు ఉన్నానని చెప్పుకొచ్చింది. ప్రసవం తర్వాత పదికిలోలు మాత్రమే తగ్గానని, మిగిలిని పదికిలోల బరువు అలాగే ఉందని తెలిపింది. ఏడాదికి పైగా బిడ్డకు పాలిచ్చానని, ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకున్నానని, అలాగే తేలికపాటి వాకింగ్ వంటివి చేసేదాన్ని అని వెల్లడించింది. కానీ అంతలా కేర్ తీసుకున్నా..బరువులో అంతగా మార్పులు కనిపించలేదని అంటోంది. పైగా డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి తీవ్రమైన వ్యాయామాల జోలికి అస్సలు పోకూడదని అంటోంది. ఎందుకంటే కొత్త తల్లుల శరీరం సున్నితంగా మారిపోయి ఉంటుంది..దాంతో ఆ వర్కౌట్లు తట్టుకోవడం అంత సులభం కాదని చెబుతోంది. కనీసం 15 నిమిషాలు కూడా చేయలేమని అంటోంది. అలా అని బయటకు జిమ్ వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో హోమ్ ఇన్స్ట్రక్టర్ని నియమించుకున్నట్లు తెలిపింది. అతను సూచించిన కోర్ వ్యాయామాలు, కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలతో బలం పుంజుకోగలిగానని అంటోంది. వీటివల్ల కండరాలు బలోపేతం అవుతుతాయి. కొద్దిపాటి బరువులు ఎత్తి..బోడ్డులోపలికి కోర్ని స్ట్రాంగ్గా మార్చుకోగలిగానని అంటోంది. అలా తాను నాలుగు నెలల్లో నాలుగు నుంచి ఐదు కిలలోలు వరకు తగ్గగలిగానని అంటోంది. ప్రస్తుతం తాను ప్లాంక్లు కూడా వేయగలనని, వెన్నునొప్పి లేదని అంటోంది. కానీ ప్రసవానంతరం వేగవంతంగా బరువు తగ్గాలనుకోవడం తప్పులేదు గానీ..ఆ క్రమంలో తప్పుడు మార్గంలో వెళ్లొద్దని, ఆరోగ్యకరమైన మార్గాన్ని ఎంచుకోమని చెబుతోంది కంటెంట్ క్రియేటర్ నిధి త్యాగి. View this post on Instagram A post shared by Nidhi Tyagi (@thenidhityagi) (చదవండి: చీరకట్టులో స్నోబోర్డింగ్ స్టంట్..!)
అంతర్జాతీయం
ఖమేనీ మృతితో రంగంలోకి విధ్వంసక శక్తులు?
వాషింగ్టన్: ఇరాన్ అత్యున్నత నేత ఆయతొల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్లతో నేరుగా సైనిక పోరాటం సాగిస్తున్న ఇరాన్.. విదేశాల్లో ఉన్న తన ‘స్లీపర్ సెల్స్’ను అప్రమత్తం చేస్తూ, రహస్య సంకేతాలు పంపినట్లు సంచలన సమాచారం బయటకు వచ్చింది. ‘ఆపరేషనల్ ట్రిగ్గర్’గా భావిస్తున్న ఒక ఎన్క్రిప్టెడ్ (రహస్య సంకేతాలతో కూడిన) సందేశాన్ని అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి.ఫిబ్రవరి 28న అలీ ఖమేనీ మృతిచెందిన కొద్దిసేపటికే ఇరాన్ నుంచి ఒక ప్రత్యేక రేడియో స్టేషన్ ద్వారా ఈ సంకేతాలు వెలువడినట్లు ‘ఏబీసీ న్యూస్’ కథనం వెల్లడించింది. ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్వర్క్లపై ఆధారపడకుండా, పాతకాలపు రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా పంపిన ఈ సందేశం కేవలం సంబంధిత ‘కోడ్’ తెలిసిన వారికి మాత్రమే అర్థమవుతుంది. విదేశాల్లో మాటువేసిన ఇరాన్ అనుకూల ఉగ్రవాద మూకలు, గూఢచారులకు తక్షణమే దాడులకు దిగాలని లేదా విధ్వంసక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశిస్తూ ఈ ‘ట్రిగ్గర్’ సందేశాన్ని పంపినట్లు అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు గమనించాయి.అయితే ఈ దాడులు ఎక్కడ జరగవచ్చనే దానిపై నిర్దిష్ట సమాచారం లేనప్పటికీ, అప్రమత్తంగా ఉండాలని అన్ని దేశాల భద్రతా విభాగాలకు సూచనలు అందాయి. గత వారం రోజులుగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భీకరమైన వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. మరోవైపు లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేయగా, ఆ సంస్థ ఇజ్రాయెల్ భూభాగంపై రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా గడ్డపైనే ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఉగ్రవాద వ్యతిరేక బృందాలను హై అలర్ట్లో ఉంచారు. ముఖ్యంగా న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, మయామి వంటి ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రార్థనా మందిరాలు, విద్యా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాల వద్ద గస్తీని పెంచారు. అమెరికా భూభాగంపై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. "యుద్ధం అన్నాక ప్రాణనష్టం తప్పదు, మేము అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుఉ సిద్ధంగా ఉన్నాం’ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం గమనార్హం.ఇది కూడా చదవండి: యూఏఈ కాన్సులేట్పై డ్రోన్ దాడి
యూఏఈ కాన్సులేట్పై డ్రోన్ దాడి
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుతున్నాయి. ఇరాన్ కేంద్రంగా సాగుతున్న దాడులు గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఇరాక్ పరిధిలోని కుర్దిస్థాన్ రీజియన్లో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కాన్సులేట్పై డ్రోన్ దాడి జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో యూఏఈకి ఆస్ట్రేలియా అండగా నిలిచింది. అత్యాధునిక గగనతల క్షిపణులను సరఫరా చేయడంతో పాటు నిఘా విమానాలను రంగంలోకి దించుతున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది.ఇరాక్లోని ఎర్బిల్లో ఉన్న యూఏఈ కాన్సులేట్ జనరల్ భవనంపై మంగళవారం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో భవనం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాలేదు. ఈ దాడిని యూఏఈ విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ దౌత్య నిబంధనలను ఉల్లంఘిస్తూ, సాగుతున్న ఇటువంటి చర్యలు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులెవరో తేల్చేందుకు దర్యాప్తు జరపాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టేందుకు యూఏఈకి ఆస్ట్రేలియా సైనిక సాయాన్ని ప్రకటించింది. అత్యాధునిక ‘అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్-టు-ఎయిర్’ క్షిపణులను యూఏఈకి పంపనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ వెల్లడించారు. గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న తమ దేశ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి గగనతలం సురక్షితంగా ఉండటం అత్యవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు యూఏఈ సుమారు 1,500కు పైగా క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుందని, పౌర భద్రత దృష్ట్యా ఈ సాయం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.మరోవైపు ఇరాన్ తన దాడులను ఇంధన కేంద్రాల వైపు మళ్లించింది. బహ్రెయిన్లోని అల్ మామీర్ చమురు శుద్ధి కర్మాగారంపై జరిగిన దాడితో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. దీంతో బహ్రెయిన్ ప్రభుత్వ ఇంధన సంస్థ ‘బాప్కో’ ఫోర్స్ మెజ్యూర్ ప్రకటించింది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదన్న ఆందోళనతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో భారత్ నుంచి వెళ్లే బియ్యం, ఇండోనేషియా కాఫీ రవాణాపై తీవ్ర ప్రభావం పడింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఉద్రిక్తతలపై స్పందిస్తూ ఇరాన్తో యుద్ధం అతి త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాయి. యుద్ధం ఎప్పుడు ముగియాలో అమెరికా కాదు.. తామే నిర్ణయిస్తామని సవాల్ విసిరాయి. కాగా నిత్యావసరాల ధరలు పెరగకుండా దుబాయ్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. వచ్చే కొన్ని నెలల వరకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని పేర్కొంది.
ఇరాన్పై యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!
వాషింగ్టన్: ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు దొరుకుతుందన్నారు. ఇరాన్పై తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిండానికి చాలా చేరువలో ఉన్నామన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా చమురు సరఫరాకు సంబంధించి ఇరాన్ను హెచ్చరించారు. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అంతరాయం కలిగిస్తే ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించగా, ఆయన వారసుడిగా ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత రోజే చమురు ధరలు భారీగా పెరిగి, 2022 తర్వాత తొలిసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పెట్టుబడిదారులు దీన్ని ఇరాన్లో యుద్ధం రోజులు తరబడి కొనసాగుతుందనే సంకేతంగా భావించారు.అయితే అనూహ్యంగా చమురు ధరలు పడిపోయాయి. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగదనే అంచనాల నడుమ అమెరికన్ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా జోరందుకున్నాయి. ఈ క్రమంలో మియామి గోల్ఫ్ క్లబ్లో రిపబ్లికన్ చట్టసభ సభ్యులతో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొంత చెడును వదిలించడానికి మేం మధ్యప్రాచ్యంలో ఓ చిన్న విహారయాత్ర చేశాం. ఆ విహారయాత్ర స్వల్పకాలికంగా ఉంటుంది. ఆ విషయం మీకు త్వరలో తెలుస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనితో, ఇరాన్తో యుద్ధం ముగుస్తుందనే సంకేతం ఇచ్చినట్లు భావిస్తున్నారు.ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. హర్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించడంతో చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద చమురు రవాణా సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఫలితంగా అమెరికాలో ఆయిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి.దాడుల ప్రభావంతో పెట్టుబడిదారులు కూడా వెనక్కి తగ్గారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడారు. గల్ఫ్ నాయకులు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో జరిగిన సంభాషణల తర్వాత ‘వివాదానికి రాజకీయ, దౌత్య పరిష్కారం అవసరం’ అని పుతిన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఆయన విదేశాంగ సలహాదారు యూరి ఉషాకోవ్ తెలిపారు.ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ఇరాన్పై దాడుల విషయంలో ట్రంప్ పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ట్రంప్ వ్యూహమా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇరాన్కు తుర్కియే వార్నింగ్..
తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇరాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ నుంచి వచ్చిన బాలిస్టిక్ క్షిపణిని నాటో రక్షణ వ్యవస్థలు రెండోసారి కూల్చివేశాయని, ఇలాంటి "తప్పుడు, రెచ్చగొట్టే చర్యలు" కొనసాగిస్తూ మధ్యప్రాచ్యాన్ని మళ్లీ గత శతాబ్దంలోలా యుద్ధభూమిగా మార్చేస్తామంటే ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు.క్యాబినెట్ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎర్డోగాన్ మాట్లాడుతూ, ఇరాన్కు సంబంధించిన పరిణామాలను తుర్కియే నిశితంగా గమనిస్తోందని తెలిపారు. తమ ఆందోళనలను నేరుగా టెహ్రాన్కు తెలియజేశామని చెప్పారు. “ఇరాన్కు అవసరమైన హెచ్చరికలు ఇచ్చాం. అయినప్పటికీ వారు తప్పుదోవలోనే కొనసాగుతున్నారు” అని ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు.దౌత్యపరమైన పరిష్కారాలకే తుర్కియే ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. “ఇతర యుద్ధాల మాదిరిగానే తుర్కియే న్యాయం వైపు నిలుస్తుంది. చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడానికే మేము మద్దతు ఇస్తాం” అని తెలిపారు.అదే సమయంలో దేశ రక్షణ సామర్థ్యాలపై కూడా ఎర్డోగాన్ నమ్మకం వ్యక్తం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారాన్ని లక్ష్యంగా చేసుకునే ఎలాంటి బెదిరింపులకైనా తగిన ప్రతిస్పందన ఇవ్వగల సామర్థ్యం తుర్కియేకి ఉందని పేర్కొన్నారు. “తుర్కియే ప్రతి రంగంలో బలమైన దేశం. ఎలాంటి దాడినైనా తిప్పికొట్టగలదు” అన్నారు. "మధ్యప్రాచ్యాన్ని శతాబ్దం క్రితం మాదిరిగా మళ్లీ ఆపరేటింగ్ టేబుల్పై ఉంచడానికి అనుమతించం" అని ఎర్డోగాన్ హెచ్చరించారు.అలాగే గాజా పరిస్థితిపై మాట్లాడుతూ, గాజాలో జరుగుతున్న ఘటనల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించుకుంటూ ఇజ్రాయెల్ రెండు దేశాల పరిష్కారాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరించకుండా త్వరగా ముగియాల్సిన అవసరం ఉందని, లేకపోతే యూరప్-ఆసియాతో పాటు ప్రపంచానికే నష్టం జరుగుతుందని ఎర్డోగాన్ హెచ్చరించారు.
జాతీయం
‘ఎన్సీఈఆర్టీ’ వివాదం: ‘న్యాయ పాఠం’పై కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పాఠ్యపుస్తకాల్లో న్యాయవ్యవస్థ ప్రతిష్టను భంగపరిచేలా అభ్యంతరకర అంశాలను పొందుపరిచిన వ్యవహారంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) దిగివచ్చింది. ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి మంగళవారం ‘బేషరతుగా, నిష్పాక్షికంగా’ క్షమాపణలు ప్రకటించింది. సదరు పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది.ఇటీవల ప్రచురించిన "ఎక్స్ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్" (Exploring Society: India and Beyond) అనే ఎనిమిదో తరగతి పుస్తకంలోని నాలుగో అధ్యాయం ‘మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర’ (The Role of Judiciary in our Society) తీవ్ర దుమారం రేపింది. భారత న్యాయవ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోందని, కేసుల పెండింగ్కు జడ్జీల కొరతే ప్రధాన కారణమని పేర్కొంటూ వ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ugraగత నెలలో ఈ అంశంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఆ పుస్తక ప్రచురణ, పంపిణీ, డిజిటల్ ప్రసారాలపై తక్షణమే పూర్తిస్థాయి నిషేధం విధించింది. న్యాయవ్యవస్థను కించపరచడం వెనుక లోతైన కుట్ర దాగి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ అప్రమత్తమైంది. డిజిటల్ ప్లాట్ఫారమ్ల నుండి ఈ పుస్తకాన్ని తొలగించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వ శాఖలకు లేఖలు రాసింది. మరోవైపు ఈ వివాదాస్పద పాఠ్యాంశాన్ని రూపొందించిన ఇద్దరు వ్యక్తులను మంత్రిత్వ శాఖ విధులకు దూరం పెట్టినట్లు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు.ఇది కూడా చదవండి: పొద్దున్నే రెండు ఘోరాలు.. గాలిలో 14 నిండు ప్రాణాలు..
పొద్దున్నే రెండు ఘోరాలు.. గాలిలో 14 నిండు ప్రాణాలు..
గురుగ్రామ్: హర్యానాలో మంగళవారం తెల్లవారుజామున రెండు వేర్వేరు చోట్ల పెను విషాదాలు చోటుచేసుకున్నాయి. గురుగ్రామ్లోని ఒక భవన నిర్మాణ ప్రాంతంలో భారీ మట్టి దిబ్బ పడి, ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, జింద్ జిల్లాలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరో ఏడుగురు మహిళా కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ రెండు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.గురుగ్రామ్లోని సిద్ధ్రావలి ప్రాంతంలో ఓ ప్రైవేట్ నిర్మాణ ప్రాంతంలో భారీ ఎత్తున పోగుపోసిన మట్టి ఒక్కసారిగా జారిపోవడంతో అక్కడ పనిచేస్తున్న సుమారు 20 మందికి పైగా కార్మికులు దాని కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వెలికితీయగా, మరో నలుగురిని కాపాడారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా పది మందికి పైగా కార్మికులు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.జింద్లో అగ్నిప్రమాదంజింద్ జిల్లా సఫిడాన్ ప్రాంతంలోని ఒక పెయింట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఏడుగురు మహిళా కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు ఫ్యాక్టరీ యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ రెండు దుర్ఘటనలపై హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జింద్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: ఖమేనీ మృతితో రంగంలోకి విధ్వంసక శక్తులు?
ఢిల్లీలో డీకే మంత్రాంగం
బెంగళూరు: ముఖ్యమంత్రి మార్పిడిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించిన తనకు కూడా ఒక అవకాశం కల్పించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు తెలిసింది. ఇదే డిమాండ్తో గత కొన్ని వారాలుగా హైకమాండ్పై ఒత్తిడి తీసుకొస్తున్న ఆయన ఆదివారం హఠాత్తుగా హస్తినకు వెళ్లారు. అయితే వెంటనే పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్లు దొరకకపోవడంతో రాత్రికి అక్కడే మకాం వేశారు. సోమవారం ఉదయం నుంచి రాహుల్గాందీ, సోనియాగాంధీ, ప్రియాంక గాందీతో పాటుగా పలువురు నాయకులతో సమావేశం కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. తనకు సీఎం పదవి కావాలనే ఏకవాక్య అజెండాతో పర్యటన సాగించారు.కొలిక్కిరాని పోరాటం రాష్ట్రంలో సీఎం కుర్చీ కోసం సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే మధ్య గత 4, 5 నెలలుగా పోరాటం సాగుతోంది. ఇది శీతల యుద్ధం నుంచి వీధి పోరాటాల వరకూ వ్యాపించింది. కొందరు మంత్రులు, ఇరువర్గాల ఎమ్మెల్యేలు జంతువులతో పోల్చుతూ ఆరోపణలు చేసుకుంటున్నారు. హైకమాండ్ మాత్రం గట్టి నిర్ణయం తీసుకోవడం లేదు. సీఎం సీటు గురించి ఎవరూ బయట మాట్లాడరాదని ఢిల్లీ పెద్దలు ఆదేశించినా, అనుకూల–వ్యతిరేక వ్యాఖ్యలు అడపాదడపా వెలువడుతున్నాయి. పైగా ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని హైకమాండ్కే సలహాలు ఇవ్వడం గమనార్హం. విందుకు వేళాయె డీకే మంగళవారం బెంగళూరుకు తిరిగి వస్తున్నారు. అదే రోజు బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆయన భారీ విందు ఇవ్వబోతున్నారు. దీంతో అందరి చర్చ విందు మీదే సాగుతోంది. సీఎం సిద్దరామయ్యను, మంత్రులను కూడా ఆహ్వానించారు. ఎంతమంది వస్తారు, ఎంతమంది ముఖం చాటేస్తారు, ఏం జరుగుతుందీ అన్నది కుతూహలం రేపుతోంది.ఎవరిని కలిశానో చెప్పను: డీసీఎంబనశంకరి: నేను ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తాను అనేది బహిరంగంగా చెప్పడం కుదరదని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. సోమవారం ఢిల్లీలో కర్ణాటక భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీకి వచ్చిన తరువాత నేను అందరినీ కలుస్తాను. కానీ హైకమాండ్ నేతలు అపాయింట్మెంట్ ఇవ్వక పోవడంతో నేను వేచి చూస్తున్నాను అని మీడియాలో ప్రసారం చేస్తారు. అందుకే వేచిచూస్తున్నాను. పూణేలో నా స్నేహితుని ఇంట్లో పెళ్లి ఉంటే ఆదివారం బయల్దేరాను. సోమవారం అసోం పీసీసీ అధ్యక్షునితో భేటీతో పాటు అనేక సమావేశాల్లో పాల్గొన్నాను’ అని తెలిపారు. మంగళవారంతో కేపీసీసీ అధ్యక్షునిగా 6 ఏళ్లు పూర్తి అవుతుంది, ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బెంగళూరులో విందు ఏర్పాటు చేశానని చెప్పారు. ఓడిన అభ్యర్థులు, జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు మరోసారి డిన్నర్ ఇస్తానని చెప్పారు. ఢిల్లీ భేటీపై ఎలాంటి ప్రత్యేక చర్చ వద్దన్నారు. ఇక బుధవారం కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ఉందని తెలిపారు.
యువ జంట ఆత్మహత్య
కర్ణాటక: కలిసి ఏడడుగులు వేశారు, ఎంత కష్టం వచ్చిందో గానీ కలిసే తనువు చాలించారు. జిల్లాలోని కెఆర్ పేట పట్టణంలోని జయనగర బ్లాక్లో యువ దంపతులు ఒకే తాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. హోస్కోటే గ్రామానికి చెందిన దర్శన్ (29), నతనహళ్లికి చెందిన భార్య ఎన్.ఎల్. దివ్య (25) మృతులు. వీరికి 3 ఏళ్ల కిందట పెళ్లయింది, ఏడాదిగా ఇక్కడ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దర్శన్ క్యాబ్ డ్రైవర్ కాగా, దివ్య ఓ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నారు. వీరికి రక్ష అనే రెండేళ్ల కుమార్తె ఉంది. ఏం సమస్యలు వచ్చాయోగానీ.. ఆదివారం రాత్రి వారితో పాటు పాపకు ఉరి బిగించి ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఉరి జారిపోవడంతో పాప క్షేమంగా తప్పించుకుంది. చిన్నారి ఏడుస్తూ ఉండడంతో ఇరుగు పొరుగు వచ్చి చూడగా దంపతులు ఉరికి వేలాడుతూ కనిపించారు. దర్శన్ తండ్రి గణేష్ గౌడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలవారు చేరుకుని మీరంటే మీరు కారణమని ఆరోపణలు చేసుకున్నారు. తల్లిదండ్రులు కానరాని లోకాలకు చేరడంతో కూతురు అనాథగా మారింది.
ఎన్ఆర్ఐ
అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత
అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..
అమెరికాలో ఉండే మన భారతీయులు ఏ రేంజ్లో ప్యాకేజ్లు అందుకుంటారో తెలిసిందే. అంతలా వేతనాలు వస్తాయనే..విదేశాలంటే మోజు మనవాళ్లకు. కానీ ఆ వ్యక్తి కోట్లలో వచ్చే వేతనం కాదనుకుని మరి భారత్కి వచ్చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాదు దానికి గల కారణాన్ని వివరిస్తూ..అది సరైనదో కాదో సలహా ఇవ్వండి అంటూ రెడ్డిట్లో పోస్ట్ పెట్టాడు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అతడి ఉద్దేశానికి ఫిదా అవ్వతూ ప్రశంసలజల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.ఇంతకీ కారణం ఏంటేంటే..అమెరికాలో 12 ఏళ్లకు పైగా గడిపిన తర్వాత తిరిగి కుటుంబంతో సహా భారత వచ్చేయాలనకుంటున్నట్లు ఓ ఎన్నారై పోస్ట్లో తెలిపాడు. ఈ జూన్ కల్లా తాము ఐదుగురు ముంబైకి వచ్చేయాలని నిర్ణయించుకున్నామని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు. తన వయసు 36 ఏళ్లు అని, 2018లో నవంబర్ నుంచి హెచ్1బీ విసాతో అమెరికాలో నివశిస్తున్నట్లు తెలిపాడు. పైగా తన వార్షిక ఆదాయం రూ. 2.9 కోట్లు అని, నెట్వర్త్ వచ్చేసి రుణ రహిత ఇల్లుతో కలిపి దగ్గర దగ్గర రూ. 9 కోట్లు అని వెల్లడించారు. భారత్ తన ఉద్యోగ ఆఫర్ ఏడాదికి రూ. 1.5 కోట్ల ప్యాకేజ్ అని కూడా వివరించాడు. అయితే తన తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉన్నారని, కుటుబానికి దగ్గరగా ఉండటమే మేలని ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అందులోనూ తన పిల్లలు తాతయ్య నానమ్మల, దగ్గర బంధువులతో పెరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు పోస్ట్లో. అక్కడ అమెరికాలో ఇంటి అద్దె చెల్లించకుండా లగ్జరియస్గా గడిపినా తన కుటుంబానికి ఈ నిర్ణయం కారణంగా.. చాలా పెద్ద మార్పుని స్వాగతించాల్సి ఉంటుందని అంటున్నాడు. ఎందుకంటే ముంబైలో అద్దె చెల్లిస్తూ..ఏడాదికి రూ. 1.5 కోట్లతో బతకడం సాధ్యమేనా? అని సందేహం వ్యక్తం చేశాడు. అలాగే యూఎస్లో పుట్టి..అక్కడే పెరిగిన పిల్లలు ఇక్కడ జీవనశైలికి, ఎడ్యుకేషన్కి సులభంగా అలవాటుపడగలరా, అసలు తన నిర్ణయం సరైనదేనా..? ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని పోస్ట్ పెట్టాడు. అయితే నెటిజన్లు అది మంచి ప్యాకేజీ అని, ముంబైలో ధీమాగా బతకొచ్చు అని అన్నారు. పైగా ఇలా భారత్కి రావాలనుకుంటున్న మీ నిర్ణయానికి స్వాగతం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తల్లిదండ్రలు గురించి ఆలోచిస్తున్నందుకు మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: లే ఆఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే..?: మాజీ అమెజాన్ టెక్కీ)
13 ఏళ్ల టీనేజర్ అమెరికాలో మైనర్లపై వేధింపులు, దొంగతనాలు
అమెరికాలో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఒక భారతీయుడిని అరెస్టు చేశారు. ఓదెల యశస్వి కొత్తపల్లిగా గుర్తించబడిన నిందితుడు అక్రమ వలసదారు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రకటించింది. న్యూజెర్సీలో పిల్లలపై లైంగిక వేధింపులతోపాటు, దొంగతనానికి సంబంధించిన ఆరోపణలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించింది.సరైన పత్రాలు లేకుండా అమెరికాలోని ప్రవేశించిన నిందితుడు యశస్విని చైల్డ్ రేపిస్తూ అని పేర్కొంది. అతడిపై యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం తొలగింపు చర్యలు పెండింగ్లో ఉన్నాయని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఈసీఇ) ఎక్స్లో ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుమైనర్లపై లైంగిక నేరాలకుపాల్పడినట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, దొంగతనం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే నిందితుడిపై కేసు ఎప్పుడు, ఎక్కడ నమోదైంది, ఎప్పుడు అరెస్టు చేశారనే విషయాలపై స్పష్టతనివ్వలేదు.—SEXUAL ASSAULT OF A CHILD UNDER 13 —SHOPLIFTING —PUBLIC DISORDER Vodela Yashaswi Kottapalli, a criminal illegal alien from India, has pending charges for sexual assault and larceny in New Jersey. We’ll keep him in custody pending removal proceedings. pic.twitter.com/VM97e9KUD9— U.S. Immigration and Customs Enforcement (@ICEgov) February 16, 2026 ఇదీ చదవండి: పెళ్లయ్యి ఆరునెలలే.. వాలెంటైన్స్డే రోజే హత్య
క్రైమ్
యువ జంట ఆత్మహత్య
కర్ణాటక: కలిసి ఏడడుగులు వేశారు, ఎంత కష్టం వచ్చిందో గానీ కలిసే తనువు చాలించారు. జిల్లాలోని కెఆర్ పేట పట్టణంలోని జయనగర బ్లాక్లో యువ దంపతులు ఒకే తాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. హోస్కోటే గ్రామానికి చెందిన దర్శన్ (29), నతనహళ్లికి చెందిన భార్య ఎన్.ఎల్. దివ్య (25) మృతులు. వీరికి 3 ఏళ్ల కిందట పెళ్లయింది, ఏడాదిగా ఇక్కడ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దర్శన్ క్యాబ్ డ్రైవర్ కాగా, దివ్య ఓ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నారు. వీరికి రక్ష అనే రెండేళ్ల కుమార్తె ఉంది. ఏం సమస్యలు వచ్చాయోగానీ.. ఆదివారం రాత్రి వారితో పాటు పాపకు ఉరి బిగించి ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఉరి జారిపోవడంతో పాప క్షేమంగా తప్పించుకుంది. చిన్నారి ఏడుస్తూ ఉండడంతో ఇరుగు పొరుగు వచ్చి చూడగా దంపతులు ఉరికి వేలాడుతూ కనిపించారు. దర్శన్ తండ్రి గణేష్ గౌడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలవారు చేరుకుని మీరంటే మీరు కారణమని ఆరోపణలు చేసుకున్నారు. తల్లిదండ్రులు కానరాని లోకాలకు చేరడంతో కూతురు అనాథగా మారింది.
ఢీ కొట్టి.. 200 మీటర్లు ఈడ్చుకెళ్లి
హైదరాబాద్: మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై రవీందర్రెడ్డి కథనం ప్రకారం... షాద్నగర్కు చెందిన సర్ఫరాజ్, హుస్సేన్, షమీర్, మాజీద్లు రెండు బైక్లపై పల్లెచెరువు మీదుగా చార్మినార్కు షాపింగ్ నిమిత్తం వెళ్తున్నారు. అదే సమయంలో నగరానికి చెందిన కిషోన్, టోటన్లు పల్లెచెరువు మీదుగా కారులో ఇంటికి వెళ్తున్నారు. అతివేగంగా వచ్చిన ఆ కారు వారి బైక్లను బలంగా ఢీ కొట్టింది. నలుగురు యువకులు పక్కకు పడిపోయి, స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే కారు డ్రైవర్ కిషోర్ భయంతో కారును మరింత వేగంగా పోనివ్వడంతో దాని కింద భాగంలో బైక్ చిక్కుకుపోయింది. 200 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. కేసు దర్యాప్తులో ఉంది.
ఊపిరి తీసిన ఊయల
అన్నమయ్య జిల్లా: ఊయలలో నవ్వులు..క్షణాల్లో కన్నీళ్లుగా మారాయి. ఆనందంగా ఊయల ఊగుతున్న చిన్నారులను కాపాడే ప్రయత్నంలో విద్యుత్ షాక్ రూపంలో ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. అప్పటి వరకు జాతర సందడిలో మునిగి తేలిన ఆకుటుంబం క్షణాల్లో విషాదంలో మునిగిపోయింది. చూపరుల హృదయాలను కలచి వేసింది. కురబలకోట మండలం ముదివేడు గ్రామం రెడ్డివారిపల్లిలో ఈ విషాదకర సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ రూపంలో ఆ ఇంటిపై మృత్యువు మాటు వేసినా అదృష్టవశాత్తు ఇద్దరు బాలికలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇంటిలోని మిగిలిన వారికి ఇరుగుపొరుగు వారికి గుండె ఆగినంత పనైంది. ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడు, గ్రామస్థుల కథనం మేరకు...నిమ్మనపల్లి మండలం వలసపల్లికి చెందిన శివకుమార్ రెడ్డి ఆదివారం ముదివేడులో జరిగే దండు మారెమ్మ జాతరకు సమీపంలోని రెడ్డివారిపల్లికి చెందిన బంధువు జగదీశ్వర్ రెడ్డి ఇంటికి భార్యా పిల్లలు, అత్త పద్మావతమ్మ ఇంకో మిత్రుడు రాపూర్ వెంకటేష్తో కలసి వచ్చారు. వీరంతా రెడ్డివారిపల్లిలో ఇంటి వద్ద ఉండగా శివకుమార్ రెడ్డి కుమార్తెలు మధుప్రియ (11), లిఖిత (9) ఇంట్లో ఉన్న ఊయల ఊగసాగారు. అది రేకుల ఇళ్లు. ఉన్నట్టుండి మధుప్రియ ఊగుతున్న ఊయలకు విద్యుత్ షాక్ తగిలింది. బాలిక ఒక్కసారిగా అరిచింది. అక్కడే ఉన్న పద్మావతమ్మ (58) ఏమో జరిగిందన్న ఆత్రుతలో పాపను కాపాడాలి..అని ఊయల నుంచి కిందకు దింపబోయింది. ఊయల తగిలి విద్యుత్ షాక్తో ఆమె చనిపోయింది. అక్కడే ఉన్న వెంకటేష్ (38) కూడా చిన్నారికి ఏదో అయ్యిందని కాపాడాలని అతను కూడా ఊయలను పట్టుకున్నారు. అతను కూడా విద్యుత్షాక్కు గురై చనిపోయాడు. బాలిక మధు ప్రియ అప్పటికే ఊయల నుంచి కిందకు పడిపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. ఈమెకు దగ్గరగా ఉన్న సోదరి లిఖిత (9) కూడా అదృష్టవశాత్తు బయటపడింది. హుటాహుటిన గ్రామస్తులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అంతకు ముందు అంతా జాతర హడావుడిలో ఆనందంగా కాలం గడుపుతుండగా ఒక్కసారిగా గ్రామంలో విషాదం అలుముకుంది. మనవరాలిని కాపాడబోయి అవ్వ పద్మావతమ్మ, వారింటికి వచ్చిన వెంకటేష్ ఒకరి తర్వాత ఒకరు క్షణాల వ్యవధిలోనే చనిపోయారు. అంతా కోలుకోలేని షాక్కు గురయ్యారు. మృతి చెందిన ఎస్.పద్మావతమ్మది పుంగనూరు దగ్గర గోళ్లపల్లి కాగా రాపూర్ వెంకటే‹Ùది చిత్తూరు దగ్గర కొంగారెడ్డిపల్లి. ఇతను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేసేవారు. మధు ప్రియకు స్వల్ప గాయాలు కావడంతో ఆసపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాలను కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు. తోడుగా వచ్చి.. విద్యుత్ షాక్తో మృతి చెందిన రాపూర్ వెంకటేష్ బెంగళూరులో ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న శివకుమార్రెడ్డితో పరిచయం పెరగడంతో ఇద్దరు మిత్రులయ్యారు. ఇండ్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. దీంతో జాతర చూద్దామని ఇద్దరూ ముదివేడు దగ్గర రెడ్డివారిపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడ మధుప్రియ ఊగుతున్న ఊయలకు విద్యుత్ సరఫరా రావడం, ఆమెను కాపాడబోయి రాపూర్ వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందడం తీరని వేదనగా మారింది. స్నేహితుడి కోసం జతగా వచ్చి మృత్యువాత పడటం విచారకరం. ఇక మాకెవరు దిక్కని ఇతని కుటుంబీకుల బోరున విలపించారు. అల్లుడి ఇంటికి వచ్చి... పద్మావతమ్మకు ఇద్దరు కుమార్తెలు. ఒకరిని నిమ్మనపల్లి మండలం వలసపల్లికి చెందిన శివకుమార్ రెడ్డికి, మరో కుమార్తెను రెడ్డివారిపల్లిలోని జగదీశ్వర్ రెడ్డికి ఇచ్చారు. ఆమె రెడ్డివారిపల్లిలోని అల్లుడి ఇంటికి చాన్నాళ్ల తర్వాత జాతరకు వచ్చారు. చుట్టాలు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతుండగా మనవరాలు ఊగుతున్న ఊయలకు విద్యుత్ సరఫరా కావడంతో కాపాడబోయి విద్యుత్ షాక్ గురై పద్మావతమ్మ మృతి చెందడం తీరనిలోటుగా మారింది.కుంగిపోయిన శివకుమార్ రెడ్డి బెంగళూరులో ఉన్న శివకుమార్ రెడ్డి పిల్లలతో పాటు స్నేహితుడు, అత్త పద్మావతమ్మతో జాతరకు రావడం, తీరని విషాదం చోటుచేసుకోవడంతో కుంగిపోయాడు. ఆఊరిలో వీరి ఇంటి వద్దే చాందినీ బండి కూడా కట్టారు. సాయంత్రం జాతరకు వెళ్లాల్సి ఉంది. ఇంతలో ఊయల ఊగుతున్న మధుప్రియకు విద్యుత్షాక్ తగలడం, వారిని కాపాడబోయి పద్మావతమ్మ, రాపూర్ వెంకటేష్ అక్కడికక్కడే విగత జీవులయ్యారు. దీంతో ఒక వైపు బిడ్డలు తృటిలో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడటం, మరో వైపు అత్త, జతగా వచ్చిన మిత్రుడు మృత్యు ఒడికి చేరడం అతన్ని దహించి వేస్తోంది. ఇలా అవుతుందని ఊహించలేదని కంటతడిపెట్టారు.
మహిళల పట్ల టీడీపీ నాయకుడి అమానుషం
గుంటూరు జిల్లా: మహిళల ఫొటోలను ఐటీడీపీకి చెందిన నాయకుడు తీసి మార్ఫింగ్ చేస్తున్న సంఘటన వెలుగు చూసింది. ప్రశ్నించిన మహిళలపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఆగ్రహించిన మహిళలు ఆందోళనకు దిగారు. సేకరించిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన నల్లమామిడి అంజయ్య కళాశాల విద్యార్థునులు, మహిళల ఫొటోలు తీసి మార్ఫింగ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ విద్యార్థిని గుర్తించి శనివారం రాత్రి అంజయ్య ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ నర్రా శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని ‘ఏం చేస్తారు మీరు అంటూ దురుసుగా మాట్లాడి, కేసులు పెట్టినా, వెంటనే తీసుకువచ్చి ఇదే రోడ్డులో తిప్పుతానని’ బెదిరించాడు. సమాచారం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల మహిళలు తెనాలి– మంగళగిరి రహదారిపై ఆందోళనకు దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకోకుండా సుమారు మూడు గంటల పాటు పక్కన ఉన్న చర్చిలో ఉంచారు. గతంలో కూడా ఫొటోలు తీస్తున్న విషయం గమనించి కొందరు మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు. అయినా కూడా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని బాధితులు అంటున్నారు. కేవలం దళిత పిల్లల్ని ఫొటోలు తీయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతు పలికారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాలుగు గంటల అనంతరం పోలీసులు నిందితుడిని దుగ్గిరాల పోలీసుస్టేషన్కు తరలించారు.
వీడియోలు
11 వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా మిత్ర పక్షాలపై ఇరాన్ దాడులు
రాష్ట్రాన్ని ముంచేలా చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ భారీ అప్పు
కొత్త సుప్రీం మొజ్జబా ఖమేనీపై రగులుతున్న ఇరాన్
Anantapur: రథం కింద పడి ఐదుగురికి తీవ్ర గాయాలు
అలిగిన చిన్నారికి ఆహ్వానం భోజనానికి ఇంటికి పిలిచిన విజయ్
గుంజీలు తీయమంటే.. ఈ బుడ్డాడు చేసిన పనికి నవ్వాగదు
పోసుకునేవాడు.. నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. తమిళ తంబీలు ఫైర్!
కల్తీ పాల కేసు CBIకి అప్పగించాలి
టీడీపీ కార్యకర్తల వీరంగం YSRCP కార్యకర్త, మహిళా సిబ్బందిపై దాడి
ఇరాన్ స్కూల్ పై దాడి... దాడి అమెరికా పనేనా?

