Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan Visits The Residence Of YV Subbareddy Medarametla1
మేదరమెట్లకు వైఎస్‌ జగన్‌.. వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థీవదేహానికి నివాళులు

తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) బాపట్ల జిల్లా మేదరమెట్లకు బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు వైఎస్‌ జగన్‌. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు జగన్‌.అనారోగ్యంతో పాటు, వయోభారంతో బాధపడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85)సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. ఈ రోజు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి.

KSR Comment On Pawan Kalyan And Chandrababu Political Drama2
పవన్‌ గొంతు చించుకున్నారు.. మరి అది ఇప్పుడేమైంది?

సాధారణంగా శాసనసభలో లేని వ్యక్తుల గురించి ఏవైనా ఆరోపణలు,విమర్శలు చేయడం సమంజసం కాదన్నది సంప్రదాయం. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైనా అలా మాట్లాడితే స్పీకర్ స్థానంలో ఉన్నవారు వారిస్తుంటారు. కాని స్వయంగా ముఖ్యమంత్రే అలా మాట్లాడితే ఏమి చేస్తారు! ఎపి శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ గురించి చేస్తున్న విమర్శలు అసంబద్దంగా ,అసందర్భంగా ఉంటున్నాయి. కారణం ఏమైనా సభలో జగన్ లేనప్పుడు ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి చంద్రబాబు సభా సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారేమో అనిపిస్తుంది. తాము ఎన్నికల సమయంలో చేసిన సూపర్ సిక్స్ తో పాటు మరో 143 హామీల అమలు గురించి కన్నా జగన్ పైనే ఆరోపణలు చేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. మహిళా సాధికారిత గురించి ఆయన సభలో ప్రసంగం చేసినప్పుడు ఏ అంశాల గురించి చెప్పాలి? తాము ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల గురించి కదా!వాటిని పక్కనబెట్టి కొత్త హామీలు ఇస్తూ కధ నడిపడమే కాకుండా ,జగన్ ఆడబిడ్డల ద్రోహానికి పాల్పడ్డారని ,అదో కేస్ స్టడీ అని చెబుతున్నారంటే ప్రజలు విస్తుపోవడం తప్ప చేయగలిగింది ఏముంది?చంద్రబాబు నాయుడు మహిళలకు ఏఏ హామీలు ఇచ్చారు? వాటిలో ఎన్నిటిని అమలు చేశారో అంశాలవారిగా లెక్కలు చెబితే అది ఆడబిడ్డలకు మేలు చేసినట్లు అవుతుంది .అలాకాకుండా అసలు ఆ అంశాలనే ప్రస్తావించకుండా జగన్ పైనో, మరొకరిపైనో ఆరోపణలు చేస్తే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది. అది చంద్రబాబు ప్రభుత్వం ఆడబిడ్డలకు ద్రోహం చేసినట్లు కాదా!ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తకుండా ఎగవేయడం ద్రోహం అవుతుందా? కాదా?కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంతమంది మహిళలు అఘాయిత్యాలకు గురయ్యారో వివరించి, వాటిని అరికట్టడానికి ఏమి చర్య తీసుకుంటున్నారో చెప్పాలి కదా?అవన్ని ఎందుకు !ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో సుగాలి ప్రీతి అంటూ గొంతు చించుకుని మాట్లాడేవారు కదా! ఆ కేసు గురించి ఎన్నడైనా చంద్రబాబు మాట్లాడారా? పవన్ మాట నిలబెట్టుకున్నారా?దానిని ద్రోహం అంటారా?అనరా?ప్రతి ముఖ్యమైన పండగకు మహిళలకు కానుకలు ఇస్తామని ప్రకటించారు కదా?ఈ ఏడాది కాలంలో పండగలు రాలేదా!అయినా ఏ ఒక్క మహిళకైనా కానుకలు అందాయా?పెళ్లికానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారే!మహిళలు ఎవరికైనా అందచేశారా?వలంటీర్లకు పదివేల వేతనం ఇస్తామని చెప్పి,అసలుకే ఎసరు పెట్టారు కదా!ఆ వలంటీర్లలో లక్షమందికి పైగా మహిళలుఉన్నారు కదా!వారికి ఇచ్చిన సాధికారిత ఇదేనా!ఆర్డిసి బస్ లలో ఉచిత ప్రయాణం హామీ ఇచ్చారు కదా!దానికి బడ్జెట్ లో ఒక్క రూపాయి అయినా పెట్టారా?తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి 15వేలు ఇచ్చే వాగ్దానం ఒక ఏడాదిపాటు అతీగతీ లేదే!వచ్చే ఏడాది ఏ మేరకు ఇస్తారో తెలియదు.ఆ తల్లికి ఆ డబ్బు ద్వారా సాధికారిత వచ్చేది కదా!జగన్ తాను మహిళలకు ఇచ్చిన హామీలన్ని దాదాపు అమలు చేశారే.అన్ని స్కీమ్ లు మహిళల పేరిటే ఇచ్చారు కదా!అమ్మ ఒడి, 31 లక్షల ఇళ్ల పట్టాలు, చేయూత,ఆసరా,కాపు నేస్తం , ఆర్ధికంగా బలహీనవర్గాల నేస్తం..ఇలా ఆయా స్కీములలో డబ్బులు ఇచ్చారే.చేయూత కింద మహిళలకు 18500 రూపాయల చొప్పున ఆర్దిక సాయం చేసి,వారితో వ్యాపారాలు పెట్టించి, రిలయన్స్, ఐటిసి తదితర ప్రముఖ సంస్థలతో టై అప్ చేశారే.మహిళల భద్రతకు దిశ యాప్ తెచ్చారే.ఇప్పుడు అదే యాప్ ను పేరు మార్చి చంద్రబాబు వాడుతున్నారా?లేదా?ఇన్ని చేసిన జగన్ ఆడబిడ్డల ద్రోహి అవుతారా?లేక చేసిన బాసలకు మంగళం పలుకుతున్నట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు ద్రోహి అవుతారా అన్న ప్రశ్న వస్తే ఏమి జవాబు ఇస్తాం. ఇవన్ని వదలివేసి జగన్ కుటుంబంలో ఏదో జరిగిందని,తల్లికి ,చెల్లికి న్యాయం చేయలేదంటూ అసత్య ఆరపణలు చేయడం ఎంతమేర సమంజసం.చెల్లికి 200 కోట్ల మేర డివిడెండ్ల రూపంలో చెల్లించిన జగన్ ద్రోహం చేసినట్లు ఎలా అవుతుందో చంద్రబాబే చెప్పాలి. పోనీ తన తోబుట్టువులకు చంద్రబాబు ఏ విధంగా సాయం చేసింది చెప్పి ఉంటే బాగుండేది కదా!చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రతిగా వైఎస్సార్‌సీపీ స్పందిస్తూ పలు ప్రశ్నలు వేసింది.హైదరాబాద్ లో ఇతర చోట్ల చంద్రబాబు కుటుంబానికి ఉన్న వందల కోట్ల ఆస్తులలో తన తోబుట్టువులకు ఎంత ఇచ్చారని అడిగింది.తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుటుంబానికి ఎంత వాటా ఇచ్చారని ప్రశ్నించింది. తనతల్లి పేరు మీద ఉన్న మదీనగూడ భూమిలో వారికి వాటా ఇవ్వకుండా లోకేష్ ఒక్కరి పేరు మీదే ఎందుకు మార్పించింది వాస్తవం కాదా అని అప్రశ్నించింది.ముందుగా తన ఇంటిలో సమన్యాయం పాటించకుండా ఇంకొకరి ఇంటి వ్యవహారాన్ని ప్రస్తావించడం అన్యాయం కాదా అని వైఎస్సార్‌సీపీవ్యాఖ్యానించింది. డ్వాక్రా మహిళలకు సంబంధించి చంద్రబాబు చేసిన ప్రకటనలు కూడా ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలియదు. కొద్ది రోజుల క్రితం ఏడాదికి లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని అన్నారు.తాజాగా ఆ సంఖ్యను లక్షా డెబ్బైఐదువేలకు పెంచారు. డ్వాక్రా మహిళలకు 65వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని,అందులో సగం పెట్టుబడి తీసుకురాగలిగితే ఆరువేల కోట్ల లాభాలు వచ్చేస్తాయని కూడా ఆయన ఊరించారు. డీ లిమిటేషన్ జరిగితే భవిష్యత్తులో శాసనసభలో 75 మంది మహిళలకు అవకాశం రావచ్చని ఆయన అన్నారు. డి లిమిటేషన్ లో ఎపికి కూడా నష్టం జరుగుతుంందని అంతా వాపోతుంటే, దాని గురించి మాట్లాడకుండా మహిళలకు సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనండని ఆయన ప్రచారం చేస్తున్నారు.కాని తద్వారా ఎదురయ్యే సమస్యల గురించి వివరించి, వాటిని అధిగమించడానికి ఏమి చేయాలో చెప్పరు. మహిళలకు తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చి తద్వారా సాధికారిత తెచ్చామని చెబితే ఎవరైనా నమ్ముతారు కాని, ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పేసి అంతా అయిపోయినట్లు భ్రమలో పెట్టాలని అనుకుంటే ఏమి ప్రయోజనం ?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Ranya Rao Gold Case: Tollywood Hero Arrested3
రన్యా రావు కేసులో బిగ్‌ ట్వి‍స్ట్‌.. టాలీవుడ్‌ హీరో అరెస్ట్‌!

దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు (Ranya Rao Case) కేసులో రోజుకో ట్విస్ట్‌ బయటకు వస్తోంది. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో తెలుగు నటుడు తరుణ్‌ రాజ్‌ కొండూరుని పోలీసులు అరెస్ట్‌ చేశారు.‘పరిచయం’(2018)అనే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తరుణ్‌ రాజ్‌.. డెబ్యూ ఫిల్మ్‌తోనే ప్లాప్‌ని మూటగట్టుకున్నాడు. లక్ష్మీకాంత్‌ చెన్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సిమ్రత్‌ కౌర్‌ హీరోయిన్‌గా నటించింది. 2018 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇప్పుడు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో అరెస్ట్‌ కావడంతో తరుణ్‌రాజ్‌ కొండూరు పేరు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. రోజుకో ట్విస్ట్‌గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావు గురించి రోజుకో ట్విస్ట్‌ బయటకు వస్తూనే ఉంది. ఆమెకు గత నవంబర్‌లో వివాహం అయిందట. పెళ్లయిన నెల నుంచే తాము విడిగా ఉంటున్నట్లు ఆమె భర్త జతిన్‌ హుక్కేరి కోర్టులో వెల్లడించారు. తాము అధికారికంగా విడిపోలేదని, అయితే కొన్ని కారణాల వల్ల వేరుగా జీవిస్తున్నామని చెప్పారు. ఈ కేసు విషయంలో తాజాగా జతిన్ హుక్కేరీని అధికారులు కర్ణాటక హైకోర్టులో హాజరుపరిచారు. రన్యారావు చేస్తున్న స్మగ్లింగ్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో జతిన్ ను కస్టడీకి ఇవ్వాలంటూ డీఆర్ఐ కోరింది. ఈ క్రమంలోనే జతిన్ ను మరోసారి ఈరోజు(సోమవారం) కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే రన్యారావు స్మగ్మింగ్ తో తనకు ఏమీ సంబంధం లేదని చెబుతున్న జతిన్.. తాము పెళ్లి చేసుకున్నాం.. కానీ వేరుగా ఉంటున్నామని కోర్టుకు తెలిపాడు. ఇదే విషయాన్ని జతిన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అతని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. తదుపరి విచారణ వరకూ జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు.ఏం జరిగింది?నటి రన్యారావు మార్చి 3న బెంగళూరు ఎయిర్‌పోర్టులో 14 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ పట్టుబడింది. ఈమెకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కె.రామచంద్రారావు సవతి తండ్రి అవుతాడు. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు తండ్రి పేరును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలున్నాయి. ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

AP Assembly Session Live Updates On March 18th4
మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం

AP Assembly And Council Updates11:05 AMశాసనమండలికి స్వల్ప విరామంశాసనమండలి కేంద్రం నుంచి వచ్చే వ్యవసాయ పథకాల్లో కేంద్రం వాటా ఉందా లేదా అని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ సభ్యులువైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నకు వ్యంగ్యంగా సమాధానమిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడుమంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యల పై వైఎస్సార్‌సీపీ అభ్యంతరంశాసనమండలి విపక్ష నేత,బొత్స సత్యనారాయణవ్యవసాయానికి పేటెంట్ ఎవరిదో...వ్యవసాయం సుద్ధ దండగ అని ఎవరు చెప్పారో అందరికీ తెలుసువ్యవసాయానికి ఎవరు ఏం చేశారో చర్చించుకుమదామంటే మేం రెఢీసభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదుకేంద్రం ఇచ్చిన క్లస్టర్ల పై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరుతున్నాంనిన్నటి రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయాలుఎస్సీల వర్గీకరణపై కమిషన్‌ నివేదికకు ఆమోదంరాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయాలు వైఎస్సార్‌ జిల్లా.. వైఎస్సార్‌ కడప జిల్లాగా పేరు మార్పురాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయాలు వైఎస్సార్‌ జిల్లా.. వైఎస్సార్‌ కడప జిల్లాగా పేరు మార్పు‘నిరుద్యోగ భృతి’.. ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’పథకం అమలుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ప్రశ్న సభకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన మంత్రి ‘ఆ పథకాన్ని తమ శాఖ అమలు చేయడం లేదంటూ’ జవాబు ఎప్పటిలోగా అమలు చేస్తారన్నదానికి ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ పథకం ఎప్పటినుంచి అమలు అన్నదానిపైనా దాటవేత చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌ లూమ్స్‌కు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌. ⇒ ఎన్టీఆర్‌ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్‌ రెగ్యులేటర్‌ మెకానికల్, ఎలక్ట్రికల్‌ పరికరాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు, రూ.37.97 కోట్లతో బుడమేరు డైవర్షన్‌ చానల్‌ వరద నివారణ రక్షణ గోడల నిర్మాణానికి పరిపాలన ఆమోదం.⇒ గుంటూరు జిల్లాలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్‌ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ (వీవీఐటీయూ)ని బ్రౌన్‌ఫీల్డ్‌ కేటగిరీ కింద ప్రైవేట్‌ విశ్వవిద్యాలయ స్థాపనకు అనుమతించేందుకు చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.⇒ సీఆర్‌డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమీక్ష, మంత్రుల బృందం సిఫార్సుల ఆమోదానికి సీఆర్‌డీఏ కమిషనర్‌ను అనుమతిస్తూ నిర్ణయం. రూ.22,607.11 కోట్ల విలువైన 22 పనులకు ఎల్‌ 1 బిడ్లను ఆమోదించడానికి ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌కు అధికారం. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ తదితర ఆర్ధిక ప్రాజెక్టులకు సంబంధించి రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనుల ప్యాకేజీకి సంబంధించి బోర్డు నిర్ణయాన్ని అమలు చేసేందుకు సీఆర్‌డీఏ ఎండీకి అధికారం.

today gold and silver rates on telugu states5
త్వరలో బంగారం ధర లకారం! తులం ఎంతంటే..

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. త్వరలో తులం రూ.లక్షకు చేరుతుందని చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,500 (22 క్యారెట్స్), రూ.90,000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.90,000 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.82,650కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.90,150 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే మంగళవారం వెండి ధర(Silver Prices)ల్లోనూ మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై ఏకంగా రూ.1,100 పెరిగి రూ.1,13,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

New Zealand Beat Pakistan In 2ND T20I By 5 Wickets And Takes 2-0 Lead In Five Match Series6
న్యూజిలాండ్‌ ఓపెనర్ల ఊచకోత.. రెండో వన్డేలోనూ చిత్తైన పాకిస్తాన్‌

5 టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న పాక్‌ క్రికెట్‌ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పాక్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన కెప్టెన్‌ సల్మాన్‌ అఘా టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. షాదాబ్‌ ఖాన్‌ (26), షాహీన్‌ అఫ్రిది (22 నాటౌట్‌), మహ్మద్‌ హరీస్‌ (11), ఇర్ఫాన్‌ ఖాన్‌ (11), అబ్దుల్‌ సమద్‌ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో హసన్‌ నవాజ్‌ (0), ఖుష్దిల్‌ షా (2), జహన్‌దాద్‌ ఖాన్‌ (0), హరీస్‌ రౌఫ్‌ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేకబ్‌ డఫీ, బెన్‌ సియర్స్‌, జిమ్మీ నీషమ్‌, ఐష్‌ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్‌ సీఫర్ట్‌ (22 బంతుల్లో 45), ఫిన్‌ అలెన్‌ (16 బంతుల్లో 32) చెలరేగిపోయారు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్‌ 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును తాకింది. పాక్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌లో టిమ్‌ సీఫర్ట్‌ శివాలెత్తిపోయాడు. ఈ ఓవర్‌లో సీఫర్ట్‌ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. అంతకుముందు మొహమ్మద్‌ అలీ వేసిన రెండో ఓవర్‌లో ఫిన్‌ అలెన్‌ కూడా చెలరేగాడు. ఈ ఓవర్‌లో అలెన్‌ మూడు సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉండగా మ్యాచ్‌ 10 ఓవర్లలోనే ముగిస్తుందని అంతా అనుకున్నారు. అయితే పాక్‌ బౌలర్లు ఒక్కసారిగా ఫామ్‌లోకి రావడంతో న్యూజిలాండ్‌ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. మార్క్‌ చాప్‌మన్‌ (1), డారిల్‌ మిచెల్‌ (15), జిమ్మీ నీషమ్‌ (5) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. మిచెల్‌ హే (21 నాటౌట్‌), కెప్టెన్‌ బ్రేస్‌వెల్‌ (5 నాటౌట్‌) న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్‌ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌ 2, మొహమ్మద్‌ అలీ, ఖుష్దిల్‌ షా, జహన్‌దాద్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్‌ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్‌ పాక్‌ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్‌ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే పాక్‌ సిరీస్‌ను కోల్పోతుంది.

Cellulite: What It Is Causes, Location And Treatment7
ఇన్‌ఫెక్షన్‌: సెల్యు'లైట్‌' తీసుకోకండి..!

ఓ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా చర్మానికి సెల్యులైటిస్‌ అనే కండిషన్‌ వస్తుంది. ఇందులో కాలు లేదా చేయి విపరీతంగా వాచిపోయి, చర్మం ఎర్రగా అలాగే బాధితులకు వేడిగా అనిపిస్తుంటుంది. ముట్టుకుంటేనే నొప్పి (టెండర్‌నెస్‌)తో బాధాకరంగా ఉంటుంది. ఇది చేయి లేదా కాలు అంతటికీ వేగంగా వ్యాపిస్తుంది. ఈ దశలో కూడా చికిత్స సరిగా అందకపోతే చేయి/ కాలికి మాత్రమే పరిమితమైన ఆ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ శరీరమంతా పాకి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదముంది. అందుకే సెల్యులైటిస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టగల ఈ సెల్యులైటిస్‌పై అవగాహన కోసం ఈ కథనం.సెల్యులైటిస్‌ సాధారణంగా దేహంలోని కాలు, చేయితో పాటు ఏ భాగానికైనా రావచ్చు. కానీ ఈ కండిషన్‌ కాలిలో కనిపించడమే ఎక్కువ. సెల్యులైటిస్‌తో ప్రభావితమైన కాలు బాగా వాచిపోతుంది. ఎర్రబారుతుంది. ఇలా జరగడాన్ని ఎరిథిమా అంటారు. వాపు వచ్చి ముట్టుకుంటే మంట (ఇన్‌ఫ్లమేషన్‌)తో, లోపల వేడిగా ఉన్న భావన కలుగుతుంది. ఇన్‌ఫ్లమేషన్‌తో కూడిన సెల్యులైటిస్‌ను తీవ్రమైన పరిస్థితిగానే పరిగణించాలి. అది కేవలం పై చర్మానికి మాత్రమే పరిమితమైందా లేక లోపలి పొరలూ ప్రభావితమయ్యాయా అన్నదానిపై పరిస్థితి తీవ్రత ఆధారపడి ఉంటుంది. లోపలికి వ్యాపించిన కొద్దీ సెల్యులైటిస్‌లోని ఇన్ఫెక్షన్‌ రక్తప్రవాహంతో కలిసి లింఫ్‌నోడ్స్‌కూ వ్యాపిస్తుంది. సెల్యులైటిస్‌ కనిపించే సూక్ష్మక్రిములివే... సెల్యులైటిస్‌ సోకిన కాలు నునుపుదనంతో ఎర్రగా మెరుస్తూ కనిపిస్తుంది. అంతకు ముందే కాలికేదైనా గాయం ఉండటం, చర్మం చీరుకుపోయి ఉండటం వంటివి జరిగితే దానికి సెల్యులైటిస్‌ వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. చర్మానికి ఏ కారణంగానైనా పుండ్లు పడి అవి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరడంతో పాటు అది రెండో (సెకండరీ) దశకు చేరితే... అది సెల్యులైటిస్‌కు దారితీయవచ్చు. ఇందుకు చాలారకాల సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) కారణమవుతాయి. ఉదాహరణకు... స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ, సూడోమొనాస్‌ ఎస్‌పీపీ, బ్యాక్టీరియోడీస్‌ వంటివి వీటిల్లో ప్రధానమైనవి. ఇవిగాక మరికొన్ని అప్రధాన రకాలకు చెందిన సూక్ష్మజీవులూ ఉంటాయి. సెల్యులైటిస్‌లో ఎలా వస్తుందంటే?వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకుపోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్‌ ఫూట్‌ (టీనియా పెడిస్‌) వంటి కండిషన్‌లో చర్మానికి ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్‌ సిస్టమ్‌ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్‌కు దారితీస్తుంది. వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకు΄ోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్‌ ఫూట్‌ (టీనియా పెడిస్‌) వంటి కండిషన్‌లో చర్మానికి ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్‌ సిస్టమ్‌ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్‌కు దారితీస్తుంది.చర్మం రంగు మారడం: సెల్యులైటిస్‌ వచ్చిన భాగంలో చర్మం రంగు మారిపోతుంది. ప్రధానంగా ఎర్రబారుతుంది. అప్పటికే ఎర్రటి చర్మం ఉన్నవారిలో ఇలా ఎర్రబారడం జరిగితే దాన్ని గుర్తుపట్టడం కాస్తంత కష్టమవుతుంది. అదే కాస్త నల్లటి చర్మం ఉన్నవారిలో ఈ రంగు మార్పును వెంటనే గుర్తుపట్టడం సాధ్యమతుంది. దాంతో తగిన చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది. వాపు రావడం : సాధారణంగా వాపు పాదం నుంచి మొదలై పై వైపునకు వ్యాపిస్తుంటుంది. కొన్నిసార్లు పిక్కల నుంచి కూడా వాపు మొదలు కావచ్చు. ∙కాలికి ఎరుపుదనం వచ్చి బాగా వాచిన కారణంగా అది బాగా నునుపుగా అనిపిస్తూ, మెరుస్తూ కనిపిస్తుంది. వాపు కారణంగా చర్మం బాగా బిగుసుకు΄ోయినట్లుగానూ అనిపిస్తుంటుంది. ∙ముట్టుకుంటే మంట / నొప్పితోపాటు లోపల వేడిగా ఉన్నట్లుగానూ అనిపిస్తుంటుంది. ఈ కాలివాపు రాక ముందు ఫ్లూ జ్వరం వచ్చినప్పటి లక్షణాలతో... చలితో కూడిన జ్వరం కూడా కనిపించవచ్చు. ∙రక్త పరీక్ష చేయిస్తే తెల్లరక్తకణాల సంఖ్య బాగా పెరిగి కనిపిస్తుంది. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ ఉందనడానికి ఇది ఒక సూచన. ∙వాపు వచ్చిన కాలి భాగంలోని పుండ్ల నుంచి పసుపు రంగుతో కూడిన చీము స్రవిస్తుంటుంది. సెల్యులైటిస్‌కు తావిచ్చే కండిషన్స్‌చర్మానికి గాయమై అది దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం. చర్మం చీరుకు΄ోయి ఆ గాయం చాలాకాలం మానక΄ోవడం, కాలి మీద పుండ్లు రావడం. దీర్ఘకాలంగా ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ ఉండి, అవి దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం (ప్రధానంగా కాలికి... అథ్లెట్స్‌ ఫూట్‌ వంటివి). ఎగ్జిమా, సోరియాసిస్‌ వంటి చర్మసంబంధమైన రుగ్మతలతో బాధపడేవారిలో చర్మం పగుళ్లుబారి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. కొద్దిగా అరుదుగా దీర్ఘకాలికంగా ఉండే తీవ్రమైన మొటిమల కారణంగా కూడా. ∙చర్మం పగుళ్లుబారేలా చేసే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్‌ ఉందాహరణకు చికెన్‌పాక్స్, షింగిల్స్‌ వంటి జబ్బులు వచ్చాక సెల్యులైటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్‌ ఉండి కాలిపై దీర్ఘకాలికంగా పుండ్లు పడటం (డయాబెటిస్‌ ఉన్నవారిలో సెల్యులైటిస్‌ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ).రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు ఉండటం (వేరికోసిక్‌ వెయిన్స్‌ వంటివి). పెరిఫెరల్‌ వ్యాస్క్యులార్‌ డిసీజ్‌ వంటి జబ్బుల కారణంగా. శరీరంలో లింఫ్‌ ప్రవాహం తగినంతగా లేకపోవడం వల్ల. దీర్ఘకాలికంగా కాలేయ సంబంధిత జబ్బులతో బాధపడుతూ ఉండేవారిలో. (అంటే... క్రానిక్‌ హెపటైటిస్, సిర్రోసిస్‌ వంటి జబ్బులు ఉన్నవారిలో సెల్యులైటిస్‌కు అవకాశాలెక్కువ). స్థూలకాయం ఉన్నవారిలో. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత ఏర్పడ్డ గాయం కారణంగా. చాలా సందర్భాల్లో కాలిన గాయాల కారణంగా. చర్మంలో ప్రవేశపెట్టే సూదుల కారణంగా (ఇంట్రావీనస్‌గా మందులను పంపడానికి అమర్చే క్యాన్యులా వంటివి), ట్యూబ్స్, ఆర్థోపెడిక్‌ కేసుల్లో చర్మంలోపల అమర్చే ప్లేట్లు, రాడ్ల వంటి వస్తువుల కారణంగా. ఎముకలకు వచ్చే ఇన్ఫెక్షన్స్‌ వల్ల. కొన్ని కీటకాల కాటు కారణంగా (ప్రధానంగా సాలీడు వంటివి); కొన్ని జంతువులు కరవడం వల్ల. దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నవారిలో వాళ్ల వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం వల్ల... ఇలాంటి అనేక కారణాల వల్ల సెల్యులైటిస్‌ రావచ్చు. ఒకసారి సెల్యులైటిస్‌ సోకాక...ఒకసారి సెల్యులైటిస్‌ సోకిన తర్వాత అది వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాంటి స్రావాలు లేకుండా కేవలం వాపు మాత్రమే కనిపించే దాన్ని ‘డ్రై సెల్యులైటిస్‌’ అంటారు. ఈ దశలో సెల్యులైటిస్‌కు సరైన చికిత్స తీసుకోక΄ోతే అది వ్యాపించిన మేరకు కణజాలం నాశనమవుతుంటుంది. డ్రై సెల్యులైటిస్‌లో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. డ్రై సెల్యూలైటిస్‌కు వెంటనే చికిత్స తీసుకోకపోతే చర్మంపై సన్నటి పగుళ్ల వంటివి ఏర్పడి అందులోంచి నీరు స్రవిస్తుంటుంది. దీన్నే వెట్‌ సెల్యులైటిస్‌ అంటారు.సాధారణంగా కాలి బొటనవేలికి దీర్ఘకాలంగా ఉండే గాయం వల్ల సెల్యులైటిస్‌ వస్తుంటుంది. సెల్యులైటిస్‌ కాలి భాగం నుంచి పైకి విస్తరిస్తూపోతుంటే దాన్ని అసెండింగ్‌ సెల్యులైటిస్‌ అంటారు. సాధారణంగా స్ట్రెప్టోకోకల్‌ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌లో ఇలా జరుగుతుంది. సెల్యులైటిస్‌ అన్నది ఒక కాలికే కనిపిస్తుంటే దీన్ని యూనిలేటరల్‌ సెల్యులైటిస్‌గా పేర్కొంటారు. ఈ యూనిలేటరల్‌ సెల్యులైటిస్‌ చాలా సాధారణం. కానీ కొంతమందిలో రెండుకాళ్లకూ సెల్యులైటిస్‌ కనిపించ వచ్చు. కాకపోతే ఇది కాస్తంత అరుదు. ఇలా రెండుకాళ్లకూ సెల్యులైటిస్‌ రావడాన్ని ‘బైలేటర్‌ కాంకరెంట్‌ సెల్యులైటిస్‌’ అంటారు. చికిత్స యాంటీబయాటిక్స్‌తో చికిత్స స్ట్రెప్టోకాక్సి, స్టెఫాలోకాక్సి బ్యాక్టీరియాను మట్టుపెట్టే యాంటీబయాటిక్స్‌ మందులను నోటి ద్వారా తీసుకోవడం లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో నరానికి ఇంజెక్షన్‌ ద్వారా పంపడం వంటి చికిత్స అందిస్తారు.వ్యాయామం (ఫిజియోథెరపీ) వాపు తగ్గేలా కాలి వేళ్లు కదిలించే కొన్ని వ్యాయామాలు చేయడం అవసరమవుతుంది. కొన్ని జాగ్రత్తలుసెల్యులైటిస్‌ను నివారించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కాలిపై ఎలాంటి గాయాలూ లేకుండా చూసుకోవడం.కాలి గోళ్లను తీసుకునే సమయంలో గాయం కాకుండా జాగ్రత్త వహించడం.కీటకాలు, జంతువులు కుట్టకుండా / కరవకుండా వాటిని దూరంగా ఉంచడం.కాలిన గాయాలైనప్పుడు అవి పూర్తిగా తగ్గే వరకు జాగ్రత్తగా ఉండటం.కాలికి గాయాలు ఉన్నవారు, కాలిన గాయాలైన వారు మురికినీళ్లలోకి వెళ్లక΄ోవడం. గాయమైన కాలితో సముద్రపు నీటిలోకి వెళ్లకపోవడం. కాలికి సరిగ్గా సరిపోయి, సౌకర్యంగా ఉండే పాదరక్షలు / షూస్‌ ధరించడం. (కాలికి గాయాన్ని చేస్తూ, బాధను కలిగించే షూస్‌ను బలవంతంగా తొడగకూడదు. చెప్పులు లేదా షూ కరవడం, కాలికి గాయం చేయడం వంటివి జరుగుతుంటే ఆ పాదరక్షలను తొడగడం మానేసి, సౌకర్యంగా ఉండే వాటినే తొడుక్కోవాలి. పాదరక్షల వల్ల కాలికి గాయాలవుతున్నాయా అంటూ తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి) అథ్లెట్స్‌ ఫూట్‌ వంటి ఇన్ఫెక్షన్‌తోపాటు అన్ని రకాల ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌కు తగిన చికిత్స తీసుకుని పూర్తిగా తగ్గేలా జాగ్రత్త వహించడం వేరికోస్‌ వెయిన్స్‌ వంటి సమస్య వస్తే అది తగ్గేలా చికిత్స తీసుకోవడం సెల్యులైటిస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం. చివరగా... సెల్యులైటిస్‌ వచ్చి, అది ప్రాణాంతకం అవడం కంటే ... కేవలం చిన్న చిన్న జాగ్రత్తలతో అసలది రాకుండానే చూసుకోవడం మేలు.డా. స్వప్నప్రియ, సీనియర్‌ డర్మటాలజిస్ట్‌డా.జి. వెంకటేష్‌ బాబు, సీనియర్‌ కన్సల్టెంట్‌, ప్లాస్టిక్‌ – కాస్మటిక్‌ సర్జన్‌ (చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?)

NASA astronauts Sunita Williams and Barry Butch Wilmore are scheduled to return to Earth8
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. తిరిగొస్తున్న సునీత

వాషింగ్టన్‌: భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తున. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో. ఏడెనిమిది రోజులనుకుంటే ఏకంగా వారాలూ, నెలలూ గడిచిపోతున్నాయి. ఉన్నది భారరహిత స్థితిలోనే. అయినా అటు కార్యభారం. ఇటు ఎడతెగని ఆలోచనల భారం. క్షణమొక యుగంగా సమయం కూడా భారంగానే గడుస్తున్న పరిస్థితి. ఎడతెగని ఆ ఎదురుచూపులకు ఎట్టకేలకు శుభంకార్డు పడనుంది. 9 నెలల అంతరిక్షవాసం ముగించుకుని నాసా వ్యోమగాములు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ (59), బచ్‌ బారీ విల్మోర్‌ (62) భూమికి తిరిగి రానున్నారు. వాతావరణం అనుకూలించి, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27కు) అమెరికాలో ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగనున్నారు. ఆదివారం నాసా ఈ మేరకు ప్రకటించింది. అనుకూల వాతావరణం నేపథ్యంలో తిరుగు ప్రయాణాన్ని నిరీ్ణత సమయం కంటే ఒక రోజు ముందుకు జరిపినట్టు పేర్కొంది. గత సెపె్టంబర్లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన మరో ఇద్దరు వ్యోమగాములు నిక్‌ హేగ్‌ (అమెరికా), అలెగ్జాండర్‌ గుర్బనోవ్‌ (రష్యా) కూడా స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌–10 స్పేస్‌క్రాఫ్ట్‌లో సునీత, విల్మోర్‌తో పాటే తిరిగి వస్తున్నారు. వారి రాక కోసం ప్రపంచమంతా అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తోందిప్పుడు. బాధ్యతల అప్పగింత బోయింగ్‌ సంస్థ తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా 2024 జూన్‌ 5న ప్రయోగించిన స్టార్‌లైనర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లో సునీత, విల్మోర్‌ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. షెడ్యూల్‌ మేరకు వారు ఎనిమిది రోజుల్లోనే తిరిగి రావాలి. కానీ స్టార్‌లైనర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అది వీలు పడలేదు. దాని మరమ్మతుకు చేసిన ప్రయత్నాలు కూడా పూర్తిగా ఫలించలేదు. దాంతో రిస్కు తీసుకోరాదని నాసా నిర్ణయించింది. ఫలితంగా సెపె్టంబర్‌ 7న స్టార్‌లైనర్‌ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు మధ్యలో చేసిన ఒకట్రెండు ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అలా 9 నెలలుగా సునీత ఐఎస్‌ఎస్‌ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు ఆమెను, విల్మోర్‌ను వెనక్కు తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగించిన డ్రాగన్‌–9 వ్యోమనౌక ఆదివారం విజయవంతంగా ఐఎస్‌ఎస్‌ను చేరింది. అందులో వచ్చిన నలుగురు వ్యోమగాములు సునీత బృందం నుంచి లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. కమాండర్‌ బాధ్యతలను రష్యాకు చెందిన అలెక్సీ ఒచినిన్‌కు సునీత అప్పగించారు. వచ్చే ఆర్నెల్ల పాటు ఐఎస్‌ఎస్‌ కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లో జరుగుతాయి. అయినా స్థైర్యమే... అనూహ్యంగా ఐఎస్‌ఎస్‌లో 9 నెలల పాటు గడపాల్సి వచ్చినా సునీత ఎక్కడా డీలాపడలేదు. మొక్కవోని ఆత్మస్థైర్యం ప్రదర్శించారు. తన పరిస్థితిపై కూడా తరచూ జోకులు పేల్చారు! నడవటమెలాగో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నానంటూ గత జనవరిలో నాసా సెంటర్‌తో మాట్లాడుతూ చమత్కరించారు. ఐఎస్‌ఎస్‌లో ఉన్నన్ని రోజులూ ఊపిరి సలపని బాధ్యతల నడుమే గడిపారు. అలాగని చిన్నచిన్న సరదాలకూ లోటులేకుండా చూసుకున్నారు. సహచరులతో కలిసి సునీత, విల్మోర్‌ క్రిస్మస్‌ వేడుకలు జరుపుకున్నారు. వీడియో కాల్స్‌ ద్వారా తమ కుటుంబీకులతో టచ్‌లో ఉంటూ వచ్చారు. → ఐఎస్‌ఎస్‌ కమాండర్‌గా కీలక ప్రయోగాలకు సునీత సారథ్యం వహించారు. → అంతరిక్షంలో భారరహిత స్థితిలో మొక్కల్ని పెంచిన నాసా ప్రయోగాన్ని స్వయంగా పర్యవేక్షించారు. → మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ చేశారు. ఎందరికో స్ఫూర్తి వ్యోమగామిగా గ‘ఘన’ విజయాలు సాధించిన సునీతవి భారత మూలాలు. ఆమె పూర్తి పేరు సునీతా లిన్‌ విలియమ్స్‌. 1965లో అమెరికాలోని ఒహాయోలో జని్మంచారు. తండ్రి దీపక్‌ పాండ్యా గుజరాతీ కాగా తల్లి బోనీ జలోకర్‌ది స్లొవేనియా. వారి ముగ్గురు సంతానంలో సునీత అందరికన్నా చిన్న. అమెరికా నావల్‌ అకాడెమీ నుంచి ఫిజిక్స్‌లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ చేశారు. తండ్రి సూచనతో...తండ్రి సూచన మేరకు నావికా దళంలో బేసిక్‌ డైవింగ్‌ ఆఫీసర్‌గా చేరారు సునీత.→ నేవల్‌ ఏవియేటర్‌గా యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ పొందారు. కంబాట్‌ హెలికాప్టర్‌ స్క్వాడ్రన్‌లో పని చేశారు. → 30 ఏళ్ల వృత్తిగత జీవితంలో పైలట్‌గా 30 పై చిలుకు రకాల విమానాలను 3,000 గంటలకు పైగా నడిపిన అపార అనుభవం ఆమె సొంతం. → నేవీ నుంచి రిటైరయ్యాక సునీత 1998 జూన్‌ లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. → 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర చేశారు. ఐఎస్‌ఎస్‌లో ఆర్నెల్లకు పైగా గడిపి దాని నిర్వహణ, మరమ్మతులు తదితరాలపై అనుభవం గడించారు. → 2012లో రెండోసారి ఐఎస్‌ఎస్‌కు వెళ్లి నాలుగు నెలలకు పైగా ఉన్నారు. → సునీత భర్త మైకేల్‌ జె.విలియమ్స్‌ రిటైర్డ్‌ ఫెడరల్‌ మార్షల్‌. వారికి సంతానం లేరు. పెట్‌ డాగ్స్‌ అంటే ఈ జంటకు ప్రాణం. వాటినే తమ సంతానంగా భావిస్తుంటారు. → సునీత హిందూ మతావలంబి. నిత్యం భగవద్గీత చదువుతానని చెబుతారు.పరిహారమేమీ ఉండదు సునీత, విల్మోర్‌ ఏకంగా 9 నెలలకు పైగా ఐఎస్‌ఎస్‌లో చిక్కుబడిపోయారు కదా. మరి వారికి పరిహారం రూపంలో అదనపు మొత్తం ఏమన్నా లభిస్తుందా? అలాంటిదేమీ ఉండదు. తమకు ప్రత్యేకంగా ఓవర్‌టైం వేతనమంటూ ఏమీ ఉండదని నాసా వ్యోమగామి కాడీ కోల్మన్‌ చెప్పారు. ‘‘అంతరిక్ష యాత్రలను అధికార పర్యటనల్లో ఇతర కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే పరిగణించడమే ఇందుకు కారణం. ఇలాంటప్పుడు ఖర్చుల నిమిత్తమని మాకు అదనంగా రోజుకు కేవలం 4 డాలర్లు (రూ.347) అందుతాయంతే’’ అని వివరించారు. ఆ లెక్కన సునీత, విల్మోర్‌ అదనంగా 1,148 డాలర్లు (దాదాపు రూ.లక్ష) అందుకోనున్నారు. వారు అమెరికా ప్రభుత్వోద్యోగుల్లో అత్యున్నతమైన జీఎస్‌–15 వేతన గ్రేడ్‌లో ఉన్నారు. ఆ లెక్కన వాళ్లకు ఏటా 1.25 లక్షల నుంచి 1.62 లక్షల డాలర్ల (కోటి నుంచి 1.41 కోట్ల రూపాయల) వేతనం లభిస్తుంది.తిరుగు ప్రయాణం ఇలా... → సునీత బృందం తిరుగు ప్రయాణానికి భారత కాలమానం ప్రకారం మంగళవారం కౌంట్‌డౌన్‌ మొదలవుతుంది. → క్రూ డ్రాగన్‌–10 వ్యోమనౌక హ్యాచ్‌ మూసివేత ప్రక్రియ మంగళవారం ఉదయం 8.15కు మొదలవుతుంది. → ఐఎస్‌ఎస్‌ నుంచి వ్యోమనౌక విడివడే ప్రక్రియ మంగళవారం ఉదయం 10.35కు మొదలవుతుంది. ఆ తర్వాత నాసా ప్రత్యక్ష ప్రసారం ఆడియోకు పరిమితమవుతుంది. అంతా అనుకూలిస్తే బుధవారం (మంగళవారం అర్ధరాత్రి దాటాక) తెల్లవారుజాము 2.15 గంటలకు తిరిగి ప్రత్యక్ష ప్రసారం మొదలవుతుంది. → బుధవారం తెల్లవారుజాము 2.41 గంటలకు వ్యోమనౌక భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. → బుధవారం తెల్లవారుజామున సుమారు 3.27కు ఫ్లోరిడా తీరానికి సమీపంలో సముద్ర జలాల్లో క్యాప్సూల్‌ దిగుతుంది. → ఆ వెంటనే నలుగురు వ్యోమగాములనూ నాసా సిబ్బంది ఒక్కొక్కరిగా బయటికి తీసుకొస్తారు. అన్నీ అనుకూలించాలి అయితే ప్రయాణ సమయం నిర్ణయమైనా చివరి నిమిషం దాకా అన్నీ అనుకూలించాల్సి ఉంటుంది. వాతావరణంతో పాటు ఇతర పరిస్థితులన్నీ సజావుగా ఉంటేనే తిరుగు ప్రయాణం షెడ్యూల్‌ ప్రకారం సాగుతుంది. ప్రత్యక్షప్రసారం సునీత బృందంతో స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ క్రూ–9 స్పేస్‌క్రాఫ్ట్‌ తిరుగు ప్రయాణాన్ని భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 నుంచి నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. రికార్డు మాత్రం కాదు సునీత, విల్మోర్‌ వరుసగా 9 నెలల పాటు (287 రోజులు) ఐఎస్‌ఎస్‌లో గడిపినా ప్రపంచ రికార్డుకు మాత్రం దూరంగానే ఉండిపోయారు. రష్యా వ్యోమగామి వలేరీ పొల్యకోవ్‌ తమ దేశానికి చెందిన మిర్‌ అంతరిక్ష కేంద్రంలో ఏకబిగిన 437 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. నాసా ఆస్ట్రోనాట్‌ 371 రోజులతో ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. మూడు అంతరిక్ష యాత్రల్లో కలిపి సునీత 583 రోజులు ఐఎస్‌ఎస్‌లో గడిపారు. క్రమశిక్షణ విషయంలో సునీత చాలా పట్టుదలగా ఉంటారు. ఐఎస్‌ఎస్‌లో ఉన్నన్నాళ్లూ ఒక్క రోజు కూడా వ్యాయామం మానలేదట!టైమ్‌లైన్‌ 2024 జూన్‌ 5: సునీత, విల్మోర్‌లతో ఐఎస్‌ఎస్‌కు బయల్దేరిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక జూన్‌ 6: ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైన స్టార్‌లైనర్‌. కానీ ఆ క్రమంలో స్టార్‌లైనర్‌లో థ్రస్టర్లు పని చేయకపోవడం, ప్రొపల్షన్‌ వ్యవస్థలో హీలియం లీకేజీ వంటి సాంకేతిక లోపాలు తెరపైకొచ్చాయి. దాంతో వ్యోమగాములు క్షేమంగా తిరిగిరావడంపై ఉత్కంఠ నెలకొంది. జూన్‌ 12: స్టార్‌లైనర్‌ ప్రయాణానికి సిద్ధంగా లేనందున సునీత, విల్మోర్‌ తిరుగు ప్రయాణం నిరవధికంగా వాయిదా పడ్డట్టు నాసా ప్రకటన. జూలై–ఆగస్టు: తిరుగు ప్రయాణంపై మరింత పెరిగిన అనిశ్చితి. దాంతో సునీత, విల్మోర్‌ ఐఎస్‌ఎస్‌ సిబ్బందితో కలిసిపోయి దాని నిర్వహణ బాధ్యతలు, పరిశోధనలు తదితరాను పూర్తిగా తలకెత్తుకున్నారు. ఆ క్రమంలో సునీత ఆరోగ్యం కాస్త క్షీణించింది. ఎముకల సాంద్రత తగ్గడం వంటి పలు సమస్యలు తలెత్తాయి. సెపె్టంబర్‌: ఐఎస్‌ఎస్‌ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించిన సునీత నవంబర్‌: సహోద్యోగులతో కలిసి ఐఎస్‌ఎస్‌లోనే దీపావళి, థాంక్స్‌ గివింగ్‌ వేడుకలు జరుపుకున్న సునీత. ఈ సందర్భంగా వారికోసం ప్రత్యేకంగా స్మోక్డ్‌ చికెన్‌ తదితర వంటకాలను పంపిన నాసా. డిసెంబర్‌: విద్యార్థులతో చిట్‌చాట్‌ చేసి తన అనుభవాలు పంచుకున్న సునీత. అంతరిక్షంలో జీవితం చాలా ఫన్నీగా ఉందని వ్యాఖ్య. 2025 జనవరి 30: తొలి స్పేస్‌ వాక్‌ చేపట్టిన సునీత. అందులో భాగంగా ఐఎస్‌ఎస్‌ బయట కీలక మరమ్మతుల్లో భాగస్వామ్యం. ఫిబ్రవరి: తిరుగు ప్రయాణంపై సర్వత్రా అనిశ్చితి పెరుగుతుండటంతో, తాము బాగున్నామని సందేశం పంపిన సునీత, విల్మోర్‌. మార్చి 12: స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కు తీసుకొస్తున్నట్టు ప్రకటించిన నాసా, ఎక్స్‌. మార్చి 16: విజయవంతంగా ఐఎస్‌ఎస్‌ను చేరిన డ్రాగన్‌ క్రూ–10 వ్యోమనౌక మార్చి 17: సునీత, విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములతో డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ మార్చి 18న భూమికి తిరిగొస్తుందంటూ నాసా ప్రకటన – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Chandrababu coalition govt Scam in Amaravati capital construction works tenders9
నీకది.. నాకిది 'నాకింత.. నీకింత'!

సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో కాంట్రాక్టు సంస్థ­లతో ముఖ్యనేతల లాలూ‘ఛీ’ పర్వం బట్టబయలైంది! టెండర్‌ నోటి­ఫికేషన్లు జారీ చేయక ముందే అస్మదీయ కాంట్రాక్టు సంస్థలతో బేర­సారాలు జరిపి, అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి అంచనా వ్యయా­లను పెంచేసేలా చక్రం తిప్పారు. ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలు మాత్రమే బిడ్లు దాఖలు చేసేలా ఆ పనులకు అర్హతలను నిర్దేశించి టెండర్‌ నోటిఫికేషన్లు జారీ చేయించారు. వాటిని అధిక ధరలకు కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టారు. ఏడీసీఎల్‌ (అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) రూ.10,081.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 35 పనులను ముఖ్యనేత అత్యంత సన్నిహితులకు చెందిన ఆరు కాంట్రాక్టు సంస్థలకు పంచి పెట్టడమే అందుకు నిదర్శనం. 2014–19 మధ్య ముఖ్యనేత తరఫున కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకి పట్టుబడ్డ అధికారే నేడు రాజధాని నిర్మాణ టెండర్లలోనూ కాంట్రాక్టర్లతో బేరసారాలు సాగిస్తుండటం గమనార్హం. పనులు అప్పగించి కాంట్రాక్టర్లతో ఏడీసీఎల్‌ ఒప్పందం చేసుకోగానే అంచనా వ్యయంలో 10 శాతాన్ని మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ఇప్పించేసి.. అందులో తిరిగి 8 శాతాన్ని ఆ అధికారి ద్వారా కమీషన్‌గా వసూలు చేసుకునే దిశగా ముఖ్యనేత వేగంగా అడుగులు వేస్తున్నారు. టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూరుస్తూ, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జుడీషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ విధానాలను తమ అక్రమాలకు అడ్డు వస్తున్నాయని రద్దు చేసిన చంద్రబాబు సర్కారు రాజధాని టెండర్లలో ఆకాశమే హద్దుగా అక్రమాలకు తెర తీసింది.రూ.31 వేల కోట్ల రుణ ఒప్పందాలు..రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు) ద్వారా రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ద్వారా రూ.5 వేల కోట్లు వెరసి ఇప్పటికే రూ.31 వేల కోట్ల రుణం తీసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. ఈ రుణంతో రాజధాని ప్రాంతంలో ఏడీసీఎల్, సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ద్వారా నిర్మాణ పనులను చేపట్టింది. ఏడీసీఎల్‌ రూ.10,714.57 కోట్లకు.. సీఆర్‌డీఏ రూ.20,358.83 కోట్లకు కలిపి మొత్తంగా రూ.31,073.4 కోట్లతో ఇప్పటివరకూ రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచాయి. ఇందులో ఏడీసీఎల్‌ రూ.10,081.82 కోట్లతో పిలిచిన 35 పనుల టెండర్లను ఇటీవల ఖరారు చేశారు.ఇతరులు బిడ్‌ వేస్తే అనర్హత వేటే..ముఖ్యనేతలు ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలు మినహా ఇతరులు ఎవరైనా బిడ్‌ వేస్తే అనర్హత వేటు వేయాలన్న ఉన్నత స్థాయి ఆదేశాలను ఏడీసీఎల్‌ అధికారులు నిక్కచ్చిగా అమలు చేశారు. తస్మదీయ సంస్థపై అనర్హత వేటు వేసి.. అస్మదీయ సంస్థకే పనులు కట్టబెట్టారు. రాజధాని ముంపు నివారణ పనుల్లో రెండో ప్యాకేజీ (నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్‌ తవ్వకం, కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణం) పనులే అందుకు నిదర్శనం. ఆ పనులకు హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా సంస్థ బిడ్‌ దాఖలు చేయగా తస్మదీయ సంస్థ కావడంతో అనర్హత వేటు వేశారు. 3.98 శాతం అధిక ధరకు బిడ్‌ దాఖలు చేసిన ఎమ్వీఆర్‌ ఇన్‌ఫ్రా(మంత్రి నారా లోకేష్‌ తోడల్లుడు విశాఖ ఎంపీ ఎం.భరత్‌కు అత్యంత సన్నిహితుడైన ముప్పాన వెంకటరావుకు చెందిన సంస్థ)కు ఆ పనులను కట్టబెట్టారు. ఇక ఎన్‌–18 రహదారి (ప్యాకేజీ–5) నిర్మాణ టెండర్లలో బిడ్‌ దాఖలు చేసిన హజూర్‌ మల్టీ ప్రాజెక్టŠస్‌ సంస్థపై అనర్హత వేటు వేసి... వాటిని బీఎస్సార్‌ ఇన్‌ఫ్రా (సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావుకు చెందిన సంస్థ) 3.18 శాతం అధిక ధరలకు కట్టబెట్టారు.అన్ని పనులూ అధిక ధరలకే..ఏడీసీఎల్‌ 35 పనులకు పిలిచిన టెండర్లలో ముఖ్యనేతలు ఎంపిక చేసిన ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌(ఈనాడు కిరణ్‌ సోదరుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందిన సంస్థ), బీఎస్సార్‌.. ఎన్‌సీసీ (ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడైన ఏవీ రంగారాజు ఎండీగా ఉన్న సంస్థ).. బీఎస్పీసీఎల్‌ (సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన సంస్థ), మేఘా, ఎమ్వీఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థలు దాఖలు చేసిన బిడ్లు మాత్రమే అర్హత సాధించాయి. ఆర్వీఆర్‌ ప్రాజెక్స్‌కు రూ.2,539.72 కోట్ల విలువైన 8 పనులు.. బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాకు రూ.2,170.81 కోట్ల వ్యయంతో కూడిన 9 పనులు, ఎన్‌సీసీకి రూ.2,645.96 కోట్లు విలువైన 8 పనులు, బీఎస్సీసీఎల్‌కు రూ.748.75 కోట్లు వ్యయంతో చేపట్టిన 4 పనులు, మేఘాకు రూ.1,182.54 కోట్లు విలువైన 4 పనులు, ఎమ్వీఆర్‌ ఇన్‌ఫ్రాకు రూ.794.04 కోట్లు విలువ చేసే రెండు పనులను కట్టబెట్టారు.లాలూ‘ఛీ’కి ఇదిగో తార్కాణం..⇒ రాజధాని ముంపు నివారణ పనుల్లో ఒకటో ప్యాకేజీ (కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 16.75 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణం) పనులకు రూ.462.25 కోట్లతో ఏడీసీఎల్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ టెండర్లలో 3.98 శాతం అధిక ధరకు కోట్‌ చేసిన ఎమ్వీఆర్‌ ఇన్‌ఫ్రా ఎల్‌–1గా నిలిస్తే... 4.35 శాతం అధిక ధరకు కోట్‌ చేసిన ఎన్‌సీసీ ఎల్‌–2గా, 4.69 శాతం అధిక ధరలకు కోట్‌ చేసిన మేఘా ఎల్‌–3లుగా నిలిచాయి. ⇒ రాజధాని ముంపు నివారణ రెండో ప్యాకేజీ పనులకు రూ.303.73 కోట్ల వ్యయంతో ఏడీసీఎల్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 3.84 శాతం అధిక ధరకు కోట్‌ చేసిన ఎమ్వీఆర్‌ ఎల్‌–1గా నిలిస్తే... 4.40 శాతం అధిక ధరకు కోట్‌ చేసిన ఎన్‌సీసీ ఎల్‌–2గా, 4.76 శాతం అధిక ధరకు కోట్‌ చేసిన మేఘా ఎల్‌–3గా నిలిచాయి. ⇒ ఈ రెండు ప్యాకేజీల టెండర్లలో దాఖలైన బిడ్లను గమనిస్తే కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేతలు లాలూఛీ పడినట్లు స్పష్టమవుతోంది. ఇవే కాదు మిగతా 33 ప్యాకేజీల పనుల్లోనూ ఇదే కథ.అంచనాల్లోనే వంచన...⇒ రాజధాని ముంపు నివారణ పనుల అంచనాల్లోనే వంచనకు తెర తీశారు. అమరావతి ప్రాంతం నల్లరేగడి భూమితో కూడుకున్నది. పెద్దగా రాళ్లు, రప్పలు ఉండవు. పొక్లెయిన్లు లాంటి యంత్రాలతో సులువుగా కాలువ తవ్వవచ్చు. పైగా ఇవేమీ కొత్తగా తవ్వే కాలువలు కాదు. ఒకటో ప్యాకేజీలో కొండవీటి వాగు, పాల వాగులను విస్తరించాలి. కొత్తగా 7.843 కి.మీ పొడవున మాత్రమే కాలువ తవ్వాలి. ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్స్‌) ప్రకారం క్యూబిక్‌ మీటర్‌ మట్టి తవ్వేందుకు ప్రస్తుతం గరిష్టంగా రూ.100 చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 8 నుంచి 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కి.మీ. పొడవున కాలువ తవ్వకం పనుల అంచనా వ్యయం రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మించదని, పది నుంచి 11 వేల క్యూసెక్కుల కాలువ తవ్వకం పనులకు కి.మీ.కి రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు (జీఎస్టీ, సీనరేజీ, ఎన్‌ఏసీ లాంటి పన్నులతో కలిపి) మించదని జలవనరుల శాఖలో పలు ప్రాజెక్టుల్లో చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఓ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుత ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్‌ నిర్మించడానికి అంచనా వ్యయం జీఎస్టీ, ఎన్‌ఏసీ, సీనరేజీ లాంటి పన్నులు కలిపినా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు మించదని రిజర్వాయర్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మరో రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఒకరు వెల్లడించారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే ఒకటో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం రూ.301.75 కోట్లకు మించదు. కానీ.. ఈ ప్యాకేజీ కాంట్రాక్ట్‌ విలువను రూ.522.79 కోట్లుగా ఏడీసీఎల్‌ఎల్‌ నిర్దేశించింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.221.04 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. మొత్తమ్మీద రాజధాని ముంపు ముప్పు నివారించడానికి చేపట్టిన మూడు ప్యాకేజీల పనుల్లో అంచనా వ్యయాన్ని రూ.702.33 కోట్లు పెంచేసినట్టుగా కాంట్రాక్టు వర్గాలే లెక్కలు వేస్తున్నాయి.మిగిలిపోయిన రోడ్డు పనులకు..దేశంలో ఒక కి.మీ. పొడవున ఆరు లేన్‌.. ఒక్కో వరుస 50 మీటర్ల వెడల్పుతో జాతీయ రహదారిని సగటున రూ.20 కోట్లతో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మిస్తోంది. అది కూడా అన్ని రకాల పన్నులు జీఎస్టీ, నాక్‌ (నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ అకాడమీ), సీనరేజీతో కలిపి. కానీ.. రాజధాని అమరావతిలో ఆరు లేన్‌.. ఒక్కో వరుస 50 మీటర్ల వెడల్పుతో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిపోయిన వాటికి కి.మీ.కి గరిష్టంగా రూ.53.88 కోట్లు.. కనిష్టంగా రూ.24.88 కోట్లను కాంట్రాక్టు విలువగా ఏడీసీఎల్‌ ఖరారు చేసింది. వాటికి అదనంగా జీఎస్టీ, నాక్, సీనరేజీ పన్నులను రీయింబర్స్‌ చేస్తామని చేయడం గమనార్హం.

Shah Rukh Khan And  Pushpa director Sukumar Going With Big Deal10
బిగ్‌ డీల్‌ ప్లాన్‌తో సుకుమార్‌.. విలన్‌గా షారుక్‌ఖాన్‌

అల్లు అర్జున్‌(Allu Arjun), సుకుమార్‌ (Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదుచేసింది. ఈ మూవీ తర్వాత సుకుమార్‌కు బాలీవుడ్‌లో క్రేజ్‌ పెరిగింది. దీంతో ఆయన తర్వాత డైరెక్ట్‌ చేయబోయే సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో సుకుమార్‌ గురించి బాలీవుడ్‌ నుంచి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్‌ అవుతుంది. పుష్ప2 విజయం తర్వాత రామ్‌చరణ్‌తో (Ram Charan) చేయనున్న సినిమా కోసం స్క్రిప్ట్‌ పనిలో సుకుమార్‌ బిజీగా ఉన్నారనే విషయం తెలిసిందే.. అయితే, సుకుమార్‌- షారుక్‌ఖాన్‌(Shah Rukh Khan) కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతుందని బాలీవుడ్‌ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఈమేరకు షారుక్‌ టీమ్‌తో చర్చలు కూడా జరిగిపోయాయని తెలుస్తోంది. రాజకీయం నేపథ్యం ఉన్న ఒక గ్రామీణ కథను షారుక్‌ఖాన్‌కు సుక్కు వినిపించారట.. అది ఆయనకు కూడా బాగా నచ్చేసిందని టాక్‌. కానీ, ఈ కథలో షారుక్‌ వ్యతిరేక (విలన్‌) పాత్రలో కనిపిస్తారని బాలీవుడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి.'పుష్ప 1, 2'లకు సీక్వెల్‌గా పార్ట్‌ -3 ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆపై చరణ్‌ ప్రాజెక్ట్‌ కూడా సుకుమార్‌ చేతిలో ఉంది. మరి షారుక్‌ఖాన్‌ కూడా రీసెంట్‌గా తన సొంత బ్యానర్‌ నుంచి ఒక సినిమాను ప్రకటించారు. ఇలా ఇద్దరూ ఫుల్‌ బిజీగా తమ వర్క్‌లో ఉన్నారు. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు సెట్‌ అవుతుందని ఫ్యాన్స్‌ ఆలోచిస్తున్నారు. అయితే, వారిద్దరి నుంచి కూడా ఈ వార్త గురించి ఎలాంటి రియాక్షన్‌ రాలేదు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
ప్రవాస భారతీయ కుటుంబంలో విషాదం

తెనాలి: అమెరికా నార్త్‌ కెరోలినాలో తుపాను కారణంగా గుంటూరు జి

title
యూఏఈకి ఉచిత వీసాలు.. విమాన టికెట్స్‌

మోర్తాడ్‌: నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేసేందుకు యూఏఈ ప్రభుత్వరంగ సంస్థ ఏడీఎన్‌హెచ్‌ ఉచిత వీసాలను జారీ చేస్తోంది.

title
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణవాసులు ముగ్గురు మృతి

కొందుర్గు/ సిద్దిపేట అర్బన్‌: అమెరికాలోని ఫ్లోరిడా లో సోమవారం తెల్లవారుజామున

title
కెనడా కొత్త కేబినెట్‌లో ఇద్దరు భారతీయులు

ఒట్టావా: కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్‌ క

title
పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన భార్య ఉషా

International View all
title
గాజా ప్లాన్‌పై ట్రంప్‌ రివర్స్‌ గేర్‌

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధంతో శిథిలమైన గాజాను స్వా

title
Sunita Williams: మళ్లీ నిరాశే.. చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌ రాక విషయంలో మళ్లీ నిరాశే ఎదురైంది.

title
ఉక్రెయిన్‌కు మళ్లీ అమెరికా ఆయుధాలు

కీవ్‌: ఉక్రెయిన్‌కు సైనిక సాయంపై సస్పెన్షన్‌ను డొనాల్డ్‌ ట్ర

title
గాయాన్ని గంటల్లో మాన్పే మాయా చర్మం 

అది చర్మం కాని చర్మం. అయితే అలాంటిలాంటి చర్మం కాదు. గాయాలను శరవేగంగా నయం చేసే చర్మం!

title
పాక్‌ రైలు హైజాక్‌.. కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్‌

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్థాన్‌లో వేర్పాటువాద బలోచ్‌ మ

NRI View all
title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్

న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చ

title
గిఫ్ట్‌ సిటీ ఫండ్స్‌లో భారీగా ఎన్నారైల పెట్టుబ‌డులు

ముంబై: గిఫ్ట్‌ సిటీలోని ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌లో ప్రవాస భారతీయులు దాదాపు 7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు (Investments) ప

title
మిసెస్‌ ఇండియా పోటీలకు తెలుగు ఎన్‌ఆర్‌ఐ

సాక్షి, సిటీబ్యూరో: లండన్‌ వేదికగా ప్రముఖ బహుళ జాతి సంస్థలో

title
గల్ఫ్ మృతుల కుటుంబాలతో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం

గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్‌లో త్వరలో 'గల్ఫ్ అమరుల సంస్మరణ సభ' ఏర్పాటు చేయాలని రాష్

Advertisement
Advertisement