ఇండియా క్రికెట్ను నాశనం చేసింది: షోయబ్ అక్తర్
టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంటే.. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు మాత్రం విషం చిమ్ముతున్నారు. పాక్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ మరోసారి భారత్పై తన అక్కసు వెల్లగక్కాడు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ అధిపత్యం క్రికెట్ను పూర్తి నాశనం చేసిందంటూ అక్తర్ ఆరోపించాడు."ఓ ధనిక పిల్లాడు.. పక్కవీధిలో ఉన్న పేద పిల్లలందరినీ పిలిచి క్రికెట్ ఆడదాం రండి అని చెబుతాడు. ముందుగా 8 జట్లలో నాలుగు జట్లను ఉంచుకొని, తర్వాత అందులో మూడు జట్లను ఇంటికి పంపించి చివరకు నేనే గెలిచాను అంటాడు. ఇప్పుడు భారత్ చేస్తుంది కూడా అదే. ఇలా క్రికెట్ను భారత్ పూర్తిగా నాశనం చేసింది" అని ఓ ఛానల్ డిబేట్లో అక్తర్ పేర్కొన్నాడు.కాగా ఫైనల్కు ముందు న్యూజిలాండ్ కప్ గెలవాలని కోరుకుంటున్నట్లు అక్తర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఓ వైపు భారత్ను విమర్శిస్తునే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై షోయబ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కష్టకాలంలో ఆటగాళ్లకు అండగా ఉంటూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో గంభీర్ సక్సెస్ అయ్యారని అక్తర్ కొనియాడాడు. మరో పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ అమీర్ సైతం భారత విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.చదవండి: మరో 10 ఏళ్లు ఆడతా.. 10 ఐసీసీ ట్రోఫీలు గెలుస్తా: హార్దిక్
గల్ఫ్ ఫ్యూచర్ డిసైడ్ చేసేది మీరు కాదు.. మేమే: ఇరాన్
యుద్ధానికి సంబంధించి ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. ఇరాన్ ప్రధానమైన నేవీ, ఆర్మీ, ఎయిర్ఫోర్స్లతో పాటు కీలకమైన స్థావరాలను నాశనం చేశామని, యుద్ధం ముగింపు ఒక్కటే మిగిలి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు ప్రకటనలపై ప్రకటనలు చేస్తుంటే.. ఇరాన్ మాత్రం అందుకు ధీటుగా బదులిస్తోంది. తమకు ఏమీ కాలేదని, ఇక నుంచి తమ నుంచి ఎదుర్కోబోయే పరిణామాలను ప్రపంచం చూడబోతుందనే అర్ధం వచ్చేలా ఇరాన్ కౌంటర్ల మీద కౌంటర్ల ఇస్తోంది. తమను తక్కువగా అంచనా వేయొద్దని ట్రంప్కు నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చింది. తమతో యుద్ధాన్ని ముగించేది మీరు కాదని, ఆ యుద్ధానికి ముగింపు తామిస్తామంటూ స్పష్టం చేసింది. ‘ యుద్ధం ముగించేది మీరు కాదు. మేం. గల్ఫ్ ఫ్యూచర్ డిసైడ్ చేసేది కూడా మేమే. మీపై(అమెరికా-ఇజ్రాయెల్) దాడులు చేస్తూనే ఉంటాం’ అని ఇరాన్ హెచ్చరించింది. కాగా, ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు దొరుకుతుందన్నారు. ఇరాన్పై తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిండానికి చాలా చేరువలో ఉన్నామన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా చమురు సరఫరాకు సంబంధించి ఇరాన్ను హెచ్చరించారు. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అంతరాయం కలిగిస్తే ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ ఆందోళనఅమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం ఉంటుందన్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం 30 రోజుల్లో హర్మూజ్ జలసంధి పూర్తిగా మూతబడిపోతుందని, అదే గనుక జరిగితే ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
దుబాయ్లో భారతీయులకు భారీ ఊరట
అబుదాబి:అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై జరిపిన దాడుల కారణంగా మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రవాణా కార్యకలాపాలు నిలిచిపోవడంతో పశ్చిమాసియా దేశాల్లో నివసిస్తున్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబాలతో కలిసి స్వదేశానికి చేరలేక, బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలో దుబాయ్లోని ప్రవాస భారతీయ వ్యాపారవేత్త యోగేష్ దోషి ముందుకు వచ్చారు. ఆయన తన 64 అపార్ట్మెంట్ల భవనాన్ని భారతీయులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. భారతీయులకు వసతి, భోజనం, కనీస అవసరాలను తీర్చేలా ఏర్పాట్లు చేశారు. హోటళ్లలో ధరలు అమాంతం పెరిగిన ఈ సమయంలో, దోషి కల్పిస్తున్న సౌకర్యాలు భారతీయులకు పెద్ద ఊరట లభించినట్లైంది. దుబాయ్లో చిక్కుకున్న 125 మంది భారతీయులకు ఇప్పటికే ఆశ్రయం కల్పించినట్లు సమాచారం. భారత రాయబార కార్యాలయంతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు తమకు సమాచారం అందించాలని రాయబార కార్యాలయం కోరింది.దుబాయ్కు సమీపంలోని అజ్మాన్లో కూడా భారతీయులకు ఆశ్రయం లభిస్తోంది. యుఎఇ వ్యాపారవేత్త ధీరజ్ జైన్ తన ఫామ్హౌస్ను తాత్కాలిక వసతిగా మార్చి, ఉచిత నివాసం, భోజనం అందిస్తున్నారు. హోటళ్లలో స్థలం లేక, డబ్బు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులను ఆయన తన కార్లతో భారతీయుల్ని తరలిస్తున్నారు. అందులో ఆరు రోల్స్ రాయిస్ వాహనాలతో తీసుకువచ్చి ఫామ్హౌస్లో ఆశ్రయం కల్పించారు.ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు జరిపి, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుండి ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో దుబాయ్లో చిక్కుకున్న భారతీయులకు యోగేష్ దోషి, ధీరజ్ జైన్ వంటి వ్యాపారవేత్తల మానవతా చర్యలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అందరినీ మెప్పించడం లేదా అందరినీ ఎదిరించడమని చాలామంది అపోహపడుతుంటారు. మీరు గమనిస్తే, ఆఫీసులోనో లేదా కుటుంబంలోనో కొందరు వ్యక్తులు ఎప్పుడూ అందరినీ ప్లీజ్ చేస్తూ ఉంటారు, కొందరు మాత్రం ఎప్పుడూ గొడవ పడుతుంటారు. ఈ రెండూ సరైన పద్ధతులు కావు. అసలైన పర్సనాలిటీ గ్రోత్ 'Assertiveness' (నిశ్చయత) లో ఉంది. ఇది ఎదుటివారిని గౌరవిస్తూనే, మన హక్కులను మనం కాపాడుకోవడం.1. మూడు రకాల ప్రవర్తనలు (The Behavioral Spectrum)సైకాలజీలో మనం మనుషులతో ప్రవర్తించే విధానాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు.Passive (అణగిపోవడం): ఎదుటివారు ఏమనుకుంటారో అని మీ అభిప్రాయాలను దాచుకోవడం. దీనివల్ల మీ ఆత్మగౌరవం తగ్గుతుంది, దీనివల్ల మీకు లేనిపోని ఒత్తిడి పెరుగుతుంది.Aggressive (అతిగా అరవడం): ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం, డామినేట్ చేయడం. దీనివల్ల మనుషులు మీకు దూరమవుతారు, మీ చుట్టూ ఉన్నవారు భయపడతారు తప్ప గౌరవించరు.Assertive (The Golden Mean): "నా అభిప్రాయం ముఖ్యం, అలాగే నీ అభిప్రాయం కూడా ముఖ్యం." ఇది ఎదుటివారిని హర్ట్ చేయకుండా మీ బౌండరీని మీరు సెట్ చేసుకోవడం.2. Assertiveness ఎందుకు అవసరం? Assertiveness అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ స్కిల్ మాత్రమే కాదు, అది మీ ఆత్మగౌరవానికి (Self-Respect) ప్రతిరూపం.మీరు 'Assertive' గా ఉన్నప్పుడు, మీ నిర్ణయాలకు ఒక విలువ ఉంటుంది.మీరు చెప్పే 'Yes' కు ఒక గౌరవం, చెప్పే 'No' కు ఒక క్లారిటీ ఉంటుంది.అతిగా అరవాల్సిన అవసరం లేదు, అణగిపోవాల్సిన అవసరం అస్సలు లేదు.3. మోటివేషన్ మాయ vs నిజమైన సైకాలజీట్రైనర్స్ "ఎవ్వరినీ వదిలిపెట్టకు, సింహంలా ఉండు, గర్జించు" అని చెప్తారు. ఇది మీకు అగ్రెసివ్ ట్యాగ్ను ఇస్తుంది. కానీ సైకాలజీ మీ గొంతును కాదు, మీ పాయింట్ని బలంగా చెప్పమంటుంది. కోపం తగ్గించి, స్పష్టతను పెంచుకోమంటుంది. నిజమైన నాయకుడు అరిచి పని చేయించడు, తన క్లారిటీతో పని చేయిస్తాడు.4. Assertive గా ఉండటం ఎలా?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ ఆర్ట్ను ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం.Step 1: మొహమాటాన్ని బ్రేక్ చేయండిమొహమాటం అనేది ఒక జబ్బు. "నేను వాళ్ళని ఏమీ అనకూడదు" అనే ఆలోచనని బ్రేక్ చేయండి. మీరు ఎదుటివారికి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే, వారు చెప్పే ప్రతి తప్పుకు తల ఊపడం కాదు. మీ బౌండరీలను దాటినప్పుడు సున్నితంగా, బలంగా 'No' చెప్పడం ప్రాక్టీస్ చేయండి.Step 2: Build 'I' స్టేట్మెంట్స్ఇతరులను విమర్శించేటప్పుడు "నువ్వు తప్పు చేస్తున్నావు" అనకుండా, "నీ వల్ల నాకు ఇలా ఇబ్బందిగా ఉంది" (I feel... when you...) అని చెప్పండి. ఇది ఎదుటివారిని డిఫెన్సివ్ మోడ్లో పడకుండా, మీ పాయింట్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. దీన్నే మనం బిల్డ్ చేసుకోవాలి.Step 3: ప్రశాంతతే బలంమీరు ఏ పరిస్థితిలో అయినా ప్రశాంతంగా, క్లారిటీతో మాట్లాడగలిగినప్పుడు, అది మీ వ్యక్తిత్వానికి ఒక గొప్ప బలాన్ని ఇస్తుంది. మీరు ఎవరినీ డామినేట్ చేయరు, ఎవరూ మిమ్మల్ని డామినేట్ చేయలేరు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీరు ఎక్కడ ఉన్నారు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీరు నిన్నటి రోజున ఎవరికైనా ఇష్టం లేకపోయినా 'సరే' అని అన్నారా? (Passive)మీరు ఎవరి మీదైనా అనవసరంగా కోప్పడ్డారా? (Aggressive)ఏ సందర్భంలో మీరు మీ పాయింట్ను గౌరవంగా చెప్పగలిగారు? (Assertive)మీ గొంతుకే మీ ఆయుధం!బ్రో, మీ గొంతులో ఉండేది కేవలం శబ్దం మాత్రమే కాదు, మీ అస్తిత్వం (Identity). దాన్ని అణచివేయనివ్వకండి, అలాగని దాన్ని ఎదుటివారిపైకి గర్జనలా వాడకండి. ఒక స్పష్టమైన, ప్రశాంతమైన, దృఢమైన గొంతుకను డెవలప్ చేసుకోండి."Assertiveness is not about what you say, but how you say it."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: దెబ్బ తగిలినా తిరిగి నిలబడే తత్వం)
చిరుత దవడలు సాగదీసి.. పంజాను తొక్కిపెట్టి..
సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి!
భార్యను రోకలితో కొట్టి చంపిన భర్త
లంచమిస్తావా?... జైలుకెళ్తావా?
48 గంటల్లో 312 మిలియన్స్ వ్యూస్.. ‘ధురంధర్ 2’ రికార్డు
పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్
పిలవని పేరంటానికి వస్తే జైలు, జరిమానా
Parliament Budget Session: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం చర్చ
‘టీటీడీని చంద్రబాబు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు’
డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు
గ్యాస్ సిలిండర్ బుకింగ్.. కొత్త రూల్స్!
100 ఎకరాలు ఉంటే చెప్పండి: మీనాక్షి
మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..
భారీగా పెరిగిన గ్యాస్ ధరలు - యుద్ధంతో భగ్గుమన్న ధరలు
ఉగాదికి 'అల్లు సినిమాస్' ప్రారంభం.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ పేసర్
వరల్డ్కప్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
పతనమైన వెండి.. రూ.35 వేలు తగ్గిన రేటు!
ప్రేమలో పడ్డ కోర్ట్ జంట? రోషన్, శ్రీదేవి రియాక్షన్ ఇదే!
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్లో నీటి యుద్ధం మొదలైందా?
మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
పాత బంగారు లోకం
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
పడిపోయిన పసిడి ధరలు.. వారమంతా ఆనందమే!
బుజ్జి అభిమానిని సర్ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ
లక్కీ కెప్టెన్!
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు.. ఆకస్మిక ధనలబ్ధి
చిరుత దవడలు సాగదీసి.. పంజాను తొక్కిపెట్టి..
సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి!
భార్యను రోకలితో కొట్టి చంపిన భర్త
లంచమిస్తావా?... జైలుకెళ్తావా?
48 గంటల్లో 312 మిలియన్స్ వ్యూస్.. ‘ధురంధర్ 2’ రికార్డు
పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్
పిలవని పేరంటానికి వస్తే జైలు, జరిమానా
Parliament Budget Session: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం చర్చ
‘టీటీడీని చంద్రబాబు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు’
డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు
గ్యాస్ సిలిండర్ బుకింగ్.. కొత్త రూల్స్!
100 ఎకరాలు ఉంటే చెప్పండి: మీనాక్షి
మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..
భారీగా పెరిగిన గ్యాస్ ధరలు - యుద్ధంతో భగ్గుమన్న ధరలు
ఉగాదికి 'అల్లు సినిమాస్' ప్రారంభం.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ పేసర్
వరల్డ్కప్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
పతనమైన వెండి.. రూ.35 వేలు తగ్గిన రేటు!
ప్రేమలో పడ్డ కోర్ట్ జంట? రోషన్, శ్రీదేవి రియాక్షన్ ఇదే!
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్లో నీటి యుద్ధం మొదలైందా?
మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
పాత బంగారు లోకం
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
పడిపోయిన పసిడి ధరలు.. వారమంతా ఆనందమే!
బుజ్జి అభిమానిని సర్ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ
లక్కీ కెప్టెన్!
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు.. ఆకస్మిక ధనలబ్ధి
ఫొటోలు
సినిమా ఈవెంట్లో మెరిసిన అనన్య నాగల్ల (ఫొటోలు)
విశాఖపట్నంలో వైభవంగా పైడిమాంబ తొలేళ్ల సంబరం (ఫొటోలు)
'లేచింది మహిళా లోకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
కాబోయే భార్యని పరిచయం చేసిన హీరో బెల్లంకొండ (ఫొటోలు)
చీరలో పవర్ఫుల్గా హీరోయిన్ ధన్సిక (ఫొటోలు)
సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు (ఫొటోలు)
#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్ హైలైట్స్.. (ఫొటోలు)
టీ–20 వరల్డ్ కప్ : హైదరాబాద్ లో క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
గ్రాండ్గా హీరోయిన్ శ్రద్ధాదాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
సినిమా
హిట్ సినిమాకు సీక్వెల్.. విడుదలపై ప్రకటన
ప్రేమిస్తే మూవీతో పాపులర్ అయిన నటుడు భరత్ హీరోగా నటించిన కాళిదాస్ చిత్రం 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో దానికి సీక్వెల్గా ఇప్పుడు కాళిదాస్–2 చిత్రం రూపొందింది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన శ్రీసెంథిల్నే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భరత్ కథానాయకుడిగా నటించిన ఇందులో మరో కీలక పాత్రను అజయ్కార్తీ పోషించారు.పూవే ఉనక్కాగ(poove unakkaga) చిత్రం ఫేమ్ సంగీత చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. ఆమెతో పాటు భవానిశ్రీ, అపర్ణ నటించారు. తొలి భాగం తరహాలోనే కుటుంబ నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.ఈ చిత్రాన్ని స్కై పిక్చర్స్ అధినేత ఫైవ్స్టార్ కె.సెంథిల్, డా. యోగేశ్వరన్ కలసి నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి స్పందన వస్తోందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. చిత్రం అన్నివర్గాలను అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రానికి శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, సురేశ్బాలా చాయాగ్రహణం అందించారు. ఈ మూవీ తెలుగులో కూడా విడుదల కావచ్చని సమాచారం.
సల్మాన్ తో జోడీ?
సల్మాన్ ఖాన్ , సమంత జోడీగా నటించనున్నారా? అంటే... బాలీవుడ్లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా రాజ్ అండ్ డీకే ద్వయం సూపర్హీరో జానర్లో ఓ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు సమంతను సంప్రదిస్తున్నారట మేకర్స్. ఈ చిత్ర దర్శకుల్లో సమంత భర్త రాజ్ నిడిమోరు కూడా ఉన్నారు కనుక సమంత భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని భోగట్టా. అయితే ఈ సినిమాలో సమంత నటించడం లేదని, నిర్మాతగా బాధ్యతలు తీసుకుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి.. సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో సమంత హీరోయిన్ గా స్క్రీన్ పై కనిపిస్తారా? లేక నిర్మాతగా భాగం అవుతారా? అనేది చూడాలి. ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం మే 15న రిలీజ్ అవుతోంది.
బై బై జార్జియా
జార్జియాకి బై బై చెప్పారు మహేశ్బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేశ్బాబు, మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ , మరో కీలక పాత్రలో ప్రకాష్రాజ్ నటిస్తున్నారు. ఇటీవల జార్జియాలో మొదలైన ‘వారణాసి’ కొత్త షూటింగ్ షెడ్యూల్ ముగిసింది. జార్జియా షూట్ షెడ్యూల్ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు మహేశ్బాబు.ఈ షెడ్యూల్లో మహేశ్, పృథ్వీరాజ్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలిసింది. కాగా ఈ మూవీ నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ అంటార్కిటికాలో జరగనుందని తెలిసింది. ఈ షూట్ షెడ్యూల్లో మహేశ్బాబు, ప్రియాంకా చోప్రా పాల్గొంటారు. అలాగే లాటిన్ స్టైల్లో ఓ డ్యాన్స్ నంబరును కూడా ప్లాన్ చేశారట మేకర్స్. ప్రచారంలో ఉన్నట్లు ‘వారణాసి’ టీమ్ అంటార్కిటికాలో చిత్రీకరణ జరిపితే.. ఈ లొకేషన్స్ లో షూట్ జరుపుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ నిలుస్తుందనే వార్తలు ఉన్నాయి.
'ఆర్ఆర్ఆర్'కి నాటునాటు.. 'వారణాసి'కి లాటిన్ స్టయిల్!
ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు-నాటు' పాట అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆస్కార్ వేదికపై కూడా మెరిసింది ఈ పాట. అది తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైంది. అయితే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి మరోసారి అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడట. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసిలో ఓ ప్రత్యేకమైన డాన్స్ నంబర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ పాటను లాటిన్ స్టయిల్లో తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నారని సీనియర్ కొరియోగ్రాఫర్ శంకర్ వెల్లడించారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటపై తెరకెక్కనున్న ఈ పాట కోసం వందలమంది లాటిన్ డాన్సర్లను తీసుకురావాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడట.నాటు-నాటు తరహాలోనే, వారణాసిలో లాటిన్ స్టయిల్లో సాగే ఈ పాట కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఇప్పటికే వారణాసి టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా కొరియోగ్రాఫర్ వ్యాఖ్యలతో అంచనాలు మరింత పెరిగాయి. జార్జియాలోని షెడ్యూల్ను పూర్తి చేసుకొని మహేష్ బాబు హైదరాబాద్కి తిరిగొచ్చాడు. ఎయిర్పోర్టులో ఆయన కొత్త లుక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే అంటార్కిటికాలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హీరోయిన్ ప్రియాంక చోప్రా స్వయంగా ఈ విషయం వెల్లడించింది. వారణాసి అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకోనున్న తొలి తెలుగు చిత్రంగా గుర్తింపు పొందనుంది.
క్రీడలు
ముగిసిన నిరీక్షణ.. భారత్ను వీడనున్న సౌతాఫ్రికా, విండీస్ జట్లు
భారత్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆడేందుకు వచ్చింది వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఎట్టకేలకు స్వదేశాలకు పయనం అవుతున్నాయి. టీమిండియా నెగ్గిన ఈ మెగా ఈవెంట్లో కరీబియన్ సూపర్–8లోనే నిష్క్రమించింది. దక్షిణాఫ్రికా సెమీస్ ఓడింది. సూపర్–8 మ్యాచ్లు ముగిసి వారం రోజులవుతున్నా... పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో విదేశీ జట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ వైమానిక దాడులతో మొదలైన కుంపటి పశ్చిమాసియాకు పాకింది. తమపై యుద్ధం చేస్తున్న అమెరికా స్థావరాలపై గురిపెట్టిన ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. దీంతో పశ్చిమాసియా గగనతలం మూసివేయడంతో విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో కోల్కతాలో కరీబియన్ జట్టు చిక్కుకుంది. కొందరు ఐపీఎల్ కోసం ఉండిపోగా, మరికొందరు ప్రత్యామ్నాయ ఆకాశ మార్గాల్లో చుట్టూ తిరిగి విండీస్ దీవులకు చేరుకోనున్నారు. మిగిలిపోయిన 12 మంది విండీస్ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున దక్షిణాఫ్రికా జట్టు సభ్యులతో కలిసి జొహన్నెస్బర్గ్ మీదుగా అంటిగ్వా చేరుకోనుంది.
పాపం పాకిస్తాన్..! మరోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్
ప్రపంచకప్తో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాం«దీనగర్ సమీపంలోని మోనుమెంట్ కాంప్లెక్స్కు చేరగానే అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. గుజరాత్ వారసత్వ కట్టడం ‘అడాలజ్ స్టెప్వెల్’ వద్ద అధికారిక ఫొటో సెషన్ నిర్వహించగా... టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ ప్రపంచకప్తో సందడి చేశాడు.అతను కప్తో చేరుకోగానే అభిమానులంతా ‘ఇండియా... ఇండియా...’ నినాదాలతో హోరెత్తించారు. తర్వాత అడాలజ్ కట్టడం వద్ద కప్ పట్టుకొని ఫొటోలకు ఫొజులివ్వడంతో కెమెరా ట్రిగ్గర్లన్నీ ‘కిస్సిక్... కిస్సిక్...’ మోత మోగాయి. సుప్రసిద్ధ అడాలజ్ స్టెప్వెల్’ 500 ఏళ్ల పైచిలుకు చరిత్ర ఉంది. రాణి రుడాబాయి ఈ అడాలజ్ను నిర్మించింది.ఆమె వాఘెలా సంస్థానదీశుడు రాణా వీర్ సింగ్ భార్య. రాణా వీర్ మరణానంతరం రుడాబాయి ఈ ప్రాంతాన్ని పాలించింది. ఆ సమయంలోనే అడాలజ్ స్టెప్వెల్ను నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. గుజరాత్ సంస్కృతి, వారసత్వ సంపదలో భాగమైన ఈ కట్టడాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్ సందర్భంగా విన్నర్స్ ట్రోఫీతో భారత జట్టు అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫొటోలు దిగారు. ట్రోఫీతో ఆలయంలో పూజలు అంతకుముందు స్టేడియంలో సంబరాల్లో పాల్గొన్న ఆటగాళ్లు కాసేపు సేద తీరారు. ఈ సమయంలో కోచ్ గంభీర్, కెపె్టన్ సూర్యకుమార్, ఐసీసీ చైర్మన్ జై షాతో కలిసి స్టేడియం లోపలే ఉన్న హనుమాన్ ఆలయానికి ప్రపంచకప్ను తీసుకువెళ్లి పూజలు చేశారు.పూజల అనంతరం మళ్లీ ఎప్పట్లాగే మైదానంలోకి వచ్చి అభిమానుల్ని అలరించారు. సోమవారం తెల్లవారుజాము వరకు ఈ సంబరాలు జరుపుకున్నారు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ తదితురులు ప్రపంచకప్తో దిగిన ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.పాక్ను ట్రోలు చేసిన వరుణ్కాగా విజయోత్సవాల సందర్భంగా టీమిండియా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో హాట్ టాపిక్గా మారింది. పాకిస్తాన్ను వరుణ్ మరోసారి ట్రోల్ చేశాడు. వరుణ్ చక్రవర్తి తన ఇన్స్టాగ్రామ్లో ట్రోఫీని పట్టుకుని టీ కప్పుతో సిప్ చేస్తున్న ఫోటోను షేర్ చేశాడు.ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇదే తరహా ఫోటోను ఆసియాకప్-2025 విజయనంతరం కూడా అతడు షేర్ చేశాడు. ఆసియా ఛాంపియన్స్గా నిలిచిన భారత జట్టు.. ఏసీసీ చైర్మెన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది.ఆ సమయంలో వరుణ్ చక్రవర్తి ట్రోఫీ లేకపోయినా, తన బెడ్ పక్కన ఒక 'టీ కప్పు' పెట్టుకుని పడుకున్న ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. "ట్రోఫీని లాక్కోవచ్చు కానీ, ఛాంపియన్ ట్యాగ్ను కాదు" అని పరోక్షంగా పాక్కు చురకలు అంటించాడు. ఇప్పుడు ఒరిజినల్ వరల్డ్ కప్ ట్రోఫీతో మళ్ళీ అదే విధంగా కాఫీ తాగుతూ ఫోటోను షేర్ చేస్తూ పాక్ను ట్రోల్ చేశాడు.చదవండి: ఐసీసీ ప్రపంచకప్ టీమ్లో సామ్సన్, బుమ్రా, పాండ్యా, ఇషాన్... కెప్టెన్గా మార్క్రమ్
ఐసీసీ ప్రపంచకప్ టీమ్లో సామ్సన్, బుమ్రా, పాండ్యా, ఇషాన్... కెప్టెన్గా మార్క్రమ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన టి20 ప్రపంచకప్ జట్టులో టైటిల్ నిలబెట్టుకున్న టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ జట్టుకు మార్క్రమ్ (దక్షిణాఫ్రికా) కెపె్టన్ కాగా, ఓపెనింగ్లో సంజూ సామ్సన్, టాపార్డర్లో ఇషాన్ కిషన్, మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, బౌలింగ్లో పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు చోటు లభించింది. పాకిస్తాన్ నుంచి టాప్ స్కోరర్గా నిలిచిన సాహిబ్జాదా ఫర్హాన్ ఈ ఐసీసీ టీమ్లో ఓపెనర్గా ఉన్నాడు.చిత్రంగా రన్నరప్ న్యూజిలాండ్ జట్టులో నుంచి కనీసం 12వ ఆటగాడిగా కూడా ఎవరికీ చాన్స్ దక్కలేదు. ఐసీసీ టి20 ప్రపంచకప్ జట్టు: మార్క్రమ్ (కెపె్టన్), ఫర్హాన్ (పాకిస్తాన్), సామ్సన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, బుమ్రా (భారత్), విల్ జాక్స్, ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), ఎన్గిడి (దక్షిణాఫ్రికా), ముజరబాని (జింబాబ్వే), షాడ్లీ వాన్ షాలి్వక్ (అమెరికా; 12వ ప్లేయర్).
భారత్కు నిరాశ
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం స్కాట్లాండ్తో జరిగిన పూల్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్ను భారత్ 2–2తో ‘డ్రా’ చేసుకుంది. తమకంటే బలహీన జట్టయిన స్కాట్లాండ్పై భారత్ పలు అవకాశాలు చేజార్చుకొని విజయాన్ని కోల్పోయింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ (18వ నిమిషంలో), సునెలితా టొప్పో (29వ నిమిషంలో)... స్కాట్లాండ్ తరఫున మెక్ఇవాన్ హీతర్ (6వ నిమిషంలో), ఫియోనా బర్నెట్ (33వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.భారత్కు మొత్తం 9 పెనాల్టీ అవకాశాలు రాగా, రెండింటిలో మాత్రమే జట్టు సఫలమైంది. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్ల్లో ఉరుగ్వే 3–2తో వేల్స్పై, ఇంగ్లండ్ 3–0తో కొరియాపై, ఇటలీ 3–0తో ఆస్ట్రియాపై గెలిచాయి. పూల్ ‘బి’లో ప్రస్తుతం భారత్, స్కాట్లాండ్ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఉరుగ్వే 3 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. వేల్స్ ఖాతా తెరువలేదు. నేడు విశ్రాంతి దినం. బుధవారం జరిగే పూల్ ‘ఎ’ మ్యాచ్ల్లో ఇంగ్లండ్తో ఆస్ట్రియా (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), ఇటలీతో కొరియా (మధ్యాహ్నం 3 గంటల నుంచి), ఉరుగ్వేతో స్కాట్లాండ్ (సాయంత్రం గం. 5:15 నుంచి), వేల్స్తో భారత్ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక రెండు పూల్స్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. వేల్స్తో మ్యాచ్ను భారత్ ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్కు చేరుకుంటుంది.
న్యూస్ పాడ్కాస్ట్
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
భవిష్యత్ అభివృద్ధి శూన్యం... ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్. సెమీస్లో 7 పరుగులతో ఇంగ్లండ్పై గెలుపు
హాజరైన సెలబ్రిటీలు... విరోష్ రిసెప్షన్ కు
‘లడ్డూ’పై బాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. శాసన మండలిలో చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు
స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెద్ది
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలపై ఆటవిక దాడి... మహిళా దినోత్సవ వేళ చంద్రబాబు మార్కు గిఫ్ట్
బిజినెస్
వెండి కిందికి.. బంగారం పైకి..
న్యూఢిల్లీ: వెండి వరుసగా మూడో రోజు అమ్మకాలతో నష్టపోయింది. ఢిల్లీ మార్కెట్లో కిలోకి రూ.3,400 తగ్గి (1.3 శాతం) రూ.2,68,300 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.1,64,300 స్థాయికి చేరింది.‘‘ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరగడంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరోసారి తీవ్రతరమయ్యాయి. దీంతో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు జాప్యం కావొచ్చన్న అంచనాలు పెరిగాయి. ఈ పరిస్థితులు యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్కు మద్దతునిస్తున్నాయి. ఈ ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతోంది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ గోల్డ్ ఔన్స్కు 65 డాలర్లు నష్టపోయి 5,105 డాలర్ల స్థాయిలో, వెండి ఔన్స్కు అర డాలర్ తగ్గి 83.92 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మార్కెట్వ్యాప్తంగా అమ్మకాలతో మార్జిన్కాల్స్ ఎదురై, పొజిషన్లను బలవంతంగా విక్రయించుకోవాల్సి రావడం సైతం బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపించినట్టు కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం ఏవీపీ కేనత్ చైన్వాలా తెలిపారు.
రష్యా మాస్టర్ ప్లాన్.. ఇదే అదను!
పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం మండిపోతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రిఫైనరీలు, ఆయిల్ స్టోరేజ్ డిపోలు ధ్వంసమవుతున్నాయి. హార్ముజ్ జలసంధి దాదాపు మూతపడింది. ప్రపంచంలో 20 శాతం చమురు సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీంతో మిడిల్ ఈస్ట్ నుంచి చమురు, ఎల్ఎన్జీ సరఫరాలు తీవ్రంగా తగ్గాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లు దాటింది.. కొన్ని సమయాల్లో 119 డాలర్ల వరకు చేరింది.ఈ సంక్షోభానికి సద్వినియోగం చేసుకోవాలని రష్యా భావిస్తోంది. "ఇదే అదను! చమురు ధరలు భారీగా పెరిగిన ఈ సమయంలో మన సరఫరాలను సద్వినియోగం చేసుకోవాలి!" అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారులకు స్పష్టం చేశారు. రష్యా ఇప్పటికే యూరప్కు సరఫరా చేస్తున్న గ్యాస్ను తగ్గించి.. లేదా పూర్తిగా ఆపేసి.. ఆ సరఫరాలను ఇతర మార్కెట్లకు (ఆసియా దేశాలు, భారత్ వంటివి) మళ్లించాలని సూచించారు."మనం ఇప్పుడే ఎక్కువ సరఫరాలు అవసరమయ్యే మార్కెట్లకు మా దృష్టిని మళ్లిస్తే.. అక్కడ అడుగు పెట్టవచ్చు" అని పుతిన్ చెప్పారు. యూరప్ దేశాలు రష్యా గ్యాస్పై ఆంక్షలు విధించాలని, 2027 నాటికి పూర్తిగా ఆపేయాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడే ఆ సరఫరాలను ఆపి.. ధరలు ఎక్కువగా ఇచ్చే కొత్త మార్కెట్లలో స్థానం సంపాదించుకోవచ్చనేది ఆయన వ్యూహం.రష్యా ఆయిల్ (ఉరల్స్ క్రూడ్) ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గతంలో 40 డాలర్లకి పడిపోయిన ధర.. ఇప్పుడు 60 డాలర్లు పైగా ఉంది. కొన్ని మార్కెట్లలో బ్రెంట్ కంటే కూడా ప్రీమియంతో అమ్ముడవుతోంది! ఇరాన్ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ ఎల్ఎన్జీ ఉత్పత్తి పునరుద్ధరణకు నెలల తరబడి సమయం పడుతుందని పుతిన్ చెప్పారు. దీంతో రష్యా ఎనర్జీ ఎగుమతుల నుంచి భారీ ఆదాయం వస్తుంది.. అది ఉక్రెయిన్ యుద్ధ ఖర్చులకు కూడా సహాయపడుతుంది.ఈ 'మాస్టర్ ప్లాన్'తో రష్యా ఆర్థికంగా బలపడుతుందా.. లేక యూరప్ ఎనర్జీ సంక్షోభం మరింత తీవ్రమవుతుందా? ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.Putin says Russia should take advantage of the sky-high oil prices after US-Israeli attacks on Iran.Russia should redirect supplies to Europe elsewhere, he adds. “If we shift our focus right now to the markets that need more supplies, we might get a foothold there.” pic.twitter.com/FZAHksP2p6— max seddon (@maxseddon) March 9, 2026
రూపాయి రికార్డు కనిష్టం 39 పైసలు తగ్గి 92.21కు
చమురు ధరల పెరుగుదలతో దిగుమతుల బిల్లు పెరగనుంది. ఇందుకు డాలర్లలో చెల్లింపుల కారణంగా రూపాయి విలువకు చిల్లు పడింది. వెరసి డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ 39 పైసలు క్షీణించి సరికొత్త కనిష్టం 92.21 వద్ద ముగిసింది. పశ్చిమాసియాలో యుద్ధ భయాలు, ప్రధాన కరెన్సీలతో మారకంలో పుంజుకున్న డాలరు దేశీయంగా రూపాయిని దెబ్బతీసినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. రూపాయి ఒక దశలో 92.35కు చేరింది. ఇది ఇంట్రాడేలో రికార్డ్ కనిష్టం. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.3% బలపడి 99.27కు చేరింది.
ప్రస్తుతానికి పెట్రోల్ రేట్లు పెరగవు
న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా ప్రస్తుతానికైతే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే యోచనేదీ కేంద్రానికి లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే అదనపు భారాన్ని భరించనున్నట్లు వివరించాయి. మరోవైపు, వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయంలో కనీస వెయిటింగ్ పీరియడ్ను 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా, అక్రమంగా నిల్వ చేయడాన్ని అడ్డుకోవడానికే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపాయి.
ఫ్యామిలీ
చీరకట్టులో స్నోబోర్డింగ్ స్టంట్..!
స్కేటింగ్, స్నోబోర్డింగ్ వంటివి చీరతో సాధ్యమయ్యేవి కావు. అందులోనూ మంచు పర్వతాల్లో రెయ్రెయ్ మని వెళ్లాలంటే శారీతో సాధ్యమైన పనికాదు. కానీ ఇద్దరు మహిళలు చీరతో చాలా ఈజీగా చెయ్యొచ్చని చూపించి అందర్నీ షేక్ చేశారు. భారతీయతను ఉట్టిపడేలా చేసే చీరకట్టుతో చేసిన స్నోబోర్డింగ్ అందర్నీ కట్టిపడేసింది. ఆరుగజాల చీరలో ఊర్మిలా పేబుల్, లిండా ష్మిటర్ అనే ఇద్దరు మహిళలు మంచు పర్వతాల్లో చాలా చక్కగా స్కోబోర్డింగ్ చేసి నోటమాట రాకుండా చేశారు. ప్రొఫెషనల్ అథ్లెట్లు అయినా ఈ ఇద్దరూ చీరకట్టుతో స్నోబోర్డింగ్ చేసే థ్రిల్ కోసం చేసినా..అందర్నీ ఆలోచించేలా చేసింది. భారతీయురాలైన ఊర్మిలా పేబుల్, తన స్విస్ స్నేహితురాలితో కాశ్మీర్లోని గుల్మార్గ్లో మంచుకొండలపై ఈ స్టంట్ చేశారు. అందుకు సంబంధించిన కమనీయ దృశ్యాల్ని స్వీడిష్లో జన్మించిన అడ్వెంచర్ ఫిల్మ్ మేకర్, డ్రోన్ పైలట్ అయిన హెరాల్డ్ ఎడ్లండ్ కెమెరాలో బంధించారు. ఊర్మిళ, లిండా మాదిరిగానే, అతను పారాగ్లైడింగ్, స్పీడ్ఫ్లైయింగ్ వంటి అనేక హై-ఇంటెన్సిటీ అడ్వెంచర్ క్రీడలపై ఆసక్తితోపాటు, పర్వత ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించడంలో నిపుణుడు. అయితే ఆ దృశ్యాలకు "శారీ నాట్ సారీ" అనే క్యాప్షన్ జోడించి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ఊర్మిలా పేబుల్. ఇదిలా ఉండగా, ఊర్మిలా 19 ఏళ్ల ఉత్సాహభరితమైన ప్రొఫెషనల్ స్కేట్బోర్డర్. ఐదేళ్ల వయసులో రోలర్ స్కేటింగ్ నేర్చుకుంది. అలా ఆమెకు స్కేట్ బోర్డింగ్ పట్ల మక్కువ పెరిగింది. ఇక లిండా ష్మిటర్ స్విట్జర్లాండ్, హిమాలయాలు, వంటి దిగ్గజ ప్రదేశాలలో సాహసోపేతమైన కంటెంట్కు ప్రసిద్ధి చెందింది. అలాగే ఆమెకు బర్టన్, మమ్ముట్ వంటి ప్రధాన బహిరంగ స్నోబోర్డింగ్ బ్రాండ్ల నుంచి అనేక స్పాన్సర్షిప్లు కూడా వచ్చాయి. View this post on Instagram A post shared by Urmila P. (@ursk8kid) (చదవండి: ఫ్లైట్ వాష్రూమ్ని జిమ్గా మార్చేశాడుగా..!)
ఎవరీ నమ్రత స్టాన్లీ..? ఏకంగా వైన్ బ్రాండ్ని..
మహిళా సాధికారత, మహిళా చైతన్యం అని ఏవేవో చెబుతుంటారు గానీ ఇంకా వివక్ష తగ్గలేదనే గణాంకాలు చెబుతున్నాయి. అందుకు నిదర్శనంగా సమాజంలో జరుగుతున్న కొన్ని ఉదంతాలే ఉదాహరణ. వాటిని చూస్తే..ఇంకా ఏ కాలంలో ఉన్నామనే ఫీల్ కలుగుతుంది. మహిళలు పురుషులతో సమానమని పైపై మాటలుగా చెబుతుంటారే గానీ వాస్తవికంగా అది పూర్తి స్థాయిలో జరగదు. అయినప్పటికీ కొందరు ధీర వనితాలు.. ఆ మాటను అక్షరాల నిజం చేసి..అందర్నీ ఆశ్చర్యపరిచేలా సక్సెస్ని అందుకుంటున్నారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా వివక్ష, గృహహింసను ఎదుర్కొంటూనే అంచలంచెలుగా ఎదిగిన ఈ నారీమణి గురించి తెలుసుకుందామా. పైగా పురుషాధిక్య వ్యాపారమైన వైన్ బిజినెస్లో రాణిస్తున్న ఏకైక మహిళగా పేరు కూడా తెచ్చుకుందామె. ఇంతకీ ఎవరామె అంటే..ఆ శక్తిమంతమైన మహిళే 45 ఏళ్ల నమ్రత స్టాన్లీ. బెంగళూరు చెందిన నమ్రత కుటుంబంలో కూడా ఆడపిల్లకు ఉద్యోగం ఎందుకు అనే భావజాలం ఎక్కువగా ఉండేది. అంతగా ఆడపిల్లలకు ప్రాధాన్యతలోని తన కుటుంబంలో తండ్రి తీరు అస్సలు నచ్చేది కాదు నమ్రతకు. ఆమె తల్లి గృహిణిగి ఇంటి బాధ్యతలు చూసుకోవాలి. ఆయన ఇంటి నిర్ణయాలన్నింటిని తీసుకునేవారు. మా అమ్మకు ప్రతిభ ఉన్న ఇంటి గోడలకే పరిమితం చేశారాయన. ఇక నమ్రత ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో హాస్పిటాలిటీ చదివింది, అలాగే పాటిస్సేరీ(డెజర్ట్స్ తయారీ) నైపుణ్యం ఉందామెకు. 2024లో సరిగ్గా పెళ్లైంది. ఇక అక్కడ కూడా ఆడపిల్లలకు జాబ్ అనవసరం అనే అభిప్రాయమే బలంగా ఉండేది. అంతేగాదు ఆమె అత్తారింటిలో చీరకట్టుకుంటే గానీ బయటకు రాకూడదు, కనీసం స్నేహితులను కలవకూడదు, బేకరీ లాంటి వ్యాపారం వంటివి ఏమి చేయకూడదు. ఇంతలో 2007లో తనకు పాప జన్మించడంతో గృహహింస, ఛీత్కారాలు మొదలయ్యాయి. ఇవన్ని కూడా ఆమెను ఆపలేకపోయాయి. వీటన్నింటిని తట్టుకుంటూనే బెంగళూరులోని అలయన్స్ ఫ్రాంకైస్ స్థానిక కేంద్రానికి సమీపంలో నివసిస్తున్న ఆమె రహస్యంగా ఫ్రెంచ్ తరగతుల్లో చేరింది. మార్కెట్కి వెళ్తున్నా అని ఫ్రెంచ్ క్లాస్లకు వెళ్లేది. రాత్రిపూట కూతుర్ని పడుకోబెట్టి హెడ్ఫోన్లలో చదువుకునేది. ఇక తన కుటుంబానికి తానెంటో చూపాలనే ఉద్యేశ్యంతో 2013లో రెజ్యూమ్ని ఒక జాబ్సైట్లో అప్లోడ్ చేసింది. అయితే స్టాన్లీ స్కిల్స్కి ఫిదా అయ్యి ఒక ఫ్రెంచ్ ఐటీ సంస్థ ఆమెను పారిస్లో నియమించుకుని శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. తన పాపను అమ్మ చూసుకుంటుందని ఒప్పించి, భర్త అనుమతితో వెళ్లింది. అది కూడా ఒక నెలపాటు ట్రైనింగ్కి మాత్రమే పంపించారు స్టాన్లీని. అయితే స్టాన్లీ అక్కడ విజయవంతంగా ట్రైనింగ్ని పూర్తిచేసుకుని కుమార్తె కోసం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఫ్రెంచ్కి వెళ్లినప్పుడు సరదాగా భుజం మీద వేయించుకున్న టాటు కారణంగా భర్త ఆగ్రహానికి గురైంది. ఆ తర్వాత బెంగళూరులో జాబ్లు అన్వేషిస్తున్న ఆమెను వారించే ప్రయత్రం చేయడమే గాక, ఆమె పాస్పోర్ట్ని మాయం చేయడం, అర్థరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు పంపించేయడం వంటి టార్చర్ ఎక్కువైంది. దాంతో ఆ గృహహింస నుంచి బయటపడి 2017లో తల్లి మద్దతుతో ఫ్రాన్స్ బోర్డియక్స్లో వైన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ MBA ప్రోగ్రామ్లో చేరింది. చెప్పాలంటే ఆ క్లాస్లో అందరికంటే పెద్దది స్టాన్లీనే..అయినా సరే..లక్ష్యంపైనే ఫోకస్ పెట్టేది స్టాన్లీ. వైన్ తయారీ ప్రక్రియకు సంబంధించి.. ద్రాక్షపండను పండించడం నుంచి వైన్గా మారే వరకు ప్రతిదాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. అదీగాక బోర్డియక్స్లోని కఠినమైన చట్టాలు నీటిపారుదలను నిషేధిస్తాయి, దాంతో ద్రాక్ష పాదులను పండించడం చాలా సవాలుగా ఉండేది. అదే తనకు స్ట్రాంగ్గా పోరాడుతూ నిలబడటం ఎలాగో నేర్పిందని అంటోంది స్టాన్లీ. అలాగే ఈ వైన్ తయారీలో ప్రతి దశ చాలా కచ్చితత్వం అవసరమని అంటోంది. ఆ తర్వాత వైన్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని..వైన్ తయారీ కేంద్రాల నుంచి నేరుగా సోర్సింగ్ చూస్తూ..కంపెనీని బోర్డియక్స్లో నమోదు చేయించుకుంది. క్రమేణ తన సొంత బ్రాండ్ 'సోలికాంటస్' పేరుతో వైన్ని విక్రయించే రేంజ్కు చేరింది. ఇక్కడ సోలి అంటే నేల, కాంటస్ అంటే లాటిన్లో శ్రావ్యత. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఈ వైన్ వ్యాపార సామ్రాజ్యంలో శక్తిమంతమైన వ్యాపారవేత్తగా సాగుతూ..మహిళలు ఎందులోనైనా రాణించగలరు అని చాటి చెబుతోంది. అంతేగాదు స్టాన్లీ వైన్ నాణ్యత, రుచిని నిర్ణయించేది కూడా ఆమెనే కావడం విశేషం. (చదవండి: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ)
నయనిక రెడ్డి అల్లు శిరీష్ పెళ్లిలో హైలెట్ 'శంకు చక్రం' మెహందీ డిజైన్
ఈసారి సెలబ్రిటీల జంట ట్రెండ్ని సెట్ చేయడం లేదు. వాళ్లే సరికొత్త ట్రెండ్ని సెట్ చేసేలా భారతీయ మూలాలను గౌరవించడం విశేషం. ఈ మార్చి 6న అల్లు శిరీష్ నయనిక రెడ్డీల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో అల్లు శిరీష్ చేతి మెహందీ అందర్నీ అమితంగా ఆకర్షించింది. మన సంస్కృతికో పాతుకపోయిన గోరింటాకు అంతరార్థాన్ని తెలియజెప్పేలా శిరీష్ చేతి మెహిందీ ఉంది. నిజంగానే మన భారతీయ సంప్రదాయంలో వధువరులను లక్ష్మీ నారాయణులుగా భావిస్తారు. నారాయణుడకి తమ ఇంటి ఆడపిల్ల చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిని అందిస్తున్నాం అన్నట్లుగా కాళ్లు కడిగి మామగారు అల్లుడి చేతిలో పెడతారు. నారాయణ..మా లక్ష్మీకి ఇక నుంచి అన్ని నీవే అని చెబుతారు. ఆ నేపథ్యాన్ని ఇలా శిరీస్ చేతిపై ఉన్న మెహందీ డిజైన్ ద్వారా చెప్పకనేచెప్పారు. ఈ శంకు చక్రాలు ఎక్కువగా వైష్ణవులు తమ భుజాలపై ఛాతీపై ధరిస్తారు. అలాగే ప్రతి వైష్ణవ ఆలయాల్లో ఇవి దర్శనిమిస్తాయి. నిజంగా ఆ వివాహ వేడుకలో నారయణుడిగా శిరీష్..లక్ష్మీదేవిగా నయనికలు అతిథులకు చూడచక్కని జంటలా కనువిందు చేశారు. ఇక్కడ శంఖం అనేది శుభ శుచికానికి, ధనానికి ప్రతీక అయితే..చక్రం మన జీవిత గమనానికి సంకేతం..ఇక మధ్యలో ఉండే తిరునామాలు..అందరిలోనూ ఉండే సర్వాంతర్మామి ఆ నారాయణుడి అని గొంతెత్తి చెప్పేలా చాలామంది వైష్ణవులు ముఖంపై ధరిస్తుంటారు. కాగా ఈ వివాహ వేడుకలో అల్లు శిరీష్ బంగారు రంగులో క్లిష్టమైన ఎంబ్రాయిడీ కలిగి న్న ఆఫ్ వైట్ సిల్క్ షేర్వానీని ఎంచుకోగా, నయనికా రెడ్డి బంగారం వెండి జర్దోజీ వర్క్తో అంకరించబడిన లావెండర్ రంగు పట్టు చీరను ఎంచుకుంది. దానికి అనుబంధంగా రూబీ, వజ్రాల నెక్లెస్లు, స్టేట్మెంట్ చెవిపోగులు, గాజులతో ముగ్ధమనోహరంగా ఉంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) (చదవండి: Arjun Saaniya Chandhoks wedding: సారా మీనాకారి నెక్లెస్..! ఇంత స్పెషాల్టీ దాగుందా..?!)
సారా మీనాకారి నెక్లెస్..! ఇంత స్పెషాల్టీ దాగుందా..?!
సచిన్ టెండూల్కర్ అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండూల్కర్ల వివాహం గత గురవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు, పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు విచ్చేసి వధువరులు ఆశ్వీరదించారు కూడా. అయితే ఈ వేడుకలో అర్జున్ అక్క సారా కుందనపు బొమ్మలా అందరి కళ్లను ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె ధరించిన మీనాకారి నెక్లెస్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. సునీతా షెఖావత్ కలెక్షన్కి సంబంధించిన ఈ నెక్లెస్ చాలా ప్రత్యేకంగా తయారు చేశారట. ఇందులో హస్తకళ, సంప్రదాయ కుందన్ సెట్ పోల్కీలు, పూల మోటిఫ్లు తరతరాల సంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి. ప్రముఖ ఆభరణాల నిపుణురాలు ప్రియంషు గోయెల్ జైపూర్కి చెందిన సునీతా షెఖావత్ తయారు చేసిన ఈ నెక్లెస్ ధర దగ్గర రూ. 40 నుంచి రూ. 60 లక్షలు పైన ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెక్లెస్లో కొలంబియన్ ఎమరాల్డ్లు, సౌత్ సీ ముత్యాలను పొందుపరిచారు. అద్భుతమైన వారసత్వ ఆభరణాలు.. మన దేశ సంస్కృతిని, గత వైభవాన్ని కళ్లముందు కదలాడలే చేసింది ఈ ఆభరణం. అంతేగాదు దీన్ని తయారు చేసేందుకు 360 గంటలు పైనే పట్టిందట. ఈ ఆభరణం ప్రత్యేకతలను వివరిస్తూ నెట్టింట షేర్ చేశారు ప్రియంషు గోయెల్. View this post on Instagram A post shared by Sunita Shekhawat (@sunita_shekhawat_jaipur) (చదవండి: Arjun-Saaniya Chandhok Wedding: అంజలి, సారా ఆ చీరలే ఎందుకు ఎంచుకున్నారంటే..)
అంతర్జాతీయం
అమెరికాలో ఆకలికేకలు... ఆపన్న హస్తంగా భారతీయ హిందువు
ఓ వైపు అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందిన దేశంగా అభివర్ణించుకుంటూ ఉన్న అమెరికాలో ప్రస్తుతం ఆహార అభద్రత అత్యంత ఆందోళన కలిగించే అంశాలలో ఒకటిగా మారింది. మాట వినని వారిపై కయ్యాలకు కాలు దువ్వుతూ ఇతర దేశాలపై ఆంక్షల కొరడా ఝులిపిస్తూ ఏ అంతర్గత సమస్యలూ లేనట్టు పైకి కనిపిస్తున్న ఆ దేశంలో కనీసపాటి నాణ్యమైన భోజనం పొందలేకపోతున్నవారి సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ విషయాన్ని ఫుడ్ రీసెర్చ్ – యాక్షన్ సెంటర్ అందించిన 2024 డేటా నిర్ధారించింది.ఈ అధ్యయనం ప్రకారం ఆ దేశంలోని ఏడు ఇళ్లలో కనీసం ఒక ఇల్లు ఆహార అభద్రతను ఎదుర్కుంటోంది. అంటే దాదాపుగా 47.9% మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్నారని అంచనా. దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం దేశవ్యాప్తంగా ఇళ్లలో తృప్తికరమైన భోజనాలు ఆస్వాదించడాన్ని కష్టతరం గా మార్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపధ్యంలో పలువురు వ్యక్తులు సంస్థలు అవసరార్ధులకు రుచికరమైన, ఉచిత భోజనాన్ని అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. అలాంటి వారిలో జన్మతః భారతీయుడైన గోవింద దత్తా కూడా ఒకరు. ఆయన ఆధ్వర్యంలోని లాస్ ఏంజిల్స్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కృష్ణ లంచ్ అనే సంస్థ ఒక ఫుడ్ ట్రక్ను నిర్వహిస్తోంది. ఇది వెస్ట్వుడ్లోని లే కాంటే అవెన్యూలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వెలుపల కొలువుదీరిన ఓ ఫుడ్ ట్రక్. ఈ కృషగోవింద దత్తా... ఆధ్వర్యంలో ఈ ట్రక్ విద్యార్ధులు, కార్మికులకు నామమాత్రపు ధరకే శాఖాహార భోజనాలను అందిస్తోంది.‘ ఆహార అభద్రతను ఎదుర్కోవడంలో ఇక్కడి సమాజానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం‘ అని దత్తా మీడియాతో అంటున్నారు. ఆయన శృకృష్ణుని ఆదర్శాల వ్యాప్తికి వెలసిన హిందూ భక్తి ఉద్యమం ఇస్కాన్లోని హరేకృష్ణ కు దీర్ఘకాల సభ్యుడు, కర్మ సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తాను అంటున్న ఆయన భగవద్గీతను వ్యాప్తి చేయాలనే లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నానంటారు.అతి తక్కువగా, చిన్న పాటి విరాళానికి (షుమారు 5 డాలర్లు) ప్రతిగా స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని ఈ ట్రక్ అందిస్తుంది. అయితే, ఆ కనీస విరాళం మొత్తాన్ని ఇవ్వలేని వారు కూడా ఇక్కడ భోజనానికి అర్హులే. తమ ట్రక్ లో వడ్డించే వంటకాల కోసం రూపొందిన మెనూ ఆయుర్వేద పురాతన వంట శైలులపై ఆధారంగా ఉందని ఆయన వెల్లడించారు, ‘కూరగాయలు, ధాన్యాలు, బీ¯Œ ్స‘ కలయిక గా ఈ ఆహారపదార్ధాలు రూపొందుతాయి.ఆయన తో పాటు మరొక స్వచ్ఛంద సేవకుడు శాంతాత్మ ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు మేల్కొంటారు.. అక్కడ నుంచి తమ ట్రక్ పనులను చూసుకుని సాయంత్రం 7 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంటారు. వారానికి ఐదు రోజుల పాటు ఈ ప్రాజెక్టును అందించగలుగుతారు. ఈ ఫుడ్ ట్రక్ సోమవారం నుంచి శుక్రవారం వరకు స్థిరమైన మెనూ షెడ్యూల్ను అనుసరిస్తుంది.‘ఆహారం ఒక బహుమతి, అదే మా ప్రేరణ‘ అని దత్తా అంటున్నారు. దేశంలో 20% మంది విద్యార్థులు డబ్బు కారణంగా ఆహార స్వీకరణను వాయిదా వేస్తున్నారని, మొత్తంగా 42% మంది ఆహార అభద్రతతో ఉన్నారని అంటున్న వీరు తమ వంతుగా ఈ సమస్య పరిష్కారంలో భాగం అవుతున్న తీరు హర్షణీయం.
‘కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’.. ట్రంప్ పరువు తీసిన ఇరాన్
టెహ్రాన్: ‘ట్రంప్ కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’ అంటూ ఇరాన్ ప్రభుత్వ ఆంగ్ల మీడియా సంస్థ టెహ్రాన్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో ఇటీవల అమెరికా మిసైల్ దాడిలో మరణించిన ఇరాన్ మినాబ్ నగరంలోని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుల ఫొటోలు ప్రచురించి, ప్రపంచ దేశాల ఎదుట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు తీసింది.‘ట్రంప్ ఒక్కసారి ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు’ అంటూ ఆ ఫొటోలతో పాటు ఇరాన్పై జరుగుతున్న సైనిక దాడులపై ట్రంప్ చేసిన ప్రకటనలు బాధ్యతారహితంగా, తప్పుడు వాదనలు, దౌత్య పరిష్కారాలను ధిక్కరించేవిగా ఉన్నాయని పేర్కొంది. స్కూల్పై దాడి ఘటనపై ట్రంప్ మాట్లాడుతూ, “ఆ స్కూల్పై ఇరాన్ దాడి చేసింది. వారి ఆయుధాలకు ఖచ్చితత్వం ఉండదు” అంటూ ఇనాబ్ స్కూల్ విషాదాన్ని ఇరాన్పై నెట్టే ప్రయత్నం చేశాడు.ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఇరాన్ తన సొంత మీడియా పత్రిక ఫ్రంట్ పేజీలో ఇనాబ్ స్కూల్లో ప్రాణాలు కోల్పోయిన పసిపిల్లల ఫొటోలు అచ్చు వేసింది. ఇక అటు ట్రంప్, ఇటు ఇరాన్ వాదనలు–ప్రతివాదనలు కొనసాగుతుండగా, ప్రముఖ అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ విచారణలో మినాబ్లోని పాఠశాలపై దాడి చేసింది అమెరికా సైన్యమేనని తేలింది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడి జరగగా, స్కూల్లో 150 మంది చనిపోయారని, వారిలో అధిక శాతం విద్యార్థులేనని నివేదికలో పేర్కొంది. స్కూల్లో జరిగిన మారణహోమానికి అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సిందేనని న్యూయార్క్ టైమ్స్ హైలైట్ చేసింది.గత ఫిబ్రవరి 28న ఇరాన్లోని ఇనాబ్ ప్రాంతంలో అమెరికా–ఇజ్రాయెల్ మిసైళ్లతో దాడి జరిపాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అభివృద్ధి చేసిన టొమాహాక్ క్రూయిజ్ మిసైల్ దాడి జరిగినట్లు యుద్ధాలు, ఘర్షణలు, వాటి ప్రభావాలను అధ్యయనం చేసే రీసెర్చర్ ట్రెవర్ బాల్ తెలిపారు.అంతేకాదు, తొలిసారి ఐఆర్జీసీ కేంద్రాలపై అమెరికానే ఈ దాడి జరిపిందని, అందులో ఇజ్రాయెల్ ప్రమేయం లేదని చెప్పారు. ఇనాబ్ స్కూల్ గోడలోకి దూసుకెళ్లిన అమెరికాకు చెందిన టొమాహాక్ క్రూయిజ్ మిసైల్ అని నిర్ధారించేందుకు ఫుటేజీలను కూడా బయటపెట్టారు.
న్యూయార్క్ తొలి ముస్లిం మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటిపై దాడి
వాషింగ్టన్: న్యూయార్క్ తొలి ముస్లిం మేయర్ జోహ్రాన్ మమ్దానీ (34)ఇంటిపై దాడి జరిగింది. అగంతకులు మమ్దానీ ఇంటిపై పేలుడు పదార్ధాలు విసిరారు.అయితే, పేలుడు పరికరాన్ని వెలిగించినప్పటికీ ఫ్యూజ్ సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రమాదం తప్పింది.ఒకవేళ పేలి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది. మమ్దానీ ఇంటిపై దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానితులు ఎమీర్ బాలాట్ (18), ఇబ్రహీం కయూమి(19)ని అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసుకుని ఎఫ్బీఐకి చెందిన జాయింట్ టెర్రరిజం టాస్క్ ఫోర్స్ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తును ఉగ్రవాద కోణంలో చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ట్రంప్నకు కోపం తెప్పించే పని చేసిన పుతిన్
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీకి వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మొజ్తబా ఖమేనీకి మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించారు. అలీ ఖమేనీ కుమారుడే మొజ్తబా ఖమేనీ.మొజ్తబాకు పుతిన్ ఓ సందేశం పంపారు. “ఇరాన్కు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇరాన్లోని మిత్రులతో ఐక్యంగా ఉంటాం. ఇరాన్కు రష్యా విశ్వసనీయ భాగస్వామిగా ఉంది. భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుంది. ఇరాన్ దాడులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో మీ పదవీకాలంలో మీకు చాలా ధైర్యం, అంకితభావం అవసరం” అని తెలిపారు.తాజాగా, డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లకు పుతిన్ వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు ఉండడం తనకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇరాన్లో సామరస్యం, శాంతిని తీసుకువచ్చే నేత కావాలని చెప్పారు. తమ ఆమోదం లేకపోతే అతను ఎక్కువ కాలం నిలవడని అన్నారు. అలాగే, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించడం గమనార్హం. యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు..కాగా, ప్రజల ముందుకు మొజ్తబా ఖమేనీ అంతగా రారు. తన 56 సంవత్సరాల జీవితంలో అదే తీరును అవలంభించారు. అయితే, ఇరాన్లో చెలరేగిన నిరసనలను అణచివేయడంలో మొజ్తబా పాత్ర ఉంది. గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. సోమవారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై మళ్లీ దాడులు ప్రారంభించింది. బీరూట్లో హిజ్బుల్లా మౌలిక వసతులపై కూడా దాడి చేసింది.దీనికి ముందు రోజు టెహ్రాన్ చమురు నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ ప్రతిగా ఇజ్రాయెల్పై, పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలపై దాడులు చేస్తోంది. ఆదివారం సౌదీ అరేబియాలోని ఓ నివాస ప్రాంతంలో ఒక ఆయుధం పడటంతో ఒక భారతీయుడు సహా ఇద్దరు విదేశీయులు మరణించారు.ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో మొజ్తబా తండ్రి అలీ ఖమేనీతో పాటు తల్లి, కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మీడియా నివేదికల ప్రకారం.. మొజ్తబా భార్య పేరు జహ్రా హద్దాద్-అదెల్, ఆయన కుమారుల్లో ఒకరు దాడుల్లో మరణించారు. మొజ్తబాకు ఒక కుమార్తె కూడా ఉంది. మొత్తం ముగ్గురు పిల్లలు.
జాతీయం
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇజ్రాయెల్-ఇరాన్ ఇష్యూ మొత్తం ముగియవచ్చని భారత్లోని యూఏఈ తొలి రాయబారి హుస్సేన్ హసన్ మిర్జా అన్నారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో మిర్జా మాట్లాడారు. యూఏఈకి ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించగా.. మోదీ అంటే గల్ఫ్ నాయకులకు మాత్రమే కాదని,. ఆయా దేశాల ప్రజలు, వ్యాపార వర్గాల్లో కూడా ఆయనకు చాలా గౌరవం ఉందని మిర్జా చెప్పారు. “ఇరాన్, ఇజ్రాయెల్ అధినేతలకు మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య ముగుస్తుంది. ఒక ఫోన్ కాల్ చాలు” అని మిర్జా చెప్పారు. ప్రస్తుతం యుద్ధం చేస్తున్న ఇరాన్- ఇజ్రాయెల్ నాయకులతో మోదీకి ఉన్న సత్సంబంధాలపై ఇది ఆధారపడి ఉందని ఆయన చెప్పారు.‘ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలో చేరాలన్న ఆసక్తి యూఏఈకి లేదు. మా భూభాగాన్ని దాడుల కోసం వాడుకోవడానికి ఇరు పక్షాలకు అనుమతి ఇవ్వము. నిజంగా చెప్పాలంటే ఇందులో మేమెందుకు చేరుతున్నామో నాకు స్పష్టంగా తెలియదు. ఈ ఘర్షణలో యూఏఈ జోక్యం చేసుకోవాల్సిన కారణం ఏమీ లేదు” అని మిర్జా వ్యాఖ్యానించారు. రెండు పక్షాలతో తాము చర్చలు జరపగలమని అన్నారు.యూఏఈ సున్నితమైన భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో ఉంది. అది ఇరాన్ పక్కన ఉన్న దేశం. అలాగే అబ్రహామ్ ఒప్పందాల కింద ఇజ్రాయెల్తో యూఏఈ పార్ట్నర్షిప్ కొనసాగిస్తోంది. అబ్రహామ్ ఒప్పందాలు అంటే కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణం చేసుకోవడానికి కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలు.“వాళ్లు మా భూభాగంగాపై పరస్పరం యుద్ధం చేస్తున్నారు. దీన్ని మేము అంగీకరించలేం” అని మిర్జా చెప్పారు. ఇప్పటివరకైతే నష్టం తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు.ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై మరోసారి దాడులు చేసింది. బీరూట్లో హిజ్బుల్లా మౌలిక సదుపాయాలపై కూడా దాడి చేసింది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి చెప్పిన వివరాల ప్రకారం యుద్ధంగా వల్ల ఇప్పటివరకు ఇరాన్లో 1,332 మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు.
తమిళనాడులో ట్విస్ట్.. విజయ్కి మరోసారి సీబీఐ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: టీవీకే అధినేత, నటుడు విజయ్కి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో విచారణకు రావాలని తాజాగా నోటీసులు పంపింది. ఈ క్రమంలో మార్చి 10న దర్యాప్తు సంస్థ అధికారుల ఎదుట హాజరుకావాలన్న సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఇక, కరూర్ ఘటనలో విజయ్ ఇప్పటికే రెండు సార్లు సీబీఐ విచారణకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై ఢిల్లీలోని సీబీఐ అధికారులు ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపారు. ఈ విచారణకు విజయ్ హాజరయ్యారు. ఆరుగంటల పాటు జరిగిన ఈ దర్యాప్తులో.. కరూర్ తొక్కిసలాటకు తమ పార్టీకి సంబంధం లేదని విజయ్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.#TamilNadu: #CBI has reportedly issued a summons to actor and Tamilaga Vettri Kazhagam (#TVK) chief #Vijay, asking him to appear for inquiry on March 10 in connection with the #Karur crowd stampede case.— South First (@TheSouthfirst) March 9, 2026గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాద ఘటనపై మద్రాస్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఒక సభ్యుడితో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే సుప్రీం కోర్టు మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావించి ఆ కమిషన్ను రద్దు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి ఆధ్వర్యంలో ప్యానెల్ పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని ఆదేశించింది.ఇక, తమిళనాడులో కరూర్లో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అందుకు సభకు వచ్చిన అభిమానులు,కార్యకర్తలకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం,ఆహారం,నీరు,మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితంగా పరిస్థితి అదుపు తప్పింది. విజయ్ ఆలస్యంగా వేదికకు చేరుకోవడం కూడా గందరగోళానికి కారణమైందని తమిళనాడు పోలీసులు ఆరోపించారు. తమిళనాడు పోలీసులు ఈ ఘటనకు విజయ్ ఆలస్యమే కారణమని పేర్కొన్నారు. అయితే విజయ్ ఈ ఆరోపణలను ఖండించారు.
లిక్కర్ స్కాం కేసు.. వారికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా కేజ్రీవాల్, కవిత, మనీశ్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కేసులో ప్రతివాదుల నుంచి ఢిల్లీ హైకోర్టు సమాధానాలు కోరింది.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులందరినీ డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ కోర్టు(రౌస్ ఎవెన్యూ కోర్టు) ఇచ్చిన తీర్పును హైకోర్టులో సీబీఐ సవాల్ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ పిటిషన్పై ఈరోజు ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా ట్రయల్ కోర్టు తీర్పులో సీబీఐపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ట్రయల్ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు, వ్యాఖ్యలపై సొలిసిటర్ జనరల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(మార్చి 16) తదుపరి విచారణ చేపట్టనుంది. Delhi Excise Policy Case: Delhi High Court begins hearing the CBI’s appeal challenging the trial court order that discharged former Delhi Chief Minister Arvind Kejriwal, former Deputy Chief Minister Manish Sisodia and 21 others.The matter is being heard by Justice Swarna Kanta…— ANI (@ANI) March 9, 2026
లోక్ సభ రేపటికి వాయిదా
లోక్ సభ రేపటికి వాయిదా పశ్చిమాసియా యుద్ధం పై చర్చించాలని విపక్షాల పట్టుఅధికారపక్షం అంగీకరించకపోవడంతో సభా కార్యక్రమాలను అడ్డుకున్న విపక్షాలులోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముందుకు రావాలని కోరిన ప్యానెల్ స్పీకర్స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇరాన్ యుద్ధం పై చర్చించాలనడం ఏమిటని ప్రశ్నిస్తున్న అధికారపక్షంవిపక్ష పార్టీలు అయోమయంలో ఉన్నాయన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజులోక్సభ మరోసారి వాయిదా..మధ్యాహ్నం మూడు గంటల వరకు లోక్సభ వాయిదా.స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి విపక్ష ఎంపీల ఆందోళన.గల్ఫ్ యుద్ధంపై చర్చించాలని విపక్షాల పట్టు.విపక్షాల ఆందోళన మధ్య లోక్సభ వాయిదా. పెట్రోల్, గ్యాస్ ధరలపై జైశంకర్ ప్రకటనపశ్చిమాసియాలో యుద్ధంపై రాజ్యసభలో కేంద్రం ప్రకటన.రాజ్యసభలో ప్రకటన చేస్తున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.రాజ్యసభలో జైశంకర్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు.ముందుగా విపక్షాలకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేతల డిమాండ్. విపక్షాల ఆందోళనల మధ్యే ప్రకటన చేస్తున్నా మంత్రి జైశంకర్.మంత్రి జైశంకర్ కామెంట్స్..మార్చి ఒకటో తేదీ సీసీఎస్ సమావేశం నిర్వహించాం.ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నాం.యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం.సంబంధిత శాఖలన్నింటికీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించాం.కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు.పెట్రోల్, గ్యాస్ ధరలపై దృష్టి సారించాం.ఇరాన్కు వెళ్లవద్దని జనవరిలోనే భారతీయులకు సూచించాం.ఇరాన్లోని భారతీయుల భద్రతకు ఎంబసీ అన్ని చర్యలు తీసుకుంటోంది.పరిస్థితులు చక్కబడగానే టెహ్రాన్లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం. గల్ఫ్లో చిక్కుకున్న వారిని భారత్ రప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నాం.ఈరోజు 50 విమానాలు నడుస్తున్నాయి.పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధంపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది.ఫిబ్రవరి 28 నాటి పరిణామాల తర్వాత యుద్ధం తీవ్రరూపం దాల్చింది.యుద్ధ ప్రాంతాల నుంచి 67వేల మందిని సురక్షితంగా తరలించాం.ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆమోదయోగ్యం కాదు.యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉంది.హింస దేనికీ పరిష్కారం కాదు.తక్షణమే చర్యల బాట పట్టాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చాం.శాంతి స్థాపన కోసం భారత్ తన వంతు దౌత్య ప్రయత్నాలు చేస్తోంది.అంతర్జాతీయ మానవతా చట్టాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలి. శాంతిని నెలకొల్పేందుకు అన్ని ప్రయత్నాలు జరగాలిఇంధన భద్రతకు, కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నాంఇరాన్ నౌకను డాకింగ్ చేసేందుకు సహకరించాంEAM Dr S Jaishankar makes a statement in the Rajya Sabha on the situation in West Asia, amid sloganeering by Opposition MPsEAM says," Our government had issued a statement on 20th February expressing deep concerns and urging all sides to exercise restraint. We continue to… pic.twitter.com/whk4pOE259— ANI (@ANI) March 9, 2026లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.కాసేపట్లో పశ్చిమాసియా యుద్ధంపై విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన.పార్లమెంట్ ఆవరణలో సస్పెండ అయిన ఎంపీల ఆందోళనలు.పార్లమెంట్లో ఇండియా బ్లాక్ ఎంపీల సమావేశం. After making obituary references, the Lok Sabha adjourned to meet again at 12 Noon today. pic.twitter.com/7Twxxz1HUP— ANI (@ANI) March 9, 2026 👉పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంఅందుకే స్పీకర్పై అవిశ్వాసం పెట్టాం: చామల కిరణ్కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కామెంట్స్..ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారుబీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలకు లోక్సభ స్పీకర్ ప్రాధాన్యత ఇస్తున్నారుస్పీకర్ అనే వ్యక్తి లోక్సభలో ఉన్న అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి18వ లోక్ సభలో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదురాహుల్ గాంధీ మాట్లాడే ప్రతీసారి అసౌకర్యం కల్పిస్తున్నారు.నిషికాంత్ దూబే, అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్లకు అవసరం లేకపోయినా మైక్ ఇస్తున్నారుదేశంలో ఉన్న ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా లోక్ సభను నడుపుతున్నారుమహిళా ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడి చేయాలని చూశారని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారుఅందుకే లోక్సభ స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాముఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై లోక్ సభలో చర్చ చేయాలినరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారుఅమెరికా నుంచి దిగుమతులపై సుంకాలను వైట్ హౌస్ నుంచి ట్రంప్ డిసైడ్ చేశారుపార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అంశాలను ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారుమోదీ ఎందుకు ట్రంప్తో కాంప్రమైజ్ అయ్యారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలిలోక్ సభలో ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేసిన అంశంపై చర్చ జరగాలిలోక్సభ స్పీకర్పై అవిశ్వాసం సందర్భంగా ఎనిమిది మంది ఎంపీలకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలిప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము ధర్నా చేస్తాముప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలిలోక్ సభలో ఉన్న 543 మంది ఎంపీలకు అవిశ్వాసంపై ఓటు వేసే అవకాశం ఉంటుందిగ్యాస్, క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెంచారు.దీనిపై లోక్సభలో చర్చ చేపట్టాలి. పార్లమెంట్కు చేరుకున్న ప్రియాంక, రాహుల్పశ్చిమ ఆసియాలో పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు.విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఏం చేబుతారో వినాలని ఉందన్న ప్రియాంక. #WATCH | Delhi: On EAM Dr S Jaishankar to make a statement in Parliament today on the situation in West Asia, Congress MP Priyanka Gandhi Vadra says, "I am keen to hear what he will say." pic.twitter.com/gc26kjlKuJ— ANI (@ANI) March 9, 2026బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చనేటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలుఏప్రిల్ 2 వరకు కొనసాగనున్న సమావేశాలునేడు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చించనున్న లోక్సభతీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ఎంపీలు మహమ్మద్ జావేద్, కే సురేష్, మల్లు రవిఅవిశ్వాసం తీర్మానంపై చర్చలో స్పీకర్ స్థానంలో కాకుండా సభ్యుల మధ్యలో కూర్చొనున్న ఓం బిర్లా తొలి విడత సమావేశాల్లో లోక్సభ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ సహా విపక్షాలుస్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నోటీసుపై సంతకం పెట్టిన కాంగ్రెస్, సమాజ్వాద్ పార్టీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలుతమ ఎంపీలకు విప్ జారీచేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలుతప్పనిసరిగా లోక్సభకు హాజరుకావాలని ఆదేశం#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, Congress President Mallikarjun Kharge, arrive at the ParliamentThe second phase of the budget session of Parliament will commence today and will continue till the 2nd of April pic.twitter.com/GFIWWyVSMG— ANI (@ANI) March 9, 2026
ఎన్ఆర్ఐ
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత
అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..
అమెరికాలో ఉండే మన భారతీయులు ఏ రేంజ్లో ప్యాకేజ్లు అందుకుంటారో తెలిసిందే. అంతలా వేతనాలు వస్తాయనే..విదేశాలంటే మోజు మనవాళ్లకు. కానీ ఆ వ్యక్తి కోట్లలో వచ్చే వేతనం కాదనుకుని మరి భారత్కి వచ్చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాదు దానికి గల కారణాన్ని వివరిస్తూ..అది సరైనదో కాదో సలహా ఇవ్వండి అంటూ రెడ్డిట్లో పోస్ట్ పెట్టాడు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అతడి ఉద్దేశానికి ఫిదా అవ్వతూ ప్రశంసలజల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.ఇంతకీ కారణం ఏంటేంటే..అమెరికాలో 12 ఏళ్లకు పైగా గడిపిన తర్వాత తిరిగి కుటుంబంతో సహా భారత వచ్చేయాలనకుంటున్నట్లు ఓ ఎన్నారై పోస్ట్లో తెలిపాడు. ఈ జూన్ కల్లా తాము ఐదుగురు ముంబైకి వచ్చేయాలని నిర్ణయించుకున్నామని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు. తన వయసు 36 ఏళ్లు అని, 2018లో నవంబర్ నుంచి హెచ్1బీ విసాతో అమెరికాలో నివశిస్తున్నట్లు తెలిపాడు. పైగా తన వార్షిక ఆదాయం రూ. 2.9 కోట్లు అని, నెట్వర్త్ వచ్చేసి రుణ రహిత ఇల్లుతో కలిపి దగ్గర దగ్గర రూ. 9 కోట్లు అని వెల్లడించారు. భారత్ తన ఉద్యోగ ఆఫర్ ఏడాదికి రూ. 1.5 కోట్ల ప్యాకేజ్ అని కూడా వివరించాడు. అయితే తన తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉన్నారని, కుటుబానికి దగ్గరగా ఉండటమే మేలని ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అందులోనూ తన పిల్లలు తాతయ్య నానమ్మల, దగ్గర బంధువులతో పెరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు పోస్ట్లో. అక్కడ అమెరికాలో ఇంటి అద్దె చెల్లించకుండా లగ్జరియస్గా గడిపినా తన కుటుంబానికి ఈ నిర్ణయం కారణంగా.. చాలా పెద్ద మార్పుని స్వాగతించాల్సి ఉంటుందని అంటున్నాడు. ఎందుకంటే ముంబైలో అద్దె చెల్లిస్తూ..ఏడాదికి రూ. 1.5 కోట్లతో బతకడం సాధ్యమేనా? అని సందేహం వ్యక్తం చేశాడు. అలాగే యూఎస్లో పుట్టి..అక్కడే పెరిగిన పిల్లలు ఇక్కడ జీవనశైలికి, ఎడ్యుకేషన్కి సులభంగా అలవాటుపడగలరా, అసలు తన నిర్ణయం సరైనదేనా..? ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని పోస్ట్ పెట్టాడు. అయితే నెటిజన్లు అది మంచి ప్యాకేజీ అని, ముంబైలో ధీమాగా బతకొచ్చు అని అన్నారు. పైగా ఇలా భారత్కి రావాలనుకుంటున్న మీ నిర్ణయానికి స్వాగతం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తల్లిదండ్రలు గురించి ఆలోచిస్తున్నందుకు మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: లే ఆఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే..?: మాజీ అమెజాన్ టెక్కీ)
13 ఏళ్ల టీనేజర్ అమెరికాలో మైనర్లపై వేధింపులు, దొంగతనాలు
అమెరికాలో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఒక భారతీయుడిని అరెస్టు చేశారు. ఓదెల యశస్వి కొత్తపల్లిగా గుర్తించబడిన నిందితుడు అక్రమ వలసదారు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రకటించింది. న్యూజెర్సీలో పిల్లలపై లైంగిక వేధింపులతోపాటు, దొంగతనానికి సంబంధించిన ఆరోపణలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించింది.సరైన పత్రాలు లేకుండా అమెరికాలోని ప్రవేశించిన నిందితుడు యశస్విని చైల్డ్ రేపిస్తూ అని పేర్కొంది. అతడిపై యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం తొలగింపు చర్యలు పెండింగ్లో ఉన్నాయని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఈసీఇ) ఎక్స్లో ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుమైనర్లపై లైంగిక నేరాలకుపాల్పడినట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, దొంగతనం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే నిందితుడిపై కేసు ఎప్పుడు, ఎక్కడ నమోదైంది, ఎప్పుడు అరెస్టు చేశారనే విషయాలపై స్పష్టతనివ్వలేదు.—SEXUAL ASSAULT OF A CHILD UNDER 13 —SHOPLIFTING —PUBLIC DISORDER Vodela Yashaswi Kottapalli, a criminal illegal alien from India, has pending charges for sexual assault and larceny in New Jersey. We’ll keep him in custody pending removal proceedings. pic.twitter.com/VM97e9KUD9— U.S. Immigration and Customs Enforcement (@ICEgov) February 16, 2026 ఇదీ చదవండి: పెళ్లయ్యి ఆరునెలలే.. వాలెంటైన్స్డే రోజే హత్య
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది కూడా శివాలయాల సందర్శన యాత్ర ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు నిర్వహించారు. సింగపూర్లోని జురాంగ్ ఈస్ట్ ,బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్రను నిర్వహించారు. సుమారు 230 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. భక్తుల శివనామస్మరణలతో ప్రముఖ దేవాలయాలు కిటకిటలాడాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష, ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవ, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల మరియు ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మొదలగు వారు ఉన్నారు.వీరితో పాటు యాత్రలో సహాయపడిన పెరుకు శివ రామ్ ప్రసాద్,సమ్మయ్య మొలుగూరి, లక్ష్మణ్ రాజు కల్వ, వేణు గోపాల్ ఐరేని, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు అందరికి కృతజ్ణతలు తెలియజేశారు. ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్ గారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి , చల్ల కృష్ణ మొదలగు వారు గత సంవత్సరం లాగే ఈ సారి కూడా భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
ఢీ కొట్టి.. 200 మీటర్లు ఈడ్చుకెళ్లి
హైదరాబాద్: మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై రవీందర్రెడ్డి కథనం ప్రకారం... షాద్నగర్కు చెందిన సర్ఫరాజ్, హుస్సేన్, షమీర్, మాజీద్లు రెండు బైక్లపై పల్లెచెరువు మీదుగా చార్మినార్కు షాపింగ్ నిమిత్తం వెళ్తున్నారు. అదే సమయంలో నగరానికి చెందిన కిషోన్, టోటన్లు పల్లెచెరువు మీదుగా కారులో ఇంటికి వెళ్తున్నారు. అతివేగంగా వచ్చిన ఆ కారు వారి బైక్లను బలంగా ఢీ కొట్టింది. నలుగురు యువకులు పక్కకు పడిపోయి, స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే కారు డ్రైవర్ కిషోర్ భయంతో కారును మరింత వేగంగా పోనివ్వడంతో దాని కింద భాగంలో బైక్ చిక్కుకుపోయింది. 200 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. కేసు దర్యాప్తులో ఉంది.
ఊపిరి తీసిన ఊయల
అన్నమయ్య జిల్లా: ఊయలలో నవ్వులు..క్షణాల్లో కన్నీళ్లుగా మారాయి. ఆనందంగా ఊయల ఊగుతున్న చిన్నారులను కాపాడే ప్రయత్నంలో విద్యుత్ షాక్ రూపంలో ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. అప్పటి వరకు జాతర సందడిలో మునిగి తేలిన ఆకుటుంబం క్షణాల్లో విషాదంలో మునిగిపోయింది. చూపరుల హృదయాలను కలచి వేసింది. కురబలకోట మండలం ముదివేడు గ్రామం రెడ్డివారిపల్లిలో ఈ విషాదకర సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ రూపంలో ఆ ఇంటిపై మృత్యువు మాటు వేసినా అదృష్టవశాత్తు ఇద్దరు బాలికలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇంటిలోని మిగిలిన వారికి ఇరుగుపొరుగు వారికి గుండె ఆగినంత పనైంది. ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడు, గ్రామస్థుల కథనం మేరకు...నిమ్మనపల్లి మండలం వలసపల్లికి చెందిన శివకుమార్ రెడ్డి ఆదివారం ముదివేడులో జరిగే దండు మారెమ్మ జాతరకు సమీపంలోని రెడ్డివారిపల్లికి చెందిన బంధువు జగదీశ్వర్ రెడ్డి ఇంటికి భార్యా పిల్లలు, అత్త పద్మావతమ్మ ఇంకో మిత్రుడు రాపూర్ వెంకటేష్తో కలసి వచ్చారు. వీరంతా రెడ్డివారిపల్లిలో ఇంటి వద్ద ఉండగా శివకుమార్ రెడ్డి కుమార్తెలు మధుప్రియ (11), లిఖిత (9) ఇంట్లో ఉన్న ఊయల ఊగసాగారు. అది రేకుల ఇళ్లు. ఉన్నట్టుండి మధుప్రియ ఊగుతున్న ఊయలకు విద్యుత్ షాక్ తగిలింది. బాలిక ఒక్కసారిగా అరిచింది. అక్కడే ఉన్న పద్మావతమ్మ (58) ఏమో జరిగిందన్న ఆత్రుతలో పాపను కాపాడాలి..అని ఊయల నుంచి కిందకు దింపబోయింది. ఊయల తగిలి విద్యుత్ షాక్తో ఆమె చనిపోయింది. అక్కడే ఉన్న వెంకటేష్ (38) కూడా చిన్నారికి ఏదో అయ్యిందని కాపాడాలని అతను కూడా ఊయలను పట్టుకున్నారు. అతను కూడా విద్యుత్షాక్కు గురై చనిపోయాడు. బాలిక మధు ప్రియ అప్పటికే ఊయల నుంచి కిందకు పడిపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. ఈమెకు దగ్గరగా ఉన్న సోదరి లిఖిత (9) కూడా అదృష్టవశాత్తు బయటపడింది. హుటాహుటిన గ్రామస్తులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అంతకు ముందు అంతా జాతర హడావుడిలో ఆనందంగా కాలం గడుపుతుండగా ఒక్కసారిగా గ్రామంలో విషాదం అలుముకుంది. మనవరాలిని కాపాడబోయి అవ్వ పద్మావతమ్మ, వారింటికి వచ్చిన వెంకటేష్ ఒకరి తర్వాత ఒకరు క్షణాల వ్యవధిలోనే చనిపోయారు. అంతా కోలుకోలేని షాక్కు గురయ్యారు. మృతి చెందిన ఎస్.పద్మావతమ్మది పుంగనూరు దగ్గర గోళ్లపల్లి కాగా రాపూర్ వెంకటే‹Ùది చిత్తూరు దగ్గర కొంగారెడ్డిపల్లి. ఇతను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేసేవారు. మధు ప్రియకు స్వల్ప గాయాలు కావడంతో ఆసపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాలను కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు. తోడుగా వచ్చి.. విద్యుత్ షాక్తో మృతి చెందిన రాపూర్ వెంకటేష్ బెంగళూరులో ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న శివకుమార్రెడ్డితో పరిచయం పెరగడంతో ఇద్దరు మిత్రులయ్యారు. ఇండ్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. దీంతో జాతర చూద్దామని ఇద్దరూ ముదివేడు దగ్గర రెడ్డివారిపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడ మధుప్రియ ఊగుతున్న ఊయలకు విద్యుత్ సరఫరా రావడం, ఆమెను కాపాడబోయి రాపూర్ వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందడం తీరని వేదనగా మారింది. స్నేహితుడి కోసం జతగా వచ్చి మృత్యువాత పడటం విచారకరం. ఇక మాకెవరు దిక్కని ఇతని కుటుంబీకుల బోరున విలపించారు. అల్లుడి ఇంటికి వచ్చి... పద్మావతమ్మకు ఇద్దరు కుమార్తెలు. ఒకరిని నిమ్మనపల్లి మండలం వలసపల్లికి చెందిన శివకుమార్ రెడ్డికి, మరో కుమార్తెను రెడ్డివారిపల్లిలోని జగదీశ్వర్ రెడ్డికి ఇచ్చారు. ఆమె రెడ్డివారిపల్లిలోని అల్లుడి ఇంటికి చాన్నాళ్ల తర్వాత జాతరకు వచ్చారు. చుట్టాలు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతుండగా మనవరాలు ఊగుతున్న ఊయలకు విద్యుత్ సరఫరా కావడంతో కాపాడబోయి విద్యుత్ షాక్ గురై పద్మావతమ్మ మృతి చెందడం తీరనిలోటుగా మారింది.కుంగిపోయిన శివకుమార్ రెడ్డి బెంగళూరులో ఉన్న శివకుమార్ రెడ్డి పిల్లలతో పాటు స్నేహితుడు, అత్త పద్మావతమ్మతో జాతరకు రావడం, తీరని విషాదం చోటుచేసుకోవడంతో కుంగిపోయాడు. ఆఊరిలో వీరి ఇంటి వద్దే చాందినీ బండి కూడా కట్టారు. సాయంత్రం జాతరకు వెళ్లాల్సి ఉంది. ఇంతలో ఊయల ఊగుతున్న మధుప్రియకు విద్యుత్షాక్ తగలడం, వారిని కాపాడబోయి పద్మావతమ్మ, రాపూర్ వెంకటేష్ అక్కడికక్కడే విగత జీవులయ్యారు. దీంతో ఒక వైపు బిడ్డలు తృటిలో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడటం, మరో వైపు అత్త, జతగా వచ్చిన మిత్రుడు మృత్యు ఒడికి చేరడం అతన్ని దహించి వేస్తోంది. ఇలా అవుతుందని ఊహించలేదని కంటతడిపెట్టారు.
మహిళల పట్ల టీడీపీ నాయకుడి అమానుషం
గుంటూరు జిల్లా: మహిళల ఫొటోలను ఐటీడీపీకి చెందిన నాయకుడు తీసి మార్ఫింగ్ చేస్తున్న సంఘటన వెలుగు చూసింది. ప్రశ్నించిన మహిళలపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఆగ్రహించిన మహిళలు ఆందోళనకు దిగారు. సేకరించిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన నల్లమామిడి అంజయ్య కళాశాల విద్యార్థునులు, మహిళల ఫొటోలు తీసి మార్ఫింగ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ విద్యార్థిని గుర్తించి శనివారం రాత్రి అంజయ్య ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ నర్రా శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని ‘ఏం చేస్తారు మీరు అంటూ దురుసుగా మాట్లాడి, కేసులు పెట్టినా, వెంటనే తీసుకువచ్చి ఇదే రోడ్డులో తిప్పుతానని’ బెదిరించాడు. సమాచారం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల మహిళలు తెనాలి– మంగళగిరి రహదారిపై ఆందోళనకు దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకోకుండా సుమారు మూడు గంటల పాటు పక్కన ఉన్న చర్చిలో ఉంచారు. గతంలో కూడా ఫొటోలు తీస్తున్న విషయం గమనించి కొందరు మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు. అయినా కూడా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని బాధితులు అంటున్నారు. కేవలం దళిత పిల్లల్ని ఫొటోలు తీయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతు పలికారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాలుగు గంటల అనంతరం పోలీసులు నిందితుడిని దుగ్గిరాల పోలీసుస్టేషన్కు తరలించారు.
ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలి దుర్మరణం
బత్తలపల్లి: బస్సు రాగానే ఎక్కేందుకు ప్రయాణికుల నడుమ తోపులాట జరగడంతో ఓ వృద్ధురాలు అదే బస్సు కింద పడి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆదివారం జరిగింది. కదిరికి చెందిన భాగ్యమ్మ(80) తన కోడలు మాధవితో కలిసి ఆదివారం ధర్మవరంలో సమీప బంధువుల ఇంట్లో శుభకార్యం చూసుకుని బత్తలపల్లికి చేరుకున్నారు. నాలుగు రోడ్ల కూడలిలో కదిరి వెళ్లే బస్సు కోసం వేచి ఉండగా బస్సు రావడంతో ఎక్కే సమయంలో ప్రయాణికుల రద్దీ కారణంగా తోపులాట జరిగింది. భాగ్యమ్మ ప్రమాదవశాత్తు బస్సు వెనుక టైరు కింద పడింది. బస్సు ముందుకు కదలగానే ఆమె తలపై నుండి వెనుక చక్రాలు వెళ్లాయి. తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కేకలు వేయడంతో బస్సు నిలిపివేశారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసు స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ బస్సులో మహిళ మృతిజంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ శ్వాస ఆడక మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన ముప్పిడి జ్యోతిరెడ్డి (50) ఆదివారం జంగారెడ్డిగూడెంకు వెళ్లేందుకు గోపాలపురంలో కొవ్వూరు ఆర్టీసీ డిపో బస్సు ఎక్కింది. బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉండగా జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్కు వచ్చేసరికి జ్యోతిరెడ్డి స్పృహ తప్పి పోయిఉంది. తోటి ప్రయాణికులు గమనించి 108కు సమాచారమివ్వగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్టు చెప్పారు. జ్యోతిరెడ్డి కుమారుడు తన తల్లి అనారోగ్యంతో ఉన్నారని, ఆమె మృతిపై అనుమానాలూ లేవని చెప్పి మృతదేహాన్ని తీసుకువెళ్లారు.
వీడియోలు
KSR LIVE Show: దేవుడికే భూములు అమ్మిన బడా వ్యాపారి బాబు
ఓ తండ్రి త్యాగం.. ఎన్నో అవమానాలు.. కట్ చేస్తే..
లావణ్య త్రిపాఠికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య
ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక యుద్ధం ముగింపుపై అనిశ్చితి
వస్తే దాడి చేస్తాం.. బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్
కుప్పకూలిన మిర్చి ధరలు రైతులకు భారీ నష్టాలు
చమురు కేంద్రాలే లక్ష్యంగా యుద్ధం తీవ్రతరం
TVK అధినేత, దళపతి విజయ్ కు సీబీఐ సమన్లు
అమెరికాలో తెలుగు జంట సరదా రీల్.. అమెరికా విడిచి వెళ్లండి..?
తల్లికి వందనం మోసం భారీ షాక్ ఇచ్చిన చంద్రబాబు

