రూ. 2.5 లక్షల అప్పు, 19 మంది పేర్లు : సివిల్స్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, ముంబై: పూణేలోని శనివార్ పేట్ ప్రాంతంలో విషాదంచోటు చేసుకుంది. కేవలం రూ. 2.5 లక్షల అప్పు తీర్చలేక సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న 28 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో తన అప్పులపై రాసిన రెండు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం మృతుడిని ధారాశివ్ జిల్లాలోని పరందా తహసీల్ పరిధిలోని ఖసాపురి గ్రామానికి చెందిన ప్రథమేష్ దేశ్ముఖ్గా గుర్తించారు. గత ఎనిమిది నెలలుగా పూణేలోని ఒక భవనంలో మూడవ అంతస్తులో ఉన్న వన్-BHK ఫ్లాట్లో ఇతర విద్యార్థులతో కలిసి ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షలతో సహా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు.బుధవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు దేశ్ముఖ్ రాసినట్లు భావిస్తున్న లేఖ సూచిస్తోందని విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ నవనాథ్ జగ్తాప్ తెలిపారు.MPSC ची तयारी करणाऱ्या परांडा तालुक्यातील (जि. धाराशिव) विद्यार्थी प्रथमेश देशमुख याने पुण्यात आत्महत्या केल्याची घटना अत्यंत दुःखद आहे.गेल्या काही काळात पेपरफुटीसह विविध गैरप्रकार होत असल्याने एक स्वप्न उराशी बाळगून अभ्यास करणाऱ्या विद्यार्थ्यांमध्ये डावलल्याची भावना निर्माण… pic.twitter.com/UWiw9vcyVQ— Riven (@R1v3n_0x) September 9, 2026ఇదీ చదవండి: కేవలం రూ.15 కోసం ప్రొఫెసర్పై కత్తితో దాడిసొంత ఖర్చుల కోసం దేశ్ముఖ్ రూ. 2.5 లక్షలు అప్పు తీసుకున్నానని, అందులో అతను ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాడో వారి పేర్లను కూడా అందులో పేర్కొన్నాడు. అతను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని, తల్లిదండ్రులను కూడా విచారించనున్నామని డీసీపీ (జోన్-1) రుషికేష్ రావలే చెప్పారు.మరోవైపు మార్చిలో జరిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్-బి) స్క్రీనింగ్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలతో సహా, నియామక పరీక్షలలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై పూణే , మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో MPSC అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్న తరుణంలోనే అతని బలవన్మరణం పలు ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది. An MPSC aspirant died by suicide. Exam delays, irregularities and years of uncertainty have made the pressure unbearable for many students.How many more students have to suffer before the government takes accountability?https://t.co/SbWkzoej5h— Cockroach Janta Party - CJP (@Cockroachisback) September 9, 2026ఇంకా ఎంతమంది బలికావాలి - సీజేపీమరోవైపు ఈ ఘటనపై సీజేపీ కూడా స్పందించింది. పరీక్షల ఆలస్యం, అక్రమాలు , సంవత్సరాల అనిశ్చితి ఒత్తిడి చాలా మంది విద్యార్థులను బలితీసుకుంటోంది. ఇంకా ఎంతమంది బలికావాలి? ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాన్ని కలుసుకున్న సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే వారిని ఓదార్చారు. ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసు
తమిళనాడులో సంచలనం.. స్టాలిన్కు పళనిస్వామి బంపరాఫర్!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో కొత్త సమీకరణాలపై ఉత్కంఠ పెరుగుతోంది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థి డీఎంకేతో చేతులు కలిపేందుకు తాము సిద్ధమంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకేకు వ్యతిరేకంగా తమ కూటమిలోకి ఇతర పార్టీలు వస్తే స్వాగతిస్తామని చెప్పిన ఆయన.. ‘డీఎంకే వస్తుందా?’ అంటూ ఆ పార్టీకి నేరుగా సవాల్ విసిరారు.టీవీకేకు వ్యతిరేకంగా కూటమి ఏర్పడుతోందా అని మీడియా ప్రశ్నించగా.. తాము కూడా టీవీకేకు వ్యతిరేకమేనని ఈపీఎస్ స్పష్టం చేశారు. తమ కూటమి ఇప్పటికే ఉన్న విధంగానే కొనసాగుతుందని, ఇతర పార్టీలు చేరాలనుకుంటే ఆహ్వానిస్తామని చెప్పారు. అదే సమయంలో ‘డీఎంకే వస్తుందా?’ అంటూ ప్రశ్నించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారితీసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో టీవీకే నేతృత్వంలోని కూటమి, డీఎంకే నేతృత్వంలోని ఫ్రంట్, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.మరోవైపు విజయ్ ప్రభుత్వంపై ఈపీఎస్ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, ధరల పెరుగుదల, శాంతిభద్రతలు, డ్రగ్స్ సమస్య, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సీఎం విజయ్ నేరుగా సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు.ఇప్పటికే అసెంబ్లీ వేదికగా విజయ్, డీఎంకే మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. మాజీ డీఎంకే ప్రభుత్వంపై విజయ్ అవినీతి ఆరోపణలు చేయడంతో డీఎంకే సభ్యులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈపీఎస్ డీఎంకేతో కలిసి టీవీకేకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమంటూ సంకేతాలు ఇవ్వడం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఇక, విజయ్ కూటమి బలం పెంచుకుంటున్న వేళ.. పాత ప్రత్యర్థులైన డీఎంకే-అన్నాడీఎంకే ఒకే వేదికపైకి వస్తాయా? ఈపీఎస్ వ్యాఖ్యలు నిజంగా పొత్తుకు సంకేతాలా? అన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది.ఇదీ చదవండి: తమ్ముడు విజయ్.. నువ్వుచెప్పింది కరెక్టే: స్టాలిన్
‘నమ్మినవాళ్లే మోసం చేశారు..’ ఏడ్చేసిన బొత్స
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలి పరిణామాలతో కలత చెందిన ఆయన.. కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను అంటూ కంటతడి పెట్టారు. అయితే తండ్రి బొత్స సత్యనారాయణ కంటితడి పెట్టడంపై ఆయన కుమార్తె బొత్స అనూష చలించిపోయారు. తండ్రిని ఓదార్చారు. గురువారం గరివిడిలో చీపురుపల్లిలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమయంలో బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాస్(చిన్న శ్రీను) ఇటీవలె పార్టీ మారడం.. పార్టీతో కలిసి నడిచిన రోజుల్ని, అనుబంధాన్ని కొందరు కార్యకర్తలు ప్రస్తావించారు. ఆ ప్రసంగాల సమయంలో.. నమ్మినవాళ్లు మోసం చేశారంటూ బొత్స ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆపై తనను తాను సముదాయించుకుని.. ‘‘వ్యక్తులు రావొచ్చు.. పోవచ్చు.. పార్టీ మాత్రం శాశ్వతం. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. పార్టీ పటిష్టత కోసం నిరంతరం పని చేయాలి. వైఎస్ జగన్ ఆశయాల కోసం కలిసి పని చేద్దాం. కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను’’ అని అన్నారాయన.ఇదీ చదవండి: నేనూ ఓ కాక్రోచ్గా మారొచ్చు: వైఎస్ జగన్
హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లేకుండానే జుట్టు పెరుగుదల.. డా.స్తుతి ప్రత్యేక చికిత్స
భారతదేశంలో ప్రముఖ డెర్మటాలజిస్ట్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హెయిర్ స్పెషలిస్ట్ డా. స్తుతి ఖరే శుక్లా జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్న వారికి ఆశాకిరణంగా నిలుస్తున్నారు. ఆమెను చాలామంది ప్రేమగా 'హెయిర్ గ్రోత్ క్వీన్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడే ప్రత్యేక చికిత్సా విధానాలతో ఆమె దేశ, విదేశాల్లో ఎంతోమందికి సేవలు అందిస్తున్నారు. ఆమె సెప్టెంబర్ 26, 27 తేదీల్లో హైదరాబాద్లో ఎలిమెంట్స్ ఆప్ ఏస్థటిక్స్ క్లినిక్, 2వ అంతస్తు, మెడ్9 హెల్త్ కేర్, ఇండస్ఇండ్ బ్యాంక్ పక్కన, ఫేస్ 1, కమలపురి కాలనీ, బంజారాహిల్స్, హైదరాబాద్, తెలంగాణ, 500073 చిరునామాలో అందుబాటులో ఉంటారు.Address: Elements of Aesthetics Clinic, 2nd Floor, Med9 Health Care, beside INDUSIND Bank, Phase 1, Kamalapuri Colony, Banjara Hills, Hyderabad, Telangana 500073హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్డా. స్తుతి రూపొందించిన ప్రత్యేకమైన.. హెయిర్ గ్రోత్ బూస్టర్ నాన్-సర్జికల్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యలకు పరిష్కారంగా నిలుస్తోంది. కేవలం 5 నిమిషాల్లో నిర్వహించే ఈ ప్రత్యేకమైన చికిత్స.. శస్త్రచికిత్సతో కలిగే నొప్పి, కోలుకునే సమయం వంటి ఇబ్బందులు లేకుండా జుట్టు పెరుగుదలకు తోడ్పడేలా రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ చికిత్స ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా ఇంటి నుంచే పొందే అవకాశం కూడా ఉంది.శస్త్రచికిత్స లేకుండా జుట్టు తిరిగి పెరిగేలా చేయడంలో ఆమె చూపిన అద్భుతమైన ఫలితాలకు గాను, డాక్టర్ స్తుతి ప్రఖ్యాత హెల్త్ కేర్ లీడర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆమె ఇటీవల సుష్మితా సేన్, సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలాలతో పాటు మిస్ యూనివర్స్ ఇండియా 2026కు జ్యూరీగా వ్యవహరించారు. ఆమె హెయిర్ కేర్ నిపుణురాలు కూడా.డెర్మటాలజీలో అంతర్జాతీయ అనుభవండా. స్తుతి ఖరే శుక్లా విద్యా, వైద్య రంగాల్లో అంతర్జాతీయ అనుభవాన్ని సంపాదించారు. ఆమె భారతదేశంలో డెర్మటాలజీలో పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో పాటు, ప్రపంచంలోని ప్రముఖ వైద్యులు, ప్రసిద్ధ ఆసుపత్రుల నుంచి నాలుగు అంతర్జాతీయ ఫెలోషిప్లు ఉన్నాయి. లాస్ ఏంజెల్స్లోని డా. జైన్ ఒబాగీ సెంటర్లో అడ్వాన్స్డ్ స్కిన్ హెల్త్ ట్రీట్మెంట్, నాష్విల్లేలోని డా. గోల్డ్ స్కిన్ కేర్ సెంటర్లో కాస్మెటిక్ డెర్మటాలజీ, సింగపూర్లోని నేషనల్ స్కిన్ సెంటర్లో డెర్మటోసర్జరీ, బ్యాంకాక్లోని సిరిరాజ్ హాస్పిటల్లో లేజర్స్కు సంబంధించిన ప్రత్యేక శిక్షణ పొందారు.హైదరాబాద్తోపాటు ప్రధాన నగరాల్లో..అంతర్జాతీయ అనుభవాన్ని సంపాదించిన తరువాత భారత్కు తిరిగి వచ్చిన డా. స్తుతి జుట్టు పెరుగుదల చికిత్స రంగంలో తనదైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. ఆమె నిర్వహిస్తున్న 'ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్థెటిక్స్' క్లినిక్లు ముంబై, హైదరాబాద్, నాగ్పూర్ మొదలైన నగరాల్లో ఉన్నాయి.డాక్టర్ స్తుతి ఖరే శుక్లా.. జుట్టు పెరుగుదల చికిత్స అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన జుట్టు రాలడం సమస్యలతో బాధపడుతున్న ఎందరో రోగుల జీవితాలను ఈమె మార్చివేశారు. దీంతో చికిత్సల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యం, ఆసియా తదితర ప్రాంతాల నుంచి కూడా చాలామంది సంప్రదిస్తుంటారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న రోగులకు ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా చికిత్సా మార్గదర్శకాలు అందించడం సాంకేతికత ద్వారా సాధ్యమవుతోంది.బట్టతలకు చెక్బట్టతలతో బాధపడుతూ, కొన్ని సందర్భాల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్కు అనుకూలంగా లేని రోగులు కూడా నాన్-సర్జికల్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ను ఆశ్రయిస్తున్నారు. వారసత్వంగా వచ్చే జుట్టు రాలడం, తీవ్రమైన బట్టతల, అరుదైన జన్యుపరమైన జుట్టు సమస్యలు, హార్మోన్ల కారణంగా వచ్చే హెయిర్ లాస్, పీసీఓడీకు సంబంధించిన జుట్టు రాలడం వంటి వివిధ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఆమె సేవలు అందిస్తున్నారు.ఒకప్పుడు బట్టతలతో.. కానీ ఇప్పుడుఅమెరికాలోని టెక్సాస్కు చెందిన హరీష్ రెడ్డి ఒకప్పుడు తీవ్రమైన బట్టతల సమస్యతో బాధపడ్డారు. జుట్టు పెరుగుదలకు గతంలో చాలా చికిత్సలు తీసుకుని నిరాశ చెందారు. కానీ స్తుతి అందించిన హెయిర్ ట్రీట్మెంట్ ద్వారా జుట్టు పెరుగుదలలో గణనీయమైన మార్పు కనిపించిందని ఆయన తన అనుభవాన్ని సంతోషంగా వెల్లడించారు.డాక్టర్ స్తుతి ఖరే శుక్లా చికిత్స గురించి మరింత తెలుసుకోవడానికి, @dr.stutikhareshukla ఇన్స్టాగ్రామ్ సందర్శించండి.అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి +91 626 196 7835 నంబర్కు కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ చేయవచ్చు.Instagram Page : https://instagram.com/dr.stutikhareshuklaWebsite : https://www.drstutikhareshukla.in/YouTube : https://youtube.com/@DrStutiKhareShuklaEmail : drstutikhareshukla@gmail.comDisclaimer : ఈ సమాచారాన్ని ఎలిమెంట్స్ ఆఫ్ ఏస్థటిక్స్ క్లినిక్స్ రూపొందించింది.
దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్
ఆ స్కూల్ నాదే.. ఆ వైపు వెళ్లకండి!
ధురంధర్ 3.0! పాకిస్తాన్ జట్టులో ఇండియన్ ఏజెంట్?
విత్తన గణపతిని పూజిద్దాం.. మొక్కలు పెంచేద్దాం..!
ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని కాదని యోగ టీచర్గా!
ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్.. కెమెరాలో అదిరిపోయే మార్పులు!
అంతా సౌజన్యే చేసింది!
బొజ్జ గణపయ్య.. బిలియనీర్ సీక్రెట్స్!
అఫ్గాన్కు దబిడిదిబిడే.. టీమిండియా పేస్ గుర్రం వచ్చేస్తున్నాడు!
Bangladesh: ‘మీజిల్స్’ కలకలం..1,000కి చేరిన మృతులు
ఇవ్వడానికి ఏమీ లేదంటే కుదరదు.. ఉన్నదివ్వాల్సిందే!!
నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..
ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు
ఆ మాత్రం దానికే కరువు ప్రాంతంగా ప్రకటించ లేను!
ప్రభుత్వాన్ని మూసెయ్యడం కాదయ్యా! ఓన్లీ కళాశాలలనే!
ఎంత వెతికినా నీటి జాడ దొరకదు కానీ.. ఇక పైకి రండి
ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైను మించిపోతున్న ఆ నగరం
యూకే వీసా స్కామ్.. ‘మాస్టర్ మైండ్ అతడే’ : యూట్యూబర్ నందన
25 ఎకరాల్లో కొత్త సచివాలయం.. రూ.1,200 కోట్లతో నిర్మాణం
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్: రెండు ఆప్షన్స్!
మోదీకి ఊహించని షాక్.. భారత్కు ముయిజ్జు వెన్నుపోటు?
పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..
ఏసీపీ దామోదర్పై సీపీకి వల్లభనేని వంశీ లాయర్ ఫిర్యాదు
నష్రా సంధుకు 6 వికెట్లు.. సెమీఫైనల్లో పాకిస్తాన్
ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు
సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్
‘నేనేం పారిపోలేదు.. న్యాయ బంధనాల్లో చిక్కుకున్నా’
తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది కరెక్టే: స్టాలిన్
IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్ పాండ్యాకు చోటు
దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్
ఆ స్కూల్ నాదే.. ఆ వైపు వెళ్లకండి!
ధురంధర్ 3.0! పాకిస్తాన్ జట్టులో ఇండియన్ ఏజెంట్?
విత్తన గణపతిని పూజిద్దాం.. మొక్కలు పెంచేద్దాం..!
ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని కాదని యోగ టీచర్గా!
ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్.. కెమెరాలో అదిరిపోయే మార్పులు!
అంతా సౌజన్యే చేసింది!
బొజ్జ గణపయ్య.. బిలియనీర్ సీక్రెట్స్!
అఫ్గాన్కు దబిడిదిబిడే.. టీమిండియా పేస్ గుర్రం వచ్చేస్తున్నాడు!
Bangladesh: ‘మీజిల్స్’ కలకలం..1,000కి చేరిన మృతులు
ఇవ్వడానికి ఏమీ లేదంటే కుదరదు.. ఉన్నదివ్వాల్సిందే!!
నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..
ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు
ఆ మాత్రం దానికే కరువు ప్రాంతంగా ప్రకటించ లేను!
ప్రభుత్వాన్ని మూసెయ్యడం కాదయ్యా! ఓన్లీ కళాశాలలనే!
ఎంత వెతికినా నీటి జాడ దొరకదు కానీ.. ఇక పైకి రండి
ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైను మించిపోతున్న ఆ నగరం
యూకే వీసా స్కామ్.. ‘మాస్టర్ మైండ్ అతడే’ : యూట్యూబర్ నందన
25 ఎకరాల్లో కొత్త సచివాలయం.. రూ.1,200 కోట్లతో నిర్మాణం
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్: రెండు ఆప్షన్స్!
మోదీకి ఊహించని షాక్.. భారత్కు ముయిజ్జు వెన్నుపోటు?
పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..
ఏసీపీ దామోదర్పై సీపీకి వల్లభనేని వంశీ లాయర్ ఫిర్యాదు
నష్రా సంధుకు 6 వికెట్లు.. సెమీఫైనల్లో పాకిస్తాన్
ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు
సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్
‘నేనేం పారిపోలేదు.. న్యాయ బంధనాల్లో చిక్కుకున్నా’
తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది కరెక్టే: స్టాలిన్
IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్ పాండ్యాకు చోటు
ఫొటోలు
‘కాగితం పడవలు’ సినిమా టీజర్ విడుదల (ఫొటోలు)
అప్పటి కాలేజ్ లుక్.. ఇప్పటి స్టార్ హీరోయిన్స్! (ఫోటోలు)
కాఫీ కప్తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్! (ఫోటోలు)
సింపుల్ లుక్లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు
స్టార్ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్
ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్సిరీస్ (ఫొటోలు)
‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్ జగన్ (ఫొటోలు)
భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్లో అదిరిపోయే.. (ఫొటోలు)
సింపుల్ లుక్లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)
సినిమా
TVK నినాదాలతో దద్దరిల్లిన ‘సిగ్మా’ ఈవెంట్.. సీఎం విజయ్ తనయుడి రియాక్షన్
తమిళ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుక తమిళనాడులోని సేలంలో ఘనంగా జరిగింది. తెలుగు నటుడు సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈవెంట్లో జేసన్ సంజయ్ ప్రసంగిస్తుండగా అభిమానులు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) నినాదాలతో హోరెత్తించారు. 'మా కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు' అని సంజయ్ అనగానే అభిమానుల కేరింతలు మరింత పెరిగాయి. దీంతో కాసేపు ప్రసంగాన్ని ఆపిన సంజయ్ చిరునవ్వుతో థంబ్స్ అప్ చూపిస్తూ స్పందించారు.కొంతకాలం క్రితం సీఎం విజయ్, సంజయ్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ పలు రూమర్లు వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వేడుకలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. సంజయ్ తన తండ్రి విజయ్ నటించిన ‘తిరుమలై’ తాను థియేటర్లో చూసిన తొలి సినిమా అని గుర్తుచేసుకున్నారు. అప్పుడు తనకు 3 ఏళ్ళు అని చెప్తూ నవ్వుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. తాను దర్శకుడిగా మారుతున్న విషయం మొదటగా తన తల్లికి ఫోన్ చేసినట్లు తెలిపారు. ఈ చిత్ర హీరో సందీప్ కిషన్ సైతం విజయ్ను తమ సినిమాకు స్ఫూర్తిగా పేర్కొన్నారు. దానికి సంజయ్ కూడా చిరునవ్వుతో మద్దతు తెలిపారు. దీంతో తండ్రి, కొడుకుల మధ్య విబేధాలపై వస్తున్న ప్రచారానికి ఈ వేడుకలోని సంజయ్ స్పందన కొంత స్పష్టత ఇచ్చినట్టయింది.ఇక ‘సిగ్మా’ హీస్ట్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంపత్ రాజ్, శివ్ పండిట్, యోగ్ జేపీ, షీలా రాజ్కుమార్, రాజు సుందరం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
డాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. రఘు మాస్టర్, సుమలతతో చర్చలు
లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై కీలక సమావేశం జరిగింది. జాయింట్ కమిషనర్ శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్, సుమలత దేవితో పాటు ఇరువర్గాలతో చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు జాయింట్ కమిషనర్ ఎదుట ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తమకు అన్యాయం జరిగిందని..సుమలత అధ్యక్షురాలిగా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా ఆమె కార్యవర్గంలోని కొంతమంది రాజీనామా చేశారని జాయింట్ కమిషనర్ తెలిపారు. ఖాళీ అయిన స్థానాలకు సుమలత ఉప ఎన్నికలు నిర్వహించడంతో.. ఇప్పటికే ఎన్నికైన తమకు అన్యాయం జరిగిందని కొందరు ఆరోపించినట్లు చెప్పారు. తమవైపే మెజారిటీ సభ్యులు ఉన్నారని రఘు మాస్టర్ పేర్కొన్నారు.ఫెడరేషన్ కీలక పాత్ర పోషిస్తుందని..ఈ వివాదాన్ని 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ సమక్షంలో పరిష్కరించుకోవాలని జాయింట్ కమిషనర్ సూచించారు. వివాదం కొనసాగితే యూనియన్ రద్దయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలని డాన్సర్లు కోరుతున్నారని రఘు మాస్టర్ తెలిపారు. సినిమా పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ను ముందుకు తీసుకెళ్లడంలో ఫెడరేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
సినిమాలో బోల్డ్ సీన్స్.. హీరోయిన్కు భరోసా
'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండతో వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకుడు. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ను మంగళవారం హైదరాబాద్లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదీ చదవండి: బిగ్బాస్లో ఛాన్స్మిస్.. రాజకుమారి పరిస్థితి ఇంత దారుణమా?అయితే ఈ ఈవెంట్లో డైరెక్టర్ ఆదిత్య హీసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ ఈ మూవీలో కొన్ని బోల్డ్ సీన్స్లో నటించేందుకు హీరోయిన్ వైష్ణవి నర్వస్గా ఫీల్ అయింది. ఈ విషయంలో ఆమెకు ఒకటే చెప్తున్నా.. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి నెగిటివిటీ వచ్చానా సపోర్ట్గా ఉంటా. బాధ్యత తీసుకుంటా’ అని తెలిపారు. కాగా ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. కాగా ఇటీవల బోల్ట్ సీన్స్పై విమర్శలు ఎక్కువ అవుతుండడంతో గతంలో బేబీ మూవీలోని ఆమె పాత్రపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది. Director #AdityaHaasan about the BOLD SCENES in #EPIC :“Vaishnavi is a SUPERSTAR.If there is any NEGATIVITY after the release regarding her BOLD SCENES, let it come to me first.I will take FULL RESPONSIBILITY for it.” pic.twitter.com/i2668WUK4n— Rangasthalam (@RangasthalamIN) September 8, 2026
‘సీక్రెట్ సోల్జర్’ నుంచి సాంగ్ రిలీజ్
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. ఈ సినిమా సెప్టెంబరు 18న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఓయ్ ఓయ్’ సాంగ్ని రిలీజ్ చేశారు మేకర్స్. కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ సాంగ్ ను కంపోజ్ చేసి అలపించిన తీరు ఆకట్టుకుంది. రెహమాన్ అందించిన సాహిత్యం పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
క్రీడలు
గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. హెడ్కోచ్ గౌతం గంభీర్ ప్రియ శిష్యుడిగా పేరొందిన యువ పేసర్ హర్షిత్ రాణా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన ఈ ఢిల్లీ బౌలర్.. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో పునరావాసం పొందుతున్నాడు.మరోసారి గాయంఈ క్రమంలో హర్షిత్ రాణా గాయం నుంచి కోలుకోవడంతో అఫ్గాన్తో సిరీస్కు టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫిట్నెస్ ఆధారంగా టీ20 సిరీస్ ఆడతాడని పేర్కొన్నారు. కానీ హర్షిత్ రాణా మరోసారి గాయపడ్డాడు. మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకునే క్రమంలో సోమవారం బౌలింగ్ చేస్తున్న సందర్భంగా హర్షిత్కు మరోసారి తొడ కండరాలు పట్టేసినట్లు సమాచారం. దీంతో అఫ్గానిస్తాన్తో సిరీస్తో పాటు ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా దూరమయ్యాడు.హర్షిత్ స్థానంలో అతడేఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ధ్రువీకరించింది. హర్షిత్ రాణా స్థానంలో యశ్ ఠాకూర్ను అఫ్గాన్తో టీ20 సిరీస్తో పాటు.. ఆసియా క్రీడల జట్టుకు ఎంపిక చేసినట్లు గురువారం ప్రకటన విడుదల చేసింది.ఇరవై ఏడేళ్ల యశ్ ఠాకూర్ కుడిచేతి వాటం ఫాస్ట్ మీడియం పేసర్. విదర్భకు చెందిన ఈ యువ బౌలర్ ఇటీవలే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వే పర్యటన సందర్భంగా అరంగేట్రం చేసిన యశ్ ఠాకూర్,, ఇప్పటికి రెండు మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 50 మ్యాచ్లు ఆడిన యశ్ ఠాకూర్.. మొత్తంగా 81 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఐపీఎల్లో ఇప్పటికి 22 మ్యాచ్లు ఆడిన యశ్ ఠాకూర్ 27 వికెట్లు కూల్చాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్కు ఆడాడు యశ్. గోల్డెన్ ఛాన్స్ఇక పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇటీవలే భారత టీ20 జట్టు సారథిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యశ్ ఠాకూర్ అరంగేట్రం చేశాడు. తాజాగా హర్షిత్ రాణా దూరం కావడంతో అఫ్గాన్తో టీ20 సిరీస్తో పాటు.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టుకు ఆడే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.ఆసియా క్రీడలు-2026 టోర్నీకి భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.చదవండి: ‘జింబాబ్వేతో మ్యాచ్ పెట్టండి.. మా కింగ్ ఆడతాడు’
పాకిస్తాన్ను మట్టికరిపించి సెమీ ఫైనల్లో భారత్
మహిళల జూనియర్ ఆసియా కప్ టోర్నీలో భారత హాకీ జట్టు సంచలన విజయం సాధించింది. దాయాది పాకిస్తాన్ను ఏకంగా 19-0 గోల్స్ తేడాతో మట్టికరిపించింది. తద్వారా ఆసియా కప్ టోర్నీ సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది. ఆది నుంచే భారత్ ఆధిపత్యంచైనాలోని మోకీ వేదికగా గురువారం నాటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్- పాక్ యువ జట్లు తలపడ్డాయి. ఆట మొదలైన ఏడో నిమిషంలోనే పూజా సాహూ గోల్ కొట్టడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత రోషిణి ఐంద్, తనుశ్రీ దినేశ్ కదూ, సుఖ్వీర్ కౌర్, సనికా చంద్రకాంత్ మనే కూడా గోల్స్ సాధించారు.దీంతో ఆది నుంచే భారత్ ఆధిపత్యం కొనసాగించింది. ఇక 23వ నిమిషంలో మనే తన రెండో గోల్ కొట్టగా.. తనూజ తొప్పూ, పూజా మాలిక్, పూర్ణిమా యాదవ్ కూడా గోల్స్ సాధించారు. ఫలితంగా ఆట తొలి అర్ధ భాగంలోనే భారత్ 10-0తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది.ఇక రెండో అర్ధ భాగంలోనూ భారత మహిళా జట్టు జోరు కొనసాగించింది. మాలిక్ హ్యాట్రిక్ గోల్స్తో దుమ్ములేపగా.. సుప్రియా రెండుసార్లు గోల్ కొట్టింది. క్రిష్ణా శర్మ, బినిమా ధన్, రోషిణి కూడా అద్భుత ఆట తీరు కనబరుస్తూ పాకిస్తాన్ను మరింత కష్టాల్లోకి నెట్టారు. ఏకపక్ష విజయంఆఖరి నిమిషంలో రోషిణి మరోసారి గోల్ కొట్టడంతో భారత్ పాక్పై 19-0 గోల్స్ తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. తద్వారా భారత మహిళా హాకీ జూనియర్ జట్టు ఆసియా కప్ సెమీ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. కాగా మహిళల జూనియర్ హాకీ ఆసియా కప్ 2023, 2024 ఎడిషన్లలో భారత జట్టు విజేతగా నిలిచింది. తాజా ఎడిషన్లోనూ చాంపియన్గా నిలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. కాగా తాజా సెమీ ఫైనల్లో భారత్... సౌత్ కొరియా- మలేషియా మధ్య మ్యాచ్ విజేతతో తలపడుతుంది. ఇక గ్రూప్ దశలో భారత్ ఇప్పటికే జపాన్, మలేషియా, సౌత్ కొరియాలను ఓడించి టాపర్గా నిలిచింది.పాకిస్తాన్తో మ్యాచ్లో గోల్స్ కొట్టిన భారత ప్లేయర్లుపూజా సాహూ (7వ నిమిషం), రోషిణి ఐంద్ (9, 60+ నిమిషం), తనుశ్రీ దినేశ్ కదూ (11వ నిమిషం), సుఖ్వీర్ కౌర్ (13వ నిమిషం), సనికా చంద్రకాంత్ మనే (13, 23వ నిమిషం), మధూ సిదార్ (16, 39వ నిమిషం), గీతా యాదవ్ 18వ (నిమిషం), తనూజ తొప్పూ (25వ నిమిషం), పూజా మాలిక్ (27, 49, 51వ నిమిషం), పూర్ణిమా యాదవ్ (33వ నిమిషం), సుప్రియ (40, 54వ నిమిషం), క్రిష్ణ శర్మ (48వ నిమిషం), బినిమా ధన్ (55వ నిమిషం).చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్!
పాక్ క్రికెటర్లకు ఘోర అవమానం.. శరణార్థులనుకొని
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ అండర్-19 క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. పోర్ట్స్మౌత్లోని ఓ హోటల్లో బస చేసిన పాక్ యువ ఆటగాళ్లను అక్రమ శరణార్థులుగా పొరబడిన నిరసనకారులు..వారుంటున్న హోటల్ను చుట్టుముట్టడం తీవ్ర కలకలం రేపింది.అసలేం జరిగిందంటే?పోర్ట్స్మౌత్ నగర సమీపంలోని 'మారియట్' హోటల్లో పాక్ జట్టు బస చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఆటగాళ్లు బస్సు దిగి హోటల్లోకి వెళ్లడాన్ని చూసిన కొందరు సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేశారు. వారంతా ఆశ్రయం కోసం వచ్చిన అక్రమ శరణార్థులని భావించిన దాదాపు 40 మందికి పైగా నిరసనకారులు వెంటనే హోటల్ ముట్టడికి దిగారు.తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు, స్థానిక ‘రిఫార్మ్ యూకే’ పార్టీ కౌన్సిలర్ నిరసనకారులకు నచ్చజెప్పారు. అక్కడ ఉన్నది శరణార్థులు కాదని, పాకిస్తాన్ అండర్-19 క్రికెటర్లని స్పష్టం చేశారు. నిజం తెలుసుకున్న నిరసనకారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా పాకిస్తాన్ సీనియర్ పురుషుల జట్టు కూడా ఇంగ్లండ్లోనే ఉండడం గమనార్హం. బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది.కాగా ఈ ఘటనపై ‘స్టాండ్ అప్ టు రేసిజం’ వ్యవస్థాపకుడు మైఖేల్ బ్రాడ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శరణార్థులపై ఉన్న ద్వేషం ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ అని మండిపడ్డారు. చదవండి: 'జింబాబ్వేతో మ్యాచ్ పెట్టండి.. మా కింగ్ ఫామ్లోకి వస్తాడు'
టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్రౌండర్లు వచ్చేస్తున్నారు?
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు డబుల్ గుడ్ న్యూస్ అందింది. స్టార్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో వీరిద్దరూ పాసైనట్లు వార్తలు వస్తున్నాయి.వీరిద్దరూ గురువారం (సెప్టెంబర్ 10) ఢిల్లీలో భారత జట్టుతో కలవనున్నట్లు క్రిక్బజ్ తమ కథనంలో పేర్కొంది. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన సుందర్ ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా తొడ కండరాల గాయం బారిన సుందర్.. ఈ కారణంగానే శ్రీలంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు.లంకతో తొలి టెస్టు సమయానికి అతడు కోలుకుంటాడని సెలక్టర్లు భావించినప్పటికి.. సీఓఈ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించకపోవడంతో భారత్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక నితీశ్ విషయానికి వస్తే.. అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు అతడు దూరమయ్యాడు. అనంతరం ఈ ఆంధ్ర ఆల్రౌండర్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో దాదాపు ఒకటిన్నర నెలలుగా పునరావాసం పొంది పూర్తి ఫిట్నెస్ను సాధించాడు.మరోవైపు యువ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా అఫ్గానిస్తాన్తో సిరీస్కు దూరం కానున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ పర్యటనలో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన హర్షిత్ రాణా కూడా హ్యామ్స్ట్రింగ్ గాయంతోనే బాధపడుతున్నాడు. సెలక్టర్లు అతడు కోలుకుంటాడని భావించి అఫ్గానిస్తాన్తో సిరీస్కు ఎంపిక చేశారు. కానీ అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకపోయినట్లు తెలుస్తోంది. ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్పై ఇంకా స్పష్టత రాలేదు. అఫ్గాన్-భారత్ మధ్య సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది.
న్యూస్ పాడ్కాస్ట్
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
కొండా సురేఖను తప్పించాల్సిందే.... కేసీ వేణుగోపాల్తో భేటీలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
బిజినెస్
పసిడి ధరలు తారుమారు.. ఒక్క గ్రాముకు ఎంత తేడా!
దేశంలో బంగారం ధరలు మళ్లీ కస్సుమన్నాయి. క్రితం రోజున భారీగా తగ్గిన పసిడి ధరలు నేడు అమాంతం ఎగిశాయి. దీంతో తగ్గుదల ఆశించిన పసిడి కొనుగోలుదారులకు ఈరోజు నిరాశే దక్కింది. ఇక వెండి ధరల్లో మాత్రం మిశ్రమ కదలికలు నమోదయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఈరోజు ఉదయం 09:55 సమయానికి నిఫ్టీ(Nifty) 7 పాయింట్లు పెరిగి 23,440 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 47 పాయింట్లు పుంజుకొని 74,812 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.72బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 101 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.84 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.48 శాతం తగ్గింది.నాస్డాక్ 0.64 శాతం నష్టపోయింది.Today Nifty position 10-09-2026(time: 09:55 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఆధార్ ఫేస్ అథెంటికేషన్కు కొత్త ఎస్డీకే ఆవిష్కరణ
బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, బీమా కంపెనీలు తమ మొబైల్ యాప్లలోనే ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ను నేరుగా అనుసంధానించుకునేలా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కొత్త ఆధార్ ఫేస్ అథెంటికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ (ఎస్డీకే)తో పాటు ప్రత్యేక శాండ్బాక్స్ను ఆవిష్కరించింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026లో ఈ ప్రకటన వెలువడింది.ఈ కొత్త ఎస్డీకే వల్ల యూజర్లు వేర్వేరు యాప్లకు మారాల్సిన అవసరం లేకుండా ఒకే బ్యాంకింగ్, బీమా లేదా బ్రోకింగ్ యాప్లోనే ఆధార్ ఫేస్ ధ్రువీకరణను పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా ఫేస్ఆర్డీ(FaceRD) యాప్ అవసరమయ్యేది. ఇది వినియోగదారుల అనుభవాన్ని క్లిష్టతరం చేసేది.యూఐడీఏఐ ఛైర్మన్ నీల్కంఠ్ మిశ్రా మాట్లాడుతూ.. కొత్త ఎస్డీకే ద్వారా భాగస్వామ్య బ్యాంకులు తమ సొంత సర్వర్లపైనే ప్రామాణీకరణ(అథెంటికేషన్)ను నిర్వహించుకోగలవని చెప్పారు. తద్వారా యూఐడీఏఐ కేంద్రాలపై భారం తగ్గడంతో పాటు భద్రత మెరుగవుతుందని తెలిపారు. ప్రతిరోజూ వందలాది సైబర్ దాడులు జరుగుతున్నా తగిన భద్రతా చర్యలు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 10 కోట్ల ఆధార్ ప్రామాణీకరణ లావాదేవీలు జరుగుతుండగా, భవిష్యత్తులో 25-30 కోట్లకు చేరుకునేలా మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నట్టు మిశ్రా చెప్పారు.కొత్త ఎస్డీకేలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత లైవ్నెస్ డిటెక్షన్, స్పూఫింగ్ నిరోధక సామర్థ్యాలు ఉన్నాయి. దీంతోపాటు ఆవిష్కరించిన శాండ్బాక్స్ ద్వారా బాహ్య బయోమెట్రిక్ హార్డ్వేర్ అవసరం లేకుండానే డెవలపర్లు యూజర్ ప్రొవిజనింగ్, ఫేస్ క్యాప్చర్, లైవ్నెస్ చెక్లు, ఎర్రర్ హ్యాండ్లింగ్ వంటి దశలను పరీక్షించవచ్చు.2021లో ప్రారంభమైన ఈ ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థ ఇప్పటివరకు 500 కోట్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేసింది. జీవన్ ప్రమాణ్, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి పథకాల్లో వినియోగిస్తున్నారు. అదనంగా, బీఎఫ్ఎస్ఐ రంగానికి మార్గదర్శకంగా ఈజ్ ఆఫ్ ఆన్బోర్డింగ్ ప్లేబుక్ను కూడా యూఐడీఏఐ విడుదల చేసింది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్పై వీసా మోసం ఆరోపణలు
కోకాపేట్లో ‘గోల్డెన్’ చాన్స్.. అ‘ధర’గొట్టిన భూములు
సాక్షి, సిటీబ్యూరో: కోకాపేట్ మరోసారి కేక పుట్టించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) బుధవారం కోకాపేట్ నియోపోలిస్, గోల్డెన్ మైల్ సైట్–1లోని స్థలాలకు ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించింది. ఈ బిడ్డింగ్లో గోల్డెన్ మైల్ సైట్–1లోని 0.70 ఎకరాల స్థలానికి భారీ స్పందన లభించింది. ఎకరాకు రూ.70 కోట్లుగా కనీస ధరను నిర్ణయించగా, బిడ్డింగ్లో ఎకరాకు రూ.115 కోట్ల లెక్కన రూ.81 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ స్థలం ట్రయాంగిల్లా ఉన్నప్పటికీ అంచనాలకు మించిన స్పందన లభించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నగరానికి పడమటి వైపున ఉన్న డిమాండ్ను ఇది మరోసారి చాటిచెప్పింది. గతంలో హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో ఎకరానికి కనీస ధర రూ.100 కోట్లు గా ప్రతిపాదించిగా అనూహ్యంగా రూ.151.25 కోట్లకు అమ్ముడైంది. ఈ సారి రూ.70 కోట్ల కనీస ధరపైన బిడ్డింగ్లో రూ.115 కోట్లకు అమ్ముడు కావడం గమనార్హం.నియోపోలిస్ మరోసారి... నియోపోలిస్ లేఅవుట్లోని ప్లాట్ నంబర్ 17లో ఉన్న 4.59 ఎకరాలకు కూడా బుధవారం బిడ్డింగ్ నిర్వహించారు. దీనికి ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. ఈ బిడ్ ధర ఎకరాకు రూ.120 కోట్లుగా నమోదైంది. ఒకే బిడ్ రావడం వల్ల మరోసారి వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఫ్యామిలీ
అమెరికాలో ఏఐ కాలేజీకి ఎన్నారై దంపతుల పేరు
అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన దంపతులు విద్యారంగానికి భారీ విరాళం అందించారు. టెక్సాస్లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (UNT)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అడ్వాన్స్డ్ అనలిటిక్స్కు ప్రత్యేక కాలేజీ ఏర్పాటుకు ఏకంగా 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.167 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ భారీ విరాళం అందించిన అనురాధ, వికాస్ సిన్హా దంపతుల పేరుతోనే కొత్త కాలేజీకి ‘అనురాధ అండ్ వికాస్ సిన్హా కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్’ అని పేరు పెట్టనున్నారు.AI, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో విద్య, పరిశోధనలకు ఈ కాలేజీ కేంద్రంగా పనిచేయనుంది. AI, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, లైబ్రరీ సైన్స్, లెర్నింగ్ టెక్నాలజీస్ వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి ఈ కాలేజీ ఉపయోగపడుతుందని వర్సిటీ అధ్యక్షుడు హారిసన్ కెల్లర్ తెలిపారు.ఈ విరాళంతో కాలేజీ నాయకత్వం, విద్యార్థుల స్కాలర్షిప్లు, ప్రొఫెసర్షిప్లు, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇంక్యుబేషన్, అధునాతన పరిశోధనలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు మద్దతుగా ఆరు శాశ్వత ఎండోమెంట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే *అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్*ను కూడా ఈ కాలేజీలో ఏర్పాటు చేస్తారు. ఇది వర్సిటీలోని వివిధ విభాగాల మధ్య AI, డేటా సైన్స్ పరిశోధనలకు సమన్వయం చేస్తూ పరిశ్రమలతో భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనుంది.చదువు కోసం అమెరికాకు.. ఇప్పుడు భారీ విరాళంవికాస్, అనురాధ ఇద్దరూ భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఉత్తరప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేసిన అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీలు పొందారు. వికాస్ సిన్హా నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీలోనూ చదివి, 2023లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచే పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన బ్రాడ్కామ్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు.సిన్హా దంపతులు ఇప్పటికే UNTకు పలు సందర్భాల్లో భారీగా అండగా నిలిచారు. 2024లో వారు అందించిన విరాళంతో అనురాధ అండ్ వికాస్ సిన్హా డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, అధ్యాపకులు, పరిశోధనలకు మద్దతుగా ఎండోమెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడాదికే మరో భారీ విరాళంతో సిన్హా ఇన్నోవేషన్ ల్యాబ్ ఫర్ డేటా సైన్స్ను ఏర్పాటు చేశారు.“మాకు ఈ విరాళం అంటే అవకాశాన్ని మరో తరానికి అందించడం. వలస వచ్చినవారు అమెరికన్ డ్రీమ్లో కేవలం భాగస్వాములు మాత్రమే కాదు.. దాన్ని నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. విద్య మా జీవితాల్లో ఎన్నో తలుపులు తెరిచింది. ఇప్పుడు ఆ తలుపులు మరికొందరికి తెరిచి ఉంచాలనుకుంటున్నాం” అని వికాస్ సిన్హా తెలిపారు.AI, డేటా ఆధారంగా భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న నేపథ్యంలో.. కొత్త తరం విద్యార్థులను అందుకు సిద్ధం చేయడం, పరిశోధనలను ప్రోత్సహించడం, పరిశ్రమలతో అనుసంధానం పెంచడం ఈ కొత్త కాలేజీ ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి.(చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!)
జీర్ణించుకోలేకపోయా అందుకే..!నికితా పోర్వాల్ భావోద్వేగభరిత లేఖ
ఇటీవల ముగిసిన మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన నికితా పోరాల్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరితమైన లేఖ రాశారు. కిరీటాన్ని అందుకోలేకపోయినా..ఆ విస్ వరల్డ్ తనకు అందించి అనుభవం, ఆ ప్రయాణంలో తనకు లభించిన ప్రేమ, నేర్చుకున్న పాఠాలను గురించి లేఖలో పంచుకుంది. తన మిస్వరల్డ్ జర్నీకి సంబంధించిన ఫోటోల తోపాటు ఈపోస్ట్ని కూడా జోడించి షేర్ చేసింది. ఆ లేఖలో నికితా ఇలా రాసుకొచ్చింది. "మిస్ వరల్డ్ ఫైనల్ తర్వాత కిరీటం లేకుండా ఇంటికి రావడం అత్యంత కష్టమైన విషయం, అయినా అక్కడ పొందిన ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. అక్కడ తనకు లభించిన ప్రేమ, మద్దతు..ఇలా ప్రతీదాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. మీరంతా నేను కిరీటాన్ని గెలుచుకోవాలని కొండంత ఆశతో ఎదురుచూశారు. అలా ఇంతకుమందెన్నడూ చూడని ఎన్నో కుటుంబాల ప్రేమను సంపాదించుకున్నాను. అందాల పోటీల ప్రపంచంలో అత్యంత విచిత్రమైన మరియు అందమైన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు మీకు మద్దతు ఇచ్చే అకౌంట్ల వెనుక ఉన్న ముఖాలు మనకు తెలియవు. తెల్లవారుజామున 2 గంటలకు ఆ ఎడిట్ ఎవరు చేస్తున్నారో, ఆ సుదీర్ఘ సందేశం ఎవరు రాస్తున్నారో, కామెంట్ సెక్షన్లో నాకోసం ఎవరు పోరాడుతున్నారో, అప్డేట్ కోసం పేజీని ఎవరు రిఫ్రెష్ చేస్తున్నారో కూడా తెలియదు... కానీ ఎలాగోలా వారి ప్రేమ మనకు తెలుస్తుంది అంటూ అభిమానులను ఉద్దేశించి రాసింది.". ఆ తర్వాత తన ఓటమి గురించి ఇలా పేర్కొంది. " ‘ఇండియా' అని పిలిచే అదృష్టం దక్కించుకున్నా. అసలు ఆ వారాల పాటు, నా పేరు దాదాపు కనుమరుగైపోయింది, మర్చిపోయా. ఎవరైనా 'ఇండియా!' అని పిలవగానే ఏదో తెలియని పులకింత, ఒక అటెన్షన్ వచ్చేసేవి. నిజానికి నేను కిరీటాన్ని దక్కించుకోవాలని అనుకున్నా..బలంగా కోరుకున్నా..అందుకోసం ఎంతో కష్టపడ్డా. కానీ ఓటమిని ఎదుర్కొన్నా..అయినప్పటికీ ఈ జర్నీలో ఎన్నో జ్ఞాపకాలు, స్నేహాలు, ప్రేమలు సంపాదించుకుని సరికొత్త నికితాగా ఇంటికి తిరిగి వచ్చా. కొన్ని విజయాలు వరించలేకపోయినా..హృదయంలో ఎన్నో జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతాయి. ప్రేమతో మీ నికితా అంటూ తన పోస్ట్ని ముగించింది నికితా పోర్వాల్. View this post on Instagram A post shared by Nikita Porwal (@nikitaporwal_) (చదవండి: అమ్మాయి నిజంగా బంగారం! ఆ డ్రెస్ అక్షరాల రూ. 4 కోట్లుపైనే..)
రియల్ టు రీల్
కల్పిత కథలు కాదు... నిజజీవిత కథలు వెండితెరపై ఆదరణ పొందుతున్న కాలం ఇది. ఈ వరుసలో ఇప్పుడు ‘దైరా’ చేరింది. ఈ కథకు మూలం... సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరి«ధిలో ఏడేళ్ల క్రితం చోటు చేసుకున్న ‘దిశ’పై హత్యాచారం, నిందితుల ఎన్ కౌంటర్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో ‘దైరా’ పేరుతో సినిమాగా తెరకెక్కింది. కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీసు అధికారులుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది...హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ టోల్ప్లాజా వద్ద 2019 నవంబర్ 27 రాత్రి... వెటర్నరీ వైద్యురాలు (26) స్కూటర్ను పార్క్ చేసి మరో చోటుకి వెళ్లారు. అది గమనించిన నలుగురు దుండగులు పథకం ప్రకారం ఆమె స్కూటర్ టైర్ పంక్చర్ చేశారు. తిరిగి వచ్చిన ఆమెకు సాయం చేస్తున్నట్లు నమ్మించి, సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. మృత దేహాన్ని లారీలో చటాన్ పల్లి సమీపంలోని అండర్పాస్ వద్దకు తీసుకెళ్లి తగులబెట్టారు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.24 గంటల్లో నిందితుల అరెస్ట్... మృతదేహం మర్నాడు (2019 నవంబర్ 28) వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నవంబర్ 29న నిందితులైన హమ్మద్ ఆరిఫ్ (లారీ డ్రైవర్), జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులులను (క్లీనర్) అరెస్టు చేశారు. ఈ నిందితులను షాద్నగర్ పోలీసుస్టేషన్ కు తీసుకొచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని, నిందితులను తమకు అప్పగించాలని, వెంటనే కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టాల్సి వచ్చింది.చటాన్ పల్లి ఎన్ కౌంటర్... తెలంగాణ ప్రభుత్వం దిశ కేసు విచారణకు 2019 డిసెంబర్ 4న ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. దిశ అదృశ్యంపై కేసు నమోదు, దర్యాప్తులో పోలీసుల స్పందనలో జాప్యం జరిగిందనే ఆరోపణలతో ముగ్గురు పోలీసు సిబ్బందిపై వేటు పడింది. డిసెంబర్ 6 తెల్లవారుజామున నలుగురు నిందితులను క్రైమ్ సీన్ రీ–కన్ స్ట్రక్షన్ కోసం చటాన్ పల్లి తీసుకువచ్చారు. అక్కడ జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురూ చనిపోయారు. నిందితులు తమ వద్ద ఉన్న ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని, అలా పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపామన్నది పోలీసుల కథనం.కమీషన్ నుంచి కోర్టుకు... నిందితుల్లో మైనర్ ఉన్నారని, నిజమైన ఎన్ కౌంటర్ కాదని వివాదం చెలరేగింది. దీంతో 2019 డిసెంబర్ 12న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలోని కమిషన్ లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా సోందూర్ బల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్ సభ్యులుగా ఉన్నారు. 2022లో కమిషన్ 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. కీలక అంశాలు‘దైరా’లో కరీనా డీసీపీ అజూనీ కోహ్లీగా, పృథ్వీరాజ్ డీసీపీ రమణ్ కుమార్గా నటించారు. ఓ కేసు విషయంలో వీరిద్దరి ఆలోచనలు, దర్యాప్తు విధానాలు విభేదిస్తాయి. అజూనీ కేసును లోతుగా దర్యాప్తు చేస్తుంది అజూనీ. రమణ్ చేసిన ఎన్ కౌంటర్లపై ప్రశ్నలు తలెత్తుతాయి. మైనర్ నిందితులపై చట్టం ఎలా వ్యవహరించాలి? తీవ్రమైన నేరాలకు పాల్పడిన మైనర్లకు కూడా అదే రక్షణ వర్తించాలా? ఈ కీలక అంశాలు ‘దైరా’లో ప్రస్తావనకు వస్తాయి.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, సాక్షి, హైదరాబాద్
పోస్ట్ చేశారంటే... మీ లొకేషన్ ట్రాక్ ఖాయం!
సోషల్ మీడియా అనేది మన జీవితాల్లో ముఖ్యమైన భాగం అయింది. ‘రీల్స్’ నుంచి విహారయాత్రలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకోవడం వరకు ఎన్నో చేస్తుంటాం. గమనించాల్సిన విషయమేమిటంటే... ఏఐ సాధనాలను ఉపయోగించి పోస్ట్ల ద్వారా మీ లొకేషన్ను గుర్తించవచ్చునని గ్లోబల్ కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ మెకఫీ స్టడీ తెలియజేస్తోంది...స్టడీలో భాగంగా...ఒక ఫొటోను జత చేసి, ఆ ప్రదేశాన్ని గుర్తించమని ప్రాంప్ట్ ఇచ్చారు. ఎలాంటి మెటాడేటా, ఇఎక్స్ఐఎఫ్ డేటా, ఫైల్ పేర్లను ఉపయోగించలేదు. చిత్రాలలోని సంకేతాలు, వాస్తుశిల్పం, వీధి గుర్తులు, దుకాణాలు, ఫుడ్స్టాల్స్... మొదలైన వివరాలతో ఏఐ సాధనాలు లొకేషన్ను గుర్తించాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, విలక్షణమైన ప్రదేశాలను ఏఐ సులభంగా గుర్తించింది. సాధారణ బీచ్లు, గ్రామీణ రహదారులు, హోటల్ గదులను గుర్తించడం మాత్రం ఏఐకి కష్టమైంది.మోసాలు జరుగుతాయా?ఇంతకుముందు బహిరంగంగా పోస్ట్ చేయని ఫొటోలతో సహా పర్సనల్ ట్రావెల్ ఫొటోలను చాట్ జీపీటీ, క్లాడ్, కోపైలట్లాంటి వాటిలో అప్లోడ్ చేసి...‘ఈ ఫొటోలు ఎక్కడ తీశారు?’ అని అడిగారు. ఏఐ గుర్తించిన వాటిలో న్యూయార్క్ రాష్ట్రంలోని హేస్టింగ్–ఆన్–హడ్సన్ అనే గ్రామం కూడా ఉన్నది. జీపీఎస్ డేటా, లొకేషన్ ట్యాగ్, క్యాప్షన్ లేకపోయినా సరే, ఆ ఫొటోలను ఎక్కడ తీశారనేది ఏఐ సాధనాలు గుర్తించగలవని మెకఫీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పదిలో తొమ్మిదిసార్లు ఏఐ సాధనాలు లొకేషన్ను సరిగ్గా ట్రాక్ చేశాయి. ఈ అధ్యయనంలో గూగుల్... జెమ్మ 227బీ, అలీబాబా 3వియల్ 3వోబీ అనే మోడల్స్ను ఉపయోగించారు. ఈ రెండు మోడల్స్ ఒపెన్–వెయిట్స్ రకానికి చెందినవి. ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా ఉచితంగా ఉపయోగించవచ్చు. ...ఇలా లొకేషన్లను ట్రాక్ చేయడం ద్వారా మోసాలు జరుగుతాయా? ‘అవును’ అని చెబుతోంది మెకఫీ స్టడీ.ఇలా జరగవచ్చు...జెనెరిక్ పిషింగ్ నుంచి పర్సనలైజ్ ఫ్రాడ్ వరకు ఏదైనా జరగవచ్చు. ఉదాహరణకు ఒక మోసగాడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్లాంటి ప్లాట్ఫామ్ల నుండి ఫొటోలను తీసుకొని వాటిని ఏఐ మోడల్స్లో ప్రాసెస్ చేసి లొకేషన్ ట్రాక్ చేసి, ఆ ప్రదేశాన్ని ప్రస్తావిస్తూ మెసేజ్లు పంపవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో అసాధారణ లావాదేవిలు జరుగుతున్నట్లు, మీరు ఉన్న ప్రాంతంలోనే ఎవరో ఒకరు లాగిన్ కావడానికి ప్రయత్నిస్తున్నట్లు హెచ్చరికలు రావచ్చు.‘మీరు షేర్ చేసిన ఫొటోలో ఏదైనా ప్రముఖ ప్రదేశం లేదా ల్యాండ్మార్క్ కనిపించకపోతే ఖచ్చితమైన లొకేషన్ను గుర్తించడంలో ఏఐ మోడల్స్ సమర్థంగా పనిచేయకపోవచ్చు’ అంటున్నారు నిపుణులు.
అంతర్జాతీయం
Philippines: ఫెర్రీలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి
పాలావాన్: ఫిలిప్పీన్స్లోని పాలావాన్ ప్రావిన్స్లో పర్యాటక ప్రాంతానికి సమీపంలో ఓ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 87 మంది ఆచూకీ తెలియడం లేదు. ప్రమాద సమయంలో ఫెర్రీలో మొత్తం 134 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు కోస్ట్గార్డ్ గురువారం వెల్లడించింది. గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ‘ఎంవీ జూన్ ఆస్టర్’ (M/V June Aster) ఫెర్రీలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. పాలావాన్ తీరానికి సుమారు 2.2 కిలోమీటర్ల (1.3 మైళ్ల) దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు కోస్ట్గార్డ్ తెలిపింది. ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురి మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చినట్లు పేర్కొంది.అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోను కోస్ట్గార్డ్ ఫేస్బుక్లో విడుదల చేసింది. అందులో ఫెర్రీ పూర్తిగా మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు కనిపించాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 42 మందిని రక్షించినట్లు కోస్ట్గార్డ్ కెప్టెన్ నోమీ కయాబ్యాబ్ స్థానిక రేడియోకు తెలిపారు. వీరిలో 38 మంది ప్రయాణికులు కాగా.. నలుగురు సిబ్బంది ఉన్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే 87 మంది ఆచూకీ తెలియడం లేదని ఆమె చెప్పారు. ఇది కూడా చదవండి: ‘కలల కశ్మీరం’లో థియేటర్లు ఎందుకు మూతపడ్డాయి?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా–ఇరాన్ యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందన్న ఉత్కంఠ కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్తో యుద్ధం ముగుస్తుందని ఆయన అంచనా వేశారు. ‘‘ఎన్నికల తర్వాత వెంటనే యుద్ధం ముగుస్తుంది.. ఇరాన్ ఇక ఎక్కువ కాలం తట్టుకోలేదు’’ అని ట్రంప్ అన్నారు.బుధవారం రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్కు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే అమెరికా విధిస్తున్న ఆర్థిక ఒత్తిడిని తట్టుకునే పరిస్థితిలో ఇరాన్ లేదని పేర్కొన్నారు. నవంబర్ ఎన్నికల వరకు ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించలేదన్న ధీమాను వ్యక్తం చేశారు.చర్చలకు అవకాశం ఉన్నా..ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు జరిగే అవకాశాన్ని ట్రంప్ పూర్తిగా కొట్టిపారేయలేదు. ‘‘చర్చలు జరగొచ్చు.. కానీ ప్రస్తుతం మేము దానిని పరిశీలించడం లేదు’’ అని స్పష్టం చేశారు. అంటే, యుద్ధం ముగింపు విషయంలో చర్చల కంటే అమెరికా ఒత్తిడికే ట్రంప్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.ఇప్పటికే అమెరికా–ఇరాన్ యుద్ధం ఏడో నెలలోకి ప్రవేశించింది. తక్షణమే యుద్ధం ముగిసే పరిస్థితులు కనిపించడం లేదనే సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.హర్ముజ్లో మళ్లీ ఉద్రిక్తతమరోవైపు హర్ముజ్ జలసంధి సమీపంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ముంచినట్లు సమాచారం వెలువడిన నేపథ్యంలో.. ఇరాన్ 10 నౌకలపై దాడి చేసినట్లు తెలిపింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయి. బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 100 డాలర్లను దాటింది.తగ్గిన ఆదరణఇరాన్ యుద్ధం కారణంగా ఇప్పటికే అమెరికాలో ట్రంప్ పట్ల ఉన్న ప్రజాదరణ విపరీతంగా పడిపోయింది. యుద్ధంతో పాటు పెరుగుతున్న జీవన వ్యయంపై ఓటర్లలో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాతే యుద్ధం ముగుస్తుందని ట్రంప్ చెప్పడం అమెరికా రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది. యుద్ధం ముగిసిన వెంటనే చమురు ధరలు కూడా తగ్గుతాయని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇరాన్తో తక్షణ చర్చలకు అమెరికా సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఉన్న అధ్యక్షుడి పాలనపై ప్రజల తీర్పుగా విశ్లేషకులు పరిగణించనున్నారు . ఇటు ఉక్రెయిన్ సంక్షోభంపైనా.. ఉక్రెయిన్ యుద్ధంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నాడని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అంగీకరిస్తే డీల్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న రష్యా పూర్తిస్థాయి దాడితో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టినా కాల్పులకు మాత్రం తెరపడలేదు. యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇరు దేశాల మధ్య బెలారస్లో చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇస్తాంబుల్లో ప్రత్యక్షంగా చర్చలు జరిగాయి. 2022 ఏప్రిల్ నాటికి ఆ చర్చలు నిలిచిపోయాయి. 2025లో మరోసారి శాంతి చర్చలకు ప్రయత్నాలు జరిగాయి. రష్యా–ఉక్రెయిన్ ప్రతినిధులు ఇస్తాంబుల్లో సమావేశమైనా కాల్పుల విరమణ, భూభాగాల అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ఏడాది కూడా అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరిగాయి. తాజాగా అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కో, కీవ్లలో పర్యటించి కొత్తగా చర్చలకు ఊపిరిపోసే ప్రయత్నం చేశారు. అయితే భూభాగాలపై రష్యా, ఉక్రెయిన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: ఇరాన్పై సంచలన ఆరోపణలు
‘యురేనియం’పై దర్యాప్తునకు ఇరాన్ సహకరించలేదు
వియన్నా: ఇరాన్లోని వివిధ అప్రకటిత ప్రదేశాలలో తనిఖీ అధికారులు గుర్తించిన యురేనియం ఆనవాళ్లపై దీర్ఘకాలంగా సాగుతున్న దర్యాప్తునకు ఇరాన్ సహకరించలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) బోర్డు బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నివేదించింది. ఇరాన్పై మండలికి నివేదించడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. వియన్నాలోని ఐఏఈఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇరాన్ అంశంపై ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. 35 మంది సభ్యులు కలిగిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో 23 దేశాలు ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. చైనా, రష్యా, నైజర్ దీనిని వ్యతిరేకించగా 8 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. ఒక దేశం ఓటు వేయలేదు. ఈ తీర్మానాన్ని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ ప్రవేశపెట్టాయి. యురేనియం ఆనవాళ్లకు సంబంధించిన విచారణకు ఇరాన్ సహకరించకపోవడం ద్వారా అణువ్యాప్తి నిరోధక బాధ్యతలను ఉల్లంఘించిందని ఐఏఈఏ బోర్డు నిర్ధారించింది. 2003 వరకు ఇరాన్ రహస్య అణు ఆయుధ కార్యక్రమాన్ని కలిగి ఉందనడానికి, అక్కడ లభించిన యురేనియం ఆనవాళ్లే సాక్ష్యమని పశి్చమ దేశాల ప్రతినిధులు చెబుతున్నారు. అణ్వాయుధాలు తయారు చేసే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ చెబుతోంది. శాంతియుత అవసరాల కోసమే యురేనియం నిల్వ చేస్తున్నట్లు వాదిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ తీవ్రమవుతున్న తరుణంలో ఇరాన్కు సంబంధించిన యురేనియం అంశాన్ని ఐఏఈఏ బోర్డు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నివేదించడం గమనార్హం.
సూర్యుడికి అద్దం పట్టాల్సిందేనా!
భూమికి ముప్పు తప్పేట్టు లేదు... భూతాపోన్నతికి పగ్గాలేసే లక్ష్యం గురి తప్పుతోంది! సగటు ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీ సెల్సియస్ వరకూ పెరగడం ఖాయమవుతోంది. మరి... తరుణోపాయం???? భూతాపోన్నతి ప్రభావాలను తట్టుకునేందుకు ప్రపంచం సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్కే పరిమితం చేయాలన్న లక్ష్యం నెరవేరే అవకాశాల్లేవు. ఫలితంగా ఈ శతాబ్దం అంతానికి భూమిపై అకాల వర్షాలు, వరదలు, విపరీతమైన వేడి కారణంగా మనిషి బతికే పరిస్థితులు ఉండవన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు నిజమవడం తథ్యమన్న అంచనాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకో రెండు నెలల్లో టర్కీలో వాతావరణ మార్పులపై ఐరాస సదస్సు ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. భూతాపోన్నతిని తగ్గించేందుకు కర్బన ఉద్గారాలను తగ్గించడం ఒక్కటే మేలైన మార్గం అని అనుకునేవారు. వాతావరణ మార్పులకు తగ్గట్టుగా మనం మారడం, భూతాపోన్నతికి అనుగుణంగా సర్దుకుపోవడాన్ని ఓడిపోవడంగా భావించేవారు. అయితే ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. వాతావరణ మార్పులను అడ్డుకోవడంలో ప్రపంచదేశాలన్నీ విఫలం కావడంతో ఇప్పుడు క్లైమేట్ అడాప్టేషన్ (వాతావరణానికి తగ్గట్టుగా మనం మారడం) అత్యవసరమైన విధానంగా మారిపోయింది. ఫలితంగా ఒకప్పుడు వివాదాస్పదమైన సౌర వికిరణ మార్పు పద్ధతికి ప్రాచుర్యం పెరుగుతోంది. సౌర వికిరణ మార్పు అంటే? సౌర వికిరణ మార్పు లేదా సోలార్ రేడియేషన్ మాడిఫికేషన్ (ఎస్ఆర్ఎం) అంటే సూర్యకాంతిలో కొంత భాగాన్ని మళ్లీ అంతరిక్షంలోకి పంపించడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే సూర్యుడికి అద్దం పట్టడం. అయితే ఇందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ ఏర్పాట్లు అవసరం. భూమిపై పడుతున్న సూర్యరశి్మలో కనీసం ఒక శాతాన్ని ఇలా వెనక్కు పంపించగలిగితే కర్బన ఉద్గారాల ద్వారా వాతావరణంలోకి చేరిన విషవాయువుల ప్రభావాన్ని తగ్గించవచ్చునని సగటు ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించవచ్చునని అంచనా. నేలపై లేదంటే అంతరిక్షంలో భారీసైజున్న అద్దాలు ఏర్పాటు చేసి సూర్యుడి నుంచి పడే కాంతి మళ్లీ అంతరిక్షంలోకి చేరేలా చేయాలని ఆలోచించారు. అలాగే అప్పుడప్పుడూ రసాయన కణాలు చల్లడం ద్వారా మేఘాలు మరింత సౌర రేడియోధార్మికతను వెనక్కు పంపించగలమని అంచనాలున్నాయి. అగి్నపర్వతాలు బద్ధలైనప్పుడు వెలువడే పొగ ఆకాశాన్ని కమ్మేసి చాలాకాలంపాటు సూర్యరశ్మి కిందపడకుండా చేస్తున్నట్లు అన్నమాట. ఇదీ వివాదం... ఎస్ఆర్ఎం వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది కానీ.. కర్బన ఉద్గారాలను తగ్గించదు. పైగా పర్యావరణ వ్యవస్థలపై దీని ప్రభావం ఏమిటన్నది స్పష్టంగా తెలియదు. ఎలాగూ ఇది ఉందన్న సాకుతో పరిశ్రమలు, ప్రభుత్వాలు వాతావరణంలోకి చేరుతున్న విష వాయువులను తగ్గించడంపై దృష్టి పెట్టవన్నది మరో ఆందోళన. ఎస్ఆర్ఎం పద్ధతిని ఒకసారి వాడి... ఉష్ణోగ్రతలు తగ్గాయి కాబట్టి నిలిపేద్దామనుకుంటే అది కూడా ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఈ ‘టెర్మినేషన్ షాక్’వల్ల భూమి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. 2023 నుంచి సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే కొత్త ఇంధన నిబంధనలు అమల్లోకి వచి్చన తర్వాత ఉష్ణోగ్రతలు వేగంగా పెరగడం ఈ టెర్మినేషన్ షాక్ను ధ్రువీకరిస్తున్నాయి. మరోవైపు ఎస్ఆర్ఎం పద్ధతిపై ఇప్పటివరకూ స్పష్టమైన విధానం, మార్గదర్శకాలు, నియంత్రణ వ్యవస్థలు లేవు. ఈ నేపథ్యంలో దీన్ని కర్బన ఉద్గారాల తగ్గింపునకు ప్రత్యామ్నాయంగా కాకుండా.. ఎమర్జెన్సీ ఏర్పాటుగా మాత్రమే చూడాలని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. 2024లో స్విట్జర్లాండ్ ఎస్ఆర్ఎంపై ఒక ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించగా పలు దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. జపాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు మద్దతివ్వగా, పసిఫిక్, ఆఫ్రికా దేశాలు వ్యతిరేకించాయి. అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్సహా కొందరు రిపబ్లికన్లు వాతావరణ మార్పులనే కొట్టిపారేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టర్కీలో జరగబోయే వాతావరణ మార్పుల సదస్సు ఎస్ఆర్ఎంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరమైన విషయంగా మారింది. –సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం
Gujarat: అర్థరాత్రి కూలిన భవనం.. శిథిలాల్లో కార్మికులు
గాంధీనగర్: గుజరాత్లోని గాంధీనగర్ కుడాసన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వాణిజ్య భవనంలో కొంత భాగం కూలిన ఘటనలో చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం రాత్రి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలాన్ని, గాంధీనగర్ సివిల్ ఆసుపత్రిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి.. తొలుత సుమారు 15 మంది కార్మికులు గాయపడినట్లు తెలిపారు. వారిలో ఇద్దరిని వైద్యులు పరీక్షించి, సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మిగిలిన గాయపడిన కార్మికులకు సివిల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం కుడాసన్లోని ‘బోస్కీ ది ఎంపైర్’ వాణిజ్య భవన నిర్మాణ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్లో కొంత భాగం ఒక్కసారిగా కూలిపోవడంతో కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఫైర్ బ్రిగేడ్, విపత్తు నిర్వహణ బృందాలు క్రేన్లు, ఆధునిక పరికరాల సాయంతో శిథిలాలను తొలగించి కార్మికులను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని అంబులెన్సుల్లో గాంధీనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. Gandhinagar, Gujarat: Rescue operations are underway at the site of a building collapse in the Kudasan area of Gandhinagar. Deputy Chief Minister Harsh Sanghavi visited the site to assess the situation and oversee the ongoing rescue efforts https://t.co/6Wz6fPJXLu— IANS (@ians_india) September 9, 2026సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంతో ప్రాణనష్టం తప్పిందని ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజీవ్ కుమార్, డీజీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సీనియర్ పోలీసు అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో 10 నుంచి 15 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని తొలుత సమాచారం అందింది. అత్యవసర బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలో నిర్దేశిత భద్రతా ప్రమాణాలు పాటించారా? సెంటరింగ్, స్లాబ్ పనుల్లో నాణ్యతా లోపాలు లేదా ఇతర సమస్యలు ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించనున్నారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.ఇది కూడా చదవండి: 1980ల ట్రెండ్ వెనుక ఏముంది? ఎందుకు వైరల్ అవుతోంది?
‘కాక్రోచ్గా మారిపోవాలేమో!’.. మాల్యా సంచలన వ్యాఖ్యలు
బ్యాంకు రుణాల ఎగవేత, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వ్యవహారం, మనీలాండరింగ్ ఆరోపణలతో ఏళ్లుగా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం బ్రిటన్లో ఉంటున్న ఆయన.. తనపై భారత ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందంటూ తాజాగా మరోసారి ఆరోపణలు చేశారు. తన ఆస్తులు, నిధుల నుంచి బ్యాంకులకు భారీ మొత్తంలో చెల్లింపులు జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్లో వరుస పోస్టులు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మాల్యా చేసిన ఓ వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. తనపై జరుగుతున్న పరిణామాలు, ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘‘నేను ఎదుర్కొంటున్న, ఇప్పటికీ ఎదుర్కొంటున్న అన్యాయాలన్నింటినీ చూస్తుంటే.. నేను కాక్రోచ్గా మారిపోవాలేమో అనిపిస్తోంది. బహుశా కాక్రోచ్ వైపు జీవితం మెరుగ్గా ఉండొచ్చు’’ అని ఆయన ఎక్స్లో రాసుకొచ్చారు. ఇదే సమయంలో ఇటీవల సోషల్ మీడియాలో చర్చకు వచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) పేరు ప్రస్తావనకు వచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత చేసిన బొద్దింకల వ్యాఖ్యల నేపథ్యంలో సెటైరిక్ క్యాంపెయిన్గా పుట్టుకొచ్చింది సీజేపీ, అభిజిత్ దీప్కే నేతృత్వంలో పుట్టిన ఈ పార్టీ.. ఆ తర్వాత జంతర్ మంతర్ నీట్ నిరసనలతో దేశం చూపును ఒక్కసారిగా తమ వైపు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో ‘కాక్రోచ్’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ మాల్యా చేసిన కామెంట్ సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.With all the injustices I have faced and continue to face, I wonder if I should become a cockroach. Maybe a better life on the cockroach side.— Vijay Mallya (@TheVijayMallya) September 9, 2026రూ.14 వేల కోట్లపై మాల్యా వాదనతనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ మాల్యా ఈడీ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. బాంబే హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్లో.. తన నుంచి రూ.14 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులు, నిధులను స్వాధీనం చేసుకుని, వాటిని తాను బకాయిపడిన బ్యాంకులకు చెల్లించినట్లు పేర్కొందని ఆయన అన్నారు. 2021లోనే ఈ మొత్తాన్ని బ్యాంకులకు అందించినట్లు తెలిపారు.‘‘నా మాటలను నమ్మకపోతే పర్వాలేదు. కోర్టులో ఈడీ ఏం చెప్పిందో చూడండి’’ అంటూ తన వాదనకు మద్దతుగా మాల్యా పేర్కొన్నారు. తనపై భారీ మొత్తంలో బకాయిలు ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఇప్పటికే తన ఆస్తులు, నిధుల నుంచి పెద్ద మొత్తంలో బ్యాంకులకు చెల్లింపులు జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు.కింగ్ఫిషర్ ఉద్యోగులకూ చెల్లింపులుకింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విషయాన్ని కూడా మాల్యా ప్రస్తావించారు. ఈడీ అటాచ్ చేసిన తన నిధుల నుంచి రూ.350 కోట్లకు పైగా విడుదల చేసి ఉద్యోగులకు చెల్లింపులు చేసినట్లు తెలిపారు. తన వద్ద నిధులు ఉన్నప్పటికీ.. అవి ఈడీ అటాచ్ చేయడంతో తాను నేరుగా చెల్లింపులు చేయలేకపోయానని వివరించారు.ఇదే సందర్భంగా తన నివాసం, పౌరసత్వం, భారత్కు తిరిగి రావడం వంటి అంశాలపై వస్తున్న విమర్శలకు మాల్యా వివరణ ఇచ్చారు. బ్రిటన్లో శాశ్వత నివాస హోదా ఉండటం, అక్కడి పౌరసత్వం కలిగి ఉండటం రెండూ ఒకటి కాదని చెప్పారు. అలాగే బ్యాంకులకు బకాయిలు చెల్లించడానికి తాను తప్పనిసరిగా భారత్లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.‘భగోడా’ వ్యాఖ్యలపైనా స్పందనభారత్కు తిరిగి రావడం లేదంటూ తనను ‘భగోడా’(పరారీలో ఉన్న వ్యక్తి) అని విమర్శిస్తున్న వారిపైనా మాల్యా ఇటీవల స్పందించారు. తాను 1992 నుంచే బ్రిటన్లో శాశ్వత నివాస హోదాలో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం బ్రిటన్ నుంచి బయటకు వెళ్లకుండా తనపై చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం తనపై తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. 2026 ఫిబ్రవరిలోనూ మాల్యా ఇదే విషయాన్ని బాంబే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బ్రిటన్ కోర్టుల ఆంక్షల కారణంగా ఇంగ్లండ్, వేల్స్ నుంచి బయటకు వెళ్లలేనని చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం లేదా దాన్ని కలిగి ఉండటం కూడా తనకు సాధ్యం కాదని కోర్టుకు వివరించారు.కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల ఎగవేత, మోసం, మనీలాండరింగ్, ఆర్థిక అవకతవకలకు సంబంధించి మాల్యా భారత్లో పలు కేసులు ఎదుర్కొంటున్నారు. 2015లో ఐడీబీఐ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ తీసుకున్న రుణాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత మాల్యాపై పలు కేసులు నమోదయ్యాయి. న్యాయపరమైన ఒత్తిడి పెరుగుతున్న సమయంలో 2016 మార్చిలో ఆయన భారత్ విడిచి బ్రిటన్ వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఆయనను భారత్కు తీసుకురావడం, బ్యాంకుల బకాయిలు వసూలు చేయడం వంటి అంశాలపై భారత్, బ్రిటన్లలో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది.అయితే తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను మాల్యా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ‘కాక్రోచ్’ వ్యాఖ్యతో మరోసారి తనపై జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు జరుగుతున్నదంతా అన్యాయమేనన్న భావనతోనే ఈ వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: ఆమె రీ ఎంట్రీకి ఇదే మాంచి ఛాన్స్!
1980ల ట్రెండ్ వెనుక ఏముంది? ఎందుకు వైరల్ అవుతోంది?
న్యూఢిల్లీ: ఇన్స్టాగ్రామ్, ‘ఎక్స్’ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం 1980ల నాటి ఫొటోల ట్రెండ్ వైరల్గా మారింది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సాధారణ సెల్ఫీలను.. పెద్ద హెయిర్స్టైల్, పాతకాలపు దుస్తులు, ఫిల్మ్ గ్రెయిన్తో కూడిన రెట్రో ఫొటోలుగా మార్చుకుంటున్నారు. దశాబ్దాల క్రితం తాము ఎలా కనిపించి ఉండేవారమో ఊహించుకుంటూ, రూపొందించిన ఈ చిత్రాలను పలువురు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.చూడటానికి ఇది సరదా సోషల్ మీడియా ఛాలెంజ్లా కనిపిస్తోంది. ఇప్పటి యువత నాటి సాంకేతికత, భౌతిక మాధ్యమాలు, రెట్రో రూపకల్పన వైపు మొగ్గుచూపుతున్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ ఇటీవల పేర్కొంది. పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో మరింత స్పష్టంగా, స్పృశించగలిగే అనుభూతిని కోరుకోవడం ఇందుకు కారణమని తెలిపింది. మనస్తత్వవేత్త క్లే రౌట్లెడ్జ్ యువత తాము చూడని కాలాలపైనా ఎందుకు ఆకర్షితులవుతారో అధ్యయనం చేస్తున్నారు. ‘బిగ్ థింక్’లో ఇటీవల ప్రచురితమైన కథనంలో ఆయన దీనిని ‘హిస్టారికల్ నాస్టాల్జియా’గా పేర్కొన్నారు. నాస్టాల్జియా మన జీవితానికి అర్థం, సామాజిక అనుబంధం, సృజనాత్మకత, ఆశావాదాన్ని పెంపొందించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయని అన్నారు. ఆయన బృందం నిర్వహించిన సర్వేల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది తాము పుట్టకముందు కాలంపై ఆసక్తి కలిగి ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు.అయితే 1980ల ట్రెండ్ నిజంగా ఆ కాలంలో జీవించాలనే కోరికను సూచించకపోవచ్చు. అప్పటి జీవనశైలి, ఫొటోలు, పాత సంగీతం, కుటుంబ ఆల్బమ్లు లేదా ఫోన్ లేకుండా కలిసి గడిపిన సమయం వంటి అనుభూతులనే కొందరు కోరుకుంటుండవచ్చు. ఈ ట్రెండ్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. స్మార్ట్ఫోన్లు, జనరేటివ్ ఏఐకి ముందున్న కాలాన్ని పునఃసృష్టించేందుకు నేటి అత్యాధునిక సాంకేతికతనే ఉపయోగిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ‘యాడ్ యువర్స్’ లాంటి ఫీచర్ల ద్వారా వినియోగదారులు తమ రెట్రో చిత్రాలను రూపొందించుకుని, ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇది కూడా చదవండి: రూ.14 కోట్లతో 33 ఏళ్లలో 233 దేశాలు చుట్టొచ్చాడు!
బెంగాల్ రాజకీయాల్లో కొత్త సస్పెన్స్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో దారుణ ఓటమి.. దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం.. టీఎంసీలో చీలిక.. ఇలా వరుస ఎదురుదెబ్బలతో మమతా బెనర్జీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని అంతా భావిస్తున్న వేళ.. ఆమెకు అనూహ్యంగా మరో అవకాశం తలుపుతట్టింది. అసెంబ్లీ ఉప ఎన్నికలు ఇప్పుడు బెంగాల్లో కొత్త సస్పెన్స్కు తెరతీశాయి. రెండు స్థానాల్లో ఏదైనా ఒకదాని నుంచి దీదీ బరిలోకి దిగి.. మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతారా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మమతా బెనర్జీ అసెంబ్లీలో ఉంటే బీజేపీ, ఇతర ప్రతిపక్షాలను నేరుగా ఎదుర్కోవడంతోపాటు ప్రజా సమస్యలను మరింత బలంగా ప్రస్తావించే అవకాశం ఉంటుందని టీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆమెను నందిగ్రామ్ లేదంటే రిజినగర్ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన పార్టీలో మొదలైనట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్రంలో బలపడటం, టీఎంసీలో చీలికలు–ఫిరాయింపులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మమత స్వయంగా అసెంబ్లీలోకి రావడం పార్టీకి రాజకీయంగా కీలకమని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే..2026 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి గెలిచిన సువేందు అధికారి, హుమాయున్ కబీర్ చెరో స్థానానికి రాజీనామా చేయడంతో నందిగ్రామ్, రిజినగర్ అసెంబ్లీ సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాల్లో నందిగ్రామ్ మమతకు కొంత అనుకూలమైన ఎంపికగా కనిపిస్తోంది. 2021 ఎన్నికల్లో ఇక్కడ సువేందు అధికారి చేతిలో మమత 1,956 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ సువేందు అధికారి టీఎంసీ అభ్యర్థిపై 9,665 ఓట్ల మెజారిటీ సాధించారు. అయినప్పటికీ మమత స్వయంగా బరిలోకి దిగితే పోటీ స్వరూపం మారే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ముర్షిదాబాద్ జిల్లాలోని రిజినగర్లో ముస్లిం ఓటర్లు సుమారు 65 శాతం ఉన్నారు. ఈ సామాజిక సమీకరణం మమతకు అనుకూలంగా మారొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో కాంగ్రెస్కు ఉన్న పాత రాజకీయ బలం దృష్ట్యా రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని టీఎంసీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు.ఈసీ షెడ్యూల్ ప్రకారం బుధవారం (సెప్టెంబర్ 9) ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్ 16 చివరి తేదీ కాగా.. సెప్టెంబర్ 17న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) జరుగుతుంది. సెప్టెంబర్ 19 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 6న నందిగ్రామ్, రిజినగర్ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.మరో సస్పెన్స్!ఇదిలా ఉండగా, ఉప ఎన్నికల్లో టీఎంసీకి అసలైన గుర్తు(గడ్డి కాడపై రెండు పూలు) దక్కుతుందా? అన్నది మరో కీలక ప్రశ్నగా మారింది. పార్టీ నుంచి విడిపోయిన రితబ్రత బెనర్జీ వర్గం తామే అసలైన టీఎంసీ అని ఇప్పటికే కోర్టుకెక్కింది. అటు ఎన్నికల సంఘంలోనూ అభ్యర్థన దాఖలు చేసుకుంది. అంతేకాదు ఆ రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థులు పోటీ చేస్తారని, పార్టీ గుర్తు తమకే వస్తుందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. అయితే మమతా బెనర్జీ ప్రజల్లోనే ఉన్నారని, ఆమె తరఫున అభ్యర్థి తప్పకుండా పోటీ చేస్తారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ కూడా రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. మమత రెండు చోట్ల పోటీ చేసినా మరోసారి ఓడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ నేత సజల్ ఘోష్ వ్యాఖ్యానించారు. దీంతో ఉప ఎన్నికలు కేవలం రెండు స్థానాల పోరుగా కాకుండా.. మమతా బెనర్జీ రాజకీయంగా మళ్లీ అసెంబ్లీలోకి వస్తారా? టీఎంసీపై ఆమె పట్టు ఎంతవరకు ఉంది? పార్టీ గుర్తు ఎవరికి దక్కుతుంది? అనే మూడు కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పే ఎన్నికలుగా మారే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: పేరుతోనే అసలు విషయం చెప్పేసిన విజయ్
ఎన్ఆర్ఐ
జర్మనీలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
బెర్లిన్: జర్మనీలోని మ్యూనిచ్, స్టుట్గార్ట్, బెర్లిన్ నగరాల్లో ఈ రోజు సోమవారం దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు తరలివచ్చి, ఆయన సేవలను కొనియాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా నేడు తామంతా ఉన్నత స్థాయిలో ఉండగలుగుతున్నామని ఆయన సేవలను స్మరించుకున్నారు.17వ వర్ధంతి సందర్భంగా మ్యూనిచ్ నగరంలో నిర్వహించిన “YSR Chess Tournament” విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం కృష్ణ తేజ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కోర్ కమిటీ సభ్యులు నాగార్జున రెడ్డి ఆవుల (జనరల్ సెక్రటరీ), గురు (కో-కన్వీనర్), విష్ణు వర్ధన్ రెడ్డి మార్తల (ఐటీ కోఆర్డినేటర్), Dr. మల్లికార్జున రెడ్డి బండి (మీడియా స్పోకెస్పర్సన్), మనోజ్ కామసాని (మీడియా స్పోకెస్పర్సన్), నవీన్ రెడ్డి కలమకూరి (సోషల్ మీడియా కోఆర్డినేటర్), సాయి సూర్య చౌదరి (ఎగ్జిక్యూటివ్ మెంబర్), మంజునాథ్ రెడ్డి చవ్వాబాలన్న (ఎగ్జిక్యూటివ్ మెంబర్), వినోద్ అమలదాసు (ఎగ్జిక్యూటివ్ మెంబర్), షాలిని అక్షింతల (ఎగ్జిక్యూటివ్ మెంబర్), ఉపేంద్ర జలది, ప్రదీప్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ బాధ్యతని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తెలిపారు.
వైఎస్సార్ వర్ధంతి: వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్నారై కమిటీ రక్తదానం
ఫీనిక్స్ (అరిజోనా): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్నారై కమిటీ, వైటలెంట్ సహకారంతో సెప్టెంబర్ 6న రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కమ్యూనిటీ సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజాసేవకు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడానికి డాక్టర్ వైఎస్సార్ చూపిన నిబద్ధతను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్, మాజీ ముఖ్యమంత్రి విద్యా సలహాదారు ఆలూరు సాంబశివ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన జీవితం, ప్రజాసేవ, ప్రజా సంక్షేమం కోసం చేసిన కృషిని ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన నిర్వహించారు.కమిటీ సభ్యులు డాక్టర్ వైఎస్సార్తో తమకున్న వ్యక్తిగత అనుభవాలను, ఆయనలోని నిరాడంబరత, ధైర్యం, ప్రజాకేంద్రిత పాలనా విధానాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలూరు సాంబశివ రెడ్డి డాక్టర్ వైఎస్సార్ను “ప్రజల నాయకుడు”గా అభివర్ణిస్తూ, సామాన్య ప్రజలతో ఆయనకు ఉన్న విడదీయరాని అనుబంధాన్ని గుర్తుచేశారు. డాక్టర్ వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆ ఆశయాలను కొనసాగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన ఫీనిక్స్ ఎన్నారై కమిటీని ఆయన అభినందించారు. రక్తదానం అనేది సులభమైనదైనా, అత్యంత విలువైన సేవా కార్యక్రమమని, ఒకరి రక్తదానం నేరుగా మరొకరి ప్రాణాలను కాపాడగలదని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని ధీరజ్ పోలా, వంశీ ఎరువరం, చెన్నా రెడ్డి మద్దూరి, రుక్మన్, శ్రీధర్ చెమిడితి, అంజి రెడ్డి,నాగేష్ పొర్ల, వేమ శేఖర్, విఘ్నేష్, కొండా రెడ్డి , శ్రీనివాస్ మామిడి, హేమ కుమార్, అజయ్ కాల్వ , కుడుముల సుధీర్, సుజన్, రాజేశ్వరరావు బండారు, రాజశేఖర్ అవుదూరి, హితేష్ తదితరులు నిర్వహించి, పాల్గొన్నారు. పలువురు వాలంటీర్లు, కమ్యూనిటీ సభ్యులు కూడా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వైటలెంట్, రక్తదాతలు, వాలంటీర్లు, నిర్వాహకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవ, మానవతా విలువలు, సమాజ సంక్షేమం పట్ల డాక్టర్ వైఎస్సార్ చూపిన నిబద్ధతను కొనసాగిస్తూ, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురాగల సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఫీనిక్స్ ఎన్నారై కమిటీ తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించింది.
జయ పీసపాటి గౌరవార్థం సింగపూర్లో ఆత్మీయ సమ్మేళనం
సింగపూర్: హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి సింగపూర్ పర్యటన సందర్భంగా, శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సింగపూర్లో ఘనంగా జరిగింది. సరిగమ గ్రాండ్ రెస్టారెంట్లో సుమారు 25 మంది తెలుగు ప్రముఖులు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.సుబ్బు వి. పాలకుర్తి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి జయ పీసపాటి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరైనారు. ఈ సందర్భంగా జయ పీసపాటి మాట్లాడుతూ, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆవిర్భావానికి ముందు జరిగిన పరిణామాలతో పాటు, గత 22 సంవత్సరాలుగా సమాఖ్య ద్వారా తెలుగువారికి అందిస్తున్న సేవలను వివరించారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.మహిళలు మీడియా సహా వివిధ రంగాల్లో మరింత చురుకైన పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని మరెందరికో స్ఫూర్తిగా నిలవగలరని జయ పీసపాటి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పించడం ద్వారా వారికి భాషపై అభిమానం పెంపొందించడంతో పాటు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారిగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఆదివారం కూడా ఇంతమంది తెలుగువారు ఒకచోట చేరి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సింగపూర్, హాంగ్ కాంగ్ తెలుగు సంస్థల మధ్య ఇప్పటికే ఉన్న సత్సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.సింగపూర్తో 2016 నుంచే ప్రత్యేక అనుబంధంహాంగ్ కాంగ్లో తెలుగు సమాఖ్యను నిర్వహిస్తున్న తనకు విదేశాల్లో జరిగిన తెలుగు కార్యక్రమాల్లో తొలిసారిగా పాల్గొనే అవకాశం 2016లో సింగపూర్లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సు ద్వారా లభించిందని జయ పీసపాటి గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా సింగపూర్లోని తెలుగువారి ఐక్యత, చురుకుదనం తనకు ఎంతో ప్రేరణనిచ్చాయని ఆమె నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.ఇటీవల మలేషియా తెలుగు సంఘం నిర్వహించిన 70వ వార్షికోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలకు ఒక మార్గదర్శకంగా, బెంచ్మార్క్గా నిలిచాయని ఆమె అభినందించారు. ముఖ్యంగా నేటి తరం పిల్లలు ఎంతో చక్కగా తెలుగు మాట్లాడటంతో పాటు పద్యాలు, గద్యాలను స్పష్టంగా చదివి వినిపించడం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.మలేషియా తెలుగు సమాజం చూపించిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు భాష మరింతగా అభివృద్ధి చెంది, భావితరాల్లో సజీవంగా కొనసాగాలని జయ పీసపాటి ఆకాంక్షించారు.తమకు ఆత్మీయ‘జయక్క’గా మారిన“జయ పీసపాటి ఈ సందర్భంగా రత్న కుమార్ మాట్లాడుతూ అభినందనలు తెలిపారు. హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న కార్యక్రమాలుఎన్నో సందర్భాల్లో స్ఫూర్తినిచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాము చామిరాజు, భాస్కర్ వూలపల్లితో పాటు సింగపూర్ తెలుగు ప్రముఖులు సుదర్శన్ పూల, కొనాలి కాళికృష్ణ, సత్య జాస్తి, యోగి బూరుగుపల్లి, రాఘవాచార్యులు తట్టా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని, విద్యాధరి, రేణుక, శ్రీలలిత, పద్మావతి, సునీత, మాధవి తదితరులు పాల్గొన్నారు.
మిస్సిసాగాలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
మిస్సిసాగా: కెనడాలోని మిస్సిసాగా నగరంలో శనివారం(సెప్టెంబర్ 5వ తేదీ) సాయంత్రం 6 గంటలకు వైఎస్సార్సీపీ కెనడా విభాగం ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజా సేవ, సంక్షేమ పథకాలు, నాయకత్వ పటిమ, ప్రజల పట్ల ఆయన చూపిన నిబద్ధతను నేతలు, కార్యకర్తలు ఘనంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమం వైఎస్సార్సీపీ కెనడా అడ్వైజర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో, వైఎస్సార్సీపీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు గారి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమ నిర్వాహకులు (వైఎస్సార్సీపీ కెనడా టీమ్):* సుబ్బారావు – వైఎస్సార్సీపీ కెనడా కో-కన్వీనర్* నూర్ గారు – వైఎస్సార్సీపీ కెనడా యూత్ వింగ్ కన్వీనర్ముఖ్య అతిథులు మరియు వక్తలుచల్లా మధుసూదన్ రెడ్డి గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ) – జూమ్ ద్వారా హాజరయ్యారుపాండుగాయల రత్నాకర్ గారు (మాజీ వైఎస్సార్సీపీ యూఎస్ఏ/ఎన్ఆర్ఐ కన్వీనర్, ఏపీ ప్రభుత్వ మాజీ నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి) – జూమ్ ద్వారా హాజరయ్యారు. డాక్టర్ ప్రదీప్ చింత గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - ఎన్ఆర్ఐ వ్యవహారాలు) – జూమ్ ద్వారా హాజరయ్యారు. కొండం వెంకట్ రెడ్డి గారు (కెనడా కమ్యూనిటీ నాయకులు) – ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దూరదృష్టి, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావాన్ని కొనియాడారు.ఎగ్జిక్యూషన్ టీమ్: కార్యక్రమ నిర్వహణ, వేదిక ఏర్పాట్లు, సమన్వయంలో కీలక పాత్ర పోషించిన సభ్యులు: అస్లాం, సుమంత్, యశ్వంత్ నిమ్మకాయల, గోపిరెడ్డి కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, కృష్ణ, ఆరిఫ్, డాక్టర్ నిరంజన్ చుక్కలూరు, సుబ్బారెడ్డి దుగంపూడి, శ్రీనివాస్ కొరపోరలు.అడ్వైజర్ కమిటీ: కార్యక్రమానికి విలువైన మార్గదర్శకత్వం అందించిన సలహాదారుల కమిటీ సభ్యులు:* కృష్ణారెడ్డి పసల* రాజగోపాల్ గుంటక* విశ్వనాథ్ రెడ్డి* విజయభాస్కర్ రెడ్డి* కృష్ణ ఆలంపాటి* డాక్టర్ శివ రెడ్డిఈ కార్యక్రమంలో మిస్సిసాగాతో పాటు పరిసర ప్రాంతాల నుండి వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించిన కోర్ కమిటీ సభ్యులందరికీ, ఎగ్జిక్యూషన్ టీమ్కు, అడ్వైజర్ కమిటీ సభ్యులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
కన్నబిడ్డనే అమ్మాలనుకుంది..
హైదరాబాద్: నవజాత శిశువును విక్రయించడానికి యత్నించిన మహిళపై కేసు నమోదు చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఎన్టీఆర్ నగర్కు చెందిన ముఖ్తార్ బేగ్ (62) చిన్న కుమార్తెకు సంతానం లేకపోవడంతో చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలనుకున్నారు. ఈ నెల 7న ఓ అపరిచిత మహిళ 8 రోజుల వయసున్న శిశువుతో వచ్చింది. రూ.లక్షకు పాపను అమ్ముతానంది. ఆమె ప్రవర్తనపై అనుమానంతో ముఖ్తార్ బేగ్ తిరస్కరించారు. 8న రాత్రి సదరు మహిళ మళ్లీ వచ్చి తన పెద్ద కుమార్తె పెళ్లికి డబ్బులు కావాలంటూ రూ.30 వేలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చింది. ఆమె ప్రవర్తనతో అనుమానించిన ముఖ్తార్ బేగ్.. వెంటనే ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించి, శిశువుతో సహా మహిళను పోలీసులకు అప్పగించారు. విచారణలో సదరు మహిళ బిహార్ రాష్ట్రం కిషన్గంజ్ జిల్లా దిఘల్బ్యాంక్ మండలం పలాస గ్రామానికి చెందిన లాల్మోన్ ఖాటూన్ (34), భర్త ఎండీ సుల్తాన్గా తేలింది. ప్రస్తుతం ఈమె పహాడీషరీఫ్లో కూలిపనులు చేస్తూ నివసిస్తోందని, విచారణలో ఆ మహిళే నవజాత శిశువుకు తల్లి అని నిర్ధారించారు. తల్లీబిడ్డలను రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణ పర్యవేక్షణలో ఉంచినట్లు ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. చదవండి: సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం!
11 ఏళ్ల సహజీవనం.. మరో యువతిని పెళ్లాడిన కానిస్టేబుల్!
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో ఏకంగా పదకొండేళ్లు సహజీవనం చేసి మోసం చేసిన కానిస్టేబుల్ అరుణ్ కుమార్పై ఉప్పల్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తనకు ఇష్టం లేకుండా రెండుసార్లు గర్భస్రావం చేయించాడని, పెళ్లికి ముహూర్తాలు పెట్టి కూడా మరో యువతిని వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. గత నెల ఆఖరి వారంలో ఈ కేసు నమోదు కాగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ ప్రశాంత్నగర్కు చెందిన యువతితో అరుణ్కుమార్కు 2013లో పరిచయమైంది. 2014లో అరుణ్కుమార్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అది నమ్మిన తాను అతడితో సన్నిహితంగా మెలిగానని తెలిపారు. ఈ ఏడాది నవంబరు 1న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. అరుణ్కుమార్ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో ఆగస్టు 24న ఉదయం సుమారు 7.30 గంటలకు అతడి ఇంటికి వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. అక్కడ వాచ్మెన్తో పాటు కుటుంబ సభ్యులను ఆరా తీయగా..అరుణ్కుమార్కు అప్పటికే పెళ్లయిపోయిందనే విషయం తెలిసిందని పేర్కొన్నారు. అతడు ఈ ఏడాది జూలై 1న మరో యువతిని వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని యువతి ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం!
పుట్టింటికి పంపడం లేదని నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్: తనను పుట్టింటికి పంపడానికి భర్త నిరాకరిస్తున్నాడని మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన ముద్దం నాగలక్ష్మీ (18) వివాహం ఏడు నెలల క్రితం అదే జిల్లా తూడికుర్తి మండలానికి చెందిన మాదగాని శేఖర్ (32)తో జరిగింది. ఓ హోటల్లో పనిచేస్తున్న శేఖర్ భార్యతో కలిసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–4లోని సుఖ్దేవ్నగర్లో ఉంటున్నాడు. కొంతకాలంగా నాగలక్ష్మీ పుట్టింటికి వెళ్తానని భర్తను అడుగుతోంది. కొద్ది రోజుల తర్వాత వెళ్లాలని శేఖర్ సర్దిచెప్పి డ్యూటీకి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల రాఖీల పండుగ, బోనాల పండుగ సందర్భంగా అల్లుడు శేఖర్ తన కూతురిని పుట్టింటికి పంపలేదని, దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఎస్ఐ సంధ్యారాణి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం!
సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం!
రాంగోపాల్పేట్: సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతి అదృశ్యమైంది. రాంగోపాల్పేట్ పోలీసులు తెలిపిన మేరకు.. కేరళకు చెందిన అధిరా అనీష్ (24) కిమ్స్లో నర్సుగా పనిచేస్తూ పీజీరోడ్లోని హాస్టల్లో ఉంటుంది. అధిరా అనారోగ్యంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు కేరళ నుంచి పరామర్శించేందుకు వచ్చారు. ఆస్పత్రి వద్దను ఆమెను కలువగా చిన్న విషయానికి వాగ్వవాదం జరిగింది. తాను హాస్టల్కు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిపోయింది. అన్ని చోట్ల వెతికినా ఎక్కడా ఆచూకీ తెలియకపోవడంతో పాటు మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో తల్లి రాంగోపాల్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.చదవండి: వర్షిణికి వాష్రూమ్ కడిగే పని.. ఎందుకింత శిక్ష?
వీడియోలు
బయటపడ్డ మంత్రి అనగాని బాగోతం వైరల్ అవుతున్న వీడియోలు
Viral: బామ్మ జంప్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే! వైరల్ అవుతున్న వీడియో
మా డిమాండ్స్ అన్ని చెత్త బుట్టలో... ప్రజలకు ఎలా న్యాయం చేస్తుంది
పవన్ కు అంటుతున్న డీఎస్సీ బురద ?
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు..! కన్నీరు పెట్టిన బొత్స
అసలు సూత్రదారులు వీళ్లే..! ఆధారాలతో బయటపెట్టిన YS జగన్
ఎవరికీ పోస్టు ఇవ్వాలో మంగళగిరి నుంచి ఫోన్.. లైవ్ వీడియో ప్లే చేసి ఏకిపారేసిన జగన్
బాబు జైలుకెళ్లి మూడేళ్లు... వెళ్తూ వెళ్తూ జగన్ సెటైర్లు అదుర్స్
ఉక్రెయిన్ ఖజానా ఖాళీ... యుద్ధంతో దివాలా దిశగా..!
అరుదైన కోతులు.. ఇక్కడికి ఎలా వచ్చాయి! వీటి ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

