చారిత్రక మ్యాచ్లో టీమిండియా సంచలన విజయం
‘క్రికెట్ మక్కా’ లార్డ్స్లో భారత్ చారిత్రక విజయం సాధించింది. ఈ మైదానంలో మహిళల టెస్టు ఫార్మాట్లో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ను మట్టికరిపించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 270 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా లార్డ్స్లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి మహిళా జట్టుగా హర్మన్ సేన చరిత్రకెక్కింది.స్మృతి మంధాన అర్ధ శతకంలండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్- భారత్ మహిళా జట్ల మధ్య శుక్రవారం ఏకైక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఓపెనర్లలో షఫాలీ వర్మ డకౌట్ కాగా.. స్మృతి మంధాన అర్ధ శతకం (83)తో మెరిసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగిలిన వారిలో జెమీమా రోడ్రిగ్స్ (35) చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ బ్యాటర్ అమీ జోన్స్ అర్ధ శతకం (52)తో రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది.క్రాంతికి ఐదు వికెట్లుఇక భారత బౌలర్లలో పేసర్ క్రాంతి గౌడ్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. తద్వారా లార్డ్స్లో తొలి ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన మహిళా బౌలర్గా చరిత్ర సృష్టించింది. మిగిలిన వారిలో సయాలీ సత్ఘరే, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.యస్తికా సెంచరీఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (115 పరుగులు) కలుపుకొని రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. ఏడు వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా సెంచరీ (113)తో సత్తా చాటింది.ఇంగ్లండ్ లక్ష్యం 457ఫలితంగా టీమిండియా ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఈ క్రమంలో ఆదివారం నాటి నాలుగో రోజు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ కేవలం 130 పరుగులు చేసింది. ఈ క్రమంలో 130/6 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాటి చివరి రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. మరో 56 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.ఆఖరి రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లిస్టోన్ టెస్టుల్లో తొలి అర్ధ శతకం పూర్తి చేసుకుంది. యాభై పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె పదో వికెట్గా వెనుదిరగడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. భారత్ 270 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. సయాలీ సత్ఘరే, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు కూల్చారు.సంక్షిప్త స్కోర్లుభారత్ : 285 &3 41/7 డిక్లేర్డ్ఇంగ్లండ్ : 170 & 186ఫలితం : ఇంగ్లండ్పై 270 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపు.చదవండి: టీమిండియాలోకి సూర్య!
రేపు విశాఖకు వైఎస్ జగన్.. మత్స్యకార కుటుంబాలకు పరామర్శ
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (మంగళవారం) విశాఖలో పర్యటించనున్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన విషాదకర బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకుని, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు.అదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.పర్యటన షెడ్యూల్ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. విశాఖపట్నం చేరుకున్న అనంతరం జబ్బార్ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన కారి చిన్నాను కలుస్తారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఇప్పటికే పార్టీ నాయకులను ఆదేశించిన వైఎస్ జగన్, ఈ విషాద ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు.
ఏసీ కోచ్లలో దుప్పట్లు, ఫేస్ షీట్ల చోరీ : 4 ఏళ్లలో రూ. 104 కోట్లు
భారతీయ రైల్వేలోని ఎయిర్ కండిషన్డ్ (AC) కోచ్లలో ప్రయాణించే ప్రయాణికులు జనవరి 2022 మరియు మే 2026 మధ్య కాలంలో ఏకంగా 1.27 కోట్లకు పైగా దుప్పట్లు, తువ్వాళ్లు (బెడ్రోల్ వస్తువులను) దొంగిలించినట్లు సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' చేసిన దర్యాప్తులో వెల్లడైంది. దీనివల్ల లినెన్ కాంట్రాక్టర్లకు రూ. 104 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.దేశంలోని 18 రైల్వే జోన్లలో 16 జోన్ల పరిధిలోని 54 రైల్వే డివిజన్ల నుండి సేకరించిన ఆర్టీఐ సమాధానాల ప్రకారం.. 2022 -2025 మధ్య కాలంలో లినెన్ వస్తువుల దొంగతనాలు 56 శాతం పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన బెడ్రోల్ సేవలను జనవరి 2022లో పూర్తిగా పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ట్రంప్, నెతన్యాహుతో పాటు 13 మంది టార్గెట్? ఇరాన్ రివెంజ్ లిస్ట్ కలకలం సాధారణంగా ఏసీ కోచ్లలో ప్రయాణించే వారికి రెండు బెడ్షీట్లు, ఒక బ్లాంకెట్ (కంబళి), ఒక దిండు, దిండు కవర్ ఒక ఫేస్ టవల్ (ముఖం తుడుచుకునే తువ్వాలు) ఉన్న బెడ్రోల్ కిట్ను అందిస్తారు. దొంగిలించబడిన వస్తువుల సంఖ్యను లెక్కగడితే.. ప్రతి 1,000 మంది ప్రయాణికులలో ఒకరు ఒక వస్తువును దొంగిలించినట్లు అవుతుంది. అయితే, నాలుగేళ్ల కాలంలో దొంగిలించబడిన వస్తువులలో ఫేస్ టవల్స్ మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ మొత్తం నష్టం రైల్వే అధికారులకు, కాంట్రాక్టర్లకు పెద్ద ఆందోళనగా మారింది. బడాబాబులు కొట్టేసిన వస్తువుల వివరాలు: ఫేస్ టవల్స్: 46.54 లక్షలుబెడ్షీట్లు: 41.13 లక్షలుదిండు కవర్లు: 23.59 లక్షలుబ్లాంకెట్లు (కంబళ్లు): 12.95 లక్షలుదిండ్లు: 2.76 లక్షలు (ఇవి పరిమాణంలో పెద్దవిగా ఉండటం వల్ల తక్కువగా దొంగిలించబడ్డాయి).ఎక్కువగా దొంగతనాలు జరిగిన ప్రాంతాలు:ఆర్టీఐ నివేదిక ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఈ దొంగతనాలు చాలా ఎక్కువగా జరిగాయి:బికనీర్: 25.76 లక్షల వస్తువులతో అగ్రస్థానంలో ఉంది.రాంచీ: 9.31 లక్షలుఢిల్లీ: 8.21 లక్షలుముంబై: 8.17 లక్షలుజోధ్పూర్: 8.09 లక్షలుఅహ్మదాబాద్: 6.94 లక్షలుఈ భారం ఎవరికి?కోచ్ల లోపల లినెన్ వస్తువుల సంరక్షణ బాధ్యత అంతా బెడ్రోల్స్ పంపిణీ చేసే కాంట్రాక్ట్ ఏజెన్సీదేనని రైల్వే ప్రతినిధి తెలిపారు. వస్తువులు కనిపించకుండా పోతే, వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసే ఆర్థిక భారం పూర్తిగా కాంట్రాక్టరే భరించాల్సి ఉంటుంది. ఈ నిరంతర దొంగతనాల వల్ల తలెత్తే కొరతను అధిగమించడానికి అదనపు లినెన్ సెట్లను ఏర్పాటు చేయడం కాంట్రాక్టర్లకు పెద్ద సవాలుగా మారిందని అధికారులు పేర్కొన్నారు. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి : 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?
15 ఏళ్లకే చదువు మానేసింది..! కట్చేస్తే రూ 7 వేల కోట్ల కంపెనీ..
సాధారణంగా కష్టపడి చదివి..నైపుణ్యాలు అందిపుచ్చుకుని ఒక్కోమెట్టు ఎక్కుతూ సక్సెస్ అందుకుంటాం. కానీ కొందరు చిన్న వయసులోనే అపార ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ కోవకు చెందిన పిల్లలు అందరి పిల్లల్లా క్లాస్రూమ్ పాఠాలకు అంకితమవ్వరు. అలా టైం వేస్ట్ చేసే కంటే..తనకేది ఇష్టమే ఏం చేస్తే బాగుంటుందో.. అంత చిన్న వయసులోనే నిర్ణయించుకోగలరు. ఆ దిశగా తమ టాలెంట్ని ప్రదర్శించి దిగ్గజ కంపెనీలే వచ్చి తమ సంస్థలో చేర్చుకునేలా చేసుకుంటారు. అలాంటి టాలెంటెడ్ గర్ల్ హర్షిత అరోరా. ఆమె స్కూల్ చదువుని మధ్యలోనే ఆపేసి పేరెంట్స్కి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత అత్యంత చిన్న వయసులోనే కోట్ల విలువ చేసే కంపెనీని నిర్మించి..ఇంటెలిజెన్స్కి కేరాఫ్గా నిలిచింది. ఆ అమ్మాయే ఉత్తప్రదేశ్లోని సహారన్పూర్ నగరానికి చెందిన హర్షిత అరోరా. చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు ఇంజీనర్ లేదా డాక్టరో అవ్వాలనే అనుకుంటారు. కానీ హర్షిత తన తల్లిదండ్రులే ఆందోళన చెందేలా భయానక నిర్ణయం తీసుకుని షాక్కి గురి చేసింది. చదువుకి అత్యంత కీలకమైన టీనేజ్ దశ అంటే 15 ఏళ్ల వయసుకే ఈ చదువులు నావల్ల అయ్యే పని కాదని స్టడీస్కి బై..బై చెప్పేసింది. తనకు తాను సొంతంగా టెక్నాలజీ గురించి నేర్చుకోవడం ప్రారంభించింది. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ సాయంతో 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒక క్రిప్టో పోర్ట్ఫోలియో ట్రాకింగ్ యాప్ను సృష్టించింది. అది చాలా సరళంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. ఆపిల్ దీన్ని గమనించి తన ఫ్లాట్ఫామ్లోకి చేర్చింది. ఈ యాప్ అమెరికా, కెనడా దేశాల వ్యాప్తంగా రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన ఫైనాన్స్ యాప్గా నిలిచింది. ఆ తర్వాత కొద్ది కాలానికే, ఒక కంపెనీ దీనిని కొనుగోలు చేసింది. అలా 2020లో, భారత ప్రభుత్వం హర్షిత విజయాలను గుర్తించింది. అందుకుగానూ ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాల పురస్కార్ను అందుకుంది కూడా. అదే ఏడాది ఆమె అమెరికా వెళ్లడానికి O-1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. తమ రంగంలో అసాధారణమైన సామర్థ్యాన్ని ప్రదర్శించిన వారికి ఈ వీసా ఇస్తారు. అందుకోసం ఆమెకు మొత్తం పదిమంది సీఈవోల నుంచి సిఫార్సులు అవసరం. కానీ హర్షితకు ఏకంగా 15 సిఫార్సులు లభించాయి. అంతేగాదు శాన్ ఫ్రాన్సిస్కో ఆమెకు స్వాగతం పలికింది. 2019లో, ఆమె విజ్ఞాన్ వెలివేల తుషార్ మిశ్రాలతో కలిసి AtoB అనే స్టార్టప్ను స్థాపించారు. వాళ్ల మంచి ఆలోచనతో స్టార్టప్ని ప్రారంభించడంతో Y కాంబినేటర్ సమ్మర్ 2020 బ్యాచ్కు ఎంపికయ్యారు.ఈ Y కాంబినేటర్ (Y Combinator) అనేది 2005లో స్థాపించిన ఒక ప్రముఖ అమెరికన్ స్టార్టప్ యాక్సిలరేటర్. ఇది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి (స్టార్టప్లకు) అవసరమైన ప్రాథమిక పెట్టుబడి (Seed Fund), శిక్షణను అందిస్తుంది. అయితే వారి ఆలోచన ప్రారంభం కాకముందే కరోనా మహమ్మారితో వారి స్టార్టప్కి బ్రేక్లు పడ్డాయి. అకస్మాత్తుగా మారిపోయిన ప్రపంచం ఒకవైపు..ఏదో నిర్మించాలనే తపనతో కష్టపడుతున్న హర్షిత బృందం ఇంకోవైపు. నిజానికి ఆ టైంలో చాలా స్టార్టప్లు మూతపడ్డాయి. చాలామంది వ్యవస్థాపకులు తిరిగి ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు కూడా. అయితే హర్షిత బృందం మాత్రం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ట్రంక్ స్టాప్లకు వెళ్లారు. వారాల తరబడి అక్కడే నిలబడి ఆ ట్రక్ డ్రైవర్లతో మాట్లాడేవారు. వారి సమస్యల గురించి, చెల్లింపుల గురించి అడిగారు. అలాగే ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. నిజానికి హర్షిత బృందానికి ట్రక్కింగ్ పరిశ్రమ గురించి ఏమీ తెలియదు. దానికి సంబంధించి..ఫ్లీట్ల కోసం చెల్లింపు వ్యవస్థల గురించి కూడా ఏమీ తెలియదు. వాళ్లకు అర్థమయ్యే వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంది ఆ బృందం. అలా వారు AtoBని మళ్ళీ మొదటి నుండి నిర్మించారు. ఈసారి ఈసారి అమెరికన్ ట్రక్కింగ్ పరిశ్రమ కోసం ఆర్థిక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి..దశాబ్దాలుగా పాత పద్ధతులను ఉపయోగిస్తున్న పరిశ్రమ కోసం ఆధునిక టెక్నాలజీని అందించారు.అలా ఇప్పుడు అమెరికాలోని 30 వేలకు పైగా ఫ్లీట్లు AtoBని ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ సుమారు $800 మిలియన్లు, అంటే దాదాపు రూ. 7,600 కోట్లు. ఇక్కడ హర్షిత చదువు మానేసి మరి..తనకు ఏ మాత్రం పరిచయంలోని పరిశ్రమలో భారీ విజయాన్ని అందుకోవడం విశేషం. ప్రారంభించాలనుకున్నా.. స్టార్టప్కు బ్రేకులు పడ్డాయేమో గానీ తనకు కాదని తన సక్సెస్తో నిరూపించింది. ఏప్రిల్ 2026లో, వై కాంబినేటర్ హర్షితను జనరల్ పార్టనర్గా పదోన్నతి కల్పించింది. అంతకుముందు ఏడాది ఆ సంస్థలో అత్యంత పిన్న వయస్కురాలైన విజిటింగ్ పార్టనర్గా ఉంటూ..ప్రారంభ దశలో ఉన్న వ్యవస్థాపకులకు ఒక కంపెనీని నిర్మించడంలో సహాయసహకారాలు అందించేది. దాంతో హర్షిత 24 ఏళ్లకే ప్రపంచంలోని అత్యంత తెలివైన బిల్డర్లతో పనిచేసే అవకాశం దక్కించుకుంది. ఇక్కడ ఆమె ఏ స్టార్టప్లకు నిధులు అందాలో, ఏ వ్యవస్థాపకులకు ప్రపంచాన్ని మార్చే అవకాశం లభించాలో హర్షితానే నిర్ణయిస్తుంది. కెరీర్ ప్రారంభించే వయసుకే వై కాంబినేటర్లో జనరల్ పార్టనర్ అవ్వడం అంటే మామలు విషయం కాదు. ఎవ్వరికైన ఏదైనా మొదలు పెట్టేటప్పుడూ ఆటంకాలు వస్తాయి..దాన్ని అధిగమించి ఎలా ముందుకు సాగుతున్నావనే దానిపై సక్సెస్ మొత్తం ఆధారపడి ఉంటుందని హర్షిత నిరూపించింది. (చదవండి: పింక్ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..!)
బ్యాంకులకే అర్థంకాని మిస్టరీ.. ఇతడి డబ్బు ఎలా మాయమైంది?
భారత్తో మ్యాచ్.. శ్రీలంక బ్యాటర్ డబుల్ సెంచరీ
కొత్త రూపంలో IRCTC వెబ్సైట్!
శస్త్ర చికిత్స లేకుండా 'ఏఐ' ఎండోమెట్రియోసిస్ను నిర్థారించగలదా?
అయోధ్య ట్రస్ట్ సీఈవో పదవికి దరఖాస్తులు ఆహ్వానం, అర్హతలేంటో!
డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. జానీ మాస్టర్ కామెంట్స్
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు.. టీజర్ వచ్చేసింది
ఆసియా ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ల హవా.. 15 పతకాలు ఖరారు
చారిత్రక మ్యాచ్లో టీమిండియా సంచలన విజయం
సోనమ్ వాంగ్చుక్ దీక్షకు సీపీఎం మద్దతు
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్.. భువనేశ్వర్కు చోటు
ఇప్పుడు కలవడం కుదరదు మంత్రులతో సార్ సీరియస్గా మాట్లాడుతున్నారు!!
మీకు సంతానం తక్కువ సంపద ఎక్కువ ఎలా సాధ్యం సార్!
IND vs ENG: భారత తుదిజట్టు ఇదే!.. వైభవ్పై వేటు!
ఇంగ్లండ్ టెస్టు హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్!
కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి
నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా ఇది: రామ్గోపాల్ వర్మ
రవాణా మంత్రినే బస్సు దింపేసిన కండక్టర్
అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది
ఈ రాశి వారికి సోదరుల నుంచి ఆస్తిలాభాలు
World Population Day: మనదే పైచేయి.. కాని..
ఇప్పుడే ఏదో కొత్తగా తప్పారని మాట్లాడుతున్నారేంటీ! వెళ్లు వెళ్లమా!
ప్రియుడితో స్టార్ డైరెక్టర్ కూతురి నిశ్చితార్థం
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్
ఓటీటీలో తెలుగు హారర్ సినిమా.. మూడింటిలో స్ట్రీమింగ్
రెండు ఓట్ల సంగతి దేవుడెరుగు... ఉన్న ఒక్క ఓటు పోకుంటే చాలు!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు
రూ.6 కోట్ల ఇల్లు.. ఇది నిజంగా మధ్యతరగతి ఇల్లేనా?
బ్యాంకులకే అర్థంకాని మిస్టరీ.. ఇతడి డబ్బు ఎలా మాయమైంది?
భారత్తో మ్యాచ్.. శ్రీలంక బ్యాటర్ డబుల్ సెంచరీ
కొత్త రూపంలో IRCTC వెబ్సైట్!
శస్త్ర చికిత్స లేకుండా 'ఏఐ' ఎండోమెట్రియోసిస్ను నిర్థారించగలదా?
అయోధ్య ట్రస్ట్ సీఈవో పదవికి దరఖాస్తులు ఆహ్వానం, అర్హతలేంటో!
డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. జానీ మాస్టర్ కామెంట్స్
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు.. టీజర్ వచ్చేసింది
ఆసియా ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ల హవా.. 15 పతకాలు ఖరారు
చారిత్రక మ్యాచ్లో టీమిండియా సంచలన విజయం
సోనమ్ వాంగ్చుక్ దీక్షకు సీపీఎం మద్దతు
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్.. భువనేశ్వర్కు చోటు
ఇప్పుడు కలవడం కుదరదు మంత్రులతో సార్ సీరియస్గా మాట్లాడుతున్నారు!!
మీకు సంతానం తక్కువ సంపద ఎక్కువ ఎలా సాధ్యం సార్!
IND vs ENG: భారత తుదిజట్టు ఇదే!.. వైభవ్పై వేటు!
ఇంగ్లండ్ టెస్టు హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్!
కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి
నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా ఇది: రామ్గోపాల్ వర్మ
రవాణా మంత్రినే బస్సు దింపేసిన కండక్టర్
అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది
ఈ రాశి వారికి సోదరుల నుంచి ఆస్తిలాభాలు
World Population Day: మనదే పైచేయి.. కాని..
ఇప్పుడే ఏదో కొత్తగా తప్పారని మాట్లాడుతున్నారేంటీ! వెళ్లు వెళ్లమా!
ప్రియుడితో స్టార్ డైరెక్టర్ కూతురి నిశ్చితార్థం
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్
ఓటీటీలో తెలుగు హారర్ సినిమా.. మూడింటిలో స్ట్రీమింగ్
రెండు ఓట్ల సంగతి దేవుడెరుగు... ఉన్న ఒక్క ఓటు పోకుంటే చాలు!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు
రూ.6 కోట్ల ఇల్లు.. ఇది నిజంగా మధ్యతరగతి ఇల్లేనా?
ఫొటోలు
శారీలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ అందాలు.. ఫోటోలు
దర్శకుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)
హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి రాశి ఖన్నా (ఫొటోలు)
'శ్రీనివాస మంగాపురం' మూవీ HD స్టిల్స్
వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్ (ఫొటోలు)
వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెటర్ల హల్చల్.. స్పెషల్ అట్రాక్షన్ వైభవ్ సూర్యవంశీ (ఫొటోలు)
ఘనంగా ముగిసిన టీజీ20 లీగ్... విజేతగా హైదరాబాద్ (ఫొటోలు)
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి అప్పుడే రెండేళ్లు (ఫోటోలు)
అన్షులా కపూర్ వెడ్డింగ్ పార్టీ.. బాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 12 - 19)
సినిమా
ప్రియుడితో స్టార్ డైరెక్టర్ కూతురి నిశ్చితార్థం
లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, హైవే సినిమాలతో పాటు రీసెంట్ సెన్సేషన్ 'మైన్ వాపస్ ఆవుంగా'తో ఇంతియాజ్ అలీ దర్శకుడిగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడి కుమార్తె ఇదా అలీ కూడా తండ్రి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. దర్శకురాలిగా షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఇకపోతే ఈమె ఇప్పుడీమె తనకు ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి బయటపెట్టింది. ఇన్ స్టాలో ఫొటోలు పంచుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)ఇదా అలీ.. గత కొన్నేళ్ల నుంచి కృష్ణ్ అగర్వాల్తో ప్రేమలో ఉంది. ఎప్పటికప్పుడు తాము కలిసున్న ఫొటోలోని ఇదా పోస్ట్ చేస్తూనే ఉంది. అలాంటిది జూలై 01న రాత్రి 11 గంటలకు నార్వేలేని య్ట్రెసాండ్ బీచ్లో క్రిష్ మోకాళ్లపై కూర్చుని ఇదాకు ప్రపోజ్ చేశాడు. తర్వాత ఆమెకు వజ్రాల ఉంగరం తొడిగాడు. ఈ ఫొటోలు పోస్ట్ చేయగా.. బాలీవుడ్ సెలబ్రిటీలైన వేదాంగ్ రైనా, శార్వరి, ఖుషి కపూర్, ఆలియా కశ్యప్, ఓర్రీ తదితరులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. ఇదా అలీ విషయానికొస్తే..మాయా, లిఫ్ట్, థాయ్ మసాజ్ తదితర షార్ట్ ఫిల్మ్స్ తీసింది.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో హీరో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి) View this post on Instagram A post shared by Ida Ali (@idaali11)
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ
స్టార్ హీరో జూ.ఎన్టీఆర్.. ఈ నెల 18న రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. చాలామంది వీటిని నిజమే అనుకుంటున్నారు. ఇదలా ఉండగా ఎన్టీఆర్ అభిమాన సంఘం ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేసింది.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)'జూలై 18న జరగబోయే 'ఊరు-వాడ' కార్యక్రమానికి ఎప్పుడో ప్లాన్స్ వేశాం. దీనికి రాజకీయాలతో ముడిపెట్టొద్దు. ఎలాంటి రూమర్స్ నమ్మొద్దు. ఇలాంటి వాటిని ప్రచారం చేయొద్దని మీడియా, సోషల్ మీడియా పేజీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీనివల్ల అభిమానులు అనవసరంగా అయోమయానికి గురవుతున్నారు' అని తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఓ నోట్ రిలీజ్ చేసింది.తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి మిగతా భాషల హీరోలు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఎన్టీఆర్ అనే కాదు బన్నీ, విజయ్ దేవరకొండ పేర్లు కూడా వినిపించాయి. చూస్తుంటే ఇవన్నీ కేవలం పుకార్లే అనిపిస్తోంది. ప్రస్తుతం 'డ్రాగన్'తో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. తర్వాత కుమారస్వామి కథతో త్రివిక్రమ్ మూవీలో నటిస్తాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ)
ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మిగతా భాషల్లో ప్రేక్షకులని అలరించిన చిత్రాలు, డబ్బింగ్ల రూపంలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా గత వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ 'పరిమిళ అండ్ కో'. జీ5 ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)కథేంటి?మిడిల్ క్లాస్కి చెందిన పరిమిళ(జయరాం).. తన భార్య స్వరాజ్యం(ఊర్వశి), కూతుళ్లు పరాశక్తి, మధుమితతో కలిసి ఓ అద్దె ఇంట్లో బతికేస్తుంటాడు. ప్రశాంతంగా ఉన్న వీళ్ల జీవితంలోకి వర్గీస్ (శాండీ మాస్టర్) అనే లోకల్ రౌడీ ఎంట్రీ ఇస్తాడు. పరిమళ చిన్న కూతురు మధుమిత వెంటపడుతూ పెళ్లి చేసుకుంటానని ఇబ్బందిపెడుతుంటాడు. ఈ టార్చర్ భరించలేక అతడిని చంపేస్తే బాగుంటుందని కుటుంబమంతా ఓ రోజు అనుకుంటారు. సీన్ కట్ చేస్తే తర్వాత రోజు తెల్లారేసరికి వర్గీస్ హత్యకు గురవుతాడు. ఇంతకీ ఇతడిని చంపిందెవరు? పరిమళ కుటుంబానికి ఈ హత్యకు సంబంధముందా? లేదా? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'దృశ్యం' వచ్చిన తర్వాత ఈ తరహా కాన్సెప్ట్లతో చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా అలాంటి ఓ మూవీనే. కాకపోతే అది సీరియస్, దీన్ని మాత్రం కామెడీగా తీశారు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కుంటే ఏమవుతుంది? అనే సింపుల్ కాన్సెప్ట్ ఈ చిత్రంలోనూ చూపించారు. ఇక ఎలా ఉందంటే ఓటీటీలో చూస్తున్నప్పుడు అయితే ఓకే ఓకే అనిపించింది.మొదలైన అరగంట పాటు సినిమా చకచకా వెళ్తుంది. తర్వాత హత్య ఎవరు చేశారు? అనే దగ్గర పరిమిళ కుటుంబంలోని ఒక్కొక్కరిపై అనుమానం వచ్చేలా సీన్స్ వస్తుంటాయి. వీళ్లతో పాటు పరిమళ తమ్ముడు, బావమరిదిపై కూడా అనుమానం వస్తుంది. ఒకానొక దశలో ఎవరో చంపారనేది పరిమిళ కుటుంబానికి తెలిసిపోతుంది. కానీ పోలీసులకు మాత్రం అంతుచిక్కదు. మరోవైపు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న ఏడుకొండలు అనే సీఐ.. నిందితుడిని కనిపెట్టకుండా ఆలస్యం చేస్తుంటాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడనే దానికి చివరలో వివరణ ఇస్తారు.సినిమాలో కామెడీ.. పార్ట్స్ పార్ట్స్గానే వర్కౌట్ అయింది. హత్య ఎవరు చేశారనే విషయంలో చాలామందిపై అనుమానం వచ్చేలా సీన్స్ చూపిస్తారు కానీ చివరలో అసలు వర్గీస్ని ఎవరు? ఎందుకు చంపారనేది ఊహించని ట్విస్టు రూపంలో బయటపెడతారు. అయితే అది మూవీలో ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది తప్పితే సహజంగా అనిపించదు. సెకండాఫ్లో స్టోరీ అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపించడం ఓ మైనస్.నటన విషయానికొస్తే.. పరిమళ, స్వరాజ్యం అనే భార్యభర్తలుగా చేసిన జయరాం, ఊర్వశి తమ అనుభవం చూపించి నవ్వించారు. వీళ్ల కూతుళ్లుగా చేసిన సంజన, అనంతిక కూడా బాగానే చేశారు. పోలీస్ అధికారిగా మిస్కిన్, వర్గీస్ అనే రౌడీగా శాండీ మాస్టర్.. పరిమిళ పెద్ద కూతురి ప్రియుడిగా తెలుగు హీరో సంతోశ్ శోభన్ ఆకట్టుకున్నారు. మిగిలిన వాళ్లు ఓకే.టెక్నికల్ అంశాలకొస్తే మ్యూజిక్ గుర్తుంచుకునేంత గొప్పగా ఏం లేదు. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. దర్శకుడు పాండిరాజ్ ఓ పాయింట్ అనుకున్నారు కానీ దాన్ని తీసే క్రమంలో సాగదీసి వదిలారు. పేరుకే రెండున్న గంటల మూవీ గానీ మూడు గంటల నిడివిలా అనిపిస్తుంది. మీకు బాగా ఖాళీ ఉండి ఏదో టైమ్ పాస్ చేద్దామనుకుంటే ఈ చిత్రం చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలేం లేవు. కుటుంబంతోనూ వీక్షించొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: అనాథకి అద్భుత దీపం దొరికితే.. ఫహాద్ ఫాజిల్ హీరోగా తెలుగు సినిమా)
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'లెనిన్'.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది. మరోవైపు ఈ వారం బిగ్ స్క్రీన్స్పైకి ఐశ్వర్యా రాజేశ్ 'ఓ సుకుమారి', మాధవన్ 'జీడీఎన్', వదలా, రాజా ది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి, మహేంద్రగిరి వారాహి తదితర తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ' ఇదే వీకెండ్ రాబోతుంది.(ఇదీ చదవండి: నేనేం చేస్తున్నానో నాకు తెలుసు: నాగ్ అశ్విన్)ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. సమంత 'మా ఇంటి బంగారం', వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ' ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు సెకండ్ లవ్, రెడీ ఆర్ నాట్ 2 తదితర రియాలటీ షో, డబ్బింగ్ చిత్రాలు కూడా ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్లోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 13 నుంచి 19 వరకు)హాట్స్టార్సెకండ్ లవ్ (తమిళ రియాలటీ సిరీస్) - జూలై 13పవిత్రం (మలయాళ సిరీస్) - జూలై 13వుథరింగ్ హైట్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 13రెడీ ఆర్ నాట్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 16మా ఇంటి బంగారం (తెలుగు మూవీ) - జూలై 17టెస్ట్ సబ్జెక్ట్ వీ (హిందీ డాక్యుమెంటరీ) - జూలై 18నెట్ఫ్లిక్స్ద హాక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15మీ బిఫోర్ మీ (ఇండోనేసియన్ మూవీ) - జూలై 16ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ సిరీస్) - జూలై 17ద ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ సిరీస్) - జూలై 17డిజైర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 1723000 లైవ్స్ (జర్మన్ మూవీ) - జూలై 17హార్ట్ స్టాపప్ ఫరెవర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17స్పూకీ ఇన్ లవ్ (కొరియన్ సిరీస్) - జూలై 18అమెజాన్ ప్రైమ్మర్డర్ 101 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 13బ్యాక్ రూమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 14 (రెంట్)రైడ్ ఆర్ డై (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15జీ5ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు (తెలుగు సినిమా) - జూలై 17ఎమ్ఎక్స్ ప్లేయర్రక్తాంచల్ సీజన్ 3 (హిందీ సిరీస్) - జూలై 16ఆపిల్ టీవీ ప్లస్లక్కీ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15(ఇదీ చదవండి: ఇప్పుడు వాళ్ల కళ్లు చల్లబడ్డాయి.. జానకి మరణంపై సుశీల)
క్రీడలు
టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్!
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాను చాంపియన్గా నిలిపిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. కానీ ఈ మెగా టోర్నీ తర్వాత జట్టు ఆడిన తొలి సిరీస్లోనే ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్పై వేటు పడింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. కెప్టెన్గా తప్పించడమే కాకుండా.. జట్టులోనే అతడికి స్థానం లేకుండా చేసింది.గత ఏడాదిన్నర కారణంగా బ్యాటర్గా సూర్యకుమార్ వ్యక్తిగత వైఫల్యలే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్కు సారథ్య బాధ్యతలు అప్పగించిన యాజమాన్యం.. చిచ్చర పిడుగు, పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టుకు ఎంపిక చేసింది.ఘోర పరాభవం!అయితే, అయ్యర్ కెప్టెన్సీలో తొలి సిరీస్లోనే భారత్కు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్లో 2-0తో టీమిండియా వైట్వాష్కు గురైంది. ఇక ఇంగ్లండ్ చేతిలోనూ 4-0తో క్లీన్స్వీప్ అయింది. దీంతో తాజా యూకే టూర్ భారత క్రికెట్ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.ఈ నేపథ్యంలో సూర్యను గుర్తు చేసుకుంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అతడిని కొనసాగించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్టు కరిష్మా సింగ్ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.బీసీసీఐ గ్రీన్ సిగ్నల్!.. కానీ ఓ కండిషన్!సూర్యకు టీమిండియా తలుపులు శాశ్వతంగా ఏమీ మూసుకుపోలేదన్నారు. అతడు త్వరలోనే తిరిగి భారత టీ20 జట్టులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే, అందుకోసం సూర్య దేశవాళీ క్రికెట్లో ముంబై తరఫున.. అదే విధంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫునా కచ్చితంగా రాణించాల్సి ఉంటుందని కరిష్మా చెప్పుకొచ్చారు.అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు కరిష్మా తెలిపారు. బంతి ఇప్పుడు సూర్య కోర్టులోనే ఉందన్నారు. దేశీ క్రికెట్లో రాణిస్తే తప్పక అతడు తిరిగి టీమిండియాలో అడుగుపెడతారని జోస్యం చెప్పారు. కాగా మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, దినేశ్ కార్తిక్ తదితరులు కొన్నాళ్లపాటు జాతీయ జట్టుకు దూరమైనా.. దేశీ క్రికెట్లో సత్తా చాటి తిరిగి జట్టులో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.చదవండి: ఇంగ్లండ్తో తొలి వన్డేకు భారత జట్టు ఇదే!
వరుసగా రెండో మ్యాచ్లోనూ శతక్కొట్టిన విండీస్ ఓపెనర్
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ (100), వన్డౌన్ బ్యాటర్ స్టెఫానీ టేలర్ (100 నాటౌట్) సూపర్ సెంచరీలతో చెలరేగడంతో ఐర్లాండ్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్ జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 39 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. మాథ్యూస్కు ఇది వరుసగా రెండో వన్డే సెంచరీ. ఇదే సిరీస్లోని తొలి మ్యాచ్లో కూడా ఆమె శతక్కొట్టింది.మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అమీ హంటర్ 67, రెబెక్కా స్టోకెల్ 57 పరుగులతో జట్టును ఆదుకున్నారు. చివర్లో లియా పాల్ 30 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించింది. వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ (2/34), డియాండ్రా డాటిన్ (2/15) రాణించారు.241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ తొలి ఓవర్లోనే ఓపెనర్ రియలియానా గ్రిమాండ్ (0) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత హేలీ మాథ్యూస్, స్టెఫానీ టేలర్ ఐర్లాండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. వీరిద్దరూ రెండో వికెట్కు 158 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. చివరి వరకు క్రీజులో నిలిచిన టేలర్, షెమైన్ క్యాంప్బెల్ (10 నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ సిరీస్లో నామమాత్రపు చివరి వన్డే జులై 15న జరుగనుంది. ఈ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఐర్లాండ్లో పర్యటించనుంది.
పొరపాటు చేసిన వెస్టిండీస్ కోచ్
వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించలేదని ప్రధాన కోచ్ డారెన్ సామీ స్పష్టం చేశాడు. ఇటీవల హోల్డర్ వన్డేలకు వీడ్కోలు పలికాడని చేసిన వ్యాఖ్యలు తప్పని అంగీకరిస్తూ, వాటిని వెనక్కి తీసుకున్నాడు.జూలై 12న మీడియాతో మాట్లాడిన సామీ, హోల్డర్ వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్నాడని పేర్కొన్నాడు. అయితే ఆ వ్యాఖ్యలు గందరగోళానికి దారితీయడంతో, అనంతరం అధికారికంగా వివరణ ఇచ్చాడు."జేసన్ హోల్డర్ అంతర్జాతీయ భవిష్యత్తుపై మాట్లాడుతున్నప్పుడు నేను పొరపాటున అతను వన్డేలకు రిటైర్ అయ్యాడని చెప్పాను. అది నా తప్పు. ఈ వ్యాఖ్యల వల్ల జేసన్ హోల్డర్కు, క్రికెట్ వెస్టిండీస్కు, అభిమానులకు కలిగిన గందరగోళానికి హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను" అని సామీ వెల్లడించాడు.సామీ ఇంకా మాట్లాడుతూ, "వాస్తవానికి హోల్డర్ వన్డే క్రికెట్ నుంచి నిరవధిక విరామం మాత్రమే తీసుకున్నాడు. అతను రిటైర్ కాలేదు. వన్డే జట్టు ఎంపికకు అతడు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో అతని అందుబాటుపై క్రికెట్ వెస్టిండీస్తో నిరంతరం చర్చలు కొనసాగుతున్నాయి" అని వివరించాడు.కాగా, హోల్డర్ గత కొంతకాలంగా వన్డేలకు దూరంగా ఉన్నాడు. అయితే టీ20 క్రికెట్లో మాత్రం చురుగ్గా కొనసాగుతున్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ తరఫున ఆడిన అతను ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో పాల్గొంటున్నాడు. ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున 11 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసి, జట్టును ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.హోల్డర్ వన్డే కెరీర్ విషయానికొస్తే.. అతడు ఇప్పటివరకు 138 మ్యాచ్లు ఆడి 2,237 పరుగులు చేయడంతో పాటు 159 వికెట్లు పడగొట్టాడు. 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్లోనే చివరిసారిగా వన్డే ఆడిన హోల్డర్, వెస్టిండీస్కు 86 వన్డేల్లో కెప్టెన్గా వ్యవహరించి 24 విజయాలు అందించాడు.
‘అందుకే వైభవ్ను తప్పించి.. సంజూను ఆడించాము’
టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్లలో క్లీన్స్వీప్ కావడమే ఇందుకు కారణం. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ గురైన శ్రేయస్ అయ్యర్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్నూ విజయమన్నదే లేకుండా ముగించింది. ఇంగ్లిష్ జట్టు చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది.ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కోసం వరల్డ్కప్ హీరో సంజూ శాంసన్ను పక్కనపెట్టడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా సంజూ ఐర్లాండ్తో రెండు టీ20లు (5, 0).. అదే విధంగా ఇంగ్లండ్తో తొలి టీ20 (1)లో విఫలమయ్యాడు.ఈ క్రమంలోనే సంజూను తప్పించి.. అతడి స్థానంలో ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ రెండో టీ20తో అరంగేట్రం చేశాడు. అయితే, వరుసగా మూడు మ్యాచ్లు ఆడిన వైభవ్.. 13, 14, 15 పరుగులు చేశాడు. అంతేగాక వైభవ్ రాకతో టాపార్డర్లో ముగ్గురూ (ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్) లెఫ్టాండర్లే అయ్యారు.ఈ నేపథ్యంలో నామమాత్రపు ఐదో టీ20లో మాత్రం వైభవ్ సూర్యవంశీని తప్పించి.. సంజూ శాంసన్ను తిరిగి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వివరణ ఇచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ..‘‘సౌతాంప్టన్ పిచ్ పరిస్థితికి తగ్గట్లు మేము అత్యుత్తమ ఓపెనింగ్ కాంబినేషన్తో ముందుకు వెళ్లాలని అనుకున్నాము. అభిషేక్ శర్మతో కలిసి కుడిచేతి వాటం బ్యాటర్తో ఓపెనింగ్ చేయించాలని ఫిక్స్ అయ్యాము. అందుకే వైభవ్ను తప్పించాము. ఈ మ్యాచ్కు ఇలా చేయడమే సరైన నిర్ణయం. సంజూ గన్ బ్యాటర్. గతంలో ఒంటిచేత్తో ఎన్నో సిరీస్లు గెలిపించాడు’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఐదో టీ20లో సంజూ 27 పరుగులు చేయగా.. అభిషేక్ 3 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. టీమిండియా 201 పరుగులకే కుప్పకూలింది.
న్యూస్ పాడ్కాస్ట్
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో మరో కుంభకోణానికి తెరతీసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... ల్యాప్టాప్ల కొనుగోలులో దోపిడీకి స్కెచ్
నిలబెట్టుకోలేనప్పుడు హామీలు ఎందుకిచ్చారు?.... ఆంధ్రప్రదేశ్లో కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు... భారీ ర్యాలీలు, ధర్నాలతో చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో తిష్టవేసిన సమస్యలు... 2024లో 43 లక్షలున్న విద్యార్థులు ఇపుడు 30 లక్షలే..
టీచర్ల ‘టెట్’ ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదు?... ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
టెట్ మినహాయింపునకు కృషి. టీచర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. తనను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలకు వైఎస్ జగన్ భరోసా
విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు
ప్రశ్నించే గొంతును నొక్కడానికి అత్యంత ప్రమాదకర ధోరణి వైపు పోలీసు వ్యవస్థను నడిపిస్తున్నారు... ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించాం. పౌరులపై ఆర్థిక భారాన్ని చాలావరకు తగ్గించాం. ప్రధాని మోదీ వెల్లడి
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి కడప ఉక్కు పరిశ్రమ మైలురాయి... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
బిజినెస్
గగన్యాన్ దిశగా భారత్ ముందడుగు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గగన్యాన్’ మానవసహిత అంతరిక్ష యాత్ర సాధన దిశగా మరో కీలకమైన మైలురాయిని అధిగమించింది. వ్యోమగాముల భద్రతకు ప్రధానంగా ఉన్న ‘క్రూ మాడ్యూల్’ వ్యవస్థలకు సంబంధించిన మూడు క్వాలిఫికేషన్ పరీక్షలను శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. అంతరిక్ష ప్రయాణం ముగించుకుని భూమికి తిరిగి వచ్చే క్రమంలోనూ, సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత వ్యోమగాముల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రక్షించే సాంకేతికతలను ఈ పరీక్షల ద్వారా ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.మొదటిది..ఈ ప్రక్రియలో మొదటిది ‘క్రూ మాడ్యూల్ అప్రైటింగ్ సిస్టమ్’. గగన్యాన్ యాత్ర ముగిసిన తర్వాత వ్యోమగాములు ప్రయాణించే క్రూ మాడ్యూల్ సురక్షితంగా భారత సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది. అలా పడినప్పుడు సముద్రపు అలల ఉధృతికి మాడ్యూల్ తలకిందులుగా తిరగబడే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి ఇస్రో ప్రత్యేకంగా కోల్డ్-గ్యాస్ ఆధారిత అప్రైటింగ్ వ్యవస్థను రూపొందించింది. సముద్రంలో పడిన వెంటనే ఈ వ్యవస్థ యాక్టివేట్ అయి క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చేస్తుంది. తాజాగా నిర్వహించిన పరీక్షలో ఫ్లోటేషన్ బ్యాగులను విజయవంతంగా ఉబ్బించి, వివిధ రకాల పీడన పరిస్థితుల్లో ఈ వ్యవస్థ కచ్చితత్వంతో పనిచేస్తుందని నిరూపించారు.రెండవది..రెండవది ‘అంబిలికల్ సెపరేషన్ టెస్ట్’. వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యూల్కు అవసరమైన ఇంధనం, విద్యుత్ శక్తి, రక్షణ వ్యవస్థలకు అనుసంధానంగా ఒక ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తుంది. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో ఈ రెండు మాడ్యూళ్లు విడిపోవాల్సి ఉంటుంది. ఒక కృత్రిమ క్రూ మాడ్యూల్ను ఉపయోగించి ఈ వేరుపడే ప్రక్రియను విజయవంతంగా పరీక్షించారు. ఎలాంటి ఆటంకం లేకుండా అత్యంత క్లీన్గా ఈ సెపరేషన్ జరిగిందని ఇస్రో తెలిపింది.మూడవది, ‘అపెక్స్ కవర్ సెపరేషన్ లోడ్స్’. క్రూ మాడ్యూల్ భూ వాతావరణంలోకి తిరిగి వచ్చేటప్పుడు ఉత్పన్నమయ్యే తీవ్రమైన వేడి, ఘర్షణ నుంచి లోపల ఉండే పారాచూట్లను రక్షించడానికి పైభాగంలో ‘అపెక్స్ కవర్’ రక్షణగా ఉంటుంది. పారాచూట్లు తెరుచుకోవడానికి ముందే ఈ అపెక్స్ కవర్ సురక్షితంగా విడిపోవాలి. ఈ కవర్ విడిపోయే సమయంలో క్రూ మాడ్యూల్ నిర్మాణంపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. అసలు మిషన్లో ఎదురయ్యే గరిష్ట ఒత్తిడి కంటే సుమారు 1.75 రెట్లు ఎక్కువ లోడ్ను కృత్రిమంగా ప్రయోగించి పరీక్షించారు. ఈ భీకర ఒత్తిడిలోనూ క్రూ మాడ్యూల్ ఆకృతి ఎక్కడా దెబ్బతినకుండా స్థిరంగా ఉందని స్పష్టమైంది.అంతరిక్ష ప్రయోగాల్లో రాకెట్లను నింగిలోకి పంపడం ఒకెత్తయితే.. మానవసహిత మిషన్లలో వ్యోమగాములను సురక్షితంగా తిరిగి భూమికి తీసుకురావడం మరో ఎత్తు. ఇస్రో తాజాగా పూర్తి చేసిన ఈ మూడు క్వాలిఫికేషన్ పరీక్షలు కేవలం సాంకేతిక విజయాలు మాత్రమే కాదు.. వ్యోమగాముల ప్రాణాలకు ఇస్రో ఇస్తున్న అత్యున్నత రక్షణ గ్యారంటీకి నిదర్శనాలు. త్వరలోనే ప్రయోగించనున్న మానవరహిత మొదటి గగన్యాన్ (జీ1) మిషన్కు ఈ విజయాలు తిరుగులేని విశ్వాసాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం..
టెక్కీలకు డైరెక్ట్ ఏసీ బస్
ఐటీ కారిడార్ బెంగళూరులో నిత్యం ట్రాఫిక్ నరకం చూసే టెక్కీలకు, ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించింది. తుమకూరు నుంచి బెంగళూరు ఐటీ హబ్ ‘ఎలక్ట్రానిక్స్ సిటీ’ మధ్య ప్రయాణించే వందలాది మంది ఉద్యోగుల కోసం బెంగళూరు మహానగర రవాణా సంస్థ (బీఎంటీసీ) సరికొత్త ‘విస్తారా ఏసీ బస్సు’ సేవలను ప్రారంభించింది.బీఎంటీసీ లాంగ్ రూట్దాదాపు 101 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రత్యేక రూట్ ప్రస్తుతం బీఎంటీసీ నడుపుతున్న బస్సు సర్వీసులన్నింటిలోకి అత్యంత పొడవైనది కావడం విశేషం. గ్రేటర్ బెంగళూరు పరిధి దాటి సుమారు 40 కిలోమీటర్ల పరిధి వరకు బస్సులు నడుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో.. స్థానికంగా ఉన్న శాటిలైట్ టౌన్స్ను అనుసంధానిస్తూ బీఎంటీసీ ఈ నిర్ణయం తీసుకుంది.‘ప్రజా డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని ఈ సరికొత్త ఏసీ సర్వీస్ను ప్రారంభించాం. ప్రస్తుతం తుమకూరు - ఎలక్ట్రానిక్స్ సిటీ మధ్య ప్రయాణికుల ఆదరణ చాలా బాగుంది. గతంలో మేము నైలామంగళ, హోస్కోట్ మధ్య 80 కిలోమీటర్ల రూట్ను ప్రారంభించాం. ఇప్పుడు ఈ 101 కిమీ రూట్ మా నెట్వర్క్లోనే అతి పెద్దది’ అని బీఎంటీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (ఆపరేషన్స్) జి.టి. ప్రభాకర్ రెడ్డి అన్నారు.ప్రయాణ సమయం, టైమింగ్స్ వివరాలుఈ సరికొత్త సర్వీస్ ద్వారా ప్రయాణికులకు నిత్యం 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు ప్రయాణ సమయం ఆదా అవుతోంది. ఉదయం 7:45 గంటలకు తుమకూరులో బయలుదేరి, ఉదయం 9:45 గంటల వరకు ఎలక్ట్రానిక్స్ సిటీకి చేరుకుంటుంది. (ఆఫీస్ వేళలకు సరిగ్గా సరిపోయేలా రూపకల్పన చేశారు). ఎలక్ట్రానిక్స్ సిటీ నుంచి సాయంత్రం ఐటీ ఉద్యోగుల లాగ్-అవుట్ సమయానికి అనుగుణంగా సాయంత్రం 5:45 గంటలకు బయలుదేరి రాత్రి 9:00 గంటల కల్లా తుమకూరు చేరుకుంటుంది. వన్వే రూట్లో ప్రయాణ ఛార్జీ రూ.200గా నిర్ణయించారు. ప్రధాన స్టాపులు.. తుమకూరు, నేలమంగళ, మాదవర మీదుగా ‘నైస్ రోడ్’ ద్వారా నేరుగా ఎలక్ట్రానిక్స్ సిటీ చేరుకుంటుంది.ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం..
అయోధ్య రామాలయంలో టెక్ అప్డేట్
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆలయంలో విరాళాల లెక్కింపు, కానుకల నిర్వహణలో మరింత పారదర్శకతను పెంచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. విరాళాల చోరీలను, వాటి దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిఫార్సు చేయనుంది. ఈ మేరకు జులై 15న యూపీ ప్రభుత్వానికి సమర్పించనున్న తన తుది నివేదికలో ఈ అంశాన్ని ప్రధానంగా చేర్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.ప్రాథమిక నివేదికలో షాకింగ్ నిజాలురామమందిరంలో కానుకలు, నగదు మాయమవుతున్నాయనే ఫిర్యాదులపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సిట్ను ఏర్పాటు చేసింది. జూన్ 15 నుంచి రంగంలోకి దిగిన ఈ కమిటీ ఆలయ భద్రత, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. కాగా, జూన్ 23న సిట్ సమర్పించిన ప్రాథమిక నివేదికలో సంచలన నిజాలు బయటపడ్డాయి. కేవలం 40 రోజుల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణంలో ఏకంగా 70 సార్లు కానుకల చోరీ జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు బృందం నిర్ధారించింది.ప్రతీ రూపాయిపై ఏఐ కన్ను!ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవాలని సిట్ భావిస్తోంది. దీనికోసం సిఫార్సు చేయనున్న ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థ ప్రధానంగా కొన్ని అంశాలపై పనిచేయనుంది.హుండీ నిర్వహణ - పారదర్శకత: భక్తులు సమర్పించే నగదు, విలువైన వస్తువుల సేకరణ నుంచి భద్రపరిచే వరకు ప్రతి దశను ఏఐ కెమెరాలు నిశితంగా పరిశీలిస్తాయి.కౌంటింగ్ ప్రక్రియపై ప్రత్యేక నిఘా: విరాళాల లెక్కింపు సమయంలో జరిగే అనుమానాస్పద కదలికలను, చేతివాటాన్ని ఈ వ్యవస్థ తక్షణమే పసిగట్టి అధికారులను అలర్ట్ చేస్తుంది.అనుమానితుల గుర్తింపు: ఆలయ పరిసరాల్లో పదే పదే తిరిగే వ్యక్తులు లేదా అనుమానాస్పద ప్రవర్తన కలిగిన వారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందే గుర్తించి భద్రతా సిబ్బందికి సమాచారం అందిస్తుంది.త్వరలోనే సిట్ తుది పరిశీలనతుది నివేదిక సమర్పణకు ముందు సిట్ సభ్యులు మరోసారి అయోధ్యను సందర్శించనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులతో పాటు ఆలయ విరాళాల నిర్వహణ సిబ్బందిని అదనపు రికార్డుల ఆధారంగా ప్రశ్నించనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రస్ట్ సైతం తమ అంతర్గత విరాళాల సేకరణ, లెక్కింపు విధానాలను పునసమీక్షించే పనిలో పడింది. ప్రపంచవ్యాప్త భక్తుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న అయోధ్య రామాలయంలో ప్రతీ రూపాయి భద్రంగా ఉండేలా చూసేందుకు అక్కడి ప్రభుత్వం ఈ మెగా టెక్ అప్డేట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం..
కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
ఫ్యామిలీ
ఆ ప్రాంతం పేరు వింటే ఇప్పటకీ భయమే..! నేటికీ అది మిస్టరీనే..
మనిషి ఎంత అన్వేషించినా ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని ప్రపంచంలోని కొన్ని వింత ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని నేటికీ అంతు చిక్కని మిస్టరీలానే మిగిలిపోయాయి. ఆఖరికి సైన్సుకి, టెక్నాలజీ సైతం ఆ ప్రాంతాల వద్దకు వచ్చేటప్పటికీ చతికిలపడ్డాయని చెప్పొచ్చు. అందుకు ప్రధాన కారణం ఇక్కడ జరిగిన ఎన్నో విచిత్రమైన సంఘటనలే. ఈ ప్రాంతంలో ప్రవేశించిన కొన్ని షిప్స్ విమానాలు అకస్మాతుగా తమ కమ్యూనికేషన్ కోల్పోయి అదృశ్యమయ్యాయి. ఎందువల్ల ఇలా జరుగుతుందని అప్పటికప్పుడూ రెస్కూ చర్యలు చేపట్టేందుకు పంపిన మరో ఓడ సైతం తనలోకి లాగేసుకుంది. చివరికి వాటి శకలాలు అదృశ్యమైన ప్రదేశంలో కాకుండా వందల కిలోమీటర్ల దూరంలో కనిపించాయి. అయితే ఇందులో ప్రయాణించిన మనుషుల జాడ మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అంతేగాదు ఈ ప్రాంతం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు సముద్ర గర్భంలో ఒక భారి వర్టెక్స్(సుడిగాలి) ఉందని, మరికొందరు అక్కడ ఏదో అదృశ్య శక్తి ఉందని..ఇలా ఏవేవో కథనాలు కల్పించేస్తుంటారు. ఆ ప్రాంతమే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఫ్లోరిడా ప్యూటోరికో బెర్మిడా దీవులను కలుపుతూ ఏర్పడే ఒక ఊహాజనిత త్రిభుజ ఆకార ప్రాంతమైన బర్మిడా ట్రయాంగల్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?. ఎందుకు ఆ ప్రాంతానికి 5 లక్షల చెదరపు మైళ్ల పరిధిలో వందల సంఖ్యలో నౌకలు, విమానాలు ఆనవాలు లేకుండా మాయమైపోయాయి, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు?. నిజంగానే ఇది సైన్స్ ఇంకా పూర్తిగా చేదించలేని ఒక మిస్టరీనా లేక మానవ మేదస్సుకు అందని రహస్యమా తదితర విశేషాల గురించి ఈ కింది వీడియోపై క్లిక్ చేయండి. (చదవండి: ఐఐటీ నేపథ్యం కాదు..కానీ ఏకంగా యూఎస్ ఎన్విడియాలో రూ. 2.6 కోట్ల జీతం)
ఈ ఆదివారం పసందైన వంటకాలు ట్రై చేయండిలా..!
మూలీ పరాఠాకావలసినవి: ముల్లంగి తురుము: 2 కప్పులు, గోధుమ పిండి: 3 కప్పులు, పచ్చిమిర్చి తరుగు: టీస్పూన్, అల్లం తురుము: టీస్పూన్, కారం: 1/2 స్పూన్, వాము: 1/2 స్పూన్, జీలకర్ర పొడి: 1/2 స్పూన్, గరం మసాలా: పావు చెంచా, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడా, నెయ్యి లేదా నూనె: పరాఠాలు కాల్చడానికి.తయారీ: ముల్లంగి తురుములో కొద్దిగా ఉప్పు కలిపి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఉప్పు వేయడం వల్ల ముల్లంగిలోని నీరంతా బయటకు వస్తుంది. ఆ తర్వాత ఒక కాటన్ బట్టలో లేదా చేతులతో ముల్లంగి తురుమును గట్టిగా పిండి, నీటిని పూర్తిగా వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, ఒక చెంచా నూనె వేసి, ముల్లంగి తురుమును పిండగా వచ్చిన నీటిని ఉపయోగించి చపాతీ ముద్దలా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత నీరు తీసేసిన ముల్లంగి తురుములోకి పచ్చిమిర్చి, అల్లం తురుము, వాము, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని చిన్న పూరీలా ఒత్తి, దాని మధ్యలో రెండు చెంచాల ముల్లంగి మిశ్రమాన్ని ఉంచాలి. ఇప్పుడు చుట్టూ ఉన్న పిండిని పైకి తెచ్చి స్టఫింగ్ను పూర్తిగా క్లోజ్ చేయాలి. ఆ తర్వాత పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా తయారుచేసుకున్న వాటిని పెనంపై వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి. కాల్చేటప్పుడు నెయ్యి లేదా నూనె రాస్తే పరాఠాలు రుచిగా వస్తాయి.స్టఫ్డ్ డేట్స్ కావలసినవి: ఖర్జూరాలు: 15–20, బాదం పప్పులు: 10, జీడిపప్పు: 10, పిస్తా పప్పులు: స్పూన్ (సన్నని తరుగు), పీనట్ బటర్ లేదా ఆల్మండ్ బటర్: 4 స్పూన్లు, డార్క్ చాక్లెట్: 1/2 కప్పు, సీ సాల్ట్ : ఒక చిటికెడు, (టేస్ట్ పెంచడానికి)తయారీ: ముందుగా ఖర్జూరాలను తడి బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు ప్రతి ఖర్జూరాన్ని ఒక వైపు మాత్రమే చాకుతో నిలువుగా కట్ చేసి, లోపల ఉన్న గింజను జాగ్రత్తగా తీసేయాలి. ఖర్జూరం రెండు ముక్కలుగా విడిపోకుండా కేవలం మధ్యలో పాకెట్ లాగా ఓపెన్ అవ్వాలి. ఒక చిన్న పాన్లో నూనె లేదా నెయ్యి లేకుండా బాదం, జీడిపప్పులను లో–ఫ్లేమ్పై దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గింజ తీసేసిన ప్రతి ఖర్జూరం మధ్యలో పావు చెంచా పీనట్ బటర్ను నింపాలి. ఆ తర్వాత దానిపై ఒక వేయించిన బాదం పప్పు, ఒక జీడిపప్పు ముక్కను గట్టిగా నొక్కి పెట్టాలి. చివరగా పైభాగంలో సన్నగా తరిగిన పిస్తా ముక్కలు, ఒక చిటికెడు సీ సాల్ట్ చల్లాలి. చివరిగా ఈ స్టఫింగ్ చేసిన ఖర్జూరాలను కరిగించిన డార్క్ చాక్లెట్లో ముంచి, ఒక ప్లేట్లో పెట్టి 15 నిమిషాల పాటు ఫ్రిజ్లో ఉంచాలి. చాక్లెట్ గట్టిపడిన తర్వాత ఇది హోమ్మేడ్ క్యాండీ బార్ లాగా మారుతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో దాచుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి.కుర్కురీ భేండికావలసినవి: శెనగపిండి: 4 స్పూన్లు, వరిపిండి: 2 చెంచాలు, కారం: స్పూన్, పసుపు: పావు చెంచా, ధనియాల పొడి: స్పూన్, జీలకర్ర పొడి: 1/2 స్పూన్, నిమ్మరసం: స్పూన్, వాము: 1/2 స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: డీప్ ఫ్రైకి తగినంత.తయారీ: ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి, పొడి కాటన్ బట్టతో తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు వాటికి ఇరువైపులా తొడిమలు తీసేసి, నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని, ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, వాము వేసి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో శెనగపిండి, వరిపిండి చల్లి చేతులతో కలుపుతూ పిండిని బెండకాయ ముక్కలకు బాగా పట్టించాలి. బెండకాయలో ఉండే సహజమైన తేమ వల్ల పిండి ముక్కలకు అంటుకుంటుంది. ఇపుడు బాండీలో నూనె పోసి బాగా కాగాక, సిద్ధం చేసుకున్న బెండకాయ ముక్కలను విడివిడిగా వేస్తూ, మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. బెండకాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి, కరకరలాడే వరకు వేయించి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే వేడివేడి కుర్కురి భేండి సిద్ధం. ఈ ముక్కలపై కొద్దిగా చాట్ మసాలా చల్లుకుని, కొన్ని చుక్కల నిమ్మరసం పిండుకుని తింటే రుచి అమోఘంగా ఉంటుంది.(చదవండి: 'వాకింగ్'కి అత్యంత అనుకూలమైన నగరం అదే..!)
'వాకింగ్'కి అత్యంత అనుకూలమైన నగరం అదే..! కానీ హారన్ కొట్టారో..
నగరాల్లో వాకింగ్ వెళ్లాలంటే విసుగొచ్చేస్తుంది. కొద్ది దూరం నడిచేటప్పటికే అలసట, చికాకు అన్ని వచ్చేస్తాయి. ఎందుకంటే రద్దీగా ఉండే రహదారులు, వీధులు, ఓ పక్క హారన్ మోతలలో హోరెత్తిపోతుంది. కాబట్టి హాయిగా నడవడం చాలా కష్టం. ఏ పార్క్ లేదా చక్కటి ఉద్యానవనం లాంటి ప్రదేశాల్లోనే ప్రశాంతంగా వాకింగ్ చేయగలం అంతే. కానీ భారత్లోనే ఓ నగరం వాకింగ్ అత్యంత అనుకూలమైంది. అక్కడ నడిస్తే ఎంత హాయిగా అనిపిస్తుందంటే..అలసట కూడా తెలియదు. మన దేశంలో ఎక్కడుందంటే ఆ నగరం..పట్టణ ప్రాంతాలు ఎల్లప్పుడూ వాకింగ్కి అనుకూలంగా ఉండవనేది తెలిసిందే. భారత్లో ప్రతిచోటా ట్రాఫిక్, మరోవైపు ఫుట్పాత్లపై కూడా ద్విచక్రవాహనాలు దర్శనం ఇవ్వడంతో..నడకకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలే లేని ప్రశాంతమైన నగరం భారత్లో ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ట్రావెల్ వ్లాగర్ తాన్య ఖనిజో ఆ నగరం గురించి నెటింట షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చంది. ఆమె తన వీడియోకి ‘భారతదేశంలో అత్యంత నడవడానికి అనువైన నగరం’ అనే క్యాప్షన్ జోడించి మరి ఆ నగరం విశేషాల గురించి వీడియోలో వివరించారు. అది ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంత రాష్ట్రమైన సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ అని పేర్కొంది. తాన్యా పోస్ట్లో తన అభిప్రాయంలో, భారతదేశంలో అత్యంత నడవడానికి అనువైన నగరం ఇదే అని రాశారు. ఈ గ్యాంగ్టక్ భారతదేశంలోని పట్టణ నగరాలలో ప్రత్యేకంగా నిలిచే, పాదచారులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానం. నగరంలోని ఎత్తైన నడక మార్గాలు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయని చెప్పుకొచ్చింది. తాను ఇప్పటి వరకు వెళ్లిన నగరాలలో నడవడానికి అనుకూలమైన నగరం ఇదే. ఇక్కడ ట్రాఫిక్కు అంతరాయం కలిగించని, అంతరాయం లేని ఎత్తైన ఫుట్పాత్లు చాలానే ఉన్నాయన్నారు. నడుస్తున్నప్పుడు ఎంతో హాయిగా సురక్షితంగా ఉంటుందన్నారు. ఒకవేళ హారన్ కొట్టారో ఏకంగా రూ. 1000 జరిమానా పడుతుందని తెలిపింది. అందువల్ల ఈ నగరం ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిందని వెల్లడించింది. ఈ నగరం ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన సుదీర్ఘ నడకలను ప్రోత్సహిస్తుందని, అందువల్లే తాను తెలియకుండానే అరగంటపైనే నడిచానని సంబరంగా చెప్పింది. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఇబ్బందికరమైన చూపులు లేదా వేధింపులకు గురికాకపోవడం వల్ల సురక్షితంగా భావిస్తారని పేర్కొంది. మహిళలు సోలాగా వాక్ చేయాలనుకుంటే ఈ నగరమే అత్యంత అనుకూలమైందని అంటోంది. చివరగా వ్లాగర్ తాన్య నడవడానికి అనువైన ప్రాంతాల విషయంలో ఇంతటి ఉన్నత ప్రమాణాలు, మహిళల ప్రదేశాలకు ఇచ్చే గౌరవం, సామాన్య ప్రజల అవసరాలపై అవగాహన తదితరాలను చూసి ఆశ్చర్యంగా అనిపిస్తోందని అంటోంది. నగరాలన్ని ఇలానే ఉంటే బాగుండును అంటూ తన వీడియోని ముగించింది. నెటిజన్లు కూడా నగరాన్ని అందరికీ నివాసయోగ్యంగా మార్చడానికి గ్యాంగ్టక్ చూపిస్తున్న నిబద్ధతను ప్రశంసించగా, మరికొందరు ప్లీజ్ దీని గురించి మరి ఎక్కువగా ప్రచారం చేయకండి, లేదంటే ప్రజలంతా తండొపతండాలుగా వచ్చి ఆ ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని కూడా పాడుచేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Tanya Khanijow (@tanyakhanijow) (చదవండి: ఐఐటీ నేపథ్యం కాదు..కానీ ఏకంగా యూఎస్ ఎన్విడియాలో రూ. 2.6 కోట్ల జీతం)
ముఖవర్చస్సు కోసం..!
వయసు పైబడే కొద్దీ ముఖంపై మార్పులు రావడం సహజం. ముఖ్యంగా కళ్ల కింద వాపులు, పెదవుల చుట్టూ వచ్చే ముడతలు చాలా మందిని వేధించే ప్రధాన సమస్య. ఈ వృద్ధాప్య ఛాయలను తొలగించి, ముఖాన్ని మళ్లీ యవ్వనవంతంగా మార్చేందుకు బ్యూటీ రంగంలో సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అదే మైక్రోకరెంట్ లైన్–స్మూతింగ్ టెక్నాలజీతో పనిచేసే ‘బేర్ 2 ఐస్ అండ్ లిప్స్’ డివైజ్. ఈ సరికొత్త హ్యాండ్హెల్డ్ డివైజ్ ఇప్పుడు సౌందర్య ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఫేస్లో అత్యంత సున్నితంగా ఉండే కళ్ల చుట్టూ ఉన్న చర్మం, పెదవుల రక్షణే ధ్యేయంగా ఈ పరికరం పనిచేస్తుంది. కేవలం చర్మం పైపైన మాత్రమే కాకుండా, లోపలి కండరాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ డివైజ్ నుంచి వెలువడే అత్యల్ప విద్యుత్ ప్రవాహం చర్మంలో కొలాజెన్, ఎలాస్టిన్ అనే ప్రొటీన్ల ఉత్పత్తిని వేగవంతం చేసి, చర్మానికి మంచి బిగుతును అందిస్తుంది. ముఖంలో రక్త ప్రసరణను పెంచి, చర్మ కణాలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. ముఖంలో పేరుకుపోయిన అదనపు నీరు, వ్యర్థాలను తొలగించి, కళ్ల కింద వచ్చిన వాపును తక్షణమే తగ్గేలా చేస్తుంది.పచ్చరాయితో ఫేస్ రోలర్!చైనా రాజకుటుంబీకులు తమ సౌందర్యాన్ని పెంచుకోవడానికి సహజ సిద్ధంగా లభించే జేడ్ రత్నాలతో తయారు చేసిన రోలర్స్తో మసాజ్ చేసుకునేవారు. ముఖంపై ముడతలు తగ్గించడానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఉపయోగించే ఈ రోలర్ వెనుక సుమారుగా 1300 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ జేడ్ రోలర్లు అప్పట్లో కేవలం రాణులు, ఉన్నత వర్గాల మహిళలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. చైనాను సుదీర్ఘకాలం పాలించిన ప్రసిద్ధ మహారాణి సిక్సీ ప్రతిరోజూ ఈ జేడ్ రోలర్ను ఉపయోగించేది. జేడ్ రత్నానికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ, ఇది ఎల్లప్పుడూ చల్లగానే ఉంటుంది. ఈ చల్లదనం ముఖంలోని రక్తనాళాలను సంకోచింపజేసి, చర్మంపై వచ్చే ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ ముఖంపై మసాజ్ చేయడం వల్ల ముఖ కండరాలు దృఢపడి, కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, ముడతలు తగ్గుతాయి.వర్షంలో తడుస్తున్నారా? వర్షాకాలంలో తలలో జిడ్డు, మురికి త్వరగా పేరుకుపోతాయి. అందువల్ల జుట్టు తత్వానికి సరిపోయే మైల్డ్ షాంపూతో క్రమం తప్పకుండా తలస్నానం చేయాలి. అలాగే వర్షంలో తడవడం సరదాగా అనిపించినా, వాన నీటిలోని ఆమ్లాలు, కాలుష్య కారకాలు జుట్టును దెబ్బతీస్తాయి. ఒకవేళ అనుకోకుండా వానలో తడిస్తే, వెంటనే మంచినీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా రెయిన్కోట్ తప్పనిసరిగా వాడాలి. ఈ సీజన్లో జుట్టును స్ట్రెయిటెనింగ్ చేయడం కోసం హీటింగ్ టూల్స్ ఉపయోగించడం వల్ల్ల జుట్టు మరింత బలహీనపడి తెగిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కేవలం పైపూతలే కాకుండా, పోషకాహారం కూడా ముఖ్యమే!(చదవండి: ధగ ధగ మెరిసే ఆభరణాలు లేకుండానే..పెళ్లికూతురు రూపం!)
అంతర్జాతీయం
ఉక్రెయిన్ ప్రధాని యూలియా రాజీనామా
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తన ప్రభుత్వంలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మహిళా ప్రధాని యూలియా స్విరిడెంకో ఆదివారం రాజీనామా చేశారు. రష్యాతో యుద్ధం కొనసాగుతుండటంతో పదవీ కాలం ముగిసినప్పటికీ రాజ్యాంగం ప్రకారం జెలెన్స్కీ పదవిలో కొనసాగుతున్నారు. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో యూలియా అమెరికాతో ఖనిజ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ ఒప్పందం తర్వాత ఆమె 2025 జూలైలో తన 39వ ఏట ప్రధానిగా నియమితులయ్యారు. తనకు మరింత కీలకమైన పదవిని ఇస్తానంటూ జెలెన్స్కీ వాగ్దానం చేసినట్లు రాజీనామా అనంతరం యూలియా సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే, ఆ పదవి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఉక్రెయిన్ రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటోందంటూ యూలియా స్విరిడెంకో రాజీనామా నేపథ్యంలో జెలెన్స్కీ ప్రకటించడం గమనార్హం. ముఖ్యమైన అంతర్జాతీయ భాగస్వామి దేశంతో సంబంధాలను మెరుగుపర్చుకునే విషయంలో ఆమెకు అత్యంత కీలకంగా వ్యవహరించే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రభుత్వంలోని ఇతర విభాగాల్లోనూ భారీగా మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంధన మంత్రి డెనిస్ ష్మిహాల్, అంతర్గత శాఖ మంత్రి ఇహోర్ క్లిమెంకో, రక్షణ మంత్రి మైఖెయిలో ఫెదొరొవ్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. కాగా, రష్యా దురాక్రమణ మొదలైన తర్వాత నాలుగేళ్లలో ఇది నాలుగో కీలక ప్రక్షాళన కానుంది.
బ్రహ్మపుత్ర మెగా డ్యామ్కు ముప్పు!
బీజింగ్: టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్ కింద ఉన్న ఒక క్రియాశీల ఫాల్ట్ లైన్ ఆ ప్రాజెక్టు నిర్మాణ స్థిరత్వాన్ని ప్రభావితం చేయగలదని చైనా భూగర్భ శాస్త్రవేత్తలు జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. అయితే, ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో విపత్తులను నివారించడంలో తోడ్పడుతుందని చైనా చెబుతోంది. ఈ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లోని భారత సరిహద్దుకు సమీపంలోనే ఉంది. తూర్పు హిమాలయ ప్రాంతంలోని ఎర్త్ క్రస్ట్లో ఏర్పడిన పగులు ఈ భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు మౌలిక సదుపాయాల నిర్మాణ సమగ్రతను గణనీయంగా ప్రభావితం చేయగలదని శాస్త్రవేత్తలు చెప్పినట్లు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పత్రిక వెల్లడించింది. ఈ పగులు జలాశయ ప్రాంతంతో పాటు ఆనకట్టలు, రోడ్లు, వంతెనలు, సొరంగాల వంటి సమీప నిర్మాణాలు, వాటి స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సైంటిస్టులు అంచనాకొచ్చారు. దీర్ఘకాలిక భూకంప పగుళ్ల కారణంగా చుట్టుపక్కల ఉన్న శిలా నిర్మాణాలు పగిలి, బలహీనపడ్డాయి. దీనివల్ల సమీపంలోని ఇంజనీరింగ్ ప్రాజెక్టుల పునాదులు, నిర్మాణ స్థిరత్వం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంది. చైనా గత జూలైలో టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై 167.8 బిలియన్ డాలర్ల వ్యయంతో ఆనకట్ట నిర్మాణాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఇక్కడ ఏటా 300 బిలియన్ కిలోవాట్ అవర్కు పైగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తారని అంచనా.
మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా
దుబాయ్: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఒమన్ తీరంలో హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ‘జీఎఫ్ఎస్ గెలాక్సీ’పై ఇరాన్ సైన్యం దాడికి దిగింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. వారిలో 10 మందిని రక్షించగా, ఒకరు గల్లంతయ్యారు. అతడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో మొత్తంగా 23 మందిని కాపాడారు. వాణిజ్య నౌకపై ఇరాన్ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. గల్లంతైన నావికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. మస్కట్లోని ఒమన్ అధికారులతో కలిసి ఇండియన్ ఎంబసీ గాలింపు చర్యలను సమీక్షిస్తోంది. ఇరాన్ దాడిలో నౌక వెంటనే మంటల్లో చిక్కుకుంది. హార్మూజ్ జలసంధిని మరోసారి మూసివేసినట్లు ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు హెచ్చరికగా జరిపిన దాడికి ఇరాన్ అభివర్ణించింది. ఈ దాడిలో సైప్రస్ జెండా కలిగిన జీఎఫ్ఎస్ గెలాక్సీ నౌక అగి్నకి ఆహూతయ్యింది. హార్మూజ్లో అది అనుమతి లేని మార్గంలో ప్రయాణిస్తోందని ఇరాన్ పేర్కొంది. ఈ ఘటన పట్ల ఎవరైనా ప్రతీకార చర్యకు దిగితే తమ ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు జీఎఫ్ఎస్ గెలాక్సీపై జరిగిన దాడిని కారణంగా చూపుతూ అమెరికా సైన్యం ఇరాన్పై మరో విడత దాడులు చేపట్టింది. ఈ వారంలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడుల్లో ఇది మూడోది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్లోని సుమారు 140 సైనిక లక్ష్యాలపై అమెరికా దాడులుచేసింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ స్థావరాలు, నౌకాదళ సామర్థ్యాలు, మందుగుండు సామగ్రి నిల్వ సౌకర్యాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, తీరప్రాంత నిఘా కేంద్రాలపై దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం వెల్లడించింది. ఇరాన్లోని అత్యంత కీలకమైన ఖెష్మ్ దీవిపై ఆదివారం మధ్యాహ్నం నుంచి వరుస దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఇరాన్ అధికార వార్తా సంస్థ ఈ విషయం ప్రకటించింది. దీవిలోని సైనిక లక్ష్యాలపై కనీసం డజను దాడులు జరిగినట్లు తెలిపింది. ఇరాన్ ప్రతిదాడులు అమెరికా తాజా దాడుల పట్ల ఇరాన్ వెంటనే ప్రతిచర్యకు దిగింది. ఆదివారం ఉదయం బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, ఒమన్లపై వైమానిక దాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకున్నట్లు ఖతార్ సైన్యం ప్రకటించింది. పొరుగున ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఖతర్లో ఇరాన్ దాడులను అడ్డుకునే క్రమంలో పడిన గగనతల రక్షణ వ్యవస్థ శకలాల కారణంగా ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఇరాన్ క్షిపణులను మధ్యలోనే ధ్వంసం చేశామని కువైట్ వెల్లడించింది. అమెరికా దూకుడుపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నౌకలు అనుమతి లేని మార్గాల్లో ప్రయాణిస్తున్నాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆరోపించింది. వాటిలో ఒకనౌకపై ముందస్తు హెచ్చరికగా కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపింది. హార్మూజ్ను మూసేశామని పేర్కొంది. అయితే హార్మూజ్ తెరచే ఉందని అమెరికా పేర్కొంది. వచ్చేవారం జనం ముందుకు మొజ్తబా! ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వచ్చేవారం ప్రజల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంస్మరణ సభను వచ్చేవారం నిర్వహించబోతున్నట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 23న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల దాకా ఈ సభ జరుగనుంది. అయితే, ఈ కార్యక్రమానికి మొజ్తబా హాజరవుతారా? లేదా? అనే దానిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.నౌకలపై ఎలాంటి ఆంక్షలు వద్దు: భారత్ హార్మూజ్లో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతుండటంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని, ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనేలా దౌత్యపరమైన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలను విజయవంతంగా ముగించాలని విన్నవించింది. హార్మూజ్లో నౌకలపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని స్పష్టంచేసింది. వాణిజ్య నౌకాయానం, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే ఆపాలని పేర్కొంది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుతమైన. నిరాటంకమైన నౌకాయానం, వాణిజ్యాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరింది.
ఖతార్లో నాలుగు రోజులు సెలవులు
దోహా: ఖతార్ మాజీ అమీర్ (ఫాదర్ అమీర్) షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) మరణంతో ఆ దేశం నాలుగు రోజుల అధికారిక సంతాపాన్ని ప్రకటించింది. జూలై 12 నుంచి సంతాప దినాలు అమల్లోకి వచ్చాయని ఖతార్ అమిరీ దివాన్ వెల్లడించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాలను అవనత స్థితిలో ఎగురవేయనున్నారు. అలాగే జూలై 13 నుంచి మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ బాడీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులు జూలై 19న తిరిగి విధుల్లో చేరనున్నారు.1995 నుంచి 2013 వరకు ఖతార్ను పాలించిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీని ఆధునిక ఖతార్ రూపశిల్పిగా వ్యవహరిస్తారు. సహజ వాయువు (LNG) వనరులను సమర్థంగా వినియోగించి ఖతార్ను ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. ఆయన హయాంలోనే ‘అల్ జజీరా’ మీడియా నెట్వర్క్ స్థాపించబడింది. 2022 ఫిఫా ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు సాధించడం, ఖతార్ను అంతర్జాతీయ దౌత్య, పెట్టుబడులు, క్రీడా రంగాల్లో కీలక కేంద్రంగా నిలబెట్టడం ఆయన నాయకత్వంలోని ప్రధాన విజయాలుగా భావిస్తారు.2013లో అరుదైన నిర్ణయం తీసుకుంటూ స్వచ్ఛందంగా అధికారాన్ని తన కుమారుడు, ప్రస్తుత అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి అప్పగించారు. ఆ తర్వాత కూడా దేశ అభివృద్ధికి మార్గదర్శకుడిగా కొనసాగారు. ఆయన మృతిపై ప్రపంచ దేశాధినేతలు సంతాపం వ్యక్తం చేస్తుండగా, భారత ప్రభుత్వం కూడా ఒక రోజు జాతీయ సంతాపాన్ని ప్రకటించి జాతీయ పతాకాన్ని అవనత స్థితిలో ఎగురవేయాలని నిర్ణయించింది.
జాతీయం
చిన్నగొడవ, భర్తను మొబైల్తో కొట్టింది.. అంతే..!
ఒడిశాలోని బోలాంగిర్ జిల్లాలో జరిగిన ఒక ఘటన కలకలం రేగింది. కుటుంబ గొడవలో భాగంగా భార్య మొబైల్ ఫోన్తో తలపై గట్టిగా కొట్టడంతో ఓ భర్త మృతి చెందాడు. స్వల్ప వివాదం విషాదానికి దారితీయడంతో స్థానిక నివాసితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.అసలేం జరిగిందంటేపోలీసుల సమాచారం ప్రకారం శనివారం భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో స్వల్ప వివాదం రేగింది. ప్రారంభమైంది. ఇది కాస్తా ముదరడంతో ఆగ్రహానికి గురైన భార్య, భర్త తలపై మొబైల్ ఫోన్తో బలంగా కొట్టింది. దీనితో ఆయన తలకు తీవ్ర గాయమైంది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం బోలాంగిర్ జిల్లా ప్రధాన ఆసుపత్రి (DHH)కి తరలించారు. అక్కడ అతనికి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. చికిత్స అనంతరం అతని ఆరోగ్యం మెరుగుపడిందని భావించిన వైద్యులు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు.అకస్మాత్తుగా క్షీణించిన ఆరోగ్యంఅయితే, ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు మళ్లీ ఆయనను అత్యవసర చికిత్స కోసం జిల్లా ప్రధాన ఆసుపత్రికి పరుగుపరుగున తీసుకువెళ్లారు. వైద్యులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు వారి మధ్య గొడవకు దారి తీసిన కారణాలేంటి? అతని మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఏంటి అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణం స్పష్ట మవుతుందని అధికారులు తెలిపారు. దర్యాప్తులో తేలిన నిజాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?
బద్రీనాథ్ విరాళాల చోరీ: సస్పెండైన ఉద్యోగి అరెస్ట్
డెహ్రాడూన్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయ విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కీలక పురోగతి సాధించింది. బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ)కి చెందిన సస్పెండైన ఉద్యోగి ప్రమోద్ నౌటియాల్ను ‘సిట్’ సోమవారం అరెస్ట్ చేసింది. డెహ్రాడూన్లో నిందితుడిని అదుపులోకి తీసుకుని, సుమారు గంటపాటు విచారించిన అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని గోపేశ్వర్ కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి కోరనున్నట్లు పోలీసులు తెలిపారు.జూలై 2న ఆలయ విరాళాల లెక్కింపు సమయంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై బీకేటీసీ ఇన్ఛార్జ్ టెంపుల్ ఆఫీసర్ యుధ్వీర్ పుష్పవాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బద్రీనాథ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆలయ సీసీటీవీ విజువల్స్ పరిశీలించగా.. నిందితుడు నౌటియాల్ రూ.500, రూ.100 కరెన్సీ నోట్ల కట్టలు, బంగారు, వెండి నాణేలు, శాలిగ్రామ శిలలు, భక్తుల కానుకల కవర్లను అనుమానాస్పదంగా దాచడం, దొంగిలించడం బయటపడింది. లెక్కింపు గదికి, తన కార్యాలయానికి మధ్య నిందితుడు పలుమార్లు తిరిగినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా స్పష్టమైంది.మరోవైపు, తన సస్పెన్షన్ను, ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ నౌటియాల్ ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించాలని బీకేటీసీని ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను జూలై 16కు వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ కేసుపై రాష్ట్ర పోలీసులు, ‘సిట్’తో పాటు గర్వాల్ కమిషనర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు జరుపుతున్నాయి.ఇది కూడా చదవండి: ‘కార్తికేయ’ నటుడి వ్యాఖ్యలపై మాజీ సీఎం ఫైర్!
అయోధ్య విరాళాల చోరీ కేసు : సుప్రీం నోటీసులు
అయోధ్య రామాలయం విరాళాల వివాదానికి సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విరాళాల చోరీ కేసు పై విచారణలో సుప్రీం ప్రతి వాదులకు నోటీసులు జారీచేసింది. అలాగే సిట్ దర్యాప్తు స్టేటస్ రిపోర్టు ఫైల్ చేయాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదావేసింది. విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్ ద్వారా దర్యాప్తు జరుపుతోందని కోర్టుకు తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.అయోధ్య రాముడి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ (CBI) స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను (PILs) సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు పునఃప్రారంభమైన మొదటి రోజే ఈ కీలకమైన కేసు విచారణకు రావడం గమనార్హం.రామాలయ నిర్మాణం కోసం సేకరించిన ప్రజా విరాళాలను దుర్వినియోగం చేశారని, నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ న్యాయవాదులు, ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ సహా మరికొందరు వేర్వేరుగా ఈ పిటిషన్లను దాఖలు చేశారు. ఇందులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరుపుతోంది.అయితే, సంక్లిష్టమైన ఆర్థిక నేరాలను దర్యాప్తు చేయడానికి అవసరమైన ఫోరెన్సిక్ మరియు తగిన వనరులు రాష్ట్ర సిట్ (SIT) వద్ద లేవని, పైగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే దర్యాప్తు ప్రారంభించారని పిటిషనర్లు వాదన.దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయం కావడంతో, దీనిపై సీబీఐ నేతృత్వంలో నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని, అలాగే ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలపై కాగ్ (CAG) లేదా స్వతంత్ర సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని కూడా కోరారు.ఇదీ చదవండి: 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?
‘కార్తికేయ’ నటుడి వ్యాఖ్యలపై మాజీ సీఎం ఫైర్!
న్యూఢిల్లీ: అయోధ్య రామాలయం విరాళాల చోరీ వివాదంపై బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఆయన ‘ఎక్స్’ వేదికగా పరోక్షంగా ఒక ఆసక్తికరమైన సందేశాన్ని పంచుకున్నారు.‘నా సమాధానం ఒక్కటే..’తాజా పోస్టులో అనుపమ్ ఖేర్ .. ‘కొన్ని అంశాలపై నేను ఇంత నిర్భయంగా ఎలా మాట్లాడగలుగుతున్నానని, నా జనాదరణ తగ్గిపోతుందనే భయం నాకు లేదా అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. దానికి నా సమాధానం ఒక్కటే.. నేను ప్రతి ఒక్కరినీ సంతోష పెట్టడానికి ప్రయత్నించను. జీవితంలో అందరినీ సంతోషంగా ఉంచడం అత్యంత కష్టమైన పని. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఇష్టుడిగా మారిన వ్యక్తి ఎవరూ లేరు’ అని పేర్కొన్నారు.అందరికీ ఇష్టమైన వారిగా మారాలని ప్రయత్నిస్తే, జనం తమ సౌకర్యాన్ని బట్టి మనల్ని వాడుకోవడం మొదలుపెడతారని ఆయన అన్నారు. ‘నా జీవితంలో ఒక సిద్ధాంతం ఉంది. ముందుగా మీకు మీరే ఇష్టులుగా మారండి. ప్రతిరోజూ ఉదయం అద్దంలో చూసుకున్నప్పుడు నేను మంచి వ్యక్తినే అని మీకు అనిపించాలి. ఒకవేళ ఏదైనా తప్పుగా అనిపిస్తే మార్చుకోండి. ఆ మార్పు మీ కోసమే కావాలి.. ప్రపంచం కోసం కాదు. మీ గురించి అత్యుత్తమమైన విషయం మీరే. మీ తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఆప్తమిత్రులు మిమ్మల్ని ప్రేమిస్తే, మీకు ఇప్పటికే ప్రజాదరణ పత్రం లభించినట్లే. మిగిలిన విషయాలేవీ ముఖ్యం కాదు’ అని ఖేర్ రాసుకొచ్చారు.అసలు వివాదం ఏంటి?అయోధ్య రామాలయ విరాళాల నిధుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ వివాదంపై అనుపమ్ ఖేర్ తన రాబోయే చిత్రం 'శ్రీరామ భూమి' ప్రమోషన్ల కోసం అయోధ్యను సందర్శించినప్పుడు స్పందించారు. ఈ నిధుల దుర్వినియోగాన్ని ఒక ‘చిన్న సమస్య’ లేదా ‘చిన్న పొరపాటు’ గా అభివర్ణిస్తూ.. గతంలో మొఘలుల కాలంలో హిందూ దేవాలయాలను లూటీ చేసిన, ధ్వంసం చేసిన చారిత్రక ఉదంతాలతో దీనిని పోల్చారు. కేవలం ఈ ఒక్క ఘటన ఆధారంగా ఆలయాన్ని లేదా సనాతన ధర్మాన్ని నిందించవద్దని, దొంగతనం చేసిన వారిని మాత్రమే నిందించాలని ఆయన కోరారు.రాజకీయ దుమారంఈ పోలికపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడమే కాకుండా, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘దొంగను ఏమీ అనకూడదంటూ, దొంగతనాన్ని బట్టబయలు చేసిన వారికి హితబోధలు చేయడం విచిత్రమైన వాదన అని అన్నారు. దొంగలపై ఇంత సానుభూతి చూపించడం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది’ అని అనుపమ్ ఖేర్ను ఉద్దేశిస్తూ అఖిలేష్ విమర్శించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తెలుగులో ‘కారికేయ-2’లో కీలక పాత్ర పోషించారు.
ఎన్ఆర్ఐ
విదేశాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం: మహానేత, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వ ర్యంలో జోహన్నెస్బర్గ్లోని మిడ్రాండ్లో జరిగిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షత వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి అన్నదానం చేపట్టారు. కెనడాలోని టొరొంటో నగరంలో వైభవంగా వైఎస్సార్ జయంతి వేడుకలు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బి వెంకట సుబ్బా రెడ్డి , వాసు సింగారెడ్డి , వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఎనుముల, శ్రీకృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ , శ్రీమతి కల్పన జోసెఫ్, శివమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు కెనడాలో.. కెనడాలోని టొరంటోలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అలూరు సాంబశివరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, కార్తీక్ ఎల్లాప్రగడ, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ చింతా, పార్టీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు వర్చువల్గా పాల్గొన్నారు. టొరంటోలో జరిగిన కార్యక్రమంలో నరసింహ రెడ్డి గుట్టిరెడ్డి, చెన్న కేశవ, ప్రతాప్ బొల్లారం, ఆరిఫ్, నూర్, శ్రీనివాస్ రెడ్డి మరెక్కగారి, చంద్రహాస్ చల్లా, శాలిని బెక్కం, కృష్ణ రెడ్డి అల్లంపాటి, కృష్ణ చిదిరాల, శ్రీకాంత్ మద్దిరెడ్డి, రమేష్ తుంపర, సుబ్బా రావు, గుణశేఖర్ కొనపల్లి, విష్ణు వంగాల, కల్యాణ్ గుర్రంకొండ, శైలేష్ పాల్యం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్బర్గ్లో భారీ కేక్ కట్ చేస్తున్న అభిమానులు ఆస్ట్రేలియాలో.. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్లో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అరి్పంచారు. అనంతరం కేక్ను కట్ చేశారు. ఈ వేడుకల్లో బ్రహ్మరెడ్డి ఎరువూరి, కిషోర్, జస్వంత్ బొమ్మిరెడ్డి, వంశీ చాగంటి, శ్రీనివాసులు రెడ్డి, చిన్నప్ప, శౌర్య పాల్గొన్నారు. అలాగే, కందుల భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్తన్ టెరిటోరీలోని డారి్వన్ నగరంలో కొమ్మిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, శివ హర్షవర్థన్ రెడ్డి వంగ, లక్ష్మణ్ రెడ్డి, రాఘవేంద్ర రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, రవితేజ మదినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెర్త్లో జరిగిన కార్యక్రమంలో వంశీ కృష్ణా రెడ్డి, యశ్వంత్, సతీష్ త్రినాథ్, వినయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్ అభిమానులు మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా కన్వీనర్ భరత్, విక్టోరియా కన్వీనర్ కృష్ణా రెడ్డి, సహ కన్వీనర్ రామాంజి, కోర్ టీమ్ సభ్యులు శిరీష, స్వాతి, యశు, బ్రహ్మ రెడ్డి, పవన్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అబ్దుల్, రవి వర్మ, తేరా జయవర్ధన్ రెడ్డి, శ్రీనాథ్, నితీష్, ప్రణీత్, రోహిత్, అభిష్క్, ఉదయ్, భార్గవ్, యశ్వంత్, దశరథ్ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేతలు నూర్ ఫాతిమా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.ఆస్ట్రేలియాలోని పెర్త్లో వైఎస్సార్ జయంతి వేడుకలు
సీఎం విజయ్ పర్యటనను నియంత్రించజాలం
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ కరూర్ తొక్కిసలాట కేసులో నిందితుడిగా లేరని, ఆయన పర్యటనను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. సీఎం విజయ్ పర్యటనను ప్రశ్నిస్తూ, అలాగే ఈ వ్యవహారంలో మంత్రులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ డీఎంకే వేసిన పిటిషన్పై మంగళవారం జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరా«ధేల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ముఖ్యమంత్రి పర్యటనను నియంత్రించాలని, ఆయన పర్యటన షెడ్యూల్ను కూడా మేమే ఖరారు చేయాలని మీరు కోరుకుంటున్నారా? ఇదెలా సాధ్యం?’అని ప్రశ్నించింది.న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చొద్దని వ్యాఖ్యానించింది. పిటిషనర్గా ఉన్న డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే ప్రభుత్వంలోని మంత్రులు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. అలాంటప్పుడు, సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర మంత్రి ఆధవ్ అర్జున్ చేస్తున్న వ్యాఖ్యలపై ధిక్కార పిటిషన్ వేయాలని కూడా డీఎంకే ఆలోచిస్తోందన్నారు.ఈ కేసు గురించి సీఎం, మంత్రులు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరారు. స్పందించిన ధర్మాసనం..‘అంటే వాక్ స్వాతంత్య్రంపై మేం నిషేధాజ్ఞలు విధించాలని కోరుకుంటున్నారా? వారి మాటలకు మీరు కూడా మాటలతోనే సమాధానం చెప్పండి. ఈ కేసును సుప్రీంకోర్టు ఇప్పటికే సీబీఐకి బదిలీ చేసింది. అలాంటప్పుడు, ఒక రాజకీయ ప్రత్యర్థి ఈ కేసులో ఒక పక్షంగా చేరాలని ఎలా కోరగలరు?’అని ప్రశ్నించింది. అయితే, సీబీఐ దర్యాప్తు ముగిసే వరకు కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, విచారణను ప్రభావితం చేయరాదన్నది మాత్రమే తమ ఉద్దేశమని రంజిత్ కుమార్ వివరించారు.వాక్ స్వాతంత్య్రాన్ని మరింత బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలన్నది డీఎంకే పార్టీ అభిమతమన్నారు. మరలాంటప్పుడు, ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచి్చన విధంగా తొక్కిసలాట బాధితులకు రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి చొప్పున ఉద్యోగం ఇవ్వడం దర్యాప్తును ఎలా ప్రభావితం చేయగలదని ధర్మాసనం లాయర్ రంజిత్ కుమార్ను అడిగింది. పిటిషన్ను ఉపసంహరించుకునే అవకా>శం డీఎంకేకు కల్పిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు నియమించిన రిటైర్డు జస్టిస్ అజయ్ రస్తోగి సారథ్యంలోని కమిటీని ఆశ్రయించవచ్చని సూచించింది.
ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర
సాక్షి, అమరావతి : మాట ఇస్తే మడమ తిప్పని నైజం.. కలిసిన ప్రతి ఒక్కరినీ పేరుతో పలకరింపు.. ఇలా ఎన్నో లక్షణాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డిని జననేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశాయని వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి కార్తీక్ యల్లాప్రగడ కొనియాడారు. జర్మనీలోని ఇన్గాల్స్ట్యాట్ నగరంలో ఆదివారం వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించి భారీ కేక్ను కట్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్తీక్ మాట్లాడుతూ.. జన సంక్షేమమే ధ్యేయంగా.. ప్రాంతాలకతీతంగా అభివృద్ధి చెందాలనే తలంపు.. సాగునీటితోనే సమగ్రాభివృద్ధి అనే ప్రగాఢ విశ్వాసం.. ఇవన్నీ కలగలిపిన రూపం మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ ఏపీ అభివృద్ధికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ కూడా తన ఐదేళ్ల పాలనలో తండ్రిని తలపించేలా పాలన అందించారని చెప్పారు. మాజీమంత్రి పేర్ని నాని, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కో–ఆర్డినేటర్ సాంబశివారెడ్డి వర్చువల్గా పాల్గొని మాట్లాడారు. జర్మనీ, ఐర్లాండ్, పోలాండ్, డెన్మార్క్, ఇటలీతో పాటు యూరప్లోని పలు దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని వైఎస్సార్కు నివాళులర్పించారు. వైఎస్ ఆశయాలు, దార్శనికతను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ జర్మనీ కమిటీ అధ్యక్షుడు కృష్ణతేజారెడ్డి గడ్డం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నెదర్లాండ్స్ కన్వీనర్ శరత్రెడ్డి వంగా, ఐర్లాండ్ కన్వీనర్ ఆకేపాటి కిషోర్రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ
ఓ భారత మహిళ అబుదాబిలో జాక్పాట్ కొట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 62 కోట్ల లాటరీని గెలుచుకుంది. ఢిల్లీకి చెందిన కనికా అరోరా అనే గృహిణి కొన్న లాటరీ టికెట్కు రూ. 62 కోట్ల ప్రైజ్మనీ వరించింది. అబుదాబి బిగ్ టికెట్ సిరీస్లో భాగంగా ప్రతీనెల లాటరీ టికెట్ కొనే ఆ మహిళకు జూన్ 30వ తేదీన తీసిన లాటరీలో 25 మిలియన్ దిర్హమ్ల భారీ మొత్తం వరించింది. తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోవడంతో సదరు మహిళ ఉబ్బితబ్బిబ్బై పోతోంది. సంవత్సరాలుగా ఢిల్లీకి చెందిన ఆమె కుటుంబానికి బిగ్ టికెట్ ఎంట్రీ కొనడం నెలవారీ అలవాటుగా మారింది. గృహిణి అయిన కనికా అరోరా అబుదాబి బిగ్ టికెట్ సిరీస్ 288 డ్రాలో 25 మిలియన్ దిర్హమ్ల (AED) గ్రాండ్ ప్రైజ్ (సుమారు రూ. 62 కోట్లు) గెలుచుకుని, చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నారు.దీనిపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘ కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా ఆ టికెట్ను కొనుగోలు చేశాం. అబుదాబిలో లాటరీ టికెట్ల కొనుగోలులో ఒక రకమైన ప్రమాదం ఉన్నప్పటికీ, వాటిని మాత్రం ప్రతీనెలా కొంటూనే ఉన్నాం. ఇన్నాళ్లకు మా కల సాకారమైంది. లాటరీలో బహుమతి గెలిస్తే ఆ మొత్తాన్ని ఏం చేయాలో అనే దానిపై నా భర్త, నేను మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఇప్పుడు నిజంగా గెలవడంతో ఎక్కడ నుంచి ప్రారంభించాలో కూడా తెలియడం లేదు. ప్రతీ ఒక్కరూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. మన కల ఎలా నిజమౌతుందో చెప్పలేం కదా’ అంటూ ఆనందం వ్యక్తం చేసిదామె.
క్రైమ్
సంతకం చేయి.. లేకపోతే నీ భార్యపై లైంగిక దాడి చేస్తాం..!
వికారాబాదు జిల్లా: కుటుంబ ఆస్తి వివాదం నేపథ్యంలో బాధితుడిపై దాడి చేసి, అతని భార్యపై లైంగిక దాడిచేస్తామని బెదిరించిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. ఆల్విన్ కాలనీ ఫేజ్–1లో గుంటి వేణుగోపాల్తో పాటు తన సోదరులు శ్రీనివాస్, రవి ఒకే ఇంట్లో ఉంటున్నారు. 2022లో వీరి తండ్రి నాగభూషణం చనిపోయారు. కొన్ని రోజుల నుండి శ్రీనివాస్, రవి ఇప్పుడుంటున్న 100 గజాల ఇంటి ప్రాపర్టీ విషయమై రిజిస్ట్రేషన్ చేయించుకొని రుణం తీసుకుంటున్నట్లు దీనికి గాను తన తమ్ముడు వేణుగోపాల్ను సంతకం చేయమని కోరారు. దీనికి తాను ఒప్పుకోనని, తనకు రావాల్సిన వాటా చెల్లించిన తర్వాతే ఆస్తి పత్రాలపై సంతకం చేస్తానని వేణుగోపాల్ చెప్పడంతో గొడవ మొదలైంది. ఈ విషయమై శనివారం మధ్యాహ్నం మాట్లాడాలని వేణుగోపాల్ని పిలిచారు. వెళ్లగానే అన్నలు శ్రీనివాస్, రవిలు పిడిగుద్దులు గుద్దుతూ ఆస్తి పత్రాలపై సంతకం చేయాలని వేణుగోపాల్పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో పొత్తికడుపు, ఎడమ కాలి బొటనవేలికి గాయాలయ్యాయి. అంతే కాకుండా అడ్డు వచ్చిన బాధితుడి భార్యను అన్న రవి లైంగికదాడి చేస్తామని అసభ్య పదజాలంతో దూషించి తోసేశారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒక ఆమ్లెట్.. ఓ కుటుంబంలో పెను విషాదం
శ్రీకాకుళం క్రైమ్ : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాకేంద్రంలోని ఆదివారంపేటలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్మేన్గా పనిచేస్తున్న కోనాడ నాగరాజు పొందూరు మండలం బొడ్డేపల్లికి చెందినషర్మిల(26)ను ఏడాది కిందట వివాహం చేసుకున్నాడు. నాగరాజు తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఆదివారంపేటలో ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. ఆమ్లెట్ వేయనందుకు..! నాగరాజు కాస్త అమాయకుడు కావడంతో అత్త దమయంతితో షర్మిలకు తరచూ తగాదాలొచ్చేవి. ఈ క్రమంలో ఈ నెల 8న షాపులో విధులు ముగించుకుని వచ్చిన భర్తకు భోజనంతో పాటు ఆమ్లెట్ పెట్టింది. పక్కనే తింటున్న చిన్న కుమారుడికి ఆమ్లెట్ పెట్టలేదని అత్త దమయంతి ప్లేట్ విసిరికొట్టడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో భర్త నాగరాజు స్పందించకపోవడంతో శనివారం మరోసారి గొడవపడింది. దీంతో షర్మిల మనస్థాపానికి గురై అందరూ నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
మేనమామతో పెళ్లి.. నా కూతురికి చుక్కలు చూపించాడు!
ఇచ్ఛాపురం రూరల్: ‘సొంతవాడే కదా.. మా బిడ్డను బంగారంగా చూసుకుంటాడు’ అనే ఆశతో కుమార్తెను మేనమామకు ఇచ్చి వివాహం చేసిన తల్లిదండ్రుల కలలు కల్లలయ్యాయి. ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రామానికి చెందిన మరడ రుక్మిణమ్మ, దేవేందర్ల కుమార్తె ధనలక్ష్మి(27)ని 2018 ఆగస్టులో ఒడిశా రాష్ట్రం రొంపా బొరడా గ్రామానికి చెందిన నందిక లోకనాథంకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఏడేళ్ల కుమారుడు రక్షిత్ ఉన్నాడు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతుండటంతో ధనలక్ష్మి కన్నవారి గ్రామం ధర్మపురంలో ఉంటోంది. పెద్దలు పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ భర్త వేధింపులు తీవ్రంగా ఉండటంతో మనస్థాపం చెందిన ధనలక్ష్మి శనివారం రాత్రి కన్నవారింట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి మృతదేహం వద్ద రక్షిత్ ‘అమ్మా.. లేవమ్మా.. నాతో మాట్లాడమ్మా..!’ అంటూ అమాయకంగా పిలుస్తూ కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. మృతురాలి తల్లి రుక్మిణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ ఆర్.జనార్దనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ రావులపాలెంలో యువకుడు దారుణ హత్య..
ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు దుండగులచేతిలో హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా, రావులపాలెంలో విషాదకర ఘటన జరిగింది. ఓ గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు తలను బండరాళ్లతో మోది కిరాతకంగా హత్యచేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి అను సాయి అలియాస్ నల్లసాయిగా గుర్తించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వీడియోలు
ఆరుగురిని చంపిన సైకో చచ్చాడు..
YS జగన్ కృషి...పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి 100 మెడికల్ సీట్లు
అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు
సైకో కిల్లర్ రాజ్కుమార్ మృతి
ఏ ఒక్కడినీ వదలను.. కట్టలు తెంచుకున్న రాచమల్లు ఆవేశం
కూటమి అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ను నిర్వీర్యం చేశారు
అమెరికా భీకర దాడులు.. ఛిన్నాభిన్నమైన ఇరాన్
మాస్టర్ల మధ్య గొడవ అసలు ఎక్కడ చెడిందంటే?
బంగారం తగ్గిందోచ్.. లేటెస్ట్ ధరలు ఇవే!
నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్'పై YSRCP ఫిర్యాదు


