Instagramతో కోట్లలో డబ్బు సంపాదన.. ఎలా అంటే?
ఫ్రెండ్స్.. మీకో విషయం తెలుసా..? Instagramలో సబ్స్క్రిప్షన్ అనే ఫీచర్తో ఒక అమ్మాయి నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? అక్షరాలా కోటి రూపాయలు. అవును.. మీరు విన్నది నిజమే. అక్షరాలా సంవత్సరానికి 12 కోట్లు. ఇది వినగానే మీలో చాలా మందికి.. అబ్బా.. నాకూ అకౌంట్ ఉంది.. నేను కూడా స్టార్ట్ చేస్తా, ఆ టాలెంట్ ఏదో నేర్చేసుకుంటా.. అని అనిపిస్తోంది కదా..? కానీ ఒక్క నిమిషమాగండి. ఆ టాలెంట్ మీరు నేర్చుకోలేరు, నేను నేర్పించలేను. ఎందుకంటే అది ముఠామేస్త్రి సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు.. అదో రకమైన టాలెంట్, అది అందరికీ రాదు, అందరూ చేయకూడదు కూడా.హిందీలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి కూడా పాకింది. దురదృష్టవశాత్తూ.. మన ఫీమేల్ కంటెంట్ క్రియేటర్స్ ఈ ఫీచర్ని చాలా రాంగ్ దారిలో వాడుతున్నారు. అసలేం జరుగుతోంది..? దీనిపై ఎందుకు ఇంత వ్యతిరేకత..? అనేవి వివరంగా మాట్లాడుకుందాం.అసలు ఈ కోటి రూపాయల గోలేంటి..? కేరళకు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. తన పేరు అశ్విని, Instagramలో పర్పుల్ సెలా అని ఉంటుంది.. ఆ అమ్మాయికి ఉన్నది కేవలం 2-3 లక్షల ఫాలోవర్లే. కానీ.. సబ్స్క్రైబర్లు మాత్రం 26 వేల మందే. వీరంతా ఒక్కొక్కరు నెలకు 399 రూపాయలు పే చేస్తున్నారు. ఇలా లెక్కేస్తే నెలకు కోటి రూపాయల పైనే ఈ అమ్మాయి సంపాదిస్తోంది. హిందీ క్రియేటర్లని కూడా దాటి ఈమె ఇండియాలోనే నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళిపోయింది. మన తెలుగులో కూడా గత 4-5 నెలలుగా విష్ణుప్రియ, సాధన నాయుడు లాంటి వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు. నిన్న మొన్నటి వరకు Twitterలో వీళ్ళ ఫోటోలే ట్రెండింగ్. మరి.. ఏంటా ఫోటోలు? ఏమున్నాయి అందులో? అన్నీ ఆనిముత్యాలే. బాహాటంగా ఎక్స్పోజింగ్ చేస్తూ యూత్ ని ఆకర్షించడమే వీరి పని.అసలు Instagram ఈ సబ్స్క్రిప్షన్ ఫీచర్ ఎందుకొచ్చింది..? అంటే నిజానికి ఇది YouTube మానిటైజేషన్ లాంటిది. క్రియేటర్లకి డైరెక్ట్ ఆదాయం ఉండదు కాబట్టి, వాళ్ళ స్పెషల్ టాలెంట్ని క్యాష్ చేసుకోవడానికి ఇచ్చారు. ఉదాహరణకు.. ఒక బిజినెస్ పర్సన్ తన ప్రీమియం డిజైన్లు చూపించడానికి.. ఒక CA లేదా లాయర్ తన క్రిటికల్ లీగల్ టిప్స్ చెప్పడానికి.. ఒక ఫోటోగ్రాఫర్ తన సీక్రెట్ సెట్టింగ్స్ నేర్పించడానికి.. లేదా ఒక డాన్సర్ తన ఎక్స్క్లూజివ్ స్టెప్స్ నేర్పించడానికి.. ఈ సబ్స్క్రిప్షన్ను తీసుకొచ్చింది. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి..? టాలెంట్ని పక్కన పెట్టి, బాడీని చూపిస్తూ మనీ సంపాదిస్తున్నారు. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు రాత్రింబవళ్లు కష్టపడితే నెలకి లక్ష రావడం కష్టంగా ఉంటే, వీళ్ళు ఇలాంటి కంటెంట్తో కోట్లు కొల్లగొడుతున్నారు. ఇది చూసినప్పుడు ఎవరికైనా కోపం, ఆవేదన రావడం సహజం.ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. మన పేరెంట్స్ చిన్నప్పుడు కష్టపడి కాయగూరలమ్మినా, కూలి పని చేసినా మనం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే అది కష్టం, అది నీతి. కానీ వీళ్ళు రేపు పొద్దున వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు..? మీ అమ్మ ఏం చేస్తుందిరా అంటే.. Instagramలో సబ్స్క్రిప్షన్ పెట్టి ఇగో ఇలాంటి ఫోటోలు అమ్ముతుంది.. అని గర్వంగా చెప్పుకోగలరా..? మై బాడీ మై విష్ అని కొందరు వాదిస్తారు. లీగల్గా ఇది కరెక్టే కావచ్చు.. కానీ ఎథికల్గా ఏం సమాధానం చెబుతారు. ఇలాంటివి చూసి కాలేజీ పిల్లలు, హౌస్ వైఫ్స్ కూడా మనీ ఇంత ఈజీగా వస్తుందా అని తప్పుడుదారిలో ఇన్స్పైర్ అవుతున్నారు. దీనివల్ల యూత్ టైం ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా..? ఒక ఫోటో చూడటానికెళ్లి గంటల కొద్దీ అందులోనే మునిగిపోతున్నారు. రాబోయే కాలం ఒక యుద్ధభూమి. అక్కడ సర్వైవ్ అవ్వాలంటే స్కిల్ కావాలి కానీ, ఇలాంటి వ్యసనాలు కాదు.మీకు అలాంటి కంటెంట్ చూపించాలనే ఉంటే.. దానికి ఓన్లీ ఫ్యాన్స్ లాంటి డెడికేటెడ్ యాప్స్ ఉన్నాయి, అక్కడికెళ్ళండి. Instagram అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర్నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ ఉంటారు. దీన్ని ఇలాంటి చెత్తతో నింపేయొద్దు. తల్లిదండ్రులకు కూడా ఓ సజిషన్.. మీ పిల్లల ఫోన్లలో Instagram, Telegram యాప్స్ ఎలా వాడుతున్నారో గమనించండి. వాళ్ళు ఎక్కడ మనీ స్పెండ్ చేస్తున్నారో చూడండి. చెడిపోవడానికి వంద దారులున్నాయిక్కడ, జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. చివరిగా.. మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు, ఎలా సంపాదిస్తున్నారు అన్నదే ముఖ్యం. అభిమానుల పేరుతో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు మీ అభిమానానికి అర్హులు కాదా అని. దట్సాల్.
‘ కూటమి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలి’
తాడేపల్లి : అమరావతి పేరుతో బారీ దోపిడీ జరుగుతోందని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలన్నారు సజ్జల. ఈ రోజు(శనివారం, ఏప్రిల్ 11వ తేదీ) తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ఆర్టీఐ విభాగం రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల మాట్లాడుతూ.. ‘ప్రజాసమస్యలపై బలమైన గళం వినిపించాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు సిద్ధంగా ఉండాలి. సిస్టమాటిక్గా అవినీతి, దోపిడీ జరుగుతోంది. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జరుగుతున్న అవినీతి దాచిపెడుతున్నారు. జగన్పై ఇంకా తప్పుడు ప్రచారం కొనసాగుతోంది. 2047 పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు.రాజధాని పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది. లక్షల కోట్ల రూపాయిల అవినీతికి రంగం సిద్ధమైంది. అమరావతి పేరుతో దోపిడీ కొనసాగుతోంది. ఉద్యమంలా అవినీతిని ఎండగట్టేందుకు సిద్ధం కావాలి’ అని సజ్జల పిలుపునిచ్చారు.
ఆలుమగల స్ఫూర్తి గాథ.. జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!
జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!.. ఇదొక శీర్షిక మాత్రమే కాదు.. ఆలుమగలకు ఆదర్శమైన ప్రధాన విషయం. ప్రస్తుత రోజుల్లో భార్యా భర్తల సంబంధాల్లో ప్రేమలు ఎంతవరకూ ఉంటున్నాయనే దానికి ఈ తరహా ఘటనలు ప్రేరణగా నిలుస్తాయి. ఒకరికోసం ఒకరు జీవించే క్షణాలు చాలా అల్పమై స్వల్పమైపోయిన ఈ రోజుల్లో నిజంగా ఇదొక స్ఫూర్తిగానే నిలుస్తుంది. ఏదో యాంత్రిక జీవితంలో ముందుకు సాగుతూ.. ఏదో బ్రతికేస్తున్నాం అని కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి కష్టంలో ఒకరు తోడుగా నిలుస్తేనే ఆ దాంపత్యానికి అర్ధం ఉంటుందనేది తాజా ఎపిసోడ్ చెప్పకనే చెప్పేసింది. ఇలా ఒకరికోసం ఒకరు అనే జంట ఉండటమే ఇప్పుడు వార్త అయ్యింది. వార్తా వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన డెంగ్ యుకై అనే మహిళకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. నడవలేని స్థితి. బెడ్కే పరిమితమై కృంగిపోయింది. తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని కూడా భర్తను ప్రాధేయ పడింది. భర్తకు తనవల్ల కష్టం రాకూడదని ఆమె చనిపోవాలని అనుకుంది. తాను చనిపోతే భర్త సుఖంగా ఉంటాడని భావించింది. భర్త నో అన్నాడు. ‘నేను ఉండగా నీకేం కాదు’ అన్నాడు,. భార్యకు అండగా నిలబడ్డాడు. విధితో పోరాడాడు. తన సంకల్పం ఎంత గట్టిదో చూపించాడు. భార్యను పూర్వపు స్థితికి తీసుకురావడానికి సుమారు రూ. 2 కోట్ల వరకూ ఖర్చు పెట్టాడు. అదే సమయంలో ప్రతీ రోజూ ప్రతీ క్షణం భార్య అలా బెడ్కే పరిమితమైన భార్య ముందు డ్యాన్స్లు చేస్తూ నవ్వించే యత్నం చేశాడు. చివరకు ఆమె కోలుకుంది. మళ్లీ తన పాత రోజుల్లోకి వచ్చేసింది. ప్రేమ శక్తితో భార్య తిరిగి జీవం పోసుకుంది.. లౌకిక జీవితాన్ని మళ్లీ చూడసాగింది. View this post on Instagram A post shared by History Facts & Stories (@howhistorylooks) Crazy what having someone who won't give up on you can do for you. This is will forever be a beautiful story https://t.co/UH7Jzd0TEL— Bhuti Olishayayo Ikhekhe (@BantuMthabela_) April 11, 2026
ఓటీటీలో సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
ఒకప్పటి హీరోయిన్ రాధిక లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ సినిమా 'తాయ్ కిళవి'. నిర్మాతల్లో హీరో శివకార్తికేయన్ ఒకరు. రూ.10 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ.81 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. థియేటర్లలో అద్భుతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా)కథేంటి?పపున్తాయ్(రాధిక) ఓ పల్లెటూరి బామ్మ. ఊరిలో అందరూ ఈమె దగ్గర అప్పు తీసుకుంటారు. కానీ వడ్డీ వసూలు చేయడానికి వస్తుందంటే మాత్రం అందరూ తప్పించుకుని పారిపోతుంటారు. దీంతో ఈమె ఎప్పుడు చచ్చిపోతుందా అని శాపనార్థాలు పెడుతూ ఉంటారు. మరోవైపు ఆస్తి గొడవల కారణంగా ముగ్గురు కొడుకులు ఈమెని వదిలేసి వెళ్లిపోతారు. కట్నంగా మాట్లాడుకున్న మిగిలిన బంగారం ఇవ్వలేదని అల్లుడు, ఈమె కూతురు సురులి(రైచల్ రెబెకా)ని వదిలేస్తాడు. దీంతో కూతురు, మనవడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. ఓ రోజు పపున్తాయ్కి పక్షవాతం వచ్చి మాట పడిపోతుంది. ఏదో సైగ మాత్రం చేస్తుంటుంది. ఈమె చనిపోవడం పక్కా అనుకుని ఆస్తి పంచుకోవడానికి కొడుకులు, కోడళ్లు తిరిగొస్తారు. అయితే ఈమె దగ్గర 160 తులాల బంగారం ఉందనే రహస్యం తెలుస్తుంది. మరి ఆ బంగారం ఎక్కడుంది? దీనికోసం కొడుకులు, కోడళ్లు ఏం చేశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఒకప్పుడు బంధాలు, బంధుత్వాలు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడంతా డబ్బుమయం అయిపోయింది. డబ్బు లేకపోతే సొంత కొడుకులు కూడా తల్లిదండ్రులని పట్టించుకోరు. అలా డబ్బు వల్ల రోజురోజుకీ దారుణంగా మారుతున్న మానవ సంబంధాల్ని కామెడీగా, ఎమోషనల్గా చూపిస్తూ చివరలో అద్భుతమైన సందేశం ఇచ్చిన సినిమా 'తాయ్ కిళవి'. చూస్తున్నంతసేపు ఇది సినిమాలా అనిపించదు. మన పక్కనే ఉండే చాలామంది వ్యక్తులా జీవితంలా అనిపిస్తుంది.మనం ఊళ్లలో చూసే గడుసు బామ్మలు ఎలా ఉంటారో పపున్తాయ్ కూడా అలానే ఉంటుంది. మాటతీరు, ప్రవర్తన, ఊరిలో ప్రతిఒక్కరిపై చూపించే ఆజమాయిషీ లాంటివి చూపిస్తూ ఈమె పాత్రని పరిచయం చేశారు. ఈమెకు పక్షవాతం రావడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఆస్తి పంచుకోవాలని ఆరాటపడుతూ తల్లి ఎప్పుడు చనిపోతుందా అని ఈమె కొడుకులు, కోడళ్లు చేసే పనులు కాస్త అతిగా అనిపిస్తాయి. నిజ జీవితంలో మరీ ఇలా ప్రవర్తించేవాళ్లు ఉంటారా అనిపిస్తుంది. ఎప్పుడైతే 160 తులాల బంగారం గురించి కొడుకులకు తెలుస్తుందో స్టోరీ ట్రాక్లో పడుతుంది. అప్పటినుంచి వచ్చే ప్రతి సీన్, చుట్టూ ఉండే పాత్రలు ప్రవర్తించే విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది.ఫస్టాఫ్ అంతా కామెడీగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో పపున్తాయ్ని ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు వ్యవహరించే తీరు కూడా నవ్విస్తుంది. కానీ సమాజంలో జరుగుతున్న పలు విషయాల్ని గుర్తుచేస్తాయి. చివరగా ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత బామ్మ తన సైగలకు అర్థం చెప్పినప్పుడు ఇదెక్కడి ట్విస్ట్ రా బాబోయ్ అనిపిస్తుంది. నిజంగా ఈమె దగ్గర అంత బంగారం ఉందా లేదా అనే సీన్ ఆకట్టుకుంది. అలానే మహిళలు ఒకరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఎలా బతకాలో పపున్తాయ్, ఆమె కూతురితో చెప్పించే సీన్స్ అయితే భావోద్వేగానికి గురిచేస్తాయి. వీటికి ప్రతి మహిళ కనెక్ట్ అవుతుంది. అన్ని ప్లస్సులేనా మైనస్సులు లేవా అంటే ఉన్నాయి. కాకపోతే చాలా తక్కువగానే ఉన్నాయి.ఎవరెలా చేశారు?పపున్తాయ్ అనే వృద్ధురాలిగా రాధిక అదరగొట్టేసింది. ప్రారంభంలో పది నిమిషాలు, చివరి అరగంట మాత్రమే ఈమె కనిపిస్తుంది. కానీ గెటప్, క్లైమాక్స్లో ఈమె చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. మిగతా నటీనటులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ మూవీ చూస్తున్నంతసేపు అదేం పెద్ద సమస్యగా అనిపించదు. ఫస్టాప్ లో కాస్త అతి అనిపిస్తుంది కానీ కథలో లీనమైన తర్వాత అవేం పెద్దగా గుర్తుండవు. కమల్ హాసన్ పాటల రిఫరెన్స్లతో వచ్చే హంగామా కూడా అలరించింది.'జీవితంలో ఎవరైనా డబ్బు అవసరం లేదని అంటే వాళ్లు డబ్బు సమస్య లేకుండా బతుకుతున్నారని అర్థం. అలాంటి వాళ్ల మాటలు విని మీరు కూడా అలా బతికితే.. అమ్మ నగలు దాచిపెట్టిందా? నాన్న ఆస్తి రాకపోతుందా? అని ఎదురుచూడాల్సి వస్తుంది' అని బామ్మ చెప్పే డైలాగ్.. మనిషికి డబ్బు ఎంత అవసరమో చెప్పకనే చెబుతుంది. డైరెక్టర్ శివకుమార్ మురుగేశన్ రాసుకున్న స్టోరీ గానీ తీసిన విధానం గానీ సూపర్. సాంకేతికంగానూ మూవీ బాగుంది. ప్రస్తుతం హాట్స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి చూడొచ్చు. వీకెండ్ ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)
Instagramతో కోట్లలో డబ్బు సంపాదన.. ఎలా అంటే?
విజయవాడలో అమానుషం..
రూ. 158 కోట్ల అప్పు : జో బైడెన్ కొడుకు అమెరికా విడిచి పారిపోయాడా?
అభిషేక్ మెరుపులు వృధా.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన పంజాబ్
టయోటా కారు.. రెండు లక్షల సేల్స్!
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సీఎస్కే లైవ్ అప్డేట్స్
కొరియన్ కనకరాజు ఫస్ట్ సాంగ్
ఇరాన్ చిత్తుగా ఓడిపోతుంది: చర్చల వేళ ట్రంప్
‘మహిళలు నాయకులుగా ఎదగాలి’
‘ కూటమి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలి’
అవన్నీ పీరియడ్స్లో ఉండగానే చేశా: శ్రీలీల
దానికి టైమ్ ఉంది.. కొంచెం ఓపిక పట్టాలి!
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
ఆంటీ అనకూడదు
రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సీజ్ఫైర్ ప్రకటన
అంతకాలం సీఎంగా ఉండి ఆమె ఇంకేం పనిచేసినట్లు సార్!
చంద్రబాబు సర్కార్ మళ్లీ అప్పు
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం'
నేడు పాక్ లో కాల్పుల విరమణపై చర్చలు
ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
చారిత్రక ద్వైపాక్షిక సిరీస్ను ప్రకటించిన పాకిస్తాన్
సముద్ర గర్భంలో రష్యా దుష్ట కార్యక్రమాలు
'విశ్వంభర' విడుదల తేదీ వైరల్
బంగారం ధరలు రివర్స్.. కొనేవారికి గుడ్న్యూస్
పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఉద్యోగం - ఆర్థిక స్వేచ్ఛ: కియోసాకి సూచన
అనుష్క శెట్టి.. నమ్మశక్యం కాని రూమర్
బీసీబీ నూతన అధ్యక్షుడి సంచలన నిర్ణయం
Instagramతో కోట్లలో డబ్బు సంపాదన.. ఎలా అంటే?
విజయవాడలో అమానుషం..
రూ. 158 కోట్ల అప్పు : జో బైడెన్ కొడుకు అమెరికా విడిచి పారిపోయాడా?
అభిషేక్ మెరుపులు వృధా.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన పంజాబ్
టయోటా కారు.. రెండు లక్షల సేల్స్!
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సీఎస్కే లైవ్ అప్డేట్స్
కొరియన్ కనకరాజు ఫస్ట్ సాంగ్
ఇరాన్ చిత్తుగా ఓడిపోతుంది: చర్చల వేళ ట్రంప్
‘మహిళలు నాయకులుగా ఎదగాలి’
‘ కూటమి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలి’
అవన్నీ పీరియడ్స్లో ఉండగానే చేశా: శ్రీలీల
దానికి టైమ్ ఉంది.. కొంచెం ఓపిక పట్టాలి!
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
ఆంటీ అనకూడదు
రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సీజ్ఫైర్ ప్రకటన
అంతకాలం సీఎంగా ఉండి ఆమె ఇంకేం పనిచేసినట్లు సార్!
చంద్రబాబు సర్కార్ మళ్లీ అప్పు
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం'
నేడు పాక్ లో కాల్పుల విరమణపై చర్చలు
ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
చారిత్రక ద్వైపాక్షిక సిరీస్ను ప్రకటించిన పాకిస్తాన్
సముద్ర గర్భంలో రష్యా దుష్ట కార్యక్రమాలు
'విశ్వంభర' విడుదల తేదీ వైరల్
బంగారం ధరలు రివర్స్.. కొనేవారికి గుడ్న్యూస్
పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఉద్యోగం - ఆర్థిక స్వేచ్ఛ: కియోసాకి సూచన
అనుష్క శెట్టి.. నమ్మశక్యం కాని రూమర్
బీసీబీ నూతన అధ్యక్షుడి సంచలన నిర్ణయం
ఫొటోలు
ఆర్టెమిస్-2 గ్రాండ్ సక్సెస్...నాసా విడుదల చేసిన (ఫొటోలు)
శర్వానంద్ 'బైకర్' థాంక్యూ మీట్ (ఫోటోలు)
ట్రెండింగ్లో తెలుగు హీరోయిన్ మానస వారణాసి (ఫోటోలు)
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)
గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)
ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ (ఫొటోలు)
సీతామహాలక్ష్మిలా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)
తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
మిస్ తెలుగు యూఎస్ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)
సినిమా
సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బూతు కంటెంట్.. క్లారిటీ ఇచ్చిన నటి
ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ గోల ఎక్కువైపోయింది. చాలామంది సబ్స్క్రిప్షన్ అనగానే అక్కడేదో బూతు కంటెంట్ ఉంటుందని భావిస్తున్నారు. తన దగ్గర మాత్రం అలాంటివి ఆశించొద్దంటోంది మలయాళ నటి అన్నా రేష్మ రాజన్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నా అకౌంట్లో సబ్స్క్రిప్షన్ మోడల్ను రెండేళ్ల క్రితమే ప్రారంభించాను. దాని ద్వారా మీ అందరితో కనెక్ట్ అయ్యాను. సబ్స్క్రిప్షన్ వల్ల నా రీల్స్, ఫోటోలు మీకు ముందుగానే వస్తాయి. ఏదో ఊహించొద్దుఅలాగే మీరు నాతో కాస్త ఎక్కువగా కనెక్ట్ అవొచ్చు. అంతే తప్ప సబ్స్క్రిప్షన్ అంటే అక్కడేదో బూతు కంటెంట్ ఉంటుందని కాదు. కేవలం క్వాలిటీ, సృజనాత్మకత, గౌరవప్రదమైన సంభాషణలు మాత్రమే ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఏదో ఊహించి రాకండి. కేవలం వృత్తిపరమైన విషయాలు మాత్రమే ఉంటాయని మీకు క్లియర్గా చెప్తున్నా అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మంచి పని చేశావని మెచ్చుకుంటున్నారు. సినిమాకొందరు నెటిజన్లు మాత్రం.. నీ రీల్స్, ఫోటోలు ముందుగా చూడటానికి సబ్స్క్రిప్షన్ దేనికో? అని సెటైర్లు వేస్తున్నారు. కాగా నటి అన్నా రాజన్.. 2017లో 'అంగమలి డైరీస్' మూవీలో మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రంలో పృథ్వీరాజ్ భార్యగా నటించింది. మలయాళంలో పలు సినిమాలు చేసిన ఈ నటి ప్రస్తుతం జైలర్ 2లో నటిస్తోంది. తమిళంలో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం! View this post on Instagram A post shared by Anna raajan (@annaspeeks) చదవండి: మైండ్ బ్లాక్ అయ్యే సిరీస్.. ఓటీటీలో ఎప్పుడంటే?
ఓటీటీలోకి లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘యూత్’. మార్చి 19న తమిళ్లో విడుదలైన ఈ చిత్రం..అక్కడ సూపర్ హిట్ టాక్తో భారీ కలెక్షన్స్ని రాబట్టింది. ఇక అదే నెల 27న తెలుగులో విడుదలైంది. అయితే తమిళ్తో పోలిస్తే..తెలుగులో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో రాబోతుంది. ఏప్రిల్ 16 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.యూత్ కథేంటంటే..ప్రవీణ్ (కెన్ కరుణాస్) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. తండ్రి ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరమూడు) బెకరీ నడుపుకుంటూ జీవితం కొనసాగిస్తాడు. తల్లి సరోజ(దేవదర్శిని) ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కొడుకు అంటే ప్రాణం. తండ్రికి మాత్రం ప్రవీణ్ చేసే పనులు నచ్చవు. చదువు పక్కకు పెట్టి.. అమ్మాయిలకు సైట్ కొడుతుంటాడు. ఆయన చేష్టలకు స్కూల్లో ఏ అమ్మాయి అతని వైపు చూసేది కాదు. కానీ ఇంటర్లో మాత్రం గంగవల్లి (అనీషా అనిల్ కుమార్), ప్రేషిక (మీనాక్షి దినేష్), సోనాల్ (ప్రియాన్షీ యాదవ్).. ముగ్గురు తన జీవితంలోకి వస్తారు. ఆ ముగ్గురి వల్ల ప్రవీణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? బ్రేకప్స్, అవమానాలతో ప్రవీణ్ నేర్చుకున్న గుణపాఠం ఏంటి? తల్లి సరోజకు వచ్చిన సమస్య ఏంటి? బాగా చదువుకోవాలని ఆశపడ్డ తల్లిదండ్రుల కోరికను ప్రవీణ్ నెరవేర్చాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.Ada ennada ithu kaadhaluku vandha sodhanai? 🤭💔 pic.twitter.com/gJHkSEqa9N— Netflix India South (@Netflix_INSouth) April 11, 2026
ఆ బాధ నాకే ఎక్కువ తెలుసు..: విజయ్ దేవరకొండ
ఒక సినిమా రూపుదిద్దుకోవడం వెనక వందలాది మంది కష్టం దాగి ఉంటుంది. ఆ మూవీ రిలీజై ఆదరణ పొందినప్పుడు వారి శ్రమకు తగ్గ ఫలితం దక్కినట్లు లెక్క! కానీ రిలీజ్కు ముందే పైరసీ బారిన పడితే వారి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ పైరసీ అతిపెద్ద భూతంగా మారింది. తాజాగా విజయ్ చివరి మూవీ జననాయగణ్ సినిమాకు లీకుల బెడద తప్పలేదు.జననాయగణ్ లీక్థియేటర్లలో విడుదలవడానికి ముందే ఈ చిత్రంలో అనేక సన్నివేశాలను ఆన్లైన్లో లీక్ చేశారు. దీనిపై చిత్రనిర్మాణ సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా ఆ పైరసీ వీడియోలు చూసినా, షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామంది. ఇక ఎంతోమంది సెలబ్రిటీలు జన నాయగణ్కు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు.ఆ బాధ అనుభవించా..తాజాగా హీరో విజయ్ దేవరకొండ సైతం ఈ విషయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 'జననాయగణ్ సినిమా లీక్ అయిందన్న విషయం తెలిసి నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే సినిమా లీకైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.. కెరీర్ తొలినాళ్లలోనే ఆ బాధను, నష్టాన్ని చవిచూశాను. మనల్ని టార్గెట్ చేయడంతో మన ఆశలన్నీ అడియాసలైపోతాయి. నేను కేవలం నా గురించి మాత్రమే చెప్పడం లేదు. నటులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా సినిమాలో భాగమైన ఎంతోమందికి ఇదే వర్తిస్తుంది.ఎంత దిగజారుతున్నారు?ప్రస్తుత సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. అలాగే దీని వెనక ఉన్న వ్యక్తులను గుర్తించాలి. అది గనక చేయలేకపోతే అది వ్యవస్థ వైఫల్యమే అవుతుంది. అవతలివారికి హాని చేయడానికి మనుషులు ఎంత దిగజారుతున్నారు? అనేదానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న జననాయగణ్ మూవీ టీమ్కు నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది' అని ట్వీట్ చేశాడు.టాక్సీవాలాకాగా విజయ్ దేవరకొండ కెరీర్ తొలినాళ్లలో టాక్సీవాలా సినిమా చేశాడు. ఈ మూవీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే లీక్ అయింది. అది చూసి విజయ్ మానసిక క్షోభ అనుభవించాడు. తన పనైపోయిందని గదిలో కూర్చుని ఏడ్చాడు. ఏదైతే అదైందని, సినిమా రిలీజ్ చేద్దామని పట్టుబట్టాడు. అలా పైరసీ జరిగిన సినిమాను థియేటర్లలో విడుదల చేసి మరీ హిట్టు కొట్టాడు. The #JanaNayagan leak makes me angry.I’ve experienced personally the pain and sense of loss when something like this happens, early in my career. You feel like a target, you feel a loss of hope, it’s not just about me, there are co-actors, directors, producers, and so many who…— Vijay Deverakonda (@TheDeverakonda) April 11, 2026 చదవండి: డెకాయిట్కు ఊహించని కలెక్షన్స్.. తొలిరోజు ఎంతంటే?
ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు కాస్త లేటుగా ఓటీటీలోకి వస్తాయి. ఫ్లాప్ సినిమా అయినా సరే థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత కనీసం నాలుగు వారాల గ్యాప్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ పవన్ కల్యాణ్ తాజాగా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నెలలోపే ఓటీటీలోకి వచ్చింది. ఏప్రిల్ 16 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెటిఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.థియేటర్స్లో ఫ్లాప్ టాక్.. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్- పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. శ్రీలీల, రాఖీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. మరోవైపు అదే రోజు వచ్చిన దురంధర్ 2 చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో ఉస్తాద్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఎంతలా అంటే నిర్మాణ సంస్థ కనీసం కలెక్షన్స్ పోస్టర్ కూడా వేసుకోలేకపోయింది.నెలలోపే.. వాస్తవానికి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని కనీసం 5-6 వారాల గ్యాప్తో ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారట. కానీ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ముందే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16 నుంచి నెట్ఫ్లిక్లో అందుబాటులోకి వస్తుంది. తెలుగులో పాటు హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. మరి ఓటీటీలో అయినా పాజిటివ్ టాక్ సంపాదించుకుంటుందో లేదో తెలియాలంటే ఏప్రిల్ 16 వరకు ఆగాల్సిందే. Peru Bhagat, kaani udhyamam ey thana gurthimpu 🔥🚨 pic.twitter.com/5tYUxKmuKA— Netflix India South (@Netflix_INSouth) April 11, 2026
క్రీడలు
ఊచకోత.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (ఏప్రిల్ 11) జరుగుతున్న మ్యాచ్లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో ఐపీఎల్ చరిత్రలో 20 లోపు బంతుల్లో 5 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ తన ఐపీఎల్ కెరీర్లో 16 బంతుల్లో ఓసారి.. 18 బంతుల్లో రెండు సార్లు, 19 బంతుల్లో మరో రెండు సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు.ఈ విభాగంలో అభిషేక్ తర్వాతి స్థానంలో నికోలస్ పూరన్ ఉన్నాడు. పూరన్ 4 సార్లు ఐపీఎల్లో 20 లోపు బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. అభిషేక్, పూరన్ తర్వాతి స్థానాల్లో జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (3), వైభవ్ సూర్యవంశీ (3) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అభిషేక్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 27, క్లాసెన్ 33 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు.మిగతా ఆటగాళ్లలో అనికేత్ వర్మ 18, సలీల్ అరోరా 9 పరుగులు చేయగా.. నితీశ్ 0, హర్ష్ దూబే ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, శాశాంక్ సింగ్ తలో 2, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ తీశారు.
వైభవ్ మరో 'చరిత్ర'
రాజస్థాన్ రాయల్స్ యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026 ఎడిషన్లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో (26 బంతుల్లో 78; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) తన జట్టుకు తిరుగులేని విజయాన్నందించిన వైభవ్.. ఈ ఎడిషన్లో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో (15 ఏళ్లు) ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.గతంలో ఈ రికార్డు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ పేరిట ఉండేది. సాయి 23 ఏళ్ల 231 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. వైభవ్, సాయి తర్వాతి స్థానాల్లో శుభ్మన్ గిల్ (23 ఏళ్ల 263 రోజులు), రుతురాజ్ గైక్వాడ్ (24) ఉన్నారు.ఈ ఏడిషన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన వైభవ్ 266.67 స్ట్రయిక్రేట్తో 50 సగటున 2 హాఫ్ సెంచరీల సాయంతో 200 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 18 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఎడిషన్లో వైభవ్ చేసిన రెండు అర్ద సెంచరీలు 15 బంతుల్లోనే (సీఎస్కే, ఆర్సీబీ) చేయడం మరో విశేషం. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో టాప్-3 రన్ స్కోరర్లు రాయల్స్ ఆటగాళ్లే (వైభవ్ (200), జైస్వాల్ (183), జురెల్ (176)) కావడం మరో విశేషం.ఇదిలా ఉంటే, గత ఎడిషన్లో (2025) 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న వైభవ్ మరిన్ని రికార్డులపై కన్నేశాడు. వైభవ్ ప్రస్తుతమున్న జోరును కొనసాగిస్తే ఈ సీజన్లో చాలా అల్టైమ్ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. అతి చిన్నవయసులో ఐపీఎల్ అరంగేట్రంతో పాటు ఐపీఎల్ చరిత్రలో భారత ఆటగాడిచే అత్యంత వేగవంతమైన సెంచరీ (35) రికార్డులు కలిగిన వైభవ్.. ఈ సీజన్లో ఓవరాల్గా (ఐపీఎల్ చరిత్రలో) ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది.
సన్రైజర్స్పై పంజాబ్ గెలుపు
సన్రైజర్స్పై పంజాబ్ గెలుపుసన్రైజర్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందిన పంజాబ్ కింగ్స్.మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్10.2వ ఓవర్- 128 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. శివాంగ్ కుమార్ బౌలింగ్లో అనికేత్ వర్మ (11)కు క్యాచ్ ఇచ్చి కూపర్ కన్నోల్లీ (11) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్6.2వ ఓవర్- 99 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. శివాంగ్ కుమార్ బౌలింగ్లో నితీశ్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్య (57) ఔటయ్యాడు. ధీటుగా బదులిస్తున్న పంజాబ్220 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ ధీటుగా బదులిస్తుంది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (51), ప్రభ్సిమ్రన్ (41) చెలరేగి ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 93-0గా ఉంది. ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్20 ఓవర్లలో 218-6 (అభిషేక్ శర్మ (74), ట్రవిస్ హెడ్ (38), ఇషాన్ కిషన్ (27), క్లాసెన్ (39), అనికేత్ వర్మ (18)).మూడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్13.6వ ఓవర్-169 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (27) ఔటయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్అప్పటిదాకా పరుగుల వరద పారించిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ఒకే ఓవర్లో ఔటైపోయారు.ఎస్ఆర్హెచ్ ఓపెనర్ల ఊచకోతటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న సన్రైజర్స్ తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఏకంగా 84 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (59), ట్రవిస్ హెడ్ (18) శివాలెత్తిపోతున్నారు. ముఖ్యంగా అభిషేక్ పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోతున్నాడు. కేవలం18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హెడ్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు రఫ్ఫాడిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 11) డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్-సన్రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ముల్లాన్పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ రెండు మార్పులు చేయగా.. పంజాబ్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఎస్ఆర్హెచ్ తరఫున లివింగ్స్టోన్ స్థానంలో సలీల్ అరోరా బరిలోకి దిగుతున్నాడు. అలాగే ప్రఫుల్ హింజ్ (ఉనద్కత్ స్థానంలో) అరంగేట్రానికి సిద్దమయ్యాడు.తుది జట్లు..పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: నేహాల్ వధేరా, విష్ణు వినోద్, సూర్యాంశ్ షెడ్గే, యష్ ఠాకూర్, హర్ప్రీత్ బ్రార్సన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (w/c), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగఇంపాక్ట్ సబ్స్: జయదేవ్ ఉనద్కత్, లియామ్ లివింగ్స్టోన్, శివమ్ మావి, ప్రఫుల్ హింగే, కమిందు మెండిస్
చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ..?
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీని చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ వీరవిహారం చేసి రాయల్స్కు తిరుగులేని విజయాన్ని అందించాడు. అయితే మ్యాచ్ మధ్యలో వైభవ్ చేసిన ఓ పని అతన్ని చిక్కుల్లో పడేసేలా ఉంది.మ్యాచ్ జరుగుతున్న సమయంలో వైభవ్ డగౌట్లో కూర్చొని జట్టు మేనేజర్ రోమీ భిందర్తో కలిసి మొబైల్ ఫోన్ చూస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరలైంది. బీసీసీఐ నియమాల ప్రకారం ఆటగాళ్లు మ్యాచ్ జరుగుతుండగా మొబైల్ చూడరాదు, వాడరాదు. మేనేజర్కు ఈ విషయంలో వెసులుబాటు ఉన్నా, అతనికి కూడా డగౌట్లో మొబైల్ వాడే పర్మిషన్ లేదు. మేనేజర్కు డ్రెస్సింగ్ రూమ్లో మాత్రమే ఫోన్ వినియోగించే వెసులుబాటు ఉంది.ఇప్పుడు డగౌట్లో మొబైల్ వాడినందుకు మేనేజర్తో పాటు వైభవ్ కూడా చిక్కుల్లో పడినట్లైంది. వైభవ్ స్వతహాగా మొబైల్ వాడనప్పటికీ, దానివైపు చూస్తున్నట్లు సోషల్మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ విషయంలో మేనేజర్తో పాటు వైభవ్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాడేమో చూడాలి.ఈ అంశానికి సంబంధించి బీసీసీఐ నియమాలు (PMOA – Minimum Standards for Players and Match Officials Areas) ఇలా ఉన్నాయి.- మొబైల్ ఫోన్లు, కమ్యూనికేషన్ డివైజ్లు డగౌట్లో అనుమతించబడవు. - టీమ్ మేనేజర్ డ్రెస్సింగ్ రూమ్లో మాత్రమే ఫోన్ వాడవచ్చు, డగౌట్లో కాదు. - అనలిస్టులు కంప్యూటర్లు వాడవచ్చు, కానీ కేవలం ప్రత్యేకంగా కేటాయించిన అనలిస్ట్ టేబుల్ వద్ద మాత్రమే. - ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ స్టేడియంలోకి వచ్చిన వెంటనే తమ డివైజ్లను ఆఫ్ చేసి సురక్షితంగా భద్రపరచాలి. - అటెండెంట్స్, క్యాటరింగ్ వర్కర్స్ వంటి సిబ్బంది కూడా కమ్యూనికేషన్ డివైజ్లు తీసుకురావడానికి అనుమతి లేదు.
న్యూస్ పాడ్కాస్ట్
భారీగా పడిపోతున్న బంగారం ధరలు
అమరావతిలో నీకింత.. నాకింత... ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన ‘బీఎస్సార్’కు రాజధానిలో భారీగా పనుల అప్పగింత
ఆంధ్రప్రదేశ్లో ‘సీఎంఆర్ఎఫ్’ నిధులు స్వాహా... టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి సీఎంవో వరకూ వసూళ్ల పర్వం
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మావిగన్.. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు: వైఎస్ జగన్
ఇరాన్ను తుడిచిపెట్టేస్తాం, వారి నాగరికతను నాశనం చేస్తాం. తీవ్రంగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
మళ్లీ పెరిగిన వెండి, బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీకి దినదిన గండం... ఐదో రోజూ స్తంభించిన ఓపీ, అత్యవసర వైద్యసేవలు
లోక్సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ... రెండు ఫైటర్ జెట్లను కూల్చివేసిన ఇరాన్
వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా చర్చ...
బిజినెస్
అందరికీ నచ్చిన జియో రీఛార్జ్ ప్లాన్!
మొబైల్ రీచార్జ్ ధరలు పెరుగుతున్న తరుణంలో.. ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అందిస్తున్న రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా నిలిచింది తక్కువ ఖర్చుతో.. సిమ్ యాక్టివ్గా ఉంచుకోవాలని భావించే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపిక.రూ.189 రీఛార్జ్ ప్లాన్ వివరాలురిలయన్స్ జియో అందిస్తున్న రూ.189 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 300 ఎస్ఎమ్ఎస్లు, ఇంటర్నెట్ వినియోగానికి 2జీబీ డేటా లభిస్తాయి. ఒకసారి ఈ డేటా పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు. కానీ స్పీడ్ తగ్గుతుంది. దీనివల్ల కనీస అవసరాల కోసం అయినా కనెక్టివిటీ కొనసాగించవచ్చు.50జీబీ జియోక్లౌడ్ స్టోరేజ్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. కాలింగ్స్ మాత్రమే కాకుండా జియోటీవీ ద్వారా ఎక్కడైనా టీవీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. అంతే కాకుండా.. డిజిటల్ యుగంలో డేటా భద్రతను దృష్టిలో ఉంచుకుని 50జీబీ జియోక్లౌడ్ స్టోరేజ్ను ఉచితంగా అందిస్తున్నారు. ఇది ఫోటోలు, వీడియోలు వంటి ఫైల్స్ను సురక్షితంగా నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.అయితే.. ఈ ప్లాన్ కొన్ని థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్లో కనిపించకపోవచ్చు. అందువల్ల వినియోగదారులు మైజియో యాప్ను డౌన్లోడ్ చేసి, అందులోని ‘రీఛార్జ్’ విభాగంలో ఈ ప్లాన్ను ఎంపిక చేసుకుని యాక్టివేట్ చేయాలి.
పసిడి పండుగ.. అప్పుడు పది గ్రాములు..
ఆశలు అక్షయం కావాలని కోరుకుంటూ భారతీయులు జరుపుకునే పవిత్ర పండుగ అక్షయ తృతీయ. ఈ ప్రత్యేక సందర్భంలో పసిడి కొనుగోలు చేయడం అనవాయితీ. ఈ ఏడాది కూడా పసిడి కొనుగోళ్లకు జనం సిద్ధమవుతున్నప్పటికీ, ఆకాశాన్నంటుతున్న ధరలు సామాన్యుడి అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే బంగారం ధరల్లో వచ్చిన భారీ మార్పు ఇప్పుడు కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది.ధరల వ్యత్యాసం2025 అక్షయ తృతీయ నాటి ధరలతో పోలిస్తే, ఈ ఏడాది (2026) బులియన్ మార్కెట్లో పెను మార్పులు సంభవించాయి. గతేడాది 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.96,000 నుండి రూ.97,000 మధ్య ఉండగా, ఇప్పుడు అదే ధరకు కేవలం 6 నుండి 6.5 గ్రాములు మాత్రమే వస్తోంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే కొనుగోలుదారుల శక్తి 30-40% వరకు క్షీణించిందని విశ్లేషకులు చెబుతున్నారు.దేశంలో ప్రస్తుతం తులం (10 గ్రాములు) బంగారం (24 క్యారెట్స్) ధర రూ.1,52,840 లుగా (ఏప్రిల్ 11 నాటికి) ఉంది. ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,40,100 లుగా ఉంది.ఎందుకీ పరుగు?బంగారం ధరలు ఇలా అదుపు లేకుండా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు 'సురక్షిత ఆస్తి'గా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. రూపాయి విలువ తగ్గడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. భౌతిక బంగారంతో పాటు డిజిటల్ గోల్డ్, ఇటిఎఫ్ (ETF)లపై ఆసక్తి పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పైపైకి వెళ్తున్నాయి.మారిన వినియోగదారుల తీరుధరలు భారమైనా సెంటిమెంట్ను వదులుకోని భారతీయులు, తమ కొనుగోలు పద్ధతులను మార్చుకుంటున్నారు. భారీ ఆభరణాల కంటే తక్కువ బరువుతో ఆకర్షణీయంగా కనిపించే డిజైన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యాషన్ కంటే పెట్టుబడి దృక్పథంతో బంగారు నాణేలను కొనుగోలు చేస్తున్నారు. కొత్తగా నగదు ఖర్చు చేసే కంటే, ఇంట్లో ఉన్న పాత ఆభరణాలను ఇచ్చి కొత్తవి తీసుకునే 'ఎక్స్ఛేంజ్ స్కీంల' వైపు జనం మొగ్గు చూపుతున్నారు.వ్యాపారుల వ్యూహాలుకస్టమర్లను ఆకర్షించడానికి జ్యువెలరీ షాపులు కూడా రాయితీలను ప్రకటిస్తున్నాయి. మేకింగ్ ఛార్జీలపై తగ్గింపులు, ముందస్తు బుకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. స్టోర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గకపోయినప్పటికీ, ఒక్కొక్కరు కొనే బంగారం పరిమాణం తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
21 నెలల కనిష్ఠానికి ఎల్పీజీ వినియోగం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును అతలాకుతలం చేస్తున్న వేళ, భారత ఇంధన రంగంలో విరుద్ధమైన ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకవైపు యుద్ధ భయాలతో రవాణా ఇంధనాలైన పెట్రోల్, డీజిల్కు విపరీతమైన గిరాకీ పెరగ్గా, మరోవైపు వంట గ్యాస్ వినియోగం గత 21 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) విడుదల చేసిన తాత్కాలిక గణాంకాలు ఈ ఆసక్తికర అంశాలను వెల్లడించాయి.ఎల్పీజీ వినియోగంలో భారీ క్షీణతమార్చి 2026లో దేశీయ ఎల్పీజీ వినియోగం గణనీయంగా తగ్గింది. గత నెలతో పోలిస్తే 16 శాతం, గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 13 శాతం క్షీణత నమోదైంది. మార్చిలో మొత్తం వినియోగం 2.38 మిలియన్ టన్నుల వద్ద నిలిచింది. జూన్ 2024 తర్వాత ఎల్పీజీ వినియోగంలో ఇంతటి భారీ పతనం నమోదు కావడం ఇదే తొలిసారి.దిగుమతులపై హార్మూజ్ ప్రభావంభారతదేశం తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సుమారు 90 శాతం దిగుమతులు వ్యూహాత్మకమైన హార్మూజ్ జలసంధి గుండానే సాగుతుంటాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ సంక్షోభం ఈ జలసంధి ద్వారా రవాణాను ప్రభావితం చేయడంతో ఫిబ్రవరిలో 2 మిలియన్ టన్నులుగా ఉన్న దిగుమతులు మార్చి నాటికి 1.1 మిలియన్ టన్నులకు పడిపోయాయి.పెట్రోల్, డీజిల్కు డిమాండ్సరఫరాలో అంతరాయాలు కలగవచ్చనే భయంతో వినియోగదారులు ముందు జాగ్రత్తగా ఇంధన కేంద్రాలకు క్యూ కట్టడం వల్ల రవాణా ఇంధనాల వినియోగం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరింది.ఇంధనంమర్చి నెల వినియోగంవృద్ధి (నెలవారీ)వృద్ధి (వార్షిక)డీజిల్8.73 MT (రికార్డు)14%8%పెట్రోల్3.78 MT (రికార్డు)12%8% వార్షిక ధోరణి ఆశాజనకంమార్చి నెలలో ఎల్పీజీ వినియోగంలో క్షీణత కనిపించినప్పటికీ 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం వినియోగం మాత్రం ఆశాజనకంగానే ఉంది. గతేడాది కంటే 6 శాతం వృద్ధి చెంది 33.21 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత నమోదైన అత్యధిక వార్షిక వృద్ధి కావడం విశేషం.ప్రభుత్వ భరోసా - ప్రత్యామ్నాయ మార్గాలుప్రస్తుత అస్థిరతపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ దేశంలో ఇంధన నిల్వలు తగినంతగా ఉన్నాయని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. దేశీయ ఎల్పీజీ వినియోగంలో 90 శాతంపైగా ఉన్న గృహ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీపై భారాన్ని తగ్గించేందుకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. మార్చిలోనే 3 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వగా ఏప్రిల్ చివరి నాటికి మరో 6 నుంచి 7 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్!
రూ. 640 కోట్ల ఇల్లు.. నాన్న ఇచ్చిన గిఫ్ట్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ తాజాగా తన పుట్టినరోజును జరుపుకొన్నారు. బాలీవుడ్ అగ్ర తారలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటంతో సోషల్ మీడియా సందడి నెలకొంది. ఈ ప్రత్యేక సందర్భంలో, రాధికా మర్చంట్తో వివాహానికి ముందు తండ్రి ముఖేష్ అంబానీ కానుకగా ఇచ్చిన దుబాయ్లోని అద్భుతమైన విల్లా విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.పామ్ జుమేరాలో బిలియనీర్ ప్యాలెస్దుబాయ్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పామ్ జుమేరా ద్వీపంలో ఉన్న ఈ విల్లా విలువ దాదాపు రూ. 640 కోట్లు. సముద్రపు అంచున, ప్రకృతి ఒడిలో నిర్మితమైన ఈ నివాసం విలాసానికి మారుపేరులా నిలుస్తుంది.విల్లాలోని అద్భుతమైన ఫీచర్లుదాదాపు 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవంతి విస్తరించి ఉంది.ఇందులో మొత్తం 10 రాజభవనాల్లాంటి బెడ్రూమ్లు ఉన్నాయి.ఈ విల్లాకు అనుబంధంగా 70 మీటర్ల పొడవైన ప్రైవేట్ బీచ్ ఉండటం విశేషం.ఇటాలియన్ మార్బుల్స్తో మెరిసిపోయే ఫ్లోరింగ్, గోడలపై అరుదైన కళాఖండాలు ఈ ఇంటికి రాయల్ లుక్ను ఇస్తాయి.తెల్లటి రంగు ఇంటీరియర్స్ ఎడారి వేడిలోనూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి.విల్లాలో అధునాతన స్పా, టెర్రస్ గార్డెన్, ఇండోర్-అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి.ప్రముఖుల నిలయం.. పామ్ జుమేరాదుబాయ్లోని ఈ ప్రాంతం కేవలం అంబానీలకే కాదు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (జన్నత్ విల్లా), అమితాబ్ బచ్చన్ వంటి సెలబ్రిటీల నివాసాలకు కూడా నిలయం. సముద్రపు అలల మధ్య, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ 'డెజర్ట్ మాన్షన్' ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఒకటిగా నిలుస్తోంది.
ఫ్యామిలీ
ఆ వ్యాధి మళ్లీ తిరగబెడుతుందని ఊహించలేదు..! : దీపికా కక్కర్
దీపికా కక్కర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు. ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్లాంటి షోల పాత్రల్లోని నటనతో పాపులర్ అయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. ఆమె గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. గతేడాది వైద్యులు ఆమె కాలేయం దగ్గర టెన్నిస్ బంతి పరిమాణంలో కేన్సర్ గడ్డ ఉందని నిర్థారించినట్లు తెలిపారామె. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ గడ్డతోపాటు కాలేయంలో 22 శాతం తొలగించారు. హమ్మయ్యా బయటపడ్డాను అనుకునేలోపే ఆ వ్యాధి మరోసారి తిరగబట్టి గట్టి షాకిచ్చింది. దీంతో ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ..కనీసం మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోతున్నాననంటూ తన గోడును సోషల్ మీడియా వేదికగా వెళ్లబోసుకుంది. అంతేగాదు ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత జీవితాన్ని ఎలా ఇరకాటంలో పడేస్తాయో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.నటి దీపికా కాకర్కు కాలేయం దగ్గర 1.3 సెం.మీ సిస్ట్ మళ్లీ రావడంతో మరో శస్త్ర చికిత్స జరిగింది. కాలేయ కేన్సర్కు చికిత్స పొందుతున్న దీపికాకు ఈ కేన్సర్ మళ్లీ తిరగబెట్టడం ఒక భావోద్వేగపరమైన ఎదురుదెబ్బగా మారిందామెకు. ఈ మేరకు పోస్ట్లో ఊహించన ఈ మలుపు తనను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని పంచుకున్నారు. తన ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత జీవితాన్ని, ముఖ్యంగా మాతృత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని వాపోయారు. తన కొడుకు రుహాన్తో సమయం గడపలేకపోతున్నాన్న బాధ తనను కలిచివేస్తోందని అంటోంది. ఆస్పత్రి సందర్శనలే దినచర్యగా మారిపోవడంతో అలిసిపోతున్నానని అంటోంది. ఇక తన భర్త షోయబ్ తన కారణంగా పనులతో బిజీ అయిపోయాడని చెప్పుకొచ్చింది. ఆస్పత్రిలో ఉంటే రుహాన్ చూడలేను పోనీ ఇంటికి వస్తే చికిత్సతో అలిసిపోయి పడుకుంటాను అంతే ఇది తన దినచర్యను పూర్తిగా మార్చేసిందన్నారు. నిజానికి అనారోగ్యంతో ఉన్నప్పుడే మనం బలంగా ఉండాలి, సానుకూలంగా ఉండాలి. కానీ ఊహించని విధంగా మరోసారి ఈ కేన్సర్ తిరగబెట్టడం ఒకింత బాధ, భయం ఆవరించాయని కన్నీటి పర్యంతమైంది. ఒకరకంగా ఈ పరిస్థితి తన ఆరోగ్యం, జీవనశైలి పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసిందన్నారు. మన శరీరాలు చలా సంక్లిష్టమైనవి, బలమైనవి, ప్రతిరోజు వివిధ చికిత్సలు తట్టుకుంటున్నందుకు అవి నిజంగా గొప్పవి అని మెచ్చుకుంది. ఏ అనారోగ్యం వచ్చినా..మన శరీరంలో హార్మోన్లు ఎంతలా మార్పులు చెందినా..మన జీవితాలను సజావుగా గడుపుతామని అన్నారు. తనలా మళ్లీ మళ్లీ సిస్ట్ వచ్చినా కొందరితో మాట్లాడుతూ.. ఈ సమస్యను ఎదుర్కొనేలా తనను తాను బలోపేతం చేసుకుంటున్నట్లు తెలిపారు దీపికా. అలాగే అనారోగ్యం కారణంగా క్రమం తప్పకుండా వ్లాగ్లో పోస్ట్లు పెట్టలేకపోతున్నానని అన్నారు. తన చుట్టూ ఉన్నవారు నవ్వుతూనే ఉంటున్నారు కానీ, లోపల ఎంత ఆందోళన ఉందో గ్రహించగలను, ముఖ్యంగా అమ్మ, అత్తయ్య ఎంత బాధపడుతున్నారో ఊహించగలను అంటూ తన పోస్ట్ని ముగించింది.(చదవండి: పుష్-అప్స్లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్ 12 వారాల్లో..)
పుష్-అప్స్లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్ 12 వారాల్లో..
ఈ ఏజ్లో అంత కష్టతరమైన వ్యాయామాలు మావల్ల కాదు అనే వాళ్లకు ఈ బామ్మే ఆదర్శం. చేయాలనే గట్టి సంకల్పం ఉంటే వయసు అనేది పెద్ద సమ్య కాదని ఈ బామ్మని చూస్తే తెలుస్తుంది. పెద్ద వయసువారైన సులభంగా క్లిష్టమైన వ్యాయమాలు చేయాలంటే కేవలం ఓపిక, నిలకడే అత్యంత కీలకం అని ఈ సూపర్ బామ్మని చూస్తే అర్థమవుతోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియో క్లిప్లో కనిపిస్తున్న మహిళ పేరు అమృత్ కౌర్. 75 ఏళ్ల వయసులో మరింత బలంగా ఉండేందుకు చిన్నపాటి కదలికల కోసం వ్యాయమాలు చేస్తూ కనిపిస్తుంటుందామె. ముఖ్యంగా ఆ వృద్ధాప్య వయసులో పుష్ అప్లు చేసేందుకు పడ్డ శ్రమ చూస్తే..నోరెళ్ల బెట్టడం ఖాయం. మొదట కొన్నింటి సాయంతో పుష్ అప్లు చేస్తుంటుంది. ఆ తర్వాత మోకాళ్లు, చిన్న పరికరాల సాయంతో పుష్ అప్లు చేస్తుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వేటి సాయం లేకుండా సునాయాసంగా పుష్ అప్లు చేస్తుంటుంద. నిలకడతో చేస్తూ ఉంటే..ఎంత కష్టమైన వ్యాయామాలైన ఈజీగా చేసేయొచ్చని ఈ బామ్మని చూస్తే అర్థమవుతుంది. ఈ బామ్మ జస్ట్ 12 వారాల్లో పుష్ అప్లో పట్టు సాధించింది. రోజు జిమ్కి వచ్చేవారు సైతం సిగ్గుపడేలా ఎంత అద్భుతంగా చేసిందో చూస్తే మాటలు రావు. నెటిజన్లు ఇకపై ఎలాంటి సాకులు చెప్పకండి ఈ బామ్మని చూసి స్ఫూర్తి పొందండి, అమ్మో బామ్మ నువ్వు చాలా గ్రేట్ అని రకరకాలు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Amrit Kaur | Strong at 75 ❤️ (@getfitwithdadi) (చదవండి: ఆ రైడ్కి ఐదు స్టార్లు..! కించెత్తు సంభాషణకు నో ఛాన్స్..)
హ్యాపీ హప్చీ
గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాడీ సేఫ్టీ... మొదలైన వాటి గురించి ఒకటికి రెండుసార్లు చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఉండదని గ్రహించిన డా. కనిక, అన్నిరకాలుగా పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని ‘హాప్చి’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ‘హప్చి’ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎన్నో పాఠశాలల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది...ఒకరోజు కుమారుడితో సరదాగా మాట్లాడుతూ...‘స్కూల్లో ఏం నేర్చుకుంటున్నావు?’ అని అడిగారు కనిక. ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ అని క్యాజువల్గా చెప్పి పరుగెత్తాడు ఆ పిల్లాడు. ఆ సమయంలో ఆమె ఆలోచనలన్నీ ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ చుట్టే తిరిగాయి. ‘అక్కడ ఏమి నేర్చుకున్నారు? అది మాత్రమే సరిపోతుందా? నిజజీవిత పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యం పిల్లలకు చేరుతుందా?’... ఇలా ఎన్నోరకాలుగా ఆలోచించారు. ఆ ఆలోచనలే ‘హప్చీ’ ఆవిర్భావానికి కారణం అయ్యాయి.హప్చి అంటే హ్యాపీ చిల్డ్రన్2020లో ఐఐఎం బెంగళూరులోని ఎన్ఎస్ఆర్సిఇఎల్లోని ఉమెన్ స్టార్టప్ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకున్నారు కనిక. ఒక సంవత్సరం తరువాత కనిక నేతృత్వంలో పిల్లల భద్రత, జీవన నైపుణ్యాలు, మానసిక శ్రేయస్సుపై దృష్టి సారించే ప్రత్యేక సంస్థ ‘హప్చి’ ఆవిర్భవించింది. ‘హప్చి అంటే హ్యాపీ చిల్డ్రన్ అని అర్థం. పిల్లలు సంతోషంగా, భద్రంగా ఉండేలా చూడడమే మా లక్ష్యం’ అంటున్న కనిక పిల్లల భద్రతపై ‘స్మార్ట్ బీ సేఫ్’ ‘టైమ్ టు వాయిస్ మై ఛాయిస్’లాంటి ఎన్నో పుస్తకాలు రాశారు. వర్క్షాప్లు నిర్వహించారు.స్పందన లేదు...వన్–టైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కు పరిమితం కాకుండా ఏడాదిపాటు రకరకాల డిజిటల్ టూల్స్తో స్కూల్ ప్రోగ్రామ్స్లో భాగమయ్యే మోడల్ని ‘హప్చి’ ప్రవేశ పెట్టింది.మొదట్లో పాఠశాలల నుంచి కనికకు పెద్దగా స్పందన లభించలేదు. బాడీ సేఫ్టీ, వేధింపుల వంటి అంశాలపై చర్చలు నిర్వహించడానికి చాలా పాఠశాలలు విముఖత చూపాయి. కొన్ని పాఠశాలల వారు వర్క్షాప్లకు అనుమతించినా ఆ తరువాత పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఈ నేపథ్యంలో పిల్లల భద్రతకు సంబంధించిన చొరవ ఒకేవైపు నుంచి కాకుండా ఇరువైపులా ఉండాలని ఆలోచించారు కనిక.వారి సహకారంతో...మార్పు రావాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం కూడా అవసరం అని ఆలోచించిన కనిక ఆ వైపుగా దృష్టి పెట్టి విజయం సాధించారు. ‘హ్యాప్సేఫ్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘హ్యాప్సేఫ్’ ప్రోగ్రామ్లో భాగంగా 1 నుంచి 11 తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అబ్యూజ్ ప్రివెన్షన్, బుల్లీయింగ్ ప్రివెన్షన్, ఆన్లైన్ భద్రత, ఒత్తిడి, మానసిక ఆరోగ్యం... మొదలైన కీలక అంశాలపై పాఠ్యప్రణాళిక రూ΄÷ందించారు. కేవలం ఒకసారి అవగాహన కల్పించే స్థాయిని దాటి విద్యాభ్యాసంలో ప్రతి దశలోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగమయ్యేలా ఆచరణాత్మక నైపుణ్యాలను అందించే పాఠ్యప్రణాళిక రూ΄÷ందించారు.ఎంతో మార్పుఎన్నో పాఠశాలలపై ‘హప్చి’ ఎంతో ప్రభావాన్ని చూపించింది. అలాంటి పాఠశాలల్లో ‘హోరైజన్ గురుకుల్’ ఒకటి. ‘మా స్కూల్లో హప్చి ఎంతో మార్పు తెచ్చింది. పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడడానికి సంబంధించి, శరీర భద్రత, భావోద్వేగ అవగాహన విషయాలలో మార్పు ప్రత్యేకంగా కనిపించింది’ అంటుంది న్యూహోరైజన్ గురుకుల్ టీచర్ జాస్మిన్ పడ్డా. ఫరీదాబాద్(హరియాణా)లోని సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన కనిక మెడిసిన్ చేశారు. తండ్రి కోరుకున్నట్లే డాక్టర్ అయ్యారు. ఆ తరువాత హెల్త్కేర్ మేనేజ్మెంట్లోకి మారారు.
దోమలకూ ఓ టేస్ట్ ఉంది!
వేమన చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ అన్నాడు గాని చెవిలో దోమ అనాలి. దోమల బాధలు మనిషికి ఇంతింత గాదయా అని అందరూ రాత్రయితే అనుకోవడమే. దోమలది సర్వసమాన దృష్టి. ఇంటి యజమానినైనా, ఇంటికొచ్చిన అతిథినైనా ఒకేలాగా చూస్తాయి. అంతు చూస్తాయి. అయితే గమనించి చూస్తే కొందరి దగ్గర ఏవో సిఫార్సు లెటర్సు ఉన్నట్టుగా వారిని తక్కువ కుట్టడం... మరికొందరిని రేషన్ క్యూలో నిలుచున్నవారిలా లెక్కలేనట్టుగా చూసి ఎక్కువ కుట్టడం చేస్తుంటాయి. ‘నా రక్తం తియ్యగా ఉన్నట్టుంది దోమలకి’ అంటూ ఉంటారు ఇలాంటి వాళ్లు. కాని దోమలు కొందరిని ఎక్కువగా కుట్టడం రక్తం తీయగా ఉండటం వల్ల కాదు. దోమలకు మనిషి రుచి రక్తం గురించి పట్టింపు లేదు అయితే అవి మానవ శరీరం నుండి వెలువడే అనేక రకాల జీవసంకేతాలపై ఆధారపడతాయి. వాటిని అధికంగా వెదజల్లే వారిని సులభంగా గుర్తించి వారిని ఎక్కువగా కుడతాయి.మీ నిశ్వాసే మీ గూగుల్ లొకేషన్దోమలు అదేదో గూగుల్ మ్యాప్లో చూసి మిమ్మల్ని గుర్తుపట్టి కుట్టడానికి కారణం మీరు వదిలే నిశ్వాస. అందులోని కార్బన్ డయాక్సైడ్ (íసీఓ2) లో దోమలు గుర్తు పట్టే ప్రత్యేకమైన సెన్సర్లు ఉంటాయి, ఈ సెన్సర్లు వాటికి దారి చూపి మీ దాకా తీసుకొస్తాయి. అంటే మీ నిశ్వాసలో ఎక్కువ మొత్తంలో సీఓ2 ఉంటే మిమ్మల్ని ఈజీగా గుర్తు పట్టి వెంట పడతాయి. పిల్లల కంటే పెద్దలను దోమలు ఎక్కువగా కుట్టడానికి కారణం పిల్లల కంటే పెద్దలు ఎక్కువ సిఓ2 వదులుతారు. గర్భిణీ స్త్రీల శరీరం నుంచి కూడా ఎక్కువ సీఓ2 విడుదలవుతుంది కాబట్టి వారు దోమల్ని ఎక్కువగా ఆకర్షించవచ్చు. అదేవిధంగా వ్యాయామం చేసిన వారు లేదా మంచి మెటబాలిజం ఉన్న వారు దేహ రసాయనాలు విడుదల చేస్తూ దోమలకు తమ ఆచూకీ ఇస్తారు. ఒకసారి ఆచూకీ తెలుసుకున్నాక ఇక అక్కడే అవి రొద పెడుతూ తిరుగుతాయి.మీది వేడి శరీరమా?దోమలు నిశ్వాసలోని సీఓ2ను గుర్తించి దగ్గరగా వచ్చినట్టే మీది వేడి శరీరం అయితే దానిని కూడా బాగా గుర్తు పడతాయి. దోమలు సూక్ష్మమైన ఉష్ణోగ్రతలను గుర్తిస్తాయి. మానవ చర్మంలో వెచ్చదనాన్ని అవి సులభంగా గుర్తించగలవు. రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉన్న చోట వాటికి వేడి తెలుస్తుంది. అదీగాక కదులుతున్న శరీరం గాలిలోకి ఎక్కువ వేడిని, వాసనను విడుదల చేస్తుంది. దీనిని ఫోన్ కాల్లాగా అందుకుని దోమలు వాలి కుట్టగల కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించి కుడతాయి. మనం ఎంత దుప్పటి కప్పుకున్నా కాపు కాచి అందుకే కుడతాయి.మరి బ్లడ్ గ్రూప్ సంగతేంటి?దోమలు కొన్ని నిర్దిష్ట బ్లడ్ గ్రూప్లను ఇష్టపడతాయనే ఒక సాధారణప్రతిపాదన ఉంది. ఏ, బీ, ఏబీ ఇలా ఈ గ్రూపులు ఉన్నావారి కంటే ‘ఓ’ గ్రూప్ ఉన్నవారిని ఎక్కువగా కుడతాయని కొన్ని అధ్యయనాలు సూచించాయి. అయితే ఈ విషయం ఇంకా సాధికారికంగా నిరూపణ కాలేదు. శాస్త్రవేత్తలు ఈ సంగతి గురించి అధ్యయనం చేస్తూ ఉన్నారు. ముందు చెప్పినట్టు దోమలు ఒక వ్యక్తిపై వాలడానికి రక్తాన్ని గుర్తించడం కంటే శ్వాసలోని కార్బన్ డయాక్సైడ్ను శరీర వేడి, చర్మం నుండి వెలువడే రసాయన వాసనలనే ఎక్కువ గుర్తిస్తాయి.మీ చర్మం.. దాని మీది బ్యాక్టీరియామిమ్మల్ని దోమలు కుట్టడానికి, మీ చర్మంపైన ఉండే బ్యాక్టీరియాకు సంబంధం ఉంది. మానవ చర్మం సహజంగానే శరీరంలో నివసించే ట్రిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాకు నిలయం. ఈ సూక్ష్మజీవులు చెమట, ఇతర జీవన క్రియల సమయంలో రకరకాల రసాయన వాసనలను ఉత్పత్తి చేస్తాయి. ప్రతి వ్యక్తికీ వేరు వేరు బ్యాక్టీరియా స్థాయి వేరు వేరు చర్మ వాసనలు ఉంటాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాలు దోమలను ప్రత్యేకంగా ఆకర్షించే వాసనలను ఉత్పత్తి చేయగలవని పరిశోధనలు సూచిస్తున్నాయి, దీనివల్ల కొందరిని ఇతరుల కంటే ఎక్కువగా కుట్టే అవకాశం ఉంది.దోమ గారి యమా సంగతులు→ దోమలు చాలా వేగంగా రెక్కలు కొడతాయి. ఒక దోమ సెకనుకు సుమారు 500 సార్లు తన రెక్కలను ఆడిస్తుంది. అందుకే అది చెవి దగ్గరకు వచ్చినప్పుడు మనకు ‘కుయ్’మనే రొద వినిపిస్తుంది. దోమ కుట్టునైనా భరించడం సులభమేమో కానీ ఈ రొద వినడం కష్టం. మనకు సుపరిచితమైనది ఆ గుయ్.. కారం.→ దోమలు పులి, సింహం కంటే ప్రాణాంతకమైన జీవులు. సైజులో చాలా చిన్నగా ఉన్నప్పటికీ మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేసి ప్రాణాలు కబళిస్తాయి. మోటుగా చెప్పాలంటే యుద్ధాల్లో చనిపోయేవారి కంటే దోమకాటుకు చనిపోయేవారి సంఖ్య ఎక్కువ.→ శునకాలే కాదు దోమలు కూడా మిమ్మల్ని దూరం నుంచే వాసన పసిగట్టగలవు. మనుషులు వదిలే కార్బన్ డయాక్సైడ్ ద్వారా 10 నుండి 15 మీటర్ల దూరం నుంచే ఇక్కడ మనిషి ఉన్నాడని అవి గ్రహిస్తాయి. ఎగురుకుంటూ వచ్చి కసక్కున కుట్టి వదలుతాయి.→ దోమల్లో మగవి సాధుజీవులు. పాపం ఇవి చెట్ల మీద పుట్ల మీద ఎగురుతూ తేనె లాంటివి తాగి బతుకుతాయి. ఆడ దోమలు అలా కాదు. వాటికి బ్లడ్ కావాలి. గుడ్లు పెట్టడానికి మన రక్తం నుండి ప్రోటీన్ అవసరం కాబట్టి అవి మన రక్తం కోసం వెంట పడతాయి. → దోమలకు చూపు చాలా తక్కువ. కాబట్టి అవి కంటి పరిధిలో అడ్డంగా స్పష్టంగా కనిపించే ఆకారాలను వెతుకుతాయి. ముదురు రంగు దుస్తులు ధరించిన మనిషి వాటికి స్పష్టంగా కనిపిస్తాడు.→ దోమలకు పాదాలు ఇష్టం. అందుకే దోమలు కుట్టే మనిషి కాళ్లు గీరుకుంటూ కనిపిస్తాడు. దోమలు తరచుగా చీలమండలు, పాదాలను కుడతాయి, ఎందుకంటే అక్కడ ఉండే బ్యాక్టీరియా వాటికి నచ్చిన బలమైన వాసనలను ఉత్పత్తి చేసి వాటికి మనిషి ఆచూకి ఇస్తుంది. ఐస్లాండ్లో దోమ–ప్రమాదంఐస్లాండ్లో దోమలు ఉండవు. కాని ఇటీవల ఒక దోమ కనబడటం ఆ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. దోమలు జీవించి, పునరుత్పత్తి చేయడానికి వెచ్చని ఉష్ణోగ్రతలు కావాలి. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, ఐస్లాండ్ వంటి చల్లని ప్రాంతాలు కూడా వాటికి మరింత అనుకూలంగా మారుతున్నాయి. దీనివల్ల డెంగ్యూ జ్వరం, మలేరియా, చికున్ గున్యా వంటివి దోమల ద్వారా ఎక్కడెక్కడకు వ్యాపిస్తాయా అని సైంటిస్ట్లు ఆందోళన చెందుతున్నారు.ఎండాకాలం... దోమల కాలం. మనిషికి మహమ్మారుల నుంచైనా విముక్తి ఉందేమోగాని దోమ నుంచి లేదు. రాత్రయ్యి లైట్ ఆఫ్ చేయగానే ఈ దండు బయలుదేరి చుక్కలు చూపించడం నిత్యకృత్యం. అయితే ఇవి కొందరిని ఎక్కువ కుడతాయి. కొందరిని క్షమించి వదిలిపెడతాయి. కారణాలు తెలిస్తే మీరు ఔరా అంటారు.
అంతర్జాతీయం
బీటీఎస్ లిప్ సింక్ వివాదం: అసలు నిజం ఏంటి?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న సౌత్ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ ‘బీటీఎస్’ తాజా ప్రదర్శన సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. చాలా ఏళ్ల తర్వాత సభ్యులంతా కలిసి సియోల్లోని గొయాంగ్ స్టేడియంలో మొదలుపెట్టిన ‘అరిరాంగ్’ వరల్డ్ టూర్ 2026 అట్టహాసంగా ప్రారంభమైనప్పటికీ, ఒక చిన్న వీడియో క్లిప్ వారి గాత్రంపైనే అనుమానాలు పెంచుతోంది. వారు నిజంగా పాడుతున్నారా లేదా కేవలం లిప్ సింక్ చేస్తున్నారా? అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.ఏప్రిల్ 9న జరిగిన ఈ లైవ్ కాన్సర్ట్ను ‘వీవర్స్’ ప్లాట్ఫామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ చేశారు. కళ్లు చెదిరే స్టేజ్ డిజైన్, అద్భుతమైన కొరియోగ్రఫీతో షో అదరగొట్టింది. కానీ జంగ్కూక్, వీ, జిన్ కలిసి ‘బాడీ టు బాడీ’ పాటలోని ‘సమ్బడీ లైక్ యు’ అనే సెగ్మెంట్ పాడుతున్న సమయంలో తీసిన వీడియో వివాదానికి దారి తీసింది. జిన్ పాడుతున్న వాయిస్కి, అతని చేతిలోని మైక్ కదలికలకు అస్సలు పొంతన లేకపోవడంతో కొందరు నెటిజన్లు విమర్శలు మొదలుపెట్టారు. ‘బ్యాక్గ్రౌండ్ ట్రాక్ ప్లే చేసినా పర్వాలేదు, కానీ లైవ్లో పాడుతున్నట్లు ఎందుకు నటిస్తున్నారు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. Here is the video https://t.co/zLd6uNwmQL pic.twitter.com/z66bbV0S8b— T🎭 (@Wakeazul) April 9, 2026ఈ విమర్శలపై బీటీఎస్ అభిమానులు (ఆర్మీ) అంతే ధీటుగా స్పందించారు. వైరల్ అవుతున్న వీడియోను కావాలనే తప్పుగా ఎడిట్ చేశారని మండిపడుతున్నారు. లైవ్ స్ట్రీమింగ్ సమయంలో వీవర్స్ యాప్లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్లే ఆడియో, వీడియో మధ్య మిల్లీసెకన్ల తేడా వచ్చిందని ఆధారాలతో సహా వివరిస్తున్నారు. స్టేజి మీద వాళ్లు పాడుతున్నప్పటికీ, స్క్రీన్ మీద టెలికాస్ట్ అయ్యేసరికి ఆ జాప్యం కనిపించిందని చెబుతున్నారు.స్టేడియంలో నేరుగా రికార్డ్ చేసిన ఒరిజినల్ ఫ్యాన్క్యామ్ వీడియోల్లో వారి వాయిస్ స్పష్టంగా ఉందని, వేరే స్ట్రీమింగ్ వీడియోలను చూసి, తప్పుగా అర్థం చేసుకోవద్దని ఫ్యాన్స్ గట్టిగా వాదిస్తున్నారు. ఈ వివాదం ఆన్లైన్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన తారలకు అండగా నిలుస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘దీదీ’కి మైండ్ బ్లాంక్.. బెంగాల్ బరిలో బీజేపీ బ్రహ్మాస్త్రం
వహ్ చైనా.. వాట్ ఏ డబుల్ గేమ్!
పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ వినిపిస్తున్నాయి. లెబనాన్ను కాల్పుల విరమణ పరిధిలోకి తేకపోవడమే ఇందుకు కారణం. ఈ తరుణంలో ఇస్లామాబాద్ చర్చలు తేడా కొడితే.. అంతర్జాతీయంగా ఆ దేశం పరువు పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అమెరికా-ఇరాన్ను శాంతి చర్చలకు ఒప్పించి సైలెంట్గా క్రెడిట్ కొట్టేసిన చైనా.. డబుల్ గేమ్కి తెర తీసినట్లు తెలుస్తోంది.రెండు వారాల యుద్ధ విరమణలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీర్ఘకాలిక శాంతి స్థాపనే ధ్యేయంగా ఇరు వైపులా చేసిన ప్రతిపాదనలపై చర్చించబోతున్నారు. అయితే ట్రంప్ వార్నింగ్ను బట్టి ఒప్పందం కుదరకపోతే మాత్రం యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోలేదు. ఈ తరుణంలో.. ఇరాన్కు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేసేందుకు చైనా సిద్ధమవుతున్నట్లు అమెరికా గూఢచార సంస్థలు నివేదికలు ఇచ్చాయి!.సీఎన్ఎన్ కథనాల ప్రకారం.. ‘‘చైనా త్వరలో ఇరాన్కు కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను పంపేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా మాన్పాడ్స్ (MANPADs.. భుజంపై మోసుకెళ్లే యాంటీ-ఎయిర్ మిసైల్ వ్యవస్థ)లను రహస్యంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రవాణా నేరుగా కాకుండా ఇరు దేశాలకు నమ్మకంగా ఉన్న మూడో దేశం ద్వారా జరగొచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం’’ అని పేర్కొంది.ఎందుకిలా..ఒకవైపు ఇరాన్–అమెరికా మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ శాంతి చర్చలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తూనే.. మరోవైపు ఇరాన్కు సీక్రెట్గా ఆయుధాల్ని సరఫరా చేయాల్సిన అవసరం చైనాకు ఎందుకు?.. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ విషయంలో చైనా ద్వంద్వ వ్యూహాన్ని సూచిస్తోంది.ఇరాన్ చమురు చైనాకు అవసరం. కాబట్టే శాంతి చర్చల ద్వారా చమురు సరఫరా స్థిరంగా ఉండేలా చూడాలనుకుంది. అలాగే అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ప్రపంచ శాంతి దూతగా తనను చూపించుకోవాలని.. తన ప్రతిష్టను పెంచుకోవాలని ప్రయత్నించింది. వీటన్నింటి కంటే హర్ముజ్ జలసంధి చైనాకు ఎంతో కీలకం. అందుకే మధ్యవర్తిత్వం జరిపింది. అదే సమయంలో..అమెరికా ఆంక్షల మధ్య ఇరాన్కు మద్దతు ఇవ్వడం ద్వారా.. ఆ ఆధిపత్యాన్ని ప్రశ్నించినట్లైంది. అదే సమయంలో చైనా తన “Axis of Autocracy (అమెరికా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేసే ధోరణి.. రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి) భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటోంది.అందుకే.. బహిరంగంగా శాంతి ప్రయత్నాలు చేస్తూ, రహస్యంగా ఇరాన్కు మిలిటరీ సహాయం అందిస్తూ.. రెండు వైపులా లాభం పొందాలని ప్రయత్నిస్తోందన్నది విశ్లేషకుల మాట. అంతర్జాతీయంగా ఆందోళనలు కలిగిస్తున్న సీఎన్ఎన్ కథనంపై అమెరికా విదేశాంగ శాఖ, వైట్ హౌస్, వాషింగ్టన్లోని చైనా దౌత్య కార్యాలయం ఇంకా స్పందించలేదు. చైనా యుద్ధం మొదలైనప్పటి నుంచి బహిరంగంగానే ‘‘మేము ఎవరికి ఆయుధాలు ఇవ్వడం లేదు’’ అని చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ప్రచారాలను కూడా తోసిపుచ్చే అవకాశం లేకపోలేదు.
హర్మూజ్ విషయంలో ఇరాన్ భింకం ఇందుకే?
ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరితే యుద్ధం ముగిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకూ జరిగిన యుద్ధంలో హాట్ టాఫిక్గా నిలిచిన అంశాలలో ప్రధానమైంది హర్మూజ్ జలసంధి. దీనిని తెరవాలని అమెరికా పట్టుబట్టడం ఇరాన్ ససేమిరా అనడంతో చాలా కాలం పాటు ఉద్రిక్తతలు నడిచాయి. అయితే ఇరాన్ ఈ జలసంధిని తెరవలేక పోవడానికి అందులో అమర్చిన మైన్స్ సైతం ఓ కారణంగా తెలుస్తోంది.ప్రపంచ రవాణాకు హర్మూజ్ జలసంధి ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వాణిజ్య రవాణాలో దాదాపు 20 శాతంకు పైగా దీనిగుండానే ప్రయాణం అవుతాయి. గల్ఫ్ దేశాలకు చెందిన చమురుతో పాటు ఇతరత్రా కీలకమైన వస్తువులు దీని గుండానే సరఫరా జరుగుతుంది. అయితే యుద్ధం కారణంతో ఇరాన్ను దీనిని మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా నిలిచి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంక్షోభ పరిస్థిలకు ట్రంప్ యుద్ధ నిర్ణయమే కారణమని ప్రపంచ దేశాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే హర్మూజ్ తెరవాలని ట్రంప్ పలుమార్లు హెచ్చరించినా ఇరాన్ మాత్రం ససేమిరా అంది. ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరినా వెనక్కి తగ్గలేదు. ఇరాన్ ఇంత మెుండిగా వ్యవహరించడానికి ఇతర కారణాలు ఉన్నాయని విశ్లేశకులు భావిస్తున్నారు.అయితే తొలి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ తో యుద్ధం తలెత్తి అవకాశం ఉందని భావించిన ఇరాన్ హర్మూజ్ని మూసివేయాలని భావించినట్లు తెలుస్తోంది. దీనికోసమే ఆ జలసంధికి చెందిన చాలా ప్రదేశాల్లో ల్యాండ్ మైన్స్ (మందుపాతరలు) పెట్టింది. అయితే అలల తాకిడికి చాలా మైన్స్ కొట్టుకపోయి ఉండవచ్చని అవి ఎక్కడ ఉన్నాయో ప్రస్తుతం ఇరాన్కు సైతం గుర్తించ లేకుండా ఉందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ పూర్తి సురక్షిత ప్రయాణానికి జలసంధిని తెరవాలని అల్టిమేటం ఇవ్వడం.. ఒక వేళ అనుమతి ఇచ్చాక ఏదైనా ప్రమాదంతో షిప్లు పేలిపోతే యుద్దం తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో ఇరాన్ కొంత ఆలోచిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి.దానితో పాటు ల్యాండ్ మైన్లను అమర్చడం కంటే తొలగించడం మరింత కష్టమని ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో వాటిని తొలగించే సాంకేతికత గానీ సమయం గానీ ఇరాన్ వద్ద లేవని పేర్కొన్నాయి. ఒకవేళ ట్రంప్ మాటలను నమ్మి వాటిని తొలగిస్తే ఆయన ప్లేటు పిరాయిస్తే పరిస్థితులు ఏంటని అక్కడి నాయకులు ఆలోచిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే హర్మూజ్ తెరవడానికి సందిగ్ధిత కొనసాగుతుందని తెలిపాయి. అయితే ట్రంప్ ఈ జలసంధి అంశంపై తాజాగా స్పందించారు ఇరాన్ హర్మూజ్ను తెరిచినా.. తెరవకపోయినా త్వరలోనే దానిని మేము ఓపెన్ చేస్తాము అని అన్నారు. ఈ విషయంలో వేరే దేశాలు సైతం మాకు సహాయం చేస్తామని ప్రకటించాయి అని అన్నారు. అయితే వాటి పేర్లు మాత్రం వెల్లడించలేదు.
ఇరాన్ విమానంలో రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు..
ఇస్లామాబాద్: చర్చలకు పాకిస్తాన్ వచ్చిన ఇరాన్ విమానంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మృతి చెందిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకువచ్చారు. మినాబ్ స్కూల్ మృతుల కోసం ఒక్కో సీటు కేటాయించారు. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు ఇవాళ ప్రారంభం కాగా.. ఈ చర్చలకు హాజరైన ఇరాన్ ప్రతినిధి బృందం రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మృతి చెందిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల సంభవిస్తున్న మానవ ప్రాణ నష్టానికి ఇవి నిదర్శనంగా నిలిచాయి. సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకుంటూ, ఘలీబాఫ్ ఇలా రాశారు: "ఈ విమాన ప్రయాణంలో నా సహచరులు వీరే.. #Minab168" అంటూ ట్వీట్ చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలని ఆశిస్తూ, అమెరికాతో చర్చల కోసం ఇస్లామాబాద్ వెళ్తున్న ఈ ప్రతినిధి బృందానికి 'మినాబ్ 168' అని పేరు పెట్టారు. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజున అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన పాఠశాల విద్యార్థుల జ్ఞాపకార్థం ఈ పేరును నిర్ణయించారు. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఈ ఫోటోను రీ-షేర్ చేస్తూ.. "మినాబ్ చిన్నారులను మేము ఎప్పటికీ మర్చిపోము" అని రాసింది.همراهان من در این پرواز#Minab168 pic.twitter.com/xvXmDlSDiF— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 10, 2026మినాబ్లో ఏం జరిగింది?ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 160 మందికి పైగా చిన్నారులు మరణించారు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన రోజున దక్షిణ ఇరాన్లోని మినాబ్ పట్టణంలో ఉన్న 'షజరే తయ్యిబే' అనే బాలికల ప్రాథమిక పాఠశాలపై ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఒక వైమానిక చిత్రాన్ని షేర్ చేశారు. అందులో "అమాయక" బాలికల మృతదేహాలను పూడ్చిపెట్టడానికి సామూహిక సమాధులను తవ్వుతున్న దృశ్యాలు ఉన్నాయి. అదే పోస్ట్లో అరాగ్చీ, ట్రంప్పై విమర్శలు చేస్తూ దీనిని 'కోల్డ్ బ్లడెడ్ మర్డర్'(క్రూరమైన హత్య) గా అభివర్ణించారు.
జాతీయం
ముఖేష్ అంబానీకి ఊరట
23 ఏళ్లుగా సా..గుతున్న ఓ కేసులో బిలీయనీర్ ముఖేష్ అంబానీకి ఊరట లభించింది. కేసును కొట్టిపారేసిన న్యాయస్థానం.. ఫిర్యాదు చేసిన వ్యక్తికే జరిమానా విధించి షాకిచ్చింది. ఈ క్రమంలో అంబానీకి సమన్లు జారీ చేసిన కింది కోర్టు తీరును ఒడిశా హైకోర్టు తప్పుబట్టింది. రూ.501 ఈ వ్యవహారంలో అసలేం జరిగిందంటే.. ఒడిశా రూర్కెలాకు చెందిన ప్రఫుల్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి 2003లో.. ఆనాడు ముఖేష్ అంబానీ అధినేతగా ఉన్న రిలయన్స్ ఇన్ఫోకమ్(రిలయన్స్ గ్రూప్లో భాగంగా..) తీసుకొచ్చిన ఓ స్కీమ్లో చేరాడు. సబ్సిడీ కింద రూ.501 చెల్లించి ఫోన్ను కొనుగోలు చేశాడు. అయితే ఆ సేవలు నాసిరకంగా ఉన్నాయని.. తాను ఎంతో నష్టపోయానని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యవహారంలో ముఖేష్ అంబానీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరాడు.అయితే.. ఈ వ్యవహారంలో అతను కోర్టులను పదే పదే ఆశ్రయించాడు. 2003, 2004లో వేసిన పిటిషన్లను 2004, 2005లో నిశితంగా పరిశీలించిన ఒడిశా హైకోర్టు కొట్టి పారేసింది. 2007లో అయితే ఏకంగా సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు వేస్తే.. అక్కడా అతనికి చుక్కెదురైంది.నాలుగోసారి హైకోర్టును ఆశ్రయించగా.. ఈసారి న్యాయస్థానం పిటిషన్ను పరిశీలించి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు దశాబ్దాలుగా పిటిషన్లు వేస్తూ కోర్టుల సమయాన్ని వృథా చేశారంటూ.. రూ.1000 జరిమానా విధించింది. మార్చి 31న తీర్పు వెలువడగా.. తాజాగా ఆ ఆర్డర్ కాపీని ఆన్లైన్లో పబ్లిష్ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.న్యాయ పరిశీలన చేయరా?..సాధారణంగా మొబైల్ సేవలపై వినియోగదారుడు ఫిర్యాదు చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అదీ సంబంధిత ఫోరమ్లలో. కానీ, ఈ కేసులో ప్రఫుల్.. ఏకంగా క్రిమినల్ కేసు పెట్టాలంటూ కోర్టులను ఆశ్రయించాడు. అయితే అతని పిటిషన్ ఆధారంగా.. పాన్పోష్లోని సబ్-డివిజనల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ (SDJM) ముఖేష్ అంబానీకి సమన్లు కూడా జారీ చేసింది. ఈ పరిణామాలన్నింటిపై తాజా విచారణలో.. ఒడిశా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘చిన్న మొత్తానికి సంబంధించిన వినియోగదారుడి ఫిర్యాదుతో.. ఓ పేరొందిన వ్యాపారవేత్తను నిందితుడిగా పేర్కొనడం ఏంటి?.. సమన్లు జారీ చేయడం ఏంటి?. ఇది కచ్చితంగా సరైన న్యాయ పరిశీలన లేకుండా జరిగిన వ్యవహారమేనని స్పష్టమవుతోంది’’ అని కింది కోర్టును మందలించింది. ఈ కేసులో అంబానీకి జారీ చేసిన సమన్లు, అలాగే ఈ పెండింగ్ కేసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.అలాంటి హక్కు ఉండదు.. మొబైల్ సేవల్లో అంతరాయం ఏర్పడితే వినియోగదారుడికి ఫిర్యాదు చేసే హక్కు ఉండి ఉండొచ్చు. కానీ అలాంటి వివాదాలను క్రిమినల్ చట్టం ద్వారా కొనసాగించడం తగదు. “ఫిర్యాదు ఎలాంటిదైనా.. అది క్రిమినల్ బాధ్యత లేని వారిపై క్రిమినల్ చట్టాన్ని ఆయుధంగా వాడుకునే హక్కు ఇవ్వదు” అని తీర్పు సందర్భంగా జస్టిస్ పాణిగ్రాహి వ్యాఖ్యానించారు.
కొండల్లో కేరళ బాలిక మిస్సింగ్.. నాలుగు రోజుల తర్వాత..
కర్ణాటక కొండల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి అదృశ్యమైన 14 ఏళ్ల కేరళ బాలిక నాలుగు రోజుల తర్వాత శవమై కనిపించింది. పోలీసులు ముమ్మరంగా గాలించిన తర్వాత ఆమె మృతదేహం లభ్యం కాగా.. తమ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని పాలక్కాడ్కు చెందిన 10వ తరగతి విద్యార్థిని శ్రీనంద తన బంధువులతో సుమారు 40 మందితో కలిసి కర్ణాటక పర్యటనకు వచ్చింది. వీరు మొదట ఉత్తర కర్ణాటకలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హంపిని సందర్శించారు. ఏప్రిల్ 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు చిక్కమగళూరు చేరుకున్నారు. అక్కడ ప్రైవేట్ జీపుల్లో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లి.. ఆ తర్వాత చంద్రద్రోణ కొండల్లో ట్రెక్కింగ్కు వెళ్లారు.ట్రెక్కింగ్ రోజున ఒక కుటుంబ సభ్యుడితో కలిసి ఉన్న వీడియోలో బాలిక చివరిసారిగా కనిపించింది. అయితే, ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చీకటి పడుతున్న సమయంలో ఆమె అదృశ్యమైంది. కొండల్లోని మాణిక్యధార ప్రాంతంలో ఆమెను చివరిగా చూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. లోతైన ఘాట్ ప్రదేశాలు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. లోతైన ప్రాంతాలకు వెళ్లేందుకు తాళ్లను కూడా ఉపయోగించారు. రాత్రి సమయాల్లో డ్రోన్ సర్వైలెన్స్, థర్మల్ కెమెరాలను వినియోగించారు. నాలుగు రోజులు పాటు గాలింపు అనంతరం మాణిక్యధార వ్యూ పాయింట్కు సుమారు 1,500 అడుగుల దిగువన ఉన్న లోయలో శ్రీనంద మృతదేహం లభ్యమైంది.అయితే, బాలిక మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి స్పందిస్తూ.. బాలిక కిడ్నాప్ అయి ఉండవచ్చని ఒక వాదన ఉందని.. ఎవరితోనైనా వెళ్లి ఉండవచ్చని మరో వాదన వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఆచూకీ లభించిన నేపథ్యంలో వాస్తవాలు విచారణలో తేలుతాయని పేర్కొన్నారు. పోలీసులు పలు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ప్రమాదవశాత్తూ కొండపై నుండి జారిపడిందా? ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తేల్చాల్సి ఉంది. దర్యాప్తులో భాగంగా బాలిక తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మథుర విషాదం: చలించిపోయిన హేమమాలిని
మధుర: ఉత్తరప్రదేశ్లోని మథుర సమీపంలో యమునా నదిలో జరిగిన ఘోర పడవ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని, ఇది అత్యంత హృదయ విదారకమైన ఘటన అని స్థానిక పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ నటి హేమమాలిని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు ఆనందంగా భజనలు చేసుకుంటూ వెళ్తున్న పడవ బోల్తా పడి 10 మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. ‘మరణించిన వారి ఆత్మలకు శాశ్వత శాంతి చేకూరాలని, ఈ తీరని శోకాన్ని భరించే శక్తిని ఆ బాధిత కుటుంబాలకు ప్రసాదించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఆమె ట్వీట్ చేశారు.శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో ఈ మహా విషాదం చోటుచేసుకుంది. మథుర డీఐజీ శైలేష్ కుమార్ పాండే తెలిపిన వివరాల ప్రకారం సుమారు 30 మంది భక్తులతో వెళ్తున్న ఒక మోటారు బోటు అదుపుతప్పి పాంటూన్ వంతెనను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మృతదేహాలను వెలికితీశారు. ప్రాణాలతో బయటపడిన 22 మందిని రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వారికోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానిక గజ ఈతగాళ్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయిఈ ప్రమాదానికి కనీస అనుమతులు లేని పడవ ప్రయాణమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. మథుర, బృందావన్, గోకులం మధ్య బోటు ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి దీన్ని నడిపినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు పడవలో భక్తులు భక్తిపారవశ్యంతో భజనలు చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. భక్తుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: West Bengal: ‘పీకే’ లేని పందెం.. మమత హ్యాట్రిక్ కొడతారా?
West Bengal: ‘పీకే’ లేని పందెం.. మమత హ్యాట్రిక్ కొడతారా?
అసెంబ్లీ ఎన్నికలు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. ఈ ఎన్నికల సంగ్రామం పైకి పాత కథలాగే కనిపిస్తున్నా, లోపల మాత్రం అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు సంక్షేమం, ప్రాంతీయ అస్తిత్వం నినాదంతో మమతా బెనర్జీ.. మరోవైపు జాతీయ నాయకత్వం, బెంగాల్ మార్పు నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈసారి కూడా ప్రధాన పోరు తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్యే నెలకొంది. అయితే గత ఎన్నికల్లో భారీ విజయానికి కారణంగా నిలిచిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు దీదీ పక్కన లేరు. ఆయన మార్క్ వ్యూహాలు లేకుండా తృణమూల్ తిరిగి కాషాయ దళాన్ని నిలువరించగలదా? ఇదే ఇప్పుడు బెంగాల్ నుంచి ఢిల్లీ పీఠం వరకూ ఉత్కంఠ రేపుతున్న ప్రధాన ప్రశ్న.భవానీపూర్లో హై ఓల్టేజ్2026, ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న ఈ అత్యంత కీలకమైన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. మొత్తం 294 స్థానాలకు గానూ 291 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేరుగా పోటీ చేస్తుండగా, మిగిలిన మూడు డార్జిలింగ్ హిల్ సీట్లను తన మిత్రపక్షమైన బీజీపీఎంకు కేటాయించింది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై మరోసారి హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమయ్యారు. సువేందు అదనంగా తన పాత స్థానమైన నందిగ్రామ్ నుంచి కూడా పోటీకి దిగడం విశేషం.వ్యూహాన్ని మార్చిన బీజేపీమార్చి 17న వెలువడిన టీఎంసీ అభ్యర్థుల జాబితాలో మధుజ, మదన్ మిత్ర, ఫిర్హాద్ హకీమ్ లాంటి సీనియర్ నేతలకు చోటు దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా ఏకంగా 52 మంది మహిళలకు, 95 మంది ఎస్సీ, ఎస్టీలకు దీదీ అవకాశం కల్పించారు. ‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మేము కచ్చితంగా 226 కు పైగా సీట్లు సాధిస్తాం’ అని మమతా బెనర్జీ అత్యంత ధీమాగా చెబుతున్నారు. మరోవైపు, 2021లో ‘200 పార్’ నినాదంతో బరిలోకి దిగి వెనుకబడిన బీజేపీ, ఈసారి వ్యూహాన్ని మార్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్కతా సభలో మాట్లాడుతూ ‘మేము ఒకదాని తర్వాత ఒకటిగా 170 సీట్లు గెలుచుకుంటాం, ఆ తర్వాతే బెంగాల్లో అసలైన మార్పు వస్తుంది’ అని సవాల్ విసిరారు.సంక్షేమ పథకాల సాయంతో..ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘భయం లేని బెంగాల్’ నినాదంతో పట్టణ, హిందూ మెజారిటీ ప్రాంతాల్లో బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉన్నప్పటికీ ప్రధానంగా శాంతిభద్రతల సమస్యలు, నిరుద్యోగంపై అధికార పార్టీని బీజేపీ నిలదీస్తోంది. దానికి ధీటుగా టీఎంసీ ‘లక్ష్మీర్ భండార్’ వంటి ప్రజాదరణ పొందిన సంక్షేమ పథకాలను నమ్ముకుంది. ఓటర్ల జాబితా సవరణలను దీటుగా ఎదుర్కొనేందుకు తమ బూత్ స్థాయి ఏజెంట్లను తిరిగి చురుగ్గా రంగంలోకి దించింది. రెండు దశల్లోనే ఎన్నికలు ఉండటంతో, ఇరు పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి.కుదిపేసిన బొగ్గు కుంభకోణంఎన్నికల ప్రచారం ఊపందుకోకముందే, జనవరి నెలలో జరిగిన ఒక నాటకీయ పరిణామం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. 2020 నాటి బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి కోల్కతాలోని ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయాలతో పాటు, దాని చీఫ్ ప్రతీక్ జైన్ ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. అయితే, తమ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల రహస్య డేటాను దొంగిలించేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కక్షపూరితంగా ఈ దాడులు చేయిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఏకంగా రాష్ట్ర పోలీసులతో కలిసి దాడులు జరుగుతున్న ప్రాంతానికి ఆమె స్వయంగా చేరుకుని, కీలక పత్రాలను సీజ్ చేయకుండా ఈడీ అధికారులను అడ్డుకున్నారు. దీనిని రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించి, కోల్కతాలో భారీ నిరసన చేపట్టారు.నాడు ఐ-ప్యాక్ అండతో..అయితే విచారణకు ఆటంకం కలిగించారని ఈడీ ఆరోపించగా, ఈ వివాదంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, ఈడీ అధికారుల విధులకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని కఠినంగా హెచ్చరించాల్సి వచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 38 శాతం ఓట్లతో 77 సీట్లు గెలుచుకున్న బీజేపీ గట్టి పోటీనిచ్చినా, 213 సీట్లతో దీదీ తన ఆధిపత్యాన్ని ,చెక్కుచెదరనీయలేదు. ఆ చారిత్రక విజయంలో ప్రశాంత్ కిషోర్తో పాటు, ఆయన సంస్థ ఐ-ప్యాక్ పోషించిన పాత్ర అసాధారణం. ‘దీదీ కే బోలో’ లాంటి వినూత్న కార్యక్రమాలను కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయి సమస్యలను ప్రణాళికాబద్ధంగా గుర్తించి వాటిని ప్రభుత్వ విధానాలుగా, హామీలుగా మార్చడంలో ఐ-ప్యాక్ ఒక పటిష్టమైన డేటా వ్యవస్థలా పనిచేసింది.ఏం జరగనుంది?.. సర్వత్రా ఉత్కంఠఅయితే ప్రశాంత్ కిషోర్ బీహార్లో సొంతంగా ‘జన్ సురాజ్ పార్టీ’ పెట్టుకుని రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. (ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు). ఈ 2026 ఎన్నికల్లో ఐ-ప్యాక్ ఇప్పటికీ టీఎంసీకి వ్యూహాత్మక భాగస్వామిగానే కొనసాగుతున్నప్పటికీ, గత ఎన్నికల్లో పీకే స్వయంగా నడిపించిన ఆ పదునైన వ్యూహాత్మక యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా కనిపించడం లేదు. ఈ లోటు ఎన్నికల ఫలితాలపై ఎంతగా ప్రభావం చూపుతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ కిషోర్ లాంటి దిగ్గజ వ్యూహకర్త నేరుగా లేకపోయినా, ఐ-ప్యాక్ మద్దతుతో పాటు, తనకున్న సొంత ఇమేజ్, పటిష్టమైన సంక్షేమ పథకాలతో మమతా బెనర్జీ ఈ మహా పోరును మరోసారి తనవైపు తిప్పుకుంటారో లేదో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచం షేక్.. ‘ఓపెన్ ఏఐ’ సంచలన ప్రతిపాదన!
ఎన్ఆర్ఐ
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’
అల్ఫారెట్టా, జార్జియా: స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి-2026’ అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు.ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. నాలుగేళ్ల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ(యూఎస్ఏ) సేవా సంస్థలకు అందజేయనున్నారు.ఈ వేడుకల్లో బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి (శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రతినిధులు), గిరిధర్ కొటగిరి (ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు), జ్యోత్స్న పాలకుర్తి (గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ చైర్మన్), రమణ గంద్ర (గేట్స్ అధ్యక్షులు), సునీత పోట్నూరు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు), ఆది శ్రీనివాసన్ (ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు), శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ (ప్రెసిడెంట్ అండ్ సీఈఓ), జనార్ధన్ పన్నెల (శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధి) పాల్గొన్నారు.
న్యూయార్క్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయుల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్టర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరంలోని ఇండియా హౌస్లో ఘనంగా నిర్వహించారు.గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వ్యాపారం, మీడియా, ఫైనాన్స్, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అమెరికాలో భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు.FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తమ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు.కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో', 'ఉజ్వల యోజన' వంటి పథకాల ద్వారా భారత్ మహిళా సాధికారతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అలాగే 100 మిలియన్ కుటుంబాలను మహిళల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థికంగా శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరఫున గుర్తింపు సర్టిఫికెట్లు, FIA శాలువాలు, ట్రోఫీలు అందజేశారు.నార్త్స్టార్ స్ట్రాటజీస్ COO జోడి లిన్ హెర్క్లోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల్ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాన్సుల్ జనరల్ సతీమణి మోనాలిసా శువదర్షిణి ప్రధాన్ కూడా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్ మాట్లాడుతూ, కమ్యూనిటీ నిర్మాణంలో FIA పాత్రను కొనియాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అమెరికన్ నటి రేష్మా శెట్టి.. మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ తానియా కిన్సెల్లా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం ఇస్తూ.. అడ్డంకులను అధిగమించిన వైనాన్ని వివరించారు.కార్యక్రమ ప్రారంభంలో దివంగత అవార్డు గ్రహీత రాధా సుబ్రమణ్యం జ్ఞాపకార్థం మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం ముగింపులో FIA ప్రధాన కార్యదర్శి సృష్టి కౌల్ నరులా ధన్యవాదాలు తెలిపారు. FIA జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల వందన సమర్పణతో వేడుకలను ముగిశాయి.ఎఫ్ఐఏ సంస్థ 1970 నుండి భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారతీయ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఇండో–అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తోంది.
సింగపూర్లో ఘనంగా ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి తనయులు కే నాగేంద్రనాథ్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం 43, బర్గండీ క్రిసెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 70 మంది దర్శకుడు కె. విశ్వనాథ్ అభిమానులు హాజరయ్యారు.సంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ, కె. నాగేంద్రనాథ్తో తనకు దాదాపు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తెలిపారు. సామవేదం షణ్ముఖ శర్మ 2017లో సింగపూర్ విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన శివపదం కార్యక్రమానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో సందేశాలు అందించిన పుస్తక రచయిత, ప్రముఖ దర్శకులు సీనియర్ డైరెక్టర్ వంశీకి, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయులు ఏడిద రాజాకి ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్య అతిథి కె. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ శంకరాభరణం’ చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం అప్పట్లో తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందిందని తెలిపారు. ప్రస్తుతం పుస్తక రచయిత వంశీని సంప్రదించి పునర్ముద్రణ చేయించామని చెప్పారు. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న హైదరాబాద్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామని, దానికి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలు, విశేషాలు వినిపించడంతో ఇది ఒక అచ్చ తెలుగు పండుగలా అనిపించిందని తెలిపారు.ఈ సందర్భంగా తొలి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినసంస్కార భారతి అధ్యక్షులు రమణమూర్తి కి, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు బి.వి.ఆర్. చౌదరి దంపతులకు, తంగిరాల రాజశేఖర్, సౌభాగ్యలక్ష్మి దంపతులకు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు.కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి ఆలపించగా, శేషశ్రీ వీణపై ఒక గీతాన్ని వాయించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ప్రేక్షకులతో పంచుకోగా, చిత్ర మరియు పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం రాజశేఖర్–సౌభాగ్యలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో భోజనాన్ని సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లలో శ్రీలలిత, మాధవి పాలకుర్తితోపాటు, సుబ్బు పాలకుర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ్, సత్య జాస్తి, రాజ్ కుమార్ తదితరులు సహాయ సహకారాలను అందించారు.
క్రైమ్
పోక్సో కేసులో 76 ఏళ్ల డాక్టర్కు ఏడేళ్ల జైలు
కేపీహెచ్బీకాలనీ: బాలికతో అనుచితంగా ప్రవర్తించిన ఓ డాక్టర్కు కూకట్పల్లి ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపిన మేరకు.. 2023లో ఓ బాలికతో ఆదిత్యనగర్కు చెందిన డాక్టర్ కందుల సుబ్బారావు (76) అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తులో నేరం రుజువు కావడంతో సుబ్బారావుకు ఏడేళ్ల ఏళ్ల జైలు శిక్ష, 30 వేల రూపాయల జరిమానా విధిస్తూ కూకట్పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు తీర్పు వెలువరించారు. తీర్పు అనంతరం డాక్టర్ సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
ఏకాంతంగా ఉన్న జంటలే ఆ ఏఎస్సై టార్గెట్
పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో సంచలన ఘటన బయటపడింది. మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఓ ఏఎస్ఐ అకృత్యాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని, వారి వీడియోలను రహస్యంగా చిత్రీకరించి తర్వాత బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, ఆ వీడియోలను చూపిస్తూ యువతులు, మహిళలను లైంగికంగా వేధిస్తూ కోరికలు తీర్చాలని ఒత్తిడి తెస్తున్నాడని బాధితులు చెబుతున్నారు.ఈ వ్యవహారంలో జమ్మలమడకకు చెందిన ఓ ఆటో డ్రైవర్ సహకారం తీసుకుని వీడియోలు తీయిస్తున్నట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన బెదిరింపు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.ఇక ఇదే ప్రాంతంలో పనిచేస్తున్న స్థానిక ఎస్సై, కానిస్టేబుల్ కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
తోటి విద్యార్థి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
హయత్నగర్: సహచర విద్యార్థి సోషల్ మీడియాలో వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన నమలితోక కేశవ లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుంట్లూర్లో ఉంటున్నాడు. ఆయనకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు (15) స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. స్థానిక కాంగ్రెస్ నేత కొడుకు (15) కూడా అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.ఈ క్రమంలో కేశవ కూతురు గురువారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు కేశవకు ఫోన్ చేసి మృతదేహాన్ని తిరిగి హైదరాబాద్ తెప్పించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు ఆరా తీయగా స్థానిక రాజకీయ నేత కొడుకు తరచూ సోషల్ మీడియాలో బాలికను వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
మగపిల్లాడి కోసం ఆరుగురిని చంపేశాడు!
వరంగల్ క్రైం: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో ఈ నెల ఒకటిన భర్త తన భార్య, ఇద్దరు పిల్లలను స్విమ్మింగ్పూల్లో ముంచి చంపిన ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మగ పిల్లాడు కావాలనే ఆశ, ఆడపిల్ల పుడుతుందనే భయంతో గతంలోనే నిందితుడు రెండుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని.. అందుకు కుటుంబ సభ్యులు, కొందరు వైద్యులు, సిబ్బంది సహకరించారని తేలింది.అలాగే భార్య మూడోసారి గర్భం దాల్చడంతో మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే భయంతో ఆమెతోపాటు ఇద్దరు పిల్లలను హతమార్చినట్లు తాజాగా నిర్ధారణ అయింది. అంటే మొత్తంగా మగ సంతానం కోసం భర్త కిరాతకుడిగా మారి ఆరుగురిని కడతేర్చడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్తతోపాటు హత్యలకు పరోక్షంగా కారణమైన మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ శుక్రవారం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రేమ వివాహం..హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామానికి చెందిన అజహరుద్దీన్ అదే గ్రామానికి చెందిన ఫరహాత్ను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి హుమేరా (9), ఆయేషా (6) అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులకు కుమారుడు పుట్టాలన్న కోరిక ఉండటంతో 2021, 2022లలో ఫరహాత్ గర్భం దాల్చినప్పుడు అజహరుద్దీన్తోపాటు అతని కుటుంబ సభ్యులు ఫరహాత్కు లింగనిర్ధారణ పరీక్షలు చేయించారు. అందుకు పున్నేలు గ్రామానికి చెందిన మందుల షాపు నిర్వాహకుడు సట్ల రాజుతోపాటు ఆర్ఎంపీ నరేశ్, ల్యాబ్ టెక్నీషియన్ మనోహర్, కాజీపేటలోని సురక్షా హాస్పిటల్ డాక్టర్ రవళి, నర్సు స్రవంతి, నెక్కొండకు చెందిన ఉపేందర్ హాస్పిటల్ డాక్టర్ పూర్ణిమ సహకారం అందించారు.గర్భంలో ఉన్నది ఆడపిల్లలుగా నిర్ధారించుకొని ఫరహాత్కు ఇష్టం లేకున్నా రెండుసార్లు అబార్షన్ చేయించారు. ఈ క్రమంలో అజహరుద్దీన్ తనకు దూరపు బంధువైన ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని, తనకు కుమారుడు కావాలని చెప్పాడు. అయితే ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకోనని ఆమె తెగేసి చెప్పింది. మరోవైపు గత నెలలో ఫరహాత్ మరోసారి గర్భం దాల్చగా తిరిగి ఆడపిల్ల పుడుతుందనే భయంతో అజహరుద్దీన్తోపాటు అతని తల్లిదండ్రులు, తమ్ముడు అబార్షన్ చేయించుకోవాలని ఫరహాత్తో గొడవ పడ్డారు. ఆమె ఒప్పుకోకపోవడంతో భార్య, పిల్లలను చంపి తాను ఇష్టపడిన బాలికను పెళ్లి చేసుకోవాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. వేడుకున్నా కరగని తండ్రి మనసుభార్య, ఇద్దరు పిల్లలను కడతేర్చాలని నిర్ణయించుకున్న అజహరుద్దీన్ ఈ నెల 1న రాత్రి 7:50 గంటలకు ఐస్క్రీం తినిపిస్తానని తాను నిర్వహిస్తున్న స్విమ్మింగ్పూల్ వద్దకు తీసుకెళ్లాడు. అంతకుముందే అక్కడున్న సీసీ కెమెరాలను ఆఫ్ చేశాడు. స్విమ్మింగ్పూల్ వద్ద కొన్ని పనులను భార్యతో చేయించి ఒక్కసారిగా ఆమెను నీళ్లలోకి నెట్టాడు. అనంతరం చిన్న కూతురు అయేషాను పూల్లోకి విసిరేశాడు. భార్య బయటకు వచ్చే ప్రయత్నం చేయగా నీళ్లలోనే ముంచి చంపేశాడు. పైన ఉన్న పెద్ద కూతురు హుమేరా వద్దు నాన్నా అంటూ కన్నీళ్లతో వేడుకున్నా అతని మనసు కరగలేదు. భార్య, చిన్నకూతురిని చంపాక పెద్ద కూతురిని సైతం నీళ్లలో ముంచి హత్య చేశాడు.
వీడియోలు
జగన్, అవినాష్ రెడ్డిలపై షర్మిల కామెంట్స్ ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి
ఏపీలో అంతా ఊడ్చేశాం..! ప్యూచర్ తెలంగానే బాబు మాస్టర్ స్కెచ్..
ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి
ఇన్వెస్టర్ల పంట పండింది భారీగా పెరిగిన బంగారం ధర
బయటపడ్డ ఏపీపై చంద్రబాబు కపట ప్రేమ
చంద్రబాబు తెలంగాణకు షాడో సీఎం, జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కావాలనే నాపై తప్పుడు ప్రచారం... లాయర్పై సింగర్ మంగ్లీ ఫిర్యాదు
అమెరికా నష్టపరిహారం చెల్లించాల్సిందే.. మీ ఇష్టం మళ్లీ యుద్ధమే!
చర్చలు విఫలమైతే మళ్లీ యుద్ధం మొదలవుతుందా?
కారుపై పడ్డ కాంక్రీట్ లారీ


