23 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్
చెన్నై నుంచి మదురై వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సుకు శనివారం తెల్లవారుజామున పెరంబలూరు సమీపంలోని జాతీయ రహదారిపై మంటలు అంటుకున్నాయి. మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టడానికి కొన్ని నిమిషాల ముందే డ్రైవర్ ఇబ్రహీం (63) అప్రమత్తమై బస్సును ఆపాడు. దీంతో అందులో ఉన్న 23 మంది ప్రయాణికులు బయటకు రావడంతో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.ఆ ప్రైవేట్ బస్సు అర్ధరాత్రి సమయంలో చెన్నై నుంచి మదురై బయల్దేరింది. డ్రైవర్ ఇబ్రహీం మదురై జిల్లా మేలూరుకు చెందిన వ్యక్తి. చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు ప్రయాణిస్తోంది. శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో పెరంబలూరు జిల్లా మంగళమెడు సమీపంలోని అయన్ పెరైయూర్ గ్రామం వద్ద వెళ్తుండగా బస్సు ముందు భాగం నుంచి ఒక్కసారిగా పొగ రావడం మొదలైంది.నిద్రిస్తున్న ప్రయాణికులను లేపిన డ్రైవర్డ్రైవర్ ఇబ్రహీం వెంటనే పొగను గమనించి బస్సును రహదారి పక్కన ఆపాడు. ప్రమాదాన్ని గుర్తించి... నిద్రలో ఉన్న ప్రయాణికులను లేపి వెంటనే కిందికి దిగాలని చెప్పాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రయాణికులు చేతికి దొరికిన సామాన్లు తీసుకుని బస్సు నుంచి బయటకు పరుగులు తీశారు.ప్రయాణికులు దిగుతున్న సమయంలోనే ముందు భాగం నుంచి మంటలు వేగంగా వ్యాపించాయి. కొద్ది సేపటికే బస్సు మొత్తం భారీ మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న మంగళమెడు పోలీసులు, జాతీయ రహదారి గస్తీ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. వెప్పూర్, పెరంబలూరు అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికి బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది.దాదాపు 15 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలు మరింత వ్యాపించకుండా చేసి, ఉదయం 7 గంటల కల్లా అదుపులోకి తీసుకొచ్చారు. బస్సు పూర్తిగా దగ్ధమై ఇనుప చట్రం మాత్రమే మిగిలింది. ఆ ప్రాంతం మీదుగా వాహనాలు వెళ్లలేకపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఎదురువైపు లేన్లోకి వాహనాలను మళ్లించి అడ్డంకిని తొలగించారు. ఉదయం 7 గంటల సమయంలో ఎర్త్మూవర్ల సాయంతో బస్సును జాతీయ రహదారి నుంచి తొలగించారు.ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాటు చేయడంలో అధికారులు సాయం చేశారు. ప్రయాణికులు తమ సామాన్లు తీసుకుని తమ గమ్యస్థానాలకు బయల్దేరారు. జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సును ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మంగళమెడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
విజయవాడ: ఏపీలో క్రమేపీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురికి కోవిడ్-19 సోకగా, తాజాగా మరో కేసు నమోదైంది. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో కరోనా కేసు నమోదైంది. 13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. జ్వరంతో ఆసుపత్రికి వచ్చిన తిరువూరుకు చెందిన బాలికకు టెస్టులు చేయగా కోవిడ్గా తేలింది. ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్గా నిర్దారణ కావడంతో ఆ బాలికను కోవిడ్ వార్డుకు తరలించారు వైద్యులు. కాగా, దేశంలో మళ్లీ కోవిడ్ వ్యాప్తి వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా 340కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో జూన్ 26 నుంచి శుక్రవారం వరకు నలుగురు కోవిడ్తో మృతిచెందగా మొత్తం 13 కోవిడ్ యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. అయితే కోవిడ్ బారినపడిన రోగులంతా స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్లోనే కోలుకుంటున్నారని.. తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నందునే ఏపీలో నలుగురు రోగులు మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు.
‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ అంటే సంక్లిష్టమైన కథలు, కాలాల ఇంద్రజాలంతో ఆడుకునే కథన శైలి, అద్భుతమైన విజువల్ అనుభవాలకే ఇప్పటివరకు చిరునామా, అయితే ’ది ఒడిస్సీ’ తర్వాత తో ఆయన పట్ల ఈ అభిప్రాయాలు సమూలంగా మారిపోతాయి. వేల ఏళ్ల క్రితం హోమర్ రాసిన మహాకావ్యాన్ని ఆధునిక తరపు ప్రేక్షకులకు సైతం సులభంగా అర్థమయ్యేలా నోలన్ తెరకెక్కించాడు. విశేషం ఏమిటంటే ఈ చిత్రం కేవలం యాక్షన్ లేదా ఫాంటసీ కాదు; యుద్ధం, పశ్చాత్తాపం, కుటుంబం, ప్రేమ, విముక్తి వంటి మానవీయ భావోద్వేగాల సమ్మేళనంగా సాగిన సమున్నత ప్రయాణం.కధ ఏమిటి?యుద్ధకళల్లో ఆరితేరిన పరాక్రమవంతుడైన రాజు... తప్పని పరిస్థితుల్లో ఒక భీకర యుద్ధంలో పాల్గొని అతి కష్టం మీద గెలిచి తిరిగి తన రాజ్యానికి తిరిగివచ్చే మార్గంలో ఎదుర్కున్న అడ్డంకులు, రాజ్యానికి తిరిగి వచ్చాక ఎదురైన అనూహ్య పరిస్థితులు అక్కడ మళ్లీ తన వాళ్లతోనే యుద్ధం చేయాల్సి రావడం...వీటన్నింటినీ ఎలా ఎదుర్కున్నాడు? దీనికి సమాధానమే ఈ చిత్రం.. కట్టె కొట్టె తెచ్చేలా చెప్పాలంటే ఇంతే ’ది ఒడిస్సీ’ కథ, గతంలో వచ్చిన ’ట్రాయ్’ సినిమాకు ఒక విధంగా కొనసాగింపులా అనిపిస్తుంది. ఆ సినిమాలో ట్రోజన్ యుద్ధం ఎలా ముగిసిందో చూసిన ప్రేక్షకులకు, ఆ యుద్ధంలో విజేతలైన గ్రీకు వీరులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి చేసిన పోరాట సహిత ప్రయాణమే ఈ చిత్రంలో ప్రధాన కథ.హైలెట్...దర్శకత్వం...తన గత సినిమాల్లోలాగే ఈ సినిమా సక్సెస్లో కూడా దర్శకుడు నోలన్ ఫుల్ మార్కులు అందుకుంటాడు. ఆయన ప్రతీసారీలాగే ఈసారి కూడా చిత్రీకరణలో తన మేధస్సును ప్రదర్శించడమే కాకుండా, భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేశాడు. అయితే గత చిత్రాల్లా ప్రేక్షకుడిని పజిల్స్తో గందరగోళానికి గురిచేయకుండా, కథనం సాగే క్రమంలో ప్రతీ దశలోనూ మానవీయ కోణాన్ని స్పర్శించడం ఆకట్టుకుంటుంది.సాంకేతి‘కధ’నోలన్ సినిమాల్లో సాంకేతిక నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో కూడా హోయ్టే వాన్ హోయ్టెమా సినిమాటోగ్రఫీ అద్భుతంగా మెరిసింది. సముద్ర ప్రయాణాలు, యుద్ధ దృశ్యాలు, ప్రకృతి ప్రకోపాల సమయంలో సన్నివేశాలు... ప్రతీ ఫ్రేమ్ భారీ కాన్వాస్పై వేసిన చిత్రంలా కనిపిస్తుంది. దీని తర్వాత తప్పకుండా చెప్పుకుని తీరాల్సింది లుడ్విగ్ గోరాన్సన్ నేపథ్య సంగీతం. అది ప్రతి భావోద్వేగాన్ని మరింత బలంగా ప్రేక్షకుడికి చేరుస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాల్లో ఎంత ప్రభావం చూపుతుందో, నిశ్శబ్దమైన భావోద్వేగ భరిత సన్నివేశాల్లో కూడా అంతే గాఢతను ప్రేక్షకులు అనుభవించేలా చేయగలిగారు.నటీనటుల ప్రదర్శనఒడిసియస్ పాత్రలో మ్యాట్ డేమన్ తన కెరీర్లోని అత్యుత్తమ నటనల్లో ఒకదాన్ని కనబరిచాడు. యుద్ధ వీరుడి గర్వం, తన అనుచరులను కాపాడలనే థీరత్వం, కుటుంబాన్ని చేరాలనే తపన, యుద్ధ ఫలితాలపై అంతర్మధనం... అన్నింటినీ సమ తూకంలో ప్రదర్శించాడు. ప్రేక్షకులను తన పాత్రతో ప్రయాణం చేసేలా చేయగలిగాడు. ఆయన భార్యగా నటించిన యాన్ హాతవే పెనెలోపీగా తక్కువ సన్నివేశాలున్నా, భావోద్వేగాలకు బలమైన కేంద్రంగా నిలుస్తుంది. ఆమె నటన సినిమాకు ఆత్మలా మారిందనొచ్చు. రాజ కుమారుడిగా, టామ్ హాలండ్ టెలిమాకస్ పాత్రలో పరిపక్వతను చూపించాడు. రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రతి నాయకుడిగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు...గ్రీకు పురాణాల ఆధారంగా రూపొందిన కథ అయినప్పటికీ, ఇందులో కనిపించే అనేక అంశాలు భారతీయ ఇతిహాసాలను గుర్తు చేస్తాయి. యుద్ధం ముగిసిన తర్వాత ఎన్నో కష్టాలు దాటి ఇంటికి చేరాలనే నాయకుడి ప్రయాణం, రెండు దశాబ్ధాల సుదీర్ఘకాలం గడిచినా భార్యాభర్తల మధ్య సడలిపోని అనుబంధం , తండ్రి మరణించలేదని నమ్ముతూ కుమారుడు తండ్రి కోసం ఎదురుచూడటం వంటి కుటుంబ విలువలు మన ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి. అలాగే ధర్మం కోసం చేసే యుద్ధంలో గెలిచినా ఎందరో ఆప్తుల్ని కోల్పోవడం లాంటి బాధించే వాస్తవాల్ని గుర్తించడం...ఇలాంటి భావాలు రామాయణం, మహాభారతంలో కనిపించే విలువలను తలపిస్తాయి. అందుకే ఈ కథ భారతీయ ప్రేక్షకులకు కొత్తగా కాకుండా, బాగా పరిచయమున్నట్టు అనుభూతిని కలిగిస్తుంది. చివర్లో వచ్చే విల్లు ఎక్కుపెట్టే పరీక్ష చాలామందికి రామాయణంలో శ్రీరాముడు శివధనుస్సును ఎత్తిన ఘట్టాన్ని గుర్తు చేస్తుంది. అలాగే బలవంతుడే కాదు, నిజమైన అర్హుడే ఆ విల్లును ప్రయోగించగలడనే భావన మన పురాణాల్లో కనిపించే వీర పరీక్షలను తలపిస్తుంది.హైలెట్స్...ట్రోజన్ యుద్ధంలో గ్రీకులు ఉపయోగించిన భారీ చెక్క గుర్రం ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో అత్యంత తెలివైన యుద్ధ వ్యూహంగా చెప్పుకుంటారు. ఓటమి అంచుల్లో నిలిచినప్పటికీ... గుర్రం లోపల సైనికులను దాచిపెట్టి ట్రోయ్ నగరంలోకి ప్రవేశించి చివరి క్షణంలో యుద్ధాన్ని గెలిచిన ఘట్టాన్ని ఈ సినిమాలో కూడా గుర్తు చేస్తారు. ఆ సినిమా చూడని ప్రేక్షకులకు ఇది ఉపశమనం ఇస్తుంది. గెలుపు తర్వాత ప్రారంభమయ్యే ఒడిసియస్ తిరుగు ప్రయాణంలో దేవతల శాపాలు ఎదుర్కుంటాడు. అలాగే సముద్ర తుఫాన్లు, భయంకరమైన రాక్షసులు, మంత్రగత్తెలు, ప్రాణాంతక ద్వీపాలు... ఇలా ప్రతి అడుగూ ఒక పరీక్షగా మారుతుంది. ఇవన్నీ విజువల్ ట్రీట్స్ అందిస్తాయి. ప్రత్యేకంగా ఒంటికన్ను రాక్షసుడు సైక్లోప్స్ తో జరిపే పోరాటం సినిమా హైలైట్లలో ఒకటి. బలంతో కాకుండా తెలివితో అతడిని ఓడించే విధానం ఆకట్టుకుంటుంది. అలాగే సముద్ర దేవుడు పోసైడన్ కోపం వల్ల ఎదురయ్యే తుఫాన్లు, మోహింపజేసే సైరన్స్ , మంత్రగత్తె సిర్సే, చివర్లో తన రాజ్యంలోకి చేరాక శత్రువులను ఎదుర్కొనే పోరాటం... వేటికవే అన్నట్టుగా కళ్లకు విందు చేస్తాయి. దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ ప్రయాణాన్ని కేవలం ఫాంటసీగా కాకుండా, ఇంటికి చేరాలనే ఒక మనిషి ఆరాటం, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆరాటం, యుద్ధం తర్వాత మనిషి మానసిక సంఘర్షణ వంటి భావోద్వేగాలతో ముడిపెట్టడం వల్ల సినిమా మరింతగా హృదయానికి దగ్గరవుతుంది. ’ది ఒడిస్సీ’ కేవలం ఒక గ్రీకు పురాణ చిత్రం కాదు; భారతీయ ప్రేక్షకులు తమ ఇతిహాసాల జ్ఞాపకాలను కూడా ఆస్వాదిస్తూ చూడగలిగే గొప్ప విజువల్, ఎమోషనల్ అనుభవంగా నిలుస్తుంది. లోపాలుహెలెన్ పాత్రలో నటించిన లుపిటా న్యోంగో నటనపై పెద్దగా విమర్శలు లేవు. కానీ "ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ"గా వర్ణించిన హెలెన్ పాత్రకు ఆమె ఎంపిక సరిపోలేదు. ఇది ప్రధానంగా నటన కంటే కాస్టింగ్కు సంబంధించిన చర్చ. మరోవైపు, నోలన్ తన కథన దృష్టికోణానికి అనుగుణంగానే ఈ ఎంపిక చేశారని, అందం కంటే పాత్రలోని మానవీయ కోణాన్ని చూపించాలని భావించారని అయన టీమ్ సభ్యులు అంటున్నారు.హోమర్ రచనతో పోలిస్తే అథీనా, సిర్సే, కాలిప్సో వంటి పాత్రలను నోలన్ కుదించేశాడనే భావన కలుగుతుంది. అలాగే నిడివి కూడా కాస్త తగ్గిస్తే బాగుండేది.ఒడిసియస్ ఎదుర్కొనే అనేక అడ్డంకుల్ని ఒకే సినిమాలో చెప్పాల్సి రావడంతో ముఖ్య మైన కొన్ని సంఘటనలు వేగంగా ముగిసి పోయాయి అనిపిస్తుందిగ్రీకు పురాణ కథ అయినప్పటికీ, అమెరికన్ యాసలో సంభాషణలు, కొన్ని దుస్తులు, ఆయుధాల రూపకల్పన, విభిన్న జాతుల నటీనటుల ఎంపిక వల్ల "చారిత్రక వాస్తవికత తగ్గింది" అనిపిస్తుంది. అయితే ఇవి నోలన్ సృజనాత్మక నిర్ణయాలని టీం స్పష్టత ఇచ్చింది .పెద్ద తారాగణం ఉన్నప్పటికీ, కొందరు ప్రముఖ నటీనటులకు చాలా తక్కువ స్క్రీన్ టైమ్ మాత్రమే దక్కడం ముఖ్యంగా హెలెన్ పాత్ర కథపై పెద్దగా ప్రభావం చూపలేకపోవడం...లోపాలు గా కనిపిస్తాయి.–సత్యబాబు
గోదావరిలో ఐదుగురు గిరిజనుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనులు మృత్యువాత పడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది బృందం గేలాలతో చేపలు పట్టేందుకు గోదావరిలోకి వెళ్లగా, వరదనీరు ఒక్కసారిగా పెరగడంతో ఐదుగురు ప్రవాహంలో కొట్టుకుపోయి, ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండటం హృదయవిదారకమన్నారు.మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి, తగిన ఆర్థిక సాయం అందించాలని వైఎస్ జగన్ కోరారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ట్రెండింగ్ హీరోయిన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా?
IND vs ENG: మూడో వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
6 నెలల్లో 554 మంది భర్తల మరణాలు : షాకింగ్ సర్వే
23 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్
ఫిఫా ఫైనల్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధర 27 లక్షలు!
లెక్కల్లో 51 మార్కులే.. కట్ చేస్తే రూ.వేల కోట్ల కంపెనీ!: ఎవరీ పవన్ కుమార్ చందన?
ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
"ఒక్క పెళ్లి చేసుకున్న వారే రాష్ట్రంలో ఉంటారు".. మధ్యప్రదేశ్ సీఎం
జంతర్మంతర్: సీజేపీ చీఫ్ అభిజిత్పై ఇంక్ దాడి
అభిషేక్ బెనర్జీ 5 అంతస్తుల భవనం ఢమాల్
‘ఇక చమురు కాదు.. రానున్నది సరికొత్త యుద్ధం’
ఫాస్టెస్ట్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ రికార్డు బ్రేక్
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి
ఎంత వెతికినా నీ ఓటు మాత్రం కనపడటం లేదు
డిజిటల్ మూల్యాంకనంతో విద్యార్థులు, ఈవీఎంలతో ప్రజలు ఆందోళన పడుతున్నారు!
ఓటీటీలోకి వచ్చేసిన 'బంగారం'.. మరోవైపు సమంత సీమంతం
అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది: శుబ్మన్ గిల్
ఇలా అన్నిచోట్లా ఉంటే బావుండు.. హాయిగా ప్రచారం చేసుకోవచ్చు..!!
జగన్నాథ మహారథయాత్ర.. ఇస్కాన్పై పూరీ ఆలయ మండిపాటు
అంత ఈజీ కాదు.. అందుకే కెనడా నుంచి వచ్చేశా!
ఓటీటీలోకి వచ్చేసిన సాయిపల్లవి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కొత్తింట్లోకి అడుగుపెట్టిన తెలుగు సీరియల్ జంట
శత్రువే అయినా ప్రశంసించాల్సిందే.. ఇరాన్ను పొగిడిన ట్రంప్!
19 ఏళ్ల క్రితం స్నానం చేయించిన 'ఆ' చిన్నారే ఫైనల్లో మెస్సీ ప్రత్యర్ది
ఓటీటీకి మా ఇంటి బంగారం.. ఒక్క రోజే 14 చిత్రాలు స్ట్రీమింగ్..!
భారత్లోకి కరోనా రీఎంట్రీ! అసలు కారణం ఏంటంటే..
స్కోరు 82/8.... తొమ్మిదో స్థానంలో వచ్చి.. ప్రపంచ రికార్డు!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. యత్నకార్యసిద్ధి
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. శుభ్మన్ గిల్ సహచరుడు అరెస్ట్
ఆసీస్ క్రికెటర్ రిటైర్మెంట్.. ఇకపై ‘నా’ దేశానికి ఆడతా!
ట్రెండింగ్ హీరోయిన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా?
IND vs ENG: మూడో వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
6 నెలల్లో 554 మంది భర్తల మరణాలు : షాకింగ్ సర్వే
23 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్
ఫిఫా ఫైనల్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధర 27 లక్షలు!
లెక్కల్లో 51 మార్కులే.. కట్ చేస్తే రూ.వేల కోట్ల కంపెనీ!: ఎవరీ పవన్ కుమార్ చందన?
ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
"ఒక్క పెళ్లి చేసుకున్న వారే రాష్ట్రంలో ఉంటారు".. మధ్యప్రదేశ్ సీఎం
జంతర్మంతర్: సీజేపీ చీఫ్ అభిజిత్పై ఇంక్ దాడి
అభిషేక్ బెనర్జీ 5 అంతస్తుల భవనం ఢమాల్
‘ఇక చమురు కాదు.. రానున్నది సరికొత్త యుద్ధం’
ఫాస్టెస్ట్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ రికార్డు బ్రేక్
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి
ఎంత వెతికినా నీ ఓటు మాత్రం కనపడటం లేదు
డిజిటల్ మూల్యాంకనంతో విద్యార్థులు, ఈవీఎంలతో ప్రజలు ఆందోళన పడుతున్నారు!
ఓటీటీలోకి వచ్చేసిన 'బంగారం'.. మరోవైపు సమంత సీమంతం
అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది: శుబ్మన్ గిల్
ఇలా అన్నిచోట్లా ఉంటే బావుండు.. హాయిగా ప్రచారం చేసుకోవచ్చు..!!
జగన్నాథ మహారథయాత్ర.. ఇస్కాన్పై పూరీ ఆలయ మండిపాటు
అంత ఈజీ కాదు.. అందుకే కెనడా నుంచి వచ్చేశా!
ఓటీటీలోకి వచ్చేసిన సాయిపల్లవి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కొత్తింట్లోకి అడుగుపెట్టిన తెలుగు సీరియల్ జంట
శత్రువే అయినా ప్రశంసించాల్సిందే.. ఇరాన్ను పొగిడిన ట్రంప్!
19 ఏళ్ల క్రితం స్నానం చేయించిన 'ఆ' చిన్నారే ఫైనల్లో మెస్సీ ప్రత్యర్ది
ఓటీటీకి మా ఇంటి బంగారం.. ఒక్క రోజే 14 చిత్రాలు స్ట్రీమింగ్..!
భారత్లోకి కరోనా రీఎంట్రీ! అసలు కారణం ఏంటంటే..
స్కోరు 82/8.... తొమ్మిదో స్థానంలో వచ్చి.. ప్రపంచ రికార్డు!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. యత్నకార్యసిద్ధి
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. శుభ్మన్ గిల్ సహచరుడు అరెస్ట్
ఆసీస్ క్రికెటర్ రిటైర్మెంట్.. ఇకపై ‘నా’ దేశానికి ఆడతా!
ఫొటోలు
గోవాలో అల్లువారి కోడళ్లు.. సతీమణితో శిరీష్ సందడి (ఫోటోలు)
బర్త్డే స్పెషల్.. ప్రియాంక చోప్రా గురించి ఈ విషయాలు తెలుసా ? (ఫొటోలు)
అబ్బో.. ఈ రైల్వే స్టేషన్ పేరుకు తగ్గట్లే ఉందే! (చిత్రాలు)
కామాఖ్య ఆలయంలో నిక్కీ గల్రానీ దంపతుల పూజలు..ఫోటోలు
ఓ సుకుమారి బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ లేటేస్ట్ స్టిల్స్.. ఫోటోలు
లండన్ వీధుల్లో హీరోయిన్ హెబ్బా పటేల్ చిల్.. ఫోటోలు
రోజురోజుకీ సన్నబడిపోతున్న శ్రీముఖి (ఫొటోలు)
అందాల భాగ్యశ్రీ.. లెనిన్ షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)
టీజీ20 లీగ్ మెమొరీస్ షేర్ చేసిన యాంకర్ (ఫొటోలు)
హైదరాబాద్లో జగన్నాథుడి రథచక్రాల సందడి (చిత్రాలు)
సినిమా
ఐరన్ లెగ్ అని ముద్ర వేయకండి : హీరోయిన్ విజ్ఞప్తి
ఏ రంగానికి చెందిన వారికైనా అవమానాలు, అవరోధాలు ఎదురుకావడం సహజం. ముఖ్యంగా సినిమా రంగంలోని వారికి ఇలాంటి ఇబ్బందులు కాస్త ఎక్కువే ఉంటాయి. ఒక్కోసారి శాయశక్తులా శ్రమించినా తమనే కార్నర్ చేసే విమర్శలు గుండెల్లో కలుక్కుమంటుంటాయి. నటి భాగ్యలక్ష్మి భోర్సే ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోందట. అలా తన ఆవేదనను ఇటీవల ఒక భేటీలో వ్యక్తం చేసిందీ బ్యూటీ. నిజం చెప్పాలంటే నటిగా ఈ అమ్మడికి అదృష్టం ఉన్నా, సరైన విజయం వరించలేదు. తెలుగులో రవితేజ, విజయ్ దేవరకొండ, రామ్ వంటి స్టార్ హీరోలతో జత కట్టినా, ద్విభాషా చిత్రం కాంతాలో దుల్కర్ సల్మా న్ వంటి నటుడితో రొమాన్స్ చేసినా మంచి నటిగా పేరు తెచ్చుకుంది కానీ మంచి సక్సెస్ మా త్రం దోబూచులాడుతూనే ఉంది. అలాంటిది తాజాగా అఖిల్ అక్కినేనితో జత కట్టిన లెనిన్ చిత్రం సంతృప్తి కరమైన విజయాన్ని అందించింది. దీంతో చాలా కాలంగా గూడు కట్టుకున్న ఆవేదన కట్టలు తెంచుకుంది. దాన్ని ఒక భేటీలో వ్యక్తం చేస్తూ. ‘‘చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతే వెంటనే ఆ చిత్ర కథానాయికిని కార్నర్ చేస్తూ ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేయకండి. చిత్ర అపజయాన్ని హీరోయిన్లకు మాత్రమే ఆపాదించడం ఎంత వరకు న్యాయం. నేనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను’’ అంటూ విమర్శకులపై దాడి చేసింది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో శివకార్తికేయన్కు జంటగా సెయోన్ చిత్రంలో నటిస్తోంది.
ప్రెగ్నెన్సీలోనూ యాక్షన్కి సై
సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. అయితే దీపికా పదుకోన్ మాత్రం ప్రెగ్నెన్సీ టైమ్లోనూ రిస్క్ చేస్తున్నారు. ‘రాకా’ సినిమా కోసం యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నారామె. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాకా’. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొంటున్నారట దీపిక. ఇదిలా ఉంటే... హీరో రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ 2018 నవంబరు 14న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు దువా అనే కుమార్తె ఉంది. తాను రెండోసారి తల్లి కానున్నట్లు దీపిక ఈ మధ్య ప్రకటించారు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతి. అయినప్పటికీ ‘రాకా’ కోసం రాత్రిపూట కూడా పని చేస్తూ, రిస్కీ యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూ, నటనపై తనకున్న నిబద్ధతను చాటుకుంటున్నారామె. ప్రసూతి సెలవులకు వెళ్లేలోపే ‘రాకా’లోని తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేయాలనే పట్టుదలతో దీపిక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆ మధ్య ఎనిమిది గంటల పని నిబంధనను తెరపైకి తీసుకొచ్చిన దీపిక ‘రాకా’ కోసం ఎలాంటి నిబంధనలు లేకుండా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2027లో విడుదల కానుంది.
కాస్త ఆలస్యంగా జీడీ నాయుడు
కొంచెం ఆలస్యంగా థియేటర్స్కు వస్తున్నాడు జీడీ నాయుడు. ప్రముఖ భారతీయ ఆవిష్కర్త, మిరాకిల్ మ్యాన్, ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన జీడీ నాయుడు (గోపాలస్వామి దొరైస్వామి నాయుడు) బయోపిక్ ‘జి.డి.ఎన్’గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో జీడీ నాయుడు పాత్రలో మాధవన్ నటించారు. ఈ సినిమాని కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వంలో ఆర్. మాధవన్, సరిత మాధవన్, విజయ్ మూలన్, వర్గీస్ మూలన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 17న విడుదల చేయాలనుకున్నారు. కానీ చేయలేదు... ఆగస్టు 7న రిలీజ్ చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు మేకర్స్.
మరింత ముదురుతున్న 'జానీ మాస్టర్' డాన్సర్ అసోసియేషన్ వివాదం
డాన్సర్స్ అసోసియేషన్ – ఫెడరేషన్ మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదురుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఫెడరేషన్ జానీ మాస్టర్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దాంతో సాయంత్రం జానీ మాస్టర్ ఫెడరేషన్ నాయకులపై నిర్మాతలకు ఫిర్యాదు చేశారు. ఫిలిం ఛాంబర్లోని పెద్దలను కలిసిన జానీ మాస్టర్ యూనియన్లో అవినీతి చేసే వారిపై చర్యలు తీసుకుంటే ఫెడరేషన్ అడ్డుపడుతోందని ఆరోపించారు. అంతేకాక సస్పెండ్ చేసిన సభ్యులను తిరిగి తీసుకోవాలని ఫెడరేషన్ వారిపై ఒత్తిడి తెస్తోందని, నిర్మాతలను మోసం చేస్తున్న వారిపై ప్రెసిడెంట్ సుమలత చర్యలు తీసుకుంటే ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫెడరేషన్ పెద్దలు ఆమెపై లింగభేదం చూపుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.జానీ మాస్టర్ భార్య, ప్రెసిడెంట్ సుమలత కూడా నిర్మాతలతో సమావేశమైయ్యారు. ఫెడరేషన్ జోక్యం లేకుండా చూడాలని కోరారు. తప్పు చేసిన సభ్యుల ఆధారాలను ఛాంబర్ పెద్దలకు అందజేశాం. అవినీతి చేస్తున్న వారిని శిక్షించి వారికి సహకరిస్తున్న ఫెడరేషన్ పెద్దలను మందలించాలని విజ్ఞప్తి చేశారు. డాన్సర్స్ అసోసియేషన్లో కొంతమంది సభ్యులు నిర్మాతలను మోసం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫెడరేషన్ మాత్రం వారిని కాపాడుతోందని డాన్సర్స్ అసోసియేషన్ నాయకత్వం ఆరోపిస్తోంది. ఈ వివాదం ఫిలిం ఛాంబర్ వరకు చేరింది. ఇప్పుడు ఫెడరేషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
క్రీడలు
యామల్ ఒక్కడే కాదు.. ఈ ముగ్గురూ ఇప్పుడు మెస్సీకి ‘ప్రత్యర్థులే’!
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్కప్-2026 ఫైనల్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. న్యూజెర్సీ వేదికగా భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అర్జెంటీనా- స్పెయిన్ మధ్య టైటిల్ పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ, స్పెయిన్ యువ సంచలనం లమీన్ యామల్పైనే నిలిచాయి.లాలపోసి జోల పాడాడునిజానికి కెరీర్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఏ ఆటగాడైనా... తన అభిమాన ప్లేయర్ను దగ్గర నుంచి చూడాలనో లేక అతడితో ఆటోగ్రాఫ్, ఫొటోగ్రాఫ్ తీసుకోవాలనో కోరుకుంటాడు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చిన్నప్పుడు ఆశిష్ నెహ్రా చేతుల మీదుగా అవార్డు తీసుకొని మురిసిపోగా... శ్రేయస్ అయ్యర్ బాల్బాయ్గా ఉన్నప్పుడు ఇర్ఫాన్ పఠాన్ మాటలతో స్ఫూర్తిపొందాడు. ఇలా ఎవరైనా ఊహ వచ్చాకే తమ అభిమాన ఆటగాళ్లతో అనుబంధం పెంచుకుంటారు. కానీ, స్పెయిన్ ఫుట్బాల్ యువ సంచలనం లమీన్ యామల్ అనుభవం మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. ఊహ తెలియక ముందే యామల్ను అతడి అభిమాన ప్లేయర్ ముద్దాడాడు. ఐదు నెలల వయసులోనే లాలపోసి జోల పాడాడు. ఇదేంటీ విడ్డూరం అనుకుంటున్నారా! కాదు నిజమే. అపుడు ఐదు నెలల పసికందు.. ఇపుడు ప్రత్యర్థిదాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంటున్న ఓ యువ ఆటగాడు... ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఐదు నెలల పసికందును ఎత్తుకొని ముద్దుచేశాడు. కట్ చేస్తే... ఆ ఎత్తుకున్న వ్యక్తి ప్రస్తుతం అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ కాగా... ఆ ముద్దులొలికే బాబు స్పెయిన్ స్టార్ ప్లేయర్ లమీన్ యామల్. యూనిసెఫ్, బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో 2007లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు నెలల యామల్కు మెస్సీ స్నానం చేయించాడు. ఆ రోజు మెస్సీ చేతుల్లో ఆడుకున్న ఆ చిన్నారి ఇప్పుడు పెరిగి పెద్ద వాడై అతడితోనే తలపడేందుకు సిద్ధమయ్యాడు. అమెరికా వేదికగా ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫైనల్లో ఈ ఇద్దరు ప్లేయర్లు అమీతుమీ తేల్చుకోనున్న నేపథ్యంలో... 19 ఏళ్ల నాటి ఫొటో సోషల్ మీడియాను ఊపేస్తోంది.అయితే ఏఐ యుగంలో ఈ ఫోటో నకిలీ అయి ఉంటుందని ప్రచారం జరగగా... యూనిసెఫ్ ప్రతినిధులు ఈ ఫొటో వెనక ఉన్న చరిత్రను తాజాగా వెల్లడించారు. 2008 యూనిసెఫ్ క్యాలెండర్ కోసం ఈ ఫొటోషూట్ నిర్వహించినట్లు తెలిపారు. హాలీవుడ్ సినిమా స్క్రిప్ట్ను తలపిస్తున్న ఈ నిజజీవిత కథ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. యామల్ ఒక్కడే కాదు..ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. యామల్ ఒక్కడే కాదు.. ఫైనల్లో మెస్సీ బృందంతో తలపడనున్న స్పెయిన్ జట్టులో మరో ముగ్గురు కూడా మెస్సీతో చిన్ననాడే ఫొటోలకు ఫోజులిచ్చారు. వారు మరెవరో కాదు.. డానీ ఒల్మో (Dani Olmo), జోవాన్ గ్రేసియా (Joan Garcia), గవీ (Gavi).బార్సిలోనా మిడ్ఫీల్డర్ గవీకి మెస్సీ రోల్ మోడల్. ఇప్పుడు తన ఆరాధ్య ఫుట్బాలర్కు ప్రత్యర్థిగా అతడు బరిలోకి దిగనున్నాడు. ఇక స్పెయిన్ జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్గా, సెంట్రల్ మిడ్ఫీల్డర్గా డానీ పాత్ర కీలకం. బార్సిలోనాలో చాలా ఏళ్ల క్రితమే అతడు మెస్సీతో కలిసి ఫొటో దిగాడు. ఇప్పుడు తన అనుభవాన్ని డానీ.. తన రోల్ మోడల్ మెస్సీకి వ్యతిరేకంగా ఉపయోగించబోతున్నాడు. ఇక జోవాన్ గ్రేసియా స్పెయిన్ గోల్ కీపర్. చిన్నపుడు మెస్సీతో కలిసి అతడు సందడి చేశాడు. ఇప్పుడు మెస్సీ గోల్ కొట్టకుండా ఆపే అడ్డుగోడలా నిలబడేందుకు సిద్ధమయ్యాడు. ఇది విధి రాసిన కథఈ నేపథ్యంలో.. ‘ఇది విధి రాసిన కథ.. మెస్సీ చేతుల్లో నాడు ఒదిగిపోయిన చిన్నారులు నేడు.. అతడికే ప్రత్యర్థిగా మారడం నిజంగా నమ్మలేని విషయం’ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా యామల్ ఫొటో నిజమే అని యూనిసెఫ్ ధ్రువీకరించగా.. మిగతా ముగ్గురితో ఉన్న ఫొటోలు మాత్రం బార్సిలోనా ఇండిపెండెంట్ న్యూస్ చానెల్ బార్కా యూనివర్సల్ ఎక్స్ వేదికగా షేర్ చేయడంతో తెరమీదకు వచ్చాయి.చదవండి: రోహిత్, జైస్వాల్ కోసం నాడు గిల్ అలా చేశాడు!
వైభవ్పై ఫార్ములా-1 స్టార్ రేసర్ ప్రశంసలు
భారత క్రికెట్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీపై ఫార్ములా-1 సంచలనం, రేసింగ్ బుల్స్ డ్రైవర్ అర్విడ్ లిండ్బ్లాడ్ (Arvid Lindblad) ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రీడల్లో చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న ఆటగాళ్లలో వైభవ్ కూడా ఒకడని కొనియాడాడు.ఇటీవల ఇంగ్లండ్-భారత్ తొలి వన్డే సందర్భంగా స్కై స్పోర్ట్స్తో మాట్లాడిన లిండ్బ్లాడ్.. సాంకేతికత అభివృద్ధి, చిన్న వయసులోనే మెరుగైన సమాచారం అందుబాటులోకి రావడం వల్ల యువ ఆటగాళ్లు అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని చెప్పాడు."ఇది అన్ని క్రీడల్లో కనిపిస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. చిన్న వయసులోనే సరైన సమాచారం, శిక్షణ లభిస్తోంది. అందుకే చాలా చిన్న వయసులోనే ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ, ఫుట్బాల్లో లమీన్ యమాల్ అందుకు మంచి ఉదాహరణలు. వైభవ్ చాలా చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు ప్రపంచ క్రీడల స్వభావంగా మారింది" అని లిండ్బ్లాడ్ వ్యాఖ్యానించాడు.ఇదే సందర్భంగా తన భారతీయ మూలాల గురించి కూడా అతడు మాట్లాడాడు. తన అమ్మమ్మ, తాతయ్య పంజాబ్కు చెందిన వారని, భారతీయ సంస్కృతితో తనకు బలమైన అనుబంధం ఉందని తెలిపాడు. గతేడాది ముంబైలోని ఆజాద్ మైదాన్లో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడిన అనుభవం ఎంతో ప్రత్యేకమని గుర్తు చేసుకున్నాడు. అలాగే తన అమ్మమ్మ వండే భారతీయ వంటకాలు తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.ఫార్ములా-1లో అడుగుపెట్టడం తన చిన్ననాటి కల అని, ఈ ఏడాది ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్లో అరంగేట్రం చేసిన సమయంలో భావోద్వేగానికి గురయ్యానని లిండ్బ్లాడ్ వెల్లడించాడు. చిన్నప్పుడు తండ్రితో కలిసి తొలిసారి వెళ్లిన సిల్వర్స్టోన్ ట్రాక్లోనే ఎఫ్1 డ్రైవర్గా రేస్ చేయడం జీవితంలో మరపురాని క్షణమని పేర్కొన్నాడు.అలాగే బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ను కలవడం ఆనందంగా అనిపించిందని చెప్పిన లిండ్బ్లాడ్, ఫార్ములా-1 కార్లు నడిపినా ఇప్పటికీ రోడ్డు డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం తీసుకోలేదని సరదాగా వ్యాఖ్యానించాడు.
విశ్రాంతి వద్దన్న రోహిత్.. అతడి కోసం గిల్ అనూహ్య నిర్ణయం!
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డే హిట్మ్యాన్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ వార్తల్ని కొట్టిపారేశాడు. లార్డ్స్ వన్డే రోహిత్కు చివరి మ్యాచ్ కాదని స్పష్టం చేశాడు.సెలక్టర్లపై బీసీసీఐ ఆగ్రహం!అదే విధంగా ఈ విషయంలో లీకులు ఇచ్చారని సెలక్టర్లపై బీసీసీఐ ఆగ్రహం చేసినట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. నిజానికి అఫ్గానిస్తాన్తో ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ నుంచే రోహిత్ శర్మను పక్కనపెట్టాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.అప్పుడే డిసైడ్ అయ్యారువిశ్రాంతి పేరిట రోహిత్ను పక్కనపెట్టి.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను అఫ్గాన్తో సిరీస్లో ఆడించాలనే యోచనలో ఉన్నారట. అయితే, ఇందుకు రోహిత్ ససేమిరా అనడంతో.. కెప్టెన్ శుబ్మన్ గిల్ స్వయంగా తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘గత నెలలో స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్ నుంచి రోహిత్ శర్మను తప్పించాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నారు. కానీ అతడు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆఖరిదైన మూడో వన్డేలోనైనా విశ్రాంతి తీసుకోవాలని కోరారు.విశ్రాంతి వద్దన్న రోహిత్.. గిల్ అనూహ్య నిర్ణయం!అతడి స్థానంలో జైస్వాల్ను ఆడించాలనుకున్నారు. కానీ రోహిత్ రెస్ట్ తీసుకునేందుకు నిరాకరించాడు. దీంతో జైస్వాల్ను ఎలాగైనా ఆడించాలనే ఉద్దేశంతోనే కెప్టెన్ శుబ్మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు’’ అని పేర్కొన్నాయి. అదే విధంగా.. ‘‘అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన తర్వాత రోహిత్కు అసలైన సవాలు ఎదురైంది.అతడు దేశవాళీ క్రికెట్లోనూ కేవలం రెండు మ్యాచ్లే ఆడాడు. కానీ ఆశించిన స్థాయిలో లయను అందుకోలేకపోయాడు. ఇటీవల కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఫామ్ కోల్పోయిన రోహిత్ విషయంలో సెలక్టర్లు అయితే ఇప్పటికే తమ నిర్ణయం గురించి చెప్పేశారు. రోహిత్ శర్మ, బోర్డు తీసుకునే నిర్ణయం ఆధారంగానే అతడు వన్డే వరల్డ్కప్ టోర్నీ-2027 ఆడతాడా? లేదా? అన్నది తేలుతుంది’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.తొలుత విఫలమైనా..కాగా అఫ్గాన్తో వన్డే సిరీస్లో రోహిత్ శర్మ 16, 48, 79 పరుగులు సాధించాడు. ఇక రెండో వన్డేతో తుదిజట్టులోకి వచ్చిన జైస్వాల్ నిరాశపరిచినా (4).. మూడో వన్డేలో అజేయ శతకం (110*)తో ఆకట్టుకున్నాడు. మరోవైపు.. తొలి వన్డేలో ఓపెనర్గా దిగి 84 పరుగులతో అజేయంగా నిలిచిన గిల్.. తర్వాత రెండు వన్డేలో మూడో నంబర్ బ్యాటర్గా వచ్చి భారీ శతకం (154)తో దుమ్ములేపాడు.ఇదిలా ఉంటే.. రెగ్యులర్ వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్కు దూరం కావడంతో.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్కు జట్టులో చోటు దక్కింది. ఈ వన్డే సిరీస్లో భారత్ అఫ్గాన్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇక తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ శర్మ ఇప్పటికి రెండు వన్డేలలో వరుసగా 11, 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు రావడం గమనార్హం.చదవండి: అదే మా కొంప ముంచింది: శుబ్మన్ గిల్
జాతీయ మహిళా షూటర్ ఆచూకీ లభ్యం
రెండు రోజుల కిందట అదృశ్యమైన పశ్చిమ బెంగాల్కు చెందిన జాతీయ స్థాయి షూటర్ దమయంతి సేన్ (15) సురక్షితంగా ఇంటికి చేరింది. శనివారం ఉదయం హౌరా పోలీసులు ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు.హౌరాలోని రామ్కృష్ణపూర్ ఫెర్రీ జెట్టీ సమీపంలో ఒంటరిగా తిరుగుతుండగా గమనించిన మార్నింగ్ వాకర్స్ వెంటనే దమయంతి తండ్రి ధ్రువజ్యోతి సేన్కు సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడికి చేరుకుని, పోలీసుల సహకారంతో కుమార్తెను ఇంటికి తీసుకెళ్లారు.గురువారం ఇంటి నుంచి ఒక పని కోసం వెళ్లిన దమయంతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు చేపట్టిన దర్యాప్తులో దమయంతి హౌరా రైల్వే స్టేషన్లోని 4, 5 ప్లాట్ఫారమ్ల వద్ద సంచరించినట్లు తెలిసింది. దమయంతి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, క్రీడా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.కారణాలు ఏంటి..?అయితే దమయంతి అదృశ్యానికి గల అసలు కారణాలపై పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదువుల ఒత్తిడి, షూటింగ్ శిక్షణకు సంబంధించిన ఒత్తిడి వంటి అంశాలను కూడా విచారణలో పరిశీలిస్తున్నారు. దీనిపై పోలీసులు లేదా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేదు.
న్యూస్ పాడ్కాస్ట్
నంబర్ 1 నుంచి నేలచూపులే... నీతి ఆయోగ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు భారీగా పతనం
ఏపీ సమస్యలపై ఎలుగెత్తాలి. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తాం... ఆక్వా రైతులతో ముఖాముఖిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
పల్నాడు కలను సాకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... 100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల కొత్త మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో మరో కుంభకోణానికి తెరతీసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... ల్యాప్టాప్ల కొనుగోలులో దోపిడీకి స్కెచ్
నిలబెట్టుకోలేనప్పుడు హామీలు ఎందుకిచ్చారు?.... ఆంధ్రప్రదేశ్లో కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు... భారీ ర్యాలీలు, ధర్నాలతో చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో తిష్టవేసిన సమస్యలు... 2024లో 43 లక్షలున్న విద్యార్థులు ఇపుడు 30 లక్షలే..
టీచర్ల ‘టెట్’ ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదు?... ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
బిజినెస్
హైదరాబాద్లో ఇల్లు.. ఇలా కట్టుకోవాల్సిందే!
సాక్షి, సిటీబ్యూరో: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్ నగరంలో నిర్మాణాలకు ‘క్యూర్’ కొత్త చట్టంలో కట్టుదిట్టమైన ప్రమాణాలను ప్రతిపాదించారు. గ్రీన్ బిల్డింగ్స్కు ప్రాధాన్యమిస్తూ తగిన ప్రోత్సాహకాలతో పాటు, పెద్ద భవనాల్లో వాతావరణ మార్పులను తట్టుకునే డిజైన్లు, వర్షపునీటి సంరక్షణ, నిర్మాణ సమయంలో దుమ్ము, శబ్ద కాలుష్య నియంత్రణ చర్యలు, అవసరాకనుగుణంగా ప్రభుత్వం సూచించే ఇతర పర్యావరణ చర్యలు అమలు చేయాల్సి ఉంటుంది.భారీ భవనాలు లేదా ప్రత్యేక కేటగిరీల ప్రాజెక్టులకు ట్రాఫిక్ ఇంపాక్ట్ స్టడీతోపాటు పర్యావరణ ప్రభావం అధ్యయనం చేయాలి. స్టామ్వాటర్ మేనేజ్మెంట్ప్లాన్ ఉండాలి. అంతేకాదు, గాలి ప్రభావం, భూకంప భద్రత వంటి సాంకేతిక నివేదికలను సైతం కోరే అధికారం ఉంటుంది. నెట్– జీరో, గ్రీన్ బిల్డింగ్స్ లేదా తక్కువ కర్బన ఉద్గారాల భవనాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి చట్టం అవకాశం కల్పించింది.లోకల్ ఏరియా ప్లాన్ నగరంలో ఆయా ప్రాంతాలకు తగ్గట్లుగా లోకల్ ఏరియా ప్లాన్ను రూపొందించే అధికారం సంబంధిత కార్పొరేషన్ కమిషనర్కు ఉంటుంది. నోటీసు జారీ చేసి ఒక ప్రాంతం లేదా వీధికి ప్రత్యేక లోకల్ ఏరియా ప్లాన్ రూపొందించవచ్చు. ఇందుకోసం నెలరోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆ తర్వాత వాటిని పరిశీలించి కార్పొరేషన్, అనంతరం ప్రభుత్వానికి సిఫారసులతో పంపిస్తారు. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత గెజిట్లో ప్రచురించి అమలు చర్యలు చేపడతారు. తద్వారా ఒక ప్రాంతానికి తగిన నిర్మాణ శైలిని నిర్దేశించవచ్చు. ప్లాట్ కనీస పరిమాణాన్ని నిర్ణయించవచ్చు. నిర్దిష్ట విస్తీర్ణంలో నిర్మించే భవనాలు లేదా నివాస యూనిట్ల సంఖ్యను పరిమితం చేయవచ్చు. దుకాణాలు, గోదాములు, పరిశ్రమలు వంటి వినియోగాలపై నియంత్రణలు విధించవచ్చు.వికలాంగులకు అనుకూల సౌకర్యాలు తప్పనిసరి దివ్యాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం వారికి యాక్సెసిబిలిటీ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. భవన రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ మొత్తం అందుకు అనుగుణంగా ఉండాలి.నిర్మాణ నాణ్యతపై కఠిన ప్రమాణాలు నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక నిబంధనలను కూడా ప్రభుత్వం సంబంధిత ముసాయిదా బిల్లులో పొందుపరిచింది. ప్రతి భవనం స్థల పరిస్థితులు, లేఅవుట్, రహదారి అనుసంధానం, నిర్మాణ భద్రత, ఎత్తు, విస్తీర్ణం, వెంటిలేషన్, పారిశుద్ధ్యం, నిర్మాణ సామగ్రి వంటి అంశాల్లో ప్రభుత్వం లేదా బై–లాస్ నిర్దేశించిన ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. అవసరమైతే కొన్ని ప్రత్యేక రకాల భవనాలకు అదనపు నిబంధనలు కూడా విధించే అధికారం కమిషనర్కు ఉంటుంది. మొత్తంగా.. కొత్త చట్టం ద్వారా గ్రేటర్ నగరంలో నియంత్రిత, పర్యావరణ హిత, భద్రతతో కూడిన, అందరికీ అందుబాటులో ఉండే మౌలిక వసతులతో కూడిన భవన నిర్మాణాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసినట్లు సమాచారం.
జియో లాభాల జోష్.. 3 నెలలకు రూ.7,764 కోట్లు
దాదాపు 4 బిలియన్ డాలర్ల రికార్డు ఐపీఓ బాటలో ఉన్న జియో ప్లాట్ఫామ్స్ క్యూ1లో అదరగొట్టింది. కంపెనీ నికర లాభం 9.2 శాతం వృద్ధితో రూ. 7,764 కోట్లకు ఎగబాకింది. గతేడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.7,110 కోట్లుగా నమోదైంది. కాగా, ఆదాయం 11.8 శాతం ఎగసి రూ.39,173 కోట్లకు చేరింది. ఎబిటా 15.1 శాతం ఎగసి రికార్డు స్థాయిలో రూ.20,865 కోట్లను తాకింది.ఒక్కో యూజర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 3.3 శాతం వృద్ధి చెంది రూ.215.6కు చేరింది. క్యూ1లో ఒక్కో యూజర్ నెలవారీ డేటా వినియోగం 43.7 జీబీకి ఎగసింది. 26.9 శాతం వృద్ధి సాధించింది. జియో మొత్తం కస్టమర్ల సంఖ్య ఈ ఏడాది జూన్ నాటికి 7.1 శాతం పెరిగి, 53.3 కోట్లకు చేరారు. గతేడాది జూన్ క్వార్టర్లో యూజర్ల సంఖ్య 49.8 కోట్లుగా ఉంది.
ఎన్విడియా సీఈఓ జాకెట్ రూ.9 కోట్లు.. వేలంలో భారీ ధర
ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా (NVIDIA) సీఈఓ జెన్సెన్ హువాంగ్ ధరించిన సిగ్నేచర్ నల్లటి టామ్ ఫోర్డ్ (Tom Ford) లెదర్ జాకెట్ వేలంలో సంచలన ధర పలికింది. న్యూయార్క్లో ప్రముఖ వేలంపాట సంస్థ సోథెబీస్ నిర్వహించిన వేలంలో ఈ జాకెట్ 9.6 లక్షల డాలర్లు (సుమారు రూ.9.2 కోట్లు)కు అమ్ముడైంది. ఇది ముందుగా అంచనా వేసిన 40,000–60,000 డాలర్ల విలువ కంటే దాదాపు 16 రెట్లు ఎక్కువ.సోథెబీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ జాకెట్ కోసం ప్రపంచవ్యాప్తంగా 45 మంది పోటీపడ్డారు. సంస్థ ఆధునిక కలెక్టిబుల్స్ విభాగం అధిపతి బ్రహ్మ్ వాచ్టర్ దీన్ని "ఏఐ యుగాన్ని నిర్వచించిన ప్రముఖ వ్యక్తుల్లో ఒకరితో అత్యంత సన్నిహితంగా ముడిపడిన అరుదైన స్మారక వస్తువు"గా అభివర్ణించారు.జెన్సెన్ హువాంగ్ నల్లటి లెదర్ జాకెట్ ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకగా మారింది. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్కి నల్లటి టర్టిల్నెక్ స్వెటర్, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్కి బూడిదరంగు టీ-షర్టు ఎలాగో హువాంగ్కు ఈ బ్లాక్ జాకెట్ అలాగే. ఆయన దాదాపు ప్రతి కీలక ఉత్పత్తి ఆవిష్కరణ, డెవలపర్ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ వేదికలపై ఇదే తరహా జాకెట్లో కనిపిస్తుంటారు. 2021లో టైమ్ మ్యాగజైన్ ముఖచిత్రంపైనా ఇదే నలుపు జాకెట్తో మెరిశారు. వేలానికి వచ్చిన జాకెట్ను ఆయన 2023 అక్టోబర్లో తైవాన్లో జరిగిన హాన్ హై (ఫాక్స్కాన్) టెక్ డే కార్యక్రమంలో ధరించినదేనని ఫోటో మ్యాచింగ్ ద్వారా ధ్రువీకరించారు. జాకెట్పై హువాంగ్ సంతకాన్ని కూడా నిపుణులు ప్రామాణికంగా నిర్ధారించారు.ఎన్విడియా నాయకత్వంలో జెన్సెన్ హువాంగ్ కంపెనీని కృత్రిమ మేధ (AI) విప్లవానికి కేంద్రబిందువుగా నిలబెట్టారు. ఏఐ చిప్లకు పెరిగిన భారీ డిమాండ్తో ఎన్విడియా ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన పబ్లిక్ కంపెనీగా ఎదిగింది.ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఎడ్జ్ ఇన్స్టిట్యూట్ అనే లాభాపేక్షలేని సంస్థకు అందజేస్తున్నారు. సాంకేతికత, విజ్ఞానం, విద్య రంగాల్లో యువ ఆవిష్కర్తలకు ఫెలోషిప్లు, గ్రాంట్లు, పరిశోధన అవకాశాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.
రిలయన్స్ లాభాల రికార్డ్!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (2026–27, క్యూ1)లో రూ. 23,196 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ.30,783 కోట్లతో పోలిస్తే లాభం 25 శాతం తగ్గింది. అయితే, ఆ క్వార్టర్లో ఏషియన్ పెయింట్స్లోని రూ. 8,924 కోట్ల వాటా విక్రయం ద్వారా లభించిన అసాధారణ రాబడి కలిసి ఉండటం వల్ల వార్షికంగా లాభంలో తగ్గుదల నమోదైంది.ఈ వన్టైమ్ రాబడిని గనుక పక్కనబెడితే ఈ ఏడాది క్యూ1లో నికర లాభం దాదాపు 6.1 శాతం ఎగబాకి కొత్త రికార్డు నమోదు చేసినట్లు లెక్క. మొత్తం ఆదాయం రూ. 3.12 లక్షల కోట్లకు ఎగబాకింది. గతేడాది క్యూ1లో నమోదైన రూ. 2.48 లక్షల కోట్లతో పోలిస్తే 26 శాతం వృద్ధి చెందింది. ఆయిల్–టు–కెమికల్స్ (ఓ2సీ), రిటైల్, డిజిటల్ సరీ్వసుల వ్యాపారాల స్థిరమైన పనితీరు ఇందుకు ప్రధానంగా దోహదం చేసింది. కాగా, క్యూ1లో ఎబిటా 10.1 శాతం జంప్ చేసి రికార్డు స్థాయిలో రూ. 54,067 కోట్లను తాకింది.ఇతర ముఖ్యాంశాలివీ... క్యూ1లో ఓ2సీ బిజినెస్ ఎబిటా రూ.17,010 కోట్లకు చేరింది. 17.2 శాతం వృద్ధి చెందింది. రిలయన్స్ రిటైల్ నికర లాభం 14.2 శాతం తగ్గి రూ. 2,806 కోట్లకు చేరింది. ఆదాయం 8.6 శాతం పెరిగి రూ.79,745 కోట్లుగా నమోదైంది. ఎబిటా 1.1 శాతం తగ్గుదలతో రూ.6,309 కోట్లుగా ఉంది. కొత్తగా 252 స్టోర్లు జతయ్యాయి. దీంతో మొత్తం షోరూమ్ల సంఖ్య 20,169కి చేరింది. రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆదాయం 11.6 శాతం పెరిగింది. క్యాంపా కోలా అమ్మకాలు రూ. 2,900 కోట్లుగా నమోదయ్యాయి. రిలయన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపార ఎబిటా దాదాపు అదే స్థాయిలో రూ. 4,973 కోట్లుగా నమోదైంది. జూన్ క్వార్టర్లో కంపెనీ రూ.38,682 కోట్ల పెట్టుబడులు వెచ్చించింది. ఓ2సీ విస్తరణ, న్యూ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు కన్జూమర్ బిజినెస్ ఇన్ఫ్రాపై దీన్ని ఇన్వెస్ట్ చేసింది. జూన్ నాటికి నికర రుణ భారం రూ.1,22,914 కోట్లుగా ఉంది. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం రిలయన్స్ షేరు ధర 2.6 శాతం లాభంతో రూ.1,327 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.
ఫ్యామిలీ
అందానికి ఆక్సిజన్...
పార్లర్కి వెళ్ళడం... గంటలకొద్ది కూర్చొని ఫేషియల్స్ చేయించుకోవడం... ఇదంతా నిన్నటి మాట! ఇప్పుడు బ్యూటీ ఇండస్ట్రీ రూట్ మార్చింది. క్రీములు, మసాజ్లతో పనిలేకుండా, కేవలం గాలితోనే ముఖాన్ని మెరిపించే ఒక అద్భుత టెక్నాలజీని తీసుకువచ్చింది. అదే ఆక్సిజన్ ఫేషియల్. డల్ స్కిన్ ను సైతం క్షణాల్లోనే హైడ్రేట్ చేసి... కొరియన్ గ్లాస్–స్కిన్లా మార్చే ఈ ఫేషియల్కు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఫిదా అవుతున్నారు.సాధారణంగా మనం రెగ్యులర్గా చేయించుకునే ఫేషియల్స్లో చేతులతో మసాజ్ చేయడం, రకరకాల క్రీములు రాయడం చూస్తుంటాం. కానీ ఈ ఆక్సిజన్ ఫేషియల్ అందుకు పూర్తిగా భిన్నం. ఇది ఒక అధునాతన మెషిన్ ద్వారా చేసే ట్రీట్మెంట్. మన చర్మానికి అవసరమైన పోషకాల మిశ్రమం సిరమ్ని చర్మం పైపొరల్లోకి పంపిస్తారు. ఈ ప్రెజర్ డెలివరీ వల్ల చర్మం లోపలి భాగం వరకు పోషకాలు వేగంగా చొచ్చుకుపోతాయి.ముప్పై నిమిషాల్లో...ఈ ఆక్సిజన్ ఫేషియల్ ప్రక్రియ ఎలాంటి నొప్పి లేకుండా, కేవలం 30 నుంచి 60 నిమిషాల్లో పూర్తవుతుంది. ఇందులో భాగంగా మొదటగా క్లెన్సింగ్ చేస్తారు. అంటే ముఖంపై ఎలాంటి కెమికల్స్ లేకుండా క్లీన్ చేసి, డెడ్ స్కిన్ ను తొలగిస్తారు. దీనివల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుని, పోషకాలను గ్రహించడానికి సిద్ధమవుతాయి. ఆ తరువాత చర్మ తత్వాన్ని బట్టి ఒక పవర్హౌస్ సిరమ్ను అప్లై చేస్తారు. మూడవ దశలో ఒక చిన్న వాండ్ లాంటి పరికరంతో స్వచ్ఛమైన ఆక్సిజన్ ను ప్రెజర్తో ముఖంపై స్ప్రే చేస్తారు. ఇది చర్మానికి చల్లని గాలి తగిలినట్లు హాయిగా అనిపిస్తూ, సిరమ్ను లోపలికి పంపుతుంది.తక్షణ మెరుపుఈ ఆక్సిజన్ ఫేషియల్ వల్ల చర్మానికి క్షణాల్లో తేమ అంది, డ్రై స్కిన్ మృదువుగా మారుతుంది. గాలిని ప్రెజర్తో పంపించడం వల్ల ముఖంలో రక్తప్రసరణ పెరిగి చర్మంలో తక్షణమే మెరుపువస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా చర్మాన్ని టైట్ చేయడం వల్ల ముఖంపై ఉన్న సన్నని గీతలు, ముడతలు తాత్కాలికంగా తగ్గుతాయి. అలాగే ఆక్సిజన్కు ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాల వల్ల మొటిమలు, మంట తగ్గుతాయి. అంతే కాకుండా మిగతా ఫేషియల్ల వలే దీని వల్ల చర్మం ఎర్రబడటం అనేది ఉండదు. ఫేషియల్ అవ్వగానే మేకప్ వేసుకుని రెడీ అయిపోవచ్చు.ఎవరికి అవసరం?బిజీ లైఫ్స్టైల్, నిద్రలేమి, కాలుష్యం వల్ల ముఖం కాంతివిహీనంగా మారిన వారికి ఈ ఆక్సిజన్ ఫేషియల్ ఒక వరం లాంటిది. అలాగే పెళ్ళి కూతుళ్ళు, పార్టీలకు వెళ్లేవారు ఈవెంట్కు ఒకటి రెండు రోజుల ముందు ఇది చేయించుకుంటే మేకప్ చాలా సహజంగా, అందంగా కుదురుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు కూడా ఎలాంటి భయం లేకుండా దీనిని చేయించుకోవచ్చు.
ఆ ఉద్యోగం వదిలేయడానికి.. ఏకంగా 74 లక్షల మూల్యం..!
కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. మరికొన్నింటికి ఏకంగా లక్షలు ఖర్చవుతాయి. అయినా కూడ వెనకగుడు వేయకుండా ముందుకు సాగాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. ఇక్కడ చోటు చేసుకుంది అలాంటి ఘటనే. అసలేం జరిగిందంటే.. సశాస్త్ర సీమా బాల్ (SSB) మాజీ అసిస్టెంట్ కమాండెంట్ అమిత్ సోని సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవడానికి దాదాపు 74 లక్షలు ఎలా వదిలించుకోవాల్సి వచ్చిందో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తాను ఐఐఎం అహ్మదాబాద్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్ (PGPX) చేయడం కోసం తన ప్రభుత్వ పదవికిఇ రాజీనామా చేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదా పునరాలోచన లేకుండా తనపై ఉన్న నమ్మకంతో తీసుకున్న నిర్ణయానికి భారీ మూల్యం చెల్లించక తప్పలేదన్నారు. ఆ నిర్ణయం ఫలితంగా ఆర్థికంగా ఎంత ఖర్చు అయ్యిందో వివరించారు. PGPX ప్రోగ్రామ్ ఫీజు రూ. 37.10 లక్షలు కాగా, అంతర్జాతీయ ఇమ్మర్షన్కు రూ. 4.5 లక్షలు ఖర్చయ్యాయని అన్నారు. అతను తన ఒక ఏడాది జీవన వ్యయాలు సుమారు రూ. 2.5 లక్షలుగా అంచనా వేశాడు. అలాగే రూ. 9.80 లక్షల రాజీనామా బాండ్లు, అలాగే ఏడాది జీతం, ఉద్యోగ ప్రయోజనాల రూపంలో సుమారు 20 లక్షలు కలిపి దగ్గర దగ్గర రూ. 74 లక్షలు దాక వదులుకోవాల్సి వచ్చిందన్నారు. ఆర్థిక పరంగా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యినా..తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నారు అమిత్. ఆయన తన నిర్ణయాన్ని డబ్బుతో కొలవకూడదని అనుకుంటున్నాని, ఎందుకంటే..వ్యక్తిగత ఎదుగుదల, కొత్త అవకాశాలు కోసం సౌకర్యవంతమైన జీవితం వదులుకుంటున్నప్పడు ఆ మాత్రం ఖర్చు ఉంటుందని అన్నారు. అంతేగాదు ఆయన ఈ మార్పుని "యూనిఫాం నుంచి బోర్డురూమ్కు" మారడంగా అభివర్ణించారు. ఇది వృత్తి జీవితంలో ఒక కొత్త అధ్యయానికి నాందిగా పేర్కొంటూ తన పోస్ట్ని ముగించారు. ఇది నెటిజన్ల మనసును అమితంగా ఆకర్షించింది. కొందరు అతడి ధైర్యాన్ని, నిబద్ధతను ప్రశంసించగా, మరికొందరు ఉన్నత విద్య కోసం స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవడం ఒక విలువైన పెట్టుబడా కాదా అని ప్రశ్నిస్తూ పోస్టలు పెట్టారు.(చదవండి: గర్భంలో పడినప్పుడే..ఆయుర్ధాయం ఖరారు..!: పరిశోధనలో షాకింగ్ విషయాలు)
వైభవంగా జగదాంబిక బోనాలు..అక్కడే తొలి బంగారు బోనం..!
గోల్కొండ: గోల్కొండ జగదాంభిక మహంకాళీ అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా గురువారం మొదటి బోనం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు ఉదయం 6 గంటల నుంచే గోల్కొండ కోటకు తరలివచ్చారు. కోట మెయిన్ గేటు వద్ద భారీగా చేరిన భక్తులను అతికష్టం మీద పోలీసులు ఒకొక్కకరిని కోటలోకి పంపారు. రాష్ట్ర సంస్కృతిక శాఖ వారు ప్రత్యేకంగా తయారు చేసిన విగ్రహాలు ఊరేగింపునకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోట చౌరస్తా వద్ద ఓ వైపు శివసత్తులు, మరో వైపు పోతరాజులు పోటాపోటీగా విన్యాసాలు చేస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. రిసాల బజార్ నుంచి బి.శ్రీకాంత్చారి ఆధ్వర్యంలో రోబోటిక్ అంబారీపై అమ్మవారి మూర్తి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవర శ్రీనివాస్, గోల్కొండ జోన్ డీసీపీ రాఘవేందర్రెడ్డి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. జగదాంబకు బంగారు బోనంసప్త మాతృకలకు సప్త బంగారు బోనం పూజా కార్యక్రమాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబ అమ్మవారికి మొదటి బంగారు బోనంతో పాటు పట్టు వ్రస్తాలు, ఒడి బియ్యం సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉçత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ మల్యాల మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో జోగిని అవిక బోనమెత్తారు. హరిబౌలిలోని బంగారు మైసమ్మ దేవాలయంలో బంగారు పాత్రకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపు నిర్వహించారు. లంగర్హౌజ్ వద్ద స్వాగత వేదికపై నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలు బంగారు బోనానికి ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి మాజీ చైర్మన్లు గాజుల అంజయ్య, పొటేల్ సదానంద్, రాకేష్ తివారి, జనగామ మధుసూదన్ గౌడ్, ప్రవీణ్కుమార్ గౌడ్, పొటేల్ శ్రీనివాస్ యాదవ్, బల్వంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గోల్కొండ కోటలో గురువారం నగర సీపీ సజ్జనర్ పర్యటించారు. జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల నేపథ్యంలో ఆయన ఏసీపీ సయ్యద్ ఫయాజ్, సిబ్బందితో కలిసి అమ్మవారి దేవాలయానికి వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. బోనాలతో వచి్చన మహిళలతో ముచ్చటించారు. ప్రశాంత వాతావరణంలో వేడుకగా బోనాల పండుగను జరుపుకోవాలని ఆకాక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కోటకు బయలెల్లిన అమ్మవారులంగర్హౌస్ చౌరస్తా వద్ద మంత్రులు అమ్మవారికి తొట్టెల, పట్టు వ్రస్తాలు సమర్పించగా అమ్మవార్ల సోదరుడు పోతరాజులు చెర్నకోలలను జులుపుతు నృత్యాలు చేస్తు ఊరేగింపును కోట వైపు తీసుకువెళ్లారు. చోటాబజార్లో పూజారి అనంతచారి ఇంట్లో అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తులతో పాటు శివరాజ్ స్వామి బంగారు పల్లకిని తలపై మోపుకొని ఊరేగింపు కోటపై వెలసిన జగదాంబ ఆలయానికి సాగింది. డీసీపీ రాఘవేందర్ రెడ్డి, ఏసీపీ సయ్యద్ ఫయాజ్, రాజు వస్తాద్, నాగన్న అమ్మవార్లకు పూజలు నిర్వహించారు.
గర్భంలో పడినప్పుడే..ఆయుర్ధాయం ఖరారు..!
మనిషి ఆయుర్దాయంపై ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. దాని సాయంతో వృద్ధాప్యాన్ని, పలు రోగాల బారి నుంచి మనిషిని రక్షించి.. దీర్ఘాయువుని ప్రసాదించే దిశగా ఏళ్లుగా ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దానికి ఓ మార్గం దొరికేలా సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది తాజా పరిశోధనల్లో. ఒకరకంగా ఇది మనిషి జీవితకాలంపై సరికొత్త ఆశాకిరణం అందించిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ మనిషికి దీర్ఘాయువు సాధ్యమేనా అంటే..అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనల ప్రకారం పుట్టకకు ముందు అనుభవించే వాతావరణం ఆయుర్ధాయంపై ప్రభావం చూపగలదనే విషయం నిర్థారణ అయ్యింది. అంటే గర్భధారణ సమయంలో పిండ దశలో ఉండగానే ఆయుర్థాయం నిర్ణయింపబడి ఉంటుందంట. ఆ సమయంలో ఆ పిండానికి ఆరోగ్యం నుంచి వృద్ధాప్య దశలు ఎలా ఉంటాయి..పైగా ఎంతవరకు జీవించగలడనేది కూడా నిర్థారించొచ్చని ఈ కొత్త పరిశోధన వెల్లడించింది. ఈ పరిశోధన నేచర్ హెల్త్లో ప్రచురితమైంది. గర్భధారణ సమయంలో పిండ దశలో ఉన్నప్పుడే ఆ జీవి బాల్యం, జీవిత కాల ఆరోగ్యం, స్థితిస్థాపకత తదితరాలతో అతడి దీర్ఘాయువుని తెలుసుకోగలమని అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే వాటి సాయంతో అతడి ఆయువుని నిర్ణయించొచ్చని అన్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు PROSPER అనే ప్రసవ పూర్వం పరిశోధనపేరుతో అధ్యయనం మొదలు పెట్టినట్లు వెల్లడించారు. గర్భంలోని పరిస్థితులు జీవితాంతం కొనసాగే విధంగా శరీర అభివృద్ధిని ప్రభావితం చేస్తాయని అధ్యయనంలో గుర్తించారు. జన్యువులు ముఖ్యమైనవి అయినప్పటికీ, దీర్ఘకాలిక ఆరోగ్యం, స్థితి స్థాపకతన నిర్ణయించడంలో గర్భస్థ వాతావరణం కూడా గణనీయమైన పాత్ర పోషిస్తుందని పరిశోధనలు పేర్కొన్నాయని అన్నారు. గర్భధారణ సమయంలో తల్లి పోషణ, ఒత్తిడి స్థాయిలు, మొత్తం ఆరోగ్యం వంటి అంశాలు పుట్టుకకు మందు శరీర అవయవాలు, వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందుతాయనేదాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. అలాగని పుట్టకకు మందే భవిష్యత్తు నిర్ణయించబడిపోతుందని భయపడిపోవాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. జననం తర్వాత కూడా సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకరమై జీవనశైలితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఈ పరిశోధన గర్భధారణ సమయంలో పరిస్థితులను మెరుగుపరిస్తే గనుక ఒక వ్యక్తి జీవితకాల ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చగలదని నిరూపించిందన్నారు. ఇది ఒకరకంగా తల్లి ఆరోగ్యం, ప్రసవ పూర్వ సంరక్షణ తదితరాలపై దృష్టి పెట్టేలనే అంశం గురించి నొక్కి చెప్పిందన్నారు పరిశోధకులు.(చదవండి: ఆ అలవాట్లతో 15 కిలోలు బరువు..! 5 ఏళ్ల పాటు అలానే..)
అంతర్జాతీయం
ఇరాన్పై నిప్పుల వర్షం
దుబాయ్: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య దాడులు నానాటికీ తీవ్రతరం అవుతున్నాయి. తాత్కాలిక శాంతి ఒప్పందం అకస్మాత్తుగా ముగిసిన తర్వాత రెండు దేశాలు పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ప్రధానంగా హార్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతున్నాయి. హార్మూజ్పై టెహ్రాన్ పట్టును సడలించేలా ఒత్తిడి పెంచడానికి బలప్రయోగం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా గురువారం అర్ధరాత్రి తర్వాత అమెరికా తన వైమానిక దాడుల పరంపరను మరింత ఉధృతంచేసింది. ఇరాన్లో కీలక వంతెనలు, విద్యుత్ వ్యవస్థలపై దాడి చేయడంతోపాటు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చాబహార్ ఓడరేవు వద్ద ముఖ్యమైన నిఘా టవర్ను కూల్చివేసింది. ఇరాన్ సైతం వెంటనే ప్రతిదాడికి దిగింది. ఖతార్, కువైట్, జోర్డాన్పై క్షిపణులు ప్రయోగించింది. బహ్రెయిన్, ఒమన్, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కువైట్లో విద్యుత్, నీటి శుద్ధి ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉత్పాదన యూనిట్లకు నష్టం వాటిల్లిందని కువైట్ ఆందోళన వ్యక్తంచేసింది. గల్ఫ్లో అమెరికా యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ప్రకటించింది. జోర్డాన్లో మోహరించిన అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్లు స్పష్టంచేసింది. ఈ దాడుల్లో పలు అమెరికన్ యుద్ధ విమానాలు, గగనతల ఇంధన సరఫరా విమానాలు ధ్వంసం కాగా, మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. అయితే, తమ భూభాగం మీదుగా వచ్చిన మూడు క్షిపణులను అడ్డుకొని, కూల్చివేసినట్లు జోర్డాన్ సైన్యం తేల్చిచెప్పింది. విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలి ఇరాన్లోని దక్షిణ హార్మూజ్గాన్ ప్రావిన్స్లో వంతెనలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో కనీసం ఏడుగురు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ తీర నగరమైన బందర్ ఖమీర్పైనా దాడులు జరిగాయి. ప్రధాన రహదారులు, రైల్వే వంతెనలను కూడా విడిచిపెట్టలేదు. ప్రధాన రేవు పట్టణమైన బందర్ అబ్బాస్, రాజధాని టెహ్రాన్ మధ్య అనుసంధానం లేకుండా చేయడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. తమ దేశంలో విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు ఇరాన్ అంగీకరించింది. దక్షిణ ప్రావిన్స్లలో ప్రజలు విద్యుత్ను చాలా పొదుపుగా వాడుకోవాలని ఇరాన్ ఇంధన మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. టార్గెట్ చాబహార్ పోర్టు! ఇరాన్లో పదుల సంఖ్యలో లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అమెరికా సైనిక దళాల సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. వరుసగా ఆరో రోజు ఇరాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు వెల్లడించింది. అమెరికా వైమానిక దాడిలో చాబహార్ ఓడరేవు వద్ద ఒక టవర్ కూలిపోయినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలియజేసింది. ఓడరేవులోకి వచ్చే నౌకలను ఈ టవర్ నుంచే పర్యవేక్షిస్తారు. నిఘా టవర్ కూలిపోతున్న ఫొటోను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత ప్రభుత్వ సహకారంతో ఇరాన్ నిర్వహిస్తున్న చాబహార్ ఓడరేవు అమెరికా దాడులకు పదేపదే లక్ష్యంగా మారుతోంది. ఇక్కడ దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సైతం ధ్రువీకరించింది. శుక్రవారం ఉదయం 6 గంటల కల్లా అమెరికా దాడుల కారణంగా ఇరాన్లో కనీసం 38 మంది మరణించారని, 400 మందికి పైగా గాయపడ్డారని ఆరోగ్య శాఖ ప్రతినిధి హొస్సేన్ కెర్మన్పూర్ వెల్లడించింది. కుర్దిష్ రెబెల్ గ్రూప్పై ఇరాన్ దాడులు ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలంటూ ఖతార్ ప్రభుత్వం తమ పౌరులను రెండుసార్లు హెచ్చరించింది. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడానికి గగనతల రక్షణ వ్యవస్థలను సన్నద్ధం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు ఖతార్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రయోగించిన మూడు క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు జోర్డాన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు ఉత్తర ఇరాన్లోని కుర్దిష్ రెబెల్ గ్రూప్ ‘కొమాలా’పై దాడులు జరిగాయి. ఈ ఘటనలో కనీసం తొమ్మిది మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఇరాన్ సైన్యమే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక ట్యాంకర్ దాడికి గురైందని బ్రిటిష్ సైన్యం తెలిపింది.
2020 నాటి ఎన్నికల్లో చైనా జోక్యం
వాషింగ్టన్: 2020 నాటి అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఓటింగ్ వ్యవస్థలో అత్యంత ఆందోళనకరమైన లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన గురువారం రాత్రి వైట్హౌస్లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రైమ్టైమ్ ప్రసంగం చేశారు. దాదాపు అరగంట పాటు మాట్లాడారు. అప్పట్లో తన ప్రత్యర్థి జో బైడెన్కు అనుకూలంగా ఎన్నికలను ప్రభావితం చేయడానికి చైనా కుట్రలు సాగించిందని, ఆ విషయాన్ని నిర్ధారించే వందలాది నిఘా ఫైళ్లను తాను బహిర్గతం చేశానని చెప్పారు. తన వ్యక్తిగత సమాచారంతో సహా 22 కోట్ల మంది ఓటర్ల వివరాలను చైనా అక్రమంగా సేకరించిందని మండిపడ్డారు. 18 రాష్ట్రాల్లోని ఓటర్ల డేటాను చైనా కొనుగోలు చేసిందని, దొంగిలించిందని లేదా హ్యాక్ చేసిందని ట్రంప్ అన్నారు. ఈ విషయాన్ని నిఘా అధికారులు ప్రభుత్వానికి గానీ, కాంగ్రెస్కు గానీ చెప్పలేదని నిందించారు. అమెరికా పౌరులు కాని 2,78,000 మంది ఓటర్లుగా నమోదైనట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గుర్తించిందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో ఓటర్లకు సంబంధించిన సమాచారం చాలావరకు బహిరంగంగానే అందుబాటులో ఉంటుంది. అయితే, ఓటింగ్ విధానాలను మార్చడానికి లేదా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి చైనా ఈ సమాచారాన్ని వాడుకుందని తేల్చడానికి ట్రంప్ ఎటువంటి ఆధారాలనూ చూపలేదు. 2020 నాటి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, విదేశీ జోక్యం వల్ల ఫలితాలు తారుమారు అయ్యాయని ఆయన పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సాక్ష్యాధారాలను మాత్రం బయటపెట్టడం లేదు. మరోవైపు, కాంగ్రెస్పై నియంత్రణను నిర్ణయించే రాబోయే మధ్యంతర ఎన్నికలపై ప్రజల్లో సందేహాలు రేకెత్తించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని విపక్ష డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకోలేదని బలమైన నమ్మకం ఉన్నట్లు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ 2021 నాటి నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉండగా, ట్రంప్ ప్రజామోద రేటింగ్ 37 శాతానికి పడిపోయినట్లు వాషింగ్టన్ పోస్ట్–ఇప్సోస్ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. జీవన వ్యయం పెరగడం, ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం పట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడయ్యింది. ప్రత్యక్ష ప్రసారం చేయాలా? వద్దా? తన ప్రసంగాన్ని తప్పనిసరిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని మీడియా సంస్థలకు ట్రంప్ తేల్చిచెప్పారు. ప్రత్యక్ష ప్రసారం చేయకపోతే ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రసార, కేబుల్ వార్తా సంస్థలు అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నాయి. ప్రసారం చేయాలా? వద్దా? అనేదానిపై ఎటూ తేల్చుకోలేకపోయాయి. అమెరికా మీడియా సంస్థల్లో తన వ్యతిరేకులు ఉన్నారని ట్రంప్ చాలా రోజులుగా ఆక్షేపిస్తున్నారు. మీడియాపై పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘‘మీడియా సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయి. అలాంటి సంస్థల లైసెన్సులను రద్దు చేయాలి. కోట్లాది డాలర్ల విలువైన మన ప్రజా ఆస్తి ఎయిర్వేవ్స్ను (ప్రసార తరంగాలను) ఎలాంటి రుసుమూ చెల్లించకుండానే వాడుకుంటున్నాయి. మాకు కావాల్సిందల్లా ఎన్నికలు, వార్తల ప్రసారంలో నిజాయితీ మాత్రమే’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ ప్రసంగాన్ని కొన్ని చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయగా, మరికొన్ని చేయలేదు. ట్రంప్ ఆరోపణలు అవాస్తవం: చైనా అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా తిప్పికొట్టింది. అమెరికా అధ్యక్షుడి వాదనలు కల్పితం, దురుద్దేశపూర్వకం అని స్పష్టంచేశారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేసింది. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని ట్రంప్కు సూచించింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తమ విధానం కాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ శుక్రవారం పేర్కొన్నారు. అమెరికా ఎన్నికలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని, ఎన్నడూ జోక్యం చేసుకోలేదని వెల్లడించారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఎల్లప్పుడూ ఎవరు జోక్యం చేసుకుంటారో, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వ్యాపారాలు, సాధారణ పౌరులపై ఎవరు నిఘా పెడతారో, విదేశీ పౌరుల డేటాను ఎవరు దొంగిలిస్తారో అంతర్జాతీయ సమాజానికి బాగా తెలుసని స్పష్టంచేశారు. సొంత ప్రవర్తనను సమీక్షించుకోవాలని అమెరికాకు హితవు పలికారు. చైనాను ఎన్నికల అంశంగా వాడుకోవద్దని, చైనా–అమెరికా సంబంధాలను మెరుగుపరిచే దిశగా మరింత కృషి చేయాలని అమెరికాకు స్పష్టంచేశారు.
జపాన్ రాజవంశ చట్ట సవరణ
టోక్యో: పురుషులు మాత్రమే చక్రవర్తి కాగలరని నిర్దేశిస్తూ, 19వ శతాబ్దపు రాజవంశ చట్టానికి జపాన్ పార్లమెంట్ శుక్రవారం చారిత్రాత్మక సవరణను ఆమోదించింది. భవిష్యత్ వారసుల కోసం దూరపు మగ బంధువులను దత్తత తీసుకోవడం, అలాగే యువరాణులు సామాన్యులను వివాహం చేసుకున్న తర్వాత కూడా తమ రాజ హోదాను నిలుపుకోవడానికి అనుమతించడం వంటివి ఈ సవరణలలో ఉన్నాయి. ఇది ఇప్పటికే కుంచించుకుపోతున్న రాజకుటుంబాన్ని మరింత ప్రమాదంలో పడేస్తుందనే భయాన్ని రేకెత్తిస్తోంది. దీంతో ప్రభుత్వ ప్రయత్నాలు మహిళలపై వివక్షను, పితృస్వామ్య వ్యవస్థను సమర్థించడానికేనని పలువురు విమర్శిస్తున్నారు. పురుష వారసత్వంపై ఉన్న వ్యామోహానికి ప్రధాన ప్రతిపాదకురాలిగా మొదటి మహిళా ప్రధానమంత్రి ఉండటం చాలా విడ్డూరమని ప్రముఖ స్త్రీవాద పండితురాలు చిజుకో ఉనో ఇటీవల తకైచిని ఉద్దేశించి రాశారు. పురుష రాజవంశీకులను అశ్వాలుగా, మహిళా రాజవంశీకులు మగ సంతానాన్ని కనే యంత్రాలుగా పరిగణిస్తూ ఒత్తిడికి గురిచేస్తాయని ఉనో అన్నారు.
ఇంజన్ వైఫల్యంతో స్పేస్ఎక్స్ రాకెట్ లాంచ్ రద్దు
శాన్ ఆంటోనియో: స్పేస్ఎక్స్ తన అత్యంత ప్రతిష్టాత్మక స్టార్షిప్ రాకెట్ ప్రయోగాన్ని చివరి క్షణంలో రద్దు చేసింది. ఈ ప్రయోగం సమయంలో ఇంజిన్ సరిగ్గా స్టార్ట్ కాకపోవడం, కొన్ని ఇంజన్లు విఫలం కావడంతో టేకాఫ్కు కొన్ని సెకన్ల ముందు ఆటోమేటిక్ లాంచ్ సిస్టమ్ను నిలిపివేసింది. టెక్సాస్–మెక్సికో సరిహద్దులోని స్టార్బేస్ వద్ద జరగాల్సిన ఈ లాంఛింగ్ నింగిలోకి ఎగరడానికి మూడు సెకన్ల ముందే ఇంజిన్ మండటం ప్రారంభమైనట్లు ప్రయోగ వేదిక పైనుంచి తీసిన డ్రోన్ దృశ్యాల్లో కనిపించింది. మండిన ఇంజన్లు అకస్మాత్తుగా ఆగిపోయాయి. రాకెట్ ప్యాడ్కు అతుక్కుపోయి ఉండిపోయింది. ఆ తర్వాత ప్రయోగ బృందం వెంటనే రాకెట్ నుంచి ఇంధనాన్ని తీసివేయడం ప్రారంభించింది. మరికొన్ని రోజుల్లోనే తదుపరి ప్రయోగ ప్రయత్నం ఉంటుందని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ‘ఇంజన్ పాక్షికంగా మండే వరకు, వాతావరణంతో సహా ప్రతిదీ స్పేస్ఎక్స్కు అనుకూలంగానే సాగిందన్నారు. ప్రణాళిక ప్రకారం గంటసేపు సాగే ఈ ప్రయాణంలో, రాకెట్లోని 20 స్టార్లింక్లను విడుదల చేయాల్సి ఉంది. అవి అప్పటికే కక్ష్యలో ఉన్న స్టార్లింక్లతో సంభాషించడానికి ప్రయత్నిస్తూనే, స్టార్షిపహీట్ షీల్డ్ చిత్రాలను కూడా తీయాల్సి ఉంది. మొదటి దశ బూస్టర్ను గానీ, అంతరిక్ష నౌకను గానీ తిరిగి పొందాల్సిన అవసరం లేదు, రెండూ సముద్రంలోనే పడిపోతాయని భావించారు. ఈ ఆలస్యం స్పేస్ఎక్స్ ఉపగ్రహ ప్రణాళికలు, నాసా భవిష్యత్ చంద్ర కార్యక్రమంపై ప్రభావం చూపనుంది. ఈ ఎదురుదెబ్బతో అసలు సమస్య ఏమిటో పరీక్షించే పనిలో స్పేస్ఎక్స్ పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైనదిగా ప్రచారంలో ఉన్న ఈ రాకెట్, ప్రపంచం చుట్టూ సగం దూరం ప్రయాణించే తన 13వ యాత్రను చేయాల్సి ఉంది. ఈ మిషన్లో, 20 సరికొత్త స్టార్లింక్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను కూడా తీసుకువెళ్లాల్సి ఉంది.
జాతీయం
విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం..
శ్రీహరికోట: స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైంది. దీంతో, ఇస్రో యువ శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఇది దేశంలోనే తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్గా రికార్డుల్లోకి ఎక్కింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1ను శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. చిన్న ఉపగ్రహాలను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఈ రాకెట్ను రూపొందించారు. విక్రమ్-1లో ఆధునిక సాంకేతికతను వినియోగించారు. తేలికైన కార్బన్ కాంపోజిట్ నిర్మాణం, అధునాతన ప్రొపల్షన్ వ్యవస్థలు ఈ రాకెట్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. చిన్న ఉపగ్రహాల ప్రయోగాలను తక్కువ ఖర్చుతో, వేగంగా నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు.India’s first privately developed orbital rocket, Vikram-1 Test Flight-1, has successfully reached orbit after completing its final burn and injecting payloads into a 450 km orbit. The milestone makes India the third country in the world to achieve private orbital launch… pic.twitter.com/h2plDUat54— ANI (@ANI) July 18, 2026విక్రమ్-1 ప్రధాన లక్ష్యం..350 కిలోల వరకు ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్లోకి 350 కిలోల వరకు పేలోడ్లను ప్రవేశపెట్టడం. 60 డిగ్రీల వంపు (Inclination) ఉన్న కక్ష్యలో ఉపగ్రహాలను అమర్చేలా ఈ మిషన్ను రూపొందించారు. ఇది చిన్న ఉపగ్రహ ప్రయోగాల మార్కెట్లో భారత్కు కొత్త అవకాశాలను తెరవనుంది.విక్రమ్-1 ప్రత్యేకతలుతయారీ సంస్థ: స్కైరూట్ ఏరోస్పేస్, హైదరాబాద్రాకెట్ రకం: ఆర్బిటల్-క్లాస్ లాంచ్ వెహికల్పొడవు: సుమారు 24 మీటర్లుబరువు: సుమారు 30 టన్నులుదశలు (Stages): మూడు ఘన ఇంధన (Solid Fuel) దశలు + 1 లిక్విడ్ ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్పేలోడ్ సామర్థ్యం: గరిష్ఠంగా 350 కిలోల వరకుకక్ష్య: 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ (LEO)కక్ష్య వంపు (Inclination): 60 డిగ్రీలువిక్రమ్-1లో ఉపయోగించిన సాంకేతికతకార్బన్ కాంపోజిట్తో తేలికైన నిర్మాణం3D ప్రింటింగ్ సాంకేతికతతో తయారైన కొన్ని కీలక భాగాలుఘన ఇంధన రాకెట్ మోటార్లుచివరి దశలో కక్ష్యను ఖచ్చితంగా సరిచేసే లిక్విడ్ ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ #WATCH | Andhra Pradesh: India's first privately developed orbital-class rocket, Vikram-1, launched from the Satish Dhawan Space Centre in Sriharikota Built by Hyderabad-based Skyroot Aerospace, Vikram-1 is powered by three solid-fuel stages and a liquid orbital adjustment… pic.twitter.com/aSiCEuSXfg— ANI (@ANI) July 18, 2026అంతకుముందు.. చివరి నిమిషంలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం ఆలస్యమైంది. ఇంధన ప్రక్రియలో సాంకేతిక సమస్యను గుర్తించడంతో ప్రయోగాన్ని నిలిపివేసినట్టు ఇస్రో పేర్కొంది. గుర్తించారు. శాస్త్రవేత్తలు పరిస్థితిని చక్కదిద్దారు. దీంతో 35 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగం ప్రారంభమైంది. #UPDATE | Andhra Pradesh: India's first privately developed orbital-class rocket, Vikram-1, will be launched at 12.05:30Latest visuals from the Satish Dhawan Space Centre in Sriharikota.(Source: Skyroot Aerospace) pic.twitter.com/ro8rUWcsEa— ANI (@ANI) July 18, 2026
నోట్ల ముద్రణ ప్రైవేట్ పరం?.. అఖిలేష్ సంచలన ఆరోపణలు!
లక్నో: దేశంలో కరెన్సీ నోట్ల ముద్రణను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసిన ఒక టెండర్ నోటీసును అఖిలేష్ యాదవ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రస్తావిస్తూ ఈ ఆరోపణలు చేశారు.నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక పాలీమర్ సబ్స్ట్రేట్ షీట్ల సరఫరా కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ జారీ చేసిన నోటీసుపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ‘భ్రష్ట బీజేపీ పాలనలో ఇప్పుడు కరెన్సీ నోట్ల ప్రైవేటీకరణ కూడా జరగబోతోందా?’ అని ఆయన ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, కరెన్సీ పరంగా స్వయం ప్రతిపత్తిని కోల్పోతే, దేశం ఎలా ఆత్మనిర్భర్ భారత్గా మారుతుందని ఆయన నిలదీశారు. भ्रष्ट भाजपा राज में अब नोटों का भी प्राइवेटाइजेशन हो जाएगा क्या? कमीशनख़ोरी का मॉडल इस हद तक गिर जाएगा, देश की जनता ने सोचा न था। जब देश की मुद्रा ही आत्मनिर्भर नहीं होगी तो अर्थव्यवस्था और देश आत्मनिर्भर कैसे होगा? अब क्या सरकार भी आउटसोर्सिंग पर दे दी जाएगी?इतने बड़े और… pic.twitter.com/rvyxRjY5rZ— Akhilesh Yadav (@yadavakhilesh) July 17, 2026బీజేపీ ప్రభుత్వం పాలకుల వలె కాకుండా, లాభాపేక్ష కలిగిన వ్యాపారుల భాగస్వామిగా వ్యవహరిస్తోందని, ఈ టెండర్ ప్రక్రియ కేవలం నామమాత్రపు లాంఛనం మాత్రమేనని అఖిలేష్ ఆరోపించారు. కాగా, ఈ టెండర్లకు సంబంధించిన బిడ్లు ఆగస్టు 18న తెరవనున్నారు. కరెన్సీ వంటి అత్యంత సున్నితమైన అంశంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు.ఇది కూడా చదవండి: ఆమిర్ ఖాన్కు గ్యాంగ్స్టర్ హెచ్చరిక
ఆమిర్ ఖాన్కు గ్యాంగ్స్టర్ హెచ్చరిక
ముంబై: ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్కు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు ఆర్జూ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ‘లవ్ జిహాద్’ అంశంపై ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు, అభిప్రాయాలు భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని పేర్కొంటూ ఆయనను ఆర్జూ బిష్ణోయ్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్, ఆడియో క్లిప్ వైరల్గా మారాయి.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన ఆర్జూ బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ పేరుతో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. ‘లవ్ జిహాద్ పేరుతో సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించే ఆమీర్ ఖాన్ వంటి వారిని సహించేది లేదు. ఆయన చేసిన పనులకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ బుద్ధి చెబుతాం’ అని ఆడియో క్లిప్లో సదరు వ్యక్తి పేర్కొన్నాడు.సోషల్ మీడియా పోస్ట్లో కూడా అదే తరహా హెచ్చరికలు జారీ చేశారు. శ్రీగంగానగర్లో జరిగిన ఒక ఘటనలో నిందితులకు రాజకీయ నేతలు అండగా ఉండటంపై కూడా ఆర్జూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్, సోషల్ మీడియా పోస్ట్ల ప్రామాణికతను ధృవీకరించలేమని ‘ఇండియా టుడే’ పేర్కొంది. ఏదేమైనా ఈ పరిణామం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఇది కూడా చదవండి: ‘కంటే కూతుర్నే కనాలి’.. ఆస్పత్రిలో తండ్రి సందడి
‘కంటే కూతుర్నే కనాలి’.. ఆస్పత్రిలో తండ్రి సందడి
ఝాన్సీ: కూతురు పుట్టిన వేళ.. ఒక తండ్రి చూపిన ప్రేమాభిమానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలోని ఒక ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన సమాజానికి చక్కటి సందేశాన్ని ఇస్తోంది. తన ఇంట్లోకి మహాలక్ష్మి లాంటి కూతురు వస్తే, ఆ వేడుకను కేవలం కుటుంబానికే పరిమితం చేయకుండా, ఆస్పత్రిలోని వారందరితో కలిసి పంచుకోవాలని ఆ తండ్రి ముందే మొక్కుకున్నాడు. అనుకున్నట్లే కూతురు జన్మించగానే, ఆనందంతో ఆస్పత్రి వార్డులో ఉన్న రోగులకు, మహిళలకు, సిబ్బందికి స్వయంగా మిఠాయిలు పంచిపెట్టాడు. అంతేకాకుండా, వారికి బట్టలు, ఇతర కానుకలను కూడా అందజేశాడు.ఆ తండ్రి చేస్తున్న ఈ వేడుకను చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. కూతురు పుడితే వివక్ష చూపే వారికి, ఈ తండ్రి ప్రవర్తన ఒక పాఠంలా నిలుస్తోంది. ప్రభుత్వం ‘బేటీ బచావో-బేటీ పఢావో’ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నా, సమాజంలో పూర్తిస్థాయిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆడపిల్ల పుట్టడం అనేది అదృష్టమని, అది ఒక గొప్ప పండుగ అని చాటిచెప్పిన ఈ తండ్రి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది మంది మనసులను గెలుచుకుంటోంది. ఇలాంటి ఆలోచన ప్రతి ఇంట్లో ఉండాలని, అప్పుడే సమాజంలో లింగ వివక్ష తగ్గుతుందని నెటిజన్లు అంటున్నారు. View this post on Instagram A post shared by Life Of Student 📚 (@_life.of.student_)
ఎన్ఆర్ఐ
ఉద్యోగం లేదు, ఎలాంటి వేతనం లేదు..!దర్జాగా స్విట్జర్లాండ్లో..
ఎలాంటి ఆదాయం లేకుండా ఏ ఒక్క పని కాదు కదా..బయటికి కాలు కదపడం కూడా కష్టమే. అలాంటిది ఈ మహిళ ఏకంగా అత్యంత ఖరీదైన స్విట్జర్లాండ్ దేశంలో బేషుగ్గా బతికేస్తోందామె. కార్పొరేట్ ఉద్యోగం లేకుండా అలాంటి దేశంలో నివశించడం అంటే..అత్యంత హాస్యాస్పదం, నమ్మశక్యం కానీ విషయం. కానీ ఈ భారత సంతతి మహిళ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్న ఉదంతం వింటే..ఔనని అంగీకరిస్తారు. మరి ఆమె దాన్ని ఎలా సాధ్యం చేసిందంటే..భారత సంతతి మహిళ స్నేహ గౌర్ తాను కార్పొరేట్ ఉద్యోగం లేకుండా ఆరు నెలలపాటు స్విట్జర్లాండ్లో ఎలా గడపగలిగిందో పంచుకుంది. చాలామందికి ఆర్థిక భద్రత అనేది పూర్తికాలపు ఉద్యోగంతో ముడిపడి ఉంటుంది. కానీ ఒక భారతీయ కంటెంట్ క్రియేటర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశాలలో ఒకటైన స్విట్జర్లాండ్లో ఏ కంపెనీలో పనిచేయకుండానే ధీమాగా స్పెండ్ చేస్తోంది. అంతకుముందు తాను ఒక కార్పొరేట్ ఉద్యోగంలో నెలకు సుమారు రూ. 45,000 సంపాదిస్తున్నప్పటి నుంచి తన ప్రయాణం ప్రారంభమైందని అన్నారు. డిగ్రీ సంపాదించడం, జీతం తీసుకోవడం, ఉద్యోగం సంపాదించడం,తదుపరి ప్రమోషన్ పొందడం వంటివే అతిపెద్ద విజయాలుగా భావించానని చెప్పుకొచ్చింది. కానీ కాలక్రమేణ స్వేచ్ఛగా బతకడమే అసలైన జీవితం అని తెలిసి వచ్చింది. ముఖ్యంగా తాను ఎక్కడ నివశించాలో ఎంచుకునే స్వేచ్ఛ, ప్రయాణించే స్వేచ్ఛ, నచ్చిన విషయాలపై పనిచేసే స్వేచ్ఛ ఉంటేనే లైఫ్ అని గ్రహించానని అంటోందామె. అందుకే స్పానిష్ నేర్చుకోవడంపై పెట్టుబడి పెట్టి..చివరికి ఆ నైపుణ్యమే తన జీవిత గమనాన్ని మార్చేసిందని చెబుతోంది. ఆ భాష ఆమెకు స్పెయిన్కు వెళ్లడానికి, అంతర్జాతీయ అనుభవాన్ని పొందడానికి ఉపకరించిందని పేర్కొంది. అదే క్రమంగా ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అయ్యేందుకు అవకాశాలు కల్పించింది. ఏళ్ల తర్వాత ఆ నైపుణ్యాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నట్లు వెల్లడించింది. అలా క్రమంగా తన ఆదాయ మార్గాలను విస్తరింపచేయడంతో శాలరీపై ఆధారపడాల్సిన అవసరం రాలేదంటోంది. అందువల్లే తనకు స్విట్జర్లాండ్కు వెళ్లినప్పుడూ కంపెనీ జీతంపై ఆధారపడలేదని అంటోంది. జస్ట్ ఒక ల్యాప్టాప్, రిమోట్ టీమ్ సరిపోయాయని చెబుతోంది. కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది కేవలం ప్రమోషన్ కాదని అది ఒక నైపుణ్యం కూడా అంటూ పోస్ట్ని ముగించింది. అందుకు సంబంధించిన వీడియో తోపాటు క్యాప్షన్లో గౌర్ ఇలా రాసుకొచ్చారు. ‘ఆఫీసు లేదు.. బాస్ లేరు.. అనుమతి అంతకన్నా అవసరం లేదు’ అయినా స్విట్జర్లాండ్ హాయిగా నిద్రపోగలను అని రాసి మరి వీడియోని పోస్ట్ చేసింది. అలాగే తాను స్పెయిన్లో ఉన్నప్పుడే ఒక వ్యవస్థను రూపొందించుకున్నానని, అది తనకు నచ్చిన చోట నివశించే స్వేచ్ఛను అందించిందని తెలిపింది. నిజంగా సాధించదగిన స్వేచ్ఛ అంటే ఇదే అని చెబుతుండటం విశేషం. View this post on Instagram A post shared by Sneh Gaur (@snehgaur_) (చదవండి: 14 ఏళ్ల వయసులో టాయిలెట్ క్లీనింగ్.. ఇప్పుడేమో మార్స్ మిషన్కు లీడర్!)
సౌదీలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
రియాద్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని సౌదీ అరేబియా సెంట్రల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్ నగరంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా సెంట్రల్ కమిటీ కన్వీనర్ రబ్బానీ సయ్యద్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని కొనియాడారు. వైఎస్సార్సీపీ ఘన విజయం కోసం కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా కలిసికట్టుగా పని చేయాలో దిశా నిర్దేశం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘మావిగన్’ కార్యక్రమం గురించి రబ్బానీ సయ్యద్ ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మావిగన్’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రియాద్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన కరతాళ ధ్వనులు, ‘జై మావిగన్’ నినాదాలతో ఆడిటోరియం మార్మోగింది.ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులు సిరుమల సుబ్బారెడ్డి, పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి, కరీముల్లా బాషా షేక్, వెలంపాటి వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గొల్ల విజయ్, గానుగపెంట శ్రీకాంత్, సుభాన్ ఖాన్ పఠాన్, నాగినేని ఉదయ్ కృష్ణ చౌదరి, షేక్ షాదక్ వలి, కంది శశిధర్ రెడ్డితో పాటు వందలాది మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ జయంతి వేడుకలను విజయవంతం చేశారు.
YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో డా. వై.ఎస్.ఆర్ జయంతి వేడుకలు
ఫీనిక్స్, అరిజోనా : మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఘనంగా నిర్వహించింది. YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, YSRCP ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ చ ముఖ్యమంత్రి మాజీ సలహాదారు (విద్య) ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఎన్ఆర్ఐ వ్యవహారాలు) డాక్టర్ ప్రదీప్ చింతా గారు హాజరయ్యారు. డాక్టర్ వై.ఎస్కు పుష్పాంజలి ఘటించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం, ఆయన అద్భుతమైన జీవితం, దార్శనిక నాయకత్వం, ప్రజా సంక్షేమం పట్ల అచంచలమైన నిబద్ధతను తెలియజేస్తూ ఒక ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన జరిగింది.డా. వైయస్సార్తో తమ జ్ఞాపకాలను పలువురు పంచుకున్నారు. ఆయన వినయం, కరుణ, ధైర్యం, ప్రజా సేవ పట్ల అచంచలమైన అంకితభావాన్ని వారు గుర్తు చేసుకున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ను నిజమైన ప్రజానాయకుడు అంటూ ముఖ్య అతిథి ఆలూరు సాంబ శివారెడ్డి అభివర్ణించారు. సామాన్య పౌరులతో ఆయనకున్న అసాధారణ అనుబంధాన్ని, పరిపాలన పట్ల ఆయన అనుసరించిన పరివర్తనాత్మక విధానాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ నిరంతర సంక్షేమం, అభివృద్ధి కోసం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలను, దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలవాలని ఆయన కోరారు.ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఎన్నారై చాప్టర్లను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన జగనన్న టెక్ఫోర్స్ కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించారు. సాఫ్ట్వేర్ నిపుణులు మరియు ఎన్నారైల కీలక పాత్రను నొక్కిచెబుతూ, పార్టీ ప్రపంచవ్యాప్త విస్తరణ,భాగస్వామ్యానికి సభ్యులు చురుకుగా పాల్గొని, తమ వంతు సహకారం అందించాలని ఆయన ప్రోత్సహించారు.అలాగే ఆంధ్రప్రదేశ్లోని తమ కుటుంబ సభ్యులు , స్నేహితులలో అవగాహన కల్పించడం ద్వారా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో ఎన్నారైలు చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. ప్రతి అర్హతగల ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, నమోదు ప్రక్రియను సరిగ్గా పూర్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.ముఖ్య అతిథి డా. ప్రదీప్ చింత, దివంగత డా. వై.ఎస్. స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం మరియు శాశ్వత వారసత్వం గురించి ప్రస్తావించారు. ఆయన పదవీకాలంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ మరియు గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో అమలు చేసిన పరివర్తనాత్మక సంస్కరణల గురించి మాట్లాడారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న అణచివేతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు, ప్రజా చైతన్యానికి మద్దతుగా సోషల్ మీడియా వేదికల ద్వారా చురుకుగా పాల్గొనాలని ఎన్నారైలకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల SIR పథకంపై ఒక వాక్త్రూ సెషన్ను నిర్వహించారు. SIR పథకం కింద ఓటరు వివరాలను ధృవీకరించుకోవడానికి, గణన పత్రాలను సరిగ్గా పూరించడానికి అవసరమైన దశలవారీ ప్రక్రియను ఆయన వివరించారు. నిర్దేశించిన కాలపరిమితిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు తమ కుటుంబ సభ్యులకు, స్థానిక సమాజాలకు మార్గనిర్దేశం చేయాలని పాల్గొన్నవారిని ప్రోత్సహించారు.డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి కమిటీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ ఈ సమావేశం ముగిసింది. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆశించిన సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమ ఆధారిత పాలన అనే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి మద్దతు కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను వక్తలు నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అత్యంత ప్రియమైన నాయకులలో ఒకరికి ఈ కార్యక్రమాన్ని ఒక అర్థవంతమైన నివాళిగా మార్చడంలో పాల్గొన్న సభ్యులు, మద్దతుదారులు మరియు సామాజిక నాయకులందరికీ వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల, వంశీ ఏరువరం, చెన్నారెడ్డి మద్దూరి, సోమ శేఖర్ రెడ్డి యర్రపురెడ్డి, బోగారపు లక్ష్మీ & గురు, బలరాంరెడ్డి, శ్రీధర్ లక్కిరెడ్డి, రమేష్, శ్రీధర్ చెమిడ్తి, అంజిరెడ్డి, విఘ్నేష్, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగేష్పొర్లక్లు పాల్గొన్నారు. శిరసనంబేడు, సాయి రోహిత్ చెరుకుమిల్లి, శ్రవణ్, విష్ణు చొప్పా, విజయ్, ప్రవీణ్, ప్రక్ష్, పురంధర్, శివ కోడూరు, నాగరాజు దాసరి, ప్రక్షా, లోకనాధ్, అనిల్ ప్రవీణ్ అవుతారు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం ముగిసింది.
మహిళ హత్య కేసు: అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్యను హత్య చేసిన ఆరోపణలపై ఒక తెలుగు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లేవ్లోని ఒక అపార్ట్మెంట్ బాత్రూమ్లో భార్య మృతదేహం లభ్యమైన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.నిందితుడిని అవినాష్ నార్నె (30)గా గుర్తించారు. జూన్ 27న బెల్లేవ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, భార్య సబ్బినేని రజిత (27) మరణానికి కారణమైనందుకు ఫస్ట్-డిగ్రీ మర్డర్ నిందారోపణలు మోపారు. ప్రస్తుతం అతడికి కింగ్ కౌంటీ జైలులో 5 మిలియన్ డాలర్ల (రూ. 47 కోట్లకు పైగా) భారీ బెయిల్ విధించారు. 2025 అక్టోబర్ 27న బెల్లేవ్ డౌన్టౌన్లోని ఉడ్ల్యాండ్ కామన్స్ అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న బాత్రూమ్లో రజిత అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అధికారులు గమనించారు.వైద్య సిబ్బంది కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆమె అప్పటికే మరణించినట్లు తేలింది. ఆఫీసు నుండి వచ్చేసరికి భార్య బాత్రూమ్ ఫ్లోర్పై పడి ఉందని అవినాష్ పోలీసులకు తెలిపాడు. వీరిద్దరికీ 2025 జూన్లో పెద్దలు కుదిర్చిన వివాహం జరగ్గా, ఆ తర్వాతే ఈ అపార్ట్మెంట్కు మారారు. మొదట అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నివేదికలో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో దీనిని హత్యకేసుగా మార్చారు.సుదీర్ఘ దర్యాప్తులో ఎలక్ట్రానిక్ డోర్ లాక్ రికార్డులు, మొబైల్ డేటా, వాట్సాప్ సందేశాలను డిటెక్టివ్లు పరిశీలించారు. రజిత మరణించిన సమయంలో అవినాష్ మినహా మరెవ్వరూ అపార్ట్మెంట్లోకి ప్రవేశించలేదని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, అవినాష్కు భారతదేశంలో మరో మహిళతో సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో నిందితుడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు, డిజిటల్ ఆధారాల బట్టి అతడే ప్రధాన నిందితుడిగా నిర్ధారించి కోర్టులో హాజరుపరిచారు.
క్రైమ్
బాలిక పట్ల అసభ్య ప్రవర్తన
హైదరాబాద్: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు, స్థానికులు, సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.గోల్కొండ జోన్ అడిషనల్ కమిషనర్ కృష్ణ గౌడ్, కుల్సుంపురా ఏసీపీ తిరుపతి వివరాల ప్రకారం.. జియాగూడ డబుల్ బెడ్రూమ్లలో ఉంటున్న అబ్బుల్ అజీజ్ (55) రెడ్హిల్స్లోని నీలోఫర్ ఆసుపత్రి వద్ద చాయ్ అమ్ముతుంటాడు. భార్య, పిల్లలు వదిలేయడంతో తల్లి గౌసియా బీ వద్దే ఉంటున్నాడు. మద్యానికి బానిసయ్యాడు.గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ అంతస్తులో మైనర్ (9) ఒక్కతే ఉన్నది గమనించి అసభ్యంగా ప్రవర్తించాడు. అదే అంతస్తులోకి వచ్చిన మరో వ్యక్తి అజీజ్ను చూసి బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.సీసీ కెమెరాల్లో పరిశీలించి బయటకు వెళ్లిన అబ్బుల్ అజీజ్ సాయంత్రం 6 గంటలకు తిరిగి రావడంతో అతడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
'ఇంత త్వరగా విడుదలా?' అనుకునేలోపే.. మళ్లీ జైలుకే..!
హైదరాబాద్: డ్రంకన్ డ్రైవ్ కేసులో 14 రోజుల జైలు శిక్ష పడిన ఓ మందు బాబును చంచల్గూడ జైలు సిబ్బంది పొరపాటున శిక్ష పూర్తవకుండానే..తొమ్మిది రోజులు ముందే విడుదల చేశారు. చివరకు తప్పు తెలుసుకుని.. మళ్లీ అతన్ని ఒక రోజు తర్వాత జైలుకు తరలించారు. ఈ ఘటన కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అంబర్పేటకు చెందిన మనోహర్ ఈ నెల మొదటి వారంలో మద్యం తాగి బైకు నడుపుతూ కాచిగూడ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని 9వ తేదీన నాంపల్లి 8వ ఎంజేఎఫ్సీ కోర్టులో హాజరుపరచగా రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినందుకు న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. దీంతో మనోహర్ను చంచల్గూడ జైలుకు తరలించారు. 14 రోజులు జైల్లో పెట్టాల్సిన జైలు అధికారులు అతన్ని 5 రోజులకే విడుదల చేశారు. మరుసటి రోజు తప్పు గుర్తించిన జైలు అధికారులు మనోహర్ను తిరిగి జైలు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కాచిగూడ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఎట్టకేలకు మనోహర్ ఆచూకీ తెలుసుకుని..అయోమయానికి గురైన అతనికి జరిగిన తప్పిదాన్ని వివరించి..అతికష్టం మీద తిరిగి గురువారం చంచల్గూడ జైలుకు తరలించారు.
నా భర్తతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటావా?!
కృష్ణాజిల్లా: కట్టుకున్న భర్త మరో మహిళతో ఉంటూ తనని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడన్న కోపంతో భార్య తన కుటుంబ సభ్యులతో ఆ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన మచిలీపట్నంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బలరామునిపేటకు చెందిన శ్రీను అనే వ్యక్తికి అంజలితో వివాహం అయ్యింది. శ్రీను శ్లాబు పనులు చేస్తుంటాడు. అయితే ఐదేళ్ల క్రితం శ్రీను మీనాక్షి అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా ఆమెతోనే ఉంటూ మొదటి భార్యను పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అంజలి శుక్రవారం రాత్రి తన బంధువులతో కలిసి మీనాక్షిని నడిరోడ్డుపై అడ్డుకుని విచక్షణారహితంగా దాడి చేసింది. ఆమెతో పాటు బంధువులు మీనాక్షిని మహిళ అని కూడా చూడకుండా మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నడిరోడ్డుపై ఆమె దుస్తులను చింపేసి తీవ్రంగా అవమానించారు. కొంత మంది మగాళ్లు కూడా మహిళ అని చూడకుండా మీనాక్షి జుట్టు పట్టుకుని ఈడ్చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు పలువురు చికిత్స నిమిత్తం ఆమెను మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో వైద్యుల సలహా మేరకు పోలీసులు తమ ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నారు. బాధితురాలు కోలుకున్న అనంతరం వివరాలు సేకరించి ఆమె ఇచ్చిన ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చిలకలపూడి పోలీసులు తెలిపారు.
మద్యం మత్తు.. తండ్రి చేతిలో తనయుడి హత్య
కోనేరు సెంటర్: మద్యం మత్తులో ఉన్న తండ్రీకొడుకులు గొడవ పడగా..ఆగ్రహంతో కుమారుడిని తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..బందరు మండలం బోట్లవానిపాలెంకు చెందిన బొల్లా రామ్మోహనరావు తాపీ పని, అతడి పెద్ద కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి (30) పెయింటింగ్ పని చేస్తుంటారు. నాలుగేళ్ల క్రితం కళ్యాణ్కు గూడూరు మండలానికి చెందిన దుర్గాభవానితో వివాహం కాగా, తన భార్యతో పాటు అతడు తన అత్తవారి ఊర్లో ఉంటున్నాడు. మంగినపూడి బీచ్కి సమీపంలో పెయింటింగ్ పనులకు వచ్చిన కళ్యాణ్..రెండు రోజులుగా తల్లిదండ్రుల వద్దే ఉన్నాడు. గురువారం రాత్రి తండ్రీకొడుకులు మద్యం తాగారు. అనంతరం కళ్యాణ్ తన తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో తండ్రీకొడుకులు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుకున్నారు. ఓ దశలో తీవ్ర ఆగ్రహంతో తండ్రి రామ్మోహనరావు మంచంపై పడుకుని ఉన్న కళ్యాణ్ తలపై సరుగుడు బాదుతో బలంగా కొట్టగా తలకు గాయాలై కళ్యాణ్ స్పృహ కోల్పోయాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో బంధువులు అతడిని మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ఆసుపత్రికి వచ్చి ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుని భార్య దుర్గాభవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీడియోలు
నడిరోడ్డుపై మహిళను.. ఛీ..ఛీ.. టీడీపీపై రాయన భాగ్యలక్ష్మి ఫైర్
భారీ భూకంపం.. బిల్డింగులు ఎలా కూలిపోయాయో చూడండి
విక్రమ్ -1 రాకెట్ ప్రయోగం సక్సెస్ పై YS జగన్ హర్షం
మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈ రోజు తులం ఎంతంటే?
కోలీవుడ్ కు కయాదు ఫీవర్...
సిద్ధాంతాల కోసం సాగిన ప్రయాణం.. ముద్రగడ పోరాట ప్రస్థానం
రోహిత్ రిటైర్మెంట్ పై టీమిండియా కోచ్ క్లారిటీ
ఈ రోజు నిన్ను ఏమనాలి లోకేష్..! తల్లి కి వందనం పథకానికి ఎగనామం
శవరాజకీయాలా..? పచ్చ మీడియాకు ముద్రగడ కుటుంబం వార్నింగ్
ఎన్టీఆర్ మా స్పూర్తి.. 100 కోట్లతో ప్రజా సేవ చేస్తాం


