ఈ రాశి వారికి జీవితాశయం నెరవేరుతుంది
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: శు.విదియ రా.2.29 వరకు, తదుపరి తదియ,నక్షత్రం: శ్రవణం ప.1.29 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: సా.5.15 నుండి 7.14 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.53 నుండి 9.35 వరకు తదుపరి రా.10.54 నుండి 11.44 వరకు, అమృత ఘడియలు: రా.3.27 నుండి 5.04 వరకు.సూర్యోదయం : 6.39సూర్యాస్తమయం : 5.44రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం..... ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. స్థిరాస్తి వృద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.వృషభం... కొత్తగా అప్పులు చేస్తారు. బంధువర్గంతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. మానసిక ఆందోళన. దేవాలయదర్శనాలు.మిథునం..... కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.కర్కాటకం..... కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి సహాయం. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది. దేవాలయదర్శనాలు.సింహం..... దూరపు బంధువులను కలుసుకుంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.కన్య... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ఆరోగ్యసమస్యలు.తుల.... ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఖర్చులు తప్పవు.వృశ్చికం.. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. దేవాలయదర్శనాలు.ధనుస్సు.... అప్పులు చేస్తారు. అవసరాలకు డబ్బు అందక ఇబ్బంది. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దేవాలయదర్శనాలు.మకరం...... పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విందువినోదాలు.కుంభం.... ప్రయత్నాలలో ఆటంకాలు. కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. బందువర్గంతో తగాదాలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మీనం.. ఆదాయం పెరుగుతుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. భవిష్యత్పై కొత్త ఆశలు. పరిచయాలు పెరుగుతాయి. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యాపార వృద్ధి.
పోలీసుల నిర్లక్ష్యంతోనే సాల్మన్ హత్య
సాక్షి, అమరావతి: పోలీసుల నిర్లక్ష్య వైఖరితోనే మందా సాల్మన్ హత్య జరిగిందని.. సీఎం చంద్రబాబు కుట్రతోనే పక్కా పథకం ప్రకారం సాల్మన్ని అతి దారుణంగా పట్టపగలు ఇనుపరాడ్లతో కొట్టి చంపారని వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పల్నాడు జిల్లాలోని పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు మందా సాల్మన్ దారుణహత్య నేపథ్యంలో సోమవారం వైఎస్సార్సీపీ నాయకులు డీజీపీకి వినతిపత్రం ఇవ్వడానికి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్రంలో దిగజారిపోతున్న శాంతిభద్రతలు, ఎస్సీలపై జరుగుతున్న దాడులపై డీజీపీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.సాల్మన్ది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సాల్మన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతోపాటు కోటి రూపాయల పరిహారం, ఐదెకరాల పొలం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై అట్రాసిటీ కేసు నమోదు చేయడంతోపాటు ఈ హత్య ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటినుంచి దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు నిర్వీర్యం అయ్యాయని చెప్పడానికి మందా సాల్మన్ హత్యే తాజా నిదర్శనమని చెప్పారు.కళ్ల ముందు దారుణాలు జరుగుతున్నా చోద్యం చూస్తున్న పోలీసులు రాబోయే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. డీజీపీకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో డీజీపీ కార్యాలయం గేటు వద్దనే బైఠాయించి ధర్నా చేశారు. దీంతో దిగివచ్చిన పోలీసులు వారిని లోపలికి అనుమతించి ఏడీజీకి వినతిపత్రం ఇప్పించి పంపించారు. ముందస్తు సమాచారం ఉన్నా తమను కలవకపోవడంతో ప్రజాసమస్యలను వినడానికి కూడా డీజీపీకి ఓపిక లేదా అని వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు.ప్రభుత్వం పట్టించుకోకపోతే న్యాయస్థానాలను, జాతీయ మానవహక్కుల సంఘాన్ని (ఎన్హెచ్ఆర్సీని), నేషనల్ ఎస్సీ కమిషన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, రుహుల్లా, మాజీమంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, విడదల రజిని, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టి.జె.ఆర్.సుధాకర్బాబు, పార్టీ ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పాల్గొన్నారు. ఎన్హెచ్ఆర్సీ, ఎస్సీ కమిషన్ను ఆశ్రయిస్తాం గతంలో బిహార్లో జంగిల్రాజ్ గురించి దేశమంతా మాట్లాడుకునేది. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో అమలవుతున్న దొంగల రాజ్యం, డెకాయిట్ రాజ్యాన్ని ప్రజలు కళ్లారా చూస్తున్నారు. ఎంతోమంది వేధింపులు అనుభవిస్తున్నారు. ఒక్క పిన్నెల్లి గ్రామంలోనే దాదాపు 200 కుటుంబాలను ఊరి నుంచి వెలివేస్తే.. పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినా ఫలితం శూన్యం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఊరి బయటే ఉంటున్న సాల్మన్.. భార్య అనారోగ్యంతో ఉందని వస్తే నిర్దాక్షిణ్యంగా చంపేశారు.కోమాలో ఉన్న వ్యక్తి మీద 324 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఆధార్ కార్డులు చూపిస్తేనే శ్మ శానానికి అనుమతిస్తామంటూ దిక్కుమాలిన నిర్ణయం తీసుకున్నారు. సాల్మన్ హత్యపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఎన్హెచ్ఆర్సీని, ఎస్సీ కమిషన్ని ఆశ్రయిస్తాం. న్యాయం జరిగేదాకా వైఎస్సార్సీపీ పోరాటం ఆపదు. సాల్మన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించాం. – కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డీజీపీ కనీసం పట్టించుకోలేదు అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి వచ్చిన మందా సాల్మన్ను టీడీపీ గూండాలు దారుణంగా కొట్టి చంపేశారు. పోలీసుల ఉదాసీన, నిర్లక్ష్యవైఖరి కారణంగానే సాల్మన్ హత్య జరిగింది. సాల్మన్ మీద జరిగిన దాడి గురించి ఫోన్ చేసి చెప్పినా, ఆయన భార్య స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.పైగా చావు బతుకుల మధ్య ఉన్న సాల్మన్పైనే 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేయడానికి ప్రతిపక్ష నాయకులు వచ్చినా డీజీపీ పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 15 సార్లకు పైగా వివిధ అంశాలపై ఫిర్యాదు చేయడానికి వచ్చినా డీజీపీ కనీస బాధ్యతగా వ్యవహరించలేదు. సాల్మన్ హత్యపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి. – అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి సీబీఐ విచారణ జరిపించాలి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులు ప్రాణాలతో ఉండాలంటే ఊళ్లు వదిలేసి బయట తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. భార్యకు ఆరోగ్యం బాలేదని చూడటానికి వెళ్లిన వ్యక్తిని ఇనుపరాడ్లతో కొట్టి అతి దారుణంగా చంపేశారు. నిందితులను అరెస్ట్ చేయాల్సిన పోలీసులు.. వారిచ్చిన ఫిర్యాదుతో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న సాల్మన్ మీదనే కేసు పెట్టిన దౌర్భాగ్య పరిస్థితి. సాల్మన్ హత్య పథకం ప్రకారమే జరిగింది. రాష్ట్రంలో దళితులు వైఎస్సార్సీపీకి అండగా ఉంటున్నారన్న కక్షతో వారిని భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా ఈ హత్య జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్టులు కూడా దేశంలో ఎక్కువ నేరాలు ఏపీలోనే నమోదవుతున్నట్లు వెల్లడిస్తున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగంతో దళిత బిడ్డల్ని వేధిస్తున్నారు. – మేరుగ నాగార్జున, మాజీ మంత్రి వైఎస్సార్సీపీకి దూరం చేసే కుట్ర సాల్మన్ దారుణ హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ముందస్తుగా అనుమతి తీసుకుని వచ్చిన మమ్మల్ని ధర్నా చేస్తేగానీ కార్యాలయం లోపలికి అనుమతించలేదు. డీజీపీని కలవడానికి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చినా ఆయనకు సమయం లేకపోయింది. సాధారణ వ్యక్తులతో వ్యవహరించినట్టు కూడా పోలీసులు ప్రవర్తించలేదు.స్థానిక సీఐ, ఎస్ఐల తీరుని వివరించాలని వచ్చిన మమ్మల్ని కనీసం సమస్య చెప్పుకోనివ్వలేదు. వైఎస్సార్సీపీకి అండగా ఉన్న దళితులను దూరం చేయాలన్న కుట్రతోనే పథకం ప్రకారం దళితులపై సీఎం చంద్రబాబు దాడులు చేయిస్తున్నాడు. దళితుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతీయాలన్న వ్యూహాలు రచిస్తున్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇచ్చే వరకు వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుంది. – టి.జె.ఆర్.సుధాకర్బాబు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి దళితుడిని పట్టపగలు దారుణంగా తలపగలగొట్టి చంపితే ప్రభుత్వం నుంచిగానీ టీడీపీ నుంచిగానీ కనీస స్పందన లేదు. ఎన్నికలొచ్చినప్పుడల్లా పెద్ద మాదిగనని చెప్పుకొనే సీఎం చంద్రబాబు.. మాదిగ కులస్తుడు మందా సాల్మన్ని దారుణంగా చంపితే ఎందుకు పట్టించుకోవడం లేదు? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మవిశ్వాసంతో బతికిన దళితులు కూటమి ప్రభుత్వం వచ్చాక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. దళితులను దారుణంగా వేధిస్తున్న ఈ ప్రభుత్వానికి పతనం తప్పదు. సాల్మన్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలి. టీడీపీలో ఉన్న దళిత నాయకులు కూడా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలి. – మొండితోక అరుణ్కుమార్, ఎమ్మెల్సీ
ఐఫోన్ అయితే వాడినా ఓకే
దేశీయంగా కొత్త డివైజ్ల రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో సెకండ్హ్యాండ్ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ నెలకొంది. దీంతో రీఫర్బిష్డ్ ఫోన్ల మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం 2025లో 7–8 శాతం మేర వృద్ధి చెందిన సెకండరీ మార్కెట్ ఈ ఏడాది కూడా అదే జోరు కనబర్చవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడుతుండటం, ఆన్లైన్–ఆఫ్లైన్ మాధ్యమాల ద్వారా నేరుగా కస్టమర్లకు మరింత అందుబాటు స్థాయిలో లభిస్తుండటంలాంటి అంశాలు రీఫర్బిష్డ్ ఫోన్ల విక్రయాలు పెరిగేందుకు దోహదపడగలవని పేర్కొన్నారు. కొత్త వ్యూహాలు.. థర్డ్ పార్టీలు రీఫర్బిష్ చేసి, అమ్మే డివైజ్లలో నాణ్యత సరిగ్గా లేకపోవడం, రిటర్నులు ఎక్కువగా వస్తుండటంతో అమెజాన్, ఫ్లిప్కార్ట్లాంటి దిగ్గజాలు గతేడాది ఈ విభాగం నుంచి తప్పుకున్నప్పుడు కొంతకాలం అమ్మకాలు నెమ్మదించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సదరు ప్లాట్ఫాంలపై ఆధారపడిన విక్రేతల వ్యాపారం తాత్కాలికంగా దెబ్బతిందని వివరించాయి. దీనితో నేరుగా వినియోగదారులను చేరుకునే వ్యూహాలకు క్యాషిఫై, కంట్రోల్జెడ్లాంటి సంస్థలు పదును పెట్టాయి. ఆన్లైన్ ప్లాట్ఫాంలను, ఆఫ్లైన్ రిటైల్ నెట్వర్క్లను విస్తరించాయి. ప్రభావం ఇంకా తెలియడం లేదు.. చాలామటుకు బ్రాండ్స్ దగ్గర 60–90 రోజుల వరకు సరిపడేంత నిల్వలు ఉండటం వల్ల రేట్ల పెంపు ప్రభావం పూర్తి స్థాయిలో ఇంకా తెలియడం లేదు. కొత్త డివైజ్ల రేట్లు 15–20 శాతం పెరిగాయంటే చాలు, కోవిడ్ కాలంలోలాగా రీఫర్బిష్డ్ ఫోన్లకు డిమాండ్ భారీగా పెరుగుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అప్పట్లో సరఫరాపరమైన సవాళ్ల వల్ల కొత్త ఫోన్లకు కొరత ఏర్పడి, కొనుగోలుదార్లు సెకండ్హ్యాండ్ డివైజ్ల వైపు మళ్లాల్సి వచి్చంది. ప్రస్తుతం కూడా మెమరీ, చిప్ల వ్యయాలు పెరిగి కొత్త డివైజ్ల రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయని క్యాషిఫై వర్గాలు వివరించాయి. ఎంట్రీ లెవెల్ షాక్.. అత్యధిక మార్కెట్ వాటా ఉండే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్ల విభాగంలో రేట్ల పెంపు షాక్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రూ. 10,000గా ఉన్న హ్యాండ్సెట్స్ రేటు వచ్చే ఆరు నెలల్లో దాదాపు 50 శాతం పెరిగి రూ. 15,000కు చేరొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇదే అతి పెద్ద సెగ్మెంట్ కావడంతో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని, దీనితో కస్టమర్లు రీఫర్బిష్డ్ డివైజ్ల వైపు డిమాండ్ మళ్లొచ్చని ఆశిస్తున్నట్లు వివరించాయి. అయితే, రేట్లు పెరగడమనేది మరో ప్రతికూల పరిణామానికి కూడా దారి తీయొచ్చని భావిస్తున్నారు. యూజర్లు తమ పాత డివైజ్లను మరింత కాలం అట్టే పెట్టుకునేందుకు ప్రాధాన్యతనివ్వొచ్చని, ఫలితంగా మార్కెట్లో సరఫరా తగ్గొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా అమ్ముడయ్యే ఫోన్లలో దాదాపు 50 శాతం డివైజ్లు రీఫర్బిష్డ్ లేదా ఎక్సే్చంజ్ మార్కెట్లోకి రావడానికి అనువైనవిగానే ఉంటున్నాయి. కానీ ఇందులో సగం మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయి. మిగతా వాటిని యూజర్లు నిరుపయోగంగా డ్రాలలో పడేయడమో లేక తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఇవ్వడమో చేస్తున్నారు. ఈ–వ్యర్థాలు, పాత డివైజ్ల విక్రయ విలువ గురించి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా ఉంటోంది. ఐఫోన్లే కావాలి.. రీఫర్బిష్ చేసిన యాపిల్ ఐఫోన్లకు భారీగా డిమాండ్ నెలకొంది. వాటి లభ్యత కూడా పెరుగుతోంది. దీనితో 2019లో సుమారు 2 శాతంగా ఉన్న ఐఫోన్ల మార్కెట్ వాటా ఇప్పుడు 9 శాతానికి చేరుకుంది. రీఫర్బిష్డ్ సంస్థల మొత్తం అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 60 శాతంగా ఉంటోందని పరిశ్రమ అంచనా. లేటెస్ట్ డివైజ్ల ప్రారంభ ధర ఎక్కువగా ఉండటంతో, యాపిల్ డివైజ్లను మొదటిసారిగా వాడే వారు, వేరే బ్రాండ్స్ బదులుగా దాదాపు అదే రేటుకో అంతకన్నా కాస్త తక్కువ రేటుకో లభించే పాత ఐఫోన్లనే తీసుకోవడంవైపు మొగ్గుచూపుతున్నారు. యాపిల్లో ఎంట్రీ లెవెల్ మోడల్ లేకపోవడంతో ఈ ధోరణి కొనసాగవచ్చని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్లో ఏడాది, రెండేళ్ల పాత ఫోన్లతో పోలిస్తే నాలుగైదేళ్లు పాతబడ్డ యాపిల్ ఫోన్లకు కూడా డిమాండ్ బాగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. – సాక్షి బిజినెస్ డెస్క్
భారత్ నెత్తిన మిచెల్ పిడుగు
130, 134, 17, 63, 84, 131 నాటౌట్, 137... భారత్పై గత 7 వన్డేల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డరైల్ మిచెల్ స్కోర్లు ఇవి. టీమిండియాపై మ్యాచ్ అనగానే చెలరేగిపోయే అతి తక్కువ మంది ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు అతను కూడా చేరాడు. మొత్తంగా భారత్పై ఆడిన 11 వన్డే ఇన్నింగ్స్లలో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సహా ఏకంగా 74.10 సగటుతో అతను 741 పరుగులు సాధించాడు. ఏబీ డివిలియర్స్ ఒక్కడే భారత్లో భారత్పై ఇంతకంటే ఎక్కువ (5) సెంచరీలు నమోదు చేయగలిగాడంటే మిచెల్ ప్రదర్శన విలువను చెప్పవచ్చు. ఒంటిచేత్తో అతను తన టీమ్కు తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్ అందించి కివీస్ హీరోగా మారాడు. భారత్లో భారత్పై మిచెల్ చెలరేగిపోవడం వెనక తీవ్ర సాధన, పట్టుదల ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్ లీగ్ మ్యాచ్, సెమీఫైనల్లలో రెండుసార్లూ వందకు పైగా స్ట్రయిక్ రేట్తో అతను శతకాలు బాదాడు. కానీ ఈ రెండు మ్యాచుల్లోనూ టీమిండియా అలవోక విజయాలు సాధించింది. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో కూడా లీగ్ మ్యాచ్లో విఫలమైన తర్వాత ఫైనల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి అతను హాఫ్ సెంచరీ చేశాడు. అయితే పరిస్థితిని బట్టి బాగా నెమ్మదిగా ఆడిన మిచెల్ మన స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడ్డాడు. తన ఇన్నింగ్స్లోని 101 బంతుల్లో అతను 96 బంతులు స్పిన్నర్ల బౌలింగ్లోనే ఆడాడు! అయితే నలుగురు భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక 52 పరుగులే చేయగలిగాడు. ఈ మ్యాచ్లో కూడా కివీస్ ఓడింది. సిరీస్కు సిద్ధమై... భారత్తో వన్డే సిరీస్కు ముందు మిచెల్ అన్ని రకాలుగా సిద్ధమయ్యాడు. ఈసారి తాను వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన కనబర్చడమే కాదు. టీమ్ను కూడా గెలిపించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. భారత్ తరహాలో నెమ్మదైన పిచ్లు ఉండే లింకన్, మౌంట్ మాంగనీలలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై ఎదురుదాడికి చాలా మంది స్టార్ బ్యాటర్లు వాడే ఆయుధం ‘స్వీప్ షాట్’ను గంటలకొద్దీ ఆడాడు. రివర్స్ స్వీప్ల సాధన దీనికి అదనం. స్పిన్ను సమర్థంగా ఎదుర్కొనే మరో పద్ధతి ముందుకు దూసుకొచ్చి బౌలర్ మీదుగా లాఫ్టెడ్ షాట్ ఆడటం. రాజ్కోట్ వన్డేలో ఇది చాలా బాగా కనిపించింది. జడేజా, కుల్దీప్లను అతను అలవోకగా ఎదుర్కోవడంతో భారత్ సమస్య పెరిగింది. కుల్దీప్ తొలి ఓవర్లోనే సిక్స్తో మొదలు పెట్టిన మిచెల్ ...అతని బౌలింగ్లో ఆడిన 32 బంతుల్లో 50 పరుగులు రాబట్టడం విశేషం. కివీస్ ఇంత అలవోకగా లక్ష్యాన్ని ఛేదించడం దిగ్గజం సునీల్ గావస్కర్ను కూడా ఆశ్చర్యపర్చింది. వన్డేల్లో కుల్దీప్ ఒక సిరీస్లో ఇంత చెత్త ప్రదర్శన (60.66 సగటు) తొలిసారి నమోదు చేశాడంటే అందుకు మిచెల్ కారణం. అన్ని ఫార్మాట్లలో... న్యూజిలాండ్ జట్టులో మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న ఆటగాళ్లలో మిచెల్ కూడా ఒకడు. ఏడాదిన్నర క్రితం భారత్పై 3–0తో క్లీన్స్వీప్ చేసిన టెస్టు టీమ్లో అతను కూడా ఉన్నాడు. అదే స్ఫూర్తితో తాము వన్డే సిరీస్ కూడా గెలవడం సంతోషానిచి్చందని మిచెల్ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్ ఆరంభంలో స్పిన్ ప్రదర్శనను అతను గుర్తు చేసుకున్నాడు. న్యూజిలాండ్తో పాటు జూనియర్ స్థాయిలో పెర్త్లో ఎక్కువగా క్రికెట్ ఆడిన మిచెల్కు స్పిన్ అంటే మొదటి నుంచీ సమస్యే. ఎప్పుడో 2013లో అండర్–19 జట్టు సభ్యుడిగా భారత్, శ్రీలంక పర్యటలకు వచ్చి ఘోరంగా విఫలమైన అనంతరం అతను మళ్లీ పోటీలోకి వచ్చేందుకు చాలా సమయం పట్టింది. దాదాపు ఏడేళ్ల కెరీర్లో ఇప్పటికి 184 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అతను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమ్లో ప్రస్తుతం కీలక సభ్యుడిగా ఎదిగిన మిచెల్... ఐపీఎల్లో ఒక సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు, మరో ఏడాది చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక్కడ ఆడటం మాత్రమే కాదు, భారీ సంఖ్యలో ప్రేక్షకుల మధ్యలో ఆడిన అనుభవం తన ఆటను రాటుదేలి్చందని చెప్పాడు. – సాక్షి క్రీడా విభాగం
వక్ఫ్ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదు
మద్యం అక్రమ కేసులో మోహిత్కు భారీ ఊరట
ప్లే ఆఫ్స్కు బెంగళూరు
ఢిల్లీ సంస్థతో డీల్
భారత్ నెత్తిన మిచెల్ పిడుగు
పంటల బీమా ఫట్!
విమానాల రాకపోకలకు పొగమంచు ఆటంకం
ద్వైపాక్షిక వాణిజ్యం రూ.18 లక్షల కోట్లకు!
వినుకొండ బస్టాండ్లో తొక్కిసలాట
పాఠశాలలో క్షుద్రపూజల కలకలం
గత ప్రభుత్వం చేసినవన్నీ క్రెడిట్ చోరీ చేశాం.. ఇదీ అంతేగా సార్!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
‘కథ’లేని సినిమాలపై కాసుల వర్షం.. కారణం ఏంటి?
సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్?
కాంగ్రేస్, కమ్యూనిస్టు సోదరులు కొట్లాడితేనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది - సీఎం రేవంత్ రెడ్డి
శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం
అవన్నీ నాన్న కోరికలు.. నెరవేరే సమయానికి ఆయన లేడు!
ఇండియా వీసా వచ్చిందోచ్.. పాకిస్తానీ ఆనందం
మరో వారసురాలు వచ్చేస్తుంది
‘ప్లీజ్ నాన్న.. నాకు చావాలని లేదు..’
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్..
పాకిస్తాన్లో పిండి సంక్షోభం.. రెండు పూటలా తిండికీ దరిద్రం!
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
కొంత స్థలం మనకు, మరికొంత స్థలం ప్రైవేటు వాళ్లకు.. మిగతా స్థలం మనవాళ్లు కబ్జా చేశారు. ఇక సమస్యలు ఏముంటాయ్ సార్!!
7 పరుగులకే 5 వికెట్లు.. కట్ చేస్తే స్కోర్ ఎంతంటే..?
క్యారవాన్లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే
బ్రెయిన్ స్ట్రోక్.. మూతి వంకర.. అవే చివరి క్షణాలనుకున్నా!
మారిపోయిన గోల్డ్ రేటు.. లేటెస్ట్ ధరలు ఇలా!
వక్ఫ్ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదు
మద్యం అక్రమ కేసులో మోహిత్కు భారీ ఊరట
ప్లే ఆఫ్స్కు బెంగళూరు
ఢిల్లీ సంస్థతో డీల్
భారత్ నెత్తిన మిచెల్ పిడుగు
పంటల బీమా ఫట్!
విమానాల రాకపోకలకు పొగమంచు ఆటంకం
ద్వైపాక్షిక వాణిజ్యం రూ.18 లక్షల కోట్లకు!
వినుకొండ బస్టాండ్లో తొక్కిసలాట
పాఠశాలలో క్షుద్రపూజల కలకలం
గత ప్రభుత్వం చేసినవన్నీ క్రెడిట్ చోరీ చేశాం.. ఇదీ అంతేగా సార్!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
‘కథ’లేని సినిమాలపై కాసుల వర్షం.. కారణం ఏంటి?
సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్?
కాంగ్రేస్, కమ్యూనిస్టు సోదరులు కొట్లాడితేనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది - సీఎం రేవంత్ రెడ్డి
శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం
అవన్నీ నాన్న కోరికలు.. నెరవేరే సమయానికి ఆయన లేడు!
ఇండియా వీసా వచ్చిందోచ్.. పాకిస్తానీ ఆనందం
మరో వారసురాలు వచ్చేస్తుంది
‘ప్లీజ్ నాన్న.. నాకు చావాలని లేదు..’
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్..
పాకిస్తాన్లో పిండి సంక్షోభం.. రెండు పూటలా తిండికీ దరిద్రం!
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
కొంత స్థలం మనకు, మరికొంత స్థలం ప్రైవేటు వాళ్లకు.. మిగతా స్థలం మనవాళ్లు కబ్జా చేశారు. ఇక సమస్యలు ఏముంటాయ్ సార్!!
7 పరుగులకే 5 వికెట్లు.. కట్ చేస్తే స్కోర్ ఎంతంటే..?
క్యారవాన్లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే
బ్రెయిన్ స్ట్రోక్.. మూతి వంకర.. అవే చివరి క్షణాలనుకున్నా!
మారిపోయిన గోల్డ్ రేటు.. లేటెస్ట్ ధరలు ఇలా!
ఫొటోలు
హీరోయిన్స్ నయనతార, త్రిషల స్నేహ బంధం... ఫోటోలు
రాతివనం.. అపురూపం
రెడ్ డ్రెస్ లో మెరిసిన ధురంధర్ మూవీ హీరోయిన్ సారా అర్జున్ (ఫొటోలు)
మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)
జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)
మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం (ఫొటోలు)
దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
హీరోయిన్ సంఘవి కూతురి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)
సినిమా
వచ్చేనెలలో విజయ్తో పెళ్లి.. రష్మిక ఏమన్నారంటే?
హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. గతేడాది ది గర్ల్ఫ్రెండ్తో హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలోనూ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. తనపై వస్తున్న రూమర్స్పై స్పందించింది. విజయ్ దేవరకొండతో వచ్చే నెలలోనే పెళ్లంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలని యాంకర్ రష్మికను ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు రష్మిక చాలా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది. నాలుగేళ్లుగా ఇలాంటి వింటూనే ఉన్నానని తెలిపింది. జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారు.. దాని కోసమే తాను కూడా ఎదురుచూస్తున్నానంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. దీనిపై ఎప్పుడు చెప్పాలో అప్పుడే మాట్లాడతానని తెలిపింది. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాకుండా కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డ్లో ఈ విషయం గురించి మాట్లాడతానని రష్మిక సమాధానం దాటవేసింది.కాగా.. విజయ్ దేవరకొండతో ఫిబ్రవరి 26న రష్మిక పెళ్లి జరగనుందని నెట్టింట వైరలవుతోంది. రాజస్థాన్లోని ఉదయపూర్లో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్. గతేడాది అక్టోబర్లో వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కానీ దీనిపై కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే తాజాగా పెళ్లి విషయంలోనూ అదే ఫాలో అవుతూ సర్ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే. Q: There’s been a lot of buzz that #VijayDeverakonda and Rashmika are engaged and getting married on FEB 26th in Udaipur. What’s the truth?#RashmikaMandanna : pic.twitter.com/x6vD2jSIZB— Whynot Cinemas (@whynotcinemass_) January 19, 2026
నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి?.. హీరోయిన్ ఇంట్రో గ్లింప్స్ చూశారా?
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఆకాశంలో ఒక తార. ఈ మూవీకి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ను పరిచయం చేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తున్నట్లు గ్లింప్స్ రిలీజ్ చేశారు. నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. రోడ్డు కూడా సరిగా లేని ఈ ఊరి నుంచి ఆకాశానికి నిచ్చేనేశావా? ముందు ఈ ఊరి పొలిమేర దాటి చూపించు చూద్దాం అనే డైలాగ్ వింటుంటే.. కనీస వసతులు కూడా లేని పల్లెటూరి అమ్మాయి తన కలలను ఎలా సాధించుకుంది అనే కథాంశంతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
గోల్డెన్ ఛాన్స్ వదులుకున్న నాగార్జున?
మనది అని రాసుంటే ఎప్పటికైనా అది మన దగ్గరకే వస్తుంది. మనది కాకపోతే చేతుల వరకు వచ్చినా సరే దక్కకుండా చేజారిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున.. ఓ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ ఆ ఛాన్స్ నాగ్ అందుకుని ఉంటే ఎలా ఉండేదా అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?రీసెంట్ టైంలో ఊహించని సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. థియేటర్లలోకి వచ్చేంతవరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. పాన్ ఇండియా రిలీజ్ కూడా కాదు. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే విడుదల చేశారు. టికెట్ పెంపు లాంటివి అసలే లేవు. డిసెంబరు తొలివారంలో బిగ్ స్క్రీన్స్పైకి రాగా ఇప్పటికీ వసూళ్లు రాబడుతూనే ఉంది. ప్రస్తుతానికైతే రూ.1300 కోట్ల మేర వసూలు చేసింది. ఇందులో హీరో పాత్ర కంటే రహమాన్ డకాయిత్ అనే విలన్ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా.. టీజర్ రిలీజ్)రహమాన్ డకాయిత్గా అక్షయ్ ఖన్నా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే తొలుత ఈ పాత్ర కోసం నాగార్జునని అనుకున్నారట. స్క్రిప్ట్ కూడా నచ్చింది గానీ అదే సమయానికి కూలీ, కుబేర చిత్రాలతో నాగ్ బిజీగా ఉండటం వల్ల చేజేతులా ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. సినిమా చూసిన ప్రతిఒక్కరూ ఆ పాత్రలో అక్షయ్ తప్ప మరొకరిని ఊహించుకోలేరు. అంతలా అదరగొట్టేశారు. అలాంటి పాత్ర నాగార్జున చేసుంటే ఎలా ఉండేదో మరి?రణ్వీర్ సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆదిత్య ధర్ దర్శకుడు. 1990ల్లో పాకిస్థాన్ కరాచీలోని లయరీ అనే ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ వార్స్, అక్కడికి వెళ్లిన ఓ భారత రహస్య ఏజెంట్.. తర్వాత ఏం జరిగింది? అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీశారు. జనవరి 30 నుంచి ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కావొచ్చనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు 'ధురంధర్' సీక్వెల్.. ఈ మార్చి 19నే థియేటర్లలోకి రానుంది. తొలి పార్ట్ హిందీ వరకే రిలీజ్ చేయగా.. సీక్వెల్ మాత్రం తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)
ప్రతి రోజు ఏడ్చేవాడిని.. వదిలేద్దామనుకున్నా: నవీన్ పొలిశెట్టి ఎమోషనల్
ఈ సంక్రాంతి టాలీవుడ్ సినీ ప్రియులను అలరించిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆడియన్స్ను విపరీతంగా అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ సాధించింది.ఈ సినిమా రిలీజైన ఐదు రోజుల్లో వంద కోట్ల మార్క్ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో నవీన్ పొలిశెట్టి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోయిందని నవీన్ రాసుకొచ్చారపు. ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపాడు. ఈ క్షణం కోసం చాలా సంవత్సరాలు పట్టిందని ఎమోషనల్ ట్వీట్ చేశారు.నవీన్ పొలిశెట్టి తన ట్వీట్లో రాస్తూ..'ముంబైలో నేను ఇచ్చిన ఆడిషన్లన్నింటి గురించి ఆలోచిస్తున్నా. ఎన్నోసార్లు వదిలేయాలనిపించింది. నా ప్రమాదం తర్వాత ఈ సినిమాలో ఎలా నటిస్తాను అని ప్రతిరోజూ ఏడ్చేవాడిని. కానీ ఈ రోజు అనగనగా ఒకరాజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నా కళ్లలో ఆనంద భాష్పాలు తిరుగుతున్నాయి. ఈ క్షణం కోసం చాలా ఏళ్లు పట్టింది. నన్ను నమ్మి టికెట్ కొన్నందుకు ధన్యవాదాలు. థియేటర్లలో మేము చూస్తున్న మీ ప్రేమకు, ఉత్సాహానికి ధన్యవాదాలు. ఈ బ్లాక్బస్టర్ అందించిన మా నిర్మాతలకు నా హృదయపూర్వక అభినందనలు. మా లాంటి వారికి మీ మద్దతు, ప్రోత్సాహం ప్రాణం లాంటిది. ఈ విజయం మనందరిది. మీ ప్రేమ, మద్దతు ఇలాగే అందిస్తూ ఉండండి. మీకు మరింత వినోదాత్మక చిత్రాలను అందించడానికి నేను మరింత కష్టపడతా' అంటూ రాసుకొచ్చారు Thinking about all the auditions in Mumbai. Enno saarlu give up cheseyali anipinchindi. Even with this film I used to cry everyday after my accident wondering how I will write and act. Today #AnaganagaOkaRaju has grossed 100 crores worldwide. 🙏🏻🙏🏻🙏🏻My heart is filled with… pic.twitter.com/2GN9Kxl4FI— Naveen Polishetty (@NaveenPolishety) January 19, 2026
క్రీడలు
ప్రపంచకప్లో బోణీ కొట్టిన పాక్
జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. అలీ రజా (10-0-37-4) అద్భుతమైన బౌలింగ్తో స్కాట్లాండ్ పతనాన్ని శాశించాడు. మొమిన్ కమర్ 3 వికెట్లతో సత్తా చాటాడు. మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్ తలో వికెట్ తీశారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్లో 37 పరుగులు చేసిన థామస్ నైట్ టాప్ స్కోరర్ కాగా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు ఫిన్లే జోన్స్ (33), ఓల్లీ జోన్స్ (30), మను సరస్వత్ (25), రోరి గ్రాంట్ (21), ఫిన్లే కార్టర్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఏడో వికెట్కు సరస్వత్, ఫిన్లే జోన్స్ 58 పరుగులు జోడించడంతో స్కాట్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఆచితూచి ఆడి 43.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఉస్మాన్ ఖాన్ (75), అహ్మద్ హుసేన్ (47) పాక్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ ఫర్హాన్ (18 నాటౌట్) పాక్ను గెలుపు తీరాలు దాటించాడు. పాక్ ఇన్నింగ్స్లో అలీ హసన్ బలోచ్ 15, స్టార్ బ్యాటర్ సమీర్ మిన్హాస్ 28 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో ఓల్లీ జోన్స్, సరస్వత్ తలో 2 వికెట్లు తీశారు. కాగా, ఈ మెగా టోర్నీలో పాక్ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తైంది తదుపరి మ్యాచ్లో ఈ జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ 22న జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే పాక్ సూపర్-8కు చేరుకుంటుంది.ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో అరంగేట్రీ టాంజానియాపై సౌతాఫ్రికా 329 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ బుల్బులియా, జేసన్ రోల్స్ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన టాంజానియా 32.2 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. ఇవాళే మరో మ్యాచ్ కూడా జరుగుతుంది. శ్రీలంక-ఐర్లాండ్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలుపు దిశగా పయనిస్తుంది.
ఆస్ట్రేలియాకు భారీ షాక్
త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, మాజీ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయాల నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్లకు దూరమవుతున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. కమిన్స్ మూడు లేదా నాలుగో మ్యాచ్కు అందుబాటులోకి వస్తాడని ప్రకటించాడు. కమిన్స్ వేగంగా పురోగతి సాధిస్తే ప్రణాళికలు మారవచ్చని చెప్పుకొచ్చాడు. కమిన్స్ గత కొంతకాలంగా లంబర్ బోన్ స్ట్రెస్ ఇంజరీతో బాధపడుతున్నాడు. ఇటీవల యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ ఆడినా, గాయం తిరగబెట్టడంతో ఆతర్వాతి మ్యాచ్లకు దూరమయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే అవకాశం లేకపోవడంతో, వరల్డ్కప్ తొలి రెండు మ్యాచ్లు సహా, దానికి ముందు పాకిస్తాన్లో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా అందుబాటులో ఉండడంలేదు. పాక్తో సిరీస్కు కమిన్స్ సహా నాథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ హేజిల్వుడ్ కూడా అందుబాటులో ఉండడం లేదు. ప్రపంచకప్ జట్టులో ఉన్న వీరికి విశ్రాంతినిచ్చారు. ప్రపంచకప్లో తొలి రెండు మ్యాచ్లకైనా కమిన్స్ అందుబాటులో లేకపోవడం ఆస్ట్రేలియాకు పెద్ద లోటే అవుతుంది. అతని అనుభవం, డెత్ ఓవర్లలో బౌలింగ్ నైపుణ్యం జట్టుకు చాలా కీలకం. అసలే ఆసీస్ ప్రపంచకప్ జట్టు అంతంతమాత్రంగా ఉంది. కమిన్స్ లాంటి ఆటగాడు ఒక్క మ్యాచ్కు దూరమైనా, ఆ జట్టు టైటిల్ గెలిచే అవకాశాలను ప్రభావితం చేస్తాయి. ప్రపంచకప్లో ఆసీస్ ప్రయాణం ఫిబ్రవరి 11న ఐర్లాండ్తో మ్యాచ్తో మొదలవుతుంది. ఆసీస్ రెండో మ్యాచ్ జింబాబ్వేతో ఆడనుంది. ఈ మెగా టోర్నీలో ఆసీస్..ఒమన్, ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక జట్లతో గ్రూప్-బిలో ఉంది. ప్రపంచకప్కు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా
అలా అయితే మేమూ ఆడం.. బంగ్లాదేశ్కు వంత పాడుతున్న పాక్
2026 టీ20 ప్రపంచకప్కు ముందు ఆసియా క్రికెట్లో మరోసారి రాజకీయ-క్రీడా ఉద్రిక్తతలు పెరిగాయి. భద్రత కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భారత్లో జరగబోయే తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ఐసీసీ పలు సమీక్షలు జరిపిన అనంతరం భారత్లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని బీసీబీకి హామీ ఇచ్చింది. అయినా వెనక్కు తగ్గని బంగ్లా క్రికెట్ బోర్డు, భారత్లో పర్యటించేదే లేదంటూ భీష్మించుకు కూర్చుంది. దీంతో ఐసీసీ వేరే ప్లాన్స్ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ భారత్లో ఆడేందుకు నిరాకరిస్తే స్కాట్లాండ్ను ప్రత్యామ్నాయ జట్టుగా ప్రపంచకప్లో ఆడించాలని కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. బంగ్లాదేశ్ ఏ విషయం తేల్చుకునేందుకు ఐసీసీ డెడ్లైన్ విధించినట్లు తెలుస్తుంది. ఈ నెల 21 లోగా ఏ విషయం తేల్చాలని ఐసీసీ దూత బీసీబీకి సందేశం పంపినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో.. ఐసీసీ తమ డిమాండ్ను పరిష్కరించకపోగా, భారత్లో ఆడేందుకు ఒత్తిడి తెస్తుందని బీసీబీ అంతర్జాతీయ వేదికపై గగ్గోలు పెడుతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సాయాన్ని కోరినట్లు సమాచారం. బీసీబీ అభ్యర్థన కోసం ఎదురుచూస్తూ ఉండిన పీసీబీ.. అడగటమే ఆలస్యమన్నట్లు రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్పై లేని ప్రేమను ఒలకబోస్తూ.. ఐసీసీ బీసీబీపై ఒత్తిడి పెంచితే, తాము కూడా ప్రపంచకప్ ఆడబోమని ఓవరాక్షన్ చేస్తుంది. బంగ్లాదేశ్ అభ్యర్థనలో న్యాయం ఉందని, ఐసీసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పెద్దన్నపాత్ర పోషించే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో పాకిస్తాన్ రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఈ అంశంపై పాక్ క్రికెట్ బోర్డు, ఆ దేశ ముఖ్య రాజకీయ నాయకులు ఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నట్లు సమాచారం. ఇందులో ఐసీసీ, బీసీసీఐకి వ్యతిరేకంగా.. బీసీబీ అనుకూలంగా చాలా తీర్మానాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఏ జట్టూ ఒత్తిడి లేదా బెదిరింపులకు గురి కాకూదు. వరల్డ్కప్ మ్యాచ్లు భద్రతా వాతావరణంలో జరగాలి. అవసరమైతే బంగ్లాదేశ్ మ్యాచ్లను పాకిస్తాన్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీబీ తీర్మానించినట్లు సమాచారం. పాకిస్తాన్ ఎంట్రీతో ప్రపంచకప్లో బంగ్లా భవితవ్యం ఏ మలుపు తీసుకుంటోదనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.కాగా, గత కొంతకాలంగా బంగ్లాదేశ్-భారత్ మధ్య రాజకీయ ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026 నుంచి బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ విడుదల చేయడంతో ఈ ఉద్రిక్తలు క్రికెట్కు పాకాయి. బంగ్లాలో హిందువులపై దాడులు పెరిగిపోతుండడంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకుంది.దీన్ని ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తమ జట్టును వరల్డ్కప్ కోసం భారత్ పంపబోమని, వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో బ్యాన్ చేసింది.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్లను కోల్కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది.
భారత్తో సిరీస్కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ సంచలన నిర్ణయం
న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో భారత్తో జరుగబోయే టీ20 సిరీస్ను రద్దు చేసుకొని, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 21 నుంచి 31 వరకు భారత్లో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు న్యూజిలాండ్ జట్టులో ఎంపికైన నీషమ్, చివరి నిమిషంలో జాతీయ విధులను వద్దనుకొని, ఫ్రాంచైజీ లీగ్కు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ విషయాన్ని రాజ్షాహీ వారియర్స్ (నీషమ్ బీపీఎల్ ఫ్రాంచైజీ) హెడ్ కోచ్ హన్నన్ సర్కార్ సోషల్మీడియా వేదికగా వెల్లడించాడు. కాగా, భారత్తో సిరీస్ న్యూజిలాండ్ జట్టుకు ప్రపంచకప్కు ముందు రిహార్సల్గా భావించబడుతోంది. ఈ సిరీస్కు ఎంపికైన వారే దాదాపుగా ప్రపంచకప్ జట్టులోనూ ఉంటారు. నీషమ్ కూడా న్యూజిలాండ్ ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి దేశ ప్రయోజనాలు కాకుండా, వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై న్యూజిలాండ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నీషమ్ను ప్రపంచకప్ ప్రణాళికల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదిఏమైనా నీషమ్ లాంటి అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ జట్టులో లేకపోవడం న్యూజిలాండ్కు పెద్ద లోటుగా పరిగణించబడుతుంది. అది భారత్తో సిరీస్ అయినా, ప్రపంచకప్ అయినా నీషబ్ లేని లోటు న్యూజిలాండ్ జట్టులో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.కాగా, ప్రస్తుతం జరుగుతున్న బీపీఎల్ 2025-26 ఎడిషన్లో నీషమ్ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శనలేమీ చేయలేదు. నాలుగు మ్యాచ్ల్లో 30 పరుగులు, మూడు వికెట్లు మాత్రమే తీశాడు. నీషమ్ సత్తా చాటలేకపోయినప్పటికీ అతని జట్టు రాజ్షాహీ వారియర్స్ లీగ్ దశలో అగ్రస్థానంలో (10 మ్యాచ్ల్లో 8 విజయాలు) నిలిచింది. రాజ్షాహీ వారియర్స్ జనవరి 20న జరిగే తమ తదుపరి మ్యాచ్లో చట్టోగ్రామ్ రాయల్స్తో (తొలి క్వాలిఫయర్) తలపడనుంది. ఇదిలా ఉంటే, జనవరి 21న నాగ్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టీ20 జరుగనుంది. 35 ఏళ్ల నీషమ్కు ఈ మ్యాచ్లో ఆడే అవకాశం తప్పక ఉండేది.భారత్తో టీ20 సిరీస్కు న్యూజిలాండ్ జట్టు..హెన్రీ నికోల్స్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), నిక్ కెల్లీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జకరీ ఫౌల్క్స్, జోష్ క్లార్క్సన్, డెవాన్ కాన్వే, మిచెల్ హే, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్, జేడన్ లెన్నాక్స్, మైఖేల్ రే
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారిన మద్యం... సంక్రాంతి సీజన్లో టీడీపీ మద్యం సిండికేట్కు పండుగ
ఆంధ్రప్రదేశ్లో భూముల ‘రీ సర్వే’పై చంద్రబాబు దొంగాట... అప్పుడు దుష్ప్రచారం చేసి ఇప్పుడు క్రెడిట్ చోరీ కోసం పాకులాట
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా జూదాల జాతర.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో విచ్చలవిడిగా మద్యం ప్రవాహం
సంక్రాంతి సంబరాలను జూదంగా మార్చేసిన కూటమి నేతలు... ఏపీలో పండుగ వేళ యథేచ్ఛగా దోపిడీ... 2 రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల జూదం .
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ రిజిస్ట్రేషన్ల బాదుడు... వచ్చే నెల నుంచి పెంపు అమలు చేసేందుకు సన్నాహాలు... ఆదాయమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు పండుగ లేనట్లే... ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచిన ఏపీ సీఎం చంద్రబాబు
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు మరో డ్రామా. ఖజానాకు రాబడి తగ్గిందంటూ కార్యదర్శులు, కలెక్టర్లపై సీఎం చంద్రబాబు చిర్రుబుర్రు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్లుగా భారీగా తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య... ప్రైవేటు స్కూళ్లలో పెరిగిన చేరికలు
ఆంధ్రప్రదేశ్లో దారి దోపిడీకి పచ్చజెండా... సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు తలాడిస్తున్న కూటమి ప్రభుత్వం
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పన్నాగం...
బిజినెస్
బినామీ ఆస్తులకు చెక్
బినామీ ఆస్తులు... దాని వ్యవహారాలను భారతదేశంలో నిషేధించారు. ఇందుకు సంబంధించి 1988లో చట్టమే వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన, బలమైన చట్టం.ఆస్తి అంటే: బినామీ వ్యవహారాలన్నీ ఆస్తి చుట్టూ తిరుగుతాయి. అందుకని ‘ఆస్తి’ అనే పదాన్ని బాగా నిర్వచించారు. చట్టంలో ఈ నిర్వచనం కష్టమయితే చాలా తెలివిగా, పరిధి ఎక్కువగా ఉండేలా వివరణ ఇచ్చారు. ఈ క్రిందివన్నీ ‘ఆస్తి’ అని పెద్ద జాబితా చెబుతారు. ఈ నిర్వచనం చదివితే మీకు భగవద్గీత స్ఫురణకు రాకతప్పదు.(1) ఏ రకమయినా.. స్థిరమైన, అస్థిరమైన, కంటికి కనిపించేవి... కనపడవని... భౌతికమైనవి... నిరాకారమైనవి. (2) హక్కు, ఆసక్తి, దస్తావేజుల్లో పేరు, ప్రస్తావన(3) రూపాంతరం చెందగలిగే ఆస్తి(4) పై పేర్కొన్న 1,2,3 ఆస్తుల ద్వారా వచ్చిన వసూళ్లు ..రియల్ ఎస్టేట్, భూములు, ఇళ్లు, పొలాలు, స్థిరాస్తులు, షేర్లు, వేతనాలు, ఫిక్సిడ్ డిపాజిట్లు, బ్యాంకు డిపాజిట్లు, నగదు బ్యాంకు లాకర్లు, ప్రయివేటు లాకర్లు మొదలైనవి.బినామీ వ్యవహారం ఏమిటంటే..➤ఒక వ్యవహారం–ఒప్పందం.. ఒక ఆస్తికి కాగితాల ప్రకారం ఓనర్ (యజమాని) ఓనమాలు రాని ఓబయ్య అయితే.., ఆ వ్యవహారానికి మదుపు పెట్టినది చదువుకున్న చలమయ్య. ఇందులో చలమయ్య గారికి ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం ఉంటుంది.➤లేని వ్యక్తి పేరు మీద, డమ్మీ వ్యక్తి పేరు మీద జరిగే వ్యవహారం... కర్త, కర్మ, క్రియ... ఒకరైతే.. అబద్దపు పేరుతో దస్తావేజులు తయారవుతాయి.➤ఒక వ్యక్తి/సంస్థకి తెలియకుండా/చెప్పకుండా/ ఎరుకలో లేకుండా జరిగిన వ్యవహారం. విచారణలో నాకు తెలియదు, నేను కాదని, నాకు హక్కు లేదని ధ్రువీకరించిన కేసులు.➤కొన్ని వ్యవహారాల్లో మనిషి కల్పితం (చందమామ బేతాళ కథల్లోలాగా).గాభరా పడొద్దు.. వీటికీ మినహాయింపులున్నాయి. హిందూ ఉమ్మడి కుటుంబంలో కర్త కాని, సభ్యులు కాని వారి పేరు మీద ఆస్తి ఉంచుకోవచ్చు. కానీ సోర్స్ మాత్రం కుటుంబం నుంచే రావాలి. ప్రయోజనం ఉమ్మడి కుటుంబానికే చెందాలి. ట్రస్టుల్లో, భాగస్వామ్యంలో, కంపెనీల్లో, డిపాజిటరీలాగా, ఏజెంటులాగా, విశ్వాసపాత్రుడి హోదాలో వ్యవహారాలు.. కుటుంబంలో భార్యభర్తల పేరు మీద, పిల్లల పేరు మీద జరిగే వ్యవహారాలు మొదలైన వాటికి సోర్స్ కుటుంబ సభ్యుల నుంచే రావాలి. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్లు, గత తరంగానీ, భవిష్యత్తు తరంగానీ, జాయింట్ ఓనర్స్... డాక్యుమెంట్ ప్రకారం ఉండి.. సోర్స్ వారిలో ఎవరి దగ్గర్నుంచైనా ఉండాలి. గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే ‘సోర్స్’ అంటే ‘కెపాసిటీ‘ ఉండాలి. నిజమైన వ్యవహారం అయి ఉండాలి. డమ్మీలుండకూడదు. మరి కొన్ని ఉదాహరణలు గమనించండి..➤‘అ’ అనే అన్నగారు ఒక ఇల్లు కొన్నారు. తానే డబ్బు ఇచ్చారు. కానీ ‘ఆ’ అనే వదిన గారి పేరు మీద రిజిస్టేషన్ జరిగింది. ‘అ’ ఆ ఇంట్లోనే ఉంటారు. ఈ కేసులో ‘ఆ’ బినామీదారు. ‘అ’ ప్రయోజనం పొందిన వ్యక్తి.➤ఇక మరో కేసు. ఇది వింటే ‘మత్తు’ వదిలిపోతుంది. 'పీ’ అనే వ్యక్తికి లిక్కర్ లైసెన్సు ఉంది. తన ఉద్యోగి ‘ఖ’ పేరు మీద అన్ని చెల్లింపులు. కానీ రాబడి అంతా 'పీ’దే. ఇదొక బినామీ వ్యవహారం.బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, కల్పిత పేర్లతో, లేనివారి పేరు మీద, మరణించిన వారి పేరుతో మీద పెడతారు. ఇదీ బినామీయే. ఉద్యోగస్తుల పేరు మీద బ్యాంకు లాకర్లు తెరిచి అందులో నగదు, బంగారం పెట్టడం, అలాగే బంధువుల పేరు మీద వ్యవహారాలు చేయడం.. ఇటువంటి వ్యవహారాల్లో బేతాళ కథల్లోని కల్పిత వ్యక్తి ... బినామీదారు. తన గుట్టు చెప్పకుండా ప్రయోజనం పొందే వ్యక్తి, ప్రయోజనం పొందిన వ్యక్తిని ఈ పేరుతో వ్యవహరిస్తారు.ఈ వ్యవహారాలు/ఆస్తులు, ఇందులోని సూత్రధారులు అందరూ శిక్షార్హులే! ‘‘బినామీ వ్యవహారాలకు దూరంగా ఉండండి’’ అని డిపార్టుమెంటు వారు జారీ చేసిన కరపత్రాలు చదవండి. బినామీ అంటే సునామీ లాంటిది.ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య
విద్యుత్తు బిల్లులో అసమానతలు
అమెరికాలో గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు గుదిబండగా మారుతున్నాయి. గత ఐదేళ్లలో విద్యుత్ ధరలు ఆకాశాన్ని తాకగా ఈ భారం పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డేటా సెంటర్ల విద్యుత్ అవసరాలు పెరుగుతున్నప్పటికీ, వాటి ఖర్చును కూడా సామాన్య పౌరులే మోయాల్సి వస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆకాశాన్నంటుతున్న ధరలుఫిబ్రవరి 2020తో పోలిస్తే అమెరికా వ్యాప్తంగా విద్యుత్ ధరలు సగటున 40 శాతం పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా వాషింగ్టన్లో జులై 2020 నుంచి జులై 2025 మధ్య విద్యుత్ ఖర్చులు ఏకంగా 93 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (EIA) డేటా ప్రకారం 2022-2024 మధ్య..నివాస వినియోగదారుల విద్యుత్తు బిల్లులు 10 శాతం పెరిగాయి.వాణిజ్య వినియోగదారులపై 3 శాతం మాత్రమే పెరిగాయి.పారిశ్రామిక వినియోగదారులపై ధరలు 2 శాతం తగ్గాయి.డేటా సెంటర్లుచిన్నపాటి నగరాలకు సరిపోయే విద్యుత్తును వినియోగించే డేటా సెంటర్లు గ్రిడ్లోకి వస్తున్నా వాటికి తక్కువ ధరలకే విద్యుత్ అందుతోంది. ఈఐఏ గణాంకాల ప్రకారం, 2024 చివరి నాటికి నివాస వినియోగదారులకు యూనిట్ (కిలోవాట్-గంట) ధర 16 సెంట్లు ఉండగా వాణిజ్య వినియోగదారులకు అది 13 సెంట్లు మాత్రమే ఉంది.ఈ వ్యత్యాసానికి కారణాలునివాస ప్రాంతాలకు విద్యుత్ చేరవేయడానికి స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఖర్చు పెరిగింది. ఇవి తుఫానులు, అడవి మంటల వల్ల దెబ్బతింటే ఆ మరమ్మతు ఖర్చులు వినియోగదారులపైనే పడుతున్నాయి.డేటా సెంటర్లు నేరుగా హై-వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్లకు అనుసంధానమవుతాయి. తద్వారా పంపిణీ ఖర్చుల నుంచి తప్పుకుంటున్నాయి.పెద్ద కంపెనీలకు ఉన్న లాబీయింగ్ బలం సామాన్య ప్రజలకు ఉండదు. యుటిలిటీ రెగ్యులేటర్ల వద్ద కంపెనీలు తమకు అనుకూలమైన ధరలను సాధించుకోగలుగుతున్నాయి.గ్రిడ్ అప్గ్రేడ్ భారం ఎవరిది?ఇటీవల యూఎస్లో పీజేఎం అనే గ్రిడ్ ఆపరేటర్ 5 బిలియన్ డాలర్ల వ్యయంతో ట్రాన్స్మిషన్ లైన్ల అప్గ్రేడ్ ప్రాజెక్టును చేపట్టింది. డేటా సెంటర్ల వల్లేఈ అప్గ్రేడ్ అవసరం ఏర్పడినప్పటికీ వర్జీనియా, మేరీల్యాండ్ వంటి ప్రాంతాల్లో ఈ భారాన్ని నివాస వినియోగదారుల బిల్లుల్లో చేర్చడం వివాదాస్పదమైంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ నివేదిక ప్రకారం, అనేక యుటిలిటీ సంస్థలు మెటా వంటి దిగ్గజ కంపెనీలతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. టెక్సాస్లో ఎల్ పాసో ఎలక్ట్రిక్ సంస్థ మెటా డేటా సెంటర్ కోసం ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఆ విషయాన్ని ప్రజల దృష్టికి రాకుండా దాచేందుకు ప్రయత్నించడం గమనార్హం.మార్పు దిశగా..ఈ అసమానతలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్వర్డ్ లా స్కూల్ ఎక్స్పర్ట్ అరి పెస్కో మాట్లాడుతూ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత రెగ్యులేటర్లపై ఉందన్నారు. ఇప్పటికే వర్జీనియా రాష్ట్రం డేటా సెంటర్ల కోసం ప్రత్యేక వినియోగదారుల క్లాస్ను ఏర్పాటు చేసి గ్రిడ్ అప్గ్రేడ్ల కోసం వారి నుంచే ఎక్కువ వసూలు చేసేలా నిబంధనలు మార్చింది. విస్కాన్సిన్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. పెరుగుతున్న విద్యుత్ ధరలు అమెరికాలో ఒక ప్రధాన రాజకీయ, ఆర్థిక అంశంగా మారాయి. దీన్ని సరిదిద్దకపోతే ఓటర్ల ఆగ్రహం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: డిజిటల్ భారత్ ముంగిట ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’ విప్లవం
సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి!
బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1.50 లక్షలకు చేరువలో ఉండగా.. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ. 3 లక్షలు దాటేసింది.పెట్టుబడిదారుల డిమాండ్, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల కేజీ వెండి రూ.3 లక్షల రికార్డును అధిగమించాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ఔన్సు ధర ఏకంగా 94.35 డాలర్లు పెరిగింది. ఇటీవలి సెషన్లలో బంగారం కంటే వెండికి డిమాండ్ పెరుగుతోందని.. దీనికి డాలర్ విలువ తగ్గడం కూడా సహాయపడిందని నిపుణులు చెబుతున్నారు.ఈ రోజు (జనవరి 19) హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో కేజీ వెండి రేటు 8000 రూపాయలు పెరిగి, రూ. 3.18 లక్షలకు చేరింది. ముంబైలో కేజీ సిల్వర్ రేటు రూ. 10వేలు పెరిగినప్పటికీ రూ. 3.05 లక్షల వద్ద నిలిచింది. ఢిల్లీలో కూడా ఇదే రేటు వద్ద కొనసాగుతోంది.ఇదీ చదవండి: ఊహించనంతగా పెరుగుతున్న బంగారం.. కారణమెవరు?వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే?వెండిని కేవలం ఆభరణాలు, కాయిన్స్ రూపంలో మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో.. ధరలు ఆటోమేటిక్గా పెరుగుదలవైపు పరుగులు పెడతాయి.
డిజిటల్ భారత్ ముంగిట కొత్త విప్లవం
ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ ప్రభంజనం కొనసాగుతున్న వేళ, భారతదేశం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఏఐ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. కేవలం అగ్రరాజ్యాల నమూనాలను అనుకరించకుండా మన దేశ అవసరాలకు తగ్గట్టుగా ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’(SLM) అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాబోయే కేంద్ర బడ్జెట్ 2026లో ఈ స్వదేశీ ఏఐ నమూనాల పట్ల కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.ఎల్ఎల్ఎం Vs ఎస్ఎల్ఎం.. భారత్కు ఏది ముఖ్యం?గత కొన్ని ఏళ్లుగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు బిలియన్ల కొద్దీ పారామీటర్లతో కూడిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)ను అభివృద్ధి చేశాయి. ఇవి శక్తివంతమైనవి అయినప్పటికీ వీటి నిర్వహణకు భారీ ఖర్చు, అపారమైన కంప్యూటింగ్ శక్తి అవసరం. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో ప్రతి పౌరుడికి ఏఐ సేవలు అందాలంటే ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ (SLMs)’ సరైన వ్యూహమని నిపుణులు భావిస్తున్నారు.ఇవి అతి తక్కువ కంప్యూటింగ్ శక్తితో పని చేస్తాయి. ప్రాంతీయ భాషలు, మాండలికాలపై ప్రత్యేక శిక్షణ పొందుతాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు ప్రత్యేకంగా వీటిని రూపొందించవచ్చు.భాషా వైవిధ్యానికి ఏఐ అండదేశంలో వందల సంఖ్యలో భాషలు, మాండలికాలు ఉన్నాయి. గ్లోబల్ ఏఐ మోడల్స్ స్థానికంగా ఉన్న అన్ని భాషల్లో ప్రావీణ్యం సాధించాలంటే కష్టం. ఈ లోటును పూడ్చడానికి ‘సర్వం 1’ (Sarvam 1) వంటి మోడల్స్ ఇప్పటికే పునాది వేశాయి. ఇది 10 భారతీయ భాషలకు మద్దతు ఇచ్చే 2 బిలియన్ పారామీటర్ మోడల్. ప్రభుత్వం చేపట్టిన ‘భారత్ జెన్’ (BharatGen) వంటి కార్యక్రమాలు స్వదేశీ ఏఐ అభివృద్ధిలో వేగం పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్ని స్థాయుల్లోని వారి అవసరాలకు అనుగుణంగా ఏఐ నమూనాలను నిర్మించడం కీలకం.బడ్జెట్ 2026లో ఆశించేవి..2026 బడ్జెట్లో ఇండియా ఏఐ మిషన్ (IndiaAI Mission) విస్తరణకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించనున్నారు.1. క్లౌడ్ ప్రొవైడర్ల ద్వారా స్టార్టప్లకు, చిన్న సంస్థలకు ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయాలను తక్కువ ధరకే అందుబాటులోకి తేవడం.2. వ్యవసాయం, గ్రామీణ పాలన, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ప్రాంతీయ లాంగ్వేజ్ డేటా సేకరణకు ప్రత్యేక నిధులు.3. ఏఐ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులను తయారు చేయడానికి విద్యా సంస్థలకు ప్రోత్సాహకాలు.దేశంలో 85.5 శాతం కుటుంబాల వద్ద స్మార్ట్ఫోన్లు, 86.3 శాతం ఇంటర్నెట్ సదుపాయం ఉన్న తరుణంలో స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ విప్లవం ఉత్పాదకతను పెంచడమే కాకుండా సామాన్యుడికి డిజిటల్ సేవలను చేరువ చేస్తుంది. స్వదేశీ ఏఐ ద్వారా భారతదేశం గ్లోబల్ ఏఐ పవర్హౌస్గా ఎదగడమే కాకుండా, తన సాంస్కృతిక, భాషా వారసత్వాన్ని సాంకేతికతతో అనుసంధానించనుంది.ఇదీ చదవండి: ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు
ఫ్యామిలీ
కథాకళి: టైమ్ ట్రావెల్
జయవర్మకి చిన్నప్పుడు చంద్రుడి మీదకి మనిషి వెళ్ళాడని తండ్రి చెప్పడం గుర్తుంది. ఏడేళ్ళ వయసులోనే అతను రాత్రుళ్ళు చంద్రుడి మీదకి దిగిన మనిషి కోసం డాబా మీంచి చంద్రుడిని చూసేవాడు. తండ్రి అమెరికన్స్ ఎంబసీకి ఉత్తరం రాసి తెప్పించిన ముగ్గురు ఆస్ట్రొనాట్స్ ఉన్న కలర్ ఫొటోని ఫ్రేమ్ కట్టించి గోడకి తగిలించాడు. అతనిలో స్వతహాగా గల శాస్త్ర జిజ్ఞాసని ఆ ఫొటో బాగా ప్రభావితం చేసింది.అతని ఆసక్తిని గమనించిన జయవర్మ తండ్రి నండూరి రామ్మోహన్రావు రాసిన విశ్వ దర్శనం పుస్తకాన్ని కొనిచ్చాడు. పెద్దయ్యే కొద్దీ జయవర్మ చాలా సైన్స్ పుస్తకాలని చదివాడు. అతను హెచ్.జి.వెల్స్ 1895లో రాసిన ‘టైమ్ మెషీన్స్ ’ నవలని చదివాక టైమ్ ట్రావెల్ మీద ఆసక్తి కలిగింది. అంతకు మునుపు 1843లో చార్లెస్ డికెన్స్ రాసిన క్రిస్టమస్ కేరల్లో కూడా మనిషి భవిష్యత్తులోకి వెళ్ళి తిరిగి రావడాన్ని చదివాడు. మరికొన్ని టైమ్ ట్రావెల్ పుస్తకాలని చదివాక అతను ఎలాగైనా దాన్ని సాధించాలని సంకల్పించాడు. వీసా ఇంటర్వ్యూలో టైమ్ ట్రావెల్ మీద జయవర్మ అభిప్రాయాలని విన్న అమెరికన్స్ కాన్సులేట్ ఆఫీసర్ అతను అమెరికాకి అవసరం అనుకుని, స్టూడెంట్ వీసాని మంజూరు చేసి నవ్వుతూ చెప్పాడు. ‘‘వెల్కం. 1967లో షికాగోకి వెళ్తే, మార్సెలో ఫెలినీని కలిస్తే వాళ్ళబ్బాయి హలో చెప్పాడని చెప్పు.’’ ‘‘కచ్చితంగా వెళ్తాను సర్. 1967ని, మార్సెలో ఫెలినీని గుర్తుంచుకుంటాను.’’ జయవర్మ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. జయవర్మ కేలిఫోర్నియాలోని స్టా¯Œ ఫోర్డ్ యూనివర్సిటీలో తన ప్రొఫెసర్తో టైమ్ ట్రావెల్ గురించి తరచూ చర్చిస్తూండటంతో దాని మీద అంతదాకా జరిగిన రీసెర్చ్ని ఆయన జయవర్మకి ఇచ్చాడు. యూనివర్సిటీ లైబ్రరీలోని పుస్తకాల్లో దానిమీద ఎన్నో డయాగ్రమ్స్ని చూసి, థియరీలని చదివాక జయవర్మకి ఓ దారి దొరికింది. చివరకి అతను లేబరేటరీలో ఓ టైమ్ ట్రావెల్ మెషీన్స్ ని రూపొందించాడు. షికాగో నగరంలోకి, 1967కి వెళ్ళాడు. తను చూసిన ఆధునిక షికాగోలా లేదది. ప్రొహిబిషన్స్ సమయంలో ప్రసిద్ధ అమెరికన్స్ నేరస్తుడు అల్ కపోన్స్ తో సంబంధం గల ది గ్రీన్స్ మిల్ బార్కి చేరుకున్నాడు. లైవ్ జాజ్ మ్యూజిక్ జరుగుతోంది. జయవర్మని స్టీవార్డ్ మర్యాదగా ఆహ్వానించి అడిగాడు. ‘‘శుక్రవారం రాత్రి కాబట్టి బాగా బిజీగా ఉంది. దయచేసి ఇంకొకరితో టేబుల్ షేర్ చేస్తారా?’’ ‘‘అలాగే.’’ అతను జయవర్మని రెండు కుర్చీలున్న బల్ల దగ్గరికి తీసుకెళ్ళి ఖాళీ కుర్చీని చూపించి, ఇంకో కుర్చీలోని అరవై పైబడ్డ వ్యక్తిని పరిచయం చేశాడు.‘‘ఇతను మిస్టర్ డేవ్.’’ జయవర్మ తన పేరు చెప్పి, బడ్వైజర్ బీర్ ఆర్డర్ చేశాడు. ‘‘మిమ్మల్ని ఈ బార్లో ఎన్నడూ చూడలేదు? ఊరికి కొత్తా?’’ విస్కీ తాగే డేవ్ అడిగాడు. ‘‘అవును.’’ ‘‘ఎక్కణ్ణుంచి వచ్చారు?’’ ‘‘స్టాన్స్ ఫోర్డ్, కాలిఫోర్నియా.’’ ‘‘ఓ. ఐతే మీరు మేధావి అన్నమాట?’’ బాగా తాగి ఉన్న ఆ బ్లూ కాలర్ ఉద్యోగి నవ్వుతూ అడిగాడు. ‘‘రీసెర్చ్ స్కాలర్ని.’’ జయవర్మ చెప్పాడు. ‘‘దేని మీద రీసెర్చ్ చేస్తున్నారు?’’ ‘‘టైమ్ ట్రావెల్.’’‘‘అది ఎన్నటికీ మనిషికి సాధ్యం కాదు. సమయం అనేది ఓ ఆలోచన మాత్రమే. అది అసలు లేనేలేదని నా అభిప్రాయం.’’ ‘‘ఉంది. నేను 2016 నించి 1967కి వచ్చాను.’’ జయవర్మ చెప్పాడు.‘‘నేను దాన్ని నమ్మేంత ఇంకా తాగలేదు.’’ డేవ్ చెప్పాడు.‘‘నెల, తారీకు, సంవత్సరం చూడండి.’’ జయవర్మ తన డ్రైవింగ్ లైసెన్స్ని మౌనంగా ఆయనకి ఇచ్చి చెప్పాడు. దాన్ని చూడగానే ఆయన మొహం ఎర్రబడింది. ‘‘నీ పథకం ఏమిటి? నా నుంచి డబ్బు గుంజే స్కామ్ ఇది. అవునా?’’ కోపంగా అడిగాడు. ‘‘లేదు. ఇది నిజం. ఇది నా మొబైల్ ఫోన్. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. దీనికి వైర్లు ఉండవు. సాటిలైట్తో పనిచేస్తుంది. ఇంట్లోనే టీ.వీ.లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలు చూడొచ్చు. అందుకు టీ.వీ. ప్రసారం చేయక్కర్లేదు...’’ ‘‘ఆపు. ఇంకో అబద్ధం చెప్తే చంపేస్తాను.’’ తాగి ఉన్న డేవ్ అరిచాడు. ‘‘నిజం. ఓ నల్లజాతి వ్యక్తి మన ప్రెసిడెంట్.’’ జాతి విద్వేషం గల ఆయన వెంటనే బల్ల మీది మటన్ చాప్స్ కోసుకునే కత్తిని తీశాడు. బలాఢ్యుడైన జయవర్మ తనని పొడవబోయిన ఆయన చేతిని పట్టుకుని ఆపాడు. ఆ పెనుగులాటలో ఆ కత్తి ఆయన ఛాతీలో ఊపిరితిత్తుల్లో బలంగా దిగింది.‘‘ మై గాడ్. హత్య. పట్టుకోండి.’’ అరుపులు వినిపించాయి. ఓ మెరుపు మెరిసింది. వెంటనే జయవర్మ తనవైపు వచ్చేవారి వంక కత్తిని ఝుళిపిస్తూ తప్పించుకుని బయటపడ్డాడు. సరాసరి సమీపంలోని పార్క్లో ఆపిన తన వాహనం వైపు పరిగెత్తాడు. విరక్తితో అతను మళ్ళీ టైమ్ ట్రావెల్ చేయలేదు. 2025. జయవర్మ తనని అనుసరించే ముప్ఫై ఏళ్ళ యువకుడిని గమనించి అడిగాడు. ‘‘ఎందుకు నా వెంట పడ్డావు?’’ ‘‘ఇందుకు.’’ అతను వెంటనే బొడ్డులోంచి కత్తిని తీసి జయవర్మ ఊపిరితిత్తుల్లో దిగేలా క్రోధంగా పొడిచాడు. ‘‘ఎందుకు? ఎందుకు?’’ జయవర్మ బాధగా అడిగాడు. ‘‘నీ మొహం నాకు బాగా గుర్తు. 1967లో మా తాతని షికాగోలో గ్రీన్స్ మిల్ బార్లో పొడిచినప్పుడు అక్కడ ఒకరు తీసిన నీ ఫొటో మా ఇంట్లో వేలాడుతోంది.’’ అతను చెప్పాడు.
రామేశ్వర లింగ ప్రతిష్ఠాపన
రావణ వధానంతరం పుష్పక విమానంలో సపరివారంగా బయలుదేరిన రాముడు మార్గమధ్యంలో సముద్ర తీరాన మజిలీ చేశాడు. రాముడి రాకను తెలుసుకున్న మునులందరూ ఆయన దర్శనం కోసం వచ్చారు. రాముడిని మునులందరూ వేనోళ్ల స్తుతించారు. రాముడు వారికి నమస్కరించి, ‘మునులారా! పులస్త్యబ్రహ్మ కుమారుడైన రావణుడు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎప్పటికీ బ్రాహ్మణుడే! యుద్ధంలో నేను రావణుడిని చంపవలసి వచ్చింది. బ్రహ్మహత్య మహాపాతకమని శాస్త్రాలు చెబుతున్నాయి. నేను ఆ మహాపాతకాన్ని తొలగించుకోవాలంటే, ఏం చేయాలో తగిన ఉపాయం మీరే సెలవీయండి’ అని అడిగాడు.‘పరమాత్మా! నీకు దోషం అంటుతుందా? లోకాన్ని అనుగ్రహించటానికి అడిగావు. అయినా, పరిహారం చెబుతున్నాం విను! ఈ సాగర తీరంలో శంభు ప్రతిష్ఠాపన చెయ్యి. శివలింగ ప్రతిష్ఠాపన వల్ల వచ్చే పుణ్యాలను పరమేష్టి కూడా స్తుతించలేడంటే, మా బోటివారికి వివరించడం శక్యమా? కాశీ విశ్వేశ్వరుడిని సందర్శించుకున్నప్పుడు వచ్చే పుణ్యం కంటే, నువ్వు ఇక్కడ ప్రతిష్ఠించబోయే శివలింగాన్ని దర్శించుకున్న వారికి వెయ్యిరెట్లు పుణ్యం వస్తుంది’ అని మునులందరూ ముక్తకంఠంతో పలికారు.‘మరందుకు ముహూర్తాన్ని మీరే నిర్ణయించండి’ అన్నాడు రాముడు.‘మరో నాలుగు ఘడియలకు దివ్యమైన ముహూర్తం ఉంది’ చెప్పారు మునులు.రాముడు తన పక్కనే ఉన్న హనుమంతుడి వైపు చూసి, ‘హనుమా! కైలాస పర్వతం మీదనున్న శివలింగాన్ని మరో నాలుగు ఘడియల్లోగా ఇక్కడకు తీసుకురావాలి. తేగలవా?’ అని అడిగాడు.‘స్వామీ! నువ్వు ఆజ్ఞాపించాలే గాని, అదెంత పని?’ అని అంటూ మరుక్షణంలోనే ఒక్కసారిగా కుప్పించి, నింగిపైకి ఎగిశాడు. అకస్మాత్తుగా హనుమంతుడు అలా పైకెగిరే సరికి, నేల కంపించింది. చుట్టూ ఉన్న సుగ్రీవాది వానర ప్రముఖులు, విభీషణుడు, అతడి పరివారం హనుమంతుడిని సంభ్రమాశ్చర్యాలతో తిలకించసాగారు. హనుమంతుడి వేగాన్ని నింగి నుంచి గమనిస్తున్న దేవతలు, అతడు ఏకంగా కైలాస పర్వతాన్నే పెకలించుకుని వస్తాడేమోనని కలత చెందారు.హనుమంతుడు ఉత్తర దిశగా నింగిలో వాయువేగంతో దూసుకుపోయాడు. అరఘడియలోనే కైలాసానికి చేరుకున్నాడు. శివలింగం కోసం కైలాస పర్వతంపై అడుగడుగునా వెదికాడు. ఎక్కడా శివలింగం అతడికి కనిపించలేదు. తాను శివలింగం జాడ కనుగొనే సరికే గడువు మించిపోతుందేమోనని దిగులు చెందాడు. కాసేపు ఆలోచించాడు. మహత్తరమైన ఇలాంటి దైవకార్యాలు తపస్సు ద్వారా మాత్రమే నెరవేరుతాయని భావించి, ఒంటికాలిపై నిలబడి, నడినెత్తిన కనిపిస్తున్న సూర్యుడిపై చూపునిలిపి, చేతులు పైకెత్తి నమస్కరిస్తూ తపశ్చర్యకు పూనుకున్నాడు.హనుమంతుడి దీక్షాదక్షతకు సంతోషించిన శివుడు కొద్దిసేపటికే అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు.‘నాయనా! ఏం కావాలో కోరుకో! అని అడిగాడు.‘పరమేశ్వరా! శ్రీరాముడు నీ అవ్యయలింగాన్ని భూలోకంలో ప్రతిష్ఠించాలని సంకల్పించుకున్నాడు. గడువు మీరిపోక ముందే నీ అవ్యయలింగాన్ని అనుగ్రహించు. తీసుకుపోయి, శ్రీరాముడికి అందిస్తాను’ అన్నాడు.శివుడు వెంటనే హనుమంతుడి చేతికి తన అవ్యయలింగాన్ని ఇచ్చి, అంతర్ధానమయ్యాడు.హనుమంతుడు వెనువెంటనే ఆ లింగాన్ని తీసుకుని, ఆకాశ మార్గాన దక్షిణ సముద్రతీరంలో రాముడు నిరీక్షిస్తున్న ప్రదేశానికి బయలుదేరాడు. ఈలోగా వేళ మించిపోతూ ఉండటంతో, మునులందరూ ‘రామా! ముహూర్తం సమీపించింది. హనుమ వల్ల ఆలస్యమయ్యేలా ఉంది. వేళ మించిపోకుండానే సైకత లింగాన్ని ప్రతిష్ఠించు’ అని చెప్పారు. మునుల సలహాతో సీతారాములు సముద్రంలో స్నానాలు ఆచరించి, సైకత లింగ ప్రతిష్ఠాపనకు సిద్ధమయ్యారు. మునులు మంత్రాలు చదువుతుండగా, రాముడు సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడు. రాముడు శివలింగ ప్రతిష్ఠాపన జరుపుతున్న సమయానికే హనుమంతుడు గగన మార్గంలో అక్కడకు చేరుకున్నాడు. పైనుంచి తిలకించిన హనుమంతుడికి రాముడు సాగిస్తున్న శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమం కనిపించింది. ‘స్వామి శివలింగం కోసం నన్ను కైలాసానికి పంపించి, ఇక్కడ అన్యలింగ ప్రతిష్ఠాపన చేయడమేమిటి’ అనుకుంటూ లోలోపల కలత చెందాడు. రాముడికి సమీపంలోనే నేల మీదకు దిగాడు హనుమంతుడు. అక్కడే ఉన్నవారందరినీ పలకరించాడు. నేరుగా రాముడి వద్దకు వచ్చాడు. ‘స్వామీ! నీ కార్యాన్ని సకాలంలో నెరవేర్చలేని నా జన్మవ్యర్థం’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకుని పలికాడు.రాముడు అతడిని అనునయించాడు. ‘హనుమా! నువ్వు వేరు, నేను వేరు కాదు. నీలో ద్వైతబుద్ధి ఇంకా తొలగిపోలేదు. అందుకే ఈ దుఃఖం. ముహూర్తం మించిపోతోందని మునులు చెప్పడంతో సైకతలింగాన్ని ప్రతిష్ఠించాను. అంతమాత్రానికే శోకించడం తగునా! నువ్వు కూడా యుద్ధంలో ఎందరో బ్రహ్మరాక్షసులను సంహరించావు కదా! శివుడు అనుగ్రహించిన అవ్యయలింగాన్ని నీ పేరిట ప్రతిష్ఠించు’ అని పలికాడు.హనుమంతుడు తాను కైలాసం నుంచి తెచ్చిన శివలింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించాడు.∙సాంఖ్యాయన
బయట ఆడకపోతే... నాలుగు నష్టాలు
ఒకప్పుడు బాల్యం ఇంట్లో కంటే, ఇంటి బయటే ఎక్కువ ఉండేది. పరుగులాట, కోతికొమ్మచ్చి, బిళ్లంగోడు, గాలిపటాలు, దొంగాట... ఇలా పిల్లలు ఇంటి బయటే ఎక్కువగా ఉండేవారు. చెమటలు కారుతున్నా ఆటలు ఆపకపోవడం, అమ్మ పిలుస్తున్నా పట్టించుకోకపోవడం, ఆకలయ్యేంత వరకు ఇల్లు గుర్తురాకపోవడం, ఒక్కోసారి ఆకలి కూడా మరచిపోయి ఆడుకోవడం... ఇవన్నీ సర్వసాధారణం. ఆ బాల్యం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈరోజు పిల్లల బాల్యం ఒక చిన్న స్క్రీన్లో మొదలై, అదే స్క్రీన్లో ముగుస్తోంది. ఇది అభివృద్ధి కాదు, ఒక తరం మౌనంగా కోల్పోతున్న జీవితం.ఇప్పటికీ ఆలస్యం కాలేదు. గేటు తెరవండి. ఫోన్ పక్కన పెట్టండి. పిల్లల బాల్యాన్ని మళ్లీ బయటకు తీసుకురండి. బాల్యం ఎందుకు బయటే ఎదగాలి?పిల్లల మెదడు పుస్తకాలతో కాదు, అనుభవాలతో ఎదుగుతుంది. ఆ అనుభవాలు ఎక్కువగా బయట ప్రపంచం నుంచే వస్తాయి. బయట ఆడే ఆటల్లో పిల్లలు కేవలం శరీరాన్ని కాదు, మెదడును కూడా ఉపయోగిస్తారు.ఎక్కడ పరుగెత్తాలి? ఎక్కడ ఆగాలి? ఎవరితో కలిసి ఆడాలి? ఎవరితో తగువుపడాలి? ఎప్పుడు ఒప్పుకోవాలి? ఎప్పుడు ఎదురు నిలవాలి?... ఇవన్నీ ప్లానింగ్, నిర్ణయాలు, స్వీయ నియంత్రణకు మూలాలు. వీటినే సైకాలజీలో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ‘సెంటర్ ఆన్ ది డెవలపింగ్ చైల్డ్’ ప్రకారం, పిల్లలు బయట ఆడే ఆటలు మెదడులో న్యూరల్ కనెక్షన్లను సహజంగా బలపరుస్తాయి. కాని ఇప్పుడా అనుభవాలన్నీ స్క్రీన్కు అతుక్కుపోయియి. స్క్రీన్ ఎందుకు ప్రమాదకరం?స్మార్ట్ఫోన్ సమస్య అది చూపే కంటెంట్ కాదు, అది పనిచేసే విధానం. స్మార్ట్ఫోన్లోని యాప్ల ఉద్దేశం ఎక్కువసేపు స్క్రీన్ ముందు ఉంచడమే, పిల్లలకు ఉపయోగపడాలని కాదు. ఈ యాప్లు డోపమైన్ రసాయనాన్ని చిన్న చిన్న మోతాదుల్లో విడుదల చేస్తూ, పిల్లల మెదడును నిరంతర ఉత్సాహంలో ఉంచుతాయి.బయట ఆటల్లో ఆనందం రావాలంటే శ్రమ అవసరం. స్క్రీన్లో ఆనందం రావాలంటే ఒక టచ్ చాలు. మెదడు ఈ తేడాను త్వరగా నేర్చుకుంటుంది. దీనివల్ల పిల్లలు తక్షణ ఆనందానికి అలవాటుపడతారు. ఓర్పు తగ్గిపోతుంది. బోర్డమ్ను భరించలేని మనస్తత్వం, అసహనం, చిరాకు పెరుగుతాయి. బోర్ కూడా అవసరం.. ‘మా పిల్లాడు త్వరగా బోర్ అవుతున్నాడు సర్. అందుకే ఫోన్ ఇస్తుంటాం’ అని చాలామంది తల్లిదండ్రులు చెబుతుంటారు. వాస్తవానికి బోర్ అవ్వడం పిల్లలకు ఒక అవసరం. బోర్ అవ్వడం అంటే ఖాళీగా ఉండడం కాదు. అది మెదడుకు ఒక విరామం. ఆ విరామంలోనే ఊహాశక్తి పుడుతుంది, కొత్త ఆటలు పుట్టుకొస్తాయి, సృజనాత్మకత మేల్కొంటుంది. స్మార్ట్ఫోన్ పిల్లల జీవితంలో బోర్డమ్ను పూర్తిగా తొలగించింది.ప్రతి నిమిషం ఏదో ఒకటి చూపిస్తూ, పిల్లల మెదడును వినోదానికి బానిసగా మార్చేసింది. పరిష్కారాలు... → రోజుకు కనీసం గంట బయట ఆట తప్పనిసరి చేయండి. చలిగా ఉందని, ఎండగా ఉందని సాకులు చెప్పొద్దు. ఆటకు వాతావరణ అడ్డుకాకూడదు. → స్క్రీన్ను హక్కుగా కాదు, రివార్డుగా మార్చాలి → డైనింగ్ టేబుల్, స్టడీ టేబుల్, పడకగదిలో ఫోన్ అనుమతించకూడదు → పిల్లలతో కలిసి బయటకి వెళ్లండి. ఆడకపోయినా, అక్కడ ఉండండి → పిల్లలు బోర్ అయితే వెంటనే స్క్రీన్ ఇవ్వకండి. ఆ బోర్లోనే ఎదుగుదల ఉంటుందిబయట ఆటలు లేకపోతే... పిల్లలు బయట ఆటలు ఆడకపోతే నాలుగు ముఖ్యమైన సామర్థ్యాలు కోల్పోతారు. → రిస్క్ అంచనా వేసే సామర్థ్యం: ఎక్కితే పడిపోతామో లేదో తెలుసుకోవడం → సోషల్ నెగోషియేషన్: ఆటలో గొడవలు, ఒప్పందాలు, రాజీలు → శరీర అవగాహన: బ్యాలెన్స్, కోఆర్డినేషన్, స్థల జ్ఞానం → నిజమైన విజయ భావన: కష్టపడి సాధించిన ఆనందం ఈ నాలుగు అంశాలను ఏ స్క్రీన్ ఇవ్వలేదు.భయపెట్టే గణాంకాలుప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సిఫారసు ప్రకారం రెండేళ్ల లోపు పిల్లలకుస్క్రీన్ పూర్తిగా నిషిద్ధం. ఐదేళ్ల పిల్లలకు రోజుకు గంట కంటే ఎక్కువ స్క్రీన్ ఉండకూడదు. కాని, మనదేశంలో 3–6 ఏళ్ల పిల్లలు సగటునరోజుకు 3–5 గంటలుస్క్రీన్ చూస్తున్నారు. నగరాల్లో 60 శాతానికి పైగా పిల్లలు రోజుకు 30 నిమిషాలు కూడా బయట ఆడటంలేదు. 1990లతో పోలిస్తే పిల్లల ఔట్డోర్ ఆటల సమయం 70 శాతం తగ్గింది.
ఆహార్యమే ఆధారమై!
నేరస్థలంలో దొరికే ఆధారాలు నిందితులను పట్టించడానికే కాదు, ఒక్కోసారి అమాయకులను రక్షించడానికీ ఉపయోగపడతాయి. నగరంలో నమోదైన హైప్రొఫైల్ కేసులో ఒకటి రికార్డుల్లో నిలిచిపోయే జగదాంబ జ్యూలర్స్ యజమాని ప్రహ్లాద్ అగర్వాల్ భార్య పుష్పాబాయి హత్యకేసు దర్యాప్తులో తొలుత అనుమానితుల జాబితా భారీగా ఉంది. అనేకమందిని విచారించారు. ఎట్టకేలకు సంఘటనా స్థలంలో నిందితుడు వదిలి వెళ్లిన దుస్తులు, జేబులో లభించిన వస్తువుల ఆధారంగా కేసు కొలిక్కి వచ్చింది.బషీర్బాగ్లో జగదాంబ జ్యూలర్స్ నిర్వహించే ప్రహ్లాద్ అగర్వాల్ బంజారాహిల్స్లోని రోడ్ నెం.14లో నివసించేవారు. వీరిది ఉమ్మడి కుటుంబం. అగర్వాల్ భార్య పుష్పాబాయితో పాటు ఇద్దరు కుమారులు, కోడళ్లు, మనుమలు ఒకే ఇంట్లో ఉండేవారు. అగర్వాల్, ఆయన కుమారులు 2005 అక్టోబర్ 5 ఎప్పటిలాగే వారి బంగారం దుకాణానికి వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో కోడలు రాధిక నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ వారందరూ హడావుడిగా ఇంటికి పరిగెత్తేలా చేసింది. అప్పటికే ఆ ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు డాక్టర్లును పిలిపించారు. వాళ్లు వచ్చి రక్తపు మడుగులో ఉన్న పుష్పాబాయిని నిశితంగా పరీక్షించి, చనిపోయినట్లు నిర్ధారించారు. దీన్ని హత్యగా తేల్చారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా హత్యాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ వివిధ ప్రాంతాల్లో లభించిన ఓ చొక్కా గుండీ, ప్యాంటు–షర్టు, ఆడవారి చెప్పులు, కుర్తా–పైజామాలతో పాటు హతురాలు పుష్పాబాయి చేతిలో ఉన్న పొడువాటి వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఓ పాదముద్రనూ గుర్తించి, దాన్ని కెమెరాలో బంధించారు. ఇంటి చుట్టూ క్షుణ్ణంగా పరిశీలించగా, హత్య జరిగిన గది నుంచి వంటింటి మీదుగా బయట వరకు పడిన రక్తపు మరకలు కనిపించాయి. వీటి నమూనాలు సేకరించి, సాంకేతికంగా పరిశీలించిన దర్యాప్తు అధికారులు– అవి హతురాలివి కావని, హంతకుడికి అయిన గాయం నుంచి కారినవని నిర్ధారించారు. తన భార్య ప్రతిరోజూ ధరించే రెండు బంగారు గాజులు కనిపించట్లేదంటూ ప్రహ్లాద్ పోలీసులకు తెలిపారు. ఎక్కువ సొత్తు చోరీకి గురికాకపోవడంతో ఈ హత్య దోపిడీ దొంగల పని కాదని భావించారు. కేవలం పరిచయస్తుల పనిగా అనుమానించి, ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుల పట్టుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన అధికారులు తొలుత ఒక అనుమానితుల జాబితా రూపొందించి, కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరికొందరి పూర్వాపరాలు తెలుసుకుని ఒక్కోక్కరికీ క్లీన్చిట్ ఇస్తూ పోయారు. ఇదిలా ఉండగా, హతురాలి చేతిలో లభించిన వెంట్రుకలను పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు కొందరి అనుమానితుల నుంచి సేకరించిన వాటితో పోల్చారు. అవి ఎవరి వాటితోనూ సరిపోలలేదు. దీంతో ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో పుష్పాబాయి నమూనాలతోనూ పరీక్షించి ఆమెవే అని తేల్చారు. హత్య జరిగిన గది బయట స్వాధీనం చేసుకున్న చెప్పులు పుష్పాబాయి కోడలివిగా తేలాయి. ఘటనా స్థలిలో పడి ఉన్న కుర్తా–పైజామా ఆ ఇంట్లో వారివే అని స్పష్టం కావడంతో దానిపై ఉన్న రక్తపు మరకల కోణంలో ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే హత్యానంతరం నిందితులు తమకు అంటిన రక్తపు మరకలు తుడుచుకోవడానికి ఆ దుస్తులు వినియోగించారని వెల్లడైంది. అంతకంతకూ కేసు జటిలంగా మారుతుండటంతో అధికారులు మరింత లోతుగా, సాంకేతికంగా దర్యాప్తు చేశారు. ఆ ఇంట్లో పని చేస్తున్న ఒడిశా యువకుడిని, అతడి కుటుంబీకులు, సన్నిహితులను అనుమానితుల జాబితాలో చేర్చారు. హత్యాస్థలిలో లభించిన నమూనాలు వీరిలో ఎవరి వాటితోనూ సరిపోలేదు. దీంతో దర్యాప్తు అధికారులు వారందరికీ క్లీన్ చిట్ ఇస్తూ వదిలేశారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలుల్లో ఉన్న చొక్కా బటన్, ప్యాంటు–షర్టులపై పోలీసులు దృష్టి పడింది. రక్తపు మరకలు అంటిన ఆ ప్యాంట్, షర్ట్ విప్పే క్రమంలోనే దాని గుండీ తెగిపడి ఉంటుందని తేల్చారు. అదే సమయంలో తనకు సంబంధించిన ఓ జత బట్టలు కనిపించట్లేదంటూ యజమాని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో హత్య చేస్తున్నప్పుడు ధరించిన దుస్తులను అక్కడ వదిలేసిన నిందితుడు– యజమాని దుస్తులను వేసుకు వెళ్లాడని వెల్లడైంది. నిందితుడు వదిలేసిన ప్యాంట్ కాళ్ల దగ్గర మడిచి ఉండటం, జేబులో కాల్చిన చింత గింజలు వంటివి లభించడంతో హత్య చేసిన వ్యక్తి సామాజిక, ఆర్థిక స్థితిగతులను పోలీసులు అంచనా వేశారు. ఆ ఆహార్యంతో ఉండే వ్యక్తులు ఎవరంటూ హతురాలి సంబంధీకులను పోలీసులు ప్రశ్నించగా, వెలుగులోకి వచ్చిన పేరే నర్సింహ. హతురాలి కుమార్తె వద్ద గతంలో పనిమనిషిగా ఉండి మానేసినట్లు వెల్లడైంది. మరోపక్క హత్యకు ముందు ఆ ఇంటికి రాకపోకలు సాగించిన వారి వివరాలు ఆరా తీసిన పోలీసులు ఆ జాబితాలో నర్సింహతో పాటు నారాయణ అనే మరో వ్యక్తి ఉన్నట్లు తేల్చారు. హత్య తర్వాత అతడు ఆ చుట్టుపక్కలకు రాకపోవడంతో అనుమానం నిజమైంది. దీంతో అతడి ఇంటి అడ్రస్ తీసుకున్న పోలీసులు గగన్మహల్ వద్ద ఉన్న గదిపై దాడి చేశారు. అప్పటికే అది తాళం వేసి ఉండటం, స్వస్థలమైన మెదక్ జిల్లా చిన శంకరంపేటలోనూ అతడి ఆచూకీ లేకపోవడంతో ఈ హత్య నర్సింహ పనిగా నిర్ధారించారు. నర్సింహ కోసం తాము వెతుకుతుంటే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని పోలీలుసు భావించారు. గగన్మహల్లో అతడు అద్దెకు తీసుకున్న గదిలో సామాను అలానే ఉందా? లేదా? అనేది గమనించారు. అవన్నీ అక్కడే ఉండటంతో ఎప్పటికైనా తిరిగి వస్తాడని, ముందు అతడి కోసం పోలీసులు గాలించట్లేదని అనుకునేలా చేద్దామని దర్యాప్తు అధికారులు నిర్ణయించుకున్నారు. దీంతో కొన్ని రోజుల పాటు గగన్మహల్లో ఉన్న గదిపై నిఘా ఉంచిన మఫ్టీ పోలీసులు ఎట్టకేలకు నర్సింహ రాకను గుర్తించి పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించగా, నారాయణ అనే వ్యక్తిని పనిలో చేర్చే ఉద్దేశంతోనే ప్రహ్లాద్ అగర్వాల్ ఇంటికి అతడితో కలిసి వెళ్లానని, అయితే పుష్పాబాయి వద్ద ఉన్న సొత్తు చూసి దాని కోసం నారాయణతో కలిసి ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత భయం వేయడంతో కేవలం గాజులు మాత్రమే పట్టుకుని పారిపోయామని బయటపెట్టాడు. దీంతో గాలింపు కొనసాగించిన అధికారులు నారాయణను కూడా అరెస్టు చేయగలిగారు. శ్రీరంగం కామేష్
అంతర్జాతీయం
నార్వే ప్రధాని లేఖలో తేల్చిచెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ టంప్కు నోబెల్ బహుమతిపై ఉన్న ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఎలాగైనా ప్రపంచశాంతి బహుమతి సాధించాలని ట్రంప్ ఎక్కని గడపా లేదు.. చేయని రచ్చా లేదు. ఎలాగైనా ఈ అవార్డు తనకు ప్రకటించాలంటూ పలుసార్లు బహిరంగ ప్రకటన సైతం చేశారు. కానీ నోబెల్ మాత్రం ట్రంప్కు దక్కలేదు. తాజాగా ట్రంప్ మరోసారి నోబెల్పై తనకు ప్రకటించకపోవడంపై తనకున్న అక్కసును వెల్లగక్కారు. తాజాగా నార్వే ప్రధాని జోనస్ గహర్కు ట్రంప్ లేఖ రాశారు. అందులో ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న విధ్వంసానికి కారణం ఆదేశం తనకు నోబెల్ ప్రకటించకపోవడమేనన్నారు. అందువల్లే తన రూట్ మార్చానని తెలిపారు. శాంతిని వదిలి యుద్ధ బాట పట్టినట్లు పేర్కొన్నారు.ఆలేఖలో ట్రంప్ ... "నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను. అయినా మీ దేశం నన్ను శాంతిదూతగా గుర్తించలేదు. అందుకే ఇక నేను శాంతి గురించి ఆలోచించాలనుకోవడం లేదు. ఇప్పుడు నేను కేవలం అమెరికాకు ఏది లాభం చేకురుస్తోంది అదే చేస్తాను" అని ట్రంప్ లేఖలో అన్నారు. గ్రీన్లాండ్కు ఎప్పటికైనా చైనా, రష్యాల నుంచి ముప్పు పొంచి ఉంది ఈ నేపథ్యంలో ఆ భూమిపై వారికి యాజమాన్య హక్కులు ఎలా ఉంటాయి అని ట్రంప్ ప్రశ్నించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ పడవలు దిగాయి. మా భూభాగంలో కూడా పడవలు దిగాయి. అంతే .. ఆ భూమిపై యాజమాన్య పత్రాలు ఆదేశానికి లేవు అని అన్నారు.అయితే గ్రీన్లాండ్ ద్వీపాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆక్రమించుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ నిర్ణయాన్ని డెన్మార్క్తో సహా ఇతర నాటో దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆ నాటో దేశాలపై 10 శాతం సుంకం విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. నోబెల్ బహుమతి ప్రకటన అనేది పూర్తిగా నోబెల్ కమిటీ ఎంపిక మాత్రమే అక్కడి ప్రభుత్వానికి అందులో ఎటువంటి జోక్యం ఉండదు.
బాబోయ్ ట్రంపూ.. అప్పుడే ఏడాది పూర్తి
2024 జనవరి 20.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా వైట్హౌజ్లో అడుగు పెట్టిన రోజు. అమెరికా ఫస్ట్ నినాదంతో నెగ్గిన ఆయన.. దేశాన్ని ఓ గాడిన పెడతాడని, అదే సమయంలో అంతర్జాతీయంగా పెద్దన్న రోల్ను సమర్థనీయంగా పోషిస్తారని ఆనాడు అంచనాలు ఉండేవి. కానీ, ఒక సంవత్సరం గడిచేలోపే సీన్ సితార అయ్యింది. ట్రంప్ సంతకం చేసిన అనేక నిర్ణయాలు అమెరికాలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చలకు దారితీశాయి. వాటిలో చాలామట్టుకు ‘‘తల తిక్క’’ నిర్ణయాలుగా గుర్తింపు దక్కించుకున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.. వలసవాదానికి చుక్కలు .. అధికారంలోకి రాగానే ట్రంప్ చేసిన మొదటి పని.. శరణార్థులపై కఠిన ఆంక్షల విధింపు. ఈ నిర్ణయంలో అక్రమ వలసవాదుల్ని వెతికి మరీ.. వాళ్ల వాళ్ల దేశాలకు డిపోర్ట్ చేశాడు. ఈ క్రమంలో బేడీలు వేసి.. కనీస వసతుల్లేని విమానాల్లో తరలించడం తీరు తీవ్రవిమర్శలు తావిచ్చింది. మానవ హక్కుల సంస్థలు వలసవాదులకు తలుపులు మూసేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. అయినప్పటికీ అమెరికా భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ సమర్థించుకున్నాడు.. ఇదేగాక.. వీసా టఫ్ రూల్స్.. అమెరికన్ల ఉద్యోగాల్ని రక్షించడం అనే పేరుతో.. హెచ్1బీ వీసా నియమాలను కఠినతరం చేశారు. ఫీజులు గణీయంగా పెంచారు. అధిక వేతన ప్రమాణాలు, కఠిన అర్హతలు, తక్కువ అనుమతులతో.. తీవ్ర చర్చనీయాంశంగా మారారాయన. ఈ నిర్ణయంతో.. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ప్రభావితమయ్యారు.ఆ దేశాలపై ట్రావెల్ బ్యాన్.. 2025 డిసెంబర్లో ట్రంప్ చేసిన ఒక ప్రకటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 39 దేశాల పౌరులపై అమెరికా ప్రవేశ నిషేధం విధించారాయన. అఫ్గన్ పౌరుడొకడు వాషింగ్టన్లో గన్ ఫైర్ ఎటాక్ జరపడమే ఇందుకు కారణం. ఈ లిస్టులో చాలా వరకు ముస్లిం దేశాలే ఉన్నాయి. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.టారిఫ్ కింగ్.. 2025లో ట్రంప్ను ప్రత్యేకంగా నిలిపింది ఏదైనా ఉందీ అంటే.. అది సుంకాల యుద్ధమే. తనకు నచ్చని.. తన మాట వినని దేశాలపై టారిఫ్ కొరడా ఝుళిపించారాయన. ఈ క్రమంలో.. చైనా, యూరప్, కెనడా, మెక్సికో వంటి దేశాలపై భారీ దిగుమతి సుంకాలు (tariffs) విధించారు. ట్రంప్ టారిఫ్ వార్లు అమెరికా పరిశ్రమలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రారంభమైనా, అవి గ్లోబల్ ట్రేడ్లో ఉద్రిక్తతలు, భారత్ లాంటి మిత్రదేశాలతో సంబంధాల క్షీణత, వినియోగదారులపై అదనపు భారాలు వంటి అనేక సమస్యలకు దారితీశాయి.ఫెడరల్ టు స్టేట్స్.. 2024 నవంబర్లో ట్రంప్ తన ఎన్నికల హామీలో.. విద్యాశాఖను పూర్తిగా రద్దు చేస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగా.. అధికారంలోకి రాగానే ఆ పని చేశారు. 2025 మార్చి 20న ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసి, కేంద్ర(ఫెడరల్) విద్యాశాఖను మూసివేయడానికి అధికారిక ప్రక్రియను ప్రారంభించారు. ఫెడరల్ ప్రభుత్వంపై అనవసర భారం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన. 40 ఏళ్లలో 3 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసినా ఫలితం లేదు. విద్యా నియంత్రణ రాష్ట్రాలకే ఉండాలి అనేది ఆయన వాదన. దీంతో ఆ దేశంలో కేంద్ర విద్యా శాఖ కనుమరుగు అయ్యే ప్రాసెస్ నడుస్తోంది. అయితే.. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భారం కానుంది.అదే సమయంలో.. ఇటు అమెరికా ఆరోగ్య శాఖ (Department of Health and Human Services – HHS)ను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. రెండో టర్మ్లో ఈ మేరకు ప్రతిపాదన కూడా చేశారు. ఆయన వాదన ప్రకారం, ఆరోగ్య విధానాలు రాష్ట్రాలకే అప్పగించాలి.. ఫెడరల్ స్థాయిలో ప్రత్యేక శాఖ అవసరం లేదు. అయితే ఇది ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. ప్రస్తుతానికి దాని అధికారాలు, నిధులు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒబామాకేర్( Affordable Care Act) రద్దు ప్రయత్నాలతో కలిపి, ఆరోగ్య శాఖను పునర్వ్యవస్థీకరించాలనే ప్రణాళిక మాత్రం రేపో మాపో అమలయ్యే ఛాన్స్ ఉంది.వీటితో పాటు ఐక్యరాజ్య సమితిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గప్పించడం.. నిధుల్ని తగ్గించడం.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధుల్ని కోత వేసే ప్రయత్నాలు.. భారత్తో వాణిజ్య వివాదాలు.. పాక్తో మైత్రి, వెనెజువెలా అధ్యక్షుడ్ని బంధించి ఎత్తుకెళ్లి.. ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు మద్దతు.. ఆమెకు దక్కిన నోబెల్ మెడల్ను స్వీకరించడం.. “ఇకపై కేవలం శాంతి గురించే ఆలోచించాల్సిన బాధ్యత లేదు” అని వ్యాఖ్యలు చేయడం, ఇరాన్ నిరసనకారుల్ని రెచ్చగొట్టడం.. డెన్మార్క్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ గ్రీన్లాండ్ను చేజిక్కించుకునే ప్రయత్నాలు.. వీటికి తోడు ఫేక్ న్యూస్ అంటూ మీడియా సంస్థలపై దాడులు, దావాలు వేయడం.. ఈ ఏడాది కాలంలో కుటుంబ వ్యాపారాలు విపరీతమైన లాభాలు అర్జించి సంపద పెరగడం ట్రంప్ను తిట్టిపోసేలా చేశాయి.
‘సమయం ఆసన్నమైంది’.. గ్రీన్లాండ్పై ట్రంప్ కీలక ప్రకటన!
వాషింగ్టన్ డీసీ: గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాలనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై డెన్మార్క్తో సహా ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు నీళ్లు చల్లాయి. గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే.. ట్రేడ్ బజూకా పేరుతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించాయి. ఈ క్రమంలో ఆ హెచ్చరికలపై ట్రంప్ పరోక్షంగా స్పందించారు. డెన్మార్క్పై ఆగ్రహ వ్యక్తం చేశారు. ‘రష్యా నుంచి గ్రీన్లాండ్కు ముప్పు ఉంది. దాన్ని నుంచి బయటపడేందుకు డెన్మార్క్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఇప్పటికే 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా ప్రభావం పెరుగుతోంది. అందుకే గ్రీన్లాండ్ను సొంతం చేసుకుని, దానిపై రష్యా ముప్పును తొలగిస్తామని ప్రకటించారు. అమెరికా తన మిత్రదేశాలను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.గ్రీన్లాండ్ భౌగోళికంగా ఆర్కిటిక్ సముద్ర మార్గాలకు కీలకమైన ప్రాంతం. అమెరికా దీన్ని తన రక్షణ వ్యవస్థలో భాగంగా చూస్తోంది. థూల్ ఎయిర్బేస్ అమెరికా సైనిక వ్యూహంలో ప్రధాన కేంద్రంగా ఉంది. అదే సమయంలో ఆర్కిటిక్లో రష్యా సైనిక స్థావరాలు పెంచడం వల్ల అమెరికా, నాటో మిత్రదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్కు చెందిన స్వయం పాలిత ప్రాంతం. అమెరికా, డెన్మార్క్తో కలిసి రక్షణ చర్యలు చేపడుతోంది. డెన్మార్క్ ప్రభుత్వం కూడా ఆర్కిటిక్లో రష్యా ఉనికిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా–రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న పోటీని మరోసారి వెలుగులోకి తెచ్చాయి. రష్యా కొత్త సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తుండగా, అమెరికా దీనిని ప్రాంతీయ భద్రతకు ముప్పుగా చూస్తోంది.
ఊడిన చక్రం?.. రన్వేపై తుళ్లిపడిన విమానం
మరికాసేపట్లో ఆ విమానం ఎయిర్పోర్టులో దిగాల్సి ఉంది. అయితే ఏం జరిగిందో తెలియదు ల్యాండింగ్ సక్రమంగా జరగలేదు. రన్వేపై విమానం ఒక్కసారిగా ఊగుతూ దిగింది. కాస్త ఉంటే క్రాష్ ల్యాండ్ అయ్యేదే. కానీ, అదృష్టవశాత్తూ అది జరగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఒకటి( UA2323 ఫ్లైట్) ఆదివారం మధ్యాహ్నాం చికాగో నుంచి ఒర్లాండోకు బయల్దేరింది. ఎయిర్పోర్ట్లో దిగే సమయంలో తీవ్ర కుదుపునలకు లోనైంది. అయితే.. పైలట్ చాకచక్యంగా స్పందించడంతో విమానం క్రాష్ ల్యాండ్ తప్పించుకుంది. ప్రమాదం సమయంలో విమానంలో 200 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఎవరూ గాయపడలేదని అధికారలు వెల్లడించారు. అయితే.. ఈ ఘటన తర్వాత విమానాల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. ప్రయాణికులను ఎయిర్పోర్ట్ టర్మినల్కు తరలించి.. విమానాన్ని రన్వేపై నుంచి జరపడంతో రాకపోకలు యధావిధిగా కొనసాగాయి. ఫ్లోరిడా నగరం ఓర్లాండోలో గత కొంతకాలంగా విపరీతమైన వానలు, ఈదురు గాలులు వీస్తున్నాయి. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ల్యాండింగ్ సమయంలో నోస్ వీల్(ల్యాండింగ్ గేర్ చక్రం) ఊడిపోయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఎయిర్లైన్స్గానీ, ఒర్లాండో ఎయిర్పోర్ట్ అథారిటీ కాని దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 🚨WATCH: United Airlines flight nearly crashes during landing at Orlando International Airport (MCO) as nose wheel appears to roll off landing gearpic.twitter.com/bzjY6uQFmT— Derrick Evans (@DerrickEvans4WV) January 19, 2026
జాతీయం
మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
పెళ్లి పేరుతో బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి దారుణంగా మోసపోయింది. నకిలీ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో పరిచయమైన వ్యక్తిని నమ్మి ఏకంగా రూ. 1.52 కోట్లు నష్టపోయింది. ఆనక విషయం తెలిసి లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.బెంగళూరులోని వైట్ఫీల్డ్ నివాసి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నవ్య శ్రీ (29) గత ఏడాది మార్చిలో, ఒక్కలిగ మ్యాట్రిమోని ద్వారా విజయ్ రాజ్ గౌడ అలియాస్ విజేత్ బి కలిసింది. తనకు వ్యాపారం ఉందని, తనకు రూ. 715 కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ నవ్యను బాగా నమ్మించాడు. దీంతోఆమె కుటుంబం, స్నేహితులు కూడా లక్షల కొద్దీ పెట్టుబడులు పెట్టారు. మరో విధంగా చెప్పాలంటే వారితో ఆ పెట్టుబడులు పెట్టేలా వారిని మభ్య పెట్టాడు. ఇలా రూ. 66 లక్షల దాకా పెట్టుబడి పెట్టాడు. వారినుంచి అప్పులు కూడా చేశాడు. వాటిని చెల్లించమని అడిగినపుడు మరో నాటకానికి తెరలేపాడు.కోర్టు కేసు కారణంగా తన బ్యాంకుఖాతాలు సీజ్ అయ్యాయంటూ నకిలీ కోర్టు పత్రాలు చూపించాడు. అలా నవ్యశ్రీ తల్లిదండ్రులను కూడా ఒప్పించి మరో రూ. 23 లక్షలు కొట్టేశాడు. ఎంతకీ తీసుకున్న డబ్బులు చెల్లించక పోవడం, పెళ్లి ఊసు ఎత్తక పోవడంతో అనుమానం వచ్చిన నవ్యశ్రీ అతని ఇంటికి వెళ్లడంతో అతని నిజస్వరూపం బైట పడింది. విజయ్కి ఇప్పటికే వివాహమై ఒక బిడ్డ కూడా ఉన్నాడు. అంతేకాదు భార్య,కుటుంబంతో కలిపి ఈ మ్యాట్రిమోనియల్ కమ్ ఇన్వెస్ట్మెంట్ మోసానికి తెగబడ్డాడు. దీంతో నివ్వెర పోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.FIR ప్రకారం విజయ్ తనకు రూ.715 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని , నవ్య శ్రీని వివాహం చేసుకుంటానని నమ్మించి భారీ మోసానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని రాజాజీనగర్ ,సదాశివనగర్లలో క్రషర్లు, లారీలు, భూమి , నివాస ఆస్తులతో పాటు VRG ఎంటర్ప్రైజెస్ ఉన్నాయని తానొక బిజినెస్ మేన్ అని విజయ్ తనను తాను పరిచయం చేసుకున్నాడని బాధితురాలు నవ్యశ్రీ ఆరోపించింది. 2019 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కేసుకు సంబంధించిన బెయిల్ ఆర్డర్ కాపీని చూపించి మోసం చేశాడు. తండ్రి బిగౌడ అలియాస్ బోరే గౌడయుజె రిటైర్డ్ తహసీల్దార్ (రెవెన్యూ ఆఫీసర్) అని, తల్లి నేత్రావతి, సోదరిలను కూడా పరిచేశాడు. ఇక ఇంకో ట్విస్ట్ ఏంటీ అంటే సోదరి అని పరిచయం చేసుకున్న మహిళే అతని భార్య. మూడేళ్ల క్రితమే వీరికి పెళ్లి అయింది.కష్టాల్లో ఉన్నానని చెప్పడంతో డిసెంబర్ 2024 , ఫిబ్రవరి 2025 మధ్య, శ్రీ తండ్రి రూ. 10.5 లక్షలు ఇచ్చాడని, ఆమె తల్లి తన పదవీ విరమణ నిధితో సహా రూ. 18 లక్షలు ఇచ్చిందని నవ్యశ్రీ తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఆభరణాలపైరుణం ద్వారా రూ. 10 లక్షలు, తోబుట్టువుల నుండి మరో రూ. 5 లక్షలు ఇచ్చింది. మొత్తం రూ. 1,75,66,890 తీసుకొని, కేవలం రూ. 22వేలు మాత్రమే తిరిగి ఇచ్చాడని, రూ. 1,53,15,090 చెల్లించ లేదని ఆరోపించింది. విజయ్, అతని కుటుంబం మోసం చేశారని, ఈ విషయాన్ని బైటికి చెపితే, స్నేహితులను చంపేస్తారని నవ్య తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు మేరకు విజయ్, మరో ఇద్దరిపై మోసం, నేరపూరిత కుట్ర మరియు బెదిరింపుల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. అదే కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను జత చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. గత వారం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో చివరి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్ ఇంకా ముగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని.. మిగిలిన అనర్హత పిటిషన్లపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టి మేటం జారీ చేసింది.ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి 8 వారాల గడువు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. స్పీకర్ తీసుకోబోయే నిర్ణయాలతోపాటు ఇప్పటివరకు జరిగిన పురోగతిపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇరుపక్షాలు వాడీవేడిగా మిగతా వాదనలు వినిపించాయి.గడువు కోరిన ప్రభుత్వ న్యాయవాదులు బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్లలో ప్రతివాదులుగా పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అభిషేక్ మను సింఘ్వీ, నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ‘స్పీకర్ కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. రెండు రోజులపాటు ఆస్పత్రిలో ఉన్నారు. అలాగే అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందువల్ల పిటిషన్ల విచారణలో జాప్యం జరిగింది. ఇప్పటికే కొన్ని అంశాలను పరిష్కరించాం. మరికొన్నింటిపై తీర్పును రిజర్వ్ చేశాం. మిగిలిన వాటిని పూర్తి చేయడానికి మరో 8 వారాల సమయం ఇవ్వండి’అని ముకుల్ రోహత్గీ ధర్మాసనాన్ని కోరారు. రెండు వారాల్లో పురోగతి చూపిస్తే నాలుగు వారాల సమయం ఇస్తామని చెబుతూ విచారణను వాయిదా వేసింది.
జమ్ము కశ్మీర్లో భూకంపం
భూకంపంతో జమ్ము కశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సోమవారం ఉదయం భూ ప్రకంపనలు లఢాఖ్లోని లేహ్తో పాటు కశ్మీర్ ప్రజలను వణికించాయి. ఇళ్లలో, కార్యాలయాల్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, ఈ భూకంపం ఉదయం 11:51 గంటలకు సంభవించింది. లేహ్ ప్రాంతంలో భూకంపం కేంద్రం నమోదు కాగా.. 171 కిలోమీటర్ల లోతులో భూకంపం పుట్టింది. రిక్టర్ స్కేల్పై 5.7 తీవ్రత నమోదైంది. ఈ ప్రకంపనలు జమ్ము కశ్మీర్ రీజియన్ అంతటా ప్రభావం చూపాయి. అప్రమత్తమైన అధికారులు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. Earthquake tremors felt in Jammu and Kashmir. https://t.co/JvDujditvy— AsiaWarZone (@AsiaWarZone) January 19, 2026అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతం భూకంపాలకు నెలవు కూడా. అయితే ఆదివారం.. అఫ్ఘనిస్తాన్లో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇవాల్టి ప్రకంపనలు తాత్కాలికంగానే ఉన్నప్పటికీ, ఆఫ్టర్షాక్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోట్లకు పడగలెత్తిన బిచ్చగాడు.. కళ్లు బైర్లు కమ్మేలా ఆస్తులు!
ఇండోర్: మూడు ఇళ్లు, కార్లు, ఆటోలు, వడ్డీ వ్యాపారం. ఈ ఆస్తులు.. వడ్డీ వ్యాపారం ఇవన్నీ చూస్తుంటే ఓ బడా వ్యాపారవేత్తకు చెందిన ఆస్తులేనని అనుకుంటున్నారా? అయితే, మీరు పొరబడినట్లే. మీరనుకుంటున్నట్లు ఈ ఆస్తులన్నీ కోటీశ్వరుడివి కావు. ఓ సాదాసీదా బెగ్గర్వి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘బెగ్గర్ ఎరాడికేషన్ క్యాంపెయిన్’లో వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇండోర్ బెగ్గర్ ఎరాడికేషన్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశ్యం వీధుల్లో భిక్షాటన జీవితాలను మార్చడం. భిక్షాటనను పూర్తిగా నిర్మూలించి వారికి పునరావాసం కల్పించడం. ఈక్యాంపెయిన్లో ఓ ప్రాంతంలో బిక్షాటన చేస్తున్న మంగీలాల్ అనే వ్యక్తి గురించి ఫిర్యాదులు రావడంతో మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పునరావాసం కల్పించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల్లో అధికారులు సైతం కళ్లు బైర్లు కమ్మేలా అతని ఆస్తులు కోట్లలో ఉన్నట్లు నిర్ధారించారు.బిక్షమెత్తుతూ కోట్లకు పడగనెత్తిన గీలాల్ ఘటన చర్చాంశనీయంగా మారింది. భిక్షాటన ద్వారా సంపాదించిన డబ్బుతో అతను కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టాడని అధికారులు వెల్లడించారు. తమ దర్యాప్తులో మంగీలాల్ వద్ద 600ఎస్ఫ్టీలలో భగత్ సింగ్ నగర్, శివనగర్, అల్వాస్ ప్రాంతాల్లో మూడు ఇళ్లు, మూడు ఆటోలు,స్విఫ్ట్ డిజైర్లు ఉన్నాయి. స్విప్ట్ డిజైర్ కోసం ఓడ్రైవర్ను పెట్టుకున్నాడు. తాను బిక్షాటనకు ఎక్కడికి వెళ్లాలన్నా, ఇంటికి తిరిగి రావాలన్నా అదే కారులో వచ్చేవాడు. ఖాళీ సమయాల్లో అద్దెకు తిప్పేవాడు. అదనంగా డబ్బు సంపాదిస్తున్నాడు.రాష్ట్ర ప్రభుత్వం, రెడ్ క్రాస్ సంయుక్తంగా చేపట్టిన పథకం ద్వారా మంగీలాల్కు ఒక వన్ బీహెచ్కే ఇల్లు కూడా కేటాయించింది. అయినప్పటికీ, అతను భిక్షాటనను ఆపలేదు. చెక్కతో చేసిన కార్డు పట్టుకుని ఇండోర్ వీధుల్లో భిక్షాటన కొనసాగిస్తున్నాడు. భిక్షాటనతో పాటు సరాఫా బజార్ ప్రాంతంలో చిరు వ్యాపారులకు ఫైనాన్స్ ఇస్తూ.. ప్రతిరోజూ రూ.400–500 వరకు వసూలు చేస్తున్నాడని సమాచారం.జిల్లా నోడల్ అధికారి మాట్లాడుతూ, మంగీలాల్పై పలువురు ఫిర్యాదులు వచ్చినందున మహిళా శిశు అభివృద్ధి శాఖ అతని గురించి ఆరా తీసినట్లు తెలిపాడు. జిల్లా ప్రోగ్రామ్ అధికారి రాజీష్ సిన్హా మాట్లాడుతూ..భిక్షాటనను ప్రోత్సహించే లేదా దానిలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్ఆర్ఐ
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో మాజీ ఉపరాష్ట్రపతి ఆత్మీయ సమ్మేళనం
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం సింగపూరులోని నేషనల్ పబ్లిక్ స్కూలు ఆవరణలో దాదాపు 400 మంది ఆహూతులు సమక్షంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ అధ్యక్షత వహిస్తూ మాట్లాడుతూ, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ప్రారంభమే వెంకయ్య నాయుడు ఆశీస్సుల సందేశంతో జరిగిందని, అప్పటి నుంచి ప్రతి దశలోనూ వారి మార్గదర్శకత్వం, సూచనలు, ప్రోత్సాహం తమకు నిరంతరం లభిస్తూనే ఉన్నాయని తెలిపారు. అలాగే అతి తక్కువ సమయంలో సమాచారం అందించినప్పటికీ, సమయాన్ని సర్దుబాటు చేసుకుని కార్యక్రమానికి హాజరైన సింగపూరు భారతీయ హైకమిషనర్ డా. శిల్పక్ అంబులే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్య అతిథి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కుటుంబంలో, సమాజంలో, దేశంలో ఐక్యత ఉన్నప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. దేశంలో ఉన్న ప్రతిఒక్కరూ, నేతలందరూ ఐక్యంగా ఉండాలి. ఎన్నికల వరకే ప్రత్యర్థులు. ఆ తర్వాత అందరం భారతీయులం. ఐక్యంగా ఉంటే శాంతి ఉంటుంది. ‘‘భాష పోతే శ్వాస పోతుంది" అంటూ మాతృభాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను శ్రీ వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. తెలుగులోని గొప్ప సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించి ప్రపంచానికి అందించాలని విదేశాల్లోని తెలుగువారికి పిలుపునిచ్చారు.శ్రీ సాంస్కృతిక కళాసారథి గాయని–గాయకులు ఆలపించిన “మా తెలుగు తల్లికి” గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. సింగపూరులోని ప్రముఖ తెలుగు సంస్థలైన తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగుదేశం ఫోరమ్, కాకతీయ సంస్కృతిక పరివారం, APNRT ప్రతినిధులు హాజరై శ్రీ వెంకయ్య నాయుడు గారిని ఘనంగా సన్మానించారు.తదుపరి కార్యక్రమానికి హాల్ను సమకూర్చిన కొత్తమాస్ వెంకటేశ్వర రావు (KV Rao, SIFAS) , నేషనల్ పబ్లిక్ స్కూల్ సిబ్బందిని అభినందించారు. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ అందించిన హనుమంత రావు మాదల, నాగులపల్లి శ్రీనివాసు, శివప్రసాద్ టీమ్, సరిగమ గ్రాండ్, సూపర్ డీలక్స్, కూల్ టైం, వీర ఫ్లేవర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. గాయని–గాయకులు సౌభాగ్యలక్ష్మి తంగిరాల, చంద్రహాస్ ఆనంద్, శేషుకుమారి యడవల్లి, ఉషాగాయత్రి నిష్టల, అలాగే శరజ అన్నదానం, సౌమ్య ఆలూరు, కృష్ణ కాంతి లను శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ, రామాంజనేయులు చామిరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సుబ్బు వి. పాలకుర్తి వ్యాఖ్యానం అందించగా, వంశీ కృష్ణ శిష్ట్లా, కుమారస్వామి గుళ్లపల్లి సాంకేతిక సహకారం అందించారు. అలాగే మాధవి పాలకుర్తి, మమత మాదాబత్తుల సత్య జాస్తి, రేణుక చామిరాజు, ప్రసన్న భరద్వాజ్, శ్రీలలిత తదితరులు వాలంటీర్ సేవలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానంతరం విచ్చేసిన ఆహుతులందరికీ సరిగమ గ్రాండ్ వారు ఏర్పాటు చేసిన విందు భోజనంతో కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో ముగిసింది.
ఇరాన్ను ఈసీఆర్ కేటగిరీలో చేర్చిన భారత ప్రభుత్వం
భారత ప్రభుత్వం ఇటీవల ఇరాన్ దేశాన్ని ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ – విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు అనుమతి అవసరమైన) దేశాల జాబితాలో చేర్చింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ & ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ విభాగం గత ఏడాది ఆగస్టున సర్కులర్ను జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు 18గా ఉన్న ఈసీఆర్ దేశాల సంఖ్య 19కి పెరిగింది.ఈ నిర్ణయం ప్రకారం, ఈసీఆర్ పాస్పోర్టు కలిగిన భారతీయ కార్మికులు ఉద్యోగం కోసం ఇరాన్కు వెళ్లాలంటే ఇక నుంచి తప్పనిసరిగా భారత ప్రభుత్వ ఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ-మైగ్రేట్ పోర్టల్లో నమోదైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (బీఓఐ) ద్వారా ఎయిర్పోర్టులలోని ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల (ఐసీపి) వద్ద ధృవీకరణ జరుగుతుంది.ఇవే 19 ఈసీఆర్ దేశాలుఎమిగ్రేషన్ యాక్ట్–1983 ప్రకారం భారత ప్రభుత్వం నోటిఫై చేసిన ఈసీఆర్ దేశాలు ఇవి: ఈ దేశాలను స్పెసిఫైడ్ / నోటిఫైడ్ ఈసీఆర్ కంట్రీస్ గా కూడా పిలుస్తారు.గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలు (6): బహరేన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ).ఇతర దేశాలు (13): ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేసియా, సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్, ఇరాన్.ఈసీఆర్ పాస్పోర్ట్ అంటే ఏమిటి?ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వాయిర్డ్) పాస్పోర్ట్ అంటే – ఈ 19 దేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే ముందు, భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని అర్థం.సాధారణంగా 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారికి ఈసీఆర్ పాస్పోర్ట్ జారీ చేస్తారు. తక్కువ చదువు, తక్కువ లోకజ్ఞానం కలిగిన బలహీన వర్గాల కార్మికులను విదేశాల్లో దోపిడీ నుంచి రక్షించడమే ఈ విధాన ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా విదేశాల్లో శారీరక శ్రమ చేసే 'బ్లూ కాలర్ వర్కర్స్' సంక్షేమం కోసం ఈసీఆర్ వ్యవస్థను అమలు చేస్తున్నారు.ఎమిగ్రేషన్ క్లియరెన్స్ ఎలా?ఈసీఆర్ పాస్పోర్ట్ కలిగిన వారు ఈ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే ముందు, లైసెన్స్ పొందిన రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా హైదరాబాద్ లోని 'ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్' (పిఓఈ) కార్యాలయంలోఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాలి.వలస కార్మికుని పాస్పోర్ట్, ఉద్యోగ సంస్థ, జీతం ఒప్పందం, రిక్రూటింగ్ ఏజెన్సీ వివరాలు అన్నీ ఈ-మైగ్రేట్ సిస్టమ్లో నమోదు అవుతాయి.అలాగే, ఈసీఆర్ పాస్పోర్ట్ కలిగిన వారికి ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) కింద రూ.10 లక్షల ప్రమాద బీమా తప్పనిసరిగా వర్తిస్తుంది.రెండేళ్ల బీమాకు కేవలం రూ.325 ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఆన్లైన్లో పునరుద్ధరణ చేసుకోవచ్చు. ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అంటే?ఈసీఎన్ఆర్ (ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వయిర్డ్) అంటే – విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు భారత ప్రభుత్వ అనుమతి అవసరం లేదు అన్నమాట.ఈసీఎన్ఆర్ కేటగిరీకి వీరు అర్హులు:* 10వ తరగతి ఉత్తీర్ణులు* విదేశాల్లో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉన్నవారు* ఆదాయపు పన్ను చెల్లింపుదారులు* 50 సంవత్సరాల పైబడిన వారువీరు లోకజ్ఞానం కలిగినవారు, అవసరమైతే తమను తాము రక్షించుకునే సామర్థ్యం ఉన్నవారిగా ప్రభుత్వం భావిస్తుంది. వీరు కూడా ఐచ్చికంగా ప్రవాసి భారతీయ బీమా యోజన పొందవచ్చు.విజిట్ / టూరిస్ట్ వీసాలకు వర్తించదుఏ పాస్పోర్ట్ కలిగిన వారైనా – విజిట్ వీసా, టూరిస్ట్ వీసా, వైద్య అవసరాలు లేదా విహారయాత్రల కోసం ఈ 19 దేశాలకు వెళ్లేవారికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేదు.రాను–పోను విమాన టిక్కెట్, చెల్లుబాటు అయ్యే వీసా ఉంటే సరిపోతుంది.–మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు 91 98494 22622
జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి
విదేశాల్లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. జర్మనీలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలుగు విద్యార్థి ఒకరు చనిపోయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. మరణించిన విద్యార్థి పేరు తోకల హృతిక్ రెడ్డి.హృతిక్ స్వస్థలం తెలంగాణ జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామం. ఉన్నత విద్య కోసం అతను జర్మనీకి వెళ్లాడు. అయితే.. బుధవారం అతను నివాసం ఉంటున్న భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో భవనం నుంచి దూకి గాయాలతో మరణించాడని తెలుస్తోంది.తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హృతిక్ కుటుంబం బోరున విలపిస్తోంది. తమ బిడ్డ మృతదేహాన్ని రప్పించాలని ప్రభుత్వాల్ని వేడుకుంటోంది. ఈ ఘటనతో మల్కాపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి
విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ఎన్నారైల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన యశ్వంత్ కుమార్ గోషిక (33) శనివారం డల్లాస్లో గుండెపోటుతో మరణించారు. యశ్వంత్ ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. స్నేహితులను, తెలుగు ఎన్నారై సమాజాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.యశ్వంత్ కుమార్ తెలంగాణలోని చౌటప్పల్ గ్రామంలోని దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. అమెరికాలోనే మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆ తరువాత టాప్ MNCలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. స్లీప్ అప్నియాకు సంబంధించిన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని, ఆకస్మిక గుండెపోటు కారణంగా నిద్రలోనే మరణించాడని సన్నిహితులు వెల్లడించారు. తోటి తెలుగువారితో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు యశ్వంత్ మృతదేహాన్నిఅంతిమ సంస్కారాల కోసం భారతదేశానికి తిరిగి పంపడానికి NRI సంఘం ప్రయత్నాలు చేస్తోంది.విషాదం ఏమిటంటేయశ్వంత్కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైనట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పెళ్లికోసం స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్న తరుణంలో, పెళ్లికొడుకుగా చూడాలనుకున్న యశ్వంత్ అకాలమరణం వారిని తీరని విషాదంలోకి నెట్టేసింది.
క్రైమ్
తాంత్రికుడు మాటలు నమ్మి.. స్నేహితుణ్ని బలిచ్చారు!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజియాబాద్లో దారుణం జరిగింది. డబ్బులు, దైవానుగ్రహం కోసం ఇద్దరు యువకులు తన స్నేహితుణ్ని హత్య చేశారు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. పోలీసుల వివరాల మేరకు.. ఘాజియాబాద్లోని లోనీ ప్రాంతానికి చెందిన నందు అలియాస్ నవీన్ అనే యువకుడు జనవరి 13వ తేదీ రాత్రి తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో దారుణంగా హత్యకు గురయ్యాడు. నిందితులు పవన్ (25), సాగర్ అలియాస్ పండిట్ (24) తమ స్నేహితుడిని గ్యాస్ సిలిండర్తో దాడి చేసి చంపారు. అనంతరం శవాన్ని దాచిపెట్టేందుకు దాన్ని దుప్పట్లో చుట్టి బ్యాటరీతో నడిచే ఆటోలో పెట్టి, ఆ ఆటోను కాల్చివేశారు. ఎలక్ట్రిక్ ఆటో కాబట్టి ప్రమాదానికి గురైందని నమ్మించే ప్రయత్నించాడు. అయితే, బాధితుడి సోదరుడు ట్రోనికా సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, స్థానిక సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. మరో నిందితుడు నసీమ్ అలియాస్ ఇక్బాల్ పరారీలో ఉండగా.. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. వారు ఒక తాంత్రికుడిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఆ తాంత్రికుడు మానవ బలి ఇస్తే సంపద, దైవానుగ్రహం లభిస్తుందని చెప్పాడు. ఈ మాటలకు ప్రభావితులైన నిందితులు తమ స్నేహితుడినే బలిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధంగా నందును హత్య చేసి, శవాన్ని కాల్చివేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులిద్దరికీ గతంలోనే హత్య, దోపిడీ, ఆయుధాల చట్టం ఉల్లంఘన కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
కాళ్ల పారాణి ఆరకముందే..
విశాఖపట్నం: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందిన విషాద ఘటన ఎన్ఏడీ జంక్షన్ ఫ్లైఓవర్పై చోటుచేసుకుంది. పండగ ఆనందాలు మిగలాల్సిన ఆ కుటుంబాల్లో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. ఎంవీపీ కాలనీకి చెందిన మువ్వ నారాయణ రావు కుమార్తె రమా హిమజ (27)కు, గత ఏడాది నవంబర్లో ఎంవీవీ వినీష్తో వివాహం జరిగింది. హైదరాబాద్లో నివాసముంటున్న ఈ నూతన దంపతులు తొలి పండగ కోసం విశాఖ వచ్చారు. నాలుగు రోజులు కుటుంబంతో సంతోషంగా గడిపిన వీరు, శుక్రవారం కారులో అన్నవరం వెళ్లారు. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని, అదే రోజు రాత్రి తిరిగి విశాఖ బయలుదేరారు. మరో పావు గంటలో ఇంటికి చేరుకుంటామనుకునే సమయంలో.. ఎన్ఏడీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్పై కారు ముందు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి రోటరీ డివైడర్ను ఢీకొట్టింది. ఆ సమయంలో కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ప్రమాద తీవ్రతకు భయపడి తీవ్ర ఆందోళనకు గురైన హిమజ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఆమెను 108 వాహనంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతి చెందారు. మృతురాలి తండ్రి నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శంకర నారాయణ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.
ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య
ఒక్క క్షణం ఆలోచించలేకపోతున్నారు.. సమస్యలను ఎదుర్కోలేకపోతున్నారు.. ఆటుపోట్లకు నిలదొక్కుకోలేకపోతున్నారు.. అనుకున్నది జరక్కపోతే తట్టుకోలేకపోతున్నారు.. అత్తారింట్లో ఇమడలేకపోతున్నారు.. ఆడపడుచుల పోరుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.. తల్లిదండ్రుల చాటు బిడ్డలుగానే మెలుగుతున్నారు.. తెలిసీతెలియని వయస్సు పెళ్లిళ్లతో నలిగిపోతున్నారు.. కోపం వస్తే అణచుకోలేకపోతున్నారు.. అణకువను అలవర్చుకోలేకపోతున్నారు.. మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారు.. సమయస్ఫూర్తితో వ్యవహరించలేకపోతున్నారు.. నలుగురితో చర్చించలేకపోతున్నారు.. క్షణికావేశంలో విచక్షణ కోల్పోతున్నారు.. నూరేళ్ల జీవితాన్ని కాలరాసుకుంటున్నారు.. కంటిపాపలను నిర్దయగా చిదిమేస్తున్నారు.. నంద్యాల: ఆర్థిక, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలతో కొందరు ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నారు. ఏం పాపం చేయని చిన్న పిల్లలకు రంగుల లోకంలో చోటు లేకుండా చేస్తున్నారు. విషమిచ్చి, కాల్వలో తోసేసి చిన్నారులను తమతోపాటు తీసుకెళ్తున్నారు. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయాలతో కుటుంబసభ్యులకు రోదనే మిగులుతోంది. నంద్యాల జిల్లాలో కొన్ని రోజులుగా ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. 20 రోజుల్లో ఏడుగురు చిన్నారులు మృతి గడివేముల మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన బుగ్గానిపల్లి ఎల్లా లక్ష్మీ(23) గతేడాది డిసెంబర్ 28న మంచాలకట్ట సమీపంలో తన పిల్లలు వైష్ణవి(3), మూడు నెలల చిన్నారి సంగీతను ఎస్సార్బీసీ కాల్వలో తోసి తాను కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడవకముందే ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో వేములపాటి సురేంద్ర(34) ఆర్థిక సమస్యలతో తట్టుకోలేక సురేంద్ర కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి (4), సూర్యగగన్ (1.5)కు పాలలో విషం కలిపి తాపించి తాను చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త వేధింపులు భరించలేక మల్లిక(27) అనే మహిళ శనివారం ఉదయం ఇద్దరు పిల్లలు ఇషాంత్(7), పరిణతి(9నెలలు)కి పురుగుల మందు తాపి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గత 20 రోజుల్లో జిల్లాలో వరుసగా జరిగిన ఘటనల్లో అభం శుభం తెలియని ఏడుగురు చిన్నారులు నిండు జీవితాలను కోల్పోయారు. జీవితాలను బలి చేసుకోవద్దు సమస్య చిన్నదే అయినా కొందరు తీవ్రంగా భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాము లేకపోతే పిల్లలకు భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వస్తున్నారు. బలవన్మరణానికి పాల్పడతూ తమతోపాటు తీసుకెళ్తున్నారు. వారు తీసుకొనే నిర్ణయమే తప్పు అయితే పిల్లలను చంపి మరో తప్పు చేస్తుండటం విస్మయానికి గురి చేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని, తీవ్ర నిర్ణయాలు తీసుకొని జీవితాలను బలి చేసుకోద్దని సూచిస్తున్నారు.
ప్రియురాలి కోసం భార్యను చంపి..
కృష్ణా జిల్లా: తల్లిని తమ తండ్రి చంపటం జీర్ణించుకోలేక పోతున్నామని, తమ తండ్రికి కచ్చితంగా శిక్ష పడాలని మృతురాలు రేణుకాదేవి కుమార్తె, కుమారుడు ముక్కామల తేజశ్రీ, ముక్కామల నాగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పోరంకిలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమ తండ్రి ముక్కామల ప్రసాద్ చౌదరి ఆకునూరు ఝాన్సీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తమ తల్లి అడ్డుగా ఉందని పథకం ప్రకారం హత్య చేశారని తెలిపారు. తమ పట్ల తండ్రి కపటప్రేమ చూపాడని, తల్లి పేరున ఉన్న ఇంటిని నమ్మకంగా తన పేరున రాయించుకున్నాడని అన్నారు. తమ తండ్రి ఇంత దారుణానికి ఒడికడతాడని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. సెల్ఫోన్ డేటా ఆధారంగానే తల్లి హత్య ఉదంతం వెలుగు చూసిందని అన్నారు. హత్య వెనుక పలువురు వ్యక్తుల ప్రమేయం ఉందని అనుమానాలు ఉన్నాయని దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని కోరారు. నన్ను కూడా చంపాలని చూశారు... తన తండ్రి ప్రసాద్చౌదరి, ఆయనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఝాన్సీ తనను కూడా హత్య చేయాలని చూశారని మృతురాలి కుమారుడు నాగేష్ ఆరోపించారు. తనకు ఇష్టం లేకపోయినా తనను యూకేకు బలవంతంగా పంపారని, తనను యూకేలోనే చంపాలని పథకం వేశారని అన్నారు. తాను యూకేకు వెళ్లిన 25 రోజుల్లోనే తల్లిని హత్య చేశారని చెప్పారు. దీంతో తాను ఇండియాకు వచ్చానన్నారు. ఇంత దారుణానికి పాల్పడిన తండ్రి ప్రసాద్చౌదరి, ఝాన్సీలకు శిక్షపడాలని అన్నారు.
వీడియోలు
Ravi Teja: ప్రేమ పేరుతో యువతిని మోసం 10 ఏళ్ల జైలు శిక్ష
Palnadu: సిగ్గులేకుండా రికార్డింగ్ డ్యాన్స్ లు పైగా లోకేష్, పవన్ ఫోటోలు
Jada Sravan: మీరు టీడీపీకే హోం మంత్రి, డిప్యూటీ సీఎంలా
Karanguda : రోడ్లు వేయడం లేదంటూ కలెక్టర్కు ఫిర్యాదు
Karnataka : ఆఫీస్ లోనే ముద్దులు, కౌగిలింతలు అడ్డంగా దొరికిన DGP..
Sakshi Special: ఇన్ఫ్లుయెన్సర్ల కొత్త దందా
Guntur : కోట్ల భూమికి.. 30 లక్షలా? చెత్త ప్యాకేజీ..
తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్
Kannababu : మెడికల్ కాలేజీలకు డబ్బులేవ్ కానీ NTR విగ్రహం కోసం రూ. 1750 కోట్లు
బలవంతపు భూసేకరణ ఆపాలి హిందూపురంలో రైతుల ధర్నా

