వైఎస్ జగన్ను ఎలా అడ్డుకుందాం?
సాక్షి, అమరావతి : మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనపై గురువారం రాష్ట్ర మంత్రివర్గంలో విస్తృత చర్చ జరిగింది. అజెండా అంశాలు ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేక సమావేశంలో జగన్ పర్యటనలు, డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆందోళనలపై చంద్రబాబు చాలాసేపు మాట్లాడారు. వైఎస్ జగన్ క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న స్పందనపై చంద్రబాబు చర్చించారు. ఆ పర్యటనలను తప్పుబడుతూ మాట్లాడాలని, అక్కడ జరిగిన విషయాలను ప్రజలకు వ్యతిరేకంగా చూపాలని ఆదేశించినట్లు తెలిసింది. ఉద్యమంపై బురద చల్లండి..! తాజాగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన అంచనాలకు అందని రీతిలో విజయవంతం కావడం, జనవాహిని పోటెత్తడంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఆ పర్యటలను నీరుగార్చేలా ప్రచారాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్తో వైఎస్సార్సీపీ చేస్తున్న ఉద్యమంపై మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.ఇది ఇంకా తీవ్రమైతే ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. యువతలో దీనిపై చర్చ జరుగుతోందని, ఇది జెన్జీని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తుందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆ ఉద్యమంపై బురద జల్లాలని చంద్రబాబు మంత్రులకు సూచించనట్లు తెలిసింది. ఆ ఉద్యమంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు ఉన్నాయని ప్రచారం చేయాలని చెప్పినట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నేతలకు రిజర్వేషన్ల గురించి తెలియదని చెప్పాలని ఆదేశించినట్లు తెలిసింది. మరోసారి పవన్ డుమ్మామంత్రివర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి డుమ్మా కొట్టారు. గత మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. వరుసగా రెండు మంత్రివర్గ సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడం కూటమిలో చర్చనీయాంశంగా మారింది. భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో ఆయన సమావేశంలో పాల్గొనలేదని టీడీపీ సర్దిచెప్పుకుంటున్నా పవన్ కావాలనే రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రివర్గ సమావేశాలకు దూరంగా ఉంటూ తన శాఖకు సంబంధించిన అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షలు నిర్వహిస్తుండడం విశేషం.
గుజరాత్లో మిస్టరీ.. ఐదు రోజులుగా బావిలో ఏం జరుగుతోంది?
ఆ గ్రామంలోని ఓ సాధారణ బావి.. గత ఐదు రోజులుగా ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా లేదు. గాలి లేదు.. వర్షం లేదు.. ఎవరూ తాకడం లేదు.. అయినా బావిలోని నీరు సముద్రంలా అలలు ఎగురేస్తూనే ఉంది. ఈ వింతను చూసిన గ్రామస్థులు మొదట భయంతో వణికిపోయారు. భూకంపం రాబోతోందా? అంటూ ఆందోళన చెందారు.గుజరాత్లోని మోర్బీ జిల్లాలో ఉన్న ఒక 18 అడుగుల లోతైన బావి గత ఐదు రోజులుగా నిరంతరం అలలు, తరంగాలతో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో, వార్త క్షణాల్లో వ్యాపించడంతో వందలాది మంది అక్కడికి చేరుకుని, ఆ అద్భుతాన్ని తమ కళ్లారా వీక్షిస్తున్నారు. మరోవైపు.. బావి యజమాని ప్రాంజీవన్ సదారియా తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 2న ఆయన పొలానికి వెళ్లినప్పుడు బావిలోని నీరు అలలతో కదులుతూ బయటకు పొర్లిపోతున్నట్లు గమనించారు. మూడు నెలల క్రితమే ఈ బావిని తవ్వినట్టు చెప్పుకొచ్చారు.అయితే, ఈ మిస్టరీకి నిపుణులు ఇచ్చిన వివరణ మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు వేగంగా నిండిపోయాయి. రాళ్ల మధ్య చిక్కుకున్న గాలి బయటకు రావడంతో బావిలో నిరంతరం అలలు ఏర్పడుతున్నాయని ప్రాథమికంగా గుర్తించారు. అయినా ఈ వింత వెనుక అసలు రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి గాంధీనగర్ నుంచి నిపుణుల బృందం రంగంలోకి దిగుతోంది. ప్రశాంతంగా ఉండాల్సిన బావి... ఇప్పుడు అలలతో ఉప్పొంగుతోంది. ఇది ప్రకృతి సృష్టించిన అద్భుతమా? లేక ఇంకా వెలుగులోకి రాని మరో రహస్యమా? సమాధానం కోసం అందరి చూపు ఇప్పుడు ఆ బావిపైనే ఉంది!Well Water Continues to Oscillate in #Morbi Village; Collector Orders Probe#Gujarat #India 🇮🇳 pic.twitter.com/eZYwUKNvqV— Mahalaxmi Ramanathan (@MahalaxmiRaman) August 7, 2026ఇక, మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖరే ఈ ఘటనపై వెంటనే స్పందించి, బావిలో ఐదు రోజులుగా కనిపిస్తున్న అలల విషయాన్ని గుజరాత్ ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ ఘటనకు గల అసలు కారణాన్ని శాస్త్రీయంగా గుర్తించేందుకు గాంధీనగర్ నుంచి భూగర్భ శాస్త్ర నిపుణుల బృందాన్ని ఘటన స్థలానికి పంపించాలని ఆదేశించారు. నిపుణుల బృందం బావిని పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించిన తర్వాతే ఈ వింతకు గల ఖచ్చితమైన కారణాన్ని అధికారికంగా వెల్లడిస్తామని జిల్లా యంత్రాంగం తెలిపింది.
కీచక పాలనలో కీలక బిల్లు డ్రాప్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల భద్రత తమకు ఏమాత్రం పట్టదని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించుకుంది. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన చరిత్రాత్మకమైన ‘దిశ’ బిల్లును ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు సర్కారు తన నైజాన్ని బయటపెట్టుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, వేధింపులు పెచ్చుమీరిపోయాయి.చంద్రబాబు కూటమిలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద నేతల వరకు అనేక మంది మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. నిత్యం అనేక మంది కూటమి కీచకుల బారిన పడుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదు. చివరకు ఓ ఎన్నారై మహిళను చంద్రబాబు కేబినెట్లోని మంత్రే వేధించారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన దిశ బిల్లును చట్టంగా మార్పించాల్సింది పోయి.. చంద్రబాబు ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోవడంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ విప్లవాత్మక చర్యలు రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని రీతిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు’ను తెచ్చారు. మహిళలకు ఇది ప్రత్యేక రక్షణ కవచంలా నిలిచింది. ఇందులో భాగంగా ఆపదలో ఉన్న మహిళలు, బాలికల రక్షణ కోసం దిశ యాప్ను రూపొందించారు. ఫోన్లో దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్ను అటూ ఇటూ ఊపితే చాలు.. ఎస్వోఎస్ ద్వారా పోలీస్ స్టేషన్కు సమాచారం వెళ్లి 15 నుంచి 20 నిమిషాల్లోగా పోలీసులు బాధిత మహిళ ఉన్న ప్రదేశానికి వెళ్లి ఆమెను రక్షించే వారు. దిశ యాప్ను 1.5 కోట్ల మంది వారి ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్, ఎస్ఓఎస్ కాల్స్ ఆధారంగా భారీగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మహిళలపై వేధింపులు, గృహ హింస, అత్యాచారం, పోక్సో, కిడ్నాప్, ఈవ్టీజింగ్, హత్యాయత్నం వంటి కేసులు ఇందులో ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నుంచి నేరస్తుడి అరెస్టు, ఫోరెన్సిక్ నివేదిక, చార్జిïÙట్ నుంచి ప్రత్యేక కోర్టులో శిక్ష వరకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థతో నిరి్మంచిన సమగ్ర మహిళా భద్రతా వ్యవస్థ దిశ బిల్లు. మహిళలకు ప్రమాదకరంగా గుర్తించిన ప్రాంతాల్లో 24 గంటలూ పెట్రోలింగ్ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలను అందించారు. 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. పోక్సో కేసుల కోసం మరో 13 ప్రత్యేక కోర్టులను గుర్తించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. ఈ చర్యలతో మహిళలపై నేరాల దర్యాప్తు సమయం కూడా 156 రోజుల నుంచి 28 రోజులకు తగ్గించారు. 2017లో మహిళలపై నేరాల దర్యాప్తు పూర్తి చేయడానికి సగటున 156 రోజులు పట్టేది. 2021 నాటికి ఇది 67 రోజులకు, 2022లో 28 రోజులకు తగ్గింది. అత్యాచారం, పోక్సో కేసుల్లో 60 రోజుల్లో పూర్తి చేసిన దర్యాప్తులు 2019లో 14.15 శాతం కాగా, ఇది 2020లో 41.7 శాతం, 2021లో 92.21 శాతం, 2022లో 95.18 శాతానికి పెరిగాయి. లైంగిక నేరాల దర్యాప్తులో దేశ సగటు 40 శాతం కాగా ఏపీ 92.21 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. 2019–2022 మధ్య నమోదైన అత్యాచారం – హత్య కేసుల్లో 60 శాతం నిందితులను 48 గంటల్లోనే అరెస్టు చేశారు. గతంలో ఇలాంటి కేసుల్లో అరెస్టుకు సగటున 43 రోజులు పట్టగా, దిశ కాలంలో 8 రోజులకు తగ్గింది. త్వరగా అరెస్టు చేయడం ద్వారా నిందితులు తప్పించుకునే అవకాశాన్ని తగ్గించారు. దేశానికే దిశా నిర్దేశం చేసేలా జగన్ తెచ్చిన ఈ విప్లవాత్మక బిల్లుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. 19 అవార్డులు కూడా లభించాయి. 2024లో చంద్రబాబు సర్కారు రాగానే మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేసింది. దిశ బిలు్లకు కేంద్రం ఆమోదం రాలేదనే సాకుతో దిశ యాప్, పోలీస్ స్టేషన్లు, హెల్ప్డెస్్క, ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక కోర్టులు, పెట్రోలింగ్, దర్యాప్తు పర్యవేక్షణ వంటి మొత్తం వ్యవస్థకు పాతరేసింది. రమ్య హత్య కేసులో మరణ శిక్ష దిశ వ్యవస్థ ఎంత వేగంగా పనిచేస్తుందో గుంటూరులో జరిగిన రమ్య హత్య కేసు ఓ ఉదాహరణ. ఈ కేసులో నిందితుడిని 48 గంటల్లో అరెస్టు చేసి, 7 రోజుల్లో చార్జిïÙట్ దాఖలు చేశారు. విచారణను వేగంగా పూర్తి చేయడంతో నిందితుడికి మరణశిక్ష పడింది. 2019 డిసెంబర్ నుంచి 2022 ఏప్రిల్ వరకు 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. వీటిలో ముగ్గురికి మరణించే వరకు జీవిత ఖైదు, 19 మందికి జీవిత ఖైదు, పలువురికి 20 ఏళ్లు, 10 ఏళ్లు తదితర శిక్షలు విధించారు. ‘దిశ’ ఉపసంహరణతో మహిళల భద్రత ప్రశ్నార్థకంమాజీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆర్కే రోజా సాక్షి, అమరావతి: ‘దిశ’ ఉపసంహరణ మహిళా భద్రతకు బ్లాక్ డే అని, వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం దిశను రద్దు చేయడంతో మహిళల భద్రత ప్రశ్న్రా్థకంగా మారిందని మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆర్కే రోజాలు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం వారు వేర్వేరు ప్రకటనల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ తప్పుడు నిర్ణయంతో మహిళలపై దారుణాలకు ప్రభుత్వమే వత్తాసు పలికినట్లయిందన్నారు. కేవలం జగన్ చేసిన మంచి పని మిగిలి ఉండకూడదనే దురుద్దేశంతోనే దిశను రద్దు చేసిందన్నారు. వెంటనే వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రులు డిమాండ్ చేశారు. మహిళల భద్రతను సమాధి చేసే చీకటి నిర్ణయం ‘దిశ’ను తొలగించడం అంటే కేవలం ఒక బిల్లును ఉపసంహరించడం కాదు చంద్రబాబు గారూ.. మీరు ఇచ్చిన మహిళలకు భద్రత, చిన్నారులకు రక్షణ, బాధితులకు త్వరిత న్యాయం అనే హామీని వెనక్కి తీసుకున్నట్టే. మహిళల భద్రతను సమాధి చేసే ఈ చీకటి నిర్ణయమిది. తక్షణమే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉపముఖ్యమంత్రి దిశ వ్యవస్థ వల్ల మహిళలకు జరిగిన నష్టం ఏమిటో చంద్రబాబు చెప్పాలి దిశ వ్యవస్థ వల్ల మహిళలకు జరిగిన నష్టం ఏమిటో ఒక్క ఉదాహరణ అయినా చెప్పగలరా చంద్రబాబూ? నష్టం లేకపోతే మహిళలకు అదనపు రక్షణ కల్పించే వ్యవస్థను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు? మహిళలు, చిన్నారులపై అత్యంత తీవ్రమైన నేరాల్లో 21 రోజుల్లో దర్యాప్తు ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యం తప్పా? మహిళ చేతిలోని భద్రత ఆయుధాన్ని నిరీ్వర్యం చేస్తున్న మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – మాజీ మంత్రి విడదల రజినిమహిళల భద్రతకు పెను విఘాతమే మహిళలు, చిన్నారులకు దిశ రూపంలో ఉన్న రక్షణ కవచాన్ని చంద్రబాబు ప్రభుత్వం తొలగించడం దుర్మార్గం. కేబినెట్ తీసుకున్న ఈ చీకటి నిర్ణయం మహిళల భద్రతకు పెను విఘాతమే. – జి. తనూజా రాణి, ఎంపీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ఒక మహిళా హోం మంత్రిగా అనిత దిశ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, దాన్ని తొలగించే నిర్ణయాన్ని సమర్థించడం దురదృష్టకరం. మహిళల నమ్మకాన్ని దెబ్బ తీసిన హోం మంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలి. మహిళల భద్రతను రాజకీయాలకు బలి చేసినందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – కాకాణి పూజిత, వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రక్షణ కవచాన్ని తొలగించడం దుర్మార్గంమహిళలకు రక్షణ కల్పించాల్సిన కేబినెట్ వారి రక్షణ కవచాన్ని తొలగించడం దుర్మార్గం. మహిళల భద్రత కోసం దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిన ‘దిశ‘ మోడల్ను ఏపీ ప్రభుత్వమే తొలగించడం సిగ్గుచేటు. – చింతా అనూరాధ, మాజీ ఎంపీ మహిళల విశ్వాసానికి పాతర వైఎస్ జగన్ మహిళల రక్షణ కోసం దిశ వ్యవస్థను నిర్మించారు. ఆ వ్యవస్థనే వెనక్కి తీసుకెళ్లడం చంద్రబాబుకు మహిళల భద్ర పట్టదనడానికి నిదర్శనం. మహిళల విశ్వాసాన్ని కేబినెట్ నిర్ణయంతో తుడిచి పెట్టేస్తున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – వరదు కల్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు
పచ్చ బ్యాచ్ రౌడీయిజం
సాక్షి, అమరావతి, సాక్షి, నెట్వర్క్: ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అయింది.. అధికార మదంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు... ఉన్మాదంతో నీచాతి నీచానికి ఒడిగట్టారు... మునుపెన్నడూ లేనివిధంగా నిరసన శిబిరాలపై పాశవిక దాడులకు తెగబడి, దారుణ ఘటనకు పురిగొల్పి విష సంస్కృతికి తెర తీశారు. మహాత్ముడు జన్మించిన దేశంలో నిరసన తెలియ చేయడం ప్రజల ప్రజాస్వామ్య హక్కు. అలాంటి హక్కును కిరాతకంగా కాలరాశారు. నిరసన శిబిరాలపై దాడులకు తెగబడి దౌర్జన్యం చేయడం.. విజయవాడలో ఏకంగా బాటిల్లో మూత్రం తీసుకొచ్చి పైశాచికంగా శిబిరంలో ఉన్నవారిపై చల్లడం.. నడిరోడ్డుపై రౌడీయిజానికి దిగడం.. కానీ దెబ్బలు తిన్నవారిపైనే పోలీసులు తిరిగి కేసులు పెట్టడం.. నిజంగా ఇది రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే! ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయడం.. యువతకు రెండేళ్లుగా ఎగ్గొడుతున్న నిరుద్యోగ భృతి చెల్లించడం.. మెగా డీఎస్సీ 2025 స్కామ్పై సీబీఐతో విచారణ.. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్లతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శాంతియుత ఆందోళనలపై చంద్రబాబు సర్కారు దమనకాండకు పాల్పడింది. మెగా డీఎస్సీ పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు, అర్హులను వెనక్కి నెట్టి పోస్టులను అమ్ముకోవటాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6వతేదీ నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జెన్జీ యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉద్యమిస్తోంది. దగా పడిన డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, పార్టీ యువజన–విద్యార్థి విభాగాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుండటంతో తన కుమారుడి రాజకీయ భవిత అంధకారంలో పడుతుందని బెంబేలెత్తిన సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణులు, పోలీసులను రంగంలోకి దించారు. ఖాకీల అండతో పచ్చమూకలు విచ్చలవిడిగా వ్యవహరించాయి. పలు ప్రాంతాల్లో నేరుగా శిబిరాల వద్దకు చేరుకుని వీరంగం సృష్టించాయి. రెడ్బుక్ రాజ్యాంగం అమలులో నిమగ్నమైన పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. శాంతియుత ఆందోళనలను అడ్డుకోవడం, ప్రజాస్వామ్య హక్కులను చంద్రబాబు సర్కారు కాలరాయడంపై యువత మండిపడుతోంది. వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలను భగ్నం చేసేందుకు యత్నించడంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు పీకేస్తున్న టీడీపీ మూకలు బ్రాహ్మణనేత మల్లాది శిబిరంపై కోడిగుడ్లు విసిరి.. మూత్రం పోసి!బ్రాహ్మణనేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలో పాల్గొన్న నిరసన దీక్ష శిబిరంపై కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలు విసిరిన పచ్చమూక అంతటితో ఆగకుండా అత్యంత దారుణంగా మూత్రం పోసి రెచ్చిపోయాయి. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్వయంగా దీన్ని పర్యవేక్షించడం గమనార్హం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే దీక్షా శిబిరం ఏర్పాటైంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో అక్కడకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ తన అనుచరులతో కలసి దుర్భాషలకు దిగారు. టెంట్ వేసి ధర్నాలు చేయడం ఏమిటి..? లోకేశ్, చంద్రబాబును తిడితే తోలు తీస్తామంటూ ఎమ్మెల్యే బొండా టెంట్ పీకేయడంతో ఆయన వెంట వచ్చిన అనుచరులు మరింత చెలరేగిపోయారు. రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో శిబిరంలో ఉన్నవారిపై దాడి చేశారు. ముందుగానే బాటిల్లో తెచ్చుకున్న మూత్రాన్ని శిబిరంలో ఉన్నవారిపై చల్లి భీతావహ పరిస్థితి సృష్టించారు. మహిళా కార్యకర్తలపై కూడా దాడి చేశారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారే గానీ టీడీపీ మూకలను నిలువరించే యత్నం చేయలేదు. ఓ మహిళా కార్యకర్త టీడీపీ జెండా కర్రతో మల్లాది విష్ణు చేతిపై దాడి చేసింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి ధర్నా చౌక్కు తరలించడంతో అందులో కూర్చునే సాయంత్రం వరకు నిరసన తెలిపారు.టీడీపీ మూకల దాడిపై వైఎస్సార్సీపీ నిరసన..టీడీపీ మూకల దాడిని నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, ఎండీ రుహుల్లా, నగర మాజీ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అసిఫ్ తదితరులు విజయవాడ ధర్నా చౌక్లో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. శాంతియుత ఆందోళనకు ముందుగానే పోలీసుల అనుమతి తీసుకున్నామని, అయినప్పటికీ టీడీపీ మూకల నుంచి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాది విష్ణు శిబిరంపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ శ్రేణులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబును కలిసిన మర్నాడే బొండా బరి తెగింపు..సీఎం చంద్రబాబు వద్దకు తన కుమారులను వెంటబెట్టుకుని వెళ్లిన మరుసటి రోజే ఎమ్మెల్యే బొండా ఉమ ఈ దమనకాండకు తెగబడటం గమనార్హం. తన కుమారుడు లోకేశ్ రాజకీయ జీవితాన్ని రక్షించుకునేందుకే బొండాను ఉసిగొల్పినట్లు స్పష్టమవుతోంది. పలు సందర్భాల్లో కాపు నేతలనే చంద్రబాబు పావులుగా వాడుకుంటున్నారు. గతంలో గుడివాడ, మాచర్ల ఘటనల్లోనూ బొండా ఉమను పంపి దాడులకు పురిగొల్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. యూట్యూబర్ రావణ్పై నమోదైన కేసులన్నీ జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలోనే ఉండటం గమనార్హం. చంద్రబాబు తన రాజకీయ కుతంత్రంతో కాపు యువతను వాడుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.⇒ గుంటూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, తాడిపత్రి, బాపట్ల తదితర ప్రాంతాల్లో దీక్షా శిబిరాలను పోలీసులు బలవంతంగా తొలగించారు. వైఎస్సార్సీపీ నేతలను నిర్బంధించి దీక్షలను అడ్డుకునే యత్నం చేశారు. మాచర్ల, గురజాలలో పోలీసుల ఓవరాక్షన్పై వైఎస్సార్సీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్న నిరసన దీక్ష టెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు బెదిరింపులకు దిగారు. దీక్షలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించగా.. అక్రమ కేసులకు భయపడేది లేదని పిన్నెల్లి తేల్చి చెప్పారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో రిలే దీక్షల్లో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ⇒ రేపల్లె, పలమనేరు, చిలకలూరిపేట, వేమూరు, పొన్నూరులో రిలే దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షా శిబిరాలను తొలగించే యత్నాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిరోధించడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. మార్కాపురం జిల్లా కనిగిరిలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఉదయాన్నే కూల్చి వేశారు. కనిగిరి ఇంఛార్జ్ నారాయణయాదవ్ను పోలీసులు ఈడ్చేశారు. అనంతపురం జిల్లా యాడికిలో దీక్ష టెంట్ను టీడీపీ నేతలు దౌర్జన్యంగా తొలగించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటివద్దే పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన రిలే దీక్షలను దర్గామిట్ట పోలీసులు అడ్డుకున్నారు. 24 గంటల్లోగా బొండా ఉమాను అరెస్టు చేయాలిలేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉ«ధృతం చేస్తాం: మల్లాది విష్ణు టీడీపీ జెండాతో వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు, తదితరులపై దాడి చేస్తున్న టీడీపీ గూండాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ/గాంధీనగర్: పోలీసులు పూర్తిగా టీడీపీకి తొత్తులుగా మారారు. వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షకు అనుమతి ఉందా? లేదా? అనే విషయంలో ఎమ్మెల్యేకి ఏం సంబంధం? శిబిరం గురించి మేం పోలీసులకు సమాచారం ఇచ్చాం. ఎమ్మెల్యే మాపై దాడికి వస్తున్నట్లు ఒక గంట ముందే పోలీసులకు సమాచారం ఇచ్చాం. ఈ విషయం సీఐ సహా పై అధికారులందరికీ చెప్పాం. ధర్నా చేస్తుంటే టెంట్ పీకాల్సిన అవసరం ఏమిటి? రాళ్లు, కోడిగుడ్లు, టమోటాలు వేశారు. మహిళలపై దాడి చేశారు. ఇది మంచి ప్రభుత్వమా? ప్రతిపక్షం ఏమీ మాట్లాడకూడదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు.. ఏదైనా మాట్లాడితే తోలు తీస్తాం అంటూ బెదిరింపులు! ఇలాంటి రౌడీయిజం, గుండాయిజాన్ని సహించేది లేదు. మంత్రి లోకేశ్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందే. అంతవరకు మా పోరాటం ఆగదు. సీఎంవో డైరెక్షన్లో..ఎమ్మెల్యే బొండా ఉమా తన అనుచరులు, రౌడీ మూకలతో వచ్చి దాడికి తెగబడ్డారు. దాదాపు రెండు గంటల పాటు వైఎస్సార్సీపీ దీక్షా శిబిరం వద్ద బీభత్సం సృష్టించారు. టీడీపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమోటాలు, కుళ్లు పట్టిన పదార్థాల్లో మూత్రం పోసి వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళలపై విసిరి రాక్షసానందం పొందారు. దాడి చేస్తున్న బొండా ఉమా రౌడీ మూకలను పోలీసులు అడ్డుకోకుండా, మౌనంగా దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తరలించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే నేరుగా డైరెక్షన్ రావడం వల్లే పోలీసులు దాడిని అడ్డుకోలేదు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో యమధర్మరాజు స్కిట్ రూపంలో వినూత్నంగా రిలే నిరాహార దీక్ష.. సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ ఈ దాడి ఘటనపై హోంమంత్రి, డీజీపీ ఏం సమాధానం చెబుతారు? డీఎస్సీలో అక్రమాలు, అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. శాంతియుత దీక్షపై భౌతిక దాడులకు పాల్పడిన ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులపై 24 గంటల్లోగా పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను మరింత ఉ«ధృతం చేస్తాం. కాగా, శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై దాడి చేసి గాయపర్చిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు గుండె సుందర్పాల్, వరలక్ష్మీ, మాన్యం జగదీష్ ఎస్ఎన్ పురం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.
స్టాక్ మార్కెట్ తీరుపై వారెన్ బఫెట్ సీరియస్!
వచ్చాడు.. సిక్సర్లతో గెలిపించాడు!
పని మనిషి ఇంటికి వెళ్లి.. ఇక తిరిగి రాలేదు!
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా
గుజరాత్లో మిస్టరీ.. ఐదు రోజులుగా బావిలో ఏం జరుగుతోంది?
వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్
మరో వీడియా రిలీజ్ చేసిన ప్రధాని
బోఫోర్స్ కేసు.. చివరి తలుపు కూడా మూసేసింది!
ఆ సినిమాకు ఆస్కార్ రావాల్సిందే! లేకుంటే..
పౌరసత్వంపై ట్రంప్ సంచలన నిర్ణయం
సాక్షి కార్టూన్ : 06-08-2026
ఒకటి.. చెప్పడం తప్ప రెండు.. చేయడం తప్ప.. అన్నీ చేసేశారు!!
మన ఇల్లు లోతట్టు ప్రాంతంలో ఉండటం వలన డైరెక్ట్గా కొట్టుకొని వచ్చా!
పొగాకు రైతులు.. సర్కార్
ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి
సాక్షి కార్టూన్ : 05-08-2026
చదివిన పాఠశాల రుణం తీర్చుకున్న ధనుశ్.. విరాళం ఇన్ని కోట్లా..
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. సంఘంలో గౌరవం
సన్రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం.. 100 బంతుల్లో 241 రన్స్
‘ఏడు’ ఏడుపు కాదు.. అదృష్టం తెచ్చిపెట్టింది
మోదీ వీడియో.. క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు!
సూర్య కంటే మూడింతలు ఎక్కువ సంపాదించా
ప్రదీప్ రావత్.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
ఒకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఇది చాలదన్నట్టు ఆ మినిస్టర్ ఎవరు సార్!
నమ్మకం పోయింది.. వాంగ్చుక్ సంచలన ఆరోపణలు
కొత్త రికార్డుల దిశగా బంగారం!
ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి దక్కలేదు
రెస్టారెంట్లలో ఫ్రీగా మంచి నీరు ఇవ్వాల్సిందే..
'కొరియన్ కనకరాజు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
స్టాక్ మార్కెట్ తీరుపై వారెన్ బఫెట్ సీరియస్!
వచ్చాడు.. సిక్సర్లతో గెలిపించాడు!
పని మనిషి ఇంటికి వెళ్లి.. ఇక తిరిగి రాలేదు!
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా
గుజరాత్లో మిస్టరీ.. ఐదు రోజులుగా బావిలో ఏం జరుగుతోంది?
వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్
మరో వీడియా రిలీజ్ చేసిన ప్రధాని
బోఫోర్స్ కేసు.. చివరి తలుపు కూడా మూసేసింది!
ఆ సినిమాకు ఆస్కార్ రావాల్సిందే! లేకుంటే..
పౌరసత్వంపై ట్రంప్ సంచలన నిర్ణయం
సాక్షి కార్టూన్ : 06-08-2026
ఒకటి.. చెప్పడం తప్ప రెండు.. చేయడం తప్ప.. అన్నీ చేసేశారు!!
మన ఇల్లు లోతట్టు ప్రాంతంలో ఉండటం వలన డైరెక్ట్గా కొట్టుకొని వచ్చా!
పొగాకు రైతులు.. సర్కార్
ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి
సాక్షి కార్టూన్ : 05-08-2026
చదివిన పాఠశాల రుణం తీర్చుకున్న ధనుశ్.. విరాళం ఇన్ని కోట్లా..
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. సంఘంలో గౌరవం
సన్రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం.. 100 బంతుల్లో 241 రన్స్
‘ఏడు’ ఏడుపు కాదు.. అదృష్టం తెచ్చిపెట్టింది
మోదీ వీడియో.. క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు!
సూర్య కంటే మూడింతలు ఎక్కువ సంపాదించా
ప్రదీప్ రావత్.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
ఒకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఇది చాలదన్నట్టు ఆ మినిస్టర్ ఎవరు సార్!
నమ్మకం పోయింది.. వాంగ్చుక్ సంచలన ఆరోపణలు
కొత్త రికార్డుల దిశగా బంగారం!
ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి దక్కలేదు
రెస్టారెంట్లలో ఫ్రీగా మంచి నీరు ఇవ్వాల్సిందే..
'కొరియన్ కనకరాజు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఫొటోలు
'కొరియన్ కనకరాజు' మూవీలో స్పెషల్ సాంగ్ ట్రెండింగ్ లో దక్షా నగార్కర్ (ఫొటోలు)
హైదరాబాద్ : అంగరంగ వైభవంగా సచివాలయంలో బోనాల సంబరాలు (ఫొటోలు)
డెన్మార్క్లో హీరోయిన్ తాప్సీ సందడి (ఫొటోలు)
వెకేషన్లో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ చిల్ (ఫొటోలు)
బ్లాక్ డ్రెస్లో గోల్డెన్ హార్ట్.. ఈషా రెబ్బ స్టన్నింగ్ లుక్స్!(ఫొటోలు)
రీతూ చౌదరి, డిమాన్ పవన్ 'బంగారం' పాట లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
వైట్ డ్రెస్లో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ మ్యాజిక్... (ఫొటోలు)
ఏపీలో అద్భుత రాతి కొండ... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
‘అనకాపల్లి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా సోనూ సూద్ (ఫొటోలు)
ఉప్పెనలా తరలొచ్చిన జనం.. జగన్పై చెక్కుచెదరని అభిమానం (ఫొటోలు)
సినిమా
దేవదాస్... పార్వతిల ప్రయాణం
‘‘ఒక పార్టీలో లోకేష్ కనగరాజ్గారిని కలిశాను. మనిద్దరం కలిసి పని చేస్తే బాగుంటుందని చెప్పాను. ‘డీసీ’ చిత్రకథ ఆయనకు చాలా నచ్చడంతో హీరోగా నటించేందుకు వెంటనే ఓకే చెప్పారు. భారతీరాజా, సెల్వరాఘవన్, ధనుష్... వంటి వార్లను నేను డైరెక్ట్ చేశాను. దర్శకులతో పని చేయడం సులభంగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ విజన్ని త్వరగా అర్థం చేసుకుంటారు’’ అని అరుణ్ మాథేశ్వరన్ తెలిపారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘డీసీ’. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయిన్లుగా నటించారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా అరుణ్ మాథేశ్వరన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘డీసీ’ ఒక వైల్డ్ గ్యాంగ్స్టర్ కథ. దేవదాస్ తన ప్రయాణంలో చంద్ర, పార్వతిని కలుస్తాడు.ఆ తర్వాత వీరి జర్నీ ఎలా సాగుతుంది? అనేది ఈ సినిమా. దేవదాస్ అంటే అందరికీ క్లాసిక్ లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది. అదే పాత్రలను గ్యాంగ్స్టర్ ప్రపంచంలో చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథను రూపొందించాను. లోకేష్ కనగరాజ్ అద్భుతంగా నటించారు. వామికా గబ్బి సెక్స్ వర్కర్ పాత్రలో కనిపిస్తారు. దేవదాస్ను కలిశాక ఆమె జీవితం ఎలా మారుతుంది? అనేదే ఆమె పాత్ర ప్రయాణం. ఇళయరాజాగారి బయోపిక్ భవిష్యత్తులో ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
‘రామాయణ’ డేట్ ఫిక్స్
రామాయణం ఆధారంగా హిందీలో రూపొందిన చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. కాగా, ‘రామాయణ: పార్ట్ 1’ చిత్రాన్ని ఈ ఏడాది నవంబరు 6న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు.ఇప్పటికే ‘రామాయణ’ తొలి భాగం ట్రైలర్ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. తాజాగా ఇంగ్లిష్ ట్రైలర్ను రిలీజ్ చేసి, ‘రామాయణ పార్ట్ 1’ను నవంబరు 6న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ‘రామాయణ’ ఇంగ్లిష్ ట్రైలర్లో సంభాషణలు ‘బ్రహ్మ ఏఐ’ అనే కృత్రిమ మేధ సాయంతో పాత్రల లిప్ సింక్కు తగ్గట్లు రెడీ చేశారనే టాక్ వినిపిస్తోంది.ఇక ఈ చిత్రాన్ని ఇండియాలో ధర్మా ప్రోడక్షన్స్ రిలీజ్ చేస్తుండగా, ఓవర్సీస్లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేయనుంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాకు యశ్ సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ‘రామాయణ పార్ట్ 2’ని వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రియా ప్రకాశ్ వారియర్కు వింత ప్రశ్న.. అడగడానికి ఇంకేం లేదా?
మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్కు వింత అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్కు హాజరైన ఈ ముద్దుగుమ్మకు ఆమె వేసుకున్న డ్రెస్ గురించి కొందరు ప్రశ్నించారు. మీరెందుకు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు? దీనికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? అని ప్రియాను అడిగారు. దీనికి కాస్తా అసౌకర్యానికి గురైన ప్రియా అలాంటిదేం లేదని బదులిచ్చింది.ఇలాంటి సిల్లీ ప్రశ్నలు వేసి హీరోయిన్లను ఇబ్బంది పెట్టడమేంటని నెటిజన్స్ ఫైరవుతున్నారు. సినిమా గురించి అడగకుండా ఆమె డ్రెస్ కలర్తో పనేంటని రిపోర్టర్కు గడ్డిపెడుతున్నారు. హీరోయిన్ల నటించిన మూవీ గురించి ప్రశ్నలు అడగితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. కేరళలో కాషాయ రంగు దుస్తులు ధరిస్తే కూడా కారణం చెప్పాలా? వ్యక్తిగత స్వేచ్ఛ లేదా?" అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.#PriyaPrakashVarrier@Priyavarrier08 pic.twitter.com/v8RUt3R1q2— Sillarai Siruvar (@SillaraiSiruvar) August 5, 2026
హాలివుడ్ థ్రిల్లర్ ‘ప్రొటెక్టర్’ మూవీ రివ్యూ
ప్రపంచంలో ప్రతి వ్యక్తికి రక్షణ అనేది కీలకం. కాని ఆ రక్షణ అనేది ఎవరి నుంచి తమకు అందుతుందనేదే ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మంది మనకు రక్షణగా ఉంటుంటారు. అందులో మనకు సుదూరపు సరిహద్దుల నుంచి మనల్ని కాపాడే సైనికుడు కావచ్చు, కూతవేటు దూరంలో ఉండే పోలీసు కానిస్టేబుల్ కావచ్చు.. అంతెందుకు అనుక్షణం మన వెంట ఉండే మన స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. కాని మన ప్రాణం కోసం తన ప్రాణాన్ని అడ్డుపడుతూ మనల్ని కంటికి రెప్పలా కాపాడేది మాత్రం ఎప్పటికీ కన్నతల్లే. ఆ నేపథ్యంతో మన ముందుకు తీసుకువచ్చిన సినిమానే ప్రొటెక్టర్. ఇదో హాలివుడ్ థ్రిల్లర్. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. ఆద్యంతం ఈ సినిమా ప్రేక్షకుడిని ఉత్కంఠ రేపుతూ కదలనీయకుండా చేస్తుంది. అంతలా ఈ సినిమా కథలో ఏముందో ఓ సారి చూద్దాం. నిక్కీ ఓ రిటైరైన సోల్జర్. తాను డ్యూటీలో ఉన్నపుడు దాదాపు ఏళ్ళ తరబడి కన్నకూతురు క్లోయీని ఫోను ద్వారానే మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు రిటైరయ్యాక కూతురుతో ఆనందంగా గడుపుదామని అనుకుని క్లోయితో చెబుతుంది. కాని క్లోయీ నువ్వు నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదని బాధపడుతూ తాను స్నేహితులతో క్లబ్ కు వెళుతున్నానని చెప్పి విసురుగా వెళిపోతుంది. కన్న మమకారంతో క్లోయీ క్లబ్ వైపు వెళ్ళిన నిక్కీకి అక్కడ ఓ వింత అనుభవం ఎదురవుతుంది. క్లోయీని ఎవరో దుండగులు కిడ్నాప్ చేస్తూ కనిపిస్తుంది. దాంతో నిక్కీ వాళ్ళని వెంబడిస్తూ 72 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లోను తన బిడ్డను కాపాడుకోవాలని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటుంది. మరి నిక్కీ తన కూతురు క్లోయీని వెతికి పట్టుకుంటుందా లేదా అన్నది మాత్రం ప్రొటెక్టర్ సినిమాలోనే చూడాలి. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా మంచి థ్రిల్లర్. మరీ ముఖ్యంగా సినిమాలో వచ్చే ఆఖరి ట్విస్టు మాత్రం ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేస్తుందనే విషయం నిస్సందేహంగా చెప్పవచ్చు. మస్ట్ వాచ్ ఫర్ ది థ్రిల్లింగ్ వ్యూవర్స్.– ఇంటూరు హరికృష్ణ
క్రీడలు
పోరాడి ఓడిన శ్రియాన్షి
సియోల్: కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ శ్రియాన్షి వలిశెట్టి పోరాటం ముగిసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రియాన్షి 57 నిమిషాల్లో 16–21, 21–17, 13–21తో భారత్కే చెందిన మూడో సీడ్ తన్వీ శర్మ చేతిలో పోరాడి ఓడింది. భారత్కే చెందిన అష్మిత చాలిహా, రక్షిత శ్రీ కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో అష్మిత 21–17, 21–6తో కిమ్ జిన్ మి (దక్షిణ కొరియా)పై, రక్షిత శ్రీ 22–20, 21–10తో మనామి సుయిజు (జపాన్)పై గెలిచారు.భారత ఇతర ప్లేయర్లు ఇషారాణి బారువా 21–17, 18–21, 19–21తో కిమ్ మిన్ సున్ (దక్షిణ కొరియా) చేతిలో, మాన్సి సింగ్ 12–21, 21–14, 17–21తో హాన్ కియాన్ జి (చైనా) చేతిలో, అన్మోల్ ఖరబ్ 21–23, 21–15, 18–21తో థి ట్రాంగ్ వు (వియత్నాం) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గరగ కృష్ణప్రసాద్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ (భారత్) జోడీ 21–18, 21–19తో కిమ్ యంగ్ హైక్–షిన్ తె యాంగ్ (దక్షిణ కొరియా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది.
డిస్కస్ త్రో ఫైనల్లో అమానత్
యుజీన్ (అమెరికా): ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్ ఈరోజు పతకాల బోణీ చేసే అవకాశముంది. మహిళల డిస్కస్ త్రో ఈవెంట్లో అమానత్ కంబోజ్... పురుషుల జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్, ధరణీధరన్ ఫైనల్లోకి ప్రవేశించారు. డిస్కస్ త్రో క్వాలిఫయింగ్లో అమానత్ డిస్క్ను 52.58 మీటర్ల దూరం విసిరి ఓవరాల్గా 12వ స్థానంలో నిలిచి ఫైనల్కు చేరింది. డిస్కస్ త్రో ఫైనల్ నేడు జరుగుతుంది. ఆశిష్ జావెలిన్ను 69.87 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో, ధరణీధరన్ 68.07 మీటర్ల దూరం విసిరి 12వ స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మొగలి వెంకట్రామ్ రెడ్డి పురుషుల 800 మీటర్ల విభాగంలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించాడు. హీట్–5లో వెంకట్రామ్ 1 నిమిషం 52.81 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి సెమీఫైనల్కు చేరుకున్నాడు.
శివానికి రజతం
జైపూర్: జాతీయ సబ్ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ పతకాల బోణీ కొట్టింది. గురువారం ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్లో తొలి రోజు గ్రూప్–2 బాలికల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్ విభాగంలో శివాని కర్రా రజత పతకం సొంతం చేసుకుంది. శివాని 200 మీటర్ల లక్ష్యాన్ని 2 నిమిషాల 26.71 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. «200 మీటర్ల ఫ్రీస్టయిల్లో శివాని 2ని:11.30 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. అయితే రేసు ముగిశాక శివాని ఫాల్స్ స్టార్ట్ చేసినట్లు తేలడంతో నిర్వాహకులు ఆమెను డిస్క్వాలిఫై చేయడంతో పతకం చేజారింది.
554 మంది కోచ్ల ఖాళీలు!
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో ప్రస్తుతం 554 మంది కోచ్ల స్థానాలను భర్తీ చేయాల్సి ఉందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. రాజ్యసభలో గురువారం క్రీడలకు సంబంధించి వచ్చిన వేర్వేరు ప్రశ్నలకు ఆయన సమాధానిమిచ్చారు. జనవరిలో 350 మంది అసిస్టెంట్ కోచ్లను ఎంపిక చేసినా... దేశంలోని వివిధ ‘సాయ్’ కేంద్రాల్లో ప్రస్తుతం ఓవరాల్గా 554 స్థానాలు ఖాళీగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీటిలో 90 ఖాళీలు హెడ్ కోచ్లకు సంబంధించినవే కావడం గమనార్హం. డోపింగ్కు పాల్పడిన ఆటగాళ్లకు శిక్షలను మరింత కఠినతరం చేస్తున్నామని కూడా మంత్రి అన్నారు. ఈ క్రమంలో శాంపుల్ కలెక్షన్ పర్సనల్ (ఎస్సీపీ)ల సంఖ్యను బాగా పెంచామని, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, రాష్ట్ర స్థాయిల్లోనూ డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాని మాండవియా స్పష్టం చేశారు. దేశంలో ఫుట్బాల్ క్రీడను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం తమ సహకారం అందిస్తోందన్న మంత్రి... గత ఐదేళ్లలో ఇందు కోసం రూ.37.98 కోట్లు అందించినట్లు గుర్తు చేశారు. 2036 ఒలింపిక్స్ భారత్కు కేటాయించే విధంగా తమ వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
న్యూస్ పాడ్కాస్ట్
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
చంద్రబాబు పాలన రైతులకు హానికరం... చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ... వైఎస్ జగన్ ఆగ్రహం
అసత్య ప్రచారంలో ఆరితేరిన ఏపీ సీఎం చంద్రబాబు... రెండు మినహా హామీలన్నీ అమలు చేశానంటూ బుకాయింపు...
బీసీ నేతలపై రెడ్బుక్!. బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అక్రమ అరెస్టులు
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
ఏపీలో దగా డీఎస్సీపై దండయాత్ర... రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు విజయవంతం
దేశంలో పసిడికి తగ్గిన డిమాండ్... ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6 శాతం డౌన్
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ కుంభకోణంపై జెన్జీ వార్...
ఏపీలో డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ పదవి నుంచి తప్పుకోవాల్సిందే...
బిజినెస్
గూగుల్ సంచలన నిర్ణయం.. యూజర్లకు షాక్!
టెక్నాలజీ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు రానుంది. ఎన్నో ఏళ్లుగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు సహాయకుడిగా ఉన్న గూగుల్ అసిస్టెంట్ మాయమైపోతుంది. దీని స్థానాన్ని జెమినీ ఏఐ భర్తీ చేయనుంది. సెప్టెంబర్ 4 నుంచి ఆండ్రాయిడ్ పరికరాల్లో గూగుల్ అసిస్టెంట్ సేవలను క్రమంగా తొలగించనున్నట్లు గూగుల్ ప్రకటించింది.గూగుల్ తన వినియోగదారులకు పంపిన ఈమెయిల్లో, ఈ మార్పు ఒక్కసారిగా కాకుండా దశలవారీగా అమలు చేస్తామని తెలిపింది. అంటే.. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని వారాల వ్యవధి పడుతుందని తెలుస్తోంది. స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా.. ఆండ్రాయిడ్ టాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు, హెడ్ఫోన్లు, అలాగే ఆండ్రాయిడ్ ఆటోకు కనెక్ట్ అయ్యే పరికరాల్లో కూడా గూగుల్ అసిస్టెంట్ సేవలు నిలిచిపోనున్నాయి.నిజానికి.. గూగుల్ అసిస్టెంట్ను 2025 చివరి నాటికి పూర్తిగా తొలగించాలని కంపెనీ ముందుగా భావించింది. అయితే.. జెమినీకి మరిన్ని ఫీచర్లు జోడించేందుకు ఈ మార్పును కొంతకాలం వాయిదా వేసింది. ప్రస్తుతం జెమినీ అనేక కొత్త సామర్థ్యాలతో ముందుకు వచ్చినప్పటికీ, గూగుల్ అసిస్టెంట్లో ఉన్న కొన్ని ఫీచర్లు ఇంకా అందుబాటులో లేవు.గూగుల్ 2025 మార్చిలోనే అసిస్టెంట్ నుంచి జెమినీకి మార్పు గురించి ప్రకటించింది. భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ టెక్నాలజీనే కంప్యూటింగ్ రంగంలో కీలక మార్పు తీసుకురాబోతుందని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది వినియోగదారులు జెమినీని ఉపయోగించడం ప్రారంభించారని గూగుల్ తెలిపింది.ఇటీవలి కాలంలో జెమినీ వినియోగం వేగంగా పెరిగింది. ఏఐ ఆధారిత సేవలపై ప్రజల ఆసక్తి పెరుగుతుండటంతో జెమినీకి వినియోగదారుల ఆదరణ కూడా పెరుగుతోంది. గతంలో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్లు, రిమైండర్లు, సెర్చ్, స్మార్ట్ హోమ్ కంట్రోల్ వంటి పనులను నిర్వహించేది. ఇప్పుడు అదే స్థానాన్ని మరింత ఆధునికమైన ఏఐ సామర్థ్యాలతో జెమినీ భర్తీ చేయనుంది.
బంగారంపై 85% వరకు లోన్.. ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ఆఫర్!
అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే.. చాలామంది తమ వద్ద ఉన్న బంగారంపై లోన్ తీసుకోవాలనుకుంటారు. అలాంటి వారికి ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance) ఒక మంచి గోల్డ్ లోన్ ఆఫర్ అందిస్తోంది. ఇందులో మీరు.. మీ బంగారం విలువలో 85 శాతం వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది.వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వ్యాల్యూ, స్పీడ్, సేవింగ్స్ అనే మూడు ప్రధాన ప్రయోజనాలను అందిస్తున్నట్లు ముత్తూట్ ఫైనాన్స్ వెల్లడించింది. తక్కువ సమయంలోనే లోన్ అందించడం, సులభమైన ప్రక్రియతో సేవలు అందించడం తమ ప్రత్యేకత అని సంస్థ చెబుతోంది.గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు మొబైల్ నెంబర్, పిన్కోడ్ ఎంటర్ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. సంస్థ నిబంధనలు, షరతులకు అంగీకరించిన తర్వాత దరఖాస్తు పూర్తి చేయవచ్చు.ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ప్రత్యేకతముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ప్రత్యేకత ఏమిటంటే.. లోన్ అందించే ప్రక్రియ చాలా వేగంగా ఉండటం. బంగారం విలువను అంచనా వేసిన వెంటనే లోన్ అందించే విధానాన్ని సంస్థ అనుసరిస్తోంది. అంతే కాకుండా.. వడ్డీ రేట్లు, కస్టమర్కు అనుకూలమైన సేవలతో మంచి గుర్తింపు పొందింది. దేశంలోనే అత్యధిక గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో కలిగిన సంస్థగా ముత్తూట్ ఫైనాన్స్ రికార్డ్ క్రియేట్ చేసింది.ముత్తూట్ ఫైనాన్స్ దేశవ్యాప్తంగా 7,500కు పైగా శాఖలతో సేవలు అందిస్తోంది. రోజూ 2.5 లక్షలకు పైగా వినియోగదారులు తమ సేవలను వినియోగిస్తున్నారని, కేవలం ఒక్కసారి శాఖను సందర్శిస్తే వెంటనే గోల్డ్ లోన్ పొందే అవకాశం కల్పిస్తున్నామని కంపెనీ తెలిపింది.Gold Loan@Home గురించివినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంస్థ Gold Loan@Home అనే ప్రత్యేక సేవను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవ ద్వారా ఇంటి నుంచే గోల్డ్ లోన్ పొందే అవకాశం ఉంది. దీనికోసం ముందుగా లోన్ కోసం రివెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత సంస్థ ప్రతినిధులు ఇంటికే.. వచ్చి బంగారం విలువను అంచనా వేస్తారు. ఆ తర్వాత డబ్బు నేరుగా వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. దీంతో శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఇంటి నుంచే సౌకర్యవంతంగా లోన్ పొందవచ్చు.
టాటా నెక్సాన్ కొత్త ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?
భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న నెక్సాన్.. 'కామో ఎడిషన్' రూపంలో లాంచ్ అయింది. దీని ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనికి కంపెనీ పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనుంది.భారతదేశంలో నెక్సాన్ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని, 11 లక్షలకు పైగా అమ్మకాలను సాధించిన సందర్భంగా.. ఈ కాంపాక్ట్ ఎస్యూవీని టాటా మోటార్స్ లాంచ్ చేసింది. అయితే ఇందులో ఎలాంటి మెకానికల్ మార్పులు లేదు, కానీ కొన్ని కాస్మెటిక్ అప్డేట్లు & కొన్ని అదనపు పరికరాలను జోడించారు.నెక్సాన్ కామో ఎడిషన్ మున్నార్ మిస్ట్, కూర్గ్ క్లౌడ్ అనే రెండు కొత్త రంగుల్లో లభిస్తుంది. ఈ రంగులు కాకుండా కామో బ్యాడ్జ్లు కనిపిస్తాయి. క్యాబిన్లో కూడా ముందు సీట్ల హెడ్రెస్ట్లపై కామో థీమ్ ఉంటుంది. క్యాబిన్ లోపల 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో కూడిన కొత్త 12.3-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను అందించారు.మరో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే.. ఈ కారులోని నాలుగు సరౌండ్-వ్యూ కెమెరాలను ఉపయోగించి పనిచేసే ఇంటిగ్రేటెడ్ డాష్క్యామ్. ఇది నిరంతరంగా రికార్డ్ చేయగలదు, ప్రమాదం జరిగినప్పుడు ఫుటేజీని ఆటోమేటిక్గా సేవ్ చేస్తుంది, వీడియోలను ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్పై చూడటానికి లేదా స్మార్ట్ఫోన్కు బదిలీ చేయడానికి అనుమతిస్తుంది.వేరియంట్ను బట్టి.. పరికరాల జాబితాలో పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బ్లైండ్ వ్యూ మానిటర్తో కూడిన 360-డిగ్రీ కెమెరా, జేబీఎల్ స్పీకర్ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మొదలైనవి ఉన్నాయి. ఏడు ఫంక్షన్లతో కూడిన ఏడీఏఎస్ మాత్రమే కాకుండా.. ఆరు ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం కూడా ఉన్నాయి.నెక్సాన్ కామో ఎడిషన్.. స్టాండర్డ్ మోడల్లో ఉన్న అవే ఇంజన్ ఆప్షన్లతో కొనసాగుతుంది. కొనుగోలుదారులు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్, 1.2-లీటర్ టర్బో సీఎన్జీ యూనిట్ వంటి వాటిలో ఎంచుకోవచ్చు. వేరియంట్ను బట్టి, ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో మాన్యువల్, ఆటోమాటిక్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్లు ఉన్నాయి.ఇదీ చదవండి: E20 పెట్రోల్ సేఫేనా?.. 87 వేల పెట్రోల్ బంకుల్లో తనిఖీలు!
వివేక్ ఒబెరాయ్ రియల్ ఎస్టేట్ కంపెనీ దూకుడు
యూఏఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ బీఎన్డబ్ల్యూ డెవలప్మెంట్స్ (BNW Developments) భారత మార్కెట్పై మరింత దృష్టి సారిస్తోంది. దుబాయ్, రాస్ అల్ ఖైమా (RAK)లో చేపడుతున్న ప్రాజెక్టులకు భారతీయ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా తన ఛానల్ పార్టనర్ నెట్వర్క్ను విస్తరిస్తోంది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు, బ్రోకర్లతో భాగస్వామ్యాలను పెంచుకుంటోంది. వచ్చే నాలుగేళ్లలో యూఏఈలో సుమారు 10,000 ఇళ్లను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది.బీఎన్డబ్ల్యూ డెవలప్మెంట్స్ను అంకుర్ అగర్వాల్ స్థాపించగా, నటుడు-పారిశ్రామికవేత్త వివేక్ ఆనంద్ ఒబెరాయ్ మేనేజింగ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు. సంస్థ వివరాల ప్రకారం, బీఎన్డబ్ల్యూ ప్రస్తుతం దుబాయ్, రాస్ అల్ ఖైమాలో బ్రాండెడ్ రెసిడెన్సులు, హాస్పిటాలిటీ ఆధారిత ప్రాజెక్టులు, మిక్స్డ్-యూజ్ డెవలప్మెంట్లు, మాస్టర్-ప్లాన్డ్ కమ్యూనిటీలపై పనిచేస్తోంది. సంస్థ మొత్తం గ్రాస్ డెవలప్మెంట్ విలువ (GDV) సుమారు 32 బిలియన్ దిర్హమ్లుగా (రూ.72 వేల కోట్లే) పేర్కొంది.భారతీయ కొనుగోలుదారులే టార్గెట్అధిక అద్దె ఆదాయం, దీర్ఘకాలిక ఆస్తి విలువ పెరుగుదల, అంతర్జాతీయ కనెక్టివిటీ వంటి అంశాల కారణంగా సంపన్న భారతీయులు యూఏఈ ప్రాపర్టీ మార్కెట్పై ఆసక్తి చూపుతున్నారని బీఎన్డబ్ల్యూ చెబుతోంది. సంస్థ తాజా ప్రకటన ప్రకారం, 2026 తొలి అర్ధభాగంలో భారతీయ కొనుగోలుదారులు తమ మొత్తం వ్యాపారంలో 14.38 శాతం వాటాను కలిగి ఉన్నారు.దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్లో భారతీయుల ప్రాధాన్యం ఇతర తాజా డేటాలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. జూలై 2026లో వెలువడిన ఫామ్ ప్రాపర్టీస్ డేటా ప్రకారం, అంతర్జాతీయ ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చ్లలో భారత్ వాటా 20.59 శాతంగా ఉంది. అలాగే డీఎక్స్బీ ఇంటరాక్ట్ డేటాను ఉటంకిస్తూ, 2026 తొలి భాగంలో దుబాయ్లో విదేశీ కొనుగోలుదారుల్లో భారతీయులు అతిపెద్ద వర్గంగా కొనసాగుతున్నారని నివేదికలు పేర్కొన్నాయి.మార్కెట్ మందగించినా.. పెట్టుబడులపై ఆసక్తిమధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కార్యకలాపాలు కొంత మందగించాయి. కావెండిష్ మ్యాక్స్వెల్ గణాంకాల ప్రకారం, 2026 జనవరి–మే మధ్య దుబాయ్లో 66,900 రెసిడెన్షియల్ లావాదేవీలు నమోదయ్యాయి. వీటిలో సుమారు 74 శాతం ఆఫ్-ప్లాన్ కొనుగోళ్లే. అయితే మే నెలలో లావాదేవీలు 9,500కు తగ్గాయి. గత ఏడాది మేలో నమోదైన 17,600తో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల. తొలి ఐదు నెలల్లో మొత్తం లావాదేవీల విలువ 196.2 బిలియన్ దిర్హమ్లకు పైగా ఉండగా, గత ఏడాది ఇదే కాలంలో అది 217.8 బిలియన్ దిర్హమ్లుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారతీయ పెట్టుబడిదారులపై బీఎన్డబ్ల్యూ నమ్మకం ఉంచుతోంది. దుబాయ్లో మార్కెట్ వేగం కొంత తగ్గినప్పటికీ, భారతీయ కొనుగోలుదారుల నుంచి దీర్ఘకాలిక పెట్టుబడి డిమాండ్ కొనసాగుతోందని సంస్థ భావిస్తోంది.2,000 మందికి పైగా భాగస్వాములతో సమావేశంభారత మార్కెట్లో తన పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు బీఎన్డబ్ల్యూ ఇటీవల ఢిల్లీ-NCRలో గ్లోబల్ పార్ట్నర్స్ మీట్ నిర్వహించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 2,000 మందికి పైగా ఛానల్ భాగస్వాములు, రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు సంస్థ తెలిపింది. బీఎన్డబ్ల్యూ వ్యవస్థాపకుడు, చైర్మన్ అంకుర్ అగర్వాల్ మాట్లాడుతూ, భారత్ తమకు కేవలం కీలకమైన మూల మార్కెట్ మాత్రమే కాదని, సంస్థ భవిష్యత్ వృద్ధిలో వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు.
ఫ్యామిలీ
చెత్తలో పారేసిన లాటరీ టికెట్..ఏకంగా అన్ని కోట్లా..! కన్నీళ్లు పెట్టుకున్న మహిళ
ఒక్కోసారి పొరపాటున లేక ఏమరపాటున పెద్ద వాల్యు చేయదని పడేసిన లాటరీ టికెట్ ఒక్కోసారి ఊహకందని రేంజ్లో డబ్బును గెలుచుకుంటుంది. నిజమా కల అనిపించేంత సొమ్ముని అందిస్తుంటుంది. అయితే ఆ లాటరీ మన వద్ద ఉంటే..ఆ అదృష్టం మన చెంతే.. అదే చేజార్చుకుంటూ ఆ బాధ మాటలకందనిది. ఇక్కడొక మహళ కూడా చేజేతులారా లాటరీ టికెట్ని పోగోట్టుకుంది. కట్చేస్తే అది ఎంత మొత్తం గెలుపొందిందంటే..ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. దక్షిణ ఇటలీలోని బిటోంటోలో ఒక దుకాణంలో తన లాటరీ నంబర్లను సరిచూసుకున్నప్పుడు, అది అనర్హమైనది, (నాన్ పేబుల్) అని సందేశం రావడంతో మరో ఆలోచన లేకుండానే పారేసింది. నిజానికి అలా దుకాణం వద్ద చెల్లించలేనంత భారీ సోమ్ముని గెలుపొందినప్పుడే ఇలాంటి సందేశం వస్తుంది. అయితే సదరు మహిళ దుకాణం నుంచి ఇంటికి తిరిగి వచ్చాక..ఆమె తరుచుగా ఆడే నంబర్లే ఆమెను విజేతగా నిలిపాయని, కటుంబ సభ్యులు చెప్పాకగానే తెలియలేదు అసలు విషయం. ఆమె ఎంచుకునే నంబర్లన్నీ అత్యంత ఆప్తులైన వారికి సంబధించినవే. దీంతో ఆమె వెంటనే ఆ టికెట్ కోసం దుకాణానికి పరిగెత్తింది. అప్పటికే ఆ టికెట్ చెత్తలో పారేయబడటం, చెత్తను తరలించే వాహనంలో వెళ్లిపోవడం చకచక జరిగిపోయాయి. ఎలాగైనా టికెట్ని తిరిగిపొందేందుకు..ఆమె కుటుంబ సభ్యులు వ్యర్థాల నిర్వహణ సంస్థ 'SANB' నిర్వాహకుడు రాబర్టో నికోలా టోస్కానోను సంప్రదించారు. చెత్తను తీసుకువెళ్లే ట్రక్ అప్పటికే దానిని తీసుకెళ్లిపోవడంతో, అది దొరుకుతుందనే పెద్దగా ఆశ లేకుండానే టోస్కానో అతని బృందం ఆ ట్రక్ని గుర్తించి ఆపారు. చెత్తలో ప్రమాదకరమైన పదార్థాలు ఉండే అవకాశం ఉన్నందున, ప్రత్యేక సంరక్షణా సౌకర్యాలున్నా..సంస్థకు తరలించి, అక్కడి పారిశుధ్య కార్మికుల సాయంతో జల్లెడ పట్టారు. చివరికి ఆశ్చర్యకరంగా ఆ టికెట్ని గుర్తించారు. అదృష్టవశాత్తు చెక్కు చెదరకుండా ఉండటంతో ఆ విషయాన్ని టోస్కానో సదరు మహిళకు తెలియజేశారు. పాపం ఆ మహిళ ఒక్కసారిగా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఆమెకు అదృష్టం తిరిగి వరించినా..ఒక షరతు వర్తిస్తుందామెకు. ఎందుకంటే..SANB ఒక ప్రభుత్వ సంస్థ కావడంతో, ఆ అన్వేషణ ప్రక్రియకు అయిన అదనపు ఖర్చులన్నింటినీ భరించేందుకు ఆ మహిళ ఒక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ టికెట్ ఎంత సొమ్ము గెలుపొందిదంటే..అక్షరాల రూ. 11 కోట్లు. ఏదీఏమైతేనేం కాలదన్నుకున్నది కోట్లు తెచ్చిపెట్టింది..తిరిగి చెంతకు చేరింది. రాసి పెట్టుంటే..అది మన చెంతకు ఏదో విధంగా వచ్చి తీరుతుంది అంటే ఇదే కదూ..!(చదవండి: షాపింగ్ కోసం ఏకంగా హెలికాప్టర్..!విస్తుపోయిన అధికారులు)
తల్లిపాల నిర్వహణలో... స్మార్ట్ పరికరాలు
బిడ్డ పుట్టడానికి ముందే తల్లిపాలు పట్టే పరికరాలను సిద్ధం చేసుకోవడం వల్ల ప్రసవానంతర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు అనేది నిపుణుల సూచన. ఫలితంగా తల్లి ప్రసవానంతరం కలిగే వివిధ రకాల ఒత్తిడులను తగ్గించుకునే వీలుంది.తల్లిపాల పరికరాలు రోజువారీ సవాళ్లలో కొన్నింటిని సులభతరం చేసినా, సరైన సహకారం అందినప్పుడే వాటిని బాగా వినియోగించుకోగలరు. చనుబాలు పట్టించే నిపుణుల గైడెన్స్తో పాటు బాధ్యతలను పంచుకునే భాగస్వామి మద్దతు అవసరం. ‘బిడ్డలకు పాలిచ్చే పనులను సులువు చేయడానికి తల్లులు బ్రెస్ట్ పంపులు (51 శాతం), నర్సింగ్ బ్రాలు (37 శాతం), నర్సింగ్ దిండ్లు (31శాతం) వంటి సాధనాలను ఉపయోగిస్తున్నారని నివేదికలు చూపుతున్నాయి. నవతరం అమ్మలకు వచ్చిన అనుకూల ఉత్పత్తుల గురించి...ఫీడింగ్ మానిటర్స్: శిశువు పాలు మింగే శబ్దాలను గుర్తించడానికి, ఎన్ని పాలు తాగిందో లెక్కించడానికి, ఏఐ–ఆధారిత సెన్సార్లు కూడా వచ్చాయి.రియల్–టైమ్ బ్రెస్ట్ ఫీడింగ్ వేరబుల్: ఇది రొమ్ము చుట్టూ చుట్టుకునే ఒక మృదువైన, అనువైన పరికరం. ఇది బయోఇంపిడెన్ ్సను ఉపయోగించి, శిశువు ఎన్ని పాలు తాగిందో అనే దానిపై క్లినికల్–గ్రేడ్, లైవ్ డేటాను మొబైల్ స్క్రీన్ లపై అందిస్తుంది. లాక్టేషన్ ప్యాడ్ డ్రగ్ ట్రాకర్లు: ఇవి మైక్రోఫ్లూయిడిక్ ఛానెల్స్, లేజర్–ప్రేరిత గ్రాఫేన్ సెన్సార్లతో పొందుపరిచిన మోడర్న్ వేరబుల్ ప్యాడ్స్. తల్లి తీసుకునే మందులు (ఎసిటమినోఫెన్ వంటివి) నేరుగా తల్లిపాలలోకి చేరే రేటును ట్రాక్ చేసి, కొలుస్తాయి.ఇన్ఫాంట్ స్మార్ట్ బాటిల్స్: ఆహారపు అలవాట్లను మెరుగుపరచడానికి, సింక్రొనైజ్డ్ యాప్ల ద్వారా శిశువు బరువు పెరుగుదలను ట్రాక్ చేయడానికి బయోఫీడ్బ్యాక్ డేటాను అందిస్తాయి.ఇతర అనుకూలమైన పరికరాలు...ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్స్: వీటిని నర్సింగ్ బ్రా లోపల సెట్ చేసుకోవచ్చు. పాలు ఎక్కువైనప్పుడు ఈ పరికరం ద్వారా పాలు తీసి, స్టోరేజ్ చేయవచ్చు.నర్సింగ్ కవర్స్: తల్లిపాలు పట్టే సమయంలో మెడ భాగం నుంచి నడుము కిందవరకు ఆ్రపాన్ తరహాలో ఉండే కాటన్ కవర్ పూర్తిగా కప్పి ఉంచుతుంది. బిడ్డ పాలు తాగుతుండగా తల్లి నేరుగా చూసే అవకాశమూ ఉంటుంది. బయట పాలు పట్టడం అనే ఇబ్బందిని ఈ కవర్ దూరం చేస్తుంది.బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లోస్: పాలిచ్చే సమయంలో బిడ్డను పిల్లోపైన పడుకోబెట్టడానికి., కదలకుండా ఉండటానికి.. వీటిని ఉపయోగిస్తుంటారు. పాలు తాగే సమయంలో తల్లికి–బిడ్డకు ఈ పిల్లో అనువుగా ఉంటుంది.నర్సింగ్ ప్యాడ్స్: లీక్ ప్రూఫ్స్, స్కిన్ ఫ్రెండ్లీవి లభిస్తున్నాయి. వాపు, నొప్పి ఉన్న రొమ్ము చర్మానికి తక్షణ ఉపశమనాన్ని ఇచ్చే చల్లని జెల్ ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి.బ్రెస్ట్ మిల్క్ కంటెయినర్స్, స్టోరేజీ కప్స్: రొమ్ము నుంచి తీసిన పాలను కంటెయినర్లలో భద్రపరచేవి. సెన్సార్ స్టోరేజీ బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి బిడ్డకు తగినంత ఉష్ణోగ్రతలలో పాలు ఉండేలా నిల్వ చేస్తాయి. ఓవెన్ లేదా స్టవ్ ఉపయోగించకుండా ఫ్రీజర్లో భద్రపరిచిన పాలను కరిగించే స్మార్ట్ బాటిల్ వార్మర్స్ అందుబాటులో ఉన్నాయి.సిలికాన్ నిపుల్ ప్రొటెక్టర్: మొదటిసారి బిడ్డకు పాలు పట్టే సమయంలో, ఆ తర్వాత చనుమొనలు చిట్లడం, నొప్పి సమస్యలు ఉంటాయి. ఇలాంటప్పుడు సిలికాన్ నిపుల్ ప్రొటెక్టర్స్ బాగా ఉపయోగపడతాయి.బ్రెస్ట్ నిపుల్ క్రీమ్: ప్రసవం తర్వాత ΄÷డిబారిన, చిట్లిన, నొప్పిగా ఉన్న చనుమొనల సమస్యను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.
కేరళ వరదల్లో అమ్మ సాహసం!
బయట కుండపోత వర్షం. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో మృత్యువు ఆ ఇల్లాలి తలుపు తట్టింది. క్షణాల్లో ఇల్లు కూలిపోతోంది. ఆమె తల పగిలి రక్తం కారుతోంది. కానీ, ఆమెలో ఎక్కడ లేని బలం వచ్చింది. నొప్పినీ, భయాన్నీ పక్కన పెట్టి కాలంతో పరుగు తీసింది. కుప్పకూలుతున్న ఇంటి శిథిలాల నుంచి తన కుటుంబాన్ని ప్రాణాలతో బయటకు లాక్కొచ్చింది. కేరళలోని పయ్యన్నూరులో భయానక వరద విపత్తులో 54 ఏళ్ల ఇందూ దామోదరన్ చూపిన మాతృహృదయం ఇది.కేరళను గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉప్పొంగుతున్న నదులు. విరిగిపడుతున్న కొండచరియలు. అతలాకుతలమవుతున్న సామాన్య జీవితాలు. కానీ, ప్రకృతి సృష్టించిన ఈ మహా బీభత్సంలో ఒక సామాన్య మహిళ సృష్టించిన అద్భుతం ఇవాళ కేరళ వ్యాప్తంగా వైరల్గా నిలిచింది. కన్నూర్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పయ్యన్నూర్ మున్సిపాలిటీలోని కేలోత్ గ్రామంలో నివసిస్తున్న ఇందూ దామోదరన్ అనే మహిళ ఒక తల్లిగా, ఇల్లాలుగా విపత్కర పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం ఐదుగురు ప్రాణాలను కాపాడింది. అది కేవలం సమయస్ఫూర్తి కాదు, మరణాన్ని సైతం ఎదిరించిన మాతృమూర్తి ధైర్యం.అర్ధరాత్రి ప్రళయం.. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేలోత్ గ్రామంలోని లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమయ్యాయి. ఆగస్టు 3 అర్ధరాత్రి దాటిన సమయం. ఇందూ దామోదరన్ తన పూర్వీకుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తోంది. ఆ సమయంలో భర్త దామోదరన్ ఏదో పని మీద వేరే ఊరిలో ఉన్నారు. బయట వర్షం బీభత్సంగా కురుస్తుండగా ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దంతో ఇంటి పైకప్పు భాగం కూలి ఇందూ తలపై పడింది.ఆ దెబ్బకు ఆమె తల పగిలి, రక్తం ధారగా కారడం ప్రారంభమైంది. తీవ్రమైన నొప్పితో కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి. సాధారణంగా ఏ మనిషైనా ఆ సమయంలో భయంతో కేకలు వేస్తూ పడిపోతారు. కానీ, ఇందూ చుట్టూ చూసింది. పక్కనే గాఢ నిద్రలో ఉన్న వృద్ధురాలైన తల్లి, సోదరి, 14 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల మేనల్లుడు ఉన్నారు. ఇంకా ముఖ్యం ఐదేళ్ల వయసున్న చిన్న మేనల్లుడు నిద్రపోతున్నాడు. తాను పడిపోతే వీరంతా ఈ శిథిలాల కింద సమాధి అయిపోతారని ఆమెకు అర్థమైంది. అంతే, తల నుంచి కారుతున్న నెత్తుటిని తుడుచుకునే తీరిక కూడా లేకుండా ఆమె కదిలింది.మృత్యుగృహం నుంచి సురక్షిత తీరానికి...నెత్తురు ఓడుతున్న శరీరంతోనే ఇందు ఒక్కొక్కరినీ నిద్ర లేపింది. ఇల్లు కూలిపోతోంది, వెంటనే బయటకు రండంటూ కేకలు వేసింది. ఆ సమయంలో బయట ఊరంతా వరద నీరు చేరడం, అర్ధరాత్రి గాఢాంధకారం కావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు కూడా తమ ఇళ్లను కాపాడుకునే కంగారులో ఉన్నారు.ఎవరి సహాయం కోసం ఎదురుచూడకుండా భయంతో వణికిపోతున్న చిన్నపిల్లాడు పార్థివ్ను, నడవలేని స్థితిలో ఉన్న తన తల్లిని చేతుల్లోకి తీసుకుని, కాంక్రీట్ ముక్కలు పడుతున్నా లెక్కచేయకుండా వాకిట్లోకి పరుగెత్తింది ఇందూ. ఆమె వెనుకే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ప్రాణభయంతో బయటకు వచ్చారు. వారు వాకిట్లోకి వచ్చి, అడుగు దూరంలో ఉన్న సురక్షితమైన తోటలోకి చేరుకున్నారో లేదో... పెద్ద శబ్దంతో ఆ ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. కేవలం కొన్ని సెకన్ల వ్యవధి. ఇందూ గనుక ఆ నెత్తురు చూసి భయపడి ఉంటే, ఆ కొన్ని సెకన్లు ఆలస్యమై ఉంటే... ఇవాళ ఆ కుటుంబం ప్రాణాలతో ఉండేది కాదు.మాతృత్వపు అసాధారణ శక్తిప్రకృతి విపత్తుల ముందు మనుషులు ఎంత బలహీనులో మనం చూస్తూనే ఉంటాం. కానీ, అదే ప్రకృతి విపత్తును ఒక స్త్రీ తన సంకల్పబలంతో ఎలా ఎదిరించిందో ఈ ఘటన నిరూపించింది. పక్కన భర్త లేకపోయినా, ఊరంతా వరద ముంచెత్తినా, తీవ్రమైన గాయాలతో ఒంటరిగా పోరాడి గెలిచింది.ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇందూను చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆ సమయంలో ఆమెకు కలిగిన శారీరక నొప్పి కంటే, తన కుటుంబం ఏమైపోతుందనే మానసిక ఆందోళనే ఆమెను నడిపించిందన్నారు. కేరళ వరదల్లో ఇందూ దామోదరన్ ఒక సాధారణ బాధితురాలిగా మిగిలిపోలేదు; విపత్తుల కంటే మనుషుల ఆత్మవిశ్వాసం, బంధాల మీద ఉండే ప్రేమ చాలా శక్తిమంతమైనవని నిరూపించింది. సెల్యూట్ ఇందూ దామోదరన్!
ఉద్యోగానికి గుడ్బై.. సేవే అసలైన విజయం!
స్విట్జర్లాండ్లో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని, ఆర్థిక భద్రతను, సకల సౌకర్యాలనూ వదిలి ఇండియాను వెదుక్కుంటూ వచ్చిన సాండ్రా లావి గోజ్కోవిచ్ ఇక్కడ ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతోంది. ‘ఇండియాలో నేను ఇలా చేయాలనుకుంటున్నాను’ అని లావి ఒక ప్రణాళిక వేసుకొని రాలేదు. ఇక్కడ ఆమె అడుగు పెట్టిన తరువాత ఊహించని ప్రణాళిక పుట్టింది. ఆ ప్రణాళికలో నుంచే తన జీవిత లక్ష్యం రూపుదిద్దుకుంది..పశ్చిమబెంగాల్లోని ఒక గ్రామంలో ఒక స్కూల్ ప్రారంభించి పేద పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టిన లావి సాండ్రా బాల్య వివాహాల నిరోధానికి కృషి చేసింది. మానవ అక్రమరవాణ, గృహహింసకు వ్యతిరేకంగా గళం విప్పింది. తమ కుటుంబాల్లో మార్పు తెచ్చే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతోంది.తాజా విషయానికి వస్తే...తన జీవితంలోని కొన్ని విశేషాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది లావి సాండ్రా. కార్పొరెట్ బోర్డ్ రూమ్ను వదిలి భారతదేశంలోని మారుమూల ప్రాంత స్కూల్ రూమ్లోకి ఎలా వచ్చిందో వివరించింది. గ్రామస్తుల నమ్మకాన్ని చూరగొనడం లాంటి సవాళ్లు ఎన్నో ఆమెకు ఎదురయ్యాయి.ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాలలో ఒకటైన జ్యూరీచ్లో పెరిగిన లావి తన బాల్యం చాలా సంతోషంగా గడిచింది అని చెబుతుంటుంది. తల్లిదండ్రులు ఏది కాదనకుండా ఇచ్చారు. అందులో ఒకటి... ప్రపంచాన్ని చూసే అవకాశం.‘ప్రయాణాల వల్ల ఎన్నో సంస్కృతులను చూసే అవకాశం వచ్చింది. తల్లిదండ్రులు నాకు ఇచ్చిన విలువైన బహుమానం... ప్రయాణించే అవకాశం’ అంటుంది లావి. ఆ ప్రయాణాలలో ఒక జ్ఞాపకం ఆమె మదిలో స్థిరంగా నిలిచిపోయింది. చెప్పులు లేకుండా నడిచి వెళుతున్న ఒక పేద బాలికను చూసి బాధ పడిన లావి తన బూట్లను ఆ అమ్మాయికి ఇచ్చేసింది.‘పంచడంలోని ఆనందం నాకు తొలిసారిగా తెలిసొచ్చిన క్షణం అది’ అని గుర్తు తెచ్చుకుంటుంది లావి.‘ఎంతోమందికి కనీస సౌకర్యాలు లేవు. నాలాంటివారికి చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఎందుకు ఇలా?’ అనే ప్రశ్న ఆమెను వెంటాడింది. సామాజిక సేవ రూపంలో కొత్త మార్గాన్ని చూపింది.‘కెరీర్కు సంబంధించిన విజయం నాకు ఆర్థిక సౌకర్యం ఇచ్చింది కానీ, లక్ష్యాన్ని మాత్రం ఇవ్వలేదు అనే విషయాన్ని గ్రహించాను. ఈ క్రమంలోనే నా గురించి కాదు సమాజం గురించి ఎంతో కొంత పని చేయాలనుకున్నాను. అందుకే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు చొక్కాలు, రెండు ప్యాంట్లు సర్దుకొని ఇండియాకు వన్–వే టికెట్ కొనుక్కున్నాను’ అంటోంది లావీ.
అంతర్జాతీయం
అమెరికాకు కొత్త పవర్.. చైనా, రష్యాకు వార్నింగ్ బెల్స్?
ప్రపంచ భద్రతా సమీకరణాలను మార్చే నిర్ణయం దిశగా అమెరికా అడుగులు వేస్తోందా? చైనా లేదా రష్యాతో యుద్ధం జరిగితే ఇప్పటివరకు ఉన్న అణు వ్యూహాన్ని పూర్తిగా మార్చాలని పెంటగాన్ ఆలోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీర్ఘ శ్రేణి అణు క్షిపణులకే పరిమితం కాకుండా, యుద్ధభూమిలో వినియోగించే టాక్టికల్ అణు ఆయుధాలకు ప్రాధాన్యం పెంచే ప్రతిపాదనపై సమీక్ష జరుగుతున్నట్లు సమాచారం. ఈ మార్పు అమల్లోకి వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంక్షోభ సమయంలో మరిన్ని సైనిక ఎంపికలు లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై మద్దతుతో పాటు తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం అమెరికా ప్రధానంగా దీర్ఘ శ్రేణి వ్యూహాత్మక (Strategic) అణు క్షిపణులపై ఆధారపడుతోంది. అయితే కొత్త ప్రతిపాదనలో తక్కువ శ్రేణి టాక్టికల్ అణు ఆయుధాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమీక్షకు పెంటగాన్ విధానాల విభాగం అధిపతి ఎల్బ్రిడ్జ్ కోల్బీ నాయకత్వం వహిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.మరిన్ని సైనిక ఎంపికలే లక్ష్యమా?ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంక్షోభ సమయంలో మరిన్ని ప్రతిస్పందన ఎంపికలు అందుబాటులో ఉంచడమేనని అధికారులు చెబుతున్నారు. రష్యా లేదా చైనా.. అమెరికా మిత్రదేశాలపై దాడి చేసిన సందర్భంలో, భారీ స్థాయి అణు దాడికి మాత్రమే పరిమితం కాకుండా పరిస్థితికి అనుగుణంగా స్పందించే అవకాశాలు ఉండాలని ఈ సమీక్ష సూచిస్తోంది. ఒక సీనియర్ రక్షణ శాఖ అధికారి ప్రకారం..‘అమెరికాకు విశ్వసనీయమైన అణు ప్రతిస్పందన ఎంపికలు అవసరం. అధ్యక్షుడికి ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉంటేనే శత్రుదేశాలను సమర్థంగా నిరోధించవచ్చు’ అని అభిప్రాయపడ్డారు.టాక్టికల్ అణు ఆయుధాలు అంటే?టాక్టికల్ అణు ఆయుధాలు వ్యూహాత్మక అణు బాంబులతో పోలిస్తే తక్కువ శక్తి కలిగి ఉంటాయి. ఇవి యుద్ధభూమిలోని సైనిక స్థావరాలు, దళాలు లేదా ఇతర సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని ఉపయోగించేందుకు రూపొందించబడతాయి. అయినప్పటికీ, ఇవి కూడా భారీ ప్రాణనష్టం, విధ్వంసం సృష్టించే సామర్థ్యం కలిగిన అణు ఆయుధాలేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే, ఈ ప్రతిపాదనపై ఇప్పటికే చర్చ మొదలైంది. అనుకూల వర్గాలు ఇది అమెరికా అణు నిరోధక శక్తిని (Deterrence) మరింత బలపరుస్తుందని చెబుతుండగా, విమర్శకులు మాత్రం టాక్టికల్ అణు ఆయుధాలకు ప్రాధాన్యం పెరగడం వల్ల వాటి వినియోగానికి ఉన్న మానసిక అడ్డంకి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అణు ఆయుధం ఉపయోగిస్తే అది మరింత పెద్ద స్థాయి ఘర్షణకు దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.కాగా, ఈ ప్రతిపాదన ఇప్పటికీ విధాన సమీక్ష (Policy Review) దశలోనే ఉంది. అమెరికా ప్రభుత్వం అధికారికంగా కొత్త అణు విధానాన్ని ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం దీనిని పరిశీలనలో ఉన్న ప్రతిపాదనగా మాత్రమే పరిగణించాలి. అయితే, 1945లో హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు పడిన తర్వాత ప్రపంచంలో యుద్ధ రంగంలో అణు ఆయుధాలు మళ్లీ ఉపయోగించబడలేదు. అందుకే అమెరికా అణు వ్యూహంలో ఎలాంటి మార్పు ప్రతిపాదన వచ్చినా, అది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, ఆందోళనలకు కారణమవుతోంది.
హసీనా ప్రెస్మీట్ తర్వాత బంగ్లాదేశ్లో కలకలం
బంగ్లాదేశ్లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ నుంచి వర్చువల్గా నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కొద్ది గంటల్లోనే ప్రముఖ క్రికెటర్, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ కుటుంబ ఇంటిపై దాడి జరగడం కలకలం రేపింది. మగురా పట్టణంలోని కేశబ్మోర్ ప్రాంతంలో ఉన్న షకీబ్ పూర్వీకుల ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో పాటు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.బుధవారం రాత్రి సుమారు 8.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఇంటి కిటికీలను ధ్వంసం చేశారని, ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారని మగురా సదర్ పోలీస్ స్టేషన్ అధికారి అబ్దుల్లా అల్ మమూన్ వెల్లడించారు. కొందరు స్థానికులు పెట్రోల్ బాంబులు విసిరినట్లు చెబుతున్నప్పటికీ.. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా నిర్ధారించలేదు.ప్రెస్మీట్లో పాల్గొన్న గంటల్లోనే..ఈ దాడి వెనుక షకీబ్ రాజకీయ అనుబంధమే కారణమని మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ ఆరోపించింది. ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ వేదికగా నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో షేక్ హసీనా మాట్లాడగా.. షకీబ్ అల్ హసన్ కూడా అందులో పాల్గొన్నారు. ఈ పరిణామాల తర్వాతే తన ఇంటిపై దాడి జరిగిందని ఆవామీ లీగ్ పేర్కొంది. “ఆవామీ లీగ్ ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరైనందుకు ఇళ్లను తగలబెడుతున్నారు. బంగ్లాదేశ్ను నయా ఫాసిజం చుట్టుముడుతోంది” అంటూ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.#BREAKING: Sheikh Hasina Press Conference Fallout.Petrol Bomb thrown at Former Bangladesh national cricket team captain and former MP from Magura-1 constituency Shakib Al Hasan's house in the city. The incident took place at Shakib's ancestral residence in Keshabmor area of… pic.twitter.com/UBXEL9BfCr— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 5, 2026అయితే దాడికి, హసీనా ప్రెస్మీట్కు మధ్య సంబంధం ఉందనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. దాడికి పాల్పడిన వారి వివరాలు, ఉద్దేశం తెలియాల్సి ఉంది.షకీబ్ అలా..బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన షకీబ్ అల్ హసన్ రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. 2024 సాధారణ ఎన్నికల్లో ఆవామీ లీగ్ తరఫున మగురా-1 నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అయితే హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఒక హత్య కేసులో కూడా ఆయన పేరు నిందితుల జాబితాలో చేరింది. తనపై ఉన్న కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, కానీ భద్రత కల్పించాలని షకీబ్ గతంలో పేర్కొన్నారు. ప్రస్తుతం షకీబ్ బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లకుండా కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. వివిధ ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీల్లో మాత్రం కొనసాగుతున్నారు.హసీనా సంచలన వ్యాఖ్యలుఇదిలా ఉండగా.. బుధవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను డిసెంబర్లో బంగ్లాదేశ్కు తిరిగి వెళ్తానని ప్రకటించారు. “నా తిరుగు ప్రయాణం అధికారం కోసం కాదు.. బంగ్లాదేశ్ను తిరిగి అభివృద్ధి, లౌకికవాదం, అభివృద్ధి మార్గంలోకి తీసుకురావడానికే” అని ఆమె అన్నారు. తిరిగి వెళ్తే అరెస్టు చేయవచ్చని, ప్రాణహాని కూడా ఉండొచ్చని తెలిసినా స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.2024 ఆగస్టు 5న భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పదవి కోల్పోయిన తర్వాత షేక్ హసీనా భారత్కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్లోనే ఉంటున్నారు. బంగ్లాదేశ్లోని ప్రత్యేక ట్రైబ్యునల్ ఆమెకు మానవత్వానికి వ్యతిరేకమైన నేరాల ఆరోపణలపై గైర్హాజరులో మరణశిక్ష విధించింది...కొనసాగుతున్న రాజకీయ అశాంతిహసీనా మీడియా సమావేశంపై బంగ్లాదేశ్లోని ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆమె వ్యాఖ్యలను ప్రచారం చేయొద్దంటూ కొన్ని మీడియా సంస్థలను హెచ్చరించినట్లు సమాచారం. హసీనా అనుచరులు మాత్రం దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. షకీబ్ ఇంటిపై దాడి ఘటన కూడా అదే రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చోటుచేసుకోవడం బంగ్లాదేశ్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం షకీబ్ ఇంటి వద్ద భద్రతను పెంచిన పోలీసులు.. దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
మిలిటరీ కుటుంబాలపైనా ఇమ్మిగ్రేషన్ దాడులు
వాషింగ్టన్: అక్రమ వలసదారులపై చర్యల పేరుతో డొనాల్డ్ ట్రంప్ చేపడుతున్న చర్యలు వింత పోకడలకు పోతున్నాయి. రెండోసారి అధికారం చేపట్టిన తరువాత ఇమ్మిగ్రేషన్ అధికారులు జరిపిన పలు దాడుల్లో అక్రమ వలసదారులు మాత్రమే కాకుండా సర్వీసులో ఉన్న మిలిటరీ వాళ్ల కుటుంబ సభ్యులు కనీసం యాభై మంది ఉన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ నిర్వహించిన పరిశోధన తెలిపింది. అరెస్ట్ అయిన వారిలో మిలటరీ అధికారుల తల్లిదండ్రులు, భార్యలు ఉండగా వీరిలో ఆరుగురిని వారి స్వదేశాలకు తిప్పి పంపారని, ఎనిమిది మంది కస్టడీలో ఉన్నారని ఈ పరిశోధన బయటపెట్టింది. సాధారణంగా మిలటరీ అధికారుల కుటుంబాలకు ఇలాంటి విషయాల్లో రక్షణ ఉంటుంది కానీ ట్రంప్ కొత్త విధానాల కారణంగా ఇప్పుడు వారిపై కూడా ఇమ్మిగ్రేషన్ దాడులు, కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటన చేస్తూ మిలటరీలో పనిచేస్తున్నారన్న ఒకే కారణం వల్ల వారి బంధువులు ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించడం నుంచి మినహాయింపు ఇవ్వలేమని తెలిపింది. ఆర్మీ సార్జెంట్ హెదర్ టుర్కియోస్ జునెజ్ భార్యను సంతానం ముందే ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారని, వాయుసేన టెక్నికల్ సార్జెంట్ వెంటీ జిబీవ్ తండ్రిని మెక్సికో తిప్పి పంపారని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. జనవరి 2025 నుంచి జనవరి 2026 మధ్యకాలంలోనే డీహెచ్ఎస్ 125 మంది రిటైర్ అయిన మిలటరీ వారిని, 150 కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుందని సమాచారం. వీరిలో కొంతమందిని అమెరికా నుంచి బయటకు పంపించే ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం.
మసాయ్ మారాకు పర్యాటక ముప్పు
అభివృద్ధి రెండువైపులా పదునైక కత్తిలాంటిది. అది మంచి చేస్తామని చెబుతూనే తరతరాలుగా బతుకున్న నేలను నెమ్మదిగా ఆక్రమిస్తుంది. చివరకు మనుషులనే కాదు, జంతువులను తన నేలను తనకే పరాయిని చేస్తుంది. పర్యాటకం కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందంటారు. కానీ కొన్నిసార్లు ఆ అవకాశం కనబడకుండానే కబళించేస్తుంది. దాన్ని అందుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు మసాయి మారాలో ఈ రెండు ప్రక్రియలు.. మొత్తంగా పర్యావరణాకి, స్థానిక సమాజాలకు ముప్పు తెచ్చిపెట్టాయి.మసాయి మారా. కెన్యాలో అత్యంత ప్రసిద్ధ వన్యప్రాణుల అభయారణ్యం. అద్భుతమైన, వైవిధ్యభరితమైన అనేక జాతులకు అందమైన నిలయం. ఆఫ్రికాలోని సుప్రసిద్ధ సఫారీ గమ్యస్థానాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం, లక్షలాది మంది సందర్శకులు ఈ అభయారణ్యానికి వస్తారు. 1960వ దశకంలో ఈ రిజర్వ్ను స్థాపించినప్పటి నుంచి ఈ ప్రాంతానికి వచ్చే సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో కెన్యా ఆర్థిక వ్యవస్థకు మిలియన్ల డాలర్లు సమకూరుతున్నాయి. స్థానికులకు ఉద్యోగాలతోపాటు, స్థానిక వ్యాపారాలు లబి్ధపొందుతున్నాయి. ఈ లాభాలపై బహుళ జాతి కంపెనీలు, ఇంటర్నేషనల్ లగ్జరీ హోటల్స్ కన్ను పడింది. అభయారణ్యం అంతటా విస్తరిస్తున్న విలాసవంతమైన శిబిరాలు, లాడ్జీలు పర్యావరణ వ్యవస్థపై ఆందోళనలు పెంచుతున్నాయి. అనియంత్రిత అభివృద్ధి వన్యప్రాణుల ఆవాసాలను దెబ్బతీస్తోందని, టాంజానియాలోని సెరెంగెటి నేషనల్ పార్క్, కెన్యాలోని మసాయి మారా నేషనల్ రిజర్వ్ మధ్య జరిగే వన్యప్రాణుల వలసకు ముప్పు కలిగిస్తోందని పర్యావరణ పరిరక్షకులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాలుగా, మసాయి మారా కెన్యా ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉంది. పర్యాటకం నిస్సందేహంగా కెన్యా ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భాగం. ఇది ఏటా బిలియన్ల షిల్లింగ్లను ఆర్జిస్తూ, సఫారీ గైడ్లు, హోటల్ కారి్మకులు, రవాణా నిర్వాహకులు, హస్తకళల విక్రేతలు, మసాయి వర్గాల వంటి వేలాది మందికి ఉద్యోగాలను కల్పిస్తోంది. అయితే, ఈ పర్యాటకం, అభివృద్ధి వల్ల నష్టాలు కలుగుతున్నాయి. వలస మార్గాల సమీపంలో జరుగుతున్న నిర్మాణాలు, వాహనాల రద్దీ, మానవ కార్యకలాపాలు జంతువుల కదలికలకు అంతరాయం కలిగిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమైన వన్యప్రాణులపై ఇవి అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయి. జంతువులను వేటాడేందుకు సఫారీ వ్యాన్లు వాటి చుట్టూ గుమిగూడటం తరచుగా వాటిని భయపెడుతోంది. వాహనాల మార్గాలు జంతువుల దారులను వెంబడించడంతో సహజ ప్రక్రియలకు అంతరాయం కలుగుతోంది. మౌలిక సదుపాయాల నిర్వహణ సరిగా లేకపోవడంతో అభయారణ్యంలో కాలుష్యం పెరుగుతోంది. కీలకమైన వలస మార్గాల్లో విలాసవంతమైన హోటళ్లను నిర్మిస్తున్నారు. ఇవి నీటి వనరులను అడ్డుకుంటున్నాయి. కొత్తగా నిర్మించిన విలాసవంతమైన శిబిరాల్లో ఒకటి ‘గ్రేట్ మైగ్రేషన్’ మార్గానికి అడ్డుగా మారింది. సింహాలు, దున్నలు, హిరోలా జింకలు, వైల్డ్బీస్ట్లతో సహా అనేక జాతుల జనాభా తీవ్రంగా పడిపోయింది. ప్రతి సీజన్లో ఆ ప్రాంతం గుండా ప్రయాణించే లక్షలాది వైల్డ్బీస్ట్లకు ఇది ఒక కీలకమైన ప్రదేశం. ఇటీవలి సంవత్సరాల్లో వాటి సంఖ్య 150,000 నుంచి కేవలం 15,000కి పడిపోయింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రిజర్వ్లోని సున్నితమైన ప్రాంతాలలో కొత్త పర్యాటక వసతులపై 2023లో నిషేధం విధించినప్పటికీ, కొత్త శిబిరాలు వెలుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఉన్న సౌకర్యాలు విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. న్యాయ పోరాటం అభయారణ్యం లోపల, చుట్టుపక్కల పర్యాటక శిబిరాల నిర్మాణం, విస్తరణను సవాలు చేస్తూ పరిరక్షణ బృందాలు కోర్టుకెక్కాయి. ఈస్ట్ ఆఫ్రికా లా సొసైటీ, నేచురల్ జస్టిస్, జస్ట్యాక్ట్, ఆఫ్రికా సెంటర్ ఫర్ పీస్ అండ్ హ్యూమన్ రైట్స్ తాజాగా పిటిషన్ దాఖలు చేశాయి. కేసు విచారణ పూర్తయ్యే వరకు మసాయి మారా నేషనల్ రిజర్వ్లో నిర్మాణాలు, విస్తరణను నిలిపివేయాలని కోరుతున్నాయి. పలు బహుళ జాతి కంపెనీలు, ఇంటర్నేషనల్ లగ్జరీ హోటల్స్ నిర్మాణం, నిర్వహణను సవాలు చేశాయి. అభివృద్ధి పేరుతో విధ్వంసం కొనసాగితే మారా పర్యావరణ వ్యవస్థకు కోలుకోలేని నష్టం వాటిల్లవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం
యూపీఐ చెల్లింపులపై చార్జీలు
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) లావాదేవీలతోపాటు ఇతర ఎల్రక్టానిక్ ఆధారిత చెల్లింపులపై బ్యాంకులు చార్జీలు విధించబోతున్నాయి. ఈ మేరకు బ్యాంకులకు అధికారం కల్పిస్తూ పేమెంట్, సెటిల్మెంట్స్ చట్టం–2007లో కేంద్ర ప్రభుత్వం సవరణ చేసింది. సవరణ బిల్లును గురువారం లోక్సభలో ఆమోదించారు. ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ప్రస్తుతం యూపీఐ పేమెంట్లు ఉచితమే. గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్ల ద్వారా డబ్బులు పంపించినా లేక స్వీకరించినా ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదు. ఇకపై వీటికి రుసుములు కట్టాల్సిందే. బ్యాంకులు ఈ రుసుములు వసూలు చేస్తాయి. ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా చేసే తక్షణ చెల్లింపులకు సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫైడ్ ఎల్రక్టానిక్ చెల్లింపు విధానాలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వసూలు చేయకుండా బ్యాంకులు లేదా చెల్లింపు సేవా సంస్థలను నిరోధించే ప్రస్తుత చట్టపరమైన నిబంధనను తొలగించాలని ఈ సవరణ బిల్లు సూచిస్తోంది. వినియోగదారులపై అదనపు భారం లోక్సభలో గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘పన్నులు, ఇతర చట్టాలు (సవరణ) బిల్లు–2026’ను పరిశీలన నిమిత్తం ప్రవేశపెట్టారు. పేమెంట్, సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం–2007, ఇన్కంట్యాక్స్ చట్టం–2025, ఫైనాన్స్ చట్టం–2026ను సవరించడం ఈ బిల్లు ఉద్దేశం. వినియోగదారులు, చిన్న వ్యాపారాల కోసం డిజిటల్ చెల్లింపు సేవలపై రుసుము విధించడంతోపాటు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నడిపించే బ్యాంకులు, చెల్లింపు సేవా ప్రదాతలు, చెల్లింపు మౌలిక సదుపాయాల సంస్థలకు స్థిరమైన ఆదాయం వచ్చేలా చేయడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. పేమెంట్, సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం–2007లోని సెక్షన్ 10ఏలో, ఆదాయపు పన్ను చట్టం–1961లోని సెక్షన్ 269ఎస్యూ కింద నిర్దేశించిన ‘ఎల్రక్టానిక్ చెల్లింపు విధానాలు’అనే పదాలు, అంకెలు, అక్షరాలకు బదులుగా ‘కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎల్రక్టానిక్ చెల్లింపు విధానాలు’అనే పదాలను చేర్చాలని తాజా బిల్లు పేర్కొంది. సెక్షన్ 10ఏ బ్యాంకులు, సిస్టమ్ ప్రొవైడర్లు ఎల్రక్టానిక్ చెల్లింపులపై చార్జీలు విధించడాన్ని నిషేధిస్తోంది. సెక్షన్ 269ఎస్యూ రూ.50 కోట్లకు మించిన టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపారాలు, రూపే డెబిట్ కార్డులు, భీమ్–యూపీఐ క్యూర్ కోడ్లతో సహా నిర్దిష్ట ఎల్రక్టానిక్ పద్ధతుల ద్వారా చెల్లింపులను స్వీకరించాలని నిర్దేశిస్తోంది. ప్రస్తుతానికి సెక్షన్ 269ఎస్యూ కింద నిర్దేశించిన ఎల్రక్టానిక్ చెల్లింపు విధానాలను ఉపయోగించినందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి రుసుము విధించడం లేదు. బిల్లు చట్టంగా మారిన తర్వాత ఇలాంటి చెల్లింపులపై బ్యాంకులు చార్జీలు విధించబోతున్నాయి. వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. దీనివల్ల మళ్లీ నగదు లావాదేవీలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూపీఐ చెల్లింపుల వంటి ప్రజా మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి అవసరమని, దానికి ఎవరో ఒకరు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టంచేశారు.
సత్వరమే ‘పారాక్వాట్’ నిషేధం!
దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కలుపు/గడ్డి మందు ‘పారాక్వాట్ డైక్లోరైడ్’ తయారీ, అమ్మకం, వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. ‘క్రిమిసంహారక మందుల చట్టం–1968’లోని సెక్షన్ 27 కింద ఈ మేరకు గత నెల 13న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపే గడువు ఈ నెల 13తో ముగియనుంది. దీంతో, ఈ ప్రతిపాదిత నిషేధాజ్ఞలపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదిత నిషేధాన్ని ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అమల్లోకి తీసుకురావాలని ‘ఆశా–కిసాన్ స్వరాజ్’ జాతీయ సహ సమన్వయకర్త కవిత కురుగంటి నేతృత్వంలో 270 మందికి పైగా వైద్య నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి గురువారం సంయుక్త వినతిపత్రం సమర్పించారు. వీరిలో తెలంగాణ సహా అనేక రాష్ట్రాల వారున్నారు. పారాక్వాట్ అత్యంత తీవ్రమైన విషపూరిత గడ్డిమందు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్వల్ప పరిమాణంలో శరీరంలోకి వెళ్లినా ఇది ఊపిరితిత్తులకు నష్టం కలిగిస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. ఈ రసాయన విషప్రభావానికి గురైన వారిలో మరణాల రేటు ఏకంగా 70% వరకు ఉంటోంది. దీనికి ఇప్పటివరకు ఎటువంటి విరుగుడు అందుబాటులో లేదు. రసాయన పరిశ్రమల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వం పారాక్వాట్పై నిషేధ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రిమిసంహారకాల నియంత్రణకు బలమైన ‘పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ యాక్ట్’ తీసుకురావాలని కూడా నిపుణులు డిమాండ్ చేశారు. ఇతర దేశాల్లో నిషేధించిన ప్రమాదకర రసాయనాలను భారత్లోనూ స్వయంచాలకంగా నిషేధించాలన్నారు. 70కి పైగా దేశాలలో కొన్ని దేశాలు పారాక్వాట్ వినియోగాన్ని నిషేధించాయి, కొన్ని దేశాలు తీవ్రంగా నియంత్రించటం తెలిసిందే. అయితే, వ్యవసాయ విధాన విశ్లేషకులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి కేంద్రానికి విడిగా లేఖ రాశారు. పారాక్వాట్పై నిషేధాన్ని అమలు చేసే క్రమంలో ఇప్పటికే దిగుమతి చేసుకున్న నిల్వలను విక్రయించుకోవడానికి ఒక 6 నెలల గడువు మాత్రమే ఇవ్వాలని, ఎగుమతుల పేరుతో ఎటువంటి మినహాయింపులు ఇవ్వకుండా పూర్తి నిషేధం విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఏపీలో దిగజారిన శాంతిభద్రతలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని, ‘రెడ్బుక్’ దౌర్జన్యాలు పెచ్చుమీరాయని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీ లోక్సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాశ్రెడ్డి, డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు గురువారం సాయంత్రం ఢిల్లీలో అమిత్షాతో భేటీ అయ్యారు. మెగా డీఎస్సీ అక్రమాలతో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడడం, భారతి సిమెంట్స్, ఫ్రెంచ్ గ్రూపు వికాట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలను అధికారమదంతో బెదిరించడం, వాటి కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించడం వంటి కీలక అంశాలపై వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కేంద్ర హోం మంత్రి వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలపై జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్న విషయం తెలిసినా అందుకు అనుగుణంగా పోలీసు రక్షణ కల్పించకుండా రాష్ట్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని వివరించింది. వైఎస్సార్సీపీ ఎంపీలు లేవనెత్తిన అంశాలపై హోం మంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన విధంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారని వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు.. ఎంపీల బృందం లేవనెత్తిన అంశాలివే..పెచ్చుమీరిన కక్షసాధింపు రాజకీయాలు రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని, చట్టాలను టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తోందని ఎంపీలు కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల అక్రమ నిర్బంధాలు, రాజకీయ కక్షసాధింపు కేసులతో వేధిస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆదోని మాజీ ఎమ్మెల్యే విరూపాక్షల అరెస్టులు ఇందుకు నిదర్శనమని చెప్పారు. గత రెండు నెలల్లోనే నాలుగు లాకప్ డెత్లు చోటుచేసుకోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియామకాల్లో భారీ అక్రమాలు టీడీపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా అమలులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఎంపీలు ఫిర్యాదు చేశారు. అవినీతి, చేతివాటం కారణంగా అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో తీవ్ర ఆందోళనకు దారితీస్తోందని అమిత్షాకు వివరించారు. ఆయా అక్రమాలపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. భారతి సిమెంట్స్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు ఫ్రెంచ్ గ్రూపు వికాట్, భారతి సిమెంట్స్ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆరోపించారు. ప్రభుత్వపెద్దల ఆదేశాలతో అధికార పార్టీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలు రహదారులను దిగ్బంధించడం, సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో అ్రల్టాటెక్ సిమెంట్స్ విషయంలోనూ ఇదే తరహా పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల కార్యకలాపాలను ఈ విధంగా అడ్డుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్పై పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన హక్కుల పరిరక్షణకు చట్టబద్ధత కల్పించాలి గిరిజనుల విద్య, ఉద్యోగ, ఉపాధి హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా జీవో నెం.3కు ప్రత్యామ్నాయంగా చట్టబద్ధ వ్యవస్థను అమలు చేయడంతో పాటు అవసరమైన చట్ట సవరణలు చేపట్టాలని ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజరాణి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. జీవో నెం.3, 1/70 చట్టానికి సంబంధించిన అంశాలను సమగ్రంగా పరిశీలించి గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులు పరిరక్షించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్కు భద్రతా వైఫల్యంపై ఆందోళన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న పర్యటనల్లో ఆయనకు రక్షణ కరవైందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా దేవరపల్లి పర్యటనలో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చినప్పటికీ, పోలీసుల మోహరింపు నామమాత్రంగానే ఉందని, ఈ ఉదాసీనత వైఖరి వల్ల ప్రతిపక్ష నేతకు తీవ్రమైన భద్రతా ముప్పునకు దారితీసిందని చెప్పారు. గత రెండేళ్లుగా టీడీపీ ప్రభుత్వం దుర్బుద్ధితోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలా, చట్టబద్ధతను కాపాడేలా, పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని నిలబెట్టేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కోరారు. ఆయా సమస్యలపై తక్షణమే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల బృందం లేవనెత్తిన ప్రధానాంశాలపై కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారని వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఉచిత చెల్లింపులకు 'చెల్లు'!
సాక్షి బిజినెస్ డెస్క్: పల్లె నుంచి పట్నం వరకు దాదాపు అన్ని నగదు లావాదేవీలు ఇప్పుడు డిజిటల్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. అది రూపాయి అయినా వేల రూపాయలైనా సరే..స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. చిటికెలో చెల్లింపు జరిగిపోతోంది. అదీ ఎలాంటి చార్జీ లేకుండా..పూర్తి ఉచితంగా. కానీ ఇప్పుడా పరిస్థితి మారనుంది. డిజిటల్ పద్ధతిలో సులువుగా చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పిస్తున్న యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విధానం ఇకపై ఆర్థికంగా భారం కానుంది. ఇప్పటివరకు ఉచితంగా కొనసాగుతున్న ఈ సర్వీసు మీద భవిష్యత్తులో చార్జీలు విధించబోయే పరిస్థితి రానుంది. యూపీఐ చెల్లింపులపై ఫీజులు విధించడానికి బ్యాంకులు, పేమెంట్ సిస్టం ప్రొవైడర్స్ని అనుమతించేలా ప్రభుత్వానికి అధికారమిచ్చే చట్ట సవరణను లోక్సభ ఆమోదించింది. రూపే డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులపైనా చార్జీలు విధించడానికి ఇది మార్గం సుగమం చేయనుంది. యూపీఐ వ్యవస్థ నిర్వహణ భారం తడిసి మోపెడవుతోందని, చార్జీలు వసూలు చేసుకునేందుకు వీలు కల్పించాలంటూ బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్లు చాన్నాళ్లుగా గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో కేంద్రం ఆ మేరకు చర్యలు చేపట్టింది. అందరినీ డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించే లక్ష్యంతో ముందుగా యూపీఐ ఉచితమనే తాయిలం చూపించిన ప్రభుత్వం..దాదాపుగా దేశమంతా దానికి అలవాటు పడ్డాక ప్లేటు ఫిరాయించిందని, యూపీఐని కూడా ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యల వల్ల మళ్లీ ప్రజలు నగదు లావాదేవీల వైపు మళ్లే పరిస్థితి తలెత్తుతుందని.. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద గతంలోలా క్యూ లైన్లు కనిపించినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు. వీటిపై ఎండీఆర్ ఇకపై జీరో కాదు.. ప్రస్తుతం చెల్లింపుల సంబంధ ఆర్థిక లావాదేవీల కోసం ప్రాథమికంగా బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్ల నెట్వర్క్లను ఉపయోగించుకున్నందుకు గాను వ్యాపార వర్గాలు ఆయా సంస్థలకు చెల్లించాల్సిన చార్జీలను మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)గా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఇంటర్చేంజ్ ఫీజు, ప్రాసెసింగ్ చార్జీలు, నెట్వర్క్ ఫీజులు, పన్నుల్లాంటివి ఉంటాయి. క్రెడిట్, డెబిట్ కార్డులను జారీ చేసే బ్యాంకులకు చెల్లించేది ఇంటర్చేంజ్ ఫీజు, రేజర్పే, పేయూలాంటి పేమెంట్ ప్రాసెసర్ లేదా గేట్వేలకు కట్టేవి ప్రాసెసింగ్ చార్జీలు. వీసా, మాస్టర్కార్డ్ ఎన్పీసీఐలాంటి పేమెంట్ నెట్వర్క్లకు వెళ్లేది నెట్వర్క్ ఫీజు. అంతిమంగా ఈ సర్వీసులపై జీఎస్టీ కింద ప్రభుత్వానికి ట్యాక్సులు వెళ్తాయి. అయితే దేశీయ పేమెంట్ గేట్వేని, డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 2020 నుంచి యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్ అయినా జీరో చేస్తూ కేంద్రం చట్టం చేసింది. ఈ నేపథ్యంలో రూపే, యూపీఐ మినహా ఇతర వ్యవస్థల్లో యధావిధిగా 0.4 శాతం నుంచి 4.5 శాతం వరకు (కార్డును బట్టి) ఎండీఆర్ చార్జీలు కొనసాగుతున్నాయి. కాగా తాజా చట్ట సవరణలో యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ‘ఎండీఆర్ జీరో’ను తొలగించి దీనిపై నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టారు. ప్రభుత్వం ఇకపై ఎప్పటికప్పుడు విడుదల చేసే నోటిఫికేషన్ల ద్వారా యూపీఐ, రూపే లావాదేవీలకు సంబంధించిన చార్జీలను నిర్ణయించనుంది. ఇప్పుడు యూపీఐ భారాన్ని ఎవరు మోస్తున్నారంటే .. యూపీఐ లావాదేవీల వ్యయాల భారంలో కొంత భాగాన్ని బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్లు భరిస్తుండగా, మిగతాదంతా ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తోందని, ఇదంతా పన్ను చెల్లింపుదారుల సొమ్మేనని నిపుణులు చెబుతున్నారు. ఈ భారం ఏటా దాదాపు రూ. 20 వేల కోట్లు ఉంటుందని అంచనా. వాస్తవానికి తక్కువ విలువ చేసే లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో రూ.2 వేల లోపు విలువ ఉండే లావాదేవీలపై బ్యాంకులకు సబ్సిడీ ఇచ్చేలా 2021 డిసెంబర్లో ప్రభుత్వం స్కీమును ప్రవేశపెట్టింది. 2021–22లో ఇలా రూ.1,389 కోట్ల సబ్సిడీ ఇవ్వగా, 2023–24 నాటికి ఇది ఏకంగా రూ.3,631 కోట్లకు పెరిగింది. దీంతో క్రమంగా ఈ భారాన్ని తగ్గించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. 2026–27 బడ్జెట్లో ఇందుకోసం రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించడం ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇతరత్రా ఎల్రక్టానిక్ పేమెంట్స్ విధానాల్లో ఎండీఆర్ చార్జీలను పరిస్థితులను బట్టి కొందరు వ్యాపారులు తామే చెల్లిస్తుండగా మరికొందరు ఆ భారాన్ని కస్టమర్లకే బదలాయిస్తున్నారు. అమెరికాను సంతృప్తి పరిచేందుకేనా..? ఇన్నాళ్లూ ఉచితంగా ఇస్తూ వచ్చిన సర్వీసులపై చార్జీల భారాన్ని మోపాలనే ఆలోచన వెనుక ప్రత్యేక కారణాలున్నాయనే వాదనలు విని్పస్తున్నాయి. యూపీఐని ఆర్థికంగా నిలబెట్టాలంటే చార్జీలను విధించడం ఒక్కటే మార్గమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. అసలు ప్రజలకు బదలాయించాల్సిన అవసరమే లేకుండా ఈ భారాన్ని భరించేందుకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఆర్థిక సామర్థ్యాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. 2025–26లో ఆర్బీఐ ఏకంగా రూ.2.86 లక్షల కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి బదలాయించింది. కీలకమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను నిలబెట్టేందుకు ఇందులో చాలా తక్కువ మొత్తాన్ని వెచ్చించినా సరిపోతుంది అని వారంటున్నారు. మరోవైపు దీని వెనుక అమెరికా ఒత్తిళ్లు కూడా ఉన్నాయనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. యూపీఐ, రూపే వ్యవస్థలను ఉచితంగా అందించడం ద్వారా వీసా, మాస్టర్కార్డ్లాంటి తమ పేమెంట్ ప్లాట్ఫాంలకు భారత్ పొగ పెడుతోందంటూ 2026 యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ నివేదికలో అమెరికా ఆరోపించింది. ఈ నేపథ్యంలో చట్ట సవరణ జరగడంతో..ఇది అమెరికాను సంతృప్తి పరిచేందుకేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న మొత్తాలకు వర్తించకపోవచ్చు..! యూపీఐ పేమెంట్లపై చార్జీల వడ్డనకు రంగం సిద్ధమవుతున్నప్పటికీ, అన్ని చెల్లింపులపైనా చార్జీల భారం పడకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రూ.2 వరకు చెల్లింపులపై మినహాయింపు ఉండొచ్చని చెబుతున్నాయి. రూ.50 కోట్ల పైబడి టర్నోవర్ ఉండే పెద్ద వ్యాపారులకు సంబంధించిన యూపీఐ లావాదేవీలపై 0.3–0.6 శాతం వరకు చార్జీలు విధించవచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం చిన్న వ్యాపారులకు చేసే రూ.2 వేల వరకు మొత్తాలకు మాత్రమే ప్రభుత్వం ఇన్సెంటివ్ స్కీము కింద సబ్సిడీనిస్తోంది. ఆర్థిక శాఖ డేటా ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో వ్యాపారులకు కస్టమర్లు చెల్లించిన రూ.2 వేలకు పైబడిన లావాదేవీల పరిమాణం కేవలం 4 శాతంగానే ఉంది. లోకల్ సర్కిల్స్ అనే ఆన్లైన్ ప్లాట్ఫాం ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం రూ.3 వేలకు పైబడే యూపీఐ పేమెంట్ల మీద చార్జీలను కస్టమర్ల నుంచే వ్యాపారులు వసూలు చేస్తే తాము యూపీఐని వాడటం మానేస్తామంటూ దాదాపు 98 శాతం మంది చెప్పారట. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ ఊహగానాలేనని, వాస్తవ చార్జీలు.. భవిష్యత్తులో చట్ట సవరణ పూర్తిస్థాయిలో ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా మాత్రమే వెల్లడవుతాయని బ్యాంకర్లు చెబుతున్నారు. యూపీఐ లావాదేవీలు, విలువ కథా కమామిషు – 2016 ఏప్రిల్లో యూపీఐ ఆవిష్కరణ – 2016–17లో 2 కోట్ల లావాదేవీలు, విలువ సుమారు రూ.7 వేల కోట్లకు పరిమితం – పదేళ్లలో 12 వేల రెట్లు పెరిగిన లావాదేవీలు, 4 వేల రెట్లు పెరిగిన విలువ – 2025–26లో 24 వేల కోట్ల యూపీఐ లావాదేవీలు, విలువ రూ.314 లక్షల కోట్లు – యూపీఐ లావాదేవీల్లో రూ.2 వేలకు పైగా ఉండే చెల్లింపులు 4 శాతమే – 2021–22 నుంచి 2024–25 వరకు ఇన్సెంటివ్ స్కీము కింద కేంద్రం ఇచ్చిన మొత్తం రూ. 8,730 కోట్లు
ఎన్ఆర్ఐ
న్యూయార్క్లో వైభవంగా ఆషాఢమాస బోనాలు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా ప్రతిబింబించేలా స్థానిక ఐసెన్ హోవర్ పార్క్లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. లాంగ్ ఐలాండ్ (నాస్సా కౌంటీ) డిప్యూటీ డైరెక్టర్ మెంగ్ లీ, లెజిస్లేటర్ రోజ్ మేరీ వాకర్, టౌన్ క్లర్క్ రాగిని శ్రీవాస్తవ ఈ వేడుకలకు అతిథులుగా హాజరయ్యారు..ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రముఖ కళాకారులు, కవులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, గాయకుడు సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్యలు ప్రత్యేకంగా తమ పాటలు, ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు.అలాగే పద్మ కోడెల చేతుల మీదుగా జరిగిన అమ్మవారి అలంకరణ, పోతురాజు వేషధారణలో ఆశోక్ చింతకుంట చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అమెరికా నేలపై తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన ఈ బోనాల సంబరాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి.
లండన్లో అట్టహాసంగా 'టాక్' బోనాల సంబురం
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. హౌంస్లౌ నగరంలోని కింగ్స్లే అకాడమిలో జూలై 19న జరిగిన ఈ వేడుకలకు బ్రిటన్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ గణేష్ కుప్పాల.. వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హైకమిషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని.. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని ముఖ్య అతిథులు తమ సందేశంలో పేర్కొన్నారు. మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలతో తమ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరును ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల కోసం తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలానికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.బోనాల వేడుకలు విజయవంతం కావడం పట్ల టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు, అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. టాక్ కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగళి, సత్య చిలుముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లారెడ్డి, గణేష్ పాస్తాం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్రీ విద్య, దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, కార్తీక్, స్నేహ, అమరేశ్వరి, సాయిరావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఈమె న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడైన శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు. స్థానిక వివరాల ప్రకారం.. దీప ఐటీ ఉద్యోగిని అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్తతో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. శ్రీపాతి దీప మరణవార్త విన్న హైదరాబాద్లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. దీప మరణంతో ఆకుతోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఘనంగా తానా ప్రపంచసాహిత్యవేదిక 94వ సమావేశం
తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. “ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత” అనే అంశం మీద ఆదివారం జరిగిన 94 వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది. యూకేలో శస్త్రచికిత్సా వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా. చంద్ర చెరువు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తమ కుటుంబం తరపున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో శస్త్రచికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అలాగే ఇదే సందర్భంలో వెలువరించిన “మహర్షి సుశ్రుత ఏ కంపెండియం – ఫాదర్ ఆఫ్ సర్జరీ” అనే గ్రంధంలో విలువైన వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదములు అన్నారు. వేల సంవత్సరాలనాడే సుశ్రుతుడు సోదాహరణంగా వివరించిన వైద్య పద్దతులు, ఉపయోగించిన శస్త్ర పరికరాల జాబితా పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని అన్నారు. సుశ్రుతుడు రచించిన “సుశ్రుత సంహిత” గ్రంధంలోని అనేక విషయాలను ఇతర భారతీయ భాషలలోకి, ప్రపంచ భాషలలోకి అనువాదం కావలసిన అవసరం ఉందని, వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కారాలు స్ఫూర్తి దాయకంగావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.” తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వేల సంత్సరాలనాడే ప్రపంచం ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలగా ఉన్న “సుశ్రుత సంహిత” అనే ఆయుర్వేద గ్రంథం వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం అన్నారు. మనిషి సాధారణంగా 1,120 రకాల వ్యాధులకు గురిఅవుతాడని, 700 కు పైగా మొక్కల గురించి ఏ మొక్క, ఏ వ్యాధిని, ఎలా తగ్గిస్తుందో ప్రయోగాత్మకంగా నిరూపించాడు. 64 రకాల ఖనిజాల నుంచి అవసరమైన మందులను ఎలా తయారుచేసుకోవచ్చో వివరించాడు. ఈ గ్రంథంలో 120 శస్త్రపరికరాల గురించి వివరించాడు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! అనస్తీషియా ప్రక్రియకు ఆద్యుడు సుశ్రుతుడు. ప్రొస్టేట్ గ్రంథిని జాగ్రత్తగా తొలగించే పద్ధతి, విరిగిన ఎముకలు తిరిగి అతుక్కునేందుకు శస్త్రచికిత్స సూత్రాలు, తెగిన శరీర భాగాలను అతికించటం, అతి సున్నితమైన పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించగల్గడం, గర్భిణీస్త్రీ ఉదరంలో శిశువు పరిణామ క్రమం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్లు చేసే విధానం, వ్యాధిరహితంగా ఉండేందుకు ఏ ఏ కాలాల్లో, ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి, ఎలాంటి తృణధాన్యాలు, పప్పుదినుసుల వాడాలి అనే సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాధమికదశనుండే విద్యార్థులకు పాట్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి (డెట్రాయిట్ నుండి) సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి, డా. వి. కె రాజు (వెస్ట్ వర్జీనియా నుండి) సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్దతుల గురించి, డా. శేషు శర్మ (వాషింగ్టన్ డి.సి నుండి) సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహరం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే డా. పండరి గంటి (లాస్ ఏంజిల్స్ నుండి) సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంధంలో పేర్కొన్నారని, అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్న అతిథులందరికీ, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. (చదవండి: ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు)
క్రైమ్
భర్త, కుమారుడితో కలిసి ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
ఉయ్యూరు: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఇన్చార్జ్ కార్యదర్శిగా (సీఈఓ) పనిచేస్తున్న ఒక ఉద్యోగిని భర్త, కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నం చేయడం కృష్ణాజిల్లా, ఉయ్యూరు సమీపంలోని కడవకొల్లు ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. కడవకొల్లు శివారు వీరవల్లి మొఖాసా పరిధిలో గల పీఏసీఎస్లో పనిచేస్తున్న హేమ అక్కడికి సమీపంలోని ఉయ్యూరు శివాలయం రోడ్డులో భర్త బాలాజీ, కుమారుడు మేఘాన్ష్ తో కలిసి నివసిస్తున్నారు. బుధవారం రాత్రి ఇంట్లో భర్త, కుమారుడితో కలిసి పురుగు మందు తాగారు. ఫోన్ ద్వారా హేమ చెప్పిన సమాచారం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన వారి నివాసానికి చేరుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్న ముగ్గురిని వైద్యం నిమిత్తం తొలుత విజయవాడ ప్రభుత్వాసుపత్రికి, అటుపై మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సొసైటీ చైర్మన్గా పనిచేసిన జొన్నలగడ్డ తాతా నరేష్ బాబే తమ ఆత్మహత్యకు కారణమని సూచిస్తూ హేమ రాసిన సూసైడ్ నోట్ను స్వాదీనం చేసుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. ‘నరేష్ బాబుకు రూ.2 లక్షలు ఇచ్చి గుమాస్తాగా ఉద్యోగంలో చేరా. అటు తర్వాత సీఈఓగా పదోన్నతి పొందా. నరేష్ తన వ్యక్తిగత అవసరాలకు సొసైటీ సొమ్ము వాడుకుంటూ ఉండేవాడు. ఇవ్వనని నిరాకరిస్తే బెదిరించేవాడు. ఒత్తిడి తట్టుకోలేక డిపాజిట్లు క్లోజ్ చేసి సొమ్ము అప్పగించేవాళ్లం. అప్పటి నుంచి ఈ విధంగా రూ. 62,38,393 నగదు దుర్వినియోగం అయినట్లు బ్యాంకు అధికారులు గత నెల 17న నిర్వహించిన తనిఖీల్లో తేల్చారు. పది రోజుల్లో సొమ్ము జమ చేయాలని బ్యాంకు అధికారులు ఆదేశించారు. నరేష్ ను సొమ్ము విషయమై అడగ్గా తనకు సంబంధం లేదని, నువ్వే కట్టుకో అంటూ బెదిరించాడు. సొమ్ము కట్టలేని పరిస్థితుల్లో పరువు పోతుందనే భయంతో డిపాజిట్దారులకు ఎలా న్యాయం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడుతున్నా’ అని హేమ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా హేమ ఆరోపణలపై నరేష్ ను సంప్రదించగా తాను బ్యాంకు చైర్మన్ పదవి కోల్పోయి రెండున్నరేళ్లు అవుతుందని, నిధులు గోల్మాల్ వ్యవహారానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎప్పుడూ తనతో కార్యదర్శి హేమ చర్చించలేదని వివరణ ఇచ్చారు.
కారు ప్రమాదంలో అక్కాచెల్లెలు మృతి..!
తిరుపతి జిల్లా: స్వగ్రామానికి వెళుతుండగా మంగళవారం చైన్నె– బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన ప్రమాదంలో అక్కాచెల్లెలు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం జగవాండ్లపల్లె పంచాయితీ బోడిరెడ్డి గారిపల్లెకు చెందిన అనిల్ కుమార్ బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య మానస(35) మరదలు గౌతమి(32)తో కలిసి కారులో స్వగ్రామం బయలుదేరారు. బెంగళూరు కార్నర్లోని బట్టరహళ్లి వద్ద పరంధామరెడ్డి, జ్ఞానేంద్రరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ అడగడంతో కారులో ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో వి.కోట మండలం రామాపురం వద్ద హంద్రీ–నీవా కాలువ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అనిల్ కుమార్ మరదలు గౌతమి(32) కారులో నుంచి బయట పడి అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన మానసను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది. అనిల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. లిప్ట్ అడిగి ప్రయాణిస్తున్న పరంధామరెడ్డి, జ్ఞానేంద్రరెడ్డి క్షేమంగా బయటపడినట్టు సీఐ సోమశేఖర్రెడ్డి, ఎస్ఐ షేక్షావలీ తెలిపారు. అక్కాచెల్లెలు మృతదేహాలను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
నాలుగేళ్ల కొడుకుపై కన్న తండ్రి ఘాతుకం
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్న కొడుకునే చంపడానికి ప్రయత్నించాడు. రోడ్డుపై వెళుతున్న డీసీఎం కింద తోసినా చనిపోకపోవడంతో ఫ్లై ఓవర్ పిల్లర్కేసి బాదాడు. అదృష్టవశాత్తు స్థానికులు అడ్డుకోవడంతో బాలుడు మృత్యువాత నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన బుధవారం గుడిమల్కాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ ఫతేదర్వాజాకు చెందిన సల్మాన్ (25) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఇతడికి ముగ్గురు పిల్లలు. కొంతకాలంగా మద్యానికి బానిసగా మారిన సల్మాన్ భార్యతో నిత్యం గొడవపడుతూ ఉండేవాడు. మంగళవారం రాత్రి కూడా తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సల్మాన్ తన కుమారుడు అర్మాన్(4)ను గోల్కొండ నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నెంబర్ 104 వద్దకు తెచ్చాడు. మద్యం మత్తులో కుమారుడిని డీసీఎం ముందుకు తోశాడు. అదృష్టవశాత్తు డీసీఎం వాహనం బాలుడిపై వెళ్లలేదు. అయితే కుమారుడు చనిపోలేదన్న కోపంతో కసాయి తండ్రి చిన్నారి జుట్టును పట్టుకుని పిల్లర్కు కొట్టడం ప్రారంభించాడు. దీంతో స్థానికులు సల్మాన్ను అడ్డుకొని బాలుడిని కాపాడారు. పోలీసులు సల్మాన్ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న బాలుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
నో మీన్స్ నో.. తెహల్కా మాజీ ఎడిటర్కు బిగ్ షాక్
ప్రముఖ జర్నలిస్టు, తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు బాంబే హైకోర్టు గోవా బెంచ్లో ఎదురుదెబ్బ తగిలింది. తన జూనియర్ సహోద్యోగిపై అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును హైకోర్టు కొట్టివేసింది. తేజ్పాల్ను దోషిగా నిర్ధారిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. మధ్యాహ్నం శిక్ష ఖరారు కానుంది. అయితే తీర్పు అనంతరం.. కోర్టులో కాసేపు హైడ్రామా నడిచింది.2013 నవంబర్లో గోవాలో జరిగిన థింక్ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా ఓ హోటల్ లిఫ్ట్లో తనపై లైంగిక దాడి జరిగిందంటూ ఓ మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేయడంతో తేజ్పాల్పై కేసు నమోదైంది. ఆ సమయంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది.ఈ కేసులో 2014లో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2017లో గోవాలోని మపుసా కోర్టులో విచారణ ప్రారంభమైంది. 2021 మేలో కోర్టు తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీల్పై జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జంసందేకర్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తీర్పు వెలువడడాని కంటే ముందే తేజ్పాల్ కోర్టుకు వచ్చారు.బాధితురాలి ప్రవర్తనపై ముందస్తు అంచనాలు సరికాదురాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. లైంగిక దాడి బాధితురాలు ఎలా ప్రవర్తించాలనే ముందస్తు అభిప్రాయాలతో ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన వాదించారు. ప్రతి బాధితురాలి స్పందన ఒకేలా ఉండదని, వ్యక్తిగత పరిస్థితులు, సామాజిక నేపథ్యం, వ్యక్తిత్వం వంటి అంశాల ఆధారంగా మారుతుందని పేర్కొన్నారు.ట్రయల్ కోర్టు తన తీర్పులో బాధితురాలు లైంగిక దాడి అనంతరం సాధారణంగా కనిపించే ప్రవర్తనను ప్రదర్శించలేదని వ్యాఖ్యానించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన తుషార్ మెహతా.. బాధితుల ప్రవర్తనను ఒకే కొలమానంతో అంచనా వేయలేమని తెలిపారు. ఇటు తేజ్పాల్ తరఫున సీనియర్ న్యాయవాది అబాద్ పొండా వాదనలు వినిపించారు.నో మీన్స్ నో.. అరెస్ట్కు డిమాండ్తేజ్పాల్ను దోషిగా నిర్ధారించిన అనంతరం ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని తుషార్ మెహతా కోర్టును కోరారు. బాధితురాలు తన కుమార్తె వయసులో ఉన్నప్పటికీ తేజ్పాల్ నేరానికి పాల్పడ్డారని, ఆమె నిరాకరించిన తర్వాత కూడా ముందుకు వెళ్లారని వాదించారు. “ఒక మహిళ ‘నో’ అంటే దాని అర్థం నోనే అని సమాజానికి స్పష్టమైన సందేశం వెళ్లాలి” అని తుషార్ మెహతా కోర్టులో పేర్కొన్నారు.మరోవైపు, తీర్పు అనంతరం తరుణ్ తేజ్పాల్ శిక్షలో ఉపశమనం ఇవ్వాలని కోరారు. “నాకు 62 ఏళ్లు. నేను కూడా బాధితుడిననే నమ్ముతున్నాను. నాకు భార్య ఉంది. ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్తాను. దయచేసి నా విషయంలో కొంత సానుభూతి చూపించండి” అని కోర్టును అభ్యర్థించారు.తెహల్కా-తరుణ్ తేజ్పాల్ నేపథ్యంతెహల్కా భారత జర్నలిజం చరిత్రలో సంచలనాత్మక దర్యాప్తు కథనాలకు పేరుగాంచిన ప్రముఖ వార్తా మ్యాగజైన్. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ.. స్టింగ్ ఆపరేషన్లు, అవినీతి బహిర్గతాలు, రాజకీయ–కార్పొరేట్ వ్యవహారాలపై పరిశోధనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తెహల్కా వ్యవస్థాపకుల్లో తరుణ్ తేజ్పాల్ ఒకరు. జర్నలిస్టుగా, రచయితగా ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారు. 1990లలో జర్నలిజంలోకి వచ్చిన తేజ్పాల్.. పలు ప్రముఖ ప్రచురణ సంస్థల్లో పనిచేసిన అనంతరం 2000లో తెహల్కా డాట్కామ్ను ప్రారంభించారు. ఆ తర్వాత దానిని వార్తా మ్యాగజైన్గా తీర్చిదిద్దారు.తెహల్కా నిర్వహించిన కొన్ని స్టింగ్ ఆపరేషన్లు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా 2001లో వెలుగులోకి వచ్చిన “ఆపరేషన్ వెస్ట్ ఎండ్” రక్షణ రంగంలో అవినీతి ఆరోపణలపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కథనాలతో తెహల్కా పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే తర్వాతి కాలంలో తేజ్పాల్ వ్యక్తిగత జీవితం, సంస్థకు సంబంధించిన వివాదాలు కూడా వార్తల్లో నిలిచాయి. తాజాగా 2013 లైంగిక దాడి కేసులో హైకోర్టు తీర్పుతో ఆయన పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వీడియోలు
నగలు కొంటున్నట్లు డ్రామా.. 10 గ్రాముల నెక్లెస్ కొట్టేసిన దొంగలు
ఉదయనిధి.. స్టేషన్ బెయిల్ వెనుక విజయ్ మాస్టర్ ప్లాన్
పల్నాడులో YSRCP నేత దారుణ హత్య
బాబు అబద్దం చెప్పాడు అనేది పెద్ద అబద్దం.. భువనేశ్వరి వ్యాఖ్యలకు అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్
అసలు దాడి ఎలా చేసారంటే..! మీ కేసులకు, దాడులకు తగ్గేదేలే.. బోండా ఉమాపై మల్లాది విష్ణు ఫైర్
అయ్యా గూండా ఉమా.. నిన్ను లోకేష్ మింగేయడం ఖాయం..!
UPI యూజర్స్ కు బిగ్ షాక్..? ఇక బాదుడే బాదుడు
బరితెగించిన లోకేష్ గూండాలు.. వీడియోలో అడ్డంగా దొరికిపోయారు..
టెంట్లు పీకేసి, కోడిగుడ్లు విసిరి.. మూత్రం పోసి.. టీడీపీ సైకోల దాడి
రేవంత్ రెడ్డిని ఓడిస్తా.. కాంగ్రెస్ ను భయపెడుతున్న PK కామెంట్స్


