ఫస్ట్ తెలుగు సోషల్ ఫిల్మ్ @ 90 ఏళ్లు
ఇప్పటికి సరిగ్గా తొంభై ఏళ్ళ క్రితం తొలి తెలుగు సోషల్ ఫిల్మ్ – ‘ప్రేమ విజయం’ వచ్చింది (రిలీజ్ 1936 జూలై 20). ఇవాళ మనం చూస్తున్న అన్ని సోషల్ సినిమాలకూ అదే పునాది. చరిత్రలో అంతటి ప్రాధాన్యం ఉన్నా, ఇవాళ్టికీ అరకొర సమాచారమే తప్ప పూర్తి వివరాలు ఎవరికీ తెలియని చిత్రం అది. మైలురాయి లాంటి ఆ సినిమా చరిత్రను తవ్వి తీసిన వివరాలతో తొలిసారి అక్షరబద్ధం చేస్తున్న ఈ పరిశోధనాత్మక తెర వెనుక అసలు కథ ‘సాక్షి’కి ప్రత్యేకం.తెలుగు సినిమా అంటే ఒకప్పుడు పౌరాణికం, జానపదం... ఇలా రకరకాల జానర్లుండేవి. ఇవాళ అత్యధిక భాగం సాంఘికమే. తొంభై ఏళ్ళ క్రితం తెలుగు తెరపై సాంఘిక చిత్రాలు తీయడం ఓ విడ్డూరం. పౌరాణిక, జానపద కథలదే రాజ్యమైన తెరపై, సామాజిక వాతావరణాన్ని చూపెట్టి నెగ్గుకు రాగలమా అన్న బాక్సాఫీస్ భయం. ఆ పరిస్థితుల్లో తెలుగులో వచ్చిన ఫస్ట్ సోషల్ ఫిల్మ్ ‘ప్రేమ విజయము’.అది... పేరులోనే లవ్ స్టోరీ పెట్టుకున్న తొలి తెలుగు సినిమా. కాలేజీ చదువులు, ప్రేమలు, వితంతు వివాహాలు, వివాహేతర వ్యామోహాలు, సంఘంలోని దురాచారాలు... ఇలా ఎన్నెన్నో అంశాలను తొలిసారిగా తెలుగు తెరపై చర్చించిన సినిమా. అనేక కష్టనష్టాలకు ఓర్చి, బాక్సుల్లో నుంచి బయటపడ్డ సినిమా. చూద్దామంటే సినిమానే కాదు, పాటలు, ఫొటోలు సైతం కనిపించని అరుదైన సినిమా. ఇంకా చెప్పాలంటే, చిత్ర నిర్మాణమే ఓ పెద్ద సినిమా స్టోరీని తలపించే సినిమా. చారిత్రక ప్రాధాన్యమున్న రాజమండ్రి ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్ళలో తెలుగునాట సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ముఖ్యకేంద్రమైంది. నాటకం సామాన్య వినోదంగా మారిన ఆ రోజుల్లో నాటక సంస్థలకూ కేంద్రస్థానమైంది. తెలుగు గడ్డపై తొలి సినిమా స్టూడియో వెలసిందీ రాజమండ్రిలోనే. అలాగే, తొలి తెలుగు సాంఘిక చిత్రం ‘ప్రేమ విజయము’ చిత్ర నిర్మాణంతోనూ ఆ ప్రాంతానిదే అనుబంధం.సాహసించి... తొలి అడుగు!అది 1935–36 నాటి సంగతి. పాపులర్ స్టేజ్ నాటకాలు, పౌరాణిక గాథలు... అన్నీ అప్పటికే వెండితెర మీదకొచ్చాయి. అయితే, రాజమండ్రి వాస్తవ్యులైన రంగస్థల దిగ్గజం కృత్తివెంటి నాగేశ్వరరావు మాత్రం ధైర్యం చేసి, తొలి సినీ ప్రయత్నంలోనే సాంఘిక గాథ తీసుకున్నారు. అప్పట్లో అందరూ దాన్ని ఓ ప్రయోగంగా చూశారు. అందుకే, ఓ పక్క తెలుగులో తొలి సోషల్ టాకీ తయారవుతున్నా... వారంతా ‘కనకతార’ లాంటి ఇతర పాపులర్ స్టేజ్ డ్రామాలు, ‘మోహినీ రుక్మాంగద’ లాంటిపురాణగాథల మీదే దృష్టి పెట్టారు. ‘ప్రేమ విజయము’కు నిర్మాత కృత్తివెంటి నాగేశ్వరరావు అని చరిత్రలో చాలామంది తెలిసీ తెలియక రాస్తుంటారు కానీ, నిజానికి ఆయన దర్శకుడు. పెట్టుబడి పెట్టిన నిర్మాతలతో పాటు తానూ నిలబడి, సినిమా మొత్తాన్నీ నిర్వహించిన సారథి. అయితే, ఆయనకు నాటకానుభవమే తప్ప సినీ సాంకేతిక పరిజ్ఞాన అనుభవం లేదు. అందుకని, బొంబాయిలో పని చేసి, రికార్డింగ్, లేబరేటరీ పనుల్లో అనుభవమున్న ద్వారకానాథ్ను టెక్నికల్ డైరెక్టర్గా తీసుకున్నారు. కాపీరైట్ గొడవల్లో నాటకీయ కథ కృత్తివెంటి వారి నాటక సమాజానుభవానికీ, ఈ ‘ప్రేమ విజయము’ చిత్రకథకూ దగ్గరి సంబంధం ఉంది. వారి డ్రామా సంస్థ ఆడిన ‘కాలేజి గరల్’ నాటకమే ఈ సినిమాకు మూలం. ఆ సంస్థ 1934లో మద్రాసులో ఆ నాటక ప్రదర్శనలు ఇచ్చాక ఆ కథనే సినిమా తీయాల్సిందిగా మిత్రులు ప్రోత్సహించారు. ఆ నాటకం కథన, కల్పన వగైరా అంతా కృత్తివెంటిదే. రచయిత కాళ్ళకూరి హనుమంతరావుతో చెప్పి రాయించారు. నాటకం వేసిన ప్రతి పట్టణంలో రంగస్థలానికి అనుకూలంగా మార్చుకుంటూ ప్రదర్శించారు. ప్రదర్శనల సమయంలోనే పేచీలు పెట్టిన కాళ్ళకూరి ఆ నాటకాన్ని తన పేరు మీద పుస్తకంగా వేసుకున్నారు. అది తాము సినిమా తీయడానికి అడ్డంకి అవుతుందని కృత్తివెంటి భావించారు. వెంటనే తాము నాటకాన్ని ప్రదర్శిస్తున్న పద్ధతిలోనే కవి వేదుల సత్యనారాయణశాస్త్రితో సరికొత్తగా నాటకం రాయించారు. దానికి ‘ఎక్స్ కాలేజి గరల్’ (లేదా ‘న్యూ కాలేజి గరల్’) అని పేరు పెట్టారు. అదే ఈ సోషల్ ఫిల్ముకు మూలాధారమైంది. ఇలా ఉండగా, ‘కాలేజి గరల్’ నాటకంపై కృత్తివెంటి మీద కాళ్ళకూరి కోర్టులో తెచ్చిన చార్జీని కొట్టేశారు. దీని కన్నా ముందే మరో సోషల్!?అసలు ఈ ‘ప్రేమ విజయము’ కన్నా ముందే తెలుగులో వేరే సోషల్ టాకీ తీసే ప్రయత్నాలు జరిగాయి. ఆ సినిమా పేరు ‘విజయ’. ఆ తొలి ప్రయత్నాలు చేసింది కూడా ఈ ‘ప్రేమ విజయము’ నిర్మాతలే! వారు చెన్నపట్నంలోని ‘ది మద్రాస్ పీపుల్స్ బ్యాంక్ లిమిటెడ్’ యజమానులు. మరికొందరితో కలసి వాళ్ళు విజయ సౌండ్ ఫిలిమ్స్ లిమిటెడ్, ఇండియన్ ఆర్ట్ సినీటోన్ అనే కంపెనీలు పెట్టారు. పౌరాణిక చిత్రం ‘సేతుబంధనం’, సాంఘిక చిత్రం ‘విజయ’... రెండూ తీయాలనుకున్నారు. దర్శకుడు ఐ. రాజారావు నాయుడు. షూటింగ్ కూడా మొదలైంది. తీరా దర్శకుడితో విభేదాలతో, ‘విజయ’ అటకెక్కింది. నిర్మాతలకు అప్పుడు గతంలో తాము చూసిన పాపులర్ డ్రామా ‘కాలేజి గరల్’ గుర్తొచ్చింది. ఆ నాటక ప్రయోక్త కృత్తివెంటి నాగేశ్వరరావును రప్పించారు. తన ‘న్యూ కాలేజి గరల్’ నాటకాన్ని ‘నియో కాలేజి గరల్’ పేరిట ఫిల్మ్ తీసేందుకు కృత్తివెంటి ఒప్పుకొన్నారు. కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అప్పట్లోనే అన్ని రకాల జోక్యాలూ! నెలరోజుల్లోనే అందరినీ బుక్ చేసి, సినేరియో (స్క్రీన్ప్లేకు అప్పటి పేరు), వగైరా సిద్ధం చేశారు కృత్తివెంటి. తీరా సినీ నిర్మాణ సంస్థ పక్షాన అన్ని విషయాల నిర్వహణా చూసే జనరల్ మేనేజర్గా నియమితులైన అడ్వకేట్ గారికి సినేరియో నచ్చలేదు. అందులో ఎన్నికలు, కట్నం లేని పెళ్ళి లాంటి ఘట్టాలు చేర్పించి, కలగాపులగం చేసి, కొత్త సినేరియో తయారు చేయించారు. చివరకు కట్నాల కథ తీసేసి, ఎన్నికల అంశం మాత్రం ఉంచేలా రాజీ కుదిరింది. కానీ, కథనంతా మార్చేసి మళ్ళీ కొత్తగా రాయాల్సి వచ్చింది. ‘కాలేజి గరల్’ టైటిల్ను ‘ప్రేమ విజయము’ అని మార్చాల్సొచ్చింది. ప్రింట్ లేని ఆ చిత్రకథేమిటంటే...సినిమా ప్రింట్, పాటల పుస్తకం మాట దేవుడెరుగు, కనీసం ఫొటోలు దొరకడమే గగనమైన ‘ప్రేమ విజయము’ చిత్రకథ స్థూలంగా ఇదీ: వెంకట్రావు మంచి చిత్రకారుడు. చిత్రకళాశాలలో అతని సహాధ్యాయిని రుక్మిణి బాల వితంతువు. వెంకట్రావుకు స్నేహితులు కృష్ణారావు, రామారావు. అప్పటికే పెళ్ళయిపోయిన కృష్ణారావు పాతకాలపు చాదస్తాలు నిండిన తన భార్య పట్ల విముఖుడై రుక్మిణి పట్ల ఆకర్షితుడవుతాడు. ఒకపక్క కృష్ణారావు స్వగ్రామంలో జిల్లా బోర్డుకు ఎన్నికలు. ఎన్నికల్లో గెలవాలని అప్పు కోసం తన పడుచు కూతురు లక్ష్మిని ఓ ముసలి రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్కి ఇచ్చి అయిదోపెళ్ళి జరిపించేస్తాడు రావుబహద్దూర్ గోపాలరావు. ఆ అమ్మాయికేమో చిన్నప్పటి నుంచి మేనబావ రామారావు అంటే ఇష్టం. ఇక్కడ ఇంకోపక్కేమో... భర్త కృష్ణారావు తనను ప్రేమించడం లేదని భార్య దిగులుతో కృశిస్తూ ఉంటుంది. బాలవితంతువు రుక్మిణేమో అప్పటికే పెళ్ళయిన కృష్ణారావునే వివాహమాడాలని తపిస్తుంటుంది. వేరొకపక్క చిత్రకారుడైన వెంకట్రావేమో, రుక్మిణిని పెళ్ళి చేసుకోవాలని తహతహలాడుతుంటాడు. చివరకు ఏం జరిగిందన్నది మిగతా సినిమా.ఆ నటీనటులు ఎవరంటే...ఇండియన్ ఆర్ట్ సినీటోన్ పతాకంపై తయారైన ఈ తొలి తెలుగు సాంఘిక చిత్రంలో హీరో ప్రభల కృష్ణమూర్తి. ‘‘హీరోయినేమో తర్వాతి రోజుల్లో నటి – నిర్మాత సి. కృష్ణవేణి నిర్మించిన ‘దాంపత్యం’లో హీరోగా నటించిన విజయకుమార్ తల్లి. ఆమె పేరు రాజ్యలక్ష్మి అని గుర్తు’’ అని విమర్శకులు వి.ఏ.కె. రంగారావు మాట. అయితే, కృష్ణవేణి కుమార్తె – నిర్మాత అనూరాధాదేవి మాత్రం, ఆమె పేరు సుగుణమ్మనీ, ఆమెకు సినిమాలతో సంబంధమే లేదనీ అన్నారు. ఏమైనా, లభిస్తున్న ఆధారాల మేరకు ఈ చిత్రంలో మిస్ (గుంటూరు) భానుమతి కీలక పాత్రధారిణి. పి.యస్. శర్మ, పి. రామారావు, మిస్ నూకరాజు, మిస్ రాజ్యం, బి. రాజ్యలక్ష్మమ్మ భాగవతార్, ఎం. రామచంద్రమూర్తి, కె. రంగారావు తదితరులు నటించారు. తర్వాత గయ్యాళి పాత్రలతో పేరొందిన నటి (జవ్వాది) గంగారత్నం హాస్యపాత్ర ధరించారు. ‘గౌతమీ కోకిల’ సాహిత్యం! కాకినాడ మాస్టారి సంగీతం!‘ప్రేమ విజయము’ సంగీతం, పాటలకూ ఓ చరిత్ర ఉంది. ప్రసిద్ధ భావకవి ‘గౌతమీ కోకిల’ వేదుల సత్యనారాయణశాస్త్రి సాహిత్యం అందించారు. కాకినాడకు చెందిన సంగీత విద్వాన్ మునుగంటి వేంకటరావు పంతులు సంగీతం సమకూర్చారు. అలా సాహిత్య, సంగీత రంగాల్లో దిగ్దంతులైన ఇద్దరు పనిచేయడం ఆ సినిమా ప్రత్యేకత. ఈమని శంకరశాస్త్రి, ఓలేటి వెంకటేశ్వర్లు, వింజమూరి సిస్టర్స్ (అనసూయ – సీత)... మునుగంటి వారి శిష్యులే. ‘గానకళ’ మాసపత్రికను నడిపిన సంగీత విమర్శకులు మునుగంటి శ్రీరామమూర్తి వారి కుమారుడే! ‘ప్రేమ విజయము’ కోసం మునుగంటి కట్టిన బాణీలు, ఆ పాటలు స్వర్గీయ వింజమూరి అనసూయ ఈ వ్యాసకర్తకు గతంలో వివరిస్తూ, ‘‘మా గురువు గారు ఆ సినిమాలో ఓ వేషం కూడా వేశారు. ఓ పాట పాడారు. ఎక్కువగా శివరంజని రాగంలో వరసలు కట్టారు’’ అని చెప్పారు. ‘పాడు స్వార్థములు అనుమానాలు...’, ‘ఏటికీ ఈ మగవారలు...’, అలాగే ‘చీకటుల పాలేనా...’ అనే పాటలను ఆమె గుర్తుచేసుకున్నారు. అతి పొదుపుగా... అదీ నెల రోజుల్లో... ‘ప్రేమ విజయము’ చిత్రీకరణ కూడా నానా అవస్థలతో నడిచింది. అప్పటికే విజయ సినీటోన్ పక్షాన మొదలైన ‘సేతుబంధనం’లో ఖర్చు తప్పితే, పురోగతి లేదు. దాంతో, నిర్మాతలు ఆ చిత్ర డైరెక్టర్ రాజారావు నాయుడు ట్రూప్ను స్టూడియో నుంచి బయటకు పంపేసి, విజయ సినీటోన్కు చరమగీతం పాడేశారు. అప్పటికే బొంబాయి నుంచి కెమెరా, రికార్డింగ్ ట్రక్కులు వగైరా తెచ్చి చాలా రోజులైంది. వాటి కాంట్రాక్ట్ కాలం నెలరోజులే మిగిలింది. ఆ వ్యవధి లోపలే ‘ప్రేమ విజయము’ షూటింగ్ అయిపోవాలన్నారు ఫిల్మ్ కంపెనీ తాలూకు ట్రస్టీలు. అంతా హడావిడే. అతి పొదుపుగా షూటింగ్ ఏర్పాటు జరిగాయి. ఎలాగోలా నెల రోజుల్లో షూటింగ్ అంతా ముగించారు. తొలి సోషల్... ఓ పెద్ద ఫ్లాప్!1936 జూలై 20న ‘ప్రేమ విజయము’ రిలీజైంది. ‘‘పుక్కిటి పురాణాల ఫిలిమ్స్తో విసిగిపోయిన ఆంధ్రులకు ఒక కొత్త కానుక... ఒక కళోపహారం’’ అంటూ అప్పట్లో ఈ సినిమాకు పబ్లిసిటీ చేశారు. అలా మన తొలి సోషల్ టాకీయే ‘స్త్రీ స్వాతంత్య్ర సంకల్పం’, ‘బాల్యవివాహాలతో అనర్థాల’ను వెండితెరపై చూపడం పెద్ద విశేషమే! సినిమా ముందుగా గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడల్లోనే రిలీజైంది. కథ, సాంకేతికతల రీత్యా సినిమా వట్టి అతుకులబొంతగా మిగిలింది. పెద్దగా ప్రజాదరణ పొందలేదు. తెరపై తెలుగు సమాజం, వాతావరణం!తెలుగులో వచ్చిన తొలి సోషల్ టాకీ ఆశించిన విజయం సాధించకున్నా, తర్వాత వరుసగా సోషల్ టాకీలు వచ్చేందుకు బీజం వేయగలిగింది. ఆ సినిమా వచ్చిన 20 నెలలకు, తెలుగులో రెండో సోషల్ టాకీ హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో ‘గృహలక్ష్మి’ (1938 మార్చి 12) వచ్చింది. ఆ వెంటనే గూడవల్లి రామబ్రహ్మం ‘మాలపిల్ల’ (1938), ‘రైతుబిడ్డ’ (1939), వై.వి. రావు ‘మళ్ళీ పెళ్ళి’ (1939 డిసెంబర్ 17) లాంటివి వరుసగా వచ్చి, తెలుగు సినిమాను సమకాలీన సాంఘిక మార్గం పట్టించాయి. అలా తెరపై మన జీవితాన్నీ, కట్టూ, బొట్టునూ చూపించాల్సి వచ్చింది. తొంభై ఏళ్ళ కాలంలో సంఘ ప్రబోధం, సెంటిమెంట్ దగ్గర మొదలై స్మగ్లింగ్ కథల దాకా తెలుగు సోషల్ సినిమా ఎన్నో కోవల్లో, ఎంతో దూరం ప్రయాణించింది. హీరో మంచివాడన్న మాటకు కాలం చెల్లి, యాంటీ హీరోయే అసలు హీరో అనే టాక్సిక్ వాతావరణానికి వచ్చేశాం. తెలుగు సినిమాల్లో తెలుగు సమాజం ఎంత అంటే నీళ్ళు నమలాల్సిన పరిస్థితీ వచ్చింది. మనదైన జీవితమే లేని సినిమాలే మన సినిమాగా చలామణీ అవుతున్న దౌర్భాగ్యమూ దాపురించింది. బాక్సాఫీస్ లెక్కల్లో మాత్రం పాన్ ఇండియా కోటలు దాటామని తృప్తి పడాల్సిన పరిస్థితి. సంఖ్య, విస్తృతి, వసూళ్ళపరంగా అనూహ్య ప్రగతి సాధించాం సరే, సరుకులో నాణ్యత మాటేమిటన్నది మాత్రం బేతాళ ప్రశ్నే!ఎవరీ కృత్తివెంటి నాగేశ్వరరావు? నాటకకళే జీవితంగా బతికిన నటుడు, తొలితరం నాటక సమాజ నిర్వాహకుడు, ప్రయోక్త కృత్తివెంటి నాగేశ్వరరావు. ఆయన పుట్టింది బందరులో అయినా, పెరిగింది రాజమండ్రిలో! అక్కడే పార్శీ నాటకాలు చూసి, ప్రేరణ పొంది, ప్రసిద్ధ ‘హిందూ నాటక సమాజం’లో తొలుత స్త్రీ పాత్రలు ధరించారు. ఉర్దూ నాటకాలు కూడా ఆడారు. 1908లో సత్యవోలు గున్నేశ్వరరావు గారి నాటక కంపెనీలో చేరి, దాని నిర్వహణ బాధ్యతలు చూశారు. తర్వాత కొన్నాళ్ళకు ఇద్దరూ విడిపోయారు. కృత్తివెంటి సొంత నాటక సమాజం పెట్టారు. దాదాపు 12 ఏళ్ళు 150 మంది నటుల్ని పోషించారు. నాటకకళ కోసం ఆస్తినే కాదు, జీవితాన్ని కూడా ఖర్చుపెట్టిన కృత్తివెంటి ‘ప్రేమ విజయము’ తర్వాత మళ్ళీ సినిమాలు తీయలేదు. వారి ఏకైక కుమారుడు కె. హరనాథ్ మాత్రం సినిమాల్లోకే వచ్చారు. వాహినీ స్టూడియో శబ్దగ్రహణ శాఖలో వల్లభజోస్యుల శివరామ్ మార్గదర్శకత్వంలో ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్తో కలసి సుదీర్ఘకాలం రికార్డిస్ట్గా పనిచేశారు.గుడిలో షూటింగ్... ఆలయ సంప్రోక్షణ!‘ప్రేమ విజయము’లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మద్రాసులోని ట్రిప్లికేన్లో ప్రసిద్ధ శ్రీపార్థసారథి స్వామి గుడిలో జరిగింది. ‘పవిత్రమైన ఆలయంలో సినిమా షూటింగ్ చేయనిస్తారా’ అంటూ అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. ఆలయ భక్తులందరూ స్థానిక మండపంలో బహిరంగ సమావేశమై, షూటింగ్ వ్యవహారాన్ని నిరసించారు. జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆలయ ‘సంప్రోక్షణ’ జరపాలని నిర్ణయించారు. ఆ వివాదం నాటి సాంఘిక పరిస్థితులకు అద్దంపడుతుంది.పారితోషికంలోనూ పేచీలే! సినిమాల్లో రెమ్యూనరేషన్ వివాదాలు ‘ప్రేమ విజయము’ నాటికే ఉన్నాయి. ఆ సినిమా పూర్తయ్యాక నిర్మాతలు రైల్వే చార్జీలు మినహా అంతా ఇచ్చి, ఆర్టిస్టుల్ని పంపేశారు. రచయితకు ఇవ్వాల్సిన మిగతా సొమ్ము, నటీనటుల రైలుఖర్చులు కొన్ని నెలల పాటు తిప్పించి గానీ ముట్టజెప్పలేదు. కృత్తివెంటి కోర్టుకెక్కారు. అయితే, అన్నివిధాలా నష్టపోయి, దెబ్బతిన్న ఆయన చివరకు తనకు ఇవ్వాల్సిన పర్సంటేజ్ మాట దేవుడెరుగు, కనీసం పెట్టిన ఖర్చయినా వస్తే చాలనుకొని రాజీకి వచ్చారు. తెలుగు సినీరంగంలో రెమ్యూనరేషన్ వ్యవహారం కోర్టు మెట్లెక్కడం బహుశా అదే తొలిసారి.3 భాషల్లోనూ... నాటకాలే! సైలెంట్ సినిమాల రోజుల్లోనే దక్షిణాదిన సోషల్ కథలు వచ్చినా, మూకీలు పోయి మాటలు, పాటలున్న టాకీలు మొదలయ్యాక తెలుగులో సోషల్ సినిమా రావడానికి అయిదేళ్ళు పట్టేసింది. తెరపై పూర్తి నిడివి టాకీ చిత్రాల విషయంలో తమిళం సహా ఇతర దక్షిణాది భాషల కన్నా మనమే ముందున్నా, తెరపై సాంఘిక చిత్రం మాత్రం తమిళం తర్వాత కానీ మనకు రాలేదు. తమిళంలో తొలి సోషల్ టాకీ ‘మేనక’ (1935 ఏప్రిల్ 6). ఇక, తెలుగు తర్వాత నెల రోజుల చిల్లరకే కన్నడంలో తొలి సోషల్ టాకీ ‘సంసార నౌక’ (1936 ఆగస్టు 27) వచ్చింది. అటు తమిళం, ఇటు తెలుగు, ఆ తర్వాత కన్నడం... మూడింటిలోనూ ఫస్ట్ సోషల్ టాకీలు రంగస్థలం నుంచి వెండితెరకెక్కిన నాటకాలే కావడం గమనార్హం.∙రెంటాల జయదేవ
పాట పాడింది.. దేశం చప్పట్లు కొట్టింది
ఒక పాట.. భాషల సరిహద్దులను దాటి కోట్లాది మనసులను తాకుతుంది. ఒక స్వరం... కళ్లతో కాదు, హృదయంతో ప్రపంచాన్ని చూస్తుందని నిరూపిస్తుంది. అలాంటి అరుదైన గాయని వైక్కం విజయలక్ష్మి. 2024 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ మహిళా నేపథ్య గాయని అవార్డును ఆమె సొంతం చేసుకున్నారు.కేరళలోని కొట్టాయం జిల్లా వైకోమ్లో విజయలక్ష్మి అనంత సుబ్రహ్మణియన్ జన్మించారు. పుట్టుకతోనే తీవ్రమైన దృష్టిలోపంతో జన్మించిన ఆమెకు ఈ ప్రపంచాన్ని కళ్లతో చూసే అదృష్టం లేకపోయినా, సంగీతాన్ని మాత్రం హృదయంతో ఆస్వాదించే వరం లభించింది. చిన్నప్పటి నుంచే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్న ఆమె, వీణ వాయించడంలోనూ విశేష ప్రతిభ కనబరిచారు. సంగీతమే జీవితంగా భావిస్తూ నిరంతర సాధనతో తన ప్రతిభను మెరుగుపరుచుకున్నారు.2013లో విడుదలైన సెల్యులాయిడ్ సినిమాతో నేపథ్య గాయనిగా సినీ రంగంలో అడుగుపెట్టిన వైక్కం విజయలక్ష్మి, తొలి పాటతోనే సంగీత దర్శకులు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రంలోని కైక్కొట్టుం కండిట్టిల్లా పాట ఆమెకు అపారమైన గుర్తింపును తీసుకొచ్చింది. అనంతరం ‘తెరి’ చిత్రంలోని ఎన్ జీవనే, కనా చిత్రంలోని వాయాడి పెట్ట పుల్ల వంటి పాటలు దక్షిణ భారత సంగీత ప్రపంచంలో ఆమె స్థానాన్ని మరింత బలపరిచాయి. భావోద్వేగాన్ని స్వరంలో పలికించడంలో ఆమెకు ఉన్న ప్రత్యేక నైపుణ్యమే ప్రతి పాటను శ్రోతల హృదయాలకు చేరువ చేసింది.ఆమె ప్రయాణంలో గుర్తింపులు కూడా తక్కువేం కాదు. ఫిల్మ్ఫేర్ పురస్కారం, ఏషియానెట్ పురస్కారం, వనిత పురస్కారం, కేరళ ప్రభుత్వ గౌరవాలు సహా అనేక అవార్డులు ఆమెను వరించాయి. అయితే భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర పురస్కారం మాత్రం కాస్త సమయం పట్టింది. ఆ నిరీక్షణకు ముగింపు పలికింది ఏఆర్ఎమ్ చిత్రంలోని అంగు వాన కొనిలు పాట.భావోద్వేగాలతో నిండిన ఈ గీతంలో వైక్కం విజయలక్ష్మి తన గాత్రంతో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లారు. మలయాళంలో పుట్టిన ఈ పాట భాషల సరిహద్దులను దాటి తెలుగు ప్రేక్షకుల హృదయాలను సైతం తాకింది. పదాలు అర్థం కాకపోయినా.. ఆమె స్వరంలో వినిపించిన ఆవేదన, మమకారం, ప్రేమ ప్రతి ఒక్కరి మనసును కదిలించాయి. అదే గీతం ఇప్పుడు ఆమెకు జాతీయ ఉత్తమ మహిళా నేపథ్య గాయని పురస్కారాన్ని అందించింది.వైక్కం విజయలక్ష్మి ప్రయాణం ఒక గాయని విజయగాథ మాత్రమే కాదు.. జీవితం మనకు ఏమి ఇవ్వలేదన్నది కాదు, ఉన్న ప్రతిభతో ఎంత ఎత్తుకు ఎదిగామన్నదే ముఖ్యమని చెప్పే స్ఫూర్తిదాయకమైన కథ. కళ్లలో వెలుగు లేకపోయినా.. తన గాత్రంతో కోట్లాది మంది హృదయాల్లో వెలుగులు నింపిన ఆమె ఇప్పుడు భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె గెలిచింది ఒక అవార్డును మాత్రమే కాదు... కోట్లాది మంది అభిమానుల మనసులను కూడా.
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.పంచమి ఉ.7.38 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ఉత్తర రా.10.43 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: ఉ.5.53 నుండి 7.29 వరకు, దుర్ముహూర్తం: సా.4.51 నుండి 5.43 వరకు, అమృత ఘడియలు: ప.3.30 నుండి 5.06 వరకు.సూర్యోదయం : 5.38సూర్యాస్తమయం : 6.34రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకుమేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వాహనయోగం. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.వృషభం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్య సూచనలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.కర్కాటకం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సా«ధిస్తారు.సింహం: బంధువులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. దైవదర్శనాలు.కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ఉద్యోగయత్నాలు సఫలం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు రాగలవు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.తుల: మిత్రుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.వృశ్చికం: వ్యతిరేకులు సైతం మిత్రులుగా మారతారు. భూ, గృహయోగాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.ధనుస్సు: రావలసిన బాకీలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. సంఘంలో గౌరవం. సోదరుల నుండి పిలుపు రావచ్చు. చర్చలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.మకరం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. అనుకోని ప్రయాణాలు. రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. నిరుద్యోగులకు కొంత నిరాశ. వ్యాపార,ఉద్యోగాలలో చిక్కులు. మానసిక అశాంతి.కుంభం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మీనం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం..కొన్ని చికాకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని విషయాలలో మీ మాటకు ఎదురుండదు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువుల నుంచి ఆహ్వనాలు అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఏæ పనైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలు, క్రీడాకారులకు పురోగతి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమ. గులాబీ, లేత పసుపు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.వృషభం....ఆర్థికంగా పడిన ఇబ్బందులు తీరతాయి. సోదరులతో మనస్పర్థలు సర్దుకుంటాయి. ఆస్తుల విషయంలో ఒక ఒప్పందానికి వస్తారు. కీలక వ్యక్తుల సమావేశాలలో పాల్గొంటారు. మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. విద్యార్థుల కృషి ఫలించే సమయం. స్వయం కృషితో కొన్ని పనులు చక్కదిద్దుతారు.. వ్యాపారాలు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తారు. కొత్త పెట్టుబడులకు అవకాశాలున్నాయి.. ఉద్యోగాలలో బాధ్యతలు క్రమేపీ తగ్గుతాయి. కళాకారులు, రాజకీయవర్గాలకు అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో లేనిపోని ఖర్చులు. ఆరోగ్యం మందగిస్తుంది. మానసిక అశాంతి. ఆకుపచ్చ, ఎరుప రంగులు. దేవీస్తుతి మంచిది.మిథునం...మిమ్మల్ని ఆకట్టుకునే సంఘటనలు ఎదురుకావచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో క్రమేపీ పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగులు ఊహించని ఉద్యోగాలు సాధిస్తారు. భూవివాదాల తీరి లబ్ది పొందుతారు. వ్యాపారాలను సజావుగా నడిపి లాభాల బాట ఎక్కిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు. కళాకారులు, రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. మంచి గుర్తింపు సైతం దక్కుతుంది. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు, సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. గులాబీ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కర్కాటకం...ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. మరోవైపు అప్పుల కోసం యత్నాలు సాగిస్తారు. శ్రమ తప్పకపోవచ్చు. అనుకున్న కార్యక్రమాలలో అవరోధాలు.. బంధువులు, మిత్రులు కొంత అలక వహించే వీలుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురై ఇబ్బంది పెట్టవచ్చు. . సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తుల వ్యవహారాలు కొంత జఠిలం కావచ్చు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడొచ్చు.. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు పసుపు, ఎరుపు రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.సింహం...మీపై నిందలు మోపాలనుకున్న వారే పశ్చాత్తాపం చెందుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. సమాజంలో మంచి పేరు గడిస్తారు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దూరమైన బంధువులు కూడా దగ్గరకు వస్తారు.. కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. అలాగే, మరిన్ని వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి.. కళాకారులు, రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. . వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు.ఆకస్మిక ప్రయాణాలు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. హనుమాన్ను పూజించండి.కన్య....ముఖ్యమైన వ్యవహారాలు సమయానుసారం పూర్తి చేస్తారు. బంధువుల చేయూతతో ముందుకు సాగుతారు. శుభకార్యాలకు సన్నాహాలు చేసుకుంటారు. జీవిత భాగస్వామితో తగాదాలు పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఆనందాన్ని కుటుంబçసభ్యులతో పంచుతారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు కీలక సమాచారం. క్రీడాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. కష్టమే తప్ప ఫలితం ఉండదు. ఆకుపచ్చు, పసుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.తుల....ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా ముగిస్తారు. ఆప్తుల సూచనలు స్వీకరిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కారవుతాయి. సోదరుల ఆహ్వానాలు రాగలవు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి æ మెరుగుపడుతుంది. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు మరింత రాణిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతి సూచనలు.కళాకారులు, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. నీలం, నేరేడు రంగులు. నవగ్రహారాధన మంచిది.వృశ్చికం...ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకుల నుండి బయటపడతారు. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొ ంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు ఊహించని అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి, అనుకున్నంత లాభాలు రాగలవు.. ఉద్యోగాలలో చాకచక్యంగా వ్యవహరించి విధులు చక్కదిద్దుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల ఆశలు నెరవేరతచాయి. వారం చివరిలో అనారోగ్యం, బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దత్తస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...కొన్ని విషయాలలో నిక్కచ్చిగా మాట్లాడి అందర్నీ ఆకట్టుకుంటారు. . ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్ధిక విషయాలు అంచనాల మేరకు కొనసాగుచతాయి. అప్పుల బాధలు తొలగుతాయి. సంఘ సేవలో పాలుపంచుకుంటారు. కుటుంబసభ్యుల సలహాల మేరకు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంతో సాగుతారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, నేరేడు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.మకరం...పట్టుదలతో అనుకున్న పనులు చక్కదిద్దుతారు. జీవిత భాగస్వామి ద్వారా కొంత ఆస్తిలాభం ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ప్రయోజనం పొందుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో్ర వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. కనక«ధారా స్తోత్రాలు పఠించండి.కుంభం...నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. నిరుద్యోగులకు స్థిర ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యతిరేకులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. కళారంగం వారి సేవలకు గుర్తింపు రాగలదు. వారం మధ్యలో సోదరులతో కలహాలు. అనారోగ్యం సూచనలు. దూరప్రయాణాలు. తెలుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.మీనం....కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేసి సమర్థత చాటుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తి వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత కలసివస్తాయి. కీలక సమావేశాలలో పాల్గొంటారు. విద్య, వివాహయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. గృహ నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో బంధువిరోధాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్య సూచనలు. గులాబీ, లేత నీలం రంగులు. . గణేశ్ను పూజించండి.
గార్ధబాలకు గులాబ్ జామ్లు
రోహిత్ కాదు..! త్వరలో ఆ ముగ్గురు రిటైర్మెంట్ ఫిక్స్?
ఇజ్రాయెల్ సెటిలర్ల దాడి.. పాలస్తీనా ఫుట్బాల్ ప్లేయర్ మృతి
తండ్రీకొడుకుల బిజినెస్ బాగుంది ఇంక ఆ ‘బిజినెస్’ గురించి ఎందుకు పట్టించుకుంటారు!
రాష్ట్రంలో ఒమిక్రాన్ ఆర్ఎఫ్–5 వేరియంట్ కోవిడ్ కేసులు
ప్రత్యేక లోక్ అదాలత్లో భారీగా కేసులు పరిష్కారం
విశాఖలో 2..చీరాలలో 2
ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంజా!
రామాయపట్నం పోర్టు ముట్టడి ఉద్రిక్తం
ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్?
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి
ఓటీటీలోకి వచ్చేసిన 'బంగారం'.. మరోవైపు సమంత సీమంతం
ఎంత వెతికినా నీ ఓటు మాత్రం కనపడటం లేదు
అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది: శుబ్మన్ గిల్
ఇలా అన్నిచోట్లా ఉంటే బావుండు.. హాయిగా ప్రచారం చేసుకోవచ్చు..!!
ఓటీటీలోకి వచ్చేసిన సాయిపల్లవి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కొత్తింట్లోకి అడుగుపెట్టిన తెలుగు సీరియల్ జంట
ట్రెండింగ్ హీరోయిన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. యత్నకార్యసిద్ధి
భారత్లోకి కరోనా రీఎంట్రీ! అసలు కారణం ఏంటంటే..
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. శుభ్మన్ గిల్ సహచరుడు అరెస్ట్
బంగారంపై మళ్లీ కియోసాకి ‘భారీ’ కామెంట్
మూడు వారాల కనిష్టానికి పసిడి
IND vs ENG: మూడో వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
సంపద సృష్టించడం ఎలా..?: కియోసాకి సలహా
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్కి లక్కీ ఛాన్స్
హైదరాబాద్లో దిగొచ్చిన బంగారం ధర!
సైదాబాద్ హోం వర్క్ వివాదం.. NHRC నోటీసులు..
రా ఎన్టీఆర్ ప్రెస్ మీట్.. భద్రతా కల్పించాలని వినతి
గార్ధబాలకు గులాబ్ జామ్లు
రోహిత్ కాదు..! త్వరలో ఆ ముగ్గురు రిటైర్మెంట్ ఫిక్స్?
ఇజ్రాయెల్ సెటిలర్ల దాడి.. పాలస్తీనా ఫుట్బాల్ ప్లేయర్ మృతి
తండ్రీకొడుకుల బిజినెస్ బాగుంది ఇంక ఆ ‘బిజినెస్’ గురించి ఎందుకు పట్టించుకుంటారు!
రాష్ట్రంలో ఒమిక్రాన్ ఆర్ఎఫ్–5 వేరియంట్ కోవిడ్ కేసులు
ప్రత్యేక లోక్ అదాలత్లో భారీగా కేసులు పరిష్కారం
విశాఖలో 2..చీరాలలో 2
ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంజా!
రామాయపట్నం పోర్టు ముట్టడి ఉద్రిక్తం
ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్?
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి
ఓటీటీలోకి వచ్చేసిన 'బంగారం'.. మరోవైపు సమంత సీమంతం
ఎంత వెతికినా నీ ఓటు మాత్రం కనపడటం లేదు
అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది: శుబ్మన్ గిల్
ఇలా అన్నిచోట్లా ఉంటే బావుండు.. హాయిగా ప్రచారం చేసుకోవచ్చు..!!
ఓటీటీలోకి వచ్చేసిన సాయిపల్లవి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కొత్తింట్లోకి అడుగుపెట్టిన తెలుగు సీరియల్ జంట
ట్రెండింగ్ హీరోయిన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. యత్నకార్యసిద్ధి
భారత్లోకి కరోనా రీఎంట్రీ! అసలు కారణం ఏంటంటే..
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. శుభ్మన్ గిల్ సహచరుడు అరెస్ట్
బంగారంపై మళ్లీ కియోసాకి ‘భారీ’ కామెంట్
మూడు వారాల కనిష్టానికి పసిడి
IND vs ENG: మూడో వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
సంపద సృష్టించడం ఎలా..?: కియోసాకి సలహా
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్కి లక్కీ ఛాన్స్
హైదరాబాద్లో దిగొచ్చిన బంగారం ధర!
సైదాబాద్ హోం వర్క్ వివాదం.. NHRC నోటీసులు..
రా ఎన్టీఆర్ ప్రెస్ మీట్.. భద్రతా కల్పించాలని వినతి
ఫొటోలు
కేరళ క్రికెట్ లీగ్ వేలం.. కీర్తి ముస్తాబైందిలా! (ఫొటోలు)
చీరలో శ్రుతి హాసన్.. ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)
మోడ్రన్ దేవకన్యలా దివ్యభారతి.. చూసేందుకు రెండు కళ్లు సరిపోవు (ఫొటోలు)
గోవాలో అల్లువారి కోడళ్లు.. సతీమణితో శిరీష్ సందడి (ఫోటోలు)
బర్త్డే స్పెషల్.. ప్రియాంక చోప్రా గురించి ఈ విషయాలు తెలుసా ? (ఫొటోలు)
అబ్బో.. ఈ రైల్వే స్టేషన్ పేరుకు తగ్గట్లే ఉందే! (చిత్రాలు)
కామాఖ్య ఆలయంలో నిక్కీ గల్రానీ దంపతుల పూజలు..ఫోటోలు
ఓ సుకుమారి బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ లేటేస్ట్ స్టిల్స్.. ఫోటోలు
లండన్ వీధుల్లో హీరోయిన్ హెబ్బా పటేల్ చిల్.. ఫోటోలు
రోజురోజుకీ సన్నబడిపోతున్న శ్రీముఖి (ఫొటోలు)
సినిమా
ట్రెండింగ్ హీరోయిన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా?
మన దేశం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్తల్లో శ్రీనివాస రామానుజన్ ఒకరు. ఈయన గణిత సిద్ధాంతాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈయన ఘనతలు గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. అయితే పుట్టినరోజు, వర్ధంతి లాంటివి ఇప్పుడేం లేవు అయినా సరే శ్రీనివాస రామానుజన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతున్నారు. దీనికి కారణం. లేటెస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్.. ఈయనకు మునిమనవరాలు అవుతుందనే వార్త.(ఇదీ చదవండి: రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్కి లక్కీ ఛాన్స్)తమిళనాడులోని ఈరోడ్లో 1887లో పుట్టిన శ్రీనివాస రామానుజన్ 32 ఏళ్లకే మశూచి వ్యాధి బారినపడి చనిపోయారు. ఇదంతా జరగడానికి చాన్నాళ్ల క్రితమే జానకి అమ్మళ్ అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్లకు ఎలాంటి సంతానం లేదు. కానీ గత రెండు రోజుల నుంచి హీరోయిన్ ప్రీతి ముకుందన్ తల్లికి శ్రీనివాస రామానుజన్తో బంధుత్వం ఉందని, తద్వారా ప్రీతి, రామానుజన్కి ముని మనవరాలు అవుతుందని అంటున్నారు.కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని అనిపిస్తుంది. శ్రీనివాస రామానుజన్ చనిపోయిన ముప్పై ఏళ్ల తర్వాత జానకి అమ్మళ్.. డబ్ల్యూఎస్ నారాయణ్ అనే వ్యక్తిని పెంచుకుందని చెప్పి గూగుల్లో ఉంది. బహూశా ఈయన తర్వాత తరం వాళ్లతో ప్రీతి ముకుందన్ కుటుంబానికి ఏమైనా బంధుత్వం ఉంటే ఉండాలి. ఒకవేళ ఉన్నాగానీ ఈ విషయం గురించి ప్రీతి స్పందిస్తే తప్పితే ఏదో ఒకటి క్లారిటీ రాదు.ప్రీతి ముకుందన్ విషయానికొస్తే.. ఓం భీం బుష్, కన్నప్ప లాంటి తెలుగు సినిమాలు చేసింది గానీ ఈమెకు సక్సెస్ రాలేదు. తమిళంలో ఈ ఏడాది వచ్చిన 'బ్లాస్ట్' ఈమె ఫేట్ మార్చింది. ఓవర్ నైట్ సెన్సేషన్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)
‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ అంటే సంక్లిష్టమైన కథలు, కాలాల ఇంద్రజాలంతో ఆడుకునే కథన శైలి, అద్భుతమైన విజువల్ అనుభవాలకే ఇప్పటివరకు చిరునామా, అయితే ’ది ఒడిస్సీ’ తర్వాత తో ఆయన పట్ల ఈ అభిప్రాయాలు సమూలంగా మారిపోతాయి. వేల ఏళ్ల క్రితం హోమర్ రాసిన మహాకావ్యాన్ని ఆధునిక తరపు ప్రేక్షకులకు సైతం సులభంగా అర్థమయ్యేలా నోలన్ తెరకెక్కించాడు. విశేషం ఏమిటంటే ఈ చిత్రం కేవలం యాక్షన్ లేదా ఫాంటసీ కాదు; యుద్ధం, పశ్చాత్తాపం, కుటుంబం, ప్రేమ, విముక్తి వంటి మానవీయ భావోద్వేగాల సమ్మేళనంగా సాగిన సమున్నత ప్రయాణం.కధ ఏమిటి?యుద్ధకళల్లో ఆరితేరిన పరాక్రమవంతుడైన రాజు... తప్పని పరిస్థితుల్లో ఒక భీకర యుద్ధంలో పాల్గొని అతి కష్టం మీద గెలిచి తిరిగి తన రాజ్యానికి తిరిగివచ్చే మార్గంలో ఎదుర్కున్న అడ్డంకులు, రాజ్యానికి తిరిగి వచ్చాక ఎదురైన అనూహ్య పరిస్థితులు అక్కడ మళ్లీ తన వాళ్లతోనే యుద్ధం చేయాల్సి రావడం...వీటన్నింటినీ ఎలా ఎదుర్కున్నాడు? దీనికి సమాధానమే ఈ చిత్రం.. కట్టె కొట్టె తెచ్చేలా చెప్పాలంటే ఇంతే ’ది ఒడిస్సీ’ కథ, గతంలో వచ్చిన ’ట్రాయ్’ సినిమాకు ఒక విధంగా కొనసాగింపులా అనిపిస్తుంది. ఆ సినిమాలో ట్రోజన్ యుద్ధం ఎలా ముగిసిందో చూసిన ప్రేక్షకులకు, ఆ యుద్ధంలో విజేతలైన గ్రీకు వీరులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి చేసిన పోరాట సహిత ప్రయాణమే ఈ చిత్రంలో ప్రధాన కథ.హైలెట్...దర్శకత్వం...తన గత సినిమాల్లోలాగే ఈ సినిమా సక్సెస్లో కూడా దర్శకుడు నోలన్ ఫుల్ మార్కులు అందుకుంటాడు. ఆయన ప్రతీసారీలాగే ఈసారి కూడా చిత్రీకరణలో తన మేధస్సును ప్రదర్శించడమే కాకుండా, భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేశాడు. అయితే గత చిత్రాల్లా ప్రేక్షకుడిని పజిల్స్తో గందరగోళానికి గురిచేయకుండా, కథనం సాగే క్రమంలో ప్రతీ దశలోనూ మానవీయ కోణాన్ని స్పర్శించడం ఆకట్టుకుంటుంది.సాంకేతి‘కధ’నోలన్ సినిమాల్లో సాంకేతిక నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో కూడా హోయ్టే వాన్ హోయ్టెమా సినిమాటోగ్రఫీ అద్భుతంగా మెరిసింది. సముద్ర ప్రయాణాలు, యుద్ధ దృశ్యాలు, ప్రకృతి ప్రకోపాల సమయంలో సన్నివేశాలు... ప్రతీ ఫ్రేమ్ భారీ కాన్వాస్పై వేసిన చిత్రంలా కనిపిస్తుంది. దీని తర్వాత తప్పకుండా చెప్పుకుని తీరాల్సింది లుడ్విగ్ గోరాన్సన్ నేపథ్య సంగీతం. అది ప్రతి భావోద్వేగాన్ని మరింత బలంగా ప్రేక్షకుడికి చేరుస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాల్లో ఎంత ప్రభావం చూపుతుందో, నిశ్శబ్దమైన భావోద్వేగ భరిత సన్నివేశాల్లో కూడా అంతే గాఢతను ప్రేక్షకులు అనుభవించేలా చేయగలిగారు.నటీనటుల ప్రదర్శనఒడిసియస్ పాత్రలో మ్యాట్ డేమన్ తన కెరీర్లోని అత్యుత్తమ నటనల్లో ఒకదాన్ని కనబరిచాడు. యుద్ధ వీరుడి గర్వం, తన అనుచరులను కాపాడలనే థీరత్వం, కుటుంబాన్ని చేరాలనే తపన, యుద్ధ ఫలితాలపై అంతర్మధనం... అన్నింటినీ సమ తూకంలో ప్రదర్శించాడు. ప్రేక్షకులను తన పాత్రతో ప్రయాణం చేసేలా చేయగలిగాడు. ఆయన భార్యగా నటించిన యాన్ హాతవే పెనెలోపీగా తక్కువ సన్నివేశాలున్నా, భావోద్వేగాలకు బలమైన కేంద్రంగా నిలుస్తుంది. ఆమె నటన సినిమాకు ఆత్మలా మారిందనొచ్చు. రాజ కుమారుడిగా, టామ్ హాలండ్ టెలిమాకస్ పాత్రలో పరిపక్వతను చూపించాడు. రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రతి నాయకుడిగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు...గ్రీకు పురాణాల ఆధారంగా రూపొందిన కథ అయినప్పటికీ, ఇందులో కనిపించే అనేక అంశాలు భారతీయ ఇతిహాసాలను గుర్తు చేస్తాయి. యుద్ధం ముగిసిన తర్వాత ఎన్నో కష్టాలు దాటి ఇంటికి చేరాలనే నాయకుడి ప్రయాణం, రెండు దశాబ్ధాల సుదీర్ఘకాలం గడిచినా భార్యాభర్తల మధ్య సడలిపోని అనుబంధం , తండ్రి మరణించలేదని నమ్ముతూ కుమారుడు తండ్రి కోసం ఎదురుచూడటం వంటి కుటుంబ విలువలు మన ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి. అలాగే ధర్మం కోసం చేసే యుద్ధంలో గెలిచినా ఎందరో ఆప్తుల్ని కోల్పోవడం లాంటి బాధించే వాస్తవాల్ని గుర్తించడం...ఇలాంటి భావాలు రామాయణం, మహాభారతంలో కనిపించే విలువలను తలపిస్తాయి. అందుకే ఈ కథ భారతీయ ప్రేక్షకులకు కొత్తగా కాకుండా, బాగా పరిచయమున్నట్టు అనుభూతిని కలిగిస్తుంది. చివర్లో వచ్చే విల్లు ఎక్కుపెట్టే పరీక్ష చాలామందికి రామాయణంలో శ్రీరాముడు శివధనుస్సును ఎత్తిన ఘట్టాన్ని గుర్తు చేస్తుంది. అలాగే బలవంతుడే కాదు, నిజమైన అర్హుడే ఆ విల్లును ప్రయోగించగలడనే భావన మన పురాణాల్లో కనిపించే వీర పరీక్షలను తలపిస్తుంది.హైలెట్స్...ట్రోజన్ యుద్ధంలో గ్రీకులు ఉపయోగించిన భారీ చెక్క గుర్రం ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో అత్యంత తెలివైన యుద్ధ వ్యూహంగా చెప్పుకుంటారు. ఓటమి అంచుల్లో నిలిచినప్పటికీ... గుర్రం లోపల సైనికులను దాచిపెట్టి ట్రోయ్ నగరంలోకి ప్రవేశించి చివరి క్షణంలో యుద్ధాన్ని గెలిచిన ఘట్టాన్ని ఈ సినిమాలో కూడా గుర్తు చేస్తారు. ఆ సినిమా చూడని ప్రేక్షకులకు ఇది ఉపశమనం ఇస్తుంది. గెలుపు తర్వాత ప్రారంభమయ్యే ఒడిసియస్ తిరుగు ప్రయాణంలో దేవతల శాపాలు ఎదుర్కుంటాడు. అలాగే సముద్ర తుఫాన్లు, భయంకరమైన రాక్షసులు, మంత్రగత్తెలు, ప్రాణాంతక ద్వీపాలు... ఇలా ప్రతి అడుగూ ఒక పరీక్షగా మారుతుంది. ఇవన్నీ విజువల్ ట్రీట్స్ అందిస్తాయి. ప్రత్యేకంగా ఒంటికన్ను రాక్షసుడు సైక్లోప్స్ తో జరిపే పోరాటం సినిమా హైలైట్లలో ఒకటి. బలంతో కాకుండా తెలివితో అతడిని ఓడించే విధానం ఆకట్టుకుంటుంది. అలాగే సముద్ర దేవుడు పోసైడన్ కోపం వల్ల ఎదురయ్యే తుఫాన్లు, మోహింపజేసే సైరన్స్ , మంత్రగత్తె సిర్సే, చివర్లో తన రాజ్యంలోకి చేరాక శత్రువులను ఎదుర్కొనే పోరాటం... వేటికవే అన్నట్టుగా కళ్లకు విందు చేస్తాయి. దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ ప్రయాణాన్ని కేవలం ఫాంటసీగా కాకుండా, ఇంటికి చేరాలనే ఒక మనిషి ఆరాటం, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆరాటం, యుద్ధం తర్వాత మనిషి మానసిక సంఘర్షణ వంటి భావోద్వేగాలతో ముడిపెట్టడం వల్ల సినిమా మరింతగా హృదయానికి దగ్గరవుతుంది. ’ది ఒడిస్సీ’ కేవలం ఒక గ్రీకు పురాణ చిత్రం కాదు; భారతీయ ప్రేక్షకులు తమ ఇతిహాసాల జ్ఞాపకాలను కూడా ఆస్వాదిస్తూ చూడగలిగే గొప్ప విజువల్, ఎమోషనల్ అనుభవంగా నిలుస్తుంది. లోపాలుహెలెన్ పాత్రలో నటించిన లుపిటా న్యోంగో నటనపై పెద్దగా విమర్శలు లేవు. కానీ "ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ"గా వర్ణించిన హెలెన్ పాత్రకు ఆమె ఎంపిక సరిపోలేదు. ఇది ప్రధానంగా నటన కంటే కాస్టింగ్కు సంబంధించిన చర్చ. మరోవైపు, నోలన్ తన కథన దృష్టికోణానికి అనుగుణంగానే ఈ ఎంపిక చేశారని, అందం కంటే పాత్రలోని మానవీయ కోణాన్ని చూపించాలని భావించారని అయన టీమ్ సభ్యులు అంటున్నారు.హోమర్ రచనతో పోలిస్తే అథీనా, సిర్సే, కాలిప్సో వంటి పాత్రలను నోలన్ కుదించేశాడనే భావన కలుగుతుంది. అలాగే నిడివి కూడా కాస్త తగ్గిస్తే బాగుండేది.ఒడిసియస్ ఎదుర్కొనే అనేక అడ్డంకుల్ని ఒకే సినిమాలో చెప్పాల్సి రావడంతో ముఖ్య మైన కొన్ని సంఘటనలు వేగంగా ముగిసి పోయాయి అనిపిస్తుందిగ్రీకు పురాణ కథ అయినప్పటికీ, అమెరికన్ యాసలో సంభాషణలు, కొన్ని దుస్తులు, ఆయుధాల రూపకల్పన, విభిన్న జాతుల నటీనటుల ఎంపిక వల్ల "చారిత్రక వాస్తవికత తగ్గింది" అనిపిస్తుంది. అయితే ఇవి నోలన్ సృజనాత్మక నిర్ణయాలని టీం స్పష్టత ఇచ్చింది .పెద్ద తారాగణం ఉన్నప్పటికీ, కొందరు ప్రముఖ నటీనటులకు చాలా తక్కువ స్క్రీన్ టైమ్ మాత్రమే దక్కడం ముఖ్యంగా హెలెన్ పాత్ర కథపై పెద్దగా ప్రభావం చూపలేకపోవడం...లోపాలు గా కనిపిస్తాయి.–సత్యబాబు
'ది ఒడిస్సీ' తొలిరోజు వసూళ్లు ఎంత?
హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన సినిమా 'ది ఒడిస్సీ' ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. అయితే విడుదలకు ముందు కొంత నెగిటివిటీ వినిపించింది గానీ రిలీజైన తర్వాత అంతటా పాజిటివ్ టాక్ తప్పితే మరొకటి వినిపించడం లేదు. మరి ఇంతలా సౌండ్ చేస్తున్న ఈ చిత్రానికి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయ్? మొదటిరోజు మన దగ్గర ఎన్ని కోట్లు వచ్చాయ్?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..)మ్యాట్ డామన్, ఆన్ హాత్వే, టామ్ హోలండ్, రాబర్ట్ పాటిన్సర్, జెండాయా ప్రధాన పాత్రల్లో కనిపించిన 'ది ఒడిస్సీ' సినిమాని మూడువేళ్ల ఏళ్ల క్రితం హోమర్ అనే రచయిత రాసిన ఒడిస్సీ నవల ఆధారంగా తీశారు. రూ.2200 కోట్ల బడ్డెట్తో నిర్మించారు. విడుదల కావడానికి ముందే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి తొలిరోజు అదే స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఓవరాల్గా 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.418 కోట్లు) వచ్చాయి. ఇందులో మన దేశం నుంచి రూ.17 కోట్ల మేర నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం టాక్ పాజిటివ్ రావడం, దగ్గరలో మరో సినిమా లేదు కాబట్టి వసూళ్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర 'ది ఒడిస్సీ' సినిమా సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశమైతే ఉంది. తెలుగు, హిందీ లాంటి ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేయడం ఈ మూవీకి ప్లస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.'ది ఒడిస్సీ' విషయానికొస్తే.. ఒడిసియస్(మ్యాట్ డామన్) ట్రోజన్ యుద్ధంలో పదేళ్ల పాటు పోరాడి గెలుస్తాడు. త్వరగా భార్య పెనలోపి(ఆన్ హాత్వే), కొడుకు టెలీమాకస్(టామ్ హాలెండ్) దగ్గరకు వెళ్లిపోవాలనుకుంటాడు. ఈ క్రమంలోనే తన సైనికులతో కలిసి పడవ ప్రయాణం చేస్తాడు. అయితే దారిలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. దీంతో పదేళ్ల పాటు ఎక్కడెక్కడో తిరిగి రాజ్యానికి చేరుకుంటాడు. తర్వాత ఏమైంది? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’లో నటించనందుకు చాలా హ్యాపీగా ఉంది!)
ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
చిన్న సినిమాలో థియేటర్స్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచన మలయాళ చిత్రం ‘బాలన్-ది బాయ్’. ‘మంజుమ్మల్ బాయ్స్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రం ఇది. రోమాంచం.. ఆవేశం లాంటి వైవిధ్యమైన కామెడీ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు జీతు మాధవన్ ఈ చిత్రానికి కథను అందించాడు.ఫర్జానా పాలత్గింగల్, ఆది శేషన్, ముహమ్మద్ జినన్, డాలీ జూన్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటించారు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా జూన్ 19న థియేటర్స్లో రిలీజ్ హిట్ టాక్ సంపాదించింది. రూ. 18 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. జులై 31 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ట్రైలర్ని రిలీజ్ చేసింది. బాలన్-ది బాయ్ కథేంటే..ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, తన కొడుకు(ఆది శేషన్)తో బయటకు వచ్చిన ఓ మహిళ(ఫర్జానా పాలత్గింగల్) చుట్టూ ఈ కథ తిరుగుంది. బయటకు వచ్చిన ఆ మహిళ..పేర్లను మార్చుకుంటూ కొడుకుతో కలిసి పలు చోట్ల పని చేస్తుంది. అంతా సవ్యంగా జరుగుతుందన్న సమయంలో ఆ మహిళ మరో హత్య చేయాల్సి వస్తుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. రోవైపు స్కూల్కి వెళ్లిన కొడుకు అమ్మ రాక కోసం ఒక చోట ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పిపోయిన బాలుడు అనుకొని పోలీసులు అతన్ని స్టేషన్కి తీసుకెళ్తాడు. అయితే తల్లి ఇచ్చిన ట్రైనింగ్ కారణంగా ఆ బాలుడు తన అడ్రస్ని పోలీసులకు చెప్పడు. అంతేకాదు చాలా చాకచక్యంగా స్టేషన్ నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఎక్కడికి వెళ్లాడు? తల్లిని కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా లేదా? తల్లి కొడుకుల కథలోకి టొవినో థామస్ ఎలా వచ్చాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
క్రీడలు
ఫైనల్ 'కిక్'
39 రోజులు, 103 మ్యాచ్ల తర్వాత ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మెస్సీ మెరుపులతో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ టైటిల్ను నిలబెట్టుకుంటుందా? టీనేజ్ సంచలనం లమీన్ యామల్ నైపుణ్యం 2010 విశ్వవిజేత స్పెయిన్కు రెండోసారి ప్రపంచకప్ అందిస్తుందా? అటాకింగ్ ఆటతీరుతో ఈ ప్రపంచకప్ను ఊపేసిన అర్జెంటీనా ఆటగాళ్లు అదే జోరును తుది పోరులో కొనసాగిస్తారా? అడ్డుగోడలా నిలబడుతూ ప్రత్యర్థి జట్లకు గోల్ కొట్టడమే గగనంలా చేసిన స్పెయిన్ డిఫెన్స్ తుది పోరులోనూ విజయవంతం అవుతుందా? వరుసగా రెండోసారి ప్రపంచకప్ను సొంతం చేసుకొని ఇటలీ, బ్రెజిల్ సరసన అర్జెంటీనా నిలుస్తుందా? అర్జెంటీనా ఆశలను వమ్ము చేసి ప్రపంచకప్తో స్పెయిన్ పూర్వ వైభవం సాధిస్తుందా? వీటన్నింటికి సమాధానం నేడు అర్ధరాత్రి తర్వాత లభిస్తుంది. న్యూయార్క్: ఒక్క పరాజయం లేకుండానే అంతిమ సమరానికి అర్హత సాధించిన అర్జెంటీనా, స్పెయిన్ జట్లు ప్రపంచకప్ను ముద్దాడేందుకు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. ఆఖరి పోరులోనూ గెలిచి టోర్నీని అజేయంగా ముగించాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే 23వ ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ ఫైనల్పై యావత్ క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మైదానంలో ప్రత్యక్షంగా 80 వేల మంది... ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మందికి పైగా ప్రేక్షకులు టీవీల ద్వారా ఈ తుది పోరును వీక్షించనున్నారు.2022లో ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టులోని 17 మంది ప్లేయర్లు ప్రస్తుత ప్రపంచకప్లోనూ ఆడుతున్నారు.ముఖ్యంగా 39 ఏళ్ల లియోనెల్ మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా ఈ టోర్నీలో అద్భుత ఆటతీరుతో అలరిస్తోంది. నాకౌట్ మ్యాచ్ల్లో ఓటమి అంచుల్లో నుంచి విజయకేతనం ఎగురవేస్తోంది. చివరి క్షణం ముగిసేవరకు తమను తక్కువ అంచనా వేయొద్దని.... అవకాశం దొరికితే ఏ క్షణంలోనైనా మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా తమలో ఉందని మెస్సీ బృందం నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ గెలుపు కిక్ తమదే కావాలని అర్జెంటీనా పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగనుంది. మరోవైపు 2010లో ఏకైకసారి ప్రపంచకప్ గెలిచిన స్పెయిన్ జట్టులోని ఆటగాళ్లెవరూ ప్రస్తుత ప్రపంచకప్లో లేరు. అయితే 2024లో యూరోపియన్ చాంపియన్షిప్ గెల్చుకున్న స్పెయిన్ జట్టులోని 16 మంది ప్రస్తుత ప్రపంచకప్లో ఆడుతున్నారు. స్పెయిన్ భవిష్యత్ ఆశాకిరణం, 19 ఏళ్ల యామల్పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. చివర్లో చెలరేగుతూ... ఫైనల్ చేరే క్రమంలో అర్జెంటీనా జట్టు 19 గోల్స్ సాధించింది. ప్రత్యర్థి జట్లకు 7 గోల్స్ సమ ర్పించుకుంది. అర్జెంటీనా చేసిన 19 గోల్స్లో 12 గోల్స్ మ్యాచ్లో 75 నిమిషాలు ముగిశాకే వచ్చాయి. ముందుగా నెమ్మదిగా ఆడటం... ప్రత్యర్థి జట్టు గోల్ చేశాక అర్జెంటీనా జోరు పెంచుతూ తమ సత్తా చాటుకుంటోంది. చివర్లో సబ్స్టిట్యూట్గా వస్తున్న ఆటగాళ్లు కూడా గోల్స్ చేస్తూ అర్జెంటీనాను గట్టెక్కిస్తున్నారు. మరోవైపు స్పెయిన్ జట్టు పూర్తి డిఫెన్స్ ఆటతీరుకు ప్రాధాన్యమిస్తోంది. అవకాశం దొరికినపుడు గోల్ చేసి ఆ తర్వాత ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయతీరానికి చేరుతోంది. ఈ టోర్నీలో స్పెయిన్ జట్టు 13 గోల్స్ సాధించి... ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ మాత్రమే సమ ర్పించుకుంది. మొత్తం ఏడు మ్యాచ్ల్లో స్పెయిన్ గోల్పోస్ట్పై ప్రత్యర్థి జట్లు 11 సార్లు మాత్రమే షాట్లు కొట్టడం గమనార్హం.విజేత జట్టుకు రూ. 481 కోట్లు ఈసారి ప్రపంచకప్ గెలిచిన జట్టుకు 5 కోట్ల డాలర్లు (రూ. 481 కోట్లు) ప్రైజ్మనీగా లభించనుంది. రన్నరప్ జట్టుకు 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 317 కోట్లు) దక్కుతాయి. మూడో స్థానం పొందిన జట్టు ఖాతాలో 2 కోట్ల 90 లక్షల డాలర్లు (రూ. 279 కోట్లు) చేరుతాయి. నాలుగో స్థానం సంపాదించిన జట్టుకు 2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 259 కోట్లు) లభిస్తాయి. 5 నుంచి 8 స్థానాల మధ్య నిలిచిన జట్లు 1 కోటీ 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 182 కోట్లు చొప్పున) అందుకుంటాయి. 9 నుంచి 16 స్థానాల మధ్య నిలిచిన జట్లకు 1 కోటీ 50 లక్షల డాలర్ల చొప్పున (రూ. 144 కోట్లు చొప్పున) లభిస్తాయి. 17 నుంచి 32 స్థానాల మధ్య నిలిచిన జట్లు 1 కోటీ 10 లక్షల డాలర్ల చొప్పున (రూ. 105 కోట్లు చొప్పున) అందుకుంటాయి. 33 నుంచి 48 స్థానాల్లో నిలిచిన జట్ల ఖాతాలో 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 86 కోట్లు) లభిస్తాయి. 37 ప్రపంచకప్లో ఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ జట్టు వరుసగా 37 మ్యాచ్ల్లో పరాజయం రుచి చూడలేదు. 2024 నుంచి ఇప్పటి వరకు స్పెయిన్ 27 మ్యాచ్ల్లో గెలిచింది. 10 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో స్పెయిన్ గెలిస్తే ఇటలీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతుంది. ఇటలీ జట్టు 2018 నుంచి 2021 వరకు వరుసగా 37 మ్యాచ్ల్లో ఓడిపోలేదు.3 మెస్సీ బృందం ఈసారి టైటిల్ గెలిస్తే ప్రపంచకప్ను అత్యధికంగా నాలుగుసార్లు గెలిచిన మూడో జట్టుగా నిలుస్తుంది. అర్జెంటీనా ఇప్పటికి మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా నిలిచింది. బ్రెజిల్ జట్టు అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. ఇటలీ, జర్మనీ జట్లు నాలుగుసార్లు చొప్పున సాధించాయి. 1 ప్రపంచ ఫుట్బాల్ ర్యాంకింగ్స్ను 1992లో ప్రవేశపెట్టాక వరల్డ్కప్ టైటిల్ కోసం ర్యాంకింగ్స్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తుది పోరులో తలపడుతున్నాయి. 4 ఫైనల్లో స్పెయిన్పై అర్జెంటీనా గెలిస్తే ఆడిన అన్ని మ్యాచ్ల్లో గెలిచి ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన నాలుగో జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో బ్రెజిల్ (2002, 1970), ఉరుగ్వే (1930), ఇటలీ (1934) మాత్రమే ఈ ఘనత సాధించాయి.3 అర్జెంటీనా ఫైనల్లో విజయం సాధిస్తే వరుసగా రెండు ప్రపంచకప్లు గెలిచిన మూడో జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) మాత్రమే ఈ ఘనత సాధించాయి.1 మూడు ప్రపంచకప్ ఫైనల్స్లో ఒక జట్టుకు కెపె్టన్గా వ్యవహరించిన తొలి ప్లేయర్గా మెస్సీ గుర్తింపు పొందనున్నాడు. 2014 ప్రపంచకప్ ఫైనల్స్లో మెస్సీ కెప్టెన్సీలో అర్జెంటీనా జట్టు జర్మనీ చేతిలో ఓడిపోయింది. 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్పై గెలిచింది.
విజేతకు ఇచ్చేది నమూనా ట్రోఫీనే!
ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ వరల్డ్ కప్ ట్రోఫీ రూపకల్పన ఆసక్తికరంగా జరిగింది. మైదానంలో ప్లేయర్ల పోరాటం... స్టాండ్స్లో అభిమానుల ఆనందం... విజయం సాధించిన అపురూప క్షణం... ఈ మూడు భావోద్వేగాలకు ప్రస్తుతం విజేతకు అందిస్తున్న ట్రోఫీ ప్రతిరూపం. ఇటలీకి చెందిన ప్రఖ్యాత శిల్పి సిల్వియో గజానిగా దీన్ని రూపొందించారు. 1930లో జరిగిన తొలి వరల్డ్ కప్ సమయంలో రూపొందించిన ట్రోఫీ గ్రీకు దేవత ‘నైక్’ను పోలి ఉండేది. 1970లో బ్రెజిల్ మూడోసారి వరల్డ్ చాంపియన్గా నిలిచిన అనంతరం అసలు ట్రోఫీని శాశ్వతంగా సొంతం చేసుకుంది. దీంతో కొత్త డిజైన్ రూపకల్పన అనివార్యమైంది. పలు ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వేల డిజైన్లు... వందల మోడల్స్... పదుల సంఖ్యలో నమూనాలు తీర్చిదిద్దిన తర్వాత జ్యూరీ చివరకు ప్రస్తుతం ఉన్న ట్రోఫీకి పచ్చజెండా ఊపింది. ఫైనల్లో విజయం సాధించిన జట్టు కెప్టెన్కు అందించే అసలు ట్రోఫీ ఎత్తు 36 సెంటీమీటర్లు, ఇది 18 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. అయితే ఈ ట్రోఫీని విజేతకు శాశ్వతంగా అందించరు. సంబరాల అనంతరం ‘ఫిఫా’ దాన్ని తిరిగి తీసుకుంటుంది. దాని స్థానంలో బంగారు పూత పూసిన నమూనా ట్రోఫీని మాత్రమే విజేత జట్టుకు ఇస్తారు. తదుపరి వరల్డ్కప్ వరకు అసలైన ట్రోఫీ స్విట్జర్లాండ్లోని ‘ఫిఫా’ ప్రధాన కార్యాలయంలో ఉంటుంది. అయితే గతంలో మూడుసార్లు వరల్డ్కప్ నెగ్గిన జట్టు ఈ ట్రోఫీని శాశ్వతంగా తమ వద్ద ఉంచుకునేది... ప్రస్తుతం దీనికి ‘ఫిఫా’ అనుమతించడం లేదు. 1974 వరల్డ్కప్లో మొదటిసారి వాడిన ప్రస్తుత డిజైన్ను ఇప్పటి వరకు 14 సార్లు ఉపయోగించారు. 2038 వరకు ఇదే ట్రోఫీని కొనసాగించాలని ‘ఫిఫా’ నిర్ణయించింది. కప్ను కరిగించేశారు! వరుసగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచి బ్రెజిల్ 1970లో సొంతం చేసుకున్న ‘జూల్స్ రిమేట్ ట్రోఫీ’ ఇప్పుడు లేదు. ఈ కప్ రెండుసార్లు చోరికి గురైంది. 1966లో తొలిసారి ప్రేక్షకుల కోసం లండన్లో ప్రదర్శనకు ఉంచారు. ఆ సమయంలో దీనిని ఎవరో చోరి చేశారు. అయితే ‘పికిల్స్’ పేరు గల జాగిలం సౌత్ లండన్లో దీనిని గుర్తించడంతో ప్రపంచకప్ దొరికింది. ఆ తర్వాత 1983లో బ్రెజిల్ ఫుట్బాల్ సమాఖ్య ప్రధాన కార్యాలయం నుంచి ఎవరో ఈ ప్రపంచకప్ను ఎత్తుకెళ్లారు. చోరీ చేసిన వ్యక్తులు బంగారు ప్రపంచకప్ను కరిగించేశారని.. అందుకే ఎంత వెతికినా ప్రపంచకప్ జాడ దొరకలేదని చెబుతుంటారు.
దొంగాట కూడా... మెరుపుల మధ్య మరకలు
ఫుట్బాల్ ప్రపంచకప్లో వివాదాలు కొత్త కాదు. ప్రతీసారి ఈ మెగా ఈవెంట్లో ఎన్నో అంశాలు తీవ్ర చర్చకు దారి తీస్తాయి. ఆటగాళ్ల ప్రవర్తను సంబంధించి కొన్ని వివాదాలు ఉంటే, మరికొన్ని రిఫరీల నిర్ణయాలు, వారి వ్యవహార శైలిపై సందేహాలు రేకెత్తిస్తాయి. ఇప్పుడు కూడా పలు ఘటనలు ప్రపంచకప్ నిర్వహణలో పారదర్శకత లేకుండా ‘ఫిఫా’ నిజాయితీని శంకించేలా కనిపించాయి. రొనాల్డోకు ప్రపంచకప్ అవకాశం... వరల్డ్ కప్ క్వాలిఫయర్లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాడు దారాషియాను దురుసుగా అడ్డుకున్నందుకు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోపై మూడు మ్యాచ్ల నిషేధం పడింది. దీని ప్రకారం అతడు చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్తో పాటు వరల్డ్ కప్ తొలి రెండు మ్యాచ్ల నుంచి తప్పుకోవాలి. అయితే రొనాల్డో స్థాయి, అతని స్టార్ హోదాను దృష్టిలో ఉంచుకొని ‘ఫిఫా’ సడలింపు ఇచ్చింది. 226 మ్యాచ్ల అంతర్జాతీయ కెరీర్లో అతను ఇలా ఎప్పుడూ చేయలేదు కాబట్టి నిషేధాన్ని ‘ఏడాది పాటు నిలిపివేస్తున్నట్లు’ ప్రకటించింది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. రొనాల్డో రెండు మ్యాచ్లు ఆడకపోతే ఆ మ్యాచ్లపై ఆసక్తి తగ్గిపోతుందనే ‘ఫిఫా’ ఈ నిర్ణయం తీసుకుంది. బాలోగాన్ కోసం ట్రంప్ సిఫారసు... అమెరికా ఆటగాడు ఫొలారిన్ బాలోగాన్ విషయంలో ‘ఫిఫా’ వ్యవహారం అందరినీ ఆశ్చర్యపర్చింది. బోస్నియా హెర్జెగోవినాతో జరిగిన మ్యాచ్లో అమెరికా ఆటగాడు బాలోగన్ రెడ్ కార్డుకు గురయ్యాడు. దాంతో బెల్జియంతో జరిగే ప్రిక్వార్టర్స్ పోరులో అతను ఆడటానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఆతిథ్య జట్టు ఆటగాడు అలా తప్పుకోవడం బాగుండదని, ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్ఫాంటినోకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగా ఫోన్ చేసి అడిగాడు. దాంతో ఇన్ఫాంటినో వెంటనే స్పందించిన బాలోగాన్ నిషేధాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. మైదానంలో ఆటపై బయటి వ్యక్తి ఇలా కోరడం గతంలో ఎన్నడూ జరగలేదు. తగిన సమాధానం ఇవ్వకుండా ‘ఫిఫా’ తమ నిర్ణయాన్ని అమలు చేసింది.టోర్నీ ‘డ్రా’తోనే పక్షపాతం... ఫుట్బాల్ ప్రపంచకప్లో గతంలో ఎన్నడూ లేని విధంగా టెన్నిస్ పద్ధతిలో ‘ఫిఫా’ తెలివిగా మ్యాచ్ల ‘డ్రా’ను ప్రకటించింది. గతంలో ఓపెన్ ‘డ్రా’ ద్వారా చూస్తే నాకౌట్ దశకు ముందే పెద్ద జట్లు ప్రత్యర్థులుగా తలపడే అవకాశం వచ్చేది. ఈసారి ఎంచుకున్న ‘డ్రా’ ప్రకారం ర్యాంకింగ్స్లో నంబర్వన్గా ఉన్న స్పెయిన్...నంబర్ టూ అర్జెంటీనాను ఫైనల్ వరకు ఎదుర్కొనే అవకాశమే లేదు. మూడో స్థానంలోని ఫ్రాన్స్, నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ మధ్య సెమీస్కు ముందు మ్యాచ్ జరగదు. ‘ఫిఫా’ తెలివితేటలు బాగా పని చేశాయని చివరకు తేలింది. చరిత్రలో తొలిసారి టాప్–4 టీమ్లు వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. సోమాలియా రిఫరీకి నో ఎంట్రీ... ప్రపంచ ఫుట్బాల్లో అత్యుత్తమ రిఫరీల్లో ఒకడిగా సోమాలియాకు చెందిన ఒమర్ అబ్దుల్ కదిర్కు పేరు ఉంది. అందుకే అతడిని ‘ఫిఫా’ వరల్డ్ కప్ రిఫరీల జాబితాలో చేర్చింది. అయితే తమ దేశంలోకి ప్రవేశించించేందుకు నిషేధం ఉన్న దేశాల్లో సోమాలియా ఒకటి. కాబట్టి కదిర్ను అమెరికాలో అడుగుపెట్టనిచ్చేది లేదని వైట్హౌస్ అధికారులు స్పష్టం చేశారు. అతడికి వీసా ఉండటంతో పాటు వ్యక్తిగతంగా కాకుండా అధికారిక హోదాలో వరల్డ్ కప్ కోసం అతను వచ్చినా సరే అమెరికా ప్రభుత్వం లెక్క చేయలేదు. ఇలాంటి స్థితిలో రిఫరీకి కనీసం అండగా నిలవకుండా మౌనం వహించడం ‘ఫిఫా’ అమెరికాకు ఎంతగా తలవంచిందో అర్థమవుతుందని విమర్శలు వెలువెత్తాయి. అర్జెంటీనా... ‘ఫిఫా’ భాయ్ భాయ్‘ఫిఫా’ ఎలాగైనా అర్జెంటీనా జట్టును మళ్లీ విజేతగా నిలపాలని చూస్తున్నట్లుంది... ఆ జట్టుకు మా ముందస్తు అభినందనలు... ప్రిక్వార్టర్స్ మ్యాచ్ తర్వాత ఈజిప్ట్ ఆటగాళ్ల స్పందన ఇది. ప్రతీ మ్యాచ్లో రిఫరీలు ఆ జట్టుకు మద్దతుగా నిలిచారని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. వరుసగా ఈజిప్ట్ , స్విట్జర్లాండ్, ఇంగ్లండ్తో మ్యాచ్లలో అర్జెంటీనాకు అనుకూలంగా అంతా జరిగిందని ప్రపంచం మొత్తం విమర్శించింది. వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) ద్వారా అయితే అర్జెంటీనాకే పూర్తిగా అండగా నిలవడం కనిపించింది. కనీసం దాపరికం కూడా లేకుండా బహిరంగంగా ‘ఫిఫా’ అన్ని పరిమితులు దాటేసిందని ఇతర జట్ల అభిమానులు, విశ్లేషకులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలన్నీ అర్జెంటీనా విజయాల స్థాయిని తగ్గించాయి అల్జీరియాతో జరిగిన మ్యాచ్లో మెస్సీ కాలు తగిలి ప్రత్యర్థి కెప్టెన్ ఐసా మందీ కింద పడ్డాడు. రీప్లేలో కూడా ఇది కనిపించింది. రెడ్ కార్డ్ స్థాయి శిక్షకు గురయ్యే ఈ ఘటనలో మెస్సీపై ఎలాంటి చర్య తీసుకోలేదు. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో తప్పు లేదని కనిపిస్తున్నా అంపైర్ ఎల్లో కార్డ్ ఇచ్చాడు. మ్యాచ్లో అది అతడికి రెండో ఎల్లో కార్డ్ కావడంతో బ్రీల్ ఎంబోలో మైదానం వీడగా... అప్పటి వరకు 1–1తో మెరుగైన స్థితిలో కనిపించిన స్విట్జర్లాండ్ 10 మందితోనే ఆడి ఓటమి పాలైంది. ఈజిప్ట్ తో జరిగిన మ్యాచ్లోనైతే రిఫరీ మరీ పక్షపాతంగా వ్యవహరించినట్లు తేలింది. 58వ నిమిషంలో ఈజిప్ట్ ప్లేయర్ ముస్తఫా జికో చేసిన గోల్ను రిఫరీ ‘ఫౌల్’గా తేల్చడం ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. అదే మ్యాచ్ చివర్లో సలా తప్పు లేదని తేలినా... అర్జెంటీనాకు రిఫరీ పెనాల్టీ ఇచ్చేశాడు. ఓటమి ఖాయమనిపించిన స్థితిలో 14 నిమిషాల వ్యవధిలో 3 గోల్స్ చేసి అర్జెంటీనా మ్యాచ్ను గెలుచుకుంది. అర్జెంటీనా గోల్ కొట్టడంలో విఫలమైనప్పుడు బాధపడుతూ, గోల్ కొట్టగానే సంబరాలు చేసుకుంటున్న ‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్ఫాంటినో దృశ్యాలు ప్రపంచం అవాక్కయ్యేలా చేశాయి. ఇంగ్లండ్తో జరిగిన సెమీస్లో అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్ చేసిన గోల్ చర్చకు దారి తీసింది. అది ‘ఆఫ్సైడ్’ గోల్ అయినా... పూర్తిగా రివ్యూ చేయకుండా, అసలు వీఏఆర్లో ఆఫ్సైడ్ గ్రాఫిక్స్ కూడా చూడకుండా రిఫరీ తన నిర్ణయం ప్రకటించాడని అంతా ఆరోపించారు.
‘మన’ ఆట ఎప్పుడో?
మరో ఫుట్బాల్ ప్రపంచ కప్ వచ్చింది... ఆదివారంతో ముగిసిపోతోంది కూడా! మెస్సీ మాయలో తరించాం... ఎంబాపె, హాలాండ్, డెంబెలె, మార్టినెజ్ మెరుపులకు జేజేలు పలికాం... మిగతా ఆటగాళ్ల విన్యాసాలను కూడా ఓహో అంటూ చప్పట్లు కొట్టాం... కానీ ఇలా ఎప్పటి వరకు? పరాయి దేశపు ఆటగాడికి అభిమాన ప్రేక్షకుడిలా ఆటను ఆస్వాదిస్తున్నాం తప్ప ‘మనోడు’ అంటూ ఒక్కడూ మైదానంలో కనిపించడం లేదు. ‘ఫిఫా’ వరల్డ్ కప్ మొదలై 96 ఏళ్లు అయినా భారత జట్టుకు ప్రాతినిధ్యమే లేదు. మైదానంలో దిగేందుకు కనీసం ఒక్కసారి కూడా అవకాశం రాలేదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన 1950 వరల్డ్ కప్లో మాత్రం భారత్గా నేరుగా అవకాశం లభించింది. వేర్వేరు రాజకీయ కారణాలతో పలు జట్లు తప్పుకోవడంతో ఆడేందుకు భారత్ను కూడా ‘ఫిఫా’ ఎంపిక చేసింది. అయితే తగిన ప్రాక్టీస్ లేక, జట్టు ఎంపికలో గందరగోళవంటి సమస్యలతో చివరి నిమిషంలో జట్టును పంపడం లేదని భారత ఫుట్బాల్ సమాఖ్య ప్రకటించింది. ఆ తర్వాత మన అడుగులు ఒక్కసారి కూడా అటు వైపు పడలేదు. 2026 టోర్నీలో ప్రపంచ కప్ను 32 నుంచి 48 జట్లకు పెంచినా... అర్హతా ప్రమాణాలకు మనం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాం. మన దేశంలో ఫుట్బాల్ స్థాయి నానాటీకీ పడిపోతున్న ఈ స్థితిలో వరల్డ్ కప్లో ఆటను కోరుకోవడం అత్యాశే కావచ్చు. ప్రస్తుతం ‘ఫిఫా’ ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్ 138వ స్థానంలో ఉంది. ఆసియా ఖండంలోనైతే ఈ ర్యాంక్ 27గా ఉంది. వరల్డ్ కప్కు అర్హత సాధించే ప్రయత్నంలో 1986, 1994, 1998లలో... ఆ తర్వాత 2002 నుంచి 2026 వరకు భారత జట్టు వరుసగా ఆసియా ఖండం నుంచి అర్హత సాధించే లక్ష్యంతో క్వాలిఫయింగ్ టోర్నమెంట్లు ఆడింది. అయితే ఒక్కసారి కూడా జట్టు కావాల్సిన విజయాలు సాధించి ముందంజ వేయలేకపోయింది. ఇన్నేళ్లలో ఆసియాలోని 22 జట్లతో తలపడిన భారత్ వరల్డ్ కప్ కోరిక మాత్రం తీరలేదు. 2026 టోర్నీలో ఆసియా నుంచి 9 జట్లకు చాన్స్ లభించినా భారత్ మాత్రం వీటిలో లేదు. ఈ ఖండం నుంచి ఇరాన్, ఇరాక్, జపాన్, జోర్డాన్, ఖతర్, సౌదీ అరేబియా, కొరియా, ఉజ్బెకిస్తాన్, ఆ్రస్టేలియా బరిలోకి దిగాయి. క్వాలిఫయింగ్ టోర్నీలో ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్లపై మొత్తం 6 మ్యాచ్లు ఆడిన భారత్ ఒకటే మ్యాచ్ గెలిచి అర్హత సాధించే అవకాశాలు చేజార్చుకుంది. మరోవైపు ఒలింపిక్స్లో మాత్రం భారత్కు అవకాశం దక్కింది. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో సెమీఫైనల్కు చేరడం మన జట్టు అత్యుత్తమ ప్రదర్శన. అయితే 1992 నుంచి నిబంధనలు మార్చి అండర్–23 టీమ్లను మాత్రమే ఒలింపిక్స్కు పంపాలని నిర్ణయించగా...ఆ తర్వాత భారత్ ఒక్కసారి కూడా అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుతం మన దేశంలో ఫుట్బాల్ క్రీడకు అసలు ఏమాత్రం ఆదరణ లేని స్థితి, కనీస సౌకర్యాలు లేకపోవడం, నాసిరకం ప్రమాణాలకు తోడు ఏమాత్రం ముందు చూపు లేని జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చేతగానితనం వెరసి వరల్డ్ కప్లో మన జట్టు గురించి కనీసం ఆలోచించకుండా చేస్తోంది. జట్టుగా కాకున్నా కొందరు ఆటగాళ్లయినా కనీసం తమ వ్యక్తిగత సామర్థ్యంతో విదేశీ లీగ్లలో ఆడటం, స్థాయిని పెంచుకోవడం లాంటివి కూడా కనిపించడం లేదు. 2030లో జరిగే వరల్డ్ కప్లో మళ్లీ జట్ల సంఖ్యను 64కు పెంచాలని ‘ఫిఫా’ యోచిస్తోంది. దాని కోసమైనా ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమై క్వాలిఫయింగ్ కోసం ఒక ప్రయత్నం చేయవచ్చు. తాజా స్థితిలో మాత్రం ప్రపంచకప్లో మన హాజరు ఇంకా సుదూర స్వప్నమే!
న్యూస్ పాడ్కాస్ట్
నంబర్ 1 నుంచి నేలచూపులే... నీతి ఆయోగ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు భారీగా పతనం
ఏపీ సమస్యలపై ఎలుగెత్తాలి. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తాం... ఆక్వా రైతులతో ముఖాముఖిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
పల్నాడు కలను సాకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... 100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల కొత్త మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో మరో కుంభకోణానికి తెరతీసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... ల్యాప్టాప్ల కొనుగోలులో దోపిడీకి స్కెచ్
నిలబెట్టుకోలేనప్పుడు హామీలు ఎందుకిచ్చారు?.... ఆంధ్రప్రదేశ్లో కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు... భారీ ర్యాలీలు, ధర్నాలతో చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో తిష్టవేసిన సమస్యలు... 2024లో 43 లక్షలున్న విద్యార్థులు ఇపుడు 30 లక్షలే..
టీచర్ల ‘టెట్’ ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదు?... ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
బిజినెస్
ఐపీవో బాటలో మేక్ మై ట్రిప్ ఇండియా
ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫాం మేక్మైట్రిప్ ఇండియా (ఎంఎంటీ ఇండియా) పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉంది. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కాన్ఫిడెన్షియల్ ప్రాతిపదికన ముసాయిదా ప్రాస్పెక్టస్ను సమర్పించింది. దీని ప్రకారం.. కంపెనీ మాతృ సంస్థ మేక్మైట్రిప్, దాని అనుబంధ సంస్థ ఐబిబో గ్రూప్ హోల్డింగ్స్ కొంత వాటాలను విక్రయించనున్నాయి. తద్వారా వచ్చిన నిధులు దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడనున్నాయి. ఐపీవో అనంతరం కూడా మేక్మైట్రిప్కి ఎంఎంటీ ఇండియా అనుబంధ సంస్థగానే కొనసాగుతుంది.
బంగారంపై మళ్లీ కియోసాకి ‘భారీ’ కామెంట్
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం, వెండి పెట్టుబడులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పెట్టుబడిదారుడు జిమ్ రోజర్స్ అభిప్రాయాలను ప్రస్తావిస్తూ, "బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగి 'చంద్రుడి' దాకా వెళ్తాయి" అని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు.అయితే ధరలు నేరుగా పెరగవని, మధ్యలో భారీ పతనాలు (రిట్రేస్మెంట్లు) కూడా తప్పవని జిమ్ రోజర్స్ చెప్పిన విషయాన్ని కియోసాకి గుర్తు చేశారు. ఇటీవల బంగారం గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా తగ్గిందని, వెండి కూడా భారీ కరెక్షన్ను ఎదుర్కొందని తెలిపారు.చాలా మంది ఇన్వెస్టర్లు ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు కొనుగోలు చేసి, తర్వాత ధరలు పడిపోగానే భయంతో విక్రయిస్తారని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను మాత్రం ఈ ధరల పతనాన్ని అవకాశంగా తీసుకుని మరింత బంగారం, వెండి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.బంగారం, వెండి ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఒక స్నేహితుడు అడిగితే, "ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఈ సమస్యలను పరిష్కరిస్తాయనే నమ్మకం నాకు లేదు. నిజానికి అప్పులు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలకు వారే కారణం. ఇవి ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువ" అని తాను సమాధానం ఇచ్చినట్లు కియోసాకి తెలిపారు.చివరగా ఇన్వెస్టర్లను ఉద్దేశించి, "ఎక్కువ ధరకు కొనుగోలు చేసి, తక్కువ ధరకు అమ్ముతారా? లేక తక్కువ ధర వద్ద కొనుగోలు చేసి సంపదను సృష్టిస్తారా? బంగారం, వెండి ధరలు ఇంకా భారీగా పెరుగుతాయి" అంటూ తన పోస్టును ముగించారు. అయితే ఇవి ఆయన వ్యక్తిగత పెట్టుబడి అభిప్రాయాలేనని, పెట్టుబడులు పెట్టే ముందు సొంతంగా విశ్లేషించుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.“Gold and silver going to the moon.”Legendary investor Jim Rogers.Jim states further, that the prices of gold and silver will go to the moon, yet not without severe retracements. Gold and silver just went through a severe retracements.Recently gold hit a high of…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 17, 2026
ఇకపై అలాగైతేనే డ్రైవింగ్ లైసెన్స్..
సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను రవాణా శాఖ కఠినతరం చేసింది. రోడ్డు భద్రతా నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న అభ్యర్థి ఇక నుంచి తప్పనిసరిగా ఆన్లైన్లో రోడ్డు భద్రతపై మూడు గంటల పాటు వీడియో పాఠాలను చూసి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. వీడియో పాఠాలకు హాజరైన వారిని మాత్రమే డ్రైవింగ్ లైసెన్సుల కోసం నిర్వహించే ట్రాక్ టెస్టులకు అనుమతిస్తారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా కూకట్పల్లి ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ప్రారంభించారు. ఈ ఫలితాలను అనుసరించి నగరంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఈ విధానాన్ని విస్తరించనున్నారు. ముఖ కవళికల నమోదు ఉంటేనే.. సాధారణంగా లెరి్నంగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత 30 రోజుల నుంచి 6 నెలల్లోపు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఇందుకోసం నాగోల్, కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, తదితర డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే లైసెన్స్ లభిస్తుంది. ఇక నుంచి ఈ రెండు పరీక్షలతో పాటు 3 గంటల వీడియో పాఠాలను చూసి రోడ్డు భద్రతా నియమాలను తెలుసుకొని డ్రైవింగ్ టెస్ట్కు వెళ్లాల్సి ఉంటుంది. రవాణాశాఖ ఆధ్వర్యంలోని టీజీ ఆన్లైన్లో ఈ పాఠాలకు సంబంధించిన మాడ్యూల్స్ ఉంటాయి. ఆన్లైన్లో ఈ పాఠాలను వీక్షించే సమయంలో అభ్యర్థుల ముఖకవళికల నమోదు (ఫేస్ రికగ్నిషన్) తప్పనిసరి. అలాగే స్కూల్ జోన్లలో వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా హారన్ మోగించాలి. ఆసుపత్రులు ఉన్న చోట హారన్ మోగించొద్దు. డిఫెన్సివ్ డ్రైవింగ్ తెలిసి ఉండాలి. రోజుకు 2,500 డ్రైవింగ్ టెస్టులు... ప్రస్తుతం నగరంలోని అన్ని టెస్ట్ ట్రాక్లలో నిత్యం 2,500 మందికిపైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. కాగా.. కొన్ని చోట్ల ఎలాంటి పరీక్షలు లేకుండానే డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో రవాణాశాఖ తాజాగా ప్రవేశపెట్టిన రోడ్డు భద్రతా పాఠాలు సత్ఫలితాలిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్బీఐ తొలి అడుగు!
దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.10, రూ.20 విలువల పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక చర్యలు ప్రారంభించింది. అయితే పైలట్ ప్రాజెక్టు తేదీలు లేదా నోట్ల డినామినేషన్లపై ఆర్బీఐ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం గ్లోబల్ టెండర్ ప్రక్రియ ప్రారంభించడం ద్వారా సన్నాహాలు వేగవంతం చేసింది.ఆర్బీఐకి చెందిన కరెన్సీ ముద్రణ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) ప్రపంచవ్యాప్తంగా తయారీ సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI) కోరింది. ఇందులో బయాక్సియల్ ఓరియెంటెడ్ పాలీప్రొపైలిన్ (BOPP) ఆధారిత పాలిమర్ సబ్స్ట్రేట్ను సరఫరా చేయాలని పేర్కొంది. మొత్తం 68,000 రీముల పాలిమర్ షీట్లు అవసరమని, వాటిలో రెండు డినామినేషన్లకు చెరో 34,000 రీములు కేటాయించినట్లు టెండర్లో వెల్లడించింది.ఈ పాలిమర్ షీట్లలో పారదర్శక విండో, మెటాలిక్ న్యూమరల్, మాగ్నెటిక్ సూడో థ్రెడ్, షాడో ఇమేజ్, ఇరిడిసెంట్ ప్యాటర్న్ వంటి అధునాతన భద్రతా లక్షణాలు ఉండాలని ఆర్బీఐ నిర్దేశించింది. ఇవి నకిలీ నోట్ల తయారీని మరింత కష్టతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు.టెండర్ నిబంధనల ప్రకారం, దరఖాస్తు చేసుకునే సంస్థలకు సెంట్రల్ బ్యాంకులు లేదా బ్యాంక్నోట్ ప్రింటింగ్ సంస్థలకు కనీసం మూడేళ్ల పాటు పాలిమర్ సబ్స్ట్రేట్ సరఫరా చేసిన అనుభవం ఉండాలి. అంతేకాదు, చైనా లేదా పాకిస్తాన్కు సంబంధించిన కార్యకలాపాలు భారత ప్రాజెక్టుతో సంబంధం లేకుండా పూర్తిగా వేరుగా ఉండాలని, అక్కడి నుంచి ముడి పదార్థాలను సేకరించకూడదని కూడా కఠిన నిబంధనలు విధించింది. బిడ్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 18గా నిర్ణయించింది.ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారు?జూన్లో జరిగిన ద్రవ్య విధాన సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, పాలిమర్ నోట్ల ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉందని, వాటి ప్రయోజనాలు, వ్యయభారం, అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అందువల్ల 2027లో పూర్తి స్థాయి అమలు జరిగే అవకాశం ఉందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నప్పటికీ, దీనిపై ఆర్బీఐ నుంచి అధికారిక ధ్రువీకరణ ఇంకా వెలువడలేదు.పాలిమర్ నోట్ల ప్రత్యేకత ఏమిటంటే..1988లో ఆస్ట్రేలియా తొలిసారిగా పాలిమర్ బ్యాంకు నోట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 50కిపైగా దేశాలు వీటిని ఉపయోగిస్తున్నాయి. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువకాలం మన్నుతాయి. నీరు, తేమ, మురికి ప్రభావం తక్కువగా ఉండటంతో పాటు నకిలీ చేయడం కూడా కష్టమవుతుంది. దీర్ఘకాలంలో ముద్రణ వ్యయం తగ్గడం, పాడైన నోట్ల స్థానంలో కొత్త నోట్లు ముద్రించే అవసరం తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఫ్యామిలీ
మనలో కూడా దాగున్న ఈ జబ్బు ఇంత ప్రమాదమా!?
సోమరితనం, బద్ధకం, నిర్లక్ష్యం... ఏదైతేనేం? చేయాల్సిన పనులు ఆపేయడానికి..? రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అంటూ ‘వాయిదా’ల అటకెక్కించడానికి..? నిజానికి ఇలాంటి బద్ధకస్తుల జాబితాలో మన చుట్టూ ఉన్నవాళ్లే కాదు మనం కూడా కొన్నికొన్ని సార్లు చేరిపోతుంటాం. ఎందుకంటే వాయిదా వేయడం కొందరికి అలవాటు.. మరికొందరికి అదోరకం కంఫర్ట్. నేటి యువతలో ఎక్కువగా కనిపించే లక్షణం సోమరితనం. కాని జపాన్ ప్రజలు మాత్రం వారి పిల్లలకి సోమరితనాన్ని ఒక బూచిలా చూపిస్తారు. కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా సోమరితనాన్ని మెల్లమెల్లగా దూరం చేస్తారు. జపాన్లో సోమరితనాన్ని దూరం చేసే అత్యంత ప్రాచుర్యం పొందిన ఏడు జీవన సూత్రాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..1.కైజెన్పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఏదైనా చిన్న లక్ష్యంతో ప్రారంభించండి. క్రమక్రమంగా లక్ష్యాలను పెద్దగా మార్చుకుంటే మీ బ్రెయిన్కి మీరే గురువుతారు.2. ఇకిగైఏం చేయాలన్న దాని మీద స్పష్టత లోపించినప్పుడే పనులు సక్రమంగా సాగవు. అందుకే ‘ఏం చేయాలి?’ అని కాకుండా ‘ఎందుకు చేయాలి?’ అని ఎవరికి వారే ప్రశ్నించుకోగలిగినప్పుడు పని మీద గురి కుదురుతుంది.3. హరా హచి బుఏదైనా మితంగా తినడం మంచిది. బిర్యాని అంటే ఇష్టమని పొట్ట పగిలేలా తినకుండా 80 శాతం ఆకలి తీరినంత వరకే తినాలన్నది జపాన్ సంప్రదాయం. ఇలా చేయడం వల్ల శరీరం తేలికగా ఉండడమే కాకుండా మెదడు కూడా చురుకుగా మారుతుందని జపాన్ ప్రజలు భావిస్తారు.4. సెయిరి – సెయితోనుమీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడి ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి. ప్రతి వస్తువు క్రమ బద్ధంగా, వీలైనంత వరకు కాస్త నిశబ్ధంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చేస్తున్న పని మీద ఏకాగ్రత పెరుగుతుంది.5. కింట్సుగికొన్నిసార్లు పొరపాట్లు జరగవచ్చు. తప్పులు దొర్లవచ్చు. భయపడకండి. ధైర్యంతో ఎదుర్కోండి. తప్పులను ఒప్పుకోండి. లోపాలను అంగీకరించండి...అలా చేసినప్పుడే నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది.6. వాబి సాబిప్రతి క్షణం విలువైనదే.. మొదలు పెట్టేవరకు ఏదీ పూర్తి కాదు. ఇంకా సమయం కావాలని ఆలోచించక ఉన్న వనరులతో పని మొదలుపెట్టండి. విశ్వాశమే విజయానికి తొలిమెట్టు.7. యాంకర్డ్ ఫోకస్ప్రతిసారి గంటల తరబడి కుర్చుని పని చేయడం కంటే ప్రతి పనిని మొదలు పెట్టే ముందు గట్టిగా శ్వాస తీసుకోండి. తర్వాత నచ్చిన మ్యూజిక్ కొన్ని నిమిషాల పాటు వినండి. ఆ తర్వాత పనిని మొదలు పెట్టండి. ప్రతి 25 నిమిషాలకొకసారి లేచి ఓ ఐదు నిమిషాల పాటు విరామం తీసుకోండి. దీని వల్ల శరీరంలో ఉత్సాహంతో పాటు పనిలో ఉత్పాదకత పెరుగుతుంది.
అమ్మను కొంచెం యంగ్గా...
చాలామంది తల్లిదండ్రులలో నాన్న యంగ్గా కనిపిస్తే... అమ్మేమో కొంచెం వయసు పైబడ్డట్లుగా కనిపించడం సహజం. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామా?అమ్మానాన్నల వయసు దాదాపు ఒకటే. చె΄్పాలంటే సహజంగానే అమ్మకంటే నాన్నే వయసులో బాగా పెద్ద అయినా, చాలామందిలో నాన్నే యంగ్గా.. యాక్టివ్గా ఉంటే అమ్మలేమో కొంచెం పెద్దగా కనిపిస్తుంటారు. అందుకు వారి జీన్స్ ఒక్కటే కారణం కాదు. మహిళలలో ముందుగా వచ్చే మెనోపాజ్ కారణంగా శరీరంలో వృద్ధాప్య ప్రక్రియ కొంచెం వేగంగా జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యతలు, ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఈ వయస్సులో ఈ మార్పులు త్వరగా కనిపించొచ్చు. 40 ఏళ్ల వరకు మహిళల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత ఇది తగ్గిపోవడం వల్ల శరీరం అనేక మార్పులకు లోనవుతుంది.ఈ మార్పుల వల్ల మెదడు పనితీరు మందగించడం, ఎముకలు బలహీనపడటం, పొట్టలో కొవ్వు పెరగడం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ హార్మోన్ల మార్పులు మాత్రమే కాదు.. నిద్రలేమి, ఆహారంలో పోషకాల లోపం, దీర్ఘకాలిక ఒత్తిడి లాంటి కారణాలు కూడా స్త్రీ శరీరాన్ని త్వరగా బలహీన పరిచే కారకాలు.అన్నింటికన్నా ముఖ్యంగా... చాలా మంది మహిళలు సరైన ఆహారం తీసుకోకపోవడం, గర్భధారణ సమయంలో పోషకాలు తగ్గిపోవడం లాంటి కారణాలతో హార్మోన్ల అసమతుల్యతను ఎదుర్కొంటారు. దాని ఫలితంగానే తొందరగా వయసు మీదపడ్డట్లు కనిపిస్తారు. చర్మ ఆరోగ్యం, ఎముకల బలం కోసం విటమిన్ ఇ,సి,డి విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 లాంటి పోషకాలు తీసుకోవడం చాలా అవసరం.ఉదాహరణకి పొద్దుతిరుగుడు గింజలు, బాదం, కీర దోస, క్యాప్సికమ్, బ్రోకలీ, నారింజ, టమాటా లాంటి ఆహారాల్లో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగు, పనీర్, కేఫిర్, మజ్జిగ, ఇడ్లీ లాంటివి ఆరోగ్యకరమైన పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం అరుగుదల వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే యాంటీ బయాటిక్స్ వల్ల నాశనం అయిన మంచి బ్యాక్టీరియాను తిరిగి పెంచడానికి ఇది సహాయపడుతుంది.ఈ వయసులో అధిక రక్తపోటు ఎక్కువగా సమస్యగా మారే అవకాశం ఉంటుంది. టేబుల్ ఉప్పు తక్కువగా తీసుకోవడం, వెల్లుల్లి, ఉల్లిపాయ పొడి, మిరియాలు, కొత్తిమీర లాంటి సహజమైన మసాలాపదార్థాలు ఉపయోగించడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సోడియం తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. వారానికి కనీసం మూడు రోజుల పాటు బలం పెంచే వ్యాయామాలు చేయడం, యోగా, నడక లాంటి వ్యాయామాలు చేయడం వయసును నియంత్రించడంలో సహాయపడతాయి. అదే సమయంలో 7 నుంచి 9 గంటల వరకు నిద్రపోవడం, మానసిక ఆరోగ్యం కోసం కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ సూచనలు పాటిస్తే అమ్మ కూడా నాన్న లాగే ఆరోగ్యంగా, యంగ్గా ఉటుంది.అమ్మ యాక్టివ్గా ఉండాలంటే..?వయసు పైబడ్డట్టు కనిపించే మాటెలా ఉన్నా... ఈ వయసులో వారు యాక్టివ్గా ఉండాలంటే మాత్రం వారి బరువుకు తగ్గట్టు రోజుకు 5 నుంచి 10 గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవాలి. ఇది ఎముకలు, కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇంకా మూత్రపిండాల సమస్యలు తగ్గించడానికి దోహదం చేస్తుంది.
ప్రతిభకు పట్టం
భారతీయ ఇతిహాసాలలో శ్రీరాముడు కేవలం ధర్మప్రభువు మాత్రమే కాదు; ఆయన ఒక దూరదృష్టి గల నాయకుడు, ప్రతిభను గుర్తించే వ్యక్తి, మనుషులను తీర్చిదిద్దే సమర్థ నిర్వాహకుడు. ఆయన ఎవరినీ వారి జన్మ, హోదా, వయస్సు ఆధారంగా అంచనా వేయలేదు. ఒక వ్యక్తి పనితనం, సమర్థత, లక్ష్యానికి ఎంతగా ఉపయోగపడగలడనే ఒక్క ప్రమాణమే ఆయన ముందుండేది.వానర సేనలో హనుమంతుడు మొదట ఒక సాధారణ యోధుడిలా కనిపించవచ్చు. కానీ అతని వాక్చాతుర్యం, బుద్ధిశక్తి, సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని గమనించిన రాముడు, లంకా ప్రయాణం వంటి అత్యంత కీలకమైన బాధ్యతను హనుమకే అప్పగించాడు. చివరికి జాంబవంతుడు వంటి అనుభవజ్ఞులు కూడా హనుమంతుడిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాటలకంటే ఆచరణను గమనించే మేనేజర్గా శ్రీరాముడిని చూడవచ్చు. ఎవరు ఎంత చెప్పారు అనేదానికంటే, సంక్షోభ సమయంలో ఎవరు ముందుకు వచ్చారనే విషయానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే విభీషణుడు రావణుని సోదరుడైనప్పటికీ, అధికారబలం లేకపోయినా, నిజాయితీగా సరైన సలహా చెప్పగల ధైర్యం ఉందని గుర్తించి, అనేక మంది వ్యతిరేకించినా లంకకు రాజుగా నియమించాడు.చాలామంది ప్రతిభను గుర్తించిన తర్వాత అవకాశం మాత్రమే ఇస్తారు. కానీ శ్రీరాముడు నమ్మిన వారికి అధికారాన్ని కూడా అప్పగిస్తాడు. దీనికి ఉత్తమ ఉదాహరణ సుగ్రీవుడు. ఆయనను కేవలం మిత్రుడిగా కాకుండా, వానర సేనాధిపతిగా పూర్తి నిర్ణయాధికారంతో నియమించాడు. విద్య, అధికారమేమీ లేని గిరిజన మహిళ శబరి భక్తి, అంకితభావం, సేవాభావాన్ని గుర్తించి ఆమెను అనుగ్రహించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం. శ్రీరాముడి ప్రతిభా నిర్వహణ నమూనా మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రతిభే ప్రధాన అర్హత. బాధ్యతను స్వీకరించే ధైర్యం, బృందాన్ని ముందుకు నడిపించే నైతికతే నిజమైన నాయకత్వ లక్షణాలు. రాముడు చూపిన ప్రతిభా నిర్వహణ నమూనా నేటి సీఈవోలు, హెచ్ఆర్ నాయకులు, ప్రాజెక్ట్ మేనేజర్లకు విలువైన పాఠం.– డా. బాలాజీ దీక్షితులు పి.వి.
కింగ్ ఖాన్ గేమ్స్ ఆడతాడు
బాలీవుడ్లో షారూఖ్ ఖాన్ టాప్ హీరో. కింగ్ ఖాన్ అంటూ తెరపై షారూఖ్ కనపడితే అభిమానులు ఒళ్లు మరచిపోతారు. షారుఖ్ ఖాన్ వీడియో గేమ్స్ అంటే ఒళ్లు ఇల్లు కూడా మరచిపోతారు. ఆయన టాప్ యాక్టర్ అని దేశమంతా తెలుసు కానీ ఆయన బెస్ట్ వీడియో గేమర్ అని తక్కువ మందికే తెలుసు. సిక్స్ టీ ఏజ్లోనూ సిక్స్ప్యాక్ తో స్క్రీన్ను మెరిపించేందుకు ఎంత కష్టానికైనా సై అనే ఈ సూపర్స్టార్, విశ్రాంతి తీసుకోవడానికి కూడా వినోదాన్నే ఎంచుకుంటారు. అందులో భాగంగా తాను బాట్మాన్: ఆర్కమ్ ఆరిజిన్స్ వంటి ప్రసిద్ధ గేమ్లు ఆడతానని తరచుగా ఆయన చెబుతారు. ఏదో రిలాక్సేషన్ కోసం వీడియో గేమ్స్ ఆడితే ఆయన హాబీ గురించి చెప్పుకోవాల్సింది ఏమంది? కానీ ఆయన ముంబై లోని అత్యంత ఖరీదైన భవనాల్లో ఒకటైన ఆయన ఇల్లు ’మన్నత్’లో ఒక అంతస్తు మొత్తాన్ని గేమింగ్ పరికరాలు సెటప్ల కోసం కేటాయించారు కాబట్టే ఆయన హాబీ హాట్ టాపిక్ అవుతుంటుంది.సాటి హీరోలతోనూ... సినిమాల్లోనూ సాటి హీరోలతో తీవ్రమైన పోటీతత్వానికి ప్రసిద్ధి చెందిన ఆయన తరచుగా అభిషేక్ బచ్చన్, కాజోల్ వరుణ్ ధావన్ వంటి సహనటులతో షూటింగ్ల మధ్య గేమ్లు ఆడుతూ పోటీ పడుతూ తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు.. ఆయన ఉత్సాహం ప్రోత్సాహంగా మారి తరచుగా తోటి నటులపై కూడా తన ప్రభావం చూపింది. దానికో ఉదాహరణ ఆయన సహనటుడు సోనూ సూద్. ఒకసారి సెట్లో షూటింగ్ గ్యాప్లో షారూఖ్ ఖాన్ ద్వారా గేమింగ్ నేర్చుకున్న సోనూ ఇప్పుడు దానికి తాను కూడా బానిస అయ్యా నంటున్నాడు. ’మై హూ నా’ షూటింగ్ సమయంలో షారుఖ్ ఉత్సాహంగా... ఫిఫా ఆడేవారని, ఆడేవారని గెలిచే వరకు గేమింగ్ కొనసాగించాలని పట్టుబట్టేవారని షూటింగ్ సమయంలో జాయెద్ ఖాన్ వంటి సహనటులు తరచు గుర్తుచేసుకుంటారు. జాయెద్ ఖాన్ ఇటీవల ’మై హూ నా’ సెట్లో షారుఖ్ ఖాన్ తో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను పంచుకుంటూ, షూటింగ్ తర్వాత తాము తరచూ కలిసి వీడియో గేమ్లు ఎలా ఆడేవారో గుర్తుచేసుకున్నారు. ఆయనకు ఉన్న వీడియో గేమ్ అభిరుచి గాఢతను సోదాహరణంగా వెల్లడిస్తూ ఎస్ఆర్కే ఒక అంకితభావం గల గేమర్ అని, ముఖ్యంగా ఫీఫా 2000 గేమ్లో ఓడిపోవడాన్ని ఆయన ఇష్టపడరనే విషయాన్ని జాయెద్ పంచుకున్నారు. గేమింగ్ పట్ల ఆయనకున్న అభిరుచి బయటివారిని మాత్రమే కాదు ఆయన ఇంటివారిని కూడా ఓ ఆట ఆడిస్తోంది. ఆయన చిన్న కొడుకు అబ్రమ్ని కూడా గేమ్ లవర్గా మార్చేసింది. తన ఇద్దరు అబ్బాయిలు గేమింగ్ లో లీనమైన ఫొటోని ఆయన భార్య గౌరీఖాన్ని అభిమానులతో పంచుకున్నారు. సినిమా ఆధారిత వీడియో గేమ్స్ రావడానికి కూడా రావణ్, డాన్ 2, చెన్నై ఎక్స్ప్రెస్ వంటి సినిమాలు దోహదం చేశాయి. – సత్యబాబు, సాక్షి, హైదరాబాద్
అంతర్జాతీయం
ఇరాన్ దెబ్బకు ఆరు దేశాలు అలర్ట్!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు వరుసగా ఏడో రాత్రికి చేరుకోగా హర్మూజ్ జలసంధి చుట్టూ సైనిక కదలికలు, నౌకా రవాణా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. దక్షిణ ఇరాన్లోని హర్మూజ్గాన్ ప్రావిన్స్పై అమెరికా దాడుల్లో ముగ్గురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మాత్రం ఈ దాడుల లక్ష్యం ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమేనని పేర్కొంది.ఆధిపత్య పోరు..ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు ఘర్షణకు కేంద్రంగా మారింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) రెండు చమురు ట్యాంకర్లు మైన్ల కారణంగా పేలిపోయాయని, కొన్ని నౌకల రాకపోకలను అడ్డుకున్నామని ప్రకటించింది. అయితే అమెరికా ఈ వాదనలను ఖండించింది. అమెరికా, ఇరాన్ రెండూ ఈ వ్యూహాత్మక జలమార్గంపై తమ ప్రభావాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని నౌకలు మాత్రం పరిమిత స్థాయిలో రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం.ఇరాన్ హెచ్చరిక..అమెరికా దాడులు ఇలాగే కొనసాగితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ సైనిక అధికారులు హెచ్చరించారు. తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సీనియర్ సైనిక సలహాదారు మేజర్ జనరల్ మొహ్సెన్ రెజాయి హెచ్చరించారు. ఇరాన్ ఇక సమాన స్థాయి ప్రతీకార చర్యలకే పరిమితం కాదు.. ఎలాంటి రాజకీయ సరిహద్దు కూడా సురక్షితంగా ఉండదు అని ఆయన హెచ్చరించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటివరకు ఇరాన్ ప్రధానంగా అమెరికా స్థావరాలు, మిత్రదేశాలపై ప్రతీకార చర్యలకు దిగుతామని ప్రకటించగా, తాజా హెచ్చరికతో దాడుల పరిధి విస్తరించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ తన దాడులను కేవలం అమెరికా సైనిక లక్ష్యాలకే పరిమితం చేయకపోవచ్చని సంకేతాలు ఇస్తోంది.గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలు, సైనిక స్థావరాలు మరింత అప్రమత్తంగా మారే అవకాశం ఉంది.గల్ఫ్ దేశాలకు టెన్షన్.. ఇరు దేశాల మధ్య యుద్ధ ఘర్షణ ఇప్పుడు సరిహద్దులను దాటి గల్ఫ్ ప్రాంతానికి విస్తరిస్తోంది. తాజాగా కువైట్లో కీలక మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్ ప్రాంతాల్లోనూ క్షిపణులు, డ్రోన్ దాడుల ఆరోపణలు వచ్చాయి. కొన్ని దాడులు అమెరికా మిత్రదేశాలపై జరిగాయని ఇరాన్ ప్రకటించగా, వాటిలో కొన్ని వాదనలను ఆయా దేశాలు ఖండించాయి. దీంతో, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ దేశాలు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తున్నాయి.కువైట్పై ప్రభావంఇరాన్ దాడుల్లో కువైట్లోని కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలపై ప్రభావం పడటంతో ప్రజలను ఇంధనం, విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.ఖతార్లో అప్రమత్తతగల్ఫ్లో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరాల్లో ఒకటైన అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఉన్న ఖతార్పై కూడా ఉద్రిక్తతల ప్రభావం కనిపిస్తోంది. ఇరాన్ క్షిపణి దాడుల ప్రయత్నాలను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఖతార్ తెలిపింది.బహ్రెయిన్కు ప్రత్యేక సవాల్బహ్రెయిన్లో అమెరికా నౌకాదళానికి చెందిన కీలక స్థావరం ఉంది. దీంతో ఈ చిన్న దేశం వ్యూహాత్మకంగా అత్యంత సున్నిత ప్రాంతంగా మారింది. గల్ఫ్ భద్రతపై ఆందోళనలు పెరిగాయి.సౌదీ అరేబియా, యూఏఈ పరిస్థితిగల్ఫ్లో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులైన సౌదీ అరేబియా, యూఏఈలు తమ చమురు మౌలిక సదుపాయాల రక్షణపై దృష్టి పెట్టాయి. గతంలో చమురు కేంద్రాలపై జరిగిన దాడుల అనుభవంతో, ఇప్పుడు డ్రోన్లు, క్షిపణుల ముప్పును ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉన్నాయి.ఒమన్కు పెరుగుతున్న ప్రాధాన్యంహర్మూజ్ జలసంధికి సమీపంలో ఉన్న ఒమన్ ఈ సంక్షోభంలో కీలక పాత్రలో ఉంది. నౌకా రవాణా భద్రత, సముద్ర మార్గాల రక్షణపై దృష్టి పెట్టింది.
లిఫ్ట్లో శశిథరూర్ విలవిల..
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శుక్రవారం సాయంత్రం తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ హోటల్లో లిఫ్ట్లో చిక్కుకుని భయాందోళనకు గురయ్యారు. పీఎంజీ ప్రాంతంలోని హోటల్ ప్రశాంత్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సాయంత్రం 6 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు. ఆరో అంతస్తులో ఉండగా లిఫ్ట్ ఒక్కసారిగా మొరాయించడంతో థరూర్తో పాటు ఆయన బృందం సభ్యులు సుమారు 15 నిమిషాల పాటు లోపలే ఉండిపోయారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన హోటల్కు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బయటి నుంచి లిఫ్ట్ తలుపులను తెరిచి థరూర్ను, ఆయన వెంట ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. లిఫ్ట్ లోడ్ ఎక్కువగా ఉండటం వల్లే సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా గుర్తించారు. #WATCH | Thiruvananthapuram, Keralam: Congress MP Shashi Tharoor got briefly stuck in the lift of a private hotel while arriving to attend the installation ceremony of the Rotary Club of Trivandrum East. Fire and Rescue Services personnel reached the spot and used a hydraulic… pic.twitter.com/EA0FtTHTqZ— ANI (@ANI) July 17, 2026ఘటన అనంతరం థరూర్ మాట్లాడుతూ.. తాము అందరం సురక్షితంగా ఉన్నామని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ‘ముందుగా నేను లిఫ్ట్ నిర్వహణ సిబ్బందికి, ఆ తర్వాత హోటల్ యాజమాన్యానికి సమాచారం అందించాను. వారు విఫలం కావడంతో చివరికి ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ వారికి కాల్ చేశాం’ అని పేర్కొన్నారు. తక్షణమే స్పందించి ప్రాణాపాయం నుంచి తప్పించిన అగ్నిమాపక సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.ఇది కూడా చదవండి: ప్రపంచం మెచ్చిన పాట.. సింగర్కు దక్కింది ఇంతేనా?
ఇరాక్ సంచలన వ్యూహం.. ఇరాన్కు సూపర్ స్ట్రోక్!
బాగ్దాద్/వాషింగ్టన్: ప్రపంచ చమురు రాజకీయాల్లో భారీ మార్పులకు తెరలేచింది. ఎన్నో ఏళ్లుగా చమురు ఎగుమతులకు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయం వెతికే పనిని ఇరాక్ ప్రారంభించింది. ఈ దిశగా అమెరికాకు చెందిన దిగ్గజ చమురు సంస్థలు చెవ్రాన్, బీపీ, కొనోకోఫిలిప్స్తో కలిసి 60 బిలియన్ డాలర్లకు పైగా విలువైన మెగా ఎనర్జీ ఒప్పందాలు కుదుర్చుకుంది.ఈ ఒప్పందాల్లో భాగంగా చెవ్రాన్ ఇరాక్లోని భారీ చమురు క్షేత్రాలను అభివృద్ధి చేయడంతో పాటు, సిరియా లేదా టర్కీ మీదుగా మధ్యధరా సముద్రానికి చేరే కొత్త పైప్లైన్ మార్గాలపై అధ్యయనం చేయనుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే హర్మూజ్ జలసంధిపై ఇరాక్ ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గనుంది. అదే సమయంలో బీపీ ఉత్తర ఇరాక్లోని కిర్కుక్ చమురు క్షేత్రాల పునరాభివృద్ధి చేపడుతుండగా, కొనోకోఫిలిప్స్ 42 శాతం వాటాతో ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కానుంది. దీంతో ఇరాక్ చమురు ఉత్పత్తి, ఎగుమతి సామర్థ్యం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఎందుకింత కీలకం? ప్రపంచంలో సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురులో గణనీయమైన భాగం హర్మూజ్ జలసంధి మీదుగానే ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఎగసిపడుతుంటాయి. ఇప్పుడు ఇరాక్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టడంతో ప్రపంచ ఇంధన రంగంలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రకటించినవి ప్రాథమిక ఒప్పందాలే. సాంకేతిక అధ్యయనాలు, ప్రభుత్వ అనుమతులు, పెట్టుబడుల తుది ఆమోదం అనంతరమే ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. అయినప్పటికీ ఈ నిర్ణయం మధ్యప్రాచ్య ఇంధన రాజకీయాల్లో కీలక మలుపుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇరాక్ వ్యూహం ఏమిటి?ఇరాక్ లక్ష్యం కేవలం చమురు ఉత్పత్తి పెంచడం మాత్రమే కాదు. ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, రవాణా వ్యయాలను తగ్గించడం, భౌగోళిక-రాజకీయ ప్రమాదాలను తగ్గించడం కూడా ఈ ప్రణాళికలో భాగమే. భవిష్యత్తులో హర్మూజ్ జలసంధిలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా చమురు ఎగుమతులు ఆగిపోకుండా చూసే దిశగా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడనున్నాయి.భారత్కు ఎలాంటి ప్రయోజనం?భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటి. ఇరాక్ నుంచి కూడా భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇరాక్కు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాలు సిద్ధమైతే సరఫరాలో అంతరాయాలు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరల అస్థిరత కొంత మేర తగ్గి, భారత్ వంటి దిగుమతి దేశాలకు దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
7.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
మెక్సికో-గ్వాటెమాల సరిహద్దు సమీపంలోని పసిఫిక్ తీరంలో సంభవించిన భారీ భూకంపం మధ్య అమెరికా దేశాలను వణికించింది. శుక్రవారం రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం మెక్సికోతో పాటు గ్వాటెమాల, ఎల్ సాల్వడార్ ప్రాంతాల్లో బలంగా నమోదైంది. భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇప్పటివరకు భారీ ప్రాణనష్టం, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం నమోదుకాలేదు.అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. భూకంప కేంద్రం మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రం, ఆక్విలెస్ సెర్డాన్ ప్రాంతానికి నైరుతి దిశగా సముద్రంలో 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం భూమి లోపల సుమారు 15 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఆ తర్వాత 4.9 నుంచి 6 తీవ్రత మధ్య పలు ప్రకంపనలు (ఆఫ్టర్షాక్స్) నమోదయ్యాయి.సునామీ హెచ్చరికలు.. తీర ప్రాంతాల్లో అప్రమత్తతభూకంపం సముద్రంలో సంభవించడంతో అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ, మెక్సికో అధికారులు అప్రమత్తమయ్యారు. మెక్సికో నేవీ ప్రజలను తీర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. సుమారు ఆరు గంటల పాటు బీచ్లకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.మెక్సికో, గ్వాటెమాల తీరాల్లో ఒక మీటర్ వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే పెద్ద ఎత్తున సునామీ ఏర్పడే పరిస్థితి కనిపించలేదని తర్వాత స్పష్టం చేశారు.భయంతో పరుగులు తీసిన ప్రజలుచియాపాస్ రాష్ట్రంలోని తపచులా నగరంలో భూకంపం మొదట స్వల్పంగా ప్రారంభమై తర్వాత తీవ్రత పెరిగింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న అలెజాండ్రా మెండోజా మాట్లాడుతూ.. "మొదట ఇది సాధారణ ప్రకంపన అనుకున్నాం. కానీ క్రమంగా తీవ్రత పెరగడంతో అందరం భవనం నుంచి బయటకు వచ్చాం" అని తెలిపారు.గ్వాటెమాల రాజధాని గ్వాటెమాల సిటీలో భూకంపం సమయంలో రద్దీగా ఉన్న రోడ్లపైకి ప్రజలు పరుగులు తీశారు. పలు భవనాలను ఖాళీ చేయించారు. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.ఇద్దరికి గాయాలుమెక్సికోలోని తపచులాలో ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఓ హైతీ వలస మహిళ భయంతో ఓ అపార్ట్మెంట్ భవనం నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. మరో వ్యక్తికి ఓ దుకాణం అద్దం పగిలి స్వల్ప గాయాలయ్యాయి.మెక్సికో అధ్యక్షురాలి స్పందనమెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ మాట్లాడుతూ.. చియాపాస్, టబాస్కో రాష్ట్రాల్లో ప్రాథమికంగా ఎలాంటి పెద్ద నష్టం కనిపించలేదని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అయితే మెక్సికో సిటీ వరకు ప్రకంపనలు అనిపించినప్పటికీ అక్కడ భూకంప హెచ్చరిక వ్యవస్థ పనిచేయలేదు. భూకంపం ప్రారంభ దశలో నమోదైన శక్తి హెచ్చరిక స్థాయిని దాటలేదని అధికారులు వివరించారు.గ్వాటెమాలలో పాఠశాలలు మూసివేతగ్వాటెమాల ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసింది. శాన్ మార్కోస్, క్వెట్జాల్టెనాంగో తదితర భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెడ్క్రాస్ అత్యవసర బృందాలను రంగంలోకి దింపి నష్టాన్ని అంచనా వేస్తోంది.భూకంపాలకు సున్నితమైన ప్రాంతంమెక్సికో, గ్వాటెమాల ప్రాంతాలు భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ భారీ భూకంపాలు సంభవించాయి. 2017లో మెక్సికోలో సంభవించిన 7.1 తీవ్రత భూకంపం వందలాది ప్రాణాలను బలిగొంది.తాజా భూకంపం మూడు దేశాల్లో ప్రకంపనలు సృష్టించినప్పటికీ.. ప్రస్తుతం పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆఫ్టర్షాక్స్, సునామీ ముప్పును దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
జాతీయం
వాంగ్చుక్ దీక్ష భగ్నం : ఎట్టకేలకు స్పందించిన రాహుల్గాంధీ
సాక్షి,న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నీట్ (NEET) పరీక్షలో జరిగిన అక్రమాలపై జవాబుదారీతనం కోరుతూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 20 రోజులకు పైగా జరుగుతున్న నిరసనలు, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ తరలింపుపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు స్పందించారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ ప్రధాన విధానాలపై విమర్శలు గుప్పించారు.గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను నిరసన స్థలం నుండి బలవంతంగా తరలించి, ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్ది గంటలకే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. అసత్యం, హింసలే మోదీ ప్రభుత్వ ప్రధాన సూత్రాలు అంటూ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. అహింసా మార్గంలో నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ను బలవంతంగా తరలించడం తప్పు అంటూ శనివారం ట్వీట్ చేశారు.The core tenets of the Modi government are Asatya and Hinsa.The removal of Sonam Wangchuk ji from Jantar Mantar while he was on a non-violent hunger strike is wrong.Paper leaks, the rising cost of education, and student suicides are critical issues for India’s future. No…— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2026 విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ వరుస ట్వీట్లలో స్పందించారు. ఎంతటి బలప్రయోగం చేసినా, ఈ సమస్యలను లేవనెత్తకుండా భారతదేశ విద్యార్థులను గానీ, వారిని ప్రేమించి విశ్వసించే మనల్ని గానీ ఎవరూ ఆపలేరన్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో పేపర్ లీక్లు, పెరిగిపోతున్న విద్యా ఖర్చులు, విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలపై గళమెత్తే భారతదేశ విద్యార్థులను లేదా వారికి మద్దతుగా నిలిచే వారిని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. తద్వారా వాంగ్చుక్ నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతును చాటారు. रिया के पिता, राजेश जी बेटी को खोकर इस तरह टूटे कि उन्हें देखने वाले हर शख़्स की आँखें भर आईं।यह सिर्फ़ एक परिवार का दर्द नहीं। पेपर लीक ने ऐसे कई परिवारों से उनका बच्चा छीन लिया।हर नाम के पीछे एक माँ है, एक पिता है - जिनके लिए अब कोई कल नहीं।इस System को नए सिरे से बनाना… pic.twitter.com/wCGC5lleh1— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2026అలాగే తన కుమార్తెను కోల్పోయిన బాధలో రియా తండ్రి రాజేష్ ఎంతో కుంగిపోయారనీ, ఆయనను చూసిన ప్రతి ఒక్కరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయన్నారు. ఇది కేవలం ఒక కుటుంబం పడుతున్న వేదన మాత్రమే కాదు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటన ఇలాంటి అనేక కుటుంబాల నుండి వారి పిల్లలను దూరం చేసింది. ప్రతీబాధితుడి వెనుక ఒక తల్లి, ఒక తండ్రి ఉంటారు, కానీ వారికి ఇక రేపు అనే ఆశ లేకుండా పోయింది. ఈ వ్యవస్థను మొదటి నుండి పునర్నిర్మించాల్సి ఉంది. పిల్లలకు ఒత్తిడి కాకుండా భద్రత లభించాలి, అలాగే తల్లిదండ్రులకు కన్నీళ్లు కాకుండా, వారి త్యాగానికి తగిన ప్రతిఫలం దక్కాలని రాహుల్ తెలిపారు. అంతకు ముందు గురువారం, కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్లకు బహిరంగంగా మద్దతు పలికింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ను పునరుద్ఘాటిస్తూనే, దీక్షను విరమించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ వాంగ్చుక్ను కోరారు.కాగా జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను శనివారం ఉదయం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. నిపుణులైన వైద్యుల సలహా మేరకు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనను ఆసుపత్రికి మార్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు తమ ఆందోళనను విరమించి, ఆ ప్రాంతాన్ని శాంతియుతంగా ఖాళీ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. జూన్ 28 నుండి వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్షలో ఉన్నారు. గత మూడు వారాలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దీక్ష ప్రారంభమైనప్పటి నుండి ఆయన దాదాపు 9.5 కిలోల బరువు తగ్గారని, బీపీ, బ్లడ్ షుగర్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు శుక్రవారం తెలిపారు.ఇదీ చదవండి: వాంగ్చుక్ దీక్ష భగ్నం : ఎట్టకేలకు స్పందించిన రాహుల్గాంధీమరోవైపు వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన తర్వాత, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తాను నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వాంగ్ చుక్ను తరలించినప్పటికీ ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్పాట్ : నిద్రలేమే వరంలా మారింది
శబరిమల వెళ్లే భక్తులకు ఐఎండీ కీలక సూచన
తిరువనంతపురం: కేరళ శబరిమల భక్తులకు వాతావరణ శాఖ కీలక సూచన జారీ చేసింది. ఈ జూలై 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.దీంతో అక్కడికి వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని రెయిన్ కోట్, గొడుగులు తమ వెంట తీసుకెళ్లాలని సూచించింది. గతంలో నాలుగు జిల్లాలకు జారీ చేసిన హెచ్చరికను ఈ రోజు (శనివారం) ఏడు జిల్లాలకు పెంచి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రానున్న 24 గంటల వ్యవధిలో 64.5 మిల్లీమీటర్ల నుండి 115.5 మిల్లీమీటర్లు వరకు భారీ వర్షపాతం కురుస్తుందని హెచ్చరిక జారీ చేసింది. పతనంతిట్ట , కొట్టాయం , ఇడుక్కి, మలప్పురం , కోజికోడ్ , కన్నూర్ , కాసరగోడ్ జిల్లాలకు ఇదివరకే ఎల్లో అలర్డ్ జారీ చేయగా తాజాగా మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్ కాసరగోడ్లలో ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.నైరుతి రుతపవనాలు బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం మీదుగా, ఉత్తర తమిళనాడు,దక్షిణ అంతర్గత కర్ణాటక ,ఉత్తర కేరళ వరకు విస్తరిస్తాయని అల్పపీడన ప్రాంతం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
6 నెలల్లో 554 మంది భర్తల మరణాలు : షాకింగ్ సర్వే
గురుగ్రామ్కు చెందిన 'ఏకం న్యాయ్ ఫౌండేషన్' (Ekam Nyaay Foundation) అనే స్వచ్ఛంద సంస్థ (NGO) సంచలన నివేదకను వెల్లడించింది. జెండర్ సమానత్వం కోసం, ముఖ్యంగా సమాజంలో పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల నివారణకు పనిచేసే ఈ ఎన్జీవో 2026 తొలి ఆరు నెలల్లో (జులై 14 వరకు) దేశవ్యాప్తంగా 554 మంది భర్తల హత్యలు లేదా ఆత్మహత్యలు చేసుకున్నట్టు తేలిందని ఈ నివేదిక పేర్కొంది. మీడియాలో వచ్చిన వార్తలు, తాము సేకరించిన వివరాల ఆధారంగా ఈ డేటాను సేకరించినట్టు తెలిపింది.ఇటీవలి కాలంలో ప్రియులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేస్తున్న దారుణ ఉదంతాలు ఆందోళన రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల కాబోయే భార్య చేతిలో పుణే రియల్టర్ హత్య సంచలనంగా మారింది. అయితే ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ జరుగుతున్నాయని ఏకం న్యాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఫిలిం మేకర్, దీపికా నారాయణ్ భరద్వాజ్ వెల్లడించారు. అధికారిక నేరాల డేటాలో పురుషులపై జరిగే గృహహింసకు లేదా భర్తల హత్యలకు ప్రత్యేక వర్గీకరణ (classification) లేకపోవడం వల్ల ఈ సమస్య తీవ్రతను అంచనా వేయడం కష్టంగా మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ గణాంకాల ప్రకారం భారతదేశంలో 2026 మొదటి ఆరు నెలల్లో ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు హత్యకు గురవుతుండగా, ఒకరి కంటే ఎక్కువ మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఫౌండేషన్ తెలిపింది. అయితే ఇవి కేవలం మీడియా నివేదికల ఆధారంగా సేకరించినవేనని, ప్రభుత్వ అధికారిక గణాంకాలు కావని స్పష్టం చేసింది. పురుషులపై జరిగే గృహహింసను ట్రాక్ చేయడానికి ప్రత్యేక జాతీయ డేటాబేస్ లేనందున, వాస్తవ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చన్నారు. ఇదీ చదవండి: తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్ సక్సెస్ స్టోరీభార్యలు లేదా వారి ప్రియుల చేతిలో హత్యకు గురైన భర్తల కేసులు: 322వైవాహిక వివాదాలు, గృహహింస, వేధింపులు, తప్పుడు కేసుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న భర్తల కేసులు: 232హత్యలకు ప్రధాన కారణాలు322 హత్య కేసుల్లో 194 కేసులు (60.2%) వివాహేతర సంబంధాల వల్లే జరిగాయి. వివాహేతర సంబంధాన్ని భర్త వ్యతిరేకించడంతో, భార్యలు తమ ప్రియుళ్లతో కలిసి భర్తలను చంపడానికి కుట్ర పన్నినట్లు నివేదిక పేర్కొంది. 88 కేసులు పాత గృహ వివాదాల కారణంగా జరిగాయి. మిగిలిన హత్యలు డబ్బు గొడవలు, కుటుంబ కుట్రలు మొదలైన కారణాలతో సంభవించాయి.ఇదీ చదవండి: తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్ సక్సెస్ స్టోరీవణికిస్తున్న హత్యా పద్దతులువిషం పెట్టడం, సజీవ దహనం, కరెంట్ షాక్ ఇవ్వడం, గొంతు నులమడం, మృతదేహాలను ముక్కలుగా నరకడం, పూడ్చిపెట్టడం, హత్యలను ప్రమాదాలు లేదా ఆత్మహత్యలుగా చిత్రీకరించడం వంటివి ఉన్నాయని ఫౌండేషన్ తెలిపింది. ఈ కాలంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 93 భర్తల హత్యలు, 103 ఆత్మహత్యలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి.ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్పాట్ : నిద్రలేమే వరంలా మారిందిఫౌండేషన్ ఈ ఏడాది జరిగిన 25 అత్యంత ఘోరమైన కేసులను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇందులో భర్తల తలలు నరకడం, ముక్కలుగా కోయడం, ఇళ్లల్లోనే పూడ్చిపెట్టడం వంటి ఘటనలు ఉన్నాయి. మరికొన్ని ఆత్మహత్య కేసుల్లో బాధితులు చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్లు లేదా రికార్డ్ చేసిన వీడియోలలో... తాము ఎదుర్కొన్న మానసిక క్షోభ, పిల్లలను చూడనివ్వకపోవడం, తప్పుడు కేసుల వేధింపులు ఉన్నాయని దీపికా నారాయణ్ భరద్వాజ్ వివరించారు.ఇదీ చదవండి: రెచ్చిపోయిన పోకిరీకి, యువతి గుణపాఠం : వీడియో వైరల్
23 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్
చెన్నై నుంచి మదురై వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సుకు శనివారం తెల్లవారుజామున పెరంబలూరు సమీపంలోని జాతీయ రహదారిపై మంటలు అంటుకున్నాయి. మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టడానికి కొన్ని నిమిషాల ముందే డ్రైవర్ ఇబ్రహీం (63) అప్రమత్తమై బస్సును ఆపాడు. దీంతో అందులో ఉన్న 23 మంది ప్రయాణికులు బయటకు రావడంతో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.ఆ ప్రైవేట్ బస్సు అర్ధరాత్రి సమయంలో చెన్నై నుంచి మదురై బయల్దేరింది. డ్రైవర్ ఇబ్రహీం మదురై జిల్లా మేలూరుకు చెందిన వ్యక్తి. చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు ప్రయాణిస్తోంది. శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో పెరంబలూరు జిల్లా మంగళమెడు సమీపంలోని అయన్ పెరైయూర్ గ్రామం వద్ద వెళ్తుండగా బస్సు ముందు భాగం నుంచి ఒక్కసారిగా పొగ రావడం మొదలైంది.నిద్రిస్తున్న ప్రయాణికులను లేపిన డ్రైవర్డ్రైవర్ ఇబ్రహీం వెంటనే పొగను గమనించి బస్సును రహదారి పక్కన ఆపాడు. ప్రమాదాన్ని గుర్తించి... నిద్రలో ఉన్న ప్రయాణికులను లేపి వెంటనే కిందికి దిగాలని చెప్పాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రయాణికులు చేతికి దొరికిన సామాన్లు తీసుకుని బస్సు నుంచి బయటకు పరుగులు తీశారు.ప్రయాణికులు దిగుతున్న సమయంలోనే ముందు భాగం నుంచి మంటలు వేగంగా వ్యాపించాయి. కొద్ది సేపటికే బస్సు మొత్తం భారీ మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న మంగళమెడు పోలీసులు, జాతీయ రహదారి గస్తీ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. వెప్పూర్, పెరంబలూరు అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికి బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది.దాదాపు 15 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలు మరింత వ్యాపించకుండా చేసి, ఉదయం 7 గంటల కల్లా అదుపులోకి తీసుకొచ్చారు. బస్సు పూర్తిగా దగ్ధమై ఇనుప చట్రం మాత్రమే మిగిలింది. ఆ ప్రాంతం మీదుగా వాహనాలు వెళ్లలేకపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఎదురువైపు లేన్లోకి వాహనాలను మళ్లించి అడ్డంకిని తొలగించారు. ఉదయం 7 గంటల సమయంలో ఎర్త్మూవర్ల సాయంతో బస్సును జాతీయ రహదారి నుంచి తొలగించారు.ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాటు చేయడంలో అధికారులు సాయం చేశారు. ప్రయాణికులు తమ సామాన్లు తీసుకుని తమ గమ్యస్థానాలకు బయల్దేరారు. జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సును ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మంగళమెడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్ఆర్ఐ
ఉద్యోగం లేదు, ఎలాంటి వేతనం లేదు..!దర్జాగా స్విట్జర్లాండ్లో..
ఎలాంటి ఆదాయం లేకుండా ఏ ఒక్క పని కాదు కదా..బయటికి కాలు కదపడం కూడా కష్టమే. అలాంటిది ఈ మహిళ ఏకంగా అత్యంత ఖరీదైన స్విట్జర్లాండ్ దేశంలో బేషుగ్గా బతికేస్తోందామె. కార్పొరేట్ ఉద్యోగం లేకుండా అలాంటి దేశంలో నివశించడం అంటే..అత్యంత హాస్యాస్పదం, నమ్మశక్యం కానీ విషయం. కానీ ఈ భారత సంతతి మహిళ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్న ఉదంతం వింటే..ఔనని అంగీకరిస్తారు. మరి ఆమె దాన్ని ఎలా సాధ్యం చేసిందంటే..భారత సంతతి మహిళ స్నేహ గౌర్ తాను కార్పొరేట్ ఉద్యోగం లేకుండా ఆరు నెలలపాటు స్విట్జర్లాండ్లో ఎలా గడపగలిగిందో పంచుకుంది. చాలామందికి ఆర్థిక భద్రత అనేది పూర్తికాలపు ఉద్యోగంతో ముడిపడి ఉంటుంది. కానీ ఒక భారతీయ కంటెంట్ క్రియేటర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశాలలో ఒకటైన స్విట్జర్లాండ్లో ఏ కంపెనీలో పనిచేయకుండానే ధీమాగా స్పెండ్ చేస్తోంది. అంతకుముందు తాను ఒక కార్పొరేట్ ఉద్యోగంలో నెలకు సుమారు రూ. 45,000 సంపాదిస్తున్నప్పటి నుంచి తన ప్రయాణం ప్రారంభమైందని అన్నారు. డిగ్రీ సంపాదించడం, జీతం తీసుకోవడం, ఉద్యోగం సంపాదించడం,తదుపరి ప్రమోషన్ పొందడం వంటివే అతిపెద్ద విజయాలుగా భావించానని చెప్పుకొచ్చింది. కానీ కాలక్రమేణ స్వేచ్ఛగా బతకడమే అసలైన జీవితం అని తెలిసి వచ్చింది. ముఖ్యంగా తాను ఎక్కడ నివశించాలో ఎంచుకునే స్వేచ్ఛ, ప్రయాణించే స్వేచ్ఛ, నచ్చిన విషయాలపై పనిచేసే స్వేచ్ఛ ఉంటేనే లైఫ్ అని గ్రహించానని అంటోందామె. అందుకే స్పానిష్ నేర్చుకోవడంపై పెట్టుబడి పెట్టి..చివరికి ఆ నైపుణ్యమే తన జీవిత గమనాన్ని మార్చేసిందని చెబుతోంది. ఆ భాష ఆమెకు స్పెయిన్కు వెళ్లడానికి, అంతర్జాతీయ అనుభవాన్ని పొందడానికి ఉపకరించిందని పేర్కొంది. అదే క్రమంగా ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అయ్యేందుకు అవకాశాలు కల్పించింది. ఏళ్ల తర్వాత ఆ నైపుణ్యాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నట్లు వెల్లడించింది. అలా క్రమంగా తన ఆదాయ మార్గాలను విస్తరింపచేయడంతో శాలరీపై ఆధారపడాల్సిన అవసరం రాలేదంటోంది. అందువల్లే తనకు స్విట్జర్లాండ్కు వెళ్లినప్పుడూ కంపెనీ జీతంపై ఆధారపడలేదని అంటోంది. జస్ట్ ఒక ల్యాప్టాప్, రిమోట్ టీమ్ సరిపోయాయని చెబుతోంది. కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది కేవలం ప్రమోషన్ కాదని అది ఒక నైపుణ్యం కూడా అంటూ పోస్ట్ని ముగించింది. అందుకు సంబంధించిన వీడియో తోపాటు క్యాప్షన్లో గౌర్ ఇలా రాసుకొచ్చారు. ‘ఆఫీసు లేదు.. బాస్ లేరు.. అనుమతి అంతకన్నా అవసరం లేదు’ అయినా స్విట్జర్లాండ్ హాయిగా నిద్రపోగలను అని రాసి మరి వీడియోని పోస్ట్ చేసింది. అలాగే తాను స్పెయిన్లో ఉన్నప్పుడే ఒక వ్యవస్థను రూపొందించుకున్నానని, అది తనకు నచ్చిన చోట నివశించే స్వేచ్ఛను అందించిందని తెలిపింది. నిజంగా సాధించదగిన స్వేచ్ఛ అంటే ఇదే అని చెబుతుండటం విశేషం. View this post on Instagram A post shared by Sneh Gaur (@snehgaur_) (చదవండి: 14 ఏళ్ల వయసులో టాయిలెట్ క్లీనింగ్.. ఇప్పుడేమో మార్స్ మిషన్కు లీడర్!)
సౌదీలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
రియాద్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని సౌదీ అరేబియా సెంట్రల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్ నగరంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా సెంట్రల్ కమిటీ కన్వీనర్ రబ్బానీ సయ్యద్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని కొనియాడారు. వైఎస్సార్సీపీ ఘన విజయం కోసం కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా కలిసికట్టుగా పని చేయాలో దిశా నిర్దేశం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘మావిగన్’ కార్యక్రమం గురించి రబ్బానీ సయ్యద్ ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మావిగన్’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రియాద్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన కరతాళ ధ్వనులు, ‘జై మావిగన్’ నినాదాలతో ఆడిటోరియం మార్మోగింది.ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులు సిరుమల సుబ్బారెడ్డి, పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి, కరీముల్లా బాషా షేక్, వెలంపాటి వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గొల్ల విజయ్, గానుగపెంట శ్రీకాంత్, సుభాన్ ఖాన్ పఠాన్, నాగినేని ఉదయ్ కృష్ణ చౌదరి, షేక్ షాదక్ వలి, కంది శశిధర్ రెడ్డితో పాటు వందలాది మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ జయంతి వేడుకలను విజయవంతం చేశారు.
YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో డా. వై.ఎస్.ఆర్ జయంతి వేడుకలు
ఫీనిక్స్, అరిజోనా : మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఘనంగా నిర్వహించింది. YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, YSRCP ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ చ ముఖ్యమంత్రి మాజీ సలహాదారు (విద్య) ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఎన్ఆర్ఐ వ్యవహారాలు) డాక్టర్ ప్రదీప్ చింతా గారు హాజరయ్యారు. డాక్టర్ వై.ఎస్కు పుష్పాంజలి ఘటించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం, ఆయన అద్భుతమైన జీవితం, దార్శనిక నాయకత్వం, ప్రజా సంక్షేమం పట్ల అచంచలమైన నిబద్ధతను తెలియజేస్తూ ఒక ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన జరిగింది.డా. వైయస్సార్తో తమ జ్ఞాపకాలను పలువురు పంచుకున్నారు. ఆయన వినయం, కరుణ, ధైర్యం, ప్రజా సేవ పట్ల అచంచలమైన అంకితభావాన్ని వారు గుర్తు చేసుకున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ను నిజమైన ప్రజానాయకుడు అంటూ ముఖ్య అతిథి ఆలూరు సాంబ శివారెడ్డి అభివర్ణించారు. సామాన్య పౌరులతో ఆయనకున్న అసాధారణ అనుబంధాన్ని, పరిపాలన పట్ల ఆయన అనుసరించిన పరివర్తనాత్మక విధానాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ నిరంతర సంక్షేమం, అభివృద్ధి కోసం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలను, దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలవాలని ఆయన కోరారు.ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఎన్నారై చాప్టర్లను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన జగనన్న టెక్ఫోర్స్ కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించారు. సాఫ్ట్వేర్ నిపుణులు మరియు ఎన్నారైల కీలక పాత్రను నొక్కిచెబుతూ, పార్టీ ప్రపంచవ్యాప్త విస్తరణ,భాగస్వామ్యానికి సభ్యులు చురుకుగా పాల్గొని, తమ వంతు సహకారం అందించాలని ఆయన ప్రోత్సహించారు.అలాగే ఆంధ్రప్రదేశ్లోని తమ కుటుంబ సభ్యులు , స్నేహితులలో అవగాహన కల్పించడం ద్వారా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో ఎన్నారైలు చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. ప్రతి అర్హతగల ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, నమోదు ప్రక్రియను సరిగ్గా పూర్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.ముఖ్య అతిథి డా. ప్రదీప్ చింత, దివంగత డా. వై.ఎస్. స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం మరియు శాశ్వత వారసత్వం గురించి ప్రస్తావించారు. ఆయన పదవీకాలంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ మరియు గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో అమలు చేసిన పరివర్తనాత్మక సంస్కరణల గురించి మాట్లాడారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న అణచివేతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు, ప్రజా చైతన్యానికి మద్దతుగా సోషల్ మీడియా వేదికల ద్వారా చురుకుగా పాల్గొనాలని ఎన్నారైలకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల SIR పథకంపై ఒక వాక్త్రూ సెషన్ను నిర్వహించారు. SIR పథకం కింద ఓటరు వివరాలను ధృవీకరించుకోవడానికి, గణన పత్రాలను సరిగ్గా పూరించడానికి అవసరమైన దశలవారీ ప్రక్రియను ఆయన వివరించారు. నిర్దేశించిన కాలపరిమితిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు తమ కుటుంబ సభ్యులకు, స్థానిక సమాజాలకు మార్గనిర్దేశం చేయాలని పాల్గొన్నవారిని ప్రోత్సహించారు.డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి కమిటీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ ఈ సమావేశం ముగిసింది. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆశించిన సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమ ఆధారిత పాలన అనే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి మద్దతు కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను వక్తలు నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అత్యంత ప్రియమైన నాయకులలో ఒకరికి ఈ కార్యక్రమాన్ని ఒక అర్థవంతమైన నివాళిగా మార్చడంలో పాల్గొన్న సభ్యులు, మద్దతుదారులు మరియు సామాజిక నాయకులందరికీ వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల, వంశీ ఏరువరం, చెన్నారెడ్డి మద్దూరి, సోమ శేఖర్ రెడ్డి యర్రపురెడ్డి, బోగారపు లక్ష్మీ & గురు, బలరాంరెడ్డి, శ్రీధర్ లక్కిరెడ్డి, రమేష్, శ్రీధర్ చెమిడ్తి, అంజిరెడ్డి, విఘ్నేష్, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగేష్పొర్లక్లు పాల్గొన్నారు. శిరసనంబేడు, సాయి రోహిత్ చెరుకుమిల్లి, శ్రవణ్, విష్ణు చొప్పా, విజయ్, ప్రవీణ్, ప్రక్ష్, పురంధర్, శివ కోడూరు, నాగరాజు దాసరి, ప్రక్షా, లోకనాధ్, అనిల్ ప్రవీణ్ అవుతారు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం ముగిసింది.
మహిళ హత్య కేసు: అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్యను హత్య చేసిన ఆరోపణలపై ఒక తెలుగు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లేవ్లోని ఒక అపార్ట్మెంట్ బాత్రూమ్లో భార్య మృతదేహం లభ్యమైన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.నిందితుడిని అవినాష్ నార్నె (30)గా గుర్తించారు. జూన్ 27న బెల్లేవ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, భార్య సబ్బినేని రజిత (27) మరణానికి కారణమైనందుకు ఫస్ట్-డిగ్రీ మర్డర్ నిందారోపణలు మోపారు. ప్రస్తుతం అతడికి కింగ్ కౌంటీ జైలులో 5 మిలియన్ డాలర్ల (రూ. 47 కోట్లకు పైగా) భారీ బెయిల్ విధించారు. 2025 అక్టోబర్ 27న బెల్లేవ్ డౌన్టౌన్లోని ఉడ్ల్యాండ్ కామన్స్ అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న బాత్రూమ్లో రజిత అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అధికారులు గమనించారు.వైద్య సిబ్బంది కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆమె అప్పటికే మరణించినట్లు తేలింది. ఆఫీసు నుండి వచ్చేసరికి భార్య బాత్రూమ్ ఫ్లోర్పై పడి ఉందని అవినాష్ పోలీసులకు తెలిపాడు. వీరిద్దరికీ 2025 జూన్లో పెద్దలు కుదిర్చిన వివాహం జరగ్గా, ఆ తర్వాతే ఈ అపార్ట్మెంట్కు మారారు. మొదట అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నివేదికలో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో దీనిని హత్యకేసుగా మార్చారు.సుదీర్ఘ దర్యాప్తులో ఎలక్ట్రానిక్ డోర్ లాక్ రికార్డులు, మొబైల్ డేటా, వాట్సాప్ సందేశాలను డిటెక్టివ్లు పరిశీలించారు. రజిత మరణించిన సమయంలో అవినాష్ మినహా మరెవ్వరూ అపార్ట్మెంట్లోకి ప్రవేశించలేదని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, అవినాష్కు భారతదేశంలో మరో మహిళతో సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో నిందితుడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు, డిజిటల్ ఆధారాల బట్టి అతడే ప్రధాన నిందితుడిగా నిర్ధారించి కోర్టులో హాజరుపరిచారు.
క్రైమ్
నాలుగు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం
హైదరాబాద్: రహదారులు రుధిర ధారలుగా మారాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గ్రేటర్ పరిధిలో గురువారం అర్ధరాత్రి, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరు పాఠశాల విద్యార్థి, మరొకరు ఇంటర్మీడియట్ విద్యార్థి, ఓ మహిళ ఉన్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..మేడ్చల్లో బైక్ను ఢీకొట్టడంతో.. నగర శివారు ఐడీపీఎల్ దిల్కుష్నగర్కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సొహైల్ (18), కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సుమిత్ గైక్వాడ్ (17) గురువారం అర్ధరాత్రి మేడ్చల్ నుంచి కొంపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గంమధ్యలో ఓఆర్ఆర్ అండర్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే వీరి బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో సొహైల్, సుమిత్ గైక్వాడ్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.కీసర ఓఆర్ఆర్పై..మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన రషీద్ (40) మటన్ షాప్ యజమాని. అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాములు (60), గౌస్ కలిసి బొలేరో వాహనంలో గొర్రెల లోడ్తో నగర శివారు చెంగిచర్లలోని మండీకి వెళ్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర రావడంతో కీసర ఓఆర్ఆర్పై రాంపల్లి దాయర వద్ద బొలేరో వాహనాన్ని ఎడమ వైపు ఆపి నిద్రించారు. గుర్తు తెలియని వాహనం వెనక నుంచి వచ్చి బొలేరో వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. వాహనంలో నిద్రిస్తున్న రషీద్, రాములు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. గౌస్కు కాలు విరిగింది. వాహనంలోని కొన్ని గొర్రెలు సైతం మృతిచెందాయి. మృతుడు రషీద్కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. రాములుకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ ఆంజనేయులు చెప్పారు. మెట్రో పిల్లర్ను బైక్ ఢీ..జగిత్యాల జిల్లా బీజ్పూర్ మండలం నర్సింహుల పల్లె గ్రామానికి చెందిన చెర్పూరి అఖిలేష్ యాదవ్ (24) నగరంలోని కేపీహెచ్బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ ఆస్పత్రిలో ఎలక్ట్రిషియన్గా పని చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన మహమ్మద్ యూనిస్ (26) ప్రైవేట్ ఉద్యోగ చేస్తూ ఇక్కడి హాస్టల్లో ఉంటున్నాడు.వీరిద్దరూ కలిసి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైక్పై జేఎన్టీయూ నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కూకట్పల్లి భాగ్యనగర్ బస్టాప్ వద్ద వీరి బైక్ అదుపుతప్పి మెట్రో పిల్లర్ను ఢీకొట్టడంతో అఖిలేష్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనక కూర్చున్న మహమమ్మద్ యూనిస్ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అఖిలేష్ తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బాలిక పట్ల అసభ్య ప్రవర్తన
హైదరాబాద్: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు, స్థానికులు, సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.గోల్కొండ జోన్ అడిషనల్ కమిషనర్ కృష్ణ గౌడ్, కుల్సుంపురా ఏసీపీ తిరుపతి వివరాల ప్రకారం.. జియాగూడ డబుల్ బెడ్రూమ్లలో ఉంటున్న అబ్బుల్ అజీజ్ (55) రెడ్హిల్స్లోని నీలోఫర్ ఆసుపత్రి వద్ద చాయ్ అమ్ముతుంటాడు. భార్య, పిల్లలు వదిలేయడంతో తల్లి గౌసియా బీ వద్దే ఉంటున్నాడు. మద్యానికి బానిసయ్యాడు.గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ అంతస్తులో మైనర్ (9) ఒక్కతే ఉన్నది గమనించి అసభ్యంగా ప్రవర్తించాడు. అదే అంతస్తులోకి వచ్చిన మరో వ్యక్తి అజీజ్ను చూసి బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.సీసీ కెమెరాల్లో పరిశీలించి బయటకు వెళ్లిన అబ్బుల్ అజీజ్ సాయంత్రం 6 గంటలకు తిరిగి రావడంతో అతడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
'ఇంత త్వరగా విడుదలా?' అనుకునేలోపే.. మళ్లీ జైలుకే..!
హైదరాబాద్: డ్రంకన్ డ్రైవ్ కేసులో 14 రోజుల జైలు శిక్ష పడిన ఓ మందు బాబును చంచల్గూడ జైలు సిబ్బంది పొరపాటున శిక్ష పూర్తవకుండానే..తొమ్మిది రోజులు ముందే విడుదల చేశారు. చివరకు తప్పు తెలుసుకుని.. మళ్లీ అతన్ని ఒక రోజు తర్వాత జైలుకు తరలించారు. ఈ ఘటన కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అంబర్పేటకు చెందిన మనోహర్ ఈ నెల మొదటి వారంలో మద్యం తాగి బైకు నడుపుతూ కాచిగూడ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని 9వ తేదీన నాంపల్లి 8వ ఎంజేఎఫ్సీ కోర్టులో హాజరుపరచగా రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినందుకు న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. దీంతో మనోహర్ను చంచల్గూడ జైలుకు తరలించారు. 14 రోజులు జైల్లో పెట్టాల్సిన జైలు అధికారులు అతన్ని 5 రోజులకే విడుదల చేశారు. మరుసటి రోజు తప్పు గుర్తించిన జైలు అధికారులు మనోహర్ను తిరిగి జైలు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కాచిగూడ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఎట్టకేలకు మనోహర్ ఆచూకీ తెలుసుకుని..అయోమయానికి గురైన అతనికి జరిగిన తప్పిదాన్ని వివరించి..అతికష్టం మీద తిరిగి గురువారం చంచల్గూడ జైలుకు తరలించారు.
నా భర్తతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటావా?!
కృష్ణాజిల్లా: కట్టుకున్న భర్త మరో మహిళతో ఉంటూ తనని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడన్న కోపంతో భార్య తన కుటుంబ సభ్యులతో ఆ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన మచిలీపట్నంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బలరామునిపేటకు చెందిన శ్రీను అనే వ్యక్తికి అంజలితో వివాహం అయ్యింది. శ్రీను శ్లాబు పనులు చేస్తుంటాడు. అయితే ఐదేళ్ల క్రితం శ్రీను మీనాక్షి అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా ఆమెతోనే ఉంటూ మొదటి భార్యను పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అంజలి శుక్రవారం రాత్రి తన బంధువులతో కలిసి మీనాక్షిని నడిరోడ్డుపై అడ్డుకుని విచక్షణారహితంగా దాడి చేసింది. ఆమెతో పాటు బంధువులు మీనాక్షిని మహిళ అని కూడా చూడకుండా మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నడిరోడ్డుపై ఆమె దుస్తులను చింపేసి తీవ్రంగా అవమానించారు. కొంత మంది మగాళ్లు కూడా మహిళ అని చూడకుండా మీనాక్షి జుట్టు పట్టుకుని ఈడ్చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు పలువురు చికిత్స నిమిత్తం ఆమెను మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో వైద్యుల సలహా మేరకు పోలీసులు తమ ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నారు. బాధితురాలు కోలుకున్న అనంతరం వివరాలు సేకరించి ఆమె ఇచ్చిన ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చిలకలపూడి పోలీసులు తెలిపారు.
వీడియోలు
తిరుమలలో హరీష్ రావు ఫ్యామిలీ
నడిరోడ్డుపై మహిళను.. ఛీ..ఛీ.. టీడీపీపై రాయన భాగ్యలక్ష్మి ఫైర్
భారీ భూకంపం.. బిల్డింగులు ఎలా కూలిపోయాయో చూడండి
విక్రమ్ -1 రాకెట్ ప్రయోగం సక్సెస్ పై YS జగన్ హర్షం
మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈ రోజు తులం ఎంతంటే?
కోలీవుడ్ కు కయాదు ఫీవర్...
సిద్ధాంతాల కోసం సాగిన ప్రయాణం.. ముద్రగడ పోరాట ప్రస్థానం
రోహిత్ రిటైర్మెంట్ పై టీమిండియా కోచ్ క్లారిటీ
ఈ రోజు నిన్ను ఏమనాలి లోకేష్..! తల్లి కి వందనం పథకానికి ఎగనామం
శవరాజకీయాలా..? పచ్చ మీడియాకు ముద్రగడ కుటుంబం వార్నింగ్


