సిగార్తో యోగి.. యాంగ్రీ యంగ్మ్యాన్గా అఖిలేశ్.. అదిరిపోయే సీన్..
చీకటి గదిలో విలన్ తరహా కుర్చీలో యోగి.. చేతిలో సిగార్.. చుట్టూ అనుచరులు.. మరోవైపు ‘యాంగ్రీ యంగ్మ్యాన్’లా అఖిలేశ్ ఎంట్రీ.. డైలాగ్లు పేలుతుంటే బయట జనం నినాదాలు.. ఇదేదో 80ల బాలీవుడ్ సినిమా కాదు.. 2027 యూపీ ఎన్నికల ముందు సమాజ్వాదీ పార్టీ విడుదల చేసిన ఏఐ పొలిటికల్ సినిమా!ఎన్నికల సమరం మొదలవ్వకముందే ఉత్తరప్రదేశ్లో రాజకీయ తెరపై కొత్త సీన్ మొదలైంది. మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు AI సినిమాల యుద్ధంగా మారుతోంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. సీఎం యోగి ఆదిత్యనాథ్ను టార్గెట్ చేస్తూ మరో AI వీడియోను విడుదల చేశారు. ఈసారి ఏకంగా 80ల నాటి మసాలా సినిమాల ఫార్ములాను తీసుకొచ్చారు.సీన్.. విలన్ ఎంట్రీ!తెరపై యోగి ఆదిత్యనాథ్ పాత్ర కనిపిస్తుంది. సాధారణ రాజకీయ నాయకుడిలా కాదు.. పాత బాలీవుడ్ విలన్ గెటప్లో! చుట్టూ అనుచరులు.. చేతిలో సిగార్.. తన పీఆర్ వ్యవస్థ గురించి గొప్పగా చెప్పుకుంటున్నట్లు సన్నివేశం. ప్రజల అభిప్రాయాన్ని మార్చేందుకు పీఆర్ యంత్రాంగం పనిచేస్తుందన్న అర్థంలో డైలాగ్లు ఉంటాయి. అంతేకాదు.. పీఆర్ కోసం తాను భారీగా ఖర్చు చేస్తున్నానని, ప్రధాని మోదీ కంటే కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నానని యోగి పాత్ర చెప్పేలా వీడియోను రూపొందించారు.सपा वालों का नया वीडियो जारी! सोशल मीडिया पर रहा है तेजी के साथ वायरल।अजय सेठअब बहुत हुआ तुम्हारा पाप, फूट चुका है तुम्हारा घड़ाअब यूपी लाएगा पीडीए सरकारSamajwadi party | Akhilesh Yadav | CM Yogi pic.twitter.com/0U6Kbcmkp0— India Times Official 🇮🇳 (@indiatimes24x7) September 15, 2026కట్ చేస్తే.. హీరో ఎంట్రీ!కట్ చేస్తే హీరోగా అఖిలేశ్ యాదవ్ పాత్ర తెరపైకి వస్తుంది. ముఖంలో కోపం.. మాటల్లో పదును.. యోగి పాత్రను ప్రశ్నిస్తూ వరుస డైలాగ్లు. మహిళలపై పెరుగుతున్న నేరాలు, ఎక్స్ప్రెస్వేల నిర్మాణ నాణ్యత, అవినీతి, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిస్థితి, రైతుల ఆత్మహత్యలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ యోగి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నట్లు చూపించారు. ధరల పెరుగుదలను కూడా ప్రస్తావిస్తూ.. ‘చక్కెర కంటే మనిషి ప్రాణం చౌకైపోయింది.. గ్యాస్, రేషన్ అన్నీ ఖరీదయ్యాయి.. చౌకగా మిగిలింది పేదవాడి ప్రాణమే’ అనే భావన వచ్చేలా అఖిలేశ్ పాత్రకు డైలాగ్ పెట్టారు.‘పీఆర్’ వర్సెస్ ‘ప్రజల ప్రేమ’!ఇక్కడే కథలో మరో ట్విస్ట్. వీడియోలో యోగి పాత్ర తన పీఆర్ యంత్రాంగం గురించి గొప్పగా చెప్పుకుంటుంది. దానికి అఖిలేశ్ పాత్ర.. తనకు ప్రజల నుంచి లభించే ప్రేమే ఏ పీఆర్ వ్యవస్థకైనా సరిపోతుందని బదులిస్తుంది. అంటే.. ఒకవైపు పీఆర్.. మరోవైపు ప్రజల ప్రేమ! అంటూ రాజకీయ సందేశాన్ని సినిమా సన్నివేశాల రూపంలో చూపించే ప్రయత్నం చేసింది ఎస్పీ. అయితే, వీడియోలో యోగి పాత్ర రాజకీయ ‘మోడల్’పై కూడా అఖిలేశ్ పాత్ర ఆరోపణలు చేస్తున్నట్లు సన్నివేశాలను రూపొందించారు. ప్రజలను విభజించడం, వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించడం వంటి ఆరోపణలు అందులో ఉన్నాయి.చివరి సీన్ మరింత సినిమాటిక్గా ఉంటుంది. కిటికీ బయట భారీగా ఎస్పీ కార్యకర్తలు గుమిగూడినట్లు చూపించారు. చేతుల్లో ప్లకార్డులు.. నినాదాలతో హోరెత్తుతున్న వాతావరణం. ఇదంతా చూస్తే.. ఎన్నికల ప్రచారంలో పోస్టర్లు, సభలు, రోడ్షోలు దాటి రాజకీయ పార్టీలు ఇప్పుడు AI తెరపైకి కూడా అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది. ఇక, యోగి ఆదిత్యనాథ్ను లక్ష్యంగా చేసుకుని ఎస్పీ రూపొందించిన AI వీడియోలలో ఇది తాజా ఎపిసోడ్. గతంలో విడుదల చేసిన మరో AI వీడియోలో యోగి పాత్రను చిల్లం తాగుతున్నట్లు చూపించారు. ఆ వీడియోపై బీజేపీ తీవ్రంగా స్పందించి విమర్శలు చేసింది. ఇప్పుడు 80ల సినిమా ఫార్ములాతో వచ్చిన కొత్త వీడియోతో మరోసారి రాజకీయ దుమారం మొదలైంది. 2027 యూపీ ఎన్నికల వేడి పెరిగే కొద్దీ.. ఈ AI రాజకీయ సినిమా ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.Blockbuster Cinema 📽️ Akhikesh Yadav Vs Yogi Adityanath pic.twitter.com/eZJwroF9eq— Rahul Kumar (@MukAn_X) September 17, 2026
రహస్య భేటీ కలకలం.. సౌదీకి ట్రంప్ హ్యాండిచ్చినట్టేనా?
యెమెన్లో హౌతీల దూకుడు పెరుగుతున్న వేళ సౌదీ అరేబియాకు కొత్త తలనొప్పి మొదలైంది. ఒకవైపు హౌతీ దళాలు ఎర్ర సముద్ర తీరంలో కీలక ప్రాంతాలపై పట్టు బిగిస్తూ సౌదీ చమురు రవాణా మార్గాలకు ముప్పుగా మారుతున్నాయి. మరోవైపు.. సౌదీకి ప్రధాన మిత్రదేశమైన అమెరికా మాత్రం హౌతీలతో నేరుగా చర్చలు జరుపుతోంది. ఒమన్ రాజధాని మస్కట్లో అమెరికా అధికారులు, హౌతీ ప్రతినిధులు రహస్యంగా సమావేశమైనట్లు Reuters వెల్లడించింది. ఈ రహస్య భేటీ ఇప్పుడు గల్ఫ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అమెరికా-హౌతీల మధ్య నిజంగానే ఏదైనా అవగాహన కుదిరిందా? అదే జరిగితే.. సౌదీకి మిగిలేది ఎవరు? అనే ప్రశ్న ఎదురవుతోంది.ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు ఇటీవల యెమెన్లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో వేగంగా ముందుకు సాగారు. వ్యూహాత్మకంగా కీలకమైన బాబ్ ఎల్-మండేబ్ జలసంధికి సమీపంలోని ప్రాంతాల్లో తమ పట్టును పెంచుకున్నారు. ఈ మార్గం సౌదీ చమురు ఎగుమతులతో పాటు అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా కీలకమైనది. హౌతీల దాడులు ఏకంగా సౌదీ నగరాలు, ఇంధన మౌలిక వసతుల వరకు విస్తరించాయి. ఇటీవలి ఘర్షణల్లో సౌదీ, హౌతీ బలగాలు పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి.మస్కట్లో అమెరికా-హౌతీల భేటీఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా అధికారులు హౌతీ ప్రతినిధులతో ఒమన్లో సమావేశమయ్యారు. ఒమన్ మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ భేటీలో ఎర్ర సముద్రంలో నౌకాయానం కొనసాగడం, అమెరికా-హౌతీల మధ్య గతంలో కుదిరిన కాల్పుల విరమణను కొనసాగించడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. హౌతీ ప్రతినిధులు అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని హామీ ఇచ్చినట్లు Reuters పేర్కొంది. అదే సమయంలో సౌదీ నౌకలపై దాడులు కొనసాగించే అవకాశం ఉందన్న సమాచారం వెలువడింది.వాన్స్ కీలక ప్రకటన.. ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా హౌతీలతో నేరుగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. అయితే ఈ చర్చలు పూర్తిస్థాయి ఒప్పందానికి దారితీశాయా? అన్నది ఇంకా స్పష్టంగా లేదు. అమెరికా ప్రధాన ప్రాధాన్యత ఎర్ర సముద్రంలో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని కొనసాగించడమేనని వాషింగ్టన్ స్పష్టం చేసింది.సౌదీ ఒంటరిగా మిగిలిపోతుందా?ఇదిలా ఉండగా.. దాడులు జరుగుతున్నా హౌతీలపై నేరుగా సైనిక చర్యకు అమెరికా ఇప్పటివరకు వెనుకంజ వేస్తుండటం సౌదీకి కీలక సమస్యగా మారింది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికా సాయం కోరినప్పటికీ వాషింగ్టన్ ప్రత్యక్ష దాడులకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఇంటెలిజెన్స్ పంచుకోవడం, టార్గెటింగ్ విషయంలో సహకారం అందించే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో సౌదీ మద్దతున్న యెమెన్ బలగాలు హౌతీలను నిలువరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హౌతీల తాజా ముందడుగు సౌదీ భద్రత, చమురు ఎగుమతులు, బాబ్ ఎల్-మండేబ్ మార్గంపై ఒత్తిడిని పెంచింది.ప్రస్తుత హౌతీల దూకుడు, సౌదీ మిత్రబలగాల వైఫల్యం, అమెరికా నేరుగా హౌతీలతో చర్చలు జరపడం.. ఇవన్నీ రియాద్కు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. అయితే అమెరికా-హౌతీల మధ్య అధికారిక ఒప్పందం కుదిరిందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ ఎర్ర సముద్రంలో అమెరికా నౌకాయాన ప్రయోజనాలకు హామీ లభిస్తే.. సౌదీ ప్రయోజనాలు మాత్రం పక్కకు నెట్టబడే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన నెలకొంది. దీంతో హౌతీలను ఎదుర్కొనే విషయంలో సౌదీ తదుపరి వ్యూహం ఏంటి? అమెరికా మద్దతు ఎంతవరకు ఉంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.ఇదీ చదవండి: పాక్ తీరు మారలేదు.. భారత్ సంచలన వ్యాఖ్యలు
హోమియోపతితో ఆరోగ్య సమస్యలకు చెక్.. 6 నెలలు ఫ్రీ ట్రీట్మెంట్!
హోమియోపతి అనేది సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక వైద్య విధానం. ఈ రంగంలో భారతదేశంలోని ఉత్తమ హోమియోపతి సంస్థలలో ఒకరిగా గుర్తింపు పొందిన ప్రముఖ హోమియోపతి సంస్థ హోమియోకేర్ ఇంటర్నేషనల్ (Homeocare International).హోమియోకేర్ ఇంటర్నేషనల్హోమియోకేర్ ఇంటర్నేషనల్కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 60కి పైగా బ్రాంచ్లు ఉన్నాయి. కాబట్టి హోమియోపతి చికిత్స కోరుకునే వారు సమీపంలోని క్లినిక్లు ఎంచుకోవచ్చు. ఇక్కడ చికిత్స కోసం వచ్చే వారికి వ్యక్తిగత అవసరాలను బట్టి అధునాతన కానిస్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స ట్రీట్మెంట్ లభిస్తుంది.చికిత్స విధానంకేవలం ఒక వ్యాధికి మాత్రమే కాకుండా.. వ్యక్తి మొత్తం ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చికిత్స అందిస్తారు. అనుభవం ఉన్న హోమియోపతి వైద్యులు రోగి సమస్యలను పరిశీలించి, అవసరానికి అనుగుణంగా ట్రీట్మెంట్ అందిస్తారని సంస్థ చెబుతోంది.ఇకపోతే.. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ నెలలో మీరు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, మీ కుటుంబ సభ్యుడు లేదా ఫ్రెండ్లో ఒకరికి 6 నెలల పాటు ఉచిత ట్రీట్మెంట్ ఇస్తామని హోమియోకేర్ ఇంటర్నేషనల్ చెబుతోంది. ఇక్కడ డయాబెటిస్, కీళ్ల నొప్పులు, స్పాండిలోసిస్, సయాటికా, డిస్క్ సమస్యలు , పైల్స్, IBS, సోరియాసిస్, వేరికోస్ వీన్స్ వంటి అనేక సమస్యలకు ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి.మరిన్ని వివరాల కోసం “హాయ్” అని 92480 90252 నంబర్కు వాట్సాప్ చేయండి.
పులితో భీకర పోరు.. ప్రాణాలు దక్కించుకున్న ఆవు!
ఒంగోలు: నల్లమల అటవీ సరిహద్దు గ్రామాలపై పెద్దపులి పంజా విసురుతోంది. ఎప్పుడు ఏ పొదల్లోంచి మృత్యువు దూసుకొస్తుందోనన్న భయంతో పల్లెవాసులు కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అడవికే పరిమితం కావాల్సిన బెబ్బులి.. వరుసగా పశువుల మందలపై విరుచుకుపడుతుండటంతో రైతులు, పశువుల కాపరులు భయాందోళనలకు గురవుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో నల్లమల సమీప ప్రాంతంలో రెండు ఆవులను బలితీసుకోవడంతో పాటు మరో ఆవును తినేందుకు యత్నించిన ఘటనతో బొమ్మలాపురం, పరిసర గ్రామాల ప్రజల గుండెల్లో గుబులు రేగుతోంది. మందపై విరుచుకుపడి.. గత కొద్ది రోజులుగా బొమ్మలాపురం సమీపంలోని ఊరకొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. ఈ నెల 12వ తేదీన బొమ్మలాపురానికి చెందిన ఓ రైతు తన పశువుల మందను మేత కోసం సమీప అటవీ ప్రాంతంలోకి తోలాడు. ఈ క్రమంలో పెద్దపులి దాడి చేయడంతో రెండు ఆవులు మృతి చెందాయి. అనంతరం మరో ఆవును మట్టుబెట్టేందుకు యత్నించిగా, అది ప్రాణభయంతో పులిని ప్రతిఘటించింది. తీవ్ర గాయాలతో ప్రాణ గండం తప్పించుకున్న ఆ ఆవు యజమాని చెంతకు చేరింది. కాగా, దాడి జరిగిన అదే రోజు సాయంత్రం పెద్దపులి ఆహారం కోసం తిరిగి ఆవుల కళేబరాల వద్దకు రాగా, అటవీశాఖ అమర్చిన ట్రాప్ కెమెరాల్లో ఆ బెబ్బులి కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. పొలాలకు వెళ్లాలన్నా ప్రాణసంకటమే! పులి దాడి ఘటనతో మూగజీవాలను అడవి వైపు మేతకు తోలేందుకు యజమానులు గజగజ వణికిపోతున్నారు. గతంలోనూ వ్యవసాయ పనులకు వెళ్లే రైతులకు, కూలీలకు పెద్దపులి ప్రత్యక్షంగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో వారాల తరబడి చేలల్లోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. తరచూ పశువులపై దాడులు జరుగుతుండటంతో రైతులకు కంటిమీద కునుకు కరువైంది. అప్రమత్తంగా ఉండాలన్న అటవీశాఖ దేవటూడు పరిసరాల్లో సంచరించే పెద్దపులి.. దాహం తీర్చుకునేందుకు నెలకు ఒకటి లేదా రెండుసార్లు బొమ్మలాపురం సమీపంలోని గండి చెరువు వద్దకు వస్తుంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి తన సహజ ఆవాస పరిధిలోనే తిరుగుతోందని, ప్రజలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లరాదని హెచ్చరించారు. మేతకు వెళ్లిన పశువులను సాయంత్రం కాకముందే గ్రామాలకు తరలించాలని స్పష్టం చేశారు. అటవీ సరిహద్దుల్లో నిరంతర నిఘా ఉంచి పులులు గ్రామాలపైకి రాకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.ఇదీ చదవండి: ప్రియుడిపై మరిగిన నూనె పోసి చంపేసిన రాములమ్మ
అత్తను గొంతు నులిమి చంపిన కోడలు
ఏఐ పైనే కంపెనీల ‘ఐ’
క్రిస్టోఫర్ నోలన్ సందర్శించిన కేఫ్కు అధికారులు షాక్! లైసెన్స్ సస్పెండ్!
నెల రోజుల్లో పెళ్లి : డ్రైనేజీలో శవమై తేలిన హెచ్ఆర్ ఉద్యోగి
భార్యను లాడ్జికి తీసుకెళ్లి..
‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీ రివ్యూ
మహిళల అభివృద్ధికి సెలబ్రిటీల సంచలన నిర్ణయం
నా మాట ఎవరు వింటారు?
‘ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడను’
ఉద్యోగం ఎందుకు వదిలేస్తున్నారు?
సీఎం కోటాలో నిన్ను ఐఏఎస్ను చేస్తా!
‘కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు!
నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: శేఖర్
పసిడి ధరలు.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!
సాక్షి కార్టూన్ 17-09-2026
మమ్మీ! తమ్ముడు నా ప్రోగ్రెస్ రిపోర్టును తన ప్రోగ్రెస్ రిపోర్టు అని ఏపీ సీఎంలా చెప్పి క్రెడిట్ చోరీ చేస్తున్నాడు!!
ఇల్లు ఆస్తి కాదు.. అప్పుల కుప్ప: కియోసాకి
ఏదో రకంగా ఒక కూలర్ పెట్టించండి స్వామీ! మీకు పుణ్యముంటుంది!!
పాప మరణం.. బాధపడుతూ నటి పూర్ణ పోస్ట్
అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్తో పోటీ.. స్పందించిన సంజూ
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
అందుకేనేమో సార్! అక్కడ ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకత వస్తుందనుకుంటా సార్!
అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడు.. ఆ తర్వాత..
బట్లర్ ప్రపంచ రికార్డు.. రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం
కత్రినాపై బాడీ షేమింగ్.. పాకిస్తాన్ నటుడు మద్దతు
ఓటీటీకి ఇరుముడి.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..!
నా సినిమా చూడ్డానికి మా నాన్న ఆసక్తిగా ఉన్నారు: జేసన్ సంజయ్
‘అభిషేక్ ఒక అద్భుతం.. వాళ్ల ఆటతీరు ప్రశంసనీయం’
మోదీని కలిసిన వారం రోజుల్లోనే..
పసిడి ప్రియులకు తీపి కబురు.. తులం ఎంతంటే..
అత్తను గొంతు నులిమి చంపిన కోడలు
ఏఐ పైనే కంపెనీల ‘ఐ’
క్రిస్టోఫర్ నోలన్ సందర్శించిన కేఫ్కు అధికారులు షాక్! లైసెన్స్ సస్పెండ్!
నెల రోజుల్లో పెళ్లి : డ్రైనేజీలో శవమై తేలిన హెచ్ఆర్ ఉద్యోగి
భార్యను లాడ్జికి తీసుకెళ్లి..
‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీ రివ్యూ
మహిళల అభివృద్ధికి సెలబ్రిటీల సంచలన నిర్ణయం
నా మాట ఎవరు వింటారు?
‘ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడను’
ఉద్యోగం ఎందుకు వదిలేస్తున్నారు?
సీఎం కోటాలో నిన్ను ఐఏఎస్ను చేస్తా!
‘కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు!
నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: శేఖర్
పసిడి ధరలు.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!
సాక్షి కార్టూన్ 17-09-2026
మమ్మీ! తమ్ముడు నా ప్రోగ్రెస్ రిపోర్టును తన ప్రోగ్రెస్ రిపోర్టు అని ఏపీ సీఎంలా చెప్పి క్రెడిట్ చోరీ చేస్తున్నాడు!!
ఇల్లు ఆస్తి కాదు.. అప్పుల కుప్ప: కియోసాకి
ఏదో రకంగా ఒక కూలర్ పెట్టించండి స్వామీ! మీకు పుణ్యముంటుంది!!
పాప మరణం.. బాధపడుతూ నటి పూర్ణ పోస్ట్
అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్తో పోటీ.. స్పందించిన సంజూ
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
అందుకేనేమో సార్! అక్కడ ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకత వస్తుందనుకుంటా సార్!
అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడు.. ఆ తర్వాత..
బట్లర్ ప్రపంచ రికార్డు.. రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం
కత్రినాపై బాడీ షేమింగ్.. పాకిస్తాన్ నటుడు మద్దతు
ఓటీటీకి ఇరుముడి.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..!
నా సినిమా చూడ్డానికి మా నాన్న ఆసక్తిగా ఉన్నారు: జేసన్ సంజయ్
‘అభిషేక్ ఒక అద్భుతం.. వాళ్ల ఆటతీరు ప్రశంసనీయం’
మోదీని కలిసిన వారం రోజుల్లోనే..
పసిడి ప్రియులకు తీపి కబురు.. తులం ఎంతంటే..
ఫొటోలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు (ఫొటోలు)
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో రష్మిక మందన్న (ఫొటోలు)
సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ (ఫొటోలు)
'మగాళ్లు జిందాబాద్' మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
నటుడు ఉపేంద్ర ఇంట్లో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు (ఫొటోలు)
హైదరాబాద్ లో వెరైటీ గణేషుడి విగ్రహాలు (ఫొటోలు)
‘సిగ్మా’ సినిమా టీజర్ లాంచ్ లో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపుపందిరి వాహనంపై శ్రీనివాసుడు (ఫొటోలు)
అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
సింపుల్ చీర.. స్టైలిష్ లుక్..అనసూయ ఫోటోలు చూశారా?
సినిమా
కత్రినాపై బాడీ షేమింగ్.. పాకిస్తాన్ నటుడు మద్దతు
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్లో కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. భర్త విక్కీ కౌశల్తో కలిసి ముకేశ్, నీతా అంబానీ నిర్వహించిన గణేశ్ వేడుకలకు హాజరయ్యారు. ఈ మేరకు ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే కొందరు నెటిజన్లు కత్రినా ప్రెగ్నెన్సీకి ముందు, ఆ తర్వాతి ఫొటోలను పోల్చుతూ ఆమె లుక్పై కామెంట్లు చేశారు. దీంతో కత్రినాపై జరుగుతున్న బాడీ షేమింగ్పై పాకిస్థాన్ నటుడు, గాయకుడు అలీ జాఫర్ స్పందించాడు. (ఇదీ చదవండి: బిగ్బాస్లో చరణ్ రీఎంట్రీ.. తొలిరోజే మళ్లీ షాక్..)‘ఆమెను బతకనివ్వండి’కత్రినా గురించి సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, కామెంట్లు తన దృష్టికి వచ్చాయని అలీ జాఫర్ తెలిపాడు. మహిళల శరీరం, రూపంపై సమాజం పెట్టుకున్న ప్రమాణాల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నాడు. ముఖ్యంగా పురుషులు తమ ఆలోచనా విధానాన్ని ఒకసారి పరిశీలించుకోవాలని సూచించాడు. ప్రతి మహిళకు తనదైన జీవితం ఉంటుందని ఆమె గతం, భవిష్యత్తు గురించి బయటివారు తీర్పులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. ‘ఆమెను బతకనివ్వండి.. మీరు మీ జీవితంపై దృష్టిపెట్టండి’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కత్రినా కైఫ్కు మద్దతుగా నిలిచాడు.కత్రినాపై గతంలోనూ ఇలాంటి కామెంట్లు రావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. నటి శివాలీకా ఒబెరాయ్ సైతం కత్రినా పోస్ట్ ప్రెగ్నెన్సీ లుక్పై వస్తున్న విమర్శలను ప్రశ్నిస్తూ.. ఇది మాతృత్వం అని పేర్కొంది.(ఇదీ చదవండి: ఈసారి నాని కాదు.. ఆ పేరుతో పిలుస్తారు: నాని)
ఈసారి నాని కాదు.. ఆ పేరుతో పిలుస్తారు: నాని
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది ప్యారడైజ్’ గురించే చర్చ జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దీనికి తగ్గట్టుగానే మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఈ తరహాలోనే చైన్నైలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నానీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సినిమా చూసి వచ్చాక..నా కెరీర్లో నేను చాలా కష్టపడి చేసిన చిత్రమిది. ఓ మంచి కథని భోవోద్వేగాలతో తెరపైకి తీసుకొస్తున్నాం. సినిమాపై చాలా నమ్మకం ఉంది. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది. ఇప్పుడు నన్ను అంతా నాని అని పిలుస్తున్నారు. సినిమా చూసి వచ్చాక జడల్ అనే పేరుతో పిలుస్తారు. జడలతో షూటింగ్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో మహిళలకు హ్యాట్సాఫ్. ఎందుకంటే జీవితాంతం ఆ జడలతోనే ఉంటారు. కయాదు చాలా బాగా నటించింది. సుబ్బు అనే పాత్రకు నూరుశారం న్యాయం చేసింది’ అని అన్నారు. (ఇదీ చదవండి: బిగ్బాస్లో చరణ్ రీఎంట్రీ.. తొలిరోజే మళ్లీ షాక్..)కాగా ట్రైలర్ లేకుండా డైరెక్ట్గా థియేటర్లలోకి వస్తుండడంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అనిరుద్ సంగీతం అందించాడు. మోహన్బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదీ చదవండి: సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎలా షూట్ చేస్తారో తెలుసా?
బిగ్బాస్లో చరణ్ రీఎంట్రీ.. తొలిరోజే మళ్లీ షాక్..
బిగ్బాస్ హౌస్లో కెప్టెన్సీ రేస్ మరింత ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ రేసులో భాగంగా లెవెల్-2లో పోటీదారులకు వరుసగా టాస్కులు ఇచ్చాడు బిగ్బాస్. ఇందులో తొలి టాస్క్లో రోహిత్ తన సత్తా చాటలేకపోవడంతో కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో దెబ్జానీ, రాంప్రసాద్, త్రిగుణ్ మాత్రమే కెప్టెన్సీ కంటెండర్లుగా మిగిలారు. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది..! ఒకసారి చూద్దాం రండి!ఇదీ చదవండి: ఈ ముగ్గురు మహిళలు.. రూ.291 కోట్ల సంచలనం..! స్పీడ్ అండ్ సక్సెస్..లెవెల్-2లో మిగిలిన సభ్యులకు బిగ్బాస్ ‘స్పీడ్ అండ్ సక్సెస్’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ను రెండు స్టేజ్లుగా నిర్వహించారు. మొదటి స్టేజ్లో పోటీదారులు స్టార్టింగ్ పాయింట్ నుంచి టేబుల్ కింద ఉన్న సందుల్లోంచి ముందుకు వెళ్లాలి. అనంతరం టేబుల్పై ఉన్న గ్యాప్స్లో వేళ్లు పెట్టి.. పైన ఉంచిన ఐదు డిస్కుల్లో ఒక్కో డిస్క్ను బయటకు తీసుకురావాలి. అలా తీసుకున్న డిస్క్ను టేబుల్పై ఏర్పాటు చేసిన మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎండింగ్ పాయింట్ వరకు జరిపి కిందకు పడేలా చేయాలి. ఆ తర్వాత ఎదురుగా ఉన్న టైర్లలో కాళ్లు పెడుతూ వాటిని దాటుకుని ముందుకు వెళ్లాలి. చివరికి డిస్క్ను నిర్ణయించిన లైన్ దగ్గర పెట్టాలి. ఇలా ఐదు డిస్కులను లైన్ దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత రెండో స్టేజ్ ప్రారంభమవుతుంది. రెండో స్టేజిలో లైన్ దగ్గర నిలబడి.. తాము తీసుకొచ్చిన ఐదు డిస్కులను ఎదురుగా ఉన్న టేబుల్పైకి ఒక్కొక్కటిగా విసిరి ల్యాండ్ చేయాలి. నిర్ణీత సమయంలో ఈ ప్రక్రియను ముందుగా పూర్తి చేసిన ఇద్దరు విజేతలుగా నిలుస్తారని బిగ్బాస్ ప్రకటించాడు. విజేతలే కెప్టెన్సీ కంటెండర్లుగా కొనసాగుతారని, చివరి స్థానంలో నిలిచిన వారు కెప్టెన్సీ రేసు నుంచి నిష్క్రమిస్తారని తెలిపాడు. ఈ టాస్క్కు నరేశ్ను సంచాలకుడిగా నియమించారు. పోటీదారులు గెలుపు కోసం హోరాహోరీగా పోటీ పడగా.. చివరికి రాంప్రసాద్, త్రిగుణ్ విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ కెప్టెన్సీ కంటెండర్లుగా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.మళ్లీ హౌస్లోకి చరణ్..ఇక అందరూ ఊహించినట్లుగానే చరణ్ మరోసారి బిగ్బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతడి రాకతో హౌస్లో సందడి నెలకొంది. వచ్చిరావడంతోనే ఈసారి తన టాలెంట్ ఏంటో చూపిస్తానని గట్టి పంతానే విసిరాడు. మరోవైపు నరేశ్, రాంప్రసాద్ అక్కడున్న కంటెస్టెంట్లను ఇమిటేట్ చేస్తూ కాసేపు నవ్వులు పూయించారు. చరణ్కు స్పెషల్ పవర్..కొత్తగా హౌస్లోకి వచ్చిన చరణ్కు బిగ్బాస్ ఓ ప్రత్యేకమైన పవర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో ఒకరిని కెప్టెన్సీ రేసులో పాల్గొనకుండా చేయడంతో పాటు.. ఇప్పటికే కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచిన వారిలో ఒకరితో ఛాలెంజ్ చేసి గెలిస్తే తాను కూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం కల్పించాడు. ఈ రెండు ఆప్షన్లలో చరణ్ రెండో ఆప్షన్ను ఎంచుకున్నాడు. దీంతో అప్పటికే కెప్టెన్సీ కంటెండర్గా ఉన్న త్రిగుణ్తో ఛాలెంజ్కు సిద్ధమయ్యాడు. ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. చివరికి త్రిగుణ్ విజేతగా నిలిచినట్లు బిగ్బాస్ ప్రకటించాడు. దీంతో త్రిగుణ్ తన కెప్టెన్సీ కంటెండర్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వచ్చీ రావడంతోనే చరణ్కు ఇది మొదటి అపజయం. ఇదీ చదవండి: ‘గబ్బర్ సింగ్’ నటుడికి బ్రైయిన్ స్ట్రోక్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..
అద్భుతమైన ప్రయాణం
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతిహాసన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కృష్ణ అనేపాత్రలో నటిస్తున్నారు దుల్కర్ సల్మాన్.ఈ సినిమాని నవంబరు 20న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి, గురువారం కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఇదొక అద్భుతమైన ప్రయాణం. నవంబర్ 20న మీ అందరికీ (ప్రేక్షకులు) ఈ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఎదురు చూస్తున్నాను’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు దుల్కర్.
క్రీడలు
టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్
ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 టోర్నీలో భాగంగా నాలుగో క్వార్టర్ ఫైనల్లో భారత్- జపాన్ పోటీకి దిగాయి. నిశిన్లోని కరోగి స్పోర్ట్స్ పార్క్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.మూడు సెమీస్ బెర్తులు ఖరారుకాగా సెప్టెంబరు 17- 22 మధ్య ఆసియా క్రీడల-2026 మహిళల టీ20 టోర్నీకి షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో గురువారం నాటి తొలి క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్- చైనా తలపడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ రద్దైపోయింది. ఫలితంగా ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్ సెమీ ఫైనల్కు నేరుగా అర్హత సాధించింది.ఇక రెండో క్వార్టర్ ఫైనల్లో థాయ్లాండ్పై మూడు వికెట్ల తేడాతో గట్టెక్కి పాకిస్తాన్ సెమీస్కు చేరింది. మరోవైపు.. మూడో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక మలేషియాపై 86 పరుగుల తేడాతో గెలిచి టాప్-4లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్- శ్రీలంక తలపడనుండగా.. భారత్- జపాన్ మధ్య మ్యాచ్ విజేతతో బంగ్లాదేశ్ రెండో సెమీస్ మ్యాచ్లో పోటీకి దిగనుంది.తుదిజట్లుభారత్స్మృతి మంధాన, షఫాలి వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, నందిని శర్మ జపాన్హరునా ఇవాసాకి, ఆకారి నిశిముర కానో, మైయ్ యనగిడ (కెప్టెన్), ఎరిక ఓడా, అహిల్య చందేల్, షిమాకో కాటో, అయాక కాటో- స్టఫోర్డ్, ఆయుమి ఫుజికావా, హినాసే గోటో (వికెట్ కీపర్), ఎరిక టొగుచి క్విన్, నొనొహా యసుమొటో.
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
సియోల్: డేవిస్కప్ కొత్త ఫార్మాట్లోకి మారాక భారత పురుషుల టెన్నిస్ జట్టు తొలిసారి వరల్డ్ ఫైనల్స్ టోర్నీ బెర్త్పై గురి పెట్టింది. దక్షిణ కొరియా జట్టుతో రెండు రోజులపాటు జరిగే క్వాలిఫయర్లో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఈ ఏడాది నవంబర్లో ఇటలీ వేదికగా ఎనిమిది జట్ల మధ్య నిర్వహించే డేవిస్కప్ వరల్డ్ ఫైనల్స్కు అర్హత సాధిస్తుంది. తొలి రోజు శుక్రవారం రెండు సింగిల్స్ మ్యాచ్లు జరుగుతాయి. తొలి మ్యాచ్లో కొరియా నంబర్వన్, ప్రపంచ 150వ ర్యాంకర్ సూన్వూ క్వోన్తో ప్రపంచ 367వ ర్యాంకర్ దక్షిణేశ్వర్ సురేశ్ ఆడతాడు. రెండో మ్యాచ్లో ప్రపంచ మాజీ 19వ ర్యాంకర్ హైన్ చుంగ్తో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ తలపడతాడు. 2018లో హైన్ చుంగ్ ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నిలో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)లను ఓడించి సెమీఫైనల్ చేరుకున్నాడు. రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)తో జరిగిన సెమీఫైనల్లో హైన్ చుంగ్ గాయంతో రెండో సెట్ మధ్యలో వైదొలిగాడు. శనివారం మూడు మ్యాచ్లు జరుగుతాయి. మొదట డబుల్స్ మ్యాచ్, ఆ తర్వాత రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్లు నిర్వహిస్తారు.
గదులు...గందరగోళం!
నగోయా: అంతా బాగుంది అంటూ ఆసియా క్రీడల్లో ఏర్పాట్లు, వసతి సౌకర్యాలపై గత రెండు రోజులుగా ఆటగాళ్లు, అధికారులు కొంత సంతృప్తి చెందినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే అంతా మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. ఇరుకైన గదులు, ఇద్దరికే కష్టమైన చోట మూడో వ్యక్తికి చోటు, బయట ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్న అధికారులు... ఇలా అన్ని వైపుల నుంచి సమస్యలు కనిపిస్తున్నాయి. రేపు ఆసియా క్రీడల్లో ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎంతో గొప్పగా చెప్పుకున్న ‘కోస్టా సెరెనా క్రూజ్ షిప్’లో వసతి ఏమాత్రం బాగా లేదని ఆటగాళ్లు చెబుతున్నారు. సమన్వయ లోపంతో పురుష, మహిళా ఆటగాళ్లకు కలిపి ఒకే గదిలో వసతి కల్పించినట్లుగా కూడా వినిపిస్తోంది. వీరిలో జపాన్ అథ్లెట్లు కూడా ఉండటం విశేషం. ‘కోచ్లు, టీమ్ అధికారులు, అథ్లెట్లకు కలిపి ఒకే గది ఇచ్చారు. పురుషులు, మహిళలకు కలిపి ఒకే గది ఇస్తూ పది మంది ఆటగాళ్లకు కలిపి ఐదు రూమ్లు కేటాయించిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ వాళ్లు అంకె మాత్రమే చూశారు. వాస్తవికంగా చూస్తే ఇలా వాడుకోవడం అసాధ్యం. ఎంతో భారీ సామగ్రి ఉండే ట్రైనర్లు, మెడికల్ సిబ్బందికి కూడా ఆటగాళ్లతో కలిపి ఇస్తే ఎలా సరిపోతుంది’ అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు భారత వుషు, రోయింగ్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు ఇప్పటికే క్రూజ్ షిప్లోకి చేరుకున్నారు. వారు కూడా తమ సమస్యను చెప్పుకున్నారు. గది కోసం భారత రోయర్లు 12 గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. థాయ్లాండ్ సెపెక్తక్రా ప్లేయర్లయితే గది లభించకపోవడంతో వెల్కమ్ సెంటర్లో నేలపైనే పడుకున్నారు. ‘ఇద్దరికే కేటాయించాల్సిన ఒక గదిలో ముగ్గురిని పంపించారు. అసలే అవి చిన్నవి కాగా, ఇప్పుడు మరింత సమస్యగా మారింది. తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన అథ్లెట్లను ఇలాంటివి ఇబ్బంది పెడతాయి. అయితే ఇప్పటికిప్పుడు ఫిర్యాదు చేయాలనే ఆలోచన లేదు. వాటికి అనుగుణంగా సర్దుకునే ప్రయత్నం చేస్తున్నాం’ అని భారత క్రీడాకారులు స్పందించారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని భారత చెఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్ వివరణ ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి మెగా ఈవెంట్లలో వసతికి దగ్గర్లోనే ప్రాక్టీస్ ఏర్పాట్లు కూడా ఉంటాయి. కానీ నగోయాలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. అథ్లెటిక్స్ విలేజ్ లేకపోవడంతో 17 వేల మందికి వేర్వేరు చోట్ల వసతి సౌకర్యం కల్పించారు. ఇవన్నీ ప్రాక్టీస్ మైదానాలకు చాలా దూరంగా ఉన్నాయి. దాంతో సుదీర్ఘ ప్రయాణం తర్వాతే తమ ప్రాక్టీస్ వేదికలకు అథ్లెట్స్ వెళ్లగలుగుతున్నారు. ఆటగాళ్లు ఉన్న క్రూజ్ షిప్ నుంచి రోయర్లు, వుషు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుండగా, మార్షల్ ఆర్ట్స్ హాల్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరోవైపు ఇప్పటికే బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన కంటెయినర్ తరహాలో వసతి గృహాల్లో భారత ఆటగాళ్లు ఉండటానికి ఇష్టపడటం లేదు. ఫుట్బాల్, బాస్కెట్బాల్, బేస్బాల్, సాఫ్ట్బాల్, కురా‹Ùవంటి క్రీడాంశాల్లో పాల్గొనే అథ్లెట్ల కోసం ప్రధానంగా ఈ ఏర్పాట్లు ఉండగా...ఒక్క కురాష్ ఆటగాళ్లు మాత్రమే కంటెయినర్లలో ఉంటున్నారు.
మన మహిళా క్రికెటర్లు బరిలోకి
నగోయా: ఆసియా క్రీడల మహిళల క్రికెట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పతక వేటలో నేడు తొలి పోరులో బరిలోకి దిగనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న భారత జట్టు ఈ మ్యాచ్లో ఆతిథ్య జపాన్ను ఎదుర్కొంటుంది. ఇటీవలే ఆసియా కప్ను గెలుచుకున్న హర్మన్ప్రీత్ కౌర్ బృందానికి ఈ మ్యాచ్లో గెలుపు నల్లేరు మీద నడకలాంటిదే. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న భారత్ను నిలువరించడం ప్రత్యరి్థకి అసాధ్యం. మరోవైపు ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి 61 టి20 మ్యాచ్ల అనుభవం ఉన్నా... పెద్ద జట్లతో ఎప్పుడూ ఆడని జపాన్ ఈ ఆసియా క్రీడల్లో ఒక్క మ్యాచ్లోనైనా ప్రభావం చూపించాలని ఆశగా ఉంది. 2028 లాస్ ఏంజెలిస్లో జరిగే ఒలింపిక్ క్రీడలకు సన్నాహకంగా ఈ ఆసియా క్రీడలు పనికొస్తాయని భారత కోచ్ అమోల్ మజుందార్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్తో పెద్దగా పరిచయం లేని జట్లతో కూడా ఆడుతున్న తమకు ఒలింపిక్స్లోనూ ఇదే తరహా పరిస్థితులు ఎదురవుతాయని అతను వ్యాఖ్యానించాడు. నేడు జరిగే మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మలేసియాతో శ్రీలంక తలపడుతుంది. సెమీస్లో పాక్, బంగ్లాదేశ్... ఆసియా క్రీడల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మహిళల జట్లు సెమీస్లోకి అడుగు పెట్టాయి. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో థాయ్లాండ్పై 3 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. బంగ్లాదేశ్, చైనా మధ్య జరిగిన మరో క్వార్టర్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా...ర్యాంకింగ్ ప్రకారం బంగ్లాదేశ్ ముందంజ వేసింది.
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీలో ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్... సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఏపీలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో ‘పోలీసింగ్’... మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
డీఎస్సీ అక్రమాలపై పోరాటం ఉధృతం.. 21న భారీ నిరసనకు YSRCP పిలుపు..
డీఎస్సీ స్కాంకు బాధ్యత వహిస్తారా? లేదా?... చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
ఇదేనా నిష్పాక్షిక, పారదర్శక నియామకం... మెగా డీఎస్సీ వ్యవహారంపై చంద్రబాబు బాధ్యత వహించాలి... వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
ప్రపంచ పరిపాలనకు రూల్స్ మనమే రూపొందించాలి.... బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
బిజినెస్
ఇండిగో ఛార్జీల పెంపు
విమానయాన దిగ్గజం ఇండిగో వివిధ అనుబంధ సేవల ఛార్జీలను పెంచింది. దేశీ ఫ్లయిట్లలో ప్రయాణాలకు సంబంధించి మూడు రోజుల నుంచి రెండేళ్ల లోపు వయస్సు గల పిల్లలకు ఛార్జీలను రూ.2,200 నుంచి రూ.3,000కు పెంచింది. అంతర్జాతీయ రూట్లలో ఈ ఛార్జీలు వేరుగా ఉంటాయి.ఇక పెద్దవాళ్లు వెంట లేకుండా ఒంటరిగా ప్రయాణించే మైనర్లకు సంబంధించిన ఛార్జీలు దేశీ ఫ్లయిట్స్లో రూ.5,999గా, అంతర్జాతీయ ఫ్లయిట్స్లో రూ.12,999గా ఉంటుందని తమ వెబ్సైట్లో కంపెనీ పేర్కొంది. అయితే, గతంలో ఈ రేట్లు ఎంత ఉండేవనేది నిర్దిష్టంగా తెలియరాలేదు. మరోవైపు ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీస్ ఛార్జీలు రూ.650గా, ట్రావెల్ సర్టిఫికెట్ రేటు రూ.300గా ఉంటుందని వెబ్సైట్లో కంపెనీ పేర్కొంది. ఇంధన ధరల కారణంగా నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంతో కొన్ని అనుబంధ సేవల చార్జీలను కంపెనీ పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: వందల గంటల సమయాన్ని ఆదా చేసే టాప్ ఏఐ టూల్స్!
వందల గంటల సమయాన్ని ఆదా చేసే టాప్ ఏఐ టూల్స్!
నేటి డిజిటల్ యుగంలో కాలాన్ని ఆదా చేసుకోవడం, ఉత్పాదకతను పెంచుకోవడం ప్రతి ఒక్కరికీ కీలకంగా మారింది. ఒకప్పుడు గంటల తరబడి సమయం పట్టే పనులను నేడు వినూత్నంగా దూసుకొచ్చిన ఏఐ టూల్స్ కేవలం నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నాయి. కోడింగ్, డిజైనింగ్, వీడియో మేకింగ్, రీసెర్చ్, వర్క్ఫ్లో ఆటోమేషన్.. ఇలా ఏ రంగంలో చూసినా ఏఐ అసిస్టెంట్ల హవా నడుస్తోంది. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం 2026 నాటికి వందల గంటల విలువైన సమయాన్ని మిగిల్చి, పని సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు ఉపయోగపడుతున్న కొన్ని ఏఐ టూల్స్ సమగ్ర సమాచారం ఇక్కడ పరిశీలిద్దాం.పరిశోధన.. సమాచార విశ్లేషణClaude: సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి, లోతైన విశ్లేషణలు చేయడానికి, సృజనాత్మక రచనలకు మెరుగైన టూల్.Perplexity: ఇంటర్నెట్ నుంచి తాజా, కచ్చితమైన సమాచారాన్ని ఆన్లైన్ సోర్స్లతో సహా అందిస్తూ రీసెర్చ్ పనిని సులభతరం చేస్తుంది.NotebookLM: మీ వద్ద ఉన్న డాక్యుమెంట్స్, పీడీఎఫ్లను విశ్లేషించి సారాంశాన్ని అందించడానికి ఉపయోగపడే గూగుల్ ఆధారిత స్మార్ట్ టూల్.Elicit: సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్లను త్వరగా వెతికి కీలకమైన వివరాలను అందిస్తుంది.SciSpace: సంక్లిష్టమైన పరిశోధనా పత్రాలను సులభంగా అర్థం చేసుకోవడానికి, వాటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి ఉపయోగపడుతుంది.కంటెంట్ రైటింగ్.. ప్రాంప్టింగ్GeminiAI: మెరుగైన వ్యాసాలు, కథనాలు, ప్రొఫెషనల్ ఈమెయిల్స్ రాయడంలో సహకరించే శక్తివంతమైన గూగుల్ ఏఐ అసిస్టెంట్.ChatGPT: సృజనాత్మక ఆలోచనలు, కంటెంట్ క్రియేషన్, కోడింగ్ సందేహాల నివృత్తికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టూల్.Grok: రియల్-టైమ్ ఆన్లైన్ ట్రెండ్స్, సమాచారాన్ని వేగంగా విశ్లేషించే ఏఐ అసిస్టెంట్.Notion AI: నోట్స్ రాసుకోవడానికి, వర్క్ స్పేస్లో కంటెంట్ను ఆర్గనైజ్ చేయడానికి స్మార్ట్ రైటింగ్ పార్ట్నర్.కోడింగ్, వెబ్, యాప్ డెవలప్మెంట్Lovable: కొన్ని నిమిషాల్లోనే ఆకట్టుకునే వెబ్ అప్లికేషన్లను బిల్డ్ చేసే టూల్.Bolt new: ప్రాంప్ట్ ఆధారంగా ఫుల్-స్టాక్ వెబ్ యాప్లను నేరుగా రూపొందిస్తుంది.Cursor: ప్రోగ్రామర్ల కోడింగ్ వేగాన్ని పెంచే ప్రముఖ ఏఐ కోడింగ్ అసిస్టెంట్.Windsurf: ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ను అందిస్తుంది.Replit: బ్రౌజర్ నుంచే నేరుగా యాప్లను డెవలప్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి దోహదపడుతుంది.Framer AI: కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ ద్వారా కోడింగ్ అవసరం లేకుండా వెబ్సైట్లను నిర్మిస్తుంది.వీడియో మేకింగ్, ఎడిటింగ్Kling AI: అత్యుత్తమ క్వాలిటీతో కూడిన ఏఐ వీడియోలను జనరేట్ చేస్తుంది.CapCut: స్మార్ట్ ఏఐ ఫీచర్లతో వీడియో ఎడిటింగ్ను సులభతరం చేసే ప్రజాదరణ పొందిన యాప్.HeyGen: డిజిటల్ ఏఐ అవతార్లతో ప్రొఫెషనల్ వీడియోలను రూపొందిస్తుంది.Synthesia: వర్చువల్ ప్రెజెంటర్లతో కంపెనీ విధానాలు, శిక్షణా వీడియోలను వేగంగా సిద్ధం చేస్తుంది.Runway: అడ్వాన్స్డ్ ఏఐ జనరేటివ్ ఫీచర్లతో వీడియో ఎడిటింగ్ టూల్.Pika: కొన్ని క్లిక్లలో యానిమేషన్, సృజనాత్మక ఏఐ వీడియోలను క్రియేట్ చేస్తుంది.Luma AI: సినిమాటిక్ విజువల్స్, 3D మోషన్ వీడియోలను రూపొందిస్తుంది.డిజైన్, ఇమేజ్ క్రియేషన్, గ్రాఫిక్స్, ఫొటో ఎడిటింగ్PortfolioTab: నిమిషాల్లో ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియోలను డిజైన్ చేస్తుంది.Canva: పోస్టర్లు, సోషల్ మీడియా గ్రాఫిక్స్ కోసం సులభమైన ఏఐ డిజైనింగ్ ప్లాట్ఫామ్.Midjourney: హై-క్వాలిటీ, హైపర్-రియలిస్టిక్ ఏఐ ఆర్ట్ క్రియేషన్కు తిరుగులేని టూల్.Ideogram: చిత్రాలపై కచ్చితమైన టెక్స్ట్తో కూడిన ఏఐ ఇమేజెస్ రూపొందిస్తుంది.Leonardo AI: గేమింగ్ అసెట్స్, కాన్సెప్ట్ ఆర్ట్లకు అనువైన డిజైన్ టూల్.Figma AI: యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్ల ప్రొడక్టివిటీని పెంచే ఫీచర్లు.Photoroom: ఈ-కామర్స్ ప్రొడక్ట్ ఫొటోలను ప్రొఫెషనల్గా ఎడిట్ చేస్తుంది.Remove bg: సింగిల్ క్లిక్తో చిత్రాల బ్యాక్గ్రౌండ్ను తొలగిస్తుంది.ఆడియో, వాయిస్, మ్యూజిక్YouLearn: సుదీర్ఘమైన యూట్యూబ్ వీడియోల నుంచి సారాంశాన్ని క్షణాల్లో అందిస్తుంది.ElevenLabs: మన స్వరానికి చాలా దగ్గరగా ఉండే వాయిస్ క్లోనింగ్, టెక్స్ట్-టు-స్పీచ్ సేవలు.Podcastle: పోడ్కాస్ట్ రికార్డింగ్, ఆడియో ఎడిటింగ్ను సులభతరం చేస్తుంది.Wispr Flow: వాయిస్ ద్వారా మాట్లాడిన మాటలను వెంటనే స్పష్టమైన టెక్స్ట్గా మారుస్తుంది.Suno: టెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆధారంగా అద్భుతమైన ఏఐ సంగీతాన్ని కంపోజ్ చేస్తుంది.Udio: ఒరిజినల్ సాంగ్స్, మ్యూజిక్ ట్రాక్లను క్రియేట్ చేస్తుంది.ఆటోమేషన్, వర్క్ఫ్లోTally: స్మార్ట్, డైనమిక్ ఆన్లైన్ ఫారమ్లను రూపొందించే సాధనం.Zapier: వివిధ యాప్లను అనుసంధానించి రోజువారీ వర్క్ఫ్లోలను ఆటోమేట్ చేస్తుంది.Make: సంక్లిష్టమైన ఆటోమేషన్ ప్రాసెస్ వ్యాపారాలకు సులభం చేస్తుంది.n8n: వినూత్నమైన ఓపెన్-సోర్స్ వర్క్ఫ్లో ఆటోమేషన్ ప్లాట్ఫామ్.మీటింగ్స్, ఆఫీస్ వర్క్Gamma: కొన్ని నిమిషాల్లో ప్రెజెంటేషన్లు, డాక్యుమెంట్లను సిద్ధం చేస్తుంది.Otter ai: జూమ్, గూగుల్ మీట్ వంటి సమావేశాలను రియల్-టైమ్లో టెక్స్ట్గా మారుస్తుంది.Fireflies ai: మీటింగ్లకు సంబంధించిన నోట్స్, ముఖ్యాంశాలను స్వయంచాలకంగా రాస్తుంది.Granola: ఆఫీస్ సమావేశాలలో ముఖ్యమైన అంశాలను పాయింట్ల రూపంలో రికార్డ్ చేసే స్మార్ట్ అసిస్టెంట్.అడ్వాన్స్డ్, ఆటోనమస్ ఏఐ ఏజెంట్లుTripo AI: ప్రాంప్ట్ల నుంచి సులభంగా 3D మోడళ్లను సిద్ధం చేస్తుంది.The AI Library: రోజువారీ అవసరాలకు తగిన కొత్త ఏఐ టూల్స్ను కనుగొనడానికి ఉపయోగపడే డాష్బోర్డ్.DeepL: వ్యాకరణ లోపాలు లేకుండా అత్యంత కచ్చితత్వంతో విదేశీ భాషలను అనువదిస్తుంది.Poe: ఒకే వేదికపై రకరకాల ప్రధాన ఏఐ మోడళ్లను వాడుకునే వెసులుబాటు కల్పిస్తుంది.Genspark: స్వతంత్రంగా సమాచారాన్ని వెతికి నివేదికలు తయారుచేసే ఏఐ సూపర్ ఏజెంట్.Manus: సంక్లిష్ట టాస్క్లను మానవ ప్రమేయం లేకుండా స్వయంచాలకంగా పూర్తిచేసే ఆటోనమస్ ఏఐ ఏజెంట్.టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం పనిచేసే విధానం కూడా వేగంగా రూపాంతరం చెందుతోంది. ఈ ఏఐ సాధనాలను రోజువారీ వృత్తిపరమైన, వ్యాపార జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా సమయం అవుతుంది. సృజనాత్మకత, నాణ్యత గణనీయంగా పెరుగుతాయని సాంకేతిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: నగవులు నిజమని నమ్మేదా?
ఎండీఆర్పై అమెరికా ఒత్తిడి లేదు
న్యూఢిల్లీ: యూపీఐ చెల్లింపులకు సంబంధించి 0.4 శాతం ఎండీఆర్ విధించాలన్న నిర్ణయానికి అమెరికా ఒత్తిడే కారణమన్న ఆరోపణలను ఆర్థిక శాఖ ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమైన, తప్పుదోవ పట్టించే ఆరోపణలను పేర్కొంది. ఈ విషయంలో ఎన్పీసీఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం రూపే కార్డులతో పోలిస్తే ఇతర విదేశీ క్రెడిట్ కార్డులకు ఎలాంటి అదనపు ప్రయోజనాలూ ఉండవని స్పష్టం చేసింది. రూపేకి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల యూపీఐ వ్యవస్థలో అమెరికన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు పోటీపడలేకపోతున్నారంటూ యూఎస్టీఆర్ (అమెరికా ట్రేడ్ రిప్రెజెంటేటివ్) 2026 రిపోర్ట్ వ్యాఖ్యానించడం, ఆ తర్వాత యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించడం చోటు చేసుకున్న నేపథ్యంలో విమర్శకుల ఆరోపణలు, ఆర్థిక శాఖ వివరణ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘యూపీఐ వ్యవస్థలో రూపే క్రెడిట్ కార్డులకు మాత్రమే అనుమతి ఉంటుందని సెపె్టంబర్ 15 నాటి ఎన్పీసీఐ సర్క్యులర్ స్పష్టం చేస్తోంది. భారత్లో యూజర్లు రూపే క్రెడిట్ కార్డులకు ప్రాధాన్యతనిచ్చేలా ప్రోత్సహించాలనే విధానం చాలా స్పష్టంగా ఉంది. బైటి ఒత్తిళ్ల వల్ల ఎండీఆర్ను ప్రవేశపెట్టారనే ఆరోపణ పూర్తిగా అవాస్తవం‘ అని ఎక్స్లో ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) పోస్ట్ చేసింది. అధిక విలువ చేసే లావాదేవీలపై ఎండీఆర్ని ప్రవేశపెట్టడం వల్ల మరిన్ని దేశీ సంస్థలు యూపీఐ వ్యవస్థలో పని చేసేందుకు ముందుకు వస్తాయని పేర్కొంది. ఫోన్పేకి ప్రయోజనం.. ఎండీఆర్ విధింపుతో ఫోన్పే అత్యధికంగా లబ్ధి పొందవచ్చని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. యూపీఐ లావాదేవీల్లో 45 శాతం వాటా ఫోన్పేదే ఉన్నట్లు పేర్కొన్నారు. 2023లో 12 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ పలికినప్పటికీ ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో 2026 మార్చిలో తలపెట్టిన ఐపీవోని ఫోన్పే వాయిదా వేసింది. తాజాగా ఎండీఆర్ నుంచి వచ్చే ఆదాయంతో సంస్థ వేల్యుయేషన్ భారీగా పెరుగుతుందని శ్రీవాస్తవ వివరించారు. ఫోన్పే, గూగుల్పే దేశీయంగా 80 శాతం పైగా యూపీఐ లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్నాయి. అమెజాన్, ఇతర విదేశీ ప్లాట్ఫాంలు కూడా విస్తరిస్తున్నాయి. ‘ప్రజా ధనంతో భారతీయ సంస్థలు, బ్యాంకులు నిర్మించిన యూపీఐ మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడానికి అమెరికన్ టెక్నాలజీ కంపెనీలకి భారత్ ఇప్పటికే భారీ స్థాయిలో యాక్సెస్ ఇస్తోంది. ఈ ప్లాట్ఫాంలలో భారీ స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నాయి. అంతేకాకుండా కోట్ల కొద్దీ ప్రజలు ఖర్చు చేసే ధోరణులకు సంబంధించిన గణాంకాలు కూడా వాటికి చేరుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారులపై ఎండీఆర్ భారాన్ని మోపితే వారు అంతిమంగా దాన్ని వినియోగదారులకు బదలాయిస్తారు. ఈ మార్పులన్నీ కూడా భారత్లో అమెరికన్ వీసా, మాస్టర్కార్డ్ల వ్యాపారాన్ని యూపీఐ, రూపే కార్డులు దెబ్బతీస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న అమెరికాకే ప్రయోజనం చేకూర్చేవిగా ఉన్నాయి. ఎండీఆర్ విధించే బదులుగా యూపీఐతో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్న అగ్రగామి విదేశీ సంస్థలు ఒక్కో దానికి వార్షికంగా ఓ 100 మిలియన్ డాలర్ల పారి్టసిపేషన్ ఫీజు విధించాలి‘ అని శ్రీవాస్తవ చెప్పారు.
సెమీకాన్ 2.0కు పెట్టుబడుల పుష్
న్యూఢిల్లీ: చిప్ తయారీ తదుపరి దశలో భాగంగా ప్రభుత్వం సెమీకాన్ 2.0ను ప్రకటించడంతో భారీ పెట్టుబడులకు ఆసక్తి కనిపిస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా పేర్కొన్నారు. సుమారు 11–12 బిలియన్ డాలర్ల(రూ. లక్ష కోట్లు) సెమీకండక్టర్ పెట్టుబడులకు కట్టుబాటు ప్రదర్శించినట్లు వెల్లడించారు. వెరసి చిప్ తయారీ తదుపరి దశలో భాగంగా కనీసం లక్ష కొత్త ఉద్యోగాల సృష్టికి వీలున్నట్లు తెలియజేశారు. ఎక్విప్మెంట్, మెటీరియల్స్, గ్యాసెస్, కెమికల్స్సహా అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏటీఎంపీ) యూనిట్స్ తదితరాలలో పెట్టుబడులకు కట్టుబాటు కనిపిస్తున్నట్లు వివరించారు. రెండు, మూడేళ్లలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులకు తెరలేవనున్నట్లు సెమీకాన్ ఇండియా 2026 సదస్సు సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైష్ణవ్ తెలియజేశారు. అయితే పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న కంపెనీల వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. పలు కంపెనీలు ఇందుకు సిద్ధపడుతున్నప్పటికీ ఆయా సంస్థల బోర్డులు, వాటాదారుల నుంచి అనుమతి పొందిన తరువాతే ఇందుకు వీలున్నట్లు తెలియజేశారు. నిజానికి పెట్టుబడులు ప్రారంభమయ్యాక లక్షకంటే చాలా అధికంగా ఉద్యోగాలు లభించనున్నాయని అభిప్రాయపడ్డారు. దేశీ సెమీకండక్టర్ పరిశ్రమలో సెమీకాన్ 2.0 ద్వారా పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ ఏర్పాటుకానున్నట్లు పేర్కొన్నారు. చిప్ డిజైన్, ఎక్విప్మెంట్, మెటీరియల్స్, ఫ్యాబ్స్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, ఆర్అండ్డీ, నైపుణ్యం తదితరాలకు వీలున్నట్లు వివరించారు. సెమీకాన్ 1.0 ఫౌండేషన్కు శ్రీకారం చుట్టగా.. సెమీకాన్ 2.0 మరింత పురోభివృద్ధి బాటలో సాగనున్నట్లు వివరించారు.
ఫ్యామిలీ
నొప్పి తగ్గేదిలా...
రుతుక్రమ సమయంలో టీనేజ్ బాలికల నుంచి యువతుల వరకు తీవ్రమైన పొత్తి కడుపునొప్పి, వెన్నునొప్పిని అనుభవించేవారి శాతం 80 నుంచి 85 వరకు ఉంటుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన అధ్యయనాలలో స్పష్టమైంది. ఈ సమస్యకు పరిష్కారంగా చాలామంది పెయిన్కిల్లర్స్ వాడుతుంటారు, రోజువారీ పనుల నుండి దూరంగా ఉంటూ ఇబ్బందులు పడుతుంటారు. రుతుక్రమ నొప్పి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో నిపుణుల ద్వారా తెలుసుకుందాం...రుతుక్రమం మొదలయ్యే 90 శాతం మంది మహిళల మాదిరిగానే మీకూ నెలసరి సమయంలో కడుపునొప్పి, చిరాకు, అలసట, తల తిరగడం, వికారం వంటి లక్షణాలు కనిపించవచ్చు... ఇలాంటప్పుడు..సహజ పద్ధతుల్లో ... నెలసరి ప్రారంభం కావడానికి కొన్నిరోజులముందు కడుపు లేదా శరీరంలోని ఇతర భాగాలు ఉబ్బినట్లుగా లేదా బరువు పెరిగినట్లుగా అనిపించవచ్చు. ఇది నెలసరి సమయంలో సాధారణంగా కనిపించే లక్షణమే, కానీ ఇది అసౌకర్యాన్ని కలిగించి, నెలసరి నొప్పులను మరింత తీవ్రతరం చేస్తుంది. దీనికి విరుగుడుగా రోజుకు 8–10 గ్లాసుల నీళ్లు తాగాలి. కడుపు ఉబ్బరాన్ని పెంచే కెఫీన్, చక్కెరతో కూడిన పానీయాలు, ఉప్పుతో కూడిన స్నాక్స్ను తగ్గించాలి. వేడినీళ్లు తాగడం వల్ల శరీరమంతటా రక్తప్రసరణ పెరిగి, కండరాలు రిలాక్స్ అవుతాయి. గర్భాశయ సంకోచాల వల్ల కలిగే తిమ్మిర్లూ తగ్గుతాయి.హెర్బల్ టీలు మేలు... కండరాలు రిలాక్స్ అయ్యి, నొప్పులు తగ్గడానికి గోరువెచ్చని టీ లేదా అల్లం కషాయం తాగచ్చు. కొన్ని రకాల హెర్బల్ టీ లలో ఉబ్బరం, వాపును తగ్గించగల యాంటీ–ఇన్స్ ఫ్లమేటరీ గుణాలు, గర్భాశయంలో కండరాల నొప్పులను తగ్గించగల ఔషధ గుణాలుంటాయి. వేడినీటి కాపడం... గర్భాశయ కండరాలను సడలించి, రక్తప్రసరణను మెరుగుపరచడానికి పొత్తికడుపుపై వేడినీటి కాపడం పెట్టాలి. ఇది కండరాలకు విశ్రాంతినిచ్చి, రక్తప్రసరణను మెరుగుపరిచి, ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడుతుంది. తేలికపాటి వ్యాయామం... శరీరాన్ని స్ట్రెచింగ్ చేయడం, కొద్దిపాటి నడక... వల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది. నొప్పితో బాధపడుతున్నప్పుడు వ్యాయామం గురించిన ఆలోచన రాకపోవచ్చు. కానీ తేలికపాటి వ్యాయామం కూడా ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. దీంతో నొప్పి తగ్గి, కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. మసాజ్ థెరపీ రుతుస్రావ నొప్పిని తగ్గిస్తుందని వివిధ అధ్యయనాలలో తేలింది. శారీరక ఒత్తిడిని తగ్గించే మసాజ్ గర్భాశయాన్ని రిలాక్స్ చేయడం ద్వారా గర్భాశయ సంకోచాలు తగ్గి, నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.ఉపశమనం కోసం... ఒత్తిడి వల్ల కండరాల నొప్పులు మరింత తీవ్రం కావచ్చు. ధ్యానం, దీర్ఘ శ్వాస, యోగా వంటి పద్ధతులు ఎంతో మేలు చేస్తాయి. విశ్రాంతిగా కూర్చొని, కళ్ళుమూసుకుని, దీర్ఘ శ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండాలి. కొన్ని నిమిషాల వ్యవధిలో నొప్పినివారణ తెలుస్తుంది. రుతుస్రావ నొప్పికి సహాయపడే ఇంటిచిట్కాలతో పాటు, వైద్యుల సూచనలు సహాయపడతాయి. అందుబాటులో మరికొన్ని ... రుతుక్రమ నొప్పులను తగ్గించేందుకు కార్డ్లెస్ హీటింగ్ బెల్ట్లు, మసాజ్ ΄్యాడ్లు, పీరియడ్ క్రాంప్ డివైజ్లు, జెల్లు.. అందుబాటులోకి వచ్చాయి. ఇవి గర్భాశయ కండరాలను రిలాక్స్ చేయడానికి, సర్దుబాటు చేయడానికి నొప్పి నుంచి ఉపశమనం కలిగించే వైబ్రేషన్లను కలిగిస్తాయి.నివారణకు ఓ పరికరంమహిళల్లో పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే నొప్పికి డ్రగ్–ఫ్రీ పరిష్కారాన్ని అందించే లక్ష్యంతో ‘క్యురపాడ్ ఎమ్’ అనే వైద్యపరికరాన్ని రూపొందించారు తెలంగాణ వాసి డాక్టర్ సూర్యప్రకాశ్, బెంగళూర్కు చెందిన శ్రీరామ్. ‘‘నాలుగేళ్ల క్రితం బాడీ పెయిన్ రిలీఫ్ డివైజ్ను రూపొందించాం. దానిని వాడిన వారి దగ్గర నుంచి అనేక అభ్యర్థనలు వస్తున్నాయి. మా ఇంట్లో చెల్లెలు రుతుక్రమ నొప్పిని అనుభవించడం చూసి, మహిళల కోసం మరో పరికరాన్ని తయారు చేయాలని రెండేళ్లు గా కృషి చేశాం. ఎలాంటి మందులూ అవసరం లేకుండా మహిళలు సులువుగా ఉపయోగించేలా ఈ పరికరాన్ని తీసుకువచ్చాం. మహిళలు రుతుక్రమం సమయంలో వచ్చే నొప్పి నివారణకు తమ పొత్తికడుపు భాగంలో ఈ పరికరాన్ని ధరించడం వల్ల 30 నిమిషాలలో రెడ్లైట్, నియర్–ఇన్ఫ్రారెడ్ లైట్ ఆధారంగా ఫొటో బయోమాడ్యులేషన్ సాంకేతికతతో పీరియడ్ నొప్పికి సంబంధించిన వాపు, రక్తప్రసరణ వంటి అంశాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వారి రోజువారి పనులకు ఎలాంటి ఆటంకం కలగదు. ఈ పరికరానికి సీడిఎస్సీవో అనుమతితోపాటు ఎఫ్డిఎ రిజిష్ట్రేన్ కూడా ఉంది.’’– డాక్టర్ సూర్యప్రకాశ్, శ్రీరామ్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
సీమ.. సింహం
దిక్కులు పిక్కటిల్లేలా ధైర్యసాహసాలు ఎప్పుడూ గర్జిస్తూ ఉండవు. కొన్ని సందర్భాలలో అవి మౌనంగా ఉంటాయి’ అనే మాటొకటి ఉంది. సీబీఐ ఆఫీసర్ సీమ పహుజా గురించి విన్న వారికి, ఆమె పనితీరును నిశితంగా గమనించిన వారికి పై వాక్యాలు వెంటనే గుర్తుకొస్తాయి. సీమ పహుజా పెద్దగా మాట్లాడరు. ఆమె పేరు మాత్రం దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట సంచలన స్వరంతో వినిపిస్తూనే ఉంటుంది.తాజాగా...బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ అనుమానాస్పద మృతి కేసు విచారణ బాధ్యతలను సీమ పహుజా చేపట్టనున్నారు..శివసేన (యూబీటి) నాయకుడు ఆదిత్య థాకరే, నటుడు డినో మోరియా పేర్లను ప్రస్తావిస్తూ దిశా శాలియన్ తండ్రి సతీష్ శాలియన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న భవనం 14వ అంతస్తు నుండి కిందపడి దిశా శాలియన్ మరణించింది. బాంద్రాలోని ఒక ప్లాట్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించడానికి కొద్ది రోజుల ముందే ఈ ఘటన జరిగింది. మొదట ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు(ఏడీఆర్)గా కేసు నమోదు చేశారు.హైకోర్టు ఆదేశం‘విచారణ అనంతరం దిశా శాలియన్ ఆత్మహత్య చేసుకుంది’ అని పోలీసులు చెప్పారు. పోలీసులు చెప్పినదాన్ని విభేదిస్తూ, తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని, హత్యకు గురైందని ఆరోపిస్తూ సీమ తండ్రి సతీష్ శాలియన్ హైకోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను అనుసరించి ఆమె మరణానికి సంబంధించిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐ ఆఫీసర్ సీమ పహుజా చేపట్టనుండడంతో ‘ఎవరీ సీమ పహుజా?’ అనే ఆసక్తి మొదలైంది.విశేష అనుభవందిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక నేరవిభాగంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు సీమ పహుజా. సున్నితమైన కేసులతో సహా క్లిష్టమైన క్రైమ్కేసులు, ఫోరెన్సిక్ సాక్ష్యాల దర్యాప్తులో ఆమెకు విశేష అనుభవం ఉంది. 2024లో కోల్కతా ఆర్.జి.కార్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసు దర్యాప్తు బృందంలో సీమ సభ్యురాలిగా ఉన్నారు.ఉన్నావ్ అత్యాచార కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు. ఉత్తర్ప్రదేశ్లో హత్రాస్ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన పదిహేనుమంది సభ్యుల బృందంలో ఆమె ఉన్నారు. హిమాచల్ప్రదేశ్లో గుడియా కేసు దర్యాప్తు బాధ్యతను కూడా సీబీఐ సీమ పహుజాకు అప్పగించింది. సిమ్లాలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం, హత్యకు సంబంధించిన దర్యాప్తులో కూడా ఆమె పాలుపంచుకున్నారు.బంగారంలాంటి ఆఫీసర్!ఔట్స్టాండింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా 2007, 2018, 2021లో బంగారు పతకాలను గెలుచుకున్నారు సీమ పహుజా. సీబీఐలో ఆమె చేసిన విశిష్ట సేవలకు 2014లో పోలీస్ మెడల్ ప్రదానం చేశారు. ‘జటిలమైన కేసులను దర్యాప్తు చేయడంలో దిట్ట’ అని పేరు తెచ్చుకున్న సీమ పహుజా పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి వివరం... పకడ్బందీగా!సంచలనం సృష్టించిన కోట్ఖాయ్ (హిమాచల్ ప్రదేశ్) కేసులో నిందితుడు తప్పించుకోకుండా, శిక్ష పడేలా చేయడం సీమ పహుజా సాధించిన విజయాలలో ఒకటి. పదవ తరగతి చదివే అమ్మాయి స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా అదృశ్యమైంది. రెండు రోజులు తరువాత ఆమె మృతదేహం కనిపించింది. ఆమెపై దారుణంగా అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపారు. నిందితులను పట్టుకోవడంలో, కేసును ఛేదించడంలో పోలీసులు విఫలం అయ్యారు. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో ‘లీనియేజ్ టెస్టింగ్’ అనే వినూత్నమైన పద్ధతిని భారతదేశంలో తొలిసారిగా ఉపయోగించారు. దీంతో కేసులో కీలక పురోగతి వచ్చింది. నిందితుడికి జీవిత ఖైదు విధించారు. ‘తనకు అప్పగించిన కేసులకు సంబంధించి ఏ చిన్న వివరాన్నీ సీమ వదిలి పెట్టరు. ‘నిందితులకు శిక్ష పడేలా, తార్కిక ముగింపు ఉండేలా కేసులను పకడ్బందీగా రూపొందించడంలో దిట్ట’ అని సీమ పహుజా గురించి సీబీఐలోని సీనియర్ అధికారులు చెబుతుంటారు. బీకాం చేసిన సీమ పహుజా 1988లో ఏజెన్సీలో చేరారు. 1993లో సబ్–ఇన్స్పెక్టర్ అయ్యారు. 2013లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాకు పదోన్నతి పొందారు. 2022లో ఏఎస్పీ అయ్యారు. సీబీఐలో విశిష్ట సేవలకుగాను రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. సాక్షులను మానసికంగా విశ్లేషించడంలో తనదైన శైలిని, అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శిస్తారని పేరు తెచ్చుకున్నారు.
పూల వ్యర్థాల నుంచి : ఏకంగా రూ. 200 కోట్ల కంపెనీ
పెళ్లిళ్లలోనూ,పండగల్లోనూ, ఉత్సవాల్లోనూ, దేవాలయల్లోనూ అలంకరణకు క్వింటాళ్ల కొద్దీ పువ్వులతోమండపాలను, దేవుళ్లను అలంకరించడం సర్వ సాధారణం. ఆ తరువాత ఈ పూలన్నీ ఎక్కడికి పోతున్నాయి. ఎపుడైనా ఆలోచించారా? మరీ ముఖ్యంగా గణేశ్, దేవీ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనాల తరువాత పుణ్య నదుల్లో, కాల్వల్లో కలిసిపోవే పువ్వుల గురించి ఆలోచించారా? అలా 2015లో, అంకిత్ అగర్వాల్ కాన్పూర్లోని గంగా నది ఒడ్డున నిలబడి, మామూలుగా కనిపించిన ఒక దృశ్యం అతన్ని ఆగి ఆలోచించేలా చేసింది. ఆ ఆలోచనే రూ. 200 కోట్ల కంపెనీకి పునాది పడింది.అది మకర సంక్రాంతి రోజు.. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తుండగా, ఆలయాల్లో సమర్పించిన పూలను సేకరించి అదే నదిలో పడేస్తున్నారు. చాలామందికి అవి వ్యర్థాలు మాత్రమే, కానీ అంకిత్ అగర్వాల్కు మాత్రం అది ఒక పెద్ద సమస్యలా కనిపించింది. ఇది తీవ్ర సమస్యగా మారకూడదు అనే తపన మొదలైంది.పురుగుమందులు,రసాయన రంగులు, ఇతర పదార్థాలతో ఆ పువ్వులు, దేవాలయాలలో సమర్పించిన తర్వాత నదిలో కలిసి పోతున్నాయని కలత చెందారు. నది కలుషితం అవ్వడాన్ని ఆపడానికి ఈ పూలను రీసైకిల్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆలయాల నుంచి సేకరించిన వ్యర్థ పువ్వులతో నది కాలుష్యం బారిన పడకుండా ఉండాలనే ఆలోచన మొదలైంది.ఆటోమేషన్ సైన్స్లో నేపథ్యం ఉండి, సోషల్ ఇన్నోవేషన్లో ఫుల్బ్రైట్ ఫెలోషిప్ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన అంకిత్ ఏదైనా చేయాలనుకున్నాడు.అంకిత్ తన చిన్ననాటి స్నేహితుడైన, పర్యావరణ ఇంజనీర్ ప్రతీక్ కుమార్ సంప్రదించాడు. ఇద్దరూ పారేసిన పువ్వులను సేకరించి, వాటిని ప్రాసెస్ చేసే మార్గాలను పరీక్షించడం ప్రారంభించారు. వారి ప్రారంభ ఆలోచన కంపోస్టింగ్, కానీ ప్రయోగాలు అనుకున్నట్లుగా జరగలేదు. ఆలయ వ్యర్థాలలో ఉండే పసుపు, కుంకుమ వంటి పదార్థాలు ఈ ప్రక్రియలో సమస్యలను సృష్టించాయి. కానీ ఎక్కడా తగ్గలేదు.ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. చివరికి, వారు పూల వ్యర్థాలను అగరబత్తి ఉత్పత్తులకు ముడి పదార్థంగా మార్చే మార్గాన్ని కనుగొన్నారు. వ్యర్థాల సమస్యను పరిష్కరించే ప్రయత్నంగా ప్రారంభమైనది నెమ్మదిగా ఒక వ్యాపార నమూనాగా మారింది.2017లో 'ఫూల్' (Phool.co) వెనుక ఉన్న కంపెనీ అయిన కాన్పూర్ ఫ్లవర్సైక్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. ప్రారంభంలో ఈ పువ్వులతో అగర్బత్తీలు, ధూప్ కోన్లు, పర్యావరణహిత రంగులను తయారు చేశారు. ఆ తర్వాత ఈ వ్యాపారాన్ని మరింతగా విస్తరించారు. View this post on Instagram A post shared by PHOOL (@phool.co)అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ద్వారా అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలకు, ముఖ్యంగా ప్రమాదకరమైన ట్యానిరీ పనుల్లో పనిచేసిన వారికి ఉపాధి కల్పించారు. ప్రాసెసింగ్ సమయంలో మిగిలిపోయిన పూల పదార్థంతో ఏమి చేయవచ్చో ఆ బృందం పరిశోధించడం ప్రారంభించింది. ఆ పరిశోధన చివరికి అది మరో కంపెనీకి దారి తీసింది. ఇదీ చదవండి: లవర్ను పెళ్లాడి బిహార్కు, ఇన్స్టాలో అమెరికా అమ్మడు సందడిఫ్లెదర్ -వీగన్ లెదర్(Fleather) ఆవిష్కరణ: కేవలం పూల వ్యర్థాలతో ఆగకుండా, ఆ అవశేషాల నుంచి జంతువుల చర్మానికి ప్రత్యామ్నాయంగా 'ఫ్లెదర్' అనే బయోమెటీరియల్ను అభివృద్ధి చేశారు. ఇది ఫ్యాషన్ పరిశ్రమను ఎంతగానో ఆకర్షించింది. 2017లో సీడ్ ఫండింగ్ ప్రారంభం కాగా, ఏప్రిల్ 2022 నాటికి సిరీస్-ఎ రౌండ్లో బాలీవుడ్ నటి ఆలియా భట్ తదితరుల పెట్టుబడితో సుమారు రూ. 95 కోట్ల ఈక్విటీ ఫండింగ్ను సాధించింది. FY25 నాటికి ఫూల్ ఆపరేటింగ్ రెవెన్యూ సుమారు రూ. 77 కోట్లకు చేరగా, సంస్థ విలువ రూ. 200 కోట్లకు పైగా ఉంది. జూన్ 2026లో ఎన్సీఎల్టీ (NCLT) అలహాబాద్ బెంచ్ 'ఫ్లెదర్' వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా డీమెర్జ్ చేసేందుకు అనుమతించింది.ఇదీ చదవండి: పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
జస్ట్ రూ. 100తో మొదలై..రూ. 2 కోట్ల వ్యాపార సామ్రాజ్యం!
ఏ వ్యాపారంలోనైనా ఒక్కసారి ఘోరమైన నష్టం చవిచూస్తే..మళ్లీ దానివైపుకి కన్నెత్తి చూసే సాహసం చేయం. అసలు ఆ కష్టం నుంచి కోలుకోవడమే చాలా కష్టం. కానీ ఈ మహిళ వ్యాపారంలో ఎంత ఘోరమైన నష్టాలు చూసిందంటే..చేతిలో వంద రూపాయలతో రోడ్డుపైకి వచ్చేసింది. కానీ ఆ వంద కంటే తక్కువ మొత్తంతోనే మళ్లీ వ్యాపారం ప్రారంభించి.. ఇవాళ ఏ రేంజ్కి చేరుకుందో తెలిస్తే విస్తుపోతారు. నష్టాలనేవి నట్టేట ముంచేవి కాదు..నింగికేగేసేలా చేసే పాఠాలని చెబుతోంది ఆమె సక్సెస్ స్టోరీ. ఆ శక్తిమంతమైన మహిళే ఇలావరసి జయకాంత్. తమిళనాడులోని ఉసిలంపట్టికి చెందిన ఆమె కుటుంబం కేరళలోని త్రిస్సూర్ జిల్లాకు వలస వచ్చింది. ఆమె తల్లిదండ్రులు జీవనోపాధి కోసం స్వీట్స్, స్నాక్స్ తయారు చేసి విక్రయిస్తుండేవారు. అలా ఆమెకు చిన్ననాటి నుంచి ఉత్పత్తులను చుట్టపక్కల వాళ్లకు అమ్మడంలో పేరెంట్స్ సహాయం చేస్తుండేది. పెళ్లి తర్వాత కూడా జయకాంత్ తన కుటుంబ సంప్రదాయన్ని కొనసాగిస్తూ.. ఆమె కూడా ఇంట్లోనే స్వీట్లు, స్నాక్స్ తయారు చేసి, సమీపంలో ఇళ్లలో ఉత్పత్తులనను అమ్ముతుండేది. దీనికి చుట్టపక్కల వాళ్లు, బంధువుల నుంచి అనూహ్య స్పందన రావడంతో పెద్ద వ్యాపారంగా మార్చాలని నిర్ణయించుకుంది. అలా తన వద్ద ఉన్న పొదుపు, బ్యాంకు రుణాలు, కొంత బయట నుంచి తెచ్చిన అప్పుతో సహా మొత్తం రూ. 50 లక్షలతో సూపర్మార్కెట్ను ప్రారంభించింది. దాంట్లోనే పండ్లు, కూరగాయలతో చేసిన హల్వా, చిప్స్, కేకులు, స్వీట్లు, స్నాక్స్ వంటి వస్తువులను విక్రయించడం ప్రారంభించింది. అంతేగాదు 50 మందిదాక ఉపాధి కల్పించింది. సరిగ్గా 2011లో సూపర్ మార్కెట్ దొంగతనానికి గురవ్వడంతో తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంది. ఎంతలా అంటే వ్యాపారంలో మొత్తం డబ్బునిపోగొట్టుకుని చేతిలో కేవలం వంద రూపాలయతో రోడ్డు మీదకు వచ్చేసింది. ఆ నష్టం ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి ఆస్పత్రి పాలు చేసింది. కానీ ఆమెకు విరామం తీసుకునే వ్యవధి లేనంతగా బ్యాంకు నుంచి అప్పులవాళ్ల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ఆమె వెంటనే మళ్లీ.. మరో వ్యాపారం చేసి నిలదొక్కుకుంటే పరిస్థతి చక్కబడేలే లేదని గ్రహించి చివరకు చేతిలో ఉన్న కొద్ది మొత్తంతోనే త్రిస్సూర్ రైల్వే స్టేషన్ సమీపంలో 'అశ్వతి హాట్ చిప్స్' అనే ఒక చిన్న హాట్-చిప్స్ స్టాల్ను ప్రారంభించింది. వంద రూపాయల కన్నా తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన ఈ వ్యాపారం కాస్తా అమ్మకాలు ఊపందుకుని తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుంది. అలా చిప్స్ తోపాటు వడలు వంటి వాటిని జోడించి వ్యాపారాన్ని విస్తరించింది. అలా తొలి వ్యాపారంలో ఎదురైన అప్పులన్నిటినీ తీర్చేసింది. అంతేగాదు ఆ చిన్న స్టాల్లోనే ఏకంగా కేకులు, స్వీట్లు, ఊరగాయలు కూడా చేర్చింది. అలా కొద్దికాలంలోనే ఆ వ్యాపారం ఇలావరసి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్గా నమోదై అతిపెద్ద సంస్థగా అవతరించింది. ఇవాళ ఏకంగా రెండు కోట్లు టర్నోవర్ చేసే వ్యాపార సామ్రాజ్యంగా మారింది. అలాగే ఈమె కథ పెద్ధ పెట్టుబడులతోనే విజయం రాదని, కష్టించేతత్వం ఉంటే చిన్న మొత్తంతో ఊహకందని సక్సెస్ని ఒడిసిపట్టుకోవచ్చని నిరూపిస్తోంది కదూ..(చదవండి: సాధారణ ఫుడ్ డెలివరీ కాస్తా..ఫ్లైట్లో ఇంటికి వెళ్లేలా..!)
అంతర్జాతీయం
బ్రిటన్ రాజకుటుంబంలో మళ్లీ కలకలం.. డయానా ఉదంతంతో కొత్త వివాదం!
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలో మరోసారి వివాదం మొదలైంది. కొంతకాలంగా ప్రశాంతంగా కనిపించిన రాజకుటుంబంలో దివంగత యువరాణి డయానా సోదరుడు చార్లెస్ స్పెన్సర్ రాసిన పుస్తకం కొత్త చర్చకు కారణమైంది. డయానా మరణం తర్వాత అప్పటి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్ తనతో ఫోన్లో మాట్లాడిన విషయాలను స్పెన్సర్ తన రాబోయే పుస్తకంలో ప్రస్తావించినట్లు బ్రిటన్ మీడియా కథనాలు తెలిపాయి.డయానా మరణించిన కొద్ది రోజుల తర్వాత చార్లెస్ తనతో తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారని స్పెన్సర్ పేర్కొన్నట్లు ‘డైలీ మెయిల్’లో పుస్తకంలోని కొన్ని భాగాలు ప్రచురితమయ్యాయి. డయానా అంత్యక్రియల ఊరేగింపులో ఆమె కుమారులు విలియం, హ్యారీ పాల్గొనడం ఆమెకు ఇష్టం ఉండేది కాదని తాను చెప్పినప్పుడు చార్లెస్ కోపంగా స్పందించినట్లు స్పెన్సర్ వివరించారు. డయానా మరణించిన రాత్రి చార్లెస్ తనతో మాట్లాడిన తీరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నట్లు అనిపించిందని ఆయన పుస్తకంలో రాసినట్లు సమాచారం.1997 ఆగస్టులో పారిస్లో జరిగిన కారు ప్రమాదంలో డయానా మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటికి ఆమె కుమారులు విలియం, హ్యారీల వయసులు వరుసగా 15, 12 సంవత్సరాలు. తల్లి అంత్యక్రియల ఊరేగింపులో వారిద్దరూ తండ్రి చార్లెస్తో కలిసి నడిచారు. ‘పీపుల్స్ ప్రిన్సెస్’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డయానా మృతి బ్రిటన్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె మరణం తర్వాత రాజకుటుంబం వ్యవహరించిన తీరుపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి.అరుదుగా స్పందించిన ప్యాలెస్స్పెన్సర్ పుస్తకంలోని విషయాలపై బకింగ్హామ్ ప్యాలెస్ సాధారణంగా పాటించే విధానానికి భిన్నంగా స్పందించింది. పుస్తకాలపై సాధారణంగా తాము వ్యాఖ్యానించబోమని చెబుతూనే.. డయానా మరణం తర్వాత సోదరుడిగా స్పెన్సర్ ఎదుర్కొన్న తీవ్ర విషాదం ఆయన జ్ఞాపకాలు, ఆలోచనలపై ప్రభావం చూపి ఉండొచ్చని ప్యాలెస్ ప్రతినిధి పేర్కొన్నారు. చాలా ఏళ్ల తర్వాత కూడా ఆ విషాదం గత ఘటనలను గుర్తు చేసుకునే విధానాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు.డయానా, చార్లెస్ వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా స్పెన్సర్ పుస్తకంలో ప్రస్తావించినట్లు బ్రిటన్ మీడియా తెలిపింది. చార్లెస్, కెమిల్లా సంబంధానికి సంబంధించిన ఓ విషయాన్ని డయానా తెలుసుకున్నట్లు, అలాగే నిశ్చితార్థం తర్వాత చార్లెస్ చేసిన ఓ వ్యాఖ్య ఆమెను తీవ్రంగా బాధించిందని పుస్తకంలో ఉన్నట్లు సమాచారం. అయితే వీటిలో చాలా విషయాలు గతంలోనే డయానా జీవిత చరిత్రలు, వివిధ మీడియా కథనాల్లో వచ్చినవేనని తెలుస్తోంది.గతంలోనూ రాజకుటుంబంపై విమర్శలురాజకుటుంబంపై ఆరోపణలు వచ్చినప్పుడు ప్యాలెస్ స్పందించడం ఇదే మొదటిసారి కాదు. 2021లో హ్యారీ, మేఘన్ తమ రాజకుటుంబ జీవితానికి సంబంధించిన పలు విషయాలను బహిరంగంగా మాట్లాడినప్పుడు అప్పటి రాణి ఎలిజబెత్ స్పందించారు. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పుడు డయానా సోదరుడి పుస్తకం విడుదలకు ముందే ప్యాలెస్ స్పందించడంతో మరోసారి రాజకుటుంబ వ్యవహారాలు వార్తల్లో నిలిచాయి.ఆండ్రూ వ్యవహారంతో ఇప్పటికే ఇబ్బందులుఈ ఏడాది ప్రారంభం నుంచే బ్రిటన్ రాజకుటుంబానికి వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. రాజు చార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్బాటన్-విండ్సర్ 66వ పుట్టినరోజున ప్రభుత్వ పదవిలో ఉన్న సమయంలో జరిగిన ఓ వ్యవహారానికి సంబంధించి అనుమానాలపై అరెస్టయ్యారు. గతంలో ఆయన బ్రిటన్ వాణిజ్య ప్రతినిధిగా పనిచేశారు. లైంగిక నేరాలకు దోషిగా తేలిన జెఫ్రీ ఎప్స్టెయిన్తో సంబంధాలపై తీవ్ర విమర్శలు రావడంతో 2011లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే ఎప్స్టెయిన్తో తన వ్యవహారాల్లో ఎలాంటి తప్పు చేయలేదని, వ్యక్తిగత ప్రయోజనం పొందలేదని ఆండ్రూ గతంలో ఖండించారు.హ్యారీ–మేఘన్ తిరిగొచ్చినా తగ్గని చర్చఇటీవల హ్యారీ, మేఘన్ బ్రిటన్కు తిరిగి రావడం కూడా రాజకుటుంబంలో ఆసక్తిని పెంచింది. రాజకుటుంబ అధికారిక బాధ్యతలు నిర్వహించని ఈ దంపతులు తమ పిల్లలు ఆర్చీ, లిలిబెట్తో కలిసి దేశానికి వచ్చారు. ఈ క్రమంలో హ్యారీ తొలిసారి ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరై ‘ఇన్విక్టస్ స్పిరిట్ అవార్డ్స్’లో పాల్గొన్నారు.మరోవైపు రాజు చార్లెస్ ఈ నెలలో హ్యారీ, మేఘన్లను ‘ప్రైవేట్ సిటిజన్స్’గా పరిగణించాలని స్పష్టం చేసినట్లు వారి ప్రతినిధి తెలిపారు. బ్రిటన్కు తిరిగి వచ్చిన కొద్దిరోజులకే పిల్లల పాఠశాలను మార్చడం కూడా చర్చనీయాంశమైంది. భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. ఇదే సమయంలో మేఘన్కు భద్రతకు సంబంధించిన కొత్త సమీక్ష జరిగినట్లు బ్రిటన్ మీడియా కథనాలు వచ్చాయి. మరోవైపు ప్రిన్స్ విలియం, కేట్ స్కాట్లాండ్లో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో డయానా సోదరుడి పుస్తకం పాత విషయాలను మరోసారి తెరపైకి తీసుకురావడంతో బ్రిటన్ రాజకుటుంబ వ్యవహారాలు మళ్లీ వార్తల్లో నిలిచాయి.ఇదీ చదవండి: ట్రంప్కు షాకిచ్చిన వార్ష్.. ఫెడ్ స్వతంత్రతపై మళ్లీ చర్చ!
ట్రంప్కు షాకిచ్చిన వార్ష్.. ఫెడ్ స్వతంత్రతపై మళ్లీ చర్చ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) చైర్మన్ కెవిన్ వార్ష్ మధ్య సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. ట్రంప్ కోరుకున్న విధంగా వడ్డీ రేట్లను తగ్గించకుండా.. ఫెడ్ మూడు సంవత్సరాల తర్వాత తొలిసారి వడ్డీ రేట్లను పెంచింది. దీంతో అధ్యక్షుడు, అమెరికా కేంద్ర బ్యాంకు మధ్య సంబంధం కొత్త మలుపు తిరిగింది.బుధవారం రాత్రి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం సరైనది కాదని తాను భావించినప్పటికీ.. వార్ష్కు ఓటు వేయడానికి అనుమతించానని ట్రంప్ చెప్పినట్లు కథనం పేర్కొంది. ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయ కమిటీలో వార్ష్కు తగినంత మద్దతు లేకపోవడంతో.. ఆయన తనతోనే ఓటు వేసినా ప్రయోజనం ఉండదని చెప్పినట్లు ట్రంప్ వివరించారు.అయితే ఫెడ్ చైర్మన్కు వడ్డీ రేట్లు పెంచేందుకు అధ్యక్షుడి అనుమతి అవసరం ఉండదని మాజీ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ బోస్టన్ అధ్యక్షుడు ఎరిక్ రోసెన్గ్రెన్ వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అసాధారణమైనవిగా పేర్కొన్న ఆయన.. వార్ష్కు అధ్యక్షుడు అనుమతి ఇచ్చినట్లుగా భావించే అవకాశం ఉందని అన్నారు. అయితే ట్రంప్ చెప్పిన విషయాలు ఎంతవరకు వాస్తవమో తనకు తెలియదని స్పష్టం చేశారు.‘ఫెడ్ నిర్ణయం వార్ష్దే..వార్ష్ సహచరులతో కలిసి తీసుకున్న నిర్ణయమే ఇది తప్ప.. ఇతరుల ఒత్తిడితో ఆయన రేట్లు పెంచారని చెప్పడానికి ఆధారాలు లేవని ఎవర்கోర్ ఐఎస్ఐకి చెందిన ఆర్థిక నిపుణుడు కృష్ణ గుహా అన్నారు. కమిటీలో వార్ష్ నాయకత్వం స్పష్టంగా కనిపించిందని, సభ్యులంతా ఆయన నిర్ణయానికి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. గతంలో వార్ష్ కొన్ని విషయాల్లో తడబడినప్పటికీ.. తాజా సమావేశంలో మాత్రం ఆయన మరింత స్పష్టంగా, నమ్మకంగా వ్యవహరించారని గుహా అభిప్రాయపడ్డారు.ఫెడ్ రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా ఉండటం అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకమని నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేట్లపై నిర్ణయాలు అధ్యక్షుడి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా.. ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధి వంటి అంశాలను పరిశీలించి తీసుకోవాల్సి ఉంటుంది. ఫెడ్ స్వతంత్రతపై అనుమానాలు పెరిగితే మార్కెట్లలో నమ్మకం దెబ్బతినడంతో పాటు.. భవిష్యత్తులో రుణాలపై వడ్డీ రేట్లు, ఇళ్ల రుణాలు, కార్ల రుణాల ఖర్చులపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.‘మా పరిధిలో మేం ఉంటాం’అధ్యక్షుడితో తన సంబంధాలపై అడిగిన ప్రశ్నలకు వార్ష్ మాత్రం ఆచితూచి స్పందించారు. ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతలో భాగంగా తమ పరిధిలో తాము పనిచేస్తామని చెప్పారు. వాణిజ్య, ఆర్థిక విధానాలు చూసే వారు కూడా తమ పరిధిలో ఉండాలని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్తో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు.వార్ష్ స్పందన కొంత అసాధారణంగా అనిపించిందని యాక్సెస్/మ్యాక్రో సంస్థకు చెందిన ఆర్థిక నిపుణుడు టిమ్ మహెడీ అన్నారు. అధ్యక్షుడితో మాట్లాడలేదని నేరుగా చెప్పడం సరైన సమాధానమని, ముందుగానే ట్రంప్తో వార్ష్ చర్చించి ఉంటే అది ఆశ్చర్యకరమైన విషయమవుతుందని ఆయన పేర్కొన్నారు.వార్ష్ నాయకత్వంపై ప్రభావం?తాజా పరిణామాలు వార్ష్ నాయకత్వంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు ట్రంప్ కోరుకోని వడ్డీ రేట్ల పెంపునకు వార్ష్ అధ్యక్షత వహించారు. మరోవైపు సమావేశంలో ఆయన సహచరులందరి మద్దతును పొందారు. మాజీ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కూడా ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు.అయితే భవిష్యత్తులో వార్ష్ నేతృత్వంలోని ఫెడ్ మళ్లీ వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తే.. ఆ నిర్ణయం నిజంగా ఫెడ్ స్వతంత్రంగా తీసుకుందా? లేక అధ్యక్షుడి ప్రభావం ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రంప్ మాత్రం వార్ష్పై విమర్శలు చేయకుండా.. ఆయన మంచి వ్యక్తి అంటూ ప్రశంసించారు. అయితే ద్రవ్యోల్బణం, రుణ వ్యయాలు, షేర్ మార్కెట్, అమెరికా ప్రభుత్వ బాండ్ల వడ్డీ రేట్లు ఎలా మారతాయన్నదే ఇక ముందు వీరిద్దరి సంబంధాలపై ప్రభావం చూపే కీలక అంశాలుగా మారనున్నాయి.
విదేశీ విద్యార్థులకు షాకిచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం!
ఆస్ట్రేలియా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను తోడుగా తెచ్చుకోవడంపై కొత్త విధానాలను తీసుకొచ్చింది. డిగ్రీలు, ఇతర కోర్సుల్లో చదువుకునే విద్యార్థులు ఇక నుంచి ఒంటరిగానే రావాలని, భాగస్వాములు లేదా 18 ఏండ్లలోపు పిల్లలను వెంట తీసుకురావడానికి వీళ్లేదని ఆ దేశ హోం అఫైర్స్ మంత్రి టోనీ బర్క్ వెల్లడించారు. విదేశీ వలసలను ఏడాదికి 2,50,000కు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.విద్యార్థులతో పాటు సెకండరీ వీసాలు, డిపెండెంట్ వీసాల ద్వారా తమ దేశానికి వస్తున్న వలసదారులతో ఇబ్బందులు వస్తున్నాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతున్నది. మౌలిక సదుపాయాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నది. ఇప్పటికే విద్యార్థి వీసాలపై అనేక షరతులు విధిస్తూ తిరస్కరిస్తున్న ఆస్ట్రేలియా.. వీసా ఫీజులను కూడా పెంచేసింది. ఇప్పుడు కొత్త నిబంధనతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద మదర్షిప్.. చైనా మాస్టర్ ప్లాన్!
ప్రపంచంలోనే అతిపెద్ద మదర్షిప్.. చైనా మాస్టర్ ప్లాన్!
చైనా తన జలాంతర్గత సైనిక సామర్థ్యాలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. భారీ మానవరహిత జలాంతర్గాములను చేరవేసి, మోహరించేందుకు వీలుగా షాంఘైలోని హుడాంగ్-జోంగ్హువా షిప్యార్డ్లో ఒక మదర్షిప్ నిర్మాణంలో ఉంది. ఉపగ్రహ చిత్రాలలో కనిపించిన ఈ నౌక, ప్రపంచంలోనే ఈ తరహాలో మొదటిదిగా పరిగణించబడుతోంది. ఇది ఒకేసారి కనీసం నాలుగు అతిపెద్ద మానవరహిత జలాంతర్గాములను మోయగలగడం దీని ప్రధాన లక్షణం. ఈ జలాంతర్గాములు సిబ్బంది లేకుండానే నీటి అడుగున సుదూర ప్రాంతాలకు ప్రయాణించగలవు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా, ఈ నౌక నిర్మాణంలో ఉన్న ఎర్రటి ఓడలా కనిపిస్తోంది. దాని పరిమాణం, ఆకారం బట్టి లోపల ఒక పెద్ద హ్యాంగర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హ్యాంగర్లో పెద్ద మానవరహిత జలాంతర్గాములను ఉంచి, అవసరమైనప్పుడు వాటిని సముద్రంలోకి ప్రయోగించవచ్చు. ఈ నౌక కనీసం నాలుగు జలాంతర్గాములను మోయగలదని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నౌక ముందు భాగంలో హెలికాప్టర్లను తరలించడానికి ఉపయోగపడే ఒక ప్రత్యేక హ్యాంగర్ కూడా కనిపిస్తోంది. దీనివల్ల ఇది కేవలం రవాణా నౌకగానే కాకుండా, సముద్రంలో డ్రోన్ జలాంతర్గాములను మోహరించడానికి ఒక చలనశీల వేదికగా కూడా మారగలదు.Photo Credit: Twitterచైనా అభివృద్ధి చేసిన మానవరహిత జలాంతర్గాముల వర్గాన్ని XXLUUV లేదా ఎక్స్ట్రా-ఎక్స్ట్రా-లార్జ్ అన్క్రూడ్ అండర్సీ వెహికల్ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్లే ఇవి సాధారణ డ్రోన్ జలాంతర్గాముల కంటే చాలా పెద్దవిగా ఉంటాయి. ఇప్పటివరకు చైనాలో రెండు జలాంతర్గాములు గుర్తించబడ్డాయి. వాటిలో ఒకటి సుమారు 115 అడుగుల పొడవు, మరొకటి సుమారు 148 అడుగుల పొడవు ఉన్నట్లు అంచనా. అమెరికాకు చెందిన ఓర్కా ఎక్స్ఎల్యూవీ (Orca XLUV) సుమారు 51 అడుగుల పొడవు ఉంటుంది. ఈ మానవరహిత జలాంతర్గాములు ఓర్కా కంటే ఆరు నుంచి ఎనిమిది రెట్లు పెద్దవిగా ఉండవచ్చు, మరియు చైనా వీటిని హైనాన్ ద్వీపం సమీపంలోని దక్షిణ చైనా సముద్రంలో కూడా పరీక్షించింది.చైనా రక్షణ వ్యూహంలో సముద్రం పాత్ర క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకల తయారీదారుగా చైనా నిలిచింది. దాని నౌకా నిర్మాణ సామర్థ్యం అమెరికా కంటే కనీసం 200 రెట్లు ఎక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా వద్ద సుమారు 405 యుద్ధనౌకలు ఉండగా, అమెరికా వద్ద దాదాపు 295 ఉన్నాయి. తైవాన్ను తమ నియంత్రణలోకి తీసుకురావాలన్న తన ఆశయాన్ని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పష్టం చేశారు. తైవాన్ను స్వాధీనం చేసుకోవడానికి బలప్రయోగం చేసే అవకాశాన్ని కూడా ఆయన తోసిపుచ్చలేదు. చైనా వాదనను తైవాన్ తిరస్కరిస్తోంది. అందువల్ల, ఏ సైనిక సంఘర్షణలోనైనా సముద్రం పాత్ర అత్యంత కీలకం కావచ్చు.ఇదీ చదవండి: 'వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా; ఇదే నా స్టైల్'
జాతీయం
మోదీ టీచర్ వయసు.. ఇదిగో క్లారిటీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పాఠాలు చెప్పిన మాజీ ఉపాధ్యాయుడు హెచ్సీ పటేల్ ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోదీ చిన్ననాటి జ్ఞాపకాలను పటేల్ గుర్తుచేసుకోవడం ఒకవైపు ఆసక్తికరంగా మారితే.. మరోవైపు ఆయన ప్రస్తుత వయసుపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇద్దరికీ ఒకే వయసు ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆయన చెప్పిన సబ్జెక్ట్ల విషయంలోనూ పొంతన కుదరకపోవడమూ.. చర్చకు దారి తీసింది.హెచ్సీ పటేల్ గుజరాత్లోని వడ్నగర్లో మోదీ చదువుకున్న పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారట. 1965 జూన్ నుంచి 1967 మే వరకు మోదీకి మ్యాథ్స్, సైన్స్ బోధించినట్లు పటేల్ స్వయంగా గుర్తుచేసుకున్నారు. అయితే ఎన్డీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పటేల్ 10, 11 తరగతులకు మ్యాథ్స్, సైన్స్ బోధించారని పేర్కొన్నారు. పీటీఐ ఆధారంగా వచ్చిన మరో కథనంలో 11, 12 తరగతుల సైన్స్ టీచర్గా పేర్కొన్నారు. ఇక్కడే అసలు కథ ఆరంభమైంది.మోదీ 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. అంటే 1965లో ఆయన వయసు సుమారు 14–15 ఏళ్లు. 1967లో స్కూల్ విద్య పూర్తిచేసే సమయానికి ఆయన వయసు 16–17 ఏళ్ల మధ్య ఉంటుంది. అందువల్ల పటేల్ ఆ సమయంలో ఉపాధ్యాయుడిగా ఉన్న విషయం మాత్రం ఆయన చెప్పిన వివరాలతో స్పష్టంగా ఉంది. మరి టీచర్ వయసెంత? అంటూ ట్రోలింగ్ మొదలైంది.Ahmedabad, Gujarat: Teacher of Prime Minister Narendra Modi, H.C. Patel says, "I taught Narendra Modi for two years, from June 1965 to 1967 May, when he was in Classes 10 and 11. In Class 11, he would sometimes come to my house for tuition-not every day, but occasionally. There… pic.twitter.com/d7L7wCqk9N— IANS (@ians_india) September 17, 2026మోదీకి 14–16 ఏళ్ల వయసులో పాఠాలు చెప్పిన టీచర్.. ఇప్పుడు 76 ఏళ్ల మోదీతో పోలిస్తే మరింత వయసులో ఉండాలని కొందరు నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు. సాధారణంగా టీచర్, విద్యార్థి మధ్య ఉండే వయసు తేడాను ప్రస్తుత వయసులతో పోల్చుతూ.. పటేల్ 80 లేదంటే 90లలో ఉండాల్సి ఉంటుందని కొందరు పోస్టులు చేస్తున్నారు.‘మోదీ.. చాలా షార్ప్’ఓవైపు ఈ చర్చ నడుస్తుండగా.. పటేల్ మాత్రం మోదీ విద్యార్థిగా ఉన్న రోజుల గురించి ఎన్నో విషయాలు గుర్తుచేసుకున్నారు. మోదీ చాలా చురుకైన విద్యార్థి అని, స్కూల్లో జరిగే దాదాపు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారని చెప్పారు. ఒకసారి పాఠశాల భవనం ప్రహరీ నిర్మాణానికి నిధులు సేకరించేందుకు నిర్వహించిన నాటకంలో మోదీ జోగీదాస్ ఖుమాన్ పాత్ర పోషించారని తెలిపారు. కత్తితో నటిస్తూ కాఠియావాడీ భాషలో సంభాషణలు చెప్పిన ఆయనకు ప్రేక్షకుల నుంచి దాదాపు పది నిమిషాల పాటు చప్పట్లు(స్టాండింగ్ ఒవేషన్) లభించాయని పటేల్ గుర్తుచేసుకున్నారు.చిన్నప్పటి నుంచే మోదీకి ఈత అంటే ఆసక్తి ఉండేదని కూడా పటేల్ చెప్పారు. వడ్నగర్లోని శర్మిష్ఠ చెరువులో ఈత కొట్టే సమయంలో ఓసారి పిల్ల మొసలిని ఇంటికి తీసుకొచ్చారని.. తల్లి హీరాబెన్ దానిని తిరిగి చెరువులో వదిలేయాలని చెప్పడంతో మరుసటి రోజు మళ్లీ చెరువులో వదిలేశారని వివరించారు.రాజకీయాల్లోకి వచ్చినా.. టీచర్ను మర్చిపోలేదుమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను గుర్తించారని పటేల్ తెలిపారు. 2001లో మోదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తాను అక్కడికి వెళ్లినప్పుడు.. జన సందోహం మధ్య తనను గుర్తించిన మోదీ వచ్చి పాదాలకు నమస్కరించారని చెప్పారు. తర్వాత 2005లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ తన పాత ఉపాధ్యాయులను సత్కరించిన కార్యక్రమాన్ని కూడా గుర్తు చేశారు.సోషల్ మీడియాలో ప్రశ్న.. అసలు క్లారిటీ ఇదేఅయితే మోదీ, ఆయన టీచర్ పటేల్ వయసు 76 అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఓ జాతీయ మీడియా క్లారిటీ ఇచ్చింది. పటేల్ వయసు 90–91 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొంది. దీంతో ఆయన వయసుపై సోషల్ మీడియాలో వచ్చిన అనుమానాలకు తెరపడినట్టయింది. ఇక ఆయన చెప్పిన సబ్జెక్ట్ల విషయంలో ఎన్డీటీవీ, పీటీఐ కథనాల్లో కనిపించిన తేడా మాత్రం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది.Age of PM modi - 76Age of Teacher - 75 pic.twitter.com/kVODe4xyd7 https://t.co/e0mimnacaU— AIN (@Tejusurya_) September 17, 2026ఇదీ చదవండి: ఆ స్టార్ హీరోలు చట్టాన్ని ఉల్లంఘించారని తెలుసా?
గుండె.. 95 కిలో మీటర్లు.. 63 నిమిషాలు
హర్యానాలోని రోహ్తక్ నుంచి ఢిల్లీకి 95 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 63 నిమిషాల్లో అధిగమిస్తూ ఓ దాత గుండెను తరలించారు. అత్యవసర గుండె మార్పిడి కోసం గురువారం ఈ అవయవాన్ని షాలిమార్ బాగ్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రోహ్తక్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రాత్రి 7.20 గంటలకు దాత గుండెను సేకరించారు.అనంతరం గుండెను వైద్య బృందం 7.40 గంటలకు ఆసుపత్రి నుంచి బయలుదేరింది. హర్యానా, ఢిల్లీ పోలీసుల సమన్వయంతో ఏర్పాటు చేసిన గ్రీన్ కారిడార్ ద్వారా అంబులెన్స్ ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించి.. రాత్రి 8.43 గంటలకు ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ఫోర్టిస్ ఆసుపత్రికి చేరుకుంది. బి-పాజిటివ్ రక్తగ్రూప్ కలిగిన ఓ రోగికి గుండె అవసరమని ఉదయం 8.50 గంటలకు నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ నెట్వర్క్ ద్వారా ఆసుపత్రికి సమాచారం అందింది.ఉదయం 9.55 గంటలకు ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు గుండెకు సరిపడే గ్రహీతను గుర్తించారు. వైద్య బృందం మధ్యాహ్నం 2.49 గంటలకు ఢిల్లీ నుంచి రోహ్తక్కు బయలుదేరి.. సాయంత్రం 4.34 గంటలకు ఆసుపత్రికి చేరుకుంది. గుండె సేకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం గ్రీన్ కారిడార్ ద్వారా అవయవాన్ని తిరిగి ఢిల్లీకి తరలించారు.95 km. 63 minutes. One donor heart, transported from #PGIMS #Rohtak to #Fortis Hospital, #ShalimarBagh, through an interstate #GreenCorridor for an emergency #heart #transplant. Seamless coordination between #Haryana and #DelhiPolice helped make the life-saving journey possible,… pic.twitter.com/HDp6yDdxpg— Anuja Jaisswal (@AnujaJaiswalTOI) September 17, 202695 కిలోమీటర్ల అంతర్రాష్ట్ర మార్గంలో గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేసి గుండెను తరలించడం అంటే పోలీసు, వైద్య బృందాల మధ్య అసాధారణ స్థాయిలో సమన్వయం అవసరం. ఈ తరలింపులో ప్రతి నిమిషం కీలకం అని ఫోర్టిస్ ఆసుపత్రి షాలిమార్ బాగ్ వైస్ ప్రెసిడెంట్, ఫెసిలిటీ డైరెక్టర్ నవీన్ శర్మ తెలిపారు. అనంతరం దాత గుండెను ఆసుపత్రికి తీసుకెళ్లి.. అవయవ మార్పిడి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ‘పిట్బుల్’ బీభత్సం.. సీసీటీవీలో భయానక దృశ్యాలు
వాళ్లు స్టార్ హీరోలే కావొచ్చు! కానీ చట్టాన్ని ఉల్లంఘించారు
స్టార్ హీరోలు.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్.. కానీ చట్టం ముందు ఇవేవీ పనిచేయవని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే స్పష్టం చేశారు. వాణిజ్య ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలు కూడా నిబంధనలకు బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పారు. షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గణ్, టైగర్ ష్రాఫ్లకు విమల్ యాడ్ వ్యవహారంలో నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘మీ దృష్టిలో వాళ్లు స్టార్లు కావొచ్చు. కానీ ఈ కేసులో నా దృష్టిలో వాళ్లు కేవలం అడ్వర్టైజర్లు మాత్రమే. చట్టాన్ని ఉల్లంఘించినవారిగానే చూస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుంటుంది’’ అని తుకారాం ముండే అన్నారు. సెలబ్రిటీలు ప్రకటనల్లో నటించే ముందు తాము ప్రచారం చేస్తున్న ఉత్పత్తి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. తయారీదారుడిదే మొత్తం బాధ్యత అని చెప్పడం సరికాదన్నారు.మహారాష్ట్ర ఎఫ్డీఏ గ్రేటర్ ముంబై విభాగం ఆగస్టు 11న షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గణ్, టైగర్ ష్రాఫ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమల్ ఇలాచీ పేరుతో వచ్చిన ప్రకటన పరోక్షంగా విమల్ పాన్ మసాలాను ప్రచారం చేస్తోందన్నది ప్రధాన ఆరోపణ. మహారాష్ట్రలో పాన్ మసాలా నిషేధం నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నటులు 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.ఇద్దరి నుంచి సమాధానం.. ఒకరిపై చర్యలుముగ్గురు నటుల్లో ఇద్దరు నోటీసులకు సమాధానం ఇచ్చారని ముండే తెలిపారు. అయితే ఎవరెవరు స్పందించారన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ఒక నటుడు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదని, ఆ వ్యక్తిపై అడ్జుడికేషన్, ప్రాసిక్యూషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. షారుఖ్ ఖాన్ టీమ్ స్పందించిందా? అనే ప్రశ్నకు.. ‘‘నాకు ఖచ్చితంగా తెలియదు’’ అని ముండే పేర్కొన్నారు.బాధ్యత తయారీదారుడిదేనా?ప్రకటనలో నటించినంత మాత్రాన బాధ్యత ఉండంటూ ఆ నటులు, వాళ్ల అభిమానులు వాదించడంపైనా ముండే స్పందించారు. ఫుడ్ సేఫ్టీ చట్టం, 2018 రెగ్యులేషన్స్ ప్రకారం.. ప్రకటనదారుల బాధ్యతల గురించి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని చెప్పారు. తాము ప్రచారం చేస్తున్న ఉత్పత్తిపై తగిన పరిశీలన చేయాల్సిన బాధ్యత ఎండార్సర్లకు కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇది కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదని, చట్టపరమైన బాధ్యత కూడా అని ముండే స్పష్టం చేశారు.ఢిల్లీ హైకోర్టులోనూ దక్కని ఊరటఈ వ్యవహారంలో వమల్ ఇలాచీ మాస్టర్ లైసెన్సీ పీబీ అగ్రో ఎల్ఎల్పీ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 14న కొట్టివేసింది. ముంబై ఎఫ్డీఏ జారీ చేసిన నోటీసులను సవాలు చేసే విషయంలో ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదంటూ జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం పేర్కొంది. ఈ వివాదానికి సంబంధించిన ప్రధాన అంశాలు మహారాష్ట్రలోనే ఉన్నందున అక్కడి న్యాయస్థానమే సరైన వేదికగా కోర్టు అభిప్రాయపడింది. ఇటు ఆస్పత్రి వస్తువుల ధరలపైనా ఫోకస్కొన్ని హాస్పిటల్ కన్జ్యూమబుల్స్పై 150 నుంచి 2,800 శాతం వరకు మార్కప్ ఉన్నట్లు ఎఫ్డీఏ గుర్తించిందని తెలిపారు. ఉదాహరణగా రూ.11కు కొనుగోలు చేసిన ఇంట్రావీనస్ సెట్కు రూ.325 ఎంఆర్పీ ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ అంశాన్ని పరిశీలించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA)ని కోరినట్లు వెల్లడించారు. అయితే వైద్య చికిత్సలో నిత్యం ఉపయోగించే ఇలాంటి వస్తువులను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలా అనే అంశాన్ని అన్ని వర్గాలతో చర్చించాల్సి ఉందని ముండే చెప్పారు. ఇది వ్యవస్థాగత దోపిడీగా పరిగణించవచ్చా ? లేదా? అనేది NPPA తదుపరి పరిశీలనలో తేలుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మహిళలు గ్యాస్ మొద్దును ఎత్తలేరా?-సుప్రీం కోర్టు
టీవీకేకు తలపోటు.. తమిళనాట మరో ట్విస్ట్!
తమిళనాడు రాజకీయాల్లో టీవీకే-కాంగ్రెస్ పొత్తు మరో కొత్త మలుపు తీసుకుంది. విజయ్, రాహుల్ గాంధీ మధ్య ప్రధాని అభ్యర్థిత్వంపై మొదలైన చర్చ ఇప్పుడు కాంగ్రెస్ నేతల మధ్యే మాటల యుద్ధానికి దారితీసింది. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా పొత్తు భాగస్వాములు అంగీకరించాల్సిందేనని మాజీ టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై స్పష్టం చేయగా.. అసలు రాహుల్కు వ్యతిరేకంగా టీవీకే ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ నేత ప్రవీణ్ చక్రవర్తి కౌంటర్ ఇచ్చారు. దీంతో పొత్తులో అంతా సవ్యంగానే ఉందా? లేక ప్రధాని అభ్యర్థి అంశం అసలు పంచాయితీగా మారిందా? అన్న చర్చ మొదలైంది.తమిళనాడులో టీవీకే-కాంగ్రెస్ పొత్తు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2029 లోక్సభ ఎన్నికల ప్రధాని అభ్యర్థిత్వంపై రెండు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే పార్టీలు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించాలని సెల్వపెరుంతగై వ్యాఖ్యానించారు. రాహుల్ ప్రధాని అభ్యర్థి అయితే.. పొత్తు భాగస్వాములు దాన్ని అంగీకరించాలని, అలా లేనప్పుడు అలాంటి పొత్తు అవసరం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ తమ నేతను ప్రధాని అభ్యర్థిగా బహిరంగంగా, స్పష్టంగా అంగీకరించే పార్టీలతోనే పొత్తు పెట్టుకోవడం సముచితమని పేర్కొన్నారు.‘పొత్తులో ఎలాంటి సమస్య లేదు’సెల్వపెరుంతగై వ్యాఖ్యలపై ప్రవీణ్ చక్రవర్తి స్పందిస్తూ.. పొత్తులో ఎలాంటి గందరగోళం లేదని అన్నారు. టీవీకే అధికారికంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పారు. ఇటీవల జరిగిన కూటమి సమావేశంలో అన్ని భాగస్వామ్య పార్టీలు కలిసి చర్చించాయని, ముఖ్యమంత్రి విజయ్ కూడా సమావేశంలో ఉన్నారని తెలిపారు. అందరూ కలిసి మాట్లాడుకున్నారని, పొత్తు బలంగానే ఉందని పేర్కొన్నారు.‘నవ్వుతూ మాట్లాడితే ఒప్పందమా?’ప్రవీణ్ వ్యాఖ్యలకు సెల్వపెరుంతగై సోషల్ మీడియా వేదికగా మళ్లీ స్పందించారు. నాయకులు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడాన్ని ప్రధాని అభ్యర్థిత్వంపై అంగీకారంగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి విజయ్ లేదా టీవీకేలోని కీలక నేతల్లో ఎవరైనా రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని స్పష్టంగా చెప్పారా? అని నిలదీశారు. అలా చెప్పి హామీ ఇచ్చి ఉంటే తనకు తెలియజేయాలని కోరారు.ఇదిలా ఉండగా.. ఇటీవల టీవీకేకు చెందిన కొందరు నేతలు 2029 లోక్సభ ఎన్నికల్లో విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దీనికి భిన్నంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని తమ ప్రధాని అభ్యర్థిగా ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులోని రెండు వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు బహిరంగమయ్యాయి. ప్రస్తుతం టీవీకే-కాంగ్రెస్ పొత్తులో అసలు పరీక్ష సీట్ల సర్దుబాటు కాదు.. ప్రధాని అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం అనే చర్చ మొదలైంది.అసలు చిక్కు టీవీకేకే..ఈ వ్యవహారంలో టీవీకే ముందున్నది కీలకమైన ప్రశ్న. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తున్న సొంత నేతల వ్యాఖ్యలకు బ్రేక్ వేయాలా? లేక రాహుల్ గాంధీ పేరుపై కాంగ్రెస్ కోరుతున్న స్పష్టత ఇవ్వాలా? అన్నది ఆ పార్టీ తేల్చుకోవాల్సి ఉంది. విజయ్ పేరుపై పట్టుబడితే కాంగ్రెస్తో పొత్తులో విభేదాలు మరింత బహిర్గతమయ్యే అవకాశం ఉంది. రాహుల్ అభ్యర్థిత్వానికి అంగీకారం తెలిపితే విజయ్ను ప్రధాని ముఖంగా ముందుకు తెస్తున్న నేతలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవైపు పొత్తు.. మరోవైపు ప్రధాని పీఠంపై ఆశలు.. ఈ రెండింటి మధ్య టీవీకే ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నదే ఇప్పుడు అసలు ఉత్కంఠ. విజయ్ మౌనం వీడి స్పష్టత ఇస్తారా? లేక ఈ పంచాయితీని కూటమి నేతలకే వదిలేస్తారా? అన్నది చూడాలి.ఇదీ చదవండి: సీఎం రెండో పెళ్లిపై బిగ్ ట్విస్ట్..
ఎన్ఆర్ఐ
భద్రతా కారణాలతో విజయ్ లండన్ కార్యక్రమం రద్దు
తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ కోసం లండన్లో భారీగా తరలివచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. లండన్లోని ప్రముఖ ‘ది షార్డ్’ భవనం వద్ద విజయ్ పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని భద్రతా కారణాలతో అధికారులు రద్దు చేశారు. వందలాది మంది అభిమానులు గంటల తరబడి వేచి చూసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.విజయ్ ప్రస్తుతం తమిళనాడుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో అధికారిక పర్యటనలో భాగంగా యూకేలో ఉన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు మంగళవారం ‘ది షార్డ్’ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పలువురు అభిమానులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి అక్కడే నిరీక్షించారు. అయితే భారీగా జనసమీకరణ జరగడంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.‘అనుమతి రాలేదు.. కార్యక్రమం రద్దు’భద్రతా కారణాలతో కార్యక్రమానికి అవసరమైన అనుమతి లభించలేదని విజయ్ బృందం ప్రకటించింది. లౌడ్స్పీకర్ ద్వారా అభిమానులకు సమాచారం అందిస్తూ.. ప్రజల భద్రత దృష్ట్యా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో విజయ్ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు అభిమానులు గంటల తరబడి ఎదురు చూసినట్లు పీటీఐ తెలిపింది.VIDEO | UK: Vijay fan greeting event in London called off due to 'health and safety' reasons after large number of people gather to see Tamil Nadu CM.Announcement was made by the authorities outside CM Vijay's hotel at the Shard in London on Tuesday.(Full video available on… pic.twitter.com/l4GDVUL6Fk— Press Trust of India (@PTI_News) September 15, 2026తలా-దళపతి.. విమర్శలకు టీవీకే కౌంటర్ఇదిలా ఉండగా.. విజయ్ లండన్ పర్యటనపై డీఎంకే విమర్శలు గుప్పించింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి లండన్ వెళ్లినట్లు చెబుతున్న విజయ్.. తన స్నేహితుడు, నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న కార్ రేసును వీక్షించడంపై డీఎంకే నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. పెట్టుబడుల పర్యటన పేరుతో వెళ్లి రేసు కార్యక్రమానికి హాజరయ్యారని విమర్శించారు. దీనిపై టీవీకే నేతలు స్పందిస్తూ.. విజయ్ అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ అజిత్ను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అంతేకాకుండా అంతర్జాతీయ రేసింగ్లో అజిత్కు ఉన్న గుర్తింపును తమిళనాడు బ్రాండ్ ప్రమోషన్కు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.పెట్టుబడుల కోసం విజయ్ యూకే పర్యటనఇదిలా ఉండగా విజయ్ యూకే పర్యటన ప్రధానంగా తమిళనాడుకు భారీ పెట్టుబడులను తీసుకురావడంపైనే సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో సుమారు రూ.12,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వీటి ద్వారా రాష్ట్రంలో 9,400కు పైగా హై-వాల్యూ ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తమిళనాడును ఆసియాలో అధునాతన తయారీ, సాంకేతిక రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పెట్టుబడుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విజయ్ తన యూకే పర్యటనను ముగించుకుని బుధవారం భారత్కు తిరిగి రానున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: విజయ్పై అనుచిత కామెంట్ల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
పట్టాలపై ప్రియుడితో ఎన్నారై యువతి.. క్షణాల్లో ఘోరం!
న్యూయార్క్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై కూర్చున్న ఓ జంటను రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన మలైకా చిత్రే (24)తో పాటు నేపాలీ-అమెరికన్ నవమ్ కౌల్ (24) ఉన్నారు. బలవన్మరణమా? లేదంటే మత్తులో అక్కడికి చేరారా?.. వీళ్లు పట్టాలపై ఎందుకు కూర్చున్నారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.లోయర్ మన్హాటన్లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సౌత్ వింగ్ వైపు వెళ్తున్న నంబర్ 4 రైలు పట్టాలపై ఉన్న ఇద్దరినీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటన తర్వాత రైలులో ఉన్న సుమారు 100 మంది ప్రయాణికులను బయటకు తరలించారు.ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో..మలైకా చిత్రే న్యూజెర్సీలోని డేటన్కు చెందినవారు. అకాడియా ఫార్మాస్యూటికల్స్లో ఆపరేషన్స్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నారు. నవమ్ కౌల్ సైరేవిల్లేకు చెందినవారు కాగా.. బ్లూమ్బర్గ్లో ఫైనాన్షియల్ డేటా అనలిస్ట్గా పనిచేస్తున్నారు. ఇద్దరూ రట్జర్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులే. దాదాపు ఒకే సమయంలో అక్కడి నుంచి పట్టాలు పొందారు.ఈ విషాదంతో వాళ్ల సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నవమ్ ఎంతో స్నేహపూర్వకంగా, సరదాగా ఉండేవాడని స్నేహితులు గుర్తుచేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు దాదాపు మూడు దశాబ్దాల క్రితం నేపాల్ నుంచి అమెరికాకు వలస వచ్చినట్లు తెలిపారు. మలైకా తెలివైన, చురుకైన విద్యార్థినిగా తమకు తెలుసని ఆమె కుటుంబానికి సమీపంలోని పొరుగువారు చెప్పారు. ఇంత చిన్న వయసులో ఇద్దరూ ఇలా ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.A tragic situation in Manhattan. Recent Rutgers graduates Navam Kaul and Malaika Chitre were killed after being struck by a southbound 4 train at Spring Street around 3:15 a.m. Sunday.Reports say Kaul went onto the tracks first and Chitre climbed down after him, apparently…— Shadab Chow 🇺🇸 (@tonyinmycity97) September 15, 2026వైరల్గా మారిన వీడియో..ఈ ఘటనకు ముందు ఓ వ్యక్తి తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్గా మారింది. అందులో మలైకా, నవమ్ ఇద్దరూ పట్టాలపై ప్రశాంతంగా కూర్చున్నట్లు కనిపిస్తోంది. రైలు వస్తున్న సమయంలోనూ వారు అక్కడే ఉన్నారు. అయితే రైలు డ్రైవర్ మాత్రం.. మలైకా నవమ్ను తన వైపునకు లాగుతున్నట్లు, ఆమె నవ్వుతున్నట్లు కనిపించిందని చెప్పినట్లు సమాచారం.ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. వారిలో ఒకరు ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయి ఉండొచ్చని, ఆమెను కాపాడేందుకు మరొకరు పట్టాలపైకి వెళ్లి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రైలు డ్రైవర్ వారిని గమనించి అత్యవసర బ్రేకులు వేసినా.. అప్పటికే రైలు సమీపంలోకి రావడంతో ఆపడం సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు.మత్తులో ఉన్నారా?ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు మద్యం లేదంటే ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉండి ప్రమాదాన్ని గుర్తించలేకపోయారా? అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే ఆత్మహత్య కోణాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేదని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఆ యాక్సిడెంట్తో స్పాట్లోనే చనిపోయేదాన్ని!
620 కోట్ల కుంభకోణం.. భారత్లో తలదాచుకున్న నిందితుడు!
అమెరికాలో సుమారు రూ. 620 కోట్ల విలువైన భారీ మెడికేర్ కుంభకోణానికి పాల్పడి, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఓ భారతీయ వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్లో తలదాచుకున్నట్లు తెలిసింది. మహమ్మద్ ఖదీర్ ఖాన్ అనే ఈ నిందితుడు నగరంలోనే ఉన్నాడని అమెరికా పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక అధికారులు అతడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.టెక్సాస్లోని రిచర్డ్సన్లో ఖదీర్ ఖాన్ 'అమెరికన్ ప్రీమియర్ ల్యాబ్స్' పేరుతో ఒక జెనెటిక్ టెస్టింగ్ ల్యాబొరేటరీని నిర్వహించేవాడు. 2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబర్ మధ్య కాలంలో, అమెరికా ప్రభుత్వ మెడికేర్ పథకం కింద సుమారు 93 మిలియన్ డాలర్ల విలువైన నకిలీ క్లెయిమ్లను అతడు సృష్టించాడు. వీటి ద్వారా ప్రభుత్వం నుంచి 65 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 620 కోట్లు) అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో తేలింది. వైద్యుల వివరాలు, సంతకాలను ఫోర్జరీ చేసి ఈ భారీ మోసానికి పాల్పడినట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్బీఐ, ఆరోగ్య శాఖల సంయుక్త విచారణలో వెల్లడైంది.ఈ కుంభకోణం బయటపడటంతో అధికారులు ఖాన్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి, అతడిని 'మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్'గా ప్రకటించారు. అయితే, అప్పటికే అతను అమెరికా నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఖాన్ హైదరాబాద్లోనే ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో, శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల జాబితాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరవ్యాప్తంగా గాలిస్తున్నారు.ఇదీ చదవండి: జేడీయూ యూటర్న్.. షాక్లో బీజేపీ!
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో అంతర్జాలంలో గూగుల్ మీట్ ద్వారా 14-Sep-2026 ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొన్నారు. సకల విఘ్నాలు తొలిగి అందరి పై వినాయకుని ఆశీస్సులు ఉండాలని వినాయకుడిని కోరారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ గారు అంతర్జాలం ద్వారా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు మరియు విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు , శివ ప్రసాద్ ఆవుల మరియు కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్ , యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం మరియు సుకేందర్ నీలం మొదలగు వారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అందరి పై శ్రీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియ జేశారు.ఈ వేడుకలకు సహకారం అందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏ వి ఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (కూల్ టైమ్ ఎయిర్కాన్ ఇన్స్టాలేషన్ & సర్వీస్), కామాక్షి సిల్వర్,గోల్డ్ & డైమండ్ , బులియన్ కింగ్ గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
పులితో భీకర పోరు.. ప్రాణాలు దక్కించుకున్న ఆవు!
ఒంగోలు: నల్లమల అటవీ సరిహద్దు గ్రామాలపై పెద్దపులి పంజా విసురుతోంది. ఎప్పుడు ఏ పొదల్లోంచి మృత్యువు దూసుకొస్తుందోనన్న భయంతో పల్లెవాసులు కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అడవికే పరిమితం కావాల్సిన బెబ్బులి.. వరుసగా పశువుల మందలపై విరుచుకుపడుతుండటంతో రైతులు, పశువుల కాపరులు భయాందోళనలకు గురవుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో నల్లమల సమీప ప్రాంతంలో రెండు ఆవులను బలితీసుకోవడంతో పాటు మరో ఆవును తినేందుకు యత్నించిన ఘటనతో బొమ్మలాపురం, పరిసర గ్రామాల ప్రజల గుండెల్లో గుబులు రేగుతోంది. మందపై విరుచుకుపడి.. గత కొద్ది రోజులుగా బొమ్మలాపురం సమీపంలోని ఊరకొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. ఈ నెల 12వ తేదీన బొమ్మలాపురానికి చెందిన ఓ రైతు తన పశువుల మందను మేత కోసం సమీప అటవీ ప్రాంతంలోకి తోలాడు. ఈ క్రమంలో పెద్దపులి దాడి చేయడంతో రెండు ఆవులు మృతి చెందాయి. అనంతరం మరో ఆవును మట్టుబెట్టేందుకు యత్నించిగా, అది ప్రాణభయంతో పులిని ప్రతిఘటించింది. తీవ్ర గాయాలతో ప్రాణ గండం తప్పించుకున్న ఆ ఆవు యజమాని చెంతకు చేరింది. కాగా, దాడి జరిగిన అదే రోజు సాయంత్రం పెద్దపులి ఆహారం కోసం తిరిగి ఆవుల కళేబరాల వద్దకు రాగా, అటవీశాఖ అమర్చిన ట్రాప్ కెమెరాల్లో ఆ బెబ్బులి కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. పొలాలకు వెళ్లాలన్నా ప్రాణసంకటమే! పులి దాడి ఘటనతో మూగజీవాలను అడవి వైపు మేతకు తోలేందుకు యజమానులు గజగజ వణికిపోతున్నారు. గతంలోనూ వ్యవసాయ పనులకు వెళ్లే రైతులకు, కూలీలకు పెద్దపులి ప్రత్యక్షంగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో వారాల తరబడి చేలల్లోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. తరచూ పశువులపై దాడులు జరుగుతుండటంతో రైతులకు కంటిమీద కునుకు కరువైంది. అప్రమత్తంగా ఉండాలన్న అటవీశాఖ దేవటూడు పరిసరాల్లో సంచరించే పెద్దపులి.. దాహం తీర్చుకునేందుకు నెలకు ఒకటి లేదా రెండుసార్లు బొమ్మలాపురం సమీపంలోని గండి చెరువు వద్దకు వస్తుంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి తన సహజ ఆవాస పరిధిలోనే తిరుగుతోందని, ప్రజలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లరాదని హెచ్చరించారు. మేతకు వెళ్లిన పశువులను సాయంత్రం కాకముందే గ్రామాలకు తరలించాలని స్పష్టం చేశారు. అటవీ సరిహద్దుల్లో నిరంతర నిఘా ఉంచి పులులు గ్రామాలపైకి రాకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.ఇదీ చదవండి: ప్రియుడిపై మరిగిన నూనె పోసి చంపేసిన రాములమ్మ
దారుణం : గ్యాంగ్రేప్, కుళ్లిపోయిన శవం, పీక్కుతిన్న కుక్కలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరోహత్యాచార ఘటన కలకలం రేపింది. మైనర్ బాలికపై ముగ్గురు మైనర్లతో సహా నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ఒక బహిరంగ ప్రదేశంలో పడేశారు. దీంతో ఆమె శరీర భాగాలను కుక్కలు తినడం మరింత ఆందోళన రేపింది. సెప్టెంబర్ 13న ఆలస్యంగా ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసుల సమాచారం ప్రకారం 16 ఏళ్ల బాలికను నలుగురు (ముగ్గురు మైనర్లతో సహా) గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం బాలికను కత్తితో పొడిచి చంపేశారు. ఆమె శవాన్ని బహిరంగ ప్రదేశంలో పడేసి పారిపోయారు. మృతదేహంలోని కొన్ని భాగాలను కుక్కలు పీక్కు తిన్నాయి. దీంతో మృతదేహం మరింత కుళ్లిపోయింది. ఎంతగా అంటే పోలీసులు లింగ నిర్ధారణను కూడా వెంటనే చేయలేకపోయారు.సెప్టెంబర్ 13న వాయువ్య ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో కుషాక్ రోడ్డు సమీపంలో గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. మృతురాలితో నిందితులకు ముందే పరిచయం ఉన్నట్టు భావిస్తున్నారు. ఎందుకంటే సంఘటన జరిగే రోజు ఆమె వారితో కలిసి ఒక టెంపోలో ప్రయాణించింది. టెంపో లోపల అందరూ కలిసి మద్యం సేవించిన తర్వాత, బాలికపై లైంగిక దాడి చేసి, కత్తితో పొడిచి హత్య చేశారు. శవంలో కొన్ని భాగాలను కుక్కలు తినేశాయి. ఒక చేయి కూడా వేరుపడి ఉంది. దీంతో చనిపోయింది ఆడా, మగా అని నిర్ధారించడానికి పోలీసులకు సమయం పట్టింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు శివమ్ అలియాస్ సుదామ మిగిలిన ముగ్గురు 16, 17 ఏళ్ల మైనర్లు.అయితే బాలిక తరచూ ఇంటి నుంచి వెళ్లి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చేది కావడంతో, ఆమెపై ఎలాంటి మిస్సింగ్ ఫిర్యాదు చేయలేదని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేసి, నిందితుల నుంచి రెండు కత్తులు, టెంపో, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది. ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్
రాములమ్మ.. ఎంత పని చేశావ్!
పార్వతీపురం మన్యం: గరివిడి మండలంలోని కందిపేట గ్రామంలో కలిసి జీవనం సాగిస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్య చేసిన ఘటన కలకలం రేపింది. తనతో కలిసి జీవిస్తున్న ధనాల శ్రీను(34) అనే వ్యక్తిపై రాములమ్మ సిమెంట్ దిమ్మతో దాడి చేసి హతమార్చింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాములమ్మకు గతంలోనే వివాహం కాగా భర్తను విడిచి దూరంగా ఉంది. అదే విధంగా మృతుడు ధనాల శ్రీను కూడా వివాహం చేసుకుని భార్యను విడిచిపెట్టి దూరంగా ఉంటున్నాడు.ఈ క్రమంలో వారిద్దరూ పరిచయం పెంచుకుని ఎనిమిది నెలల క్రితం నుంచి భార్యాభర్తల మాదిరిగా కందిపేట గ్రామంలో జీవిస్తున్నారు. శ్రీను విశాఖపట్నంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ అప్పుడప్పుడూ కందిపేట వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈ మధ్య ఐదు రోజులుగా కందిపేట గ్రామంలోనే ఉంటున్నాడు. తనను కూడా విశాఖపట్నం తీసుకుపోవాలని కొంతకాలం నుంచి రాములమ్మ అడుగుతుండడంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. బుధవారం రాత్రి కూడా వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో తనను విశాఖపట్నం తీసుకువెళ్లిపోవాలని శ్రీనుపై రాములమ్మ ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ క్రమంలో రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో రాములమ్మ మంచం కాళ్ల కింద పెట్టిన సిమెంట్ దిమ్మతో శ్రీను తలపై గట్టిగా కొట్టి హత్య చేసింది. అంతటితో ఆగకుండా ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మృతుని ముఖం, శరీరంపై మరిగిన నూనెను పోసింది. హత్య అనంతరం రాములమ్మ కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న సీఐ జి.శంకరరావు, ఎస్సై బి.లోకేశ్వరరావులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమెను వైద్య చికిత్స నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. ఎస్సై లోకేశ్వరరావు కేసు నమోదు చేయగా సీఐ శంకరరావు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: మామయ్యా కడుపులో నొప్పి, మంటగా ఉంది..
మామయ్యా కడుపులో నొప్పి, మంటగా ఉంది..
ఖమ్మం: నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురానికి చెందిన రైతు పుసులూరి శ్రీనివాస్ కలుపు మందు కలిపిన కూల్ డ్రింగ్ తాగి.. ఆ తర్వాత తన కుమారుడు, కుమార్తెకు కూడా తాగించిన విషయం విదితమే. ఘటనలో శ్రీనివాస్, ఆయన కుమార్తె లాస్య మృతి చెందగా.. కుమారుడు నిఖిల్ హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు. ఈమేరకు తండ్రీకుమార్తె మృతదేహాలను గురువారం అప్పలనరసింహాపురం తీసుకురాగా.. కుటుంబీకులు, స్థానికుల రోదనల నడుమ అంత్యక్రియలు పూర్తిచేశారు.పిల్లలను పానీపూరి తినిపించి...పుసులూరి శ్రీనివాస్–లీలా దంపతులకు కుమార్తె లాస్య, కుమారుడు నిఖిల్ ఉన్నారు. ఆయన గ్రామంలోని పది ఎకరాలతో పాటు ముదిగొండ మండలం పెద్ద మండవ, ఏపీలోని గండ్రాయిలో పదేసి ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. ఇటీవల పెట్టుబడులకు అప్పులు చేయగా, చీడపీడలకు తోడు సరిపడా నీరు అందక మనోవేదనకు గురయ్యాడు. దాదాపు రూ.15 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వినాయకచవితి పండగ కోసం ఇంటికి వచ్చిన లాస్యను బుధవారం బైక్పై తీసుకుని నిఖిల్ స్కూల్కు వద్దకు వెళ్లి బయటకు తీసుకొచ్చాడు. కోదాడలో ఇద్దరికీ ఇష్టమని పానీపూరి తినిపించాక కలుపు మందు కలిపిన థమ్సఫ్ సీసాతో గండ్రాయిలో కౌలు చేస్తున్న పొలం వద్దకు వెళ్లాడు. తొలుత శ్రీనివాస్ తాగి... ఆ తరువాత లాస్యకు తాగించగా.. నిఖిల్ కొద్దిగా తాగగానే ఘాటుగా ఉందని తాగలేకపోయాడు. ఆ తర్వాత విషయాన్ని శ్రీనివాస్ తన బావమరిదికి ఫోన్లో చెప్పి స్విచాఫ్ చేసినా పోలీసుల సాయంతో ఘటనా స్థలిని గుర్తించే సరికి శ్రీనివాస్, లాస్య స్పృ హ కోల్పోయారు. ముగ్గురికి గండ్రాయిలో చికిత్స అందించి ఖమ్మం తరలించగా తండ్రి, కూతురు మృతి చెందారు.నన్ను బతికించండి మామయ్యాఖమ్మంలో చికిత్స పొందుతుండగా లాస్య వద్దకు వెళ్లిన మేనమామను చూసి బోరున విలపించించిందని కుటుంబీకులు తెలిపారు. ‘మామయ్యా కడుపులో నొప్పి, మంటగా ఉంది.. నన్ను బ్రతికించండి...’ అంటూ రోదించిందని గుర్తు చేసుకుంటూ మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, హైదరాబాద్లో చికిత్స పొందుతున్న నిఖిల్ను గురువారం శ్రీనివాస్ తండ్రి రామారావుతో వీడియో కాల్ మాట్లాడించగా.. ‘తాతా నేను బాగున్నా.. నాకేమీ కాలేదు...’ అని చెప్పాడు. ఇక గండ్రాయి శివారులో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోగా అక్కడి పోలీసులు గురువారం అప్పలనరసింహాపురం వచ్చారు. శ్రీనివాస్ భార్య లీల, తండ్రి రామారావు నుంచి వివరాలు సేకరించారు. అయితే, ‘అప్పులు ఉన్నాయని చెప్పుకుని బాధపడేవాడు.. ఏమీ కాదని ధైర్యం చెప్పాను. అయినా ఇలా చేసుకుంటాడని ఊహించలేదు’ అని శ్రీనివాస్ తండ్రి రామారావు పోలీసులకు వివరించారు. ఇక భర్త, కుమార్తెను కోల్పోగా.. కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లీల రోదించిన తీరు అందరినీ కంట తడిపెట్టించింది. ఇదీ చదవండి: నీకు నా మీద లవ్ తగ్గిపోయింది కదా...
వీడియోలు
ఈ సంవత్సరం భారత్ లో చలిలేదు, రాదు సూపర్ ఎల్ నినో ప్రభావం
జాతీయ స్థాయి జర్నలిస్ట్ పై రెడ్ బుక్ ఆగడాలు
TV5, ABN రిపోర్టర్లు వచ్చారా..? నేను చెప్పింది చెప్పినట్లు వేయండి..
పోలీసుల ముందే బాబు పరువు తీసిన CITU నాయకులు
రేవంత్ కు ఆఫర్ ఇచ్చిన కేటీఆర్
వైష్ణవి భర్త ఘటనలో ట్విస్ట్ ఎలా చంపారంటే..
అజిత్ సినిమా విషయంలో క్లారిటీ ఎప్పుడు?
మహేష్ ఖలేజా చాలా ఇష్టం.. విజయ్ కొడుకు ఆసక్తికర కామెంట్స్!
నిజామాబాద్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో విషాదం
అనంతపురంలో బయటపడ్డ టీడీపీ నేత కబ్జా పర్వం
