సముద్ర గర్భంలో 65 వేల ఏళ్ల నాటి సామ్రాజ్యం..
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ సముద్ర గర్భంలో దాగి ఉన్న 65,000 ఏళ్ల నాటి ప్రాచీన భూభాగాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. నదులు, సరస్సులు, బీచ్లతో కూడిన ఈ సమగ్ర భౌగోళిక ప్రాంతం నీటి అడుగున చెక్కుచెదరకుండా నిక్షిప్తమై ఉండటం విశేషం. క్వీన్స్లాండ్ తీరంలో పరిశోధనా నౌక ‘ఇన్వెస్టిగేటర్’ ద్వారా చేపట్టిన 24 రోజుల అన్వేషణలో దీనిని కనుగొన్నారు.స్థానిక దారుంబల్, వొప్పాబుర్రా తెగల సాంప్రదాయ జ్ఞానంతో పాటు నౌకలోని అధునాతన సోనార్ వ్యవస్థను ఉపయోగించి ఈ ప్రాంతాన్ని మ్యాపింగ్ చేశారు. ఈ యాత్ర ప్రధాన శాస్త్రవేత్త హెలెన్ బోస్టాక్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 65,000 సంవత్సరాల క్రితం ప్రస్తుత సముద్ర మట్టం కంటే నీటి మట్టం 80 మీటర్ల దిగువన ఉన్న సమయంలో ఆస్ట్రేలియాకు చేరుకున్న మొదటి తరం స్థానిక తెగలు (ఫస్ట్ నేషన్స్) ఈ మైదాన ప్రాంతాల్లో జీవించారు. 7,000 సంవత్సరాల క్రితం సముద్ర మట్టాలు పెరగడంతో ఈ నేల క్రమంగా మునిగిపోయింది. సముద్ర గర్భం నుంచి సేకరించిన 20కి పైగా అవక్షేపాల (సెడిమెంట్ కోర్స్) ఆధారంగా అప్పటి శీతోష్ణస్థితి, వృక్షసంపద, శిలాజాలను విశ్లేషించి చరిత్రను పునర్నిర్మించే పనిలో పరిశోధకులు ఉన్నారు. ఈ ప్రాచీన సమాచారం ద్వారా భవిష్యత్తులో సముద్ర మార్పులు, రీఫ్ పరిణామాలను అంచనా వేయడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: అదుపుతప్పిన ‘ఏఐ’.. దాడికి దిగిన 688 ఓపెన్ఏఐ ఏజెంట్లు
కర్ణాటకకు అన్నాడీఎంకే నేత వార్నింగ్.. ఆయన జైలుకే అంటూ..
చెన్నై: మేకేదాటు ప్రాజెక్టు విషయంలో కర్ణాటక, తమిళనాడు నేతల మధ్య రాజకీయ మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ విషయమై కర్ణాటక కాంగ్రెస్ నేతలపై అన్నాడీఎంకే నేత కోవై సత్యన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టేలా కర్ణాటక నేతలు పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి మేకేదాటు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించారు. దీంతో, రెండు రాష్ట్రాల నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది.కర్ణాటక సీఎం డీకే శివకుమార్, మంత్రి చెలువరాయస్వామి మేకేదాటు ప్రాజెక్టుపై చేసిన తాజా వ్యాఖ్యలపై సత్యన్ స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. మేకేదాటుపై కాంగ్రెస్ నేతలు పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు ఖండించదగినవి. రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజలను రెచ్చగొట్టడం మంచిది కాదు అంటూ సత్యన్ విమర్శలు కురిపించారు. కావేరీ జల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉందని, రాజకీయ నాయకులు చట్టాన్ని, కోర్టు ఆదేశాలను గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. మేకేదాటు ప్రాజెక్టుపై కర్ణాటక ఏకపక్షంగా ముందుకు వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు.జైలుకు వెళ్తారా.. ఇదే సమయంలో కేదాటు ప్రాజెక్టు విషయంలో కర్ణాటక ప్రభుత్వం ముందుకు వెళ్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తూ సత్యన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘తీర్పు తమిళనాడుకు అనుకూలంగా ఉంది. మీరు మేకేదాటులో ఒక్క రాయి కూడా కదపలేరు. ఇదే నిజం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ప్రాజెక్టు నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పెట్టలేరని సవాల్ విసిరారు. మంత్రి చెలువరాయస్వామిపై మరింత ఘాటుగా స్పందించిన సత్యన్.. మేకేదాటు విషయంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే జైలుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. పరప్పన అగ్రహార జైలుకెళ్లాలా? తీహార్ జైలుకెళ్లాలా? ఎక్కడ ఉండాలో ఆయనే ఎంచుకోవచ్చు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కావేరీ వివాదం.. మేకేదాటు ప్రాజెక్టు అంశం మరోసారి తమిళనాడు-కర్ణాటక రాజకీయాల్లో వేడి పెంచుతోంది. కావేరీ నదిపై ప్రతిపాదించిన ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టును కర్ణాటక ముందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా.. తమిళనాడు మాత్రం మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మేకేదాటు ప్రాజెక్టు అమలైతే తమిళనాడుకు దక్కాల్సిన కావేరీ జలాల వాటాపై ప్రభావం పడే అవకాశం ఉందన్నది తమిళనాడు వాదన. దీంతో ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా రాజకీయ, న్యాయపరమైన వివాదానికి కేంద్రంగా ఉంది.చదవండి: బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు!
విమర్శలపై స్పందించిన డివిలియర్స్
టీమిండియా మాజీ క్రికెటర్లు తనపై చేస్తున్న విమర్శలపై సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ స్పందించాడు. గణాంకాలే అన్నింటికీ ప్రామాణికం కాదని.. తాను కేవలం రికార్డులు చూసి మాట్లాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశాడు. కాగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్- విరాట్ కోహ్లి మధ్య టెస్టుల్లో పోలిక తెస్తూ డివిలియర్స్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.సచిన్ కంటే కోహ్లి బెటర్ఉపఖండానికి చెందిన బ్యాటర్లకు విదేశాల్లో సీమింగ్ పిచ్లపై ఎలా ఆడాలో సచిన్ చూపిస్తే.. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ కోహ్లి సచిన్నే మించిపోయాడని డివిలియర్స్ అన్నాడు. విదేశాల్లోనూ అద్భుతంగా ఆడగలనని సచిన్ నిరూపించినప్పటికీ.. అతడు కోహ్లి కంటే స్ట్రాంగ్ మాత్రం కాదని పేర్కొన్నాడు.చిచ్చు పెట్టకుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు దొడ్డ గణేశ్, ఆకాశ్ చోప్రా వంటి వాళ్లు డివిలియర్స్పై విరుచుకుపడ్డారు. ఇద్దరు టీమిండియా దిగ్గజాల మధ్య పోలిక తెస్తూ సచిన్ను అవమానించడం సరికాదని.. భారత క్రికెటర్ల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయవద్దని చురకలు అంటించారు. ఎప్పటికీ సచిన్ టెండుల్కరే భారత అత్యుత్తమ బ్యాటర్ అని.. అతడిని ఎవరూ అధిగమించలేరని పేర్కొన్నారు.ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదుఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై డివిలియర్స్ తాజాగా స్పందించాడు. ‘‘విరాట్, సచిన్ గురించి నేను చేసిన వ్యాఖ్యలు చాలా మందిని గందరగోళానికి గురిచేశాయి అనుకుంటున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమేనని గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. నా అభిప్రాయం ఏమిటో మాత్రమే చెప్పాను.సచిన్ టీమిండియాను ముందుకు తీసుకువెళ్లి.. ప్రపంచవ్యాప్తంగా నిలకడగా ఎలా ఆడాలో చూపించాడు. అయితే, విరాట్ మరో భిన్న దారిని పరిచయం చేశాడు. ముఖ్యంగా షార్ట్ బాల్ ఆడటంలో రాటుదేలాడు. తద్వారా ప్రత్యర్థికి సరైన కౌంటర్లు ఇచ్చేవాడు.గణాంకాల కోణంలోనే చూడలేనునిజానికి స్వదేశంలో కంటే విదేశాల్లో కోహ్లి కెరీర్ మరీ అంత గొప్పగా ఏమీ సాగలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్ పిచ్లపై అతడు ఇబ్బంది పడేవాడు. అయినప్పటికీ అతడు ఎప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. వైఫల్యాల నుంచి త్వరగా తేరుకుని ముందుకు సాగేవాడు.తన వ్యక్తిత్వం, ఆట తీరు ద్వారా తన చుట్టూ ఉన్న ఎంతో మంది యువ ఆటగాళ్లలో కోహ్లి ఆత్మవిశ్వాసం నింపాడు. సచిన్తో పోలిస్తే కోహ్లి గణాంకాలు గొప్పగా ఏమీ లేవని నాకూ తెలుసు. అయితే, ప్రతీసారీ గణాంకాల కోణంలోనే చూడకూడదనేది నా అభిప్రాయం. సచిన్, కోహ్లి.. ఇద్దరూ కొత్త తరానికి బాట చూపారు.నా మాటల్లో తప్పేమీ లేదుముఖ్యంగా కోహ్లి ఫిట్నెస్ ప్రాముఖ్యతతో పాటు.. ఆత్మవిశ్వాసంతో ఎలా ముందుకు సాగాలో చెప్పడానికి చక్కటి ఉదాహరణగా నిలిచాడు’’ అని డివిలియర్స్ స్పష్టం చేశాడు. తద్వారా తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని.. ఇది తన అభిప్రాయం మాత్రమేనంటూ భారత మాజీ క్రికెటర్లకు కౌంటర్ ఇచ్చాడు.సచిన్ వర్సెస్ కోహ్లి.. విదేశీ గణాంకాలు ఇలాకాగా విదేశాల్లో టెస్టు క్రికెట్లో సచిన్ టెండుల్కర్ ఓవరాల్గా 8705 పరుగులు చేయగా.. కోహ్లి 4774 పరుగులు సాధించాడు. ఇక సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి కఠిన పిచ్లపై సచిన్ 63 టెస్టుల్లో 5387 రన్స్ చేయగా.. కోహ్లి 46 టెస్టుల్లో 3661 పరుగులు సాధించాడు. అయితే, కోహ్లి కెప్టెన్గా ఉన్న సమయంలోనే టీమిండియా విదేశాల్లో అత్యుత్తమ విజయాలు సాధించింది. నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఇదిలా ఉంటే టెస్టుల్లో సచిన్ 51 సెంచరీలతో రికార్డు నెలకొల్పగా.. కోహ్లి 30 సెంచరీలు సాధించాడు. చదవండి: IND vs SL: ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్లు ఇవే!
తేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ జయప్రకాష్ నగర్కు చెందిన పడికిటి లక్ష్మీతేజ(30) హైదరాబాద్లో అమెజాన్ కంపెనీలో ఐదేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆమెకు తండ్రి రామ్ప్రసాద్, తల్లి కవిత, తమ్ముడు దేవివరప్రసాద్ ఉన్నారు. మిలాద్ ఉన్నబీ, రాఖీ, వీకెండ్ వరుస సెలవులు కావడంతో ఆమె తమ్ముడికి రాఖీ కట్టేందుకు విజయవాడకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఆనందంగా బయలుదేరారు. మంగళవారం రాత్రి తండ్రికి ఫోన్ చేసి బుధవారం ఉదయం ఆరు గంటలకల్లా విజయవాడలో ఉంటానని సంతోషంగా చెప్పింది. కూతురి కోసం ఏడు గంటల వరకు వేచి చూసిన తల్లిదండ్రులు కూతురుకు ఫోన్ చేశారు. ఫోన్ కలవకపోవడంతో ఏం జరిగిందో తెలీక కంగారు పడ్డారు. ఇంతలో కోదాడ సమీపంలో ప్రమాదం జరిగిందని టీవీలో వార్తలు ప్రసారం కావడం, మృతుల జాబితాలో లక్ష్మీతేజ పేరు ఉండడంతో తండ్రి రాంప్రసాద్ హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు. అప్పటికే లక్ష్మితేజ మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురిలో ఉంచారు. రాత్రి ఫోన్ చేసి ఉదయానికి వస్తాను నాన్న అని చెప్పిన నా కూతురిని ఇలా చూస్తానని అనుకోలేదని రాంప్రసాద్ కన్నీరుమున్నీరయ్యారు. ఇంటికి తీసుకొచ్చిన కూతురు మృతదేహంపై పడి తల్లి కవిత విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఇంటికి వచ్చినప్పుడల్లా నీ కాళ్ల పట్టీలు కావాలమ్మా.. అని అడిగేదానివి కదా.. లే అమ్మా పట్టీలు ఇస్తాను. తమ్ముడికి రాఖీ కడుదువుగానీ అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. గత రెండేళ్ల నుంచి లక్ష్మితేజకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నామని, ఈ ఏడాది ఎలాగైనా కల్యాణం జరిపించాలని అనుకున్నామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది.చదవండి: ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి...
మీ ఫోన్లోనే AI పరీక్ష పెడుతోంది!.. ఎలాగో తెలుసా?
16 ఏళ్ల స్టూడెంట్ ఘనత..! తండ్రికే జీతం ఇస్తున్న తనయుడు..
నేపాల్ వరదలు: సరిహద్దుల్లో స్తంభించిన వ్యాపారం
బాబూ.. అమరావతి కథనం వెనుక అసలు కథేంటి?
మా పాలన.. మేం కట్టం చలానా!
ఉల్లి ధరల దూకుడుకు కారణాలేంటో..
ధైర్యం వదిలేస్తే ఏం జరుగుతుంది?
IND vs SL: 70 పరుగులు దాటిన శ్రీలంక ఆధిక్యం
‘మోసం.. అని చెప్పేముందు జాగ్రత్త’
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
రూ.999కే ఇంటిపై సోలార్.. టాటా పవర్ కొత్త స్కీమ్
అనవసరంగా జనానికి ‘ఓటుకు నోటు’ గుర్తు చేస్తున్నామేమోననిపిస్తోంది సార్!
.. ఉన్నదల్లా మీకు డైరెక్ట్ కనెక్షనే కదా సార్!
స్వామి శరణం.. 'ఇరుముడి'పై రామ్ చరణ్ రివ్యూ
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఇరుముడి' కోసం థియేటర్ బయట ప్రజలు ధర్నా
8 ఏళ్ల తర్వాత ఒకేసారి 4 తుపానులు.. ప్రభావం ఎంతంటే..
ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా
'మోహన్లాల్తో పెళ్లి.. నాన్న ముందే వార్నింగ్ ఇచ్చారు'
‘టాక్సిక్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
రాష్ట్రానికి కరువు కానీ మీ అప్పులకేమీ ఉండదేమిటి సార్!
ఆగు బ్రో.. రాహుల్ గాంధీకి కంగనా కౌంటర్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. స్థిరాస్తి వృద్ధి
మరో ఆరు రోజుల్లో చౌకగా విమాన ప్రయాణం
‘టాక్సిక్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ పక్కా?
‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ రివ్యూ
విలన్గా మెప్పించిన జబర్దస్త్ నటుడు
ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు: శోభిత
IND vs SL: ‘ఫాలో ఆన్’ ఆడి గెలిచిన జట్లు ఇవే!
మీ ఫోన్లోనే AI పరీక్ష పెడుతోంది!.. ఎలాగో తెలుసా?
16 ఏళ్ల స్టూడెంట్ ఘనత..! తండ్రికే జీతం ఇస్తున్న తనయుడు..
నేపాల్ వరదలు: సరిహద్దుల్లో స్తంభించిన వ్యాపారం
బాబూ.. అమరావతి కథనం వెనుక అసలు కథేంటి?
మా పాలన.. మేం కట్టం చలానా!
ఉల్లి ధరల దూకుడుకు కారణాలేంటో..
ధైర్యం వదిలేస్తే ఏం జరుగుతుంది?
IND vs SL: 70 పరుగులు దాటిన శ్రీలంక ఆధిక్యం
‘మోసం.. అని చెప్పేముందు జాగ్రత్త’
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
రూ.999కే ఇంటిపై సోలార్.. టాటా పవర్ కొత్త స్కీమ్
అనవసరంగా జనానికి ‘ఓటుకు నోటు’ గుర్తు చేస్తున్నామేమోననిపిస్తోంది సార్!
.. ఉన్నదల్లా మీకు డైరెక్ట్ కనెక్షనే కదా సార్!
స్వామి శరణం.. 'ఇరుముడి'పై రామ్ చరణ్ రివ్యూ
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఇరుముడి' కోసం థియేటర్ బయట ప్రజలు ధర్నా
8 ఏళ్ల తర్వాత ఒకేసారి 4 తుపానులు.. ప్రభావం ఎంతంటే..
ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా
'మోహన్లాల్తో పెళ్లి.. నాన్న ముందే వార్నింగ్ ఇచ్చారు'
‘టాక్సిక్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
రాష్ట్రానికి కరువు కానీ మీ అప్పులకేమీ ఉండదేమిటి సార్!
ఆగు బ్రో.. రాహుల్ గాంధీకి కంగనా కౌంటర్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. స్థిరాస్తి వృద్ధి
మరో ఆరు రోజుల్లో చౌకగా విమాన ప్రయాణం
‘టాక్సిక్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ పక్కా?
‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ రివ్యూ
విలన్గా మెప్పించిన జబర్దస్త్ నటుడు
ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు: శోభిత
IND vs SL: ‘ఫాలో ఆన్’ ఆడి గెలిచిన జట్లు ఇవే!
ఫొటోలు
కేరళ అందాల ఓణం వేడుకలో కృతి శెట్టి.. (ఫోటోలు)
సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తార మంజు వారియర్..(ఫోటోలు)
ఫ్యామిలీతో అనుపమ ఓనం సెలబ్రేషన్స్.. (ఫోటోలు)
హైదరాబాద్ : చార్మినార్ వద్ద ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు (ఫొటోలు)
రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)
'టాక్సిక్' మూవీ ట్రెండింగ్ లో నయనతార (ఫొటోలు)
దుబాయిలో తన డ్యాన్స్ స్టూడియోలో పూర్ణ ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)
హీరోయిన్ మానస వారణాసి ఓనం సెలబ్రేషన్స్.. (ఫొటోలు)
నేపాల్లో వరద బీభత్సం... (ఫొటోలు)
'రోమాంచకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
సినిమా
టాక్సిక్పై తప్పుడు ప్రచారం.. అలాంటి వారికి స్ట్రాంగ్ వార్నింగ్
టాక్సిక్ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని బెంగళూరు కోర్టు హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై స్పందించింది. టాక్సిక్ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్పై బెంగళూరు కోర్ట్ విచారణ చేపట్టింది. ఈ సినిమాకు వ్యతిరేకంగా తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్ను ప్రచురించడం, షేర్ చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.అంతేకాకుండా సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆంక్షలు విధించింది. టాక్సిక్కు సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలు సృష్టించినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ సినిమాను కించపరిచేలా మీడియాలోనూ పోస్ట్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, షేర్ చేయడం లాంటివి చేయకూడదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 28 వరకు అమల్లో ఉంటాయని కోర్టు తెలిపింది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే ఎలాంటి నోటీసులు లేకుండానే వీటిని రద్దు చేస్తామని న్యాయస్థానం పేర్కొంది.
బిగ్ స్క్రీన్పై మరోసారి అవెంజర్స్.. తెలుగు ట్రైలర్ రిలీజ్
అవెంజర్స్ ఎండ్గేమ్: ఎంకోర్తో మరోసారి థియేటర్లలోకి సందడి చేయనుంది. అభిమానులకు మరోసారి బిగ్ స్క్రీన్పై అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ సిద్ధమైంది. అవెంజర్స్: ఎండ్గేమ్కు ప్రత్యేకమైన ఎంకోర్ ప్రదర్శనగా మరో మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇంగ్లీష్తో పాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మూవీ ఐమాక్స్ స్క్రీన్స్తో పాటు మార్వల్ స్టూడియోస్ ఇన్ఫినిటీ విజన్ సర్టిఫైడ్ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్స్లోనూ ఈ స్పెషల్ ప్రెజెంటేషన్ అందుబాటులో ఉండనుంది. పెద్ద స్క్రీన్స్, మరింత ప్రకాశవంతమైన విజువల్స్, అత్యుత్తమ సౌండ్తో ప్రేక్షకులకు మరింత గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోని ఇన్ఫినిటీ సాగాకు మహత్తర ముగింపుగా నిలిచిన ‘అవెంజర్స్: ఎండ్గేమ్’ను మరోసారి థియేటర్లలో చూసే అవకాశం అభిమానులకు లభించనుంది.అవెంజర్స్ ఎండ్గేమ్: ఎంకోర్లో థానోస్ కారణంగా ప్రపంచ జనాభాలో సగం మంది కనుమరుగైన తర్వాత మిగిలిన సూపర్హీరోలు ఎదుర్కొనే పరిస్థితులు, తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడానికి వారు చేసే పోరాటం ప్రధానంగా సాగుతుంది. విశ్వంలో శాంతి, సమతుల్యతను పునరుద్ధరించేందుకు అవెంజర్స్ మరోసారి ఏకమై థానోస్తో తలపడే మహా సంగ్రామం ప్రేక్షకులకు మరోసారి అద్భుతమైన అనుభూతిని అందించనుంది.కాగా.. ఈ చిత్రాన్ని కెవిన్ ఫైజీ నిర్మించగా.. ఆంథనీ, జో రూసో దర్శకత్వం వహించారు. లూయిస్ డి ఎస్పొసిటో, విక్టోరియా అలోన్సో, మైఖేల్ గ్రిల్లో, ట్రిన్ ట్రాన్, జాన్ ఫావ్రూ, జేమ్స్ గన్, స్టాన్ లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఈ అవెంజర్స్ ఎండ్గేమ్: ఎంకోర్ సెప్టెంబర్ 25, 2026 ఇండియాలో గ్రాండ్గా విడుదల కానుంది.
టాక్సిక్ నెగెటివ్ టాక్... ఆ విషయంలో తగ్గేదేలే..!
యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. కేజీఎఫ్-2 తర్వాత వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్పై విమర్శలు రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. భారీ అంచనాలతో పాటు విమర్శల నేపథ్యంలో ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.మొదటి షో నుంచే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. యశ్ నటనతో మెప్పించినా కథపై విమర్శలు వస్తున్నాయి. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత యశ్ మూవీ కావడంతో అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. తొలి రోజే నెగెటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సైతం నిరాశకు గురవుతున్నారు.కలెక్షన్ల వర్షం..అయితే ఈ మూవీకి నెగెటివ్ రివ్యూలు వస్తున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళ్తోంది. తొలి రోజే దేశవ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకే రూ.79.12 కోట్ల నికర వసూళ్లను సాధించిందని ప్రముఖ ట్రేడింగ్ సైట్ శాక్నిల్క్ వెల్లడించింది. కేవలం కన్నడ వర్షన్లో రూ.19 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లో రిలీజైన దురంధర్ రూ.28 కోట్ల వసూళ్లను టాక్సిక్ అధిగమించింది. ఇప్పటికే పఠాన్, యానిమల్, జవాన్ చిత్రాలను కూడా దాటేసింది. అయితే కేజీఎఫ్ చాప్టర్- 2 రూ.116 కోట్ల తొలిరోజు వసూళ్ల ఆల్-టైమ్ కన్నడ ఇండస్ట్రీ రికార్డ్ మాత్రం అందుకోవడం కష్టంగానే అనిపిస్తోంది. కాగా..టాక్సిక్ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటించారు.
'మోహన్లాల్తో పెళ్లి.. నాన్న ముందే వార్నింగ్ ఇచ్చారు'
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి పరిచయం అక్కర్లేదు. మలయాళంతో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నారు. జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్లో ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం మలయాళంలో సినిమాలు చేస్తోన్న మోహన్ లాల్..ఈ ఏడాది దృశ్యం-3 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం మోహన్ లాల్.. రజినీకాంత్ హీరోగా వస్తోన్న జైలర్-2లో కనిపించనున్నారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే..పర్సనల్ లైఫ్లో ఆయన సుచిత్ర బాలాజీని పెళ్లాడారు. 1988 వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం లేని సుచిత్ర.. మోహన్ లాల్తో పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైన సుచిత్ర..మోహన్ లాల్తో తన రిలేషన్ గురించి మాట్లాడారు. వీరిద్దరు మొదటిసారి ఎలా కలుసుకున్నారో గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా పెళ్లికి తన తండ్రి ఇచ్చిన సలహాను కూడా పంచుకున్నారు.తాను మోహన్లాల్ను మొదటిసారి ఓ పెళ్లిలో కలిశానని సుచిత్ర వెల్లడించారు. అప్పటికే మా కుటుంబాలకు పరిచయం ఉండటంతో ఆయనను కలిసే అవకాశం వచ్చిందని తెలిపింది. తాను కూడా ఒక అభిమానిగానే ఆయనతో ఒక ఫోటో దిగానని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే ఆ ఫోటో కాపీ తనకు ఇప్పటికీ అందలేదని సుచిత్ర వెల్లడించారు. ఆ తర్వాత సుచిత్ర తాను మోహన్లాల్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తన కుటుంబంతో చెప్పగా.. నా ఆలోచనకు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని తెలిపింది. తన తండ్రికి బాగా తెలిసిన నటి సుకుమారి ద్వారా ఈ పెళ్లి ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని భావించానని పేర్కొంది. మోహన్లాల్తో పెళ్లికి ముందే తన తండ్రి హెచ్చరించారని సుచిత్ర వెల్లడించింది. నువ్వు అతన్ని పెళ్లి చేసుకునే ముందే ఒకసారి ఆలోచించుకో అన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నావని వార్నింగ్ ఇచ్చారు. కొన్నిసార్లు ఆయన ఇంట్లోనే ఉంటాడు.. కొన్నిసార్లు షూటింగ్కు వెళ్లి నెలల రోజుల వరకు తిరిగి రాడని నాన్న అన్నారు. అలాంటప్పుడు నువ్వు అన్నింటికీ సిద్ధంగా ఉండాలని.. పైగా ఇండస్ట్రీలో మనం చాలా విషయాలు వింటాం.. వాటన్నింటినీ కూడా తట్టుకోగలగాలని చెప్పారు. మీ అమ్మ చాలా ప్రశాంతమైన వ్యక్తి.. మీ అమ్మ అన్నింటినీ ఎలా సర్దుకుపోతుందో నువ్వు చూస్తూనే ఉన్నావ్ కదా.. నువ్వు కూడా అలాగే ఉండాలని సలహా ఇచ్చాడు. కానీ నీ పెళ్లయ్యాక తిరిగి వచ్చి నాన్న, ఆయన ఇలా ఉంటాడు, అలా ఉంటాడని నా దగ్గర ఏడిస్తే.. నేను నిన్ను మళ్లీ ఇంట్లోకి కూడా రానివ్వనని చెప్పాడని గుర్తు చేసుకుంది. అందుకే పెళ్లి విషయంలో అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకో అని నాన్న చెప్పారని సుచిత్ర వెల్లడించింది.అయితే భర్తగా మోహన్లాల్పై ఇప్పటివరకు తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని కూడా సుచిత్ర వెల్లడించారు. మా వివాహం తర్వాత తండ్రికి, మోహన్లాల్కి మధ్య జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. నా కూతురిని ఇంత బాగా చూసుకుంటూ.. నువ్వు ఆమెను చెడగొట్టావని మా నాన్న మోహన్లాల్తో అన్నారు. ఏది ఏమైనప్పటికీ.. మీరు చూసుకున్న దానికంటే నేను ఇంకా బాగా చూసుకోవద్దా? మోహన్లాల్ అని అన్నారని తెలిపింది. మోహన్లాల్ తనకు దక్కాల్సిన గౌరవాన్ని ఎల్లప్పుడూ ఇచ్చారని ఆమె వివరించారు. కాగా.. సుచిత్ర- మోహన్లాల్ పెళ్లి ఏప్రిల్ 28, 1988న జరిగింది. వీరికి కుమారుడు ప్రణవ్ మోహన్లాల్, కుమార్తె విస్మయ మోహన్లాల్ ఉన్నారు. కాగా.. సుచిత్ర తండ్రి కె బాలాజీ తమిళంలోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
క్రీడలు
ఐదో స్థానం కోసం...నేడు జర్మనీతో భారత మహిళల హాకీ జట్టు పోరు
ఆమ్స్టెల్వీన్: మహిళల హాకీ ప్రపంచకప్లో సెమీఫైనల్కు చేరడంలో విఫలమైన భారత జట్టు ఇప్పుడు ఐదో స్థానం కోసం జర్మనీతో పోరుకు సిద్ధమైంది. సాయంత్రం గం. 6:30 నుంచి జరిగే ఈ మ్యాచ్ను జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ మెగా టోర్నీలో పూల్ ‘డి’ నుంచి బరిలోకి దిగిన సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు... ఒక మ్యాచ్లో గెలిచి మరో రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. అనంతరం రెండో దశ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ్రస్టేలియాతో చివరి మ్యాచ్లో గెలిస్తేనే సెమీస్కు అర్హత సాధించే దశలో టీమిండియా ‘డ్రా’ చేసుకొని సెమీఫైనల్కు దూరమైంది. గతంలో రెండుసార్లు వరల్డ్కప్ నెగ్గిన జర్మనీ ప్రస్తుతం ఐదో ర్యాంక్లో ఉండగా... భారత్ 9వ స్థానంలో ఉంది. 1974లో జరిగిన తొలి మహిళల హాకీ ప్రపంచకప్లో అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచిన భారత్...ఆ తర్వాత ఎప్పుడూ సెమీస్కు చేరలేకపోయింది.
తొలి గేమ్లో ప్రజ్ఞానంద ఓటమి
సెయింట్ లూయిస్: గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ తొలి క్లాసికల్ గేమ్లో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. అమెరికా గ్రాండ్మాస్టర్ కరువానా 48 ఎత్తుల్లో ప్రజ్ఞానందపై గెలిచి 6–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. వీరిద్దరి మధ్య మరో క్లాసికల్ గేమ్, రెండు ర్యాపిడ్ గేమ్లు, నాలుగు బ్లిట్జ్ గేమ్లు జరగాల్సి ఉన్నాయి. క్లాసికల్ గేమ్లో గెలిస్తే ఆరు పాయింట్లు లభిస్తాయి. ర్యాపిడ్ గేమ్లో గెలిస్తే నాలుగు పాయింట్లు, బ్లిట్జ్ గేమ్లో గెలిస్తే రెండు పాయింట్లు దక్కుతాయి.
నగాల్కు నిరాశ
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత నంబర్వన్ ర్యాంకర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 86వ ర్యాంకర్, క్వాలిఫయింగ్ ‘డ్రా’లో టాప్ సీడ్ ప్లేయర్ ఆర్థర్ గియా (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్లో సుమిత్ నగాల్ 3–6, 6–7 (4/7)తో ఓడిపోయాడు. 1 గంట 49 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో నగాల్ 12 విన్నర్స్ కొట్టి, 27 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశాడు. తాజా ఓటమితో 29 ఏళ్ల నగాల్ ఈ ఏడాది ఒక్క గ్రాండ్స్లామ్ టోర్నీలోనూ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. గత ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడి తొలి రౌండ్లో ఓడిన నగాల్ కెరీర్ మొత్తంలో ఎనిమిదిసార్లు గ్రాండ్స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగాడు.
పోరాడి ఓడిన దక్షిణేశ్వర్
న్యూఢిల్లీ: విన్స్టన్–సాలెమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ దక్షిణేశ్వర్ సురేశ్ పోరాటం ముగిసింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో జరుగుతున్న ఈ టోర్నీలో 394వ ర్యాంకర్ దక్షిణేశ్వర్ రెండో రౌండ్లో నిష్క్రమించాడు. ప్రపంచ 51వ ర్యాంకర్ సెరున్డోలో (అర్జెంటీనా)తో జరిగిన మ్యాచ్లో దక్షిణేశ్వర్ 6–7 (10/12), 3–6తో ఓటమి చవిచూశాడు. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో దక్షిణేశ్వర్ 10 ఏస్లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తొలి సెట్ను టైబ్రేక్లో కోల్పోయిన ఈ తమిళనాడు ప్లేయర్ రెండో సెట్లో ఒకసారి తన సర్వీస్ను చేజార్చుకున్నాడు. నెట్ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 21 సార్లు పాయింట్లు గెలిచిన దక్షిణేశ్వర్ 36 విన్నర్స్ కొట్టి, 38 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో రౌండ్లో ఓడిన దక్షిణేశ్వర్కు 7,180 డాలర్ల (రూ. 6 లక్షల 84 వేలు) ప్రైజ్మనీతోపాటు 13 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
న్యూస్ పాడ్కాస్ట్
కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నా కుంభకర్ణుడి నిద్ర నటిస్తారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం మనదే... వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు చెబుతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
జరిమానా లెక్క తేల్చాల్సిందే... రామోజీకి, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్ చిట్ ఇవ్వలేదు.... తేల్చిచెప్పిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
మోసాలపై చర్చ మొదలైంది!. హామీల ‘వెన్నుపోటు’పై రెండేళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ జగన్ వ్యాఖ్య
మళ్లీ మాయోపాయం!. రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
టీచర్లపై ఇంతలా కక్షగడతారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరిద్దాం... ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
బిజినెస్
కార్పొరేట్ కొనుగోళ్లు రెట్టింపు
ముంబై: ఇతర కంపెనీల కొనుగోళ్లలో దేశీ కార్పొరేట్ దిగ్గజాలు భారీ ఆసక్తి చూపుతున్నట్లు దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే కొనుగోళ్లు రెట్టింపైనట్లు వెల్లడించింది. అయితే వీటిలో మూడోవంతు అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినట్లు తెలియజేసింది. విభిన్న కారణాలతో కంపెనీలు ఇతర సంస్థల కొనుగోళ్లను చేపడుతున్నట్లు క్రిసిల్ ఎండీ సుబోధ్ రాయ్ తెలియజేశారు. వృద్ధిని పెంచుకోవడంలో వేగం, మార్కెట్లలో మరింత విస్తరించడం, కొనుగోళ్ల సామర్థ్యాలకు పదును పెట్టుకోవడం తదితరాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. నివేదిక విశ్లేషణ ప్రకారం 2017 నుంచి డీల్స్ సంఖ్య రెట్టింపైంది. 20 రంగాల నుంచి విడిగా రూ. 500 కోట్లకుపైగా విలువైన 600 డీల్స్ను నివేదిక విశ్లేషించింది. అయితే విశ్లేషణలో ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరీ్వసుల రంగాలలోని లావాదేవీలను మినహాయించింది. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) దిగ్గజాలు దేశీయంగా చేపట్టే డీల్స్కు సైతం చోటివ్వలేదు. కారణాలు వేరువేరు.. క్రిసిల్ నివేదిక ప్రకారం ఫార్మాస్యూటికల్స్, హెల్త్కేర్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, కన్జూమర్ బిజినెస్లు టెక్నాలజీల అనుసంధానం, నైపుణ్యాలు, మేథోసంపత్తిని సమకూర్చుకోవడం తదితరాల కోసం కొనుగోళ్లను చేపడుతున్నాయి. సిమెంట్, మెటల్స్ రంగాలలోని పరిశ్రమలు.. కన్సాలిడేషన్, ప్లాంట్ల నిర్మాణ సమయాన్ని తగ్గించుకోవడం తదితరాలపై దృష్టితో కొనుగోళ్లకు తెరతీస్తున్నాయి. తద్వారా 4–6 ఏళ్ల కాలాన్ని ఏడాది నుంచి మూడేళ్లకు తగ్గించుకుంటున్నాయి. రుణ సమీకరణతో చేపట్టిన 100కుపైగా భారీ డీల్స్ మూడింటిలో రెండు అంచనాలను అందుకున్నట్లు రాయ్ పేర్కొన్నారు. కొన్ని డీల్స్ ఏకీకృతంకావడంలో విఫలంకాగా.. నియంత్రణ సంస్థల ఆలస్యాలు, దేశ సరిహద్దులనుదాటి(క్రాస్బోర్డర్) చేపట్టే కొనుగోళ్లు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నట్లు వివరించారు. కొనుగోళ్లు, విలీనాలనేవి వ్యూహాత్మక నిర్ణయాలతోనే విజయవంతంకాబోవని, క్రమశిక్షణాయుత ఏకీకృత చర్యలు, సమయానుగుణంగా సొంతం చేసుకోవడం, వనరుల సమర్థవంత వినియోగం తదితరాలు ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడ్డారు.
ఎంజీ హెక్టార్ ‘తొమాహాక్’ వచ్చేసింది
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ ‘జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ భారత మార్కెట్లోకి నూతన మల్టీ–ఎనర్జీ వెహికల్ ‘హెక్టార్ తొమాహాక్’ ను అధికారికంగా ఆవిష్కరించింది. కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన ‘అడ్వాన్స్డ్ డ్రైవ్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ టెక్నాలజీ (ఏడీఏపీటీ)’ పై రూపొందిన తొలి మోడల్ ఇదేనని తెలిపింది. అలాగే, భారత్లో న్యూ ఎనర్జీ వెహికల్ ప్లాట్ఫామ్పై రూపొందిన తొలి ఉత్పత్తిగా కూడా పేర్కొంది. ఎక్స్ షోరూం వద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) వెర్షన్ ప్రారంభ ధర రూ.19.49 లక్షలుగా ఉంది. ప్లగ్–ఇన్ హైబ్రిడ్ (పీహెచ్ఈవీ) వెర్షన్ ధర రూ. 25.70 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. కారు ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ పార్థ్ జిందాల్ మాట్లాడుతూ విస్తరణ ప్రణాళికలను వెల్లడించారు. ‘‘దేశంలో తమ తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు కంపెనీ, దాని భాగస్వామ్య వెండర్లు కలిసి రూ.6,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నాము’’ అని తెలిపారు. ఇందులో కంపెనీ వాటా రూ.3,500 కోట్లు కాగా, వెండర్లు దాదాపు రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత విస్తరణ ప్రణాళికకు అవసరమైన నిధులు కంపెనీ వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హలోల్ ప్లాంట్ విస్తరణకు భారీ ప్రణాళిక మొత్తం రూ.6 వేల కోట్ల పెట్టుబడిలో కొంత భాగాన్ని గుజరాత్లోని హలోల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వినియోగించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హలోల్ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.10 లక్షల యూనిట్లుగా ఉందని, వచ్చే ఏడాది మార్చి నాటికి దీనిని 1.60 లక్షల యూనిట్లకు, 2028 జనవరి నాటికి 2.20 లక్షల యూనిట్లకు పెంచనున్నట్లు వివరించారు. రాబోయే 3–4 ఏళ్లలో కొత్త ప్రాంతంలో మరో ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న హలోల్ ప్లాంట్లోనే వార్షిక సామర్థ్యాన్ని 4 లక్షల యూనిట్ల వరకు పెంచుకునే అవకాశం ఉందన్నారు. భారీ వృద్ధి లక్ష్యాలు కంపెనీ ఏటా 35–40 శాతం వార్షిక వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకుందని పార్థ్ జిందాల్ చెప్పారు. మార్కెట్లో డిమాండ్ కంటే సరఫరా తక్కువగా ఉండటమే ప్రధాన సవాలు అన్నారు. గతేడాది 71,000 కార్లను విక్రయించగా, ఈ ఏడాది 1,00,000 కార్ల విక్రయాల మార్కును దాటతామనే ధీమా వ్యక్తం చేశారు. భారత్లో బ్యాటరీ సెల్స్ తయారీపై కంపెనీ ఆసక్తి చూపుతున్నప్పటికీ, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) టెక్నాలజీ చైనా వెలుపల పరిమితంగా అందుబాటులో ఉందన్నారు. అయితే బ్యాటరీ స్టోరేజ్ కోసం జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి, ఎంజీ వాహనాల కోసం సెల్–టు–ప్యాక్ సదుపాయాలను ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. వాటా కొనుగోలుపై చర్చలు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియాలో అదనపు వాటా కొనుగోలుపై జేఎస్డబ్ల్యూ గ్రూప్, ఎస్ఏఐసీ మోటార్ మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ఈ అంశంపై ఇప్పటివరకు ఎ లాంటి నిర్ణయం తీసుకోలేదని పార్థ్ జిందాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కంపెనీలో ఎస్ఏఐసీ మోటార్కు 49%, జేఎస్డబ్ల్యూ గ్రూప్కు 35% వాటా ఉండగా, మిగిలిన వాటాను ఇతర భారతీయ పెట్టుబడిదారులు, డీలర్లు, ఉద్యోగులు కలి గి ఉన్నారు. భారత్ను తమ తదుపరి కీలక వృద్ధి మార్కెట్గా ఎస్ఏఐసీ మోటార్ చూస్తోందన్నారు.
చిన్న బ్యాంకుల విలీనం.. పెద్ద బ్యాంకుల ఏర్పాటు!
పలు చిన్న బ్యాంకులను విలీనం చేసి కొన్ని భారీ బ్యాంకులను ఏర్పాటు చేయడంపై భారత్ దృష్టి పెట్టాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) ఒక చర్చాపత్రంలో ప్రతిపాదించింది. అదే సమయంలో మార్కెట్లో పోటీ తగ్గిపోకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 2017లో ఎస్బీఐలో అనుబంధ బ్యాంకులను, 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడా-విజయ బ్యాంక్-దేనా బ్యాంకులను, 2020లో 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా కన్సాలిడేట్ చేయడం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కి తగ్గిందని వివరించింది.కన్సాలిడేషన్ వల్ల స్థాయి, కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాలు పెరిగాయని ఈఏసీ–పీఎం తెలిపింది. దేశీ బ్యాంకింగ్ రంగంలో సమర్ధత, ఉత్పాదకతను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయని పేర్కొంది. భవిష్యత్తులో కృత్రిమ మేథ (ఏఐ), బ్యాంక్ డిజిటైజేషన్ కూడా కలిస్తే సమర్ధత మరింతగా పెరుగుతుందని వివరించింది. 2015–2026 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో (12 ఏళ్లు) 47 బ్యాంకులను అధ్యయనం చేసిన మీదట ఈఏసీ-పీఎం ఈ పత్రాన్ని రూపొందించింది.
గోల్డ్, సిల్వర్పై పన్ను తగ్గే ఛాన్స్.. కారణం ఇదే!
బంగారం, వెండిపై భారీగా ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించే అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అధిక పన్నుల కారణంగా.. చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారం కంటే, అక్రమ మార్గాల్లో వచ్చే బంగారం చౌకగా మారే పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. సుంకం తగ్గిస్తే స్మగ్లింగ్ను అడ్డుకోవచ్చా?, అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బులియన్ వ్యాపారులు, జ్యువెలరీ రంగం మాత్రం ప్రస్తుత 15 శాతం సుంకాన్ని.. 6 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇదే జరిగితే ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది.సుంకం ఎందుకు పెంచారు?బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుందన్న ఆందోళనతో ప్రభుత్వం మే 13, 2026న దిగుమతి సుంకాన్ని పెంచింది. భారత్ ప్రతి ఏడాది సుమారు 700-800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. సుంకం పెంచడానికి ముందు ఏప్రిల్లో బంగారం దిగుమతులు ఏకంగా 82 శాతం పెరిగాయి. ఎక్కువగా బంగారం దిగుమతి చేసుకుంటే డాలర్లకు డిమాండ్ పెరగడంతో పాటు కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరుగుతుంది. దీంతో రూపాయిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది.పన్ను పెంచినా దిగుమతులు తగ్గలేదే?ప్రభుత్వం సుంకాన్ని పెంచినప్పటికీ బంగారం దిగుమతులు పూర్తిగా తగ్గలేదు. మేలో దిగుమతులు దాదాపు 34 శాతం పెరిగాయి. ఆ తర్వాత జూన్, జూలై నెలల్లో కలిపి బంగారం దిగుమతుల విలువ 5.5 శాతం పెరిగి 6.13 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో అధిక సుంకం విధించడం ద్వారా దిగుమతులను నియంత్రించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎంతవరకు నెరవేరిందనే ప్రశ్నలు వస్తున్నాయి.స్మగ్లింగ్ ఎందుకు పెరుగుతోంది?పరిశ్రమ వర్గాల వాదన ప్రకారం.. అధిక పన్ను కారణంగా చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారం ఖరీదుగా మారుతుంది. అదే సమయంలో అక్రమ మార్గంలో వచ్చే బంగారంపై ఇలాంటి పన్ను ఉండదు. దీంతో రెండు మార్గాల మధ్య ధర వ్యత్యాసం పెరుగుతుంది. ఈ పరిస్థితి స్మగ్లింగ్కు ప్రోత్సాహం ఇవ్వొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందుకే సుంకాన్ని తగ్గిస్తే చట్టబద్ధమైన దిగుమతులు పెరగడంతో పాటు అక్రమ మార్గాల్లో బంగారం వచ్చే ప్రోత్సాహం కూడా తగ్గవచ్చని వారు భావిస్తున్నారు.వెండి, ప్లాటినంపైనా ప్రభావంకేంద్రం కేవలం బంగారం గురించే కాకుండా వెండి, ప్లాటినం దిగుమతి సుంకాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి ఆభరణాల రంగంతో పాటు పారిశ్రామికంగా కూడా భారీ డిమాండ్ ఉంది. వెండిని సౌర విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. ప్లాటినం ఆటోమొబైల్, వైద్య రంగాల్లో కీలకంగా ఉంటుంది. కాబట్టి వీటిపై అధిక సుంకాలు విధించడం వల్ల పరిశ్రమలకు ముడి పదార్థాల ఖర్చులు పెరిగి, చివరకు ఉత్పత్తుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.ప్రస్తుతం ప్రభుత్వం ఒకవైపు దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలని చూస్తోంది. మరోవైపు అధిక పన్నుల వల్ల స్మగ్లింగ్ పెరగడం, పరిశ్రమల ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే.. సుంకాలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 15 శాతం నుంచి 6 శాతానికి సుంకం తగ్గిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ సుంకం తగ్గిస్తే అధికారిక మార్గంలో బంగారం దిగుమతులు పెరగవచ్చు. అదే సమయంలో స్మగ్లింగ్ తగ్గుతుందా, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఎలా ఉంటుంది అనేది కీలకంగా మారనుంది.ఇదీ చదవండి: బంగారం ధరలకు బ్రేక్.. ఒక్కరోజులో భారీ పతనం!
ఫ్యామిలీ
స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు
ప్రపంచ రికార్డు సాధించడమే జీవితాశయంగా పెట్టుకుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన పుష్పజ్యోతి రవికుమార్ (29). రికార్డులోకెక్కడానికి ఒక చిన్న స్టిక్కీ నోట్పై ఏకంగా 150 పదాలను స్పష్టంగా రాసి, గిన్నిస్బుక్లోకెక్కింది. మొదటి ప్రయత్నంలోనే పుష్పజ్యోతి ఈ రికార్డుని సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మనలో చాలామంది స్టిక్కీ నోట్ను కేవలం షాపింగ్ జాబితాలకో లేదా చిన్న విషయాలు గుర్తుంచుకోవడానికో వాడతాం. కానీ, దుబాయ్లో సీనియర్ క్లౌడ్ ఇంజనీర్గా పనిచేస్తున్న పుష్పజ్యోతికి మాత్రం అది ఒక ప్రపంచ వేదికగా కనిపించింది. అదే చిన్న కాగితం ముక్కపై ఏకంగా 150 పదాలను అత్యంత స్పష్టంగా రాసి, ఒకే స్టిక్కీ నోట్పై అత్యధిక పదాలు రాసిన రికార్డును తన పేరుపై లిఖించుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే..ఈ సవాలులో కేవలం పదాలను ఇరికించి రాయడం మాత్రమే కాదు, అవి చదవడానికి వీలుగా ఉండడం కూడా ముఖ్యం. తక్కువ స్థలంలో ఎక్కువ పదాలను పట్టించడానికి ఆమె జాగ్రత్తగా చిన్న చిన్న పదాలను ఎంచుకున్నారు. అందులోనూ ఎక్కువ శాతం కేవలం మూడు అక్షరాలు ఉన్న పదాలనే ఉపయోగించారు. వేర్వేరు చేతిరాత శైలులలో ప్రయోగాలు చేయడం పుష్పజ్యోతికి అలవాటు. అందువల్ల తక్కువ స్థలంలో స్పష్టంగా రాయడం ఆమెకు సులువైంది. బాల్యం నుంచే గిన్నిస్ బుక్లో రికార్డు సాధించాలని పుష్పజ్యోతి ఆకాంక్ష. అలా ఆమె తన తొలి ప్రయత్నంలోనే ఈ ఘనతను సాధించింది.ప్రశంసల జల్లులుపుష్పజ్యోతి తన విజయానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకోగానే ఆమెపై ప్రశంసల జల్లులు కురిసాయి. సుమారుగా పది లక్షల వ్యూస్ వచ్చాయి. ఆశయానికి అంకితభావం తోడైతే, సాధించలేనిది ఏదీ లేదని పుష్పజ్యోతి నిరూపించింది.గిన్నిస్ వరల్డ్ రికార్డు విజేతగా మారడం నాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంత గానో పెంచింది. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉంటుంది. దానిని వెలికితీసి ప్రపంచానికి ప్రదర్శించడానికి ఇటువంటి వేదికలు దోహదపడతాయి. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సాధించడమే నా లక్ష్యం. View this post on Instagram A post shared by Varnam MY (@varnammalaysia)– పుష్యజ్యోతి రవికుమార్ (చదవండి: కంటతడి పెట్టించే ప్రేమకథ..! ఆఖరికి విధి సైతం..)
బహూకరించిన ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు తండ్రికి ఉందా?
కొన్ని సంవత్సరాల క్రితం మా తండ్రి తన స్వార్జిత ఆస్తులతో పాటు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను కూడా నాకు రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా బహూకరించారు. అనంతరం మా తల్లి మరణించడంతో మా తండ్రి రెండో వివాహం చేసుకున్నారు. తన రెండోభార్య ప్రభావంతో ఇటీవల ఆ గిఫ్ట్డీడ్ను రద్దు చేస్తానని నన్ను బెదిరిస్తున్నారు. తండ్రికి ఇష్టమొచ్చినప్పుడు ఇలాంటి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసే అధికారం ఉంటుంది అని అంటున్నారు. ఆయన అలాంటి చర్య తీసుకోకుండా కోర్టు ద్వారా రక్షణ పొందగలనా?– విశ్వసాగర్, మహబూబ్ నగర్చట్టపరంగా ఒకసారి చెల్లుబాటయ్యే విధంగా బహుమతి పూర్తయి, దానిని స్వీకరించిన అనంతరం, కేవలం దాత మనసు మార్చుకున్నందుకు లేదా కుటుంబ పరిస్థితులు మారాయనే కారణంతో ఆ బహుమతిని ఏకపక్షంగా రద్దు చేయడం అంత సులువేం కాదు.ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 1882లోని సెక్షన్ 122 ప్రకారం, బహుమతి అంటే ప్రతిఫలం లేకుండా స్వచ్ఛందంగా ఆస్తిని బదిలీ చేయడం; అదే చట్టంలోని సెక్షన్ 126 ప్రకారం గిఫ్ట్ను రద్దు చేసే అవకాశం చాలా పరిమితమైన సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు, గిఫ్ట్ డీడ్లోనే దాత ఇష్టానుసారం కాకుండా, ఒక నిర్దిష్ట సంఘటన సంభవించినప్పుడు బహుమతి రద్దు కావచ్చని చట్టబద్ధంగా అంగీకరించి ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. అయితే ‘‘నాకు నచ్చినప్పుడు గిఫ్ట్ను రద్దు చేసుకుంటాను’’ అంటే కుదరదు. అలా రాసుకున్నా చట్టం ఒప్పుకోదు. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే సూత్రాన్ని పునరుద్ఘాటించాయి.మీ తండ్రిగారు ఏం చేస్తారో చెప్పలేదు. ఆయనకు ఆస్తులు ఉన్నాయా? ఉద్యోగస్తుడా? ఎందుకంటే, ఒకవేళ గిఫ్ట్ డీడ్లో తండ్రిని జీవితాంతం పోషించాలి, నివాసం కల్పించాలి లేదా ఇతర థమిక అవసరాలు తీర్చాలి అనే షరతు స్పష్టంగా ఉన్నదా లేదా అన్నది పరిశీలించాలి. తండ్రి సీనియర్ సిటిజెన్ అయితే, మెయింటెనెన్స్ అండ్ వెల్పేర్ ఆఫ్ సీనియర్ సిటిజెన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్, 2007లోని కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ఆస్తి బదిలీని రద్దు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. బదిలీ గ్రహీత తల్లిదండ్రికి ప్రాథమిక అవసరాలు, భౌతిక అవసరాలు తీర్చాలనే షరతు ఉన్నప్పుడు, ఆ బాధ్యతను నిర్వర్తించనప్పుడు ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు. కాబట్టి ఆయనకు వాస్తవంగా మెయింటెనెన్స్ అవసరమా లేదా, ఆయన ఆదాయం ఎంత, గిఫ్ట్ డీడ్లో ఏమైనా మెయింటెనెన్స్ ఉందా వంటి అంశాలను వాస్తవాల ఆధారంగా పరిశీలించాలి. అలాగని కేవలం మెయింటెనెన్స్ కోరే హక్కు ఉండటం వల్లనే ఇప్పటికే పూర్తయిన గిఫ్ట్ డీడ్ను స్వయంచాలకంగా రద్దు చేసే హక్కు దాతకు ఏర్పడదు. సెక్షన్ 126 లేదా సీనియర్ సిటిజెన్స్ యాక్ట్ లోని వర్తించే నిబంధనల కింద చట్టపరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే బహుమతి రద్దుచేసే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.అదలా ఉంటే కోర్టులో ఇంజక్షన్ సూట్ వేసే అవకాశం ఉన్నప్పటికీ మీ తండ్రిగారు బెదిరిస్తున్నారనే కారణంతో మీరు వెంటనే కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ముందుగా గిఫ్ట్ డీడ్ను న్యాయపరంగా పరిశీలించి, అందులో రివోకన్స్, మెయింటెనెన్స్, లైఫ్ ఇంటరెస్ట్ లేదా ఇతర షరతులు ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలి. బెదిరింపులకు భయపడటం కంటే ముందుగా గిఫ్ట్ డీడ్ పూర్తి కాపీని న్యాయ నిపుణుడితో పరిశీలించి, అవసరమైతే ముందస్తు న్యాయపరమైన రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవడం ఉత్తమమైన మార్గం. దగ్గరలోని మంచి లాయరు గారిని కలవండి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.
సమానత్వానికి ఉపాధే మార్గం
ఆగస్టు 26... మహిళా సమానత్వ దినోత్సవం. ఓటు హక్కు కోసం మొదలైన పోరాటం నేడు అంతరిక్షం వరకు సాగింది. కానీ ప్రశ్న మిగిలే ఉంది.నిజంగానే ఆమెకు సమాన గుర్తింపు, భద్రత, స్వేచ్ఛ దక్కాయా? జవాబు... ఇంకా లేదు. ఒకవైపు ఆమె ముందుకు దూసుకెళుతోంది. మరోవైపు సామాజిక ఆంక్షలు, గృహహింస, వివక్ష ఆమె రెక్కలను కత్తిరిస్తూనే ఉన్నాయి. సమానత్వం అంటే ‘పురుషులతో పోటీ కాదు’... ‘పురుషులతో సమానంగా బతికే హక్కు’. ఆఫీస్లో సమాన అవకాశం, ఇంట్లో సమాన గౌరవం దక్కినప్పుడే ‘విమెన్స్ ఈక్వాలిటీ డే’కు అర్థం. ఆమెను కేవలం బాధ్యతగల గృహిణిగా, సమర్థురాలైన ఉద్యోగిగా మాత్రమే కాదు.. ఒక మనిషిగా, నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వంగా గౌరవించినప్పుడే అది సిసలైన సమానత్వం. అందుకై మార్పు అనివార్యం.మహిళల ఆర్థిక స్వాతంత్య్రానికి, సాధికారతకు, సమానత్వానికి.. ఉద్యోగం అనేది అత్యంత కీలకం. ఎంతోమంది ప్రతిభావంతులైన మహిళలు,ఎన్నో అద్భుతాలు చేస్తారని ఆశలు పెట్టుకున్న వాళ్లు, ఒకే ఒక మాటతో ఉసూరుమనిపిస్తారు. ‘ఉద్యోగం చేస్తూ పిల్లలను చూసుకోవడం, ఇంటిపనులు చేసుకోవడం కష్టంగా ఉంది. అందుకే ఉద్యోగం మానేశాను’ గ్లోబల్ ఆన్లైన్ ఎంప్లాయిమెంట్ వెబ్సైట్ అండ్ సెర్చ్ ఇంజిన్ ఇండీడ్ నిర్వహించిన సర్వే ప్రకారం.. భారతదేశంలో ప్రతి పదిమంది మహిళల్లో ఎనిమిది మందికి పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం లేదు. ఇంటి సంరక్షణ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం కష్టం అని భావించడం వల్ల చాలామంది మహిళలు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం లేదు....మహిళలు తమ కెరీర్ను ఎంచుకునే విధానాన్ని కుటుంబ బా«ధ్యతలు ప్రభావితం చేస్తున్నాయని, కెరీర్ను ఎంచుకోవడంలో సౌలభ్యం అనేది కీలక విషయంగా మారిందని చెబుతోంది ఇండీడ్ సర్వే. మరి కొన్ని విషయాలు... ⇒ ఉద్యోగాన్ని ఎంచుకునేటప్పుడు సౌకర్యవంతమైన పనిగంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.⇒ 48 శాతం మంది హైబ్రిడ్ లేదా రిమోట్ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.⇒ కుటుంబ జీవితం–వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కోసం పది మందిలో ఎనిమిది మంది తక్కువ జీతానికైనా సరే ఉద్యోగాల్లో చేరుతున్నారు.⇒ ఆఫీసుకు హాజరు కావాల్సిన నిబంధనల కారణంగా 51 శాతం మంది ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరు కావడం లేదు.⇒ పూర్తి సమయం ఆఫీసులో ఉండాలనే నిబంధనను 37 శాతం మంది ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. ఉద్యోగ విధులలో సౌలభ్యం లేకపోవడాన్ని 34 శాతం మంది ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. ఉద్యోగం చేసే తల్లులు హైబ్రిడ్, రిమోట్ వర్క్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.‘ఉద్యోగాలకు సంబంధించి మహిళలకు కలలు ఉన్నప్పటికీ, గృహ సంరక్షణ బాధ్యతలకే చాలామంది మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటున్నారు ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశి కుమార్.ఉద్యోగం డబ్బుల కోసం మాత్రమే కాదు...‘ఉద్యోగం అనేది కేవలం డబ్బు సం పాదించే మార్గం మాత్రమే కాదు. ఆర్థికంగానే కాదు మాససికంగా కూడా ఉపయోగపడుతుంది. వృత్తి జీవితమే వ్యక్తిగత జీవితంలో సంతృప్తిని, స్ఫూర్తిని ఇస్తుంది. పని– వ్యక్తిగత జీవితం మధ్య సమన్వయం సాధించాలి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ జీవితానికి ప్రాధాన్యత ఇస్తూనే వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించాలి’ అంటున్నారు లైఫ్స్టైల్ అండ్ ఫర్నీచర్ బ్రాండ్ ‘బెంట్చైర్’ సీఈవో, కో–ఫౌండర్ నటషా జైన్.ఆ లక్ష్యాలనే ఎంచుకుంటాను‘వ్యా పారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా మహిళలు రాణిస్తున్న ఈరోజుల్లో ఎంతోమంది మహిళలు తమ వృత్తి, వ్యక్తిగత జీవితాలను చక్కగా సమన్వయం చేసుకుంటున్నారు. నా విషయానికి వస్తే...అసాధారణమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోకపోవడమే పని–జీవిత సమతుల్యతకు ఒక మార్గం. నా మానసిక ప్రశాంతతకు భంగం కలగకుండా సాధించగలిగే లక్ష్యాలనే నా వృత్తి లేదా వ్యక్తిగత జీవితంలో ఎంచుకుంటాను. నేను ఉత్తమ తల్లి లేదా ఉత్తమ ఉద్యోగి అని నిరూపించుకోవడానికి నన్ను నేను అతిగా ఒత్తిడికి గురిచేసుకోను’ అంటుంది దీక్ష చాబ్ర ఫిట్నెస్ కన్సల్టేషన్ ఫౌండర్ దీక్ష చాబ్ర.లక్ష్యాల దిశగా...‘ఇంట్లో బిడ్డను చూసుకోవాల్సిన బా«ధ్యతల వల్ల మొదట్లో నా వ్యా పారప్రయాణం భారంగా అనిపించింది. పని–జీవిత సమతుల్యతను కా పాడుకోవడానికి ప్రతి ఒక్కరికీ మార్గం ఉంటుంది. లక్ష్యాల దిశగా ప్రణాళిక వేసుకోవడానికి, విశ్లేషించుకోవడానికి రోజులో కొంత సమయాన్ని నా కోసం కేటాయించుకుంటాను’ అంటున్నారు గిఫ్టింగ్ కంపెనీ జిఫ్టర్ కో–ఫౌండర్ పూజా పుంజ్.పనిని ఆస్వాదించండి‘మొదటగా మీ ప్రాధాన్యతలపై దృష్టి పెట్టండి. చేసే పనిని ఆస్వాదించండి. వర్క్–లైఫ్ బ్యాలెన్స్పై కృషి చేయండి. వర్క్–లైఫ్ బ్యాలెన్స్కు ఒక మార్గం కనుగొన్న తరువాత ఉద్యోగ జీవితంలో లభించే సంతృప్తి, ఆనందం సాటిలేనివి. కెరీర్లో మీరు ఎదిగే కొద్ది పని–వ్యక్తిగత జీవిత సమతుల్యత గురించి మార్గాలు మరిన్ని కనబడతాయని గుర్తుంచుకోవాలి. ఒక్కమాటలో చె΄్పాలంటే సమతుల్యత అనేది ఎక్కడో ఉండదు. అది మనం సృష్టించుకోవాలి’ అంటున్నారు ప్రమేయ హెల్త్ ఫౌండర్ డాక్టర్ సంధ్యా రవి.నిరాసక్తత ఎందుకంటే..?ఉద్యోగాల కొరత, పని ప్రదేశంలో కార్మిక చట్టాలు వర్తించకపోవడం, సరైన మౌలిక సౌకర్యాలు లేకపోవడం వంటి కారణాల వల్లే మహిళలు ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. భారతీయ మహిళలు మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండడం, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆత్మ విశ్వాసం తక్కువగా ఉండడం కుటుంబ నేపధ్యం ఇందుకు ప్రధాన కారణాలు.n భారతదేశంలో పని చేసే వయసు ఉండి ఉద్యోగం చేస్తున్న మహిళల శాతం కేవలం 35 మాత్రమే.భారత్ కూడా ఉన్నత ఆదాయ దేశాల స్థాయికి చేరాలంటే మరో 9 కోట్ల మంది మహిళలను శ్రామిక శక్తిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు సుమారుగా రూ. 116 లక్షల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. వస్త్ర పరిశ్రమ ద్వారా బంగ్లాదేశ్ మహిళలకు భారీగా ఉ పాధి కల్పించింది. భారత్ కూడా అదే స్థాయిలో శ్రామిక ఆధారిత రంగాలను ప్రోత్సహిస్తే, మూడు రెట్లు వేగంగా మహిళా ఉ పాధి పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి.ఇంకా అక్కడే..మహిళా సాధికారతను కొన్నేళ్లుగా విద్య, ఉద్యోగం, బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సదు పాయాల ఆధారంగానే కొలుస్తూ వస్తున్నారు. ఈ ప్రాథమిక ప్రమాణాలన్నింటిలోనూ భారతదేశం గణనీయమైన ప్రగతిని సాధించినప్పటికీ ఎన్ఎఫ్హెచ్ సర్వే–6 (జాతీయ, కుటుంబ, ఆరోగ్య సర్వే) ఫలితాలు కనిపించని కోణాన్ని మన ముందుకు తెచ్చాయి. ⇒ 22.3 శాతం మంది 18 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న వివాహితలు తమ భర్త నుంచి భౌతిక, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గతంలో చేసిన ఎన్ఎఫ్హెచ్ –5 (2019–21) సర్వేలోని 29.2 శాతంతో పోలిస్తే ఈ సంఖ్య కొంత తగ్గినప్పటికీ, ఇప్పటికీ ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఈ తరహా వైవాహిక హింసను ఎదుర్కొంటున్నారనేది ఆందోళన కలిగించే అంశం. ⇒ కేరళలో 87 శాతం మంది బాలికలు పదో తరగతి కంటే ఎక్కువ చదువుకున్నారని ఎన్ఎఫ్హెచ్–6 చెబుతోంది. అయినప్పటికీ, భర్త చేతిలో వేధింపులకు గురవుతున్న వివాహితల శాతం 9.8 నుంచి ఏకంగా 17.7 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్య, వికాసాలు ఉన్నచోట కూడా గృహహింస తీవ్ర రూపంలోనే ఉందనడానికి ఈ గణాంకాలు నిదర్శనం.⇒ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ముందే వారి జీవితాలను దెబ్బతీస్తున్న మరో ప్రధాన సమస్య బాల్య వివాహాలు. ఆంధ్రప్రదేశ్ (25%), జార్ఖండ్ (28.1%), బీహార్ (34.6%), పశ్చిమ బెంగాల్ (36.4%) లతో బాల్య వివాహాలు ఇప్పటికీ పెద్ద సమస్యగా ఉన్నాయి. చిన్న వయసులోనే వివాహాలు కావడం వల్ల మహిళలు మానసిక, ఆర్థిక, సామాజిక సాధికారతను సాధించలేకపోతున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలు, ముఖ్య విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడిపోతున్నారు.వర్క్–లైఫ్ బాలెన్స్ కోసం...వర్క్–లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడంలో భాగంగా ప్రతి ఉదయం మెంటల్ నోట్ క్రియేట్ చేసుకుంటాను. మెంటల్ నోట్ ద్వారా ఆరోజు నేను పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులను దృష్టిలో పెట్టుకుంటాను. నా పని ముగించేలోపు వాటిని పూర్తి చేయడంపై దృష్టి పెడతాను. మీరు తీరికలేని జీవితాన్ని గడిపే ఉద్యోగి అయితే మీ కోరికల జాబితాలోని ప్రతిదాన్ని సాధించడం కష్టం. దీని వల్ల మనం పూర్తిగా అలసిపోతాం. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతాం. వృత్తి–కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి మన ఆరోగ్యం, లైఫ్స్టైల్పై దృష్టి పెట్టాలి. ఎంటర్ప్రెన్యూర్స్గా మనం చాలా ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతాం. అది అనారోగ్యానికి, డిప్రెషన్కు దారి తీయవచ్చు. పని నుండి పూర్తిగా విరామం తీసుకోవడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు, మూడు రోజులు సెలవు తీసుకుంటాను.– రాశీ జైన్, ఆన్కో.కామ్ సీయివో, కో–ఫాండర్
కంటతడి పెట్టించే ప్రేమకథ..! ఆఖరికి విధి సైతం..
అందర్నీ ఎదిరించి ప్రేమను విజయవంతంగా పెళ్లిపీటల వరుక తెచ్చుకున్నారు. ఆనందంగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంతా హాయిగా సాగిపోతుందన్న తరుణంలో విధికే కన్ను కుట్టిందో, పరీక్షే పెట్టాలనుకుందో..ఒక్క క్షణంలో వాళ్ల జీవితాలు అగాథంలో పడేలా భయానక యాక్సిడెంట్ ఒక్క కుదుపు కుదిపేసింది. నిజానికి మరొకరేవరైనా ఆ సమయంలో ఎవరి జీవితం వారు అనుకునేవారేమో..కానీ ఆమె అనలేదు. ఎవ్వరేమి చెప్పినా..అతడే తన సర్వస్వం అంటూ చూపిన తెగువకు చేతులెత్తి నమస్కరించాల్సిందే. అసలేం జరిగిందంటే..గుజరాత్కి సంబంధించిన దీప్తి, జయ్లు చదువుకునే రోజుల నుంచే మంచి స్నేహితులు. సాధారణ స్నేహంగా మొదలైన వారి బంధం..కాస్త ప్రేమగా మారింది. చదువులు పెరుగుతూ వస్తున్నా.. వారి మధ్య దూరం, సంభాషణలు తగ్గలేదు. చివరికి పెద్దయ్యాక కూడా కలిసే ఉండాలనే ఉద్దేశ్యంతో పెళ్లితో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించకున్నారు. కానీ ఇరు కుటుంబసభ్యులు వారి పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. ఏళ్ల తరబడి నిరీక్షించినా..ఫలితం కనిపించక..చేసేదిలేక..జయ్ పేరెంట్స్ని కాదని దీప్తిని పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపాడు. అలా వారి పెళ్లిలో దీప్తి తరుఫు పెద్దవాళ్లున్న, జయ్ తరుఫున ఎవ్వరూ లేరు. అలా 2024లో ఇద్దరు పెళ్లిచేసుకున్నారు. ఇక నుంచి తమ జీవితాలు ఆనందంగా సాగిపోతాయి అని భావించారు ఇరువురు. అంతలోనే తమ జీవితాలు తలకిందులైపోతాయని అస్సలు ఊహించలేదు. ఎప్పటిలానే ఆఫీస్కి వెళ్లిన జయ్ ఆరోజు ఇంటికి రాలేదు..అతడి ఆఫీసు ఇన్ఛార్జ్ రావడంతో దీప్తిలో కంగారు, ఆందోళన మొదలయ్యాయి. అతడు వచ్చి జయ్కు చిన్న యాక్సిడెంట అయ్యిందనగానే చిన్న గాయాలే అనుకుని ధైర్యంగా బయలుదేరబోతుండగా..ఇద్దరి బట్టలు తెచ్చుకోవాల్సిందిగా చెప్పడంతో విస్తుపోతుంది. అయోమయంగా ..కంగారు కంగారుగా ఆస్పత్రికి వెళ్లిన దీప్తికి అక్కడ జయ్ని చూశాకగానీ అర్థం కాలేదు..అతడికి అయ్యింది భారీ యాక్సిడెంట్ అని. పైభాగం తప్పించి మొత్తం కింద భాగం 40% మేర కాలిపోయింది, అస్సలు స్పృహలో లేడు జయ్. ఆ దృశ్యాలను చూసి తట్టుకోలేక దీప్తి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. ఆ పరిస్థతిని అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టిందామెకు. ఒక పక్క వైద్యులు ప్రాణాంతకమని చెప్పి.. హుటాహుటినా అహ్మదాబాద్కు తరలించారు. ఏడు గంటల ప్రయాణం తర్వాత అతనికి చికిత్స మొదలైంది. ఇందులో నాలుగు ప్లాస్టిక్ సర్జరీలు, చర్మ మార్పిడి తదితరాలు ఉన్నాయి. ఇక్కడ దీప్తికి ఆస్ప్రతి భయం, ఆర్థిక భయం వెంటాడుతూనే ఉన్నాయి. కానీ జయ్ని బతికించుకోవాలంటే తాను ధైర్యంగా ఉండాల్సిందే. అంతటి పరిస్థితిని ఒక్కత్తే చక్కబెట్టుకుంటూ..తన వద్ద ఉన్న సొమ్ము, బంగారు తాకట్టు పెట్టి కొంత, స్నేహితుల వద్ద అప్పుగా కొంత ఇలా వచ్చిన సొమ్ముతో అతడికి విజయవంతంగా చికిత్స అందేలా చేసింది. అయితే ఆ ప్రమాదం జయ్ని శారీరకం, మానసికంగా చాలా బలహీనంగా మార్చేసింది. అతడిలో ఇదివరకటి వ్యక్తిలాంటి చురుకుదనం కోసం మళ్లీ చాలా గట్టిగా పోరాడాల్సి వచ్చింది. తన ముఖంలో నవ్వులు విరబూసిలే తను చేయగలిగిందంతా చేసి, మాములు మనిషిగా చేసింది. జయ్ రోజువారీ పనుల చేసుకోలేకపోయినా..ప్రాణాలతో మాత్రం దక్కించుకుంది. అయితే చుట్టు పక్కల వాళ్లు వయసు చిన్నదే కదా..అతడితో ఎందుకు మరో పెళ్లిచేసుకోమని చెబుతుండేవారు. పెళ్లి రెండేళ్ల కిందటే అయ్యిందేమో..మాది 14 ఏళ్లప్రేమ బంధం అని, అతడి చేతిని ఎన్ని కష్టాలు ఎదురైనా వదిలేది లేదని తెగేసి చెప్పింది దీప్తి. మరికొందరు జయ్ పరిస్థితికి దీప్తినే కారణమని నిందించేవారు కూడా. అయినా అవేమి లెక్కచేయక అతడిని ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటూ అసలైన దాంపత్యానికి నిలువెత్తు అర్థంలా మారిందామె. అంతేగాదు ఈ ప్రమాదం తర్వాతే తాము జీవించడం గురించి నేర్చుకున్నామని చెబుతోంది దీప్తి. ఇంతకముందు తామిద్దరం భవిష్యత్తు గురించి తపన పడి సంపాదన వైపు పరుగులు తీస్తే..ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితి ఈ రోజు గురించి ఆలోచించలే చేసిందని చెబుతోంది. అంతేగాదు రేపే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చిన్న చిన్న ఆనందాలను సెలబ్రేట్ చేసుకోవడం ఎలాగో తెలిసింది, అలాగే తమకు బతుకు విలువ నేర్పిందని అంటోంది దీప్తి. నిజానికి అంతటి కష్టపరిస్థితుల్లో ఒకరికొకరుగా తోడుగా నిలిచి, ఆలుమగల బంధానికి అసలైన అర్థం ఏంటో చాటిచెప్పారు. కనీసం ఈ దంపతుల అన్యోన్యతకైనా ..ఆ విధి కరిగి మళ్లీ వాళ్ల జీవితాల్లో ఆనందం విరబూసేలా చేయాలని మనసారా కోరుకుందామా.!. View this post on Instagram A post shared by People of India (@officialpeopleofindia) (చదవండి: తొలి అడుగుల నుంచి.. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వరకు..! కుమార్తె భావోద్వేగ పోస్ట్)
అంతర్జాతీయం
సముద్రమార్గాల భద్రతకు అంతర్జాతీయ కృషి
ఐక్యరాజ్య సమితి: అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పనిచేసి సముద్రమార్గాల భద్రతను కాపాడాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఇంధనంతోపాటు ఆహారం, ఎరువుల రవాణా సాఫీగా జరిగేందుకు ఇది అత్యవసరమని ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని స్పష్టం చేశారు. ‘‘సాయుధ ఘర్షణల అత్యంత తీవ్రమైన మానవతా పరిణామాల్లో ఆహార కొరత ఒకటి. ఈనాటి ఘర్షణల ప్రభావం యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకు మించి దూర ప్రాంతాలపైనా పడుతోంది’’అని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్వహించిన ఉన్నతస్థాయి చర్చలో ఆయన మాట్లాడుతూ యుద్ధాల వల్ల ఇంధన మార్కెట్లు దెబ్బ తింటున్నాయి. ఎరువుల సరఫరా ప్రభావితమవుతోంది. సముద్ర రవాణా, మానవతా సహాయం, వ్యవసాయ వాణిజ్యానికి అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రాంతంలో జరిగే ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ముప్పుగా మారుతున్నాయన్నారు. ఈ ప్రభావం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా ఉంటుందన్నారు. సాయుధ ఘర్షణల వల్ల జరుగుతున్న మానవీయ నష్టాన్ని తగ్గించడం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తొలి ప్రాథమ్యం కావాలని కోరారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా వాణిజ్య నౌకల రాకపోకలకు భద్రత, స్వేచ్ఛ కల్పించాలని చెప్పారు. కీలక సముద్ర మార్గాలు, మౌలిక సదుపాయాల రక్షణకు అంతర్జాతీయ సమాజం కలిసి పనిచేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక సాయుధ ఘర్షణలు చోటు చేసుకున్నది గత ఏడాదేనని, అదే సమయంలో ఆకలి సమస్య కూడా పెచ్చరిల్లిందని తెలిపారు. గత ఏడాది ఒకేసారి సూడాన్, గాజాల్లో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని ఐక్యరాజ్యసమితి తాజా ‘హంగర్ హాట్స్పాట్స్’నివేదిక ప్రస్తావిస్తూ చెప్పారు. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇజ్రాయెల్ –ఇరాన్ల యుద్ధం కొనసాగుతూండటం వల్ల హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు, ఘర్షణల కారణంగా వస్తువుల ధరలు పెరిగాయని చెప్పారు.
హాలీవుడ్ స్టైల్లో రష్యా, అమెరికా సీక్రెట్ చర్చలు
ఉప్పు నిప్పుగా ఉండే అమెరికా రష్యాల మధ్య తాజా పరిణామాలు హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. వేర్వేరు వార్తా సంస్థలు, అధికార వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అమెరికా గూఢచార సంస్థ సీఐఏ చీఫ్ తాజాగా మాస్కో వెళ్లి రష్యన్ ఇంటెలిజెన్స్ విభాగం క్రెమ్లిన్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా ఇటీవలి కాలంలో అమెరికా – రష్యా దౌత్య సంబంధాలు కనిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ పర్యటన చోటు చేసుకోవడం.. అది కూడా అత్యంత రహస్యంగా జరగడం ఆసక్తి రేకెత్తిస్తోంది. సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్ క్లిఫ్ రష్యా వచ్చారని, అధ్యక్షుడు పుతిన్ను కలవకపోయినప్పటికీ చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ప్రకటించారు. ఏ ఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం చెప్పలేదు. మరోవైపు ఈ చర్చలపై కానీ, డైరెక్టర్ రష్యా పర్యటనపై కానీ సీఐఏ కూడా నోరు మెదపడం లేదు. వైట్హౌస్ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. అమెరికా మిలిటరీ విమానం మాస్కోలోని వ్నూకోవో విమానాశ్రయంలో మంగళవారం ల్యాండ్ అయిందని, అదే రోజు తిరిగి వెళ్లిపోయిందని రష్యా అధికార వార్తా సంస్థలు తెలిపాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. ‘‘ప్రతినిధి బృందం ఒకటి రష్య రాజధానికి వెళుతోంది. ఆ బృందం రష్యా నుంచి వెళ్లిపోయేదాకా దాడులకు విరామం ఇవ్వాలి’’అంటూ వాషింగ్టన్ నుంచి ఉక్రెయిన్కు ఆదేశాలు వెళ్లినట్లు ఉక్రెయిన్ అధికారి ఒకరు అసోసియేటెడ్ ప్రెస్కు తెలిపారని సమాచారం. రష్యా మొత్తమ్మీద దాడులు ఆపాల్సిందిగా చెప్పలేదని, మాస్కో, సెయింట్ పీటర్స్బెర్గ్, రష్యా ఉత్తర ప్రాంతాల్లో మాత్రం జరక్కూడదని అమెరికా స్పష్టంగా చెప్పిందని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆ అధికారి తెలిపారు. సీఐఏ డైరెక్టర్ రష్యా పర్యటన వివరాలను మొట్టమొదట సీబీఎస్ ఛానెల్ బయటపెట్టింది. సంక్షోభంలోనే దౌత్య సంబంధాలు... నిఘా వర్గాల స్థాయిలో ఇరు దేశాల మధ్య కొన్ని సంబంధాలు ఉన్నప్పటికీ రష్యా, అమెరికా మధ్య దౌత్య సంబంధాల్లో మాత్రం సంక్షోభం కొనసాగుతోందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ చెబుతున్నారు. సీఐఏ డైరెక్టర్ పర్యటన ప్రభావం ఇరుదేశాల సంబంధాలపై ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. అయితే సీఐఏ డైరెక్టర్ రష్యా రావడం చాలా అరుదైన విషయమని రష్యా భద్రతాదళాల విషయంలో నిపుణుడైన అండ్రే సోల్డటోవ్ చెబుతున్నారు. సాధారణంగా ఈ స్థాయి సమావేశాలు అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఏదైనా దెబ్బ తగులుతోందన్న సందర్భంలోనే జరుగుతాయని చెప్పారు.
నేపాల్లో భూకంపం.. వరద విలయం.. 157 మందికిపైగా జలసమాధి!
కఠ్మాండు/బీజింగ్/న్యూఢిల్లీ: ప్రకృతి ప్రకోపం ధాటికి నేపాల్ చివురుటాకులా వణికిపోయింది. రాజధాని కఠ్మాండు సమీపంలోని రాసువా, దాడింగ్ జిల్లాల ఎగువ ప్రాంతంలో బుధవారం ఉదయం సంభవించిన భూకంపం తర్వాత పెను ఉపద్రవాన్ని మోసుకొచ్చింది. ఉదయం 8.37 గంటలకు టిబెట్ సరిహద్దు ప్రాంతంలో కొడారీ అనే చోట భూమికి 77 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి హిమాలయ పర్వతప్రాంతంలోని కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ కొండల మీది గ్లేసియర్(హిమానీనదాలు)లోని భారీ స్థాయిలో మంచు ఒక్కసారిగా దిగువన ఉన్న భోటె కోశీ నదిలో పడింది. దీంతో మంచు కరిగి అనూహ్య రీతిలో నదీ ప్రవాహం, నీటి మట్టం పెరిగాయి. దీంతో మెరుపు వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. నది ఉగ్రరూపం దాల్చి దిగువన ఉన్న రాసువా, ధాడింగ్ జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు, డజను జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు, దుకాణ సముదాయాలను సర్వనాశనం చేసింది. 42 కి.మీ.ల పొడవైన కీలక బేద్రావతి–రసువాగఢి రోడ్డు కొట్టుకుపోయింది. నేపాల్ పర్వతప్రాంత రమణీయతను చూసేందుకు దేశవిదేశాల నుంచి తరలివచ్చిన పర్యాటకులు ఈ మెరుపు వరదల్లో జలసమాధి అయ్యారు. 157 మందికిపైగా చనిపోయారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 750 మందికిపైగా పర్యాటకులు, స్థానికుల జాడ గల్లంతైంది. జాడ తెలీకుండా పోయిన వారిలో 133 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు టూరిస్ట్ కంపెనీలు, స్థానిక యంత్రాంగం గణాంకాలను బట్టి తెలుస్తోంది. నువాకోట్, ఛిటావన్ జిల్లాల్లోనూ మెరుపు వరదల భీభత్సం ఎక్కువగాఉంది. వరద ఉధృతికి సమీపంలోని ఇళ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాలు పేకమేడల్లా కూలాయి. కార్లు, ఇతర వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అసలేం జరుగుతుందో తెలిసేలోపే అమాంతం వరద ముంచెత్తి జనం జలసమాధి అయిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నేపాల్–చైనా సరిహద్దులోని రసువాగఢి చెక్పోస్ట్లో రెండంతస్తుల భవంతిని వరదనీరు రెప్పపాటులో సర్వనాశనం చేసిన వీడియో సోషల్మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వరదధాటికి ఇక్కడ నేపాల్–చైనా భూతల మార్గం పూర్తిగా ధ్వంసమైంది. వరద ఉధృతికి నామరూపాలు కోల్పోయి, బురదలో కూరుకుపోయి ఆ ప్రాంతాలన్నీ భీతావహంగా మారాయి. ఎటు చూసినా అడుగుల ఎత్తులో పేరుకుపోయిన బురద, సాయం కోసం అరి్థస్తున్న జనం హాహాకారాలతో ఆ ప్రాంతాల్లో విషాద వాతావరణం రాజ్యమేలుతోంది. భోటె కోశీ నదీజలాలు తర్వాత తిబూరే ప్రాంతంలో త్రిశూలి నదిలోకి రావడంతో దాని కారణంగానూ ఒకింత విధ్వంసం పెరిగింది. బుధవారం రాత్రినాటికి ఏడు జిల్లాల్లో 95 మృతదేహాలను స్వా«దీనం చేసుకున్నారు. బిహార్, యూపీలో అలర్ట్ నేపాల్ వరద నీటితో గండక్ నదిలో నీటి మట్టం పెరిగే ఆస్కారం ఉండటంతో బిహార్, ఉత్తర ప్రదేశ్లో స్థానికయంత్రాంగాలు నదీపరీవాహక ప్రాంతాలోని ప్రజలను అప్రమత్తంచేశాయి. దిగువ ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచించారు. అవసరమైతే తగు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. గండక్ నదిపై ఒక బరాజ్లో 36 గేట్లను ఎత్తి నీళ్లను కిందకు వదిలేస్తున్నారు. వరదనీటి ముప్పు ఉండే ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్, కుషీనగర్ జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సహాయక బృందాలకు యూపీ సీఎం యోగి సూచించారు. చైనా ఆపన్న హస్తంతమ అధీనంలోని టిబెట్లోని సరిహద్దు ప్రాంతాల్లోనూ ఈ వరద విలయం ఎక్కువగా ఉండటంతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విస్తృతస్థాయిలో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టాలని ఆర్మీకి ఆదేశాలిచ్చారు.మానస సరోవర్ యాత్రికులు సైతంఅమెరికా, మలేసియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్, దక్షిణకొరియా పర్యాటకుల జాడ తెలీడంలేదని నేపాల్ టూరిజం బోర్డ్ తెలిపింది. టిబెట్లోని కైలాస్ మానస సరోవర్ను దర్శించుకునేందుకు యాత్రకు వచ్చిన 77 మంది భారతీయుల జాడ సైతం తెలీడంలేదని సామ్రాట్ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ వెల్లడించింది. దీంతో భారతీయుల జాడ కనిపెట్టి ఎలాగైనా క్షేమంతా స్వదేశానికి తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం భరోసా ఇచ్చింది. 341 మంది పర్యాటకులు, 291 మంది విదేశీయులు, 62 మంది నేపాలీల జాడ తెలీడంలేదని నేపాల్ టూరిజం బోర్డ్ ప్రకటించింది. 24న నేపాల్ పర్యటనకు వెళ్లిన పశ్చిమబెంగాల్లోని ఆరామ్బాగ్కు చెందిన 65 మంది పర్యాటకులు సైతం వరద ప్రాంతంలో చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి.పూర్తి సాయం చేస్తాం: ప్రధాని మోదీ వరద విలయం వార్త తెలియగానే నేపాల్ ప్రధాని బాలేంద్రకు భారత ప్రధాని మోదీ ఫోన్చేసి మాట్లాడారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేస్తున్నట్లు ఆయనతో మోదీ చెప్పారు. మిత్రదేశమైన నేపాల్కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సదాసిద్ధంగా ఉన్నట్లు మోదీ హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పటికే భారత వాయుసేన విమానాల్లో అత్యవసర ఉపకరణాలు, ఔషధాలు, ఆహారం, ఇతర సామగ్రిని నేపాల్కు తరలిస్తున్నారు. కష్టకాలంలో నేపాలీ సోదర, సోదరీమణులకు అండగా ఉంటామని తర్వాత మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బలగాలు సైతం నేపాల్కు తరలివెళ్లే ఆస్కారముంది. అదనపు సాయం కోసం సీ–17 గ్లోబ్మాస్టర్, లాక్హీడ్ సీ–130 రవాణా విమానాలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు భారీ సంఖ్యలో భారతీయులు నేపాల్లో గల్లంతుకావడం, వరద ప్రాంతాల్లో చిక్కుకోవడంతో వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని మోదీ సర్కార్కు విపక్ష కాంగ్రెస్ సూచించింది.రంగంలోకి నేపాల్ ఆర్మీ... విషయం తెల్సి నేపాల్ సైన్యం, సాయుధ పోలీస్ బలగాలు, నేపాల్ పోలీసులు, జాతీయ విపత్తు స్పందన బలగాలు, అగ్నిమాపక సిబ్బంది, డ్రోన్లు మెరుపు వేగంతో రంగంలోకి దిగి బాధితులను కాపాడేందుకు అన్వేషణ, సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నాయి. వీళ్లను కాపాడే క్రమంలో ఇప్పటికే 80 మంది భద్రతా బలగాలు, 44 నేపాల్ సైనికులు సైతం గల్లంతైనట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించారు. త్రిశూలి ప్రాంతంలో 80 మందిని ఆర్మీ హెలికాప్టర్లు కాపాడాయి. ఇప్పటిదాకా 300 మందిని కాపాడినట్లు ప్రధాని బాలేంద్ర తెలిపారు. గాయపడిన వారిని సమీప ఎగువ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చేరి్పంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాలు పర్వతసానువుల వద్ద ఉండటంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. రాసువా ప్రాంతంలో కుంభవృష్టి కారణంగా మెరుపు వరదలు వచ్చాయన్న వార్తల్లో నిజం లేదని మంత్రి శిశిర్ స్పష్టంచేశారు. పరిస్థితిని దేశ ప్రధాని బాలేంద్ర షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఎలాన్ మస్క్కు ఉక్రెయిన్ అత్యున్నత పురస్కారం!
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ, ప్రముఖ వ్యాపారవేత్త, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ను ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్’ పురస్కారంతో సత్కరించారు. మనుషుల ప్రాణాలు, స్వేచ్ఛను కాపాడటంలో చేసిన సేవలు, అలాగే ఉక్రెయిన్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డును అందించారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మస్క్ అందించిన స్టార్లింక్ సేవలు ఉక్రెయిన్కు ఎంతో ఉపయోగపడ్డాయి.2022లో రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్లో అనేక కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉక్రెయిన్ సైనికులు, కమాండర్లు, పౌరులకు కీలక కమ్యూనికేషన్ మార్గంగా మారింది. సైనిక కార్యకలాపాల్లో కూడా స్టార్లింక్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్లను నియంత్రించడం, దూర ప్రాంతాల్లో వాటితో కనెక్షన్ కొనసాగించడం వంటి కార్యకలాపాలకు ఇది సహాయపడుతోంది. దీంతో రష్యా సైనిక సరఫరా, లాజిస్టిక్స్పై ఉక్రెయిన్ ఒత్తిడి పెంచగలిగింది.అయితే.. మస్క్ పాత్ర ఉక్రెయిన్కు ప్రయోజనంతో పాటు కొన్ని సమస్యలను కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉక్రెయిన్ తన భూభాగంలో స్టార్లింక్ను ఉపయోగించగలుగుతున్నప్పటికీ, రష్యా భూభాగంలో దాని వినియోగంపై పరిమితులు ఉన్నాయి. రష్యాపై దూరప్రాంత డ్రోన్ దాడులకు కూడా స్టార్లింక్ ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని జెలెన్స్కీ కోరుతున్నారు. కానీ.. మస్క్ మాత్రం అలా చేయడం యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా.. రష్యా దళాలు అనధికారికంగా ఉపయోగిస్తున్న కొన్ని స్టార్లింక్ టెర్మినల్స్ను బ్లాక్ చేయడానికి స్పేస్ఎక్స్ చర్యలు తీసుకుంది.
జాతీయం
మెడ నుంచి వెళ్లి నోటి నుంచి బయటకు.. 3 అడుగుల ఇనుప రాడ్
గుజరాత్లోని సూరత్ నగరంలోని ఉన్న్ ప్రాంతం మిస్వాహున్ నగర్ నుంచి ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి మహ్మూదియా మదర్సాలో చదువుతున్న 10 ఏళ్ల నాజిష్ మొహమ్మద్ అలియాస్ నాజిమ్ 3వ అంతస్తు నుంచి కిందపడిపోయాడు. బాలుడు నేరుగా సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం పిల్లర్ నుంచి బయటకు వచ్చిన ఇనుప రాడ్పై పడిపోయాడు.ప్రమాదం తీవ్రత ఎంతగా ఉందంటే ఇనుప రాడ్ బాలుడి భుజం, మెడ వెనుక భాగాన్ని చీల్చుకుంటూ నోటి నుంచి బయటకు వచ్చింది. అయితే స్థానికుల సమయస్ఫూర్తి, సూరత్ న్యూ సివిల్ ఆసుపత్రి వైద్యుల అప్రమత్తతతో దాదాపు గంట పాటు సాగిన అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స తర్వాత బాలుడిని ప్రాణాపాయం నుంచి కాపాడారు.కట్టర్తో రాడ్ను కత్తిరించిన స్థానికులుఈ ఘటన మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. బాలుడు 3వ అంతస్తు నుంచి కిందపడగానే అక్కడ గందరగోళం నెలకొంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన స్థానికులు ఆలస్యం చేయకుండా కట్టర్ సహాయంతో ప్రధాన రాడ్ను కత్తిరించారు. మెడలో ఇరుక్కున్న ఇనుప రాడ్తోనే బాలుడిని అంబులెన్స్లో న్యూ సివిల్ ఆసుపత్రి ట్రామా సెంటర్కు తరలించారు.అప్పుడు బతికే అవకాశాలు కేవలం 20 శాతమేఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి బాలుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వైద్యుల ప్రకారం అతను బతికే అవకాశం కేవలం 20 శాతం మాత్రమే. అత్యవసర విభాగం సిబ్బంది వెంటనే ప్రాథమిక చికిత్స అందించి బాలుడి శ్వాసను స్థిరీకరించారు. సీటీ స్కాన్ తర్వాత నేరుగా శస్త్రచికిత్స గదికి తీసుకెళ్లారు.శస్త్రచికిత్స చేసిన వైద్యుడు దివ్యాంగ్ దవే మాట్లాడుతూ.. బాలుడి నోటిలో రాడ్ ఇరుక్కుపోవడంతో మత్తు మందు కోసం ట్యూబ్ను అమర్చడం అత్యంత సవాలుగా మారిందని తెలిపారు. అయితే మత్తు మందుల వైద్య బృందం దీన్ని ఎంతో సమర్థంగా నిర్వహించిందని చెప్పారు.యూనిట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రకాశ్ పటేల్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ నీలేశ్ కాచ్డియా, డాక్టర్ దీప్ షా, డాక్టర్ ఋత్విక్ జీవాణి, డాక్టర్ కౌశల్, డాక్టర్ హార్దిక్ ఆస్తిక్, ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణుల పూర్తి బృందం దాదాపు గంట పాటు శ్రమించి రాడ్ను విజయవంతంగా బయటకు తీసింది.ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే గొంతులోని ప్రధాన రక్తనాళానికి ఎలాంటి నష్టం జరగలేదు. లాలాజల గ్రంథి, కండరాలకు స్వల్ప గాయాలయ్యాయి. వాటిని ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణులు సరిచేశారు. బాలుడు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. అతని పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉంది.బాలుడి తండ్రి సద్రే ఆలమ్ మాట్లాడుతూ.. ఈ ఘటన జరిగిన సమయంలో తాను పనిలో ఉన్నానని తెలిపారు. ఫోన్లో సమాచారం అందగానే నేరుగా ఆసుపత్రికి చేరుకున్నానని చెప్పారు. “ఆసుపత్రిలోని వైద్యులందరూ తమవంతు పూర్తి ప్రయత్నం చేశారు. ప్రమాదం ఎలా జరిగింది? ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉంది? అనేది మదర్సాలో ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన తర్వాతే స్పష్టమవుతుంది” అని తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యే కారును కడగడానికి ఏ నీటిని వాడారంటే?
భోపాల్: బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఓ ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది. అధికారికంగా ప్రజా సేవల కోసం ఉపయోగించాల్సిన వనరుల వినియోగంపై ఈ ఘటనతో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియో ఈ వ్యవహారంపై చర్చకు కారణమైంది. ఎమ్మెల్యేకు సంబంధించిన ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వనరులను ప్రజాప్రతినిధులు వ్యక్తిగత అవసరాలకు ఎలా వాడుకుంటారో ఈ ఘటన ద్వారా మరోసారి తేటతెల్లమైంది.మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీలో అధికారిక నివాసం బయట బీజేపీ ఎమ్మెల్యే రామ్ నివాస్ షా వ్యక్తిగత కారును అగ్నిమాపక వాహనంతో కడుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అగ్నిమాపక వాహనానికి ఉన్న పైపులతో ముగ్గురు సిబ్బంది ఎమ్మెల్యే ఇన్నోవాపై నీటిని చల్లడం కనిపించింది. బిలోంజీలోని షా అధికారిక నివాసం బయట రోడ్డుపై ఆ వాహనం నిలిపి ఉంది.ఇదీ చదవండి: 6 ఏళ్లకే ఈ బాలుడు ‘అభిజీత్ దీప్కే’లా అయిపోయాడు..ఇదిలా ఉండగా, వీడియోను తాను చూసినట్లు షా తెలిపారు. నీటిని నింపేందుకు ఆ వాహనం మేయర్ చైర్మన్ ఇంటికి వెళ్లిందని, అక్కడ అనుకోకుండా నిలిపి ఉంచారని చెప్పారు. “మేము కూడా వీడియో చూశాం. ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ తన సొంత కారును కడుక్కోడు. అగ్నిమాపక వాహనం నీటి ట్యాంకును నింపేందుకు మేయర్ చైర్మన్ ఇంటికి వెళ్లిందని డ్రైవర్ చెప్పాడు. అక్కడ అనుకోకుండా వాహనాన్ని నిలిపి ఉంచారు. అందుకే దానిపై కొద్దిగా నీటిని చల్లాడు. ఇలాంటివి చేయకూడదని డ్రైవర్కు చెప్పాను” అని రామ్ నివాస్ షా తెలిపారు. ప్రైవేటు అవసరాల కోసం ప్రభుత్వ వనరులను ఉపయోగించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే కారును కడగడానికి ఏ నీటిని వాడారంటే?सिंगरौली में बीजेपी के माननीय विधायक जी की कार वाशिंग फ़ायर ब्रिगेड की गाड़ी से हो रही है pic.twitter.com/CM0YBheLMz— Brajesh Rajput (@drbrajeshrajput) August 25, 2026
6 ఏళ్లకే ఈ బాలుడు ‘అభిజీత్ దీప్కే’లా అయిపోయాడు..
పట్నా: ఉపాధ్యాయుల నియామక పరీక్ష (టీఆర్ఈ-4)లో ఒకే పరీక్ష, నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని తొలగించడంతో పాటు పలు డిమాండ్లతో బిహార్ రాజధాని పట్నాలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గాంధీ మైదాన్ నుంచి ముఖ్యమంత్రి నివాసం వరకు విద్యార్థులు మార్చ్ నిర్వహించారు. డాక్ బంగ్లా చౌరస్తాలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య కొంత ఉద్రిక్తత కనిపించింది.వాటర్ క్యానన్ ప్రయోగించినా విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. ఈ సమయంలో పలువురిని కలచివేసే చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ ఆందోళనలో ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల ఆదిత్య ప్రభుత్వం తీరుపై ప్రశ్నలు సంధించాడు. బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడిగాడు.జనంలో వైరల్గా మారిన బాలుడువేలాది మంది పోలీసు సిబ్బంది, ఆందోళనకారుల మధ్య వైరల్గా మారిన ఈ బాలుడు ప్రభుత్వం విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశాడు. నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ విద్యార్థులు నిరుద్యోగులుగా మారుతున్నారని చెప్పాడు. అతడి మాటలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. వైరల్ అవుతున్న వీడియోలో బాలుడు మాట్లాడుతూ.. అధికారం వస్తుంది, పోతుంది. కానీ దేశ భవిష్యత్తుతో జరిగిన ఆట కారణంగా విద్యార్థుల జీవితాలపై ప్రభావం పడుతోందని చెప్పాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావని అతడిని అడిగినప్పుడు.. విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చానని చెప్పాడు.ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన బాలుడుముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆ బాలుడు అన్నాడు. విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం రూపొందించిన పథకాల పరిస్థితి ఏమైందని ఆదిత్య ప్రశ్నించాడు. ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ వాటిలో కొన్ని ఎందుకు అమలు చేయడం లేదని అడిగాడు. విద్యార్థులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇక్కడ వారికి లాఠీఛార్జ్లు అందుతున్నాయని అన్నాడు.ఆదిత్యను తీసుకెళ్లిన పోలీసులుఆదిత్య తన తల్లితో కలిసి చేతిలో పోస్టర్ పట్టుకుని ఆందోళనకు వచ్చాడు. విద్యార్థులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసి బిహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేశ్ తివారీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఉన్న పోలీసులు బాలుడిని అక్కడి నుంచి తమ వెంట తీసుకెళ్లారు. ఆందోళనకారులు గాంధీ మైదాన్ నుంచి ర్యాలీగా ముఖ్యమంత్రి నివాసం వైపు ముందుకు సాగారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులకు ఆదిత్య కూడా పోస్టర్ పట్టుకుని ఆందోళనకారులతో కలిసి కనిపించడంతో అతడిని తీసుకెళ్లడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే కారును కడగడానికి ఏ నీటిని వాడారంటే?సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంఫ్యాక్ట్చెక్: ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలంటూ ఆ బాలుడు పోస్టర్లు పట్టుకోవడంతో అతడిని అరెస్టు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో నిజం లేదు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసు బృందం ఆదిత్యను ఆందోళన స్థలం నుంచి తమ వెంట తీసుకెళ్లింది. దీనిపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వచ్చాయి. అయితే బాలుడిని అధికారికంగా అదుపులోకి తీసుకున్నట్లుగానీ, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నట్లుగానీ అధికారిక సమాచారం వెలువడలేదు. గుంపు, ఉద్రిక్త పరిస్థితుల మధ్య బాలుడిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లేందుకే పోలీసులు చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఆందోళన మధ్య 6 ఏళ్ల ఆదిత్య హీరో అయిపోయాడు. 6 ఏళ్లకే ఈ బాలుడు అభిజీత్ దీప్కే అపోయాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. A 6 year old kid defeated a 76 year old kid. https://t.co/lwWvBcgcWw— Neeraj Agarwal (@taxpayer1978) August 26, 2026आज (25 अगस्त 2026) पटना के डाकबंगला चौराहे से पुलिस ने एक छोटे बच्चे को हटाया (detain किया) है।25 अगस्त 2026 को पटना के डाकबंगला चौराहा पर BPSC TRE-4 छात्र प्रदर्शन के दौरान 6 साल के बच्चे (आदित्य) को हिरासत में लिया गया ।पटना में रोजगार और भर्ती को लेकर चल रहे प्रदर्शन के… pic.twitter.com/EWjVBT5So4— SUNIL YADAV 2.0 (@SUNILYADAV2027) August 25, 2026 6 saal ka baccha press conference kar raha hai… pic.twitter.com/jRjfjw6d1l— Abhijeet Dipke (@abhijeet_dipke) August 26, 2026
‘వాళ్లు బెస్ట్ సీఎంలా?’.. సీజేపీ చీఫ్పై పూనావాలా ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రులుగా ఎంకే స్టాలిన్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్ల పేర్లను ప్రతిపాదించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై షెహజాద్ పూనావాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ సంస్థను ‘మోసగాళ్ల ముఠా’ (ఫ్రాడియాస్) అని అభివర్ణించిన ఆయన, దీప్కే పేర్కొన్న ముఖ్యమంత్రులను సంబంధిత రాష్ట్రాల ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని అన్నారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన పూనావాలా, సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో విడుదల చేసిన ఒక వీడియోలో మాట్లాడుతూ.. ప్రజలు తిరస్కరించిన నేతలంటేనే సీజేపీకి ఇష్టమని ఎద్దేవా చేశారు.‘ఈ ముగ్గురు నేతలను వారి రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారు. సీజేపీకి ఇలాంటి వారంటేనే ప్రీతి. ప్రజలు మరో నిర్ణయం తీసుకున్నందున ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నుంచి ‘జనతా’ అనే పదాన్ని తొలగించి, కేవలం ‘కాక్రోచ్ పార్టీ’ అని మాత్రమే పిలవాలి’ అని ఆయన పేర్కొన్నారు. తన వాదనకు మద్దతుగా స్టాలిన్ హయాంలో తమిళనాడు పబ్లిక్ డెట్ (ప్రజా రుణం) పెరగడం, విజయన్ పాలనలో కేరళలో నమోదైన కొవిడ్ మరణాలు, కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీలోని మద్యం దుకాణాల అంశాలను పూనావాలా ప్రస్తావించారు.ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్న అభిజీత్ దీప్కే, దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రులు ఎవరు అన్న ప్రశ్నకు స్పందిస్తూ పలువురు నేతలు మంచి పనితీరు కనబరిచారని చెప్పారు. తమిళనాడు ఆర్థిక వ్యవస్థను స్టాలిన్ మెరుగుపరిచారని, కేరళ ఆరోగ్య రంగంలో విజయన్ చక్కటి సేవలందించారని, ఢిల్లీలో పాఠశాలలు, విద్యారంగ అభివృద్ధికి కేజ్రీవాల్ కృషి చేశారని దీప్కే పేర్కొన్నారు. కాగా గత మే నెలలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలవడంతో సీ జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధికారాన్ని చేపట్టింది. ఈ ఎన్నికల్లో స్టాలిన్ తన సొంత స్థానంలోనూ ఓటమి చవిచూశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పదేళ్ల తర్వాత ఘనవిజయం సాధించగా, వీడీ సతీశన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించడంతో రేఖా గుప్తా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.ఇది కూడా చదవండి: తిరుగుబాటు టీఎంసీ ఎంపీలకు లోక్సభ స్పీకర్ నోటీసులు
ఎన్ఆర్ఐ
నాట్స్ వినూత్న సేవ కార్యక్రమం
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మిస్సోరీ చాప్టర్ సభ్యులు వినూత్నంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా సెయింట్ లూయిస్ ప్రాంతీయ ఫుడ్ బ్యాంకాక్లో జరిగిన ప్రత్యేక ఆహార సేకరణ, ప్యాకేజింగ్ కార్యక్రమంలో నాట్స్ టీమ్ చురుగ్గా పాల్గొని సేవలు అందించింది. పేదలు, నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్స్ వాలంటీర్లు, తెలుగు కుటుంబాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ నార్త్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపర, నాట్స్ మిస్సోరీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాలలతో పాటు చాప్టర్ ప్రతినిధులు మధుసూధన్ దడ్డాల, నరేష్ రాయంకుల తదితరులు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు. తెలుగు సమాజానికి, అలాగే స్థానిక అమెరికన్ సమాజానికి సహాయం చేయడంలో నాట్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా నాట్స్ నాయకులులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆకలితో ఉన్నవారికి బాసటగా నిలవడం ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాట్స్ వాలంటీర్లకు, నాట్స్ సభ్యులకు నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం)
డాలస్లో ‘హర్ ఘర్ తిరంగా’.. మార్మోగిన దేశభక్తి గీతాలు
డాలస్, టెక్సస్: డాలస్ పరిసర ప్రాంతం ఇర్వింగ్ నగరంలో నెలకొనియున్న అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకం వద్ద “హర్ ఘరంగ్ తిరంగా” అనే నినాదంతో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల స్వాగత శుభాకాంక్షలతో భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ముందుగా సంగీత గురు సమీరా శ్రీపాద దర్శకత్వంలో వారి శిష్యులు అమెరికా జాతీయగీతంతో సహా అనేక భారతదేశభక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి “భారతదేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని సర్వం త్యాగం చేసిన అనేకమంది అమరవీరులకు మహాత్మాగాంధీ, నెహ్రు, వల్లభభాయి పటేల్, నేతాజీ, వీర సావర్కార్, భగత్ సింగ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి నేతలు చేసిన త్యాగాలు మరువలేనివి అంటూ ప్రవాస భారతీయలగా అమెరికా దేశ చట్టాలను గౌరవిస్తూ అమెరికా జనజీవన స్రవంతిలో భాగం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. “ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ యల్ జపంటా మాట్లాడుతూ “రెండు ప్రముఖ ప్రజాసామ్య దేశాలైన అమెరికా, భారత్ల మధ్య ధృడమైన సంబంధాలు నెలకొల్పడంలో ప్రవాస భారతీయలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని, ఈ రోజు భారత జాతీయగీతంతో పాటు, అమెరికా జాతీయగీతం కూడా ఆలపించడం సబబుగా ఉందంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు.”ప్రత్యేకఅతిథిగా హాజరైన ఈనాడు దినపత్రిక సంపాదకులు ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ “ప్రవాస భారతీయలు మాతృభూమికి వేల మైళ్ళ దూరంలో ఉన్నా వారి హృదయాలకు భారతదేశం ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటుందని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరదేశంలో విస్తరిస్తూ, భారతదేశ ప్రగతికి తోడ్పడుతున్న వారందరికీ కృతజ్ఞతలు అన్నారు. భారతదేశ విముక్తి కోసం సర్వం త్యాగం చేసిన వేలాదిమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వారికి ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు.గత 79 సంవత్సరాలలో భారతదేశంలో అక్షరాస్యత 12 శాతంనుండి 81 శాతానికి పెరిగిందని, ఒకప్పుడు ఆహార కొరతతో బాధపడిన దేశం ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార ధాన్యాల ఉత్పత్తి దారులలో ఒకటిగా మారిందని, విశ్వవిద్యాలయాల సంఖ్య 20 నుంచి 1, 200కు పైగా పెరిగిందని, విమానాశ్రయాల సంఖ్య 12 నుంచి 166 కు పెరిగిందని, ఫార్మసీ రంగంలో ఎంతో ప్రగతి సాధించి కోవిడ్ సమయంలో ఎన్నో దేశాలకు సైతం కోవిడ్ టీకాలను అందించే స్థాయికి చేరామని అన్నారు. అయితే ఇదంతా నాణానికి ఒక వైపు అని మరో వైపు రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, మెరుగైన వైద్య సేవల కొరత, అవినీతి, నల్లధనం లాంటి సమస్యలతో దేశం సతమతమవుతుందని అన్నారు. భారతదేశ ప్రగతిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో ముఖ్యమని, ఎవరికి తోచిన విధంగా వారు వేర్వేరు రంగాలలో సహకారం అందించాలని కోరారు.”ఆత్మీయఅతిథిగా హాజరైన ప్రముఖ కవి, సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు త్రివర్ణ పతాకంపై ఒక పద్యాన్ని శ్రావ్యంగా గానం చేశారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ సంఘసేవకులు వామరాజు సత్యమూర్తి ప్రవాస భారతీయులందరికి 80వ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకలలో భారతదేశ రక్షణలో సైనికులగా సేవలందించి అమెరికాలో స్థిరపడిన కల్నల్ రాకేష్ శర్మ, కల్నల్ హరవిందర్ బింద్రాలను, అలాగే 8 సంవత్సరాలలోపు పిల్లలకు కొలంబియా దేశంలో నిర్వహించిన చెస్ పోటీలలో అమెరికా దేశంనుండి పాల్గొని పాన్ అమెరికన్ చాంపియన్ గా నిల్చి, సువర్ణ పతకం సాధించిన సరయు తలపనేని ని ఇర్వింగ్ మేయర్ అల్ జపంటా, డా. ప్రసాద్ తోటకూర ఇతర అతిథులు ఘనంగా సన్మానించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కో ఛైర్మన్ తాయబ్ కుండావాలా తన వందన సమర్పణలో ఈ కార్యక్రమం విజయవంతంగావడానికి సహకరించిన సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.బోర్డు సభ్యులు కలై, మురళి వెన్నం, ముర్తుజా, రాజేంద్ర వంకావాలా, తిరుమల్ రెడ్డి, అనంత్ మల్లవరపుతో సహా ఎం.వి.ఎల్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ పూర్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డా. కె. అరవిందరావు, వందలాది ప్రవాస భారతీయులు ఈ స్వాతంత్రదినోత్సవ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం “ఇండియా టుడే” రెస్టారెంట్ వారు అందరికీ రుచికరమైన అల్పాహారం అందజేశారు.
బెర్లిన్లో ఘనంగా భారత్ దివస్ వేడుకలు
బెర్లిన్: జర్మనీలోని భారతీయ ప్రవాసులు ఆగస్టు 16న బెర్లిన్లోని చారిత్రక బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద భారత్ దివస్ను ఘనంగా నిర్వహించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్మనీ నలుమూలల నుంచి భారతీయ సంఘాలు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భారతదేశ ఐక్యత, వైవిధ్యం, గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. తెలంగాణ అసోసియేషన్ చైర్పర్సన్, వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘు చెల్లిగంటి, యూపీ అసోసియేషన్కు చెందిన డాక్టర్ అఖిల్ అగర్వాల్, కాశ్మీరీ సమాజానికి ప్రాతినిధ్యం వహించిన వీణా చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జర్మనీలోని పలు భారతీయ సంఘాలు, కమ్యూనిటీ సంస్థలు చురుకైన సహకారం అందించాయి.ఈ వేడుకలకు జర్మనీలో భారత రాయబారి అజిత్ గుప్తా తన సతీమణితో కలిసి హాజరయ్యారు. భారత రాయబార కార్యాలయానికి చెందిన కాన్సులర్ మంత్రి స్టాలిన్ బాబు చీకట్ల, పర్సనల్ మంత్రి డాక్టర్ మందీప్ సింగ్ తులితో పాటు పలువురు ప్రముఖ అధికారులు, అతిథులు పాల్గొన్నారు.బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద వందలాది మంది భారతీయ ప్రవాసులు ఒకచోట చేరడంతో దేశభక్తి, ఐక్యత, సోదరభావంతో కూడిన ప్రత్యేక వాతావరణం నెలకొంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశంలోని భిన్నత్వాన్ని చాటుతూ, అందరినీ త్రివర్ణ పతాకం కింద ఒక్కతాటిపైకి తీసుకువచ్చాయి.అనంతరం బ్రాండెన్బర్గ్ గేట్ నుంచి శాంతి స్తూపం వరకు యూనిటీ వాక్ నిర్వహించారు. శాంతి, స్నేహం, ఐక్యత, పరస్పర సహకారం అనే సందేశాన్ని ఈ వాక్ ద్వారా చాటారు.జర్మనీలోని భారతీయ సమాజానికి ఈ వేడుక ఒక గర్వించదగిన, చిరస్మరణీయమైన సందర్భంగా నిలిచింది. భారతదేశం పట్ల తమ అనుబంధాన్ని, ఉమ్మడి వారసత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తిని ప్రవాస భారతీయులు ఘనంగా చాటుకున్నారు.చదవండి: సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం
2వ ప్రపంచ యుద్ధం తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్లో
భారత సంతతికి చెందిన 28 ఏళ్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ అర్ష్దీప్ సింగ్ డాంగ్ (Arshdeep Singh Dang), బ్రిటన్ చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAF)లో ఫైటర్ పైలట్గా పట్టా పొందిన తొలి సిక్కు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక సిక్కు యోధుడు ఫైటర్ స్క్వాడ్రన్ నుండి 'వింగ్స్' (Wings) సాధించడం ఇదే తొలిసారి అని RAF తెలిపింది.నార్త్ వేల్స్లోని 'RAF వ్యాలీ'లో శుక్రవారం (ఆగస్టు 14న) జరిగిన వేడుకలో అర్ష్దీప్ సింగ్ పట్టభద్రుడయ్యారు. తన తండ్రిని పైలట్గా చూడాలనేది తాతగారైన సర్దార్ సంతోఖ్ సింగ్ డాంగ్ కల అని, అయితే ఆయన చిన్నతనంలోనే మరణించడంతో ఆ అవకాశం రాలేదని అర్ష్దీప్ తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాతగారి కలను తాను నిజం చేసినట్లు అర్ష్దీప్ వెల్లడించారు.రక్షణ రంగంలో ఫ్రంట్లైన్ ఫైటర్ విమానాలను నడిపేందుకు ఆయన మరో ఏడాది పాటు కఠినమైన శిక్షణ తీసుకోనున్నారు.ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!1998లో చండీగఢ్లో జన్మించిన అర్ష్దీప్, తన ఆరేళ్ల వయసులో కుటుంబంతో కలిసి యూకే (UK) వెళ్లారు. ప్రస్తుతం వారి కుటుంబం ఇంగ్లాండ్లోని సౌత్ ఆల్లో నివసిస్తోంది. ఆయన తండ్రి జగ్దీప్ సింగ్ డాంగ్ (లుధియానా), తల్లి గగన్దీప్ కౌర్ (అమృత్సర్). బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో గణితం మరియు తత్వశాస్త్రం (Mathematics & Philosophy) అభ్యసించిన ఆయన, 2022లో ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేశారు. 2025లో ఫాస్ట్ జెట్ శిక్షణ ప్రారంభించి, అక్టోబర్ 2025లో టెక్సాస్లో సోలో ఫ్లైట్ పూర్తి చేశారు. జులై 2026లో 'వింగ్స్ టెస్ట్'లో ఉత్తీర్ణులయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ పైలట్ ఇంద్రలాల్ రాయ్, హర్దిత్ సింగ్ మాలిక్, స్క్వాడ్రన్ లీడర్ మోహిందర్ సింగ్ పూజ్జీ సహా, బ్రిటిష్ సైనిక విమానయానంలో సేవలందించిన భారతీయ సంతతికి చెందినఈ ఘనత సాధించి భారతీయుల సరసన అర్ష్దీప్ చేరారు.ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం
క్రైమ్
నోటరీ కోసం వెళితే.. చంపేసి బంగారం దోపిడీ
శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీస్ స్టేషన్ సమీపంలో నివసిస్తున్న ఓ మహిళా న్యాయవాది ఇంటికి ఫ్యామిలీ సర్టిఫికెట్ నోటరీ కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈనెల 17న జరిగిన ఈ దురాగతానికి సంబంధించిన వివరాలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బుధవారం వెల్లడించారు. ఆ వివరాలు.. జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన వృద్ధురాలు చింతు చిన్నమ్మడు (74) ఒంటినిండా బంగారం ధరించి ఈనెల 17న నరసన్నపేటలోని మహిళా న్యాయవాది కింతలి ధనలక్ష్మి ఇంటికి వెళ్లింది. ఆమె నుంచి బంగారం దోచుకోవాలనే అత్యా శతో ధనలక్ష్మి తన సోదరుడు బెండి అచ్యుతరావు (స్టాంపు వెండర్), పెద్ద కుమారుడు గణేష్ (న్యాయవాది)తో కలిసి హత్యకు పథకరచన చేసింది. వృద్ధురాలిని వాష్రూమ్లోకి తీసుకెళ్లి సుత్తితో తలపై మోది చంపేసిన అనం తరం మరో ఇద్దరి సాయంతో శవాన్ని గోనె సంచిలో పెట్టి అద్దె కారులో హిర మండలం పిండ్రువాడ బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి తంపర కాలువలో పడేశారు. ధనలక్ష్మి రెండో కుమారుడు మణికంఠ (సాఫ్ట్వేర్ ఇంజినీర్), అచ్యుతరావు కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నారు. ఘాతుకం బయటపడిందిలాహతురాలు చిన్నమ్మడు కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. ఈనెల 11న స్వగ్రామైన అల్లాడపేటకు వచ్చిన ఆమె 17న అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. గ్రామంలో బంధువుల ఇంట్లో పెళ్లి రాటవేసే కార్యక్రమం ఉండటంతో నగలు ధరించి వెళ్లిందని, ఆ తర్వాత ఫ్యామిలీ సర్టిఫి కెట్ నిమిత్తం నోటరీ చేసేందుకు ఈ ఏడాది మేలో పరిచయమైన న్యాయవాది కింతలి ధనలక్ష్మి ఇంటికి వెళ్తానని కుటుంబీకులకు చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ దిశగా జలుమూరు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. ఈ నెల 17న ఉదయం 11.30 గంటలకు నరసన్నపేట పోలీస్స్టేషన్ మీదుగా ఆ వృద్ధురాలు నడుచుకుంటూ సమీపంలోనే ఉన్న న్యాయవాది ధనలక్ష్మి ఇంట్లోకి వెళ్లింది. ఆ ఫుటేజీలో వృద్ధురాలు తిరిగి రావడం కనిపించలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో న్యాయవాది ఇంటికి ఓ కారు వచ్చింది. సీడీఆర్ విశ్లేషణతో పాటు డాగ్స్కా్వడ్ బృందంతో తనిఖీలు చేయగా న్యాయవాది ఇంటి పరిసరాల్లోనే తిరగడాన్ని పోలీసులు గుర్తించారు. కారు ట్రాకింగ్ హిస్టరీ బట్టి పోలీసులు నిందితులను విచారించగా హత్యోదంతం బయటపడింది. న్యాయవాదులు కావడంతో చేసిన నేరాలనుంచి ఎలా తప్పించుకోవాలో ప్రణాళిక రచించి కారును కెమికల్ లిక్విడ్తో శుభ్రపరిచారు. రక్తపు ఆధారాలు, ఇతర కీలకమైనవి చెరిపేశారు. ఆ న్యాయవాది జంట హత్యల కేసులో నిందితురాలునిందితుల్లో ఒకరైన ధనలక్ష్మి 2008లో జరిగిన జంట హత్యల కేసులో నిందితురాలని, అప్పుడు కూడా బంగారం కోసం హత్య చేశారని ఎస్పీ చెప్పారు. నిందితుల నుంచి రూ.38 లక్షల విలువైన 24 తులాల బంగారం, 6 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఘోర రోడ్డు ప్రమాదం
కోదాడ, కోదాడ రూరల్/సాక్షిప్రతినిధి, విజయవాడ: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురై సగం రోడ్డుమీద, సగం డివైడర్పై ఆగిపోయిన ట్రాలీ లారీని గమనించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్డ్రైవర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (టీఎస్ 08యుఎల్ 5112) 42 మంది ప్రయాణికులతో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఏలూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సూర్యాపేట సమీపంలోని చార్జింగ్ స్టేషన్ వద్ద ఆపి బస్సు చార్జింగ్ పెట్టుకున్నారు. ఈ సమయంలో మొదటి డ్రైవర్ డ్యూటీ దిగి రెండో డ్రైవర్కు బస్సు అప్పగించాడు. హైదరాబాద్ నుంచి విజయవాడవైపు ఐరన్ పిల్లర్లలోడ్తో వెళ్తున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కోదాడ శివారులో అదుపుతప్పి డివైడర్పైకి సగం వెళ్లి ఆగింది. ఆ తర్వాత 48 నిమిషాలకు కోదాడ శివారుకు చేరుకున్న బస్సు డ్రైవర్ ట్రాలీ లారీని గమనించకుండా వెనుకవైపు నుంచి వేగంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ట్రాలీ లారీలో ఉన్న ఐరన్ పిల్లర్లు బస్సులోకి చొచ్చుకురావడంతో బస్సు కుడివైపు భాగం పూర్తిగా దెబ్బతిని డ్రైవర్ సీటు వెనుక సీట్లలో ఉన్న యాసారపు చిన్ని(32), బొల్లిపోగు మేరీ జ్యోత్స్న (29), సూరవరపు షకీనా(24), చెన్నకేశవుల నాగేంద్రబాబు(31), పడికిటి లక్ష్మీతేజ (30), కొండూరు భావన వర్ష(23) అక్కడిక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కోదాడ రూరల్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణారెడ్డి, పలువురు ఎస్సైలు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ ఘటనాస్ధలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. కోదాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డు మీద నిలిచిపోయిన ట్రాలీ లారీతోనే..కోదాడ దాటిన తరువాత కిలోమీటరు దూరంలో ఇనుప పిల్లర్ల లోడ్తో వెళుతున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ప్రమాదానికి గురై డివైడర్మీదకు దూసుకెళ్లింది. సగం టైర్లు రోడ్డుమీద, సగంటైర్లు డివైడర్పై ఉన్నాయి. లారీ డ్రైవర్ ఎలాంటి హెచ్చరిక బోర్డులూ పెట్టకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదం జరగడానికి అరగంట ముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కూడా ట్రాలీ లారీని ఢీకొట్టబోయి తృటిలో తప్పించుకుంది. ఆ బస్సుకు స్వల్పంగా గీతలు పడ్డాయి.ఆ బస్సు డ్రైవర్ తన బస్సును పక్కకు ఆపి ట్రాలీ లారీ వద్దకు వచ్చి డ్రైవర్ను తీవ్రంగా హెచ్చరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే హెచ్చరిక బోర్డులు పెట్టాలని గట్టిగా చెప్పి వెళ్లిపోయినట్టు సమాచారం. ఆ బస్సు వెళ్లిన 15 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్తో పాటు లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టంమీద వెలికితీశారు. కోదాడ వైద్యశాలకు తరలించారు. పోస్ట్మార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.మృతుల్లో ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులే..మృతి చెందిన ఆరుగురిది ఉమ్మడి కృష్ణా జిల్లా. వీరిలో యాసరపు చిన్ని, భావనవర్ష, షకీనా మినహా మిగిలిన ముగ్గురూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. షకీనా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళ్లి తిరిగి వస్తూ మృత్యుఒడికి చేరారు.క్షతగాత్రుల వివరాలు» విజయవాడకు చెందిన యాసరపు సుధాకర్, కేతు రమణమ్మ, ఆదిలాబాద్కు చెందిన రాథోడ్ విశాల్లకు గాయాలు కావడంతో వారు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు, ఉన్నం యశ్వంత్ సూర్యాపేట ఏరియా వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు.» తాడేపల్లిగూడెంకు చెందిన పెద్దోజు భవానీకి తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. » విజయవాడకు చెందిన గరికపాటి మనోహర్, ఏలూరుకు చెందిన బండి చందన, సాయిల అనిల్కుమార్, సుంకర విజయలక్ష్మి, కరిషపోగు వంశీ, ఆకుల నవీన్కుమార్, జి.వి. ధృవకుమార్, ఎం.జేసన్కుమార్ విజయవాడలోని పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. రేపల్లి వేదవ్యాస్ ఏలూరు ఆంధ్ర వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు. గాయపడిన వారిలో వరంగల్కు చెందిన జి.అవినాష్ ఉండగా.. ఆయన ఎక్కడ చికిత్సపొందుతున్నాడన్న వివరాలు తెలియరాలేదు.అన్నయ్యకు రాఖీకట్టాలని... మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రమాదంలో మరణించిన కొండూరు భావన వర్ష(23)ది విజయవాడ. హైదరాబాద్లో హెచ్ఆర్ ఉద్యోగం చేస్తున్న ఆమెకు తండ్రి కృష్ణారావు, తల్లి సుభాíÙణి ఉన్నారు. వీరు అజిత్సింగ్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో జ్యూయలరీ వర్క్షాపు ఉంది. దీంతో మంగళవారం మకాం అడవినెక్కలంకు మార్చారు. భావన వర్ష సోదరుడు రెశ్వంత్ సౌదీలో పనిచేస్తున్నారు. ఆయన రాఖీ పండగ కోసం వస్తుండడంతోపాటు తనకు బెంగళూరులో ఉద్యోగం రావడంతో కొన్ని రోజులు తల్లిదండ్రులతో ఉండాలని భావించిన భావన వర్ష చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి విజయవాడకు బయలుదేరారు. ముందు వేరే బస్సుకు టికెట్ బుక్ చేసుకున్న ఆమె ఆ బస్సు వెళ్లిపోవడంతో ప్రమాదానికి గురైన బస్సు ఎక్కారు. రూమ్మేట్స్ బుధవారం వెళ్లొచ్చుకదా అన్నా.. సోదరుడికి రాఖీ కట్టాలని, అన్నయ్య వచ్చేటప్పటికే తాను అక్కడ ఉండాలని ఉత్సాహంగా బయలుదేరారు. మార్గమధ్యంలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్సులో విజయవాడ మధురానగర్లోని తాతయ్య బ్రహ్మయ్య ఇంటి వద్దకు తీసుకురావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అమ్ములూ ఒక్కసారి కళ్లుతెరువమ్మా అంటూ ఆమె తల్లి, పెద్దమ్మలు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. సోదరుడు రెశ్వంత్ సౌదీ నుంచి వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.చేతికందివచ్చిన కొడుకు అనంతలోకాలకు...పమిడిముక్కల: చెన్నకేశవుల నాగేంద్రబాబు(31)ది కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి. హైదరాబాద్లో ఆరేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఈయన తండ్రి నరసింహారావు, తల్లి విజయలక్ష్మి. నాగేంద్రబాబుకు ఓ సోదరి ఉంది. ఆమెకు ఇటీవలే వివాహం చేశారు. ప్రస్తుతం బాబాయి కొడుకు(తమ్ముడు) పెళ్లికని హైదరాబాద్ నుంచి ప్రైవేటు బస్సులో ఉత్సాహంగా బయలుదేరిన నాగేంద్రబాబు మార్గమధ్యంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అసువులుబాశాడు. లంకపల్లికి తీసుకొచ్చిన నాగేంద్రబాబు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. చేతికందివచ్చిన కొడుకు అండగా ఉన్నాడనుకుంటున్న సమయంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని, ఇక తమను ఎవరు పట్టించుకుంటారంటూ కన్నీరుమున్నీరయ్యారు. చిన్న రైతు కుటుంబమైనా బాగా చదివించుకున్నామని, రోజూ ఫోన్ చేసి తమ ఆరోగ్య వివరాలు అడిగేవాడని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని రోదించారు.ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి... పటమట(విజయవాడతూర్పు): బీటెక్ చదివిన సూరవరపు షకీనా(24) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం సోమవారం హైదరాబాదు వెళ్లారు. ఇంటర్వ్యూ బాగా చేశానని, తనకు ఉద్యోగం తప్పకుండా వస్తుందని మంగళవారం రాత్రి తన భర్తకు ఫోన్ చేసి సంతోషంగా చెప్పింది. ఉద్యోగం సాధిస్తే తను జీవిత లక్ష్యాన్ని చేరుకున్నట్లేనని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆ ఆనందం అంతలోనే ఆవిరైందని ఆమె కుటుంబ సభ్యులు గుండలవిసేలా విలపిస్తున్నారు. భీమవరానికి చెందిన షకీనాకు రాజమండ్రికి చెందిన సాయికృష్ణతో గత ఏడాది వివాహం జరిగింది. సాయి కృష్ణ విజయవాడ గురునానక్ కాలనీలోని ఓ ప్రైవేటు కన్సల్టెన్సీలో ఆర్కిటెక్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వీరు పెళ్లయిన రెండునెలల తర్వాత విజయవాడ పటమట ఆర్ఆర్ గార్డెన్స్లోని కనకదుర్గ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. రోజూ తమతో కలుపుగోలుగా ఉండే షకీనా మరణించడంతో స్థానికులూ కంటతడి పెట్టారు.రోడ్డు ప్రమాదానికి గురైన తండ్రిని చూసి వస్తూ...గన్నవరం: రోడ్డు ప్రమాదానికి గురైన తండ్రిని చూసేందుకు హైదరాబాద్కు వెళ్లి తిరిగి వస్తున్న ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన యాసారపు చిన్ని(32) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తేలప్రోలు గ్రామంలోని సుందరయ్యనగర్లో కుటుంబంతోపాటు చిన్ని నివసిస్తుంది. ఆమె భర్త సుధాకర్ తేలప్రోలు సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్. వీరికి ఇద్దరు కుమారులు. పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. భర్త, పిల్లలతో ఆనందంగా జీవిస్తున్న ఆమె తండ్రి హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డాడు. తండ్రిని చూసేందుకు పదిహేను రోజుల క్రితం చిన్ని హైదరాబాద్ వెళ్లారు. ఆమెను తీసుకువచ్చేందుకు భర్త సుధాకర్ సోమవారం వెళ్లారు. ఇద్దరూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గ్రామానికి బయలుదేరారు. కోదాడ సమీపంలో జరిగిన ప్రమాదంలో చిన్ని అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త సుధాకర్ గాయాలతో బయటపడ్డాడు. చిన్ని మృతితో సుందరయ్యకాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నతల్లి మృతి చెందిన విషయం తెలుసుకుని ఇద్దరు చిన్నారులు బోరున విలపించారు. వారిని ఆపడం ఎవరి తరమూ కాలేదు.తేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువుమొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ జయప్రకాష్ నగర్కు చెందిన పడికిటి లక్ష్మీతేజ(30) హైదరాబాద్లో అమెజాన్ కంపెనీలో ఐదేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆమెకు తండ్రి రామ్ప్రసాద్, తల్లి కవిత, తమ్ముడు దేవివరప్రసాద్ ఉన్నారు. మిలాద్ ఉన్నబీ, రాఖీ, వీకెండ్ వరుస సెలవులు కావడంతో ఆమె తమ్ముడికి రాఖీ కట్టేందుకు విజయవాడకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఆనందంగా బయలుదేరారు. మంగళవారం రాత్రి తండ్రికి ఫోన్ చేసి బుధవారం ఉదయం ఆరు గంటలకల్లా విజయవాడలో ఉంటానని సంతోషంగా చెప్పింది. కూతురి కోసం ఏడు గంటల వరకు వేచి చూసిన తల్లిదండ్రులు కూతురుకు ఫోన్ చేశారు. ఫోన్ కలవకపోవడంతో ఏం జరిగిందో తెలీక కంగారు పడ్డారు. ఇంతలో కోదాడ సమీపంలో ప్రమాదం జరిగిందని టీవీలో వార్తలు ప్రసారం కావడం, మృతుల జాబితాలో లక్ష్మీతేజ పేరు ఉండడంతో తండ్రి రాంప్రసాద్ హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు. అప్పటికే లక్ష్మితేజ మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురిలో ఉంచారు. రాత్రి ఫోన్ చేసి ఉదయానికి వస్తాను నాన్న అని చెప్పిన నా కూతురిని ఇలా చూస్తానని అనుకోలేదని రాంప్రసాద్ కన్నీరుమున్నీరయ్యారు. ఇంటికి తీసుకొచ్చిన కూతురు మృతదేహంపై పడి తల్లి కవిత విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఇంటికి వచ్చినప్పుడల్లా నీ కాళ్ల పట్టీలు కావాలమ్మా.. అని అడిగేదానివి కదా.. లే అమ్మా పట్టీలు ఇస్తాను. తమ్ముడికి రాఖీ కడుదువుగానీ అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. గత రెండేళ్ల నుంచి లక్ష్మితేజకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నామని, ఈ ఏడాది ఎలాగైనా కల్యాణం జరిపించాలని అనుకున్నామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది.ఏడాదిన్నర బిడ్డను చూసేందుకు వస్తూ..గుణదల(విజయవాడ తూర్పు)/పెనమలూరు: విజయవాడ అరుళ్నగర్కు చెందిన బొల్లిపోగు మేరీజ్యోత్స్న (29) తండ్రి సాల్మన్ రాజు విజయవాడ లో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి, తల్లి నిర్మలా కుమారి గృహిణి. రెండేళ్ల క్రితమే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వంశీతో పెళ్లయింది. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఇవాన్ ఉన్నాడు. బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, దీనికోసం తానూ కష్టపడతానని జ్యోత్స్న భర్తకు చెప్పారు. దీంతో హైదరాబాద్లోనే కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేరారు. బిడ్డను విజయవాడ కానూరు తులసీనగర్లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దే ఉంచారు. ఆమెకు తమ్ముడు రాహుల్ కూడా ఉన్నాడు ఇటీవల వర్క్ఫ్రం హోం చేస్తున్న జ్యోత్స్న అప్పుడప్పుడు హైదరాబాద్లోని కార్యాలయానికి వెళ్లివస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన ఆమె మంగళవారం రాత్రి తిరిగి విజయవాడ కానూరుకు ట్రావెల్ బస్సులో బయలుదేరారు. బిడ్డను చూడాలని బయలుదేరే ముందు భర్తతో చెప్పారు. అయితే మార్గమధ్యంలోనే కోదాడ వద్ద జరిగిన ప్రమాదంలో మరణించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బిడ్డను చూడాలని ఆశగా బయలుదేరిందని, అతడి భవిష్యత్తు కోసం తానూ కష్టపడతానని చెప్పిందని, సాఫీగా సాగుతున్న జీవితం ఒక్కసారిగా తల్లకిందులైందని ఆమె భర్త వంశీ, తల్లిదండ్రులు విలపించారు. విజయవాడ అరుళ్ నగర్కు తరలించి అంతిమ సంస్కారాలు చేశారు. ఇదిలా ఉంటే తెల్లవారు జామున 4.48 గంటలకు ఫోన్ మెసేజ్ అలర్ట్తో కోదాడ సమీపంలో బస్సు ప్రమాదానికి గురైందని తెలిసిందని, వెంటనే ట్రావెల్స్ సంస్థ టోల్ఫ్రీకి ఫోన్ చేస్తే స్పందించలేదని జ్యోత్స్న సోదరుడు రాహుల్ విమర్శించాడు.తీవ్ర విషాదకరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్సాక్షి, అమరావతి: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించి, విషమ పరిస్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
క్షుద్ర పూజలు, చిన్నారి బలికి యత్నం!
కాట్రేనికోన: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చిర్రయానం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. కొంతమంది వ్యక్తులు ఓ చిన్నారిని బలిచ్చేందుకు తీసుకొచ్చారని తెలియడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. నిందితులను నిలదీస్తే చిన్నారిని తీసుకుని నలుగురు పరారవ్వగా, మహిళతోపాటు ఐదుగురిని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. చిర్రయానం సముద్ర తీరంలో కాలభైరవ స్వామి ఆలయం ఉంది. దీనికి సుమారు కిలోమీటరు దూరంలో తీరాన సరుగుడు, తుమ్మ చెట్లు దట్టంగా ఉన్నాయి. ఆ ప్రాంతానికి మంగళవారం రాత్రి 11 గంటలకు ఓ మహిళతోపాటు తొమ్మిది మంది గుర్తు తెలియని వ్యక్తులు కొత్త కారు, ఏపీ 05 ఈఈ 8557నంబరు గల మోటార్ సైకిల్పై చేరుకున్నారు. వీరిని అక్కడే ఉన్న ఇద్దరు గ్రామస్తులు ‘ఎవరు మీరు’ అంటూ ప్రశ్నించారు. తమది కోతుల చెరువు అని, మల్లాడి ధన కిషోర్ తెలుసా అని ఎదురు ప్రశ్నించాడు. అదే సమయంలో తోటలో మరి కొంత మంది ఉన్నట్లు గుర్తించిన ఇద్దరు గ్రామస్తులు లైట్లు వేసుకుని అక్కడకు వెళ్లారు. వారిని చూసి, అక్కడున్న నలుగురు వ్యక్తులు పదేళ్లలోపు పాపను తీసుకుని ఒక్కసారిగా పరారయ్యారు. ఈ విషయంపై వారిద్దరూ మిగిలిన గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆలయం వద్దకు చేరుకుని కారును అడ్డుకుని మహిళతోపాటు ఐదుగురు వ్యక్తులను గట్టిగా నిలదీశారు. దీంతో గుప్త నిధుల కోసం పూజలు చేసేందుకు వచ్చామని ఆ మహిళ చెప్పింది. ఆ కారులో కొబ్బరి కాయలు పూజా సామగ్రి ఉన్నాయి. అదే సమయంలో కత్తి పట్టుకుని ఉన్న ఓ వ్యక్తి మోటారు సైకిల్పై అక్కడి నుంచి పారిపోయాడు. తోటలో ఉన్న నలుగురు వ్యక్తులతోపాటు చిన్నారిని కూడా కారు వద్దకు తీసుకుని రావాలని గ్రామస్తులు పట్టుబట్టారు. తమ వెనుక ప్రజాప్రతినిధులున్నారంటూ నిందితులు బెదిరించడంతో గ్రామస్తులు వారిని పోలీసులకు అప్పగించారు.అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వారిని పంపేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఆ ప్రాంతంలో చాకు, రెండు పారలు, కొత్త బట్టలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరి కాయలు, పేలాలు, పేడ, తాళ్లు, సంచులు, కల్లు, కూల్ డ్రింక్, మంచి నీటి బాటిళ్లను గుర్తించామని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై కాట్రేనికోన ఎస్సై అవినాష్ను వివరణ కోరగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని చెప్పారు.
చిలూకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
సాక్షి, పల్నాడు: చిలకలూరిపేట వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా.. వాళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కొండమంజులూరు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ఆటోను విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన బస్సు ఆటోను బలంగా ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వాళ్లంతా వేలూరు వాసులుగా పోలీసులు నిర్ధారించారు.సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ, గంగమ్మ, మరియమ్మ, సువార్తగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుతాసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదానికి కారణాలు గుర్తించే పనిలో ఉన్నారు.ఇదిలా ఉంటే.. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిన్న వేకువ జామున ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఐరన్ లోడ్తో వెళ్తున్న లారీ రోడ్డు మధ్యలో ఆగిపోగా.. మితిమీరిన వేగంతో వెళ్లిన బస్సు దాన్ని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తేలింది.
వీడియోలు
విశాఖ రేవ్ పార్టీలో టీడీపీ నేతలు రచ్చ.. నాగార్జున యాదవ్ స్టాంగ్ రియాక్షన్
కైలాస యాత్రికులపై ప్రకృతి పగ.. భారతీయ యాత్రికుల జాడెక్కడ ?
23 రోజుల తర్వాత జాడ లభ్యం.. 7 మంది మత్స్యకారులు సేఫ్..!
Shocking Video: ప్రాణాల కోసం పరుగులు.. నేపాల్ లో భయానక దృశ్యాలు..
జగనన్న ఇచ్చిన హామీతోనే మాకు ఇంత దైర్యం వచ్చింది
విశాఖలో రేవ్ పార్టీ.. అమ్మాయిల కోసం కొట్టుకున్న టీడీపీ నేతలు
విడదల రజిని పరామర్శ
సరదా తీర్చేస్తాం.. కంగారుపడకండి..! టీడీపీకి కాసు మహేష్ రెడ్డి వార్నింగ్
బస్సు-ఆటో ఢీ.. 7 మంది మృతి
బాబు పతనం స్టార్ట్.. TDP కి కోలుకోలేని దెబ్బ.. పోలీసులే అడ్డంగా ఇరికించారు!

