అదుపు తప్పిన డ్రోన్: పరిగి ఎమ్మెల్యేకు గాయాలు
వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్లలో డ్రోన్ ట్రయల్రన్లో అపశ్రుతి చోటు చేసుకుంది. డ్రోన్ ఎగరేసే సమయంలో అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి కాలికి గాయమైంది. డ్రోన్ రెక్కలు తెగడంతో ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరికి గాయాలయ్యాయి. తిరుమలపూర్ వెంకటయ్య గౌడ్ కాలుకు , రాంపూర్ సర్పంచు తిరుపతయ్యకు చేతికి గాయాలయ్యాయి. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ట్రాయల్ రన్ చేస్తుండగా ఒక్కసారిగా డ్రోన్ ఒక్కసారిగా అదుపు తప్పింది. నేరుగా ఎమ్మెల్యే మీదకి వచ్చేసింది డ్రోన్. దాంతో ఎమ్మెల్యే కాలికి డ్రోన్ రెక్కలు తగలగా, మరొకరికి చేతి బ్రొటన వేలు తెగిపోయినట్లు తెలుస్తోంది. మరొకరికి కాలికి తీవ్ర రక్తగాయమైనట్లు సమాచారం.సబ్సిడీపై పంట పొలాలకు మందులు పిచికారి చేసే డ్రోన్ను నిరుద్యోగ యువకుడు తెచ్చుకున్నాడు. ఆ డ్రోన్ను ప్రారంభించడానికి వెళ్లారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి. డ్రోన్ ఆపరేటింగ్లో ఇబ్బందులు తలెత్తాయి.
తెలంగాణలో పలుచోట్ల వడగండ్ల వాన బీభత్సం
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల వడగండ్ల వాన బీభత్సం స్పష్టించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాలతో పాటు నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో వడగండ్ల వాన కురిసింది. నిజామాబాద్లో పలు చోట్ల గంట పాటు వడగండ్ల వాన కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, కొండూరు, మైలారం, పెద్ద వాల్గోట్ , చిన్న వాల్గోట్, భీం గల్లో వడగండ్ల వానతో జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. అకాల వర్షంతో అరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక హైదరాబాద్లో పలు చోట్ల వడగండ్ల వాన పడింది. ప్రధానంగా సుచిత్రా సర్కిల్, కొంపల్లి పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్, చందానగర్, చింతల్, సూరారం, దుండిగల్లో కూడా వడగండ్ల కురిసింది. భారీ వర్షానికి కొన్ని చోట్ల వడగండ్లు ఇంట్లోకి సైతం వచ్చి పడ్డాయి. వాతావరణ మార్పులతో తెలంగాణలో పలుచోట్ల అకాల వర్షాలు పడతాయని ముందుగానే అధికారులు హెచ్చరించారు. రేపు, ఎల్లుండి కూడా తెలంగాణలో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారుల ప్రకటన బట్టి తెలుస్తోంది.
ఇల్లు.. ఎలాంటి డబ్బుతో కడుతున్నారు?
సాధారణంగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే అది వారి కష్టార్జితం లేదా బ్యాంకు రుణాల ద్వారా పొందిన సొమ్ము అయి ఉండాలి. కానీ, కొందరు నేరస్థులు డ్రగ్స్ రవాణా, అవినీతి లేదా ఇతర అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన నల్లధనాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెడుతుంటారు.రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుడికి చెందిన కోటి రూపాయల విలువైన ఇంటిని అధికారులు సీజ్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో, అక్రమ సంపాదనతో ఇళ్లు నిర్మిస్తే ఎదురయ్యే పరిణామాలు, చట్టపరమైన నిబంధనలపై ప్రత్యేక కథనం.ఆ ఇల్లు ఏ డబ్బుతో కట్టారు?నాగౌర్ కేసులో నిందితుడు గోవింద్ రామ్ అలియాస్ గోవింద్ జాట్, అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన డబ్బుతో తన నివాసాన్ని నిర్మించాడు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) యాక్ట్ ప్రకారం, ఇలాంటి మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా అక్రమమైనది. పోలీసులు జరిపిన విచారణలో, సదరు నిందితుడు తన నేరపూరిత ఆదాయాన్ని దాచడానికి ఆ ఆస్తిని భార్య పేరిట రిజిస్టర్ చేసినట్లు తేలింది.ఇంటి నిర్మాణ నిధులపై నిబంధనలు ఏమిటి?భారతదేశంలో ఆస్తుల కొనుగోలు లేదా నిర్మాణం విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. భారీ వ్యయంతో కూడిన నిర్మాణాలకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయో యజమాని నిరూపించాల్సి ఉంటుంది. ఒకరు డబ్బు చెల్లించి, మరొకరి పేరు మీద (భార్య, పిల్లలు లేదా ఇతరులు) ఆస్తిని కొనుగోలు చేస్తే, ఆ నిధులకు సరైన లెక్క లేని పక్షంలో దానిని 'బినామీ' ఆస్తిగా పరిగణిస్తారు. ఎన్డీపీఎస్ సెక్షన్ 68 (E) ప్రకారం.. మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులు తమ నేరాల ద్వారా ఆర్జించిన డబ్బుతో కొన్న ఆస్తులను గుర్తించి, వాటిని స్తంభింపజేసే అధికారం పోలీసులకు, కేంద్ర సంస్థలకు ఉంటుంది.భవిష్యత్తులో స్వాధీనం చేసుకుంటారా?అవును, అక్రమ సొమ్ముతో నిర్మించిన ఆస్తులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అలాంటి ఇళ్లను ప్రభుత్వాలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ప్రాథమిక ఆధారాలు లభించిన వెంటనే ఆ ఆస్తిని ఎవరికీ విక్రయించకుండా లేదా బదిలీ చేయకుండా పోలీసులు స్తంభింపజేస్తారు. కోర్టులో నేరం నిరూపితమైతే, సదరు ఆస్తిని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. నాగౌర్ కేసులో కూడా ఎస్పీ రోషన్ మీనా తెలిపిన వివరాల ప్రకారం, సదరు నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది.కొన్ని రాష్ట్రాల్లో అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నేరస్థులు నిర్మించిన కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కట్టుకోవడం గౌరవం. కానీ, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిర్మించిన 'సౌధాలు' ఎంతో కాలం నిలవవు.ఇదీ చదవండి: హైదరాబాద్లో రియల్ బూమ్.. ఇప్పుడు ఇక్కడే..
‘హలో.. పోలీస్ స్టేషనా? నా కూతుళ్లను చంపేశాను సర్’
కాన్పూర్: కన్న కుమార్తెలన్న ప్రేమ కూడా లేదు. అభం శుభం తెలియని పసివాళ్లన్న జాలి కూడా లేకుండాపోయింది. రాక్షసుడిలా ప్రవర్తించాడు. తన ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు. ఆ తర్వాత, పోలీసులకు ఫోన్ చేసి తన కూతుళ్లను హత్య చేశానని పోలీసులకు చెప్పాడు.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. శశి రంజన్ మిశ్రా (48) తన 11 సంవత్సరాల కవల కూతుళ్లను పదునైన ఆయుధంతో గొంతులు కోసి హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున అతని ఫ్లాట్లో జరిగింది. శశి రంజన్ మిశ్రా మెడికల్ రిప్రెజెంటేటివ్గా పనిచేస్తుంటాడు.బిహార్కు చెందిన అతను భార్య రేష్మా, జంట కూతుళ్లు రిద్ధి, సిద్ధి, కుమారుడు (6)తో నివసిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని శశి రంజన్ మిశ్రా అనుమానించాడు. తరచుగా ఆమె కుమారుడితో ఉండాలని, తాను కూతుళ్లను చూసుకుంటానని చెప్పేవాడు.రేష్మా తెలిపిన వివరాల ప్రకారం.. శశి డిప్రెషన్తో బాధపడుతున్నాడు. ఇంట్లో అనేక సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. కూతుళ్ల గదుల్లోకి ఆమెను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. శనివారం రాత్రి భోజనం తర్వాత శశి కూతుళ్లను నిద్రపొమ్మన్నాడు. రాత్రి 2.30 గంటల సమయంలో ఒక కూతురిని బాత్రూమ్కు తీసుకెళ్లి, తిరిగి గదికి వచ్చి లైట్లు ఆపేశాడని ఆమె తెలిపింది. రెండు గంటల తర్వాత అతను పోలీసులకు కాల్ చేసి తాను హత్య చేశానని తెలిపాడు. ఫ్లాట్కు చేరుకున్న పోలీసులు ఇద్దరు బాలికలు రక్తపు మడుగులో కనపడ్డారు. కాగా, పశ్చిమ బెంగాల్కు చెందిన రేష్మా కాన్పూర్లో బ్యూటీ పార్లర్లో పని చేస్తూ శశిని కలిసింది. 2014లో వారి వివాహం జరిగింది. “శశిని అరెస్ట్ చేశాం, కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారని చెప్పారు.
'క్యాచ్లు జారవిడవడం మా కొంపముంచింది’
ఎట్టకేలకు బోణీ కొట్టిన కేకేఆర్.. రాజస్తాన్పై విజయం
Hyd: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
శ్రీనగర్లో అమెరికా వాసి అరెస్ట్.. రీజన్ ఇదే
భర్తతో కాజల్ సెలబ్రేషన్స్.. చిత్రమైన డ్రస్లో మానుషి
IPL 2026: పంజాబ్ వర్సెస్ లక్నో అప్డేట్స్
‘బుచ్చయ్య చౌదరి మతి గతి తప్పి మాట్లాడుతున్నారు’
రేసింగ్లో విషాదం.. ఏడు కార్లు ఒకదానితో ఒకటి ఢీ!
అజింక్య రహానే చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్బాస్' ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా
రేపే గ్రహకూటమి.. ఈ 5 రాశుల వారికి తిరుగులేదు
అమ్మలా మోసి.. నాన్నలా కాచి
రుతుపవనాల దగా?
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో
ఆసియాకు కొత్త కుబేరుడు.. ముఖేష్ అంబానీ నెం.2
సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
గేమ్ చేంజర్ X నేమ్ చేంజర్
మీరు నెత్తిన పెట్టుకున్న ఈశ్వరన్ జైలుకెళ్లాడు.. సింగపూర్ ఎవరి దెబ్బకు భయపడిందో అందరికీ తెలుసు!!
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
సంచలనం.. వైభవ్ సూర్యవంశీకి రూ.150 కోట్లు!?
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా
అతడి కోసం ఢిల్లీ విరాట్ కోహ్లిని వద్దనుకుంది: సెహ్వాగ్
T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం!
ట్రంప్, మునీర్ దోస్తీ.. అమెరికా నిఘా వర్గాల్లో టెన్షన్
కళ్లు చెమర్చే దృశ్యం.. హృదయాన్ని తాకిన చిన్నారి వీడియో
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
శుభవార్త చెప్పిన తెలుగు హిట్ సీరియల్ హీరోయిన్
'క్యాచ్లు జారవిడవడం మా కొంపముంచింది’
ఎట్టకేలకు బోణీ కొట్టిన కేకేఆర్.. రాజస్తాన్పై విజయం
Hyd: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
శ్రీనగర్లో అమెరికా వాసి అరెస్ట్.. రీజన్ ఇదే
భర్తతో కాజల్ సెలబ్రేషన్స్.. చిత్రమైన డ్రస్లో మానుషి
IPL 2026: పంజాబ్ వర్సెస్ లక్నో అప్డేట్స్
‘బుచ్చయ్య చౌదరి మతి గతి తప్పి మాట్లాడుతున్నారు’
రేసింగ్లో విషాదం.. ఏడు కార్లు ఒకదానితో ఒకటి ఢీ!
అజింక్య రహానే చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్బాస్' ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా
రేపే గ్రహకూటమి.. ఈ 5 రాశుల వారికి తిరుగులేదు
అమ్మలా మోసి.. నాన్నలా కాచి
రుతుపవనాల దగా?
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో
ఆసియాకు కొత్త కుబేరుడు.. ముఖేష్ అంబానీ నెం.2
సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
గేమ్ చేంజర్ X నేమ్ చేంజర్
మీరు నెత్తిన పెట్టుకున్న ఈశ్వరన్ జైలుకెళ్లాడు.. సింగపూర్ ఎవరి దెబ్బకు భయపడిందో అందరికీ తెలుసు!!
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
సంచలనం.. వైభవ్ సూర్యవంశీకి రూ.150 కోట్లు!?
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా
అతడి కోసం ఢిల్లీ విరాట్ కోహ్లిని వద్దనుకుంది: సెహ్వాగ్
T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం!
ట్రంప్, మునీర్ దోస్తీ.. అమెరికా నిఘా వర్గాల్లో టెన్షన్
కళ్లు చెమర్చే దృశ్యం.. హృదయాన్ని తాకిన చిన్నారి వీడియో
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
శుభవార్త చెప్పిన తెలుగు హిట్ సీరియల్ హీరోయిన్
ఫొటోలు
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)
చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్ (ఫొటోలు)
ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)
కంట్రీ క్లబ్లో గ్రాండ్గా ఫ్యాషన్ షో (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)
ముంబైలో INCA అవార్డ్స్.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)
సినిమా
రూ.4500 జీతానికి పని చేస్తున్న స్టార్ హీరో కొడుకు
ఆ యువకుడి తండ్రి ఓ స్టార్ హీరో. కోట్ల ఆస్తి ఉంది. సినిమాల్లోకి వస్తానంటే.. దర్శకనిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కడతారు. కానీ ఇవన్నీ వదులుకోని ఓ సాధారణ యువకుడిలా జీవితం గడుపుతున్నాడు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు అరవ్ భాటియా. 24 ఏళ్ల వయసు ఉన్న ఈ యువకుడు.. అనుకుంటే ఈ పాటికే హీరో అయిపోయేవాడు. కానీ నటన అంటే ఆయనకు ఇష్టం లేదు. ఫ్యాషన్ రంగంలో రాణించాలనేది ఆయన కల. అందుకే ప్రస్తుతం ఆ ఫీల్డ్లో రూ. 4500 జీతానికి పని చేస్తున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ వెల్లడించారు.‘అరవ్కి పని చేయడం ఇష్టం. సినిమా రంగంలోకి రావాలనుకోవట్లేదు. ప్రస్తుతానికి అతనికి ఎలాంటి ప్లాన్స్ లేవు కానీ ఫ్యాషన్ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఆ ఫీల్డ్లో రూ. 4500 జీతానికి పని చేస్తున్నాడు. గ్రామాలు తిరుగుతూ ఫ్యాషన్పై అధ్యయనం చేస్తున్నాడు. హీరో కొడుకునని ఎక్కడ చెప్పుకోడు. నేను కూడా వాడిని సినిమాల్లోకి రావాలని ఫోర్స్ చేయను. తనకు నచ్చిన పని చేసుకోమని చెబుతాను. తండ్రిగా వాడికి ఎలాంటి క్లాసులు తీసుకోని కానీ.. ‘ఎవరికీ హానీ చేయొద్దు.. బాధ పెట్టొద్దు’ అని మాత్రం చెబుతాను’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు.
లెజెండరీ డైరెక్టర్ ఇలా అయిపోయారేంటి? వైరల్ వీడియో
తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు. నాలుగు నెలల క్రితం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చేర్చగా తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన్ని ఒకప్పటి హీరోయిన్ రాధిక వెళ్లి పరామర్శించింది. భావోద్వేగానికి గురవుతూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)రాధిక రీసెంట్గా లీడ్ రోల్ చేసిన 'తాయ్ కిళవి' సినిమాని భారతీ రాజా చూశారు. దీని గురించి రాధిక ఆయన మధ్య చర్చ కూడా జరిగింది. సినిమా చూశారా అని రాధిక అడగ్గా.. చూశానని చెప్పిన భారతీరాజా, ఈ చిత్రానికి మీకు జాతీయ అవార్డ్ అందుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆశ్చర్యానికి గురైన రాధిక.. అదే జరిగితే, ఆ అవార్డుని మీ పాదాల దగ్గర అర్పిస్తానని స్పందించింది.ఇన్ స్టాలో భారతీరాజాతో మాట్లాడుతున్న వీడియోని పోస్ట్ చేసిన రాధిక.. ఆయన ఆశీర్వాదం, అవార్డు కంటే గొప్పది. ఆయనని ఈ స్థితిలో చూస్తాననుకోలేదు. చాలా బాధగా ఉంది. ఇప్పటికీ సినిమాపై ఉన్న ప్రేమే ఆయనని ముందుకు నడిపిస్తోంది అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన చాలామంది.. ఎలా ఉండే భారతీరాజా ఇలా అయిపోయారేంటి అని మాట్లాడుకుంటున్నారు. ఈయన చివరగా గతేడాది రిలీజైన 'దేశియా తలైవర్' సినిమాలో నటించారు.(ఇదీ చదవండి: బూతు కాదు నేను పోస్ట్ చేస్తున్నది భక్తి కంటెంట్: అనన్య నాగళ్ల) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar)
నభా నటేశ్ నాగబంధం మూవీ.. మరో సాంగ్ రిలీజ్
విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధానపాత్రల్లో వస్తోన్న మూవీ నాగబంధం. ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్తో పాటు టీజర్ కూడా చేశారు. వీటికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ పతాకంపై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సుర సుర అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. కనకవ్వ, నల్గొండ గద్దర్, అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటను జునైద్ కుమార్, అభే కంపోజ్ చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 3న థియేటర్లలో రిలీజ్ కానుంది.
రూ.10 కోట్లతో అపార్ట్మెంట్ కొన్న టబు.. ప్రత్యేకతలు ఇవే!
సీనీ తారల్లో చాలా మంది తమ సంపాదనను రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతున్నారు. స్టార్ హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు విలాసవంతమైన భవనాలు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత మంచి ధర వస్తే..వాటిని అమ్మి.. వచ్చిన డబ్బుతో మరో చోట పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా సీనియర్ నటి టబు కూడా ముంబైలో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసింది. ముంబైలోని వెర్సోవా ఏరియాలో ఉన్న ఆ అపార్ట్మెంట్ విలువ దాదాపు రూ. 10.40 కోట్లుగా ఉంటుందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసమే టబు రూ. 60 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందంట. ఆ అపార్ట్మెంట్ సముద్ర తీరానికి సమీపంలోనే ఉండడమే కాదు.. నగరం మొత్తం అందంగా కనిపించేలా ఉంటుందట. ఆ వెంచర్లో మొత్తం 2 టవర్స్ ఉన్నాయట. ఒక్కో టవర్ 24 అంతస్తులు ఉంటుంది. మొత్తం 126 నివాసాలు ఉండగా..అందులో ఒకటి టబు కొనుగోలు చేసింది. జిమ్, స్వీమ్మింగ్ పూల్తో పాటు రెండు కార్లు పార్కింగ్ చేసుకునేలా పార్కింగ్ స్తలం వచ్చిందట. ముంబైలో టబుకి ఇప్పటికే ఓ ఫ్లాట్ ఉంది. ఇది రెండోది. హైదరాబాద్లో కూడా టబుకి సొంతిల్లు ఉంది.టబు సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘బూత్ బంగ్లా’ ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే విజయ్ సేతు పతి కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తోన్న `స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్` లో నటిస్తోంది.
క్రీడలు
అజింక్య రహానే చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2026లో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ ధనాధన్ లీగ్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రహానే ఖాతా తెవకుండానే పెవిలియన్కు చేరాడు. రాజస్తాన్ పేసర్ నండ్రీ బర్గర్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి రహానే ఔటయ్యాడు.అంతకుముందు గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా రహానే గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. తద్వారా ఈ వెటరన్ ఆటగాడు ఓ అవాంఛనీయ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఓపెనర్గా రహానే నిలిచాడు. రహానే ఇప్పటివరకు 12 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్ధివ్ పటేల్(11) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో పార్ధివ్ను రహానే అధిగమించాడు.ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ఓపెనర్లు వీరే12 - అజింక్య రహానే*11 - పార్థివ్ పటేల్10 - శిఖర్ ధావన్10 - గౌతమ్ గంభీర్9 - డేవిడ్ వార్నర్
'ఆడందే ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటానా?'
సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన స్ట్రైక్రేట్పై వస్తున్న విమర్శలకు క్లాసెన్ గట్టిగానే బదులిచ్చాడు. తన పని బ్యాటింగ్ చేయడం మాత్రమేనని, స్ట్రైక్రేట్ ఇతర విషయాలు పెద్దగా పట్టించుకోనని తెలిపాడు. అయితే స్ట్రైక్రేట్ విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ఐపీఎల్ 2026 సీజన్లో ఆరు మ్యాచ్ల్లో 283 పరుగులు సాధించిన క్లాసెస్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉండడం కొసమెరుపు. ఈ నేపథ్యంలోనే సీఎస్కేతో మ్యాచ్ అనంతరం క్లాసెన్ మాట్లాడాడు. 'నా పని బ్యాటింగ్ చేయడమే. ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వ ర్తిస్తున్నా. అయితే ఈ సీజన్లో నా స్ట్రైక్రేట్ విషయంలో విమర్శలు వస్తున్న సంగతి నాకు తెలుసు. కానీ నా బ్యాటింగ్తో జట్టుకు ఎంత ఉపయోగపడుతున్నాననేదే నాకు ముఖ్యం. స్ట్రైక్రేట్పై చింత లేదు. ఎందుకంటే క్రీజులో కుదురుకుంటేనే పరుగుల వస్తాయి. అంతేకానీ కేవలం స్ట్రైక్రేట్పైనే దృష్టి సారిస్తే పరుగులు చేయడం సంగతి అటుంచితే జట్టుకు నష్టం చేకూరుతుంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడుతానే తప్ప ప్రతీసారి బ్యాట్ నుంచి మెరుపులు రావాలంటే కష్టమే. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ఆడాలి. ఆ పనిని నేను సరిగ్గానే చేస్తున్నా. అయినా నేను ఆడందే ఆరెంజ్క్యాప్ రేసులో టాప్లో ఉంటానా? ఇక కేప్టౌన్లోని ఐ జిమ్లో కండ్లకు సంబంధించి నేను తీసుకున్న శిక్షణ ఒత్తిడిని దూరం చేసింది. కేవలం రోజు 10 నిమిషాల పాటు క్రమం తప్పకుండా శిక్షణ తీసుకోవడం చాలా ఉపయోగపడింది.' అని చెప్పుకొచ్చాడు. సీజన్లో భాగంగా ఎస్ఆర్హెచ్ మూడో విజయాన్ని నమోదు చేసకుంది. శనివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్, క్లాసెన్లు అర్థసెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులకు పరిమితమైంది. మూడు విజయాలతో పట్టికలో నాలుగో స్థానానికి చేరిన ఎస్ఆర్హెచ్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 21న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.చదవండి: బుడ్డోడి వికెట్తో మిస్టరీ స్పిన్నర్ అరుదైన రికార్డు!
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. శనివారం (ఏప్రిల్ 18) చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ విజయంలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ది కీలక పాత్ర. తన 34వ పుట్టినరోజున రాహుల్ అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 57 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు తన పుట్టినరోజున హాఫ్ సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు.గతంలో 2021 సీజన్లో (29వ పుట్టినరోజున) పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతూ ఢిల్లీపై హాఫ్ సెంచరీతో మెరిశాడు. మళ్లీ ఇప్పుడు తన బర్త్డే రోజున హాఫ్ సెంచరీ సాధించడంతో ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన రాహుల్.. 168 పరుగులు సాధించాడు.ఐపీఎల్లో పుట్టిన రోజున అర్ద సెంచరీ చేసిన ఆటగాళ్లుమైక్ హస్పీడేవిడ్ వార్నర్కేఎల్ రాహుల్(రెండు సార్లు)
బుడ్డోడి వికెట్తో మిస్టరీ స్పిన్నర్ అరుదైన రికార్డు!
టీ20 క్రికెట్లో కోల్కతా నైట్రైడర్స్ బౌలర్ వరుణ్ చక్రవర్తి మరో రికార్డు అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ వికెట్ తీయడం ద్వారా ఈ మిస్టరీ స్పిన్నర్ తన ఖాతాలో 200వ వికెట్ జమ చేసుకున్నాడు. కాగా టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి వరుణ్ చక్రవర్తి 155 మ్యాచ్లు తీసుకున్నాడు. అత్యంత వేగంగా 200 వికెట్ల మార్క్ను చేరుకున్న రెండో భారత బౌలర్గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. తొలి స్థానంలో టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ (151 మ్యాచ్లు ఉన్నాడు. 2019లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి తొలుత పంజాబ్ కింగ్స్కు ఆడాడు. ఆ తర్వాత కేకేఆర్కు మారిన ఈ మిస్టరీ స్పిన్నర్ అప్పటి నుంచి అదే జట్టులో కొనసాగుతున్నాడు. అయితే వరుణ్ చక్రవర్తి ఈ సీజన్లోనే గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేకేఆర్ తరఫున వంద వికెట్లు సాధించాడు. కేకేఆర్ తరఫున వంద వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలిచాడు. గతంలో సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్లు ఈ ఘనత సాధించారు. ఓవరాల్గా వరుణ్ చక్రవర్తి ఐపీఎల్లో 89 మ్యాచ్ల్లో 105 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియా తరఫున వరుణ్ చక్రవర్తి 45 టీ20ల్లో 73 వికెట్లు పడగొట్టాడు. రెండుసార్లు ఐదు వికెట్ల హాల్ను అందుకున్నాడు.WICKET x 2️⃣!🎥 Spinners spinning #KKR back into the contest ☝️☝️Updates ▶️ https://t.co/776nTdPbPj#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @KKRiders pic.twitter.com/TyU5HsJuGv— IndianPremierLeague (@IPL) April 19, 2026 చదవండి: తలతిక్క నిర్ణయాలతో కొంపముంచిన పటీదార్!
న్యూస్ పాడ్కాస్ట్
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న పాపం ప్రతిపక్షాలదే... భ్రూణ హత్యతో పాపం మూటగట్టుకున్నాయి... ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
లోక్సభలో గట్టెక్కని మహిళా బిల్లు... అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు... మూడింట రెండొంతుల మెజారిటీ సాధనలో మోదీ సర్కారు విఫలం
డీలిమిటేషన్ దంగల్కు రంగం సిద్ధం... మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్
మత్స్యకారుల కడుపుపై తంతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు కుట్ర... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
చట్టసభల్లో చారిత్రక మలుపు... లోక్సభ స్థానాలు 850కి పెంపు... రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం... డిమాండ్లపై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్... అణ్వాయుధాలు, హార్మూజ్పైనే పీటముడి
ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు షురూ. మరో దఫా చర్చించే అవకాశం
భారీగా పడిపోతున్న బంగారం ధరలు
అమరావతిలో నీకింత.. నాకింత... ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన ‘బీఎస్సార్’కు రాజధానిలో భారీగా పనుల అప్పగింత
బిజినెస్
కొత్త ఫోన్: ఒప్పో ఎఫ్33 సిరీస్ వచ్చేసింది..
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన ఎఫ్33 5జీ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ‘ఒప్పో ఎఫ్33 5జీ’, ‘ఒప్పో ఎఫ్33 5జీ ప్రో’ అనే రెండు మోడళ్లు ఉన్నాయి. వీటిలో 6.57 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (ఎఫ్హెచ్డీ+) రిజల్యూషన్తో పాటు 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ గల అమోలెడ్ డిస్ప్లేను ఉంది.రెండు ఫోన్లు కూడా 50ఎంపీ + 2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉన్నాయి. 4కే వీడియో రికార్డింగ్ లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ ఏఐ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. 7000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తోంది. ఐపీ66, ఐపీ68, ఐపీ69కే ప్రీమియం డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్లున్నాయి. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఏప్రిల్ 26 నుంచి సేల్కు అందుబాటులో ఉంటాయి. ఒప్పో ఎఫ్33 5జీ ధర: 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ. 31,999గా ఉంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999గా ఉన్నాయి. ఒప్పో ఎఫ్33 ప్రో 5జీ ధర: 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.37,999, 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.40,999గా ఉన్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్కి ప్రొవిజనింగ్ దన్ను
ముంబై: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశీయంగా రెండో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 9.28 శాతం వృద్ధి చెంది రూ. 14,755 కోట్లకు చేరింది. మొండిబాకీలు మొదలైన వాటికి కేటాయింపులు ఏకంగా 90 శాతం తగ్గడం ఇందుకు దోహదపడింది. శనివారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం గతేడాది క్యూ4లో రూ. 891 కోట్లుగా ఉన్న ప్రొవిజనింగ్ ఈ మార్చ్ క్వార్టర్లో రూ. 96.16 కోట్లకు తగ్గింది. డిసెంబర్ క్వార్టర్లో ఇది రూ. 2,556 కోట్లుగా ఉంది. సమీక్షాకాలంలో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 8.4 శాతం వృద్ధితో రూ. 22,979 కోట్లకు చేరింది. అసెట్స్ 15 శాతం వృద్ధి చెందడం, నికర వడ్డీ మార్జిన్ స్వల్పంగా 4.32 శాతానికి పెరగడం ఇందుకు ఉపయోగపడింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న క్రమంలో ఆరోగ్యకరమైన ఫలితాలు సాధించగలిగినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా తెలిపారు. ఎకానమీ మెరుగుపడే కొద్దీ మరింతగా రుణాలిచ్చేందుకు తమ దగ్గర తగినన్ని నిధులు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్ అంచనాలను వెల్లడించడం కష్టమని బాత్రా చెప్పారు. తమ రిస్కు సామర్థ్యాల పరిధికి లోబడి వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. క్యూ4లో అసెట్ క్వాలిటీ, రికవరీలు మెరుగుపడటం వల్ల ప్రొవిజనింగ్ తగ్గిందని, అత్యవసర పరిస్థితుల కోసం కేటాయించిన రూ. 13,100 కోట్ల నిధి అలాగే ఉందని ఆయన పేర్కొన్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు ఒక్కో షేరుకి రూ. 12 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది. ఫలితాల్లో కీలకాంశాలు.. → క్యూ4లో వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ కాకుండా) 5.6 శాతం పెరిగి రూ. 7,415 కోట్లకు చేరింది. రూపాయిపై అతి స్పెక్యులేషన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ఇటీవల తీసుకున్న చర్యలతో ట్రెజరీ విభాగానికి సంబంధించి రూ. 106 కోట్ల నష్టం వచ్చింది. → నిర్వహణ వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 12,089 కోట్లకు చేరాయి. → అసెట్ క్వాలిటీ విషయానికొస్తే స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి డిసెంబర్లో 1.53 శాతంగా, గతేడాది మార్చి క్వార్టర్లో 1.67 శాతంగా ఉండగా ప్రస్తుతం 1.40 శాతానికి తగ్గింది. స్థూల స్లిప్పేజీలు రూ. 4,242 కోట్లుగా ఉన్నాయి. → బిజినెస్ బ్యాంకింగ్ దన్నుతో రుణ వృద్ధి 24 శాతం మేర నమోదైంది. గ్రామీణ రుణాల పోర్ట్ఫోలియో 25 శాతం మేర పెరగగ్గా, రిటైల్ వాటా 41 శాతానికి నెమ్మదించింది. దేశీయంగా కార్పొరేట్ రుణాలు 9 శాతం పెరిగినప్పటికీ, పోర్ట్ఫోలియోలో వీటి వాటా 20 శాతానికి పరిమితమైంది. రాబోయే రోజుల్లో ఇది కొంత పెరిగే అవకాశం ఉంది. → మార్చి 31 నాటికి బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ 17.18 శాతంగా ఉంది. → స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ. 13,702 కోట్లకు చేరింది. క్రితం క్యూ4లో నమోదైన రూ. 12,630 కోట్లతో పోలిస్తే 8.5 శాతం పెరిగింది. → 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం 6.2 శాతం వృద్ధి చెంది రూ. 50,147 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 47,227 కోట్లు.
స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు డౌన్
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్ఫోన్ మార్కెట్ ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) మందగించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, క్యూ1లో స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు (కంపెనీ నుంచి డీలర్లకు రవాణా) గత ఏడాదితో పోలిస్తే 3 శాతం తగ్గాయి. గత 6 ఏళ్లలో బలహీనమైన పనితీరు ఇది. పెరిగిన తయారీ ఖర్చులు, ముఖ్యంగా మెమొరీ చిప్ల ధరలు పెరిగిపోవడం తెలిసిందే. దీంతో వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గడం (ముఖ్యంగా రూ.15,000 లోపు ఫోన్లకు).. మొత్తం మార్కెట్ పనితీరును ప్రభావితం చేసినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు డబుల్ డిజిట్ స్థాయిలో తగ్గొచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ పేర్కొన్నారు. ‘‘2026 పూర్తి సంవత్సరానికి స్మార్ట్ఫోన్ మార్కెట్ సుమారు 10 శాతం తగ్గొచ్చని అంచనా. ‘‘విడిభాగాల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా మెమొరీ ధరలు గత 9 నెలల్లో 4 రెట్లు పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులు ఫోన్లను వెంటనే మార్చకుండా, ఉన్న వాటినే ఎక్కువ కాలం వినియోగిస్తున్నారు’’అని పాఠక్ వివరించారు. పశ్చిమాసియలో సంక్షోభంతో జీవన వ్యయాలు పెరిగాయని, ఈ పరిస్థితుల్లో ప్రజలు స్మార్ట్ఫోన్ల వంటి వాటి కంటే ముఖ్యమైన అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. కనుక ఈ మార్కెట్ నెమ్మదిగా కోలుకోవచ్చని అభిప్రాయపడింది. వివో నంబర్ 1 → దేశీ మార్కెట్లో 21 శాతం వాటాతో వివో మొదటి స్థానంలో నిలిచింది. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో పోర్ట్ఫోలియో విస్తరణ ద్వారా తన ఆధిపత్యాన్ని కాపాడుకుంది. → శామ్సంగ్ రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా ఎ–సిరీస్ మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. → ఒప్పో 14 శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచింది. మార్చి త్రైమాసికంలో 8 శాతం వృద్ధిని (2025 క్యూ1తో పోల్చితే) సాధించింది. → షావోమీ నాలుగో స్థానంలో ఉంది. రూ.10,000–20,000 ధరల శ్రేణిలో రడబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసింది. → ఆన్లైన్ మార్కెట్లో రూ.10,000–20,000 ధరల విభాగంలో రియల్మీ బలమైన బ్రాండ్గా నిలిచింది. → నథింగ్ 47 శాతం వృద్ధిని నమోదు చేసింది. → ప్రీమియం ఫోన్ల సెగ్మెంట్లో (రూ.45,000కు పైన) గూగుల్ 39 శాతం వృద్ధిని సాధించింది. → అందుబాటు ధరల ఫోన్ల విభాగంలో (రూ.30,000–45,000) ప్రముఖ బ్రాండ్గా వన్ప్లస్ ముందంజలో ఉంది. నార్డ్ సిరీస్కు మంచి స్పందన లభిస్తోంది.
721 టన్నుల బంగారం దిగుమతి
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కొత్త రికార్డులకు చేరాయి. 71.98 బిలియన్ డాలర్ల (రూ.6,69,414 కోట్లు) విలువైన బంగారం దిగుమతి అయింది. 2024–25 సంవత్సరంలో 58 బిలియన్ డాలర్ల దిగుమతులతో పోల్చి చూస్తే 24 శాతం పెరిగాయి. పరిమాణం పరంగా చూస్తే తగ్గుదల కనిపిస్తోంది. 2024–25లో 759.09 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 4.76 తక్కువగా 721.03 టన్నులకు పరిమితమయ్యాయి. బంగారం ధర గణనీయంగా పెరగడంతో, విలువ అధికంగా ఉన్నప్పటికీ పరిమాణం తగ్గినట్టు వాణిజ్య శాఖ గణాంకాల ఆధారంగా స్పష్టమవుతోంది. 2023–24లో 45.54 బిలియన్ డాలర్లు, 2022–23లో 35 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు నమోదయ్యాయి. చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద పసిడి వినియోగ మార్కెట్గా ఉండడం గమనార్హం. ప్రధానంగా ఆభరణాల నుంచే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. → వెండి దిగుమతుల విలువ సైతం గత ఆర్థిక సంవత్సరంలో 150 % పెరిగి 12 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిమాణం పరంగానూ 42 % పెరిగి 7,335 టన్నుల మేర ఉంది. → బంగారం కిలో ధర 2024–25లో 76,617 డాలర్లుగా ఉంటే, 2025–26లో 99,825 డాలర్లకు చేరడం దిగుమతుల విలువ పెరిగేందుకు దారితీసింది. → అత్యధికంగా స్విట్జర్లాండ్ నుంచి 40 శాతం మేర బంగారం దిగుమతి కాగా, యూఏఈ నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10% చొప్పున వచ్చింది. దేశ మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా 5 శాతంగా ఉంటుంది. → స్విట్జర్లాండ్ నుంచి బంగారం దిగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 11.36 శాతం పెరిగి 24.27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఫ్యామిలీ
ఆశాకు ఆమె నేర్పిన షాహీ కబాబ్
ఆశా భోంస్లేకు దుబాయ్, కతార్, సింగపూర్, యూరప్లలో ‘ఆశాస్’ పేరుతో రెస్టరెంట్లు ఉన్నాయి. అన్నింట్లోనూ ఒక పదార్థం చాలా గిరాకీ. దాని పేరు ‘షాహీ కబాబ్’. మెనూ తెరిస్తే షాషీ కబాబ్ పక్కన చిన్న అక్షరాల్లో ‘లెర్న్›్ట ఫ్రమ్ మిసెస్ మజ్రూ సుల్తాన్ పురి’ అని ఉంటుంది. ప్రఖ్యాత సినీ కవి మజ్రూ శ్రీమతి బేగంజీ నేర్పిన షాహీ కబాబ్ రెసిపీ ఆశాకు ఒక పెద్ద వరంగా మారింది. ఆ వంట మహత్యం కథ ఇది.ఆశా రికార్డింగ్స్తో బిజీగా ఉన్నా ఇంటికి వచ్చి పిల్లలకు ఏదో ఒకటి వండి పెట్టాలని తల్లిగా కోరుకునేది. ఒక్కోసారి వీలయ్యేది కాదు. ఒకరోజు ఆమె ఇంటికి వచ్చేసరికి చిన్న కుమారుడు ఆనంద్ చాలా హుషారుగా ఉన్నాడు. ‘ఏంట్రా’ అని అడిగితే బజారులో కబాబ్ తిన్నాడట... అది తినడం మొదటిసారట... ‘చాలా బాగుంది... ఇక మీదట దానిని చేసి పెడుతుండు’ అని అడిగాడు. కాని ఆశాకు కబాబ్ చేయడం రాదు. కబాబ్ చేయడం ఎవరు నేర్పిస్తారా అని ఆలోచిస్తే మజ్రూ సుల్తాన్పురి శ్రీమతి గుర్తుకొచ్చింది. మజ్రూ స్నేహితులు, బంధువులు అందరూ ఆమెను ‘బేగంజీ’ అని పిలుస్తారు. బేగంజీకి ఫోన్ చేసి ‘నా కొడుకు కోసం కబాబ్ ఎలా చేయాలో నేర్పిస్తావా?’ అని అడిగింది ఆశా. ‘ఓ అదెంత సేపు... ఇంటికి రా’ అని పిలిచింది బేగంజీ.అలా మజ్రూ ఇంటికి నాలుగైదుసార్లు వెళ్లిన ఆశా ‘కబాబ్’ చేయడం నేర్చుకుంది. అయితే ఆమెకు మెల్లగా ఒక విషయం అర్థమైంది. ముంబైలో ఆ తర్వాత ఎన్నోచోట్ల ఆశా కబాబ్ ట్రై చేసినా మజ్రూ శ్రీమతి చూపించిన కబాబ్ రుచి వేరు బయట బజారులో దొరుకుతున్న కబాబ్ రుచి వేరు. ఏంటా అని ఆలోచించి మళ్లీ మజ్రూ ఇంటికి వెళ్లింది ఆశా. అప్పుడు బేగంజీ నవ్వేసి ‘ఆశా... నీకు నేర్పింది షాబీ కబాబ్. అది కేవలం లక్నోలో ఉండే కొందరు నవాబుల ఇళ్లల్లోని స్త్రీలకు మాత్రమే తెలిసిన రెసిపీ. ఆ రెసిపీ రహస్యాన్ని నీకు చెప్పాను’ అంది. షాహీ అంటే బాదుషాహీ... రాజస అని అర్థం. అలనాడు ఒక లక్నో నవాబు గారికి నోట్లో పళ్లు లేకపోతే నోట వేయగానే మెత్తగా కరిగిపోయే షాహీ కబాబ్ను వంటవాళ్లు కనిపెట్టారట. అలా పుట్టిందా కబాబ్. దాని రెసిపీ బేగంజీ దయ వల్ల ఆశా వశమైంది.బేగంజీ ఆశాకు నేర్పిన పాఠం ఏమిటి? ‘ఆశా... కబాబ్ చేయడానికి కావాల్సింది మసాలా కాదు... సబర్. అంటే ఓర్పు. రాత్రంతా మాంసాన్ని మసాలాలో నానబెట్టాలి. మెత్తగా రుబ్బిన జీడిపప్పు, గసగసాలు, దహీ, పచ్చి బొప్పాయి... ఇవన్నీ కలిపి 12 గంటలు ఊరనివ్వాలి. తొందరపడితే రుచి రాదు. పాటలాగే వంట కూడా సాధన చేస్తేనే వస్తుంది’ అని చెప్పిందామె. తర్వాతి రోజుల్లో ఆశా చేసిన షాహీ కబాబ్లు తిన్న భర్త, సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ ‘ఆశా... నువ్వు పాడటం మానేసినా పర్లేదు. కబాబ్లు చేస్తూ బతికేయొచ్చు’ అనేవాడు. ఆశా ఇంట్లో పార్టీ జరిగితే మెనూలో షాహీ కబాబ్ తప్పనిసరి. అక్కాచెల్లెళ్ల మధ్య ఎన్ని స్పర్ధలు ఉన్నా ఆశా చేసిన కబాబ్ని లతా ఇష్టపడేది. ఒకసారి లతాకి నలతగా ఉంటే ఆశా స్వయంగా షాహీ కబాబ్ చేసి పంపిందట. తిన్నాక లతా ఫోన్చేసి ‘చాలా బాగుంది’ అని ఒక్క మాట అందట. మాటల్లేని తమ మధ్య షాహీ కబాబ్ అలా మాట కలిపింది. అన్నట్టు కబాబ్ వెనక కన్నీళ్లు కూడా ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఆశా చెప్పింది – ‘నేను బాధలో ఉన్నప్పుడు వంటగదిలోకి వెళ్తాను. కబాబ్ కోసం మసాలా దంచుతూ, ఉల్లిపాయ కోస్తూ ఏడుస్తాను. కన్నీళ్లు ఉల్లిపాయవే అని అందరూ అనుకుంటారు’ అని. ఏమైనా మజ్రూహ్ సుల్తాన్ పురి తన కలంతో అక్షరాలకు రుచి అద్దితే, ఆయన భార్య బేగంజీ కబాబ్కి రుచి అద్దింది. ఆ రుచిని ఆశా ప్రపంచమంతా పంచుతోంది. – కె
వెండితెర తార... నేల పైకి
మాధవన్ విలక్షణ పాత్రలకు పేరొందిన ఆర్.మాధవన్ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాకా సాగించిన వైవిధ్యభరిత ప్రయాణం మనందరికీ తెలిసిందే. అయితే మనలో చాలా మందికి తెలియనిది రైతుగా ఆయన సాధించిన అపురూపమైన విజయం....తమిళనాడులోని పళనిలో ఉన్న ఒక బీడు భూమి మాధవన్ విజయానికి కేంద్రబిందువుగా మారింది. ఆ బీడు భూమిని కొనుగోలు చేసిన మాధవన్ ... కేవలం మూడేళ్లలోనే ఫలవంతమైన కొబ్బరితోటగా మార్చారు. నిరంతర కృషి, ప్రయోగాల ద్వారా సాధించిన ఈ మార్పు, తీయని నీరు, విలక్షణమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన నాన్ –హైబ్రీడ్ కొబ్బరి తోటగా రూపుదిద్దుకుంది.నేలతల్లి నుంచి నేర్చుకున్నా...‘వ్యవసాయంలో ప్రతి అడుగు ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేలా చేసింది. ఇది ఎంతో సంతృప్తికరమైన అనుభవం. నా జీవితంలో అత్యంత ప్రతి ఫలదాయకమైన అనుభవాలలో ఒకటి. భూమి పునర్జీవం ΄పొంది, అది ఫలాలను ఇవ్వడాన్ని చూడటం అద్భుతంగా అనిపించింది. సరైన మల్చ్తో భూమిని సిద్ధం చేయడం నుంచి బావిలో సరైన చేపలను వదలడం వరకు నేను నేర్చుకున్న ప్రతి విషయం అమూల్యమైనది. ఎంతో విలువైనది’ అంటారు మాధవన్ ఎంతో సంతోషంగా...కొబ్బరిచెట్ల ప్రాజెక్ట్!తన కొబ్బరి చెట్ల పెంపకాన్ని ఒక ప్రాజెక్ట్‘ గా పేర్కొంటారు మాధవన్ . ‘ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. దీనిలో దాదాపు బీడుగా ఉన్న భూమిలో అత్యంత తీయని, సువాసనగల నాన్ –హైబ్రిడ్, స్వచ్ఛమైన ΄పొట్టి రకం కొబ్బరికాయలను పండించాము. త్వరలో నేను స్థానిక రైతుల కోసం ఒక వ్యాసం రాస్తున్నాను’ అంటున్నారు మాధవన్. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నాన్ హైబ్రిడ్ కొబ్బరి తోటల గురించి కల కంటున్నారు మాధవన్.కొత్త ఫలంకోవిడ్ లాక్డౌన్ సమయంలో, మాధవన్ తన అందమైన టెర్రస్ గార్డెన్ను వీడియోల ద్వారా చూపించారు. ఒక వీడియోలో చిన్న చెర్రీ పండ్లను చూపిస్తూ, ‘ముంబై టెర్రస్కు ఒక కొత్త ఫలం వచ్చింది’ అంటూ సంబరంగా చెప్పారు. నటిస్తే ఆదాయం, అవార్డులు రావచ్చు. రైతుగా అడుగులు వేస్తే... ఆ అడుగులు ముందుతరాలకు కొత్త దారులు చూపిస్తాయి. ఈ విషయంలో మార్గదర్శిగా నిలుస్తున్నారు మాధవన్.సామాజిక గళంసామాజిక సందేశాల కోసం గళాన్ని వినిపించడంలో ముందుంటారు మాధవన్. పశుపోషణకు సంబంధించిన విషయాలను, దాని పర్యావరణ ప్రభావాన్ని తెలియజేసేలా పెటా ఇండియా విడుదల చేసిన ‘గ్లాస్ వాల్స్’ అనే వీడియోకు మాధవన్ వ్యాఖ్యానం అందించారు. ‘వధశాలలకు గాజు గోడలు ఉంటే, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారిపోయేవారు’ అన్న ఒక ప్రసిద్ధ ఆంగ్లోక్తిని ఆయన ఈ వీడియోలో మనకు వినిపిస్తారు. మాంసం, పాల పరిశ్రమలలోని రకరకాల దశలను ఈ వీడియో చిత్రీకరిస్తుంది. జంతువుల పట్ల వ్యవహరించే తీరును చూపిస్తూ, నైతికతకు సంబంధించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. తెర వెనుకసినిమా తారలు తెర వెనుక తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఒకవైపు నటనను కొనసాగిస్తూనే మరోవైపు తమవైన అభిరుచులను ఆస్వాదిస్తున్నారు. బైక్, కార్ రేసింగ్లకు పేరొందిన అజిత్ లాంటి తమిళ టాప్ హీరోల నుంచి వెయిట్ లిఫ్టింగ్లో సత్తా చాటుతున్న ప్రగతి లాంటి టాలీవుడ్ నటీమణుల దాకా...విభిన్న రంగాల్లోనూ తమను తాము నిరూపించుకుంటున్నారు. వృత్తిజీవితాన్ని, ప్రవృత్తిని సమన్వయం చేసుకుంటున్నారు.– ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్
నా లోపల రెబెల్
సౌమ్యమైన చూపులు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాళవిక నాయర్, జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు ఆమె మాటల్లోనే...నా బాల్యమే నా బలం!నేను ఢిల్లీలో ఒక మలయాళీ కుటుంబంలో పుట్టాను. నా బాల్యం నాన్నగారి వృత్తిరీత్యా కొన్నిసార్లు ఢిల్లీ హడావుడి, మరికొన్నిసార్లు కేరళ ప్రశాంతత మధ్య సాగింది. ఒకసారి మా కుటుంబంలో జరిగిన బైక్ ప్రమాదం నాపై చాలా ప్రభావం చూపింది. అప్పటి నుంచి నేను స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.నాన్న నా పెద్ద సపోర్టర్!‘అమ్మాయివి, బైక్ ఎందుకు?’ అని చాలామంది చెప్పినా, మా నాన్న వినలేదు. నాకు బైక్ నేర్పించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నన్ను నేనే కాపాడుకోగలగాలి అని ఆయన కోరుకున్నారు.కెమెరా బయట నా ప్రపంచం!షూటింగ్ లేకపోతే నేను ఎక్కువగా పుస్తకాల్లో మునిగిపోతుంటాను లేదా స్కెచింగ్ చేస్తుంటాను. నేను ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో తత్త్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశాను. ఆ చదువు నాకు పాత్రలను కొత్త కోణంలో అర్థం చేసుకునే దృష్టిని ఇచ్చింది.నేను కేవలం నటించను!నా ప్రయాణం చిన్నప్పుడే మలయాళం సినిమా ‘కరుత్త పక్షికల్’లో మొదలైంది. కానీ, ‘కుక్కూ’ నాకు అసలైన గుర్తింపు ఇచ్చింది. అంధురాలైన పాత్రలో కళ్లతో కాదు, మనసుతో ప్రపంచాన్ని చూడటం నేర్చుకున్న అనుభవం. అందుకే, పాత్రలోని భావాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.చిన్న సీక్రెట్స్!ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. కానీ నా లోపల ఒక చిన్న రెబెల్ ఉంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నాకు కొన్ని టాటూలు ఉన్నాయి. ఒక చిన్న నిమ్మకాయ ముక్క ఆకారంలో ఒక టాటూ ఉంది. అలాగే పోలినేషియన్ స్టయిల్లో ట్రయాంగిల్స్, ట్రైబల్ డిజైన్స్ తో మరో టాటూ కూడా ఉంది. అవి నా జీవితంలో ప్రత్యేకమైన గుర్తుల్లాంటివి.వ్యక్తిత్వం ముఖ్యం!మొదట్లో ‘గ్లామర్’ అనే భావన నాకు పెద్దగా నచ్చేది కాదు. ఇండస్ట్రీలో ప్రెజెంటబుల్గా ఉండాలి కానీ, వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు అని నేను నమ్ముతాను.అరుదైన గుర్తింపు!చిన్నప్పుడే ఉత్తమ బాలనటి అవార్డు అందుకున్నందుకు, కొందరు నన్ను ప్రముఖ నటి శారదతో పోలుస్తుంటారు. ఆ గుర్తింపు కాపాడుకోవడానికే పారితోషికం కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను.ఫుడ్ అంటే ఫుల్ లవ్!నేను పక్కా ఫూడీని. ఢిల్లీలో పెరిగాను కాబట్టి అక్కడి స్ట్రీట్ ఫుడ్, మసాలా చాట్ ఎప్పటికీ నా ఫేవరెట్. అలాగే మా ఇంట్లో చేసే మటన్ రసం కలిపిన అన్నం. నెమ్మదిగా ఉడికిన ఆ మాంసం నోట్లో కరిగిపోతుంది. అది నా ఆల్టైమ్ కంఫర్ట్ ఫుడ్. ఇప్పుడు షూటింగ్లు ఎక్కువగా ఉండటంతో, శక్తి కోసం ఆర్గానిక్, హెల్తీ ఫుడ్ కూడా నా మెనూలో చేరింది.ఇష్టమైన స్టార్!చిన్నప్పటి నుంచే నేను మోహన్ లాల్ సర్కి పెద్ద అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పని చేసిన రోజు నాకు ఒక కలలా అనిపించింది. అలాగే జ్యోతిక నటనలోని శక్తి, ఒక సినిమాను తన భుజాలపై మోసే ధైర్యం నాకు పెద్ద ఇన్ స్పిరేషన్ .
తలకట్టు... కనికట్టు
అబ్బాయిలకు ఏం స్టయిల్ ఉంటుందిలే అని చాలామంది అనుకుంటారు. కాని, బార్బర్ కుర్చీలో కూర్చునే పది నిమిషాలు చాలు, మామూలు అబ్బాయి కూడా సినిమా హీరోలా మారిపోవడానికి. సరైన హెయిర్ కట్ ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవల్! చక్కని తలకట్టుతో రూపం కనికట్టు చేసినంతగా మారిపోతుంది. అందుకే ఈ సమ్మర్లో కంఫర్ట్తో పాటు కూల్గా కనిపించే కొన్ని ట్రెండీ హెయిర్ స్టయిల్స్ చూద్దాం...జెంటిల్మన్ ఫ్యాడ్ – క్లాసీ స్టయిల్! జెంటిల్మన్ ఫ్యాడ్ అనేది ఇప్పటికీ ఎవర్గ్రీన్ స్టయిల్! చెవుల దగ్గర జుట్టు క్రమంగా తగ్గుతూ, పైన మాత్రం సెట్ చేసుకునేలా ఉండటం. ఈ కట్ వేసుకుంటే ముఖం మరింత షార్ప్గా, సన్నగా కనిపిస్తుంది. ఆఫీస్కు వెళ్లినా, ఫంక్షన్ కు వెళ్లినా సూట్ అయ్యే సేఫ్ అండ్ స్మార్ట్ స్టయిల్ ఇదే! అండర్కట్ – యూత్ ఫేవరెట్అండర్కట్ అనేది కొంచెం బోల్డ్గా, ట్రెండీగా కనిపించాలనుకునే వాళ్లకు బెస్ట్. సైడ్స్ షార్ట్గా, పైన కొంచెం లెంగ్త్ ఉంచడం వల్ల మీరు స్టయిల్ను మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఫార్మల్గా నీట్గా దువ్వుకోవచ్చు, లేదా క్యాజువల్గా మెస్సీగా వదిలేయొచ్చు. ఒకే కట్తో రెండు వేర్వేరు లుక్స్ రావడం దీని కున్న ప్లస్ పాయింట్. టాప్ నాట్ – డిఫరెంట్ టచ్జుట్టు కొంచెం పొడవుగా ఉంటే, టాప్ నాట్ వేసుకోవడం ఒక స్మార్ట్ ఐడియా. జుట్టు మొత్తాన్ని పైకి తీసుకుని చిన్న ముడి వేయడం వల్ల కూల్గా, కంఫర్ట్గా ఉంటుంది. ఈ స్టయిల్ మీకు కొంచెం ఆర్టిస్ట్ లుక్ లేదా ట్రావెలర్ వైబ్ ఇస్తుంది. ముఖ్యంగా వేసవిలో జుట్టు ముఖంపై పడకుండా క్లీన్ గా ఉంచుతుంది. బజ్ కట్ – కంఫర్టబుల్ చాయిస్వేసవిలో చాలామంది ఇష్టపడే సింపుల్ స్టయిల్ ఈ బజ్ కట్. జుట్టు చిన్నగా ఉండటం వల్ల చెమట తక్కువగా ఉంటుంది, మెయింటెనెన్స్ ఈజీ, పైగా షాంపూ, నూనె ఖర్చును ఆదా చేస్తుంది. ఉదయం లేట్గా లేచినా, దువ్వుకోవాల్సిన టెన్షన్ ఉండదు. టైమ్ కూడా సేవ్ చేస్తుంది. కట్ చిన్నదే అయినా, కంఫర్ట్ మాత్రం పెద్దది.టెక్చ్సర్డ్ క్రాప్ – మెస్సీగా.. మోడ్రన్ గా..నేచురల్గా, కొంచెం మెస్సీగా కనిపించే స్టయిల్ కావాలనుకుంటే టెక్స్చర్డ్ క్రాప్ మంచి ఎంపిక. ఈ కట్ వల్ల జుట్టు మరింత వాల్యూమ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా థిన్ హెయిర్ ఉన్నవాళ్లకు ఇది మంచి సొల్యూషన్ . ఎక్కువగా సెట్ చేయకపోయినా, స్టయిల్గా కనిపిస్తారు. ఇలా స్టయిలిష్గా కనిపించడానికి పెద్ద ఖర్చు అవసరం లేదు. మీ ఫేస్ షేప్కు సరిపోయే చిన్న హెయిర్ కట్ చాలు, మీ లుక్కి వెంటనే కొత్త చార్మ్ వస్తుంది.
అంతర్జాతీయం
ట్రంప్, మునీర్ దోస్తీ.. అమెరికా నిఘా వర్గాల్లో టెన్షన్
గత కొన్ని రోజులుగా అమెరికా, పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ లేనంత స్నేహ బంధం కొనసాగుతోంది. పాక్ నేతలు అమెరికా వెళ్లడం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కావడం, ఈ క్రమంలో పాకిస్తాన్ నేతలపై ట్రంప్ ప్రశంసలు కురిపించడం చూశాం. ప్రత్యేకంగా పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్పై ట్రంప్ దోస్తీ చేయడం అమెరికా నిఘా వర్గాలను టెన్షన్కు గురి చేస్తోంది. మునీర్తో స్నేహమంటే అమెరికాను రెడ్ జోన్లోని నెట్టేయడమేనని నిఘా సంస్థలు చెబుతున్నాయి. అయితే, ఇంటెలిజెన్స్ను భయపెడుతున్న అంశాలను పరిశీలిస్తే..అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్పై కొత్త చర్చలు మొదలయ్యాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ ఆయనను ప్రియమైన ఫీల్డ్ మార్షల్ అని పిలిచారు. కానీ అమెరికా గూఢచార సంస్థలు, ప్రాంతీయ విశ్లేషకులు మాత్రం మునీర్కి ఇరాన్ సైనిక నాయకత్వంతో ఉన్న పాత పరిచయాలు ఒక రెడ్ అలర్ట్గా భావిస్తున్నారు.ఇరాన్తో సంబంధాలు..మునీర్ గతంలో ఇరాన్కి చెందిన ప్రముఖ సైనిక నాయకులు కుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసీమ్ సోలేమానీ, ఐఆర్జీసీ కమాండర్ హొసేన్ సలామీతో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉన్నారని పాకిస్తాన్ మాజీ జనరల్ అహ్మద్ సయీద్ వెల్లడించారు. అలాగే, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లోని ఉన్నత స్థాయి వ్యక్తులతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాలు అమెరికా విధాన నిర్ణేతల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.మధ్యవర్తిత్వం అవకాశమా? ప్రమాదమా?మునీర్ ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ద్వంద్వ సంబంధాలు ఒకవైపు అమెరికాకు ఉపయోగపడవచ్చు. మరోవైపు వ్యూహాత్మక ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టి అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.చారిత్రక అనుమానాలు..అమెరికా విధాన వర్గాల్లో పాకిస్తాన్పై అనుమానం కొత్తది కాదు. ఆఫ్ఘనిస్థాన్ యుద్ధ సమయంలో అమెరికా సహాయం పొందుతూ, తాలిబాన్కి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ (FDD) విశ్లేషకులు, ముఖ్యంగా బిల్ రోజ్జియో, పాకిస్తాన్ సైన్యం విశ్వసనీయతపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగించాలా, లేక గూఢచార సంస్థల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. మధ్యప్రాచ్యం, దక్షిణాసియా అంతటా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ విధాన అంచనాలలో మునీర్ ఒక ఉపయోగకరమైన దౌత్య వారధిగా నిలుస్తారా? లేక ఒక సంభావ్య వ్యూహాత్మక భారంగా పరిణమిస్తారా? అనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఇక, అమెరికా-పాకిస్తాన్ సంబంధాలు ఎప్పుడూ వ్యూహాత్మక అవసరాల ఆధారంగా మారుతూ రావడం కొసమెరుపు.
ఉక్రెయిన్లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. కాల్పుల్లో దుండగుడు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పది మంది వరకు గాయపడ్డారు. హొలొసివ్స్కీ ప్రాంతంలోని ఓ మాల్లో ఉన్న సూపర్మార్కెట్లో శనివారం ఓ దుండగుడు హఠాత్తుగా తుపాకీతో కాల్పులకు దిగాడు.ఇక, ఈ కాల్పుల్లో ఐదుగురు చనిపోగా మరో 10 మంది గాయపడ్డారు. అనంతరం కొందరిని అతడు నిర్బంధంలోకి తీసుకున్నాడు. వారిని కాపాడేందుకు వెళ్లిన పోలీసులపైకి కాల్పులకు దిగాడు. నలుగురు బందీలను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో అతడు చనిపోయాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు.
‘ట్రంప్తో వాదనకు ఏమాత్రం ఆసక్తి లేదు’
రోమ్: ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వాదించేందుకు తనకు ఏమాత్రం ఆసక్తి లేదని క్యాథలిక్కుల మతపెద్ద పోప్ లియో–14 స్పష్టం చేశారు. దైవ సందేశాన్ని బోధించడమనే తన కర్తవ్యాన్ని యథావిధిగా కొనసాగిస్తానని చెప్పారు. ఆఫ్రికాలోని కామెరూన్ నుంచి అంగోలాకు విమానంలో వెళ్తూ మీడియాతో ఆయన మాట్లాడారు.తన బోధనలు ట్రంప్ను ప్రత్యక్షంగా ఉద్దేశించినవి కావని, విస్తృత శాంతి సందేశంలో అవి ఒక భాగమని వివరించారు. తన పర్యటన మొదటి రోజే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నన్ను ఉద్దేశిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఏర్పడిన రాజకీయ వాతావరణం కారణంగా.. తనపై వ్యతిరేక ప్రచారం జరిగిందన్నారు. అందులోని కొన్ని అంశాలు నిజాలు కావని చెప్పారు.
10 మంది శాస్త్రవేత్తల అదృశ్యం
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ అత్యంత కీలకమైన సమాచారం తెల్సిన కనీసం 10 మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు అదృశ్యం కావడం లేక మరణించడంపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించారు. అమెరికా ఏరోస్పేస్, రక్షణ, గ్రహాంతర జీవులకు సంబంధించిన విషయాలు వీరికి సమగ్రంగా తెల్సునని చెబుతున్నారు. ట్రంప్ ఉత్తర్వుల నేపథ్యంలో మరో వారం పదిరోజుల్లో వీరికి సంబంధించిన పూర్తి సమాచారం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకుల అదృశ్యంపై హౌస్ ఓవర్సైట్ కమిటీలోని కాంగ్రెస్ సభ్యుడు ఎరిక్ బర్లిసన్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటి వెనుక రష్యా, చైనా, ఇరాన్ల హస్తం ఉండేందుకు అవకాశాలు లేకపోలేదన్నారు.
జాతీయం
బ్యాక్టీరియాకు బ్యాడ్ టైం!
సాక్షి, స్పెషల్ డెస్క్: బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల చికిత్సకు మానవాళి దశాబ్దాలుగా యాంటీబయోటిక్స్ వినియోగిస్తుండటంతో ఆ మందులకు నిరోధకత పెంచుకొని మొండి బ్యాక్టీరియా ‘సూపర్ బగ్స్’గా మారిన నేపథ్యంలో పరిశోధకులు కొత్త యాంటీబయోటిక్స్ కనుగొనడానికి కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో మెడికల్, బయోలాజికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన జేమ్స్ జె. కాలిన్స్ నేతృత్వంలోని బృందం ఈ దిశగా పరిశోధనలు సాగిస్తోంది. ఏయే రసాయన అణువులు బ్యాక్టీరియాను చంపగలవు.. ఏవి చంపలేవు అనే సమాచారాన్ని జనరేటివ్ ఏఐ మోడల్కు అందించడం ద్వారా అత్యంత ప్రభావవంతమైన యాంటీబయోటిక్స్ తయారీకి అవసరమైన రసాయన సమ్మేళనాన్ని పొందే మార్గాన్ని ఈ బృందం కనుగొంది.ప్రయోగం సాగింది ఇలా..తమ ప్రయోగంలో భాగంగా కాలిన్స్ బృందం ఇప్పటికే తెలిసిన యాంటీబయోటిక్స్ రసాయన నిర్మాణాలను ఉపయోగించి ఒక జనరేటివ్ ఏఐ మోడల్కు శిక్షణ ఇచ్చింది. యాంటీబయాటిక్ అణువులు ఎలా పనిచేస్తాయో జనరేటివ్ ఏఐ మోడల్ నేర్చుకొని దాని ఆధారంగా 4.5 కోట్లకుపైగా రసాయన నిర్మాణాల పనితీరును పరిశీలించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే హాలిసిన్ అనే యాంటీబయోటిక్ క్యాండిడేట్ (చక్కెర వ్యాధికి మందుగా ఉపయోగించేందుకు వీలుగా గతంలో ప్రీ–క్లినికల్, క్లినికల్ ప్రయోగాల్లో వాడిన ఒక రసాయన అణువు) మొండి బ్యాక్టీరియాకు విరుగుడుగా పనిచేస్తుందని గుర్తించింది. ప్రస్తుత యాంటీబయోటిక్స్ రసాయన నిర్మాణాలతో పోలిస్తే హాలిసిన్ రసాయన నిర్మాణం పూర్తి భిన్నమైనది కావడం విశేషం. దీంతో కాలిన్స్ బృందం హాలిసన్ను మొండి బ్యాక్టీరియా సహా వివిధ రకాల బ్యాక్టీరియాలపై పరీక్షించగా ఇది వాటి శక్తి ఉత్పత్తిని దెబ్బతీయడం ద్వారా సమర్థంగా నాశనం చేసింది. ఎంఐటీ శాస్త్రవేత్తలు చేపట్టిన మరో అధ్యయనంలో పూర్తిగా కొత్త యాంటీబయోటిక్ అణువులను సృష్టించడానికి జెనరేటివ్ ఏఐని ఉపయోగించారు. ఈ ఏఐ మోడల్ 3.6 కోట్లకుపైగా రసాయన సమ్మేళనాలను రూపొందించి పరీక్షించింది. ఎంఆర్ఎస్ఏ, గొనేరియా వంటి మొండి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేసే రసాయన అణువులను ఇది గుర్తించింది. ఈ సమ్మేళనాలకు ప్రస్తుతమున్న ఏ రకమైన యాంటీబయోటిక్స్తోనూ పోలిక లేదు. ఇవి బ్యాక్టీరియా కణ త్వచాన్ని దెబ్బతీయడం ద్వారా వాటిని నాశనం చేస్తాయి.పార్కిన్సన్ వ్యాధి చికిత్స కోసం..పార్కిన్సన్ వ్యాధికి మెరుగైన మందులను కనుగొనే ప్రయత్నాల్లో భాగంగా 2024లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బయోఫిజిక్స్ ప్రొఫెసర్ మిచెల్ వెండ్రూస్కోలో, ఆయన సహచరులు మెషీన్ లెర్నింగ్ను ఉపయోగించారు. చివరకు ఈ ప్రక్రియ ద్వారా ఐదు ఆశాజనకమైన అణువులను గుర్తించారు. మరోవైపు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఒక ఏఐ మోడల్ దాదాపు 8,000 మందులను గుర్తించింది. వాటిని 17,000 కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలకు తిరిగి ఉపయోగించే అవకాశం ఉంది.ప్రారంభ దశల్లోనే ఏఐ దోహదం..మందులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఫార్మా కంపెనీల వద్ద ప్రైవేట్గా ఉండటంతో పరిశోధకులకు ఆ సమాచారం అందుబాటులో ఉండట్లేదు. ఫలితంగా లక్ష్యాలను గుర్తించడం, అణువులను పరిశీలించడం వంటి ప్రారంభ దశల్లోనే ప్రస్తుతం ఏఐ దోహదపడుతోంది. దీంతో ఏఐ ద్వారా కనుగొనే అనేక మందులు రోగులకు చేరడానికి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. కాగా, 2017–22 మధ్యకాలంలో 12 కొత్త యాంటీబయోటిక్స్ మాత్రమే ఆమోదం పొందగా వాటిలో ఎక్కువ భాగం ఇప్పటికే అందుబాటులో ఉన్న మందుల మాదిరిగానే ఉన్నాయి.
మహిళలు క్షమించరు!
న్యూఢిల్లీ: నారీ శక్తికి చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం దక్కాలన్న పవిత్రమైన ఆశయంతో తెచ్చిన మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఓడించిన పాపం పూర్తిగా విపక్షాలదేనంటూ ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. వాటి ముసుగు తొలగి అసలు రంగు బయట పడిందన్నారు. ‘‘మా ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ప్రయత్నించినా బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందలేకపోయాం. ఇందుకు దేశ మహిళలందరితో పాటు నేను కూడా ఎంతగానో దుఃఖిస్తున్నా. వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా’’అని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమల్లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు శుక్రవారం లోక్సభలో వీగిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని శనివారం రాత్రి జాతినుద్దేశించి 30 నిమిషాల పాటు ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ తదితర విపక్షాలు దేశ మహిళల చిరకాల ఆకాంక్షను అత్యంత కర్కశంగా నలిపేశాయి. బిల్లును ఓడించడం ద్వారా భ్రూణ హత్యకు పాల్పడ్డాయి. పైగా అందుకు నిండు సభలోనే సంబరాలు చేసుకున్నాయి. బల్లలను చరుస్తూ హర్షాతిరేకాలు వెలిబుచ్చాయి. మహిళల ఆత్మగౌరవాన్ని అత్యంత దారుణంగా గాయపరిచాయి’’అంటూ తూర్పారబట్టారు. మహిళల ఆకాంక్షలను ఆ పార్టీలు కాలరాసిన తీరును దేశ పౌరులంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. ‘‘విపక్షాల పాపానికి ఎన్నటికీ నిష్కృతి లేదు. అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు. మహిళా శక్తిని విపక్షాలు తేలిగ్గా తీసుకుంటున్నాయి. కానీ భారత మహిళ దేన్నయినా మర్చిపోతుందేమో గానీ తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే మాత్రం సహించబోదు. రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, సమాజ్వాదీ తదితర పార్టీలు తలపెట్టిన ద్రోహాన్ని మహిళలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అవి ఎన్నటికీ మర్చిపోలేని రీతిలో గట్టి గుణపాఠం చెప్పి తీరతారు’’అని మోదీ స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు పట్టం కట్టేందుకు జరుగుతున్న కృషి విపక్షాల స్వార్థ రాజకీయాల కారణంగా నిలిచిపోయే పరిస్థితి నెలకొందంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘లోక్సభలో మాకు సంఖ్యా బలం లేకపోయింది. అయినా నిరాశ పడబోం. మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు, రిజర్వేషన్ల చట్టం సత్వర అమలుకు బీజేపీ, ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధితో పోరాడుతూనే ఉంటాయి. ఆ మార్గంలో నెలకొన్న ప్రతి అడ్డంకినీ తొలగించి తీరతాం’’అని ప్రకటించారు. ‘‘పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి అవసరమైన 66 శాతం ఓట్లను మేం సాధించలేకపోవచ్చు. కానీ దేశ మహిళల ఆశీర్వాదాలు మాత్రం 100 శాతం మాతోనే ఉన్నాయి’’అని ప్రధాని పేర్కొన్నారు. పునాదులు కదులుతాయని భయం! కుటుంబాల చెప్పుచేతుల్లో నడిచే కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ వంటి పార్టీలు మహిళల ఎదుగుదలను సహించలేవని మోదీ ఆరోపించారు. ‘‘మహిళలను ఎదగనిస్తే తమ స్వార్థ రాజకీయ పునాదులు పూర్తిగా కదిలిపోతాయని వాటి భయం. అధికారం ఎప్పటికీ తమ కుటుంబానికే పరిమితం కావాలని కోరుకుంటాయి. తమ కుటుంబంలోని మహిళలు తప్ప దేశ మహిళల రాజకీయ ఎదుగుదల సహించలేవు’’అంటూ ఎద్దేవా చేశారు. జనాభాలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో కూడా సముచిత ప్రాధాన్యం దక్కడం తక్షణావసరమని ఆయన పునరుద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్ల అంశం 40 ఏళ్లుగా పెండింగ్లోనే ఉందని గుర్తు చేశారు. ‘‘అందుకే మహిళల సమున్నత ఆకాంక్షలకు రెక్కలు తొడిగే ఉదాత్త లక్ష్యంతోనే సవరణ బిల్లు తెచ్చాం. ఆ క్రమంలో ఎవరికీ ఎలాంటి అన్యాయమూ జరగకుండా జాగ్రత్త పడ్డాం. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర... ఇలా ప్రాంతాలవారీగా సమతుల్యతతో దెబ్బతినకుండా నిజాయతీతో కృషి చేశాం. లోక్సభలో ప్రతి రాష్ట్రానికీ ప్రస్తుతమున్న ప్రాతినిధ్యం సంఖ్యాపరంగానే గాక నైష్పత్తికంగా కూడా యథాతథంగా కొనసాగేలా చూశాం. ఇదే విషయాన్ని విపక్షాలన్నింటికీ పదేపదే చెప్పాం. అయినా దేశ హితం, మహిళా సాధికారత కంటే స్వార్థానికే అవి పెద్దపీట వేశాయి. బిల్లును ఓడించడం ద్వారా రాజ్యాంగాన్ని కూడా అవమానించాయి. రాజ్యాంగం ముందు, దేశ మహిళా శక్తి ముందు నేరస్తులుగా నిలబడ్డాయి’’అంటూ మండిపడ్డారు. ‘‘లోక్సభ స్థానాల పెరుగుదలతో తమిళనాడు, పశ్చమబెంగాల్ గొంతుకను పార్లమెంటులో మరింతగా విన్పించే సువర్ణావకాశం అక్కడి అధికార పార్టీలు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్కు వచ్చింది. దాన్ని అవి కాలదన్నాయి’’అంటూ ప్రధాని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘21వ శతాబ్దపు మహిళలు దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్నీ నిశితంగా గమనిస్తున్నారు. విపక్షాల అసలు ఉద్దేశాలను వారు అర్థం చేసుకుంటున్నారు’’అంటూ హెచ్చరించారు. పరాన్నజీవిలా కాంగ్రెస్! కాంగ్రెస్పై ప్రధాని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. దేశ ప్రగతికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ ఆ పార్టీది ఆది నుంచీ ప్రతికూల భావజాలమేనంటూ దుయ్యబట్టారు. దేశ వెనకబాటుకు, అది ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ కాంగ్రెసే ఏకైక కారణమని ఆరోపించారు. ‘‘సంస్కరణలకు కాంగ్రెస్ నిత్య వ్యతిరేకి. ఆ పేరు వింటేనే ఉలిక్కిపడుతుంది. జాతి నిర్మాణానికి, మెరుగుదలకు ఉద్దేశించి ప్రతి ప్రయత్నాన్నీ అడ్డుకుంటూ వచ్చిన చరిత్ర కాంగ్రెస్ది. దశాబ్దాలుగా ప్రతి సంస్కరణనూ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంది. జన్ధన్ యోజన మొదలుకుని ఆధార్, డిజిటల్ చెల్లింపులు, జీఎస్టీ దాకా ఇందుకు తార్కాణాలెన్నో. ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లను, ఆర్టికల్ 370, త్రిపుల్ తలాక్ రద్దునూ కాంగ్రెస్ గుడ్డిగా వ్యతిరేకించింది’’అంటూ ఆక్షేపించారు. ‘‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నానాటికీ బలహీనపడుతోంది. ప్రజాదరణ, సొంత బలం కోల్పోయి ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి పరాన్నజీవిలా మనుగడ సాగిస్తోంది. కానీ ఆ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ బలోపేతం కావొద్దని కోరుకుంటోంది’’అంటూ ఎద్దేవా చేశారు. ‘‘మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా 40 ఏళ్లుగా కాంగ్రెస్ గుడ్డి వ్యతిరేకిస్తోంది. సవరణ బిల్లుకు మద్దతిచ్చి ఆ తప్పిదాలను సరిచేసుకుంటుందని, కొత్త చరిత్ర లిఖిస్తుందని ఆశించా. కానీ ఆ చరిత్రాత్మక అవకాశాన్ని కాంగ్రెస్ పోగొట్టుకుంది. ఆ పార్టీ నమ్ముకున్నది విభజన రాజకీయాలను మాత్రమే. అందుకే ఉత్తరాది, దక్షిణాది విభజన అంటూ డీలిమిటేషన్పై అవాస్తవాలను ప్రచారం చేసింది’’అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రతికూల భావజాలానికి దేశ మహిళలు తగిన రీతిలో బదులిచ్చి తీరతారని హెచ్చరించారు.
’మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నా’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నాను. మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రవర్తించాయో దేశం మొత్తం చూసింది. బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి. మహిళా రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. భారత మహిళల కలలను నాశనం చేశారు. దేశహితమే మాకు ముఖ్యం’ అని తెలిపారు. కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే పార్టీలన్నీ మహిళలకు వ్యతిరేకం. నారీశక్తి ఎదగకుండా అడ్డుకున్నాయని మోదీ ఆరోపించారు. 40 ఏళ్లుగా మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. మహిళా రిజర్వేషన్ను అడ్డుకున్న పాపం విపక్షాలను వదిలిపెట్టదు. కొందరికి దేశం కంటే రాజకీయమే ముఖ్యం. విపక్షాలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది. పాపం చేసిన విపక్షాలకు శిక్ష తప్పదు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం విపక్షాలకు ఇష్టం లేదు. మహిళా బిల్లును అడ్డుకుని బ్రూణహత్యకు పాల్పడ్డాయి‘ అని మోదీ ప్పారు.కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు‘మహిళా రిజర్వేషన్ బిల్లును గర్భంలోనే చంపేశారు. ఈ భ్రూణ హత్యలకు కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మహిళలకు అన్యాయం చేశారు. మహిళా బిల్లును ఓడించి కొట్టిన చప్పట్లు.. మహిళలకు చేసిన గాయాలు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ సమాజ్ వాదీ పార్టీ నిజస్వరూపం బయటపడింది.కాంగ్రెస్ తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటుందని భావించా. కానీ మహిళలకు న్యాయం చేసే అవకాశాన్ని జారవిడుచుకుంది. మిత్రపక్షాలపై ఆధారపడి కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. ఇప్పుడున్న సీట్ల నిష్పత్తి ప్రకారమే నియోజకవర్గాలను పెంచాలని ప్రతిపాదించా. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. అన్ని రాష్ట్రాలలో నియోజకవర్గాలు పెరిగి ఎక్కువ మందికి అవకాశాలు వచ్చేవి. కానీ, డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంస్కరణల వ్యతిరేక పార్టీ. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370ని కూడా వ్యతిరేకించింది. డీలిమిటేషన్పై దుష్ప్రచారం చేశారు’ అని మోదీ తెలిపారు.
తమిళనాట ఇండియన్ ఇనిస్టిట్యూట్ సర్వే...!
చెన్నై: మరో వారం రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమెక్రటిక్ స్ట్రాటజీస్ సంచలన ఓపీనియన్ పోల్ వెల్లడించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ తన స్థానాన్ని పదిలం చేసుకోబుతున్నారని సర్వే తెలిపింది.ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటములతో పాటు సినీ హీరో విజయ్ టీవీకే పార్టీ ప్రచారాలు జోరుగా చేస్తున్నాయి. అధికారం పొందడమే లక్షంగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే డీఎంకే కూటమి తమిళనాట మరోసారి జెండా ఎగురవేయడం ఖాయమని ఒపీనియన్ పోల్ చెబుతున్నాయి. అదేవిధంగా ప్రతిపక్ష డీఎంకే కూటమి ఏ సారి కూడా ప్రతిపక్షానికి పరిమితం కానున్నట్లు పేర్కొంది. సినీహీరో విజయ్ అధికారానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ మంచి స్థాయిలో ఓట్లషేర్ సాధించే అవకాశాలున్నాయని సర్వే తెలిపింది.ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమెక్రటిక్ స్ట్రాటజీస్ ఓపీనియన్ పోల్ ప్రకారండీఎంకే కూటమి-37.5 % ఓట్లు 121 సీట్లుఏఐడీఎంకే కూటమి- 33.63 % ఓట్లు 83 సీట్లుటీవీకే పార్టీ - 24.71 % ఓట్లు 3 సీట్లు సాధించనున్నట్లు సర్వే తెలిపింది. 27 చోట్ల హోరాహోరి పోరు నడుస్తోందని పేర్కొంది. అయితే డీఎంకే సైతం సొంతంగా మెజారిటీ సాధించలేదని అలియన్స్ ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఇదివరకు వచ్చిన సర్వేలలో చాలా వరకూ డీఎంకే వైపే మెుగ్గుచూపాయి. కాగా తమిళనాడులో 234 స్థానాలుండగా అధికారం సాధించడానికి 118 స్థానాలు అవసరం.
ఎన్ఆర్ఐ
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్లోని తెలుగు వాసులు ఈ ఏడాది ఉగాది పండుగను సంప్రదాయానికి అనుగుణంగా, ఆత్మీయంగా మరియు వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20, 2026 తేదీలలో ఈ ఉత్సవాలు చాంగీ రామర్ దేవాలయం, సెంగ్కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం మరియు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రత్యేకంగా, టీమ్ శివ ప్రసాద్ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాలయాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి మరియు ప్రసాదాన్ని పంపిణీ చేశారఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆనందం, ఐక్యత మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది.ఈ ఉత్సవాల ద్వారా సాంప్రదాయం, సంస్కృతి, భక్తి మరియు ఐక్యత మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో, సింగపూర్లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు.
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు)
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
క్రైమ్
టీచర్ ఇంట దొంగలు పడ్డారు
చెన్నై: వల్లియూర్లో ఎన్నికల శిక్షణకు వెళ్లిన ఒక ఉపాధ్యాయురాలి ఇంట దొంగలు పడ్డారు. 21 సవర్ల విలువైన నగలు చోరీ చేశారు. వివరాలు.. నెల్లై జిల్లా, వల్లియూర్, రామలక్ష్మి నగర్కు చెందిన రోసారియో భార్య సహాయుజిన్ శాంతి (58) ఏర్వాడి ప్రభుత్వ బాలికల పాఠశాలలో టీచర్గా పని చేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, పోలింగ్ కేంద్రాల అధికారులుగా పనిచేసే ఉపాధ్యాయులకు గురువారం వల్లియూర్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి సహాయుజిన్ శాంతి వెళ్లారు. అలాగే తన పోస్టల్ బ్యాలెట్కు కూడా అక్కడ నమోదు చేసుకున్నారు. తిరిగి సాయంత్రం ఇంటికి ఆమె వచ్చా రు. ఇంట్లోని బెడ్రూమ్లో బీరువా తెరచి ఉండటం, అందులో ఉన్న వాటిని చెల్లాచెదురుగా చేసి పడేసి ఉండటంతో ఆందోళన చెందారు. బీరువాను పరిశీలించి చూడగా అందులో ఉన్న 50 సవర్ల నగల్లో దాదాపు 21 సవర్ల బంగారు నగలు చోరీ చేసినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 21 లక్షలు. దీనిపై తన భర్తకు ఆమె సమాచారం ఇవ్వడంతో అతను ఇంట్లో పనిచేస్తున్న వారిని ప్రశ్నించాడు. తామేమీ చోరీ చేయలేదని వారు పేర్కొనడంతో చివరకు వల్లియూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ ఇంటిలోని నిఘా కెమెరా ఫుటేజీని పరిశీలించారు.ఆ ఇంట్లో పనిచేస్తున్న కొంతమంది మహిళల బంధువులు ఇద్దరు వచ్చి వెళ్లినట్లు తేలింది. దీని ఆధారంగా పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసు కుని విచారణ చేస్తున్నారు.
తల్లే నరరూప రాక్షసి.. 95 ఏళ్ల జైలు విధించిన కోర్టు
అన్నానగర్: మైనర్ బాలికపై సామూహిక లైంగికదాడి చేసిన ముగ్గురికి జైలు శిక్ష, దీనికి సహకరించిన బాలిక తల్లికి 95 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శివగంగై పోక్సో కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. వివరాలు.. శివగంగై జిల్లా తిరుపత్తూరు ప్రాంతానికి చెందిన అక్బర్ అలీ అంబలం (71), డ్రైవర్. అరియలూరుకు చెందిన శరవణన్ (41) కూలీ. పుదుక్కోట్టై జిల్లా అళగియనాయకిపురం గ్రామానికి చెందిన మురుగేషన్ (55). ముగ్గురూ కలిసి 2021లో 15 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక తల్లి కూడా దీనికి సహకరించడం గమనార్హం! తిరుపత్తూరు అఖిల మహిళా పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అక్బర్ అలీ, శరవణన్, మురుగేశన్, బాలిక తల్లి మరో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. శివగంగైలోని పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు శుక్రవారం తుది విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి గోకుల్ మురుగన్, నిందితుడు అక్బర్ అలీ అంబలానికి 50 ఏళ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా, శరవణకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, మురుగేషన్కు 25 ఏళ్లు జైలు, రూ.11 వేలు జరిమానా, బాలిక తల్లికి 95 ఏళ్లు జైలు శిక్ష, రూ.5వేల జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. మిగతా ఇద్దరు మహిళలను నిర్దోషులుగా విడుదల చేశారు. బాధితురాలికి నష్టపరిహారంగా రూ. 5 లక్షలు చెల్లించాలని కూడా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
20 నిమిషాలు.. 10 కేజీల గోల్డ్.. రూ.35 లక్షలు
సింగ్రౌలీ: మధ్యప్రదేశ్లోని బ్యాంకు దోపిడీ కలకలం రేపింది. తుపాకులతో లోపలికి చొరబడిన దుండగులు.. కస్టమర్లు, బ్యాంకు సిబ్బందిని రూ. 15 కోట్ల విలువైన బంగారం(10 కేజీలు), రూ.35 లక్షల నగదుతో పరారయ్యారు. సింగ్రౌలీలో శుక్రవారం మధ్యాహ్నం(ఏప్రిల్ 17) సమయంలో ఐదుగురు దుండగులు కస్టమర్ల ముసుగులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖ బ్యాంకులో ప్రవేశించారు. కేవలం 20 నిమిషాల్లో బంగారం, వెండి, రూ.35 లక్షల నగదుతో ఉడాయించారు.మొదట ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించారు. లోపలికి రాగానే తుపాకులు తీసి సిబ్బందిని బెదిరించడం ప్రారంభించారు. వెంటనే మరో ముగ్గురు సహచరులు కూడా లోపలికి రావడంతో బ్యాంకు మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లిపోయింది. దోపిడీ దొంగలు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరపడంతో కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. లాకర్లు, నగదు నిల్వలకు సంబంధించిన తాళాలు ఇవ్వాలంటూ బ్రాంచ్ మేనేజర్ను బెదిరించారు. మేనేజర్ నిరాకరించడంతో అతని తలపై తుపాకీతో బలంగా కొట్టి గాయపరిచారు. ఆ తర్వాత బలవంతంగా తాళాలు తీసుకున్నారు.ఆ సమయంలో బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడం దొంగలకు కలిసి వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారిని ఎవరూ అడ్డుకోలేకపోయారని.. క్షణాల్లో అంతా జరిగిపోయిందని ఓ కస్టమర్ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. నగరం వెలుపలికి వెళ్లే అన్ని దారులన్నీ మూసివేశారు. నిందితులను గుర్తించడానికి బ్యాంకు, పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది, కస్టమర్ల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు.
నోట్ల కట్టల వెనుక మిస్టరీ.. గోదావరి జిల్లాల్లో సంచలనం
నరసాపురం: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో ఓ పాస్టర్ ఇంట్లో రూ.2,27,94,000 పోలీసులు స్వాధీనం చేసుకోవడం గోదావరి జిల్లాల్లో సంచలనంగా మారింది. కొద్దినెలల క్రితం వరకూ సాధారణ జీవితం గడిపిన పాస్టర్ గంటా జాన్ బాబూరావు ఒక్కసారిగా విలాసవంతమైన జీవితంలోకి మారడమే కాకుండా, పెద్ద సంఖ్యలో ఆస్తుల కొనుగోలు చేయడం, ఈ క్రమంలో ఆయన ఇంట్లో కోట్లలో నోట్ల కట్టలు లభ్యం కావడం హాట్టాపిక్గా మారింది. ఇంట్లో లభ్యమైన నగదుకు ఆధారాలు చూపని కారణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నరసాపురం డీఎస్పీ సుధాకర్ నేతృత్వంలో రూరల్ సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రెండు బృందాలు విస్తృతంగా దర్యాప్తు చేపట్టాయి. శుక్రవారం ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. జాన్ బాబూరావు నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. పలు దస్తావేజులు, ఆస్తి పత్రాలు స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. ఇటీవల బాబూరావు తనతో పాటు అతని అల్లుడు, కుమార్తె పేరుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా ఐటీ అధికారులు ప్రాథ«మికంగా గుర్తించారు. తమ వద్ద ఉన్న నగదుకు అన్ని ఆధారాలు ఉన్నట్టు పాస్టర్ కుమార్తె ఫోన్ ద్వారా ఐటీ అధికారులకు తెలిపినట్టు సమాచారం. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన జాన్బాబూరావు గ్రామంలో చిన్న చర్చి నడిపేవారు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్కు చెందిన వ్యక్తితో తన కుమార్తె వివాహం చేశారు. అప్పటి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు.
వీడియోలు
ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం
పెళ్లి తర్వాత వన్స్ మోర్..!
తెలంగాణలో రెడ్ బుక్ అంటే తాట తీస్తాం.. అబ్బా కొడుకులకు జర్నలిస్టులు వార్నింగ్
అక్షయ తృతీయ ఆఫర్స్.. కిక్కిరిసిన బంగారం షాపులు
ఓటర్ జాబితాలో అక్రమాలు.. పరకాల సంచలన వ్యాఖ్యలు
కాపు టైగర్ దీక్ష అంటే ఆ మాత్రం ఉండాలి..
జర్నలిస్ట్ KVRపై కేసులు.. బాబును ఏకిపారేసిన జగన్
ప్రళయ కాలం వచ్చేసింది! మానవాళికి ఆఖరి రోజా
నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నేను శ్రీ రాముడిని అలా అనలేదు
KGF డైలాగుతో దడదడలాడించిన శ్యామల



