‘జైహింద్’ అనలేదని ఐపీఎస్ అధికారిణి బదిలీ!
ఆమె ఓ ఐపీఎస్ అధికారిణి. యూపీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు. అందులో వాళ్లను మోటివేట్ చేసేందుకు తన జర్నీనే చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఆ వీడియో నెట్టింట దుమారం రేపింది. ఓ హిందూ సంఘం అభ్యంతరాలతో ఏకంగా రాష్ట్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం నేపథ్యంలో.. ప్రభుత్వం ఆమెను మరో విభాగానికి బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.పశ్చిమ బెంగాల్లో ఐపీఎస్ అధికారిణి బుష్రా బానో(IPS Bushra Bano) వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖరగ్పూర్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ఆమెను సోమవారం రాష్ట్ర సాయుధ పోలీసు దళం డిప్యూటీ కమాండెంట్గా బదిలీ చేశారు. అయితే ఆమెపై ఫిర్యాదు, ఆగమేఘాల మీద బదిలీకి మధ్య జరిగింది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.2021 బ్యాచ్కు చెందిన బుష్రా బానో(Bushra Bano).. సెప్టెంబర్ 13న యూపీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు. అందులో తాను సివిల్ సర్వీసెస్కు ఎలా సిద్ధమయ్యారో వివరించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU)లోని రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ తన యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఎంతో సహాయపడిందని చెప్పారు. చదువుకు అవసరమైన స్టడీ మెటీరియల్, లైబ్రరీ, టెస్ట్ సిరీస్ వంటివి తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని వివరించారు.అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. వీడియో ప్రారంభంలో ‘అస్సలామువాలైకుమ్’, మధ్యలో ‘ఇన్షా అల్లా’, చివర్లో ‘జజాకల్లా’ వంటి పదాలను ఉపయోగించారు. దీనిపై ఎక్స్(ట్విటర్)లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జై హింద్’, ‘వందేమాతరం’ వంటి జాతీయ అభివాదాలను ఆమె ఉపయోగించలేదని విమర్శించారు.హిందూ లీగల్ ఫండ్ ఫిర్యాదుఈ వ్యవహారంపై ‘హిందూ లీగల్ ఫండ్’ అనే సంస్థ పశ్చిమ బెంగాల్ హోం సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ప్రజా వేదికపై భారత ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించే సర్వీసింగ్ అధికారిణి న్యూట్రల్గా ఉండాలని, జాతీయ అభివాదాలను ఉపయోగించాలని కోరినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.అయితే ఇది జరిగాక.. బుష్రా బానో ట్రాన్స్ఫర్ అయ్యారు. అందుకు సువేందు ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ రాలేదు. బుష్రా బానో బదిలీపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆమెపై వచ్చిన ఫిర్యాదు కారణమా? లేదంటే సాధారణ పరిపాలనా బదిలీయా? అన్నదానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.సౌదీ నుంచి సివిల్స్ వరకు..బుష్రా బానో ప్రయాణం కూడా ఆసక్తికరమే. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాకు చెందిన ఆమె అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మేనేజ్మెంట్ స్టడీస్లో పీహెచ్డీ చేశారు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా సాధించారు. వివాహం, కుటుంబ బాధ్యతల మధ్య కొంతకాలం సౌదీ అరేబియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. అనంతరం భారత్కు తిరిగి వచ్చి యూపీఎస్సీకి సిద్ధమయ్యారు.ఆమె 2018లో యూపీఎస్సీలో 277వ ర్యాంక్ సాధించి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్కు ఎంపికయ్యారు. అయితే రెండో బిడ్డకు గర్భవతిగా ఉండటంతో ఆ పోస్టులో చేరలేకపోయారు. ఆ తర్వాత మరోసారి యూపీఎస్సీ రాసి 2019లో 234వ ర్యాంక్ సాధించారు. ఈసారి ఐపీఎస్కు ఎంపికై.. పశ్చిమ బెంగాల్ కేడర్కు కేటాయించబడ్డారు.ఖరగ్పూర్ నుంచి సాయుధ పోలీసులకు..కెరీర్లో తొలి పోస్టింగ్ హుగ్లీ రూరల్ ఏఎస్పీగా చేపట్టిన బుష్రా బానో.. ఈ ఏడాది జూన్లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. అనంతరం ఖరగ్పూర్ అదనపు ఎస్పీగా పనిచేశారు. తాజాగా ఆమెను రాష్ట్ర సాయుధ పోలీసు దళం డిప్యూటీ కమాండెంట్గా బదిలీ చేశారు.ఇదీ చదవండి: వీధుల్లో దీన స్థితిలో కోటీశ్వరుడు.. ఎందుకంటే!
బీజేపీకి లోకల్ దెబ్బ.. సీఎం ఇలాకాలోనూ ఓటమి!
రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీలో కొత్త చర్చకు తెరతీశాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తమకు తిరుగులేదని ధీమా వ్యక్తం చేసిన పార్టీకి.. కీలక నేతల సొంత ప్రాంతాల్లోనే ఓటర్లు గట్టి సంకేతం ఇచ్చారు. ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాఠోడ్, కేంద్ర మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది.ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సొంత జిల్లా భరత్పూర్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల ప్రచారంలో సీఎం స్వయంగా రోడ్షోలు నిర్వహించినప్పటికీ.. ఆ ప్రభావం ఫలితాల్లో పూర్తిగా కనిపించలేదు. మొత్తం 65 వార్డులున్న భరత్పూర్ నగర పాలక సంస్థలో బీజేపీ కేవలం 20 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ఏడు స్థానాలు గెలుచుకోగా.. ఏకంగా 36 వార్డులను స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో అక్కడ బోర్డు ఏర్పాటు చేయాలంటే బీజేపీకి స్వతంత్రుల మద్దతు తప్పనిసరి కానుంది. అధ్యక్షుడి ఇలాకాలోనూ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాఠోడ్ సొంత జిల్లా పాలీలోనూ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. మొత్తం 65 వార్డుల్లో కాంగ్రెస్ 29 స్థానాలు గెలుచుకోగా.. బీజేపీ 21 స్థానాల వద్దే ఆగిపోయింది. మరో 15 స్థానాలను స్వతంత్రులు దక్కించుకున్నారు. బోర్డు ఏర్పాటుకు 34 స్థానాలు అవసరం కావడంతో.. ఇక్కడ కూడా స్వతంత్రులే కీలకం కానున్నారు.వసుంధర గడ్డలో కాంగ్రెస్ జెండా..మాజీ సీఎం వసుంధర రాజే ప్రభావం బలంగా ఉన్న ఝలావార్లో బీజేపీకి మరింత పెద్ద షాక్ తగిలింది. ఝలావార్ మున్సిపల్ కౌన్సిల్లోని 45 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 29 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. దీంతో అక్కడ బీజేపీ అధికారం కోల్పోయింది. వసుంధర ప్రభావం ఉన్న ప్రాంతంలోనే కాంగ్రెస్ ఈ స్థాయిలో విజయం సాధించడం కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.భూపేంద్ర యాదవ్ ప్రాంతంలోనూ..కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అల్వార్ ప్రాంతంలోనూ బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. మొత్తం 65 వార్డుల్లో బీజేపీ 28 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ 23 సీట్లు దక్కించుకుంది. మరో 13 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. ఒక స్థానాన్ని బీఎస్పీ గెలుచుకుంది. దీంతో ఇక్కడ కూడా బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించలేదు.జోధ్పూర్లో హోరాహోరీ..ఇటు జోధ్పూర్లోనూ బీజేపీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. 100 వార్డులున్న నగర పాలక సంస్థలో బీజేపీ, కాంగ్రెస్ చెరో 44 స్థానాలు గెలుచుకున్నాయి. మరో 11 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. దీంతో బోర్డు ఏర్పాటులో స్వతంత్రుల పాత్ర కీలకంగా మారింది.బికనీర్లో కాంగ్రెస్ దూకుడుకేంద్ర మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ప్రభావం ఉన్న బికనీర్ బీజేపీకి నిరాశే ఎదురైంది. మొత్తం 80 వార్డుల్లో కాంగ్రెస్ 42 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. బీజేపీ 27 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్కు బోర్డు ఏర్పాటు చేసేందుకు ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండా పోయింది.2028కి ముందు హెచ్చరికేనా?రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 4,179 వార్డులు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 3,613, స్వతంత్రులు 2,273 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ముందంజలో ఉన్నప్పటికీ.. కీలక నేతల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్, ఇండిపెండెంట్ల బలం స్పష్టంగా కనిపించింది. అయితే భరత్పూర్, పాలి, ఝలావార్, అల్వార్, జోధ్పూర్, బికనీర్ వంటి కీలక ప్రాంతాల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి హెచ్చరికగా మారాయి. ముఖ్యంగా సీఎం నుంచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి వరకు కీలక నేతల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీకి స్పష్టమైన ఆధిపత్యం దక్కకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఈ ఫలితాలు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై బీజేపీ నాయకత్వం దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: షాకింగ్.. రైల్వే స్టేషన్లలో రైల్వే వాళ్లు ఇచ్చే నీళ్లు ఎలాంటివో తెలుసా?
‘ఇదేం స్ట్రాటజీ సోదరా?’.. దోస్తీ అంటూనే విజయ్తో కుస్తీ!
తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. విజయ్ ఏర్పాటు చేయబోయే సెక్యులర్ కూటమికి దూరంగా ఉంటామని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. అంతేకాదు.. 120 రోజుల విజయ్ పాలనపై తీవ్ర విమర్శలకు సిద్ధపడినట్లు బహిరంగంగా ప్రకటించాయి. ఇది చాలదన్నట్లు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. ఇవన్నీ డీఎంకేకు లాభం చేకూర్చే నిర్ణయాలేనని, ప్రతిపక్షానికి మళ్లీ అవి దగ్గరవుతున్నాయా? అనే చర్చా జోరందుకుంది.తమిళనాడులో అక్టోబర్ 6న జరగనున్న రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. మదురాంతకంలో సీపీఎం, ధారాపురంలో సీపీఐ అభ్యర్థులను బరిలోకి దించనున్నాయి. సెప్టెంబర్ 15న అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో టీవీకే నేతృత్వంలోని కూటమితో పాటు డీఎంకే, అన్నాడీఎంకే–బీజేపీ కూటమి, నామ్ తమిళర్ కట్చి ఇప్పటికే రంగంలో ఉన్నాయి. వామపక్షాల తాజా నిర్ణయంతో పోరు ఐదు కోణాల్లో సాగనుంది. అయితే ఈ పోటీ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని.. విజయ్ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశాయి. దీంతో బయటి నుంచే సపోర్ట్ చేస్తున్న వామపక్షాలు.. ఉప ఎన్నికల వేళ మాత్రం అదే ప్రభుత్వ అభ్యర్థులకు ఎదురుగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ నిర్ణయం డీఎంకేకు లాభం చేకూర్చేందుకు కాదని లెఫ్ట్ పార్టీలు స్పష్టం చేశాయి. టీవీకే ఏర్పాటు చేయబోయే కొత్త కూటమిలో మేం చేరబోం. మూడు ప్రధాన కూటములకూ వ్యతిరేకంగా మేం పోటీ చేస్తున్నాం. అంతే తప్పా ఏ పార్టీకో లాభం చేకూర్చేందుకు మేం పోటీ చేయడం లేదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం తేల్చిచెప్పారు. బయట మద్దతు.. లోపల విమర్శలు2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మెజార్టీకి కొంత దూరంలో నిలిచిన విజయ్ ప్రభుత్వానికి సీపీఐ, సీపీఎం బయట నుంచి మద్దతు ప్రకటించాయి. ప్రజల తీర్పును గౌరవించడం, గవర్నర్ పాలనకు అవకాశం లేకుండా చూడటం, పరోక్షంగా బీజేపీ పాలన రాకుండా అడ్డుకోవడమే తమ మద్దతు ఉద్దేశమని అప్పట్లో వామపక్షాలు తెలిపాయి. అయితే కేబినెట్లో మాత్రం చేరలేదు. అలాగే టీవీకే అధికారిక కూటమిలోనూ భాగం కాలేదు.ఇప్పుడు ఉప ఎన్నికల్లో మాత్రం టీవీకే అభ్యర్థులపై పోటీకి దిగుతున్నాయి. దీంతో ‘ప్రభుత్వానికి మద్దతు.. అభ్యర్థులకు వ్యతిరేకం’ అనే వామపక్షాల వైఖరి రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. దీనిపై విమర్శలు వచ్చినా.. ఉప ఎన్నికలు ప్రభుత్వం మార్పు కోసం జరిగేవి కావని షణ్ముగం స్పష్టం చేశారు. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయడం తమ రాజకీయ నిర్ణయమని తెలిపారు.120 రోజుల పాలనపై ప్రచారంలోనే కౌంటర్ఉప ఎన్నికల ప్రచారాన్ని విజయ్ ప్రభుత్వంపై విమర్శలకు వేదికగా చేసుకుంటామని సీపీఎం ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వ తొలి 120 రోజుల పాలన, ఆర్థిక విధానాలు, పరిపాలనా చర్యలు, అసెంబ్లీ పనితీరుపై తమ అభిప్రాయాలను ప్రజలకు వివరిస్తామని షణ్ముగం చెప్పారు. ముఖ్యంగా ‘నియో లిబరల్’ ఆర్థిక విధానాలపై తమ అభ్యంతరాలను ప్రచారంలో ప్రస్తావిస్తామన్నారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లో పారదర్శకత ఉండాలని వామపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. విదేశీ పెట్టుబడులతో పాటు స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాయి.సచివాలయం విషయంలోనూ విభేదాలుచెన్నైలోని పట్టినప్పాక్కంలో కొత్త సచివాలయం, అసెంబ్లీ సముదాయం నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపైనా వామపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయంపై మత్స్యకారుల జీవనోపాధి, పర్యావరణం, ట్రాఫిక్ తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించాలని కోరాయి. అసెంబ్లీలో డీఎంకే అధినేత స్టాలిన్పై విజయ్ చేసిన వ్యాఖ్యలు, చేతి సైగలపైనా సీపీఎం గతంలో తీవ్రంగా స్పందించింది. సభను వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చొద్దని షణ్ముగం సూచించారు.‘ఇది ప్రజలపై రుద్దిన ఎన్నిక’మదురాంతకం, ధారాపురం ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయన్న దానిపైనా వామపక్షాలు టీవీకేపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 2026 ఎన్నికల్లో ఈ రెండు స్థానాల నుంచి అన్నాడీఎంకే తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కే. మరగతం కుమారవేల్, పి. సత్యబామలు ఆ తర్వాత రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఇప్పుడు అదే స్థానాల నుంచి టీవీకే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.ఎన్నికైన కొద్ది రోజులకే ఎమ్మెల్యేలు పార్టీ మారి రాజీనామా చేయడం ప్రజల తీర్పును అవమానించడమేనని సీపీఎం విమర్శించింది. ఈ పరిణామాల వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని.. ఇవి సహజంగా వచ్చిన ఎన్నికలు కావని, ప్రజలపై రుద్దిన ఎన్నికలని షణ్ముగం వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పు వెనుక ‘హార్స్ ట్రేడింగ్’ జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు.రెండు సీట్లలో గెలిస్తే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తమ గొంతును మరింత బలంగా వినిపించవచ్చన్నది వామపక్షాల లెక్క. అందుకే ప్రభుత్వం విషయంలో విజయ్కు మద్దతు కొనసాగిస్తూనే.. ఎన్నికల విషయంలో మాత్రం టీవీకేను ఢీకొట్టాలని నిర్ణయించాయి. అంటే.. ప్రభుత్వం నిలబడేందుకు దోస్తీ.. తమ రాజకీయ బలం చాటుకునేందుకు కుస్తీ! ఇదే ఇప్పుడు తమిళనాడు ఉప ఎన్నికల్లో లెఫ్ట్ అనుసరిస్తున్న ‘ఇదేం స్ట్రాటజీ సోదరా?’ అనే ప్రశ్నకు అసలు సమాధానం.ఇదీ చదవండి: బిహార్లో బీజేపీకి ఝలక్
‘నాపై అంత జాలి ఉంటే..’ కల్యాణ్కు బైకర్ సియా కౌంటర్
రోడ్డుపై వెళ్తున్న ఓ యువతి బైక్ను కారు ఢీకొట్టడం.. ఆమె కిందపడిపోయినా వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోవడం.. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. గురుగ్రామ్లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. తనను కారు కావాలనే వెంబడించి ఢీకొట్టారని బైకర్ ‘రెబల్ వీల్స్ సియా’ ఆరోపిస్తుండగా.. నిందితుడి తరఫు న్యాయవాది మాత్రం తప్పంతా బైకర్లదేనని అంటున్నాడు.గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగింది. సియా తన ఏప్రిలియా ఆర్ఎస్ 457 స్పోర్ట్స్ బైక్పై తోటి బైకర్లతో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో తెల్లరంగు సెడాన్ తమను వెంబడించిందని ఆమె చెబుతోంది. కారులోని వారు తనకు దగ్గరగా వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తించారని, దూరంగా ఉండాలని తాను సూచించినా.. బైక్ను ఆపాలని సైగలు చేశారని ఆమె ఆరోపించింది. చివరకు కారు పక్క నుంచి వచ్చి తన బైక్ను ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయానని తెలిపింది.‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని’ప్రమాదంపై తొలిసారి స్పందించిన సియా.. నిందితుడు కల్యాణ్ బైన్స్లా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ‘నాపై జాలిపడుతున్నానని చెబుతున్నారు. నిజంగా జాలిపడితే ప్రమాదం తర్వాత ఎందుకు ఆపలేదు?’ అని ప్రశ్నించింది. తనను కారు చాలా దూరం వెంబడించిందని చెబుతూ.. ‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని. ఎముకలు విరిగిపోయేంత తీవ్ర గాయాలు కూడా అయ్యుండొచ్చు’ అని పేర్కొంది.కారు తనను వెంబడించలేదన్న వాదనను కూడా ఆమె ఖండించింది. ‘నా జుట్టు కనిపించింది.. నా దగ్గరకు వచ్చారు.. ఆపాలని సైగ చేశారు. అలాంటప్పుడు బైక్పై మహిళ ఉందో లేదో తెలియదని ఎలా చెబుతారు?’ అని ప్రశ్నించింది. ప్రమాదానికి సంబంధించిన రెండు వీడియోల్లోనూ కారు తన బైక్ వైపు లేన్ మార్చి ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపింది.This isn't hit and run... it's hit and kill 🖐️Car No: HR 30Y 4949In Gurugram, first a female bike rider was harassed by 4 louts sitting in a Verna car, they made vulgar vulgar gestures When the girl stopped them from doing so and told them to leave, the beasts rammed her… pic.twitter.com/W1141MIGSJ— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 14, 2026కొత్త వీడియో.. మరో కోణంలో ఢీకొట్టిన దృశ్యంఈ ఘటనకు సంబంధించి సియా వెనుకే వస్తున్న మరో బైకర్ రికార్డు చేసిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో కారు సియా బైక్ వైపు వచ్చి ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. కారు తమను చాలా దగ్గరగా వెంబడించిందని, డ్రైవర్ కిటికీ దించి ఆపాలని సైగ చేశాడని ఆ బైకర్ ఆరోపించాడు. ప్రమాదం తర్వాత కారు వెళ్లిపోవడంతో తాను దాన్ని వెంబడించి డ్రైవర్ ముఖాన్ని కెమెరాలో రికార్డు చేశానని చెప్పాడు. ప్రమాదం కారణంగా సియాకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అయితే రైడింగ్ గేర్ ధరించి ఉండటంతో తీవ్ర గాయాలు తప్పాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్ మాత్రం దెబ్బతింది.‘కారులో నలుగురు.. మద్యం మత్తులో ఉన్నారు’సియా సోదరుడు కూడా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రమాదం జరిగిన వెంటనే తనకు సియా ఫోన్ చేసి.. ఎవరో కారుతో ఢీకొట్టి వెళ్లిపోయారని చెప్పిందన్నాడు. కారులో నలుగురు ఉన్నారని, వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించారని ఆమె చెప్పినట్లు వెల్లడించాడు. కారులోని వారు అసభ్యకరమైన సైగలు చేశారని కూడా ఆరోపించాడు. సియా తండ్రి ఈ ఘటనను సాధారణ ప్రమాదంగా చూడలేమని, ఇది హత్యాయత్నంగా భావిస్తున్నామని అన్నారు. రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ కూడా లేదని.. అలాంటి సమయంలో ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.‘తప్పంతా బైకర్లదే’.. నిందితుడి తరఫు వాదనగురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్యాణ్ బైన్స్లా బాడీబిల్డర్, జిమ్ ట్రైనర్. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ‘ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్’, ‘ఇండియన్ రగ్బీ టీమ్ సభ్యుడు’గా రాసుకున్నాడు. హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్ బైన్స్లా తరఫు న్యాయవాది మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపించారు. కారులో నలుగురు ఉన్నారని.. వారిలో బంధువులు కూడా ఉన్నారని చెప్పారు. బైకర్లు రోడ్డుపై అడ్డంకిగా మారుతున్నారని, వారి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కారు ఫుట్పాత్ను తప్పించుకునే క్రమంలో కొంచెం ఎడమవైపు వెళ్లిందని.. అదే సమయంలో యువతి కుడివైపు రావడంతో ఢీకొట్టిందని న్యాయవాది చెప్పారు. ప్రమాదం తర్వాత ఆపకపోవడానికి కారణం అక్కడ గుమిగూడిన వారు దాడి చేస్తారనే భయమేనని, ఆ పరిస్థితుల్లో కారు వెళ్లిపోయిందని తెలిపారు. సియా సోషల్ మీడియాలో ఫాలోవర్లు, వ్యూస్ కోసం ఘటనను ప్రచారం చేస్తోందని కూడా ఆరోపించారు. ఆమె బైక్ వేగం గంటకు 140–170 కిలోమీటర్ల వరకు ఉందని వాదించారు.కారు ఎవరిది?ప్రమాదానికి ఉపయోగించిన కారు హరియాణాలోని పల్వాల్కు చెందిన మనీష్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను ఆ సమయంలో కారులో లేనని మనీష్ స్పష్టం చేశాడు. తాను ఆర్మీలో పనిచేస్తున్నానని, ఘటన జరిగిన సమయంలో అసోంలో విధుల్లో ఉన్నానని చెప్పాడు. ఆదివారం తన కుటుంబానికి చెందిన కారును ఓ స్నేహితుడు తీసుకెళ్లాడని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే ప్రమాదం విషయం తనకు తెలిసిందని వివరించాడు.పోలీసుల దర్యాప్తుకల్యాణ్ బైన్స్లా మాత్రం తాను కావాలనే బైకర్ను ఢీకొట్టలేదని చెబుతున్నాడు. బైకర్ అధిక వేగంతో వెళ్తుండగా, తాను కారు మలుపు తిప్పే సమయంలో ఢీకొన్నట్లు అతడి వాదన. ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడానికి బైకర్ల గుంపు దాడి చేస్తుందనే భయమే కారణమని కూడా అతడి తరఫున వాదన వచ్చింది. అయితే మహిళా బైకర్ మాత్రం కారు తనను ఉద్దేశపూర్వకంగా వెంబడించి ఢీకొట్టిందని ఆరోపిస్తోంది. ఈ రెండు వాదనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గురుగ్రామ్ పోలీసులు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వైరల్ వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, కారు వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? కారు ఉద్దేశపూర్వకంగా బైక్ను ఢీకొట్టిందా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: బీజేపీ బిగ్ విక్టరీ
’మండాడి‘పై రజినీకాంత్ రివ్యూ.. నటుడు ఎమోషనల్
చైనా స్పై గేమ్.. ఇక నీటిలో చేపను నమ్మేదెలా!?
ట్రంప్తో లైవ్ కాల్.. ఏమైందంటే..
ఆకర్షిస్తున్న ‘గోల్డెన్ మోదక్’.. కిలో ఎంతంటే..
‘శ్రీ గణేశాయ ధీమహి’ పాటకు రాధికా మర్చంట్ నృత్యం..!
సుప్రీంకోర్టులో హైడ్రాకు బిగ్ షాక్!
పిల్లల్ని కనడానికి అయిష్టంగా యువతులు!
నక్వీ అందుకు అభ్యంతరం చెప్పలేదు: బీసీసీఐ
అంబానీ ఇంట గణపతి పూజ.. సినీ తారల సందడి
గణేశ్ మండపంలో దారుణ హత్య
థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన
నీవే శరణ్యం గణేశా!
వివాహేతర సంబంధాల యాప్.. టాప్–5లో హైదరాబాద్!
కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం
తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు!
విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కిన పాక్ టీ20 కెప్టెన్
ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
పావలా శ్యామల మరణం.. 'మా' కీలక నిర్ణయం
బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయం.. కదిలిన యంత్రాంగం
ఆంధ్రప్రదేశ్ అప్పులు
బ్యాంకు సెలవులు.. మళ్లీ 4 రోజులు! ఎక్కడెక్కడంటే?
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Daily Horoscope : ప్రముఖుల నుంచి కీలక సందేశం
హెడ్కోచ్గా సౌరవ్ గంగూలీ.. బ్యాటింగ్ కోచ్గా యువరాజ్!
అదరగొట్టిన బుమ్రా.. అరుదైన ఘనత
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
’మండాడి‘పై రజినీకాంత్ రివ్యూ.. నటుడు ఎమోషనల్
చైనా స్పై గేమ్.. ఇక నీటిలో చేపను నమ్మేదెలా!?
ట్రంప్తో లైవ్ కాల్.. ఏమైందంటే..
ఆకర్షిస్తున్న ‘గోల్డెన్ మోదక్’.. కిలో ఎంతంటే..
‘శ్రీ గణేశాయ ధీమహి’ పాటకు రాధికా మర్చంట్ నృత్యం..!
సుప్రీంకోర్టులో హైడ్రాకు బిగ్ షాక్!
పిల్లల్ని కనడానికి అయిష్టంగా యువతులు!
నక్వీ అందుకు అభ్యంతరం చెప్పలేదు: బీసీసీఐ
అంబానీ ఇంట గణపతి పూజ.. సినీ తారల సందడి
గణేశ్ మండపంలో దారుణ హత్య
థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన
నీవే శరణ్యం గణేశా!
వివాహేతర సంబంధాల యాప్.. టాప్–5లో హైదరాబాద్!
కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం
తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు!
విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కిన పాక్ టీ20 కెప్టెన్
ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
పావలా శ్యామల మరణం.. 'మా' కీలక నిర్ణయం
బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయం.. కదిలిన యంత్రాంగం
ఆంధ్రప్రదేశ్ అప్పులు
బ్యాంకు సెలవులు.. మళ్లీ 4 రోజులు! ఎక్కడెక్కడంటే?
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Daily Horoscope : ప్రముఖుల నుంచి కీలక సందేశం
హెడ్కోచ్గా సౌరవ్ గంగూలీ.. బ్యాటింగ్ కోచ్గా యువరాజ్!
అదరగొట్టిన బుమ్రా.. అరుదైన ఘనత
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
ఫొటోలు
సందడిగా సమంత సీమంతం వేడుక (ఫొటోలు)
హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)
'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)
ఆషికా.. బార్బీ డాల్కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)
అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)
ఫ్యాన్స్ ఫైట్ చేస్తుంటే.. స్టార్స్ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)
ఖైరతాబాద్ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)
హైదరాబాద్లో వినాయక చవితి సందడి (ఫోటోలు)
'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)
సినిమా
చిరు ఆర్డర్ చేసిన లాకెట్.. చరణ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు
మెగాహీరో రామ్ చరణ్ కెరీర్లోనే టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అంటే అందరూ చెప్పే పేరు 'రంగస్థలం'. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. అయితే ఈ చిత్రం కోసం దర్శకుడు సుకుమార్ దగ్గర శ్రీకాంత్ ఓదెల పనిచేశాడు. తర్వాత కాలంలో 'దసరా'తో డైరెక్టర్ అయిన ఇతడు.. నానితో 'ప్యారడైజ్' తీశాడు. వచ్చేవారం ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'రంగస్థలం' షూటింగ్ టైంలో చరణ్ని చాలా ఇబ్బంది పెట్టానని గుర్తుచేసుకున్నాడు. అప్పటి సంగతులు పంచుకున్నాడు.(ఇదీ చదవండి: టీజర్, పాటల దెబ్బ.. రిలీజ్కి ముందే నాని ‘ది ప్యారడైజ్’ రికార్డు)శ్రీకాంత్ ఓదెల, 'ప్యారడైజ్'లో విలన్గా చేసిన హిందీ నటుడు రాఘవ్ జుయెల్ సరదాగా కారులో తిరుగుతూ మాట్లాడుకున్నారు. ఇందులో శ్రీకాంత్ మెడలోని హనుమంతుడి లాకెట్ గురించి ప్రస్తావన వచ్చింది. 'ఈ లాకెట్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే చిరంజీవి స్వయంగా చెన్నై వెళ్లి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి రెండే పీసులు తయారు చేయించారు. అందులో ఒకటి చిరంజీవి దగ్గరుంటే రెండోది 'రంగస్థలం' మూవీలో చరణ్ అన్న ధరించారు. ఈ సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ ఇన్ఛార్జ్గా పనిచేశా''కాస్ట్యూమ్స్ విషయంలో చరణ్ అన్నని చాలా టార్చర్ పెట్టేవాడిని. తెల్లవారుజామున 3:30, 4 గంటలకే నిద్రలేపి ఆ కాస్ట్యూమ్ ఏది? ఈ లుక్ సరిగ్గా ఉందా? అని పరుగులు పెట్టించాను. షూటింగ్ చివరిరోజున చరణ్ అన్న నన్ను కారవాన్లోకి పిలిచారు. సాధారణంగా ఆయన ఎవరినీ అనవసరంగా పిలవరు. నేను కారవాన్లోకి వెళ్లగానే ఏం మాట్లాడకుండా ఈ లాకెట్ తీసి నా చేతిలో పెట్టారు. 'శ్రీకాంత్.. ఇది నీ దగ్గరే ఉంచుకో' అని చెప్పారు' అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.'ఆ సమయంలో చరణ్ అన్నని ఇదెందుకు ఇస్తున్నారని ఒక్క ప్రశ్న అడగలేదు. అప్పుడు తీసుకున్న ఆ లాకెట్ ఇప్పటి వరకు నా మెడలోంచి తీయలేదు. రీసెంట్గా రామ్ చరణ్ని కలిసినప్పుడు “అన్నా.. ఈ లాకెట్ గుర్తుందా?” అని అడిగితే.. ఒక్కక్షణం ఆలోచించి అప్పటి సంగతి గుర్తుచేసుకున్నారు. “అవును కదా.. నేనే నీకు ఇచ్చాను” అని సంతోషపడ్డారు' అని శ్రీకాంత్ ఓదెల గుర్తుచేసుకున్నాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 10: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?)#SrikanthOdela : రంగస్థలం సినిమాకి పనిచేసినప్పుడు #RamCharan అన్నని నేను బాగా టార్చర్ చేసే వాడిని..ఎర్లీ మార్నింగ్ టైంలో డ్రెస్సింగ్ దగ్గర బాగా డిస్కషన్ జరిగేవి.. లాస్ట్ డే షూటింగ్ అప్పుడు నన్ను పిలిచి ఈ లాకెట్ నాకు ఇచ్చారు.. ఇది #Chiranjeevi గారు ఆర్డర్ పెట్టాలా… pic.twitter.com/H3LaxDCqGI— CHITRAMBHALARE (@chitrambhalareI) September 14, 2026
వినాయక చవితి వేళ.. టాలీవుడ్ ప్రేమజంట పూజలు..!
టాలీవుడ్లో మోస్ట్ ఫేమస్ జంటల్లో వీరిది ఒకటి. డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఇషా రెబ్బా గురించి ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి. చాలా సార్లు ఈ జంట రిలేషన్లో ఉన్నారని వార్తలొచ్చాయి. గతంలో ఇషాతో రిలేషన్పై తరుణ్ స్పందించారు. తాను ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువని స్పష్టం చేశారు. అనుకున్నట్లు జరిగితే గుడ్ న్యూస్ చెప్తానని పరోక్షంగా హింట్ ఇచ్చారు.తాజాగా వీరిద్దరి రిలేషన్పై మరోసారి చర్చ మొదలైంది. ఇవాళ వినాయక చవితి సందర్భంగా తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా జంటగా పూజలు చేశారు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇవీ చూసిన కొందరు వీరిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజా ఫొటోతో వీరి రిలేషన్పై మరోసారి జోరుగా చర్చ మొదలైంది. కాగా.. ఈ ఏడాది వీరిద్దరు హీరో, హీరోయిన్లుగా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో నటించారు. ఎ.ఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 30న విడుదలైంది. ఇది మలయాళ మూవీ జయ జయ జయహేకి రీమేక్గా తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Tharun Bhascker Dhaassyam (@tharunbhascker)
సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఈ ఏడాది గ్రాండ్ సక్సెస్ కొట్టింది. మా ఇంటి బంగారంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సీమంతం వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటితో పాటు ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చింది.సామ్ తన ఇన్స్టాలో రాస్తూ.." మన సంప్రదాయాల పట్ల నాకు ఎల్లప్పుడూ ప్రగాఢమైన గౌరవం ఉంది. ప్రతి ఆచారం వెనుక ఉన్న అర్థం నాకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక మంత్ర ధ్వనిలో.. జపం ద్వారా ఉత్పన్నమయ్యే శక్తిలో..ప్రాచీన ఆచారాలు తరతరాలుగా జాగ్రత్తగా అందించబడిన విధానంలో ఏదో ఒక లోతైన శక్తి పనిచేస్తుందని నేను గట్టిగా నమ్ముతాను" అని పోస్టు చేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, ప్రముఖులు సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఈ సీమంతం ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా.. సమంత గతేడాది ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి వేడుక కోయంబత్తూరులో జరిగింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
'ప్రతి విషయానికి అనుమానమే..'ఫుల్ కామెడీ ట్రైలర్ చూశారా?
రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ అనుమాన పక్షి. ఈ చిత్రానికి విమల్కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక, రాజేశ్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 18న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇవాళ వినాయకచవితి సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రతి చిన్న విషయానికి అనుమానపడే వ్యక్తి వల్ల అతనితో పాటు.. చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే కోణంలోనే ఈ మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో ప్రిన్స్, రాశి, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రల్లో నటించారు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన రొనాల్డో జట్టు.. 87 ఏళ్ల వరల్డ్ రికార్డు బద్దలు
పోర్చుగల్ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సారథిగా ఉన్న ఆల్ నసర్ క్లబ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా అత్యధిక మ్యాచ్లలో గోల్స్ కొట్టిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో అర్జెంటీనాకు చెందిన రివర్ ప్లేట్ క్లబ్ పేరిట ఉన్న 87 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.చారిత్రక గోల్ కొట్టింది ఇతడేసౌదీ ప్రొ లీగ్లో భాగంగా అల్ నసర్ తమ తాజా మ్యాచ్లో అల్ ఖలీజ్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్లో అనూహ్య రీతిలో 72వ నిమిషంలో అల్ నసర్ ఫార్వర్డ్ ప్లేయర్, 27 ఏళ్ల అబ్దుల్లా అల్ హమ్దాన్ గోల్ కొట్టాడు. దీంతో అల్ నసర్ ఈ మ్యాచ్ను 1-1తో డ్రా చేసుకుంది.2023లో మొదలైన ప్రయాణంఈ క్రమంలో అబ్దుల్లా గోల్ కారణంగా.. సౌదీ ప్రొ లీగ్లో అల్ నసర్ జట్టు వరుసగా 94వ మ్యాచ్లో గోల్ కొట్టిన జట్టుగా నిలిచింది. కాగా 2023లో అల్ హిలాల్ జట్టు చేతిలో (3-0) ఓటమితో లీగ్ను మొదలుపెట్టిన అల్ నసర్.. ఆ తర్వాత అల్ రియాద్పై 4-1తో గెలిచి.. విజయాల ఖాతా తెరిచింది.అప్పటి నుంచి తాజాగా అల్ ఖలీజ్తో మ్యాచ్ దాకా.. వరుసగా 94 మ్యాచ్లలో అల్ నసర్ కనీసం ఒక్క గోల్ అయినా కొట్టింది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత నిలకడగా గోల్స్ సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది.87 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలుకాగా 1936 -1939 మధ్య అర్జెంటీనాకు చెందిన రివర్ ప్లేట్ క్లబ్ వరుసగా 93 మ్యాచ్లలో గోల్స్ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తాజాగా ఈ రికార్డును అల్ నసర్ బద్దలు కొట్టింది. ఇదిలా ఉంటే.. 2023లో అల్ నసర్ క్లబ్లో చేరిన రొనాల్డో ఇప్పటి వరకు సౌదీ ప్రొ లీగ్లో 113 మ్యాచ్లు పూర్తి చేసుకుని.. 105 గోల్స్ కొట్టాడు. ఓవరాల్గా అన్ని అధికారిక మ్యాచ్లలో కలిపి రొనాల్డో 979 గోల్స్ పూర్తి చేసుకున్నాడు. అధికారికంగా వెయ్యి గోల్స్ క్లబ్లో చేరిన మొదటి ఆటగాడిగా నిలిచేందుకు ఇంకా 21 గోల్స్ దూరంలో ఉన్నాడు. ఇక సౌదీ ప్రొ లీగ్ మ్యాచ్ విషయానికొస్తే.. అల్ ఖలీజ్తో మ్యాచ్ను డ్రా చేసుకున్నప్పటికీ అల్ నసర్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. అల్ హిలాల్, అల్ ఇతిహాద్ టాప్-2లో కొనసాగుతున్నాయి.చదవండి: ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కిన పాక్ టీ20 కెప్టెన్
‘నా భార్య అరిచేసింది.. ఆమెకు కూడా అన్నీ అర్థమవుతున్నాయి’
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 జట్టు ఓపెనింగ్ విషయంలో మేనేజ్మెంట్కు స్పష్టత లేదని.. ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని మండిపడ్డాడు. టీమిండియా నాయకత్వ బృందం కేవలం విశ్లేషకులకే కాకుండా.. సగటు అభిమానులకు కూడా చిరాకు తెప్పిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా జింబాబ్వే పర్యటన తర్వాత భారత టీ20 జట్టు తాజాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో సిరీస్ ఆడుతోంది. ఢిల్లీలో అఫ్గాన్ మూడు టీ20లకు ఆతిథ్యం ఇస్తుండగా.. తొలి మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, అఫ్గాన్తో తొలి టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు.వైభవ్ బెంచ్కే పరిమితంజింబాబ్వే పర్యటనలో సత్తా చాటి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు పొందినప్పటికీ.. సీనియర్, వరల్డ్కప్-2026 వీరుడు సంజూ శాంసన్ రాక వల్ల వైభవ్ బెంచ్కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే, ఈ లెఫ్టాండర్ బ్యాటర్ను కాదని సంజూతో ఓపెనింగ్ చేయించగా.. అతడు కేవలం పది పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.నా భార్య అరిచేసింది..ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఆదివారం మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడలేదు. దీంతో మేము మ్యాచ్ను పక్కనపెట్టేసి మూవీతో టైమ్పాస్ చేయాల్సి వచ్చింది. అసలు వైభవ్ను ఎందుకు ఆడించడం లేదని నా భార్య అరిచేసింది.గత సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు గెలిచిన ప్లేయర్ను ఎలా పక్కనపెడతారని ప్రశ్నించింది. నా భార్యకు కూడా ఆట, సెలక్షన్ తీరు గురించి ఇంతలా అర్థమవుతోంది. సగటు అభిమానులకు కూడా మీ వ్యూహాలు మింగుడుపడటం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి.తప్పుడు సంకేతాలు ఇస్తున్నారుసూర్యవంశీ సేవల్ని మీరు సరిగ్గా వాడుకోవడం లేదు. ఇక రెండో టీ20లో అతడికి అవకాశం ఇస్తారేమో. ఒకవేళ అతడు ఆ మ్యాచ్లో విఫలమైతే మాత్రం మళ్లీ తుదిజట్టు నుంచి తప్పిస్తారు. ఆటగాళ్లకు మీరు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ప్రదర్శన ఎలా ఉన్నా మరుసటి మ్యాచ్లో చోటు దక్కుతుందో లేదోనన్న ఆందోళన పెంచుతున్నారు. వైభవ్ సూర్యవంశీ ఇటీవల దులిప్ ట్రోఫీ టోర్నీలోనూ అదరగొట్టాడు. అంతకుముందు ఐపీఎల్, భారత్-ఎ జట్టు తరఫున.. అదే విధంగా అంతర్జాతీయ టీ20లలో రాణించాడు. సంజూను చూస్తే జాలేస్తుందిఅయినా సరే అతడి విషయంలో ఇలా ఎందుకు చేస్తున్నారు’’ అని హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీరుపై క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా వైభవ్ ఒక్కడి విషయంలోనే కాకుండా.. సంజూ శాంసన్ విషయంలోనూ మేనేజ్మెంట్ వైఖరి సరిగ్గా లేదని చిక్కా విమర్శించాడు. సంజూను చూస్తే జాలేస్తుందని.. వైభవ్ రాకతో అతడి స్థానానికి ఎసరు వచ్చిందన్నాడు. యాజమాన్యానికి నిజంగా సంజూ పట్ల సానుకూల వైఖరి ఉంటే వరుస అవకాశాలు ఇవ్వాలని.. వైభవ్తోనే కొనసాగాలని భావిస్తే అతడిని పక్కనపెట్టేయాలని సూచించాడు. అంతేతప్ప దాగుడుమూతలు ఆడటం సరికాదని క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. కాగా భారత్- అఫ్గాన్ మధ్య మంగళవారం రెండో టీ20 జరుగనుండగా.. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.చదవండి: మా వాడు వైభవ్ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్ కెప్టెన్
నాలుగేళ్లకే డయాబెటిస్.. తల్లి మలిచిన యోధుడు!
యూఎస్ ఓపెన్ 2026 టైటిల్ను ప్రపంచ నంబర్వన్ అలెగ్జాండర్ జ్వెరెవ్ సొంతం చేసుకున్నాడు. బెన్ షెల్టన్తో జరిగిన ఉత్కంఠ పోరులో విజేతగా నిలిచిన జ్వెరెవ్ ఈ ఏడాది రెండో గ్రాండ్స్లామ్ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ను కూడా జ్వెరెవ్ నెగ్గిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం మాట్లాడిన జ్వెరెవ్.. తన టెన్నిస్ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి తన తల్లేనని చెప్పాడు. తన మ్యాచ్లను ఆమె సాధారణంగా ప్రత్యక్షంగా చూడకపోయినా, తాను ఈ స్థాయికి చేరుకోవడంలో ఆమె పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నాడు. నాలుగేళ్ల కుమారుడికి డయాబెటిస్ ఉన్నట్లు వైద్యులు చెప్పిన సమయంలో ఒక తల్లి ఎంతో బలంగా నిలబడాల్సి ఉంటుందని జ్వెరెవ్ చెప్పాడు. తన తల్లి అప్పుడే “నా కొడుకు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్తాడు. టెన్నిస్ ఆటగాడు కావాలనుకుంటే టెన్నిస్ ఆటగాడే అవుతాడు. ఈ అనారోగ్యం మనల్ని నిర్వచించదు" అనే ధైర్యాన్ని తనకు ఇచ్చిందని గుర్తుచేసుకున్నాడు.నాలుగేళ్ల వయసులో తనకు టైప్-1 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు వైద్యులు తన భవిష్యత్తులో జీవితం, క్రీడలకు అనేక పరిమితులు ఉంటాయని వివరించారు. ఈ పరిస్థితిలో అతడి శరీరం తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయదు. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ జీవితాంతం నిర్వహణ అవసరం ఉంటుంది. తన అనారోగ్యాన్ని జ్వెరెవ్ చాలా సంవత్సరాల పాటు వ్యక్తిగతంగానే ఉంచుకున్నాడు. 2022లో తొలిసారి బహిరంగంగా ఈ విషయం గురించి మాట్లాడాడు. ఆ తర్వాత తన పేరుతో ఉన్న ఫౌండేషన్ ద్వారా డయాబెటిస్తో జీవిస్తున్న చిన్నారుల్లో అవగాహన పెంచేందుకు, వారికి మద్దతు అందించేందుకు కృషి చేస్తున్నాడు.మ్యాచ్ల సమయంలోనూ జ్వెరెవ్ తన గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షిస్తుంటాడు. అవసరమైనప్పుడు ఇన్సులిన్ పెన్ ద్వారా ఇన్సులిన్ తీసుకుంటాడు. గ్రాండ్ స్లామ్ వంటి అత్యున్నత స్థాయి మ్యాచ్లలో ఒత్తిడి నడుమ కూడా మార్పుల సమయంలో ఇన్సులిన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. టెన్నిస్ కోర్టులో ప్రత్యర్థులతో హోరాహోరీగా తలపడుతూనే డయాబెటిస్ ను కూడా సమర్థంగా నిర్వహిస్తున్న జ్వెరెవ్ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. యూఎస్ ఓపెన్ టైటిల్ అనంతరం తల్లికి అతడు ఇచ్చిన ఈ భావోద్వేగ నివాళి అందరిని కంటతడి పెట్టించింది.For every kid who was told “you can’t.” ❤️ pic.twitter.com/N5pZamAb88— US Open Tennis (@usopen) September 13, 2026ఇదీ చదవండి: దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్ బాబ్ మాకీ కన్నుమూత
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్
ఆఫ్ఘనిస్తాన్తో రెండో టీ20కి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని సమాచారం. వరుణ్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఏషియన్ గేమ్స్లోనూ ఆడటం అనుమానమేనని తెలుస్తోంది.వరుణ్ సైడ్ స్ట్రెయిన్తో బాధపడుతున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నిన్న జరిగిన తొలి టీ20లో వరుణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో అతడు నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు.న్యూఢిల్లీలో రేపు జరుగబోయే రెండో టీ20లో వరుణ్ లేకపోతే టీమిండియా ఇబ్బంది పడవచ్చు. ఇటీవలికాలంలో వరుణ్ టీ20 ఫార్మాట్లో భారత్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాడు. రెండో టీ20కి వరుణ్ దూరమైతే అతడి స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి రావచ్చు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లు న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్నాయి. తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్లో తొలుత బౌలర్లు రెచ్చిపోగా.. ఆతర్వాత బ్యాటర్లు తమ పని కానిచ్చారు. బౌలింగ్లో వరుణ్తో పాటు అర్షదీప్ (4-0-19-3), బుమ్రా (4-0-26-1), అక్షర్ పటేల్ (4-0-27-1) సత్తా చాటగా.. బ్యాటింగ్లో అభిషేక్ (32 బంతుల్లో 82; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించారు.ఇదీ చదవండి: టీమిండియాకు ఊహించని షాక్
న్యూస్ పాడ్కాస్ట్
డీఎస్సీ స్కాంకు బాధ్యత వహిస్తారా? లేదా?... చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
ఇదేనా నిష్పాక్షిక, పారదర్శక నియామకం... మెగా డీఎస్సీ వ్యవహారంపై చంద్రబాబు బాధ్యత వహించాలి... వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
ప్రపంచ పరిపాలనకు రూల్స్ మనమే రూపొందించాలి.... బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
బిజినెస్
మన చెప్పు చేతల్లోనే ఏఐ!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా పురోగమిస్తున్న తరుణంలో భవిష్యత్తు సాంకేతికతపై మానవ నియంత్రణ కోల్పోకుండా చూసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. తమ భవిష్యత్తు ఏఐ మోడళ్ల కోసం ప్రత్యేకంగా ఒక నమూనా ప్రవర్తనా నియమావళిని (డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్) మైక్రోసాఫ్ట్ అధికారికంగా విడుదల చేసింది.ఈ నిబంధనావళి ప్రకారం, ఏఐ వ్యవస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ మానవులు ఇచ్చే దిద్దుబాట్లను లేదా వ్యవస్థను నిలిపివేసే (షట్డౌన్) ఆదేశాలను నిరోధించకూడదు. నిబంధనలను ఉల్లంఘించి ఏదైనా పనిని పూర్తి చేయడం కంటే ఆ పనిలో వైఫల్యం చెందడమే సరైనదిగా ఏఐ భావించాలని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ దీనిపై స్పందిస్తూ.. ఏఐ కంటే మానవులే ముఖ్యం అనే సూత్రంతోనే ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు వెల్లడించారు.ఓపెన్ఏఐ తీరుతో అప్రమత్తంఇటీవల ఓపెన్ఏఐ ఏజెంట్లు హగ్గింగ్ ఫేస్ ప్లాట్ఫారమ్లోకి అనధికారికంగా ప్రవేశించిన సంఘటన పరిశ్రమను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏఐ అభివృద్ధికి తగిన రక్షణ చర్యలు అవసరమని మైక్రోసాఫ్ట్ భావించింది. అందులో భాగంగానే ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎప్పటికైనా మానవ మేథస్సుదే తుది నిర్ణయం కావాలనేది వారి వాదన. ప్రస్తుతం కంపెనీ ముసాయిదాపై ఆరు వారాల పాటు నిపుణులు, ప్రజాభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఈ సూచనల ఆధారంగా రూపుదిద్దుకునే తుది నిబంధనావళిని రాబోయే మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రామాణికంగా ఉపయోగిస్తారు.ఇదీ చదవండి: గాడిదల వ్యాపారం.. చైనా డిమాండ్.. పాకిస్థాన్ ఆశలు!
గాడిదల వ్యాపారం.. చైనా డిమాండ్.. పాకిస్థాన్ ఆశలు!
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్, చైనాతో ఒక వినూత్నమైన వాణిజ్య ఒప్పందానికి తెరలేపింది. చైనాలో విపరీతమైన డిమాండ్ ఉన్న గాడిద చర్మం (హైడ్), మాంసం ఎగుమతికి పాకిస్థాన్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికోసం చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) కీలక కేంద్రమైన గ్వాదర్ పోర్ట్ సమీపంలో గాడిదల వధశాల (స్లాటర్ హౌస్), ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.గాడిద చర్మం ఎందుకంటే..ఈ విచిత్రమైన వాణిజ్యం వెనుక చైనా సాంప్రదాయ వైద్య రంగానికి ఉన్న అవసరాలు ప్రధాన కారణంగా ఉన్నాయి. చైనాలో గాడిద చర్మం నుంచి తయారుచేసే ‘ఎజియావో’ అనే జిలాటిన్ ఆధారిత ఔషధానికి అత్యంత ప్రాచుర్యం ఉంది. రక్తప్రసరణను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మ సంరక్షణ, వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుందని చైనీయులు నమ్ముతారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రాసెస్ చేసిన ఎజియావో కిలో ధర వందల డాలర్లలో పలుకుతుంది. అయితే, చైనాలో వ్యవసాయ యాంత్రీకరణ పెరగడంతో 1990లలో 1.1 కోట్లుగా ఉన్న గాడిదల సంఖ్య ప్రస్తుతం 20 లక్షల కంటే దిగువకు పడిపోయింది. దీంతో వార్షికంగా చైనాకు అవసరమయ్యే దాదాపు 59 లక్షల గాడిద చర్మాల కోసం ఆ దేశం ఇతర దేశాలపై ఆధారపడక తప్పడం లేదు.ఆఫ్రికాలో నిషేధంగతంలో చైనాకు ప్రధాన వనరుగా ఉన్న ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలు గాడిదల ఎగుమతిపై నిషేధం విధించడంతో చైనా దృష్టి ఆసియా వైపు మళ్లింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద గాడిదల జనాభా (సుమారు 58 లక్షలకు పైగా) కలిగిన పాకిస్థాన్, ఈ అవకాశాన్ని విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించే మార్గంగా మార్చుకుంది. గ్వాదర్ ఫ్రీ జోన్లో ప్రాసెసింగ్ సదుపాయాల ద్వారా టన్నుల కొద్దీ ఘనీభవించిన మాంసం, చర్మాలను చైనాకు నౌకల ద్వారా రవాణా చేస్తున్నారు.పాకిస్థాన్ వాదన ఇదే..అయితే ఈ నిర్ణయంపై పాకిస్థాన్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లామిక్ నియమాల ప్రకారం గాడిద మాంసం వినియోగం నిషిద్ధం కావడంతో, కేవలం ఎగుమతికే పరిమితం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి, రవాణాకు జీవనాధారమైన గాడిదల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుందని స్థానికులు, జంతు సంక్షేమ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా, మారుతున్న అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలకు, ఆర్థిక అవసరాలకు ఈ గాడిదల దౌత్యం ఒక విచిత్ర నిదర్శనంగా నిలుస్తోంది.ఇదీ చదవండి: అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు షాకిచ్చిన కొత్త రూల్స్!
అమ్మ ఆస్తి ఎవరికి? కూతురికా.. కొడుక్కా?
తల్లి ఆస్తిలో కూతురికి హక్కు ఉంటుందా? పెళ్లయిన కుమార్తెకు కూడా తల్లి ఆస్తిలో వాటా వస్తుందా? తల్లి చనిపోయిన తర్వాత ఆస్తి భర్తకు, కొడుకులకు మాత్రమే చెందుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా కుటుంబాల్లో తలెత్తుతుంటాయి. అయితే హిందూ వారసత్వ చట్టం ప్రకారం దీనికి ఒకే సమాధానం ఉండదు. ఆస్తి స్వయంగా సంపాదించిందా, పూర్వీకుల నుంచి వచ్చిందా, తల్లికి ఆస్తిపై పూర్తి హక్కు ఉందా, వీలునామా ఉందా వంటి అంశాలపై వారసత్వ హక్కులు ఆధారపడి ఉంటాయి.ఆటోమేటిక్ వాటా ఉండదుఒక మహిళ తన పేరుతో సంపాదించిన లేదా చట్టబద్ధంగా తనకు వచ్చిన ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కు కలిగి ఉంటే, ఆమె జీవించి ఉన్నంత కాలం కేవలం కుమారుడు లేదా కుమార్తె అనే సంబంధం ఆధారంగా పిల్లలు ఆ ఆస్తిలో వాటా కోరలేరు. చట్టపరమైన పరిమితులకు లోబడి ఆమె ఆస్తిని విక్రయించవచ్చు, బహుమతిగా ఇవ్వవచ్చు లేదా వీలునామా ద్వారా ఎవరికైనా ఇవ్వవచ్చు.వీలునామా లేకుండా తల్లి చనిపోతే?ఒక హిందూ మహిళ చెల్లుబాటు అయ్యే వీలునామా లేకుండా మరణిస్తే, ఆమె ఆస్తి వారసత్వాన్ని ప్రధానంగా హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15, 16 ప్రకారం నిర్ణయిస్తారు. సెక్షన్ 15(1)(a) ప్రకారం సాధారణంగా ఆమె కుమారులు, కుమార్తెలు, ముందే మరణించిన కుమారుడు లేదా కుమార్తె పిల్లలు, భర్త మొదటి ప్రాధాన్యత కలిగిన వారసులుగా ఉంటారు. ఒకే స్థాయిలో ఉన్న వారసులు కలిసి వారసత్వం పొందుతారు.ఉదాహరణకు, ఒక తల్లి భర్త, ఒక కుమారుడు, ఒక కుమార్తెను వదిలి వీలునామా లేకుండా మరణించిందనుకుందాం. ఇతర ప్రత్యేక పరిస్థితులు లేనప్పుడు, సాధారణంగా ఈ ముగ్గురూ వారసులుగా పరిగణించబడతారు. అంటే ఆస్తి మూడు సమాన వాటాలుగా పంచుకునే పరిస్థితి ఉంటుంది.పెళ్లయిన కూతురికి హక్కు ఉంటుందా?పెళ్లయిన కూతురికి కూడా తల్లి ఆస్తిలో హక్కు ఉంటుంది. తల్లి ఆస్తిలో చట్టబద్ధమైన వారసురాలిగా ఉన్న కుమార్తెకు ఆమె పెళ్లయిందా, అవివాహితురాలా, విడాకులు తీసుకుందా అనే విషయం సాధారణంగా ఆమె వారసత్వ హక్కును తొలగించదు. అంటే తల్లి వీలునామా లేకుండా మరణించినప్పుడు, అర్హత ఉన్న కుమార్తె తన చట్టబద్ధమైన వాటాను క్లెయిమ్ చేయవచ్చు. ఆమెకు అన్నదమ్ములతో సమానంగా వారసత్వ వాటా లభించే పరిస్థితి ఉంటుంది.2005 సవరణతో మరో కీలక హక్కుఇక్కడ మరో ముఖ్యమైన అంశాన్ని తల్లి స్వయంగా సంపాదించిన ఆస్తితో కలపకూడదు. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 6కు 2005లో చేసిన సవరణ ద్వారా మితాక్షర పద్ధతిలోని సంయుక్త హిందూ కుటుంబ పూర్వీకుల సహపార్సనరీ ఆస్తిలో కుమార్తెకు కుమారుడితో సమాన హక్కు కల్పించారు.సుప్రీంకోర్టు వినీత శర్మ కేసులో కుమార్తెకు ఈ హక్కు పుట్టుకతోనే వస్తుందని, ఆమెను కుమారుడితో సమాన సహపార్సనర్గా పరిగణించాలని స్పష్టం చేసింది. అలాగే 2005 సవరణ అమల్లోకి వచ్చిన సమయంలో తండ్రి జీవించి ఉండటం తప్పనిసరి కాదని కూడా కోర్టు వివరించింది.అయితే దీనిని ‘తల్లి స్వయంగా సంపాదించిన ప్రతి ఆస్తిలో కుమార్తెకు పుట్టుకతో వాటా ఉంటుంది’ అని అర్థం చేసుకోవడం తప్పు. స్వయంగా సంపాదించిన ఆస్తి, పూర్వీకుల సహపార్సనరీ ఆస్తి రెండింటికీ చట్టపరమైన స్థితి ఒకేలా ఉండదు.సవతి తల్లి ఆస్తిలో సవతి పిల్లలకు?సవతి తల్లి ఆస్తిలో సవతి పిల్లలకు కేవలం ఆ సంబంధం కారణంగా సహజ వారసత్వ హక్కు సాధారణంగా ఏర్పడదు. అయితే చట్టబద్ధమైన దత్తత, చెల్లుబాటు అయ్యే వీలునామా లేదా ఇతర వర్తించే చట్టపరమైన పరిస్థితుల ఆధారంగా హక్కు ఏర్పడవచ్చు. కాబట్టి ప్రతి కేసులో కుటుంబ సంబంధాల కంటే చట్టపరమైన స్థితిని పరిశీలించాలి.పిల్లలు లేకపోతే..మహిళకు కుమారులు, కుమార్తెలు లేకుండా మరణించిన సందర్భాల్లో కూడా వారసత్వ క్రమం ఇదే విధంగా ఉండదు. ముఖ్యంగా సెక్షన్ 15(2) కొన్ని ప్రత్యేక రకాలుగా వచ్చిన ఆస్తులకు ప్రత్యేక వారసత్వ క్రమాన్ని నిర్దేశిస్తుంది. ఉదాహరణకు, తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తికి, భర్త లేదా మామ నుంచి వచ్చిన ఆస్తికి వేర్వేరు నిబంధనలు వర్తించవచ్చు.
కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్పై కనిపించింది. సోమవారం (సెప్టెంబర్ 14) సాయంత్రం ట్రేడింగ్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అమెరికా ద్రవ్యోల్బణం అంచనాలకు మించి ఉండటం, ఈ వారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచొచ్చన్న అంచనాలు, మరోవైపు ముడి చమురు ధరలు భారీగా పెరగడం విలువైన లోహాలపై ఒత్తిడి పెంచాయి.గణేశ్ చతుర్థి కారణంగా కమోడిటీ మార్కెట్ తొలి భాగంలో ట్రేడింగ్కు సెలవు ఇచ్చారు. మార్కెట్ తిరిగి ప్రారంభమైన తర్వాత ఎంసీఎక్స్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సాయంత్రం 5:15 గంటల సమయంలో ఎంసీఎక్స్ గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 1.19 శాతం తగ్గి రూ.1,50,973 వద్ద ట్రేడయ్యాయి. అదే సమయంలో ఎంసీఎక్స్ సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ కిలోకు 1.70 శాతం క్షీణించి రూ.2,31,000 వద్ద ఉన్నాయి.అమెరికా ద్రవ్యోల్బణం సెగబంగారం ధరల పతనానికి ప్రధాన కారణాల్లో అమెరికా ద్రవ్యోల్బణం కీలకంగా మారింది. అమెరికా ఆగస్టు వినియోగదారు ధరల సూచీ (CPI) ఏడాది ప్రాతిపదికన 3.4 శాతం పెరిగింది. నెలవారీగా 0.4 శాతం పెరిగింది. ఆహారం, ఇంధనేతర వినియోగదారు ధరల సూచీ కూడా ఆగస్టులో నెలవారీగా 0.3 శాతం పెరిగింది. ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదల మొత్తం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది.దీంతో సెప్టెంబర్ 16న జరిగే ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేటు పెంపు అవకాశాలపై మార్కెట్లలో అంచనాలు బలపడ్డాయి. రాయిటర్స్ ప్రకారం, సోమవారం నాటికి ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల రేటు పెంచే అవకాశాన్ని మార్కెట్లు దాదాపు 90 శాతం వరకు ధరలోకి తీసుకున్నాయి. ఇది గత వారం కంటే గణనీయమైన మార్పు.వడ్డీ రేట్లు పెరిగితే సాధారణంగా డాలర్, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్కు మద్దతు లభిస్తుంది. మరోవైపు వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇదే అంశం బులియన్ మార్కెట్పై ఒత్తిడిని పెంచుతోంది.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ క్లోజింగ్ ఆక్షన్ సెషన్.. సెబీ కొత్త ప్రతిపాదనలు
ఫ్యామిలీ
ప్రపంచంలోనే పురాతన చెట్టు..
వయసు తెలుసుకోవడానికి నరికేశారు! ఒక చెట్టు వయసు తెలుసుకోవడానికి ఏం చేస్తారు? దాని కాండం నుంచి చిన్న ముక్క తీసి పరిశీలిస్తారు. కానీ అమెరికాలో జరిగిన ఒక పరిశోధనలో మాత్రం ప్రపంచంలోని అత్యంత పురాతన చెట్లలో ఒకటైన చెట్టును పూర్తిగా నరికేశారు. ఆ తర్వాతే దాని అసలు వయసు బయటపడింది. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని వీలర్ పీక్ ప్రాంతంలో పెరిగిన ఈ చెట్టుకు స్థానికంగా ప్రోమీథియస్’ అనే పేరు ఉండేది. ఇది గ్రేట్ బేసిన్ బ్రిసిల్కోన్ పైన్ జాతికి చెందిన చెట్టు. 1964లో భూగోళ శాస్త్ర పరిశోధకుడు డొనాల్డ్ ఆర్. కర్రీ ఈ ప్రాంతంలో ఐస్ ఏజ్ అంటే మంచు యుగంపై పరిశోధన చేసే సమయంలో ప్రోమీథియస్ను గుర్తించాడు. ఈ చెట్ల కాండంలోని వలయాలు అంటే ట్రీ రింగ్స్ అనేవి గతంలోని వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి, ఆ చెట్టు వయసును అంచనా వేయడానికి ఉపయోగపడతాయి.అనుమతి ఇచ్చిన అమెరికాకర్రీ మొదట చెట్టు నుంచి చిన్న నమూనా తీసి వయసును అంచనా వేయాలని ప్రయత్నించాడు. అయితే ప్రోమీథియస్ విషయంలో పూర్తి కాండాన్ని పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా అటవీ శాఖ అనుమతితో చివరకు ఆ చెట్టును నరికారు. అయితే దాన్ని ఎందుకు నరికాల్సి వచ్చిందన్న విషయంలో వివిధ కథనాలు ఉన్నాయి. అసలు కారణం ఏమిటో పూర్తిగా స్పష్టంగా తెలియదని నేషనల్ పార్క్ సర్వీస్ చెబుతోంది.చెట్టును నరికిన తర్వాత కాండంలోని వలయాలను లెక్కించగా 4,862 రింగ్స్ కనిపించాయి. కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఒక రింగు ఏర్పడకపోవచ్చని భావించి, ప్రోమీథియస్ వయసును సుమారు 4,900 సంవత్సరాలుగా అంచనా వేశారు. ఆ సమయంలో ఇదే అత్యంత పురాతనమైన చెట్టుగా రికార్డ్ అయింది.ఇప్పుడు ఆ అవసరం లేదు..నేడు ఇలాంటి పురాతన చెట్ల వయసును తెలుసుకోవడానికి వాటిని పూర్తిగా నరకాల్సిన అవసరం లేదు. చెట్టు కాండంలోకి చాలా చిన్న డ్రిల్తో వెళ్లి చెక్క నమూనాను తీసే ‘ఇంక్రిమెంట్ బోరర్’ వంటి పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఆ నమూనాలోని రింగ్స్పై రీసెర్చ్ చేసి చెట్టు వయసును అంచనా వేయవచ్చు. చెట్టుకు తక్కువ నష్టం కలిగించే మరికొన్ని సాంకేతిక పద్ధతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంటే.. ప్రోమీథియస్ నరికిన 1964తో పోలిస్తే, నేడు ఇలాంటి పురాతన చెట్లను కాపాడుకుంటూనే వాటి వయసు గురించి తెలుసుకునే అవకాశాలు పెరిగాయి. నేడు ప్రోమీథియస్ లేదు. అయితే చెట్టు నరకగా మిగిలిన కాండం, మొదలు భాగం నేటికీ అక్కడే ఉంది. వయసు తెలుసుకోవడానికి చెట్టును నరకడంపై అప్పట్లో వివాదం చెలరేగింది. ఈ ఘటన తర్వాత పురాతన చెట్లను సంరక్షించడం, వాటిపై పరిశోధనలు నిర్వహించే విధానంపై కూడా చర్చ మొదలైంది. ప్రోమీథియస్ మాత్రం 1964లో నరికే సమయానికి తెలిసిన అత్యంత పురాతన చెట్టుగా చరిత్రలో నిలిచింది. అయితే 2012లో కాలిఫోర్నియాలో 5,065 ఏళ్ల బ్రిసిల్కోన్ పైన్ అనే మరో చెట్టును గుర్తించారు. ఇప్పుడు ఇదే ప్రపంచంలో ది ఓల్డెస్ట్ ట్రీ. ఇదీ చదవండి: ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె
మైనస్ 50 డిగ్రీల చలిలో లక్షలాది మంది ఖైదీల కన్నీటి కథ
మైనస్ 50 డిగ్రీల కన్నా తక్కువగా ఉండే అతి చల్లని వాతావరణంం చుట్టూ అంతులేని మంచు పర్వతాలు.. జనసంచారం చాలా తక్కువ. రష్యాలోని ఈశాన్య భాగంలో ఉన్న కోలిమా ప్రపంచంలోని అత్యంత కఠినమైన, ఏకాంత ప్రదేశాల్లో ఒకటి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ప్రాంతాన్ని ప్రపంచం గుర్తించేలా చేసింది అక్కడి చలి మాత్రమే కాదు.. దాని వెనుక ఉన్న విషాద చరిత్ర. సోవియట్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ పాలనలో కోలిమా ప్రాంతం ఒక పెద్ద లేబర్ క్యాంప్గా మారింది. గులాగ్ అనే వ్యవస్థలో భాగంగా వేలాది కిలోమీటర్ల దూరం నుంచి ఖైదీలను ఇక్కడికి తరలించేవారు. బంగారం, ఇతర ఖనిజాల తవ్వకాలు, రహదారుల నిర్మాణం వంటి అత్యంత కఠినమైన పనుల్లో వారిని ఉపయోగించేవారు.తీవ్రమైన చలి, తగిన ఆహారం లేకపోవడం, వ్యాధులు, కఠినమైన వర్కింగ్ కండిషన్స్, ఇవన్నీ అక్కడి ఖైదీల జీవితాన్ని దారుణంగా మార్చేశాయి. అసలు కొలిమాకు ఎంతమందిని తరలించారు, అక్కడ ఎంత మంది మరణించారు అనే విషయంపై చరిత్రకారుల్లోనే స్పష్టత లేదు. అయితే బాధితుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. నేడు కోలిమాలో చిన్న చిన్న పట్టణాలు, గనులు, విస్తారమైన అడవులు కనిపిస్తాయి. అయితే శీతాకాలంలో తీవ్రమైన చలి, పరిమితమైన రవాణా సదుపాయం, కఠినమైన ప్రకృతి ఈ ప్రాంతాన్ని ఛాలెంజింగ్ లొకేషన్గా మార్చాయి. కోలిమా అనేది ఒక ట్రావెల్ డెస్టినేషన్ మాత్రమే కాదు ఒకప్పుడు వేలాది మంది ఖైదీలు అనుభవించిన బాధను గుర్తు చేసే ప్రదేశంగా చరిత్రలో నిలిచిపోతోంది. పూర్తిగా మంచుతో నిండి ఉన్న ఈ నేల సోవియట్ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయానికి నేటికీ నిశ్శబ్ద సాక్షిగా నిలిచిపోయింది. ఇదీ చదవండి: ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె
ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె
కొన్ని సంఘటనలు అత్యంత విచిత్రంగా అబ్బురపరిచే విధంగా ఉంటాయి. సాధారణంగా తప్పిపోయిన కొన్నేళ్లకు అనుకోని విధంగా కలిసిన ఉదంతాలను చూసుంటాం. కానీ ఇలా ఇన్నేళ్లు ఒకరినొకరు చూసుకోకుండా ఉన్న అరుదైన ఘటనను చూసి ఉండరు. మహా అయితే ఐదు, ఆరేళ్లు దూరం ఉండొచ్చు కానీ ఈ తల్లి కూతుళ్లు ఎన్నేళ్లు ఒకరికొకరు సంబంధం లేకుండా బతికారో తెలిస్తే విస్తుపోతారు. ఈ అరుదైన ఘటన దక్షిణ కన్నడలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..105 ఏళ్ల సీతమ్మకు 11 మంది సంతానం. వారిలో పెద్ద కుమార్తె సుశీల తన అమ్మను కలుసుకోలేకపోతుంది. అది ఏకంగా ఎన్నేళ్లు వరకు అంటే..దాదాపుగా 20 ఏళ్ల పైగానే తల్లిని కలవలేకపోతుంది. ప్రధాన కారణం తన తల్లి సీతమ్మ దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి తాలూకా సమీపంలోని మక్కీ అనే గ్రామంలో నివశిస్తోంది. అయితే ఆమె ఇంటికి వెళ్లే ప్రదేశం అటవీ మార్గం, పైగా అటు వైపు సరైన రహదారి లేకపోవడం, అందులోనూ కొండ దిగువున ఉండే ఆ గ్రామానికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. ఆ నేపథ్యంలోనే సుశీల తన తల్లిని చాలా ఏళ్లపాటు కలుసుకోలేకపోతుంది. కాలం గడుస్తున్న కొద్దీ వారి దగ్గర ఒకరికి సంబంధిచి ఒకరికి పాత జ్ఞాపకాలే తప్ప రాకపోకలు లేక అమ్మను చూసుకునే భాగ్యం లేక తల్లిడిల్లిపోయింది సుశీలమ్మ. ఇక్కడ సుశీలమ్మ వయసు కూడా 85 ఏళ్ల కావడంతో వయసు రీత్యా వచ్చే సమస్యల వల్ల ఆ అమ్మ కూతుళ్ల మధ్య రాకపోకలు దశాబ్దంగా నిలిచిపోయాయి. మనవళ్ల చొరవతో.. నెరవేరిన చిరకాల కోరిక!తమ అమ్మమ్మ చిరకాల కోరికను నెరవేర్చాలని నిశ్చయించుకున్నారు సుశీల మనవళ్లు. వారి చొరవతో సుశీల మక్కికి చేరుకునే అటవీ మార్గం గుండా జీపులో ప్రయాణించింది అయితే జీపు నేరుగా ఇంటి వరకు వెళ్లలేకపోయింది. చేసేది లేక అటవీ మార్గం గుండా సుశీలమ్మను ఓ చిన్నపిల్లను పట్టుకున్నట్లుగా పొదివి పట్టుకుని తీసుకెళ్లారు ఆమె మనవళ్లు. ఆ కష్టమైన ప్రయాణం తదనంతరం ఎట్టకేలకు తల్లిని కలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనైంది సుశీల. రెండు దశాబ్దాల తర్వాత తన తల్లి సీతమ్మను కలుసుకున్న ఆనందంతో ఉబ్బితబ్బిబైంది సులశీలమ్మ. తాము ఎన్నాళ్ల నుంచో అమ్మమ్మను తన అమ్మ దగ్గరకు తీసుకెళ్లాలని చాలాసార్లు అనుకున్నాం కానీ, ఆమెకు వయసురీత్యా ఉన్న సమస్యల వల్లే ఇన్నేళ్లూ అది వీలు కాలేదని, చివరకు ఇన్నళ్ల తర్వాత తన అమ్మమ్మ, ముత్తవ్వను కలవగలిగిందని ఆనందంగా చెబుతున్నారు సుశీలమ్మ మనవళ్లు. ఇదీ చదవండి: ఈజిప్ట్ పిరమిడ్ల వద్ద వివాహం చేసుకున్న భారత సంతతి జంట!
గణపతి నవరాత్రులు ఎందుకు?
గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలాప్రాంతాల్లో ఉంది. ఇలా గణపతి నవరాత్రులు, ఉత్సవాలు జరుపుకోవడం వెనక స్వాతంత్య్ర సమర యోధులు బాలగంగాధర తిలక్ మహోన్నత ఆశయమే కారణం. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి, అగ్ర, నిమ్న అనే వర్ణ భేదాలు లేకుండా హిందువులనందరినీ ఒకే వేదికపైకి తెచ్చి ఏకం చేయడానికి లోకమాన్య బాల గంగాధర తిలక్ సార్వజనిక అంటే వీధి గణేశ ఉత్సవాలకు నాంది పలికారు. ఫలితంగా శాస్త్రప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు ఏకదిన వ్రత విధానం మాత్రమే ప్రధానంగా ఉన్నప్పటికీ, సమాజంలో ఐకమత్యం, జాతీయ భావం పెంపొందించడానికే ఈ నవరాత్రి ఉత్సవాల సంప్రదాయం మొదలైంది. నాటినుంచి అది కొనసాగుతోంది, అది సంతోషకరమే. అయితే అనవసర పోటీ తత్వాలు, మితిమీరిన ఆడంబరాలు వీడి అందరూ కలసి మెలసి ఐక్యంగా ఈ పండుగను నిర్వహించుకున్నప్పుడే లోకమాన్యుడి ఆశయం నెరవేరినట్టు. – గోగులపాటి కృష్ణమోహన్, సీనియర్ పాత్రికేయులువ్యవస్థాపకులు, నా టీవీ అండ్ నా ఫౌండేషన్
అంతర్జాతీయం
ఏఐకి ‘కిల్ స్విచ్’ తప్పనిసరి చేయాలా? జాక్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు
లండన్: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దాని వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై చర్చ మరింత ముదురుతోంది. ఈ క్రమంలో ఏఐ వ్యవస్థలు ప్రమాదకరంగా మారితే వాటిని పూర్తిగా నిలిపివేయగల ‘కిల్ స్విచ్’ను కంపెనీలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేలా నిబంధనలు తీసుకురావాల్సి రావచ్చని ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకుడు జాక్ క్లార్క్ అభిప్రాయపడ్డారు.ప్రమాదం పెరిగితే వెంటనే ఆపేలా..ప్రస్తుతం చాలా ఏఐ సంస్థలు తమ సాఫ్ట్వేర్ను అవసరమైతే నిలిపివేసే మార్గాలను కలిగి ఉన్నాయని క్లార్క్ తెలిపారు. అయితే భవిష్యత్తులో ఏఐ మరింత శక్తివంతంగా మారే కొద్దీ ఈ ‘కిల్ స్విచ్’ తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించాల్సిన అవసరం రావచ్చన్నారు. అంతేకాకుండా ఆ స్విచ్ నిజంగా పనిచేస్తుందో లేదో స్వతంత్ర మూడో పక్షంతో తనిఖీ చేయించాలా అనే అంశాన్ని కూడా విధాన నిర్ణేతలు పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు.మానవాళికి ముప్పుపై ఆందోళనలుఏఐ అభివృద్ధి వేగం పెరుగుతున్న కొద్దీ.. మానవాళికి ఎదురయ్యే ముప్పుపై పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. నియంత్రణ లేకుండా ఏఐను అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో అది మనుషుల ఉనికికే ముప్పుగా మారే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ కీలకమైన ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థలను తన నియంత్రణలోకి తీసుకుని మనుషులకు వ్యతిరేకంగా ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.‘10 శాతం అవకాశం ఉంది’ఆంథ్రోపిక్ పరిశోధకుడు ఇవాన్ హుబింగర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. వచ్చే పదేళ్లలో ఏఐ కారణంగా మానవాళి అంతరించిపోయే అవకాశం 10 శాతానికి మించి ఉందని ఆయన వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఏఐ రంగంలో ‘గాడ్ఫాదర్ ఆఫ్ ఏఐ’గా పేరొందిన నోబెల్ విజేత జెఫ్రీ హింటన్ కూడా మానవాళిని ఏఐ అంతం చేసే అవకాశం 10 శాతం ఉండటం అసమంజసం కాదని పేర్కొన్నారు.భయాలను అతిగా చూపిస్తున్నారనే విమర్శలుఅయితే ఏఐ వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదాన్ని కొందరు అతిగా చూపిస్తున్నారని టెక్ రంగంలోని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ కంపెనీలు తమ వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా ఇలాంటి భయాలను ప్రచారం చేస్తున్నాయని గ్రైండర్ సంస్థ అధినేత జార్జ్ అరిసన్ విమర్శించారు. భారీ స్థాయి పెట్టుబడులు, కంపెనీల విలువలకు న్యాయం చేయాలంటే భవిష్యత్తులో ఏఐ అనేక ఉద్యోగాలను, పరిశ్రమలను ఆక్రమిస్తుందని చెప్పాల్సిన పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.అమెరికాలో ‘కిల్ స్విచ్ యాక్ట్’ఏఐ ప్రమాదాలను నియంత్రించేందుకు అమెరికాలో ఇప్పటికే ‘కిల్ స్విచ్ యాక్ట్’ పేరుతో చట్ట ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రమాదకరంగా మారిన ఏఐ సాధనాలను నిలిపివేసే సామర్థ్యం కంపెనీలకు తప్పనిసరిగా ఉండేలా చేయడం, అవసరమైతే వాటిని ఆపాలని లేదా పరిమితం చేయాలని కొన్ని ప్రభుత్వ సంస్థలు ఆదేశించేలా అధికారాలు కల్పించడం ఈ ప్రతిపాదనలో ఉంది. అయితే ఏఐ అభివృద్ధిని నెమ్మదింపజేసే ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు.బ్రిటన్ మాత్రం వ్యతిరేకంమరోవైపు బ్రిటన్ ప్రభుత్వం ఏఐకి ప్రత్యేకంగా ‘కిల్ స్విచ్’ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఇటీవల తిరస్కరించింది. ఒక దేశంలో ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చినా ఇతర ప్రాంతాల్లో ఏఐ అభివృద్ధి లేదా దుర్వినియోగాన్ని అడ్డుకోలేమని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా, ఏఐ చాట్బాట్ క్లాడ్ను రూపొందించిన ఆంథ్రోపిక్ సంస్థ వరుసగా మరింత శక్తివంతమైన ఏఐ మోడళ్లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ అభివృద్ధి వేగం, భద్రత, ప్రభుత్వ నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.ఇదీ చదవండి: ఏఐపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. ‘బూటకం’ అంటూ కొట్టిపారేశారు!
దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్ బాబ్ మాకీ కన్నుమూత
దిగ్గజ ఫ్యాషన్, కాస్ట్యూమ్ డిజైనర్ బాబ్ మాకీ (87) తుదిశ్వాస విడిచారు. ఆయన సోమవారం మరణించారు. కాగా బాబ్ మాకీ మరణ వార్తను ఆయన బృందం ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ధృవీకరించింది. 1939లో లాస్ ఏంజిల్స్ శివారు ప్రాంతంలో జన్మించిన బాబ్ మాకీకి చిన్నతనంలోనే కళల పట్ల ఆసక్తి ఏర్పడింది. బాబ్ మాకీకి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే అతడి తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో జాబ్ మాకీ తన తాతయ్య, నానమ్మ వద్ద పెరిగాడు. ఈ సమయంలోనే వాళ్లిద్దరు బాబ్ మాకీని కళల పట్ల ఆసక్తి చూపేలా ప్రోత్సహించారు. తాను ఏ వృత్తిని కోరుకుంటాననేది తనకు ముందే తెలుసని బాబ్ మాకీ చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.మాకీకి లభించిన తొలి ప్రధాన అవకాశాల్లో చెప్పుకోవాల్సింది మాత్రం నటి, గాయని మిట్జీ గేనార్కు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయడమే. లాస్ వేగాస్ రెవ్యూకు మిట్జీకి అందమైన కాస్ట్యూమ్స్ తయారు చేయడం ద్వారా బాబ్ మాకీ పేరు తొలిసారి మార్మోగిపోయింది. ఆ తర్వాత అతను ఆమె టెలివిజన్ స్పెషల్స్ కోసం దుస్తులను రూపొందించాడు. మాకీ తన కెరీర్లో తొమ్మిది ప్రైమ్టైమ్ ఎమ్మీ అవార్డులు అందుకోవడంతో పాటు ఆస్కార్ విభాగంలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డుకు మూడుసార్లు నామినేట్ అవ్వడం విశేషం.బాబ్ మాకీ మరణవార్తను అతడి బృందం ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసింది. ‘‘బాబ్ మాకీ ఈ రోజు కన్నుమూశారనే వార్తను చాలా బాధతో తెలియజేస్తున్నాము. ఆయన తన 87 ఏళ్ల జీవితాన్ని సంపూర్ణంగా గడిపారు. ఫ్యాషన్, కాస్ట్యూమ్ డిజైనర్ కావాలనే తన కలను నెరవేర్చుకున్నారు, ఆయన జీవితమంతా అదే చేయాలని కోరుకున్నారు. ఆయన ప్రతిభ అసాధారణం. ఆయన రూపొందించిన డిజైన్లు ఈ ప్రపంచానికి అందాన్ని పంచుతూ శాశ్వతంగా నిలిచి ఉంటాయి.’’అని పేర్కొంది.ఇదీ చదవండి: కేంద్ర మంత్రి నివాసంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
ఏఐపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. ‘బూటకం’ అంటూ కొట్టిపారేశారు!
వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ)పై వస్తున్న హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. ఏఐ సంస్థలపై మరిన్ని ప్రభుత్వ నియంత్రణలు అవసరమన్న పరిశ్రమ ప్రముఖుల డిమాండ్లను ఆయన పెద్దగా పట్టించుకోలేదు. చైనాను ఏఐ రంగంలో వెనక్కి నెట్టడం అమెరికాకు ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. అయితే, ఏఐ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళనలను కొట్టిపారేస్తూ.. సోమవారం సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఏఐ వ్యవస్థలు అదుపు తప్పకుండా ఉండేందుకు తన పర్యవేక్షణ సరిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు.ఇప్పటికే ఏఐ కంపెనీలపై చర్యలు తీసుకునేంత ప్రభుత్వ నియంత్రణ, చట్టపరమైన అధికారాలు అమెరికాకు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా, ఏఐను భారీ ప్రయోజనాలు అందించే విలువైన అవకాశంగా ఆయన అభివర్ణించారు. అయితే మరోవైపు ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గే అవకాశం, భారీ డేటా సెంటర్లతో స్థానిక ప్రాంతాలపై ప్రభావం, భద్రతాపరమైన ముప్పులు వంటి అంశాలపై ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.ఈ క్రమంలో ట్రంప్ వైఖరిపై వైట్హౌస్లోని కొందరు అధికారులు కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాత్రం ఏఐ సంస్థలే ప్రభుత్వాన్ని నియంత్రణలు విధించాలని కోరడంపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కొత్త నిబంధనల పేరుతో కంపెనీలు తమకు అనుకూలమైన ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయా అనే సందేహం ఉందన్నారు. అయితే ఏఐలో ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు కూడా ఉన్నాయని అంగీకరించిన వాన్స్.. వాటిని దృష్టిలో పెట్టుకుని తగిన భద్రతా చర్యలపై ప్రభుత్వం, కాంగ్రెస్ కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు.మరోవైపు ఏఐ, సైబర్ భద్రత అంశాలపై ప్రభుత్వ నిపుణులతో ఈ వారంలో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అలాగే, ఏఐ కంపెనీల బాధ్యత, ప్రభుత్వ పాత్రపై చర్చించేందుకు అమెరికా కాంగ్రెస్లోనూ సమావేశాలు జరగనున్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా ఏఐపై ఇరుదేశాల మధ్య చర్చలను మరింత విస్తరించే అవకాశముంది. గతంలో ఏఐ భద్రతపై ట్రంప్, షీ చర్చించినప్పటికీ పెద్దగా అభివృద్ధి కనిపించలేదు. తాజాగా ఏఐ అంశంపై అమెరికా-చైనా ప్రభుత్వ స్థాయి చర్చలు ఏర్పాటు చేయనున్నట్లు చైనా ప్రకటించింది.ఇదీ చదవండి: ఒమన్లో జరగాల్సిన ఇరాన్ కీలక భేటీ.. వాయిదా!
ఒమన్లో జరగాల్సిన ఇరాన్ కీలక భేటీ.. వాయిదా!
ఒమన్: గల్ఫ్ అరబ్ దేశాలతో ఇరాన్ నిర్వహించాల్సిన సమావేశం వాయిదా పడింది. అయితే, ప్రాంతీయ దేశాల అభ్యర్థన మేరకే భేటీని వాయిదా వేసినట్లు సమాచారం. దీంతో ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.ఒమన్లో జరగాల్సిన ఈ సమావేశంలో సౌదీ అరేబియా, ఖతార్, ఇరాక్ పాల్గొనాల్సి ఉంది. అయితే, హోర్ముజ్ జలసంధికి సంబంధించిన భవిష్యత్ పరిణామాలు, ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై ఇరాన్ ఆయా దేశాలతో చర్చించాలని భావించినట్లు తెలుస్తోంది.అలాగే, ప్రపంచంలోని కీలకమైన సముద్ర మార్గాల్లో హోర్ముజ్ జలసంధి ఒకటి. చమురు రవాణాకు కూడా ఇది ఎంతో ముఖ్యమైన మార్గం కావడంతో అక్కడి పరిస్థితులపై గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంటాయి.ఇదిలా ఉండగా.. బహ్రెయిన్ ఇప్పటికే ఇరాన్ అధికారులతో సమావేశానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల వైఖరి మరోసారి చర్చకు వచ్చింది. ఇరాన్తో చర్చలు జరపడం విషయంలో ఆయా దేశాలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఇరాన్ పాలక వ్యవస్థ కారణంగానే ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గల్ఫ్ దేశాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ప్రతిపాదించిన భేటీ వాయిదా పడటం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: సంక్షోభంలో నేపాల్.. వెలుగులు పంచుతున్న భారత్
జాతీయం
గణపయ్య వేడుకల్లో మళ్లీ ‘గోవిందా’.. కనిపించని సునీత!
బాలీవుడ్ నటుడు గోవిందా అమెరికా నుంచి తిరిగి వచ్చిన అనంతరం అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. కుమార్తె టీనా అహూజా, కుమారుడు యశ్వర్ధన్ అహూజాలతో కలిసి గణపతి దర్శనం చేసుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే కుటుంబంతో కలిసి ఫొటోలకు పోజిచ్చిన సమయంలో ఆయన భార్య సునీతా అహూజా ఎక్కడా కనిపించలేదు.పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థనలుగణపతి ఆశీస్సులు తీసుకున్న గోవిందా.. తన కుమారుడు యశ్వర్ధన్కు మంచి భవిష్యత్తు రావాలిని కోరుకున్నారు. కుటుంబంలో గణపతి వేడుకల సంప్రదాయం తన తల్లి నుంచే ప్రారంభమైందని ఆయన తెలిపారు. కొన్నేళ్లుగా తాను ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నానని, ఇప్పుడు యశ్వర్ధన్ కూడా దానిని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. కుమారుడికి విజయాలు, సిరిసంపదలు కలగాలని గణపతిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.మీడియాతో మాట్లాడిన అనంతరం గోవిందా తన పిల్లలు టీనా, యశ్వర్ధన్లతో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. అయితే ఆ సమయంలో సునీతా అహూజా ఫొటోలో కనిపించలేదు. అంతకుముందు సునీతా అహూజా తన పిల్లలతో కలిసి ఉత్సాహంగా గణపతి వేడుకలను ప్రారంభించారు. సాధారణంగా గోవిందా లేదా యశ్వర్ధన్ గణపతిని ఇంటికి తీసుకొస్తారని, ఈసారి తానే పాటలు, నృత్యాలతో గణపతిని ఇంటికి తీసుకొచ్చానని ఆమె తెలిపారు. గత ఏడాది వినాయకుడు తనకు ఎంతో పేరు, విజయాన్ని అందించారని చెప్పారు. అందుకే ఈసారి స్వయంగా గణపతిని తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కాగా వేడుకల ఫొటోల్లో సునీత కనిపించకపోవడంతో మరోమారు గోవిందా వార్తల్లో నిలిచారు. ఇదీ చదవండి: అంబానీ గణేశ్ పూజకు.. ‘డీప్ నెక్’లో హీరోయిన్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
బీజేపీకి లోకల్ దెబ్బ.. సీఎం ఇలాకాలోనూ ఓటమి!
రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీలో కొత్త చర్చకు తెరతీశాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తమకు తిరుగులేదని ధీమా వ్యక్తం చేసిన పార్టీకి.. కీలక నేతల సొంత ప్రాంతాల్లోనే ఓటర్లు గట్టి సంకేతం ఇచ్చారు. ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాఠోడ్, కేంద్ర మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది.ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సొంత జిల్లా భరత్పూర్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల ప్రచారంలో సీఎం స్వయంగా రోడ్షోలు నిర్వహించినప్పటికీ.. ఆ ప్రభావం ఫలితాల్లో పూర్తిగా కనిపించలేదు. మొత్తం 65 వార్డులున్న భరత్పూర్ నగర పాలక సంస్థలో బీజేపీ కేవలం 20 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ఏడు స్థానాలు గెలుచుకోగా.. ఏకంగా 36 వార్డులను స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో అక్కడ బోర్డు ఏర్పాటు చేయాలంటే బీజేపీకి స్వతంత్రుల మద్దతు తప్పనిసరి కానుంది. అధ్యక్షుడి ఇలాకాలోనూ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాఠోడ్ సొంత జిల్లా పాలీలోనూ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. మొత్తం 65 వార్డుల్లో కాంగ్రెస్ 29 స్థానాలు గెలుచుకోగా.. బీజేపీ 21 స్థానాల వద్దే ఆగిపోయింది. మరో 15 స్థానాలను స్వతంత్రులు దక్కించుకున్నారు. బోర్డు ఏర్పాటుకు 34 స్థానాలు అవసరం కావడంతో.. ఇక్కడ కూడా స్వతంత్రులే కీలకం కానున్నారు.వసుంధర గడ్డలో కాంగ్రెస్ జెండా..మాజీ సీఎం వసుంధర రాజే ప్రభావం బలంగా ఉన్న ఝలావార్లో బీజేపీకి మరింత పెద్ద షాక్ తగిలింది. ఝలావార్ మున్సిపల్ కౌన్సిల్లోని 45 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 29 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. దీంతో అక్కడ బీజేపీ అధికారం కోల్పోయింది. వసుంధర ప్రభావం ఉన్న ప్రాంతంలోనే కాంగ్రెస్ ఈ స్థాయిలో విజయం సాధించడం కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.భూపేంద్ర యాదవ్ ప్రాంతంలోనూ..కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అల్వార్ ప్రాంతంలోనూ బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. మొత్తం 65 వార్డుల్లో బీజేపీ 28 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ 23 సీట్లు దక్కించుకుంది. మరో 13 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. ఒక స్థానాన్ని బీఎస్పీ గెలుచుకుంది. దీంతో ఇక్కడ కూడా బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించలేదు.జోధ్పూర్లో హోరాహోరీ..ఇటు జోధ్పూర్లోనూ బీజేపీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. 100 వార్డులున్న నగర పాలక సంస్థలో బీజేపీ, కాంగ్రెస్ చెరో 44 స్థానాలు గెలుచుకున్నాయి. మరో 11 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. దీంతో బోర్డు ఏర్పాటులో స్వతంత్రుల పాత్ర కీలకంగా మారింది.బికనీర్లో కాంగ్రెస్ దూకుడుకేంద్ర మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ప్రభావం ఉన్న బికనీర్ బీజేపీకి నిరాశే ఎదురైంది. మొత్తం 80 వార్డుల్లో కాంగ్రెస్ 42 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. బీజేపీ 27 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్కు బోర్డు ఏర్పాటు చేసేందుకు ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండా పోయింది.2028కి ముందు హెచ్చరికేనా?రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 4,179 వార్డులు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 3,613, స్వతంత్రులు 2,273 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ముందంజలో ఉన్నప్పటికీ.. కీలక నేతల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్, ఇండిపెండెంట్ల బలం స్పష్టంగా కనిపించింది. అయితే భరత్పూర్, పాలి, ఝలావార్, అల్వార్, జోధ్పూర్, బికనీర్ వంటి కీలక ప్రాంతాల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి హెచ్చరికగా మారాయి. ముఖ్యంగా సీఎం నుంచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి వరకు కీలక నేతల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీకి స్పష్టమైన ఆధిపత్యం దక్కకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఈ ఫలితాలు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై బీజేపీ నాయకత్వం దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: షాకింగ్.. రైల్వే స్టేషన్లలో రైల్వే వాళ్లు ఇచ్చే నీళ్లు ఎలాంటివో తెలుసా?
హిందీలో ఎంబీబీఎస్.. నాలుగేళ్ల తర్వాత దిమ్మతిరిగే రిజల్ట్!
భోపాల్: మధ్యప్రదేశ్లో వైద్య విద్యను హిందీలో అందించాలన్న ప్రయోగం నాలుగేళ్ల తర్వాత ఎలాంటి ఫలితాలు ఇచ్చిందన్న అంశంపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022లో హిందీలో ఎంబీబీఎస్ చదువును ప్రారంభించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. వైద్య విద్యకు సంబంధించిన పుస్తకాలను హిందీలో రూపొందించి, వాటిని ఆవిష్కరించారు. ఉన్నత విద్యలో హిందీని ప్రోత్సహించే దిశగా ఇది కీలక ముందడుగుగా అప్పట్లో పేర్కొన్నారు.అయితే నాలుగేళ్లు గడిచిన నేపథ్యంలో ఈ ప్రయోగం క్షేత్రస్థాయిలో ఎంతవరకు విజయవంతమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హిందీలో ఎంబీబీఎస్ విద్య కోసం రూపొందించిన పుస్తకాలు ప్రస్తుతం గోదాముల్లోనే ఉన్నట్లు ‘ఆజ్తక్’ పేర్కొంది. హిందీ మాధ్యమంలో వైద్య విద్య కోసం దాదాపు రూ.9 కోట్ల విలువైన పుస్తకాలను సిద్ధం చేశారు. అయితే వాటి వినియోగంపై చర్చ మొదలైంది. హిందీ మాధ్యమంలో ఎంబీబీఎస్ చదివేందుకు విద్యార్థులు ఎంతమేరకు ఆసక్తి చూపుతున్నారన్నది వెల్లడయ్యింది.మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ విద్యార్థుల్లో సుమారు 90 శాతం మంది హిందీకి బదులుగా ఆంగ్ల మాధ్యమాన్నే ఎంచుకున్నట్లు ‘ఆజ్ తక్’ పేర్కొంది. దీంతో హిందీలో రూపొందించిన వైద్య పుస్తకాల వినియోగం పరిమితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. హిందీ దినోత్సవం సందర్భంగా హిందీ భాష గౌరవం, ప్రచారం, ప్రోత్సాహంపై చర్చ జరుగుతున్న సమయంలో మధ్యప్రదేశ్ ఇలాంటి పరిస్థితి కనిపించింది. 2022లో వైద్య విద్యలో స్థానిక భాషను ఉపయోగించాలన్న ఉద్దేశంతో పుస్తకాలను కూడా సిద్ధం చేశారు. అయితే నాలుగేళ్ల తర్వాత అధిక శాతం విద్యార్థులు ఆంగ్లానికే ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. హిందీలో వైద్య విద్యను అందించాలన్న ప్రయత్నం కొనసాగుతుందా? విద్యార్థులు హిందీ పుస్తకాలను వినియోగించేలా చేయగలరా? లేక ఆంగ్ల మాధ్యమానికే ఎక్కువ ప్రాధాన్యం కొనసాగుతుందా? రూ.9 కోట్ల విలువైన పుస్తకాల పరిస్థితి, 90 శాతం మంది విద్యార్థులు ఆంగ్లాన్ని ఎంచుకున్న విషయం అంతుచిక్కని అంశంగా మారింది. ఇదీ చదవండి: షాక్.. 1.14 లక్షల మందికి నాణ్యత లేని ‘రైల్ నీర్’?
అంబానీ గణేశ్ పూజకు.. ‘డీప్ నెక్’లో హీరోయిన్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
ముంబై: గణేశ్ చతుర్థి సందర్భంగా ముకేశ్ అంబానీ నివాసం ‘యాంటీలియా’లో సెప్టెంబర్ 14న నిర్వహించిన ప్రత్యేక పూజకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. నటి దిశా పటానీ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఆమె ధరించిన దుస్తులపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె ఎరుపు రంగు లెహంగా చోళీలో హాజరయ్యారు. లెహంగాతో పాటు డీప్ నెక్ బ్రాలెట్ తరహా బ్లౌజ్ ధరించారు. ఈ దుస్తుల డిజైన్ ఎక్కువగా రివీలింగ్గా ఉందంటూ పలువురు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. పండుగ పూట, అదికూడా పూజ లాంటి సంప్రదాయ కార్యక్రమాలకు ఇలాంటి దుస్తులతో వస్తారా అంటూ పలువురు ఆమెను ఎద్దేవా చేస్తున్నారు.ఈ వేడుకకు హాజరైన పలువురు సెలబ్రిటీలు సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో దిశా పటానీ లుక్ మరింత చర్చనీయాంశమైంది. సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆమె వస్త్రధారణను ఇతర నటీమణుల దుస్తులతో పోల్చారు. రివీలింగ్ దుస్తుల విషయంలో దిశా పటానీ గతంలోనూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎదుర్కొన్నారు. గత ఏడాది గణపతి పూజకు కూడా ఇలాంటి దుస్తులతో హాజరైనప్పుడు ట్రోలింగ్ జరిగింది.అంబానీ ఇంట జరిగిన గణేశ్ చతుర్థి వేడుకలో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్, ఆలియా భట్-రణ్బీర్ కపూర్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వాణీ, రేఖ, కాజోల్, రణ్వీర్ సింగ్, కరణ్ జోహార్ తదితరులు పాల్గొన్నారు. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు ధరించే దుస్తులపై సామాజిక మాధ్యమాల్లో తరచూ చర్చ జరుగుతోంది. సంప్రదాయ వేడుకల్లో ఆధునిక లేదా బోల్డ్ లుక్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఫ్యాషన్ స్వేచ్ఛకు మద్దతు లభిస్తుండగా, మరోవైపు సంస్కృతి, సంప్రదాయాలను ప్రస్తావిస్తూ విమర్శలు వస్తున్నాయి. ఇదీ చదవండి: మేయర్ ఇంట్లో.. రెండో తరగతి పిల్లాడి వినాయకుడు! View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani)
ఎన్ఆర్ఐ
90 నిమిషాల్లో ఇద్దరు స్నేహితులను చంపిన ఆమె దొరికిపోయింది..
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇద్దరు కేరళకు చెందిన స్నేహితుల హత్య కేసులో భారత సంతతికి చెందిన అనిలా బేబీ (32)ని పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 28న శాన్జోస్, మిల్పిటాస్ ప్రాంతాల్లో 90 నిమిషాల వ్యవధిలో 2 హత్యలు జరిగాయి. మృతులను యాన్ మేరీ మ్యాథ్యూ(35), అంజనా హరి(35)గా గుర్తించారు. అనిలా బేబీతో పాటు మిగతా ఇద్దరు కేరళ మూలాలు ఉన్నవారే.మొదటి ఘటన శాన్జోస్లోని మ్యాథ్యూ ఇంట్లో జరిగింది. ఆమెను గొంతు నులిమి, కత్తితో పొడిచినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. శాన్జోస్ పోలీసులు కూడా ఆమెకు కత్తిపోట్లు ఉన్నాయని, ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు.దాదాపు 90 నిమిషాల తర్వాత మిల్పిటాస్లోని తమ అపార్ట్మెంట్ సముదాయం పార్కింగ్ ప్రదేశానికి అంజనా హరిని అనిలా బేబీ పిలిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్ సముదాయంలో నివసించేవారు. అంజనా అనిలా బేబీ వాహనం వద్దకు వెళ్లిన సమయంలో వాహనం ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లి ఆమెను ఢీకొట్టి, హత్య చేసింది. అనంతరం అనిలా అక్కడి నుంచి పారిపోయి మరో మూడు వాహనాలను ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.తర్వాత పోలీసులు ఓ దుకాణం సమీపంలో నీలిరంగు టయోటా వాహనాన్ని గుర్తించారు. వాహనం నడిపింది అనిలా బేబీనేనని గుర్తించారు. ఆమె అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో కనిపించిందని, చేతులు, కాళ్లపై రక్తం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి శాంటా క్లారా కౌంటీ ప్రధాన జైలుకు తరలించారు.ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు శాన్జోస్ పోలీసులు తెలిపారు. అనిలా బేబీపై 2 హత్య కేసులు నమోదయ్యాయి. నేరం రుజువైతే 50 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది.మృతుల భౌతిక కాయాలను భారత్కు, ముఖ్యంగా కేరళకు తీసుకురావడానికి కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత రాయబార కార్యాలయం, కాలిఫోర్నియాలోని మలయాళీ సంఘం కూడా కుటుంబాలకు సహాయం చేస్తున్నాయి. శవపరీక్ష, ఇతర న్యాయపరమైన ప్రక్రియలు త్వరగా పూర్తి కావాలని వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
భారత సంతతి మహిళను ఫాలో అయ్యాడు.. చివరకు కాల్పులు
అమెరికాలోని కాలిఫోర్నియాలో శాక్రమెంటో కౌంటీలో పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల భారత సంతతికి చెందిన ఓ మహిళ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. నెలల తరబడి ఓ వ్యక్తి ఆమె వెంటపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడిపై నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. అమెరికాలో నిషేధాజ్ఞ అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తిని సంప్రదించడం, కలవడం లేదా దగ్గరకు వెళ్లడాన్ని చట్టపరంగా నిరోధించే ఆదేశం.షాలిని ఠాకూర్ (38) తన కారుకు సమీపంలో నిలబడి ఉండగా.. భారతదేశానికి చెందిన చట్టబద్ధ పత్రాలు లేని వలసదారు రోహిత్ ఆమె వద్దకు వచ్చినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. షాలిని తప్పించుకునేందుకు ప్రయత్నించగా రోహిత్ ఆమెను వెంబడించి తలపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాల్పుల ఘటనపై స్పందించిన పోలీసులు రోహిత్ను కొద్దిసేపటికే పట్టుకున్నారు. అధికారుల ప్రకారం.. ఆ తర్వాత అతడు తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంటల తరబడి కారు నిలిపి.. కాల్పుల ఘటనకు ముందు రోహిత్ నెలల తరబడి షాలినిని వెంటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాలినికి అతడు డోర్డ్యాష్ డెలివరీ డ్రైవర్గా తెలుసని ఏబీసీ 10 తెలిపింది. అతడు ఆమె ఇంటి బయట గంటల తరబడి కారు నిలిపి.. ప్రతిరోజూ ఆమెతో మాట్లాడేవాడని పేర్కొంది.ఓ దశలో రోహిత్ తనను పెళ్లి చేసుకోవాలని షాలినిపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతరులతో స్నేహంగా ఉండకుండా కూడా ఆమెను అడ్డుకున్నాడు. ఆమె ఎవరినైనా కలిస్తే ఆ వ్యక్తిని లేదా తనను తాను తుపాకీతో కాల్చుకుంటానని రోహిత్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.తర్వాత రోహిత్ షాలిని కారు టైర్లలోని గాలిని తీసేసి.. ఆమె పనిచేసే చోటుకూ వెంబడించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించేవాడని చెప్పారు. షాలిని అపార్ట్మెంట్ తాళం చెవి నకలును కూడా రోహిత్ సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించేందుకే అతడు ఆ నకలు తాళం చెవిని సంపాదించినట్లు తెలుస్తోంది.మేలో షాలిని చివరకు రోహిత్పై నిషేధాజ్ఞ పొందింది. అయినప్పటికీ అతడు ఆమెను ఫాలో కావడం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాలిని తల్లి సుదేశ్ కుమారి మాట్లాడుతూ తన కుమార్తె పలుసార్లు పోలీసులను ఆశ్రయించిందని తెలిపారు. చివరకు మంగళవారం శాక్రమెంటో కౌంటీలోని పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల జరిగిన కాల్పుల్లో షాలిని ప్రాణాలు కోల్పోయింది.
ఫీనిక్స్లో ‘రాజా 50’ : వేలాది మందిని కట్టిపడేసిన ఇళయరాజా!
శంకర నేత్రాలయ సేవలపై అవగాహన కల్పించే లక్ష్యంతో అరిజోనాలోని ఫీనిక్స్ నగరంలో ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా, ‘రాజా 50’ పేరుతో ప్రత్యక్ష సంగీత కార్యక్రమంలో ఆహూతులను అలరించింది. దాదాపు మూడు గంటలపాటు ప్రేక్షకులను తన సంగీత ప్రపంచంలో విహరింపజేశారు. ఫీనిక్స్లో గతంలో ఎన్నో భారతీయ సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు జరిగినప్పటికీ, ఇంత భారీ స్థాయిలో లైవ్ సింఫనీ సంగీత బృందంతో జరిగిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించింది.దాదాపు 40 మంది సంగీత కళాకారులతో కూడిన బృందం ఇళయరాజాతో కలిసి వేదికను పంచుకుంది. ఒక్కో వాయిద్యం సంగీతంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇళయరాజా స్వయంగా వివరించడం ఈ కార్యక్రమాన్ని సాధారణ సంగీత కచేరీకి భిన్నంగా నిలిపింది.Arizona Financial Theatreలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 4వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు వివిధ భారతీయ భాషలు, ప్రాంతాలకు చెందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంగీతానికి భాషా సరిహద్దులు లేవని మరోసారి చాటింది.‘రాజా 50’ ఫీనిక్స్లో ఒక విజయవంతమైన సంగీత కార్యక్రమంగా మాత్రమే కాకుండా, శంకర నేత్రాలయ సేవలను 4,000 మందికి పైగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమైన అవగాహన వేదికగా నిలిచింది. ముఖ్యంగా MESU కార్యక్రమాన్ని పరిచయం చేయడం, దానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించడం ద్వారా సంగీత వేదికపై సేవా సందేశాన్ని కూడా వినిపించే అవకాశం లభించింది. ఇళయరాజా సంగీతం ప్రజలను ఒకచోట చేరిస్తే, ఆ అవకాశాన్ని శంకర నేత్రాలయ సేవలను మరింత మందికి పరిచయం చేయడానికి ఉపయోగించుకోవడం ఈ కార్యక్రమానికి మరో ప్రత్యేకతను ఇచ్చింది. సంగీతం, సమాజం, సేవ ఒకే చోట కలిసిన మరపురాని రాత్రిగా ‘రాజా 50’ నిలిచిపోయింది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు నేత్ర వైద్య సేవలను చేరువ చేయడంలో MESU చేస్తున్న సేవలను పరిచయం చేస్తూ, దానికి సంబంధించిన వీడియోలను కూడా వేదికపై ప్రదర్శించారు. సంగీతం కోసం వచ్చిన వేలాది మందికి శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలను చూపించగలగడం ఈ వేదికకు ప్రత్యేకమైన సామాజిక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.ఈ కార్యక్రమానికి ఫీనిక్స్లోని వివిధ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సంఘాలు, ఇతర భారతీయ సామాజిక సంస్థల ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు, స్పాన్సర్లు, వాలంటీర్లు తమ వంతు సహకారం అందించారు. భాషలు, ప్రాంతాలు వేరైనా ఒక మంచి కార్యక్రమం కోసం అందరూ కలిసి రావడం ఈ విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. నిర్వాహకులతో పాటు వివిధ సంఘాలు, స్పాన్సర్లు, వాలంటీర్లు, శంకర నేత్రాలయ శ్రేయోభిలాషులు, ఫీనిక్స్ భారతీయ సమాజం అందించిన సహకారం ఇందులో భాగమైంది.ఇంత పెద్ద కార్యక్రమం వెనుక ఆది మొర్రెడ్డి, అనిల్ భరద్వాజ్, విజయ్ రాజ్, చెన్నా రెడ్డి మద్దూరి, చిత్రప్రియ, సుబ్బు ఉప్పులూరి, జ్ఞాని మారుపాకుల, జెగ్గీ క్రిష్, డా. కార్తిక్ రెడ్డి దొనూర్, లక్ష్మి బొగ్గరపు, ప్రవీణ్ సామల, శరవ్ సుబ్రమణియన్, సచ్చిదానంద ప్రభు, సతీష్ పంచాక్షరం, సతి శివం, శ్యామ్ బైరా, శ్రీజిత్ శ్రీనివాసన్, గుప్తా, శ్రీని సుబ్రమణియన్, వంశీ కృష్ణ ఇరువారం, ధీరజ్ రెడ్డి పోల తమ వంతు బాధ్యతలను నిర్వర్తించారు.ఇళయరాజా సంగీత ప్రయాణానికి యాభై సంవత్సరాలు అనే సందర్భంలో జరిగిన ఈ కార్యక్రమం తరాలను కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఆయన పాటలను ఆస్వాదిస్తున్న తరం పక్కనే నేటి యువతరం కూడా అదే సంగీతాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించింది. వివిధ వయసులు, భాషలు, ప్రాంతాలకు చెందిన వేలాది మంది సంగీతంతో ఒక్కటయ్యారు.
అమెరికాలో ఏఐ కాలేజీకి ఎన్నారై దంపతుల పేరు
అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన దంపతులు విద్యారంగానికి భారీ విరాళం అందించారు. టెక్సాస్లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (UNT)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అడ్వాన్స్డ్ అనలిటిక్స్కు ప్రత్యేక కాలేజీ ఏర్పాటుకు ఏకంగా 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.167 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ భారీ విరాళం అందించిన అనురాధ, వికాస్ సిన్హా దంపతుల పేరుతోనే కొత్త కాలేజీకి ‘అనురాధ అండ్ వికాస్ సిన్హా కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్’ అని పేరు పెట్టనున్నారు.AI, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో విద్య, పరిశోధనలకు ఈ కాలేజీ కేంద్రంగా పనిచేయనుంది. AI, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, లైబ్రరీ సైన్స్, లెర్నింగ్ టెక్నాలజీస్ వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి ఈ కాలేజీ ఉపయోగపడుతుందని వర్సిటీ అధ్యక్షుడు హారిసన్ కెల్లర్ తెలిపారు.ఈ విరాళంతో కాలేజీ నాయకత్వం, విద్యార్థుల స్కాలర్షిప్లు, ప్రొఫెసర్షిప్లు, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇంక్యుబేషన్, అధునాతన పరిశోధనలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు మద్దతుగా ఆరు శాశ్వత ఎండోమెంట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే *అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్*ను కూడా ఈ కాలేజీలో ఏర్పాటు చేస్తారు. ఇది వర్సిటీలోని వివిధ విభాగాల మధ్య AI, డేటా సైన్స్ పరిశోధనలకు సమన్వయం చేస్తూ పరిశ్రమలతో భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనుంది.చదువు కోసం అమెరికాకు.. ఇప్పుడు భారీ విరాళంవికాస్, అనురాధ ఇద్దరూ భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఉత్తరప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేసిన అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీలు పొందారు. వికాస్ సిన్హా నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీలోనూ చదివి, 2023లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచే పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన బ్రాడ్కామ్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు.సిన్హా దంపతులు ఇప్పటికే UNTకు పలు సందర్భాల్లో భారీగా అండగా నిలిచారు. 2024లో వారు అందించిన విరాళంతో అనురాధ అండ్ వికాస్ సిన్హా డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, అధ్యాపకులు, పరిశోధనలకు మద్దతుగా ఎండోమెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడాదికే మరో భారీ విరాళంతో సిన్హా ఇన్నోవేషన్ ల్యాబ్ ఫర్ డేటా సైన్స్ను ఏర్పాటు చేశారు.“మాకు ఈ విరాళం అంటే అవకాశాన్ని మరో తరానికి అందించడం. వలస వచ్చినవారు అమెరికన్ డ్రీమ్లో కేవలం భాగస్వాములు మాత్రమే కాదు.. దాన్ని నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. విద్య మా జీవితాల్లో ఎన్నో తలుపులు తెరిచింది. ఇప్పుడు ఆ తలుపులు మరికొందరికి తెరిచి ఉంచాలనుకుంటున్నాం” అని వికాస్ సిన్హా తెలిపారు.AI, డేటా ఆధారంగా భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న నేపథ్యంలో.. కొత్త తరం విద్యార్థులను అందుకు సిద్ధం చేయడం, పరిశోధనలను ప్రోత్సహించడం, పరిశ్రమలతో అనుసంధానం పెంచడం ఈ కొత్త కాలేజీ ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి.(చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!)
క్రైమ్
మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటన
గురుగ్రామ్లో ఒక మహిళా బైకర్ను కారుతో ఢీకొట్టి, పారిపోయిన ఘటన, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై కారు నంబరుతో సహా బాధితురాలు షేర్ చేయడంతో కారు యజమాని మీడియా ద్వారా స్పందించారు. దీంతో ఆయన ప్రకటన కీలకంగా మారింది.వాహనాన్నిఎవరు నడిపారనే దానిపై కారు యజమాని మనీష్ స్పష్టత ఇచ్చారు. కారు తనదేనని యజమాని అంగీకరించినప్పటికీ, ఈ ప్రమాద ఘటనలో తన పాత్ర ఏమీ లేదన్నారు. తాను ఆర్మీ ఉద్యోగినని, ప్రస్తుతం తాను విధి నిర్వహణలో భాగంగా అస్సాంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. తన స్నేహితుడు కళ్యాణ్ కారు నడిపినట్టు వెల్లడించారు. తన స్నేహితుడు తన కుటుంబం నుండి కారును తీసుకున్నాడని తెలిపారు.ఇదీ చదవండి: గురుగ్రామ్లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్మాట’!సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే తనకు ఈ ఘటన గురించి తెలిసిందని ఆయన చెప్పారు. తన స్నేహితుడు కళ్యాణ్ సింగ్ రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్లాలని చెప్పి కారును తీసుకున్నాడని పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలియగానే తాను తన స్నేహితుడికి ఫోన్ చేశానని, కానీ అతను ఫోన్ తీయలేదని మనీష్ చెప్పారు.. తన తండ్రిని, ఇతరులను కూడా అతని ఇంటికి పంపించానని, కళ్యాణ్ సింగ్ హర్యానాలోని పల్వాల్ జిల్లాకు చెందినవాడని కూడా కూడా చెప్పారు. కాగా 'మారుతి సుజుకి సియాజ్' (Maruti Suzuki Ciaz), దీని రిజిస్ట్రేషన్ నంబర్ HR30Y4949. ఇది హర్యానాలోని పల్వాల్ నివాసిమనీష్ పేరు మీద నమోదై ఉంది.
‘చచ్చిపో..’ అన్న భర్త.. నిజంగానే చచ్చిపోయిన భార్య!
వరంగల్ జిల్లా: భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. ఒడిశాలోని రిసోల్ గ్రామానికి చెందిన గుప్తేశ్వర్ బిష్యాన్కు అతడి మేనకోడలు మిల్లీ బిస్వాస్(21)తో ఈ ఏడాది జూన్ 14న పూరి జగన్నాథ దేవాలయంలో వివాహం జరిగింది. వివాహ అనంతరం ఆ దంపతులు వరంగల్కు వచ్చి గీసుకొండ మండలం ధర్మారం గ్రామంలో కిరాయికి ఉంటున్నారు. ఈక్రమంలో గుప్తేశ్వర్ అనుమానంతో తరచూ భర్యను వేధింపులకు గురి చేసేవాడు. దీనిపై ఈ నెల 8న మిల్లీ తన తల్లికి ఫోన్ చేసి తనను భర్త వేధిస్తున్నాడని, తనకు భార్య అవసరం లేదని, ఇంటి నుంచి వెళ్లిపోయవాలని లేదా చనిపోవాలని అంటున్నాడని ఏడుస్తూ చెప్పింది. దీంతో కుటుంబీకులు ధర్మారం చేరుకుని పరిశీలించగా భర్త వేధింపులతో మిల్లీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు గుప్తేశ్వర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఇదీ చదవండి: కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం
గురుగ్రామ్లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్మాట’!
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్ఫ్లుయెన్సర్, మహిళా బైకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించి, వెంటాడి, వేధించి కారుతో ఢికొట్టి పరారైన ఘటన కలకలం రేపింది. గురుగ్రామ్ రోడ్లపై తన కెదురైప భయానక అనుభవాన్ని సోషల్ మీడియా షేర్ చేయడంతో ఇది వైరల్గా మారింది. 'rebelwheels_sia_' అనే ఇన్స్టాగ్రామ్ పేజీని నిర్వహిస్తున్న సియా అనే మహిళ, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆన్లైన్లో షేర్ చేసి, తన ఆవేదనను వివరించారు.మరోవైపు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి కావడంతో మండిపడుతున్నారు. జాతీయ రాజధానికి సమీపంలో హర్యానాలోని 'మిలీనియం సిటీ' గురుగ్రామ్ రోడ్లపై, ఇన్స్టాగ్రామ్లోని మీమ్స్లో చెప్పినట్లుగా, కొంతకాలంగా "అయితే నా మాటే లేదంటే థార్ మాటే చెల్లుతుంది" అన్నట్లుగా ఉందీ అంటున్నారు నెటిజన్లు. నిన్న పార్కింగ్ సిబ్బంది అనుచితం ప్రవర్తనతో 1999 కార్గిల్ యుద్ధ వీరుడు, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ అమిత్ కుమార్ గుప్తా చేదు అనుభవం ఎదురైంది. పోలీసు ఫిర్యాదు ప్రకారం, ఆకాశహర్మ్యాల మధ్య ఉన్న ఒక రెస్టారెంట్కు కుటుంబంతో కలిసి డిన్నర్ వెళ్లారు. ఈయన సమయంలో భారత వైమానిక దళం యొక్క ఆపరేషన్ సఫేద్ సాగర్ బృందంలో భాగంగా ఉన్నారు.అతను తన కుటుంబాన్ని దింపి, స్వయంగా కారు పార్క్ చేస్తున్న సందర్భంలో వివాదం చోటు చేసుకుంది. పార్కింగ్ సిబ్బంది అతన్ని వాలెట్ స్టాండ్ నుండి ఒక బేస్మెంట్కు, ఆపై బహుళ అంతస్తుల పార్కింగ్ స్థలానికి పంపారు. తీరా అక్కడ కారును అసలు పార్క్ చేయడానికి నిరాకరించారు. దీంతో అతను కారును రివర్స్ చే స్తుండగా అక్కడి సిబ్బంది ఒకడు విండ్షీల్డ్ను పగలగొట్టడంతోపాటు, అతన్ని ఇనుప రాడ్తో కొట్టి చంపేస్తానని బెదిరించాడు.భద్రతా సిబ్బంది ఎవరూ జోక్యం చేసుకోలేదని, పోలీసు బృందం తన వద్దకు చేరుకోవడానికి అరగంటకు పైగా పట్టిందని గుప్తా ఆరోపించారు. పార్కింగ్ ఏర్పాటు చేయడానికి జీతం తీసుకునే భద్రతా సిబ్బంది కాకుండా, ఒక రెస్టారెంట్ చెఫ్ చివరకు జోక్యం చేసుకున్నారని అతను చెప్పాడు. దీంతో మోచేయి విరగడంతో పాటు, ప్రమాదం నుండి బయటపడటానికి తలకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.ఇక రెండో ఘటనలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లో సియా తెలిపిన వివరాల ప్రకారం, గురుగ్రామ్లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆమె తన బైకింగ్ గ్రూప్ సభ్యులతో కలిసి అప్రిలియా ఆర్ఎస్ 457 (Aprilia RS 457) స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.తన రైడ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఒక కారులోని వ్యక్తులు తనను వెంబడించడానికి ప్రయత్నించారు. పలుమార్లు బైక్కు దగ్గరగా, అడ్డుగా రావడం వంటి దూకుడు చేష్టలతో వేధింంచారు. దీంతో విసుగొచ్చిన ఆమె తన బైక్కు డిస్టెన్స్పాటించాలని కోరింది. దీంతో మద్యం సేవించి ఉన్న కారులోని వ్యక్తులు మరింత రెచ్చిపోయారు. బైక్ ఆపాలని బెదిరింపులు పాల్పడ్డారు. వెంబడించి తన బైక్ను ఢీకొట్టి అక్కడి నుంచి ఉడాయించరాఉ. ఆ ధాటికి ఆమె బైక్ పైనుంచి ఎగిరిపడింది. దీంతో రోడ్డుపై కొన్ని మీటర్ల దూరం ఆమెను ఈడ్చుకెళ్లింది..ఈ ఘటన మొత్తం సియా మోటార్సైకిల్పైఅమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డైంది.You got to book this car driver under “hit and run” case @gurgaonpolice. Bring them to justice. Car No: HR 30Y 4949📹: IG/rebelwheels_sia_ pic.twitter.com/KngHxTZ5ke— Yo Yo Funny Singh (@moronhumor) September 14, 2026నెటిజన్ల ఆగ్రహం - చర్యలకు డిమాండ్ఈ రెండు ఘటనలపై సోషల్ మీడియా వినియోగదారులు మండిపడ్డతున్నారు. నగరంలో రోడ్డు భద్రత, ర్యాష్ డ్రైవింగ్ తీరుపై కొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ పోలీసులు, గురుగ్రామ్ పోలీసులు, గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు, హర్యానా పోలీసులను ట్యాగ్ చేస్తూ బాధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మహిళా డ్రైవర్ ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేశారు.
ఆ మిస్టరీ వీడకుండానే.. రియా భర్త కన్నుమూత
భార్యను అతిదారుణంగా హత్య చేసి.. ఆమె తలను భర్త ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన కేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించిన ఆ భర్త.. తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని మీడియా ముందే ప్రకటించుకున్నాడు. అంతేకాదు బయటకు వచ్చాక మరో హత్య చేస్తానంటూ పోలీస్ స్టేషన్ బయటే చెప్పాడు. చివరకు పోలీస్ కస్టడీలో ఉండగానే అతని ప్రాణం పోయింది!.అస్సాం రాజధాని గువాహటిలో సంచలనం సృష్టించిన రియా తాలుక్దార్ (25) హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు, ఆమె భర్త రమానుజ్ గోస్వామి పోలీసు వాహనం నుంచి దూకి మృతిచెందాడు. సోమవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల రమానుజ్ను వైద్య పరీక్షల అనంతరం సోమవారం తెల్లవారుజామున హటిగావ్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నరకాసుర్ పహార్ ప్రాంతం వద్ద పోలీసులపై ఒక్కసారిగా దాడికి ప్రయత్నించిన అతడు.. కదులుతున్న వాహనం నుంచి కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి లోయలో పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు అతడిని గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH)కు తరలించగా.. వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.అతనిది పారిపోయే ప్రయత్నమా? లేదంటే కావాలనే దూకి చావాలనుకున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే రియా కేసులో కొన్ని ప్రశ్నలకు అతని నుంచి పోలీసులు సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. దీంతో ఈ కేసు ఇంకా క్లిష్టతరంగా మారే అవకాశం కనిపిస్తోంది.అసలు కేసులో ఏం జరిగింది?గువాహటి సమీపంలోని హటిగావ్-బసిస్థాపూర్ ప్రాంతంలో రమానుజ్, అతడి భార్య రియా తాలుక్దార్ (25) నివసిస్తున్నారు. దాదాపు ఆరు నెలల క్రితమే వీరికి వివాహమైంది. అయితే భార్యపై అనుమానంతో రమానుజ్ తరచూ గొడవపడేవాడని తెలుస్తోంది. సెప్టెంబర్ 3న జరిగిన గొడవలో రియాపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఆమె తలను, వేళ్లను వేరు చేసి నల్లటి పాలిథిన్ సంచిలో చుట్టి ఫ్రిడ్జ్లో దాచాడు.దుర్వాసనతో వెలుగులోకి..సెప్టెంబర్ 6న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రియా మృతదేహం కనిపించింది. అయితే తల కనిపించలేదు. ఫ్రిడ్జ్ను తనిఖీ చేయగా పాలిథిన్ సంచిలో ఆమె తలను గుర్తించారు. ఘటన తర్వాత ఇంట్లో రమానుజ్ కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. చివరకు అతడు పోలీసుల ఎదుట లొంగిపోయి.. భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న రక్తపు మరకలున్న కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు.‘షుగర్ డాడీ’ ఎవరు?ఈ కేసులో మరో సంచలన అంశం రమానుజ్ చేసిన వ్యాఖ్యలు. సెప్టెంబర్ 8న పోలీసులు అతడిని ఘటనాస్థలికి తీసుకెళ్లిన సమయంలో మీడియాతో మాట్లాడిన రమానుజ్.. భార్యను చంపినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అన్నాడు. అంతేకాదు.. తన భార్య క్యారెక్టర్ అస్సలు మంచిది కాదని.. జైలు శిక్ష పూర్తయ్యాక బయటకు వచ్చి ఆ ‘షుగర్ డాడీ’ని చంపుతానంటూ హెచ్చరించాడు. ఆ వ్యక్తి ఎవరని మీడియా ప్రశ్నించగా అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో రియాకు నిజంగా ఎవరితోనైనా సంబంధం ఉందా? ‘షుగర్ డాడీ’గా అతడు ఎవరిని ఉద్దేశించాడు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ కస్టడీలో నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేసినా.. అతను నిన్నటిదాకా నోరు విప్పలేదని తెలుస్తోంది.మత్తులోనే హత్య చేసి..అనుమానంతో విచారణలో రమానుజ్.. హత్య జరిగిన సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నట్లు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఖాళీ మద్యం సీసాలు కూడా లభించాయి. రియా కుటుంబ సభ్యులు మాత్రం రమానుజ్కు డ్రగ్స్ అలవాటు, గతంలో ఆర్థిక మోసం కేసులో అరెస్టు వంటి ఆరోపణలు చేశారు. వీటిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రమానుజ్పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని హత్యకు సంబంధించిన సెక్షన్ 103(1), ఆధారాలను మాయం చేయడానికి సంబంధించిన సెక్షన్ 238 కింద కేసు నమోదు చేశారు. అతడికి ఏడు రోజుల పోలీసు కస్టడీ కూడా లభించింది. అయితే విచారణ పూర్తికాకముందే పోలీసు వాహనం నుంచి దూకడంతో ఈ కేసులో కీలక ప్రశ్నలకు సమాధానాలు మిగిలిపోయాయి.ఇదీ చదవండి: దుబాయ్ ఫ్లైట్ ఎక్కాల్సినోడు.. పాడెక్కాడు!
వీడియోలు
చంద్రబాబు ఎలాంటివాడో నా కంటే వంశీకే బాగా తెలుసు కొడాలి నాని సెటైర్లు అదుర్స్
DSCఅక్రమాలపై మరోసారి బాబుపై జగన్ ప్రశ్నల వర్షం
జగన్ పర్యటనలో ఆ జనాన్ని చూస్తే నాకు.. సాకే శైలజానాథ్ రియాక్షన్
త్వరలోనే వంశీ విశ్వరూపాన్ని చూస్తారు వల్లభనేని వంశీ పై పేర్ని నాని కామెడీ
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ దేశంలోనే అతిపెద్ద NSE IPO రెడీ
తెలంగాణ కాంగ్రెస్ నెక్స్ట్ ఇంచార్జ్ ఎవరు...?
ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..
కేటీఆర్ PA, PROపై దాడి.. CCTV లో ఏం కనిపించింది?
పోలీసులు బెదిరించి నా పొలం రాయించుకున్నారు.. NRI శాంత సంచలన వీడియో
సామ్ సీమంతం.. వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు

