హీరో సూర్యతో రాజమౌళి కొత్త సినిమా?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్స్టార్ మహేష్బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి చిత్రం తర్వాత జక్కన్న ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. గతంలో రాజమౌళి తర్వాత చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఉండబోతుందని ప్రచారం జోరుగా జరిగింది. అయితే దీనిపై అల్లు అర్జున్ నుంచి కానీ, రాజమౌళి టీం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అయితే తాజాగా రాజమౌళి వారణాసి తర్వాత చిత్రం తమిళ స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో ఉండబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. సినీ ఇండస్ట్రీలో కూడా సూర్యతో సినిమా చేయడానికి రాజమౌళి సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఇది ఒకటిగా నిలవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే సూర్య-రాజమౌళి కాంబినేషన్పై ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. వీరి కాంబినేషన్లో సినిమా రానుందంటూ గతంలో కూడా పలు వార్తలు తెగ హల్చల్ చేశాయి. అప్పట్లో రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంలో హీరోగా ముందు సూర్య పేరును పరిశీలించినట్లు జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అనంతరం కూడా పలుమార్లు వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించినప్పటికీ, అవి అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. సూర్యతో మూవీ చేసే అవకాశాన్ని తాను మిస్ అయ్యానని అప్పట్లోనే రాజమౌళి చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సూర్య తన 50వ సినిమా రాజమౌళి దర్శకత్వంలోనే ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో ఓ భారీ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. దాంతో సూర్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్పై రాజమౌళి నుంచి కానీ సూర్య నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది కరుప్పుతో సూపర్ హిట్ కొట్టిన సూర్య ఫుల్ జోష్ మీదున్నారు. వరుస పెట్టి సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనుంది. అనంతరం భారీ చిత్రాలు నిర్మించే హోంబలే ఫిల్మ్స్తో జతకట్టారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్కు జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు.
రామ మందిరం సీఈవో రేసులో మాజీ ఐపీఎస్.. గతం తొవ్వితే షాకులే..
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టులో ప్రధాన కార్యనిర్వాహక అధికారి (సీఈవో) పదవి భర్తీ ప్రక్రియ మొదలైన వెంటనే తొలి దరఖాస్తు ఉత్తరప్రదేశ్ కేడర్కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ నుంచి వచ్చింది. ట్రస్ట్ ఇటీవల ఈ పదవికి భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జులై 18. దరఖాస్తు పంపిన తర్వాత అమితాబ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ట్రస్ట్ ప్రతిపాదించిన అర్హతలు, అనుభవం, పరిపాలనా సామర్థ్యం అన్నింటికీ తాను సరిపోతానని చెప్పారు. పోలీసు, పరిపాలనా సేవల్లో ఎన్నో సంవత్సరాల అనుభవం ఈ బాధ్యతలు నిర్వహించడంలో ఉపయోగపడుతుందని తెలిపారు. దరఖాస్తు సమర్పించిన తర్వాత మరోసారి అమితాబ్ ఠాకూర్ వార్తల్లో నిలిచారు.ఆయన జీవితానికి సంబంధించి ఎప్పుడూ చర్చకు వచ్చే 5 ప్రధాన సంఘటనలు ఇవి..వివాదం-1: వికాస్ దుబే ఎన్కౌంటర్కు ముందు చేసిన అంచనాకాన్పూర్ బిక్రూ గ్రామంలో 2020లో ఎనిమిది మంది పోలీసులను హత్య చేసిన తర్వాత గ్యాంగ్స్టర్ వికాస్ దుబే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో లొంగిపోయాడు. ఆ వెంటనే అమితాబ్ ఠాకూర్ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు పెట్టారు. వికాస్ దుబే పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చనిపోయే అవకాశం ఉందని, అక్కడితో వ్యవహారం ముగిసే అవకాశముందని పేర్కొన్నారు.వికాస్ దుబేపై కన్నా పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలు, అవినీతిపై నిష్పాక్షిక విచారణ జరగడం ముఖ్యమని కూడా చెప్పారు. తర్వాత వికాస్ దుబే పోలీసు ఎన్కౌంటర్లో మరణించడంతో ఆయన పోస్టు విస్తృత చర్చకు దారితీసింది.వివాదం-2: ములాయం సింగ్ యాదవ్ ఫోన్ కాల్ ఆడియో అమితాబ్ ఠాకూర్ 2015లో ఓ ఆరోపణ చేశారు. అప్పటి సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తనకు ఫోన్ చేసి బెదిరించారని, "మారిపోవాలి" అని హెచ్చరించారని చెప్పారు. ఆ సంభాషణ రికార్డింగ్ను బహిర్గతం చేశారు. దీనితో పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది. ఆ తర్వాత ఈ ఘటనపై హజ్రత్గంజ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ములాయం సింగ్ యాదవ్ ఫోన్ చేసిన విషయం అంగీకరించినా, బెదిరించిన ఆరోపణలను ఖండించారు. ఈ వివాదం తర్వాత అమితాబ్ ఠాకూర్పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. ఆయన సస్పెన్షన్ను కూడా ఎదుర్కొన్నారు.వివాదం-3: అప్పటి ఎస్పీ అమితాబ్ ఠాకూర్కు చెంపదెబ్బమీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన 2006లో జరిగింది. ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా జస్రానా ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో పోలీసులు, స్థానిక నాయకుల మధ్య వివాదం తలెత్తింది. ఆ సమయంలో అమితాబ్ ఠాకూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)గా పని చేస్తున్నారు. నాయకుల మధ్య వివాదం ఘటనలో అమితాబ్ ఠాకూర్తో అప్పటి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే రామ్వీర్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించి చెంపదెబ్బ కొట్టారని ఆరోపణలు వచ్చాయి.వివాదం-4: ఫేస్బుక్పై ఎఫ్ఐఆర్ నమోదుఅమితాబ్ ఠాకూర్ సాహిత్యం, రచనలతో కూడా అనుబంధం కొనసాగించారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే ఆయన.. ఒకసారి ఫేస్బుక్లో ఉన్న "ఐ హేట్ గాంధీ" పేరుతో ఉన్న పేజీని వ్యతిరేకించారు. ముందుగా ఆ పేజీ తొలగించాలని ఫేస్బుక్ను కోరారు. స్పందన రాకపోవడంతో ఫేస్బుక్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఆ పేజీ తొలగించారు. ఈ చర్యకు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు లభించాయి.వివాదం-5: ధోనీకి 1,000 రూపాయల చెక్కుక్రికెట్ ప్రపంచకప్-2015లో ఆస్ట్రేలియాతో భారత్ ఓడిన తర్వాత అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అమితాబ్ ఠాకూర్ 1,000 రూపాయల చెక్కు పంపించారు. దానితో పాటు ఒక లేఖ కూడా పంపించారు. అందులో ఓటమికి వ్యంగ్యంగా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, "మున్నీ బద్నామ్ హుయీ", "షీలా కీ జవానీ" పాటలపై నిషేధం విధించాలని హైకోర్టును కూడా ఆశ్రయించారు.ట్రస్ట్ ప్రధాన కార్యదర్శికి సీఈవో జవాబుదారీశ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. నియమితులయ్యే సీఈవో నేరుగా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శికి జవాబుదారీగా ఉంటారు. ఆలయానికి సంబంధించిన పరిపాలన, చట్టపరమైన వ్యవహారాలు, ఆర్థిక నిర్వహణ బాధ్యతలు ఆయన వద్ద ఉంటాయి. ప్రధాన కార్యదర్శి అప్పగించే ఇతర బాధ్యతలను కూడా నిర్వర్తించాలి.సీఈవో పదవికి మతపరమైన అర్హత తప్పనిసరిఈ పదవికి ట్రస్ట్ మతపరమైన అర్హతలు కూడా నిర్ణయించింది. దరఖాస్తుదారు హిందువు, వైష్ణవుడు, శ్రీరామ భక్తుడు అయి ఉండాలి. ఆలయ నిర్వహణలో గత అనుభవం ఉంటే ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యం ఇస్తారు.విరాళాల వివాదం తర్వాత సీఈవో పదవికి ప్రాధాన్యంరామ మందిరం విరాళాల వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సీఈవో నియామకానికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. కొత్త అధికారి నుంచి పరిపాలనా పారదర్శకత, ఆర్థిక పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్లు, భక్తులకు మెరుగైన నిర్వహణ అందుతుందని ఆశిస్తున్నారు.
చనిపోక ముందే కుటుంబ సభ్యులకు ముద్రగడ లేఖ
సాక్షి, కాకినాడ జిల్లా: చనిపోక ముందే కుటుంబసభ్యులకు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. తనను ఎక్కడ ఖననం చేయాలో ముందే చెప్పిన ముద్రగడ.. ఇంటి ఆవరణలోనే తనను ఖననం చేయాలని చెప్పారు. ప్రభుత్వ లాంఛనాలు తనకు అవసరం లేదంటూ లేఖలో పేర్కొన్నారు. పోలీసుల గౌరవ వందనం కూడా అవసరం లేదని.. జీవించి ఉన్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి.. మరణానంతరం ఇచ్చే గౌరవం తనకు అవసరం లేదని లేఖలో స్పష్టం చేశారు. తాను మరణించినా భార్య పుణ్య స్త్రీగానే ఉండాలని పేర్కొన్నారు.కాగా, ప్రభుత్వ తీరుపై ముద్రగడ పద్మనాభం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలు వద్దన్నా కానీ, ప్రభుత్వం.. గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదంటూ ముద్రగడ అభిమానులు ఆందోళనకు దిగారు. పోలీసులు గోబ్యాక్ అంటూ ముద్రగడ అభిమానులు నినాదాలు చేశారు.కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్.. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ముద్రగడ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్ జగన్.. ఆయన పాడె మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వైఎస్ జగన్ కిర్లంపూడిలోనే ఉన్నారు.
మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వ్యవహారంపై సోషల్ మీడియాలో దుమారం కొనసాగుతోంది. జూలై 5న ముంబైలోని తన పాలి హిల్ నివాసంలో అత్యంత సాదాసీదాగా, సన్నిహితుల మధ్య చేసుకున్న గౌరి స్ప్రాట్ (Gauri Spratt)తో జరిగిన పెళ్లి వివాదాలకు దారితీసింది. దీనిపై లవ్ జిహాద్ ఆరోపణలతోపాటు, ఈ పెళ్లికి వ్యతిరేకంగా ఒక 'ఫత్వా' జారీ కావడంపై ఆమీర్ ఖాన్ ఘాటుగా స్పందించారు. ఈ వివాహంపై రాజకీయ, మతపరమైన కోణాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో ఆమిర్ సమాధానమిచ్చారు.తన చిరకాల స్నేహితురాల్ని పెళ్లి చేసుకోవడంపై అనేక విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా మహారాష్ట్ర బీజేపీ మంత్రి నితేష్ రాణే ఈ పెళ్లిని "లవ్ జిహాద్" గా అభివర్ణించారు. ఇది ఇలా ఉండగానే ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తాకు చెందిన షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్ ఈ పెళ్లికి వ్యతిరేకం షరియా చట్టం ప్రకారం ముస్లిం పురుషుడు ముస్లిమేతర స్త్రీని (ఆమె ఇస్లాంలోకి మారకుండా) వివాహం చేసుకోకూడదని, ఇది చెల్లదని ఆయన పేర్కొన్నారు.ఆమిర్ ఖాన్ సమాధానంరెడిఫ్ (Rediff) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. తన ముగ్గురు భార్యలలో ఎవరూ ఇస్లాంలోకి మారలేదని స్పష్టం చేశారు. తన వివాహాలన్నీ సివిల్ వివాహాలే (చట్టబద్ధమైన రిజిస్టర్ మ్యారేజ్)అని పేర్కొన్నారు. అలాగే గౌరి అసలు హిందువు కానేకాదని ఒక క్రిస్టియన్. పైగా ఆమె మతాచారాలను పాటించే వ్యక్తి కూడా కాదని ఆమిర్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఘనంగా పెళ్లి : రూ. కోటి నగలు, నగదుతో రాత్రికి రాత్రే వధువు జంప్కలిసికట్టుగా ఉండే కుటుంబం"మాది చాలా విశాల దృక్పథం ఉన్న కుటుంబం. నా ఇద్దరు సోదరిమణులు హిందువులను వివాహం చేసుకున్నారు. నా కుమార్తె కూడా హిందువునే పెళ్లి చేసుకుంది. నా కజిన్ మన్సూర్ ఒక క్రిస్టియన్ను పెళ్లాడాడు" అని వివరించారు. అంతేకాదు కాలం గడుస్తున్న కొద్దీ జీవితం మరింత హాస్యాస్పదంగా మారుతోందంటూ ఈ వివాదాలపై ఆమీర్ చురకలు వేశారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందికాగా ఆమీర్- గౌరి స్ప్రాట్ల వివాహానికి దాదాపు 150 మంది అతిథులు హాజరయ్యారు.ముఖ్యంగా ఆమీర్ ఇద్దరు భార్యలు రీనా దత్తా, కిరణ్ రావ్తోపాటు, పిల్లలు జునైద్, ఇరా, ఆజాద్లతో పాటు గౌరి కుమారుడు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఇదీ చదవండి: 18 ఏళ్ల ఎన్ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్ పోస్ట్ వైరల్
హీరో సూర్యతో రాజమౌళి కొత్త సినిమా?
ధార్వాడ్లో ఘోరం.. ఇంట్లోనే డాక్టర్ దారుణ హత్య
ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఇది ఊతం ఇస్తుంది: రేవంత్ రెడ్డి
అయ్యగారే నంబర్వన్.. సక్సెస్ మీట్లో అఖిల్ సతీమణి..!
డాక్టర్ సతీష్ రెడ్డికి ‘ఎమెస్కో- బి.వి. పట్టాభిరామ్’ పురస్కారం
భారత్ నుంచి హసీనా తిరిగి బంగ్లా వెళ్తాననడానికి కారణాలేంటి?
రామ్ చరణ్ పెద్ది.. ఓటీటీలోనూ ట్రెండింగ్..!
రూ.11 వేల కోట్ల కంపెనీ సీఈవో.. అయినా ‘నో లోన్’!
విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్పై వివాదం
వచ్చే ఏడాది పాదయాత్ర: కేటీఆర్
అట్టర్ ఫ్లాప్గా నిలిచిన ‘దురంధర్’.. 900 మంది కూడా చూడలేదు!
నా సినిమాలో మీరే హీరోయిన్.. ముందు శరీరమంతా చూపించండి..!
విమాన చార్జీల దోపీడీపై 'సుప్రీం' సీరియస్
గందరగోళంగా 'సర్'
కావేరి నదిలో జానకి అస్థికల నిమజ్జనం
మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్
‘ఇది మంచి ఆరంభం.. అతడొక అద్భుతం’
అమరనాథ్ యాత్రలో అద్భుతం
ఎట్టకేలకు ఒక విజయం
అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా?: మాజీ కెప్టెన్ ఫైర్
అసభ్యకరంగా హీరోయిన్ మార్ఫింగ్ ఫోటోలు.. పోలీసులకు ఫిర్యాదు
వివాదాల నేపథ్యంలో.. విజయ్ సంచలన నిర్ణయం
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యవహారాల్లో విజయం
ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్
IND vs SL: ఒకే ఒక్కడు!.. శ్రీలంక భారీ స్కోరు
విజయ్ చివరి సినిమా.. కొడుకు ఊహించని నిర్ణయం!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
హీరో సూర్యతో రాజమౌళి కొత్త సినిమా?
ధార్వాడ్లో ఘోరం.. ఇంట్లోనే డాక్టర్ దారుణ హత్య
ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఇది ఊతం ఇస్తుంది: రేవంత్ రెడ్డి
అయ్యగారే నంబర్వన్.. సక్సెస్ మీట్లో అఖిల్ సతీమణి..!
డాక్టర్ సతీష్ రెడ్డికి ‘ఎమెస్కో- బి.వి. పట్టాభిరామ్’ పురస్కారం
భారత్ నుంచి హసీనా తిరిగి బంగ్లా వెళ్తాననడానికి కారణాలేంటి?
రామ్ చరణ్ పెద్ది.. ఓటీటీలోనూ ట్రెండింగ్..!
రూ.11 వేల కోట్ల కంపెనీ సీఈవో.. అయినా ‘నో లోన్’!
విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్పై వివాదం
వచ్చే ఏడాది పాదయాత్ర: కేటీఆర్
అట్టర్ ఫ్లాప్గా నిలిచిన ‘దురంధర్’.. 900 మంది కూడా చూడలేదు!
నా సినిమాలో మీరే హీరోయిన్.. ముందు శరీరమంతా చూపించండి..!
విమాన చార్జీల దోపీడీపై 'సుప్రీం' సీరియస్
గందరగోళంగా 'సర్'
కావేరి నదిలో జానకి అస్థికల నిమజ్జనం
మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్
‘ఇది మంచి ఆరంభం.. అతడొక అద్భుతం’
అమరనాథ్ యాత్రలో అద్భుతం
ఎట్టకేలకు ఒక విజయం
అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా?: మాజీ కెప్టెన్ ఫైర్
అసభ్యకరంగా హీరోయిన్ మార్ఫింగ్ ఫోటోలు.. పోలీసులకు ఫిర్యాదు
వివాదాల నేపథ్యంలో.. విజయ్ సంచలన నిర్ణయం
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యవహారాల్లో విజయం
ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్
IND vs SL: ఒకే ఒక్కడు!.. శ్రీలంక భారీ స్కోరు
విజయ్ చివరి సినిమా.. కొడుకు ఊహించని నిర్ణయం!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
ఫొటోలు
రాధిక భర్త శరత్కుమార్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ముద్రగడకు కన్నీటి వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్ (ఫొటోలు)
ఆక్వా రైతులకు బాసటగా.. వైఎస్ జగన్ భీమవరం పర్యటన (ఫొటోలు)
ప్రెగ్నెన్సీతోనూ సమంత ఫారిన్ ట్రిప్ (ఫొటోలు)
జగపతిబాబు-లయ 'వదలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
'ఆపరేషన్ అరుణారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
పింక్ శారీలో బాలీవుడ్ భామ మాధురి దీక్షిత్ అందాలు.. ఫోటోలు
ఫ్రెండ్ పార్టీలో బాలీవుడ్ భామ ఆలియా భట్ సందడి.. ఫోటోలు
కూతురి పెళ్లి.. ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసిన నిర్మాత (ఫొటోలు)
శ్రుతి హాసన్ నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)
సినిమా
ఖరీదైన కారు కొన్న టాలీవుడ్ నటి హేమ.. వీడియో వైరల్
క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ. తాజాగా ఆమె ఖరీదైన కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కొత్త కారుకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హేమకు కంగ్రాట్స్ చెబుతున్నారు.ప్రముఖ మెర్సిడెజ్ బెంజ్ బ్రాండ్ కారును హేమ కొనుగోలు చేసింది. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.కోటిన్నరకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారును తానే స్వయం నడుపుతూ వీడియోలో కనిపించింది. View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211)
మరో ఓటీటీకి టాలీవుడ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా ఈషా. గతేడాది చివర్లో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సిరి హనుమంతు, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించారు.ఈషా కథేంటంటే..కల్యాణ్(త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవు అని నమ్ముతుంటారు. పెద్దయ్యాక టీమ్గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు తెలుస్తుంది. అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్లి ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ.
విజయ్ జన నాయగన్.. రిలీజ్ డేట్ ఫిక్స్
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. రాజకీయాలకు ముందు ఆయన నటించిన చివరి చిత్రమిదే. ఈ మూవీనే తన ఆఖరి సినిమా అని కూడా విజయ్ విజయ్ ప్రకటించారు. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ ఎట్టకేలకు రిలీజ్కు రెడీ అయిపోయింది. ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు.తాజాగా జన నాయగన్ రిలీజ్ డేట్ను రివీల్ చేశారు మేకర్స్. జూలై 23 నుంచే థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. ఈ మేరకు విజయ్ పోలీస్ డ్రెస్లో పోస్టర్ షేర్ చేశారు. దీంతో విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ను జారీ చేసింది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుండగా.. ప్రేమలు బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది. Tested by fire.Forged by time.Built for history.The tougher the battle,The louder the victory.#JanaNayaganFromJuly23#JanaNayakuduFromJuly23#JanNetaFromJuly23The Hon'ble Chief Minister @actorvijay @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol… pic.twitter.com/21xjixgUBM— KVN Productions (@KvnProductions) July 15, 2026
ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు వస్తూనే ఉంటాయి. రీసెంట్ టైంలో అలా ప్రీతమ్ అండ్ పెడ్రో, సూపర్ సుబ్బు తదితర సిరీస్లు సినీ ప్రేమికుల్ని ఆకట్టుకున్నాయి. వీటిలానే ఎంటర్టైన్ చేసేందుకు ఓ రొమాంటిక్ డ్రామా సిరీస్ రెడీ అయింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చెప్పేశారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)విక్రాంత్ మస్సే, వేదిక పింటో, మహిమా మక్వానా ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'ముసాఫిర్ కేఫ్'. దివ్య ప్రకాశ్ దూబే అనే రచయిత్రి రాసిన 'ముసాఫిర్ కేఫ్' నవల ఆధారంగా ఈ రొమాంటిక్ డ్రామాని తెరకెక్కించారు. నెట్ఫ్లిక్స్లో ఈ నెల 24 నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి రావొచ్చు.'ముసాఫిర్ కేఫ్' ట్రైలర్ బట్టి చూస్తే.. చందర్(విక్రాంత్ మస్తే) కుర్రతనంలో ఉన్నప్పుడు సుధ(వేదిక పింటో)ని ప్రేమిస్తాడు. రిలేషన్లోకి వెళ్తాడు. కానీ కొన్ని కారణాలతో వాళ్లు విడిపోతారు. కొన్నేళ్లు గడిచిపోయిన తర్వాత చందర్.. ప్రీతి(మహిమా మక్వానా)తో ప్రేమలో పడతాడు. తర్వాత ఏమైంది? ప్రీతికి సుధ గురించి తెలిసినప్పుడు చందర్ ఎలా రియాక్ట్ అయ్యాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
క్రీడలు
వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు
పురుషుల వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో ఐసీసీ భారీ మార్పులు ప్రకటించింది. టోర్నీల్లో పోటీ స్థాయిని పెంచడం, ప్రతి మ్యాచ్కు మరింత ప్రాధాన్యం కల్పించడం, అభిమానులకు మరింత ఆసక్తికర అనుభవాన్ని అందించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది.వన్డే ప్రపంచకప్లో ఇలా..!2027 వన్డే ప్రపంచకప్లో మొత్తం 14 జట్లు బరిలోకి దిగనున్నాయి. 2019, 2023 ప్రపంచకప్ల్లో 10 జట్లు మాత్రమే పాల్గొనగా, 2015 తర్వాత మళ్లీ 14 జట్లతో టోర్నీ నిర్వహించనున్నారు.కొత్త ఫార్మాట్లో ముందుగా ర్యాంకింగ్స్లో 12, 13, 14 స్థానాల్లో ఉన్న మూడు జట్లు తొలి దశలో పోటీ పడతాయి. వీటిలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తుంది.ఆ తర్వాత 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. రెండు గ్రూపుల నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు, రెండు గ్రూపుల్లో అత్యుత్తమంగా నిలిచిన మరో జట్టు 'సూపర్-7' దశకు చేరుకుంటుంది.గతంలో ఉన్న'సూపర్-6' స్థానంలో ఇప్పుడు 'సూపర్-7' దశను ప్రవేశపెట్టారు. ఈ దశలో అగ్ర నాలుగు జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో తొలి స్థానం జట్టు నాలుగో స్థాన జట్టుతో, రెండో స్థాన జట్టు మూడో స్థాన జట్టుతో తలపడుతుంది.టీ20 ప్రపంచకప్లో 'సూపర్-10'2028 టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లో కూడా ఐసీసీ మార్పులు చేసింది. మొత్తం 20 జట్లను ఐదు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు జట్లు రెండో దశకు చేరుకుంటాయి.గతంలో అమల్లో ఉన్న 'సూపర్-8' స్థానంలో ఇప్పుడు 'సూపర్-10' దశను ప్రవేశపెట్టారు. ఇందులో 10 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు.ప్రతి గ్రూపులో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్కు చేరుకుంటుంది. రెండో, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఐపీఎల్ తరహాలో ఎలిమినేటర్ మ్యాచ్లు ఆడతాయి. ఎలిమినేటర్ విజేతలు సెమీఫైనల్కు అర్హత సాధిస్తారు. అనంతరం సెమీఫైనల్, ఫైనల్తో టోర్నీ ముగుస్తుంది.అర్హత విధానంలోనూ మార్పులు2028 టీ20 ప్రపంచకప్ అర్హత విధానంలో కూడా ఐసీసీ సవరణలు చేసింది. స్కాట్లాండ్కు యూరప్ రీజినల్ ఫైనల్కు నేరుగా ప్రవేశం కల్పించారు. మిగిలిన జట్లు గ్లోబల్ క్వాలిఫయర్ ద్వారా అర్హత సాధించాల్సి ఉంటుంది. వివిధ ప్రాంతీయ టోర్నీల నుంచి జట్లు ఎంపికై ప్రపంచకప్కు చేరతాయి.పై మార్పులకు ఐసీసీ డెవలప్మెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపినా, ఈ ఏడాది నవంబర్లో జరిగే ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ సమీక్ష అనంతరం తుది ఆమోదం లభించనుంది.భారత్-పాక్ మ్యాచ్లు పెరిగే అవకాశంకొత్త ఫార్మాట్తో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉంటే గ్రూప్ దశలో ఒకసారి తలపడే అవకాశం ఉంది. అనంతరం రెండు జట్లు సూపర్-7కు (వన్డే) చేరితే మరోసారి ముఖాముఖి అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ప్రపంచకప్లో ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య కనీసం రెండు మ్యాచ్లు జరిగే అవకాశాలు పెరుగుతాయి.
అర్జెంటీనాను ప్రపంచకప్ నుంచి బహిష్కరించండి..!
ఫిఫా ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాపై మరోసారి వివాదం చెలరేగింది. రిఫరీలు, వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) నిర్ణయాల్లో అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ, ఆ జట్టును టోర్నమెంట్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్లో ఓ పిటిషన్ వైరల్ అవుతోంది. ఈ పిటిషన్కు ఇప్పటికే 75 లక్షల మందికిపైగా మద్దతు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.పిటిషన్ నిర్వాహకులు ఫిఫాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అర్జెంటీనాకు అనుకూలంగా రిఫరీ నిర్ణయాలు వస్తున్నాయని, దీంతో పోటీ సమానంగా జరగడం లేదని వారు ఆరోపించారు. "విజేత ముందే నిర్ణయించబడితే మిగతా జట్లు ఎందుకు పోటీ పడాలి? అర్జెంటీనాను ప్రపంచకప్ నుంచి తప్పించి ఇతర జట్లకు న్యాయం చేయాలి" అని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ వివాదం మధ్యనే అర్జెంటీనా సెమీఫైనల్లో ఇంగ్లండ్తో తలపడనుంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక ప్రత్యర్థిత్వం కారణంగా ఈ మ్యాచ్పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. తాజా ఆరోపణలతో ఈ పోరుకు మరింత ఉత్కంఠ ఏర్పడింది.ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ, అర్జెంటీనాపై చర్యలు తీసుకునే అంశంపై ఫిఫా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే పిటిషన్లో చేసిన ఆరోపణలకు సంబంధించి స్వతంత్రంగా నిర్ధారిత ఆధారాలు కూడా వెలుగులోకి రాలేదు. అందువల్ల ఇవి ప్రస్తుతం ఆరోపణలుగానే పరిగణించాల్సి ఉంటుంది. కాగా, భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్య రాత్రి రెండో సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లండ్తో తలపడనుంది. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై గెలుపుతో స్పెయిన్ ఇదివరకే ఫైనల్కు చేరుకుంది.
ODI WC: రోహిత్ విఫలం.. ట్విస్ట్ ఇచ్చిన గంభీర్!
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో టీమిండియా శుభారంభం అందుకుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది.రో- కో విఫలంఅయితే, ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తీవ్రంగా నిరాశపరిచారు. ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ 21 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు చేసి.. సామ్ కరన్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఇక వన్డౌన్ బ్యాటర్ కోహ్లి.. ఆరు బంతుల్లో ఒక ఫోర్ బాది.. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్-2027 టోర్నీలో రో-కో ఆడటంపై మరోసారి చర్చమొదలైంది.ప్రయోగాలు చేస్తాంఇప్పటికే ప్రయోగాలు చేస్తామంటూ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పష్టం చేసిన తరుణంలో.. రోహిత్- కోహ్లిని పక్కనపెట్టే సాహసం చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు స్పోర్ట్స్ టాక్తో మాట్లాడుతూ రోహిత్ విషయంలో మేనేజ్మెంట్ వైఖరి గురించి కీలక విషయాలు వెల్లడించాయి.ట్విస్ట్ ఇచ్చిన గంభీర్!‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ ఇప్పటికే ఎంతో గొప్పగా సేవ చేశాడు. కాబట్టి కోచ్ (గంభీర్) అతడికి స్వేచ్ఛనిచ్చాడు. ఇన్నాళ్లుగా ఎలా ఆడాడో.. ఇప్పుడు కూడా అలాగే ఆడేమని స్వేచ్ఛగా వదిలేశాడు.అయితే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం కోచ్ అతడి పట్ల సానుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా రోహిత్ ఒత్తిడి లేకుండా.. ప్రశాంతమైన మనసుతో మ్యాచ్ ఆడేలా చూస్తున్నారు. అలా అయితేనే రోహిత్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడని యాజమాన్యం నమ్ముతోంది.మేనేజ్మెంట్కు ఆ విషయం తెలుసునిజానికి రోహిత్ ఒత్తిడిలో ఉంటే ఏం జరిగిందో చూశాం కదా!.. కాబట్టి ఇప్పుడు మేనేజ్మెంట్ అతడి ప్రతి ఇన్నింగ్స్ను భూతద్దంలో పెట్టి చూడాలనుకోవడం లేదు. అతడి స్థాయి ఏమిటో యాజమాన్యానికీ తెలుసు. రోహిత్ ప్రశాంతంగా.. ఒత్తిడి లేకుండా ఆడితే ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రస్తుతానికి మేనేజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది. టెక్నిక్లో ఉన్న చిన్నపాటి లోపాలు సరిచేసుకుంటే హిట్మ్యాన్కు తిరుగు ఉండదు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా హెడ్కోచ్ గౌతం గంభీర్ రోహిత్ శర్మ పట్ల సానుకూలంగానే ఉన్నట్లు దీనిని బట్టి తెలుస్తోంది. అతడి అనుభవం, దూకుడైన ఆట జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తున్న గంభీర్.. వరల్డ్కప్లో హిట్మ్యాన్ను ఆడించేందుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చదవండి: IND vs ENG: అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా?
మిచెల్కు గిల్ గట్టి సవాల్
భారత్-ఇంగ్లండ్ తొలి వన్డే అనంతరం ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ రేటింగ్ పాయింట్లు పెంచుకుని ప్రపంచ నంబర్-1 బ్యాటర్ స్థానానికి మరింత చేరువయ్యాడు.ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 80 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించిన గిల్కు 12 రేటింగ్ పాయింట్లు లభించాయి. ప్రస్తుతం అతను ప్రపంచ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అగ్రస్థానంలో ఉన్న డారిల్ మిచెల్ను (814) అధిగమించేందుకు గిల్కు (803) ఇంకా 12 రేటింగ్ పాయింట్లు మాత్రమే అవసరం. మరో మంచి ఇన్నింగ్స్ గిల్ను అగ్రపీఠంపై కూర్చోబెట్టడం ఖాయం.తొలి వన్డేలో విఫలమైనప్పటికీ భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి (3వ స్థానం), రోహిత్ శర్మ (4వ స్థానం) తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.భారత ఆటగాళ్లకు భారీ లబ్దిదీర్ఘ విరామం తర్వాత వన్డే ఆడిన జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్పై కట్టుదిట్టమైన బౌలింగ్తో ర్యాంకింగ్స్లో 24వ స్థానానికి చేరుకున్నాడు.అలాగే తొలి వన్డేలో అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన అక్షర్ పటేల్ ఆల్రౌండర్ల జాబితాలో టాప్-10లోకి ప్రవేశించాడు. బ్యాట్తో అజేయ అర్ధశతకం సాధించిన వాషింగ్టన్ సుందర్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 73వ స్థానానికి చేరుకున్నాడు.ఇంగ్లండ్ ఆటగాళ్లకు కూడా మెరుగైన ర్యాంకులుఇంగ్లండ్ తరఫున తొలి వన్డేలో 76 పరుగులు చేసిన జో రూట్ 12వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే అర్ధశతకంతో ఆకట్టుకున్న లియామ్ డాసన్ బ్యాటర్ల జాబితాలో 81 స్థానాలు ఎగబాకి 262వ స్థానంలో నిలిచాడు.ఇతర దేశాల ఆటగాళ్లలో న్యూజిలాండ్ స్పిన్నర్ జేడెన్ లెనాక్స్, వెస్టిండీస్ బ్యాటర్ కీసీ కార్టీ, జింబాబ్వే ఆటగాళ్లు బెన్ కర్రన్, బ్రాడ్ ఇవాన్స్ కూడా తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో గణనీయమైన పురోగతి సాధించారు.
న్యూస్ పాడ్కాస్ట్
మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
పల్నాడు కలను సాకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... 100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల కొత్త మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో మరో కుంభకోణానికి తెరతీసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... ల్యాప్టాప్ల కొనుగోలులో దోపిడీకి స్కెచ్
నిలబెట్టుకోలేనప్పుడు హామీలు ఎందుకిచ్చారు?.... ఆంధ్రప్రదేశ్లో కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు... భారీ ర్యాలీలు, ధర్నాలతో చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో తిష్టవేసిన సమస్యలు... 2024లో 43 లక్షలున్న విద్యార్థులు ఇపుడు 30 లక్షలే..
టీచర్ల ‘టెట్’ ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదు?... ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
టెట్ మినహాయింపునకు కృషి. టీచర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. తనను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలకు వైఎస్ జగన్ భరోసా
విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు
ప్రశ్నించే గొంతును నొక్కడానికి అత్యంత ప్రమాదకర ధోరణి వైపు పోలీసు వ్యవస్థను నడిపిస్తున్నారు... ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
బిజినెస్
సొంతింటి కల నిజం కావాలా?
సొంతంగా ఇల్లు కొనుగోలు చేయడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతిపెద్ద ఆర్థిక నిర్ణయం. అయితే, నేటి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇల్లు కొనడం కేవలం బడ్జెట్కు సరిపోయే ప్రాపర్టీని ఎంచుకోవడంతో ముగిసిపోయే ప్రక్రియ కాదు. కొనుగోలు సమయంలో మనం తీసుకునే కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు, భవిష్యత్తులో దశాబ్దాల పాటు మన జేబుకు చిల్లు పడకుండా కాపాడతాయి. గృహ కొనుగోలుదారులు దీర్ఘకాలికంగా డబ్బు ఆదా చేసుకునేందుకు దోహదపడే ఐదు కీలకమైన నిర్ణయాలపై విశ్లేషణ.డౌన్ పేమెంట్ వాటా పెంపుచాలామంది బ్యాంకులు ఇచ్చే గరిష్ట రుణం (లోన్-టు-వాల్యూ)పై ఆధారపడుతుంటారు. కానీ, కొనుగోలు సమయంలో కేవలం కనీస డౌన్ పేమెంట్ కాకుండా, మీ పొదుపు మొత్తాన్ని వీలైనంత ఎక్కువగా (కనీసం 20-30% లేదా అంతకంటే ఎక్కువ) ముందస్తుగా చెల్లించడం ఉత్తమం. దీనివల్ల అసలు రుణభారం తగ్గడమే కాకుండా నెలవారీ ఈఎంఐ భారం, మొత్తం రుణ కాలపరిమితిపై చెల్లించాల్సిన వడ్డీ రేటు లక్షల్లో తగ్గుతుంది.వడ్డీ రేట్ల సరళిగృహ రుణం తీసుకునేటప్పుడు వడ్డీ రేట్ల ఎంపిక అత్యంత కీలకం. ప్రస్తుత ఆర్థిక మార్కెట్ ఒడిదుడుకులు, ఆర్బీఐ రెపో రేట్ల ధోరణిని బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా సుదీర్ఘ కాలపరిమితి (15-20 ఏళ్లు) కలిగిన రుణాలకు ఫ్లోటింగ్ రేట్ ఎంచుకోవడం వల్ల మార్కెట్ తగ్గుముఖం పట్టినప్పుడు వడ్డీ ఆదా అవుతుంది. అయితే, స్థిరమైన బడ్జెట్ ప్రణాళికను ఇష్టపడేవారు ‘ఫిక్స్డ్ రేట్’ వైపు మొగ్గు చూపవచ్చు.సరైన ప్రాపర్టీ పరిమాణం, లేఅవుట్ ఎంపిక‘పెద్ద ఇల్లు... ఎక్కువ హోదా’ అనే భ్రమల నుంచి బయటకు రావాలి. కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా ఇంటిని ఎంచుకోవడం ద్వారా కొనుగోలు ధరతోపాటు భవిష్యత్తులో అయ్యే ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, అంతర్గత నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. అనవసరమైన కార్పెట్ ఏరియా కోసం పెట్టే పెట్టుబడిని వేరే ఆర్థిక వనరుల్లో మళ్లించడం ద్వారా అదనపు రాబడిని పొందవచ్చు.లొకేషన్ ఎంపికనగరం నడిబొడ్డున ఉన్న స్థలాలు లేదా ఐటీ కారిడార్లకు సమీపంలోని పూర్తయిన ప్రాజెక్టుల ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. వీటికి బదులుగా రాబోయే 3-5 ఏళ్లలో మౌలిక సదుపాయాలు (మెట్రో, హైవేలు) మెరుగుపడనున్న అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలను ఎంచుకోవడం స్మార్ట్ నిర్ణయం. దీనివల్ల కొనుగోలు ఖర్చు తగ్గడమే కాక భవిష్యత్తులో ఆస్తి విలువ వేగంగా పెరిగి లాభాలను అందిస్తుంది.బీమా, ఇతరత్రా ఖర్చుల పట్ల అప్రమత్తతఇల్లు కొనేటప్పుడు కేవలం బేస్ ప్రైస్ మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, క్లబ్ హౌస్ మెంబర్షిప్ వంటి అదనపు ఖర్చులను ముందే అంచనా వేయాలి. అలాగే, హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ లేదా హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఊహించని విపత్కర పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడంతోపాటు బ్యాంకులు మీ ఆస్తిని జప్తు చేయకుండా కాపాడుతుంది.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ
ఉదయం 3:30 వరకు పబ్లు, రెస్టారెంట్లు ఓపెన్!
ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాల నేపథ్యంలో సిలికాన్ సిటీ బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్కు సంబంధించిన సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ ఉన్న రోజుల్లో (జులై 14, 15, 19 తేదీలు) నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లను రాత్రి 1 గంటకు బదులు తెల్లవారుజామున 3:30 గంటల వరకు తెరిచి ఉంచేందుకు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక పోలీస్ చట్టం పరిధిలో ఈ తాత్కాలిక సడలింపు ఇచ్చారు. అయితే, ఈ ఉత్తర్వులు కేవలం ఆహార పదార్థాల (ఫుడ్) సరఫరాకేనా లేక మద్యం (లిక్కర్) విక్రయాలకు కూడా వర్తిస్తాయా అనే అంశంపై గందరగోళం నెలకొంది.నిర్ణయ నేపథ్యం ఏమిటి?ప్రస్తుతం అమెరికా, కెనడా, మెక్సికో దేశాల వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2:30 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) బెంగళూరు ప్రతినిధులు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ను కలిసి మ్యాచ్లు వీక్షించేందుకు వచ్చే కస్టమర్ల సౌకర్యార్థం నగరంలోని వ్యాపార వేళలను పొడిగించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి క్రీడాభిమానుల ఉత్సాహాన్ని గౌరవిస్తూనే ప్రజా భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.లిక్కర్ అనుమతిపై సందిగ్ధత!పోలీస్ కమిషనరేట్ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో ఆహార సేవలను తెల్లవారుజామున 3:30 గంటల వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, మద్యం సరఫరా, విక్రయాలపై ఎలాంటి ప్రత్యేక ప్రస్తావన చేయలేదు. సాధారణ నిబంధనల ప్రకారం బెంగళూరులో రాత్రి 1 గంట తర్వాత మద్యం విక్రయించడం చట్టవిరుద్ధం. దీంతో పబ్లు, బార్ల యజమానులు ఈ ఉత్తర్వులపై సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి స్పష్టమైన రాతపూర్వక అనుమతి లేదా నిబంధనల సడలింపు వస్తేనే తెల్లవారుజాము వరకు మద్యం సరఫరా చేయడానికి వీలవుతుందని వాదిస్తున్నారు.శాంతిభద్రతలపై పోలీసుల నిఘామరోవైపు రాత్రి వేళల్లో సమయాన్ని పొడిగించడం వల్ల నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠిన నిబంధనలను విధించారు. లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసే యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఫుట్బాల్ అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నైట్లైఫ్ సంస్కృతికి భంగం కలగకుండా పోలీసులకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏదేమైనా ఈ నిర్ణయం బెంగళూరు నైట్లైఫ్కు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుందా లేక లిక్కర్ సందిగ్ధత వల్ల నీరుగారిపోతుందా అనేది ఎక్సైజ్ శాఖ ఇచ్చే తదుపరి స్పష్టతపైనే ఆధారపడి ఉంది.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ
రైళ్లలో దుప్పట్లు మాయం.. రైల్వే యాక్షన్ ప్లాన్ ఇదే!
భారతీయ రైల్వేలో ప్రయాణికులకు అందించే సౌకర్యాలు ఎంత విలాసవంతంగా మారుతున్నాయో, అంతే స్థాయిలో కొందరు ప్రయాణికుల బాధ్యత లోపిస్తోందనడానికి తాజా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) నివేదిక ఒక నిదర్శనం. ఏసీ కోచ్లలో ప్రయాణించే వారు బెడ్షీట్లు, దుప్పట్లు, తువ్వాళ్లను దొంగిలిస్తుండటంతో గడిచిన నాలుగేళ్లలో (జనవరి 2022 నుంచి మే 2026 వరకు) రైల్వే శాఖకు ఏకంగా రూ.104.51 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. గణాంకాల ప్రకారం, ప్రతి వెయ్యి మంది ఏసీ ప్రయాణికుల్లో ఒకరు రైల్వే వస్తువులను తమతో పాటు పట్టుకెళ్తున్నారు.మాయమైన వస్తువుల వివరాలురైల్వే పరిధిలోని 54 డివిజన్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. అత్యధికంగా ఫేస్ టవల్స్ (ముఖం తుడుచుకునే తువ్వాళ్లు) దొంగలిస్తున్నారు.ఫేస్ టవల్స్: 46.54 లక్షలుబెడ్షీట్లు (దుప్పట్లు): 41.13 లక్షలుపిల్లో కవర్లు: 23.59 లక్షలుబ్లాంకెట్లు: 12.95 లక్షలుదిండ్లు: 2.76 లక్షలు2022 నుంచి 2025 మధ్య కాలంలో ఈ తరహా చోరీలు ఏకంగా 56 శాతం పెరగడం గమనార్హం. డివిజన్ల వారీగా చూస్తే రాజస్థాన్లోని బికనీర్ డివిజన్ 25.76 లక్షల వస్తువుల నష్టంతో అగ్రస్థానంలో ఉండగా రాంచీ, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, కొన్ని డివిజన్లు అద్భుతమైన నియంత్రణను ప్రదర్శించాయి. తిరుచిరాపల్లి, పాలక్కాడ్ డివిజన్లలో ఒక్క చోరీ కూడా నమోదు కాకపోవడం విశేషం.ఎవరిపై భారం?రైల్వే నిబంధనల ప్రకారం వస్తువుల బాధ్యత కాంట్రాక్ట్ ఏజెన్సీలదే. వస్తువులు పోయినప్పుడు ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి మినహాయిస్తారు. దురదృష్టవశాత్తూ ఆ కాంట్రాక్టర్లు రోజుకు కేవలం రూ.700 వరకు సంపాదించే అటెండెంట్ల జీతాల నుంచి ఈ మొత్తాన్ని (దిండుకు రూ.115, బ్లాంకెట్కు రూ.343 చొప్పున) కట్ చేస్తున్నారు. ప్రయాణికుల నిర్వాకానికి పేద కార్మికులు బలి కావడం ఆందోళనకరం.నియంత్రణకు రైల్వే సరికొత్త వ్యూహంకోచ్ మిత్ర యాప్: అటెండెంట్లు ఈ యాప్ ద్వారా ప్రయాణికుల బోర్డింగ్, డీ-బోర్డింగ్ సమయాలను ట్రాక్ చేస్తూ వస్తువుల పంపిణీని పర్యవేక్షిస్తున్నారు.30 నిమిషాల రూల్: ప్రయాణం ముగియడానికి 30 నిమిషాల ముందే బెడ్రోల్ వస్తువులను తిరిగి సేకరించేలా ప్యాకెట్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ముద్రిస్తున్నారు.సీసీటీవీ, ఆకస్మిక తనిఖీలు: కోచ్లలో నిఘా పెంచడంతో పాటు అనుమానాస్పద ప్రయాణికుల లగేజీని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సాయంతో చట్టబద్ధంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.మౌలిక వసతుల కల్పనపై పెట్టాల్సిన నిధులు ఇలాంటి ప్రత్యామ్నాయాలకు ఖర్చవుతుండటం శోచనీయం. ఇప్పటికైనా ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ
త్వరలో ఓపెన్ఏఐ స్మార్ట్ స్పీకర్!
కృత్రిమ మేధ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ ఏఐ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగాన్ని దాటి కన్స్యూమర్ హార్డ్వేర్ మార్కెట్పై కన్నేసింది. ఇప్పటివరకు మన స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలో అప్లికేషన్ రూపంలో డిజిటల్గా మాత్రమే పరిచయమున్న ‘చాట్జీపీటీ’ సాంకేతికత.. త్వరలోనే మన ఇళ్లలో ఒక భౌతిక రూపంలో దర్శనమివ్వబోతోంది. అంతర్జాతీయ టెక్ వర్గాల తాజా లీకుల ప్రకారం, ఓపెన్ ఏఐ తన మొదటి స్వతంత్ర హార్డ్వేర్ పరికరంగా ఒక సరికొత్త ‘స్మార్ట్ స్పీకర్’ను తెరపైకి తెచ్చింది.అయితే, ఇది మార్కెట్లో ప్రస్తుతం లభించే అమెజాన్ ఎకో లేదా యాపిల్ హోమ్పాడ్ వంటి సాధారణ స్పీకర్ కాదని కొందరు నిపుణులు చెబుతున్నారు. దీనికి ఎలాంటి స్క్రీన్ (డిస్ప్లే) ఉండదు. కానీ, ఇది స్వయంప్రతిపత్తితో పని చేస్తుంది. ప్రాణమున్న ఒక ఏఐ తోడులా మనతో సంభాషిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ఇంట్లో ఒక మనిషి తరహా ఉనికిని చాటడమే దీని ప్రత్యేకత.సాంకేతిక నైపుణ్యం - ప్రత్యేకతలుఈ పరికరంలో అధునాతన ఇన్-బిల్ట్ కెమెరాలు, పర్యావరణ సెన్సార్లు ఉంటాయి. ఇవి చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని, వ్యక్తులను, వస్తువులను నిశితంగా గమనించగలవు. అంతేకాదు, వినియోగదారుడి దినచర్యలు, అలవాట్లను, చివరికి వారి ఈమెయిళ్లను సైతం విశ్లేషించి వారు అడగకముందే అవసరాలను ముందస్తుగా గుర్తించి సమాచారాన్ని అందిస్తుంది. ఓపెన్ ఏఐ ఇటీవల ప్రవేశపెట్టిన అత్యంత వేగవంతమైన ‘జీపీటీ-లైవ్’ వాయిస్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. దీనివల్ల మనం మాట్లాడుతున్నప్పుడే అది వినగలదు. ఒకే సమయంలో సహజమైన మనుషులలాగా స్పందించగలదు. రీఛార్జబుల్ బ్యాటరీ సదుపాయం ఉండటం వల్ల వంటగది నుంచి బెడ్రూమ్ వరకు ఇంట్లో ఎక్కడికైనా సులభంగా తరలించుకోవచ్చు.యాపిల్తో వైరం.. మార్కెట్ సవాళ్లుయాపిల్ మాజీ డిజైన్ ఇంజినీర్ జోనీ ఐవ్ నేతృత్వంలోని బృందంతో కలిసి ఓపెన్ ఏఐ సుమారు ఐదు విభిన్న హార్డ్వేర్ ఉత్పత్తులపై పరిశోధనలు చేస్తోంది. అయితే ఈ ప్రతిష్టాత్మక హార్డ్వేర్ ప్రస్థానానికి ప్రారంభంలోనే చట్టపరమైన బ్రేక్ పడింది. ఓపెన్ ఏఐ తమ వాణిజ్య రహస్యాలను దొంగిలించిందంటూ యాపిల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ న్యాయపరమైన వివాదం కారణంగా ఈ పరికరం మార్కెట్ ఎంట్రీ కొంత ఆలస్యం కావచ్చు. ఓపెన్ ఏఐ షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది (2026) ద్వితీయార్థంలో ఈ పరికరాన్ని అధికారికంగా ఆవిష్కరించి, 2027 ఫిబ్రవరి నాటికి వినియోగదారుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ
ఫ్యామిలీ
ప్లీజ్ పట్టుచీరను ఎలా ఉతకాలో చెప్పరు..!: ఓ విదేశీ మహిళ అభ్యర్థన
మహిళామణులకు పట్టు చీర అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదివాళ్లకు ఒక వస్త్రం మాత్రమే కాదు ఒక హుందాతనాన్ని, పండుగ వాతావరణాన్ని అందించే జ్ఞాపకాల చీర. ఆ చీరలో వాళ్లకు ఏళ్ల తరబడి పదిలంగా దాచుకున్న జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి చీర భారతీయ మహిళలకే కాదు విదేశీ వనితల మనసులను సైతం గెలుచుకుంది. అలాంటి మన భారతీయ పట్టుచీరను కొనుకున్న ఓ విదేశీ మహిళ దాన్ని ఎలా ఉతకాలో తెలియక ఇబ్బందిపడుతున్నా..దయచేసి ఏదైన సలహా ఇవ్వరు అంటూ వీడియో రికార్డు చేసి మరి సోషల్ మీడియాలో షేర్ చేసింది.నెట్టింట పంచుకున్న వీడియోలో ఆ విదేశీ మహిళ భారతీయ మహిళలను ఉద్దేశించి ఒక అభ్యర్థన చేసింది. తన అందమైన పట్టు చీరను చూపిస్తూ..దాని లేబుల్పై డ్రైక్లీనింగ్ చేసి ఉతకాలని ఉంది. అయితే తాను ఉండే ఆస్ట్రేలియన్ బుష్లో డైక్లీనింగ్ సర్వీస్ సమీపంలో లేదని, అందువల్ల ఈ పట్టుచీరను ఎలా ఉతకాలో సలహా ఇవ్వరా ప్లీజ్ అని కోరింది. తాను ఆస్ట్రేలియాలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉంటానని, అందువల్ల ఇది పాడవ్వకుండా ఎలా ఉతకాలో చక్కటి చిట్కా గానీ సలహా గానీ చెప్పమని అభ్యర్థించిందామె. తాను భారత పర్యటనలో ఈ అందమైన చీర కొన్నానని చెప్పింది. ఈ సున్నితమైన పట్టు వస్త్రంపై ఉన్న క్లిష్టమైన ఎంబ్రాయిడరీ కారణంగా ఉతకడానికి భయపడుతున్నట్లు పేర్కొంది. ఉతకడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా..చీర మొత్తం పాడైపోతుంది, అందువల్ల ఎలా ఉతకాలో నేర్పించరు అంటూ తన వీడియోని ముగించింది. అంతేగాదు అందుకు సంబంధించిన చిట్కాలు, సలహాలు కామెంట్ బాక్స్లో పంచుకోమని, తాను వినడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అలాగే ఎల్లప్పుడూ తన అనుమానాలు, సందేహాలు నివృత్తి చేసే ఆన్లైన్ కమ్యూనిటీకి ధన్యావాదాలు కూడా చెప్పారామె. ఆమె అభ్యర్థనకు నెటిజన్లు స్పందించడమే కాదు పలు రకాల సలహాలు, సూచనలు అందించారు. చాలామంది మహిళలు కఠినమైన డిటర్జెంట్కి బదులుగా షాంపుతో ఉతికి నీడలో ఆరేసి భద్రపరచుకుంటే సరిపోతుందని సలహాలు ఇచ్చారు. అంతేగాదు బ్రష్ ఉపయోగించొద్దని, చేతులతోనే సున్నితంగా రుద్దమని కూడా సూచించారు. View this post on Instagram A post shared by Lea Murray (@lea_murray90) (చదవండి: శస్త్ర చికిత్స లేకుండా ఏఐ ఎండోమెట్రియోసిస్ను నిర్థారించగలదా? బ్రయాన్ జాన్సన్ గర్లఫ్రెండ్..)
‘అన్యురిజమ్’ అంటే..! బ్రెయిన్లో రావడానికి రీజన్..
దేహంలోని రక్తనాళాల్లో కొన్ని రక్తనాళాల పొరల నిడివి అంతటా ఒకే లాంటి మందం కలిగి ఉండకపోవచ్చు. ఆ రక్తనాళాల్లో కొన్ని కొన్నిచోట్ల బలహీనమైన చోట్లు / ప్రదేశాలు ఉండవచ్చు. మెదడులోనూ అల్లుకున్న రక్తనాళాల్లో బలహీనమైన చోట చిన్న బుడగలా ఉబ్బిపోయి... ఆ రక్తనాళపు పొర మరింత బలహీనపడ్డవేళ ఒక్కోసారి అది ఒక్కసారిగా చిట్లిపోతే మెదడులో రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. ఇలా మెదడులో రక్తనాళాల్లో ఎక్కడైనా బలహీనమైన ప్రాంతం ఉండి, అక్కడ రక్తం బుడగలా మారడాన్ని ‘సెరిబ్రల్ అన్యురిజమ్స్’ అంటారు. ఆ బలహీనమైన రక్తనాళ పొర అకస్మాత్తుగా చిట్లిపోవడం జరిగితే అది ఆ వ్యక్తికి అదిప్రాణాంతకంగా మారవచ్చు. ఇలా రక్తనాళాల్లో బలహీనమైన చోట ఉబ్బిపోయి... అది చిట్లిపొవడం ఎందుకు, అలా రక్తనాళపు పొరలు బలహీనపడి ‘అన్యురిజమ్’గా దారితీసే పరిస్థితులేమిటి లాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.దాదాపు 30 నుంచి 40 ఏళ్ల కిందట ‘అన్యురిజమ్స్’పై వైద్యవర్గాల్లో పెద్దగా అవగాహన లేకపోవడంతో పేషెంట్ ఆకస్మికంగా చనిపోతే అది ఎందువల్లనో తెలియని పరిస్థితే ఎక్కువగా ఉండేది. సుమారు 30 ఏళ్ల కిందట ప్రతి లక్షమందిలో 5 నుంచి 10 మంది అన్యురిజమ్స్తో చనిపోయినా... అప్పట్లో ఆ మరణాలకు కారణం పెద్దగా తెలిసేది కాదు. ఎందుకంటే కారణం తెలిసేలోపే పేషెంట్ మరణించే పరిస్థితులే ఎక్కువగా ఉండేవి. ఈ అన్యురిజమ్స్ గురించి ఇప్పుడు చాలా ఎక్కువగా అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో వాటి గురించి సమగ్రంగా తెలుసుకుందాం.మెదడులో వచ్చే అన్యూరిజమ్లు (సెరిబ్రల్ ఎన్యురిజమ్స్)మెదడు అన్యూరిజమ్ (సెరిబ్రల్ / ఇంట్రాక్రేనియల్ ఎన్యురిజమ్) అనేది మెదడులోని ఒక ధమని (ఆర్టరీ) గోడలోని లోపలి పొర బలహీనపడటం వల్ల ఆ రక్తనాళం ఒక చిన్న బుడగ (బ్లిస్టర్) లాగా ఉబ్బిపోవడం. ఈ ఉబ్బిన భాగం క్రమంగా చాలా పలుచగా మారి ఎలాంటి సూచనగానీ హెచ్చరికగానీ ఇవ్వకుండానే చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా అన్యూరిజమ్ చిట్లిపోయినప్పుడు మెదడు చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో రక్తస్రావం జరుగుతుంది. దీనిని సబ్ అరాక్నాయిడ్ హీమరేజ్ (ఎస్ఏహెచ్) అంటారు. ఇటువంటి రక్తస్రావాలలో సుమారు 90% అన్యూరిజమ్ చిట్లిపోవడం వల్లే సంభవిస్తాయి. ఇది పక్షవాతం (స్ట్రోక్), కోమా లేదా మరణానికి కూడా దారితీయవచ్చు.మెదడు అన్యూరిజమ్ ఏర్పడడానికి కారణాలు- అధిక రక్తపోటు (హైపర్టెన్షన్)- పొగతాగడం (సిగరెట్, బీడీ, చుట్ట తాగడం లాంటి అలవాట్లు)- పుట్టుకతో వచ్చే (జన్యుపరమైన) కారణాలతో.- రక్తనాళాలకు గాయం లేదా దెబ్బతగలడం- కొన్ని రకాల బ్లడ్ ఇన్ ఫెక్షన్ల కారణంగా వచ్చే పరిణామాలతో.అన్యూరిజమ్ ఎలా చిట్లుతుందంటే... - అన్యూరిజమ్ సంచిలో (స్యాక్) చిన్న రంధ్రం ఏర్పడినప్పుడు అది చిట్లినట్లుగా భావిస్తారు. - రంధ్రం చిన్నదైతే కొద్దిపాటి రక్తం మాత్రమే లీక్ అవుతుంది.- రంధ్రం పెద్దదైతే తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది.- చిట్లని అన్యూరిజమ్ (అన్ రప్చర్డ్ అన్యురిజమ్) అంటే ఇంతకుముందు ఎప్పుడూ రక్తం లీక్ కాని అన్యూరిజమ్.పగలని (అన్ రప్ఛర్డ్) అన్యూరిజమ్ లక్షణాలు- పక్షవాతం (స్ట్రోక్ ) – 37%- తలనొప్పి – 37%- ఫిట్స్ (మూర్ఛ) – 18%- చూపు సమస్యలు – 29%పగిలిన (రప్చర్డ్) అన్యూరిజమ్ లక్షణాలు- జీవితంలో ఎన్నడూ / ఎప్పుడూ అనుభవించని తీవ్రమైన తలనొప్పి- స్పృహ కోల్పోవడం- పక్షవాతం (స్ట్రోక్) - మాట్లాడలేకపోవడం, నోరు ఒకవైపు వంగిపోవడం - ఫిట్స్ (మూర్ఛ)చికిత్స విధానాలు...- ఔషధ చికిత్స (మెడికల్ / నాన్ సర్జికల్ థెరపీ) - శస్త్రచికిత్స (సర్జికల్ క్లిప్పింగ్) ∙ఎండోవాస్క్యులర్ చికిత్స (ఎండోవాస్క్యులార్ కాయిలింగ్)- అవసరమైతే స్టెంట్ లేదా బెలూన్ సహాయంతోమన దేశంలోని పరిస్థితి ఇది... ప్రతి ఏటా మన దేశంలో ప్రతి లక్షమందికి పది నుంచి పన్నెండు మందికి పైగా అన్యురిజమ్ బారిన పడుతున్నట్లు ఓ అంచనా. ఇటీవల వీరి సంఖ్య పెరిగినట్లుగా కూడా గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో దాదాపు 40 శాతం మంది మృతిచెందుతుంటారు. బతికి బయటపడ్డ వారిలోనూ దాదాపు మూడింట రెండు వంతుల మంది ఏదో ఒక రకమైన వైకల్యం లేదా అవయవలోపం కలుగుతుంది. అంటే వారు ఏదో ఒక రకమైన న్యూరలాజికల్ డెఫిసిట్తో బాధపడాల్సిన పరిస్థితి. మెదడులో రక్తస్రావమై... అది అవయవాలను నియంత్రించే సెంటర్లపై దుష్ప్రభావం చూపడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది.కొందరిలో జీవితకాలంలో బయటపడకపోవచ్చు...అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో మెదడులో రక్తనాళాలు కొంత బలహీనంగా ఉండవచ్చు. చాలా బలహీనంగా కూడా ఉండవచ్చు. అయినప్పటికీ అదృష్టవశాత్తు జీవితకాలంలో అవి చిట్లకపోవచ్చు. ఉదాహరణకు ఒక రక్తనాళంలో అంగుళంలో ఎనిమిదో వంతు ఉండే అన్యురిజమ్స్లో 50 శాతం నుంచి 80 శాతం ఎప్పటికీ చిట్లకపోవచ్చు. ఇక కొందరిలో ఈ రక్తనాళాల్లోని ఉబ్బు అంగుళం కంటే పెద్దగా కూడా ఉండవచ్చు. వీటినే ‘జెయింట్ అన్యురిజమ్స్’ అంటారు. ఇలాంటి జెయింట్ అన్యురిజమ్స్ అకస్మాత్తుగా చిట్లడానికి ఆస్కారం ఉంది. ఇవి చిట్లాక రోగికి అకస్మాత్తుగా పక్షవాతం రావచ్చు.నిర్ధారణ కోసం సెరిబ్రల్ ఏంజియోగ్రామ్...గుండెపోటు వచ్చిన వారిలో నిర్ధారణ కోసం చేసే యాంజియోగ్రామ్ పరీక్ష లాగే మెదడుకూ యాంజియోగ్రామ్ చేస్తారు. ఇందులో న్యూరోఇంటర్వెన్షనల్ సర్జన్ ఒక ట్యూబ్ ద్వారా మెదడు రక్తనాళాల వరకు చేరి... అక్కడ ఒకరకమైన రంగు పదార్థాన్ని (డై అని పిలిచే రంగుపదార్థం) మెదడులోని రక్తనాళాల్లోకి వదులుతారు. దాంతో ఆ రంగు పదార్థం రక్తనాళాల్లో చేరి ఉబ్బినట్లుగా ఉన్న ప్రాంతాలను (అన్యురిజమ్స్ను) స్పష్టంగా చూపుతుంది. ఇలాంటి చిత్రాలను చూపించే ప్రక్రియను ‘ఫ్లోరోస్కోప్’గా చెబుతారు. ఈ చిత్రాల సహాయంతో మెదడులోని ఏయే ప్రాంతాల్లో అన్యురిజమ్స్ ఉన్నాయి, వాటి పరిమాణం, ఆకృతి వంటి అనేక కీలకమైన అంశాలను తెలుసుకోగలుగుతారు. వాటి తీవ్రత ఆధారంగా అవసరమైన చికిత్సను డాక్టర్లు సూచిస్తారు.అన్యురిజమ్ మెదడులోనే వస్తాయా?అన్యురిజమ్స్ అంటే బలహీనమైన చోట్లలో రక్తనాళాలు ఉబ్బడం. అది దేహంలోని ఏ ప్రాంతలో ఉన్న రక్తనాళల్లోనైనా జరగవచ్చు. అయితే... దేహంలోని మిగతా ప్రాంతాల్లో అలా ఉబ్బు రావడం లేదా చిట్లడం వల్ల తక్షణ ప్రమాదంగానీ లేదాప్రాణాపాయంగానీ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ మెదడు విషయంలో అలా కాదు. మెదడులో రక్తస్రావం జరిగితే... శరీరంలోని అన్ని కీలకమైన అవయవాలనూ, అలాగే దేహ భాగాలను నియంత్రించే నాడులు అక్కడే ఉంటాయి కాబట్టి అవి దెబ్బతినిప్రాణాపాయం కలిగే అవకాశాలెక్కువ. అందుకే మెదడులో సంభవించే అన్యురిజమ్ను తేలికగా తీసుకోకూడదు. ఇలా మెదడులో వచ్చే అన్యురిజమ్స్ను ‘సెరిబ్రల్ అన్యురిజమ్స్’గా చెబుతారు. మిగతా చోట్ల వచ్చే వాటిని దేహంలోని ఆ ప్రదేశం పేరుతో చెబుతారు. ఉదాహరణకు ఛాతీ ప్రాంతంలో వస్తే వాటిని థొరాసిక్ అన్యురిజమ్స్ అని పేర్కొంటారు.1. మందులతో చేసే చికిత్స (మెడికల్ థెరపీ) ఈ చికిత్స సాధారణంగా చిట్లిపోని (అన్ రప్చర్డ్) అన్యూరిజమ్లకు మాత్రమే ఉపయోగిస్తారు. చికిత్స తర్వాత ప్రధానంగా...- పొగతాగే అలవాటు పూర్తిగా మానేయడం- రక్తపోటును నియంత్రణలో ఉంచడం- వైద్యుడు సూచించిన ఆహార నియమాలు పాటించడం- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంఈ చర్యలే అన్యూరిజమ్ ఏర్పడటం, పెరగడం లేదా చిట్లుపోవడం వంటి ముప్పులను తప్పించడానికి దోహదపడేవిగా నిరూపితమయ్యాయి.అలాగే, అన్యూరిజమ్ పరిమాణం లేదా పెరుగుదలను గమనించేందుకు డాక్టర్లు అవసరాన్ని ఎమ్మారై, సీటీ స్కాన్ లేదా సంప్రదాయ యాంజియోగ్రఫీ వంటి పరీక్షలను క్రమం తప్పకుండా చేయాలని సూచించవచ్చు.2. శస్త్రచికిత్స (సర్జికల్ క్లిప్పింగ్)ఈ విధానంలో క్రేనియోటమీ అనే శస్త్రచికిత్స ద్వారా పుర్రెలో చిన్న రంధ్రం చేసి మెదడును, అలాగే ప్రభావితమైన రక్తనాళాల వరకు చేరుకుంటారు. అన్యూరిజమ్ను గుర్తించిన తర్వాత, చుట్టూ ఉన్న మెదడు కణజాలం నుంచి దాన్ని (అన్యురజమ్ను) జాగ్రత్తగా వేరుచేస్తారు.తర్వాత టైటానియంతో తయారు చేసిన చిన్న మెటల్ క్లిప్ను అన్యూరిజమ్ వచ్చిన ప్రాంతంలో (దీన్ని సాధారణంగా నెక్ అని వ్యవహరిస్తారు) వద్ద అమర్చుతారు. దీంతో అన్యూరిజమ్లోకి రక్త ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది. దాంతో మెదడులో సాధారణ రక్తప్రసరణ తిరిగి కొనసాగుతుంది.3. ఎండోవాస్క్యులర్ కాయిలింగ్ఈ విధానంలో కాలులోని ఫెమొరల్ ఆర్టరీ ద్వారా ఒక క్యాథెటర్ను ప్రవేశపెట్టి, దాని ద్వారా చిన్న మైక్రోక్యాథెటర్ను అన్యూరిజమ్ వరకు తీసుకెళ్తారు. ఆ తర్వాత అన్యూరిజమ్ లోపల ప్రత్యేకమైన మెటల్ కాయిల్స్ వేస్తారు. దీంతో అన్యూరిజమ్లో రక్తప్రవాహం ఆగి అది మూసుకుపోతుంది.ఈ చికిత్సలో తల / పుర్రె (స్కల్)ను తెరవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల శస్త్రచికిత్స చాలా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది.మత్తుమందు (అనస్థీషియా) అవసరం కూడా తక్కువే. చాలా వేగంగా కోలుకుంటారు.4. స్టెంట్ లేదా బెలూన్ సహాయంతో కాయిలింగ్కొన్ని సంక్లిష్టమైన అన్యూరిజమ్లలో... మరీ ముఖ్యంగా వెడ్ నెక్డ్ అన్యురిజమ్ అనే అన్యురిజమ్స్లో లేదా పెద్ద లేదా అతి పెద్ద (లార్జ్ అండ్ జెయింట్ అన్యురిజమ్) వంటి సందర్భాల్లో స్టెంట్ లేదా బెలూన్ సహాయంతో కాయిలింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కాయిల్స్ ప్రధాన రక్తనాళంలోకి జారిపోకుండా నివారించవచ్చు. లేదంటే పక్షవాతం (స్ట్రోక్) వచ్చే ప్రమాదం ఉంటుంది.బెలూన్–అసిస్టెడ్ కాయిలింగ్లో, కాయిల్స్ వేస్తున్న సమయంలో అన్యూరిజమ్ నెక్ ప్రాంతంలో బెలూన్ ను తాత్కాలికంగా ఉబ్బించి ఉంచుతారు.5. ఫ్లో డైవర్షన్ అన్యూరిజమ్ చికిత్స కోసం సుమారు ఏడు సంవత్సరాల క్రితం ఫ్లో డైవర్టర్ (ఎఫ్డీ) స్టెంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ట్యూబ్ ఆకారంలో ఉండే ప్రత్యేక స్టెంట్లు. ఇవి రక్తప్రవాహాన్ని అన్యూరిజమ్ వైపు వెళ్లకుండా మళ్లిస్తాయి. దీంతో అన్యూరిజమ్ స్యాక్లోకి వెళ్లే రక్తప్రవాహం క్రమంగా తగ్గిపోతుంది. ఫలితంగా అన్యూరిజమ్ నెమ్మదిగా పూర్తిగా మూసుకుపోయి, కాలక్రమేణా సహజంగా నయమవుతుంది.చికిత్సలో ఎదురయ్యే సవాళ్లుచిట్లిన లేదా చిట్లని... ఇలా రెండు రకాల మెదడు అన్యూరిజమ్ల చికిత్సలు ఇటు పేషెంట్కూ, అటు డాక్టర్లకూ ఓ పెద్ద సవాలుగా మారడం చాలా సాధారణం.గుండెపోటు లాగే అన్యురిజమ్ కూడా... అన్యురిజమ్స్తో వచ్చే పరిణామాలను మనం గుండెజబ్బు అనంతర పరిణామాలతో పోల్చవచ్చు. అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చినట్టుగానే అన్యురిజమ్స్ కూడా అంతే అకస్మాత్తుగా రావచ్చు. గుండెపోటు విషయంలో గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని పూడిక చేరినందువల్ల అడ్డంకులు ఏర్పడి గుండెపోటు వస్తే... అన్యురిజమ్స్ విషయంలో మాత్రం మెదడుకు చేరవేసే రక్తనాళాలు చిట్లడం వల్ల ఈ సమస్య వస్తుంది. గుండెపోటుకు పొగాకు వాడకం, కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బుల చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) రిస్క్ ఫ్యాక్టర్లు అయినట్లుగానే... దీనికీ పొగాకు, ఫ్యామిలీ హిస్టరీలే పెద్ద రిస్క్ ఫ్యాకర్లు.మరికొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు కూడా... శరీర నిర్మాణానికి దోహదపడే కొన్నిప్రోటీన్లకు సంబంధించిన జబ్బులు (ఉదాహరణకు ఎహ్లర్స్–డాన్లోస్ సిండ్రోమ్, మార్ఫన్స్ సిండ్రోమ్), కండరాల జబ్బు అయిన ఫైబ్రోమస్క్యులార్ డిస్ప్లేసియా, దీర్ఘకాలికంగా ఉండే రక్తపోటు, కుటుంబ సభ్యుల్లో చాలా దగ్గరి వారికి అన్యురిజమ్స్ ఉండటం, కోకెయిన్ వంటి మాదకద్రవ్యాలు తీసుకునే దురలవాటు, మూత్రపిండాల్లో నీటితిత్తుల ఉండే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉండటం... అన్యురిజమ్కు రిస్క్ఫ్యాక్టర్లు.గ్లాస్గో కోమా స్కేల్పై తీవ్రత కొలతతో గ్రేడింగ్... అన్యురిజమ్స్ కారణంగా కానీ లేదా ఇతరత్రాగానీ... ఒక వ్యక్తి కోమాలోకి వెళ్లినప్పుడు దాని తీవ్రతను కొలిచేందుకు ఉపయోగపడే స్కేల్ను గ్లాస్గో కోమా స్కేల్గా అంటారు. ఇందులో ఒక్కోరకమైన స్పందనకు ఒక్కో స్కోర్ ఇస్తారు. ఉదాహరణకు పేషెంట్ కంటి కదలికలకూ, డాక్టర్ మాటలకు పేషెంట్ స్పందించే తీరుకూ, ఇలా... ఒక్కోదానికి కొంత స్కోర్ ఉంటుంది. ఇందులో డాక్టర్ ఇచ్చిన ఏ ఆదేశానికీ పేషెంట్ నుంచి స్పందన లేకపోతే కనిష్టంగా స్కోర్ మూడుగా నమోదవుతుంది. అదే ఆదేశాలకు పేషెంట్ స్పందిస్తున్న కొద్దీ గ్లాస్గో కోమా స్కేల్పై స్కోర్ పెరుగుతుంది. అంటే మూడు స్కోర్ ఉంటే అది పేషెంట్ నుంచి ఏ స్పందనా లేని పరిస్థితి. అంటే అది పూర్తిస్థాయి కోమా అని అర్థం. అదే స్కోర్ పెరుగుతూ... అన్ని ఆదేశాలకూ స్పందిస్తే అది నార్మల్గా 15 ఉంటుంది. ఈ స్కోర్ను బట్టి అన్యురిజమ్స్ కారణంగా సబర్కనాయిడ్ హామరేజ్ జరిగినప్పుడు పేషెంట్లో దాని తీవ్రతను గ్రేడింగ్ చేస్తారు. (వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్స్ ఆమోదించిన గ్రేడింగ్ ప్రక్రియ ఇది).హేమరేజ్ జరిగిన కేసుల్లో పేషెంట్ తాలూకు గ్లాస్గో కోమా స్కేల్పై కొలతల గ్రేడ్... - స్కోరు 15 ఉంటే రోగి కోలుకోవడానికి పూర్తిగా అవకాశాలుంటాయి.- స్కోరు 3 ఉంటే రోగి కోలుకోడానికి అవకాశాలు ఉండవు.- స్కోరు 8 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే రోగి కోలుకోవడానికి మంచి అవకాశాలుంటాయి.- స్కోరు 3 – 5 ఉంటే అది ప్రమాదకరమైన స్థితి.చివరగా... ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో కాస్త ఎక్కువగా కనిపించే ఈ కేసులు ఇటీవల మన దేశంలోనూ ఎక్కువగా వస్తున్నాయి. అప్పట్లో మన దగ్గర వ్యాధి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు అంతగా అందుబాటులో లేవు. కానీ ఇప్పుడా పరీక్షలు, వాటితో పాటు సరికొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి రావడంతో మన దగ్గర కూడా ఆ పేషెంట్ల వివరాలు తెలియడంతో పాటు చాలామందిని రక్షించడమూ ఇప్పుడు సాధ్యమవుతోంది.- డా. కిశోర్ కుమార్, సీనియర్ న్యూరో సర్జన్- నిర్వహణ: యాసీన్
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఉపాధి!
మన దేశంలో గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి, పోషకాహార భద్రతను పటిష్టం చేయడానికి పెరటి కోళ్ళ పెంపకం ఒక శక్తివంతమైన సాధనంగా అవతరించిందని భువనేశ్వర్లోని కేంద్రీయ మహిళా వ్యవసాయ సంస్థ (ఐసిఎఆర్–సిఐడబ్ల్యూఏ) శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్ కుమార్ పాండా తన పరిశోధనా పత్రంలో వెల్లడించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధిని, మహిళా సాధికారతను అందించే ఈ రంగంపై డా. అరుణ్ కుమార్ పాండా ఏమంటున్నారంటే..అంతరం... దేశ జనాభాలో దాదాపు 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. అయితే, వాణిజ్యపరమైన కోళ్ళ పరిశ్రమల లాభాలు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడిమాంసంలో 75–80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే.. గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది. 2019 పశుగణన ప్రకారం.. దేశంలో పెరటి కోళ్ళ సంఖ్య 31.37 కోట్లకు చేరింది. మొత్తం గుడ్ల ఉత్పత్తిలో పెరటి గుడ్ల వాటా 21 శాతం ఉంటుంది.మహిళా సాధికారత... సాధారణంగా గ్రామాల్లో పెరటి కోళ్ళ నిర్వహణ, వాటికి మేత వేయటం, గుడ్ల అమ్మకం వంటి పనులన్నీ మహిళలే చూసుకుంటారు. దీనివల్ల వచ్చే అదనపు ఆదాయం వల్ల వారి కుటుంబ నిర్ణయాధికారం పెరిగి, సామాజిక హోదా మెరుగుపడుతుంది. ఇది స్త్రీ పురుష సమానత్వానికి దారితీస్తుంది.లాభసాటి కావాలంటే..? పెరటి కోళ్ళ పెంపకంలో తక్కువ ఉత్పాదకత, కొక్కెర వ్యాధి వంటి ప్రాణాంతక వ్యాధులు, సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడం ప్రధాన సమస్యలు. వీటిని అధిగమించడానికి గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలు రకం కోడి పిల్లలను ప్రభుత్వాలు పంపిణీ చేయాలి. స్థానికంగా లభించే మేతను వాడుకోవటం, మహిళలకు వ్యాక్సినేష¯Œ పై శిక్షణ ఇవ్వటం, మహిళా సహకార సంఘాల ద్వారా గ్రామీణ మార్కెట్లను ఏర్పాటు చేయటం వంటి చర్యలు చేపడితేనే కుటుంబ స్థాయిలో పెరటి కోళ్ళ పెంపకం మరింత లాభసాటిగా మారుతుంది. గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, శ్రీనిధి వంటి మేలైన పెరటి కోడి పిల్లల కోసం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ ‘డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్’ను సంప్రదించవచ్చు. హెల్ప్ లైన్: 040–24015651.కోడిగుడ్డులో 44 పోషకాలుగ్రామీణప్రాంతాల్లో ఐదు సంవత్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే. సంప్రదాయ భారతీయ ఆహారంలోప్రోటీన్ల లోపం ఉంటుంది. మానవ శరీరానికి అవసరమైన 45 రకాల పోషకాల్లో 44 పోషకాలు కోడిగుడ్డులో లభిస్తాయి. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైనప్రోటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతంప్రోటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.- ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
అనుగ్రహం అవసరం!
సురాసురులు కలిసి కష్టించి, ఎన్నెన్నో మహత్తరమైన అవరోధాలనూ, విఘ్నాలనూ అధిగమించి, ఎట్టకేలకు అమృతం సాధించారు. ధన్వంతరి అందించిన అమృత కలశాన్ని తటాలున అందుకొని, అసురులు అన్యాయంగా స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికప్పుడు శ్రీహరి మోహినీ అవతారాన్ని ఎత్తి, వాళ్ళను కామ మోహితులను చేశాడు. ఆ మోహంతో వాళ్ళు అందరికీ అమృతం పంచే బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆమె దాన్ని ఎలా పంచినా, తాము అడ్డుపడమని ఒప్పందం చేసుకొన్నారు.మోహిని అమృతాన్ని మొదట దేవతల పంక్తికి పంచటం పూర్తయేసరికి, పాత్ర ఖాళీ అయిపోయింది. ఆమె అంతర్ధానమై పోయింది. రాక్షసులకు ఏమీ మిగలలేదు. రాహువు అనే రాక్షసుడు మాత్రం, మారువేషంలో దేవతల పంక్తిలో చేరి, అమృతం పుచ్చుకొన్నాడు. సూర్యచంద్రులు ఇది గమనించి చెప్పగానే, సుదర్శన చక్రం రివ్వున వచ్చి, పుచ్చుకొన్న అమృతం నాలుక దాటకుండానే, రాహువు తలను నరికి వేసింది. అమృత ప్రభావం వల్ల అతడి తల సజీవంగా మిగిలిపోయింది. అమృత స్పర్శ లేని మొండెం పతనమై నశించింది. (అప్పటి నుంచి ‘రాహువు తల’ అనేది ప్రత్యేకంగా లేదు. రాహువు అంటేనే రాహువు తల. కాబట్టి ‘రాహు మస్తకం’ అని చెప్పనక్కర్లేదు. చెప్తే అది, ‘సీతా ఫలం పండు’, ‘పేపరు కాగితం’ అన్నట్టు పునరుక్తి అవుతుంది!)దేవాసురులు ఒకే పరిస్థితులలో, ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో, ఒకే సాధన సామగ్రితో, ఒకే విధమైన శ్రమను, ఒకే సంకల్పంతో చేశారు. కానీ వాళ్ళకు లభించిన ఫలంలో మాత్రం తేడాలు వచ్చాయి. ఏవం సురాసుర గణాః సమ దేశ, కాల,/ హేతు–అర్థ, కర్మ, మతయః–అపి, ఫలే వికల్పాః. ఎలాంటి తేడాలు? తత్ర అమృతం సురగణాః ఫలం–అంజనా–ఆపుః, నదైత్యాః – అక్కడ సురగణాలు అమృతం అనే ఫలాన్ని సులభంగా పొందారు, దైత్యులు పొందలేదు. కారణమేమిటి? పాద పంకజ రజ–ఆశ్రయాత్– శ్రీహరి పదకమలాల ధూళిని (దేవతలు) ఆశ్ర యించి, సేవించటం వల్ల. హరి విముఖులు కనక అసురుల శ్రమ నిష్ఫలమైంది. శ్రమకు దైవానుగ్రహం తోడయి తేనే ఫల ప్రాప్తి ఉంటుంది, అంటుంది భాగవతం.– ఎం.మారుతి శాస్త్రి
అంతర్జాతీయం
హర్ముజ్లో మళ్లీ అమెరికా బ్లాకేడ్.. ఇరాన్ సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో యుద్ధ మంటలు మరోసారి ఎగిసిపడే పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా నాలుగో రోజూ అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. మధ్యవర్తుల ప్రయత్నాలతో ఉద్రిక్తతలు తగ్గి.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని అంతా భావించిన వేళ.. పరిణామాలు మళ్లీ మారిపోయాయి. పరస్పర ఆరోపణలు, కవ్వింపు చర్యలతో శాంతి ఒప్పందం ప్రశ్నార్థకంగా మారింది. హర్ముజ్ జలసంధిపై అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం ఒప్పందాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఇరాన్ ఆరోపించింది. దీంతో ఆ అవగాహన ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ సంచలన ప్రకటన చేసింది.గత నెలలో స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) ప్రకారం.. ఘర్షణలను నిలిపివేసి, రెండు నెలల కాలపరిమితిలో శాంతి ఒప్పందం దిశగా ముందుకు సాగాల్సి ఉంది. ఇందులో కీలకమైన అణు అంశంపై ఒప్పందం కూడా భాగంగా ఉంది. అయితే అమెరికా పదేపదే ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా మళ్లీ నౌకాదళ దిగ్బంధాన్ని అమలు చేయడం.. ఈ ఒప్పందాన్ని పూర్తిగా దెబ్బతీసిందని టెహ్రాన్ మండిపడుతోంది.హర్ముజ్పై మళ్లీ ఆధిపత్య పోరుప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మరోసారి ఘర్షణ కేంద్రంగా మారింది. ఇరాన్కు చెందిన నౌకలు ఈ మార్గంలో ప్రయాణించే విషయంలో అమెరికా ఆంక్షలు విధించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ మరోసారి దాడులకు దిగిందని సమాచారం. మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలపై కూడా ఇరాన్ ప్రతీకార చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురు, సహజ వాయువులో భారీ వాటా హర్ముజ్ మార్గం గుండా సాగుతుంది. అందుకే ఈ ప్రాంతంలో ఏర్పడే ఏ సంక్షోభమైనా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది."హర్ముజ్పై పూర్తి ఆధిపత్యం మాదే"ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధ పరిస్థితుల్లో హర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. "ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా హర్ముజ్పై మా సార్వభౌమ హక్కును కాపాడుకుంటాం" అని ఆయన పేర్కొన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. సాధారణ పరిస్థితుల్లో హర్ముజ్ జలసంధి నిర్వహణలో ఇరాన్తో పాటు ఒమన్కూ పాత్ర ఉంటుంది. అయితే జాతీయ భద్రత దృష్ట్యా ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో మొత్తం మార్గంపై నియంత్రణ అవసరమని ఇరాన్ వాదిస్తోంది.చర్చలకు నో చెప్పిన ఇరాన్అమెరికాతో మళ్లీ చర్చలు జరిపే ఉద్దేశం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తమపై ఒత్తిడి పెంచే చర్యలను కొనసాగిస్తే.. తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ప్రతీకార దాడులు కొనసాగుతుండగా.. తాజాగా ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్ ప్రకటన చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.హర్ముజ్పై బ్లాకేడ్.. మళ్లీహర్ముజ్ జలసంధి పరిణామాల్లో అమెరికా బ్లాకేడ్ కీలక అంశంగా మారింది. ఇరాన్పై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా అమెరికా తొలిసారి ఏప్రిల్ 13న ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లే, అక్కడి నుంచి బయటకు వచ్చే నౌకలపై నౌకాదళ దిగ్బంధాన్ని ప్రారంభించింది. ఈ చర్యతో గల్ఫ్ ప్రాంతంలో నౌకాయాన ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి అవగాహన (MoU) కుదిరిన తర్వాత పరిస్థితులు కొంత చల్లబడ్డాయి. ఆ ఒప్పందంలో భాగంగా అమెరికా జూన్ 18న బ్లాకేడ్ను ఎత్తివేసింది. కాల్పుల విరమణ కొనసాగుతుందని, తదుపరి చర్చలకు మార్గం సుగమం అవుతుందని భావించారు. కానీ తాజాగా మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అమెరికా జూలై 14 నుంచి ఇరాన్ నౌకాశ్రయాలపై నౌకాదళ దిగ్బంధాన్ని పునరుద్ధరించింది. ఇరాన్ మాత్రం ఈ చర్యను ఒప్పంద ఉల్లంఘనగా అభివర్ణిస్తూ.. శాంతి ఒప్పందాన్ని అమెరికానే నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తోంది.ప్రపంచానికి కొత్త ఆందోళనహర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే.. దాని ప్రభావం అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణకే పరిమితం కాకపోవచ్చు. ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన ఈ జలసంధిలో రవాణాకు ఆటంకాలు ఏర్పడితే.. అంతర్జాతీయ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడిచమురు, సహజ వాయువులో భారీ వాటా హర్ముజ్ మార్గం గుండా సాగుతుంది. ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా సరఫరా వ్యవస్థ దెబ్బతిని.. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరల నుంచి.. రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరల వరకు కనిపించే అవకాశం ఉంటుంది.ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ.. హర్ముజ్లో సంక్షోభం మరింత ముదిరితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి. అందుకే హర్ముజ్ జలసంధిపై అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం రెండు దేశాల సమస్యగా కాకుండా.. ప్రపంచ ఇంధన భద్రతకు, అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి కొత్త సవాలుగా మారాయి.
మాస్కోతో దోస్తీ.. భారత్పైనా ట్రంప్ గురి!
రష్యా నుంచి ముడిచమురు దిగుమతుల విషయంలో భారత్కు అమెరికా మరోసారి గట్టి హెచ్చరికలు పంపుతోంది. ఇప్పటివరకు కొన్ని వెసులుబాట్లతో కొనసాగిన పరిస్థితులకు తెరదించేలా.. రష్యా ఇంధన రంగంతో వ్యాపారాలు కొనసాగించే దేశాలపై భారీ సుంకాలు విధించే ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే మిత్రదేశం భారత్కు షాక్ ఇస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానికి పూర్తి మద్దతు తెలిపినట్లు వైట్హౌస్ వెల్లడించింది.రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే ఓ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించినట్లు వైట్హౌస్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ అధికారికంగా ధృవీకరించింది. ‘సాంక్షనింగ్ రష్యా యాక్ట్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే.. రష్యా ఇంధన రంగంతో సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా అధ్యక్షుడికి భారీ సుంకాలు విధించే అధికారం లభిస్తుంది. ఈ బిల్లులో భాగంగా దిగుమతులపై గరిష్ఠంగా 500 శాతం వరకు టారిఫ్లు విధించే అవకాశం ఉంది. అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు.టార్గెట్లో భారత్, చైనాఈ బిల్లును ముందుకు తీసుకెళ్లిన రిపబ్లికన్ నేత లిండ్సే గ్రాహమ్ గతంలోనే భారత్, చైనాలను ప్రధానంగా ప్రస్తావించారు. రష్యా చమురు, గ్యాస్ ఆదాయాలకు ఈ రెండు దేశాలే కీలక ఆధారాలని ఆయన వాదించారు. భారత్, చైనా కలిసి రష్యా ఇంధన ఎగుమతుల్లో భారీ వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంటూ.. ఈ డిమాండ్ను తగ్గించడం ద్వారా మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుకు బలమైన మద్దతుదారుగా ఉన్న గ్రాహమ్.. ఇటీవల ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన అనంతరం ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత కూడా ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని పలువురు సెనేటర్లు భావిస్తున్నారు.భారత్కు ఎందుకు ఆందోళన?ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకు లభిస్తున్న ముడిచమురు భారత్కు కీలకంగా మారింది. దేశ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకునే రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నామని భారత్ స్పష్టం చేస్తోంది. అయితే అమెరికా కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తే.. భారత్ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫార్మా, టెక్స్టైల్స్, ఐటీ సేవలు రంగాలు ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముందని అంచనా. 500 శాతం టారిఫ్లు అమలైతే భారత ఆర్థిక వృద్ధి దాదాపు 0.5 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.ఒకవైపు ముప్పు.. మరోవైపు వాణిజ్య అవకాశంరష్యా చమురు విషయంలో అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలోనే.. భారత్ మరో కీలక వాణిజ్య ఒప్పందంతో ముందుకు వెళ్తోంది. భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (CETA) జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. దీనితో భారత ఎగుమతిదారులకు బ్రిటన్ మార్కెట్లో మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. అంటే ఒకవైపు రష్యా చమురు విషయంలో అమెరికా ఒత్తిడి.. మరోవైపు కొత్త వాణిజ్య భాగస్వామ్యాలతో అవకాశాలు.. ప్రస్తుతం భారత్ దౌత్య, ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది.చమురు కోసం స్నేహమా? ఆర్థిక భద్రతా?భారత్ మాత్రం తన వైఖరిలో మార్పు లేదని మొదటి నుంచి చెబుతోంది. ఇంధన దిగుమతులు దేశ ఆర్థిక అవసరాల ఆధారంగా జరుగుతున్నాయని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని వివరిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు సెనేటర్లు రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఇది అవసరమని చెబుతుండగా.. మరికొందరు భారత్, చైనా వంటి దేశాలపై భారీ సుంకాలు విధించడం ప్రపంచ వాణిజ్యానికి నష్టం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.ఇక ముందు ఏం జరుగుతుంది?ట్రంప్ మద్దతుతో ఈ బిల్లుకు మరింత ఊపు వచ్చినప్పటికీ.. ఇది చట్టంగా మారాలంటే కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే.. రష్యాతో భారత్ ఇంధన సంబంధాలు మాత్రమే కాదు.. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. రష్యా చమురు కొనుగోళ్లు.. ఇప్పుడు భారత్కు ఆర్థిక లాభమా? లేక అమెరికా టారిఫ్ల రూపంలో కొత్త సవాలా? అన్నది అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక చర్చగా మారింది.
ఐఎస్ఎస్కు భారతీయ సంతతి వ్యోమగామి.. ఎవరీ అనిల్ మీనన్?
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ సోయుజ్ఎంఎస్–29 అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు పయనమయ్యారు. అనిల్, రష్యా వ్యోమగాములు ప్యోత్స్ డుబ్రోవ్, అన్నా కికినాలతో రాస్కాస్మోస్ అంతరిక్ష నౌక కజఖ్స్తాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి మంగళవారం రాత్రి 8.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. సోయుజ్ఎంఎస్–29 అర్ధరాత్రి 11.56 గంటలకు ఐఎస్ఎస్తో అనుసంధానమవుతుంది. అనిల్ మీనన్కు ఇది మొట్టమొదటి అంతరిక్ష యాత్రకాగా, రష్యా వ్యోమగాములకిది రెండో పర్యటన అని నాసా తెలిపింది. వీరికి బైకనూర్లో అనిల్ భార్య అన్నా విల్హెల్మ్ ఇతర కుటుంబసభ్యులు, నాసా ఉన్నతాధికారి జేర్డ్ ఇసాక్మన్ వీడ్కోలు పలికారు.మీనన్, డుబ్రోవ్, కికినాలు 8 నెలలపాటు ఐఎస్ఎస్లో గడిపి వస్తారు. ఈ సమయంలో మీనన్ అంతరిక్ష అన్వేషణ, మానవ జీవితానికి ప్రయోజనం చేకూర్చే అంశాలపై శాస్త్రీయ పరిశోధనలు జరుపుతారని నాసా తెలిపింది.ఎవరీ అనిల్ మీనన్?కేరళలోని పాలక్కడ్కు చెందిన శంకరన్ మీనన్ అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన లిసా సామోయిలింకోను ఆయన వివాహం చేసుకున్నారు. వీరిద్దరి సంతానమైన అనిల్ మిన్నియాపోలిస్లో జన్మించాడు. అనిల్ మీనన్.. న్యూరోబయాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, వైద్య రంగాలలో డిగ్రీలు పూర్తి చేశారు. ఆయన హెల్త్కేర్, అంతరిక్ష పరిశోధన రంగాలను అనుసంధానిస్తూ తన కెరీర్ను అద్భుతంగా మలచుకున్నాడు. అనిల్ మీనన్ ప్రస్తుతం యూఎస్ స్పేస్ ఫోర్స్లో ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజీషియన్, కల్నల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అంతకుముందు యూఎస్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు. ఆ సమయంలో అఫ్గనిస్తాన్లో అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్లో ఫ్రంట్లైన్ సేవలందించారు. సరిహద్దుల్లోనే కాకుండా ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహకుల ప్రాణాలు కాపాడేందుకు 'హిమాలయన్ రెస్క్యూ అసోసియేషన్' తరపున కూడా అనిల్ పనిచేశారు. అదేవిధంగా రోటరీ అంబాసిడరియల్ స్కాలర్గా ఆయన భారత్లో ఏడాది పాటు గడిపారు.నాసా టూ స్పేస్ఎక్స్అనిల్ అంతరిక్ష ప్రయాణం 2014లో నాసాతో ప్రారంభమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో ఉండే వ్యోమగాముల ఆరోగ్య బాగోగులు చూసుకునే 'ఫ్లైట్ సర్జన్'గా నాసాలో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 2018లో ఎలోన్ మాస్క్కు చెందిన అంతరిక్ష సంస్థ 'స్పేస్ఎక్స్' (SpaceX) లో అనిల్ చేరారు. చంద్రుడు, అంగారకుడి పైకి ప్రయోగించబోయే 'స్టార్షిప్' అభివృద్ధిలో అనిల్ మీనన్ కీలకంగా వ్యవహరించారు. అయితే డిసెంబర్ 2021లో నాసా అనిల్ను అధికారికంగా వ్యోమగామిగా ఎంపిక చేసింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు శిక్షణ పొందాడు. కాగా ఆయన భార్య అన్నా విల్హెల్మ్ కూడా ఒక వ్యోమగామి కావడం గమనార్హం. 2024లో స్పేస్ఎక్స్ నిర్వహించిన ఒక ప్రైవేట్ స్పేస్ఫ్లైట్ ద్వారా ఆమె దాదాపు ఐదు రోజుల పాటు అంతరిక్షంలోకి ప్రయాణించారు.
ఇరాన్పై మళ్లీ విరుచుకుపడ్డ అమెరికా
దుబాయ్: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య భీకర స్థాయిలో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని పునరుద్ధరిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికా సైన్యం ఇరాన్పై మళ్లీ దాడులు ప్రారంభించింది. మంగళవారం తెల్లవారుజామున పలుచోట్ల క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. రేవు నగరం బందర్ అబ్బాస్ సమీపంలో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. బుషెహర్లోనూ 4 ప్రాంతాల్లో క్షిపణి దాడులు జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇరాన్ వెంటనే ప్రతీకార దాడులకు పాల్పడింది. గల్ఫ్లో అమెరికా మిత్రదేశాలపై విరుచుకుపడింది. అమెరికా–ఇరాన్ ఘర్షణకు సాధ్యమైనంత త్వరగా దౌత్యపరమైన పరిష్కారం లభించకపోతే ఇది పూర్తిస్థాయి యుద్ధంగా తీవ్రరూపం దాల్చవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మధ్యంతర ఒప్పందం ప్రకారం జలమార్గాన్ని తిరిగి తెరవాల్సి ఉండగా, చమురు నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. హార్మూజ్ను బలవంతంగా తిరిగి తెరుస్తామని అమెరికా హెచ్చరించింది. అయితే, దీనికి భారీ నౌకాదళం లేదా అమెరికన్ భూతల దళాలు అవసరమని నిపుణులు అంటున్నారు. ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బకొట్టడమే లక్ష్యం! ఇరాన్లోని తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ స్థావరాలు, సముద్ర సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని పలు ప్రాంతాలపై దాడి చేసినట్లు అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దాడులు జరిగినట్లు ఇరాన్ సైతం అంగీకరించింది. కానీ, ప్రాణనష్టం, ఆస్తినష్టంపై ఎలాంటి సమాచారం అందించలేదు. ఈ దాడులు ఇరాన్ సైన్యానికి భారీ నష్టాన్ని కలిగిస్తూనే ఉంటాయని, హార్మూజ్లో అమాయక పౌరులు, వాణిజ్య నౌకలపై గురిపెట్టేందుకు వీల్లేకుండా ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టంచేసింది. అమెరికా తాజా దాడుల పట్ల ఇరాన్ తీవ్రంగా స్పందించింది.బహ్రెయిన్, జోర్డాన్లో వైమానిక దాడులకు పాల్పడింది. బహ్రెయిన్లో మంగళవారం తెల్లవారుజామున మూడుసార్లు క్షిపణి హెచ్చరిక సైరన్లను మోగించారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకున్నట్లు జోర్డాన్ సైన్యం, కువైట్ ప్రకటించాయి. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గగనతలంలో, ఒమన్ గల్ఫ్ మీదుగా కార్యకలాపాలు నిర్వహించవద్దని తమ విమానయాన సంస్థలను యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ హెచ్చరించింది. క్షిపణులు, డ్రోన్ల దాడులు, యుద్ధ విమానాలు, వైమానిక రక్షణ వ్యవస్థల వినియోగం వంటి అంశాలు పౌర విమానయానానికి తీవ్ర ముప్పును కలిగించే అవకాశం ఉందని స్పష్టంచేసింది.టోల్ వసూలుపై వెనక్కి తగ్గిన ట్రంప్ హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే సరుకు రవాణా నౌకలపై 20 శాతం టోల్ఫీజు వసూలుచేస్తానన్న ట్రంప్ వెనక్కి తగ్గారు. ‘‘రాజులు, అమీర్లతో మాట్లాడా. టోల్ఫీజుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూస్తామన్నారు. అమెరికాలో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. గల్ఫ్ దేశాలతో కుదుర్చుకోబోయే వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడుల రూపంలో అమెరికా ఆదాయాన్ని సాధించబోతోంది’’ అని ట్రంప్ అన్నారు. ట్యాంకర్లపై ఇరాన్ దాడి ఒక భారతీయుడి మృతి.. మరో 10 మందికి గాయాలు న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధిపై పట్టుకోసం ఇరాన్ సైన్యం విదేశీ చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంటోంది. మంగళవారం జలసంధి గుండా ప్రయాణిస్తున్న రెండు ట్యాంకర్లపై దాడులు చేయడంతో ఒక భారతీయుడు మరణించాడు. 10 మంది భారతీయులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా మారింది. హార్మూజ్లో ఎం.టి.అల్ బహియా, ఎం.టి.మొంబాసా అనే రెండు వాణిజ్య చమురు నౌకలపై దాడులు జరిగాయి. ఈ రెండు నౌకల్లో మొత్తం 46 మంది నావికులు ఉండగా, వీరిలో 30 మంది భారతీయులు ఉన్నారు. దాడి ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో ఉన్నతాధికారిని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తమ కార్యాలయానికి పిలిపించి తాజా దాడులపై తీవ్ర నిరసన తెలియజేసింది. హార్మూజ్లో నౌకలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని తేల్చి చెప్పింది. నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు హింసాకాండను తక్షణమే విరమించుకోవాలని ఇరాన్కు స్పష్టంచేసింది. వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాల్లో ముందుకెళ్లాలని సూచించింది.ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎం.టి.అల్ బాహియా నౌకలో 12 మంది భారతీయులు, ఎం.టి.మొంబాసా నౌకలో 18 మంది భారతీయులున్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. హార్మూజ్ వంటి అంతర్జాతీయ జలమార్గాల గుండా స్వేచ్ఛాయుత, సురక్షితమైన నౌకాయానానికి అంతరాయం కలిగిస్తూ, నావికులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడులను, హింసాత్మక చర్యలను ఖండిస్తున్నామని తేల్చిచెప్పింది.
జాతీయం
ఆ షరతుకు ఒప్పుకుంటేనే ఎన్డీయేకు మద్దతు!!
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంటాయి. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న నేతల మధ్య అనూహ్య భేటీలు, మారుతున్న సమీకరణాలు అక్కడి రాజకీయాలను మరింత ఉత్కంఠగా మారుస్తుంటాయి. తాజాగా మరోసారి అలాంటి పరిణామమే తెరపైకి వచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్ష కూటమిలో ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) వైఖరి మారే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు శరద్ పవార్ వర్గం సిద్ధమవుతోందన్న వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అయితే ఈ మద్దతుకు ఓ షరతు ఉందని తెలుస్తోంది. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం లోక్సభ స్థానాల పెంపు కల్పిస్తేనే బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని ఎన్సీపీ వర్గాలు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రతిపక్ష శిబిరంలో ఉన్న శరద్ పవార్ ఎన్సీపీ.. ఎన్డీఏకు దగ్గరవుతోందా? అనే చర్చ మొదలైంది.ప్రతిపక్ష కూటమికి షాక్?గత పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా వ్యతిరేకించాయి. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం అదే బిల్లుపై శరద్ పవార్ వర్గం భిన్నమైన వైఖరి తీసుకుంటే.. ప్రతిపక్ష ఐక్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.50 శాతం సీట్ల పెంపు ఉంటే మద్దతుఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఈ అంశంపై స్పందిస్తూ.. బిల్లులో అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా స్పష్టమైన నిబంధనలు ఉంటే మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. “అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపునకు అవకాశం కల్పిస్తే, అమలు విధానం స్పష్టంగా ఉంటే మద్దతు ఇస్తాం” అని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.ఇదే అంశంపై గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హామీ ఇచ్చారు. ఏ రాష్ట్రానికీ నష్టం జరగకుండా లోక్సభ స్థానాలను పెంచేలా సవరణ తీసుకొస్తామని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఎన్డీఏలో భాగం కానప్పటికీ.. కీలక సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది.అసలు డీలిమిటేషన్ బిల్లు ఏంటి?లోక్సభ స్థానాల సంఖ్యను పెంచడం, మహిళా రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది. రాజ్యాంగం (131వ సవరణ) బిల్లుగా పిలుస్తున్న ఈ ప్రతిపాదనలో లోక్సభ స్థానాల సంఖ్యను పెంచే అంశం ఉంది. అయితే జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలకు సీట్లు తగ్గే ప్రమాదం ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.రహస్య భేటీలతో పెరిగిన చర్చతాజా రాజకీయ పరిణామాలకు మరో కారణం ఎన్సీపీకి చెందిన రెండు వర్గాల నేతల కదలికలు. శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో రహస్యంగా సమావేశమైనట్లు వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ పరిణామాలతో శరద్ పవార్ మళ్లీ బీజేపీకి దగ్గరవుతున్నారా? ఎన్సీపీ రెండు వర్గాలు తిరిగి ఒక్కటయ్యే అవకాశం ఉందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.అయితే ఎన్సీపీ నేతలు మాత్రం ఈ భేటీలకు రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నారు.కాంగ్రెస్ ఆందోళనమరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఈ పరిణామాలపై స్పందిస్తూ.. శరద్ పవార్ ఎన్సీపీ, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని కోరారు. ప్రస్తుత డీలిమిటేషన్ విధానం వల్ల జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.శరద్ పవార్ వ్యూహం ఏమిటి?మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ ఎప్పుడూ వ్యూహాత్మక నిర్ణయాలకు పేరుగాంచారు. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న పార్టీలతోనూ అవసరానికి అనుగుణంగా రాజకీయ సమీకరణాలు మార్చుకోవడం ఆయన శైలిలో భాగమని విశ్లేషకులు చెబుతుంటారు. తాజా పరిణామాలు కేవలం ఒక బిల్లుపై మద్దతుకే పరిమితమా? లేదంటే భవిష్యత్ రాజకీయ పొత్తులకు సంకేతమా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.డీలిమిటేషన్ బిల్లుపై వైఖరి మారితే.. అది మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశం ఉంది. మరి ప్రతిపక్ష కూటమితో కలిసి నడుస్తున్న శరద్ పవార్ ఎన్సీపీ.. కీలక సమయంలో మిత్రపక్షాలకు హ్యాండ్ ఇస్తుందా? లేక షరతులతో కూడిన మద్దతుకే పరిమితం అవుతుందా? అన్నది వేచి చూడాలి.
శబరిమలలో ఏఐ సాంకేతికత.. భక్తుల మిస్సింగ్కి చెక్
పథనంతిట్ట: వార్షిక యాత్ర సందర్భంగా తమ బృందాల నుంచి విడిపోయిన యాత్రికులను త్వరగా గుర్తించేందుకు శబరిమల, ఏఐ (AI) ఆధారిత థర్మల్ కెమెరాలను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త వ్యవస్థలో భాగంగా , నిలక్కల్, పంపా, సన్నిధానంలోని సమాచార కేంద్రాలు తప్పిపోయిన యాత్రికుల పేర్లను లౌడ్స్పీకర్ల ద్వారా పలు భాషల్లో ప్రకటించే పద్ధతిని నిలిపివేస్తాయి. దీంతో , సుపరిచితమైన "మీరు ఎక్కడ ఉన్నా, ఇక్కడికి రండి" అనే బహిరంగ ప్రకటనలకు ముగింపు పడుతుంది.ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు, పుణ్యక్షేత్ర ప్రాంతంలోని కీలక ప్రదేశాలలో సహాయక మౌలిక సదుపాయాలతో పాటు 400 ఏఐ-సామర్థ్యం గల థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కొచ్చిలో జరిగిన డిజిటల్ కాన్క్లేవ్లో ఈ వ్యవస్థ నమూనాను ప్రదర్శించారు.ప్రతి ఏడాదిలక్షలాది మంది భక్తులు శబరిమలను సందర్శిస్తారు. ఈ తీవ్రమైన రద్దీ మధ్య పిల్లలు, వృద్ధ యాత్రికులతో సహా చాలా మంది తమ సహచరుల నుంచి విడిపోతుంటారు. ఈ ఏఐ-ఆధారిత నిఘా వ్యవస్థ, గాలింపు చర్యలను వేగవంతం చేయడానికి, జనసమూహ నిర్వహణను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది.వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే..ఒక యాత్రికుడు తప్పిపోయినప్పుడు అతనితో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు లేదా సహచరులు ఈ విషయాన్ని ఒక సమాచార కేంద్రంలో తెలియజేస్తారు. అధికారులు వర్చువల్ క్యూ రిజిస్ట్రేషన్ డేటాబేస్ నుంచి యాత్రికుడి ఫోటోను సేకరించి, దానిని ఏఐ (AI) సిస్టమ్లోకి అప్లోడ్ చేస్తారు.ఆ తర్వాత ఏఐ ప్లాట్ఫామ్ మొత్తం 400 థర్మల్ కెమెరాల నుంచి వచ్చే లైవ్ ఫీడ్లను స్కాన్ చేస్తుంది. ముఖ గుర్తింపు ద్వారా వ్యక్తిని గుర్తించిన వెంటనే , సిస్టమ్ ఆ వ్యక్తి ఉన్న ప్రదేశం గురించి కంట్రోల్ రూమ్కి తక్షణమే తెలియజేస్తుంది. భద్రతా సిబ్బందిని ఆ ప్రదేశానికి పంపిస్తారు, ఆ తర్వాత పోలీసులు యాత్రికుడిని గుర్తించి వారి బృందంతో తిరిగి కలుపుతారు.కెమెరా సంస్థాపన స్థానాలుAI థర్మల్ కెమెరాలను ప్రధాన పుణ్యక్షేత్రాలు, రవాణా కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్నారు, వాటిలో ఇవి కూడా ఉన్నాయి:నీలక్కల్: పార్కింగ్ గ్రౌండ్ మరియు చైన్ సర్వీస్ బస్ స్టాండ్.పంబ: బస్ స్టాండ్ , స్నానఘట్టం , త్రివేణి వంతెన మరియు గణపతి ఆలయం.పంబ - సన్నిధానం మార్గం: నీలిమల, అప్పచిమేడు, శబరిపీఠం , మరక్కూట్టం, క్యూ కాంప్లెక్స్ చరల్మేడు.సన్నిధానం: నడపండల్ , సోపానం , పతినెట్టంపాడి (18 పవిత్ర మెట్లు), ప్రసాదం కౌంటర్ , అన్నదానం హాలు మరియు పండితవళం.కొత్త ఏఐ - ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ , మాన్యువల్ ప్రకటనలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు , తప్పిపోయిన భక్తులను గుర్తించే ప్రక్రియను వేగవంతంగా, మరింత సమర్థవంతంగా చేస్తూ , యాత్రికుల భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.(చదవండి: జగన్నాథుని వంటశాల ఎలా ఉంటుందంటే..! ఆఖరికి పొయ్యిలు కూడా..)
బెంగళూరు తొక్కిసలాట కేసు: ఐపీఎస్ అధికారులకు క్లీన్ చిట్
బెంగళూరు: గత ఏడాది జూన్ నెలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా ఎం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాటి బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బీ దయానందతో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై కొనసాగుతున్న శాఖాపరమైన విచారణను ప్రభుత్వం ముగిస్తూ, వారికి క్లీన్ చిట్ ఇచ్చింది.ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా జనం తీవ్రంగా గాయపడ్దారు. ఘటన జరిగిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించి, బాధ్యులని భావించిన కమిషనర్ బి. దయానంద, అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్ వికాస్, నాటి డీసీపీ (సెంట్రల్) శేఖర్ సహా పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే తాజాగా సంబంధిత అధికారులు సమర్పించిన వివరణలు, పరిపాలనా విభాగం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, వారిపై విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం ఆర్సీబీ యాజమాన్యమే ప్రధాన బాధ్యత వహించాలని పేర్కొంది. అనుమతులు తీసుకోకుండానే కార్యక్రమం నిర్వహించడం, జనసమూహాన్ని అదుపు చేయడంలో విఫలమవ్వడం వంటి లోపాలను ప్రభుత్వం ఎత్తిచూపింది. ఈ దుర్ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
ఘనంగా పెళ్లి : రూ. కోటి నగలు, నగదుతో రాత్రికి రాత్రే వధువు జంప్
ఐఏఎస్ (IAS) అధికారిణిని పెళ్లి చేసుకోవాలన్న ఉత్తరప్రదేశ్లోని ఒక యువకుడి కల ఖరీదైన పీడకలగా మారింది. ఎంతో ఘనంగా పెళ్లయిన కొద్ది గంటల్లోనే రాత్రికి రాత్రే వధువు కోటి రూపాయలకు పైగా విలువైన నగలు, విలువైన వస్తువులతో పరారైన ఘటన కలకలం రేపింది. నెట్టింట ఈ వింత పెళ్లి మోసం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఏమైంది?ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా ఫరీద్పూర్ పరిధిలో గల పచోమి గ్రామానికి చెందిన అభిషేక్ పెళ్లి చేసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్నే పెళ్లి చేసుకోవా లనుకున్నాడు. సాధన అనే ఒక కిలాడీ తనను తాను ఐఏఎస్ అధికారిణిగా పరిచయం చేసుకుంటూ, సోషల్ మీడియాలో ప్రొఫైల్ను చూసి వెనుకా ముందు ఆలోచించకుండా భలే ఛాన్స్లే అనుకుంటూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా పెళ్లిదాకా తీసుకొచ్చాడు. అటు తమ ఇంటికి ఐఏఎస్ అధికారిణి కోడలిగా రాబోతుందనే ఆనందంతో అభిషేక్ కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఎంతో సంతోషంగా అంగీకరించారు. ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. అయితే, ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు.శోభనం రాత్రే 'కోటి రూపాయల' తో జంప్ఎఫ్ఐఆర్ (FIR) వివరాల ప్రకారం... పెళ్లయిన తర్వాత వధువు సాధన అత్తారింటికి చేరుకుంది. అక్కడ కుటుంబ సభ్యులు ఆమెకు పెద్ద ఎత్తున బంగారు, వెండి, వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇచ్చారు. అయితే, పెళ్లి జరిగిన మొదటి రాత్రి (శోభనం రాత్రి) భర్త అభిషేక్ నిద్రిస్తున్న సమయంలో, సాధన ఇంట్లోని విలువైన నగలు, నగదును బ్యాగ్లో సర్దుకుని అక్కడి నుండి పరారైంది. ఉదయం చూసేసరికి దాదాపు రూ. 1 కోటి విలువైన వస్తువులతో వధువు కనిపించకుండా పోవడంతో వరుడి కుటుంబం లబోదిబోమంది.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందిమోసపోయామని గ్రహించిన వరుడి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సాధన, ఆమె తండ్రి ,మరో ఇద్దరు కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు. ఈ నకిలీ ఐఏఎస్ వధువును పట్టుకోవడానికి బరేలీ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.ఇదీ చదవండి: 25 ఏకరాల భూమి కొన్న స్టార్ హీరో, ధర ఎంతో తెలుసా?వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పొరుగున ఉన్న బుదౌన్ జిల్లాకు చెందిన ప్రధాన నిందితురాలు సాధనను అదుపులోకి తీసుకున్నారు. ఈమె వెనుక ఉన్న మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా గతంలో కూడా ఎవరినైనా ఇలాగే ఐఏఎస్ పేరుతో మోసం చేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నకిలీ ఐఏఎస్ ప్రొఫైల్, వివాహ మోసాల నెట్వర్క్ విస్తృతిపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తుండటంతో, ఈ కేసు స్థానికంగా విస్తృత చర్చనీయాంశ మైంది.
ఎన్ఆర్ఐ
సౌదీలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
రియాద్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని సౌదీ అరేబియా సెంట్రల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్ నగరంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా సెంట్రల్ కమిటీ కన్వీనర్ రబ్బానీ సయ్యద్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని కొనియాడారు. వైఎస్సార్సీపీ ఘన విజయం కోసం కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా కలిసికట్టుగా పని చేయాలో దిశా నిర్దేశం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘మావిగన్’ కార్యక్రమం గురించి రబ్బానీ సయ్యద్ ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మావిగన్’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రియాద్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన కరతాళ ధ్వనులు, ‘జై మావిగన్’ నినాదాలతో ఆడిటోరియం మార్మోగింది.ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులు సిరుమల సుబ్బారెడ్డి, పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి, కరీముల్లా బాషా షేక్, వెలంపాటి వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గొల్ల విజయ్, గానుగపెంట శ్రీకాంత్, సుభాన్ ఖాన్ పఠాన్, నాగినేని ఉదయ్ కృష్ణ చౌదరి, షేక్ షాదక్ వలి, కంది శశిధర్ రెడ్డితో పాటు వందలాది మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ జయంతి వేడుకలను విజయవంతం చేశారు.
YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో డా. వై.ఎస్.ఆర్ జయంతి వేడుకలు
ఫీనిక్స్, అరిజోనా : మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఘనంగా నిర్వహించింది. YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, YSRCP ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ చ ముఖ్యమంత్రి మాజీ సలహాదారు (విద్య) ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఎన్ఆర్ఐ వ్యవహారాలు) డాక్టర్ ప్రదీప్ చింతా గారు హాజరయ్యారు. డాక్టర్ వై.ఎస్కు పుష్పాంజలి ఘటించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం, ఆయన అద్భుతమైన జీవితం, దార్శనిక నాయకత్వం, ప్రజా సంక్షేమం పట్ల అచంచలమైన నిబద్ధతను తెలియజేస్తూ ఒక ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన జరిగింది.డా. వైయస్సార్తో తమ జ్ఞాపకాలను పలువురు పంచుకున్నారు. ఆయన వినయం, కరుణ, ధైర్యం, ప్రజా సేవ పట్ల అచంచలమైన అంకితభావాన్ని వారు గుర్తు చేసుకున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ను నిజమైన ప్రజానాయకుడు అంటూ ముఖ్య అతిథి ఆలూరు సాంబ శివారెడ్డి అభివర్ణించారు. సామాన్య పౌరులతో ఆయనకున్న అసాధారణ అనుబంధాన్ని, పరిపాలన పట్ల ఆయన అనుసరించిన పరివర్తనాత్మక విధానాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ నిరంతర సంక్షేమం, అభివృద్ధి కోసం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలను, దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలవాలని ఆయన కోరారు.ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఎన్నారై చాప్టర్లను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన జగనన్న టెక్ఫోర్స్ కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించారు. సాఫ్ట్వేర్ నిపుణులు మరియు ఎన్నారైల కీలక పాత్రను నొక్కిచెబుతూ, పార్టీ ప్రపంచవ్యాప్త విస్తరణ,భాగస్వామ్యానికి సభ్యులు చురుకుగా పాల్గొని, తమ వంతు సహకారం అందించాలని ఆయన ప్రోత్సహించారు.అలాగే ఆంధ్రప్రదేశ్లోని తమ కుటుంబ సభ్యులు , స్నేహితులలో అవగాహన కల్పించడం ద్వారా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో ఎన్నారైలు చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. ప్రతి అర్హతగల ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, నమోదు ప్రక్రియను సరిగ్గా పూర్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.ముఖ్య అతిథి డా. ప్రదీప్ చింత, దివంగత డా. వై.ఎస్. స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం మరియు శాశ్వత వారసత్వం గురించి ప్రస్తావించారు. ఆయన పదవీకాలంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ మరియు గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో అమలు చేసిన పరివర్తనాత్మక సంస్కరణల గురించి మాట్లాడారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న అణచివేతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు, ప్రజా చైతన్యానికి మద్దతుగా సోషల్ మీడియా వేదికల ద్వారా చురుకుగా పాల్గొనాలని ఎన్నారైలకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల SIR పథకంపై ఒక వాక్త్రూ సెషన్ను నిర్వహించారు. SIR పథకం కింద ఓటరు వివరాలను ధృవీకరించుకోవడానికి, గణన పత్రాలను సరిగ్గా పూరించడానికి అవసరమైన దశలవారీ ప్రక్రియను ఆయన వివరించారు. నిర్దేశించిన కాలపరిమితిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు తమ కుటుంబ సభ్యులకు, స్థానిక సమాజాలకు మార్గనిర్దేశం చేయాలని పాల్గొన్నవారిని ప్రోత్సహించారు.డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి కమిటీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ ఈ సమావేశం ముగిసింది. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆశించిన సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమ ఆధారిత పాలన అనే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి మద్దతు కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను వక్తలు నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అత్యంత ప్రియమైన నాయకులలో ఒకరికి ఈ కార్యక్రమాన్ని ఒక అర్థవంతమైన నివాళిగా మార్చడంలో పాల్గొన్న సభ్యులు, మద్దతుదారులు మరియు సామాజిక నాయకులందరికీ వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల, వంశీ ఏరువరం, చెన్నారెడ్డి మద్దూరి, సోమ శేఖర్ రెడ్డి యర్రపురెడ్డి, బోగారపు లక్ష్మీ & గురు, బలరాంరెడ్డి, శ్రీధర్ లక్కిరెడ్డి, రమేష్, శ్రీధర్ చెమిడ్తి, అంజిరెడ్డి, విఘ్నేష్, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగేష్పొర్లక్లు పాల్గొన్నారు. శిరసనంబేడు, సాయి రోహిత్ చెరుకుమిల్లి, శ్రవణ్, విష్ణు చొప్పా, విజయ్, ప్రవీణ్, ప్రక్ష్, పురంధర్, శివ కోడూరు, నాగరాజు దాసరి, ప్రక్షా, లోకనాధ్, అనిల్ ప్రవీణ్ అవుతారు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం ముగిసింది.
మహిళ హత్య కేసు: అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్యను హత్య చేసిన ఆరోపణలపై ఒక తెలుగు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లేవ్లోని ఒక అపార్ట్మెంట్ బాత్రూమ్లో భార్య మృతదేహం లభ్యమైన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.నిందితుడిని అవినాష్ నార్నె (30)గా గుర్తించారు. జూన్ 27న బెల్లేవ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, భార్య సబ్బినేని రజిత (27) మరణానికి కారణమైనందుకు ఫస్ట్-డిగ్రీ మర్డర్ నిందారోపణలు మోపారు. ప్రస్తుతం అతడికి కింగ్ కౌంటీ జైలులో 5 మిలియన్ డాలర్ల (రూ. 47 కోట్లకు పైగా) భారీ బెయిల్ విధించారు. 2025 అక్టోబర్ 27న బెల్లేవ్ డౌన్టౌన్లోని ఉడ్ల్యాండ్ కామన్స్ అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న బాత్రూమ్లో రజిత అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అధికారులు గమనించారు.వైద్య సిబ్బంది కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆమె అప్పటికే మరణించినట్లు తేలింది. ఆఫీసు నుండి వచ్చేసరికి భార్య బాత్రూమ్ ఫ్లోర్పై పడి ఉందని అవినాష్ పోలీసులకు తెలిపాడు. వీరిద్దరికీ 2025 జూన్లో పెద్దలు కుదిర్చిన వివాహం జరగ్గా, ఆ తర్వాతే ఈ అపార్ట్మెంట్కు మారారు. మొదట అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నివేదికలో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో దీనిని హత్యకేసుగా మార్చారు.సుదీర్ఘ దర్యాప్తులో ఎలక్ట్రానిక్ డోర్ లాక్ రికార్డులు, మొబైల్ డేటా, వాట్సాప్ సందేశాలను డిటెక్టివ్లు పరిశీలించారు. రజిత మరణించిన సమయంలో అవినాష్ మినహా మరెవ్వరూ అపార్ట్మెంట్లోకి ప్రవేశించలేదని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, అవినాష్కు భారతదేశంలో మరో మహిళతో సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో నిందితుడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు, డిజిటల్ ఆధారాల బట్టి అతడే ప్రధాన నిందితుడిగా నిర్ధారించి కోర్టులో హాజరుపరిచారు.
విదేశాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం: మహానేత, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వ ర్యంలో జోహన్నెస్బర్గ్లోని మిడ్రాండ్లో జరిగిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షత వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి అన్నదానం చేపట్టారు. కెనడాలోని టొరొంటో నగరంలో వైభవంగా వైఎస్సార్ జయంతి వేడుకలు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బి వెంకట సుబ్బా రెడ్డి , వాసు సింగారెడ్డి , వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఎనుముల, శ్రీకృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ , శ్రీమతి కల్పన జోసెఫ్, శివమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు కెనడాలో.. కెనడాలోని టొరంటోలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అలూరు సాంబశివరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, కార్తీక్ ఎల్లాప్రగడ, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ చింతా, పార్టీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు వర్చువల్గా పాల్గొన్నారు. టొరంటోలో జరిగిన కార్యక్రమంలో నరసింహ రెడ్డి గుట్టిరెడ్డి, చెన్న కేశవ, ప్రతాప్ బొల్లారం, ఆరిఫ్, నూర్, శ్రీనివాస్ రెడ్డి మరెక్కగారి, చంద్రహాస్ చల్లా, శాలిని బెక్కం, కృష్ణ రెడ్డి అల్లంపాటి, కృష్ణ చిదిరాల, శ్రీకాంత్ మద్దిరెడ్డి, రమేష్ తుంపర, సుబ్బా రావు, గుణశేఖర్ కొనపల్లి, విష్ణు వంగాల, కల్యాణ్ గుర్రంకొండ, శైలేష్ పాల్యం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్బర్గ్లో భారీ కేక్ కట్ చేస్తున్న అభిమానులు ఆస్ట్రేలియాలో.. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్లో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అరి్పంచారు. అనంతరం కేక్ను కట్ చేశారు. ఈ వేడుకల్లో బ్రహ్మరెడ్డి ఎరువూరి, కిషోర్, జస్వంత్ బొమ్మిరెడ్డి, వంశీ చాగంటి, శ్రీనివాసులు రెడ్డి, చిన్నప్ప, శౌర్య పాల్గొన్నారు. అలాగే, కందుల భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్తన్ టెరిటోరీలోని డారి్వన్ నగరంలో కొమ్మిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, శివ హర్షవర్థన్ రెడ్డి వంగ, లక్ష్మణ్ రెడ్డి, రాఘవేంద్ర రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, రవితేజ మదినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెర్త్లో జరిగిన కార్యక్రమంలో వంశీ కృష్ణా రెడ్డి, యశ్వంత్, సతీష్ త్రినాథ్, వినయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్ అభిమానులు మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా కన్వీనర్ భరత్, విక్టోరియా కన్వీనర్ కృష్ణా రెడ్డి, సహ కన్వీనర్ రామాంజి, కోర్ టీమ్ సభ్యులు శిరీష, స్వాతి, యశు, బ్రహ్మ రెడ్డి, పవన్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అబ్దుల్, రవి వర్మ, తేరా జయవర్ధన్ రెడ్డి, శ్రీనాథ్, నితీష్, ప్రణీత్, రోహిత్, అభిష్క్, ఉదయ్, భార్గవ్, యశ్వంత్, దశరథ్ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేతలు నూర్ ఫాతిమా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.ఆస్ట్రేలియాలోని పెర్త్లో వైఎస్సార్ జయంతి వేడుకలు
క్రైమ్
HYD: మాదాపూర్లో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్: మాదాపూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రామేశ్వరం కేఫే సమీపంలో భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేయగా, అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రాథమిక సమాచారం ప్రకారం, భాస్కర్ కొంతకాలంగా ఇద్దరు యువతులను వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై గతంలో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదుకాగా, పోలీసులు ఇరు పక్షాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కూడా భాస్కర్ లో మార్పు రాలేదని సమాచారం.ఈ మధ్యకాలంలో భాస్కర్ “దమ్ముంటే హైదరాబాద్కు రండి” అంటూ సవాల్ విసిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన యువతుల్లో ఒకరి తండ్రి, మరో వ్యక్తితో కలిసి వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు . హత్య అనంతరం నిందితులిద్దరూ స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు.భాస్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వేధింపుల వివాదమే హత్యకు ప్రధాన కారణమా, లేక ఇతర వ్యక్తిగత విభేదాలు కూడా ఉన్నాయా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉండగా, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
కామ పిశాచి కథ అంతేనా?
తిరుపతి తుడా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ అధికారిపై మహిళ ఉద్యోగి చేసిన ఫిర్యాదుకు సంబంధించి డీఎంహెచ్ఓ ఆరుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్మిని్రస్టేషన్ అధికారి తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు కుయుక్తులు పన్నారు. విచారణ కమిటీని తనకు అనుకూలంగా మార్చుకోవడంతోపాటు అధికారికి అండగా తెలుగునాడు వైద్య ఆరోగ్య సంఘం కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ అధికారికి అనుకూలంగా విచారణ నివేదిక సమర్పించేందుకు వారు శతవిధాల ప్రయత్నించినట్లు సమాచారం. ఆ సంఘంలోని కొందరు నాయకులు ప్రశ్నించినా వారిని బెదిరిస్తూ.. కామ పిశాచికి అనుకూలంగా కృషి చేస్తున్నారని మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. లంచగొండు కూడా! జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్అధికారిగా పనిచేస్తున్న కామపిశాచి ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి లంచాలకు పాల్పడడం అలవాటుగా మారింది. లంచం ముట్టితేగానీ ఆయన టేబుల్ నుంచి ఫైల్ కదలదు. అటువంటి వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేయడం ఎమిటని జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగు నాడు వైద్య ఆరోగ్య సంఘం నాయకులు కొందరు కార్యాలయంలో డిప్యూటేషన్ల పేరుతో తిష్టవేసి చక్రం తిప్పుతుండడం గమనార్హం. అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
స్నానపు వీడియోతో వివాహితకు బ్లాక్మెయిల్!?
స్నానం చేస్తుండగా ఓ యువకుడు మహిళను రహస్యంగా వీడియో తీశాడు. ఆ వీడియోతో ఆమెను లోబర్చుకున్నాడు. విషయం ఆమె భర్తకు తెలిసినా కుటుంబ పరువు పోతుందనే భయంతో మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యువకుడి ఆగడాలు మితిమీరిపోవడంతో.. అతడిని లేకుండా చేయాలని దంపతులు పథకం రచించారు. గుజరాత్లోని గాంధీనగర్లో తీవ్ర కలకలం రేపిన ఘటన వివరాల్లోకి వెళ్తే..గాంధీనగర్ జిల్లా పరిధిలోని కలొల్ ప్రాంతానికి చెందిన హార్దిక్ (20) కాలేజీ స్టూడెంట్. దాదాపు ఒకటిన్నర నెలల క్రితం ఓ మహిళ స్నానం చేస్తుండగా చాటుగా తన ఫోన్తో వీడియో తీశాడు. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని ఆమెను మహిళను బెదిరించాడు. తనతో శారీరక సంబంధం కొనసాగించాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. భయంతో ఆమె అతడి డిమాండ్లకు అంగీకరించింది.మహిళ భర్త ఫ్యాన్ రిపేర్లు, వైరింగ్ పనులు చేస్తుంటాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య పదే పదే ఫోన్లో మాట్లాడడంపై గట్టిగా నిలదీశాడు. ఆమె జరిగింది చెప్పింది. అయితే పరువు పోతుందనే భయంతో అతను మౌనంగా ఉండిపోయాడు. అయితే ఈలోపు హార్ధిక్ మితిమీరి ప్రవర్తించాడు.ఇంటి ముందు నుంచి వెళ్లే సమయంలో మహిళను చూసి కన్ను కొట్టడం, అసభ్య సైగలు చేయడం ఆ భర్త భరించలేకపోయాడు. మొదట హార్దిక్ కుటుంబ సభ్యులతో పంచాయితీ పెట్టి విషయం చెప్పాలని దంపతులు భావించారు. అయితే.. విషయం బయటకు తెలిసిపోతుందని భావించారు. ఈలోపు హార్దిక్ చేష్టలు ఆ భర్తకు మరింత కోపం తెప్పించాయి. దీంతో అతన్ని హతమార్చాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు.పథకం ప్రకారం జూలై 11 ఉదయం మహిళ హార్దిక్కు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. అంతకుముందే భర్త పని కోసం బయటకు వెళ్తున్నట్లు నటించి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పిల్లలు స్కూల్కు వెళ్లిపోయారు. హార్దిక్ తన తండ్రికి ఫోన్ చేసి.. పర్బత్పురలో ఓ భూమి చూసేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. అయితే అతడు నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు.ఈలోపు.. హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చిన భర్తను చూసి హార్దిక్ పరుగులు తీయబోయాడు. భర్త అతని ఛాతీ మీద కూర్చోగా.. భార్య కాళ్లు, చేతులు బలంగా పట్టుకుంది. తొలుత ఆమె స్కార్ప్తో, ఆ తర్వాత కరెంట్ వైర్లను మెడకు బిగించి హార్దిక్ను హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఇంటికి తాళం వేశారు. సరాసరి స్కూల్కు వెళ్లి పిల్లలను తీసుకుని.. వివాహిత స్వస్థలానికి పారిపోయారు.మొబైల్ స్విచ్చాఫ్ రావడంతో..హార్దిక్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కంగారుపడ్డ తండ్రి.. కలోల్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుల ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఈ హత్య బయటపడింది. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి మరణించినట్లు వెల్డి కావడంతో.. దంపతుల్ని ట్రేస్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.హార్దిక్ వద్ద ఉన్న మొబైల్లోనే మహిళకు సంబంధించిన వీడియో ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య తర్వాత భర్త ఆ ఫోన్ను పగలగొట్టి రోడ్డుపక్కన పడేసినట్లు సమాచారం. ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు నిందితులను విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.
అత్తపై ఫన్నీ రీల్.. కోడలికి ఊహించని షాక్!
తమిళనాడు: రీల్స్ను వాట్సాప్ స్టేటస్గా పెట్టడం వల్ల గొడవ జరగడంతో భార్యపై దాడి చేసిన ఐటీ కంపెనీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. సేలంకు చెందిన శ్రీకాంత్ (24), అభిరామి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు చెన్నైలో నివసిస్తున్నారు. అభిరామి తన వాట్సాప్ స్టేటస్లో అత్తని కోడలు పని చేయమని పురమాయించేలా ఉన్న ఒక ఫన్నీ రీల్ను పోస్ట్ చేసింది. దీన్ని చూసిన శ్రీకాంత్ సోదరి అతనికి సమాచారం అందించింది.దీనిపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో అభిరామి తన పుట్టింటికి వెళ్లిపోయింది. జూలై 9న శ్రీకాంత్ అక్కడికి వెళ్లి మళ్లీ గొడవ పడి, ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అభిరామి ఆసుపత్రిలో చేరింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీకాంత్ను అరెస్ట్ చేశారు.
వీడియోలు
ట్రంప్ వెనక్కి తగ్గిన వెనుక షాకింగ్ నిజాలు
బాబుకు పవన్ బిగ్ షాక్
విశ్వసనీయత లేని బాబు మాటలు
మీరు రావొద్దు... ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదు...
CI వేధింపులు తట్టుకోలేక పుట్టినరోజు నాడే
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రెండో వన్డే నుంచి గిల్ ఔట్?
సాయి కృష్ణ కేసుపై తల్లి వెనకడుగు అడ్వకేట్ సంచలన వ్యాఖ్యలు
నేను విన్నాను...!. నేను ఉన్నాను..!
ముద్రగడ ఇంటి వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్ ఇచ్చిపడేసిన అంబటి
బిజ్లీ మహాదేవ్ అసలు రహస్యం! సైన్స్ కు అర్థంకాని శివుడి మహిమ


