ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి..
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం; తిథి బ.త్రయోదశి ఉ.8.08 వరకు; తదుపరి చతుర్దశి; నక్షత్రం శతభిషం తె.5.50 వరకు(తెల్లవారితే బుధవారం), తదుపరి పూర్వాభాద్ర; వర్జ్యం ప.12.46 నుండి 2.24 వరకు; దుర్ముహూర్తం ఉ.8.33 నుండి 9.21 వరకు, తదుపరి రా.10.56 నుండి 11.44 వరకు; అమృత ఘడియలు రా.10.20 నుండి 11.57 వరకుసూర్యోదయం : 6.11సూర్యాస్తమయం : 6.06రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకుమేషం: దూరప్రాంతాల నుంచి ఆసక్తికర సమాచారం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.వృషభం: రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో పురోగతి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.మిథునం: బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో పనిభారం ఉండవచ్చు.కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.సింహం: పనులు అనుకున్న విధంగా పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.కన్య: చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో హోదాలు.తుల: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు సంభవం. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశపరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.వృశ్చికం: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.ధనుస్సు: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగులకు యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.కుంభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రగతి.మీనం: పనులు కొంత నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌలకు ఎంత డిమాండో!!
ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రమైంది. దీంతో ఇండక్షన్ స్టౌలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే.. ఇండక్షన్ స్టౌల కొరత పెరగడంతో.. ఇప్పటికిప్పుడు వాటిని తయారు చేసే పరిస్థితులు లేవని, చైనా నుంచి ముడిపదార్థాలు దిగుమతి అవ్వడానికి 45 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. ఇండక్షన్ స్టౌల లభ్యత భారీగా తగ్గిపోవడానికి కారణాలేమిటి? వరుస పండగల వేళ.. పౌరుల పరిస్థితి ఏమిటి?500 శాతం డిమాండ్ హిందువులకు నూతన సంవత్సరమైన ఉగాది.. అదేవిధంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకొనే రంజాన్ మరో మూడునాలుగు రోజుల్లో రానున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాపై ప్రతికూల ప్రభావం పడడంతో పండుగ పూట పిండివంటలు చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎల్పీజీ సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే హాస్టళ్లలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి.హోటళ్లలో దోశ, పూరీ, మైసూర్ బజ్జీ వంటి పదార్థాలు అందుబాటులో లేకుండా పోయాయి. కార్పొరేట్ సంస్థలు, ఐటీ సంస్థల్లోని క్యాంటీన్లు కూడా మూతపడ్డాయి. గృహావసరాల సిలిండర్ సరఫరాలో ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. బుక్ చేసిన వారం పది రోజులకు గానీ గ్యాస్ బండ అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అటు ఆన్లైన్లో ఈ-కామర్స్ ప్లాట్ ఫారాల్లో.. ఇటు ఆఫ్లైన్లో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ షోరూంలలో కూడా ఇండక్షన్ స్టౌల కొరత నెలకొంది. ఇండక్షన్ స్టౌల కోసం ఒక్కసారిగా 500 శాతం దాకా డిమాండ్ పెరిగిందని డీలర్లు చెబుతున్నారు.ఇప్పటికిప్పుడు ఇండక్షన్ స్టౌల ఉత్పత్తిని పెంచొచ్చా?ఇండక్షన్ స్టౌల తయారీలో కీలకమైన ముడి పదార్థాలు చైనా నుంచి వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్పత్తిదారులు ముడిపదార్థాల కోసం ఇప్పటికిప్పుడు ఆర్డరిచ్చినా.. అవి భారత్కు చేరడానికి కనీసం 45 రోజుల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క ఇండక్షన్ స్టౌ అని కాకుండా.. ఎయిర్ ఫ్రయ్యర్లు, ఓటీజీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, సోలార్ కుక్కర్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణం భోపాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యపట్టణం లఖ్నవూల్లో దాదాపుగా ఇండక్షన్ స్టౌలకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండక్షన్ స్టౌల కోసం డిమాండ్ బాగా పెరిగింది. ధరలు కూడా పైపైకి వెళ్తున్నాయి. నెల క్రితం వరకు 2,200 రూపాయలకు దొరికే ఇండక్షన్ స్టౌ ధర ఇప్పుడు 3 వేల రూపాయలకు చేరుకుంది. ఫిలిప్స్ కంపెనీకి చెందిన ముంబై బ్రాంచ్ మేనేజర్ వివేక్ గౌర్ కూడా దీనిపై స్పందించారు. ఎల్పీజీ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు వెల్లడించారు. డిమాండ్ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుందన్నారు. భోపాల్లోని ఉషా ఇంటర్నేషనల్ డిప్యూటీ సేల్స్ మేనేజర్ వినీత్ శర్మ కూడా సాక్షితో మాట్లాడుతూ నెలకు సగటున వెయ్యి యూనిట్ల మేర ఇండక్షన్ స్టౌల విక్రయాలు జరిగేవని... ఇప్పుడు రోజుకు 10 వేల యూనిట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఇప్పటికిప్పుడు ఉత్పత్తిని పెంచడానికి ముడిపదార్థాల అవసరం ఉంటుందని, అందుకు చైనానే మార్గమని చెబుతున్నారు. ముఖ్యంగా ఇండక్షన్ స్టౌ తయారీలో ఉపయోగించే హీట్ ప్లేట్లు చైనా నుంచి వస్తాయి. కంట్రోలింగ్ వ్యవస్థ, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం భారత్ ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు ఆ పదార్థాల కోసం 45 రోజుల పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది.ఏయే రంగాలపై ప్రభావం?గ్యాస్ కొరత దాదాపు అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ఉత్తరాది కార్మికులు ఎక్కువగా పనిచేస్తుంటారు. వీరికి రెగ్యులర్ ఎల్పీజీ కనెక్షన్లు ఉండవు. చిన్న సిలిండర్లతో వంటలు చేసుకుంటారు. సాధారణంగా 650 నుంచి 750 వరకు 5 కేజీల చిన్న సిలిండర్ల రీఫిలంగ్ చార్జీలుంటాయి. గడిచిన 15 రోజులుగా మార్కెట్లో చిన్న సిలిండర్ల రీఫిల్లింగ్ జరగడం లేదు. దీంతో వాళ్లంతా స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా హోటల్ రంగంపై సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీని ప్రభావం పర్యాటకరంగంపై పడుతుంది. ఇండక్షన్ స్టౌలు ఇళ్లలో వంటకు సరిపోతాయే తప్ప.. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో వంటకు పెద్దగా ఉపయోగపడవు.రాబోయే పండుగలపై ఈ ప్రభావం ఎలా ఉండనుంది?ఉగాదికి భక్ష్యాలు చేయడం ప్రత్యేకత. దీంతోపాటు.. కొత్త మామిడికాయలతో చేసే పులిహోర, పంచభక్ష్య పలహారాలను దేవుడికి నివేదన చేయడం తెలుగువారి సంప్రదాయం. అదేవిధంగా రంజాన్ ఈద్ సందర్భంగా షీర్కుర్మా, ఇతర వంటకాలు చేయడం ఆనవాయితీ. దీంతో.. గ్యాస్ కొరత, ఇండక్షన్ స్టౌల లభ్యత లేకపోవడం ఈ పండుగలపై తీవ్రంగా కనిపించనుంది. ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు.. అంటే మార్చి 27న శ్రీరామ నవమి, ఏప్రిల్ 3న గుడ్ఫ్రైడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి.ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పండుగల నేపథ్యంలో సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రానికి లేఖ రాశారు. జిల్లాల స్థాయిలో గ్యాస్ సరఫరాను స్వయంగా కలెక్టర్లు మానిటర్ చేస్తున్నారు.
10.40 దాటిన తర్వాత పంచ్ వేస్తే సెలవే..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం మరో పిడుగు వే సింది. ఇప్పటికే సర్వేల పేరిట ఉక్కిరిబిక్కిరి చేస్తూ షోకాజ్ నోటీసులతో బెంబేలెత్తిస్తున్న సర్కారు తాజాగా హాజరు నిబంధనలు మార్చింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఉదయం 10.40 గంటల తర్వాత పంచ్ వేస్తే సెలవుగా పరిగణిస్తామంటూ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సచివాలయాల ఉద్యోగుల ముఖ ఆధారిత హాజరు నమోదు యాప్లో సోమవారం ఆయా నిబంధనలు ప్రత్యక్షమయ్యాయి. నిబంధనలు ఇలా... ఆఫీసు మాన్యువల్ ప్రకారం సచివాలయాల ఉద్యో గులు ఉదయం 10.30 గంటల్లోగా హాజరు నమోదు చేయాలి. మరో పది నిమిషాలు సర్దుబాటు సమయం (గ్రేస్ టైం) కల్పించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 10.40 గంటల తర్వాత 11.30 గంటల మధ్య నెలలో హాజరు నమోదును ఆయా సచివాల యాల డీడీవో (వేతన బిల్లులు నమోదు చేసే అధికారి) ముందస్తు అనుమతితో నెలలో మూడు సార్లు సా ధారణ హాజరుగా వీలు కల్పించనున్నట్టు పేర్కొంది. మూడు సార్లు మించి ఒక ఉద్యోగి 10.40 గంటల త ర్వాత 11.30 గంటల మధ్య హాజరు నమోదు చేసినా ప్రతిసారి అర రోజు సెలవుగా పరిగణిస్తామని ప్రభు త్వం స్పష్టం చేసింది. నెలలో ఏ రోజైనా ఒక ఉద్యోగి 11.31 నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య హా జరు నమోదు చేసినా అరరోజు సెలవుగా పరిగణిస్తా రు. మధ్యాహ్నం 2.01 గంటల నుంచి ఐదు గంటల మధ్య హాజరు నమోదు చేస్తే పూర్తి రోజు సెలవుగానే పరిగణించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. నెలలో గరిష్టంగా ఏడు రోజులు మాత్రమే ఆన్డ్యూటీ హా జరుకు అవకాశం ఇవ్వనున్నట్టు పేర్కొంది. అయితే ప్రభుత్వం ప్రత్యేకించి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను టార్గెట్ చేసుకుని వివిధ నిబంధనలు అమలు చేస్తున్నట్టు ఉందని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘ నేతలు మండిపడుతున్నారు.
Viveka Case: ‘సునీత కీలక అంశాలను పక్కదారి పట్టించారు’
న్యూఢిల్లీ: వివేకా కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత అనేక కీలకాంశాలను పక్కదారి పట్టించారన్నారు కడప ఎంపీ అవినాష్రెడ్డి. తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని కొందరిపై సునీత ఒత్తిడి చేశారన్నారు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, సీబీఐ కూడా దీనికి సమాధానం చెప్పాలన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని సృష్టించిందే సునీత అని అవినాష్రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(సోమవారం, మార్చి 16వ తేదీ) న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన అవినాష్రెడ్డి.. వివేకాది గుండెపోటు అని సృష్టించింది సునీతతో పాటు నర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి అనే వ్యక్తులు అని తెలిపారు. అసలు వివేకాది మర్డర్ ఫర్ గెయిన్ దిశగా సునీత ఎందుకు విచారణ కోరలేదని అవినాష్రెడ్డి ప్రశ్నించారు. వివేకా హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది తానేనని అవినాష్ పేర్కొన్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు అవినాష్. సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది..వివేకా హత్య కేసులో నాపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని సునీత కొందరిపై ఒత్తిడి చేశారు. వారు చెప్పినట్లే సీబీఐకి చెప్పాలని కొందరని సునీత బెదిరించారు. రామ్సింగ్ విచారణ అధికారిగా వచ్చాక కేసు పక్కదారి పట్టింది. సీబీఐ డైరెక్టర్కు అనేక సాక్ష్యాలు సమర్పించి విచారణ చేయాలని మొరపెట్టుకున్నా. గతంలో సీబీఐకి నచ్చిన వారిని మాత్రమే పిలిచి మాట్లాడారు. సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది’ అని స్పష్టం చేశారు.చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారుఈ కేసును చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారు. చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య జరిగింది. వచ్చే ఎన్నికల వరకూ వివేకా కేసు సాగదీయాలనేది సునీత, చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబుకు రాజకీయంగా అవసరం ఉన్న సమయంలో సునీత బయటకొస్తారు. టాపిక్ డైవర్షన్ కోసం మీడియా ముందుకొచ్చి ఈ కేసు అంశాన్ని లేవనెత్తుతారు.వాటికి సునీత సమాధానం చెప్పలేదు..సీబీఐ స్టేట్మెంట్ తీసుకునే సమయంలో సునీతను లెటర్ గురించి అడిగారు. లెటర్ గురించి సీబీఐ అడిగిన ప్రశ్నలకు సునీత సమాధానం చెప్పలేదు.గతంలో సునీత మాటలను నేను కోర్టుకు సమర్పించాను. సునీత కీలక అంశాలను పక్కదారి పట్టించారు. చట్టం, ధర్మం, దేవుడిపై నాకు నమ్మకం ఉందిదస్తగిరి బెయిల్ రద్దు కాకుండా అడ్డుకుంటున్నారుసునీతకు దస్తగిరి అత్యంత ఆప్తుడు. దస్తగిరి బెయిల్ రద్దు కాకుండా సునీత అడ్డుకుంటున్నారు. దస్తగిరి తరఫున లూథ్రాను పెట్టి కేసు వాదనలు వినిపిస్తున్నారు. దస్తగిరి సీబీఐకి చెప్పిన స్టేట్మెంట్లో అనేక కీలక అంశాలున్నాయి. విచారణ సక్రమంగా చేయాలని సీబీఐ డైరెక్టర్కు చాలాసార్లు మొరపెట్టుకున్నా. మూడేళ్లుగా విచారణ సక్రమంగా జరగకుండా సునీత అడ్డుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిజం నిగ్గు తేలుతుంది. ఈ కేసును సీబీఐ, న్యాయస్థానం త్వరగా విచారణ పూర్తి చేయాలి’ అని కోరారు.రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటం..ఈ కేసుకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటపడుతున్నారన్నారు అవినాష్. ‘రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాట పడుతున్నారు. దస్తగిరి, డ్రైవర్ ప్రసాద్, రాజశేఖ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ను సునీత చదివారా?, హత్యకు ముందు రోజు రాజశేఖర్ను ఎందుకు శ్రీకాళహస్తికి పంపించారు. స్టేట్మెంట్లో రాజశేఖర్ అనేక విషయాలు చెప్పారు. చివరి రోజుల్లో వివేకానందరెడ్డిని మానసికంగా వేధించారు. డాక్యుమెంట్స్ కోసమే వివేకానందరెడ్డిన హత్య చేశామని దస్తగిరి చెప్పాడు. పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన లెటర్ను సునీత పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని మేం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం’ అని స్సష్టం చేశారు. ఆ కోణంలో ఎందుకు విచారణ చేయలేదు..?సిబిఐ వన్ సైడ్ గా దర్యాప్తు జరిపింది. హత్య జరిగిన రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. సాక్షులకు శిక్షణ ఇచ్చి నాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇప్పించారు. శివ ప్రకాష్ రెడ్డి తనకి ఫోన్ చేసి.. వివేకా కు గుండె పోటు అని చెప్పారు. గుండె పోటు వచ్చిందని థియరీ సృష్టించింది సునీతక్క, రాజశేఖర్ రెడ్డినే. దీనిపై ఎందుకు విచారణ అడగడం లేదు. వివేకాను ఆయన కుటుంబం వదిలేసింది. ఆయన చెక్ పవర్ తీసేశారు. షమీమ్, ఆమె కొడుకుకు ఆస్తులు పోవద్దనే వివేకాను హత్య చేసి ఉండవచ్చే కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదు. వివేకాది మర్డర్ ఫర్ ది గెయిన్ అనే కోణంలో ఎందుకు విచారణ చేయలేదు. ఈ అంశాలపై ప్రధాన మంత్రి, హోమ్ మంత్రికి లేఖ రాశాను’ అని అవినాష్ స్పష్టం చేశారు.
నేడు ఒంగోలు నేతలతో వైఎస్ జగన్ సమావేశం
రేపు తిరుమల జూన్ దర్శన కోటా విడుదల
ప్రగతి తెలంగాణే లక్ష్యం
రెండో తరగతి బాలికపై వృద్ధుడి అఘాయిత్యం
మొత్తానికి ఇలా ‘కూటమి’ కట్టారు!
10.40 దాటిన తర్వాత పంచ్ వేస్తే సెలవే..
అనుబంధాలకే ఆస్కారం
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు ‘సై’
ఆసుపత్రిపై దాడి.. 250 మంది మృతి
తిలక్ వర్మకు సీఎం అభినందన
శ్రీ పరాభవ నామ సంవత్సర (2026 – 27) రాశిఫలాలు
నా కూతుర్ని సినిమాల్లో ఊహించలేదు.. నాగార్జున వల్లే..
Hyderabad: మూతపడనున్న బావర్చి రెస్టారెంట్..!
భారత యుద్ధనౌకల మోహరింపు
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
ఏమీ తినకున్నా షుగర్ ఎందుకు పెరుగుతుంది?
మీరు ధర్మం సేయకున్నా పర్వాలేదు కానీ అప్పులు సేసి మానెత్తిన మాత్రం వేయకండి సార్.. పుణ్యముంటుంది!!
బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..
యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ గుడ్న్యూస్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
పైల్స్ నుంచి ఫ్రీ అవండి ఇలా...
నెతన్యాహు ఎక్కడ?
పద్మవ్యూహం అంటే..?
దేవుడు నాకిలా రాసిపెట్టాడు: పవన్ ఎమోషనల్
లక్షన్నర జీతం.. రూ.15 వేలు కూడా మిగల్లేదు!
అమెరికా అంచనాలు ఎలా తప్పాయ్? గల్ఫ్ భవిష్యత్తు ఏంటి?
ఇరాన్ మాజీ యువరాజు సంచలన ప్రకటన
గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. కేంద్రం కొత్త ఆదేశాలు
ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. మరో జలసంధి బంద్!
హెరిటేజ్కు సర్కారు రాయితీలు
నేడు ఒంగోలు నేతలతో వైఎస్ జగన్ సమావేశం
రేపు తిరుమల జూన్ దర్శన కోటా విడుదల
ప్రగతి తెలంగాణే లక్ష్యం
రెండో తరగతి బాలికపై వృద్ధుడి అఘాయిత్యం
మొత్తానికి ఇలా ‘కూటమి’ కట్టారు!
10.40 దాటిన తర్వాత పంచ్ వేస్తే సెలవే..
అనుబంధాలకే ఆస్కారం
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు ‘సై’
ఆసుపత్రిపై దాడి.. 250 మంది మృతి
తిలక్ వర్మకు సీఎం అభినందన
శ్రీ పరాభవ నామ సంవత్సర (2026 – 27) రాశిఫలాలు
నా కూతుర్ని సినిమాల్లో ఊహించలేదు.. నాగార్జున వల్లే..
Hyderabad: మూతపడనున్న బావర్చి రెస్టారెంట్..!
భారత యుద్ధనౌకల మోహరింపు
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
ఏమీ తినకున్నా షుగర్ ఎందుకు పెరుగుతుంది?
మీరు ధర్మం సేయకున్నా పర్వాలేదు కానీ అప్పులు సేసి మానెత్తిన మాత్రం వేయకండి సార్.. పుణ్యముంటుంది!!
బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..
యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ గుడ్న్యూస్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
పైల్స్ నుంచి ఫ్రీ అవండి ఇలా...
నెతన్యాహు ఎక్కడ?
పద్మవ్యూహం అంటే..?
దేవుడు నాకిలా రాసిపెట్టాడు: పవన్ ఎమోషనల్
లక్షన్నర జీతం.. రూ.15 వేలు కూడా మిగల్లేదు!
అమెరికా అంచనాలు ఎలా తప్పాయ్? గల్ఫ్ భవిష్యత్తు ఏంటి?
ఇరాన్ మాజీ యువరాజు సంచలన ప్రకటన
గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. కేంద్రం కొత్త ఆదేశాలు
ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. మరో జలసంధి బంద్!
హెరిటేజ్కు సర్కారు రాయితీలు
ఫొటోలు
‘ఉస్తాద్ భగత్సింగ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
OSCARS 2026 : ఆస్కార్ విజేతల జాబితా (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
వైట్ డ్రెస్లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
తెలంగాణ వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు (ఫొటోలు)
అల్లు సినిమాస్ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)
సినిమా
బాలీవుడ్ బ్యూటీ బర్త్ డే.. శ్రీనివాస మంగాపురం టీమ్ స్పెషల్ వీడియో
ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ మూవీకి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా తడానీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాతో నటి రాషా థడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో మంగ అనే పాత్రలో అభిమానులను మెప్పించనుంది. ఇప్పటికే 'ఉయి అమ్మ' అనే సాంగ్తో అందరి దృష్టిని ఆకర్షించింది.ఇవాళ బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఈ మూవీ సెట్లో రషా నటన, హవభావాలతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. అందరూ కలిసి రషాకు హ్యాపీ బర్త్ డే విష్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు ఇందులో ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్నిచందమామ కథలు బ్యానర్పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. Your smile is simple, but the magic is unforgettable ❤️🔥Happiest Birthday #RashaThadani 💐❤️🤩#SrinivasaMangapuram #JayaKrishnaGhattamaneni @themohanbabu @AshwiniDuttCh @gemini_kiran @gvprakash @CKPicturesoffl @VyjayanthiFilms @SwapnaCinema @AnandiArtsOffl pic.twitter.com/yrDAkbA3Ye— Ajay Bhupathi (@DirAjayBhupathi) March 16, 2026
నాలాగా మోసపోకండి.. నటుడి పోస్ట్ వైరల్
ప్రతి మనిషిలోనూ జాలి, కరుణ, దయ అనేది ఉంటుంది. ఇవే ఇప్పుడు మోసగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నాయి. సెంటిమెంట్తోనూ ‘కొట్టేస్తున్నారు’. తాజాగా నటుడు, దర్శకుడు దేవీప్రసాద్ కూడా ఇలానే మోసపోయాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదంటూ ఓ వ్యక్తి ఫోన్ చేస్తే.. రూ. 6వేలు ట్రాన్స్ఫర్ చేశాడట. ఆ తర్వాత కూడా పదే పదే డబ్బులు అడగడంతో అనుమానంతో ఆరా తీస్తే.. అతనో మోసగాడని తెలిసిందంట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. తనలాగా ఇంకెవరు మోసపోవద్దని దేవీప్రసాద్ కోరాడు.అసలేం జరిగింది?గత నెలలో దేవిప్రసాద్కు ఓ ఫోన్ కాల్ వచ్చిందట. ‘నమస్తేసర్. నేను లింగా... గుర్తున్నానా సర్’ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడట. శ్రీరంగనీతులు సినిమాలో మీతో కలిసి నటించాను అంటూ.. సెంటిమెంట్ డ్రామా స్టార్ట్ చేశాడట. ‘ఎలా చెప్పాలో అర్ధం కావటంలేదు సర్.కొన్నిరోజులుగా మలక్పేట యశోదాహాస్పిటల్ లో మా అమ్మగారు సీరియస్గా ఉన్నారు.మా దగ్గర డబ్బులు అయిపోయాయి .ఆరోగ్యశ్రీలాంటి కార్డులేవీలేవు. తెలిసినవాళ్ళు బెంగుళూరు షిఫ్ట్ చేస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయిస్తామన్నారు. అంబులెన్స్ కి 16 వేలు అడిగారు.పదివేలు దొరికాయి.6 వేలు తక్కువయ్యింది.టైమ్ లేదుసర్.ఏంచేయాలో అర్ధంకాక మీకు కాల్ చేశాను’ అని దీనంగా అడుగుతూ..ఆక్సిజన్ మాస్క్ఉన్న పెద్దావిడ ఫోటో,హాస్పిటల్లో ఓ ప్రదేశం ఫోటోలు పెట్టడంతో నిజమే అనుకొని దేవీప్రసాద్ రూ. 6 వేలు గూగుల్ పే ద్వారా పంపించారట.అలా దొరికిపోయాడుమరుసటి రోజు కూడా మళ్లీ కాల్ చేసి ఆపరేషన్ కోసం కొంత డబ్బులు కావాలని అడగడంతో దేవీప్రసాద్కి అనుమానం వచ్చిందట. శ్రీరంగనీతులు సినిమాకి పనిచేసినవాళ్ళకు కాల్ చేసి లింగారెడ్డి గురించి అడిగితే.. ఆ పేరుతో ఉన్నవాళ్లెవరు ఈ సినిమాలో పని చేయలేదని చెప్పారట. అంతేకాదు ఆ సినిమా పేరుచెప్పి రెండునెలలక్రితం హీరోని కూడా ఇలానే డబ్బులు అడిగారని చెప్పడంతో దేవికి అసలు విషయం తెలిసిపోయింది. మూడు రోజుల తర్వాత అవే ఫోటోలను పంపించి భాషా అనే నటుడి దగ్గర కూడా అలానే చెప్పాడట. అయితే దేవిప్రసాద్ ద్వారా భాషాకు ముందే అతని గురించి తెలియడంతో లొకేషన్ పెట్టమని అడిగాడట. అతను హైదరాబాద్లోని యశోదా హాస్పిటల్కి మూడు వీధుల అవతలున్న ఓ లొకేషన్ పెట్టాడట. వెంటనే దేవిప్రసాద్ ఫోన్ చేసి ఇప్పుడెక్కడున్నారు అని అడిగితే బెంగుళూరులో జయదేవ్ హాస్పిటల్లో ఉన్నాం, ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పాడట. దీంతో దేవిప్రసాద్ అతనిపై సీరియస్ అయ్యాడట. ఇలా తల్లిసెంటిమెంట్తో తనని మోసం చేశాడని.. తనలాగా ఎవరూ మోసపోవద్దనే ఈ పోస్ట్ పెడుతున్నానంటూ జరిగిన విషయం మొత్తం రాసుకొచ్చాడు.
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావు ఫోటో.. ఎందుకంటే?
ఆస్కార్ అవార్డుల వేడుక గ్రాండ్గా జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్లోని డాల్బీ థియేటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ దిగ్గజాలకు నివాళులర్పించారు. సినీ రంగంలో విశేషంగా రాణించిన టాలీవుడ్ దివంగత నటుడు కోట శ్రీనివాసరావును స్మరించుకున్నారు. ఆయనతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి లాంటి నటులకు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు. ఈ సినీ దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేకంగా పొందుపరిచారు.వెండితెరపై తమదైన నటన, హావభావాలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న వీరికి ఘనంగా నివాళులర్పించింది ఆస్కార్ వేదిక. తెలుగు వెండతెరపై దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ కలిగిన కోట శ్రీనివాసరావు గతేడాది జులై 13న మరణించారు. ఆ తర్పాత 89 ఏళ్ల వయసులో ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. గతేడాది నవంబర్ 24న ఆయన మరణించారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం.. ధర్మేంద్రను పద్మ విభూషణ్తో సత్కరించింది.అయితే ఆస్కార్ వేడుక ప్రారంభంలో గతేడాది మరణించిన హాలీవుడ్ ప్రముఖులకు నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు.సినీ రంగానికి వారి సేవలను స్మరించుకుంటూ వారితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ వీడియోలో ధర్మేంద్రను చూపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ నెట్టింట అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్లు పెట్టారు. సమయాభావం వల్ల వీడియోలో కొందరినే చూపారని.. ఆ తర్వాత అందరి పేర్లను అఫీషియల్ సైట్లో ఉంచామని హాలీవుడ్ మీడియా క్లారిటీ ఇచ్చింది.
ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 17 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ వీక్లో పెద్ద సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. బాలీవుడ్ నుంచి దురంధర్-2, టాలీవుడ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే దురంధర్ బాక్సాఫీస్ను షేర్ చేయగా సీక్వెల్గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయానికొస్తే టాలీవుడ్లో మాత్రమే కాస్తా బజ్ ఉంది. అంతకుమించి ఈ మూవీపై పెద్ద అంచనాల్లేవు.ఇక ఈ వారం ఓటీటీల విషయానికొస్తే చాలా సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేయనున్నాయి. వీటిలో టాలీవుడ్ నుంచి సీతాపయనం, జటాధర, బాలీవుడ్ మూవీ బోర్డర్-2 స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే జటాధర ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. తాజాగా జీ5లో కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు చిరాయ, ల్యాండ్ లార్డ్ లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..రేడియోయాక్టివ్ ఎమర్జన్సీ(వెబ్ సిరీస్)- మార్చి 18ప్యూరియస్ సీజన్-2- (వెబ్ సిరీస్)- మార్చి 18పీకీ బ్లైండర్స్ ది ఇమ్మార్షల్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- మార్చి 20బోర్డర్-2(హిందీ మూవీ)- మార్చి 20ది రైజ్ ఆఫ్ ది రెడ్హాట్ చిల్లి పెప్పర్స్(డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20 ఏ డిఫరెంట్ మ్యాన్ (హాలీవుడ్ సినిమా)- మార్చి 20అమెజాన్ ప్రైమ్..ఇన్విసిబుల్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 18ది హౌస్మెయిడ్(హాలీవుడ్ మూవీ)- మార్చి 19డెడ్ లాక్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 20 అమోర్ యానిమల్ (వెబ్ సిరీస్): మార్చి 20జీ5..ల్యాండ్ లార్డ్(డబ్బింగ్ సినిమా)- మార్చి 19కాసర్గడ్ ఎంబసీ(డబ్బింగ్ మూవీ)- మార్చి 20జటాధర(తెలుగు సినిమా)- మార్చి 20జియో హాట్స్టార్..చిరైయా(హిందీ మూవీ)- మార్చి 20యాపిల్ టీవీ..ఇమ్పర్ఫెక్ట్ ఉమెన్(హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ).. మార్చి 18సోనీ లివ్..జజ్ సిటీ(బెంగాలీ మూవీ)- మార్చి 19సన్ నెక్ట్స్..సీతా పయనం (తెలుగు సినిమా)- మార్చి 20
క్రీడలు
‘పీసీబీవన్నీ దిక్కుమాలిన నిర్ణయాలు’!
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లాతో సిరీస్ ఓటమి అనంతరం షాహిద్ అఫ్రిది పీసీబీని ఏకిపారేస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియో పోస్టును షేర్ చేసుకున్నాడు. అఫ్రిది మాట్లాడుతూ.. ‘బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ ఓటమికి పూర్తి బాధ్యత సెలక్షన్ కమిటీదే. ఆదివారం నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్ బ్యాటర్ సల్మాన్ అఘా ఒంటరి పోరాటం చేసినప్పటికీ లాభం లేకపోయింది. నాయకుడిగా అంతగా అనుభవం లేని తన అల్లుడు షహీన్ అఫ్రిదికి ఎందుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారో చెప్పాలి. బాబర్ ఆజమ్ లాంటి అనుభవమున్న ఆటగాడిని జట్టు నుంచి తప్పించి పెద్ద తప్పిదమే చేశారు. కెప్టెన్గా అతనికి మంచి రికార్డు ఉంది. కనీసం ఆటగాడిగా జట్టులో చోటు కల్పిస్తే కనీసం సలహాలు ఇచ్చి ఉండేవాడు. టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచి కనీసం సెమీస్ చేరడంలో విఫలమైంది. తాజాగా బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను 2-1తేడాతో కోల్పోవడం చూస్తుంటే ఇదంతా సెలక్షన్ కమిటీ తప్పిదమేని క్లియర్గా తెలుస్తోంది. అసలు ఏ ఫార్మాట్కు ఎవరిని కెప్టెన్ చేయాలన్న విషయం కూడా పీసీబీ అవగాహన లేకపోవడం సిగ్గుచేటు. జాతీయ జట్టుకు సర్జరీ అనే పేరుతో మార్పులు అంటూ ఇప్పటికే చాలా చేశారు. అనుభవమున్న క్రికెటర్లను పక్కనబెట్టి కేవలం కొన్ని ఫస్ట్క్లాస్ మ్యాచ్ు ఆడిన యువ క్రికెటర్లను తీసుకోవడం ఎంతవరకు సమంజసమో చెప్పాలి. దేశవాలీ క్రికెట్ పరిస్థితి రోజురోజుకు అగమ్యగోచరంగా తయారవుతుంది. పాక్ జాతీయ జట్టుకు నాణ్యమైన క్రికెటర్లను అందించే స్థాయి ఎప్పుడో కనుమరుగైంది. పీసీబీ తీసుకుంటున్న దిక్కుమాలిన నిర్ణయాలతో పాక్ క్రికెట్ను భ్రష్టు పట్టించింది. ఇది ఇలాగే కొనసాగుతూ పోతే ప్రతీ టోర్నీలో అపజయాలే ఎదురయ్యే అవకాశాలున్నాయి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్లో సూపర్-8 దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by ASports (@asportstv.pk)చదవండి: ఆర్సీబీ అభిమానులకు శుభవార్త!
ఆర్సీబీ అభిమానులకు శుభవార్త!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతించింది. గత సంవత్సరం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విధాన సౌధలో హోంమంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ మ్యాచ్లకు ఈ వేదిక ఆతిథ్యం ఇవ్వనుంది. ఆర్సీబీ జట్టు చిన్నస్వామి స్టేడియంలో 5 లీగ్ మ్యాచ్లు ఆడనుంది. అలాగే రెండో హోమ్ గ్రౌండ్ రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణసింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండు లీగ్ మ్యాచ్లు ఆడనుంది. ఐపీఎల్లో ఒక ప్లేఆఫ్ మ్యాచ్ను బెంగళూరులో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.గత సంవత్సరం జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో, జస్టిస్ కున్హా నివేదిక సిఫార్సులను అనుసరించి, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు క్రౌడ్ మేనేజ్మెంట్, భద్రతా చర్యలను ప్రవేశపెట్టినట్లు కార్యదర్శి సంతోష్ మీనన్ వెల్లడించారు.ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ సందర్భంగా 35 వేల మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు. చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి మ్యాచ్కు మూడు నుంచి నాలుగు గంటల ముందే స్టేడియం గేట్లను తెరుస్తారు. మహిళలు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. మ్యాచ్ టిక్కెట్ కలిగి ఉన్న వారికి బెంగళూరు మెట్రోలో ఉచిత ప్రయాణ వసతి కల్పించనున్నారు.చదవండి: రోహిత్, కోహ్లీతో విభేదాలు.. మౌనం వీడిన గంభీర్!
రోహిత్, కోహ్లీతో విభేదాలు.. మౌనం వీడిన గంభీర్!
టీమిండియా స్టార్క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మెరుగైన సంబంధాలు కొనసాగించలేదా అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఎందుకంటే గంభీర్ కోచ్గా వచ్చిన కొద్ది రోజులకే బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ వైఫల్యం అనంతరం రోహిత్, విరాట్లు ఏకకాలంలో టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ ఇద్దరు టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలకడానికి ఒకరకంగా గంభీరే కారణమని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా కోల్కతాలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి అతిథిగా హాజరైన గంభీర్ చాలా విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీతో ఉన్న బంధాన్ని నేరుగా కాకుండా పరోక్షంగా ప్రస్తావించడం ఆసక్తి కలిగించింది. ‘మనిషిగా నేను తప్పులు చేయడం సహజం. కోచ్ పాత్రలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతాయి. అలాగే ఆటగాళ్లు కూడా తప్పులు చేయడం జరుగుతుంటుంది. గత 18 నెలల్లో కోచ్గా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దాని గురించి పెద్దగా పట్టించుకోను. సోషల్ మీడియాలో నేను కోహ్లి, రోహిత్లకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి కామెంట్కు సమాధానం ఇవ్వడం నా పని కాదు. భారత జట్టు నా ఒక్కడిదే కాదు.. అది డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నవాళ్లతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరిది. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా నమ్ముతా. అదేంటంటే కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో తీసుకునే నిర్ణయాలు విఫలం కావొచ్చు. కానీ తప్పుడు ఉద్దేశంతో కూడిన తప్పుడు నిర్ణయాలు మాత్రం డ్రెస్సింగ్ రూమ్లో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. పని విషయంలో నేను నిజాయితీగా ఉన్నంతవరకు, ఎదుటివారి కళ్లలోకి చూస్తూ ధైర్యంగా మాట్లాడగలను. నా తప్పు లేనంత వరకు అన్ని విషయాల్లో కఠినంగానే ఉంటాను.’అని గంభీర్ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ల ఓటమి తర్వాత కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలను బీసీసీఐ సమీక్షకు పిలిచింది. ఆ సమయంలో టీమిండియా ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకుంటూ బోర్డు అనేక మార్గదర్శకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని గంభీర్ స్వాగతించగా, రోహిత్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అప్పుడే రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్గా వైదొలగాలని బోర్డు ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికే రోహిత్ శర్మ, కోహ్లీలు టెస్టు కెరీర్కు గుడ్బై చెప్పారు. రోహిత్ టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు శుబ్మన్ గిల్కు అప్పగించారు. గిల్ కెప్టెన్సీలో ఇంగ్లండ్, వెస్టిండీస్లపై టెస్టు సిరీస్లు నెగ్గినప్పటికీ, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో మిశ్రమ ఫలితమే వచ్చింది. ఇక కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు అంతర్జాతీయ కెరీర్కు గుడ్బై చెప్పే అవకాశముంది.🚨 BREAKING & EXCLUSIVE 🚨 "I am human, I am allowed to make mistakes": Gautam Gambhir opens up on dressing room relationships. He also shares his views on Rohit Sharma-Virat Kohli@AgeasFederal #GautamGambhir #Trailblazers4 pic.twitter.com/alsJdNHvm4— RevSportz Global (@RevSportzGlobal) March 16, 2026
అవకాశమొస్తే ఆడకుండా ఉంటానా?
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్లో టీమిండియా టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ధోనీ, రోహిత్ శర్మ తర్వాత టీ20 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్గా సూర్యకుమార్ అరుదైన ఘనత సాధించాడు.క్రికెట్లో మూడు ఫార్మాట్లు ఆడాలనే కల ఏ క్రికెటర్కైనా ఉంటుంది. సూర్య జట్టులోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ కేవలం టీ20లకే పరిమితం కావడం కొంతమేర ఆశ్చర్యం కలిగిస్తుంది. కెరీర్ ఆరంభంలో వన్డేలతో పాటు ఏకైక టెస్టు మ్యాచ్ ఆడిన సూర్యకుమార్ ఆ తర్వాత టీ20 స్పెషలిస్ట్గానే ముద్ర వేసుకున్నాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ తాను వన్డేలు, టెస్టు మ్యాచ్లు ఆడకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. ‘ఏది రాసిపెట్టి ఉంటే జీవితంలో అదే జరుగుతుంది. తొలుత నేను క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పుడు రెడ్బాల్ క్రికెట్ ఆడా. దాదాపు పదేళ్లు రంజీ ట్రోఫీలో ఆడాను. ముంబైకి ప్రాతినిధ్యం వహించాను. ఇక్కడ ప్రతి ఒక్కరూ రెడ్బాల్ క్రికెట్తోనే మొదలుపెడతారు. క్రమంగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆట వైపు వచ్చినప్పుడు ఇక్కడే సౌకర్యంగా అనిపించింది. మరీ ముఖ్యంగా టీ20లకు బాగా సెట్ అయ్యా. వన్డేల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. నాకు టెస్టు క్రికెట్పై ప్రేమ లేదని చెప్పను. ఎందుకంటే 2010 నుంచి 2020 వరకూ రంజీల్లో ఆడా. ఆ ఫార్మాట్ను ఆస్వాదించా. ఎవరైనా సరే టెస్టు క్రికెట్ ఆడే అవకాశం వస్తే వద్దంటారా చెప్పండి? అయితే నాకున్న క్రికెట్ అనుభవం ప్రకారం ఈ ఫార్మాట్లో మూడు భిన్నమైన మార్గాల్లో ఆడాల్సి ఉంటుంది.కొన్నిసార్లు త్వరగా వికెట్లు పడి ముందుగా క్రీజులోకి వెళ్తే టెస్టుల్లో మాదిరిగా నెమ్మదిగా ఆడాలి. మధ్య ఓవర్లలో స్ట్రైక్ట్ పెంచుకుంటూ పోవాలి. ఇక ఆఖర్లో టీ20ల మాదిరిగా చెలరేగాలి. అందుకేనేమో నాకు ఈ వన్డే ఫార్మాట్ సరిగా అర్థం కాలేదు అనిపిస్తుంది. నేను వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆడాను.అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కింది. మూడు ఫార్మాట్లకు ఉన్న ఆకర్షణ పూర్తిగా భిన్నమైంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక సూర్యకుమార్ ఇప్పటివరకు ఒక టెస్టు మ్యాచ్ ఆడి 8 పరుగులు, 37 వన్డేల్లో 773 పరుగులు సాధించాడు. ఇక 113 టీ20ల్లో 3,272 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలున్నాయి.చదవండి: రెండు ముక్కల్లో విషెస్.. ట్రోల్కు గురైన బుమ్రా!
న్యూస్ పాడ్కాస్ట్
తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ గుట్టు రట్టు... డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్గా నిర్ధారణ
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రం... ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా భీకర దాడులు
రైతులతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొండాట.. పేరుకే అన్నదాత సుఖీభవ, ఆచరణలో అంతా మోసం
విలువలు, విశ్వసనీయతకు వైఎస్సార్సీపీ మారుపేరు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఆదాయం... కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఇక్కడ బాబు, అక్కడ BR నాయుడు కోట్లల్లో భారీ స్కాం
పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు..ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
బిజినెస్
గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌలకు ఎంత డిమాండో!!
ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రమైంది. దీంతో ఇండక్షన్ స్టౌలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే.. ఇండక్షన్ స్టౌల కొరత పెరగడంతో.. ఇప్పటికిప్పుడు వాటిని తయారు చేసే పరిస్థితులు లేవని, చైనా నుంచి ముడిపదార్థాలు దిగుమతి అవ్వడానికి 45 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. ఇండక్షన్ స్టౌల లభ్యత భారీగా తగ్గిపోవడానికి కారణాలేమిటి? వరుస పండగల వేళ.. పౌరుల పరిస్థితి ఏమిటి?500 శాతం డిమాండ్ హిందువులకు నూతన సంవత్సరమైన ఉగాది.. అదేవిధంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకొనే రంజాన్ మరో మూడునాలుగు రోజుల్లో రానున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాపై ప్రతికూల ప్రభావం పడడంతో పండుగ పూట పిండివంటలు చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎల్పీజీ సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే హాస్టళ్లలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి.హోటళ్లలో దోశ, పూరీ, మైసూర్ బజ్జీ వంటి పదార్థాలు అందుబాటులో లేకుండా పోయాయి. కార్పొరేట్ సంస్థలు, ఐటీ సంస్థల్లోని క్యాంటీన్లు కూడా మూతపడ్డాయి. గృహావసరాల సిలిండర్ సరఫరాలో ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. బుక్ చేసిన వారం పది రోజులకు గానీ గ్యాస్ బండ అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అటు ఆన్లైన్లో ఈ-కామర్స్ ప్లాట్ ఫారాల్లో.. ఇటు ఆఫ్లైన్లో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ షోరూంలలో కూడా ఇండక్షన్ స్టౌల కొరత నెలకొంది. ఇండక్షన్ స్టౌల కోసం ఒక్కసారిగా 500 శాతం దాకా డిమాండ్ పెరిగిందని డీలర్లు చెబుతున్నారు.ఇప్పటికిప్పుడు ఇండక్షన్ స్టౌల ఉత్పత్తిని పెంచొచ్చా?ఇండక్షన్ స్టౌల తయారీలో కీలకమైన ముడి పదార్థాలు చైనా నుంచి వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్పత్తిదారులు ముడిపదార్థాల కోసం ఇప్పటికిప్పుడు ఆర్డరిచ్చినా.. అవి భారత్కు చేరడానికి కనీసం 45 రోజుల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క ఇండక్షన్ స్టౌ అని కాకుండా.. ఎయిర్ ఫ్రయ్యర్లు, ఓటీజీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, సోలార్ కుక్కర్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణం భోపాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యపట్టణం లఖ్నవూల్లో దాదాపుగా ఇండక్షన్ స్టౌలకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండక్షన్ స్టౌల కోసం డిమాండ్ బాగా పెరిగింది. ధరలు కూడా పైపైకి వెళ్తున్నాయి. నెల క్రితం వరకు 2,200 రూపాయలకు దొరికే ఇండక్షన్ స్టౌ ధర ఇప్పుడు 3 వేల రూపాయలకు చేరుకుంది. ఫిలిప్స్ కంపెనీకి చెందిన ముంబై బ్రాంచ్ మేనేజర్ వివేక్ గౌర్ కూడా దీనిపై స్పందించారు. ఎల్పీజీ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు వెల్లడించారు. డిమాండ్ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుందన్నారు. భోపాల్లోని ఉషా ఇంటర్నేషనల్ డిప్యూటీ సేల్స్ మేనేజర్ వినీత్ శర్మ కూడా సాక్షితో మాట్లాడుతూ నెలకు సగటున వెయ్యి యూనిట్ల మేర ఇండక్షన్ స్టౌల విక్రయాలు జరిగేవని... ఇప్పుడు రోజుకు 10 వేల యూనిట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఇప్పటికిప్పుడు ఉత్పత్తిని పెంచడానికి ముడిపదార్థాల అవసరం ఉంటుందని, అందుకు చైనానే మార్గమని చెబుతున్నారు. ముఖ్యంగా ఇండక్షన్ స్టౌ తయారీలో ఉపయోగించే హీట్ ప్లేట్లు చైనా నుంచి వస్తాయి. కంట్రోలింగ్ వ్యవస్థ, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం భారత్ ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు ఆ పదార్థాల కోసం 45 రోజుల పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది.ఏయే రంగాలపై ప్రభావం?గ్యాస్ కొరత దాదాపు అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ఉత్తరాది కార్మికులు ఎక్కువగా పనిచేస్తుంటారు. వీరికి రెగ్యులర్ ఎల్పీజీ కనెక్షన్లు ఉండవు. చిన్న సిలిండర్లతో వంటలు చేసుకుంటారు. సాధారణంగా 650 నుంచి 750 వరకు 5 కేజీల చిన్న సిలిండర్ల రీఫిలంగ్ చార్జీలుంటాయి. గడిచిన 15 రోజులుగా మార్కెట్లో చిన్న సిలిండర్ల రీఫిల్లింగ్ జరగడం లేదు. దీంతో వాళ్లంతా స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా హోటల్ రంగంపై సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీని ప్రభావం పర్యాటకరంగంపై పడుతుంది. ఇండక్షన్ స్టౌలు ఇళ్లలో వంటకు సరిపోతాయే తప్ప.. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో వంటకు పెద్దగా ఉపయోగపడవు.రాబోయే పండుగలపై ఈ ప్రభావం ఎలా ఉండనుంది?ఉగాదికి భక్ష్యాలు చేయడం ప్రత్యేకత. దీంతోపాటు.. కొత్త మామిడికాయలతో చేసే పులిహోర, పంచభక్ష్య పలహారాలను దేవుడికి నివేదన చేయడం తెలుగువారి సంప్రదాయం. అదేవిధంగా రంజాన్ ఈద్ సందర్భంగా షీర్కుర్మా, ఇతర వంటకాలు చేయడం ఆనవాయితీ. దీంతో.. గ్యాస్ కొరత, ఇండక్షన్ స్టౌల లభ్యత లేకపోవడం ఈ పండుగలపై తీవ్రంగా కనిపించనుంది. ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు.. అంటే మార్చి 27న శ్రీరామ నవమి, ఏప్రిల్ 3న గుడ్ఫ్రైడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి.ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పండుగల నేపథ్యంలో సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రానికి లేఖ రాశారు. జిల్లాల స్థాయిలో గ్యాస్ సరఫరాను స్వయంగా కలెక్టర్లు మానిటర్ చేస్తున్నారు.
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కేటాయింపు షురూ
దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ విభాగాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ ప్రక్రియను వివిధ రాష్ట్రాలు ప్రారంభించాయి. ఢిల్లీ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కేటాయింపులు అమల్లోకి వచ్చాయి.ప్రాధాన్యత క్రమంలో పంపిణీప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) రోజువారీ సగటు వినియోగంలో 20 శాతం మేర నియంత్రిత పంపిణీ కోసం కేటాయించాయి. ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో రోజుకు సుమారు 1,800 సిలిండర్లను ఈ విధానం కింద పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంపిణీలో ఐదు స్థాయిల ప్రాధాన్యతను నిర్ణయించారు:స్థాయి 1, 2: విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వేలు, విమానాశ్రయాలకు అత్యున్నత ప్రాధాన్యత.స్థాయి 3: రెస్టారెంట్లు, భోజనశాలలకు 42 శాతం వాటా.స్థాయి 4: హోటళ్లు, గెస్ట్ హౌస్లు, ట్రస్టులకు 4 శాతం కేటాయింపు.స్థాయి 5: డెయిరీలు, బేకరీలు, స్వీట్ షాపులకు 11 శాతం కేటాయింపు.రాష్ట్రాల వారీగా..కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికే ఢిల్లీ, బిహార్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాలు అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. గృహ వినియోగ గ్యాస్ మళ్లింపును అరికట్టడానికి, వాణిజ్య అవసరాలకు అంతరాయం కలగకుండా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ఈ నూతన విధానం వల్ల పండుగల సీజన్లో, రద్దీ సమయాల్లో వాణిజ్య గ్యాస్ కొరత తలెత్తకుండా ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష
లక్షన్నర జీతం.. రూ.15 వేలు కూడా మిగల్లేదు!
బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అధిక జీతాలు ఉన్నప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా నెలాఖరుకు పెద్దగా పొదుపు మిగలకపోవడం చాలా మంది ఉద్యోగుల వాస్తవ పరిస్థితిగా మారుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపించింది.తన బంధువు అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో ఓ యూజర్ పంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్లో పట్టభద్రుడైన అతని బంధువు మొదటి సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగం కోసం నెలకు రూ.1.5 లక్షల జీతంతో బెంగళూరుకు వెళ్లాడని చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అతను పెద్ద విజయాన్ని సాధించాడని భావించినప్పటికీ, కొన్ని నెలల తర్వాత నగర జీవన వ్యయం ఎంత భారంగా ఉంటుందో అతనికి అర్థమైంది.వచ్చే జీతంలో దేనికి ఎంత ఖర్చు అవుతోందన్నది ఆయన వివరంగా తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఇంటి అద్దె: ఆఫీస్కు సమీపంలోని చిన్న అపార్ట్మెంట్కు సుమారు రూ.36,000కిరాణా సామాగ్రి: రూ.13,000 – రూ.15,000ప్రయాణ ఖర్చులు: ట్రాఫిక్ కారణంగా క్యాబ్లు, ఆటోల కోసం రూ.6,000 – రూ.8,000ఇతర ఖర్చులు: ఆన్లైన్ ఫుడ్, కాఫీ, వీకెండ్ విహారాలు కోసం రూ.10,000 – రూ.12,000ఇవి కాకుండా సబ్స్క్రిప్షన్లు, వైద్య ఖర్చులు, అనుకోని బిల్లులు, అలాగే ఇంటికి డబ్బు పంపడం వంటి ఖర్చులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ అన్ని ఖర్చుల తర్వాత నెలాఖరుకు అతనికి కేవలం రూ.15,000 నుంచి రూ.20,000 వరకు మాత్రమే పొదుపు మిగులుతుందని తెలిపారు.ఈ అనుభవం ద్వారా అతను ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడని పోస్టులో పేర్కొన్నారు. “సొంతూరులో నెలకు రూ.1 లక్షకుపైగా జీతం చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ బెంగళూరు వంటి మెట్రో నగరంలో అదే జీతం కేవలం ప్రారంభ స్థాయి మాత్రమే” అని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియాలో భిన్న స్పందనలుఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వేలల్లో వ్యూస్, వందలాది లైక్లను సాధించింది. చాలా మంది నెటిజన్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. “సొంతూరులో అదే జీతంతో ఎక్కువగా పొదుపు చేయవచ్చు”, “పెద్ద నగరాలు మీకు తెలియకుండానే డబ్బును వేగంగా ఖర్చు చేయిస్తాయి” అని కొందరు వ్యాఖ్యానించగా “సరైన ఎంపికలు చేస్తే ఖర్చులను నియంత్రించుకోవచ్చు” అని మరో యూజర్ కామెంట్ చేశారు.
కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష
పశ్చిమ ఆసియా సంక్షోభం కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, భారతీయ కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి స్థాయి అనిశ్చితిని సృష్టించిన ఈ పరిణామాలను ఎదుర్కోవడంలో కార్పొరేట్ కంపెనీల సీఈఓలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేక కథనం.మునుపెన్నడూ లేని సవాలుసాధారణంగా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు కంపెనీల అధినేతలు గత చరిత్రను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ప్రస్తుత పశ్చిమ ఆసియా సంక్షోభం అసాధారణమైంది. గత అనుభవాలేవీ దీనికి సరిపోలవు. ఈ నేపథ్యంలో వ్యాపార రంగానికి పొంచి ఉన్న ప్రధాన ముప్పులు కింది విధంగా ఉన్నాయి.ముడి చమురు ధరల పెరుగుదల వల్ల పెట్రోల్ నుంచి ఎరువుల వరకు అన్ని ఉత్పత్తుల ధరలు భారమవుతాయి.ఎఫ్ఎంసీజీ రంగంలో ప్యాకేజింగ్ ఖర్చు 10% కంటే ఎక్కువగా ఉంటుంది. పెట్రో-డెరివేటివ్స్ ధరలు పెరగడం వల్ల ఈ వ్యయం మరింత భారం కానుంది.కొవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గ్లోబల్ సప్లై చైన్ మళ్లీ సంక్షోభంలో పడింది. పశ్చిమ ఆసియా మీదుగా సాగే రవాణా మార్గాలపై అనిశ్చితి నెలకొంది.గల్ఫ్ దేశాల నుంచి భారత్కు వచ్చే పెట్టుబడులు, రెమిటెన్స్లు తగ్గే అవకాశం ఉంది. ఇది భారతీయ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.దుబాయ్ వంటి పర్యాటక కేంద్రాలకు డిమాండ్ తగ్గి విమాన ప్రయాణాలు మరింత భారంగా మారుతాయి.బంగారం ధరలు తగ్గడం, విలాసవంతమైన బ్రాండ్ మార్కెట్ దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి.సీఈఓల వ్యూహరచన.. ఏం చేయాలి?వినియోగదారుడి కొనుగోలు శక్తిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు తమ కార్యాచరణను మార్చుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రాబడిని అందించే వినియోగదారుడిని కాపాడుకోవడం ముఖ్యం. ధరలు పెంచడం లేదా ఉత్పత్తి పరిమాణాన్ని తగ్గించడం వంటి పనులు చేయకపోవడమే మంచిది. ఇది దీర్ఘకాలంలో బ్రాండ్ విలువను దెబ్బతీస్తుంది.వ్యయ నియంత్రణఉద్యోగులను తొలగించడం కంటే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. అవసరంలేని ఇన్వెంటరీ, ఎంతోకాలంగా జాప్యం జరుగుతున్న నిర్ణయాలు, భారీ అప్పులపై వడ్డీలను తగ్గించుకోవాలి. సిబ్బంది సంఖ్యను కత్తిరించకుండానే 20% ఖర్చులను తగ్గించే ప్రణాళికలు సిద్ధం చేయాలి.కాలానుగుణంగా ప్రణాళికలురాబోయే 30 రోజులు, 90 రోజులు, 300 రోజులకు స్పష్టమైన కార్యాచరణ ఉండాలి. దీన్ని ఉద్యోగులందరికీ వివరించాలి. వారిలో భయాందోళనలు కలగకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలి. నగదు నిల్వలను కాపాడుకోవడం ముఖ్యం. అదే సమయంలో జీతాల్లో కోతలు విధించకూడదు.బ్యాంకులు, ప్రభుత్వంతో సమన్వయంఇది అసాధారణ పరిస్థితి కాబట్టి బ్యాంకుల నుంచి రుణాల చెల్లింపు గడువును, మూలధన అవసరాలను పునర్వ్యవస్థీకరించుకోవాలి. అలాగే, పరిశ్రమ వర్గాలన్నీ ఏకమై ప్రభుత్వం నుంచి అవసరమైన రాయితీలు, మద్దతు కోరాలి.ఈ సంక్షోభ సమయంలో సీఈఓలు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరగడం, మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి రావడం వంటి మార్పులను అందిపుచ్చుకోవాలి. తిరిగి పోటీలో నిలబడగలిగే సామర్థ్యాన్ని కాపాడుకోవడమే ప్రస్తుత అసలైన నాయకత్వ లక్షణం.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం
ఫ్యామిలీ
మూడువేల అడుగుల లోతుల భూగర్భంలో మారథాన్..! 18 దేశాలు..
సాధారణ పరిస్థితుల్లో మారథాన్ చేయడమే కష్టం. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భంలో మారథాన్ అంటే..సవాలు ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి భయానక పరిస్థితులను తట్టుకుని విజయవంతంగా అత్యంత లోతైన భూగర్భంలో మారథాన్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించి.. అరుదైన ఘనతను రన్నర్ నమోదు చేశారు . ఈ అసాధారణ మారథాన అక్టోబర్ 25, 2025న స్వీడన్లోని గార్పెన్బర్గ్లో జరిగింది.తలకు హెడ్ల్యాంప్లు ధరించి షూలేస్లను గట్టిగా కట్టి ..రన్నర్లు అత్యంత లోతైన భూమి లోపల ఈ ప్రత్యేకమైన రేసుని పూర్తి చేశారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 1,118.56 మీటర్లు (3,669 అడుగుల 10 అంగుళాలు) లోతులో జరిగిన సర్టిఫైడ్ మారథాన్లో దాదాపు 18 దేశాల నుంచి యాభైఐదు మంది రన్నర్లు పాల్గొన్నారు. ఇక్కడ వాతావరణం వేడిగా, తేమగా, కొద్దిగా దుమ్ముతో కూడినది. ఇక ఈ రేసు జరిగిన లోతుని గురించి చెప్పాలంటే..ఈ భూగర్భ స్థాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏంజెల్ జలపాతం, స్కాట్లాండ్లోని UKలోని ఎత్తైన పర్వతం బెన్ నెవిస్ కిందగా ఎంతో లోతు ఉంటుందో అంత లోతైనదిగా గుర్తించారు. ఈ మారథాన్ని బికమింగ్ఎక్స్ (యూకే), ఐసిఎంఎం (యూకే), బోలిడెన్ (స్వీడన్) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ మారథాన్తో దాదాపు రూ. 8 కోట్ల డబ్బుని సేకరించారు. వీటిని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ మారథాన్ రైసుతో మరో ప్రపంచ రికార్డుని కూడా నమోదు చేశారు. అదేంటంటే ఈ రన్నర్లు లోతైన భూగర్భ మారథాన్ దూరం వచ్చేసి 1,082.30 మీటర్ల (3,550 అడుగుల 10 అంగుళాలు) రన్ చేసి మరో రికార్డుని క్రియేట్ చేశారు. ఈ మేరకు ఈ మారథాన్ని నిర్వహించిన బికమింగ్ఎక్స్ సహ వ్యవస్థాపకుడు బేర్ గ్రిల్స్ మాట్లాడుతూ..వందల మీటర్ల భూగర్భంలో మారథాన్ను నిర్వహించడం అసాధారణమైన ఘనత అని, అయినప్పటికీ అది సాధ్యమయ్యే పరిధిలో ఉండేలా చూసుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు. సాధారణ పరిస్థితుల్లో కూడా మారథాన్ సహజంగానే కష్టమైనది, అలాంటి కఠినమైన వాతావరణంలో ఈ మారథాన్ రేసులో పాల్గొనడం అనేది తీవ్రమైన ఒత్తిడి అధిగమించే సవాలుగా పేర్కొన్నారు.(చదవండి: అదే అసలైన కాన్ఫిడెన్స్..!)
అదే అసలైన కాన్ఫిడెన్స్..!
కాన్ఫిడెన్స్ అంటే ఎదుటివారిని డామినేట్ చేయడం లేదా గట్టిగా అరవడమని చాలామంది అనుకుంటుంటారు. కానీ సైకాలజీలో కాన్ఫిడెన్స్ అంటే "నేను గొప్పవాడిని" అని అరుచుకోవడం కాదు, "నేను దేనినైనా ఎదుర్కోగలను" అని మనసులో ఉండే 'Self-Efficacy' (ఆత్మసామర్థ్యం). దీనికి గర్వానికి (Arrogance) మధ్య ఉన్న తేడాను గుర్తించడమే అసలైన వ్యక్తిత్వ వికాసం. అసలైన కాన్ఫిడెన్స్ ఒక 'నిశ్శబ్ద బలం' (Silent Strength).1. Albert Bandura సిద్ధాంతంకాన్ఫిడెన్స్ అనేది ఒక పుట్టినప్పుడు వచ్చే లక్షణం కాదు. ఆల్బర్ట్ బాండూరా అనే సైకాలజిస్ట్ దీనిని 'Self-Efficacy' అని పిలిచారు. దీనికి నాలుగు మూలస్తంభాలు ఉన్నాయి.Mastery Experiences: మీరు ఒక పనిని పదే పదే చేసి, అందులో నైపుణ్యం సంపాదించినప్పుడు వచ్చే నమ్మకం.Vicarious Experiences: మీలాంటి వారే ఒక పనిని సాధించడం చూసి, "అతనే సాధించగలిగినప్పుడు నేను ఎందుకు సాధించలేను?" అని అనుకోవడం.Social Persuasion: మీపై నమ్మకం ఉన్నవారు మిమ్మల్ని ప్రోత్సహించడం.Physiological States: మీ శరీరంలోని ఒత్తిడిని, ఉత్సాహాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది.2. గర్వానికి, కాన్ఫిడెన్స్ కి తేడా ఏంటి?Arrogance (గర్వం): "నేను అందరికంటే తోపు, నేను ఎప్పుడూ తప్పు చేయను." ఇది భయాన్ని దాచుకోవడానికి వేసే ముసుగు.Confidence (ఆత్మవిశ్వాసం): "నేను తప్పు చేయవచ్చు, కానీ ఆ తప్పు నుండి నేర్చుకుని మళ్ళీ లేవగలను." ఇది వాస్తవాన్ని ఒప్పుకునే ధైర్యం.కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తికి తన బలహీనతలు తెలుసు, అందుకే అతను ఇతరుల విమర్శలకు భయపడడు. గర్వం ఉన్న వ్యక్తికి తన బలహీనతలు తెలిస్తే భయం, అందుకే అతను ఇతరుల మీద అరుస్తాడు.3. నిజమైన కాన్ఫిడెన్స్మోటివేషన్ ట్రైనర్లు "నువ్వు అద్దంలో చూసి నిన్ను నువ్వు పొగుడుకో, నువ్వు గెలుస్తావు" అని చెప్తారు. ఇది కేవలం పైన పూసే రంగు. కానీ సైకాలజీ ప్రకారం కాన్ఫిడెన్స్ రావాలంటే 'కాంపిటెన్స్' (నైపుణ్యం) ఉండాలి (Competence-based Confidence). మీరు ఒక పనిని కష్టపడి నేర్చుకుని, అందులో ప్రావీణ్యం సంపాదిస్తే.. ఆటోమేటిక్గా మీలో కాన్ఫిడెన్స్ పుడుతుంది.4. కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడం ఎలా?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం మూడు అంచెల్లో ఆత్మవిశ్వాసాన్ని ఎలా పొందాలో చూద్దాం.Step 1: అభద్రతా భావాన్ని బ్రేక్ చేయండిముందుగా I am not enough అనే అభద్రతా భావాన్ని బ్రేక్ చేయండి. మీరు ఎవరితోనూ పోటీ పడనవసరం లేదు, మీ నిన్నటి వెర్షన్ తో మాత్రమే పోటీ పడండి.Step 2: చిన్న చిన్న విజయాలుఒక రోజులో మీరు అనుకున్న పనిని పూర్తి చేయండి. ఆ చిన్న 'విజయం' మీ సబ్-కాన్షియస్ మైండ్కి మీరు నమ్మదగ్గ వ్యక్తి అని చెప్తుంది. ఇలా రోజురోజుకూ మీ కాన్ఫిడెన్స్ మజిల్ని Build చేయండి.Step 3: నిశ్శబ్ద విజేతమీరు స్టేజ్ ఎక్కనవసరం లేదు, అరవనవసరం లేదు.. మీ నడకలో, మీ కళ్ళలో, మీ మాటల్లో ఆ బలం కనిపిస్తుంది. ఎదుటివారికి మీరు ఒక 'ముప్పు'గా కాకుండా, ఒక 'ప్రేరణ'గా కనిపిస్తారు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ కాన్ఫిడెన్స్ రిపోర్ట్ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీరు ఎప్పుడు, ఏ పని చేస్తున్నప్పుడు ఎక్కువగా కాన్ఫిడెంట్గా ఫీలవుతారు? మీలో ఉన్న ఒక బలహీనతను మీరు గర్వంగా ఒప్పుకోగలరా?ఇతరుల విమర్శలు మిమ్మల్ని ఇంకా కదిలిస్తున్నాయా?కాన్ఫిడెన్స్ ఒక ప్రయాణం!బ్రో, కాన్ఫిడెన్స్ అనేది ఒక రోజులో రాదు. ఇది ఒక ప్రయాణం. మీ నైపుణ్యాలను పెంచుకోండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మీ గాయాలను హీల్ చేసుకోండి.. అప్పుడు కాన్ఫిడెన్స్ దానంతట అదే ఒక నీడలా మిమ్మల్ని అనుసరిస్తుంది."Confidence is silent. Insecurities are loud."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: సమయాన్ని గౌరవిస్తే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టే..)
పద్మవ్యూహం అంటే..?
ఎవరైనా తీవ్రసమస్యలు, కష్టాల్లో చిక్కుకుంటే వాళ్ళు పద్మవ్యూహంలో చిక్కుకున్నారని అంటుంటాం. అలనాటి ద్వాపర యుగంలో 18 రోజులు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో 13 వ రోజున కౌరవుల సర్వ సైన్యాధ్యక్షుడు ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని అమలు పరిచాడు. ఈ వ్యూహం చూసేందుకు పద్మం, చక్రం ఆకారంలో ఉండటంతో దీనిని పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం అని కూడా అంటారు. మొత్తం కౌరవ సైన్యాన్ని తామరపువ్వు ఆకారంలో ఉండేలా ఏడు వలయాలలో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రుదుర్భేద్యంగా పద్మవ్యూహాన్ని ద్రోణచార్యుడు ఏర్పాటు చేశారు. ఈ పద్మవ్యూహం అతిరథ మహారథులకే అంతుచిక్కనిదిగా ఉంటుంది. సామాన్యుడెవరూ, ఈ వ్యూహంలోకి వెళ్ళలేరు.ఒకవేళ వెళ్లినా మృత్యువలయానికి దగ్గరవుతూ, సజీవంగా తిరిగి రాలేరు. అందుకే అతి పరాక్రమ వంతుడైన అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళగలిగాడే కానీ, తిరిగి రాలేక అమరుడయ్యాడు. ఈ వ్యూహాన్ని పాండవుల తరఫున ఛేదించగలిగిన వారు కేవలం శ్రీ కృష్ణుడు, అర్జునుడు, శ్రీ కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు, అర్జునుని కుమారుడైన అభిమన్యుడు మాత్రమే. అయితే శ్రీ కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే కానీ, వెనుకకు వచ్చే విద్య తెలియకపోవడం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు వీరమరణం పొండాడు. కేవలం శ్రీ కృష్ణుడు అర్జునుడు మాత్రమే ఈ పద్మవ్యూహాన్ని ఛేదించగలిగిన యోధులు. ఇక కౌరవుల తరఫున భీçష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామలు మాత్రమే పద్మవ్యూహాన్ని ఛేదించ గలిగినవారు.పద్మవ్యూహ నిర్మాణం ఇలా....కురుక్షేత్ర మహా సంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నారు. ఒక అక్షౌహిణిలో 21,870 రథాలు, మరో 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 పదాతి దళాలు కలిపి 2,18,700 మంది మొత్తం సైన్యం ఉంటారు. దీనిని 18తో హెచ్చవేస్తే 39,36,600 మంది సైన్యం పాల్గొంటారు. సుమారుగా పద్మవ్యూహం విస్తీర్ణం 5,929 చదరపు కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు.పద్మ వ్యూహంలో ఎవరెవరు ఏయే స్థానాల్లో...కౌరవసేనలను తామరపూవు ఆకారంలో నిలిపిన ద్రోణుడు అలనాటి వివిధ దేశాధిపతులను తామరపూవులోని రేకుల మాదిరిగా నిలిపాడు. వారి కుమారులను పూవు మధ్యభాగంలోని కేసరాలుగా నిలబెట్టాడు. కర్ణుడు, దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపల భాగంలో, వారి మధ్య దుర్యోధనుడు సైన్యంగా నిలిచారు. సైంధవుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, కౌరవులు వారి కుమారులు ఇతర స్థానాల్లో నిలిచారు. – సి.ఎన్.మూర్తి, పాత్రికేయులు
కొడుకే ప్రేరణ..తల్లిగా లాలన..
ఒక కంటితో చూపు.. ఏం మాట్లాడినా వినపడదు.. ఏది చెప్పాలన్నా మాటలేదు.. ఆలోచనా శక్తి లేదు.. మానసికంగా ఎలాంటి ఎదుగుదల లేని కుమారుడినే ఓ తల్లి ‘ప్రేరణ’గా మార్చుకుంది. తన కుమారుడి వంటి ఎంతో మంది పిల్లలను అమ్మగా లాలిస్తోంది. వారి ఆలనా పాలనా చూస్తోంది. వారి సంక్షేమమే తప్ప ఎలాంటి లాభాపేక్ష లేకుండా దాదాపు 22 ఏళ్లుగా స్పెషల్ స్కూల్ నడుపుతోంది. ఇలాంటి పిల్లలంతా ఆత్మవిశ్వాసంతో జీవించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన ఈ అమ్మ..మలక్పేటకు చెందిన తొగరుచేడు విజయలక్ష్మి 2004లో అక్బర్బాగ్ పల్టాన్లో నలుగురితో ‘ప్రేరణ స్పెషల్ స్కూల్’ ప్రారంభించింది. వయసు భేదం లేకుండా 22 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. స్పెషల్ ఎడ్యుకేషన్లో శిక్షణ పొంది, టీచర్గా పనిచేసిన ఆమె ప్రస్తుతం మలక్పేట ప్రభుత్వ క్వార్టర్స్లో దాతల సహకారంతో 12 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో ఓ స్కూల్ నడిపిస్తోంది. పిల్లలకు స్వశక్తిలో శిక్షణ.. ఇక్కడ ఎక్కువ మంది సెరిబ్రల్ పాల్సీ, స్పాస్టిక్ చి్రల్డన్స్ ఉన్నారు. మెంటల్లీ చాలెంజ్ పిల్లలకు స్వీయరక్షణ, మాట్లాడటం, ఫిజియోథెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ రకరకాల వాటితో పాటు కంప్యూటర్లో శిక్షణ ఇస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పేరంటల్ గైడెన్స్ తరగతుల్ని నిర్వహిస్తున్నారు. మైనంతో దీపాలు, గ్రీటింగ్ కార్డులు, స్క్రీన్ ప్రింటింగ్, ఆఫీస్ ఫైల్స్ చేయించడంలో తరీ్ఫదు ఇస్తున్నారు. పప్పుల ప్యాకింగ్, బుక్ బైడింగ్, ఆడపిల్లలకు వంటింటి పనులు నేర్పిస్తున్నారు. నిత్యజీవిత అవసరాలు తీర్చుకునేలా బ్యాంకు పనులు, సరుకులు కొనుక్కోవడం, బస్సులో వెళ్లి తిరిగి రావడం, రైలు, బస్సు రిజర్వేషన్లు చేయించడం, అక్షరాలు చదవగలగడం వంటి తదితర వాటిని నేర్పిస్తారు.ఆత్మవిశ్వాసంతో.. మెంటల్లీ చాలెంజ్డ్ పిల్లలను ప్రారంభంలోనే గుర్తించి.. వారికి సరైన వైద్యం, సంబంధిత ఇన్స్టిట్యూట్లో వారికి శిక్షణ అందిస్తే ఫలితాలు ఉంటాయి. పిల్లల తల్లులు ఆ పనిని సవాల్గా తీసుకుంటే ఎవరిపై ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. ఒక కన్నుతోనే చూసి.. వినపడని, మాట్లాడలేని, మానసికంగా ఎదగని నా కొడుకు వంశీ నాకు ‘ప్రేరణ’. పిల్లల సంక్షేమమే ధ్యేయంగా, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ మాది.తొగరుచేడు విజయలక్ష్మి, ప్రేరణ స్పెషల్ స్కూల్ నిర్వాహకురాలు (చదవండి: డెలివరీ బాయ్గా 78 ఏళ్ల వ్యక్తి..!)
అంతర్జాతీయం
అట్టుడుకుతున్న దుబాయ్ : విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడి
మధ్యప్రాచ్య వివాదం ప్రారంభమైనప్పటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై 1,800కి పైగా క్షిపణులు, డ్రోన్లను ఇరాన్ ప్రయోగిచింది. ఇరానియన్ డ్రోన్ దాడి తర్వాత దుబాయ్ విమానాశ్రయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పలు విమానాలు రద్దయ్యాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) సమీపంలో జరిగిన డ్రోన్ ఇంధన ట్యాంక్ను ఢీకొట్టిన తర్వాత సోమవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మంటలు చెలరేగాయి అత్యవసర బృందాలు వేగంగా స్పందించి విమానాలను తాత్కాలికంగా నిలిపివేసాయి. యుఎఇ అత్యంత లక్ష్య దేశంగా మారిందని అధికారులు తెలిపారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బందిని వెంటనే మంటలను అదుపు చేశారు. సమీపంలో భద్రతా చర్యలు చేపట్టడంతో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈమేరకు దుబాయ్ మీడియా ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. దుబాయ్ విమానాశ్రయం దుబాయ్ విమానాశ్రయం నుండి అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొన్ని విమానాలను మళ్లిస్తున్నట్లు కూడా ప్రకటించింది. విమానాశ్రయ రోడ్డు, విమానాశ్రయ సొరంగంను పోలీసులు మూసివేశారు.Large fire reported in the vicinity of Dubai International Airport after an Iranian drone attack tonight. pic.twitter.com/XmIvEq2KTu— OSINTtechnical (@Osinttechnical) March 16, 2026విమానాలు తిరిగి ప్రారంభంమరోవైపు ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత దుబాయ్ విమానాలను క్రమంగా తిరిగి ప్రారంభమైనాయి. ఇక్కడి నుండి కొన్ని విమానాలు క్రమంగా ఎంపిక చేసిన గమ్యస్థానాలకు తిరిగి ప్రారంభ మవుతున్నా యని దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎక్స్ ద్వారా సమాచారం అందించింది. ప్రయాణీకులు తమ విమానాలకు సంబంధించిన వివరాలకోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని పేర్కొంది.విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడి ఇదే మొదటిసారి కాదు. వరుస దాడుల మధ్య తమ సేనలు ఈ దాడులు తిప్పికొడుతున్న తరుణంగా లేటెస్ట్ అప్డేటట్స్ను ఫాలో కావాలని అధికారులు సూచించారు. ప్రస్తుత దాడులు ఈ ప్రాంతంలో కీలకమైన మౌలిక సదుపాయాల భద్రతపై పెరుగుతున్న ఆందోళనలను మరింత పెంచుతోంది.#WATCH | Dubai authorities brought under control a fire caused by a drone attack near the city's international airport that forced a temporary suspension of flights, though no injuries were reported, they said: Reuters (Video Source: Reuters) pic.twitter.com/tVEDxDqtFN— ANI (@ANI) March 16, 2026
ట్రంప్నకు భారీ షాక్.. యుద్ధంలో ఊహించని ఎదురుదెబ్బ?
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. క్షిపణులు, డ్రోన్ దాడులతో పశ్చిమాసియా 17 రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏడు మిత్రదేశాలు ట్రంప్కు షాకిచ్చాయి. ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపాలంటూ ట్రంప్ చేసిన సూచనను పలు మిత్ర దేశాలు తిరస్కరించాయి. దీంతో, ఇరాన్తో యుద్ధంలో కీలక పరిణామం నెలకొంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధి విషయంలో మిత్ర దేశాలకు సందేశాలు పంపించారు. ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపాలంటూ సూచనలు చేశారు. ఈ క్రమంలో ట్రంప్ సందేశంపై మిత్రదేశాలు జపాన్, ఆస్ట్రేలియా షాకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కేబినెట్ మంత్రి కేథరిన్ కింగ్ స్పందిస్తూ.. హర్మూజ్ జలసంధి వద్దకు కానీ, పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది లేదని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో యుద్ధనౌకను పంపాలని కోరుతూ అమెరికా నుంచి తమకు అధికారిక విన్నపమేదీ అందలేదని మరో ట్విస్ట్ ఇచ్చారు. తమ వార్షిప్ను పశ్చిమాసియాకు పంపే ఆలోచనేదీ లేదని ఆమె తేల్చి చెప్పారు. అయితే హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంత ముఖ్యమైందో తమకు తెలుసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.జపాన్ ఝలక్..మరోవైపు.. ట్రంప్ సందేశంపై జపాన్ ప్రధానమంత్రి సనాయీ తకాయిచి కూడా స్పందించారు. జపాన్ పార్లమెంటు వేదికగా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమాసియా సముద్ర జలాల మీదుగా రాకపోకలు సాగించే ఆయిల్ ట్యాంకర్లు, నౌకలకు భద్రత కల్పించేందుకు నౌకాదళాన్ని పంపే ఆలోచనేదీ లేదని ఆమె వెల్లడించారు.బ్రిటన్ ఇలా.. అలాగే, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రాయల్ నేవీ డిస్ట్రాయర్లను పంపేందుకు లండన్ సిద్ధంగా లేదని స్టార్మర్ స్పష్టం చేశారు. బదులుగా, మైన్-హంటింగ్ డ్రోన్లను పంపి సహకరించవచ్చని తెలిపారు. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం అత్యంత ముఖ్యం. కానీ సంక్షోభం మరింత పెరగకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. అంతేకాకుండా హర్మూజ్ జలసంధి విషయంలో కొన్ని అమెరికా మిత్ర దేశాలు కూడా ఆచితూచి స్పందిస్తుండగా, ఇంకొన్ని దేశాలు ముక్కుసూటిగానే నిరాకరిస్తున్నాయి. దీంతో, ఇరాన్పై యుద్ధం కొనసాగుతున్న వేళ ట్రంప్నకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.అమెరికా ఒత్తిడి..యుకే, జపాన్, ఆస్ట్రేలియా వెనక్కి తగ్గడంతో అమెరికా ఒంటరిగా ఇరాన్ నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. ఇది ఇంధన మార్కెట్లలో అనిశ్చితి పెంచుతోంది. ఈ నేపథ్యంలో మిత్రదేశాలు వెనక్కి తగ్గడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అయితే, చైనా ఎక్కువగా ఈ జలసంధి ద్వారా చమురు పొందుతున్న కారణంగా దాని రక్షణ బాధ్యతను కూడా వారు తీసుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
UAE:19 మంది భారతీయుల అరెస్ట్.. కారణం ఇదే..
దుబాయ్: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని, కల్పిత దృశ్యాలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై మొత్తం 35 మందిని అరెస్ట్ చేయగా, అందులో ఏకంగా 19 మంది భారతీయులు ఉండటం గమనార్హం.అసలేం జరిగింది?పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, క్షిపణి దాడులు లేదా రక్షణ వ్యవస్థల ఆపరేషన్లను చిత్రీకరించవద్దని యూఏఈ ప్రభుత్వం గతంలోనే స్థానికులను హెచ్చరించింది. అయితే ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, కొందరు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశారు. తాజాగా యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ 25 మందిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు (వీరిలో 17 మంది భారతీయులు ఉన్నారు). అంతకుముందు శనివారం పది మందిని (వీరిలో ఇద్దరు భారతీయులు) అరెస్ట్ చేశారు. మొత్తంగా 19 మంది భారతీయులు ఇప్పుడు జైలు పాలయ్యారు.అరెస్ట్ అయిన వారిపై మూడు రకాల ఆరోపణలు..నిందితులు మూడు గ్రూపులుగా విడిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారుక్షిపణుల వీడియోలు: ఆకాశంలో వెళ్తున్న క్షిపణులను లేదా వాటిని అడ్డుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించి, వాటికి భయాందోళనలు కలిగించే శబ్దాలను జోడించి ప్రచారం చేయడం.ఏఐ ఫేక్ దృశ్యాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ఉపయోగించి పేలుళ్లు జరిగినట్లు కృత్రిమ వీడియోలను సృష్టించడం. ఇతర దేశాల్లో జరిగిన పాత ఘటనలను యూఏఈలో జరిగినట్లుగా నమ్మించడం.శత్రు దేశాలకు మద్దతు: యూఏఈ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే దేశాలను, వారి సైనిక చర్యలను పొగుడుతూ పోస్టులు పెట్టడం.శిక్షలు కఠినం: లక్ష దిర్హమ్ల జరిమానాఈ తరహా చర్యలు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయని అటార్నీ జనరల్ హెచ్చరించారు. నిందితులకు కనీసం ఏడాది జైలు శిక్షతో పాటు, ఒక లక్ష దిర్హమ్లకు (సుమారు రూ. 22 లక్షలకు పైగా) తగ్గకుండా జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వీరందరినీ అదుపులోకి తీసుకున్న పబ్లిక్ ప్రాసిక్యూషన్, త్వరితగతిన విచారణ చేపట్టాలని ఆదేశించింది.ఇది కూడా చదవండి: మెగా ఫైట్ @2026: పేలుతున్న ‘సీనియర్ల’ మాటల తూటాలు
సంచలనం.. యుద్ధంలో తొలిసారి ‘డ్యాన్సింగ్ మిస్సైల్’
టెహ్రాన్: పశ్చిమాసియాలో నిప్పుల వర్షం కురుస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా మెరుపు దాడులు చేస్తున్నాయి. ఇరాన్లో తాము నిర్ధేశించుకున్న లక్ష్యాల్ని ఛేదిస్తున్నాయి. అయితే, ఈ క్రమంలో అమెరికా-ఇజ్రాయెల్ను బయపెట్టేలా యుద్ధంలో తొలిసారి ఇరాన్ అమ్మల పొదిలో అస్త్రాన్ని బయటకు తీసినట్లు ఇరాన్ మీడియా సంస్థ ప్రెస్టీవీ తెలిపింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై యుద్ధం మొదలవగా.. ఆదివారం ఆ అస్త్రాన్ని బయటకు తీసింది. ప్రయోగించింది. ప్రస్తుతం ఇరాన్ క్షిపణులపై ప్రపంచ దేశాల్లో చర్చ మొదలైంది. ఇజ్రాయెల్, అమెరికాకు షాకిస్తూ ఇరాన్ రెండు దశల బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసి ఇటీవల పరీక్షించింది. వీటిలో ప్రధానమైనది సెజ్జిల్ బాలిస్టిక్ క్షిపణి. సెజ్జిల్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, దాని విస్ఫోటన ప్రభావం భారీ స్థాయిలో ఉంటుంది. ఇరాన్ వద్ద సెజ్జిల్తో పాటు అషురా వంటి ఇతర క్షిపణులు కూడా ఉన్నాయి.సెజ్జిల్-2 అనేది రెండు దశల, ఘన-ఇంధన మధ్యస్థ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీని పొడవు 18 మీటర్లు, వ్యాసం 1.25 మీటర్లు, మొత్తం బరువు 23,600 కిలోలు. ఇది 2,000 కి.మీ పరిధిలో దాదాపు 700 కిలోల పేలోడ్ను మోయగలదు. అధిక ఎత్తులో మలుపులు తిరే సామర్థ్యం కారణంగా దీనికి ‘డ్యాన్సింగ్ మిసైల్’ అనే పేరు వచ్చింది. ఈ ప్రత్యేకత వల్ల ఐరన్డోమ్ వంటి రక్షణ వ్యవస్థలను తప్పించగలదు.సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) ప్రకారం, సజ్జిల్ క్షిపణి ఘన-ఇంధన రూపకల్పన వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది పాత షహాబ్ సిరీస్ ద్రవ-ఇంధన క్షిపణుల కంటే వేగంగా తయారు చేయబడుతుంది. తక్షణ ప్రయోగానికి సిద్ధంగా ఉంటుంది.సెజ్జిల్ రూపకల్పనపై పని 1990ల ప్రారంభంలో ప్రారంభమైంది. 2008లో మొదటి పరీక్ష జరిగింది, ఆ సమయంలో క్షిపణి దాదాపు 800 కి.మీ ప్రయాణించింది. 2009లో రెండవ పరీక్షలో మార్గదర్శక వ్యవస్థలను అంచనా వేశారు. 2009 నుండి నాలుగు అదనపు పరీక్షలు జరిగాయి. ఆరవ పరీక్షలో క్షిపణి హిందూ మహాసముద్రంలోకి దాదాపు 1,900 కి.మీ ప్రయాణించినట్లు సమాచారం. ఇరాన్ ఈ క్షిపణిని యుద్ధంలో బయటకు తీయడం, అమెరికా–ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలకు కొత్త సవాలుగా మారింది.
జాతీయం
భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్!
న్యూఢిల్లీ: భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. ఖతార్ నుంచి శివాలిక్ నౌక భారత్ చేరుకుంది. ఇరాన్ హర్మూజ్ జలసంధి దాటి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు శివాలిక్ నౌక చేరుకుంది. ఐఎన్ఎస్ శివాలిక్ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఐఎన్ఎస్ శివాలిక్కు రక్షణగా భారత నావికా దళం వచ్చింది.షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ఎల్పీజీ ట్యాంకర్ నౌక శివాలిక్ సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుజరాత్కు చేరింది. ఖతార్లోని రాస్ లఫాన్ ఓడరేవు నుండి బయలుదేరిన శివాలిక్ హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించింది. ఇవాళ గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని ముంద్రా ఓడరేవుకు చేరుకుంది. ఈ నౌక సుమారు 40వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువచ్చింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాలో అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఎల్పీజీ గ్యాస్ నౌక భారత్కు సురక్షితంగా రావడం శుభపరిణామ. దేశీయ వంట గ్యాస్ కొరతను తగ్గించడంలో సహాయపడుతోంది. రాస్ లఫాన్ నుండి బయలుదేరిన మరో నౌక నందా దేవి ఇప్పటికే గుజరాత్ తీరానికి దూరంగా ఉంది. రేపు (మార్చి 17న) ఉదయం 6:30 గంటలకు గుజరాత్లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక దాదాపు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని రవాణా చేస్తోంది. ఈ రెండు నౌకలు కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తున్నాయి. #Fujairah #IranIsraelWar #GlobalEnergy #PMModi #IndianShips #NandaDevi #Shivalik #Delhi $BJP 54 हजार टन LPG लेकर जहाज ‘शिवालिक’ आज मुद्रा पोर्ट पहुंचेगा,नई दिल्ली. मोदी सरकार की कुशल रणनीति और ईरान–इजराइल तनाव के बीच भारत के लिए राहत की खबर है, करीब 54 हजार टन एलपीजी गैस लेकर… pic.twitter.com/YbqSa3dnBM— सिरोही की आवाज (@Sirohikiaawaz) March 16, 2026
వంట గ్యాస్ వినియోగదారులకు షాక్
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయుల వంటింట్లో సెగలు రేపుతున్నాయి. ఒకవైపు గ్యాస్ కొరత, మరోవైపు బ్లాక్ మార్కెట్ దందా సామాన్యుడి నడ్డి విరుస్తుండటంతో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని గృహ వినియోగదారులందరికీ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (ఈ-కేవైసీ) తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తమ మొబైల్ నుండే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ) యాప్తో పాటు, ‘ఆధార్ ఫేస్ ఆర్డీ) (Aadhaar FaceRD) యాప్ను ఉపయోగించి ఇంట్లోనే ఈ-కేవైసీ వెరిఫికేషన్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏవైనా సందేహాలుంటే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించాలని లేదా టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలని సూచించింది.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపధ్యంలోనే కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ఓడల రాకపోకలు నిలిచిపోయాయి. భారత్ తన గ్యాస్ అవసరాల కోసం 90% దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. ఫలితంగా ఢిల్లీలో 14.2 కిలోల గృహ సిలిండర్ ధర ₹60 పెరిగి ₹913కు చేరగా, కమర్షియల్ సిలిండర్ ధర ₹1,884.50కు పెరిగింది.గ్యాస్ కొరతను సాకుగా చూపి అక్రమంగా నిల్వ చేసే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కర్ణాటకలోని కెంఘేరిలో బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఢిల్లీలో గ్యాస్ డిపోల వద్ద నిరంతరం పోలీసు పహారా ఏర్పాటు చేశారు. అటు ఢిల్లీ ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సరఫరాపై 20 శాతం క్యాపింగ్ విధించి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు గ్యాస్ సరఫరా ఇబ్బందులు, మరోవైపు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు సతమతమవుతున్నాడు.ఇది కూడా చదవండి: UAE:19 మంది భారతీయుల అరెస్ట్.. కారణం ఇదే..
భారత్ నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్.. జైశంకర్ ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగుతున్న వేళ ఇరాన్తో తాను జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం నేను ఇరాన్తో సంప్రదింపులు జరుపుతున్నాను. ఈ చర్చలు ఫలితాల్ని ఇస్తున్నాయి. ఇరాన్తో భారత్ నిరంతరం టచ్లోనే ఉంటుంది. చర్చల ద్వారా దౌత్యపరమైన విజయాలు లభిస్తుంటే వాటిని పరిశీలించడంలో తప్పులేదు. నేనుకూడా అదే చేస్తున్నాను’ అని ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో జైశంకర్ తెలిపారు. ‘ఖచ్చితంగా, ఆయా దేశాలతో సమస్యలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. భారత్ దృక్కోణం నుండి ఇరాన్తో చర్చలు జరపడం,సమన్వయం చేసుకోవడం మంచిది. పరిష్కారం సైతం లభిస్తోందన్నారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంత కొనసాగుతోంది. క్రమంలో ప్రపంచ దేశాలపై ఆర్థిక పరమైన ఒత్తిడి తెచ్చేలా ఇరాన్ తన హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. తమని కాదని చమురు నౌకల రవాణాని కొనసాగిస్తే వాటిని పేల్చుతామని హెచ్చరించింది. అందుకు కొనసాగింపు ఇరాన్ హర్మూజ్ జలసంధిలో నేవల్ మైన్స్ను నింపేసింది. 700నౌకలను నిలిపివేసిందిఈ క్రమంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ ఇరాన్తో చర్చలు జరిపారు. హర్మూజ్ జలసంధిలో భారత్ నౌకలపై ఆంక్షలు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు భారత్ గ్యాస్, చమురు నౌకలకు అనుమతి ఇచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది. భారత్ జెండాలతో జలసంధి గుండా వెళ్లొచ్చని సూచించింది.ఆరోణల్ని ఖండించిన జైశంకర్భారత జెండాతో ఉన్న నౌకలకు సంబంధించి ఇరాన్తో ఎలాంటి ‘సమగ్ర ఒప్పందం’లేదని విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా భారత్ నౌకలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఇరాన్ ప్రతిఫలం పొందిందనే ఆరోపణలను ఆయన ఖండించారు. ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరం. భారత్-ఇరాన్ల మధ్య చిరకాల సంబంధం ఉంది. దాని ఆధారంగా చర్చలు జరిపినట్లు పునరుద్ఘాటించారు. భారత్ నౌకలకు అనుమతి ఇవ్వడం శుభపరిణామం. అయినప్పటికీ హర్మూజ్ జలసంధి నుంచి భారత్కు రావాల్సిన నౌకలు చాలా ఉన్నాయి. వాటి విషయంలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు.
మెగా ఫైట్ @2026: పేలుతున్న ‘సీనియర్ల’ మాటల తూటాలు
దేశవ్యాప్త ఉత్కంఠకు తెరదించుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 9 నుంచి మే 4 వరకు సాగే ఈ ‘ప్రజాస్వామ్య పండగ’లో విజయం ఎవరిదనే చర్చ అప్పుడే మొదలైంది. ఎన్నికల తేదీల ప్రకటన రాగానే ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి మంత్రం, మరోవైపు ప్రజాస్వామ్య రక్షణ నినాదాలతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.తమిళనాడు: ‘వారసత్వ రాజకీయాలకు చరమగీతం’ తమిళనాడులో ఈసారి చారిత్రాత్మక మార్పు రాబోతోందని ఏఐఏడీఎంకే (AIADMK) ప్రతినిధి కోవై సత్యన్ ధీమా వ్యక్తం చేశారు. ‘మే 4న తమిళనాడులో వారసత్వ పాలన అంతం కాబోతోంది’ అంటూ ఆయన అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్ ఇస్తూ, డీఎంకే ఎంపీ ఎంఎం అబ్దుల్లా.. ‘డీఎంకే ఎప్పుడూ ఎన్నికల మూడ్లోనే ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటుంది, గెలుపు మాదే’ అని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ నేత పీటర్ అల్ఫోన్స్ దీన్ని ప్రజాస్వామ్య పరిరక్షణకు జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు.పశ్చిమ బెంగాల్: 'హింస లేని ఎన్నికలే మా లక్ష్యం'బెంగాల్ రాజకీయం ఎప్పుడూ రణరంగాన్ని తలపిస్తుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, అయితే బెంగాల్లో మా కార్యకర్తల హత్యలు మళ్లీ జరగకూడదు.. భయం లేని వాతావరణంలో ఎన్నికలు జరగాలి’ అని కోరారు. కాగా, ఒపీనియన్ పోల్స్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ (TMC) 150కి పైగా సీట్లతో ముందంజలో ఉండటం తృణమూల్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది.కేరళ: ‘వేసవి ఎండలో ప్రచార యుద్ధం’కేరళలో ఎల్డీఎఫ్ (LDF), యూడీఎఫ్ (UDF) మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం మాట్లాడుతూ.. ‘ఎన్నికలకు సిద్ధం కానీ, వేసవి ఎండల్లో ప్రచారం చేయడం అభ్యర్థులకు సవాలే. మా దగ్గర భారీగా ఖర్చు చేసేందుకు ఆర్థిక వనరులు లేవు. కానీ ప్రజల మద్దతు ఉంది’ అని అన్నారు. కాగా, కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ తాము ఏడాది క్రితమే గ్రౌండ్ లెవల్లో ప్రిపరేషన్స్ మొదలుపెట్టామని, ఈసారి మార్పు ఖాయమని అన్నారు.అస్సాం: ‘అభివృద్ధి వర్సెస్ ప్రజా మద్దతు’అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారం చేపడుతుందని బీజేపీ నేతలు అశోక్ భట్టారాయ్ లాంటి వారు నమ్మకంతో ఉన్నారు. ‘పంచాయతీ స్థాయి నుంచి మా కమిటీలు సిద్ధంగా ఉన్నాయి’ అని వారు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాత్రం ‘అస్సాం ప్రజలు ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇస్తారు’ అని సవాల్ విసిరారు. ఇక్కడ కూడా ఒపీనియన్ పోల్స్ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యాన్ని సూచిస్తున్నాయి.బీజేపీ గెలుపు ధీమా: ‘ఐదు రాష్ట్రాల్లోనూ మాదే విజయం’కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. "ఐదు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్డీఏ (NDA) భారీ మెజారిటీతో విజయం సాధిస్తుంది’ అని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని బీజేపీ నేతలు రాజీవ్ ప్రతాప్ రూడీ, వీరేంద్ర సచ్దేవా తదితరలు నొక్కి చెప్పారు. సామాన్యుల కష్టసుఖాల్లో తోడుగా ఉండే పార్టీగా బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఇది కూడా చదవండి: సిలిండర్లకు సంకెళ్లు.. బడిలో పానీపూరీ భోజనం
ఎన్ఆర్ఐ
వాషింగ్టన్ డీసీలో శంకర నేత్రాలయ నిధుల సేకణ కార్యక్రమం
గతేడాది డిసెంబర్ 6. 2025న వాషింగ్టన్ డి.సి. మెట్రో ప్రాంతంలో నిర్వహించిన శంకర నేత్రాలయ (SN) నిధుల సేకరణ కార్యక్రమం విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మక నేత్ర వైద్య సంస్థ కోసం మొత్తం $150,000 నిధులు సమీకరించారు. సంస్కృతి,కరుణను ప్రతిబింబించే ఈ వేడుకకు చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రమణ రెడ్డి మడ్డికుంట CapEx సభ్యుడు తిరుమల రెడ్డి మునుకుంట్ల నాయకత్వం వహించారు.ఆ సాయంత్రం థీమ్ కరుణ ప్రతిధ్వనులు: కళ హృదయాన్ని కలిసే స్థలం (Echoes of Compassion: Where Art Meets Heart)గా నిర్వహించబడింది. శాస్త్రీయ మరియు సాంప్రదాయ నృత్య కళలతో సేవా భావాన్ని మేళవిస్తూ ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక అకాడమీలు పాల్గొని యువ వయోజన నర్తకుల అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సాంస్కృతిక బృంద సభ్యురాలు లక్ష్మి బాబు సమన్వయంతో నృత్య ప్రదర్శనలు అత్యంత కన్నులపండుగగా నిర్వహించారుఈ వేడుకకు గౌరవ అతిథిగా ఎస్. వి. ఆచార్య గారు హాజరై తమ ప్రోత్సాహకర సందేశంతో కార్యక్రమానికి మరింత గౌరవాన్ని చేకూర్చారు. అలాగే 11 మంది MESU స్పాన్సర్ల మద్దతు ఈ కార్యక్రమ విజయానికి కీలకమైంది.ఉదార హృదయంతో సహకరించిన MESU స్పాన్సర్లు:సెల్వ, ప్రతిభ జయరామన్, భువనేశ్ బూజాల, భానుమతి రామకృష్ణ, శ్రవణ్ పడూరు, కృష్ణకాంత్ కుచ్చలకంటి, ప్రవీణ్ పాల్రెడ్డి, రఘు పాల్రెడ్డి, వెంకట్ దోమా, తిరుమల మునుకుంట్ల, రఘు జువ్వాది గారు. వీరి ఆర్థిక కార్యనిర్వహణ సహకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.ఇంకా SNUSA నేషనల్ మరియు డి.సి. మెట్రో చాప్టర్ సభ్యులు విశేషంగా సహకరించారు. ముఖ్యంగా శ్రీమతి నీలిమ గడ్డమనుగు, కృష్ణ రాజ్ భట్, సౌమ్య నారాయణన్, డి.సి. చాప్టర్ నాయకులు — బాలాజీ రాధాకృష్ణన్, హరిత రెడ్డి, అర్జున్ కామిసెట్టి, దిలీరాజ్ చాంతివేలు, రూపేష్ చిన్నకంపల్లి, కార్తిక్ గౌడ్ తదితరుల కృషి ప్రశంసనీయం.SNUSA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి గారి నాయకత్వం తోపాటు బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యుల మార్గదర్శకత్వం ఈ విజయానికి బలమైన ఆధారంగా నిలిచాయి. ట్రెజరర్ మూర్తి రేకపల్లి గారు లాజిస్టిక్స్ నిర్వహణలో విశేష కృషి చేయగా, మీడియా సహకారం అందించిన శ్రీగిరి కోటగిరి సేవలు అభినందనీయం. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువ వాలంటీర్లు, మీడియా,ఫోటోగ్రఫీ బృంద సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మాస్టర్ ఆఫ్ సెరిమనీగా వ్యవహరించిన శ్రియా బాబు తన చక్కని వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని చురుకుగా, సమర్థవంతంగా ముందుకు నడిపించారు.ఈ కార్యక్రమంలో సమీకరించిన నిధులు శంకర నేత్రాలయ లక్ష్యమైన అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించేందుకు వినియోగించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ముగిసే సమయానికి సేవా భావం, ఐక్యత, సామాజిక బాధ్యత స్పష్టంగా ప్రతిఫలించాయి. ఈ వేడుక కేవలం కళలు, సంస్కృతిని మాత్రమే కాకుండా, సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరి హృదయంలో మరింత బలంగా నాటింది.(చదవండి: అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..)
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు భారత్కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్ ఎవరు? ఆ వివరాలు మీకోసం.లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలోజన్మించారు నిత్య రామన్. ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య కుటుంబం, అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కరెన్ బాస్కు గట్టి పోటీప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!
అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత
క్రైమ్
చికిత్సకొస్తే చిల్లర చేష్టలు
మహబూబాబాద్ జిల్లా: జ్వరంతో చికిత్స కోసం క్లినిక్కు వచ్చి న ఓ మహిళతో ప్రభుత్వ ఆయుర్వేదిక్ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో జరిగిన ఈ సంఘట నపై బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ మహిళకు తీవ్రంగా జ్వరం రావడంతో శనివారం రాత్రి విజయలక్ష్మి క్లినిక్కు తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆ యుర్వేదిక్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్ట ర్ కిరణ్కుమార్ విజయలక్ష్మి క్లినిక్ను నిర్వహిస్తున్నాడు. వైద్య పరీక్షలు చేసి సెలైన్ ఎక్కిస్తున్న క్ర మంలో.. డాక్టర్ కిరణ్ తనతో అసభ్యంగా ప్ర వర్తించినట్లు బాధిత మహిళ తన భర్త, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆగ్ర హానికి గురైన మహిళ భర్త, తల్లిదండ్రులు, బంధువులు ఆదివారం డాక్టర్ కిరణ్కుమార్తో గొడవపడి దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డాక్టర్పై కేసు నమోదు చేసినట్లు సీఐ గణేశ్, ఎస్ఐలు ఉపేందర్, అంజమ్మ తెలిపారు.
చెల్లిని చూడాలని వెళ్తూ.. అనంతలోకాలకు
మేడ్చల్ జిల్లా: మల్కాజిగిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెల్లిని చూడా లని బైక్పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గోదావరిఖనికి చెందిన మర్రి ప్రశాంత్ (35) మెడికల్ రిప్రజెంటేటివ్. భార్య శ్రావణి (33), కుమారుడు సహస్రన్ (10)తో కలిసి రాంనగర్లో నివసిస్తున్నారు. ఆదివారం మేడిపల్లిలో నివాసం ఉంటున్న తన చెల్లి ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా స్పార్క్ ఆస్పత్రి సమీపం వరంగల్ హైవేలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కియా కారు అదుపుతప్పి బైక్ను బలంగా ఢీకొట్టి కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య శ్రావణికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కుమారుడు సహస్రన్కు స్వల్పగాయాలు కాగా అత న్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నా రు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపా రు. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్, యజమాని ఉన్నారు. వీరిని మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని కార్ను సీజ్చేసి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.
రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఎమ్మెల్యే వెలగపూడి అనుచరుడు
విశాఖపట్నం: విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు, కరకచెట్టు పోలమాంబ ఆలయ కమిటీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ వివాహేతర సంబంధంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం కలకలం రేపింది. కొద్ది రోజులుగా టీడీపీ నాయకుల లైంగిక వేధింపుల ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండగా తాజాగా మద్ది శ్రీనివాస్ ఆ జాబితాలో చేరాడు. పోలీసులు, బాధిత మహిళ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...! బుద్ధి చెప్పాల్సింది పోయి.. వెలగపూడి వత్తాసు.. మద్ది శ్రీనివాస్ కొన్నాళ్లుగా భార్య వసుంధరను వదిలించుకోవాలని చూస్తున్నాడు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో శ్రీనివాస్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంపై అతడి భార్య న్యాయ పోరాటానికి దిగారు. దీనిపై భీమిలి పోలీసు స్టేషన్తో పాటు విశాఖ త్రీటౌన్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అతడి వ్యవహారాన్ని పలు సందర్భాల్లో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దృష్టికి తెచ్చారు. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ప్రాథేయపడ్డారు. అయితే శ్రీనివాస్కు బుద్ధి చెప్పాల్సింది పోయి వెలగపూడి అతడిని వెనకేసుకురావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భార్యా బిడ్డలను పట్టించుకోని శ్రీనివాస్ను ప్రసిద్ధ గ్రామ దేవత పోలమాంబ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్గా నియమించడం వివాదాస్పమైంది. ఈ వ్యవహారాన్ని శ్రీనివాస్ భార్య ప్రభుత్వం దృష్టికి కూడా తెచ్చినా పట్టించుకోలేదు. శ్రీనివాస్ అనైతిక సంబంధాలను రుజువు చేస్తే ఆలయ కమిటీ చైర్మన్గా తొలగిస్తామని ఎమ్మెల్యే వెలగపూడి గతంలో మీడియా సాక్షిగా ప్రకటించారు. అడ్డంగా చిక్కిన శ్రీనివాస్.. కేసులు నమోదైనప్పటికీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్థానిక టీడీపీ నాయకుడు పోతన్నరెడ్డి తదితరుల సహకారంతో శ్రీనివాస్ తప్పించుకుని తిరుగుతున్నాడు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకుని బరితెగించి తిరుగుతున్నట్లు భార్య పలు దఫాలు వాపోయారు. ఈ క్రమంలో శ్రీనివాస్ శనివారం అర్ధరాత్రి పెదవాల్తేర్లోని ఓ ఇంట్లో ఓ మహిళతో కలిసి ఉండగా భార్య వసుంధర రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాళ్లిద్దరూ ఉన్న గదికి కుటుంబ సభ్యుల సహకారంతో తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శ్రీనివాస్ గది బయట కాపుకాసిన తన భార్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై తన అనుచరులతో దాడి చేయించాడు. తన అనుచరుల సాయంతో గది తాళం పగలగొట్టించి బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ వారు రాకపోవడంతో శ్రీనివాస్ మరోసారి తప్పించుకున్నాడని, ఓ మహిళతో రెడ్ హ్యాండెడ్గా దొరికిన అతడిపై చర్యలు తీసుకోవాలని వసుంధరతోపాటు ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో పోలీసులు అతడిని ఎంవీపీ స్టేషన్కు తరలించారు. అయితే ఎమ్మెల్యే వెలగపూడి ఒత్తిడితో పోలీసులు శ్రీనివాస్ను విడిచిపెట్టినట్లు తెలిసింది. తాజా ఘటనపై వసుంధర రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై ఎంవీపీ సీఐని వివరణ కోరగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదు అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అక్రమ సంబంధం, రాసలీలల ఘటనలో నేరుగా దొరికినప్పటికీ పోలీసులు, టీడీపీ నాయకులు శ్రీనివాస్కు తొత్తులుగా వ్యవహరించారని వసుంధర ఆక్రోశించారు. తనకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు. వెలగపూడీ.. ఆడబిడ్డ ఉసురు పోసుకోకు.. మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని రుజువుచేస్తే శ్రీనివాస్పై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే వెలగపూడి ఇప్పుడు అతడు రెడ్హ్యాండెడ్గా దొరికినా వత్తాసుగా నిలవడంపై వసుంధర మండిపడ్డారు. నీ పార్టీ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఓ ఆడబిడ్డ ఉసురుపోసుకోవద్దంటూ వెలగపూడిపై దుమ్మెత్తిపోశారు. నీ ఇంట్లో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి వస్తే నిందితుడిని ఇలాగే వెనకేసుకొస్తావా..? అంటూ ఆక్రోశించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల జీవితాలను నాశనం చేయవద్దంటూ హితవు పలికారు. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై కలగజేసుకుని తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఉరి వేసుకునేలా ప్రేరేపించింది భర్తే
రాజంపేట: ఉరి ఎలా వేసుకోవాలో చెప్పి భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని వైఎస్సార్ కడప జిల్లా మన్నూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సీఐ లింగప్ప కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నందలూరుకు చెందిన రైల్వే లోకో పైలెట్ శ్రీరాం శ్రీనివాస్ 2017లో కృష్ణవేణి(30)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరు బోయనపల్లెలోని శ్రీరామ్నగర్లో నివాసం ఉండేవారు. శ్రీరాం మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈనెల 11న కారు మరమ్మతుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న శ్రీరాం శ్రీనివాస్ కృష్ణవేణిని బెల్టుతో కొట్టాడు. ఆమెను చనిపోవాలని తీవ్రంగా ప్రేరేపించాడు. మనోవేదనకు గురైన మృతురాలు బెడ్రూంలోకి వెళ్లి లోపలి నుంచి గడియపెట్టుకొని ఉరి వేసుకుంటుండగా, నిందితుడు ఆమెను కాపాడకపోగా , ఆ దృశ్యాన్ని కిటికీలో నుంచి భార్య సెల్ఫోన్లోనే వీడియో తీశాడు. ఉరి అలా కాదు.. కృష్ణా.. సరిగ్గా వేసుకో అంటూ వికృతంగా నవ్వుతూ పైశాచికత్వం ప్రదర్శించాడు. ఆమె ఉరివేసుకుని మరణించిన తర్వాత ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టి, మరుసటి రోజు తన తల్లిదండ్రులు వచి్చన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం సెక్షన్ 108 బీఎన్ఎస్ కింద కేసుగా మార్చి నిందితుడు శ్రీరాం శ్రీనివాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
వీడియోలు
Hyd: ఫలక్ నుమాలో భారీ అగ్నిప్రమాదం
గుడ్ న్యూస్.. భారత్కు LPG గ్యాస్ నౌక.. గ్యాస్ కొరత ఉండదు..
నెతన్యాహు చనిపోయాడా!? నిజమవుతున్న అనుమానాలు... కానీ..AI వీడియోతో
తిరుమల లడ్డూ బాగాలేదు.. బీజేపీ మాధవి లతా సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి YS జగన్ అభినందలు
వివేక ను చంపించాల్సిన అవసరం ఏంటి? " వైఎస్ సునీత వ్యాఖ్యలపై రాచమల్లు స్ట్రాంగ్ రిప్లై
రానున్న 4 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
రేవంత్ చేతకాని తనం వల్ల తెలంగాణకు అన్యాయం
మళ్లీ బంగారం కొనే టైమొచ్చింది..! ఐదో రోజు పతనమైన గోల్డ్ రేట్
సునీత సంచలన ఆడియో బయటపెట్టిన వైఎస్ అవినాష్ రెడ్డి
