చర్చకు పొంగులేటి వస్తారా?.. లేక సీఎం రేవంత్ వస్తారా?: హరీష్ సవాల్
హైదరాబాద్: తమ హయాంలో భూముల రిజిస్ట్రేషన్లు ఆగాయని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు సవాల్ విసిరారు. తనతో చర్చకు మంత్రి పొంగులేటి వస్తారా?, లేక సీఎం రేవంతే వస్తారో? తేల్చుకోవాలని చాలెంజ్ చేశారు. తాము ప్రభుత్వం అవినీతి మీద ప్రశ్సిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు హరీష్రావు. ఈరోజు(బుదవారం, సెప్టెంబర్ 16వ తేదీ) తెలంగాణ భవన్ నుంచి మీడియాతో మాట్లాడిన హరీష్రావు.. ఎన్నికల అఫడవిట్లో చూపించనవే సభలో రేవంత్రెడ్డి చెప్పారని హరీష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో రిజిస్ట్రేషన్లు ఆగాయంటే తన ముక్కును నేలకు రాస్తానన్నారు. భూభారతిలో 9, 200 మంది భూములు మరొకరికి మారాయని ఆరోపించారు హరీష్, భూభారతి స్కామ్ మీద సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు జరిపించరు? అని ప్రశ్నించిన హరీష్,, భూభారతి కాదు.. భూహారితి అంటూ ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: కేసీఆర్ ఫాంహౌస్పై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత?
కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది వ్యవస్థీకృత రంగానికి చెందిన ఉద్యోగుల జీతాల నిర్మాణంలో కీలక మార్పులకు బాటలు వేస్తుందని నిపుణులు నమ్ముతున్నారు. 2014 తర్వాత దాదాపు 12 ఏళ్లకు ఈ పరిమితి పెరగడంతో వేతనజీవుల్లో ఒకవైపు పొదుపు పెరుగుతుందనే ఆనందం ఉన్నప్పటికీ నెలవారీ చేతికి వచ్చే జీతం తగ్గుతుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది.సగటు ఉద్యోగి వేతనంపై ప్రభావం ఎంతంటే..ఉద్యోగి కనీస వేతనం (బేసిక్పే+డియర్నెస్ అలవెన్స్) ఆధారంగా 12 శాతానికి తగ్గకుండా పీఎఫ్ మినహాయింపు ఉంటుంది.పాత నిబంధన (రూ.15,000 సీలింగ్): ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ.15,000 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ చట్టబద్ధంగా గరిష్టంగా రూ.15,000 పరిమితి పైనే పీఎఫ్ను పరిగణించేవారు. దాంతో ఉద్యోగి వాటా నెలకు రూ.1,800 (12%) మాత్రమే కట్ అయ్యేది.కొత్త నిబంధన (రూ.25,000 సీలింగ్): ఇప్పుడు రూ.25,000 సీలింగ్ వర్తించడం వల్ల పూర్తి ప్రాథమిక వేతనం రూ.25,000 పై 12% లెక్కించి రూ.3,000 పీఎఫ్ వాటాగా జమ చేయాల్సి ఉంటుంది.ప్రధాన ప్రభావాలు.. ఉద్యోగికి కలిగే ప్రయోజనాలుతక్షణ నెట్ పే తగ్గింపు: ఫిక్స్డ్ సీటీసీ విధానం అనుసరించే కంపెనీల్లో పని చేసే సగటు ఉద్యోగులకు నెలకు దాదాపు రూ.1,200 వరకు చేతికి వచ్చే నికర జీతం తగ్గుతుంది. ఇది స్వల్పకాలికంగా గృహ బడ్జెట్ లేదా ఈఎంఐ చెల్లింపులపై కొద్దిపాటి ఒత్తిడి తేవచ్చు.భారీ ప్రావిడెంట్ ఫండ్ నిధి: ఉద్యోగి వాటా రూ.1,800 నుంచి రూ.3,000 కి పెరగడం, అదే సమయంలో యజమాని వాటా కూడా పెరగడం వల్ల ప్రతి నెలా పీఎఫ్ ఖాతాలో రూ.3,600 కి(రూ.1800+రూ.1800) బదులుగా రూ.6,000 జమ అవుతుంది. చక్రవడ్డీ ప్రభావంతో 20-25 ఏళ్ల పదవీ విరమణ సమయంలో ఉద్యోగి ఖాతాలో అదనంగా లక్షల రూపాయిల కార్పస్ నిధి సమకూరుతుంది.పెన్షన్ (ఈపీఎస్), బీమా (ఈడీఎల్ఐ) సౌకర్యాల పెంపు: ప్రిన్సిపల్ సీలింగ్ పెరగడం ద్వారా ఉద్యోగుల పెన్షన్ నిధి (ఈపీఎస్) మినహాయింపు రూ.1,249.50 నుంచి రూ.2,082.50కి పెరుగుతుంది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత లభించే నెలవారీ పెన్షన్ పరిమాణం కూడా పెరుగుతుంది.పన్ను ప్రయోజనం: ఉద్యోగి మినహాయించే అదనపు పీఎఫ్ మొత్తానికి పాత పన్ను విధానం కింద సెక్షన్ 80సీ పరిధిలో పన్ను మినహాయింపు లభిస్తుంది.ప్రస్తుత ఆర్థిక ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వ్యవస్థీకృత రంగానికి చెందిన ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేస్తుందని కొందరు చెబుతున్నారు. స్వల్పకాలంలో చేతికి వచ్చే జీతంలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ సుదీర్ఘ కాలంలో ఉద్యోగుల ఆర్థిక భద్రతకు, పదవీ విరమణ సమయానికి ఆర్థికంగా స్థిరపడటానికి ఇది అవకాశంగా పరిణమిస్తుందంటున్నారు.ఇదీ చదవండి: టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు అందించిన రిలయన్స్
నాపైనే ఫిర్యాదు చేస్తారా?: టీడీపీ ఎమ్మెల్యే చిందులు
రంపచోడవరం(పోలవరం జిల్లా): అడ్డ తీగలలో టీడీపీ సమావేశంలో కార్యకర్తలపై ఆ పార్టీకే చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తాటతీస్తానంటూ కార్యకర్తలను హెచ్చరించారు. ‘పనిచేయరు... ఓట్లు వేయించలేరు..... తిరిగి తమపై హైకమండ్ కు ఫిర్యాదు చేస్తారా’ అంటూ కార్యకర్తలపై చిందులు తొక్కారు. ఏమైనా కార్యక్రమం జరిగితే ఒక్కడైనా ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడా ఆగ్రహం వ్యక్తం చేశారు శిరీష. ఎమ్మెల్యే శిరీష్. ఎమ్మెల్యే శిరీష వ్యాఖ్యలతో రంపచోడవరం టీడీపీ క్యాడర్లో కలకలం మొదలైంది. తమను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని సీనియర్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఎమ్మెల్యే వ్యాఖ్యలు అవమానకరంగా ఉందంటూ కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి షాక్?
"యూపీఐ పేమెంట్లపై చార్జీలు వద్దు".. విపక్ష నేతలు
న్యూఢిల్లీ: వ్యాపారులకు రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై ఫీజు విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దేశంలోని మొత్తం ప్రజలపై ప్రభావం చూపుతుందని, ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం అని రాష్ట్రీయ సమాజ్ పక్ష ఎంపీ ఎన్.కె.ప్రేమచంద్రన్ పేర్కొన్నారు.పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం సమావేశంలో కొందరు ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు ఆ సంఘం చైర్మన్ భర్తృహరి మహతాబ్ తెలిపారు. వచ్చే సమావేశంలో దీనిని చర్చకు తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు.స్థాయీ సంఘం సభ్యుడు ప్రేమచంద్రన్ మాట్లాడుతూ.. వ్యాపారులకు రూ.2,000కు మించిన చెల్లింపులపై ఫీజు విధించాలన్న ప్రభుత్వ నిర్ణయం దేశ ప్రజలందరినీ ప్రభావితం చేస్తుందని అన్నారు. దాదాపు ఆరు సంవత్సరాలుగా పూర్తిగా ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ చెల్లింపుల విధానంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం (సెప్టెంబర్ 15) మార్పు ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి వ్యాపారులకు యూపీఐ ద్వారా చేసే రూ.2,000కు మించిన బదిలీలపై 0.4 శాతం ఫీజు విధించనున్నట్లు వెల్లడించింది. అయితే సాధారణ వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే లావాదేవీలు, చిన్న మొత్తాల చెల్లింపులకు ఎలాంటి ఫీజు ఉండదని స్పష్టం చేసింది.ఎవరు ఏమన్నారు?యూపీఐ ద్వారా వ్యాపారులకు చేసే రూ.2,000కు మించిన చెల్లింపులపై అక్టోబర్ 15 నుంచి 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలు చేయాలన్న నిర్ణయంపై రాజకీయంగా భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సహా విపక్ష నేతలు ఈ నిర్ణయాన్ని విమర్శించగా, ప్రభుత్వం మాత్రం వినియోగదారులపై ఎలాంటి ఛార్జీ ఉండదని స్పష్టం చేసింది.రాహుల్ గాంధీ: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. వ్యాపారులపై విధించే ఫీజు చివరికి వినియోగదారులపైనే పడే అవకాశం ఉందని ఆరోపించారు. దుకాణదారులు ఈ వ్యయాన్ని వస్తువుల ధరల్లో కలిపితే సాధారణ ప్రజలే భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గుతోందని కూడా ఆయన ఆరోపించారు.మల్లికార్జున ఖర్గే: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కేంద్ర నిర్ణయాన్ని విమర్శించారు. ద్రవ్యోల్బణం ఇప్పటికే సామాన్యులపై ఒత్తిడి పెంచుతున్న సమయంలో డిజిటల్ చెల్లింపులపై అదనపు భారాన్ని మోపుతున్నారని ఆయన ఆరోపించారు.పవన్ ఖేరా: కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి, రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా.. కొత్త 0.4 శాతం ఎండీఆర్ను “మోదీ ట్యాక్స్”గా పిలవాలని అన్నారు. యూపీఐని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన తర్వాత దాని వినియోగంపై పన్ను విధిస్తున్నారని ఆయన విమర్శించారు.హారిస్ బీరన్: ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రాజ్యసభ సభ్యుడు హారిస్ బీరన్.. ప్రభుత్వం సాధారణ ప్రజలను మోసం చేసిందని వ్యాఖ్యానించారు. వ్యాపారులు ఎండీఆర్ భారం వినియోగదారుల నుంచి వసూలు చేసే ప్రయత్నం చేయవచ్చని, దీంతో వ్యాపారులు డిజిటల్ చెల్లింపులకు దూరమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వ వివరణ: ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఎండీఆర్ వినియోగదారులపై విధించే ఛార్జీ కాదని స్పష్టం చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే ఉంటాయని, రూ.2,000 వరకు వ్యాపారి చెల్లింపులకు కూడా ఎండీఆర్ ఉండదని తెలిపింది. చిన్న వ్యాపారులకు సంబంధించిన జీరో-ఎండీఆర్ నిబంధనలు కొనసాగుతాయని, మొత్తం వ్యాపారి లావాదేవీల్లో సుమారు 96 శాతం ప్రభావితం కాకుండా ఉంటాయని పేర్కొంది.బీజేపీ వాదన: ప్రభుత్వ వాదన ప్రకారం, ఈ ఎండీఆర్ పన్ను కాదు. దీనివల్ల వచ్చే ఆదాయం బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు, యూపీఐ యాప్ సంస్థల మధ్య పంచబడుతుంది. యూపీఐ మౌలిక వసతులు, భద్రత, విస్తరణకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడమే కొత్త విధానం ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వ్యాపారులు ఎండీఆర్ భారాన్ని ఎలా నిర్వహిస్తారు, వస్తువుల ధరలపై దాని ప్రభావం ఉంటుందా, డిజిటల్ చెల్లింపుల వినియోగంలో ఏమైనా మార్పు వస్తుందా అనేది తదుపరి పరిశీలించాల్సిన అంశాలుగా మారాయి.
మహ్మద్ నబీ అరుదైన రికార్డు
మావోయిస్టు దాడి.. 10 మందికి మరణశిక్ష విధించిన కోర్టు
రూ.200 కోట్ల ఇరుముడి.. మా ఇంటి బంగారాన్ని దాటలేదు..!
సంపదలో అదానీని దాటేసిన టిక్టాక్ వ్యవస్థాపకుడు
గని కూలి 60 మంది మృతి.. శిథిలాల కిందే మరికొందరు
అమెరికా నుంచి ఇజ్రాయెల్కు 60 వేల భారీ బాంబులు? ఏం జరుగుతోంది?
దేశంలోనే తొలి స్టెయిన్లెస్ స్టీల్ ఉప్పు కంటెయినర్ రైలు
పేరు మార్చి ప్రేమ నాటకం.. నిలదీస్తే కారు ఎక్కించిన ప్రియుడు
చంద్రబాబూ.. మీ పాలనలో పోలీసింగ్ అంటే ఇదేనా?: వైఎస్ జగన్
కీలక టోర్నీ నుంచి సీఎస్కే స్టార్ ఔట్..!
నీవే శరణ్యం గణేశా!
‘కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు!
కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం
నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: శేఖర్
తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు!
మమ్మీ! తమ్ముడు నా ప్రోగ్రెస్ రిపోర్టును తన ప్రోగ్రెస్ రిపోర్టు అని ఏపీ సీఎంలా చెప్పి క్రెడిట్ చోరీ చేస్తున్నాడు!!
‘జైహింద్’ అనలేదని ఐపీఎస్ అధికారిణి బదిలీ!
ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్
ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కిన పాక్ టీ20 కెప్టెన్
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా
పావలా శ్యామల మరణం.. 'మా' కీలక నిర్ణయం
సీఎం కోటాలో నిన్ను ఐఏఎస్ను చేస్తా!
మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
గణనాథుని సేవలో నమ్రతా.. వినాయకుడి పూజలో అనసూయ
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
పాప మరణం.. బాధపడుతూ నటి పూర్ణ పోస్ట్
అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్తో పోటీ.. స్పందించిన సంజూ
నిన్న బంగారంతో చైనా.. ఇవాళ సౌదీ అరేబియాకు జాక్పాట్!
మహ్మద్ నబీ అరుదైన రికార్డు
మావోయిస్టు దాడి.. 10 మందికి మరణశిక్ష విధించిన కోర్టు
రూ.200 కోట్ల ఇరుముడి.. మా ఇంటి బంగారాన్ని దాటలేదు..!
సంపదలో అదానీని దాటేసిన టిక్టాక్ వ్యవస్థాపకుడు
గని కూలి 60 మంది మృతి.. శిథిలాల కిందే మరికొందరు
అమెరికా నుంచి ఇజ్రాయెల్కు 60 వేల భారీ బాంబులు? ఏం జరుగుతోంది?
దేశంలోనే తొలి స్టెయిన్లెస్ స్టీల్ ఉప్పు కంటెయినర్ రైలు
పేరు మార్చి ప్రేమ నాటకం.. నిలదీస్తే కారు ఎక్కించిన ప్రియుడు
చంద్రబాబూ.. మీ పాలనలో పోలీసింగ్ అంటే ఇదేనా?: వైఎస్ జగన్
కీలక టోర్నీ నుంచి సీఎస్కే స్టార్ ఔట్..!
నీవే శరణ్యం గణేశా!
‘కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు!
కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం
నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: శేఖర్
తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు!
మమ్మీ! తమ్ముడు నా ప్రోగ్రెస్ రిపోర్టును తన ప్రోగ్రెస్ రిపోర్టు అని ఏపీ సీఎంలా చెప్పి క్రెడిట్ చోరీ చేస్తున్నాడు!!
‘జైహింద్’ అనలేదని ఐపీఎస్ అధికారిణి బదిలీ!
ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్
ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కిన పాక్ టీ20 కెప్టెన్
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా
పావలా శ్యామల మరణం.. 'మా' కీలక నిర్ణయం
సీఎం కోటాలో నిన్ను ఐఏఎస్ను చేస్తా!
మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
గణనాథుని సేవలో నమ్రతా.. వినాయకుడి పూజలో అనసూయ
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
పాప మరణం.. బాధపడుతూ నటి పూర్ణ పోస్ట్
అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్తో పోటీ.. స్పందించిన సంజూ
నిన్న బంగారంతో చైనా.. ఇవాళ సౌదీ అరేబియాకు జాక్పాట్!
ఫొటోలు
మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక (ఫొటోలు)
పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)
మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తజనం (ఫోటోలు)
రాజమౌళితో వారణాసి.. 15 ఏళ్లు పట్టిందన్న మహేశ్ బాబు(ఫోటోలు)
సందడిగా సమంత సీమంతం వేడుక (ఫొటోలు)
హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)
'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)
ఆషికా.. బార్బీ డాల్కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)
అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)
సినిమా
పాప మరణం.. బాధపడుతూ నటి పూర్ణ పోస్ట్
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసి ఆపై డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన నటి పూర్ణ.. కేరళకు చెందిన ఈమె దుబాయికి చెందిన బిజినెస్మ్యాన్ షనీద్ అసిఫ్ అలీని కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. చివరగా గతేడాది డిసెంబరులో రిలీజైన 'అఖండ 2' మూవీలో కనిపించింది. 'జైలర్ 2'లోనూ స్పెషల్ సాంగ్ చేసింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 10: ఓరి నాయనో ఇదేం 'ప్రేమ'? చైత్ర-చరణ్.. అనుకున్నట్లే ట్విస్ట్)ఇలా సినిమాలతో ఓవైపు బిజీగా ఉంటూనే మరోవైపు దుబాయిలో ఓ డ్యాన్స్ స్టూడియోని కూడా పూర్ణ నడుపుతోంది. ఇందులో చాలామంది పిల్లలకు డ్యాన్స్ ట్రైనింగ్ ఇస్తోంది. అయితే తన స్టూడియోలో డ్యాన్స్ నేర్చుకునే ఓ పాప చనిపోయిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న పూర్ణ.. చాలా విచారం వ్యక్తం చేసింది.'కొన్ని వీడ్కోలు మాటలకు అందవు. ఎంతలా కన్నీళ్లు పెట్టుకున్నా గుండెల్లోని బాధ తొలగిపోదు. చిన్నారి అమాయకమైన చిరునవ్వు, డాన్స్ నేర్చుకునే సమయంలో వేసిన చిన్ని చిన్ని అడుగులు స్టూడియోలోని ప్రతి మూలలో ఎప్పటికీ జ్ఞాపకాలుగా నిలిచిపోతాయ్. ఈమె నా స్టూడెంట్ మాత్రమే కాదు. నా కుటుంబంలో ఒకరిగా భావించా. డాన్స్ స్టూడియో ఉన్నంతకాలం ఈ చిన్నారి మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, నీకు కన్నీటి నివాళి అర్పిస్తున్నాం' అని నటి పూర్ణ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: నా రెండో బిడ్డ కళ్లలో ఆయనని చూసుకుంటున్నా: నటి పూర్ణ) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim)
ఒక్క నిర్ణయం.. త్రివిక్రమ్ జీవితాన్నే మార్చేసింది
మనం జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మన ఫేట్ డిసైడ్ చేస్తాయి. అయితే అవి ఎప్పుడు ఎలా తీసుకోవాలనేది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అలాంటి ఓ నిర్ణయాన్ని తీసుకుని ఇప్పుడు ఇలా స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇండస్ట్రీలో ఉన్న కొందరికే తెలిసిన త్రివిక్రమ్ సీక్రెట్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినీ రచయిత బీవీఎస్ రవి బయటపెట్టాడు. రూ.3 వేల జీతానికి పనిచేసిన త్రివిక్రమ్.. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో వెల్లడించాడు.(ఇదీ చదవండి: పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక)90ల్లో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత త్రివిక్రమ్.. పోసాని దగ్గర రచయితగా పనిచేసేవాడు. అప్పట్లోనే త్రివిక్రమ్కి రూ.40 వేల జీతం ఇచ్చేవారు. తిరిగేందుకు కారు, స్టోరీ డిస్కషన్ కోసం లగ్జరీ హోటల్స్లో రూమ్స్ ఇలా ఓ రేంజులో జీవితం ఉండేది. కానీ దర్శకుడు కావాలనే ఆశతో ఈ ఉద్యోగం మానేశాడు. కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా రూ.3 వేల జీతానికి చేరాడు. ఇది చూసిన బీవీఎస్ రవి.. త్రివిక్రమ్ని ఇదే విషయం అడగ్గా.. నేను డైరెక్టర్ అవ్వడానికి వచ్చా, పోసానికి అసిస్టెంట్గా అవ్వడానికి కాదని తనతో అన్నట్లు బీవీఎస్ రవి చెప్పుకొచ్చాడు. అప్పుడు కలగన్నాడు కాబట్టి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయ్యాడని త్రివిక్రమ్ తీసుకున్న లైఫ్ మారిపోయే నిర్ణయం గురించి బయటపెట్టాడు.త్రివిక్రమ్.. 'సముద్రం' కోసం కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఇతడితో పాటు నందినిరెడ్డి, శ్రీవాస్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్గా చేశారు. తర్వాత కాలంలో వీళ్లంతా డైరెక్టర్స్ అయ్యారు. కానీ రచయితగా త్రివిక్రమ్ ఎంత పేరు తెచ్చుకున్నాడో.. దర్శకుడిగా అంతకు మించిన స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు.నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి లాంటి సినిమాలతో రైటర్గా హిట్ కొట్టిన త్రివిక్రమ్.. నువ్వే నువ్వే, అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, అఆ, సన్నాఫ్ సత్యమూర్తి, అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వెంకటేశ్తో 'ఆదర్శ కుటుంబం' తీస్తున్న గురూజీ.. త్వరలో ఎన్టీఆర్ హీరోగా కుమారస్వామి నేపథ్య కథతో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.(ఇదీ చదవండి: రూ.50 కోట్ల ఖరీదైన నగలు కొట్టేస్తే.. రూ.110 మాత్రమే పరిహారం)Writer BVS Ravi:“Director #Trivikram's Salary was ₹40K in the 90s as a Writer. He left the Job and joined as an AD under Krishna Vamsi garu for ₹3K.Just for his Dream of becoming a Director, he took that step.Today, he is Director Trivikram Srinivas.” pic.twitter.com/g3GXXNBhA2— Telugu Chitraalu (@CineChitraalu) September 16, 2026
ఓరి నాయనో ఇదేం 'ప్రేమ'? చైత్ర-చరణ్.. అనుకున్నట్లే ట్విస్ట్
ఈసారి బిగ్బాస్ షోలో తొలివారమే ఇద్దరూ ఎలిమినేట్ అయిపోయారు. అది కూడా వారం మధ్యలోనే హౌస్ నుంచి వెళ్లిపోవడంతో అంతా షాకయ్యారు. కానీ వాళ్లిద్దరూ బయటకెళ్లలేదు. అనుకున్నట్లే ఈ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. అలానే దేబ్జానీ, ముకేశ్ అయితే నిజమైన ప్రేమికుల కంటే అతి చేస్తున్నారు. ఇంతకీ బిగ్బాస్ 10లో 10వ రోజైన మంగళవారం ఏం జరిగింది? ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి?(ఇదీ చదవండి: పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక)నామినేషన్ల హంగామాతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. దీని గురించి మాట్లాడుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇంతలో ముకేశ్, వర్షిణితో కలిసి స్విమ్మింగ్ పూల్లో దిగాడు. దీంతో దేబ్జానీ సరదాగానే ముకేశ్తో గొడవ పెట్టుకుంది. నా చెల్లికి అన్యాయం చేస్తావా అని రాంప్రసాద్ ఓవైపు నుంచి ముకేశ్ని అడుగుతుంటే.. నేను ఉండగా మరొకరితో పూల్లోకి ఎలా దిగుతావ్ అని దేబ్జానీ అడిగింది. ఇదంతా చూసిన ప్రేక్షకులు ఓరి నాయనో ఇదేం ప్రేమ అనకుండా ఉండలేరు.ఇక వినాయక చవితి పండగని ఇంట్లోనే అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూజా సామాగ్రిని బిగ్బాస్ పంపించాడు. కాసేపటి తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. పవర్ ఆఫ్ పీపుల్లో ఉన్న త్రిగుణ్, దేబ్జానీ, అమన్, షాలిని, ముఖేశ్, రోహిత్, ఝాన్సీ, రాంప్రసాద్లు కెప్టెన్ అయ్యేందుకు పోటీపడ్డారు. బెలూన్ టాస్క్లో భాగంగా కంటెస్టెంట్స్ అందరికీ కొన్ని స్పెల్లింగ్స్ ఇచ్చారు. ఎవరు కరెక్ట్గా రాస్తే వాళ్లు మిగతా కంటెస్టెంట్స్లలో ఒకరి బెలూన్ పగలగొట్టి కారణాలు చెప్పాలని బిగ్బాస్ అన్నాడు.మొదటి రౌండ్లో త్రిగుణ్ బెలూన్లు నాలుగూ వేరే మిగతావాళ్లు పగలగొట్టేయడంతో ఇతడు ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత వరసగా రోహిత్, రాంప్రసాద్, దేబ్జానీ, షాలినీ, ముకేశ్ ఎలిమినేట్ అయ్యారు. చివరగా మిగిలిన ఝాన్సీ, అమన్లకు బుధవారం నాడు కెప్టెన్సీ పోటీ ఉండబోతుంది. గతవారం ఎలిమినేట్ అయిన చైత్ర, చరణ్ విషయంలో అనుకున్నట్లే బిగ్బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్లిద్దరిలో ఒకరిని తిరిగి హౌస్లోకి తీసుకొచ్చే బాధ్యత ఆడియెన్స్కి ఇచ్చారు. ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారో వాళ్లు రీఎంట్రీ ఇస్తారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తుంటాయి. అలా ఈ వారం కూడా దాదాపు 24 వరకు మూవీస్, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇరుముడి, హుషార్ పిట్టలు, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3, రామ్ అండ్ లీలా తదితర చిత్రాలు ఉన్నాయి. వీటితోపాటు ఇప్పుడు రీసెంట్గా హిట్ అయిన తమిళ కామెడీ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా)సిరాయ్, యూత్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనిష్మా హీరోయిన్గా చేసిన లేటెస్ట్ తమిళ సినిమా 'మొదరాత్రి'. తెలుగులో ఈ టైటిల్కి ఫస్ట్ నైట్ అని అర్థం. టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మించింది. గత నెల 21న థియేటర్లలోకి వచ్చి హిట్ అయింది. ఇప్పుడు ఈ శుక్రవారం (సెప్టెంబరు 18) నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.'మొదరాత్రి' విషయానికొస్తే.. పెళ్లయిన రోజు రాత్రే తాను మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని ముత్తు సెల్వి(అనిష్మా), భర్త మారుదు(రిషికాంత్)కు చెబుతుంది. కానీ మారుదు కోప్పడడు. ప్రేమించిన వ్యక్తితో తన భార్యని కలపాలని అనుకుంటాడు. ఈ మేరకు ఆమెకు సాయం కూడా చేయాలనుకుంటాడు. అలా ఆరోజు రాత్రి వీళ్లిద్దరూ ముత్తుసెల్వి ప్రియుడితో కలిసి బయటకు వెళ్తారు. తర్వాత ఏమైంది? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక)
క్రీడలు
అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడు.. ఆ తర్వాత..
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్లలో సర్ వివియన్ రిచర్ట్స్కు ప్రత్యేక స్థానం ఉంది. డెబ్బై, ఎనభైవ దశకాల్లోనే టీ20 తరహాలో దూకుడైన, విధ్వంసకర బ్యాటింగ్తో తనదైన శైలితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. హెల్మెట్ లేకుండానే మైదానంలోకి మెల్లగా నడుచుకుంటూ వచ్చి.. స్టైలిష్గా షాట్లు బాదే ఈ ‘స్వాగర్’పై అప్పట్లో చాలా మంది అమ్మాయిలు మనసు పారేసుకున్నారు.అలా పరిచయంఅందులో బాలీవుడ్ నటి నీనా గుప్తా కూడా ఒకరు. ఎనభైవ దశకంలో జైపూర్ మహారాణి ఇచ్చిన విందులో రిచర్డ్స్ను నేరుగా కలిసే అవకాశం వచ్చింది నీనాకు. అంతకుముందు రోజే అతడి మ్యాచ్ చూసిన ఆమెకు రిచర్డ్స్తో పరిచయం చెప్పలేని సంతోషాన్నిచింది.ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అయితే, రిచర్డ్స్ వెస్టిండీస్కు తిరిగి వెళ్లిపోయిన తర్వాత కాంటాక్ట్ మిస్ అయింది. ఓ రోజు అనుకోకుండా ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. నవ్వుతూ పలకరించుకున్నారు. అప్పటి నుంచి స్నేహం పెరిగి ఇద్దరి మధ్య ‘బంధం’ మొదలైంది.అప్పటికే అతడికి పెళ్లి అయిపోయిందిఅలా ఇద్దరూ ఒక్కటి కాగా.. నీనా గుప్త గర్భం దాల్చింది. అయితే, అప్పటికే వివియర్ రిచర్డ్స్ వెస్టిండీస్కు వెళ్లిపోగా... ఆ తర్వాతే నీనాకు ఈ విషయం తెలిసింది. అయితే, అప్పటికే వివియన్ రిచర్డ్స్కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇలాంటి తరుణంలో గర్భం కొనసాగించేందుకు నిర్ణయించుకున్న నీనా గుప్తా.. కూతురు మసాబా గుప్తాకు 1989లో జన్మనిచ్చింది. సింగిల్ పేరెంట్గా ఆమెను పెంచి పెద్ద చేసి ఫ్యాషన్ డిజైనర్గా తీర్చిదిద్దింది. అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడుఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాత విషయాలు గుర్తు చేసుకున్న నీనా గుప్తా వివియన్ రిచర్డ్స్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. దీంతో మరోసారి వీరి రిలేషన్షిప్ మరోసారి తెరమీదకు వచ్చింది.ఇక తన ఆటోబయోగ్రఫీ ‘సచ్ కహూన్ తో’లోనూ నీనా గుప్తా వివియన్ రిచర్డ్స్ గురించి ప్రస్తావించింది. ‘‘వివియన్కు, నాకు మధ్య అఫైర్ నడిచింది. అలా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. తల్లిని కాబోతున్నానన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.అయితే, తన బిడ్డను మోయాలా? లేదా? అనే విషయాన్ని వివియన్తో చర్చించాలని నిర్ణయించుకున్నా. నేను గర్భవతినన్న విషయం తెలిసేసరికే వివియన్ వెస్టిండీస్ చేరుకున్నాడు. ఎలాగోలా అతడి నంబర్ సంపాదించి ప్రెగ్నెంట్ అన్న విషయం చెబితే నాకు నచ్చినట్లే ముందుకు సాగమని చెప్పాడు. తన బిడ్డను కనడంలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు’’ అని నీనా పేర్కొంది.అందుకే పెళ్లి చేసుకోలేదుఇక మరో ఇంటర్వ్యూలో వివియన్ రిచర్డ్స్ను నిజంగానే ప్రేమించి ఉంటే ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న ప్రశ్న నీనాకు ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘అతడిని ఇదే ప్రశ్న అడగడానికి చాలా మంది భయపడతారు. మరి నన్నెందుకు ఇంత సులువుగా అడిగేస్తున్నారు. మేము ప్రేమించుకున్నామనే నేను అనుకుంటున్నాను.కలిసి ఉన్న కొంతకాలంలోనే మాకు ఎన్నో మధురు జ్ఞాపకాలు మిగిలాయి. నటిగా ఉండటం నాకిష్టం. వివియన్ను పెళ్లి చేసుకుని నేను విండీస్కు వెళ్లలేను. అతడు కూడా నా కోసం తన కెరీర్ వదులుకుని ఇండియాకు రాలేడు. అందుకే పెళ్లి గురించి ఆలోచించలేదు’’ అని నీనా తెలిపింది. మసాబాకు సారీ చెప్తూనే ఉంటాఅదే విధంగా.. ‘‘ఏదేమైనా నేను పెళ్లి చేసుకోకుండా బిడ్డను కనాల్సి కాదు. ప్రతీ బిడ్డకు తల్లి.. తండ్రి.. ఇద్దరి ప్రేమా అవసరం. నేను నా కూతురు మసాబాకు ఈ విషయంలో రోజూ క్షమాపణలు చెబుతూ ఉంటా. తండ్రి లేకుండా పెరిగే క్రమంలో తను చాలా బాధ పడింది. కానీ నాపై మాత్రం ఆమెకు ప్రేమ తగ్గలేదు’’ అని నీనా గుప్తా ఉద్వేగానికి లోనైంది.కాగా మసాబాకు తండ్రి వివియన్ రిచర్డ్స్తో మంచి అనుబంధం ఉంది. వీలు చిక్కినప్పుడల్లా మసాబా తన తండ్రిని కలుసుకుంటూ ఉంటుంది. నీనా, ఆమె భర్త సైతం అతడితో స్నేహంగానే ఉంటారు. మసాబా పెళ్లిలో వీరు ముగ్గురు కలిసి కనిపించడం విశేషం.ఎవరి జీవితాల్లో వారు బిజీఇదిలా ఉంటే.. నీనా గుప్తా తనకు 49 ఏళ్ల వయసు ఉన్నపుడు 2008లో వివేక్ మెహ్రా అనే వ్యక్తిని పెళ్లాడింది. అమెరికాలో అత్యంత సన్నిహితుల నడుమ వీరి వివాహం జరిగింది. మరోవైపు.. వివియన్ రిచర్డ్స్- మిరియం రిచర్డ్స్ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. నీనాతో రిలేషన్షిప్ తర్వాత వివియన్- మిరియం మధ్య విభేదాల కారణంగా కొన్నాళ్లు దూరంగా ఉన్నట్లు సమాచారం.కాగా 74 ఏళ్ల వివియన్ రిచర్డ్స్ 1974- 1991 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. వెస్టిండీస్ తరఫున 121 టెస్టుల్లో 8540, 187 వన్డేల్లో 6721 పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. తన అద్భుతమైన ఆట తీరుతో సర్ వివియన్ రిచర్డ్స్గా ఖ్యాతిగాంచాడు.చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. విలువ ఎంతంటే?
పాక్ ప్లేయర్ను కిందకు తోసిన అభిషేక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. గత వారం మూడో స్థానంలో ఉన్న అతడు.. ఈ వారం పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ను ఓ స్థానం కిందకు తోసి, రెండో స్థానానికి ఎగబాకాడు. మరో టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్ టాప్ ప్లేస్ను నిలబెట్టుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ ఓ స్థానాన్ని కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోగా.. మరో టీమిండియా డాషింగ్ ఓపెనర్ సంజూ శాంసన్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 30వ స్థానానికి ఎగబాకాడు. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరు స్థానాలు కోల్పోయి 29వ స్థానానికి పడిపోయాడు.బౌలర్ల ర్యాంకింగ్స్లోనూ భారత ప్లేయర్లు సత్తా చాటారు. వరుణ్ చక్రవర్తి రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకగా.. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి.. మరో పేసర్ అర్షదీప్ సింగ్ 11 స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్-3 ర్యాంక్లను కాపాడుకున్నారు.ఆల్రౌండర్ల విభాగానికొస్తే.. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా, పాకిస్తాన్ సైమ్ అయూబ్, నేపాల్ దీపేంద్ర సింగ్ టాప-3లో కొనసాగుతున్నారు. భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 2 స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండు టీ20ల్లో అద్భుత ప్రదర్శనలు చేయడంతో భారత ఆటగాళ్ల ర్యాంకింగ్స్ భారీగా మెరుగుపడ్డాయి. ఇదీ చదవండి: టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్..!
టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్..!
ఆఫ్ఘనిస్తాన్తో రెండో టీ20కి ముందు టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడిన (సైడ్ స్ట్రెయిన్) విషయం తెలిసిందే. గాయం పెద్దది కావడంతో వరుణ్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్తో పాటు ఏషియన్ గేమ్స్కు కూడా దూరమయ్యాడని తెలుస్తోంది.ఈ క్రమంలో భారత మేనేజ్మెంట్ ఏషియన్ గేమ్స్ కోసం వరుణ్ ప్రత్యామ్నాయంగా ఎవరూ ఊహించని ప్లేయర్ను ఎంపిక చేసినట్లు సమాచారం. 22 ఏళ్ల రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఆల్రౌండర్ విప్రాజ్ నిగమ్ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.వరుణ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు విప్రాజ్ నిగమ్తో పాటు కుల్దీప్ యాదవ్ పేరును కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే కుల్దీప్ యాదవ్ ఈ నెలాఖర్లో వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్లో ఆడనున్న నేపథ్యంలో విప్రాజ్ నిగమ్ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై అతి త్వరలో అధికారిక సమాచారం రావొచ్చు.ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న విప్రాజ్ ఐపీఎల్లో ఇప్పటివరకు 19 మ్యాచ్లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ అతడు తన సత్తా చాటాడు. ఐపీఎల్ కెరీర్లో అతడి బ్యాటింగ్ స్ట్రైక్రేట్ సుమారు 176గా ఉంది.సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభంజపాన్లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే పురుషుల క్రికెట్ పోటీలు మాత్రం సెప్టెంబర్ 24 నుంచి మొదలవుతాయి. భారత్ నేరుగా క్వార్టర్ఫైనల్ దశలో బరిలోకి దిగనుంది.ఇదీ చదవండి: శతక్కొట్టిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు
అతడు బంగారం.. ఇతడేమో అంచనాలు పెంచేశాడు!
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ ద్వారా టీమిండియాలోకి పునరాగమనం చేశాడు యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి. చాన్నాళ్లుగా గాయం కారణంగా బీసీసీఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందిన ఈ ఆంధ్ర ఆటగాడు.. ఆదివారం నాటి తొలి టీ20 సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు.తొలి మ్యాచ్లో విఫలంఢిల్లీ వేదికగా అఫ్గాన్తో తొలి టీ20లో నితీశ్ రెడ్డి.. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా ముప్పై పరుగులు ఇచ్చుకున్నాడు. కానీ వికెట్ మాత్రం తీయలేకపోయాడు. దీంతో ఈ పేస్బౌలింగ్ ఆల్రౌండర్ బౌలింగ్పై విమర్శలు వచ్చాయి.తిరిగి పుంజుకుని.. అద్భుత ప్రదర్శనఅయితే, మంగళవారం నాటి రెండో టీ20 సందర్భంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్ రెడ్డి.. విమర్శకులకు చెక్ పెట్టాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ రైటార్మ్ పేసర్.. కేవలం ఇరవై నాలుగు పరుగులే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు కూల్చాడు. అఫ్గానిస్తాన్ ఓపెనర్, కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (37), గుల్బదిన్ నైబ్ (10), రషీద్ ఖాన్ (28)లను అవుట్ చేశాడు.తద్వారా అఫ్గాన్ను 159 పరుగులకే చేయడంలో నితీశ్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 14.5 ఓవర్లలోనే పని పూర్తి చేయగా.. 23 ఏళ్ల నితీశ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా నితీశ్ రెడ్డిపై ప్రశంసలు కురిపించాడు.PC: BCCI Xఅతడు బంగారంతన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఐదో బౌలర్ సరిగ్గా బౌలింగ్ చేయగలడా? వికెట్లు తీయగలడా? టీమిండియాకు ఉన్న సమస్య ఇదే. రెండో టీ20లో జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో 25 పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. అతడు బంగారం.Nabi looks to clear the ropes, but Shreyas Iyer makes no mistake in the deep.Watch #AFGvIND 2nd T20I LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork pic.twitter.com/BEld9G9uat— Sony Sports Network (@SonySportsNetwk) September 15, 2026జట్టుకు అవసరమైనపుడు అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. ఇక అర్ష్దీప్ సింగ్ నాలుగు ఓవర్లలో 35 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 28 పరుగులే ఇచ్చాడు. ఇక రవి బిష్ణోయి 32 పరుగులిచ్చి వికెట్ తీశాడు.నితీశ్ రెడ్డి అంచనాలు పెంచేశాడువీరందరిని పక్కనపెడితే.. నితీశ్ కుమార్ రెడ్డి.. మూడు ఓవర్లలో కేవలం 24 పరుగులే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు కూల్చాడు. అతడిని ఇరవయ్యో ఓవర్లోనూ రంగంలోకి దించవచ్చు. నిజంగా నితీశ్ రెడ్డి అంచనాలు పెంచేశాడు. హార్దిక్ పాండ్యా తర్వాత టీమిండియాకు ఆ స్థాయి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఎవరన్న ప్రశ్న ఉండేది. హార్దిక్ వారసుడిగా తానే సరైన వాడినంటూ నితీశ్ బెర్తు ఖరారు చేసుకునే పనిలో పడ్డాడు’’ అని ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు.చదవండి: అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్తో పోటీ.. సంజూ స్పందన ఇదేStraight off the top edge and straight into Samson’s hands! 🧤💥Nitish Reddy struck again with the first ball of the over, sending Gulbadin Naib back to the pavilion. Watch #AFGvIND 2nd T20I LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork pic.twitter.com/JO6xMI3jwy— Sony Sports Network (@SonySportsNetwk) September 15, 2026
న్యూస్ పాడ్కాస్ట్
డీఎస్సీ అక్రమాలపై పోరాటం ఉధృతం.. 21న భారీ నిరసనకు YSRCP పిలుపు..
డీఎస్సీ స్కాంకు బాధ్యత వహిస్తారా? లేదా?... చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
ఇదేనా నిష్పాక్షిక, పారదర్శక నియామకం... మెగా డీఎస్సీ వ్యవహారంపై చంద్రబాబు బాధ్యత వహించాలి... వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
ప్రపంచ పరిపాలనకు రూల్స్ మనమే రూపొందించాలి.... బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
బిజినెస్
టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు అందించిన రిలయన్స్
తిరుమల తిరుపతిలో పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య రహిత రవాణాకు ప్రోత్సాహం లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేపడుతున్న గ్రీన్ మొబిలిటీ ఉద్యమానికి మద్దతుగా రిలయన్స్ ఫౌండేషన్ 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ప్రత్యేక ఈవీ ఛార్జింగ్ కేంద్రాన్ని విరాళంగా అందజేసింది.బుధవారం తిరుమలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఈ బస్సులను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో భక్తుల రవాణా అవసరాలను తీర్చేందుకు రిలయన్స్ ఈ సర్వీసులు అందించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.హామీ నెరవేర్చిన అనంత్ అంబానీగత జూన్లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ, కొండపై పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించేందుకు 25 ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, స్వల్ప వ్యవధిలోనే రిలయన్స్ ఫౌండేషన్, టీటీడీ భాగస్వామ్యంతో ఈ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రాజెక్ట్ రిలయన్స్ ఫౌండేషన్, జియో-బీపీ ఉమ్మడి కృషితో సాకారమైంది. రిలయన్స్ ఆర్ధిక సహకారాన్ని అందించగా, జియో-బీపీ సంస్థ అవసరమైన ఈవీ ఛార్జింగ్ వసతులను, సాంకేతిక మౌలిక సదుపాయాలను సమకూర్చింది.ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ, ‘శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో భాగస్వామ్యం కావడం మాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాం. తిరుమల కొండల్లోని గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడుతూ, భక్తుల యాత్రను మరింత సౌకర్యవంతంగా మార్చడమే మా లక్ష్యం’ అని తెలిపారు. సంప్రదాయ ఇంధన వాహనాల వాడకాన్ని తగ్గించి, ఏటా తిరుమలను సందర్శించే కోట్లాది మంది భక్తులకు కాలుష్య రహిత ప్రయాణాన్ని అందించడంలో ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలవనుంది.ఇదీ చదవండి: గోల్డ్ లవర్స్కి శుభవార్త.. ధరల పతనం
యూపీఐ చార్జీలు: ఆ.. ఎంతలే అనుకోవద్దు!!
దేశంలో గత ఆరేళ్లుగా సాగుతున్న ఉచిత యూపీఐ (UPI) చెల్లింపుల సేవలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) ఒత్తిడితో పాటు, ఆర్బీఐ, బ్యాంకుల సూచనల మేరకు పెద్ద వ్యాపారుల లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) పునఃప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది.కొత్త చార్జీల నిబంధనలుమినహాయింపులు: రూ.2,000 లోపు ఉండే వ్యాపార చెల్లింపులు, వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) జరిగే నగదు బదిలీలు, రూ.1 లక్ష లోపు నెలవారీ టర్నోవర్ ఉన్న చిరు వ్యాపారులకు ఎలాంటి ఎండీఆర్ వర్తించదు.భారం ఎవరిపై?: వ్యక్తుల నుంచి వ్యాపారులకు (P2M) జరిగే రూ.2,000 పైబడిన లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధించనున్నారు.గరిష్ట పరిమితి: రూ.75,000 దాటిన చెల్లింపులపై ఎండీఆర్ రుసుమును గరిష్టంగా రూ.300గా ఖరారు చేశారు.ఏయే లావాదేవీలపై ఎక్కువ భారం?ఆగస్టు నెలలో నమోదైన మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో రూ.2,000 దాటిన చెల్లింపుల వాటా ఏకంగా 67 శాతంగా ఉంది. సంఖ్య పరంగా ఇవి 4 శాతం మాత్రమే అయినప్పటికీ, విలువ రీత్యా అత్యంత భారీ మొత్తాలు వీటిలోనే ఉన్నాయి. వ్యాపారులు ఈ అదనపు ఎండీఆర్ భారాన్ని వినియోగదారులపైకే నెట్టేసే అవకాశం ఉండటంతో, పెద్ద కొనుగోళ్లపై ప్రభావం పడనుంది.ఏయే లావాదేవీలపై ఎంత భారం?కొత్త చార్జీలు ఏయే చెల్లింపులపై ఎలా వర్తిస్తాయో ఉదాహరణలతో చూస్తే..రూ.2,000 లోపు కొనుగోలు: చేస్తే ఎటువంటి లేదు. ఉదాహరణకు రూ.1,500 విలువైన వస్తువును యూపీఐతో కొనుగోలు చేస్తే కొత్త ఎండీఆర్ వర్తించదు.రూ.5,000 చెల్లింపు: 0.4 శాతం ప్రకారం వ్యాపారికి రూ.20 చార్జీ వర్తిస్తుంది.రూ.10,000 చెల్లింపు: రూ.40 చార్జీ వర్తిస్తుంది.రూ.25,000 చెల్లింపు: రూ.100 చార్జీ వర్తిస్తుంది.రూ.50,000 చెల్లింపు: రూ.200 చార్జీ వర్తిస్తుంది.రూ.75,000 చెల్లింపు: రూ.300 చార్జీ వర్తిస్తుంది.రూ.1 లక్ష చెల్లింపు: 0.4 శాతం ప్రకారం రూ.400 వచ్చినా, గరిష్ఠ పరిమితి కారణంగా ఎండీఆర్ రూ.300లే అవుతుంది.కొన్ని రంగాలకు ఫ్లాట్ రూ.5రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్పుట్స్ వంటి కీలక, తక్కువ మార్జిన్ రంగాల్లో రూ.2,000కు పైబడిన లావాదేవీలకు 0.4 శాతానికి బదులుగా ఒక్కో లావాదేవీకి రూ.5 ఫ్లాట్ ఎండీఆర్గా నిర్ణయించారు.ఏటా రూ.16,000 కోట్ల ఆదాయం ఈ రుసుముల ద్వారా పేమెంట్స్ పరిశ్రమకు ఏటా రూ.16,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్పీసీఐ డేటా ప్రకారం ఆగస్టులో రూ.29,82,356 కోట్ల విలువైన 2,451 కోట్ల లావాదేవీలు జరిగాయి. పర్సన్-టు-పర్సన్ బదిలీల్లో రూ.2,000 పైబడిన ఉచిత లావాదేవీల వాటా 85% ఉన్నప్పటికీ, వ్యాపార చెల్లింపులపై ఈ చార్జీల భారం పడనుంది.పెద్ద మొత్తంలో షాపింగ్ చేసేటప్పుడు డిజిటల్ చార్జీలు వసూలు చేస్తే, ప్రజలు మళ్లీ యూపీఐకి ప్రత్యామ్నాయంగా పాత పద్ధతిలోనే నగదు (Cash) వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కు యూపీఐ చార్జీల ఎఫెక్ట్.. ఎంత?
యూపీఐ (UPI) లావాదేవీలపై కొత్తగా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా యూపీఐ ద్వారా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ తదితర క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు చెల్లింపులు చేసే వారికి కూడా చార్జీలు అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 15 నుంచి క్యాపిటల్ మార్కెట్ కేటగిరీలోని యూపీఐ చెల్లింపులపై 0.02 శాతం ఎండీఆర్ వసూలు చేయనున్నారు. ఒక్కో లావాదేవీకి ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300 ఉంటుంది.ఇన్వెస్టర్లపై నేరుగా నో ఎఫెక్ట్!కొత్త విధానంలో ఈ ఎండీఆర్ను రిటైల్ ఇన్వెస్టర్పై నేరుగా మోపడం కాకుండా, క్యాపిటల్ మార్కెట్ పరిధిలోని నియంత్రిత సంస్థలైన బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, డీలర్లు, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారమ్లు భరించాల్సి ఉంటుంది. ఈ కేటగిరీలో ఈక్విటీ కొనుగోళ్లు, డెట్ మార్కెట్ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్ కొనుగోళ్లు, బ్రోకర్ అకౌంట్ లేదా వాలెట్కు నిధుల జమ వంటి యూపీఐ చెల్లింపులు ఉంటాయి.అందువల్ల సాధారణ దీర్ఘకాలిక మదుపరులకు తక్షణంగా అదనపు ఛార్జీ పడే అవకాశం పరిమితంగానే ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా సిప్ల వంటి లావాదేవీల్లో ప్రభావం తక్కువగా ఉండొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఆయా సంస్థలు భవిష్యత్తులో తమ ఫీజు నిర్మాణాన్ని మార్చుతాయేమోనన్న ఆందోళనైతే ఉంది.రూ.1 లక్ష చెల్లిస్తే ఎంత?0.02 శాతం ఎండీఆర్ అంటే ప్రతి రూ.1 లక్ష క్యాపిటల్ మార్కెట్ యూపీఐ చెల్లింపుపై రూ.20 ఖర్చవుతుంది. రూ.5 లక్షల లావాదేవీకి లెక్క ప్రకారం రూ.100 అవుతుంది. అయితే రూ.15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించినా గరిష్ఠ ఎండీఆర్ రూ.300కే పరిమితం అవుతుంది.ఇది సాధారణ మర్చంట్ యూపీఐ చెల్లింపులపై అమలయ్యే 0.4 శాతం రేటుతో పోలిస్తే చాలా తక్కువ. సాధారణంగా రూ.2,000కు మించిన వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) లావాదేవీలకు 0.4 శాతం ఎండీఆర్, ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 వర్తిస్తుంది. మరోవైపు వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) జరిపే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలూ ఉండవు.యాక్టివ్, ఇంట్రాడే ట్రేడర్లపై ప్రభావం?దీర్ఘకాలిక మదుపరులతో పోలిస్తే తరచూ ట్రేడింగ్ చేసే యాక్టివ్, ఇంట్రాడే ట్రేడర్ల విషయంలో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజులో అనేకసార్లు యూపీఐ ద్వారా ట్రేడింగ్ అకౌంట్లోకి నిధులు జమ చేసే సందర్భాల్లో బ్రోకర్లకు ప్రతి లావాదేవీపై ఈ ఖర్చు ఏర్పడుతుంది.డిస్కౌంట్ బ్రోకర్ల విషయంలో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకోవచ్చు. వీరు సాధారణంగా తక్కువ మార్జిన్లతో పనిచేస్తుండటంతో, అదనపు చెల్లింపు వ్యయం కొంత మేర లాభదాయకతపై ఒత్తిడి తేవచ్చు. దీనికి ప్రతిగా బ్రోకర్లు నెట్ బ్యాంకింగ్, NEFT/RTGS వర్చువల్ అకౌంట్లు, యూపీఐ బ్లాక్ మెకానిజం వంటి ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలను మరింతగా ప్రోత్సహించే అవకాశం ఉంది.అన్ని పెట్టుబడులపైనా ఒకే ప్రభావం ఉండదుకొత్త ఎండీఆర్ ప్రభావం పెట్టుబడి సాధనం, లావాదేవీ పరిమాణం, సంబంధిత బ్రోకర్ లేదా ఏంఎంసీ ఇప్పటికే వసూలు చేస్తున్న ఫీజులపై ఆధారపడి మారవచ్చు. అందువల్ల షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇతర సెక్యూరిటీల లావాదేవీలపై ప్రభావం ఒకే విధంగా ఉండకపోవచ్చు.ఇదీ చదవండి: యూపీఐ చార్జీలు.. ఆర్బీఐ ఏమన్నదంటే?
పసిడి ధరల్లో మార్పు.. హ్యాట్రిక్ మిస్!
దేశంలో బంగారం ధరలు పెరుగుదల బాటపట్టాయి. రెండు రోజులుగా వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు నేడు పుంజుకున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
ఫ్యామిలీ
రెండోసారి వెనైస్!
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ‘వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఒక భారతీయ దర్శకురాలు రెండోసారి మనదేశ పతాకాన్ని సగర్వంగా ఎగరేసింది. బెంగాల్కు చెందిన అనుపర్ణ రాయ్ రెండో చిత్రం ‘లవర్స్ ఇన్ ది బ్లూ నైట్’ అంతర్జాతీయ జ్యూరీ ‘నెట్ప్యాక్’ (ఉత్తమ ఆసియా చిత్రం) అవార్డును గెలుచుకుంది. స్త్రీ సృజనాత్మకతకు, భారతీయ ఇండిపెండెంట్ సినిమా సత్తాకు ఈ విజయం ఒక మచ్చుతునక.మన కమర్షియల్ సినిమా పెద్దలు హీరో కోసం ఎర్రరంగు డబ్బాలు ఎన్ని ఖర్చు పెడితే అంత గొప్ప అనుకుంటున్న వేళ, భారతీయ జీవనంలో చుక్క రక్తం కనపడక కొనసాగే వేదనాపూరిత రక్తపాతాన్ని తెర మీద ఒంపి అంతర్జాతీయ గుర్తింపు పొందుతోంది అనుపర్ణా సేన్. ఆమె తీసిన రెండో సినిమా ‘లవర్స్ ఇన్ ది బ్లూ నైట్’ సెప్టెంబర్ 11న వెనిస్లో వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శన ముగియగానే ప్రేక్షకులు ఏడు నిమిషాల పాటు లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారంటేనే ఆమె ప్రతిభ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అలాగని ఆమె సినిమాలో గొప్ప స్టార్ కాస్టింగ్ లేదు. బడ్జెట్ లేదు. కేవలం కోటి రూపాయల లోపు ఖర్చుతో తీసిన ఈ సినిమాలో ఉన్నది జీవం, జీవితం.వరుసగా రెండోసారి.. ఇదో రికార్డ్!ఇటలీలోని వెనిస్లో సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు జరిగిన వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫెస్టివల్లో 80 దేశాల నుంచి 2000కు పైగా దరఖాస్తులను వడపోసి, 80 చిత్రాలను ఎంపిక చేస్తే వాటిలో భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన ఏకైక ఫిక్షన్ ఫీచర్ సినిమా అనుపర్ణ రాయ్ ‘లవర్స్ ఇన్ ది బ్లూ నైట్’. 2025లో ఆమె తన ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ సినిమాతో వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఓరిన్జోంటి’ (నవ సినిమా) విభాగంలో ‘బెస్ట్ డైరెక్టర్’గా నిలిచి హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ నమ్మకంతోనే ఈ ఏడాది ఆమె రెండో సినిమాను నేరుగా ‘ఓరిన్జోంటి’ పోటీకి ఆహ్వానించారు. ఫ్రాన్స్ , ఇరాన్, ఇటలీ, జపాన్ దేశాల నుంచి వచ్చిన 15 బలమైన చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ అనుపర్ణ సినిమా ‘నెట్ప్యాక్’ జ్యూరీ మనసు గెలుచుకుని అవార్డు సాధించింది. నెట్ప్యాక్ అంటే ‘నెట్వర్క్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఏషియన్ సినిమా’. ఆసియా సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి యునెస్కో సహకారంతో ఏర్పాటైన సంస్థ. ‘నిజమైన ఆసియా గొంతుక’ను ప్రతిబింబించే ఉత్తమ చిత్రానికి ‘నెట్ప్యాక్’ ఇచ్చే ఈ పురస్కారం ఆస్కార్కు ఏ మాత్రం తక్కువ కాదు.ప్రేమ లేని వాళ్ల ప్రేమకథ108 నిమిషాల నిడివి ఉన్న ‘లవర్స్ ఇన్ ది బ్లూ నైట్’ ముంబైలోని నలుగురు వలస జీవుల కథ. మున్సిపాలిటీలో దోమల మందు చల్లే కరీం, అతని భార్య అమీనా, సుక్కా అనే చిల్లర దొంగ, ఓమీ అనే పింప్... వీళ్లే ప్రధాన పాత్రలు. కరీంకు పెళ్లయినా సమాజానికి భయపడి తనలోని ‘గే సెక్సువాలిటీ’ని దాచుకుని బతుకుతుంటాడు. అమీనా మొదట బార్లో, తర్వాత ఫోన్ సెక్స్ కాల్ సెంటర్లో పని చేస్తూ, నిజమైన ప్రేమ కోసం అల్లాడిపోయే ఒక ఒంటరి మహిళ. సుక్కా సమాజంలో కుల వివక్షకు గురై దొంగగా మారాడు. ఓమీ.... పింప్ (విటులను సరఫరా చేసేవాడు)గా బతుకుతుంటాడు. ఈ నలుగురు వలస జీవులు ఒకరి ఒంటరితనాన్ని ఒకరు ఎలా తాకారు? ఒకరినొకరు ఎలా మోసం చేసుకున్నారు? చివరికి ప్రేమ దొరకని ఆ నరక్రపాయమైన నగరంలో కూడా ‘ప్రేమను కలగనడమే’ వాళ్ల మనుగడగా ఎలా మారింది? అనేదే ఈ సినిమా ‘సమాజం కళ్లకు ఏ మాత్రం కనపడని, అది పక్కకు నెట్టేసే కిందిస్థాయి మనుషులను నేను ప్రేమతో, గౌరవంతో, నిజాయితీతో ఇందులో చూపించాలనుకున్నాను’ అన్నారు అనుపర్ణ. ఈ సినిమాలో ఆమె ముంబైని గ్లామర్గా చూపించకుండా, వలస కూలీల పాలిట అది ఎలా నరకంగా మారిందో కళ్లకు కట్టారు. ఈ సినిమా త్వరలోనే ‘ముబి’ లేదా ‘నెట్ఫ్లిక్స్’ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఫిల్మ్ స్కూల్ కెళ్లకుండానే..!అనుపర్ణ రాయ్ ఎవరి దగ్గరా సినిమా శిష్యరికం చేయలేదు. ఆమె తనకు తానుగా సినిమా ఎలా తీయాలో తెలుసుకుంది. ఆమె తన మొదటి సినిమా ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటన్ ట్రీస్’ను దాదాపుగా తన ముంబై ఫ్లాట్లోనే తీసింది. నటీనటులను తన ఫ్లాట్లోనే ఉంచుకుని సినిమా పూర్తి చేసింది బడ్జెట్ లేక. ఈ సినిమాకు అంతర్జాతీయ సపోర్ట్ ఉన్నా తక్కువ బడ్జెట్లోనే ముగించింది. వరుసగా రెండేళ్లు వెనిస్ కాంపిటీషన్ లో తన సినిమాలు ప్రీమియర్ చేసిన అతికొద్ది మంది భారతీయుల్లో ఒకరిగా రికార్డు సృష్టించింది. వచ్చే నెల అక్టోబర్లో ‘బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘లవర్స్ ఇన్ ది బ్లూ నైట్’ ఆసియా ప్రీమియర్ జరగనుంది. అంతేకాదు ఈ ఫెస్టివల్కు అనుపర్ణ ‘జ్యూరీ మెంబర్’గా కూడా వ్యవహరించబోతోంది. మనమంతా ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వచ్చింది కదా అని సంబరపడతాం. కానీ ఎలాంటి స్టార్ పవర్ లేకుండా రూపాయి భారీ బడ్జెట్ లేకుండా.. కేవలం ముంబై మురికివాడలోని నలుగురు వలస జీవుల కథతో ప్రపంచ సినిమా తన వైపు తిరిగి చూసేలా చేసింది అనుపర్ణ. ఇది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు.. ‘అసలైన సినిమా ఎక్కడుందో’ కమర్షియల్ ప్రపంచానికి చేసిన ఒక హెచ్చరిక!
పట్టు వదలని ఆమె ఇప్పుడు జట్టు కోచ్!
లక్ష్య సాధన కోసం చేసే ప్రయత్నంలో గాయాలు, ఎదురుదెబ్బలు సహజం.. కాని క్రీడాకారుల పాలిట మాత్రం ఆ గాయాలే అశనిపాతాలు... పొరపాటున గాని, స్వయంకృతంతో గాని శరీరానికి గాయమైతే కెరీర్ గాయబ్... ఒక్క రోజులో కలలన్నీ చెదిరిపోతాయి. అలా కల చెదిరిన ఓ క్రీడాకారిణి అందరిలా ఉసూరుమంటూ ఊరికే కూర్చోలేదు. వయసు 40 దాటింది...అయినా సరే ఫిట్నెస్ పెంచుకుంది. పట్టుదలతో బరిలోకి దిగింది.. గెలిచి చూపించింది. ఆమే పంజాబ్కు చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్, అంతర్జాతీయ జూడో క్రీడాకారిణి రాజ్విందర్ కౌర్. కెరియర్లో ఎన్నో మెడళ్లు సంపాదించిన ఆమె ప్రస్తుతం ప్రపంచ జూడో చాంపియన్షిప్తో పాటు ఆసియా క్రీడలకు కూడా భారతజట్టు కోచ్గా వ్యవహరించనుంది. ఒక క్రీడాకారిణి మోకాళ్ల లిగ్మెంట్కు గాయాలైతే ఆమె కెరీర్ దాదాపు ముగిసినట్టే. రాజ్విందర్ కౌర్కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. 2014 కామన్వెల్త్ గేమ్స్కి ముందే మోకాళ్ల నొప్పితో బాధపడింది. 2019లో తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో రాజ్విందర్ జూడోకి దూరమైంది. 2022లో రెండు మోకాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకుంది. ఆ తర్వాత 2024 వరకు ఫిజియోథెరపీ చికిత్స తీసుకుని మళ్లీ పోటీకి సిద్ధమైంది. అలా ఆ దూరాన్ని దాటడానికి ఆమెకు ఐదేళ్లు పట్టింది.తొలి గెలుపు... తొలి గాయం... వరుస విజయాలు... కాలేజీ స్థాయిలో పోటీలలో ఎంత రాణించినా రాజ్విందర్కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది మాత్రం 2007, గౌహతిలో జరిగిన నేషనల్ గేమ్స్లోనే. జూడోలో తొలిసారి బంగారు పతకం గెలిచి వార్తల్లో నిలిచింది. తర్వాత 2009 లో హరిద్వార్లో జరిగిన సీనియర్ నేషనల్ జూడో చాంపియన్షిప్లో రాజ్విందర్కు కుడికాలికి తీవ్రమైన గాయమైంది. కానీ రాజ్విందర్ వెనక్కి తగ్గలేదు. 2011లో రాంచీలో జరిగిన నేషనల్ గేమ్స్లో గోల్డ్మెడల్తో మెరిసింది. తర్వాత ఏడాది విరామం తీసుకుంది. ఎందుకంటే ఆమె కుమారుడికి జన్మనిచ్చింది ఆ ఏడాదే. ఆ తర్వాత విరామానికి సెలివిచ్చి ఏకధాటిగా 2013 నుంచి 2018 వరకు వరుసగా ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్లో బంగారు పతకాలు గెలిచింది. ఇక అంతర్జాతీయ స్థాయిలో 2014లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 78 కేజీ విభాగంలో తొలిసారిగా కాంస్యంతో రాజ్విందర్ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2015, 2017లో వరల్డ్ పోలీస్ గేమ్స్లో రజతం, 2018లో సీనియర్ నేషనల్ జూడో చాంపియన్షిప్, ఇండియన్ చాంపియన్షిప్లలో రజతం గెలుచుకుంది. శస్త్ర చికిత్స తర్వాత 2024 భువనేశ్వర్లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్లో గోల్డ్ మెడల్తో సూపర్ కమ్బ్యాక్ ఇచ్చింది. తర్వాత 2025లో అమెరికాలోని అలబామాలో జరిగిన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో బంగారు పతకం సాధించి సత్తా చాటింది.ఫ్యామిలీ ఉమన్... రాజ్విందర్ భర్త కుల్జిందర్సింగ్ కూడా జూడో కోచ్. ఆయన పురుషుల జట్టుకు కోచ్గా వ్యవహరిస్తే, రాజ్విందర్ మహిళల జట్టుకు కోచ్. ఆమె కుమారుడి వయసు 14 ఏళ్లు. ప్రతి రోజూ తన కొడుకుతో పాటే జిమ్కి వెళ్లి శిక్షణ తీసుకోవడం ఆమెకు అలవాటు. ఇంటి పనులు చేస్తూ, ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, జూడో క్రీడలో తనదైన ముద్రవేసింది. జూడో మ్యాట్పై పడిపోవడం ఆమెకు కొత్త కాదు. ఒడిదుడుకులు కొత్త కాదు. ఒకప్పుడు తన కోసం గెలవాలనుకుంది. ఇప్పుడు దేశాన్ని గెలిపించేందుకు తనలాంటి వారికి శిక్షణ ఇవ్వబోతోంది. ఆట నుంచి ఆమెను మోకాళ్లు కొంతకాలం ఆపి ఉండొచ్చు కాని ఆమె మనసు మాత్రం ఎప్పుడూ జూడో రాజ్విందర్ కెరీర్లో ఎన్ని గెలిచిందన్నది విజయం కాదు.. పడిపోయినా... మళ్లీ లే చి ఎలా నిలదొక్కుకుందన్నదే నిజమైన విజయం.ఆమె ఛాయిస్ కాదు! నిజానికి రాజ్విందర్కు మొదట ఇష్టమైన ఆట 200 మీటర్ల పరుగు పందెం. జూడో గురించి ఆమెకు తెలియదు. పంజాబ్లోని తరన్తారన్ జిల్లా, ఫాజిల్పూర్ గ్రామం రాజ్విందర్ స్వస్థలం. 1984 ఏప్రిల్ 2న ఆమె పుట్టింది. స్కూల్లో చదువుతున్నప్పుడు రన్నింగ్ రేస్ తన ఫేవరెట్ స్పోర్ట్. కాని జలంధర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడు.. స్కూల్లో జూడో జట్టు కోసం కాస్త బలమైన క్రీడాకారిణుల కోసం చూస్తున్నప్పుడు రాజ్విందర్ అక్కడి కోచ్ దృష్టిలో పడింది. వెంటనే రాజ్విందర్ శిక్షణలో చేరాల్సి వచ్చింది. అలా జూడో ఆట ఆమెను ఎంచుకుంది.
బిచ్చగాడు రీల్ కాదు రియల్!
కోటీశ్వరుడైన అరుల్ తల్లి చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు అతడికి ఒక స్వామీజీ.. ‘నలభై ఎనిమిది రోజులు ఎవరికీ తెలియకుండా బిచ్చగాడిగా దీక్ష చేస్తే నీ తల్లి కోలుకుంటుంది’ అని సలహా ఇస్తాడు. స్వామిజీ సలహాను అనుసరించి నలభై ఎనిమిది రోజులు బిచ్చగాడిగా అవతారం ఎత్తి అష్టకష్టాలు పడతాడు అరుల్. అయితే ఇది ‘బిచ్చగాడు’ అనే సూపర్ హిట్ సినిమా కథ. ఇంచుమించు ఇలాంటి ఘటనే ముంబైలో జరిగి సంచలనం సృష్టించింది...మహారాష్ట్రలోని అత్యంత సంపన్న శాసన సభ్యులలో పరాగ్ షా ఒకరు. ఈయన ఘాట్కోపర్ తూర్పు నియోకవర్గ శాసనసభ్యుడు, వ్యాపారవేత్త. జైన సంప్రదాయంలోని ఒక ప్రత్యేక మాసం సందర్భంగా తన ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు ముంబైలోని ఘాట్కోపర్ వీధుల్లో ఒకరోజు బిచ్చగాడి వేషధారణలో గడిపాడు షా. దీని కోసం భద్రతా సిబ్బందిని దూరం పెట్టాడు. ఖరీదైన వస్తువులు, వాహనాలను విడిచి పెట్టాడు. ప్రజలు తనను గుర్తు పట్టకుండా ఉండడానికి ప్రత్యేకంగా మేకప్ వేసుకొని రోజంతా భిక్షాటన చేస్తూ గడిపాడు.ఆ బీదలు దయాగుణ సంపన్నులు!‘ సమోసాలు అమ్మే వ్యక్తి పేదవాడు అయినప్పటికీ ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా నాకు సమోసాలు ఇచ్చాడు. ముంబై నగరం ఎలాంటిదంటే ఇక్కడ ప్రజలు ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు’ అని ఆ అనుభవాన్ని గుర్తు తెచ్చుకున్నాడు షా. కోటీశ్వరుడైన షా భిక్షాటన చేయడమే కాకుండా, రోడ్డు పక్కన కూర్చొని బిచ్చగాడిలాగే తిన్నాడు. ఆ తరువాత తన మేకప్ను తీసేసుకొని, తాను ఇంతకు ముందు వెళ్లిన వారి దగ్గరకు వెళ్లాడు. ఆ వ్యక్తులతో మాట్లాడాడు. కృతజ్ఞతలు తెలియజేశాడు. బిచ్చగాడిగా తన అనుభవాలను సన్నిహితులతో, గురువుతో పంచుకున్నాడు. రియల్టర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన షా మొదట కార్పొరేటర్గా గెలిచాడు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్–2024 కోసం సమర్పించిన అఫిడవిట్లో రూ.3,383 కోట్లకు పైగా విలువైన ఆస్తులు తనకు ఉన్నట్లు ప్రకటించాడు. తద్వారా రాష్ట్రంలో అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.ఇలా అందరూ చేస్తే!బిచ్చగాడిగా షా వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ‘ఒక్క రోజో, రెండు రోజులో... ప్రతి ఒక్కరు బిచ్చగాడిగా మారితే మనకు కొత్త వెలుగు తప్పకుండా కనిపిస్తుంది’ అని ఒక నెటిజనుడు అభి్రపాయపడ్డాడు. ‘వాస్తవం’ అంటూ అతడితో చాలామంది ఏకీభవించారు.జీవన వాస్తవం‘ఈ అనుభవం నాకు జీవన వాస్తవికతను కళ్లకు కట్టింది. రోజూ కనిపించే గౌరవ మర్యాదలు లేవు. నన్ను కలవడానికి ప్రజలు క్యూ కడతారు. అదే ప్రజల దగ్గరికి నేను వెళ్లినప్పుడు వారు నా కంటే ఉన్నతమైన వారిగా, ఎక్కువ హోదా కలిగిన వారిగా కనిపించారు. అదే జీవనవాస్తవికత. ముంబై ప్రజలలోని సహజ దయాగుణం కూడా తెలిసింది’ అంటున్నాడు షా.ఒక వ్యక్తి షాకు ఇరవై రూపాయలు ఇచ్చి... ‘వెళ్లి భోజనం చెయ్ బాబా’ అన్నాడు. ఆ ఇరవై రూపాయలు తీసుకొని సమోసాలు అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లాడు షా. ‘నా దగ్గర డబ్బులేవీ లేవు’ అని సమోసాలు అమ్మే వ్యక్తికి చె΄్పాడు. ఆయన విసుక్కోకుండా చిరునవ్వుతో సమోసాలు ఇచ్చాడు.
76 ఏళ్ల వయసులోనూ అద్భతంగా తకిల్..!శబరిమలలో..
పురుషులే ఎక్కువగా వాయించే భారీ తాళ వాయిద్యం తకిల్. అలాంటి వాయిద్యాన్ని ఒక మహిళ కళాకారిని అద్భుతంగా పలికించడమే కాదు ఓ కొత్త లయను సృష్టివచి ఆశ్చర్యపరిచింది. ఇంతవరకు అలాంటి వాయిద్యాన్ని పరికించిన మహిళామణి లేదు. అలాగే ఏకంగా శబరిమలలో అయ్యప్ప గుడిలో తకిల్ వాయించే మహిళా కళాకారిణిగా చరిత్ర సృష్టించింది ఈ వనిత. ఏడు పదుల వయసులోనూ అంతే అద్భుతంగా వాయిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోందామె. ఆ మహిళే కేరళకు చెందిన పతియూర్ కమలం. ఆమె మొదటి గురువు తండ్రి గోపాల కృష్ణ పణికర్. ఆయన స్వయంగా దేవస్వం బోర్డులో తకిల్ విద్వాంసుడు. తన కుమార్తె ఆసక్తిని గమనించి సాధన కోసం తేలికపాటి తకిల్ వాయిద్యాన్ని తయారు చేయించారు. అలా ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఈ రంగంలోకి ప్రవేశించింది. శబరిమలలో తన తండ్రితో కలిసి ప్రదర్శన ఇచ్చిన తర్వాత ఆమె వృత్తిపరమైన ప్రస్థానం ఊపందుకుంది. పెరున్న సుబ్రహ్మణ్య ఆలయం 'తైపూయం' ఉత్సవంలో ఆమె ఇచ్చిన అద్భుత ప్రదర్శన, కేరళ, తమిళనాడులోని వివిధ ఆలయాల నుంచి పెద్ద ఎత్తున ఆహ్వానాలలు వచ్చేందుకు దారితీసింది. ఆమె భర్త 'ఇడక్క' (మరొక సాంప్రదాయ తాళ వాయిద్యం) కళాకారుడు. ఎనమిది మంది సంతానంలో మూడొవది అయిన కమలం తన సుదీర్ఘ వృత్తి జీవితంలో అనేక పురస్కారాలు అందుకున్నారు. 2019లో కేరళ సంగీత నాటక అకాడమీ ప్రతిష్టాత్మక 'గురుపూజ' అవార్డుతో ఆమెను సత్కరించింది. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆమె కుమారుడు ప్రదీప్ జి. పణికర్ కూడా తకిల్ కళాకారుడిగా రాణిస్తున్నారు. కేరళ ప్రముఖ రచయిత ఆర్యద్ సనల్ కుమార్ కళాకారిణి కమలం జీవితం, ఆమె కళా ప్రస్థానంపై డాక్యుమెంటరీని రూపొందించారు. దీన్ని ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ డిసెంబర్లో ప్రదర్శించనున్నారు.(చదవండి: జెన్ ఆల్ఫా పెంపకంపై ఆది సాయికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!)
అంతర్జాతీయం
సముద్రం.. గడ్డకట్టే చలి.. 62 గంటల తర్వాత..
ఒళ్లు గగుర్పొడిచే ఘటన అలాస్కా తీరంలో జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని విషాదం ఎదురైంది. చిన్న పడవ ఒక్కసారిగా సముద్రంలో బోల్తా పడటంతో 15 ఏళ్ల డెరిక్ పార్కర్ అఘ్నాంగ తన అన్న, కజిన్ను కోల్పోయాడు. అయితే ప్రాణాలతో బయటపడేందుకు దాదాపు మూడు రోజుల పాటు సముద్రంలో మంచు గడ్డలతో పోరాటం చేశాడు. సెప్టెంబర్ 5న జరిగిన ఈ ఘటన జరగ్గా, సుమారు 62 గంటల తర్వాత డెరిక్ను రక్షించారు.పడవ బోల్తా పడిన తర్వాత డెరిక్తో పాటు అతని అన్న, కజిన్ సముద్రంలో పడిపోయారు. కొంతసేపు ముగ్గురూ ఒకరికొకరు దగ్గరగా ఉండగలిగారు. అయితే పరిస్థితులు మరింత విషమించడంతో అతని అన్న, కజిన్ మునిగి ప్రాణాలు కోల్పోయారు. వారు తన నుంచి దూరంగా కొట్టుకుపోకుండా ఉండేందుకు డెరిక్ తన అన్న, కజిన్ మృతదేహాలను సాధ్యమైనంత ఎక్కువసేపు పట్టుకుని ఉండేందుకు ప్రయత్నించాడు. చివరకు బలమైన సముద్ర ప్రవాహాల కారణంగా వారిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో అతను ఒంటరిగా సముద్రంలో మిగిలిపోయాడు.పడవలోని చేపల వేటకు ఉపయోగించే ఓ లైన్.. ఇంజిన్లో చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. దాన్ని విడిపించేందుకు వారు ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. అనంతరం వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారడంతో పడవ బోల్తా పడింది. పడవ తిరగబడటంతో అందరూ గడ్డకట్టేంత చల్లని సముద్రంలో పడిపోయారు. కొన్ని గంటలకు డెరిక్ అన్న, కజిన్ మృతి చెందారు. అయినప్పటికీ డెరిక్ వారిని వదలకుండా వీలైనంత వరకు పట్టుకుని ఉన్నాడు. సాయం అందుతుందనే ఆశతో సముద్రంలోనే పోరాడాడు.సెప్టెంబర్ 7 ఉదయం అమెరికా కోస్ట్ గార్డ్ బృందం బోల్తా పడిన పడవను గుర్తించింది. అది సెయింట్ లారెన్స్ ద్వీపానికి తూర్పున సుమారు నాలుగు మైళ్ల దూరంలో ఉంది. అధికారులు ముందుగా డెరిక్కు అవసరమైన ప్రాణరక్షణ సామగ్రిని అందించారు. అనంతరం సమీపంలోని నౌక అతడిని రక్షించింది.అప్పటికే డెరిక్ తీవ్ర హైపోథర్మియాతో బాధపడుతున్నాడు. శరీరంలో నీరు తీవ్రంగా తగ్గిపోయి.. చలికి గురై అతని పరిస్థితి విషమంగా ఉంది. అయినప్పటికీ అతను శ్వాస తీసుకుంటూనే ఉన్నాడు. వెంటనే అత్యవసర చికిత్స కోసం అతడిని వైద్య కేంద్రానికి తరలించారు. డెరిక్ అత్త కొలీన్ వాకర్ గోఫండ్మీ పేజీలో ఈ విషాద ఘటన వివరాలను వెల్లడించారు. తన అన్న, కజిన్ మునిగిపోయిన తర్వాత వారిని సాధ్యమైనంత ఎక్కువసేపు పట్టుకుని ఉండేందుకు డెరిక్ ప్రయత్నించాడని ఆమె తెలిపారు.
ఇక చిటికెలో టీబీ గుర్తింపు.. 16 ఏళ్ల కుర్రాడి వినూత్న ఆవిష్కరణ!
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి ఆస్టిన్ జిన్.. క్షయవ్యాధి (ట్యూబర్క్యులోసిస్-టీబీ)ని రక్త పరీక్ష ద్వారా గుర్తించడంతోపాటు, ఔషధ నిరోధకత కలిగిన బ్యాక్టీరియాను గుర్తించగల క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్(సీఆర్ఐఎస్పీఆర్) ఆధారిత నిర్ధారణ వ్యవస్థను అభివృద్ధి చేశాడు. ఈ పరిశోధనకు గాను ఆస్టిన్ జిన్కు 2026 డేవిడ్సన్ ఫెలోషిప్తో పాటు 50,000 డాలర్ల స్కాలర్షిప్ లభించింది.న్యూయార్క్లోని గ్రేట్ నెక్లో ఉన్న విలియం ఎ. షైన్ గ్రేట్ నెక్ సౌత్ హైస్కూల్లో సీనియర్ అయిన జిన్.. ఎం- క్యాచ్ అనే డయాగ్నస్టిక్ ప్లాట్ఫామ్ను రూపొందించాడు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షలకు పైగా మరణాలకు కారణమవుతున్న ట్యూబర్క్యులోసిస్ నిర్ధారణలో ఎదురయ్యే సమస్యను పరిష్కరించేందుకు ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాడు.సాధారణంగా టీబీ నిర్ధారణకు ఊపిరితిత్తుల లోతు నుంచి వచ్చే కఫాన్ని ఉపయోగిస్తారు. అయితే చిన్నారులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తగిన నమూనాను అందించడం కష్టంగా ఉంటుంది. ఈ సమస్యకు భిన్నమైన విధానాన్ని జిన్ తన ప్రాజెక్ట్లో అనుసరించాడు. ఎం-క్యాచ్ రక్త సీరమ్లో ఉండే బ్యాక్టీరియా ఎన్డీఏ చిన్న భాగాలను గుర్తిస్తుంది. ఇందుకోసం పాలిమరేజ్ చైన్ రియాక్షన్స్తో పాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంది. టీబీ ఉందా లేదా అన్నదాన్ని గుర్తించడంతోపాటు, కొన్ని ఔషధాలకు బ్యాక్టీరియా నిరోధకతను కలిగించే జన్యు మార్పులను కూడా ఈ పరీక్ష గుర్తించగలదు.ఈ సూక్ష్మ జన్యు మార్పులను గుర్తించేందుకు జిన్ ప్రత్యేక సీఆర్ఐఎస్పీఆర్ గైడ్ ఆరఎన్ఏలను రూపొందించాడు. వాటిని మైక్రోఫ్లూయిడిక్స్ చిప్తో అనుసంధానించాడు. దీంతో ఒకేసారి అనేక రియాక్షన్లు నిర్వహించవచ్చు. ఫలితంగా వందలాది రియాక్షన్లను, ఒకటి కంటే ఎక్కువ మ్యుటేషన్లను ఏకకాలంలో పరీక్షించే మల్టీప్లెక్స్ ప్లాట్ఫామ్ రూపొందింది. అత్యాధునిక ప్రయోగశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పెద్దస్థాయి పరీక్షలకు ఇది భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది.భవిష్యత్తులో బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోకెమిస్ట్రీ చదివి వైద్యునిగా, శాస్త్రవేత్తగా పనిచేయాలని జిన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రయోగశాల పరిశోధనలను వైద్యానికి ఉపయోగపడే సాధనాలుగా మార్చాలనేది అతని ఆశయం. భవిష్యత్తులో ఎం క్యాచ్ ప్లాట్ఫామ్ను ఇతర అంటువ్యాధులను, క్యాన్సర్ను గుర్తించేందుకు కూడా ఉపయోగపడనున్నదని సమాచారం.ఇదీ చదవండి: విశ్వ వీక్షణ నిలయం.. ఈ గణేశ మండపం
ఇరాన్ విమానంలో భయానక సీన్
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఒక్కసారిగా భారీగా కుదుపులకు గురైంది. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఇంతలో క్యాబిన్ పైకప్పు భాగాలు ఊడిపడి సీట్లపై వేలాడుతూ కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకుని బ్యాగులు కిందపడటంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. చివరకు పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని తిరిగి ఎయిర్పోర్టుకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.ఇరాన్కు చెందిన సెపెహ్రాన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 విమానం మంగళవారం సాయంత్రం మషద్ నుంచి కెర్మాన్షాకు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్లోని ఓ టైరు ఊడిపోయింది. ఆ టైరు దెబ్బతినడంతో దాని భాగాలు ఇంజిన్ను తాకాయి. దీంతో ఇంజిన్లో సమస్య తలెత్తి విమానం తీవ్రంగా కుదుపులకు లోనైంది. పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించి విమానాన్ని మషద్ వైపు మళ్లించారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించి తిరిగి ల్యాండ్ చేయాలని నిర్ణయించారు.భయంతో కేకలు..విమానం తిరిగి వస్తున్న సమయంలో కుదుపులు మరింత తీవ్రంగా మారాయి. ఆ ప్రభావంతో క్యాబిన్ పైకప్పు లోపలి లైనింగ్ భాగాలు ఊడిపోయి ప్రయాణికులపై పడినట్లు వీడియోల్లో కనిపించింది. ఆ సమయంలో ప్రాణ భయంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. కొన్ని చోట్ల విమానం లోపలి నిర్మాణంలోని భాగాలు కూడా బయటకు కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకోవడంతో బ్యాగులు సీట్లపై, మార్గంలో పడిపోయాయి. సేఫ్గా ల్యాండింగ్..అయితే విమానం మషద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. లగేజీలు కిందపడ్డా కూడా ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదు. అనంతరం ప్రయాణికులను మరో విమానంలో కెర్మాన్షాకు పంపించినట్లు సమాచారం. ఘటన అనంతరం రన్వేను కొంతసేపు మూసివేసి తనిఖీలు నిర్వహించారు.విమానంలో సాంకేతిక లోపానికి అసలు కారణమేంటన్న దానిపై ఇరాన్ పౌర విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఎయిర్లైన్స్కు చెందిన మరో విమానం ఆగస్టు 25న మషద్లో ల్యాండ్ అవుతుండగా రన్వేపై నుంచి పక్కకు వెళ్లిన ఘటన జరిగింది.WATCH: Cabin ceiling falls apart onboard a Sepehran Airlines Boeing 737 after a tire reportedly burst shortly after takeoff from Mashhad Airport causing engine damage and severe vibrations. pic.twitter.com/R7RP1AwZYX— Breaking Aviation News & Videos (@aviationbrk) September 15, 2026
వార్త కవరేజీకి వెళ్లి.. హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు మృతి!
లాస్ఏంజెల్స్: అమెరికాలోని లాస్ఏంజెల్స్లో గల శాన్ ఫెర్నాండో వ్యాలీలో మంగళవారం ఎస్యూవీ-బస్సు ఢీకొన్న ఘటనను కవర్ చేస్తుండగా, ఓ వార్తా సంస్థ హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదానికి ముందు హెలికాప్టర్లో చోటుచేసుకున్న భయానక దృశ్యాలు విమానం లోపల నుంచి తీసిన వీడియోలో కనిపిస్తున్నాయి.చాట్స్వర్త్లోని ఎన్ మాన్షన ఎవెన్యూ 9100 బ్లాక్ సమీపంలోని ఓ పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ కూలిపోయింది. అక్కడికి సమీపంలోనే అంతకుముందు ఓ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఎస్యూవీ(కారు).. మెట్రో బస్సును ఢీకొనడంతో ఇద్దరు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. హెలికాప్టర్లోని కెమెరా రికార్డింగ్లో విమానం నియంత్రణ కోల్పోతున్నట్లు కనిపించింది. ఆ తర్వాత అది కూలిపోవడంతో వీడియో రికార్డింగ్ ముగిసింది. రెండు వాణిజ్య భవనాల మధ్య హెలికాప్టర్ కూలిపోయి.. అది పలు వాహనాలు, షిప్పింగ్ కంటైనర్లపై పడింది.లాస్ ఏంజెల్స్ ఫైర్ డిపార్ట్మెంట్ కెప్టెన్ బ్రాండెన్ సిల్వర్మన్ సంఘటనా స్థలంలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించామని తెలిపారు. హెలికాప్టర్ కూలిన సమయంలో ఆ వ్యక్తి దాని వెలుపల ఉన్నట్లు కనిపించిందన్నారు. ‘హెలికాప్టర్లో ఎంత మంది బాధితులు ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని సిల్వర్మన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. విమానం చాలావరకు పూర్తిగా ధ్వంసమైందని ఆయన పేర్కొన్నారు. హెలికాప్టర్లో మరెవరైనా ఉన్నారా? విమానం ఎవరిదన్న విషయాన్ని నిర్ధారించేందుకు అగ్నిమాపక సిబ్బంది శిథిలాలను పరిశీలించాల్సి వచ్చింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం హెలికాప్టర్ ఓ టెలివిజన్ స్టేషన్కు చెందినది. అయితే ఏ స్టేషన్కు చెందినదో వెంటనే నిర్ధారించలేదని సీబీఎస్ తెలిపింది. హెలికాప్టర్ ప్రమాదంపై లాస్ ఏంజెల్స్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని తెలుస్తోంది. BREAKING: KNBC helicopter crashes while covering metro bus crash in Los Angeles, California. https://t.co/TgzkkVTBHx— AZ Intel (@AZ_Intel_) September 16, 2026
జాతీయం
రూ.4 కోట్లు : 108 కిలోల వెండి గణపతి
ముంబై: దేశమంతటా లక్షలాది విగ్రహాలతో గణేశ ఉత్సవాలు సోమవారం నుంచి సందడిగా మొదలయ్యాయి. అయితే, మహారాష్ట్రలోని జల్నా నగరంలో, బంగారంతో పూత పూసిన, సుమారు రూ. 4 కోట్ల విలువైన 108 కిలోల వెండి గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఈ విగ్రహాన్ని ఏకంగా 108 కిలోల వెండితో తయారు చేయడంతోపాటు ఆపై బంగారు పూత పూయడం విశేషం. ఈ విగ్రహం విలువ రూ.4 కోట్లుంటుందని అనోఖా గణేశ్ మండల్ వ్యవస్థాపకుడు అజయ్ భారతీయ చెప్పారు.‘వాస్తవానికి విగ్రహానిన 2023లో 107 కిలోల వెండితో తయారు చేయించారు. అయితే ఈ నాలుగేళ్లలో వెండి విలువ బాగా పెరిగింది. ఇటీవల ఈ విగ్రహానికి 50 తులాల బంగారంతో పూత వేయించడంతో దీని ప్రస్తుత బరువు 108 కిలోలకు చేరింది. ఈ ఏడాది వేడుకల్లో భక్తులు, కుటుంబాల కోసం అలంకరించిన శకటాలు, ఇతర ఆకర్షణలు ఉంటాయని మండల్ అధ్యక్షుడు రితేష్ మిశ్రా తెలిపారు. ఇదీ చదవండి: ‘క్వీన్ ఫిషర్’ యూట్యూబర్ జీవితం విషాదాంతంవిగ్రహాన్ని ఏడాది పొడవునా సురక్షిత మైన ప్రదేశంలో ఉంచుతారని, గణేష్ ఉత్సవాల సమయంలో దానిని బయటకు తీసి మండప ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తారని తెలిపారు. 12 రోజుల పండుగ గణేష్ చతుర్థి ఉత్సవాలు సోమవారం ప్రారంభమైనాయి.ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!
"యూపీఐ పేమెంట్లపై చార్జీలు వద్దు".. విపక్ష నేతలు
న్యూఢిల్లీ: వ్యాపారులకు రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై ఫీజు విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దేశంలోని మొత్తం ప్రజలపై ప్రభావం చూపుతుందని, ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం అని రాష్ట్రీయ సమాజ్ పక్ష ఎంపీ ఎన్.కె.ప్రేమచంద్రన్ పేర్కొన్నారు.పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం సమావేశంలో కొందరు ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు ఆ సంఘం చైర్మన్ భర్తృహరి మహతాబ్ తెలిపారు. వచ్చే సమావేశంలో దీనిని చర్చకు తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు.స్థాయీ సంఘం సభ్యుడు ప్రేమచంద్రన్ మాట్లాడుతూ.. వ్యాపారులకు రూ.2,000కు మించిన చెల్లింపులపై ఫీజు విధించాలన్న ప్రభుత్వ నిర్ణయం దేశ ప్రజలందరినీ ప్రభావితం చేస్తుందని అన్నారు. దాదాపు ఆరు సంవత్సరాలుగా పూర్తిగా ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ చెల్లింపుల విధానంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం (సెప్టెంబర్ 15) మార్పు ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి వ్యాపారులకు యూపీఐ ద్వారా చేసే రూ.2,000కు మించిన బదిలీలపై 0.4 శాతం ఫీజు విధించనున్నట్లు వెల్లడించింది. అయితే సాధారణ వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే లావాదేవీలు, చిన్న మొత్తాల చెల్లింపులకు ఎలాంటి ఫీజు ఉండదని స్పష్టం చేసింది.ఎవరు ఏమన్నారు?యూపీఐ ద్వారా వ్యాపారులకు చేసే రూ.2,000కు మించిన చెల్లింపులపై అక్టోబర్ 15 నుంచి 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలు చేయాలన్న నిర్ణయంపై రాజకీయంగా భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సహా విపక్ష నేతలు ఈ నిర్ణయాన్ని విమర్శించగా, ప్రభుత్వం మాత్రం వినియోగదారులపై ఎలాంటి ఛార్జీ ఉండదని స్పష్టం చేసింది.రాహుల్ గాంధీ: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. వ్యాపారులపై విధించే ఫీజు చివరికి వినియోగదారులపైనే పడే అవకాశం ఉందని ఆరోపించారు. దుకాణదారులు ఈ వ్యయాన్ని వస్తువుల ధరల్లో కలిపితే సాధారణ ప్రజలే భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గుతోందని కూడా ఆయన ఆరోపించారు.మల్లికార్జున ఖర్గే: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కేంద్ర నిర్ణయాన్ని విమర్శించారు. ద్రవ్యోల్బణం ఇప్పటికే సామాన్యులపై ఒత్తిడి పెంచుతున్న సమయంలో డిజిటల్ చెల్లింపులపై అదనపు భారాన్ని మోపుతున్నారని ఆయన ఆరోపించారు.పవన్ ఖేరా: కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి, రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా.. కొత్త 0.4 శాతం ఎండీఆర్ను “మోదీ ట్యాక్స్”గా పిలవాలని అన్నారు. యూపీఐని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన తర్వాత దాని వినియోగంపై పన్ను విధిస్తున్నారని ఆయన విమర్శించారు.హారిస్ బీరన్: ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రాజ్యసభ సభ్యుడు హారిస్ బీరన్.. ప్రభుత్వం సాధారణ ప్రజలను మోసం చేసిందని వ్యాఖ్యానించారు. వ్యాపారులు ఎండీఆర్ భారం వినియోగదారుల నుంచి వసూలు చేసే ప్రయత్నం చేయవచ్చని, దీంతో వ్యాపారులు డిజిటల్ చెల్లింపులకు దూరమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వ వివరణ: ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఎండీఆర్ వినియోగదారులపై విధించే ఛార్జీ కాదని స్పష్టం చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే ఉంటాయని, రూ.2,000 వరకు వ్యాపారి చెల్లింపులకు కూడా ఎండీఆర్ ఉండదని తెలిపింది. చిన్న వ్యాపారులకు సంబంధించిన జీరో-ఎండీఆర్ నిబంధనలు కొనసాగుతాయని, మొత్తం వ్యాపారి లావాదేవీల్లో సుమారు 96 శాతం ప్రభావితం కాకుండా ఉంటాయని పేర్కొంది.బీజేపీ వాదన: ప్రభుత్వ వాదన ప్రకారం, ఈ ఎండీఆర్ పన్ను కాదు. దీనివల్ల వచ్చే ఆదాయం బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు, యూపీఐ యాప్ సంస్థల మధ్య పంచబడుతుంది. యూపీఐ మౌలిక వసతులు, భద్రత, విస్తరణకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడమే కొత్త విధానం ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వ్యాపారులు ఎండీఆర్ భారాన్ని ఎలా నిర్వహిస్తారు, వస్తువుల ధరలపై దాని ప్రభావం ఉంటుందా, డిజిటల్ చెల్లింపుల వినియోగంలో ఏమైనా మార్పు వస్తుందా అనేది తదుపరి పరిశీలించాల్సిన అంశాలుగా మారాయి.
రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే
మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే మరో బాంబు పేల్చారు. రూ. 11 విలువైన IV సెట్ రూ. 325కి విక్రయిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుడిపై ఈ రేంజ్లో భారాన్నిమోపడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని, దీనిపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఆసుపత్రుల్లో సాధారణంగా వాడే వైద్య సామాగ్రి ధరలను సమీక్షించాలనికోరారు. ఇప్పటికే ఆహార భద్రత, నిబంధనలపై విస్త్రృత దాడులు, జరిమానాలు, రద్దు లాంటి చర్యలతో పలు రెస్టారెంట్ల ఓనర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న తుకారం ముండే మరో సంచలనానికి తెరలేపారు.రిటైల్ అండ్ వాణిజ్య మార్కెట్లలో విక్రయించే వైద్య పరికరాల ధరల తీరును అంచనా వేసేందుకు మహారాష్ట్ర స్టేట్ ప్రైస్ మానిటరింగ్ రిసోర్స్ యూనిట్ (MSPMRU) , ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నిర్వహించిన ఒక సర్వేలో దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడైనాయి. ఆసుపత్రులలో వాడే వైద్య పరికరాలపై భారీ దోపిడీ జరుగుతున్నట్లు వెల్లడైంది. కొనుగోలు ధరకు, గరిష్ట దరకు, MRPకి మధ్య వందల, వేల శాతాల వ్యత్యాసం ఉన్నట్లు తేలింది.ఈ సర్వే ప్రకారం కేవలం రూ. 11 విలువ చేసే ఐవీ సెట్ రూ. 325కి విక్రయిస్తున్నారు. అంటే దీనిపై లాభం ఏకంగా 2,841శాతం. రూ. 6.75 ఖరీదు చేసే 10 మి.లీ. సిరంజీని రూ. 57.20కి అమ్ముతున్నారు (747శాతం ఎక్కువ). రూ. 40-45 ఖరీదు చేసే నెబ్యులైజర్ మాస్క్ (Nebulizer Mask) ధర రూ. 652 నుంచి రూ. 715 వరకు బిల్లు వేస్తున్నారు (సుమారు 1,687 శాతం అదనం). అంతేకాదు రూ. 29.41 కొనుగోలు ధర గల క్యాథెటర్ దాని అసలు ధర కంటే 10 రెట్లు అధికంగా విక్రయిస్తున్నారు. ఈ లెక్కలు వాణిజ్య స్థాయిలో అదుపులేని లాభార్జన జరుగుతోందని అధికారులు పేర్కొనడానికి ఈ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఇదీ చదవండి: ఒరాకిల్ను వదిలేసిన టెకీ : ఏకంగా రూ. 9 కోట్ల వ్యాపారంఈ భారీ ధరల పెరుగుదల అహేతుకమైనది, అన్యాయమైందీ అంటూ తుకారాం ముండే ఈ దోపిడీని తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు బేరాలాడే అవకాశం లేకపోవడంతో, ట్రేడింగ్ వర్గాలు దీనిని ఆసరాగా చేసుకుని విపరీతంగా లాభాలు గడిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సాధారణ శస్త్రచికిత్స వినియోగ వస్తువులను (Surgical Consumables) డ్రగ్స్ (ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్ (DPCO), 2013 పరిధిలోకి తీసుకువచ్చి ధరలను నియంత్రించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!
ఒరాకిల్ను వదిలేసిన టెకీ : ఏకంగా రూ. 9 కోట్ల వ్యాపారం
గ్లోబల్ టెక్ కంపెనీ ఒరాకిల్(Oracle)లో ఉద్యోగాల కోత ప్రకంపనలు రేపుతున్న వేళ, ఆ సంస్థ మాజీ ఉద్యోగి సక్సెస్ స్టోరీ నెట్టింట సందడిగా మారింది. లక్షల జీతం వదులుకొని ఫలూదా బిజినెస్ మొదలు పెట్టి రూ. 9 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుండటం విశేషంగా నిలుస్తోంది. తనలాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.2019లో ప్రదీప్ కన్నన్ (Pradeep Kannan) నెలకు లక్ష రూపాయలు ఆర్జిస్తున్న సమయంలో తన స్థిరమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. తనకంటూ ఒక సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఆయన ప్రణాళిక. ఈ మాట వినగానే లక్షల జీతం వదులుకొని ఐస్ క్రీం షాపులేంటి?అని అందరూ ఎగతాళి చేశారట. కానీ కల సాకారం కోసం 33 ఏళ్ల వయసులో బెంగళూరు వదిలి తన సొంత ఊరు కరూర్ (తమిళనాడు) వెళ్ళి 'ది ఫలూదా షాప్' (The Falooda Shop) ప్రారంభించారు.నిజానికి ఒరాకిల్కు ముందే ఆయన 'లెట్స్ కుల్ఫీ' (Lets Kulfi) పేరిట ఒక కుల్ఫీ వ్యాపారాన్ని ప్రారంభించి విఫలమయ్యారు. అయితే ఆ వైఫల్యం ద్వారా వ్యాపార మెళకువలు, కస్టమర్ల అభిరుచులు , నిర్వహణలో ఉండే సవాళ్లను బాగా అర్థం చేసుకున్నారు. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో అడుగు ముందుకేశారు. కేవలం రూ. 6 లక్షల పొదుపు , కుటుంబ ఆస్తులతో కరూర్లో 10x10 అడుగుల చిన్న కియోస్క్తో ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. అంతే ఒక వెనుదిరిగి చూసింది లేదు. కాలక్రమేణా వ్యాపారం దేశవ్యాప్తంగా విస్తరించింది. దుబాయ్లో కలిపి 20కి పైగా అవుట్లెట్లతో ప్రముఖ డెజర్ట్ బ్రాండ్గా అవతరించింది. వివిధ నివేదికల ప్రకారం ఈ వ్యాపార విలువ సుమారు రూ. 9 కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!ఉత్పత్తుల్లో నాణ్యత, రుచి ఎక్కడా మారకుండా ప్రామాణిక పద్ధతులను అనుసరిస్తూ ఎన్నోజాగ్రత్తలు పాటించారు. కస్టమర్లే స్వయంగా ఫ్రాంచైజీల కోసం ముందుకు రావడంతో ఈ బ్రాండ్ వేగంగా విస్తరించింది. ప్రస్తుతం సాంప్రదాయ ఫలూదాతో పాటు, డబ్బాలో లభించే (ready-to-eat) క్యాన్ ఫలూదాలను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చారు.ఇదీ చదవండి:
ఎన్ఆర్ఐ
బార్బెక్యూలో బీఫ్ : కెనడాలో చిక్కుల్లో భారతీయ మహిళ
కెనడాలో ఒక ప్రవాస భారతీయ మహిళ ఓవర్ యాక్షన్ నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తన ఇంట్లో అద్దెకి ఉంటున్న వ్యక్తిపై అనుచితంగా ప్రవర్తించిన వైనం కలకలం రేపింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కెనడాలోని సరీ నగరంలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది అంటే.కెనడాలో నివసిస్తున్న రాజ్ తివానా అనే భారతీయ మహిళ, తన అద్దెదారుడితో వాగ్వాదానికి దిగింది. ఆ ఇంట్లోని తోటలో తన స్నేహితుడితో కలిసి బార్బెక్యూలో బీఫ్ వండడాన్ని తివానా అభ్యంతరం చెప్పడంతో వివాదం షురూ అయింది. తన ఇంటిని, గోడల్ని పాడు చేస్తున్నారని ఆరోపిస్తూ వారితో గొడవకు దిగింది. అక్కడితో ఆగలేదు ఒక కర్ర ముక్కను తీసుకుని గ్రిల్ పైనుంచి ఆహారాన్ని తోసేసింది. ఆ తరువాత ఇంట్లోకి చొరబడి మరీ ఆమె రాయితో దాడిచేసింది. మస్కిటో బ్యాట్తోనూ ఎటాక్ చేసింది. తన యూనిట్ నుంచి వెళ్లిపోమని పదేపదే దూషించడం, అతడిపై ఎటాక్ చేయడం లాంటివి వీడియోలు రికార్డైనాయి. దీంతో బాధితుడు తన యజమానురాలు పదేపదే వేధిస్తోందని, తన పనుల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ వరుస వీడియోలను పోస్ట్ చేశాడు. ఇదీ చదవండి: జొమాటో కస్టమర్ల నెత్తిన పిడుగు, భారీ షాకిచ్చిందిగా! An Indian woman in Canada clashed with her tenant after objecting to him using a barbecue in the garden with a friend on her property. After a video of their altercation went viral, the man shared a series of clips alleging that the incident was part of a larger pattern of… pic.twitter.com/vGMtZnVSmZ— Hate Detector 🔍 (@HateDetectors) September 12, 2026తన గదిని ఖాళీ చేసి వెళ్లాలని వేడుకుంటున్నావినలేదంటూ మరో వీడియో షేర్ చేశాడు. ముందస్తు సమాచారం లేకుండానే లోపలికి వచ్చి తాళాలు మార్చేయడమే కాకుండా, చివరకు అతని ఇంటి ప్రధాన తలుపునే పూర్తిగా తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకో వీడియోలో కొంతమంది పురుషులు ఆ ప్రాంగణంలోకి ప్రవేశించడం, ఘర్షణ పడటం కూడా రికార్డైంది. అతని ఫిర్యాదు మేరకు ఈ సంఘటనకు సంబంధించి తివానాను అరెస్టు చేసినట్టు కూడా ఈ వీడియోల ద్వారా తెలుస్తోంది.ఇదీ చదవండి: నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్Landlord and tenant disputes in Canada are rampant specifically in Punjabi dominated areas and properties; however this incident between Raj Tiwana and her tenant has turned the conversation exceedingly factional; entire incident is being seen from a highly racists point of view… pic.twitter.com/YKQnx07R0v— Arshdeep Singh Saini (@the_lama_singh) September 12, 2026అయితే ఈ ఘటనలో అసలు వివాదానికి కారణాలపై స్పష్టత లేదు. అలాగే దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసులు నమోదు చేసిన అభియోగాలు తదితర అంశాలపై క్లారిటీ లేదు. ఇదీ చదవండి : రూ. 250లతో చెట్టు కింద ఉచిత స్కూలు: KBC 18 కంటెస్టెంట్ ఇంట్రస్టింగ్ స్టోరీ
ఇదేమి వింతో.. బ్రేకప్ తర్వాత రివర్స్ ట్విస్ట్..
సింగపూర్లో జరిగిన ఓ వింత ఘటన అందర్నీ అశ్చరపరుస్తోంది. ప్రేమలో ఉండగా ప్రేయసి కోసం ఏకంగా రూ.3.5 కోట్లు ఖర్చు చేశాడు.. విలాసవంతమైన కానుకలు, ఫస్ట్క్లాస్ విమాన ప్రయాణాలు, విదేశీ పర్యటనలు.. ఇలా ఆమె కోసం భారీగా ఖర్చు చేసిన భారత సంతతికి చెందిన ఓ సీఈవో.. ప్రేమ బంధం తెగిపోయిన తర్వాత ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని కోర్టుకెక్కాడు. కానీ న్యాయస్థానం మాత్రం ఇది ప్రేమలో ఇచ్చిన బహుమతులేనంటూ తీర్పు చెప్పింది. దీంతో డబ్బు తిరిగి రాకపోగా.. కోర్టు ఖర్చులు కూడా అతడే భరించాల్సి వచ్చింది. ఆయనకు కోర్టులో చుక్కెదురైంది.సీఎన్ఎన్ కథనం మేరకు భారత లాజిస్టిక్స్ సంస్థ టీసీఎల్ ఎక్స్ప్రెస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చందర్ అగర్వాల్, తన మాజీ ప్రేయసి ఫెలీషియా లీ తనకు దాదాపు $3.7 లక్షలు చెల్లించాల్సి ఉందని పేర్కొంటూ సింగపూర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమెపై ఖర్చు చేసిన మొత్తాన్ని తాను వడ్డీ లేని రుణాలుగా ఇచ్చానని.. వాటిని ఆమె తిరిగి చెల్లించాల్సి ఉందని అగర్వాల్ వాదించారు. అయితే కోర్టు మాత్రం ఆ మొత్తంలో ఎక్కువ భాగం బహుమతుల రూపంలో ఇచ్చినవేనని తేల్చింది. అగర్వాల్ దావాను కొట్టివేసింది.అగర్వాల్, లీ ఇద్దరూ తొలిసారిగా 2019లో ఓ విమాన ప్రయాణంలో కలుసుకున్నారు. ఆ తర్వాత 2022 సెప్టెంబర్లో వారి మధ్య ప్రేమ ఏర్పడింది. 2023 డిసెంబర్లో వారి సంబంధం ముగిసింది. లీ తనకు నమ్మకద్రోహం చేసిందని.. అందుకే తాము విడిపోయామని అగర్వాల్ పేర్కొన్నారు. వారు ప్రేమలో ఉండగా అగర్వాల్.. లీ కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు. అంతే కాకుండా.. లీ నివసించే ఫ్లాట్ కోసం ఓ ఫెంగ్ షుయ్ నిపుణుడికి సుమారు S$17,000 కూడా చెల్లించారు.ఈ చెల్లింపు మాత్రం రుణమేనని అగర్వాల్ వాదించారు. లీ తనను డబ్బు రుణంగా ఇవ్వాలని కోరిందని.. దాన్ని తిరిగి చెల్లిస్తానని ఆమె అంగీకరించిందని అగర్వాల్ తెలిపారు. ఇందుకు ఆధారంగా లీ ఇనిషియల్స్ ఉన్నాయని తాను పేర్కొన్న ఓ చేతిరాత ఒప్పందాన్ని కూడా కోర్టుకు ఆయన సమర్పించారు. అయితే, లీ ఆ పత్రంపై తాను సంతకం చేయలేదని స్పష్టం చేశారు. చెల్లింపులు రుణాలు కాదని.. బహుమతులేనని, అందువల్ల లీ ఆ డబ్బును అగర్వాల్కు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని సింగపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది.ఇదీ చదవండి: జైలులో తనిఖీలు.. ఫోన్తో దొరికేసిన ప్రజ్వల్ రేవణ్ణ
90 నిమిషాల్లో ఇద్దరు స్నేహితులను చంపిన ఆమె దొరికిపోయింది..
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇద్దరు కేరళకు చెందిన స్నేహితుల హత్య కేసులో భారత సంతతికి చెందిన అనిలా బేబీ (32)ని పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 28న శాన్జోస్, మిల్పిటాస్ ప్రాంతాల్లో 90 నిమిషాల వ్యవధిలో 2 హత్యలు జరిగాయి. మృతులను యాన్ మేరీ మ్యాథ్యూ(35), అంజనా హరి(35)గా గుర్తించారు. అనిలా బేబీతో పాటు మిగతా ఇద్దరు కేరళ మూలాలు ఉన్నవారే.మొదటి ఘటన శాన్జోస్లోని మ్యాథ్యూ ఇంట్లో జరిగింది. ఆమెను గొంతు నులిమి, కత్తితో పొడిచినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. శాన్జోస్ పోలీసులు కూడా ఆమెకు కత్తిపోట్లు ఉన్నాయని, ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు.దాదాపు 90 నిమిషాల తర్వాత మిల్పిటాస్లోని తమ అపార్ట్మెంట్ సముదాయం పార్కింగ్ ప్రదేశానికి అంజనా హరిని అనిలా బేబీ పిలిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్ సముదాయంలో నివసించేవారు. అంజనా అనిలా బేబీ వాహనం వద్దకు వెళ్లిన సమయంలో వాహనం ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లి ఆమెను ఢీకొట్టి, హత్య చేసింది. అనంతరం అనిలా అక్కడి నుంచి పారిపోయి మరో మూడు వాహనాలను ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.తర్వాత పోలీసులు ఓ దుకాణం సమీపంలో నీలిరంగు టయోటా వాహనాన్ని గుర్తించారు. వాహనం నడిపింది అనిలా బేబీనేనని గుర్తించారు. ఆమె అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో కనిపించిందని, చేతులు, కాళ్లపై రక్తం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి శాంటా క్లారా కౌంటీ ప్రధాన జైలుకు తరలించారు.ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు శాన్జోస్ పోలీసులు తెలిపారు. అనిలా బేబీపై 2 హత్య కేసులు నమోదయ్యాయి. నేరం రుజువైతే 50 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది.మృతుల భౌతిక కాయాలను భారత్కు, ముఖ్యంగా కేరళకు తీసుకురావడానికి కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత రాయబార కార్యాలయం, కాలిఫోర్నియాలోని మలయాళీ సంఘం కూడా కుటుంబాలకు సహాయం చేస్తున్నాయి. శవపరీక్ష, ఇతర న్యాయపరమైన ప్రక్రియలు త్వరగా పూర్తి కావాలని వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
భారత సంతతి మహిళను ఫాలో అయ్యాడు.. చివరకు కాల్పులు
అమెరికాలోని కాలిఫోర్నియాలో శాక్రమెంటో కౌంటీలో పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల భారత సంతతికి చెందిన ఓ మహిళ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. నెలల తరబడి ఓ వ్యక్తి ఆమె వెంటపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడిపై నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. అమెరికాలో నిషేధాజ్ఞ అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తిని సంప్రదించడం, కలవడం లేదా దగ్గరకు వెళ్లడాన్ని చట్టపరంగా నిరోధించే ఆదేశం.షాలిని ఠాకూర్ (38) తన కారుకు సమీపంలో నిలబడి ఉండగా.. భారతదేశానికి చెందిన చట్టబద్ధ పత్రాలు లేని వలసదారు రోహిత్ ఆమె వద్దకు వచ్చినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. షాలిని తప్పించుకునేందుకు ప్రయత్నించగా రోహిత్ ఆమెను వెంబడించి తలపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాల్పుల ఘటనపై స్పందించిన పోలీసులు రోహిత్ను కొద్దిసేపటికే పట్టుకున్నారు. అధికారుల ప్రకారం.. ఆ తర్వాత అతడు తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంటల తరబడి కారు నిలిపి.. కాల్పుల ఘటనకు ముందు రోహిత్ నెలల తరబడి షాలినిని వెంటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాలినికి అతడు డోర్డ్యాష్ డెలివరీ డ్రైవర్గా తెలుసని ఏబీసీ 10 తెలిపింది. అతడు ఆమె ఇంటి బయట గంటల తరబడి కారు నిలిపి.. ప్రతిరోజూ ఆమెతో మాట్లాడేవాడని పేర్కొంది.ఓ దశలో రోహిత్ తనను పెళ్లి చేసుకోవాలని షాలినిపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతరులతో స్నేహంగా ఉండకుండా కూడా ఆమెను అడ్డుకున్నాడు. ఆమె ఎవరినైనా కలిస్తే ఆ వ్యక్తిని లేదా తనను తాను తుపాకీతో కాల్చుకుంటానని రోహిత్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.తర్వాత రోహిత్ షాలిని కారు టైర్లలోని గాలిని తీసేసి.. ఆమె పనిచేసే చోటుకూ వెంబడించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించేవాడని చెప్పారు. షాలిని అపార్ట్మెంట్ తాళం చెవి నకలును కూడా రోహిత్ సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించేందుకే అతడు ఆ నకలు తాళం చెవిని సంపాదించినట్లు తెలుస్తోంది.మేలో షాలిని చివరకు రోహిత్పై నిషేధాజ్ఞ పొందింది. అయినప్పటికీ అతడు ఆమెను ఫాలో కావడం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాలిని తల్లి సుదేశ్ కుమారి మాట్లాడుతూ తన కుమార్తె పలుసార్లు పోలీసులను ఆశ్రయించిందని తెలిపారు. చివరకు మంగళవారం శాక్రమెంటో కౌంటీలోని పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల జరిగిన కాల్పుల్లో షాలిని ప్రాణాలు కోల్పోయింది.
క్రైమ్
ఉచిత సినిమా కోసం క్లిక్..
హైదరాబాద్: ఉచితంగా సినిమాలు చూడాలన్న ఆశ, అతని బ్యాంకులోని నగదును మాయం చేసింది. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ ప్రాంతానికి చెందిన షేక్ మహ్మద్ ఈ నెల 11న ఇన్స్ట్రాగామ్ స్క్రోల్ చేస్తుండగా ఉచితంగా సినిమాల అందిస్తామన్న ప్రకటన చూశాడు. ‘గూగుల్ పేటీవీ’ అనే ఫైల్ను డౌన్లోడ్ చేశాడు. కొద్ది గంటల్లోనే తన ఐడీబీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ. 29 వేలు బదిలీ అయ్యాయి. దీంతో బా«ధితుడు ఈనెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొద్దిసేపట్లో విమాన ప్రయాణం.. అంతలోనే దుర్మరణం
శంషాబాద్(హైదరాబాద్): కంటైనర్ చేసిన బీభత్సంతో అదుపుతప్పిన బస్సు హోటల్ల్లో దూసుకెళ్లడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లేందుకు కొద్దిసేపట్లో విమానం ఎక్కాల్సిన అతడు పరలోకాలకు వెళ్లాడు. ఈ విషాదకర ఘటన శంషాబాద్లో కిషన్గూడ ఆర్వోబీ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ఆర్జీఐఏ సీఐ సంజీవులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 5.30కు వర్షం కురుస్తోంది. శంషాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కంటైనర్ డివైడర్ మధ్యలోకి దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొంది. అదే సమయంలో బెంగళూరు నుంచి బాచుపల్లికి వెళుతున్న సెవెన్ హిల్స్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుపై స్తంభం విరిగి పడడంతో నియంత్రణ కోల్పోయిన బస్సు డ్రైవర్ సాధిక్ రోడ్డు పక్కనే నిలిపి ఉన్న వాహనాలను ఢీకొట్టి హోటల్లోకి తీసుకెళ్లాడు. చాయ్ కోసం ఆగితే కరీంనగర్ జిల్లా కేంద్రం రజ్వీచమన్ రోడ్డు సిటిజన్ కాలనీకి చెందిన మహ్మద్ మోహియుద్దీన్.. తన కుమారుడు మహ్మద్ అజీమొద్దీన్ (26)ను దుబాయ్కి పంపేందుకు కుటుంబసభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరారు. ఎయిర్పోర్టు బ్రిడ్జి సమీపంలోని హోటల్ వద్ద చాయ్ తాగేందుకు కారు నిలిపారు. కారులోంచి బయటికి వచ్చిన అజీమొద్దీన్ను బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. కళ్లెదుటే అజీమొద్దీన్ మృతి చెందడంతో కుటుంబసభ్యులను శోకసంద్రంలో ముంచింది. బీభత్సం బస్సు హోటల్లోకి దూసుకెళ్లడం అక్కడే బోండాలు వేస్తున్న గ్యాస్ స్టవ్కు మంటలందుకున్నాయి. పాన్షాప్ పూర్తిగా ధ్వంసమైంది. వాహనాలు సైతం ధ్వంసం కాగా బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనై హాహాకారాలు చేయడంతో పక్కనే ఈవీ చార్జింగ్ కోసం వచ్చిన ఓ యువకుడితో పాటు హోటల్ వద్ద ఉన్న మరికొందరు యవకులు ఎమర్జెన్సీ డోర్ తెరిచి ప్రయాణికులను బయటికి రప్పించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కరెంటు సరఫరాను నిలిపివేయించారు. స్వల్పంగా గాయపడిన పదిమందిని, తీవ్ర గాయాలపాలైన బస్సు డ్రైవర్ సాధిక్ను ఆస్పత్రికి తరలించారు.
తొలిపూజ వివాదం పూజారి ప్రాణం తీసింది
తిరుమలగిరి(సాగర్)నల్గొండ జిల్లా : గణేష్ మండపాల వద్ద రెండు వర్గాల మధ్య ఏర్పడిన గొడవ చివరికి పూజారి మృతికి దారితీసింది. తిరుమలగిరి(సాగర్) మండలం చింతలపాలెం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గత 17 సంవత్సరాలుగా నందికొండ మున్సిపాల్సి పరిధిలోని పైలాన్కాలనీకి చెందిన ఉప్పల దత్తుప్రసాద్(60) పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో కూడా పూజలు చేస్తారు. సోమవారం వినాయకచవితి కావడంతో విగ్రహాల వద్ద పూజలు నిర్వహించడానికి ఆయనతో పాటు ఆయన కుమారుడు ఉప్పల శ్రీవల్లభరాఘవ చింతలపాలెం వచ్చారు. గ్రామానికి చెందిన గుండాల రవి, గుండాల పున్నయ్య పూజారికి ఫోన్ చేసి మొదటగా మా విగ్రహం వద్ద పూజలు నిర్వహించాలని సూచించారు. వారి సూచన మేరకు అక్కడికి వెళ్లిన దత్తుప్రసాద్.. అక్కడ ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో గ్రామంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన మరో విగ్రహం వద్దకు వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న రవి, పున్నయ్య మొదటగా మా విగ్రహం వద్దనే పూజలు నిర్వహించాలని చెప్పినప్పటికీ ఇక్కడికి వచ్చి ఎలా పూజలు నిర్వహిస్తావని దత్తుప్రసాద్తో గొడవకు దిగారు. ఈ క్రమంలో దత్తుప్రసాద్పై చేయి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లు కలుగజేసుకొని దత్తుప్రసాద్ను పక్కనే ఉన్న ఆలయంలోకి తీసుకెళ్లారు. కొద్దిసేపటి తరువాత గ్రామస్తులు సర్దిచెప్పడంతో దత్తుప్రసాద్ తన కుమారుడు శ్రీవల్లభరాఘవకు కమిటీ విగ్రహం వద్ద పూజలు నిర్వహించమని చెప్పి ఆయన గుండాల రవి, పున్నయ్య విగ్రహం వద్దకు వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహిసూ్తనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే నాగార్జునసాగర్ కమలానెహ్రూ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు.పూజలందుకోకుండానే గంగమ్మ ఒడికి.. పురోహితుడు దత్తుప్రసాద్ మృతితో చింతలపాలెంలో ఆరు విగ్రహాలను ప్రతిష్ఠించగా సోమవారం రాత్రి రెండు విగ్రహాల వద్దనే పూజ జరిగింది. మిగతా నాలుగు విగ్రహాల వద్ద పూజ జరగలేదు. దీంతో మంగళవారం రాత్రి గ్రామంలో ఉన్న ఆరు విగ్రహాలను శోభాయాత్ర లేకుండానే నాగార్జున సాగర్లో నిమజ్జనం చేశారు. ఇదీ చదవండి: ఎక్కడున్నావ్ జానూ!
వివాహేతర సంబంధం.. మహిళ ఆత్మహత్య!
విశాఖపట్నం: వివాహేతర సంబంధంలో వివాదాల కారణంగా మనస్తాపానికి గురై ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాలు.. మధురవాడ ఆర్టీసీ కాలనీలోని సాయిప్రియ నివాస్ ఎఫ్–2లో పిట్ల కోమలి(29) మూడు నెలలుగా సుభాన్ అనే వ్యక్తితో కలిసి ఉంటోంది. ఈ నెల 13న సుభాన్ భార్య, ఆమె సోదరుడు కోమలిని వాంబే కాలనీకి పిలిపించి సుభాన్తో ఉన్న సంబంధంపై నిలదీసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సుభాన్కు కోమలి ఫోన్లో చెప్పినప్పటికీ అతని నుంచి స్పందన లేదు. దీంతో మనస్తాపానికి గురైన కోమలి అదే రోజు రాత్రి ఇంటి కిటికీ ఊచలకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతురాలి సోదరి బి.భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీఎం పాలెం సీఐ జి.భాస్కరరావు తెలిపారు. ఇదీ చదవండి: విశాఖలో కలకలం.. పార్క్ వద్ద చిరిగిన కరెన్సీ నోట్ల కుప్ప
వీడియోలు
వైభవ్ తో పోటీనా... రిపోర్టర్ ప్రశ్నకు సంజూ శాంసన్ దిమ్మతిరిగే కౌంటర్
వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ కు సిద్ధం.. కామెడీ మూవీ
ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు లేవు
దానం నాగేందర్ అనర్హత పిటిషన్ తీర్పు వాయిదా
కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య వెంటనే పెంచాలి
ఒక మంచి మిత్రుడిని కోల్పోయా... ఆళ్ల నానితో అనుబంధం గుర్తు చేసుకుంటూ ఎమోషనల్
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. EPFO వేతన పరిమితి భారీగా పెంపు
కానిస్టేబుల్ నోటిఫికేషన్ తో గుట్టురట్టిన అసలు కథ
వీసా స్కామ్ కేసులో హైడ్రామా పోలీసులకు రామానందన కండిషన్లు
ఆళ్ల నానికి నివాళులు అర్పించిన వంగవీటి కుమార్తె ఆశా కిరణ్

