హైదరాబాద్ను తాకిన ఢిల్లీ సెగ
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీ కాక్రోచ్ జనతా పార్టీ సెగ హైదరాబాద్కు తగిలింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఛలో లోక్ భవన్కు పిలుపునిచ్చాయి. దీంతో విద్యార్థులు ప్రెస్క్లబ్ నుంచి లోక్ భవన్కు బయల్దేరారు. మరోవైపు రాహుల్గాంధీ చర్చలపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. పార్లమెంట్లో చర్చిస్తామంటే రాహుల్ గాంధీ ధర్నా విరమిస్తామని అన్నారు. పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధమని చెప్పా.ఐతే ఆయన వెంటనే డిమాండ్ మార్చారు. పార్లమెంట్లో చర్చ జరపడమే కాదు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చర్చించాలని మాత్రమే అన్నారు కదా అని ప్రశ్నిస్తే.. మా డిమాండ్లు మారాయని రాహుల్ సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష నేత వెంటవెంటనే మాట మార్చడం సరికాదు’ ట్వీట్లో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడినా వెనక్కి తగ్గని రాహుల్ గాంధీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నిరసనకు దిగిన నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్ కల్యాణ్ మార్గ్కు చేరుకుని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో మాట్లాడారు. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా అక్కడ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రాహుల్ గాంధీ పట్టుబడ్డారు.నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని రాహుల్ గాంధీ చెప్పారు. విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్పై విచారణ జరిపించాలని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ మౌనం వీడాలని చెప్పారు. సమాధానం దాటవేసే ధోరణిలో మోదీ ఉన్నారు. విద్యార్థులపై దాడి.. దేశంపై దాడేనని చెప్పారు.స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని కాంగ్రెస్ చెబుతోంది. రాహుల్ గాంధీ డిమాండ్లపై కేంద్ర మంత్రి అమిత్ షాతో జితేంద్ర సింగ్ చర్చిస్తున్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాత్రంతా ధర్నాలోనే ఉండాలన్న యోచనలో రాహుల్ గాంధీ ఉన్నారు. ఆందోళనలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం ముందు కాంగ్రెస్ పార్టీ 5 డిమాండ్లు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలినీట్ పేపర్పై హోంమంత్రి సమాధానం చెప్పాలినీట్ పేపర్ లీక్తో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలిఆదివారం (జులై 20) జరిగిన లాఠీఛార్జ్పై విచారణ జరిపించాలి छात्रों पर हमला हर भारतीय परिवार पर हमला है।प्रधानमंत्री मोदी को लगता है कि वो बिना जवाब दिए, बिना किसी नतीजे का सामना किए बच निकलेंगे - नहीं कर पाएंगे, इस बार तो बिल्कुल नहीं। मैं हर उस देशभक्त भारतीय से अपील करता हूं जो मानता है कि हमारे छात्रों को न्याय मिलना चाहिए -…— Rahul Gandhi (@RahulGandhi) July 21, 2026
Hyd: ఎన్నడూలేని విధంగా డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ కంట్రోల్
హైదరాబాద్: నగరంలోని గోల్కొండ ట్రాఫిక్ జోన్ పరిధిలో శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాలు (జులై 16 నుంచి ఆగస్టు 13 వరకు) వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వుల మేరకు.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు విస్తృత స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ బందోబస్తును జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో, డీసీపీ (ట్రాఫిక్) కాజల్, ఏసీపీ (ట్రాఫిక్, గోల్కొండ జోన్) ధనలక్ష్మి నిరంతరం సమీక్షిస్తున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ మొదటిసారిగా డ్రోన్ సర్వేలెన్స్ (డ్రోన్ల నిఘా) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. డ్రోన్ల సహాయంతో పార్కింగ్ స్థలాలు, ప్రధాన ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లను ఎప్పటికప్పుడు ఆకాశ మార్గం ద్వారా పర్యవేక్షిస్తూ, ట్రాఫిక్ జామ్లను తక్షణమే నివారించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.డ్రోన్ సర్వేలెన్స్ ప్రాముఖ్యతట్రాఫిక్ మళ్లింపు పాయింట్ల పర్యవేక్షణ: ముందస్తుగా ప్రకటించిన రూట్ డైవర్షన్ల ప్రకారం వాహనాలు సజావుగా సాగేలా అన్ని ప్రధాన మళ్లింపు పాయింట్లను డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.పార్కింగ్ నిర్వహణ: గోల్కొండ కోటకు సమీపంలో కేటాయించిన పార్కింగ్ స్థలాలలో వాహనాల రద్దీని అంచనా వేయడానికి, అనధికార పార్కింగ్ను నిరోధించడానికి, భక్తులకు ఖాళీగా ఉన్న పార్కింగ్ స్థలాలను సూచించడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.రద్దీ నివారణ చర్యలు: కోటకు వెళ్లే ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాలలో ట్రాఫిక్ ఆటంకాలను తక్షణమే గుర్తించి, వెంటనే క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.ఈ ఆధునిక డ్రోన్ సాంకేతికత వినియోగం వల్ల క్షేత్రస్థాయి ట్రాఫిక్ పరిస్థితిపై సమగ్ర అవగాహన ఏర్పడి, బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు, సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఎంతగానో తోడ్పడుతోంది.
'జన నాయగన్' 50 శాతమే రీమేక్.. వేరే కథ విజయ్కి చెబితే
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చిట్టచివరి సినిమా 'జన నాయగన్' మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. అయితే ఇది తెలుగు మూవీ 'భగవంత్ కేసరి' రీమేక్ అనే ప్రచారం చాన్నాళ్లుగా సాగుతోంది. ఇది అదే అని అందరికీ తెలిసినప్పటికీ అధికారికంగా ఏది బయటకు రాలేదు. కానీ ఇప్పుడు స్వయంగా దర్శకుడు హెచ్. వినోత్ రీమేక్ వార్తలపై స్పష్టత ఇచ్చేశాడు. సగం మాత్రమే రీమేక్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి 10 జాతీయ అవార్డులు)''జన నాయగన్'..భగవంత్ కేసరికి రీమేక్. కాకపోతే పూర్తిగా చేయలేదు. 'భగవంత్ కేసరి'లో 50% మాత్రమే ఉంటుంది. ఫస్టాఫ్లో 60%, సెకండాఫ్లో 20% ఉంటుంది. విజయ్ సార్ చివరి మూవీ కోసం నేను మొదట వేరే కథ వినిపించా. కానీ ఆ కథ చాలా హెవీగా ఉందన్నారు. 'భగవంత్ కేసరి'ని రీమేక్ చేయమని నన్ను అడిగారు. బాలయ్య యూనివర్స్ విజయ్ శైలికి భిన్నంగా ఉంటుంది. 'నేర్కొండ పార్వై' తర్వాత మళ్లీ రీమేక్ చేయాలా అనే సందేహాలు నాకు చాలానే ఉండేవి. ఇది విజయ్ చివరి సినిమా కాబట్టి, ఛాన్స్ వదులుకోవాలని అనుకోలేదు''అయితే మనం ఎందుకు రీమేక్ సినిమా చేయాలని నేను విజయ్ని అడిగాను. 'భగవంత్ కేసరి' ఎందుకు నచ్చిందో ఆయన నాకు సీన్ బై సీన్ వివరించారు. విజయ్కి మహిళా సాధికారత పట్ల ఆసక్తి ఉంది. ఇది విజయ్ సర్ చివరి సినిమా అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే భవిష్యత్తులో సీఎం విజయ్ సర్గా మారిన తర్వాత వచ్చే తొలి సినిమాగా మాత్రం దీన్ని చూడొచ్చు. ఇది కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. విజయ్ని హీరోయిక్గా చూపించడానికే తీసిన సినిమా కాదు. సున్నితమైన రాజకీయాల నేపథ్యంలో సాగే కథ ఇది''జన నాయగన్' విషయంలో నేను రెండుసార్లు ఏడ్చాను. సెన్సార్ ఆలస్యమై పొంగల్ పండగకు సినిమా విడుదల కానప్పుడు, సినిమా ఆన్లైన్లో లీక్ అయినప్పుడు, పైరసీని ఎవరూ ఆపలేకపోయినప్పుడు బాధపడ్డాను. అప్పుడు విజయ్ సార్ నాకు అండగా నిలిచారు. 'ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, బాధపడకండి. ఒకవేళ మనసు బాగోలేకపోతే నాకు ఫోన్ చేయండి' అని నాకు ధైర్యం చెప్పారు' అని డైరెక్టర్ వినోత్ అన్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. బాబీ డియోల్ విలన్గా నటించాడు. అనిరుధ్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)Dir #HVinoth Recent- #JanaNayagan is not a complete remake of #BhagavanthKesari. Around 50% is inspired by BK, while the remaining 50% is an entirely new story.- The core idea has been reworked, with the hero villain conflict significantly expanded and made much bigger than in…— Movie Tamil (@_MovieTamil) July 20, 2026
'ఎప్పటికైనా హీరో అవుతా..' మాస్టర్ అరుణ్ దేవ్
శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు
హైదరాబాద్ను తాకిన ఢిల్లీ సెగ
హీరోయిన్తో శృంగార సన్నివేశం..పదే పదే థ్యాంక్స్ చెప్పిన హీరో!
పెళ్లిలో ప్రాంక్ తెచ్చిన తంట..! పాపం ఆ వధువు స్నేహితురాలు..
జంపింగ్లకు ఇచ్చిపడేసిన మమత
స్కూల్లో నేర్పని డబ్బు పాఠాలు.. కియోసాకి చెప్పిన విషయాలు!
కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడినా వెనక్కి తగ్గని రాహుల్ గాంధీ
ఇంగ్లండ్కు భారీ షాక్
Hyd: ఎన్నడూలేని విధంగా డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ కంట్రోల్
వారి వల్లే ఓడిపోయాం.. కానీ అతడు మాత్రం అద్భుతం: గిల్
బెంగాల్లోనూ బుల్డోజర్ న్యాయం - టీఎంసీ కార్యాలయం కూల్చివేత
బొడ్డు, నడుము ఫాంటసీ.. చాలా మారింది
ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్
బంగారం, వెండి ధరలు ఇలా..
టీ20 సిరీస్.. జింబాబ్వేకు బయల్దేరి వెళ్లిన టీమిండియా
పార్కింగ్ కోసం జొన్న పంటను జేసీబీతో దున్నేశారు
తండ్రీకొడుకుల బిజినెస్ బాగుంది ఇంక ఆ ‘బిజినెస్’ గురించి ఎందుకు పట్టించుకుంటారు!
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఒకే కుటుంబానికి 10 జాతీయ అవార్డులు
భారత్లో తొలి హైడ్రోజన్ రైలు.. టికెట్ ధర ఎంతంటే?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం
డైవర్స్ కావాలి: భర్త - బిడ్డను కనాలి: భార్య
జియో రీఛార్జ్లు.. తక్కువలో టాప్ 10 ప్లాన్లు
బలూచ్ బిగ్ ట్విస్ట్తో చైనా-పాక్ ఫ్రెండ్షిప్ ఖతం!
ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ
విలేజ్ స్టైల్లో మెగాహీరో మాస్ పాట
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి
'ఎప్పటికైనా హీరో అవుతా..' మాస్టర్ అరుణ్ దేవ్
శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు
హైదరాబాద్ను తాకిన ఢిల్లీ సెగ
హీరోయిన్తో శృంగార సన్నివేశం..పదే పదే థ్యాంక్స్ చెప్పిన హీరో!
పెళ్లిలో ప్రాంక్ తెచ్చిన తంట..! పాపం ఆ వధువు స్నేహితురాలు..
జంపింగ్లకు ఇచ్చిపడేసిన మమత
స్కూల్లో నేర్పని డబ్బు పాఠాలు.. కియోసాకి చెప్పిన విషయాలు!
కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడినా వెనక్కి తగ్గని రాహుల్ గాంధీ
ఇంగ్లండ్కు భారీ షాక్
Hyd: ఎన్నడూలేని విధంగా డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ కంట్రోల్
వారి వల్లే ఓడిపోయాం.. కానీ అతడు మాత్రం అద్భుతం: గిల్
బెంగాల్లోనూ బుల్డోజర్ న్యాయం - టీఎంసీ కార్యాలయం కూల్చివేత
బొడ్డు, నడుము ఫాంటసీ.. చాలా మారింది
ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్
బంగారం, వెండి ధరలు ఇలా..
టీ20 సిరీస్.. జింబాబ్వేకు బయల్దేరి వెళ్లిన టీమిండియా
పార్కింగ్ కోసం జొన్న పంటను జేసీబీతో దున్నేశారు
తండ్రీకొడుకుల బిజినెస్ బాగుంది ఇంక ఆ ‘బిజినెస్’ గురించి ఎందుకు పట్టించుకుంటారు!
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఒకే కుటుంబానికి 10 జాతీయ అవార్డులు
భారత్లో తొలి హైడ్రోజన్ రైలు.. టికెట్ ధర ఎంతంటే?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం
డైవర్స్ కావాలి: భర్త - బిడ్డను కనాలి: భార్య
జియో రీఛార్జ్లు.. తక్కువలో టాప్ 10 ప్లాన్లు
బలూచ్ బిగ్ ట్విస్ట్తో చైనా-పాక్ ఫ్రెండ్షిప్ ఖతం!
ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ
విలేజ్ స్టైల్లో మెగాహీరో మాస్ పాట
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి
ఫొటోలు
చెల్లి సితార, ఫ్రెండ్స్తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)
వైఎస్సార్సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)
విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)
హైదరాబాద్లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)
రకుల్.. సో బ్యూటిఫుల్ (ఫొటోలు)
హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)
చీరలో పద్ధతిగా రాశీ సింగ్ (ఫొటోలు)
మెగా కోడలు ఉపాసన పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)
శ్రీనివాస మంగాపురం హీరో బర్త్ డే.. హీరోయిన్ స్పెషల్ విషెస్ (ఫోటోలు)
సినిమా
రష్మిక కోసం సుకుమార్ సెంటిమెంట్ బ్రేక్?
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమాల్లో హీరోయిన్లు ఎవరా అని చూస్తే రష్మిక లాంటి ఒకరిద్దరు సౌత్ హీరోయిన్లు, లేదంటే బాలీవుడ్ భామలే కనిపిస్తారు. ఈ క్రమంలోనే రీసెంట్గా పెళ్లి చేసుకుని రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మికని మరో బంపర్ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)'పుష్ప' తర్వాత సుకుమార్.. రామ్ చరణ్తో సినిమా చేయబోతున్నాడు. చాన్నాళ్ల క్రితమే మూవీ లాక్ అయింది. రీసెంట్గా 'పెద్ది'తో వచ్చిన చరణ్ ఖాళీ అయిపోయాడు. మరోవైపు సుక్కు చరణ్తో తీయబోయే మూవీ పనిలో ఉన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ప్రస్తుతం మిగతా పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగానే హీరోయిన్గా రష్మికని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.సుకుమార్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేశాడు గానీ ఒకసారి పనిచేసిన హీరోయిన్తో మళ్లీ పనిచేయలేదు. 'పుష్ప' రెండు భాగాలు అయినప్పటికీ అది ఒక ప్రాజెక్ట్ కిందకే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చరణ్ సరసన రష్మికని తీసుకుంటే సుక్కు సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. అదే టైంల చరణ్-రష్మికది కూడా ఫ్రెష్ కాంబో కాబట్టి. ప్రేక్షకుల్లోనూ కాస్త ఆసక్తి పెరిగే అవకాశముంటుంది.సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా ఏళ్లకు ఏళ్లు పడుతుంది. 'పుష్ప' రెండు భాగాలు తీయడానికి ఐదేళ్లు పట్టేసింది. మరి ఇప్పుడు రామ్ చరణ్తో కనీసంలో కనీసం రెండేళ్లయినా పట్టొచ్చు. అంటే ఎంతలేదన్నా మూవీ వచ్చేసరికి 2028 చివర అయిపోవచ్చు. మరి రష్మిక విషయంలో వస్తున్న రూమర్స్ నిజమా కాదా అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: విలేజ్ స్టైల్లో మెగాహీరో మాస్ పాట)
పోర్నోగ్రఫితో గ్లోబల్ వార్మింగ్.. నటుడి వ్యాఖ్యలు వైరల్
టెలివిజన్ ప్రముఖ నటుడు అభినవ్ శుక్లా వాతావరణ మార్పులపై చేసిన వినూత్న వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. పోర్న్ వీడియోలు చూడటం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య రుబినా దిలైక్, ప్రముఖ నటి హినా ఖాన్, ఆమె భాగస్వామి రాకీ జైస్వాల్లతో కలిసి నిర్వహిస్తున్న 'ది4పీవోవీ' (the4POV) పొడ్కాస్ట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోడ్కాస్ట్లో అసలు ఏం జరిగింది?పోడ్కాస్ట్ సంభాషణలో భాగంగా నటి దియా మీర్జా గతంలో పర్యావరణ మార్పులపై చేసిన వ్యాఖ్యల గురించి చర్చిస్తున్న సమయంలో అభినవ్ ఈ విషయాన్ని లేవనెత్తారు. గ్లోబల్ వార్మింగ్కు ఉన్న అనేక కారణాల్లో పోర్న్ చూడటం కూడా ఒక ప్రధాన కారణం. అడల్ట్ కంటెంట్ను భారీ స్థాయిలో ప్రొడక్షన్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఆన్లైన్ డేటా, సర్వర్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడానికి భారీ ఎత్తున విద్యుత్ శక్తి ఖర్చవుతుందని, ఇది పెద్ద మొత్తంలో కార్బన్ ఫుట్ప్రింట్ కు దారితీస్తుందని ఆయన వివరించారు.ఆయన వ్యాఖ్యలకు పొడ్కాస్ట్లో ఉన్న రుబినా దిలైక్తో పాటు, హినా ఖాన్, రాకీ జైస్వాల్ షాకయ్యారు.చాలా ప్రమాదకరం..కేవలం వాతావరణ ప్రభావమే కాకుండా, పోర్నోగ్రఫీ వల్ల కలిగే ఇతర దుష్ప్రభావాలపైనా అభినవ్ స్పందించారు. ‘పోర్న్ చూడటం చాలా ప్రమాదకరం. ఇది వాస్తవ జీవితంపై అవాస్తవికమైన అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా పురుషులలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. సమయాన్ని వృథా చేస్తుంది’ అని అభినవ్ అన్నారు. డిజిటల్ వినియోగం-వాతావరణ మార్పుల మధ్య ఉన్న సంబంధంపై అభినవ్ చేసిన ఈ విచిత్రమైన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. కొంతమంది నెటిజన్స్ అభినవ్కు మద్దతుగా కామెంట్స్ చేస్తుంటే..మరికొంతమంది ఆయన వాదనను తోసిపుచ్చుతూన్నారు. ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ ఏదైనా డేటా వినియోగిస్తుందని, కేవలం ఒకే రకమైన కంటెంట్ను లక్ష్యంగా చేసుకుని గ్లోబల్ వార్మింగ్కు ముడిపెట్టడం విచిత్రంగా ఉందంటూ మరికొందరు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. డేటా సెంటర్లు, డిజిటల్ స్ట్రీమింగ్ వల్ల విద్యుత్ వినియోగం పెరిగి కార్బన్ ఉద్గారాలు విడుదలవుతాయనే సాంకేతిక కోణాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. Kuch zyada hi dark hogaya 🌚 #HinaKhan #RubinaDilaik #AbhinavShukla pic.twitter.com/Gsi8LGri25— Hina_khanfc (@Hinakhanfc24) July 18, 2026
ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా
సాధారణంగా ఓ వయసొచ్చిన తర్వాత దర్శకులు దాదాపుగా సినిమాలు చేయడం తగ్గించేస్తుంటారు. కానీ రీసెంట్ టైంలో టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, 94 ఏళ్ల వయసులోనూ 'సింగ్ గీతం' అనే చిత్రం తీసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈయనలానే హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా 79 ఏళ్ల వయసులోనూ ఇంకా చలాకీగా మూవీస్ చేస్తున్నారు. ఈయన తీసిన లేటెస్ట్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)జురాసిక్ పార్క్, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్, మ్యూనిచ్, ద టెర్మినల్, ఇండియానా జోన్స్ తదితర సినిమాలతో అద్భుతమైన గుర్తింపు సాధించిన స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'డిస్క్లోజర్ డే'. గత నెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఓ మేరకు ఆకట్టుకుంది. ఏలియన్స్ కాన్పెప్ట్తో తీసిన ఈ చిత్రం ఇప్పుడు విదేశాల్లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో ఇంగ్లీష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.డిస్క్లోజర్ డే విషయానికొస్తే.. ఓ సైబర్ సెక్యూరిటీ విజిల్ బ్లోయర్ డేనియల్ (జోష్ ఓ కానర్), వాతావరణ శాస్త్రవేత్త మార్గెట్(ఎమిలీ బ్లంట్).. అమెరికా ప్రభుత్వం దాచిపెట్టిన గ్రహాంతరవాసుల రహస్య ఆధారాలని బయటపెట్టాలనుకుంటారు. ఈ క్రమంలోనే ఏజెన్సీ చీఫ్ నోవా (కోలిన్ ఫెర్త్) నుంచి వీళ్లిద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. గ్రహాంతరవాసులు నిజంగానే భూమిపైకి వస్తే మానవాళి ఎలా స్పందిస్తుందనేది ఇందులో చూపించే ప్రయత్నం చేశారు.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా)
రూ. 84 కోట్లు పెట్టి ఇల్లు కొన్న స్టార్ హీరో
సినిమా హీరోలు తమ డబ్బులకు ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతుంటారు. పారితోషికంగా సంపాదించిన డబ్బులతో బంగ్లాలు కొనుగోలు చేసి.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం రూ. 84 కోట్లతో విలాసవంతమైన బంగ్లాను ఆయన కొనుగోలు చేశాడు. రియల్ ఎస్టేట్ రికార్డుల ప్రకారం, ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 14న పూర్తయింది. ఈ కొనుగోలుకు గాను ఆయన సుమారు రూ. 5.04 కోట్ల రూపాయలను స్టాంప్ డ్యూటీ రూపంలో చెల్లించినట్లు సమాచారం.ఈ ఆస్తి మొత్తం 1,017.60 చదరపు మీటర్ల ఫ్లాట్లో విస్తరించి ఉంది. ఇందులో 193.12 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతం కలిగిన బంగ్లాతో పాటు 31.50 చదరపు మీటర్ల అవుట్హౌస్ కూడా ఉంది. ముంబైలో ప్రముఖ సినీ తారలు - విఐపిలు నివసించే ప్రైమ్ లొకేషన్లలో బాంద్రా వెస్ట్ ఒకటి. ఇక్కడ స్వంత స్థలంతో ఉన్న బంగ్లాలు దొరకడం అత్యంత అరుదు కావడం వల్ల జాన్ చేసిన ఈ రూ. 84 కోట్ల బిగ్ డీల్ ప్రస్తుతం సినీ, బిజినెస్ వర్గాల్లో వైరల్గా మారింది.జాన్ అబ్రహం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. డిసెంబర్ 2023లో కూడా ముంబైలోని ఖార్ ఏరియాలో రూ. 70.83 కోట్ల విలువైన బంగ్లాను ఆయన సొంతం చేసుకున్నారు.ఇక సినీ కెరీర్ విషాయానికొస్తే.. ఇటీవల 'ది డిప్లొమాట్', 'తెహ్రాన్' వంటి వైవిధ్యమైన యాక్షన్- పొలిటికల్ థ్రిల్లర్లతో అలరించాడు. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా బయోపిక్తో పాటు తన కెరీర్లో సూపర్ హిట్ అయిన యాక్షన్ ఫ్రాంచైజ్ 'ఫోర్స్' మూడో భాగం -ఫోర్స్ 3 లో నటిస్తున్నాడు. ఈ రెండింటిలోనూ జాన్ అబ్రహం పోలీసులు ఆఫీసర్గా అలరించబోతున్నాడు.
క్రీడలు
IND vs SL: శ్రీలంకతో టెస్టు.. భారత్ భారీ స్కోరు
శ్రీలంక అండర్-19 జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత యువ జట్టు భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 411 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గాలె వేదికగా శ్రీలంక- భారత్ అండర్-19 జట్ల మధ్య తొలి యూత్ టెస్టు ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే.ఓపెనర్లు డకౌట్ అయినా..ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య కొలంబో వేదికగా సోమవారం రెండో యూత్ టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది. తొలి రోజు ఆటలో ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ డకౌట్ కాగా.. వన్డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా.. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.శతక్కొట్టిన కుశాగ్రఈ క్రమంలో కుశాగ్ర శతకం పూర్తి చేసుకోగా.. యశ్వర్దన్ అర్ధ శతకం (78) చేసి అవుటయ్యాడు. కుశాగ్రకు తోడుగా ఐదో నంబర్ బ్యాటర్ మనాల్ చౌహాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా సోమవారం నాటి ఆట పూర్తయ్యేసరికి భారత్ 65 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.ఇక 253/3 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. భోజన విరామ సమయానికి 92 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 355 పరుగులు చేసింది. శతక వీరుడు కుశాగ్ర (193 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లు: 111) రనౌట్ కాగా.. ఆల్రౌండర్ మనాల్ చౌహాన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.మనాల్ భారీ శతకంఅనంతరం అదే జోరు కొనసాగించిన మనాల్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. మొత్తంగా 224 బంతులు ఎదుర్కొన్న ఈ ఆల్రౌండర్.. 20 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 150 పరుగులు చేశాడు. అయితే, గిమ్హాన్ మెండిస్ బౌలింగ్లో విఘ్నేశ్వరన్ ఆకాశ్కు క్యాచ్ ఇవ్వడంతో అతడి మారథాన్ ఇన్నింగ్స్కు తెరపడింది.మనాల్ అవుటైన తర్వాత భారత జట్టు వేగంగా వికెట్లు కోల్పోయింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్యన్ సక్పా 10, జగన్నాథన్ హేంచుదేశన్ 4 పరుగులు చేసి వెనుదిరిగారు. రోహిత్ యాదవ్ డకౌట్ కాగా.. చిగురుపాటి వెంకట 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ప్రణవ్ రాఘవేంద్ర ఒక బంతిని ఎదుర్కొని ఖాతా ఏమీ తెరవలేదు.411 పరుగులకు ఆలౌట్ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్లో భారత్ 105.2 ఓవర్లలో 411 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కుశాగ్ర ఓజా (111), మనాల్ చౌహాన్ (150) సెంచరీలు.. యశ్వర్దన్ చౌహాన్ (78) అర్ధ శతకంతో రాణించడంతో భారత్కు ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది. ఇక శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.. మీరేం చేస్తున్నారు?
మెస్సీ సేనకు ఘనస్వాగతం.. కానీ చిన్న ట్విస్ట్!
ఫిఫా ప్రపంచకప్ 2026లో రన్నరప్గా నిలిచిన అర్జెంటీనాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున మెస్సీ సేన అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ ఎయిర్పోర్టులో అడుగుపెట్టింది. ముందుగా బ్యూనస్ ఎయిర్స్లోని ఐజా అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆటగాళ్లు, కోచ్, సహాయక సిబ్బందికి మూడు ప్రత్యేక ఓపెన్టాప్ బస్సులను ఏర్పాటు చేశారు. Phot Credit: FIFA Twitterఈ క్రమంలో ఎయిర్పోర్టు నుంచి సెంట్రల్ బ్యూనస్ ఎయిర్స్కు చేరుకునే దారిలో అభిమానులు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనంతో రాజధాని వీధులు నిండిపోయాయి. మ్యూజిక్ చాంటింగ్స్, ర్యాప్ సాంగ్స్తో వీధులన్నీ హోరెత్తిపోయాయి. భారీగా తరలివచ్చిన అభిమానులను చూసిన అర్జెంటీనా ఆటగాళ్లు బస్ క్యాబిన్ డోర్లను ఓపెన్ చేసి బయటకు వచ్చి అభివాదం చేశారు. చేతిలో ఫిఫా ట్రోఫీలకు బదులు వాళ్లు సాధించిన సిల్వర్ మెడల్స్, సిల్వర్ ట్రోఫీలను చూసే అభిమానులు మురిసిపోయారు. ట్రోపీలు ఎవడికి కావాలి.. మీ ఆటతో మనసులు గెలిచారు అని అభిమానులు తమ సందేశాలు వినిపించారు.'కమాన్ అర్జెంటీనా' అని నినాదాలతో హోరెత్తించారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. Phot Credit: FIFA Twitterఅర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ జట్టుతో ప్రయాణం చేయలేదు. తన కుటుంబం కూడా తనతోనే ఉండడంతో మెస్సీ అమెరికాలోనే ఉండిపోయాడు. ఇంటర్ మియామి క్లబ్ తరఫున ఆడుతున్న మెస్సీ కొంత బ్రేక్ తర్వాత మళ్లీ ఆ క్లబ్తో జాయిన్ అవ్వనున్నాడు. దీంతో ఫిఫా ప్రపంచకప్ తర్వాత మెస్సీ స్వదేశానికి వస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. తమ ఆరాధ్య దైవాన్ని లైవ్లో చూడాలని ఆశించిన అభిమానులకు భంగపాటు ఎదురైంది. Phot Credit: FIFA Twitterఅయితే తాను రాకున్నా తాను సాధించిన సిల్వర్ బూట్ను మాత్రం అభిమానులకు కానుకగా జట్టుతో పాటే పంపించాడు. గోల్కీపర్ ఎమిలియో మార్టినేజ్ సహా నికోలస్ ఒటమెండి, మిడ్ఫీల్డర్ లియాండ్రో పరెడెస్, అలెక్సిక్మాక్ అలిస్టర్, నికోలస్ గొంజలెజ్, సహా అర్జెంటీనా ఆటగాళ్లు తమను చూసేందుకు వచ్చిన అభిమానులను ఉద్దేశించి అభివాదం చేస్తూ కృతజ్ఞతలు చెప్పడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Phot Credit: FIFA Twitterఇక ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా ఫైనల్లో స్పెయిన్ చేతిలో 1-0తో పరాజయం చవిచూసింది. ఫెర్నాండేజ్ రెడ్కార్డుకు గురవ్వడంతో పది మందితోనే ఆడిన అర్జెంటీనా మ్యాచ్ను లాక్కొచ్చింది. ఫిఫా టోర్నీ అంతటా అర్జెంటీనా జట్టును తన భుజస్కందాలపై మోసిన మెస్సీ ఫైనల్ మ్యాచ్లో ప్రభావం చూపలేకపోయాడు. అయితే టోర్నీ ఆసాంతం అసాధారణ ఆటను కనబరిచిన మెస్సీ 8 గోల్స్తో సిల్వర్ బూట్ను సొంతం చేసుకున్నాడు. వచ్చే ఫిఫా ప్రపంచకప్ (2030)లో మెస్సీ ఆడడం అనుమానమే కాబట్టి తమ ఆరాధ్య ఆటగాడిని చివరిసారి అర్జెంటీనా జాతీయ జెర్సీలో చూడాలని ఆశించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. 🇦🇷💙 ¡GRACIAS POR TODO, SELECCIÓN!📹 @Argentina pic.twitter.com/fzzLE6k1Be— TyC Sports (@TyCSports) July 21, 2026Despite the World Cup final loss, thousands of Argentine fans were there to welcome their heroes home. Respect. 🫡 🇦🇷🩵 pic.twitter.com/Bo9UfU60nL— MC (@CrewsMat10) July 20, 2026Argentina 🩵 pic.twitter.com/gn9ZhMuDP3— Selección Argentina in English (@AFASeleccionEN) July 20, 2026Read: అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ
ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.. మీరేం చేస్తున్నారు?
టీమిండియాతో వన్డే సిరీస్లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ అదరగొట్టాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి వన్డేలో 76 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ వన్డౌన్ బ్యాటర్.. కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో 99 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. సహచరుడికి మ్యాచ్ ముగించే అవకాశం ఇచ్చి.. హుందాగా వ్యవహరించాడు.ఈ మ్యాచ్లో రూట్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ జయభేరి మోగించి సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక లార్డ్స్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డేలోనూ రూట్ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. కేవలం 39 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 48 బంతుల్లో తొమ్మిది ఫోర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ తొలి క్రికెటర్గా రికార్డుఇక మూడో వన్డేలో గెలిచి ఇంగ్లండ్ సిరీస్ 2-1తో కైవసం చేసుకోగా.. టీమిండియా ఓటమితో నిరాశగా వెనుదిరిగింది. రూట్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.నిజానికి గత కొంతకాలంగా రూట్ వన్డేల్లోనూ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ ముప్పై ఐదేళ్ల బ్యాటర్ గత ఆరు వన్డే ఇన్నింగ్స్లో చేసిన పరుగులు వరుసగా.. 61, 75, 111*, 76*, 99*, 74*. తద్వారా ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో వరుసగా ఆరు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన తొలి క్రికెటర్గా రూట్ చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.. మీరేం చేస్తున్నారు?ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ సదగోపన్ రమేశ్ టీమిండియా యాజమాన్యం వైఖరిని విమర్శించాడు. ఇంగ్లండ్ మేనేజ్మెంట్ జో రూట్కు పూర్తి స్వేచ్ఛనిచ్చి.. మంచి ఫలితాలు రాబడుతోందన్నాడు. అదే సమయంలో భారత జట్టు యాజమాన్యం మాత్రం దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి విషయంలో తప్పు చేస్తోందని మండిపడ్డాడు.కాగా ఇప్పటికే రోహిత్- కోహ్లి అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే, అనూహ్య రీతిలో రోహిత్ను కెప్టెన్సీ తప్పించిన యాజమాన్యం.. రో-కో ప్రపంచకప్ ఆడతారో లేదోనన్న అంశంపై తమకు స్పష్టత లేదన్నారు.రోహిత్ భారీ శతకంఈ క్రమంలోనే లార్డ్స్లో ఇంగ్లండ్తో మూడో వన్డే సందర్భంగా రోహిత్ శర్మ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోడుతన్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ మ్యాచ్లో రోహిత్ భారీ శతకం (138)తో రాణించి ఊహాగానాలకు చెక్ పెట్టాడు. తాను రిటైర్ కాబోవడం లేదని స్పష్టం చేశాడు.మీరు తప్పు చేస్తున్నారుఈ పరిణామాల నేపథ్యంలో నేపథ్యంలో రమేశ్ స్పందిస్తూ.. ‘‘విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు యాజమాన్యం మద్దతుగా ఉండాల్సిన సమయం ఇది. వాళ్లిద్దరు ఇప్పటికీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్-5లో ఉన్న సత్తా కలవారు. ఓసారి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ను చూడండి. జో రూట్కు వాళ్లు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు. అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకునేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు.అతడిపై ఏమాత్రం ఒత్తిడి పెట్టడం లేదు. ఇంగ్లండ్ రూట్ను తమ బలంగా భావిస్తోంది. కానీ భారత జట్టు యాజమాన్యం మాత్రం రోహిత్- విరాట్లనే తమ వెన్నెముకగా భావించాల్సింది పోయి వారి విషయంలోనే స్పష్టత లేకుండా చేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రోహిత్ వరుసగా 11, 26, 138 పరుగులు చేయగా.. కోహ్లి 5, 74, 65 పరుగులు సాధించాడు.చదవండి: లార్డ్స్ వన్డేలో అదే హైలైట్: పాక్ మాజీ క్రికెటర్
లార్డ్స్ మ్యాచ్లో అదే హైలైట్: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకానికి చేరిందంటూ గత కొంతకాలంగా వస్తున్న వార్తలకు.. ‘హిట్మ్యాన్’ లార్డ్స్లో శతకంతో చెక్ పెట్టాడు. ఇంగ్లండ్తో మూడో వన్డే సందర్భంగా క్రికెట్ ‘మక్కా’లో సెంచరీ బాది తన బ్యాట్ పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. కాగా ఇంగ్లండ్తో లార్డ్స్ వన్డేనే రోహిత్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ 110 బంతుల్లోనే పదిహేడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 138 పరుగులతో అదరగొట్టాడు.లార్డ్స్ మ్యాచ్లో అదే హైలైట్అనంతరం తన రిటైర్మెంట్ వార్తలపై స్పందిస్తూ.. తాను క్రికెట్ ఆడుతున్నంత కాలం... రిటైర్మెంట్ ఊహాగానాలు వస్తూ ఉంటాయని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి వార్తలతో పోరాడటం కంటే... మైదానంలో పరుగులు సాధించడంపైనే దృష్టి పెడతానని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లతో పాటు పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ సైతం రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచాడు. గేమ్ ప్లాన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్లో గెలిచేందుకు ఇంగ్లండ్కు అర్హత ఉంది. అయితే, ఆ విషయం కంటే కూడా రోహిత్ శర్మ సెంచరీ చేయడమే లార్డ్స్ మ్యాచ్కు హైలైట్. ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో తానూ ఒకడినని.. ఇప్పటికీ తన ఆటలో పదును తగ్గలేని రోహిత్ తన ఇన్నింగ్స్ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చాడు. అతడి భవిష్యత్తు గురించి చాలా వదంతులు వస్తున్నాయి. వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో అతడు లేడని చాలా మంది అంటున్నారు. వాళ్లు తలచుకుంటేనే..అయితే, తనను విమర్శించే వాళ్లందరికీ రోహిత్ బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. రోహిత్, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లను ఎవరూ జట్టు నుంచి బయటకు పంపలేరు. ఆటకు వీడ్కోలు పలకడానికి సరైన సమయం వచ్చిందని భావిస్తే వాళ్లే స్వయంగా తప్పుకొంటారు. రిటైర్మెంట్ అనేది కేవలం వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. భారత క్రికెట్కు వీరిద్దరు చేసిన సేవలు వెలకట్టలేనివి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే క్రమంలో మిగతా ఫార్మాట్ల నుంచి వారే తప్పుకొన్నారు. అందుకే వాళ్లు నేటికీ సూపర్స్టార్లుగానే కొనసాగుతున్నారు’’ అని కమ్రాన్ అక్మల్ రో-కోలపై ప్రశంసలు కురిపించాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్లో 4-0తో వైట్వాష్ అయిన టీమిండియా.. వన్డే సిరీస్ను 1-2తో కోల్పోయింది.ఇదిలా ఉంటే.. 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియాను చాంపియన్గా నిలిపిన తర్వాత.. రోహిత్- కోహ్లి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. గతేడాది వారం రోజుల వ్యవధిలో ఇద్దరూ టెస్టులకూ గుడ్బై చెప్పారు. వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా వన్డేల్లో కొనసాగుతున్నారు.చదవండి: ఆటకు గుడ్బై చెప్పు... భారత మాజీ క్రికెటర్ ఫైర్
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
రామాయపట్నంలో భారీ స్కామ్... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
తెలంగాణలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లయితే రాజకీయ సన్యాసం చేస్తా... సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్
నంబర్ 1 నుంచి నేలచూపులే... నీతి ఆయోగ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు భారీగా పతనం
ఏపీ సమస్యలపై ఎలుగెత్తాలి. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తాం... ఆక్వా రైతులతో ముఖాముఖిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
పల్నాడు కలను సాకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... 100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల కొత్త మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో మరో కుంభకోణానికి తెరతీసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... ల్యాప్టాప్ల కొనుగోలులో దోపిడీకి స్కెచ్
బిజినెస్
ఐఆర్జీసీ ప్రతీకార దాడులు
అమెరికా సైనిక, ఆర్థిక, సాంకేతిక మౌలిక వసతులే లక్ష్యంగా ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది. దీనిలో భాగంగా బహ్రెయిన్లో ఉన్న ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం అమెజాన్కు చెందిన ప్రధాన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది.ఆపరేషన్ నస్ర్-2లో భాగంగా ప్రతికార దాడిఇరాన్ అధికారిక వార్తా సంస్థల (ఐఆర్ఎన్ఏ, తస్నీమ్) వివరాల ప్రకారం.. తమ ఏరోస్పేస్ బలగాలు ఆపరేషన్ నస్ర్-2లో భాగంగా దాడులను నిర్వహించాయి. ఇటీవల ఇరాన్లోని దార్ఖోవిన్ వద్ద అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణలో నిర్మాణంలో ఉన్న పౌర అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా బలగాలు జరిపిన వైమానిక దాడులకు నిరసనగా ఈ క్షిపణి దాడి చేపట్టినట్లు ఐఆర్జీసీ స్పష్టం చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) హార్మూజ్ జలసంధిలో నౌకాయాన భద్రత నెపంతో ఇరాన్ స్థావరాలపై దాడులకు దిగుతుండటంతో ఇరాన్ సైతం గల్ఫ్ రీజియన్లోని అమెరికా రాడార్ వ్యవస్థలు, వైమానిక స్థావరాలతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ డిజిటల్ వనరులను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది.స్వతంత్ర వర్గాల స్పందన.. ప్రస్తుత పరిస్థితిఐఆర్జీసీ చేసిన ఈ క్షిపణి దాడి ప్రకటనపై అమెజాన్ సంస్థ గానీ, బహ్రెయిన్ ప్రభుత్వ వర్గాలు గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధ్రువీకరణ విడుదల చేయలేదు. దాడి వల్ల జరిగిన ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం వివరాలపై స్వతంత్ర వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.గ్లోబల్ టెక్నాలజీ, ఆర్థిక రంగాలపై ప్రభావంయుద్ధాల్లో కేవలం మిలిటరీ క్యాంపులనే కాకుండా ప్రధాన టెక్ కంపెనీల డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ విశ్లేషకులను ఆందోళనకు గురిచేస్తోంది. బహ్రెయిన్ వంటి కీలక ఆర్థిక కేంద్రంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మౌలిక వసతులపై దాడి జరగడం వల్ల ప్రాంతీయ డిజిటల్ సేవలు, గ్లోబల్ సప్లై చైన్, అంతర్జాతీయ వాణిజ్య నెట్వర్క్లు దెబ్బతినే ప్రమాదముంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో భద్రతా సంక్షోభాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్లోకి పసిడి.. నేటి ధరలు ఇలా..
మీ నెలవారీ పెన్షన్ ఆగిపోయిందా?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నుంచి వచ్చే నెలవారీ పెన్షన్ హఠాత్తుగా ఆగిపోయిందా? దానికి ప్రధాన కారణం మీ డిజిటల్ జీవిత ప్రమాణ పత్రం (జీవన్ ప్రమాణ్) గడువు ముగిసిపోవడమే కావచ్చు. ఏటా పెన్షనర్లు తమ డిజిటల్ జీవిత ప్రమాణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి. మీరు సమర్పించిన తేదీ నుంచి ఏడాది పాటు దీని చెల్లుబాటు ఉంటుంది. అయితే దీని కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా ఇంటి నుంచే దీన్ని సబ్మిట్ చేసుకునే వెసులుబాటును ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తెచ్చింది.డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం ఎలా?మీ జీవన్ ప్రమాణ్ పత్రం ఇంకా అమలులో ఉందో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లోని ‘పెన్షనర్స్ పోర్టల్’ ద్వారా సులభంగా పరిశీలించుకోవచ్చు.జీవన్ ప్రమాణ్ను సమర్పించే దశలు..ముందుగా మీ స్మార్ట్ఫోన్లో 'UMANG' యాప్తో పాటు Aadhaar Face RD యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.ఉమంగ్ యాప్ను ఓపెన్ చేసి Jeevan Pramaan Certificate విభాగంలోకి వెళ్లి Generate Life Certificate ఆప్షన్ ఎంచుకోవాలి.తర్వాత Face Authentication క్లిక్ చేయాలి.మీ ఆధార్ సంఖ్య, మొబైల్ సంఖ్య నమోదు చేసి ఫోన్కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి.ఆ తర్వాత మీ పీపీఓ సంఖ్య, పెన్షన్ మంజూరు చేసిన అధికారి, బ్యాంక్ పేరు, ఖాతా సంఖ్య వివరాలను సమర్పించాలి.పునర్నియామకం (Re-employed), పునర్వివాహం (Remarried) ఆప్షన్లను సరిగ్గా ఎంచుకొని నిబంధనలను అంగీకరిస్తూ Aadhaar Face RD యాప్కు కెమెరా యాక్సెస్ అనుమతి ఇవ్వాలి.కెమెరా ద్వారా మీ ముఖాన్ని స్కాన్ (Face Scan) చేయడంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది.ఉచితంగా ఇంటివద్దే సేవలుసాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించలేని వృద్ధుల కోసం ఈపీఎఫ్ఓ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఉచిత డోర్స్టెప్ సేవను ప్రవేశపెట్టింది. పెన్షనర్లు టోల్ ఫ్రీ నంబర్ 155299 లేదా 1800 889 7711 కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తే ఐపీపీబీ డాక్ సేవక్ నేరుగా ఇంటికే వచ్చి జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఉచితంగా నమోదు చేస్తారు. పెన్షన్ సజావుగా అందాలంటే గడువు ముగియక ముందే జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించాలి.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్లోకి పసిడి.. నేటి ధరలు ఇలా..
హోటళ్లకు నోటీసులు.. కస్టమర్లదే అంతిమ నిర్ణయం!
రెస్టారెంట్లలో బిల్లులతో పాటు అడ్డగోలుగా సర్వీస్ ఛార్జ్ పేరిట వినియోగదారులపై అదనపు భారం మోపుతున్న హోటళ్లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బిల్లులో కస్టమర్ల అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జ్ కలపడం, దానిని తొలగించమని కోరినా నిరాకరించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న 41 ప్రముఖ రెస్టారెంట్లపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) సుమోటోగా చర్యలు ప్రారంభించింది.వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయంపై స్పందిస్తూ.. ‘రెస్టారెంట్లు వినియోగదారులను సర్వీస్ ఛార్జ్ చెల్లించమని బలవంతం చేయడానికి వీల్లేదు. ఇది పూర్తిగా కస్టమర్ ఆప్షన్’ అని స్పష్టం చేశారు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ (ఎన్సీహెచ్)కు అందిన వేలాది ఫిర్యాదుల ఆధారంగా సీసీపీఏ ఈ చర్యలు చేపట్టింది.కోర్టు తీర్పుతో మారిన సమీకరణాలువాస్తవానికి, జులై 2022లోనే సీసీపీఏ రెస్టారెంట్లలో నిర్బంధ సర్వీస్ ఛార్జ్ విధించడాన్ని అనుచిత వ్యాపార ధోరణిగా అభివర్ణిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే, రెస్టారెంట్ అసోసియేషన్లు దీన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. గత ఏడాది (మార్చి 2025) ఢిల్లీ హైకోర్టు సీసీపీఏ మార్గదర్శకాలను సమర్థిస్తూ తీర్పునివ్వడంతో చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.వినియోగదారులు తెలుసుకోవాల్సినవి..ఆహార పదార్థాలు, వాటిపై పడే పన్నులు మాత్రమే కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుంది. రెస్టారెంట్ అందించే సేవ నచ్చితే టిప్ లేదా సర్వీస్ ఛార్జ్ ఇవ్వడం వినియోగదారుడి ఇష్టం. బిల్లులో సర్వీస్ ఛార్జ్ ఉంటే దానిని తీసివేయమని అడిగే హక్కు కస్టమర్కు ఉంది. హోటల్ యాజమాన్యం నిరాకరిస్తే అది చట్టరీత్యా నేరం. సర్వీస్ ఛార్జ్ అనేది అధికారిక పన్ను కానందున దానిపై జీఎస్టీ విధించడం నిబంధనలకు విరుద్ధం.ఫిర్యాదు చేయడం ఎలా?ఒకవేళ ఏ రెస్టారెంట్ అయినా సర్వీస్ ఛార్జ్ బలవంతంగా వసూలు చేస్తే వినియోగదారులు జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1915 ద్వారా లేదా ఎన్సీహెచ్ యాప్/పోర్టల్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. మార్గదర్శకాల అమలు స్థాయి నుంచి ప్రత్యక్ష చర్యల దిశగా కేంద్రం వేసిన ఈ అడుగు వినియోగదారుల హక్కుల పరిరక్షణలో కీలక మైలురాయిగా నిలవనుంది.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్లోకి పసిడి.. నేటి ధరలు ఇలా..
ఈక్విటీలపై ఎల్టీసీజీ పన్ను రద్దు లేదు
ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నును ఎత్తివేసే ఆలోచన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతికూల మార్కెట్ వార్తలు, నిపుణుల అంచనాల నడుమ పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ లోక్సభలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.పార్లమెంట్ ఉభయసభల సమావేశాల సందర్భంగా లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానమిస్తూ.. పన్ను విధానాలు, మూలధన లాభాల పన్ను రేట్లను ప్రభుత్వం వార్షిక బడ్జెట్ రూపకల్పన సమయంలోనే స్థూల ఆర్థిక పరిస్థితులను బట్టి సమీక్షిస్తుందని, ప్రస్తుతానికి ఎల్టీసీజీని రద్దు చేసే ఎలాంటి ప్రతిపాదన లేదని పేర్కొన్నారు.ఖజానాకు భారీగా పన్ను ఆదాయంభారత మార్కెట్లలో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం ఊపందుకోవడంతో ఎల్టీసీజీ ద్వారా ప్రభుత్వానికి లభించే రాబడి భారీగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ (అసెస్మెంట్ ఇయర్ 2025-26) ఈక్విటీ ఎల్టీసీజీ పన్ను వసూళ్లు ఏకంగా 78.8 శాతం పెరిగి రూ.1,29,158 కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (ఏవై 2024-25) ఈ వసూళ్లు రూ.72,249 కోట్లుగా నమోదయ్యాయి.ఎఫ్పీఐలతో సమానమైన పన్ను నిబంధనలువిదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులపై వస్తున్న వార్తలను కూడా ప్రభుత్వం ఖండించింది. ఈక్విటీలపై విధిస్తున్న 12.5% ఎల్టీసీజీ పన్ను రేటు స్వదేశీ రిటైల్ ఇన్వెస్టర్లకు, విదేశీ ఇన్వెస్టర్లకు సమానంగానే వర్తిస్తుందని తెలిపింది. ఎఫ్పీఐలకు ఇటీవల ప్రకటించిన పన్ను మినహాయింపు కేవలం ప్రభుత్వ సెక్యూరిటీల పెట్టుబడుల వరకే పరిమితమని స్పష్టం చేసింది.ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు పైబడిన ఈక్విటీ లాభాలపై 12.5% చొప్పున ఎల్టీసీజీ పన్ను అమలులో ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పన్ను రాబడిని సమకూరుస్తున్న ఈ విధానాన్ని మున్ముందు కూడా కొనసాగించడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్లోకి పసిడి.. నేటి ధరలు ఇలా..
ఫ్యామిలీ
ఐవరీ చీరలో ‘రాధమ్మ’ను తలపిస్తున్న నీతా అంబానీ!
నీతా అంబానీ ధరించే చీరలే సందర్భం ఏంటో చెప్పేస్తాయి. కార్యక్రమానికి అనుగుణమైన వస్త్రాధారణతో తన ఫ్యాషన్ అభిరుచి ఏంటో చెప్పకనే చెప్పేస్తారామె. ముఖ్యంగా భారతీయ గొప్ప వారసత్వాన్ని చాటిచెప్పేలా హస్తకళకు అద్దంపట్టే చీరలతో అందర్నీ ఆశ్చర్యపర్చడమే గాక మన కళాకారుల నైపుణ్యాన్ని ఎలుగెత్తి చాటుతారామె. ఈసారి కూడా అలాంటి అందమైన చీరలో దివ్యంగా కనిపించింది నీతా అంబానీ. తన శారీతో ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని మేకప్ ఆర్టిస్ట్ స్మారవ్ రాయ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తన ఇంట జరిగే కృష్ణుడి పూజ కోసం..శ్రీకృష్ణుడి స్ఫూర్తితో రూపొందించిన ఐవరీ చీరలో ప్రత్యేకంగా కనిపించింది. ఫ్యాషన్ని సందర్భానుసారంగా స్టైలిష్గా కనిపించడంలో నీతాకు సాటిలేరని చెప్పొచ్చు. ప్రకాశవంతమైన సంప్రదాయంతో ఫ్యాషన్ని చాటుతుందామె. ఈసారి కూడా అలానే ఇంట్లో జరిగే పూజ కోసం కృష్ణుడి స్ఫూర్తితో రూపొందించిన ఐవరీ రంగు చీరలో దివి నుంచి భువికి వచ్చిన దేవతాలా మెరిసింది. తెల్ల గన్నెరు రంగు చీరపై పురాతన బంగారు, వెండి జరీతో కృష్ణుడి రూపాన్ని అందంగా ఎంబ్రాయిడరీ చేశారు. చీర అంతటా ఆ చిన్న కృష్ణుడి మోటీప్లను ఆలోచనాత్మకం నేయడం విశేషం. ఆ శారలో అద్భుతంగా ఎంబ్రాయిడరీ చేసిన అంచు, క్లిష్టమైన పూల నమునాలు ప్రధాన ఆకర్షణగా కనిపించాయి. ఏక వర్ణంగా ఉండే ఈ చీరకు ఆ డిజైన్ అద్భుతమైన లుక్ని ఇచ్చింది. అలాగే పల్లు కూడా పారదర్శకమైన ఆర్గాంజా వస్త్రంతో కూడిన వంపుల అంచు ఆమె భుజాల మీద నుంచి అందంగా జాలువారింది. ఆ చీరకు మ్యాచింగ్గా నిరాడంబరైమన గుండ్రని మెడ, హాఫ్ హ్యాండ్స్..ఆ చీరపై ఉన్న క్లిష్టమైన హస్తకళా నైపుణ్యం స్పష్టంగా కనిపించేలా ఆకర్ణగా నిలిచింది. ఆ అందమైన లుక్కి అనుగుణంగా ధరించిన వజ్రాభరణాలు మరింత శోభను చేకూర్చాయి. ముఖ్యంగా ఎమరాల్డ్-కట్ రాళ్లతో కూడిన పొరల వజ్రాల నెక్లెస్, దానికి సరిపోయే పూల చెవిపోగులు, వరుసగా పేర్చిన వజ్రాల బ్రాస్లెట్లు, వరుసగా పేర్చిన వజ్రాల బ్రాస్లెట్లు, ఒక పెద్ద కాక్టెయిల్ ఉంగరం వంటి జ్యువెలరీ నీతాకు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన లుక్ని అందించాయి. అలాగే కురులను ముడివేసి, ముఖానికి లైట్ మేకప్తో చక్కటి గుండ్రటి బొట్టుతో సంప్రదాయం మేళవింపుతో కూడిన ఆధునిక మహిళలా మెరిసింది నీతా అంబానీ. View this post on Instagram A post shared by Sourav Roy| Hair & Makeupartist (@souravv_roy_) (చదవండి: కాంచీపురం చీరలో దేవతలా సాయిపల్లవి..!)
సాధారణ బైక్ నుంచి బీఎండబ్ల్యూ రేంజ్కి..!
సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటే ఆ ఫీల్ ఆ ఆనందం మాటలకందనిది. ఒక్కసారిగి వెనుతిరిగి చూసుకుంటే..ఇంత పెద్దస్థాయికి ఎలా చేరుకున్నాను అని ఆశ్చర్యం, గర్వం ఒకేసారి కలుగుతాయి. అంతేగాదు అందుకోసం మనవాళ్లు చేసిన త్యాగాలు కళ్లుముందు మెదలడమే కాదు..అందుకు తగ్గట్టుగా ప్రయోజకుడై వాళ్లను బాగా చూసుకుంటే..అంతకుమించిన సంతృప్తి ఇంకొకటి ఉండదు. ఆ ఆనందాన్నే ఓఎన్నారై ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది.మధురకు చెందిన ఎన్నారై అమిత్ కశ్యప్ షేర్ చేసిన వీడియో నెట్టింట హాట్టాపిక్గా మారింది. భారతదేశంలోని సాధారణ బైక్ నుంచి అమెరికాలో బీఎండబ్ల్యూ కొనుగోలు చేసే రేంజ్కి తాను ఎలా చేరుకున్నాడో ఇన్స్టాగ్రామ్ రీల్లో పంచుకున్నాడు. ఒకప్పుడు భారతదేశంలో తన వద్ద ఒక బైక్ మాత్రమే ఉండేదని, కానీ ఈరోజు అమెరికాలో తన సొంత ఇంటి గ్యారేజ్లో కారుని పార్క్ చేస్తున్నానని అని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది అన్నాడు. ఉత్తరప్రదేశ్లోని మధురకు చెందిన తాను ప్రస్తుతం అమెరికాలో టెక్సాస్లో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన పేరెంట్స్ కోసం అమెరికాలో ఒక ఇల్లు కొన్నట్లు తెలిపాడు. అమెరికా రోడ్లపై బీఎండబ్ల్యూ కారుని నడపడమే కాదు, అందులో మా అమ్మనాన్నలతో కలిసి ప్రయాణిస్తున్నానని అన్నారు. అంతేగాదు తాను కట్టిన ఇల్లుని అమ్మకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు కూడా. తను ఈ రోజు ఈ ఉన్నత స్థాయిలో ఉన్నానంటే అందుకు తన పేరెంట్స్ చేసిన త్యాగాలేనని గుర్తుచేసుక్న్ననారు. డబ్బు ఆదా చేసేందుకు తన తల్లి మట్టిపొయ్యి మీద వంట చేయడంతో సహా, ఎన్నెన్నో త్యాగాలు చేశారు. తమ సొత ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేసి మరి మంచి స్కూల్కి పంపించారని, అలాగే ఇంజనీరింగ్ ఫీజుల కోసం ప్రతి పైసాను ఎలా కూడబెట్టేవారో తాను ఇప్పటికీ మర్చిపోనని అన్నారు. అంతేగాదు అలా మట్టిపోయ్యి మీద వండుతున్నప్పుడు ఆ పొగతో ఆమె పడ్డ బాధ ఇప్పటికీ గుర్తుందని భావోద్వేగంగా మాట్లాడారు. అంతేగాదు ఆ పరిస్థితుల్లో ఏదో ఒక రోజు మంచి స్థాయికి చేరుకుని మా కుటుంబానికి ఉన్న మధ్యతరగతి అన్న ముద్రను మార్చేయాలని ఎంత బలంగా అనుకునేవాడో నాటి సంఘటనలను గుర్తుతెచ్చుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ తాను మంచిహోదాకు చేరుకుని ఆ కలను నిజం చేసుకున్నా.. అని సగర్వంగా చెబుతూ వీడియోని ముగించారు. అంతేగాదు కశ్యప్ సక్సెస్ జర్నీపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఓపికగా, నిలకడగా ఉంటే విజయ తథ్యం అదే కశ్యప్ చేసి చూపించారని పలువురు పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Amit Kashyap (@amitkashyap._) (చదవండి: రన్నింగ్ జస్ట్ ఫిట్నెస్ కాదు! అంతకుమించి..)
రన్నింగ్ జస్ట్ ఫిట్నెస్ కాదు! అంతకుమించి..
ఆరోగ్యం కోసం వ్యాయామాలు, వాకింగ్ , రన్నింగ్ వంటివి అన్ని చేస్తుంటాం. ఇది సర్వసాధారణం. చాలామంది రోజువారి దినచర్యలో భాగం కూడా. కానీ అదొక జస్ట్ రోజు చేసే ఒక సాధారణ దినచర్య కాదని, అంతకుమించి అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా అంటూ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. నిజాయితీగా వెల్లడించిన ఆ అభిప్రాయం నెటిజన్ల మనసుని హత్తుకుంది. ఆ వీడియోలో ప్రఖర్ నేగి అనే ఇన్స్టాగ్రామ్ వినియోగదారుడు తనకు 29 ఏళ్లు అని, స్థిరమైన ఉద్యోగం కూడా ఉందని చెప్పాడు. గురుగ్రామ్లో రాత్రి 7:30 గంటలకు తాను 15 కిలోమీటర్లు పరుగెత్తడానికి కారణం ఏదో తప్పనిసరి పరిస్థితులు కాదని, తనను కాపాడటానికి ఎవ్వరూ రారని తెలుసుకోవడమేనని అన్నారు. తాను సాధించాల్సిన లక్ష్యాలు తనంతట తానే సాధించుకోవాలని అన్నారు. ఇది అంగీకరించేందుకు కష్టంగా ఉన్నా..ఇదే నిజం అని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలనే ఆశావాదం పెంపొందించుకుంటే..ఏదైనా సాధ్యమేనని మనఃపూర్వకంగా విశ్వసించాలని అన్నారు. అలా రోజు చేయడం కాస్త కష్టం ఉన్నా..గొప్పగా లైప్ ఉండాలి, మరిన్ని చూడాలంటే తప్పదని అన్నారు. అలాంటి వాళ్ల గొప్ప విజయాలకు అర్హులని చెప్పారు. దయచేసి మీరు కూడా ఇలాంటి ఆశావాహ దృక్పథాన్నే అలవరుచుకోవాలని పిలుపునిస్తూ..అందరికీ "హ్యాపీ రన్నింగ్" శుభాకాంక్షలని చెప్పారు. నెటిజన్లకు ప్రఖర్ పంచుకున్న ఆలోచనలు ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు..ఆరోగ్యంగా ఉండటంపై మంచి స్ఫూర్తినిచ్చారు, ధన్యవాదాలు అని పోస్టులు పెట్టడం విశేషం. View this post on Instagram A post shared by Prakhar Negi (@negisdayintheliferunning) (చదవండి: కేవలం ఆటో నడుపుతూ నెలకు రూ. 60 వేలు..!)
పీక్ సీజన్లో హోటళ్లు చవకగా బుక్ చేసుకోవాలంటే...
సెలవులు, పండుగలు, లాంగ్ వీకెండ్లు... ఇలా పీక్ సీజన్ లో ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా గుర్తొచ్చే సమస్య హోటల్ ధరలే. అదే గది సాధారణ రోజుల్లో ఒక ధర ఉంటే, పీక్ సీజన్ లో మరో ధర ఉంటుంది. అయితే కొంచెం తెలివిగా ప్లాన్ చేస్తే 20 నుంచి 40 శాతం వరకు డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. అందుకోసం ఈ 12 సులభమైన చిట్కాలు ఉపయోగపడతాయి.1. సరైన సమయంలో బుకింగ్ చేయండి..వారం మధ్యలో, ముఖ్యంగా డిమాండ్ తక్కువగా ఉండే సమయంలో ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు ధరలు పరిశీలించి బుక్ చేయండి.2. వ్యక్తిగత బ్రౌజింగ్ లేకుండా వెతకండి..ఒకే హోటల్ను పదేపదే వెతికితే ధరల్లో మార్పు కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే వ్యక్తిగత బ్రౌజింగ్ సమాచారం లేకుండా లేదా మరో పరికరం ద్వారా కూడా ఒకసారి ధరలు పరిశీలించండి.3. ప్రధాన ప్రాంతం కాకుండా..పర్యాటక ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న హోటళ్లు ఖరీదుగా ఉండే అవకాశం ఎక్కువ. రెండు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల్లో వెతికితే తక్కువ ధరకే మంచి వసతి దొరకొచ్చు.4. వారాంతపు రోజులను వీలైతే ఎవాయిడ్ చేయండి..శని, ఆదివారాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు సోమవారం నుంచి గురువారం మధ్య బుకింగ్ చేసుకునేలా ప్రయాణ ప్రణాళిక రూపొందించండి.5. హోటల్తో నేరుగా మాట్లాడండి..ఆన్ లైన్ లో కనిపించిన ధరను ప్రస్తావిస్తూ హోటల్కు నేరుగా ఫోన్ చేస్తే కొన్నిసార్లు అదే ధరకు లేదా ఇంకా తక్కువకు గది ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఎర్లీ చెకిన్ లేదా లేట్ చెకిన్ చేసే సౌకర్యం కూడా లభించవచ్చు.6. ఫుడ్ ఉన్న ప్యాకేజీలను ఎంచుకోండి..గదితో పాటు అల్పాహారం లేదా రాత్రి భోజనం కలిపి ఇచ్చే ప్యాకేజీలు ఎంచుకుంటే విడిగా ఖర్చు చేయడంకంటే చవకగా ఉండొచ్చు.7. ఫిల్టర్ కరెక్టుగా చేయండి..మంచి రేటింగ్, సరైన ప్రదేశం, తక్కువ ధర వంటి ప్రమాణాలతో హోటళ్లను ఫిల్టర్ చేసుకుంటే చూసుకుంటే మంచి వసతి సులభంగా దొరుకుతుంది.8. ముందుగానే బుక్ చేసుకోండి..ప్రయాణ తేదీ ముందే ఖరారైతే కనీసం రెండు నెలల ముందే బుక్ చేసుకోవడం మంచిది. ఫ్రీ కేన్సిలేషన్ సౌకర్యం ఉన్న రూమ్ని ఎంచుకుంటే తరువాత ధర తగ్గినప్పుడు మళ్లీ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.9. హోటల్కు వెళ్లిన తర్వాతే చెల్లించండి..ఇలా చెకిన్ చేసిన తరువాత పే చేసే అవకాశం ఉంటే ధరలు, రూల్స్ చెక్ చేయండి. అయితే ముందుగా పక్కాగా చెల్లించాలా లేదా అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.10. ఆఫర్లను యూజ్ చేసుకోండి..వివిధ బుకింగ్ ప్లాట్ఫామ్లు, బ్యాంకులు, యూపీఐ సేవలు అందించే ఆఫర్లు, కూపన్లు, రివార్డ్ పాయింట్లను ఉపయోగించుకుంటే మరింత ఆదా చేయవచ్చు.11. రద్దీ సమయంలో వద్దు..సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎక్కువ మంది బుకింగ్ చేయడం వల్ల ధరల్లో మార్పులు ఉండొచ్చు. వీలైతే మధ్యాహ్నం లేదా సాయంత్రం ముందుగానే బుకింగ్ ప్రయత్నించండి.12. నియర్ బై టౌన్స్ చెక్ చేయండిప్రధాన ప్రాంతంలోని హోటళ్లు పూర్తిగా నిండిపోయినప్పుడు సమీప పట్టణాలు లేదా శివారు ప్రాంతాల్లో వెతికితే తక్కువ ధరకే మంచి వసతి దొరికే అవకాశం ఉంటుంది.చివరగా...ఒకే వెబ్సైట్పై ఆధారపడకుండా కనీసం రెండు లేదా మూడు బుకింగ్ వేదికల్లో ధరలను పోల్చండి. హోటల్ రివ్యూలు, కేన్సిలేషన్, అదనపు ఛార్జీలను పరిశీలించిన తర్వాతే బుకింగ్ చేయండి.
అంతర్జాతీయం
గెలుపంటే ఇదేకదా.."డెలివరీ బాయ్టూ చైనా సాహిత్య పురస్కారం"
బీజింగ్: పొట్టకూటికోసం వీధుల వెంట పరుగులు తీస్తూ డెలివరీ బాయ్గా పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు ఏకం ఒక సాధారణ ఫుడ్ డెలివరీ బాయ్.. చైనాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారాన్ని కైవసం చేసుకుని అంతర్జాతీయంగా సంచలనం సృష్టించారు. 56 ఏళ్ల వాంగ్ జిబింగ్ రాసిన "మ్యాన్ ఇన్ ఎ హర్రీ" అనే కవితా సంకలనానికి ఆ దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం ‘లుక్సున్" పురస్కారం లభించిందికష్టాల నుంచి కవిత్వం వైపుచైనాలోని జియాంగ్సు ప్రావిన్స్కు చెందిన వాంగ్ జిబింగ్ జీవితం అంతా ఒడిదుడుకులతోనే సాగింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నతనంలోనే చదువుకు దూరమైన వాంగ్.. పొట్టకూటి కోసం ఎన్నో పనులు చేశారు. భవన నిర్మాణ కార్మికుడిగా, వ్యర్థాలు సేకరించే వ్యక్తిగా, రోడ్డు పక్కన చిరు వ్యాపారిగా మారారు. చివరకు 2019లో కున్షాన్ నగరంలో ఫుడ్ డెలివరీ బాయ్గా స్థిరపడ్డారు.రోజుకు 12 నుంచి 14 గంటల పాటు సైకిళ్లు, బైకులపై తిరుగుతూ డెలివరీలు ఇచ్చే క్రమంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలే ఆయనలోని కవిని మేల్కొలిపేలా చేశాయి.ఒక్క ఘటన జీవితాన్నే మార్చింది2019లో ఒక కస్టమర్ తప్పుడు అడ్రస్ ఇవ్వడం వల్ల వాంగ్ చాలా ఇబ్బంది పడ్డారు. ఆర్డర్ లేట్ అవ్వడంతో కస్టమర్ ఆగ్రహానికి గురవ్వడమే కాకుండా, కంపెనీ నుండి పెనాల్టీ పడింది. ఆ రాత్రి గుండెల్లోని ఆవేదనను కవిత్వంగా మారుస్తూ ఆయన రాసిన ‘మ్యాన్ ఇన్ ఎ హర్రీ’ (తొందరపాటులో ఉన్న మనిషి) అనే కవిత 2022లో చైనా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'వైబో' (Weibo) లో విపరీతంగా వైరల్ అయింది. కోట్లాది మంది శ్రమజీవుల మనసులను తాకిన ఆ ఒక్క కవితతో ఆయన రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.అత్యున్నత పురస్కారం ‘లుక్సున్ లిటరరీ ప్రైజ్’వాంగ్ జిబింగ్ తాజాగా రాసిన ‘లో ఫ్లైట్’ (Low Flight) అనే కవితల సంపుటికి చైనాలోనే అత్యున్నత గౌరవప్రదమైన "లు క్సున్ లిటరరీ ప్రైజ్" లభించింది. చైనా ఆధునిక సాహిత్య పితామహుడిగా పిలవబడే 'లు క్సున్' జ్ఞాపకార్థం ఇచ్చే ఈ అవార్డును, కవిత్వ విభాగంలో వాంగ్కు అందజేశారు.ఈ పుస్తకం కోసం ఆయన కేవలం తన బాధలనే కాకుండా, గిగ్ ఎకానమీ (తాత్కాలిక ఉపాధి రంగం) లో పనిచేసే దాదాపు 200 మంది తోటి డెలివరీ రైడర్ల జీవితాలను, వారి సవాళ్లను ఇంటర్వ్యూ చేసి కవితలుగా మలిచారు. ఇప్పటివరకు ఆయన దాదాపు 6,000 పైగా కవితలు రాయడం విశేషం.నగదు పురస్కారం.. అంతకుమించి రాయల్టీ!ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కింద వాంగ్కు చైనీస్ రైటర్స్ అసోసియేషన్ భారీ నగదు బహుమతిని కూడా అందజేసింది. గత అవార్డుల లెక్కల ప్రకారం ఈ పురస్కార గ్రహీతలకు సుమారు 1,00,000 చైనీస్ యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 11.5 లక్షలకు పైగా) నగదు లభిస్తుంది. దీనితో పాటు, అవార్డు రావడంతో ఆయన పుస్తకాల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగాయి. దీని ద్వారా పబ్లిషర్స్ నుండి ఆయనకు లక్షల్లో రాయల్టీ ఆదాయం కూడా సమకూరుతోంది.డెలివరీలు ఆపేది లేదుసాధారణంగా ఇంత పెద్ద అవార్డు, డబ్బు వస్తే ఎవరైనా ఆ కష్టమైన ఉద్యోగాన్ని వదిలేస్తారు. కానీ వాంగ్ జిబింగ్ మాత్రం తన వినమ్రతను చాటుకున్నారు."ఈ అవార్డు నా జీవితాన్ని కానీ, నన్ను కానీ మార్చలేదు. నాకు 60 ఏళ్లు వచ్చే వరకు నేను డెలివరీ బాయ్గానే పనిచేస్తాను. ఈ పనే నన్ను శారీరకంగా దృఢంగా ఉంచుతుంది, సమాజంలోని సామాన్య ప్రజల కష్టాలకు దగ్గరగా ఉంచుతుంది. శ్రమజీవుల గొంతుకగా నా కలాన్ని సాగిస్తూనే ఉంటాను" అని వాంగ్ స్పష్టం చేశారు.
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు
కాబూల్: అఫ్గానిస్తాన్ని భారీ వరదలు అతలాకుతలం చేశాయి. నిన్న (సోమవారం) నూరిస్తాన్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. , మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ వివరాలను అక్కడి అధికారులు ప్రకటించారు.భారీ వరదలకు నూరిస్తాన్ 'పరూన్' లో నది ఒడ్డున మార్కెట్లు, హోటళ్లు, వందలాది దుకాణాలు వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతంపూర్తిగా బురదతో నిండిపోయింది. దీంతో వరదలు తగ్గుముఖం పట్టాక క స్థానిక నివాసితులు బురద కుప్పలపై గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలింపులు చేపడుతున్నారు. అయితే ఈ వరదలలో పరూన్ నగర మేయర్తో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.కాగా సహాయక చర్యలకు సరైన సామాగ్రి లేకపోవడంతో స్థానికులు తమ చేతులతోనే బురదను తొలగిస్తూ గాలింపు చర్యలు చేపట్టడం హృదయవిదారకంగా కనిపిస్తోంది. కాగా ఈ ఘటనపై తాలిబన్ ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పందిస్తూ, నూరిస్తాన్ ప్రాంతంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని బాధితులను రక్షించడానికి మరియు వారి ఆస్తులను కాపాడటానికి సంబంధిత ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగి తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలిపారు.భారీ వర్షాలు పడే అవకాశంఆ దేశ వాతావరణ పరిస్థితులపై విపత్తు నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రావిన్సుల్లో భారీ వర్షాలు, తుఫానులు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలు నదీ తీరాలకు వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.
ఇరాన్పై అమెరికా భారీ వైమానిక దాడులు
దుబాయి: అమెరికా – ఇరాన్ల యుద్ధం మరింత వేడెక్కింది. సోమవారం ఉదయం ఇరాన్ లక్ష్యంగా అమెరికా మరోసారి దాడులకు తెగబడగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్లపై ప్రతిదాడులకు దిగింది. ఇరాన్ వాయువ్య ప్రాంతంలో భూగర్భ క్షిపణి కేంద్రంగా భావిస్తున్న తబ్రిజ్ నగరం లక్ష్యంగా అమెరికా దాడులకు దిగగా ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రతీకారంగా ఇరాన్ బహ్రెయిన్తోపాటు అమెరికా నావికాదళపు ఫిఫ్త్ ఫ్లీట్ ఉన్న కువైట్పై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరు దేశాల్లో సోమవారం ఉదయమే క్షిపణి దాడులకు సంబంధించిన హెచ్చరికలు జారీ అయ్యాయి. దూసుకొస్తున్న క్షిపణులను అడ్డుకున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరుదేశాల మధ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తూ గత నెలలో ఒక ఒప్పందం కుదిరినా ఆ తరువాత దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూండటంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో కార్యకలాపాలు మళ్లీ స్తంభించిపోయాయి. ఇరుపక్షాలూ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు చేసుకుంటూండంతో చమురు ధరలు మళ్లీ పైకి ఎగబాకాయి. సోమవారం బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్ ధర 90 డాలర్ల కంటే ఎక్కువ పలికి ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. బాగా దెబ్బకొట్టాం: ట్రంప్ ఇరాన్పై సోమవారం జరిగిన దాడులు బాగా జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒరాన్ డ్రోన్ దాడిలో శనివారం వీరసైనికుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నామని ఆయన ప్రకటించారు.
ఖర్గ్ ద్వీపం కోసం ఆలోచిస్తే.. ఇరాన్ భారీ వార్నింగ్
టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ మరోసారి భారీ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ఖర్గ్ ద్వీపం ఆక్రమించడానికి వాషింగ్టన్ యత్నిస్తే అక్కడికి వచ్చిన సైనికులు ప్రాణాలతో తిరిగి వెళ్లలేరని వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ట్రంప్ ఖర్గ్ ద్వీపంపై వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.పర్షియన్ గల్ఫ్లోని, బుషెహర్ ప్రావిన్స్ తీరానికి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గ్ ద్వీపం, ఇరాన్ యొక్క అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రం ఆ దేశంలోని అత్యంత వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఇంధన ఆస్తులలో ఇది ప్రధానమైనది. ఇరాన్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే మొత్తం ముడి చమురులో దాదాపు 90 శాతం ఈ ఒక్క ద్వీపం నుంచే సరఫరా అవుతుంది.దీంతో దీనిని ఎలాగైనా ఆక్రమించాలని ట్రంప్ తొలినుంచి యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అవసరమైతే ఖర్గ్ ద్వీపాన్ని తమ నియంత్రణలోకి తీసుకునేలా పరిమిత భూతల దాడి చేసే ఆలోచన ఉందని మాట్లాడారు. తాజాగా ఆ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటరిచ్చింది.విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి మాట్లాడుతూ "ఖర్గ్ ద్వీపంపై భూతల దాడి చేయడానికి అమెరికా సైనికులు వస్తే... వారిని 'స్వాగతించడానికి' మా సైన్యం, మా ప్రజలు నిమిషాలు లెక్కిస్తూ, సిద్ధంగా ఎదురుచూస్తున్నారు." అని అన్నారు.మళ్లీ ఉద్రిక్తతప్రస్తుతం పశ్చిమాసియా పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా, యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్నాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా విఫలమై, మళ్లీ భారీ ఎత్తున దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి.
జాతీయం
ప్రాణాపాయ స్థితిలో సోనమ్ వాంగ్చుక్
న్యూఢిల్లీ: సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించాలని మద్దతుదారులు కోరడంతో వాంగ్చుక్ అంగీకరించినప్పటికీ, అంతకుముందు రోజు జరిగిన పోలీసుల లాఠీఛార్జీని చూసి మనస్తాపం చెంది దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు.వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంగ్చుక్ రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నాయని, పొటాషియం స్థాయి 3.2 mEq/L గా నమోదైందని తెలిపారు. అంతేకాకుండా, ఆయన రక్తహీనత, తెల్ల రక్తకణాల లోపంతో కూడిన ‘పాన్ సైటోపీనియా’ సమస్యతో బాధపడుతున్నారు. వైద్యులు ఎంత చెప్పినా ఆయన ఐవీ ఫ్లూయిడ్స్, గ్లూకోజ్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని, కేవలం ఓఆర్ఎస్, పొటాషియం సప్లిమెంట్లను మాత్రమే తీసుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీర్ఘ కాలం పాటు ఆహారం మానివేయడం వల్ల ఆయన శరీరం తీవ్ర ఒత్తిడికి గురైందని, ప్రాణాపాయం పొంచి ఉన్నందున నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరమని తెలుస్తోంది.
ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారా?.. కంగనా ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై ఆమె స్పందిస్తూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు సరైనవి కాదని హితవు పలికారు. నీట్-యూజీ 2026 వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలను ఆమె తప్పుబట్టారు. #WATCH | Monsoon session of Parliament | Delhi: On issues being raised by the Opposition, BJP MP Kangana Ranaut says, "Parliament sessions are convened so that we can discuss all issues in detail. Government is answerable for everything and so the session is held. We want the… pic.twitter.com/Fy213UfHA2— ANI (@ANI) July 20, 2026సమస్యలపై చర్చించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి పార్లమెంటే సరైన వేదిక అని కంగనా స్పష్టం చేశారు. సభను అడ్డుకోవడం, గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. మంత్రులను తొలగించాలంటూ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయలేరని, ఎవరిని ఉంచాలి, ఎవరిని తొలగించాలనే నిర్ణయాధికారం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికే ఉంటుందని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు మరింత పట్టుదలగా ఉంటే నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని ఆమె సవాల్ విసిరారు. వర్షాకాల సమావేశాల తొలిరోజు నీట్ వివాదం, అయోధ్య ట్రస్ట్ విరాళాల ఆరోపణలపై విపక్షాలు సభలో నినాదాలు చేశాయి. సభ్యులు సహకరించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేసినప్పటికీ, గందరగోళం చెలరేగడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.ఇది కూడా చదవండి: ‘నీట్’ ఆందోళనలపై హేమామాలిని వివాదాస్పద వ్యాఖ్యలు
నీట్ వివాదంపై మోదీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్షా పత్రాలను లీక్ చేయడం ‘ఘోర పాపం’ అని అభివర్ణించిన ఆయన.. విద్యార్థుల భవిష్యత్తో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. పార్లమెంట్ సమీపంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు కొనసాగుతున్న వేళ.. ఎన్టీయే (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వివరాలు వెల్లడించారు.‘తప్పు చేసిన వారిని వదిలిపెట్టం’నీట్ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ప్రధాని పేర్కొన్నట్లు కిరణ్ రిజిజు తెలిపారు. లీక్కు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేశామని.. ఇప్పటివరకు 13 మంది నిందితులు జైలులో ఉన్నారని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్కు నష్టం కలిగించే ఇలాంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రధాని స్పష్టం చేసినట్లు తెలిపారు. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు అవసరమని పేర్కొన్నట్లు చెప్పారు.విద్యార్థుల ప్రయోజనాలే ప్రాధాన్యంనీట్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో విద్యార్థుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని.. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, భద్రత మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు రిజిజు వెల్లడించారు. లీక్ కారణంగా రద్దైన నీట్-యూజీ పరీక్షకు ప్రభుత్వం రీ-ఎగ్జామ్ నిర్వహించిందని.. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి ఫలితాలను కూడా నిర్ణీత సమయంలో ప్రకటించామని తెలిపారు.పరీక్షా వ్యవస్థలో మార్పులపై దృష్టిపరీక్షా పత్రాల లీకేజీ వంటి ఘటనలు దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణ విధానంలో మరింత పటిష్ఠమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. పరీక్షల భద్రత, పారదర్శకతపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.ఎన్టీయే భేటీలో పలు అంశాలపై చర్చఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ వివాదంతో పాటు పార్లమెంట్ సమావేశాలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారని తెలిపారు.నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మంత్రి తప్పుకోవడం లేదా కేంద్రం ఆయనను తప్పించడం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది. విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు అవసరమని పేర్కొంటూ.. తమ డిమాండ్లను కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కూడా అందజేసింది. ఆ డిమాండ్లపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా సీజేపీ నిరసనలపై స్పందించారు. యువత సమస్యలను ప్రభుత్వం వినాలని, నీట్ వ్యవహారంలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
‘నీట్’ ఆందోళనలపై హేమామాలిని వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నీట్-యూజీ (NEET-UG) 2026 పేపర్ లీక్ వివాదంపై రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం అర్థరహితమని బీజేపీ ఎంపీ హేమామాలిని చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపాయి. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, నిరసనలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. విద్యారంగానికి, యువతకు మోదీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలిచిందని ఆమె సమర్థించారు. #WATCH | Monsoon session of Parliament | Delhi: BJP MP Hema Malini says, “If there is a problem, it should be discussed properly. Protesting in this manner won't achieve anything. As for the country's youth and the education system, our Modi government has always stood by them… pic.twitter.com/4HQqf90fqk— ANI (@ANI) July 20, 2026అయితే ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కాలరాసేలా మాట్లాడటం సరికాదని దుయ్యబట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తరుణంలో ఈ వివాదం రాజకీయంగానూ వేడెక్కింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. మరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేయడంతో పాటు భారీగా మోహరించారు. పరీక్షల వ్యవస్థను పారదర్శకంగా మార్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని విపక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎన్ఆర్ఐ
భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్: ప్రధాని మోదీ
ఆక్లాండ్: భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్.. అంతర్జాతీయ వృద్ధికి భారత్ ప్రయోగాల వేదిక అంటూ ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్-న్యూజిలాండ్' సరికొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉందన్న మోదీ.. ఇరు దేశాల ముందు ‘అపారమైన అవకాశాల సముద్రం’ ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయాణ విజయానికి అసలైన దిశానిర్దేశకులు ఈ ప్రవాస భారతీయులేనంటూ పేర్కొన్నారు. ఈ దేశం నలుమూలలా భారతీయులు ఉన్నారని.. ఈ ప్రయాణం విజయవంతమవుతుందనే నమ్మకం ఉందన్నారు.న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఇరుదేశాల ప్రధానుల చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్ సహా పలు అంశాల్లో మరిన్ని అవకాశాలపై భారత్ ఫోకస్ పెట్టింది. ఇరుదేశాల స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ రోడ్ మ్యాప్-2030 ఆవిష్కరించారు. భారత్, న్యూజిలాండ్ దేశాలు శనివారం (జూలై 11, 2026) తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ల మధ్య జరిగిన చర్చల అనంతరం, 2030 నాటికి ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వస్తు, సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి రూ.35,000 కోట్లకు చేర్చాలని ఐదేళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.ఈ సమావేశం ద్వారా 10 ఒప్పందాలతో కలిపి మొత్తం 18 నిర్దిష్ట ఫలితాలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా రాబోయే నాలుగేళ్లలో సంబంధాలను విస్తరించుకోవడానికి ఒక రోడ్మ్యాప్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర సహకారాన్ని పెంపొందించుకోవడానికి కార్యాచరణ, భారత నౌకాదళం, న్యూజిలాండ్ రక్షణ దళాల మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందాలు జరిగాయి.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న దూకుడు నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో సహకారాన్ని విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా సాగిన మోదీ మూడు దేశాల పర్యటనలో ఆక్లాండ్ చివరి విడత. నిన్న రాత్రి ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఇటీవల భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) తర్వాత ఈ పర్యటన జరగడం విశేషం. కాగా, హాకాతో ప్రధాని మోదీకి సంప్రదాయ స్వాగతం పలికారు. మావోరి సంప్రదాయ నృత్యం హాకాతో మోదీ గౌరవ వందనం స్వీకరించారు. హాకా కళాకారులను ప్రధాని మోదీ అభినందించారు.
అమెరికాలో బెజవాడ యువతిని హత్య చేసిన భర్త
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడకు చెందిన సబ్బినేని రజిత గతేడాది అక్టోబర్ 27న అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ బెల్వ్యూ పోలీసులు జరిపిన విచారణలో..రజితను అమె భర్త నార్నే అవినాష్ చంపాడని వెల్లడవడంతో కేసును హత్య కేసుగా మార్చారు. గాయత్రీనగర్కు చెందిన సబ్బినేని కృష్ణారావుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రజితను గతేడాది తెలంగాణకు చెందిన నార్నే అవినాష్ కు ఇచ్చి హైదరాబాద్లో పెళ్లి చేశారు. జులైలో ఈ జంట అమెరికాలోని వాషింగ్టన్కు వెళ్లిపోయారు. పెళ్ళికి ముందుగానే అవినాష్కు భారత్కు చెందిన మరో మహిళతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ కారణంగా రజితను చంపాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. భార్యను ఎలా చంపితే పోలీసులకు దొరక్కుండా ఉంటారనే విషయంపై ఇంటర్నెట్లో వెతికాడు. గాలి ఆడకుండా చేస్తే ఎంత సమయానికి మనిషి ప్రాణాలు పోతాయనే విషయాలను వెతికి, గతేడాది అక్టోబర్ 27న రజితను గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. వెంటనే మృతదేహాన్ని ఫొటో తీసి తన ప్రియురాలికి వాట్సాప్లో పంపాడు. రజిత బాత్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుందని, ఎంత పిలిచినా రావడం లేదని పోలీసులకు ఫోన్ చేసి అవినాష్ చెప్పాడు. పోలీసులు వచ్చేలోపే రజిత అపస్మారకస్థితిలో పడిఉంది. వైద్యులు పరిశీలించి ఆమె మరణించిందని చెప్పారు. ఆ సమయంలోనే రజిత మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డిజిటల్ ఫోరెన్సిక్స్ ద్వారా రజితను ష్ష్ చంపాడని గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రజిత తల్లిదండ్రులు అమెరికాకు బయలుదేరారు. అమెరికా పోలీసులు అవినా షను అరెస్ట్ చేశారు.
శంకరనేత్రాలయ అమెరికా సలహామండలి సభ్యుడిగా లక్ష్మీనరసింహన్ వాసన్
లాస్ ఏంజెలెస్: లాస్ ఏంజెలెస్: శంకర నేత్రాలయ సంస్థ అమెరికా సలహా మండలి (అడ్వైజరీ బోర్డు) సభ్యుడిగా లక్ష్మీ నరసింహన్ వాసన్ను నియమితులయ్యారు. అమెరికన్ కిచెన్ ఎక్విప్మెంట్ రంగంలో స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ఎన్నో సమాజ సేవ, దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. ఆయనను ప్రతీష్టాత్మకమైన అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా నియమించామని సంస్థ అధ్యక్షులు బాలరెడ్డి ఇందుర్తి తెలియచేశారు.ఈ సందర్భంగా శంకర నేత్రాలయ యూఎస్ఏ నాయకత్వ బృందం, ఇతర సలహా మండలి సభ్యులు, శంకర నేత్రాలయ ఇండియా అధ్యక్షులు డాక్టర్ గిరీష్ రావు తదితరులు లక్ష్మీ నరసింహన్ వాసన్, ఆయన సతీమణి డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్కు స్వాగతాభినందనలు తెలియచేశారు. లక్ష్మీ నరసింహన్ వాసన్ తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని పసూర్ గ్రామంలో జన్మించి, హైదరాబాద్లో పెరిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ పట్టా పొందిన అనంతరం, 1981లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగి, ఇటీవల దక్షిణ కాలిఫోర్నియాలోని రాయల్ కిచెన్ ఎక్విప్మెంట్ కంపెనీ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి (CEO)గా సేవలందించారు.ఆయనకు క్రీడారంగంలో కూడా విశిష్టమైన ప్రస్థానం ఉంది. అమెరికాకు వెళ్లే ముందు ఆయన భారతదేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్గా రాణించి, హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలోని జట్టులో మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, శివలాల్ యాదవ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు సభ్యులుగా ఉన్నారు. భారతదేశంలో జరిగిన వివిధ క్రికెట్ మ్యాచ్లలో కూడా పాల్గొన్న ఆయన, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, ఎస్. వెంకటరాఘవన్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి మైదానాన్ని పంచుకున్నారు.లక్ష్మీ నరసింహన్ వాసన్ 1988లో డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ కార్తీక్ వాసన్ వైద్య పరిశోధనలో పీహెచ్డీ. పూర్తి చేయగా, కుమార్తె మయూరి వాసన్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలిగా గుర్తింపు పొందారు.దాతృత్వ సేవలను జీవిత ధ్యేయంగా భావించిన లక్ష్మీ నరసింహన్, భారతదేశం, అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఇటీవల శంకరనేత్రాలయా సంస్థకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళంతో, శంకరనేత్రాలయ సంస్థ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతంలో పూర్తిస్థాయి సౌకర్యాలతో కూడిన మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల మధ్యప్రదేశ్, సమీప ఐదు రాష్ట్రాల పేదప్రజలకు కంటిచూపు సంబందించిన వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. ఈ యూనిట్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు మరింత విస్తృతంగా అందించే అవకాశం కల్పిస్తుంది.శంకర నేత్రాలయ యూఎస్ఏ వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ ఎమిరిటస్ ఎస్ వి ఆచార్య, పద్మభూషణ్ డాక్టర్ జగదీశ్ సేథ్, ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శ్రీమతి లీల క్రిష్ణమూర్తి , డాక్టర్ రాజ్ మోదీ, డాక్టర్ కిశోర్ చివుకుల , ఉదయ భాస్కర్ గంటి, శ్యామ్ అప్పలి, శ్రీ మూర్తి రేకపల్లి, వంశీకృష్ణ ఏరువరం, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, వాసన్ కుటుంబం అందిస్తున్న విశేష దాతృత్వ సేవలను, సంకర నేత్రాలయ లక్ష్య సాధనకు వారు అందిస్తున్న సహకారాన్ని హృదయపూర్వకంగా అభినందించారు.
ఆక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇవాళ ఆక్లాండ్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సాన్ స్వాగతం పలికారు. ఇరు దేశాల ప్రధానులు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత న్యూజిలాండ్లో భారత ప్రధాని పర్యటించారు. వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలపై దృష్టిపెట్టారు.భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1968లో ఇందిరా గాంధీ, ఆ తర్వాత 1986లో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ పర్యటించిన అనంతరం.. భారత ప్రధాని ఇక్కడికి రావడం ఇది మూడోసారి మాత్రమే. ఈ పర్యటనను భారత్-న్యూజిలాండ్ సంబంధాలలో ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభంగా భావిస్తున్నారు.భారత ప్రధాని శనివారం లక్సాన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం-పెట్టుబడులు, సముద్ర భద్రత, విద్య, పర్యాటకం, క్రీడలపై ఈ చర్చలు సాగనున్నాయి. వ్యాపారవేత్తలు, క్రీడాకారులతోనూ సమావేశం కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. శనివారం సాయంత్రం 'స్పార్క్ అరేనా'లో జరిగే ఒక భారీ కమ్యూనిటీ ఈవెంట్లో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కింద తమ దేశం నుంచి భారత్కు ఎగుమతి జరిగే ఉత్పత్తుల్లో 57 శాతం ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు చేరుకుంటాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్లో పోస్టు చేశారు. ఇరుదేశాల మధ్య ఎఫ్టీఏ అమల్లోకి వచ్చిన తొలిరోజు నుంచే సున్నా శాతం సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు. ఈ ఒప్పందం తో న్యూజిలాండ్ వ్యాపారాలు భారీగా వృద్ధి చెందనున్నాయని తెలిపారు. భారత మార్కెట్లో న్యూజిలాండ్ ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
క్రైమ్
కుక్కను వెతికిపెడితే రూ.10వేల బహుమతి
నల్గొండ, మిర్యాలగూడ: తన పెంపుడు కుక్కను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని ఓ వ్యక్తి సోమవారం మిర్యాలగూడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిర్యాలగూడ పట్టణంలోని వినోభానగర్కు చెందిన గడ్డం నాగరాజు పెంచుకుంటున్న కుక్క ఈ నెల 18వ తేదీ నుంచి కనిపిండంలేదు. దీంతో అతడు కాలనీలో సీసీ కెమెరాలను పరిశీలించగా.. వినోభానగర్ చర్జి రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కుక్కను ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించాడు. కుక్క ఆచూకీ లభించకపోవడంతో వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన కుక్కను తీసుకొచ్చి ఇస్తే రూ.10వేల వరకు బహుమతిని ఇస్తానంటూ నాగరాజు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం విశేషం.
కీచకుడిపై చట్టపరమైన చర్యలు
కాకినాడ క్రైం: ఇద్దరు మైనర్లు, ఆమె తల్లిపై ఘాతుకానికి పాల్పడిన కీచకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ‘సాక్షి’ పత్రికలో సోమవారం ప్రచురితమైన ‘కీచకుడి చేతిలో విలవిల’ కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, జిల్లా పోలీస్ శాఖ నుంచి నివేదిక కోరామన్నారు. జరిగిన నేరంపై ఆధారాలు లభ్యమయ్యాయని, ఫిర్యాదుతో నిమిత్తం లేకుండా నేరం చేసిన వ్యక్తిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మిని వివరణ కోరగా, బాధిత కుటుంబంతో సహా బాధ్యుడిని తమ కార్యాలయానికి పిలిపించి మాట్లాడామన్నారు. బాధితులు జరిగిన ఘోరాన్ని వివరించి లిఖిత పూర్వకంగా నిర్ధారించారన్నారు. మైనర్లు, ఆమె తల్లిపై జరిగిన ఘాతుకం నిజమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బాలికకు ఆరోగ్య పరీక్షలు, ఆమెకు చదువుకు ఏర్పాట్లు, నేరానికి పాల్పడిన యువకుడిపై చట్టపరమైన చర్యలు అనే మూడు అంశాలను సిఫారసు చేస్తూ కలెక్టర్కు నోట్ఫైల్ పంపామన్నారు. అలాగే ఎస్పీ బిందుమాధవ్కు వీరబాబు అనే బాధితుల బంధువు నుంచి మెయిల్ వచ్చిందని, ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడుతున్నామని కాకినాడ త్రీ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. భార్య, అత్త, మైనర్ మరదలిపై అత్యాచారం చేసిన అల్లుడు!
ఆ హోటల్ వద్ద ఆగితే అంతే..!
నల్గొండ జిల్లా: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నార్కట్పల్లి శివారులోని ఓ హోటల్ దోపిడీ దొంగలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి రాత్రివేళ హైదరాబాద్కు వెళ్లే ప్రైవేట్, ఆర్టీసీ బస్సులను డ్రైవర్లు టీ, టిఫిన్ కోసం ఈ హోటల్ వద్ద ఆపుతుంటారు. దీంతో అక్కడే మాటువేస్తున్న దోపిడీ దొంగలు పక్కా స్కెచ్తో ప్రయాణికుల సొమ్మును దోచేస్తున్నారు. హైవేపై ఎన్నో హోటళ్లు ఉన్నప్పటికీ.. కేవలం ఈ హోటల్ వద్దే పదేపదే దొంగతనాలు జరుగుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్లలో నాలుగు.. గడిచిన నాలుగేళ్లలో ఆ హోటల్ ఆవరణలోనే నాలుగు భారీ చోరీలు జరిగాయి. 2022 నవంబర్ 22న విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును హోటల్ వద్ద ఆపగా.. ఓ ప్రయాణికుడికి సంబంధంచిన కిలో 300 గ్రాముల బంగారాన్ని దుండగులు అపహరించారు. అదేవిధంగా 2023 జూలై 26న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుడికి చెందిన రూ.28 లక్షల నగదును ఈ హోటల్ వద్దే దొంగలు అపహరించారు. ఈ రెండు కేసుల్లో నిందితులు ఇప్పటికీ దొరకలేదు. 2025 ఫిబ్రవరి 9న ఈ హోటల్ వద్ద ఆపిన బస్సులో నుంచి రూ.25 లక్షలు చోరీ చేసి కారులో పారిపోతున్న ముఠాను అప్పటి ఎస్ఐ క్రాంతికుమార్ సీసీ కెమెరాల ఆధారంగా మధ్యప్రదేశ్కు వెళ్లి పట్టుకున్నారు. రికవరీ చేసిన నగదును బాధితుడికి అప్పగించారు. తాజాగా ఆదివారం ఖమ్మం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఈ హోటల్ వద్ద ఆగగా.. ఓ ప్రయాణికుడు రూ.9లక్షల నగదు ఉన్న బ్యాగును పక్కన పెట్టుకుని టిఫిన్ చేస్తుండగా.. దుండగులు ఒక్కసారిగా బ్యాగును లాక్కొని అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కారులో పరారయ్యారు. సినిమా ఫక్కీలో చోరీ..ఈ దోపిడీ ముఠాలు పక్కా ప్రణాళికతోనే సినిమా ఫక్కీలో దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దొంగలు ముందుగానే కారులో వచ్చి హోటల్ వద్ద మాటు వేస్తున్నారు. బస్సులు ఆగగానే ప్రయాణికులను గమనిస్తూ, నగదు లేదా నగలు ఉన్న బ్యాగులను టార్గెట్ చేస్తున్నారు. తరచూ ఆ హోటల్ వద్ద పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ప్రయాణికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రంగంలోకి మూడు ప్రత్యేక బృందాలువరుస చోరీల నేపథ్యంలో çహోటల్ వద్ద పోలీసులు సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.. తాజాగా జరిగిన దోపిడీపై నార్కట్పల్లి సీఐ సిరికొండ సురేష్, ఎస్ఐ పందిరి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీసీఎస్ సమన్వయంతో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. హోటల్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలు, జిల్లా సరిహద్దుల్లోని నాలుగు టోల్ ప్లాజాల డేటా, మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాపురం చేయాల్సిన భర్త.. వాట్సాప్లోనే!?
పెద్దపల్లి: అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి ఇంటినుంచి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ భజ్జురి రేఖలత సోమవారం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. పెద్దపల్లికి చెందిన రేఖలతకు భీమారం ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్తో వివాహం జరిగింది. కొంతకాలం వరకు దాంపత్యజీవితం సజావుగానే సాగినా.. ఆ తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని భర్త, కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఇకపై సక్రమంగా చూసుకుంటానని భర్త హామీ ఇచ్చాడు. కానీ, ఇంటికి తీసుకెళ్లకుండా వాట్సాప్ సందేశాలు, నోటీసుల ద్వారా వేధింపులకు పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని, భౌతిక దాడులకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆర్థిక ఆధారం లేకుండా పెద్దపల్లిలో అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న రేఖలత.. తన భర్త, ఆయన కుటుంబ సభ్యులు, తోటి కోడలు, బావల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు.
వీడియోలు
రాజీనామా చేసేంత వరకు నిరసన కొనసాగుతుంది..!
హైకోర్టు ఆవరణలో హైడ్రా కమీషనర్ కి నీకి అవమానం!
నోరు తెరిచి మాట్లాడు! పవన్ పై వరుదు కల్యాణి సీరియస్
బుడోడు రీఎంట్రీ.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే
ఆస్పత్రిలో వాంగ్ చుక్.. బయట సీజేపీ నిరసన.. టెన్షన్ టెన్షన్
సీదిరి అప్పలరాజును పరామర్శించారు YSRCP నేతలు
జంగల్ పాలనకు ముగింపు తప్పదు బయటపడ్డ గల్లా మాధవి, జత్వానీ అసలు రంగు
ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇదిగో ఇలా దరఖాస్తు చేసుకోండి
ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల
అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోవద్దు ఇంతకుఇంత అనుభవిస్తారు


