ఎస్ఐని కొట్టిన ఎమ్మెల్యే కుమార్తె.. ఆ రోజు అసలేం జరిగింది?
బెంగళూరు: శ్రీరంగపట్నంలోని ఓ ఆలయంలో ఎస్ఐ-ఎమ్మెల్యే కుమార్తె మధ్య వివాదం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. తుమకూరు రూరల్ ఎమ్మెల్యే సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య.. హారతి ఉక్కడ ఆలయంలో ఎస్ఐ సవితా బి. పాటిల్తో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఐశ్వర్య ఫోన్ కాల్ చేస్తున్నట్లు కూడా వీడియోలో రికార్డయ్యింది.ఇరువురు మధ్య వాగ్వాదం కొనసాగుతుండగా.. ఆమె ఆ పోలీసు అధికారిని చెంపదెబ్బ కొట్టింది. దాంతో ఆ అధికారి తిరిగి ఆమెను కొట్టారు. వారిని శాంతింపజేయడానికి భక్తులు కూడా ప్రయత్నించారు. ఆగస్టు 12న రాత్రి 8.15 గంటలకు భీమ అమావాస్య వేడుకల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశం విషయమై ఈ వివాదం జరిగినట్లు సమాచారం.మండ్య మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ సవితా పాటిల్ ఈ ఘటనపై క్యాతనహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ప్రతి ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఐశ్వర్యను వెంటనే లోపలికి అనుమతించకపోవడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె పోలీసు అధికారిని దూషించి.. చెంపదెబ్బ కొట్టి, విధులకు ఆటంకం కలిగించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే సురేష్ గౌడ.. ఆ పోలీసు అధికారి కూడా తన కుమార్తెను దూషించారన్నారు.ఇదీ చదవండి: బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బుKarnataka: A lady cop was allegedly slapped by a Karnataka MLA’s daughter during a dispute over special darshan at a temple. The cop reportedly slapped her back in response. 😳 pic.twitter.com/3tlqk5HYdm— Ghar Ke Kalesh (@gharkekalesh) August 24, 2026"తన కుమార్తె.. ఆలయ గర్భగుడిని దర్శించుకోవాలని కోరిందని.. అందుకు పోలీసులు తన కుమార్తెను లోపలికి అనుమతించలేదన్నారు. లోపలికి అనుమతించాలని తన కుమార్తె మళ్లీ అభ్యర్థించిందని.. ఆ తర్వాత ఆ పోలీసు అధికారి తన కుమార్తెను దూషించినట్లు తెలుస్తోందన్నారు. ఆ తర్వాత గొడవ ప్రారంభమైంది. నా కుమార్తె ఆ అధికారిని చెంపదెబ్బ కొట్టిన వీడియోను నేను చూడలేదు. నేను క్షమాపణలు కోరుతున్నానని ఎమ్మెల్యే గౌడ అన్నారు.
ఖైదీతో మహిళా ఎస్ఐ అర్దనగ్నంగా వీడియో కాల్..!
బెంగళూరు: మహిళా ఎస్ఐ, జైలులో ఖైదీతో అర్దనగ్నంగా వీడియో కాల్లో మాట్లాడడం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. సోమవారం శాసనసభలో హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడారు. ఈ వీడియో ఏడాది కిందటిదని, ఆమెకు నోటీస్ ఇచ్చి బదిలీ చేశామన్నారు. ఆమె ఇలా చేయడాన్ని సమర్థించడం లేదన్నారు. పోలీసులే ఇలాంటి పనులు చేస్తుంటే ఎలా?, పోలీస్ శాఖకు చెడ్డపేరు తెచ్చారు అని వాపోయారు. ఓ మహిళా ఎస్ఐ.. బెళగావి సెంట్రల్ జైల్లోని ఖైదీతో ప్రేమలో పడింది. అతనికి యూనిఫారంలోనే వాట్సాప్ కాల్ చేసి అర్ధనగ్నంగా కనిపించింది. ఖైదీ ఆ వీడియోను ఇతరులకు పంపడంతో వైరల్ అయ్యింది. ఆ ఎస్ఐ దీనిపై వారం కిందట బెంగళూరు కబ్బన్పార్క్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ బాగోతం వైరల్ అయ్యింది.
ప్రేయసి దూరమైందని అమెరికాలో ఆత్మహత్య..!
హైదరాబాద్: చదువుకునేందుకు అమెరికా వెళ్లిన ఓ యువకుడు ప్రేమించిన యువతి దూరం కావడంతో ఆ బాధ తట్టుకోలేక ఈనెల 21న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపిన మేరకు.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ దమ్మాయిగూడలోని శ్రీనివాస్నగర్ కాలనీకి చెందిన కృష్ణ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు సాయిప్రదీప్(29) 2024లో మాస్టర్స్ చదువు కోసం అమెరికా వెళ్లారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో తన అన్న ప్రణీత్తో కలిసి ఉంటూ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ నుండి మూడు నెలల క్రితం మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న సిద్ధిపేటకు చెందిన యువతిని ప్రదీప్ 9 నెలల పాటు ప్రేమించారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని సాయి ప్రదీప్ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముందు తల్లిదండ్రులు అంగీకరించకపోయినా చివరకు ఒప్పుకున్నారు. ఇంతలోనే ప్రేమించిన యువతి దూరంగా ఉంటోంది. సున్నిత మనస్తత్వం కలిగిన ప్రదీప్ ఇది తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న ప్రేయసికి దాదాపు పది సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. తను చేస్తున్న జాబ్ బాధ్యతలను రెండు గంటల పాటు నిర్వర్తించాలని అన్నకు అప్పగించారు. ఆ తరువాత ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఘటన గురించి తల్లిదండ్రులకు ప్రణీత్ తెలిపారు. ప్రేయసి దూరం కావడంతోనే తమ్ముడు ప్రదీప్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని అమెరికాలో పోలీసులకు ప్రణీత్ ఫిర్యాదు చేశారని మృతుని తండ్రి కృష్ణ తెలిపారు. మృతదేహాన్ని ఈ నెలాఖరులోపు తెప్పించేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇదిఆ ఉండగా ప్రదీప్కు చిన్నతనంలోనే కిడ్నీ సమస్య ఉండటంతో ఒక కిడ్నీని వైద్యులు తొలగించారు. సాయిప్రదీప్ తల్లిదండ్రులను కాంగ్రెస్ పార్టీ దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షుడు రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, బీఆర్ఎస్ నేత హరిగౌడ్ తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు.
షుగర్ రేటు వింటే బీపీ
దేశంలో చక్కెర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. చెరకు పంట నష్టం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశీయంగా ఉత్పత్తి అంచనాలు తగ్గడం, పండుగల సీజన్ నేపథ్యంలో డిమాండ్ భారీగా ఎగబాకడంతో ధరలు దూసుకెళ్తున్నాయి. నెల రోజుల్లోనే 30 % ఎగసిన రిటైల్ రేటు ప్రస్తుతం సగటున కేజీ రూ. 63 స్థాయికి చేరింది. దీంతో సరఫరా పెంచి ధరలను అదుపులో ఉంచేందుకు దశాబ్దకాలం తర్వాత కేంద్రం తొలిసారి దిగుమతులకు తలుపులు తెరిచింది. అక్రమ నిల్వలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది. మరోవైపు చక్కెర కొరతకు ప్రభుత్వ ఇథనాల్ పాలసీ కూడా కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సాక్షి, బిజినెస్ డెస్క్: చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్.. దాదాపు పదేళ్ల తర్వాత దిగుమతుల బాట పట్టింది. సరఫరా తగ్గడంతోపాటు పండుగలు,వివాహాల సీజన్ దగ్గరపడుతుండటంతో చక్కెరకు డిమాండ్ జోరందుకుంది. ఇళ్లలో వినియోగంతోపాటు స్వీట్లు, బేకరీలు, పానీయాలు, ఇతర ఆహార ఉత్పత్తుల తయారీలోనూ చక్కెర అవసరం పెరుగుతోంది. దీంతో రిటైల్గా కిలో చక్కెర ధర జూలై 20న రూ. 48 స్థాయిలో ఉండగా తాజాగా రూ. 63 (దేశవ్యాప్త సగటు)కు చేరింది. అంటే ఒక్క నెలలోనే దాదాపు 30 శాతం పెరిగింది. ఏడాదిలో దాదాపు 35 శాతం జంప్ చేసింది. కొందరు వ్యాపారులు, ఉత్పత్తిదారులు నిల్వలు పెంచుకోవడం కూడా సరఫరాపై ప్రభావం చూపుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలను అదుపులో ఉంచడంతోపాటు మార్కెట్లో సరఫరా కొరతకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు తెరతీసింది. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. మిగులు నుంచి కొరతలోకి... భారత్ సాధారణంగా ఏడాదికి 3.2–3.4 కోట్ల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేస్తుంది. దేశీయంగా వినియోగం 2.8–2.9 కోట్ల టన్నుల వరకు ఉంటుంది. అంటే పంట బాగా పండితే నికరంగా మిగులు ఉంటుంది. ఎగుమతులు, కొంత ఇథనాల్కు మళ్లింపు ద్వారా దీన్ని పరిశ్రమ మేనేజ్ చేస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారింది. పంచదార ఉత్పత్తి అంచనాలు తొలుత 3.43 కోట్ల టన్నులుగా ఉండగా తాజాగా ప్రభుత్వం దాన్ని 3.06 కోట్ల టన్నులకు కుదించింది. దీంతో దేశీ వినియోగం కోసం సరిపడా సరఫరా ఉన్నప్పటికీ అదనంగా అందుబాటులో ఉండే నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. తక్కువ దేశీయ ఉత్పత్తి, పెరిగిన సీజనల్ డిమాండ్తోపాటు అకాల వర్షాలు, పంట తెగుళ్ల కారణంగా చెరకు పంట దెబ్బతినడం, అంతర్జాతీయంగా సరఫరా తగ్గడం వంటి అంశాలు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. నిల్వలపై కేంద్రం నిఘా కొందరు వ్యాపారులు, ఫ్యాక్టరీలు చక్కెరను అవసరానికి మించి నిల్వ చేస్తున్నాయన్న సమాచారం నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా చక్కెర డీలర్లకు 400 టన్నుల నిల్వ పరిమితి విధించింది. దీన్ని 200 టన్నులకు తగ్గించాలని కూడా ఐఎస్ఎంఏ డిమాండ్ చేస్తోంది. బల్క్ వినియోగదారులు (పానియాలు, చాక్లెట్లు, స్వీట్లు–బేకరీ తయారీ తదితర సంస్థలు) 15 రోజుల అవసరానికి మించి నిల్వ చేసుకోకుండా సెప్టెంబర్ 1 నుంచి నియంత్రణలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా నిఘా పెంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చక్కెర ఫాక్టరీల్లో నిల్వల తనిఖీపై దృష్టిపెట్టారు. ముందస్తు క్రషింగ్... చక్కెర దిగుమతులతోపాటు దేశీయ ఉత్పత్తిని త్వరగా మార్కెట్లోకి తీసుకురావడంపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. సాధారణంగా ప్రారంభమయ్యే సమయం కంటే ముందే అక్టోబర్ 15 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభించాలని రాష్ట్రాలు, చక్కెర కర్మాగారాలకు సూచించింది. ముందస్తు క్రషింగ్ వల్ల అక్టోబర్లో చక్కెర ఉత్పత్తి సాధారణంగా ఉండే 3–4 లక్షల టన్నుల నుంచి 10 లక్షల టన్నులకుపైగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతర్జాతీయంగానూ ధరలు పైపైకి దేశీయ ఉత్పత్తి తగ్గడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కూడా చక్కెర సరఫరా తగ్గుముఖం పట్టింది. 2026–27లో ప్రపంచవ్యాప్తంగా 33 లక్షల టన్నుల మేర చక్కెర కొరత ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. కాగా, అంతర్జాతీయంగా చక్కెర ధర జూన్ 30న టన్నుకు 474 డాలర్ల నుంచి ఆగస్టు 20 నాటికి 552 డాలర్లకు పెరిగింది. అంటే రెండు నెలల్లోనే 16 శాతానికిపైగా ఎగసింది. ఈ నేపథ్యంలో భారత్ దిగుమతులకు తెరతీయడం వల్ల దేశీయంగా సరఫరా పెరిగినా.. అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరగడం వల్ల, రూపాయి క్షీణత కారణంగా దిగుమతులు భారంగా మారొచ్చనేది మార్కెట్ వర్గాల మాట. ఇథనాల్కు మళ్లింపు ప్రభావం? చక్కెరను ఇథనాల్ తయారీకి మళ్లించడం వల్లే ప్రస్తుత కొరత ఏర్పడిందన్న విమర్శలు జోరందుకున్నాయి. భారతీయ చక్కెర, బయో ఇందన తయారీదారుల సంఘం (ఐఎస్ఎంఏ) 2025–26 సీజన్ (అక్టోబర్–సెప్టెంబర్)లో నికరంగా చక్కెర ఉత్పత్తి 2.9 కోట్ల టన్నులుగా లెక్కగట్టింది. దీనికి ప్రధానంగా 31 లక్షల టన్నుల చక్కెరకు సమానమైన ఫీడ్స్టాక్ ఇథనాల్ కోసం మళ్లిస్తున్నట్లు వెల్లడించింది. దేశీయంగా చెరకు పంటలో ఇది 10 శాతంగా అంచనా. అయితే దేశీయంగా చక్కెర కొరత లేదని రానున్న రోజుల్లో రిటైల్ ధరలు దిగొస్తాయని ఐఎస్ఎంఏ పేర్కొంది. మరోవైపు కేంద్రం ఇథనాల్పై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తోంది. ఇథనాల్ కోసం చక్కెర (చెరకు రసం, సిరప్, మొలాసిస్) మళ్లింపు వాటా 2022–23లో సుమారు 12 శాతం ఉండగా 2025–26లో అది 9 శాతానికి తగ్గినట్లు చెబుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం దేశంలో తయారయ్యే ఇథనాల్లో దాదాపు మూడొంతుల ఫీడ్స్టాక్ ధాన్యాల నుంచి ముఖ్యంగా మొక్కజొన్న నుంచి వస్తోందని స్పష్టం చేసింది. ప్రస్తుత చక్కెర ధరల పెరుగుదల ఇథనాల్ తయారీ కోసం చక్కెరను మళ్లించడం వల్ల కాదనేది కేంద్రం వాదన. దేశంలో చక్కెర నిల్వలేమీ అడుగంటలేదని.. ఉత్పత్తి తగ్గడంతోపాటు పండుగల ముందు పెరిగిన డిమాండ్తో సాధారణంగా ఉండే అదనపు నిల్వలు తగ్గిపోవడమే ప్రస్తుత సమస్యకు ప్రధాన కారణమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
మోజ్తాబా ఖమేనీ మరో సంచలన వీడియో విడుదల
యూపీఐకి పదేళ్లు.. మీ అనుభవమేంటో చెప్పండి: మోదీ
ఇన్స్టాలో 15 ఏళ్ల బాలుని ప్రేమ.. ఆత్మహత్యాయత్నం
Delhi: రెండో రోజూ భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
పవన్కు ఇవేవీ కనిపించడం లేదా?: భూమన
10వ ఏడాదిలోకి రోహింగ్యా సంక్షోభం.. చేతులెత్తేసిన బంగ్లాదేశ్!
తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ను గుర్తు చేశాడుగా! వీడియో
నేడు ముఖ్య నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం
చిన్న సమస్యతో ఆస్పత్రికి.. చివరికి విషాదం!
మేం సిద్ధం.. మా దాడి మొదలవుతుంది: ఇరాన్
...అలా చేస్తే మనమెవరమూ మిగలం సార్!
ఈ వారం బ్యాంకులకు సెలవులు.. 4 రోజులు బంద్!
పోతే పోనీవోయ్.. పవర్ కంపెనీలు పోతే మన సారు పవరేమన్నా పోతుందా!
రాహుల్ సిప్లిగంజ్ బర్త్ డే.. సతీమణి స్పెషల్ విషెస్
దావూద్ నేర సామ్రాజ్యానికి పునాది.. ఈ మహిళనే!
తండ్రికి మూడు.. కూతురికి మొదటి ర్యాంక్.. ‘లా’లో తండ్రిని మించిన తనయి
తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?
విటమిన్ డి సీక్రెట్ బయటపెట్టిన న్యూరాలజిస్ట్
దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్
'ఇరుముడి'తో జాక్పాట్ కొట్టిన రవితేజ
‘బాహుబలి’తో నిర్మాణం కూల్చివేత షురూ
రవితేజ ఇరుముడి.. రెండు రోజుల్లోనే క్రేజీ రికార్డ్
మూడుగంటల ట్యాక్సీ ప్రయాణం..ప్రేమకథగా ఎలా మారిందంటే..!
ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ
సర్దార్ సర్వాయ్ పాపన్న మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
జనవరి 12 విడుదల.. అనిల్ రావిపూడి బిగ్ ప్లాన్..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
అనవసరంగా జనానికి ‘ఓటుకు నోటు’ గుర్తు చేస్తున్నామేమోననిపిస్తోంది సార్!
IND vs SL: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్
చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్గా
మోజ్తాబా ఖమేనీ మరో సంచలన వీడియో విడుదల
యూపీఐకి పదేళ్లు.. మీ అనుభవమేంటో చెప్పండి: మోదీ
ఇన్స్టాలో 15 ఏళ్ల బాలుని ప్రేమ.. ఆత్మహత్యాయత్నం
Delhi: రెండో రోజూ భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
పవన్కు ఇవేవీ కనిపించడం లేదా?: భూమన
10వ ఏడాదిలోకి రోహింగ్యా సంక్షోభం.. చేతులెత్తేసిన బంగ్లాదేశ్!
తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ను గుర్తు చేశాడుగా! వీడియో
నేడు ముఖ్య నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం
చిన్న సమస్యతో ఆస్పత్రికి.. చివరికి విషాదం!
మేం సిద్ధం.. మా దాడి మొదలవుతుంది: ఇరాన్
...అలా చేస్తే మనమెవరమూ మిగలం సార్!
ఈ వారం బ్యాంకులకు సెలవులు.. 4 రోజులు బంద్!
పోతే పోనీవోయ్.. పవర్ కంపెనీలు పోతే మన సారు పవరేమన్నా పోతుందా!
రాహుల్ సిప్లిగంజ్ బర్త్ డే.. సతీమణి స్పెషల్ విషెస్
దావూద్ నేర సామ్రాజ్యానికి పునాది.. ఈ మహిళనే!
తండ్రికి మూడు.. కూతురికి మొదటి ర్యాంక్.. ‘లా’లో తండ్రిని మించిన తనయి
తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?
విటమిన్ డి సీక్రెట్ బయటపెట్టిన న్యూరాలజిస్ట్
దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్
'ఇరుముడి'తో జాక్పాట్ కొట్టిన రవితేజ
‘బాహుబలి’తో నిర్మాణం కూల్చివేత షురూ
రవితేజ ఇరుముడి.. రెండు రోజుల్లోనే క్రేజీ రికార్డ్
మూడుగంటల ట్యాక్సీ ప్రయాణం..ప్రేమకథగా ఎలా మారిందంటే..!
ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ
సర్దార్ సర్వాయ్ పాపన్న మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
జనవరి 12 విడుదల.. అనిల్ రావిపూడి బిగ్ ప్లాన్..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
అనవసరంగా జనానికి ‘ఓటుకు నోటు’ గుర్తు చేస్తున్నామేమోననిపిస్తోంది సార్!
IND vs SL: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్
చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్గా
ఫొటోలు
అందంలో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ అనఘా మాయా రవి.. (ఫొటోలు)
న్యూజిలాండ్లో టాలీవుడ్ హీరో పెళ్లి సందడి.. (ఫోటోలు)
రవితేజ ‘ఇరుముడి’ సక్సెస్ సెలబ్రేషన్స్.. (ఫొటోలు)
19 ఏళ్ల కేరళ అమ్మాయికి మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఏకంగా 52 మంది బ్యూటీలను..(ఫొటోలు)
'ఇరుముడి'లో విలనిజం.. ఈ నటిని గుర్తుపట్టారా? (ఫొటోలు)
‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ రుక్మిణి వసంత్ (ఫొటోలు)
ఆదిలాబాద్ : ఐటీడీఏ ముట్టడికి భారీగా తరలివచ్చిన ఆదివాసీలు (ఫొటోలు)
ఈ అనుభూతి మాటల్లో చెప్పలేను.. 'దృశ్యం' పాప (ఫొటోలు)
హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)
ఇన్నాళ్లకు మళ్లీ ఒకే వేదికపై..(ఫోటోలు)
సినిమా
తథాస్తు అంటూ ఉండండి!
‘అసలు ఈ నీచ మానవులు మిమ్మల్ని ఎలా చూస్తారో తెలుసా? చీర్ గాళ్స్గా చూస్తారే!’ అంటూ నటుడు ‘వెన్నెల’ కిశోర్ చెప్పే డైలాగ్తో ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్ ఆరంభం అయింది. ‘అల్లరి’ నరేష్ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సురభి హీరోయిన్గా నటించారు. నరేష్ వీకే, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, రచ్చ రవి ఇతర పాత్రలు పోషించారు.అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్ బ్యానర్స్పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ‘రంభ ఊర్వశి మేనక’ మూవీ సెప్టెంబరు 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ని హీరో అక్కినేని నాగార్జున లాంచ్ చేసి, చిత్రయూనిట్కి అభినందనలు తెలిపారు. ‘ముందు నేను ఈ లిస్ట్ చదువుతుంటాను మీరు తథాస్తు తథాస్తు అంటూ ఉండండి’, ‘అంటే మీకు ఇప్పుడు పవర్స్ లేవా?’, ‘నాకు నెలరోజులు కాదు.. జస్ట్ ఫైవ్ డేస్ ఇవ్వు చాలు’ అంటూ ‘అల్లరి’ నరేష్ చెప్పే డైలాగులు ట్రైలర్లో నవ్వులు పంచుతున్నాయి. అదేవిధంగా ‘యమధర్మ రాజులవారికి ప్రణామములు’, ‘మానవా.. ఇది మా తప్పిదం కాదు’(రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్), ‘ఈ అమ్మాయిలు ఏంటి? అసలు ఏం చేస్తున్నావురా నీవు’(సురభి), ‘మీరు మా ఇంద్రలోకం ప్రాపర్టీ.. ఇంత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్న మిమ్మల్ని భూలోకంలో బాయ్స్ వదులుతారా? అసలే వారు కరువు్రపాంత జీవులే’(‘వెన్నెల’ కిశోర్) అంటూ పలికే పలు డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: రాంరెడ్డి.
నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.2,000..? మరి 'టాక్సిక్'కి ఎంతో తెలుసా?
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నయనతార తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తన కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన మొదటి జీతం గురించి వెల్లడించింది. తాజాగా నయనతారను ఆమె తొలి ఉద్యోగం గురించి అడిగారు. దీనికి స్పందించిన నయనతార.. తన మొదటి పని ఓ మ్యాగజైన్ కవర్ షూట్ అని గుర్తుచేసుకుంది. ఓ ఫ్యాషన్ కార్యక్రమం కోసం తనను పిలిచారని తెలిపింది. ఆ సమయంలో తనకు వచ్చిన పారితోషికం కేవలం రూ.2,000 నుంచి రూ.3,000 వరకు మాత్రమే అని నయనతార చెప్పింది. ఆ చిన్న మొత్తంతో ప్రారంభమైన తన కెరీర్.. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగే స్థాయికి చేరుకోవడం విశేషం.నయనతార చాలా కాలంగా సౌత్లో లేడీ సూపర్స్టార్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మోడలింగ్ ద్వారా సినీరంగం దృష్టిని ఆకర్షించిన ఆమె 2003లో ‘మనస్సినక్కరే’ సినిమాతో నటిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యాగజైన్లో నయనతార ఫొటోలు చూసిన దర్శకుడు సత్యన్ ఆమెకు తొలి సినిమా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ‘అయ్యా’, ‘చంద్రముఖి’ చిత్రాలతో తమిళంలో గుర్తింపు తెచ్చుకుంది.రజనీకాంత్తో చేసిన చంద్రముఖి సినిమా నయనతార కెరీర్ను మలుపుతిప్పింది. ఆ తర్వాత తెలుగులో కూడా ఆమె పాపులర్ అయింది. అదే టైమ్లో ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల వైపు ఫోకస్ పెట్టింది. అవి సక్సెస్ కావడంతో తిరుగులేని లేడీ సూపర్స్టార్గా క్రేజ్ సంపాదించుకుంది. వరుస విజయాలతో లేడీ సూపర్స్టార్గా ఎదిగిన నయనతార 2023లో షారుఖ్ హీరోగా నటించిన ‘జవాన్’తో బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది. నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అంటే.. కేవలం రూ.3 వేలతో మొదలైన ఆమె సినీ ప్రయాణం ప్రస్తుతం కోట్ల రూపాయల పారితోషికం అందుకునే స్థాయికి చేరింది. ఇక పాన్ ఇండియా స్టార్ హీరో యశ్తో ఆమె నటించిన టాక్సిక్ సినిమా విడుదలకు సిద్ధమైంది.
అల్లు అర్జున్ రాకా.. మరో భామ రాక..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న మూవీ రాకా. ఈ మూవీకి అట్లీ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మికా మందన్నా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారని సమాచారం. వీటిలో ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఇటీవలే మంచు లక్ష్మీ సైతం రాకా షూటింగ్ సెట్ అద్భుతంగా ఉందంటూ కొనియాడింది.ఈ నేపథ్యంలో రాకాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇప్పటికే ఈ మూవీలో నలుగురు భామలు కనిపించనున్నారు. తాజాగా మరో ముద్దుగుమ్మ ఈ భారీ ప్రాజెక్ట్లో భాగం కానుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మీ సైతం నటించనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. లేడీ విలన్ పాత్ర పోషించనుందని లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. దీనిపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.ప్రస్తుతం ముంబయిలో వేసిన ఓ భారీ సెట్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ను హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో సెట్ను రెడీ చేయిస్తున్నారని సమాచారం. ఈ సెట్ వర్క్ పూర్తయ్యాక అక్కడ చిత్రీకరణ ఆరంభిస్తారని సమాచారం. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు, జిమ్ సర్భ్, ఫెమినా జార్జ్, నైలా గ్రేవాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నారు.
ఇరుముడిలో బేబీ నక్షత్ర.. ఇంత కన్నీటి కథ ఉందా?
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సలబ్రేషన్స్ చేసుకుంది. హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్కు ఇరుముడి టీమ్ అంతా హాజరైంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఈ మూవీలో అందరినీ ఆకట్టుకున్న బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ శివ నిర్వాణ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. తండ్రి లేరనే విషయం తెలిసి చాలా బాధగా అనిపించిందని శివ నిర్వాణ వెల్లడించారు. తండ్రి లేని లోటును ఎదుర్కొంటూనే.. ఇంత చిన్న వయసులో ఆమె చూపిస్తున్న ధైర్యానికి నిజంగా అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా బేబీ నక్షత్ర తల్లిని స్టేజ్పైకి తీసుకొచ్చి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా తన కూతురిని సపోర్ట్ చేసిన దర్శకుడు శివ నిర్వాణకు నక్షత్ర తల్లి ధన్యవాదాలు తెలిపారు.
క్రీడలు
అనిరుద్–బాలాజీ జోడీకి ఏటీపీ చాలెంజర్ టైటిల్
న్యూఢిల్లీ: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్ టూర్ డబుల్స్ టైటిల్ సాధించాడు. భారత్కే చెందిన డేవిస్కప్ జట్టు సభ్యుడు శ్రీరామ్ బాలాజీతో జతకట్టిన అనిరుధ్ మెక్సికోలో జరిగిన క్యాన్కన్ కంట్రీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో విజేతగా నిలిచాడు. 84 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ తుది పోరులో అనిరు«ద్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 6–3, 7–6 (7/4)తో లియుటారెవిచ్ (బెలారస్)–వరేలా (మెక్సికో) జంటపై నెగ్గింది. అనిరు«ద్–బాలాజీ జంటకు 9,900 డాలర్ల (రూ. 9 లక్షల 48 వేలు) ప్రైజ్మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది అనిరుధ్ జపాన్ ప్లేయర్ టకెరు యుజికితో కలిసి బుసాన్ ఓపెన్ టోర్నీలో టైటిల్ సాధించాడు. తాజా టైటిల్తో ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో అనిరుధ్ 6 స్థానాలు ఎగబాకి 86వ ర్యాంక్కు చేరుకున్నాడు.
ఆధిక్యంలో ప్రజ్ఞానంద
సెయింట్ లూయిస్ (అమెరికా): గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ టోర్నీ తొలి సెమీఫైనల్లో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద ఆధిక్యంలోకి వెళ్లాడు. విన్సెంట్ కీమెర్ (జర్మనీ)తో జరుగుతున్న సెమీఫైనల్లో రెండు క్లాసికల్ గేమ్లు ముగిశాక ప్రజ్ఞానంద 9–3తో ఆధిక్యంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య తొలి గేమ్ 80 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. రెండో గేమ్లో ప్రజ్ఞానంద 55 ఎత్తుల్లో కీమెర్ను ఓడించాడు. ప్రజ్ఞానంద, కీమెర్ల మధ్య ర్యాపిడ్ ఫార్మాట్లో రెండు గేమ్లు, బ్లిట్జ్ ఫార్మాట్లో నాలుగు గేమ్లు జరగాల్సి ఉన్నాయి. మూడు ఫార్మాట్ల గేమ్లు ముగిశాక అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్ ఫైనల్ చేరుకుంటాడు. టోర్నీ నిబంధనల ప్రకారం క్లాసికల్ గేమ్లో గెలిస్తే 6 పాయింట్లు... ‘డ్రా’ చేసుకుంటే 3 పాయింట్లు లభిస్తాయి. క్లాసికల్ రెండు గేమ్లు ‘డ్రా’గా ముగిస్తే బ్లిట్జ్ బోనస్ గేమ్ను నిర్వహిస్తారు. ఇందులో నెగ్గిన ప్లేయర్కు 2 పాయింట్లు దక్కు తాయి. ర్యాపిడ్ గేమ్లో గెలిస్తే 4 పాయింట్లు.... ‘డ్రా’ చేసుకుంటే 2 పాయింట్లు... బ్లిట్జ్ గేమ్లో గెలిస్తే 2 పాయింట్లు... ‘డ్రా’ చేసుకుంటే 1 పాయింట్ లభిస్తాయి. వెస్లీ సో– కరువానా (అమెరికా) మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్లో క్లాసికల్ గేమ్లు ముగిశాక కరువానా 8–6తో ముందంజలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య క్లాసికల్ గేమ్లు ‘డ్రా’ కాగా ... బ్లిట్జ్ బోనస్ గేమ్లో కరువానా 33 ఎత్తుల్లో వెస్లీ సోపై గెలిచి 8–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు.
జురేల్ జిగేల్...
కొలంబో: శ్రీలంకతో సిరీస్కు ముందు వరుసగా విఫలమవుతూ ఒత్తిడిని ఎదుర్కొన్న ధ్రువ్ జురేల్ ఇప్పుడు ఆరో స్థానంలో బ్యాటర్గా తన సమర్థతను చూపించాడు. తొలి టెస్టులో అర్ధ సెంచరీతో రాణించిన అతను ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ శతకంతో కదం తొక్కాడు. అతనికి రిషభ్ పంత్ మెరుపులు తోడవడంతో భారీ స్కోరు నమోదు చేసిన భారత్... 11 బంతుల వ్యవధిలో 2 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ కొట్టింది. రెండో రోజు వెలుతురులేమితో ఆట నిలిపివేసే సమయానికి శ్రీలంక 3 ఓవర్లలో 2 వికెట్లకు 8 పరుగులు చేసింది. మ్యాచ్కు రెండో రోజు వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతో మొత్తం 56 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 300/5తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 138 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ధ్రువ్ జురేల్ (177 బంతుల్లో 115 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్లు) కెరీర్లో రెండో టెస్టు సెంచరీ సాధించగా, రిషభ్ పంత్ (89 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరు ఏడో వికెట్కు 112 పరుగులు జోడించారు. లంక పేసర్ అసిత ఫెర్నాండోకు 4 వికెట్లు దక్కాయి. పంత్ హాఫ్ సెంచరీ... సోమవారం ఆట మొదలయ్యాక రెండో ఓవర్లోనే సారాంశ్ జైన్ (6) వెనుదిరిగాడు. ముందు రోజు మణికట్టు గాయంతో రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగిన పంత్ మళ్లీ బరిలోకి దిగి జురేల్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చక్కటి సమన్వయంతో ఆడుతూ పరుగులు రాబట్టిన వీరిద్దరిని నిలువరించడంలో లంక బౌలర్లు విఫలమయ్యారు. ఈ క్రమంలో తనదైన శైలిలో దూకుడుగా ఆడిన పంత్ ముందుగా 81 బంతుల్లో, తర్వాతి ఓవర్లో జురేల్ 97 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్ను అందుకున్నారు. అయితే లంచ్ తర్వాత తొలి బంతికే పంత్ అవుట్ కాగా, మానవ్ సుతార్ (18) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో జాగ్రత్తగా ఆడుతూ జురేల్ ఇన్నింగ్స్ను నడిపించాడు. వానతో సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఆట మళ్లీ మొదలయ్యాక ఫెర్నాండో బౌలింగ్లో మిడాఫ్ దిశగా సింగిల్ తీయడంతో 171 బంతుల్లో జురేల్ శతకం పూర్తయింది. మరో ఎండ్లో సిరాజ్ (3) అవుట్ కాగా, స్కోరు 500 దాటిన తర్వాత భారత్ డిక్లేర్ చేసింది.వెలుతురుపై వివాదంతో... శ్రీలంక ఇన్నింగ్స్ మొదలైన రెండు బంతులకే వర్షం వచ్చింది. అయితే దాదాపు అరగంట తర్వాత మళ్లీ ఆట మొదలు కాగా, ప్రసిధ్ కృష్ణ తన రెండో బంతికే ఉడారా (1)ను వెనక్కి పంపించాడు. వెలుతురు తగ్గడంతో లైట్ మీటర్తో పరీక్షించిన అంపైర్లు పేసర్లు బౌలింగ్ వేయరాదని, స్పిన్తో కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఆటను నిలిపివేయాలంటూ లంక బ్యాటర్లు పదే పదే అంపైర్లతో వాదించినా వారు పట్టించుకోలేదు. సుతార్ తన తొలి ఓవర్ చివరి బంతికి ప్రభాత్ జయసూర్య (2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లంక బ్యాటర్ రివ్యూ చేసినా లాభం లేకపోగా, డ్రెస్సింగ్ రూమ్లో అతను తన ఆగ్రహాన్ని ప్రదర్శించడం కనిపించింది. వెలుతురు తగ్గిన స్థితిలో సుతార్ వేసిన ఈ బంతి సిరీస్లో స్పిన్నర్లు వేసిన 1958 బంతుల్లో అన్నింటికంటే వేగవంతమైంది (98.85 కిమీ./గం.) కావడం విశేషం!స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఫెర్నాండో 45; రాహుల్ (సి) డిక్వెలా (బి) కుమార 18; పడిక్కల్ (బి) నువాంతా 117; గిల్ (సి) డిక్వెలా (బి) ఫెర్నాండో 50; పంత్ (సి) ఉడారా (బి) నువాంతా 63; జడేజా (బి) ఫెర్నాండో 43; జురేల్ (నాటౌట్) 115; సారాంశ్ (సి) మిషారా (బి) ఫెర్నాండో 6; సుతార్ (సి) డిక్వెలా (బి) జయసూర్య 18; సిరాజ్ (ఎల్బీ) (బి) జయసూర్య 3; ప్రసిధ్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 21; మొత్తం (138 ఓవర్లలో 9 వికెట్లకు డిక్లేర్డ్) 503. వికెట్ల పతనం: 1–37, 2–66, 3–207, 4–281, 5–296, 6–307, 7–419, 8–458, 9–489. బౌలింగ్: అసిత ఫెర్నాండో 29–5–106–4, లాహిరు కుమార 20–4–68–1, ప్రభాత్ 42–7–132–2, నువాంతా 38–3–154–2, దినూషా 3–0–8–0, ధనంజయ 2–0–8–0, మిషారా 4–0–16–0. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: ఉడారా (సి) జైస్వాల్ (బి) ప్రసిధ్ 1; మిషారా (బ్యాటింగ్) 5; జయసూర్య (ఎల్బీ) (బి) సుతార్ 2; ఎక్స్ట్రాలు 0; మొత్తం (3 ఓవర్లలో 2 వికెట్లకు) 8. వికెట్ల పతనం: 1–1, 2–8. బౌలింగ్: సిరాజ్ 1–0–1–0, ప్రసిధ్ 1–0–1–1, సుతార్ 1–0–6–1.జైస్వాల్, ఫెర్నాండోలపై చర్యటెస్టు మ్యాచ్ తొలి రోజు గొడవకు దిగిన భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్, లంక పేసర్ అసిత ఫెర్నాండోలపై ఐసీసీ చర్య తీసుకుంది. జైస్వాల్ను అవుట్ చేసిన ఫెర్నాండో ఏదో అనడంలో జైస్వాల్ తగ్గకుండా వెనక్కి వచ్చి అతనిపైకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో జైస్వాల్ హెల్మెట్ ఫెర్నాండో తలను తాకింది. ఈ ఘటనను లెవల్ 1 తప్పిదంగా గుర్తించిన ఐసీసీ... ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతాన్ని జరిమానాగా విధించింది. దీంతో పాటు ఇద్దరు ఆటగాళ్ల ఖాతాలో ఒక్కో డీమెరిట్ పాయింట్ కూడా చేరింది.
‘దమ్ముంటే సెంచరీ చెయ్యు’.. లంక ప్లేయర్కు జురెల్ స్ట్రోక్!
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. 99 నుంచి 100 పరుగుల మార్క్ అందుకోవడానికి 22 బంతులాడినప్పటికీ, మరిచిపోలేని అనుభూతిని పొందాడు. సెంచరీ సెలబ్రేషన్లో కండల ప్రదర్శన చేయడంపై వివరణ ఇచ్చిన ధ్రువ్ జురెల్ మరో ఆసక్తికర విషయాన్ని కూడా పంచుకున్నాడు. తాను సెంచరీ చేయడం వెనుక లంక ఆటగాడు నిరోషన్ డిక్వెల్లా కూడా ఒక కారణమని జురెల్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో జురెల్ మాట్లాడుతూ.. ‘‘నేను క్రీజులోకి వచ్చిన వెంటనే డిక్వెల్లా నీకు దమ్ముంటే ఇక్కడ సెంచరీ చేసి చూపించు. కానీ నువ్వు అది చేయలేవు అని సవాల్ విసిరాడు. కానీ ఆ క్షణంలో నేనేమీ మాట్లాడలేదు. నోటితో కాకుండా బ్యాట్తో సమాధానం చెప్పాలని అనుకున్నా. నేను అనుకున్నట్లుగానే ఓపికను ప్రదర్శించి అద్భుత సెంచరీతో అజేయంగా నిలిచాను. ఆ తర్వాత డిక్వెల్లా దగ్గరకు వెళ్లి నువ్వు అడిగింది నేను చేసి చూపించాను.. ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగాను. కానీ అతడి నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు.’’ అని చెప్పుకొచ్చాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. ప్రస్తుతం లంక జట్టు మరో 495 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, జురెల్ శతకాలతో చెలరేగగా, గిల్, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు.This DJ’s got some crazy drops! 🎧💯Second Test ton for Dhruv Jurel, with a little late drama for good measure! 😮💨 Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/EPPFd2doQS— Sony Sports Network (@SonySportsNetwk) August 24, 2026Read: సెంచరీ సెలబ్రేషన్.. కండల ప్రదర్శనపై జురెల్ స్పందన!
న్యూస్ పాడ్కాస్ట్
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు చెబుతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
జరిమానా లెక్క తేల్చాల్సిందే... రామోజీకి, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్ చిట్ ఇవ్వలేదు.... తేల్చిచెప్పిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
మోసాలపై చర్చ మొదలైంది!. హామీల ‘వెన్నుపోటు’పై రెండేళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ జగన్ వ్యాఖ్య
మళ్లీ మాయోపాయం!. రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
టీచర్లపై ఇంతలా కక్షగడతారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరిద్దాం... ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
బిజినెస్
ట్రంప్ సర్కార్ కొత్త ప్లాన్.. భారతీయులకు భారీ షాక్?
అమెరికాలో ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్లే భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా H-1B వీసా, F-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్లపై భారీ ఫీజులు విధించే ప్రతిపాదనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నిబంధన ప్రకారం.. H-1B వీసా ఫీజు ఏకంగా 1,03,265 డాలర్లకు (దాదాపు రూ.98.91 లక్షలు) పెరిగే అవకాశం ఉంది. గతంలో 1 లక్ష డాలర్ల ఫీజును ప్రతిపాదించినప్పటికీ, ఆ నిర్ణయంపై కోర్టులో వివాదం కొనసాగుతోంది.భారతీయులపై ప్రభావంఈ ప్రతిపాదనలు భారతీయులకు చాలా కీలకం. ఎందుకంటే.. అమెరికా H-1B వీసా లబ్ధిదారుల్లో 70 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు. 2024లో అమెరికా USCIS సుమారు 3,99,402 H-1B పిటిషన్లను ఆమోదించగా, అందులో ఇండియాలో జన్మించిన వారికి సంబంధించిన లబ్ధిదారుల వాటా దాదాపు 71 శాతంగా ఉంది. అందువల్ల H-1B ఫీజు భారీగా పెరిగితే అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయ నిపుణులు, వారిని స్పాన్సర్ చేసే కంపెనీలపై ఆర్థిక భారం గణనీయంగా పెరగవచ్చు.OPTపై కూడా భారీ ఫీజు?H-1Bతో పాటు F-1 విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉద్యోగ అనుభవం పొందేందుకు ఉపయోగించే ఓపీటీ కార్యక్రమంపైనా కొత్త ఫీజు విధించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ ఫీజు సుమారు 1 లక్ష డాలర్ల వరకు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే అసలు ఫీజు ఎంత, ఎవరికి వర్తిస్తుంది వంటి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం వైట్హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలన దశలో ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ సంస్థలు చెబుతున్నాయి.H-1B ఉద్యోగులకు కొత్త రూల్కొత్త ఫీజులతో పాటు H-1B ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగించే ప్రతిపాదనను కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తీసుకొచ్చింది. ప్రస్తుతం H-1B ఉద్యోగం కోల్పోయినవారు కొన్ని పరిస్థితుల్లో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నిబంధన తొలగిస్తే.. ఉద్యోగం ముగిసిన వెంటనే కొత్త మార్గం చూసుకోవాల్సి రావచ్చు. లేదంటే అమెరికాలో ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ఉల్లంఘనకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగులపై మాత్రమే కాకుండా వారి డిపెండెంట్లపైనా దీని ప్రభావం పడే అవకాశం ఉంది.అయితే..ఈ నిబంధనలన్నీ ఇప్పటికీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా అమలు చేసే వరకు ఫీజులు లేదా నిబంధనలు ఖరారైనట్లుగా చెప్పలేం. అయినప్పటికీ H-1Bపై ఆధారపడుతున్న భారతీయ టెక్ నిపుణులు, అమెరికాలో చదువుతున్న విద్యార్థులు, వారిని నియమించుకునే కంపెనీల్లో ఈ ప్రతిపాదనలు తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికాలో భారతీయ మూలాలున్న వారి సంఖ్య 52 లక్షలకు పైగా ఉండటంతో, ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వచ్చే మార్పులు భారతీయులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బిట్కాయిన్.. కారణాలివే!
ఐదు నెలల గరిష్ఠానికి బంగారం ధర!
అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్స్, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత వల్ల డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర మరో రూ. 900 పెరిగి రూ. 1,64,400కి చేరింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి.చివరిసారిగా మార్చి 9న పుత్తడి రేటు రూ. 1,64,300 పలికింది. అటు వెండికూడా వరుసగా మూడో సెషన్లోనూ పెరిగింది. కేజీకి రూ. 3,500 పెరిగి రూ. 2,53,500కి చేరింది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 42.45 డాలర్లు (1 శాతం) పెరిగి 4,646.54 డాలర్లు పలికినట్లు కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ (కమోడిటీ రీసెర్చ్) కైనాత్ చైన్వాలా తెలిపారు.వెండి ధర ఫ్లాట్గా 69 డాలర్ల వద్ద ట్రేడయినట్లు పేర్కొన్నారు. బంగారం కీలకమైన 4,650 డాలర్ల చేరువకు వచ్చిన నేపథ్యంలో తదుపరి కదలికలు భౌగోళిక-రాజకీయ పరిస్థితుల కన్నా ద్రవ్యోల్బణంపైనే ఆధారపడి ఉంటాయని వివరించారు.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బిట్కాయిన్.. కారణాలివే!
దూసుకెళ్తున్న బిట్కాయిన్.. కారణాలివే!
క్రిప్టో మార్కెట్లో బిట్కాయిన్ మరోసారి దూకుడు పెంచింది. సోమవారం బిట్కాయిన్ ధర సుమారు 2 శాతం పెరిగి 80,000 డాలర్లకు చేరువలో ట్రేడైంది. మే తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. బిట్కాయిన్తో పాటు ఈథర్ కూడా దాదాపు 2 శాతం లాభపడి 2,500 డాలర్లకు చేరుకుంది. దీంతో క్రిప్టోకు సంబంధించిన కంపెనీల షేర్లు కూడా లాభాల్లో ట్రేడయ్యాయి.మూడు రోజుల్లో 20 శాతానికి..గత కొంతకాలంగా బిట్కాయిన్ ధర పరిమిత శ్రేణిలోనే కదులుతోంది. అయితే.. ఇటీవల మూడు రోజుల్లోనే 20 శాతానికి పైగా పెరగడంతో మార్కెట్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. బిట్కాయిన్లో భారీగా షార్ట్ పొజిషన్లు తీసుకున్న ట్రేడర్ల స్థానాలు మూసివేయబడటం కూడా.. ఈ ర్యాలీకి మరింత బలం ఇచ్చింది. మొత్తం 4 బిలియన్ డాలర్లకు పైగా బేరిష్ క్రిప్టో పొజిషన్లు లిక్విడేట్ అయినట్లు సమాచారం.ETFల్లోకి భారీగా పెట్టుబడులుబిట్కాయిన్ ర్యాలీకి మరో ముఖ్యమైన కారణం.. పెట్టుబడిదారుల నుంచి పెరిగిన డిమాండ్. గత వారం స్పాట్ బిట్కాయిన్ ETFల్లోకి సుమారు 1.92 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. గత అక్టోబర్ తర్వాత ఒక వారంలో వచ్చిన అత్యధిక పెట్టుబడులు ఇవే. దీంతో పెద్ద ఇన్వెస్టర్లు మళ్లీ క్రిప్టోపై ఆసక్తి చూపుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఆర్థిక ఆందోళనలు కూడా కారణమేఅమెరికా ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ఆర్థిక లోటు, పెరుగుతున్న రుణభారం వంటి అంశాలు కూడా బిట్కాయిన్కు అనుకూలంగా మారుతున్నాయి. అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లను పెంచనున్నట్లు ప్రకటించడంతో బాండ్ ఈల్డ్స్ కొంత తగ్గాయి. దీంతో బిట్కాయిన్, బంగారం వంటి ప్రత్యామ్నాయ ఆస్తులపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది.ర్యాలీ కొనసాగుతుందా?బిట్కాయిన్ ప్రస్తుత ర్యాలీ నిజంగా కొత్త అప్ట్రెండ్కు సంకేతమా, లేక తాత్కాలిక పెరుగుదల మాత్రమేనా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. 2023 జనవరిలో కూడా బిట్కాయిన్ మూడు రోజుల్లో సుమారు 20 శాతం పెరిగింది. అయితే ఆ సమయంలో ర్యాలీ ఎక్కువ కాలం కొనసాగలేదు. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి వస్తుందా అనే విషయంలో మార్కెట్ నిపుణులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.రే డాలియో కీలక వ్యాఖ్యలుప్రముఖ పెట్టుబడిదారుడు రే డాలియో ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు రాబోయే సంవత్సరాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ పోర్ట్ఫోలియోలో కొంత మొత్తాన్ని బిట్కాయిన్లో ఉంచుకోవచ్చని ఆయన సూచించారు. దీంతో బిట్కాయిన్ భవిష్యత్తుపై చర్చ మరింత వేడెక్కింది. మొత్తం మీద.. ETF పెట్టుబడులు, షార్ట్ స్క్వీజ్, ఆర్థిక ఆందోళనలు కలిసి బిట్కాయిన్ ర్యాలీకి ప్రస్తుతం మద్దతుగా నిలుస్తున్నాయి.ఇదీ చదవండి: ద్రవ్యోల్బణం ముప్పు తప్పదా?.. పీటర్ షిఫ్ సంచలన వ్యాఖ్యలు
కొత్త లుక్తో 2026 పల్సర్ బైక్స్ లాంచ్: ధరలు, ఫీచర్లు ఇవే..
బజాజ్ ఆటో భారతదేశంలో 2026 పల్సర్ 125, పల్సర్ 150 మోటార్సైకిల్స్ లాంచ్ చేసింది. ఈ రెండు బైక్లు అప్డేటెడ్ డిజైన్, వెడల్పైన ఫ్యూయల్ ట్యాంకులతో వస్తున్నాయి.2001లో తొలిసారిగా లాంచ్ అయినప్పటి నుంచి పల్సర్ సిరీస్ భారతీయ రైడర్లకు అత్యంత ఇష్టమైన బైకులలో ఒకటిగా నిలిచింది. సంవత్సరాలు గడిచేకొద్దీ.. ఈ శ్రేణిలో ఫుల్లీ ఫెయిర్డ్ అండ్ నేకెడ్ స్ట్రీట్ బైక్లు కూడా చేరాయి. బజాజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా పల్సర్ మోటార్సైకిళ్లను విక్రయించి, దేశంలో అత్యంత విశ్వసనీయమైన మోటార్సైకిల్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది.2026 బజాజ్ పల్సర్ 125 & పల్సర్ 1502026 పల్సర్ 125 రెండు కాస్మెటిక్ వేరియంట్లలో, విభిన్న సీటింగ్ ఆప్షన్లతో వస్తుంది. ప్రీమియం కార్బన్ ఫైబర్ స్ప్లిట్ సీట్ వేరియంట్ ధర రూ. 94,518, కాగా సింగిల్ సీట్ ఆప్షన్ ధర రూ. 92,341. ఈ మోటార్సైకిల్ బ్లాక్ గోల్డ్, బ్లాక్ సియాన్ బ్లూ, బ్లాక్ డార్క్ గ్రే, బ్లాక్ రేస్ రెడ్, మరియు రేసింగ్ రెడ్ టాన్ బీజ్ రంగులలో లభిస్తుంది. కేవలం సింగిల్ సీట్లో మాత్రమే వచ్చే ఎంట్రీ-లెవల్ నియాన్ ట్రిమ్ ధర రూ. 90,494 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). బ్లాక్ గోల్డ్ షేడ్ మినహా, ఇది కార్బన్ ఫైబర్ మోడల్ మాదిరిగానే అదే రంగులను కలిగి ఉంటుంది.ఇక 2026 పల్సర్ 150 విషయానికి వస్తే.. ఇది బ్రేకింగ్ కాన్ఫిగరేషన్ల ఆధారంగా మూడు వేరియంట్లలో వస్తుంది. సింగిల్ డిస్క్ (SD) వేరియంట్ ధర రూ. 1.11 లక్షలు, సింగిల్ డిస్క్ అప్గ్రేడ్ ధర రూ. 1.14 లక్షలు, ట్విన్ డిస్క్ అప్గ్రేడ్ ధర రూ. 1.17 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). అన్ని మోడళ్లు బ్లాక్ గోల్డ్, ఎబోనీ బ్లాక్ చెర్రీ రెడ్, ఎబోనీ బ్లాక్ ఇంక్ బ్లూ అనే నాలుగు రంగులలో లభిస్తాయి.2026 బజాజ్ పల్సర్ 125 విశేషాలు2026 పల్సర్ 125 కొత్త 124.38 సీసీ ఇంజన్ను పొందుతుంది, ఇది ఇప్పుడు 11.93 bhp పవర్ అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తుంది. 5-అంగుళాల TFT స్క్రీన్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, పూర్తి ఎల్ఈడీ లైటింగ్, హజార్డ్ లైట్లు, USB-టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లతో సహా అనేక కొత్త ఫీచర్లతో వస్తుంది.మంచి రైడింగ్ కోసం.. ఈ మోటార్సైకిల్కు క్లిప్ ఆన్ హ్యాండిల్బార్లు, వెనుక భాగంలో గ్యాస్ ఛార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్ కూడా లభిస్తాయి. దీనిలోని ప్రత్యేక ఫీచర్లలో ఒకటి 'క్రావల్ టెక్', ఇది ఈ సెగ్మెంట్లో మొదటిది. ఇది రైడర్లు థ్రాటిల్ను తాకకుండానే బైక్ను నెమ్మదిగా కదిలించడానికి అనుమతిస్తుంది, ఇది రద్దీగా ఉండే ట్రాఫిక్లో లేదా ఇరుకైన ప్రదేశాలలో ఉపయోగపడుతుంది.2026 బజాజ్ పల్సర్ 150 విశేషాలు2026 పల్సర్ 150, దాని మునుపటి మోడల్లో ఉన్న అదే 149.5 సీసీ ఇంజన్ ద్వారా 13.8 bhp పవర్ అందిస్తుంది. అయితే.. ఇప్పుడు ఇది మల్టిపుల్ రైడ్ మోడ్లు, క్లిప్-ఆన్ హ్యాండిల్బార్లు మరియు మరింత స్పోర్టీ లుక్ కోసం బెల్లీ పాన్ వంటి అనేక కొత్త అదనపు ఫీచర్లతో వస్తుంది.కొత్త పల్సర్ 125 మాదిరిగానే, 150లో కూడా 5-అంగుళాల TFT డిస్ప్లే, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, పూర్తి ఎల్ఈడీ లైటింగ్, హజార్డ్ లైట్లు, USB-టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ మరియు గ్యాస్ ఛార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. కొత్త క్రావల్ టెక్ ఫీచర్ కూడా ఉంది.
ఫ్యామిలీ
బ్రహ్మపుత్రను ‘రెడ్ రివర్’ అని ఎందుకు అంటారో తెలుసా?
భారత దేశంలో ఎన్నో రివర్స్ ఉన్నాయి. అందులో కొన్ని నదులు ఒక ప్రాంత చరిత్ర, సంస్కృతి, ప్రకృతితో స్ట్రాంగ్ కనెక్షన్ కలిగి ఉంటాయి. అలాంటి గొప్ప నదుల్లో బ్రహ్మపుత్ర కూడా ఒకటి. బ్రహ్మపుత్ర నదిని కొన్ని సందర్భాల్లో రెడ్ రివర్ అని కూడా అంటారు.బ్రహ్మపుత్ర నది జర్నీ టిబెట్లో ప్రారంభం అవుతుంది. టిబెట్లో దీనిని యార్లాంగ్ సాంగ్పో అని పిలుస్తారు. హిమాలయాలను దాటుకుంటూ భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాక, దీనిని బ్రహ్మపుత్ర నది అని పిలుస్తారు. అక్కడి నుంచి అస్సాం మీదుగా ప్రయాణించి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది.అస్సాంకి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చిన నేచురల్ ఫోర్స్గా బ్రహ్మపుత్ర నదిని కీర్తిస్తారు. నది చుట్టూ కనిపించే పచ్చని అడవులు, ద్వీపాలు, వెట్ల్యాండ్స్, హిమాలయన్ పాద ప్రాంతాలు కలిసి ఒక అద్భుతమైన సీనరీని క్రియేట్ చేస్తాయి.రెడ్ రివర్ అని ఎందుకు అంటారు?ఇక రెడ్ రివర్ అనే పేరు విషయానికి వస్తే, నది నీటిలో కనిపించే ఎరుపు రంగే దీనికి కారణం. హిమాలయాల నుంచి భారీ స్థాయిలో వచ్చే సెడిమెంట్స్, మట్టి, ఖనిజాలు నదిలో కలుస్తాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఈ నదీ నీరు ఎర్రగా లేదా మట్టిగా కనిపిస్తుంది.బ్రహ్మపుత్ర అస్సాంకి కేవలం ఒక నది మాత్రమే కాదు. స్థానిక ప్రజల జీవితం కూడా. వ్యవసాయం, చేపలు పట్టడంలో ప్రజలకు ఉపయోగపడటంతో పాటు ఇక్కడి కల్చర్తో కూడా ఈ నదికి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. నదీ లోయలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రజల జీవితం కూడా ఈ నదితో పాటు కొన్ని శతాబ్దాలుగా సాగుతోంది.బ్రహ్మపుత్ర నదీ జర్నీలో మజూలీ అనే ప్రముఖ నది ద్వీపం కూడా ఒక స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తుంది. నది మధ్యలో ఉన్న ఈ ద్వీపం అస్సాం కల్చర్, ట్రెడిషన్స్, నేచురల్ బ్యూటీకి ప్రతీకగా నిలుస్తుంది.హిమాలయాల నుంచి ప్రారంభమై, అస్సాం మైదానాల మీదుగా ప్రవహిస్తూ బంగ్లాదేశ్ వరకు ప్రయాణించే బ్రహ్మపుత్ర నది జర్నీ నిజంగా అద్భుతంగా ఉంటుంది. అందుకే రెడ్ రివర్ అనే పేరుతో భారతీయ భౌగోళిక అద్భుతాల్లో దీనికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు.ఇవి చదవండి: ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న 5 అద్భుత ప్రదేశాలు!
ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న 5 అద్భుత ప్రదేశాలు!
ఒక చోట చెట్ల వేర్లు వంతెనలుగా మారుతాయి. మరొక చోటు నీటిపై తేలుతున్న ద్వీపాలు కనిపిస్తాయి. ఇంకొక చోటు పూలతో నిండిన లోయలు, ఆకాశాన్ని తాకిన సరస్సులు, వర్షం వచ్చినప్పుడు రంగులు మార్చుకునే మైదానాలు, లోయలు కనిపిస్తాయి. ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఉంటాయి.ఈ ఐదు ప్రదేశాలు అలాంటి ప్రకృతి అద్భుతాలే. మేఘాలయలోని సజీవ వేర్ల వంతెనల నుంచి మహారాష్ట్రలోని కాస్ పీఠభూమి వరకు ప్రతి ప్రదేశంలో ప్రకృతి మనకు కొత్త రూపంలో కనిపిస్తుంది.త్సో మోరీరి సరస్సులడఖ్ అంటే చాలా మందికి ప్యాంగాంగ్ గుర్తొస్తుంది. కానీ చాంగ్థాంగ్లో ఉన్న త్సో మోరీరి ఒక ప్రశాంతమైన అనుభవాన్ని ఇస్తుంది. సుమారు 4,500 మీటర్ల ఎత్తులో, చుట్టూ కొండల మధ్య నీలం రంగులో విస్తరించిన ఈ సరస్సు ఒక పెద్ద ప్రకృతి చిత్రంలా కనిపిస్తుంది.లేహ్ నుంచి త్సో మోరీరి వైపు ప్రయాణం చేస్తుంటే భూదృశ్యం పూర్తిగా మారిపోతుంది. రాళ్లు, గడ్డి మైదానాలు, దూరంగా కనిపించే హిమ శిఖరాల మధ్య చివరికి సరస్సు కనిపించిన క్షణం మర్చిపోలేని దృశ్యంగా మిగిలిపోతుంది. కోర్జోక్ గ్రామం, కోర్జోక్ మఠం, సరస్సు చుట్టూ తిరిగే వలస పక్షులు ఈ ప్రదేశంలో ప్రత్యేక జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చాంగ్పా సంచార జీవన విధానాన్ని కూడా చూసే అవకాశం లభిస్తుంది.నీళ్లపై తేలే జీవితంమణిపూర్లోని లోక్టక్ సరస్సును మొదటిసారి చూసినప్పుడు అది ఒక పెద్ద సినిమాటిక్ సీన్లా, ఒక కొత్త సముద్రంలా అనిపించవచ్చు. కానీ దగ్గరగా చూస్తే ఆ నీళ్లపై చిన్న చిన్న తేలియాడే ద్వీపాలు కనిపిస్తాయి. వీటిని ఫుమ్డీలు అంటారు. వాటిపై ఇళ్లు, జీవనం, చేపల వేట అన్నీ ఉంటాయి. ఇది ఒక ప్రత్యేక ప్రపంచంలా అనిపిస్తుంది.ఇంఫాల్ నుంచి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్టక్, ఈశాన్య భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు. అదే సరస్సులో కీబుల్ లాంజోవా జాతీయ ఉద్యానవనం ఉండటం మరో అద్భుతం. ప్రకృతి, నీరు, జీవన విధానం కలిసి ఒక చిత్రంలా కనిపించే అందమైన ప్రదేశం ఇది.మేఘాలు నివసించే లోయనాగాలాండ్, మణిపూర్ మధ్య ఉన్న జుకోవ్ లోయను చూస్తే భూమిపై ఒక పచ్చని సముద్రం పరుచుకున్నట్టు అనిపిస్తుంది. సుమారు 2,452 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ లోయలో సీజనల్ పూలు, వెదురు తోటలు, చిన్న చిన్న సెలయేర్లు అందంగా ఉంటాయి.హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు పడితే ముందుగా నాగాలాండ్ చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో ఈశాన్య భారతదేశపు భూదృశ్యం మెల్లిగా మారుతుంది. నాగాలాండ్ కొండలు దగ్గరవుతున్న కొద్దీ రోడ్డు ప్రయాణంలోనే ప్రకతి తన రంగులను మార్చుకుంటూ వస్తుంది.జుకోవ్లో ఒక రోజు గడపడం అంటే కేవలం ట్రెక్కింగ్ అనుభవం మాత్రమే కాదు. మేఘాల లోయలో నిలిచిపోయిన సమయం, గాలిలో వెదురు ఆకుల శబ్దం, దూరంగా కనిపించే కొండలు ఇవన్నీ కలిసి ఒక అందమైన నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయి. ఎండాకాలంలో కనిపించే ప్రత్యేక జుకోవ్ లిల్లీ ఈ ప్రదేశానికి మరో గుర్తింపు ఇస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఈ ఐదు గమ్యస్థానాలకు వెళ్లే మార్గం అనేది గమ్యస్థానాన్ని బట్టి మారుతుంది. మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ ప్రాంతాలకు మీరు గువాహటి, ఇంఫాల్, దిమాపూర్ నుంచి చేరుకోవచ్చు. లడఖ్ వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి లేహ్ చేరుకుని, అక్కడి నుంచి చాంగ్థాంగ్ వైపు రోడ్డు ప్రయాణం చేసి వెళ్లవచ్చు. ఈ ప్రయాణం చాలా మందికి నచ్చుతుంది. కాస్ పీఠభూమికి పుణే లేదా సతారా మార్గంలో వెళ్లడం అనుకూలంగా ఉంటుంది.ఆసక్తికరమైన విషయాలులివింగ్ రూట్ బ్రిడ్జ్లు అనేవి మేఘాలయలోని ఖాసీ, జైంటియా సామాజిక వర్గాల ప్రజలు ప్రకృతితో కలిసి పెంచిన సజీవ నిర్మాణాలు.లోక్టక్ సరస్సు అనేది ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇందులో కనిపించే ఫుమ్డీలు దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.జుకో లోయ అనేది నాగాలాండ్, మణిపూర్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న లోయ. సీజనల్ పూలతో పాటు జుకోవ్ లిల్లీకి ప్రసిద్ధి.త్సో మోరీరి చాంగ్థాంగ్ ప్రాంతంలో సుమారు 4,500 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన, ఎత్తైన ప్రాంతంలోని సరస్సు.కాస్ పీఠభూమి అనేది పశ్చిమ కనుమల్లోని జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ పీఠభూమి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.దక్షిణాది పూల లోయమహారాష్ట్రలోని సతారా దగ్గర ఉన్న కాస్ పీఠభూమిని మహారాష్ట్రలోని పూల లోయ అని కూడా పిలుస్తారు. వర్షాకాలం తరువాత ఈ పీఠభూమిపై వందల రకాల పూలు ఒకేసారి విరిసి, భూమి మొత్తం రంగుల తివాచీలా మారుతుంది. 1200 మీటర్ల ఎత్తులో ఉన్న కాస్లో 850 కిపైగా పూల జాతి మొక్కలు ఉంటాయి.హైదరాబాద్ నుంచి పూణే వైపు ప్రయాణం చేసి, అక్కడి నుంచి సతారా మార్గంలో సాగాల్సి ఉంటుంది. పశ్చిమ కనుమల మధ్య సాగే ఈ ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతుంది. ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య పూల సీజన్ లో ఈ పీఠభూమి పూర్తిగా మారిపోతుంది. దగ్గరలోని కాస్ సరస్సు, బమ్నోలి, ఠోసేఘర్ జలపాతాలు, సజ్జన్ గడ్ లాంటి ప్రదేశాలు ఈ ప్రయాణంలో ప్రత్యేక ఆకర్షణలుగా మిగిలిపోతాయి.ఏం తినాలి?మేఘాలయలో స్థానిక ఖాసీ వంటకాలు, మణిపూర్లో అన్నంతో తయారు చేసే సంప్రదాయ వంటకాలు, నాగాలాండ్లో స్థానిక మాంసాహార వంటకాలు, లడఖ్లో తుక్పా, మోమోలు, మహారాష్ట్రలో కంది పెఢా, పిట్లా, ఇతర స్థానిక మహారాష్ట్ర వంటకాలు మీ ప్రయాణానికి రుచికరమైన అనుభూతిని ఇస్తాయి.వేర్లతోనే వంతెనలు మేఘాలలో ఖాసీ ప్రజల జీవన విధానం ప్రకతితో మమేకమైన జీవన విధానం. దీనికి సాక్షాలే సజీవ వేర్ల వంతెనలు. ఫికస్ ఎలాస్టికా చెట్ల వేర్లను సంవత్సరాల పాటు పెంచి, నది రెండు వైపుల కలిసేలా తయారు చేసిన ఈ వంతెనలు కాంక్రీట్ నిర్మాణంలా బలంగా ఉంటాయి. కొన్ని వంతెనలు వందేళ్ల పాటు నిలిచి ఉన్నాయని మేఘాలయ పర్యాటక శాఖ చెబుతుంది.నాంగ్రియాట్, సోహ్రా, మాలినాంగ్ ప్రాంతాల్లో ఇలాంటి వంతెనలను చూడవచ్చు. పచ్చని అడవుల్లో నడుస్తుంటే కింద ప్రవహిస్తున్న నీటి మధ్య వేర్లు కలిసి వంతెనలా మారడం చూస్తే, మనిషి, ప్రకృతి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం అవుతుంది.ఎక్కడ ఉండాలి?లివింగ్ రూట్ బ్రిడ్జ్ల సమీపంలో గ్రామీణ హోమ్స్టేలు, లోక్టక్ సరస్సు వద్ద సరస్సు ఒడ్డున ఉండే వసతి సౌకర్యాలు, జుకో లోయ ప్రయాణంలో పర్వత రహదారులు కనిపించే వసతి ప్రదేశాలు బాగుంటాయి.త్సో మోరీరి సమీపంలోని కొర్జోక్లో అతిథి గృహాలు, క్యాంపులు అందుబాటులో ఉంటాయి. కాస్, సతారా ప్రాంతంలో హోటళ్లు, హోమ్స్టేలు ఉంటాయి. ప్రతీ గమ్యస్థానంలో బస చేయడం కూడా ఒక జ్ఞాపకంగా మారిపోతుంది.ఏం చూడాలి?లివింగ్ రూట్ బ్రిడ్జ్ల మధ్య ప్రవహించే నీరు, లోక్టక్ సరస్సులో తేలియాడే ఫుమ్డీలు, జుకో లోయలో కనిపించే సీజనల్ పూలు, త్సో మోరీరి నీలిరంగు సరస్సు, కాస్లో విరబూసే సీజనల్ పువ్వులుం ఈ ఐదు గమ్యస్థానాల్లో మీరు ఎక్కడా ప్రయాణ అనుభూతిని మిస్ అవరు. ఈ గమ్యస్థానాలను వేగంగా చుట్టేయాలని కాకుండా ప్రశాంతంగా ఆస్వాదించడానికి ్రపాధాన్యత ఇవ్వండి.సందర్శనీయ ప్రదేశాలుఈ ఐదు ప్రదేశాలలో ఒక్కో ప్రదేశం ఒక్కో అనుభూతిని ఇస్తుంది. మేఘాలయలో మనిషి చేతులతో పెంచిన వేర్ల వంతెనలు ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా జీవితాన్ని కొనసాగించే సందేశాన్ని అందిస్తాయి. అలాగే లోక్టక్లో నీటిపై జీవితం, జుకోలో పూల మధ్య మేఘాలు, త్సో మోరీరిలో ఆకాశం సరస్సులో ప్రతిబింబించడం, వర్షాల తరువాత భూమి పూలనే అక్షరాలుగా మార్చుకుని మాట్లాడటం ఇవన్నీ తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలే కదా.యాక్టివిటీస్ఈ ప్రయాణంలో రూట్ బ్రిడ్జ్పై నడవడం, లోక్టక్ సరస్సులో తేలియాడే ప్రకతి దశ్యాలను చూడటం, జుకో లోయలో మేఘాల మధ్య నడవడం, త్సో మోరీరి సరస్సు తీరంలో పర్వతాల ప్రతిబింబాలను ఆస్వాదించడం, కాస్లో సీజనల్ పూల మధ్య ప్రకృతిని గమనించడం ఇవన్నీ ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతాయి.యాత్ర, బడ్జెట్ వివరాలుఐదు రోజుల ట్రిప్లో బడ్జెట్ అనేది గమ్యస్థానాన్ని బట్టి మారిపోతుంది. హైదరాబాద్ నుంచి విమానంలో ప్రయాణించడం, స్థానిక రవాణా, బస, ఆహారం అన్నీ కలిపి బడ్జెట్ ప్రయాణానికి సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఖర్చు అవ్వొచ్చు.సాధారణ స్థాయి ప్రయాణ బడ్జెట్తో వెళ్తే రూ.40,000 నుంచి రూ.60,000 వరకు, ప్రత్యేకమైన ప్రయాణ అనుభవానికి అయితే రూ.70,000కు పైగా ఖర్చు కావచ్చు. త్సో మోరీరి, జుకో లోయ, లివింగ్ రూట్ బ్రిడ్జ్ల వంటి ప్రాంతాల్లో స్థానిక రవాణా, బస ఆధారంగా బడ్జెట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.బస విషయానికి వస్తే ఒక్క రాత్రికి రూ.1,000–4,000 మధ్యలో బడ్జెట్ పెట్టుకోవడం మంచిది. ప్రీమియం హోటళ్లకు మరింత ఖర్చు కావచ్చు. ఆహారం కోసం రోజుకు సుమారు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీ రుచికి, ఎంపికకు అనుగుణంగా ఈ ఖర్చులు మారుతాయి.- ఎం.జి. కిశోర్, ప్రయాణికుడుఇవి కూడా చదవండి: బ్రహ్మపుత్రను ‘రెడ్ రివర్’ అని ఎందుకు అంటారో తెలుసా?
ధర్మవాక్కు..! అతడి మరణాన్ని ముందే చెప్పిన అయోధ్య రాజు!
పూర్వం అయోధ్యను అనరణ్యమహారాజు పాలించేవాడు. ఆ రోజులలో రావణుడు తనకు యక్ష కిన్నర కింపురుషాదులలో ఎవరి వలననూ మరణం కలగకుండా బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు. ఆ బలంతో రాజులందరినీ పరాజితులను చేసి, అవమానపరచి ఆనందిస్తున్నాడు. అది తెలిసి, ముందుగానే లొంగిపోయి ప్రాణం రక్షించుకున్నారు కొందరు.అయోధ్యను పాలించిన అనరణ్యమహారాజు మాత్రం రావణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ‘పూటకొకమాటు ఆకలిదప్పులతో అల్లాడే నరుల సేనను నా సైన్యం వేసే శరసమూహజ్వాలల దాహాన్ని తీర్చడానికి తెచ్చావా?’ అని హాస్యమాడాడు రావణుడు. ఇరువురికీ ముఖాముఖి జరిగిన యుద్ధంలో చివరన సారథిని కూల్చి, అనరణ్యమహారాజును రథహీనుడిని చేసి నేలమీద పడేట్లు చేశాడు. ‘మృత్యువు కూడా నా దగ్గరకు రావడానికి భయపడుతుంది. అలాంటిది నువ్వెంత? ఓడిపోయానని ఒప్పుకో, వదిలేస్తాను!’ అన్నాడు. ఒప్పుకోకుండా రావణుడి చేతిలో వీరమణం పొందాడు. అయితే, మరణానికి ముందు, ‘ఎప్పటికైనా నా వంశంలో పుట్టిన వీరుడి చేతిలోనే నీవు మరణం పొందుతావు!’ అన్నాడు. ఆ మాటలకు నవ్విన రావణుడితో అనరణ్యమహారాజు ఇంకా ఇలా అన్నాడని కంకంటి పాపరాజు రచించిన ‘శ్రీమదుత్తర రామాయణం’ తృతీయాశ్వాసంలోని ఈ క్రింది పద్యం చెబుతోంది:చ. పురుషుడు కర్మసంగమున బొందు సుఖంబులు దుఃఖ మెవ్వరెవ్వరికి విరోధముల్ సలుపు వా రిది దైవవశంబు దీనగాతరతవహింప నే గనక దానమఖాధ్యయనాది కర్మముల్వొరసితి నేని బల్కు పొలివోవక నట్లగుగాక యంచనన్.‘మనిషి చేసే పనులను బట్టి సుఖదుఃఖాలు ఉంటాయి. ఎవరూ ఎవరికీ విరోధులు కారు. దైవం జరిపించే విధంగా జరిగేవే అన్నీ. నేనే గనుక దానధర్మాధ్యయనాది పుణ్యకర్మలను నిష్ఠగా చేసినవాడనైతే నా మాట అక్షరం పొల్లుపోకుండా జరుగుతుంది!’ అన్నట్లుగానే రావణుడి మరణం అయోధ్యను పాలించిన శ్రీరాముడి వలన జరిగింది. ధర్మబద్ధమైన జీవనం సాగించే వ్యక్తికి కష్టం కలిగి మాట్లాడే మాట తప్పక జరుగుతుందని దీనివలన అర్థమౌతుంది.– భట్టు వెంకటరావు
పాండవుల ధనుస్సులు, శంఖాల పేర్లు
మహా భారత యుద్ధంలో పాండవులు, ముఖ్యంగా యుద్ధానికి దిశ, దశ చూపిన శ్రీ కృష్ణ పరమాత్మ తదితరులు ఉపయోగించిన ధనుస్సులు, శంఖాల పేర్లు మీకు తెలుసా...? శ్రీ కృష్ణుని ధనుస్సు పేరు శారంగం...శంఖం పేరు పాంచజన్యంధర్మరాజు ధనుస్సు పేరు మహేంద్ర... శంఖం పేరు అనంత విజయం, భీముని ధనుస్సు పేరు వాయువ్య. అయితే చాలా మంది భీముడు గదతోనే యుద్ధం చేసాడని అనుకుంటారు. ఆ గద పేరు వృకోదర. అంతేకాకుండా భీముడు గొప్ప మల్ల యోధుడు కూడా. కాగా భీముని శంఖం పేరు పౌండ్రం. అర్జునిని ధనుస్సు పేరు గాండీవం. శంఖం పేరు దేవదత్తం. నకులుడి ధనుస్సు పేరు వైష్ణవ శంఖం పేరు సుఘోషం. సహదేవుని ధనుస్సు పేరు అశ్వివ. శంఖం పేరు మణి పుష్పకం. అభిమన్యుని ధనుస్సు పేరు రౌద్ర.ఘటోత్కచుని ధనస్సు పేరు పౌలస్త్రయ.కాగా కురుపితామహుడైన భీష్ముని శంఖం పేరు శైశాంక. ధుర్యోధనుని గద పేరు కౌముది. కర్ణుని ధనుస్సు పేరు విజయ. శంఖం పేరు హిరణ్యగర్భ.– సి.ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు
అంతర్జాతీయం
నెల రోజుల పాటు ప్రతిరోజూ 3 పూటలా ఫ్రైడ్ చికెన్ తిని..
బ్రిటిష్ హాస్యనటుడు మో గిల్లిగన్ కొత్త నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘‘బిగ్ చికెన్: ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పిరసీ’’ కోసం 28 రోజుల పాటు రోజుకు మూడు పూటలా ఫ్రైడ్ చికెన్ తిన్నాడు. ఆ తర్వాత ఎదురైన ఆందోళనకర పరిణామాలను మో గిల్లిగన్ వివరించాడు. గిల్లిగన్ 2004లో విడుదలైన సూపర్హిట్ డాక్యుమెంటరీ ‘సూపర్ సైజ్ మీ’ నుంచి స్ఫూర్తి పొంది 28 రోజుల పాటు రోజుకు 3 పూటలా ఫాస్ట్ఫుడ్ చికెన్ తినేందుకు అంగీకరించాడు. ఆ డాక్యుమెంటరీలో చిత్రనిర్మాత మోర్గాన్ స్పర్లాక్ నెల రోజుల పాటు మెక్డొనాల్డ్స్ ఆహారం మాత్రమే తిని, దాని ప్రభావాలను నమోదు చేశాడు.గిల్లిగన్ ఏం చెప్పాడు? “నెట్ఫ్లిక్స్ నాకు చికెన్ తినడానికి డబ్బులు ఇస్తోందా? ఇది పిచ్చిగా ఉంది కదా అని అనుకున్నాను. వాళ్లు రూపొందించాలనుకున్న సినిమా వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. మొదటి కొన్ని నిమిషాల్లో ఇదంతా అద్భుతంగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే, ఇది కలల ఉద్యోగంలా అనిపించింది” అని గిల్లిగన్ ‘ఆబ్సెస్డ్: ది పాడ్కాస్ట్’ తాజా ఎపిసోడ్లో మ్యాట్ విల్స్టీన్తో చెప్పాడు.దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని తనకు తెలుసని గిల్లిగన్ చెప్పాడు. అయితే తన ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందనే ఆలోచన తన నిద్రను దూరం చేసేంతగా ఆందోళన కలిగించలేదని తెలిపాడు. అయితే, ఈ సవాలు సగానికి చేరుకునే సమయానికి అతడిలో అనేక మార్పులు మొదలయ్యాయి. అవి నిజంగా శారీరకంగా వచ్చిన మార్పులా, లేక తన ఊహ మాత్రమేనా అనేది కూడా అతడికి అర్థం కాలేదు.ఆరోగ్యం క్షీణించింది.. గిల్లిగన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. వారం రోజుల తర్వాత తన ఆరోగ్యం క్షీణించిందని చెప్పాడు. మరో వారం తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని తెలిపాడు. బరువు పెరిగిందని, నియంత్రణ లేకుండా చెమటలు పట్టడం మొదలైందని, మానసిక స్థితిలో మార్పులు వచ్చాయని చెప్పాడు. అలాగే అతిగా కునుకులు తీసే అలవాటు ఏర్పడిందని, అవి చాలా లోతైన, తీవ్రమైన నిద్రలా అనిపించేవని వివరించాడు.“నేను కాఫీతో పాటు చికెన్ తింటున్న దృశ్యం చూస్తే ఇదంతా నిజమా అనిపించింది. నాకు అల్పాహారంగా ఇలా చికెన్ తినాలని లేదు. కాఫీతో కలిసి అస్సలు తినాలని లేదు. సగం దశ బహుశా అన్నింటికంటే కష్టమైనది. ఆహారం తింటున్నప్పుడు దాని రుచి ఇక బాగుండదని అనుకున్నాను. కానీ అది చాలా రుచిగానే ఉంది” అని గిల్లిగన్ చెప్పాడు.గిల్లిగన్ ఎదుర్కొన్న అనుభవంతో పాటు ఈ డాక్యుమెంటరీ చికెన్ పరిశ్రమను కూడా పరిశీలిస్తుంది. ఫ్రైడ్ చికెన్ చుట్టూ ఉన్న జాతిపరమైన మూసధోరణులు, బ్రిటన్ ఫాస్ట్ఫుడ్ రంగానికి సంబంధించిన సమస్యలపై కూడా దృష్టి సారిస్తుంది. “ఫ్రైడ్ చికెన్కు సంబంధించిన చాలా అంశాలను ఇందులో చూపించడానికి ప్రయత్నించాం. అలాగే పెద్ద చికెన్ పరిశ్రమను కూడా పరిశీలించాం. అక్కడి నుంచే ఈ చిత్రం మరో దిశలోకి మారుతుంది” అని గిల్లిగన్ చెప్పాడు.“వీలైనన్ని అంశాలను ఇందులో చూపించడానికి మేము నిజంగా ప్రయత్నించాం. ‘అతడి ప్రయాణాన్ని చూస్తాను, అతడికి ఏమి జరుగుతుందో నాకు తెలుస్తుంది’ అనే విధంగా మాత్రమే ఈ చిత్రం ఉండకూడదని భావించాం. ఇంతకుముందు ఎవరో చేసినదాన్ని అనుకరించకుండా, మా చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేందుకు మేము ప్రయత్నించిన విధానం ఇదేనని అనుకుంటున్నాను” అని అతడు చెప్పాడు.
ఒక్క పొరపాటు.. అపార్ట్మెంట్లు కూలిపోతాయని దడుసుకున్నారు..
బీజింగ్: చిన్న భూకంపం వస్తే ఏకంగా 7.7 తీవ్రత (రిక్టర్ స్కేలుపై)తో భారీ భూకంపం వచ్చిందంటూ హెచ్చరిక చేసింది ఓ సంస్థ. దీంతో జనాలు బెంబేలెత్తిపోయారు. చైనాలోని నైరుతి ప్రాంతంలోని చెంగ్డూ మహానగరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేర్ లైఫ్.. భూకంపం సంభవించిన 5 సెకన్లకే 7.7 తీవ్రతతో భూకంప హెచ్చరికను జారీ చేసింది. ఇతర భూకంప పర్యవేక్షణ సంస్థలు తెలిపిన తీవ్రత కంటే చాలా ఎక్కువ తీవ్రతతో భూకంప హెచ్చరికను ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేర్ లైఫ్ జారీ చేయడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తమ అపార్ట్మెంట్లు కుప్పకూలిపోతాయేమోనని భయపడ్డారు.చైనా భూకంప నెట్వర్క్స్ కేంద్రం ప్రకారం.. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో యిబిన్ ప్రాంతంలో సోమవారం ఉదయం 8.26 గంటలకు 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప హెచ్చరిక వ్యవస్థ అయిన "చైనా భూకంప ముందస్తు హెచ్చరిక నెట్వర్క్" పేరును కేర్-లైఫ్ అనుమతి లేకుండా ఉపయోగించి.. హానర్, వివో స్మార్ట్ఫోన్లతో పాటు షియావోటియాన్కాయ్ స్మార్ట్వాచ్ల ద్వారా ప్రజలకు 7.7 తీవ్రతతో హెచ్చరికను పంపినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది.తీవ్రత అంచనాలో భారీ వ్యత్యాసంపై స్పందిస్తూ.. నెట్వర్క్ 6వ సెకనులో అంచనాను 6.4కు, 7వ సెకనులో 3.7కు, 8వ సెకనులో 4.1కు, 16వ సెకనులో 3.9కు తగ్గించినట్లు తెలిపింది. సేవలను మెరుగుపరిచేందుకు ఈ వ్యత్యాసానికి కారణాన్ని సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేస్తామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేర్-లైఫ్ తెలిపింది.గతంలో వరసగా భూకంపాలు జూలైలో చైనాలోని ఓ మారుమూల ప్రావిన్స్లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించగా, కేవలం 18 నిమిషాల తర్వాత 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. వాయవ్య చైనాలోని క్వింగ్హై ప్రావిన్స్లోని జింగ్హై కౌంటీలో ఉదయం 11.16 గంటలకు, 11.34 గంటలకు ఈ భూకంపాలు సంభవించాయి. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపాల కేంద్రం, క్వింగ్హై రాజధాని షినింగ్కు సుమారు 244 కిలోమీటర్ల దూరంలో ఉన్న తక్కువ జనాభా కలిగిన ఎత్తైన ప్రాంతంలో ఉంది.మే నెలలో దక్షిణ గ్వాంగ్సీ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. భవనాలు కూలిపోయాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో నలుగురు గాయపడగా, లియుజౌ నగరం నుంచి 7,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
బ్రిటన్పై రష్యా ఫైర్.. స్థావరాలను పేల్చిపడేస్తాం
మాస్కో: బ్రిటన్పై రష్యా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఉక్రెయిన్లో శాంతి స్థాపన జరగకుండా బ్రిటన్ అడ్డుకుంటుందని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకై ఈ రోజు సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్లోనే SCALP సుదూర క్షిపణులను తయారు చేసేందుకు అవసరమైన సమాచారాన్ని బ్రిటన్ కీవ్కు అందిస్తున్నందుకు రష్యా తీవ్రంగా స్పందించింది. ఈ క్షిపణులను తయారు చేసే ప్లాంట్లను గుర్తించి ధ్వంసం చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్కు సైనికంగా కొనసాగుతున్న బ్రిటన్ మద్దతును మరింత బలపరుస్తామని బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్హామ్ కీవ్ పర్యటన సందర్భంగా హామీ ఇచ్చిన నేపథ్యంలో రష్యా ఈ హెచ్చరికలు చేసింది.SCALP క్షిపణులకు సంబంధించిన బ్లూప్రింట్లు, సాంకేతిక సమాచారంపై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ని ప్రశ్నించగా తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. “ బ్రిటన్ క్రమపద్ధతిలో, నిరంతరం మంటలకు నూనె పోస్తోంది. శాంతి ప్రక్రియలో కనీస స్థాయిలోనైనా పురోగతి సాధించకుండా అడ్డుకునేందుకు బ్రిటన్ పదేపదే పథకాలు రచిస్తోంది. ఇలాంటి క్షిపణులు, ఇతర సైనిక పరికరాల తయారీ కేంద్రాలను గుర్తించేందుకు మా సాయుధ దళాలు అవసరమైన గూఢచారి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఆ సదుపాయాలను ధ్వంసం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి” అని విలేకరులతో అన్నారు.SCALP క్షిపణిSCALP ఒక సుదూర క్రూయిజ్ క్షిపణి. ఇది సుమారు 250 కిలోమీటర్ల (దాదాపు 150 మైళ్ల) దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. 2022లో రష్యా ఉక్రెయిన్పై పూర్తి స్థాయి సైనిక దాడిని ప్రారంభించినప్పటి నుంచి ఫ్రాన్స్, బ్రిటన్లు ఈ క్షిపణులను ఉక్రెయిన్కు అందిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఉక్రెయిన్లోనే వీటిని దేశీయంగా తయారు చేయలేదు.ఉక్రెయిన్లో SCALP క్షిపణుల ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన సహకారం అందించే దిశగా బ్రిటన్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఫ్రాంకో-బ్రిటిష్ క్షిపణిలో ఉపయోగించే బ్రిటన్కు చెందిన భాగాలకు సంబంధించిన సమాచారాన్ని రక్షణ రంగ సంస్థ MBDA ఉక్రెయిన్కు విడుదల చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతించనుంది.బ్రిటన్ ప్రధాని ఉక్రెయిన్ పర్యటనకాగాా బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్హామ్ సోమవారం కీవ్ను సందర్శించారు. ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, రష్యా నుంచి వస్తున్న దారుణమైన బెదిరింపులు ఉన్నప్పటికీ ఉక్రెయిన్ రక్షణకు బ్రిటన్ తన సైనిక మద్దతును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.నా దేశానికి రష్యా దారుణమైన బెదిరింపులు చేస్తున్నప్పటికీ , ఉక్రెయిన్ రక్షణకు మా మద్దతును కొనసాగిస్తాం అని కీవ్లో జరిగిన ప్రసంగంలో బర్న్హామ్ అన్నారు. కాగా ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు తీవ్రస్థాయికి చేరాయి. ఇరుదేశాలు పరస్పరం క్షిపణి దాడులతో విరుచుక పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.
హర్ముజ్ విషయంలో మరో బాంబు పేల్చిన ఇరాన్
టెహ్రాన్: ఇరాన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలపై పన్ను విధించేందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్కు సంబంధించిన మీడియా కథనాలు ఈ కీలక విషయాలు వెల్లడించాయి.ఆ దేశ మీడియా కథనాల ప్రకారం.. "హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతి ఉన్న దేశాల ఓడల నుండి సముద్రయాన సేవలకు రుసుము వసూలు చేయబడుతుంది రుసుములకు బదులుగా సముద్ర సేవలు, భద్రత మరియు బీమా వంటి సౌకర్యాలు కల్పించబడతాయి.పర్యావరణ సేవలు మరియు, ప్రత్యేక పరిస్థితులలో, ఇంధనం కూడా అందించబడతాయి. చెల్లింపు ఇరానియన్ రియాల్స్లో లేదా ఇరాన్ ఎంచుకున్న ఏదైనా ఇతర కరెన్సీలో చేయబడుతుంది". అని తెలిపాయి.కాగా ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. అమెరికా ఇరాన్పై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్నట్లు తెలిపింది.ఇరాన్పై ఆర్థిక యుద్ధంఇరాన్పై ట్రంప్ ప్రభుత్వం సాగిస్తున్న ఆర్థిక యుద్ధం ఇప్పుడు తుది దశలోకి ప్రవేశించిందని అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సాంట్ అన్నారు. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరులను నిలిపివేయడమే అమెరికా లక్ష్యమని బెస్సాంట్ తెలిపారు. ఇరాన్పై ఒత్తిడిని పెంచడానికి అమెరికా తన ప్రభుత్వ సంస్థలన్నింటినీ, అధికారాలన్నింటినీ వినియోగిస్తుందని బెస్సెంట్ చెప్పారు. దీనిని ఒక శత్రువుపై చేపట్టే అతిపెద్ద ఆర్థిక చర్యగా ట్రంప్ గతంలో అభివర్ణించారు మరియు ఇరాన్ను ఏకాకిని చేయడంలో పాలు పంచుకోవాలని ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు.గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ సైతం గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ఆర్థిక కఠిన చర్యలకు మద్దతు ఇచ్చే గల్ఫ్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధించడంలో అమెరికాకు మద్దతు ఇచ్చే ఏ దేశాన్నైనా శత్రువుగా పరిగణిస్తామని ఇరాన్ కొత్త జాతీయ భద్రతా అధిపతి మొహ్సెన్ రెజాయీ అన్నారు.కాగా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య హర్ముజ్ అంశంలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ కీలకమైన జలసంధిపై పట్టు సాధించేందుకు అమెరికా యత్నిస్తుంది. ఇప్పుడు ఇరాన్ దానికి టోల్ టాక్స్ వసూలు చేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
జాతీయం
క్లోరిన్ గ్యాస్ లీకై 56 మంది ఆస్పత్రిపాలు
నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ప్రభుత్వ ఆదీనంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో క్లోరిన్ గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గ్యాస్ను పీలి్చన 56 మంది ఆస్పత్రి పాలుకాగా, వీరిలో 8 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గోధని గ్రామపంచాయతీలోని నీటిశుద్ధి ప్లాంట్లో 900 కిలోల సామర్థ్యమున్న క్లోరిన్ గ్యాస్ సిలిండరుంది. వేకువజాము నుంచి ఈ గ్యాస్ లీకవడం మొదలైంది. గమనించిన అధికారులు 5.30 గంటలకు ఆ సిలిండర్ను పూర్తిగా నీటిలో ముంచి, ప్రమాదం తగ్గించారు. అప్పటికే గ్యాస్ను పీల్చిన కొందరు దగ్గు, శ్వాసలో ఇబ్బందులతో అవస్థలు పడ్డారు. ఇందులో 56 మంది ఆస్పత్రి పాలుకాగా, 11 మందిని చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. మరో 45 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉన్నారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న8 మందిని ఐసీయూలో ఉంచారు. గ్యాస్ లీకేజీ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గ్రామంలోని 200 మీటర్ల పరిధిలోని వారందరినీ ఖాళీ చేయించారు.
రాజకీయ సన్యాసం ప్రశ్నే లేదు: మమత
కోల్కతా: రాజకీయాల నుంచి తాను వైదొలిగే ప్రశ్నే లేదని, బీజేపీ గద్దె దిగేదాకా పోరాటం కొనసాగుతుందని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్ ప్రజలకు కేవలం నాలుగు నెలల్లోనే బీజేపీ అసలు స్వరూపం ఏమిటో తెలిసి వచ్చందన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో హనీమూన్ ముగిసి, మనీ–మూన్ దశ మొదలైందంటూ ఎద్దేవా చేశారు. ‘నన్ను అడుగడుగునా అడ్డుకుంటున్న బీజేపీ ప్రభుత్వం, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పొరపాటు పడుతోంది. బీజేపీ ప్రభుత్వం రాజకీయ అస్త్ర సన్యాసం తీసుకునే దాకా పోరాటం ఆపేది లేదు’అని మమత సోమవారం ఫేస్బుక్ లైవ్లో స్పష్టం చేశారు. ‘మమతా బెనర్జీ వర్గం టీఎంసీని సమర్థించ వద్దంటూ పోలీసులే ప్రజలకు చెబుతున్నారు. టీఎంసీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. పోలీస్ ఎస్పీలు, జిల్లా బీజేపీ అధ్యక్షుడుల మాదిరిగా తయారయ్యారు. ఇప్పటి దాకా కనీసం 14 వేల మంది కార్యకర్తలపై కేసులు పెట్టారు. కొందరు మోసగాళ్ల అండ చూసుకుని బీజేపీలో చేరాలంటూ ప్రచారం చేస్తున్నారు’అని మమత ధ్వజమెత్తారు. జాదవ్పూర్ వర్సిటీ ప్రాంగణంలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలకు కాషాయ పార్టీయే కారణమని ఆమె నిందించారు. రాజకీయ పార్టీలతో ఎటువంటి చర్చలు జరపకుండానే జనగణన ప్రక్రియను చేపట్టారని, దీని ద్వారా జాతీయ పౌర రిజిస్టర్ను అమలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జనగణన దరఖాస్తులపై సంతకం చేసేముందు, జాగ్రత్తగా ఉండాలని ప్రజలను ఆమె హెచ్చరించారు. అందులో వెల్లడించే వ్యక్తిగత సమాచారంతో బ్యాంకు అక్కౌంట్లలో దాచుకున్న మొత్తాలు కూడా మాయమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్ సమయంలో తొలగింపునకు గురైన లక్షలాది నిజమైన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్పించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మమత తెలిపారు.
సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటండి
న్యూఢిల్లీ: మన సాంస్కృతిక ఔన్నత్యాన్ని, సాంకేతికత, ఆవిష్కరణలతో కలగలిపి, ప్రపంచ పటంలో భారత్ స్థాయిని ఇనుమడింప జేయాలని ట్రెయినీ ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్)అధికారులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 2025 బ్యాచ్లోని 50 మంది ఐఎఫ్ఎస్ అధికారులు సోమవారం సేవాతీర్థ్ లో ప్రధాని మోదీని కలిశారు. యువ దౌత్యవేత్తలు దేశ గొప్ప నాగరికత, సాంకేతికత, ఆవిష్కరణలు, సమర్థవంతమైన సమాచార మార్పిడిని మిళితం చేస్తూ దేశ గౌరవాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రపంచ దేశాలతో భారత్ కొనసాగించే ఆర్థిక సంబంధాలకు ఉ్రత్పేరక ఏజెంట్లుగా వ్యవహరించాలని వారిని కోరారు. ‘మీరు పనిచేసే దేశాల్లో స్థానిక వర్గాలతో భారత్ సంబంధాలను లోతుగా పెంచేలా ప్రాథమిక స్థాయిలో అనుబంధాన్ని పెంపొందించుకోండి. సంప్రదాయ దౌత్య పరిధికి మించి విస్తరించి, ప్రజల స్థాయిలో సంబంధాలను నెలకొల్పుకునేందుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. భారతీయ మిషన్లు కేవలం ప్రభుత్వాలు, సంస్థలతోనే కాకుండా ప్రజలతో కూడా అర్థవంతమైన సంబంధాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది’అని ప్రధాని మోదీ వారికి చెప్పారు. ‘భారతీయ మిషన్లలో డిజిటల్ సాంకేతికత వినియోగాన్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ప్రభుత్వ సేవలు, ఇతర కాన్సులర్ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు సాంకేతికత ఉపయోగపడుతుంది. ప్రజలు ఏదైనా ఒక సంస్థతో సంప్రదింపులు జరిపేందుకు వెబ్సైట్ మొదటి ద్వారంగా ఉంటుంది’అని ప్రధాని పేర్కొన్నారు. మన నాగరికత, సాంస్కృతిక, భౌగోళిక విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పడం ద్వారా దేశాన్ని మరింత ఆకర్షణీయమైన ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని ట్రెయినీలను ప్రధాని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతలో మనదేశంపై ఆసక్తిని పెంచేందుకు ‘భారత్ను తెలుసుకోండి’క్విజ్ను సది్వనియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి కార్యక్రమాలను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్లను సాధనాలుగా వాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా ట్రెయినీ ఐఎఫ్ఎస్లు తమ శిక్షణ, భారత్ దర్శన్ నుంచి పొందిన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు.
1,712 కేసుల పరిష్కారం
న్యూఢిల్లీ: ఈ ఏడాదికిగాను సర్వోన్నత న్యాయస్థానంలో నిర్వహించిన సమాధాన్ సమారోహ్ ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమంలో మూడ్రోజుల్లోనే ఏకంగా 1,712 కేసులను పరిష్కరించారు. మొత్తం 1,712 కేసులకు తీర్పులివ్వడం లేదా విచారణార్హమైనవి కావని తేలిన పక్షంలో తిరస్కరించడమూ చేశారు. ఆగస్ట్ 21వ తేదీ నుంచి 23వ తేదీదాకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మార్గదర్శకంలో ఈ లోక్అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సుప్రీంకోర్టు సోమవారం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. సత్వరం సెటెల్మెంట్ చేయగల ఆస్కారమున్న కేసులను ఒక జాబితాగా సిద్ధంచేసి కక్షిదారులు, ప్రత్యర్థి పార్టీలను పిలిపించి వేగంగా కేసులను పరిష్కరించారు. ఈ మూడ్రోజుల్లో విచారణ కోసం 3,285 కేసులను సిద్ధంచేయగా కాలావధిలోపు 1,664 కేసులకు తీర్పులు ఇవ్వడం లేదా తిరస్కరించడం చేశారు. మిగతా 48 కేసులన మధ్యవర్తిత్వం మార్గం ద్వారా రాజీ కుదిర్చి కేసులకు ముగింపు పలికారు. దీంతో పరిష్కారభాగ్యం దక్కిన కేసుల సంఖ్య 1,712కు పెరిగింది. ఈ మొత్తం కేసులతో ముడిపడిన రూ.240.94 కోట్ల విలువైన స్థిర,చరాస్థులకు సైతం సుప్రీంకోర్టు పరిష్కారాలు చూపింది. లోక్అదాలత్కు సీజేఐ నేతృత్వం వహించారు. ఈయనతోపాటు సీనియర్ జడ్జీలు, ఇతర జడ్జీలు, సీనియర్ న్యాయవాదులు, అడ్వకేట్స్–ఆన్–రికార్డ్, సీనియర్ రిజి్రస్టార్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ లోక్ అదాలత్లో భాగస్వాములయ్యారు. మధ్యవర్తిత్వం, రాజీ, ఏకాభప్రాయం ద్వారా కొన్ని కేసులు పరిష్కారమయ్యాయి. వివాహ సంబంధ, స్థిరచరాస్థి తగాదాలు, యాక్సిడెంట్లు, భూ వివాదాలు, నష్టపరిహారాలు, పన్నులు, సేవలు, కారి్మకులకు సంబంధించిన కేసులను ఈ లోక్అదాలత్లో పరిష్కరించారు. లోక్అదాలత్లో ఇరు పక్షాల కాలం, డబ్బు, శ్రమ, మానసిక క్షోభ, నిరీక్షణ అన్ని తప్పుతాయని కోర్టు వ్యాఖ్యానించింది.
ఎన్ఆర్ఐ
బెర్లిన్లో ఘనంగా భారత్ దివస్ వేడుకలు
బెర్లిన్: జర్మనీలోని భారతీయ ప్రవాసులు ఆగస్టు 16న బెర్లిన్లోని చారిత్రక బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద భారత్ దివస్ను ఘనంగా నిర్వహించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్మనీ నలుమూలల నుంచి భారతీయ సంఘాలు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భారతదేశ ఐక్యత, వైవిధ్యం, గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. తెలంగాణ అసోసియేషన్ చైర్పర్సన్, వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘు చెల్లిగంటి, యూపీ అసోసియేషన్కు చెందిన డాక్టర్ అఖిల్ అగర్వాల్, కాశ్మీరీ సమాజానికి ప్రాతినిధ్యం వహించిన వీణా చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జర్మనీలోని పలు భారతీయ సంఘాలు, కమ్యూనిటీ సంస్థలు చురుకైన సహకారం అందించాయి.ఈ వేడుకలకు జర్మనీలో భారత రాయబారి అజిత్ గుప్తా తన సతీమణితో కలిసి హాజరయ్యారు. భారత రాయబార కార్యాలయానికి చెందిన కాన్సులర్ మంత్రి స్టాలిన్ బాబు చీకట్ల, పర్సనల్ మంత్రి డాక్టర్ మందీప్ సింగ్ తులితో పాటు పలువురు ప్రముఖ అధికారులు, అతిథులు పాల్గొన్నారు.బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద వందలాది మంది భారతీయ ప్రవాసులు ఒకచోట చేరడంతో దేశభక్తి, ఐక్యత, సోదరభావంతో కూడిన ప్రత్యేక వాతావరణం నెలకొంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశంలోని భిన్నత్వాన్ని చాటుతూ, అందరినీ త్రివర్ణ పతాకం కింద ఒక్కతాటిపైకి తీసుకువచ్చాయి.అనంతరం బ్రాండెన్బర్గ్ గేట్ నుంచి శాంతి స్తూపం వరకు యూనిటీ వాక్ నిర్వహించారు. శాంతి, స్నేహం, ఐక్యత, పరస్పర సహకారం అనే సందేశాన్ని ఈ వాక్ ద్వారా చాటారు.జర్మనీలోని భారతీయ సమాజానికి ఈ వేడుక ఒక గర్వించదగిన, చిరస్మరణీయమైన సందర్భంగా నిలిచింది. భారతదేశం పట్ల తమ అనుబంధాన్ని, ఉమ్మడి వారసత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తిని ప్రవాస భారతీయులు ఘనంగా చాటుకున్నారు.చదవండి: సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం
2వ ప్రపంచ యుద్ధం తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్లో
భారత సంతతికి చెందిన 28 ఏళ్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ అర్ష్దీప్ సింగ్ డాంగ్ (Arshdeep Singh Dang), బ్రిటన్ చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAF)లో ఫైటర్ పైలట్గా పట్టా పొందిన తొలి సిక్కు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక సిక్కు యోధుడు ఫైటర్ స్క్వాడ్రన్ నుండి 'వింగ్స్' (Wings) సాధించడం ఇదే తొలిసారి అని RAF తెలిపింది.నార్త్ వేల్స్లోని 'RAF వ్యాలీ'లో శుక్రవారం (ఆగస్టు 14న) జరిగిన వేడుకలో అర్ష్దీప్ సింగ్ పట్టభద్రుడయ్యారు. తన తండ్రిని పైలట్గా చూడాలనేది తాతగారైన సర్దార్ సంతోఖ్ సింగ్ డాంగ్ కల అని, అయితే ఆయన చిన్నతనంలోనే మరణించడంతో ఆ అవకాశం రాలేదని అర్ష్దీప్ తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాతగారి కలను తాను నిజం చేసినట్లు అర్ష్దీప్ వెల్లడించారు.రక్షణ రంగంలో ఫ్రంట్లైన్ ఫైటర్ విమానాలను నడిపేందుకు ఆయన మరో ఏడాది పాటు కఠినమైన శిక్షణ తీసుకోనున్నారు.ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!1998లో చండీగఢ్లో జన్మించిన అర్ష్దీప్, తన ఆరేళ్ల వయసులో కుటుంబంతో కలిసి యూకే (UK) వెళ్లారు. ప్రస్తుతం వారి కుటుంబం ఇంగ్లాండ్లోని సౌత్ ఆల్లో నివసిస్తోంది. ఆయన తండ్రి జగ్దీప్ సింగ్ డాంగ్ (లుధియానా), తల్లి గగన్దీప్ కౌర్ (అమృత్సర్). బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో గణితం మరియు తత్వశాస్త్రం (Mathematics & Philosophy) అభ్యసించిన ఆయన, 2022లో ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేశారు. 2025లో ఫాస్ట్ జెట్ శిక్షణ ప్రారంభించి, అక్టోబర్ 2025లో టెక్సాస్లో సోలో ఫ్లైట్ పూర్తి చేశారు. జులై 2026లో 'వింగ్స్ టెస్ట్'లో ఉత్తీర్ణులయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ పైలట్ ఇంద్రలాల్ రాయ్, హర్దిత్ సింగ్ మాలిక్, స్క్వాడ్రన్ లీడర్ మోహిందర్ సింగ్ పూజ్జీ సహా, బ్రిటిష్ సైనిక విమానయానంలో సేవలందించిన భారతీయ సంతతికి చెందినఈ ఘనత సాధించి భారతీయుల సరసన అర్ష్దీప్ చేరారు.ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం
సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం
సేవను జీవిత పరమార్థంగా, దాతృత్వాన్ని జీవన విధానంగా మలుచుకున్న శోభా రెడ్డి, ప్రసాద్ రెడ్డి దంపతులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. భారత్తో పాటు అమెరికాలోనూ చిన్నారులు, పేద కుటుంబాలు, వెనుకబడిన వర్గాల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.ఇటీవల కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో పాఠశాల విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఆహార రవాణా వాహనాల కొనుగోలుకు 25 వేల అమెరికన్ డాలర్ల విరాళం అందించారు. రోజూ సుమారు 15 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే లక్ష్యంతో అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించనున్న వంటశాలకు 2.5 లక్షల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. నెల్లూరు సమీపంలోని వెంకటాచలం వద్ద ఐదు ఎకరాల భూమి సమీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.అలాగే, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత పాదరక్షలు అందించే కార్యక్రమాన్ని ప్రథమ్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ప్రారంభించారు. తొలిదశలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పది కేంద్రాల్లో దీనిని అమలు చేస్తున్నారు. ఆరోగ్య సేవల్లోనూ వారి సహకారం విశేషం.చెన్నైలోని శంకర నేత్రాలయ కోసం అత్యాధునిక మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఏర్పాటుకు 5.5 లక్షల అమెరికన్ డాలర్ల విరాళం అందించారు. దీంతో ఈ యూనిట్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో నేత్ర వైద్యం, శస్త్రచికిత్సలు అందించనున్నారు. ఇప్పటికే ఏపీలో ఎనిమిది నేత్ర శిబిరాలు నిర్వహించగా, తదుపరి శిబిరాన్ని తమిళనాడులో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రసాద్ రెడ్డి శంకర నేత్రాలయ యూఎస్ఏకు బోర్డు సలహాదారుగా, బ్రాండ్ అంబాసిడర్గా సేవలందిస్తున్నారు. అలాగే, తన సంస్థ లాభాల్లో సుమారు 13 శాతాన్ని ప్రతి ఏడాది డల్లాస్ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా న్యూజెర్సీ సెనెట్, అసెంబ్లీ ఆయనను సత్కరించాయి. శంకర నేత్రాలయం ప్రతిష్ఠాత్మక ‘శంకర రత్న’ పురస్కారంతోనూ ఆయనను గౌరవించనుంది.ప్రసాద్ రెడ్డి సేవా ప్రస్థానంలో తన భార్య శోభా రెడ్డి ప్రోత్సాహం, సహకారం కీలకంగా నిలుస్తున్నాయి. చిన్నారుల సంక్షేమం, విద్య, పోషకాహారం, ఆరోగ్యం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ దంపతులు చేస్తున్న సేవలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.
బ్రిటన్ ప్రధాని సలహాదారుగా ఎన్నారై
లండన్: భారతీయ మూలాలున్న వ్యూహకర్త, మీడియా ఎగ్జిక్యుటివ్ గౌతమ్ రంగరాజన్ను బ్రిటన్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. యూకే ప్రధాని ఆయన్ను స్ట్రక్చర్ అండ్ ప్రాసెసెస్ (రాజ్యాంగ వ్యవస్థలు, వ్యవహారాలు)పై ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వార్తా సంస్థ బీబీసీలో వ్యూహకర్తగా పనిచేసిన అనుభవమున్న రంగరాజన్ ఇప్పటికే కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించారని అని యూకే ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. లేబర్ పార్టీ నేత బర్న్హామ్ గత నెల ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలన వికేంద్రీకరణ చర్యల్లో భాగంగా మ్యాంచెస్టర్లో ‘నంబర్ 10 నార్త్’ను ప్రారంభించారు. పలు ప్రభుత్వ విభాగాల పునర్వవ్యవస్థీకరణ చేపటాట్టరు.ఎవరీ గౌతమ్ రంగరాజన్?గౌతమ్ రంగరాజన్ (Gautam Rangarajan) బీబీసీలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1993లో బీబీసీ రేడియో క్లాసికల్ మ్యూజిక్లో ట్రెయినీ ప్రొడ్యూసర్గా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత బీబీసీ వేల్స్, బీబీసీ రేడియోలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2013లో గౌతమ్ రంగరాజన్ గ్రూప్ డైరెక్టర్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ పెర్ఫార్మెన్స్గా నియమితులయ్యారు. 2025 ఏప్రిల్ వరకు ఈ పదవిలో కొనసాగారు. గ్రూప్ డైరెక్టర్గా బీబీసీ మొత్తానికి సంబంధించిన వ్యూహరచనకు 10 సంవత్సరాల పాటు బాధ్యత వహించారు.2025లో బీబీసీని వీడిన తర్వాత ఫ్రీలాన్స్ కన్సల్టెంట్గా పనిచేశారు. 2025 జనవరి నుంచి గ్లైండ్బోర్న్లో బోర్డ్ ట్రస్టీగా కూడా కొనసాగుతున్నారు. టెంపుల్ చర్చ్ క్వైర్తో కలిసి ఆయన పాటలు పాడారు. అలాగే పాలీఫోనీతో పాటు వెస్ట్మినిస్టర్ అబ్బే, సెయింట్ పాల్స్ కేథడ్రల్, విండ్సర్లోని సెయింట్ జార్జ్ చాపెల్ గాయక బృందాలతో డిప్యూటీగా కూడా పనిచేశారు. రికార్డింగ్ ప్రొడ్యూసర్గా కూడా ఆయన పనిచేశారు. 2012లో విడుదలైన A Festival of Psalms అనే సీడీకి కూడా ఆయన రికార్డింగ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు.చదవండి: విజయ్ పార్టీలో చేరిన యువనేత
క్రైమ్
ఖైదీతో మహిళా ఎస్ఐ అర్దనగ్నంగా వీడియో కాల్..!
బెంగళూరు: మహిళా ఎస్ఐ, జైలులో ఖైదీతో అర్దనగ్నంగా వీడియో కాల్లో మాట్లాడడం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. సోమవారం శాసనసభలో హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడారు. ఈ వీడియో ఏడాది కిందటిదని, ఆమెకు నోటీస్ ఇచ్చి బదిలీ చేశామన్నారు. ఆమె ఇలా చేయడాన్ని సమర్థించడం లేదన్నారు. పోలీసులే ఇలాంటి పనులు చేస్తుంటే ఎలా?, పోలీస్ శాఖకు చెడ్డపేరు తెచ్చారు అని వాపోయారు. ఓ మహిళా ఎస్ఐ.. బెళగావి సెంట్రల్ జైల్లోని ఖైదీతో ప్రేమలో పడింది. అతనికి యూనిఫారంలోనే వాట్సాప్ కాల్ చేసి అర్ధనగ్నంగా కనిపించింది. ఖైదీ ఆ వీడియోను ఇతరులకు పంపడంతో వైరల్ అయ్యింది. ఆ ఎస్ఐ దీనిపై వారం కిందట బెంగళూరు కబ్బన్పార్క్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ బాగోతం వైరల్ అయ్యింది.
గుండెపోటుతో అంగన్వాడీ టీచర్ మృతి
నాగర్కర్నూల్ జిల్లా: ఆ కుటుంబంపై మృత్యువు పగబట్టింది. ఉదయం విధులకు బయలుదేరిన తల్లి బస్టాండ్లోనే అకస్మాత్తుగా మృతి చెందగా, ఈ విషాద వార్త తెలుసుకుని పరామర్శించేందుకు వస్తున్న కుమారుడు, కోడలు, అల్లుడు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో కోడలు, అల్లుడు అక్కడికక్కడే మృతి చెందారు. గంటల వ్యవధిలోనే ముగ్గురూ మృత్యువాత పడటంతో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రాయవరం గ్రామానికి చెందిన లావుడ్యా లలిత (50) గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. సోమవారం విధులకు వెళ్లేందుకు అచ్చంపేట బస్టాండ్కు చేరుకున్న ఆమె అక్కడే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అంత్యక్రియలకు వస్తూ అనంతలోకాలకు.. లలిత మృతి విషయం తెలుసుకున్న హైదరాబాద్లో నివాసముంటున్న ఆమె కుమారుడు శ్రీకాంత్, కోడలు చంద్రకళ (32), అల్లుడు నాగరాజు (35) అచ్చంపేటకు బయలుదేరారు. ముగ్గురూ ఒకే ద్విచక్రవాహనంపై వస్తుండగా నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేయబోయారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో కారు వీరి బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కోడలు చంద్రకళ, అల్లుడు నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందడంతో రాయవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీకాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు.
అమెరికా నుంచి వచ్చిన యువతి అదృశ్యం
హైదరాబాద్: అమెరికాలో నివాసం ఉంటున్న యువతి అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు..పీర్జాదిగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన బుడిగె శైలజ కుమార్తె బుడిగె విహారిక (27), అల్లుడు హరీష్ లు ఈ ఏడాది జనవరి 26 నుంచి అమెరికాలో నివసిస్తున్నారు. అయితే ఈ నెల 20న విహారిక కనిపించడం లేదంటూ భర్త కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకోగా... విహారిక అమెరికా నుంచి తన పాస్పోర్ట్తో బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆమె హైదరాబాద్కు వస్తుందని భావించి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లగా ఆమె అక్కడికి చేరుకోలేదు. అయితే ఆగస్టు 21న విహారిక ముంబై విమానాశ్రయంలో ఉన్నట్లు సమాచారం అందింది. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ కలవకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. మేడిపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు.
ప్రేయసి దూరమైందని అమెరికాలో ఆత్మహత్య..!
హైదరాబాద్: చదువుకునేందుకు అమెరికా వెళ్లిన ఓ యువకుడు ప్రేమించిన యువతి దూరం కావడంతో ఆ బాధ తట్టుకోలేక ఈనెల 21న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపిన మేరకు.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ దమ్మాయిగూడలోని శ్రీనివాస్నగర్ కాలనీకి చెందిన కృష్ణ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు సాయిప్రదీప్(29) 2024లో మాస్టర్స్ చదువు కోసం అమెరికా వెళ్లారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో తన అన్న ప్రణీత్తో కలిసి ఉంటూ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ నుండి మూడు నెలల క్రితం మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న సిద్ధిపేటకు చెందిన యువతిని ప్రదీప్ 9 నెలల పాటు ప్రేమించారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని సాయి ప్రదీప్ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముందు తల్లిదండ్రులు అంగీకరించకపోయినా చివరకు ఒప్పుకున్నారు. ఇంతలోనే ప్రేమించిన యువతి దూరంగా ఉంటోంది. సున్నిత మనస్తత్వం కలిగిన ప్రదీప్ ఇది తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న ప్రేయసికి దాదాపు పది సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. తను చేస్తున్న జాబ్ బాధ్యతలను రెండు గంటల పాటు నిర్వర్తించాలని అన్నకు అప్పగించారు. ఆ తరువాత ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఘటన గురించి తల్లిదండ్రులకు ప్రణీత్ తెలిపారు. ప్రేయసి దూరం కావడంతోనే తమ్ముడు ప్రదీప్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని అమెరికాలో పోలీసులకు ప్రణీత్ ఫిర్యాదు చేశారని మృతుని తండ్రి కృష్ణ తెలిపారు. మృతదేహాన్ని ఈ నెలాఖరులోపు తెప్పించేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇదిఆ ఉండగా ప్రదీప్కు చిన్నతనంలోనే కిడ్నీ సమస్య ఉండటంతో ఒక కిడ్నీని వైద్యులు తొలగించారు. సాయిప్రదీప్ తల్లిదండ్రులను కాంగ్రెస్ పార్టీ దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షుడు రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, బీఆర్ఎస్ నేత హరిగౌడ్ తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు.
వీడియోలు
లిక్కర్ స్కామ్ కు కారుమూరి గారికి ఏం సంబంధం లేదు.. కీలక విషయాలు బయటపెట్టిన లాయర్
YS జగన్ పాలనలో విద్యా వికాసం, ఇప్పుడు విధ్వంసం
పరందూర్ ఎయిర్ పోర్ట్ రద్దుతో కొత్త ట్విస్ట్.. చెన్నైకి మరో విమానాశ్రయం ఎక్కడ..?
కూటమి సర్కార్ పై ఉద్యోగుల దండయాత్ర...!
కొండా సురేఖకు ప్రభుత్వం బిగ్ షాక్
సంచలనం రేపుతున్న IITIANS సర్వే ... కదులుతున్న కూటమి కూసాలు
భారీ వర్షం..ఎక్కడికక్కడే ఆగిపోయిన వాహనాలు
కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్ పై వరుదు కళ్యాణి స్ట్రాంగ్ రియాక్షన్
కూటమి ఇంత దిగజారుతోంది వాళ్ల టార్గెట్ బిసీలే..! కడిగిపారేసిన విడదల రజిని
సాధిక్ ఖాన్ కి 14 రోజుల రిమాండ్

