ట్రంప్ పద్మవ్యూహం.. ఇరాన్కు తప్పని చిక్కులు?
వాషింగ్టన్: పశ్చిమాసియా రణరంగంలో ఇరాన్ను దౌత్యపరంగా, సైనిక పరంగా కట్టడి చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యూహాలు రచిస్తున్నారు. ఆ దేశాన్ని ప్రాంతీయంగా పూర్తిగా ఏకాకిని చేసేలా అమెరికా ఓ పద్మవ్యూహాన్ని సిద్ధం చేసినట్లు ‘యాక్సియోస్’ నివేదిక వెల్లడించింది.‘యాక్సియోస్’ నివేదికలో.. ట్రంప్ ప్రధానంగా మూడు కీలక అంశాలపై దృష్టి సారించారు. ఇరాన్పై యుద్ధం ముగిసిన తర్వాత పశ్చిమాసియాలో ఇరాన్ ప్రభావానికి చెక్ పెట్టేందుకు ఇజ్రాయెల్, దాని పొరుగున ఉన్న అరబ్ దేశాలతో కలిసి ఒక బలమైన ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ కూటమికి అమెరికా పూర్తిస్థాయి భద్రతా హామీ ఇవ్వనుంది.2023 అక్టోబర్ 7 నాటి దాడి తర్వాత మొదలైన సంక్షోభాన్ని సమర్థవంతంగా ముగించేందుకు ట్రంప్ బృందం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గాజా ప్రణాళిక తదుపరి దశను వేగవంతం చేయడం, ఇజ్రాయెల్ - సిరియా మధ్య కొత్త భద్రతా ఒప్పందాన్ని కుదర్చడం, ఇజ్రాయెల్ - లెబనాన్ ఒప్పందాన్ని అమలు చేయాలని చూస్తున్నారు.'అబ్రహం ఒప్పందాలను' మరింత విస్తరింపజేస్తూ ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించడమే ట్రంప్ ప్రధాన లక్ష్యం. ఇది సాకారమైతే పశ్చిమాసియా రాజకీయాల్లో అదొక మైలురాయిగా మారడమే కాకుండా, ట్రంప్కు దౌత్యపరంగా అతిపెద్ద విజయంగా నిలుస్తుంది.ట్రంప్ వ్యూహాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, వీటి అమలుకు పలు రాజకీయ అడ్డంకులు ఎదురవుతున్నాయని యాక్సియోస్ పేర్కొంది. రాబోయే ఇజ్రాయెల్ సాధారణ ఎన్నికలు, అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రభావం ఈ ప్రణాళికపై పడే అవకాశం ఉంది. ఇజ్రాయెల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు వేచి చూడకుండా, ఒకవేళ అక్కడ రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడినా తన వ్యూహంతో ముందుకు వెళ్లేందుకే ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లు అమెరికా ఉన్నతాధికారులు వెల్లడించారు.కాగా, యుద్ధానంతరం పశ్చిమాసియాలోని మిత్రదేశాలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో ట్రంప్ ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాలి.👉ఇదీ చదవండి: ఇరాన్ పికాక్స్.. ట్రంప్కు ఎందుకంత పట్టుదల?
రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి
‘నాకు జన్మ ఇవ్వమని అడిగానా అమ్మా..ఎందుకు పుట్టిన వెంటనే పేగుబంధం తెంచ్చుకొని రోడ్డుపై వదిలేసి వెళ్లావ్’ అంటూ ఒక నవజాత శిశువు మూగరోదన ఇది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును రోడ్డుపై వదిలేసి వెళ్లిన అమానుష ఘటన మహబూబ్నగర్ నగరంలో చోటుచేసుకుంది. రన్నింగ్ ఆటోలోనే ప్రసవం జరిగిన అనంతరం గుర్తుతెలియని మహిళ శిశువును రోడ్డుపై వదిలేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రక్తపు మరకలను గమనించిన వాహనదారులు వాటిని అనుసరించడంతో శిశువు ఆచూకీ లభించింది. సకాలంలో గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. నగరంలోని న్యూటౌన్ హెచ్డీఎఫ్సీ సమీపంలో శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని మహిళ ఆటోలో ప్రసవించిన అనంతరం శిశువును చీరలో చుట్టి కేఎఫ్సీ దుకాణం ఎదుట రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్తున్న వాహనదారులు రోడ్డుపై రక్తపు మరకలను గుర్తించారు. వాటిని అనుసరించగా శిశువు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నవజాత శిశువును మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూలో చికిత్స పొందుతున్నాడు. సీసీ కెమెరాల్లో రికార్డు శిశువును ఆటో నుంచి రోడ్డుపై వదిలేస్తున్న దృశ్యాలు సమీపంలోని దుకాణాల సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు పోలీసులు గుర్తించారు. వాటిని పరిశీలిస్తూ శిశువును వదిలేసిన మహిళతో పాటు ఆటో వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డుపై పడివున్న శిశువును వాహనదారులు సకాలంలో గుర్తించకపోయి ఉంటే పరిస్థితి మరింత విషమంగా మారేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ తెలిపారు. శిశువును ఎవరు వదిలేసి వెళ్లారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, సీసీ కెమెరాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.మహబూబ్నగర్ క్రైం: చదవండి: చిన్న పిల్లలు ఉన్నారన్నా.. నన్ను బతికించండి!
పాలకుల కామెడీ... ప్రజల కంటతడి!
‘‘ఏదో తెలియని ఓ యుద్ధం తరిమేసిన శరణార్థులు వీరు’’. ‘అభివృద్ధి’ ప్రాజెక్టుల కోసం నిర్వాసితులయ్యే ప్రజలను గురించి ప్రముఖ రచయిత్రి–సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్ చేసిన వ్యాఖ్యానమిది. యుద్ధం ఏనాటికైనా ముగిసి పోతుంది. మళ్లీ ఏదో ఒకనాడు తమ ఇంటికీ, తమ ఊరికీ వెళ్లిపోవచ్చుననే ఆశ యుద్ధ శరణార్థుల్లో లేశమాత్రంగానైనా ఉంటుంది. టెర్రరిజం తరిమేసిన కశ్మీరీ పండిట్లు ముప్ఫయేళ్ల తర్వాత ఇప్పుడు తమ సొంత ప్రాంతానికి వెళ్లిపోతామంటూ చెబుతున్న మాటల్ని కూడా వింటున్నాము. అభివృద్ధి ప్రాజెక్టుల నిర్వాసితులకు మాత్రం ఇటువంటి ఆశ ఉండే అవకాశమే లేదు. ‘అభివృద్ధి’ కోసం నిర్వాసితులయ్యే ప్రజలు కోల్పోయేది కేవలం తలదాచుకునే కొంపనో, చారెడు చెలకనో మాత్రమే కాదు. వారు తమ జీవన విధానాన్నే కోల్పోతారు. కనుక, వారి జీవితాన్ని పునర్నిర్మించి ఇవ్వాలనే వాదన అంతర్జాతీయంగా చాలా బలంగా ఉన్నది. ప్రాజెక్టుల కోసం అప్పులిచ్చే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, ఐఎంఎఫ్ వంటి సంస్థలు కూడా ఇటువంటి భావనకు అనుగుణంగానే పునరావాస పథకాలను రూపొందించాలని షరతులు పెడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి నిర్వాసితుల విషయాన్ని మానవ హక్కుల సమస్యగా పరిగణిస్తున్నది.పల్లెలో మన ఇల్లంటే కేవలం నాలుగు గోడలే కాదు. తర తరాలుగా ఆ ఇంటితో పెనవేసుకున్న బంధం. కష్టసుఖాల కలబోత జ్ఞాపకాలు. సాగు నేలపై గుండెల్లో దాచుకున్న మమకారం. ఆ నేల మీద తాతలు–తండ్రులు తర్పణ చేసిన ఘర్మజలం. ఊరుమ్మడి బతుకుల్లో చిగురించిన తోడు–నీడలు, కలిసి చేసుకున్న పండుగలూ పబ్బాలు, ఊరి బడి, గుట్టమీది గుడి, చెట్టూ–పుట్టలతో కుదిరిన చిన్ననాటి స్నేహం, ఉపాధి– ఉద్యోగం... వీటన్నింటినీ నిర్వాసితులు కోల్పోతారు. అభివృద్ధి అనే ఎజెండాను అమలు చేయడం కోసం జీవితాలను త్యాగం చేస్తున్న ప్రజలకు తిరిగి అటువంటి సంపూర్ణ జీవనాన్ని పొందే హక్కు ఉన్నదని అప్పులిచ్చే అంతర్జాతీయ సంస్థలు కూడా చెబుతున్నాయి. అయితే సమాజ విస్తృత ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు తప్పనిసరి కనుక, వాటిని డిజైన్ చేసేటప్పుడే నిర్వాసితుల సమస్య ఉత్పన్నం కాకుండా ఆలోచించాలనీ, కుదరకపోతే వారి పునరావాస పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రపంచవ్యాప్తంగా నేడు అంగీకారయోగ్యమైన అంశంగా మారింది.మొన్నటి సోమవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక భావోద్వేగపూరిత రసాభినివేశాన్ని రక్తి కట్టించడానికి చాలా ప్రయాసపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల నుంచి నల్లమలసాగర్ ఫీడర్ ఛానల్కు కృష్ణా నీటిని విడుదల చేస్తూ ఆ జలాలకు సాష్టాంగ ప్రణామాన్ని ఆచరించారు. ముప్ఫయ్యేళ్ల కింద ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది తానేనని, ఇప్పుడు పూర్తి చేసింది కూడా తానేనని ఆయన ప్రకటించుకున్నారు. 1996లో జరిగిన లోక్సభ ఎన్నికలకు సుమారు నెల రోజుల ముందు (బహుశా మార్చిలో) కమ్యూ నిస్టు పార్టీల ఆందోళన కారణంగా శంకుస్థాపన రాయిని చంద్రబాబు వేశారు. ఎన్నికలు ముగిసిన కొద్ది కాలానికే కనిగిరిలో జరిగిన ఒక సభలో వెలిగొండ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని కూడా చంద్రబాబు ప్రకటించిన వైనాన్ని అదే కమ్యూనిస్టు నేతలు ఎత్తి చూపుతున్నారు. దాదాపుగా అదే కాలంలో యర్రగొండపాలెం సభలో వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు చేసిన ప్రకట నను అప్పట్లో ఆ సభను కవర్ చేసిన సీనియర్ పాత్రికేయులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. వ్యవసాయం దండగ అనే మానసిక ధోరణితో పాటు వెలిగొండ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదనే అభిప్రాయం బాబులో బలంగా ఉన్నందువల్లనే, ఆ తర్వాత ఎనిమిదేళ్లు అధికారంలో కొనసాగినా వెలిగొండపై ఒక్క అడుగూ ముందుకేయకుండా చాపచుట్టేశారు.వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించడానికి కంకణం కట్టుకున్న రాజశేఖరరెడ్డే వెలిగొండ ప్రాజెక్టు ఆచరణ సాధ్యమేనని నిరూపించడానికి సంకల్పం చెప్పుకున్నారు. ఒక్క సొరంగాన్ని తవ్వితే ప్రాజెక్టు ద్వారా ఆశించిన ప్రయోజనం నెర వేరదని భావించి జంట సొరంగాలను ఆయన డిజైన్ చేశారు. రెండు సొరంగాలు కలిపి మొత్తం నిడివి 37 కిలోమీటర్లు. ఇందులో ఇరవై కిలోమీటర్లకు పైగా వైఎస్సార్ జమానాలోనే పూర్తయింది. ఈ ముప్ఫయేళ్లలో పదిహేనేళ్లకు పైగా ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబు కాలంలో సొరంగ మార్గం ఏడు కిలోమీటర్లు మాత్రమే సాగింది. ఆ తర్వాత ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్ హయాంలో పది కిలోమీటర్లకు పైగా సాగి సొరంగ మార్గం పూర్తయింది. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జంట సొరంగాలు ప్రధానమైన భాగం. ఈ ప్రధాన భాగాన్ని పూర్తి చేసినందుకు గుర్తుగా జగన్మోహన్ రెడ్డి అక్కడొక పైలాన్ను ఆవిష్కరించారు.పైలాన్ వేసినందుకు జగన్ను ఎద్దేవా చేస్తున్న ముఖ్యమంత్రి ఈ 27 నెలల కాలంలో ఏం ఘనకార్యం చేశారని వెలిగొండను పూర్తి చేశాననే ఖ్యాతిని తగిలించుకుంటున్నారు! ఇతరులు చేసిన పనిని తన ఖాతాలో వేసుకునే క్రెడిట్ చోరీ తాపత్రయంగా ఈ వ్యవహారాన్ని పరిగణించవలసి వస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన పనులన్నీ అంతకుముందే పూర్తయ్యాయి. రిజర్వాయర్ సిద్ధంగా ఉన్నది. జంట సొరంగాల నుంచి నల్లమల సాగర్కు నీటిని తరలించే ఫీడర్ చానల్ పూర్తయింది. సాగర్ దిగువన నీటిని తరలించే మూడు ప్రధాన కాలువలు కూడా ఎప్పుడో సిద్ధమయ్యాయి. ఇక ఈ కాల్వల నుంచి పంటపొలాలకు నీటిని తరలించే డిస్ట్రిబ్యూట రీల తవ్వకం మాత్రం ఇంకా మిగిలి ఉన్నది. అన్నిటికంటే అతి ముఖ్యమైన పునరావాస పథకం కింద జగన్ హయాంలోనే మెరుగైన ప్యాకేజీ సిద్ధమైంది.అంతకుముందు నిర్ణయించిన నష్టపరిహారాన్ని భారీగా పెంచుతూ జగన్ సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 11 గ్రామాల్లో 7,318 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించి అందులో 96 కుటుంబాలకు పునరావాసాన్ని కూడా పూర్తి చేశారు. మిగిలిన 7,222 కుటుంబాల కోసం 1,301 కోట్ల రూపా యలను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో పునరావాసం కోసం ఏర్పాటైన కాలనీల్లో రోడ్లు, విద్యుత్ లైన్లు వంటి మౌలిక వసతులను కల్పించారు. ఈలోగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పునరావాస కార్యక్రమాలను అట కెక్కించి 26 నెలలు కాలయాపన చేసింది. సోమవారం నాడు వెలిగొండ భుజకీర్తులను చంద్రబాబు తగిలించుకోవడానికి సరిగ్గా వారం రోజుల ముందు అరకొర పరిహారంగా 760 కోట్లను ముట్టచెప్పి తక్షణమే వారంతా ఊళ్లు విడిచిపోవాలని బలవంతం చేశారు. ఖాకీసేనను రంగంలోకి దించారు. అనా రోగ్యంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారిపైన కూడా కనికరం చూపలేదు.పునరావాస కాలనీల్లో కనీసం ఒక చిన్న గూడు వేసుకునే అవకాశాన్ని కూడా నిర్వాసితులకు ఇవ్వలేదు. ప్రభుత్వం స్వయంగా ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. కొంతమంది మార్కాపురం, దాని పరిసర ప్రాంతాల పరిచయస్తుల పంచన తాత్కాలిక సర్దుబాటు చేసుకున్నారు. ఎక్కువ మంది మాత్రం ఎక్కడికి వెళ్లాలో తెలియక కాలనీల్లో తమకు కేటాయించిన ప్లాట్ల దగ్గర సామాన్లు పెట్టుకొని, గొడ్డూగోదాను అక్కడే కట్టేసుకొని వర్షం పడితే దేవుడే దిక్కనుకుంటూ మూడు నాలుగు రోజులు పడిగాపులు పడ్డారు. వేలాది బతుకులు నడివీధిన పడిన ఇంతటి మానవతా సంక్షోభంలో సర్కార్ వైపు నుంచి పట్టించు కున్న నాథుడే లేడు. యుద్ధ శరణార్థులు కూడా ఇంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొని ఉండరు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పంచిన నష్టపరిహారం సొమ్మును నిర్వాసితులు ఎంతకాలం నిలబెట్టుకో గలరు? ఈమధ్య కాలంలో పద్దెనిమిదేళ్లు దాటిన వారిని, పెళ్లిళ్లు చేసుకొని ఏర్పడిన కొత్త కుటుంబాలను పరిగణనలోకి తీసు కోకుండా అదనంగా ఇంకో రెండు లక్షలిస్తామనే వాగ్దానం మాత్రం చేశారు. అసలు పరిహారానికే ఎసరుపెట్టిన సర్కార్ ఈ కొసరు వేస్తుందన్న నమ్మకం నిర్వాసితుల్లో ఏమాత్రం కనిపించడం లేదు. ఆగమేఘాలమీద నిర్వాసితుల్ని తరిమేసి ప్రభుత్వం సాధించదలుచుకున్నదేమిటో తెలుసా?... క్రెడిట్ చోరీ! రైతులకు ఇప్పు డప్పుడే నీళ్లిచ్చే అవకాశమే లేదు. ఎప్పుడో పూర్తయిన కాల్వలకు అవసరమైన మరమ్మతులు చేయకుండా, అసలు డిస్ట్రిబ్యూట రీలే తవ్వకుండా పంట చేలకు నీళ్లెట్లా ఇస్తారు? ప్రాజెక్టు తొలి దశకు నీళ్లివ్వడానికి ఎంతలేదన్నా ఏడాదికి పైగా పడుతుందని విశ్వసనీయ సమాచారం. ఈలోగా రిజర్వాయర్లోకి ఒకటో రెండో టీఎమ్సీల నీళ్లను వదిలి ఫొటోలు తీసి వెలిగొండ వెలుగులివిగో అంటూ ప్రచారం చేసుకుంటారు. ఈ నకిలీ క్రెడిట్ కోసం వేలాది కుటుంబాలను నిర్దయంగా వీధిపాల్జేశారు. మానవీయ విలు వల్ని ఉక్కుపాదాలతో నలిపేశారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసినట్టు రాష్ట్ర సర్కార్ మరో నాటకాన్ని రక్తి కట్టించింది. పోల వరం ప్రాజెక్టు పూర్తయిందని ఇప్పుడు యావదాంధ్ర జనులు నమ్మాలన్నమాట. పోలవరం ప్రాజెక్టుకు దిగువన ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా వైఎస్సార్ తవ్వించిన ఎడమ కాల్వలోకి 3,500 క్యూసెక్కుల ప్రవాహాన్ని ఎత్తిపోశారు. ఇదే పోలవరం నెత్తిన చల్లుకోండని సెలవిస్తున్నారు. పాయక రావుపేటలో కూడా చంద్రబాబు గోదావరి జలాలకు సాష్టాంగ ప్రణామాన్ని ఆచరించారు. అక్కడక్కడా కొన్ని అక్విడెక్టులు, బ్రిడ్జీలను నిర్మించడం మినహా ఎడమ కాల్వ పనుల్ని ఈ సర్కార్ ముందుకు తీసుకొని పోయిందేమీలేదు. లక్షలాది ఎకరాలకు సాగునీటితోపాటు విశాఖ నగరం మంచినీటి అవసరాలనూ, పారిశ్రామిక అవసరాలనూ ఎడమకాల్వ తీర్చవలసి ఉన్నది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా దీనిపైనే అధారపడి ఉన్నది. భారీ గంగాళంలో చెంబెడు నీళ్లుపోసి ఉత్తరాంధ్ర ప్రజలను పండుగ చేసుకొమ్మని సెలవిస్తున్నారు. పాయకరావుపేట దాకా కాల్వ సమీపంలోని జలాశయాలకు నీటిని తరలించడానికి అవసరమైన పాసేజ్లు కూడా సిద్ధంగా లేవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన నాటక్ బాజీ సర్కార్ చర్యలను విదూషకత్వమనాలో, క్రూరత్వం అనాలో అర్థం కావడం లేదు. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
చిన్న పిల్లలు ఉన్నారన్నా.. నన్ను బతికించండి!
కర్నూలు: ఓ వైపు రక్తమోడుతున్నా ఇంటి వద్ద ఉన్న భార్యా పిల్లలను గుర్తు చేసుకుంటూ.. ‘అన్నా.. నన్ను రక్షించండి.. నాకు చిన్న పిల్లలన్నా’ అంటూ విలపించాడు. కదలలేనిస్థితిలో ఇరుక్కుపోయినా ‘మా ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడాలా’ అంటూ విలవిలలాడాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ క్షతగాత్రుని వేదన అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై మంగంపల్లె స్టేజీ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వాహన డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు ఐరన్ మెటీరియల్ లోడ్తో వెళ్తున్న లారీ మంగంపల్లె స్టేజ్ వద్ద టైర్ బరస్ట్ అయ్యి రహదారికి కుడి వైపు డివైడర్ పక్కనే నిలిచిపోయింది. లారీ డ్రైవర్ కిందకు దిగి పరిస్థితిని చూసి 1032 ద్వారా సమాచారమిచ్చాడు. అయితే నిమిషాల వ్యవధిలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఐచర్ వాహ నం లారీని ఢీకొంది. దీంతో ఐచర్ వాహన డ్రైవర్ తాడిపత్రికి చెందిన నాగేంద్ర (35) డ్రైవింగ్ సీటులోనే ఇరుక్కుపోయాడు. వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న హైవే పోలీసులు ఆనంద్, శివ, హైవే అంబులెన్స్ సిబ్బంది, క్రేన్ సిబ్బంది ఇరుక్కుపోయిన డ్రైవర్ను దాదాపు గంటపాటు శ్రమించి బయటకు తీశారు. ఆ సమయంలో డ్రైవర్ ‘త్వరగా తీయండన్నా.. తట్టుకోలేకపోతున్నాను.. నాకు చిన్న పిల్లలన్నా.. మా ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడాలి’ అంటూనే సృహ కోల్పోతుండడం అక్కడి వారి హృదయాలను కలచివేసింది. అతి కష్టం మీద బయటకు తీయగా అప్పటికే తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. చదవండి: రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి
ప్రభాస్తో టాలీవుడ్ హీరో ఢీ.. పెద్ద సాహసమే..!
‘పాలు, పెరుగు అమ్మినట్టు టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు’
మోదీ ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలు.. ప్రధానికి సీజేపీ కౌంటర్!
పిచ్చికుక్క కాటుకు రిన్తో శుభ్రం చేస్తారా?
పసిడి ప్రియులకు ఊరట.. ఈ రోజు ధరలు ఇలా..
మతిమరుపు నివారణ ఇలా..!
ఎదురుగా షార్క్.. సముద్రంలో భయానక దృశ్యం
పాక్ క్రికెట్లో కలకలం.. ఆటగాళ్ల మొబైల్స్ లాక్కున్న పీసీబీ!
మీర్జాపూర్ సిరీస్ మాత్రమే కాదు.. సినిమా కూడా..!
గడ్డం ఉంటే గమ్మత్తే! అస్సలు తగ్గేదేలే!!
కృష్ణాష్టమి స్పెషల్.. అనుసూయ డ్యాన్స్ వైరల్
ఈసారి ప్రారంభోత్సవానికి హెల్మెట్, స్విమ్సూట్ తప్పనిసరి సార్!
.. రెండో స్థానం ఏంటి సార్!మనమెప్పుడూ నెంబర్ 1 స్థానంలో ఉంటాం.. అంతే!
జియో రూ.55 రీచార్జ్ ప్లాన్: బెనిఫిట్స్ ఇవే..
ఇక రాజకీయాలకు గుడ్ బై.. అయ్యన్నపాత్రుడు
వచ్చేస్తోంది సూపర్ ఎల్నినో!
సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!
సాక్షి కార్టూన్: 04-09-2026
రోడ్డు కింద 20 వేల పాత టైర్లు.. ఎందుకు పాతిపెట్టారంటే?
గంజాయి వాసన వస్తుందని మ్యాచ్ను ఆపిన సబలెంకా
సాక్షి కార్టూన్: 05-09-2026
‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది’
డబ్బు త్వరగా చేతికి రావాలంటే?..కియోసాకి పెట్టుబడి విధానం!
వాటిని మర్చిపోలేక ఇప్పుడు డీఎస్సీ దెబ్బలతో రియాక్షన్ చూపిస్తున్నారా సార్!
ముక్కుతో ఒకేసారి 10 చేపలు పట్టే ఈ పక్షిని గురించి విన్నారా?
చెదల బెడదకు ఇంట్లోనే పరిష్కారం.. ఈ పద్ధతులు ట్రై చేయండి!
అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
ఎప్పుడూ విమానంలో ఉంటారు.. ఎంత సంపాదిస్తారు?
ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి
ప్రభాస్తో టాలీవుడ్ హీరో ఢీ.. పెద్ద సాహసమే..!
‘పాలు, పెరుగు అమ్మినట్టు టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు’
మోదీ ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలు.. ప్రధానికి సీజేపీ కౌంటర్!
పిచ్చికుక్క కాటుకు రిన్తో శుభ్రం చేస్తారా?
పసిడి ప్రియులకు ఊరట.. ఈ రోజు ధరలు ఇలా..
మతిమరుపు నివారణ ఇలా..!
ఎదురుగా షార్క్.. సముద్రంలో భయానక దృశ్యం
పాక్ క్రికెట్లో కలకలం.. ఆటగాళ్ల మొబైల్స్ లాక్కున్న పీసీబీ!
మీర్జాపూర్ సిరీస్ మాత్రమే కాదు.. సినిమా కూడా..!
గడ్డం ఉంటే గమ్మత్తే! అస్సలు తగ్గేదేలే!!
కృష్ణాష్టమి స్పెషల్.. అనుసూయ డ్యాన్స్ వైరల్
ఈసారి ప్రారంభోత్సవానికి హెల్మెట్, స్విమ్సూట్ తప్పనిసరి సార్!
.. రెండో స్థానం ఏంటి సార్!మనమెప్పుడూ నెంబర్ 1 స్థానంలో ఉంటాం.. అంతే!
జియో రూ.55 రీచార్జ్ ప్లాన్: బెనిఫిట్స్ ఇవే..
ఇక రాజకీయాలకు గుడ్ బై.. అయ్యన్నపాత్రుడు
వచ్చేస్తోంది సూపర్ ఎల్నినో!
సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!
సాక్షి కార్టూన్: 04-09-2026
రోడ్డు కింద 20 వేల పాత టైర్లు.. ఎందుకు పాతిపెట్టారంటే?
గంజాయి వాసన వస్తుందని మ్యాచ్ను ఆపిన సబలెంకా
సాక్షి కార్టూన్: 05-09-2026
‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది’
డబ్బు త్వరగా చేతికి రావాలంటే?..కియోసాకి పెట్టుబడి విధానం!
వాటిని మర్చిపోలేక ఇప్పుడు డీఎస్సీ దెబ్బలతో రియాక్షన్ చూపిస్తున్నారా సార్!
ముక్కుతో ఒకేసారి 10 చేపలు పట్టే ఈ పక్షిని గురించి విన్నారా?
చెదల బెడదకు ఇంట్లోనే పరిష్కారం.. ఈ పద్ధతులు ట్రై చేయండి!
అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
ఎప్పుడూ విమానంలో ఉంటారు.. ఎంత సంపాదిస్తారు?
ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి
ఫొటోలు
పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)
'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)
'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)
రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)
‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ఇంద్రగిరిపై వరలక్ష్మీవ్రత శోభ (ఫోటోలు)
విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)
సినిమా
బూతు సినిమాలకు లేని ఇబ్బంది ఈ సినిమాలకు ఎందుకు?
జానకిరాం మారెల్ల దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య, ఆర్. నారాయణమూర్తి సెన్సర్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎక్కువ మంది చదివింది: పిచ్చి సినిమా అన్నవాల్లే చీఫ్ గెస్ట్లుగా వచ్చారు: అల్లరి నరేశ్సినిమాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు‘సెన్సార్ విషయంలో సినిమాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఓటీటీలలో ఎలాంటి సెన్సార్ లేకుండానే కంటెంట్ వస్తోంది. మరి తెరపై వచ్చే సినిమాలకు సెన్సార్ ఆంక్షలు ఎందుకు?. సినిమాల విషయంలో రాజకీయాలు మానుకోవాలి. ప్రభుత్వం, సెన్సార్ బోర్డు పెద్దలు కఠినమైన ఆంక్షలు పెట్టకుండా సినిమా వాళ్ల కష్టాలు కూడా అర్థం చేసుకోవాలి. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అయ్యారు. కానీ ఏ రాజకీయ నేత సినిమాల్లోకి వచ్చి సూపర్స్టార్ కాలేదు. ప్రతి తెలుగు సినిమా సెన్సార్ ఇబ్బందుల్లో పడుతోంది’ అని దర్శకుడు వీఎన్ ఆదిత్య సంచలన వ్యాఖ్యలు చేశారు.షాక్ అయ్యా‘కామ్రేడ్ అనే పదం సెన్సార్ వాళ్లు వద్దంటే షాక్ అయ్యా. అసలు ఈ పదం అర్థం తెలుసా ఎవరికైనా? కామ్రేడ్ అంటే ఒక అమ్మ. ఒకే భావజాలంతో ఒకే లక్ష్యంతో.. ఓకే జీవనశైలితో ప్రజల కోసం వారి జీవితాలను వదిలేస్తారో వాళ్లే కామ్రేడ్స్. కామ్రేడ్ అని పిలుచుకోవడం మన అదృష్టం. అందువల్ల ఈ పదంపై సెన్సార్ వాళ్లు ఇబ్బందులు పెట్టవద్దు. కొన్ని సినిమాల్లో బూతులు ఉన్నా వదిలేస్తున్నారు. మరికొన్ని సినిమాలు మంచిగా ఉన్నా ఇబ్బందులు పెడుతున్నారు’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఇదీ చదవండి: తగ్గని ‘ఇరుముడి’ ఫీవర్.. ట్రాక్టర్లతో పోటెత్తిన ప్రేక్షకులు
బిగ్బాస్ తొలి కంటెస్టెంట్.. రైతుబిడ్డ ఝాన్సీ
బిగ్బాస్ సీజన్10 మరి కొద్ది గంటల్లో బుల్లితెర ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. రేపు (సెప్టెంబర్ 6) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి తొలి కంటెస్టెంట్ ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి బిగ్బాస్లోకి వెళ్లేందుకు సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా పెద్దపీట వేశారు. ఇలా ఇప్పుడు ‘అగ్నిపరీక్ష’ నుంచి మెయిన్ బిగ్బాస్ హౌస్లోకి వెళ్లే తొలి కంటెస్టెంట్గా రైతుబిడ్డ, జానపద గాయని ఝాన్సీ ఎంపికై ఛాన్స్ కొట్టేసింది.ఎక్కువ మంది చదివింది: కీర్తి సురేశ్, నాని డ్యాన్స్ వైరల్.. ఈసారి క్రాస్ ఓవర్ వీడియోఅగ్నిపరీక్ష నుంచి బిగ్బాస్ హౌస్లోకి..బిగ్బాస్ తెలుగు-10లో సామాన్యులకు అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ సీజన్-2ను నిర్వహించారు. ఇందులో 15 మంది సామాన్యులు పోటీపడ్డారు. వారిలో సింగర్ ఝాన్సీ తన ఆటతీరు, పాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అగ్నిపరీక్షలో ఆమె చూపిన ప్రతిభ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఆమెనే మెయిన్ బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టే తొలి కంటెస్టెంట్గా ఎంపికైంది. ‘తొలి అడుగు పడింది. ఇప్పుడు బిగ్బాస్ 10 వేదికపైకి అడుగు పెట్టబోతున్నాను. ఈ ప్రయాణంలో ఇంతవరకు నన్ను ముందుకు నడిపించిన మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలే నా అసలైన బలం. మీ ఆశీస్సులు నాకు కొండంత బలం. ఇక నా ఆటతో… మన పాటతో… మిమ్మల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాను. మీ ప్రేమ, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నా ప్రతి అడుగులో మీ ప్రోత్సాహం కావాలి’ అని ఇన్స్టా వేదికగా ఝాన్సీ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Gundeboina jhansi (@singer_jhansi)
బిగ్ బాస్ 10 ఎంట్రీ పై ఆటో రాంప్రసాద్ క్లారిటీ!
బిగ్బాస్ సీజన్ 10 మరికొన్ని గంటల్లో(సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు) ప్రారంభం కానుంది. అయితే ఎప్పటి మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ లీకైంది. పలువురి సెలెబ్రెటీల పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వారిలో జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ సారి ఆయన హౌస్లో సందడి చేయబోతున్నాడు. అయితే బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీపై రాంప్రసాద్ డైరెక్ట్గా స్పందించలేదు కానీ.. పరోక్షంగా ఎప్పుడో హింట్ ఇచ్చాడు. కొత్తగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన బిగ్బాస్లోకి వెళ్తున్నాడనే విషయం దాదాపు కన్ఫామ్ అయిపోయింది. తాజాగా తన ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు రాంప్రసాద్. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్ట్ పెడుతూ.. తనకు సపోర్ట్ చేయాలని కోరాడు.(చదవండి: బిగ్బాస్ 10: ఈ సారి హౌస్లోకి వెళ్లేది వీళ్లే?)కొత్త చాప్టర్ ప్రారంభం.. బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్న నేపథ్యంలో తాజాగా తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నాడు. అనంతరం తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..‘జబర్దస్త్ నుంచి ఇప్పటివరకు నా కామెడీని ఎంజాయ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. జబర్దస్త్ జర్నీ నాకు చాలా స్పెషల్. మీ ప్రేమ సపోర్ట్ కారణంగానే నేను ఈరోజుకి స్థాయిలో ఉన్నాను… ఇప్పుడు నా జీవితంలో మరొక కొత్త చాప్టర్ ప్రారంభం కాబోతోంది. ఈ జర్నీలో కూడా మీ సపోర్ట్ ఇలాగే నా ఉండాలని కోరుకుంటున్నాను. చేంజ్ ఏదైనా మీకోసం ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా’ టీట్ చేశాడు. దీంతో ఆయన బిగ్బాస్లోకి వెళ్తున్నాడనే వార్త నిజమని తేలిపోయింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం హౌస్లోకి వెళ్లేవరకు అధికారికంగా చెప్పకూడదు.అందుకే రాంప్రసాద్ ఇలా పరోక్షంగా తన ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఈ సారి రాంప్రసాద్తో పాటు మరో జబర్దస్త్ కమెడియన్ నరేశ్ కూడా హౌస్లోకి వెళ్తున్నట్లు సమాచారం. వీరితో పాటు యాంకర్ వర్షిణి, పల్లవి గౌడ, యూట్యూబర్ నందు, నటుడు టెంపర్ వంశీ, వినాయుకు మూవీ హీరో కృష్ణుడు, 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ఫేమ్ దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం ముఖేష్ గౌడ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. #Jabardasth nunchi ippati varaku naa comedy ni enjoy chesi, nannu support chesina prathi okkariki heartfelt THANK YOU ❤️🙏Aa journey naaku chala special… mee love & support valle ee roju nenu ee stage lo unna!Ippudu life lo oka new chapter start avvabothundi… ee journey lo… pic.twitter.com/gwOp7wLQmZ— Jabardasth Ram Prasad (@RamPrasadAuto) September 5, 2026
ఆ ప్రేక్షకులంతా ఏమైపోయారనిపించింది– కార్తీ
‘‘స్పై బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే చాలా చిత్రాలు మన దేశం బయట జరిగే ఆపరేషన్స్ నేపథ్యంలో ఉంటాయి. కానీ ‘సర్దార్ 2’ మన దేశం లోపల మన కోసం గూఢచారులు చేసే సాహసాల నేపథ్యంలో ఉంటుంది’’ అని కార్తీ చెప్పారు. కార్తీ హీరోగా నటించిన సినిమా ‘సర్దార్ 2’. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో కార్తీ చెప్పిన విశేషాలు.→ ‘సర్దార్’లో వాటర్ కాన్సెప్ట్కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. మన జీవితాల్లోని ఓ ముఖ్యమైన అంశాన్ని ‘సర్దార్ 2’లో ప్రస్తావించాం. ఆ అంశాన్ని తెరపై చూస్తేనే బాగుంటుంది. ఈ సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. నాకు యాక్షన్ అంటే ఇష్టం. డ్యాన్స్ అంటే భయం (సరదాగా..). ‘సర్దార్ 2’లో తండ్రీకొడుకులు ఓ మిషన్ కోసం కలిసి పని చేస్తారు. తండ్రీకొడుకుగా నటించాను. ఇలా ఒకేసారి రెండు పాత్రలు చేయడం సవాల్గా అనిపించింది. అలాగే ఓపికతో మేకప్ వేసుకోవాల్సి వచ్చేంది.→ నాగార్జున అన్నయ్యతో నాకు మంచి అనుబంధం ఉంది. ‘సర్దార్’ చిత్రం తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా రిలీజ్ అయింది. ‘సర్దార్ 2’ కూడా ఆ సంస్థ ద్వారానే రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది.→ ‘సత్యం సుందరం’ సినిమా థియేటర్స్లో సరిగ్గా ఆడలేదు. చాలా బాధగా అనిపించింది. కానీ ఓటీటీలో మంచి స్పందన లభించింది. అయితే ఒకప్పుడు ‘స్వాతిముత్యం’, ‘శంకరాభరణం’ వంటి చిత్రాలను ప్రేక్షకులు బ్లాక్ బస్టర్స్ చేశారు. ఆ ప్రేక్షకులంతా ఇప్పుడు ఏమైపోయారని నాకు బాధగా అనిపించింది. → తమిళనాడులో రాజకీయాల పరంగా జనరేషనల్ షిఫ్ట్ జరిగిందని అనుకుంటున్నాను. నేటి తరం ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా యాక్టర్స్గా మేం మారుతున్నాం. అలానే పొలిటీషియన్స్ నెక్ట్స్ జనరేషన్కు అడాప్ట్ అవ్వాలి. ఇక సినిమాలు వద్దని విజయ్గారు నిర్ణయించుకుని, ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వెళ్లారు. అలాంటి అంకితభావంతో ఎవరు వచ్చినా వారికి ప్రత్యేకమైన జర్నీ ఉంటుంది. అయితే మా అన్నయ్య (హీరో సూర్య) చెప్తుంది ఏంటంటే... ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయాలు మాత్రమే మార్గం కాదు. మా అగరం ఫౌండేషన్ నుంచి దాదాపు 8 వేలమంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. → తెలుగులో కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాను. ‘హిట్ 4’కి చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో ‘మార్షల్’ సినిమా చేస్తున్నాను.
క్రీడలు
భారీ మైలురాయిని తాకనున్న షమీ
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తన కెరీర్లో ఓ భారీ మైలురాయిని తాకనున్నాడు. ఆదివారం సౌత్ జోన్తో మొదలయ్యే దులీప్ ట్రోఫీ ఫైనల్ అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 100వ మ్యాచ్ కానుంది. ఈ టోర్నీలో షమీ ఈస్ట్ జోన్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.షమీ ఇప్పటివరకు 99 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 382 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ 8-90గా (ఇన్నింగ్స్లో) ఉంది. ప్రస్తుత దులీప్ ట్రోఫీలో షమీ ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు.ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉన్న షమీ రీఎంట్రీ కోసం చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా టీమిండియా సెలెక్టర్లు అతడిని కనికరించడం లేదు. 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్కు ముందు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (అతడి రంజీ జట్టు అసోసియేషన్) షమీని సత్కరించింది. అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంతకం చేసిన 100వ నంబర్ జెర్సీని బహుకరించింది. ఈస్ట్ జోన్ సహచరులు కూడా సంతకాలు చేసిన జెర్సీని షమీకి బహుకరించారు.MOHAMMED SHAMI 100* 🇮🇳- A special gift from Cricket Association of Bengal for Mohammed Shami.Indian legend will be playing his 100th First Class matches tomorrow. pic.twitter.com/SVwDBKsL9p— Johns. (@CricCrazyJohns) September 5, 2026షమీ తన 100వ మ్యాచ్పై స్పందిస్తూ, ఈ ప్రయాణం హార్డ్ వర్క్, సవాళ్లు, నేర్చుకోవడం, మరచిపోలేని జ్ఞాపకాలతో సాగిందని అన్నాడు. ఈ ప్రత్యేక మైలురాయికి తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, కోచ్లు, సహచరులు, అభిమానులతో పాటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కు కృతజ్ఞతలు తెలిపాడు.చదవండి: పాకిస్తాన్ మ్యాచ్లో చరిత్ర సృష్టించిన షఫాలీ.. సరికొత్త ప్రపంచ రికార్డులు
పాకిస్తాన్ మ్యాచ్లో చరిత్ర సృష్టించిన షఫాలీ.. సరికొత్త ప్రపంచ రికార్డులు
మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా నిన్న జరిగిన గ్రూప్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో 6 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 12 పరుగులు చేసిన ఆమె.. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు (2182 బంతులు) పూర్తి చేసిన బ్యాటర్గా నిలిచింది. ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలిస్సా హీలీ పేరిట ఉండేది.22 ఏళ్ల 220 రోజుల వయసులో 3000 టీ20 పరుగులు పూర్తి చేసిన షఫాలీ, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా కూడా రికార్డు సృష్టించింది. పై రెండు ప్రపంచ రికార్డులే.2019లో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన షఫాలీ, 3000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత మహిళా క్రికెటర్గానూ నిలిచింది. ఆమెకు ముందు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ఈ ఘనత సాధించారు.భారత్ ఘన విజయందుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా పాక్ను 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్ దశలో మూడు మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించి అజేయంగా సెమీఫైనల్కు చేరింది.చెలరేగిన స్పిన్నర్లుఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు శ్రీచరణి (4-0-7-3), ప్రేమా రావత్ (4-0-9-3), దీప్తి శర్మ (3.1-0-5-2), షఫాలీ వర్మ (3-0-10-1) చెలరేగిపోయారు. చదవండి: శ్రీ చరణి ప్రపంచ రికార్డు.. 55 పరుగులకే పాక్ ఆలౌట్
ప్రిక్వార్టర్స్లో అల్కరాజ్
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ దూసుకుపోతున్నాడు. మూడో రౌండ్లో అలవోక విజయంతో అతను ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఈ పోరులో అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–4, 6–1తో వు యిబింగ్ (చైనా)పై ఘన విజయం సాధించాడు. 2 గంటల 20 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో అల్కరాజ్ 6 ఏస్లు, 21 విన్నర్లు కొట్టాడు. 2021 చాంపియన్, ఏడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) కూడా ముందంజ వేశాడు. మూడో రౌండ్లో అతను 6–4, 6–4, 6–4తో ఆర్థర్ రిండర్నెక్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. పురుషుల విభాగంలో 8వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా), 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియాఫో (అమెరికా), సిట్సిపాస్ (గ్రీస్) కూడా ప్రిక్వార్టర్స్కు చేరగా... 15వ సీడ్ అలెగ్జాండర్ బబ్లిక్ (కజకిస్తాన్) మూడో రౌండ్లో ఓడి నిష్క్రమించాడు. షెల్టన్ 7–6 (7/3), 6–7 (5/7), 6–3, 6–4 స్కోరుతో డెనిస్ షపలోవ్ (కెనడా)పై, టియాఫో 6–4, 6–2, 6–4తో వలెంటైన్ వాకెరట్ (మొనాకో)పై, సిట్సిపాస్ 2–6, 6–1, 7–6 (7/3), 6–1తో జిరి లెహెకా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. బబ్లిక్ను 6–4, 3–6, 6–7 (4/7), 6–1, 6–3తో టామీ పాల్ (అమెరికా) ఓడించాడు. సెరెనా–వీనస్ జోడి ఓటమి మహిళల సింగిల్స్లో వింబుల్డన్ చాంపియన్, 6వ సీడ్ లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్స్కు చేరగా, 9వ సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) మూడో రౌండ్లో ఓడి వెనుదిరిగింది. నొస్కోవా 6–2, 6–7 (6/8), 6–2తో యాన్ లీ (అమెరికా)ను, స్వితోలినా (ఉక్రెయిన్) 3–6, 6–2, 3–6తో అనా కలినస్కియా (రష్యా) చేతిలో ఓటమిపాలైంది. మహిళల డబుల్స్ అమెరికా స్టార్ సిస్టర్స్ వీనస్ విలియమ్స్–సెరెనా విలియమ్స్ తొలి రౌండ్లోనే ‘సూపర్ టైబ్రేక్’లో ఓడి వెనుదిరిగారు. మాయా జాయింట్ (ఆ్రస్టేలియా)–హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ) జోడి 6–3, 6–7 (6/8), 7–6 (10/7)తో వీనస్–సెరెనాపై విజయం సాధించారు. బాంబ్రీ, నికీ జోడీల నిష్క్రమణ... పురుషుల డబుల్స్లో భారత ప్లేయర్ నికీ పునాచా –గొంజాలో ఎస్కోబార్ (ఈక్వెడార్) ద్వయం మొదటి రౌండ్లోనే ఓడింది. నికీ–ఎస్కోబర్ 6–7 (3/7), 7–6 (7/4), 2–6 స్కోరుతో నీల్ ఒబర్లీట్నర్ (ఆస్ట్రియా)–పెట్ర్ నౌజా (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయంపాలైంది. మరో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ కూడా తొలి రౌండ్ను దాటలేకపోయాడు. బాంబ్రీ–మైకేల్ వీనస్ (అమెరికా) ద్వయం 6–7 (4/7), 6–7 (3/7)తో ర్యాన్ సెగెర్మన్–పాట్రిక్ ట్రాక్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు.
అనాహత్ ఓటమి
లండన్: ప్రతిష్టాత్మక లండన్ స్క్వాష్ క్లాసిక్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ అనాహత్ సింగ్ పోరాటం ముగిసింది. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) గోల్డ్ ఈవెంట్లో భాగంగా శనివారం మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో ప్రపంచ 20వ ర్యాంకర్ అనాహత్ 4–11, 4–11తో ఐదో ర్యాంకర్ శివసంగరి సుబ్రమణ్యం (మలేసియా) చేతిలో ఓడింది. ప్రిక్వార్టర్స్లో ప్రపంచ 11వ ర్యాంకర్ను చిత్తుచేసిన 18 ఏళ్ల అనాహత్ క్వార్టర్స్లో అదే జోరు కొనసాగించలేక టోర్నీ నుంచి నిష్క్ర మించింది. ఆసియా క్రీడలకు ముందు ఈ నెల 12 నుంచి ఖతార్ క్లాసిక్ టోర్నీలో అనాహత్ బరిలోకి దిగనుంది.
న్యూస్ పాడ్కాస్ట్
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
కొండా సురేఖను తప్పించాల్సిందే.... కేసీ వేణుగోపాల్తో భేటీలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
Audio: బీడు పడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు... కాలువకు నీరివ్వని కూటమి సర్కార్... బోరుమంటున్న రాయలసీమ రైతులు
నేపాల్లో ఆగని మృత్యుఘోష.... 579కి చేరిన మరణాల సంఖ్య... భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
కమిషనర్ ఔట్... వేతన సవరణ కమిషన్ లేదు... ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం
బిజినెస్
రూ.6.10 లక్షలకే కొత్త బాలెనో.. ఫుల్ అప్డేట్స్తో లాంచ్!
మారుతి సుజుకి ఎట్టకేలకు బాలెనో ఫేస్లిఫ్ట్ను భారత మార్కెట్లో.. రూ. 6.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా డిజైన్ మార్పులతో పాటు, ఫీచర్లు, భద్రత, పవర్ట్రెయిన్లలో కూడా ఎక్కువ అప్డేట్లను పొందింది.మారుతి సుజుకి బాలెనో ఫేస్లిఫ్ట్ పాత మోడల్ మాదిరిగా.. అదే సిల్హౌట్ పొందుతుంది. అయితే.. డీఆర్ఎల్, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్ల కోసం కొద్దిగా సవరించిన డిజైన్ను పొందుతుంది. ముందు భాగంలోని గ్రిల్కు కొత్త డిజైన్, అలాగే బంపర్కు కూడా సరికొత్త డిజైన్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ మాత్రం అలాగే ఉంది, కానీ కొత్త అల్లాయ్ వీల్స్తో వస్తుంది.2026 మారుతి సుజుకి బాలెనో క్యాబిన్ బ్లూ అండ్ బ్లాక్ రంగులతో కూడిన డ్యూయల్ టోన్ లేఅవుట్తో వస్తుంది. డాష్బోర్డ్ లేఅవుట్ పాత మోడల్ను పోలి ఉంటుంది. కానీ మధ్యలో ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ప్రాథమిక నియంత్రణల కోసం ఫిజికల్ బటన్లు ఉంటాయి. ఈ కారు మౌంటెడ్ కంట్రోల్స్తో కూడిన స్టీరింగ్ వీల్ కోసం అదే డిజైన్ను కొనసాగిస్తుంది.కొత్త బాలెనోలో.. మొదటిసారిగా ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా.. ఈ బ్రాండ్ వైర్లెస్ ఛార్జర్, క్లారియన్ సౌండ్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటివి కూడా ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్బ్యాగ్లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.ఇంజిన్ విషయానికి వస్తే.. మారుతి సుజుకి బాలెనో ఫేస్లిఫ్ట్ 1.2-లీటర్ Z-సిరీస్ ఇంజన్తో వస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో లభిస్తుంది. అంతేకాకుండా.. ఈ బ్రాండ్ ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన CNG వేరియంట్ను కూడా అందిస్తోంది. కాగా ఇది హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఆవిష్కరించిన స్పెషల్ బైక్
దశాబ్దం తర్వాత భారత్లోకి కారెఫోర్.. భారీ విస్తరణకు ప్లాన్!
రిటైల్ రంగ ఫ్రెంచ్ దిగ్గజం కారెఫోర్ దశాబ్దం తదుపరి భారత్ మార్కెట్లోకి ప్రవేశించింది. దుబాయ్కు చెందిన అపారెల్ గ్రూప్తో భాగస్వామ్యం ద్వారా స్థానికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఇక్కడ 50,000 చదరపు అడుగులలో కారెఫోర్ స్టోర్ను అపారెల్ గ్రూప్ ఏర్పాటు చేసింది. రానున్న నాలుగు వారాల్లోగా మరో స్టార్ను జత చేయనున్నట్లు వెల్లడించింది.ఈ బాటలో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో మరిన్ని స్టోర్లకు తెరతీయనున్నట్లు తెలిపింది. వచ్చే వేసవికల్లా దేశ పశ్చిమ ప్రాంతంలో కార్యకలాపాలను విస్తరించనున్నట్లు పేర్కొంది. వృద్ధికి దన్నుగా ఇతర సంస్థల కొనుగోళ్లను చేపట్టనున్నట్లు అపారెల్ గ్రూప్ తెలియజేసింది. తొలి దశ విస్తరణలో భాగంగా రానున్న ఐదేళ్లలో 50 ఫుడ్ అండ్ గ్రోసరీ స్టోర్లను తెరవనున్నట్లు తెలియజేసింది.2010లో తొలుత.. కారెఫోర్ ఇంతక్రితం 2010లో క్యాష్ అండ్ క్యారీ(హోల్సేల్) బిజినెస్ ద్వారా దేశీయంగా కార్యకలాపాలకు తెరతీసింది. ఆపై ఆశించిన ఫలితాలు అందుకోలేకపోవడానికితోడు విస్తరణకు వీలైన స్థానిక భాగస్వామి లభించకపోవడంతో 2014లో ఐదు స్టోర్లను మూసివేసింది. కార్యకలాపాలకు ఫుల్స్టాప్ పెట్టేసింది.కాగా.. ప్రస్తుతం అప్రమత్తతతో బిజినెస్ విస్తరణ ప్రణాళికలు అమలు చేయనున్నట్లు అపారెల్ గ్రూప్ యజమాని, చైర్మన్ నీలేష్ వేద్ పేర్కొన్నారు. సొంత స్టోర్లను విస్తరిస్తూనే వృద్ధిని పెంచుకునేందుకు ఇతర సంస్థలను సొంతం చేసుకునే ప్రణాళికలు అమలు చేయనున్నట్లు వివరించారు. తొలి దశలో హైపర్మార్కెట్ విధానంపై దృష్టిపెట్టి ముందుకుసాగనున్నట్లు చెప్పారు. ఇందుకు అనుగుణంగా 50,000 ఎస్కేయూలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
మనశ్శాంతి కోసం జాబ్ మానేసి.. నెలకు రూ.కోటి టర్నోవర్!
సాధారణంగా బెంగళూరు నగరంలో.. యాక్సెంచర్ వంటి కంపెనీలో ఉద్యోగం వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. కానీ సుప్రీత్ కశ్యప్ మాత్రం ఇందుకు భిన్నంగా.. ఉద్యోగం వదిలి మనశ్శాంతి కోసం సొంత ఊరికి వెళ్ళిపోయాడు. నేడు నెలకు కోట్ల రూపాయల ఆదాయం సంపాదించే స్థాయికి చేరాడు. ఇంతకీ కశ్యప్ ఏం చేసాడు?, ఎలా సంపాదిస్తున్నాడు?, అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.యాక్సెంచర్ ఉద్యోగం వదిలి..సుప్రీత్ కశ్యప్ మైసూరులో పుట్టి పెరిగాడు. తాను మైసూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ చదివాడు. చదువు పూర్తయ్యాక, 2017లో యాక్సెంచర్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం అతనికి మంచి కెరీర్ ఇచ్చినప్పటికీ.. బెంగళూరులో జీవనశైలి తనకు సరిపోవడం లేదని భావించాడు. నగరంలోని ట్రాఫిక్, రద్దీ, నిరంతర ఒత్తిడి కారణంగా ప్రశాంతత లోపించిందని అనిపించింది.వెల్బీ పేరుతో వ్యాపారం..అందుకే.. 2018లో యాక్సెంచర్లో ఉద్యోగాన్ని వదిలి మైసూరుకు వెళ్ళిపోయాడు. ప్రారంభంలో ఫ్రీలాన్స్ కన్సల్టెంట్గా పనిచేశాడు. అయితే.. తనకు కేవలం ఉద్యోగం చేయడం కాకుండా, మైసూరు నుంచే ఒక సంస్థను నిర్మించి, ఇతరులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన వచ్చింది.ఈ ఆలోచనతో కశ్యప్ వెల్బీ పేరుతో.. దుస్తుల వ్యాపారాన్ని 2021లో ప్రారంభించాడు. వెల్బీ అనేది ప్రధానంగా సౌకర్యవంతమైన, స్పోర్ట్స్, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే దుస్తులను తయారు చేస్తుంది. సస్టైనబుల్, ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్కు కూడా సంస్థ ప్రాధాన్యత ఇస్తుంది.రూ.10 లక్షలు పెట్టుబడిసుప్రీత్ తన వ్యాపారం ద్వారా చాలామందికి ఉద్యోగాలు కూడా కల్పించాలని సంకల్పించాడు. దీంతో.. టైర్2, టైర్3 నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉద్యోగావకాశాలను సృష్టించాలని భావించాడు. వెల్బీలో ఇప్పుడు 15 మందికి పైగా ఫుల్-టైమ్ ఉద్యోగులు ఉన్నారు. సుమారు 40 మంది చేతివృత్తి కళాకారులతో కలిసి పనిచేస్తున్నారు.వెల్బీని ప్రారంభించడానికి సుప్రీత్ మొదట కుటుంబ సభ్యుల సహాయంతో.. సుమారు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ వ్యాపారం క్రమంగా అభివృద్ధి చెందడంతో మొత్తం పెట్టుబడి రూ.50 లక్షలకు చేరింది. తరువాత సంస్థకు ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.3 కోట్ల పెట్టుబడి లభించింది.కోట్లలో టర్నోవర్కంపెనీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. మొదటి సంవత్సరంలో సుమారు రూ.11 లక్షల ఆదాయం వచ్చింది. తరువాతి సంవత్సరం అది రూ.70 లక్షలకు పెరిగింది. ఆ తర్వాత రూ.2.4 కోట్లు, తదుపరి సంవత్సరం రూ.5.6 కోట్లు ఆదాయం సాధించింది. ఇప్పుడు సంస్థ ఏడాదికి సుమారు రూ.15-16 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయాణంలో వెల్బీ నెలకు సుమారు రూ.1 కోటి ఆదాయం సాధించే స్థాయికి చేరుకుంది. కేవలం రూ.10 లక్షలతో ప్రారంభమైన వ్యాపారం, ఇంత పెద్ద స్థాయికి ఎదగడం సుప్రీత్ వ్యాపార ప్రయాణంలో సాధించిన గొప్ప విజయం అనే చెప్పాలి.సుప్రీత్ తనను తాను ఒక యాదృచ్ఛిక పారిశ్రామికవేత్తగా భావిస్తాడు. ఎందుకంటే అతడు అనుకోకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అంతే కాకుండా.. తన కుటుంబానికి కూడా వ్యాపార నేపథ్యం లేదు. అందువల్ల వ్యాపారం ప్రారంభించినప్పుడు.. తనకు అనుభవం కూడా పెద్దగా లేదు. కానీ కాలక్రమంలో అనుభవంతో పాటు అనేక విషయాలు నేర్చుకున్నాడు.మైసూరు నుంచి అంతర్జాతీయ మార్కెట్లోకిప్రారంభంలో.. మంచి ఫ్యాషన్ ఫొటోషూట్లు చేస్తే అమ్మకాలు పెరుగుతాయని ఆయన అనుకున్నాడు. కానీ.. తర్వాత అసలు విజయం మంచి ఫొటోలలో కాకుండా, మంచి ఉత్పత్తిని తయారు చేయడం, వినియోగదారులకు అది నిజంగా అవసరమా అని తెలుసుకోవడంలో ఉందని గ్రహించాడు.అలాగే ఉద్యోగులను నియమించడంలో కూడా ఆయనకు ఒక ముఖ్యమైన పాఠం తెలిసింది. మొదట ప్రతి పనికి ప్రత్యేక వ్యక్తులను నియమించడం వల్ల సంస్థలో అవసరానికి మించిన పెద్ద టీమ్ ఏర్పడింది. తరువాత ఒకటి కంటే ఎక్కువ పనులు చేయగలిగే మల్టీ టాస్క్ ఉద్యోగులను నియమించడం ద్వారా చిన్న టీమ్తోనే సంస్థను సమర్థవంతంగా నడపవచ్చని తెలుసుకున్నాడు.మైసూరులో ప్రారంభమైన వెల్బీ.. ఇప్పుడు భారతదేశం దాటి అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో అమెజాన్ ద్వారా ఉత్పత్తులను విక్రయించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఇదీ చదవండి: డబ్బు త్వరగా చేతికి రావాలంటే?..కియోసాకి పెట్టుబడి విధానం!
లగ్జరీ ఏరియాలో రూ. 63 లక్షల కొత్త ఇల్లు కొన్న ఖుషీ కపూర్
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, దివంగత నటి శ్రీదేవి-నిర్మాత బోనీ కపూర్ ల చిన్నకుమార్తె ఖుషీ కపూర్ తన రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోకు కొత్త ఆస్తిని జోడించింది. ముంబైలోని బాంద్రా వెస్ట్లో కొత్త అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది.CRE మ్యాట్రిక్స్కు లభించిన ఆస్తి రికార్డుల ప్రకారం బాలీవుడ్ ప్రముఖులు నివాసముండే పాపులర్ ఏరియా, బాంద్రా వెస్ట్లోని 25వ రోడ్డులో ఉన్న సమతాదీప్ బిల్డింగ్లో ఈ అపార్ట్మెంట్ ఉంది. దీని ధర సుమారు రూ. 63 లక్షలు. ఈ లావాదేవీ సెప్టెంబర్ 1 అధికారికంగా రిజిస్టర్ చేయబడింది. ఈ డీల్కు స్టాంప్ డ్యూటీ కింద రూ. 3.15 లక్షలు చెల్లించినట్టు సమాచారం.కార్పెట్ ఏరియా 180 చదరపు అడుగులు ఈ ఫ్లాట్ను ఫారూఖ్ ఛాగ్లా అనే వ్యక్తి నుంచి ఈ ప్రాపర్టీని ఆమె కొనుగోలు చేసినట్లు పత్రాల ద్వారా తెలుస్తోంది.కాగా 2023లో జోయా అక్తర్ దర్శకత్వం వహించిన 'ది ఆర్చీస్' (The Archies) సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిందిఖుషీకపూర్. ఆ తర్వాత ఇబ్రహీం అలీ ఖాన్తో కలిసి 'నాదానియాన్', జునైద్ ఖాన్తో కలిసి 'లవ్యాపా' చిత్రాల్లో నటించారు. తన తల్లి శ్రీదేవి నటించిన హిట్ చిత్రం 'మామ్' (Mom - 2017) కి సీక్వెల్గా వస్తున్న 'మామ్ 2' (Mom 2) లో ఖుషీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో జిష్షూ సేన్గుప్తా, కరిష్మా తన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఎమోషనల్ థ్రిల్లర్లో ఖుషీ అత్యంత బలమైన, ఆకట్టుకునే నటనను కనబరచనున్నట్లు సమాచారం.అటు ఖుషీ సోదరి జాన్వీ కపూర్కూడా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడుఇదీ చదవండి: రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్ జాబ్ ఎంచుకున్న టెకీ
ఫ్యామిలీ
సంకష్టహర చతుర్థి వ్రతం.. తన జీవితాన్నే మార్చేసింది!
పూర్వం హైహయ వంశానికి చెందిన కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతడు అమిత బలసంపన్నుడు, ధర్మపరాయణుడు. అతడి భార్య సుగంధి. సంపదలకు లోటు లేకున్నా, వారికి సంతానమే లేదు. సంతాన ప్రాప్తికి వారు చేయని వ్రత, దాన, యజ్ఞ యాగాలు లేవు. ఎన్ని చేసినా, పురాకృత పాపఫలితంగా వారికి సంతానం కలగలేదు.సంతాన రాహిత్యంతో రాజదంపతులు నిరాశలో కూరుకుపోయారు. రాజ్యాన్ని, సంపదను అమాత్యులకు విడిచి, తపోనిష్ఠతో కాలం గడపడానికి అడవులకు బయలుదేరారు. అడవులలో వారు కఠిన నియమాలను పాటిస్తూ, తపోనిష్ఠలో కాలం గడపసాగారు. కేవలం చెట్ల నుంచి రాలిన ఆకులను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తుండటంతో కృశించిపోయారు. వారు ధ్యానంలో ఉన్నప్పుడు వారి శరీరాలను క్రిమి కీటకాదులు తినేయసాగాయి. కొన్నాళ్లకు రాజదంపతులు శల్యావశిష్టులుగా మిగిలారు.ఒకనాడు గగనమార్గాన పోతున్న త్రిలోక సంచారి నారద మహర్షి కృతవీర్య దంపతుల పరిస్థితిని గమనించాడు. ఆయన వెంటనే పితృలోకానికి చేరుకుని, అక్కడ కృతవీర్యుడి తండ్రి వద్దకు వెళ్లి, ‘మర్త్యలోకంలో నీ కొడుకు, కోడలు సంతానం కోసం అలమటిస్తూ, తపశ్చర్యలో నిమగ్నులై, శల్యావశిష్టులుగా మిగిలారు. వారి పరిస్థితి నేడో రేపో అన్నట్లుగా ఉంది.’ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు.దారిలో నారదుడికి ఒక దారుణ దృశ్యం కనబడింది. భృంశ మహర్షి తల్లిదండ్రులు, బంధువులు కుంభీపాక నరకంలో అధోముఖులై వేలాడుతూ, యమభటుల దండనలకు తాళలేక హాహాకారాలు చేస్తున్నారు. ఈ దృశ్యం చూసి, నారదుడు విచలితుడయ్యాడు. వెంటనే, భృంశుడి వద్దకు వెళ్లాడు. ‘మహర్షీ! నువ్వు సాక్షాత్తు సర్వజ్ఞుడవు. సాక్షాత్తు గణేశ సమానుడవు. కపిలాది మహర్షులు నీ దర్శనం కోరి వస్తుంటారు. అలాంటి నీ తల్లిదండ్రులు, బంధువులు నరకంలో యమబాధలు అనుభవిస్తుండటం బాధ కలిగిస్తోంది. నీ పూర్వుల నరక విమోచనం కోసం చేయదగిన పరిహారం ఏదైనా ఉంటే, నువ్వు ఉపేక్షించక దానిని వెంటనే ఆచరించు’ అని పలికాడు.నారదుడి ద్వారా తన పితరుల బాధలు తెలుసుకున్న భృంశుడు చింతాక్రాంతుడై, కొద్దిసేపు ఆలోచించాడు. తాను ఏళ్లతరబడి ఆచరిస్తూ వచ్చిన సంకష్టహర చతుర్థి వ్రతఫలంలో ఒకరోజు వ్రతఫలాన్ని ససంకల్పితంగా తన పితరులకు ధారపోశాడు. అతడు తన వ్రతఫలాన్ని ధారపోసిన వెంటనే భృంశుడి పితరులందరూ నరక కూపం నుంచి విముక్తి పొందారు. దేవతలు తీసుకువచ్చిన దివ్యవిమానంలో వారందరూ స్వర్గానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, నారదుడి ద్వారా తన కుమారుడి పరిస్థితి తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి బ్రహ్మలోకానికి వెళ్లి, ‘బ్రహ్మదేవా! నా కుమారుడు కృతవీర్యుడు సంతానం లేకపోవడం వల్ల తపోనిష్ఠలో శల్యావశిష్టుడిగా మిగిలాడు. నా కుమారుడి సంతానలేమికి కారణమేమిటి? అతడి పురాకృత పాపకర్మ నశించడానికి తగిన తరుణోపాయమేది? నువ్వే చెప్పాలి’ అని అడిగాడు.‘నీకు నీ తనయుడి పూర్వజన్మ విశేషాలు చెబుతాను, విను. నీ రాజ్యంలోనే సామ అనే దుష్టుడు ఉండేవాడు. అతడు నిష్కారణంగా పన్నెండుమంది బ్రాహ్మణులను వధించి, వారి మృతదేహాలను ఒక కొండగుహలో పారవేశాడు. ఒకనాడు అతడికి పొద్దుగూకే వరకు ఎక్కడా తిండి, నీళ్లు దొరకలేదు. అలసి సొలసి పొద్దు గూకిన తర్వాత ఇంటికి చేరుకున్న మరుక్షణమే, తన కొడుకును ‘గణేశా! గణేశా!’ అని పిలిచాడు. కొడుకుతో కలసి భోజనం చేశాడు. సామకు తెలియకున్నా, ఆరోజు మాఘ కృష్ణ చతుర్థి. మరికొన్నాళ్లకు అదే తిథినాడు సామ కాలధర్మం చెందాడు. సంకష్టహర చతుర్థినాడు తెలియక చేసిన పుణ్యఫలితంగా మరణానంతరం స్వర్గానికి చేరుకున్నాడు. ఆ పుణ్యశేషం వల్లనే నీకు కొడుకుగా పుట్టాడు. పురాకృత పాపకర్మ మిగిలి ఉండటం వల్ల అతడికి సంతానం కలగలేదు’ అని బ్రహ్మదేవుడు చెప్పాడు.‘విరించీ! పాపాకర్మ పరిహారానికి తరుణోపాయమేమిటో నువ్వే చెప్పు’ అడిగాడు కృతవీర్యుడి తండ్రి.‘సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమానుసారం ఆచరిస్తే, అతడికి పాప విముక్తి కలుగుతుంది’ అని చెప్పి, వ్రత విధానాన్ని వివరించాడు బ్రహ్మదేవుడు.బ్రహ్మదేవుడి ద్వారా సంకష్టహర వ్రత విధానాన్ని తెలుసుకున్న అతడు తన కొడుకు వద్దకు చేరుకుని, ‘కృతవీర్యా! పురాకృత పాపకర్మ ఫలితంగానే నీకు సంతానం కలగలేదు. సంకష్టహర చతుర్థివ్రతం ఆచరించినట్లయితే, నీకు పాపవిమోచనం కలిగి, సంతానం కలుగుతుంది’ అని చెప్పి, బ్రహ్మదేవుడు చెప్పిన వ్రత విధానాన్ని బోధించాడు.కృతవీర్యుడు పత్నీసహితంగా నియమానుసారంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. అతడి పాపకర్మ నశించింది. కొన్నాళ్లకు కృతవీర్యుడి భార్య సుగంధి గర్భం దాల్చింది. నెలలు నిండాక ఆమెకు పండంటి కొడుకు పుట్టాడు. అయితే, అతడికి చేతులు లేవు. పెరిగి పెద్దయ్యాక అతడు తీవ్ర తపస్సుతో దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుని, సహస్రబాహువులు పొందాడు. సహస్రబాహు అర్జునుడిగా, కార్తవీర్యార్జునుడిగా పేరు పొందాడు.- సాంఖ్యాయనఇవి చదవండి: ఒకనాటి ఆదివారం
ఏఐతో వైరస్ సృష్టి.. మానవాళికి వరమా? శాపమా?
వైరస్లు, బ్యాక్టీరియాల వంటి ఇతరేతర రోగకారక జీవకణాలు ప్రకృతిలో అసంఖ్యాకంగా ఉన్నవే మనకు తెలుసు. ఏఐ సాయంతో వీటిని కృత్రిమంగా కూడా సృష్టించడం సాధ్యమేనని ఇటీవల అమెరికన్ శాస్త్రవేత్తలు నిరూపించారు. ప్రకృతిలో లేని పదహారు వైరస్లను కొత్తగా సృష్టించారు. ఏఐతో కృత్రిమ వైరస్లు, ఇతరేతర జీవకణాలను సృష్టించే పరిజ్ఞానం వల్ల జరగబోయే మేలేమిటి? వాటిల్లబోయే కీడేమిటి? శాస్త్ర సాంకేతిక రంగాల్లో చర్చకు దారితీస్తున్న ఈ అంశం గురించి తెలుసుకుందాం...నిజానికి నిండు కణం కూడా కాదు – జీవకణాల్లో ఉండే ఆర్ఎన్ఏ లేదా డీఎన్ఏతో కూడిన అతిసూక్ష్మ కణశకలం. ప్రొటీన్ కవచంతో ఉండే ఈ కణశకలమే వైరస్. ఇది ఏదైనా జీవకణంలోకి చొరబడితే, అసంఖ్యాకంగా వృద్ధి చెందుతుంది. అలవికాని అలజడి సృష్టిస్తుంది. జీవకణాల మనుగడకు ముప్పు తెస్తుంది. జీవుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. జీవకణాలతో రూపొందిన మనుషుల శరీరాలలోకి రకరకాల వైరస్లు చొరబడుతుంటాయి. వీటిలో కొన్ని వైరస్లు ప్రాణాంతక వ్యాధులను కూడా కలిగిస్తాయి. వైరస్ ధాటి ఎలా ఉంటుందో ‘కోవిడ్–19’ ద్వారా ఇప్పటి ప్రపంచానికి బాగా బోధపడింది.ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసినవి ప్రకృతిలో పుట్టిన వైరస్లు మాత్రమే! ఇటీవల శాస్త్రవేత్తలు ఏఐతో పదహారు సరికొత్త వైరస్లు సృష్టించారు. ఇవి ఇంతవరకు ప్రకృతిలో ఎక్కడా లేనివి. ప్రస్తుతానికి ఏఐ సాంకేతికతతో సృష్టించిన వైరస్లు సానుకూల ఫలితాల కోసమే రూపొందించినవి. ఇదే సాంకేతికతతో ప్రమాదకరమైన వైరస్లను సృష్టించే అవకాశం కూడా ఉండటమే ఆందోళనకు కారణమవుతోంది. ప్రపంచంలో కలకలం రేపుతున్న ఈ ‘కృత్రిమ కణ’కలం గురించి ఈ ప్రత్యేక కథనం...ప్రకృతిలో ఉన్న వైరస్లతోనే మానవాళి ఇప్పటికీ సతమతవుతుంటే, తాజాగా ఏఐతో తయారైన కృత్రిమ వైరస్లు పుట్టుకొచ్చాయి. ఏఐ సాయంతో వైరస్లు, ప్రొటీన్ కణాలను రీడిజైన్ చేసే ఈ కొత్త ప్రక్రియకు శాస్త్రవేత్తలు ‘సింథటిక్ బయాలజీ’ అనే పేరు పెట్టారు. అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఆర్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఏఐ సాంకేతికతో పదహారు కొత్త వైరస్లను తయారు చేశారు. ఈ వైరస్లు ఇదివరకు ప్రకృతిలో ఎక్కడా లేనివి. స్టాన్ఫర్డ్ శాస్త్రవేత్తలు ఏఐకి వైరస్ల డీఎన్ఏ నమూనాలను ఇచ్చి, వాటి ఆధారంగా కొత్తగా పదహారు వైరస్ జీనోమ్లను రూపొందించారు. ఇవి బ్యాక్టీరియా కణాల్లోకి చొరబడి వాటిని నాశనం చేయగలవు. లాబొరేటరీల్లో జరిపిన పరీక్షల్లో ఈ పదహారు వైరస్లు ఇ–కోలి బ్యాక్టీరియా కణాలను విజయవంతంగా అరికట్టగలిగాయి.స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, కంప్యూటేషనల్ బయాలజిస్ట్ డాక్టర్ బ్రియాన్ హై ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం ఏఐకి వైరస్ల డీఎన్ఏ నమూనాలను ఇచ్చి, వాటిలో తాము కోరుకున్న మార్పులను సూచించి, ఇదివరకు ప్రకృతిలో ఎక్కడాలేని పదహారు సరికొత్త వైరస్లను సృష్టించింది. కొత్త వైరస్ల సృష్టి కోసం ఏఐ రూపొందించిన జీనోమ్ నమూనాలకు ‘ఇవో–1’, ‘ఇవో–2’ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ వైరస్లను ప్రధానంగా మానవాళికి హాని చేసే ‘ఇ–కోలి’ తరహా బ్యాక్టీరియాలను తుదముట్టించే లక్ష్యంతో రూపొందించారు. ఈ ప్రయత్నంలో భాగంగా డాక్టర్ బ్రియాన్ హై నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం నిజానికి వందలాది కృత్రిమ వైరస్ నమూనాలను ఏఐ సాయంతో పరీక్షించింది. వీటిలో పదహారు వైరస్లు మాత్రమే శాస్త్రవేత్తలు ఆశించినట్లుగా బ్యాక్టీరియా కణాలను నిర్మూలించగలిగాయి.శాస్త్రవేత్తల జాగ్రత్తలుఏఐ సాయంతో కృత్రిమ వైరస్లను సృష్టించడంలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఆర్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఏఐకి వైరస్ జన్యు సమాచారం ఇవ్వడంలో గరిష్ఠస్థాయి అప్రమత్తత పాటించారు. ఏఐకి కేవలం బ్యాక్టీరియాను నిర్మూలించగలిగే ‘బ్యాక్టీరియోఫేజ్’ వైరస్ల జన్యు సమాచారం మాత్రమే ఇచ్చారు. ఇందులోంచి మనుషులకు, జంతువులకు, మొక్కలకు సోకే వైరస్ జన్యు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించారు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల్లో ఉనికిలో ఉన్న వైరస్లకే జన్యు ఉత్పరివర్తనలు జరపడం మాత్రమే చేస్తూ వచ్చారు.ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా జన్యు విశ్లేషణల కోసం, జన్యు మార్పిడి సూచనలు తెలుసుకోవడం మాత్రమే దానిని వాడుతూ వచ్చారు. ఇప్పుడు తొలిసారిగా ఏఐతోనే వైరస్ జీనోమ్లకు రూపకల్పన చేసి, కొత్త వైరస్లను సృష్టించారు. ఏఐ అందించిన జీనోమ్ నమూనాల ఆధారంగా ప్రయోగశాలలో సృష్టించిన ఈ వైరస్లు పూర్తిస్థాయి కృత్రిమ వైరస్లు. జీవశాస్త్ర ప్రయోగాల్లో దీనినొక గొప్ప మైలురాయిగా కొందరు శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఏఐ సాయంతో రూపొందించే కృత్రిమ వైరస్ల ద్వారా సాధించగల సానుకూల ఫలితాల గురించి వారు చాలా విశేషాలే చెబుతున్నారు. అయినా, ఏఐ కృత్రిమ వైరస్లను సృష్టించగలగడం పట్ల శాస్త్ర సాంకేతిక వర్గాల్లోనే కాకుండా, అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో కూడా కొన్ని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.- డాక్టర్ బ్రియాన్ హైఇవీ సానుకూలతలుఏఐ సాయంతో కృత్రిమ వైరస్లను సృష్టించడం ఇదివరకటి ప్రక్రియల కంటే చాలా సులువైనది. దీని వల్ల చాలావరకు సమయం కలిసొస్తుంది. ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. ఇదివరకు లాబొరేటరీల్లో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో రకరకాల ప్రయత్నాలు సాగిస్తే తప్ప వైరస్లలో ఆశించిన జన్యు ఉత్పరివర్తనలు తీసుకురావడం సాధ్యమయ్యేది కాదు. ఇదంతా వ్యయ ప్రయాసలతో కూడిన ప్రక్రియ. ఇప్పుడు ఏఐకి ఈ పని అప్పగించడం వల్ల వేగంగా ఫలితాలు వస్తున్నాయి. ఏఐ తనకు అందించిన జీవ సమాచారాన్ని శరవేగంగా ఆకళింపు చేసుకుని, కొత్త జన్యు నమూనాలకు రూపకల్పన చేయగలుగుతోంది.బ్యాక్టీరియాను నాశనం చేయగల వైరస్లను ఏఐ సాయంతో సృష్టించడం ద్వారా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తేవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారి వాదన ప్రకారం ఇప్పటికే కొన్ని ప్రమాదకరమైన వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా కణాలు యాంటీ బయోటిక్స్ను తట్టుకునే శక్తిని సంతరించుకున్నాయి. వీటిని అరికట్టడానికి మరింత శక్తిమంతమైన యాంటీ బయోటిక్స్ను తయారు చేసే బదులుగా ఏఐ సాయంతో తయారు చేసిన వైరస్లనే ఆయుధాలుగా ఉపయోగిస్తే సత్ఫలితాలను సాధించవచ్చని చెబుతున్నారు.శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఏఐ సాయంతో కృత్రిమ వైరస్ల సృష్టి వల్ల కలిగే ఉపయోగాలు ఇవీ:1. వ్యాక్సిన్లుఏఐ సాంకేతికతతో రూపొందించిన కృత్రిమ వైరస్లతో మెరుగైన వ్యాక్సిన్లను తయారు చేయడం సులువుగా మారుతుంది. కృత్రిమ వైరస్లతో తయారు చేసిన వ్యాక్సిన్ల ద్వారా ప్రమాదకరమైన వైరస్ల వల్ల వచ్చే వ్యాధులను శాశ్వతంగా అరికట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రమాదకర వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్న వైరస్లలో జరగబోయే ఉత్పరివర్తనలను ముందుగానే ఏఐతో అంచనా వేసి, వాటిని అరికట్టే వ్యాక్సిన్లను తయారు చేయడానికి కూడా వీలవుతుంది.2. జన్యు చికిత్సజన్యు వ్యాధులను నయం చేయగల జన్యుచికిత్స పద్ధతులు మరింత తేలికవుతాయి. జన్యులోపాల వల్ల తలెత్తే వ్యాధులను నయం చేయడానికి జన్యువులను సరిచేసే పదార్థాలను జన్యుకణాల్లోకి పంపాల్సి ఉంటుంది. సమీప భవిష్యత్తులో ఏఐ సాంకేతికతతో తయారు చేసే హానికరం కాని ‘ఆర్టిఫిషియల్ వైరల్ వెక్టర్స్’ను జన్యుకణాల్లోకి పంపడం ద్వారా జన్యులోపాలను సవరించడం సులువుగా మారుతుంది. ఈ ‘ఆర్టిఫిషియల్ వైరల్ వెక్టర్స్’ ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హాని కలిగించకుండా, లోపాలు ఉన్న జన్యుకణాలకే నేరుగా జన్యు పదార్థాలను చేరవేస్తాయి.3. క్యాన్సర్ చికిత్సఏఐ సాయంతో రూపొందించే కృత్రిమ వైరస్లతో క్యాన్సర్ చికిత్స మరింత మెరుగుపడుతుంది. ఏఐ సాయంతో క్యాన్సర్ కణాలను నిర్మూలించగలిగే ‘ఆంకోలైటిక్ వైరస్’లను రూపొందించవచ్చు. ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇవి ఆరోగ్యకరమైన కణాలకు హాని చేయకుండా, క్యాన్సర్ కణాలనే నిర్మూలిస్తాయి. క్యాన్సర్ చికిత్సలో ఇప్పటికే వాడుకలో ఉన్న రేడియో థెరపీ, కీమో థెరపీ వంటి పద్ధతులు తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తుండటం తెలిసిందే! ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’ అందుబాటులోకి వస్తే, క్యాన్సర్ రోగులకు ఈ చికిత్స వరంగా మారుతుంది.4. ఫేజ్ థెరపీకృత్రిమ వైరస్లు ‘యాంటీబయెటిక్ రెసిస్టెన్స్’కు విరుగుడు కాగలవు. వీటి ద్వారా చేసే చికిత్సను ‘ఫేజ్ థెరపీ’ అంటున్నారు. ‘ఫేజ్ థెరపీ’లో ఉపయోగించే కృత్రిమ వైరస్లు అత్యంత శక్తిమంతమైన యాంటీ బయోటిక్లకు లొంగని జగమొండి బ్యాక్టీరియా కణాలను సైతం నిర్మూలించగలవు.ఇంకొన్ని ఇబ్బందులుఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా, ఏఐతో రూపొందించే కృత్రిమ వైరస్లతో కొన్ని ఇబ్బందులు తప్పవు. ప్రకృతిలో సహజసిద్ధంగా ఉండే వైరస్లు మన శరీరంలోకి చేరితే, వాటిని ఎదుర్కోవడానికి మన శరీరంలో ఎంతో కొంత నిరోధకత ఉంటుంది. మన శరీరంలోని యాంటీబాడీలు వైరస్లతో శక్తిమేరకు పోరాటం సాగిస్తాయి. కృత్రిమ వైరస్లు శరీరంలోకి చేరి వ్యాధులను కలిగిస్తే, మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వాటిని గుర్తించలేదు.మన శరీరంలోని యాంటీబాడీలు వాటితో పోరాడే ప్రయత్నం కూడా చేయకపోవచ్చు. పైగా, వాటిని అరికట్టే మందులు, వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉండవు. కృత్రిమ వైరస్లను కట్టడి చేసే మందులు, వ్యాక్సిన్లు రూపొందించడానికి చాలా కాలమే పట్టవచ్చు. ఏఐ సాంకేతికత శరవేగంగా విస్తరిస్తోంది గాని, దానిని నియంత్రించే చట్టాలు, అంతర్జాతీయ నిబంధనలు ఇంకా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ సాంకేతికతను వాడుకుని సృష్టించే కృత్రిమ వైరస్ నమూనాలను డిజిటల్ డేటా ఆధారంగా గుర్తించడం దుస్సాధ్యం.ఇక భయాలెందుకు?ఏఐతో రూపొందించే కృత్రిమ వైరస్లతో ఇన్ని సానుకూలతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతుంటే, వీటిపై భయాలెందుకు? అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. కృత్రిమ వైరస్లపై శాస్త్రవేత్తల సమూహం నుంచే భయాలు వ్యక్తమవుతున్నాయి. వారి భయాలు ఎందుకంటే, ప్రపంచంలో దాదాపు డజను దేశాలు ‘బయో వెపన్స్’ను సమకూర్చుకుని ఉన్నాయి. ఈ దేశాలు ఆ సంగతిని బాహాటంగా ప్రకటించకపోయినా, అంతర్జాతీయ గూఢచర్య సంస్థల సమాచారం ప్రకారం ఇవి పకడ్బందీగా కట్టుదిట్టమైన లాబొరేటరీల్లో జన్యు ఉత్పరివర్తనల ద్వారా ప్రమాదకరమైన వైరస్లు, బ్యాక్టీరియాలు వంటి వాటిని రూపొందించి, ఇప్పటికే నిల్వ చేసుకుని ఉన్నాయి. ఇలాంటి మరికొన్ని బయో వెపన్స్ను రూపొందించేందుకు రహస్య ప్రయోగాలను ముమ్మరంగా సాగిస్తున్నాయి. దేశాల మధ్య యుద్ధాలు తలెత్తే సందర్భాల్లో ‘బయో వెపన్స్’ను వినియోగించరాదనే ఐక్యరాజ్య సమితి ఒడంబడికను 185 దేశాలు ఆమోదించాయి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో మిగిలిన డజను దేశాలు ఈ ఒడంబడికపై ఇంతవరకు కనీసం సంతకాలు కూడా చేయలేదు. అంతర్జాతీయ గూఢచర్య సంస్థల సమాచారం ప్రకారం చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, సిరియా సహా డజను దేశాల వద్ద ఇప్పటికే ‘బయో వెపన్స్’ ఉన్నాయి.ఈ దేశాలు మరింత ప్రమాదకరమైన ‘బయో వెపన్స్’ తయారీ కోసం రహస్య ప్రయోగాలను ఇంకా కొనసాగిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఒడంబడికను ఖాతరు చేయని ఇలాంటి దేశాలకు కృత్రిమ వైరస్లను సృష్టించగలిగే ఏఐ సాంకేతికత చేతికందితే, అవి మరిన్ని బయో వెపన్స్ను తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇతర దేశాలతో యుద్ధాలు తలెత్తితే అవి విచక్షణారహితంగా బయోవెపన్స్ను బయటకు విడిచిపెట్టి, మహమ్మారి వ్యాధులను వ్యాప్తి చేసి, భారీ జనహననానికి తెగబడవచ్చు. ఐక్యరాజ్య సమితిని ఖాతరు చేయని ధూర్త దేశాలు మాత్రమే కాదు, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు కూడా ఇదే పద్ధతిలో ‘బయో వెపన్స్’ తయారీకి సిద్ధపడవచ్చు.ఉగ్రవాద సంస్థల చేతికి ఈ పరిజ్ఞానం చేరితే, వాటి వల్ల ఎలాంటి విపత్తులు ఏర్పడవచ్చో ఊహించడం కూడా కష్టమే! ధూర్త దేశాలు, ఉగ్రవాద సంస్థలు ఇష్టానుసారం ఏఐ సాంకేతికతతో ప్రమాదకరమైన వైరస్లను రూపొందించే ప్రక్రియలో లాబొరేటరీల్లోంచి పొరపాటున లీకైతే, అవి వాతావరణంలో కలిసిపోయి, మహమ్మారి వ్యాధులు వ్యాపించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏఐతో రూపొందించే కృత్రిమ వైరస్ల వల్ల ఎన్ని సానుకూలతలు ఉన్నాయో, వాటి వల్ల ప్రమాదావకాశాలు అంతకు మించే ఉన్నాయి.నియంత్రణకు శాస్త్రవేత్తల సూచనలుకృత్రిమ వైరస్ల వల్ల ప్రపంచానికి ముప్పు తలెత్తకుండా ఉండాలంటే, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, బయో సెక్యూరిటీ నిపుణులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు. అవేమిటంటే, ఏఐతో వైరస్లను రూపొందించే సాంకేతికత దుర్వినియోగం కాకుండా ఉండటానికి, బయో టెర్రరిజం వ్యాపించకుండా చూడటానికి జీన్ డేటాను ప్రాసెస్ చేసే ఏఐ నమూనాలకు కఠిన నియమావళిని అమలులోకి తేవాలి. డీఎన్ఏ విశ్లేషణలు జరిపే కంపెనీలను ఎవరెవరు ఆర్డర్లు ఇస్తున్నారు, వారు ఎలాంటి జన్యు నమూనాలను ప్రింట్ చేయిస్తున్నారు అనే దానిపై కచ్చితమైన తనిఖీలు ఉండాలి.అన్నింటి కంటే ముఖ్యంగా ప్రాణాంతకమైన వైరస్లు, పాథోజెన్ల డేటాను ఏఐ నమూనాల నుంచి తొలగించాలి. ఆర్టిఫిషియల్ బయో–డిజైనింగ్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అంతర్జాతీయ ఒప్పందం దిశగా ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకోవాలి. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ కట్టుదిట్టమైన చట్టాలను వీలైనంత త్వరగా అమలులోకి తేవాలి. ఇకపై ఏఐ ద్వారా సృష్టించే కృత్రిమ వైరస్లు, బ్యాక్టీరియాల ఆర్ఎన్ఏ, డీఎన్ఏ నమూనాలు స్క్రీనింగ్ను తప్పించుకునే అవకాశాలు లేకుండా నిబంధనలను కట్టుదిట్టం చేయాలని బయో సెక్యూరిటీ నిపుణులు ప్రభుత్వాలను కోరుతున్నారు.ఇదే అంశమై ఓపెన్ ఏఐ అధినేత సామ్ ఆల్ట్మన్, ఆంథ్రోపిక్ అధినేత డేరియో అమోడి, గూగుల్ డీప్మైండ్ అధినేత డెమిస్ హసబీస్, మైక్రోసాఫ్ట్ ఏఐ అధినేత ముస్తఫా సులేమాన్, మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ ఆలెగ్జాండర్ వాంగ్ తదితర ఏఐ నిపుణులు అమెరికా కాంగ్రెస్కు ఇటీవల లేఖ రాశారు. ఏఐ సాయంతో కృత్రిమ వైరస్ల వంటి వాటి తయారీపై శాస్త్రవేత్తల ఆందోళనలను ప్రభుత్వాలు పట్టించుకుని, సత్వర చర్యలకు నడుం బిగించాలి. ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తే, తర్వాత తలెత్తబోయే అనర్థాలకు ప్రపంచ దేశాలు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.- పన్యాల జగన్నాథదాసుఇవి కూడా చదవండి: ఏమిటీ టెక్ నెక్!
అమ్మ చీరలే నా స్టైల్.. నివేతా థామస్ ఆసక్తికర విషయాలు
పాత్ర ఏదైనా, అందులో పూర్తిగా ఒదిగిపోవడమే ఆమెకు తెలుసు! సినిమాలకు అతీతంగా తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని ఆస్వాదించే నటి నివేతా థామస్. ఆమె చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీకోసం...చిన్నప్పుడే కెమెరా ముందుకు!చిన్నప్పుడే టీవీ సీరియల్స్లో నటించే అవకాశం వచ్చింది. ‘మై డియర్ భూతం’తో ఎన్నో ఏళ్లు టీవీలో పనిచేశాను. కాని, సినిమాల్లోకి వచ్చాకే నటిగా నన్ను నేను కొత్తగా తెలుసుకున్నాను.బిల్డింగ్స్ కూడా డిజైన్ చేస్తా!నేను ఆర్కిటెక్చర్ చదివింది సినిమాలకు బ్యాకప్గా కాదు. నిజంగానే ఆర్కిటెక్ట్గా పనిచేయగలిగేలా చదివాను. కాలేజీ, షూటింగ్స్... రెండింటినీ ఒకేసారి బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. మా అమ్మానాన్న నటనతో పాటు చదువుకూ ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ఆ రోజులు తలచుకుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది.పాత్ర కోసమే బరువు పెరిగాను? ఒక పాత్ర కోసం నా రూపాన్ని మార్చుకోవడానికి ఎప్పుడూ వెనకాడను. ‘35– చిన్న కథ కాదు’లో సరస్వతి పాత్ర కోసం బరువు పెరిగాను. ఆ పాత్రకు అది అవసరమనిపించింది. ఇప్పుడు కొత్త పాత్రల కోసం మళ్లీ ఫిట్గా మారుతున్నాను. అది లుక్ మార్చుకోవడం కాదు, పాత్రలోకి వెళ్లే ప్రయాణం.భాషలు నా బలం!కొత్త భాష నేర్చుకోవడం ఆసక్తి ఎక్కువ. ఒక్కో భాషలోని యాస, పదాల వెనకున్న భావాన్ని తెలుసుకోవడం నటిగా చాలా ముఖ్యం. ప్రస్తుతం మలయాళం, తమిళం, తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు ఫ్రెంచ్ కూడా మాట్లాడగలను. వీలైనంత వరకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. అదే నా బలం. ప్రేక్షకులతో నా స్వరం ద్వారా కనెక్ట్ అవ్వడం ప్రత్యేకంగా అనిపిస్తుంది.కెమెరా వెనుక!ఖాళీ సమయం దొరికితే ఫొటోగ్రఫీ చేస్తుంటాను. ప్రయాణాలు చేయడం, కొత్త ప్రదేశాలను చూడడం, అక్కడి చిన్న చిన్న క్షణాలను కెమెరాలో బంధించడం చాలా ఇష్టం. పుస్తకాలు చదవడం కూడా నా ఫేవరెట్ టైమ్పాస్.శుక్రవారం అంటే నాకు పండగే!అందరికీ ఆదివారం సెలవు. కానీ శుక్రవారం నాకు చాలా స్పెషల్! సినిమా విడుదలైతే థియేటర్లో ప్రేక్షకుల రియాక్షన్ చూడాలనే టెన్షన్ , ఎగై్జట్మెంట్ రెండూ ఉంటాయి. షూటింగ్ లేకపోతే మాత్రం ఫోన్ పక్కనపెట్టి, ప్రపంచాన్ని కాస్త మర్చిపోయి ప్రశాంతంగా ఆలస్యంగా నిద్రలేవొచ్చు. అందుకే... రిలీజ్ ఉన్నా, రిలాక్స్ అయినా... శుక్రవారం అంటే నాకు పండగే!డైట్ నా వల్ల కాదు!నేను డైట్ ఫాలో అయ్యే రకం కాదు. ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బిర్యానీ కనిపిస్తే, దాన్ని వదిలేసి సలాడ్ తినడం నా వల్ల కాదు. ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నీ వ్యాయామాలైనా చేస్తా కాని, ఇష్టమైన ఆహారాన్ని తినడాన్ని మర్చిపోవడం మాత్రం చేయలేను.అమ్మ చీరల్లోనే అసలైన స్టయిల్!ఖరీదైన బ్రాండెడ్ దుస్తుల కంటే అమ్మ దగ్గరున్న పాత చీరలు నాకు చాలా ప్రత్యేకం. వాటిలో ఒక జ్ఞాపకం ఉంటుంది; ఒక కథ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు అమ్మ పాత చీరలను వేసుకుంటూ ఉంటాను.
ఏమిటీ టెక్ నెక్!
ఈ రోజుల్లో కంప్యూటర్పై పని లేకపోవడాన్ని లేదా గంటల తరబడి మొబైల్ లేని జీవితాన్ని ఊహించడం కష్టం. టెకీలు సరే సరి. ఇంట్లో ఉండే మహిళలూ, పెద్దగా టెక్నాలజీతో టచ్ లేనివారు సైతం అదేపనిగా రీల్స్ చూడటమో లేదా యూట్యూబ్లో వీడియోలు చూడటమో చేస్తున్నారు. దాంతో పాటు ఇటీవలి జీవనశైలి కారణంగా శారీరక శ్రమ తగ్గిపోవడం దాంతో ఎప్పుడూ ఒకే చోట కూర్చుని ఉండటం లేదా వృత్తి ఉద్యోగాల్లో సైతం కదలకుండా ఒకేచోట కూర్చుని పనిచేయడం బరువు పెరగడం (ఊబకాయం రావడం) వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అంతేకాదు... అలాంటి స్థిరంగా ఒకే చోట ఉండిపోవడంతో (సెడెంటరీ లైఫ్స్టైల్) వల్ల ఎముకలూ, కీళ్ల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోంది. మరీ ముఖ్యంగా యువత అదేపనిగా మెడవంచి, దాన్ని కాస్తంత ముందుకు సాచి మొబైల్ చూస్తుండటం వల్ల వస్తున్న ఆరోగ్య సమస్య పేరే... ‘టెక్ నెక్’. అసలు ‘టెక్ నెక్’ అంటే ఏమిటి, ఎముకలూ, కీళ్లూ (ముఖ్యంగా మెడ ఎముకలైన వెన్నుపూసలపై) దాని ప్రభావాలేమిటి; నివారణకు ఏం చేయాలనే అంశాలను తెలుసుకోవడం కోసం ఉపయోగపడేదే ఈ కథనం...ఇటీవల మొబైల్ కారణంగా మెడ నుంచి మోకాళ్ల వరకు ఉన్న ఎముకలపై ప్రభావం పడుతోంది. ఎప్పుడో బాగా వయసు పెరిగాక రావాల్సిన ఎముకల అరుగుదల, మెడ ఎముకల్లో డిస్క్ సమస్యల వంటివి ఇప్పుడు చాలా యుక్తవయసువారిలోనూ, ఇప్పుడిప్పుడే కౌమార వయసు వీడుతున్నవారిలోనూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద కీళ్ల సమస్యలకు దారితీయవచ్చనీ, అందునా మరీ ముఖ్యంగా మొబైల్ను ఎక్కువసేపు తల వంచి చూడటం వల్ల మెడపై నిరంతర ఒత్తిడి పడుతోందనీ,. దీనినే సాధారణంగా ‘టెక్ నెక్’ సమస్యగా ఆర్థోపెడిక్ నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘టెక్ నెక్’ సమస్య ఏమిటో చూద్దాం.ఏమిటీ ‘టెక్ నెక్’ సమస్య...?మెడను ఎక్కువసేపు ముందుకు వంచి అదేపనిగా అదే భంగిమలో చాలాసేపు ఉంచడం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంటుంది. దాంతో మెడ నొప్పి, భుజాలు బిగుతు ఉన్నట్లు అనిపించడం, తల ముందుకు వంగి అసహజ భంగిమలో చాలాసేపు ఉండిపోవడంతో తలనొప్పి వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇలా ఈ లక్షణాలతో వ్యక్తమయ్యే సమస్యనే డాక్టర్లు ‘టెక్ నెక్’గా చెబుతున్నారు.మరి కంప్యూటర్ / మొబైల్స్ మానేయాల్సిందేనా?ఈరోజు కంప్యూటర్ మీద పనిచేయడమనేది జీవన విధానంలో ఒక భాగం మాత్రమే కాదు. అదే జీవనోపాధికి ప్రధాన మార్గం కూడా. అంతేకాదు... మొబైల్ వాడకం కూడా జీవితం నుంచి విడదీయలేని అంశమై పోయింది. ప్రతిపనికీ ఓటీపీలూ, బ్యాంకు నుంచి మనకు వచ్చే సమాచారాలు, డబ్బు ట్రాన్స్ఫర్లు వంటి అనేక పనులకోసం మొబైల్ వాడకం అన్నది జీవితంలో ఒక అవిభాజ్యమైన అంశంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో వాటిని ఉపయోగించకుండా ఉండటమన్నది అసాధ్యం. అందుకే మొబైల్ లేదా కంప్యూటర్ వాడకాన్ని పూర్తిగా మానేయడం అవసరం లేదు. కాకపోతే వాటిని సరైన భంగిమలో ఉపయోగించడం, తరచూ విరామాలు తీసుకోవడం, మెడను ఒకే స్థితిలో ఎక్కువసేపు ఉంచకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.నివారణ ఇలా... టెక్ నెక్తో మెడ దగ్గరి ఎముకల్లో నొప్పి లేదా మెడ కండరాల దగ్గర ఇబ్బంది వంటివి ఉన్నవారు అదేపనిగా మెడను ముందుకు సాచి ఉంచడానికి బదులుగా తలను నిటారుగా ఉంచి మాత్రమే కంప్యూటర్గానీ, మొబైల్గానీ చూడటం అలవాటు చేసుకోవాలి. మెడను ఎంతగా వంచితే అంతగా మెడ ఎముకలపైనా, మెడ కండరాలపైనా ఒత్తిడి పెరిగి మున్ముందు అది సర్వైకల్ స్పాండిలోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుందని గుర్తించాలి. ఇక దీనితో పాటు అదేపనిగా కూర్చుని ఉండటంతో బరువు పెరిగి, అది మోకాళ్లపై ఒత్తిడిని పెంచి మోకాళ్ల నొప్పులు వస్తున్నవారు, మోకాళ్ల వాపు, కీళ్లలో బిగుతు, కూర్చున్నవాళ్లు వెంటనే లేకలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆర్థోపెడిక్ నిపుణులను సంప్రదించడం అవసరం. అయితే ఈ సమస్యలకు తక్షణం మందులు వాడటం, శస్త్రచికిత్స చేయించడం అవసరం ఉండకపోవచ్చు. అదేపనిగా కూర్చుని ఉండటానికి బదులుగా పనిలో తరచూ బ్రేక్ ఇస్తూ అటు ఇటు కదలడం, పొద్దున్నే వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం, జీవనశైలిలో మార్పులు చేసుకుని బరువు తగ్గించుకోవడంతో పాటు అవసరమైతే ఫిజియోథెరపీ వంటి ప్రక్రియలను డాక్టర్లు సూచిస్తారు. ఒకవేళ కొందరిలో ఇప్పటికే కీళ్లనొప్పులు లేదా కీళ్ల సమస్య ఉన్నవారికి వైద్య నిపుణులు వారికి సరిపోయే వ్యాయామాన్ని సూచిస్తారు. దీనికి తోడు ఆరోగ్యకరమై సమతులాహారం, అందులో తగినంత ప్రోటీన్, కాల్షియం, విటమిన్ల వంటివి తీసుకోవాలంటూ ఆ మేరకు దేహానికి అన్ని పోషకాలు అందే ఆహారంపై కూడా దృష్టిపెట్టేలా సలహాలు అందిస్తారు.నేటి వృత్తుల్లో వచ్చిన మార్పులతో ఇవీ అనర్థాలు...కదలకుండా ఒకేచోట కూర్చుని అదేపనిగా తల ముందుకు ఒంచి కంప్యూటర్ చూడటంతో పాటు అదేపనిగా కూర్చుని చేసే వృత్తుల కారణంగా చాలామందిలో బరువు పెరిగి ఊబకాయం వస్తోంది. దాంతో ఆ బరువు కారణంగా కొద్దిగా నడవడం గానీ, మెట్లు ఎక్కడం గానీ లేదా ఎక్కువ సేపు నిలబడటం, మామూలు రోజువారీ పనులుచేయడంలో వాళ్ల మోకాళ్లపైన భారమూ, ఒత్తిడీ పెరుగుతున్నాయి. దాంతో గతంలో చాలాకాలం తర్వాత వచ్చే మోకాళ్ల కీళ్ల అరుగుదల వంటి ముప్పు ఇప్పుడు చాలా త్వరితంగానే వచ్చే ప్రమాదం పెరుగుతోంది. ఇక దేహం బరువు పెరగడం వంటి అంశాలు హైబీపీ, డయాబెటిస్కూ దారితీస్తాయన్న విషయం చాలామందికి తెలిసిందే. వీటితో పాటు కనిపిస్తున్న కాస్తంత పాత సమస్యకే సరికొత్త పేరు ‘టెక్ నెక్’! కూడా.చికిత్స... తొలిదశల్లో కొన్ని మందులతో ఉపశమనం కలిగేలా డాక్టర్లు తాత్కాలికమైన చికిత్సలు అందిస్తారు. ఒకవేళ దేహం బరువు ప్రమాదకరంగా మారినవాళ్లకూ, మెడ ఎముకలూ, మోకాళ్లు బాగా అరిగిపోయిన వాళ్లకు తగిన చికిత్సలతో పాటు బాగా అవసరమైన వాళ్లకు చివరి ప్రత్యామ్నాయంగా (గ్రేడ్ – 4 దశలో) మాత్రమే శస్త్రచికిత్సలను డాక్టర్లు సూచిస్తారు.
అంతర్జాతీయం
మరో ఇద్దరు మృత్యుంజయులు
కఠ్మాండు: నేపాల్లో మరో అద్భుతం చోటుచేసుకుంది. వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. నువాకోట్ జిల్లా బిదుర్ పట్టణంలో ఆకస్మిక వరదల వల్ల కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలు చండికా శ్రేష్ట 10 రోజుల తర్వాత సజీవంగా బయటపడింది. సహాయక సిబ్బంది బురద, ఒండ్రు మట్టిని తొలగించి ఆమెను శనివారం క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. నేపాల్ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళ నెమ్మదిగా స్పృహలోకి రావడం వీడియోలో కనిపిస్తోంది. సహాయక సిబ్బంది ఆమెను దుప్పటి, జాకెట్తో కప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈ వృద్ధురాలిని చికిత్స కోసం వెంటనే హెలికాప్టర్లో కఠ్మాండు ఆసుపత్రికి తరలించారు. సొరంగంలో చైనా జాతీయుడు రసువా జిల్లాలో భారీ వరదల ధాటికి ధ్వంసమైన అప్పర్ త్రిశూలి 1 జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం నుంచి ఒక చైనా జాతీయుడిని శనివారం రక్షించారు. అతడిని లూహైటతావోగా గుర్తించారు. వరదల సమయంలో ‘ఆడిట్ టన్నెల్ 4’లో చిక్కుకుపోయాడు. లూహైతావోను నేపాలీ సైన్యం, విదేశీ సహాయక సిబ్బందితో కూడిన బృందం కాపాడినట్లు అధికారులు ప్రకటించారు. సొరంగ మార్గంలో సుమారు 225 మీటర్ల లోపల ఉన్న ఒక ప్రదేశం నుంచి సజీవంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగాల సజీవంగా బయటకు తీసిన కార్మికుల సంఖ్య మొత్తం మూడుకు చేరింది. శుక్రవారం త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్లాంట్లోని ఒక సొరంగం నుంచి ఇద్దరు కార్మికులు కబిర్ మహర్జన్, సంజయ్ షాను రక్షించిన సంగతి తెలిసిందే. నేపాల్లో పదికిపైగా జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద కనీసం 900 మంది కార్మికులు గల్లంతయ్యారని, వీరిలో దాదాపు 500 మంది సొరంగాల లోపలే ఉండి ఉంటారని అధికారులు వెల్లడించారు. 1,344కి చేరిన మృతుల సంఖ్య నేపాల్ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం 1,344కి చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల్లో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 589 మంది విదేశీయులతో సహా దాదాపు 5,000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు 13,000 మందికి పైగా బాధితులను రక్షించామని పేర్కొన్నారు. ఎనిమిది జిల్లాల్లో ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాల్లో 758 పెద్దలవి, 85 పిల్లలవి కాగా, 501 మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభించాయని తెలిపారు. డీఎన్ఏ సేకరణ సహా చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత మొత్తం 1,030 మృతదేహాలను ఖననం చేశారు. కేవలం 96 మృతదేహాలను మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మిస్ వరల్డ్ 2026 విజేతగా డొమినికన్ రిపబ్లిక్ భామ
వియత్నాంలో జరిగిన మిస్ వరల్డ్ 2026 గ్రాండ్ ఫినాలేలో డొమినికన్ రిపబ్లిక్కు చెందిన జోహెయిరీ మోలా విజేతగా నిలిచారు. థాయ్లాండ్కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ ఒపల్ సుచాటా చువాంగ్స్రీ ఆమెకు ప్రపంచ సుందరి కిరీటం అలంకరించారు.ఈ పోటీలో స్పెయిన్కు చెందిన ఎలిసబెత్ రేయ్నెస్ ఫస్ట్ రన్నరప్గా, మలేషియాకు చెందిన తానుసియా చెట్టి సెకండ్ రన్నరప్గా నిలిచారు.టాప్ 6 ఫైనలిస్టులుడొమినికన్ రిపబ్లిక్ – జోహెయిరీ మోలా: విజేతస్పెయిన్ – ఎలిసబెత్ రేయ్నెస్: ఫస్ట్ రన్నరప్మలేషియా – తానుసియా చెట్టి: సెకండ్ రన్నరప్వియత్నాం – లే న్గుయెన్ బావో న్గోక్దక్షిణాఫ్రికా – రొమాండా హోంబిర్ఎరిట్రియా – స్నిట్ హబ్టియాబ్: పీపుల్స్ ఛాయిస్భారత్కు నిరాశభారత్ తరఫున పాల్గొన్న నిఖిత పోర్వాల్ టాప్ 40లో చోటు దక్కించుకున్నప్పటికీ, టాప్ 20కి అర్హత సాధించలేకపోయారు. దీంతో ఆమె మిస్ వరల్డ్ 2026 ప్రయాణం టాప్ 40 వద్ద ముగిసింది. అయితే భారత్ వరుసగా ఐదు మిస్ వరల్డ్ ఎడిషన్లలో ప్లేస్మెంట్ సాధించిన రికార్డును కొనసాగించింది.
మిస్ వరల్డ్ పోటీ నుంచి మిస్ ఇండియా ఔట్
వియత్నాం వేదికగా జరుగుతున్న 73వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నిఖిత పోర్వాల్ నిష్క్రమించింది. ఈ పోటీలో నిఖిత టాప్-40 వరకు చేరుకున్నప్పటికీ, టాప్-20లో స్థానం సంపాదించలేకపోయింది. దీంతో భారత్కు ఏడో మిస్ వరల్డ్ కిరీటం అందించాలనుకున్న నిఖిత కల చెదిరింది.ఫైనల్ సందర్భంగా నిఖిత భవ్నా రావు రూపొందించిన ప్రత్యేక గౌన్ను ధరించింది. పూల ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబెలిష్మెంట్, ఇటాలియన్ ట్యూల్తో రూపొందించిన ఈ దుస్తులు ఆమె లుక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఉజ్జయినికి చెందిన నిఖిత ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేత. పేజెంట్ ప్రపంచంలోకి రాకముందు నిఖిత టీవీ యాంకర్గా పని చేసింది. నటనలోనూ ఆమెకు అనుభవం ఉంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. మూడు ఇరాన్ ట్యాంకర్లు ధ్వంసం
వాషింగ్టన్: అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్కు చెందిన మూడు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ అమెరికా నేవీ యుద్ధ నౌకలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగడంతో ప్రతీకార దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వివరాలు తెలిపింది.అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ. అమెరికా ఇరాన్ రెచ్చగొట్టే విధంగా చేసిన దాడులను తమ విమాన వాహక నౌక, గైడెడ్-మిస్సైల్ డ్రాయర్ విజయవంతంగా తిప్పికొట్టిందని పేర్కొంది. ఖర్గ్ ద్వీపం తీరంలో, జాస్క్ సమీపంలో ఉన్న M/T డౌనీ, M/T స్టార్క్1 అనే రెండు IRGC క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను అమెరికా బలగాలు ధ్వంసం చేశాయని తెలిపింది. అలాగే ఒమన్ సముద్రంలో లోడ్ చేయకుండా ఉన్న మరో ట్యాంకర్పై సైతం దాడి చేసి నేలమట్టం చేశాయని పేర్కొంది. ఈ విషయమై సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ మాట్లాడుతూ "IRGCకి మా సందేశం స్పష్టంగా ఉండాలి. మీరు మా రెండు నౌకలపై కాల్పులు జరిపితే, మేము దానికి ప్రతిగా మీ వైపు నుంచి మూడింటిపై దాడి చేస్తాం. మరింత ఎక్కువ ఆర్థిక మూల్యాన్ని విధిస్తాము" అని కూపర్ పేర్కొన్నారు. అమెరికా బలగాలను రక్షించడానికి తాము ఏ క్షణంలోనైనా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా, పర్షియన్ గల్ఫ్లోని ఖార్క్ ద్వీపం సమీపంలో ఉన్న ఇరాన్ ట్యాంకర్పై అమెరికా దాడి చేసిందని ఇరాన్ ధృవీకరించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగలేదని, ట్యాంకర్ సిబ్బందిని సురక్షితంగా ఖాళీ చేయిస్తున్నట్లు స్థానిక వర్గాలు పేర్కొన్నట్లు ఆ దేశ మీడియా కథనాలు ప్రచురించింది, ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఖర్గ్కు ద్వీపానికి చెందిన ఒక AI-సృష్టించిన వీడియోను జతచేస్తూ ఖార్గ్ ద్వీపం "చిన్నాభిన్నం" అవుతోందని పేర్కొన్నారు.
జాతీయం
ఝీరామ్ దాడిలో పది మంది మావోలు దోషులు
జగదల్పూర్: 2013లో ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా ఝీరమ్ లోయలో కాంగ్రెస్ నేతల కాన్వాయ్పై జరిగిన దాడి కేసులో 10 మంది మావోయిస్టులను దోషులుగా నిర్ధారిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పునిచ్చింది. ఈ దాడిలో మాజీ కేంద్ర మంత్రి విద్యా చరణ్ శుక్లా, మాజీ ప్రతిపక్ష నేత మహేంద్ర కర్మతోపాటు 29 మంది మరణించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2013 మే 25న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పరివర్తన్ ర్యాలీపై మావోయిస్టులు దాడి చేశారు. కాంగ్రెస్ నేతలతోపాటు పలువురు పౌరులు, భద్రత సిబ్బంది 29 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు. ఈ దాడి ఫలితంగా చత్తీస్గఢ్లో కాంగ్రెస్ అగ్రనాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్లు అయ్యింది. దోషులకు విధించే శిక్షను సెపె్టంబర్ 16న ఖరారు చేయనున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ సింగ్ రాజ్పుత్ తెలిపారు.
సుప్రీంకోర్టు నెలవారీ లెక్చర్ సిరీస్
న్యూఢిల్లీ: చట్టం, న్యాయం, సమాజాల్లోని సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు చర్చ కొనసాగే లక్ష్యంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక వినూత్నమైన ఆలోచనకు తెరలేపింది. న్యాయం, న్యాయ విద్య, సమకాలీన సామాజిక అంశాలపై నిపుణుల చేత నెలకు ఒక ఉపన్యాసం ఇప్పించనున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శనివారం ఈ నెలవారీ ఉపన్యాసాల కార్యక్రమాన్ని ప్రకటించారు. దీంతోపాటే వార్షిక అవార్డు ఒకదాన్ని కూడా అందివ్వనున్నట్లు తెలిపారు. ‘ప్రతి నెలా...ఒక ముఖ్యమైన ఆలోచన.’అనే భావనతో రూపొందిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పండితులు, యువ న్యాయ ప్రతిభలు పాల్గొంటారు. నెలనెలా ఒక ప్రముఖ న్యాయవేత్త లేదా నిపుణుడు ఉపన్యాసం ఇస్తారు. దానిపై చర్చ, ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. ప్రతి కార్యక్రమాన్ని రికార్డు చేసి సవరించిన ప్రతులు, సంక్షిప్త నివేదికలు అందుబాటులో ఉంచనున్నారు. ఇతర భారతీయ భాషల్లోకి అనువాదమూ చేస్తారు. న్యాయవిద్యలో అత్యున్నత నైపుణ్యాన్ని గుర్తించేందుకు ‘సుప్రీం కోర్టు న్యాయ శిక్షా సమ్మాన్’పేరుతో ఏటా ఒక అవార్డు అందివ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించినట్లు జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఉపన్యాస శ్రేణిలో మొదటి కార్యక్రమం ఇదే నెలలో జరగనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా అర్థవంతమైన చర్చ, న్యాయపరమైన అంశాల్లో లోతైన ఆలోచన, దేశ చట్టం, న్యాయాల భవిష్యత్తును రూపొందించే అంశాల్లో విస్తృత భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు.
4 రాష్ట్రాల్లో ముందస్తు జన గణన
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో జన గణన ప్రక్రియను ముందుగానే ప్రారంభిస్తున్నట్లు రిజి్రస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్జీఐ) శనివారం వెల్లడించారు. గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలతోపాటు ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియ 2026 డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 4వ తేదీ వరకు జరుగుతుందని తెలియజేశారు. అలాగే 2027 జనవరి 5 నుంచి 2027 జనవరి 9 వరకు దీనికి సంబంధించిన పునఃపరిశీలన దశ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్జీఐ, జనాభా గణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా ప్రాంతాల్లోని పౌరులు 2026 నవంబర్ 16 నుంచి నవంబర్ 30 వరకు స్వయంగా వివరాలను నమోదు చేసుకునే (ఎల్ఫ్ ఎన్యూమరేషన్) అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా జనగణన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మాత్రం ముందుగానే నిర్వహించబోతున్నారు.
పిల్లల బాల్యాన్ని కాపాడాలి
న్యూఢిల్లీ: విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వ్యసనం పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. పిల్లలను క్రీడలు, శారీరక వ్యాయామం, సృజనాత్మక కార్యకలాపాల వైపు ప్రోత్సహించాలని, తద్వారా వారు సెల్ఫోన్లతో ఎక్కువ సమయం వృథా చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. ఉత్తమ ఉపాధ్యాయులుగా జాతీయ అవార్డుకు ఎంపికైన వారితో ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ వీడియోను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి సంభాషించారు. పిల్లల బాల్యాన్ని కాపాడాలని, వారిలో సహజ కుతూహలాన్ని పెంపొందించాలని చెప్పారు. తరగతి గది అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా మార్చడానికి సృజనాత్మక పద్ధతులను ఎంచుకోవాలని అన్నారు. చదువులు మాత్రమే కాకుండా పిల్లల ప్రవర్తన, దైనందిన జీవితం పట్ల కూడా శ్రద్ధ వహించాలని స్పష్టంచేశారు. ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్న తరుణంలో విద్యార్థుల జీవితాల్లో టీచర్లు మరింత కీలక పాత్ర పోషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వారికి సరైన మార్గనిర్దేశం చేస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు ముందుకు నడిపించాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. విద్యార్థుల్లోనూ డ్రగ్స్ వ్యసనం పెరిగిపోతుండడం పట్ల ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. పెద్ద నగరాలు, విశ్వవిద్యాలయాల్లో ఎవరు ఎవరికి ఏమి ఇస్తున్నారో తెలియడం లేదని, దీనివల్ల డ్రగ్స్ బారిన పడిన వారిని గుర్తించడం కష్టమని అన్నారు. అందుకే విద్యార్థుల్లో డ్రగ్స్ ముప్పుపై తగిన అవగాహన కల్పించడానికి టీచర్లే చొరవ తీసుకోవాలని చె ప్పారు. డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు గుర్తిస్తే వారి ని ఆ వ్యసనం నుంచి దూరం చేయాలని పే ర్కొన్నారు. వారి జీవితాల్లో బాల్యాన్ని సజీవంగా ఉంచడం ద్వారా ఉపాధ్యాయులు గొప్ప సహకారాన్ని అందించగలరని వెల్లడించారు.నిజ జీవిత నైపుణ్యాలతో అనుసంధానించాలి విద్యార్థుల్లో స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం ఒక ప్రధాన సమస్యగా మారిందని ప్రధానమంత్రి చెప్పారు. పిల్లలు స్క్రీన్పై ఎంత సమయం గడుపుతున్నారు? రాత్రిపూట మొబైల్ ఫోన్లు ఎన్ని గంటలు వాడుతున్నారు? అనేదానిపై వారి తల్లిదండ్రులతో మాట్లాడాలని ఉపాధ్యాయులకు సూచించారు. క్రీడలు, శారీరక శ్రమతో కూడిన ఆటలు, సృజనాత్మక కార్యకలాపాలు, కళలపై ఆసక్తిని పెంపొందించుకోవడం ద్వారా స్క్రీన్ సమయాన్ని సహజంగా తగ్గించవచ్చని స్పష్టంచేశారు.
ఎన్ఆర్ఐ
దుబాయ్లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా దుబాయ్లోని బిన్ సనత్ లేబర్ క్యాంప్, సోనాపూర్లో అన్నదాన సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గల్ఫ్ కో-కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా, ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్ రెడ్డి, ప్రసన్న సోమిరెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రాజా రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, కోటేశ్వర రెడ్డి, నరేష్ చౌదరి, జనార్దన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, రమణ రెడ్డి , ఇషాల్ , వెంకట్ రెడ్డి, షరీఫ్, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలో ప్రియతమ మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా..ఆయన చేసిన సేవలు, అమలు చేసిన కార్యక్రమాలు నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయన్నారు. అంతేగాదు వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ, భవిష్యత్తులో కూడా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు గల్ఫ్ కో-కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా.(చదవండి: మరపురాని మహానేత.. జలప్రదాత వైఎస్సార్)
అమెరికాలో ఘనంగా మనబడి తెలుగుకు పరుగు రన్4తెలుగు 2026
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని, పురస్కరించుకొని నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘తెలుగుకు పరుగు – Run4Telugu 2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది.వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, జార్జియా, ఇల్లినాయిస్, మిషిగన్, మిన్నెసోటా, మిస్సోరీ, న్యూ జెర్సీ, ఒక్లాహోమా, టెన్నెస్సీ, టెక్సాస్, వర్జీనియా తదితర రాష్ట్రాలలోని సుమారు 25 ప్రాంతాల నుంచి మూడువేల మందికి పైగా తెలుగు భాషాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశాన్ని సమాజానికి అందించాలనే లక్ష్యంతో మనబడి భాషా సైనికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ‘తెలుగుకు పరుగు’లో ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకులు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ, మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతుల గురించి వివరించారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను తెలియజేస్తూ, తెలుగు భాషను భావితరాలకు అందించడం ప్రతి తెలుగు కుటుంబం బాధ్యత అని గుర్తుచేశారు. అమెరికా, కెనడాతో పాటు వివిధ దేశాలలో మనబడి నిర్వహిస్తున్న తెలుగు తరగతులు, కార్యక్రమాల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన మనబడి అధ్యక్షులు, కులపతి చమర్తి రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగుకు పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు శుభాభినందనలు తెలిపారు. Run4Telugu పోటీలను రెండు విభాగాలలో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి మెడల్స్తో సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనబడి ధృవపత్రాలను అందజేశారు. ఆయా ప్రాంతాలలో పాల్గొన్న వారికి అల్పాహార విందును కూడా ఏర్పాటు చేశారు. అంతేగాదు “తెలుగు నేర్చుకుందాం… తెలుగు మాట్లాడుదాం… తెలుగు భాషను భావితరాలకు అందిద్దాం” అనే మనబడి సందేశాన్ని అమెరికా వ్యాప్తంగా ధ్వనింపచేసేలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. (చదవండి: స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు)
లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?
ఆరంకెల జీతం, హెచ్1-బీ వీసా కలలతో అమెరికాకు ఎగిరిపోయే భారతీయులకు ఈ కల సాకారమైనాక ఇక లైఫ్ సెట్ అనుకుంటారు. కానీ ఒక భారత సంతతి మహిళ అలా అనుకోలేదు. వాటన్నింటినీ వదులుకుని మాతృదేశానికి తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకో తెలుసా?'బిజినెస్ ఇన్సైడర్' అందించిన వివరాల ప్రకారం 28 ఏళ్ల దిశా లాంబా, 2021లో న్యూయార్క్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికాకు వెళ్లింది. అక్కడ విజయ వంతమైన కెరీర్ను నిర్మించుకుని, 2024లో CVS హెల్త్లో డేటా సైంటిస్ట్ ఉద్యోగాన్ని పొందింది. ఆరెంకల భారీ వేతనంతో కూడిన ఉద్యోగం. H-1B వీసా లాటరీ ప్రక్రియలోనూ విజయం సాధించింది. కానీ తన కుటుంబానికి దగ్గరగా ఉండటంతో పాటు,మారుతున్న పరిస్థితుల రీత్యా వాటన్నింటినీ వదులుకోవాలని నిర్ణయించుకుంది.ఒంటరితనం, అమెరికా సమయానికి అనుగుణంగా ఇండియాలోని తల్లిదండ్రులతో మాట్లాడాల్సి రావడం ఆమెను మానసికంగా ఇబ్బందికి గురి చేసినట్టు ఆమె వెల్లడించారు. H-1B వీసా పొందినప్పటికీ ఉద్యోగం మారడం, ఇతర ఆదాయ మార్గాలు (Side hustles) వెతుక్కోవడం, ప్రయాణాలు లేదా కెరీర్ గ్యాప్ తీసుకోవడం H-1B నిబంధనల వల్ల చాలా కష్టంతో కూడుకున్నవి కావడం కూడా ఆమె నిర్ణయానికి ఊతమిచ్చాయి.ఇదీ చదవండి: రూ. 15 లక్షల కారు, 70 తులాల గోల్డ్ : అయినా కట్నదాహానికి టీచర్ భువనేశ్వరి ఆహుతి2026 మేలో ఉద్యోగానికి రాజీనామా చేసి గురుగ్రామ్లోని తన తల్లిదండ్రుల వద్దకు తిరిగొచ్చేశారు. ప్రస్తుతం ఒక చిన్న కెరీర్ బ్రేక్ తీసుకుని, భారతదేశంలోనే కొత్త అవకాశాలు లేదా స్వంతంగా వ్యాపారం ప్రారంభించే యోచనలో ఉన్నారు. H-1B వీసాలపై కొత్త ప్రతిపాదనలప్రకారం, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసాలకు సంబంధించి కొన్ని కఠినమైన మార్పులను ప్రతిపాదించింది: H-1B వీసా ఫీజు పెంచే ప్రతిపాదనతోపాటు. గ్రేస్ పీరియడ్ రద్దచేయాలని భావిస్తోంది. దీంతో ఉద్యోగం కోల్పోయిన H-1B హోల్డర్లకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగిస్తారు.అలాగే H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకిచ్చే (H-4 వీసా) ఇచ్చే పని అనుమతులను రద్దు చేసే ప్రతిపాదన కూడా ఉంది. ఈ నిబంధనలు ఎక్కువ మంది భారతీయ కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
90 ఏళ్ల వయసులో మాతృదేశానికి పయనం.. డాలస్లో ఘన సత్కారం!
డాలస్, టెక్సస్: అనేక దశాబ్దాలుగా పార్క్ల్యాండ్ హాస్పిటల్, డాలస్ కౌంటీ ఫ్యామిలీ కోర్ట్ సర్వీసెస్, డాలస్ కౌంటీ చైల్డ్ వెల్ఫేర్ తదితర సంస్థల ద్వారా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బాలల సంక్షేమం, కుటుంబ న్యాయస్థాన సేవలు, గృహహింస, వృద్ధుల సంక్షేమం, డయాలసిస్ సేవలు వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందించిన ప్రముఖ సామాజిక సేవకురాలు డా. భానుమతి ఇవటూరికి డాలస్లో ఘన సత్కారం లభించింది. 90 ఏళ్ల వయస్సులో అమెరికాలో 50 సంవత్సరాలకు పైగా జీవితం గడిపిన ఆమె ఇకపై మాతృదేశంలో జీవించేందుకు పయనమవుతున్న సందర్భంగా ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, షబ్నం మాడ్గిల్, తైయాబ్ కుండావాల, సుష్మా మల్హోత్రా, సత్యన్ కళ్యాణ్ దుర్గ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (TANTEX) అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, శ్రీధర్ కోడెల, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, రామకృష్ణ నూనె; అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఉత్తరాధ్యక్షులు సతీష్ రెడ్డి; నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (NATS) పూర్వాధ్యక్షులు బాపు నూతి; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, TANA బోర్డు పూర్వ కార్యదర్శి మురళి వెన్నం; కమ్యూనిటీ నాయకులు ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, డా. జగదీశ్వరన్ పుడూర్ తదితరులు డా. భానుమతి ఇవటూరిని జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించారు.సభాధ్యక్షత వహించిన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “సమస్యకు–పరిష్కారానికి మధ్య, వివాదానికి–అవగాహనకు మధ్య, గందరగోళానికి–స్పష్టతకు మధ్య, నిరాశకు–ఆశకు మధ్య డా. భానుమతి ఒక వెలుగుదారిగా నిలిచారు. అమెరికాలో కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం అంత సులభమైన విషయం కాదు. తల్లిదండ్రులు తమతో పాటు మాతృభూమి విలువలు, సంప్రదాయాలు, ఆశలు, ఆకాంక్షలను తీసుకువస్తారు. అయితే వారి పిల్లలు మాత్రం పూర్తిగా భిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో పెరుగుతారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, పిల్లలపై ఉన్న ఆశలు అపార్థాలకు, చివరకు కుటుంబ కలహాలకు దారితీస్తాయి. ఈ సమస్యను ఎంతో లోతుగా అర్థం చేసుకున్న భానుమతి.. తల్లిదండ్రుల ఆశలు, అంచనాల కారణంగా పిల్లలనే దూరం చేసుకునే పరిస్థితి రాకూడదని చెబుతారు” అన్నారు.“జీవితంలో విజయం అంటే కేవలం డిగ్రీలు, పదవులు, బిరుదులు కాదు. మన వల్ల ఎన్ని కుటుంబాలకు సహాయం అందింది, ఎంతమంది జీవితాలు మెరుగుపడ్డాయి అనేదే నిజమైన విజయానికి కొలమానం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ డా. భానుమతి ఇవటూరి జీవితం. 50 సంవత్సరాలకు పైగా అమెరికాలో జీవితం గడిపి, తొమ్మిది పదులు దాటిన వయస్సులో మాతృదేశంలో తన భవిష్యత్ జీవితాన్ని గడపాలనుకోవడం హర్షనీయమైన విషయం. ఆమె మిగిలిన జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని డా. ప్రసాద్ తోటకూర అన్నారు.వివిధ సందర్భాల్లో డా. భానుమతి ఇవటూరితో సన్నిహితంగా పనిచేసిన ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, డా. కృష్ణబాబు చుండూరి, డా. కిశోర్ సుంకర, రాధికా కోడెల, రామకృష్ణ నూనె, డోరిస్ మార్షల్, స్యూ యాన్ రూత్, అవ్యం రమణి తదితరులు భానుమతి సామాజిక సేవలను కొనియాడారు.డా. భానుమతి ఇవటూరి మాట్లాడుతూ.. “అతి తక్కువ సమయంలో, వారాంతం కానప్పటికీ, ఇర్వింగ్లోని మైత్రీ ఇండియన్ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశానికి దాదాపు వంద మందికి పైగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు నా జీవితంలో ఒక మధురమైన రోజుగా మిగిలిపోతుంది. నా సుదీర్ఘ సామాజిక సేవా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు.ఇవీ చదవండి: 8 ఏళ్లకే చెస్లో సంచలనం.. 9/9 గెలిచిన తెలుగు బాలిక!
క్రైమ్
లష్కర్-ఏ-తైబా కమాండర్ యాసిర్ హతం
మధ్య కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలోని ఎన్కౌంటర్లో పాకిస్థాన్కు చెందిన లష్కర్-ఏ-తైబా కమాండర్ యాసిర్ హతమయ్యాడు. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా దళాలు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేసిన తరుణంలో యూస్మార్గ్ ఎత్తైన ప్రాంతం వద్ద శనివారం ఈ తాజా ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఉగ్రవాదుల ఉనికిపై భద్రతా సంస్థలకు అందిన సమాచారం మేరకు, భద్రతా దళాలు ఆ ప్రాంతంలో నిఘా ఆధారిత గాలింపు చర్యలు చేపట్టినప్పుడు ఈ కాల్పులు మొదలయ్యాయి. స్పెషల్ ఫోర్సెస్ 53 రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి.ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. యాసిర్ మొదట లష్కర్-ఏ-తైబాకు చెందిన సులేమాన్ మూసా బృందంలో సభ్యుడిగా ఉండేవాడు. అయితే, దాదాపు ఏడాది క్రితం ఆ బృందం నుండి విడిపోయి, అప్పటి నుండి స్వతంత్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. భద్రతా సంస్థలు అతని కదలికలపై నిఘా ఉంచడంతో పాటు, కొంతకాలంగా యూస్మార్గ్ ప్రాంతంలో అతని కార్యకలాపాలపై నిఘాపెట్టాయి.సులేమాన్ బృందం నుండి విడిపోయిన తర్వాత యాసిర్ ఆ ప్రాంతంలో కీలకమైన లష్కర్ కార్యకర్తగా ఎదిగాడని కూడా వర్గాలు వెల్లడించాయి. యూస్మార్గ్ ఎత్తైన ప్రాంతాల్లో అతని ఉనికిని గుర్తించిన భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి, చివరకు అది ఎదురుకాల్పులకు దారితీసింది.ఇదీ చదవండి: రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడుయాసిర్ మరణం తర్వాత, భద్రతా సంస్థలు అతని నెట్వర్క్, ఇతర లష్కర్-ఏ-తైబా కార్యకర్తలతో అతనికి ఉన్న సంబంధాలు మరియు ఆ ప్రాంతంలో అతని కార్యకలాపాల విస్తృతిపై దర్యాప్తు చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాల ప్రణాళిక, నిర్వహణ లేదా మద్దతులో యాసిర్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా భద్రతా సంస్థలు విచారణ జరుపుతున్నాయి.ఇదీ చదవండి: 8 తులాల గోల్డ్ కొట్టేసి ప్రియుడికి బైక్ : గుట్టు విప్పిన ఇన్స్టా రీల్కాగా హషీమ్ మూసా అలియాస్ సులేమాన్ మూసా, పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి సూత్రధారులలో ఒకడు. ఆ దాడి జరిగిన కొద్ది నెలల తర్వాత, శ్రీనగర్లోని దాచిగామ్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మూసా హతమయ్యాడు.ఇదీ చదవండి: రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్ జాబ్ ఎంచుకున్న టెకీ
8 తులాల గోల్డ్ కొట్టేసి ప్రియుడికి బైక్ : గుట్టు విప్పిన ఇన్స్టా రీల్
తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడికి ఖరదైనా బైక్ కొనిచ్చేందుకు 19 ఏళ్ల కాలేజీ అమ్మాయిఏకంగా ఫ్రెండ్ ఇంట్లోనే చోరీకి తెగబడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.పోలీసుల సమాచారం ప్రకారం నిందితురాలిని టీవీకే నగర్కు చెందిన ఆర్. జాయ్ ప్రిన్సి (19)గా గుర్తించారు. ఈమె పొల్లాచి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో బి.కామ్ (సి.ఎ) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెకు మక్కిన్పట్టికి చెందిన జనగన్ శివ (20) అనే యువకుడితో పరిచయం ఉంది. ప్రియుడిని ప్రసన్నం చేసుకునేందుకు అతగాడికి ఒక బైక్ కొనాలని ప్లాన్ చేసింది. అలా పక్కా ప్లాన్ ప్రకారం స్నేహితురాలి ఇంట్లో దొంగిలించిన డబ్బుతో కొత్త KTM బైక్ను కొనుగోలు చేసింది. అక్కడితోఆగలేదు ప్రిన్సి , ప్రియుడితో కలిసి బైక్ అన్వీలింగ్ వీడియో పోస్ట్ చేయడంతో అడ్డంగా బుక్కయ్యారు. ఇదీ చదవండి: రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడుఉంజవేలాంపట్టికి చెందిన హెచ్. తమిళ్ సెల్వన్ (59) కూతురు, ప్రిన్సి ఇద్దరూ స్నేహితులు. ప్రిన్సి తండ్రికి కూడా తమిళ్ సెల్వన్ స్నేహితుడు. ఈ పరిచయాన్నే ఆమె వాడుకుంది. ఆగస్టు 16న ప్రిన్సి తన స్నేహితురాలిని కలవడానికి తమిళ్ సెల్వన్ ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో బీరువా తెరిచి అందులో ఉన్న 9 సవర్ల బంగారు నగలను దొంగిలించింది. ఇంట్లోని బంగారం కనిపించకపోవడంతో తమిళ్ సెల్వన్ ఇటీవల పొల్లాచి ఈస్ట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.మరోవైపు సోషల్మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను చూసిన పోలీసులకు అనుమానం రావడంతో ప్రిన్సిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఆమె చేసిన నేరాన్ని అంగీకరించింది. దొంగిలించిన నగలను పొల్లాచిలోని ఒక జ్యువెలరీ షాప్లో తక్షణమే రూ. 2.5 లక్షలకు అమ్మేసినట్లు చెప్పింది.ఆ డబ్బుతోనే తన ప్రియుడికి కొత్త బైక్ కొనిచ్చినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం యువతిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు మక్కినంపట్టికి చెందిన జనగన్ శివ (20) కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్ జాబ్ ఎంచుకున్న టెకీ
చిన్నారి ఎక్కడ? అని అడిగితే.. భార్యపై భర్త పైశాచికం!
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధిస్తూ.. ఓ భర్త...భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. మల్లాపూర్కు చెందిన లాలుతో 2023లో చెంగిచెర్లకు చెందిన రత్నావత్ అనిత (21)కు ప్రేమవివాహం జరిగింది.వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. రెండు నెలలుగా అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో అనిత నెలరోజుల క్రితం ఆర్టీసీ కాలనీలోని తన పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 2న లాలు వచ్చి కుమార్తెను తీసుకెళ్లాడు. మళ్లీ 3న చెంగిచెర్లకు వచ్చాడు. అయితే కూతురిని తీసుకురాలేదు.మనవరాలు ఎక్కడ ఉందని అనిత తండ్రి లాలుని ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురై ఇంట్లో ఉన్న పెట్రోల్ను అనితపై పోసి నిప్పంటించాడు. కుమార్తెను రక్షించేందుకు అనిత తల్లి ప్రయత్నించే క్రమంలో ఆమెకు కూడా మంటలు అంటుకున్నాయి. బయట ఉన్న అనిత తండ్రి కేకలు విని వెంటనే వచ్చి మంటలను ఆర్పి, అనంతరం 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఇవి కూడా చదవండి: తీజ్ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్లో కర్రలతో దాడులు
‘నీ భార్య స్వాతి నా దగ్గరే ఉంది, నువ్వు ఏమీ చేయలేవు‘
హైదరాబాద్: వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జహీరాబాద్ టౌన్ ఎస్సై లవకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. కోహిర్ మండలం బిలాల్పూర్ గ్రామానికి చెందిన కొనగారి వినయ్కుమార్కు రెండేళ్ల క్రితం తోరమామిడి గ్రామానికి చెందిన బంటు స్వాతితో వివాహమైంది. కాగా పెళ్లికి ముందే స్వాతికి కోహీర్ పట్టణంలోని లాలాగూడకు చెందిన వరుసకు బావ అయిన నాగరిగారి ప్రవీణ్ కుమార్తో ప్రేమలో ఉంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో స్వాతికి వినయ్కుమార్తో వివాహం జరిగింది. కాగా పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రవీణ్ కుమార్ తన మరదలు స్వాతితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలుసుకున్న స్వాతి భర్త భార్యతో విడిగా ఉంటున్నాడు. కొన్ని రోజుల నుంచి ప్రవీణ్ కుమార్ తరచూ స్వాతి భర్తకు ఫోన్ చేస్తూ, ‘నీ భార్య నా దగ్గరే ఉంది, నువ్వు ఏమీ చేయలేవు‘ అని బెదిరిస్తూ మెసేజ్లు, ఫొటోలు పంపిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాడు. ఈ క్రమంలో వినయ్ కుమార్ను పూర్తిగా మట్టుబెట్టాలని ప్రవీణ్ కుమార్ కర్నాటక బీదర్కు చెందిన తన పెద్దమ్మ కొడుకు ప్రవీణ్తో కలిసి హత్యకు పథకం పన్నాడు. గత నెల 9న సాయంత్రం జహీరాబాద్లోని చెన్నారెడ్డి కాలనీలో వినయ్కుమార్ను అడ్డుకుని గొడవ పెట్టుకున్నారు. ప్రవీణ్ అతనిని వెనుక నుంచి గట్టిగా పట్టుకోగా నాగరిగారి ప్రవీణ్ కుమార్ వెంట తెచ్చుకున్న కత్తితో వినయ్ వీపుపై తీవ్రంగా పొడిచాడు. ఈ దాడిలో వినయ్ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరిని రిమాండ్కు తరలించారు. చదవండి: తీజ్ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్లో కర్రలతో దాడులు
వీడియోలు
జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం
DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!
వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!
30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు
మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...
తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!
నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట
చరిత్ర సృష్టించిన రష్మిక
DSCలో అవినీతి బట్టబయలు..! లోకేష్ రాజీనామా..?
భారీగా తగ్గిన బంగారం ధర

