‘అద్దాల’ టెండర్లలో మాయాజాలం
సాక్షి, అమరావతి: శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనుల టెండర్లలో ముఖ్యనేత మాయాజాలానికి ఇదో నిదర్శనం. బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్ (బీవోసీఈ) ఆమోదించిన ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్)ను తుంగలో తొక్కి అంచనా వ్యయాన్ని రూ.553.51 కోట్లు పెంచేసి ఐదు టవర్లకు అద్దాలను అమర్చే పనులకు ఆగస్టు 4న ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) టెండర్లు పిలిచింది. టెండర్లో జాయింట్ వెంచర్లు బిడ్లు దాఖలుకు అర్హత లేదంటూ నిబంధన పెట్టింది. కానీ.. టెండర్లో పనులు దక్కించుకున్నాక 50 శాతం పనులు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించింది. పరస్పర విరుద్ధమైన ఈ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే.. అధిక మొత్తంలో కమీషన్ ఇచ్చే సంస్థకు పనులు అప్పగించేందుకే వాటిని పెట్టారని అప్పట్లోనే నిపుణులు పేర్కొన్నారు. ఆ టెండర్లు రద్దు చేసి.. ఆ తర్వాత ఆ పనులకు ఆగస్టు 31న ఏడు రోజుల స్వల్పకాలిక వ్యవధితో రెండోసారి టెండర్లు పిలిచింది. ఆ టెండర్లను ఈ నెల 9న రద్దు చేసింది. సింగిల్ బిడ్లు దాఖలు కావడంతో తొలిసారి, రెండోసారి టెండర్లు రద్దు చేసినట్టు చెబుతున్నారు. వాటికి ముచ్చటగా మూడోసారి ఈ నెల 11న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 15 నుంచి బిడ్లు దాఖలు చేయవచ్చని పేర్కొంది. బిడ్ల దాఖలు తుది గడువు ఈ నెల 22. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరిచి అర్హత సాధించిన కాంట్రాక్టు సంస్థల దాఖలు చేసిన ఆర్థిక బిడ్లను తెరిచి టెండర్లు ఖరారు చేస్తామని పేర్కొంది. మొద టి, రెండోసారి సింగిల్ బిడ్ దాఖలు కావడంతో వాటిని రద్దు చేసి ఏజీఐసీఎల్ మూడోసారి సింగిల్ బిడ్ దాఖలైనా ఆమోదించేందుకు సిద్ధమైంది.ఎస్ఎస్ఆర్ తుంగలోకి..అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో భాగంగా శాశ్వత సచివాలయం పేరుతో ఐదు టవర్ల నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. డయాగ్రిడ్ విధానంలో 39 అంతస్తులతో నిర్మీస్తున్న నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో నిర్మీస్తున్న మరో టవర్కు అద్దాలను అమర్చేలా పోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ డిజైన్లు రూపొందించింది. టవర్లకు గ్లాసింగ్, క్లాడింగ్(అత్యధిక ఉష్ణోగ్రతను, శబ్ద కాలుష్యాన్ని తట్టుకునే డబుల్–గ్లేజ్డ్ అద్దాలను అమర్చడం), క్రౌన్, అట్రియం(భవనాల పైభాగంలో ఉండే శిఖరం నిర్మాణం, విశాలమైన గ్లాస్–రూఫ్ సెంట్రల్ అట్రియమ్), కానోపి, స్కైలైట్(ప్ర«దాన ప్రవేశ ద్వారాల వద్ద టెన్షన్–రాడ్ స్టీల్ కానోపిలు, సహజ వెలుతురు కోసం స్కైలైట్లు), పీవీ ప్యానెల్స్ (భవనం వెలుపల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసే పర్యావరణ అనుకూల ఐజీబీసీ ప్లాటినమ్ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాల ప్యానెళ్లు), బీఎమ్యూ (ఎత్తైన టవర్ల గ్లాస్ను శుభ్రం చేయడానికి, నిర్వహించడానికి ఉపయోగించే ఆటోమేటెడ్, రూఫ్–మౌంటెడ్ టెలిస్కోపిక్ క్రేన్ సిస్టమ్స్ ఏర్పాటు) పనులు చేయాలి. వీటి అంచనా వ్యయం రూపొందించడానికి ఇప్పటివరకు ఎస్ఎస్ఆర్ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయలేదు. దీంతో ఎస్ఎస్ఆర్ ఖరారుకు అనుభవం ఉన్న సంస్థల నుంచి సీఆర్డీఏ కొటేష న్లు ఆహ్వానించింది. ముంబైకి చెందిన ఆల్మెక్ ఫెసాడ్, హైదరాబాద్కు చెందిన టీమ్ వర్క్ గ్లాస్ అండ్ అల్యూమినియం, బెంగళూరుకు చెందిన ఇంటెర్ని ఇంటర్నేషనల్ సంస్థలు కొటేషన్లు ఇచ్చాయి. అందులో ఆల్మెక్ ఫెసాడ్ సంస్థ తక్కువ ధరకు కోట్ చేసినట్టు సీఆర్డీఏ పేర్కొంది. శాశ్వ త సచివాలయం ఐదు టవర్లకు డిజైన్లు రూపొందించిన పోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థే.. చైనాలో షెన్జెన్లోని మర్చంట్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ భవనాలను డిజైన్ చేసింది. ఆ భవనాలకు అద్దా లు అమర్చడానికి చేసిన వ్యయాన్ని.. ఆల్మెక్ ఫెసా డ్ కొటేషన్లో పేర్కొన్న ధరను పరిగణనలోకి తీసుకుని.. అన్ని పనులకూ జీఎస్టీతో కలిపి చదరపు అడుగుకు సగటున రూ.80,892గా బీవోసీఈ ఖరారు చేసింది. కానీ.. బీవోసీఈ ఖరారు చేసిన ఎస్ఎస్ఆర్ను తుంగలో తొక్కి అంచనా వ్యయా న్ని పెంచేసి ఏజీఐసీఎల్ టెండర్లు పిలిచింది.అంచనా వ్యయం రూ.553.51 కోట్లు పెంపు అద్దాలను అమర్చే పనులకు జీఏడీ టవర్కు రూ.522.15 కోట్లు (అంచనా వ్యయం రూ.442.06 కోట్లు+రూ.80.09 కోట్లు జీఎస్టీ రీయింబర్స్), 1, 2 టవర్లకు రూ.1,073.82 కోట్లు (అంచనా వ్యయం రూ.909.88 కోట్లు+రూ.163.94 కోట్లు జీఎస్టీ రీయింబర్స్), 3, 4 టవర్లకు రూ.859.25 కోట్లు (అంచ నా వ్యయం రూ.727.45 కోట్లు+ రూ.131.79 కోట్లు జీఎస్టీ రీయింబర్స్) వెరసి రూ.2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఒప్పందం చేసుకున్న రోజు నుంచి 15 నెలల్లో వాటిని పూర్తిచేసి.. మరో 13 ఏళ్లు వాటిని నిర్వహించాలని ఏజీఐసీఎల్ షరతు విధించింది. ఐదు టవర్లలోనూ అన్నిరకాల అద్దాలు అమర్చే పనుల విస్తీర్ణం 2,35,092.75 చదరపు మీటర్లుగా లెక్కగట్టింది.ఈ లెక్కన ఆ పనుల అంచనా వ్యయం జీఎస్టీతో కలిపి రూ.1,901.71 కోట్లే.. కానీ రూ.2,455.22 కోట్లతో ఏజీఐసీఎల్ టెండర్లు పిలిచింది. అంటే అద్దాలు అమర్చేందుకు చదరపు మీటరు ధర రూ.1,04,436.22 కావడం గమనార్హం. అంటే.. బీవోసీఈ ఖరారు చేసిన ఎస్ఎస్ఆర్ను బుట్టదాఖలు చేసినట్టు స్పష్టమవుతోంది. దీన్ని బట్టి చూస్తే అంచనా వ్యయాన్ని రూ.553.51 కోట్లు పెంచేశారు. ఎంపిక చేసిన సంస్థకే అధిక ధరలకు పనులు కట్టబెట్టి పెంచేసిన అంచనా వ్యయంతోపాటు భారీగా కమీషన్లు వసూలుకే ఈ టెండర్లలో ముఖ్యనేత మాయాజాలం చేస్తున్నారంటూ ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.ఈ దోపిడీ పర్వం వల్లే సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం రూ.10,670.47 కోట్లకు చేరుకుంది. ఐదు టవర్ల నిర్మీత ప్రాంతం 52,20,496 చదరపు అడుగులు. అంటే.. నిర్మాణ వ్యయం ఇప్పటికే చదరపు అడుగుకు రూ.20,439.58కు చేరుకున్నట్టు స్పష్టమవుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లోనూ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
ఆర్టీసీ బస్సులో మహిళల గొడవ.. వీడియో వైరల్
వికారాబాదు జిల్లా: వినాయక చవితి పండుగ సందర్భంగా మూడ్రోజుల పాటు సెలవులు ఉండటంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఆదివారం వికారాబాద్ జిల్లా పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు గొడవ పడ్డారు. ఓ మహిళపై మరో ముగ్గురు మహిళలు దాడి చేశారు. జుట్టు పట్టుకొని లాగి కొట్టారు. దీంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పండుగ నేపథ్యంలో రద్దీ ఉంటుందని తెలిసినా ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్య పెంచకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పరిగి డీఎం ఇసాస్ను వివరణ కోరగా గొడవ జరిగింది తమ డిపోకు చెందిన బస్సులో కాదని, ఘటన పరిగి పరిధిలో జరగలేదని తెలిపారు. ఫ్రీ బస్సులో సీట్ల కోసం లొల్లిపరిగి నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు pic.twitter.com/hxbzeT19Td— Telugu Scribe (@TeluguScribe) September 13, 2026ఇదీ చదవండి: దారుణం.. ఆర్టీసీ బస్సు మీద నుంచి పోవడంతో
ఎల్లలు లేని వినాయకుడు.. వివిధ దేశాల్లో..
విఘ్నాలను తొలగించే దేవుడిగా, కొత్త ఆరంభాలకు ప్రతీకగా భారతీయులు కొలిచే గణపతి దేవునికి సరిహద్దులు లేవు. ఆసియాలోని పలు దేశాల్లో గణేశుడిని వివిధ పేర్లతో, భిన్నమైన సంప్రదాయాలతో పూజిస్తుంటారు. జపాన్, థాయ్లాండ్, ఇండోనేషియా, నేపాల్, మలేషియా, కంబోడియాల్లో గణేశుని ఆరాధనలు కనిపిస్తాయి.జపాన్లో ‘కాంగిటెన్’గా గణపయ్యజపాన్లో గణేశుడిని కాంగిటెన్ (Kangiten)గా పూజిస్తారు. జపాన్ సంస్కృతిలో ఆయనను విఘ్నాలను తొలగించి ఆనందం, విజయం అందించే దేవుడిగా భావిస్తారు. ఇక్కడ గణేశుడి ఆరాధనకు బౌద్ధమతంతో సన్నిహిత సంబంధం ఉంది. భారత్లో గణపతికి మోదకాలు నైవేద్యంగా సమర్పించడం సాధారణం కాగా.. జపాన్లో ఆయనకు ముల్లంగిని సమర్పించే సంప్రదాయం ఉంది. జపాన్లోని మత్సుచియామా షోడెన్, హోజాంజిలలో కాంగిటెన్ ఆలయాలున్నాయి.థాయ్లాండ్లో ‘ఫ్రా ఫికానెట్’ప్రధానంగా బౌద్ధ దేశమైన థాయ్లాండ్లో పలు హిందూ దేవతలను కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అందులో గణేశుడు కూడా ఒకరు. ఇక్కడ ఆయనను ‘ఫ్రా ఫికానెట్’ గా పిలుస్తారు. అదృష్టం, విజయం ప్రసాదించే దేవుడిగా ఆయనను భావిస్తారు. ఆనందాన్ని అందించడంతో పాటు కష్టాలను అధిగమించే శక్తిని గణేశుడు ప్రసాదిస్తాడని స్థానికుల నమ్మకం. దేశవ్యాప్తంగా గణేశుడి విగ్రహాలు, ఆలయాలు, పూజా స్థలాలు ఉన్నాయి. స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా వీటిని సందర్శిస్తారు.ఇండోనేషియా.. బాలిలో ప్రత్యేక స్థానంఇండోనేషియాలో ముఖ్యంగా బాలిలో గణేశుడికి విశిష్ట స్థానం ఉంది. అదృష్టం, జ్ఞానం, కొత్త ఆరంభాలకు నెలవైన దేవుడిగా గణేశుడిని పూజిస్తారు. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తుశకం 7వ, 8వ శతాబ్దాల నాటికే ఇండోనేషియాలో గణేశుడు ముఖ్యమైన దేవతగా గుర్తింపు పొందాడు. అక్కడి కొన్ని హిందూ సమాజాల్లో విష్ణువు, శివుడు, సరస్వతితో పాటు గణేశుడిని కూడా ఆరాధిస్తారు. ఇండోనేషియా ప్రాచీన సంస్కృతి, కళల్లోనూ గణేశుడి ప్రాతినిధ్యం కనిపిస్తుంది.నేపాల్లో శుభప్రద దేవుడిగా..నేపాల్లో గణేశుడిని గణేశ, గణపతి, వినాయక వంటి పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా హిందూ నేవార్ సమాజంలో ఆయనను అదృష్టాన్ని ప్రసాదించే దేవుడిగా పూజిస్తారు. భారత్లో మాదిరిగానే అక్కడ కూడా మతపరమైన కార్యక్రమాలను ప్రారంభించే ముందు గణేశుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది. నేపాల్లో పలు గణేశ ఆలయాలు ఉన్నాయి. రాజధాని ఖాట్మండులోని మారూ గణేశ్, భక్తపూర్లోని సూర్య వినాయక ఆలయాలు వాటిలో ప్రముఖమైనవిగా చెబుతుంటారుమలేషియాలోనూ వినాయక చవితిమలేషియాలో హిందువులు అధికంగా కనిపిస్తారు. అక్కడ కూడా గణేశుడిని కొత్త ఆరంభాలకు ప్రతీకగా, విఘ్నాలను తొలగించే దేవునిగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం గణేశ చతుర్థిని కూడా నిర్వహిస్తారు. అదృష్టం కోసం పలువురు తమ ఇళ్లలో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించుకుంటారు. మలేషియాలోని శ్రీ సిద్ధి వినాయగర్ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది.కంబోడియాలో శతాబ్దాల చరిత్రకంబోడియాలో గణేశుడి ఆరాధనకు శతాబ్దాల చరిత్ర ఉంది. క్రీస్తుశకం 5వ-6వ శతాబ్దాల నుంచే అక్కడ గణేశుడిని పూజించినట్లు చరిత్ర చెబుతోంది. శైవ హిందూ సంప్రదాయం వ్యాప్తి ద్వారా గణేశుడి ఆరాధన అక్కడికి చేరినట్లు చెబుతారు. ఖ్మేర్ సామ్రాజ్య కాలానికి చెందిన కళల్లోనూ గణేశుడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. శిల్పాలు, చెక్కడాల్లో ఆయన రూపాలు దర్శనమిస్తాయి. ప్రజలు గణేశుడిని విముక్తిని ప్రసాదించే, విఘ్నాలను తొలగించే దేవునిగా భావిస్తారు. కంబోడియాలోనూ పలు గణపతి ఆలయాలు కనిపిస్తాయి.ఇదీ చదవండి: 45 ఏళ్లుగా గణేశ్ వేడుకల్లో మారుమోగుతూ..
సరిగా ‘సిప్’ చేస్తే... చేతికి మరో జీతం!
బంగారం, వెండి ధరలు బాగా పెరిగి పోయాయి. కొనటం కష్టం. ఒకవేళ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే... వడ్డీ ఆశాజనకంగా లేదు. ఈపీఎఫ్లో పెడితే... వడ్డీ బావున్నా దీర్ఘకాలం వేచిచూడాలి. పోస్టాఫీసు స్కీముల్లో అయితే లిమిట్ ఉంటుంది. తక్కువే పెట్టగలం. మరేం చెయ్యాలి? భవిష్యత్తు కోసం అందుబాటులో ఉన్న ఇన్వెస్ట్మెంట్ మార్గమేంటి? మున్ముందు ఒక జీతంలా నెలనెలా రావాలంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే. సిప్ మార్గంలో మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయటం. నెలకు రూ.5వేల చొప్పున ‘సిప్’ చేస్తే స్థిరమైన జీతాన్ని సాధించటం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే ఇలా సిప్ చేయటానికి కొన్ని మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. అవేంటో వివరించేదే ఈ ‘వెల్త్ స్టోరీ’నెలకు రూ.5వేలు. అంటే సంవత్సరానికి రూ.60 వేలు. ఈ మొత్తంతో అప్పటికప్పుడు ఒక నిధిని పోగేద్దామనుకుంటే సాధ్యం కాదు. కాకపోతే ఓ 20–25 సంవత్సరాలు గనక ఇలానే ఇన్వెస్ట్ చేస్తే... అర్థవంతమైన నిధి ఏర్పడుతుంది. దీనిపై స్థిరమైన జీతాన్ని పొందొచ్చు. అలా వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోతుంది. చివరి రోజుల్లో ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం తప్పుతుంది. అందుకే... దీన్ని భవిష్యత్లో వచ్చే రెండో జీతంగానే చూడాలి తప్ప ఒక భారీ గ్యారంటీడ్ నిధిగా చూడకూడదు. క్రమం తప్పకుండా విత్డ్రా చేసుకునేట్లుగా పోర్టుఫోలియోను డిజైన్ చేసుకోవచ్చు. రెండో జీతమంటే ఏంటి? ఒక పెద్ద నిధి సమకూరగానే దాన్ని ఖర్చుపెట్టేసేలా ఉండకూడదు. ఆ వచ్చేదాని కోసం ముందే ఖర్చులు సిద్ధం చేసి పెట్టుకోవటం కూడా సరికాదు. ఆ నిధి నుంచి వార్షికంగా కొంత సొçమ్ము తీసుకోవటమే లక్ష్యంగా ఉండాలి. మిగిలింది పెట్టుబడిగానే కొనసాగుతుంది. ఉదాహరణకు ఏడాదికి 4 శాతం విత్డ్రా చేసుకుంటే... ఆ మిగిలిన మొత్తం పెట్టుబడిగా కొనసాగుతుంది కనక సుదీర్ఘకాలం మన లక్ష్యానికి ఢోకా ఉండదు. అదెలాగో చూద్దాం... → రూ.30 లక్షల నిధి గనక సమకూరితే దాని ద్వారా నెలకు రూ.12 వేలు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. → రూ.60 లక్షల నిధి గనక సమకూరితే దాన్నుంచి ఈజీగా నెలకు రూ.25వేల వరకు విత్డ్రా చేసుకోవచ్చు. → రూ.కోటి నిధి గనక సమకూరితే రమారమి నెలకు రూ.40 వేలు విత్డ్రా చేసుకున్నా ఇబ్బంది ఉండదు.ప్రతి నెలా ‘సిప్’ రూపంలో రూ.5వేలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఎంతవుతుంది? నిజానికి పాతికేళ్లు గనక ఇలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే రూ.కోటి కూడా కావచ్చు. కాకపోతే ఇది పూర్తిగా మార్కెట్ రాబడులపై ఆధారపడి ఉంటుంది. దీర్ఘ కాలానికైతే మార్కెట్లు ఎప్పుడూ మంచి రాబడులే ఇస్తున్నాయి కనక ఇబ్బంది ఉండదు. ఎన్నేళ్లకు ఎంతవుతుందన్నది ఈ పట్టికలో చూద్దాం...నెలకు రూ.5వేలు... ఎంతవుతుంది?పై పట్టికలో 10 శాతం రాబడి లెక్కన చూసుకుంటే రూ.5000 సిప్ 20 ఏళ్లలో 38 లక్షలవుతుంది. దీన్లోంచి ఏటా 4 శాతం చొప్పున నెలకు రూ.22,100 విత్డ్రా చేయొచ్చు. అదే 10 శాతం రాబడి లెక్కన 25 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే సిప్ మొత్తం రూ.66 లక్షలవుతుంది. నెలకు రూ.22,100 చొప్పున విత్డ్రా చేయటానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో తెలుసుకోవాల్సింది ఒక్కటే. తొలి దశాబ్దంలో ఒక మంచి ఇన్వెస్టింగ్ పద్ధతి అలవాటవుతుంది. తరువాతి దశాబ్దాల్లో కాంపౌండింగ్ వల్ల భారీ నిధి సమకూరుతుంది. ద్రవ్యోల్బణాన్ని గమనించక తప్పదు... భవిష్యత్తులో నెలకు రూ.20వేలు వస్తుందనుకోండి. ఆ మొత్తంతో ఇప్పుడు రూ. 20 వేలతో ఏం కొనగలుగుతున్నామో అవన్నీ కొనలేం. ఎందుకంటే ధరలు పెరుగుతాయి. అదే ద్రవ్యోల్బణం. ఇది ఏటా 5 శాతం పెరుగుతుందనుకుంటే ప్రస్తుతం నెలవారీ ఇంటి ఖర్చులకు పెడుతున్న రూ.10వేలు ... 10 ఏళ్లలో రూ.16,300కు చేరుతుంది. 15 ఏళ్లలో ఇది రూ.20,800 అవుతుంది. 20 ఏళ్లలో ఇది ఏకంగా రూ.26,500 అవుతుంది. అందుకే రూ.5,000 నెలవారీ సిప్ అనేది ఒక శుభారంభంగా చూడాలి. అంతే తప్ప ఇదే పూర్తిస్థాయి రిటైర్మెంట్ ప్రణాళిక కాదు. ఇందుకంటే దేశంలో వినియోగ ద్రవ్యోల్బణం ఏటా 4 శాతం వరకూ పెరుగుతున్నట్లు గడిచిన కొన్నేళ్ల డేటా చెబుతోంది. కాకపోతే చదివే చదువు, వెళ్లే ఆసుపత్రి, జీవన స్థాయిని బట్టి కుటుంబాలు ఎవరికివారు అంతకన్నా ఎక్కువ రేటు ద్రవ్యోల్బణాన్ని కూడా భరించాల్సి రావచ్చు. ఏటా ‘సిప్’ పెంచటం... సూపర్ స్టెప్మీరు నెలకు రూ.,5వేలతోనే సిప్ ఆరంభించి ఉండొచ్చు. కానీ ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళ్లటమనేది మీకు భవిష్యత్తులో సమకూరబోయే నిధిని నాటకీయంగా మార్చేస్తుంది. అలా పెంచుతూ వెళితే ఏమవుతుందంటే... ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళితే 25 ఏళ్లలో సమకూరే నిధి వల్ల నెలకు రూ.54,300 విత్డ్రా చేసుకోవటానికి వీలవుతుంది. అందుకనే ఏటా సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లటమనేది తొలి నాళ్ల నుంచీ ఆరంభిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయమేంటంటే జీతం పెరిగినపుడల్లా... దాంట్లో కొంత సిప్కు కేటాయించటం. అలా చేయటం వల్ల పెంపు భారమనిపించదు. ఈ తప్పులు చేయొద్దు.... → మార్కెట్లు పడ్డప్పుడు నిలిపేయటం... చాలామంది ఇన్వెస్టర్లు చేసే తప్పు ఇదే. మార్కెట్లు బాగా పడుతున్న సందర్భాల్లో నష్టాలు వస్తాయనే కారణంతో సిప్ను నిలిపేస్తుంటారు. కానీ ఆ సమయంలో తాము ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తానికి ఎక్కువ యూనిట్లు వస్తాయనే వాస్తవాన్ని గ్రహించరు. ఇంకా పడ్డాక కొందాంలే... అనే ధోరణితో ఉంటారు. కానీ మార్కెట్లు పడేటపుడు ఎంతవరకూ పడతాయో... ఎప్పటి నుంచి పెరుగుతాయో ఎవ్వరూ అంచనా వేయలేరు. కాబట్టే ఇలాంటి సందర్భాల్లో సిప్ చాలా ఉపయోగపడుతుంది. లక్ష్యాలు దీర్ఘకాలికం కనక ఈ ఊగిసలాటలు తాత్కాలికమేనని గ్రహించటం అత్యవసరం. → రాబడులకు గ్యారంటీ ఉండదు... ఏటా 10 శాతమో, 12 శాతమో పెరుగుతాయనే ఉద్దేశంతోనే ఇన్వెస్ట్ చేస్తారు కదా!. కాకపోతే అది గ్యారంటీ అని, తమ చేతిలోకి అనుకున్న మొత్తం తప్పనిసరిగా వస్తుందని మాత్రం అనుకోకూడదు. కాలిక్యులేటర్లో లెక్కలు వేసి... ఆ మేరకు మొత్తం తమ చేతిలోకి వస్తుంది కదా అని దాని ఆధారంగా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవటం సరికాదు. ఎందుకంటే చివరికి మనం అనుకున్న మొత్తం కన్నా ఎక్కువైనా రావచ్చు. లేదా తక్కువైనా రావచ్చు. కాకపోతే దీర్ఘకాలంలో ఎప్పుడూ మంచి లాభాలే వస్తాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. → ఇన్వెస్ట్మెంట్ కన్నా ముందు పునాది ముఖ్యంఆర్థికంగా ఇబ్బందుల్లేని పరిస్థితులనేవి అన్నిటికన్నా ప్రధానం. ఇబ్బందులు పడుతూ... ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా దూకుడుగా సిప్లో ఇన్వెస్ట్ చేయటం కూడా అంత తెలివైన నిర్ణయమేమీ కాదు. అందుకే సిప్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ అంశాలు చూసుకోవాలి.... → అత్యవసర ఖర్చులనేవి ఎటునుంచి ఎలా వస్తాయో తెలియదు. కాబట్టి వీటికి తగినంత అత్యవసర నిధి ఉండాలి. → చాలినంత ఆరోగ్య బీమా కవరేజీ ఉండాలి. టర్మ్ లైఫ్ కవరేజీ కూడా ప్రధానమే. → ఎక్కువ వడ్డీ ఉన్న అప్పుల్ని తగ్గించుకోవటానికి ప్రణాళిక ఉండాలి. ప్రత్యేకించి క్రెడిట్ కార్డు రుణాలు, ఖరీదైన వ్యక్తిగత రుణాలు ఈ కోవలోకి వస్తాయి. → దగ్గర్లో చేయాల్సిన పనులకు ప్రత్యేక నిధి అవసరం. వచ్చే ఏడాది చెల్లించాల్సిన స్కూలు లేదా కాలేజీ ఫీజు, వచ్చేనెల చెల్లించాల్సిన గృహ రుణం ఈఎంఐ...ఇలాంటివి దీని పరిధిలోకి వస్తాయి. → ప్రత్యేకించి ఇన్వెస్ట్ చేయటానికి అప్పు తీసుకోవటమనేది ప్రమాదకరం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ట్రాప్లో పడొద్దు. ఇదీ... కుటుంబాలకు రోడ్ మ్యాప్ 1 నుంచి 3 సంవత్సరాలు... ఒక ఇన్వెస్ట్మెంట్ సంస్కృతిని అలవాటు చేసుకోవాలి. నెలకు రూ.5వేల సిప్... కొంత అత్యవసర నిధి... గతేడాది అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఫండ్లో ఇన్వెస్ట్ చేయటం వంటివి కాకుండా దీర్ఘకాలంగా మంచి పనితీరు కనబరుస్తున్నవి ఎంచుకోవటం... జీతం ఖాతాలో పడగానే ఆటోమేటిగ్గా సిప్లోకి కొంత మొత్తం పోయేటట్లు చూసుకోవటం. 4 నుంచి 10 సంవత్సరాలు... జీతం పెరిగినపుడల్లా సిప్ మొత్తాన్ని కూడా పెంచుకుంటూ వెళ్లటం. స్వల్పకాలంలో అవసరమయ్యే మొత్తాన్ని విడిగా ఉంచుకోవటం... దాన్ని దీర్ఘకాల ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లలో కలపకపోవటం... ప్రతి రోజూ కాకుండా ఏడాదికోసారి లక్ష్యాలను సమీక్షించుకోవటం. → 11 నుంచి 20 సంవత్సరాలు.. లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వెళ్లాలి. ప్రధాన లక్ష్యం దగ్గరికొస్తున్న కొద్దీ... కొంత మొత్తాన్ని ఊగిసలాటల మార్కెట్ల నుంచి స్థిరంగా ఉండే సాధనాల్లోకి మళ్లించాలి. చివరి సంవత్సరం వచ్చేదాకా వేచి చూడకుండా... మార్కెట్లు బాగున్నపుడు కొంత మొత్తాన్ని మళ్లిస్తే రిస్కు తగ్గుతుంది. → 20 ఏళ్ల తరవాత... అప్పుడప్పుడూ కావలసినంత మొత్తాన్ని తీసుకోకుండా.. ఒక ప్రణాళిక మేరకు నిర్థ్ధిష్ట కాల వ్యవధుల్లో కొంత మొత్తాన్ని తీసుకుంటే మంచిది. విత్డ్రాయల్స్ను ఏడాదికోసారి సమీక్షించుకుంటే మంచిది. స్వల్పకాలంలో చెల్లించాల్సిన వాటికోసం కొంత సొమ్ము విడిగా ఉంచుకోవాలి. అలా చేస్తే అవసరమైనపుడు ఒకవేళ మార్కెట్లు బాగులేకుంటే తక్కువకే విక్రయించి బయటపడాల్సిన పరిస్థితి ఉండదు. చివరిగా గమనించాల్సింది ఒకటే. రూ.5000 నెలవారీ సిప్ అనేది మరీ చిన్న మొత్తమేమీ కాదు. కాకపోతే దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక పెట్టుకుని, ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళితే అది మరింత అర్థవంతమైన నిధిగా మారుతుంది. నిజానికి మంచి ఫండ్లను వెతకటంలోనే విజయం ఉందనుకోవద్దు. మానకుండా చిరకాలం ఇన్వెస్ట్ చేయటంలోనే అసలు విజయం దాగి ఉంటుంది.రమణమూర్తి మంథా
మైనస్ 50 డిగ్రీల చలిలో లక్షలాది మంది ఖైదీల కన్నీటి కథ
రైలు కిందపడి తండ్రి,కొడుకు ఆత్మహత్య
సంక్రాంతి రేసులో మరో సినిమా.. ఇంకెన్నిరా బాబు!
ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె
ఏఐ బండి కొంచెం మెల్లగా.. ట్రంప్ భయం నిజమేనా?
ఆర్ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తొలిపూజ
వైభవ్ను కాదని నీకు ఛాన్స్ ఇచ్చి ఏం లాభం?
టీ తాగుతుండగా.. దూసుకొచ్చిన మృత్యువు!
ఏఐతో రాజకీయాలకు, జాతీయ భద్రతకు ముప్పు!
థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన
ఎన్నికల్లో మీకు సరైన లెక్క నేను చెబుతా..
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
అలాగే ఓ బాంబు, నెత్తిన అప్పు కూడా ఇద్దాం సార్!
వివాహేతర సంబంధాల యాప్.. టాప్–5లో హైదరాబాద్!
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
‘పండుగప్ప’ కోసం పోటీ.. వేలంలో దక్కించుకున్న మహిళ
నీవే శరణ్యం గణేశా!
వైభవ్కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా
ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే?
బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయం.. కదిలిన యంత్రాంగం
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
ఆంధ్రప్రదేశ్ అప్పులు
రాత్రికి రాత్రే 23 కి.మీ వెనక్కి సముద్రం.. ఏం జరగబోతుంది?
విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
భారత రోడ్లపై పుతిన్ కారు.. ప్రత్యేకతలు ఇవే!
హెడ్కోచ్గా సౌరవ్ గంగూలీ.. బ్యాటింగ్ కోచ్గా యువరాజ్!
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
పాముల మధ్యే విధులు నిర్వహించిన డాక్టర్
మైనస్ 50 డిగ్రీల చలిలో లక్షలాది మంది ఖైదీల కన్నీటి కథ
రైలు కిందపడి తండ్రి,కొడుకు ఆత్మహత్య
సంక్రాంతి రేసులో మరో సినిమా.. ఇంకెన్నిరా బాబు!
ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె
ఏఐ బండి కొంచెం మెల్లగా.. ట్రంప్ భయం నిజమేనా?
ఆర్ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తొలిపూజ
వైభవ్ను కాదని నీకు ఛాన్స్ ఇచ్చి ఏం లాభం?
టీ తాగుతుండగా.. దూసుకొచ్చిన మృత్యువు!
ఏఐతో రాజకీయాలకు, జాతీయ భద్రతకు ముప్పు!
థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన
ఎన్నికల్లో మీకు సరైన లెక్క నేను చెబుతా..
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
అలాగే ఓ బాంబు, నెత్తిన అప్పు కూడా ఇద్దాం సార్!
వివాహేతర సంబంధాల యాప్.. టాప్–5లో హైదరాబాద్!
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
‘పండుగప్ప’ కోసం పోటీ.. వేలంలో దక్కించుకున్న మహిళ
నీవే శరణ్యం గణేశా!
వైభవ్కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా
ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే?
బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయం.. కదిలిన యంత్రాంగం
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
ఆంధ్రప్రదేశ్ అప్పులు
రాత్రికి రాత్రే 23 కి.మీ వెనక్కి సముద్రం.. ఏం జరగబోతుంది?
విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
భారత రోడ్లపై పుతిన్ కారు.. ప్రత్యేకతలు ఇవే!
హెడ్కోచ్గా సౌరవ్ గంగూలీ.. బ్యాటింగ్ కోచ్గా యువరాజ్!
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
పాముల మధ్యే విధులు నిర్వహించిన డాక్టర్
ఫొటోలు
హైదరాబాద్ : అబ్బా బలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)
'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)
ఆషికా.. బార్బీ డాల్కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)
అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)
ఫ్యాన్స్ ఫైట్ చేస్తుంటే.. స్టార్స్ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)
ఖైరతాబాద్ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)
హైదరాబాద్లో వినాయక చవితి సందడి (ఫోటోలు)
'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)
విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)
సినిమా
బెస్ట్ ఎంటర్టైనర్ వెంకటేశ్... యాక్టర్ నాగచైతన్య
సైమా అవార్డుల వేడుక (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్–2026) బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో జరిగింది. తొలి రోజు తెలుగు, కన్నడ భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను ప్రదానం చేయగా, రెండో రోజు తమిళ, మలయాళ భాషల చిత్రాల్లో ప్రతిభ చూపిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్కు అవార్డుల ప్రదానం జరిగింది. తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) సినిమా ఆరు విభాగాల్లో అవార్డులు సాధించింది. నాలుగు విభాగాల్లో ‘మిరాయ్’ సినిమాకు అవార్డులు లభించాయి. బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డు వెంకటేశ్కి, ‘తండేల్’ సినిమాలోని నటన నాగచైతన్యకు బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకువస్తే, ‘మిరాయ్’ చిత్రానికిగానూ తేజ సజ్జాకు క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. ఉత్తమ చిత్రంగా ‘మిరాయ్’ నిలవగా, ఉత్తమ దర్శకుడి అవార్డును ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకుగానూ అనిల్ రావిపూడి అందుకున్నారు. క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రస్ అవార్డు నటి ఐశ్వర్యా రాజేష్ (‘సంక్రాంతికి వస్తున్నాం’)కు లభించింది. 2025లో విడుదలైన దక్షిణాది సినిమాలకు అవార్డులను ప్రదానం చేశారు.
ప్రేక్షకుల చేతికే మొత్తం పవర్స్.. అంచనాలను పెంచేసిన బిగ్బాస్
బిగ్బాస్ సీజన్-10లో ఆదివారం ఎపిసోడ్ సందడిగా సాగింది. వినాయక చవితి సందర్భంగా హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు పండగ శుభాకాంక్షలు తెలిపి షోను ప్రారంభించారు. ఎప్పటిలాగే తనదైన శైలిలో కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతూ.. అవసరమైన చోట క్లాస్ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో బ్లాక్ కీతో హౌస్లో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చారు. ఇక రెండో వీకెండ్ ఎలా ఉండబోతుందో కూడా హింట్ ఇచ్చారు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి ఓ లుక్కేద్దాం..ఇంగ్లీష్పై నాగార్జున అసంతృప్తిహౌస్లో కొందరు కంటెస్టెంట్లు ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడటంపై నాగార్జున స్పందించారు. హౌస్లో జరిగే విషయాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉండాలంటే వీలైనంత వరకు తెలుగులో మాట్లాడాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లీష్ రాని ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలుగు సరిగా మాట్లాడటం రాకపోయినా ప్రయత్నిస్తున్న దేబ్జానీని ఈ సందర్భంగా నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు.దేబ్జానీకి ఫుల్ క్రేజ్.. రోహిత్కు వార్నింగ్కంటెస్టెంట్ల మనసులో ఎవరు ఉన్నారు? ఎవరు దూరంగా అనిపిస్తున్నారు? తెలుసుకునేందుకు నాగార్జున ఓ ఆసక్తికరమైన టాస్క్ను కంటెస్టెంట్లకు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు కంటెస్టెంట్లు తమ మనసులోని మాటలను బయటపెట్టారు. ఎక్కువమంది దేబ్జానీ పేరును ఇష్టపడుతున్నట్లు చెప్పడంతో నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. ‘నువ్వు చాలా పాపులర్ అయిపోతున్నావు’ అంటూ ఆమెతో సరదాగా అన్నారు. మరోవైపు రోహిత్ పేరును ద్వేషిస్తున్నట్లు తెలపడంతో రోహిత్ను హౌస్లో మరింత జాగ్రత్తగా ఉండాలని నాగార్జున సూచించారు.ఎక్కువ మంది చదివింది: అభిమానికి అండగా రామ్.. ఆమె కోసం మరో అడుగుబ్లాక్ కీతో అసలు ట్విస్ట్ఆదివారం ఎపిసోడ్లో బ్లాక్ కీతో బిగ్బాస్ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చారు. నాగార్జున తీసుకొచ్చిన బ్లాక్ కీని ఎవరికి ఇస్తే.. ఆ వ్యక్తి దగ్గర ఉన్న కీ పవర్ పనిచేయకుండా పోతుందని తెలిపారు. దీంతో ఆ బ్లాక్ కీ ఎవరికి ఇవ్వాలనే దానిపై కంటెస్టెంట్ల అభిప్రాయాలు తీసుకున్నారు. అందరిలో ఎక్కువమంది సృష్టి పేరు చెప్పారు. చివరికి బ్లాక్ కీని సృష్టికి ఇవ్వాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటనఇదే సమయంలో ఇప్పటివరకు మ్యాజిక్ కీ లేని నలుగురు కంటెస్టెంట్లకు మరో అవకాశం కల్పించారు. ఈ మేరకు బ్లాక్ బాక్స్ను సొంతం చేసుకునేందుకు నిర్వహించిన టాస్క్లో సుదీర్ విజయం సాధించాడు. దీంతో సృష్టి తన దగ్గర ఉన్న బ్లాక్ కీని సుదీర్కు అందించింది. ఇక సుదీర్ చేతికి చేరిన ఈ బ్లాక్ కీతో హౌస్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.ఎలిమినేషన్లో ట్విస్ట్..ఈ ఎపిసోడ్లో హౌస్మేట్స్గా అమన్, ముకేశ్, సృష్టి, నరేశ్లన ఎంపిక చేశారు. ఇప్పటివరకు హౌస్మేట్స్కానీ సుదీర్, వర్షిణి, కృష్ణుడుని యాక్టివిటీ రూంలోకి పంపించారు. ‘ మీ ముగ్గురులో హౌస్మేట్స్ ఎవరు.. ఎలిమినేట్ ఎవరు అవుతారో అక్కడ ఉన్న డోర్స్ తెరిస్తే తెలుస్తుంది’ అని నాగార్జున వాళ్లకి తెలిపాడు. ఇక్కడ ఓ మ్యాజిక్ జరిగింది అంతా సుదీర్ ఎలిమినేట్ అవుతాడు అనుకున్నారు. కానీ ఈ ముగ్గురూ హౌస్మేట్స్గానే ఎంపికయ్యారు.ముకేశ్ కళ్లపై నాగార్జున కామెంట్ముకేశ్ కళ్లను గమనించిన నాగార్జున.. ‘నీ కళ్లు చాలా బాగున్నాయి’ అంటూ ప్రశంసించారు. దీనికి ముకేశ్ థ్యాంక్యూ చెప్పాడు. ‘మీరు చెబుతుంటే నమ్మాలని అనిపిస్తుంది’ అని అన్నాడు. వెంటనే నాగార్జున సరదాగా ‘ఏంటి.. దేబ్జానీ చెబితే అర్థం కాలేదా?’ అంటూ నవ్వించారు. దీంతో పక్కనే ఉన్న దేబ్జానీ ‘నేను నిజంగానే చెప్పా సార్’ అంటూ బదులివ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి.ఇదీ చదవండి: షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్సినిమా టాస్క్..కంటెస్టెంట్ల కోసం నాగార్జున సినిమా టాస్క్ నిర్వహించారు. నరేశ్ను రెండు టీమ్లుగా విభజించమని చెప్పడంతో అతడు ఏ, బీ టీమ్లుగా విభజించాడు. ఈ పోటీలో కృష్ణుడు టీమ్ విజయం సాధించింది. విజేతలకు స్వీట్ బాక్స్లను అందించారు. ఆ సమయంలో దేబ్జానీ రాత్రిపూట తనకు కాఫీ కావాలని నాగార్జునను కోరింది. అయితే కాఫీ కావాలంటే ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ చెప్పాలని నాగార్జున కండిషన్ పెట్టారు.ఇదీ చదవండి: త్రిష రాగానే ముఖం పక్కకు తిప్పుకొన్న విజయ్దేబ్జానీ తన సీక్రెట్ చెబుతూ.. తాను ఆరో తరగతి రెండుసార్లు చదవాల్సి వచ్చిందని, తొలిసారి ఆరో తరగతిలో ఫెయిల్ అయ్యానని చెప్పింది. అయితే ఈ సీక్రెట్తో బిగ్బాస్ సంతృప్తి చెందలేదని నాగార్జున చెప్పడంతో మరో సీక్రెట్ బయటపెట్టింది. బిగ్బాస్ హౌస్లో ఉన్న ముకేశ్ అంటే తనకు చాలా ఇష్టమని దేబ్జానీ చెప్పింది. ముకేశ్ అందరితో పులహారి కలుపుతాడని కానీ తన దగ్గరకు మాత్రం రావడం లేదని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈ సీక్రెట్తో నాగార్జున ఆమెకు కాఫీని సాంక్షన్ చేశారు.రెండో వీకెండ్.. ప్రేక్షకుల చేతుల్లోనే!ఇక ఎపిసోడ్ చివర్లో వచ్చే వీకెండ్ ఎలా ఉండబోతుందో తెలిపే ఓ క్లిప్ను చూపించారు. ‘నెక్ట్స్ వీకెండ్ అంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది’ అంటూ నాగార్జున చెప్పడంతో హౌస్లో మరో ఆసక్తికరమైన పరిణామానికి తెరలేచినట్లైంది. అసలు వచ్చే వారం ప్రేక్షకుల చేతుల్లో ఉండబోయేది ఏంటి? ఎవరి గేమ్పై ఎలాంటి ప్రభావం పడనుంది? అనేది తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.ఇదీ చదవండి: బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో త్రివిక్రమ్ ప్లానేంటి?
ముకేశ్ చాలా ఇష్టం.. కానీ చెప్పలేకపోతున్నా: దేబ్జానీ
వీకెండ్ వచ్చిందంటే చాలు బిగ్బాస్ హౌస్లో సందడి మొదలైపోతుంది. ఎందుకంటే హోస్ట్ నాగార్జున వచ్చి హౌస్మేట్స్తో ఆడుకోవడంతో పాటు వారమంతా జరిగిన సంగతుల గురించి మాట్లాడుతారు. అలా ఈ సీజన్లో తొలివారం జరిగిన చాలా విషయాల గురించి ఆదివారం మాట్లాడుకున్నారు. మిగతా వాటి సంగతేమో గానీ దేబ్జానీ, ముకేశ్ 'కళ్ల' కహానీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలైంది.(ఇదీ చదవండి: తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!)మీ మనసుకు ఎవరు దగ్గరయ్యారు? ఎవరు దూరమయ్యారు? అని చెప్పాలని నాగ్ అడగ్గా.. రామ్ ప్రసాద్, నరేశ్, ముకేశ్ తోటి కంటెస్టెంట్స్ పేర్లు చెప్పారు. అయితే హౌస్లో వాతావరణం సీరియస్గా ఉండేసరికి ముకేశ్, నీ కళ్లు బాగున్నాయని నాగ్ అనడంతో అందరూ నవ్వేశారు. మీరు అన్నందుకు థ్యాంక్యూ సర్ అని ముకేశ్ అనగానే కౌంటర్ ఇచ్చిన నాగ్.. నేను అంటే ఓకే గానీ దేబ్జానీ అంటే మాత్రం ఒప్పుకోవా అని ప్రశ్నించారు.టాపిక్ తనవైపు డైవర్ట్ అయ్యేసరికి దేబ్జానీ తన మనసులో మాట బయటపెట్టింది. నాకు నిజంగా నీ కళ్లు బాగుందనిపించింది కాబట్టి చెప్పాను అని ముకేశ్ని చూస్తూ దేబ్జానీ చెప్పింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ముకేశ్ చాలా ఇష్టం. కానీ చెప్పలేకపోతున్నాను. ఇటు సైడ్ పులిహోర చేస్తున్నాడు. అటు సైడు కూడా చేస్తున్నాడు. నా దగ్గర రావట్లేదు సర్ అని గోముగా అడిగింది. త్వరలో దేబ్జానీ-ముకేశ్ మధ్య బంధం మొదలవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: బిగ్బాస్లో తొలి వీకెండ్.. ఒక్కరోజులో ఇన్ని ట్విస్టులా?)
థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన
రీసెంట్ టైంలో అద్భుతమైన హిట్ అయి వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమా 'ఇరుముడి'. రవితేజ హీరోగా చేసిన ఈ చిత్రం ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయింది. రిలీజై దాదాపు మూడు వారాలు దాటిపోయినా సరే ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అలా బిగ్ స్క్రీన్స్పై ఉండగానే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ)రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన సినిమా 'ఇరుముడి'. తండ్రి కూతురు అనుబంధంతో తెరకెక్కిన స్టోరీకి అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని జోడించారు. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో విశేషాదరణ దక్కించుకుంటోంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ శుక్రవారం(సెప్టెంబరు 18) నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు.'ఇరుముడి' విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీలేరు దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరిలో త్రినాథ్ (రవితేజ) తన భార్య కావేరి (ప్రియా భవానీ శంకర్), కూతురు మణి (బేబీ నక్షత్ర)తో కలిసి జీవిస్తుంటాడు. త్రినాథ్ అయ్యప్ప స్వామి భక్తుడు. అందుకు తగ్గట్లే ప్రతి ఏడాది మాల వేస్తుంటాడు. మరోవైపు ఊళ్లో ఓ రౌడీ గ్యాంగ్ బాగా రెచ్చిపోతుంటుంది. జనాలను ఇబ్బంది పెట్టడం, స్కూల్కి వెళ్లే అమ్మాయిలను వేధించడం వాళ్ల పని.త్రినాథ్ దీక్షలో లేనప్పుడు మందు కొడుతూ ఉంటాడు. అదే టైంలో ఊళ్లోని రౌడీలతో గొడవలకు దిగుతుంటాడు. అయితే త్రినాథ్ కూతురు మణికి గాయత్రి విషయంలో ఏదో తేడా జరుగుతోందని అనుమానం వస్తుంది. గాయత్రి.. గురుస్వామి (సాయి కుమార్) కూతురు. ఈ విషయం తన నాన్నకు చెప్పాలని మణి ప్రయత్నించినా చెప్పలేకపోతుంది. ఓ రోజు రాత్రి గాయత్రి అర్ధరాత్రి దాటినా ఇంటికి రాదు. అసలు ఆమెకు ఏమైంది? త్రినాథ్ ఆమెను వెతికి పట్టుకుంటాడా? ఆ రౌడీలకు తగిన బుద్ధి చెబుతాడా? లేదంటే కథలో ఇంకేదైనా పెద్ద ట్విస్ట్ ఉందా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)
క్రీడలు
రిబాకినాదే టైటిల్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) చాంపియన్గా అవతరించింది. టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారూస్)తో జరిగిన ఫైనల్లో రిబాకినా 2 గంటల 21 నిమిషాల్లో 6–4, 5–7, 6–2తో గెలుపొందింది. రిబాకినా కెరీర్లో ఇది మూడో గ్రాండ్స్లామ్ టైటిల్కాగా...తొలిసారి ఆమె యూఎస్ ఓపెన్లో విజేతగా నిలిచింది. నేడు తొలిసారి నంబర్వన్ ర్యాంక్ అందుకోనున్న రిబాకినా 2022లో వింబుల్డన్, 2026లో ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్స్ సాధించింది. 2024, 2025 చాంపియన్ సబలెంకా ‘హ్యాట్రిక్’ సాధించాలని ఆశించినా రిబాకినా అద్భుత ఆటతీరుతో బెలారూస్ స్టార్ ఆశలను వమ్ము చేసింది. విజేత రిబాకినాకు 55 లక్షల డాలర్లు (రూ. 52 కోట్ల 49 లక్షలు), రన్నరప్ సబలెంకాకు 28 లక్షల డాలర్లు (రూ. 26 కోట్ల 72 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి.
మనమే చాంపియన్స్
దుబాయ్: ఫార్మాట్ ఏదైనా ఆసియా పరిధిలో తమకు ఎదురులేదని భారత మహిళల క్రికెట్ జట్టు నిరూపించింది. ఆసియాకప్ టి20 టోర్నీలో భారత జట్టు ఎనిమిదోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 72 పరుగుల ఆధిక్యంతో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక జట్టును ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు సాధించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (39 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్లు), స్మృతి మంధాన (39 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. తొలి వికెట్కు వీరిద్దరు 129 పరుగులు జోడించారు. రిచా ఘోష్ (14; 1 ఫోర్), హర్మన్ప్రీత్ (17; 1 ఫోర్, 1 సిక్స్), కమలిని (5 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కూడా రాణించారు. అనంతరరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టును భారత స్పిన్నర్లు దెబ్బ కొట్టారు. ఏదశలోనూ లక్ష్యం దిశగా సాగని శ్రీలంక సరిగ్గా 20 ఓవర్లు ఆడి 111 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి 20 పరుగులిచ్చి 4 వికెట్లు, దీప్తి శర్మ 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. వన్డే, టి20 ఫార్మాట్లు కలిపి ఆసియాకప్ ఇప్పటి వరకు 10 సార్లు జరిగింది. 10 సార్లు భారత జట్టు ఫైనల్కు చేరింది. వన్డే ఫార్మాట్లో భారత జట్టు 2004, 2005, 2006, 2008లలో విజేతగా నిలిచింది. టి20 ఫార్మాట్లో 2012, 2016, 2022, 2026లలో టైటిల్ గెలిచింది. 2018లో, 2024లలో టీమిండియా రన్నరప్గా నిలిచింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (రనౌట్) 59; షఫాలీ వర్మ (సి) చమరి (బి) ప్రబోద 68; హర్మన్ప్రీత్ కౌర్ (సి) కవింది (సబ్) (బి) మిథాలీ అయోధ్య 14; రిచా ఘోష్ (సి) దిల్హారి (బి) చమరి 17; దీప్తి శర్మ (రనౌట్) 5; భారతి ఫుల్మాలి (నాటౌట్) 5; కమలిని (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–129, 2–132, 3–160, 4–166, 5–167. బౌలింగ్: మిథాలీ అయోధ్య 4–0–33–1, కవిషా దిల్హారి 3–0–29–0, సుగందిక కుమారి 4–0–31–0, చమరి అటపట్టు 4–0–34–1, చముడి ప్రబోద 4–0–40–1, నీలాక్షిక సిల్వా 1–0–15–0. శ్రీలంక ఇన్నింగ్స్: ఇమేశా దులాని (బి) క్రాంతి గౌడ్ 4; చమరి అటపట్టు (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) దీప్తి శర్మ 36; విశ్మీ గుణరత్నే (బి) దీప్తి శర్మ 20; హర్షిత సమరవిక్రమ (సి అండ్ బి) శ్రీచరణి 9; నీలాక్షిక సిల్వా (సి) కమలిని (బి) శ్రీచరణి 22; కవిషా దిల్హారి (సి) నందని శర్మ (బి) శ్రీచరణి 7; హాసిని పెరీరా (సి) శ్రీచరణి (బి) షఫాలీ వర్మ 1; కౌషిని నుత్యాంగణ (బి) దీప్తి శర్మ 9; సుగందిక కుమారి (సి) నందని శర్మ (బి) శ్రీచరణి 1; మిథాలీ అయోధ్య (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ప్రేమ రావత్ 0; చముడి ప్రబోద (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 111. వికెట్ల పతనం: 1–4, 2–62, 3–63, 4–86, 5–100, 6–101, 7–103, 8–104, 9–107, 10–111. బౌలింగ్: క్రాంతి గౌడ్ 2–0–8–1, నందని శర్మ 3–0–17–0, షఫాలీ వర్మ 4–0–23–1, శ్రీచరణి 4–1–20–4, దీప్తి శర్మ 4–0–19–3, ప్రేమ రావత్ 3–0–22–1. ట్రోఫీ స్వీకరించేందుకు నిరాకరణ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్గా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోహసిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించేందుకు భారత క్రికెట్ జట్టు నిరాకరించింది. శ్రీలంక జట్టు క్రికెటర్లు మెడల్స్ను స్వీకరించిన తర్వాత బహుమతి ప్రదానోత్సవం ముగిసింది.
అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్తో తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా అఫ్గాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.టీమిండియా బౌలర్ల విజృంభణఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ నామమాత్రపు స్కోరు చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) కూడా తేలిపోయాడు. మిగిలిన వారిలో సెదీకుల్లా అటల్ (13), గుల్బదిన్ నైబ్ (2), డార్విష్ రసూలీ (2) పేలవ ప్రదర్శన కనబరిచారు.దీంతో జట్టు కష్టాల్లో కూరుకుపోగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (44 బంతుల్లో 64)తో ఆదుకున్నాడు. సీనియర్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ 33 పరుగులతో రాణించాడు. దీంతో అఫ్గాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 156 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ 10 పరుగులు చేసి.. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 22 బంతుల్లోనేఅఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్ కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. అయితే, సెంచరీకి చేరువవుతున్న వేళ మహ్మద్ నబీ బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.మిగిలిన వారిలో వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42) రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 8, తిలక్ వర్మ 3 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 13.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 157 పరుగులు సాధించి టార్గెట్ పూర్తి చేసింది. తద్వారా అఫ్గాన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.చదవండి: Asia Cup 2026 Final: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్𝐓𝐇𝐈𝐒 𝐊𝐈𝐍𝐃 𝐎𝐅 𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆. 🤌💥When Abhishek Sharma gets going, the bat does the talking. 🔥Watch #AFGvIND 1st T20I, LIVE NOW on Sony Sports Ten 5 & Sony MAX.#SonySportsNetwork #SonyMAX #ExtraaaInnings pic.twitter.com/aLu13MB9JF— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026
Asia Cup 2026 Final: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్
భారత యువ క్రికెటర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ మహిళల టోర్నమెంట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ప్లేయర్గా నిలిచింది. దుబాయ్ వేదికగా శ్రీలంకతో ఆదివారం నాటి ఆసియా టీ20 కప్-2026 ఫైనల్ సందర్భంగా 22 ఏళ్ల షఫాలీ వర్మ ఈ ఘనత సాధించింది.శ్రీలంతో టైటిల్ పోరులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే దూకుడుగా ఆడిన ఓపెనర్ షఫాలీ వర్మ 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. అయితే, భారత ఇన్నింగ్స్లో చముడి ప్రబోద బౌలింగ్లో పదమూడో ఓవర్ ఐదో బంతికి.. చమరి ఆటపట్టుకు క్యాచ్ ఇవ్వడంతో షఫాలీ అవుటైంది.షఫాలీతో పాటు స్మృతి కూడామొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న షఫాలీ వర్మ 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తొలి వికెట్గా వెనుదిరిగింది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక మరో ఓపెనర్ స్మృతి మంధాన కూడా హాఫ్ సెంచరీ (39 బంతుల్లో 59) సాధించింది.భారత్ స్కోరు ఎంతంటే?మిగిలిన వారిలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 14 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ 17 పరుగులు చేసింది. ఆఖర్లో కమలిని 5 బంతుల్లో 15 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్.. 183 పరుగులు చేసింది.శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, కెప్టెన్ చమరి ఆటపట్టు, చముడి ప్రబోద తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.మహిళల ఆసియా టీ20 కప్ టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు👉షఫాలీ వర్మ- 24 బంతుల్లో- దుబాయ్ వేదికగా 2026లో శ్రీలంక మీద👉స్మృతి మంధాన- 25 బంతుల్లో- సెల్హైట్ వేదికగా 2022లో శ్రీలంక మీద👉రిచా ఘోష్- 26 బంతుల్లో- దంబుల్లా వేదికగా 2024లో యూఏఈ మీద👉షఫాలీ వర్మ- 26 బంతుల్లో- దంబుల్లా వేదికగా 2024లో నేపాల్ మీద👉షఫాలీ వర్మ- 26 బంతుల్లో- దుబాయ్ వేదికగా 2026లో థాయ్లాండ్ మీద.చదవండి: అదరగొట్టిన బుమ్రా.. అరుదైన ఘనతShafali Verma is accelerating and we're just getting started! 🔥Watch #INDvSL in the Final of the #DPWorldWomensAsiaCup2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #NotAGentlemansGame pic.twitter.com/u0js1RtZWo— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026
న్యూస్ పాడ్కాస్ట్
ఇదేనా నిష్పాక్షిక, పారదర్శక నియామకం... మెగా డీఎస్సీ వ్యవహారంపై చంద్రబాబు బాధ్యత వహించాలి... వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
ప్రపంచ పరిపాలనకు రూల్స్ మనమే రూపొందించాలి.... బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
బిజినెస్
రీచార్జ్ ప్లాన్ ఒక్కటే.. బెనిఫిట్స్లో ఏది బెస్ట్?
దేశంలో టెలికాం రంగంలో రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) మధ్య పోటీ కొనసాగుతోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెండు సంస్థలు వివిధ రకాల ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా రెండు టెల్కోలు రూ.349 ధరతో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ రెండు ప్లాన్లలో అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్, 5జీ డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రోజువారీ డేటా, ఓటీటీ, ఏఐ సేవలు వంటి అదనపు ప్రయోజనాల్లో తేడా ఉంది.జియో రూ.349 ప్లాన్జియో రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా కూడా అందుతుంది.అదనపు ప్రయోజనాల్లో భాగంగా జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్తో పాటు 50జీబీ ఉచిత జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. అంతేకాకుండా 18 నెలల గూగుల్ జెమినీ ఏఐ ప్రో ప్లాన్ను కూడా అందిస్తోంది. దీని విలువ సుమారు రూ.35,100గా పేర్కొంటున్నారు.అయితే గూగుల్ ఏఐ ప్రో ప్రయోజనాన్ని కొనసాగించాలంటే వినియోగదారులు ప్రతి రీచార్జ్కు రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది.ఎయిర్టెల్ రూ.349 ప్లాన్ఎయిర్టెల్ కూడా రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ను 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా సదుపాయం కూడా ఉంది.అదనపు ప్రయోజనాల్లో భాగంగా 12 నెలల అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ను అందిస్తోంది. దీని విలువ సుమారు రూ.4,000. అలాగే యాపిల్ మ్యూజిక్ ప్రయోజనం కూడా ఉంది.అయితే ఎయిర్టెల్ అందించే అపరిమిత 5జీ డేటాకు ఫెయిర్ యూసేజ్ పరిమితి వర్తిస్తుంది. ప్రతి 30 రోజుల వ్యవధిలో గరిష్ఠంగా 300జీబీ వరకు 5జీ డేటాను వినియోగించుకోవచ్చు.ఏ ప్లాన్ మంచిది?ధర, వ్యాలిడిటీ, కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు రెండింటిలోనూ దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ.. అదనపు ప్రయోజనాలు, రోజువారీ డేటా పరంగా జియో రూ.349 ప్లాన్ ముందంజలో ఉంది. ఎయిర్టెల్ 1.5జీబీతో పోలిస్తే జియో రోజుకు 2జీబీ డేటాను అందిస్తోంది. అంటే 28 రోజుల్లో జియో ప్లాన్ ద్వారా మొత్తం 56జీబీ వరకు రోజువారీ డేటా లభిస్తుంది.అదనంగా గూగుల్ జెమినీ ఏఐ ప్రో, జియో హాట్స్టార్, జియో ఏఐ క్లౌడ్ వంటి ప్రయోజనాలు కూడా ఉండటంతో.. అదనపు బెనిఫిట్స్ విషయంలో జియో ప్లాన్కు ఎక్కువ విలువ లభిస్తుంది.
కొత్త గ్యాస్ పథకం.. పీఎన్జీ కనెక్షన్లకు మరింత ఊపు
కేంద్ర ప్రభుత్వం దేశంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని మరింత వేగంగా విస్తరించేందుకు కొత్త ప్రోత్సాహక పథకాన్ని అమల్లోకి తెచ్చింది. 2026 సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన ఈ పథకం ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) కంపెనీలకు తక్కువ ధరకు లభించే దేశీయ గ్యాస్ను అదనంగా కేటాయించనున్నారు. దీంతో ఇళ్లకు కొత్త పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వడం కంపెనీలకు మరింత లాభదాయకంగా మారనుంది.కొత్త కనెక్షన్కు అదనపు గ్యాస్ప్రతి భౌగోళిక ప్రాంతానికి (GA) ప్రభుత్వం నిర్దేశించిన కనీస స్థాయికి మించి కొత్తగా బిల్లు అయ్యే ప్రతి దేశీయ పీఎన్జీ కనెక్షన్కు 200 స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (SCM) అదనపు ధరల నియంత్రణ విధానం పరిధిలోని (APM) గ్యాస్ను అర్హత కలిగిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు కేటాయిస్తారు. అంటే కేవలం పైప్లైన్ వేసి మీటర్ ఏర్పాటు చేయడం కాకుండా, వాస్తవంగా గ్యాస్ వినియోగించి బిల్లు వచ్చే కనెక్షన్లను పెంచినప్పుడే కంపెనీలకు ఈ ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకాన్ని ఆరు నెలల్లో రెండు విడతలుగా అమలు చేయనున్నారు.కంపెనీలకు భారీగా తగ్గనున్న ఖర్చుప్రస్తుతం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తమ సీఎన్జీ-ట్రాన్స్పోర్ట్ విభాగంలో కొంత అవసరాన్ని ఖరీదైన ఎల్ఎన్జీతో భర్తీ చేస్తున్నాయి. కొత్త పథకం కింద లభించే తక్కువ ధర దేశీయ గ్యాస్ను ఎల్ఎన్జీ స్థానంలో ఉపయోగించుకోవడం ద్వారా కంపెనీల మొత్తం గ్యాస్ సోర్సింగ్ వ్యయం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇంటింటికీ పీఎన్జీ కనెక్షన్ ఇచ్చేందుకు పెట్టే మూలధన పెట్టుబడి పదేళ్లలో రికవరీ కావాల్సి ఉండగా కొత్త పథకం వల్ల మూడేళ్లలోనే తిరిగొస్తుందని కేంద్రం తెలిపింది.1.75 కోట్లకు చేరిన పఘెన్జీ కనెక్షన్లుఆగస్టు 18 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 1.74 కోట్ల దేశీయ పీఎన్జీ కనెక్షన్లు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. తాజాగా పీఎన్జీఆర్బీ గణాంకాల ప్రకారం 2026 జూలై నాటికి ఈ సంఖ్య 1,75,46,911కు చేరింది. అంటే దేశంలో పీఎన్జీ కనెక్షన్ల సంఖ్య ఇప్పటికే 1.75 కోట్లను దాటింది. అయితే కనెక్షన్ ఉండటం మాత్రమే కాకుండా అవి క్రియాశీలంగా ఉండేలా చేయడం కూడా ప్రభుత్వ తాజా పథకం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.కొత్త ప్రాంతాల్లోకి పీఎన్జీ నెట్వర్క్ప్రస్తుతం దేశవ్యాప్తంగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరణను పీఎన్జీఆర్బీ అనుమతించిన భౌగోళిక ప్రాంతాల్లో ఆయా సంస్థలు చేపడుతున్నాయి. 2025లో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం 307 భౌగోళిక ప్రాంతాలకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అభివృద్ధి కోసం అనుమతులు ఉన్నాయి. 2026లో పీఎన్జీ విస్తరణను మరింత వేగవంతం చేసేందుకు 110 ప్రాధాన్య ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు, పైప్లైన్ నిర్మాణానికి అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేసే చర్యలు చేపట్టింది.పీఎన్జీకి మారేందుకు మరో ఊతంపీఎన్జీకి మారే వినియోగదారులకు ప్రభుత్వం మే 2026లో మరో సౌకర్యాన్ని కూడా ప్రకటించింది. పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న ఎల్పీజీ వినియోగదారులు 30 రోజుల్లో తమ ఎల్పీజీ కనెక్షన్ను సరెండర్ చేయవచ్చు. లేదా భవిష్యత్తులో పీఎన్జీ సౌకర్యం లేని ప్రాంతానికి మారాల్సి వస్తే తిరిగి ఎల్పీజీ కనెక్షన్ పొందేందుకు ట్రాన్స్ఫర్ వోచర్ తీసుకునే అవకాశం కల్పించారు.
రూ.71,700 కోట్ల షేర్ల అమ్మకం.. ఒరాకిల్ అధినేత యూటర్న్
టెక్ దిగ్గజం ఒరాకిల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ లారీ ఎల్లిసన్ తన వాటాల విక్రయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒరాకిల్లో తనకు ఉన్న వాటాలో 50 మిలియన్ షేర్లను విక్రయించేందుకు గతంలో రూపొందించిన ప్రణాళికను ఆయన రద్దు చేశారు. ఈ షేర్ల విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం సుమారు 7.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.71,700 కోట్లు)గా ఉంది.అంతకు ముందు రోజే ఎల్లిసన్ షేర్ల విక్రయానికి సంబంధించిన ట్రేడింగ్ ప్రోగ్రామ్ను జూన్ 22న ఏర్పాటు చేసినట్లు ఒరాకిల్ వెల్లడించింది. ఈ ప్రణాళిక ప్రకారం అక్టోబర్ 24 వరకు 50 మిలియన్ షేర్లను విక్రయించే అవకాశం ఉండేది. అయితే, ఈ ప్రణాళిక కింద ఇప్పటివరకు ఎలాంటి షేర్లను విక్రయించలేదని, ప్రస్తుతం తన ఒరాకిల్ షేర్లను విక్రయించే ఉద్దేశం ఎల్లిసన్కు లేదని కంపెనీ స్పష్టం చేసింది.జూన్లో ఈ విక్రయ ప్రణాళికను రూపొందించిన సమయంలో ఆ 50 మిలియన్ షేర్ల విలువ సుమారు 8.75 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే అప్పటి నుంచి ఒరాకిల్ షేరు ధర దాదాపు 16 శాతం తగ్గింది. ప్రస్తుతం కంపెనీలో ఎల్లిసన్కు సుమారు 40 శాతం నియంత్రణ వాటా ఉంది.భారీ ఏఐ పెట్టుబడుల ఒత్తిడికృత్రిమ మేధ (AI), క్లౌడ్ విభాగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఒరాకిల్ ఆర్థిక పరిస్థితిపై పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్ఏఐ వంటి సంస్థలతో కుదుర్చుకున్న భారీ క్లౌడ్ ఒప్పందాలను నెరవేర్చేందుకు కంపెనీ భారీగా ఖర్చు చేస్తోంది. దీంతో నగదు నిల్వలను కాపాడుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాల కోతకు కూడా శ్రీకారం చుట్టింది.ఉద్యోగుల తగ్గింపునకు సంబంధించిన ఖర్చులు సుమారు 2.8 బిలియన్ డాలర్లకు చేరొచ్చని ఒరాకిల్ అంచనా వేసింది. ఇది గతంలో పేర్కొన్న అంచనా కంటే 700 మిలియన్ డాలర్లు ఎక్కువ. ఇదే సమయంలో కంపెనీ స్థూల లాభ మార్జిన్లు తగ్గడంతో శుక్రవారం ఒరాకిల్ షేరు ధర 1.7 శాతం పడిపోయింది.ఈ నేపథ్యంలో ఎల్లిసన్ తన షేర్లను విక్రయించకూడదని తీసుకున్న నిర్ణయం కంపెనీపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని కొంతమేర తగ్గించే సంకేతంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదిలా ఉండగా, ఎల్లిసన్ తన కుమారుడు డేవిడ్ ఎల్లిసన్ చేపడుతున్న వ్యాపార కార్యక్రమాలకు ప్రధాన ఆర్థిక మద్దతుదారుగా ఉన్నారు. పారామౌంట్ స్కైడాన్స్ కార్ప్ ద్వారా వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని సుమారు 110 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసే ప్రతిపాదనలోనూ ఆయన కుటుంబం కీలకంగా ఉంది.
‘ఏఐ’ని తగ్గిద్దాం.. టెక్ దిగ్గజాల సంచలన నిర్ణయం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పరస్పరం పోటీ పడే దిగ్గజ సంస్థల అధినేతలు ఒక కీలక అంశంపై అనూహ్యంగా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అత్యాధునిక AI మోడళ్ల సామర్థ్యాలను పెంచే వేగాన్ని కొంతకాలం తగ్గించి, భద్రతా చర్యలకు మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆంథ్రోపిక్ (Anthropic) సీఈవో డారియో అమోడై, ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మాన్, ఎక్స్ఏఐ (xAI) అధినేత ఎలోన్ మస్క్ అభిప్రాయపడ్డారు.మితిమీరిన ఏఐ పురోగతిపై ఆందోళనలను వ్యక్తం చేస్తూ ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడై తాజాగా సుదీర్ఘ పదాల వ్యాసాన్ని ప్రచురించారు. ఇందులో ఏఐ అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయాలని కాకుండా, అత్యాధునిక మోడళ్ల సామర్థ్యాలు పెరుగుతున్న వేగాన్ని కొంత తగ్గించాలని ఆయన సూచించారు. అలా చేస్తే ఏఐ భద్రత, నియంత్రణ, ప్రమాదాల అంచనా వంటి అంశాలు సాంకేతిక పురోగతికి అనుగుణంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.“ఏఐ మోడళ్ల సామర్థ్యాలను మెరుగుపరిచే వేగాన్ని మనం తగ్గించాలి. పురోగతి అయినా వేగంగానే ఉంటుంది. అయితే మనకు లభించే అదనపు సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి” అనేది అమోడై ప్రధాన వాదన. AIని పూర్తిగా ఆపడం వల్ల దాని ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని, అదే సమయంలో ఎలాంటి నియంత్రణలు లేకుండా వేగంగా ముందుకు వెళ్లడం కూడా ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.6–12 నెలల్లోనే భారీ ప్రమాదమా?ఏఐ వ్యవస్థలు తమకంటే మెరుగైన తదుపరి తరం వ్యవస్థల అభివృద్ధికి మరింతగా సహకరించే స్థాయికి చేరుకుంటున్నాయని అమోడై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సామర్థ్యాల అభివృద్ధి ఇదే వేగంతో కొనసాగితే, వచ్చే 6 నుంచి 12 నెలల్లో తప్పుదోవ పట్టిన ఏఐ ఏజెంట్ల సమూహం ఇంటర్నెట్ను తమ చేతుల్లోకి తీసుకోవచ్చని ఆయన హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే వందల బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు.ఈ ఆందోళనలకు ఇటీవల జరిగిన ఒక ఘటన మరింత బలం చేకూర్చింది. జూలైలో ఓపెన్ఏఐ సంస్థ నిర్వహించిన అంతర్గత సైబర్సెక్యూరిటీ పరీక్షల సమయంలో కొన్ని ఏఐ మోడళ్లు తమను ఇంటర్నెట్ నుంచి వేరు చేయడానికి ఏర్పాటు చేసిన నియంత్రణలను దాటాయి. అనంతరం ఓపెన్ఏఐ అంతర్గత పరిశోధనా మౌలిక వసతులతో పాటు ‘హగ్గింగ్ ఫేజ్’ వ్యవస్థల్లోకి చొరబడ్డాయి.స్వతంత్ర నిపుణులకు యాక్సెస్ఈ నేపథ్యంలో ఏఐ సంస్థల్లో భద్రతా పరీక్షలను మరింత స్వతంత్రంగా నిర్వహించాలనేది అమోడై ప్రతిపాదనల్లో ఒకటి. ఆంథ్రోపిక్ తమ వ్యవస్థలకు ఉద్యోగుల తరహా యాక్సెస్ కల్పిస్తూ థర్డ్పార్టీ నిపుణులను అనుమతిస్తామని ప్రకటించింది. వీరు సంస్థ భద్రతా ప్రమాణాలను వాస్తవంగా పాటిస్తుందా లేదా అన్నది స్వతంత్రంగా పరిశీలించనున్నారు.ఈ ప్రతిపాదనకు సామ్ ఆల్ట్మాన్ వెంటనే మద్దతు తెలిపారు. ఓపెన్ఏఐ కూడా అదే విధానాన్ని అనుసరిస్తుందని వెల్లడించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఇక ఎలాన్ మస్క్ కూడా దీనికి మద్దతు పలుకుతూ అమోడై చేసిన పోస్టును ఉటంకిస్తూ “డారియో చెప్పింది నిజమే” అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు.మూడు దశల ప్రణాళికఏఐ అభివృద్ధిని సురక్షితంగా కొనసాగించేందుకు అమోడై ప్రధానంగా మూడు అంశాలను ప్రతిపాదించారు. మొదటిది ఏఐ సంస్థల్లో స్వతంత్ర భద్రతా పర్యవేక్షకులకు అవకాశం కల్పించడం. రెండోది ప్రముఖ ఏఐ కంపెనీలు కలిసి ఉమ్మడి భద్రతా ప్రమాణాలను రూపొందించడం. మూడోది దేశాల మధ్య, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఏఐ ప్రమాదాలను ఎదుర్కొనే సహకార వ్యవస్థను ఏర్పాటు చేయడం.
ఫ్యామిలీ
గులాబీలు పండిస్తూ.. నెలకు రూ. 2.5 లక్షలు..!
ఒక్కోసారి ఎప్పుడు సాగుచేసే పంటను సాగు చేసినా..ఊహించని విధంగా విపరీతమైన నష్టాలు చవిచూస్తుంటాం. అధిక దిగుబడి వల్ల గిట్టుబాటు ధర లేకోవడమో లేక ఇతర కారణాల వల్లే విపరీతమైన నష్టాలను చవిచూస్తుంటాం. అలాంటప్పడు సరైన నిర్ణయం తీసుకుని..కాస్త తెలివిగా వ్యవహరిస్తే..కనక వర్షం కురిసేలా లాభాలు కూడా పొందొచ్చు. అదే చేసి చూపించాడు ఈ యువ రైతు. అతడే మహారాష్ట్రకు చెందిన అర్జున్ సబాలే. అతడి కుటుంబం బంతి, చామంతి పువ్వులను సాగు చేసి, వాటి అమ్మకం కోసం ముంబై తీసుకువెళ్లేవారు. అయితే ధరలు పడిపోవడం, పోటీ పెరడగం వంటి కారణాలతో నష్టాలు రావడం మొదలైంది. తమ కుటంబ పొలం లాభదాయకంగా మార్చడానికి ఏం చేయాలో తోచేది కాదు. ఏం చేద్దాం అని సబాలే ఆలోచిస్తున్న తరుణంలో సురక్షిత వ్యవసాయం వైపుకి అడుగులు వేశాడు. సుమారు పావు ఏకరం భూమిలో ఈసారి గులాబీలు పెంచి చూడాలని అనుకున్నాడు. ఏదో చిన్న ప్రయోగంగా మొదలైన పూల పెంపకం కాస్తా ఏడాది పొడవునా ఆదాయన్ని అందించే పూల వ్యాపారంగా అభివృద్ది చెందింది. బీఏస్సీ అగ్రీకల్చర్ చదువుతున్నప్పుడే..వివిధ పంటలను అధ్యయనం చేయడానికి పొలాలను సందర్శించడం ప్రారంభించాడు. అక్కడ పాలీహౌస్ సాగును చూసి రక్షిత పూల సాగువైపుకి అడుగుపెట్టాడు. ఆ సమయంలోనే గులాబీల సాగుని క్షుణ్ణంగా గమనించాడు సబాలే. అలా బెంగుళూరుకి చెందిన ఒక రైతు నుంచి గులాబీ కాండాలను ఒక్కొక్కటి రూ. 12ల చొప్పున కావల్సినన్ని మొక్కలు కొని పావు ఎకరం భూమిలో నాటాడు. అందుకోసం సుమారు రూ. 8000లు వరకు పెట్టుబడి పెట్టాడు. జస్ట్ పదివేల చదరుపు అడుగుల భూమిలో గులాబీలు ప్రారంభించి, క్రమంగా విస్తరించాడు. ఆ తోటలో సుమారు 500 గులాబీలు పైనే పూసేవి, వాటిని ఒక్కోక్కటి కనీసం రూ. 5లకు చొప్పున అమ్మిన రోజుకు దాదాపు రూ. 25000/- దాక సంపాదించేవాడు. ఈ రాబడితో అతడు తోటను విస్తరించడమే గాక జెర్బెరా వంటి డెకరేటెడ్ పూల మొక్కలను కూడా పెంచడం ప్రారంభించాడు. అలా పావు ఎకరం నుంచి ఎకరం భూమిలో ఒక్కో రకం 16,000 మొక్కలతో గులాబీలు, జెర్బెరాలను పండించడం ప్రారంభించాడు. అలా సబాలే తన వ్యవసాయ క్షేత్రంలో ప్రతిరోజూ సుమారు వెయ్యి గులాబీలు, రెండు వేల జెర్బారాలు పూస్తున్నాయి. ఒక్కో గులాబీకి రూ. 5లు, ఒక్కో జెర్బెరా కాడకు రూ. 4 లు చొప్పున రోజుకు రూ. 5వేల నుంచి రూ. 8 వేల దాక ఆదాయం వస్తోంది. అంటే నెల వచ్చేటప్పటికీ రూ. 3.5 లక్షల టర్నోవర్ని ఆర్జిస్తున్నాడు. అంటే నికర లాభం రూ. 2.5 లక్షలు ఉంటుంది. సబాలే గులాబీలు, జెర్బెరాలను సహజసిద్ధమైన వెంటిలేషన్ ఉన్న పాలీహౌస్లో పెంచుతాడు. గాలి ప్రసరణ కోసం పవర్డ్ కూలింగ్ ఫ్యాన్లకు బదులుగా రూఫ్ వెంట్లు, సైడ్ కర్టెన్లను ఉపయోగిస్తారు. ఆయన పావు ఎకరంలో ప్రారంభించినప్పుడు వీటన్నింటిని ఏర్పాటు చేయడానికి దాదాపు రూ. 3 లక్షలు దాక ఖర్చయింది. అయితే ఈ మొక్కలు ఐదు నుంచి ఏడేండ్ల వరకు దిగుబడి ఇస్తూనే ఉంటాయి కాబట్టి పెట్టుబడిని చాలా ఏళ్లు పాటు విస్తరించుకోవచ్చు అని అంటున్నాడు సబాలే. అలాగే తన పువ్వులను నేరుగా స్టాల్స్, హోల్సెల్ మార్కెట్లకు అమ్ముతుంటాడు. అయితే డిమాండ్ని బట్టి పువ్వులను బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబైలకు సరఫరా చేస్తుంటానని చెబుతున్నాడు సబాలే.ఇదీ చదవండి: అది మన డీఎన్ఏలోనే ఉంది ..! మాధవన్ కుమారుడు వేదాంత్
అది మన డీఎన్ఏలోనే ఉంది ..! మాధవన్ కుమారుడు వేదాంత్
కోలీవుడ్ నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ ఆసియా క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. అతను ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఐచి ప్రిఫెక్చర్, జపాన్లోని నగోయాలో జరగనున్న ఖండాంతర బహుళ క్రీడా పోటీల కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈనేపథ్యంలో ఒక మీడియా ఇంటర్వ్యూలో తను ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి, మన భారతీయ అథ్లెట్లకు ప్రతిభ ఎలా ఉంటుంది తదితరాల గురించి చాలా ఆసక్తికరంగా మాట్లాడారు. మన భారతీయుల్లో చాలా ప్రతిభ ఉందని చెబుతున్నాడు. నిజం చెప్పాలంటే జన్యపరంగా మనం చాలా అదృష్టవంతులమని అంటున్నాడు. మన ఆహారపు అలవాట్లను, క్రమశిక్షణను, ప్రేరణను సరిదిద్దుకోగలిగినట్లయితే మనం నిజంగా మంచి క్రీడాకారులుగా రాణించగలమని అన్నాడు. అయితే మనల్ని వెనక్కి లాగేస్తున్న అంశం మన ఆహారపు అలవాట్లేనని చెబుతున్నాడు. భారతీయ శరీరాలకు ఎక్కువ కొవ్వుని నిల్వ చేసుకోగల సామర్థ్యం ఉందని తెలిపాడు. అందువల్లే మనవి సన్నగా ఉండి కొవ్వు ఎక్కువగా ఉండే శరీర రకంగా అభివర్ణించాడు. వేల ఏళ్ల క్రితం వేట జీవనశైలి నుంచి పరిణామ క్రమం చెందుతూ వచ్చిందన్నారు. ఫలితంగా మనశరీరాలు చెప్పుకోదగిన కండ ద్రవ్యరాశిని నిర్మించకుండా అంతర్గత అవయవాల చుట్టూ ఉండే కొవ్వుని నిల్వగా ఉంచుకోవడం నేర్చుకున్నాయని చెప్పారు. ఈ తత్వమే మన ప్రజలను తీవ్ర కరువుని తట్టుకుని బయటపడటానికి సహాయపడిందని చెబుతున్నాడు. కాబట్టి మనం మరింత ప్రోటీన్ తీసుకోవడం మొదలుపెట్టి మన ఆహారపు అలవాట్ల పట్ల శ్రద్ధ వహిస్తే..మన జన్యవుల నుంచి ఇంకా ఎంతో సాధించగలమని సూచిస్తున్నాడు. రాబోయే ఆసియా క్రీడలకు సిద్ధమవుతున్న తరుణంలో తాను ఒక డైటీషియన్తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపాడు. అది తన ఫామ్ వేగాన్ని మెరుగుపరుచుకోవడంలో సహాయపడిందని చెబుతున్నాడు ఈ స్విమ్మర్. అలాగే తాను గత కొన్ని నెలలుగా వెయిట్ ట్రైనింగ్, స్ట్రెంత్ కండిషనింగ్పై దృష్టి పెట్టిమరి శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఆసియా క్రీడల్లో అతడు 200 మీటర్ల ఫ్రీస్టైల్ ఈత కొట్టబోతున్నట్లు తెలిపాడు. అయితే ఇది అంత సులభం కాదని తెలుసని, అందుకే తన సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకుంటున్నట్లు తెలిపారు. కోట్లాదిమంది కళ్లు ఒక ఆటగాడిపైనే ఉంటాయి, అందువల్ల ప్రపంచ స్థాయిలో పోటీపడటానికి సిద్ధమవుతున్నప్పుడు శక్తిమంతమైన ఆత్మవిశ్వాసంతో ఉండాలని అంటున్నాడు. తాను గెలవగలననే గట్టి నమ్మకం అతడికి ఉండాలంటున్నాడు. అలాగే మన లక్ష్యం ఎల్లప్పుడూ నక్షత్రాలపై ఉంటేనే చంద్రుడిపై దిగగలమంటూ తన సంభాషణను ముగించాడు వేదాంత్.ఇదీ చదవండి: చిన్నారులు జంక్ ఫుడ్ తినకుండా..ఆ టీచర్ ట్రిక్ మాములుగా లేదు!
చిన్నారులు జంక్ ఫుడ్ తినకుండా..ఆ టీచర్ ట్రిక్ మాములుగా లేదు!
ఈ జనరేషన్ చిన్నారులు మాములుగా లేరు. జట్ స్పీడ్గా అర్థం చేసుకుంటున్నారు. చిన్నప్పుడే స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లనే చకచక వాడేస్తున్న జెన్జీ ఇది. అయితే అందుకు తగ్గట్టుగానే ఈకాలంలో మార్కెట్లోకి వస్తున్న ప్రతి జంక్ఫుడ్కి ఆకర్షితులై ఎంతలా లాగిస్తున్నారో తెలిసిందే. వద్దు నాన్న అవి మంచివి కావు అంటే..ఇక వాళ్లు పెట్టే అల్లరి మాములుగా ఉండదు. ఇక తట్టుకోలేక తల్లిదండ్రలు కొనిచ్చేస్తున్నారు. ఏదో అప్పడప్పుడే అంటూ ఇస్తుంటారు. అయితే అసలు అలాంటి అనారోగ్యకరమైన జంక్ఫుడ్కి వాళ్లే స్వయంగా నో చెప్పేలా చేస్తోంది ఈ టీచర్. ఆ ఉపాధ్యాయురాలు చేసిన పనికి ఆ స్కూల్ విద్యార్థులు వద్దంటూ ఏడుపు లంఖించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారడమే కాదు, జంక్ ఫుడ్ తికుండా ఉండేలా చేసేందుకు ఇంతల భయపెట్టడం సమంజసమేనా అనే ప్రశ్నలు లేవనెత్తినా..చాలామంది ఆ టీచర్ ట్రిక్కే మద్దతు పలకడం విశేషం.ఇంతకీ ఆమె ఏం చేసిదంటే..జంక్ ఫుడ్ వల్ల కలిగే ప్రమాదాల గురించి పిల్లలకు తెలియజేసేలా ముందుగా వాళ్లకు కొద్దిగా కూల్డ్రింక్ల, బిస్కెట్లు ఇస్తుంది. ఆ తర్వాత వాళ్లలో ఒకళ్లను పడుకోబెట్టి అవి తిన్నాక లోపల ఏం జరుగుతోందో తెలియజేలా నకిలీ అల్ట్రాసౌండ్ స్కాన్ని చూపిస్తుంది. వాటిని చూసి పిల్లలు భయపడటమే కాదు, తినమని అనడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. ముఖ్యంగా వాళ్ల ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆరోగ్యకరమై ఆహారం గురించి తరగతి గదిలో వివరించిన ఆ పాఠం వాళ్లు జంక్ఫుడ్ ఎంత అనారోగ్యకరమైనదో వివరించేలా క్లియర్గా చూపించారామె. ఇది పిల్లల్లో భయం రేకెత్తించిన చెడు ఆహారపు అలవాట్లకు బానికాకుండా చేసే బెస్ట్ ట్రిక్ అనే చెప్పొచ్చు. అయితే ఈ భయం వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఎలాంటి పర్యవసనాలు దారితీస్తుంది అని మానసిక నిపుణులు హెచ్చరించినా..నయానో, భయానో అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండేలా చేయడంలో ఎలాంటి తప్పు లేదని మరికొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.The intention may be good, but the method matters.A viral school clip shows a teacher using props and a fake ultrasound to scare children away from junk food.Teaching kids healthy eating is important. But fear, misinformation and shock tactics at such a tender age can leave a… pic.twitter.com/SgNgqRBgKj— Neetu Khandelwal (@T_Investor_) September 11, 2026 ఇదీ చదవండి: వారానికి 60 గంటలు పనిచేస్తూ..నెలకు రూ. 63 లక్షలు!
7 ‘అడుగుల’తో దాంపత్య బలం
విడివిడిగా వ్యాయామం చేసే యువ దంపతులతో పోలిస్తే కలిసి వ్యాయామం చేసే దంపతుల్లో దాంపత్య బంధం బలోపేతం అవుతోందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దంపతులు మాట్లాడుకొనే తీరు, వారి మధ్య తలెత్తే గొడవలు, వాటిని పరిష్కరించుకునే విధానంపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. పరిశోధకులు పరిశీలించిన దంపతుల్లో దాదాపు 60 శాతం మంది తాము క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నామని చెప్పగా... వారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే కలిసి వ్యాయామం చేస్తున్నారని తేలింది. కలిసి వ్యాయామం చేసే దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సమస్యలను సులభంగా పరిష్కరించుకోవడంతో వారి మధ్య మనస్పర్థలు తక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో దంపతులు కలిసి చేసిన వ్యాయామాల్లో నడక అన్నింటికంటే ఎక్కువగా కనిపించింది. దంపతులు కలిసి చురుగ్గా ఉండేందుకు నడక వ్యాయామం చాలా సులువైన, ఉపయుక్తమైన ఎక్సర్సైజ్ అని... ఇలా కలసి నడవడం వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని వెల్లడైంది. ఈ క్రమంలో దంపతులు తమ జీవిత భాగస్వామి తమ మాటలను ఎక్కువగా వింటున్నారని, తమకు అండగా నిలుస్తున్నారన్న భావన కలుగుతోందనీ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ఫ్యామిలీ రిలేషన్స్ అనే మెడికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. స్ట్రెంత్ ట్రైనింగ్తో అతివల గుండె పదిలంవారంలో కనీసం 2 గంటలపాటు బరువులు ఎత్తడం, తాళ్లను లాగడం వంటి స్ట్రెంత్ ట్రైనింగ్/రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజులతో మహిళల్లో గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఈ వ్యాయామాలన్నీ గుండెపోటు వచ్చే ముప్పును గణనీయంగా తగ్గించగలవని ఈ పరిశోధనలో తేలింది. æఎలాంటి వ్యాయామాలు చేయని మహిళలతో పోలిస్తే వారానికి కనీసం రెండు గంటలపాటు స్ట్రెంతెనింగ్/రెసిస్టెన్స్ ట్రైనింగ్ వ్యాయామాలు చేసే మహిళల్లో గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు 20 శాతం తక్కువగా, గుండెపోటు ముప్పు 44 శాతం తక్కువగా కనిపించిందని పరిశోధకులు గుర్తించారు. అలాగే రెండు గంటలకు మించి వ్యాయామాలు చేసే మహిళల్లో ప్రతి అదనపు గంట వ్యాయామం వల్ల గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు మరో 5 శాతం, గుండెపోటు ముప్పు 14 శాతం మేర తగ్గుతోందని కనుగొన్నారు. అయితే రెసిస్టెన్స్ ట్రైనింగ్ వ్యాయామాలు మాత్రమే చేసే వారిలో పక్షవాతం వచ్చే ముప్పు తగ్గినట్లు కనిపించలేదు. రెసిస్టెన్స్ ఎక్సర్సైజులతోపాటు ఏరోబిక్ వ్యాయామాలు కూడా కలిపి చేస్తే మాత్రం మరింత ప్రయోజనం కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలను జర్నల్ ఆఫ్ ద అమెరిన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అనే జర్నల్ ప్రచురించింది. 6 సూత్రాలతో మానసిక ఆరోగ్యం మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరు అంశాలు ఎంతో కీలకమని ఓ అంతర్జాతీయ అధ్యయనం పేర్కొంది. వాస్తవానికి మానసిక ఆరోగ్యానికి 19 ప్రధాన అంశాలను పరిశోధణనాలు గుర్తించగా వాటిలో ఆరు అంశాలకు 90 శాతానికిపైగా నిపుణుల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైంది. నేచర్ మెంటల్ హెల్త్ అనే జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం 26 దేశాలకు చెందిన 11 విభాగాల్లోని 122 మంది ప్రముఖ నిపుణులతో సర్వేలు నిర్వహించారు. అయితే ఆదాయం, శారీరక ఆరోగ్యం వంటి అంశాలు కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చని అధ్యయనంలో వెల్లడైంది. 1 జీవితానికి అర్థం–పరమార్థం, లక్ష్యం ఉండటం: మన జీవితం విలువైనది. దానికో అర్థం, పరమార్థం ఉన్నాయి. మనం ఏదో ఒక లక్ష్యం వైపు ముందుకు వెళ్తున్నామనే భావన ఉండటం అవసరం. 2 జీవితంపై సంతృప్తి: జీవితాన్ని మొత్తంగా చూసుకున్నప్పుడు ఒక రకమైన సంతప్త భావన కలిగి ఉండటం ముఖ్యం. 3 స్వీయ అంగీకారం: తనలోని మంచిని, లోపాలను అర్థం చేసుకొని, తనను తాను తప్పుబట్టుకోకుండా సానుకూలంగా చూసుకోవడం. 4 ఇతరులతో సత్సంబంధాలు: మనకు బాగా దగ్గరి వారితో శ్రద్ధ, ప్రేమ, సహకారం, పరస్పర అవగాహనతో కూడిన అర్థవంతమైన సానుకూల సంబంధాలను కొనసాగించడం.5 స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం: జీవితానికి సంబంధించిన నిర్ణయాలను స్వయంగా తీసుకొనే స్వేచ్ఛ ఉండటం, తన భావాలను నిజాయితీగా వ్యక్తపరచగలగడం.6 ఆనందం: రోజువారీ జీవితంలో సానుకూల భావోద్వేగాలను సంతోషంగా, ఆనందంగా, హాయిగా అనుభవించడం.
అంతర్జాతీయం
22 ఏళ్ల తరువాత ఆ తల్లి ఒడి మళ్లీ నిండింది!
ఎప్పుడో 22 ఏళ్ల క్రితం గడ్డకట్టుకుపోయిన అండం మళ్లీ ఊపిరి పోసుకుంది... యాభై మూడేళ్ల వయసులో 21 ఏళ్ల కొడుకును పోగొట్టుకున్న తల్లి కడుపులో జీవమైంది! రోడ్డు ప్రమాదంతో మరణించిన కొడుకు లోటును భర్తీ చేస్తూ... ఆ ఇల్లు మళ్లీ ముద్దు మురిపాలతో నిండిపోయింది. గ్రీకు దేశపు ఈ టెక్నాలజీ అద్భుతం ఎలా ఆవిష్కృతమైందంటే... ఏథెన్స్: కాన్స్టాంటినో రప్తీస్, క్రిస్టీనా రప్తీ జెలెపీలు గ్రీసు రాజధాని ఏథెన్స్ వాసులు. భర్త వయసు 60, భార్యకేమో 54. ఏడాది క్రితం 2025 అక్టోబరులో వీరిద్దరి ఒక్కగానొక్క కొడుకు 21 ఏళ్ల జార్జ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. దాంతో ఆ కుటుంబంలో విషాదం నిండిపోయింది. ఎలాగోలా వాళ్లు ఆ బాధ నుంచి బయటపడ్డారు కానీ.. బోసిపోయిన ఇల్లు మాత్రం వారిని రోజూ వెక్కిరిస్తూనే ఉండింది. వారసుల్లేకుండా పోతారేమో అన్న బెంగ కూడా వారిని బాధించింది. ఈ నేపథ్యంలోనే క్రిస్టీనా రప్తీ జెలెపీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఎప్పుడో 2004లో కృత్రిమ గర్భధారణ పద్ధతిలో కొడుకును కన్నప్పుడే భద్రపరచిన అండాల సాయంతో మళ్లీ బిడ్డను కనాలని నిర్ణయించింది. అయితే అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం యాభై నాలుగేళ్లు దాటితే కృత్రిమ గర్భధారణతో బిడ్డను కనడం సాధ్యం కాదు. దాంతో అప్పటికప్పుడు కొడుకు పోయిన బాధను కూడా పక్కనబెట్టి క్రిస్టీనా, భర్త కాన్స్టాంటినో రప్తీస్లు మరోసారి కృత్రిమ గర్భధారణకు సిద్ధమయ్యారు. భద్రపరచిన అండాన్ని ఫలదీకరణం చేయించి 2025 డిసెంబరులో పిండాన్ని అభివృద్ధి చేసి గర్భంలోకి ప్రవేశపెట్టారు. నెలలు గడిచాయి. బిడ్డ ఆరోగ్యంగానే ఉంది... చివరకు నెలలు నిండిన తరువాత 4 రోజుల క్రితం ఏథెన్స్లోని ఆసుపత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిప్పుడు ఆ చిన్నారి బరువు 3.49 కిలోలు!!! ఇరవై రెండేళ్ల ఐదు నెలల, 23 రోజులపాటు గడ్డకట్టి ఉన్న అండం నుంచి సరికొత్త జీవం ఉనికిలోకి రావడం వైద్య చరిత్రలో ఇదే రెండోసారి మాత్రమే. గత ఏడాది అమెరికాలోని ఓహాయోకు చెందిన దంపతులు 30 ఏళ్ల క్రితం శీతలీకరించిన అండం సాయంతో బిడ్డను కని గిన్నిస్ రికార్డు సృష్టించారు. గతంలో 18 ఏళ్ల క్రయో ప్రిజర్వేషన్ తరువాత జపాన్లో, 17 ఏళ్ల తరువాత ఇజ్రాయెల్లోనూ పిల్లలు జీవంతంగా పుట్టిన రికార్డులు ఉన్నాయి. ‘‘కొడుకు పోయిన తరువాత ఇంకో బిడ్డను కనాలి అనుకున్నప్పుడు సమయం సరిపోతుందా? అన్న అనుమానం ఉండింది. 54 ఏళ్లు నిండేలోపు కృత్రిమ గర్భదారణకు సంబంధించిన ప్రక్రియలు అన్నీ ముగియాలన్నది ప్రభుత్వ నిబంధన. దీనికి ప్రభుత్వ అనుమతులు పొందాలి కూడా.’’అని క్రిస్టీనా రప్తీ జెలెపీ బిడ్డను కన్న తరువాత తెలిపారు. కాలంతో పోటీపడుతూ మరోసారి తల్లినయ్యానని, వైద్యబృందం ఇచ్చిన స్థైర్యంతోనే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేసింది. ‘‘జీవితానికి రెండో ఛాన్స్ ఇద్దామని అనుకున్నాం. ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాలని తీర్మానించుకున్నాం. మా జీవితాల్లోకి ఇంకో కొత్త జీవితాన్ని ఆహ్వానించాం. కుటుంబం కొనసాగాలన్నదే సంకల్పం’’అని రప్తీ తెలిపారు. ‘‘కూతురు ఆరోగ్యంగా, ఆనందంగా పెద్దదయితే చాలు. జార్జ్ మాదిరిగానే మా ఇంటిని నవ్వులతో నింపాలి’’అని ఆకాంక్షించారు. అమ్మాయి పేరేంటో తెలుసా? అన్న జార్జ్ను గుర్తు చేసేలా జార్జియా అని పెట్టుకున్నారు. గ్రీస్లో బర్త్రేట్ తగ్గిపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం 54 ఏళ్ల నిబంధనను సమీక్షించాలని రప్తీ జలెపి వైద్యులైన డాక్టర్ కోస్టాస్ పాంటోస్ తెలిపారు. యాభై నాలుగేళ్లకు ఒక్కరోజు ఎక్కువైనా బిడ్డను కనడాన్ని అనుమతించడం లేదని, ఈ పరిస్థితి మారాలని అన్నారు. బిడ్డను కనడం తల్లిదండ్రుల హక్కని, ప్రభుత్వం దాన్ని లాక్కోరాదని అభిప్రాయపడ్డారు. రెండోసారి తండ్రి అయిన కాన్స్టాంటిన్ రప్తీస్ మాట్లాడుతూ... భవిష్యత్తులో ఇంకో దేశానికి వెళ్లి మూడో బిడ్డను కంటామేమో అనడం కొసమెరుపు!!
పోలాండ్ సరిహద్దుకు 2 కి.మీ. దూరంలో రష్యా డ్రోన్ దాడి
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి రైల్వే వ్యవస్థపై దాడి కలకలం రేపింది. ఉక్రెయిన్–పోలాండ్ సరిహద్దుకు సమీపంలోని యాహోడిన్ ప్రాంతంలో ఓ రైలుపై రష్యా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో రైలు ఇంజిన్ దెబ్బతిన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ప్రయాణికులను ముందుగానే రైలు నుంచి ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు.ఈ ఘటనకు కొద్దిసేపటి ముందే బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్తో పాటు పలువురు యూరప్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అదే రైల్వే మార్గంలో మరో రైలులో ప్రయాణించినట్లు సమాచారం. కీవ్లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న అనంతరం వారు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిటన్ భద్రతా సలహాదారు జోనాథన్ పావెల్ కూడా ఈ బృందంలో ఉన్నారు.రష్యా మాత్రం పశ్చిమ ఉక్రెయిన్లోని ‘రైల్వే మౌలిక వసతుల’పై దాడి చేసినట్లు పేర్కొంది. అయితే ఉక్రెయిన్ ప్రభుత్వ రైల్వే సంస్థ ఉక్ర్జలిజ్నిట్సియా మాత్రం దాడికి గురైన డ్రోన్ లక్ష్యం దౌత్య ప్రతినిధులు ప్రయాణించిన రైలు అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. రష్యా దాడుల ముప్పు నేపథ్యంలో టైమ్టేబుల్లో మార్పులు చేసి దౌత్య రైలును ముందుగానే స్టేషన్ నుంచి పంపించినట్లు తెలిపింది.దాడికి గురైన రైలులోని ప్రయాణికులను ఖాళీ చేయాలని ఆదేశం ఇచ్చిన కేవలం 15 నిమిషాలకే రష్యా జెట్ ప్రొపెల్డ్ డ్రోన్ దాడి చేసినట్లు ఉక్రెయిన్ రైల్వే అధికారులు తెలిపారు. అదే సమయంలో మాజీ సీఐఏ చీఫ్ డేవిడ్ పెట్రాయస్ మరో రైలులో యాహోడిన్ స్టేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ దాడి పోలాండ్ సరిహద్దుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో జరిగిందని ఉక్రెయిన్, పోలాండ్ అధికారులు తెలిపారు.కీవ్ సమావేశానికి హాజరైన మాజీ స్వీడన్ ప్రధాని కార్ల్ బిల్డ్ కూడా తన రైలులో ప్రయాణికులను ముందుగా ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించినట్లు చెప్పారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి అదుపులో ఉందని సమాచారం రావడంతో ప్రయాణాన్ని కొనసాగించామని తెలిపారు. ఆయన ప్రయాణించిన రైలు సురక్షితంగా పోలాండ్ సరిహద్దులోని డోరోహుస్క్ స్టేషన్కు చేరుకుంది. అయితే బిల్డ్ బోరిస్ జాన్సన్తోనే ప్రయాణించారా అనే విషయాన్ని జాన్సన్ ధ్రువీకరించలేదు.ఈ దాడిపై బోరిస్ జాన్సన్ స్పందిస్తూ.. పోలాండ్ సరిహద్దు వద్ద నిలిపి ఉంచిన ఉక్రెయిన్ రైలు ఇంజిన్పై రష్యా ఎందుకు దాడి చేసిందో అర్థం కావడం లేదన్నారు. ఉక్రెయిన్లో సాధారణ పౌరులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న అర్థరహిత దాడులకు ఇది మరో ఉదాహరణ అని పేర్కొన్నారు. రష్యా దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ఉక్రెయిన్కు అవసరమైన వైమానిక రక్షణ వ్యవస్థలను మిత్రదేశాలు అత్యవసరంగా అందించాలని ఆయన కోరారు.ఉక్రెయిన్పై రష్యా దాడుల్లో రైళ్లు, రైల్వే డిపోలు, పెట్రోల్ స్టేషన్లు, సరిహద్దు ప్రాంతాలు లక్ష్యంగా మారుతున్నాయని సమాచారం. ఇటీవల ఉక్రెయిన్–మాల్డోవా సరిహద్దు వద్ద రష్యా డ్రోన్ దాడిలో ఇద్దరు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. దక్షిణ ఉక్రెయిన్లో ప్రయాణికుల రైలుపై జరిగిన మరో డ్రోన్ దాడిలో మహిళా కండక్టర్ మృతి చెందారు. ఈ నెల ప్రారంభంలో కీవ్లోని రైల్వే డిపోపై జరిగిన దాడిలో ఆరుగురు రైల్వే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.2022లో రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్లో విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. దీంతో లక్షలాది మంది ప్రజలకు రైలు ప్రయాణమే ప్రధాన రవాణా మార్గంగా మారింది. ఈ నేపథ్యంలో రైల్వే వ్యవస్థపై జరుగుతున్న వరుస దాడులు ఆ దేశ ప్రజలపై మరింత ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు యూరప్లోనూ అనుమానాస్పద ఘటనలు చోటుచేసుకుంటుండటంతో రష్యా చర్యలపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చీకటి సొరంగంలో, మరణం అంచున 10 రోజులు భయానక పోరాటం
చీకటి సొరంగంలో బిక్కుబిక్కుమంటూ గడిచిన క్షణాలు.. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన వేళ ప్రాణాలపై ఆశలు సన్నగిల్లాయి. అయినా ఎక్కడో ఒక చోట సహాయక బృందాలు తమను చేరుకుంటాయన్న నమ్మకంతో సంజయ్ సాహ్, కబీర్ మహర్జన్ అనే ఇద్దరు కార్మికులు ధైర్యాన్ని కోల్పోలేదు. ప్రార్థనలతో మనసును నిలబెట్టుకుంటూ.. చివరకు ఆ చీకటి నుంచి వెలుగులోకి వచ్చారు.నేపాల్లో వరదల కారణంగా జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులు పది రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. త్రిశూలీ 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న యాంత్రిక విభాగం ఫోర్మ్యాన్ సంజయ్ సాహ్, యాంత్రిక పర్యవేక్షకుడు కబీర్ మహర్జన్ను సెప్టెంబర్ 4న సహాయక బృందాలు సురక్షితంగా వెలికితీశాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో వారు మాట్లాడారు. ఆపదలో చిక్కుకున్న తర్వాత చీకటి సొరంగంలో తొమ్మిది రోజులు గడిపిన సంజయ్.. ప్రార్థనలు చేస్తూ ధైర్యంగా ఉన్నట్లు తెలిపారు.ఆగస్టు 26న వరదలు ప్రాజెక్టును ముంచెత్తిన సమయంలో సంజయ్ నియంత్రణ గదిలో విధుల్లో ఉన్నారు. సాధారణంగా అక్కడ ఐదారు మంది మాత్రమే ఉండేవారని, ఆ రోజు 40 నుంచి 45 మంది ఉన్నారని ఆయన చెప్పారు. వరదనీరు భూగర్భ ప్రాంతంలోకి ప్రవేశించడంతో కార్మికులను బయటకు పంపేందుకు ప్రయత్నించారు. ఇతరులను రక్షించే క్రమంలో తనకు బయటపడే అవకాశం లేకుండా పోయిందని సంజయ్ వివరించారు.హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ.. “వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తూ అందరినీ పరుగెత్తించాను. దాంతో నాకు సమయం లేకుండా పోయింది. చివరికి నేను బయటకు రాలేకపోయాను” అని సంజయ్ తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న సమయంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నానని చెప్పారు. ఆ ప్రార్థన తనకు మనోధైర్యాన్ని ఇచ్చిందని వివరించారు.మరో కార్మికుడు కబీర్ మహర్జన్ కాఠ్మాండుకు చెందినవారు. సాధారణ నిర్వహణ పనుల కోసం కులేఖానీ జలవిద్యుత్ ప్రాజెక్టు నుంచి త్రిశూలీ 3ఏకు వెళ్లారు. ఆయన భార్య హీరా శోభా చివరిసారిగా ఆగస్టు 26 ఉదయం 7.30 గంటల సమయంలో భర్తతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఫోన్ పనిచేయలేదు. తొమ్మిది రోజుల పాటు కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.“అతను మరో జీవితం పొంది తిరిగి వచ్చాడు. మేము ఎంతో సంతోషంగా ఉన్నాం” అని హీరా శోభా తెలిపారు. రక్షణ బృందాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి తన భర్తను కాపాడాయని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వరదలతో దెబ్బతిన్న నేపాల్లో పలు జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద ఇంకా గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలీ-3ఏలో ఇద్దరు కార్మికులు ప్రాణాలతో బయటపడటం, సొరంగాల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించవచ్చన్న ఆశలను పెంచింది.ఇదీ చదవండి: పండ్ల బుట్టలో దాచిన తుపాకీని తీసి కాల్పులు
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై విమర్శలు
జెరూసలేం: ఇజ్రాయెల్లో ప్రధాని కార్యాలయ ఖర్చులకు సంబంధించి తాజాగా వెలువడిన అధికారిక సమాచారం తీవ్ర చర్చనీయాంశమైంది. 2019 నుంచి ఆగస్టు 2026 వరకు దేశ ప్రధానుల హెయిర్ స్టైలింగ్, మేకప్, అధికారిక ప్రాతినిధ్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం సుమారు 470,000వేల డాలర్లు( భారత కరెన్సీలో దాదాపు రూ. 4.49 కోట్లు) ఖర్చు చేసినట్లు వెల్లడైంది.సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడంతో ప్రధాని కార్యాలయం ఈ వివరాలను బహిర్గతం చేసింది.ఈ ఖర్చుల్లో దాదాపు 90 శాతం కేవలం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహుల హెయిర్ స్టైలింగ్, మేకప్లకే ఖర్చయినట్లు తేలింది.ఇదీ చదవండి : బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయంఇజ్రాయెల్ - హమాస్ మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న కాలంలోనూ (సెప్టెంబర్ - నవంబర్ 2023 మధ్య) ప్రధాని హెయిర్ స్టైలింగ్ కోసం సుమారు రూ. 2 లక్షలు వెచ్చించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కేవలం దేశంలోనే కాకుండా విదేశీ పర్యటనల సమయంలోనూ ఈ సౌకర్యాల కోసం భారీగా ఖర్చు పెట్టారు.ఫిబ్రవరి 2025లో వాషింగ్టన్కు వెళ్లిన సమయంలో హెయిర్, మేకప్ నిమిత్తం సుమారు 13,500 డాలర్లు (భారత కరెన్సీలో రూ.12.9లక్షలు) ఖర్చయినట్లు డేటా ద్వారా తెలిసింది. ఈ ఖర్చులు వివిధ సంవత్సరాల్లో మారుతూ వచ్చాయి. ఇజ్రాయెల్ మాజీ ప్రధానులు నఫ్తాలీ బెనెట్, యైర్ లాపిడ్ తదితరులు ఆ పదవిలో ఉన్నకాలంతో పోలిస్తే, బెంజమిన్ నెతన్యాహు హయాంలో ఈ వ్యయం గణనీయంగా ఉన్నట్లు వెల్లడైంది. అత్యధికంగా 2025 సంవత్సరంలో సుమారు రూ.1.06 కోట్లు ఖర్చయినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, భద్రతా కారణాలను చూపుతూ హెయిర్ స్టైలిస్టులు,మేకప్ ఆర్టిస్టుల పేర్లను వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. ప్రభుత్వ నిధుల దుబారాపై పౌర హక్కుల సంఘాలు,విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. מידע שקיבלנו: הוצאות האיפור והשיער של ראשי הממשלה בישראל משנת 2019. 🔹 הן הסתכמו ב-1.43 מיליון שקל - 90% מהן היו של בני הזוג נתניהו.🔹 הוצאות סידור השיער לנתניהו בתחילת המלחמה, באוקטובר 2023, היו 2,457 שקל.🔹 ההוצאה הגבוהה ביותר: 13.5 אלף דולר בביקור של 4 ימים בארצות הברית.… pic.twitter.com/SIi8X8qgMw— התנועה לחופש המידע (@shakoof) September 10, 2026
జాతీయం
45 ఏళ్లుగా గణేశ్ వేడుకల్లో మారుమోగుతూ..
గణేశ్ చతుర్థి వచ్చిందంటే చాలు.. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పాటు డీజేల్లో మారుమోగే కొన్ని పాటలు పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మారుస్తాయి. అలాంటి పాటల్లో నాలుగున్నర దశాబ్దాలుగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పాట ‘దేవా హో దేవా గణపతి దేవా’. 1981లో విడుదలైన ఈ పాట ఇప్పటికీ గణేశ్ చతుర్థి వేడుకల్లో నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. అంతేకాదు.. ఒకే పాటకు ఆరుగురు ప్రముఖ గాయకులు తమ గాత్రాన్ని అందించడం ఈ పాటకున్న ప్రత్యేకత.45 ఏళ్లుగా అదే జోష్గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని హిందీ చిత్రసీమలో ఎన్నో గణపతి పాటలు వచ్చాయి. అయితే వాటిలో ‘దేవా హో దేవా గణపతి దేవా’ పాటకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. సుమారు 45 ఏళ్ల క్రితం విడుదలైన ఈ గీతం ఇప్పటికీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సందడి చేస్తుంటుంది. పండగ సమయంలో డీజేలు, ఇతర వేడుకల్లో ఈ పాట వినిపించడం సర్వ సాధారణంగా మారింది.‘హమ్ సే బఢ్కర్ కౌన్’తో అనుబంధంఈ పాట 1981లో విడుదలైన ‘హమ్ సే బఢ్కర్ కౌన్’ అనే హిందీ చిత్రంలోనిది. ప్రముఖ దర్శకుడు దీపక్ బహ్రీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నటుడు అమ్జద్ ఖాన్తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో కనిపించారు. ఈ చిత్రంలోని ‘దేవా హో దేవా గణపతి దేవా’ పాట 1980లలో భక్తి గీతంగా విశేష ప్రజాదరణ పొందింది.సినిమాను మించిన హిట్సినిమాలో భాగమైనప్పటికీ ఈ పాటకు వచ్చిన ఆదరణ ప్రత్యేకంగా నిలిచింది. అమ్జద్ ఖాన్, మిథున్ చక్రవర్తి, డ్యానీ డెంజోంగ్పా, రంజితా కౌర్, నీతా మెహతా తదితరులపై ఈ పాటను చిత్రీకరించారు. అయితే సినిమా కంటే ఈ పాటకే ఎక్కువ గుర్తింపు లభించిందని చెబుతుంటారు. నాలుగు దశాబ్దాలకు పైగా గడిచినా గణేశ్ చతుర్థి సందర్భంగా ఈ పాటకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ఆరుగురు దిగ్గజాల స్వరాలుఈ పాటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒకే పాట కోసం హిందీ సంగీత ప్రపంచానికి చెందిన ఆరుగురు గాయకులు కలిసి తమ గాత్రాన్ని అందించారు. వారిలో మొహమ్మద్ రఫీ, ఆశా భోస్లే, శైలేంద్ర సింగ్, భూపేంద్ర, రామ్లక్ష్మణ్, సప్నా చక్రవర్తి ఉన్నారు. ఇంతమంది ప్రముఖ గాయకుల స్వరాలు కలవడం ఈ పాటకు మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది.గణపతి వేడుకల్లో ఇప్పటికీ మార్మోగుతూ..1981లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాటకు 45 ఏళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ ప్రతి గణేష్ చతుర్థి సమయంలో ఈ పాట వినిపిస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటుంది. తరాలు మారినా గణపతి వేడుకల్లో ఈ పాటకు ఆదరణ కొనసాగుతుండటం దీని ప్రత్యేకతను తెలియజేస్తున్నది.ఇదీ చదవండి: ఒక చేతిలో ‘బ్రహ్మోస్’.. మరో చేతిలో సెమీకండక్టర్ చిప్..
పంజాబీ గాయకుడి ఇంటిపైకి కాల్పులు
చండీగఢ్: పంజాబీ గాయకుడు గులాబ్ సిద్ధు నివాసంపైకి గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. పంజాబ్లోని బర్నాలాలో ఉన్న ఆయన ఇంటి వద్దకు అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో బైక్లపై ముసుగు ధరించిన వచ్చిన ముగ్గురు వ్యక్తులు మెయిన్ గేటుపైకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. సిద్ధు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారని, కాల్పుల సమయంలో ఆయన తల్లిదండ్రులు, భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారన్నారు. కాల్పులతో ఎవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదని వివరించారు. అనంతరం, ఈ కాల్పులకు తమదే బాధ్యతంటూ గ్యాంగ్స్టర్ డోని బాల్ సోషల్మీడియాలో పోస్ట్ పెట్టాడు. తమ ఫోన్ కాల్స్కు అతడు స్పందించనందునే, అతడి ఇంటి డోర్బెల్ను తుపాకీ కాల్పులతో మోగించామంటూ వ్యాఖ్యానించాడు. హత్యకు గురైన గాయకుడు సిద్ధూ మూసేవాలాకు గులాబ్ సిద్ధూ సన్నిహిత మిత్రుడు కావడం గమనార్హం.
ఒక్క విద్యార్థి కోసం 5 కి.మీ.ల ట్రెక్కింగ్
కొల్హాపూర్: రోజూ ఉదయం ప్రభుత్వపాఠశాలలో బోధించేందుకు వెళ్లాలంటే ప్రతి టీచర్ సొంత వాహనం లేదా ఆర్టీసీ బస్సులో ప్రయాణం మొదలెడతారు. కానీ 55 ఏళ్ల ఉపాధ్యాయుడు జీవన్ వసంతరావ్ మిథారీ మాత్రం రోజూ రానుపోను 5 కిలోమీటర్లు కొండప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తూ పాఠశాలకు వెళ్లివస్తున్నారు. దట్టమైన అడవి, ఎడతెరపి వానలు, వన్యప్రాణుల నుంచి ప్రాణహాని ఉన్నా వాటిని తట్టుకుంటూ ఒకే ఒక్క విద్యార్థికి పాఠాలు చెప్పేందుకు గత 13 ఏళ్లగా తన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ అంకితభావంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సహ్యాద్రి పర్వతశ్రేణిలో కొల్హాపూర్ జిల్లాలోని గగన్బవాడ తాలూకాలో కొండ మీద కవాల్టెక్ ధంగర్వాడా అనే మారుమూల గ్రామం ఉంది. అక్కడ పాతికేళ్ల క్రితం దాదాపు 100 కుటుంబాలు ఉండేవి. తర్వాత జీవనోపాధి కోసం దాదాపు కుటుంబాలన్నీ కొల్హాపూర్ నగరానికి వలసవచ్చాయి. ఒకటీ రెండు కుటుంబాలే అక్కడ ఉన్నాయి. వారిలో మూడో తరగతి చదవే స్వర బొడాకే ఒక్కతే అక్కడి జిల్లాపరిషత్ స్కూల్కు వస్తోంది. ఈమెకు చదువు చెప్పేందుకే టీచర్ మిథారీ రోజూ 2.5 కిలోమీటర్లు పైకి ట్రెక్కింగ్చేసి స్కూల్ అయ్యాక మళ్లీ 2.5 కి.మీ.లు కిందకు దిగొస్తున్నారు. ‘‘కొల్హాపూర్ జిల్లా ప్రైమరీ స్కూల్ టీచర్స్ సహకార బ్యాంక్కు గతంలో చైర్మన్గా ఉన్నా. అప్పుడు నాలాంటి ప్రతిభావంతులైన టీచర్లకు పట్టణాల్లో పోస్టింగ్లు ఇచ్చి ఇతరులకు కుగ్రామాల్లో పోస్టింగ్లు ఇస్తారని ఒకరు నాతో అన్నారు. అది తప్పు అని నిరూపించేందుకే ఈ పాఠశాలను నేనే ఎంచుకున్నా. సాయంత్రం ఆలస్యమైతే అడవి దున్నల వంటి వన్య ప్రాణాలతో ముప్పు ఎక్కువ. అందుకే ఉదయం చాలా త్వరగా స్కూల్కు ఆరోజు సిలబస్ మొత్తం చెప్పి త్వరగా వెనుతిరుగుతా. స్వర చెల్లెలు అంగన్వాడీ లేకపోవడంతో ఆ పాప కూడా బడికొస్తోంది. వచ్చే ఏడాది ఆమె ఒకటో తరగతిలో చేరబోతోంది’’అని టీచర్ నవ్వుతూ చెప్పారు. కవాల్టెక్ ధంగర్వాడా గ్రామానికి విద్యుత్ సౌకర్యంలేదు.
పూర్తి ఆరోగ్యంతో ఉన్నా!
సాక్షి, న్యూఢిల్లీ: తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఆదివారం ఆమె యూపీ రాజధాని లక్నోలో మీడియాతో మాట్లాడారు. వదంతులను నమ్మవద్దని, రాబోయే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ నుంచి తాజాగా మూడోసారి బహిష్కృతుడైన ఆకాశ్ ఆనంద్పై ఆమె మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తి చేసేందుకు అతడు ప్రయతి్నస్తున్నాడని ఆరోపించారు. సొంత ఆలోచనలతో కాకుండా మామ, మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ కనుసన్నల్లోనే అతడు నడుస్తున్నాడని విమర్శించారు. ‘శనివారం నా నివాసంలో ఉన్న పార్టీ ఇంఛార్జ్ అలోక్ కుమార్కు ఆకాశ్ ఆనంద్ ఫోన్ చేశాడు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలను సైతం బెహెన్జీ(మాయావతి) ఎక్స్ ద్వారానే ప్రకటిస్తున్నారు. ఆమె ఆరోగ్యం బాగోలేదా అంటూ అలోక్ను అడిగాడు. తాను ఫోన్ చేసిన విషయాన్ని నాకు చెప్పవద్దని కూడా అలోక్ కుమార్ను కోరాడు. ఆకాశ్ ఫోన్ చేయడం వెనుక ఎలాంటి ఉద్దేశమున్నప్పటికీ అతడు సొంతంగా ఏమీ చేయడం లేదు, మామ అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో కార్యకర్తలకు నేరుగా వాస్తవాలు వివరించాల్సిన అవసరముంది. కాబట్టే ఈ ప్రకటన చేస్తున్నా’అని ఆమె స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాల కోసం ఇటీవల తీసుకున్న కఠిన నిర్ణయాలు బీఎస్పీకి మేలు చేశాయని ఆమె పేర్కొన్నారు. తన సోదరుడు ఆనంద్ కుమార్ కుమారులు ఆకాశ్ ఆనంద్, ఇషాన్ ఆనంద్లకు బీఎస్పీలో ఎలాంటి పదవులు ఇవ్వడం లేదని ఆమె ప్రకటించారు. వారసురాలిగా దీపికా ఆనంద్! సోదరుడు ఆనంద్ కుమార్తె దీపికా ఆనంద్ విషయం ఇటీవల మాయావతి ప్రస్తావించా రు. బీఎస్పీకి సంబంధించిన అంశాల్లో ఆమె తండ్రికి సాయంగా ఉండవచ్చని అన్నారు. ముందుకు వస్తే ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలను కూడా అప్పగిస్తామని ప్రకటించారు. ఆమె సిద్ధంగా లేకుంటే దళిత వర్గానికి చెందిన సాధారణ కార్యకర్తకు ఆ బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశాయి. కాగా, లా చదువుతున్న దీపికా ఆనంద్ ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో ఏఐ కాలేజీకి ఎన్నారై దంపతుల పేరు
అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన దంపతులు విద్యారంగానికి భారీ విరాళం అందించారు. టెక్సాస్లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (UNT)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అడ్వాన్స్డ్ అనలిటిక్స్కు ప్రత్యేక కాలేజీ ఏర్పాటుకు ఏకంగా 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.167 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ భారీ విరాళం అందించిన అనురాధ, వికాస్ సిన్హా దంపతుల పేరుతోనే కొత్త కాలేజీకి ‘అనురాధ అండ్ వికాస్ సిన్హా కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్’ అని పేరు పెట్టనున్నారు.AI, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో విద్య, పరిశోధనలకు ఈ కాలేజీ కేంద్రంగా పనిచేయనుంది. AI, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, లైబ్రరీ సైన్స్, లెర్నింగ్ టెక్నాలజీస్ వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి ఈ కాలేజీ ఉపయోగపడుతుందని వర్సిటీ అధ్యక్షుడు హారిసన్ కెల్లర్ తెలిపారు.ఈ విరాళంతో కాలేజీ నాయకత్వం, విద్యార్థుల స్కాలర్షిప్లు, ప్రొఫెసర్షిప్లు, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇంక్యుబేషన్, అధునాతన పరిశోధనలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు మద్దతుగా ఆరు శాశ్వత ఎండోమెంట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే *అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్*ను కూడా ఈ కాలేజీలో ఏర్పాటు చేస్తారు. ఇది వర్సిటీలోని వివిధ విభాగాల మధ్య AI, డేటా సైన్స్ పరిశోధనలకు సమన్వయం చేస్తూ పరిశ్రమలతో భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనుంది.చదువు కోసం అమెరికాకు.. ఇప్పుడు భారీ విరాళంవికాస్, అనురాధ ఇద్దరూ భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఉత్తరప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేసిన అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీలు పొందారు. వికాస్ సిన్హా నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీలోనూ చదివి, 2023లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచే పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన బ్రాడ్కామ్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు.సిన్హా దంపతులు ఇప్పటికే UNTకు పలు సందర్భాల్లో భారీగా అండగా నిలిచారు. 2024లో వారు అందించిన విరాళంతో అనురాధ అండ్ వికాస్ సిన్హా డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, అధ్యాపకులు, పరిశోధనలకు మద్దతుగా ఎండోమెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడాదికే మరో భారీ విరాళంతో సిన్హా ఇన్నోవేషన్ ల్యాబ్ ఫర్ డేటా సైన్స్ను ఏర్పాటు చేశారు.“మాకు ఈ విరాళం అంటే అవకాశాన్ని మరో తరానికి అందించడం. వలస వచ్చినవారు అమెరికన్ డ్రీమ్లో కేవలం భాగస్వాములు మాత్రమే కాదు.. దాన్ని నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. విద్య మా జీవితాల్లో ఎన్నో తలుపులు తెరిచింది. ఇప్పుడు ఆ తలుపులు మరికొందరికి తెరిచి ఉంచాలనుకుంటున్నాం” అని వికాస్ సిన్హా తెలిపారు.AI, డేటా ఆధారంగా భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న నేపథ్యంలో.. కొత్త తరం విద్యార్థులను అందుకు సిద్ధం చేయడం, పరిశోధనలను ప్రోత్సహించడం, పరిశ్రమలతో అనుసంధానం పెంచడం ఈ కొత్త కాలేజీ ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి.(చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!)
వైఎస్సార్ చెస్ టోర్నమెంట్లో విజేతగా శిబి శ్రీనివాస్ చెమికల
మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ జర్మనీ విభాగం కన్వీనర్ కృష్ణ తేజా రెడ్డి గడ్డం ఆధ్వర్యంలో మ్యూనిక్ నగరంలో వైఎస్సార్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో విజేతగా నిలిచిన డార్మ్ స్టడ్ అప్లయిడ్ సైన్సెస్ యూనివర్సిటీ విద్యార్ధి శిబి శ్రీనివాస్ చెమికలకు వైఎస్సార్ సీపీ ఐటీ విభాగ కోర్డినేటర్ విష్ణు వర్ధన్ రెడ్డి మార్తల ట్రోఫీని అందజేశారు. జర్మనీ వైఎస్సార్ సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయి సూర్య చౌదరి నేలకుర్తి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.(చదవండి: జర్మనీలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి)
కువైట్లో భారీ డీజిల్ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్!
కువైట్ సిటీ: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన వాహనాల నుంచి డీజిల్ దొంగిలించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం పట్టుకుంది. ఈ కేసులో ఓ కువైట్ పౌరుడితో పాటు భారతీయులు సహా 40 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న కొందరు బస్సులు, లారీలను ‘అంగర్’ ప్రాంతంలోని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి డీజిల్ చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇలా సేకరించిన డీజిల్ను ఇతర ట్యాంకర్లలోకి తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ అక్రమ దందా కోసం ట్యాంకర్లను నెలకు 1,600 కువైటీ దినార్లకు అద్దెకు ఇచ్చింది అరెస్టైన కువైట్ పౌరుడేనని విచారణలో తేలింది. చాలాకాలంగా నిఘా పెట్టిన అధికారులు డీజిల్ చోరీ చేస్తున్న సమయంలో ప్రధాన నిందితులను పట్టుకున్నారు. అనంతరం దొంగిలించిన డీజిల్ కొనుగోలు చేసేందుకు వచ్చిన మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.అయితే, డీజిల్ దొంగతనం, విక్రయం, కొనుగోలులో భాగమైన మొత్తం 41 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ముఠా ఉపయోగించిన 38 ట్రక్కులు, బస్సులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలు, ఆర్థిక నష్టాన్ని అరికట్టడంలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇవీ చదవండి: లెబనాన్పై విరుచుకపడ్డ ఇజ్రాయెల్.. 11 మంది మృతి
పౌరసత్వం రద్దయిన వారికి కువైట్ గుడ్న్యూస్
కువైట్ సిటీ: కువైట్లో పౌరసత్వాన్ని కోల్పోయిన వారికి దేశంలో కొనసాగేందుకు కొత్త నివాస అనుమతి నిబంధనను తీసుకురావడానికి ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో పౌరసత్వం రద్దు చేసినా లేదా వెనక్కి తీసుకున్నా, కొన్ని షరతులతో గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు కువైట్లో నివసించేందుకు అనుమతి లభించనుంది.పౌరసత్వం కోల్పోయిన తర్వాత తమ పాత విదేశీ పౌరసత్వాన్ని తిరిగి పొందిన వారు లేదా మరో దేశ పౌరసత్వం పొందిన వారు ఈ కొత్త నిబంధన కింద సాధారణ నివాస అనుమతికి అర్హులవుతారు. అయితే ఈ అనుమతి గరిష్ఠంగా 10 సంవత్సరాల కాలానికి మాత్రమే ఉండనుందని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.అయితే, నివాస అనుమతి మంజూరు చేయడం, దాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలు, నియంత్రణలను రెసిడెన్సీ అఫైర్స్ విభాగం డైరెక్టర్ జనరల్ నిర్ణయించనున్నారు. ఈ నిబంధనల ప్రకారం నివాస అనుమతి పొందిన వారు కువైట్లో ఉద్యోగం చేసేందుకు పాటించాల్సిన నిబంధనలను కూడా అధికారులు నిర్ణయించనున్నారు.అలాగే, సవరించిన నిబంధనలను అధికారిక గెజిట్లో ప్రచురించిన తర్వాత ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. దీంతో పౌరసత్వం కోల్పోయినప్పటికీ ఇతర దేశ పౌరసత్వం పొందిన వారికి కువైట్లో చట్టబద్ధంగా నివసించే అవకాశం లభించనుంది.ఇవి కూడా చదవండి: ప్రయాణికులకు గుడ్న్యూస్.. బహ్రెయిన్-సౌదీ మధ్య కొత్త సౌకర్యం!
క్రైమ్
HYD: క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ఓ వ్యక్తి హత్య.. రెండు కుటుంబాలను విషాదంలో ముంచింది. బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలోని సీబీఎన్ నగర్కు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు వివరాలు ఆరా తీయడానికి శనివారం సాయంత్రం పటాన్చెరు ఠాణాకు వెళ్లిన ఆయన బంధువు శ్యామ్ గుండెపోటుతో అక్కడిక్కడే చనిపోయారు. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గురువారం రాత్రి అదృశ్యం.. ఖమ్మం జిల్లా పాతర్లపాడుకు చెందిన రాజశేఖర్ (32) నగరానికి వలసవచ్చి బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలోని సీబీఎన్ నగర్లో స్ధిరపడ్డారు. ఈయనకు భార్య లీల, ఎనిమిదేళ్ల లోపు వయసున్న కుమార్తెలు శ్రీనిధి, అనన్య ఉన్నారు. రాజశేఖర్కు రెండు కార్లు ఉండేవి. ఒకదాన్ని తాను నడుపుతూ.. మరో దాన్ని డ్రైవర్ ద్వారా నడిపిస్తున్నారు. రాజశేఖర్ సమీప బంధువు అశోక్ మూడు రోజుల క్రితం ఓ కారు ఖరీదు చేశారు. దీన్ని ప్రస్తుతం రాజశేఖర్ నడుపుతున్నారు. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజశేఖర్ తిరిగి రాలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబీకులు శుక్రవారం బేగంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహం, కారు వేర్వేరు చోట్ల.. సంగారెడ్డి జిల్లా కోహిర్లోని గోల్డెన్ దాబా సమీపంలో రాజశేఖర్ కారు పోలీసులకు లభించింది. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు అక్కడికి వెళ్లారు. రాజశేఖర్ కోసం పోలీసులు, కుటుంబీకులు, స్నేహితులు వెతికారు. శుక్రవారం అర్ధరాత్రి రుద్రారం శివారులోని చెట్ల పొదల్లో రాజశేఖర్ మృతదేహం లభించింది. హతుడి సోదరుడు రాంబాబు ఫిర్యాదుతో పటాన్చెరు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో రాజశేఖర్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. బెల్ట్ వంటి దాంతో మెడకు ఉరి బిగించి చంపినట్లు నిర్ధారించారు ఠాణాలో కుప్పకూలిన బంధువు.. కేసు పూర్వాపరాలు, దర్యాప్తు అంశాలను ఆరా తీయడానికి రాజశేఖర్ బంధువులు, స్నేహితులు శనివారం సాయంత్రం పటాన్చెరు ఠాణాకు వెళ్లారు. అక్కడ పోలీసు అధికారులతో మాట్లాడుతున్న సమయంలో హతుడి సమీప బంధువు శ్యామ్ గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో అటు రాజశేఖర్, ఇటు శ్యామ్ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకొన్నాయి. కారు కోసమే ఘాతుకమా? ప్రాథమిక ఆధారాలను బట్టి రాజశేఖర్ నడుపుతున్న కారు కోసమే ఆయన హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ప్యాసింజర్ల మాదిరిగా కారు బుక్ చేసుకుని, ఆపై వెనుక సీటు నుంచి మెడకు బెల్టు బిగించి చంపేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా.. కారు మరమ్మతులకు లోనుకావడంతోనే అక్కడ వదిలేసి పారిపోయినట్లు భావిస్తున్నారు. ఇదీ చదవండి: నార్సింగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
నార్సింగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
గ్రేటర్ పరిధిలో జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. మిత్రుడి పుట్టిన రోజు వేడుకకు స్నేహితులతో కలిసి ఆనందంగా వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పడంతో ఇంటర్ విద్యార్థి అసువులు బాశాడు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన కోకాపేటలో చోటుచేసుకోగా.. రోడ్డు పక్కన స్తంభాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ బాలుడు దుర్మరణం చెందిన మరో ఘటన అత్తాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. కీసర ఓఆర్ఆర్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చెందగా, రాంగ్రూట్లో వచ్చిన ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో బాలుడు మృత్యువాత పడిన ఘటన ఎల్బీనగర్ పరిధిలో జరిగింది. హైదరాబాద్: కూకట్పల్లికి చెందిన మదన్మోహన్ రెడ్డి (17) ఇంటర్ విద్యార్థి. మిత్రుడి పుట్టి న రోజు వేడుకల కోసం శనివారం రాత్రి మరో స్నేహితుడికి చెందిన కారు తీసుకుని వెళ్లాడు. వేడుకల అనంతరం కోకాపేట వైపు వెళ్లి వద్దామంటూ స్నేహితులతో కలిసి ఇన్నోవా కారులో బయలుదేరారు. కోకాపేట నియోపోలిస్ వ్యూపాయింట్ వద్ద తెల్లవారు జామున కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. కారు నడుపుతున్న మదన్మోహన్రెడ్డి డోరులో నుంచి బయటికి వచ్చి పక్కనే ఉన్న స్తంభానికి తగలటంతో తలకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు మద్యం తాగిన ఆనవాళ్లు ఉన్నాయని కోకాపేట సెక్టార్ ఎస్సై మహేందర్, నార్సింగి ఇన్స్పెక్టర్ డి. విష్ణువర్ధన్రెడ్డి చెప్పారు. స్తంభాన్ని బైక్ ఢీకొని.. వేగంగా దూసుకు వచ్చిన ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టిన దుర్ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో మైనర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. కార్వాన్ మొగల్ నగర్కు చెందిన పదో తరగతి విద్యార్థి (14), అదే ప్రాంతానికి చెందిన మరో బాలుడితో కలిసి ద్విచక్ర వాహనంపై కార్వాన్ నుంచి హైదర్గూడ వెళ్తున్నారు. వేగంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని అదుపు చేయలేక రోడ్డుపక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని ఇన్స్పెక్టర్ సీతయ్య తెలిపారు. రాంగ్ రూట్లో వచ్చి.. ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వచ్చి డివైడర్ను ఢీకొట్టడంతో బాలుడు చనిపోగా, మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మలక్పేటకు చెందిన సయ్యద్ మాజ్ హుస్సేన్ (16), నారాయణగూడకు చెందిన హంజాలా, న్యూ మలక్పేటకు చెందిన అలీఖాన్ స్నేహితులు. ముగ్గురు కలిసి ఆదివారం తెల్లవారు జామున నమాజు కోసం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఉదయం 6.30 గంటలకు ఎల్బీనగర్ చౌరస్తా సితార హోటల్ వద్ద రాంగ్ రూట్లో వచ్చి డివైడర్ను ఢీకొట్టారు. ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. సయ్యద్ మాజ్ హుస్సేన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగతా ఇద్దరు స్నేహితులు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి : ముందే పక్కా ప్లాన్.. హోటల్ గదిలో దారుణం
కొత్త కారును అడ్డగించి రూ.2 లక్షలు డిమాండ్!
బంజారాహిల్స్: కొత్తగా కొన్న కారును అడ్డుకుని రూ.2 లక్షలు డిమాండ్ చేసిన ట్రాన్స్జెండర్లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45లో రెండు వారాల క్రితం నలుగురు ట్రాన్స్జెండర్లు కొత్త కారును అడ్డగించి అందులోని వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ‘ఎక్స్’లో వీడియో పోస్ట్ అయ్యింది. ఈ వీడియో ఆధారంగా విచారణ చేపట్టగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. BMW owner harassed by transgenders in Hyderabad, demanding 2 lakh rupees after new car was delivered pic.twitter.com/zVFXKdbJh8— Mogambo (@Netajinonsense1) September 11, 2026 ఇదీ చదవండి: రెమ్యునరేషన్పై సింగర్ జంగి రెడ్డి స్పష్టత ఇదే..
ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!
హైదరాబాద్: ఓ మేనమామే ఆరేళ్ల వ యసున్న కోడలిపై అఘాయిత్యానికి ఒ డిగట్టాడు. కుము రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆల స్యంగా ఆదివారం వెలుగు లోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ రాఖీ పండుగకు తన ఆరేళ్ల కూతురును తీసుకుని కాగజ్నగర్ పట్టణంలోని తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చింది.ఈ సమయంలో కూతురు అమ్మమ్మ దగ్గర ఉంటానని మారాం చేయడంతో అక్కడే వదిలి వెళ్లింది. అయితే బాలిక మేనమామ అయిన శశిధర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. శశిధర్కు వివాహమైనా భార్య పుట్టింట్లోనే ఉంటోంది.మూత్రం ఆగిపోవడంతో..ఐదు రోజులుగా బాలికకు మూత్రం రాకపోవడంతో కడుపు ఉబ్బిపోయింది. రెండు రోజుల క్రితం బాలిక అమ్మమ్మ తన కూతురుకు సమాచారం ఇచ్చింది. దీంతో తల్లి పుట్టింటికి వెళ్లి కూతురును తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షలు చేసి బాలికపై లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించారు. సోదరుడిపైనే అనుమానం వచ్చిన తల్లి పుట్టింటికి వెళ్లి రోదిస్తూ తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ విషయం స్థానిక కౌన్సిలర్, కాలనీ పెద్దలకు ఆదివారం తెలిసింది.కాలనీలో విషయం వ్యాపించడంతో కాలనీ వాసులు నిందితుడి ఇంటిని చుట్టుముట్టారు. మానవ మృగాన్ని ప్రజల మధ్యలోనే శిక్ష విధించాలని ఆందోళన చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ ప్రేమ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు గంటల తర్వాత పోలీసులు నిందితుడిని ద్విచక్రవాహనంపై పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో జోరుగా వాన
వీడియోలు
ఖైరతాబాద్ బడా గణేష్ తొలి దర్శనం పోటెత్తిన భక్తులు..
పంజాబీ గాయకుడి ఇంటిపై కాల్పులు
పిఠాపురంలో అక్రమాలు నీకు కనిపించట్లేదా పవన్..?
నార్సింగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
AI స్పీడ్ కు బ్రేక్
ఖైరతాబాద్ బడ్డా గణేష్ వద్ద పండగ కోలాహలం
గుంటూరు జిల్లాలో మైనింగ్ భూకంపం..పగులుతున్న గోడలు
తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కుమారులు
గిరిజనులంటే లెక్కలేదా? పోలవరం జిల్లా గొల్లగుప్ప వలసలో దయనీయ పరిస్థితులు
వైరల్ అవుతున్న YS జగన్ ట్వీట్

