‘విరాళాల గోల్మాల్’ : ప్రధాని నివాసానికి సాధువుల భారీ మార్చ్!
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై నిష్పక్షపాత విచారణ కోరుతూ దాదాపు 500 మంది సాధువులు, మతాచార్యులు సోమవారం ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్నారు. ప్రకాశానంద గిరి మహారాజ్ నేతృత్వంలో ఈ నిరసన ప్రదర్శన జరుగుతోంది. మండి హౌస్ సమీపంలోని నేపాల్ రాయబార కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. విరాళాల కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధానికి సాధువులు వినతిపత్రం సమర్పించనున్నారు.శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్లో పెద్దఎత్తున ఆర్థిక మోసాలు, నిధుల స్వాహా జరిగిందని నిర్వాహకులు ఆరోపించారు. సాధారణ సిబ్బందిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని కొనసాగిస్తున్న సిట్ విచారణ కేవలం కంటితుడుపు చర్యగా ఉందని, ఇందులో కీలక వ్యక్తులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. మరోవైపు ఈరోజు రామమందిర విరాళాల గోల్మాల్పై సీబీఐ దర్యాప్తు కోరిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించనుంది. అలాగే లోక్సభలో ఈ అంశంపై చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో అత్యున్నత స్థాయి స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
విషమంగా జో బైడెన్ పరిస్థితి!
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయనకు క్యాన్సర్ మరింత విస్తరించిందని, చికిత్సలో తీవ్ర నొప్పితో బాధపడుతున్నారని ఆయన కుమారుడు హంటర్ బైడెన్ వెల్లడించారు. క్యాన్సర్ ఎముకలను దాటి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించిందని ఆయన తెలిపారు.బీబీసీ ‘న్యూస్నైట్’ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో హంటర్ బైడెన్ మాట్లాడుతూ.. తన తండ్రి క్యాన్సర్ చాలా బాధాకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. శారీరకంగా జో బైడెన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై బైడెన్ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.జో బైడెన్ చెబితేనే.. 2025 మేలో తనకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు జో బైడెన్ వెల్లడించారు. అది దూకుడుగా వ్యాప్తి చెందే రకమని, అప్పటికే ఎముకలకు పాకిందని వైద్యులు గుర్తించినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. అనంతరం ఆయన రేడియేషన్ చికిత్స, హార్మోన్ థెరపీ తీసుకుంటున్నట్లు సమాచారం.వయసుతోపాటు ఆరోగ్యంపై చర్చ83 ఏళ్ల బైడెన్.. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన అత్యంత వృద్ధుల్లో ఒకరు. 2021–2025 మధ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన శారీరక ఆరోగ్యం, మానసిక చురుకుదనంపై పలుమార్లు చర్చ జరిగింది. 2024 ఎన్నికల సమయంలోనూ ఆయన వయసు, ఆరోగ్య అంశాలు రాజకీయంగా ప్రధాన చర్చగా మారాయి.రాజకీయ జీవితంలో కీలక అధ్యాయండెలావేర్ నుంచి దీర్ఘకాలం సెనేటర్గా ఉన్న బైడెన్.. 2009 నుంచి 2017 వరకు బరాక్ ఒబామా హయాంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 2020 ఎన్నికల్లో విజయం సాధించి అమెరికాకు 46వ అధ్యక్షుడయ్యారు. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. తన రాజకీయ జీవితంపై ఆధారిత జ్ఞాపకాల పుస్తకాన్ని నవంబర్లో విడుదల చేయనున్నారు. (Joe Biden Health Condition)ట్రంప్ ఏమన్నారంటే.. బైడెన్కు క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు ట్రంప్ తొలుత “ఇది చాలా బాధాకరం” అంటూ ఆయన త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. అయితే దీనిపైనా ఆయన రాజకీయం చేశారు. ఈ విషయం ప్రజలకు ఆలస్యంగా ఎందుకు వెల్లడైందంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే హంటర్ తాజా స్టేట్మెంట్పై ట్రంప్ ఇంకా స్పందించలేదు.
మొజ్తాబా ఖమేనీ ఎక్కడ?.. ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడుతుందా? ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో చుట్టుముడుతున్న అనుమానాల మధ్య ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మోజ్తబా ఖమేనీకి సంబంధించిన మరిన్ని వీడియోలు, ఫొటోలను త్వరలో విడుదల చేస్తామని వెల్లడించింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరోసారి అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.అసలు ఏం జరుగుతోంది?తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి అనంతరం మార్చిలో ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ.. అప్పటి నుంచి బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన తాజా, స్పష్టమైన దృశ్యాలు పెద్దగా బయటకు రాకపోవడంతో ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే, ఇటీవల ఇజ్రాయెల్ మీడియా సైతం మోజ్తబా ఖమేనీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందంటూ కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి వచ్చిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.‘త్వరలో మరిన్ని వీడియోలు’బసీజ్ ఆర్గనైజేషన్ డిప్యూటీ అధికారి ఖాసెమ్ ఖొరైషీ మాట్లాడుతూ.. మొజ్తాబా ఖమేనీ ప్రజల్లో ఉన్న దృశ్యాలు, వీధుల్లో పర్యటిస్తున్న వీడియోలు, సాయుధ దళాల కమాండర్లతో సమావేశాల దృశ్యాలను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న అనుమానాలు, విమర్శలకు సమాధానం చెప్పేందుకే ఈ దృశ్యాలను బయటకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.ఆగస్టు 9న ఓ వీడియో విడుదలఇప్పటికే ఆగస్టు 9న ఇరాన్కు చెందిన సెమీ-అధికారిక మెహర్ న్యూస్ ఏజెన్సీ ఖమేనీకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. అయితే ఆ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే విషయాన్ని వెల్లడించలేదు. వీడియోలో ఖమేనీ తన అనుచరులతో మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారనే సందేశాన్ని ఇవ్వడమే ఈ వీడియో ఉద్దేశంగా కనిపించింది.మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. జూలై 21న మోజ్తబా ఖమేనీతో తన సంప్రదింపులు క్రమంగా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. కానీ ఆగస్టు ప్రారంభంలో మాత్రం.. ఖమేనీతో కమ్యూనికేషన్ “చాలా కష్టంగా ఉంది” అని వ్యాఖ్యానించారు. ఈ రెండు భిన్న వ్యాఖ్యలు ఆయన వాస్తవంగా ఎంతవరకు ప్రభుత్వ వ్యవహారాల్లో చురుకుగా ఉన్నారనే ప్రశ్నలకు దారితీశాయి. కాగా, జూలై చివర్లో మసూద్ పెజెష్కియన్.. మొజ్తాబా ఖమేనీని కలిసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ సమావేశంలో సైనిక వ్యవహారాలతో పాటు విదేశీ మారకద్రవ్య నిర్వహణ, ఇంధన వినియోగం, అంతర్జాతీయ భాగస్వాములతో ఆర్థిక సంబంధాల వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.అందరి చూపూ ఆ వీడియోలపైనే!ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు ఇరాన్ ప్రభుత్వం మరిన్ని దృశ్యాలను విడుదల చేయనున్న నేపథ్యంలో.. ఆ వీడియోలు ఎప్పుడు చిత్రీకరించబడ్డాయి? ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన ఎంత చురుకుగా ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా.. ఇప్పటివరకు విడుదలైన వీడియోలు ఎక్కువగా తేదీ వెల్లడించనివే కావడంతో, కొత్తగా విడుదలయ్యే దృశ్యాలను అంతర్జాతీయ పరిశీలకులు నిశితంగా గమనించే అవకాశం ఉంది.
‘నీట్’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు
వడకంచెరి: కేరళలోని వడకంచెరికి చెందిన నీట్-యూజీ(NEET-UG) 2024 అభ్యర్థి అంజలి ఎస్ ప్రవేశ పరీక్షలో 640 మార్కులు సాధించినప్పటికీ, ప్రభుత్వ మెడికల్ సీటు పొందలేకపోయానని, ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీలో ఏటా రూ. 10 లక్షలు చెల్లించి చదువుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. పరీక్షలో జరిగిన అక్రమాల వల్లే తనకు ఈ దుస్థితి దాపురించిందని ఆమె వాపోయారు. కాగా ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని అంజలి ఆరోపించారు.తాము ముందుగా అంచనా వేసిన ర్యాంకులు, లభ్యత ఉన్న సీట్ల ఆధారంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు ఖాయమని ఎంతో ధీమాగా ఉన్నామని, కానీ అనూహ్యంగా ప్రభుత్వ సీటు రాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్య కోటాలో చేరాల్సి వచ్చిందని, దీనివల్ల తమ కుటుంబంపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వైఫల్యానికి కారణమైన బాధ్యులు స్పందించి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి శనివారం ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రం పంపినట్లు అంజలి వెల్లడించారు. నీట్-2024 పరీక్షల వివాదాలు, గ్రేస్ మార్కుల కేటాయింపు వంటి అంశాలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలకు దారితీసిన సంగతి తెలిసిందే.ఇది కూడా చదవండి: రష్యా నుంచి భారత్కు రైలు.. కొత్త కారిడార్ ప్లాన్?
ఒక బైక్కు 500 హారన్లు.. ఇదేందయ్యా ఇదీ!
‘పెద్ది గద్దె’ తొలగింపుతో నర్సంపేటలో రగిలిన రాజకీయం
మేధో వలస నుంచి మేధో సమృద్ధి వైపు..
79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్?
నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా'
న్యూ ఫండ్ ఆఫర్స్: ఇన్వెస్కో నుంచి రెండు ఫండ్స్
ఆ పేరంటే ద్వేషం: బాక్సర్ మాటలకు మోదీ రియాక్షన్ వైరల్
బంగారం కోసం బరితెగింపు.. షాకైన అధికారులు
‘కిరాయి కోటిగాడు’గా మహేశ్.. వీడియో అదిరింది!
తాగాను.. బండి నడిపాను అంటే సరిపోతుందా?
చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి..! ఆఖరికి స్వలింగ సంపర్కుడైన కుమారుడి కోసం..
ఒకప్పుడు తోపు యాక్టర్.. ఇప్పుడు ఆటో డ్రైవర్!
పరిపాలన ప్రైవేట్కు ఇవ్వడం కుదర్దు వెళ్లవయ్యా.. వెళ్లు!
సమంత తిండిగోల.. తల్లి కూతురి బర్త్ డే సెలబ్రేషన్
సాక్షి కార్టూన్ : 08-08-2026
హెరిటేజ్ - విజయ డెయిరీ
నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా
ఏదడిగినా.. అలా ఖాళీ జేబులు చూపిస్తున్నారు!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
హీరోగా హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు
సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
సచిన్ మెరుపులు వృథా.. 240 టార్గెట్ హాంఫట్
ఉద్యోగుల సెలవుల్లో మార్పులు చేసిన యాక్సెంచర్
‘వెండి’ మండిపోతుంది: కియోసాకి భారీ అంచనా
శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..
‘యముడు’ మూవీ రివ్యూ
మోదీతో తొలి భేటీ.. రాఘవ్ చద్దా ఎమోషనల్
బుల్లిగౌనులో ఆషిక బర్త్ డే సెలబ్రేషన్.. బాలనటిని గుర్తుపట్టారా?
ఈ రాశి వారికి ఆస్తి యోగం.. వస్తులాభం
ఒక బైక్కు 500 హారన్లు.. ఇదేందయ్యా ఇదీ!
‘పెద్ది గద్దె’ తొలగింపుతో నర్సంపేటలో రగిలిన రాజకీయం
మేధో వలస నుంచి మేధో సమృద్ధి వైపు..
79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్?
నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా'
న్యూ ఫండ్ ఆఫర్స్: ఇన్వెస్కో నుంచి రెండు ఫండ్స్
ఆ పేరంటే ద్వేషం: బాక్సర్ మాటలకు మోదీ రియాక్షన్ వైరల్
బంగారం కోసం బరితెగింపు.. షాకైన అధికారులు
‘కిరాయి కోటిగాడు’గా మహేశ్.. వీడియో అదిరింది!
తాగాను.. బండి నడిపాను అంటే సరిపోతుందా?
చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి..! ఆఖరికి స్వలింగ సంపర్కుడైన కుమారుడి కోసం..
ఒకప్పుడు తోపు యాక్టర్.. ఇప్పుడు ఆటో డ్రైవర్!
పరిపాలన ప్రైవేట్కు ఇవ్వడం కుదర్దు వెళ్లవయ్యా.. వెళ్లు!
సమంత తిండిగోల.. తల్లి కూతురి బర్త్ డే సెలబ్రేషన్
సాక్షి కార్టూన్ : 08-08-2026
హెరిటేజ్ - విజయ డెయిరీ
నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా
ఏదడిగినా.. అలా ఖాళీ జేబులు చూపిస్తున్నారు!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
హీరోగా హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు
సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
సచిన్ మెరుపులు వృథా.. 240 టార్గెట్ హాంఫట్
ఉద్యోగుల సెలవుల్లో మార్పులు చేసిన యాక్సెంచర్
‘వెండి’ మండిపోతుంది: కియోసాకి భారీ అంచనా
శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..
‘యముడు’ మూవీ రివ్యూ
మోదీతో తొలి భేటీ.. రాఘవ్ చద్దా ఎమోషనల్
బుల్లిగౌనులో ఆషిక బర్త్ డే సెలబ్రేషన్.. బాలనటిని గుర్తుపట్టారా?
ఈ రాశి వారికి ఆస్తి యోగం.. వస్తులాభం
ఫొటోలు
ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు)
లంగా ఓణీలో టాలీవుడ్ ముద్దుగుమ్మ (ఫొటోలు)
హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
'టాక్సిక్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
'పాంచాలి పంచభర్తృక' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
హైదరాబాద్ లో ఘనంగా బోనాల పండుగ (ఫొటోలు)
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సారె సంబరం (ఫొటోలు)
విశాఖపట్నంలో అల్లు అర్జున్ సందడి (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16)
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు)
సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి ఇండిపెండెన్స్ డే-వీకెండ్ కలిసొచ్చింది. దీంతో పలు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్పెషల్ అట్రాక్షన్ కాగా.. అగధ, పళ్లబురుసు, అనకాపల్లి లాంటి తెలుగు మూవీస్ అలానే విశాల్ 'మకుటం' అనే డబ్బింగ్ చిత్రం కూడా విడుదల కానుంది. వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ అయితే లేదు.(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)మరోవైపు ఓటీటీల్లో 22 వరకు సినిమాలు, సిరీస్ ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రష్మిక 'కాక్ టెయిల్ 2', భారతభాగ్య విధాత లాంటి హిందీ చిత్రాతో పాటు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే తెలుగు మూవీ కూడా ఉంది. ఉన్నంతలో ఇవే కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. వీకెండ్లో ఏమైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్లు ఉండొచ్చు. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 10 నుంచి 16 వరకు)హాట్స్టార్హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 ఫినాలే (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10108 బేస్ హాస్పిటల్: ఉరి (హిందీ సిరీస్) - ఆగస్టు 15జీ5భారత భాగ్య విధాత (హిందీ మూవీ) - ఆగస్టు 14నిబ్బానిబ్బీ (మరాఠీ సినిమా) - ఆగస్టు 14సన్ నెక్స్ట్మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు సినిమా) - ఆగస్టు 14ఆహాచెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె-యూఎస్ఏ (తెలుగు కుకింగ్ షో) - ఆగస్టు 13నెట్ఫ్లిక్స్మిడ్ వింటర్ బ్రేక్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 10రోరీ స్కోవెల్: షో మస్ట్ గో ఆన్ (ఇంగ్లీష్ షో) - ఆగస్టు 11మౌరిన్హో (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 11నాండో బిట్వీన్ టూ వరల్డ్స్ (బ్రెజిలియన్ సిరీస్) - ఆగస్టు 12ఏ చైల్డ్ ఆఫ్ మై ఓన్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 13డోంట్ సే గుడ్ లక్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 13మై బ్రిలియంట్ కెరీర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13కాక్ టెయిల్ 2 (హిందీ సినిమా) - ఆగస్టు 14మోరియా (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 14ఉమెత్తో (ఆఫ్రికన్ సిరీస్) - ఆగస్టు 14మై బెస్ట్ ఫ్రెండ్, హిస్ గర్ల్ఫ్రెండ్ అండ్ మీ (జర్మన్ మూవీ) - ఆగస్టు 14అమెజాన్ ప్రైమ్ద ట్రెయిటర్స్ సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 13సోనీ లివ్కౌన్ బనేగా కరోడ్పతి 18వ సీజన్ (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 10ఆపిల్ టీవీ ప్లస్ఉమెన్ ఇన్ బ్లూ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12లయన్స్ గేట్ ప్లేఆఖరి సవాల్ (హిందీ సినిమా) - ఆగస్టు 14మనోరమ మ్యాక్స్కాట్టలన్ (మలయాళ మూవీ) - ఆగస్టు 13(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ)
ఫస్ట్ టైమ్ ఈ మూవీలో ఫైట్స్ చేశాను
అంజలి తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళంలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది పరందు పో చిత్రంలో మెరిసింది. ఈమె నటిస్తున్న తమిళ మూవీస్ వరసగా రిలీజ్కి సిద్ధమవుతున్నాయి. విశాల్కు జంటగా నటించిన మకుటం.. ఈ శుక్రవారం తెలుగు, తమిళంలో విడుదల కానుంది. 'ఏళు కడల్ ఏళు మలై' త్వరలో విడుదల కానుంది. వీటితో పాటు ఈగై అనే మరో తమిళ చిత్రం, ఒరు పెరుంగలియాట్టం అనే మలయాళ సినిమా ఈమె చేతిలో ఉన్నాయి.(ఇదీ చదవండి: ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు: జ్యోతిక)కాగా ఇటీవల చైన్నెలో జరిగిన 'మకుటం' మీడియా సమావేశంలో పాల్గొన్న అంజలి.. తన మిత్రుడు విశాల్ దర్శకుడిగా తొలి హిట్ అందుకోవాలని విషెస్ చెప్పింది. తమిళ కెరీర్లో తొలిసారి ఇందులోనే ఫైట్ సీన్స్ చేశానని చెప్పుకొచ్చింది. ఇదే మూవీలో అంజలి, విశాల్ చేసిన నచ్చావు మచ్చాన్ అనే పాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. కాగా వరుసగా విడుదలవుతున్న తన చిత్రాలతో ఈ బ్యూటీ మరోసారి తన సత్తాని చాటుకోబోతుంది.(ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు)
ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు
సూర్య, జ్యోతికది హిట్ జోడీ. పెళ్లికి ముందు పలు సినిమాల్లో కలిసి నటించిన వీళ్లు.. తర్వాత ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీ అయిపోయారు. సూర్య తమిళ చిత్రాలతో బిజీగా ఉంటే, జ్యోతిక హిందీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే మళ్లీ కలిసి నటించబోతున్నట్లు టాక్ నడుస్తుండగా దీనిపై జ్యోతిక స్పందించింది.(ఇదీ చదవండి: నటికి చేదు అనుభవం.. లిప్ కిస్ పెట్టిన లేడీ ఫ్యాన్)మేం మళ్లీ కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు, కథలు కూడా వింటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అలాంటిదేవీ జరగలేదు. మంచి కథ సెట్ అయితే కలిసి నటించడానికి సిద్దమే. తమకు ఆఫ్ స్క్రీన్లోనూ మంచి ప్రేమ లభిస్తోంది. ఆన్ స్క్రీన్లో తమని చూడాలని ఎవరూ కోరుకోవడం లేదు అనుకుంటా అని జ్యోతిక చెప్పుకొచ్చింది.సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. జీతూ మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. 'రోలెక్స్' గురించి మాట్లాడుతూ లోకేశ్ కనకరాజ్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా చిత్రం చేసే పనిలో ఉన్నారని, తర్వాత 'విక్రమ్ 2' ఉందని.. అయినా రోలెక్స్ మూవీ ఉంటుందనీ, కథను రెడీ చేస్తున్నట్లు లోకేశ్ కనక రాజ్ చెబుతున్నాడని, అయితే అది ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది కాలమే చెప్పాలని సూర్య అన్నాడు. (ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు)
ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్
ప్రస్తుతం 'రాకా' సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. వైజాగ్లో కనిపించాడు. తన 'ఏఏఏ సినిమాస్' మల్టీప్లెక్స్ని ఘనంగా ప్రారంభించాడు. హైదరాబాద్లో ఇప్పటికే ఇలా ఓ మల్టీప్లెక్స్ ఉండగా.. ఇప్పుడు విశాఖపట్నంలోనూ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై అస్సలు నడవలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: భారత క్రికెటర్ జైస్వాల్తో డేటింగ్? క్లాస్ పీకిన మృణాల్)'గంగోత్రి' రోజుల్లో వైజాగ్ రోడ్డుపై ఎవరూ నన్ను గుర్తుపట్టేవారు కాదు. ఇప్పుడు అదే రోడ్డుపై నడవలేకపోతున్నాను. 'రాకా' షూటింగ్ ముంబైలో జరుగుతోంది. వైజాగ్ ప్రజల కోసం ఒక రోజు బ్రేక్ అడిగి వచ్చాను. అయితే పోలీసులు నన్ను ఎయిర్పోర్ట్ నుంచి పువ్వుల్లో పెట్టుకుని తీసుకొచ్చారు. వాళ్లకు థ్యాంక్స్' అని అన్నాడు. ఇక ఎదురుగా ఉన్న కొందరు అభిమానులు ఫొటో కావాలని అడగడంతో అందరూ ఇక్కడికి వచ్చేయండి అని స్టేజీపైకి ఆహ్వానించాడు. ఫ్యాన్స్కి నో అని చెప్పటం నా వల్ల కాదమ్మా అని అన్నాడు.ఎనిమిది స్క్రీన్లు ఉన్న ఈ మల్టీప్లెక్స్లో 'పుష్ప'లో గడ్డం కింద చేయి పెట్టే పోజు ఉన్న బన్నీ బొమ్మని ప్రదర్శన కోసం ఉంచారు. అలానే అల్లు అర్జున్కి సంబంధించిన పలు సినిమా స్టిల్స్ కూడా ఉంచారు. ఇకపోతే ప్రస్తుతం 'రాకా' చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ తన 23వ మూవీ చేయనున్నాడు. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ హైదరాబాద్లో జరుగుతోంది.(ఇదీ చదవండి: ఆమె బదులు మరెవరున్నా తల పీక్కుని పారిపోయేవాళ్లు: విశాల్)#Gangotri Movie Shooting రోజుల్లో #Vizag రోడ్లపై వెళ్తున్నప్పుడు Nannu ఎవరూ గుర్తుపట్టేవారు కాదు...#AlluArjun pic.twitter.com/6Hevu8EiXN— Milagro Movies (@MilagroMovies) August 9, 2026The ICONIC PUSHPA Pose @alluarjun 🙅🏻🔥📍 AAA Cinemas, Vizag#AlluArjun @aaacinemasoffl #Pushpa2TheRule pic.twitter.com/V0o18cVzUj— Pushpa2TheRule 𝕏🧢 (@uicaptures) August 9, 2026
క్రీడలు
గిల్, అభిషేక్ కాదు.. అత్యధిక ధరకు అమ్ముడుపోయింది ఇతడే
టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్ షేర్- ఈ- పంజాబ్ టీ20 కప్ 2026 టోర్నీలో భాగం కానున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్కు సంబంధించి ఆదివారం ఆటగాళ్ల వేలం జరిగింది.ప్రత్యేక ఆకర్షణగా అభిషేక్ శర్మఇందులో టీమిండియా టీ20 సూపర్స్టార్ అభిషేక్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అమృత్సర్ సుర్మాస్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఆ ఫ్రాంఛైజీ అధికారులతో కలిసి వేలంలో పాల్గొన్నాడు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆరు ఫ్రాంఛైజీలుకాగా ఈ లీగ్లో ఆరు ఫ్రాంఛైజీలు ఫజిల్క ఫాల్కన్స్, అమృత్సర్ సుర్మాస్, లుథియానా లయన్స్, భటిండా రాయల్స్, జలంధర్ వారియర్స్, మొహాలీ కింగ్స్ టైటిల్ కోసం రంగంలోకి దిగనున్నాయి.అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడేఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ లీగ్ 2026 సీజన్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా సన్వీర్ సింగ్ నిలిచాడు. ఫజిల్క ఫాల్కన్స్ రూ. 13.02 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ గతంలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (2023, 2024)కు ఆడాడు. ఐపీఎల్లో మొత్తంగా ఆరు మ్యాచ్లు ఆడిన 29 ఏళ్ల సన్వీర్ 25 పరుగులు చేశాడు. టీమిండియా ప్లేయర్ల ధర ఎంతంటే?టీమిండియా స్టార్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఫజిల్క ఫాల్కన్స్, అభిషేక్ శర్మను అమృత్సర్ సుర్మాస్, అర్ష్దీప్ సింగ్ను లుథియానా లయన్స్, గుర్నూర్ బ్రార్ను భటిండా రాయల్స్ సొంతం చేసుకున్నాయి.ఇక ప్రభ్సిమ్రన్ సింగ్ను జలంధర్ వారియర్స్, రమణ్దీప్ సింగ్ను మొహాలీ కింగ్స్ కొనుక్కున్నాయి. వీరందరిని ఆయా ఫ్రాంఛైజీలు రూ. 10 లక్షల ధరకు రిజర్వు చేసుకున్నాయి.షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ వేలం-2026లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే1. సన్వీర్ సింగ్ (ఫజిల్క ఫాల్కన్స్)- రూ. 13.02 లక్షలు2. నమన్ ధిర్ (అమృత్సర్ సుర్మాస్)- రూ. 10.80 లక్షలు3. రాహుల్ కుమార్ (అమృత్సర్ సుర్మాస్)- రూ. 8.40 లక్షలు4. అన్మోల్ప్రీత్ సింగ్ (మొహాలీ కింగ్స్)- రూ. 8.20 లక్షలు5. సలీల్ అరోరా (లుథియానా లయన్స్)- రూ. 8 లక్షలు6. హర్నూర్ సింగ్ (భటిండా రాయల్స్)- రూ. 7 లక్షలు7. అశ్వనీ కుమార్ (భటిండా రాయల్స్)- రూ. 7 లక్షలు8. అన్మోల్ మల్హోత్రా (జలంధర్ వారియర్స్)- రూ. 6.20 లక్షలు9. సుఖ్దీప్ బజ్వా (జలంధర్ వారియర్స్)- రూ. 6 లక్షలు10. ఆయుశ్ గోయల్ (మొహాలీ కింగ్స్)- రూ. 4.60 లక్షలు. చదవండి: సిరాజ్ సిక్సర్ల జోరు.. భారత్ గెలుపు View this post on Instagram A post shared by Sher-E-Punjab T20 League (@sherepunjabt20)
భయపెడుతున్న గాయాలు.. గిల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్!
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ ఫిట్నెస్పై జట్టు మేనేజ్మెంట్ కీలక అప్డేట్ ఇచ్చింది. తొలి టెస్టుకు ముందు లంకతో ఆడిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో బరిలోకి దిగిన గిల్ చేతి వేలికి చిన్న గాయమైన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దూరంగా ఉన్న గిల్.. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చి 44 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే బ్యాటింగ్ చేసే సమయంలో గిల్ చేతి వేలి గాయంతో ఏమైనా బాధపడ్డాడా లేక బాగానే ఉన్నాడా అన్నదానిపై భారత బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించాడు. 'నెట్ ప్రాక్టీస్ సందర్భంగా స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ చేతి వేలికి చిన్న గాయమైంది. అయితే అతడికి అయిన గాయం మైనర్దే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగానే వార్మప్ మ్యాచ్లో తొలి రెండు రోజులు ఆటకు దూరంగానే ఉన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన గిల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపించాడు. దీంతో అతడి చేతివేలి గాయం పూర్తిగా తగ్గిపోయినట్లే. తన బ్యాటింగ్తో తొలి టెస్టుకు దూరమవుతాడన్న సందేహాలను కూడా గిల్ పటాపంచలు చేశాడు. ఇది చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే టీమిండియాకు ఎంపికైన 13 మంది ఆటగాళ్లు ప్రస్తుతం గాయాల బారిన పడి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో పునరావాస కేంద్రంలో గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో మరే ఆటగాడు గాయపడ్డా టీమిండియాకు ఎదురుదెబ్బ అవుతుందని భయపడుతున్నాం. అందుకే గిల్కు చిన్న గాయమే అయినప్పటికీ, పూర్తిగా కోలుకోవాలనే వార్మప్ మ్యాచ్లో తొలి రెండు రోజులు ఆడించలేదు. చేతి వేలి గాయం మానడంతో చివరి రోజు బ్యాటింగ్కు దిగిన గిల్ మంచి ఈజ్తో బ్యాటింగ్ చేసి తొలి టెస్టుకు పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు పరోక్షంగా సంకేతాలిచ్చాడు.' అని చెప్పుకొచ్చాడు. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన గిల్ 55 బంతుల్లో 44 పరుగులు చేశాడు. 21వ ఓవర్లో కేషారా నువంతా బౌలింగ్లో గిల్ వెనుదిరిగాడు. ఇక గిల్ గాయం మొదట మేనేజ్మెంట్ను భయపెట్టినప్పటికీ, అతడు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక 2025 నుంచి గిల్ టెస్టుల్లో నాలుగో స్థానంలో వస్తున్నాడు. అంతకముందు 2020 నుంచి 2023 వరకు గిల్ టెస్టుల్లో ఓపెనర్గా ఆడాడు. అయితే జైస్వాల్కు జతగా కేఎల్ రాహుల్ ఓపెనర్గా అదరగొట్టడంతో వీరి జోడినే శ్రీలంక టెస్టు సిరీస్లోనూ కంటిన్యూ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ లెక్కన గిల్ మరోసారి నాలుగో స్థానంలోనే బ్యాటింగ్కు రానున్నాడు. ఇక టెస్టుల్లో గిల్కు నాలుగో స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 ఇన్నింగ్స్ల్లో 88.75 సగటుతో గిల్ ఆరు సెంచరీలు సాధించడం విశేషం. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా తొలి టెస్టును ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఆడనుంది.Read: ఐదేళ్ల వయసులోనే MMA చాంపియన్.. ఎవరీ బుడ్డోడు!
ఐదేళ్ల వయసులోనే MMA చాంపియన్.. ఎవరీ బుడ్డోడు!
చైనా, జపాన్ తరహాలో భారత్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA)కు పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ కాలక్రమేణా భారత్లో కూడా ఎంఎంఏకు ఆదరణ పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. తాజాగా పంజాబ్కు చెందిన ఐదేళ్ల ఫతే సింగ్ గిల్, వరల్డ్ మార్షల్ ఆర్ట్ గేమ్స్ 2026లో స్కేట్స్పై గట్కాలో స్వర్ణం గెలిచి ఔరా అనిపించాడు. తద్వారా ఎంఎంఏలో చాంపియన్గా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా ఫతే సింగ్ చరిత్ర సృష్టించాడు. థాయ్లాండ్లోని పట్టాయా వేదికగా జరిగిన వరల్డ్ మార్షల్ ఆర్ట్ గేమ్స్లో ఫతే సింగ్ స్కేట్పై గట్కాలో స్వర్ణం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన ఐదేళ్ల ఫతే సింగ్ గిల్, సిక్కుల సంప్రదాయమైన కత్తి యుద్ధకళను స్కేట్స్పై ప్రదర్శించిన మొదటి బాలుడిగా రికార్డులకెక్కాడు. గతంలో అంతర్జాతీయ వేదికలపై తన ఖడ్గ విన్యాసాలను ప్రదర్శించిన ఫతే సింగ్ తాజాగా మార్షల్ ఆర్ట్స్లో తన ప్రావీణ్యం ప్రదర్శించి దేశానికి పతకం తేవడం గొప్ప విషయం. ఇక ఫతే సింగ్ ఖడ్గ విన్యాస కళ అతడి రెండేళ్ల వయసులోనే ప్రారంభమైంది. ఖడ్గం పట్టుకునే విధానం, అతడి చేతి కదలికలే ఇవాళ ఫతేసింగ్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. కేవలం మూడున్నరేళ్ల వయసులోనే ఫతేసింగ్ యూరోప్లో వరల్డ్ గ్రాండ్ ప్రిక్స్ ఫిట్ కిడ్తో పాటు మిస్టర్ యూనివర్సల్ ఫిట్ కిడ్ టైటిళ్లను కొల్లగొట్టి ఆశ్చర్యపరిచాడు.Fateh Singh Gill: Meet India's 5-Year-Old World Martial Arts Championhttps://t.co/Y5gRJIWKVg pic.twitter.com/bGyBDSxsnZ— NDTV Sports (@Sports_NDTV) August 10, 2026Read: ‘అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’
‘అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’
స్పెయిన్ స్టార్ ఫుట్బాల్ ఆటగాడు రోడ్రి చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రోడ్రి ప్రస్తుతం జీవిత భాగస్వామి, లాంగ్టైమ్ గర్ల్ఫ్రెండ్ లారా ఇగ్లేసియాన్తో కలిసి ఇబిజాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇబిజాలో టూరిస్ట్ స్పాట్కు తన గర్ల్ఫ్రెండ్తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న రోడ్రి, అటు పక్కనుంచి ఒక యువతి బికినీ వేసుకొని ఎదురుగా నడుస్తూ వచ్చింది. Photo Credit: Twitterదీంతో రోడ్రి గర్ల్ఫ్రెండ్ పక్కనుండగానే అటుగా వెళ్లున్న బికినీ యువతిని అదే పనిగా చూస్తూ ఉండిపోయాడు. తనను దాటి వెళ్లిపోయినా కూడా రోడ్రి మాత్రం వెనక్కి తిరిగి మాత్రం ఆమె అందాన్ని కనులారా ఆస్వాధిస్తూ ముందుకు సాగడం విశేషం. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది. చాలా మంది రోడ్రి చర్యను స్పానిష్ ఫోటోగ్రాఫర్ ఆంటోనియో గిల్లెం తీసిన 2015 నాటి ప్రసిద్ధ ‘డిస్ట్రాక్టడ్ బాయ్ఫ్రెండ్’ ఫొటోతో పోలుస్తున్నారు. ఆ ఫోటోలో, చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి, ఎర్రటి టాప్ ధరించి నడుచుకుంటూ వెళ్తున్న ఒక యువతిని చూడటానికి వెనక్కి తిరుగుతాడు, అదే సమయంలో అతడి పక్కనే ఉన్న తన గర్ల్ఫ్రెండ్ మాత్రం అతడి చర్యకు ఆశ్చర్యానికి లోనవుతోంది. Photo Credit: Twitterఈ ఫొటో అప్పట్లో సోషల్ మీడియాను ఊపేసి ఒక మీమ్ మెటిరీయల్గా మారిపోయింది. తాజాగా రోడ్రి కూడా తన గర్ల్ఫ్రెండ్ పక్కన ఉండగానే బికినీ వేసుకున్న యువతిని అదే పనిగా చూడడాన్ని ‘డిస్ట్రాక్టడ్ బాయ్ఫ్రెండ్’ మీమ్ ఫొటోతో పోల్చకుండా ఉండలేకపోతున్నారు. ‘అయినా అంత అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా స్పెయిన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాను చిత్తు చేసింది చాంపియన్గా నిలిచింది. 16 సంవత్సరాల తర్వాత రెండో ఫిఫా టైటిల్ సాధించిన స్పెయిన్ జట్టులో రోడ్రి సభ్యుడిగా ఉన్నాడు.Rodri really recreated the meme 😭🤣 pic.twitter.com/YXNn25wEVZ— Not Match of the Day (@NOT_MOTD) August 9, 2026Read: ‘రోబోలు కాదు’.. ఆటగాళ్ల గాయాలపై లక్ష్మణ్ ఆగ్రహం!
న్యూస్ పాడ్కాస్ట్
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
చంద్రబాబు పాలన రైతులకు హానికరం... చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ... వైఎస్ జగన్ ఆగ్రహం
అసత్య ప్రచారంలో ఆరితేరిన ఏపీ సీఎం చంద్రబాబు... రెండు మినహా హామీలన్నీ అమలు చేశానంటూ బుకాయింపు...
బీసీ నేతలపై రెడ్బుక్!. బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అక్రమ అరెస్టులు
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
ఏపీలో దగా డీఎస్సీపై దండయాత్ర... రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు విజయవంతం
బిజినెస్
ఫ్లాట్గా స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 10.65 పాయింట్లు తగ్గి 24,560.00 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 28.67 పాయింట్లు నష్టపోయి 78,470.50 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.65బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 84.49 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.66 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.62 శాతం పెరింగింది.నాస్డాక్ 1.30 శాతం లాభపడింది.Today Nifty position 10-08-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఈ బిలియనీర్ దగ్గర చిరుద్యోగులూ సంపన్నులే!
వాల్స్ట్రీట్లో భారీ ఆస్తులను నిర్వహించే సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది. కానీ బిలియనీర్ ఇన్వెస్టర్ బిల్ అక్మన్కు చెందిన పెర్షింగ్ స్క్వేర్ మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తోంది. కేవలం కొన్ని డజన్ల మంది సిబ్బందితోనే బిలియన్ల డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్న ఈ సంస్థలో ఉద్యోగులను నిలుపుకోవడానికి ప్రత్యేకమైన విధానాలను అనుసరిస్తున్నట్లు అక్మన్ వెల్లడించారు.తాజా వివరాల ప్రకారం, పెర్షింగ్ స్క్వేర్ మొత్తం సంస్థ ఆస్తుల నిర్వహణ విలువ (AUM) 2026 జూన్ 30 నాటికి సుమారు 33 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.13 లక్షల కోట్లు). సంస్థ అధికారిక వివరాల ప్రకారం, ఇందులో దాదాపు 98 శాతం శాశ్వత మూలధనం (Permanent Capital) కాగా, సంస్థకు మూడు ప్రధాన శాశ్వత మూలధన వాహనాలు ఉన్నాయి.ఇంత పెద్ద స్థాయి ఆస్తులను నిర్వహిస్తున్న సంస్థలో సిబ్బంది సంఖ్య మాత్రం చాలా తక్కువ. తాజా వ్యాఖ్యల్లో అక్మన్ సుమారు 48 మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. 2025 డిసెంబర్ 31 నాటికి పెర్షింగ్ స్క్వేర్ క్యాపిటల్ మేనేజ్మెంట్లో 44 మంది ఉద్యోగులు ఉన్నట్లు సంస్థ సమర్పించిన అధికారిక పత్రాల్లోనూ నమోదైంది.రిసెప్షనిస్ట్ నుంచి స్వీపర్ వరకు.. అందరికీ వాటాలుఉద్యోగులు సంస్థతో ఎక్కువకాలం కొనసాగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వారికి కంపెనీ విజయంతో నేరుగా ఆర్థిక సంబంధం ఉండటమేనని అక్మన్ చెబుతున్నారు. సంస్థలోని ప్రతి ఉద్యోగికి, వారు ఏ స్థాయిలో పనిచేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా, గణనీయమైన కంపెనీ స్టాక్ ఉందని ఆయన పేర్కొన్నారు.అంటే ఇన్వెస్ట్మెంట్ టీమ్ సభ్యులకే కాకుండా ఫ్రంట్ డెస్క్, ఇతర సహాయక విభాగాల్లో పనిచేసే సిబ్బందికీ సంస్థలో వాటా ఉందన్నమాట. ఉద్యోగులు సంస్థ ఎదుగుదలలో తమకూ ప్రత్యక్ష ప్రయోజనం ఉందని భావించేలా చేయడం ద్వారా వారి నిబద్ధతను పెంచుతున్నామని అక్మన్ వివరించారు.ఉద్యోగుల పెట్టుబడుల విషయానికొస్తే, 2025 చివరి నాటికి పెర్షింగ్ స్క్వేర్ ఉద్యోగులు, అనుబంధ సంస్థలు కలిపి సంస్థ నిర్వహించే ఫండ్లు, హోవర్డ్ హ్యూస్ హోల్డింగ్స్లో సుమారు 5.8 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు అధికారిక పత్రాలు వెల్లడిస్తున్నాయి.జూలై, ఆగస్టులో హాంప్టన్స్ నుంచి పనిఉద్యోగులను ఆకట్టుకునే మరో ప్రత్యేక విధానం కూడా పెర్షింగ్ స్క్వేర్లో ఉంది. సాధారణంగా ఏడాదిలో ఎక్కువ కాలం ఉద్యోగులు వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచే పనిచేయాల్సి ఉంటుంది. అయితే జూలై, ఆగస్టు నెలల్లో మాత్రం ఈ విధానంలో సడలింపు ఉంటుంది.ఈ రెండు నెలల్లో ఇన్వెస్ట్మెంట్ టీమ్ సభ్యులు న్యూయార్క్కు సమీపంలోని హాంప్టన్స్ ప్రాంతం నుంచి పనిచేసే అవకాశం ఉంటుంది. కొందరు అక్కడ ఇళ్లను అద్దెకు తీసుకోవడం లేదా సొంత ఇళ్లలో ఉండటం ద్వారా కలిసి పనిచేస్తారని అక్మన్ తెలిపారు.ఉద్యోగుల ఆరోగ్యం, సౌకర్యాలపైనా సంస్థ దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. ఆరోగ్యకరమైన భోజనం, జిమ్ సదుపాయాలు, సమగ్ర ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలను ఉద్యోగులకు అందిస్తున్నట్లు వివరించారు.టాలెంట్ కంటే వ్యక్తిత్వానికే ప్రాధాన్యంపెర్షింగ్ స్క్వేర్లో ఉద్యోగులను నిలుపుకోవడం కేవలం జీతాలు, స్టాక్తోనే సాధ్యమవుతుందని అక్మన్ భావించడం లేదు. సరైన వ్యక్తులను నియమించడం నుంచే సంస్థ సంస్కృతి మొదలవుతుందని ఆయన అంటున్నారు.అత్యున్నత ప్రతిభతో పాటు మంచి మానవీయ లక్షణాలు ఉన్న వ్యక్తులకే సంస్థలో చోటు కల్పించేందుకు ప్రయత్నిస్తామని అక్మన్ చెప్పారు. ప్రతిభావంతులైన వ్యక్తులు చాలామంది ఉన్నప్పటికీ, ఇతరులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడే, నమ్మదగిన, మంచి వ్యక్తిత్వం ఉన్న ప్రతిభావంతులను ఎంచుకోవడమే బలమైన సంస్థ సంస్కృతికి పునాది అని ఆయన అభిప్రాయపడ్డారు.2003లో ప్రారంభమైన పెర్షింగ్ స్క్వేర్బిల్ అక్మన్ 1966లో జన్మించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి చేసిన తర్వాత వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. 1992లో డేవిడ్ బెర్కోవిట్జ్తో కలిసి గోథమ్ పార్ట్నర్స్ను ప్రారంభించారు. ఆ సంస్థలో ఎదురైన ఇబ్బందుల తర్వాత అక్మన్ కొత్త పెట్టుబడి సంస్థను నిర్మించే దిశగా అడుగులు వేశారు.2003లో పెర్షింగ్ స్క్వేర్ను స్థాపించారు. కాలక్రమేణా ఇది ప్రముఖ యాక్టివిస్ట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థగా ఎదిగింది. చిపోటిల్, యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ వంటి కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా అక్మన్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. పెర్షింగ్ స్క్వేర్ హోల్డింగ్స్ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యింది. 2026లో సంస్థ అమెరికాలోనూ తన పబ్లిక్ మార్కెట్ ఉనికిని విస్తరించింది.
పోర్ట్ఫోలియోకి స్థిరత్వం, వృద్ధికి దన్ను
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే విషయంలో ‘పెట్టుబడి పెట్టాలా వద్దా’ అని కాకుండా .. ‘ఎందులో పెట్టాలి’ అనేదే అత్యంత క్లిష్టమైన సవాలుగా అనిపిస్తుంది. సాధారణంగా చాలాకాలంగా లార్జ్ క్యాప్ కంపెనీలు స్థిరత్వానికి, నిలకడైన వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటూ, పోర్ట్ఫోలియోలకు దన్నుగా నిలుస్తున్నాయి. మరోవైపు, మిడ్ క్యాప్ స్టాక్స్.. కార్పొరేట్ రంగ తదుపరి వృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశాలను కల్పిస్తున్నాయి. అయితే, ఈ రెండింటికీ పోర్ట్ఫోలియోల్లో స్థానం ఉంటున్నప్పటికీ, వీటి మధ్య సరైన సమతుల్యతను సాధించడం చెప్పినంత ఈజీ కాదు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ డేటా ప్రకారం ’లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్’ కేటగిరీలోకి నిధుల ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2025 జూన్లో రూ. 3,497 కోట్లుగా ఉన్న పెట్టుబడులు, 2026 జూన్ నాటికి 24 శాతం పెరిగి రూ. 4,321 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఫక్తు లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలోకి పెట్టుబడులు ఒక మోస్తరుగానే వృద్ధి చెంది రూ. 2,067 కోట్లు వచ్చాయి. ఈక్విటీ పెట్టుబడుల్లోనే డైవర్సిఫికేషన్ ద్వారా మిడ్ క్యాప్ కంపెనీల ఆదాయ వృద్ధి సామర్థ్యాన్ని, లార్జ్ క్యాప్ కంపెనీల స్థిరత్వం అలాగే లిక్విడిటీ ప్రయోజనాలను కూడా పొందాలని భావిస్తున్న ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని ఇది తెలియజేస్తోంది. ఈ కేటగిరీకి ఎందుకింత ప్రాధాన్యత.. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ప్రత్యేకత అంతా కూడా దీన్ని నిర్వహించే విధానంలోనే ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం ఈ ఫండ్స్ తమ దగ్గరున్న నిధుల్లో కనీసం 35 శాతాన్ని లార్జ్ క్యాప్ కంపెనీల్లో, మరో 35 శాతాన్ని మిడ్ క్యాప్ కంపెనీల్లో తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలి. మిగతా భాగాన్ని ఫండ్ మేనేజర్ తన విచక్షణకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ విధానం వల్ల రెండు విభాగాల్లోనూ ఎప్పుడూ సరైన ప్రాతినిధ్యం ఉండటమే కాకుండా, అధిక లాభాలకు ఆస్కారమున్న సాధనానికి కేటాయింపులను పెంచేందుకు వీలుంటుంది. డబుల్ ప్రయోజనాలు.. సాధారణంగా లార్జ్ క్యాప్ కంపెనీలకు నిరూపితమైన వ్యాపార మోడల్స్, పటిష్టమైన బ్యాలెన్స్ ఉంటాయి. ఆర్థిక సవాళ్లను తట్టుకుని నిలబడే సామర్థ్యాలు ఉండటం వల్ల మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా కూడా పోర్ట్ఫోలియోకి ఇవి కొంత స్థిరత్వాన్ని ఇస్తాయి. ఇక మిడ్ క్యాప్ కంపెనీలను చూస్తే ఇవి చిన్న సంస్థలకంటే మెరుగైన వృద్ధి దశలో ఉండి, ఇంకా లార్జ్ క్యాప్ స్థాయికి చేరుకోనివై ఉంటాయి. వ్యాపార విస్తరణ, మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, లాభదాయకతను పెంచుకోవడం ద్వారా ఇవి దీర్ఘకాలంలో అధిక ఆదాయ వృద్ధిని అందిస్తాయి.అయితే, దీనికి తగ్గట్లుగానే వీటిలో రిస్క్లు, ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఈ రెండింటి కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మార్కెట్లోని పలు రంగాల్లో లార్జ్ క్యాప్లు ఆకర్షణీయమైన విలువకే లభిస్తుండగా, మిడ్ క్యాప్లు మరింత మెరుగైన రాబడిని పొందే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ రెండింటినీ కలపడం ద్వారా ఒకే పోర్ట్ఫోలియో ద్వారా ఇన్వెస్టర్లు స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలనూ పొందవచ్చు. నిబంధనలకు ప్రాధాన్యత.. ఈ కేటగిరీ కేవలం విభిన్న క్యాపిటలైజేషన్ ఉండే కంపెనీల కలయికగా మాత్రమే కాకుండా, పెట్టుబడులను సొంతంగా నిర్వహించుకునే ఇన్వెస్టర్లకు ఎదురయ్యే ఒక ప్రధాన సమస్యకు పరిష్కార మార్గాన్ని కూడా చూపుతుంది. చాలామంది ఇన్వెస్టర్లు ఇటీవల బాగా రాణించిన రంగాల్లోనే పెట్టుబడులు పెట్టడమో లేదా నష్టాల్లో ఉన్న విభాగాల నుంచి వెంటనే పెట్టుబడులను వెనక్కి తీసుకోవడమో చేస్తుంటారు. ఇలాంటి ఆలోచన విధానం సహజమే అయినప్పటికీ, మార్కెట్ పరిస్థితులు మారినప్పుడు పోర్ట్ఫోలియో తీవ్రంగా దెబ్బతింటుంది.లార్జ్–క్యాప్, మిడ్–క్యాప్ కంపెనీలకి తప్పనిసరిగా కేటాయింపులు ఉండేలా చూడటం ద్వారా ఇలాంటి ఆలోచనా ధోరణుల వల్ల, ఇన్వెస్టర్లు నష్టాల బారిన పడకుండా చూసేందుకు తోడ్పడుతుంది. ఇన్వెస్టర్ వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడకుండా, ఈ ఫండ్ నిర్మాణ స్వరూపంలోనే క్రమశిక్షణ ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ విభాగాల్లో ఏది ఎప్పుడు మెరుగ్గా రాణిస్తుందో అనేది అంచనాలు వేసుకోవాల్సిన పని ఇన్వెస్టర్లకు ఉండదు. పోర్ట్ఫోలియోలో ఎప్పుడూ రెండూ ఉంటాయి కాబట్టి, మార్కెట్ ఎలా ఉన్నా, ఆయా సమయాల్లో లభించే అవకాశాలను ఇది అందిపుచ్చుకుంటుంది. ఎవరికి అనుకూలం..? ఈక్విటీల్లో పెట్టుబడులపరంగా వీలైనన్ని ఎక్కువ ప్రయోజనాలను కోరుకుంటున్నా, మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు తమ పెట్టుబడులను తాము స్వయంగా నిర్వహించుకోలేని ఇన్వెస్టర్లకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. లార్జ్–క్యాప్, మిడ్–క్యాప్ ఫండ్లను విడివిడిగా కొనుగోలు చేసి నిర్వహించుకోవడానికి బదులుగా, స్థిరత్వం అలాగే వృద్ధి రెండింటినీ ఒకే ఫండ్ ద్వారా పొందాలనుకునే కొత్త ఇన్వెస్టర్లకు ఇది సరైన ఎంపిక. ఇప్పటికే లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి, స్మాల్ క్యాప్స్లో రిస్కుల బారిన పడకుండా, అధిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈక్విటీల్లో మరింత ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి కూడా ఇది అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ కేటగిరీ ఫండ్స్ ఇటు లార్జ్ క్యాప్స్, అటు మిడ్ క్యాప్స్కి అర్థవంతంగా పెట్టుబడులు కేటాయిస్తూనే, కొంత మేర స్మాల్ క్యాప్స్లో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఈక్విటీ మార్కెట్లలో అవకాశాలను సమతూకంతో అందించే ప్రయత్నం చేస్తాయి. వేర్వేరు ఫండ్లలో పెట్టుబడులు పెట్టి వాటిని తరచూ రీబ్యాలెన్స్ చేసే శ్రమ లేకుండా, ఒకే ఈక్విటీ ఫండ్ తమ పోర్ట్ఫోలియోకి ప్రధాన ఆధారంగా ఉండాలని కోరుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చివరిగా.. ఈక్విటీ పెట్టుబడుల విషయంలో అందరికీ ఒకే సూత్రం వర్తించదు. ఏ ఒక్క ఫండ్ కేటగిరీ కూడా అన్ని అవసరాలనూ తీర్చలేదు. అయితే, లార్జ్ అండ్ మిడ్–క్యాప్ ఫండ్లు నిరూపితమైన పెద్ద కంపెనీల స్థిరత్వాన్ని, ఎదుగుతున్న కంపెనీల వృద్ధి సామర్థ్యాలని ఒక నియమావళికి లోబడి ఇన్వెస్టర్లకు అందిస్తాయి. గడిచిన ఏడాది కాలంగా ఈ ఫండ్స్లోకి పెరిగిన నిధులను చూస్తే, ఇన్వెస్టర్లు కేవలం ఒకే రకమైన మార్కెట్–క్యాప్పై ఆధారపడకుండా స్థిరత్వంతో కూడిన వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. పెట్టుబడుల కేటాయింపుల్లో క్రియాశీలకంగా మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇటు స్థిరత్వం అటు వృద్ధి ప్రయోజనాలను పొందాలనుకునే వారికి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉంటాయి. మార్కెట్లో ఒక్కో సెగ్మెంట్ ఒక్కో సందర్భంలో రాణిస్తుంది. తదుపరి రాణించబోయే సెగ్మెంట్ గురించి అంచనాలు వేసుకంటూ, ఊహాగానాల్లో ఉండిపోకుండా, పరిస్థితులు ఎలా ఉన్నా పెట్టుబడులను కొనసాగించిన వారికే ప్రయోజనాలు దక్కుతాయనేది గుర్తుంచుకోవాలి. ఇందుకోసం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ క్రమశిక్షణతో కూడుకున్న విధానంగా ఉపయోగపడతాయి.
EMI లాక్: కోటక్ బ్యాంక్ హైబ్రిడ్ హోమ్ లోన్
న్యూఢిల్లీ: గృహ రుణాల ఈఎంఐల భారం విషయంలో రుణగ్రహీతలకు స్పష్టత ఉండే విధంగా ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ కొత్తగా హైబ్రిడ్ హోమ్ లోన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనితో వడ్డీ రేటు 65 నెలల వరకు స్థిరంగా ఉండేలా లాక్ చేసుకునేందుకు వీలవుతుంది. రుణం తీసుకున్న తొలినాళ్లలో ఈఎంఐల భారం విషంయలో కొంత వెసులుబాటు పొందేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది.ఈ పథకం కింద 39, 52 లేదా 65 నెలల వరకు ఈఎంఐని లాక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఫలితంగా కీలకమైన రెపో రేట్లు మారినా ఆ ప్రభావం వాయిదాలపై ఉండదని తెలిపింది. ఉదాహరణకు ఇటీవల వడ్డీ రేట్ల పెరుగుదల ధోరణులను చూస్తే, ఈ పథకం కింద రూ. 1 కోటి గృహ రుణం తీసుకున్న వారికి కనీసం రూ. 3.46 లక్షల వరకు ఆదా అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీ రేటు 7.6% నుంచి ప్రారంభమవుతోంది.
ఫ్యామిలీ
లేత ఆకుపచ్చ బనారసీ చీరలో సచిన్ కూతురు..!
సారా టెండ్యూల్కర్ తన తాజా వోగ్ కవర్ షూట్ కోసం లేత ఆకుపచ్చ బనారసీ చీరలో తళుక్కుమన్నారు. ఆమె తన అందమైన రూపంతో భారతీయ గ్లామర్ సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఆమె సంప్రదాయానికి ఆధునికతను జోడించిన అందమైన బనారసీ చీరలో సరికొత్తగా కనిపించింది. ఆమె సంప్రదాయ చీరకు సొగసైన ఐవరీ కార్సెట్ బ్లౌజ్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫ్యాషన్-ఫార్వర్డ్ లుక్లో ఆఫ్-వైట్ స్వచ్ఛమైన శాటిన్ సిల్క్, ఆర్గాంజ సిల్క్ కార్సెట్ బ్లౌజ్ని జత చేశారు. సారా బ్లౌజ్ని ఇది స్ట్రక్చర్డ్, స్ట్రాప్లెస్ సిల్హౌట్, స స్వీట్హార్ట్ నెక్ లైన్తో డిజైన్ చేశారు. ఈ విధమైన డిజైన సాంప్రదాయ భారతీయ దుస్తులకు ఆధునిక సొబగులను జోడించినట్లుగా సరికొత్తగా ఉంది. ఆమెకు సున్నితమైన పాస్టెల్రంగు అందమైన లుక్ని ఇవ్వగా, దానిలో ఉన్న పూలనమునాలు ఆమెను మరింత అందంగా కనిపించేలా చేశాయి. ఆమె ఈ అందమైన లుక్కి భారీ అలంకరణకు ఆస్కారం ఇవ్వడకుండా మెడచుట్టూ జాలువారే వజ్రాల నెక్లెస్ను, దానికి సరిపోయే వజ్రాల కఫ్తో పాటు ధరించింది. అందుకు తగ్గట్టుగా తన రూపాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుకుంది. ఇక కురులను చక్కగా ముడి వేసుకుంది. బిగుతైన కార్సెట్ బ్లౌజ్ విత్, సాంప్రదాయ కటన్ సిల్క్ బనారసి చీరల కలయికలో సారా అత్యంత సుందరంగా కనిపించింది. నిజానికి ఈ లుక్ సారాకి చక్కటి హుందాతనాన్ని ఇవ్వడమే ఆధునిక ఫాషన్కి ప్రతీకగా నిలిచింది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) (చదవండి: అనేక భాషలు నేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..!)
గోరింట పూసింది..
ఆధ్యాత్మికత పరంగా సౌభాగ్యానికి గుర్తు. ఔషధ గుణాల పరంగా ఆరోగ్యకారిణిగా గుర్తింపు. అరచేతిలో పూసే గోరింటతో అందం, ఆరోగ్యం. ఆషాఢంలో వర్ష రుతువు ప్రారంభమవుతుంది. వాతావరణంలోని మార్పులను శరీరం తట్టుకునేందుకు చేతులు, కాళ్లకు మహిళలు గోరింటాకు పెట్టుకుంటున్నారు. ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. మైదాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కుల మతాలతో సంబంధం లేకుండా శుభకార్యాల్లో మహిళల చేతికి గోరింటాకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. గోరింటాకు దొరకనప్పుడు మార్కెట్లో దొరికే మె హందీ అయినా పెట్టుకుంటారు. గోరింటాకు చేతికి అందాన్నివ్వడమే కాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆషాఢంలో ముత్తయిదువలు చేతికి గోరింటాకు పెట్టుకుని, చేతి నిండా గాజులు వేసుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కొత్తగా పెళ్లయిన మహిళలు ఆషాఢమాసంలో పుట్టింటికి వస్తారు. వారు తమ కుటుంబసభ్యులతో కలిసి చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ఈ వేడుకలను స్థానిక మహిళలు, బంధువులతో కలిసి ఘనంగా జరుపుకుంటారు. కాలనీలు, అపార్ట్మెంట్లలో సైతం ఆషాఢ మాసంలో మహిళలంతా గోరింటాకు సంబరాలు జరుపుకుంటారు. తద్వారా బంధాలు బలపడతాయి.వరంగల్లో వేడుకలు..వరంగల్ కాశిబుగ్గ తిలక్రోడ్డులో శ్రీజగన్మాత మహిళా పరపతి సంఘం సభ్యులు శనివారం గోరింటాకు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు సేకరించిన గోరింటాకుతో ఒక్క చోట చేరి రోలులో వేసి రుబ్బారు. రుబ్బుతున్న సమయంలో లయబద్ధంగా గౌరమ్మను కీర్తిస్తూ పాటలు పాడారు. వాయినాలు ఇచ్చుకున్నారు. తాంబూలాలు, స్వీట్లు పంచుకున్నారు. సంతోషంతో ఒకరికొకరు చేతులు, కాళ్లకు మైదాకు పెట్టుకున్నారు. ఫొటోలు దిగి సందడి చేశారు. ప్రతీ సంవత్సరం ఇలాగే సంతోషంగా గోరింటాకు వేడుకలు జరుపుకుంటామని సంఘం సభ్యులు చెబుతున్నారు.– హన్మకొండ కల్చరల్
పెళ్లైన మహిళల్లో ఆ సమస్య ఎందుకు వస్తుంది?
నా వయసు ఇరవై ఆరు సంవత్సరాలు. పెళ్లై మూడేళ్లు అయింది. నాకు ప్రతి నెలా యోనిలో దురద వస్తోంది. కొన్నిసార్లు ఆ భాగం ఎర్రగా కూడా మారుతోంది. మందులు వాడినా మళ్లీ మళ్లీ వస్తోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది?– రాజేశ్వరి, నంద్యాలమీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, మీకు యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది. ఇది మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ముఖ్యంగా పెళ్లైన మహిళల్లో, ప్రసవ వయసులో ఉన్నవారిలో ఈ సమస్య అప్పుడప్పుడు లేదా తరచుగా మళ్లీ మళ్లీ రావచ్చు. సాధారణంగా యోనిలో కొన్ని మేలు చేసే సూక్ష్మజీవులు సహజంగానే ఉంటాయి. ఇవి ఆ ప్రాంతాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని కారణాల వల్ల శిలీంద్రాల పెరుగుదల అధికమైతే ఈ సమతుల్యత దెబ్బతిని ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు యోని లోపల, బయట తీవ్రమైన దురద ఉంటుంది. ఆ భాగం ఎర్రగా మారుతుంది. మంటగా అనిపిస్తుంది. మూత్రం విసర్జించే సమయంలో మంట కలగవచ్చు. ఎక్కువగా గోకడం వల్ల గీతలు పడే అవకాశం ఉంటుంది. అలాగే చిక్కగా, తెల్లగా ఉండే స్రావం కూడా రావచ్చు.ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే...బిగుతుగా ఉండే దుస్తులు ధరించకండి.గాలి సులభంగా ఆడే కాటన్ లోదుస్తులు వాడండి. ∙లోదుస్తులు ఉతికేటప్పుడు బలమైన సువాసన కలిగిన ద్రావకాలు ఉపయోగించకండి.యోని భాగంలో సువాసన క్రీములు, సుగంధ ద్రవ్యాలు, స్నాన ద్రావకాలు వాడకండి.మృదువైన సబ్బులు మాత్రమే ఉపయోగించండి.వైద్యుల సలహా లేకుండా యాంటీబయోటిక్ మందులు తీసుకోవద్దు.ఆ భాగాన్ని ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోండి.కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్ దానంతట అదే తగ్గిపోవచ్చు. అయితే చాలామందికి మాత్రం సరైన చికిత్స అవసరమవుతుంది. తరచుగా మళ్లీ మళ్లీ వస్తుంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి సందర్భాల్లో కారణాన్ని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. యోని నుంచి నమూనా తీసి పరీక్ష చేయడం ద్వారా ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉందో, ఏ శిలీంద్రం కారణమైందో, దానికి ఏ మందు ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. అలాగే మూత్ర పరీక్షలు, రక్తంలో చక్కెర స్థాయులు, శరీర రోగనిరోధక శక్తికి సంబంధించిన పరీక్షలు కూడా అవసరమవుతాయి. మధుమేహం ఉన్నవారిలో లేదా రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉన్నవారిలో ఇలాంటి ఇన్ఫెక్షన్లు తరచు కనిపిస్తాయి.కొన్నిసార్లు ఇతర వైరస్ ఇన్ఫెక్షన్లు లేదా రోగనిరోధక శక్తి తగ్గడం కూడా దీనికి కారణం కావచ్చు. అందుకే, తరచుగా వచ్చే యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ చికిత్సను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సాధారణంగా ఫ్లుకోనాజోల్ 150 మిల్లీగ్రాముల మాత్రను మూడు రోజులకోసారి చొప్పున మొత్తం మూడు మోతాదులు ఇవ్వవచ్చు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ మళ్లీ రాకుండా ఉండేందుకు నిర్వహణ చికిత్సలో భాగంగా వారానికి ఒక మాత్ర చొప్పున ఆరు నెలల పాటు వాడాలని వైద్యులు సూచిస్తారు. లేదా క్లోట్రిమాజోల్ 500 మిల్లీగ్రాముల మాత్రలను రెండు వారాల పాటు వాడమని చెప్తారు. అనంతరం ఆరు నెలల పాటు వారానికి ఒకసారి చొప్పున వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే యోని నుంచి నమూనా సేకరించి పరీక్ష చేయించడం ద్వారా ఏ రకమైన శిలీంద్రం కారణమైందో గుర్తించి, దానికి తగిన చికిత్స అందిస్తారు. ఇలా పూర్తి చికిత్స తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గడమే కాకుండా, మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.మేనిమాట! మెదడులో చెత్తబండి!మనం దుప్పటి కప్పుకుని రాత్రిళ్లు ‘ఆఫ్’లో ఉంటే.. మెదడు మాత్రం ‘క్లీనింగ్ మోడ్ ఆన్ !’ చేసి, వ్యర్థాలను బయటకు పంపే పనిలో బిజీగా ఉంటుంది. అవును.. నిద్రలో ‘గ్లింపాటిక్ సిస్టమ్’ చురుగ్గా పనిచేసి, మెదడులో పేరుకునే కొన్ని వ్యర్థ పదార్థాలను ‘సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ’ ప్రవాహం ద్వారా తొలగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా స్లో వేవ్ స్లీప్ సమయంలో ఈ ప్రక్రియ మరింత చురుగ్గా సాగుతుంది.- డా, భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్
తనలో తానే పాడుకున్న తత్త్వజ్ఞ!
‘మన మాటల్లో అత్యుత్తమమైనవి మనతో మనం చెప్పుకునేవే!’నన్నారు పోలిష్ రచయిత్రి ఓల్గ తొకార్చుక్. ‘మిగతా విషయాలెలా వున్నా, వాటిని ఎవరూ అపార్థం చేసుకోర’ని కూడా అన్నారామె. ఈ మాటలన్న మనిషి, ‘జైళ్ళు మన లోపలే వుంటాయి– బయట వుండవు; ఎటొచ్చీ మనలో చాలామందికి ఈ అంతర్గత కారాగారాల్లో ఎలావుండాలో తెలియదంతే!’ అనడంలో విడ్డూరమేముంది? అయినా, మానసిక చికిత్స పద్ధతుల్లో –క్లినికల్ సైకాలజీలో– పట్టా పొందిన ఓల్గా మాటతీరు మరోలా ఎందుకుంటుంది?ఆమె తల్లి వాండా, తండ్రి జోసెఫ్ ఇద్దరూ ‘పీపుల్స్ యూనివర్సిటీ’లో అధ్యాపకులే. వాస్తవానికి అది ఓ విశ్వవిద్యాలయం కాదు– హైస్కూల్ మాత్రమే. పోలండ్ వాయవ్య ప్రాంతంలోని శివారు నగరం మ్యేర్జిన్లో వుండే జానపద విజ్ఞాన కేంద్రాన్నే ‘పీపుల్స్ యూనివర్సిటీ’గా పిలుస్తారు. జెర్మన్ సరిహద్దులకు కొద్ది నిమిషాల దూరంలో ఉంటుంది మ్యేర్జిన్. పైగా, అప్పట్లో జోసెఫ్ ఆ స్కూల్ లైబ్రరీ కూడా నడిపేవాడు. అలా, చిన్న వయసు నుంచీ ఓల్గ ఆడుకున్నదీ– పాడుకున్నదీ పుస్తకాలతోనే!బాల్యంలో ఓల్గకు నచ్చిన పుస్తకం హెన్రిక్ సియెంకియేవిచ్ రాసిన ప్రేమకథ ‘క్వో–వాడిస్’. 1905లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న తొలినాటి రచయిత సియెంకియేవిచ్ రాసిన ఈ ప్రేమకథకే ‘ఎడారి–అడవి’ అనేది మరోపేరు. లాటిన్ భాషలో ఈ ప్రశ్నకు ‘ఎక్కడికి వెళ్తున్నావు?’ అనే అర్థం! నీరో చక్రవర్తి రోమ్ నగర రాజ్యాన్ని పాలించే రోజుల్లో జరిగిన ప్రేమకథగా ఈ నవలను రచించాడు సియెంకియేవిచ్. మరో 113 సంవత్సరాల తర్వాత ఓల్గ కూడా నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడానికి వున్న చారిత్రక నేపథ్యం ఇదన్నమాట. ఈ పరిసరాలే, రచయిత్రిగా ఆమె సొంత గొంతు సవరించడానికి అవసరమైన స్వరాన్నిచ్చాయి.పదహారేళ్ళ ప్రాయంలోనే కలంపట్టి కథనరంగంలోకి దిగింది ఓల్గ! అయితే యువరచయితలకు సహజమైన బెరుకు కారణంగా ఆమె ‘నతాషా బరోదిన్’ అనే మారుపేరును ఆశ్రయించారు. యువ రచయితల కోసం ఉద్దేశించిన ‘కాలిబాట’ అనే చిన్నపత్రికలో అచ్చయిన మొదటి రెండు కథలనూ ఆ పేరుతోనే ప్రచురించారామె. దాదాపు దశాబ్దకాలం ఓల్గ కథలూ కాకరకాయలూ పక్కన పెట్టి సైకో థెరపిస్టుగా ఉద్యోగం చేసుకున్నారు. అప్పట్లో ఆమె విస్తృతంగా కవిత్వం రాశారు; అనేక పత్రికల్లో ప్రచురించారు; విస్తారమైన గుర్తింపు కూడా పొందారు. అప్పట్లోనే ఆమె ఓ కవితా సంపుటి కూడా అచ్చు వేసుకున్నారు. మూడు పదుల వయసు దాటిన తర్వాత, 1996లో ఓల్గ ‘ఆదిమ యుగం– ఇతర యుగాలు’ అనే ప్రయోగాత్మక నవల రాసి పదిమంది దృష్టిలో పడ్డారు. ఈ నవలను ఓల్గ 60 ఖండికలుగా విభజించారు. ఈ ప్రయోగం జాతీయ స్థాయిలో కన్నా, అంతర్జాతీయ స్థాయిలో పెద్దపేరు తెచ్చుకుంది. ఈ పరిణామం వెనుక చిన్న నేపథ్యం లేకపోలేదు!ఇరవయ్యో శతాబ్ది చివర్లో పోలండ్ రాజకీయ– సామాజిక వ్యవస్థ సమూలమైన మార్పులకు గురైంది. అంతర్జాతీయంగా గొర్బచ్యేఫ్, జాతీయ స్థాయిలో పోలిష్ కార్మిక నేత వవుంజా (వలేజా) పరిచయం చేసిన భావాలే ఆ మార్పులకు ప్రాతిపదికలు. పోలండ్ సమాజంలో పడమటి గాలులు బలంగా వీస్తున్న పోకడ కనిపెట్టి ఎందరో సాహిత్యవేత్తలు తమ రంగు మార్చారు. ఎందుకైనా మంచిదని ఓల్గ తొకార్చుక్ కూడా వారిని అనుసరించారు. అలాంటి పెద్దల ప్రోత్సాహంతోనే ఆమె 1990 దశాబ్ది తొలినాళ్ళలో ఓల్గ కొన్నాళ్ళు ఇంగ్లండులో ఉండి, ఆంగ్లభాషా ప్రావీణ్యం సాధించారు. మరో అయిదేళ్ళ తర్వాత ఆమె రెండు స్కాలర్షిప్పులు సంపాదించి అమెరికాలోనూ– జెర్మనీ (బెర్లిన్)లోనూ రెండేళ్ళు గడిపి రావడం ఓల్గ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆనాటి నుంచీ ఆమెకి స్వదేశంలో కన్నా విదేశాల్లోనే ఎక్కువ గుర్తింపు దక్కుతూ వచ్చింది. 1999లో ఓల్గ ‘పోలిష్ పెన్ క్లబ్’లో చేరడంతో ఈ మార్పు పరిపూర్ణమైంది. 2014లో ఓల్గ రాసిన ‘ద బుక్స్ ఆఫ్ జేకబ్’ అనే సుదీర్ఘ నవల ఆమె రచనలన్నింట్లోకీ ఉత్తమమని విమర్శకులు అంటారు. పదిహేడో శతాబ్దానికి చెందిన జేకబ్ ఫ్రాంక్ అనే ‘అవతార పురుషుడి’ జీవితకథ నేపథ్యంగా రాసినదీ 900 పేజీల నవల. ఈ నవల రాయడానికి ఓల్గ ఏడేళ్ళపాటు పరిశోధన చేశారట! ఈ నవల రాయడానికి ఏడేళ్ళ ముందు, ఓల్గ ‘దిమ్మరులు’ అనే చారిత్రక నవల పోలిష్ భాషలో వెలువరించారు. ‘ప్రాచీన విశ్వాసులు’గా ప్రసిద్ధులైన ఓ క్రై స్తవ శాఖకు చెందిన సంచారజీవన సమూహాల కథనే ఈ నవలకు ఇతివృత్తంగా తీసుకున్నారు ఓల్గ. 116 ఖండికలుగా ఈ నవలను నిర్మించి ఓల్గ తన ముద్ర గట్టిగానే వేశారు. చిత్రమేమిటంటే, కొన్ని ఖండికలు, ఏకవాక్య నిర్మాణాలే! 2008లో నైకీ సాహిత్య పురస్కారం ఓల్గ రచనకు తొలిసారి దక్కింది.అమెరికన్ అనువాదకురాలు జెనిఫర్ క్రాఫ్ట్ దాని ఆంగ్లానువాదం వెలువరించే వరకూ ఓల్గ రచనకు అంతర్జాతీయ స్థాయిలో పెద్దగుర్తింపు దక్కలేదు (2018 మే నెల్లో ఓల్గ తొకార్చుక్– అమెరికన్ అనువాదకురాలు జెనిఫర్ క్రాఫ్ట్ మ్యాన్ బుకర్ బహుమతి సొమ్మును పంచుకున్నారు– అది అలా వుంచండి!) అదే సంవత్సరం అక్టోబర్లో ఓల్గ నోబెల్ సాహిత్యపురస్కారం గెల్చుకోవడానికి మ్యాన్ బుకర్ పురస్కారం ఎంతగానో సహకరించింది. ఈ రెండూ పురస్కారాలు దక్కిన తర్వాతనే, ఓల్గ రచనలకు అనేక భాషల్లో అనువాదాలు వెలువడ్డాయి. అయినా, నోబెల్ పురస్కారం పొందిన వాళ్ళ రచనలను సొమ్ముచేసుకునే సువర్ణావకాశాన్ని పెంగ్విన్ లాంటి వాణిజ్య ప్రచురణ సంస్థలు వదులుకుంటాయా?- మందలపర్తి కిషోర్
అంతర్జాతీయం
భారత యువతి హత్య: ఏడు నెలల తర్వాత ప్రియుడి అరెస్ట్!
టొరంటో: కెనడాలోని టొరంటోలో గత డిసెంబర్లో జరిగిన భారత సంతతికి చెందిన హిమాన్షీ ఖురానా (30) హత్య కేసులో ప్రధాన నిందితుడు, ఆమె భాగస్వామి అబ్దుల్ గఫూరీ (32)ని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 20, 2025న ఈ హత్య జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న గఫూరీని, ఆగస్టు 7న టొరంటో విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు టొరంటో పోలీసులు శనివారం ప్రకటించారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది.నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే అతనికి పెరోల్ లేని జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. డిసెంబర్ 19న హిమాన్షీ కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా, మరుసటి రోజు ఉదయం ఆమె మృతదేహం ఆమె ఇంట్లోనే లభ్యమైంది. టొరంటోలోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని ప్రకటించింది. నిందితుడు విదేశాలకు పారిపోయినప్పటికీ, అంతర్జాతీయ పోలీసు ఏజెన్సీల సహకారంతో అతడిని కెనడాకు రప్పించి, అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఇది కూడా చదవండి: బ్రెజిల్లో విషాదం: హెలికాప్టర్ కూలి నలుగురు మృతి!
బ్రెజిల్లో విషాదం: హెలికాప్టర్ కూలి నలుగురు మృతి!
రియో డి జెనెరో: బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్థానిక కొలంబియన్ కాన్సులేట్ తెలిపింది. మృతులలో ఒక పైలట్తో పాటు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కొలంబియన్ మహిళలు ఉన్నారు. వీరు నగరంలోని విస్టా చినెసా సమీపంలో గల టిజుకా నేషనల్ పార్కు వద్ద విహారయాత్ర చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.15 ఏళ్ల బాలిక పుట్టినరోజు వేడుకల కోసం వచ్చిన ఈ కుటుంబంలోని ఆరుగురిలో, హెలికాప్టర్ సామర్థ్యం పరిమితంగా ఉండటంతో ముగ్గురు మాత్రమే ప్రయాణించి మృత్యువాత పడ్డారు. ప్రమాద ఘటనపై రియో డి జెనీరో మేయర్ ఎడ్వర్డో కావలియర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నగరంలో పర్యాటక ఆకర్షణగా మారిన హెలికాప్టర్ విహారయాత్రల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.కొత్త భద్రతా ప్రమాణాలను అమలు చేసే వరకు ఈ విమాన సేవలను ఒకటి లేదా రెండు వారాల పాటు నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని బ్రెజిల్ నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏజెన్సీని కోరినట్లు ఆయన తెలిపారు. గతంలో జూన్ 14న రిక్రియో డోస్ బాండీరాంటెస్ శివారులో రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు.ఇది కూడా చదవండి: క్షేమంగానే మొజ్తాబా ఖమేనీ?.. వీడియో హల్చల్!
హార్మూజ్పై ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా తన బుద్ధిని మార్చుకోనంత వరకు హార్మూజ్ జలసంధిని తెరిచేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహ్మద్ బఘెర్ జొల్ఘాదర్ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనను ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది.‘అమెరికా ఇకపై ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరించే ప్రయత్నం చేయరాదు. ఇరాన్, ఈ ప్రాంతంలోని ఇరాన్ మిత్ర పక్షాలపై అమెరికా దాడులు మానుకోవాలి. ఇరాన్ నౌకాశ్రయాల నుంచి అమెరికా వైదొలగాలి. ఈ ప్రాంతం నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవాలి. ఇరాన్కు పూర్తి యుద్ధ పరిహారం చెల్లించాలి. ఆంక్షలను ఎత్తి వేయాలి. స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను బేషరతుగా విడుదల చేయాలి..’వంటి డిమాండ్లు కూడా ఆ ప్రకటనలో ఉన్నాయి.శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్ విభాగానికి జొల్ఘాదర్ కమాండర్గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించలేదు. తమ రెండు దేశాల మధ్య నుంచి వెళ్తున్న హార్మూజ్ జలసంధి ఉమ్మడి నిర్వహణపై ఒమన్తో ఒప్పందం తుది దశకు చేరుకుందని అంతకుముందు ఇరాన్ ప్రకటించింది.
క్షేమంగానే మొజ్తాబా ఖమేనీ?.. వీడియో హల్చల్!
టెహ్రాన్: ఇరాన్ సర్వోన్నత నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం, ఆచూకీపై ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ఇరాన్క చెందిన సెమీ-అఫీషియల్ మెహర్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన ఈ వీడియో, ఖమేనీ ఆరోగ్యం విషమంగా ఉందనే వదంతులను తిప్పికొట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది. Iran’s Mehr RELEASES VIDEO of Supreme Leader Mojtaba Khamenei for ‘FIRST TIME’ pic.twitter.com/v3Rp81VfLH— RT (@RT_com) August 8, 2026అయితే ఈ ఫుటేజ్ ఎప్పుడు రికార్డ్ చేసిందనే దానిపై స్పష్టత లేదు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులలో ఆయన తండ్రి అయతొల్లా అలి ఖమేనీ హత్య తర్వాత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మొజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. ఆయన కేవలం రాతపూర్వక ప్రకటనల ద్వారా మాత్రమే సమాచారాన్ని అందిస్తున్నారు. దాడుల సమయంలో ఆయన గాయపడ్డారని, ఆ తర్వాత రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారని చెబుతున్నారు.జూలైలో సౌదీ వార్తా సంస్థ అల్-హదత్ ఇజ్రాయెల్.. ఖమేనీ ఇరాన్లో లేరని తెలిపింది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ మాట్లాడుతూ, సర్వోన్నత నేతతో ప్రత్యక్ష సంబంధాలు ప్రస్తుతం చాలా కష్టంగా ఉన్నాయని అంగీకరించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమంగా లేదని ఇరాన్ అధికారులు కొట్టిపారేశారు.ఇది కూడా చదవండి: జపాన్ పర్యటనకు ఐఆర్సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ!
జాతీయం
అస్సాం వరదలు.. వందకు చేరిన మృతులు!
శివసాగర్: అస్సాంలో భారీ వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 100కి చేరింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీఆర్ఐఎంఎస్) అస్సాం బులెటిన్ ప్రకారం.. ఈ విపత్తులో 60 మంది పురుషులు, 23 మంది మహిళలు, 18 మంది పిల్లలు (12 మంది బాలురు, 6 గురు బాలికలు) ప్రాణాలు కోల్పోయారు.శివసాగర్ జిల్లాలో ఒకే పేరుతో ఒక మరణం పొరపాటున రెండుసార్లు నమోదైందని, దీంతో ఆ జిల్లాలో మృతుల సంఖ్యను 50 నుండి 49కి సవరించినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాల్లో కచార్ జిల్లాలో 22 మంది, శివసాగర్ జిల్లాలో 49 మంది మరణించారు. కరీమ్గంజ్ (9), గోలాఘాట్ (8) జిల్లాలతో పాటు ధెమాజి, నాగావ్, ఉదల్గురి, సోనిత్పూర్, కార్బి ఆంగ్లాంగ్ జిల్లాల్లోనూ ప్రాణనష్టం సంభవించింది. వరద పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.జోర్హాట్ జిల్లాలోని 304 గ్రామాల్లో సుమారు 1,66,000 మంది వరదల బారిన పడ్డారు. వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు పశు సంపద కూడా కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సహాయక చర్యలు, వైద్య సేవలను అందిస్తున్నాయి. ఈ విపత్తులో అస్సాం ప్రజలకు అండగా నిలిచేందుకు చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.ఇది కూడా చదవండి: తమ్ముని అంత్యక్రియలకు వెళ్తూ అతీక్ కుమారుని వీరంగం!
నటుడు దర్శన్ కేసులో మరో సంచలనం!
రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడు ప్రదోష్ అప్రూవర్గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశాడు. హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎలా దాడి చేసి చంపారు?.. అనంతరం సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు.. ఆపై తెరపైకి వచ్చిన కవర్అప్ కథను అందులో అతను ‘పూసగుచ్చినట్లు’ వివరించాడు. దీంతో నటుడు దర్శన్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసేలా కనిపిస్తోంది.సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో పవిత్రగౌడ, దర్శన్లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రదోష్ ఏ-14గా ఉన్నాడు. అప్రూవర్గా మారేందుకు 59వ సెషన్స్ కోర్టులో అతను వేసిన పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి.. తొలుత రేణుకాస్వామిని దర్శన్ మనుషులు కొందరు ఎత్తుకొచ్చారు. పవిత్ర గౌడకు పంపినట్లు చెబుతున్న సందేశాల విషయంలో దర్శన్ అతడిని ప్రశ్నించాడు. ఆ తర్వాతే తన మనుషుల్ని ఉసిగొల్పడంతో.. దాడి జరిగింది. కర్రలు, తాళ్లతో అతన్ని తీవ్రంగా గాయపరిచారు. రేణుకాస్వామి మరణించాడని నిర్ధారించుకున్నాక.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు.మృతదేహాన్ని తరలించి.. కథ మార్చే ప్రయత్నం?రేణుకాస్వామి మరణం తర్వాత ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రత్యామ్నాయ కథనం సిద్ధం చేసుకున్నారు. తొలుత శవాన్ని మాయం చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత కొందరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రణాళిక రూపొందించారు. ఆ నేరం వాళ్ల మీద వేసుకునేందుకు దర్శన్ పవిత్రలు వాళ్లకు డబ్బులు ఆఫర్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే అంతా నడిచింది కూడా.అయితే ఈ కేసులో జరిగిదంతా నిజాయతీగా వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకే అప్రూవర్ హోదా ఇవ్వాలని ప్రదోష్ కోర్టును కోరాడు. జైల్లో తనకు భద్రత కల్పించాలని, ఇతర నిందితులతో కలిపి ఉంచొద్దని కూడా విజ్ఞప్తి చేశాడు. అయితే ప్రదోష్ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఒకవేళ కోర్టు అతన్ని అప్రూవర్గా అంగీకరిస్తే.. ఆపై వాంగ్మూలం లభిస్తే.. దర్శన్, పవిత్ర గౌడ సహా ఇతర నిందితులపై ప్రాసిక్యూషన్ కేసుకు కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్గా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిణామాలు కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.రేణుకాస్వామి అనే వ్యక్తి దర్శన్కు వీరాభిమాని. అయితే నటి పవిత్రా గౌడ వల్ల దర్శన్ వ్యక్తిగత జీవితం నాశనమైందని అతను కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పవిత్రకు అసభ్యమైన సందేశాలు పంపాడు. ఈ విషయంలోనే ఆగ్రహించిన దర్శన్.. అతన్ని కిడ్నాప్ చేయించి తన మనుషులతో అతికిరాతకంగా హత్య చేయించాడన్నది అభియోగం. ఈ కేసులో అరెస్టైన దర్శన్కు తొలుత హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు ఆ బెయిల్ రద్దు చేసింది. కేసు విచారణ త్వరగా ముగించాలని ట్రయల్ కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో దర్శన్, పవిత్రలు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
‘ప్యూర్ పెట్రోల్ కావాలంటారా?’.. బీజేపీ ఎంపీ షాకింగ్ వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా E20 పెట్రోల్పై దుమారం కొనసాగుతున్న వేళ.. బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపడాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ప్యూర్ పెట్రోల్ మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా?” అంటూ ప్రశ్నించిన మిశ్రా.. దేశంలో క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడుతున్న పరిస్థితుల్లో ఇథనాల్ బ్లెండింగ్ అవసరమేనని సమర్థించారు.మధ్యప్రదేశ్లోని రేవా ఎంపీ అయిన జనార్దన్ మిశ్రా.. ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని గట్టిగా సమర్థించారు. భారత్ తనకు అవసరమైన ముడి చమురులో దాదాపు 80 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్లో దేశీయంగా అవసరమైన ముడి చమురులో సుమారు 20 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతోందని మిశ్రా అన్నారు. మిగిలిన 80 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని చెప్పారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, చమురు రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా భారత్కు క్రూడ్ ఆయిల్ చేరేందుకు ట్యాంకర్లు అదనంగా వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు.ఈ పరిస్థితుల్లో పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని మిశ్రా విమర్శించారు. “ఇథనాల్ వద్దు.. ప్యూర్ పెట్రోల్ కావాలి” అంటూ ఉద్యమం చేస్తున్నారు. కానీ ప్యూర్ పెట్రోల్ మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా? దేశంలో ప్యూర్ పెట్రోల్ లేకపోతే అది ఎక్కడి నుంచి వస్తుంది?” అంటూ ఆయన ప్రశ్నించారు.బ్రెజిల్ను ఉదాహరణగా చూపిన ఎంపీఇదే సమయంలో ఇథనాల్ వినియోగంలో బ్రెజిల్ను మిశ్రా ఉదాహరణగా ప్రస్తావించారు. అక్కడ వాహనాలు అధిక శాతం ఇథనాల్తో నడుస్తున్నాయని చెప్పారు. భారత్లోనూ ఇథనాల్ కలిపిన పెట్రోల్తో వాహనాలు నడపగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఇథనాల్ వినియోగం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని వస్తున్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. భారత్లో నిపుణులు నిర్వహించిన పరీక్షల్లో ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఇంజిన్కు అసాధారణ నష్టం జరుగుతున్నట్లు తేలలేదని ఆయన అన్నారు.E20పై అసలు వివాదమేంటి?పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్పై ఆధారపడటం తగ్గడంతో పాటు దేశీయంగా ప్రత్యామ్నాయ ఇంధనాల ఉత్పత్తి పెరుగుతుందని కేంద్రం చెబుతోంది. అయితే E20 వల్ల మైలేజీ తగ్గడం, వాహనాల పనితీరుపై ప్రభావం, ఇంజిన్కు దీర్ఘకాలిక నష్టం వంటి అంశాలపై వాహనదారుల్లో ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనార్దన్ మిశ్రా చేసిన “మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా?” వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీశాయి. ఇథనాల్పై కేంద్రం విధానం ఒకవైపు.. వినియోగదారుల ఆందోళనలు మరోవైపు.. ఈ నేపథ్యంలో E20పై వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.
‘నీట్’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు
వడకంచెరి: కేరళలోని వడకంచెరికి చెందిన నీట్-యూజీ(NEET-UG) 2024 అభ్యర్థి అంజలి ఎస్ ప్రవేశ పరీక్షలో 640 మార్కులు సాధించినప్పటికీ, ప్రభుత్వ మెడికల్ సీటు పొందలేకపోయానని, ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీలో ఏటా రూ. 10 లక్షలు చెల్లించి చదువుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. పరీక్షలో జరిగిన అక్రమాల వల్లే తనకు ఈ దుస్థితి దాపురించిందని ఆమె వాపోయారు. కాగా ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని అంజలి ఆరోపించారు.తాము ముందుగా అంచనా వేసిన ర్యాంకులు, లభ్యత ఉన్న సీట్ల ఆధారంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు ఖాయమని ఎంతో ధీమాగా ఉన్నామని, కానీ అనూహ్యంగా ప్రభుత్వ సీటు రాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్య కోటాలో చేరాల్సి వచ్చిందని, దీనివల్ల తమ కుటుంబంపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వైఫల్యానికి కారణమైన బాధ్యులు స్పందించి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి శనివారం ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రం పంపినట్లు అంజలి వెల్లడించారు. నీట్-2024 పరీక్షల వివాదాలు, గ్రేస్ మార్కుల కేటాయింపు వంటి అంశాలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలకు దారితీసిన సంగతి తెలిసిందే.ఇది కూడా చదవండి: రష్యా నుంచి భారత్కు రైలు.. కొత్త కారిడార్ ప్లాన్?
ఎన్ఆర్ఐ
న్యూయార్క్లో వైభవంగా ఆషాఢమాస బోనాలు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా ప్రతిబింబించేలా స్థానిక ఐసెన్ హోవర్ పార్క్లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. లాంగ్ ఐలాండ్ (నాస్సా కౌంటీ) డిప్యూటీ డైరెక్టర్ మెంగ్ లీ, లెజిస్లేటర్ రోజ్ మేరీ వాకర్, టౌన్ క్లర్క్ రాగిని శ్రీవాస్తవ ఈ వేడుకలకు అతిథులుగా హాజరయ్యారు..ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రముఖ కళాకారులు, కవులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, గాయకుడు సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్యలు ప్రత్యేకంగా తమ పాటలు, ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు.అలాగే పద్మ కోడెల చేతుల మీదుగా జరిగిన అమ్మవారి అలంకరణ, పోతురాజు వేషధారణలో ఆశోక్ చింతకుంట చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అమెరికా నేలపై తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన ఈ బోనాల సంబరాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి.
లండన్లో అట్టహాసంగా 'టాక్' బోనాల సంబురం
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. హౌంస్లౌ నగరంలోని కింగ్స్లే అకాడమిలో జూలై 19న జరిగిన ఈ వేడుకలకు బ్రిటన్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ గణేష్ కుప్పాల.. వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హైకమిషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని.. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని ముఖ్య అతిథులు తమ సందేశంలో పేర్కొన్నారు. మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలతో తమ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరును ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల కోసం తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలానికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.బోనాల వేడుకలు విజయవంతం కావడం పట్ల టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు, అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. టాక్ కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగళి, సత్య చిలుముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లారెడ్డి, గణేష్ పాస్తాం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్రీ విద్య, దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, కార్తీక్, స్నేహ, అమరేశ్వరి, సాయిరావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఈమె న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడైన శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు. స్థానిక వివరాల ప్రకారం.. దీప ఐటీ ఉద్యోగిని అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్తతో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. శ్రీపాతి దీప మరణవార్త విన్న హైదరాబాద్లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. దీప మరణంతో ఆకుతోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఘనంగా తానా ప్రపంచసాహిత్యవేదిక 94వ సమావేశం
తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. “ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత” అనే అంశం మీద ఆదివారం జరిగిన 94 వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది. యూకేలో శస్త్రచికిత్సా వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా. చంద్ర చెరువు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తమ కుటుంబం తరపున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో శస్త్రచికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అలాగే ఇదే సందర్భంలో వెలువరించిన “మహర్షి సుశ్రుత ఏ కంపెండియం – ఫాదర్ ఆఫ్ సర్జరీ” అనే గ్రంధంలో విలువైన వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదములు అన్నారు. వేల సంవత్సరాలనాడే సుశ్రుతుడు సోదాహరణంగా వివరించిన వైద్య పద్దతులు, ఉపయోగించిన శస్త్ర పరికరాల జాబితా పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని అన్నారు. సుశ్రుతుడు రచించిన “సుశ్రుత సంహిత” గ్రంధంలోని అనేక విషయాలను ఇతర భారతీయ భాషలలోకి, ప్రపంచ భాషలలోకి అనువాదం కావలసిన అవసరం ఉందని, వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కారాలు స్ఫూర్తి దాయకంగావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.” తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వేల సంత్సరాలనాడే ప్రపంచం ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలగా ఉన్న “సుశ్రుత సంహిత” అనే ఆయుర్వేద గ్రంథం వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం అన్నారు. మనిషి సాధారణంగా 1,120 రకాల వ్యాధులకు గురిఅవుతాడని, 700 కు పైగా మొక్కల గురించి ఏ మొక్క, ఏ వ్యాధిని, ఎలా తగ్గిస్తుందో ప్రయోగాత్మకంగా నిరూపించాడు. 64 రకాల ఖనిజాల నుంచి అవసరమైన మందులను ఎలా తయారుచేసుకోవచ్చో వివరించాడు. ఈ గ్రంథంలో 120 శస్త్రపరికరాల గురించి వివరించాడు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! అనస్తీషియా ప్రక్రియకు ఆద్యుడు సుశ్రుతుడు. ప్రొస్టేట్ గ్రంథిని జాగ్రత్తగా తొలగించే పద్ధతి, విరిగిన ఎముకలు తిరిగి అతుక్కునేందుకు శస్త్రచికిత్స సూత్రాలు, తెగిన శరీర భాగాలను అతికించటం, అతి సున్నితమైన పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించగల్గడం, గర్భిణీస్త్రీ ఉదరంలో శిశువు పరిణామ క్రమం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్లు చేసే విధానం, వ్యాధిరహితంగా ఉండేందుకు ఏ ఏ కాలాల్లో, ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి, ఎలాంటి తృణధాన్యాలు, పప్పుదినుసుల వాడాలి అనే సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాధమికదశనుండే విద్యార్థులకు పాట్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి (డెట్రాయిట్ నుండి) సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి, డా. వి. కె రాజు (వెస్ట్ వర్జీనియా నుండి) సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్దతుల గురించి, డా. శేషు శర్మ (వాషింగ్టన్ డి.సి నుండి) సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహరం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే డా. పండరి గంటి (లాస్ ఏంజిల్స్ నుండి) సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంధంలో పేర్కొన్నారని, అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్న అతిథులందరికీ, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. (చదవండి: ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు)
క్రైమ్
నటుడు దర్శన్ కేసులో మరో సంచలనం!
రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడు ప్రదోష్ అప్రూవర్గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశాడు. హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎలా దాడి చేసి చంపారు?.. అనంతరం సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు.. ఆపై తెరపైకి వచ్చిన కవర్అప్ కథను అందులో అతను ‘పూసగుచ్చినట్లు’ వివరించాడు. దీంతో నటుడు దర్శన్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసేలా కనిపిస్తోంది.సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో పవిత్రగౌడ, దర్శన్లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రదోష్ ఏ-14గా ఉన్నాడు. అప్రూవర్గా మారేందుకు 59వ సెషన్స్ కోర్టులో అతను వేసిన పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి.. తొలుత రేణుకాస్వామిని దర్శన్ మనుషులు కొందరు ఎత్తుకొచ్చారు. పవిత్ర గౌడకు పంపినట్లు చెబుతున్న సందేశాల విషయంలో దర్శన్ అతడిని ప్రశ్నించాడు. ఆ తర్వాతే తన మనుషుల్ని ఉసిగొల్పడంతో.. దాడి జరిగింది. కర్రలు, తాళ్లతో అతన్ని తీవ్రంగా గాయపరిచారు. రేణుకాస్వామి మరణించాడని నిర్ధారించుకున్నాక.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు.మృతదేహాన్ని తరలించి.. కథ మార్చే ప్రయత్నం?రేణుకాస్వామి మరణం తర్వాత ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రత్యామ్నాయ కథనం సిద్ధం చేసుకున్నారు. తొలుత శవాన్ని మాయం చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత కొందరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రణాళిక రూపొందించారు. ఆ నేరం వాళ్ల మీద వేసుకునేందుకు దర్శన్ పవిత్రలు వాళ్లకు డబ్బులు ఆఫర్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే అంతా నడిచింది కూడా.అయితే ఈ కేసులో జరిగిదంతా నిజాయతీగా వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకే అప్రూవర్ హోదా ఇవ్వాలని ప్రదోష్ కోర్టును కోరాడు. జైల్లో తనకు భద్రత కల్పించాలని, ఇతర నిందితులతో కలిపి ఉంచొద్దని కూడా విజ్ఞప్తి చేశాడు. అయితే ప్రదోష్ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఒకవేళ కోర్టు అతన్ని అప్రూవర్గా అంగీకరిస్తే.. ఆపై వాంగ్మూలం లభిస్తే.. దర్శన్, పవిత్ర గౌడ సహా ఇతర నిందితులపై ప్రాసిక్యూషన్ కేసుకు కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్గా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిణామాలు కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.రేణుకాస్వామి అనే వ్యక్తి దర్శన్కు వీరాభిమాని. అయితే నటి పవిత్రా గౌడ వల్ల దర్శన్ వ్యక్తిగత జీవితం నాశనమైందని అతను కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పవిత్రకు అసభ్యమైన సందేశాలు పంపాడు. ఈ విషయంలోనే ఆగ్రహించిన దర్శన్.. అతన్ని కిడ్నాప్ చేయించి తన మనుషులతో అతికిరాతకంగా హత్య చేయించాడన్నది అభియోగం. ఈ కేసులో అరెస్టైన దర్శన్కు తొలుత హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు ఆ బెయిల్ రద్దు చేసింది. కేసు విచారణ త్వరగా ముగించాలని ట్రయల్ కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో దర్శన్, పవిత్రలు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
పెళ్లయి వారం రోజులు.. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్!
హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవ వధువు కిడ్నాప్ అయిన ఘటన మంచాల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మధు కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్కు చెందిన ఏర్పుల ప్రవీణ్, నగరంలోని ఐఎస్ సదన్కు చెందిన కళ్యాణి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.వారం క్రితం భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించగా ఇరువురి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అమ్మాయి తరఫున ఎవరూ రాలేదు. చిత్తాపూర్లో ఆ జంట నివాసం ఉంటున్న క్రమంలో శనివారంరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కళ్యాణిని కారులో ఎత్తుకెళ్లారు. తన భార్యను జ్యోతిబస్ అనే యువకుడితోపాటు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆదివారం ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.
నర్సాపూర్ అర్బన్ పార్క్కు వెళ్లి వస్తుండగా.. విషాదం!
హైదరాబాద్: మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థి దుర్మరణం చెందారని నర్సాపూర్ ఎస్సై రంజిత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్కు చెందిన షేక్ హసిన్ మెహతా(19) బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.స్నేహితులు వెంకటగిరీష్, చంద్ర, దేవ సునందన్ సాయితో కలిసి మియాపూర్ నుంచి ఆదివారం ఉదయం నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని అర్బన్ పార్క్ సందర్శనకు బైక్లపై వచ్చారు. అనంతరం తిరుగుప్రయాణంలో కొండాపూర్ సమీపంలోని టర్నింగ్ వద్ద బైక్ అతివేగంగా రెయిలింగ్ను ఢీకొట్టగా హసిన్ మెహతాకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె దుర్మరణం
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షేక్ షిరీన్బేగం కుమార్తె అఫీఫా(24) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. అఫీఫా తాడేపల్లిలో జిమ్కు వెళుతుంటారు. జిమ్ యజమాని రుతి్వక్, రోజూ జిమ్కు వచ్చే వంశీ, సుదీర్, అవినాష్ లు ఆమెకు స్నేహితులయ్యారు. వీరు ఆదివారం చీరాల బీచ్కి వెళ్లేందుకు విజయవాడ నుంచి కారులో బయలుదేరారు. ఏటుకూరు బైపాస్ వద్ద హైవేలో వెళుతుండగా ముందువెళుతున్న ప్రభుత్వ పౌరసరఫరాలశాఖ రేషన్ తరలించే లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారు అదుపు తప్పి లారీని, డివైడర్ను ఢీకొంది. కారు డ్రైవ్ చేసు్తన్న అవినాష్, సుధీర్, వంశీ, రుత్విక్లు గాయపడ్డారు. కారు వెనుక సీట్లో కూర్చున్న అఫీఫా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, గాయపడినవారిని హైవేలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలిసి ఆస్పత్రికి చేరుకున్న డీసీపీ షిరీన్.. తన కుమార్తె మరణించిందన్న విషయం తెలిసి స్పృహ కోల్పోయారు. ఆమెకు వైద్యులు చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అఫీఫా మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. నల్లపాడు సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత బాధాకరం: మాజీ సీఎం జగన్ సాక్షి, అమరావతి: విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుమార్తె అఫీఫా(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అఫీఫా మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుమార్తెను కోల్పోయిన షిరీన్ బేగం, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వీడియోలు
లోకేష్ మెప్పు కోసమే...YSRCP నేతలపై పులివెందుల DSP లాఠీ చార్జ్
ప్రభుత్వానికి పరాభవం తప్పదు... పదింతలు అనుభవిస్తారు
నిరసనలో పోలీసులకు గులాబీలు.. అంబటి కామెడీ
మెడికో ప్రియాంక ఘటనపై చంద్రబాబుపై RK రోజా ఫైర్
ICUలో ఉండగానే రాజీనామా చేయిస్తారా ? ఇదేనా మీ సభ్యత
మెడికో ప్రియాంకను చంపేశారు
తోలు ఊడిపోయింది మార్గాని భరత్ పై పోలీసుల దాడి
పేకాటలో గెలిస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారా..? నువ్వేం మంత్రివయ్యా
పరిపాలనలో పూర్తిగా ఫెయిల్.. మేము వచ్చాక ఒక్కొక్కడికి..
విశాఖలో ఉద్రిక్తత.. KK రాజు అరెస్ట్


