జూ.ఎన్టీఆర్ తరహాలో రూమర్లపై బన్నీ వ్యవహరిస్తాడా?
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోకి సినీ రంగానికి చెందిన ఇద్దరు ప్రముక స్టార్ హీరోలు వస్తారనే ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రూమర్లు ప్రస్తుతం ఇద్దరు హీరోలపైన మాత్రమే నడుస్తున్నాయి. వీళ్లలో ఒకరు జూ.ఎన్టీఆర్ కాగా, మరో హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఇక్కడ పొలిటికల్ ఎంట్రీ రూమర్లు ఎన్టీఆర్ పై కొత్తేం కాదు. అతడిపై చాలా ఏళ్లుగా ఇలాంటి పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే తన పొలిటికల్ ఎంట్రీపై వచ్చే పుకార్లను ఎప్పటికప్పుడు తారక్ ఖండిస్తూనే ఉన్నాడు. తాజాగా వచ్చిన రూమర్లపై కూడా తన టీమ్ స్పందించింది. తాజాగా అల్లు అర్జున్ పై కూడా అలాంటి ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఈ విషయంపై బన్నీ నుంచి ఎలాంటి స్పందన లేదు. తన టీమ్ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. మొన్నటికిమొన్న తనపై వస్తున్న పొలిటికల్ ఎంట్రీ పుకార్లపై ఎన్టీఆర్ టీమ్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది. ‘రా ఎన్టీఆర్’ అనే సంస్థతో కానీ అది చేసే పనులతో తారక్కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈనెల 18న ‘రా ఎన్టీఆర్’ చేయబోయే ఛారిటీతో కూడా ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ టీమ్ ప్రకటించింది. ఈ మద్య వచ్చిన రూమర్లలో ఎన్టీఆర్ కంటే ముందే బన్నీ పొలిటికల్ ఎంట్రీ అంటూ పుకార్లు వచ్చాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో అవి అలానే కొనసాగుతున్నాయి. మరోవైపు అతడిపై వస్తున్న ఊహాగానాలకు ప్రజల్లో చర్చ కూడా జరుగుతోంది.ఇంత జరుగుతుంటే..అల్లు అర్జున్ మాత్రం తనపై వస్తున్న పుకార్లపై ఏమాత్రం స్పందించలేదు. ఆయన స్పందన కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. కానీ బన్నీ మాత్రం తన సినిమాల షూటింగ్ పనులు చూసుకుంటున్నాడు. ఈ పుకార్లను అల్లు అర్జున్ ఓపెన్గా ఖండిస్తాడా.. లేదా అనేది చూడాలి.
యూనిఫాం తీసేసి రాజకీయాల్లోకి రండి.. అసిమ్ మునీర్కు రెహమాన్ సవాల్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్పై ఆ దేశ ప్రముఖ రాజకీయ నాయకుడు, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఫజల్) అధినేత మౌలానా ఫజలుర్ రెహమాన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో పాత్ర పోషించాలనుకుంటే సైన్యానికి రాజీనామా చేసి రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు.జూలై 12న జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన రెహమాన్.. రాజకీయ వ్యవహారాల్లో సైన్యం జోక్యం పెరుగుతోందని ఆరోపించారు. రక్షణ, భద్రతా అంశాలకు మాత్రమే పరిమితం కావాల్సిన సైన్యం, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే యూనిఫాం తీసేసి రాజకీయాల్లోకి రండి. ఎన్నికల్లో పోటీ చేయండి. అప్పుడు ప్రజలు యూనిఫాంలో ఉన్న వ్యక్తికి ఎన్ని ఓట్లు ఇస్తారో తెలుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు.దేశంలో ఎవరు అధికారంలోకి రావాలి, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి లేదా ఎవరు పదవి నుంచి దిగిపోవాలి అనేది నిర్ణయించడం సైన్యం పని కాదని రెహమాన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి నిర్ణయాలు ప్రజలే తీసుకోవాలని ఆయన అన్నారు.పాకిస్థాన్లో సైన్యం ప్రభావం క్రమంగా పెరుగుతోందని, ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కంటే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన విమర్శించారు.దేశంలో జనాభా పెరుగుదల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీలో అసిమ్ మునీర్ను చేర్చిన ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా రెహమాన్ తప్పుబట్టారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సాధారణ పౌరులు మిలీషియాలను ఏర్పాటు చేసుకోవాలని లేదా ఆయుధాలు చేపట్టాలని వస్తున్న సూచనలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ భద్రతను కాపాడడం పూర్తిగా ప్రభుత్వం, సాయుధ దళాల బాధ్యతేనని, ఆ పని కోసమే వారికి వేతనాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.దేశ రక్షణ కోసం సైనికులు విధులు నిర్వర్తిస్తారు. అందుకు వారికి జీతాలు ఇస్తున్నారు. ప్రజలను ఆయుధాలు పట్టమని చెప్పడం సరైన విధానం కాదు. నేను ఎలాంటి మిలీషియాను ఏర్పాటు చేయను’అని ఆయన స్పష్టం చేశారు. పౌరులకు ఆయుధాలు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వ్యక్తిగత కక్షలు, హింస, రక్తపాతం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించిన రెహమాన్, అలాంటి చర్యలు దేశ భద్రతకు మరింత ముప్పు తెస్తాయని అన్నారు.ఈ సందర్భంగా బలూచిస్థాన్లోని భద్రతా పరిస్థితిపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ మెజారిటీ ప్రాంతాల్లో పాకిస్థాన్ ప్రభుత్వ నియంత్రణ బలహీనపడిందని, ఇప్పుడు హింస పష్తూన్ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోందని పేర్కొన్నారు.
మీడియాకు ముద్రగడ కుమారుల లేఖ
సాక్షి,కీర్లంపూడి: కాపు ఉద్యమ నేత, దివంగత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమారులు బాలు, గిరిబాబులు మీడియాకు లేఖ రాశారు. ‘వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి ముద్రగడ నిలువుటద్దం. ఆయన మరణాంతరం ఏం చేయాలనే దానిపై.. ఆయన మాకు చాలా స్పష్టంగా చెప్పారు. ముద్రగడ నిర్ణయం మేరకే అంత్యక్రియల ప్రక్రియ నడిచింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లాంఛనాలు వద్దని చెప్పారు.ఆయన నిర్ణయం మేరకు అధికారిక లాంఛనాలను తిరస్కరించాం. ఈ విషాద సమయంలో మాకు అండగా ఉండి.. ముద్రగడపై అపార గౌరవాన్ని చాటిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.‘మాకు, బార్లపూడి క్రాంతి కుటుంబానికి మధ్య.. కొన్నేళ్లుగా సంబంధాలు, రాకపోకలు లేవు. ఆమె కడచూపుకు రాకూడదన్న నిర్ణయం ముద్రగడదే. మమ్మల్ని మానసిక క్షోభకు గురిచేసే కథనాలు.. ప్రసారం చేయొద్దని మీడియాను వేడుకుంటున్నాం’అని లేఖలో పేర్కొన్నారు.
లెనిన్ విలన్.. ప్రభాస్ను అంత మాట అనేశాడా?
అక్కినేని హీరో అఖిల్ దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన లెనిన్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. కొన్నేళ్లుగా హిట్ కోసం తంటాలు పడుతున్న అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. ఈ విజయాన్ని అక్కినేని ఫ్యాన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ గుంటూరులో నిర్వహించారు మేకర్స్.ఈ ఈవెంట్ లెనిన్లో విలన్గా మెప్పించిన కన్నడ నటుడు ప్రమోద్ పంజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీట్లో ప్రభాస్ గురించి మాట్లాడారు. ఆయనలో తనకు నచ్చింది హాస్పిటాలిటీ అని తెలిపారు. అఖిల్ అన్నలో కూడా అదే చూశానని కొనియాడారు. అయితే ప్రభాస్ను పొగిడే క్షణంలో వాడు అని ప్రమోద్ సంభోదించారు. తెలుగు సరిగా రాకపోవడం వల్లా అలా అన్నారా.. లేదా కావాలనే ఉద్దేశపూర్వకంగా అన్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రభాస్ను వాడు అని సంభోధించడంపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. India’s Biggest Star #Prabhas ని “వాడు” అని సంబోధించిన #Lenin Villain🤯 pic.twitter.com/1xFNLFUQ1u— cinee worldd (@Cinee_Worldd) July 15, 2026
విప్రో ఫలితాలు వీక్!
సంక్షోభంతో పాకిస్తాన్ సతమతం
తునిలో పట్టాలు తప్పిన గూడ్స్.. పలు రైళ్లకు అంతరాయం
జూ.ఎన్టీఆర్ తరహాలో రూమర్లపై బన్నీ వ్యవహరిస్తాడా?
నీట్ రీఎగ్జామ్ ఫలితాలు విడుదల
ఎల్-నినో సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు సిద్ధం
ఓటీటీలో సరికొత్త యానిమేషన్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సహకార రంగం పనితీరుపై ఇరాన్ ప్రతినిధి బృందంతో తెలంగాణ మంత్రులు
తెలుగు సినిమాలపై కామెంట్స్.. చాలా బాధేసింది: కిరణ్ అబ్బవరం
ఒకే ప్లాంట్.. 30 లక్షల వెహికల్స్!
ఫాస్టెస్ట్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ రికార్డు బ్రేక్
గందరగోళంగా 'సర్'
డిజిటల్ మూల్యాంకనంతో విద్యార్థులు, ఈవీఎంలతో ప్రజలు ఆందోళన పడుతున్నారు!
‘ఇక చమురు కాదు.. రానున్నది సరికొత్త యుద్ధం’
మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
చనిపోక ముందే కుటుంబ సభ్యులకు ముద్రగడ లేఖ
జగన్నాథ మహారథయాత్ర.. ఇస్కాన్పై పూరీ ఆలయ మండిపాటు
‘ఇది మంచి ఆరంభం.. అతడొక అద్భుతం’
సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చిన పవన్ కల్యాణ్
శత్రువే అయినా ప్రశంసించాల్సిందే.. ఇరాన్ను పొగిడిన ట్రంప్!
అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా?: మాజీ కెప్టెన్ ఫైర్
అంత ఈజీ కాదు.. అందుకే కెనడా నుంచి వచ్చేశా!
బుమ్రా గురించి ప్రశ్న... ఇంగ్లండ్ కెప్టెన్ అసహనం!
అతడికి అన్యాయం.. అక్షర్, వాషీ.. ఇద్దరూ ఎందుకు?
‘అయ్యగారి’ని కలిసిన అభిమాని.. కన్నీళ్లు తూడుస్తూ అఖిల్ ఎమోషనల్!
కిర్లంపూడి: అంబటి రాంబాబుపై కేసు నమోదు
ఇంగ్లండ్తో రెండో వన్డే.. భారత జట్టులోకి పేస్ సంచలనం?
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్
విప్రో ఫలితాలు వీక్!
సంక్షోభంతో పాకిస్తాన్ సతమతం
తునిలో పట్టాలు తప్పిన గూడ్స్.. పలు రైళ్లకు అంతరాయం
జూ.ఎన్టీఆర్ తరహాలో రూమర్లపై బన్నీ వ్యవహరిస్తాడా?
నీట్ రీఎగ్జామ్ ఫలితాలు విడుదల
ఎల్-నినో సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు సిద్ధం
ఓటీటీలో సరికొత్త యానిమేషన్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సహకార రంగం పనితీరుపై ఇరాన్ ప్రతినిధి బృందంతో తెలంగాణ మంత్రులు
తెలుగు సినిమాలపై కామెంట్స్.. చాలా బాధేసింది: కిరణ్ అబ్బవరం
ఒకే ప్లాంట్.. 30 లక్షల వెహికల్స్!
ఫాస్టెస్ట్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ రికార్డు బ్రేక్
గందరగోళంగా 'సర్'
డిజిటల్ మూల్యాంకనంతో విద్యార్థులు, ఈవీఎంలతో ప్రజలు ఆందోళన పడుతున్నారు!
‘ఇక చమురు కాదు.. రానున్నది సరికొత్త యుద్ధం’
మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
చనిపోక ముందే కుటుంబ సభ్యులకు ముద్రగడ లేఖ
జగన్నాథ మహారథయాత్ర.. ఇస్కాన్పై పూరీ ఆలయ మండిపాటు
‘ఇది మంచి ఆరంభం.. అతడొక అద్భుతం’
సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చిన పవన్ కల్యాణ్
శత్రువే అయినా ప్రశంసించాల్సిందే.. ఇరాన్ను పొగిడిన ట్రంప్!
అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా?: మాజీ కెప్టెన్ ఫైర్
అంత ఈజీ కాదు.. అందుకే కెనడా నుంచి వచ్చేశా!
బుమ్రా గురించి ప్రశ్న... ఇంగ్లండ్ కెప్టెన్ అసహనం!
అతడికి అన్యాయం.. అక్షర్, వాషీ.. ఇద్దరూ ఎందుకు?
‘అయ్యగారి’ని కలిసిన అభిమాని.. కన్నీళ్లు తూడుస్తూ అఖిల్ ఎమోషనల్!
కిర్లంపూడి: అంబటి రాంబాబుపై కేసు నమోదు
ఇంగ్లండ్తో రెండో వన్డే.. భారత జట్టులోకి పేస్ సంచలనం?
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్
ఫొటోలు
గుడ్ నైట్ హీరోయిన్ మీతా రఘునాథ్ స్మైలీ లుక్స్.. ఫోటోలు
వైట్ శారీలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ అందాలు.. ఫోటోలు
లండన్లో మా తమ్ముడి ఆట చూశా.. అది చాలు! (ఫొటోలు)
‘చెన్నై లవ్స్టోరీ’ ప్రెస్మీట్ (ఫొటోలు)
'ఓ.! సుకుమారి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
హైదరాబాద్ మారథాన్కు ‘సిల్వర్ స్టాండర్డ్’ గుర్తింపు (ఫొటోలు)
రాధిక భర్త శరత్కుమార్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ముద్రగడకు కన్నీటి వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్ (ఫొటోలు)
ఆక్వా రైతులకు బాసటగా.. వైఎస్ జగన్ భీమవరం పర్యటన (ఫొటోలు)
ప్రెగ్నెన్సీతోనూ సమంత ఫారిన్ ట్రిప్ (ఫొటోలు)
సినిమా
టాలీవుడ్లో మరో సస్పెన్స్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ నుంచి వస్తోన్న మరో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఆమెన్. ఈ సినిమాకు ఎస్కే బషీద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని ఎస్బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై రేగుల నీరజరాణి నిర్మిస్తున్నారు. దర్శకుడు ఎస్కే బషీద్ మాట్లాడుతూ..'ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్కు భిన్నంగా ఆమెన్ రూపొందించాం. సరికొత్త సస్పెన్స్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాం. కొత్త నటీనటులతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎంత భయపెడుతుందో చెప్పలేం... గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు. ఒంటరిగా కూర్చుని చూసే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇది కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన మూవీ. ఔట్పుట్పై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని మేమే స్వయంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం' అన్నారు. ఈ మూవీ ట్రైలర్ను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా పోస్టర్స్ చూస్తుంటే నన్ చిత్రాన్ని తలపించేలా ఉన్నాయి.
విడాకులు తీసుకున్న రామాయణ నటుడు
ప్రముఖ బాలీవుడ్ జంట తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసుకుంది. మరాఠీ నటుడు, దర్శకుడు అదినాత్ కొఠారి, ఆయన భార్య నటి ఊర్మిళ కనేత్కర్ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అఫీషియల్గా ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. స్నేహపూర్వకంగా భాగస్వాములుగా విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ సమయంలో తమ గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అభిమానులను కోరారు. తమ వివాహ బంధం ముగిసినప్పటికీ తమ కుమార్తె జిజా పట్ల ఇద్దరం బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. తనను ఇద్దరం కలిసికట్టుగా పెంచడానికి తాము అంకితభావంతో ఉన్నామని తెలిపారు.కొఠారే తన ఇన్స్టాలో రాస్తూ.. "మా స్నేహితులకు, మీడియాకు, శ్రేయోభిలాషులకు మా విజ్ఞప్తి. చాలా సార్లు ఆలోచించిన తర్వాత నేను, ఊర్మిళ పరస్పర అంగీకారంతో, స్నేహపూర్వకంగా భాగస్వాములుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఒక జంటగా మా ప్రయాణం ముగిసింది. కానీ మా కుమార్తె జిజా పట్ల మా నిబద్ధత ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆమె మాకు అత్యంత ప్రాధాన్యత. ఆమె ప్రేమ, భద్రత, మద్దతుతో పెరిగేలా చూసేందుకు మేము చాలా సంతోషంగా, అంకితభావంతో కలిసి పెంచుతాము. మా జీవితంలో ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. ఇప్పుడు కూడా మీరు మమ్మల్ని అదే విధంగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం" అని రాసుకొచ్చారు.ఈ సమయంలో మీడియా మిత్రులు, ప్రజలు మా గోప్యతను గౌరవిస్తారని మేము ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక సిని కెరీర్ విషయానికొస్తే కొఠారే నెట్ఫ్లిక్స్ సిరీస్ 'ది రాయల్స్'లో కనిపించారు. ఈ షోలో ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్, జీనత్ అమన్, విహాన్ సమత్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించారు. రణవీర్ సింగ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా 83లో క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ పాత్ర పోషించారు. కాగా.. కొఠారే ప్రస్తుతం రణబీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తోన్న 'రామాయణంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రవీ దూబే, యశ్, సన్నీ డియోల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
లెనిన్ విలన్.. ప్రభాస్ను అంత మాట అనేశాడా?
అక్కినేని హీరో అఖిల్ దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన లెనిన్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. కొన్నేళ్లుగా హిట్ కోసం తంటాలు పడుతున్న అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. ఈ విజయాన్ని అక్కినేని ఫ్యాన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ గుంటూరులో నిర్వహించారు మేకర్స్.ఈ ఈవెంట్ లెనిన్లో విలన్గా మెప్పించిన కన్నడ నటుడు ప్రమోద్ పంజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీట్లో ప్రభాస్ గురించి మాట్లాడారు. ఆయనలో తనకు నచ్చింది హాస్పిటాలిటీ అని తెలిపారు. అఖిల్ అన్నలో కూడా అదే చూశానని కొనియాడారు. అయితే ప్రభాస్ను పొగిడే క్షణంలో వాడు అని ప్రమోద్ సంభోదించారు. తెలుగు సరిగా రాకపోవడం వల్లా అలా అన్నారా.. లేదా కావాలనే ఉద్దేశపూర్వకంగా అన్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రభాస్ను వాడు అని సంభోధించడంపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. India’s Biggest Star #Prabhas ని “వాడు” అని సంబోధించిన #Lenin Villain🤯 pic.twitter.com/1xFNLFUQ1u— cinee worldd (@Cinee_Worldd) July 15, 2026
పెళ్లికి ముందు ఇంకొకరితో ప్రేమలో ఉన్నా.. బ్రేకప్కి కారణం ఇదే: నటి
మలయాళ, తమిళ చిత్రాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాసిక విజయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన గత ప్రేమ బంధం గురించి వివరిస్తూ, సినీ పరిశ్రమలోని సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘పెళ్లికి ముందు నేను ఒకరితో రిలేషన్లో ఉన్నా. ఒక సీరియల్లో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డాను. 'మనసు పోలే మంగళ్యం' సీరియల్ షూటింగ్ సమయంలో మా పరిచయం ప్రేమగా మారింది. అతను వృత్తిరీత్యా గేమ్ డెవలపర్. అతని కుటుంబానికి నటనతో ఎలాంటి సంబంధం లేదు. కానీ కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రం హోమ్ ఉండటం వల్ల, అతను సరదాగా సీరియల్లో నటించడానికి వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి ఆలోచనలు, నటనపై ఉన్న ప్యాషన్ కలవడంతో మేము దగ్గరయ్యాం. అతను చాలా మంచి వ్యక్తి, నన్ను ఎంతో గౌరవించేవాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ అనూహ్యంగా అతని కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అలాగే కొందరు కుటుంబ సభ్యులు మరణించారు. ఆ పరిస్థితులు అతన్ని మానసికంగా తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ డిప్రెషన్ కారణంగానే అతను నన్ను దూరం చేసుకున్నాడు. ఇందులో నా తప్పేమీ లేదు’ అని స్వాసిక చెప్పుకొచ్చింది.ఇక సినీ పరిశ్రమలో ఎదురయ్యే 'కాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడుతూ..ఈ సమస్యలు కేవలం సినిమా రంగానికే పరిమితం కావని, అన్ని రంగాల్లోనూ ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, మీడియా దృష్టి ఎక్కువగా సినిమా పరిశ్రమపైనే ఉండటం వల్ల ఇది ఇక్కడ పెద్ద విషయంగా కనిపిస్తుందని ఆమె విశ్లేషించారు.
క్రీడలు
గుర్నూర్ బ్రార్పై క్రమశిక్షణ చర్యలు
ఇంగ్లండ్తో రెండో వన్డేకు ముందు భారత యువ ఫాస్ట్ బౌలర్ గర్నూర్ బ్రార్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తొలి వన్డేలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బ్రార్కు ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తూ, అధికారికంగా హెచ్చరిక జారీ చేసింది.ఏం జరిగిందంటే..?ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ గర్నూర్ బ్రార్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదాడు. ఆ మరుసటి బంతిని ఫాలోత్రూ సమయంలో అందుకున్న బ్రార్, ఆవేశంతో డకెట్ వైపు వేగంగా విసిరాడు. డకెట్ అప్రమత్తంగా తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది.ఈ ఘటనను పరిశీలించిన మ్యాచ్ రిఫరీ, బ్రార్ చర్యను ప్రమాదకరంగా పరిగణించి ఐసీసీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. బ్రార్ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించినట్లు తెలిపారు. ఈ నిబంధన ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్లో ఆటగాడిపై లేదా అతడి సమీపంలో ప్రమాదకరంగా బంతిని విసరడం క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణిస్తారు.బ్రార్ తన తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా కేసును ముగించారు. ఈ ఘటనకు సంబంధించి బ్రార్పై ఆర్థిక జరిమానా విధించలేదు. అయితే అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ నమోదు చేయడంతో పాటు అధికారిక హెచ్చరిక జారీ చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో బ్రార్కు ఇదే తొలి క్రమశిక్షణా ఉల్లంఘనగా నమోదైంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపోంది, 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్లో అక్షర్ పటేల్ (4-62), బ్రార్ (2-61), ప్రసిద్ద్ (2-50), బుమ్రా (1-31).. బ్యాటింగ్లో గిల్ (80), సుందర్ (52 నాటౌట్), అక్షర్ (57 నాటౌట్) సత్తా చాటి భారత్ను గెలిపించారు.
1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్ యోధుడు
వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ టీ20 క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని తాకాడు. మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) 2026లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడమ్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 8 సిక్సర్లు బాదిన అతడు.. పొట్టి ఫార్మాట్లో 1000 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఇప్పటికే ఈ ఘనత సాధించిన మరో క్రికెటర్ కూడా విండీస్ యోధుడే (క్రిస్ గేల్-1056) కావడం విశేషం.కెరీర్లో ఇప్పటివరకు 746 టీ20 మ్యాచ్లు ఆడిన పోలార్డ్ 1001 సిక్సర్లతో పాటు 923 ఫోర్లు కూడా బాదాడు.టీ20 క్రికెట్లో టాప్-5 అత్యధిక సిక్సర్ల వీరులుగేల్- 1056పోలార్డ్- 1001రసెల్- 792పూరన్- 764బట్లర్- 630మ్యాచ్ విషయానికొస్తే.. పోలార్డ్ (25 బంతుల్లో 64; ఫోర్, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్తో పాటు పూరన్ మెరుపు శతకం చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.ఇంత భారీ స్కోర్ చేసిన ఎంఐ బౌలర్లు దీన్ని కాపాడుకోలేకపోయారు. ఫ్రీడం బ్యాటర్లు స్టీవ్ స్మిత్ (110 నాటౌట్), ఆండ్రియస్ గౌస్ (132) సుడిగాలి శతకాలు బాది, మరో 8 బంతులు మిగిలుండగానే రికార్డు లక్ష్యాన్ని ఊదేశారు. పొట్టి క్రికెట్ ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.
స్కోరు 82/8.... తొమ్మిదో స్థానంలో వచ్చి.. ప్రపంచ రికార్డు!
ఇంగ్లండ్ వేదికగా టీ20 బ్లాస్ట్-2026 లీగ్లో సోమర్సెట్ స్టార్ క్రెయిగ్ ఓవర్టన్ అద్భుతం చేశాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మరీ అతడు విధ్వంసం సృష్టించడం విశేషం. 161 పరుగులులీడ్స్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్-4లో యార్క్షైర్తో సోమర్సెట్ తలపడింది. టాస్ గెలిచిన యార్క్షైర్ తొలుత బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది. యార్క్షైర్ బ్యాటర్లలో ఓపెనర్ ఆడం లిత్ అర్ధ శతకం (64) సాధించగా.. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం ఇరవై పరుగులు చేయలేకపోయారు.సోమర్సెట్ బౌలర్లలో జేక్ బాల్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. డానియెల్ సామ్స్, క్రెయిగ్ ఓవర్టన్, రిలే మెరెడిత్ తలా రెండు వికెట్లు కూల్చారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సోమర్సెట్కు యార్క్షైర్ బౌలర్లు చుక్కలు చూపించారు.టాప్, మిడిల్ ఆర్డర్ కుదేలుఓపెనర్లలో విల్ స్మీడ్ 21 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. థామస్ రూ ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. వీళ్లిద్దరి వికెట్లను జార్జ్ హిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ టామ్ బాంటన్ (1).. మిడిలార్డర్లో జేమ్స్ రూ (1), టామ్ కోలెర్కాడ్మోర్ (2) ఇలా వచ్చి అలా వెళ్లారు.మిగిలిన వారిలో లోయర్ ఆర్డర్లో లైయీస్ గోల్డ్స్వర్తి 19, కెప్టెన్ లూయీస్ గ్రెగరీ 22 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. డేనియల్ సామ్స్ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో కేవలం 82 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన సోమర్సెట్ గెలుపుపై ఆశలు వదిలేసుకుంది.From the most unlikely of positions, Craig Overton has pulled off something SPECTACULAR and sent Somerset to Finals Day 😱 pic.twitter.com/EcYh6pgQT5— Vitality T20 Blast (@VitalityBlast) July 15, 2026కేవలం 30 బంతుల్లోనేఇలాంటి తరుణంలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఆల్రౌండర్ క్రెయిగ్ ఓవర్టన్ అద్భుతం చేశాడు. కేవలం 30 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో ఏకంగా 79 పరుగులు రాబట్టాడు. అతడితో పాటు రిలే మెరెడిత్ ఆరు పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫలితంగా మరో బంతి మిగిలి ఉండగానే సోమర్సెట్ లక్ష్యాన్ని ఛేదించింది. మొత్తంగా 19.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 162 పరుగులు సాధించింది. తద్వారా రెండు వికెట్ల తేడాతో యార్క్షైర్ను ఓడించి.. సెమీ ఫైనల్కు అర్హత సాధించింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా శనివారం జరిగే తొలి సెమీస్ మ్యాచ్లో నార్తాంప్టన్షైర్తో సోమర్సెట్ అమీతుమీ తేల్చుకుంటుంది.క్రెయిగ్ ఓవర్టన్ ప్రపంచ రికార్డుటీ20 క్రికెట్ చరిత్రలో తొమ్మిదో స్థానంలో వచ్చి అత్యధిక స్కోరు (79 నాటౌట్) సాధించిన ఆటగాడిగా క్రెయిగ్ ఓవర్టన్ చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు జమ్మూ కశ్మీర్కు చెందిన సయ్యద్ సాగర్ పేరిట ఉండేది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2013లో భాగంగా హర్యానాతో మ్యాచ్లో సాగర్ తొమ్మిదో స్థానంలో వచ్చి 36 బంతుల్లో 74 పరుగులు చేశాడు. కాగా క్రెయిగ్ ఓవర్టన్ మరెవరో కాదు ఇంగ్లండ్ స్టార్ జేమీ ఓవర్టన్కు స్వయానా సోదరుడు.చదవండి: విధ్వంసకర శతకాలు.. ప్రపంచ రికార్డు బద్దలు
వరుస సెంచరీలు.. చరిత్ర సృష్టించిన విండీస్ బ్యాటర్
వెస్టిండీస్ మహిళల క్రికెట్ దిగ్గజం స్టెఫానీ టేలర్ అరుదైన మైలురాయిని తాకింది. ఐర్లాండ్తో జరిగిన మూడో వన్డేలో సూపర్ సెంచరీ (105) చేసిన ఆమె.. అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగులు పూర్తి చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వెస్టిండీస్ మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన ఐదో ప్లేయర్గా నిలిచింది.ఈ జాబితాలో ఇప్పటికే మిథాలీ రాజ్ (10868), సుజీ బేట్స్ (10740), స్మృతి మంధాన (10737), షార్లెట్ ఎడ్వర్డ్స్ (10273) ఉన్నారు. 35 ఏళ్ల టేలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 307 ఇన్నింగ్స్ల్లో 10005 పరుగులు చేసింది. అదనంగా ఆమె మూడు ఫార్మాట్లలో కలిపి 254 వికెట్లు కూడా తీసింది.2008లో ఐర్లాండ్పైనే వన్డే అరంగేట్రం చేసిన టేలర్, ఇప్పటివరకు 179 వన్డేల్లో 6339 పరుగులు సాధించింది. ఇందులో 10 శతకాలు, 42 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 అంతర్జాతీయాల్లో 139 మ్యాచ్ల్లో 3666 పరుగులు చేసి 22 అర్ధశతకాలు నమోదు చేసింది.ఐర్లాండ్తో జరిగిన మూడో వన్డేలో టేలక్ సెంచరీ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 257 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఐర్లాండ్ను 193 పరుగులకే కుప్పకూల్చి 64 పరుగుల తేడో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.అంతకుముందు రెండో వన్డేలోనూ టేలర్ అజేయ శతకం (100*) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
న్యూస్ పాడ్కాస్ట్
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తాం... ఆక్వా రైతులతో ముఖాముఖిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
పల్నాడు కలను సాకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... 100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల కొత్త మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో మరో కుంభకోణానికి తెరతీసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... ల్యాప్టాప్ల కొనుగోలులో దోపిడీకి స్కెచ్
నిలబెట్టుకోలేనప్పుడు హామీలు ఎందుకిచ్చారు?.... ఆంధ్రప్రదేశ్లో కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు... భారీ ర్యాలీలు, ధర్నాలతో చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో తిష్టవేసిన సమస్యలు... 2024లో 43 లక్షలున్న విద్యార్థులు ఇపుడు 30 లక్షలే..
టీచర్ల ‘టెట్’ ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదు?... ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
టెట్ మినహాయింపునకు కృషి. టీచర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. తనను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలకు వైఎస్ జగన్ భరోసా
విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు
బిజినెస్
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 1.44 శాతం లేదా 0.0019 పాయింట్ల లాభంతో 77,186.87 వద్ద, నిఫ్టీ 5.75 శాతం లేదా 0.024 పాయింట్ల నష్టంతో 24,072.75 వద్ద నిలిచాయి.లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, గ్రిండ్వెల్ నార్టన్ లిమిటెడ్, శ్రీమతి బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ లిమిటెడ్, సౌరాష్ట్ర సిమెంట్స్ లిమిటెడ్, సతియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. శ్రద్ధా రియల్టీ లిమిటెడ్, ఐసీఐసీఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, జేఎన్కే ఇండియా లిమిటెడ్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
వాడకుండా ఉన్న క్రెడిట్ కార్డ్ను క్లోజ్ చేస్తున్నారా?
ఈ రోజుల్లో ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం సాధారణం. వివిధ ఆఫర్లు, క్యాష్బ్యాక్లకు ఆకర్షితులై చాలామంది అవసరానికి మించి కార్డులు తీసుకుంటారు. అయితే, కొంతకాలం తర్వాత వాటిలో కొన్నింటిని అస్సలు వాడకుండా పక్కనపెట్టేస్తుంటారు. ‘ఎలాగూ వాడటం లేదు కదా, క్లోజ్ చేసేద్దాం’ అని అనుకుంటే.. ఒక్క నిమిషం ఆగండి! మీ నిర్ణయం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించిన విషయాలు చూద్దాం.మీ సిబిల్ స్కోర్ను దెబ్బతీసే ప్రధాన అంశాలుమీకు ఉన్న మొత్తం క్రెడిట్ లిమిట్లో ఎంత శాతం వాడుతున్నారనేదే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయూఆర్). ఇది ఎప్పుడూ 30 శాతం కంటే తక్కువగా ఉండాలి. ఒక కార్డును క్లోజ్ చేయడం వల్ల మీ మొత్తం అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది. దీనివల్ల మీరు చేసే ఖర్చు మారకపోయినా మీ సీయూఆర్ శాతం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇది మీ స్కోర్ పడిపోవడానికి ప్రధాన కారణమవుతుంది. బ్యాంకులు మీకు లోన్ ఇచ్చే ముందు మీరు ఎంత కాలంగా క్రెడిట్ను బాధ్యతాయుతంగా వాడుతున్నారనే హిస్టరీని చూస్తాయి. మీ దగ్గర ఉన్న కార్డులలో అత్యంత పాత కార్డును క్లోజ్ చేస్తే క్రెడిట్ హిస్టరీ సగటు డ్యూరేషన్ తగ్గిపోతుంది.ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?మీ క్రెడిట్ కార్డును వరుసగా 12 నెలల పాటు అసలు వాడకపోతే బ్యాంకులు ఆ కార్డును క్లోజ్ చేసే అధికారం కలిగి ఉంటాయి. అయితే, అలా చేసే ముందు ఖాతాదారునికి తప్పనిసరిగా నోటీసు ఇవ్వాలి. ఖాతాదారుడు అన్ని బకాయిలు చెల్లించి కార్డ్ క్లోజర్ కోసం దరఖాస్తు చేసుకున్న ఏడు పని దినాల్లో బ్యాంక్ ఆ ఖాతాను మూసివేయాలి. ఒకవేళ బ్యాంక్ గడువు దాటి ఆలస్యం చేస్తే ఆ తర్వాత ప్రతి రోజు ఆలస్యానికి రూ.500 చొప్పున బ్యాంకు సదరు కస్టమర్కు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.సురక్షితమైన కార్డ్ క్లోజర్ విధానంకార్డుపై ఉన్న అవుట్స్టాండింగ్ బకాయిలు, ఈఎంఐలను పూర్తిగా క్లియర్ చేయండి.ఖాతా మూసివేసే ముందే మీ రివార్డ్ పాయింట్లను పూర్తిగా వాడేసుకోండి.ఓటీటీ, ఇన్సూరెన్స్ వంటి వాటికి ఇచ్చిన ఆటో డెబిట్ ఆప్షన్లను రద్దు చేయండి.కార్డు విజయవంతంగా క్లోజ్ అయిన తర్వాత బ్యాంక్ నుంచి అధికారిక కన్ఫర్మేషన్ లేదా ‘నో డ్యూస్ సర్టిఫికేట్’ తప్పక తీసుకోండి.ఒకవేళ మీరు క్లోజ్ చేయాలనుకుంటున్న కార్డుకు ఎలాంటి వార్షిక రుసుము లేకపోతే దానిని అలాగే ఉంచడం మంచిది. నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి చిన్న మొత్తంలో వాడుతూ యాక్టివ్గా ఉంచితే అది మీ క్రెడిట్ లిమిట్ను పెంచి తద్వారా మీ సిబిల్ స్కోర్ను మరింత పెంచడానికి సహాయపడుతుంది.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు
తండ్రి జ్ఞాపకార్థం.. రూ.100 కోట్లతో యూనివర్సిటీ!
ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ అధినేత డాక్టర్ సుభాష్ చంద్ర తన తండ్రి, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వర్గీయ నంద కిషోర్ గోయెంకా జ్ఞాపకార్థం ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 'శ్రీ నంద్ కిషోర్ గోయెంకా విశ్వవిద్యాలయం' పేరుతో మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్ల భారీ వ్యయంతో ఈ యూనివర్సిటీని నిర్మించనున్నారు.యూనివర్సిటీ ముఖ్య విశేషాలుసామాజిక సేవపై ప్రత్యేక కోర్సు: నంద కిషోర్ గోయెంకా వారసత్వాన్ని, మానవీయ విలువలను రాబోయే తరాలకు అందించేలా ఈ విశ్వవిద్యాలయంలో 'సామాజిక సేవ మరియు దాతృత్వం' (Social Service and Philanthropy)పై ఒక ప్రత్యేక కోర్సును ప్రారంభించనున్నారు.పేద విద్యార్థులకు ప్రాధాన్యత: ఆర్థికంగా వెనుకబడిన, పేద విద్యార్థులకు ఈ యూనివర్సిటీలో తగిన స్థానం, ప్రాధాన్యత ఉంటుందని డాక్టర్ సుభాష్ చంద్ర స్పష్టం చేశారు.వచ్చే ఏడాది నుంచే ప్రారంభం: ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే పూర్తి చేసి, వచ్చే ఏడాది నుంచే యూనివర్సిటీ విద్యా కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
రూ.6.51 లక్షల కోట్లు వచ్చాయ్..
కార్పొరేట్ పన్ను వసూళ్లు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) జూలై 13 నాటికి దేశంలో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 16.40 % పెరిగి రూ.6.51 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలను విడుదల చేసింది. సమీక్షా కాలంలో, నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు 22% వృద్ధితో రూ.2.40 లక్షల కోట్లకు, నికర కార్పొరేట్యేతర పన్ను వసూళ్లు 12% పెరిగి రూ.3.84 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, సంస్థలు చెల్లించే పన్నులు కార్పొరేట్యేతర విభాగం కిందకు వస్తాయి.సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) వసూళ్లు 48% పెరిగి రూ.26,429 కోట్లకు చేరాయి. ఇదే కాలంలో ప్రభుత్వం రూ.1.22 లక్షల కోట్ల పన్ను రీఫండ్లను జారీ చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14.57 శాతం అధికం. మరోవైపు, రీఫండ్లను మినహాయించక ముందు స్థూల ప్రాతిపదికన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 16.11 % పెరిగి రూ.7.73 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.3.35 లక్షల కోట్లు, కార్పొరేట్యేతర పన్ను వసూళ్లు రూ.4.12 లక్షల కోట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.26.97 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో లక్ష్యంగా నిర్దేశించింది. ఇది 2025–26లో వసూలైన రూ.23.40 లక్షల కోట్లతో పోలిస్తే 15 శాతం అధికం. ‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం వంటి ప్రతికూలతలు కార్పొరేట్ కంపెనీల ఆదాయాలపై పెద్దగా ప్రభావం చూపలేదు, వాటి లాభాలు స్థిరంగా ఉన్నాయి అనేందుకు ఈ గణాంకాలు నిదర్శనం. నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు ఇప్పటికే బడ్జెట్ అంచనాలలో 19.5 శాతానికి, కార్పొరేట్యేతర పన్ను వసూళ్లు 27.6 శాతానికి చేరుకున్నాయి. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బలమైన పునాదిపై కొనసాగుతున్నాయి’’ అని డెలాయిట్ పాట్నర్ రోహింటన్ సిద్ధ్వా పేర్కొన్నారు.
ఫ్యామిలీ
ప్రతి ఆరాధన పెళ్లికి దారి తీయరాదు!
నేను ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజీలో మెడిసిన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీకి అసాధారణమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. ఆయనంటే నాకు చాలా గౌరవం, అభిమానం. ఆయనకు సుమారు 50 ఏళ్లుంటాయి. ఆయనకు గతంలో పెళ్లయింది కానీ కొన్ని కారణాల వల్ల భార్యతో విడిపోయి ఒంటరిగానే ఉంటున్నారు. ఇది తెలిసి ఆయన పట్ల నాకు ఉన్న అభిమానం కాస్తా ప్రేమగా మారింది. నేను నా మనసులోని విషయాన్ని ఆయనకు చెప్పి, పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తపరిచాను. అయితే ఆయన చాలా సున్నితంగా నా ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ విషయం నా స్నేహితులకు తెలిసింది. అప్పటినుంచి వారు నన్ను వింతగా... జాలిగా చూస్తూ ‘నువ్వు ఒకసారి సైకియాట్రిస్టును కలవాలి’ అని అంటున్నారు. నాకు చాలా బాధగా ఉంది. నిజంగానే సైకియాట్రిస్టును కలవాల్సిన అవసరం ఉందా? దయచేసి సలహా ఇవ్వండి. – మధురిమ, బెంగళూరుమెడికల్ కాలేజీల్లో గానీ లేదా ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో గానీ తమ సీనియర్లను, ఫ్యాకల్టీని ఆరాధించడం లేదా అభిమానించడం అనేది సర్వసాధారణం. దీనినే వైద్యపరిభాషలో ’మెంటర్ వర్షిప్’ అంటారు. అయితే మీ విషయంలో ఆ అభిమానం ఒక అడుగు ముందుకేసి ప్రేమగా మారింది, ఇలా జరగడమూ సహజమే. కానీ మీరు మరో అడుగు ముందుకేసి మీ ప్రేమను మీ గురువుగారికి వ్యక్తపరిచారు. ఆయన తన పరిణతితో, సమాజంలో తనకున్న బాధ్యతలు, హద్దుల గురించి ఆలోచించి సున్నితంగా ‘కాదు’ అని చెప్పి ఉంటారు. ఒకసారి ఆయన నిర్ణయం చెప్పిన తర్వాత, ఒక గురువుగా ఆయన గౌరవాన్ని కాపాడాలి. అంతేగానీ ’ఏదో ఒక రకంగా నేను ఆయన్ని సాధించాలి’ అని అనుకోవడం సరికాదు. మీ దృష్టిలో అది ప్రేమే కావచ్చు కానీ ఒక పరిధి దాటిన తర్వాత అది ‘అబ్సెషన్’గా మారిపోతుంది. అలాంటి అబ్సెషన్ ను చూసే బహుశా మీ స్నేహితులు మిమ్మల్ని ఒకసారి సైకియాట్రిస్ట్ను కలవమని సలహా ఇచ్చి ఉంటారు.ఒక వ్యక్తిని వృత్తిపరంగా ఆరాధించడం వేరు, వారితోపాటు జీవితాన్ని పంచుకోవడం వేరు... ఇవి రెండూ పూర్తిగా భిన్నమైన విషయాలు. మీరు ఇప్పుడే కెరీర్లో పీక్ స్టేజ్లోకి అడుగుపెడుతున్నారు. పైగా మీ ఇద్దరికీ వయోభేదం చాలా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో తీవ్రమైన అభి్రపాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ పరిస్థితి నుంచి తొందరగా బయటపడి మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తే మంచిది. ఒకవేళ మీరతన్ని నిజంగా అభిమానిస్తే, ఆయనలాగే ఒక మంచి ఫిజీషియన్ కావడానికి ప్రయత్నించండి. భవిష్యత్తులో మీకు ఆయనలాగే అద్భుతమైన క్లినికల్ స్కిల్స్ ఉన్న ఈడుజోడు కలిగిన అబ్బాయి దొరకడని చెప్పలేం కదా? రేపు అలాంటి వ్యక్తిని మీరు వివాహం చేసుకోవచ్చు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి... ఆకాశంలో మెరిసే నక్షత్రాన్ని చూసి మనం మురిసిపోవాలి కానీ, దాన్ని తెచ్చి ఇంట్లో దీపంలా పెట్టుకోవాలనుకోకూడదు. మీ గురువుగారిని చూడండి, ఆరాధించండి, ఆయనలా అవడానికి ప్రయత్నించండి, అంతేగానీ ఆయనను మీ జీవితంలోకి శాశ్వతంగా తెచ్చుకోవాలని అనుకోవద్దు. ఈ తాత్కాలిక భ్రమ నుండి బయటపడటానికి, ఆలోచనలను రీ–డైరెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి సైకియాట్రిస్టును, క్లినికల్ సైకాలజిస్ట్ని కలిసి కౌన్సెలింగ్ తీసుకోండి. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
Dr. AI బ్యూటిప్స్ వికటిస్తాయి?!
టీనేజర్: మొటిమలు రాకుండా ఏం చేయాలి?యువతి: డ్రై స్కిన్ను ఎలా మెరిపించాలి? మహిళ: ముడతల నివారణకు ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి? బ్యూటీకి సంబంధించిన ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఏఐ చాట్బాట్లో విస్తృతంగా కనిపిస్తుంటాయి. అడిగిన వెంటనే ఎలాంటి సమస్యకైనా ఏఐ ద్వారా ఇట్టే సమాధానమూ లభిస్తుంది. దానిని అమలులో పెట్టినవాళ్లు ఎలాంటి ఫలితాలు పొందుతున్నారో మాత్రం తెలియాల్సి ఉంది. జెనరేటివ్ ఏఐ వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో ‘బ్యూటీ’ టార్చర్కు గురవుతుందా?!నిజమిదీ... ఇటీవల ఆస్టిన్ సిటీ ఎయిర్పోర్ట్లో క్లెపాక్ అనే మహిళా ఫొటోగ్రాఫర్ ‘బ్యూటీ అథారిటీ’ అనే మ్యాగజీన్ను చూసి, చాలా ఇంప్రెస్ అయ్యింది. ఆ మ్యాగజీన్లోని అందమైన యువతుల ఫొటోలు చూసి, ఫొటోగ్రాఫర్ల వివరాల కోసం వెతికినప్పుడు ‘ఎఐ’ రూపొందించిన చిత్రాలు అని చిన్న ఫాంట్లో ఇచ్చిన లైన్స్ కనిపించాయి. అవి ఏవీ వాస్తవ మహిళల ఫొటోలు కావు. కంటెంట్ కూడా ‘ఏఐ’ ఇచ్చిందే. ఈ సౌందర్య ప్రక్రియలు నిజ జీవిత మహిళలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి..? ఈ ఆలోచన ఆ మహిళా ఫొటోగ్రాఫర్ని ఆందోళనకు గురిచేసింది. ఇదే విషయాన్ని ఆమె సోషల్మీడియా వేదికగా పంచుకుంటే కొద్దిసేపటిలోనే వేలకొద్ది లైక్స్, వ్యూస్ వచ్చాయి. లక్షలాది మంది ఇది ‘అత్యంత ప్రమాదకరం’ అని కామెంట్ల రూపంలో తెలిపారు. ‘చాలా మంది నిజమైన వ్యక్తులను, ముఖ్యంగా తాము ఫొటోజెనిక్ కాదని భావించే మహిళలను ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ గా, వారు నిజంగా ఇష్టపడే, తమని తాము గొప్పగా భావించేవారి ఫొటోలు తీయగలగడం నాకు చాలా ఇష్టం. కానీ, ఇది నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది’ అని క్లెపాక్ ఈ వీడియోలో వివరించింది. ‘ఏఐలో ఉన్న మహిళ ఎప్పుడూ తనని తాను అద్దంలో చూసుకోలేదు. కానీ, మనం ప్రతి రోజూ అద్దంలో చూసుకోవాలి..’ అని ఒకరు, ‘మహిళల సౌందర్య ప్రమాణాలు ఇప్పటికే చాలా వరకు దెబ్బతిన్నాయి. వీటివల్ల దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజమైన మనుషుల స్థానంలో నకిలీవి రావడం.. వాటిని అనుసరించి మనం మరింత నకిలీగా కనిపించేలా ప్రోత్సహించడం చాలా బాధగా ఉంది’ అని ఒక మోడల్ తెలియజేసింది.ఏఐతో రెండూ సమస్యలే.. → ఏదైనా చర్మ సమస్య వస్తే, దాని గురించి తెలుసుకోవడానికి ఏఐని అడిగితే చికిత్స జనరల్గా చెబుతుంది. అంతేకానీ, మన స్కిన్టైప్ని బట్టి పర్సనలైజ్డ్గా చెప్పలేదు. దాంతో ఏఐ ఇచ్చిన చికిత్సలను చేస్తే, వికటించే ప్రమాదం ఉంది → ఏఐలో సెర్చ్ చేసి సౌందర్య సాధనాల గురించి తెలుసుకుంటూ, వాటిని కొనుగోలు చేస్తున్నారు. వాడుతున్నారు. మన చర్మానికి అవి నప్పితే సరి, లేదంటే రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది → గూగుల్కి అడ్వాన్స్ ఏఐ... అంతే కానీ అది డాక్టర్ కాదు. ఏదైనా చర్మ సమస్య వస్తే ఫొటో తీసి ఏఐలో అప్లోడ్ చేసి, సమస్య ఏంటి అని అడుగుతూ, అదిచ్చే సమాధానంతో ఆందోళన చెందుతున్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎగ్జిమా, సోరియాసిస్.. చర్మ సంబంధిత సమస్యలు ఎన్నో ఉంటాయి. అన్నింటికీ ఒకేలాంటి సమాధానం సరైనది కాదు ∙ఏఐ ఇచ్చిన బ్యూటీ ఫొటోలు చూసి, అవి నిజమే అని వాటిలాగే తామూ ఉంటామని, అవే సూచనలు పాటించడం వల్ల కొత్త సమస్యలు తలెత్తవచ్చు. ఏఐ వల్ల సమాచారం వరకు తెలుసుకోవడం మంచిదే. కానీ, ఏఐ ఇచ్చిన సమాచారం అంతా మనమీదనే ప్రయోగించుకుంటే కోరి సమస్యలు కొనితెచ్చుకున్నట్టే అనే విషయాన్ని గ్రహించాలంటున్నారు నిపుణులు.సొంతవైద్యం సరి కాదు..ఏఐని సమాచారం తెలుసుకోవడానికే ఉపయోగించాలి కానీ, సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడూ కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికీ వారి చర్మతత్త్వం ప్రత్యేకంగా ఉంటుంది. అందరికీ ఒకేలా ఉండే ప్రయోగాలు చేయకూడదు. తెలుసుకోవడం మంచిదే. స్కిన్ రియాక్షన్ అయితే టెన్షన్ పడాల్సింది కూడా మనమే. కొందరు పేషెంట్స్ ఓవర్ నాలెడ్జ్తో వస్తారు. ఇటీవల ఒక వ్యక్తి ఆందోళనగా మావద్దకు వచ్చాడు. అతనికి కాలి బొటనవేలి గోరు మీద నల్లటి మచ్చ వచ్చింది. దాని ఫొటో తీసి, ఎఐకి ఇస్తే నెయిల్ క్యాన్సర్ అని వచ్చింది. అతను చాలా ΄్యానిక్ అయ్యాడు. అనుమానం ఉంటే నెయిల్ కట్ చేసి, ల్యాబ్కి పంపిస్తాం అని చెప్పాం. ప్రతిదీ ఏఐలో తెలుసుకుంటూ అత్యుత్సాహం చూపుతున్నారు. దీనికి ఈ ట్రీట్మెంట్ కాదు కదా! అని మమ్మల్నే ప్రశ్నించేవారూ ఉంటున్నారు. స్కిన్, హెయిర్ కి సంబంధించి ఏఐ ఇచ్చే చిట్కాలు పాటించి, వికటించి మమ్మల్ని సంప్రదించినవారూ ఉన్నారు. – డాక్టర్ విజయగౌరి బండారు, డెర్మటాలజిస్ట్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
అతను–ఆమె ఓ సైలెంట్ కిల్లర్..
రాత్రి 10 గంటలు. ఇల్లు నిశ్శబ్దం. ఆమె పక్కన అతను ఉన్నాడు. కానీ లేడు. ఫోన్ వెలుగు అతని ముఖం మీద పడుతుంది. వేళ్లు స్క్రోల్ చేస్తున్నాయి. రీల్స్... యూట్యూబ్.. ఫేస్బుక్... మాటలు లేవు. కళ్లలోకి చూడటం లేదు. స్పర్శ లేదు. వాళ్లకు విడాకులు జరగలేదు. వాళ్లు విడిపోలేదు. కాని కలిసి మాత్రం లేరు. అతని ఫోన్ వాళ్లను విడగొట్టింది. దీనికి ఒక కొత్త పేరు పెట్టారు. ‘ఫబ్బింగ్’. ఫోన్లో పడి భార్యను నిర్లక్ష్యం ( Snubbing ) చేయడమే ఫబ్బింగ్. నేడు కనిపిస్తున్న అనేక దుష్ఫలితాలకు ఈ స్థితి కూడా ఒక కారణం.రాత్రి పదిగంటలు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దం. ఆ మంచం మీద ఆమె పక్కనే అతను ఉన్నాడు.. కానీ లేడు! చేతిలోని స్మార్ట్ఫోన్ వెలుతురు అతని ముఖం మీద పడుతోంది. వేళ్లు యాంత్రికంగా స్క్రోల్ చేస్తున్నాయి. నిశ్శబ్దాన్ని చీలుస్తూ రీల్స్ శబ్దాలు వస్తున్నాయి కానీ, ఆ ఇద్దరి మధ్య మాటలు లేవు. కళ్లలోకి చూసుకునే తీరిక లేదు. కనీసం చిన్న స్పర్శ కూడా లేదు. వాళ్లకు విడాకులు కాలేదు, వాళ్లు విడిపోలేదు.. కానీ కలిసి మాత్రం లేరు! అతని చేతిలోని ఆ ఐదు అంగుళాల ఫోన్ స్క్రీన్, వాళ్ల మధ్య హిమాలయాలంత దూరాన్ని పెంచేసింది. ఆధునిక సమాజం ఈ నిశ్శబ్ద విషాదానికి పెట్టిన కొత్త పేరే.. ‘ఫబ్బింగ్’. ఫోన్ను, స్నబింగ్ ను కలిపి తయారు చేసిన పదం. దీని అర్థం ఫోను ద్వారా చేసే మానసిక హింస.ఒకప్పుడు ఆఫీస్ నుండి వచ్చే భర్త కోసం భార్య గేట్ దగ్గర ఎదురుచూసేది. ఇప్పుడు అతను వచ్చినా గేట్ తెరుచుకున్న చప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే అతను భౌతికంగా ఇంట్లోకి వచ్చినా, అప్పటికే డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయి ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మీటింగ్లు, మెయిల్స్, వాట్సాప్ చాటింగ్లు, యూట్యూబ్, రీల్స్తో కాలం కరిగిపోతోంది. భార్య ఏదైనా మాట్లాడబోతే ‘ఒక నిమిషం’ అనే సమాధానం వస్తుంది. కానీ ఆ ఒక్క నిమిషం ఎప్పటికీ రాదు. అతను శరీరంతో ఇంట్లోనే ఉంటాడు, కానీ మనసుతో వేరే ప్రపంచంలో ఉంటాడు. ఇది శారీరక దూరం కాదు, అంతకుమించిన మానసిక మరణం. దురదృష్టవశాత్తూ ఇది ఇప్పుడు ప్రతి మూడవ ఇంట్లో జరుగుతున్న నిరంతర కృత్యం.కనిపించని గోడమొదట ‘ఆఫీస్ వర్క్ ఉంది’ అని మొదలవుతుంది. తర్వాత ‘ఫ్రెండ్స్ గ్రూప్లో చాటింగ్’ అంటారు. చివరకు ఆమె ఏదైనా చెప్పాలంటే అతణ్ణి గట్టిగా తట్టి పిలవాల్సిన పరిస్థితి. అతను చెవులకున్న హెడ్ఫోన్స్ తీసి ‘ఏంటి?’ అని విసుక్కుంటాడు. ప్రేమగా మాట్లాడుకోవడానికి, కలిసి నవ్వడానికి, ఆఖరికి మనస్ఫూర్తిగా గొడవ పడటానికి కూడా అక్కడ సమయం లేదు. ఆమెకు అర్థం కావడం లేదు.. గొడవ పడాలా? లేక ఏడవాలా? ఎందుకంటే ఎదుటివాడు ఏ తప్పూ చేయలేదు, కేవలం ‘బిజీ’గా ఉన్నాడు. కానీ ఆ బిజీ అనే ముసుగు వెనుక ఆమె మనసు మెల్ల మెల్లగా చచ్చిపోతోంది.పేరు లేని ఒంటరితనంభర్త తన పక్కనే ఉన్నా తనకు అందుబాటులో లేకపోవడం భార్యకు ఎంత బాధ? సినిమాకు వెళ్లాలన్నా, కూరగాయలు తేవాలన్నా, పిల్లాడి ఫీజు కట్టాలన్నా ఆమె ఒంటరిగానే పోరాడాలి. ఇంట్లో ఇద్దరూ ఉంటారు, కానీ సంసార భారాన్ని ఆమె ఒక్కతే మోస్తుంది. స్నేహితులు ‘నువ్వు చాలా అదృష్టవంతురాలివి, భర్త బంగారం’ అంటుంటే ఆమె గుండెల్లో ఏడుస్తూ పైకి నవ్వుతుంది. ఎందుకంటే ‘నా భర్త ఫోన్ తో లవ్లో ఉన్నాడు’ అని సమాజానికి ఎలా చెప్పుకుంటుంది? ఈ ఒంటరితనానికి చట్టబద్ధమైన పేరు లేదు, విడాకుల సర్టిఫికేట్ లేదు.. అందుకే ఇది ఇంకాస్త ఎక్కువగా బాధిస్తుంది.పరిష్కారం ఎక్కడ?ఈ డిజిటల్ చెరసాల నుంచి బంధాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠినమైన నియమాలు అవసరం → భర్తతో గొడవ పడకుండా ప్రశాంతంగా కూర్చోబెట్టి ‘నువ్వు చెడ్డవాడివి కాదు, కానీ నీ పక్కన ఉంటూనే నేను ఒంటరిగా నలిగిపోతున్నాను’ అని అర్థమయ్యేలా చెప్పాలి → ఇంట్లో ‘డిజిటల్ డిన్నర్’ రూల్ పెట్టాలి. రాత్రి భోజన సమయంలో రోజుకు కనీసం 30 నిమిషాలు ఫోన్ లను పూర్తిగా పక్కన పెట్టి, కేవలం ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ మాట్లాడుకోవాలి → ‘బెడ్రూమ్ నో ఫోన్ జోన్’. పడుకునే గదిలోకి ఫోన్ ను రానివ్వకూడదు → ఆమె కూడా అతని ఫోన్ అలవాటుతో విసిగిపోయి తను కూడా ఫోన్ కు బానిస అవ్వకూడదు. తనకంటూ ఒక ప్రపంచాన్ని, హాబీలను, స్నేహితులను పెంచుకోవాలి. సాంకేతికత శత్రువు కాదు, దాన్ని మనం బంధాలను విడగొట్టడానికి వాడుతున్నామా లేదా కలపడానికి వాడుతున్నామా అనేదే ముఖ్యం. ఫోన్ స్క్రీన్ వల్ల వస్తున్న దూరాన్ని ఇప్పుడే గుర్తించి తగ్గించుకోకపోతే, ఒకరోజు ఇద్దరూ ఒకే కప్పు కింద ఉంటూనే.. మానసిక విడాకులు తీసుకున్న ‘డైవోర్సీలు’గా మిగిలిపోతారు. హెచ్చరిస్తున్న ఈ డిజిటల్ కాలాన్ని ఇప్పుడైనా గమనిద్దాం.. బంధాలను కాపాడుకుందాం.
చీరతో విదేశీ వనిత పాట్లు..! ఆ మహిళా కానిస్టేబుల్..
నెట్టింట చక్కెర్లు కొడుతున్న వీడియో..మన దేశ ఆతిథ్యం తోపాటు, మన భారతీయ చీర గొప్పదనాన్ని చాటింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఆగ్రాలలోని తాజ్మహల్వద్ద ఒక అర్జెంటిన పర్యాటకురాలికి చీర సరిచేసుకోవడంలో సహాయం చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. సాంప్రదాయ వస్త్రధారణ తెలియని ఆ పర్యాటకురాలు యూపీ పోలీసులకు ధన్యవాదాలు అని తెలపడంతో ఒక్కసారిగా ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. తన పోలీసులు విధులకు మించి సాయం చేయడానికి ముందుకు వచ్చిన సదరు కానిస్టేబుల్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. అంతేగాదు భారతదేశా అతిథ్యం, పర్యాటకుల పట్ల స్నేహపూర్వకమైన పోలీసింగ్ని హైలెంట్ చేశారు మేడం అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురింపించారు. అలాగే కొందరు నెటిజన్లు తాజ్ మహల్ సందర్శన సమయంలో చీర ధరించి భారతీయ సంస్కృతిని స్వీకరించినందుకు ఆ విదేశీ మహిళను కూడా అభినందిస్తూ పోస్టులు పెట్టారు. కాగా, ఈఘటన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన తాజ్మహల పశ్చిద్వారా వద్ద చోటు చేసుకుంది. దీనిపై యూపీ పోలీసు అధికారుల కూడా స్పందించారు. అవసరమైనప్పుడు దేశీయ , అంతర్జాతీయ పర్యాటకులిద్దరికీ సహాయం అందించేలా తాజ్ సెక్యూరిటీ పోలీస్ సిబ్బందిని ప్రోత్సహిస్తుందని అధికారులు తెలిపారు. View this post on Instagram A post shared by BENARAS GLOBAL TIMES (@benarasglobaltimes) (చదవండి: కుమారుడి సర్ప్రైజ్ గిఫ్ట్..! కన్నీటి సంద్రంలో తండ్రి)
అంతర్జాతీయం
పాత దోస్తీకి కొత్త పరీక్ష.. భారత్ సాయం కోరిన రష్యా
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా.. ఇప్పుడు శుద్ధి చేసిన ఇంధనం కోసం భారత్ వైపు చూస్తోంది. ఉక్రెయిన్ దాడులతో రష్యాలోని కీలక చమురు శుద్ధి కేంద్రాలు దెబ్బతినడంతో దేశీయ పెట్రోల్ సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో అదనపు పెట్రోల్ సరఫరా కోసం భారతీయ రిఫైనరీలను రష్యా సంప్రదించినట్లు సమాచారం.ఇది అంతర్జాతీయ ఇంధన రంగంలో ఆసక్తికరమైన పరిణామంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు రష్యా ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా చేసే శక్తివంతమైన దేశంగా ఉంది. ముఖ్యంగా భారత్కు భారీగా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసిన రష్యా.. ఇప్పుడు అదే భారత్ నుంచి శుద్ధి చేసిన పెట్రోల్ కొనుగోలు చేసే పరిస్థితిని ఎదుర్కొంటోంది.ఈ పరిణామానికి ప్రధాన కారణం ఉక్రెయిన్ చేపడుతున్న డ్రోన్ దాడులు. రష్యాలోని చమురు రిఫైనరీలు, ఇంధన నిల్వ కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరగడంతో కొన్ని ప్రాంతాల్లో ఇంధన ఉత్పత్తి తగ్గినట్లు సమాచారం. రిఫైనరీల్లో మరమ్మతులు, ఉత్పత్తి అంతరాయాల కారణంగా దేశీయ మార్కెట్లో పెట్రోల్ సరఫరాను స్థిరంగా ఉంచడం రష్యాకు సవాల్గా మారింది. రష్యా ప్రభుత్వం దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇంధన సరఫరాను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లభ్యతపై ఒత్తిడి పెరగడంతో దిగుమతుల ద్వారా లోటును భర్తీ చేసే మార్గాలను మాస్కో పరిశీలిస్తోంది.ఈ క్రమంలో రష్యా సంస్థలు భారతీయ రిఫైనరీ కంపెనీలను సంప్రదించినట్లు సమాచారం. భారత్కు ప్రపంచ స్థాయి భారీ చమురు శుద్ధి సామర్థ్యం ఉంది. ముఖ్యంగా భారత రిఫైనరీలు దిగుమతి చేసుకున్న ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తులుగా మార్చి అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తుంటాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గత కొన్నేళ్లుగా భారత్ రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య ఆంక్షల కారణంగా రష్యా చమురుకు ప్రత్యామ్నాయ మార్కెట్లు అవసరమయ్యాయి. ఆ సమయంలో భారత్ పెద్ద కొనుగోలుదారుగా మారింది. ఇప్పుడు అదే ఇంధన సంబంధాలు మరో రూపంలో కనిపిస్తున్నాయి.భారత్కు ఒక అవకాశం.. అయితే ఈ పెట్రోల్ సరఫరా వ్యవహారం కేవలం వ్యాపార అంశం మాత్రమే కాదు. దీనికి అంతర్జాతీయ రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు పెరగడం ప్రపంచ ఇంధన భద్రతపై ప్రభావం చూపుతోంది. భారత్కు ఇది ఒక అవకాశంగా కూడా మారవచ్చు. ప్రపంచ స్థాయి రిఫైనింగ్ సామర్థ్యం కారణంగా భారత ఇంధన కంపెనీలకు కొత్త మార్కెట్లు లభించే అవకాశం ఉంది. అయితే దేశీయ అవసరాలు, ఎగుమతి విధానాలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.మొత్తంగా చూస్తే.. ఒకప్పుడు ప్రపంచానికి చమురు సరఫరా చేసిన రష్యానే ఇప్పుడు పెట్రోల్ కోసం ఇతర దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కేవలం యుద్ధభూమికే పరిమితం కాకుండా ప్రపంచ ఇంధన సమీకరణాలను ఎలా మార్చుతోందో ఈ పరిణామం మరోసారి స్పష్టం చేస్తోంది.
శత్రువే అయినా ప్రశంసించాల్సిందే.. ఇరాన్ను పొగిడిన ట్రంప్!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ.. డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ఒకవైపు ఇరాన్పై సైనిక ఒత్తిడి కొనసాగిస్తూనే.. మరోవైపు అదే దేశానికి ట్రంప్ బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు. శత్రుదేశాన్నే ప్రశంసించేలా ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఓ ఆసక్తికర పరిణామం ఉంది.2024 డిసెంబర్ నుంచి ఇరాన్లో నిర్బంధంలో ఉన్న అమెరికా-ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన డెనా కరారీకి తాజాగా విముక్తి లభించింది. ఆమెను ఇరాన్ విడుదల చేయడాన్ని 'సద్భావ సంకేతం' (Goodwill Gesture)గా అభివర్ణించిన ట్రంప్.. ఆ దేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ట్రూత్ సోషల్లో స్పందిస్తూ.. "ఆమె ఇప్పుడు సురక్షితంగా ఇరాన్ వెలుపల ఉంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఈ సద్భావ చర్యను అమెరికా అభినందిస్తోంది" అని పేర్కొన్నారు.ట్రంప్ పోస్టు అనంతరం మానవ హక్కుల న్యాయవాది జారెడ్ జెన్సర్.. విడుదలైన మహిళ డెనా కరారీనేనని ధృవీకరించారు. 2024లో కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇరాన్కు వెళ్లిన ఆమెను అక్కడి అధికారులు దేశం విడిచి వెళ్లనీయలేదు. అనంతరం 2025లో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ఆమెపై గూఢచర్యం ఆరోపణలు నమోదు చేశారు. అంతకుముందు.. డెనా అమెరికాలోని ఓ టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగం చేయడంతో పాటు ఇరాన్లో పేద పిల్లల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థను నడిపేవారు. డెనా కరారీ విడుదలకు ట్రంప్ చేసిన నిరంతర ప్రయత్నాలే కారణమని జారెడ్ జెన్సర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె అమెరికాకు తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు వెల్లడించారు. గత రెండు దశాబ్దాల్లో 20 దేశాల్లో 340 మందికిపైగా ఖైదీల విడుదలకు జెన్సర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా.. ఇరాన్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. ‘‘ఇరాన్ చర్చలు కోరుకుంటోంది. వారితో ఒప్పందం కుదురుతుందేమో చూడాలి. అయితే వారు సరిగ్గా, మర్యాదగా ప్రవర్తించాలి (They better behave)’’ అంటూ హెచ్చరించారు. అలా కాదని ఘర్షణలు కొనసాగితే ఇరాన్ త్వరలోనే ఓటమి పాలవుతుందని కూడా వ్యాఖ్యానించారు. అయితే చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.మరోవైపు అమెరికా హర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఇరాన్కు చెందిన తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై రెండో విడత దాడులు కొనసాగిస్తోంది. దీనికి ప్రతిస్పందించిన ఇరాన్.. ఇది తమ ఉనికికే సంబంధించిన యుద్ధమని పేర్కొంటూ, అవసరమైతే ప్రాంతీయ ఇంధన ఎగుమతులకు అంతరాయం కలిగించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
పాకిస్తాన్ గుండెల్లో గుబులు!.. పీవోకేలో పరిస్థితి అదుపు తప్పుతోందా?
పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. స్థానిక సమస్యలు, రాజకీయ హక్కులు, పాలనా విధానాలపై అసంతృప్తితో జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు చేపట్టిన భారీ మార్చ్ను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.ఈ సందర్భంగా ఆందోళనకారుల కదలికలను నియంత్రించేందుకు సుమారు నాలుగు వేల మంది పాకిస్తాన్ రేంజర్స్ను మోహరించినట్లు సమాచారం. ప్రధాన రహదారులపై భద్రతను పెంచడం, కొన్ని ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించడం, నిరసనలను అడ్డుకునేందుకు పోలీసు బలగాలను రంగంలోకి దించడం వంటి చర్యలు చేపట్టారు. అలాగే, మీడియాపై కూడా నిషేధం విధించారు. దీంతో, అక్కడే ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది.అయితే, ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న JAAC గత కొంతకాలంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజా సమస్యలను ప్రస్తావిస్తోంది. ముఖ్యంగా రాజకీయ ప్రాతినిధ్యం, పరిపాలనలో స్థానికులకు ఎక్కువ పాత్ర, ఆర్థిక సమస్యలు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు వంటి అంశాలపై కమిటీ ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ నిరసనల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో ఒకటి పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థులకు కేటాయించిన 12 స్థానాలు. ఈ స్థానాలు స్థానిక ప్రజల రాజకీయ హక్కులను ప్రభావితం చేస్తున్నాయని JAAC ఆరోపిస్తోంది. ఈ రిజర్వు స్థానాల వ్యవస్థలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తోంది.అయితే ఆందోళనలు శాంతియుతంగా కొనసాగకముందే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడులు, నిరసనలు, బలగాల ప్రతిస్పందనతో పరిస్థితి అదుపు తప్పినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘర్షణల్లో ప్రాణనష్టం కూడా జరిగినట్లు సమాచారం. పాక్ ప్రభుత్వం మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే భద్రతను పెంచినట్లు చెబుతోంది. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు ఆందోళనకారులు మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.ముజఫరాబాద్ వైపు సాగుతున్న ఈ మార్చ్ ఇప్పుడు కేవలం స్థానిక నిరసనగా కాకుండా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పెరుగుతున్న ప్రజా అసంతృప్తికి సంకేతంగా మారింది. ఇస్లామాబాద్ ప్రభుత్వం దీనిని ఎలా ఎదుర్కొంటుంది? నిరసనకారులతో చర్చలకు దిగుతుందా? లేక కఠిన చర్యలకే పరిమితం అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక, పాక్ ఆక్రమిత కశ్మీర్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజా డిమాండ్లు, ప్రభుత్వ నియంత్రణ చర్యలు, భద్రతా బలగాల మోహరింపు మధ్య ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత సున్నితంగా మారాయి.
ఇరాన్ ఆస్పత్రిపై అమెరికా క్షిపణి దాడి
అహ్వాజ్: ఇరాన్లోని అహ్వాజ్లో ఉన్న షాహిద్ బాఘేయీ ఆస్పత్రి సమీపంలో అమెరికా క్షిపణులు దాడి చేశాయని, ఫలితంగా ఆస్పత్రిలోని రోగులను అత్యవసరంగా తరలించాల్సి వచ్చిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులు, ముఖ్యంగా కీమోథెరపీ తీసుకుంటున్న చిన్నారులను భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది ఆస్పత్రి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 24 గంటల వ్యవధిలో ఇరాన్పై అమెరికా రెండు భారీ దాడులను చేసింది.హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్ సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు నిర్వహిస్తున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ సైనిక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. అహ్వాజ్తో పాటు బందర్ అబ్బాస్, చబహార్, బుషెహర్ నగరాల్లోనూ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.అలాగే ఇరాన్ ఓడరేవుల వద్ద నిబంధనలను ఉల్లంఘించి వస్తున్న ‘ఎం/టి బెల్మా’ అనే చమురు ట్యాంకర్ను అమెరికా యుద్ధ విమానాలు క్షిపణులతో దెబ్బతీశాయి. ఈ దాడుల వల్ల ఆస్పత్రికి జరిగిన నష్టం లేదా ప్రాణనష్టంపై ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
జాతీయం
టీఎంసీ రాజకీయం.. అభిషేక్పై మమత కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. పార్టీకి ఎన్నో ఏళ్లుగా అండగా నిలిచిన సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా తిరుగుబాటు శిబిరంలో చేరుతుండగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తన మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా టీఎంసీ సీనియర్ నేత, కమర్హాటి ఎమ్మెల్యే మదన్ మిత్రా తిరుగుబాటు వర్గంలో చేరడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. మూడు దశాబ్దాలకు పైగా మమతకు అత్యంత సన్నిహితుడిగా, పార్టీ ఆవిర్భావం నుంచే కీలక నేతగా ఉన్న మదన్ మిత్రా తీసుకున్న నిర్ణయం టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులకు పాఠశాల నియామకాల కేసులో ఈడీ నోటీసులు జారీ కావడం, ఆ తర్వాత ఈ రాజకీయ పరిణామం చోటుచేసుకోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు కూడా మమత శిబిరాన్ని వీడి తిరుగుబాటు వర్గంలో చేరారు. పార్టీలో నిర్ణయాలన్నీ కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయని, సీనియర్ నాయకులకు ప్రాధాన్యం తగ్గిందని తిరుగుబాటు నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ చుట్టూ ఏర్పడిన నాయకత్వ వ్యవస్థపై వారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విమర్శలను మమతా బెనర్జీ పూర్తిగా తోసిపుచ్చారు. అభిషేక్ ఎలాంటి తప్పూ చేయలేదని, భవిష్యత్తులో కూడా ఆయన పార్టీకి కీలక నాయకుడిగానే కొనసాగుతారని స్పష్టం చేశారు. కొంతమంది పార్టీని వీడినా, టీఎంసీ బలహీనపడదని, నమ్మకమైన కార్యకర్తలు, ప్రజలే తమ అసలు బలమని ఆమె వ్యాఖ్యానించారు.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఎదుర్కొన్న పరాజయం తర్వాత పార్టీలో అసంతృప్తి మరింత పెరిగింది. ఎన్నికల ఫలితాలపై సమీక్ష, భవిష్యత్తు వ్యూహంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుకు దారితీసినట్లు విశ్లేషిస్తున్నారు. మరోవైపు తిరుగుబాటు వర్గం పార్టీ గుర్తు, సంస్థాగత హక్కులపై కూడా పోరాటం కొనసాగిస్తోంది. ఈ అంశం ఎన్నికల సంఘం వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీపై తమకే అసలు హక్కు ఉందని తిరుగుబాటు నేతలు వాదిస్తుండగా, అధికారిక టీఎంసీ మాత్రం ఆ వాదనను ఖండిస్తోంది.ఈ పరిణామాలన్నింటి మధ్య మమతా బెనర్జీ పార్టీని తిరిగి బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టారు. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, సంస్థాగతంగా పార్టీని పునర్నిర్మించాలని నాయకులకు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో అసలు ప్రశ్న ఒక్కటే... వరుసగా సీనియర్ నేతలు పార్టీని వీడుతున్న వేళ మమతా బెనర్జీ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారు? అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై వస్తున్న విమర్శలకు పార్టీ ఎలా సమాధానం చెబుతుంది? ఈ అంతర్గత పోరు టీఎంసీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
రథయాత్ర వేళ.. భక్తిభావంలో ముంచెత్తే అద్భుత చిత్రాలు
ఒడిశాలోని పూరీలో గురువారం ప్రారంభమైన రథయాత్రకు లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. అణువణువునా భక్తి, విశ్వాసాలు తాండవిస్తున్నాయి. ఇదిలావుండగా జగన్నాథునికి ఒరియా సినిమాకు విడదీయలేని అనుబంధం ఉంది.దశాబ్దాలుగా ఒరియా చిత్ర పరిశ్రమలో జగన్నాథుని మహిమలను, భక్తుల విశ్వాసాన్ని చాటిచెప్పే సినిమాలు ఎన్నో వచ్చాయి. వాటిలో ఐదు విశిష్ట చిత్రాలు ఇవే..జై జగన్నాథ (2006)ఒడిశాలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక భక్తి చిత్రాలలో ఇది ఒకటి. లక్ష్మీ పురాణం ఆధారంగా సబ్యసాచి మహాపాత్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. విద్యపతి, బిమల అనే భక్తుల గాథను వివరిస్తుంది. కులమతాల కతీతంగా జగన్నాథ భక్తిని చాటిచెప్పిన ఈ సినిమా, పలు భాషల్లో విడుదలై జగన్నాథ చైతన్యాన్ని ప్రచారం చేసింది.హిసాబ్ కరీబా కలియా (1990)1990వ దశకంలో విడుదలైన ఈ చిత్రం, సామాజిక కథాంశంతో పాటు సామాన్యుల దైనందిన జీవితంలో జగన్నాథుని ఉనికిని ఎంతో చక్కగా ప్రతిబింబించింది. దీపనాథ్ మాస్టారుగా దేబు బోస్, ప్రతినాయకుడిగా దుఖీరామ్ స్వైన్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.మణిక (1976)జగన్నాథ స్వామికి సంబంధించిన ప్రసిద్ధ ‘కాంచీ అభియాన్’ గాథ, మణిక అనే పెరుగు అమ్మే పేద మహిళ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తంద్రారాయ్ ప్రధాన పాత్రలో నటించగా, జగన్నాథుని పాత్రలో గురుదత్ కనిపించి ఆధ్యాత్మిక లోతులను చూపించారు.శ్రీ జగన్నాథ (1950)ఒరియా చిత్ర పరిశ్రమలో చరిత్రాత్మక మైలురాయిగా ఈ సినిమా నిలిచింది. జగన్నాథుని సంస్కృతి, పురాణాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంతోనే చపలా నాయక్ (తర్వాతి కాలంలో పార్వతీ ఘోష్) బాలనటిగా పరిచయమయ్యారు.జగా హతరే పఘా (2015)తరంగ్ సినీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో అనుభవ్ మహంతి, ఝిలిక్ భట్టాచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. మురళీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, నేటి తరం భక్తులకు జగన్నాథునిపై ఉన్న విశ్వాసాన్ని మరోసారి గుర్తుచేసింది. రథయాత్ర వేళ భక్తి భావంతో నిండిన ఈ చిత్రాలు.. ఒడిశా సాంస్కృతిక వారసత్వాన్ని, జగన్నాథుని మహిమలను నేటికీ సజీవంగా ఉంచుతున్నాయి.ఇది కూడా చదవండి: ‘రెండో భారీ రథయాత్ర’లో అమిత్ షా మంగళహారతి
కుండంకుళం రియాక్టర్లో డేటా లీక్ కలకలం
భారత్లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాల్లో ఒకటైన కుండంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్కు సంబంధించిన డేటా లీక్ వ్యవహారం కలకలం రేపుతోంది. హ్యాకర్లు ‘వరల్డ్ లీక్స్’ డార్క్వెబ్లో వేల సంఖ్యలో పత్రాలను విడుదల చేసినట్లు వెలుగులోకి రావడంతో సైబర్ భద్రతపై మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. అయితే ఈ ఘటన వల్ల ఏం జరగలేదని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) చెబుతోంది. కుండంకుళం ప్రాజెక్టుకు(KKNPP) సంబంధించిన దాదాపు 19 వేల ఫైల్స్ (సుమారు 14.3 జీబీ డేటా) డార్క్వెబ్లో ప్రత్యక్షమైనట్లు సమాచారం. వీటిలో ఇంజినీరింగ్ డాక్యుమెంట్లు, కొన్ని డిజైన్లు, సరఫరాదారుల వివరాలు, తనిఖీ నివేదికలు, పరికరాల సమాచారానికి సంబంధించిన పత్రాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ డేటా అంతా నేరుగా కుండంకుళం అణు కేంద్రం నుంచి దొంగిలించిందా? లేదంటే దానికి సంబంధించిన ఓ కాంట్రాక్టర్ వ్యవస్థ నుంచి బయటకు వచ్చిందా? అన్నదానిపై దర్యాప్తు కొనసాగుతోంది.థర్డ్ పార్టీ సర్వర్ నుంచే లీక్?ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ సైబర్ దాడి కుండంకుళం ప్లాంట్ ప్రధాన వ్యవస్థలపై కాకుండా.. ఓ థర్డ్ పార్టీ సర్వర్పై జరిగినట్లు తెలుస్తోంది. కుండంకుళం యూనిట్లు 3, 4 నిర్మాణ పనుల్లో భాగస్వామిగా ఉన్న రిలయన్స్ గ్రూప్ సంస్థకు చెందిన డేటా.. ఓ థర్డ్ పార్టీ డేటా సెంటర్ సర్వీస్ ప్రొవైడర్ యొట్టా డేటా సర్వీసెస్ (Yotta Data Services) సర్వర్లో ఉన్నట్లు సమాచారం. ఆ సర్వర్లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించినట్లు యొట్టా తెలిపింది. ఇటు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తమ డేటాలో “పాక్షిక ఉల్లంఘన (partial breach)” జరిగినట్లు అంగీకరించి.. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. ([Reuters][2])అణు వ్యవస్థలు భద్రంగానే!డేటా లీక్ వార్తలతో అణు భద్రతపై ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ.. NPCIL కీలక వివరణ ఇచ్చింది. లీక్ అయినట్లు చెబుతున్న సమాచారం అణు భద్రత (nuclear safety), అణు రక్షణ (nuclear security) వ్యవస్థలకు సంబంధించినది కాదని స్పష్టం చేసింది. సాధారణ మౌలిక సదుపాయాలు, నిర్మాణ పనులకు సంబంధించిన సమాచారమే బయటకు వచ్చిందని పేర్కొంది. అంటే రియాక్టర్ నియంత్రణ వ్యవస్థలు, అణు ఇంధన నిర్వహణ వంటి అత్యంత కీలక విభాగాలు ప్రభావితం కాలేదని అధికారులు చెబుతున్నారు.హ్యాకర్ల లక్ష్యం ఏంటి?సైబర్ నిపుణుల ప్రకారం.. రాన్సమ్వేర్ దాడుల్లో హ్యాకర్లు సాధారణంగా సంస్థల నుంచి డేటాను దొంగిలించి.. డబ్బు డిమాండ్ చేయడం లేదంటే తమ సామర్థ్యాన్ని చూపించేందుకు సమాచారాన్ని బహిర్గతం చేయడం చేస్తుంటారు. అయితే కీలక మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఏ చిన్న సమాచారం బయటకు వచ్చినా.. భవిష్యత్ భద్రతా అంచనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల రంగంలోకి..ఈ ఘటనపై కేంద్ర సైబర్ భద్రతా సంస్థలు, సంబంధిత విభాగాలు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. లీక్ అయిన డేటా అసలు ఏమిటి? ఎంత మేరకు సున్నితమైన సమాచారం బయటకు వెళ్లింది? హ్యాకర్లు ఎలా యాక్సెస్ పొందారు? అనే అంశాలపై పరిశీలన జరుగుతోంది. సైబర్ భద్రత కొత్త సవాల్?అణు విద్యుత్ కేంద్రాలు దేశ భద్రతలో అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలు. గతంలోనూ ప్రపంచవ్యాప్తంగా అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు జరిగిన ఉదాహరణలు ఉన్నాయి. కుండంకుళం ఘటనలో రియాక్టర్ వ్యవస్థలు ప్రభావితం కాలేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. కీలక రంగాల్లో పనిచేసే సంస్థలు, కాంట్రాక్టర్ల డేటా భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.కుండంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (KKNPP) తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఉన్న భారతదేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాల్లో ఒకటి. భారత్–రష్యా సహకారంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో రష్యా తయారీ VVER-1000 ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం రెండు యూనిట్లు వాణిజ్య విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి.. ఒక్కో యూనిట్ సామర్థ్యం 1,000 మెగావాట్లు కాగా మొత్తం సామర్థ్యం 2,000 మెగావాట్లు. దేశ దక్షిణ గ్రిడ్కు కీలక విద్యుత్ వనరుగా ఉన్న ఈ ప్లాంట్.. భవిష్యత్లో మరిన్ని యూనిట్ల విస్తరణకు కూడా ప్రణాళికలు కలిగి ఉంది. అణు భద్రత, కఠినమైన నియంత్రణ ప్రమాణాలతో పనిచేసే ఈ కేంద్రం భారత ఇంధన రంగంలో అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది.తాజా సైబర్ ఎటాక్తో అణు కేంద్రం సురక్షితమేనా? అనే ప్రశ్నకు అధికారులు భరోసా ఇస్తున్నా.. సైబర్ దాడుల ముప్పు మాత్రం పెరుగుతున్న సంకేతాలు ఈ ఘటనతో మరోసారి స్పష్టమయ్యాయి.
గగన్యాన్ వేళ ఇస్రోకు షాక్.. రాజీనామాల కలకలం
చంద్రయాన్తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఇస్రోకు ఇప్పుడు మరో సవాల్ ఎదురైంది. గగన్యాన్ వంటి ప్రతిష్టాత్మక మిషన్లు ముందున్న సమయంలో.. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల రాజీనామాలు చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలపై అప్రమత్తమైన కేంద్రం.. కీలక సిబ్బంది ఎగ్జిట్పై కట్టడి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.ఇస్రోలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల నిష్క్రమణ అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఇస్రో వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. ఇటీవల కాలంలో 100 నుంచి 120 మంది వరకు శాస్త్రవేత్తలు సంస్థను వీడి ఉండొచ్చని సమాచారం. ముఖ్యంగా బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC), తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) నుంచి ఎక్కువ మంది నిపుణులు బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిలో ఉపగ్రహాలు, రాకెట్లు, మానవ అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన కీలక విభాగాల్లో పనిచేసిన శాస్త్రవేత్తలు ఉన్నట్లు సమాచారం.అప్రమత్తమైన కేంద్రంఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర అంతరిక్ష శాఖ (Department of Space) అప్రమత్తమైంది. గగన్యాన్ సహా దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణలపై కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు సమాచారం. ఇకపై ఇలాంటి దరఖాస్తులను సాధారణంగా ఆమోదించకుండా.. ఉన్నత స్థాయి పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఇస్రో కేంద్రాలకు సూచించినట్లు తెలుస్తోంది.ఇస్రో బలం కేవలం సాంకేతిక పరికరాలు కాదు.. వాటిని అభివృద్ధి చేసే శాస్త్రవేత్తల అనుభవం. ఒక రాకెట్ ప్రయోగం విజయవంతం కావడానికి వెనుక ఏళ్ల తరబడి సాగే పరిశోధనలు, వందలాది పరీక్షలు, ఎన్నో వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఉంటాయి. గగన్యాన్ మిషన్ ద్వారా భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. అంతేకాదు.. భవిష్యత్లో భారత అంతరిక్ష కేంద్రం, మరిన్ని చంద్ర అన్వేషణ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇలాంటి కీలక సమయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు బయటకు వెళ్లడం సంస్థకు సవాల్గా మారింది. నిపుణుల స్థానాల్లో కొత్త వారిని నియమించడం సాధ్యమే అయినా.. ఒక నిర్దిష్ట మిషన్పై సంవత్సరాల పాటు పనిచేసిన వారి అనుభవాన్ని వెంటనే భర్తీ చేయడం అంత తేలిక కాదు.నిష్క్రమణకు కారణం ఏంటంటే.. ఇస్రో నుంచి శాస్త్రవేత్తల నిష్క్రమణకు ప్రధాన కారణంగా ప్రైవేట్ స్పేస్ రంగం విస్తరణ కనిపిస్తోంది. గత కొన్నేళ్లలో భారత్లో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు పెరిగాయి. రాకెట్లు, ఉపగ్రహాలు, స్పేస్ టెక్నాలజీలపై పనిచేసే స్టార్టప్లు వేగంగా ఎదుగుతున్నాయి. ఇస్రోలో సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణులకు ఈ సంస్థల్లో అధిక వేతనాలతో పాటు కొత్త ప్రయోగాల్లో భాగస్వామ్యం, నిర్ణయాధికారం, కొన్నిసార్లు సంస్థల్లో వాటాల అవకాశాలు కూడా లభిస్తున్నాయి. దీంతో కొందరు శాస్త్రవేత్తలు కొత్త అవకాశాల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇస్రోలో ఉద్యోగుల సంఖ్య వేలల్లో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం సంఖ్య కాదు.. నాణ్యత. ఒక ప్రాజెక్ట్కు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త వెళ్లిపోతే.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కొత్త వ్యక్తికి సంవత్సరాల అనుభవం అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలోనే గగన్యాన్, ఇతర జాతీయ ప్రాధాన్యత కలిగిన మిషన్లలో పనిచేసే గ్రూప్-ఏ శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనలను నేరుగా కేంద్ర అంతరిక్ష శాఖ పరిశీలించేలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని స్థాయిల వరకు ఇస్రో కేంద్రాల డైరెక్టర్లకే రాజీనామాలు ఆమోదించే అధికారం ఉండేది. ఇప్పుడు కీలక మిషన్లకు సంబంధించిన సిబ్బంది విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.ఇస్రో చీఫ్ ఏమన్నారంటే.. శాస్త్రవేత్తల రాజీనామాలపై ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ స్పందిస్తూ.. సంస్థ నుంచి ఉద్యోగులు వెళ్లడం సాధారణ ప్రక్రియలో భాగమేనని, ఒకరి స్థానంలో మరొకరు బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నట్లు సమాచారం. అయితే కీలక ప్రాజెక్టులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.స్పేస్ రేసులో భారత్కు కొత్త పరీక్షఅంతరిక్షంలో భారత్ కొత్త చరిత్ర రాయడానికి సిద్ధమవుతున్న వేళ.. ఇస్రోలో కొనసాగుతున్న ఈ టాలెంట్ ఎగ్జిట్ను సంస్థ ఎలా ఎదుర్కొంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్రయాన్ విజయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఇస్రో.. ఇప్పుడు గగన్యాన్ వంటి చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ సమయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలను నిలుపుకోవడం సంస్థ ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది
ఎన్ఆర్ఐ
ఉద్యోగం లేదు, ఎలాంటి వేతనం లేదు..!దర్జాగా స్విట్జర్లాండ్లో..
ఎలాంటి ఆదాయం లేకుండా ఏ ఒక్క పని కాదు కదా..బయటికి కాలు కదపడం కూడా కష్టమే. అలాంటిది ఈ మహిళ ఏకంగా అత్యంత ఖరీదైన స్విట్జర్లాండ్ దేశంలో బేషుగ్గా బతికేస్తోందామె. కార్పొరేట్ ఉద్యోగం లేకుండా అలాంటి దేశంలో నివశించడం అంటే..అత్యంత హాస్యాస్పదం, నమ్మశక్యం కానీ విషయం. కానీ ఈ భారత సంతతి మహిళ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్న ఉదంతం వింటే..ఔనని అంగీకరిస్తారు. మరి ఆమె దాన్ని ఎలా సాధ్యం చేసిందంటే..భారత సంతతి మహిళ స్నేహ గౌర్ తాను కార్పొరేట్ ఉద్యోగం లేకుండా ఆరు నెలలపాటు స్విట్జర్లాండ్లో ఎలా గడపగలిగిందో పంచుకుంది. చాలామందికి ఆర్థిక భద్రత అనేది పూర్తికాలపు ఉద్యోగంతో ముడిపడి ఉంటుంది. కానీ ఒక భారతీయ కంటెంట్ క్రియేటర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశాలలో ఒకటైన స్విట్జర్లాండ్లో ఏ కంపెనీలో పనిచేయకుండానే ధీమాగా స్పెండ్ చేస్తోంది. అంతకుముందు తాను ఒక కార్పొరేట్ ఉద్యోగంలో నెలకు సుమారు రూ. 45,000 సంపాదిస్తున్నప్పటి నుంచి తన ప్రయాణం ప్రారంభమైందని అన్నారు. డిగ్రీ సంపాదించడం, జీతం తీసుకోవడం, ఉద్యోగం సంపాదించడం,తదుపరి ప్రమోషన్ పొందడం వంటివే అతిపెద్ద విజయాలుగా భావించానని చెప్పుకొచ్చింది. కానీ కాలక్రమేణ స్వేచ్ఛగా బతకడమే అసలైన జీవితం అని తెలిసి వచ్చింది. ముఖ్యంగా తాను ఎక్కడ నివశించాలో ఎంచుకునే స్వేచ్ఛ, ప్రయాణించే స్వేచ్ఛ, నచ్చిన విషయాలపై పనిచేసే స్వేచ్ఛ ఉంటేనే లైఫ్ అని గ్రహించానని అంటోందామె. అందుకే స్పానిష్ నేర్చుకోవడంపై పెట్టుబడి పెట్టి..చివరికి ఆ నైపుణ్యమే తన జీవిత గమనాన్ని మార్చేసిందని చెబుతోంది. ఆ భాష ఆమెకు స్పెయిన్కు వెళ్లడానికి, అంతర్జాతీయ అనుభవాన్ని పొందడానికి ఉపకరించిందని పేర్కొంది. అదే క్రమంగా ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అయ్యేందుకు అవకాశాలు కల్పించింది. ఏళ్ల తర్వాత ఆ నైపుణ్యాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నట్లు వెల్లడించింది. అలా క్రమంగా తన ఆదాయ మార్గాలను విస్తరింపచేయడంతో శాలరీపై ఆధారపడాల్సిన అవసరం రాలేదంటోంది. అందువల్లే తనకు స్విట్జర్లాండ్కు వెళ్లినప్పుడూ కంపెనీ జీతంపై ఆధారపడలేదని అంటోంది. జస్ట్ ఒక ల్యాప్టాప్, రిమోట్ టీమ్ సరిపోయాయని చెబుతోంది. కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది కేవలం ప్రమోషన్ కాదని అది ఒక నైపుణ్యం కూడా అంటూ పోస్ట్ని ముగించింది. అందుకు సంబంధించిన వీడియో తోపాటు క్యాప్షన్లో గౌర్ ఇలా రాసుకొచ్చారు. ‘ఆఫీసు లేదు.. బాస్ లేరు.. అనుమతి అంతకన్నా అవసరం లేదు’ అయినా స్విట్జర్లాండ్ హాయిగా నిద్రపోగలను అని రాసి మరి వీడియోని పోస్ట్ చేసింది. అలాగే తాను స్పెయిన్లో ఉన్నప్పుడే ఒక వ్యవస్థను రూపొందించుకున్నానని, అది తనకు నచ్చిన చోట నివశించే స్వేచ్ఛను అందించిందని తెలిపింది. నిజంగా సాధించదగిన స్వేచ్ఛ అంటే ఇదే అని చెబుతుండటం విశేషం. View this post on Instagram A post shared by Sneh Gaur (@snehgaur_) (చదవండి: 14 ఏళ్ల వయసులో టాయిలెట్ క్లీనింగ్.. ఇప్పుడేమో మార్స్ మిషన్కు లీడర్!)
సౌదీలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
రియాద్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని సౌదీ అరేబియా సెంట్రల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్ నగరంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా సెంట్రల్ కమిటీ కన్వీనర్ రబ్బానీ సయ్యద్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని కొనియాడారు. వైఎస్సార్సీపీ ఘన విజయం కోసం కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా కలిసికట్టుగా పని చేయాలో దిశా నిర్దేశం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘మావిగన్’ కార్యక్రమం గురించి రబ్బానీ సయ్యద్ ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మావిగన్’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రియాద్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన కరతాళ ధ్వనులు, ‘జై మావిగన్’ నినాదాలతో ఆడిటోరియం మార్మోగింది.ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులు సిరుమల సుబ్బారెడ్డి, పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి, కరీముల్లా బాషా షేక్, వెలంపాటి వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గొల్ల విజయ్, గానుగపెంట శ్రీకాంత్, సుభాన్ ఖాన్ పఠాన్, నాగినేని ఉదయ్ కృష్ణ చౌదరి, షేక్ షాదక్ వలి, కంది శశిధర్ రెడ్డితో పాటు వందలాది మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ జయంతి వేడుకలను విజయవంతం చేశారు.
YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో డా. వై.ఎస్.ఆర్ జయంతి వేడుకలు
ఫీనిక్స్, అరిజోనా : మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఘనంగా నిర్వహించింది. YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, YSRCP ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ చ ముఖ్యమంత్రి మాజీ సలహాదారు (విద్య) ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఎన్ఆర్ఐ వ్యవహారాలు) డాక్టర్ ప్రదీప్ చింతా గారు హాజరయ్యారు. డాక్టర్ వై.ఎస్కు పుష్పాంజలి ఘటించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం, ఆయన అద్భుతమైన జీవితం, దార్శనిక నాయకత్వం, ప్రజా సంక్షేమం పట్ల అచంచలమైన నిబద్ధతను తెలియజేస్తూ ఒక ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన జరిగింది.డా. వైయస్సార్తో తమ జ్ఞాపకాలను పలువురు పంచుకున్నారు. ఆయన వినయం, కరుణ, ధైర్యం, ప్రజా సేవ పట్ల అచంచలమైన అంకితభావాన్ని వారు గుర్తు చేసుకున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ను నిజమైన ప్రజానాయకుడు అంటూ ముఖ్య అతిథి ఆలూరు సాంబ శివారెడ్డి అభివర్ణించారు. సామాన్య పౌరులతో ఆయనకున్న అసాధారణ అనుబంధాన్ని, పరిపాలన పట్ల ఆయన అనుసరించిన పరివర్తనాత్మక విధానాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ నిరంతర సంక్షేమం, అభివృద్ధి కోసం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలను, దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలవాలని ఆయన కోరారు.ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఎన్నారై చాప్టర్లను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన జగనన్న టెక్ఫోర్స్ కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించారు. సాఫ్ట్వేర్ నిపుణులు మరియు ఎన్నారైల కీలక పాత్రను నొక్కిచెబుతూ, పార్టీ ప్రపంచవ్యాప్త విస్తరణ,భాగస్వామ్యానికి సభ్యులు చురుకుగా పాల్గొని, తమ వంతు సహకారం అందించాలని ఆయన ప్రోత్సహించారు.అలాగే ఆంధ్రప్రదేశ్లోని తమ కుటుంబ సభ్యులు , స్నేహితులలో అవగాహన కల్పించడం ద్వారా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో ఎన్నారైలు చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. ప్రతి అర్హతగల ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, నమోదు ప్రక్రియను సరిగ్గా పూర్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.ముఖ్య అతిథి డా. ప్రదీప్ చింత, దివంగత డా. వై.ఎస్. స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం మరియు శాశ్వత వారసత్వం గురించి ప్రస్తావించారు. ఆయన పదవీకాలంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ మరియు గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో అమలు చేసిన పరివర్తనాత్మక సంస్కరణల గురించి మాట్లాడారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న అణచివేతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు, ప్రజా చైతన్యానికి మద్దతుగా సోషల్ మీడియా వేదికల ద్వారా చురుకుగా పాల్గొనాలని ఎన్నారైలకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల SIR పథకంపై ఒక వాక్త్రూ సెషన్ను నిర్వహించారు. SIR పథకం కింద ఓటరు వివరాలను ధృవీకరించుకోవడానికి, గణన పత్రాలను సరిగ్గా పూరించడానికి అవసరమైన దశలవారీ ప్రక్రియను ఆయన వివరించారు. నిర్దేశించిన కాలపరిమితిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు తమ కుటుంబ సభ్యులకు, స్థానిక సమాజాలకు మార్గనిర్దేశం చేయాలని పాల్గొన్నవారిని ప్రోత్సహించారు.డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి కమిటీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ ఈ సమావేశం ముగిసింది. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆశించిన సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమ ఆధారిత పాలన అనే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి మద్దతు కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను వక్తలు నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అత్యంత ప్రియమైన నాయకులలో ఒకరికి ఈ కార్యక్రమాన్ని ఒక అర్థవంతమైన నివాళిగా మార్చడంలో పాల్గొన్న సభ్యులు, మద్దతుదారులు మరియు సామాజిక నాయకులందరికీ వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల, వంశీ ఏరువరం, చెన్నారెడ్డి మద్దూరి, సోమ శేఖర్ రెడ్డి యర్రపురెడ్డి, బోగారపు లక్ష్మీ & గురు, బలరాంరెడ్డి, శ్రీధర్ లక్కిరెడ్డి, రమేష్, శ్రీధర్ చెమిడ్తి, అంజిరెడ్డి, విఘ్నేష్, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగేష్పొర్లక్లు పాల్గొన్నారు. శిరసనంబేడు, సాయి రోహిత్ చెరుకుమిల్లి, శ్రవణ్, విష్ణు చొప్పా, విజయ్, ప్రవీణ్, ప్రక్ష్, పురంధర్, శివ కోడూరు, నాగరాజు దాసరి, ప్రక్షా, లోకనాధ్, అనిల్ ప్రవీణ్ అవుతారు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం ముగిసింది.
మహిళ హత్య కేసు: అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్యను హత్య చేసిన ఆరోపణలపై ఒక తెలుగు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లేవ్లోని ఒక అపార్ట్మెంట్ బాత్రూమ్లో భార్య మృతదేహం లభ్యమైన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.నిందితుడిని అవినాష్ నార్నె (30)గా గుర్తించారు. జూన్ 27న బెల్లేవ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, భార్య సబ్బినేని రజిత (27) మరణానికి కారణమైనందుకు ఫస్ట్-డిగ్రీ మర్డర్ నిందారోపణలు మోపారు. ప్రస్తుతం అతడికి కింగ్ కౌంటీ జైలులో 5 మిలియన్ డాలర్ల (రూ. 47 కోట్లకు పైగా) భారీ బెయిల్ విధించారు. 2025 అక్టోబర్ 27న బెల్లేవ్ డౌన్టౌన్లోని ఉడ్ల్యాండ్ కామన్స్ అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న బాత్రూమ్లో రజిత అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అధికారులు గమనించారు.వైద్య సిబ్బంది కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆమె అప్పటికే మరణించినట్లు తేలింది. ఆఫీసు నుండి వచ్చేసరికి భార్య బాత్రూమ్ ఫ్లోర్పై పడి ఉందని అవినాష్ పోలీసులకు తెలిపాడు. వీరిద్దరికీ 2025 జూన్లో పెద్దలు కుదిర్చిన వివాహం జరగ్గా, ఆ తర్వాతే ఈ అపార్ట్మెంట్కు మారారు. మొదట అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నివేదికలో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో దీనిని హత్యకేసుగా మార్చారు.సుదీర్ఘ దర్యాప్తులో ఎలక్ట్రానిక్ డోర్ లాక్ రికార్డులు, మొబైల్ డేటా, వాట్సాప్ సందేశాలను డిటెక్టివ్లు పరిశీలించారు. రజిత మరణించిన సమయంలో అవినాష్ మినహా మరెవ్వరూ అపార్ట్మెంట్లోకి ప్రవేశించలేదని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, అవినాష్కు భారతదేశంలో మరో మహిళతో సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో నిందితుడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు, డిజిటల్ ఆధారాల బట్టి అతడే ప్రధాన నిందితుడిగా నిర్ధారించి కోర్టులో హాజరుపరిచారు.
క్రైమ్
పెళ్లి పేరుతో.. పలుసార్లు శారీరకంగా దగ్గరయ్యాడు..!
తమిళనాడు: రెండేళ్ల పాటు ప్రేమించి ఆ తర్వాత పెళ్లికి యువకుడు నిరాకరించిన క్రమంలో ఓ ప్రైవేటు వైద్యశాల నర్సు ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జేజే నగర్ ప్రాంతానికి చెందిన దేవరాజ్ కుమార్తె జయలక్ష్మి(23). ఈమే నర్సుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో జయలక్ష్మి తిరువేలాంగాడు ప్రాంతానికి చెందిన యువకుడిని రెండు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో వివాహం చేసుకుంటానని నమ్మించి పలుసార్లు దగ్గరైనట్లు తెలిసింది. అయితే గత కొద్ది రోజుల నుంచి యువకుడు జయలక్ష్మికి దూరంగా వుండడంతో పాటూ వేరే యువతితో పెళ్లికి సిద్ధమైనట్టు సమాచారం. దీంతో జయలక్ష్మి తనను పెళ్లిచేసుకోవాలని ఘర్షణ పడింది. బుధవారం మరోసారి ఫోన్లో తననూ పెళ్లి చేసుకోవాలని కోరగా యువకుడు నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఉరికి వేలాడుతున్న యువతిని కిందకు దింపి వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కొత్తగూడెం మాతా శిశు కేంద్రంలో అమానవీయ ఘటన
చుంచుపల్లి: కొత్తగూడెంలోని ఎంసీహెచ్లో చేరిన నిండు గర్భిణి బాత్రూమ్కు వెళ్లే క్రమాన ప్రసవించింది. దీంతో బిడ్డ జారి కింద పడగా.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళన చేపట్టారు. జిల్లాలోని దమ్మపేటకు చెందిన గర్భిణికి నెలలు నిండడంతో బుధవారం కొత్తగూడెం ఎంసీహెచ్లో చేర్పించారు. ఈక్రమాన బెడ్ కేటాయించిన వైద్యులు... నొప్పులు వస్తే తమకు తెలిజేయాలని సూచించారు. కాసేపటికి ఆమె బాత్ రూమ్కు వెళ్దామని నిలుచునే క్రమాన నొప్పులు రాకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో కిందకు జారి పడింది. ఆ తర్వాత బ్లీడింగ్ అవుతుండడంతో ఆమె బంధువులు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ చేయగా సదరు గర్భిణి బెడ్ దిగుతుండగా నొప్పులు తెలియకుండానే డెలివరీ అయిందని.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా, స్థానికులు, కుటుంబ సభ్యులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కొంతసేపు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాతా శిశు కేంద్రంలో అమానవీయ ఘటనపురిటి నొప్పులతో వచ్చిన మహిళను పట్టించుకోని వైద్యులునిల్చున్న చోటే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..కిందపడడంతో శిశువుకు తీవ్ర గాయాలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ… pic.twitter.com/fcrgj0n6mq— Telugu Scribe (@TeluguScribe) July 16, 2026
రక్తపు మడుగులో భర్త, కొడుకు.. ఫోన్లో బిజీగా భార్య!
కర్ణాటకలోని ధార్వాడ్లో చోటుచేసుకున్న దారుణ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైద్యుడు ఇంట్లోనే హత్యకు గురి కాగా.. ఆయన ఎనిమిదేళ్ల కొడుకు ప్రాణాల కోసం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే.. ఈ కేసులో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. భర్త శవం, కొడుకు రక్తపు మడుగులో ఉండగా.. ఆ భార్య మాత్రం ఏం జరగలేదన్నట్లు ఫోన్ చూస్తూ తాపీగా కనిపించింది. ధార్వాడ్లోని బారాకోట్రి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ (45) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు కూడా తీవ్ర కత్తిపోట్లకు గురయ్యాడు. ప్రస్తుతం బాలుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో డాక్టర్ కిరణ్, ఆయన భార్య డాక్టర్ ప్రియాంక, వారి కుమారుడు మాత్రమే ఉన్నారు. భద్రత ఎక్కువగా ఉండే అపార్ట్మెంట్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించిన ఆనవాళ్లు ఇప్పటివరకు లభించలేదని హుబ్లీ-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపారు.ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో వెలుగులోకి..డాక్టర్ కిరణ్కు బంధువులు, స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఆయన భార్య ప్రియాంకను సంప్రదించగా.. ఆమె మొదట ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆ తర్వాత డ్యూటీకి వెళ్లారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె చెప్పిన సమాధానాలపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అపార్ట్మెంట్కు చేరుకున్నారు. అక్కడ ఓ గదిలో డాక్టర్ కిరణ్ రక్తపు మడుగులో పడి ఉండగా.. మరో గదిలో తీవ్ర గాయాలతో బాలుడు కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.Shocking, horrifying & ruthless. A woman allegedly killed her doctor husband & stabbed her 8yr old son inside their #Dharwad apartment. As the child lay in a pool of blood fighting for life, mother was scrolling through her phone. @compolhdc rescued the boy & shifted to hospital. pic.twitter.com/RL5GO9fzEV— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) July 16, 2026భార్యపై అనుమానాలు.. విచారణఘటన తర్వాత పోలీసులు డాక్టర్ ప్రియాంకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనాస్థలిలో ఆమె ఫోన్ చూస్తూ కనిపించిన దృశ్యాలు కూడా చర్చకు దారితీశాయి. అయితే హత్యకు సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యల తర్వాత ఆమె ప్రవర్తించిన తీరుతో మానసిక స్థితిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హత్యకు దారితీసిన పరిస్థితులు, దాడి జరిగిన సమయం, ఆయుధం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రముఖ వైద్య కుటుంబంలో విషాదండాక్టర్ కిరణ్ స్థానికంగా పేరున్న వైద్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన భార్య ప్రియాంక కంటి వైద్యురాలు. ఇద్దరూ వైద్య వృత్తిలో ఉండగా.. ఇంట్లోనే ఈ దారుణం చోటుచేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి, ఫోరెన్సిక్ నివేదికలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మరదలిపై బావ దాడి.. అడ్డొచ్చిన అత్తను నరికి చంపాడు..!
సాక్షి, చెన్నై: నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కోపంతో మరదలిపై ఓ యువకుడు కొడవలితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించినా అత్తపై కూడా విచక్షణారహితంగా విరుచుకుపడ్డాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనలో యువతి తల్లి ప్రాణాలు కోల్పోగా.. యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కరియాపట్టి తాలూకా కల్కురిచి గ్రామానికి చెందిన ముత్తుకుమార్, వినాయకజ్యోతి(45) దంపతులకు వర్ష(21) అనే కుమార్తె ఉంది. ముత్తుకుమార్ సోదరి కుమారుడు యువరాజన్(32)తో ఆమెకు వివాహం చేసేందుకు నిశి్చతార్థం చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లికి వర్ష నిరాకరించడంతో వివాదం మొదలైంది. బుధవారం ఉదయం తీవ్ర ఆగ్రహానికి గురైన యువరాజన్.. ముత్తుకుమార్ ఇంటికి వచ్చి వర్షతో గొడవకు దిగాడు. కోపం పట్టలేక తన వెంట తెచ్చుకున్న కొడవలితో వర్షపై దాడి చేశాడు. అదే సమయంలో కుమార్తెను రక్షించేందుకు వినాయకజ్యోతి అడ్డువెళ్లింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువరాజన్.. వినాయకజ్యోతిని దారుణంగా నరికేశాడు. ఇంతలో చుట్టుపక్కలవారు రావడంతో.. అతను పారిపోయాడు. ఘటనాస్థలంలోనే వినాయక జ్యోతి మరణించగా.. తీవ్ర గాయాలపాలైన వర్షను ఆస్పత్రికి తరలించారు. యువరాజన్ బుధవారం సాయంత్రం మల్లంగి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. అత్తను, మరదలి
వీడియోలు
ఆపరేషన్ అరుణారెడ్డి పై పోసాని మురళీ Exclusive Interview
ప్రభుత్వ లాంఛనాలు తీసుకోకపోతే ముద్రగడ ఫ్యామిలీపై కేసు పెడతారా..
బ్రేకింగ్: ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక.. పరిస్థితి ఉద్రిక్తం!
సోషల్ మీడియా కార్యకర్త శ్రీకాంత్ ఎక్కడ..?
న్యూజిలాండ్లో భూకంపం... సునామీ హెచ్చరిక జారీ
చనిపోయే ముందు రోజే ఆయన చెప్పిన నాలుగు మాటలు..
కనిగిరి పొగాకు రైతులకు అండగా దీక్ష.. మాస్ వార్నింగ్ బాబుకి
గుప్తేశ్వర్ గుహల్లో...సైన్స్ కు చిక్కని రహస్యం
పూరీ రథయాత్రలో తొక్కిసలాట
జగన్ 2.0 SUPER APP లాంచ్


