ఇరాన్ను లొంగదీసుకునేందుకు మరో మాస్టర్ప్లాన్!
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ఇరాన్పై తీవ్ర హెచ్చరికలు చేస్తూ.. మరోవైపు చర్చలకు తలుపులు తెరిచి ఉంచుతున్న ఆయన తీరు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. “ఇది యుద్ధం కాదు.. చెస్ గేమ్ లాంటిది” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన వ్యూహానికి అద్దం పడుతున్నాయి. సైనిక చర్యల కంటే ముందుగా ఆర్థిక ఒత్తిడి, ఆంక్షలు, దౌత్యపరమైన ఎత్తుగడలతో ఇరాన్ను చర్చల బాట పట్టించాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. ఇరాన్తో అమెరికా ప్రస్తుతం “పాక్షిక చర్చలు మాత్రమే” జరుపుతోందని ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. “ఇరాన్లో భారీ ద్రవ్యోల్బణం ఉంది. వారి వద్ద డబ్బు లేదు. మేం పరిస్థితిని గమనిస్తున్నాం” అని ట్రంప్ పేర్కొన్నట్లు అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ తెలిపింది.వెంటనే మరో సైనిక చర్యకు దిగకుండా.. ఇరాన్ ఆర్థిక పరిస్థితిని మరింత ఒత్తిడికి గురిచేసే విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.ఇటీవల ఇరాన్పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు మాట మార్చడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం వల్ల అమెరికాపై పడే ఆర్థిక, రాజకీయ ప్రభావాలను అంచనా వేసుకుంటూనే.. ఒత్తిడి ద్వారా ఫలితం సాధించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఓసారి దాడుల మాట.. మరోసారి చర్చల బాట!ట్రంప్ విదేశాంగ విధానంలో ఈ మార్పు కొత్తది కాదు. ప్రత్యర్థి దేశాలపై గరిష్ఠ ఒత్తిడి తీసుకురావడం.. ఆ తర్వాత చర్చలకు మార్గం సుగమం చేయడం ఆయన శైలిలో కనిపించే అంశం. ఇరాన్ విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు సైనిక శక్తిని ప్రదర్శిస్తూ హెచ్చరికలు చేయడం.. మరోవైపు చర్చలకు అవకాశం ఉందని చెప్పడం ద్వారా టెహ్రాన్పై మానసిక ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోందని అంచనాలు ఉన్నాయి.“ఇది చెస్ ఆట లాంటిది. చివరకు అంతా సర్దుకుంటుంది” అని ట్రంప్ చెప్పడం కూడా ఈ వ్యూహాన్నే సూచిస్తోంది. చమురు ధరలు తగ్గుతున్నాయని, దీంతో యుద్ధ ప్రభావం అమెరికా ప్రజలపై పెద్దగా పడటం లేదని ఆయన పేర్కొన్నారు.మారిన సమీకరణాలుఅమెరికా–ఇరాన్ వివాదం కొత్తది కాదు. ఇరాన్ అణు కార్యక్రమం చుట్టూ మొదలైన వివాదం.. ఆంక్షలు, చమురు ఎగుమతులు, ప్రాంతీయ ఆధిపత్య పోరు వరకు విస్తరించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ప్రధాన పట్టు హర్ముజ్ జలసంధిపై ఉంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గం ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.హర్ముజ్ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే అమెరికా ముందుగా నౌకాదళ ఆంక్షలు, చమురు ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ.. అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని, కానీ మధ్యవర్తుల ద్వారా చర్చలకు అనుకూల వాతావరణం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.అదసలు సాధ్యమేనా?ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి అమెరికాకు కొత్త వ్యూహం కాదు. దశాబ్దాలుగా అమలు చేస్తున్న ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. చమురు ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆంక్షలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేశాయి. అయితే ఇరాన్ను పూర్తిగా లొంగదీయడం మాత్రం అంత సులభం కాలేదు. ఆంక్షల మధ్య కూడా చైనా వంటి దేశాలకు చమురు విక్రయించడం, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు అనుసరించడం ద్వారా టెహ్రాన్ కొంతవరకు నష్టాన్ని భర్తీ చేసుకుంటోంది.అంటే.. ఆంక్షలు ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, అవి ఇప్పటివరకు ఆ దేశాన్ని పూర్తిగా అమెరికా షరతులకు తలొగ్గే స్థాయికి తీసుకురాలేదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ట్రంప్ ఆర్థిక ఒత్తిడితో పాటు దౌత్యపరమైన ఒత్తిడిని కూడా కలిపి ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది.ట్రంప్కు నెతన్యాహూ షాక్ఇదిలా ఉండగా.. గాజా అంశంలో అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ పూర్తిగా ఆయుధాలు పక్కన పెట్టేంత వరకు గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ ఉండదని నెతన్యాహూ స్పష్టం చేశారు. ఈ అక్టోబర్లో ఇజ్రాయెల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తన దేశ ప్రజల ముందు తాను కఠిన వైఖరినే కొనసాగిస్తున్నానని చూపించుకోవాల్సిన రాజకీయ ఒత్తిడి కూడా ఆయనపై ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.హౌతీల దాడులతో మరింత ఉద్రిక్తతమరోవైపు యెమెన్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని అల్-మఖా పోర్టుపై దాడి చేశారు. ఈ ఘటనలో కనీసం ఏడుగురు మరణించినట్లు సమాచారం. హౌతీల చర్యలు, హార్ముజ్ వివాదం, గాజా యుద్ధ పరిణామాలు కలిసి మధ్యప్రాచ్య పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి.ట్రంప్ వ్యూహం ఫలిస్తుందా?ఇరాన్తో ఘర్షణను పూర్తిస్థాయి యుద్ధంగా మార్చకుండా.. ఆర్థిక ఒత్తిడి, చర్చలు, వ్యూహాత్మక బెదిరింపులతో తన లక్ష్యాలను సాధించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. అణు కార్యక్రమం, చమురు ఆంక్షలు, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై రెండు దేశాల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ ఆడుతున్న ఈ ‘చెస్ గేమ్’లో ఇరాన్ చివరకు ఏ ఎత్తు వేస్తుంది? లేదంటే ఈ వ్యూహం మరోసారి పశ్చిమాసియా యుద్ధం అంచులకు తీసుకెళ్తుందా?.. రాబోయే రోజుల్లోనే తెలిసేది.
మొజ్తాబా ఖమేనీ ఎక్కడ?.. ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడుతుందా? ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో చుట్టుముడుతున్న అనుమానాల మధ్య ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మోజ్తబా ఖమేనీకి సంబంధించిన మరిన్ని వీడియోలు, ఫొటోలను త్వరలో విడుదల చేస్తామని వెల్లడించింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరోసారి అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.అసలు ఏం జరుగుతోంది?తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి అనంతరం మార్చిలో ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ.. అప్పటి నుంచి బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన తాజా, స్పష్టమైన దృశ్యాలు పెద్దగా బయటకు రాకపోవడంతో ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే, ఇటీవల ఇజ్రాయెల్ మీడియా సైతం మోజ్తబా ఖమేనీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందంటూ కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి వచ్చిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.‘త్వరలో మరిన్ని వీడియోలు’బసీజ్ ఆర్గనైజేషన్ డిప్యూటీ అధికారి ఖాసెమ్ ఖొరైషీ మాట్లాడుతూ.. మొజ్తాబా ఖమేనీ ప్రజల్లో ఉన్న దృశ్యాలు, వీధుల్లో పర్యటిస్తున్న వీడియోలు, సాయుధ దళాల కమాండర్లతో సమావేశాల దృశ్యాలను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న అనుమానాలు, విమర్శలకు సమాధానం చెప్పేందుకే ఈ దృశ్యాలను బయటకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.ఆగస్టు 9న ఓ వీడియో విడుదలఇప్పటికే ఆగస్టు 9న ఇరాన్కు చెందిన సెమీ-అధికారిక మెహర్ న్యూస్ ఏజెన్సీ ఖమేనీకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. అయితే ఆ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే విషయాన్ని వెల్లడించలేదు. వీడియోలో ఖమేనీ తన అనుచరులతో మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారనే సందేశాన్ని ఇవ్వడమే ఈ వీడియో ఉద్దేశంగా కనిపించింది.మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. జూలై 21న మోజ్తబా ఖమేనీతో తన సంప్రదింపులు క్రమంగా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. కానీ ఆగస్టు ప్రారంభంలో మాత్రం.. ఖమేనీతో కమ్యూనికేషన్ “చాలా కష్టంగా ఉంది” అని వ్యాఖ్యానించారు. ఈ రెండు భిన్న వ్యాఖ్యలు ఆయన వాస్తవంగా ఎంతవరకు ప్రభుత్వ వ్యవహారాల్లో చురుకుగా ఉన్నారనే ప్రశ్నలకు దారితీశాయి. కాగా, జూలై చివర్లో మసూద్ పెజెష్కియన్.. మొజ్తాబా ఖమేనీని కలిసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ సమావేశంలో సైనిక వ్యవహారాలతో పాటు విదేశీ మారకద్రవ్య నిర్వహణ, ఇంధన వినియోగం, అంతర్జాతీయ భాగస్వాములతో ఆర్థిక సంబంధాల వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.అందరి చూపూ ఆ వీడియోలపైనే!ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు ఇరాన్ ప్రభుత్వం మరిన్ని దృశ్యాలను విడుదల చేయనున్న నేపథ్యంలో.. ఆ వీడియోలు ఎప్పుడు చిత్రీకరించబడ్డాయి? ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన ఎంత చురుకుగా ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా.. ఇప్పటివరకు విడుదలైన వీడియోలు ఎక్కువగా తేదీ వెల్లడించనివే కావడంతో, కొత్తగా విడుదలయ్యే దృశ్యాలను అంతర్జాతీయ పరిశీలకులు నిశితంగా గమనించే అవకాశం ఉంది.
సింపుల్.. ఈ 7 టిప్స్ పాటిస్తే వందేళ్లు బతికేయొచ్చు!
మనిషి వందేళ్లు జీవించాలనే కల ఎప్పటినుంచో ఉంది. కానీ మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఆ కల అందరికీ సులభంగా నెరవేరడం లేదు. అయితే ఆరోగ్యంగా, చురుగ్గా శతాధిక వయసు దాటిన ఓ బామ్మ మాత్రం సుదీర్ఘ జీవితానికి పెద్ద పెద్ద రహస్యాలు అవసరం లేదంటోంది. రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లే ఆరోగ్యానికి పునాది అని బంగారు మాట చెబుతోంది.ఆమె వయసు 111 ఏళ్లు. ఇంకా ఆరోగ్యంగానే ఉంది. ఉత్సాహంగా, చురుగ్గా ఉన్న ఈ బామ్మ జీవన విధానం నెట్టింట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వయసు పెరిగినా.. శరీరాన్ని కదిలిస్తూ ఉండటమే తన ఆరోగ్య రహస్యమని ఆమె చెబుతోంది. అంతేకాదు.. తాను పాటించే ఏడు సూత్రాలే తన దీర్ఘాయుష్షుకు కారణమని చెబుతున్నారు. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం, పరిమితంగా ఆహారం తీసుకోవడం, ప్రశాంతమైన మనసుతో జీవించడం వంటి సాధారణ అలవాట్లే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అని ఆమె నమ్మకం.తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లోని రుగావో ప్రాంతానికి చెందిన వాంగ్ గైయింగ్ అనే ఈ బామ్మ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలిచారు. వందేళ్లు దాటిన వారి సంఖ్య ఎక్కువగా ఉండే ప్రాంతంగా రుగావోకు పేరుంది. ఐదు తరాల కుటుంబంతో కలిసి జీవిస్తున్న వాంగ్.. 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పొలాల్లో పనులకు సాయం చేసేవారు. వేరుశెనగలు, పుచ్చకాయల కోత వంటి పనుల్లో పాల్గొనేవారు.ప్రస్తుతం వయసు కారణంగా పనులు తగ్గించినా.. ఇంట్లో చిన్న చిన్న పనులు మాత్రం స్వయంగా చేసుకుంటారు. టేబుళ్లు తుడవడం, బట్టలు మడతపెట్టడం వంటి పనులను వ్యాయామంగా భావిస్తారు. “శరీరం కదులుతూ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది” అనేది ఆమె నమ్మకం.ఆహారంలోనూ అదే సూత్రంవాంగ్ ఎప్పుడూ కఠినమైన డైట్ను పాటించలేదు. అన్ని రకాల ఆహారాలను సమతుల్యంగా తీసుకోవడమే తన అలవాటు అని చెబుతారు. కుడుములు, ఆవిరితో ఉడికించిన బన్స్ వంటి సాధారణ ఆహారాలతో పాటు చేపలు ఆమెకు ఎంతో ఇష్టం. జీర్ణం కావడానికి సులభంగా ఉండటంతో చేపలను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఎంత ఇష్టమైన ఆహారమైనా అతిగా తినకూడదనేది ఆమె సూత్రం.కోపానికి దూరం.. ప్రశాంతతకు దగ్గరదీర్ఘాయుష్షుకు ఆహారం మాత్రమే కారణం కాదని వాంగ్ చెబుతారు. మంచి మనసు, ప్రశాంతమైన ఆలోచనలు కూడా ఎంతో ముఖ్యమని అంటారు. ప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలని ఆమెకు ఓ నియమం ఉంది. అది కుటుంబ సభ్యులను అభినందించడం కావచ్చు.. పాత స్నేహితుడికి ఓ మెసేజ్ పంపడం కావచ్చు. ఎవరితోనైనా గొడవ జరిగినా ఎక్కువసేపు ఆలోచిస్తూ బాధపడకుండా నిద్రపోతే ఉదయం అంతా సర్దుకుంటుందని ఆమె నమ్మకం.12 గంటల నిద్ర.. క్రమబద్ధమైన జీవనంవాంగ్ రోజువారీ జీవితం కూడా చాలా క్రమబద్ధంగా ఉంటుంది. రాత్రి 7 గంటలకే నిద్రకు వెళ్లి.. ఉదయం 7 గంటలకు నిద్ర లేస్తారు. మధ్యాహ్నం ఒకటి లేదా రెండు చిన్న కునుకులు కూడా తీసుకుంటారు. ఆమె జీవన విధానం చూస్తే.. దీర్ఘాయుష్షు కోసం ఖరీదైన పద్ధతులు, ప్రత్యేక మందులు అవసరం లేదని తెలుస్తోంది. శరీరాన్ని చురుగ్గా ఉంచడం, పరిమితంగా తినడం, ప్రశాంతంగా జీవించడం వంటి సాధారణ అలవాట్లే ఆరోగ్యకరమైన జీవితానికి బాటలు వేస్తాయని ఈ 111 ఏళ్ల బామ్మ చెబుతోంది. వయసు పెరగడం సహజం.. కానీ ఆరోగ్యంగా, ఆనందంగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించడం మన అలవాట్లపైనే ఆధారపడి ఉంటుందేమో!బామ్మ చెప్పిన జీవన రహస్యాల్లో ప్రధానంగా 7 పాయింట్లు.. 1. బద్ధకించకూడదుబద్ధకం ఏ వయసు వాళ్లకైనా మంచిది కాదు. వయసు పెరిగినా శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. ఇంటి పనులు కూడా ఒకరకంగా వ్యాయామమే!.2. బ్యాలెన్స్డ్ ఫుడ్సుదీర్ఘమైన ఆయుషు కోసం కఠినమైన డైట్ లాంటి వేవీ అక్కర్లేదు. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం.3.అతిగా తినకూడదుఇష్టమైన ఆహారం అయినా మితంగా తీసుకోవాలన్నది ఆమె సూత్రం.4. సులభంగా జీర్ణమయ్యే ఆహారానికి ప్రాధాన్యంఈ తరహా ఆహారం.. ఆరోగ్యానికి మంచివి5. మంచి మనసుతో జీవించాలిప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలన్నది ఆమె అలవాటు.6. కోపం, ఆందోళనకు దూరంగా ఉండాలిసమస్యలను ఎక్కువగా మదిలో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండటం.7. క్రమబద్ధమైన నిద్ర అలవాటురాత్రి త్వరగా నిద్రపోవడం, ఉదయం త్వరగా లేవడం.. మధ్యలో విశ్రాంతి తీసుకోవడం. అది ఏడు గంటలా?, 8 గంటలా? అనేది మీ ఇష్టం.కొసమెరుపు.. వాంగ్ గైయింగ్ నివసించే రుగావో ప్రాంతం దీర్ఘాయుష్షుకు పేరుగాంచింది. అక్కడ 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు గణనీయంగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ప్రాంతంలో 672 మంది శతాధికులు (100 ఏళ్లు దాటిన వారు) ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆ ప్రాంత ప్రజల జీవనశైలి, ఆహార అలవాట్లు, పర్యావరణ పరిస్థితులు దీర్ఘాయుష్షుకు కారణాల్లో ఒకటిగా పరిశోధకులు భావిస్తున్నారు.
సీజేఐ హైదరాబాద్ నల్సార్ ఈవెంట్పై ఉత్కంఠ!
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ప్రతిష్ఠాత్మక న్యాయ విశ్వవిద్యాలయం కాన్వొకేషన్కు ముఖ్య అతిథిగా ఆహ్వానించే ప్రతిపాదనపై విద్యార్థుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (NALSAR) చివరి సంవత్సరం విద్యార్థుల బృందం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వర్సిటీ యాజమాన్యాన్ని కోరింది.సీజేఐ చేతుల మీదుగా పట్టా తీసుకోవడం తమకు ఇష్టం లేదంటూ సుమారు 450 మంది విద్యార్థుల సంతకాలు చేసి కాలేజీ యాజమాన్యానికి సమర్పించారు. తమ అభ్యంతరం కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని.. రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, నిరసనలపై న్యాయవ్యవస్థ స్పందన వంటి అంశాలకు సంబంధించినదని వాళ్లు యాజమాన్యానికి చేసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. కాన్వొకేషన్ వేదిక తమ విశ్వవిద్యాలయ విలువలను ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.‘చలో సంసద్’ నిరసన నేపథ్యంలో..విద్యార్థుల అభ్యంతరానికి ప్రధాన కారణం.. జులై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘చలో సంసద్’ నిరసన సందర్భంగా పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్!. నీట్ పరీక్ష నిర్వహణ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ఆ సమయంలో పోలీసులు అతిగా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి.ఈ అంశంపై అత్యవసర విచారణ కోరుతూ జులై 22న సుప్రీంకోర్టులో ప్రస్తావించగా.. న్యాయస్థానం స్పందనపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను చూపించేందుకు ప్రయత్నించిన న్యాయవాదులకు తగిన అవకాశం ఇవ్వలేదని వారు తమ వినతిలో పేర్కొన్నారు.170 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారని, ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని విద్యార్థులు ప్రస్తావించారు. పౌరుల హక్కులు, పోలీసు అధికారాల పరిమితులపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేశారు.“మేం నేర్చుకున్న విలువలకు విరుద్ధం”..NALSAR విద్యార్థులు వీసీ, రిజిస్ట్రార్, అధ్యాపకులకు ఇచ్చిన వినతిపత్రంలో.. కాన్వొకేషన్ ముఖ్య అతిథిగా జస్టిస్ సూర్యకాంత్ ఎంపికను పునరాలోచించాలని కోరారు. “ప్రజల హక్కులు, న్యాయం అందుబాటులో ఉండటం, సమస్యలపై తర్కబద్ధమైన చర్చ” వంటి అంశాలను న్యాయ విద్యలో నేర్చుకున్నామని.. అలాంటి సమయంలో నిరసనకారుల ఆరోపణలపై స్పందన విషయంలో అసంతృప్తి ఉన్న వ్యక్తిని గౌరవ అతిథిగా ఆహ్వానించడం తమకు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. అయితే అసలు సీజేఐని ఈ ఈవెంట్కు నల్సార్ నిజంగానే ఆహ్వానించిందా?.. ఈ అంశంపై వర్సిటీ అధికారికంగా తుది నిర్ణయం ప్రకటించలేదు.మొన్న మహారాష్ట్రలోనూ..ఇదే సమయంలో మహారాష్ట్ర ముంబైలోని ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS)లోనూ జస్టిస్ సూర్యకాంత్ హాజరు కావాల్సిన కాన్వొకేషన్ కార్యక్రమం వాయిదా పడటం చర్చకు దారితీసింది. ఆగస్టు 2న జరగాల్సిన TISS 86వ కాన్వొకేషన్ను “అనుకోని పరిస్థితుల” కారణంగా వాయిదా వేస్తున్నట్లు యాజమాన్యం విద్యార్థులకు సమాచారం ఇచ్చింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అధికారికంగా కారణాలు వెల్లడించకపోయినా.. భద్రతా కారణాలు, సాధ్యమైన నిరసనలపై వచ్చిన సమాచారమే ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చన్న చర్చ మొదలైంది.కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావమా?జస్టిస్ సూర్యకాంత్కు సంబంధించిన గత వ్యాఖ్యలు, CJP ఉద్యమం నేపథ్యంలో ఈ పరిణామాలను పలువురు విశ్లేషిస్తున్నారు. గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ “కాక్రోచ్లు”, “పరాన్నజీవులు” వంటి పదాలు ఉపయోగించారనే ప్రచారం జరిగింది. ఆ వ్యాఖ్యలు నిరుద్యోగ యువతను ఉద్దేశించినవని కొందరు భావించగా.. తాను నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి వస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడానని జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఏర్పడింది. అనంతరం NEET పరీక్ష అంశంపై ఆ సంస్థ చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి.సౌరవ్ దాస్ ట్వీట్మరోవైపు నల్సార్లోకాక్రోచ్ల నిరసనపై సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఓ ట్వీట్ చేశాడు. అయితే గతంలోనూ ఆయన నల్సార్లో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండడంతో.. ఈ వ్యవహారం వెనుక సౌరవ్ హస్తం ఉందంటూ కొందరు విమర్శలకు దిగుతున్నారు.NALSAR student-lawyers with a spine. pic.twitter.com/rX0sDqDzhR— Saurav Das (@SauravDassss) August 9, 2026ఒకే అంశం.. రెండు పరిణామాలుహైదరాబాద్లో NALSAR విద్యార్థులు నేరుగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయగా.. ముంబైలో TISS కాన్వొకేషన్ వాయిదా చుట్టూ భద్రత, నిరసనల అంశం తెరపైకి వచ్చింది. ఒకవైపు న్యాయవ్యవస్థపై గౌరవం కొనసాగాలని భావించే వర్గాలు ఉండగా.. మరోవైపు పౌర హక్కులు, నిరసనలపై న్యాయస్థానాల స్పందనను ప్రశ్నించే కొత్త తరం విద్యార్థుల గొంతు వినిపిస్తోంది. కాన్వొకేషన్ వేదికలు కేవలం పట్టాలు అందించే కార్యక్రమాలేనా? లేదంటే రాజ్యాంగ విలువలపై చర్చ జరిగే వేదికలా? అనే కొత్త చర్చకు ఈ పరిణామాలు దారితీశాయి.
తమ్ముని అంత్యక్రియలకు వెళ్తూ అతీక్ కుమారుని వీరంగం!
ఫ్లాట్గా స్టాక్మార్కెట్ సూచీలు
ఐదేళ్ల వయసులోనే ఎంఎంఏ చాంపియన్.. ఎవరీ బుడ్డోడు!
నటుడు దర్శన్ కేసులో మరో సంచలనం!
‘ప్యూర్ పెట్రోల్ కావాలంటారా?’.. బీజేపీ ఎంపీ షాకింగ్ వ్యాఖ్యలు
బాలీవుడ్ నుండి సౌత్ సినిమా వరకు.. ‘ప్లాగరిజం’ వివాదాలు!
ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
నకులుడు... అశ్వశిక్షణలో మేటి
ఈ బిలియనీర్ దగ్గర చిరుద్యోగులూ సంపన్నులే!
‘అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’
చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి..! ఆఖరికి స్వలింగ సంపర్కుడైన కుమారుడి కోసం..
ఒకప్పుడు తోపు యాక్టర్.. ఇప్పుడు ఆటో డ్రైవర్!
పరిపాలన ప్రైవేట్కు ఇవ్వడం కుదర్దు వెళ్లవయ్యా.. వెళ్లు!
సాక్షి కార్టూన్ : 08-08-2026
సమంత తిండిగోల.. తల్లి కూతురి బర్త్ డే సెలబ్రేషన్
నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా
ఏదడిగినా.. అలా ఖాళీ జేబులు చూపిస్తున్నారు!!
హీరోగా హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
హెరిటేజ్ - విజయ డెయిరీ
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
సచిన్ మెరుపులు వృథా.. 240 టార్గెట్ హాంఫట్
ఉద్యోగుల సెలవుల్లో మార్పులు చేసిన యాక్సెంచర్
శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..
సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
‘వెండి’ మండిపోతుంది: కియోసాకి భారీ అంచనా
‘యముడు’ మూవీ రివ్యూ
మోదీతో తొలి భేటీ.. రాఘవ్ చద్దా ఎమోషనల్
ఈ రాశి వారికి ఆస్తి యోగం.. వస్తులాభం
త్రివిక్రమ్ మాతో మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తారంటే?
తమ్ముని అంత్యక్రియలకు వెళ్తూ అతీక్ కుమారుని వీరంగం!
ఫ్లాట్గా స్టాక్మార్కెట్ సూచీలు
ఐదేళ్ల వయసులోనే ఎంఎంఏ చాంపియన్.. ఎవరీ బుడ్డోడు!
నటుడు దర్శన్ కేసులో మరో సంచలనం!
‘ప్యూర్ పెట్రోల్ కావాలంటారా?’.. బీజేపీ ఎంపీ షాకింగ్ వ్యాఖ్యలు
బాలీవుడ్ నుండి సౌత్ సినిమా వరకు.. ‘ప్లాగరిజం’ వివాదాలు!
ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
నకులుడు... అశ్వశిక్షణలో మేటి
ఈ బిలియనీర్ దగ్గర చిరుద్యోగులూ సంపన్నులే!
‘అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’
చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి..! ఆఖరికి స్వలింగ సంపర్కుడైన కుమారుడి కోసం..
ఒకప్పుడు తోపు యాక్టర్.. ఇప్పుడు ఆటో డ్రైవర్!
పరిపాలన ప్రైవేట్కు ఇవ్వడం కుదర్దు వెళ్లవయ్యా.. వెళ్లు!
సాక్షి కార్టూన్ : 08-08-2026
సమంత తిండిగోల.. తల్లి కూతురి బర్త్ డే సెలబ్రేషన్
నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా
ఏదడిగినా.. అలా ఖాళీ జేబులు చూపిస్తున్నారు!!
హీరోగా హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
హెరిటేజ్ - విజయ డెయిరీ
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
సచిన్ మెరుపులు వృథా.. 240 టార్గెట్ హాంఫట్
ఉద్యోగుల సెలవుల్లో మార్పులు చేసిన యాక్సెంచర్
శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..
సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
‘వెండి’ మండిపోతుంది: కియోసాకి భారీ అంచనా
‘యముడు’ మూవీ రివ్యూ
మోదీతో తొలి భేటీ.. రాఘవ్ చద్దా ఎమోషనల్
ఈ రాశి వారికి ఆస్తి యోగం.. వస్తులాభం
త్రివిక్రమ్ మాతో మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తారంటే?
ఫొటోలు
హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
'టాక్సిక్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
'పాంచాలి పంచభర్తృక' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
హైదరాబాద్ లో ఘనంగా బోనాల పండుగ (ఫొటోలు)
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సారె సంబరం (ఫొటోలు)
విశాఖపట్నంలో అల్లు అర్జున్ సందడి (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16)
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు)
టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)
సినిమా
మూడు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగువి ఎప్పుడొస్తుంటాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. అలా మూడు నెలల క్రితం థియేటర్లలో రిలీజైన ఓ తెలుగు మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఇప్పుడు రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్)త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన మూవీ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. రైతుల నేపథ్య కథతో దీన్ని తీశారు. ఈ ఏడాది మే 15న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడం, కంటెంట్ కూడా ఓ మాదిరిగా ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు దీనిని ఈ శుక్రవారం(ఆగస్టు 14) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' విషయానికొస్తే.. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అరవింద్ (త్రిగుణ్).. తన జాబ్కి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగొస్తాడు. ఆ తర్వాత ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఫిక్స్ అవుతాడు. ఇందులో కొత్త పద్దతులు ప్రవేశపెట్టడమే కాకుండా రైతులు ఆదాయం పెంచడానికి 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' యాప్ తీసుకొస్తాడు. దీనితో రైతుల జీవితం ఎలా మారింది? మహి(పాయల్ రాధాకృష్ణ)తో అరవింద్ ప్రేమ సంగతేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కంటతడి పెట్టించే ప్రేమకథా సినిమా.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)
నటికి చేదు అనుభవం.. లేడీ ఫ్యాన్ అత్యుత్సాహం
హిందీలో మూడు నాలుగు సినిమాలు చేసిన నటి నిఖితా రావల్కి ఊహించని అనుభవం ఎదురైంది. తాజాగా ఓ కార్యక్రమంలోనే ఈమె ఫొటోలకు పోజులిస్తుండగా ఓ మహిళా అభిమాని వచ్చి సెల్ఫీ అడిగింది. ఈ క్రమంలోనే అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్)మిస్టర్ హాట్ మిస్టర్ కూల్, బ్లాక్ అండ్ వైట్, హీరో తదితర సినిమాల్లో నటించిన నిఖితా రావల్ మంచి డ్యాన్సర్గానూ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అయితే కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు. ఇప్పుడు అభిమాని ఈమెకు లిప్ కిస్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే బాలీవుడ్లో ఇలాంటివి నిజంగా జరగడం కంటే ఎక్కువగా పీఆర్ స్టంట్స్గా చేస్తుంటారు. తమ గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎలాంటి మూవీ ఛాన్సులు రాకపోతే ఏదో ఒకలా వైరల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. మరి నిఖితా రావల్ కూడా ఇలాంటి స్టంట్ ఏమైనా చేసిందా? లేదంటే నిజంగా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా)SHOCKING 😲 😱😭😲#NikitaRawal Forcefully Kissesd by her Female FAN . Or just a PR Gimmick ? pic.twitter.com/WJF8uuC4y5— Manoz Kumar (@ManozTalks) August 9, 2026
నటిగా కాదు.. భార్యగా ఆ ఛాన్స్ వదులుకున్నా: ఐశ్వర్య
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా 2014లో ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో దీపికా పాత్రకు ముందుగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ను సంప్రదించారట దర్శకురాలు ఫరాఖాన్. కానీ ఆ సమయంలో భర్త అభిషేక్ బచ్చన్తో కూడా నటిస్తుండటం, షారుఖ్తో ఎక్కువ కెమిస్ట్రీ సీన్లు ఉండటంతో ఆమె ఆ అవకాశాన్ని తిరస్కరించిందట.ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘‘ఆరాధ్య పుట్టిన తర్వాత సినిమాలకు కొంత విరామం తీసుకున్నా. ‘హ్యాపీ న్యూ ఇయర్’ చేసి ఉంటే మంచి కంబ్యాక్ అయ్యేది. నటిగా ఆ అవకాశాన్ని వదులుకోవడం అంత సులభం కాదు. కానీ భార్యగా ఆ నిర్ణయం తీసుకున్నా’’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా ఐశ్వర్య చివరిగా ‘పొన్నియిన్ సెల్వన్’లో కనిపించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా విషయానికి వస్తే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కింగ్’ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాలోనూ నటిస్తోంది.
బ్రో... రిలాక్స్!
తిట్టకుండా తిట్టినట్లు కౌంటర్ ఇచ్చారు మృణాల్ ఠాకూర్. అసలేం జరిగిందంటే... తన కన్నా వయసులో పదేళ్లు చిన్న అయిన స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్తో మృణాల్ డేటింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్త గురించి ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు. ‘‘బ్రో... రిలాక్స్. మేమిద్దరం ఎక్కడైనా జంటగా కనిపించామా? మీరు చూపించండి. చదువుకున్న మీలాంటివాళ్లు ఇలాంటి వదంతులు నిజం అని ఎలా నమ్ముతారు? దేశంలో ఎంతో జరుగుతోంది. జెన్ జీ నుంచి నేర్చుకుని, సరైన టాపిక్స్ మీద వీడియోలు చేయండి... అప్పుడు మీకు కావల్సినన్ని వ్యూస్ వస్తాయి’’ అని సోషల్ మీడియా వేదికగా మృణాల్ ఠాకూర్ స్పందించారు. ఇక ముంబైలోని ఓ కేఫ్ నుంచి మృణాల్, యశస్వి జైస్వాల్ విడి విడిగా వచ్చిన ఓ వీడియోను ఉద్దేశించి... ఈ ఇద్దరూ డేటింగ్ అనే వార్తను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తాజాగా మృణాల్ చేసిన కామెంట్కి నెటిజన్లు ఆమెకు మద్దతుగా ‘అబద్ధపు వార్తను ఎలా ప్రచారం చేస్తున్నారో? అసలు ఇద్దరు వ్యక్తులు ఒకే రోజు ఒకే రెస్టారెంట్కి వెళ్లకూడదా?’ అంటూ వదంతులు ప్రచారం చేస్తున్నవారిని ఉద్దేశించి కామెంట్ చేశారు.
క్రీడలు
సిరాజ్ సిక్సర్ల జోరు
కొలంబో: శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత బ్యాటర్లకు చక్కటి ప్రాక్టీస్ లభించింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 15 నుంచి రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనుండగా... దానికి ముందు నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఎలెవన్తో జరిగిన ఈ మూడు రోజుల పోరులో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్క్లాస్ హోదా లేని ఈ మ్యాచ్లో చివరి రోజైన ఆదివారం ఇరు జట్లు చెరో 45 ఓవర్ల చొప్పున బ్యాటింగ్ చేశాయి. మొదట శ్రీలంక 45 ఓవర్లలో 200/6 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నిషాన్ ఫెర్నాండో (73 బంతుల్లో 63; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా ... భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, గుర్నూర్ బ్రార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రధాన పేసర్లు మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 పరుగులతో కలుపుకొని భారత జట్టు ముందు 207 పరుగుల లక్ష్యం నిలవగా... టీమిండియా 45 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి గెలిచింది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (46 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకంతో మెరిశాడు. ఇక గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగని భారత రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (44; 7 ఫోర్లు) చక్కటి షాట్లు ఆడాడు. రిషబ్ పంత్ (28; 1 ఫోర్, 3 సిక్స్లు), ధ్రువ్ జురేల్ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఆఖర్లో సిరాజ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్లు) భారీ సిక్స్లతో విరుచుకుపడి జట్టును గెలిపించడం విశేషం. సిరాజ్ సిక్స్ల ‘హ్యాట్రిక్’ కేవలం ప్రాక్టీస్ కోసమే జరిగిన మ్యాచ్ కావడంతో... జట్టు విజయం కోసం పెద్దగా ప్రయత్నించలేదు. 44 ఓవర్లు ముగిసేసరికి భారత్ 191/4తో నిలిచింది. భారత్ విజయానికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం. అప్పటికే ఒక సిక్స్ కొట్టి క్రీజులో ఉన్న సిరాజ్... కేషారా నువాంతా వేసిన ఆఖరి ఓవర్ తొలి మూడు బంతులకు సిక్స్లు కొట్టడంతో భారత్ విజయం ఖరారైంది. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో లంక జట్టు మిగిలిన రెండు బంతులు కూడా వేసి నిర్ణీత 45 ఓవర్లు పూర్తి చేసింది. సుదర్శన్ స్థానంలో సర్ఫరాజ్గాయం కారణంగా శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు దూరమైన సాయి సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. 28 ఏళ్ల సర్ఫరాజ్ టీమిండియా తరఫున 6 టెస్టులు ఆడి 371 పరుగులు చేశాడు.
శివానికి రజతం... ఆరుశ్కు కాంస్యం
జైపూర్: జాతీయ సబ్ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో ఆదివారం తెలంగాణ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. గ్రూప్–2 బాలికల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో కర్రా శివాని రజత పతకం సొంతం చేసుకోగా... గ్రూప్–2 బాలుర 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లో ఆరుశ్ దాస్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. శివాని 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్ను 1 నిమిషం 01.28 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ధీవశ్రీ కేశవన్ (తమిళనాడు; 1ని:00.23 సెకన్లు) స్వర్ణం, ఇంద్రాణి మీనన్ (కేరళ; 1ని:01.66 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు. 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఫైనల్ను ఆరుశ్ 29.44 సెకన్లలో ముగించి మూడో స్థానం సంపాదించాడు. క్రిశివ్ దోషి (మధ్యప్రదేశ్; 28.36 సెకన్లు) స్వర్ణం... శ్లోక్ జాధవ్ (కర్ణాటక; 28.45 సెకన్లు) రజతం దక్కించుకున్నారు.ఆదివారంతో ముగిసిన ఈ పోటీల్లో ఓవరాల్గా శివాని కర్రా మూడు పతకాలు సాధించింది. అంతకుముందు శివాని 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లో రజత పతకం... 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో పసిడి పతకం కైవసం చేసుకుంది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి చెందిన గచ్చిబౌలి స్విమ్మింగ్ స్టేడియంలో కోచ్ ఆయుశ్ యాదవ్ వద్ద శివాని, ఆరుశ్ శిక్షణ తీసుకుంటున్నారు.
జంపింగ్లో డబుల్ ధమాకా
యుజీన్ (అమెరికా): నాలుగు దశాబ్దాల చరిత్రగల ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్ మూడోసారి తమ అత్యుత్తమ ప్రదర్శనను సమం చేసింది. ఆదివారం ఒకే రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. పురుషుల హైజంప్లో బసంత్ కుమార్ మేఘ్వాల్ రజత పతకం సాధించగా... పురుషుల లాంగ్జంప్లో షానవాజ్ ఖాన్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. పురుషుల జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్ రజత పతకం గెలిచిన సంగతి విదితమే. వెరసి ఈ మెగా ఈవెంట్లో భారత్ మొత్తం మూడు పతకాలు గెల్చుకుంది. 2021, 2022 ప్రపంచ అండర్–20 చాంపియన్షిప్లోనూ భారత్ మూడు పతకాల చొప్పున సాధించింది. ఆఖరిరోజు సోమవారం మహిళల హైజంప్ ఈవెంట్ ఫైనల్లో భారత అథ్లెట్ పూజా సింగ్ బరిలో ఉంది. పూజా పతకం గెలిస్తే భారత్ తొలిసారి నాలుగు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తుంది. ప్రస్తుతం ఆసియా అండర్–20 చాంపియన్గా ఉన్న 19 ఏళ్ల బసంత్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకాన్ని సంపాదించాడు. తద్వారా ప్రపంచస్థాయి అథ్లెటిక్స్ మీట్లో పతకం గెలిచిన తొలి భారతీయ హైజంపర్గా బసంత్ గుర్తింపు పొందాడు. బసంత్ 2.21 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. స్వర్ణం గెలిచిన యూనుస్ అయాచి (అల్జీరియా), కాంస్యం సాధించిన ఒటిస్ పూలే (బ్రిటన్) కూడా 2.21 మీటర్ల ఎత్తుకు ఎగిరారు. ముగ్గురూ 2.21 మీటర్ల ఎత్తుకు ఎగిరి సమఉజ్జీగా నిలిచారు. యూనుస్ తొలి ప్రయత్నంలోనే 2.21 మీటర్లను అధిగమించగా... బసంత్ రెండో ప్రయత్నంలో... ఒటిస్ మూడో ప్రయత్నంలో సఫలమయ్యారు. దాంతో యూనుస్కు స్వర్ణం ఖరారు చేయగా.. బసంత్కు రజతం, ఒటిస్కు కాంస్యం లభించాయి. రాజస్తాన్లోని గంగానగర్ జిల్లాకు చెందిన బసంత్ ప్రస్తుతం భారత నావికాదళంలో ఉద్యోగిగా ఉన్నాడు. బసంత్ తండ్రి గంగారాం డ్రైవర్గా, దినసరి కూలీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆసియా అండర్–20 చాంపియన్ అయిన షానవాజ్ ఖాన్ తనపై పెట్టుకున్న అంచనాలను వమ్ము చేయకుండా పతకంతో మెరిశాడు. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల షానవాజ్ 7.84 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. డేనియల్ లియోనారో ఇంజోలి (ఇటలీ; 7.97 మీటర్లు) స్వర్ణం... మేసన్ మెక్గ్రోడర్ (ఆస్ట్రేలియా; 7.96 మీటర్లు) రజతం గెలిచారు. షానవాజ్ తండ్రి నసీముద్దీన్ టాక్సీ డ్రైవర్గా పని చేసేవారు. 2018లో ఆయన క్యాన్సర్తో చనిపోయారు. తండ్రి మృతి చెందాక షానవాజ్ను అతని బాబాయిలు, క్రీడాకారులైన షారుఖ్, మొహమ్మద్ హాదీస్ దిశానిర్దేశం చేశారు. షారుఖ్ 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో జాతీయ చాంపియన్ కాగా, హాదీస్ మాజీ జావెలిన్ త్రోయర్. వీరిద్దరి స్ఫూర్తితో షానవాజ్ అథ్లెటిక్స్లో ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునే స్థాయికి ఎదిగాడు.
‘జో ఖేలేగా... వో ఖిలేగా’
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. కాగా అథ్లెట్లతో భేటీ అయిన వీడియోను ప్రధాని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘జో ఖేలేగా... వో ఖిలేగా’ (ఆటలు ఆడేవాళ్లు వికసిస్తారు) అంటూ అథ్లెట్లను అభినందించిన ప్రధానమంత్రి... దేశం కోసం ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కామన్వెల్త్ క్రీడల మహిళల 51 కేజీల బాక్సింగ్ విభాగంలో పసిడి నెగ్గిన సాక్షి మాట్లాడుతూ... ‘పతకాలు సాధించిన ప్లేయర్లను ప్రధాని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ భేటీని మేమంతా ఎంతో ఆస్వాదించాం’ అని పేర్కొంది. 2030లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది.
న్యూస్ పాడ్కాస్ట్
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
చంద్రబాబు పాలన రైతులకు హానికరం... చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ... వైఎస్ జగన్ ఆగ్రహం
అసత్య ప్రచారంలో ఆరితేరిన ఏపీ సీఎం చంద్రబాబు... రెండు మినహా హామీలన్నీ అమలు చేశానంటూ బుకాయింపు...
బీసీ నేతలపై రెడ్బుక్!. బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అక్రమ అరెస్టులు
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
ఏపీలో దగా డీఎస్సీపై దండయాత్ర... రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు విజయవంతం
బిజినెస్
ఖర్చులతో.. కళ్లుచెదిరే లాభాలు!
పొదుపు. భారతీయుల సంస్కృతి. పొదుపరి అంటే... అదో కిరీటం. వచ్చే ప్రతి రూపాయిలో కొంత దాచాకే మిగతాది ఖర్చుచేయాలనే పెద్దలు... నీళ్లు, కరెంటు వాడకంలోనూ ‘పొదుపుగా..’ అని చెబుతూనే ఉంటారు. అవసరం లేనివి కొనొద్దని, రుణాలు తీసుకోవద్దని... ఇదంతా కొన్ని తరాల పాటు సాగిన ఆర్థిక రీతి. కానీ... నేటి యువతరం ఈ కిరీటాలను కోరుకోవటం లేదు. నచ్చింది కొంటున్నారు. కావాల్సింది తింటున్నారు.కొంగొత్త అనుభవాలు, అప్పుడప్పుడు ఆడంబరాల కోసం అప్పులకైనా సై అంటున్నారు. ఈఎంఐలకు ఓటేస్తున్నారు. మొత్తంగా పొదుపు ఆధారిత భారత ఆర్థిక వ్యవస్థను ఖర్చులపై పరుగులు పెట్టే ఎకానమీగా మారుస్తున్నారు. దీన్లోని మంచిచెడ్డలను పక్కన బెడితే... ఈ మార్పు బోలెడన్ని కొత్త వ్యాపారాలను సృష్టిస్తోంది. ఈ ఖర్చును ఆదాయంగా మార్చుకుంటున్న కంపెనీలు వేగంగా ఎదుగుతున్నాయి. మరి ఆ కంపెనీలేంటో తెలుసుకోవటమెలా? దీర్ఘకాలంలో సంపద సృష్టించే అవకాశాలు ఎక్కడెక్కడున్నాయి? ఈ విశ్లేషణే మన ‘వెల్త్ స్టోరీ’...రమణమూర్తి మంథా టైటన్, డీమార్ట్, ట్రెంట్, జుబ్లియెంట్ ఫుడ్వర్క్స్, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్... భారతీయ ఇన్వెస్టర్లకు కాసులు కురిపించిన ఈ కంపెనీలు ఒక రంగానికి చెందినవేమీ కావు. కానీ ఇవన్నీ దిగ్గజాలుగా ఎదగటానికి కారణమైతే ఒకటే. పెరిగిన మన ఖర్చుల సంస్కృతి. ఎందుకంటే పాతికేళ్లకు ముందు మన ఆర్థిక సంస్కృతి వేరు. ఖర్చు చేసేదంతా ఇంటద్దె, తిండి, దుస్తులు, చదువు, వైద్యం వంటి మౌలికావసరాలకే. వాటిని దాటి మిగిలేది అంతంతే. అందుకనే అప్పట్లో ఎఫ్ఎంసీజీ, ఫుడ్ కంపెనీలు, సిమెంట్, ఉక్కు, సాధారణ బ్యాంకింగ్, టెక్స్టైల్ రంగాలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్లకు ఆకర్షణీయంగా కనిపించేవి. కానీ 2000 తరవాత పరిస్థితి మారింది. ఆర్థిక సంస్కరణలు ఐటీ ఐద్యోగాలను తెచ్చాయి. పెరిగిన జీతాలు ఖర్చుల కల్చర్ను మార్చాయి. మెరుగైన ఇళ్లు, కార్లు, ఏసీలు, స్మార్ట్ఫోన్లు, విదేశీ ప్రయాణాలు, ప్రీమియం విద్యపై జనం ఖర్చు పెంచారు. దీంతో ఆటోమొబైల్స్, హౌసింగ్ ఫైనాన్స్, వినియోగ వస్తువులు, పెయింట్లు, రిటైల్ చెయిన్ల కంపెనీలు సంపద సృష్టించాయి. 2020 తరవాత... ‘కొనటం కాదు.. అనుభవం ముఖ్యం’ అనే ధోరణి మొదలైంది. ఏది కొనాలి? బదులు... ఇది కొంటే ఏంటి? అనే ప్రశ్న మొదలైంది. హాలిడే ప్రయాణాలు, రెస్టారెంట్లు, జిమ్, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, ప్రీమియం హెల్త్కేర్, కచేరీలు, థీమ్పార్క్లు, ఎడ్వంచర్ టూరిజం పెరిగాయి. ఈ సంస్కృతి ఎంతలా విస్తరిస్తోందంటే .. గతంలో రూ.5 వేల ఖర్చుకే ఆలోచించే జనం... యూపీఐ, క్రెడిట్ కార్డ్లు, బీఎన్పీఎల్, తక్షణ రుణాలను విచ్చలవిడిగా వాడుతున్నారు. డబ్బు అతివేగంగా చేతులు మారుతోంది. నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, క్లౌడ్ స్టోరేజీ, మొబైల్ గేమ్స్, ఫిట్నెస్ సబ్ర్స్కిప్షన్లు, క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ, పెట్ కేర్, ఆర్గానిక్ ఫుడ్స్ వంటివి ఇప్పుడు నిత్యావసరాల జాబితాలోకి వచ్చేశాయి.ఇప్పుడు ఎక్కువ కొనటమే కాదు. ప్రీమియం వస్తువులు కొంటున్నారు. వస్తువులపైనే కాదు. సేవలపైనా వెచ్చిస్తున్నారు. బీమా, వెల్త్ మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లు, ఫైనాన్షియల్ సబ్ర్స్కిప్షన్లు కూడా ఖర్చుల్లో భాగం అవుతున్నాయి. ఆరోగ్యమనేది జీవనశైలిగా మారిపోయింది. విద్య అనేది ఏ దశలోనూ ఆగకుండా నిరంతరమైపోయింది. నిత్యావసరాలు పోను మిగిలే సొమ్ము పెరుగుతున్న కొద్దీ... మాల్స్, మల్టీప్లెక్స్లు, రిసార్ట్స్, కాన్సెర్ట్ల వంటి లీజర్ పరిశ్రమ విపరీతంగా విస్తరించింది. ఇదిగో... కొత్త ఎకానమీ డబ్బు కన్నా సమయానికే ఎక్కువ విలువిచ్చేవాళ్లు పెరగటంతో సౌలభ్య ఎకానమీ బాగా పెరుగుతోంది. 10 నిమిషాల్లో గ్రాసరీ డెలివరీ, తక్షణం పనిమనిషిని పంపే కంపెనీలు, హౌస్ క్లీనింగ్, క్లౌడ్ కిచెన్లు, ఇళ్ల నిర్వహణ సేవలకు ప్రాధాన్యం పెరుగుతోంది. పెంపుడు జంతువులపై ఇష్టం కూడా పెరుగుతుండటం కొత్త ఎకానమీని సృష్టిస్తోంది. డిజిటల్ సబ్ర్స్కిప్షన్లతో పాటు వృద్ధులు పెరగటం... వారి ఖర్చులు మారటం మరో తరహా ఎకానమీకి దారులు తెరుస్తున్నాయి. సీనియర్ హెల్త్కేర్, వృద్ధుల సహాయకులు, హోమ్ నర్సింగ్, వృద్ధుల వైద్య పరికరాలు, రిటైర్మెంట్ ఇళ్లు ఇవన్నీ దీనికి ఉదాహరణలు. ఇవన్నీ ఎందుకంటే... రిటైల్ ఇన్వెస్టర్లు ఇపుడు చూడాల్సింది ఏ షేర్ అయితే రెట్టింపు అవుతుంది? అని కాదు. మనవాళ్లు మరిన్ని లక్షల కోట్లను ఎక్కడ ఖర్చు చేయబోతున్నారు? అని. ఎందుకంటే దేనిపై ఎక్కువ ఖర్చుపెడితే ఆ రంగం లబ్ధి పొందుతుందన్నది కొత్త ఇన్వెస్టర్లకు సైతం అర్థమయ్యే అంశం. అందుకే ఏ రకమైన ఖర్చుల వల్ల ఎలాంటి రంగాలు లబ్ధి పొందుతాయో ఒకసారి చూద్దాం...మరి భవిష్యత్తేంటి? అమెరికా, జపాన్, చైనా వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే మన తలసరి ఆదాయం అసలు లెక్కలోకే రాదు. రూపాయల్లో చూస్తే అమెరికా 90 లక్షలు, జపాన్ 34 లక్షలు, చైనా 14 లక్షల వద్ద ఉండగా మన తలసరి ఆదాయం కేవలం 2.67 లక్షలు. కానీ ఆదాయాలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 15–20 సంవత్సరాల్లో ఖర్చుల ధోరణి బాగా మారనుంది. స్మార్ట్ ఇళ్లు– గృహోపకరణాలు, ఏఐ సబ్ర్స్కిప్షన్లు– వ్యక్తిగత డిజిటల్ అసిస్టెంట్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, వృద్ధుల సంరక్షణ సేవలు, అనుభవానికి ప్రాధాన్యమిచ్చే లగ్జరీ, డేటా– డిజిటల్ ఇన్ఫ్రా ఎకోసిస్టమ్ వంటివి భవిష్యత్ను శాసించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగని ప్రతి రంగంలోనూ వెల్త్ క్రియేటర్లు రాకపోవచ్చు. ఎందుకంటే వేగంగా ఎదుగుతున్న కంపెనీలైనా అప్పటికే బాగా పెరిగి ఉంటే మన పెట్టుబడికి తగిన రాబడి వస్తుందని చెప్పలేం. ట్రెండ్ను గుర్తించి, క్వాలిటీ స్టాక్స్ను దీర్ఘ కాలానికి సరైన ధరకు కొంటేనే స్టాక్ మార్కెట్ కుబేరులవుతారు. చివరిగా చెప్పేదొకటే. ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందిన ప్రతిసారీ అద్భుతమైన పెట్టుబడి అవకాశాలొస్తాయి. భారతదేశం కూడా వ్యవసాయ ఆధారితం నుంచి తయారీకి.. అక్కడి నుంచి సేవలకు మారుతూ వచ్చింది. తదుపరి అధ్యాయానికి పునాది పెరుగుతున్న ఖర్చుల సంస్కృతే కావచ్చు. ఆ ఖర్చుల సంస్కృతికి ప్రతినిధులైన ప్రధాన లిస్టెడ్ కంపెనీల వివరాలివిగో...
ప్రీస్కూల్ ఫీజు రూ.9 లక్షలు!.. ఎక్కడంటే?
ఈ రోజుల్లో స్కూల్ పీజులు ఎక్కువగా ఉంటాయని చాలామందికి తెలుసు. కానీ ప్రీస్కూల్ ఫీజు రూ.9 లక్షలు ఉంటుందంటే.. వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.అమెరికాలో పిల్లల ప్రీస్కూల్ చదువుకు ఎంత ఖర్చవుతుందో.. తెలిపిన ఓ భారతీయ మహిళ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని కనెక్టికట్లో నివసిస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్ సోనల్ చౌదరి.. తన రెండేళ్ల కుమార్తె బానీ కోసం ఓ ప్రైవేట్ ప్రీస్కూల్ను సందర్శించారు.అక్కడ పిల్లలకు ఎలాంటి విద్య అందిస్తారు?, ఫీజు ఎంత ఉంటుంది? అనే విషయాలను ఆమె తెలుసుకున్నారు. ఈ ప్రీస్కూల్లో కేవలం ఎనిమిది మంది పిల్లలకు ఇద్దరు టీచర్లు ఉంటారని సిబ్బంది తెలిపారు. పిల్లలకు పాటలు, యోగా, క్రియేటివ్ యాక్టివిటీస్, ఆటలతో పాటు వయసుకు తగ్గట్టుగా నేర్చుకునే కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు.అయితే.. ఫీజు గురించి తెలుసుకున్నప్పుడు సోనల్కు అసలు షాక్ తగిలింది. వారానికి రెండు రోజులు ప్రీస్కూల్కు పంపిస్తే ఏడాదికి సుమారు రూ.4 లక్షలు ఖర్చవుతుందట. అదే వారానికి ఐదు రోజులు పంపిస్తే ఏడాదికి దాదాపు రూ.9 లక్షలు చెల్లించాలి. అంటే ప్రీస్కూల్ పీజుతో.. మన దేశంలో కొత్త మారుతి బ్రెజ్జా కారు కొనుగోలు చేయొచ్చన్నమాట.ఇక్కడ తరగతులు సెప్టెంబర్ నుంచి జూన్ చివరి వరకు కొనసాగుతాయి. ఉదయం 8.45 గంటలకు ప్రారంభమై 11.45 గంటలకు ముగుస్తాయి. అంటే రోజుకు మూడు గంటల క్లాసులకే ఇంత భారీ మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఫీజు ఎక్కువగా ఉన్నప్పటికీ.. పిల్లలపై చూపించే వ్యక్తిగత శ్రద్ధ, తక్కువ మంది పిల్లలతో తరగతులు నిర్వహించడం, ప్రత్యేకమైన యాక్టివిటీస్ వంటి సౌకర్యాలను చూసిన తర్వాత ఆ ఫీజు ఎందుకు ఎక్కువగా ఉందో అర్థమైందని సోనల్ చెప్పారు.అమెరికాలో కిండర్గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్య సాధారణంగా ఉచితంగా ఉంటుందని సోనల్ పేర్కొన్నారు. దీంతో ప్రైవేట్ ప్రీస్కూల్ విద్య అమెరికా తల్లిదండ్రులకు పెద్ద ఖర్చుగా మారుతోందని తెలిపారు.సోనల్ వీడియో వైరల్ కావడంతో భారత్, అమెరికాలో విద్యా ఖర్చులపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పిల్లలకు చిన్న తరగతులు, ఎక్కువ శ్రద్ధ, ప్రత్యేకమైన కార్యక్రమాలు అందుతున్నప్పటికీ.. ఏడాదికి రూ.9 లక్షల వరకు ఫీజు చెల్లించడం మాత్రం చాలా కుటుంబాలకు పెద్ద భారమేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
కేటీఎం బైకుల ధరలు పెరిగాయ్.. కొత్త రేట్లు ఇవే!
కేటీఎం ఇండియా.. తన 160 డ్యూక్, ఆర్సీ 160 ధరలను పెంచింది. ఇందులో ఆర్సీ 160 ధర గరిష్టంగా రూ.15,000 పెరిగింది. అయితే.. వేరియంట్ను బట్టి, 160 డ్యూక్ ధర రూ.12,000 నుంచి రూ.13,000 మధ్య పెరిగింది.జీఎస్టీ రేట్లలో మార్పుల నేపథ్యంలో.. సెప్టెంబర్లో కేటీఎం ధరలను తగ్గించిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత, కేటీఎం తన బైకుల ధరలను పెంచింది. అయితే.. 350సీసీ వరకు ఇంజిన్ ఆప్షన్స్ కలిగిన ద్విచక్ర వాహనాలపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో, కంపెనీ చిన్న మోటార్సైకిళ్ల ధరలు తగ్గాయి.కేటీఎం 160 డ్యూక్160 డ్యూక్ స్టాండర్డ్ వెర్షన్ ధర గతంలో రూ.1.71 లక్షలు ఉండగా, ఇప్పుడు అది రూ.1.84 లక్షలకు చేరింది. దీంతో దీని ధర రూ.13,000 పెరిగింది. అధిక స్పెసిఫికేషన్లు గల TFT వేరియంట్ ధర రూ.1.79 లక్షల నుంచి రూ. 1.91 లక్షలకు పెరిగింది. అంటే దీని ధర రూ. 12,000 పెరిగిందన్నమాట.కేటీఎం ఆర్సీ 160ఆర్సీ 160 ధర రూ.15,000 పెరిగింది. ఈ ఏడాది జనవరిలో భారతదేశంలో రూ.1.85 లక్షలకు విడుదలైన ఈ ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్సైకిల్ ధర ఇప్పుడు రూ. 2 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. ఈ బైక్ 164.2 సీసీ ఇంజన్ను కలిగి.. 18.7 bhp పవర్, 15.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
బంగారం, వెండి ధరలు గత వారం రోజుల్లో భారీగా పెరిగాయి. ఇది వచ్చే వారం కూడా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం ఏమిటి?, ఎంతవరకు ధరలు పెరగనున్నాయి?, అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ద్రవ్యోల్బణ గణాంకాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న పాజిటివ్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1.57 లక్షలు, వెండి ధర కేజీ రూ.2.80 లక్షల వరకు చేరే అవకాశం ఉందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణుడు ప్రణవ్ మేర్ అంచనా వేశారు.దేశీయ మార్కెట్లో పసిడి ధరలు.. ఈ వారంలో దాదాపు 6 శాతం పెరిగి రూ.1.51 లక్షలకు చేరింది. వెండి రూ.2.49 లక్షలకు చేరింది. అమెరికా కార్మిక మార్కెట్.. అంచనాల కంటే బలహీనంగా ఉండటంతో.. అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కొంత సడలింపు చూపించే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి. దీంతో బంగారం, వెండిపై కొనుగోళ్లు పెరిగాయి. మరోవైపు డాలర్ బలహీనపడటం కూడా ధరలు పెరగడానికి కారణం అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. బంగారం ధర దాదాపు 7 శాతం పెరగగా.. వెండి ఏకంగా 10 శాతం వరకు ఎగబాకింది. వచ్చే వారం అమెరికా ఆర్థిక గణాంకాలతో పాటు అమెరికా - ఇరాన్ మధ్య పరిణామాలు కూడా కీలకం కానున్నాయి. పశ్చిమాసియాలో ఏదైనా అనూహ్య పరిణామం చోటుచేసుకుంటే బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలంటే.. ఎవరు ఏ వీసా తీసుకోవాలి?
ఫ్యామిలీ
తనలో తానే పాడుకున్న తత్త్వజ్ఞ!
‘మన మాటల్లో అత్యుత్తమమైనవి మనతో మనం చెప్పుకునేవే!’నన్నారు పోలిష్ రచయిత్రి ఓల్గ తొకార్చుక్. ‘మిగతా విషయాలెలా వున్నా, వాటిని ఎవరూ అపార్థం చేసుకోర’ని కూడా అన్నారామె. ఈ మాటలన్న మనిషి, ‘జైళ్ళు మన లోపలే వుంటాయి– బయట వుండవు; ఎటొచ్చీ మనలో చాలామందికి ఈ అంతర్గత కారాగారాల్లో ఎలావుండాలో తెలియదంతే!’ అనడంలో విడ్డూరమేముంది? అయినా, మానసిక చికిత్స పద్ధతుల్లో –క్లినికల్ సైకాలజీలో– పట్టా పొందిన ఓల్గా మాటతీరు మరోలా ఎందుకుంటుంది?ఆమె తల్లి వాండా, తండ్రి జోసెఫ్ ఇద్దరూ ‘పీపుల్స్ యూనివర్సిటీ’లో అధ్యాపకులే. వాస్తవానికి అది ఓ విశ్వవిద్యాలయం కాదు– హైస్కూల్ మాత్రమే. పోలండ్ వాయవ్య ప్రాంతంలోని శివారు నగరం మ్యేర్జిన్లో వుండే జానపద విజ్ఞాన కేంద్రాన్నే ‘పీపుల్స్ యూనివర్సిటీ’గా పిలుస్తారు. జెర్మన్ సరిహద్దులకు కొద్ది నిమిషాల దూరంలో ఉంటుంది మ్యేర్జిన్. పైగా, అప్పట్లో జోసెఫ్ ఆ స్కూల్ లైబ్రరీ కూడా నడిపేవాడు. అలా, చిన్న వయసు నుంచీ ఓల్గ ఆడుకున్నదీ– పాడుకున్నదీ పుస్తకాలతోనే!బాల్యంలో ఓల్గకు నచ్చిన పుస్తకం హెన్రిక్ సియెంకియేవిచ్ రాసిన ప్రేమకథ ‘క్వో–వాడిస్’. 1905లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న తొలినాటి రచయిత సియెంకియేవిచ్ రాసిన ఈ ప్రేమకథకే ‘ఎడారి–అడవి’ అనేది మరోపేరు. లాటిన్ భాషలో ఈ ప్రశ్నకు ‘ఎక్కడికి వెళ్తున్నావు?’ అనే అర్థం! నీరో చక్రవర్తి రోమ్ నగర రాజ్యాన్ని పాలించే రోజుల్లో జరిగిన ప్రేమకథగా ఈ నవలను రచించాడు సియెంకియేవిచ్. మరో 113 సంవత్సరాల తర్వాత ఓల్గ కూడా నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడానికి వున్న చారిత్రక నేపథ్యం ఇదన్నమాట. ఈ పరిసరాలే, రచయిత్రిగా ఆమె సొంత గొంతు సవరించడానికి అవసరమైన స్వరాన్నిచ్చాయి.పదహారేళ్ళ ప్రాయంలోనే కలంపట్టి కథనరంగంలోకి దిగింది ఓల్గ! అయితే యువరచయితలకు సహజమైన బెరుకు కారణంగా ఆమె ‘నతాషా బరోదిన్’ అనే మారుపేరును ఆశ్రయించారు. యువ రచయితల కోసం ఉద్దేశించిన ‘కాలిబాట’ అనే చిన్నపత్రికలో అచ్చయిన మొదటి రెండు కథలనూ ఆ పేరుతోనే ప్రచురించారామె. దాదాపు దశాబ్దకాలం ఓల్గ కథలూ కాకరకాయలూ పక్కన పెట్టి సైకో థెరపిస్టుగా ఉద్యోగం చేసుకున్నారు. అప్పట్లో ఆమె విస్తృతంగా కవిత్వం రాశారు; అనేక పత్రికల్లో ప్రచురించారు; విస్తారమైన గుర్తింపు కూడా పొందారు. అప్పట్లోనే ఆమె ఓ కవితా సంపుటి కూడా అచ్చు వేసుకున్నారు. మూడు పదుల వయసు దాటిన తర్వాత, 1996లో ఓల్గ ‘ఆదిమ యుగం– ఇతర యుగాలు’ అనే ప్రయోగాత్మక నవల రాసి పదిమంది దృష్టిలో పడ్డారు. ఈ నవలను ఓల్గ 60 ఖండికలుగా విభజించారు. ఈ ప్రయోగం జాతీయ స్థాయిలో కన్నా, అంతర్జాతీయ స్థాయిలో పెద్దపేరు తెచ్చుకుంది. ఈ పరిణామం వెనుక చిన్న నేపథ్యం లేకపోలేదు!ఇరవయ్యో శతాబ్ది చివర్లో పోలండ్ రాజకీయ– సామాజిక వ్యవస్థ సమూలమైన మార్పులకు గురైంది. అంతర్జాతీయంగా గొర్బచ్యేఫ్, జాతీయ స్థాయిలో పోలిష్ కార్మిక నేత వవుంజా (వలేజా) పరిచయం చేసిన భావాలే ఆ మార్పులకు ప్రాతిపదికలు. పోలండ్ సమాజంలో పడమటి గాలులు బలంగా వీస్తున్న పోకడ కనిపెట్టి ఎందరో సాహిత్యవేత్తలు తమ రంగు మార్చారు. ఎందుకైనా మంచిదని ఓల్గ తొకార్చుక్ కూడా వారిని అనుసరించారు. అలాంటి పెద్దల ప్రోత్సాహంతోనే ఆమె 1990 దశాబ్ది తొలినాళ్ళలో ఓల్గ కొన్నాళ్ళు ఇంగ్లండులో ఉండి, ఆంగ్లభాషా ప్రావీణ్యం సాధించారు. మరో అయిదేళ్ళ తర్వాత ఆమె రెండు స్కాలర్షిప్పులు సంపాదించి అమెరికాలోనూ– జెర్మనీ (బెర్లిన్)లోనూ రెండేళ్ళు గడిపి రావడం ఓల్గ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆనాటి నుంచీ ఆమెకి స్వదేశంలో కన్నా విదేశాల్లోనే ఎక్కువ గుర్తింపు దక్కుతూ వచ్చింది. 1999లో ఓల్గ ‘పోలిష్ పెన్ క్లబ్’లో చేరడంతో ఈ మార్పు పరిపూర్ణమైంది. 2014లో ఓల్గ రాసిన ‘ద బుక్స్ ఆఫ్ జేకబ్’ అనే సుదీర్ఘ నవల ఆమె రచనలన్నింట్లోకీ ఉత్తమమని విమర్శకులు అంటారు. పదిహేడో శతాబ్దానికి చెందిన జేకబ్ ఫ్రాంక్ అనే ‘అవతార పురుషుడి’ జీవితకథ నేపథ్యంగా రాసినదీ 900 పేజీల నవల. ఈ నవల రాయడానికి ఓల్గ ఏడేళ్ళపాటు పరిశోధన చేశారట! ఈ నవల రాయడానికి ఏడేళ్ళ ముందు, ఓల్గ ‘దిమ్మరులు’ అనే చారిత్రక నవల పోలిష్ భాషలో వెలువరించారు. ‘ప్రాచీన విశ్వాసులు’గా ప్రసిద్ధులైన ఓ క్రై స్తవ శాఖకు చెందిన సంచారజీవన సమూహాల కథనే ఈ నవలకు ఇతివృత్తంగా తీసుకున్నారు ఓల్గ. 116 ఖండికలుగా ఈ నవలను నిర్మించి ఓల్గ తన ముద్ర గట్టిగానే వేశారు. చిత్రమేమిటంటే, కొన్ని ఖండికలు, ఏకవాక్య నిర్మాణాలే! 2008లో నైకీ సాహిత్య పురస్కారం ఓల్గ రచనకు తొలిసారి దక్కింది.అమెరికన్ అనువాదకురాలు జెనిఫర్ క్రాఫ్ట్ దాని ఆంగ్లానువాదం వెలువరించే వరకూ ఓల్గ రచనకు అంతర్జాతీయ స్థాయిలో పెద్దగుర్తింపు దక్కలేదు (2018 మే నెల్లో ఓల్గ తొకార్చుక్– అమెరికన్ అనువాదకురాలు జెనిఫర్ క్రాఫ్ట్ మ్యాన్ బుకర్ బహుమతి సొమ్మును పంచుకున్నారు– అది అలా వుంచండి!) అదే సంవత్సరం అక్టోబర్లో ఓల్గ నోబెల్ సాహిత్యపురస్కారం గెల్చుకోవడానికి మ్యాన్ బుకర్ పురస్కారం ఎంతగానో సహకరించింది. ఈ రెండూ పురస్కారాలు దక్కిన తర్వాతనే, ఓల్గ రచనలకు అనేక భాషల్లో అనువాదాలు వెలువడ్డాయి. అయినా, నోబెల్ పురస్కారం పొందిన వాళ్ళ రచనలను సొమ్ముచేసుకునే సువర్ణావకాశాన్ని పెంగ్విన్ లాంటి వాణిజ్య ప్రచురణ సంస్థలు వదులుకుంటాయా?- మందలపర్తి కిషోర్
లెమనేడింగ్ ఏడో రుచి.. కష్టాలను తట్టుకునే శక్తి!
మానవాళికి ప్రకృతి షడ్రుచులను ప్రసాదించింది. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏడో రుచిని కనిపెట్టారు. ఆ ఏడో రుచి పేరే... ‘లెమనేడింగ్’! నిజానికి ఇది రుచి కాదు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని సరదాగా తీసుకుని... చేదు అనుభవాల నుండి తీపి అనుభూతులను పొందే జీవన విధానం. ఈ స్వభావం మానవుల్లో మునుపు లేదని కాదు. దాన్నిప్పుడు పరిశోధకులు ఉందని రూఢీగా వెల్లడించారు. చెడు కాలంలోనూ చెదరని గుండెతో ఉండటమే లెమనేడింగ్.‘‘జీవితం మీకు నిమ్మకాయలను ప్రసాదిస్తే, నిమ్మరసమే చేసుకుని తాగండి’’ : 20వ శతాబ్దపు ప్రముఖ అమెరికన్ రచయిత, తత్త్వవేత్త, వ్యాపారవేత్త ఎల్బర్ట్ హబ్బర్డ్ చెప్పిన మాట ఇది. 1909లో ‘లిటరరీ డైజెస్ట్’ అనే పత్రికలో ఎల్బర్ట్ ఇలా రాశారు : ‘విధి తనకిచ్చిన నిమ్మకాయలను తీసుకుని, వాటితో నిమ్మరసం వ్యాపారం మొదలుపెట్టేవాడే అసలైన మేధావి’ – అని. అప్పట్నుంచీ ఈ మాట పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులలో వాడుకగా వినిపిస్తోంది. నిమ్మరసాన్ని ‘లెమనేడ్’ అంటారు. కనుక ఇది ‘లెమనేడ్ ఫిలాసఫీ’ అయింది. తాజాగా అమెరికన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనలో లెమనేడ్ ఫిలాసఫీ మానవ జీవితానికి ప్రశాంతతను చేకూర్చే మాట నిజమే అని నిర్థారణ అవటం విశేషం!నవ్వుతూ బతకాలిరా..!జీవితాన్ని సరదాగా తీసుకునే అలవాటు వల్ల కష్టాలను తట్టుకునే శక్తి పెరుగుతుందట! కష్టాలు, అడ్డంకులు ఎదురైనప్పుడు మనుషులు ఆ పరిస్థితులకు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనం కోసం వారు కోవిడ్–19 సమయంలోని 503 మంది అమెరికన్ల ప్రవర్తన, వారి భావోద్వేగాలను పరిశీలించారు.ఈ పరిశీలనలో శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. జీవితాన్ని కాస్త సరదాగా, ప్రశాంతంగా తీసుకునే మనస్తత్వం ఉన్నవారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నిజాయితీగా అంగీకరిస్తూనే, భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని తేలింది. వీరు తమకు ఎదురయ్యే సవాళ్లకు త్వరగా అలవాటు పడటమే కాకుండా, రోజువారీ పనులను ఆనందంగా, ఆ పనుల్లో లీనమై మరీ చేయగలిగారు. ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే శక్తిని (రెజిలియన్స్) కనబరచారు.ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చుకుంటూ, సృజనాత్మకంగా ఆలోచిస్తూ, అనుకూలమైన ఫలితాల కోసం ప్రయత్నించే ఈ అలవాటుకు శాస్త్రవేత్తలు ‘లెమనేడింగ్’ అని పేరు పెట్టారు. అంటే ‘చేదు’ లాంటి కష్టాలను కూడా నిమ్మరసంలా తీపిగా/సానుకూలంగా మార్చుకోవడం. దీనినే ఇంకోలా చెప్పాలంటే – జీవితంలో మనకు ఏది ఎదురైతే దానినే, దాని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్వీకరించటం.చేదులోనే తియ్యని రుచి!జీవితాన్ని కాస్త సరదాగా తీసుకోవడం అంటే, మనం ఉన్న పరిస్థితిని తేలికగా తీసుకుంటున్నామని కాదు, ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి మనలో పెరుగుతోందని అర్థం అని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్–19 లాక్డౌన్ సమయంలో ప్రజల అనుభవాలను వీరు అధ్యయనం చేసినప్పుడు ఓ నిజం వెల్లడైంది. సరదా మనస్తత్వం ఉన్నవారు భవిష్యత్తు పట్ల సానుకూలంగా ఉంటూ, సమస్యలను చాలా చురుగ్గా, సృజనాత్మకంగా ఎదుర్కొన్నారు. అంటే, జీవితం వారికి చేదు వాస్తవాలను (నిమ్మకాయలు) ఇచ్చినప్పుడు, వారు వాటిని తీపి అనుభవాలుగా (నిమ్మరసం) మార్చుకున్నారు!దీనికి సంబంధించిన పరిశోధనా వ్యాసం ‘ఫ్రంటియర్స్ ఇన్ సైకాలజీ’ పత్రిక తాజా సంచికలో అచ్చయింది. ‘‘మా పరిశోధనలో తేలిందేమిటంటే సరదా మనస్తత్త్వం, మానసిక స్థైర్యం అనేవి ‘లెమనేడింగ్’ అనే భావన ద్వారా ఒకదానికొకటి చాలా బలంగా ముడిపడి ఉన్నాయి. కష్ట సమయాల్లో కూడా సానుకూల అనుభవాలను సృష్టించుకునే సామర్థ్యమే ఈ లెమనేడింగ్’’ అని వ్యాసకర్త, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ షియాంగ్యూ ‘షారన్’ షెన్ అంటున్నారు.‘‘పాండమిక్ (మహమ్మారి) సమయంలో సరదా మనస్తత్వం ఉన్నవారు, లేనివారు ఇద్దరూ ఒకే రకమైన భయాన్ని, ఒంటరితనాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉండే వ్యక్తులు ఆ కష్టతరమైన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పోగొట్టుకున్న వాటికి ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు, అడ్డంకులను ఎదిగే అవకాశాలుగా చూశారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఆ పరిస్థితికి ఎలా స్పందించాలన్న విషయాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకున్నారు’’ అని షెన్ తెలిపారు.‘లెమనేడింగ్’ పరిశోధన వెనుకడాక్టర్ షెన్, ఆమె సహచర శాస్త్రవేత్తలు మనుషుల సరదా మనస్తత్త్వం (ప్లేఫుల్నెస్) అనేది కష్ట సమయాల్లో జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి చాలా కాలంగా ఆసక్తితో చూస్తున్నారు. కోవిడ్ మహమ్మారి వారికి ఆ విషయాన్ని పెద్ద ఎత్తున పరిశోధించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇందుకోసం వారు అమెరికాలో నివసిస్తున్న 503 మంది వయోజనులను ఎంచుకుని, 2021 ఫిబ్రవరి (కోవిడ్ రెండవ వేవ్, వ్యాక్సిన్ ప్రారంభ సమయం) ఒక సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో పాల్గొన్నవారిని – కరోనా సోకుతుందేమో అనే భయం ఎంతవరకు ఉంది? పరిస్థితులు బాగుపడతాయని నమ్ముతున్నారా? వారికి ఇతరుల మద్దతు ఉందా? వారి భావోద్వేగాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటు, వారు ఎంత సరదాగా ఉంటారు? ఎంత స్పాంటేనియస్గా (సహజంగా / వెంటనే) స్పందిస్తారు? ఆనందంగా ఉండటానికి ఎంతవరకు ప్రయత్నిస్తారు? అనే అంశాల ఆధారంగా వారి సరదా మనస్తత్వాన్ని కొలిచారు.ఈ వివరాల ఆధారంగా శాస్త్రవేత్తలు, సర్వేలో పాల్గొన్న వారిని వారి సరదా మనస్తత్వ స్థాయిని బట్టి నాలుగు భాగాలుగా విభజించారు. సరదా మనస్తత్వం అనేది మనుషుల ఆలోచనలను, ప్రవర్తనను ఎలా మారుస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అత్యంత సరదాగా ఉండే మొదటి 126 మందిని, అసలు సరదా లేని చివరి 126 మందితో పోల్చి చూశారు.సానుకూల అవకాశాలపై దృష్టిఅత్యంత సరదాగా ఉండే వ్యక్తులు భవిష్యత్తు పట్ల చాలా ఆశావాదంతో ఉన్నారని, వ్యాక్సిన్ విజయవంతంగా అందుబాటులోకి వస్తుందని; జీవితం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని నమ్మారని ఈ పరిశోధన వివరాలు స్పష్టం చేశాయి. అయితే దీని అర్థం వారు అప్పటి పరిస్థితిని పట్టించుకోకుండా, ఊహల్లో బతికారనడం కాదు!‘‘అతిగా ఆశావాదంతో ఉన్నవారు వాస్తవాలను గుర్తించకుండా ప్రతిదీ బాగుందని భ్రమిస్తుంటారు. కానీ మేము గమనించిన ‘స్పాట్లైట్’ (దృష్టి) ప్రభావం అలా కాకుండా చాలా స్పష్టంగా ఉంది’’ అని డాక్టర్ షెన్ వివరించారు. ‘‘సరదా మనస్తత్వం ఉన్నవారు కోవిడ్–19 ప్రమాదాలను తేలికగా తీసుకోలేదు, అలాగని రక్షణ చర్యల ప్రభావంపై అతిగా అంచనాలూ వేసుకోలేదు. వారు తమ ‘స్పాట్లైట్’ ని కేవలం సానుకూల మార్పులు, మెరుగవటానికి ఉండే అవకాశాలపైకి మళ్లించారు. చీకటి లాంటి కష్టసమయాల్లో కూడా ముందుకు సాగే మార్గాలను వెలుగులోకి తెచ్చుకున్నారు’’ అంటారు షెన్.అధిక సరదా మనస్తత్త్వం కలిగినవారు ఆనందాన్ని వెతుక్కోవడానికి ఎక్కువ ఉత్సాహపడ్డారు, సంకోచించకుండా ఆలోచించారు. ఇది అనిశ్చిత పరిస్థితుల్లో కూడా అనేక సానుకూల అవకాశాలను ఊహించడానికి వారికి సహాయపడింది. దీనికి తోడు వారి ప్రవర్తనలో ఉన్న సరళత, పనుల్లో వారు చూపించే శ్రద్ధ.. కష్టాలను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని అందించాయి.చిన్న చిన్న మార్పులు చేసుకున్నారుపాండమిక్ సమయంలో ఇరు వర్గాల వ్యక్తులూ సమానంగానే ఒంటరితనాన్ని, భయాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉన్నవారు ఆ పరిస్థితులను తట్టుకోవడానికి సృజనాత్మక, క్రియాశీలక అడుగులు వేశారు. వారు వేరే ఏవో కొత్త వినోద కార్యక్రమాలలో పాల్గొనలేదు, కానీ తాము చేసే పనుల్లోనే సమయాలను మార్చుకోవడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం లేదా చురుగ్గా ఉండటానికి కొత్త మార్గాలు వెతకడం ద్వారా పరిస్థితులకు అనుగుణంగా మారారు. వారు తమ రోజువారీ జీవితంలో మరింత చురుగ్గా, ఆనందంగా, లీనమై గడిపారు.‘‘మా పరిశోధన సరదా మనస్తత్త్వాన్ని కొలవడంపైనే దృష్టి పెట్టినప్పటికీ, ఈ గుణాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని మార్గాలను పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, మీకు ఆనందాన్నిచ్చే పనుల్లో పాల్గొనండి, కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని నవ్వించే వ్యక్తులతో సమయం గడపండి. సరదాగా ఉండటానికి ఆటలే ఆడాల్సిన పనిలేదు. మన రోజువారీ క్షణాల్లో కాస్త ఆనందం, స్వేచ్ఛ, అనుకూలమైన ఆలోచనా విధానాన్ని తెచ్చుకుంటే చాలు’’ అని షెన్ చెబుతున్నారు. జీవితంలో సరదాలు ఉండాలి‘‘ముఖ్యంగా కష్టకాలంలో మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరదా మనస్తత్వం అనేది చాలా కీలకమైనది. కానీ చాలామంది దీని ప్రాముఖ్యతను గుర్తించరు’’ అని అంటారు షెన్. ‘‘సరదాగా ఉండే వ్యక్తులు.. కష్టాలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారో అర్థం చేసుకోవడం వల్ల, ఇతరులు కూడా ఒత్తిడిని, అనిశ్చితిని జయించే వ్యూహాలను రూపొందించవచ్చు. మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రపంచ స్థాయి సవాళ్లకు వాస్తవిక అంచనా, సృజనాత్మకమైన సర్దుబాటు రెండూ అవసరం కాబట్టి, ఈ విషయం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.అయితే, ఈ పరిశోధన ఫలితాలను ప్రతి పరిస్థితికీ లేదా అందరికీ ఒకేలా వర్తింపజేయలేమని షెన్, ఆమె సహచరులు హెచ్చరిస్తున్నారు. వేర్వేరు పరిస్థితుల్లో ఈ సరదా మనస్తత్త్వం వేర్వేరు వ్యక్తులపై భిన్నమైన ప్రభావం చూపవచ్చు. అలాగే, అత్యంత సరదాగా ఉండేవారికి, లేనివారికి మధ్య ఉన్న తేడాలన్నీ కేవలం ఈ ఒక్క గుణం వల్లే వచ్చాయని చెప్పలేము. ‘‘మనుషుల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను మేము గుర్తించినప్పటికీ, రోజువారీ సంఘటనలకు వారు ఎలా స్పందిస్తారనే దానిపై ప్రభావం చూపే ఈ సరదా మనస్తత్త్వం ఇతర పరిస్థితులకు కూడా (రోజువారీ కానివీ, వివిధ రంగాలకు చెందినవీ) వర్తిస్తుందని చెప్పలేం అని షెన్ పేర్కొన్నారు. ‘‘ఈ ‘సరదా ఆలోచనా విధానం’ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో మరింత పూర్తిగా అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో జీవితంలోని ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిశోధనలు జరపవలసి ఉంది’’ అని షెన్ అంటున్నారు. – సాక్షి స్పెషల్ డెస్క్- షియాంగ్యూ ‘షారన్’ షెన్, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్
సర్జికల్ మెనోపాజ్తో పెరిగే మూత్ర సంబంధ సమస్యలు!
సహజంగా మెనోపాజ్ వచ్చిన మహిళలతో పోలిస్తే... శస్త్రచికిత్స ద్వారా మెనోపాజ్ (సర్జికల్ మెనోపాజ్) వచ్చిన మహిళల్లో లైంగిక సమస్యలూ, మూత్ర సంబంధిత సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తాయని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. సర్జికల్ మెనోపాజ్ అంటే ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ ద్వారా అండాశయాలను తొలగించడం వల్ల వచ్చే మెనోపాజ్ అని అర్థం.మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోవడంతో... జననేంద్రియాలు, దిగువ మూత్రనాళ వ్యవస్థలో మార్పుల కారణంగా వచ్చే దీర్ఘకాలిక సమస్యలతో కూడిన సిండ్రోమ్ను ‘జెనిటో యూరినరీ సిండ్రోమ్ ఆఫ్ మెనోపాజ్’ (జీఎస్ఎమ్) అంటారు. సర్జికల్ మెనోపాజ్కు గురైన మహిళల్లో జీఎస్ఎమ్ లక్షణాలు చాలా ఎక్కువ తీవ్రతతో ఉన్నట్లు తేలింది. లైంగిక సమస్యల్లో యోని పొడిబారడం, కలయిక సమయంలో నొప్పి, కోరిక తగ్గడం, కలయిక తర్వాత రక్తస్రావం ప్రధానంగా కనిపించాయి.ఇక మూత్ర సంబంధ సమస్యల్లో మూత్ర విసర్జన సమయంలో నొప్పి కనిపించడం, తరచుగా లేదా అత్యవసరంగా మూత్ర విసర్జన చేయాలనిపించడం, మూత్రాన్ని అదుపులో ఉంచుకోలేక΄ోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ రావడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. సర్జికల్ మెనోపాజ్కు గురైన మహిళల తాలూకు ఇతర ఫిజికల్ పరీక్షల్లోనూ జీఎస్ఎమ్ తీవ్రతను సూచించే స్కోర్లు చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. (చదవండి: మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా?)
విమానం కాలిపోతోంది... కాపాడండి! అర్ధరాత్రి బాలుడి కేకలు..
1945 మార్చి 3 – జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని ఇవోజిమా ద్వీపం...రెండో ప్రపంచ యుద్ధం ఉద్ధృతంగా సాగుతున్న సమయం... అప్పుడే అమెరికాకు చెందిన యుద్ధ విమాన పైలట్ జేమ్స్ హూస్టన్– యుద్ధనౌక నుంచి టేకాఫ్కు సిద్ధమయ్యాడు.‘జాక్! ఈరోజు శత్రువుల పీచమణిచి విజయంతో తిరిగొస్తా. పార్టీ చేసుకుందాం’ అని తన సహచరుడికి చెప్పి ఇవోజిమా ద్వీపం వైపు దూసుకెళ్లాడు జేమ్స్ హూస్టన్. జపాన్ సేనలపై బాంబుల వర్షం కురిపించాడు. అయితే, జపాన్ సైన్యం చేసిన దాడిలో ఇంజిన్కు మంటలంటుకుని విమానం సముద్రంలో కూలిపోయింది. విమానంలో ఉన్న జేమ్స్ చనిపోయాడు.2000 ఏప్రిల్ 10 – అమెరికాలోని లూసియానాలో నివసించే బ్రూస్ లైనింజర్, ఆండ్రియా లైనింజర్ దంపతులు తమ రెండేళ్ల కుమారుడు జేమ్స్ లైనింజర్తో కలిసి ఎప్పటిలాగే నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆ బాలుడు గట్టిగా కేకలు వేశాడు.‘విమానం కాలిపోతోంది! మంటలు అంటుకున్నాయి! ఆ చిన్న మనిషి బయటకు రాలేకపోతున్నాడు... కాపాడండి!’ అంటూ అరిచాడు. దీంతో ఉలిక్కిపడ్డ అతడి తల్లిదండ్రులు జేమ్స్ను దగ్గరకు తీసుకుని బుజ్జగించి నిద్రపుచ్చారు. ఇక ఆ రోజు నుంచి వారికి నిద్ర కరువైంది. ప్రతిరోజూ రాత్రివేళ నిద్రపోతున్న బాలుడు ఉన్నట్టుండి గాల్లో కాళ్లు, చేతులు విసిరేస్తూ, ఊపిరి ఆడనట్లు విలవిలలాడిపోయేవాడు. చెమటలతో తడిసిపోతూ గట్టిగా కేకలు వేసేవాడు.వారంలో నాలుగైదు రోజులు ఇదే సీన్. మొదట్లో తల్లిదండ్రులు ఏదో పీడకల అనుకున్నారు. కానీ అంతకంతకూ ఆ చిన్నారి ప్రవర్తన విచిత్రంగా మారింది. బొమ్మ విమానాలతో ఆడుకుంటూ, వాటిని నేలకేసి కొడుతూ ‘విమానం క్రాష్ అయిపోయింది’ అని అరిచేవాడు.రోజులు గడిచేకొద్దీ ఆ చిన్నారి చెబుతున్న మాటలకు తల్లిదండ్రులు షాకయ్యేవారు. ఆ వయసు పిల్లలకు అస్సలు తెలియని ‘విమాన çపరిభాష’ గురించి జేమ్స్ మాట్లాడటం చూసి నిర్ఘాంతపోయేవారు. విమానం కింద ఉండే ‘డ్రాప్ ట్యాంక్’ గురించి, దాన్ని ఎలా డిస్కనెక్ట్ చేయాలో స్పష్టంగా చెప్పేవాడు. దీంతో ఒకరోజు తండ్రి బ్రూస్ తన కొడుకుని దగ్గరకు తీసుకుని నెమ్మదిగా ఆరా తీశాడు.‘నాన్నా, అసలు ఆ విమానం ఎక్కడి నుంచి ఎగిరేది?’ అని అడిగితే, ‘అది నటోమా అనే పెద్ద యుద్ధనౌక మీద నుంచి ఎగిరేది డాడీ’ అని బదులిచ్చాడు. ఆ చిన్న మనిషి ఎవరు నాన్నా అని ప్రశ్నిస్తే, ‘అది నేనే.. నా పేరు కూడా జేమ్సే’ అని సమాధానమిచ్చాడు. ‘నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా?’ అంటే.. ‘నా బెస్ట్ ఫ్రెండ్ జాక్ లార్సన్ నాతోనే ఉండేవాడు’ అని చెప్పాడు. ‘జపాన్ సైనికులు తన విమానం ఇంజిన్ పై దాడి చేసి కూల్చివేశారు. విమానానికి మంటలు అంటుకుని సముద్రంలో పడిపోయి చనిపోయాను’ ఆ పసివాడు కళ్లు పెద్దవి చేసి మరీ వివరించాడు.ఇదంతా పసివాడి ఊహాజనిత కథ అని నిరూపించాలని బ్రూస్ నిశ్చయించుకున్నాడు. సైనిక రికార్డులు, రెండో ప్రపంచ యుద్ధ పత్రాలను జల్లెడ పట్టాడు. అవి చూసిన తర్వాత ఆయన వెన్నులో వణుకు పుట్టింది.పసిఫిక్ మహాసముద్రంలో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పేరు యూఎస్ఎస్ నటోమా బే అని, ఆ నౌకపై జాక్ లార్సన్ అనే పైలట్ పనిచేశాడని, అప్పటికి ఆయన ఇంకా జీవించే ఉన్నాడని తెలుసుకున్నాడు.1945 మార్చి 3న జేమ్స్ హూస్టన్ జూనియర్ అనే 21 ఏళ్ల పైలట్ విమానంపై జపాన్ సైనికులు దాడి చేయడంతో అది సముద్రంలో కూలిపోయి అతడు మరణించాడని మిలిటరీ రికార్డులను బట్టి బ్రూస్ నిర్ధారణకు వచ్చాడు. ఈ నమ్మలేని నిజాలను ప్రత్యక్షంగా నిరూపించుకోవడానికి లైనింజర్ కుటుంబం– చనిపోయిన పైలట్ జేమ్స్ హూస్టన్ సోదరి యాన్ బారన్ దగ్గరకు వెళ్లింది. అప్పటికి వృద్ధురాలైన యాన్ బారన్ ను చూడగానే జేమ్స్– పరిగెత్తుకుంటూ వెళ్లి ‘అక్కా’ అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాడు. వారి చిన్నతనంలో ఆడుకున్న ఆటలు, హూస్టన్ ఇంట్లో ఉన్న బొమ్మల పేర్లు, కేవలం ఆ ఇద్దరికీ మాత్రమే తెలిసిన కుటుంబ విషయాలను పూసగుచ్చినట్లు చెప్పాడు.అవన్నీ విన్న తర్వాత ఆనందబాష్పాలతో యాన్ బారన్ అన్న మాట: ‘ఇతడు నా తమ్ముడు జేమ్స్ హూస్టన్... నా తమ్ముడే మళ్లీ పుట్టాడు’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అనంతరం అప్పటికి బతికి ఉన్న సహచర పైలట్ జాక్ లార్సన్ను కలిసినప్పుడు కూడా చిన్నారి జేమ్స్ ఆయనను గుర్తుపట్టి, నాటి యుద్ధ జ్ఞాపకాలను పంచుకున్నాడు.చిన్నారి జేమ్స్ లైనింజర్ కథ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియాను, పారాసైకాలజీ పరిశోధకులను ఆకర్షించింది. గత జన్మ వివరాలన్నీ చెప్పిన జేమ్స్... తను మరణించిన జపాన్ సముద్ర తీర ప్రాంతానికి వెళ్లి నివాళులర్పించాడు. అంతే, అప్పటి నుంచి అతడికి పీడకలలు రావడం ఆగిపోయాయి. శాస్త్రవేత్తలు, డాక్టర్లు దీనికి ఎటువంటి శాస్త్రీయ వివరణ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం సాధారణ యువకుడిలా జీవితం గడుపుతున్న జేమ్స్ లైనింజర్ కథ– ‘పునర్జన్మ’ ఉందనే నమ్మకానికి ప్రపంచంలోనే అత్యంత బలమైన, సజీవ ఆధారంగా ఉంది.- సత్యకిశోర్ కొండ్రెడ్డి
అంతర్జాతీయం
హార్మూజ్పై ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా తన బుద్ధిని మార్చుకోనంత వరకు హార్మూజ్ జలసంధిని తెరిచేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహ్మద్ బఘెర్ జొల్ఘాదర్ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనను ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది.‘అమెరికా ఇకపై ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరించే ప్రయత్నం చేయరాదు. ఇరాన్, ఈ ప్రాంతంలోని ఇరాన్ మిత్ర పక్షాలపై అమెరికా దాడులు మానుకోవాలి. ఇరాన్ నౌకాశ్రయాల నుంచి అమెరికా వైదొలగాలి. ఈ ప్రాంతం నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవాలి. ఇరాన్కు పూర్తి యుద్ధ పరిహారం చెల్లించాలి. ఆంక్షలను ఎత్తి వేయాలి. స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను బేషరతుగా విడుదల చేయాలి..’వంటి డిమాండ్లు కూడా ఆ ప్రకటనలో ఉన్నాయి.శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్ విభాగానికి జొల్ఘాదర్ కమాండర్గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించలేదు. తమ రెండు దేశాల మధ్య నుంచి వెళ్తున్న హార్మూజ్ జలసంధి ఉమ్మడి నిర్వహణపై ఒమన్తో ఒప్పందం తుది దశకు చేరుకుందని అంతకుముందు ఇరాన్ ప్రకటించింది.
క్షేమంగానే మొజ్తాబా ఖమేనీ?.. వీడియో హల్చల్!
టెహ్రాన్: ఇరాన్ సర్వోన్నత నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం, ఆచూకీపై ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ఇరాన్క చెందిన సెమీ-అఫీషియల్ మెహర్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన ఈ వీడియో, ఖమేనీ ఆరోగ్యం విషమంగా ఉందనే వదంతులను తిప్పికొట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది. Iran’s Mehr RELEASES VIDEO of Supreme Leader Mojtaba Khamenei for ‘FIRST TIME’ pic.twitter.com/v3Rp81VfLH— RT (@RT_com) August 8, 2026అయితే ఈ ఫుటేజ్ ఎప్పుడు రికార్డ్ చేసిందనే దానిపై స్పష్టత లేదు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులలో ఆయన తండ్రి అయతొల్లా అలి ఖమేనీ హత్య తర్వాత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మొజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. ఆయన కేవలం రాతపూర్వక ప్రకటనల ద్వారా మాత్రమే సమాచారాన్ని అందిస్తున్నారు. దాడుల సమయంలో ఆయన గాయపడ్డారని, ఆ తర్వాత రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారని చెబుతున్నారు.జూలైలో సౌదీ వార్తా సంస్థ అల్-హదత్ ఇజ్రాయెల్.. ఖమేనీ ఇరాన్లో లేరని తెలిపింది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ మాట్లాడుతూ, సర్వోన్నత నేతతో ప్రత్యక్ష సంబంధాలు ప్రస్తుతం చాలా కష్టంగా ఉన్నాయని అంగీకరించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమంగా లేదని ఇరాన్ అధికారులు కొట్టిపారేశారు.ఇది కూడా చదవండి: జపాన్ పర్యటనకు ఐఆర్సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ!
ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్.. కారణం ఇదే!
ఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం రాత్రి ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. కీలకమైన రంగాల్లో భారత్–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు గల అవకాశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. అదేవిధంగా, వాన్స్, ఉష దంపతులకు ఇటీవల కుమారుడు పుట్టిన సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్లో వెల్లడించారు.తుర్కియే, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు కీలకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వాన్స్ మోదీతో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. పరస్పర రక్షణ ఒప్పందంపై తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్లు సంతకాలు చేసిన కొద్ది రోజులకే ప్రధాని మోదీకి వాన్స్ ఫోన్ చేయడం గమనార్హం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వర్తకం, రక్షణ, ఇంధన భద్రత రంగాలలో భారత్-అమెరికాల సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక సంబంధాలను విస్తరించడంపై కూడా చర్చించారు."అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కీలక రంగాల్లో భారత్-యుఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై మేము చర్చించాం" అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారత అధికారిక ప్రకటన ప్రకారం.. భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిని ప్రధాని మోదీ, వాన్స్ సమీక్షించారు.ఉన్నత స్థాయి చర్చల్లో కొనసాగుతున్న పురోగతిని వారు ప్రస్తావించారు. వర్తకం, రక్షణ, సంక్లిష్ట, వర్ధమాన సాంకేతికతలు, ఇంధన భద్రత, కీలక ఖనిజాల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతంపై చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారని ప్రకటన తెలిపింది. అయితే, ఈ సంభాషణకు సంబంధించి అమెరికా అధికారిక వర్గాల నుంచి ఇంకా ఎలాంటి వివరాలు వెలువడలేదు. భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం గురించి ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందో లేదో స్పష్టత రాలేదు. ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరుతో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న ఆ దేశాలు.. ఏ దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణించనున్నాయి. ఈ కీలక రక్షణ ఒప్పందంపై ఆ దేశాలు సంతకాలు చేశాయి.పెరుగుతున్న భద్రతా ఆందోళనల వేళ ఈ ఒప్పందం మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాలలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా.. అది మిగతా అన్ని దేశాలపై జరిగిన దాడిగానే పరిగణనలోకి తీసుకోనున్నాయి. మూడు దేశాలలో ఏ ఒక్క దానిపై సాయుధ దాడి జరిగినా.. అది మూడింటిపై జరిగిన దాడిగానే భావిస్తారు. అలాగే మూడు దేశాల మధ్య రక్షణ సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను మరింత పెంపొందించడానికి ఇది తోడ్పడుతుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.
బాధ్యులను గుర్తించాలి
ఐక్యరాజ్యసమితి: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో శాంతిభద్రతల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై బలప్రయోగం, కాల్పులకు దిగడం వంటి చర్యలకు పాల్పడిన వారిని తప్పనిసరిగా గుర్తించాలని స్పష్టం చేసింది. పీవోకేలో జరుగుతున్న పరిణామాలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని ఆయన ప్రతినిధి ఫర్హాన్ హక్ వెల్లడించారు. ఈ విషయంలో ఐరాస మానవ హక్కుల కమిషనర్ వోల్కర్ టర్క్ వెలిబుచ్చిన అభిప్రాయాలను ఆయన పూర్తిగా సమర్థిస్తున్నారన్నారు. జమ్మూ కశ్మీర్తోపాటు లద్దాఖ్లోని ప్రాంతాలన్నీ తమ భూభాగంలోనివేనని, ఇందులో కొంతభాగాన్ని పాక్ సైన్యం చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుని, తిష్ట వేసిందంటూ భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో వాదిస్తోంది. పీవోకేలో హింసాత్మక ఘటనలను అంశాన్ని ఆగస్ట్ 4న ఐరాసలోనూ ప్రస్తావించింది. ఇందుకు పాక్ ప్రభుత్వానిదే బాధ్యతని ఆరోపించింది.కాల్పుల్లో 400 మంది మృతిపీవోకే అసెంబ్లీలో వలసదారులకు 12 సీట్లను రిజర్వు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలు ఉద్యమ గ్రూపులతో కూడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జాక్) వరుస ఆందోళనలు కొనసాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడి, తమకు నచ్చిన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో జాక్ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నిరసనలను అణచివేసేందుకు సైన్యం తీవ్రంగా ప్రయత్నించింది. సైన్యం జరిపిన కాల్పుల్లో 40 మంది చనిపోయారు. తాము జూన్ మొదటి వారం నుంచి సాగిస్తున్న ఆందోళనలపై పాక్ బలగాలు సాగించిన దమనకాండ ఫలితంగా కనీసం 400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాక్ ఆరోపిస్తోంది. పీవోకే జరుగుతున్న ఘటనలపై జూలై 17వ తేదీన వోల్కర్ టర్క్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. జాక్పై పాక్ ప్రభుత్వం నిషేధం విధించడం, పలువురు నేతలను అరెస్ట్ చేయడం, నిరసనకారులపై కాల్పుల ఘటనలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలంటూ ఆయన పాక్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై శుక్రవారం ఫర్హాన్ హక్ జెనీవాలో మాట్లాడుతూ.. ‘శాంతియుత నిరసనలను ప్రభుత్వాలు అనుమతించాల్సిందే. ఇందుకు ఏ ఒక్కరికీ, ఏ దేశానికీ మినహాయింపు లేదు. పీవోకేలో హింసాత్మక చర్యల విషయంలో పాకిస్తాన్కూ ఇదే వర్తిస్తుంది. కాల్పులు, ఇతర తీవ్ర చర్యలకు కారకులను పాక్ ప్రభుత్వం గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి’అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆ ఘటనలపై సంపూర్ణ, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలన్నారు.
జాతీయం
మెట్రోలో అమ్మాయిలకు అంకుల్ చేతిలో భయానక అనుభవం
న్యూఢిల్లీ: మెట్రోలో ప్రయాణిస్తున్న పలువురు అమ్మాయిలకు ఓ మధ్య వయస్కుడైన వ్యక్తి చేతిలో భయానక అనుభవం ఎదురైంది. తమను ఆ వ్యక్తి రహస్యంగా వీడియో తీస్తున్నాడని ఇద్దరు యువతులు గుర్తించారు. లోక్ నాయక్ భవన్ మెట్రో స్టేషన్ వద్ద, గ్రీన్ పార్క్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్టు సమాచారం. యువతుల్లో ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. తమ సమీపంలో కూర్చున్న ఆ వ్యక్తి తమకు తెలియకుండా ఫొటోలు తీస్తున్నాడనే అనుమానం వచ్చింది.తాము గమనించామని అతనికి తెలిసిన తర్వాత కూడా తమ వైపే చూస్తూ ఉండటంతో పరిస్థితి మరింత అసౌకర్యంగా మారిందని ఆమె ఆరోపించారు. దీంతో మహిళలు అతడిని నిలదీసి, ఫోన్ చూపించాలని కోరారు. తమ ఫొటోలు తీయలేదని అతడు చెప్పాడు. అయితే వారు చూస్తుండగానే తన ఫోన్లోని చిత్రాలు, వీడియోలను తొలగిస్తున్నట్టు కనిపించాడు.ఆ తర్వాత ఫొటోలు తొలగిపోయాయని భావించి వారికి ఫోన్ చూపించాడు. అయితే మహిళలు తర్వాత ఫోన్లోని రీసైకిల్ బిన్ను పరిశీలించగా, అందులో వీడియో కనిపించింది. అనుమతి లేకుండా ఎవరి ఫొటోలు లేదా వీడియోలు తీయడం సరికాదని ఆ యువతులు అతడికి చెప్పారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియోను తర్వాత ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, అది విస్తృతంగా దృష్టిని ఆకర్షించింది.“మహిళలు నిజంగా సురక్షితమేనా?” అనే శీర్షికతో ఆ వీడియోను పోస్ట్ చేశారు. అనేక మంది సామాజిక మాధ్యమ యూజర్లు ఆ వ్యక్తి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ ప్రయాణాల్లో మహిళలు ఇలాంటి అసౌకర్యకర పరిస్థితులను ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రశ్నించారు. అనుమతి లేకుండా అపరిచితుల ఫొటోలు తీసే లేదా వీడియోలు రికార్డు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు కోరారు. View this post on Instagram A post shared by praveenya (@praveenyaaaa)
మంచివాళ్లకే ఎందుకు ఇలా కష్టాలొస్తాయ్?
ముంబై: ఓ నెటిజన్ ఆటో డ్రైవర్తో తనకు ఎదురైన హృదయాన్ని హత్తుకునే అనుభవాన్ని పంచుకున్నాడు. పాత ఆటో నడుపుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కనిపించినా, అసలు చార్జీ కంటే రూ.5 కూడా ఎక్కువ తీసుకోవడానికి ఓ డ్రైవర్ నిరాకరించాడు. అతడి స్టోరీని నెటిజన్ రెడిట్లో రాసుకొచ్చాడు. రెడిట్లో ఇందుకు సంబంధించిన వివరాలను ఆ నెటిజన్ పోస్టు చేశాడు. మహారాష్ట్ర, థానే జిల్లాలో కల్యాణ్ స్టేషన్కు షేర్డ్ ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ఘటనను వివరించాడు. అదనపు డబ్బు అడగకుండా, నిర్ణయించిన చార్జీ ప్రకారమే ప్రయాణికుల నుంచి డబ్బు తీసుకుంటున్నట్టు గమనించానని తెలిపాడు.కష్టాల్లోనూ నిజాయితీ“ఈ రోజు నా ప్రాంతం నుంచి కల్యాణ్ స్టేషన్కు ఆటోలో వెళ్లాను. నిబంధనల ప్రకారం డ్రైవర్ అంకుల్ నలుగురు ప్రయాణికులను ఎక్కించుకుంటే ఒక్కరికి చార్జీ రూ.15. ముగ్గురిని మాత్రమే ఎక్కించుకుంటే మాత్రమే రూ.20. దురదృష్టవశాత్తు ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఈ నిబంధన పాటించరు. నలుగురు ఉన్నా రూ.20 వసూలు చేస్తారు” అని రెడిట్ యూజర్ రాశాడు.నలుగురు కూర్చునే ప్రయాణానికి డ్రైవర్ ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.15 మాత్రమే తీసుకున్నాడని అతడు తెలిపాడు. డ్రైవర్ నిజాయితీకి మెచ్చి రూ.20 ఇచ్చి, మిగతా రూ.5 డబ్బు ఉంచుకోవాలని చెప్పాడు. అయితే డ్రైవర్ వెంటనే రూ.5 తిరిగి ఇచ్చేశాడు. “ఆ చిన్న చర్య అతను ఎలాంటి వ్యక్తో స్పష్టంగా చూపించింది” అని రెడిట్ యూజర్ పేర్కొన్నాడు.‘‘ఆటో బాగా పాతదిగా కనిపించింది. భారీ వర్షం పడుతున్నా విండ్షీల్డ్ వైపర్ పనిచేయడం లేదు. భారీ వర్షం పడుతోంది. వైపర్ పనిచేయకపోవడంతో అతను చేతితో అద్దాన్ని తుడుస్తూ వెళ్లాల్సి వచ్చింది” అని రాశాడు.ఈ ఘటనపై ఆలోచిస్తూ, “అంత నిజాయితీగా, విలువలతో జీవించే వ్యక్తి ఇలాంటి కష్టాల్లో ఉండటం చూసి ఒక ప్రశ్న వచ్చింది. మంచి వాళ్లే ఎందుకు ఎక్కువగా బాధలు పడుతున్నట్టు కనిపిస్తారు? అతను రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి సరిపడా సంపాదిస్తున్నట్టే కనిపించింది. అయినా కొన్ని అదనపు రూపాయల కంటే నిజాయితీకే ప్రాధాన్యం ఇచ్చాడు. ఇది నిజంగా నన్ను బాధపెట్టింది. మీరందరూ ఏమనుకుంటున్నారు? ఈ రోజుల్లో నిజాయితీకి మూల్యం చెల్లించాల్సి వస్తుందా?” అని ప్రశ్నించాడు. ఈ పోస్టును “నిజాయితీ మీ దగ్గర ఉన్నదంతా కోల్పోయేలా చేస్తుందా?” అనే శీర్షికతో పంచుకున్నాడు. Being honest can cost you everything?by u/Guilty-Kick-5617 in mumbai
మమతా బెనర్జీ కాన్వాయ్పై చెప్పులు విసిరి.. బురద చల్లి రచ్చ రచ్చ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని హలీషహర్లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ... మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఆమె కాన్వాయ్ను నిరసనకారులు అడ్డుకున్నారు.ఆందోళనకారులు బెనర్జీ వాహనాన్ని చుట్టుముట్టి నిరసన చేపట్టారు. కాన్వాయ్లోని కార్లపై బురద పూశారు. నీటి సీసాలు, చెప్పులు, ఇతర బూట్లు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమెను “దొంగ”, “దొంగల రాణి” అంటూ విమర్శించారు.ఈ నిరసనకు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త మరణం కారణమైంది. పోలీసు కస్టడీలో దాడికి గురై అతను చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్థానిక పోలీసులు కొట్టి చంపారని కుటుంబం ఆరోపించడంతో ప్రజల్లో ఆగ్రహం పెరిగి, ఆందోళనలు చెలరేగాయి. కస్టడీలో మృతి ఆరోపణలపై వివాదం పెరుగుతున్న నేపథ్యంలో, బాధిత కుటుంబాన్ని కలిసేందుకు బెనర్జీ హలీషహర్కు వెళ్లారు. అయితే, ఆమె ఇంటి వద్దకు చేరుకునే ముందే నిరసనకారులు కాన్వాయ్ను అడ్డుకోవడంతో కొద్దిసేపు ప్రతిష్ఠంభన నెలకొంది.పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులుపోలీసు సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భద్రతా సిబ్బంది బెనర్జీ కాన్వాయ్ను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లి ఆమెకు మరింత భద్రత కల్పించారు. ఉద్రిక్తత మరింత పెరగకుండా చర్యలు చేపట్టారు. ఈ నిరసన, పోలీసు కస్టడీలో అస్వస్థతకు గురై మరణించిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త బిర్జు కియోత్ మరణం అనంతరం చోటుచేసుకుంది.అవినీతి, వసూళ్ల ఆరోపణలపై కియోత్ను అరెస్టు చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతను మృతిచెందినట్టు ప్రకటించారు. అతనికి గుండెపోటు వచ్చిందని పోలీసులు చెబుతుండగా, కస్టడీలో తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని అతని భార్య ఆరోపించారు. దీంతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.Former #Bengal CM #MamataBanerjee car came under attack in Halisahar as she was on her way to meet with the bereaved family of her party worker - one who #TMC alleges had died in police custody. pic.twitter.com/6vOvbocGFX— Tamal Saha (@Tamal0401) August 9, 2026🚨 Attack on Mamata Banerjee’s carLarge stones allegedly hurled at her vehicle in Barrackpore, right before the police.Mamata: “The police are providing protection to the BJP.”⚠️ This demands answers.#MamataBanerjee #WestBengal #JantaKiMamata#AdivasiMahotsav2026… pic.twitter.com/S81dT97fGZ— Arffa Khannum (@ARFAKHANUMS) August 9, 2026
ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ, కారునుఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాద్నగర్ పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచక్ వసా సమీపంలో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఒక అధికారులు తెలిపారు. ఉజ్జైన్ వైపు వస్తున్న కంటైనర్ లారీ అకస్మాత్తుగా కార్ను ఢీకొనడంతో, అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. మృతి చెందినవారంతా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఎన్ఆర్ఐ
న్యూయార్క్లో వైభవంగా ఆషాఢమాస బోనాలు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా ప్రతిబింబించేలా స్థానిక ఐసెన్ హోవర్ పార్క్లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. లాంగ్ ఐలాండ్ (నాస్సా కౌంటీ) డిప్యూటీ డైరెక్టర్ మెంగ్ లీ, లెజిస్లేటర్ రోజ్ మేరీ వాకర్, టౌన్ క్లర్క్ రాగిని శ్రీవాస్తవ ఈ వేడుకలకు అతిథులుగా హాజరయ్యారు..ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రముఖ కళాకారులు, కవులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, గాయకుడు సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్యలు ప్రత్యేకంగా తమ పాటలు, ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు.అలాగే పద్మ కోడెల చేతుల మీదుగా జరిగిన అమ్మవారి అలంకరణ, పోతురాజు వేషధారణలో ఆశోక్ చింతకుంట చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అమెరికా నేలపై తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన ఈ బోనాల సంబరాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి.
లండన్లో అట్టహాసంగా 'టాక్' బోనాల సంబురం
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. హౌంస్లౌ నగరంలోని కింగ్స్లే అకాడమిలో జూలై 19న జరిగిన ఈ వేడుకలకు బ్రిటన్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ గణేష్ కుప్పాల.. వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హైకమిషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని.. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని ముఖ్య అతిథులు తమ సందేశంలో పేర్కొన్నారు. మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలతో తమ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరును ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల కోసం తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలానికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.బోనాల వేడుకలు విజయవంతం కావడం పట్ల టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు, అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. టాక్ కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగళి, సత్య చిలుముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లారెడ్డి, గణేష్ పాస్తాం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్రీ విద్య, దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, కార్తీక్, స్నేహ, అమరేశ్వరి, సాయిరావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఈమె న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడైన శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు. స్థానిక వివరాల ప్రకారం.. దీప ఐటీ ఉద్యోగిని అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్తతో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. శ్రీపాతి దీప మరణవార్త విన్న హైదరాబాద్లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. దీప మరణంతో ఆకుతోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఘనంగా తానా ప్రపంచసాహిత్యవేదిక 94వ సమావేశం
తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. “ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత” అనే అంశం మీద ఆదివారం జరిగిన 94 వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది. యూకేలో శస్త్రచికిత్సా వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా. చంద్ర చెరువు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తమ కుటుంబం తరపున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో శస్త్రచికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అలాగే ఇదే సందర్భంలో వెలువరించిన “మహర్షి సుశ్రుత ఏ కంపెండియం – ఫాదర్ ఆఫ్ సర్జరీ” అనే గ్రంధంలో విలువైన వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదములు అన్నారు. వేల సంవత్సరాలనాడే సుశ్రుతుడు సోదాహరణంగా వివరించిన వైద్య పద్దతులు, ఉపయోగించిన శస్త్ర పరికరాల జాబితా పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని అన్నారు. సుశ్రుతుడు రచించిన “సుశ్రుత సంహిత” గ్రంధంలోని అనేక విషయాలను ఇతర భారతీయ భాషలలోకి, ప్రపంచ భాషలలోకి అనువాదం కావలసిన అవసరం ఉందని, వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కారాలు స్ఫూర్తి దాయకంగావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.” తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వేల సంత్సరాలనాడే ప్రపంచం ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలగా ఉన్న “సుశ్రుత సంహిత” అనే ఆయుర్వేద గ్రంథం వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం అన్నారు. మనిషి సాధారణంగా 1,120 రకాల వ్యాధులకు గురిఅవుతాడని, 700 కు పైగా మొక్కల గురించి ఏ మొక్క, ఏ వ్యాధిని, ఎలా తగ్గిస్తుందో ప్రయోగాత్మకంగా నిరూపించాడు. 64 రకాల ఖనిజాల నుంచి అవసరమైన మందులను ఎలా తయారుచేసుకోవచ్చో వివరించాడు. ఈ గ్రంథంలో 120 శస్త్రపరికరాల గురించి వివరించాడు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! అనస్తీషియా ప్రక్రియకు ఆద్యుడు సుశ్రుతుడు. ప్రొస్టేట్ గ్రంథిని జాగ్రత్తగా తొలగించే పద్ధతి, విరిగిన ఎముకలు తిరిగి అతుక్కునేందుకు శస్త్రచికిత్స సూత్రాలు, తెగిన శరీర భాగాలను అతికించటం, అతి సున్నితమైన పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించగల్గడం, గర్భిణీస్త్రీ ఉదరంలో శిశువు పరిణామ క్రమం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్లు చేసే విధానం, వ్యాధిరహితంగా ఉండేందుకు ఏ ఏ కాలాల్లో, ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి, ఎలాంటి తృణధాన్యాలు, పప్పుదినుసుల వాడాలి అనే సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాధమికదశనుండే విద్యార్థులకు పాట్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి (డెట్రాయిట్ నుండి) సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి, డా. వి. కె రాజు (వెస్ట్ వర్జీనియా నుండి) సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్దతుల గురించి, డా. శేషు శర్మ (వాషింగ్టన్ డి.సి నుండి) సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహరం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే డా. పండరి గంటి (లాస్ ఏంజిల్స్ నుండి) సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంధంలో పేర్కొన్నారని, అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్న అతిథులందరికీ, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. (చదవండి: ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు)
క్రైమ్
రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె దుర్మరణం
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షేక్ షిరీన్బేగం కుమార్తె అఫీఫా(24) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. అఫీఫా తాడేపల్లిలో జిమ్కు వెళుతుంటారు. జిమ్ యజమాని రుతి్వక్, రోజూ జిమ్కు వచ్చే వంశీ, సుదీర్, అవినాష్ లు ఆమెకు స్నేహితులయ్యారు. వీరు ఆదివారం చీరాల బీచ్కి వెళ్లేందుకు విజయవాడ నుంచి కారులో బయలుదేరారు. ఏటుకూరు బైపాస్ వద్ద హైవేలో వెళుతుండగా ముందువెళుతున్న ప్రభుత్వ పౌరసరఫరాలశాఖ రేషన్ తరలించే లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారు అదుపు తప్పి లారీని, డివైడర్ను ఢీకొంది. కారు డ్రైవ్ చేసు్తన్న అవినాష్, సుధీర్, వంశీ, రుత్విక్లు గాయపడ్డారు. కారు వెనుక సీట్లో కూర్చున్న అఫీఫా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, గాయపడినవారిని హైవేలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలిసి ఆస్పత్రికి చేరుకున్న డీసీపీ షిరీన్.. తన కుమార్తె మరణించిందన్న విషయం తెలిసి స్పృహ కోల్పోయారు. ఆమెకు వైద్యులు చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అఫీఫా మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. నల్లపాడు సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత బాధాకరం: మాజీ సీఎం జగన్ సాక్షి, అమరావతి: విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుమార్తె అఫీఫా(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అఫీఫా మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుమార్తెను కోల్పోయిన షిరీన్ బేగం, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
భార్యను హత్యచేసిన భర్త
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడులో ఆదివారం భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నతనంలోనే పోలియో ఉన్న కమ్మిడి లక్ష్మణరావు (32)కు మానసిక వికలాంగురాలు శ్యామల (30)తో ఏడాది క్రితం వివాహమైంది. వీరిద్దరూ ఆ గ్రామంలోనే మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ నడుపుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. జగనన్న కాలనీలో ఉంటున్న లక్ష్మణరావు అన్న కమ్మిడి రాంబాబు ఆదివారం లక్ష్మణరావుకు ఫోన్ చేశాడు. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తమ్ముడి ఇంటికి వచ్చి చూసేసరికి భార్యాభర్తలిద్దరూ విగతజీవులై కనిపించారు.రెండు చేతుల నుంచి రక్తం కారుతూ శ్యామల మృతి చెందగా, పక్కనే ఉరివేసుకుని లక్ష్మణరావు మరణించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, వారి మరణానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. భార్యను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ మృతుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. లక్ష్మణరావు తల్లితో కలిసి ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం ఆమె మృతి చెందింది. శ్యామలతో వివాహమైన తరువాత కూడా తల్లిని మర్చిపోలేకపోయాడు. దీంతో ‘అమ్మ నీవు లేని ఈ జీవితం నాకు వద్దు, నీ వద్దకే వచ్చేస్తాను, నేను చనిపోతే శ్యామల ఒంటరిదైపోతుంది. కనుక ముందుగా ఆమెను చంపి, నేను చనిపోతాను’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు.
ఐషర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
పామిడి: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. సీఐ శివశంకర్ నాయక్ తెలిపిన మేరకు.. ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్, 35 మందితో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. అలాగే, ఐషర్ వాహనం జిమ్ పరికరాలతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతోంది. పొగరూరు గ్రామం వద్ద ఐషర్ వాహనం అదుపుతప్పి నీలూరు పుల్లేటి వంక బ్రిడ్జి ప్రారంభంలో ఉన్న డివైడర్ను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా తిరిగింది. దాని వెనకే వేగంగా వస్తోన్న ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి ఐషర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ రెండు వాహనాలూ బ్రిడ్జిపై నుంచి కిందకు దూసుకువెళ్లి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు ఎడమకాలు విరగ్గా, ఐషర్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. బస్సులోని 25 మంది గాయాలపాలయ్యారు. వారిని స్థానికులు ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో అనంతపురం నుంచి బెంగళూరు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘మత్తు’ మారుతోంది!
పోలీసులు బాటసింగారం ప్రాంతంలో నిర్వహించిన ఓ ఆపరేషన్లో గత జూన్ 12న ఎండీ డ్రగ్ తయారీ ముఠాను పట్టుకున్నారు. వీరివద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 750 గ్రాముల మెఫెడ్రోన్తోపాటు రూ.50 లక్షల విలువైన డ్రగ్ తయారీ యూనిట్, రసాయనాలు స్వాదీనం చేసుకున్నారు. కీలక సూత్రధారి అయిన సూర్యాపేట జిల్లాకు చెందిన కీసరి మత్స్యగిరి అలియాస్ నరేశ్ మోత్కూరు సమీపంలోని ఓ మామిడి తోటలో రహస్యంగా డ్రగ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. గతంలో కెమిస్ట్గా పనిచేసిన మత్స్యగిరి గుజరాత్కు చెందిన కొందరితో మెఫెడ్రోన్ తయారీని నేర్చుకుని, సొంతంగా ల్యాబ్ పెట్టి ఎండీ డ్రగ్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు.షాద్నగర్లోని ఒక అద్దె ప్రాంగణాన్ని రహస్య డ్రగ్ ల్యాబ్గా మార్చి మెఫెడ్రోన్ (ఎండీ) తయారు చేస్తున్న ముఠాను గత మార్చిలో ఈగల్ ఫోర్స్ ఛేదించింది. 17 కిలోల మెఫెడ్రోన్, 300 కిలోల ప్రీకర్సర్ కెమికల్స్ను స్వాధీనం చేసుకుంది. షాద్నగర్ కేంద్రంగా తయారు చేసిన ఎండీనిఇక్కడ విక్రయించడంతోపాటు రాజస్తాన్కు తరలించి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. సాక్షి, హైదరాబాద్: ఈగల్ఫోర్స్, పోలీస్, ఎక్సైజ్ శాఖల ముప్పేట దాడులతో కొకైన్ను సరఫరా చేసే ఆఫ్రికా దేశాలకు చెందిన డ్రగ్ సరఫరా ముఠాలు హైదరాబాద్ వైపు వచ్చేందుకు సాహసించడం లేదు. దీంతో రాష్ట్రంలో కొకైన్ సరఫరాకు దాదాపుగా అడ్డుకట్ట పడింది. విదేశాల నుంచి వచ్చే కొకైన్ సరఫరా తగ్గడంతో డ్రగ్స్ ముఠాలు రూటు మారుస్తున్నాయి. డ్రగ్ పెడ్లర్లు యువతను, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొత్త రకాల మత్తు పదార్థాల విక్రయాలు విస్తరిస్తున్నారు. గంజాయి, నల్లమందు, ఎండీఎంఏతోపాటు ప్రధానంగా ఎండీ డ్రగ్ను యువత గుట్కాలో కలిపి తీసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. మెల్లగా గుట్కాలో కొద్దికొద్దిగా కలిపి విద్యార్థులకు అలవాటు చేస్తున్న మత్తుముఠాలు నెమ్మదిగా వారిని బానిసలుగా మారుస్తున్నాయి. తొలుత తక్కువ రేటుకే మత్తుపదార్థాలను విద్యార్థులకు చేరవేసి.. తర్వాత వారిని బానిసలుగా మారుస్తున్నారు. డ్రగ్ పెడ్లర్లు కొకైన్ కాకుండా కొత్త మత్తు పదార్థాలపై దృష్టి సారిస్తున్నట్లు ఈగల్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధానంగా మెఫెడ్రోన్ (ఎండీ), మరో సింథటిక్ డ్రగ్ ఎండీఎంఏ, నల్లమందు (ఓపియం) వంటి మత్తు పదార్థాల వైపు స్థానిక డ్రగ్ నెట్వర్క్లు మళ్లుతున్నాయి. ఇటీవల వరుసగా ఎండీఎంఏ, మెఫెడ్రోన్, ఓపియం సరఫరాదారుల అరెస్టులు, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న స్థానిక డ్రగ్ తయారీ యూనిట్లు ఈ మార్పును స్పష్టం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దేశీయంగా తయారు చేస్తూ... అంతర్జాతీయంగా సరఫరా అవుతున్న డ్రగ్స్పై నిఘా పెరగడంతో కొన్ని ముఠాలు దేశీయంగానే కొన్నిరకాల డ్రగ్స్ తయారీకి తెరతీశాయి. గుట్టుచప్పుడు కాకుండా చిన్న చిన్న ల్యాబ్లలో సింథటిక్ డ్రగ్స్ను తయారు చేసి.. అంతర్రాష్ట్ర లింక్లతో దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. ఇటీవల జరిపిన కొన్ని సోదాల్లో ప్రధానంగా రాజస్తాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఎండీ డ్రగ్ తెలంగాణకు వస్తున్నట్టుగా ఈగల్ ఫోర్స్ అధికారులు గుర్తించి నిఘా పెంచారు. రాజస్తాన్కు చెందిన డ్రగ్ నెట్వర్క్తో సంబంధం ఉన్న రెండు మెఫెడ్రోన్ తయారీ కేంద్రాలను ఇటీవలే గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. అదేవిధంగా గత జూన్లోనూ బాటసింగారం ప్రాంతంలో మత్స్యగిరి అనే వ్యక్తి మామిడి తోటలో రహస్యంగా ఏర్పాటు చేసిన ఎండీ డ్రగ్ తయారీ యూనిట్ను ఈగల్ అధికారులు గుర్తించారు. ఈ తరహా డ్రగ్స్ రాజస్తాన్కు చెందిన ముఠాలే నగరానికి సరఫరా చేస్తుండడంతో నిఘా పెంచిన ఈగల్ అధికారులు 2023 ఇప్పటి వరకు 78 సార్లు ఈ ముఠాలను అడ్డుకున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు, యువత టార్గెట్గా.. మత్తుకు బానిసలుగా మారిన విద్యార్థులను డబ్బుకోసం, మత్తుపదార్థాల కోసం డ్రగ్ పెడ్లర్లుగా మార్చుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. పిల్లలు, యువత ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో డ్రగ్ నెట్వర్క్ల కార్యకలాపాలను తెలంగాణ పోలీసులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. క్వాంటమ్ లీప్ స్కూల్ కేసు నేపథ్యంలో విద్యాసంస్థల పరిసరాల్లో డ్రగ్ సరఫరా, విక్రయాలపై మరింత నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, విద్యార్థులు, కమ్యూనిటీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. అంతర్రాష్ట్ర డ్రగ్ మాఫియాను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసుల సమన్వయంతో ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు చేపడుతున్నారు. స్థానిక పెడ్లర్ నుంచి అంతర్రాష్ట్ర సరఫరాదారు వరకు మొత్తం గొలుసును ఛేదించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. పూర్తి సాంకేతికతను వాడుకుంటూ దాడులు చేస్తున్నారు. విద్యార్థులను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చే ప్రయత్నాలను ఏమాత్రం ఉపేక్షించబోమని, ఇలాంటి నెట్వర్క్లపై జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు తీసుకుంటామని ఈగల్ అధికారులు హెచ్చరిస్తున్నారు.‘ఎండీ’తో తీవ్ర ఆరోగ్య ముప్పు మెఫెడ్రోన్ (ఎండీ) అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ సైకోయాక్టివ్ డ్రగ్గా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని తీసుకోవడం వల్ల గుండె వేగంగా లేదా అసమానంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం, ముక్కు నుంచి రక్తస్రావం కావడం, తీవ్ర ఆందోళన, భయాందోళనలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తరచూ వినియోగిస్తే దీనికి బానిసగా మారి వ్యసనానికి గురయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. తీవ్రమైన మత్తు ప్రభావంలో దూకుడు ప్రవర్తన, భ్రాంతులు, ఫిట్స్ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎండీ మత్తులో కొందరు తమకు తామే తీవ్రంగా గాయపరుచుకోవడం, ప్రమాదకరంగా ప్రవర్తించడం వంటి ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. తయారీ కేంద్రాలపై నిఘా పెంచాంమత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాలను, పెడ్లర్లను కట్టడి చేయడంతో డ్రగ్స్ నెట్వర్క్ను పూర్తిగా ధ్వంసం చేసేలా ఈగల్ ఫోర్స్ విస్తృతంగా పనిచేస్తోంది. అదేవిధంగా ఎండీ, ఇతర డ్రగ్స్ తయారీ కేంద్రాలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇటీవల కాలంలో రాజస్తాన్తోపాటు తెలంగాణ కేంద్రంగా ఎండీ డ్రగ్ తయారీ కేంద్రాలపై నిఘా పెంచాం. ఇప్పటికే కొన్ని ల్యాబ్లను మూయించాం. అదేవిధంగా రాజస్తాన్ నుంచి వివిధ పనుల కోసం తెలంగాణకు వస్తున్న యువతలో ఈ మత్తుపదార్థాలు అలవాటు ఉన్న వాళ్ల ద్వారా ఇక్కడికి ఎండీ, నల్లమందు ఎక్కువగా వస్తున్నట్టు గుర్తించాం. డ్రగ్స్ వాడితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని నమ్మించి ఇక్కడి యువతకు దీన్ని అలవాటు చేస్తున్నారు. మనకు ఎక్కువగా రాజస్తాన్ ముఠాల నుంచే వస్తున్నాయి. కానీ అక్కడి వాళ్లను అరెస్ట్ చేసేందుకు రాజస్తాన్కు వెళ్లిన సమయంలో మన ఫోర్స్పై దాడులు జరిగిన ఘటనలు ఉంటున్నాయి. త్వరలో రాజస్తాన్ పోలీసుల సహకారంతో భారీ ఆపరేషన్స్ చేస్తాం. – సందీప్ శాండిల్య, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్రూ.54 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల పట్టివేత యాదాద్రి భువనగిరి జిల్లాలో నలుగురి అరెస్ట్ భువనగిరి (బీబీనగర్): కారులో తరలిస్తున్న మాదక ద్రవ్యాలను యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను యాదాద్రి భువనగిరి ఎస్పీ అక్షాంశ్యాదవ్ ఆదివారం బీబీనగర్ పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. వివరాలు ఇలా... బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద శనివారం స్థానిక పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. అందులో సుమారు రూ.54 కోట్ల విలువ చేసే 27 కిలోల నిషేధిత మెఫెడ్రోన్తోపాటు డ్రగ్స్ తయారీలో ఉపయోగించే 40 కిలోల అసిటోన్ లిక్విడ్ను గుర్తించారు. కారులో ఉన్న మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన చేతన్ మధుకర్ మెప్రామ్, ఆకాశ్ అశోక్ గవాండే, అస్సాంలోని మారిగావ్కు చెందిన ముజుమాల్ హక్, హైదరాబాద్లోని చందానగర్కు చెందిన ఉపద్రష్ట రమణమూర్తిని అరెస్టు చేశారు. వారిని విచారించగా కొండమడుగులోని వేటుకూరి ల్యాబ్లో మెఫెడ్రోన్ తయారుచేసినట్లు అంగీకరించారు. డ్రగ్స్ను కొండమడుగు నుంచి నాగపూర్కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. అనంతరం పోలీసులు వేటుకూరి ల్యాబ్కు వెâళ్లి తనిఖీలు చేశారు. పట్టుబడిన డ్రగ్స్తోపాటు ల్యాబ్లో డ్రగ్స్ తయారీకి ఉపయోగిస్తున్న రియాక్టర్, సెంట్రీఫ్యూజ్, ఇతర పరికరాలు, 6 సెల్ఫోన్లు, కారు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నాగపూర్కు చెందిన చందా ప్రదీప్ ఠాకూర్, గోపాల్ సిర్పట్ పటేలియా, హైదరాబాద్ మేడిపల్లికి చెందిన ల్యాబ్ యాజమాని వేటుకూరి రామరాజును పట్టుకునేందుకు పోలీస్ బృందాలను నియమించినట్లు చెప్పారు.
వీడియోలు
ట్రంప్ కు బిగ్ షాక్.. గాజాపై నెతన్యాహు ఏం చెప్పారంటే?
అసంతపురం, గుడివాడలో టెన్షన్ టెన్నన్.. అర్థరాత్రి పోలీసుల నోటీసులు
ఎంతో బాధతో ఈ వీడియో చేస్తున్న.. డాక్టర్ ప్రియాంక మృతిపై మార్గాని భరత్ ఎమోషనల్
గోల్డ్ రన్.. 2 లక్షల వైపు బంగారం పరుగు
పెద్ది ఫ్యామిలీకి కేసీఆర్ రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం
రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతిపై వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
శ్రీకాకుళం పోలీసులకు కోర్టులో బిగ్ షాక్
ఈ కేసులో రాజకీయ హస్తం ఉంది..!? ప్రియాంక తండ్రి సంచలన వ్యాఖ్యలు
నీ కొడుకుని పదవి నుండి తొలగించు..!? లోకేష్ రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు..!
ఆటమ్ టూ మర్డర్ కేసు..!? డాక్టర్ ప్రియాంక కేసులో ఎస్పీ సంచలన విషయాలు!


