Top Stories
ప్రధాన వార్తలు
రాహుల్గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
గువహతి:కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పోరాడుతోందని కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై అస్సాంలోని గువహతి పోలీస్ స్టేషన్లో ఆదివారం(జనవరి19) ఎఫ్ఐఆర్(FIR) నమోదైంది. మోన్జిత్ చాటియా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్య పరిమితులను దాటాయని,అవి జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని చాటియా తన ఫిర్యాదులో తెలిపారు. ఆయన వ్యాఖ్యలు అశాంతితో పాటు,వేర్పాటువాద భావాలు కలిగిన వారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్కు ఉందని చాటియా పేర్కొన్నారు. కాగా,ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ ఆరెస్సెస్ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు. తాము ఇప్పుడు బీజేపీ, ఆరెస్సెస్తోపాటు భారత దేశంపై కూడా పోరాడుతున్నామన్నారు. ఈవ్యాఖ్యలను పలువురు కేంద్ర మంత్రులు తప్పుబట్టారు.కాంగ్రెస్ అసలురూపం ఈ వ్యాఖ్యలతో బయటపడిందని బీజేపీ నేతలు విమర్శించారు.
బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా ఎక్కడో కూర్చుని మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు.. కొట్టేసిన సొమ్మును తమ వద్దకు చేర్చుకునేందుకు అమాయకుల బ్యాంకు ఖాతాలను వాడుతున్నారు. తమ చేతికి నేరం అంటుకోకుండా కమీషన్ల ఆశజూపి అమాయకులనే చివరకు బలి చేస్తున్నారు. ‘మ్యూల్’బ్యాంకు ఖాతాలతో మొత్తంగా ముంచేస్తున్నారు. ఒకటి కాదు...రెండు కాదు..దేశవ్యాప్తంగా ఐదు లక్షల మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) 2024లో మొత్తం 1.14 లక్షల సైబర్ నేరాలు నమోదు చేయగా..ఈ కేసులలో ప్రతి కేసులో కనీసం ఐదు మ్యూల్ బ్యాంకు ఖాతాలు వినియోగించినట్టు తెలిపారు. aఅమాయకుల నుంచి వివిధ మోసపూరిత విధానాల్లో కొల్లగొట్టిన సొమ్మును పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సైబర్ నేరగాళ్లు వీటిని వెంటవెంటనే పలు బ్యాంకు ఖాతాల్లోకి (మ్యూల్ ఖాతాల్లోకి) బదిలీ చేస్తున్నారు. కొన్నిసార్లు కొట్టేసిన సొమ్ము ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల్లోకి చిన్నచిన్న మొత్తాలుగా చేసి బదిలీ చేస్తున్నారు. కొన్నిసార్లు వందల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దర్యాప్తు అధికారులు ఆ సొమ్మును గుర్తించడం..తిరిగి ఫ్రీజ్ చేయడం సవాల్గా మారుతోంది. ఇలా బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన సొమ్మును చివరగా క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశాల్లోని ఖాతాలకు మళ్లిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంత రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు కొన్ని బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు మళ్లించిన తర్వాత వెంటనే వాటిని నగదు రూపంలో విత్డ్రా చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని మధ్యవర్తుల ద్వారా క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశాలకు పంపుతున్నారు. ఇటీవలే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఈ తరహా ముఠాలోని 21 మందిని 2024 డిసెంబర్ 24న అరెస్టు చేశారు. బ్యాంకుల సమన్వయంతోనే కట్టడి సాధ్యం.. మ్యూల్ బ్యాంకు ఖాతాల బెడద తగ్గించడంలో బ్యాంకు అధికారులది కీలకపాత్ర అని పోలీసులు చెబుతున్నారు. ఏదైనా బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్టుగా గుర్తిస్తే అలాంటి బ్యాంకు ఖాతాలకు రెడ్ప్లాగ్ పెట్టుకుని, వెనువెంటనే దర్యాప్తు సంస్థలకు తెలియజేస్తే ఫలితం ఉంటుందని పోలీసులు సూచిస్తున్నారు. ఉదాహరణకు ఒక బ్యాంకు ఖాతాదారుడి అకౌంట్లో అకస్మాత్తుగా లక్షల రూపాయలు జమ అవుతుండటం..అదేరీతిలో లక్షల్లో డబ్బులు ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తున్నట్టు గుర్తిస్తే అలాంటివి మ్యూల్ బ్యాంకు ఖాతాలుగా గుర్తించాలని వారు పేర్కొంటున్నారు. కానీ వాస్తవానికి ఈ సమన్వయం లోపిస్తోంది. బ్యాంకుల సాధారణ ప్రక్రియలో భాగంగా ఇలాంటి రెడ్ఫ్లాగ్ ఖాతాల (అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన ఖాతాలు) వివరాలు ఆర్థికశాఖలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)కు చేరవేస్తాయి. కొన్ని నెలల తర్వాత సంబంధిత పోలీసులకు ఆ సమాచారం చేరుతుంది. ఈలోగా సైబర్ నేరగాళ్లు నిధులను విదేశాలకు మళ్లించడం పూర్తి చేస్తుండటంతో ఆ సమాచారం పోలీసులకు నిరుపయోగంగా మారుతోంది. మ్యూల్ బ్యాంకు ఖాతా అంటే..? ఒకరి వివరాలతో ఉన్న బ్యాంకు ఖాతాను నేరపూరిత లావాదేవీలకు ఇతరులు వినియోగిస్తే (నిజమైన ఖాతాదారుడికి తెలిసి ఇది జరగవచ్చు.. తెలియకుండా కూడా జరగొచ్చు) ఇలాంటి బ్యాంకు ఖాతాను మ్యూల్ బ్యాంక్ అకౌంట్గా చెబుతారు. కొందరు నెలవారీ కమీషన్లకు ఆశపడి తమ అధికారిక ధ్రువపత్రాలు ఉపయోగించి తెరచిన బ్యాంకు ఖాతాలను ఇతరులకు అప్పగిస్తున్నారు. ఇలాంటి బ్యాంకు ఖాతాల్లో ఎవరి నుంచి డబ్బులు జమ అవుతున్నాయి. అవి మళ్లీ ఎక్కడికి బదిలీ అవుతున్నాయన్న వివరాలు ఖాతాదారుడికి తెలిసే అవకాశం కూడా ఉండదు. మ్యూల్ బ్యాంకు ఖాతాలు ఇలా తెరిపిస్తారు.. సులువుగా డబ్బులు సంపాదించవచ్చని ఆశజూపి అమాయకులకు వల వేస్తారు. వారి వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచేలా ఒప్పిస్తారు. ఆ తర్వాత నిజమైన బ్యాంకు ఖాతాదారుడి నుంచి బ్యాంకు పాస్బుక్, డెబిట్ కార్డులు, పాస్వర్డ్లు మోసగాళ్లు తమ ఏజెంట్ల ద్వారా ఆ బ్యాంకు ఖాతాలు పూర్తిగా తమ ఆ«దీనంలోకి తీసుకుంటారు. సైబర్ మోసాల్లో కొల్లగొట్టే సొమ్మును ఈ బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం..తర్వాత ఇతర ఖాతాల్లోకి మళ్లించడం వంటి లావాదేవీలు చేస్తుంటారు. ఖాతాదారులకు సూచనలు.. ఇతరులు నెలవారీ కమీషన్ ఇస్తామంటే ఆశపడి మీ బ్యాంకు ఖాతాను ఇతరులకు ఇవ్వొద్దు. మీ బ్యాంకు ఖాతా నిలిపివేయబడుతుంది. మీరు మళ్లీ కొత్తగా బ్యాంకు ఖాతా తెరవాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పేరిట ఉన్న మ్యూల్ బ్యాంక్ ఖాతా నేరస్తులు అక్రమ నిధుల బదిలీకి, లేదా మనీలాండరింగ్ చేయడానికి ఉపయోగించే అవకాశం ఉన్నందున చట్టపరంగా అసలు ఖాతాదారులకు శిక్ష తప్పదు. ప్రధానంగా మ్యూల్ బ్యాంకు ఖాతాల బాధితులు వీరే..సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా ఎక్కువ మంది ప్రైవేటు ఉద్యోగులు ఈ ఉచ్చులో చిక్కుతున్నారు. వివరాలు ఇస్తే నెలకు కొంత కమీషన్ వస్తుందని ఆశపడి నిరుద్యోగ యువత వారి వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి మ్యూల్ ఖాతాలుగా వాడేందుకు ఇస్తున్నారు. ఆర్థిక అవసరాలు ఆసరాగా చేసుకుని, నేరస్తులు కమీషన్లు ఆశజూపి రైతులను ఈ ఉచ్చులో దింపుతున్నారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన ప్రకారం..జిమ్ ట్రైనర్లు, టైలర్లు, ప్రైవేటు కాంట్రాక్టర్లు, హోటల్స్ నిర్వాహకులు ఇలా పలువురు మ్యూల్ ఖాతాల బాధితులే.
Kho Kho World Cup: విజేతగా భారత మహిళల జట్టు
ఢిల్లీ: మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్(Kho Kho World Cup 2025) విజేతగా భారత్ మహిళల జట్టు అవతరించింది. ఈ ప్రపంచకప్లో ఆద్యంతం చెలరేగిపోయిన భారత జట్టు(India).. ఫైనల్లో కూడా సత్తాచాటి విజేతగా నిలిచింది. ఈరోజు(ఆదివారం) జరిగిన ఫైనల్లో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్(Nepal) జట్టును ఓడించింది. ఫలితంగా తొలి ఖోఖో ప్రపంచకప్లో జగజ్జేతగా నిలిచింది.ఈ ఫైనల్లో టాస్ గెలిచిన నేపాల్.. ముందుగా భారత్ ను అటాక్ రమ్మని ఆహ్వానించింది. ఇది ఆతిథ్య భారత్కు వరంగా మారగా, పర్యాటక జట్టు నేపాల్కు శాపంగా మారింది. ఆది నుంచి రెచ్చిపోయిన భారత జట్టు. నేపాల్ను వరుస విరామాల్లో తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఎక్కడా కూడా నేపాల్కు అవకాశం ఇవ్వకుండా భారత్ తన ఆధిపత్యాన్నిప్రదర్శించింది. కడవరకూ ఇదే ఆట తీరుతో చెలరేగిపోయిన భారత జట్టు.. నేపాల్ను మట్టికరిపించి ప్రపంచకప్ను ముద్దాడింది.
అంబానీని మించిన దానగుణం: ఒక్క రోజులో రూ. 46వేలకోట్ల నష్టం
భారతదేశంలో ధనవంతుల సంఖ్య పెరుగుతూ ఉంది. వీరిలో చాలా మంది లెక్కకు మించిన డబ్బు సంపాదించడమే కాకుండా.. ఉదారంగా దాతృత్వ కార్యక్రమాలకు మద్దతిస్తూ.. వేలకోట్లు దానం చేస్తుంటారు. ఇందులో చెప్పుకోదగ్గ వ్యక్తి బిలియనీర్ 'శివ్ నాడార్' (Shiv Nadar). అయితే ఈయన హెచ్సీఎల్ టెక్ కంపెనీ షేర్స్ మంగళవారం 9 శాతం క్షీణించాయి. దీంతో ఒక్క రోజులోనే రూ. 46,485 కోట్లు నష్టం వాటిల్లింది.హెచ్సీఎల్ టెక్ మార్కెట్ విలువభారతదేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో ఒకటైన హెచ్సీఎల్.. డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలు మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫమయ్యాయి. దీంతో సంస్థ స్టాక్ ధరలో కూడా భారీ క్షీణత కనిపించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో కంపెనీ షేర్లు 8.63% పతనమై, ఒక్కో షేరుకు రూ.1,813.95 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్లో, స్టాక్ మొత్తం 9.41% క్షీణతను ప్రతిబింబిస్తూ రూ. 1,798.40 కనిష్ట స్థాయిని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో షేరు 8.51 శాతం క్షీణించి రూ.1,819.95 వద్ద ముగిసింది. ఫలితంగా జనవరి 14 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింది.శివ్ నాడార్ నికర విలువఒక్క రోజులో వేలకోట్ల నష్టం వాటిల్లినప్పటికీ.. శివ్ నాడార్ నికర విలువ ఫోర్బ్స్ ప్రకారం 39.4 బిలియన్ డాలర్లు లేదా రూ. 3,40,793 కోట్లుగా ఉంది. ఇది ఆయన బలమైన పునాదిని & ఐటీ రంగంలో కంపెనీ బలానికి నిదర్శనం అని తెలుస్తోంది.అత్యంత ఉదార దాతశివ్ నాడార్ కేవలం భారతదేశంలోని సంపన్నుల జాబితాలో ఒకరుగా మాత్రమే కాకుండా.. అత్యంత ఉదారమైన పరోపకారిగా కూడా గుర్తింపు పొందారు.శివ్ నాడార్ దాతృత్వంలో అంబానీ, అదానీని కూడా మించిపోయారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 2,153 కోట్లు విరాళమిచ్చారు. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. దీంతో ఎడెల్గివ్ హురున్ వితరణశీలుర లిస్టులో శివ్ నాడార్ అగ్రస్థానంలో నిలిచారు.ఇదీ చదవండి: ఐటీ కంపెనీల్లో ఇదీ పరిస్థితి: ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్ప్రస్తుతం స్టాక్ మార్కెట్ అస్థిరత ఫలితంగా హెచ్సీఎల్ టెక్ వాల్యుయేషన్లో తాత్కాలిక తగ్గుదల ఏర్పడినప్పటికీ, భారతదేశ ఐటీ రంగానికి శివ్ నాడార్ చేసిన కృషి, అతని దాతృత్వ ప్రయత్నాల కారణంగా అతనిని నిజమైన మార్గదర్శకుడిగా మాత్రమే కాకుండా.. భవిష్యత్ తరాలకు రోల్ మోడల్గా నిలిపింది.
స్టీల్ ప్లాంట్ను ఏం చేస్తారో చెప్పండి: బొత్స సత్యనారాయణ
సాక్షి,విశాఖపట్నం:స్టీల్ప్లాంట్కు కేంద్రం ఇటీవల ఇచ్చిన ప్యాకేజీపై కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం(జనవరి19) బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా ఎందుకు చెప్పలేదు. దీపం పథకంలో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి ఉండాల్సిందని కేంద్ర మంత్రి కుమార్ స్వామి చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లో ఆపడం వల్లే ప్రైవేటీకరణ జరగలేదని ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి చెప్పారు. ప్రధాని,అమిత్షా, సీఎం చంద్రబాబు ప్రయివేటీకరణ జరగదని ఎందుకు చెప్పలేదు. ప్రైవేటీకరణలో భాగంగానే ప్యాకేజీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్పై ముసుగులో గుద్దులాట వద్దు.మీ వైఖరి స్పష్టంగా చెప్పాలి. ఇచ్చే 11 వేల కోట్లకు ఎన్నో షరతులు పెట్టారు. ప్యాకేజీ వెనుక ఏదో మతలబు ఉంది.కోట్లాది మంది వచ్చిన కుంభమేళాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమీ కనిపించలేదు. తిరుపతి సంఘటనపై కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చెయ్యాలి. సొంతగా గనులు కేటాయించాలి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి. లేదంటే కార్మికులతో కలిసి ఉద్యమం చేస్తాం.మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం. కేంద్రహోం మంత్రి వస్తే రాష్ర్ట ప్రయోజనాల గురించి మాట్లాడడం మానేసి జగన్ ఏమి చేస్తున్నాడు అని మట్లాడుకుంటున్నారా. రుషి కొండ భవనాల కోసం డిన్నర్ మీటింగ్ పెట్టరా. వైఎస్ జగన్కు ఎన్ని బెడ్ రూములు, ఎన్ని బాత్ రూములు ఉన్నాయన్న దాని మీద చర్చిస్తారా. రాష్ట్రానికి ఇదేం ఖర్మ. చంద్రబాబు ప్రచారం కోసం దుబారా ఖర్చులు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చుకుంటారో వారి ఇష్టం’అని బొత్స అన్నారు.
అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అని తెలీదు: అజిత్ పవార్
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై జరిగిన దాడి ప్రత్యేకంగా టార్గెట్ చేసిన దాడి కాదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar). అతనొక దొంగ అని, కేవలం దొంగతనం కోసమే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆ దొంగ బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తి అని, అతను దొంగతనంలో భాగంగానే ఆ ఇంట్లో చొరబడినట్లు తెలిపారు. అసలు అది సైఫ్ ఇల్లు అనే విషయం ఆ దొంగకు తెలీదన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు తమ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. ముంబైలో లా అండ్ ఆర్డర్ విఫలమైందంటూ ప్రత్యర్థి పార్టీలు పదే పదే ఆరోపణలు చేయడం తగదన్నారు.‘అతను బంగ్లాదేశ్ నుంచి ముంబైకి వచ్చాడు. తొలుత కోల్కతాకు చేరుకుని ఆ తర్వాత ముంబై(Mumbai)కి వచ్చాడు. దొంగతనం కోసం ఒక ఇంటిని ఎంచుకున్నాడు. అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అనే విషయం అతనికి తెలీదు. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని మాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం’ అని అజిత్ పవార్ మండిపడ్డారు.కాగా, సైఫ్ అలీఖాన్పై దాడికి పాల్పడింది బంగ్లాదేశీయుడని ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుడి పేరు విజయ్ దాస్ అని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ముంబై డీసీపీ జోన్ 9 దీక్షిత్ గెడం పూర్తి వివరాలు వెల్లడించారు.నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్ దాస్గా అందరికీ తన పేరును చెప్పుకుంటున్నాడు. ఆరు నెలల కిందట నకిలీ పత్రాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడ్డాడు. నగరంలో మారు పేర్లతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోని ఓ బార్లో వెయిటర్గా పని చేస్తున్నాడు. దొంగతనం కోసమే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం.కొన్ని రోజుల పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. ఆ టైంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఖర్ పోలీస్ స్టేషన్లో అతని విచారణ జరుగుతోందని తెలిపారాయన. కాగా.. సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. థానే కాసర్వదవల్లి ఎస్టేట్లోని మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్పై దాడి జరిగ్గా, దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందతుడ్ని అరెస్ట్ చేశారు.
కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా(Kumbh Mela)లో ఆదివారం(జనవరి19) అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి సెక్టార్ 19లో భక్తులు, సాధువుల కోసం వేసిన గుడారాల్లో రెండు వంట గ్యాస్ సిలిండర్లు ప్రమాదవశాత్తు పేలి మంటలు చెలరేగాయి. దీంతో గుడారాల్లోని భక్తులు భయంతో పరుగులు తీశారు. మొత్తం ముప్పై దాకా గుడారాలు మంటల్లో దగ్ధమయ్యాయి.అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. మంటల ధాటికి గుడారాల్లో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. కుంభమేళాకు ఆదివారం ఒక్కరోజు 17 లక్షల మంది భక్తులు విచ్చేశారు. ఇప్పటివరకు 7 కోట్లకుపైగా భక్తులు కుంభమేళాకు విచ్చేసి పవిత్ర స్నానమాచరించారు. #WATCH | Prayagraj, Uttar Pradesh | A fire breaks out at the #MahaKumbhMela2025. Fire tenders are present at the spot. More details awaited. pic.twitter.com/dtCCLeVIlN— ANI (@ANI) January 19, 2025యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. ఆదివారం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ మహా కుంభమేళాలో పుణ్య స్నానం చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం సంగమంలో స్నానం చేసి, మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ను ప్రశంసించారు.
Cyber Scam: రూ. 11 కోట్లు పోగొట్టుకున్న టెకీ..!
బెంగళూరు: ‘ మీరు సైబర్ స్కామ్ నేరగాళ్ల(Cyber Scam) నుంచి జాగ్రత్తగా ఉండండి. తాము ప్రభుత్వ అధికారులమని మీ వివరాలు కావాలంటూ ఫోన్ చేసే వారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి’ అంటూ మనకు ఫోన్లో కాలర్ టోన్ రూపంలో తరచు వినిపిస్తున్న మాట. అది పాట అయినా మాట అయినా కానీ ఆ కాలర్ ట్యూన్ ఉద్దేశం మాత్రం.. ఫోన్ చేసే ఎవరైనా మీ వ్యక్తిగత డేటా ఏ రూపంలో అడిగినా ఇవ్వొద్దనేది దాని సారాంశం.అయితే బెంగళూరు టెకీ(Bengaluru Techie) మాత్రం,, అచ్చం ఇదే తరహాలో మోసం పోయి రూ. 11 కోట్లు పోగొట్టుకున్నాడు. ఓ సంస్థలో టెకీగా ఉద్యోగం చేస్తూ కొంత నగదును ‘మార్కెట్ ఇన్వెస్ట్మెంట్’లో పెట్టాడు. రూ. 50 లక్షలు పెడితే దాని విలువ రూ. 12 కోట్లకు చేరింది.ఈ విషయాన్ని పసిగట్టిన నిందితుడు.. బాధితుడ్ని అత్యంత చాకచక్యంగా వలలో వేసుకున్నాడు. విజయ్ కుమార్ అనే టెకీ నుంచి భారీ మొత్తంలో దోచుకుపోయాడు. తాము ఈడీ అధికారులమని, ప్రభుత్వ అదికారులమని చెబుతూ విజయ్ కుమార్ భయభ్రాంతలకు గురి చేసిందో ఓ ముఠా. మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారని, మిమ్ముల్ని అరెస్ట్ చేస్తామని తరచు బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో భయపడిన విజయ్ కుమార్.. వారు చెప్పినట్లు చేశాడు. వారు అడిగిన ఆధార్, పాన్ కార్డువివరాలతో పాటు తన వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని కూడా వారికి అందించాడు.అంతే.. దాంతో సైబర్ నేరగాళ్ల పని ఈజీ అయ్యింది. ఇంకేముంది బాధితుడికి ఉన్న ఏడు బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ. 11 కోట్లను స్వాహా చేశారు. సుమారు ఏడు కోట్ల రూపాయలను ఒకే అకౌంట్ సుంచి దొంగిలించడం గమనార్హం.ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులుతాను నష్టపోయిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నబాధితుడు విజయ్ కుమార్ లబోదిబో మన్నాడు. పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇదే దుబాయ్ కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్(Cyber Fraud) కు సంబంధించిన ఘటనలో తరుణ్ నటానీ, కరణ్, దవల్ షాలను అరెస్ట్ చేశారు. షా అనే నిందితుడు దుబాయ్ చెందిన సైబర్ స్కామ్లో ఆరితేరిన ఓ వ్యక్తి సలహాలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి గాను కోటిన్నరకు ఒప్పందం చేసుకున్నాడు సదరు దుబాయ్ చెందిన సైబర్ నేరగాడు.
కోల్కతా డాక్టర్ కేసు: దోషి సంజయ్ తల్లి సంచలన వ్యాఖ్యలు
కోల్కతా:ఆర్జీకర్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను కోల్కతా కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చింది. కోర్టు తీర్పుపై సంజయ్రాయ్ తల్లి మాలతీరాయ్ స్పందించారు. తన కొడుకు తప్పు చేస్తే కచ్చితంగా తగిన శిక్ష విధించాల్సిందేనన్నారు. తనకు కూడా ముగ్గురు కుమార్తెలున్నారని, తన కుమారుడు చేసిన తప్పును ఓ మహిళగా ఎప్పటికీ క్షమించనని చెప్పారు.మహిళా డాక్టర్ పడిన బాధను,నరకాన్ని అర్థం చేసుకోగలనన్నారు.ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరుకుగాను సంజయ్కు జీవించే హక్కు లేదన్నారు. అతడికి మరణ శిక్ష విధించినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు.చనిపోయిన వైద్యురాలు తనకు కూతురితో సమానమని, కుమార్తెకు ఇటువంటి పరిస్థితి వస్తే ఏ తల్లీ ఊరుకోదన్నారు.ఈ కేసుపై సుప్రీం కోర్టుకు వెళ్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్ సోదరి మాట్లాడుతూ తమకు ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అతడు ఇలాంటి దారుణానికి ఒడిగడతాడని తామెప్పుడూ అనుకోలేదన్నారు.అయితే నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్తో పాటు మరికొంతమంది ఉన్నట్లు కథనాలు వస్తున్నాయని,ఈ విషయంపై పోలీసులు,సీబీఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేసి తగిన శిక్ష విధించాలని కోరారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో సంజయ్రాయ్ ఎంత శిక్ష విధించబోయేదీ సిల్దా కోర్టు సోమవారం తేల్చనుంది. సంజయ్రాయ్కి మరణశిక్ష విధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముప్పైఒక ఏళ్ల ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని గత ఏడాది ఆగస్టు 10న ఆర్జీకర్ ఆస్పత్రి సెమినార్హాల్లో గుర్తించిన విషయం తెలిసిందే. ఈ హత్యాచార ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో శనినవారం సిల్దా కోర్ట తీర్పువెలువరించింది. విచారణలో భాగంగా కోర్టు 100 మందికిపైగా సాక్షులను విచారించింది. ఈ కేసులో అరెస్టయినప్పటి నుంచి సంజయ్రాయ్ కుటుంబ సభ్యులెవరు అతడిని కలవడానికి ప్రయత్నించలేదు. అతడి తరపున కేసు వాదించడానికి కూడా న్యాయవాదిని కోర్టే న్యాయ సహాయంలో భాగంగా నియమించింది.
ధనుశ్తో మూవీపై ప్రశ్న.. తనకేం తెలియదన్న స్టార్ డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2019లో తాను తెరకెక్కించిన చిత్రం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న గౌతమ్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.గతంలో 2019లో ధనుశ్తో(Dhanush) కలిసి ఎనై నోకి పాయుమ్ తోట అనే మూవీని గౌతమ్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో విడుదల చేశారు. ఎనై నోకి పాయుమ్ తోట పేరు వినగానే గౌతమ్ రియాక్ట్ అయ్యారు. మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? ఆ చిత్రాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. దాని గురించి నాకేమీ గుర్తు లేదు. అది నా సినిమా కాదు. వేరే వాళ్లది అయి ఉంటుందని అన్నారు. అయితే గౌతమ్ మీనన్ అలా రియాక్ట్ కావడంపై నెటిజన్స్ భిన్నంగా చర్చించుకుంటున్నారు. అయితే గతంలో ఈ సినిమా తొలి భాగాన్ని గౌతమ్ ఎంతో ఫోకస్ పెట్టి తెరకెక్కించారు. షూటింగ్ దశలో ఉండగానే రిలీజ్ డేట్ ప్రకటించడంతో త్వరగా పూర్తి చేయాలన్న ఒత్తిడితో రెండో భాగాన్ని స్పీడ్గా తెరకెక్కించినట్లు వార్తలొచ్చాయి. దీంతో తాజాగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. గౌతమ్ మీనన్ ప్రస్తుతం డొమినిక్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
బిగ్బాస్ దివి స్టన్నింగ్ పిక్స్.. ప్రియుడితో ప్రియాంక జైన్ చిల్!
బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు
ధనుశ్తో మూవీపై ప్రశ్న.. తనకేం తెలియదన్న స్టార్ డైరెక్టర్!
రాహుల్గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
సిరాజ్ మెరుగులు దిద్దుకుంటాడా?
Kho Kho World Cup: విజేతగా భారత మహిళల జట్టు
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్ డే.. పవిత్రా లోకేశ్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే!
అంబానీని మించిన దానగుణం: ఒక్క రోజులో రూ. 46వేలకోట్ల నష్టం
అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అని తెలీదు: అజిత్ పవార్
నిర్మాత లవ్ రిజెక్ట్ చేశా.. ఆ కోపంతో రైల్లో నుంచి తోసేయాలని..: దృశ్యం నటి
తిరుమలలో చాగంటికి అవమానం
నాన్న మనసు ముక్కలైంది.. అమ్మ నలిగిపోతోంది: మంచు విష్ణు
Ind vs Eng: టీ20, వన్డే సిరీస్లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే
పవన్ పార్ట్నర్కు 1,200 ఎకరాలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
‘ఆయన దయవల్లే బతికున్నాను’
కరుణ్ నాయర్ను ఎలా సెలక్ట్ చేయగలం?: అగార్కర్
దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం
ఇందిరమ్మ ఇంటికి కటాఫ్.. 1994
అందుకే సిరాజ్ను ఎంపిక చేయలేదు: రోహిత్ శర్మ
బిగ్బాస్ దివి స్టన్నింగ్ పిక్స్.. ప్రియుడితో ప్రియాంక జైన్ చిల్!
బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు
ధనుశ్తో మూవీపై ప్రశ్న.. తనకేం తెలియదన్న స్టార్ డైరెక్టర్!
రాహుల్గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
సిరాజ్ మెరుగులు దిద్దుకుంటాడా?
Kho Kho World Cup: విజేతగా భారత మహిళల జట్టు
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్ డే.. పవిత్రా లోకేశ్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే!
అంబానీని మించిన దానగుణం: ఒక్క రోజులో రూ. 46వేలకోట్ల నష్టం
అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అని తెలీదు: అజిత్ పవార్
నిర్మాత లవ్ రిజెక్ట్ చేశా.. ఆ కోపంతో రైల్లో నుంచి తోసేయాలని..: దృశ్యం నటి
తిరుమలలో చాగంటికి అవమానం
నాన్న మనసు ముక్కలైంది.. అమ్మ నలిగిపోతోంది: మంచు విష్ణు
Ind vs Eng: టీ20, వన్డే సిరీస్లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే
పవన్ పార్ట్నర్కు 1,200 ఎకరాలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
‘ఆయన దయవల్లే బతికున్నాను’
కరుణ్ నాయర్ను ఎలా సెలక్ట్ చేయగలం?: అగార్కర్
దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం
ఇందిరమ్మ ఇంటికి కటాఫ్.. 1994
అందుకే సిరాజ్ను ఎంపిక చేయలేదు: రోహిత్ శర్మ
సినిమా
స్నేహితురాలిని పెళ్లాడిన జెర్సీ మూవీ సింగర్.. పోస్ట్ వైరల్
ప్రముఖ సింగర్ దర్శన్ రావల్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలు ధరల్ సురేలియాను ఆయన పెళ్లాడారు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు సింగర్. ఈ వివాహా వేడుకలో బంధువులతో పాటు సన్నిహితులు కూడా పాల్గొన్నారు.తాజాగా సింగర్ దర్శన్ రావల్ తన పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. సింగర్ దర్శన్ పలు సూపర్ హిట్ సినిమాలకు తన గాత్రాన్ని అందించాడు.దర్శన్ కెరీర్..దర్శన్ రావల్ 2014లో ఇండియాస్ రా స్టార్ మొదటి సీజన్లో పాల్గొన్నాడు. ఆషోలో ఒడిశాకు చెందిన రితురాజ్ మొహంతి చేతిలో ఓడిపోయాడు. ఆ తరవాత ది టాలెంట్ హంట్ షో అతనికి మంచి వేదికను ఇచ్చింది. అప్పటి నుంచి బాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్గా తన కెరీర్ను ప్రారంభించాడు. 2015లో షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన హిమేష్ రేష్మియాకు ధన్యవాదాలు. లవ్యాత్రి చిత్రంలోని చోగడ పాటతో అతనికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత షేర్షా చిత్రం నుంచి కభీ తుమ్హే, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీలోని ధిండోరా బజే రే, ఇష్క్ విష్క్ రీబౌండ్ సినిమా నుంచి సోనీ సోని లాంటి సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా గుజరాతీలో పాటలు కూడా పాడారు. తెలుగు హీరో నాని నటించిన జెర్సీ చిత్రంలోని నీదా పదధాని అనే తెలుగు సాంగ్ను అలపించారు దర్శన్ రావల్. View this post on Instagram A post shared by Darshan Raval (@darshanravaldz)
సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunnam Movie)తో వెంకటేశ్ ఖాతాలో మరో విక్టరీ పడింది. ఈ సినిమాకు ఎవరూ ఊహించని రేంజ్లో వసూళ్లు వస్తున్నాయి. పొంగల్కు రిలీజైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం తక్కువ బడ్జెట్ చిత్రం. కానీ బలమైన కామెడీ కంటెంట్.. ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్ల ముందు క్యూ కట్టించేలా చేస్తోంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ.161 కోట్లు వసూలు చేసింది.రూ.200 కోట్లకు చేరువలో..అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ఈవెన్ దాటేసి లాభాల బాట పట్టినట్లు చిత్రయూనిట్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సినిమా యూనిట్ తాజాగా చిట్చాట్ నిర్వహించింది. ఈ చిట్ చాట్లో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో పాల్గొన్నారు. ఈ భేటీలో ఒకరినొకరు ప్రశ్నలు అడుక్కున్నారు.మీనాక్షి స్థానంలో..సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చేయకపోతే ఆ పాత్ర ఇంకెవరు చేసేవారు? అలాగే నేను చేయకపోతే నా స్థానంలో ఇంకెవర్ని తీసుకునేవారు? అని ఐశ్వర్య.. అనిల్ రావిపూడిని ప్రశ్నించింది. అందుకు అనిల్.. ఐశ్వర్య చేయకపోతే నిత్యామీనన్, మీనాక్షి స్థానంలో పూజా హెగ్డే చేసేదన్నారు. ఆ పాత్రల్లో మమ్మల్ని తప్ప ఎవర్నీ ఊహించుకోలేదంటారేమోనని ఎదురుచూశాను అని ఐశ్వర్య పంచ్ వేసింది.ప్రభాస్తో నటించాలనుందన్న మీనాక్షిదీంతో అనిల్.. నిజం చెప్పాలంటూ భాగ్యం పాత్రను ఐశ్వర్య రాజేశ్ తప్ప ఇంకెవరూ అలా చేయలేరు, అలాగే పోలీస్ పాత్ర చేసిన మీనాక్షిలో ఎంటర్టైన్మెంట్ టైమింగ్ ఉందని కవర్ చేశాడు. ఏ హీరోతో పని చేయాలని ఉందన్న ప్రశ్నకు మీనాక్షి.. అందరు హీరోలతో నటించాలనుందని.. అందులో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడంది. ఐశ్వర్య.. జూనియర్ ఎన్టీఆర్తో పని చేయాలనుందని తెలిపింది. అనిల్ రావిపూడి.. చిరంజీవితో చేయాలనుందని, వేరే భాషల్లో అయితే విజయ్ను డైరెక్ట్ చేయాలనుందన్నాడు. A storm of love at the theaters and a reign of dominance at the box office 🔥#BlockbusterSankranthikiVasthunam grosses a MASSIVE 161+ Crores Worldwide in 5 Days💥💥All Areas in Profit Zone and heading towards 200Cr+ Gross mark ❤️🔥❤️🔥❤️🔥— https://t.co/ocLq3HYfE9… pic.twitter.com/s7zfzGwT4e— Sri Venkateswara Creations (@SVC_official) January 19, 2025 చదవండి: 'పాతాళ్ లోక్'తో ట్రెండ్ అవుతున్న నగేశ్ కుకునూర్ ఎవరో తెలుసా..?
పిల్లలతో ఇదేం పని? టీఆర్పీ కోసం ఏదైనా చేయిస్తారా?
హీరోయిన్ కాయడు లోహర్ (Kayadu Lohar)కు వింత అనుభవం ఎదురైంది. డ్రాగన్ సినిమా (Dragon Movie) ప్రమోషన్స్లో భాగంగా ఆమె తమిళ సరిగమప లిటిల్ ఛాంప్స్ సీజన్ 4కు హాజరైంది. అక్కడ పాటలు పాడే ఓ బుడ్డోడు హీరోయిన్ను హత్తుకుని ముద్దుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో హీరోయిన్ పెదాలపైనా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా ఆమె తల పక్కకు తిప్పుకుంది. ఇది చూసిన జడ్జి ఎస్పీ చరణ్ ఏమీ చేయలేక చిరునవ్వు చిందించాడు. చెడిపోతున్నారుఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షో టీఆర్పీ కోసం పిల్లలతో ఇలాంటి పనులు చేయించడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో సోషల్ మీడియా వల్ల పిల్లలు చెడిపోతున్నారనడానికి ఇదే సాక్ష్యమంటున్నారు. తల్లిదండ్రులైనా పిల్లలు ఎలా నడుచుకోవాలనేది నేర్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పనులు చేసినప్పుడు నవ్వడానికి బదులు లాగి పెట్టి ఒక్కటిస్తే వారే దారికొస్తారని సలహా ఇస్తున్నారు.తెలుగులోనూ యాక్ట్ చేసిన హీరోయిన్తమిళంలో ప్రసారమవుతున్న సరిగమప లిటిల్ ఛాంప్స్ నాలుగో సీజన్కు సింగర్ శ్వేతా మోహన్తో పాటు, దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ కాయడు లోహర్ విషయానికి వస్తే.. అస్సాం రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటీ ముగిల్పేటె అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. పతనోపాతం నూట్టండుతో మలయాళంలో ప్రవేశించింది. అదే ఏడాది శ్రీవిష్ణు హీరోగా నటించిన అల్లూరి (2022) సినిమాతో తెలుగువారిని పలకరించింది. ప్రస్తుతం డ్రాగన్ సినిమా చేస్తోంది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. 🤦♂️🤦♂️🤦♂️pic.twitter.com/KbZVlDlTU6— Christopher Kanagaraj (@Chrissuccess) January 18, 2025 చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!
'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లి రాజు.. తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్!
వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ కానుకగా ఈనెల 14న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే వందకోట్లకు వసూళ్లతో సంక్రాంతి రేసులో అదరగొడుతోంది.అయితే ఈ మూవీ ఎంత హిట్టయిందో.. అదే రేంజ్లో ఫేమస్ అయ్యాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమాల. ఈ మూవీ వెంకటేశ్ కుమారుడిగా నటించిన రేవంత్ (బుల్లిరాజు) ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. బుల్లిరాజుగా సినీ ప్రియులను మెప్పించారు. తన మాటలు, డైలాగ్లతో ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. ఇటీవల సక్సెస్ మీట్లోనూ రేవంత్ మరోసారి సందడి చేశారు.అయితే తాజాగా బుల్లిరాజుతో కొందరు అభిమానులు వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు కొందరు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. అయితే ఇదే క్రమంలో బుల్లిరాజు ఇబ్బందిగా ఫీలవుతున్నా కూడా వారు వదల్లేదు. దయచేసి నన్ను వదిలేయండి అని బుల్లిరాజు చెప్పినా వారస్సలు పట్టించుకోలేదు. చిన్న పిల్లాడితో ఇలా వ్యవహరించడం ఏంటని పలువురు నిలదీస్తున్నారు. జరగండి.. నేను వెళ్లాలి అని బుల్లిరాజు చెబుతున్నా వినకుండా అతనితో ఫోటోలు తీసుకున్నారు. చిన్న పిల్లాడు అని చూడకుండా ఈ పైత్యం ఏంటని పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ నిర్మించారు.#BulliRaju with items 😍 who are harassing #SankranthikiVasthunam pic.twitter.com/CTqfFrv79L— Aristotle (@goLoko77) January 19, 2025
న్యూస్ పాడ్కాస్ట్
తిరుమలలో వరుస ఘటనలపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం. తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై నివేదిక పంపాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్లో పేదల ఇళ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం కక్ష... ఇళ్లు నిర్మించుకోనివారి స్థలాల కేటాయింపులు రద్దు
హెచ్ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారు?... ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కానున్న కేటీఆర్
మహా కుంభమేళాకు తరలివస్తున్న అశేష జనవాహిని.. రెండ్రోజుల్లో రెండున్నర కోట్ల మంది పుణ్యస్నానాలు
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
తిరుపతి తొక్కిసలాట ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపణ
తిరుపతి తొక్కిసలాటకు అసలు కారణం బట్టబయలు. తిరుమలపై పూర్తి ఆధిపత్యానికి తెగించిన చంద్రబాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీలోకి బినామీలను ప్రవేశపెట్టిన సీఎం
హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ, శిక్షేమీ విధించడం లేదు... న్యూయార్క్ కోర్టు తీర్పు
ఆరుగురు భక్తులు మృతిచెందిన ఘటనలో చంద్రబాబే మొదటి ముద్దాయి, తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
క్రీడలు
ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్ ఇంట తీవ్ర విషాదం
పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ (జనవరి 19) ఉదయం మనూ బాకర్ అమ్మమ్మ, మామ రోడ్డు ప్రమాదంలో దుర్మణం చెందారు. హర్యానాలోని చర్కీ దాద్రిలో గల మహేంద్రఘర్ బైపాస్ రోడ్డులో ఈ ఘటన సంభవించింది. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో స్కూటర్పై వెళ్తున్న మనూ బాకర్ అమ్మమ్మ, మామను బ్రీజా కారు ఢీకొంది. మానూ బాకర్ అమ్మమ్మ, మామ స్పాట్లోనే చనిపోయారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం తరలించారు.కాగా, మనూ బాకర్ రెండు రోజుల కిందటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డు అందుకుంది. మనూ బాకర్ గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మనూ.. ఒకే ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా రికార్డు నెలకొల్పింది. పారిస్ ఒలింపిక్స్లో మనూ 10మీ ఎయిర్ పిస్తోల్, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ టీం (సరబ్జోత్ సింగ్తో కలిసి) ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించింది.
విండీస్ స్పిన్నర్ మాయాజాలం.. 157 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. మూడో రోజు ఆట ప్రారంభించిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 157 పరుగులకే కుప్పకూలింది. విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ ఏడు వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టాడు. మరో స్పిన్నర్ గుడకేశ్ మోటీ ఓ వికెట్ తీశాడు. పాక్ ఇన్నింగ్స్లో ఇద్దరు (షాన్ మసూద్, ఖుర్రమ్ షెహజాద్) రనౌట్ అయ్యారు. షాన్ మసూద్ 52, ముహమ్మద్ హురైరా 29, బాబర్ ఆజమ్ 5, కమ్రాన్ గులామ్ 27, సౌద్ షకీల్ 2, మహ్మద్ రిజ్వాన్ 2, సల్మాన్ అఘా 14, నౌమన్ అలీ 9, సాజిద్ ఖాన్ 5, ఖుర్రమ్ షెహజాద్ డకౌటయ్యారు.తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని కలుపుకుని పాక్ విండీస్ ముందు 251 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో విండీస్ సైతం తడబడుతుంది. ఆ జట్టు 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విండీస్ గెలవాలంటే మరో 221 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు మాత్రమే ఉన్నాయి. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్(12), కీసీ కార్తీ (6) ఔట్ కాగా.. మికైల్ లూయిస్ (11), కవెమ్ హాడ్జ్ (0) క్రీజ్లో ఉన్నారు. సాజిద్ ఖాన్కు రెండు వికెట్లు దక్కాయి.అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (84), మహ్మద్ రిజ్వాన్ (71) అర్ద సెంచరీలు సాధించి పాక్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పాక్ తొలి ఇన్నింగ్స్లో షాన్ మసూద్ 11, ముహమ్మద్ హురైరా 6, బాబర్ ఆజమ్ 8, కమ్రాన్ గులామ్ 5, సల్మాన్ అఘా 2, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 18, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్, జేడన్ సీల్స్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్ సింక్లెయిర్ 2, మోటీ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 137 పరుగులకే కుప్పకూలింది. పాక్ స్పిన్నర్లు నౌమన్ అలీ (11-2-39-5), సాజిద్ ఖాన్ (12-0-65-4), అబ్రార్ అహ్మద్ (1.2-1-6-1) విండీస్ నడ్డి విరిచారు. విండీస్ ఇన్నింగ్స్లో 10, 11వ నంబర్ ఆటగాళ్లు వార్రికన్ (31 నాటౌట్), జేడన్ సీల్స్ (22) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. వీరిద్దరు చివరి వికెట్కు 46 పరుగులు జోడించి విండీస్ పరువు కాపాడారు. లేకపోతే విండీస్ 100లోపే ఆలౌటయ్యేది. విండీస్ ఇన్నింగ్స్లో వీరితో పాటు బ్రాత్వైట్ (11), కెవిన్ సింక్లెయిర్ (11), మోటీ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మికైల్ లూయిస్ 1, కీసీ కార్తీ 0, కవెమ్ హాడ్జ్ 4, అలిక్ అథనాజ్ 6, జస్టిన్ గ్రీవ్స్ 4, టెవిన్ ఇమ్లాచ్ 6 పరుగులు చేశారు.
రంజీల్లో ఆడనున్న రోహిత్, పంత్.. కోహ్లి, రాహుల్ దూరం
టీమిండియా ఆటగాళ్లంతా దేశవాలీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ బాట పట్టారు. భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (పంజాబ్), స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (ముంబై), రిషబ్ పంత్ (ఢిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడేందుకు సిద్దమయ్యారు. ముంబై రంజీ జట్టు తరఫున తాను తర్వాతి మ్యాచ్ బరిలోకి దిగుతానని రోహిత్ శర్మ స్వయంగా వెల్లడించాడు. ఈ నెల 23నుంచి ముంబైలోనే జమ్ము కశ్మీర్తో జరిగే పోరులో అతను ఆడతాడు. గత 6–7 ఏళ్లలో తాము అంతర్జాతీయ క్రికెట్లో బిజీగా ఉండటం వల్ల దేశవాళీ మ్యాచ్లు ఆడలేకపోయామని, రంజీ ట్రోఫీ స్థాయిని తక్కువ చేయలేమని రోహిత్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ పదేళ్ల క్రితం తన చివరి రంజీ మ్యాచ్ ఆడాడు. 2015 సీజన్లో ఉత్తర్ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ 113 పరుగులు (తొలి ఇన్నింగ్స్) చేశాడు. గడిచిన 17 ఏళ్లలో రంజీ మ్యాచ్ ఆడనున్న తొలి భారత కెప్టెన్గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు.కోహ్లి, రాహుల్ దూరంమరో వైపు మెడ నొప్పితో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... తాను ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడలేనని స్పష్టం చేయగా... మోచేతి గాయంతో కేఎల్ రాహుల్ (కర్ణాటక) కూడా రంజీ పోరుకు దూరమయ్యాడు.ఢిల్లీ జట్టులో పంత్రంజీ ట్రోఫీ తదుపరి లీగ్ మ్యాచ్లు జనవరి 23 నుంచి ప్రారంభమవుతాయి. నెక్స్ట్ లెగ్ మ్యాచ్ల కోసం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ 21 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రిషబ్ పంత్ పేరుంది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్లో సౌరాష్ట్రను ఢీకొంటుంది. ఢిల్లీ జట్టుకు ఆయుశ్ బదోని కెప్టెన్గా వ్యవహరిస్తాడు.ఢిల్లీ రంజీ జట్టు: ఆయుశ్ బదోని (కెప్టెన్), సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, రిషబ్ పంత్ (వికెట్కీపర్), జాంటీ సిద్ధూ, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, శివం శర్మ, ప్రణవ్ రాజ్వంశీ (వికెట్కీపర్), వైభవ్ కంద్పాల్, మయాంక్ గుస్సేన్ , గగన్ వాట్స్, ఆయుష్ దోసెజా, రౌనక్ వాఘేలా, సుమిత్ మాథుర్, రాహుల్ గహ్లోత్, జితేష్ సింగ్.
‘చాంపియన్స్’ పోరుకు సిద్ధం
రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు మరో ఐసీసీ వన్డే సమరానికి సన్నద్ధమైంది. వరల్డ్ కప్లో ఫైనల్ చేరిన టీమిండియాలోని ప్రధాన ఆటగాళ్లంతా ఇప్పుడు ఈ పోరులోనూ జట్టులో భాగం కానున్నారు. స్వల్ప మార్పులు మినహా ఎలాంటి అనూహ్య, సంచలనాలు లేకుండా చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపిక జరిగింది. ప్రధాన పేసర్ బుమ్రా ఫిట్నెస్పై కాస్త సందేహాలు ఉన్నా...అతడిని టీమ్లోకి తీసుకోగా, వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లతో చెలరేగిన షమీ కూడా మరో ఐసీసీ పోరుకు రెడీ అంటున్నాడు. నలుగురు ఆల్రౌండర్లను జట్టులోకి తీసుకోవడంతో హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తన స్థానాన్ని కోల్పోవాల్సి రాగా... ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న జైస్వాల్ తొలిసారి వన్డే టీమ్లోకి వచ్చాడు. ఓవరాల్గా ఈ 15 మంది సభ్యుల బృందానికి టైటిల్ సాధించే సత్తా ఉందని సెలక్షన్ కమిటీ నమ్ముతోంది. ముంబై: ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. దానికి ముందు స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల్లో కూడా ఇదే జట్టు తలపడుతుంది. ఇటీవల ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ కెపె్టన్సీపై చర్చ జరిగినా...2023 వన్డే వరల్డ్కప్లో జట్టును ఫైనల్ చేర్చిన అతని నాయకత్వంపై సెలక్టర్లు పూర్తి విశ్వాసం ఉంచారు. భారత జట్టు ‘సంధి దశ’లో ఉందని వినిపించినా...వన్డేల్లో దానికి ఇంకా సమయం ఉందని తాజా ఎంపికతో అర్థమైంది. వరల్డ్కప్లో రాణించిన ప్రధాన ఆటగాళ్లందరినీ ఎలాంటి సందేహాలు లేకుండా టీమ్లోకి తీసుకున్నారు. బహుశా ఈ టోర్నీ తర్వాత 2027 వరల్డ్ కప్ కోసం మార్పులు జరగవచ్చు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటూ శుబ్మన్ గిల్ను వైస్ కెపె్టన్గా నియమించారు. గత ఏడాది ఆగస్టులో శ్రీలంకతో సిరీస్ తర్వాత భారత్ మళ్లీ ఇప్పుడే వన్డేల్లో బరిలోకి దిగుతోంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో ఫిబ్రవరి 20, 23, మార్చి 2న వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లతో భారత్ తలపడుతుంది. పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించిన టీమిండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడుతుంది. రెండు వన్డేలకు హర్షిత్... ఫిట్నెస్పై సందేహాలు ఉన్నా...ప్ర«దాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేశారు. అయితే ఇంగ్లండ్తో తొలి రెండు వన్డేల సమయానికి అతను పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాకు చోటు కల్పించారు. ఆసీస్ పర్యటనలో హర్షిత్ 2 టెస్టులు ఆడాడు. స్పోర్ట్స్ హెర్నియా గాయంతో కివీస్తో తొలి టెస్టు తర్వాత ఆటకు దూరమైన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు కూడా టీమ్లో స్థానం లభించింది. గాయంనుంచి కోలుకున్న తర్వాత అతను ఏ స్థాయిలోనూ మ్యాచ్ ఆడకపోయినా...జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేస్తుండటంతో ఫిట్నెస్పై స్పష్టత వచి్చంది. ఫిట్గా మారి ఇంగ్లండ్తో టి20 సిరీస్కు ఎంపికైన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి ఊహించిన విధంగానే వన్డే టీమ్లోనూ స్థానం దక్కింది. టీమిండియా తరఫున ఇప్పటికే టెస్టుల్లో చెలరేగి...టి20 ఫార్మాట్లోనూ పదునైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్కు తొలిసారి వన్డే టీమ్లో అవకాశం దక్కింది. వరల్డ్ కప్ తరహాలోనే వరుసగా రోహిత్, గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్ టాప్–5లో ఉంటారు. నలుగురు ఆల్రౌండర్లు... సెలక్టర్లు ఒక ప్రధాన బౌలర్ను తగ్గించి మరీ ఆల్రౌండర్లపై దృష్టి పెట్టారు. హార్దిక్ పాండ్యా ఒక్కడే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాగా...ముగ్గురు స్పిన్ ఆల్రౌండర్లు జడేజా, అక్షర్, సుందర్లకు స్థానం లభించింది. ఈ ముగ్గురూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే కాగా, పాండ్యాతో కలిపి భారత టాప్–6 రైట్ హ్యాండర్లే ఉన్నారు. జట్టులో ముగ్గురే ప్రధాన పేసర్లు ఉన్నారు. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కే ప్రధమ ప్రాధాన్యత ఇచి్చనట్లుగా భావించవచ్చు. వన్డేల్లో ఎప్పుడూ రెగ్యులర్గా చోటు దక్కించుకోకపోయినా, పెద్దగా ప్రభావం చూపని రిషభ్ పంత్ను రెండో కీపర్గా ఎంపిక చేశారు. తాను ఆడిన చివరి వన్డేలో సెంచరీ సాధించినా సరే... సంజు సామ్సన్పై సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు. కేరళ అసోసియేషన్తో వివాదం కారణంగా విజయ్హజారే ట్రోఫీకి సామ్సన్ దూరం కావడం కూడా సెలక్షన్పై ప్రభావం చూపించి ఉండవచ్చు. ‘బోర్డు కార్యదర్శితో మాట్లాడాలి’ క్రికెటర్ల కోసం బీసీసీఐ కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల విషయంలో ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులను అనుమతించే విషయంపై మరికొంత సడలింపును వారు కోరుతున్నారు. ఇదే మాట మీడియా సమావేశంలో రోహిత్ నోటినుంచి వచి్చంది. ఇది నేరుగా రోహిత్ మీడియాతో చెప్పకపోయినా... అగార్కర్కు చెబుతుండటం అందరికీ వినిపించింది. ‘కొత్త నిబంధనలపై మరింత స్పష్టత కావాలి.ఈ సమావేశం తర్వాత నేను బోర్డు కార్యదర్శితో కూర్చొని మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరూ నన్నే అడుగుతున్నారు’ అని అగార్కర్తో రోహిత్ అన్నాడు. మరో వైపు తనకు, హెడ్ కోచ్ గంభీర్కు మధ్య పరస్పర నమ్మకం ఉన్నాయని రోహిత్ స్పష్టం చేశాడు. మైదానంలోకి దిగడానికి ముందే తమ మధ్య వ్యూహాలకు సంబంధించిన చర్చ జరుగుతుందని...ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాత అన్నీ తానే చూసుకుంటానని కెపె్టన్ వెల్లడించాడు. ఈ విషయంలో తమకు స్పష్టమైన విభజన రేఖ ఉందని రోహిత్ వ్యాఖ్యానించాడు.
బిజినెస్
బ్లేడ్ బ్యాటరీ బస్సు.. బుల్లి కారు..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో (Bharat mobility expo 2025)వివిధ కంపెనీల నుంచి నూతన ఎలక్ట్రిక్ వాహనాలు కొలువుదీరాయి. వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ ఆటో భారత్కు ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. వీఎఫ్–7, వీఎఫ్–6 ఎలక్ట్రిక్ ఎస్యూవీలను ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరినాటికి వీటిని మార్కెట్లోకి తేనున్నట్టు తెలిపింది. తమిళనాడులోని ట్యూటికోరిన్ వద్ద 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రం స్థాపించనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది రెండవ అర్ద భాగంలో ఈ ప్లాంటు రెడీ అవుతుందని విన్ఫాస్ట్ ఆసియా సీఈవో పామ్ సాన్ ఛావ్ తెలిపారు.హ్యుండై టీవీఎస్ జోడీహ్యుండై మోటార్ కంపెనీ, టీవీఎస్ మోటార్ కంపెనీ చేతులు కలిపాయి. అధునాతన ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లు, చిన్న ఫోర్–వీలర్లను అభివృద్ధి చేసే లక్ష్యంతో భాగస్వామ్యాన్ని అన్వేషించనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా హ్యుండై తన మైక్రో మొబిలిటీ కాన్సెప్ట్ ఈవీలను ఆవిష్కరించింది. ఈ భాగస్వామ్యం కార్యరూపం దాలిస్తే డిజైన్, ఇంజనీరింగ్, సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలని హ్యుండై యోచిస్తోంది. అయితే భారత్లో ఈ వాహనాల తయారీ, మార్కెటింగ్పై టీవీఎస్ దృష్టి పెడుతుంది.కొలువుదీరిన ఎంజీ మోడళ్లుజేఎస్డబ్లు్య ఎంజీ మోటార్ ఇండియా మజెస్టర్ పేరుతో మధ్యస్థాయి ఎస్యూవీని ఆవిష్కరించింది. కాంపాక్ట్ కార్స్ కంటే పెద్దగా, పూర్తి స్థాయి కార్స్ కంటే చిన్నగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఐఎం5, ఐఎం6, ఎంజీ హెచ్ఎస్, ఎంజీ7 ట్రోఫీ ఎడిషన్ మోడళ్లను సైతం కంపెనీ ప్రదర్శించింది. మోంట్రా ఎలక్ట్రిక్ కొత్త మోడళ్లుమురుగప్ప గ్రూప్ కంపెనీ మోంట్రా ఎలక్ట్రిక్ రెండు కొత్త వాహనాలను లాంచ్ చేసింది. ఈవియేటర్ పేరుతో చిన్న తరహా వాణిజ్య వాహనాన్ని, సూపర్ కార్గో పేరుతో త్రీవీలర్ను ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్తో ఈవియేటర్ 245 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.15.99 లక్షలు. సూపర్ కార్గో ఈ–త్రీవీలర్ 200 కిలోమీటర్లపైగా పరుగెడుతుంది. పూర్తి ఛార్జింగ్ కోసం 15 నిమిషాలు సమయం తీసుకుంటుంది. ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.4.37 లక్షలు. కంపెనీ 55 టన్నుల హెవీ కమర్షియల్ ఎలక్ట్రిక్ ట్రక్ రైనో సైతం ప్రదర్శించింది. బీవైడీ సీలయన్–7..చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం బీవైడీ భారత్లో సీలయన్–7 కూపే–ఎస్యూవీ ఆవిష్కరించింది. కంపెనీ నుంచి ఇది భారత మార్కెట్లో నాల్గవ మోడల్గా నిలవనుంది. 82.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్ చేస్తే వేరియంట్నుబట్టి 542–567 కిలోమీటర్లు పరుగెడుతుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పర్ఫామెన్స్ వేరియంట్ 4.5 సెకన్లలో, ప్రీమియం వేరియంట్ 6.7 సెకన్లలో అందుకుంటుంది.ఒలెక్ట్రా బ్లేడ్ బ్యాటరీ ఛాసీ..హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా 12 మీటర్ల పొడవున్న బ్లేడ్ బ్యాటరీ ఛాసీని ఆవిష్కరించింది. 9 మీటర్ల పొడవున్న సిటీ బస్, 12 మీటర్ల పొడవుతో కోచ్ బస్ సైతం ప్రదర్శించింది. బ్లేడ్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2024 సెప్టెంబర్ 30 నాటికి 2,200లకుపైగా యూనిట్ల ఎలక్ట్రిక్ బస్లను సరఫరా చేసి ప్రజా రవాణా రూపు రేఖలను మార్చినట్టు ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. అశోక్ లేలాండ్ సాథీవాణిజ్య వాహనాలు, బస్ల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ సాథి పేరుతో తేలికపాటి చిన్న వాణిజ్య వాహనాన్ని ఆవిష్కరించింది. అత్యాధునిక ఎల్ఎన్టీ సాంకేతికతతో తయారైంది. 45 హెచ్పీ పవర్, 110 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. 1,120 కిలోల బరువు మోయగలదు. ధర రూ.6.49 లక్షలు. అలాగే మల్టీ యాక్సెల్, ఫ్రంట్ ఇంజన్, 15 మీటర్ల పొడవున్న గరుడ్–15 ప్రీమియం బస్ సైతం కొలువుదీరింది. 42 స్లీపర్ బెర్తులను ఈ బస్లో ఏర్పాటు చేశారు. కాగా, ఈ–టిరాన్ పేరుతో ఎలక్ట్రిక్ పోర్ట్ టెర్మినల్ ట్రాక్టర్ను సైతం కంపెనీ ఆవిష్కరించింది. మైక్రో మొబిలిటీతో బజాజ్?స్విట్జర్లాండ్కు చెందిన మైక్రో మొబిలిటీ సిస్టమ్స్లో వాటాను కొనుగోలు చేయడంతో సహా ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిళ్లను ఉత్పత్తి, ఎగుమతి చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం బజాజ్ ఆటో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మైక్రోలీనో పేరుతో రెండు సీట్ల ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ను, అలాగే మైక్రోలెటా పేరుతో మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ను మైక్రో మొబిలిటీ తయారు చేస్తోంది. నగరాల్లో తక్కువ దూరం ప్రయాణానికి అనువైన వాహనాల తయారీలో మైక్రో మొబిలిటీ సిస్టమ్స్కు పేరుంది.జేబీఎం ఎలక్ట్రిక్ కొత్త వాహనాలుజేబీఎం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎక్స్పో వేదికగా గెలాక్సీ లగ్జరీ కోచ్, ఎక్స్ప్రెస్ ఇంటర్సిటీ బస్, లో ఫ్లోర్ మెడికల్ మొబైల్ యూనిట్ ఈ–మెడిలైఫ్, దేశంలో తొలిసారిగా 9 మీటర్ల పొడవున్న టార్మాక్ కోచ్ ఈ–స్కైలైఫ్ను విడుదల చేసింది. లిథియం–అయాన్ బ్యాటరీలు కలిగిన ఈ వాహనాలకు ఆల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది. ఇప్పటికే కంపెనీ భారత్తోపాటు యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో 1,800 ఎలక్ట్రిక్ బస్లను విక్రయించింది. 10,000 పైచిలుకు ఈ–బస్లకు ఆర్డర్ బుక్ ఉందని జేబీఎం గ్రూప్ వైస్ చైర్మన్ నిశాంత్ ఆర్య తెలిపారు.
బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు?
తదుపరి పార్లమెంటు బడ్జెట్ (Budget) సెషన్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును (new income tax bill) ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాన్ని సులభ తరం, అర్థమయ్యేలా చేస్తుందని, అలాగే పేజీల సంఖ్యను 60% తగ్గిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.‘ఇది కొత్త చట్టం. ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. ముసాయి దా చట్టాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీ లిస్తోంది. దీనిని బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది’ అని తెలిపాయి. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం–1961ని ఆరు నెల ల్లో సమగ్రంగా సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జూలై బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.బడ్జెట్ సెషన్ జనవరి 31 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనుంది. మొదటి అర్ధభాగం (జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13) ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. 2025-26కి సంబంధించి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.పార్లమెంటు మార్చి 10న తిరిగి సమావేశమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. ఐటీ చట్టం 1961 సమగ్ర సమీక్ష కోసం సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రకటన మేరకు సమీక్షను పర్యవేక్షించడానికి, చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక అంతర్గత కమిటీని సీబీడీటీ ఏర్పాటు చేసింది. అలాగే చట్టంలోని వివిధ అంశాలను సమీక్షించేందుకు 22 ప్రత్యేక సబ్కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.
విశాలమైన ఇళ్ల కొనుగోలు.. టైర్–2 జోరు
కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ (Work form Home) నేటికీ కొనసాగుతుండటంతో ‘టైర్–2’ (tier 2 cities) ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపు తున్నారు. -సాక్షి, సిటీబ్యూరోకరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఆన్లైన్లో ప్రాపర్టీల శోధన గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబై లోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్ను లీడ్ చేస్తాయని తెలిపింది.మారిన అభిరుచులు.. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకటిన్నర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాత నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్లకు డిమాండ్ ఉంటుందని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. 3 బీహెచ్కే, ఆపై పడక గదుల గృహాల్లో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2021లో 15 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది.అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్ల ఆలస్యం, దివాలా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ప్రాపర్టీ శోధనలు గణనీయమైన స్థాయిలో పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్లో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్రం, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రీజియన్లో పలు మౌలిక సదుపాయ ప్రాజెక్ట్లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది.ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి మరీ ముఖ్యంగా నివాస సముదాయ మార్కెట్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అత్యంత కీలకంగా కానున్నాయని అంచనా వేసింది.
స్కాన్ చేసి ధర్మం చేయండి.. బాబయ్యా..
మొన్నీమధ్యే పంజాగుట్ట వెళదామని ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చా.. మెట్లు ఎక్కుతోంటే.. నాలుగో మెట్టు మీద అనుకుంటా... ఒక యాచకుడ్ని చూశా.. యధావిధిగానే అతని ముందో పళ్లెం ఉంది. అందులో కొన్ని చిల్లర పైసలు, 10 రూపాయల నోట్లు ఓ నాలుగు ఉన్నట్లున్నాయి. ఇది కొత్తేమి కాదు కానీ... నన్ను ఆకట్టుకున్నదల్లా... అతని మెళ్ళో ఉన్న ఓ డిజిటల్ కార్డు.అది క్యూఆర్ కోడ్ ఉన్న కార్డు.. పెదాలపై ఓ చిన్న చిరునవ్వు వచ్చింది... ఎస్..మోదీ చెప్పింది కరెక్టే అనిపించింది.. "దేశంలో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇప్పుడు అడుగడుగునా డిజిటల్ చెల్లింపులే..రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించి పల్లెల్లో సైతం వేళ్లూనుకుంటాయి..." అంటూ అప్పుడెప్పుడో ప్రధాని అన్నట్లు వచ్చిన వార్త గుర్తుకొచ్చింది.ఇప్పుడీ సంఘటన చూడగానే... నిజమే కదా అనిపించింది..ఇప్పుడంతా డిజిటల్ మయం అయిపోయిందన్నది వాస్తవం. కూరలు కొనడానికి రైతు బజార్ కి వెళ్లినా.. చివరకు ఛాయ్ తాగుదామని టీ స్టాల్ కు వెళ్లినా... జేబులోంచి ఫోన్ తీయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పైసలతో సహా డబ్బులు చెల్లించడం... చాలా సింపుల్ అయిపోయింది..ఎప్పుడైతే ఈ డిజిటల్ చెల్లింపులు విస్తృతమవుతున్నాయో చిల్లరతో పనిలేకుండా పోతోంది.. చిల్లర దాకా ఎందుకు... కనీసం ఒక్క పది రూపాయల నోట్ కూడా జేబులో పెట్టుకోకుండా.. కేవలం సెల్ ఫోన్ తో రోడ్డెక్కేవాళ్ళు ఎంతమందో ఈరోజుల్లో..దీంతో ఎవరైనా చెయ్య చాపి యాచిస్తే... ఓ రూపాయి కూడా విదపలేని పరిస్థితి. మరి వారి ఆదాయం పడిపోక ఏమవుతుంది... అందుకే అనుకుంటా... ఆ యాచకుడు ఈ డిజిటల్ మార్గాన్ని ఎంచుకున్నట్లున్నాడు.. తప్పులేదు.. త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర యాచించే వాళ్ళు సైతం మెళ్ళో ఓ కార్డు వేసుకుని మీముందు చెయ్యి చాపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీ ప్రిపేర్..మనం పూర్తి స్థాయిలో నగదురహిత సమాజం వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పేందుకు ఇదో ప్రబల ఉదాహరణగా భావించొచ్చు. గత డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా 1673 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్ధిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2024, జనవరి నెలలో ఈ లావాదేవీలు 1220 కోట్లు జరగ్గా.. ఏడాది చివరికి వచ్చేసరికి 400 కోట్లకు పైగా పెరిగాయి. డిజిటల్ విప్లవానికి ఇంతకంటే నిదర్శనం వేరే ఏం కావాలి?యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) అనేది రకరకాల బ్యాంకుల్ని ఒకేగూటికి చేర్చి చెల్లింపులు చేసేందుకు దోహదపడే ఒక సాధనం. మీ బ్యాంకు ఏదైనా కావచ్చు.. దాన్ని యూపీఐ కి అనుసంధానం చేయడం ద్వారా ఎలాంటి చెల్లింపులైనా క్షణాల్లో చేసేయొచ్చు. పైగా ప్రతీ చెల్లింపునకూ రికార్డు ఉంటుంది.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజా సమాచారం ప్రకారం... గత నవంబర్ నెలలో 1548 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ. 21.55 లక్షల కోట్లు. డిసెంబర్ కి వచ్చేసరికి రూ.23.25 లక్షల కోట్ల విలువ చేసే 1673 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్) ని తాజాగా యూపీఐ వెనక్కి నెట్టేసింది. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు 24 గంటల్లో ఎప్పుడైనా సరే తక్షణమే చెల్లింపు చేసే విధంగా ఈ ఐఎంపీఎస్ ను ప్రభుత్వం 2010 లో ప్రారంభించింది. వ్యాపార వర్గాలకు, వ్యక్తులకు ఈ ఐఎంపీఎస్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. ఐఎంపీఎస్ ద్వారా గత ఏడాది నవంబర్ నెలలో రూ. 5.58 లక్షల కోట్ల విలువ చేసే 40.79 కోట్ల లావాదేవీలు జరగ్గా... డిసెంబర్లో వీటి సంఖ్య 44.1 కోట్లకు పెరిగింది. వీటి విలువ కూడా రూ. 6.01 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. ఇక మీరు హైవేల మీద ప్రయాణం చేసేటప్పుడు టోల్ ప్లాజా ల దగ్గర చెల్లింపులు చేస్తారు కదా... గతంలో క్యాష్ ఇచ్చేవారు. ఆ తర్వాత డెబిట్/క్రెడిట్ కార్డులు, యూపీఐ లు వచ్చాయి. ఇప్పుడు ఫాస్టాగ్ అనేది ఈ చెల్లింపుల్లో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. ప్రతి టోల్ ప్లాజా ముందు.. ప్రత్యేకంగా కొంతసేపు ఆగాల్సిన అవసరాన్ని ఈ ఫాస్టాగ్ తప్పించింది. మీరు బయల్దేరేముందే... కొంత మొత్తాన్ని మీ బ్యాంకు అకౌంట్ నుంచి ఫాస్టాగ్ కి మళ్లిస్తారు. టోల్ ప్లాజా రాగానే అక్కడి స్కానర్లు మీ వాహనానికి ఉన్న ట్యాగ్ ని స్కాన్ చేస్తాయి. అమౌంట్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఇదంతా కొద్ది సెకన్లలోనే జరిగిపోతుంది. తద్వారా వేచి ఉండే వ్యవధి తగ్గడంతో పాటు, చిల్లర నోట్ల బాధ ఉండదు. ఈ ఫాస్టాగ్ లు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. గత నవంబర్ నెలలో 35.89 కోట్ల లావాదేవీలు జరగ్గా.. డిసెంబర్లో ఈ సంఖ్య 38.30 కోట్లకు పెరిగాయి. వీటి విలువ కూడా రూ.6,070 కోట్ల నుంచి రూ.6,642 కోట్లకు పెరిగింది.యూపీఐ, ఐఎంపీఎస్, ఫాస్టాగ్ చెల్లింపులు అనేవి మానవాళి జీవితంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చాయి. ఈ చెల్లింపులు చాలా సురక్షితంగా ఉండటమే కాక, వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ లావాదేవీలు మరింత విస్తృతమై డిజిటల్ ఇండియా రూపురేఖలనే మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.-బెహరా శ్రీనివాస రావువిశ్లేషకులు
ఫ్యామిలీ
నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చినట్లు ఉంటా!
సానియా అయ్యప్పన్.. నర్తకిగా అడుగుపెట్టి నటిగా స్థిరపడింది. తన అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. అవార్డులనూ అందుకుంది. ఆమె గురించి కొన్ని విషయాలు..⇒చిన్న వయసులోనే బుల్లితెరపై మెరిసింది.. సూపర్ డాన్సర్ అనే రియాలిటీ షో విన్నర్గా! తర్వాత ఢీ2, ఢీ4 షోల్లోనూ పాల్గొని పాపులారిటీతోపాటు సినీ అవకాశాన్నీ అందుకుంది.⇒సానియా అయ్యప్పన్ సొంతూరు కేరళలోని కోచ్చి. నలంద పబ్లిక్ స్కూల్లో చదువుకుంది.⇒‘బాల్యకాలసఖి’ మలయాళ చిత్రంతో బాలనటిగా ఎంటరై, ‘క్వీన్’తో హీరోయిన్గా మారింది. ఈ చిత్రం ఆమెకు బెస్ట్ డెబ్యూ ఆర్టిస్ట్గా ‘ఫిల్మ్ఫేర్’, ‘వనిత ఫిల్మ్ అవార్డ్స్’ ను తెచ్చిపెట్టింది. తర్వాత మోహన్లాల్ నటించిన ‘లూసిఫర్’లో నటించి, ఉత్తమ సహాయ నటిగా ‘సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్’ను గెలుచుకుంది. అటుపై వచ్చిన ‘ద ప్రీస్ట్’, ‘ప్రేతమ్ 2’, ‘సెల్యూట్’, ‘సాటర్డే నైట్’ వంటి పలు సినిమాల్లో మాత్రం అతిథి పాత్రకే పరిమితమైంది.స్క్రిప్ట్ను నమ్మి చేసిన ‘కృష్ణన్కుట్టి పని తుడంగి’ హారర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ‘ఇరుగప్పట్రు’, ‘సొర్గవాసల్’లు కూడా ఫీల్గుడ్ మూవీస్గా మంచి ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఈ రెండూ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నాయి.⇒ చేతినిండా అవకాశాల కంటే గుర్తుండిపోయే పాత్రలతోనే మెప్పించాలని కొంత గ్యాప్ తీసుకుంది. ఆ గ్యాప్లో వెబ్ దునియాలోకి అడుగుపెట్టి, కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్, ‘బిలవ్డ్’ ‘స్ట్రింగ్స్’ అనే షార్ట్ ఫిల్మ్స్లో నటించింది.⇒ నెగటివ్ కామెంట్స్ను పట్టించుకోను. అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోను. కొడతాను కూడా. నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చిన ట్లు ఉంటా!– సానియా అయ్యప్పన్
చిన్నారుల నోట్లో పుండ్లు?
కొంతమంది పిల్లల్లో నోట్లో, నాలుక మీద, గొంతు లోపల తరచూ పుండ్లలా వస్తుంటాయి. చిన్నారుల్లో ఈ సమస్య కనిపించినప్పుడు నొప్పితో బాధపడటం, నోరూ, గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పటిలా ఎర్రబారడమూ జరుగుతుంది. ఏమీ తినలేక సన్నబడతారు. ఇలా వచ్చే పుండ్లను వైద్యపరిభాషలో ఆఫ్తస్ అల్సర్స్ అంటారు. కారణాలు: ఈ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. ఉదా... నోట్లో గాయాలు కావడం (బ్రషింగ్ వల్ల, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని అబ్రేసివ్ ఆహారపదార్థాల వల్ల గాయాలవుతుంటాయి) విటమిన్లు, పోషకాల లోపం... (ముఖ్యంగా విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) అనేక కారణాలతో నీరసించిపోవడం (ఫెటీగ్) వైరల్ ఇన్ఫెక్షన్లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం సరిపడకపోవడం, తరచూ జ్వరాలు... వంటి అనేక శారీరక సమస్యలతోపాటు మానసికంగా ఉద్వేగ పరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్) వల్ల కూడా పిల్లల్లో ఈ తరహా పుండ్లు (మౌత్ అల్సర్స్) కనిపించవచ్చు.చికిత్స / మేనేజ్మెంట్: నోట్లో పుండ్లు పడ్డ పిల్లలకు బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్లు; పోషకాహార లోపం వల్ల సమస్య వస్తే వాళ్లలో విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా మౌత్ అల్సర్స్ కనిపించినప్పుడు పీడియాట్రీషియన్ లేదా డెంటల్ నిపుణులను సంప్రదించాలి.
కేన్సర్ కాటు..? వద్దు కుంగుబాటు
కేన్సర్ బాధితుల ఎదుట రెండు సవాళ్లు ఉంటాయి. మనోబలంతో కేన్సర్ను ఎదుర్కోవడం మొదటిదైతే... ఇక రెండోది... కేన్సర్ చికిత్స కారణంగా తమలో ఉండే విపరీతమైన నీరసం, తీవ్రమైన నిస్సత్తువలను అధిగమించడం.ముఖ్యంగా కీమోథెరపీ తీసుకునేవాళ్లలో ఈ నీరసం, నిస్సత్తువ చాలా ఎక్కువ. తమకు కేన్సర్ వచ్చిందని తెలియగానే బాధితులు కుంగిపోతారు. ఆపైన ఏ పనీ చేయనివ్వని తమ నీరసం మరింత కుంగుబాటుకు గురిచేస్తుంది. వాళ్లలో కలిగే ఈ నీరసాన్ని ‘కేన్సర్ ఫెటీగ్’గా చెబుతారు. రూన్సర్పై తమ పోరాటానికి తోడు ఈ నీరసం, నిస్సత్తువలపై పోరాటమే మరింత పెద్ద సవాలుగా మారుతుంది. ఈ ‘కేన్సర్ ఫెటీగ్’ ఎందుకు వస్తుంది, దాన్ని అధిగమించడమెలా అనే అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం.కేన్సర్కు చికిత్స తీసుకుంటున్న చాలామంది తమలోని నీరసం, బలహీనతల కారణంగా రోజువారీ పనులను సమర్థంగా చేసుకోలేరు. దాంతో జీవితం చాలా నిస్సారం గా అనిపించడం, జీవితాన్ని ఆస్వాదించలేక΄ోవడంతో కుంగుబాటు (డిప్రెషన్)కు గురవుతారు. ఈ నీరసాలూ, నిస్సత్తువలకు అనేక అంశాలు కారణమవుతాయి. కొంత కృషి చేస్తే దీన్ని అధిగమించడం అంత కష్టం కాదు. కానీ తమ జబ్బు, కుంగుబాటు కారణంగా తామీ ‘ఫెటీగ్’ను అధిగమించగలమనే ఆత్మవిశ్వాసాన్ని చాలామంది కోల్పోతారు. కాస్తంత కృషితోనే నీరసాలను జయించడం అంత కష్టమేమీ కాదు. తొలుత ఈ ‘ఫెటీగ్’కు కారణమయ్యే అంశాలేమిటో చూద్దాం...కారణాలు... రక్తహీనత (అనీమియా) : కేన్సర్ వ్యాధిగ్రస్తుల్లో నీరసం, నిస్సత్తువలకు ‘అనీమియా’ ఓ ముఖ్యమైన కారణం. సాధారణంగా క్యాన్సర్ బాధితుల్లో, అందునా మరీ ముఖ్యంగా బ్లడ్క్యాన్సర్ బాధితుల్లో ఎముక మూలుగ దెబ్బతినడం వల్ల ఎర్రరక్తకణాల ఉత్పత్తీ, వాటి సంఖ్యా తగ్గుతాయి. ఈ ఎర్రరక్తకణాలే శరీరంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్ అందజేస్తాయన్న సంగతి తెలిసిందే. ఇవి తగ్గడంతో దేహంలోని కణాలకు అవసరమైన ΄ోషకాలూ, ఆక్సిజన్ కూడా తగ్గి బాధితుల్లో నీరసం కనిపిస్తుంది. విషాలు (టాక్సిన్స్) బయటకు వెళ్లకపోవడం: ఎర్రరక్తకణాలు దేహంలోని కణాలకు ఆక్సిజన్ను అందించడంతో పాటు జీవక్రియల కారణంగా అక్కడ ఏర్పడ్డ కార్బన్ డై ఆక్సైడ్, ఇతర విషపదార్థాల (టాక్సిన్స్)ను బయటకు పంపడానికి సహాయపడతాయి. అయితే ఎర్రరక్తకణాలు తగ్గడంతో బయటకు విసర్జితం కావాల్సిన విషపదార్థాలూ పోవాల్సినంతగా బయటకు వెళ్లవు. దేహంలో ఉండిపోయిన ఈ టాక్సిన్స్... ఇతర జీవక్రియలకూ అంతరాయం కలిగిస్తుంటాయి. ఫలితంగా బాధితుల్లో నీరసం, నిస్సత్తువ ఏర్పడి వాళ్లు తీవ్రమైన అలసటతో ఉన్నట్లుగా కనిపిస్తుంటారు.చికిత్సల కారణంగా: చాలా సందర్భాల్లో బాధితులు తీసుకునే కీమో, రేడియోథెరపీ వంటి చికిత్సల వల్ల, అలాగే బోన్ మ్యారో క్యాన్సర్ బాధితులకు అందించే మందుల కారణంగా తీవ్రమైన నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. ఈ మందులు నిజానికి క్యాన్సర్ కణాలను నశింపజేయల్సి ఉంటుంది. కానీ ఈ క్రమంలో అవి ఆరోగ్యవంతమైన కణాలనూ ఎంతోకొంత దెబ్బతీస్తుంటాయి. ఇలా ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతిని నశించిపోవడంతో కేన్సర్ బాధితుల్లో నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. ఇక కీమో తీసుకుంటున్నవారిలో దేహం చాలా వేడిగా ఉన్నట్లు అనిపించడం, ఒంట్లోంచి వేడి బయటకు వస్తున్న ఫీలింగ్తో నిద్రాభంగం అవుతుండటం, నిద్రలో అంతరాయాలు, ఆకలి తగ్గినట్లుగా ఉండటంతో సరిగా భోజనం తీసుకోక΄ోవడం వంటి అంశాలు కూడా నీరసం, నిస్సత్తువ (ఫెటీగ్)కు కారణమవుతాయి.ఫెటీగ్ను అధిగమించడమిలా... తినాలని మనస్కరించక΄ోయినా వేళకు పుష్టికరమైన ఆహారం తీసుకోవడం, మెల్లమెల్లగా వ్యాయామాలకు ఉపక్రమించి, క్రమబద్ధంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండటం... మనసు ఇచ్చగించకపోయినప్పటికీ ఇలాంటివి క్రమం తప్పకుండా చేస్తూ చురుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తే ‘కేన్సర్ ఫెటీగ్’ సమస్యను సులువుగానే అధిగమించవచ్చు. ఇలాంటి వ్యాయామాలతో ఎండార్ఫిన్స్ అనే రసాయనాల స్రావాల వల్ల సంతోషం పెరగడం, దాంతో క్రమంగా చురుగ్గా ఉండటం సాధ్యమవుతాయి. న్యూట్రిషన్ కౌన్సెలింగ్: క్యాన్సర్ బాధితులు ఆహారం సరిగా తీసుకోక΄ోవడంతో బరువు కోల్పోయి... సన్నబడతారు. ఆకలి లేక΄ోవడం, కుంగుబాటు (డిప్రెషన్), మందుల వల్ల కలిగే వికారం వంటివి వారిని సరిగా తిననివ్వవు. దాంతో దేహానికి అవసరమైన పోషకాలు అందక΄ోవడంతో సన్నబడి నీరసించిపోతారు. బాధితుల నోటికి రుచిగా ఉండేలాంటి ఆహారాల తయారీ, అవసరమైన పోషకాలు అందడానికి తీసుకోవాల్సిన పదార్థాల వంటివి తెలుసుకోడానికి ‘న్యూట్రిషనిస్ట్ / డైటీషియన్’ను సంప్రదించాలి. విశ్రాంతి : రోజులో తగినంత చురుగ్గా ఉండటంతోపాటు తగినంత విశ్రాంతి తీసుకోవడమూ అవసరమే. ఈ విశ్రాంతి తమ శక్తిసామర్థ్యాలను మరింత శక్తి పుంజుకుని మళ్లీ క్రీయాశీలం కావడానికి ఉపయోగపడుతుందని బాధితులు గ్రహించాలి. ఇతర విషయాలపైకి దృష్టి మళ్లించడం (డిస్ట్రాక్షన్): ఎప్పుడూ వ్యాధి గురించే ఆలోచించకుండా... తమ దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లించాలి. మంచి పుస్తకాలు చదవడం, హాస్యభరితమైన, వినోదాత్మకమైన సినిమాలు చూడటం, ఫ్రెండ్స్తో మాట్లాడుతుండటం, సమయాన్ని సరదాగా గడపడం వంటి వాటితో జబ్బునుంచి దృష్టిమళ్లించగలిగితే ఇది కూడా ఫెటీగ్ను అధిగమించడానికి తోడ్పడుతుంది. కంటి నిండా నిద్ర : క్యాన్సర్ బాధితుల్లో చాలామందికి నిద్రపట్టడం కష్టమై తరచూ నిద్రాభంగమవుతుంటుంది. దాంతో మరింత నిస్సత్తువగా అనిపిస్తుంటుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి ప్రక్రియల ద్వారా బాధితులు ఈ సమస్యను అధిగ మించవచ్చు. అలాగే కాఫీ లేదా కెఫిన్ ఉండే ద్రవాహారాలను తగ్గించడం కూడా మంచిదే. చిన్నపాటి కునుకు తీయడం, మధ్యాహ్నం కాసేపు ఓ పవర్న్యాప్ వంటి వాటితోపాటు వేళకు పెందలాడే నిద్రించి పెందలాడే లేవడం లాంటి మంచి నిద్ర అలవాట్లతో నిద్ర సమస్యను తేలిగ్గానే అధిగమించవచ్చు. అలాగే మంచి నిద్ర కోసం చీకటిగా ఉండే గది (డార్క్ రూమ్) లో నిద్ర΄ోవడంతో గాఢంగా నిద్రపట్టి నిద్ర సమస్యలు దూరమయ్యే అవకాశముంది. అప్పటికీ నిద్రపట్టనివాళ్లలో డాక్టర్లు ‘మెలటోనిన్’ సప్లిమెంట్లు ఇవ్వడం వంటి (ముఖ్యంగా కీమోధెరపీ తీసుకునే బాధితులకు) జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరాన్ని బట్టి మందులు: బాధితుల్లో నీరసం, నిస్సత్తువ ఎక్కువగా ఉన్నప్పుడు కారణాలను బట్టి డాక్టర్లు వారికి కొన్ని మందుల్ని సూచిస్తారు. ఉదాహరణకు రక్తహీనత ఉన్నవారికి ఐరన్ సప్లిమెంట్లూ, పోషకాహార లోపాలను బట్టి ఇతర సప్లిమెంట్లు, మానసిక సమస్యలను బట్టి యాంటీ డిప్రెసెంట్లు, సైకో స్టిమ్యులెంట్ల వంటి మందులు ఇస్తారు. కేన్సర్ ఫెటీగ్తో బాధపడుతున్నవారు పై సూచనలు పాటిస్తే తమంతట తామే సమస్యలను అధిగమించవచ్చు. కుదరకపోతే వైద్యనిపుణుల సహాయం తీసుకోవచ్చు. కేన్సర్ ఫెటీగ్ అధిమించలేని సమస్యేమీ కాదని గ్రహించడం అన్నిటికంటే ముఖ్యం.డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్
Pregnancy: సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
నాకు ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయింది. రెండు నెలలు. కొంచెం బ్లీడింగ్ అవుతోంది. హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఏమైనా వాడాలా? వాటికి సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయా? – పి. హారిక, గన్నవరంప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో బ్లీడింగ్ అనేది సర్వసాధారణం. అయితే బ్లీడింగ్ అవటంతోటే గర్భస్రావం అవుతుందేమోననే భయం ఉంటుంది చాలామందిలో. ప్రతి ముప్పైమందిలో ఒకరికి మాత్రమే గర్భస్రావమయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకానీ ప్రతి గర్భిణికీ అలాగే అవుతుందేమోనని హైడోస్ హార్మోన్స్, సపోర్ట్ మెడిసిన్స్ ఇవ్వటం సరికాదు. కేస్ను బట్టే నిర్ణయించాలి. ప్రెగ్నెన్సీలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ చాలా కీలకం. ఇది గర్భసంచి పొర పెరగటానికి తోడ్పడి, గర్భస్రావం కాకుండా ఉండటానికి సాయపడుతుంది. అయితే వజైనల్ బ్లీడింగ్ అవుతున్నవారికి ఈ హార్మోన్ సప్లిమెంటేషన్ వల్ల ఉపయోగం ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. అలాగని అందరికీ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈ హార్మోన్.. టాబ్లెట్స్, పెసరీస్, ఇంజెక్షన్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. దీన్ని రోజుకి రెండుసార్లు, నాలుగవ నెల అంటే 16 వారాల వరకు ఇస్తే సరిపోతుంది. కొన్ని సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని నివారించడానికి భోజనం చేసిన వెంటనే వేసుకోవాలి. పొట్టలో నొప్పి, వాంతులు, బ్రెస్ట్ పెయిన్, నీరసం, మలబద్ధకం లాంటివి ఉండవచ్చు. ఎక్కువ ఇబ్బంది ఉన్న వారికి వజైనల్ లేదా రెక్టల్ రూట్లో యూజ్ చెయ్యమని సూచిస్తారు.నాకిప్పుడు మూడోనెల. తొలి చూలు. ఎలాంటి సమస్యలు రావద్దనుకుంటున్నాను. ఎమోషనల్గా బేబీకి దగ్గరవటానికి, ప్రెగ్నెన్సీ నుంచే కొన్ని చెయ్యాలంటుంటారు. అవేంటో సజెస్ట్ చేయగలరా? – సి. సత్య, కదిరితొలిసారి తల్లి కాబోతున్నప్పుడు చాలా సందేహాలు, ఇంకెన్నో భయాలుంటాయి. ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో కొంత అవగాహన పెరిగింది. అయితే భయాలు కూడా పెరిగాయి. గర్భస్థ శిశువుకు భావోద్వేగాలు, చొరవ తీసుకునే సామర్థ్యాలు, తల్లిదండ్రుల ప్రేమ వంటివి అర్థమవుతాయని పరిశోధనల్లో రుజువైంది. హెల్దీ అటాచ్మెంట్ ఉంటే బయటి వాతావరణం సురక్షితంగా, భద్రంగా ఉందని గర్భస్థ శిశువు భావిస్తుంది. అయిదవ నెల నుంచి గర్భస్థ శిశువు శబ్దాలను వినే చాన్స్ ఉంది. అందుకే పొట్టలో బిడ్డతో తల్లి కమ్యూనికేట్ చేయొచ్చు. ఇది పుట్టిన తరువాత బిడ్డ మీ వాయిస్ని గుర్తుపట్టేందుకు సాయపడుతుంది. పాజిటివ్ థింకింగ్ అండ్ థాట్స్ ఉంటే లోపల బిడ్డ గ్రోత్ బాగుంటుంది. పొట్టలో బిడ్డ గురించి ఆలోచించటం, మాట్లాడటం 5వ నెల నుంచి మొదలు పెట్టవచ్చు. దీని వలన మంచి బాండింగ్ డెవలప్ అవుతుంది. 5 నుంచి 6వ నెల మధ్య బిడ్డ కదలికలు తెలుస్తుంటాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తూండాలి. ఈ కదలికల తీరు అందరికీ ఒకేలా ఉండదు. ఒక వారం గమనిస్తే ఎప్పుడు, ఎలా కదులుతోందనేది తెలుస్తుంది. అకస్మాత్తుగా కదలికలు నెమ్మదిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మంచి బుక్స్ చదవటం, హెల్దీ డైట్ తీసుకోవటం చాలా అవసరం.నాకు ఏడాది కిందట అబార్షన్ అయింది. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్ని. మూడోనెల. రొటీన్ బ్లడ్ టెస్ట్లో హెపటైటిస్ – బి పాజిటివ్ అని చెప్పారు డాక్టర్. దీని వలన నాకు, నావల్ల బేబీకి ఎలాంటి రిస్క్ ఉండొచ్చు?– రుక్మిణి, మహబూబ్నగర్హెపటైటిస్ – బి అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది చాలామందిలో ఏ సింప్టమ్స్ లేకుండా సైలెంట్గా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో అందరికీ రొటీన్గా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ని చెక్ చెస్తారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు వచ్చిన వారికి ముందే చెక్ చేసి, అవసరమైన వాళ్లకి ప్రివెంటివ్ వాక్సినేషన్ ఇస్తారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్లో ముఖ్యంగా లివర్కి వాపు ఉంటుంది. ఇది చాలావరకు కలుషిత ఇంజెక్షన్స్, రక్తం, వీర్యం, ఉమ్మి ద్వారా వ్యాపిస్తుంది. ఒకసారి మీ భర్త కూడా హెపటైటిస్–బి టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరిస్థితుల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్ చూసే డాక్టర్ని సంప్రదించాలి. డెలివరీ తరువాత బేబీకి కూడా స్పెషలిస్ట్ కేర్, వాక్సినేషన్స్ అవసరం. ప్రెగ్నెన్సీలో మీకు లివర్ సమస్య ఎక్కువవకుండా కొన్ని మందులను సూచిస్తారు. వైరల్ లోడ్ తగ్గిందా లేదా అని తరచు బ్లడ్ టెస్ట్స్ చెయ్యవలసి ఉంటుంది. లివర్ స్కాన్ చెయ్యాలి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా నార్మల్ డెలివరీ అవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చెయ్యవచ్చు. బేబీకి హెపటైటిస్–బి రాకుండా ప్రాపర్ టెస్ట్స్, వాక్సిన్స్ చేయించాలి. పుట్టిన వెంటనే నాలుగు వారాలకు, ఏడాదికి వాక్సిన్స్ ఇవ్వాలి. మీకు వైరల్ లోడ్ ఎక్కువుంటే, బేబీకి ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అందరికీ ఇచ్చే రొటీన్ వాక్సిన్స్ కూడా ఇవ్వాలి. బేబీకి ఏడాది వయసు వచ్చే వరకు క్లోజ్గా ఫాలో అప్ చెయ్యాలి. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్
ఫొటోలు
తిరుమలలో సంక్రాంతికి వస్తున్నాం టీమ్.. (ఫోటోలు)
దిగ్గజ కంపెనీలన్నీ ఒకేచోట: అబ్బురపరుస్తున్న కొత్త వెహికల్స్ (ఫోటోలు)
kiara Advani: భర్తతో గేమ్ ఛేంజర్ బ్యూటీ వెకేషన్ (ఫోటోలు)
ఫ్లాప్స్, ట్రోలింగ్తో డిప్రెషన్లో.. ఇప్పుడు వరుస హిట్స్తో దూకుడు (ఫోటోలు)
ప్రపంచం చూపు.. ప్రయాగ్రాజ్ వైపు.. మహా కుంభమేళా చిత్రాలు
అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోను.. కొడతాను (ఫొటోలు)
20 ఏళ్ల తర్వాత తెలుగులో సినిమా.. బెస్ట్ మూవీ అవార్డ్ అందుకున్న హీరోయిన్ (ఫొటోలు)
విశాఖపట్నం : కైలాసగిరి..సందడే సందడి (ఫొటోలు)
చంపేంత కోపం.. చచ్చేంత ప్రేమ.. పుకార్లకు ఒబామా దంపతుల ఫుల్స్టాప్ (ఫొటోలు)
విజయవాడలో హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)
National View all
రాహుల్గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
గువహతి:కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పోరాడుతోందని కాంగ్రెస్(Con
అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అని తెలీదు: అజిత్ పవార్
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(
Cyber Scam: రూ. 11 కోట్లు పోగొట్టుకున్న టెకీ..!
బెంగళూరు: ‘ మీర
కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ
మోదీ జీ.. వారికి భూమిలిచ్చి ఆదుకోండి: కేజ్రీవాల్ మరో లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly
International View all
వచ్చే 10 ఏళ్లలో ప్రపంచానికి అతి పెద్ద ముప్పు ఏంటో తెలుసా?
ఈ ప్రపంచం వచ్చే రెండేళ్లలో, అలాగే వచ్చే పదేళ్లలో ఎదుర్కొనే అతి పెద్ద ముప్పు (Global Risk) ఏమిటి?
గాజా ఒప్పందం ఆలస్యం!.. హమాస్కు ఇజ్రాయెల్ వార్నింగ్!
జెరుసలేం : గాజాలో శాంతి ఒప్పందం వేళ ఇజ్రాయెల్ సైన్యం హమాస్
ట్రంప్ అధ్యక్ష పట్టాభిషేకం.. ఈ విశేషాలు తెలుసా?
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ మరోసారి వైట్హౌజ్లో అడుగుపె
భారత్లో ట్రంప్ పర్యటన.. ఎప్పుడంటే?
వాషింగ్టన్ : అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారానికి మ
పేలిన పెట్రోల్ ట్యాంకర్.. 70 మంది మృతి
అబుజా : నైజీరియా ( Nigeria)లో ఘోర ప్రమాదం సంభవించింది.
NRI View all
హెచ్-1బీ వీసా కొత్త రూల్స్ : వాళ్లకి నష్టం, భారతీయులకు ఇష్టం!
హెచ్-1బీ వీసాలకు సంబంధించిన కొత్త నియమాలు ఈ రోజు (జనవరి 17, 2025) అమల్లోకి వస్తాయి.
వైట్హౌస్ కేసు.. సాయివర్షిత్కు 8 ఏళ్ల జైలు శిక్ష
అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌజ్పై దాడికి యత్నించిన భారత సంతతి యువకుడు కందుల సాయివర్షిత్కు శిక్ష ఖరారైంది.
13 ఏళ్లకే రెండు శతకాలు రాసిన సంకీర్త్
తెలుగు పదాలను, పద్యాలను సరిగా పలకలేని విద్యార్ధులు ఉన్న ఈ తరంలో 13 ఏళ్ల వయసులోనే జనార్ద, శ్రీనరసింహ శతకాలను రాసి చ
తెలుగు, సాహితీ ప్రియులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!
తానా సంస్థ సాహిత్యవిభాగంగా మే, 2020 న ఆవిర్భవించిన “తానా ప్రపంచసాహిత్య వేదిక ‘నెలానెలా తెలుగువెలుగు’ పేరిట విభిన్న సాహిత
Sankranti 2025 : జపాన్లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి వచ్చిందంటే ఊరా వాడా అంతా సంబరంగా జరుపుకుంటారు.
క్రైమ్
పల్లగిరిలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
పల్లగిరి(ఎన్టీఆర్ జిల్లా): ఏపీలో రోజు రోజుకు హత్యా రాజకీయాలు పెరిగిపోతున్నాయి. విద్వేషమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులపై విరుచుకుపడుతున్నారు దుండగులు. నందిగామ నియోజకవర్గం పల్లగిరిలో వైఎస్సార్ీపీ కార్యకర్త దారుణంగా హత్యగావించబడ్డాడు. శనివారం నాగుల్ మీరా అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు దుండగులు.నాగుల్ మీరాను హతమార్చి ఊరి బయట నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. ఈ విషాద ఘటన సమాచారాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు.. నాగుల్ మీరా మృతదేహాన్ని పరిశీలించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారాయన.
దుండగుడి కోసం వేట
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడికి పాల్పడిన దుండగుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు వేట ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా 35 పోలీసు బృందాలు ఆగంతకుడి కోసం గాలిస్తున్నాయి. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఉన్నతాధికారులు తెలిపారు. దర్యాప్తుపై హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే చాలా ఆధారాలు లభించాయి. దుండగుడిని త్వరలో వారు పట్టుకుంటారు’అని తెలిపారు. ఇందుకు సంబంధించి వారిస్ అలీ సల్మానీ అనే ఓ కార్పెంటర్ను ప్రశ్నిస్తున్నట్లు అంతకుముందు ముంబై పోలీసులు ప్రకటించారు. ఘటనకు ముందు రెండు రోజులపాటు అతడు సైఫ్ ఫ్లాట్లోనే పనులు చేశాడన్నారు. విచారణ అనంతరం అతడికి దాడితో సంబంధం లేదని తేలడంతో వదిలేశామన్నారు. ఆగంతకుడికి ఎలాంటి నేర ముఠాలతోనూ సంబంధం లేదని అందిన ఆధారాలను బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని బట్టి అతడు 1.37 గంటల సమయంలో మెట్ల ద్వారా ఇంట్లోకి చేరుకున్నట్లు వెల్లడైందన్నారు. అతడుదొంగతనానికి వెళ్లింది సైఫ్ ఇంట్లోకి అనే విషయం కూడా అతడికి తెలిసుండకపోవచ్చని చెప్పారు. కాగా, సైఫ్పై దాడి ఘటనతో అండర్ వరల్డ్ గ్యాంగ్లకు సంబంధం లేదని మహారాష్ట్ర హోం శాఖ ఉప మంత్రి యోగేశ్ కదమ్ స్పష్టం చేశారు. బెదిరింపులు వచ్చినట్లుగా సైఫ్ అలీ ఖాన్ సైతం ఎన్నడూ పోలీసులకు చెప్పలేదని, భద్రత కల్పించాలని కోరలేదని కూడా మంత్రి తెలిపారు. ఆయన అడిగితే భద్రత నిబంధనల మేరకు కలి్పంచి ఉండేవారమన్నారు. దాడి ఘటనకు చోరీ యత్నం మాత్రమే కారణమని వివరించారు. ఇలా ఉండగా, సైఫ్ ఇంట్లో చోరీకి యతి్నంచిన దుండగుడే ఈ నెల 14వ తేదీన బాలీవుడ్ మరో స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ నివాసం వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. సైఫ్ కోలుకుంటున్నారు: ఆస్పత్రి వర్గాలు తీవ్ర కత్తి పోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారని లీలావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆయన కొద్దిసేపు నడిచారని, వెన్నెముకకు తీవ్ర గాయమైనందున బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించామని పేర్కొంది. ఆయనకు ఎలాంటి సమస్యా లేకుంటే మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే చెప్పారు. ‘ఓ వైపు రక్తమోడుతూనే ఆయన ఆస్పత్రి లోపలికి సింహంలా నడుచుకుంటూ వచ్చారు. పక్కన కుమారుడు ఆరేడేళ్ల తైమూర్ మాత్రమే ఉన్నాడు’’ అంటూ గురువారం వేకువజామున సైఫ్ చూపిన గుండెనిబ్బరాన్ని మెచ్చుకున్నారు డాక్టర్ డాంగే. నేను, సైఫ్ అలీ ఖాన్.. గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో రక్తంతో తడిచిన కుర్తాతో తాను తీసుకెళ్లిన వ్యక్తి నటుడు సైఫ్ అలీ ఖాన్ అనే విషయం లీలావతి ఆస్పత్రికి వెళ్లేదాకా తనకు తెలియదని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా చెప్పారు. ఆస్పత్రి గేటు వద్దకు వెళ్లాక అక్కడి గార్డుతో.. స్ట్రెచర్ తీసుకురా, నేను..సైఫ్ అలీ ఖాన్ను అని ఆయన చెప్పాకనే ఆ విషయం తెలిసిందని రాణా శుక్రవారం ముంబైలో మీడియాకు తెలిపారు. ‘సైఫ్ ఉంటున్న సద్గురు శరణ్ అపార్టుమెంట్ సమీపం నుంచి వెళ్తుండగా ఒక మహిళ, మరికొందరు తన ఆటోను ఆపారు. అనంతరం రక్తంతో తడిచిన కుర్తాతో ఓ వ్యక్తి ఆటోలో కూర్చున్నారు. ఆయనతోపాటు 8 ఏళ్ల బాలుడు, ఓ యువకుడు, మహిళ కూర్చున్నారు. మొదట వాళ్లు హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు. కానీ, సైఫ్ లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో, అక్కడికే ఆటోను పోనిచ్చాను. అక్కడికెళ్లాక సైఫ్ ఆస్పత్రి గేట్ వద్ద గార్డును పిలిచారు. దయచేసి స్ట్రెచర్ తీసుకురా..నేను, సైఫ్ అలీ ఖాన్ అని అన్నారు. అప్పుడు సమయం దాదాపు మూడైంది. ఏడెనిమిది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాం’అని రాణా వివరించారు. అప్పటి దాకా ఆయన సైఫ్ అలీ ఖాన్ అనే సంగతి గమనించలేదని చెప్పారు.
బిహార్ గ్యాంగ్ పనేనా?
సాక్షి, హైదరాబాద్ : బీదర్లో డబ్బు దోచుకోవడానికి.. పట్టుబడతామనే భయంతో అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన దుండగులు బిహార్కు చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరిని బిహార్కు చెందిన పాతనేరగాడు మనీశ్కుష్వాడగా గుర్తించినట్టు తెలిసింది. గురువారం చోటు చేసుకున్న ఈ ఉదంతాల్లో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపగా, శుక్రవారం తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, బిహార్ల్లో గాలిస్తున్నా యి. మరోపక్క కర్ణాటక పోలీసులు నగరానికి చేరుకొని కేసు దర్యాప్తులో పాలుపంచుకున్నారు. ఆటోలో ఎంజీబీఎస్ వైపు నుంచి ..: బీదర్లో దుండగులిద్దరూ ‘ఏపీ’రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న బైక్పై రూ.93 లక్షలున్న అల్యూమినియం డబ్బా ఎత్తుకొని ఉడాయించారు. అక్కడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చి మార్గమధ్యలో ఆ డబ్బును బ్యాగ్లోకి మార్చుకున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామమైన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలోని ßæనుమాన్ టెంపుల్ వద్ద గల సీసీ ఫుటేజీల్లో దుండగులు కనిపించారు. సుల్తాన్పూర్, డప్పూర్, హత్నూర్, న్యాల్కల్ మీదుగా హైదరాబాద్ వెళ్లారు. అయితే ఆ డబ్బా, బైక్ ఎక్కడ వదిలేశారన్నది ఇంకా తేలలేదు. ఒకరు ఈ పెద్ద బ్యాగ్ పట్టుకొని, మరొకరు బ్యాక్ ప్యాక్ తగిలించుకొని గురువారం సాయంత్రానికి రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ఈ ద్వయం ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చి ట్రావెల్స్ వద్ద దిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఫోన్ నంబర్ ఇచ్చి... రాయ్పూర్ వెళ్లడానికి అమిత్కుమార్ పేరుతో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ సెల్నంబర్ ఇచ్చారు. బస్సు, సీట్ల నంబర్లు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయని, సరిచూసుకోవాలని ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పారు. దీంతో ఓ దుండగుడు తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని, ఇక్కడే ఉండి మీతోనే వచ్చి బస్సు ఎక్కుతామని వారికి చెప్పాడు. ఆ బస్సు ప్రయాణించే మార్గం, మార్గమ«ధ్యలో దాని స్టాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు ట్రావెల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మదీనాలో రెండు బ్యాగ్స్ ఖరీదు.... రూ.93 లక్షలతో కూడిన బ్యాగ్ను చేత్తో పట్టుకొని మోయడం కష్టంగా ఉండటంతో ట్రాలీ బ్యాగ్ ఖరీదు చేయాలని భావించారు. అవి ఎక్కడ దొరుకుతాయంటూ ట్రావెల్స్ నిర్వాహకులను అడిగారు. మదీనా ప్రాంతంలో దుకాణాలు ఉన్నాయని చెప్పగా, అక్కడకు వెళ్లి రెండు ట్రాలీ బ్యాగ్స్ ఖరీదు చేశారు. మూసీనది సమీపంలో లేదా పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లి పెద్ద బ్యాగ్లో ఉన్న నగదును ఓ ట్రాలీలోకి మార్చారు. మరో దాంట్లో కొన్ని వ్రస్తాలతోపాటు హెల్మెట్ పెట్టారు. బ్యాక్ ప్యాక్లో మాత్రం తుపాకీ దాచి ఉంచారు. కాల్పులు జరిపింది మినీ బస్సులోనే... రోషన్ ట్రావెల్స్ కార్యాలయం అఫ్జల్గంజ్ బస్టాప్లోనే ఉంటుంది. అక్కడ మినీ బస్సుల్ని ఆపడానికి అవకాశం ఉండదు. దీంతో తమ ప్రయాణికుల్ని ట్రావెల్స్ బస్సుల వరకు చేర్చే మినీ బస్సుల్ని సమీపంలో ఉన్న మెట్రో ట్రావెల్స్ వద్ద ఆపుతారు. గురువారం సైతం ఇలానే ఆగడంతో..రోషన్ ట్రావెల్స్ నుంచి మిగిలిన ప్రయాణికులు, బీదర్ పోలీసులతో కలిసి ఇద్దరు దుండగులూ ఆ బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణికుల లగేజీ తనిఖీ చేస్తున్న ట్రావెల్స్ ఉద్యోగి జహంగీర్ దుండగుల ఓ ట్రాలీని తెరిచి చూసి హెల్మెట్, వస్త్రాలు గుర్తించారు. రెండోది తెరవడానికి ప్రయత్నిస్తుండగా, అందులో నగదు ఉండటంతో ఓ దుండగుడు తన బ్యాక్ ప్యాక్ నుంచి తుపాకీ బయటకు తీసి ఒక రౌండ్ కాల్చాడు. ఈ శబ్దం విన్న బస్సు డ్రైవర్ తొలుత టైరు పగిలిందని భావించి కిందకు దిగాడు. అదే అదనుగా ఇద్దరు దుండగులూ తమ ట్రాలీలతో సహా కిందకు దిగి ట్రాఫిక్కు రాంగ్ సైడ్లో నడుచుకుంటూ వెళ్లారు. పోలీస్స్టేషన్ ఎదురుగా ఆటో ఎక్కి... అదే మినీ బస్సులో ఉన్న ఇద్దరు బీదర్ పోలీసు కానిస్టేబుళ్లు వీరిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ సమీపం వరకు నడుచుకుంటూ వెళ్లిన దుండగులు ఓ ఆటో ఎక్కి ఎంజే మార్కెట్ మీదుగా ఉడాయించారు. ఠాణా సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను బట్టి రాత్రి 7.09 గంటలకు దుండగులు ఆటో ఎక్కారు. దీని ప్రకారం కాల్పులు 7 గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రుడు మినీ బస్సు దగ్గర నుంచి రోషన్ ట్రావెల్స్ వరకు వచ్చి, వారికి విషయం చెప్పి, పోలీసులకు సమాచారం ఇచ్చేసరికి సమయం దాదాపు రాత్రి 7.30 గంటలైంది. సికింద్రాబాద్ మీదుగా పరారీ... దుండగులు ప్రయాణించిన ఆటో ఎంజే మార్కెట్, అబిడ్స్, ట్యాంక్బండ్ మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆటో నంబర్, దాని ద్వారా డ్రైవర్ను గుర్తించిన అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రశ్నించారు. తాను ఇద్దరినీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్ వరకు తీసుకెళ్లానని చెప్పాడు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలులో ఛత్తీస్గఢ్ లేదా బిహార్కు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు.
అమెరికా వెళ్లాక గర్ల్ఫ్రెండ్ హ్యాండిచ్చిందని..
ప్రేమ పేరుతో వంచించి తన ఆర్థిక అవసరాలన్నీ తీర్చుకున్న ఓ యువతి తిరస్కరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ప్రకాశం జిల్లాలో (Prakasam District) బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన కందుల ప్రవీణ్ (27) ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఒంగోలుకు (Ongole) చెందిన వాకా హరిణి లక్ష్మి అనే యువతి ప్రవీణ్కు ఐదేళ్ల కిందట పరిచయం కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ కలిసి హైదరాబాదులో (Hyderabad) కొద్దికాలం పాటు ప్రైవేటు ఉద్యోగం చేశారు.ఈ క్రమంలో యువతి ఈ చిన్న ఉద్యోగాలు తాను చేయలేనని, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడానికి సహకరించాలని కోరడంతో ప్రవీణ్ తనకున్న పరిచయాలతో అందినకాడికి డబ్బులు తెచ్చి హరిణి లక్ష్మిని ఏడాదిన్నర క్రితం అమెరికా పంపించాడు. ఆమె అమెరికా వెళ్లిన తరువాత అక్కడ ఆమె మరో స్నేహితురాలు యామిని చౌదరితో కలిసి ప్రవీణ్కు ఫోన్ చేసి ‘నీవంటే నాకిష్టం లేదని.. తనను మరచిపో’ అంటూ చెప్పింది. ఈ క్రమంలో తమ కుమార్తెను ప్రవీణ్ వేధిస్తున్నాడంటూ యువతి తల్లిదండ్రులు రెండు నెలల కిందట ఒంగోలు ఒన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రవీణ్తో పాటు అతని తండ్రి కందుల డానియేలును పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.అనంతరం ఎవరి తీరున వారు ఉన్న క్రమంలో ఇటీవల నుంచి మళ్లీ హరిణి లక్ష్మి, ఆమె స్నేహితురాలు యామిని చౌదరి తిరిగి ప్రవీణ్కు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని లేకపోతే వేధింపులు ఆపడం లేదని మళ్లీ ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు దిగడంతో ప్రవీణ్ తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. ఆ విషయాన్ని యువతి హరిణిలక్ష్మికి చెప్పి మరీ బుధవారం సాయంత్రం ఉప్పుగుండూరు గ్రామంలోని తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గురువారం మధ్యాహ్నం మృతుడి బంధువులు పోలీస్స్టేషన్కు చేరుకుని ఆందోళన చేశారు. కాగా, మృతుడి తండ్రి కందుల డానియేలు ఫిర్యాదు మేరకు యువతి వాకా హరిణి లక్ష్మి, ఆమె తండ్రి తిరుమలరావు, స్నేహితురాలు యామిని చౌదరిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ అజయ్బాబు తెలిపారు.భార్య తనతో డాన్స్ చేయడానికి రాలేదని.. ఉలవపాడు: సంక్రాంతి సంబరాల్లో భార్య తనతో డాన్స్ చేయడానికి రాలేదని మనస్తాపంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో (Nellore District) బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉలవపాడు (Ulavapadu) మండల పరిధిలోని కరేడు పంచాయతీలోని ఇందిరా నగర్ గిరిజన కాలనీలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అందరూ డాన్స్లు వేస్తున్న సమయంలో ఇండ్లా బాలసుబ్రహ్మణ్యం (25) తన భార్యను కూడా తనతో డాన్స్ చేయడానికి రమ్మన్నాడు. పిల్లలను పట్టుకుని ఉన్నాను.. తరువాత వచ్చి వేస్తానులే అని చెప్పింది. చదవండి: సంక్రాంతి అల్లుడు మిస్సింగ్దీంతో అతను మనస్తాపానికి గురై ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికే కదా వెళ్లింది అని కార్యక్రమం అయిన తరువాత వెళ్లి చూస్తే ఇంటిలోని వంట గదిలో ఫ్యాన్కు వేసిన కొక్కేనికి చీరతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే స్థానికులు అతడిని ఉలవపాడు వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 👉ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
వీడియోలు
5 ఏళ్ల బాలుడి కిడ్నాప్
సందు దొరికితే చాలు వైఎస్ జగన్ పై బురద చల్లాలనే ప్రయత్నమే
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం
వైఎస్ జగన్ చర్యల వల్లే ప్రైవేటీకరణ ఆగింది: అమర్నాథ్
అతిపెద్ద ఆటో షోకు వేదికగా ఢిల్లీ
Jana Tantram: అప్పారావు చిటికెల పందిరి
కూటమి సర్కార్ లో డిప్యూటీ CM పవన్ కల్యాణ్ కు చెక్ పెట్టేందుకు పావులు
12 ఏళ్ళకు విశాల్ సంచలనం దెబ్బకు సంక్రాంతి రికార్డు బద్దలు
Sankranti Special: సంక్రాంతి పిండి వంటలకు ఫిదా
శ్రీకాకుళం జిల్లా గూడూరులో మురుగు నీటిలోకి దిగిన గ్రామస్తులు