Top Stories
ప్రధాన వార్తలు

ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: రంజాన్ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఏసీ కల్యాణ మండపంలో జరుగుతున్న ఇఫ్తార్ విందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.

UPI Down: ఫోన్పే, గూగుల్ పే యూజర్లకు షాక్.. యూపీఐ సేవల్లో అంతరాయం
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. చాలామంది వినియోగదారులు లావాదేవీలను చేయలేకపోయినట్లు వెల్లడించారు. బుధవారం రాత్రి 7:50 గంటలకు 2,750 యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. గూగుల్పే వినియోగదారుల నుంచి 296 ఫిర్యాదులు వచ్చాయి.యూపీఐ సేవలు డౌన్ అవ్వడంతో.. దేశ వ్యాప్తంగా వినియోగదారులు లావాదేవీలు చేయడంలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు. వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా.. వారు ఎదుర్కొన్న సమస్యలను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సమస్య కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.Is UPI down? Anyone facing the issue? #Upidown— Sumit Mishra (@SumitLinkedIn) March 26, 2025UPI Down ⚠️Nationwise issue or it's only me ?— Crypto with Khan ( SFZ ) (@Cryptowithkhan) March 26, 2025Anyone facing UPI app issues or just me facing?? #phonepe #gpay #paytm— Anoop CSKian 💛 (@Anoopraj_7) March 26, 2025

అప్సర కేసు: ఒక్క రాత్రిలో తలకిందులైన జీవితాలు
వివాహితుడైనప్పటికీ ఆమె అతన్ని గాఢంగా ఇష్టపడింది. శారీరక సుఖం కోసం అతనూ ఆమెను ఇష్టపడినట్లు నటించాడు. ఇద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగారు. పైపెచ్చు వాళ్ల తిరుగుళ్లకు ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. అలా నాలుగేళ్లు గిర్రుమన్నాయి. తీరా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేసరికి భరించలేకపోయాడు. ప్రేమ మత్తులో ఉండగానే ఆమెను అనంతలోకాలకు పంపించేశాడు. అప్సర-వెంకటసాయికృష్ణ జీవితాలు ఆ ఒక్కరాత్రిలో తలకిందులయ్యాయి. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగిందంటే.. అప్సర-సాయికృష్ణ.. ఏడాది కాలంలోనే వాళ్ల మధ్య బంధం బలపడింది!. చెన్నై నుంచి హైదరాబాద్కు తల్లితో సహా వచ్చిన అప్సర.. సరూర్ నగర్లో ఓ ఇంట్లో అద్దెకు దిగి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించసాగింది. దైవభక్తి కారణంగా ఆలయాలకు క్రమం తప్పకుండా వెళ్తుండేది. అలా.. 2022లో సరూర్ నగర్ బంగారు మైసమ్మ గుడి పెద్ద పూజారి వెంకటసాయికృష్ణతో పరిచమైంది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సాయి కృష్ణ మెసేజ్లు పంపేవాడు. శంషాబాద్లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు సాయి. అలా స్నేహం బలపడింది. ఈలోపు.. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. అదే టైంలో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. వాట్సాప్ ద్వారా ఇద్దరూ వాళ్ల ప్రేమ వ్యక్తం చేసుకున్నారు. 👉అప్పటికే అప్సరకు వివాహమై భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. మరోవైపు సాయికృష్ణకు వివాహమైంది కూడా. కానీ, ఇద్దరూ చనువుగా ఉంటూ వచ్చారు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు. అప్సర తల్లి(Apsara Mother)ని అక్కా.. అని పిలుస్తూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. సాయి-అప్సరల స్నేహ బంధం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఆమె బ్లాక్మెయిల్కు దిగడాన్ని భరించలేకపోయాడు. అలా చేయకపోతే రోడ్డుకు ఈడుస్తానని హెచ్చరించడంతో రగిలిపోయాడు. చివరకు.. .. ఆమెను చంపడం ఒక్కటే మార్గమని భావించాడు. ఈ క్రమంలో ఎలా చంపాలనేది గూగుల్లో వెతికి మరీ స్కెచ్ వేసుకున్నాడు. సరూర్ నగర్లో తాను పూజారిగా ఉన్న గుడి వెనుక ఉన్న ఆస్పత్రి వద్ద ఖాళీ జాగా ఉంది. అప్సరను చంపేశాక.. ఆ స్థలంలో ఆమెను పాతిపెట్టాలని సాయి భావించాడట. అందుకోసం 20 అడుగుల పెద్ద గొయ్యి తవ్వించాడు. అయితే, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో ఆ గుంతను పూడ్చేయించాడు. దీంతో సాయికృష్ణ.. ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్హోల్ వద్ద స్థలం ఉందని గురించి తన ప్లాన్ను అమలు చేశాడు.👉హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ నేరాలు ఎలా చేయాలనే వివరాలను సెర్చ్ చేశాడు. "How to Kil human being" అని గూగుల్లో వెతికి చూసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. ఇదే అదనుగా భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ డిసైడ్ అయ్యాడు. జూన్ 3.. అప్సర పాలిట కాళరాత్రిఓ ఫిల్మ్మేకర్తో సినిమా అవకాశాల కోసం మాట్లాడదామని.. అందుకోసం కోయంబత్తూరు వెళ్దామని అప్సరను సాయికృష్ణ నమ్మించాడు. విమాన టికెట్లు కొనుగోలు చేశానని చెప్పాడు. నిజమేననుకున్న ఆమె లగేజీ సహా ప్రయాణానికి సిద్ధమైంది. 2023 జూన్ 3న.. అప్సర వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తోందని, ఆమెను శంషాబాద్ వద్ద దింపివస్తానంటూ ఆమె తల్లికి వెంకటసాయికృష్ణ చెప్పాడు.ఆరోజు రాత్రి 8.15 గంటలకు సాయికృష్ణ, అప్సర కారులో సరూర్నగర్ నుంచి బయల్దేరారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్ అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నాక.. టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. ఆపై గోశాలకు వెళ్దామని చెప్పి.. రాళ్లగూడ వైపు తీసుకెళ్లాడు. రాత్రి 10 గంటలకు శంషాబాద్ మండలం రాళ్లగూడలో డిన్నర్ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక అప్సర ఒకసారి వాంతి చేసుకుంది. సాయికృష్ణ ఒక్కడే భోజనం చేసి.. 12 గంటల ప్రాంతంలో సుల్తాన్ పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు.అప్సరకు ఎంతో ఇష్టమైన గోశాలలో కొంతసేపు గడిపారు. అయితే గోశాలలో బెల్లం దంచే రాయిని ఆమె కంటబడకుండా అతడు కారులోకి చేర్చాడు. 4న తెల్లవారుజామున 3.50 సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో ఓ ఖాళీ వెంచర్ వద్దకు చేరారు. ఫ్రంట్ సీటులో తన పక్కనే గాఢ నిద్రలోకి జారుకున్న అప్సరను.. కారు సీటు కవర్ను ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. ఆపై బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో పదిసార్లు బలంగా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.మృతదేహంపై కారు కవర్ కప్పి అక్కడి నుంచి సరూర్నగర్లోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడే మృతదేహం ఉన్న కారును పార్కు చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు.రెండ్రోజుల పాటు కారులో ఉన్న అప్సర మృతదేహాన్ని.. కవర్లో చుట్టి సరూర్నగర్లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్హోల్లో పడేశాడు. ఆపై దుర్వాసన వస్తోందంటూ ఎల్బీనగర్ నుంచి అడ్డా కూలీలను పిలిపించాడు. రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్హోల్ను కప్పి సిమెంట్తో పూడ్పించాడు. అప్సర నుంచి ఎలాంటి స్పందన లేకపోయే సరికి ఆమె తల్లి కంగారుపడి సాయికృష్ణకు ఫోన్ చేసింది. ఏమీ తెలియనట్లు ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి.. తాను వెతుకుతున్నట్లు నటించాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో సాయికృష్ణే హంతకుడని తేలింది. దర్యాప్తు జరుగుతున్న టైంలో సాయికృష్ణ అమాయకుడని.. తప్పంతా అప్సరదేనని అతని తల్లిదండ్రులు, భార్య వాదించారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన మృగానికి తగిన శిక్ష పడాలని అప్సర తల్లి డిమాండ్ చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు విస్తృతంగా జరిగింది. విచారణలోనూ సాయికృష్ణ తన నేరాన్ని అంగీకరించాడు. అలా.. 2023 జూన్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషి సాయికృష్ణకు బుధవారం(మార్చి 26, 2025)న శిక్ష పడింది. జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకుగానూ అదనంగా మరో ఏడేళ్ల శిక్ష వేసింది. అప్సర కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

భద్రాచలంలో విషాదం.. బిల్డింగ్ కూలి పలువురి మృతి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూలి ఆరుగురు మృతిచెందారు. ఆరంతస్తుల భవనం కూప్పకూలింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. క్రేన్లు, పొక్లెయిన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. పాత భవనంపైనే మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణంలో లోపాల వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి.. భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది.పట్టణంలోని రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్లో ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ ఈ భవనాన్ని నాసిరకమైన పిల్లర్లతో నిర్మాణం చేపట్టారని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఐటీడీపీవో రాహుల్ ఈ భవనాన్ని కూల్చివేయమని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి పలువురు మరణానికి కారణమైందని పలువురు చెబుతున్నారు.సామాజిక కార్యకర్తలపై ఇంటి యజమాని బెదిరింపులకు దిగారనే ఆరోపణలున్నాయి. పట్టణంలోని పలు భవన నిర్మాణాలు ఇలాగే నిబంధన విరుద్ధంగా జరుగుతున్నాయని ఎవరు ఫిర్యాదు చేసిన సంబంధించిన శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి పూర్తిగా పంచాయతీ శాఖ బాధ్యత వహించాలని పలువురు అంటున్నారు.

రాజేంద్రప్రసాద్ బూతు మాటలపై డేవిడ్ వార్నర్ రియాక్షన్ ఇదీ..
ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీతో రాబిన్హుడ్ సినిమా (Robinhood Movie)కు కొత్త జోష్ వచ్చినట్లయింది. అతడి స్పెషల్ ఎంట్రీ సినిమాలోనే కాకుండా ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ ఉండటంతో అభిమానులు సంతోషపడ్డారు. కానీ ఇదే ఈవెంట్లో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ వార్నర్పై నోరు జారాడు. రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే కుప్పిగంతులు వేస్తున్నావ్.. అంటూ అతడిని వెక్కిరిస్తూ ఓ బూతు మాట కూడా అన్నాడు.క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్అంత పెద్ద క్రికెటర్ను పట్టుకుని ఇలాంటి చవకబారు వ్యాఖ్యలేంటని జనం మండిపడ్డారు. దీంతో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) క్షమాపణలు తెలిపాడు. వార్నర్ అంటే తనకిష్టమని, ఉద్దేశపూర్వకంగా అలాంటి మాట అనలేదన్నాడు. పొరపాటున నోరు జారానని, మరోసారి అలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. తన మాట తీరు వల్ల ఎవరైనా బాధపడుంటే క్షమించండి అని కోరాడు.వార్నర్ రియాక్షన్ ఇదీ!ఈ విషయంలో వార్నర్ (David Warner) రియాక్షన్ ఎలా ఉందో బయటపెట్టాడు దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula). వెంకీ మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మేమందరం కలిశాం. అప్పుడు రాజేంద్రప్రసాద్గారు, వార్నర్ బాగా క్లోజ్ అయ్యారు. రాజేంద్రప్రసాద్గారు చాలా పెద్దాయన, కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం. ఏదనిపిస్తే అది మాట్లాడతారు. నువ్వు యాక్టింగ్కు వచ్చావ్ కదా.. చూసుకుందాం అని రాజేంద్రప్రసాద్.. నువ్వు క్రికెట్కు రా.. చూసుకుందాం అని వార్నర్ ఒకరినొకరు టీజ్ చేసుకున్నారు.నోరు జారాడుదాన్ని స్టేజీపై ఫన్ చేసే క్రమంలో రాజేంద్రప్రసాద్ అనుకోకుండా ఓ మాట తూలారు. అందుకు ఆయన కూడా బాధపడ్డారు. ఈ విషయం గురించి వార్నర్తో మాట్లాడా.. కాస్త నోరు జారాడు, ఏమీ అనుకోకు అని చెప్పాను. అందుకు వార్నర్.. క్రికెట్లో పెద్ద పెద్ద స్లెడ్జింగ్లు (కావాలని తిట్టుకోవడం) చూశాను. మా స్లెడ్జింగ్లు చూస్తే మీరు చెవులు మూసుకుంటారు. ఇది యాక్టర్స్ మధ్య స్లెడ్జింగ్.. ఇట్స్ ఓకే.. అని పాజిటివ్గా మాట్లాడారు. ఆయన చాలా మంచి మనిషి అని వెంకీ చెప్పుకొచ్చాడు. నితిన్ హీరోగా శ్రీలీల కథానాయికగా నటించిన రాబిన్హుడ్ మార్చి 28న విడుదల కానుంది. ఇందులో వార్నర్ ముఖ్య పాత్ర పోషించాడు.చదవండి: 15 ఏళ్ల క్రితం పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకున్నా.. కానీ అదంతా టైం వేస్ట్

'నలుపే అందం'..శక్తిమంతమైనది!: వర్ణ వివక్షపై కేరళ సీఎస్ స్ట్రాంగ్ రిప్లై..
జాతి వివక్షకు మించిన అతిపెద్ద రోగం వర్ణ వివక్ష. మనుషులంతా ఒకేలా ఉంటే ఏముంది ఘనత అని పెద్దలు అంటుంటారు. కానీ కొందరికి అవేం పట్టవు. ఒక మనిషి తన శరీర రంగుని బట్టి.. చిన్నబుచ్చేలా మాట్లేడుస్తుంటారు చాలామంది. అవతలి వ్యక్తి ఎంత పెద్ద విద్యావేత్త లేదా అధికారి అన్న స్ప్రుహ ఉండదు. కేవలం శరీర వర్ణం నల్లగా ఉంటేనే..అతడు/ఆమెని ఏమైనా అనే అవకాశం వచ్చేస్తుందా..? లేక నలుపు రంగు అంటేనే లోకువ అనేది ఎవ్వరికీ అర్థంకానీ బాధని రగిల్చే సున్నితమైన అంశం. ఆ వ్యాఖ్యలన్నింటికి కేరళ సీనియర్ బ్యూరోక్రాట్ చాలా శక్తిమంతమైన రిప్లై ఇచ్చారు. ఇప్పుడది నెట్టింట హాట్టాపిక్గా మారడమే గాక శెభాష్ మేడమ్ బాగా చెప్పారంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమె చెప్పిన తీరు చూస్తే నలుపులో ఇంత అందం దాగుందా అనిపిస్తుంది. మరి అదేంటో చూసేద్దామా..!కేరళ ప్రధాన కార్యదర్శి శారద మురళీధరన్ తన వంటి రంగు(నల్లటి రంగును )పై సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు చాలా స్ట్రాంగ్గా కౌంటరిచ్చారు. చెప్పాలంటే ఆ వ్యాఖ్యాలను తిప్పి కొట్టేలా కంటే ఆలోచింప చేసేలా నల్లనిదనంలోని అందాన్ని వెలికితెచ్చారామె. మరోమారు నల్లటి రంగు అని అవహేళన చేసే సాహసమే చేయనీకుండా చాలా చక్కగా పోస్ట్లో రిప్లై ఇచ్చారు. ఆమెపై చేసిన వ్యాఖ్య ఏంటి..?, ఏం చెప్పారామె అంటే..1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి శారద మురళీధరన్ ఆమె ప్రస్తుతం కేరళలో చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరూ ఆమె పనితీరుని భర్త (మాజీ కేరళ ప్రధాన కార్యదర్శి వి వేణు) రంగుతో పోలుస్తూ..ఆమె భర్త ఒంటి రంగు తెలుపులా నల్లగా ఉందని వెటకారంగా పోస్టులు పెట్టారు. ఆమె వాటిని చూసి వెంటనే ఆ పోస్టులని డిలీట్ చేసేశారు. అయితే కొందరూ శ్రేయోభిలాషుల విజ్ఞప్తి మేరకు దీనిపై మాట్లాడుతున్నా అంటూ ఆ పోస్టులను రీ పోస్ట్ చేస్తూ.. రాసుకొచ్చారు. శారద మురళీధరన్ పోస్ట్లో.." నా నల్లదనాన్ని సొంత చేసుకునేందుకు మాట్లాడుతున్నా.. చీకటి హదయం నలుపు రంగు. సాయంత్రానికి సంకేతం. వర్షం వాగ్దానం(నల్లిని మేఘాలే వర్షం రాక). అదికేవలం రంగు మాత్రమే కాదు. అనారోగ్యానికి, చెడుకి సంకేతంగా కూడా భావిస్తారు. అసలు అది లేకపోతే ఎలా గుర్తించగలరు మంచిని. నలుపు అనగానే చులకన భావం వచ్చేస్తోంది. ఈ నల్లని రంగు విశ్వం సర్వవ్యాప్త సత్యం. అందుండబట్టే అంతరిక్షం, నక్షత్రాలు అన్న వాటి గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగింది. ఇది అత్యంత శక్తిమంతమైన కలర్. ఏ రంగునైనా తనలో ఇముడ్చుకోగలదు. ఆఫీస్ దుస్తుల నుంచి ఇంటికి వెళ్లాక వేసుకునే క్యాజువల్ వరకు అన్నింట్లో ఈ నలుపు తప్పక ఉంటుంది. ఆఖరికి కంటి పాపకూడా నలుపు ఉంటేనేగా చూసేది. అలాంటి నలుపైపై ఎందుకింత అక్కసు, చులకనభావం అని నిలదీశారు. తాను కూడా ఒకప్పుడూ ఈ నలుపుని తక్కువగానే చూశా అంటూ తన చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. నాలుగేళ్ల వయసులో అమ్మా నేను తెల్లగా పుడతాను కదా మళ్లీ నీ గర్భంలోకి వెళ్లితే అని అంటుండేదాన్నిఅలా 50 ఏళ్లు నా ఒంటి రంగు మంచిది కాదనే భావనలోనే బతికేశా. కానీ ఆ నలుపులోని అందాన్ని గుర్తించడంలో నా పిల్లలే సాయం చేశారు. వాళ్లు తమ నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నలుపులో ఉన్న అద్భుతాన్ని, అందాన్ని నాకు కళ్లకు కట్టినట్లు చూపించాక గానీ నేను గుర్తించలేదు నలుపు ఇంత అందంగా ఉంటుందని" అని పోస్టులో రాసుకొచ్చారామె.రంగు తక్కువ అనేభావం మాయం..సీనియర్ బ్యూరోక్రాట్ మురళీధరన్ పోస్టులో రాసిన ప్రతి మాట మనస్సుని హత్తుకునేలా ఉంది. అని కేరళ అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు సతీశన్ అన్నారు. తన తల్లి కూడా నలుపురంగులోనే ఉందని, ఇది చర్చకు రావాలని కోరుకున్నా అని ఆయన పోస్ట్లో పేర్కొన్నారు.కాగా, శారద మురళీధరన్ తన భర్త వి. వేణు పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో గతేడాది ఆగస్టు 31న ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో ఆమె నియామకం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే కేరళ చరిత్రలోనే తొలిసారిగా భర్త నుంచి ఆమె ఛీప్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకారించారామె. ఇక ఆమె గతంలో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్గా, నేషనల్ రూరల్ లైవ్లిహుడ్స్ మిషన్లో సీఓఓగా, కుటుంబంశ్రీ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కీలక పాత్రల్లో పనిచేశారు.(చదవండి: ఉషా వాన్స్ నటి దీపికా పదుకునే స్టైల్ని రీక్రియేట్ చేశారా..? వివాదాస్పదంగా ఇవాంకా పోస్ట్)

పిఠాపురంలో మళ్లీ దబ్బిడి దిబ్బిడి
సాక్షి,కాకినాడ జిల్లా: పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తమ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ చెప్పబట్టే పవన్కు ఓటేశామంటూ జనసేన ఇన్ ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్పై వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మర్రెడ్డి శ్రీనివాస్పై వాగ్వాదానికి దిగారు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.బుధవారం పిఠాపురంలో జనసేన శ్రేణుల్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. గొల్లప్రోలు మండలం చెందూర్తిలో ఆర్వో ప్లాంట్ ఆవిష్కరణకు జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వచ్చారు. అయితే, ఈ కార్యక్రమానికి ఎస్వీఎస్ఎన్ వర్మకు ఆహ్వానం అందలేదు. ఇదే అంశంపై వర్మ అనుచరులు మర్రెడ్డి శ్రీనివాస్ను నిలదీశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని మర్రెడ్డి కార్యక్రమం మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయారు. వెళ్లే సమయంలో టీడీపీ,జనసేన శ్రేణులు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. వర్మ చెప్పబట్టే పవన్కు ఓటు వేశామని వర్మ అనుచరులు,టీడీపీ కార్యకర్తలు తన మనసులో మాటను భయటపెట్టారు. వారికి పోటీగా జనసేన శ్రేణులు రావడంతో వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు నెట్టుకున్నారు. నాగబాబు ఏమన్నారంటే?మార్చి 14న పిఠాపురం చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించింది. ఆ సభలో నాగబాబు ..పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను ఉద్దేశిస్తూ పరోక్షంగా మాట్లాడారు. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పని చేశాయి. ఒకటి జనసేన ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్. రెండు జనసైనికులు, పిఠాపురం ఓటర్లు’ మరెవరైనా పవన్ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి ఖర్మ’ అని నాగబాబు నొక్కి మరీ చెప్పారు. నాగబాబుకు వర్మ కౌంటర్గా ఆ వ్యాఖ్యలపై వర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సభ జరిగిన తర్వాత వర్మ సైతం సోషల్ మీడియా వేదికగా జనసేనకు కౌంటర్ వేస్తూ పోస్టులు పెడుతూ వచ్చారు. ఈ తరుణంలో వర్మ అభిమానులు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చాంశనీయంగా మారింది.

ఏపీ సర్కార్ ఇఫ్తార్ విందు మాకొద్దు!
సాక్షి, విజయవాడ: వక్ఫ్ సవరణ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రేపు(గురువారం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును బహిష్కరించాలని చేయాలని నిర్ణయించింది. వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ను బాయ్ కాట్ చేస్తున్నామని.. రాష్ట్రంలోని అన్ని ముస్లిం సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్ను బాయ్ కాట్ చేయాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. ‘‘సనాతనధర్మం బోర్డులో ఇతర మతాలను కలపాలని చూస్తే మొదటగా పోరాడేది మేమే. ముస్లింల హక్కులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం...వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల మతపరమైన అంశాల్లో జోక్యంగా భావిస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘన ఇది. మతపరమైన నిర్వహణ ఆయా మతాలే చూసుకుంటాయి. బిల్లులో పారదర్శకత లేదు. ముస్లింలపై జరుగుతున్న కుట్ర ఇది’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పేర్కొంది.‘‘వక్ఫ్ సవరణ బిల్లు కుట్రపూరితంగా చేస్తున్నారు. ప్రతీ మతానికి వారికి సంబంధించిన భూములను రక్షించుకునేందుకు బోర్డులు ఉన్నాయి. ముస్లింలకు మాత్రమే బోర్డు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదు. భవిష్యత్తులో అన్నిమతాలకు ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతాయి. ఈ నెల 29న విజయవాడ ధర్నాచౌక్లో భారీ నిరసన చేపడతాం’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు తెలిపారు.

శ్రేయస్ కాదు!.. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అశ్విన్
పంజాబ్ కింగ్స్ పేసర్ విజయ్కుమార్ వైశాఖ్ (Vijaykumar Vyshak)పై టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసలు కురిపించాడు. ఆఖరి ఐదు ఓవర్ల ఆటలో అద్భుతం చేసి జట్టును గెలిపించాడని కొనియాడాడు. గుజరాత్ టైటాన్స్ (GT)- పంజాబ్ కింగ్స్ (PBKS) మ్యాచ్కు సంబంధించి.. తన దృష్టిలో వైశాఖ్ అత్యంత విలువైన ఆటగాడని పేర్కొన్నాడు.శ్రేయస్ అయ్యర్ తుపాన్ ఇన్నింగ్స్ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్- పంజాబ్ మంగళవారం తలపడిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ దుమ్ములేపింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (23 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో పంజాబ్ ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ విజయానికి చేరువగా వచ్చింది. సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్ (41 బంతుల్లో 74) ఆడగా.. జోస్ బట్లర్ (33 బంతుల్లో 54), షెర్ఫానే రూథర్ఫర్డ్ (28 బంతుల్లో 46) పంజాబ్ నుంచి మ్యాచ్ను లాగేసుకునే ప్రయత్నం చేశారు.ఇంపాక్ట్ ప్లేయర్అయితే, సరిగ్గా అదే సమయంలో పంజాబ్ ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్కుమార్ వైశాఖ్ను రంగంలోకి దించింది. దాదాపు పద్నాలుగు ఓవర్ల పాటు బెంచ్ మీద ఉన్న అతడు.. పదిహేనో ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. అనంతరం పదిహేడో ఓవర్లో మళ్లీ బరిలోకి దిగి ఇదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఆ తర్వాత పందొమ్మిదో ఓవర్లో(18 రన్స్)నూ ఫర్వాలేదనిపించాడు.ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన ఈ విజయానికి మూలం. అయితే, ఓ ఆటగాడు డగౌట్లో కూర్చుని.. మైదానంలోని ఆటగాళ్ల కోసం నీళ్లు తీసుకువస్తూ కనిపించాడు.ఆ సమయంలో గుజరాత్ మొమెంటమ్లోకి వచ్చేసింది. రూథర్ఫర్డ్, బట్లర్ మ్యాజిక్ చేసేలా కనిపించారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు విజయ్కుమార్ వైశాఖ్. దాదాపు పద్నాలుగు ఓవర్లపాటు మ్యాచ్కు దూరంగా అతడిని పిలిపించి.. మ్యాచ్ను మనవైపు తిప్పమని మేనేజ్మెంట్ చెప్పింది.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అతడికే ఇవ్వాల్సిందిపదిహేడు, పందొమ్మిదో ఓవర్లో అతడు పరిణతితో బౌలింగ్ చేశాడు. అతడు వికెట్ తీయకపోవచ్చు. కానీ డెత్ ఓవర్లలో అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తన ప్రణాళికలను తూచా తప్పకుండా అమలు చేశాడు. అద్భుతమైన యార్కర్లతో అలరించాడు.తన బౌలింగ్లో వైడ్లు, ఫుల్ టాస్లు ఉండవచ్చు. కానీ అతడి కట్టుదిట్టమైన బౌలింగ్ వల్లే గుజరాత్ వెనుకడుగు వేసింది. నా దృష్టిలో అతడు అత్యంత విలువైన ఆటగాడు. నిజానికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విజయ్కుమార్ వైశాఖ్కు దక్కాల్సింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో పంజాబ్ పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. మొత్తంగా మూడు ఓవర్ల బౌలింగ్లో విజయ్ 28 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్కు అవమానకర ఓటమిPunjab Kings hold their nerves in the end to clinch a splendid win against Gujarat Titans ❤️Scorecard ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/0wy29ODStQ— IndianPremierLeague (@IPL) March 25, 2025

బెట్టింగ్ యాప్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై సిట్ ఏర్పాటుకు ఆదేశించింది. ఆన్లైన్ బెట్టింగ్పై సిట్ విచారణకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించామని సీఎం తెలిపారు.‘‘ఆన్లైన్ బెట్టింగ్ నిషేధిస్తూ గత ప్రభుత్వం చట్టం చేసింది.. కానీ అమలు జరగడం లేదు. దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేస్తున్నాం. ప్రకటనలు చేసినా.. నిర్వహణలో భాగస్వామ్యం ఉన్నా కఠిన చర్యలు ఉంటాయి. నేరాలు చెప్పి జరగవు. నేరాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. గతంలో న్యాయవాదులు, వెటర్నరీ డాక్టర్ హత్యలు జరిగాయి’’ అని రేవంత్ అన్నారు.ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటనపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. శాంతిభద్రతలపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ‘‘పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దిశ ఘటన జరిగింది. వామనరావు దంపతులను నడిరోడ్డుపై చంపేశారు. జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో బీఆర్ఎస్ నేత కుమారుడిపై చర్యలు తీసుకోలేదు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. కుట్రలు మాని, విజ్ఞతతో మెలగాలి’’ అని రేవంత్రెడ్డి హితవు పలికారు.
యాజమాన్యానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల అల్టిమేటం జారీ
UPI Down: ఫోన్పే, గూగుల్ పే యూజర్లకు షాక్.. యూపీఐ సేవల్లో అంతరాయం
ఐశ్వర్యరాయ్ కారుకు ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
డెబిట్ కార్డుతో పనిలేకుండా యూపీఐ పిన్ చేసుకోండిలా..
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు.. హత్య మూవీలో అసలు ఏముంది?
వాట్సప్లో టెన్త్ మ్యాథ్స్ పేపర్ లీక్.. నిందితుల అరెస్ట్
ఏంజెల్లా శ్రీలీల.. ఎమోషనలైన మహాతల్లి
ఆ సినిమా తొలి రోజే అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుంది: నిర్మాత రవిశంకర్
కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ లైవ్ అప్డేట్స్..
భారత్ కోసం రెండు జపనీస్ బ్రాండ్ కార్లు
‘లిప్లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
ఓట్లేయించుకున్నవారు జీతాలు పెంచుకున్నారు.. ఓటేసిన మనకు కనీస వేతనం లేదు!
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
అప్సర కేసులో సాయికృష్ణకి జీవితఖైదు
4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ధన, వస్తులాభాలు
అద్దెంటి కుర్రాడితో భార్య అలా.. కట్ చేస్తే ఏడడుగుల గోతిలో..
ఆ తీర్పు అమానుషం.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
యాజమాన్యానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల అల్టిమేటం జారీ
UPI Down: ఫోన్పే, గూగుల్ పే యూజర్లకు షాక్.. యూపీఐ సేవల్లో అంతరాయం
ఐశ్వర్యరాయ్ కారుకు ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
డెబిట్ కార్డుతో పనిలేకుండా యూపీఐ పిన్ చేసుకోండిలా..
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు.. హత్య మూవీలో అసలు ఏముంది?
వాట్సప్లో టెన్త్ మ్యాథ్స్ పేపర్ లీక్.. నిందితుల అరెస్ట్
ఏంజెల్లా శ్రీలీల.. ఎమోషనలైన మహాతల్లి
ఆ సినిమా తొలి రోజే అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుంది: నిర్మాత రవిశంకర్
కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ లైవ్ అప్డేట్స్..
భారత్ కోసం రెండు జపనీస్ బ్రాండ్ కార్లు
‘లిప్లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
ఓట్లేయించుకున్నవారు జీతాలు పెంచుకున్నారు.. ఓటేసిన మనకు కనీస వేతనం లేదు!
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
అప్సర కేసులో సాయికృష్ణకి జీవితఖైదు
4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ధన, వస్తులాభాలు
అద్దెంటి కుర్రాడితో భార్య అలా.. కట్ చేస్తే ఏడడుగుల గోతిలో..
ఆ తీర్పు అమానుషం.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
సినిమా

భార్యకు బర్త్ డే విషెస్ చెప్పిన టాలీవుడ్ యంగ్ హీరో.. నుదుటన బొట్టు పెట్టి!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే దిల్రుబాతో ప్రేక్షకులను అలరించారు. ఈనెల 14న థియేటర్లలోకి వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు విశ్వకరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా కనిపించింది.అయితే మన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే తాను గర్భంతో ఉన్నట్లు ప్రకటించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఇవాళ తన సతీమణి బర్త్ డే కావడంతో కిరణ్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన భార్య నుదుటన బొట్టు పెడుతున్న ఫోటోలను షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మా.. అంటూ సతీమణికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం కిరణ్ అబ్బవరం భార్యకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన కిరణ్-రహస్య.. ఆ తర్వాత స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే తమ బంధాన్ని చాలా రహస్యంగా ఉంచారు. గత ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా ప్రకటించారు. 2024 ఆగష్టు నెలలో పెళ్లితో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
కుటుంబ గొడవలతో ముంచు ఫ్యామిలీ పరువు రోడ్డునపడింది. విష్ణు (Vishnu Manchu)- మనోజ్ (Manoj Manchu)కు మధ్య సఖ్యత కుదరట్లేదు అనుకుంటే.. మనోజ్- మోహన్బాబు మధ్య కూడా గొడవలు జరగడం అభిమానులనే కాదు ఇండస్ట్రీని సైతం షాక్కు గురి చేసింది. ఇలా వీరింట్లో ఏదో ఒకరకంగా తగవులాడుతూనే ఉన్నారు. ఈ రచ్చ వల్ల తన పిల్లలు ఇబ్బందిపడుతున్నారంటోంది మంచు మోహన్బాబు పెద్ద కోడలు, విష్ణు సతీమణి విరానిక (Viranica Manchu). ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయితాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె కుటుంబ కలహాలపై స్పందించింది. విరానిక మాట్లాడుతూ.. కుటుంబమన్నాక గొడవలు అవుతూనే ఉంటుంది. కేవలం మా ఫ్యామిలీ అనే కాదు ప్రతి ఇంట్లోనూ జరుగుతాయి. కానీ చాలావరకు బయటకు రావు. దురదృష్టవశాత్తూ మా కుటుంబంలోని గొడవలు బయటకువచ్చాయి. దానికి మనమేం చేయలేం. నాకు నా పిల్లలు ముఖ్యం. వారికోసం ఏదైనా భరిస్తాను. ఒక స్పాంజిలా అన్నింటినీ ఓపికగా స్వీకరిస్తాను. పిల్లలకన్నా నాకెవరూ ముఖ్యం కాదు. కానీ జరుగుతున్న రచ్చ వల్ల నాకన్నా నా పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. భయపడిపోతున్నారు. నాలుగో ప్రెగ్నెన్సీపై ట్రోలింగ్అసలేం జరుగుతుంది? తాతయ్యకేమైనా అవుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. అందుకే పిల్లల్ని.. వివాదాలకు చాలా దూరంగా ఉంచుతాను. నేను ధైర్యంగా ఉంటేనే వారికి ఎంతోకొంత ధైర్యం చెప్పగలను అని విరానిక చెప్పుకొచ్చింది. అలాగే తను నాలుగోసారి గర్భం దాల్చినప్పుడు కూడా చాలామంది ట్రోల్ చేశారంది. మీకేం పని లేదా? అంటూ నోటికొచ్చినట్లు తిట్టారని బాధపడింది. విష్ణుకు, తనకు పిల్లలంటే ఇష్టమని.. అందుకే నలుగుర్ని కన్నామని విరానిక పేర్కొంది.చదవండి: అర్ధరాత్రి ఫోన్.. నన్ను తీసేసి ఓ శునకాన్ని పెట్టుకున్నారు.. హర్టయిన శోభిత

‘లూసిఫర్’ కథేంటి? ఎంపురాన్ అంటే అర్థం ఏంటో తెలుసా?
‘లూసిఫర్’.. 2019లో రిలీజైన ఈ మలయాళ మూవీ ఎంత ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. రూ.30 కోట్లతో తీస్తే, రూ.125 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన ఎనిమిదో చిత్రంగా నిలిచింది. హీరో మోహన్లాల్కి, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్కి కెరీర్లోనే బెస్ట్ చిత్రంగా ‘లూసిఫర్’ నిలిచిపోయింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘L2: ఎంపురాన్’ (L2: Empuraan Movie) వస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(మార్చి 27)న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో లూసిఫర్ కథేంటి? ఎంపురాన్ లో ఏం చెప్పబోతున్నారు? అసలు ఎంపురాన్ అంటే ఏంటి? తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.లూసిఫర్ కథేంటి?ముఖ్యమంత్రి పి.కె రామదాసు అలియాస్ పీకేఆర్(సచిన్ ఖేడ్కర్) అకాల మరణంతో ఐయూఎఫ్ (ఇండియన్ యూనియన్ ఫ్రంట్) పెద్దల కన్ను సీఎం సీటుపై పడుతుంది. తదుపరి సీఎం కావాలని అతని అల్లుడు బిమల్ నాయుడు అలియాస్ బాబీ(వివేక్ ఒబెరాయ్) భావిస్తాడు. అందుకోసం పార్టీలోని కొంతమంది అవినీతిపరులతో చేతులు కలుపుతాడు. అయితే పీకేఆర్ సన్నిహితుడు, పార్టీ కీలక నేత స్టీఫెన్ గట్టుపల్లి (మోహన్లాల్) మాత్రం బాబీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ సీఎం కాకుండా చేస్తాడు. దీంతో స్టీఫెన్ని హత్య చేయించేందుకు బాబీ కుట్ర చేస్తాడు. ఆ కుట్రను బాబీ ఎలా తిప్పి కొట్టాడు? బాబీ తీసుకురావాలనుకున్న డ్రగ్స్ను రాష్ట్రానికి రాకుండా ఎలా అడ్డుకున్నాడు? పీకేఆర్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించింది? అసలు స్టీఫెన్ గతం ఏంటి? అన్నదే లూసీఫర్ కథ. స్టోరీ పరంగా చూస్తే ఇది రొటీన్ పొలిటికల్ డ్రామా. కానీ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ ఒక్కో సీన్ని తీర్చి దిద్దిన విధానం, మోహన్లాల్ సెటిల్డ్ యాక్టింగ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. వివేక్ ఒబెరాయ్, మోహన్ లాల్ పాత్రల మధ్య నువ్వా నేనా అన్నట్లు సన్నివేశాలు సాగుతాయి. మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. క్లైమాక్స్లో స్టీఫెన్ నేపథ్యం చెబుతూ సినిమాను ముగించారు. ఇప్పుడదే ‘ఎల్2: ఎంపురాన్’పై ఆసక్తిని పెంచేసింది. అసలు ఎంపురాన్ అంటే ఏంటి?లూసిఫర్ అనే టైటిల్ వినగానే అసలు ఈ పేరు ఎందుకు పెట్టారని అంతా అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ టైటిల్ ఎందుకు పెట్టారో తెలిసింది. క్రైస్తవంలో లూసిఫర్ అంటే దైవదూత అని అర్థం. భగవంతుని ఆజ్ఞను వ్యతిరేకించి కిందకు వచ్చి దుష్టుడిగా మారి, మానవాళి పాపాలు చేసేందుకు ప్రేరేపించేవాడినే లూసీఫర్ అంటారు. అందుకే ఈ సినిమాలో ‘దుర్మార్గులకు, మహాదుర్మార్గులకు జరిగే యుద్ధం’ అని హీరో పాత్రలో చెప్పించారు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన మూవీకి ‘ఎంపురాన్’ అని టైటిల్ పెట్టారు. దీని అర్థం ఏంటంటే.. ‘రాజు కంటే ఎక్కువ.. దేవుడి కంటే తక్కువ’ అని అర్థం. హీరో పాత్రను దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్ని పెట్టారు. దాదాపు రూ. 180 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

మోహన్లాల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్2 ఎంపురాన్ విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రానికి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. గతంలో లూసిఫర్కు సీక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.అయితే వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న మలయాళ స్టార్ మోహన్లాల్ మరో మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఆ సినిమా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. తుడరమ్ అనే క్రైమ్ థ్రిల్లర్లో ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ జోడీగా శోభన హీరోయిన్గా నటించారు. ట్రైలర్ చూస్తే క్రైమ్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మోహన్లాల్ షణ్ముఖం పాత్రను పోషిస్తుండగా.. శోభన లలితగా కనిపించింది. ఈ సినిమాను రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్పై ఎం రెంజిత్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
న్యూస్ పాడ్కాస్ట్

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్కుమార్ అరెస్ట్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...

25 ఏళ్లపాటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొద్దు... చెన్నైలో జేఏసీ తొలి సమావేశంలో తీర్మానం

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు మాయం... దాదాపు 2 లక్షల మేర తగ్గిపోయిన ఉద్యోగుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్లో హజ్ యాత్రికులకు కూటమి సర్కార్ ద్రోహం... ఏపీ హజ్ కమిటీ ఇచ్చిన లేఖ ఆధారంగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను రద్దు చేసిన కేంద్రం

‘చేతి’లో ఉన్నంత కాలం.. పాలన పరుగు!. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 3లక్షల4వేల965 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి

భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్, విల్మోర్

‘బీసీ’ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం...

‘విద్య’లో గందరగోళం.. లక్ష్యం బడికి తాళం. ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యను భ్రష్టు పట్టిస్తోన్న కూటమి ప్రభుత్వం
క్రీడలు

శ్రేయస్ కాదు!.. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అశ్విన్
పంజాబ్ కింగ్స్ పేసర్ విజయ్కుమార్ వైశాఖ్ (Vijaykumar Vyshak)పై టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసలు కురిపించాడు. ఆఖరి ఐదు ఓవర్ల ఆటలో అద్భుతం చేసి జట్టును గెలిపించాడని కొనియాడాడు. గుజరాత్ టైటాన్స్ (GT)- పంజాబ్ కింగ్స్ (PBKS) మ్యాచ్కు సంబంధించి.. తన దృష్టిలో వైశాఖ్ అత్యంత విలువైన ఆటగాడని పేర్కొన్నాడు.శ్రేయస్ అయ్యర్ తుపాన్ ఇన్నింగ్స్ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్- పంజాబ్ మంగళవారం తలపడిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ దుమ్ములేపింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (23 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో పంజాబ్ ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ విజయానికి చేరువగా వచ్చింది. సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్ (41 బంతుల్లో 74) ఆడగా.. జోస్ బట్లర్ (33 బంతుల్లో 54), షెర్ఫానే రూథర్ఫర్డ్ (28 బంతుల్లో 46) పంజాబ్ నుంచి మ్యాచ్ను లాగేసుకునే ప్రయత్నం చేశారు.ఇంపాక్ట్ ప్లేయర్అయితే, సరిగ్గా అదే సమయంలో పంజాబ్ ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్కుమార్ వైశాఖ్ను రంగంలోకి దించింది. దాదాపు పద్నాలుగు ఓవర్ల పాటు బెంచ్ మీద ఉన్న అతడు.. పదిహేనో ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. అనంతరం పదిహేడో ఓవర్లో మళ్లీ బరిలోకి దిగి ఇదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఆ తర్వాత పందొమ్మిదో ఓవర్లో(18 రన్స్)నూ ఫర్వాలేదనిపించాడు.ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన ఈ విజయానికి మూలం. అయితే, ఓ ఆటగాడు డగౌట్లో కూర్చుని.. మైదానంలోని ఆటగాళ్ల కోసం నీళ్లు తీసుకువస్తూ కనిపించాడు.ఆ సమయంలో గుజరాత్ మొమెంటమ్లోకి వచ్చేసింది. రూథర్ఫర్డ్, బట్లర్ మ్యాజిక్ చేసేలా కనిపించారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు విజయ్కుమార్ వైశాఖ్. దాదాపు పద్నాలుగు ఓవర్లపాటు మ్యాచ్కు దూరంగా అతడిని పిలిపించి.. మ్యాచ్ను మనవైపు తిప్పమని మేనేజ్మెంట్ చెప్పింది.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అతడికే ఇవ్వాల్సిందిపదిహేడు, పందొమ్మిదో ఓవర్లో అతడు పరిణతితో బౌలింగ్ చేశాడు. అతడు వికెట్ తీయకపోవచ్చు. కానీ డెత్ ఓవర్లలో అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తన ప్రణాళికలను తూచా తప్పకుండా అమలు చేశాడు. అద్భుతమైన యార్కర్లతో అలరించాడు.తన బౌలింగ్లో వైడ్లు, ఫుల్ టాస్లు ఉండవచ్చు. కానీ అతడి కట్టుదిట్టమైన బౌలింగ్ వల్లే గుజరాత్ వెనుకడుగు వేసింది. నా దృష్టిలో అతడు అత్యంత విలువైన ఆటగాడు. నిజానికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విజయ్కుమార్ వైశాఖ్కు దక్కాల్సింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో పంజాబ్ పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. మొత్తంగా మూడు ఓవర్ల బౌలింగ్లో విజయ్ 28 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్కు అవమానకర ఓటమిPunjab Kings hold their nerves in the end to clinch a splendid win against Gujarat Titans ❤️Scorecard ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/0wy29ODStQ— IndianPremierLeague (@IPL) March 25, 2025

నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఆ జట్టుకు కప్ తీసుకువస్తా: యువరాజ్ తండ్రి
భారత మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తన వ్యాఖ్యలతో ఇటీవల తరుచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యోగరాజ్ మరోసారి తన కామెంట్స్తో హాట్టాపిక్గా నిలిచాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ను ఉద్దేశించి యోగరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.తనకు ఒక్క సీజన్లో పంజాబ్ కింగ్స్ కోచ్గా అవకాశం ఇస్తే.. ఆ జట్టుకు తొలి ఐపీఎల్ ట్రోఫీ అందిస్తాని ఆయన చాలా నమ్మకంగా చెప్పుకొచ్చారు. ఒకవేళ కోచ్గా విఫలమైతే అభిమానుల నుంచి వచ్చే ఏ డిమాండ్ను అయినా స్వీకరించేందుకు తను సిద్దమని ఆయన అన్నారు. తన కోచింగ్ సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని యోగరాజ్ పేర్కొన్నారు. కాగా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆడుతున్నప్పటికి ఒక్కసారి కూడా టైటిల్ను ముద్దాడలేకపోయింది. ప్రతీ సీజన్లోనూ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగడం.. లీగ్ స్టేజిలోనో, ప్లే ఆఫ్స్లోనో ఇంటిముఖం పట్టడం పంజాబ్కు పరిపాటుగా మారింది. అయితే తాజా ఐపీఎల్ ఎడిషన్ను మాత్రం పంజాబ్ విజయంతో ప్రారంభించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్పై 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ అయినా కింగ్స్ ఫ్రాంచైజీకి తొలి టైటిల్ను అందిస్తాడో లేదో చూడాలి.ఇక యోగరాజ్ విషయానికి వస్తే.. సొంతంగా ఆయన క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్నారు. భారత్ తరపున గొప్ప క్రికెటర్లలో ఒకడిగా ఎదిగిన తన కుమారుడు యువరాజ్ సింగ్తో సహా అనేక మంది యువ ఆటగాళ్లకు మోంటార్గా యోగరాజ్ పనిచేశారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఆయన దగ్గర శిక్షణ పొందాడు. 1980లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన యోగరాజ్.. భారత్ తరఫున ఒక టెస్టు, 6 వన్డేలు ఆడాడు.చదవండి: ఆర్సీబీ స్పిన్నర్లు భేష్.. కేకేఆర్ బౌలర్లు ఏం చేశారు?: రహానేకు పిచ్ క్యూరేటర్ కౌంటర్

ఆర్సీబీ స్పిన్నర్లు భేష్.. కేకేఆర్ బౌలర్లు ఏం చేశారు?: రహానేకు పిచ్ క్యూరేటర్ కౌంటర్
కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టును ఉద్దేశించి ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఇక్కడ క్యూరేటర్గా ఉన్నంత కాలం పిచ్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాడు. పిచ్ రూపకల్పన గురించి సలహాలు ఇచ్చే అధికారం ఫ్రాంఛైజీలకు లేదని పేర్కొన్నాడు.ఏడు వికెట్ల తేడాతో ఓటమికాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ ఆదిలోనే చుక్కెదురైన విషయం తెలిసిందే. లీగ్ ఆరంభ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్లో స్థాయికి తగ్గట్లు రాణించలేక చేతులెత్తేసింది.ఆర్సీబీతో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే (31 బంతుల్లో 56) ఒక్కడే అర్ధ శతకం సాధించాడు. కృనాల్ పాండ్యాకు మూడుఇక ఆర్బీసీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా మూడు, సూయశ్ శర్మ ఒక వికెట్ తీయగా.. పేసర్లు జోష్ హాజిల్వుడ్ రెండు, యశ్ దయాళ్, రసిఖ్ ధార్ సలాం ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 16.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పనిపూర్తి చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56), విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్), కెప్టెన్ రజత్ పాటిదార్ (16 బంతుల్లో 34) రాణించారు. ఇక కేకేఆర్ బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ ఒక్కో వికెట్ తీయగా.. పేసర్ వైభవ్ అరోరా ఒక వికెట్ పడగొట్టాడు.రహానే కామెంట్స్ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. ‘‘పిచ్ స్పిన్ బౌలర్లకు సహకరిస్తుందని అనుకున్నాం. కానీ నిన్నటి నుంచి పిచ్ను కవర్లతో కప్పేసి ఉంచారు. నిజానికి మా జట్టులో ఉన్న ఇద్దరు స్పిన్నర్లు అద్భుతంగా ఆడతారు. ఎలాంటి వికెట్ మీదైనా రాణిస్తారు. కానీ ఈరోజు పరిస్థితి అంతగొప్పగా లేదు’’ అని పేర్కొన్నాడు.రహానే వ్యాఖ్యలపై ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తాజాగా స్పందించాడు. రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడ ఉన్నంత కాలం ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఇలాగే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పూ లేదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం పిచ్ ఎలా ఉండాలో చెప్పే అధికారం ఫ్రాంఛైజీలకు లేదు.ఆర్సీబీ స్పిన్నర్లు భేష్.. కేకేఆర్ బౌలర్లు ఏం చేశారు?నేను గతంలో ఎలా ఉన్నానో.. ఇప్పుడూ అలాగే ఉన్నాను. అందుకే మరీ మరీ చెప్తున్నా.. ఈడెన్ గార్డెన్స్ వికెట్లో ఇప్పుడు.. అదే విధంగా భవిష్యత్తులోనూ ఎలాంటి మార్పులు ఉండబోవు.అయినా ఆర్సీబీ స్పిన్నర్లు మొత్తంగా నాలుగు వికెట్లు తీశారు. మరి కేకేఆర్ స్పిన్నర్లు ఏం చేశారు? ఆర్సీబీలో కృనాల్ మూడు, సూయశ్ ఒక వికెట్ పడగొట్టారు’’ అని సుజన్ ముఖర్జీ కేకేఆర్ స్పిన్నర్ల తీరును విమర్శించాడు.ఇక ఈ సీజన్లో తమ రెండో మ్యాచ్ ఆడేందుకు కేకేఆర్ గువాహతికి పయనమైంది. రాజస్తాన్ రాయల్స్తో బుధవారం నాటి పోరులో గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. అనంతరం వాంఖడేలో మార్చి 31న ముంబైతో తలపడుతుంది. మళ్లీ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్.. ఏప్రిల్ 3న సన్రైజర్స్ హైదరాబాద్ను ఢీకొట్టనుంది.చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్

NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్కు అవమానకర ఓటమి
పాకిస్తాన్తో ఐదో టీ20లో న్యూజిలాండ్ (New Zealand Vs Pakistan) క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. పర్యాటక జట్టును చిత్తుగా ఓడించి.. 4-1తో సిరీస్ ముగించింది. ఆద్యంతం ఆధిపత్యం కొనసాగించి సల్మాన్ ఆఘా బృందానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కేవలం పది ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి తమ సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకుంది.మళ్లీ పాత కథేకాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటన (Pakistan Tour Of New Zealand)కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మార్చి 16న టీ20 సిరీస్ మొదలుకాగా.. తొలి రెండు మ్యాచ్లలో కివీస్ గెలుపొందింది. అయితే, మూడో టీ20లో పాక్ అనూహ్య సంచలన విజయం సాధించింది.. ఫామ్లోకి వచ్చినట్లే కనిపించింది.కానీ తర్వాత మళ్లీ పాత కథే. నాలుగో టీ20లో కివీస్ చేతిలో ఏకంగా 115 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిన పాక్.. సిరీస్ను చేజార్చుకుంది. ఈ క్రమంలో ఐదో టీ20లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావించగా భంగపాటే ఎదురైంది. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.సల్మాన్ ఆఘా కెప్టెన్ ఇన్నింగ్స్ టాపార్డర్లో ఓపెనర్లు మహ్మద్ హారిస్ (11), హసన్ నవాజ్ (0).. వన్డౌన్ బ్యాటర్ ఒమర్ యూసఫ్ (7) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సల్మాన్ ఆఘా (Salman Agha) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. అయితే, అతడికి మిగతా వారి నుంచి సహకారం అందలేదు.ఆఖర్లో షాదాబ్ ఖాన్ 20 బంతుల్లో 28 రన్స్తో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ ఐదు వికెట్లు(5/22) కూల్చి పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో జేకబ్ డఫీ రెండు, బెన్ సీర్స్, ఇష్ సోధి ఒక్కో వికెట్ పడగొట్టారు.38 బంతుల్లోనే 97 రన్స్ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ పది ఓవర్లలోనే టార్గెట్ను ఊదేసింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా పది సిక్సర్లు, ఆరు ఫోర్ల సాయంతో 38 బంతుల్లోనే 97 రన్స్తో అజేయంగా నిలిచాడు.మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (12 బంతుల్లో 27) వేగంగా ఆడగా.. మార్క్ చాప్మన్(3) మాత్రం నిరాశపరిచాడు. ఏదేమైనా టిమ్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. టిమ్ సీఫర్ట్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ఆసాంతం అద్బుతంగా ఆడిన జేమ్స్ నీషమ్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్
బిజినెస్

అమెజాన్ గోదాంపై బీఐఎస్ దాడులు: 2783 ఉత్పత్తులు సీజ్
బీఐఎస్ ధ్రువీకరించిన ఐఎస్ఐ మార్కు, రిజిస్ట్రేషన్ మార్కు లేని ఉత్పత్తులను నిల్వ చేశారన్న సమాచారంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హైదరాబాద్ శాఖ అధికారులు అమెజాన్ గోదాములపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున బీఐఎస్ ధ్రువీకరణ పొందని గృహోపకరణాలు, సాంకేతిక ఉపకరణాలను గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ ఆదేశాలతో బీఐఎస్ హైదరాబాద్ శాఖ జాయింట్ డైరెక్టర్ రాకేశ్ తన్నీరు, డిప్యూటీ డైరెక్టర్ కెవిన్, ఎస్పీవో అభిసాయి ఇట్ట, జేఎస్ఏ శివాజీ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.హైదరాబాద్ పరిధిలోని ఎయిర్పోర్ట్ సిటీలో ఉన్న అమెజాన్ గోదాంలో మంగళవారం బీఐఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా దాదాపు రూ.50 లక్షల పైగా విలువైన 2783 ఉత్పత్తులకు బీఐఎస్ ధ్రువీకరణ లేదని గుర్తించినట్లు తెలిపారు. ఐఎస్ఐ మార్క్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఉండాల్సిన రిజిస్ట్రేషన్ మార్కు లేని ఉత్పత్తులను జప్తు చేసినట్లు వెల్లడించారు.వీటిలో 150 స్మార్ట్వాచ్లు, 15 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 30 సీసీటీవీ కెమెరాలు, 16 మిక్సర్లు, 10 ప్రెజర్ కుక్కర్లు, 1937 స్టెయిన్ లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లు, 326 వైర్లెస్ ఇయర్ బడ్స్, 170 మొబైల్ ఛార్జర్లు, 90 ఆట బొమ్మలు, ఇతర గృహోపకరణాలను జప్తు చేసి కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.బీఐఎస్ చట్టం 2016లోని పలు సెక్షన్ 17 ప్రకారం భారత ప్రభుత్వం బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసిన ఉత్పత్తులేవీ ఐఎస్ఐ మార్కు, ఎలక్ట్రానిక్ వస్తువులకు రిజిస్ట్రేషన్ మార్కు లేకుండా, బీఐఎస్ అనుమతి పొందకుండా తయారు చేసినా, విక్రయించినా, నిల్వ చేసినా రెండేళ్ల జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా మొదటిసారి, ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5లక్షల వరకూ జరిమానా రెండోసారి, తదుపరి దీనికి పదిరెట్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది.ఇప్పటివరకు భారత ప్రభుత్వం 679 ఉత్పత్తులను తప్పనిసరి చేస్తూ పలు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు విడుదల చేసింది. వీటిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ వెల్లడించారు. భారతీయ ప్రమాణాలపై ప్రతీ ఒక్క వినియోగదారుడూ అవగాహన కలిగి ఉండాలని, బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వస్తువుల నాణ్యతా ప్రమాణాలను గుర్తించాలని, ఉల్లంఘనలను గుర్తిస్తే అదే యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 757.55 పాయింట్లు లేదా 0.97 శాతం నష్టంతో 77,259.64 వద్ద, నిఫ్టీ 204.10 పాయింట్లు లేదా 0.86 శాతం నష్టంతో 23,464.55 వద్ద నిలిచాయి.టూరిజం ఫైనాన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా, కాప్రి గ్లోబల్ క్యాపిటల్, జెనస్ పేపర్ & బోర్డ్, పిల్ ఇటాలికా లైఫ్స్టైల్, SMS లైఫ్ సైన్సెస్ ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. NDL వెంచర్స్, సలాసర్ టెక్నో ఇంజనీరింగ్, BLB షేర్, లోటస్ ఐ కేర్ హాస్పిటల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

శామ్సంగ్ ఇండియాపై రూ.5,149 కోట్ల జరిమానా
దిగుమతి సంబంధిత పన్ను ఎగవేతపై భారత ప్రభుత్వం పన్నులు, జరిమానాల రూపంలో శామ్సంగ్కు 601 మిలియన్ డాలర్ల(రూ.5,149 కోట్లు) డిమాంట్ నోటీసులు జారీ చేసింది. కొన్నేళ్లుగా కీలక టెలికాం పరికరాలను తప్పుగా వర్గీకరిస్తూ ఈ కంపెనీ ఉద్దేశపూర్వకంగా భారీ సుంకాలను తప్పించుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.తప్పుడు వర్గీకరణ.. టారిఫ్ ఎగవేత2018-2021 మధ్య కాలంలో 4జీ మొబైల్ టవర్లలో ఉపయోగించే కీలక భాగాలైన ‘రిమోట్ రేడియో హెడ్స్’ (ఆర్ఆర్హెచ్)లను శామ్సంగ్ దిగుమతి చేసుకోవడంపై ఈ వివాదం కేంద్రీకృతమైంది. భారత్లో 10% నుంచి 20% దిగుమతి సుంకాలు చెల్లించకుండా ఉండటానికి కంపెనీ ఈ వస్తువులను తప్పుగా వర్గీకరించింది. ఫలితంగా దక్షిణ కొరియా, వియత్నాం నుంచి 784 మిలియన్ డాలర్ల(సుమారు రూ.6,717 కోట్లు) విలువైన దిగుమతులపై ఎటువంటి సుంకాలు చెల్లించలేదని భారత కస్టమ్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. 2021లో జరిగిన దర్యాప్తులో ముంబయి, గురుగ్రామ్లోని శామ్సంగ్ కార్యాలయాల్లో ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు సోదాలు నిర్వహించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఆ తర్వాత ఈ విడిభాగాలను భారత మొబైల్ నెట్వర్క్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సంస్థకు విక్రయించారు.ఈ దిగుమతులపై సుంకాలు చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా తప్పుడు పత్రాలను సమర్పించడం ద్వారా భారతీయ చట్టాలను కంపెనీ ఉల్లంఘించినట్లు కస్టమ్స్ కమిషనర్ సోనాల్ బజాజ్ తెలిపారు. సంస్థ లాభాలను పెంచడానికి శామ్సంగ్ అన్ని వ్యాపార నైతికత, పరిశ్రమ పద్ధతులను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఆర్ఆర్హెచ్ ట్రాన్సీవర్ కేటగిరీలో ఉందని ప్రభుత్వం పేర్కొంది. అది దిగుమతి సుంకాలకు లోబడి ఉందని తెలిపింది. అయితే కంపెనీ మాత్రం దాన్ని వ్యతిరేకించింది. ఆర్ఆర్హెచ్ ట్రాన్సీవర్గా పనిచేయదని, అందువల్ల టారిఫ్ మినహాయింపులకు అర్హత లభిస్తుందని కంపెనీ వాదిస్తోంది.ఇదీ చదవండి: మెసేజ్ స్క్రోల్ చేస్తే జాబ్ పోయింది!ఈ సమస్య పరిష్కరించేందుకు గతంలో నలుగురు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరి అభిప్రాయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. దాంతో కస్టమ్స్ అధికారులు శామ్సంగ్ వాదనను తోసిపుచ్చి పన్ను డిమాండ్ను విధించారు. ఇందులో భాగంగా భారత అధికారులు ఏడుగురు శామ్సంగ్ ఇండియా ఎగ్జిక్యూటివ్లకు మొత్తం 81 మిలియన్ డాలర్లు (సుమారు రూ .694 కోట్లు) వ్యక్తిగత జరిమానా విధించారు.ఈ వ్యవహారంపై కంపెనీ స్పందిస్తూ ‘మా హక్కులను పూర్తిగా రక్షించడానికి చట్టపరమైన ఎంపికలపై దృష్టి సారిస్తున్నాం. భారతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నాం. కస్టమ్స్ వర్గీకరణల భిన్నమైన వివరణలకు సంబంధించిన అంశంగా ఈ సమస్యను పరిగణిస్తున్నాం’ అని పేర్కొంది.

జీఎమ్ఎస్ గోల్డ్ స్కీమ్ నిలిపేసిన ప్రభుత్వం: బ్యాంకులు మాత్రం..
బంగారం ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా బుధవారం నుంచి 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' (GMS)ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. బ్యాంకులు తమ స్వల్పకాలిక గోల్డ్ డిపాజిట్ పథకాలను (1-3 సంవత్సరాలు) కొనసాగించవచ్చని ఒక ప్రకటనలో వెల్లడించింది.పసిడి దిగుమతులపై దేశం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మాత్రమే కాకుండా.. గృహాలు, సంస్థలు తమ బంగారాన్ని ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేలా ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని 2015 సెప్టెంబర్ 15న ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి నవంబర్ 2024 వరకు 31,164 కేజీల బంగారాన్ని సమీకరించారు.నిజానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది మూడు విధాలుగా ఉంటుంది. అవి షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (1-3 సంవత్సరాలు), మిడ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (5-7 సంవత్సరాలు), లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (12-15 సంవత్సరాలు).బంగారం ధరలు పెరుగుతున్న తరుణంలో.. ప్రభుత్వం తన మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ డిపాజిట్లను నిలిపివేయాలని నిర్దారించింది. షార్ట్ టర్మ్ డిపాజిట్ల విషయాన్ని నిర్వహించడం లేదా నిర్వహించకపోవడం అనేది పూర్తిగా బ్యాంకులే నిర్ణయించుకునేలా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.ఇదీ చదవండి: ఈ పాలసీతో వాహనాల ధరలు తగ్గుతాయి: నితిన్ గడ్కరీనవంబర్ 2024 వరకు సమీకరించిన మొత్తం 31,164 కిలోల బంగారంలో.. షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ కింద 7,509 కేజీలు, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రభుత్వ డిపాజిట్స్ కింద వరుసగా 9728 కేజీలు, 13926 కేజీల బంగారం ఉంది. కాగా జీఎమ్ఎస్ పథకంలో ఉన్న డిపాజిటర్ల సంఖ్య 5693 మంది.
ఫ్యామిలీ

పిల్లల పెంపకం తపస్సు లాంటిది : మంచి పాటలతో మానిసిక ఉత్తేజం
ముంబై సెంట్రల్: ‘పిల్లల పెంపకమనేది వినోదం కాదు..అదో తపస్సు.. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన నేటికాలంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత మరింత పెరిగింది. పిల్లలు భవిష్యత్తులో ఆదర్శవంతంగా ఎదగాలంటే ముందు తల్లిదండ్రులు తమ ప్రవర్తన మార్చుకోవాలి. పిల్లలు కాపీ కొట్టేది ముందుగా తల్లిదండ్రుల్నే..’అన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా’’ఇండ్ల విశాల్రెడ్డి. ఆదివారం ఆంధ్ర మహాసభలో ‘విజ్ఞానం–వినోదం’పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పిల్లలు ఎల్రక్టానిక్ గాడ్జెట్స్కు అలవాటు పడకుండా చూడాలనీ, వారిలో సర్వాంగ వికాసానికి తల్లిదండ్రులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలనీ సూచించారు. పిల్లల్ని ఇతరులతో పోల్చడం, వారిపై కఠినమైన ఆంక్షలు విధించడం, తల్లిదండ్రుల అభిరుచుల్ని బలవంతంగా రుద్దడం వల్ల పిల్లల్లో మానసిక వికాసం ఆగిపోతుందని హెచ్చరించారు. మంచి పాటలతో మానిసిక ఉత్తేజం: డా. ఇండ్ల రామసుబ్బారెడ్డికార్యక్రమంలో భాగంగా ‘మనసు పాటలపై మానసిక విశ్లేషణ’అనే అంశంపై సుప్రసిద్ధ మానసిక నిపుణులు డా’’ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రసంగించి, సభికుల్ని అలరించారు. ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు మానసిక క్షోభకు గురవుతాడనీ, అలాంటి సమయంలో కుంగిపోకుండా, మోటివేషన్ కలిగించే మధురమైన పాటలు వింటే తాత్కాలికంగా మానసిక ఒత్తిడికి దూరమై నూతన ఉత్తేజాన్ని పొందుతాడని చెప్పారు. ఒక మానసిక వైద్యుడిగా ఇది తాను సాధికారికంగా చెప్పగలననీ అన్నారు.ఈ సందర్భంగా ఆయన ‘ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, మనసు పలికే మౌన గీతం, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో, మనసు గతి ఇంతే, పాడుతా తీయగా చల్లగా, ఆట గదరా శివా, కలకానిది విలువైనది.’లాంటి పలు పాటల్ని ప్రదర్శిస్తూ, ఆ పాటలు ప్రభావం మనిషి జీవితంపై చూపలగల ప్రభావాన్ని గురించి ఉదాహరణలతో సహా వివరించారు. తెలుగువారి ప్రయోజనాలే ముఖ్యం: అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఆంధ్ర మహాసభలో వినోదాత్మక కార్యక్రమాలతో పాటు ఆధ్యాతి్మక, మానసిక వికాస, సాహిత్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామనీ, తెలుగువారి ప్ర యోజనాలే తమకు ముఖ్యమని అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. వీరందరికీ ఆంధ్ర మహాసభ తరపున టీ, టిఫిన్లు ఏర్పాటుచేశారు. అనంతరం ఇరువురు వైద్యుల్ని మహాసభ తరపున ఘనంగా సన్మానించారు. ఈ సభకు సాహి త్య విభాగ ఉపాధ్యక్షుడు బొమ్మకంటి కైలాశ్ స్వా గతం పలకగా, ధర్మకర్తల మండలి సభ్యుడు గాలి మురళీధర్ సమన్వయ కర్తగా వ్యవహరించారు. గాలి మురళీధర్ వందన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు సంగం ఏక్నాథ్, భోగ సహాదేవ్, ద్యావరిశెట్టి గంగాధర్, తాళ్ళ నరేశ్, సంయుక్త కార్యదర్శులు మచ్చ సుజాత, కటుకం గణేశ్, అల్లె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొక్కుల రమేష్, క్యాతం సువర్ణ, కూచన బాలకిషన్, చిలుక వినాయక్, అల్లం నాగేశ్వర్రావు, మహిళ శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, కార్య దర్శి పిల్లమారపు పద్మ తదితరులు పాల్గొన్నారు.

ఏడు నిమిషాల్లో బాడీ ఫిట్ : హిట్ హిట్ హుర్రే!
ప్రపంచం వేగంగా మారుతోంది. అలా వేగం పెరుగుతున్న కొద్దీ మన శారీరక కదలికలు తగ్గిపోతున్నాయి. మరోవైపు ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామానికి సమయం లేదనడమూ సర్వసాధారణంగా మారింది. అయితే నిజానికి మానవ శరీరం చురుకుగా కదులుతూ ఉండేందుకు అనువుగా రూపొందింది. సమయం లేదంటూ దానిని కదిలించ కపోతే శారీరక సమస్యలతో పాటు ఆరోగ్యానికి చేటు తప్పదు. ఈ నేపథ్యంలో గంటల తరబడి చేయడానికి బదులు కేవలం నిమిషాల్లో ముగించేందుకు వీలుగా కొత్త కొత్త వ్యాయామాలు పుట్టుకొస్తున్నాయి. అలా అందుబాటులోకి వచ్చిందేఈ హిట్ పద్ధతి. – సాక్షి, సిటీబ్యూరో అమెరికాకు చెందిన వ్యాయామ మనస్తత్వవేత్త క్రిస్ జోర్డాన్ ఈ హిట్ అనే వ్యాయామ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కదలికలు కురవైన శరీరం తెచ్చిపెట్టే సమస్యలకు.. కేవలం 7 నిమిషాల్లో పరిష్కరించగలదని ఆయన చెబుతున్నారు. సొంత శరీర బరువును ఉపయోగించి సుపరిచితమైన కాలిస్టెనిక్ వ్యాయామాలను చేయడమే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) ఈ హిట్ ఫార్ములా. ప్రతి రౌండ్కూ మధ్య ఐదు సెకన్ల విశ్రాంతి తీసుకుంటూ చేసే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ)గా దీనిని పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి వ్యాయామం 30 సెకన్ల పాటు చేయాలి. ఒక భంగిమ నుంచి మరో భంగిమకు మారేటప్పుడు మధ్యన 5 సెకన్ల చొప్పున గ్యాప్ ఉండాలి. పుష్–అప్స్: నేలపై లేదా చాపపై ‘ప్లాంక్’ పొజిషన్న్లోకి వెళ్లి చేసే ప్రక్రియ. బరువును పాదాలకు బదులుగా మోకాళ్లపై ఉంచడం ద్వారా దీన్ని సులభతరం చేయవచ్చు. వాల్ సిటప్స్: గోడ దగ్గర వెనుకభాగంలో నిల్చుని కుర్చీలో కూర్చున్నట్లుగా కూర్చునే భంగిమ. ఓ రకంగా గోడకుర్చీ వేయడం అని చెప్పొచ్చు. అబ్ క్రంచ్: ప్రాథమిక క్రంచ్తో ప్రారంభించి, వెనుకభాగంలో చదునుగా ఉంచి పడుకోవాలి, మోకాళ్లను వంచి పాదాలను నేలపై ఉంచి చేయాలి. స్టెప్–అప్: దృఢమైన కుర్చీ లేదా బెంచ్కు ఎదురుగా నిలబడి, ఎడమ కాలితో ఓ సారి కుడికాలితో మరోసారి ప్రారంభించి చేయాలి. 30 సెకన్ల వ్యవధిలో వీలైనన్ని సార్లు చేయాలి. స్క్వాట్: పాదాలను భుజం–వెడల్పు వేరుగా చేసి కాలి వేళ్లను ముందుకు ఉంచి నిలబడాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు బరువులో ఎక్కువ భాగాన్ని మడమల మీద ఉంచాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి. ట్రైసెప్ డిప్: కుర్చీ లేదా బెంచ్ ముందు అంచున కూర్చుని, మన అరచేతులను అంచుపై ఉంచి దీనిని చేయాలి. ప్లాంక్: చాపపై బోర్లా పొట్టపై పడుకుని దీన్ని చేయాలి. ఈ భంగిమలో మన మోచేతులు మన వైపు దగ్గరగా, అరచేతులు కిందికి వేళ్లు ముందుకు ఎదురుగా ఉంటాయి.చదవండి: 64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లిహై ‘నీస్’: 30 సెకన్ల పాటు ఉన్నచోటే పరుగెత్తడంగా దీన్ని చెప్పొచ్చు. ప్రతి అడుగుతో మోకాళ్లను వీలైనంత ఎత్తుకు పైకి తీసుకొస్తూ, అరచేతులను తాకడానికి మన మోకాళ్లను వేగంగా పైకి కందికి ఎత్తుతూ చేయాలి. లంజెస్: పాదాలను కలిపి నిలబడి, కుడి పాదం మీద ముందుకు సాగదీయాలి. ముందు, వెనుక మోకాలు రెండూ వీలైనంత 90–డిగ్రీల కోణానికి దగ్గరగా వంగి ఉండే వరకూ చేయాలి.ఇదీ చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుసైడ్ ప్లాంక్లు: చాపపై కుడి వైపున పడుకుని, ఎడమవైపు పడుకుని చేసే వ్యాయామం.

64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లి
ప్రేమ, పెళ్లి అనేవి క్షణికమైన బంధాలుగా మారిపోతున్న వేళ పవిత్రమైన ప్రేమకు, వివాహ బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందో జంట. 64 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. అదీ మనవరాళ్ల మధ్య. గుజరాత్కు చెందిన ఈ జంట వివాహ వేడుక నెట్టింట పలువుర్ని ఆకట్టు కుంటోంది. 80 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన అందమైన జంట లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.1961 నాటి ప్రేమకథ1961 సంవత్సరం అది. అసలు ప్రేమ, అందులోనూ ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం లాంటి విషయాలను చాలా ఆశ్చర్యంగా చూసే సామాజిక కట్టుబాట్లు ఉన్న రోజులవి. కులాంతర వివాహాలన్న ఊసే లేదు. ఇవి ఆచరణాత్మకంగా నిషిద్ధం. ఆ రోజుల్లో హర్ష్, మృధు మధ్య ప్రేమ చిగురించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న జైన యువకుడు హర్ష్, బ్రాహ్మణ యువతి మృదుతో ప్రేమలో పడ్డాడు. పాఠశాలలో చిగురించిన ప్రేమ, ప్రేమ లేఖలతో మరింత బలపడింది. View this post on Instagram A post shared by The Culture Gully™️ (@theculturegully) యథాప్రకారం వీరి ప్రేమ గురించి తెలిసి ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. చర్చోపచర్చలు, తర్కాలు తరువాత కూడా తమ వాదన మీదే నిలబడ్డాయి ఇరుకుటుంబాలు. అటు కుటుంబం, ఇటు ప్రేమ వీటి రెండింటి మధ్యా ప్రేమనే ఎంచుకున్నారు. ఇద్దరూ సాహసమే చేశారు. ధైర్యంగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. కొత్త జీవితాన్ని వెదుక్కుంటూ ఇంటినుంచి పారిపోయారు.హర్ష్ -మృదు వివాహంకలిసిన ఈ రెండు హృదయాలకు..ఒకరికొకరే తోడు నీడు తప్ప మరెవ్వరూ అండగా నిలబడలేదు. పెళ్లి వేడుక లేదు, పెద్దల ఆశీర్వాదాలు అసలే లేవు. అయినా పూర్తి నిబద్ధత, పట్టుదలతో సాదాసీదాగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. సామాజిక సరిహద్దులను అధిగమించే ప్రేమ విలువను అర్థం చేసుకునేలా పిల్లలను పెంచారు. వారికి పెళ్లిళ్లు చేశారు. మనవరాళ్లతో కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన కథను వింటూ పెరిగారు హర్ష్ మృదు పిల్లలు మనవరాళ్ళు. ఈ క్రమంలోనే ఇన్నేళ్లుగా వారి మదిలి మిగిలిపోయిన కోరిక గురించి తెలుసుకున్నారు. 64వ వార్షికోత్సవం సందర్భంగా, కనీవిని ఎరుగని విధంగా తామే దగ్గరుండి వారికి పెళ్లి జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక అతిథులందరి చేత కంట తడిపెట్టించింది.సాధారణ 10 రూపాయల చీరలో భర్తచేత ఆనాడు తాళి కట్టించుకున్న మృదు ఇపుడు గుజరాతీ సాంప్రదాయంలో ఘర్చోలా చీర, గోరింటాకు, నగలతో అందంగా ముస్తాబైంది. ఆరు దశాబ్దాలకు పైగా తన భర్తగా ఉన్న వ్యక్తిని మరోసారి పెళ్లాడి భావోద్వేగానికి లోనైంది. పవిత్ర అగ్నిహోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, తొలిసారి కలిసిన ఈ జంట చేతులు మరింత దృఢంగా పెనవేసుకున్నాయి. జీవితాంతం పంచుకున్న ఆనందాలు , కష్టాలు, కన్నీళ్లను చూసిన వారి కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలునిజమైన ప్రేమ అంటే ప్రేమించడం మాత్రమే కాదు; జీవిత పయనంలో వచ్చే ప్రతీ సవాల్ను స్వీకరించడం, అంతే బలంగా దాన్నుంచి బయటపడటం. ఓరిమితో , ఒకరికొరు తోడు నీడగా సాగిపోవడం. ఏ సామాజిక కట్టుబాట్లను తాము తోసి రాజన్నారో, ఆ అవగాహనను, చైతన్యాన్ని తమబిడ్డల్లో కలిగించడం. ఇదే జీవిత సత్యం. వైవాహిక జీవితానికి పరిపూర్ణత అంటే ఇదే అని నిరూపించిన జంటను శతాయుష్షు అంటూ దీవించారు పెళ్లి కొచ్చిన అతిథులంతా.చదవండి: కొడుకుకోసం..చిరుతపైనే పంజా విసిరింది!

మూడు నెలల్లో 9 కిలోలు తగ్గిన జ్యోతిక: ఈ సక్సెస్ సీక్రెట్ ఆమే!
బోలెడన్ని వ్యాయామాలు అంతులేని ఆహారపు మెళకువలు అందుబాటులో ఉన్నప్పటికీ, బరువు నిర్వహణ తనకు ’ఎప్పుడూ కష్టంగానే అనిపించేది అని నటి జ్యోతిక అన్నారు. రకరకాల వ్యాయామాలు, అంతులేని ఆహారాల మార్పులు, అపరిమిత ఉపవాసం ఇవేవీ నా అదనపు కిలోల బరువును తగ్గించడంలో సహాయపడలేదు. అని కూడా స్పష్టం చేశారు...అలాంటి జ్యోతిక ఇప్పుడు బరువు తగ్గారు. అదెలా సాధ్యమైంది? దీనికి ఓ ఏడాది క్రితం బీజం పడింది అని ఆమె గుర్తు చేసుకుంటున్నారు. ఆ బీజం పేరు విద్యాబాలన్. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఒక దశలో విపరీతంగా బరువు పెరిగారు. కానీ అకస్మాత్తుగా స్వల్ప వ్యవధిలోనే ఆమె గణనీయంగా బరువును తగ్గించుకోగలిగారు. దీనిపై ఎన్ని రకాల సందేహాలు, అంచనాలు, విశ్లేషణలు వచ్చినప్పటికీ... ఆమె మాత్రం స్పందించలేదు. అయితే గత అక్టోబర్ 2024లో విద్యాబాలన్ తన విపరీతమైన బరువు తగ్గడంపై మౌనం వీడింది జిమ్కి వెళ్లకుండానే చెమట్లు కక్కకుండానే తాను అదనపు కిలోల బరువు తగ్గడానికి కారణాలను, తన కొత్త ఆహారపు అలవాట్లను వెల్లడించింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ‘‘ డైట్ బట్ ’నో ఎక్సర్ సైజ్’ రొటీన్ ద్వారా విపరీతంగా బరువు తగ్గినట్టు వెల్లడించింది. దీనిని జ్యోతిక కూడా అనుసరించారు. ఆమెలాగానే నటి జ్యోతిక, తన బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించి ఆమె శిక్షకులనే ఎంచుకున్నారు. అచ్చం విద్య మాదిరిగానే తన డైట్ ఫిట్నెస్ మంత్రాన్ని మార్చడం ద్వారా ’ 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినట్లు’ వెల్లడించింది. తన ట్రైనర్ చెన్నైకి చెందిన న్యూట్రీషియన్ గ్రూప్ అమురా హెల్త్ టీమ్తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దానితో పాటు , ‘అమురా, కేవలం 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినందుకు నా అంతరంగాన్ని తిరిగి కనుగొనడంలో నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు, అమురా! మీరందరూ ఓ మాయాజాలం అంటూ పొగిడింది. తన ఇంటర్వ్యూల ద్వారా నన్ను అమరా మాయా బృందానికి పరిచయం చేసినందుకు విద్యాబాలన్ కు కృతజ్ఞతలు’’ తెలిపింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika)‘‘‘నేను నా ప్రేగు, జీర్ణక్రియ, వేడిని కలిగించే ఆహారాలు ఆహార సమతుల్యత గురించి తెలుసుకున్నాను. మరీ ముఖ్యంగా, సానుకూల భావాన్ని కలిగించేటప్పుడు నా సంతోషం, మానసిక స్థితిపై ఆహారం ప్రభావాన్ని అర్థం చేసుకున్నాను. ఫలితంగా, ఈ రోజు ఒక వ్యక్తిగా నేను చాలా శక్తివంతంగా అదే సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’’ అంటూ బరువు తగ్గడం కన్నా మన శరీరంపై మనకు అవగాహన ఏర్పడడం ముఖ్యమని ఆమె వివరించింది. అయితే బరువు తగ్గడంతో పాటే మహిళల ఆరోగ్యానికి వెయిట్ ట్రైనింగ్ ఎంత ముఖ్యమో కూడా జ్యోతిక తెలియజేసింది. ‘ఆరోగ్యకరమైన జీవితం సమతుల్యతతో కూడి ఉంటుంది; బరువు తగ్గడం లో ఆహారపు అలవాట్లు ముఖ్యమైనవి, అలాగని శక్తి అక్కర్లేదని కాదు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలువెయిట్ ట్రైనింగ్ అనేది మహిళల భవిష్యత్తుకు కీలకం, బరువు తగ్గడంతో పాటు శక్తి కోల్పోకుండా ఉండడం కూడా ముఖ్యమైన విషయం. ఇది నేర్పినందుకు వయస్సు కేవలం ఒక సంఖ్య అని నిరూపించినందుకు శిక్షకుడు మహేష్కు ధ్యాంక్స్ చెప్పాలి. ‘నా శరీరం దాని పనితీరును అర్థం చేసుకోవడం దానితో వ్యాయామాలను కలపడం నా అనుభవంపై గరిష్ట ప్రభావాన్ని చూపింది అంటూ ఇదే సందర్భంగా పోషకాహార నిపుణులు ఫిట్నెస్ నిపుణుల బృందానికి తనను పరిచయం చేసినందుకు విద్యకు ధన్యవాదాలు తెలిపింది.చదవండి: ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్
ఫొటోలు


చెల్లెళ్లతో ప్రభాస్.. డార్లింగ్ అప్పుడెలా ఉన్నాడో చూశారా? (ఫోటోలు)


రిషభ్ పంత్ సోదరి సాక్షి హల్దీ వేడుక.. ఫొటోలు వైరల్


లవ్ లెటర్లు తీసుకుంటా.. ల్యాండ్ లైన్ కాల్స్ లిఫ్ట్ చేస్తా: శ్రేయాంక (ఫోటోలు)


నల్ల చీరలో మతిపోగొడుతోన్న బాంధవి శ్రీధర్ అందాలు.. అదరహో అంటున్న కుర్రాళ్లు


నితిన్ ‘రాబిన్ హుడ్’ HD మూవీ స్టిల్స్


ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన కాజల్.. చాన్నాళ్లకు మళ్లీ ఇలా (ఫొటోలు)


భార్యపై ఎంత ప్రేమో.. రహస్యతో హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు)


శ్రీశైలం క్షేత్రం..భక్తజనసంద్రం (ఫొటోలు)


చీరలో రీతూ చౌదరి ఒయ్యారాలు (ఫొటోలు)


విశాఖ బీచ్రోడ్డులో యువతతో కలిసి వైద్యురాలు స్టెప్పులు (ఫొటోలు)
International

White House: ముందే లీక్.. మరీ ఇంత నిర్లక్ష్యమా?
వాషింగ్టన్: వైట్హౌజ్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరపాటున యెమెన్ యుద్ధ ప్రణాళికను ఓ జర్నలిస్టుతో పంచుకున్నారు. అదీ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటన చేయకమునుపే కావడం ఇక్కడ గమనార్హం. అమెరికా రక్షణశాఖమంత్రి పీట్ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు ఉన్న గ్రూప్లోకి ఓ యూఎస్ జర్నలిస్టుకు ప్రవేశం కల్పించారు. ఆ గ్రూప్లో అతనున్నాడనే విషయం కూడా హౌతీ రెబల్స్పై యుద్ధానికి సమాచారం పోస్ట్ చేశారు. ‘ద అట్లాంటిక్’ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ జెఫ్రీ గోల్డ్బర్గ్ స్వయంగా ఈ విషయం తెలియజేశారు. మార్చి 15వ తేదీన యెమెన్పై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ, అంతకంటే ముందే సిగ్నల్లోని గ్రూప్చాట్ ద్వారా తనకు నోటీసు అందిందని తెలిపారు. ఈ ఘటన జరిగిన రెండ్రోజుల ముందే ఆయన్ని ఆ గ్రూప్లో యాడ్ చేశారట!. అయితే అవకాశం ఉన్నా.. ఆయన ఆ సమాచారాన్ని పబ్లిష్ చేయలేదు. జెఫ్రీ ప్రకటన తర్వాత విషయం ధృవీకరించుకున్న వైట్హౌజ్ అధికారులు నాలిక కర్చుకున్నారు. ఈ విషయంలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని సోమవారం వైట్హౌజ్ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఎలాంటి దాడులు జరపుతామనే ప్రణాళిక అందులో ప్రస్తావించలేదని పేర్కొన్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. ముమ్మాటికీ ఇది భద్రతా లోపమేనంటున్న డెమోక్రట్లు.. ట్రంప్ అధికారంలోకి వచ్చాక జాతీయ భద్రతకు సంబంధించిన నిర్లక్ష్యపూరిత వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. అమెరికా నౌకలు, విమానాలపై యెమెన్ హౌతీలు దాడులు జరపడాన్ని ఖండిస్తూ.. ట్రంప్ సర్కారు సైనిక చర్యను మొదలుపెట్టింది. ‘‘హౌతీలు మీ సమయం ఆసన్నమైంది. మీ దాడులు వెంటనే ఆపేయాలి. ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ముందుగానే ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలో హౌతీలకు మద్ధతుగా ఉన్న ఇరాన్ను హెచ్చరించారాయన. మార్చి15-16 నుంచి మొదలైన దాడులు.. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడాలే లక్ష్యంగా జరుగుతున్నాయి. అయితే.. అగ్రరాజ్య దాడులను హూతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్ దళాలు ధీటుగానే అమెరికా సైనిక చర్యకు స్పందిస్తున్నాయి.

తుర్కియేలో తీవ్ర ఉద్రిక్తత
ఇస్తాంబుల్: అవినీతి ఆరోపణలతో ప్రతిపక్ష నాయకుడు ఎక్రెమ్ ఇమామోగ్లు అరెస్టుతో తుర్కియేలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆయనకు మద్దతుగా వేలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. ఇమామోగ్లును అదుపులోకి తీసుకున్న నాటి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఇస్తాంబుల్ సిటీ హాల్ వద్ద గుమిగూడిన జనం తుర్కియే జెండాలు ఎగరవేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రభుత్వం నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువును, రబ్బరు పెల్లెట్లను, పెప్పర్స్పేని ప్రయోగించింది. మొత్తంగా తుర్కియేలోని 81 ప్రావిన్సుల్లో కనీసం 55 ప్రావిన్సుల్లో, దేశంలో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1,133 మందికి పైగా అరెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆందోళనల్లో 123 మంది పోలీసులు గాయపడ్డారని వెల్లడించారు. జర్నలిస్టుల అరెస్టు.. మరోవైపు సోమవారం పలువురు జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది మంది రిపోర్టర్లు, ఫోటో జర్నలిస్టులను ప్రభుత్వం నిర్బంధించిందని జర్నలిస్టు యూనియన్ తెలిపింది. ఇది పత్రికా స్వేచ్ఛ, సత్యాన్ని తెలుసుకునే ప్రజల హక్కుపై దాడి చేయడమేనని, జర్నలిస్టులను మౌనంగా ఉంచి నిజాన్ని దాచలేరని పేర్కొంది. వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాజకీయ ప్రతీకారంతోనే అరెస్టు : ఇమామోగ్లు అవినీతి ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా రాజకీయనాకులు, జర్నలిస్టులు వ్యాపారవేత్తలను మొత్తంగా 100 మందిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (సీహెచ్పీ) నేత ఇమామోగ్లు కూడా ఉన్నారు. ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఉగ్రవాద సంస్థతో సంబంధాలు, లంచాలు తీసుకోవడం, దోపిడీ, చట్టవిరుద్ధంగా వ్యక్తిగత డేటాను నమోదు చేయడం, టెండర్ రిగ్గింగ్ వంటి అభియోగాలపై అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సిలివ్రీలోని జైలుకు రిమాండ్కు తరలించారు. మరోవైపు ఇమామోగ్లును మేయర్ పదవి నుంచి సస్పెండ్ చేసినట్లు తుర్కియే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అవాంతరాలు.. ఇమామోగ్లును అరెస్టు చేసినా.. 2028 అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం ఆదివారం ఓటింగ్ జరిగింది. అధ్యక్ష అభ్యరి్థగా ఇమామోగ్లు ఒక్కరే పోటీ చేశారు. అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో దాదాపు కోటిన్నర మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని సీహెచ్పీ తెలిపింది. సుమారు పది లక్షలకు పైగా ఓట్లు తమ సభ్యుల నుంచి రాగా, మిగిలినవి ఇమామోగ్లుకు సంఘీభావంగా తమ సభ్యులు కానివారు వేసినవని సీహెచ్పీ వెల్లడించింది. ఈ అరెస్టు ఇమామోగ్లు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోలేదు. అభియోగాలు రుజువైతే మాత్రం అతను ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఇదిలావుండగా, అవకతవకల కారణంగా ఇమామోగ్లు డిగ్రీని రద్దు చేస్తున్నట్లు ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. అధ్యక్ష పదవిని నిర్వహించడానికి ఉన్నత విద్యను పూర్తి చేసి ఉండాలని తుర్కియే రాజ్యాంగం చెబుతోంది. ఇదే జరిగితే.. అధ్యక్ష పదవికి పోటీ చేయడం కూడా ప్రశ్నార్థకం అవుతుంది. అయితే ఇమామోగ్లు డిగ్రీ రద్దు నిర్ణయాన్ని రాజ్యాంగ న్యాయస్థానం, యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో అప్పీల్ చేస్తామని ఇమామోగ్లు న్యాయవాదులు తెలిపారు.

కెనడా ఎన్నికల్లో అడ్వాంటేజ్ కార్నీ
కొన్నేళ్లుగా నానారకాలైన ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న కెనడాలో ఎన్నికల నగారా మోగింది. లిబరల్ పార్టీ సారథి, నూతన ప్రధాని మార్క్ కార్నీ అనూహ్యంగా ‘ముందస్తు’ నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ దాకా ఆగకుండా ఏప్రిల్ 28వ తేదీనే ప్రజా తీర్పు కోరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ముమ్మర ప్రచారంతో దూసుకెళ్తున్నారు. విపక్ష కన్జర్వేటివ్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా విజయంపై ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం తమ పార్టీకి అంతా అనుకూలంగా ఉందని కార్నీ భావిస్తున్నారు. ఇందుకు గట్టి కారణాలూ లేకపోలేదు. నిజానికి జస్టిన్ ట్రూడో పదేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థికంగానే గాక అన్నివిధాలా దేశాన్ని ఆయన తిరోగమన బాట పట్టించారని వారంతా ఆగ్రహించారు. దాంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కన్జర్వేటివ్ పార్టీ విజయం నల్లేరుపై నడకేనని అంతా భావించారు. కానీ మూడు నెలలుగా పరిస్థితిలో బాగా మార్పు వచ్చింది. ట్రూడోను ప్రధాని పదవి నుంచి తప్పించడంతో లిబరల్ పార్టీపై ప్రజల ఆగ్రహావేశాలు చల్లార్చినట్టు కన్పిస్తోంది. దానికితోడు కెనడాను అడుగడుగునా అవమానిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరే ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారిపోయింది. తమ సమస్యల పరిష్కారం కంటే ట్రంప్కు గుణపాఠం చెప్పడమే ముఖ్యమని ప్రజలు భావిస్తున్నారు. అన్ని విషయాల్లోనూ అమెరికా అధ్యక్షునితో ఢీ అంటే ఢీ అంటున్న కార్నీ తీరు వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి తోడు కార్నీ ప్రధాన ప్రత్యర్థి అయిన కన్జర్వేటివ్ నేత పొలియెవ్రాకు ట్రంప్ సమర్థకునిగా పేరుండటం ఆ పార్టీకి ప్రతికూలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగోసారి తమ గెలుపు లాంఛనమేనని లిబరల్ పార్టీ అంచనా వేసుకుంటోంది. కెనడాలో గత పదేళ్లలో జస్టిస్ ట్రూడో లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం. మార్క్ కార్నీ 60 ఏళ్ల కార్నీ వృత్తిరీత్యా బ్యాంకర్. బ్యాంక్ ఆఫ్ కెనడాతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్కు కూడా చీఫ్గా పని చేసిన ఘనత ఆయనది. అయితే రాజకీయాలకు మాత్రం పూర్తిగా కొత్త. కనీసం పార్లమెంటుకు పోటీ చేసి గెలిచిన చరిత్ర కూడా లేకున్నా కొద్ది రోజల క్రితమే అనూహ్యంగా ఏకంగా ప్రధాని అయిపోయారు. అలా ప్రధాని హోదాలో ఎన్నికల అరంగేట్రం చేస్తున్న నేతగా అరుదైన రికార్డు నెలకొల్పారు. ట్రూడో గద్దె దిగాక లిబరల్ పార్టీ సారథ్య ఎన్నికల్లో ఏకంగా 85 శాతం మంది కార్నీకే ఓటేయడం విశేషం. ఉత్తర కెనడా నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే. ఈ కొద్ది రోజుల్లోనే వరుస నిర్ణయాలతో కార్నీ మంచి దూకుడు కనబరిచారు. ట్రంప్పై ఆయన కఠిన వైఖరి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కెనడాను 51వ రాష్ట్రంగా చేసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనను కార్నీ తూర్పారబట్టారు. కెనడా సార్వబౌమత్వాన్ని గుర్తించినప్పుడే ఆయనతో ఎలాంటి చర్చలైనా జరుపుతానని ప్రకటించారు. కెనడాపై ట్రంప్ సుంకాలకు దీటుగా అమెరికా మీద వెంటనే ప్రతీకార సుంకాలకు తెర తీసి ప్రజల మన్నన చూరగొన్నారు. నానా సమస్యలు ఎదుర్కొంటున్న దేశాన్ని ఈ ఆర్థిక నిపుణుడు గాడిలో పెడతారని వారు నమ్ముతున్నారు. నలుగురు అభ్యర్థుల్లో కార్నీయే మెరుగని ప్రజలు భావిస్తున్నట్టు పలు సర్వేలు చెబుతుండటం విశేషం. ఆదివారం నాటి ఆయన ఎన్నికల ప్రచార సభకు విశేషాదరణ లభించింది. ‘‘ట్రంప్ రూపంలో కెనడా తన చరిత్రలోనే అతి పెద్ద ముప్పు ఎదుర్కొంటోంది. దాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు నాకు భారీ మెజారిటీ ఇవ్వండి’’ అంటూ కార్నీ ఇచ్చిన పిలుపునకు జనం విపరీతంగా స్పందించారు. పియే పొలియెవ్రా 45 ఏళ్ల పొలియెవ్రా కన్జర్వేటివ్ పార్టీ సారథి. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆరితేరిన యువ నేత. 25 ఏళ్ల వయసులోనే హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికయ్యారు. అప్పట్లో ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కునిగా నిలిచారు. ట్రూడో విధానాలకు తీవ్ర వ్యతిరేకి. దేశ సమస్యలన్నింటికీ అవే కారణమని నిత్యం విమర్శిస్తుంటారు. ధరల పెరుగుదల నుంచి హౌసింగ్ సంక్షోభం దాకా నానా ఇక్కట్లతో సతమతమవుతున్న కెనడావాసులను దూకుడైన ప్రసంగాలతో ఆకట్టుకుంటూ వచ్చారు. ఏడాదిన్నర క్రితం దాకా అన్ని సర్వేల్లోనూ హాట్ ఫేవరెట్గా నిలిచారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పొలియెవ్రా ప్రధాని కావడం లాంఛనమేనని అంతా భావించిన పరిస్థితి! కానీ కార్నీ రాకతో పరిస్థితులు మారిపోయాయి. దీనికి తోడు ట్రంప్ సమర్థకుడన్న పేరు కూడా పొలియెవ్రాకు చేటు చేస్తోంది. దాంతో ఆయన కూడా ట్రంప్పై విమర్శలకు దిగుతుండటమే గాక ‘కెనడా ఫస్ట్’ నినాదం ఎత్తుకున్నారు. అయితే ఆదివారం నాటి ఆయన ఎన్నికల ప్రసంగానికి అంతంత స్పందనే లభించింది.జగ్మిత్ సింగ్ భారత సంతతికి చెందిన 46 ఏళ్ల జగ్మిత్ వామపక్ష న్యూ డెమొక్రటిక్ పార్టీ సారథి. కెనడాలో ఓ ప్రధాన పార్టీకి సారథ్యం వహిస్తున్న తొలి మైనారిటీ నేతగా రికార్డులకెక్కారు. ఎన్డీపీ 2021 నుంచి ట్రూడో ప్రభుత్వానికి మూడేళ్ల మద్దతిచ్చి దాని మనుగడకు కీలకంగా నిలిచింది. 2024లో మద్దతు ఉపసంహరించుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీపీ పెద్ద ప్రభావం చూపబోదని సర్వేలు పేర్కొన్నాయి. దానికి 9% మంది ఓటర్లు మద్దతిస్తున్నట్టు తేల్చాయి. పార్టీకి అధికారిక గుర్తింపును నిలుపుకోవడమే ఎన్డీపీకి సవాలుగా మారవచ్చంటున్నారు. బ్లాక్ క్యుబెక్ నేషనలిస్ట్ పార్టీ నుంచి ఫ్రానోయిస్ బ్లాంచెట్ బరిలో ఉన్నారు. క్యూఎన్పీ పోటీ ఫ్రెంచి ప్రాబల్య ప్రాంతాలకే పరిమితమైంది. జగ్మిత్, బ్లాంచెట్ పోటీ నామమాత్రమేనని భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్

‘ఉషా వాన్స్ రాక.. మమ్మల్ని రెచ్చగొట్టడమే!’
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ ‘గ్రీన్లాండ్ పర్యటన’ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. రెండ్రోజులు ఆమె పర్యటించాల్సి ఉండగా.. ప్రకటన వెలువడి 24 గంటలు గడవక ముందే గ్రీన్లాండ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఉష పర్యటనను బహిష్కరించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. విలువైన ఖనిజాలు ఉన్న ఈ అతిపెద్ద ద్వీపదేశాన్ని హస్తగతం చేసుకుంటానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలే ఇందుకు కారణం. అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్(Usha Vance) ఈ నెల 27 నుంచి 29వ తేదీదాకా గ్రీన్లాండ్లో పర్యటించాల్సి ఉంది. అవన్నాట కిముస్సర్సులో జరగబోయే డాగ్స్లెడ్ రేసుకు హాజరు కావడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనను ఆ దేశ ప్రధాని మ్యూట్ ఎగేడే తీవ్రంగా విమర్శిస్తున్నారు. అమెరికా-గగ్రీన్లాండ్ మధ్య ఒకప్పటిలా మంచి సంబంధాలు లేవని.. అది ఈమధ్యే ముగిసిపోయిందని అన్నారాయన. అలాగే ఉషా వాన్స్ పర్యటన.. ముమ్మాటికీ గ్రీన్లాండ్ను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని అంటున్నారాయన. అంతేకాదు.. ఆమె వెంట జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్లతో కూడిన బృందాలు వస్తుండడంపైనా ఎగేడే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తన పర్యటనకు ముందు ఉషా వాన్స్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. SLOTUS VISITING GREENLAND 🇬🇱 Hands up If USA should purchase Greenland. pic.twitter.com/fkduBBVOPB— Usha Vance News (@UshaVanceNews) March 23, 2025 గ్రీన్లాండ్(GreenLand).. అతిపెద్ద ద్వీపం. అర్కిటిక్-అట్లాంటిక్ మహాసముద్రాల మధ్యలో ఉంటుంది. భౌగోళికంగా ఉత్తర అమెరికాలో భాగమైనప్పటికీ.. యూరప్ దేశాలతోనే రాజకీయ, సంప్రదాయపరంగా కలిసి ఉంది. అయితే ఇది స్వతంత్ర దేశం కాదు. కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ సరిహద్దులో అటానమస్గా ఉండిపోయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే గ్రీన్లాండ్ను చేజిక్కించుకోవడంపై ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనను ఇటు గ్రీన్లాండ్, అటు డెన్మార్క్ రెండూ వ్యతిరేకిస్తున్నాయి. రెండు నెలల కిందట ట్రంప్ పెద్ద కొడుకు గ్రీన్లాండ్ను సందర్శించారు.మార్చి 11వ తేదీన జరిగిన గ్రీన్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో డెమోక్రట్స్ ఘన విజయం సాధించారు. డెమోక్రట్స్ నేత జెన్స్ ఫ్రెడ్రిక్ నీల్సన్ సైతం ఉషా వాన్స్ పర్యటనను తీవ్రంగా తప్పుబట్టారు. అయితే విమర్శలతో సంబంధం లేకుండా.. ఉషా వాన్స్ పర్యటన భద్రత కోసం అమెరికా నుంచి ప్రత్యేక బలగాలు గ్రీన్లాండ్కు చేరుకున్నాయి. మరోవైపు ఈ పర్యటనను వ్యతిరేకిస్తూనే.. అమెరికాతో దౌత్యపరమైన సంబంధాల దృష్ట్యా గ్రీన్లాండ్కు తమ పోలీసు బలగాలను డెన్మార్క్ పంపించింది.
National

మందుబాబులకు పండుగ.. ఒకటికి మరొకటి ఫ్రీ.. రూ. 200 డిస్కౌంట్
నోయిడా: మద్యం ప్రియులకు శుభవార్త. ఆ రాష్ట్రంలోని మద్యం దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొక బాటిల్ ఉచితం(Buy one bottle, get another bottle free). పైగా ఫుల్ బాటిల్ కొంటే రూ. 200 డిస్కౌంట్. ఇది ఏ ఒక్క మద్యం దుకాణానికో పరిమితం కాదు. పలు జిల్లాల్లో ఈ ఆఫర్ కొనసాగుతోంది. దీంతో మద్యం ప్రియులంతా ఆయా దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో మద్యంపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నారు. తాజాగా మంగళవారం నోయిడాలోని ఒక దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో మద్యం ప్రియులు భారీ సంఖ్యలో క్యూకట్టారు. కాగా మద్యంపై తగ్గింపు ధరలు ఒక్క నోయిడాకు మాత్రమే పరిమితం కాలేదు. యూపీలోని పలు జిల్లాల్లో మద్యంపై అద్భుతమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఒక బాటిల్ కొనుగోలు చేస్తే మరొక బాటిల్, మరికొన్ని చోట్ల పూర్తి బాటిల్ కొనుగోలు చేస్తే రూ. 200 వరకు తగ్గింపు అందిస్తున్నారు.एक बोतल शराब लीजिए, उसके साथ एक फ्री..उत्तर प्रदेश के शराब ठेके वालों को 31 मार्च की रात 12 बजे तक सारा स्टॉक खत्म करना है. वरना बची हुई दारू सरकारी खाते में जमा हो जाएगी और उसकी बिक्री नहीं हो पाएगी. इसलिए ठेके वाले ग्राहकों को खूब ऑफर दे रहे हैं. Video नोएडा का है.#Noida pic.twitter.com/lXZqadqzCd— NDTV India (@ndtvindia) March 25, 2025ఎన్డీటీవీ పేర్కొన్న కథనం ప్రకారం నోయిడా సెక్టార్ 18లోని ఒక మద్యం దుకాణం ముందు ‘ఒక బాటిల్ కొంటే ఒకటి ఉచితం’ అనే బోర్డు పెట్టగానే మద్యం ప్రియులు పరిగెత్తుకుంటూ ఆ దుకాణానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఏదో జాతర జరుగుతున్నలాంటి దృశ్యం కనిపించింది. కొందరు క్యూలో నిలుచుని మద్యం కోనుగోలుకు వేచిచూడగా, మరికొందరు ఇతరులతో గొడవపడుతూ, మద్యం కొనుగోలుకు ప్రయత్నించారు. అక్కడున్నవారికి మద్యం బాటిల్ దొరకగానే ఏదో జాక్పాట్ తగిలినట్లు ఆనందించారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ముజఫర్నగర్ జిల్లాలో మద్యం దుకాణాలలో భారీ ఆఫర్లు ప్రకటించడంతో ఆయా దుకాణాలకు మందుబాబులు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే భారీగా నిల్వవున్న మద్యం బాటిళ్లను ఖాళీ చేసేందుకే ఇక్కడి మద్యం దుకాణాలలో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ముజఫర్ నగర్లోని ఒక మద్యం దుకాణం వద్ద మద్యం కొనుగోలుకు వేచిచూస్తున్న రాహుల్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఒక బాటిల్ కొనుగోలుకు మరొక బాటిల్ ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పాడు.యూపీలోని మద్యం స్టాకును అమ్మేందుకు మార్చి 25 చివరి తేదీ. అయితే మద్యం కాంట్రాక్టర్లు(Liquor contractors) మరో ఐదు రోజుల గడువుకోరి, డిస్కౌంట్లు అందిస్తూ జోరుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇటీవల ఈ-లాటరీ ద్వారా కొత్తగా మద్యం దుకాణాలను కేటాయించారు. ఈ నేపధ్యంలో కొందరు మద్యం దుకాణాల నిర్వాహకులు ఈ-లాటరీలో దుకాణాలను దక్కించుకోలేకపోయారు. మరోవైపు మార్చి 31 నాటికి పాత దుకాణాల్లో స్టాక్ను పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా మద్యం దుకాణాల్లో తగ్గింపు ధరలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు

ఉదయం గర్ల్ఫ్రెండ్.. సాయంత్రం మరొకరు..
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువకుడు ఒకే రోజు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రియురాలి మెడలో ఉదయం తాళికట్టిన అతడు.. పెద్దలు కుదిర్చిన యువతితో సాయంత్రం ఏడడుగులు నడిచాడు. మోసపోయినట్లు తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.వివరాల ప్రకారం.. గోరఖ్పూర్ జిల్లా హర్పూర్ బుధాట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు నాలుగేళ్లుగా ఓ యువతితో సంబంధం నెరుపుతున్నాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చగా రెండుసార్లు అబార్షన్ చేయించాడు. ఒకసారి గుడిలో కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత గర్భం దాల్చడంతో డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. జన్మించిన బిడ్డను నర్సుకు అప్పగించాడు. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటే తన కుటుంబం కూడా ఒప్పుకుంటుందని నమ్మబలికాడు.ఈ క్రమంలో ఒక రోజు ఉదయం రిజిస్టర్ ఆఫీసుకు తీసుకెళ్లి, తాళి కట్టాడు. అదే రోజు రాత్రి పెద్దలు కుదిర్చిన విధంగా సంప్రదాయబద్ధంగా మరో యువతిని పెళ్లి చేసుకుంది. అనంతరం, విషయం తెలిసి అక్కడికి వెళ్లిన బాధితురాలిని అతడి కుటుంబీకులు దూషించి, వెళ్లగొట్టారు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి జితేంద్ర కుమార్ తెలిపారు.

ద్రవ్యబిల్లుతో భారీ పన్ను ఉపశమనం
న్యూఢిల్లీ: ఆర్థిక బిల్లు, 2025తో పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం లభించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ద్రవ్యబిల్లుపై మంగళవారం లోక్సభలో చర్చ సందర్భంగా ప్రభుత్వం తరఫున బదులిస్తూ నిర్మల సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘‘ నూతన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక బిల్లుతో పన్ను చెల్లింపుదారులకు భారీగా ఉపశమనం లభించనుంది. మరోవైపు వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లలో 13.14 శాతం వృద్ధి అంచనాలు రావడం సంతోషకరం. ఇది వ్యక్తిగత ఆదాయాల పెంపును ప్రతిబింబిస్తుంది. కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణతో వస్తూత్పత్తి కర్మాగారాలకు ఎంతో తోడ్పాటునందిస్తున్నాం.దేశీయ సరకులకు విలువ జోడింపు సాధ్యమవుతుంది. ఎగుమతులూ ఊపందుకుంటాయి. వాణిజ్యం పెరుగుతుంది. దీంతో సాధారణ ప్రజలకూ ప్రయోజనం చేకూరుతుంది’’ అని అన్నారు. 2025–26 ఆర్థికసంవత్సర బడ్జెట్లో వార్షిక ఆదాయపన్ను రిబేట్ పరిమితిని (కొత్త పన్ను విధానం) రూ. 7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచడం తెల్సిందే. ‘‘శాలరీ తరగతులకు సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్ను సైతం లెక్కలోకి తీసుకుంటే వాళ్లకు ఏటా రూ.12.75 లక్షల వరకు పన్ను రిబేట్ రూపంలో భారీ ఉపశమనం లభించనుంది.ఆదాయపన్ను రిబేట్ను పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్లమేర తగ్గనుంది. ఏటా రూ.12 లక్షలకు పైబడి ఆదాయం ఉన్న వారూ కొంతమేర ఉపశమనం పొందొచ్చు. ఇక ఇన్కమ్ట్యాక్స్కు సంబంధించి ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న మధ్యతరగతి వాళ్లను సముచితంగా గౌరవించేందుకే ప్రభుత్వం ఐటీ రిబేట్ను ఏకంగా ఒకేసారి రూ.12 లక్షలకు పెంచింది’’ అని నిర్మల అన్నారు.రూ.13.6 లక్షల కోట్ల ఆదాయం‘‘2025–26 ఆర్థికంలో వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లు రూ.13.6 లక్షల కోట్లకు చేరుకునే వీలుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన అంచనాలు రూ.12.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక ఆన్లైన్ ప్రకటనలకు సంబంధించి ఇప్పుడు వసూలు చేస్తున్న 6 శాతం ఈక్వలైజేషన్ లెవీ లేదా డిజిటల్ పన్నును రద్దుచేయాలనుకుంటున్నాం’’ అని నిర్మల చెప్పారు. దీని కారణంగా గూగుల్, మెటా, ‘ఎక్స్’ వంటి సంస్థలు లబ్ధిపొందే వీలుంది. ‘‘ పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే 7 శాతం కస్టమ్స్ సుంకాలను తొలగిస్తాం. 21 రకాల టారిఫ్ రేట్లు ఉండగా వాటిని ఎనిమిదికి తెచ్చాం. అందులో ‘సున్నా’ టారిఫ్ విభాగం కూడా ఉంది. ముడిసరుకులపై దిగుమతి సుంకాలు తగ్గించిన కారణంగా ఉత్పత్తి వ్యయాలు తగ్గి ఇకపై భారత్ నుంచి ఎగుమతులు ఊపందుకోనున్నాయి’’ అని మంత్రి అన్నారు.వర్షాకాల సమావేశంలో కొత్త ఆదాయపన్ను బిల్లు‘‘వర్షాకాల సమావేశంలో కొత్త ఆదాయ పన్ను బిల్లుపై చర్చిస్తాం. ఈ బిల్లును ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టాం. ప్రస్తుతం ఈ బిల్లును సెలక్ట్ కమిటీ పరిశీలిస్తోంది. సెలక్ట్ కమిటీ అధ్యయనం తర్వాత తుది నివేదికను పార్లమెంట్ తదుపరి సెషన్ తొలి రోజునే సమర్పించాల్సి ఉంది. అందుకే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చిస్తాం’’ అని నిర్మల అన్నారు. సాధారణంగా జూలై నుంచి ఆగస్ట్ దాకా వర్షాకాల సమావేశాలుంటాయి.35 సవరణలతో ఆర్థిక బిల్లుకు లోక్సభలో ఆమోదంపన్ను అధికారులు సెర్చ్ కేసుల్లో బ్లాక్ అసెస్మెంట్ కోసం అసెసీ మొత్తం ఆదాయం కాకుండా కేవలం బయటకు వెల్లడించని ఆదాయాన్నే గుర్తించేందుకు వీలుగా ఆర్థిక బిల్లు, 2025లో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ సవరణలకు మంగళవారం లోక్సభ ఆమోదం తెలిపింది. దీంతో 2024 సెప్టెంబర్ 1, ఆ తర్వాత కాలానికి ఇది వర్తించనుంది. సెర్చ్ కేసుల్లో మొత్తం ఆదాయం స్థానంలో వెల్లడించని ఆదాయం అన్న క్లాజును ప్రభుత్వం చేర్చింది. దీంతో సహా మొత్తం 35 సవరణలతో కూడిన ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించింది. మొత్తంగా రూ.50.65 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నూతన ఆర్థిక సంవత్సర బడ్జెట్ను మోదీ సర్కార్ రూపొందించడం తెల్సిందే.

‘జమిలి’ జేపీసీ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏకకాలంలో పార్లమెంట్ దిగువ సభ, రాష్ట్రాల్లో శాసనసభకు ఎన్నికలు నిర్వహించడానికి ఉద్దేశించిన లోక్సభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులపై అధ్యయనానికి ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) గడువును లోక్సభ మంగళవారం పొడిగించింది. ఈ కమిటీ కాల పరిమితిని పెంచేందుకు లోక్సభ తన అంగీకారం తెలిపింది. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, జేపీసీ ఛైర్మన్ అయిన పీపీ చౌదరి ప్రతిపాదించిన సంబంధిత తీర్మానానికి లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేసింది. వర్షాకాల సమావేశాల చివరివారంలో తొలి రోజు వరకు కాలపరిమితిని పొడిగించింది. ఏకకాల ఎన్నికల నిర్వహణకు తీసుకొచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం గతంలో లోక్సభలో ప్రవేశపెట్టింది.అయితే ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూప, స్వభావాలను మార్చేలా ఉందని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేయడంతో కేంద్రప్రభుత్వం ఆ బిల్లును పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇందుకోసం కొత్తగా 39 మంది ఎంపీలతో కమిటీని ఏర్పాటుచేయడం తెల్సిందే. లోక్సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులతో కమిటీ కొలువుతీరింది. అయితే రాజ్యసభ నుంచి కొత్త వ్యక్తి జేపీలో సభ్యునిగా ఉంటారని లోక్సభ ప్రధాన కార్యదర్శి మంగళవారం ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో జేపీసీలో ఒక ఖాళీ ఏర్పడింది. వాస్తవానికి ఈ కమిటీ కాలపరిమితి ఈ సెషన్ చివరి వారం తొలిరోజుతో ముగుస్తుంది. అంటే ఏప్రిల్ నాలుగోతేదీతో ముగియనుంది. అయినప్పటికీ ఈ బిల్లుకు సంబంధించిన పని ఇంకా పూర్తికాలేదని, అందుకే కాలపరిమితి పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అధికార వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ అంశంపై ఇప్పటికే పలువురు న్యాయనిపుణులతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించింది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వర్గాలతో ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రంజన్ గొగోయ్, సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా జేపీసీ కమిటీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
NRI

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్పర్సన్గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

లండన్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

నిందితుడిపై అస్పష్టత!
సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచార యత్నం కేసులో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసు బృందాల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మార్గంలోని 12 ఎంఎంటీఎస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు చెబుతున్న వివరాల్లో స్పష్టత లేకపోవడంతో నిందితుడిని గుర్తించడం పోలీసులకు కష్టసాధ్యమవుతోంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితురాలికి పలువురు పాతనేరస్తుల ఫొటోలు చూపించారు. ఇందులో ఒక పాత నేరస్తుడి ఫొటోతో నిందితుడికి పోలికలు ఉన్నట్టు చెప్పింది. అదుపులో అనుమానితుడు: బాధితురాలు చెప్పిన పోలికలు ఉన్న అనుమానితుడు మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన జంగం మహేశ్గా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతనేరస్తుడు అయిన ఏడాది క్రితమే మహేశ్ను భార్య వదిలేయడంతో, మాదక ద్రవ్యాల వినియోగానికి బానిసయ్యాడు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి ముందుకు మహేశ్ను తీసుకెళ్లారు. నేరుగా అనుమానితుడిని చూశాక, నిందితుడు అతను కాదని ఆమె చెప్పినట్టు సమాచారం. అయినా, మహేశ్తోపాటు మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. అల్వాల్ స్టేషన్ నుంచి నిందితుడు: అన్ని స్టేషన్లలో పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు...నిందితుడు అల్వా ల్ రైల్వేస్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ రైలు ఎక్కినట్టు «నిర్ధారించుకున్నారు. కానీ ఎక్కడ దిగిపోయాడన్న విషయంలో స్ప ష్టత రావడం లేదు. ఆర్పీఎఫ్, జీఆర్పీతోపాటు పలు విభాగాలకు చెందిన సిటీ పోలీసులు నిందితుడిని గుర్తించడానికి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.మేడ్చల్–గుండ్లపోచంపల్లి వరకు ఉన్న అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్ల వరకు దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన కొనసాగుతోంది. ఎంఎంటీఎస్లలో సీసీ కెమెరాలు లేకపోయినా, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

టెన్త్ తెలుగు పేపర్ లీకేజీలో 13 మంది పాత్ర
నకిరేకల్: పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 13 మంది పాత్ర ఉందని, అందులో 11 మందిని అదుపులోకి తీసుకున్నట్టు నల్ల గొండ డీఎస్పీ శివరాంరెడ్డి చెప్పారు. మంగళవారం డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నకిరేకల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కేంద్రంలో ఈ నెల 21న పదోతరగతి తెలుగు పరీ క్ష ప్రారంభమైన అరగంట తర్వాత ప్రశ్నపత్రం వాట్సాప్లో చక్కర్లు కొడుతూ డీఈఓకు చేరింది. వెంటనే ఆయన ఎంఈవో నాగయ్యకు ఫోన్ చేయగా, నకిరేకల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరిలో 11 మందిని స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. ఆ రోజు(21న) ప్లాన్ ప్రకా రం ఏ–1 చిట్ల ఆకాశ్, ఏ–3 చిట్ల శివ, ఒక బాలుడు కలిసి గురుకుల పాఠశాల వద్దకు స్కూటీపై వెళ్లారు. గేట్ వద్ద అప్పటికే పోలీసులు ఉండటంతో లోప లకు వెళ్లడానికి వారికి వీలు కాలేదు. దీంతో ఆ ముగ్గురు వెనుక వైపునకు వెళ్లారు. అక్కడ ఏ–11 రాహుల్ ఉన్నాడు. బాలుడు పరీక్ష కేంద్రం ఒకటో అంతస్తులోని రూమ్ నంబరు 8 వద్దకు చేరుకున్నా డు. ఆ గదిలో పరీక్ష రాస్తున్న తనకు పరిచయ మున్న విద్యార్థిని ఉండటంతో ప్రశ్నపత్రం చూపించమని సైగ చేయగా, అతని వెనకాల మరో ఇద్దరు కూడా అక్కడకు చేరుకున్నారు. అయితే రాహుల్తో ఉన్న పరిచయం మేరకు ఆ విద్యార్థిని వెంటనే ఆ బాలుడికి ప్రశ్నపత్రం చూపించింది. ఆ బాలుడు తన ఫోన్లో ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని కిందకు దిగాడు. ఆ బాలుడు తీసిన ఆ ఫొటో పేపర్ను మిగతా నిందితులు ఒకరి నుంచి ఒకరికి పంపుకున్నారు. ఆ పేపర్లో ఉన్న ప్రశ్నలకు.. ఏ–4 అయిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు గుడుగుంట్ల శంకర్ సమాధానాలు తయారు చేయగా, వాటిని రవిశంకర్ జెరాక్స్ షాప్లో జెరాక్స్ తీసుకున్నారు. నిందితులు సమాధాన పత్రాలను వారికి తెలిసిన వారికి ఇవ్వడానికి పరీక్ష కేంద్రానికి వెళ్లగా, అక్కడ పోలీసులను చూసి దొరికి పోతామేమోనని వెళ్లిపోయారు. ఈ కేసుపై పోలీసులు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, పేపర్ లీకేజీ వ్యవహారాన్ని బయటపెట్టారని డీఎస్పీ శివరాంరెడ్డి వివరించారు. బంధువుల పిల్లల కోసం... నకిరేకల్కు చెందిన చిట్ల ఆకాశ్, చిట్ల శివ, గుడుగుంట్ల శంకర్, బి.రవిశంకర్, బండి శ్రీనుతో పాటు ఓ బాలుడిని ఈ నెల 23న రిమాండ్కు పంపామని డీఎస్పీ చెప్పారు. పోగుల శ్రీరాములు, తలారి అఖిల్కుమార్, ముత్యాల వంశీ, పల్స అనిల్కుమార్, పల్ల మనోహర్ను విచారిస్తున్నామన్నారు. రాహుల్తోపాటు మరోబాలుడు పరారీలో ఉన్నారని చెప్పారు. తమ బంధువుల పిల్లలు పదోతరగతిలో ఎక్కువ మార్కులు సాధించాలని కొంతమంది ఆకతాయిలు ఇదంతా చేశారన్నారు.కూతురి పరీక్ష.. తల్లిదండ్రులే ఇన్విజిలేటర్లుకోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయ దంపతులు ఇన్విజిలేషన్ నిర్వహిస్తున్న కేంద్రంలోనే.. వారి కూతురు పరీక్ష రాయటం వివాదాస్పదంగా మారింది. తాము ఇన్విజిలేషన్ నిర్వహించే పరీక్ష కేంద్రాల్లో సంతానం పరీక్ష రాయటం లేదని.. ఉపాధ్యాయులు పరీక్షలకు ముందే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.అలాంటి డిక్లరేషన్ ఇచ్చి కూడా.. తమ కూతురు పరీక్ష రాసే కేంద్రంలోనే ఉపాధ్యాయ దంపతులు ఇన్విజిలేషన్ చేశారు. దీనిపై ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం తెలపడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇది ఉన్నతాధికారులతోపాటు కలెక్టర్ దృష్టికి కూడా వెళ్లడంతో.. ఉపాధ్యాయ దంపతులను పిలిపించి మాట్లాడినట్లు సమాచారం.

మరదలి చేయి పట్టుకున్న బావపై కేసు..!
హైదరాబాద్: మహిళను వేధిస్తున్న ఆమె బావపై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ హరీష్ తెలిపిన మేరకు.. బోరబండ ప్రాంతానికి చెందిన మహిళ (31) జీహెచ్ఎంసీలో ఉద్యోగం చేస్తోంది. 2020లో ఆమెకు వివాహం కాగా ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. భర్త, అత్తా మామలు, బావ సంజీవ్కుమార్ (39)కుటుంబంతో కలిసి ఉమ్మడిగా ఉంటున్నారు. కొంతకాలంగా సదరు మహిళను బావ సంజీవ్కుమార్ వేధించడం మొదలుపెట్టాడు. ఈ నెల 22వ తేదీన బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా వచ్చి చేయి పట్టుకున్నాడు. దీంతో బాధితురాలు పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రుల సహకారంతో సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు సంజీవ్కుమార్పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఖాకీచకుడు.. కాటేయజూస్తున్నాడు
ఒంగోలు టౌన్: భర్త మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతూ తనను పట్టించుకోవడం లేదని న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం ఓ మహిళ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. ఒంగోలు నగరం కమ్మపాలేనికి చెందిన జి.హర్ష వర్థిని జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన నవీన్తో 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నవీన్ భార్యాబిడ్డలను పట్టించుకోవడం మానేశాడు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అయితే అక్కడి కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట హర్షవర్థిని తన పిల్లలతో సహా బైఠాయించింది. టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావుతోపాటు మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా మొండికేయడంతో కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. జనాలు గుమిగూడడంతో ట్రాఫిక్ స్తంభించింది. కలెక్టర్ను కలిసి సమస్య తెలియజేయాలని సీఐ సూచించగా.. అక్కడకు వెళ్లినా పోలీసుల దగ్గరకే పంపిస్తారని, తనకు న్యాయం జరగదని పేర్కొనడం గమనార్హం. న్యాయం జరిగేలా చూస్తామని సీఐ చాలా సేపు బతిమాలడంతో ఎట్టకేలకు ఆమె ఆందోళన విరమించింది.
వీడియోలు


Sailajanath: మీరు చేసిన ప్రమాణాలు గుర్తుచేసుకోండి..


CBI SP రామ్ సింగ్ చెప్పినట్లు సహకరించాలని సునీత దంపతులు బెదిరించారు


పాస్టర్ ప్రవీణ్ పగడాల ఘటనపై కేఏ పాల్ రియాక్షన్


ఉద్యోగాలు లేక, భృతి ఇవ్వక నిరుద్యోగులు నిండా మునిగారా ?


Vijayawada: వైఎస్ జగన్ ఇఫ్తార్ విందు


పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర విచారం


ఇండియన్స్కు ట్రంప్ వార్నింగ్!


మా ఇంటి గోడ దూకి వచ్చి నన్ను కొట్టి అసలు నిజాలు బయటపెట్టిన ప్రేమ్ కుమార్


Bhumana Karunakar Reddy: టీడీపీ పాలనలో తిరుమలకి మరొక ఘోర అపచారం


అన్ని ముస్లిం సంఘాలు ఇఫ్తార్ విందును బహిష్కరించాలి