Top Stories
ప్రధాన వార్తలు

తెలంగాణ బడ్జెట్ మూడు లక్షల కోట్లు: భట్టి
Telangana Budget Live Updates..👉తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. తెలంగాణ బడ్జెట్ రూ.3.4లక్షల కోట్లు2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లు.రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు.మూలధన వ్యయం రూ.36,504 కోట్లు. బడ్జెట్ కేటాయింపులు..పౌరసరఫరాల శాఖ- 5734 కోట్లువిద్య - 23,108కోట్లుపంచాయతీ &రూరల్ డెవలప్మెంట్ -31605 కోట్లురైతు భరోసా- 18,000 కోట్లు.వ్యవసాయ రంగానికి -24,439 కోట్ల రూపాయలుపశుసంవర్ధక శాఖకు -1,674 కోట్లు.పౌరసరఫరాల శాఖకు -5,734 కోట్లు.మహిళా, శిశు సంక్షేమం -2,862 కోట్లుఎస్సీ అభివృద్ధి -40,232 కోట్లుఎస్టీ అభివృద్ధి-17,169 కోట్లుబీసీ అభివృద్ధి-11,405కోట్లుచేనేత రంగానికి-371మైనారిటీ-3,591కోట్లువిద్యాశాఖకు-23,108 కోట్లుకార్మిక ఉపాధి కల్పన-900 కోట్లుపంచాయతీరాజ్ శాఖకు-31,605 కోట్లుమహిళా శిశు సంక్షేమశాఖ-2,862 కోట్లు.షెడ్యూల్ కులాలు-40,232 కోట్లుషెడ్యూల్ తెగలు-17,169 కోట్లు.వెనుకబడిన తరగతుల సంక్షేమానికి-11,405 కోట్లు.ఐటీ శాఖకు-774 కోట్లువిద్యుత్ శాఖకు-21,221 కోట్లుమున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు-17,677 కోట్లునీటి పారుదల శాఖకు-23,373 కోట్లురోడ్డు భవనాలు శాఖకు-5907 కోట్లుపర్యాటక శాఖకు-775 కోట్లుక్రీడా శాఖకు-465 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు-1023 కోట్లుదేవాదాయ శాఖకు-190 కోట్లుహోంశాఖకు- 10,188 కోట్లుమహాలక్ష్మి పథకానికి రూ.4305 కోట్లుగృహజోత్యి పథకానికి రూ.2080 కోట్లు.సన్న బియ్యం బోనస్కు రూ.1800 కోట్లు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1143 కోట్లు. బడ్జెట్ పూర్తి కాపీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..భట్టి ప్రసంగం..అంబేద్కర్ స్పూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.తెలంగాణ తాత్కాలిక, దీర్థకాలిక ప్రయోజనాలే ముఖ్యం. మాపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారు.అబద్ధపు వార్తలతో ప్రజలు మోసం చేస్తున్నారు. అబద్దపు విమర్శలను తిప్పి కొడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత.అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు మా నినాదం.తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో సీఎం పాలనను ముందుకు నడిపిస్తున్నారు.నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిణామం 200 బిలియన్ డాలర్లు. రాబోయే ఐదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్లు ఉండేలా కార్యాచరణ. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి రూ.11,600కోట్లు.58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.AI సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసన్న వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్..40 లక్షల ఎకరాల్లో సన్న వడ్లసాగు విస్తరణ.ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంపు.ఆయిల్ ఫామ్ సాగుకు టన్నుకు 2000 అదనపు సబ్సిడీ.వడ్ల బోనస్ కింద రైతులకు 1,206 కోట్లు చెల్లింపు.తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింపు.57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రం పునరుద్ధరణ.రాజీవ్ యువ వికాస పథకానికి రూ.6000 కోట్లు.బీఎఫ్ఎస్ఐ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులుప్రతీ నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు.స్కూల్స్లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్తో పాటు ఉచిత వసతులు.గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంపు.విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ పథకం.కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్య శ్రీలో చేరిక.. 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్య శ్రీ లబ్ధి..ఆరోగ్య శ్రీ ప్యాకేజీల ఖర్చు 20 శాతం పెంపు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని తెలంగాణ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధుని సాధిస్తుంది.24-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 16,12,579 కోట్లు.గత ఏడాదితో పోల్చితే వృద్ధి రేటు 10.1శాతంగా నమోదైంది. బడ్జెట్ ప్రసంగం చదువుతున్న భట్టి విక్రమార్క. ఆర్థిక మంత్రిగా భట్టి మూడోసారి బడ్జెట్ ప్రసంగం..👉బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ నేతల నినాదాలు.. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు.. 👉బడ్జెట్ ప్రతులను స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేసిన భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు.అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన..అసెంబ్లీ మీడియా పాయింట్ కేటీఆర్ కామెంట్స్..ఎండిన పంటలు, రైతులకు సంఘీభావంగా నిరసన చేస్తున్నాం.11 నెలలుగా మేము ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నాం.వర్షాలు సమృద్ధిగా పడ్డాయి.. రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదు.ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉన్నా రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు.తెలంగాణలో నాలుగు వందలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇసుక దోపిడి చేస్తున్నారు.కేసీఆర్ పాలనలో 36శాతం కృష్ణా జలాలను వాడుకొని రైతులకు నీళ్లు ఇచ్చాం.కాంగ్రెస్ పాలనలో కిందికి నీళ్లు వదిలి.. పంటలు ఎండబెట్టారు.కాలం తెచ్చిన కరువు కాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు.రేవంత్ రెడ్డి ముందు చూపులేని ప్రభుత్వం వల్ల పంటలు ఎండుతున్నాయి.రేవంత్ రెడ్డి గుడ్డి చూపు, చేతగాని, తెలివితక్కువ తనం వల్ల రైతులకు సమస్యలు.ఎండిన పంటలకు ఎకరానికి 25వేల పంట నష్టం ఈ బడ్జెట్ లో కేటాయించాలిపంటలు ఎండిపోవడానికి చెక్ డ్యామ్ లు, చెరువులు నిలపకపోవడం వల్లే నష్టం జరిగింది.త్వరలో ఎండిన పంటలు ఉన్న ప్రాంతాల్లో పర్యటన చేస్తాం👉తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం కేబినెట్ భేటీ.. అసెంబ్లీ హాల్లో బడ్జెట్ మీద కేబినెట్ భేటీబడ్జెట్కు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి11.14కు తెలంగాణ బడ్జెట్శాసన సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టిమండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కఘనస్వాగతం పలికిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, శాసనసభ సెక్రటరీ నరసింహచార్యులు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు. ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన భట్టి విక్రమార్క.అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్న కేబినెట్ సమావేశానికి హాజరు కానున్న భట్టి. 👉నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.👉వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) గాను రూ.3.05 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించనున్నట్టు తెలిసింది.👉2024–25లో ప్రతిపాదించిన రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్కు ఇది సుమారు 5 శాతం అదనం.👉ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. అనంతరం 11:14 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. శాసనమండలిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.గ్యారంటీలకు తోడుగా! 👉తాజా బడ్జెట్లో ఎప్పటిలాగే వ్యవసాయం, వైద్యం, సాగునీరు, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల పద్దులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలుతోపాటు అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రతిపాదనలు ఉంటాయని పేర్కొంటున్నాయి.👉ఆరు గ్యారంటీల్లో ఒకటైన సామాజిక పింఛన్ల పెంపు ద్వారా ఏటా రూ.3,500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, ఈ మేరకు పింఛన్ల బడ్జెట్ పెంచుతారని సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాల కొనసాగింపునకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నారు.👉రైతు భరోసాకు రూ.18వేల కోట్లు, పంటల బీమా ప్రీమియం కోసం రూ. 5 వేల కోట్లను ప్రతిపాదించే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ పథకాలకు సంబంధించి రాష్ట్రం భరించాల్సిన మొత్తాన్ని కూడా బడ్జెట్లో చూపించనున్నారు.👉గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 36వేల కోట్ల వరకు ప్రతిపాదించగా.. ఈసారి దీన్ని రూ.65 వేల కోట్లవరకు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.రూ.లక్ష కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల దాకా..! 👉తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 12 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో 2014–15 సంవత్సరానికి గాను 10 నెలల కాలానికి బడ్జెట్ పెట్టగా.. 2024–25లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్తో పాటు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2014–15లో నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర తొలి బడ్జెట్ను రూ.లక్ష కోట్లతో ప్రవేశపెట్టారు. తర్వాతి నాలుగేళ్లలో బడ్జెట్ పరిమాణం రూ.1.75 లక్షల కోట్ల వరకు చేరింది.👉2019–20లో కరోనా ప్రభావంతో బడ్జెట్ను తగ్గించి రూ.1.46లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. తర్వాతి రెండేళ్లలోనే ఏకంగా రూ.85 వేల కోట్ల మేర బడ్జెట్ పెరిగి రూ.2.30లక్షల కోట్లకు చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2.90లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్ 2024–25లో రూ.2.91లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ (2024–25) బడ్జెట్లో అంచనా వ్యయాన్ని రూ. 2.75 లక్షల కోట్లుగానే ప్రతిపాదించడం గమనార్హం.

BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
ఆటగాళ్ల కుటుంబ సభ్యులను విదేశీ పర్యటనలకు అనుమతించే విషయంలో తమ నిర్ణయం మారదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పష్టం చేసింది. జట్టుతో పాటు బోర్డుకు కూడా ఇదే మంచిదని పేర్కొంది. ఈ విషయంలో ఆటగాళ్లకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని.. అయితే, తాము జట్టు ప్రయోజనాల కోసం కఠినంగా వ్యవహరించక తప్పదని తెలిపింది.ఈ మేరకు బోర్డు తరఫున.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) తమ స్పందన తెలియజేశారు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్ గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. 3-1తో ఓడి ఇంటిబాటపట్టింది.ఈ పరాభవం తర్వాత.. విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై బీసీసీఐ కఠిన నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నలభై ఐదు రోజుల్లోపు విదేశీ పర్యటనలో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కుటుంబ సభ్యులను వారం రోజులు మాత్రమే అనుమతిస్తారు.విరాట్ కోహ్లి ఘాటు విమర్శలుఅంతకు మించి పర్యటన కొనసాగితే రెండు వారాల పాటు సన్నిహితులకు అక్కడే ఉండే వెసలుబాటు ఉంటుంది. అయితే, ఈ విషయంలో టీమిండియా సూపర్స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్నిహితులే సగం బలమని.. ఆటగాడి విజయం వెనుక కుటుంబ సభ్యుల పాత్రను అందరికీ వివరించలేమని పేర్కొన్నాడు.మైదానంలో దిగని వాళ్లు, అక్కడ ఏం జరుగుతుందో తెలియని వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిరాశ కలిగించిందని కోహ్లి ఘాటుగా విమర్శించాడు. ప్రతి ఆటగాడు తన కుటుంబ సభ్యులు వెంట ఉంటే మరింత బాధ్యతగా ఆడతారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ విషయంలో యూటర్న్ తీసుకోనుందనే వార్తలు వచ్చాయి.బీసీసీఐకి, దేశానికి ఇదే మంచిదిఅయితే, అలాంటిదేమీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా కొట్టిపడేశారు. ‘‘మేము ప్రవేశపెట్టిన నిబంధనలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు చేయడం లేదు. బీసీసీఐకి, వ్యవస్థకి, జట్టుకు, దేశానికి ఇదే మంచిది.ఈ అంశంలో ఆటగాళ్ల నుంచి భిన్నాభిప్రాయాలు, మిశ్రమ స్పందన వస్తుందని తెలుసు. ఇక్కడంతా ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి.. ఎవరైనా తమ గొంతును వినిపించవచ్చు. తమ భావాలను నిర్భయంగా పంచుకోవచ్చు.అయితే, ఈ నిబంధన విషయంలో అందరు ఆటగాళ్లూ సమానమే. జట్టులోని ప్రతి సభ్యుడు, కోచ్లు, మేనేజర్లు, సహాయక సిబ్బంది.. ఇలా అందరికీ రూల్స్ వర్తిస్తాయి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం.రాత్రికి రాత్రే హడావుడిగా ఈ విధానాన్ని మేము ప్రవేశపెట్టలేదు. దశాబ్దాలుగా జరుగుతున్న విషయాలను పరిగణనలోకి తీసుకుని మా అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఈ పాలసీ తీసుకువచ్చారు. నిజానికి గతంతో పోలిస్తే విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై మేము ఆటగాళ్లకు చాలా వరకు మినహాయింపులు ఇచ్చాం. అయితే, ఇప్పుడు ఈ రూల్ కాస్త కఠినంగా అనిపించినా.. తప్పక అమలు చేస్తాం’’ అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్

సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?
సునీతా విలియమ్స్కు స్పేస్ సెంటరే కుటుంబం అంటారు ఆమె ఫ్యామిలీ మెంబర్స్. ఆమెకు ఏది ఇష్టమో తమకు అదే ఇష్టం అని చెబుతారు. తండ్రి దీపక్ పాండ్యా, తల్లి ఉర్సులిన్ బోనీ పాండ్యా (Ursuline Bonnie Zalokar) వారి ముగ్గురు సంతానంలో సునీత చిన్నది. అన్నయ్య జె.థామస్తో పాటు అక్క దీనా ఆనంద్ ఉన్నారు. అమెరికాలోనే జన్మించిన సునీత చదువు అంతా అక్కడే సాగింది. చదువు పూర్తయ్యాక తండ్రి దీపక్ పాండ్యా (Deepak Pandya) సూచనలతో అమెరికన్ నేవీలో జాయిన్ అయ్యారు.నేవీలో పనిచేస్తున్న సమయంలోనే మైఖేల్ జె.విలియమ్స్ (Michael J. Williams)తో పరిచయం స్నేహంగా మారింది. వివాహ బంధంతో ఒక్కటై 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. టెక్సాస్లోని హ్యూస్టన్ శివారులో నివసిస్తున్నారు. ఈ జంటకు పిల్లలు లేరు. ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలని ఉందని చెప్పే సునీతకు పెంపుడు కుక్క గార్బీ అంటే చాలా ఇష్టం. గార్బీతో ఉన్న ఫొటోలను సునీత తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 2006లో మొదటిసారి తనతో పాటు భగవద్గీతను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లింది. 2012లో ఓం సింబల్ తీసుకెళ్లినట్టు చెప్పిన సునీత గణేష్ విగ్రహాన్ని ఎప్పుడూ తనకు తోడుగా తీసుకెళుతుందట. సునీత విశ్వాసాలకు విలియమ్స్ మద్దతు ఇస్తాడు. తల్లి బోనీ పాండ్యా కూతురి గురించి వివరిస్తూ.. ‘ఆమె సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటంపై మాకు ఎలాంటి ఆందోళన లేదు. విధి నిర్వహణలో భాగంగా కష్టపడి పనిచేస్తుంది. కూతురి నుండి చాలా కాలం దూరంగా ఉండటం మొదట్లో కష్టమయ్యేది. కానీ, ఇప్పుడు అది అలవాటయ్యింది. తను తనకు ఇష్టమైనది చేస్తోంది. అలాంటప్పుడు నేను బాధపడటం అంటూ ఉండదు. తన ప్రయత్నాల్లో తను ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను ప్రత్యేకించి ఆమెకు ఎటువంటి సలహాలు ఇవ్వను. ఎందుకంటే, ఏం చేయాలో తనకే బాగా తెలుసు. అంతా సవ్యంగానే జరుగుతుంది’ అని ధీమాను వ్యక్తం చేస్తారు ఆమె తల్లి బోనీ పాండ్యా.బాల్యం నుంచి ధైర్యం ఎక్కువసునీతా విలియమ్స్ (Sunita Williams) తిరిగి భూమి పైకి వస్తున్న వార్త గురించి యావత్ ప్రపంచం స్పందన ఒకటే... ‘చాలా సంతోషంగా ఉంది’ అయితే ఇండియాలోని ఆమె కజిన్ మాత్రం ‘భయంగా ఉంది’ అంటున్నాడు. ‘వీలైనంత త్వరగా ఆమె భూమి మీదికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకో నాకు భయంగా ఉంది. ఆమె చక్కని ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అంటున్నాడు దినేష్ రావత్.సుదీర్ఘమైన ప్రయాణం తరువాత భూమికి తిరిగి వస్తున్న సునీతా విలియమ్స్ ఆ తర్వాత విపరీతమైన శారీరక మార్పులను ఎదుర్కొనే అవకాశం ఉందనే ఆందోళన నేపథ్యంలో ఆయన ‘భయం’ అనే మాట వాడాడు. సునీతా విలియమ్స్ బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘సునీత చిన్నప్పుడు మా దగ్గరికి వచ్చింది. నేను ఆమెను ఒంటె సవారీలకు తీసుకువెళ్లేవాడిని. సవారీ అయిపోయిన తరువాత కూడా దిగేది కాదు! సోమనాథ్ తీర్థయాత్రలతో పాటు దేశంలోని వివిధప్రాంతాలకు వెళ్లాం. సునీతకు చిన్నప్పటి నుంచి ధైర్యం ఎక్కువ. ఆమె తరచుగా నా చెయ్యి పట్టుకునేది. ఎందుకు ఇలా? అని అడిగితే నాన్నలా అనిపిస్తావు అని చెప్పింది’ అంటూ ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లాడు దినేష్ రావత్.మా తరానికి స్ఫూర్తిప్రదాతనేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి సునీతా విలియమ్స్ గురించి చదువుతూ పెరిగాను. సైంటిస్ట్ (Scientist) కావాలనుకునే మహిళల సంఖ్య తక్కువగా ఉన్న రోజుల్లో కల్పనాచావ్లా భారతీయ మహిళల్లో కొత్త ఆలోచన రేకెత్తించారు. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చేసిన పరిశోధనలు స్ఫూర్తినిచ్చాయి. మనదేశంలో అంతరిక్షం, పరిశోధన రంగాలను కెరీర్ ఆప్షన్స్గా ఎంచుకునే యంగ్ జనరేషన్ తయారైంది. మా తరం అలా తయారైనదే.సైంటిస్ట్గా సునీతా విలియమ్స్ ఒక రోల్మోడల్. అకుంఠిత దీక్ష, అంకితభావంతో పని చేయడం, అంతరిక్ష పరిశోధనల ద్వారా కొత్త విషయాలను ఎక్స్ప్లోర్ చేయడంలో ఆమెకున్న ఆసక్తి, వాటిని ఛేదించడానికి చూపించే చొరవ అమోఘం. స్టెమ్ ఫీల్డ్లో భవిష్యత్తు తరాలు ఆమె అడుగుజాడల్లో నడుస్తాయి. మగవాళ్ల ఆధిపత్యం కొనసాగుతున్న రంగంలో మహిళ కూడా విజయవంతంగా రాణించగలరని సునీతా విలియమ్స్ తన పరిశోధనల ద్వారా నిరూపించారు. – శరణ్య. కె. సైంటిస్ట్, బయోటెక్నాలజీ

నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వం యూటర్న్
సాక్షి,గుంటూరు: నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. శాసనమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు నిరుద్యోగభృతి గురించి ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇస్తున్నారని అడిగారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ప్రశ్నలకు మంత్రి రాంప్రసాద్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో రాంప్రాసద్ తీరుపై ఎమ్మెల్సీ మాధవరావు మండిపడ్డారు. గతంలోనూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 2014-2019లో ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ధ్వజమెత్తారు.ఇప్పుడు మరోసారి నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చి మరో మారు మాట తప్పిందని దుయ్యబట్టారు.

ఎల్పీయూ బీటెక్ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ప్లేస్మెంట్
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. యూనివర్సిటీ విద్యార్థుల్లో ఇద్దరు ప్రతిష్ఠాత్మకంగా కోట్ల రూపాయాల వేతన మార్కును అధిగమించి ఉద్యోగాలు సాధించారు. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.2.5 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకుని రికార్డులను బద్దలు కొట్టారు. ఈ విజయం భారతదేశంలో గ్రాడ్యుయేట్ విద్యార్థికి అత్యధిక ప్యాకేజీని సూచిస్తుంది. ఇది భారత్లోని ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీల్లో ఉన్న రికార్డులను అధిగమించింది. దాంతో టాప్ టైర్ రిక్రూట్మెంట్లో లీడర్గా ఎల్పీయూ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.1.03 కోట్లు (1,18,000 డాలర్లు) ప్యాకేజీ పొందిన ఈసీఈ ఫైనల్ ఇయర్ విద్యార్థి బేతిరెడ్డి నాగవంశీరెడ్డి మరో ఘనత సాధించారు. మొత్తంగా 1,700 మందికి పైగా ఎల్పీయూ విద్యార్థులకు టాప్ ఎంఎన్సీల నుంచి ఆఫర్లు వచ్చాయి. విదార్థులకు రూ .10 ఎల్పీఏ నుంచి రూ.2.5 కోట్ల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. వందలాది మంది ఎల్పీయూ విద్యార్థులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని ప్రఖ్యాత సంస్థల్లో పనిచేస్తూ రూ.కోటికి పైగా ప్యాకేజీలు పొందుతున్నారు. మరో ఎల్పీయూ గ్రాడ్యుయేట్కు ఐటీ కంపెనీలో రూ.3 కోట్ల ప్యాకేజీ లభించింది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేసే ఎల్పీయూ సామర్థ్యం యొక్క బలం, ప్రపంచవ్యాప్త పరిధికి ఇది ఉదాహరణ. పాలో ఆల్టో నెట్వర్క్స్, న్యూటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక బహుళజాతి కంపెనీల్లో ప్లేస్మెంట్లు పొందిన వివిధ బీటెక్ విద్యార్థులకు మొత్తం 7,361 ఆఫర్లు అందాయి. వీటిలో టాప్ ఎంఎన్సీలు అందించే సగటు ప్యాకేజీ ఏటా రూ.16 లక్షలుగా నమోదైంది. ఇది జాబ్ మార్కెట్లో ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు అధిక డిమాండ్ను నొక్కిచెబుతోంది.గతంలోని ప్లేస్మెంట్ సీజన్ కూడా అంతే ఆకట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు ఆకర్షణీయమైన పరిహార ప్యాకేజీలను అందిస్తున్నాయి. అత్యధిక వేతనం చెల్లించే కంపెనీల్లో పాలోఆల్టో నెట్వర్క్స్ రూ.54.75 ఎల్పీఏతో అగ్రస్థానంలో నిలవగా, న్యూటానిక్స్ రూ.53 ఎల్పీఏ, మైక్రోసాఫ్ట్ రూ.52.20 ఎల్పీఏతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం 1,912 మల్టిపుల్ జాబ్ ఆఫర్లను అందిచగా, 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు, 18 మందికి ఐదుగురికి, ఏడుగురు విద్యార్థులకు ఆరు జాబ్ ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో బీటెక్ విద్యార్థి ఆదిరెడ్డి వాసు అద్భుతమైన ఏడు జాబ్ ఆఫర్లను సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.పైన పేర్కొన్న కంపెనీలతో పాటు అమెజాన్ (రూ.48.64 ఎల్పీఏ), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ.44.92 ఎల్పీఏ), సర్వీస్ నౌ (రూ.42.86 ఎల్పీఏ), సిస్కో (రూ.40.13 ఎల్పీఏ), పేపాల్ (రూ.34.4 ఎల్పీఏ), ఏపీఎన్ఏ (రూ.34 ఎల్పీఏ), కామ్వాల్ట్ (రూ.33.42 ఎల్పీఏ), స్కేలర్ (రూ.33.42 ఎల్పీఏ) వంటి టాప్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు అవకాశం కల్పించారు. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, అధునాతన సాంకేతితక నిపుణులకు ప్రాధాన్యమిచ్చారు.యాక్సెంచర్, క్యాప్ జెమినీ, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు అతిపెద్ద రిక్రూటర్లలో ఉండటంతో ఎల్పీయూ గ్రాడ్యుయేట్ల సాంకేతిక పరంగా అధిక డిమాండ్ ఏర్పడింది. క్యాప్ జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ పోస్టులకు 736 మంది విద్యార్థులను, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు మైండ్ ట్రీ 467 మంది విద్యార్థులను నియమించుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 418 మంది విద్యార్థులను జెన్సీ ఉద్యోగాలకు రిక్రూట్ చేసుకుంది. యాక్సెంచర్ (279 నియామకాలు), టీసీఎస్ (260 నియామకాలు), కేపీఐటీ టెక్నాలజీస్ (229 నియామకాలు), డీఎక్స్సీ టెక్నాలజీ (203 నియామకాలు), ఎంఫసిస్ (94 నియామకాలు)తోపాటు తదితర కంపెనీలు ఎల్పీయూ విదార్థులకు 279 కొలువులు అందించాయి.రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక ప్లేస్మెంట్ దక్కింది. పాలోఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్ గ్రూప్, న్యూటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి పరిశ్రమ దిగ్గజాలు ఈ విభాగాల నుండి భారీగా నియామకాలు చేస్తున్నాయి.పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ మాట్లాడుతూ..‘వేగంగా మారుతున్న ప్రపంచంలో విజయం సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయడానికి ఎల్పీయూ కట్టుబడి ఉంది. యూనివర్సిటీ ఆకట్టుకునే ప్లేస్మెంట్ విజయాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధిస్తున్నారు. స్థిరంగా కొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఎల్పీయూ విద్యాభ్యాసం వాస్తవ-ప్రపంచ పరిశ్రమ విధానాలతో మిళితం చేయడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. వృత్తి విజయాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే కాకుండా పరిశ్రమకు విలువను జోడించేందుకు, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి అవసరమయ్యే నైపుణ్యాలను అందించేలా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఎడ్యుకేషన్లో వచ్చే రివల్యూషన్ విద్యార్థుల భవిష్యత్తును రూపొందిస్తోంది. వారు అభివృద్ధి చెందడానికి, ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో అగ్రగామిగా నిలిచి మెరుగైన ప్లేస్మెంట్లు సాధించేందుకు ఎల్పీయూ అవకాశాలను సృష్టిస్తోంది’ అని తెలిపారు.2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్పీయూ నెస్ట్ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

చైతూతో ప్రేమకథ అలా మొదలైంది.. రివీల్ చేసిన శోభిత ధూళిపాల
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాలను పెళ్లాడారు. గతేడాది డిసెంబర్ వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్కు చెందిన పలువురు సినీతారలు హాజరయ్యారు.అయితే ఈ జంట పెళ్లి తర్వాత తొలిసారి ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ప్రముఖ మ్యాగజైన్ వోగ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తమ ప్రేమకథ తొలిసారి ఎక్కడ మొదలైందనే విషయాన్ని రివీల్ చేశారు. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు శోభిత స్పందించారు. మిమ్మల్ని చైతూ ఫాలో అవుతున్నాడు.. కానీ మీరెందుకు ఫాలో కావడం లేదని ఓ నెటిజన్ తనను అడిగాడని వెల్లడించింది. ఆ తర్వాత నేను చైతూ ప్రొఫైల్కి వెళ్లి చూస్తే నాతో పాటు కేవలం 70 మందిని మాత్రమే అతను ఫాలో అవుతున్నాడని తెలుసుకున్నా.. ఆ తర్వాత చైతన్యను ఫాలో అయ్యానని తెలిపింది.అప్పటి నుంచి మేమిద్దరం చాటింగ్ ప్రారంభించినట్లు శోభిత తెలిపింది. ఏప్రిల్ 2022లో చైతన్య- నేను తొలిసారి కలుసుకున్నట్లు శోభిత వివరించింది. ముంబయికి టికెట్ బుక్ చేసుకుని వచ్చిన చైతూతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశా.. అప్పటి నుంచి మా డేటింగ్ మొదలైందని చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా చాలా నేచురల్గా జరిగిందని వెల్లడించింది. ఆ తర్వాత ఒకరి కుటుంబాలను ఒకరు కలుసుకున్నట్లు పేర్కొంది. అలా తమ ప్రేమ మొదలైందని తాజా ఇంటర్వ్యూలో శోభిత తమ లవ్ స్టోరీని రివీల్ చేసింది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia)

Sunita William పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియో
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో (మార్చి 19 ఉదయం) అంతరిక్షం నుండి తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషాన్ని నింపింది. నిజంగా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా స్పేస్ఎక్స్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి, చిరునవ్వులు చిందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈనేపథ్యంలోనే ఆమె పూర్వీకులు, ఎవరు? ఏ రాష్ట్రానికి చెందినది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా, గుజరాత్లోని ఝులసన్ గ్రామానికి చెందినవారు. ఇక్కడే ఆమె పూర్వీకుల ఇల్లు (Ancestral Home) ఉంది. తొమ్మిది నెలల ఉత్కంఠ తరువాత ఆమె సురక్షితంగా భూమికి తిరిగి రావడంతో ఆ గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. ఆమె రాకను ప్రత్యక్షంగా చూడటానికి గ్రామం మొత్తం ఒక ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన టీవీల ముందు గుమిగూడి సునీతను చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విశేషంగా నిలిచింది. View this post on Instagram A post shared by India Today (@indiatoday) ఇది సునీత తండ్రి దీపక్ పాండ్య పూర్వీకులకు సంబంధించిన ఇల్లుగా భావిస్తున్నారు. ఇండియా టుడే షేర్ చేసిన వీడియో ప్రకారం, సునీత పూర్వీకుల ఇల్లు ఇప్పటికీ ఉంది. అయితే, ఎత్తైన ఈ ఇంటికి చాలా కాలంగా ఇల్లు లాక్ చేయబడి ఉండటం వల్ల కొంచెం పాతబడినట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడా పగుళ్లు కూడా ఉన్నాయి. అయితే సునీతకు భారతదేశంతో ఉన్న అనుబంధానికి నిదర్శనం. 1958లో ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడంతో ఇంటికి సరైన నిర్వహణలేకుండా ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అది దృఢంగానే కనిపిస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సునీత విలియమ్స్ను భారత్ రావాల్సిందిగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆమె, సొంత గ్రామానికి వస్తారా? పూర్వీకుల ఇంటిని సందర్శిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.సమోసా పార్టీసునీతా విలియమ్స్ వదిన, ఫల్గుణి పాండ్యా ఈ క్షణాన్ని 'అద్భుతం'గా అభివర్ణించారు. త్వరలో ఆమె కుటుంబం త్వరలో భారతదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా తమ పూర్వీకుల గ్రామం ఝులసన్తో బలమైన సంబంధాన్ని ఆమె గుర్తు చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సమోసా తిన్న మొదటి వ్యక్తి సునీత కాబట్టి, ఆమె సురక్షితంగా తిరిగి రావడాన్ని పండుగలా జరుపుకునేందుకు కుటుంబం సమోసా పార్టీ ఇస్తుందని కూడా ఆమె చమత్కరించారు. చదవండి: సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!తొమ్మిది నెలలు అంతరిక్షంలోనేఒక వారం రోజుల మిషన్మీద రోదసిలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకు పోయారు. తొమ్మిది నెలల తర్వాత, వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి భూమికి తిరిగి వచ్చారు. అచంచలమైన ధైర్య సాహసాలు, అకుంఠిత దీక్ష, అంకితభావంతో సునీతా విలియమ్స్ ఒక రోల్మోడల్గా నిలిచారు.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?

ప్చ్.. చంద్రబాబు పేరు చెప్పినా వినలేదు!
తిరుపతి, సాక్షి: సాధారణంగా.. చంద్రబాబు ఎన్నికలొస్తున్నాయంటే అడ్డగోలు హామీలు ప్రకటిస్తారు. వాటిని అమలు చేయడం అనేది ఆయన రాజకీయంలోనే లేదు. ఈ మాట మేం అంటోంది కాదు.. యావత్ ఏపీ కోడై కూస్తోంది ఇప్పుడు. ఈ క్రమంలో నిరసనలూ వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutavam) చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకు వినూత్న ప్రయత్నం జరిగింది. బుధవారం ఉదయం కొందరు ప్రయాణికులు.. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కారు. కండక్టర్ వచ్చి టికెట్ అడగ్గానే.. వాళ్లంతా తమ చేతుల్లోని ఫోన్లను చూపించారు. ‘‘అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. నాదీ హామీ’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. ఆ వీడియోను ప్రదర్శించిన మహిళలు.. తాను అందుకే ఎక్కామని చెప్పారు. ఇంతలో చంద్రబాబు ఫేస్ మాస్క్ వేసుకుని ఓ వ్యక్తి అక్కడ ప్రత్యక్షం కావడంతో.. ఆ కండక్టర్ నిర్ఘాంతపోయారు. అయితే.. ఏపీలో ఎక్కడా ఉచిత ప్రయాణం లేదని చెబుతూ ఆ మహిళల గుంపును దిగిపోవాలని సూచించాడు. ఈలోపు చంద్రబాబు ముఖం మాస్క్తో ఉన్న వ్యక్తి బస్సులో హడావిడి చేశారు. అయితే ‘‘టికెట్ అడిగితే నా పేరు చెప్పండి’’ స్వయంగా చంద్రబాబు ఆ వీడియోలో చెప్పిన మాటలు మరోసారి కండక్టర్కు చూపించారు. ఈ క్రమంలో కండక్టర్ వాళ్లతో వాగ్వాదానికి దిగారు. తాము సీఎం చంద్రబాబు చెబితేనే ఫ్రీ ప్రయాణానికి వచ్చామని పదే పదే చెప్పడంతో ఆ కండక్టర్ చివరకు పోలీసులను ఆశ్రయించారు. దీంతో.. బస్సును నేరుగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పీఎస్కు తరలించగా.. అదుపులోకి తీసుకున్న ఆ ప్రయాణికుల్లో మేయర్ డాక్టర్ శిరీష(Mayor Sirisha) కూడా ఉండడం చూసి పోలీసులు కంగుతిన్నారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జి అభినయ్ రెడ్డి నేతృత్వంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసంపై బుధవారం ఇలా నిరసన కార్యక్రమం జరగడం మరో విశేషం.

ఫస్ట్టైమ్ బంగారం ధర ఎంతకు చేరిందంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర బుధవారం జీవితకాల గరిష్టాలను చేరింది. సమీప భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,900 (22 క్యారెట్స్), రూ.90,440 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.ఇదీ చదవండి: స్టార్లింక్ సర్వీసులపై స్పెక్ట్రమ్ ఫీజు?చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.90,440 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.83,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.90,590 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లోనూ మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై ఏకంగా రూ.1,000 పెరిగి రూ.1,14,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

APLC: మేమెందుకు క్షమాపణలు చెప్పాలి?
అమరావతి, సాక్షి: శాసనమండలిలో ఇవాళ మరోసారి మంత్రి నారా లోకేష్, ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ(Botsa Satyanaraya) మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి లోకేష్ ఆరోపించగా.. బొత్స ఆ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘ఏపీలో 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారనడం(Drop Outs) సరికాదు. మంత్రి నారాలోకేష్(Nara Lokesh)కు ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఏనాడూ 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు బదిలీ అయిన సందర్భమూ లేదు. .. సౌకర్యాలు లేవనడం కరెక్ట్ కాదు. కావాలంటే మండలి సభ్యులందరినీ తీసుకెళ్లి స్టడీ టూర్ పెట్టండి. 2014-19 మధ్య స్కూల్స్ ఎలా ఉన్నాయి...2019-24 మధ్య ఎలా ఉన్నాయో పెద్దలతో గ్రామసభలు పెట్టి చర్చిద్దాం. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. కానీ, తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం(English Medium) కూడా ప్రోత్సహించాలన్నదే మా విధానం. .. ప్రాధమిక విద్యనుంచి టోఫెల్ విద్యను నేర్పించడం. ఇంగ్లీష్ మీడియంలో ఐబి విద్యను అందించడం. సెంట్రల్ సిలబస్ (సిబిఎస్) ను ప్రవేశపెట్టడం లాంటివి చేశాం. మొన్న 80% మంది విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాశారు. కిందిస్థాయి నుంచి కమ్యూనికేషన్ కోసం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ను అందుబాటులోకి తెచ్చాం. రేపు ఈ సబ్జెక్ట్ మీద చర్చించాలని మేం కోరాం. ఈ రోజు ఉద్యోగుల సమస్యల పై చర్చించాలని మేం వాయిదా తీర్మానం ఇచ్చాం. నేను తప్పు మాట్లాడితే రికార్డుల నుంచి నా మాటలను తొలగించండి. మేం క్షమాపణ చెప్పాలనడమేంటి... ఎందుకు మేము క్షమాపణ చెప్పాలి అని లోకేష్ వ్యాఖ్యలను ఉద్దేశించి బొత్స తీవ్రంగా ధ్వజమెత్తారు.అంతకుముందు.. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు , ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ,ఐఆర్ ,డీఏ ,ఉద్యోగుల సమస్యలపై వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. అనంతరం.. ప్రశ్నోత్తరాలు జరిగాయి.
వెండితెరపై సునీత విలియమ్స్ బయోపిక్?
సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!
BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
'నా సూర్యుడివి.. నా చంద్రుడివి నువ్వే'.. తండ్రికి మంచు మనోజ్ బర్త్ డే విషెస్
స్టాక్ మార్కెట్లు.. హ్యాట్రిక్..
ఓం భూం.. బుష్..: తెలంగాణ బడ్జెట్ పై బండి సంజయ్
KTR: కేటీఆర్కు ఊరట
చైతూతో ప్రేమకథ అలా మొదలైంది.. రివీల్ చేసిన శోభిత ధూళిపాల
Sunita William పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియో
భార్యకు విడాకులు.. భరణంగా చహల్ ఎన్ని కోట్లు ఇస్తున్నాడంటే..?
నేడే భూమి మీదకు సునితా విలియమ్స్
సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?
ఈ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు.. ఆస్తి ఒప్పందాలు
బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత పారితోషికమా?
SSMB29 ఒడిశా షెడ్యూల్ పూర్తి.. ఫొటోలు వైరల్
‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’
వయస్సు 19.. ‘నేను మీ అక్కనిరా’ అంటూ.. స్కూల్ విద్యార్థులను వ్యభిచారంలోకి దింపి..
'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?
క్లోజ్ అవుతున్న పోస్టాఫీస్ స్కీమ్..
పెళ్లి చేసుకున్నాం.. కానీ వేరుగా ఉంటున్నాం!
వెండితెరపై సునీత విలియమ్స్ బయోపిక్?
సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!
BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
'నా సూర్యుడివి.. నా చంద్రుడివి నువ్వే'.. తండ్రికి మంచు మనోజ్ బర్త్ డే విషెస్
స్టాక్ మార్కెట్లు.. హ్యాట్రిక్..
ఓం భూం.. బుష్..: తెలంగాణ బడ్జెట్ పై బండి సంజయ్
KTR: కేటీఆర్కు ఊరట
చైతూతో ప్రేమకథ అలా మొదలైంది.. రివీల్ చేసిన శోభిత ధూళిపాల
Sunita William పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియో
భార్యకు విడాకులు.. భరణంగా చహల్ ఎన్ని కోట్లు ఇస్తున్నాడంటే..?
నేడే భూమి మీదకు సునితా విలియమ్స్
సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?
ఈ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు.. ఆస్తి ఒప్పందాలు
బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత పారితోషికమా?
SSMB29 ఒడిశా షెడ్యూల్ పూర్తి.. ఫొటోలు వైరల్
‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’
వయస్సు 19.. ‘నేను మీ అక్కనిరా’ అంటూ.. స్కూల్ విద్యార్థులను వ్యభిచారంలోకి దింపి..
'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?
క్లోజ్ అవుతున్న పోస్టాఫీస్ స్కీమ్..
పెళ్లి చేసుకున్నాం.. కానీ వేరుగా ఉంటున్నాం!
సినిమా

సగం బాలీవుడ్ 'ఐపీఎల్' కోసం.. ఒక్క రాత్రి ఖర్చు ఎంతంటే?
మన దేశంలో జనాలు ఏది ఎక్కువ ఇష్టపడతారో అంటే టక్కున చెప్పే మాట సినిమాలు, క్రికెట్. మరీ ముఖ్యంగా ఐపీఎల్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ సెలబ్రిటీల ఆటపాట ఉండాల్సిందే. స్టార్ హీరోహీరోయిన్లు వస్తారు, తమదైన డ్యాన్సులతో ఫుల్లుగా ఎంటర్ టైన్ చేస్తారు. మిగతా సీజన్ల మాటేమో గానీ ఈ సీజన్ (IPL 2025) ప్రారంభోత్సవానికి సగం బాలీవుడ్ వచ్చే ప్లాన్ చేశారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)ప్రతి సీజన్ లోనూ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో 2-3 గంటల ప్రోగ్రామ్ ఉంటుంది. ఈసారి తొలి మ్యాచ్ కోల్ కతా vs బెంగళూరు (KKR vs RCB) మధ్య జరగనుంది. కోల్ కతా జట్టు ఓనర్ షారుక్ ఎలానూ ఉంటాడు. మరోవైపు సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, సంజయ్ దత్, వరుణ్ ధావన్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.హీరోయిన్లలో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, 'యానిమల్' తృప్తి, శ్రద్దా కపూర్, తమన్నా, ఊర్వశి రౌతేలా, కరీనా కపూర్, పూజా హెగ్డే.. ఇలా లిస్ట్ చాలా పెద్దగానే ఉన్నట్లు సమాచారం. వీళ్లతో పాటు స్టార్ సింగర్స్ అర్జిత్ సింగ్, శ్రేయా ఘెషల్, అమెరికన్ పాప్ బ్యాండ్ వన్ రిపబ్లిక్ కూడా ఫెర్ఫార్మ్ చేయనుంది.అయితే వీళ్లేం ఊరికే రారుగా. ఐపీఎల్ మేనేజ్ మెంట్ లేదా ఆయా ఫ్రాంఛెజీలు కోట్ల రూపాయల పారితోషికం చెల్లిస్తాయట. మొత్తంగా రెండు మూడు గంటల పాటు జరిగే ప్రోగ్రామ్ కోసం రూ.40-50 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారని టాక్. వీటిలో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)

ఛీ ఛీ అదేం టైటిల్..?: స్టార్ హీరో సినిమాపై జయా బచ్చన్ విమర్శలు!
అదో బ్లాక్ బస్టర్ మూవీ. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు రాబట్టి రికార్టు సృష్టించిన చిత్రం. కానీ ఆ చిత్రం అంటే తనకు నచ్చదని, అసలు ఆ సినిమానే చూడలేదని చెబుతోంది బాలీవుడ్ నటి, ఎంపీ జయా బచ్చన్(Jaya Bachchan). ఆ సినిమాకి పెట్టిన పేరు నచ్చకపోవడంతోనే తాను ఇప్పటివరకు ఆ మూవీ చూడలేదని, తన దృష్టిలో అదొక ఫ్లాప్ చిత్రమని చెబుతోంది. జయ బచ్చన్కి నచ్చని ఆ చిత్రం పేరే ‘టాయిటెట్: ఎక్ ప్రేమ్ కథ’ ( Toilet Ek Prem Katha Movie). అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రం 2017లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. శ్రీ నారాయణ్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రంపై జయా బచ్చన్ తీవ్ర విమర్శలు చేసింది. ఓ జాతియ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో జయాబచ్చన్ మాట్లాడుతూ.. ‘సినిమాలు చూసే విషయంలోనూ నేను కొన్ని కండీషన్స్ పెట్టుకున్నా. టైటిల్ నచ్చకపోతే సినిమా చూడను. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్కథ’ పేరు నాకు ఏమాత్రం నచ్చలేదు. ఒక్కసారి ఆ టైటిల్ చూడండి. అలాంటి పేరు ఉన్న సినిమాలు చూడాలని నేను ఎప్పుడూ అనుకోను. ఛీ ఛీ అసలు అదేం పేరు? నిజంగా అది కూడా ఒక పేరేనా?. అది బ్లాక్ బస్టర్ హిట్ అయినా.. నా దృష్టిలో మాత్రం ఫ్లాప్ చిత్రమే’ అని జయా బచ్చన్ అన్నారు.‘టాయిలెట్: ఏక్ ప్రేమ్కథ’ సినిమా కథ విషయానికొస్తే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న టాయిలెట్ల కొరతను ఎత్తి చూపుతూ శ్రీ నారాయణ్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అక్షయ్కి జోడీగా భూమి ఫడ్నేకర్ నటించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోరిక మేరకు గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించడానికి ఓ భర్త ఏం చేశాడనేది ఆ సినిమా కథాంశం.

తెలుగులో మిస్టరీ థ్రిల్లర్.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాలు, సిరీసులు నేరుగా వీటిల్లో రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే వాటిలో చాలా తక్కువ మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. ఇక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ కి అయితే సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అలా ఈ జానర్ లో తీసిన లేటెస్ట్ సిరీస్ 'టచ్ మీ నాట్'. తాజాగా దీని ట్రైలర్ రిలీజ్ చేయండంతో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)నవదీప్, దీక్షిత్ శెట్టి ('దసరా' ఫేమ్) కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ బట్టి చూస్తే.. స్కూల్ చదివే ఓ కుర్రాడి.. శవాన్ని ముట్టుకుని ఎవరు హత్య చేశారో చెప్పే అద్బుతమైన శక్తి ఉంటుంది. మరోవైపు పోలీస్ పాత్ర పోషించిన నవదీప్ మాత్రం ఈ కుర్రాడిపై కాస్త సందేహంగానే ఉంటాడు. మరి హంతకుడిని పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.హాట్ స్టార్ లో ఈ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో వచ్చిన సిరీస్ లు పెద్దగా క్లిక్ కాలేదని చెప్పొచ్చు. మరి 'టచ్ మీ నాట్' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)

ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా
చాన్నాళ్ల తర్వాత బ్రహ్మానందం కీలక పాత్రలో నటించిన సినిమా 'బ్రహ్మానందం'. ఇందులో బ్రహ్మీతో పాటు ఆయన తనయుడు రాజా గౌతమ్, వెన్నెల తదితరలు నటించారు. గత నెలల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)బ్రహ్మానందం సినిమాని తాత-మనవడు మధ్య జరిగే ఎమోషనల్ కంటెంట్ తో తీశారు. కథ పరంగా బాగానే అనుకున్నారు కానీ సినిమాగా రిలీజ్ చేసిన తర్వాత ఎందుకో జనానికి సరిగా కనెక్ట్ కాలేదు. ఇలాంటివి ఓటీటీలో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో గోల్డ్ యూజర్స్ కోసం స్ట్రీమింగ్ అవుతోంది. రేపటి (మార్చి 20) నుంచి యూజర్స్ అందరికీ అందుబాటులోకి వస్తుంది.'బ్రహ్మానందం' విషయానికొస్తే.. నటుడు కావాలనుకునే బ్రహ్మా (రాజా గౌతమ్).. ఢిల్లీలో నాటకం వేయాలని అనుకుంటాడు. కానీ దీనికి డబ్బులివ్వాల్సి ఉంటుంది. దీంతో తాత ఆనంద్ రామ్మూర్తి (బ్రహ్మానందం) పేరిట ఉన్న భూమి అమ్మాలని అడుగుతాడు. దీనికి తాత ఒప్పుకొంటాడు కానీ కొన్ని షరతులు పెడతాడు. ఇంతకీ అవేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: నటనకు గుడ్ బై.. హేమ ఇప్పుడేం చేస్తుంది?)
న్యూస్ పాడ్కాస్ట్

భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్, విల్మోర్

‘బీసీ’ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం...

‘విద్య’లో గందరగోళం.. లక్ష్యం బడికి తాళం. ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యను భ్రష్టు పట్టిస్తోన్న కూటమి ప్రభుత్వం

బీఆర్ఎస్ నాయకుల స్టేచర్ గుండుసున్నా.. కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా, ప్రతిపక్ష నేతగా ఉండాలి, నేను సీఎంగా ఉండాలి ..రేవంత్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులను దగా చేసిన కూటమి ప్రభుత్వం... నష్టానికే పంట అమ్ముకుంటున్న రైతులు

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి సస్పెన్షన్... ‘ఈ సభ నీ సొంతం కాదు’ అన్నందుకు బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ నయవంచనపై తిరుగుబాటు... వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో ‘యువత పోరు’లో కదంతొక్కిన విద్యార్థులు, తల్లితండ్రులు, నిరుద్యోగులు

భారతదేశ కుటుంబంలో మారిషస్ ఒక అంతర్భాగం... ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ

కేసీఆర్ను గద్దె దింపిందీ నేనే. నాది సీఎం స్థాయి.. ఆయనది మాజీ సీఎం స్థాయి. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్లో పాడి రైతుకు కూటమి సర్కారు దగా... ప్రైవేటు డెయిరీలు చెప్పిందే ధర, ఇష్టం వచ్చినంతే కొనుగోలు... లీటర్కు 25 రూపాయల దాకా నష్టపోతున్న రైతులు
క్రీడలు

IPL 2025: డైనమైట్లతో నిండిన పంజాబ్ బ్యాటింగ్ విభాగం.. వీరిని ఆపతరమా..?
ఈ ఏడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ విభాగం విధ్వంసకర డైనమైట్లతో నిండుకుని ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ జట్టు బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా, ప్రమాదకరంగా కనిపిస్తుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదలు మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, జోస్ ఇంగ్లిస్, ప్రభ్సిమ్రన్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జన్సెన్.. ఇలా జట్టు మొత్తం విధ్వంసకర వీరులే ఉన్నారు.బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్ బలగం చూసి పంజాబ్ను టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా చెప్పవచ్చు. జట్టులో చాలామంది మిడిలార్డర్ బ్యాటర్లు ఉండటంతో తుది జట్టు కూర్పు సమస్యగా మారవచ్చు. ఓపెనర్లుగా జోస్ ఇంగ్లిస్, ప్రభ్సిమ్రన్ సింగ్ రావచ్చని అంచనా. వన్డౌన్లో శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో నేహల్ వధేరా, ఐదో ప్లేస్లో శశాంక్ సింగ్ బ్యాటింగ్కు దిగే అవకాశం ఉంది.ఆరో స్థానంలో మ్యాక్స్వెల్, ఏడో ప్లేస్లో అజ్మతుల్లా ఒమర్జాయ్/మార్కో జన్సెన్, బౌలర్లుగా అర్షదీప్ సింగ్, లోకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చహల్, జేవియర్ బార్ట్లెట్ తుది జట్టులో ఉండవచ్చు.కాగా, ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుండగా... పంజాబ్ కింగ్స్ మార్చి 25న గుజరాత్ టైటాన్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.లీగ్ ఆరంభం నుంచి ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన పంజాబ్ కింగ్స్... ఈసారి తమ చిరకాల స్వప్నం నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో ఉంది. గతేడాది కోల్కతా నైట్రైడర్స్ను చాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ హెడ్కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో పంజాబ్ తమ టైటిల్ కల నేరవేర్చుకుంటుందేమో చూడాలి. ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు..శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, ప్రియాన్ష్ ఆర్య, హర్నూర్ సింగ్, పైలా అవినాశ్, ముషీర్ ఖాన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జన్సెన్, సూర్యాంశ్ షేడ్గే, ప్రవీణ్ దూబే, జోస్ ఇంగ్లిస్, ప్రభ్సిమ్రన్ సింగ్, విష్ణు వినోద్, హర్ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్, లోకీ ఫెర్గూసన్, విజయ్కుమార్ వైశాక్, కుల్దీప్ సేన్, యశ్ ఠాకూర్, జేవియర్ బార్ట్లెట్

IPL 2025: అంపైర్గా కోహ్లి సహచరుడు
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చిన్ననాటి స్నేహితుడు తన్మయ్ శ్రీవాత్సవ ఐపీఎల్ 2025 సీజన్ కోసం అంపైర్గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఉత్తర్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (శ్రీవాత్సవ సొంత రాష్ట్రం) అధికారికంగా ప్రకటించింది. నిజమైన ఆటగాడు ఎప్పుడూ మైదానాన్ని వడిచి వెళ్ళడు. మైదానంలో అతని పాత్ర మాత్రమే మారుతుంది. కొత్త ప్రయాణంలో శ్రీవాస్తవకు శుభాకాంక్షలు అంటూ ఉత్తర్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తమ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది.35 ఏళ్ల తన్మయ్ శ్రీవాత్సవ్ కోహ్లి కెప్టెన్సీలో అండర్-19 వరల్డ్కప్ (2008) గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడు. సౌతాఫ్రికాతో జరిగిన ఆ టోర్నీ ఫైనల్లో శ్రీవాత్సవ్ టాప్ రన్ స్కోరర్గా (ఇరు జట్ల తరఫున) నిలిచి భారత్ టైటిల్ సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన శ్రీవాత్సవ్ 46 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో భారత 12 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి (డక్ వర్త్ లూయిస్ పద్దతిలో) ఛాంపియన్గా నిలిచింది. ఐదేళ్ల క్రితం ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీవత్సవ.. అప్పటి నుంచి దేశవాలీ క్రికెట్లో అంపైర్గా వ్యవహరిస్తున్నాడు. శ్రీవాత్సవ 2008-2012 వరకు ఐపీఎల్ ఆడాడు. ఐపీఎల్లో ఆటగాడిగా శ్రీవాత్సవ కెరీర్ అంత ఆశాజనకంగా సాగలేదు. ఐదేళ్లలో అతను 7 మ్యాచ్లు ఆడి కేవలం 8 పరుగులే చేశాడు. శ్రీవాత్సవ దేశవాలీ కెరీర్ మాత్రం పర్వాలేదన్నట్లుగా ఉంది. ఉత్తర్ప్రదేశ్ తరఫున అతను 90 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, 44 లిస్ట్-ఏ, 34 టీ20 ఆడి 7000 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 81 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. శ్రీవాత్సవతో పాటు 2008 అండర్-19 వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో మరో సభ్యుడు కూడా బీసీసీఐ అంపైర్గా ఉన్నాడు. ఆ జట్టులోని అజితేశ్ అర్గాల్ ప్రస్తుతం ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో అంపైరింగ్ చేస్తున్నాడు. ఇద్దరు సహచరులు అంపైర్లుగా మారినా కోహ్లి మాత్రం ఇంకా ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. కోహ్లి కెరీర్ ప్రస్తుతం ఉన్నత దశలో ఉంది. సహచరుడు అంపైరింగ్ చేస్తుండగా కోహ్లి ఆటగాడిగా ఆడటం వింత ఆసక్తికరం.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది.

IPL 2025: మరోసారి తన బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేయనున్న కేఎల్ రాహుల్..?
జట్టు ప్రయోజనాల కోసం కేఎల్ రాహుల్ మరోసారి తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా, మూడో నంబర్ ఆటగాడిగా, 4, 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన రాహుల్.. ఐపీఎల్-2025లో తన కొత్త జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కోసం నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. ఐపీఎల్లో ఓపెనర్గా మంచి సక్సెస్ సాధించిన రాహుల్.. జట్టు అవసరాల దృష్ట్యా ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయనున్నాడు. రాహుల్ మిడిలార్డర్ బ్యాటింగ్కు వస్తాడన్న విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ సూచనప్రాయంగా వెల్లడించింది. జట్టు ఏదైనా ప్రయోజనాలే ముఖ్యమనుకునే రాహుల్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని సైతం వద్దనుకున్నాడు. సాధారణ ఆటగాడిగా కొనగేందుకే ఇష్టపడ్డాడు. రాహుల్ కాదనుకుంటే అక్షర్ పటేల్ను ఢిల్లీ కెప్టెన్సీ వరిచింది. అక్షర్ జూనియర్ అయినా అతని అండర్లో ఆడేందుకు రాహుల్ సుముఖత వ్యక్తం చేశాడు.గత మూడు సీజన్లలో కెప్టెన్గా వ్యవహరించిన రాహుల్ను లక్నో సూపర్ జెయింట్స్ వద్దనుకుంటే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అక్కును చేర్చుకుంది. రాహుల్ను డీసీ మేనేజ్మెంట్ రూ. 14 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్ మెగా వేలంలో తన సహచరులంతా (శ్రేయస్, పంత్) భారీ మొత్తాలు దక్కించుకున్నా రాహుల్ ఏ మాత్రం బాధపడటం లేదు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమంటున్నాడు.రాహుల్ మిడిలార్డర్లో వస్తే జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఫాఫ్ డుప్లెసిస్ ఢిల్లీ ఇన్నింగ్స్ను ఓపెన్ చేస్తారు. అభిషేక్ పోరెల్ లేదా కరుణ్ నాయర్ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగుతారు. రాహుల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగితే అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ ఆతర్వాతి స్థానాల్లో వస్తారు. ఢిల్లీ ఈ సీజన్లో హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటి. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. బ్యాటింగ్లో అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్.. బౌలింగ్లో దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్లతో ఆ జట్టు అత్యంత బలీయంగా కనిపిస్తుంది. ఈ జట్టును చూసి ఇప్పటికే చాలా మంది విశ్లేషకులు ఈ సీజన్లో ఢిల్లీ టైటిల్ సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. మరి కొత్త సారథి అక్షర్ పటేల్ అండర్లో ఢిల్లీ తమ తొలి టైటిల్ గెలుస్తుందేమో చూడాలి. ఈ సీజన్లో ఢిల్లీ మే 24న లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే మ్యాచ్తో తమ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఈ మ్యాచ్ వైజాగ్లో జరుగనుంది. ఈ సీజన్ మార్చి 22న కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్తో మొదలవుతుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, త్రిపురణ విజయ్

ఐపీఎల్కి ముందే విధ్వంసం మొదలుపెట్టిన ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ న్యూ జాయినీ ఇషాన్ కిషన్ విధ్వంసం మొదలైంది. ఎస్ఆర్హెచ్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ల్లో పాకెట్ డైనమైట్ చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు మెరుపు అర్ద సెంచరీలు సాధించాడు. తాజాగా జరిగిన ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 22 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అంతకుముందు ఓ మ్యాచ్లో 19 బంతుల్లో 49.. మరో మ్యాచ్లో 30 బంతుల్లో 70.. ఇంకో మ్యాచ్లో 23 బంతుల్లో 64 పరుగులు చేశాడు. సీజన్ ప్రారంభానికి ముందు ఇషాన్ అరివీర భయంకర ఫామ్ చూసి సన్రైజర్స్ శ్రేణులు ఖుషీగా ఉన్నాయి. ఈ సీజన్లో ఇషాన్ మరో విధ్వంకర ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి సన్రైజర్స్ ఇన్నింగ్స్కు ప్రారంభించే అవకాశం ఉంది. ఇషాన్, అభిషేక్ తమ సహజ శైలిలో చెలరేగితే ఈ సీజన్లో సన్రైజర్స్ ఆపడం ఎవరి తరమూ కాదు. ఇషాన్ను ఈ సీజన్ మెగా వేలంలో సన్రైజర్స్ రూ. 11.25 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్కు ఆడిన ఇషాన్.. ఆ జట్టు విజయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర పోషించాడు.ఈ సీజన్లో సన్రైజర్స్ బ్యాటింగ్ లైనప్ ఇషాన్, అభిషేక్, హెడ్, క్లాసెన్, అభినవ్ మనోహర్, నితీశ్ కుమార్ రెడ్డితో కూడి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. గత సీజన్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్లు నమోదు చేసిన సన్రైజర్స్ ఈసారి ఆ స్కోర్లను కూడా అధిగమించే అవకాశం ఉంది. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ల్లోనే 260, 270 పరుగులను సునాయాసంగా చేస్తున్న ఆరెంజ్ ఆర్మీ.. అస్సలు మ్యాచ్ల్లో 300 స్కోర్ను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గత సీజన్లో సన్రైజర్స్ ఆర్సీబీపై 287 (ఐపీఎల్ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోర్), ముంబై ఇండియన్స్పై 277, ఢిల్లీ క్యాపిటల్స్పై 266 పరుగులు చేసింది. గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్న ఆరెంజ్ ఆర్మీ పరుగుల సునామీ సృష్టించడం ఖాయమనిపిస్తుంది. గత సీజన్లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఈ సీజన్లో బ్యాటింగ్తో పాటు సన్రైజర్స్ బౌలింగ్ కూడా సమతూకంగా ఉంది. కెప్టెన్ కమిన్స్తో పాటు ఈ సీజన్లో కొత్తగా షమీ, ఉనద్కత్, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా జట్టులో చేరారు.ఈ సీజన్లో సన్రైజర్స్ ప్రయాణం మార్చి 23న రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది.2025 ఐపీఎల్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్
బిజినెస్

దాచుకోవాల్సిన డబ్బులు.. వాడేసుకుంటున్నారు!
ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) భారతదేశంలోని కోట్ల మంది వేతన జీవులకు కీలకమైన పొదుపు సాధనంగా ఉంది. ఇది ఆర్థిక భద్రతను, పదవీ విరమణ అనంతర ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈపీఎఫ్లోని యువ చందాదారులు తమ మొత్తం ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కార్పస్ను ముందస్తుగానే ఉపసంహరించుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల ఈ ధోరణి మరింత పెరుగుతోందని తెలిపారు. ఇందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.అనిశ్చిత సమయాల్లో ఆర్థిక ఒత్తిడిఆర్థిక అనిశ్చితులు, కొవిడ్-19 మహమ్మారి వంటి సమయాల్లో చాలామందికి ఈపీఎఫ్ పొదుపు ఆసరాగా మారింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడినా గతంలోని వైఖరినే చందాదారులు పాటిస్తున్నారు. చిన్నచిన్న అవసరాలకు కూడా పీఎఫ్ డబ్బును ఉపసంహరిస్తున్నారు. దాంతోపాటు ఇటీవల ఉద్యోగుల తొలగింపులు, జీతాల్లో కోతలు, పెరుగుతున్న ఖర్చుల కారణంగా తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ పొదుపును వాడుతున్నారు.జాబ్ మార్కెట్ అస్థిరతయువ నిపుణులు తరచుగా ఉద్యోగాలు మారుతుంటారు. దాంతో ఖర్చుల కోసం పీఎఫ్ ఉపసంహరణలు చేస్తున్నారు. కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టిన ఆన్లైన్ అకౌంట్ బదిలీ విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ పాత కంపెనీకి అనుగణంగా ఉన్న పీఎఫ్ను ఉపసంహరించుకోవడం సులభమని భావిస్తున్నారు.దీర్ఘకాలిక ప్రయోజనాలపై అవగాహన లేమిదీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఈపీఎఫ్ ప్రాముఖ్యతను యువ చందాదారులు తక్కువగా అంచనా వేస్తున్నారు. వారిలో ఈపీఎఫ్ అందించే కాంపౌండెడ్ వడ్డీ, పన్ను ప్రయోజనాల గురించి పరిమిత అవగాహన ఉంది. ముందస్తు ఉపసంహరణలు స్వల్పకాలిక లక్ష్యాలకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో సమకూరే రాబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయి.కొత్త పెట్టుబడుల అన్వేషణయువ చందాదారులు ఈపీఎఫ్ కార్పస్ను వ్యాపారాలు ప్రారంభించడానికి, ఉన్నత విద్యను అభ్యసించడానికి లేదా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలు వంటి ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టడానికి అందుబాటులో ఉన్న డబ్బుగా చూస్తున్నారు. ఇవి స్వల్ప కాలంలో అధిక రాబడిని ఇచ్చే అవకాశం ఉంది.అత్యవసర నిధి లేకపోవడంకొంతమందికి అత్యవసర నిధి లేకపోవడం, తరచుగా వైద్య ఖర్చులు, వివాహ ఖర్చులు లేదా కుటుంబ బాధ్యతలను పూర్తి చేయడానికి సరిపడా డబ్బు కొరత ఏర్పడుతుంది. దాంతో పీఎఫ్ కార్పస్ను విత్డ్రా చేస్తున్నారు. ఎమర్జెన్సీ కార్పస్ అవసరంపై యువకులు సరైన అవగాహన పెంపొందించుకోవాలి.ఉపసంహరణల కట్టడికి ఏమి చేయవచ్చు?అవగాహన కార్యక్రమాలు: ఈపీఎఫ్ఓ, కంపెనీల యాజమాన్యాలు పీఎఫ్ పొదుపును నిలుపుకోవడం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి యువ చందాదారులకు అవగాహన కల్పించాలి.ప్రోత్సాహకాలు అందించడం: పీఎఫ్ నిధులను ఎక్కువ కాలం కొనసాగించే చందాదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి.సరళీకృత బదిలీ ప్రక్రియలు: ఆన్లైన్ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఉద్యోగ మార్పుల సమయంలో పీఎఫ్ బదిలీ ప్రక్రియను మరింత సరళీకరించేలా చర్యలు తీసుకోవాలి.ఎమర్జెన్సీ ఫండ్స్పై అవగాహన: అత్యవసర నిధి ప్రాముఖ్యతపై స్పష్టతనిచ్చే ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు యువ చందాదారులు తమ పీఎఫ్ పొదుపును విత్డ్రా చేయకుండా కట్టడి చేయడంలో తోడ్పడుతాయి.ఇదీ చదవండి: స్టార్లింక్ సర్వీసులపై స్పెక్ట్రమ్ ఫీజు?పీఎఫ్ కార్పస్ ఉపసంహరించుకోవడం స్వల్పకాలిక ఉపశమనం కలిగించినప్పటికీ దీర్ఘకాలిక పరిణామాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్తు భద్రతకు ఈపీఎఫ్ను తాత్కాలిక వెసులుబాటుగా కాకుండా సంపద సృష్టించే సాధనంగా చూసేలా యువ చందాదారులను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. అవగాహనను పెంపొందించడం, మెరుగైన మార్గాలు అన్వేషించడం ద్వారా ఈ ఉపసంహరణలను కట్టడి చేయవచ్చు.

స్టార్లింక్ సర్వీసులపై స్పెక్ట్రమ్ ఫీజు?
ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ భారతదేశంలో అదనపు ఆర్థిక భారాలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ దాని సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)పై సుమారు 3 శాతం స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీ (ఎస్యూసీ)లు, 8 శాతం టెలికాం లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి స్థానిక నెట్వర్క్ ప్రొవైడర్లకు కొన్నేళ్ల క్రితమే ఈ స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఒకవేళ స్టార్లింక్ సర్వీసులపై ఈ ఛార్జీలు విధిస్తే దీని సబ్స్రిప్షన్ ప్లాన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలు (ఎస్యూసీ) అనేది రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ను వినియోగిస్తున్నందుకు బదులుగా టెలికాం ఆపరేటర్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్)కు చేసే చెల్లింపులు. ఇప్పటికే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శాటిలైట్ స్పెక్ట్రమ్ ధర, కాలపరిమితి, పన్నులకు సంబంధించిన వివరాలను ఖరారు చేసే పనిలో ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ముందుగా నిర్ణయించిన ధరకే స్పెక్ట్రమ్ను కేటాయిస్తారు కాబట్టి శాట్ కామ్ సంస్థలకు ఎస్యూసీ తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని ట్రాయ్ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రాయ్ చేసిన ఈ సిఫార్సులను డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ), కేబినెట్కు తుది ఆమోదం కోసం సమర్పించే ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) సమీక్షించే అవకాశం ఉంది.మరిన్ని కంపెనీలపై ప్రభావంఈ ఎస్యూసీ పాలసీ వల్ల ప్రభావితమయ్యే ఏకైక శాటిలైట్ ఆపరేటర్ స్టార్లింక్ మాత్రమే కాదు. ఎయిర్టెల్ ప్రమోటర్ సునీల్ మిట్టల్ పెట్టుబడులున్న యూటెల్ శాట్ వన్ వెబ్, జియో ప్లాట్ఫామ్స్, లక్సెంబర్గ్కు చెందిన ఎస్ఈఎస్ల జాయింట్ వెంచర్ రిలయన్స్ జియో-ఎస్ఈఎస్ వంటి ఇతర శాటిలైట్ కమ్యూనికేషన్ ప్లేయర్లపై కూడా ప్రభావం పడనుంది. సెప్టెంబర్ 15, 2021 తర్వాత వేలం వేసిన బ్యాండ్విడ్త్పై ఎస్యూసీని తొలగించాలని 2022 జూన్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త చట్టం ప్రకారం వేలం లేకుండా శాట్కామ్ కంపెనీలు స్పెక్ట్రమ్ను పొందే వీలుంది. దాంతో ఈ ఆపరేటర్లపై ఎస్యూసీని తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనలున్నాయి.ఈ ప్రతిపాదనల వల్ల భారత్లో ప్రవేశించాలని చూస్తున్న స్టార్లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఇతర దేశాల్లో సేవలందిస్తున్న కంపెనీ ప్లాన్లు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.యూఎస్లో స్టార్లింక్ ఛార్జీలు ఇలా..స్టార్లింక్ యూఎస్లో రెసిడెన్షియల్ విభాగంలో నెలకు రూ.6,976 నుంచి ప్లాన్లు అందిస్తోంది. కేబుల్ నెట్వర్క్కు ఎలాగైతే రూటర్ కొనుగోలు చేస్తామో.. అలాగే శాటిలైట్ సేవల కోసం కూడా పరికరాలకు ఒకసారి చెల్లించాల్సిన సొమ్ము అదనం. యూఎస్లో స్టాండర్డ్ ఎక్విప్మెంట్ కిట్ ధర రూ.30,443గా ఉంది.ఇక మొబైల్ సేవలు కావాల్సినవారు నెలకు కనీసం రూ.4,360 చెల్లించాల్సి ఉంటుంది. డేటా అపరిమితంగా అందుకోవచ్చు. 220 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ ఆఫర్ చేస్తోంది.రెసిడెన్షియల్ లైట్, రెసిడెన్షియల్ ప్లాన్లలో కూడా వినియోగదారులు అపరిమిత డేటాను అందుకోవచ్చు.రోమింగ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులు దేశవ్యాప్తంగా, ప్రయాణంలో, అంతర్జాతీయ ప్రయాణ సమయంలో కూడా వినియోగం, తీర ప్రాంతాల్లో కవరేజీ పొందవచ్చు. బిజినెస్ విభాగంలో నెలకు రూ.12,208 నుంచి రూ.4,36,000 వరకు ప్లాన్స్ ఉన్నాయి.భూటాన్లో ఇలా..ఇక భూటాన్లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ కింద స్టార్లింక్ నెలకు రూ.3,000 చార్జీ చేస్తోంది. ఈ ప్లాన్లో ఇంటర్నెట్ 23–100 ఎంబీపీఎస్ స్పీడ్తో ఆఫర్ చేస్తోంది. ఊక్లా నివేదిక ప్రకారం స్టార్లింక్ ఇంటర్నెట్ వేగం యూరప్లోని హంగరీలో అక్టోబర్–డిసెంబర్ కాలంలో గరిష్టంగా 135.11, కనిష్టంగా సైప్రస్లో 36.52 ఎంబీపీఎస్ నమోదైంది.మనదగ్గర ఇప్పటివరకు ఇలా..శాటిలైట్ ఇంటర్నెట్ చార్జీలతో పోలిస్తే మన దేశంలో మొబైల్, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ చాలా చవక. అటూ ఇటూగా రూ.20 చెల్లిస్తే ఒక జీబీ డేటా అందుకోవచ్చు. సుమారు రూ.50 నుంచి అన్లిమిటెడ్ ప్యాక్స్ లభిస్తాయి. హోమ్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి ఉన్నాయి. హై–ఎండ్ ప్లాన్ అయితే నెలకు రూ.4,000 వరకు ఉంది. దీనిలో 10 జీబీపీఎస్ వరకు వేగం, అన్ని ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ కూడా అందుతుంది. రూటర్కు అయ్యే వ్యయమూ తక్కువే. శాటిలైట్ టెలికం కేవలం ఇంటర్నెట్కే పరిమితం. కాల్స్ చేయాలంటే ఓటీటీ యాప్స్పైన ఆధారపడాల్సిందే.ఇండియాలో స్టార్లింక్ ఛార్జీలపై అంచనాలు..స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం అవసరమయ్యే హార్డ్వేర్కు ప్రస్తుతం రూ.25,000-రూ.35,000 మధ్య ఖర్చు అవుతుంది. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.5,000-రూ.7,000గా అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీట్ 25-220 ఎంబీపీఎస్ ఉంటుందని చెబుతున్నారు. ఆ ధర భారతదేశం సగటు బ్రాండ్బ్యాండ్ వ్యయం నెలకు రూ.700-రూ.1,500 కంటే చాలా ఎక్కువ. బ్రాండ్బ్యాండ్ పోటీదారులకు ధీటుగా విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ఎక్స్ భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఆల్ఫాబెట్ రూ.2.75 లక్షల కోట్లతో కంపెనీ కొనుగోలుస్టార్లింక్ ప్రత్యేకతలు ఇవీ..లోఎర్త్ ఆర్టిట్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందిస్తారు. ఇందుకోసం స్పేస్ఎక్స్ ఉపగ్రహాలను వినియోగిస్తున్నారు.కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలు: సుమారు 7,000శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తున్న దేశాలు: 100కుపైగావినియోగదారులు: సుమారు 50 లక్షలు (2024 డిసెంబర్ చివరినాటికి) అమెరికాలో దిగ్గజ బ్రాండ్బ్యాండ్ కంపెనీలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పోటీనిస్తోంది.రూరల్ కనెక్టివిటీ: మారుమూల ప్రాంతాలు, పల్లెలకు వేగంగా ఇంటర్నెట్ అందిస్తోంది. విద్య, ఆరోగ్య సేవలు, ఈ–కామర్స్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.భారత్లో పోటీ: దేశంలో 94.5 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు ఉన్నారు. అందులో 90.4 కోట్ల మంది వైర్లెస్/మొబైల్ ఇంటర్నెట్ను వాడుతున్నారు.

స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్ ముగింపుతో పోలిస్తే బుధవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 19 పాయింట్ నష్టపోయి 22,817కు చేరింది. సెన్సెక్స్(Sensex) 58 పాయింట్లు దిగజారి 75,241 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.3 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 70.38 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.07 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.71 శాతం దిగజారింది.ఇదీ చదవండి: విమాన ప్రయాణాలు మరింత భారంజాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో మంగళవారం దేశీయ స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం ర్యాలీ అయ్యాయి. అమెరికా కరెన్సీ డాలర్ బలహీనత, క్రూడాయిల్ ధరలు దిగిరావడం వంటి అంశాలూ కలిసొచ్చాయి. గడిచిన రెండు రోజుల వరుస లాభాలతో స్టాక్ మార్కెట్లో రూ.8.67 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.399 లక్షల కోట్లకు చేరుకుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 25 పైసలు పెరిగి 86.56 వద్దకు చేరింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

మరిన్ని శాఖల్లో బంగారం రుణాలు
ప్రముఖ ఎన్బీఎఫ్సీ సంస్థ శ్రీరామ్ ఫైనాన్స్ బంగారం రుణాల్లో తన మార్కెట్ వాటాను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. బంగారం రుణాల మార్కెట్ వచ్చే ఐదేళ్లలో రెట్టింపు అవుతుందన్న అంచనాల నేపథ్యంలో.. మరిన్ని శాఖల్లో బంగారం రుణాలను ప్రవేశపెట్టనున్నట్టు సంస్థ డిప్యూటీ ఎండీ అన్బుసెల్వన్ తెలిపారు.‘2024–25 మూడో త్రైమాసికంలో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో శ్రీరామ్ ఫైనాన్స్ నిర్వహణలోని బంగారం రుణ ఆస్తులు (ఏయూఎం) గణనీయంగా పెరిగాయి. మరింత స్థిరీకరణతో రానున్న త్రైమాసికాల్లో మార్కెట్ వాటాను పెంచుకోవాలని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా మరిన్ని శాఖలకు బంగారం రుణాల వ్యాపారాన్ని విస్తరించనున్నాం’అని అన్బుసెల్వన్ వివరించారు. బంగారం రుణాలకు డిమాండ్ పెరిగిందని.. వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థలు వేగంగా నిధులు కోరుకుంటున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: విమాన ప్రయాణాలు మరింత భారంసంఘటిత రంగంలో బంగారం రుణ వ్యాపారం మరింత విస్తరించనున్నట్టు అన్బుసెల్వన్ తెలిపారు. తమ బంగారం రుణ కస్టమర్లలో ఎక్కువ మంది మధ్యతరగతి వారేనని, వేతన జీవులు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల్లోని వర్తకులు ఇందులో ఉన్నట్టు చెప్పారు. ఏక మొత్తంలో రుణ చెల్లింపులు, మూడు నెలలకోసారి వడ్డీ చెల్లించడం, నెలవారీ ఈఎంఐ ఇలా పలు రూపాల్లో బంగారం రుణాలను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. వేగంగా రుణాలు జారీ చేసేందుకు వీలుగా ప్రక్రియలను ఆటోమేట్ చేసినట్టు పేర్కొన్నారు.
ఫ్యామిలీ

ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!
ఇంటిని పచ్చని పంటలు, మొక్కలతో నందన వనంగా మార్చిన విశ్రాంత ప్రధానోపాధ్యాయిని ఆహారమే ఆరోగ్యం అనే సూత్రాన్ని నమ్మి.. ఇంటినే ఆరోగ్యదాయక పంటలు, మొక్కలతో నందన వనంగా మార్చారు మచిలీపట్నానికి చెందిన ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుని. ఆమే ఎండీ ముంతాజ్బేగం.కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హైనీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయునిగా 2019లో ముంతాజ్బేగం ఉద్యోగ విరమణ చేశారు. సేంద్రియ ఇంటిపంటల సాగు ద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి దోహదం చేస్తుందని ఆమె ఆచరణాత్మకంగా చాటి చెబుతున్నారు. తాను మొదట ఆచరించి, తర్వాత ఇతరులకు చెప్పాలన్నా వ్యక్తిత్వం ఆమెది. ఇంటి నుంచి వచ్చే చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తూ మొక్కలకు వేసి పెంచుతూ అధిక ఫలసాయాన్ని పొందుతున్నారు. మునగాకు, బెల్లం కలిపి నీళ్లలో నానబెట్టి మొక్కలకు పోయటం.. పొగాకును నీళ్లలో వేసి రెండు, మూడు రోజులు నానబెట్టి మొక్కల వేర్లకు వేస్తే మట్టి ద్వారా వచ్చే తెగుళ్లు నివారించవచ్చని ఆమె తెలిపారు. పెసలు, మినుము, ఉలవలు, బార్లీ, నువ్వులు నానబెట్టి గ్రైండ్ చేసి నీళ్లలో కలిపి మొక్క వేళలో వేస్తే, మంచి దిగుబడి వస్తుందని ఆమె చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నారు. ఆరోగ్యదాయకంగా పెంచుకున్న కూరగాయలు, పండ్లు తింటే ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి కూడా తప్పించుకోవచ్చని ఆమె ఘంటాపధంగా చెబుతున్నారు. సేంద్రియ ఇంటిపంటలు ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.మానసిక, శారీరక ఆరోగ్యంముంతాజ్ ఇంటి ఆవరణలో, మిద్దెపై ఎన్నో రకాల కూరగాయలు, పండ్ల మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతూ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవటంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. మొక్కలను సంరక్షిస్తే మానసిక, శారీరక ఆరోగ్యం పొందవచ్చునని ఆమె చెబుతున్నారు. మామిడి, జామ, అరటి, డ్రాగన్, చెర్రీ, వాటర్ యాపిల్, నేరేడు, అంజూర, ఫ్యాషనఫ్రూట్, పీ నట్ బటర్, బొప్పాయి పండ్ల మొక్కలతో పాటు ΄పాలకూర, చుక్కకూర, ఆకుకూరల మొక్కలతోపాటు వంగ, టమాట, అలసంద, మునగ, అరటి, మల్బరీ ఆకులతోపాటు వంద రకాల క్రోటస్ను ఆమె తమ ఇంటి ఆవరణలో, మేడపైన పెంచుతున్నారు. మొక్కలే ప్రాణం.. ఇంటిపంటల ధ్యానం!మొక్కలే ప్రాణంగా ప్రతి రోజు నా దినచర్య ఉంటుంది. రోజు మూడు, మూడున్నర గంటలు వీటి సంరక్షణ కోసం వెచ్చిస్తుంటాను. మొక్కలను సంరక్షిస్తే సమాజం ఆరోగ్యం బాగుంటుందని, భవిష్యత్తు మన చేతిలోనే ఉందనేది అందరికీ తెలియజేయాలనేదే నా తపన. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల తొక్కలు, ఇతర సేంద్రియ చెత్తను మునిసి΄ాలిటీ వారికి ఇవ్వకుండా, ఇంటిపట్టునే కం΄ోస్టు ఎరువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. నర్సరీ నుంచే పిల్లలకు మొక్కలను పెంచటంపై అవగాహన కల్పిస్తే మంచి భవిష్యత్తు సమాజాన్ని సృష్టించుకోవచ్చు. – ఎండీ ముంతాజ్ బేగం, ఇంటి పంటల సాగుదారు, విశ్రాంత ప్రధానోపాధ్యాయిని, మచిలీపట్నం – అంబటి శేషుబాబు, సాక్షి, చిలకలపూడి (మచిలీపట్నం). (చదవండి: ఎదురు లేని వెదురు)

ఎదురు లేని వెదురు
వెదురు.. గ్రీన్ గోల్డ్.. అవును! ఈ విషయంలో మీకేమైనా సందేహం ఉందా? అయితే.. శివాజీ రాజ్పుట్ అనే అద్భుత ఆదర్శ వెదురు రైతు విశేష కృషి గురించి తెలుసుకోవాల్సిందే. మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందిన శివాజీ 25 ఎకరాల్లో వెదురును చాలా ఏళ్ల నుంచి సాగు చేస్తూ ప్రతి ఏటా రూ. 25 లక్షలను సునాయాసంగా ఆర్జిస్తున్నారు. తనకున్న 50 ఎకరాల పొలంలో పాతిక ఎకరాల్లో 16 రకాల వెదురు తోటను పెంచుతున్నారు. మిగతా 25 ఎకరాలను ఇతర రైతులకు కౌలుకు ఇచ్చారు.వెదురు సాగులో కొద్దిపాటి యాజమాన్య చర్యలు తప్ప చీకూ చింతల్లేవు, పెద్దగా కష్టపడాల్సిందేమీ ఉండదు. ఏటేటా నిక్కచ్చిగా ఆదాయం తీసుకోవటమే అంటున్నారు శివాజీ. వెదరు సాగు ద్వారా పర్యావరణానికి బోలెడంత మేలు చేస్తున్న ఈ ఆదర్శ రైతు ఉద్యమ స్ఫూర్తితో బంజరు, ప్రభుత్వ భూముల్లో విరివిగా మొక్కలు నాటటం ద్వారా పర్యావరణానికి మరెంతో మేలు చేస్తున్నారు. ఆయన నాటిన 7 లక్షల చెట్లు ఆయన హరిత స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తూ ఆయనకు 30కి పైగా పర్యావరణ పరిరక్షణ పురస్కారాల పంట పండించాయి! ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర, యుఎస్ఎ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వంటి పురస్కారాలు ఆయనకు లభించాయి. పెద్ద కమతాల్లో వెదురు సేద్యానికి సంబంధించి శివాజీ రాజ్పుట్ అనుభవాలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తాయి.శివాజీ రాజ్పుట్ వయసు 60 ఏళ్లు. వినూత్న రీతిలో వెదరును సాగు చేయటం ద్వారా, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయటం ద్వారా ఆయన తన జీవితాన్ని ఆకుపచ్చగా మార్చుకోవటమే కాదు ఇతరుల జీవితాలను కూడా ఆకుపచ్చగా మార్చుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు పాతికేళ్లుగా విశేష కృషి చేస్తున్న శివాజీ గత ఆరేళ్లుగా వెదురు తోటను సాగు చేస్తున్నారు. వాతావరణ ప్రతికూలతలను తట్టుకొనేలా వ్యవసాయాన్ని కొనసాగించటంలో, పర్యావరణ పరిరక్షణ కృషిలో, గ్రామీణాభివృద్ధి రంగంలో మహారాష్ట్రలో ఇప్పుడాయన ఒక మేరు పర్వతం అంటే అతిశయోక్తి కాదు. ఆయన చేస్తున్న కృషి భూతాపోన్నతిని తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతోంది.వెదురు సాగుకు శ్రీకారం..రాజ్పుట్ గతంలో అందరు రైతుల మాదిరిగానే ఒకటో రెండో సీజనల్ పంటలను రసాయనిక వ్యవసాయ పద్ధతిలో పండించే వారు. అయితే, భారీ వర్షాలు, పెను గాలులు, కరువు వంటి విపరీత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మూలంగా అనిశ్చితిలో కొట్టుమిట్టాడేవారు. ‘భారీ వర్షాలు, పెను గాలులు, కరువు వంటి విపత్తులు వచ్చిపడినప్పుడు సాధారణ పంటలు సాగు చేస్తున్నప్పుడు ఒక్కోసారి పంట పూర్తిగా చేజారిపోయేది. కానీ, వెదురు తోట అలాకాదు. నాటిన ఒక సంవత్సరం తర్వాత నుంచి ఆదాయం వస్తూనే ఉంటుంది. ఏటేటా నిరంతరం పెట్టుబడుల అవసరమే ఉండదు..’అంటారు శివాజీ. సాధారణ పంటల సాగును చుట్టుముట్టిన అనిశ్చితే తనను నిశ్చింతనిచ్చే వెదరు సాగువైపు ఆకర్షించిందంటారాయన. ఆయనకు 50 ఎకరాల భూమి ఉంది. 25 ఎకరాలను కౌలుకు ఇచ్చి, 25 ఎకరాల్లో వెదురు నాటారు. ఈ నిర్ణయమే తన వ్యవసాయాన్ని మేలి మలుపు తిప్పింది. ‘వెదురు సాగులో విపరీత వాతావరణ పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిందేమీ ఉండదు.వెదురు మొక్కలు వేరూనుకొనే వరకు మొదటి ఏడాది కొంచె జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత పెద్ద పని గానీ, పెట్టుబడి గానీ అవసరం ఉండదు. మొదటి ఏడాది తర్వాత నేను పెద్దగా పెట్టిన ఖర్చేమీ లుదు. కానీ, ఏటా ఎకరానికి రూ. లక్ష ఆదాయం వస్తోంది. వెదురు తోట ద్వారా నాకు ఏటేటా రూ. 25 లక్షల ఆదాయం వస్తోంది..’ అంటారు శివాజీ గర్వంగా!వెదురు: ఆకుపచ్చని బంగారంవెదరుకు ఆకుపచ్చని బంగారం అని పేరు. ఈ తోట సాగులో అంత ఆదాయం ఉంది కాబట్టే ఆ పేరొచ్చింది. ‘ఈ భూగోళం మీద అతి త్వరగా పెరిగే చెట్టు వెదురు! పర్యావరణానికి ఇది చేసే మేలు మరేఇతర చెట్టూ చెయ్యలేదు. ఇది 24 గంటల్లో 47.6 అంగుళాల ఎత్తు పెరుగుతుంది. ఇతర చెట్ల కన్నా 35% ఎక్కువ కార్బన్ డయాక్సయిడ్ను పీల్చుకొని 30% అదనంగా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. భూతాపోన్నతిని ఎదుర్కొనే కృషిలో ఇందుకే వెదురు అతికీలకంగా మారింది’ అని వివరించారు శివాజీ. బహుళ ప్రయోజనకారి కావటం అనే మరో కారణం వల్ల కూడా వెదురు సాగు విస్తృతంగా వ్యాపిస్తోంది. రాజ్పుట్ తన తోటలో 19 రకాల వెదురును సాగు చేస్తున్నారు. ఒక్కో రకం వెదురు ఒక్కో పనికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అగరొత్తుల ఉత్పత్తి ఉపయోగపడేది ఒకటైతే, బొగ్గు తయారీకి మరొకటి, బయోమాస్ ఇంధనం ఉత్పత్తికి మరొకటి.. ఇలా ఒక్కో రకం ఒక్కో పనికి ఎక్కువగా పనికొస్తాయి. ‘వెదురు బొంగులు, ఆకులు పెల్లెట్లు తయారు చేస్తారు.పౌడర్లు బయోమాస్ ఇంధన ఉత్పత్తికి వాడుతారు. ఈ ఉత్పత్తులు పర్యావరణ హితమైనవి. సాధారణ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వాడదగినవి అంటారు శివాజీ. వెదురును సాగు చేయటం దగ్గరే ఆయన ఆగిపోవటం లేదు. వెదురు బొంగులతో ఫర్నీచర్ను, అగరొత్తులను కూడా తానే తయారు చేయాలన్నది ఆయన సంకల్పం. సుస్థిర జీవనోపాధిని అందించగలిగిన వెదురు సాగు ప్రయోజనాల గురించి ఆయన ఇతర రైతులను చైతన్యవంతం చేస్తున్నారు. ‘136 రకాల వెదురు వంగడాలు ఉన్నాయి. వాటిల్లో 19 రకాలను నేను సాగు చేస్తున్నా. ప్రతి రకానికి ప్రత్యేక లక్షణాలు, ఉపయోగాలు ఉన్నాయి. రకాన్ని బట్టి వెదురు బొంగుల బలం, బరువు ఆధారపడి ఉంటాయి. మన అవసరాన్ని బట్టి ఏ రకాలు కావాలో ఎంపిక చేసుకొని నాటుకోవటం ఉత్తమం’ అనేది ఆయన సూచన.ఆచరణాత్మకంగా ఉండే ఆయన సూచనలు ఇతర రైతులను అనుసరించేలా చేస్తున్నాయి. మహరాష్ట్ర ప్రభుత్వం నుంచ వనశ్రీ పురస్కారంతో పాటు ఇందిరా ప్రియదర్శిన వృక్షమిత్ర అవార్డు వంటి మొత్తం 30 వరకు అవార్డులు ఆయనను వరించాయి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటినిపొదుపుగా వాడుకోవటం వీలుకావటంతో పాటు వెదురు మొక్కలు ఏపుగా పెరగానికి కూడా ఇది ఉపయోగపడిందంటారాయన.వనశ్రీ ఆక్సిజన్ పార్కువనశ్రీ ఆక్సిజన్ పార్క్ను రాజ్పుట్ మూడేళ్ల క్రితం నిర్మించారు. చనిపోయిన తమ ప్రియతముల గౌరవార్థం ఇటువంటి వనశ్రీ ఆక్సిజన్ పార్కులు ్రపారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘నా ప్రియతముల పుట్టిన రోజున మొక్కలు నాటుతున్నా. ఇతరులను కూడా ఇదే కోరుతున్నా’ అన్నారాయన. వెదురు సాగు భవిష్యత్తు తరాల బాగు కోసం, బంగారు భవిష్యత్తు కోసం మనం ఇప్పుడు పెట్టే తెలివైన పెట్టుబడే అంటారాయన. ఇతర రైతులకు ప్రేరణరాజ్పుట్ వెదురు తోట విజయగాథతో ప్రేరణ పొందిన రైతులు పలువురు ఆయనను అనుసరిస్తున్నారు. ధులే జిల్లాలోని షిర్పూర్ తాలూకాలో ఆయన సూచనల ప్రకారం 250 ఎకరాలకు వెదురు తోటలు విస్తరించాయి. పేపరు ఉత్పత్తికి వెదురు ఉపయోగపడుతుంది. స్థానికులకు, గ్రామీణ జనసముదాయాలకు వెదరు సాగు చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదంటారాయన. భూమిని పర్యావరణానికి అనుగుణంగా వినియోగించడాన్ని ్రపోత్సహించదలిస్తే వెదురును విస్తృతంగా సాగు చేయించాలని సూచిస్తున్న రాజ్పుట్ వెదురు భవిష్యత్తు చాలా మెరుగ్గా ఉంటుందన్నారు. ఆయన 7 లక్షలకు పైగా ఇతరత్రా మొక్కలు నాటించటం వల్ల ఆ ప్రాంతంలో జీవవైవిధ్యం పెరిగింది. భూగర్భ జలమట్టం పూర్వస్థితికి పెరిగింది. వర్షానికి మట్టి కొట్టుకుపోవటం తగ్గింది. వన్య్రపాణులకు ఆవాసాలు పెరిగాయి.

గురుత్వాకర్షణ లేని కురుల అందం!
కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ‘మీ జుట్టు బాగుంది. అందంగా, దృఢంగా ఉంది. నేనేమీ జోక్ చేయడం లేదు. ఇది నిజం’ అని సునీతా విలియమ్స్ (Sunita Williams) జుట్టు గురించి ప్రశంసలతో ముంచెత్తాడు. జుట్టు అందం గురించి ప్రశంసలు వినడం సాధారణ విషయమే అయినా... అంతరిక్షంలో జుట్టును అందంగా, శుభ్రంగా కాపాడుకోవడం ఆషామాషీ విషయం కాదు! భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల తల స్నానం (Head Bath) చేయడం అనేది మనకసలు సమస్య కాదు. తలకు కాస్తంత షాంపు రుద్దుకొని షవర్ కింద నిలబడితే సరిపోతుంది.కాని అంతరిక్షంలో అలా కాదు. జుట్టు శుభ్రం చేసుకోవడం వ్యోమగాములకు కష్టమైన పని, దీనికి కారణం స్పేస్స్టేషన్లో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం.నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ కరెన్ నైబర్గ్ అంతరిక్షంలో జుట్టు ఎలా శుభ్రం చేసుకుంటారో ఒక వీడియోలో చూపించింది. ఈ జీరో గ్రావిటీ హెయిర్ వాషింగ్ ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంది. ‘హెయిర్ వాష్ (Hair Wash) చేసుకోవడానికి నేను వీటిని ఉపయోగిస్తాను’ అంటూ గోరు వెచ్చని నీటి పాకెట్, షాంపూ బాటిల్, దువ్వెన, అద్దం, వైట్ టవల్ చూపించింది.మొదట నీళ్లను తలపై స్ప్రే చేసుకుంది. దువ్వెనతో తల వెంట్రుకలను పైకి దువ్వడం మొదలుపెట్టింది. వెంట్రుకలు కుదురుగా ఉండకుండా వివిధ దిశలలో ఎగురుతూనే ఉన్నాయి. ఆ తరువాత షాంపూ రాసుకుంది. మళ్లీ తల వెంట్రుకలను పైకి దువ్వింది. తరువాత టవల్తో తల క్లీన్ చేసుకుంది. మళ్లీ తలపై వాటర్ స్ప్రే చేసి దువ్వెనతో పైకి దువ్వింది, టవల్తో తుడుచుకుంది. ‘శుభ్రం చేసుకునేటప్పుడు జుట్టును సరిగ్గా పట్టుకోవడం కష్టమవుతుంది’ అంటుంది నైబర్గ్.నైబర్గ్ తన జుట్టును స్థిరమైన స్థితిలో ఉంచడానికి పడుతున్న కష్టం మనకు వీడియోలో కనిపిస్తుంది. దువ్వుతున్నప్పుడు ఆమె జుట్టు వివిధ దిశలలో ఎగురుతుంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) లోపల ఎయిర్ ఫ్లో తలపై తేమను ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లో డ్రైయర్ల అవసరం ఉండదు. చాలాసార్లు వ్యోమగాములు హెల్మెట్ (Helmet) లేదా హెడ్గేర్లను ధరిస్తారు. ఇది నెత్తిమీద గాలి ప్రసరణ (ఎయిర్ సర్క్యులేషన్)ను బ్లాక్ చేస్తుంది. జుట్టును ఫ్రీగా వదిలేయడం వల్ల చల్లగా, సౌకర్యవంతంగా ఉంటుంది.చదవండి: సునీత రాక.. బైడెన్పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలునిరంతరం బ్రష్ చేయడం వల్ల కూడా జుట్టును ముడి వేయాల్సిన అవసరం ఉండదు. భూమిమీద తల వెంట్రుకలు బుద్ధిగా మన మాట వింటాయి. అంతరిక్షంలో మాత్రం ‘నా ఇష్టం’ అన్నట్లుగా ఉంటాయి. అయితే వాటి ఇష్టం వ్యోమగాములకు కష్టం కాదు. చాలామంది మహిళా వ్యోమగాములు తమ జుట్టును ఫ్రీగా వదిలేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. భూమిపై మాదిరిగా తల వెంట్రుకలు (Hair) ముఖంపై పడవు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యమూ ఉండదు.

వెల్కమ్ సునీత
వినోదం కోసం నిర్మించే ‘బిగ్బాస్’ షోను మనం ఫాలో అయినట్టుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలిమయ్స్ వార్తలు ఫాలో అయ్యామా? 60 ఏళ్ల వయసులో ఆమె ఏం చెప్పడానికి అంతరిక్షంలో పరిస్థితులను ధిక్కరించి చిర్నవ్వును నిలబెట్టుకుంది? ‘నీకేం రాదు ఊరుకో’ అని ఇకపై స్త్రీలతో ఎవరూ అనకూడదు. సైకిల్ నుంచి స్పేస్ స్టేషన్ వరకు వారు రిపేర్ చేయగలరు. వెల్కమ్ సునీతా. నీ విజయం మాకు గర్వకారణం... సునీత విలియమ్స్ అంతరిక్షాన్ని జయించి సగర్వంగా భూమిని తాకనున్న మహిళ.పదిరోజుల ముందు మహిళా దినోత్సవం చేసుకున్నాం కదా. ఆ దినం వస్తుంది అంటేనే నాకు భయం వేస్తుంది. మహిళకు పది, పదహారు చేతులు పెట్టి ఓ చేతిలో కంప్యూటర్, ఓ చేతిలో పెన్ను, పుస్తకం, ఓ చేతిలో చీపురు కట్ట, ఇంకో చేతిలో అట్లకాడ; ఆడాళ్ళు ఏ పనైనా చేసేస్తారు, చేసెయ్యాలి; కానీ ఎంత గొప్ప పనులు చేసినా డిఫాల్ట్గా అట్లకాడ లేదా పప్పు గరిట లేనిదే స్త్రీ శక్తికి పరిపూర్ణత రాదు అని సందేశం ఇస్తారు. ఈ తలతిక్క వేడుకల మధ్యలో సునీత విలియం జీవన ప్రయాణం, వ్యోమగామిగా ఆమె సాధించిన విజయాలు, అంతరిక్ష నడకలు, నాసాకి చేసిన కృషి గురించి గుర్తు చేసుకోవడం ఒక ఊరట. స్టెమ్ రంగాలలో మహిళల విజయాలకు స్ఫూర్తిమంతమైన వేడుక.1965లో అమెరికాలో పుట్టిన సునీత నేపథ్యం రీత్యా, తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కావడం భారతీయులకు ఆమెను దగ్గర చేసే అంశం కాగా సునీత విజయాలు తేదీలతో,ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రపంచ మహిళలంతా ఉత్సవాలు చేసుకోవలసిన సందర్భం. సునీత తొమ్మిదిసార్లు; అరవై గంటలకన్నా ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్ చేసిన మహిళలందరిలో ‘ఎక్కువ సమయం’ రికార్డ్ ఆమెదే.భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్, గుజరాత్ టెక్నలాజికల్ యునివర్సిటీ గౌరవ డాక్టరేట్, విశ్వ గుజరాత్ సొసైటీ వారి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశ్వప్రతిభ అవార్డుతో పాటు, రష్యా ప్రభుత్వం మెడల్ ఫర్ మెరిట్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అమెరికన్ డిఫెన్స్ సర్వీస్ సుపీరియర్ మెడల్ లాంటి లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమె ఖాతాలో చేరి తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. సునీత నౌకాదళంలో డైవింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆమె 2770 కన్నా ఎక్కువ గంటలు విమానాలు నడిపారు. నాసాలో అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. 2006–07లో ఖీ –116 మిషన్ ద్వారా మొదటిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లి అక్కడ 195 రోజులు గడిపారు. ఆ తర్వాత 2012లో ఎక్స్పెడిషన్ 32/33లో మరొకసారి అంతరిక్షం చేరుకుని, బోలెడు ప్రయోగాలు చేశారు. ఇంకా చాలా చాలా. గత జూన్ లో స్వల్పకాల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు కానీ, బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో లోపాలు తలెత్తడంతో అక్కడే దీర్ఘకాలం చిక్కుకుపోయినా మొక్కవోని ధైర్యం ప్రదర్శించి భూమికి వెనుతిరిగారు.ఐ కమాండర్ సునీత న్యూస్ విన్నప్పుడు నాకు అనేక విషయాలు ఆలోచనకు వచ్చాయి. మానవ జాతికి పనికి వచ్చే పరిశోధనల కోసం ఆస్ట్రోనాట్స్ అంతరిక్షానికి వెళతారు. అదే క్రమంలో సునీత స్పేస్స్టేషన్లో చిక్కుకుని పోతే భూమ్మీద కులాసా జీవితం గడిపే మనం ఎంతమాత్రం వారి గురించి తలచుకున్నాం? వినోదంలో భాగంగా ఒక హౌస్లో కొందరు చేసే అల్లరి, ఆటపాటలు, న్యూసెన్ ్స గొడవలు చూపిస్తే, ఎందుకూ పనికిరాని వాటిని ఆసక్తితో చూస్తూ వుంటాం.సునీత అంతరిక్షంలో గడిపిన సమయంపై టీవీలో వస్తే ఆ సమాచారానికి, ముఖ్యంగా మనప్రాంతంలో టీఆర్పీ రేటింగ్స్ ఏ మేరలో ఉంటాయో! మొత్తంగా మన ఆసక్తులను పునర్ నిర్వచించమని, వాటిని పనికొచ్చే కార్యక్రమాల్లో పెట్టమని సునీత ఇవాళ మనకు సందేశం ఇస్తోంది. సునీత, అరవై ఏళ్లకు దగ్గర పడుతున్నది. ఈ దశలో చాలామంది ఆడవాళ్ళు పోస్ట్ మెనోపాజ్ సమస్యలను ఎదుర్కొంటూ ఇవాళ బాగా గడిస్తే చాలు, ఇంట్లో పనులు అవసరం అయినంత మేర చేస్తే చాలు, ఆఫీసులో అక్షింతలు పడకుండా బైటపడితే చాలు అనుకుంటారు. కానీ ఈ దశ మరింత ఉత్పాదక అభివృద్ధికి అడ్డంకి కాదు అని సునీత మనతో చెబుతోంది. సైకిల్ మెకానిజం సైతం మగవారి డొమైన్గా పరిగణన చేసే మన సమాజంలో, కృషి, పట్టుదలకి తోడు అవకాశం కల్పిస్తే మహిళ ఎయిర్ మెకానిక్ కావడం సాధ్యమే అని సునీతని చూస్తే అర్థం అవుతోంది. – డాక్టర్ ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, ప్రోఫెసర్, రచయిత్రి
ఫొటోలు


నటి సుమలత మనవడి నామకరణ వేడుక (ఫోటోలు )


‘ఇదిగో చూడు.. చంద్రబాబే చెప్పారు కదయ్యా..!’ ఫ్రీ బస్సు అమలుపై వినూత్న నిరసన (ఫొటోలు)


చూపులతోనే కేక పుట్టిస్తోన్న మీనాక్షి చౌదరి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు


యాదగిరిగుట్టలో ప్రపంచ సుందరి ప్రత్యేక పూజలు (ఫొటోలు)


క్షేమంగా భూమిపైకి తిరిగొచ్చిన సునీత విలియమ్స్ (ఫోటోలు)


హల్దీ వేడుకను గుర్తు చేసుకున్న కోలీవుడ్ నటి ఇంద్రజ శంకర్ (ఫొటోలు)


పెళ్లిలో సాయిపల్లవి సిస్టర్స్ హంగామా.. ఒకరిని మించి మరొకరు (ఫొటోలు)


మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తున్న అషురెడ్డి.. (ఫోటోలు)


కొత్తింట్లో అడుగుపెట్టిన వాషింగ్టన్ సుందర్.. గృహ ప్రవేశం (ఫొటోలు)


వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
International View all

Putin: ఎవరి మాటా వినని సీతయ్య!
మాస్కో: ప్రపంచ అధినేతల్లో..

ఖగోళ యుద్ధంలో శనిదే ఘన విజయం
‘చంద్ర సైన్యం’ (మూన్స్ ఆర్మీ) సంఖ్యాపరంగా రారాజు శనిని కొట్టే గ్రహం ఇక దరిదా

సునీత లానే అంతరిక్షంలో చిక్కుకుపోయిన ‘హీరో’
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్(

Sunita Williams: సునీతా విలియమ్స్ను స్వాగతించిన డాల్ఫిన్లు
వాషింగ్టన్: అమెరికన్ వ్యోమగాములు సునీతా విలియమ్స్(

Sunita Williams: ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’: వైట్హౌస్
వాషింగ్టన్ డీసీ: తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగా
National View all

ఓం భూం.. బుష్..: తెలంగాణ బడ్జెట్ పై బండి సంజయ్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రవేశపెట్టిన బడ్జెట

పోలీసులే దొంగను నిద్రలేపారు
కర్ణాటక: అర్థరాత్రి వేళ ఇంటి చోర

Sunita Williams: భూమి మిమ్మల్ని మిస్ అయ్యింది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన నాసా వ్యోమగాములు సునీతా

‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో ఈడీ విచారణకు లాలూ
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్(

ఔరంగజేబు రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చ: డిప్యూటీ సీఎం వ్యాఖ్యల దుమారం
Aurangzeb Controversy మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి త
National View all

పెద్దలను కాదని ఆమెతో ప్రేమ పెళ్లి.. అతడి పరిచయంతో సీన్ రివర్స్..
లక్నో: ఆమెను ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకోవడమే అతడి ప్రాణ

భారత్ను విమర్శించి తప్పుచేశా: శశిథరూర్
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి ఆసక్తికర కామ

High Alert: పాక్లో వరుస ఉగ్రదాడులు.. జమ్ముకశ్మీర్లో హై అలర్ట్
న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా పాకిస్తాన్(

సునీతా విలియమ్స్ స్వగ్రామంలో సంబరాలు
న్యూఢిల్లీ: దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన నాసా వ్యోమగామి సున

సునీతా విలియమ్స్కు ప్రధాని మోదీ లేఖ.. ఏమన్నారంటే?
ఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్
NRI View all

సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్ రిక్వెస్ట్!
భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్యం కేసులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో

ఏయూ హాస్టల్కి నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత మంచాలు
ఆంధ్ర యూనివర్సీటీలో విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో, ఆంధ్ర

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా

Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్
International View all

అమెరికాలో మరో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం
ఆరేలియో మార్టినెజ్: అమెరికాలోని హోండురాస్(

సునీత రాక.. బైడెన్పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ

Sunita Williams: భావోద్వేగంలో సునీతా సోదరి ఫల్గునీ పాండ్యా
న్యూఢిల్లీ: తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యో

సునీతా విలియమ్స్కు ప్రధాని మోదీ లేఖ.. ఏమన్నారంటే?
ఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్

అంతరిక్షంలో 9 నెలలున్నాక.. ఎదురయ్యే సమస్యలివే..
వాషింగ్టన్: అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర
NRI View all

Updates: విజయవంతంగా భూమ్మీదకు సునీత అండ్ కో
అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ల్యాండైన సునీతా విలియమ్స్ అండ్ కో

నాట్స్ తెలుగు సంబరాలు సినీ ప్రముఖులకు ఆహ్వానం
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ బృందం పలువురు సిన

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది.

USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్లో ఏం జరిగింది?
వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ
క్రైమ్

లవ్వర్ పిలుస్తోందంటూ.. యువకుని హత్య
నెల్లూరు(క్రైమ్): రౌడీషీటర్ చింటూ హత్య కేసులో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు వేదాయపాళెం పోలీస్స్టేషన్లో నగర డీఎస్పీ పి.సింధుప్రియ, స్థానిక ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డితో కలిసి హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను వెల్లడించారు. పాత వేదాయపాళేనికి చెందిన అరవభూమి సుజన్ కృష్ణారెడ్డి అలియాస్ చింటూ (28) రౌడీషీటర్. అతడిపై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. చింటూకు ఇందిరాగాంధీనగర్కు చెందిన కృష్ణసాయి అలియాస్ కిట్టు స్నేహితుడు. వీరి మధ్య విభేదాలున్నాయి. చింటూ గతంలో కిట్టు ఇంటికి వెళ్లి గొడవపడి చంపుతానని అందరిముందు బెదిరించాడు. అవమానంగా భావించిన కిట్టు ఈ విషయాన్ని తన స్నేహితులైన కొత్తూరు రామకోటయ్యనగర్కు చెందిన కరిముల్లా, ఇందిరాగాంధీనగర్కు చెందిన షేక్ మహ్మద్బాబా, వెంగళరావ్నగర్కు చెందిన జి.పవన్, ఫ్రాన్సిన్ అనిక్రాజ్ అలియాస్ అనిక్రాజ్, మనుబోలు మండలం కోదండరామపురానికి చెందిన కె.సాయితేజకు జరిగిన విషయాన్ని చెప్పాడు. అందరూ కలిసి చింటూ హత్యకు పథక రచన చేశారు.మాట్లాడాలని పిలిచి..చింటూ ఇందిరాగాంధీనగర్లోని ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆమెను కొందరు ఇబ్బందులు పెడుతుండగా ఆ విషయమై మాట్లాడదామని కిట్టు ఈనెల 14వ తేదీ రాత్రి చింటూను ఇందిరాగాంధీనగర్ రెండో వీధికి పిలిచాడు. అక్కడే కాపుకాసిన నిందితులు చింటూ రాగానే కత్తులతో విచక్షణారహితంగా నరికి హత్య చేసి పరారయ్యారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం వెంగళరావ్నగర్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులపై త్వరలో రౌడీషీట్లు తెరుస్తామని డీఎస్పీ చెప్పారు.

వాడు దీపును చంపాడు.. మాకు అప్పగించండి
అనకాపల్లి, సాక్షి: జిల్లాలోని కశింకోట మండలం బయ్యవరంలో మర్డర్ మిస్టరీ వీడింది. ఓ ట్రాన్స్జెండర్ను ప్రియుడే అతికిరాతకంగా హతమార్చిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోతున్న హిజ్రాలు పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. తమ స్నేహితురాలిని ముక్కలు చేసిన నిందితుడిని అప్పగించాలంటూనాందోళన చేపట్టారు.దీపు అనే ట్రాన్స్జెండర్ను ఆమె ప్రియుడు బన్నీ దారుణంగా హతమార్చాడు. ఆ శరీర భాగాలను వేరు చేసి బెడ్షీట్లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేశాడు. ఈ ఘోరం స్థానికంగా కలకలం రేపింది. శరీర భాగాలను సేకరించిన పోలీసులు.. చివరకు మృతదేహం నాగులపల్లికి చెందిన దిలీప్ అలియాస్ దీపు అనే హిజ్రాగా గుర్తించారు. అనంతరం ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. బన్నీతో రీకన్స్ట్రక్షన్ చేయిస్తున్న పోలీసులు.. హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. వాడిని అప్పగించండితమ స్నేహితురాలిని అతికిరాతకంగా చంపిన హంతకుడిని తమకు అప్పగించాలంటూ హిజ్రాలు పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.అయ్యో.. పాపంకశింకోట మండలం బయ్యవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రెండు మందుల మధ్య ఖాళీ స్థలం దొరికిన ఒక మూటలో మొల దిగువ భాగం కాళ్లు, ఒక చేయి ఉన్నాయి.. మంగళవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మూట విప్పి.. ఆ దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. సుమారు 30 ఏళ్ల వయసు.. చేతికి గాజులు.. కాలికి మట్టెలు.. ఉండడంతో ఆమె వివాహిత అని తొలుత అంతా పొరపడ్డారు. అయితే విచారణలో ఆమె దీపు అనే ట్రాన్స్జెండర్గా తేలింది. 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు ఈ హత్య కేసును ఛేదించడానికి 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. అనకాపల్లి ఎస్పీ సెలవులో ఉండటంతో.. విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. సంఘటన స్థలాన్ని, ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన శరీర భాగాలను కూడా ఆయన పరిశీలించారు. అనకాపల్లిలో మహిళ దారుణ హత్య

కట్టుకున్నోడే.. కాలయముడు
ఇరవై రెండేళ్లు కాపురం చేశారు. ఇద్దరు బిడ్డలను పెంచి పెద్ద చేశారు. కూతురి పెళ్లిని కూడా ఘనంగా చేశారు. చేతికి దొరికిన పనిచేస్తూ బతుకును చక్కగా పండించుకున్నారు. కానీ మద్యం మత్తు మగవాడి ఆలోచనను మార్చేసింది. కష్టసుఖాల్లో ఇన్నేళ్లుగా తోడుగా ఉండి నీడలా నడిచిన జీవన సహచరిపై కోపం పెంచుకునేలా చేసింది. అతడి మనసులో అనుమానపు విషాన్ని కలిపింది. దాని ఫలితం భార్య మరణం.. భర్తకు ఖైదు. కొడుక్కి జీవితకాలపు విషాదం. ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురంలో భర్త చేతిలో భార్య హతమైంది. శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలంలోని సంత సీతారాంపురంలో గాలి నాగమ్మ(42) అనే మహిళను ఆమె భర్త అప్పలరెడ్డి సోమవారం రాత్రి దారుణంగా నరికి చంపేశాడు. ఈ హత్య స్థానికంగా సంచలనం రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పలరెడ్డి, నాగమ్మ దంపతులకు ఇద్దరు బిడ్డలు. రెండేళ్ల కిందటే అమ్మాయికి పెళ్లి చేశారు. కొడుకు త్రినాథరావుతో కలిసి విశాఖలో ఉండేవారు. త్రినాథరావు తాపీమేస్త్రీ కాగా.. తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేవారు. కుటుంబం మొత్తం కష్టాన్నే నమ్ముకుని బతికేది. గత నెలే వీరు స్వగ్రామం సంతసీతారాంపురం వచ్చేశారు. ఇక్కడ సొంతిల్లు ఉండడంతో కుమారుడికి పెళ్లి చేసి మళ్లీ విశాఖ వెళ్లిపోవాలని అనుకునేవారు. స్థానికంగా ఉండటంతో సరుగుడు, నీలగిరి చెట్లు కొట్టటం, తొక్క తీయటం వంటి పనులు చేస్తున్నారు. సోమవారం కూడా రణస్థలంలో నీలగిరి తోట కొట్టేందుకు, తొక్క తీసే పనికి భార్యాభర్తలు వెళ్లారు. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనం చేశారు. కుమారుడు ఇంటి బయట మంచం వేసుకొని పడుకున్నారు. రాత్రి దంపతుల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. అప్పలరెడ్డికి మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో మందు తాగి గొడవపడడం, భార్యను అనుమానించడం వంటి పనులు చేసేవాడు. రాత్రి కూడా ఇలాగే దంపతులిద్దరూ గొడవ పడ్డారు. అయితే రాత్రి పది గంటల సమయంలో ఒక్కసారిగా సరుగుడు, నీలగిరి చెట్లు నరికే కత్తితో ఆమెపై దాడికి తెగబడ్డాడు. మద్యం మత్తులో అతి కిరాతకంగా కత్తితో మెడ, తలపై దాడి చేశాడు. నాగమ్మ పెద్దగా కేకలు వేయడంతో కుమారుడు, చుట్టుపక్కల వారు కంగారు పడి ఇంటిలోకి వెళ్లబోతుండగా.. అప్పలరెడ్డి తలుపులు తీసి బయటకు వెళ్లిపోయాడు. లోపల చూస్తే నాగమ్మ విగతజీవిగా పడి ఉంది. హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. జేఆర్పురం సీఐ ఎం.అవతారం, ఎస్ఐ వి.సందీప్కుమార్, క్లూస్ టీమ్ సంఘటన స్థలాన్ని సందర్శించింది. కుమారుడు త్రినాథరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగమ్మ మృతదేహానికి శ్రీకాకుళం రిమ్స్లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హత్యతో గ్రామమంతా విషాదం నెలకొంది. జేఆర్ పురం సీఐ అవతారం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో దారుణం.. సామూహిక లైంగిక దాడి
సాక్షి, కృష్ణా: కృష్ణాజిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కొందరు వ్యక్తులు మైనర్ను నాలుగు రోజుల పాటు నిర్భంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన మైనర్(14) ఈనెల తొమ్మిదో తేదీన గన్నవరం మండలం వీరపనేని గూడెంలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అనంతరం, ఈనెల 13 న స్నేహితురాaలి ఇంటి నుంచి బయటికి వచ్చింది. రాత్రి సమయంలో ఒంటరిగా కనిపించిన బాలికను ఇద్దరు యువకులు ట్రాప్ చేశారు. ఆమెను బైక్పై కొంత దూరం తీసుకెళ్లి మైనర్పై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం, మరో నలుగురు ఆమెను నాలుగు రోజులు పాటు నిర్బంధించిన లైంగిక దాడి చేశారు.అనంతరం, ఈనెల 17న రాత్రి సమయంలో విజయవాడలోని మైలవరంలో కామాంధులు ఆమెను వదిలిపెట్టి వెళ్లారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్కి జరిగిన విషయాన్ని ఆమె తెలిపింది. దీంతో, సదరు ఆటోడ్రైవర్.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన ఆత్కూరు పోలీసులు.. బాధితురాలిని ఆసుపత్రికి తరలించింది. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు.
వీడియోలు


ప్రజల గుండెలలో YSR స్థానాన్ని చెరిపివేయలేరు: సీదిరి అప్పలరాజు


ఉచిత బస్సు హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియో ప్రదర్శించిన మహిళలు


Sunita Williams: సునీతకు మరో గండం!


డైరెక్టర్ శంకర్ దెబ్బతో కుదేలైన భారీ నిర్మాణ సంస్థ..


YSR పేరు వింటేనే భయం? అందుకే చంద్రబాబు ఇలా చేశాడు


మహిళల భద్రతపై మండలిలో కూటమిని రఫ్ఫాడించిన వరుదు కళ్యాణి


వాకౌట్ చేయడానికి మాకేమైనా సరదానా బొత్స స్ట్రాంగ్ కౌంటర్


ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది


సునీతను నడిపించిన హీరో.. ఎవరీ బ్యారీ విల్ మోర్ ?


తెలంగాణ బడ్జెట్ వేళ.. ఎండిన వరి కంకులతో BRS నిరసన