‘ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలి‘
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పరిశీలకుల సమావేశం జరిగింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలపై సజ్జల రామకృష్ణారెడ్డి, కేంద్ర కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్సార్సీపీ 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెట్టింది. ప్రజలతో కలిసి, ప్రజల కోసమే పనిచేస్తూ పార్టీ ముందుకు సాగుతోంది. జగన్ వెంట నడిచే ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునే స్థాయిలో పార్టీ ఉంది. ప్రజల్లో వైఎస్సార్సీపీపై విశ్వాసం మరింత పెరిగింది. పార్టీ భవిష్యత్ విజయానికి సంస్థాగత బలోపేతం అత్యంత అవసరం. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలి. అన్ని స్థాయిల్లో కమిటీలను త్వరగా పూర్తి చేయాలి. నియోజకవర్గ ఇన్చార్జ్లకు పరిశీలకులు సపోర్టింగ్ సిస్టమ్లా పనిచేయాలి. మన హయాంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలి. టీడీపీ ఫేక్ ప్రచారం, పెయిడ్ క్యాంపెయినింగ్ను వాస్తవాలతో ఎదుర్కోవాలి. ఎన్నికల్లో విజయానికి బూత్ స్థాయి నిర్మాణం చాలా ముఖ్యం. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నారు.
ఫోటో దిగుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయి..
ఖమ్మం: ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా స్టేజ్లపైనే కుప్పకూలిపోయి మృత్యువాత పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లి గుండె పోటుతో మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరానికి చెందిన ఓ మహిళ.. బంధువుల గృహ ప్రవేశ వేడుకకు వెళ్లింది. అయితే అక్కడ ఫోటో దిగుతున్న సందర్భంలో పక్కనున్న మరొక మహిళతో మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయింది. ఆ మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. ఖమ్మం టూటౌన్కు చెందిన బొమ్మ సుస్మిత అనే మహిళ.. ఖమ్మంలోని ఓ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లారు. అయితే అప్పటివరకూ అందరితో కలివిడిగా మాట్లాడుతూ తిరిగిన మహిళ.. ఫోటో దిగుతున్న సమయంలో గుండెపోటుకు లోనైంది. ఒక్కసారిగా పక్కనున్న మహిళపై చేయి వేస్తూనే కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
‘వాళ్ల ఫీజు మన సైనికుల ప్రాణాలు తీస్తోంది’
హండ్రెడ్ మెన్స్ టీ20 టోర్నీకి సంబంధించి ఆటగాళ్ల కోసం జరిగిన వేలంలో కావ్యా మారన్కు చెందిన సన్రైజర్స్ లీడ్స్ పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. వేలంలో అబ్రార్ అహ్మద్ను 1,90,000 పౌండ్లకు (సుమారు రూ. 2.34 కోట్లు) సొంతం చేసుకుంది. అయితే పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం పట్ల సోషల్ మీడియాలో భారత మాజీ క్రికెటర్లు సహా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సన్రైజర్స్ లీడ్స్కు సంబంధించి ‘ఎక్స్’ ఖాతాను కూడా సస్పెండ్ చేయడం గమనార్హం. తాజాగా టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా సన్రైజర్స్ పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ది హండ్రెడ్ టోర్నీలో ఒక ప్రాంచైజీ పాకిస్థాన్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ భారత్కు చెందిన ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ పాక్ ఆటగాళ్లను తీసుకోవడం నచ్చడం లేదు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్థాన్తో సంబంధాలు క్షీణించడంతో ఆ దేశంలో ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఐపీఎల్ వేలంలోనూ పాక్ ఆటగాళ్లను విస్మరించడం జరిగింది. ఐపీఎల్ 2008 సీజన్ మినహా పాక్ ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్లో కనిపించలేదు. కానీ తాజాగా సన్రైజర్స్ యాజమాన్యానికి చెందిన సన్రైజర్స్ లీడ్స్ పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేసింది. సదరు ఫ్రాంచైజీ పాక్ ఆటగాడికి ఫీజు రూపంలో చెల్లించే డబ్బులను అతడు తన దేశానికి పన్నుల రూపంలో చెల్లించడం జరుగుతుంది. పన్నుల రూపంలో వచ్చిన డబ్బులతోనే పాక్ ప్రభుత్వం ఆయుధాలు కొనుగోలు చేస్తున్నది. ఆ ఆయుధాలే ఇవాళ మన భారత సైనికులు, పౌరుల మరణాలకు పరోక్షంగా కారణమవుతున్నాయి. దీంతో తెలిసీ తెలియకో సన్రైజర్స్ లీడ్స్ ఒక రకంగా ప్రాణనష్టానికి పాల్పడుతున్న దేశంతో సంబంధం కొనసాగిస్తున్నట్లే అవుతుంది. అందుకే అభిమానుల ఆగ్రహంలో నాకు తప్పు కనిపించలేదు. ఈ ఆగ్రహం ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.’ అని చెప్పుకొచ్చారు. మరోవైపు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాత్రం.. ‘ఇది మాకు సంబంధించిన విషయం కాదు. అదొక విదేశీ లీగ్. తుది నిర్ణయం ఆ ఫ్రాంచైజీయే తీసుకోవాలి. మేము జోక్యం చేసుకోలేము’ అని పేర్కొన్నారు.కాగా గతేడాది సీజన్ అనంతరం నార్తర్న్ సూపర్చార్జర్స్ ఫ్రాంచైజీని సన్ గ్రూపు కొనుగోలు చేసింది. తొలుత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కేవలం 49% వాటాను మాత్రమే సన్ గ్రూపుకు విక్రయించింది. మిగితా 51 శాతం వాటా యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది. కానీ ఆ తర్వాత కావ్యా మారన్ దాదాపు 100 మిలియన్ పౌండ్ల (సుమారు ₹1,100 కోట్లు) భారీ మొత్తాన్ని వెచ్చించి పూర్తి టేకోవర్ చేసుకుంది. నార్తర్న్ సూపర్చార్జర్స్ జట్టు పేరును సన్రైజర్స్ లీడ్స్గా మార్చారు. ఇక మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్లో తొలి మ్యాచ్లోనే సన్రైజర్స్ గతేడాది చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.చదవండి: నడవలేని స్థితిలో టీమిండియా స్టార్ క్రికెటర్.. వీడియో
వింత ప్రవర్తన: రేబిస్తో కుక్కలా అరుస్తున్న యువకుడు
లక్నో: ఓ 17ఏళ్ల యువకుడు అచ్చం కుక్కలా ప్రవర్తిస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలోని కచ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం, ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలుడి తల్లిదండ్రులు అందించిన వివరాల మేరకు.. కుక్క కరవడం వల్లే తమ కుమారుడు వింతగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్క కరవడం వల్ల రేబిస్ వ్యాధి సోకుతుంది. రేబిస్కు సరైన వైద్యం అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఈ బాలుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడనే అంశంపై వైద్యులు ఆరా తీశారు. రేబిస్కు సరైనా చికిత్స తీసుకోకపోవడం వల్లే బాలుడి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు గుర్తించారు. నాలుగు నెలల క్రితం, ఆ గ్రామంలో నివసించే భాయ్ లాల్ అనే 17 ఏళ్ల యువకుడికి కుక్క కరిచింది. ఈ సమయంలో, అతనికి మొదటి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. రేబిస్ సోకితే ఐదు టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ బాధిత బాలుడు రెండు టీకాలు మాత్రమే తీసుకున్నాడు. పూర్తి స్థాయిలో వైద్యం తీసుకోకుండా మధ్యలో వదిలేయడం వల్ల కొంత కాలంగా బాలుడు కుక్కలా ప్రవర్తించడం ప్రారంభించాడు. వైద్య చికిత్స కోసం ఆస్పత్రులు తిరిగినా ఫలితం కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వైద్యం అందిస్తే తగ్గిపోతుందని బాలుడి కుటుంబ సభ్యులు తమని తాము సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైద్యులు మాత్రం బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు చెప్పారు. మరోవైపు,స్థానిక వైద్యులు సైతం బాలుడికి టీకా పూర్తిస్థాయిలో వేయలేదని చెబుతున్నారు. కాబట్టే బాలుడు మాట్లాడే విధానం, నడక, కూర్చునే తీరు మారిపోయింది. అంతేకాకుండా, అతను బతికే అవకాశాలు దాదాపు లేనట్లేనని అంటున్నారు. బాలుడి పరిస్థితిని వైద్య పరిభాషలో హైడ్రోఫోబియా అని డికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పంకజ్ పాండే వివరించారు. రేబిస్ లక్షణాలు కనిపించినప్పుడు, శ్వాసకోశ మార్గం కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా వ్యక్తి కుక్కలా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు’ అని తెలిపారు. Mirzapur Boy Bitten by Dog 4 Months Ago, Took Only 2 Rabies Shots – Now Acting Like a Dog 😨#mirzapur #rabies #kiranyadav pic.twitter.com/ZuTZTCfJ5Z— Kiran yadav (@Thekiranyadavvv) March 15, 2026
‘ఎదురుచూపులకు తెర.. ఆరోజు వచ్చేసింది’
యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ గుడ్న్యూస్
బాలీవుడ్ బ్యూటీ బర్త్ డే.. శ్రీనివాస మంగాపురం టీమ్ స్పెషల్ వీడియో
‘ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలి‘
అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో
గ్యాస్ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్!
మార్కెట్ అదుర్స్.. అదరగొట్టిన ఆటో షేర్లు..
ఆ ఒక్క ఎంపిక విషయంలోనే గౌతీ భాయ్తో విభేదాలు: సూర్య
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు
గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌలకు ఎంత డిమాండో!!
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
శ్రీ పరాభవ నామ సంవత్సర (2026 – 27) రాశిఫలాలు
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
నా కూతుర్ని సినిమాల్లో ఊహించలేదు.. నాగార్జున వల్లే..
భారత యుద్ధనౌకల మోహరింపు
Hyderabad: మూతపడనున్న బావర్చి రెస్టారెంట్..!
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
ఏమీ తినకున్నా షుగర్ ఎందుకు పెరుగుతుంది?
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!
నెతన్యాహు ఎక్కడ?
మీరు ధర్మం సేయకున్నా పర్వాలేదు కానీ అప్పులు సేసి మానెత్తిన మాత్రం వేయకండి సార్.. పుణ్యముంటుంది!!
రూ. 60వేల పెట్టుబడి.. రూ. 25కోట్ల ఆదాయం!
పైల్స్ నుంచి ఫ్రీ అవండి ఇలా...
‘ఎదురుచూపులకు తెర.. ఆరోజు వచ్చేసింది’
యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ గుడ్న్యూస్
బాలీవుడ్ బ్యూటీ బర్త్ డే.. శ్రీనివాస మంగాపురం టీమ్ స్పెషల్ వీడియో
‘ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలి‘
అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో
గ్యాస్ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్!
మార్కెట్ అదుర్స్.. అదరగొట్టిన ఆటో షేర్లు..
ఆ ఒక్క ఎంపిక విషయంలోనే గౌతీ భాయ్తో విభేదాలు: సూర్య
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు
గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌలకు ఎంత డిమాండో!!
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
శ్రీ పరాభవ నామ సంవత్సర (2026 – 27) రాశిఫలాలు
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
నా కూతుర్ని సినిమాల్లో ఊహించలేదు.. నాగార్జున వల్లే..
భారత యుద్ధనౌకల మోహరింపు
Hyderabad: మూతపడనున్న బావర్చి రెస్టారెంట్..!
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
ఏమీ తినకున్నా షుగర్ ఎందుకు పెరుగుతుంది?
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!
నెతన్యాహు ఎక్కడ?
మీరు ధర్మం సేయకున్నా పర్వాలేదు కానీ అప్పులు సేసి మానెత్తిన మాత్రం వేయకండి సార్.. పుణ్యముంటుంది!!
రూ. 60వేల పెట్టుబడి.. రూ. 25కోట్ల ఆదాయం!
పైల్స్ నుంచి ఫ్రీ అవండి ఇలా...
ఫొటోలు
‘ఉస్తాద్ భగత్సింగ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
OSCARS 2026 : ఆస్కార్ విజేతల జాబితా (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
వైట్ డ్రెస్లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
తెలంగాణ వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు (ఫొటోలు)
అల్లు సినిమాస్ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)
సినిమా
కంటతడి పెట్టించిన చిత్రానికి ‘ఆస్కార్’.. ఏ ఓటీటీలో ఉందంటే?
ఒక సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం అంటే మామూలు విషయం కాదు.కేవలం భారీ బడ్జెట్, హంగులు ఉంటే సరిపోదు,ఆ సినిమా వెనుక ఒక బలమైన ఆత్మ ఉండాలి. సమాజానికి అవసరమైన సందేశం, మనుషుల మధ్య సంబంధాలు, సామాజిక అసమానతలు లేదా మానవీయ విలువల చుట్టూ తిరిగే కథలకే ఆస్కార్ టీమ్ ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. 98వ అకాడమీ అవార్డుల్లోనూ అదే జరిగింది. తండ్రి, కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో తెరకెక్కిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’కి ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. అంతేకాదు ఉత్తమ దర్శకుడు(పాల్ థామస్ అండర్సన్), ఉత్తమ సహాయ నటుడు(షాన్ పెన్), ఎడిటింగ్(యాండీ జుర్గెన్సన్ ), కాస్టింగ్(కసాండ్రా కులుకుందిస్), అడాప్టెడ్ స్క్రీన్ప్లే (పాల్ థామస్ అండర్సన్ )తో పాటు మొత్తం ఆరు ఆస్కార్ అవార్డులు అందుకొని ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ రికార్డు సృష్టించింది.‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ కథేంటి?బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమే ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’. మాజీ విప్లవకారుడు బాబ్ పాత్రలో ‘టైటానిక్’ ఫేమ్ లియోనార్డో డికాప్రియో నటించాడు. బాంబ్, పెర్ఫిడియా బేవర్లీ హిల్స్ (టియానా టేలర్) కలిసి సహజీవనం చేస్తుంటారు.పెర్ఫిడియా బేవర్లీ హిల్స్కి విప్లవ భావజాలం ఎక్కువ. ఓసారి వలసదారులను విడిపించే క్రమంలో అక్కడి కమాండింగ్ అధికారి స్టీవెన్ని ఆమె అవమానిస్తుంది. దీంతో పెర్ఫిడియాపై స్టీవెన్ పగపెంచుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత ఓ కేసులో ఆమెను పట్టుకొని..తనతో గడిపితే వదిలేస్తానని ఆఫర్ ఇస్తాడు. దీనికి పెర్ఫిడియా ఒప్పుకుంటుంది. అతని కారణంగా ఓ బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ కోసం తండ్రి పోరాటంకొన్నాలకు ఆ చిన్నారితో పాటు తన జీవిత భాగస్వామి బాబ్ని వదిలేసి విప్లవ బాట పడుతుంది. దీంతో ప్యాట్ ఒంటరి చిన్నారి చార్లీన్ను పెంచుతాడు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటారు. కొన్నాళ్ల తర్వాత స్టీవెన్కు ఆ చిన్నారి తన కూతురే అనే విషయం తెలుస్తుంది. ఈ విషయం బయటకు వస్తే కెరీరేకే ఇబ్బంది అవుతుందని తెలిసి..ఆమెను చంపేందుకు కుట్రలు పనఉనతాడు. ఈ విషయం బాబ్కి తెలుస్తుంది. తన కూతురిని కాపాడుకునేందుకు బాబ్ ఏం చేశాడు? స్వార్థం తన పరిస్థితులను ఎలా మార్చేసింది? అన్నదే ఈ సినిమా కథ. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషనల్ అండ్ పొలిటికల్ డ్రామా. తన బిడ్డను కాపాడుకునేందుకు తండ్రి పడే తపన తెరపై చూస్తుంటే కన్నీళ్ల ఆగవు.థామస్ పించన్ రాసిన 'వినైల్యాండ్' (Vineland) నవల ఆధారంగా దర్శకుడు పాల్ థామస్ అండర్సన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. గతేడాది సెప్టెంబరు 26న వార్నర్ బ్రదర్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను విడుదల చేసింది. 175 మిలియన్ డాలర్లతో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 209.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ప్రియుడితో పెళ్లి.. మెసేజ్ పెట్టిందన్న హీరోయిన్ తండ్రి
మలయాళ హీరోయిన్ అహానా కృష్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ప్రియుడు నిమిష్ రవితో ఏడడుగులు వేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తండ్రి, నటుడు కృష్ణ కుమార్ ధ్రువీకరించాడు. వెరైటీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూతురి పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.మా ఇంటిక్కూడా..అతడు మాట్లాడుతూ.. అహానా పెళ్లి చేసుకుంటానని నాకు మెసేజ్ పెట్టింది. ఆ అబ్బాయిని మాకు ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు మా ఇంటికి ఎన్నోసార్లు వచ్చి వెళ్తుంటాడు. నేను కుర్రవయసులో ఉన్నప్పుడు కూడా అచ్చం నా కూతురిలాగే ఉండేవాడిని. ఏమాత్రం మొహమాటం లేకుండా నా భార్య సింధును పెళ్లికి ముందే ఇంటికి తీసుకెళ్లేవాడిని. దానివల్ల నేనెవర్ని పెళ్లి చేసుకోబోతున్నాను? వాళ్లు ఎలాంటివాళ్లు? అనేది అందరికీ ముందే తెలుస్తుంది. ఏ టెన్షన్ లేకుండా పెళ్లి ప్రశాంతంగా సాగిపోతుంది.30 ఏళ్లుగా తెలుసునిమిష్ తండ్రి, నిర్మాత రవి నాకు 30 ఏళ్లుగా తెలుసు. వాళ్ల కుటుంబంలో ఏ అవసరం వచ్చినా నేను చనువుతో సలహాలు ఇస్తుంటాను. అహానా, నిమిష్ ఓ షార్ట్ ఫిలింలో కలిసి పని చేసినప్పుడు అతడిని కలిశాను. తను చాలా సింపుల్గా ఉంటాడు. అతడి ఎదుగుదల చూస్తుంటే ముచ్చటేస్తేంటుంది. అతడి తండ్రికి ఎన్నో కలలుండేవి. సినిమాకోసం ఎంతో ఖర్చుపెట్టాడు.. ఈ క్రమంలో చాలా కోల్పోయాడు. కానీ దేవుడు అతడి త్యాగాలకు.. పిల్లల రూపంలో ప్రతిఫలాన్ని ఇచ్చాడు అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా అహానా కృష్ణ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవితో ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అహానా తండ్రి మాటల్ని బట్టి వీరిద్దరూ తమ ప్రేమను నెక్స్ట్ స్టెప్కు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి! నిమిష్ రవి.. చివరగా లోక:చాప్టర్ 1 సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. అహానా.. ఎంజన్, స్టీవ్ లోపెజ్, లూకా, పతినేట్టం పది, ఆడి, నాన్సీ రాణి వంటి మలయాళ చిత్రాలతో గుర్తింపు పొందింది.చదవండి: ఆస్కార్ గెలిచిన సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే?
ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్.. అదే ఆయన స్పెషాలిటీ
98వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ నిలిచాడు. సిన్నర్స్ చిత్రంలోని నటనకు ఆయనను ఈ అవార్డు వరించింది. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో వహించిన సిన్నర్స్ చిత్రంలో జోర్డాన్ ద్విపాత్రాభినయంలో కనిపించి కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శనను కనబరిచారు. ఒకే చిత్రంలో కవలలుగా నటించి ఆస్కార్ గెలుచుకున్న తొలి నటుడిగా ఆయన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అలాగే, ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్న ఆరో నల్లజాతీయుడిగా నిలిచారు.బుల్లితెర టు వెండితెరచిత్ర పరిశ్రమలో రాణించడం అంతా ఈజీ కాదు. స్టార్ హోదా సంపాదించాలంటే చాలానే కష్టపడాలి. ఈ విషయంలో మైఖేల్ బీ జోర్డాన్ సినీ ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకమైన పాఠం అని చెప్పాలి. బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి..వెండితెరపై రాణిస్తున్నాడు. చిన్నప్పుడు మోడలింగ్తో మొదలుపెట్టి, 'ది వైర్' (The Wire), 'ఫ్రైడే నైట్ లైట్స్' (Friday Night Lights) వంటి టీవీ సిరీస్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో వచ్చిన 'ఫ్రూట్వేల్ స్టేషన్' ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. ఆస్కార్ గెలిచిన 'సిన్నర్స్' దర్శకుడు ర్యాన్ కూగ్లర్తో ఆయనకు ఇది మొదటి సినిమా. ఇందులో మైఖేల్ నటనకు హాలీవుడ్ ఫిదా అయింది. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే కమర్షియల్ సక్సెస్ మాత్రం 'క్రీడ్' చిత్రంతో వచ్చింది. ఇక మార్వెల్ చిత్రం బ్లాక్ పాంథర్ లో ఆయన పోషించిన 'కిల్మాంగర్' పాత్ర హాలీవుడ్ చరిత్రలోనే అత్యుత్తమ విలన్ పాత్రలలో ఒకటిగా నిలిచిపోయింది.అదే ఆయన ప్రత్యేకతసామాజిక సందేశాన్నిచ్చే చిత్రాల్లో నటిస్తూ.. వైవిధ్యమైన పాత్రలు పోషించడం ఆయన స్పెషల్. హీరోగానే కాకుండా.. పాత్ర నచ్చితే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాడు. హీరోగా బిజీ ఉన్న సమయంలోనే 'బ్లాక్ పాంథర్’లో విలన్గా నటించాడు.నటుడిగానే కాకుండా దర్శకుడిగాను రాణించాడు. 'క్రీడ్ III' చిత్రంతో ఆయన దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా కథా గమనాన్ని నడిపించడంలోనూ ఆయనది ప్రత్యేక.
ఆస్కార్ గెలిచిన సినిమాలు.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే?
సినీప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ఆస్కార్ వేడుక ఘనంగా జరిగింది. మార్చి 16న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు వేదికగా నిలిచింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమా ఏకంగా ఆరు అవార్డుల(ఉత్తమ చిత్రం, దర్శకుడు, సహాయ నటుడు, కాస్టింగ్, అడాప్టెడ్ స్క్రీన్ప్లే ఎడిటింగ్ విభిగాల్లో)ను కైవసం చేసుకుంది. తర్వాత నాలుగు (ఉత్తమ నటుడు, స్క్రీన్ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్) పురస్కారాలతో సిన్నర్స్ రెండో స్థానంలో ఉంది. మరి ఆస్కార్ (Oscars 2026) గెల్చుకున్న సినిమాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయో చూసేద్దాం..వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ : జియో హాట్స్టార్సిన్నర్స్ : జియో హాట్స్టార్ఫ్రాంకెన్స్టీన్ : నెట్ఫ్లిక్స్F1 : యాపిల్ టీవీఅవతార్: ఫైర్ అండ్ యాష్ : ఇంకా ఓటీటీలో విడుదల కాలేదు.వెపన్స్: జియో హాట్స్టార్కెపాప్ డిమాన్ హంటర్స్ : ఈ యానిమేటెడ్ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది.సెంటిమెంటల్ వాల్యూ : అద్దె ప్రాతిపదికన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో అందుబాటులో ఉంది.హామ్నెట్ : యాపిల్ టీవీలో అద్దెకి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.ఆస్కార్ 2026: విజేతల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రీడలు
గేల్ రికార్డు బద్దలు కొట్టడమే లక్ష్యం: వైభవ్ సూర్యవంశీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక అవార్డుల కార్యక్రమం ‘నమన్ –2026’ ఆదివారం ఘనంగా జరిగింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ వేడుకలో భారత సీనియర్, జూనియర్, పురుషులు, మహిళలు, మాజీలు అంతా ఒక్క చోట చేరడంతో సందడి నెలకొంది.ఫైనల్లో 175 పరుగులుఈ అవార్డుల కార్యక్రమంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) హైలైట్ అయ్యాడు. పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బిహారీ పిల్లాడు.. అండర్-19 వరల్డ్కప్-2026 ఫైనల్లో ఇంగ్లండ్పై 175 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఇక నమన్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఆయుశ్ మాత్రే సారథ్యంలోని అండర్-19 వరల్డ్కప్ విజేత జట్టు పురస్కారాలు అందుకుంది. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ.. ‘‘ఈ అనుభూతి గొప్పగా ఉంది. వరల్డ్కప్లో గెలిచి దేశానికి ట్రోఫీ అందించడం ఆనందకరం’’ అని పేర్కొన్నాడు.ఈ మూడింటిలో ఏది ఇష్టం? ఈ క్రమంలో కామెంటేటర్ హర్షా భోగ్లే.. టీమిండియా టీ20 వరల్డ్కప్ విన్నింగ్ స్టార్లు సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మలతో కలిసి వైభవ్ సూర్యవంశీని ప్రశ్నలు అడిగాడు. ‘ఐపీఎల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదడం, ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేయడం.. లేదంటే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించడం.. ఈ మూడింటిలో నువ్వు ఏ రికార్డు సాధించాలని అనుకుంటున్నావు’’ అని వైభవ్ను అడిగాడు.గేల్ రికార్డు బద్దలు కొట్టడమే లక్ష్యంఇందుకు బదులిస్తూ.. ఐపీఎల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలవడమే తన లక్ష్యమని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2013లో వెస్టిండీస్ వీరుడు, యూనివర్సల్ బాస్ క్రిస్గేల్ 175 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇప్పటికీ ఈ రికార్డు ఈ లెఫ్టాండర్ పేరిటే ఉండగా.. మరో లెఫ్టాండర్ వైభవ్ సూర్యవంశీ ఈ రికార్డును బద్దలు కొట్టాడమే తన లక్ష్యమని చెప్పడం విశేషం.కాగా గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి అత్యంత పిన్న వయసు (14) లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 35 బంతుల్లోనే శతకం బాదాడు. ఇదిలా ఉంటే.. ఇటీవలే 15వ వసంతంలో అడుగుపెట్టిన వైభవ్.. ఐపీఎల్-2026కు సన్నద్ధమవుతున్నాడు.చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్పై ద్రవిడ్ ప్రశంసలుVaibhav Suryavanshi wants to break Chris Gayle’s 175 record in the IPL. pic.twitter.com/X4UhulmHBT— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2026
నడవలేని స్థితిలో టీమిండియా స్టార్ క్రికెటర్.. వీడియో
ఐపీఎల్-2026కు కోల్కతా నైట్రైడర్స్కు హర్షిత్ రాణా రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి అతడు దూరమయ్యే అవకాశముంది. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన రానా నడవలేని స్థితిలో కన్పించాడు.ఊతకర్రల సాయంతో హర్షిత్ కుంటుతూ కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అతడు త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ అవార్డు హర్షిత్ రాణాకు దక్కింది. ఈ అవార్డు అందుకోవడానికి రాణా వేదికపైకి కూడా రాలేకపోయాడు. దీంతో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ స్వయంగా వేదిక దిగి రాణాకు ఈ అవార్డును అందజేశారు.కాగా హర్షిత్ గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్-2026 వార్మాప్ మ్యాచ్లో గాయపడ్డాడు. అనంతరం అతడికి అస్ప్రత్రికి తరలించి పలు స్కాన్లు నిర్వహించగా.. సర్జరీ అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో టీ20 ప్రపంచకప్కు కూడా అతడు దూరమయ్యాడు.అనంతరం ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్-19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.Harshit Rana’s injury is quite serious. He is not able to walk properly and is using a stick to walk. Even then, he came to the Naman Awards show today. If he had not come, it would have been completely understandable. Because of this injury, he will also not play in this year’s… pic.twitter.com/KIGdiSdHYV— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 15, 2026చదవండి: IPL 2026: సన్రైజర్స్, సీఎస్కే, ముంబై కాదు.. ఆ జట్టే ఐపీఎల్ విజేత!
‘అతడు మానసికంగా అన్ఫిట్.. అందుకే చోటు కరువు’
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. దాదాపు పదకొండేళ్ల తర్వాత తొలిసారి బంగ్లాదేశ్కు వన్డే సిరీస్ను కోల్పోయింది. బంగ్లా పర్యటనలో భాగంగా మూడో వన్డేలో ఓడి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.షాహిన్ ఆఫ్రిది కెప్టెన్సీలో ఈ మూడు మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్.. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడినా.. రెండో వన్డేలో గెలిచింది. ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన మూడో వన్డేలో మాత్రం 11 పరుగుల తేడాతో ఓటమిపాలై సిరీస్ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ఆట తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎవరు ఎంపిక చేశారు?ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ హెడ్కోచ్ మైక్ హెసన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ‘‘ఈ పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎవరు ఎంపిక చేశారు? అన్నింటిలోనూ అతి జోక్యం అవసరమా? ఇదేమైనా అతడి అంకుల్స్ జట్టా?’’ అంటూ ఫైర్ అయ్యాడు.పాకిస్తాన్ క్రికెట్ను నాశనం చేయడంలో...ఇక చీఫ్ సెలక్టర్ ఆకిబ్ జావేద్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్తాన్ క్రికెట్ను నాశనం చేయడంలో ఆకిబ్ జావేద్ పాత్ర కూడా ఉంది. మైక్ హసన్కు తన సెలక్షన్ అధికారాలను కట్టబెట్టిందే అతడు. హెడ్కోచ్ అయినప్పటికీ.. సెలక్టర్ల పనిని తానే చేస్తున్నాడు. అతడే జట్టు ఎంపిక చేస్తున్నాడు. దీనికి కారణం ఎవరు?’’ అని బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.మానసికంగానే అతడు అన్ఫిట్అదే విధంగా.. బాబర్ ఆజంను బంగ్లాదేశ్ పర్యటన నుంచి తప్పించడంపై ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలపైనా బసిత్ అలీ స్పందించాడు. ఆకిబ్ చెప్పినట్లు బాబర్కు ఎలాంటి గాయమూ కాలేదని పేర్కొన్నాడు. ‘‘బాబర్ ఆజం శారీరకంగా ఫిట్గానే ఉన్నాడు. మానసికంగానే అతడు అన్ఫిట్’’ అంటూ బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా బాబర్ ఆజం గత కొంతకాలంగా ఫామ్లేమితో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలంఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో వన్డేల నుంచి సెలక్టర్లు అతడిని తప్పించినట్లు వార్తలు రాగా.. ఆకిబ్ జావేద్ మాత్రం ఫిట్గా లేనందువల్లే సెలక్ట్ చేయలేదని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాకిస్తాన్ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే, గత వరల్డ్కప్లో సూపర్-8 కూడా చేరుకుండానే నిష్క్రమించిన పాక్.. ఈసారి సూపర్-8కు చేరుకున్నా.. సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ టోర్నీలో బాబర్ ఆజం మొత్తంగా 91 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్పై ద్రవిడ్ ప్రశంసలు
సన్రైజర్స్, సీఎస్కే, ముంబై కాదు.. ఆ జట్టే ఐపీఎల్ విజేత!
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ పండగకు సమయం అసన్నమవుతోంది. ఐపీఎల్-2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఏ జట్లు ప్లేఆఫ్స్కు చేరుతాయో, టైటిల్ విజేత ఎవరన్నదానిపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన అంచనాలను వెల్లడించాడు. ఆకాష్ చోప్రా ఇటీవల క్రిక్స్ యాప్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో పలు ప్రశ్నలు చోప్రాకు ఎదురయ్యాయి.హోస్ట్: ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు) ఎవరు గెలుస్తారు?ఆకాష్ చోప్రా: సంజూ శాంసన్. (ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సీఎస్కే తరపున ఆడనున్నాడు.)హోస్ట్: పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) ఎవరు గెలుస్తారు?చోప్రా: జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్)హోస్ట్: ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ఎవరికి దక్కుతుంది?చోప్రా: వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం).హోస్ట్: ఏ జట్లు ప్లే ఆఫ్స్కు చేరుతాయి?చోప్రా: ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు చేరుతాయి.హోస్ట్: ఐపీఎల్ ట్రోఫీని ఎవరు సొంతం చేసుకుంటారు?చోప్రా: ఈసారి మనం సరికొత్త ఛాంపియన్ను చూడబోతున్నాము. ఆ జట్టే ఢిల్లీ క్యాపిటల్స్కాగా చోప్రా ప్లే ఆఫ్స్కు చేరే జట్ల జాబితాలో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్కు చోటు ఇవ్వకపోవడం గమనార్హం.
న్యూస్ పాడ్కాస్ట్
తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ గుట్టు రట్టు... డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్గా నిర్ధారణ
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రం... ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా భీకర దాడులు
రైతులతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొండాట.. పేరుకే అన్నదాత సుఖీభవ, ఆచరణలో అంతా మోసం
విలువలు, విశ్వసనీయతకు వైఎస్సార్సీపీ మారుపేరు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఆదాయం... కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఇక్కడ బాబు, అక్కడ BR నాయుడు కోట్లల్లో భారీ స్కాం
పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు..ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
బిజినెస్
గిగ్ కార్మికుల ఆదాయంపై యుద్ధ మేఘాలు!
మిడిల్ఈస్ట్ ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు గిగ్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు వీధి వ్యాపారుల నుంచి మెట్రో నగరాల ఫుడ్ డెలివరీ బాయ్స్ వరకు అందరినీ రోడ్డున పడేస్తున్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు మూతపడుతుండటంతో.. డెలివరీ ఆర్డర్లు లేక గిగ్ కార్మికుల ఆదాయం సగానికి పడిపోయింది.అడుగంటిన సరఫరా.. ఆకాశన్నంటిన ధరలుఅంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ దిగుమతులు తగ్గడంతో దేశీయంగా వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఇదే అదునుగా భావిస్తున్న అక్రమ వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్ను సుమారు రూ.4,000 వరకు విక్రయిస్తున్నారని గిగ్, ప్లాట్ఫాం సర్వీస్ వర్కర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘ప్రభుత్వం కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్వయంగా స్పందించి ఈ కృత్రిమ కొరతను అరికట్టాలి’ అని యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.తగ్గిన ఆర్డర్లు..రెస్టారెంట్లు, ధాబాలు గ్యాస్ లేక వంటలు చేయలేకపోవడంతో జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్ఫారమ్లపై ఆర్డర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ వ్యవహారంపై ఓ గిగ్ సిబ్బంది స్పందిస్తూ.. ‘గతంలో రోజుకు 30-40 ఆర్డర్లు చేసేవాడిని. ఇప్పుడు 20 కూడా రావడం లేదు. గంటల తరబడి యాప్ వైపు చూస్తూ ఖాళీగా కూర్చుంటున్నాం’ అన్నాడు.ఆర్ధిక సంక్షోభంలో గిగ్ కుటుంబాలుకేవలం డెలివరీ బాయ్స్ మాత్రమే కాదు, క్లౌడ్ కిచెన్లలో పనిచేసే వారు, రోడ్డు పక్కన బండ్లు నడిపేవారు ఈ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్డర్ల పతనం వల్ల ఆదాయం తగ్గడమే కాకుండా, పెరిగిన నిత్యావసరాల ధరలు వారిని కుంగదీస్తున్నాయి. చాలా మంది గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్లు లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ పెరిగిన కరెంటు బిల్లులు మరో భారంగా మారుతున్నాయి.ప్రభుత్వ జోక్యం అవసరంగ్యాస్ సరఫరాతోపాటు లక్షలాది మంది కార్మికుల జీవనాధారానికి సంబంధించిన అంశంపై ప్రభుత్వ స్పందించాల్సి ఉంది. సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆదాయం కోల్పోయిన డెలివరీ భాగస్వాములకు కంపెనీలు లేదా ప్రభుత్వం తరఫున ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కొందరు చెబుతున్నారు. మిడిల్ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎల్పీజీ దిగుమతులను వేగవంతం చేయాలి.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం
పతనమౌతున్న పసిడి.. మరింత తగ్గిన తులం బంగారం ధర
దేశంలో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు (Today Gold Rate) ఐదో రోజూ కూడా దిగివచ్చాయి. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 81 పాయింట్లు పెరిగి 23,227 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 244 పాయింట్లు ఎగబాకి 74,823 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.26బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 104.12 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.61 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.93 శాతం నష్టపోయింది.Today Nifty position 16-03-2026(time: 9:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
మహిళలకు ప్యాసివ్ పెట్టుబడుల దన్ను
దేశీయంగా పర్సనల్ ఫైనాన్స్ వ్యవహారాల్లో నెమ్మదిగానే అయినా, గమనించతగ్గ మార్పులే జరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. డేటా ప్రకారం గత ఐదేళ్లలో కుటుంబాల ఆర్థిక ప్రణాళికల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది. ప్రతి నలుగురు ఫండ్ మదుపరులలో ఒకరు మహిళే ఉంటున్నారు. ఇది పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటాన్నే కాకుండా, వివిధ అసెట్స్, స్కీముల విషయంలో మారుతున్న వారి దృక్పథాన్ని కూడా తెలియజేస్తోంది.పెట్టుబడుల విషయంలో మహిళలు సాధారణంగా చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారు. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని, తమ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాలకు తగ్గ అవకాశాలు పరిశీలిస్తారు. అవసరమైతే నమ్మకమైన ఆర్థిక సలహాదారులను కూడా సంప్రదిస్తారు. ఈ నేపథ్యంలో మహిళలకు ప్యాసివ్ ఇన్వెస్టింగ్, అంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టడం ఒక సులభతరమైన, సరైన ప్రారంభంగా నిలుస్తోంది. తక్కువ ఖర్చుతో, స్పష్టమైన నియమాల ఆధారంగా ఉండే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది కోర్ పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకోవడంతో పాటునిర్దిష్ట రంగాలు లేదా థీమ్లలో విస్తృతంగాఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటిపై ఆసక్తి పెరుగుతోంది. తాజా యాంఫీగణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్యాసివ్ ఫండ్ల నిర్వహణలో దాదాపు రూ. 15 లక్షల కోట్ల ఆస్తులు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇందులోరంగాలవారీ ఇండెక్స్లు, గోల్డ్, సిల్వర్లాంటి కమోడిటీ ఇండెక్స్లు, వేల్యూ .. క్వాలిటీ థీమ్ ఆధారిత ఫండ్స్లో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా..డిజిటల్ మౌలిక సదుపాయాల పురోగతితో మహిళలకు పెట్టుబడి సాధనాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వివిధ సాధనాలవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేయగలిగే సామర్థ్యాలు వచ్చినప్పుడే సిసలైన సాధికారత లభించినట్లవుతుంది. విదేశీ పర్యటన కోసం లేదా ఉన్నత విద్య కోసం నిధులను సమకూర్చుకోవడం, కొత్త వాహనం కొనుగోలు చేయడం, పిల్లల చదువులు, ఆరోగ్యం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత.. ఇలా అనేక లక్ష్యాలు ఉండొచ్చు. ఇలాంటివాటిని సాకారం చేసుకునేందుకు వివిధ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల్లాంటి ప్యాసివ్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉంటున్నాయి. బ్లూచిప్, లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 50 ఇండెక్స్ను అనుసరించే ఈక్విటీ ఇండెక్స్ ఫండ్ లేదా ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల ప్రస్థానాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఇది బలమైన పునాదిగా కూడా నిలుస్తుంది. అలాగే, మరింత మెరుగైన ఫలితాల కోసం ఫ్యాక్టర్ ఆధారిత ప్యాసివ్ ఫండ్స్ను పరిశీలించవచ్చు. వేల్యూ, క్వాలిటీ, లో వోలటాలిటీ లేదా మొమెంటంలాంటి లక్షణాల ఆధారంగా ఇవి ఉంటాయి. తరతరాలుగా భారత మహిళలకు పసిడి, వెండితో ఎనలేని అనుబంధం ఉంటోంది.ఈ నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో వీటికి కూడా చోటు కల్పించవచ్చు. సరైన స్థాయిలో కేటాయిస్తే, అనిశ్చితుల్లో ఈక్విటీలు నెమ్మదించినా, పోర్ట్ఫోలియోపై తీవ్ర ప్రభావం పడకుండా హెడ్జింగ్ సాధనంగా కూడా ఇవి రక్షణ కలి్పస్తాయి. ఇండెక్స్ ఫండ్లలో బాండ్స్లాంటి స్థిరాదాయాన్ని ఇచ్చే సాధనాలకు సంబంధించిన ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీలాగా, ముందుగా నిర్ణయించిన మెచ్యూరిటీ తేదీతో ఉంటాయి. ఇలాంటివి సమీప భవిష్యత్తులో నిర్దిష్ట ఆరి్థక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి.సిప్ శ్రేయస్కరం..ఇక సిప్ విధానం ద్వారా ప్యాసివ్ ఫండ్స్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. దీనితో పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ పెరుగుతుంది. అలాగే, రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా క్రమంగా పెట్టుబడిని పెంచుకోవచ్చు. మార్కెట్ టైమింగ్ గురించి ఆందోళన చెందనక్కర్లేదు. రోజువారీ వార్తల ప్రభావంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితీ ఉండదు.చివరిగా చెప్పేదేమిటంటే దేశీయంగా మహిళలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయి లో సంపదను నిర్వహిస్తున్నారు. వారిలో ఖర్చులపై అవగాహన పెరిగింది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఫోకస్ పెరిగింది. వారి పెట్టుబడులు ఇప్పుడు మరింత ప్రణాళికాబద్ధంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండెక్స్ ఫండ్స్ అనేవి మహిళా ఇన్వెస్టర్లు తమ సామర్థ్యాలను, తెలివైన పెట్టుబడి నిర్ణయాలుగా మార్చుకునేందుకు ఒక చక్కని, సరళమైన అవకాశాన్ని కల్పిస్తాయి. మారే లక్ష్యాలు, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా పెట్టుబడులను మల్చుకునేందుకు పునాదిగా నిలుస్తాయి.
ఫ్యామిలీ
పైల్స్ నుంచి ఫ్రీ అవండి ఇలా...
ముళ్ల మీద కూర్చోవడం అనే మాట వాడుకగా వాడుతుంటారు. మొలల సమస్య ఉంటే ఈ మాట అక్షరాలా నిజమే అనిపిస్తుంది. ‘మొల’ అంటే మేకు అని అర్థం. ఆకృతిలోనూ అవి మేకును పోలి ఉంటాయి. అలాగే కూర్చునే చోట నిజంగా మేకులే ఉంటే ఎంత సమస్యగా ఉంటుందో తెలుసు కాబట్టే ఈ సమస్యకు ఆ పేరొచ్చిందేమో అనిపిస్తుంటుంది. మలద్వారం దగ్గర వచ్చే మొలల సమస్యను ఇంగ్లిష్లో పైల్స్ అనీ, హిమరాయిడ్స్ అని అంటారు. ఈ సమస్యకు కారణాలు, నివారణ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మలద్వారం దగ్గరి కణజాలంలో రక్తనాళాలు చాలా ఎక్కువ. ఒకరకంగా ఇది దేహానికి చివరి ప్రాంతం కూడా కావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున రక్తనాళాలు ఎక్కువ సంఖ్యలో అల్లుకు΄ోయినట్టుగా ఉంటాయి. కొందరిలో ఈ రక్తనాళాలు వ్యాకోచించినట్లుగా అయి ఉబ్బి బుడిపెలా మారతాయి. ఇలా బుడిపెలుగా వచ్చే వాటిని తెలుగులో మొలలు అనీ మూలశంక అని వ్యవహరిస్తుంటారు. ఇవి కొందరిలో మల ద్వారం నుంచి బయటకూ వచ్చేసి బాధిస్తుంటాయి. ఒక్కోసారి కొందరిలో ఆ బుడిపెలు ఒరుసుకు΄ోవడం వల్ల ఒక్కోసారి రక్తస్రావమూ అవుతుంటుంది. మలద్వారం వద్ద తీవ్రమైన దురదా నొప్పీ కూడా ఉంటాయి. వెరసి అవన్నీ కూర్చోనివ్వకుండా, కదల్లేకుండా బాధపెడుతుంటాయి. కారణాలు... మలద్వారం వద్ద రక్తనాళాల వాపునకు కారణమైన ఏ అంశాల వల్లనైనా ఇవి రావచ్చు. ఉదాహరణకు...కడుపులో ఒత్తిడి పెరగడం (మలబద్ధకం ఉన్నవాళ్లు ముక్కుతూ విసర్జన చేయడానికి ప్రయత్నించడంతో అక్కడి రక్తనాళాల్లో ఒత్తిడి పెరగడం మొలలకు ప్రధాన కారణం)స్థూలకాయం హై΄ో థైరాయిడిజం మహిళల్లో ప్రెగ్నెన్సీ సమయంలో కడుపు కండరాలపైనా, రక్తనాళాలపైనా పడే ఒత్తిడి వల్లశారీరక శ్రమ లేని వృత్తుల్లో ఉన్నవాళ్లలో దేహానికి తగినంత వ్యాయామం లేకపోవడంతోదీర్ఘకాలం పాటు నీళ్ల విరేచనాలు అవుతుండటం (డయేరియా)... ఈ అంశాలన్నీ మొలల సమస్యకు కొన్ని కారణాలు నివారణ / చికిత్స... మూలశంకవ్యాధిలో లక్షణాల తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. ఇందుకు కారణాలను తెలుసుకుని వాటినీ అదుపు చేయాల్సిన అవసరముంటుంది. ఉదాహరణకు... మలబద్దకం, స్థూలకాయం, బరువు పెరగడం వంటి అంశాలు కారణమైతే వాటినీ అదుపు చేయాలి. అక్కడి రక్తనాళాలను గాయపరచకుండా విసర్జితమయ్యేందుకు మలం మృదువుగా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, తాజాపండ్లు, పాలిష్ చేయని తృణధాన్యాలతో వండిన పదార్థాల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇక ద్రవాహారం, నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది. రోజూ ఒకేవేళలో మలవిసర్జనకు వెళ్లేలా విసర్జన అలవాట్లు ఉండాలి. తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం చేయాలి. ఈ జాగ్రత్తలతో కొద్దిపాటి తీవ్రత ఉన్న మొలలను నివారించుకోవచ్చు. కాని నొప్పి తీవ్రతరమై, రక్తస్రావం అవుతుంటే దానికి చికిత్స అవసరం. తీవ్రతను బట్టి డాక్టర్లు కొన్ని రకాల చికిత్సలు మొదలుకొని శస్త్రచికిత్స వరకు సూచిస్తుంటారు. ఈ శస్త్రచికిత్సల్లోనూ లేజర్, క్రయోథెరపీ, మినిమల్లీ ఇన్వేజివ్ ప్రోసీజర్ ఫర్ హీమరాయిడ్స్ / హీమరాయిడోపెక్సీ (ఇందులో అదనంగా పెరిగిన రక్తనాళాలకు రక్తసరఫరా జరగకుండా ఆపి, అవి తొలగి΄ోయేలా చేయడంతో పాటు నొప్పి, రక్తస్రావం వీలైనంతగా నివారించే అడ్వాన్స్డ్ ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల ‘రఫాలో ప్రొసిజర్’ అనే నొప్పిలేని అత్యాధునిక చికిత్స ప్రక్రియ కూడా అందుబాటులోకి వచ్చింది. లక్షణాలు... మొలల వ్యాధి ఉన్నా... చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించక΄ోవచ్చు. మొలలు ఉన్నాయన్న విషయమే వాళ్లకు తెలియకపోవచ్చు కూడా. మరికొందరిలో మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి... మలవిసర్జన తర్వాత ప్రక్షాళన సమయంలో ఓ ఉబ్బులాగా లేదా కండలాగా చేతికి తగలడం. (అందులో రక్తం గడ్డకట్టి ఉంటే గట్టిగా కూడా తగలవచ్చు) కొందరిలో మలద్వారం నుంచి రక్తస్రావం అవుతుండటం ∙మల విసర్జన తర్వాత మలంపై రక్తపు చారికలా కనిపించడంకొన్సిసార్లు లోపలి దుస్తులకు తడిలా నీళ్లలా ఏదైనా మరకలా అంటడం మలద్వారం చుట్టూరా దురదగా అనిపించడం.కొందరిలో అరుదుగా నొప్పి... పైల్స్ వల్ల నొప్పి చాలా అరుదుగా కలుగుతుంది. మొలలలోపల రక్తం గడ్డకట్టినప్పుడు మాత్రమే మొలలతో నొప్పి తెలుస్తుంది. కొందరిలో పైల్స్తో పాటు మలద్వారంలో చిన్న పగులు (ఫిషర్) కూడా ఉండవచ్చు. అలాంటి సమయంలో మాత్రం నొప్పి రావచ్చు. కొందరిలో మల విసర్జన వల్ల లోపల ఉండే మొలలన్నీ గుత్తిలా బయటకు రావచ్చు. అలాంటప్పుడు అవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. మొలల సమస్యలో ఇది సమస్య తీవ్రతకు ఇదొక తార్కాణం.డాక్టర్ ఆసిఫ్ మెహరాజ్, సీనియర్ కోలోరెక్టల్ సర్జన్ (చదవండి: జీఎస్ఎమ్’: చెప్పుకోకుంటే ముప్పు అవుతుంది!)
చెప్పుకోకుంటే ముప్పు అవుతుంది!
మహిళలకు అది బయటకు చెప్పుకోలేని ఓ సమస్య. ఎవరితోనూ పంచుకోలేని ఓ పెను ఇబ్బంది. ఇప్పటి తరానికి ఒక తరం ముందున్న వారు కావడంతో వీళ్లంతా ఓపెన్గా చర్చించాలంటే కొంతైనా అసౌకర్యంగా, ఇంకాస్త బిడియంగా ఫీలయ్యే ఈ సమస్య పేరు ‘జెనైటో యూరినరీ సిండ్రోమ్ ఆఫ్ మెనోపాజ్’. సంక్షిప్తంగా దీన్ని ‘జీఎస్ఎమ్’గా పేర్కొంటారు. సమస్య ఎప్పటినుంచో ఉన్నదే అయినప్పటికీ... ఇటీవల ఆధునిక జీవనశైలితో వచ్చే హార్మోన్ల అసమతౌల్యపు సమస్యలు ఎక్కువ కావడంతో ఇంతకుముందు కంటే ఇప్పుడు మరికాస్త ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం పీరియడ్స్ ఆగిపోయిన ముందు తరానికే కాకుండా అండాశయాలు తొలగించుకున్న ఈతరం వారినీ వేధిస్తూ ఇటీవల ఈ కేసులు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. జస్ట్... ఒక్కసారి తమ బిడియం వీడి... గైనకాలజిస్టులనూ, యూరో గైనకాలజిస్టులను సంప్రదిస్తే నూరుశాతం తగ్గి΄ోయే ఈ సమస్య ఇది. మరెవరితోనో అంత ఓపెన్గా మాట్లాడే అవకాశం లేకపోయినా మహిళలు చదువుకొని తెలుసుకోగలిగే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా మెనోపాజ్ తర్వాత దాదాపు 40 నుంచి 60 శాతం మహిళల్లో కనిపించే ఈ సమస్య ఇప్పుడు మనదేశంలో ప్రతి ఇద్దరు మహిలల్లో ఒకరికి తప్పక ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంటే మెనోపాజ్ వచ్చివారిలో 50% మంది జీఎస్ఎమ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇక మెనోపాజ్ నుంచి కాలం గడుస్తున్నకొద్దీ జీఎస్ఎమ్ బారిన పడే మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక అధ్యయనం ప్రకారం మహిళలకు తమ చివరి పీరియడ్ నుంచి కేవలం ఐదేళ్ల వ్యవధిలోపే ఆ సంఖ్య 65% చేరుకుంటోంది. ఇక పూర్తిగా మోనోపాజ్ వచ్చిన వాళ్లలో చూస్తే వారిలో ఐదేళ్లలోపే 74% మందిలో జీఎస్ఎమ్ కనిపిస్తోంది. పేరును బట్టి కేవలం మెనోపాజ్ వచ్చినవారిలోనే కనిపిస్తుందా అంటే అది కూడా అపోహే. ఈతరం మహిళల్లోనూ... అంటే 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. కేవలం మెనోపాజ్ వచ్చినవారిలోనే కాకుండా ఏదైనా మెడికల్ కారణాల వల్ల అండాశయాలు తొలగించుకున్నవారిలో లేదా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారిలోనూ కనిపించే సమస్య ఇది.తొలుత శారీరకమైన సమస్యే... కానీ తర్వాత మానసికంగా కూడా... సాధారణంగా ఇది శారీరకంగా ఇబ్బంది పెట్టే సమస్యే అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇది మహిళను కుంగదీస్తుంది. చికిత్స తీసుకోకపోవడం వల్ల భర్త నుంచి దూరం జరుగుతుండటంతో భార్యాభర్తల మధ్య ఏడబాటు, బయటకు వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో సామాజికంగా నలుగురికీ దూరం అవ్వడం, ప్రయాణాలకు దూరంగా ఉండటం, ఏ పనిలోనూ ఆసక్తిలేకపోవడం వంటి కారణాలతో సమాజం నుంచి దూరంగా జరుగుతూ కుంగుబాటుకూ (డిప్రెషన్కూ) లోనయ్యే అవకాశాలు లేక΄ోలేదు.గుర్తించడమెలా (డయాగ్నసిస్) జీఎస్ఎమ్కు ఎలాంటి నిర్దిష్టమైన వైద్య పరీక్ష ఉండదు. కానీ మహిళలు తమ బిడియం విడిచి డాక్టర్ను సంప్రదిస్తే తేలిగ్గా తెలుసుకోగల వైద్య సమస్య ఇది. పైగా వైద్య చికిత్సతో నూటికి నూరు΄ాళ్లు నయం చేయగల (ట్రీటబుల్) సమస్య ఇది. చేయాల్సిందల్లా మహిళలు ఈ సమస్యనలా భరిస్తూ ఉండేందుకు బదులు డాక్టర్ దగ్గర చెప్పుకుంటే చాలు.చికిత్స ఈ సమస్యకు చికిత్స అన్నది అందరికీ ఒకేరకంగా కాకుండా వ్యక్తిగత ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని వ్యక్తిగతంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొందరిలో ఇన్ఫెక్షన్ / ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్తో పాటు జీవనశైలి మార్పులు సూచించడం, పెల్విక్ ఫ్లోర్ కండరాలకు వ్యాయామాన్ని ఇచ్చే వర్కవుట్స్ సూచించడం వంటివి. అలాగే సమస్య తీవ్రతను బట్టి పూతమందులుగా ఇచ్చే మాయిశ్చరైజర్లు, ల్యూబ్రికెంట్లతో పాటు సిస్టమేటిక్ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీగా హార్మోన్లు ఇవ్వడంలాంటి వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్ ఇస్తూ సలహా సూచనలందిస్తూ పేషెంట్లలో ధైర్యం, స్థైర్యం పాదుగొలిపేలా మాట్లాడటమూ అవసరమవుతుంది.సమస్య ఎందుకొస్తుందంటే... సాధారణంగా మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్... వారి ప్రైవేట్ పార్ట్స్ను తేమగా ఉంచుతుంది. కానీ మెనోపాజ్ తర్వాత ప్రైవేట్ పార్ట్స్ పొడిబారిపోవడం (ఇలా పొడిబారడం వల్ల ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి), సాగే గుణం తగ్గడంతో కండరాలు స్టిఫ్గా మారడంతో మూత్రవిసర్జనలో నొప్పి, మంట, తీవ్రమైన అసౌకర్యం వంటివి కనిపిస్తాయి.డాక్టర్ సిందూరి గోరంట్ల, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్
రూ. 9 వేలతో దుస్తుల వ్యాపారం ప్రారంభించి..ఇవాళ ఏకంగా రూ. 57 కోట్లు..
సింగల్ మదర్ సక్సెస్ స్టోరీ ఇది. ఓ సాధారణ వీధి దుకాణం నుంచి బ్రాండ్ని నిర్మించే స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు బట్టలు అమ్ముడైతే చాలు అనుకునే స్థాయి నుంచి ఇవాళ ఏకంగా ఓ బ్రాండ్ వ్యస్థాపకురాలిగా కోట్లు గడిస్తూ..సక్సెస్కి చిరునామాగా మారిందామె. ఎవరామె అంటే..చైనాలో డాంగ్ అనే మహిళ కేవలం రూ. 9,240లతో వీధి దుకాణం నడుపుతుండేది. 1990లలో హెనాన్ ప్రావిన్స్లోని జెంగ్జౌలో నిర్మించిన డాంగ్ తన విజయవంతమైన దుస్తుల వ్యాపారం కారణంగా ప్రజలందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. 2012లో డాంగ్ వద్ద ఎలాంటి పొదుపులు, ఆదాయం లేక ఒంటిరి తల్లిగా రోడ్డుపై నిలబడిపోయింది. కనీసం తన బిడ్డకు పాలపొడిని కొనడానికి కూడా డబ్బులు లేని దారిద్యాన్ని అనుభవించింది. ఇరవైల వయసులో తన బిడ్డను పోషించుకోవాల్సిన పరిస్థితి ఆమెది. ఆ నేపథ్యంలో చిన్నగా వీధి వస్త్ర దుకాణాన్ని ప్రారంభించింది. అయితే వ్యాపారం అంతగా లాగాక.. ఇబ్బందిపడింది. ఒక్కోసారి ఈ వ్యాపారం తన వల్ల కాదేమో అన్నంతగా చేతులెత్తేసి దిగాలు పడేది. మళ్లీ ఆ క్షణంలోనే నేడు ఓడిపోతే..నా బిడ్డ బాధ్యతను ఎవరు చూసుకుంటారని భయపడేది. అయినా తాను పేదదాన్ని అయ్యిండొచ్చు, కానీ తన బిడ్డ ఎందుకు పేదవాడిగా ఉండాలన్న ఆలోచన తనకు వెనుకడగు వేయనివ్వని పట్టుదలను ఇచ్చేదట. అదే తనకు కఠినమైన ఆ పరిస్థితులను తట్టుకునే శక్తిని అందించిందట. తన వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రాత్రి మార్కెట్ల వైపుకి మొగ్గు చూపేదట. తక్కువ పెట్టుబడితో ఆదాయం పొందాలంటే మంచి పరిచయాలు కూడా అవసరమని తెలుసుకుంది డాంగ్. అలా డబ్బు ఆదా చేస్తూ..స్టాక్ కొనడానికి ఉదయం ఐదుగంటల కల్లా మేల్కొనేది. తర్వాత రాత్రి కూరగాయల మార్కెట్ వెలుపల బట్టలు అమ్ముతుండేది. రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేది. బేరమాడటం, భారీ వస్తువులను తక్కువ ధరకే తీసుకెళ్లగలిగే మాట చాతుర్యం అన్నింటిని స్వయంగా నేర్చుకుంది. ఈ పనుల బిజీలో బిడ్డ ఆలనాపాలనా చూడటం కష్టంగా ఉండేది. ఒక్కోసారి రాత్రిపూట వీధుల్లో బిడ్డను ఒంటరిగా వదిలేసి వ్యాపారం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. అలా కష్టాలను ఓర్చుకుంటూ..నెమ్మదిగా రిటైల్ దుకాణాలను నడిపే స్థాయికి చేరుకుంది. అప్పుడే చైనీస్ సంప్రదాయాన్ని సమకాలీన డిజైన్తో మిళితం చేస్తూ ఒక ప్రసిద్ధ బ్రాండ్ను నిర్మించింది. ఈ బ్రాండ్కి చైనా దేశ్యవాప్తంగా గుర్తింపు వచ్చేలా అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో ఆమె ఏకంగా ఏడాదికి రూ. 54 కోట్లు పైనే గడించే స్థాయికి చేరుకుంది. నెటిజన్లు సైతం ఆమె కథ విని ఒంటిరి తల్లి చాలా శక్తిమంతమైనది. ఎన్ని కష్టాలు ఓర్చుకుందో ఆమెకే తెలుసు అంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: 76 రోజుల్లో ఏడు కిలోల బరువు..!)
76 రోజుల్లో ఏడు కిలోల బరువు..!
బరువు తగ్గడంలో కొందరు అనుసరించే ఆరోగ్యకరమైన విధానాలు ఎందరికో ప్రేరణగా ఉంటాయి. అలాంటి వెయిట్లాస్ జర్నీ గురించి మహారాష్ట్ర వైద్యుడు చూసిన ఒక కేసు గురించి చెప్పుకొచ్చారు. ఒక రియల్ జంట అద్భుతంగా బరువు తగ్గినం విధానాన్ని షేర్చేసుకున్నారు. మొదట తన వద్దకు కాస్త తగ్గితే చాలని వచ్చిన వాళ్లు ఎంతలా అనూహ్యంగా బరువు తగ్గారో చెప్పారు. జస్ట్ రెండున్నర నెలలో ఇంతలా బరువు తగ్గుతారని అస్సలు ఊహించలేదని అంటున్నారు. మరి అదెలాగో చూద్దామా..!పిసిఒఎస్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఊబకాయం తదితరాల హోపియోపతిక్ ప్రాక్టీషనర్ డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్ తన అనుభవంలో చూసిన ఒక జంట కేసు గురించి చెప్పుకొచ్చారు. ఆ దంపతులు సాధారణ వెయిట్లాస్ కోసం వచ్చారని అన్నారు. సూచించిన కొద్ది ఆహారపు మార్పులతో ఇద్దరూ జస్ట్ రెండున్నరనెలల్లోనే ఏకంగా ఏడు కిలోలు తగ్గారని చెప్పారు. భర్త 71 కిలోల నుంచి 64 కిలోలకు, భార్య 82 నుంచి 75 కిలోలకు తగ్గారని చెప్పుకొచ్చారు. ఇలా బరువు తగ్గడంతో ఇద్దరికి వాపు, ఎల్డీఎల్ స్థాయిలు, బొడ్డుకొవ్వు కూడా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. మలబద్దక సమస్య కూడా చాలావరకు తగ్గిందని అన్నారు. అయితే ఈ దంపతులు ఎలాంటి క్రాష్డైట్ అనుసరించలేదని, స్థిరమైన ఆహార విధానాన్ని అనుసరించారని చెప్పారు. ఈ ఇద్దరు ఉపకరించిన ఆ ఏడు ఆహారపు అలవాట్ల గురించి వెల్లడించారు.రెండుపూటలా తినడం..ప్రతి రోజు రెండు పూటలా తింటే చాలని అన్నారు. అలాగని అల్పాహారం ఎక్కువగా తీసుకోవద్దని సూచించారు.ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వండినిపుణుడి ప్రకారం, ప్రతి భోజనంలో ప్రోటీన్ను కీలకమైన భాగంగా చేసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని అన్నారు. ముఖ్యంగా గుడ్లు, పప్పులు, పెరుగు, పనీర్ను వారి ఆహారంలో చేర్చుకోవాలని ఆయన దంపతులకు సలహా ఇచ్చారు.శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించారుతరువాత, హోమియోపతి నిపుణుడు ఆహారం నుంచి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించాలని సూచించారు. ఈ జంట స్వీట్లు, చక్కెర, బేకరీ ఆహారాలను తినకుండా ఉండాలని చెప్పానని అన్నారు.ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు చేర్చుకోవడం..నిపుణుడు దంపతులకు ప్రతిరోజూ వారి భోజనంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఆ ఆహార ప్రణాళికలో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరి అయిన అంశం. ఇది కడుపు నిండిన భావనను పెంచుతుంది. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించండిబర్గర్లు, పిజ్జాలు, సమోసాలు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు దరిచేరనివ్వదని సూచించారు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లు సదా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ సాయాజీరావు గైక్వాడ్ దంపతులు ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినాలని, అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించాలని చెప్పారు.రోజుకు 30-40 నిమిషాలు నడవండినిపుణుడు దంపతులను రోజుకు 30-40 నిమిషాలు నడవమని సూచించారు. అది కూడా ముఖ్యంగా భోజనం తర్వాత.స్థిరంగా ఉండండిబరువు తగ్గడం అనేది ఒక్కసారిగా జరిపోయేది కాదు. క్రమంత తప్పకుండా బరువు తగ్గడానికి ఏర్పాటు చేసుకున్న నియమాలను ఉల్లంఘించకుండా చూసకోవడం అత్యంత కీలకం. ఇక్కడ బరువు తగ్గడం అంత తేలికై పని కాకపోవచ్చు. కానీ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటూ..ఆకలి కోరికలు తగ్గేలా ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకుంటే..వెయిట్లాస్ అనేది అత్యంత ఈజీ. అన్నింట్లంకంటే ముఖ్యమైనది స్థిరత్వాన్ని మెయింటైన్ చేయడమే అన్ని నొక్కి చెబుతున్నారు డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్. 2.5 months.One couple.Simple home-cooked food.✅ Results:• Weight ↓ 7 kg (both)• HbA1c improved• LDL cholesterol ↓• Waist ↓ ~3 inches• Constipation resolved• Energy levels ↑No crash diets.No supplements.Just disciplined nutrition. pic.twitter.com/d2302h5Iti— Dr.Sayajirao Gaikwad (@DietDrsayajirao) March 9, 2026 (చదవండి: ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..)
అంతర్జాతీయం
ఇస్ఫహాన్పై బాంబుల వర్షం
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ యుద్ధం ఆదివారం 16వ రోజుకు చేరింది. ఇరాన్లోని పారిశ్రామిక నగరం ఇస్ఫహాన్పై అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. వాయవ్య ఇరాన్లో ఇజ్రాయెల్కు సహకరించేందుకు ప్రయతి్నస్తున్నారన్న ఆరోపణలతో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్లో దాడులకు దిగింది. పశ్చిమాసియాలోని అమెరికా పరిశ్రమలను బయటకు తరలించాలని హెచ్చరించింది.అమెరికా సంస్థల భాగస్వామ్యం ఉన్న కంపెనీలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. ఇరాన్లో సైనికేతర పరిశ్రమలపై జరిగిన దాడుల్లో సాధారణ పౌరులు మృతి చెందారు. ఇందుకు ప్రతీకారం తప్పదని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తామని వెల్లడించింది. ఇరాన్ సుప్రీం కమాండర్ మొజ్తబా ఖమేనీ క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు.అమెరికా సైన్యం పశ్చిమాసియాలో క్రూయిజ్ మిస్సైళ్లు ప్రయోగిస్తోందని, వాటిని ధ్వంసం చేస్తామని అన్నారు. హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయలేదని ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీరెజా ప్రకటించారు. అందులో కొన్ని కీలక మార్గాలను మాత్రమే తమ నియంత్రణలోకి తీసుకున్నామని తెలిపారు. ఇరాన్పై యుద్ధాన్ని కనీసం మరో మూడు వారాల పాటు కొనసాగించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. అల్–డాఫ్రా ఎయిర్బేస్పై 10 క్షిపణులు ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటిదాకా ఇజ్రాయెల్–అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్లో 10,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 1,400 మందికిపైగా మరణించారు. ఇజ్రాయెల్ దాడిలో తమ సీనియర్ మిలటరీ అధికారి బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా జలాలీ నసబ్ మృతి చెందినట్లు ఇరాన్ తెలిపింది. మరోవైపు గల్ఫ్లో ఇరాన్ దాడుల పరంపరం ఆగడం లేదు. రియాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంపై ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను తుత్తునియలు చేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ వెల్లడించింది. అల్–ఖర్గ్పై ప్రయోగించిన ఆరు బాలిస్టిక్ మిస్సైళ్లను, తూర్పు ప్రావిన్స్లో రెండు డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు ప్రకటించింది.యూఏఈలోని అమెరికా అల్–డాఫ్రా ఎయిర్బేస్పై ఐఆర్జీసీ 10 క్షిపణులు ప్రయోగించింది. బహ్రెయిన్లో సైరన్ల మోత వినిపించింది. దాడులపై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు బహ్రెయిన్లో ఆరుగురు, యూఏఈలో 33 మంది అరెస్టయ్యారు. వారిలో పలువురు భారతీయులున్నారు. ఇరాన్ దాడుల్లో గాయపడిన 108 మందిని ఆసుపత్రికి తరలించినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇరాన్ సైన్యంతో పాటు లెబనాన్ భూభాగం నుంచి హెజ్»ొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగించారు.రాకెట్ల శిథిలాలు తాకడంతో టెల్ అవీవ్, హోలోన్ సిటీలో మంటలు చెలరేగాయి. కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది. సెంట్రల్ ఇజ్రాయెల్లో ఓ అపార్టుమెంట్ భవనం ధ్వంసమైంది. ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఇజ్రాయెల్ వద్ద బాలిస్టిక్ మిస్సైల్ ఇంటర్సెప్టర్ల కొరత నెలకొంది. యుద్ధం మరింత ముదిరితే ఇరాన్, హెజ్»ొల్లా దాడులను తిప్పికొట్టడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. ఇరాన్తో ఒప్పందానికి సిద్ధంగా లేం: ట్రంప్ స్పష్టీకరణయుద్ధాన్ని ముగించే విషయంలో తమతో ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ ఆసక్తి చూపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ, అందుకు తాము సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు. ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు సమంజసంగా లేవని అభిప్రాయపడ్డారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిలో నౌకల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ఇతర దేశాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. హార్మూజ్ నుంచి వచ్చే చమురుపై ఆధారపడే దేశాలు యుద్ధనౌకలను పంపించాలని ట్రంప్ కోరారు. చమురు నౌకలకు ఇవి ఎస్కార్ట్గా పని చేస్తాయన్నారు.
అమెరికా అంచనాలు ఎలా తప్పాయ్? గల్ఫ్ భవిష్యత్తు ఏంటి?
ఇరాన్ తమకు లొంగిపోతుందని అమెరికా అనుకుంది. ఇరాన్ వద్ద ఆయుధాలు లేకుండా చేస్తే తమకు ఏ ముప్పూ ఉండబోదని ఇజ్రాయెల్ భావించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున యుద్ధాన్ని ప్రారంభించాయి. అయితే, ఊహించని విధంగా ఇరాన్ ఎదురు నిలుస్తోంది. ప్రతీకారదాడులతో విరుచుకుపడుతోంది. ఇరాన్ ప్రతిస్పందన అమెరికా-ఇజ్రాయెల్ అంచనాలను ఎలా తారుమారు చేసింది? ఇరాన్ దాడులు, ఇజ్రాయెల్ తీరుతో గల్ఫ్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?అమెరికా ప్రకటించిన అంచనాలు, లక్ష్యాల ప్రకారం ఇరాన్పై సైనిక చర్యలు ఇప్పటికే ముగిసి, ఇజ్రాయెల్-అమెరికా విజయం సాధించాల్సింది. ఇరాన్లో పాలనావ్యవస్థ ఇప్పటికే కూలిపోవాలి. అణు మౌలిక వసతులు మళ్లీ ఎప్పటికీ కోలుకోలేని విధంగా ధ్వంసం కావాలి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు అగ్ర నాయకులను లేకుండా చేయడంతో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభించిన సమయంలోనే అసాధ్యమైన పనిని సాధించినట్టు చాలామంది భావించారు. వారి అంచనాల ప్రకారం ఇది ముయామ్మర్ గడాఫీ, సద్దాం హుస్సేన్ పట్టుబడిన ఘటనలకన్నా పెద్ద విజయం.ఊహించని విధంగా ఇరాన్ పోరాటం అయితే, కొన్ని గంటల్లోనే వందల సంఖ్యలో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ లక్ష్యాలు, సమీప గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలపై దాడి చేశాయి. వాటిలో అధిక శాతం క్షిపణులు లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్, అమెరికా ముందుగానే ఇలాంటి సైనిక ఘర్షణను ఊహించి ఉండొచ్చు. కానీ, పశ్చిమాసియాలో ఉన్న అమెరికా ఆస్తులను లక్ష్యాలుగా ప్రకటించడంతో ఇరాన్ ఈ చర్యను సంప్రదాయ ఆపరేషన్ నుంచి అస్థిరత సృష్టించే ప్రాంతీయ యుద్ధంగా మార్చింది. గల్ఫ్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ చర్యలకు మద్దతు ఇవ్వలేదు. గల్ఫ్లో అమెరికా సైనిక స్థావరాలు ఆయా దేశాలకు ప్రమాదంగా కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ చర్చలు జరపాలంటే గల్ఫ్ దేశాల నుంచి అమెరికా స్థావరాలు తొలగించాలని ఇరాన్ షరతు పెట్టింది.మరింత ఆయుధీకరణ వైపు ఇరాన్? యుద్ధం ప్రారంభమైన 2 వారాల్లోనే ఒక విషయం స్పష్టమైంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఇరాన్ను మరింత ఆయుధీకరణ వైపు నడిపించనున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ సహజ వనరులను ఆయుధంగా వినియోగించే అవకాశమూ ఉంది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఓ ఆయుధంగా వాడుతోంది. అంటే గల్ఫ్ ప్రాంత సముద్రం నుంచి ప్రపంచానికి చమురు సరఫరా వెళ్లే కీలక సముద్ర మార్గంలో ఆటంకాలు కల్పిస్తోంది.చూస్తుంటే ఇప్పట్లో ఇరాన్ పాలనా వ్యవస్థ కుప్పకూలే అవకాశాలు కనిపించడం లేదు. పశ్చిమాసియా భద్రత, స్థిరత్వం మాత్రమే కాదు ప్రపంచ ఇంధన సరఫరా కూడా ప్రభావితమైంది. ఇరాన్లో పాలనా మార్పు, అణు నిరాయుధీకరణ చేస్తామని ప్రజలకు ఇజ్రాయెల్, అమెరికా వాగ్దానాలు చేశాయి. ఆ లక్ష్యాలు ఎన్నటికి నెరవేరతాయో ఎవరూ చెప్పలేరు. ఇప్పట్లో ముగిసే యుద్ధం కాదిది! కొందరు ఇజ్రాయెల్ నేతలు ఇరాన్పై భూతలంలో భీకర దాడులు చేయాలని భావిస్తున్నారు. అమెరికా నేతల్లో అసహనం పెరుగుతోంది. “షాక్ అండ్ ఆ” వ్యూహం ప్రకారం యుద్ధం ముగియదని విశ్లేషకులు చెబుతున్నారు. షాక్ అండ్ ఆ వ్యూహం అంటే శత్రువును ఒక్కసారిగా భారీ సైనిక దాడులతో మానసికంగా కుదేలు చేయడం.యుద్ధ లక్ష్యాలు సమయ పరిమితితో ఉంటాయి. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకోకూడదని ఇజ్రాయెల్, అమెరికా భావిస్తున్నాయి. ఈ లక్ష్యానికి అంతర్జాతీయ మద్దతు ఉంది. ఇరాన్ పొరుగు దేశాలు, టర్కీ, రష్యా, చైనా కూడా దీనికి ఒప్పుకున్నాయి. ఈ అంతర్జాతీయ ఒత్తిడి ఇరాన్ను అణ్వాయుధ ప్రోగ్రాం కొనసాగించకుండా నిరోధించింది. అదే సమయంలో 2015లో జరిగిన జాయింట్ కంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అందుకు సంబంధించిన ఒప్పందానికి అంగీకరించేందుకు కారణమైంది. ఇది ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడానికి కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం.ఇరాన్ మతపరమైన వాదనను కూడా వినిపిస్తుంది. అణ్వాయుధ తయారీ ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధమని చెబుతుంది. అయితే యురేనియం శుద్ధి స్థాయి పెరుగుతుండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇరాన్ తెలిపిన వివరాల ప్రకారం తన అణు విద్యుత్ కార్యక్రమం హక్కును గుర్తిస్తేనే యరేనియం శుద్ధిని ఆపుతామని చెబుతోంది. అణు విద్యుత్ కార్యక్రమాన్ని విదేశాలకు మార్చాలన్న ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. భారతదేశం సహా అనేక దేశాలు ఇరాన్కు అణు విద్యుత్ కార్యక్రమం నిర్వహించే హక్కు ఉందని గుర్తించాయి.అయితే ఇజ్రాయెల్ దృక్కోణం పూర్తిగా వేరేలా ఉంది. ఇరాన్ ను పూర్తిగా అణు నిరాయుధీకరణ చేయాలని, భవిష్యత్తులో ఇజ్రాయెల్కు ముప్పు కలిగించే ఆయుధాలు కూడా ఆ దేశం వద్ద ఉండొద్దని కోరుతోంది. ఇందులో బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి.ఈ యుద్ధంలో ఇరాన్ ఒక అంశంలో విజయవంతమైంది. ఇజ్రాయెల్ సైనిక శక్తి కేవలం ఇరాన్కే కాక గల్ఫ్ దేశాలకు కూడా ముప్పుగా మారవచ్చని గల్ఫ్ దేశాలను నమ్మించింది.గల్ఫ్పై ప్రభావంగల్ఫ్ దేశాల్లో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినప్పటికీ ఆయా దేశాలు శాంతియుత వైఖరితో ఉన్నాయి. అమెరికా సెనేటర్ లిన్డే గ్రాహం సహా పలువురు నాయకులు సౌదీ అరేబియాను యుద్ధంలో చేరాలని కోరారు. కానీ గల్ఫ్ దేశాలు ఇరాన్తో ఘర్షణను పెట్టుకోలేదు. ఇజ్రాయెల్, అమెరికా చర్యలకు గల్ఫ్ ప్రజల్లో మద్దతు కనిపించలేదు. అయితే, గల్ఫ్ దేశాలను ఇజ్రాయెల్ భద్రతకు కవచంగా ఉపయోగిస్తున్నారని చాలా మందిలో అసంతృప్తి పెరుగుతోంది. ప్రాంతీయ నాయకులు కూడా గల్ఫ్ భద్రతను పట్టించుకోలేదని విమర్శించారు. 2023లో జరిగిన సౌదీ అరేబియా-ఇరాన్ సయోధ్య తర్వాత ఇజ్రాయెల్ కఠిన విధానాలకు సౌదీ అరేబియా మద్దతు ఇవ్వడం లేదు. ఇజ్రాయెల్-గల్ఫ్ భద్రతా వ్యవస్థను నిర్మించేందుకు రూపొందించిన అబ్రహం ఒప్పందాలు ఇప్పుడు అమలులో లేవు. సౌదీ సహా గల్ఫ్ దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్రాంతీయ భద్రతా వ్యవస్థపై దృష్టి పెట్టాయి.
పిల్లలను చంపే నేరస్థున్ని లేపేస్తాం: ఇరాన్
టెహ్రాన్: ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఉనికిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన ప్రాణాలతో ఉన్నారా, లేరా? ఉంటే ఎందుకు బయిటకి రావడం లేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కీలక ప్రకటన చేసింది. బెంజిమిన్ నెతన్యాహు బ్రతికే ఉంటే ఎట్టిపరిస్థితుల్లో ఆయనను చంపి తీరుతామని హెచ్చరించింది.పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం నెతన్యాహు క్షేమంగా ఉన్నారా లేరా అనుమానాలు తీవ్రతరమవుతున్నాయి. ఇటీవలే ఆయన ప్రసంగంతో ఒక వీడియో వచ్చినా అది ఏఐ జనరేటెడ్ వీడియో అంటూ పలువురు కొట్టిపడేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది.ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రకటనలో " పిల్లలను చంపిన నేరస్థుడు బతికి ఉన్నాడో లేరో తెలియదు ఒక వేళ బతికి ఉంటే మేము పూర్తి శక్తితో అతనిని వెంటాడి చంపేస్తాము" అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభంలో ఇరాన్లోని ఓ బాలికల పాఠశాలపై దాడి చేశాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 180 కిపైగా అభం శుభం తెలియని పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా ఈ దాడి అనుకోకుండా జరిగిందని అమెరికా చెబుతుండగా తెలిసే చేశారని ఇరాన్ అంటుంది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహుని పిల్లలను చంపే నేరస్థుడు అని ఇరాన్ పిలుస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీని అంతం చేసిన ఇజ్రాయెల్ తదుపరి ఆ బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీపైన దాడి చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధినేతలను లేపేస్తాం అని పరస్పరం హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇప్పటి వరకూ ఈ యుద్ధంలో దాదాపు రెండువేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
సరదా కోసమైనా ఖార్గ్ దీవిపై దాడి చేస్తాం : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం మరింత తీవ్రమైంది. ఈ యుద్ధం ప్రాంతీయ స్థిరత్వాన్ని, ఇంధన భద్రతను, అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలను కుదిపేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చేయని చర్యలను ఇకపై చేపట్టబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ ఇంధన ఎగుమతిలో కీలకమైన ఖార్గ్ ఐలాండ్పై సరదా కోసమైనా దాడులు చేస్తామని ఇరాన్ను హెచ్చరించారు.అదే సమయంలో హర్మూజ్ జలసంధిని కాపాడేందుకు యుద్ధనౌకలను పంపాలని ప్రపంచ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ప్రతిగా, ఇరాన్ దాడుల్ని మరింత ముమ్మరం చేసింది. తాను విధించిన షరతులకు లోబడి ఇరాన్ నడుచుకోవాలని, లేదంటే యుద్ధం తీరుతెన్నులు, లక్ష్యాల్ని ఎప్పటికప్పుడూ మారుస్తుంటామని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్పై కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేలా పశ్చిమాసియా దేశాలు ట్రంప్తో సంప్రదింపులు జరిపాయి. ట్రంప్తో జరిగిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ తన హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో, ఆ దేశానికి ఆర్థిక ఆయువుపట్టైన ఖార్గ్ దీవిపై దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఖార్గ్ దీవిని లక్ష్యంగా చేసుకుని పదేపదే దాడులు చేస్తామని ఆయన ఎన్బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.వాస్తవానికి అమెరికా ఇప్పటి వరకు ఖార్గ్ దీవిలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. కానీ చమురు కేంద్రాలపై దాడులు చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఇరాన్ తన డిమాండ్లకు తలొగ్గకపోవడంతో ఇప్పు ట్రంప్ ఖార్గ్ ఐలాండ్పై పడినట్లు సమాచారం.ఖార్గ్ ఐలాండ్పై దాడులు జరగడం వల్ల ఇరాన్తో పాటు ప్రపంచంలోని పలు దేశాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధికి సమీపంలో ఖార్గ్ ద్వీపం ఉండటం.. చమురు దిగుమతులకు ఆటంకం ఏర్పడనుంది. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండగా.. గ్యాస్ కొరత ప్రజలను మరింతగా వేధించనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జాతీయం
డీప్గా మౌనం..!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఓ ప్రముఖ నటికి సంబంధించిన మా ర్పింగ్ వీడియో 2023లో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమె ముఖాన్ని వేరొక మహిళ శరీరానికి అంటించిన ఆ క్లిప్ భారతీయులకు ఒక చేదు నిజాన్ని చెప్పకనే చెప్పింది. అదేమిటంటే మహిళలకు వ్యతిరేకంగా అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతరించడమే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చర్యలు తీసుకునేలోపే ఆ వీడియో 80 లక్షలకుపైగా వ్యూస్ను పొందింది. ఈ రెండేళ్లలో ఇటువంటి డీప్ఫేక్ కంటెంట్ విస్తృతమైంది.ప్రపంచవ్యాప్తంగా డీప్ఫేక్ బాధితుల్లో అత్యధికులు మహిళలే ఉన్నారు. ఏఐ సేఫ్టీ సంస్థ ‘పై ల్యాబ్స్’నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా డీప్ఫేక్ బాధితుల్లో 93% మంది మహిళలే. ఇటీవలి కాలంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని సృష్టించిన అనధికారిక కృత్రిమ కంటెంట్ ఏకంగా 900% పెరిగింది. భారత్లో మహిళలు బాధితులుగా నమోదైన సైబర్ నేరాల ఫిర్యాదులు 2024లో సుమారు 50వేలు ఉండగా.. 2025 నాటికి 80 వేలకు చేరుకున్నాయి.ఫొటోల మార్ఫింగ్, అసభ్యకరమైన డీప్ఫేక్ వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటర్నెట్లో కనిపిస్తున్న కంటెంట్లో డీప్ఫేక్ పోర్నోగ్రఫీ అత్యధికంగా ఉంటోంది. వాస్తవ వ్యక్తుల పోలికలు లేకుండా పూర్తిగా కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన మహిళా రూపాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. మౌనంగా బాధితులు.. మహిళలకు సంబంధించిన 62% డీప్ఫేక్ వేధింపుల ఘటనలు అసలు బయటకే రావడం లేదు. సామాజిక వివక్ష, అవమానం జరుగుతుందనే భయంతో బాధితులు మౌనంగా ఉంటున్నారు. ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్న భారతీయ మహిళల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. చాలామంది ఎదురుదాడి చేయడానికి బదులుగా నిశ్శబ్దంగా తమ డిజిటల్ ఉనికిని (సామాజిక మాధ్యమాల వినియోగాన్ని) తగ్గించుకుంటున్నారు. 33% మందికి తమను రక్షించడానికి ఉన్న చట్టాల గురించి కనీస అవగాహన కూడా లేదు.పరిశ్రమలా విస్తరించాయి..డీప్ఫేక్ వీడియోలతో వేధింపులు కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. విస్తృతంగా ప్రచారంలోకి వచి్చన ఒక కేసులో.. మాజీ భాగస్వామి ఒకరు ఏఐ టూల్స్ను ఉపయోగించి ఒక మహిళ చిత్రంతో అసభ్యకరమైన ఇన్స్ట్రాగామ్ ప్రొఫైల్ను సృష్టించాడు. ఈ విషయాన్ని గుర్తించేలోపే 1.4 మిలియన్ల ఫాలోవర్లను ఆ ప్రొఫైల్ సంపాదించింది.ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఐదువేల కంటే ఎక్కువ ఫేస్–స్వాప్ టూల్స్, 1,000 వాయిస్–క్లోనింగ్ అప్లికేషన్స్ ద్వారా ఈ వేధింపులు ఒక పరిశ్రమలా విస్తరించాయి. సాధారణ మహిళలు కూడా సెలబ్రిటీలకు సమానంగా ప్రమాదంలో ఉన్నారు. డీప్ఫేక్లను అరికట్టడం అనేది ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. జెనరేటివ్ ఏఐ టూల్స్ అందరికీ అందుబాటులో ఉండటం, దురి్వనియోగం చేసే వారి సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. వీటిని గుర్తించే సాంకేతికతలు అందరికీ సమానంగా అందుబాటులో లేవు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఎర
బెంగళూరు: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ కర్నాటక నేతలు ‘ఆపరేషన్ లోటస్’కు తెరతీశారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల చొప్పున ఇస్తామంటూ కొందరు ప్రయత్నించారని తెలిపారు.దీనికి సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. బిడది రిసార్టులో ఉంచిన తమ ఎమ్మెల్యేల వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చి నగదు ఆఫర్ ఇచ్చినట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా తెలిపారు.
నేపాల్లో బస్సు ప్రమాదం ఏడుగురు భారతీయులు మృతి
కఠ్మాండు: భారతీయ తీర్థయాత్రికులతో కూడిన మినీ ఎలక్ట్రిక్ బస్సు నేపాల్లో ప్రమాదానికి గురైంది. ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గండకి ప్రావిన్స్లోని గూర్ఖా జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.మనకామన ఆలయం నుంచి వస్తున్న ఈ అదుపుతప్పి రోడ్డు పక్క ఏటవాలుగా ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఏడుగురు మృత్యువాతపడగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పాంచ్ పటాకా.. ఐదు రాష్ట్రాల్లో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కీలకమైన పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీతో కలిసి ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29ల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. కేరళ (140), అస్సాం (126), పుదుచ్చేరి (30) అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు జ్ఞానేశ్ తెలిపారు. అన్నిచోట్లా మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. ఇప్పటికే పార్టీల నేతలు, రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై సలహాలు స్వీకరించామని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో ప్రవర్తన నియామవళి అమల్లోకి వచ్చింది. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు, 17.4 కోట్ల మంది ఓటర్లున్నట్టు సీఈసీ తెలిపారు. ‘‘మొత్తం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 750 నుంచి 900 మంది ఓటర్లున్నారు. సుమారు 25 లక్షల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని తెలియజేశారు. యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని, గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఈసీ పదవి నుంచి తనను తొలగించడానికి పార్లమెంటులో ప్రతిపక్షాలు నోటీసివ్వడంపై స్పందించేందుకు నిరాకరించారు.8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలుదేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో రెండేసి, గోవా, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో ఒక్కో స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గోవా, కర్నాటక, నాగాలాండ్, త్రిపురల్లో ఏప్రిల్ 9న, గుజరాత్, మహారాష్ట్రలో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది.
ఎన్ఆర్ఐ
వాషింగ్టన్ డీసీలో శంకర నేత్రాలయ నిధుల సేకణ కార్యక్రమం
గతేడాది డిసెంబర్ 6. 2025న వాషింగ్టన్ డి.సి. మెట్రో ప్రాంతంలో నిర్వహించిన శంకర నేత్రాలయ (SN) నిధుల సేకరణ కార్యక్రమం విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మక నేత్ర వైద్య సంస్థ కోసం మొత్తం $150,000 నిధులు సమీకరించారు. సంస్కృతి,కరుణను ప్రతిబింబించే ఈ వేడుకకు చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రమణ రెడ్డి మడ్డికుంట CapEx సభ్యుడు తిరుమల రెడ్డి మునుకుంట్ల నాయకత్వం వహించారు.ఆ సాయంత్రం థీమ్ కరుణ ప్రతిధ్వనులు: కళ హృదయాన్ని కలిసే స్థలం (Echoes of Compassion: Where Art Meets Heart)గా నిర్వహించబడింది. శాస్త్రీయ మరియు సాంప్రదాయ నృత్య కళలతో సేవా భావాన్ని మేళవిస్తూ ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక అకాడమీలు పాల్గొని యువ వయోజన నర్తకుల అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సాంస్కృతిక బృంద సభ్యురాలు లక్ష్మి బాబు సమన్వయంతో నృత్య ప్రదర్శనలు అత్యంత కన్నులపండుగగా నిర్వహించారుఈ వేడుకకు గౌరవ అతిథిగా ఎస్. వి. ఆచార్య గారు హాజరై తమ ప్రోత్సాహకర సందేశంతో కార్యక్రమానికి మరింత గౌరవాన్ని చేకూర్చారు. అలాగే 11 మంది MESU స్పాన్సర్ల మద్దతు ఈ కార్యక్రమ విజయానికి కీలకమైంది.ఉదార హృదయంతో సహకరించిన MESU స్పాన్సర్లు:సెల్వ, ప్రతిభ జయరామన్, భువనేశ్ బూజాల, భానుమతి రామకృష్ణ, శ్రవణ్ పడూరు, కృష్ణకాంత్ కుచ్చలకంటి, ప్రవీణ్ పాల్రెడ్డి, రఘు పాల్రెడ్డి, వెంకట్ దోమా, తిరుమల మునుకుంట్ల, రఘు జువ్వాది గారు. వీరి ఆర్థిక కార్యనిర్వహణ సహకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.ఇంకా SNUSA నేషనల్ మరియు డి.సి. మెట్రో చాప్టర్ సభ్యులు విశేషంగా సహకరించారు. ముఖ్యంగా శ్రీమతి నీలిమ గడ్డమనుగు, కృష్ణ రాజ్ భట్, సౌమ్య నారాయణన్, డి.సి. చాప్టర్ నాయకులు — బాలాజీ రాధాకృష్ణన్, హరిత రెడ్డి, అర్జున్ కామిసెట్టి, దిలీరాజ్ చాంతివేలు, రూపేష్ చిన్నకంపల్లి, కార్తిక్ గౌడ్ తదితరుల కృషి ప్రశంసనీయం.SNUSA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి గారి నాయకత్వం తోపాటు బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యుల మార్గదర్శకత్వం ఈ విజయానికి బలమైన ఆధారంగా నిలిచాయి. ట్రెజరర్ మూర్తి రేకపల్లి గారు లాజిస్టిక్స్ నిర్వహణలో విశేష కృషి చేయగా, మీడియా సహకారం అందించిన శ్రీగిరి కోటగిరి సేవలు అభినందనీయం. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువ వాలంటీర్లు, మీడియా,ఫోటోగ్రఫీ బృంద సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మాస్టర్ ఆఫ్ సెరిమనీగా వ్యవహరించిన శ్రియా బాబు తన చక్కని వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని చురుకుగా, సమర్థవంతంగా ముందుకు నడిపించారు.ఈ కార్యక్రమంలో సమీకరించిన నిధులు శంకర నేత్రాలయ లక్ష్యమైన అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించేందుకు వినియోగించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ముగిసే సమయానికి సేవా భావం, ఐక్యత, సామాజిక బాధ్యత స్పష్టంగా ప్రతిఫలించాయి. ఈ వేడుక కేవలం కళలు, సంస్కృతిని మాత్రమే కాకుండా, సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరి హృదయంలో మరింత బలంగా నాటింది.(చదవండి: అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..)
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు భారత్కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్ ఎవరు? ఆ వివరాలు మీకోసం.లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలోజన్మించారు నిత్య రామన్. ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య కుటుంబం, అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కరెన్ బాస్కు గట్టి పోటీప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!
అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత
క్రైమ్
చెల్లిని చూడాలని వెళ్తూ.. అనంతలోకాలకు
మేడ్చల్ జిల్లా: మల్కాజిగిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెల్లిని చూడా లని బైక్పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గోదావరిఖనికి చెందిన మర్రి ప్రశాంత్ (35) మెడికల్ రిప్రజెంటేటివ్. భార్య శ్రావణి (33), కుమారుడు సహస్రన్ (10)తో కలిసి రాంనగర్లో నివసిస్తున్నారు. ఆదివారం మేడిపల్లిలో నివాసం ఉంటున్న తన చెల్లి ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా స్పార్క్ ఆస్పత్రి సమీపం వరంగల్ హైవేలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కియా కారు అదుపుతప్పి బైక్ను బలంగా ఢీకొట్టి కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య శ్రావణికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కుమారుడు సహస్రన్కు స్వల్పగాయాలు కాగా అత న్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నా రు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపా రు. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్, యజమాని ఉన్నారు. వీరిని మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని కార్ను సీజ్చేసి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.
రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఎమ్మెల్యే వెలగపూడి అనుచరుడు
విశాఖపట్నం: విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు, కరకచెట్టు పోలమాంబ ఆలయ కమిటీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ వివాహేతర సంబంధంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం కలకలం రేపింది. కొద్ది రోజులుగా టీడీపీ నాయకుల లైంగిక వేధింపుల ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండగా తాజాగా మద్ది శ్రీనివాస్ ఆ జాబితాలో చేరాడు. పోలీసులు, బాధిత మహిళ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...! బుద్ధి చెప్పాల్సింది పోయి.. వెలగపూడి వత్తాసు.. మద్ది శ్రీనివాస్ కొన్నాళ్లుగా భార్య వసుంధరను వదిలించుకోవాలని చూస్తున్నాడు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో శ్రీనివాస్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంపై అతడి భార్య న్యాయ పోరాటానికి దిగారు. దీనిపై భీమిలి పోలీసు స్టేషన్తో పాటు విశాఖ త్రీటౌన్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అతడి వ్యవహారాన్ని పలు సందర్భాల్లో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దృష్టికి తెచ్చారు. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ప్రాథేయపడ్డారు. అయితే శ్రీనివాస్కు బుద్ధి చెప్పాల్సింది పోయి వెలగపూడి అతడిని వెనకేసుకురావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భార్యా బిడ్డలను పట్టించుకోని శ్రీనివాస్ను ప్రసిద్ధ గ్రామ దేవత పోలమాంబ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్గా నియమించడం వివాదాస్పమైంది. ఈ వ్యవహారాన్ని శ్రీనివాస్ భార్య ప్రభుత్వం దృష్టికి కూడా తెచ్చినా పట్టించుకోలేదు. శ్రీనివాస్ అనైతిక సంబంధాలను రుజువు చేస్తే ఆలయ కమిటీ చైర్మన్గా తొలగిస్తామని ఎమ్మెల్యే వెలగపూడి గతంలో మీడియా సాక్షిగా ప్రకటించారు. అడ్డంగా చిక్కిన శ్రీనివాస్.. కేసులు నమోదైనప్పటికీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్థానిక టీడీపీ నాయకుడు పోతన్నరెడ్డి తదితరుల సహకారంతో శ్రీనివాస్ తప్పించుకుని తిరుగుతున్నాడు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకుని బరితెగించి తిరుగుతున్నట్లు భార్య పలు దఫాలు వాపోయారు. ఈ క్రమంలో శ్రీనివాస్ శనివారం అర్ధరాత్రి పెదవాల్తేర్లోని ఓ ఇంట్లో ఓ మహిళతో కలిసి ఉండగా భార్య వసుంధర రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాళ్లిద్దరూ ఉన్న గదికి కుటుంబ సభ్యుల సహకారంతో తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శ్రీనివాస్ గది బయట కాపుకాసిన తన భార్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై తన అనుచరులతో దాడి చేయించాడు. తన అనుచరుల సాయంతో గది తాళం పగలగొట్టించి బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ వారు రాకపోవడంతో శ్రీనివాస్ మరోసారి తప్పించుకున్నాడని, ఓ మహిళతో రెడ్ హ్యాండెడ్గా దొరికిన అతడిపై చర్యలు తీసుకోవాలని వసుంధరతోపాటు ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో పోలీసులు అతడిని ఎంవీపీ స్టేషన్కు తరలించారు. అయితే ఎమ్మెల్యే వెలగపూడి ఒత్తిడితో పోలీసులు శ్రీనివాస్ను విడిచిపెట్టినట్లు తెలిసింది. తాజా ఘటనపై వసుంధర రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై ఎంవీపీ సీఐని వివరణ కోరగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదు అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అక్రమ సంబంధం, రాసలీలల ఘటనలో నేరుగా దొరికినప్పటికీ పోలీసులు, టీడీపీ నాయకులు శ్రీనివాస్కు తొత్తులుగా వ్యవహరించారని వసుంధర ఆక్రోశించారు. తనకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు. వెలగపూడీ.. ఆడబిడ్డ ఉసురు పోసుకోకు.. మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని రుజువుచేస్తే శ్రీనివాస్పై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే వెలగపూడి ఇప్పుడు అతడు రెడ్హ్యాండెడ్గా దొరికినా వత్తాసుగా నిలవడంపై వసుంధర మండిపడ్డారు. నీ పార్టీ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఓ ఆడబిడ్డ ఉసురుపోసుకోవద్దంటూ వెలగపూడిపై దుమ్మెత్తిపోశారు. నీ ఇంట్లో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి వస్తే నిందితుడిని ఇలాగే వెనకేసుకొస్తావా..? అంటూ ఆక్రోశించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల జీవితాలను నాశనం చేయవద్దంటూ హితవు పలికారు. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై కలగజేసుకుని తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఉరి వేసుకునేలా ప్రేరేపించింది భర్తే
రాజంపేట: ఉరి ఎలా వేసుకోవాలో చెప్పి భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని వైఎస్సార్ కడప జిల్లా మన్నూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సీఐ లింగప్ప కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నందలూరుకు చెందిన రైల్వే లోకో పైలెట్ శ్రీరాం శ్రీనివాస్ 2017లో కృష్ణవేణి(30)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరు బోయనపల్లెలోని శ్రీరామ్నగర్లో నివాసం ఉండేవారు. శ్రీరాం మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈనెల 11న కారు మరమ్మతుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న శ్రీరాం శ్రీనివాస్ కృష్ణవేణిని బెల్టుతో కొట్టాడు. ఆమెను చనిపోవాలని తీవ్రంగా ప్రేరేపించాడు. మనోవేదనకు గురైన మృతురాలు బెడ్రూంలోకి వెళ్లి లోపలి నుంచి గడియపెట్టుకొని ఉరి వేసుకుంటుండగా, నిందితుడు ఆమెను కాపాడకపోగా , ఆ దృశ్యాన్ని కిటికీలో నుంచి భార్య సెల్ఫోన్లోనే వీడియో తీశాడు. ఉరి అలా కాదు.. కృష్ణా.. సరిగ్గా వేసుకో అంటూ వికృతంగా నవ్వుతూ పైశాచికత్వం ప్రదర్శించాడు. ఆమె ఉరివేసుకుని మరణించిన తర్వాత ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టి, మరుసటి రోజు తన తల్లిదండ్రులు వచి్చన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం సెక్షన్ 108 బీఎన్ఎస్ కింద కేసుగా మార్చి నిందితుడు శ్రీరాం శ్రీనివాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
అమ్మా.. ఎందుకిలా..!
భువనగిరి : కుటుంబాలలో నెలకొనే చిన్నచిన్న తగాదాలు, సమస్యలతో చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో తమతో పాటు నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డలను సైతం చంపుతున్నారు. ఫలితంగా వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఇటీవల ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ట్రైన్కు ఎదురెళ్లి దుర్మరణం చెందగా, ఇద్దరు పిల్లలను ఊపిరాగకుండా చేసి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మరవకముందే తాజాగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలపై కత్తితో దాడికి పాల్పడి తాను ఆత్మహత్య చేసుకుంది. నెలన్నర వ్యవధిలోనే చోటుచేసుకున్న ఈ మూడు ఘటనల్లో బాధితులు బీబీనగర్ మండలానికి చెందిన వారు కావడం గమనార్హం. పిల్లలపై కత్తితో దాడి చేసి..బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జం నరేందర్రెడ్డి భార్య రత్నకళ (నీలిమ) మానసిక స్థితి సరిగా లేక పిల్లలతో తల్లిగారి గ్రామమైన భువనగిరి మండలం తుక్కాపురానికి వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున నిద్రలో ఉన్న కుమార్తె కృతిరెడ్డి(14)పై కత్తితో దాడి చేసి చంపింది. అనంతరం పన్నెండేళ్ల కుమారుడి అక్షిత్రెడ్డిపై దాడికి యత్నంచగా అతడు తప్పించుకుని కేకలు పెట్టుకుంటూ బయటకు వచ్చాడు. అనంతరం ఆమె అదే గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. ఈ ఘటన బీబీనగర్ మండలంలో కలకలం సృష్టించింది.గతంలో రెండు ఘటనలు ఇలా..అయితే బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన పిన్నింటి విజయశాంతిరెడ్డి అనే మహిళ జనవరి 31న ఘట్కేసర్ వద్ద తన ఇద్దరు పిల్లలు చేతన, విశాల్రెడ్డితో కలిసి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే ఈ నెల 2న ఇదే మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన మహిళ ఐశ్వర్య కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలైన ఝాన్సీ, పండును ఊపిరాడకుండా చేసి చంపింది. తర్వాత తాను ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నెలన్నర వ్యవధిలోనే ఒకే మండలానికి ఇద్దరు మహిళలు తమ పిల్లలను చంపి తాము చావాలనుకోవడం లాంటి ఘటనలు మరువక ముందే ఇదే మండలానికి చెందిన తమ మరో మహిళ తన తల్లి గారి ఊరిలో తన కుమార్తెను చంపి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడం చర్చనీయాంశంగా మారింది.
వీడియోలు
పుట్టాపై సీరియస్... BR నాయుడుపై మాత్రం నో సీరియస్... జడ శ్రవణ్ సెటైర్లు
అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక భేటీ
తెలంగాణలో IAS-IPSల కొరత
టీడీపీ ఎంపీ పుట్టా సోషల్ మీడియాలో ఆడుకున్న నెటిజన్లు
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై BJYM కార్యకర్తలు దాడి
UAEలోని అతిపెద్ద ఇంధన నిల్వ కేంద్రంపై ఇరాన్ బాంబుల వర్షం
వేదికపై ఫోటో దిగుతూ గుండెపోటుతో మహిళ మృతి
ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు
డ్రగ్స్ కేసులో అరెస్ట్.. ఒక్కరోజులో బెయిల్ సామాన్యులకు సాధ్యమేనా!
