నేపాల్లో కొత్త ప్రభుత్వ పాలన అదుర్స్ కదూ..?
కాఠ్మాండు: నేపాల్లో ప్రస్తుతం ఏం జరుగుతోంది? కొత్త ప్రభుత్వం ప్రజల అంచనాలకు తగ్గట్లే వ్యవహరిస్తోందా? ఎన్నెన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు నేపాల్ ప్రజలు. ఆ దేశంలో కొన్ని నెలల క్రితం ఉవ్వెత్తున ఎగిసిన జెన్ జీ ఉద్యమం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఆర్థిక వ్యవస్థ కుదేలు అవ్వడం, ప్రభుత్వంలో అవినీతి వంటి పలు అంశాలు జెన్ జీ ఉద్యమానికి కారణమయ్యాయి.ఆ తర్వాత జెన్ జీ నిరసనలతో రాజకీయాల్లోకి ప్రవేశించారు రాపర్ బాలేంద్ర షా (బాలెన్). నేపాల్ ప్రధాని అయ్యారు. ప్రభుత్వంలో పారదర్శకత, విద్యా సంస్కరణలు, వీఐపీ సంస్కృతి తొలగింపు వంటి చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. చెప్పినట్లుగానే ప్రభుత్వంలో పారదర్శకత పెంచుతున్నారు. ఏప్రిల్ 9న లేబర్, ఎంప్లాయ్మెంట్, సోషల్ సెక్యూరిటీ మంత్రి దీపక్ కుమార్ సాహ్ను క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలపై పదవి నుంచి తొలగించారు.నేపాల్ హోం మంత్రి సుదాన్ గురుంగ్ బుధవారం (ఏప్రిల్ 22) తన పదవికి రాజీనామా చేశారు. తన ఆస్తులపై వచ్చిన ఆరోపణలపై నైతిక బాధ్యత వహిస్తూ, న్యాయంగా దర్యాప్తు జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని భావించి స్వచ్ఛందంగా పదవిని వదులుకున్నారు. దీంతో బాలేంద్ర షా నిజంగానే జవాబుదారీతనంతో ఉంటున్నారని, ప్రభుత్వానికి అవినీతి మచ్చ అంటనివ్వట్లేదని విశ్లేషకులు అంటున్నారు. నేపాల్ హోం మంత్రి సుదాన్ గురుంగ్ బుధవారం తన పదవి నుంచి రాజీనామా చేశారు, తన ఆర్థిక ఆస్తులపై వచ్చిన ఆరోపణలపై నైతిక బాధ్యత స్వీకరించి, దర్యాప్తు న్యాయంగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాజీనామా విషయాన్ని ప్రకటిస్తూ ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. ప్రజా జీవితంలో నైతిక ప్రమాణాలు నిలబెట్టేందుకు పదవి నుంచి తప్పుకున్నట్టు చెప్పారు."నేను, సుదాన్ గురుంగ్ను.. 2026 మార్చి 26 నుంచి హోం మంత్రిగా అత్యంత నిజాయితీతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఇటీవల నా షేర్లు, సంబంధిత విషయాలపై పౌరులు లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు, ఆందోళనలను నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. నా దృష్టిలో నైతిక విలువలు అన్ని పదవులకన్నా ఎక్కువ. ప్రజా విశ్వాసానికి మించిన శక్తి లేదు. నేటి 'జెన్ జీ' ఉద్యమం కూడా ఇదే సందేశం ఇస్తోంది. ప్రజా జీవితం స్వచ్ఛంగా ఉండాలి, నాయకత్వం బాధ్యత వహించాలి" అని చెప్పారు. దేశ రాజకీయ నేపథ్యం, గతంలో జరిగిన త్యాగాలను ప్రస్తావిస్తూ.. ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యత తప్పనిసరి అని అన్నారు.తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. పారదర్శకత ఉండేందుకు, ఒకే వ్యక్తికి రెండు విరుద్ధ ప్రయోజనాలు ఉండే పరిస్థితి లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఓ వైపు తాను పదవిలో ఉండి, మరోవైపు తనపై దర్యాప్తు జరిగే విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందన్నారు. అందుకే నేటి నుంచే హోం మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు.పౌరులు, మీడియా, యువత నిజాయితీ, బాధ్యతాయుత మార్గంలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. "నా నైతిక బాధ్యతను నేను పూర్తి చేశాను. ఇప్పుడు నా మీడియా స్నేహితులు, నేపాల్ సోదరులు, సోదరీమణులు, యువత అందరూ సత్యం, నిజాయితీ, ఆత్మశుద్ధి మార్గంలో నడవాలి. కొన్ని మీడియా వ్యక్తులు పొందిన 'స్వీట్ షేర్లు' (ప్రత్యేక లాభాల కోసం ఇచ్చే వాటాలు) గురించి సమాచారం త్వరలో బయటపడుతుంది. రామ రాజ్యం కోరుకునేవారు త్యాగం చేయడానికి, నైతిక ధైర్యం చూపడానికి సిద్ధంగా ఉండాలి" అని అన్నారు.ఏప్రిల్ 9నే మరో మంత్రి ఔట్ ఇంతకుముందు ఏప్రిల్ 9న నేపాల్ ప్రధాన మంత్రి బాలేంద్ర షా.. మంత్రి దీపక్ కుమార్ సాహ్ను క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలపై, పదవి నుంచి తొలగించారు. ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపిన ప్రకారం.. పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు సాహ్ను తొలగించారు. కమిషన్ అధ్యయనం ప్రకారం.. తన పదవిని దుర్వినియోగం చేసి, తన భార్య జును శ్రేష్ఠాను హెల్త్ ఇన్సూరెన్స్ బోర్డు సభ్యురాలిగా కొనసాగించారు. ఆ పదవి చాలా కాలంగా నిర్వీర్యంగా ఉంది. కమిషన్ తన నివేదికను పార్టీకి సమర్పించి, చర్యలు తీసుకోవాలని సూచించింది.దీంతో బాలేంద్ర షా తన మంత్రివర్గంలో అవినీతి జరగకుండా చూసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. జెన్ జీ కోరుకున్న అంశాల్లో ఇది ప్రధానం. గత ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయి, జవాబుదారీతనంలో ఉండేవి కాదు. దేశ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయినా మంత్రులు తమ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పటి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కూడా కావట్లేదు. అప్పుడే పాలనలో పారదర్శకతను చూపిస్తోంది.
ఆ రూ.3 వేలు తీసుకోకపోయి ఉంటే.. 26 మంది ప్రాణాలు నిలబడేవి
ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది. ఈ సందర్భంగా ఆ మారణహోమానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఎన్ఐఏ విచారణలో తేలిన వివరాల ప్రకారం పహల్గాం ఉగ్రదాడి ముందు రోజు (ఏప్రిల్ 21, 2025 రాత్రి) ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఇద్దరు కాశ్మీర్ స్థానికులు ఫర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ ఆశ్రయం కల్పించారు. ఉగ్రవాదుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చే అవకాశమున్నప్పటికీ, వారు చెప్పలేదు. ఇందుకోసం ఉగ్రవాదుల నుంచి రూ.3,000 తీసుకున్నట్లు విచారణలో బయటపడింది.ఆ రాత్రి ఫైజల్ జాట్ అలియాస్ సులేమాన్ షాక్, హబీబ్ తాహీర్ అలియాస్ జిబ్రాన్, హంజ్జా ఆఫ్గానీ అనే ముగ్గురు ఉగ్రవాదులు ఆయుధాలతో ఆ ఇద్దరి ఇళ్లకు వచ్చారు. వారు ఉర్దూ, పంజాబీ భాషల్లో మాట్లాడుతుండగా, పెద్ద దాడి జరగబోతుందనే విషయం స్థానికులకు అర్థమైంది. సుమారు ఐదు గంటల పాటు అక్కడే గడిపి, భోజనం చేసి, అవసరమైన వంట పాత్రలు, బ్లాంకెట్, టార్పాలిన్ షీట్ తీసుకెళ్లారు.ఏప్రిల్ 22న మధ్యాహ్నం 12:30 వరకు ఫర్వేజ్, బషీర్ ఇళ్ల వద్దే ఉన్న ఉగ్రవాదులు ఆ తర్వాత బైసరీన్ వ్యాలీలో దాక్కున్నారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఫర్వేజ్, బషీర్ పహల్గాంలో టూరిస్టులను గుర్రాలపై బైసరీన్ వ్యాలీకి తీసుకెళ్లారు. అక్కడే మారణహోమం జరిగింది. దాడి జరుగుతున్నా తమకేం పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయారని ఎన్ఐఏ విచారణలో తేలింది. జూన్ 22, 2025న ఎన్ఐఏ ఆ ఇద్దరు స్థానికులను అదుపులోకి తీసుకుని, ఛార్జ్షీట్లో వారి పేర్లను చేర్చింది.ఫర్వేజ్, బషీర్ తీసుకున్న ఆ మూడు వేల రూపాయలే 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఘటన జరిగి ఏడాది గడిచినా, బాధితుల కళ్ల ముందు ఆ దృశ్యాలు ఇంకా కదలాడుతూనే ఉన్నాయని, వారు కన్నీటి పర్యంతమవుతున్నారని తెలుస్తోంది.
‘కీమో వద్దు.. పసరు ముద్దు’.. క్యాన్సర్ రోగికి ఏఐ షాక్!
లండన్: ఆధునిక కాలంలో ఏ చిన్న అనారోగ్య సందేహానికైనా ఇంటర్నెట్ను అశ్రయించడం సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు దీనికి తోడు కృత్రిమ మేధస్సు (ఏఐ) చాట్బాట్లను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే అత్యంత సున్నితమైన క్యాన్సర్ చికిత్స విషయంలో ఈ ఏఐ సాధనాలు ఇస్తున్న సలహాలు రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. కీమోథెరపీ లాంటి శాస్త్రీయ చికిత్సలకు బదులుగా ఎటువంటి ఆధారాల్లేని ప్రత్యామ్నాయాలను సూచిస్తూ, ఇవి రోగులను ప్రాణాపాయంలోనికి నెడుతున్నాయి.సగం సమాధానాలు పచ్చి అబద్ధాలేలుండ్క్విస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ ఇన్నోవేషన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ‘బీఎంజే ఓపెన్’ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం అనేక విషయాలను బయటపెట్టింది. పరిశోధకులు చాట్జీపీటీ, జెమిని, మెటా ఏఐ, డీప్పీక్, గ్రోక్ వంటి ప్రముఖ చాట్బాట్లను పరీక్షించారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల గురించి అడిగినప్పుడు ఇవి ఇచ్చే సమాధానాల్లో దాదాపు 50 శాతం తప్పుల తడకగా ఉన్నాయని తేలింది. ఇందులో 19.6 శాతం సమాచారం పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉండగా, 30 శాతం సమాధానాల్లో సరైన స్పష్టత లేదు. ముఖ్యంగా పరీక్షించిన అన్ని మోడళ్లలో ‘గ్రోక్’ పనితీరు అత్యంత పేలవంగా ఉందని వెల్లడైంది.ప్రాణాలు తీస్తున్న ఉచిత సలహాలుకీమోథెరపీకి ప్రత్యామ్నాయాలు ఏమిటని అడిగినప్పుడు, ఈ బాట్లు ముందుగా చిన్నపాటి హెచ్చరికలు చేసినప్పటికీ.. ఆ వెంటనే ఆక్యుపంక్చర్, మూలికా వైద్యం, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని ‘క్యాన్సర్ డైట్’లను సూచించాయి. అసలు సంప్రదాయ వైద్య చికిత్సలనే వ్యతిరేకించే ‘గెర్సన్ థెరపీ’ వంటి వాటిని కూడా ఈ ఏఐలు ప్రస్తావించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాత నిరూపితమైన కీమోథెరపీతో ఇలాంటి ప్రామాణికత లేని చికిత్సలకు ఈ చాట్బాట్లు సమానమైన ప్రాధాన్యత ఇస్తుండటంతో రోగులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.ఏఐ డాక్టర్ కాదు.. అప్రమత్త తప్పనిసరిఏఐ ఇచ్చే ఈ తప్పుడు సమాచారం వల్ల రోగులు ప్రాణాలను నిలబెట్టే కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్సలను వాయిదా వేసుకోవడం లేదా పూర్తిగా పక్కనపెట్టడం జరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చాట్బాట్లు రోగుల ఆయుర్దాయం గురించి అవాస్తవ అంచనాలను ఇస్తూ, వారిలో లేనిపోని ఆందోళనను నింపుతున్నాయి. ఏఐ అనేది కేవలం ప్రాథమిక సమాచారం తెలుసుకోవడానికి మాత్రమేనని, కచ్చితమైన రోగ నిర్ధారణ, చికిత్స కోసం ఎల్లప్పుడూ అర్హత కలిగిన ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ వైద్య నిపుణులు)ను మాత్రమే సంప్రదించాలని నిపుణులుహెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘తలొంచం.. తరిమికొడతాం’: ‘పహల్గామ్’పై ప్రధాని మోదీ
'హెయిర్ గ్రోత్ క్వీన్ ఆఫ్ ఇండియా'గా డాక్టర్ స్తుతి ఖరే శుక్లా గుర్తింపు
శాస్త్రీయ ఆధారాలు, వినూత్న విధానాలతో జుట్టు రాలడం (హెయిర్ లాస్) చికిత్సలో కొత్త దారులు చూపుతున్నారు. నాన్-సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వారా లక్షలాది మందికి నమ్మకాన్ని కలిగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా రోగులకు అందుబాటులో ఉన్న ఆధునిక పరిష్కారాలు అందిస్తున్నారు. జుట్టు రాలడం అనేది అన్ని వయస్సులు, అన్ని ప్రాంతాల ప్రజలను ప్రభావితం చేసే అత్యంత సాధారణమైన అంశం. అయినా, మానసికంగా బాధ కలిగించే సమస్యలలో ఒకటిగా ఉంది. వైద్య శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నా శస్త్రచికిత్స, ఎక్కువ కాలం విశ్రాంతి అవసరమయ్యే చికిత్సకు చాలా మంది సంకోచిస్తున్నారు. ఈ సమస్యకు శాస్త్రాన్ని, సౌకర్యాన్ని కలిపి పరిష్కారం చూపుతున్న వైద్యురాలు డాక్టర్ స్తుతి ఖరే శుక్లా. ఆమెను భారతదేశంలోని ప్రముఖ చర్మ వైద్య నిపుణురాలిగా మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హెయిర్ స్పెషలిస్టుగా గుర్తిస్తారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా జుట్టు పెరుగుదలలో అద్భుత ఫలితాలు అందిస్తున్నందుకు రోగులు ఆమెను ప్రేమతో 'హెయిర్ గ్రోత్ క్వీన్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు.అమెరికాలో శిక్షణ పొందిన డెర్మటాలజిస్ట్, డెర్మాటో-సర్జన్, కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ అయిన డాక్టర్ స్తుతి ఖరే శుక్లా ప్రస్తుతం ఎలిమెంట్స్ ఆఫ్ ఏస్తెటిక్స్ క్లినిక్ల చైన్కు చీఫ్ డెర్మటాలజిస్ట్, మెడికల్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఈ క్లినిక్లు ముంబై, హైదరాబాద్, నాగపూర్, జబల్పూర్, బాలాఘాట్ నగరాల్లో ఉన్నాయి. ఇటీవల ఆమె ఫెమినా మిస్ ఇండియా 2026 పోటీలో హెయిర్ కేర్ నిపుణురాలు, జ్యూరీ సభ్యురాలిగా సేవలందించారు. శస్త్రచికిత్స లేకుండా జుట్టు పునరుద్ధరణలో ఆమె చేసిన కృషి వల్ల దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు లభించింది. హెయిర్ లాస్ చికిత్స విధానం వైద్య పరిశోధన, అంతర్జాతీయ అనుభవంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో డెర్మటాలజీలో పీజీ పూర్తి చేసిన తర్వాత, ఆమె అమెరికా, సింగపూర్, బ్యాంకాక్లలో అధునాతన సూపర్ స్పెషాలిటీ ఫెలోషిప్లు చేశారు. ఈ అంతర్జాతీయ శిక్షణ వల్ల వివిధ దేశాల ప్రజల్లో కనిపించే జుట్టు సమస్యలు, చికిత్స పద్ధతులు, సాంకేతికతను లోతుగా అధ్యయనం చేసే అవకాశం లభించింది.ఆమెకు ఉన్న ఈ అంతర్జాతీయ అనుభవమే తర్వత ప్రత్యేక చికిత్స విధానం అభివృద్ధికి పునాది అయింది. అదే హెయిర్ గ్రోత్ బూస్టర్. శస్త్రచికిత్స అవసరం లేని, సుమారు ఐదు నిమిషాల్లో పూర్తయ్యే హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ ఇది. శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఇష్టపడని, అర్హత లేని వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించినది ఈ చికిత్స. నొప్పి లేకుండా, తక్కువ సమయంలో పూర్తయ్యే విధంగా ఉండటం వల్ల ఆదరణ పొందింది. ఈరోజుల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ విధానాలు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో శస్త్రచికిత్స అవసరం లేని ప్రత్యామ్నాయాలపై మళ్లీ దృష్టిని ఆకర్షించింది. ఆమె చికిత్స విధానం శస్త్రచికిత్స చేయకుండా, శాస్త్రీయంగా రూపొందించిన పద్ధతుల ద్వారా నిద్రలో ఉన్న హెయిర్ ఫాలికల్స్ను ప్రేరేపించడంపై కేంద్రీకృతమై ఉంటుంది. అందువల్ల ఇది ప్రారంభ దశలో ఉన్న వారికి అనగా జుట్టు ఊడిపోవడం, ఒత్తిడి కారణంగా వచ్చే హెయిర్ లాస్, జుట్టు పలుచబడే సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.గ్లోబల్ పరిధిని మరింత విస్తరించిన అంశం ఏమిటంటే, ఆమె రూపొందించిన వ్యవస్థీకృత ఆన్లైన్ కన్సల్టేషన్ మోడల్. పురుషులలో కనిపించే ప్యాటర్న్ బాల్డ్నెస్, మహిళలలో వచ్చే హెయిర్ లాస్, అలోపేషియా వంటి సమస్యలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులకు ఆమె వర్చువల్ కన్సల్టేషన్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. దీని వల్ల భౌగోళిక పరిమితులు లేకుండా నిపుణుల సేవలను అందుకోవడం సాధ్యమవుతుంది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన చికిత్స ప్రణాళికలు, నిరంతర మార్గదర్శకత్వాన్ని రోగులు తమ ఇళ్ల నుంచే పొందగలుగుతున్నారు. ఈ విధంగా ఆధునిక హెయిర్ రీస్టోరేషన్ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.అనేక మంది రోగుల అనుభవాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, అమెరికాలోని చికాగో నగరానికి చెందిన నెల్సన్ జోసెఫ్ అనేక సంవత్సరాలుగా జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఇతర చోట్ల ఎన్నో చికిత్సలు చేయించినా ఫలితం లేకపోవడంతో, ఆయన ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా డాక్టర్ స్తుతిని సంప్రదించారు. ఆమె సూచించిన చికిత్సను అనుసరించిన తర్వాత, ఆయన జుట్టు పెరుగుదలలో గణనీయమైన మార్పు కనిపించిందని, ఆ ఫలితాలు జీవితాన్ని మార్చిందని పేర్కొన్నారు.క్లినికల్ ప్రాక్టీస్కు మాత్రమే పరిమితం కాకుండా, డాక్టర్ స్తుతి పరిశోధన రంగంలో కూడా చురుకుగా ఉన్నారు. హెయిర్, స్కాల్ప్ విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికతలు ఉపయోగించే పారిస్లోని ప్రముఖ ప్రయోగశాలతో కలిసి పని చేస్తున్నారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులతో కలిసి చికిత్స పద్ధతులను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు. ఆమె చేసిన పరిశోధనలు ప్రముఖ అమెరికన్ వైద్య జర్నల్స్లో కూడా ప్రచురితమయ్యాయి. ఒక లక్షకు పైగా విజయవంతమైన హెయిర్ గ్రోత్ కేసులు ఉన్నాయి. వైద్య నైతికత ఆధారంగా బలమైన అంతర్జాతీయ రోగుల వర్గాన్ని నిర్మించారు. ఆమె చేసిన పని ఏస్థెటిక్ మెడిసిన్ రంగంలో ఒక ముఖ్యమైన మార్పును ప్రతిబింబిస్తుంది. అది అధిక శస్త్రచికిత్సల కంటే భద్రత, శాస్త్రీయ ఆధారాలు, రోగుల సౌకర్యాన్ని ప్రాధాన్యంగా చూసే విధానం. శస్త్రచికిత్స అవసరం లేని చికిత్సలపై అవగాహన పెరుగుతున్న ఈ సమయంలో డాక్టర్ స్తుతి సేవలు ఒక ఉత్తమ ఉదాహరణగా చెప్పవచ్చు. శాస్త్రీయ ఆధారాలు, అంతర్జాతీయ అనుభవంతో కూడిన నవీన ఆవిష్కరణలు ఎలా హెయిర్ లాస్ చికిత్సను ప్రపంచవ్యాప్తంగా మారుస్తాయో ఆమె నిరూపిస్తున్నారు.మరిన్ని వివరాలకు..వాట్సాప్ నంబర్ : +91 6261 967 835ఇన్స్టాగ్రామ్: https://www.instagram.com/dr.stutikhareshukla?
'నా సోనును కోల్పోయా'.. బిగ్బాస్ అశ్విని ఎమోషనల్ పోస్ట్
అమ్మో.. అమెరికా సైన్యం లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేదో?
వాచ్మెన్గా పనిచేశా.. బిచ్చగాడిగా కూడా సెట్ కాదన్నారు: నటుడు
నేపాల్లో కొత్త ప్రభుత్వ పాలన అదుర్స్ కదూ..?
భగ్గుమన్న పశ్చిమాసియా
సన్రైజర్స్ కెప్టెన్సీ నుంచి ఇషాన్ కిషన్ అవుట్?
సన్రైజర్స్కు వరంలా మారిన సాకిబ్ హుస్సేన్
గీతం యూనివర్శిటీ ఎదుట వైఎస్సార్సీపీ నిరసన
మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు షాక్
హైదరాబాద్లో భారీ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్కు గుడ్బై.. షిఫ్ట్ అవుతున్న అల్లు అర్జున్!
మీతో పని ఉంది సార్.. రాత్రి ఇంటికి రండి!
ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్ నినో’
ముంబైలో స్థిరపడనున్న అల్లు అర్జున్.. స్పందించిన అరవింద్
అతని టార్గెట్ బంజారాహిల్స్ అమ్మాయిలే..!
గరికపాటికి లీగల్ నోటీసు
సార్ మనమిప్పుడు తమిళనాడులో ఉన్నాము!
ఓటుకు నోటు ‘బంధం’ వీడడం లేదు మరి!
'సారీ చరణ్.. మగధీర సినిమాలో చేయొద్దని చెప్పా'
వాహనదారులకు అలెర్ట్.. పెట్రోల్కి గుడ్బై?
‘కీమో వద్దు.. పసరు ముద్దు’.. క్యాన్సర్ రోగికి ఏఐ షాక్!
ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు!
హార్మూజ్పై ఇరాన్ భారీ ట్విస్ట్.. దిమ్మ తిరిగే ప్లాన్!
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
చైనాలో రివర్స్ మైగ్రేషన్..
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు
‘మన చంద్రన్న’ పుస్తకంలో ‘అప్పులు’ అంశం ఏ పేజీలో ఉంది సార్!
వారెన్ బఫెట్ చెప్పే ‘కోటీశ్వరులయ్యే’ రహస్యాలివే!
ఇరాన్కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్!
'నా సోనును కోల్పోయా'.. బిగ్బాస్ అశ్విని ఎమోషనల్ పోస్ట్
అమ్మో.. అమెరికా సైన్యం లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేదో?
వాచ్మెన్గా పనిచేశా.. బిచ్చగాడిగా కూడా సెట్ కాదన్నారు: నటుడు
నేపాల్లో కొత్త ప్రభుత్వ పాలన అదుర్స్ కదూ..?
భగ్గుమన్న పశ్చిమాసియా
సన్రైజర్స్ కెప్టెన్సీ నుంచి ఇషాన్ కిషన్ అవుట్?
సన్రైజర్స్కు వరంలా మారిన సాకిబ్ హుస్సేన్
గీతం యూనివర్శిటీ ఎదుట వైఎస్సార్సీపీ నిరసన
మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు షాక్
హైదరాబాద్లో భారీ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్కు గుడ్బై.. షిఫ్ట్ అవుతున్న అల్లు అర్జున్!
మీతో పని ఉంది సార్.. రాత్రి ఇంటికి రండి!
ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్ నినో’
ముంబైలో స్థిరపడనున్న అల్లు అర్జున్.. స్పందించిన అరవింద్
అతని టార్గెట్ బంజారాహిల్స్ అమ్మాయిలే..!
గరికపాటికి లీగల్ నోటీసు
సార్ మనమిప్పుడు తమిళనాడులో ఉన్నాము!
ఓటుకు నోటు ‘బంధం’ వీడడం లేదు మరి!
'సారీ చరణ్.. మగధీర సినిమాలో చేయొద్దని చెప్పా'
వాహనదారులకు అలెర్ట్.. పెట్రోల్కి గుడ్బై?
‘కీమో వద్దు.. పసరు ముద్దు’.. క్యాన్సర్ రోగికి ఏఐ షాక్!
ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు!
హార్మూజ్పై ఇరాన్ భారీ ట్విస్ట్.. దిమ్మ తిరిగే ప్లాన్!
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
చైనాలో రివర్స్ మైగ్రేషన్..
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు
‘మన చంద్రన్న’ పుస్తకంలో ‘అప్పులు’ అంశం ఏ పేజీలో ఉంది సార్!
వారెన్ బఫెట్ చెప్పే ‘కోటీశ్వరులయ్యే’ రహస్యాలివే!
ఇరాన్కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్!
ఫొటోలు
పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన.. భారీగా జన సందోహం (ఫొటోలు)
ప్రకృతి ఒడిలో అనసూయ సమ్మర్ చిల్ (ఫొటోలు)
హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన శివాలయం గురించి తెలుసా మీకు? (ఫోటోలు)
తస్సాదియ్యా.. సమంత ఇంత సింపుల్గా ఉందేంటి! (ఫొటోలు)
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
నేటి నుండి కేదార్నాథ్ దర్శనం.. భారీగా భక్తులు (ఫొటోలు)
'వాలా 2' ప్రీ రిలీజ్ ఈవెంట్లో తేజా సజ్జా సందడి (ఫొటోలు)
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన (ఫోటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
కూతురు, కుమారుడితో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి (ఫొటోలు)
సినిమా
ఓటీటీలో హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ సినిమా.. తెలుగు రివ్యూ
దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందరో అభం శుభం తెలియని మహిళలు, ఆడపిల్లలు, చిన్నారులు అన్యాయానికి గురవుతున్నారు. వీళ్లలో చాలామందికి సరైన న్యాయం దక్కట్లేదు! ఈ అంశంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి. అయితే దేశంలో రోజుకి 80 అత్యాచారాలు జరుగుతున్నాయనే కాన్సెప్ట్తో తీసిన లేటెస్ట్ హిందీ మూవీ 'అస్సి'. రీసెంట్గా జీ5 ఓటీటీలోకి వచ్చిన ఈ హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)కథేంటి?పరిమ (కని కుస్రుతి) స్కూల్ టీచర్. భర్త, కొడుకుతో కలిసి సంతోషంగా బతుకుతుంటుంది. ఓ రోజు స్కూల్లో ఆలస్యమై, ఇంటికొస్తుంటుంది. కానీ దారిలో ఈమెపై ఐదుగురు యువకులు దారుణానికి తెగబడతారు. కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పుతూ అత్యాచారం చేస్తారు. చివరకు అపస్మారక స్థితిలో ఉన్న ఈమెని రైల్వే ట్రాక్పై పడేస్తారు. తర్వాత ఏమైంది? పరిమకు న్యాయం దక్కిందా? ఈమె తరఫున వాదించిన లాయర్ రావి(తాప్సి)కి ఈ కేసు విచారణ సందర్భంగా ఎదురైన అనుభవాలేంటి? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?అస్సి అంటే హిందీలో ఎనభై(80) అని అర్థం. అంటే మన దేశంలో రోజుకు దాదాపుగా 80 వరకు అత్యాచారాలు జరుగుతున్నాయని ఈ సినిమాతో దర్శకుడు అనుభవ్ సిన్హా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందులో కళ్లు చెదిరిపోయే ట్విస్టులు ఉండవు. అద్భుతమైన విజువల్స్ కనిపించవు. కానీ చూస్తున్నంతసేపు మన పక్కనే జరిగినట్లు అనిపించే కథ, అంతా అయిపోయిన తర్వాత మనసుని బరువెక్కించే కథనం ఇందులో ఉంటుంది.కథ పరంగా చూస్తే రెగ్యులర్ రొటీన్ కోర్ట్ రూమ్ డ్రామాలానే అనిపిస్తుంది. కొత్తగా ఏముందా అనే సందేహం కలుగుతుంది. కానీ తరచి చూస్తే ఎన్నో విషయాలు అర్థమవుతాయి. మొదలైన ఐదు నిమిషాలకే స్టోరీలోకి వెళ్లిపోతాం. అక్కడి నుంచి తర్వాత ఏమవుతుందా? నిందితులకు శిక్ష పడుతుందా లేదా అనేది చివరి వరకు ఇంట్రెస్టింగ్గా చూపించారు. అత్యాచారానికి గురైన వాళ్లకు నిజమైన న్యాయం దక్కుతుందా? అసలు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాలనే ఆలోచన ఎవరికైనా ఎందుకొస్తుంది? అనే ప్రశ్నలు ప్రేక్షకులకే వేసినట్లు అనిపిస్తుంది.పోలీసులు, లాయర్లు కుమ్మక్కై.. కొన్ని కొన్ని కేసుల్ని, అందులో సాక్ష్యాలని ఎలా తారుమారు చేస్తారనే విషయాన్ని అద్భుతంగా చూపించారు. అత్యాచారం సీన్ చూస్తున్నప్పుడు అసభ్యత ఎక్కడా కనిపించదు గానీ ఓ రకమైన భయం కలుగుతుంది. ఒకవేళ మన ఇంట్లోని ఆడవాళ్లకు ఇలా జరిగితే ఎలా? అని మనసులో అలజడి రేగుతుంది.ఈ సినిమాలో చూడటానికి కొన్ని సీన్స్ సాధారణంగా అనిపిస్తాయి గానీ వాటి మర్మం తెలిసినప్పుడు చిన్నపాటి షాక్ తగులుతుంది. అత్యాచారానికి గురై, కొన్నిరోజుల తర్వాత కోలుకున్న పరిమ.. తిరిగి టీచర్ ఉద్యోగంలో చేరతానని చెప్పినప్పుడు.. విద్యార్థుల గురించి స్కూల్ ప్రిన్సిపల్, పరిమ మధ్య జరిగే సంభాషణ ఒళ్లు గగుర్పొడేలా చేస్తుంది. నేటి సమాజంలో కొందరు టీనేజీ పిల్లలు ఎంత దారుణంగా తయారయ్యారో చెప్పకనే చెబుతుంది.సినిమాలో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చూపించే రెడ్ స్క్రీన్ గానీ, క్లైమాక్స్లో స్కూల్ పిల్లలందరినీ ఎదురుగా కూర్చోబెట్టి జడ్జి, తీర్పు ఇచ్చే సన్నివేశం గానీ బాగుంటాయి. పరిమ కొడుకు పాత్ర అయితే ఇంకా హైలైట్. తల్లిని ఆస్పత్రిలో చేర్చిన దగ్గర నుంచి కోర్టులో వాదనల వరకు ప్రతి విషయాన్ని ఈ పిల్లాడు గమనిస్తుంటాడు. చిన్నతనం నుంచే ఇలాంటివి చూస్తూ పెరిగితే.. పెద్దయ్యాక ఎలాంటి సమస్యని అయినా ఎదుర్కోగల సత్తా పిల్లలకు డెవలప్ అవుతుందని ఈ సీన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారనిపిస్తుంది.మన ఇంటిలోని ఆడవాళ్లకు ఏదైనా జరగరానిది జరిగితే ఎలా తోడుగా నిలబడాలి? ఎంత కేరింగ్గా చూసుకోవాలి అనే విషయాన్ని పరిమ భర్త పాత్రతో అద్భుతంగా చూపించారు. సరైన భద్రత లేని మన దేశంలో ప్రతి ఒక్కరూ ఎంత జాగ్రత్తగా ఉండటం ముఖ్యమో ఈ సినిమాతో పరోక్షంగా హెచ్చరించారు. డబ్బున్న వ్యక్తుల కొడుకులు చాలామంది ఎలా తయారవుతున్నారు? ఇలాంటి వాళ్ల వల్ల సగటు మహిళలు, ఆడపిల్లలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని కూడా చూపించారు. అయితే ఇలాంటి సున్నితమైన అంశం ఆధారంగా సినిమాలు తీయడం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఎవరు మంచి? ఎవరు చెడు? అని మనం నిర్థారించలేం. దాన్ని కూడా దర్శకుడు చక్కగా బ్యాలెన్సింగ్ చేశాడు. ఇక క్లైమాక్స్లో ఓ చిన్న పాప చెప్పే సాక్ష్యంతో మొత్తం కేసు తీరే మారిపోతుంది. సినిమా మొత్తంలో ఇదే హైలైట్ సీన్.ఎవరెలా చేశారు?లాయర్గా తాప్సి సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మిగతా పాత్రధారులు కూడా బాగా చేశారు. పరిమి పాత్రలో అత్యాచారానికి గురైన మహిళగా చేసిన కని కుస్రుతి అయితే అద్భుతంగా నటించింది. రైల్వే ట్రాక్పై అపస్మారక స్థితిలో పడున్నప్పుడు గానీ, కోలుకున్న తర్వాత ట్రామా అనుభవించే సీన్స్ చూస్తున్నప్పుడు నిజంగా జరిగిందేమో అనిపించేలా ఉంటుంది. సాంకేతికంగానూ సినిమా బాగుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా కచ్చితంగా చూడాలి. ఎందుకంటే చాలా విషయాలు తెలుస్తాయి.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తున్న థ్రిల్లర్'సంభవం అధ్యాయం ఒన్ను' తెలుగు రివ్యూ)
చిరంజీవికి, బాలకృష్ణకూ అతడే కావాలి...
భారతీయ సినిమా రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరు మోహన్ లాల్. గత కొంతకాలంగా వరుస విజయాలతో ఆయన తన సత్తా నిరూపిస్తున్నారు. మళయాళంలో ఆయన టాప్లో ఉన్నప్పటికీ తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో ఆయన కనిపిస్తుంటారు. తాజాగా ఆయన పేరు ఒకటి కాదు, ఏకంగా రెండు ప్రధాన తెలుగు ప్రాజెక్టులతో ముడిపడి ఉందని బలమైన ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రాబోయే చిత్రం. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఈ మలయాళ దిగ్గజ నటుడిని సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఓ వైపు ఈ ప్రాజెక్ట్పై చర్చలు కొనసాగుతుండగానే, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రంలో కూడా మోహన్ లాల్ నటించవచ్చని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఇవి నిజమైతే... అపుడప్పుడు తెలుగు సినిమాల్లో మోహన్ లాల్ కనిపించడం జరిగినప్పటికీ... ఇద్దరు అగ్రహీరోల సినిమాల్లో కనిపించడం మాత్రం ఇదే మొదటిసారి కాబోతోంది. ఆసక్తికరంగా, రెండు చిత్రాలు 2027 సంక్రాంతికి విడుదలయేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చితే, ఒకే పండుగ సీజన్లో రెండు భారీ బడ్జెట్ చిత్రాలలో తన నటనతో తానే పోటీ పడుతూ, మోహన్ లాల్ ఒక అరుదైన బాక్సాఫీస్ పోరును ఎదుర్కోనున్నారని చెప్పొచ్చు.తెలుగు సినిమాతో బలమైన అనుబంధం..గత కొంత కాలంగా గంభీరమైన, పాత్ర–ఆధారిత పాత్రల కోసం టాలీవుడ్ మోహన్ లాల్పై ఆధారపడటం పెరుగుతోంది. తెరపై తన సహజమైన నటనకు భావోద్వేగ ప్రదర్శనకు పేరుగాంచిన ఆయన సినిమాలో ఉంటే... ఆయన పాత్ర నిడివితో సంబంధం లేకుండా సినిమాకి మల్టీ–స్టారర్ లుక్ వస్తుందనేది నిర్వివాదం. పాత్రోచిత నటనతో క్యారెక్టర్ను మరో రేంజ్కి తీసుకెళ్లే అభినయం ఆయన స్వంతం.తరాలకు అతీతంగా...స్టార్స్తో కాంబినేషన్...తెలుగు సినిమాల్లో నటించారు అనేదానికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ మళయాళ సూపర్స్టార్... తరాలకు అతీతంగా తెలుగు హీరోలతో జతకట్టడం..ఆయన దాదాపు 32 ఏళ్ల క్రితం 1994లో అక్కినేని నాగేశ్వరరావు తో కలిసి గాండీవం సినిమాలో కనిపించారు. అదే సినిమాలో బాలకృష్ణ కూడా మరో హీరో. అలా టాలీవుడ్లో తొలితరం అగ్రహీరో, రెండవ తరం అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న మోహన్లాల్... ఆ తర్వాత నవతరం అగ్రహీరో జూనియర్ ఎన్టీయార్తో కలిసి 2016లో విడుదలైన జనతా గ్యారేజ్లో కనిపిస్తారు. ఇప్పుడు చిరంజీవి, బాలయ్యల సినిమాల్లోనూ కనిపించబోతున్నారు. ఆలా తరాలకు అతీతంగా మన హీరోలతో జట్టు కడుతున్న నటుడిగా ఆయన నిలుస్తున్నారు. గత 2016లోనే ఆయన మనసంతా అనే సినిమా ద్వారా తానే ప్రధాన పాత్రలో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారాయన.
అల్లు అర్జున్ ముంబై హౌస్.. నెలకు ఏకంగా అన్ని లక్షలా?
తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్.. ముంబైకి షిఫ్ట్ కాబోతున్నాడనే రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన తండ్రి అల్లు అరవింద్.. షూటింగ్ కోసం ముంబైలో ఎక్కువగా ఉంటున్నందున అలా అనిపించి ఉండొచ్చని, అతడికి ఇక్కడే సొంతిల్లు ఉంది. పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. స్నేహితులందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. అలాంటప్పుడు ముంబైకి ఎందుకు వెళ్తాడు? అక్కడ స్థిరపడాలనే ఆలోచన లేదు అని స్పష్టం చేశారు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ కామెడీ సినిమా)అయితే ముంబైకి బన్నీ పూర్తిగా షిఫ్ట్ కాకపోయినప్పటికీ కొన్నాళ్ల పాటు అయితే అక్కడ ఉండబోతున్నాడు. ఈ విషయం మాత్రం నిజమే. ఎందుకంటే రీసెంట్గానే ముంబైలోని జుహూ ప్రాంతంలో తార రోడ్లో ఐదు బెడ్ రూమ్ల(5 BHK) లగ్జరీ అపార్ట్మెంట్ని బన్నీ అద్దెకు తీసుకున్నాడు. ఏడాది క్రితమే ఈ డీల్ ఫిక్సయినప్పటికీ తమ అభిరుచికి తగ్గట్లు బన్నీ-స్నేహ దాని ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకున్నారట.సముద్రానికి ఎదురుగా ఉండే ఈ అపార్ట్మెంట్కి నెలవారీ అద్దె ఏకంగా రూ.16 లక్షలు అని, ఇందులో రాబోయే మూడేళ్ల పాటు అల్లు అర్జున్ ఉండబోతున్నాడని సమాచారం. స్కూల్ సెలవులు ఇచ్చిన టైంలో భార్య స్నేహారెడ్డితో పాటు పిల్లలు అయాన్, అర్హ అక్కడికి వెళ్తారు. 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో స్విమ్మింగ్ పూల్, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఉన్నాయి.అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం అట్లీ తీస్తున్న 'రాకా' మూవీ ఉంది. దీని షూటింగ్ చాలావరకు ముంబైలోనే ఉండనుంది. దీని తర్వాత లోకేశ్ కనగరాజ్తో చేయబోయే సినిమా చిత్రీకరణ కూడా అక్కడే జరగనున్న నేపథ్యంలో రాబోయే మూడేళ్ల పాటు బన్నీ ముంబైలో ఉండబోతున్నాడట.(ఇదీ చదవండి: ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు: నటుడు వినోద్)
ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు
హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ, 'పంచాయత్' సిరీస్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న వినోద్ సూర్యవంశీ.. ఇప్పటికీ తన కుటుంబం కర్ణాటకలోని తన సొంతూరిలో కుల వివక్ష ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చాడు. ప్రముఖ యూట్యూబర్ సిద్ధార్థ్ కన్నన్తో జరిగిన సంభాషణలో భాగంగా ఈ ఆశ్చర్యకర సంగతి చెప్పి షాకిచ్చాడు. పేదరికం కారణంగా తను ఇప్పటివరకు ఎలాంటి వివక్ష ఎదుర్కొన్నాడో చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో విషాదం.. చనిపోయిన ప్రముఖ దర్శక నిర్మాత)'మా ఊరిలో ఇప్పటికీ అగ్ర కులాలు, బలహీన వర్గాల కోసం వేర్వేరు ప్రాంతాలున్నాయి. దళితులు నివసించే ప్రాంతం గ్రామానికి దూరంగా ఉంటుంది. నాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు నాన్నతో కలిసి ఊరి లోపలికి వెళ్లినప్పుడు ఓ హోటల్లో తిన్నాం. కానీ తర్వాత మేమే ప్లేట్లు కడగాల్సి వచ్చింది. అలానే ఇప్పటికీ ఊరిలోని దేవాలయంలోకి మాకు అనుమతి లేదు' అని వినోద్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.ఇక చిన్నప్పటి కష్టాలు గుర్తుచేసుకున్న వినోద్.. పండగలు వచ్చాయంటే సంతోషం కంటే మాకు బాధే ఎక్కువగా ఉండేది. దీపావళి ఎందుకు వస్తుందా అనిపించేంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇస్తే మాత్రమే మేం పండగ జరుపుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కుటుంబం విషయానికొస్తే.. నా తల్లి ఇళ్లలో పనిచేసేది. నాన్న మేస్త్రీ. ఆయనకు రోజూ పని దొరికేది కాదు. పనిలేకపోతే తాగొచ్చి అమ్మని ఇష్టమొచ్చినట్లు కొట్టేవాడు. ఆయనంటే కోపం లేదు కానీ ఎందుకనో నాన్న ప్రవర్తన నచ్చేది కాదని అన్నాడు.సినిమా కెరీర్ గురించి చెబుతూ.. ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో పనులు చేశాను. మొదటి లిఫ్ట్ మ్యాన్గా నెలకు రూ.1600 జీతానికి పనిచేశా. తర్వాత ఆఫీస్ బాయ్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేశాను. గార్డ్గా పనిచేసినప్పుడు 12 గంటలు నిలబడి పనిచేయాల్సి వచ్చేది. వర్షం పడితే చెప్పుల్లోకి నీళ్లు చేరి గాయాలయ్యేవి. కొందరు అకారణంగా తిట్టేవారని వినోద్ గుర్తుచేసుకున్నాడు. ఏ పని చిన్నది కాదంటారు గానీ నిజానికి మనిషిని అతడు చేసే పనిబట్టి అంచనా వేస్తారు. పని పెద్దదైతేనే గౌరవం కూడా ఎక్కువగా ఉంటుందని వినోద్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. హిందీలో పంచాయత్ సిరీస్తో పాటు జాన్వర్, థామా, సత్యమేవ జయతే, జాలీ ఎల్ఎల్బీ 3 తదితర సినిమాల్లో వినోద్ సూర్యవంశీ నటించాడు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ కామెడీ సినిమా)
క్రీడలు
ధోనికి ఆ హోదా ఇవ్వడం నచ్చలేదు.. కానీ: మాజీ లెఫ్టినెంట్ జనరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్గా పేరుగాంచాడు మహేంద్ర సింగ్ ధోని. భారత్కు 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనుడు. తద్వారా దేశానికి మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్గా నేటికీ కొనసాగుతున్నాడు ధోని.సాహసోపేత నిర్ణయాలతో భారత జట్టు భవితవ్యాన్ని మార్చివేసిన ధోని (MS Dhoni).. జట్టు అవసరాల దృష్ట్యా కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేశాడు. ముఖ్యంగా తనకు కుమార్తె జన్మించిన సమయంలో భార్య దగ్గర ఉండాల్సి ఉన్నా.. జట్టుతోనే ఉండిపోయాడు ధోని. ఇలాంటి త్యాగాలెన్నో అతడి కెరీర్లో ఉన్నాయి.గౌరవ ఆర్మీ ర్యాంకుఈ క్రమంలోనే భారత సైన్యంలో ధోనికి గొప్ప గౌరవం లభించింది. పారాచూట్ రెజిమెంట్లో 2011లో అతడికి లెఫ్టినెంట్ హోదా ఇచ్చి ఆర్మీ సుముచిత గౌరవం కల్పించింది. ఆ తర్వాత కఠినమైన పారాచూట్ శిక్షణ పూర్తి చేసుకున్న ధోని.. ప్రతిష్టాత్మక ‘మెరూన్ బెరెట్’ (headgear) సొంతం చేసుకున్నాడు.మొదట్లో నాకు నచ్చలేదుఈ నేపథ్యంలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా ధోనికి నాడు దక్కిన గౌరవం గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనికి అసలు ఆ అర్హత ఉందా? అనే సందేహం తనను తొలచివేసిందన్నారు. తాను ధోనికి ఈ హోదా ఇవ్వడాన్ని తాను తొలుత కాస్త వ్యతిరేకించానని.. అయితే, ఆ తర్వాత తన అభిప్రాయం తప్పని తేలిందన్నారు.ఈ మేరకు.. ‘‘అప్పట్లో మా చీఫ్ జనరల్ వీకే సింగ్. అప్పటి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనికి గౌరవ ర్యాంకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ నేను మాత్రం అందుకు సుముఖంగా లేను. మెరూన్ బెరెట్ ఎంతో ప్రతిష్టాత్మకమైనది.పారాట్రూపర్ కావాలంటే కచ్చితంగా ఆర్నెళ్ల పాటు ప్రొబేషన్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా చాలా కఠినంగా ఉంటుంది. ఇందులో సెలక్షన్ రేటు కేవలం 20 శాతం మాత్రమే. అలాంటిది ఎలాంటి శిక్షణా పొందని వ్యక్తికి మెరూన్ బెరెట్ ఇవ్వడం చాలా తప్పు అని అనిపించింది. ఆ తర్వాత నా అభిప్రాయం మారిపోయింది.నిజమైన సైనికుడుధోని దేశం కోసం చాలా చేశాడు. అతడి విజయాల పట్ల నేను కూడా గర్విస్తున్నాను. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే కెప్టెన్ కూల్. బాగా ఎత్తైన ప్రదేశాలంటే భయమని అతడు నాతో చెప్పాడు. అయినప్పటికీ పారాట్రూపర్గా శిక్షణలో ఎత్తుల మీద నుంచి దూకేశాడు.యూనిఫామ్ ధరించినపుడు అతడిలో ఓ గర్వం ఉండేది. అతడు అచ్చంగా సైనికుడిలాగే కవాతు చేసేవాడు. సైనికుడి మాదిరే వ్యవహరించేవాడు. మనసు నిండా అతడు ఆర్మీని నింపుకొన్నాడని.. తనను తాను నిజమైన సోల్జర్గా భావిస్తున్నాడని నాకు తెలిసింది.ఇంకో విషయం.. ధోని జమ్మూ కశ్మీర్లో మా విభాగాలతో కలిసి అక్కడ పనిచేశాడు. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి మా సైనికులతో కలిసి ప్రయాణాలు చేసేవాడు. నిజంగా అతడు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి’’ అని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా ఓ పాడ్కాస్ట్లో భాగంగా ధోనిని కొనియాడారు.చదవండి: బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేతThe story behind how MS Dhoni earned the Maroon Beret 🇮🇳 🪖."He went and Served in J&K with our soldiers , He went to the Border" pic.twitter.com/GXMM3cdeHX— MAHIYANK™ (@Mahiyank_78) April 21, 2026
అతడు వైభవ్ సూర్యవంశీ కంటే సమర్దుడు..!
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరు యువ క్రికెటర్లను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కంటే పంజాబ్ యువ కెరటం ప్రియాంశ్ ఆర్య చాలా సమర్థుడని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ప్రియాంశ్ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. వైభవ్, అయుశ్ మాత్రే వంటి యువ ఆటగాళ్లతో పోలిస్తే ప్రియాంశ్ ఓ మెట్టు ముందున్నాడని అన్నాడు. ఎవరినీ తక్కువ చేయడం లేదని చెబుతూనే.. ప్రియాంశ్ వద్ద ఉన్న షాట్ల వైవిధ్యం, పెద్ద ఇన్నింగ్స్లు ఆడగల సామర్థ్యం ఉందని కితాబునిచ్చాడు. ఈ లక్షణాలు ప్రియాంశ్ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని తెలిపాడు.కాగా, అశ్విన్ పొగడ్తలకు ఆనుగుణంగానే ప్రియాంశ్ ఈ ఐపీఎల్ సీజన్లో చెలరేగి ఆడుతున్నాడు. 5 మ్యాచ్ల్లో 248.24 స్ట్రయిక్రేట్తో 211 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్ల జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. ఈ సీజన్లో పంజాబ్ సాధిస్తున్న వరుస విజయాల్లో ప్రియాంశ్ది ప్రధానపాత్ర. తాజాగా లక్నో 37 బంతుల్లో 93 పరుగులు చేసిన ఇన్నింగ్స్ అతని కెరీర్ మొత్తంలో హైలైట్గా నిలిచింది. ఇలాంటి ప్రదర్శనలే అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లను ఆకట్టుకున్నాయి.వైభవ్ విషయానికొస్తే.. ఈ బుడ్డోడు కూడా తక్కువేమీ తినలేదు. ఈ సీజన్లో దాదాపు ప్రతి మ్యాచ్లో రెచ్చిపోయాడు. సీఎస్కే, ఆర్సీబీపై చేసిన మెరుపు హాఫ్ సెంచరీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఆర్సీబీపై ఆడిన ఇన్నింగ్స్ (26 బంతుల్లో 78 పరుగులు) అతని టాలెంట్ను ప్రపంచానికి మరోసారి రుచి చూపించింది. అయితే ఇటీవల మ్యాచ్లలో అతని జట్టు విజయం సాధించకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 236.54 స్ట్రయిక్రేట్తో 246 పరుగులు చేసి టాప్-5 లీడింగ్ స్కోరర్ల జాబతాలో ఉన్నాడు.మాత్రే విషయానికొస్తే.. ఇతగాడు కూడా ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తు గాయం కారణంగా సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఆయుశ్ ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచ్ల్లో 201 పరుగులు చేసి సీఎస్కే తరఫున నిలకడ ప్రదర్శనలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.మొత్తంగా అశ్విన్ వ్యాఖ్యలు ఎవరిని తగ్గించడానికి చేసినవిగా కనిపించలేదు. ప్రతిభను గుర్తించడంలో భాగంగా చేసినవిగా స్పష్టమయ్యాయి. ప్రియాంశ్తో పోలిస్తే వైభవ్కు అధిక హైప్ దక్కింది. టాలెంట్ విషయం పక్కన పెడితే, ఏజ్ అతనికి అడ్వాంటేజ్గా మారింది. 14-15 ఏళ్ల వయసులో వైభవ్ రెచ్చిపోతున్న విధానం అందరిని ఆకట్టుకుంటుంది. అతడు షాట్లు ఆడే స్టైల్ చూడముచ్చటగా ఉంటుంది. ప్రియాంశ్ సైతం ఇలాగే ఆడుతున్నా, వయసులో వైభవ్ కంటే కాస్త పెద్ద వాడు (24) కావడం, అతనికి ఆశించిన గుర్తింపు దక్కనివ్వలేదు.
ఐపీఎల్ జోరు.. పీఎస్ఎల్ బేజారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ఏకకాలంలో జరుగుతున్న నేపథ్యంలో ఏ లీగ్ జోరుగా సాగుతుంది..? ఏ లీగ్ బేజారుగా సాగుతుందన్న విషయాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గత సీజన్ నుంచి ఐపీఎల్కు పోటీగా పీఎస్ఎల్ను ఒకే సమయంలో షెడ్యూల్ చేసింది. పీసీబీ తీసుకున్న ఈ తలతిక్క నిర్ణయం పీఎస్ఎల్ అన్ని విధాల నష్టపోతుంది. ఐపీఎల్కు పోటీ కాదు కదా, కనుచూపుమేరల్లో కూడా లేకుండా పోయింది.రెండు లీగ్లు ఒకేసారి జరుగుతుండటం వల్ల సహజంగానే ఐపీఎల్కు ప్రజాదరణ ఎక్కువగా ఉంది. స్వదేశీ, విదేశీ స్టార్లంతా ఇదే లీగ్లో ఉండటంతో ప్రపంచవాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ లీగ్నే ఫాలో అవుతున్నారు. పీఎస్ఎల్ విషయానికొస్తే.. ఈ లీగ్లో స్వదేశీ ఆటగాళ్లు, ఔట్ డేటెడ్ విదేశీ ఆటగాళ్లు మాత్రమే పాల్గొంటున్నారు. దీంతో ఈ లీగ్ పరిధి కేవలం పాక్కు మాత్రమే పరిమితమైంది. బయటి దేశాల్లో పీఎస్ఎల్ను ఫాలో అయ్యే వారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.ప్రస్తుత సీజన్లో పీఎస్ఎల్తో పోలిస్తే ఐపీఎల్కు అధిక పాపులారిటీ దక్కడానికి మరో కారణం ఐపీఎల్లో జరుగుతున్న విధ్వంసం. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్లు పోటాపోటీగా సాగాయి. దాదాపుగా ప్రతి మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. బౌలర్లు సైతం ఈ సీజన్లో పని చక్కబెట్టుకున్నారు. అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలు, కళ్లు చెదిరే క్యాచ్లకు ఈ సీజన్ ప్రత్యేకమైన వేదిక అయ్యింది.ఈ సీజన్లో 31 మ్యాచ్లు పూర్తి కాగా.. భారీ సంఖ్యలో సిక్సర్లు, బౌండరీలు నమోదయ్యాయి. 4 సెంచరీలు, పదుల సంఖ్యలో అర్ద సెంచరీలు రికార్డయ్యాయి. ఎన్నో పాత రికార్డులు బద్దలయ్యాయి, మరెన్నో కొత్త రికార్డులు సృష్టించబడ్డాయి. ఏ మాత్రం అంచనాలు లేని బౌలర్లు ఈ సీజన్లో చెలరేగిపోతున్నారు. రొటీన్కు భిన్నంగా పేసర్లు స్పిన్నర్ల కంటే మెరుగ్గా రాణిస్తున్నారు.జట్ల విషయంలోనూ అంచనాలు లేని జట్లే ఈ సీజన్లో దూసుకుపోతున్నాయి. భారీ అంచనాలు ఉన్న జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో పడి ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో ఓటమి ఎరుగక దూసుకుపోతుంది. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ రాయల్స్ కూడా అంచనాలకు మించి రాణిస్తున్నాయి. భారీ అంచనాలు ఉన్న ముంబై ఇండియన్స్ గత మూడు నాలుగు సీజన్ల తరహాలోనే స్లో స్టార్ట్ మోడ్లో సాగుతుంది. ఎల్ఎస్జీ, ఢిల్లీ, గుజరాత్ పేపర్పై బలంగా కనిపిస్తున్నా, ఆన్ ఫీల్డ్లో అంచనాలను చేరుకోలేకపోతుంది. సీఎస్కే పరిస్థితి ముంబై ఇండియన్స్ లాగే ఉంది.అంచనాలు ఉన్న జట్లు విఫలమవుతున్నా, అంచనాలు లేని జట్లు అద్భుతాలు చేస్తూ ఈ సీజన్ను రక్తి కట్టిస్తున్నారు. లీగ్ మే 31 వరకు సాగనున్న నేపథ్యంలో మరిన్ని సిత్రాలు చూసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐపీఎల్ ఈ సీజన్లో గతానికి కాస్త భిన్నంగా సాగుతూ అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడా పోటీల రేసులో దూసుకుపోతుంది.పీఎస్ఎల్ విషయానికొస్తే.. ఆ లీగ్ ముగింపుకు దగ్గరగా వచ్చింది. ఇప్పటివరకు ఐపీఎల్ లాగే 31 మ్యాచ్లు జరిగినా చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన లేదు. బ్యాటింగ్ విభాగం సప్పగా, వన్డే క్రికెట్ను తలపిస్తుండగా.. నాణ్యత లేని బౌలింగ్ జనాలకు బోర్ కొట్టిస్తుంది. ఫీల్డింగ్ గురించి చెప్పుకోకుంటేనే మంచిది. ప్రపంచంలో ఎక్కడా లేని ఫీల్డింగ్ సిత్రాలన్నీ ఈ లీగ్లోనే కనిపిస్తాయి. పాక్ ఆటగాళ్ల ఫీల్డింగ్ చూస్తే నవ్వు ఆపుకోక తప్పదు. వీరి కంటే గల్లీ క్రికెటర్లు నయం అనిపిస్తుంది.ఈ లీగ్ ఆడుతున్నది అతి తక్కువ మంది విదేశీ ప్లేయర్లు, వీరిలో ఒక్కరు కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో ఇదే పరిస్థితి. అడపాదడపా లోకల్ ఆటగాళ్లే కాస్త నయం అనిపిస్తుంది. పాక్కు ఈ లీగ్ వల్ల దక్కే ఊరట ఏదైనా ఉందా అంటే, అది బాబర్ ఆజమ్ ఫామ్లోకి రావడం. ఈ పాక్ స్టార్ బ్యాటర్ ఈ పీఎస్ఎల్ సీజన్లో విశేషంగా రాణిస్తున్నాడు. తాజాగా ఓ సెంచరీ కూడా చేశాడు.ఇది మినహా పీఎస్ఎల్ మొత్తం మూకీ డ్రామాలాగా సప్పగా సాగుతుంది. ఇప్పటికి పెషావర్ జల్మీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్ రేసులో ముందు వరుసలో ఉన్నాయి.
బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేత
టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ ద్వారా కీర్తిని గడించిన ఈ ఢిల్లీ స్టార్.. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. స్వయంగా ఎన్నో బ్రాండ్లు కూడా కలిగి ఉన్నాడు. వన్8 కమ్యూన్ ద్వారా ఆతిథ్య రంగంలోనూ కోహ్లి అడుగుపెట్టాడు.దేశ వ్యాప్తంగాదేశ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్ చైన్ వ్యాపించి ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్, పుణె, కోల్కతా, నోయిడా, హైదరాబాద్ వంటి సిటీల్లో వన్8 కమ్యూన్కు శాఖలు ఉన్నాయి. అయితే, బెంగళూరులో ఉన్న వన్8 కమ్యూన్ బ్రాంచీ కోర్టు ఆదేశాలతో మూతపడింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..అద్దె కట్టకుండా..బెంగళూరులో చిన్నస్వామి స్టేడియానికి సమీపంలో వన్8 కమ్యూన్ రెస్టారెంట్ ఉంది. ట్రియో హిల్స్ హాస్పిటాలిటీ దీనిని నిర్వహిస్తూ కోహ్లితో భాగస్వామ్యంలో ఉంది. అయితే, గత ఆర్నెళ్లుగా అద్దె చెల్లించడంలో ట్రియో హిల్స్ విఫలమైంది. మెయింటెనెన్స్ కూడా బాకీ పడింది. దీంతో సదరు భవన నిర్మాణ యజమాని ఈ విషయమై సివిల్ కోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో అద్దె చెల్లించి, యజమానితో సమస్యలు పరిష్కారం చేసుకునేంత వరకు రెస్టారెంట్ను మూసివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. వివిధ నిబంధనల ఉల్లంఘన కారణంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే కూడా ఇప్పటికే ఈ రెస్టారెంట్కు పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బంధం తెంచుకున్న కోహ్లిఈ రెస్టారెంట్ అగ్రి పమాద భద్రతకు సంబంధించి నిరభ్యంతర పత్రం (NOC) కూడా పొందలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఇప్పటికే తన బ్రాండ్ పేరును తొలగించాల్సిందిగా ట్రియో హిల్స్కు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కస్టమర్ల రాక తగ్గిపోయి ఆర్థికంగానూ సదరు రెస్టారెంట్ నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి 247 పరుగులు సాధించాడు. మరోవైపు.. ఆర్సీబీ ఆరింట నాలుగు విజయాలతో జోరు మీద ఉంది.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డు
న్యూస్ పాడ్కాస్ట్
‘ఉపాధి’పై ఇంత నిర్లక్ష్యమా?. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు
ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా... అమెరికా నౌకలపై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరణ..
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న పాపం ప్రతిపక్షాలదే... భ్రూణ హత్యతో పాపం మూటగట్టుకున్నాయి... ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
లోక్సభలో గట్టెక్కని మహిళా బిల్లు... అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు... మూడింట రెండొంతుల మెజారిటీ సాధనలో మోదీ సర్కారు విఫలం
డీలిమిటేషన్ దంగల్కు రంగం సిద్ధం... మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్
మత్స్యకారుల కడుపుపై తంతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు కుట్ర... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
చట్టసభల్లో చారిత్రక మలుపు... లోక్సభ స్థానాలు 850కి పెంపు... రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం... డిమాండ్లపై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్... అణ్వాయుధాలు, హార్మూజ్పైనే పీటముడి
బిజినెస్
నాలుగేళ్ల తర్వాత గోధుమ రైతులకు గుడ్న్యూస్
దేశ రాజధాని రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో గోధుమల సేకరణ ప్రక్రియను పునప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)ను ఆదేశించింది. 2021-22 సీజన్ నుంచి నిలిచిపోయిన ఈ ప్రక్రియను తక్షణమే తిరిగి ప్రారంభించాలని ఢిల్లీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 24 నుంచి సేకరణ కేంద్రాలు ప్రారంభంతాజా అధికారిక సమాచారం ప్రకారం, 2026 ఏప్రిల్ 24 నుంచి ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో సేకరణ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. నరేలా, నజాఫ్గఢ్ మండిలో రైతుల కోసం ప్రత్యేక సేకరణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతులు తమ పంటను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లే అవసరం లేకుండా ఇంటికి సమీపంలోనే కనీస మద్దతు ధరకు విక్రయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది.21,000 మంది రైతులకు లబ్ధిరాజధాని ప్రాంతంలో సుమారు 29,000 హెక్టార్ల విస్తీర్ణంలో గోధుమ సాగు జరుగుతోంది. ఏడాదికి దాదాపు 80,000 మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తి అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఢిల్లీలోని సుమారు 21,000 మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ‘రైతు సోదరులు తమ కష్టార్జితానికి సరైన ధర పొందడంతోపాటు ప్రయాణ ఖర్చులు, సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.బలోపేతం కానున్న రేషన్ వ్యవస్థకేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఢిల్లీ ప్రభుత్వం రాసిన లేఖకు తక్షణ స్పందన రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల రైతులకు లాభం చేకూరడంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా లభించే ఆహార ధాన్యాల సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.అవసరమైన పత్రాలుసేకరణ కేంద్రాల్లో తమ పంటను విక్రయించాలనుకునే రైతులు ఈ క్రింది ధ్రువీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని అధికారులు సూచించారు.1. భూమి రికార్డులు2. బ్యాంక్ పాస్బుక్3. గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు వంటివి)అప్పుడు ఎందుకు సేకరణ ఆపారంటే..నాలుగేళ్ల క్రితం (2021-22 నుంచి) ఢిల్లీలో గోధుమల కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడానికి ప్రధానంగా కొన్ని పరిపాలనాపరమైన, క్షేత్రస్థాయి కారణాలు ఉన్నాయి. కొన్ని ఏళ్లుగా ఢిల్లీలో ఎఫ్సీఐ నేరుగా కొనుగోలు చేసే కేంద్రాల సంఖ్య తగ్గిపోయింది. దీనివల్ల రైతులు తమ పంటను అమ్ముకోవడానికి పొరుగు రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరప్రదేశ్ మండీలకు వెళ్లాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొనుగోలు ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పనపై సరైన ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ స్తంభించిపోయింది.2021-22 సమయంలో బహిరంగ మార్కెట్లో గోధుమలకు మంచి ధర లభించడం, ఎగుమతులకు అవకాశం ఉండటంతో రైతులు కూడా ప్రభుత్వ కేంద్రాల వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. దీన్ని సాకుగా చూపి అధికారులు కొనుగోలు కేంద్రాలను క్రమంగా తగ్గించారు. రాజధాని ప్రాంతంలో పట్టణీకరణ పెరగడం వల్ల సాగు భూమి తగ్గుతోందన్న కారణంతో సేకరణ ప్రాధాన్యతను తగ్గించారు. కానీ, ఇప్పటికీ సుమారు 29,000 హెక్టార్లలో సాగు జరుగుతూనే ఉంది. ఈ కారణాల వల్ల గత నాలుగేళ్లుగా రైతులు తమ పంటను మద్దతు ధర కంటే తక్కువకు దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ సేకరణ ప్రారంభించడం వల్ల రైతులకు ఆర్థిక భరోసా లభించనుంది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
ఆటోమెటిక్గా కట్ అయ్యే డబ్బులు.. ఆర్బీఐ కొత్త అప్డేట్
డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత కఠినతరం చేస్తూ ఈ-మాండేట్ (e-Mandate) నిబంధనలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా రూ. 15,000 దాటే ఆటో-డెబిట్ లావాదేవీలపై పర్యవేక్షణను పెంచుతూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రికరింగ్ (పునరావృత) చెల్లింపులకు సంబంధించి పాత నిబంధనలను సవరిస్తూ, కస్టమర్ల రక్షణ కోసం కొత్త ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టింది.మార్పులు ఏమిటంటే..కొత్త నిబంధనల ప్రకారం, ఆటో-డెబిట్ లావాదేవీలకు సంబంధించి రూ. 15,000 పరిమితిని ప్రామాణికంగా తీసుకున్నారు.రూ. 15,000 లోపు: చిన్న మొత్తాల చెల్లింపులు (OTT సబ్స్క్రిప్షన్లు, ఫోన్ బిల్లులు వంటివి) ఎటువంటి ఓటీపీ (OTP) అవసరం లేకుండానే ఆటోమేటిక్గా జరిగిపోతాయి.రూ. 15,000 పైన: లావాదేవీ విలువ రూ. 15,000 దాటితే మాత్రం ఖచ్చితంగా అదనపు ప్రామాణీకరణ అవసరమవుతుంది. అంటే కస్టమర్ ఓటీపీని ఎంటర్ చేస్తేనే పేమెంట్ పూర్తవుతుంది.అయితే బీమా ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, క్రెడిట్ కార్డు బిల్లుల వంటి వాటికి రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి.ఈ నిబంధనలు యూపీఐ (UPI) ఆటో-పే, డెబిట్/క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ వాలెట్లకు వర్తిస్తాయి.ఈ-మాండేట్ సేవలను సెటప్ చేయడానికి లేదా వినియోగించుకోవడానికి బ్యాంకులు కస్టమర్ల నుండి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయకూడదు.అనధికారిక లావాదేవీలు జరిగితే, నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో రిపోర్ట్ చేస్తే కస్టమర్ బాధ్యత పరిమితంగా ఉంటుంది. అంటే మోసపూరిత లావాదేవీల నుండి రక్షణ లభిస్తుంది.ముందస్తు హెచ్చరికలు తప్పనిసరికస్టమర్ల ప్రమేయం లేకుండా ఖాతా నుండి డబ్బు కట్ అవ్వకుండా ఉండేందుకు ఆర్బీఐ 'అలర్ట్ సిస్టమ్'ను తప్పనిసరి చేసింది. నగదు డెబిట్ అయ్యే సమయానికి కనీసం 24 గంటల ముందే కస్టమర్కు మెసేజ్ లేదా మెయిల్ పంపాలి. ఇందులో మర్చంట్ పేరు, మొత్తం, డెబిట్ తేదీ స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్ అందిన తర్వాత కస్టమర్ ఆ చెల్లింపును వద్దనుకుంటే రద్దు చేసే లేదా నిలిపివేసే అవకాశం ఉంటుంది. అలాగే నగదు డెబిట్ అయిన వెంటనే ఫిర్యాదుల పరిష్కార వివరాలతో కూడిన మెసేజ్ పంపాల్సి ఉంటుంది.
హైదరాబాద్లో ఆఫీస్ స్థలాలకు గిరాకీ
న్యూఢిల్లీ: ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతుండడంతో అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ సహా దేశంలోని ఎనిమిది ప్రముఖ నగరాల్లో జనవరి–మార్చి త్రైమాసికంలో కార్యాలయ అద్దెలు 2–15 శాతం మధ్య పెరిగినట్టు (క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు) రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ఫ్రాంక్ ఒక నివేదికను విడుదల చేసింది. ముఖ్యంగా బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్లోని ప్రముఖ ప్రాంతాల్లో మొదటిసారి చదరపు అడుగుకు (ఎస్ఎఫ్టీ) నెలవారీ అద్దె రూ.100 మార్క్ను అధిగమించింది. ముంబైలో ఇప్పటికే నెలవారీ ఆఫీస్ అద్దెలు రూ.100కు పైనే ఉండడం గమనార్హం.నగరాల వారీ డేటా.. హైదరాబాద్లో కార్యాలయ స్థలాల నెలవారీ అద్దె చదరపు అడుగుకు 8 శాతం ఎగిసింది. రూ.77.5కు చేరింది. చెన్నైలోనూ 8 శాతం పెరుగుదలతో రూ.74.50గా నమోదైంది. అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్, కోల్కతాలో కార్యాలయ స్థలాల (ఆఫీస్) అద్దెలు మార్చి త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో నెలవారీ ఆఫీస్ అద్దెలు 15 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.105కి చేరాయి. ముంబైలో నెలవారీ ఆఫీస్ అద్దెలు 6 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.125 మార్క్నకు చేరాయి. బెంగళూరులో చదరపు అడుగు నెలవారీ అద్దె రూ.100.6కు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 7 శాతం పెరిగింది. పుణెలో 5 శాతం పెరిగి ఎస్ఎఫ్టీ అద్దె రూ.80.9కు చేరింది. కోల్కతాలో ఆఫీస్ అద్దెలు 15 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.48.30కి చేరాయి. అహ్మదాబాద్లో నెలవాసీ సగటు ఆఫీస్ స్పేస్ అద్దె ధర 2 శాతం పెరిగి ఎస్ఎఫ్టీకి రూ.45గా ఉంది. డిమాండ్ ఎక్కువ.. సరఫరా తక్కువ 2026 మొదటి త్రైమాసికంలో ఎనిమిది నగరాల్లో రికార్డు స్థాయిలో 2.99 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాల లీజు లావాదేవీలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 6 శాతం పెరుగుదల కనిపిస్తోంది. కానీ, ఇదే కాలంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్థలాలు 1.4 కోట్ల చదరపు అడుగులు మాత్రమే. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే సరఫరా సైతం 154 శాతం పెరిగింది. కానీ, డిమాండ్కు తగ్గ సరఫరా రానట్టు నైట్ఫ్రాంక్ నివేదిక తెలిపింది.కీలక మార్కెట్లలో సరఫరా తగ్గడంతో అద్దెలు స్థిరంగా పెరిగేందుకు దారితీసినట్టు వెల్లడించింది. డెవలపర్లు ఆఫీస్ ప్రాజెక్టుల కంటే నివాస గృహాలవైపు మొగ్గు చూపడం డిమాండ్కు తగ్గ సరఫరా రాకపోవడానికి కారణమని వివరించింది. ‘‘2021 నుంచి ఆపీస్ స్థలాలకు డిమాండ్, సరఫరా మధ్య అంతరం కొనసాగుతోంది. దీంతో సరఫరా పరిస్థితులు కఠినంగా మారాయి. 2021లో 17.2 శాతం మేర కార్యాలయ స్థలాలు ఖాళీగా ఉంటే, ఇప్పుడు 13.9 శాతానికి తగ్గిపోయింది. కార్యాలయ స్థలాల అభివృద్ధికి భారీ పెట్టుబడులు అవసరం కావడంతో, కేవలం కొన్ని సంస్థలు మాత్రమే ఈ రంగం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి’’ నైట్ఫ్రాంక్ నివేదిక వివరించింది.
గోల్డ్ అలర్ట్: బంగారం మళ్లీ ఎంత తగ్గిందంటే..
దేశంలో బంగారం ధరలు పసిడి ప్రియులకు మళ్లీ ఊరటనిచ్చాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న బంగారం ధరలు (Today Gold Rate) ఈరోజు కాస్త దిగివచ్చాయి. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా పెరుగుదల లేకుండా స్థిరంగా ఉండటం పండుగ సందర్భంగా కొనుగోలుదారుల్లో ఉత్సాహం నింపుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ
బహుభాషావేత్త... సోలో ట్రావెలర్ అందం బహుముఖం
ముప్పై రాష్ట్రాల అందాల ప్రతినిధులతో భువనేశ్వర్లో జరిగిన ‘మిస్ ఇండియా వరల్డ్ 2026’ పోటీలో విజేతగా నిలిచిన గోవా అమ్మాయి సాధ్వీ సతీష్ విశేషాలు తెలుసుకునేకొద్దీ ఆశ్చర్యపోతున్నారు అంతా. ఆమె రెండు చేతులతోనూ రాస్తుంది. చాలా స్పీడ్గా కారు నడుపుతుంది. ఏడు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. కెనెడాలో ఎకనామిక్స్ చదివి సోలో ట్రావెలర్గా దేశాలు తిరుగుతుంది. ‘మిస్ ఇండియా’ కిరీటాన్ని గెలిచి, గోవా ఘనతను చాటింది. ఈ కాలపు అమ్మాయంటే సాధ్వీ సతీషే.‘చిన్నప్పటి నుంచి నేను కొంచెం తేడా. నలుగురితో పెద్దగా కలిసే దాన్ని కాదు. చిన్నప్పుడు ఖాళీ టైమ్ దొరికితే రెండు చేతులతో ఒకేసారి రాయడం ప్రాక్టీసు చేసేదాన్ని’ అంటోంది గోవా అందాల బరిణె సాధ్వీ సతీష్. గోవా ఇసుక తీరాల్లో ఆడుకున్న ఈ అమ్మాయి ‘మిస్ ఇండియా 2026 వరల్డ్’ టైటిల్ గెలుచుకొని 2027లో జరగనున్న ‘మిస్ వరల్డ్’ పోటీలలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.→ మొదటి గోవా అమ్మాయిభువనేశ్వర్లోని ‘కె.ఐ.ఐ.టి. విశ్వవిద్యాలయం’లో ఏప్రిల్ 18న వైభవంగా జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026’ ఫైనల్స్లో 25 ఏళ్ల సాధ్వీ సతీష్ విజేతగా గెలిస్తే, మొదటి రన్నరప్గా మహారాష్ట్రకు చెందిన రజ్నందిని పవార్, రెండో రన్నరప్గా జమ్మూ కశ్మీర్కు చెందిన శ్రీఅద్వైత నిలిచారు. న్యాయనిర్ణేతలుగా జీనత్ అమన్, నేహా ధూపియా, మధుర్ భండార్కర్, ఒలింపిక్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. సాధ్వీ సతీష్ ఈ టైటిల్ను గెలవడం వల్ల ‘మిస్ వరల్డ్’కు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్న తోలి గోవా అమ్మాయి అయ్యింది. స్వాధ్వీ సతీష్ కర్ణాటకలోని కార్వార్లో పుట్టినా తను పెరిగిన గోవానే∙ఊపిరిగా భావిస్తుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి గోవా సంస్కృతి, సముద్రం ఇష్టం. బెంగళూరులోని అమృత విద్యాలయంలో చదివి, ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డబుల్ మేజర్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్లో ప్రవేశించి అందాల పోటీ వరకూ ఎదిగింది.→ నాన్న ప్రోత్సాహంఅమ్మా నాన్నల ప్రోత్సాహం లేకుండా పిల్లలకు ఏ విజయమూ సిద్ధించదు. సాధ్వీ సతీష్ విజయం వెనుక తండ్రి సతీష్ కృష్ణ సెయిల్, తల్లి ప్రియాంక సెయిల్ ఉన్నారు. ముఖ్యంగా తండ్రి సతీష్ కూతురి కలలకు రెక్కలు తొడిగిన వ్యక్తి. ‘ఆడపిల్ల అయినా ప్రపంచం చుట్టి రావాలి’ అని కెనడా చదువుకు, సోలో ట్రావెలింగ్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తల్లి ప్రియాంక గోవా సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను సాధ్వీలో నింపింది. ‘నాన్న నన్ను ఆకాశానికి ఎగిరేలా చేశారు. అమ్మ నా కాళ్లు నేల మీద ఉంచింది. మిస్ ఇండియా కిరీటం నాది కాదు, మా అమ్మా నాన్నలది’ అంది సాధ్వీ.→ సోలో ట్రావెలర్‘కెనెడాలో చదువు పూర్తయ్యాక మెక్సికోకు మొదటి సోలో ట్రావెల్ చేశాను’ అని తెలిపింది సా«ధ్వీ. లోకం చూడటానికి ఇష్టపడే సాధ్వీ మూడేళ్లలో పది దేశాలు ఒంటరిగా తిరిగింది. కొత్త సంస్కృతులు, కొత్త మనుషులు, కొత్త సవాళ్లు అన్నింటినీ ఆహ్వానించింది. ఈ ప్రయాణాలే తనకు స్వతంత్రంగా ఆలోచించడం, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పాయి అంటుందామె. మరో విశేషం ఏమిటంటే సాధ్వీకి తేనెటీగలంటే విపరీతమైన భయం. ఫోబియా. ఆ ఫోబియాను జయించడానికి సర్టిఫైడ్ బీకీపర్గా శిక్షణ తీసుకుంది. భయాన్ని బలంగా మార్చుకోవడం అంటే ఇదే.→ బ్యూటీ విత్ ఏ పర్పస్మిస్ ఇండియా పోటీకి కేవలం మూడు నెలల ముందే సిద్ధమైన సాధ్వీ క్రమశిక్షణతో పది కిలోలకు పైగా బరువు తగ్గి ‘టాప్ 5 బెస్ట్ బాడీ’లో నిలిచింది. తర్వాత కిరీటం గెలుచుకుంది. కానీ ఆమె లక్ష్యం కిరీటం కంటే పెద్దది. వినికిడి, మాటల లోపం ఉన్న పిల్లలకు మెరుగైన పోషకాహారం, సమాన అవకాశాలు కల్పించడం ఆమె ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్ట్. టాంజానియా వేదిక కానున్న ‘మిస్ వరల్డ్ 2027’ పోటీలో భారత్ తరపున ఇలాగే విజయం సాధించాలని కోరుకుందాం.
పాపులర్ వెయిట్ లాస్ మందులు, షాకింగ్ స్టడీ
జనాదరణ పొందిన బరువు తగ్గించే మందుల వల్ల కండరాలు మరింత క్షీణించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. నార్త్ కరోలినా విశ్వవిద్యాలయానికి (UNC) చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బరువు తగ్గడానికి ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందిన సెమాగ్లుటైడ్ (Semaglutide) మరియు తిర్జెపాటైడ్ (Tirzepatide) వంటి ఇంక్రిటిన్ ఆధారిత మందుల వల్ల ఆశించిన దానికంటే ఎక్కువగా కండరాల క్షీణత (Muscle Loss) జరుగుతున్నట్లు ఈ పరిశోధన తేల్చింది.ఈ మందులు టైప్ 2 డయాబెటిస్ , ఊబకాయం తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తున్నప్పటికీ, కండరాల నష్టం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో, బరువు తగ్గే ఇంక్రిటిన్ ఆధారిత మందుల వల్ల, ఊహించిన దానికంటే ఎక్కువ కండరాల క్షీణతకు దారితీస్తుందని తేలింది. ఈ అధ్యయనం 'అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్' అనే జర్నల్లో ప్రచురితమైనాయి. దీనికి యూఎన్సీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరియు యూఎన్సీ గిల్లింగ్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ఊబకాయం మరియు పోషణ నిపుణుడైన డాక్టర్ జాన్ ఎ. బాట్సిస్ నాయకత్వం వహించారు.ఈ అధ్యయనం ప్రకారం ఈ మందులు వాడుతున్న వారిలో తగ్గుతున్న మొత్తం బరువులో దాదాపు 35శాతం కండరాలకు సంబంధించిందే అని తేలింది. సాధారణంగా ఆహార నియమాల ద్వారా బరువు తగ్గితే కండరాల నష్టం 2-10శాతం మాత్రమే ఉంటుంది, కానీ ఈ మందుల వల్ల అది చాలా ఎక్కువగా ఉంది.ఇదీ చదవండి: అపుడు సస్పెన్షన్, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్, ఎవరీ దుర్గా శక్తి?కండరాల నష్టం ఎందుకు జరుగుతుంది?మనం కేలరీలను తక్కువగా తీసుకున్నప్పుడు శరీరం శక్తి కోసం కండరాల ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ కొత్త మందులు ఆకలిని 16-39% వరకు తగ్గిస్తాయి. దీనివల్ల వేగంగా బరువు తగ్గుతారు, కానీ తగినంత వ్యాయామం (Resistance training) లేకపోతే కొవ్వుతో పాటు కండరాలు కూడా కరిగిపోతాయి.ఇదీ చదవండి: కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకికండరాల క్షీణత, నష్టాలుమెటబాలిజం మందగిస్తుంది. కండరాలు విశ్రాంతి సమయంలో కూడా కేలరీలను ఖర్చు చేస్తాయి. అవి తగ్గితే మెటబాలిక్ రేటు తగ్గి, భవిష్యత్తులో బరువు పెరగడం సులభం అవుతుంది. అలాగే దైనందిన పనులు (మెట్లు ఎక్కడం, బరువులు మోయడం) చేసుకోవడం కష్టమవుతుంది. త్వరగా అలసట వస్తుంది. కండరాలు బలహీనపడితే శరీర సమతుల్యత దెబ్బతిని, కింద పడటం మరియు ఎముకలు విరగడం వంటి ప్రమాదాలు పెరుగుతాయి. రికవరీ ఆలస్యమవుతుంది. గాయాలు త్వరగా మానవు. వ్యాయామం తర్వాత వచ్చే నొప్పులు ఎక్కువ కాలం వేధిస్తాయి. ముఖ్యంగా వృద్ధులలోఈ ప్రమాదం ఎక్కువ అని తేల్చారు. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇది మరింత ప్రమాదకరం. ఇది వారిని ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది.ఇదీ చదవండి : విషాదం : టీవీ నటుడు సిద్ధార్థ్ కన్నుమూతదీన్ని ఎలా అరికట్టవచ్చుబరువు తగ్గే ప్రక్రియలో కండరాలను కాపాడుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు కండరాల మరమ్మత్తుకు అవసరమైన ప్రోటీన్లను అధికంగా తీసుకోవాలి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అవసరం. అంటే బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు చేయడం వల్ల కండరాల సాంద్రత పెరిగి, అవి కరిగిపోకుండా ఉంటాయి. బరువు తగ్గే క్రమంలో కేవలం మెషిన్ మీద అంకెలను మాత్రమే కాకుండా, శరీరంలోని 'లీన్ మాస్'ఎంత ఉందో నిరంతరం గమనిస్తూ ఉండాలి.
అత్తారింట్లో కూతురి నిర్వాకం..చితకబాదిన అమ్మ
ఇటీవల కాలంలో కోడళ్లు ఎలా ఉంటున్నారో తెలిసిందే. ఆధునిక కాలం అత్తలకు కోడళ్లు దడవడం లేదు. కోడళ్లే అత్తలను భయపెట్టే రేంజ్లో ఉంటున్నారు. పైగా ఏ మాత్రం తేడా వచ్చినా..వేరు కాపురం, ఆస్తులు కావాలని డిమాండ్ ఒకటి కాదు..రెండు కాదు ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. అత్తలకు భయపడే కోడళ్ల కాలం చెల్లినదిగా మారిపోయింది. అంత వరకు ఓకేగానీ కనీసం అత్తమామలను స్నేహితుల్లా లేదా సాటి మనిషిగా చూడకుండా నానాయాతను పెడుతున్నారు నేటితరం కొందరు కోడళ్లు. దానికి పుట్టింటివాళ్లు వత్తాసు పలికి పెళ్లిని మూణ్ణాళ్ల ముచ్చటలా మార్చేస్తున్న ఘటనలు కోకొల్లలు. అలాంటి కాలంలో నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఘటన అత్యంత అరుదైనది , రికార్డు ఘటనగా చెప్పొచ్చు.ఇంతకీ ఏం జరిగిందంటే..కోడలు తన అత్తమామల కోసం వంట చేయలేదు. ఆ విషయం తెలుసుకున్న తల్లి అక్కడకు చేరుకుని నేరుగా కూతరు వద్దకు పోయి చితకబాదింది. అంతేగాదు అత్తమామలకు భోజనం వడ్డించమని ఆదేశించింది. ఇటీవలకాలంలో ఇది అత్యంత అరుదైన ఘటన అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.The daughter in-law did not cook food for her in- laws. Her mother arrived at the scene, gave her daughter a thrashing, and immediately instructed her to serve her in lawsThis is rarest of rare case in India in recent history, you know what i mean. pic.twitter.com/5h1VdYtYh1— Woke Eminent (@WokePandemic) April 19, 2026 (చదవండి: కూరగాయలు అమ్మడం నుంచి సైనికుడిగా! కట్చేస్తే..)
కూరగాయలు అమ్మడం నుంచి సైనికుడిగా! కట్చేస్తే..
చదివే అవకాశంలోని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా..వెనకడుగు వేయలేదు. ఫీజు చెల్లించే పరిస్థితి లేకపోయినా..కూరగాయలు అమ్ముతూ చదువు సాగించాడు. అలా దేశ సేవ చేయాలని ఆర్మీలో చేరాడు. రిటైర్ అయ్యాక కూడా చదవాలనే కోరికను కొనసాగించాడు. ఆ ఆసక్తితో ఎన్ని డిగ్రీలు పూర్తి చేశాడో తెలిస్తే విస్తుపోతారు. పైగా అన్ని డిగ్రీలు పూర్తి చేసి ఎన్ని రికార్డులు నెలకొల్పాడో తెలిస్తే 'జయహో సైనికుడా' అని ప్రశంసించకుండా ఉండలేరు.అతడే రాజస్థాన్లోని ఝున్ఝును జిల్లాలోని ఖిరోడ్ గ్రామానికి చెందిన దశరథ్ సింగ్. తన కుటుంబంలో అంతగా విద్యకు ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. ఎందుకంటే పూటగడవడమే కష్టం కావడంతో ఆ ఆలోచనే వచ్చేది కాదు. అయినా సరే ఆ ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ చదువు సాగించాడు. కానీ కాలేజీ చదువులకు ఫీజులు చెల్లించలేక స్వస్తి పలకాల్సి వచ్చింది. అయినా కూడా ఆశను వదులకోలేదు. పొలంలో పండిన కూరగాయలు అమ్మేందుకు ఏకంగా 13 కిలోమీటర్లు నడిచి మరి చదువుకి నిధులు సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరి పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో పోస్టింగ్తో సహా 16 ఏళ్లు పనిచేశాడు. సర్వీస్లో ఉన్నప్పుడు కూడా తన వార్షిక సెలవులను చదువు కోసం ఉపయోగించేవాడు. సైనిక విధులతో పాటు నిశ్శబ్దంగా బలమైన విద్యా పునాదిని నిర్మిచుకున్నాడు దశరథ్ సింగ్. ఇక 2004లో పదవీ విరమణతో సింగ్ తన చిరకాల ఆశయం నిజం చేసుకునే దిశగా అడుగులు వేసి..ఎవ్వరూ ఊహించన విధంగా వందలకొద్దీ డిగ్రీలు పూర్తి చేశాడు. మొత్తం తన జీవితాన్ని చదువుకే అంకితం చేశాడు. సుమారు 138 డిగ్రీలు పూర్తి చేశాడు. తన విద్యా విజయాలు కారణంగా మొత్తం 11 ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి సంస్థల నుంచి గుర్తింపు పొందాడు. వీటిలో చాలామటుకు డిగ్రీలు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వంటి గుర్తింపు పొందిన సంస్థల నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పూర్తి చేశారు. చదవడానికి వయసుతో సంబంధం లేదని నిరంతర కృషి, అచంచలమైన పట్టుదల ఉంటే..నిరంతరాయంగా కొనసాగించవచ్చు అనడానికి ఈ మాజీ సైనికుడే ఉదాహరణ. (చదవండి: ఆలయాన్ని తలపించే కేఫ్..! ఏకంగా ప్రపంచంలోనే..)
అంతర్జాతీయం
కాల్పుల విరమణపై ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్, అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా పోస్టు చేశారు. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని తెలిపారు.ఇరాన్ తమతో ఏకీకృత ఒప్పందానికి వచ్చే వరకు, శాంతి చర్చలు ముగిసేవరకు కాల్పుల విమరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ల నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడంతో కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.ట్రూత్ వేదికగా ట్రంప్ స్పందిస్తూ.. ‘పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ల అభ్యర్థన మేరకు ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు, చర్చలు ఒక కొలిక్కి వచ్చే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుంది. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం యాథావిధిగా ఉంటుంది. ఇప్పటికే దీనిపై అప్రమత్తంగా ఉండాలని మా సైన్యాన్ని ఆదేశించాను’ అని తెలిపారు. అయితే ఇస్లామాబాద్లో ఏర్పాటు చేసిన రెండో విడత శాంతి చర్చలకు వచ్చేందుకు ఇరాన్ విముఖత చూపడంతో ట్రంప్ మంగళవారం సీఎన్బీసీ ‘స్వాక్బాక్స్’ కార్యక్రమంలో ఇరాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘ఇరాన్ మాతో ఒప్పందానికి రావడం తప్ప వారికి మరో మార్గం లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబులేయడమే అత్యుత్తమ మార్గం.కాల్పుల విరమణ గడువు పొడిగించే ప్రసక్తే లేదు. గడువు పొడిగింపు నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. బుధవారంతో ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ గడువు ముగియనుంది. అయితే ఇంతలో ట్రంప్ కాల్పుల విరమణపై యూటర్న్ తీసుకోవడంతో కొంతమేర ఉపశమనం లభించినట్లయింది.ఫలించిన పాక్ ప్రయత్నం..హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన దౌత్యప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఒక మెట్టు దిగిరావాలని అమెరికాకు సూచిస్తూనే మరోసారి చర్చలకొచ్చి సయోధ్యకు ప్రయత్నించాలని ఇరాన్కు హితబోధ చేస్తోంది. కనీసం కాల్పుల విరమణ గడువును అయినా పొడిగించి.. మరోమారు సత్ఫల సయోధ్యకు యత్నించే అవకాశం తమకు ఇవ్వాలని ఇరుదేశాల నాయకత్వాలను పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మంగళవారం కోరారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పాక్ అభ్యర్థనపై ఒక అడుగు ముందుకేసి కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు.
కెనడా కొత్త నిబంధనలు.. భారతీయులకు షాక్!
కెనడా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. అక్కడి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'బిల్ సి-12' చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం వల్ల కెనడాలో స్థిరపడాలని చూస్తున్న వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే బిల్ సి-12 భారతీయులకు షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతీయుల్లో చాలా మంది అమెరికా తర్వాత అత్యంత ఎక్కువగా వెళ్లే దేశం కెనడానే. కొత్త నిబంధనల ప్రకారం.. కెనడాలోకి ప్రవేశించిన ఒక ఏడాది లోపు మాత్రమే రిఫ్యూజీ హోదా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ గడువు దాటితే దరఖాస్తును స్వీకరించరు. గతంలో ఏండ్లు గడిచినా పీఆర్ రాకపోతే చివరి అవకాశంగా రిఫ్యూజీ క్లెయిమ్ చేసేవారు. ఇకపై అది సాధ్యపడదు. ఈ చట్టం కేవలం కొత్తవారికి మాత్రమే కాదు, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న సుమారు 19వేల దరఖాస్తులపై కూడా ప్రభావం చూపనుంది. దీనివల్ల వేల సంఖ్యలో భారతీయ దరఖాస్తుదారులు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కెనడా ప్రభుత్వం ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తినో కాకుండా, ఒకేసారి పెద్ద సంఖ్యలో వీసాలను లేదా ఇమ్మిగ్రేషన్ పత్రాలను రద్దు చేసే అధికారాన్ని పొందింది. దీని కోసం ప్రతి కేసును విడివిడిగా విచారించాల్సిన అవసరం లేదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెనడా ప్రభుత్వం పేర్కొంది. శరణార్థుల దరఖాస్తుల విచారణను వేగవంతం చేయడం, ఇతర దేశాలతో సమాచారాన్ని పంచుకోవడం ఈ చట్టంతో సులభతరం అవుతుంది. అయితే మానవ హక్కుల సంఘాలు, ఇమ్మిగ్రేషన్ లాయర్లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు దీనిని శరణార్థుల హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటున్నాయి. సరైన విచారణ లేకుండానే వీసాలు రద్దు చేయడం వల్ల విదేశీయులను బలవంతంగా వెనక్కి పంపే ముప్పు పెరుగుతుందని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కెనడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి ఇది అవసరమని ప్రభుత్వం చెబుతోంది. మోసపూరిత దరఖాస్తులను అడ్డుకోవడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. కెనడాలో భారతీయ విద్యార్థులు, వర్క్ పర్మిట్ హోల్డర్లు లక్షల్లో ఉన్నారు. పీఆర్ దక్కని వారు చాలామంది రిఫ్యూజీ దరఖాస్తుల మీద ఆధారపడుతుంటారు. కొత్త చట్టం వల్ల పాత కేసులు రీ-ఓపెన్ అవ్వడం లేదా వేగంగా తిరస్కరణకు గురవ్వడం జరిగితే.. భారతీయులు పెద్ద సంఖ్యలో డిపోర్టేషన్ ఎదుర్కొనే అవకాశాలున్నాయి.
చర్చలపై తొలగని ఉత్కంఠ
వాషింగ్టన్/ఇస్లామాబాద్/టెహ్రాన్: హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పడంతో రెండో దఫా శాంతి చర్చలపై సందిగ్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అన్ని ఏర్పాట్లూ చేశాక అతిథులు రాబోరన్న వార్త తెల్సి కంగుతున్న అతిథ్య పాకిస్తాన్ మరోమారు తమ దౌత్యమంత్రాంగాన్ని ముమ్మరంచేసింది. ఓ మెట్టు దిగిరావాలని అమెరికాకు సూచిస్తూనే మరోసారి చర్చలకొచ్చి సయోధ్యకు ప్రయత్నించాలని ఇరాన్కు హితబోధ చేస్తోంది. గత 24 గంటలుగా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోగా కొత్తగా హిందూమహాసముద్రంలో ఇరాన్ నౌకను అమెరికా తమ అదీనంలోకి తెచ్చుకోవడంతో ఇరాన్ పాలకుల్లో కోపం మరింత ఎక్కువైంది.కనీసం గడువు తేదీని అయినా పొడిగించి.. మరోమారు సత్ఫల సయోధ్యకు యత్నించే అవకాశం తమకు ఇవ్వాలని ఇరుదేశాల నాయకత్వాలను పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మంగళవారం కోరారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రాయబారం ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ‘‘ఇరాన్ మాతో సంప్రతింపులు జరపాలి. ఒప్పందం కుదిరితే ఇరాన్ మళ్లీ గొప్పదేశంగా అవతరించవచ్చు. అద్భుత దేశంగా ఎదగవచ్చు. మంచి ఒప్పందంతోనే అమెరికా ప్రతినిధి బృందం సంతోషంగా ఇస్లామాబాద్ నుంచి వెనుతిరుగుతుందని ఆశిస్తున్నా.రెండోదఫా చర్చలకు ఇరాన్ ముందుకు రాక తప్పదు. ఆ దేశానికి మరో మార్గమే లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబులేయడమే అత్యుత్తమ మార్గం. కాల్పుల విరమణ గడువును పొడిగించే ప్రసక్తే లేదు. గడువు పొడిగింపు అనేది నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు’’అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం సీఎన్బీసీ ‘స్వా్కక్ బాక్స్’కార్యక్రమంలో స్పష్టంచేశారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగుస్తుండటంతో బుధవారం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మరింత ఎక్కువైంది మేమింకా వేచిచూస్తున్నాంఇరాన్ స్పందన కోసం పాక్ వేచిచూస్తోంది. ‘‘ప్రతినిధి బృందం పంపుతుందోలేదో అనే సందేశం కోసం మేం ఆశగా ఎదురుచూస్తున్నాం. కాల్పుల విరమణ గడువు ముగిసేలోపే రెండోదశ చర్చలు మొదలుకావడం అత్యంత కీలకం’’అని పాక్ సమాచార శాఖ మంత్రి అతౌల్లాహ్ తరార్ మంగళవారం సాయంత్రం మీడియాతో చెప్పారు. అమెరికా వైఖరితోనే మేం రావట్లేదు చర్చలపై ఇరాన్ మంగళవారం స్పందించింది. ‘‘అమెరికా అధ్యక్షుడి చంచల మనస్తత్వం, అసంబద్ధ ప్రకటనలు, సంబంధంలేని వ్యాఖ్యానాలు, బెదిరింపులు, అమెరికా ప్రతినిధి బృందం చేసిన అతి డిమాండ్లతో మేం విసిగిపోయాం. ఫలవంతమైన చర్చలు జరుగుతాయనే నమ్మకం ఉంటేనే రెండోదశ చర్చలకు వస్తాం’’అని ఇరాన్ విదేశాంగ శాఖ పతినిధి ఇస్మాయిల్ బఘేల్ తెలిపారు.మరో నౌక స్వాదీనం: అమెరికా ఇండోనేసియా, శ్రీలంక మధ్యలో హిందూ మహాసముద్రజలాల్లో ఇరాన్కు చెందిన ‘ఎం/టీ టిఫానీ’నౌకను అమెరికా స్వాధీనం చేసుకుంది. హెచ్చరికల తర్వాత తమ బలగాలు నౌకపైకి దిగాయని అమెరికా ప్రకటించింది. ఈ నౌకను అమెరికాకు తరలించాలా లేదంటే మిత్రదేశంలోకి తరలించాలా అనేది మరో నాలుగు రోజుల్లో తేలుస్తామని అమెరికా తెలిపింది. దిగ్భంధనాన్ని ఛేదించిన జీ సమ్మర్ఇరాన్కు చెందిన ముడిచమురు రవాణా నౌక ‘జీ సమ్మర్’విజయవంతంగా అమెరికా దిగ్బంధనాన్ని చేధించుకుని అరేబియా సముద్రం దిశగా పయనిస్తోందని వార్తలొచ్చాయి. ఏ ఒక్క నౌక కూడా తమ దిగ్బంధనం నుంచి తప్పించుకోబోదని గొప్పలుపోయిన అమెరికాకు ఈ వార్త తలనొప్పిగా మారింది. హార్మూజ్ను దాటేసి, ఏప్రిల్ 19వ తేదీన గల్ఫ్ ఆఫ్ ఒమన్నూ దాటేసిందని నౌకల ట్రాకింగ్ డేటా పేర్కొంది.ఆ 8 మందిని విడిచిపెట్టండిఇరాన్కు ట్రంప్ పిలుపు వాషింగ్టన్: ఇరాన్లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న ఎనిమిది మంది మహిళలను వదిలేయాలని ఆదేశ ప్రభుత్వాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఇస్లామాబాద్లో అమె రికా–ఇరాన్ల చర్చలు ప్రారంభమవుతాయని భావిస్తున్న వేళ ఆయనీ విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఆరుగురు మహిళలు, ఇద్దరు యువతులకు సంబంధించిన ఫొటోలను ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో విడుదల చేశారు. ‘మన మధ్య జరగబోయే చర్చలకు ఇది శుభారంభం అవుతుంది’అనే వ్యాఖ్యను జోడించారు.
నేపాల్లో 15 రోజులకోసారి జీతం చెల్లింపు!
నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే జీతాల విధానంలో మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో ఇకపై నెలవారీ చెల్లింపులు కాకుండా 15 రోజులకోసారి రెండు దఫాలు జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఉద్యోగులకు 15 రోజులకు ఒకసారి జీతాలు చెల్లించడం ద్వారా వారి చేతుల్లో నెల మొత్తం డబ్బు ఉంటుందని, ఇది వారిని ఆర్థిక వ్యవస్థలో డబ్బును ఖర్చు పెట్టేలా ప్రోత్సహిస్తోందని అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ విధానం దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచడంలో కూడా సహాయపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు స్వాగతించారు. పాఠశాల ఫీజులు, యుటిలిటీ బిల్లులు, రోజువారీ గృహ ఖర్చులు ఈ విధానం ద్వారా సులభతరం కానుంది. ఈ నిర్ణయం చిన్న వ్యాపారాలకు, చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చనుంది. కాగా 15 రోజులకోసారి ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానం ఇప్పటికే ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో అమలవుతోంది.
జాతీయం
శంభో శివశంభో స్మరణతో కేదారినాథ్
ఈ రోజు (బుధవారం) ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదారినాథ్ క్షేత్రం తెరుచుకుంది.దీంతో ఆలయ పరిసరాలన్నీ శివనామాస్మరణతో మార్మోగుతున్నాయి. ఆ పరమేశ్వరుని దర్శించుకొని తమ జన్మధన్యం చేసుకోవాలని భక్తులంతా ఎంతో భక్తి నిష్టలతో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేదారినాథ్ యాత్రపై సమగ్రమైన సమాచారం తెలుసుకోండి.స్థలపురాణంఇతిహాసాల ప్రకారం.. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత, పాండవులు "గోత్ర హత్తి", "బ్రహ్మ హత్తి" పాపాల నుండి విముక్తి పొందడానికి పరమేశ్వరుని కోసం కఠిన తపస్సు చేస్తారు. శివుని దర్శనం అనంతరం ఆప్రాంతంలో మొదట పాండవులు ఇక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించారని స్థలపురాణం చెబుతుంది. అనంతరం 8వ శతాబ్దంలో జగద్గురు ఆది శంకరాచార్యులు ప్రస్తుతం ఉన్న అద్భుతమైన ఆలయాన్ని పునర్నిర్మించారని ప్రతీతి. అయితే మాములుగా శివలింగాలు గుండ్రంగా ఉంటాయి, కానీ కేదారినాథ్లో శివలింగం త్రిభుజాకారంలో ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత.ఇంజినీర్లనే ఆశ్చర్యపరిచిన ఆలయ నిర్మాణం ఈ ఆలయాన్ని నిర్మించిన విధానం ఇప్పటికీ ఇంజనీర్లను ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆలయ నిర్మాణానికి వాడిన రాళ్లు టన్నుల కొద్దీ బరువు ఉంటాయి. సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో, ఆ కాలంలో ఎటువంటి యంత్రాలు లేకుండా ఆ రాళ్లను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం. ఈ ఆలయ నిర్మాణానికి ఇంటర్ లాకింగ్ టెక్నిక్ వాడారు. రాళ్లను అతికించడానికి ఎటువంటి సిమెంట్ లేదా మట్టిని వాడలేదు. ఒక రాయిలో మరొకటి సరిగ్గా సరిపోయేలా అమర్చారు. అందుకే వందల సంవత్సరాల మంచు తుఫానులు ఈ ఆలయాన్ని కనీసం తాకలేకపోయాయి. భీమశిల 2013లో ఉత్తరఖండ్లో మహాప్రళయం వచ్చింది. ఆసమయంలో ఆలయ పరిసరాల్ని పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తాయి. అప్పుడు ఓ అద్భుతం జరిగింది. ఒక పెద్దరాయి ఆలయ వెనుకభాగంలో వచ్చే ఆగింది. దీంతో వరదల ఆలయాన్ని కనీసం తాకలేకుండా చీలుకుంటూ వెళ్లింది. అంత పెద్ద భారీ జల ప్రళయం సైతం ఆలయాన్ని తాకలేకపోయింది. దీంతో భక్తులంతా ఆ భీమసేనుడే శిల రూపంలో వచ్చి ఈ ఆలయాన్ని రక్షించాడని అంటారు. అందుకే ఆ రాయిని ఇప్పటికీ "భీమ శిల" పేరుతో కొలుస్తారు.చార్ధామ్ యాత్ర భక్తులంతా ఎక్కువగా ఛార్దామ్ యాత్రలో భాగంగా కేదారినాథ్ దర్శనం చేసుకుంటారు. కేదారినాథ్,బద్రినాథ్,యమునోత్రి, గంగోత్రి క్షేత్రాలను కలిపి ఛార్దామ్ యాత్రగా పిలుస్తారు. యమునోత్రి & గంగోత్రి యాత్ర ఏప్రిల్ 19, 2026 అక్షయ తృతీయ రోజున ప్రారంభం కాగా కేదారినాథ్ ఈ రోజు తెరుచుకోనుంది. రేపు బద్రీనాథ్ ఆలయాన్ని భక్తుల దర్శనం నిమిత్తం తెరుస్తారు.ఆరు నెలలు మాత్రమే దర్శనం ఛార్ దామ్ యాత్ర సంవత్సరంలో కేవలం ఆరు నెలలు మాత్రమే భక్తుల దర్శనార్థం అందుబాటులో ఉంటుంది. సముద్రమట్టానికి సుమారు 11,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. నవంబర్ - ఏప్రిల్ సమయంలో ఉష్ణోగ్రతలు -15°C నుండి -20°C కి పడిపోతాయి ఆలయ పరిసర ప్రాంతాలు దాదాపు 10 నుండి 15 అడుగుల మేర మంచుతో పూర్తిగా కప్పబడిపోతాయి. శీతాకాలంలో కురిసే భారీ మంచు వల్ల కేదారినాథ్కు వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటం వల్ల ప్రయాణం ప్రాణాపాయంగా మారుతుంది. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా యాత్రను నిలిపివేస్తారు.అద్భుతం పురాణాల ప్రకారం, ఆలయ ద్వారాలు మూసి ఉన్న ఆరు నెలల కాలంలో మనుషులు కాకుండా దేవతలు స్వామివారికి పూజలు చేస్తారని నమ్మకం. ద్వారాలు మూసే రోజున ఆలయంలో ఒక పెద్ద దీపాన్ని (అఖండ జ్యోతి) వెలిగిస్తారు. ఆశ్చర్యకరంగా, ఆరు నెలల తర్వాత మళ్ళీ తలుపులు తీసినప్పుడు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది.దీంతో భక్తులు భక్తిపారవశ్యంతో పులకించి పోతారు.ఎలా చేరుకోవాలి?అయితే కేదారినాథ్ ఆలయం ప్రయాణం కొంత కష్టంతో కూడుకున్నది. సాధారణ రవాణా మార్గాలు కేవలం గౌరీకుండ్ వరకే చేరుకుంటాయి. అక్కడి నుంచి ఆలయం వరకూ సూమారు 16 - 18 కిలోమీటర్ల కాలి నడకన వెళ్లాల్సి ఉంటుంది. దీనికి దాదాపుగా 6 నుండి 8 గంటల సమయం పడుతుంది. నడకమార్గం మెుత్తం కొండలు కావడంతో ట్రెక్కింగ్ కొంత కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు గాలిలో ఆక్సిజన్ స్థాయిు తగ్గుతాయి. దీనివల్ల త్వరగా అలసిపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. యాత్రకు ప్రారంభించే సమయంలో సైతం అక్కడి వైద్య సిబ్బంది మన ఆరోగ్య వివరాలను తనిఖీ చేస్తారు.అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం, కాబట్టి ఉన్ని దుస్తులు , రెయిన్ కోట్ వెంట ఉంచుకోవడం తప్పనిసరి.మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే అక్కడ ఉన్న ఆక్సిజన్ సపోర్ట్ అందించేలా ఏర్పాటు చేస్తారు. ఒకవేళ నడవలేని వారి కోసం గుర్రాలు లేదా డోలీలు అందుబాటులో ఉంటాయి.దారి పొడవునా ప్రతి కొన్ని కిలోమీటర్లకు ప్రథమ చికిత్స కేంద్రాలు ఉంటాయి.హెలికాప్టర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. కానీ దీనికి ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలి.కేదారినాథ్కు రికార్డు స్థాయిలో రిజిష్ట్రేషన్లుఈ సారి చార్ ధామ్ యాత్రకోసం రికార్డు స్థాయిలో భక్తులు రిజిష్ట్రేషన్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 14.5 లక్షల మంది రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో ఒక్క కేవలం కేదారినాథ్ దర్శనం కోసమే 4,95,173 మంది రిజిష్ట్రేషన్లు చేసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రోజుకు కేవలం 15 వేలమంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించినున్నట్లు కమిటీ ప్రకటించింది.
TN Election: విజయ్ పొలిటికల్ థ్రిల్లర్.. ఇన్వెస్టర్లలో గుబులు!
చెన్నై: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాజకీయ, ఆర్థిక యుద్ధానికి తమిళనాడు వేదిక కాబోతోంది. గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 11.19 శాతం రికార్డు వృద్ధితో దూసుకుపోతున్న రాష్ట్రం రేపు (ఏప్రిల్ 23న) ఓటింగ్ కు సిద్ధమైంది. అయితే అందరి దృష్టి పాత రాజకీయ దిగ్గజాలపైనే కాకుండా, కేవలం రెండేళ్ల క్రితం ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీని స్థాపించి 234 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్న సినీ నటుడు విజయ్ పై పడింది. 2030 నాటికి $1 ట్రిలియన్(రూ. లక్ష కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రానికి ఈ సరికొత్త రాజకీయ సమీకరణం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.బలమైన ఆర్థిక శక్తిగా తమిళనాడు2024-25 ఆర్థిక సర్వే ప్రకారం, తమిళనాడు జీఎస్డీపీ ఏకంగా 11.19 శాతానికి చేరుకుని, ప్రధాన భారతీయ రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచింది. ముఖ్యంగా తయారీ రంగం జాతీయ సగటు (4.5%) కంటే మూడు రెట్లు ఎక్కువగా 14.74 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశ జనాభాలో కేవలం 6 శాతం మాత్రమే ఉన్న ఈ రాష్ట్రం జాతీయ జీడీపీకి 9.4 శాతం తోడ్పాటు అందించడం విశేషం. తలసరి ఆదాయం రూ. 3.62 లక్షలకు చేరింది. హ్యుందాయ్, ఫాక్స్కాన్, శాంసంగ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఇక్కడ భారీగా విస్తరిస్తున్నాయి. హోసూర్లో రోల్స్ రాయిస్ మెయింటెనెన్స్ ఫెసిలిటీ ప్రారంభించడం దీనికి నిదర్శనం. 2024-25లో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, లెదర్ ఎగుమతుల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం.. సరుకుల ఎగుమతుల ద్వారా $52.07 బిలియన్లు(రూ. 4.35 లక్షల కోట్లు) రాబట్టింది.‘టీవీకే’ ప్రభంజనమా? పెట్టుబడులపై ప్రభావమా?ఎలాంటి పరిపాలనా అనుభవం లేని విజయ్ పార్టీ మే 4న వెలువడే ఫలితాల్లో సృష్టించబోయే ప్రభావాన్ని మార్కెట్ శక్తులు గమనిస్తున్నాయి. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు పారిశ్రామిక అనుకూల విధానాలతో స్థిరమైన పాలన అందించాయి. దీనివల్లే 2019 అక్టోబర్ నుండి 2025 జూన్ నాటికి $17.29 బిలియన్ల (రూ. 1,53,394 కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)ఇక్కడికి వచ్చాయి. అయితే విజయ్ పార్టీ ఓట్లను చీల్చి, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితి తలెత్తితే, అది కూటమి రాజకీయాల అనిశ్చితికి దారితీస్తుంది. ఒకవేళ విజయ్ గణనీయమైన సీట్లు సాధించి ‘కింగ్ మేకర్’ అయితే, భూసేకరణ లేదా పారిశ్రామిక విధానాలపై వారికున్న అనుభవలేమి కారణంగా, హోసూర్లో కొత్తగా రూ. 2,000 కోట్ల ప్లాంట్ను ఆమోదించడానికి కార్పొరేట్ సంస్థలు వెనకడుగు వేసే ప్రమాదం ఉంది.ఉచిత పథకాలు వర్సెస్ సుస్థిర వృద్ధిఎన్నికల హడావిడిలో అసలు చర్చించాల్సిన ప్రధానాంశం ఆర్థిక సుస్థిరత. రాష్ట్ర సామాజిక రంగ వ్యయం 2021-22లో రూ. 1.13 లక్షల కోట్ల నుంచి 2025-26 నాటికి రూ. 1.57 లక్షల కోట్లకు పెరిగింది. రేపటి పోలింగ్ కోసం అన్ని పార్టీలు మరిన్ని ఉచితాలను అందిస్తామని వాగ్దానం చేశాయి. ఈ నేపధ్యంలో ఏదో ఒక దశలో రూ. 36 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ వీటన్నింటికి మూల్యం చెల్లించుకోక తప్పదు. సంక్షేమాన్ని పంచుతూనే 2030 నాటి ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని ఎలా సాధిస్తారన్నదే తదుపరి ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా నిలిచింది.ఇది కూడా చదవండి: Earth Day 2026: అవని అంతం?.. మోగిన ‘కోడ్ రెడ్’!
తమిళనాడులో జగన్ నామ గర్జన.. విజయ్ అభిమానం
జననేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడికి వెళ్లిన అభిమానులు వైఎస్ జగన్ భారీ సంఖ్యలో తరలివచ్చి వెన్నంటే ఉంటారు. తమ అభిమాన నేతపై వారికున్న అభిమానాన్ని చాటుకుంటారు. కాగా, తమిళనాడు ఎన్నికల్లో సైతం వైఎస్ జగన్ పేరు మారుమోగుతోంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా టీవీకే అధినేత విజయ్.. వైఎస్ జగన్పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. జగన్తో కలిసి ఉన్న ఫొటోను విజయ్ ప్రదర్శించారు. దీంతో, ఒక్కసారిగా అక్కడున్న వారిలో జోష్ వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీవీకే అధినేత విజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్నికల వేడి మధ్యలో, ప్రచార రథంపై నిలబడి ఉన్న విజయ్ ఒక్కసారిగా వైఎస్ జగన్ ఫొటోను పైకి ఎత్తి చూపించారు. ఆ ఫొటోను పైకెత్తిన క్షణంలోనే సభ మొత్తం ఒక్కసారిగా మార్మోగిపోయింది. “జగన్.. జగన్” అంటూ జనం గళం ఉప్పొంగిపోయింది. అది సాధారణ స్పందన కాదు. ఒక నాయకుడిపై ప్రజల్లో ఉన్న నమ్మకం, గౌరవం, ప్రేమ.. ఒక్క క్షణంలో బయటపడిన ఎమోషన్. అది ఒక ఫొటో మాత్రమే అయినా, స్పందన మాత్రం తుఫాన్లా ఎగిసిపడింది. అక్కడున్న వారంతా జగనన్న సీఎం అంటూ నినాదాలు చేశారు.Vijay holding jagan and vijay photo in TN election campaign 🇺🇿🔥🇪🇸 https://t.co/AwkL1Kuljk pic.twitter.com/SGblloxsRb— ᴊᴀɪxᴊᴀɢᴀɴɪꜱᴍ✨ (@ysj_fanboy) April 21, 2026విజయ్ ఫోటో ఎత్తిన తీరు.. జనం ఇచ్చిన ఆ రియాక్షన్.. ఈ రెండూ కలిసిన ఆ క్షణం నిజంగా ప్రజల గుండెల్లో “జగన్” అనే పేరు ఎంత లోతుగా ఉందో చూపించింది. ఇదీ జగన్ అంటే ప్రజల్లో గుండెల్లో ప్రత్యేక అభిమానమని అనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. వైఎస్ జగన్ అంటే ఒక నమ్మకం.. ఒక ఇంపాక్ట్ అని మరోసారి రుజువైంది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒓𝒂𝒏 𝑮𝒖𝒕𝒕𝒂 (@hiran_gutta)
నేటి నుంచే కేదార్నాథ్ దర్శనం
సాక్షి, న్యూఢిల్లీ: కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి విచ్చేసే భక్తుల శివనామ స్మరణతో హిమాలయ పర్వత శ్రేణులు మార్మోగి పోను న్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం ఉదయం 8 గంటలకు భక్తుల దర్శనం కోసం తెరుచుకోనున్నాయి. ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత అక్షయ తృతీయ శుభ ఘడియల్లో కేదార్నాథ్ ఆలయం తెరచుకుంటోంది. ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర ఆలయం నుంచి బాబా డోలీ (ఉత్సవమూర్తి) ఇప్పటికే కేదార్నాథ్ ధామ్కు చేరుకున్నారు.ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు భక్తుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 14.5 లక్షల మందికి పైగా భక్తులు చార్ధామ్ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు. ఇందులో ఒక్క కేదార్నాథ్ దర్శనం కోసమే 4,95,173 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ 15,000 మంది భక్తులను దర్శనానికి అనుమతించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ఫోటోలు తీయడం, ఇన్స్టా గ్రామ్ రీల్స్ చేయడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
ఎన్ఆర్ఐ
టోక్యోలో ఘనంగా ఉగాది పండుగ
జపాన్లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా (Komatsugawa) పార్క్లో ఉగాది పండుగను భారతీయులు ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్కు చెందిన స్థానికులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఉగాది సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఉగాది పచ్చడిని తయారు చేసి, దాని ప్రాముఖ్యతను పాల్గొన్న వారికి వివరించారు. అలాగే రాశి ఫలాలను వినిపిస్తూ కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అనంతరం వివిధ రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి అందరూ కలిసి భోజనం చేశారు.పిల్లల కోసం బ్యాగ్ జంపింగ్ వంటి వినోదాత్మక పోటీలు నిర్వహించగా, పెద్దల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమం అనంతరం కొత్తగా వచ్చిన కుటుంబాలు పరస్పరం పరిచయం చేసుకుని, విదేశాల్లో భారతీయ సంప్రదాయాలను ఎలా కొనసాగించాలన్న దానిపై చర్చించారు. ఈ వేడుకల ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు. వివిధ దేశాల ప్రజలు కలిసి సంస్కృతులను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన TAJ(Telugu association of Japan)కమిటీ సభ్యులకు, అలాగే పాల్గొన్న అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్లోని తెలుగు వాసులు ఈ ఏడాది ఉగాది పండుగను సంప్రదాయానికి అనుగుణంగా, ఆత్మీయంగా మరియు వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20, 2026 తేదీలలో ఈ ఉత్సవాలు చాంగీ రామర్ దేవాలయం, సెంగ్కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం మరియు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రత్యేకంగా, టీమ్ శివ ప్రసాద్ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాలయాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి మరియు ప్రసాదాన్ని పంపిణీ చేశారఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆనందం, ఐక్యత మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది.ఈ ఉత్సవాల ద్వారా సాంప్రదాయం, సంస్కృతి, భక్తి మరియు ఐక్యత మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో, సింగపూర్లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు.
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు)
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
క్రైమ్
లంచం డిమాండ్.. ఏసీబీ వలలో సీఐ, ఎస్ఐ!
అనంతగిరి: వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సరోజ, ఎస్ఐ రాణి ఏసీబీ వలలో చిక్కారు. వివరాలిలా ఉన్నాయి.. తాండూరు పట్టణానికి చెందిన కౌన్సిలర్ ఇర్షాద్ భార్య కుటుంబ గొడవల విషయంపై మహిళా పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఇర్షాద్తో పాటు అతని కుటుంబసభ్యులు ఐదుగురిపై కేసు నమోదైంది. దీదీనిపై నోటీసులు తీసుకోవాలంటూ మార్చి 15న పోలీసులు ఇర్షాద్కు ఫోన్ చేశారు. దీంతో అమ్మానాన్న, తమ్ముడిని తీసుకుని 16న పీఎస్కు వచ్చాడు. ఇద్దరు చెల్లెళ్లు రాలేదు. కేసులో ఉన్న ఆరుగురికీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.60 వేలు ఇవ్వాలని సీఐ, ఎస్ఐ డిమాండ్ చేశారు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.40 వేలకు బేరం కుదుర్చుకున్నారు. మార్చి 23వ తేదీన రూ.20 వేల నగదుతో వెళ్లిన ఇర్షాద్ సీఐ సమక్షంలో ఎస్ఐకి డబ్బులు అందజేశాడు. అనంతరం ఇందుకు సంబంధించిన ఆధారాలతో ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్ మహిళా పీఎస్కు చేరుకున్న ఏసీబీ అధికారులు సీఐ, ఎస్ఐని విచారించారు. వీరి ఇళ్లతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేదా 9440446106కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం.. తాండూరు: పట్టణానికి చెందిన కౌన్సిలర్ షేక్ ఇర్షాద్ అవినీతి అధికారుపై పోరాటం చేస్తున్నారు. ఓ భూమికి సంబంధించిన సేల్ డీడ్ రద్దు చేయాలని కోరుతూ 2022 డిసెంబర్లో తాండూరు సబ్ రిజిస్ట్రార్ జమీరొద్దీన్ను కలవగా రూ.లక్ష డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన ఇర్షాద్ డిసెంబర్ 5న డబ్బులు ఇస్తూ సబ్ రిజి్రస్టార్తో పాటు అతని అసిస్టెంట్ను పట్టించాడు. 2025లో ఇంటి నంబర్ కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ ఉద్యోగి రమేశ్ను ఏసీబీకి పట్టించాడు. దంపతుల మధ్య నెలకొన్న గొడవ విషయంలో ఇర్షాద్ భార్య మహిళా పీఎస్లో ఫిర్యాదు చేయగా, స్టేషన్ బెయిల్కు లంచం డిమాండ్ చేసిన పోలీసు అధికారులను ఏసీబీకి పట్టించడం చర్చనీయాంశమైంది.
నాకు నలుగురు అమ్మాయిలతో ఎఫైర్ ఉంది..!
కడప అర్బన్: చుక్కలాంటి అమ్మాయికి.. చక్కనైన అబ్బాయికి ఆర్భాటంగా నిశ్చితార్థం చేశారు. వివాహ ముహూర్తం నిర్ణయించారు. ఈ మధ్యలోనే అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరుగా తెలుసుకునేందుకు సెల్ఫోన్లలో మాట్లాడుకోవడం, చాటింగ్లు చేసుకున్నారు. ఏమైందో ఏమో సదరు యువకుడు ఉన్నట్లుండి తనకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, ఇప్పటికే నలుగురు యువతులతో ప్రేమ వ్యవహారం నడిచిందని చెప్పుకొచ్చాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఈ నెల 20 తేదీన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్ పోలీస్స్టేషన్లో కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పటేల్ రోడ్డుకు చెందిన రెహనా(26) ఎమ్మెస్సీ పూర్తి చేసుకుని ఇంటి వద్ద ఉంటోంది. తండ్రి నాదెళ్ల రాజా మధ్యవర్తుల ద్వారా ప్రొద్దుటూరుకు చెందిన వీర కుమారుడు షాజహాన్తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఈఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఇందిరానగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిశ్చితార్థం వేడుక జరిగింది. ఆగస్టులో పెళ్లి చేయాలనుకున్నారు. ఈ క్రమంలో షాజహాన్ పెళ్లి ఇష్టం లేదంటూ యువతికి చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి నాదెండ్ల రాజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని మంగళవారం మార్చురీకి తరలించారు.
మురుగన్ మళ్లీ చిక్కెన్!
సాక్షి, హైదరాబాద్: గుజరాత్లోని బనాస్కంత ప్రాంతంలో అపహరణకు గురైన నాలుగేళ్ల చిన్నారి దేవ్ను రెస్క్యూ చేయడంతో మొదలైన ఆపరేషన్లో భారీ శిశువుల అక్రమ రవాణా, విక్రయాల ముఠా గుట్టురట్టు అయింది. సూత్రధారులుగా ఉన్న తెలంగాణకు చెందిన ముగ్గురిని సోమవారం అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఈ ముఠాలో కింగ్పిన్గా ఉన్న తెలంగాణకు చెందిన మురుగన్ గత ఏడాది చైతన్యపురి ఠాణాలో నమోదైన శిశువుల అక్రమ రవాణా కేసులోనూ కీలక నిందితుడిగా ఉన్నాడు. దేవ్ కిడ్నాప్నకు పాల్పడిన గుజరాత్లోని డాంత ప్రాంతానికి చెందిన శైలేష్ గామర్, బాబు భగోరాలను పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. ముఠా విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో... ‘మురుగన్ గ్యాంగ్’నెట్వర్క్ను ఛేదించేందుకు బనస్కాంత పోలీసులు దాదాపు 70 నుంచి 80 ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను సేకరించడంతోపాటు తమ వద్ద ఉన్న ఆధారాలను ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ సాయంతో విశ్లేషించారు. తెలంగాణకు చెందిన బోదాశు నాగరాజే మురుగన్ అని, అతడిపై గతంలోనూ కేసులు ఉన్నాయని గుర్తించారు. ఇతడి కోసం గాలించిన స్పెషల్ టీమ్ సోమవారం కాగజ్నగర్లో పట్టుకుంది. మురుగన్ ఇచ్చి న సమాచారంతో కరీంనగర్ జిల్లా సిరికొండకు చెందిన కాసరపు తిరుపతి, కాసరపు మల్లయ్య, కేలేటి గంగాధర్ గంగరాజన్లను పట్టుకున్నారు. దాదాపు నాలుగేళ్లుగా శిశువుల అక్రమ రవాణా దందాలో ఉన్న మురుగన్ 2025 మార్చి 19న చైతన్యపురి పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టై మూడు నెలలు చర్లపల్లి జైల్లో ఉన్నాడు. మూడు రాష్ట్రాల్లో ఎనిమిది మంది విక్రయం... మురుగన్ భార్యకు కూడా మహారాష్ట్రలో నమోదైన శిశువుల అక్రమ రవాణా కేసుతో సంబంధం ఉన్నట్లు బనస్కాంత పోలీసులు అనుమానిస్తున్నారు. మురుగన్ గ్యాంగ్ ఇప్పటి వరకు ఎనిమిది మంది నవజాత శిశువుల్ని అపహరించి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్లోని మూడు ఐవీఎఫ్ కేంద్రాలు ఈ శిశు విక్రయాలకు అడ్డాలుగా ఉన్నట్లు బనస్కాంత అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, కూకట్పల్లి కేంద్రాలుగా పనిచేస్తున్న వాటిపై చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు. గిరిజనుల బిడ్డలే ఎక్కువగా... మురుగన్ గ్యాంగ్ గిరిజన ప్రాంతాల్లోని నిరుపేద దంపతులతో ఒప్పందాలు చేసుకుని శిశువు పుట్టిన 24 నుంచి 48 గంటల్లోనే ఖరీదు చేస్తోంది. రూ.ఐదు లక్షలు చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన సోము, అమూల్య, మల్లేష్, శివరాణి, వెంకటరామారావులతోపాటు విజయవాడకు చెందిన సరోజ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
రూ.కోటిన్నర బంగారం కొట్టేసింది కూతురే..!
చైతన్యపురి: ఓ వ్యాపారి ఇంట్లో కిలో బంగారు ఆభరణాలు చోరీకి గురై సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే వాటిని కొట్టేసింది అతడి కుమార్తె అని పోలీసుల విచారణలో తేలింది. చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాలు... కొత్తపేట గ్రీన్హిల్స్ కాలనీలో నివసించే దీపక్ పటేల్ టైల్స్ వ్యాపారి. జనవరి 28న భార్య వింధ్య పటేల్తో కలిసి ఇంట్లోని నగల బాక్సులను బెడ్ కింద ఉన్న లాకర్లో పెట్టి తాళం వేశారు. తాళం చెవులను బీరువా లాకర్లో భద్రపరిచారు. గత శనివారం ఆభరణాల కోసం లాకర్ తెరిచి చూడగా ఖాళీ బాక్సులు దర్శనమిచ్చాయి. అవి చోరీకి గురై ఉంటాయని భావించి దీపక్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన డీఐ గురుస్వామి దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులను విచారించగా ఈ ఘటనలో ఫిర్యాదుదారుడి కుమార్తె రియా హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఎంబీఏ చదువుతోంది. నమ్మకంగా ఉంటూ దీపక్ పటేల్ దగ్గర మేనేజర్గా పనిచేసే సాగర్(34)కు రియా ఆ ఆభరణాలను ఇచ్చినట్లు విచారణలో తేలింది. బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్కు డబ్బులు అవసరమని అతడు నమ్మించి నగలు తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో కుటుంబం పరువు పోతుందని భావించిన ఫిర్యాదుదారుడు పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి కేసు వాపస్ తీసుకుంటానని అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. అనుమానితులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నామని కొంత నగదు, బంగారం స్వా«దీనం చేసుకున్నామని చైతన్యపురి పోలీసులు తెలిపారు.
వీడియోలు
చిల్లర రాజకీయాలు మానుకో.. రేవంత్ పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు
హనీ ట్రాప్ కలకలం పోలీసులే దగ్గరుండి.. సంచలన ఆడియో లీక్
తెలంగాణలో కొనసాగుతున్న బంద్.. అల్లాడుతున్న ప్రయాణికులు
ఈ సినిమాలో పెద్ద స్టార్ట్ నటీమణులు ఒకేసారి కనిపించనున్నారు
పెళ్లి అయిన 3 నెలల నుంచే గర్భిణీ అని కూడా చూడలేదు
పవన్ కళ్యాణ్.. మీ పార్టీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా?
భరణం పేరుతో భర్తపై 'భారం' విడాకుల కేసుల్లో విడ్డూరాలు?
మాజీ సీఎం నాదెండ్ల మృతిపై YS జగన్ సంతాపం
చిట్టిబాబు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు
సీఎం రేవంత్ పాటలు పై సింగర్ మధుప్రియ కామెంట్స్



