ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.తదియ సా.5.32 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: హస్త ఉ.9.22 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: సా.5.55 నుండి 7.36 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.39 నుండి 9.26 వరకు తదుపరి ప.12.33 నుండి 1.20 వరకు, అమృత ఘడియలు: తె.4.14 నుండి 5.53 వరకు (తెల్లవారితే శనివారం), సంకటహర చతుర్థి.సూర్యోదయం : 6.20సూర్యాస్తమయం : 6.03రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం... ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తగ్గుతాయి. ధనలాభ సూచనలు.వృషభం.... ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. బంధువిరోధాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.మిథునం.... ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలలో అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.కర్కాటకం... కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూరప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. ధనలబ్ధి. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గుతాయి.సింహం.... కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. కళాకారులకు ఒత్తిళ్లు.కన్య.... కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.తుల.... ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.వృశ్చికం... నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. శుభవార్తలు వింటారు.ధనుస్సు... కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. భూ, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు,ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.మకరం... కుటుంబ, ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.కుంభం.... అనుకోని ప్రయాణాలు. కుటుంబసమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. బంధువులతో వివాదాలు.మీనం.. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రుల ద్వారా శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తన పరిధిలో లేని 1977 అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ)ను అడ్డుపెట్టుకుని విదేశాలపై విధించిన అధిక టారిఫ్ల మాటున వసూలుచేసిన 130 బిలియన్ డాలర్లను తిరిగి ఆయా కంపెనీలకే చెల్లించాలని మాన్హట్టన్ నగరంలోని ‘యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్’లో జడ్జి రిచర్డ్ ఈటన్ తీర్పు చెప్పారు.టెన్నిస్సీ రాష్ట్రంలోని నాష్విల్లే నగరంలోని అట్మాస్ ఫిల్ట్రేషన్ అనే సంస్థ వేసిన పిటిషన్ను విచారిస్తూ జడ్జి ఈ తీర్పు వెలువర్చారు. ప్రపంచదేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లు చట్టవిరుద్ధమంటూ ఫిబ్రవరి 20వ తేదీన అమెరికా దేశ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. కానీ ఆయా దేశాల కంపెనీలు చెల్లించిన అధిక టారిఫ్లను తిరిగి వాళ్లకే రీఫండ్ చేయాలని తీర్పులో ఎక్కడా పేర్కొనలేదు. అయితే గురువారం ట్రేడ్ కోర్టు ఇచ్చిన తీర్పుతో రీఫండ్ విషయంలో స్పష్టత వచి్చనట్లయింది.
ధరల మోత.. వంటనూనెలు మొదలు ఔషధాల దాకా
ఇరాన్పై అమెరికా దాడిచేస్తే బదులుగా ఇరాన్.. సౌదీ, బహ్రెయిన్, ఖతార్ సహా పలు గల్ఫ్ దేశాలపై బాంబులేస్తోంది. సుదూరంగా ఉన్న భారత్పై బాంబులు పడకపోయినా ధరల బాంబులు పడొచ్చన్న విశ్లేషణలు ఇప్పుడు సగటు భారతీయుని గుండెల్లో భయాందోళనలను పెంచేస్తున్నాయి. సముద్రమార్గంలో చమురు కూడలిగా పేరొందిన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఆగిపోవడంతో ముడిచమురు మొదలు పలురకాల వస్తూత్పత్తుల ధరలకు రెక్కలొచ్చే ఆస్కారముంది. తొలుత చమురు మంటలు యుద్ధం ఇలాగే కొనసాగితే మిగతా వినిమయ వస్తువులతో పోలిస్తే మొట్టమొదట ముడిచమురు, చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ద్రవరూప సహజవాయువు(ఎల్ఎన్జీ) సరఫరా ఇరాన్ నుంచి ఆగిపోయింది. సౌదీ అరేబియాలోని రస్ తనూరా రిఫైనరీ నుంచి భారత్కు సరఫరా భారీగా తగ్గింది. దీంతో ఫిబ్రవరి నుంచి చమురు ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. హార్మూజ్ జలసంధికి బదులు ఆఫ్రికా ఖండంలోని ‘కేప్ ఆఫ్ గుడ్హోప్’ను చుట్టేస్తూ చమురు ఉత్పత్తులను సరఫరా చేస్తే రవాణా ఖర్చులు కలుపుకుని భారత్లో ఆయిల్ ధరలు పెరగడం ఖాయం. వంటనూనె మరింత ధర.. భారత్ వంటనూనెల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. పామాయిల్ ఎక్కువగా ఇండోనేసియా, మలేసియా నుంచి వస్తోంది. అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ నూనె, రష్యా, ఉక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు నూనె దిగుమతి అవుతున్నాయి. వీటిలో కొంత సరుకు హార్మూజ్ జలసంధి గుండా వస్తోంది. రవాణా గొలుసు తెగిపోవడంతో ధరలు కట్టలు తెంచుకోవచ్చని ‘సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా చెప్పారు. ఇప్పటికే వంటనూనెల ధరలు పెరగడం ఆరంభమైంది. కేంద్రప్రభుత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం మార్చి రెండో తేదీ ధరలతో పోలిస్తే మార్చి మూడో తేదీన సన్ఫ్లవర్, సోయా, పామాయిల్ నూనెల రిటైల్ ధరలు ఒకటి నుంచి మూడు రూపాయలు పెరిగాయి. పప్పులూ మరింత ప్రియం.. పప్పుల ధరలు పెరిగే వీలుందని ‘ఆల్ ఇండియా దాల్ మిల్ అసొసియేషన్’అధ్యక్షుడు సురేశ్ అగర్వాల్ చెప్పారు. మయన్మార్, కెనడా, ఆఫ్రికాల నుంచి భారత్ ఏటా దాదాపు 60 లక్షల టన్నుల కందులు, మినుములు సహా పలు రకాల పప్పులను దిగుమతిచేసుకుంటోంది. ‘‘ఇరాన్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్ అత్తిపండు, బాదం, పిస్తా, ఖర్జూరా, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, అప్రికాట్లను దిగుమతి చేసుకుంటోంది. పాకిస్తాన్తో ఘర్షణ వాతావరణం కారణంగా ఇప్పుడు ఇరాన్, అఫ్గాన్ల నుంచి పాక్కు, అక్కడి నుంచి వాఘా సరిహద్దు గుండా భారత్కు సరుకు రావట్లేదు. సముద్రమార్గంలో వస్తోంది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు సముద్రమార్గం మూసేయడంతో డ్రై ఫ్రూట్స్ సరుకు రావడం దాదాపు ఆగిపోయినట్లే. ధరలు పెరిగే వీలుంది’’అని ‘ముంబై డ్రై ఫ్రూట్, డేట్ మర్చంట్స్ అసోసియేషన్’అధ్యక్షుడు విజయ్ భూటా చెప్పారు. ఎరువులు, సాగు ఉత్పత్తుల రాక సైతం తగ్గిపోయిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానాల రాకపోకలు తగ్గడంతో కార్గో రవాణా పరిమాణం కుచించుకుపోయింది. ఇతర దేశాల మీదుగా విమానాలు తిరిగి రావడంతో అంతర్జాతీయ ప్రయాణికులకు టికెట్ అధిక చార్జీల మోత మోగుతోంది. ప్లాస్టిక్ సైతం.. ముడిచమురు నుంచే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ను తయారుచేస్తారు. ముడిచమురు సరఫరా తగ్గడంతో గత రెండు రోజుల్లోనే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ధర 12 శాతం ఎగసింది. దీంతో ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తుల ధరలు సైతం పైపైకి పోవడం ఖాయంగా కని్పస్తోంది. ఔషధాలదీ అదే బాట... ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి సరుకులైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్(ఏపీఐ) కోసం భారత్ ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. కానీ అత్యంత ఖరీదైన కీ స్టారి్టంగ్ మెటీరియల్స్(కేఎస్ఎం) కోసం ఎక్కువగా ఐరోపా దేశాలపై ఆధారపడుతోంది. యూరప్ నుంచి కేఎస్ఎం సరుకు హార్మూజ్ ద్వారానే రావాల్సి ఉంది. ఇవి తగ్గిపోవడంతో భారత్లో సంక్లిష్ట జనరిక్ మందులతోపాటు సైడ్ ఎఫెక్ట్లను తగ్గించే ‘విలువ జోడింపు ఔషధా(వీఏఎం)’ల తయారీ ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. వీటికితోడు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి మారకం విలువ పతనమవుతుండటంతో పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు మరింత ప్రియంకానున్నాయి. ఇవన్నీ కలసి సగటు భారతీయుని జేబుకు పెద్ద చిల్లు పెడతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
నేడు థియేటర్లలోకి ఒకేసారి 10 సినిమాలు.. బాక్సాఫీస్కు ఊపిరి పోస్తాయా?
తెలుగు రాష్ట్రాల్లో గత వారం నుంచి థియేటర్లు పెద్దగా సందడిగా కనిపించడం లేదు. ఇటీవల విడుదలైన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో చాలా థియేటర్లలో ఖాళీ సీట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్కు ఊపిరి పోయేలా ఈ శుక్రవారం ఒకేసారి దాదాపు 10 సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా చిన్న చిత్రాలే ఉండటం విశేషం. పెద్దగా బజ్ లేకుండానే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో కొంతమేరకు ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం మృత్యుంజయ. హీరో శ్రీ విష్ణు ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. గత వారం విష్ణు విన్యాసంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, ఈ వీకెండ్ మృత్యుంజయతో మరోసారి థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ సినిమా సాధారణ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ఉంటుందని, ఇందులో కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కంటే థ్రిల్లింగ్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథగా ఈ చిత్రం తెరకెక్కిందని తెలిపారు.మరో చెప్పుకోదగ్గ సినిమా సరస్వతి. ఈ చిత్రాన్ని నటి వరలక్ష్మీ శరత్కుమార్ స్వయంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. అంతేకాదు ఈ సినిమాను ఆమెనే నిర్మించారు. ప్రముఖ రచయిత బుర్రా సాయి మాదవ్ కథ అందించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. కథ బలంగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.ఇవే కాకుండా సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని అనే చిత్రం కూడా ఈ వారం విడుదలవుతోంది. ఇందులో శివాజీ , లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కామెడీ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను మొదట ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. కానీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.ఇవి కాకుండా కాన, మాన్షన్ హౌజ్ మల్లేష్, కాక్రోచ్, విధాత వంటి మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ వారం థియేటర్లలోకి వస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ నటించిన మున్నా సినిమాను రీ-రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నటి లావన్య త్రీపాఠి ప్రధాన పాత్రలో నటించిన సతీ లీలావతి సినిమా మాత్రం చివరి నిమిషంలో వాయిదా పడింది. మొత్తానికి పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ ఒకేసారి పది సినిమాలు విడుదలవుతుండటంతో ఈ వారం బాక్సాఫీస్లో కొంత కదలిక కనిపిస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ప్రేక్షకులు ఈ సినిమాలను ఎలా స్వీకరిస్తారో చూడాలి.
ఆ విమానం ఎక్కడ?.. ఆచూకీ కోసం ముమ్మర గాలింపు
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ చిచ్చరపిడుగు
'ఉస్తాద్ భగత్సింగ్' ఫ్యాన్స్కు షాకిస్తున్న బుక్మైషో
డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ
ఇరాన్, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన
మీ మైండ్ మీకు అబద్ధాలు చెప్తోందా?
రీల్స్ పేరుతో ఇలాంటి ఫోటోలా.. రుక్మిణి వసంత్ ఫైర్
ఎన్నికల్లో నా పాత్ర ఉండాల్సిందే.. ఇరాన్పై ట్రంప్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా సంక్షోభానికి తక్షణం ముగింపు పలకాలి
మార్క్ 48.. నిశ్శబ్ద మృత్యువు
బ్లాక్బస్టర్ 'గీత గోవిందం'ను మిస్ చేసుకున్నా: హీరోయిన్
దుస్తులు విప్పి చూపినా సెలవు ఇవ్వలేదు..!
బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!
బాంబుల మోత మధ్య సౌదీ సర్కారు శుభవార్త
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
మొయిన్ అలీపై నిషేధం..!
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న నాయకుడి పాలనలో ఉన్నాం!
దుబాయ్ దాటని బంగారం..
T20 WC 2026: బాబర్ ఆజం ఎందుకు?.. తొలి రాజీనామా
అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం.. ఐసీసీ టోర్నీ వాయిదా
T20 WC 2026: తిరగబడ్డ పాక్ క్రికెటర్లు!.. ఇక..
విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా
పావలా శ్యామలకు అల్లు అర్జున్ సాయం
ఎక్కువ ఈఎంఐతో ఇల్లు కొంటున్నారా? ఎంత రిస్కో చూడండి..
ఒకప్పుడు క్లాస్ టాపర్..కానీ ఇవాళ..!
నాకంటూ పెద్దగా ఆస్తుల్లేవ్.. అద్దింట్లో ఉంటున్నా: వరలక్ష్మి
IND vs ENG: సెమీస్లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. స్థిరాస్తి లాభం
ఆ విమానం ఎక్కడ?.. ఆచూకీ కోసం ముమ్మర గాలింపు
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ చిచ్చరపిడుగు
'ఉస్తాద్ భగత్సింగ్' ఫ్యాన్స్కు షాకిస్తున్న బుక్మైషో
డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ
ఇరాన్, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన
మీ మైండ్ మీకు అబద్ధాలు చెప్తోందా?
రీల్స్ పేరుతో ఇలాంటి ఫోటోలా.. రుక్మిణి వసంత్ ఫైర్
ఎన్నికల్లో నా పాత్ర ఉండాల్సిందే.. ఇరాన్పై ట్రంప్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా సంక్షోభానికి తక్షణం ముగింపు పలకాలి
మార్క్ 48.. నిశ్శబ్ద మృత్యువు
బ్లాక్బస్టర్ 'గీత గోవిందం'ను మిస్ చేసుకున్నా: హీరోయిన్
దుస్తులు విప్పి చూపినా సెలవు ఇవ్వలేదు..!
బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!
బాంబుల మోత మధ్య సౌదీ సర్కారు శుభవార్త
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
మొయిన్ అలీపై నిషేధం..!
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న నాయకుడి పాలనలో ఉన్నాం!
దుబాయ్ దాటని బంగారం..
T20 WC 2026: బాబర్ ఆజం ఎందుకు?.. తొలి రాజీనామా
అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం.. ఐసీసీ టోర్నీ వాయిదా
T20 WC 2026: తిరగబడ్డ పాక్ క్రికెటర్లు!.. ఇక..
విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా
పావలా శ్యామలకు అల్లు అర్జున్ సాయం
ఎక్కువ ఈఎంఐతో ఇల్లు కొంటున్నారా? ఎంత రిస్కో చూడండి..
ఒకప్పుడు క్లాస్ టాపర్..కానీ ఇవాళ..!
నాకంటూ పెద్దగా ఆస్తుల్లేవ్.. అద్దింట్లో ఉంటున్నా: వరలక్ష్మి
IND vs ENG: సెమీస్లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. స్థిరాస్తి లాభం
ఫొటోలు
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్ (ఫొటోలు)
నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
వైఎస్ జగన్ ప్రొద్దుటూరు పర్యటన (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా వివాహంలో క్రికెట్, సినీ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
భద్రాచలం : రామయ్య పెళ్లి పసుపు దంచి.. తలంబ్రాలు కలిపి పెళ్లి పనులు ప్రారంభం (ఫొటోలు)
విశాఖలో వైఎస్ జగన్.. పోటెత్తిన అంతులేని అభిమానం (ఫొటోలు)
విరోష్ జంట రిసెప్షన్లో ప్రముఖుల సందడి (ఫోటోలు)
#Virosh Reception: ఘనంగా విజయ్- రష్మిక రిసెప్షన్ (ఫోటోలు)
'పీలింగ్స్..' పాటకు స్టెప్పులేసిన అనసూయ (ఫోటోలు)
సినిమా
మృత్యుంజయ్ని ఎంజాయ్ చేస్తారు: శ్రీ విష్ణు
‘‘మృత్యుంజయ్’ మూవీ ప్రీమియర్ షోకి వచ్చిన వారి స్పందన చూశాను. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు. రాజమౌళిగారి నుంచి మా సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయింది. ఎన్టీఆర్గారు ట్రైలర్ రిలీజ్ చేశారు. నానీగారు మా మూవీ చూసి, మెచ్చుకున్నారు. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని హీరో శ్రీ విష్ణు తెలిపారు.హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన చిత్రం ‘మృత్యుంజయ్’. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా చిత్రాన్ని ప్రదర్శించారు.అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో శ్రీ విష్ణుగారు రి΄ోర్టర్గా నటించారు. రెబా మోనికా పోలీస్ ఆఫీసర్గా చేశారు’’ అని చె΄్పారు. ‘‘ఈ మూవీ కోసం మా టీమ్ నిద్రలేని రాత్రులు గడిపి, పని చేసింది. సినిమా అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు సందీప్ గుణ్ణం. ‘‘ఈ సినిమా పట్ల మేం ఎంతో గర్వంగా ఉన్నాం’’ అన్నారు రెబా మోనికా జాన్. నటీనటులు మనీషా ఎ. దత్, రమ్య, సుదర్శన్, అయ్యప్ప శర్మ, రచ్చ రవి మాట్లాడారు.
లీడర్ ప్రతీకారం
శరవణన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘లీడర్’. పాయల్ రాజ్పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. లెజెండ్ శరవణ స్టోర్స్ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కానుంది.తాజాగా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘నా కూతురితో పాటే నేనుండాలి. దాని కోసం ఈ ప్రపంచాన్నే ఎదరించమన్నా ఎదిరించి గెలుస్తాను’ వంటి సంభాషణలు టీజర్లో ఉన్నాయి. ‘‘తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే శక్తివేల్ పాత్రలో శరవణన్ నటించారు. మాస్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆలరించేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది.
నేడు థియేటర్లలోకి ఒకేసారి 10 సినిమాలు.. బాక్సాఫీస్కు ఊపిరి పోస్తాయా?
తెలుగు రాష్ట్రాల్లో గత వారం నుంచి థియేటర్లు పెద్దగా సందడిగా కనిపించడం లేదు. ఇటీవల విడుదలైన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో చాలా థియేటర్లలో ఖాళీ సీట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్కు ఊపిరి పోయేలా ఈ శుక్రవారం ఒకేసారి దాదాపు 10 సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా చిన్న చిత్రాలే ఉండటం విశేషం. పెద్దగా బజ్ లేకుండానే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో కొంతమేరకు ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం మృత్యుంజయ. హీరో శ్రీ విష్ణు ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. గత వారం విష్ణు విన్యాసంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, ఈ వీకెండ్ మృత్యుంజయతో మరోసారి థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ సినిమా సాధారణ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ఉంటుందని, ఇందులో కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కంటే థ్రిల్లింగ్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథగా ఈ చిత్రం తెరకెక్కిందని తెలిపారు.మరో చెప్పుకోదగ్గ సినిమా సరస్వతి. ఈ చిత్రాన్ని నటి వరలక్ష్మీ శరత్కుమార్ స్వయంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. అంతేకాదు ఈ సినిమాను ఆమెనే నిర్మించారు. ప్రముఖ రచయిత బుర్రా సాయి మాదవ్ కథ అందించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. కథ బలంగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.ఇవే కాకుండా సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని అనే చిత్రం కూడా ఈ వారం విడుదలవుతోంది. ఇందులో శివాజీ , లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కామెడీ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను మొదట ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. కానీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.ఇవి కాకుండా కాన, మాన్షన్ హౌజ్ మల్లేష్, కాక్రోచ్, విధాత వంటి మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ వారం థియేటర్లలోకి వస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ నటించిన మున్నా సినిమాను రీ-రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నటి లావన్య త్రీపాఠి ప్రధాన పాత్రలో నటించిన సతీ లీలావతి సినిమా మాత్రం చివరి నిమిషంలో వాయిదా పడింది. మొత్తానికి పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ ఒకేసారి పది సినిమాలు విడుదలవుతుండటంతో ఈ వారం బాక్సాఫీస్లో కొంత కదలిక కనిపిస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ప్రేక్షకులు ఈ సినిమాలను ఎలా స్వీకరిస్తారో చూడాలి.
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష.. వీడియో వైరల్
కోలీవుడ్ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్, త్రిష కలిసి ఒక పెళ్లి వేడుకకు తాజాగా హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో వారిద్దరూ సరదాగ పలకరించుకున్నారు. వీరిద్దరి గురించి కొద్దిరోజుల క్రితం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముందుగా త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలని, తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కొద్దిరోజల గ్యాప్లోనే విజయ్ సతీమణి సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. విజయ్ మరో మహిళతో సాన్నిహిత్యంగా ఉన్నారని అందుకే విడాకులు కావాలంటూ పేర్కొంది. అయితే, ఈ కథలో త్రిష పేరు ప్రధానంగా వైరల్ అయింది. ఇప్పుడు విజయ్, త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక పెళ్లికి వెళ్లడంతో వీడియో వైరల్ అవుతుంది.#Thalapathy @TVKVijayHQ President #Vijay and #Trisha attend #KalpathiSSuresh - #MeenakshiSuresh 's son wedding reception @actorvijay @trishtrashers pic.twitter.com/iQOQet9Z0A— Nikil Murukan (@onlynikil) March 5, 2026
క్రీడలు
క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత నంబర్వన్ లక్ష్య సేన్ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ షి యుకీ (చైనా)ను బోల్తా కొట్టించిన లక్ష్య సేన్... ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 29వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 81 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–19, 21–23, 21–10తో గెలుపొందాడు. గతంలో లాంగ్ అంగుస్తో ఆడిన మూడుసార్లూ ఓడిపోయిన లక్ష్య సేన్ నాలుగో ప్రయత్నంలో విజయం అందుకోవడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)తో ఆడతాడు. టాంగ్ చున్ మన్–సె యింగ్ సుయెట్ (హాంకాంగ్)లతో జరిగిన మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో తొలి గేమ్ను 19–21తో కోల్పోయారు. రెండో గేమ్లో 8–9తో వెనుకబడిన దశలో భారత జోడీ గాయంతో వైదొలిగింది.
నరాలు తెగే ఉత్కంఠ: టీమిండియా ధనాధన్ షో.. .. దర్జాగా ఫైనల్కు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా ఫైనల్కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్లో విజేతగా నిలిచిన భారత్.. ఈసారి కూడా ఫైనల్కు చేరి సత్తా చాటింది.253 పరుగులుముంబైలోని వాంఖడేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి ధనాధన్ దంచికొట్టాడు. 42 బంతుల్లో 89 పరుగులతో ఈ వికెట్ కీపర్బ్యాటర్ అదరగొట్టాడు.వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39) కూడా వేగంగా ఆడగా.. ఆల్రౌండర్లు శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపులు మెరిపించారు. తిలక్ వర్మ (7 బంతుల్లో 21) సైతం రాణించాడు.ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్కు ఒక వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ (5), వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ (7) వికెట్లు కోల్పోయింది.పట్టువదలని విక్రమార్కుడిలాఇక టామ్ బాంటన్ (17) కాసేపు నిలబడగా.. జోస్ బట్లర్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా జేకబ్ బెతెల్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో పాతుకుపోయాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం బాది.. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) రికార్డు సమం చేశాడు.నరాలు తెగే ఉత్కంఠఅదే జోరు కొనసాగిస్తూ బెతెల్ భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లలో ఇంగ్లండ్ విజయ సమీకరణం 39 పరుగులుగా మారింది.అయితే, హార్దిక్ పాండ్యా బౌలింగ్లో పందొమ్మిదో ఓవర్లో సిక్స్ బాది బెతెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 బంతుల్లోనే 102 పరుగులు సాధించాడు. దీంతో ఉత్కంఠ పెరిగింది. అయితే, పాండ్యా మూడో బంతికి సామ్ కర్రాన్ (18)ను అవుట్ చేశాడు. పాండ్యా బౌలింగ్లో కర్రాన్ బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ అద్భుతంగా క్యాచ్పట్టాడు.ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోతన ఓవర్లో పాండ్యా 9 పరుగులే ఇవ్వగా.. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ గెలుపునకు 30 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతిని శివం దూబేకు ఇచ్చాడు. అతడి ఓవర్లో తొలి బంతికే బెతెల్ (105) రనౌట్ అయ్యాడు. దీంతో ఐదు బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లండ్ 22 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టీమిండియా ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆర్చర్ ఆఖరి మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టినా లాభం లేకుండా పోయింది. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్తో ట్రోఫీ కోసం సూర్యకుమార్ సేన తలపడుతుంది.స్కోర్లు: భారత్ - 253/7(20)ఇంగ్లండ్ - 246/7(20)ఫలితం: ఏడు పరుగుల తేడాతో భారత్ గెలుపు.
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు
టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత సాధించింది. పురుషుల పొట్టి ఫార్మాట్లో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.జింబాబ్వేపై 256 పరుగులుభారత జట్టు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సూపర్-8 దశలో జింబాబ్వేపై 256 పరుగులు సాధించిన భారత జట్టు.. తాజాగా గురువారం నాటి మ్యాచ్లోనూ 250కి పైగా స్కోరు నమోదు చేసింది.పొట్టి క్రికెట్లో తొలి జట్టుగాముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 82) అదరగొట్టగా.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27), తిలక్ వర్మ (7 బంతుల్లో 21) మెరుపులు మెరిపించారు.Another must-win game, another Sanju Samson masterclass! 🔥His maiden T20I fifty against England and what an occasion to bring it up! 👏ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/1csgOPterB— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఫలితంగా టీమిండియాకు ఈ మేర 253 పరుగుల స్కోరు సాధ్యమైంది. ఈ క్రమంలోనే పొట్టి క్రికెట్లో అత్యధిక సార్లు 250 ప్లస్ స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. తద్వారా ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 250కి పైగా పరుగులు సాధించిన జట్లు👉టీమిండియా- ఆరు సార్లు👉సన్రైజర్స్ హైదరాబాద్- ఐదు సార్లు👉వెస్టిండీస్- మూడు సార్లు👉జింబాబ్వే- మూడు సార్లు👉సర్రే- మూడు సార్లు.చదవండి: IND vs ENG: సెమీస్లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి!
పాకిస్తాన్ క్రికెట్లో కీలక పరిణామం.. ఈసారి..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. సెలక్టర్ పదవికి అలీం దర్ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో ఇద్దరిని సెలక్షన్ కమిటీలో చేర్చింది. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాకిస్తాన్ జట్టు విఫలమైన విషయం తెలిసిందే.సెమీ ఫైనల్ చేరకుండానేగ్రూప్ దశలో ఫర్వాలేదనిపించిన సల్మాన్ ఆఘా బృందం.. సూపర్-8లో మాత్రం చేతులెత్తేసింది. ఫలితంగా సెమీ ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై.. ముఖ్యంగా సీనియర్లు బాబర్ ఆజం (Babar Azam), షాబాద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిదిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.అలీం దర్ రాజీనామాఈ క్రమంలో సెలక్టర్, మాజీ అంపైర్ అలీం దర్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. శ్రీలంకలో తమ మ్యాచ్ల దృష్ట్యా హెడ్కోచ్ మైక్ హసన్ (Mike Hesson), మరో సెలక్టర్ ఆకిబ్ జావేద్ బాబర్, షాదాబ్లను ఆడించాలని పట్టుపట్టగా.. అలీం మాత్రం వ్యతిరేకించినట్లు సమాచారం.అంతేకాదు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ను ఎంపిక చేయాలని అలీం వాదించగా.. మిగతా వారు అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలతో నొచ్చుకున్న అలీం దర్ తన పదవికి రాజీనామా చేశాడు.సెలక్టర్లు మాజీ కెప్టెన్లు ఈ నేపథ్యంలో పీసీబీ ఇద్దరిని జాతీయ సెలక్షన్ కమిటీలో చేర్చింది. మాజీ కెప్టెన్లు మిస్బా ఉల్ హక్, సర్ఫరాజ్ అహ్మద్లకు మెన్స్ సెలక్షన్ కమిటీలో చోటు ఇచ్చింది. కాగా ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్లతో కలిసి వీరిద్దరు సెలక్టర్లుగా పనిచేయనున్నారు. కాగా అలీం దర్ గతేడాది అక్టోబరులో పాక్ పురుషుల జట్టు కెప్టెన్గా వచ్చాడు. అయితే, హెడ్కోచ్ మైక్ హసన్ అతి జోక్యం, ఆకిబ్ జావేద్ అతడికే వంతపాడిన నేపథ్యంలో విసుగు చెంది రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా జియో సూపర్ వెల్లడించింది.గతంలో ఇలా..ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్ అహ్మద్ గతంలో పాకిస్తాన్ అండర్-19 జట్టు పాక్ షాహీన్స్కు మెంటార్గా వ్యవహరించాడు. మరోవైపు.. మిస్బా ఉల్ హక్ గతంలో పాక్ జట్టు హెడ్కోచ్గా, చీఫ్ సెలక్టర్గా బాధ్యతలే నిర్వర్తించాడు. అంతేకాదు.. పీసీబీ క్రికెట్ టెక్నికల్ కమిటీలో సభ్యుడిగానూ సేవలు అందించాడు. ఇప్పుడు మరోసారి సెలక్టర్గా తిరిగి వచ్చాడు. ఇక బాబర్, షాదాబ్ విఫలమైన సంగతి తెలిసిందే. చదవండి: T20 WC 2026: రషీద్ ఖాన్పై వేటు.. అఫ్గనిస్తాన్కు కొత్త కెప్టెన్
న్యూస్ పాడ్కాస్ట్
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్. సెమీస్లో 7 పరుగులతో ఇంగ్లండ్పై గెలుపు
హాజరైన సెలబ్రిటీలు... విరోష్ రిసెప్షన్ కు
‘లడ్డూ’పై బాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. శాసన మండలిలో చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు
స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెద్ది
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలపై ఆటవిక దాడి... మహిళా దినోత్సవ వేళ చంద్రబాబు మార్కు గిఫ్ట్
తీవ్రరూపం దాలుస్తున్న పశ్చిమాసియా యుద్ధం... ఇరాన్కు అండగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు...
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. కుటుంబ సభ్యులతోపాటు ఆర్మీ చీఫ్ ముసావీ కూడా మృతి... క్షిపణి దాడుల్లో హత్య చేసిన ఇజ్రాయెల్
భగ్గుమన్న పశ్చిమాసియా... ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు... భారీగా ప్రతిదాడులకు దిగిన ఇరాన్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు క్లీన్చిట్... కవిత, సిసోడియా సహా 23 మందీ నిర్దోషులే... ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
తిరుమల లడ్డూ ప్రసాదం, రాయలసీమ లిఫ్ట్పై ఏపీ శాసన మండలిలో చర్చించకుండా పలాయనం చిత్తగంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం
బిజినెస్
రియల్మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. ‘పవర్’ఫుల్ బ్యాటరీతో..
స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మీ తన నార్జో సిరీస్లో కొత్తగా రియల్మీ నార్జో పవర్ 5జీ (Realme Narzo Power 5G) స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.ఈ స్మార్ట్ఫోన్లో ప్రధాన ఆకర్షణ 10,001mAh భారీ బ్యాటరీ. సాధారణ స్మార్ట్ఫోన్లతో పోలిస్తే ఎక్కువసేపు వినియోగానికి ఇది సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, రోజువారీ వినియోగం ఎక్కువగా చేసే వారికి ఈ డివైజ్ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.ధర, లభ్యతరియల్మీ నార్జో పవర్ 5G స్మార్ట్ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఒకటి కాగా మరొకటి 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్. అలాగే ఈ ఫోన్ టైటాన్ సిల్వర్, టైటాన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ప్రారంభ విక్రయంలో దీని ధర రూ.23,999 నుంచి మొదలవుతుంది.మార్చి 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత అమెజాన్, రియల్మీ అధికారిక వెబ్సైట్లో విక్రయాలు ప్రారంభమవుతాయి. బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో కలిపి కంపెనీ రూ.3,999 వరకు బండిల్ బెనిఫిట్లు అందిస్తోంది. అదనంగా 4 సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా ఇస్తోంది.ప్రధాన ఫీచర్లుఈ ఫోన్లోని 10,001mAh బ్యాటరీని సిలికాన్ యానోడ్ టెక్నాలజీతో రూపొందించారు. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ బరువు సుమారు 219 గ్రాములు మాత్రమే ఉండేలా రూపొందించారు.80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్: కేవలం 36 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. అలాగే 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ను ఉపయోగించారు. 8GB ర్యామ్తో పాటు ప్రత్యేక AI ప్రాసెసింగ్ చిప్ కూడా ఉంది. ఇది గేమింగ్ సమయంలో స్థిరమైన పనితీరును అందించడంలో సహాయపడుతుందని కంపెనీ చెబుతోంది.డిస్ప్లే విషయానికి వస్తే ఫోన్ ముందుభాగంలో 144Hz రిఫ్రెష్ రేట్తో హైపర్గ్లో 4డీ కర్వ్+ అమోల్డ్ డిస్ప్లే అందించారు. ఇది 1.07 బిలియన్ రంగులను సపోర్ట్ చేస్తుంది. గరిష్టంగా 6500 నిట్స్ బ్రైట్నెస్ ఇస్తుంది.
అమెజాన్లో మరోమారు లేఆఫ్స్!
దిగ్గజ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ మరోమారు లేఆఫ్స్ ప్రకటించింది. ఈ ప్రభావం రోబోటిక్స్ యూనిట్లోని సుమారు 100 మంది ఉద్యోగులపై పడింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే.. సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.2026 జనవరిలో కూడా అమెజాన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 16,000 ఉద్యోగాలను తొలగించింది. ఏఐకి అప్డేట్ అవుతున్న నేపథ్యంలో భారీ ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. కాగా ఇప్పుడు రెండు నెలలు కూడా గడవకముందే.. మరోమారు లేఆఫ్స్ ప్రకటించింది. 2022 నుంచి కంపెనీ దాదాపు 57వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.గత సంవత్సరం చివరి నాటికి.. అమెజాన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.58 మిలియన్ల మందికి ఉపాధి కల్పించింది. ఎక్కువ మంది గిడ్డంగి & లాజిస్టిక్స్ విభాగాలలో ఉన్నారు. అయితే ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీ.. ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపింది. రానున్న రోజుల్లో కూడా ఏఐ కారణంగా మరింతమంది జాబ్స్ కోల్పొయే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా.
పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో భారీ నష్టాలు?
దేశంలోని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క లీటర్ ఇంధన విక్రయంపై సుమారు రూ.20 వరకు నష్టం వాటిల్లుతున్నట్టు తెలుస్తోంది.ప్రభుత్వ రంగ దిగ్గజాలు అయిన ఐఓసీఎల్ (Indian Oil Corporation), హెచ్పీసీఎల్ (Hindustan Petroleum Corporation Limited), బీపీసీఎల్ (Bharat Petroleum Corporation Limited) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.మార్జిన్లపై ప్రతికూల ప్రభావంస్థూల మార్కెటింగ్ మార్జిన్ అంటే ఇంధనాల రిటైల్ విక్రయ ధర, వాటిని కొనుగోలు చేసి వినియోగదారులకు అందించే వరకు అయ్యే మొత్తం ఖర్చు మధ్య వ్యత్యాసం. ప్రస్తుతం ఈ మార్జిన్ ప్రతికూలంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, అదే సమయంలో రూపాయి బలహీనపడటం ఓఎంసీలపై ద్వంద్వ ప్రభావాన్ని చూపుతున్నాయి.రూపాయి పతనం, క్రూడ్ ధరల పెరుగుదలఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ సుమారు 2 శాతం తగ్గింది. మరోవైపు బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 33 శాతం పెరిగి 80 డాలర్లకు పైగా చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్లో హెచ్సీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ షేర్లు గణనీయంగా పడిపోయాయి.క్రూడ్ ధరల పెరుగుదలతో లాభాల క్షీణతచమురు మార్కెటింగ్ కంపెనీల లాభదాయకత సాధారణంగా అంతర్జాతీయ క్రూడ్ ధరలకు విలోమంగా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 1 డాలర్ పెరిగితే, ఈ సంస్థల స్థూల మార్కెటింగ్ మార్జిన్ లీటరుకు సుమారు రూ.0.5 వరకు తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.క్రూడ్ ధరలు బ్యారెల్కు 80 డాలర్లకు మించి కొనసాగితే, మార్జిన్లు లీటరుకు సుమారు రూ.3.5 వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది కంపెనీల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు ఈ వారం ప్రారంభంలోనే పెరిగాయి. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త వైమానిక దాడులు జరిపిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.ఇరాన్ కీలక చమురు ఉత్పత్తి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం, అలాగే హార్మూజ్ జలసంధిలో నౌకల రవాణాను అడ్డుకుంటామని హెచ్చరించడం ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళనలను పెంచింది.భారత దిగుమతులపై ప్రభావం?భారత్ రోజుకు సుమారు 2.5–2.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశ మొత్తం చమురు దిగుమతుల్లో సగానికి పైగా వాటా కలిగి ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు కొనసాగితే దేశీయ చమురు మార్కెట్పై మరింత ఒత్తిడి పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మార్కెట్లకు జోష్.. భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 811.21 పాయింట్లు (1.03 శాతం) పెరిగి 79,927.40 వద్ద, నిఫ్టీ 285.40 పాయింట్లు (1.17 శాతం) పెరిగి 24,765.90 వద్ద నిలిచాయి.ఎల్గీ రబ్బర్ కంపెనీ లిమిటెడ్, మోడరన్ థ్రెడ్స్ (ఇండియా) లిమిటెడ్, సెంచరీ ఎక్స్ట్రూషన్స్ లిమిటెడ్, ఆకాష్ ఎక్స్ప్లోరేషన్ సర్వీసెస్ లిమిటెడ్, ఇంటిగ్రే ఎసెన్షియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అక్విలాన్ నెక్సస్ లిమిటెడ్, పిఎన్జిఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్, ఆర్చాస్ప్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.స్టాక్ మార్కెట్స్ పెరగడానికి కారణంభారతీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం.. ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ వదిలివేయడానికి కొన్ని షరతులతో సిద్ధంగా ఉందని వదంతులు రావడమే. దీంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చని భావించి పెట్టుబడిదారులు మార్కెట్లో కొనుగోళ్లు పెంచారు.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
ఫ్యామిలీ
ముళ్లున్న చోటే పూలు
కుటుంబం సవ్యంగా సాగుతున్నప్పుడు మధ్యలో అనుకోకుండా ఎదురయ్యే కుదుపులు సమస్యలను సృష్టిస్తాయి. వాటినుంచి బయటపడడంలోనే మన జీవన పోరాటం దాగి ఉంటుంది. నల్గొండ జిల్లా దుగ్గపల్లికి చెందిన కర్ర శశికళ జీవితంలోనూ ఇదే జరిగింది. రెండు దశాబ్దాల క్రితం భర్త ఆకస్మిక మరణంతో ఆమెను శూన్యం ఆవరించింది. కానీ, సమస్యకు ఎదురొడ్డి తను కష్టాల నుంచి బయటపడటమే కాదు, తన చుట్టూ ఉన్నవారికి ఉపాధి అవకాశాలనూ కల్పించింది. ఈ సందర్భంగా శశికళతో మాట్లాడినప్పుడు ఆమె పంచుకున్న విశేషాలు ఇవి.‘‘మనం ఒకటి అనుకుంటాం. కానీ, విధి మరొకటి తలుస్తుంది అంటారు. అందుకు నా జీవితమే ఉదాహరణ అనిపిస్తుంది. నాకు పల్లెటూరు, పొలాలు కన్నా పట్టణ జీవితం అంటేనే ఇష్టం ఉండేది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా పెళ్లయ్యింది. మా వారు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. ఇద్దరం మిర్యాలగూడ టౌన్లో ఉండేవాళ్లం. మాకు ఒక బాబు. పెళ్లయ్యాక పీజీ, తర్వాత బీఇడీ చేశాను. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి సమయంలో మా వారు వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో ఊరికి వెళ్లిపోదాం అన్నారు. కానీ, పల్లెటూరుకు వెళ్లడం నాకు అస్సలు ఇష్టం లేదు. దీంతో కొంతమంది స్నేహితులతో కలిసి వ్యాపారం మొదలుపెట్టారు. అందులో పెద్ద నష్టం. అప్పుల్లో కూరుకుపోయాం. ఇది చాలదన్నట్టు ఆయన ఆరోగ్యం క్షీణించింది. పరీక్షలు చేయిస్తే గుండె సంబంధిత వ్యాధి అని తేలింది. ఆసుపత్రులు, చెకప్లు అంటూ తిరుగుతుండగానే ఆయన వెళ్లిపోయారు. పూర్తిగా డిప్రెషన్ ఆవరించింది. ఆరునెలలైనా మామూలు మనిషిని కాలేకపోయాను. చనిపోదాం అనుకున్నాను. అలాంటి సమయంలో అమ్మనాన్నలు, తోడబుట్టినవాళ్లు అండగా నిలిచారు.నచ్చని వ్యవసాయాన్నే ఎంచుకున్నాను..నా భర్త కల వ్యవసాయం చేయాలని. కానీ, అప్పటికి మాకు ఆస్తి ఎంత ఉందో, అంతకుమించి అప్పు ఉంది. ఏం చేయాలా అనుకుంటున్న సమయంలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ‘ఉన్న ఆస్తులు అమ్మేసి అప్పు తీర్చేసి, ఉద్యోగం చేసుకుంటూ బతుకుదామా..’ అని ఆలోచించాను. కానీ, ఉద్యోగాన్నే వదులుకున్నాను. నా భర్త కల నెరవేరాలంటే వ్యవసాయమే సరైనది అనుకున్నాను. ఆ రంగంలో ఓనమాలు కూడా తెలియవు. ప్రతీది నేర్చుకుంటూ, రాణిస్తున్నాను. అగ్రికల్చర్ లోను తీసుకొని, వ్యవసాయం మొదలుపెట్టాను. వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చడం ఎలా.. అని చాలా ఆలోచించేదాన్ని. మూడు వేల రూపాయలతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారుచేసి, బత్తాయి తోటను కాపాడే ప్రయత్నం చేశాను. మంచి రిజల్ట్ వచ్చింది. కొద్ది కొద్దిగా అప్పులు తీరుస్తూ వచ్చాను. ఈ రంగంలో ఇంకా ఏమైనా చేయవచ్చా అనే ఆలోచనలు చేసినప్పుడు నర్సరీ నాకు సరైన ఎంపిక అనిపించింది.నర్సరీ ఆలోచన మేలు చేసింది.. నర్సరీలలో మొక్కల పెంపకానికి చేపడుతున్న చాలా మంది ఉత్తమమైన దిగుబడులు సాధిస్తున్నారు. ఆ వైపుగా ఆలోచించాను. నర్సరీ ఏర్పాటు చేసి, చుట్టుపక్కల ఊళ్లలో రైతులకు నాణ్యమైన మొక్కలు అందించాలనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే ఉన్న పొలంలోనే నర్సరీ ఏర్పాటు చేశాను. ఈ నర్సరీలో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, అన్ని రకాల డెకార్కు సంబంధించిన మొక్కలను పెంచుతున్నాను. దీంతో పాటు తోటలకు సంబంధించిన మామిడి, బత్తాయి, జామ, నిమ్మ మొక్కలు సైతం ఆర్డర్లపై అందిస్తున్నాను. వీటికి తోడు గోవులను పెంచుతూ, వాటి ఉత్పత్తులను పంటలకు వాడుతున్నాను. కొన్నాళ్లకు మా వారి పేరు మీదుగా శ్రీ సాయి మాధవ గో సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాను. ఈ పని నాకు చాలా మెరుగైన ఫలితాలను ఇచ్చింది. మొదట్లో ఊళ్లో అందరూ నా వెనక మాట్లాడుకున్నవారే ఇప్పుడు వ్యవసాయంలో సలహాలు, సూచనలు అడుగుతుంటారు. హార్టీ కల్చర్ షోలలోనూ పాల్గొంటుంటాను. నర్సరీ, వ్యవసాయానికి ఉపయోగించే ఆర్గానిక్ ఉత్పత్తులనూ సప్లై చేస్తుంటాను. ఈ రంగంలో ఉత్తమ మహిళా రైతు అవార్డులూ అందుకున్నాను. మా అబ్బాయిని పై చదువులకోసం విదేశాలకు పంపగలిగాను. మహిళ శక్తి ఆమెకు మొదట తెలియదు. కానీ, తలుచుకుందంటే చేసి చూపగలదు. ఆ ధైర్యం, తెగువ ఆమెలో స్వాభావికంగానే ఉంటాయి’ అని వివరించింది శశికళ. ఇన్నేళ్లుగా వ్యవసాయం రంగంలో ఉన్నాను. కానీ, ఇప్పటికీ ప్రతిరోజూ ప్రకృతితో పోరాటమే. ఎప్పుడే సమస్య వస్తుందో తెలియదు. తెల్లవారకముందే నా పనులు మొదలవుతాయి. ఒకప్పుడు ఎంతమాత్రం ఇష్టం లేని పనే ఇప్పుడు నాకు ప్రాణమైంది. పచ్చని మొక్కలు, గోవులు నా ఆత్మీయ నేస్తాలు అయ్యాయి. ప్రకృతికి ఎంత ఎక్కువగా దగ్గరవ్వగలను.. అనేదే ప్రతీక్షణం ఆలోచిస్తాను. అదే ఈ రోజు నన్ను ఇలా మార్చింది అనుకుంటాను. – కర్ర శశికళ, సేంద్రియ వ్యవసాయ రైతు– నాతి రమేష్, సాక్షి, త్రిపురారం, నల్లగొండ జిల్లా
శాంతిలాంటి వాళ్లు ఎందరో..! ఏం జరిగినా..టెన్షన్గా పనికి వచ్చేయాలి..
మార్చి నెల అనగానే మహిళా దినోత్సవం అని ఠక్కున గుర్తొస్తుంది. ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉండే..అంతగా గుర్తించని శక్తిమంతమైన మహిళలు ఎందరో ఉన్నారు. ఒక్కోక్కరిని కదిలిస్తే వాళ్ల కన్నీళ్లు ఇంకిపోయేలా పడుతున్న బాధలు, వేదనలు తెలుస్తాయి. అయినా వాటన్నింటిని పంటి బిగువున పెట్టి..పనులకు వచ్చేస్తుంటారు. ఏం కాదు, ఏం జరగలేదు అన్నట్లుగా చకచక పనులు చేసుకుపోయే ఆ మహిళామూర్తుల జీవితాలు ఎందరికో ఆదర్శం..స్త్రీ శక్తికి నిదర్శనం. అలాంటి నారీమణే ఈ శాంతి. ఎవరీమె అంటే..ఆమె నాలుగిళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ.. బతుకు బండిని లాగిస్తుంటుంది. ఆమెకు ఇంట్లో ఎంత కష్టం ఎదురైనా..తప్పక పనికి టెన్షన్గా వచ్చేయాల్సిందే. ఆమె అవసరం కష్టాలు అలాంటివి. భర్త ఓ ప్రవేటు కంపెనీలో ఉద్యోగి. కొండంత ఆశలతో కుటుంబంతో సహా మహాగనగరానికి వస్తే..దేవుడి స్క్రిప్ట్ మరోలా రాసిపెట్టి ఉందామెకు. ఆమెకు ఇద్దరు పిల్లలు, కొడుకు ఆంటిజం బాధితుడు, కాగా కూతురు ఇటీవలే పదినెలల క్రితం అనుహ్యంగా ఓ ప్రమాదంలో చనిపోయింది. కూతురు చనిపోయినా కనీసం రెండు వారాల కూడా ఇంట్లో కూర్చోకుండా పనులకు వెళ్లిపోయేది. ఎందుకంటే..కొడుకు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఇంట్లో కూర్చొంటే కష్టం. గుండెల్ని పిండేసే బాధ అయినా సరే మౌనంగా పనికి రాకపోతే..నెల వచ్చేటప్పడికీ తడిసిమోపిడి అవుతాయి ఖర్చులు. ఎందుకంటే కొడుకు తన పనులు తానుచేసుకోగలగాలి, తనే కాళ్లపై నడవగలగాలి అదే శాంతి ఆకాంక్ష. అందుకోసం ట్రీట్మెంట్ తప్పనిసరి. అతని చికిత్స సెషన్కు రూ. 13000 ఖర్చు అవుతుంది. భర్త సంపాదనలో ఎనిమిదివేలు నేరుగా ఇంటి అద్దెకు వెళ్లిపోతాయి. మిగతా డబ్బులు అతడి స్కూల్ఫీజ్, ఆహారానికి, ట్రీట్మెంట్ ఖర్చు అయిపోతుంది. ఇక్కడ శాంతి హాయిగా పనులకు వెళ్లే వెసులుబాటు కూడా లేదామెకు. ఎందుకంటే కొడుకుకి అన్నం తినిపించడం దగ్గర నుంచి అన్ని తానే చూసుకోవాలి. ఆమె ఉదయం స్కూల్లో కొడుకుని దించడం నుంచి మొదలవుతుంది ఆమె రోజు. ఆ తర్వాత పనికోసం ఇళ్లకు వెళ్లి..మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేయడానికి ఇంటికి వెళ్లి..3 గంటల కల్లా కొడుకుని స్కూల్ నుంచి తీసుకువస్తుంది. ఆ తర్వాత మళ్లీ పనికోసం ఇళ్లకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా చేరుకుంటుంది. అయితే ఆ చుట్టుపక్కల వాళ్లే కాస్తచేదుడువాదోడుగా ఉంటారు. ఆమె పనికి వెళ్లినప్పుడు కొడుకు బాగోగులు వాళ్లు చూసుకుంటారు. కానీ ఇంత కష్టాన్ని, భారాన్ని మోస్తున్నా..అవేమి ఆమె కళ్లల్లో కనిపించదు, కనీసం కన్నీటి చారను బయటకు కనపడనివ్వకుండా..చకచక పనులు చేసుకుంటూ పోతున్నా ధీశాలి ఈ శాంతి. ఒక్కసారి తరచి చూస్తే ఇలాంటి శాంతి లెందరో మన సమాజంలో ఉన్నారు. వాళ్లందరికీ జోహార్లు..ఎందుకంటే పిల్లలను కోల్పోయి..మరోవైపు కుటుంబ కోసం ఆహర్నిశలు కొవ్వుత్తిలా కరిగిపోతూ..ఇంటికి వెలుగుని పంచే ఇలాంటి మహిళామణులే అసలైన హీరోలు. ఇక్కడ ఈ శాంతి ఇవేమి కోరుకోవడం లేదు, కేవలం తన కొడుకు బాగైతే చాలు.. అదొక్కటే ఆమెను అచంచలంగా నడిపిస్తోంది. (చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!)
ఆరోగ్యం.. ఒక డైనమిక్ ప్రయాణం
స్త్రీల జీవితంలో నెలసరి మొదలైనప్పటి నుంచి, నెలసరి ఆగిపోయే వరకు, ఆ తరువాత తీసుకోవాల్సిన ఆరోగ్య రక్షణ చర్యలు, సమస్యలు, వాటి పరిష్కారాల గురించి...ప్రతి స్త్రీ జీవితంలో టీనేజ్, పునరుత్పాదక వయస్సు, మెనోపాజ్ అనే ముఖ్యమైన మూడు దశలుంటాయి. ఈ మూడు దశల్లో హార్మోన్ మార్పులు, శారీరక మార్పులు ఎక్కువ. అందుకే వీటిని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.టీనేజ్ దశలో...యుక్తవయస్సులో నెలసరి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మొదటి నెలసరి వచ్చినప్పుడే పరిశుభ్రత గురించి తెలియజెప్పాలి. శుభ్రమైన ప్యాడ్లు వాడాలి. ప్రతి నాలుగు గంటలకు మార్చాలి. వేడినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి. శరీరంలో జరిగే మార్పులను అంగీకరించేలా కౌన్సెలింగ్ అవసరం. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పాఠశాలల్లో లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా వేయించాలి. సాధారణంగా 11 నుంచి 19 సంవత్సరాల మధ్య నెలసరి సరిగా రాకపోవడం సాధారణ విషయమే. ఆ తర్వాత హార్మోన్లు సర్దుబాటుతో 18 నుంచి 19 సంవత్సరాల నాటికి నెలసరి క్రమబద్ధంగా మారుతుంది. బరువు పెరగడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. వ్యాయామం, సరైన ఆహారం, బరువు నియంత్రణ అవసరం. అవసరమైతే థైరాయిడ్ పరీక్ష చేస్తారు. అధిక రక్తస్రావం ఉన్నవారికి రక్తహీనత రాకుండా విటమిన్లు ఇస్తారు. అల్ట్రాసౌండ్ ద్వారా గడ్డలు లేదా సిస్టులు ఉన్నాయా పరిశీలిస్తారు. కొన్నిసార్లు విటమిన్లు మాత్రమే సరి΄ోతాయి.పునరుత్పాదక వయస్సులో...20 నుంచి 40 సంవత్సరాల మధ్య దశలో వివాహం, గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సంరక్షణ ముఖ్యమైనవి. వివాహం ప్లాన్ చేసుకునే ముందు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా టీకాలు వేయించుకోక΄ోతే రుబెల్లా, చికెన్ఫాక్స్, హెచ్పీవీ టీకాలు వేయించుకోవాలి. పాప్ స్మియర్ పరీక్ష, లైంగిక వ్యాధుల రక్తపరీక్షలు చేయించుకోవాలి. గర్భధారణ ప్లానింగ్కు ముందు థైరాయిడ్, బీపీ, షుగర్, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నాయో లేవో చూసుకోవాలి. కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. నెలసరి తరువాత స్తనాన్ని స్వయంగా పరీక్షించుకోవాలి. స్తనంలో గడ్డ, నొప్పి, నిపల్ నుంచి స్రావం, ఇతర మార్పులు ఉంటే వైద్యుని సంప్రదించాలి.40 సంవత్సరాల తరువాత చాలామందికి మూత్రంలో మంట, నొప్పి, జ్వరం కనిపిస్తాయి. రోజుకు 3 నుంచి 3.5 లీటర్లు నీరు తాగాలి. పరిశుభ్రత పాటించాలి. మలబద్ధకం లేకుండా పండ్లు, కూరగాయలు తినాలి. యోని లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సరిగా చికిత్స చేయక΄ోతే గర్భాశయానికి వ్యాపించి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి వస్తుంది. దీనిని స్కాన్ , రక్తపరీక్షల ద్వారా గుర్తించి చికిత్స చేస్తారు.మెనోపాజ్ దశలో...నెలసరి ఒక సంవత్సరం పాటు రాకపోతే సహజ మెనోపాజ్ అంటారు. ఈ దశలో హార్మోన్ మార్పుల వల్ల వేడి ఆవిర్లు, చిరాకు, దిగులు, నిద్రలేమి వస్తాయి. కాఫీ, మసాలా పదార్థాలు తగ్గించాలి. ప్రాణాయామం, యోగా, ధ్యానం చేయాలి.ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఎముకల బలహీనత పెరుగుతుంది. ΄ోషకాహారం తీసుకోవాలి. చర్మం, యోని పొడిబారడం ఉంటుంది. అవసరమైతే లూబ్రికెంట్లు, మాయిశ్చరైజర్లు వాడాలి. కొందరికి హార్మోన్ చికిత్స అవసరం పడుతుంది. బీపీ, షుగర్, గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. పాప్ స్మియర్, మామోగ్రఫీని డాక్టర్ సూచన మేరకు కొనసాగించాలి.మహిళల ఆరోగ్యం వయస్సు మార్పులు, హార్మోన్ మార్పులు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు పరీక్షలు, అవగాహన, సరైన జీవనశైలి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. (చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!)
24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!
విదేశీ టూర్ వ్లాగర్ అనగానే మంచి ఆదాయం, వీసా, మంచి ఆంగ్ల భాషా నైపుణ్యం తదితరాలతో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే సాధ్యం. అది కూడా డబ్బున్నవాళ్లకే సాధ్యం, అని అందరి మదిలో నాటుకున్న భావన. అయితే అందరి అంచనాలను బ్రేక్ చేస్తూ ఓ గ్రామీణ యువకుడు..ఎలాంటి బడ్జెట్, కనీసం ఇంగ్లీష్ భాషా నైపుణ్యం, వివిధ వీసాలు కూడా లేకుండానే ఏకంగా 197 దేశాలు చుట్టేస్తూ..గ్రేట్ ట్రావెల్ వ్లాగర్గా పేరుతెచ్చుకుంటున్నాడు. అది కూడా తన సొంత డబ్బుతోనే ఇన్ని దేశాలు చుట్టేసి రావడం విశేషం. కేవలం 24 ఏళ్లకే ఇన్ని దేశాలంటే మాటలు కాదుకదా..!. మరి ఆ యువకుడు ఎవరు..?, ఏమా కథ చూద్దామా..!. బిహార్లోని ముంగేర్, భాగల్పూర్ల మధ్య ఒక చిన్న గ్రామానికి చెందని శుభమ్ కుమార్ అనే యువకుడు 197 దేశాలు పర్యటించాడు. అదికూడా కేవలం భారతీయ పాస్పోర్ట్తో, తన సొంత డబ్బుతో చుట్టొచ్చాడు. సాధారణంగా విదేశీ ప్రయాణం అంటే.. చేతినిండా డబ్బు, బహుళ వీసాలు పొందే సామర్థ్యం, మంచి ఆంగ్లభాషా నైపుణ్యం ఉంటేనే సాధ్యమవుతుంది. తనవద్ద ఇవేమి లేకపోయినా..కేవలం తనకున్న ఇష్టం, ప్యాషన్తో అలవోకగా దేశాలు చుట్టేశాడు. నిజానికి శుభమ్ది మధ్య తరగతి నేపథ్యం. తండ్రి ప్రభుత్వ పాఠశాల టీచర్. ఇరుకైన గ్రామదారుల నడుమ చిన్న చిన్న గదులతో ఉండే ఇల్లు. సోషల్ మీడియాలో తన హోమ్టూర్ వీడియోలతో వేలాదిగా అభిమానులను సంపాదించుకున్న అతడి జర్నీ..నెమ్మదిగా ట్రావెల్ వ్లాగ్ పేరుతో విదేశీ టూర్లు పర్యటించే రేంజ్కు చేరుకున్నాడు. అతడి వీడియోలు చాలా నేచురల్గా, వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో అందరూ సులభంగా కనెక్ట్ అయ్యేవారు. అలా అతడి యూట్యూబ్ ఛానెల్కి ఏకంగా మూడు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు, ఆరు లక్షలకు పైగా ఫోలోవర్లు ఉన్నారు. అతని ప్రతి ట్రావెల్ వీడియో కనీసం మూడు నుంచి నాలుగు లక్షల వ్యూస్ వస్తుంటాయి. ఇదంత శుభమ్కి ఒక్కరాత్రిలో సంపాదించిన ఘనత మాత్రం కాదు. జర్నీ ఎలా ప్రారంభమైందంటే..తనకేమి బహుళ వీసాల సామర్థ్యం లేదని, అలాగే ఇంగ్లీష్పై అంత పట్టు కూడా లేదని ఓపెన్గానే చెప్పేశాడు శుభమ్. కేవలం ఇండియా పాస్పోర్ట్తోనే పర్యటిస్తున్నట్లు తెలిపాడు. తనకు 13 లేదా 14 ఏళ్ల వయసు నుంచి విదేశాలు పర్యటించాలనే కోరిక బలంగా ఉండేదని అలా ఈ ట్రావెల్ వ్లాగ్గా వీడియోలు చేస్తూ..తన కోరికను నెరవేర్చుకున్నానని అంటున్నాడు. సరిగ్గా 2018లో లేహ్-లడఖ్ పర్యటనతో మొదలైంది అతడి ప్రస్థానం. ఓ పక్క పాఠశాల తరగుతులు..మరోవైపు ఈ విదేశాల టూర్లుతో బిజీగా ఉండేవాడు. తన తొలి అంతర్జాతీయ పర్యటన మాత్రం నేపాల్, తర్వాత రష్యా, థాయిలాండ్, లావోస్..అలా 2019 నాటికి చైనా నుంచి తన మొదటి గ్లోబల్ వ్లాగ్ పోస్ట్ చేశాడు. అలా చేస్తున్నప్పుడు సవాళ్లు మాములుగా లేవని..తన టూర్ ఖర్చుల కోసం కోచింగ్ సెంటర్లను కూడా మినహాయించాల్సి వచ్చేదని చెప్పుకొచ్చాడు శుభమ్. అంతేగాదు 16 ఏళ్ల వయసుకి రష్యా వెళ్లి అక్కడ భూభాగంలో దాదాపు 3 వేల కిలోమీటర్లు హిచ్హైక్ చేశాడు. అలాగే తల్లిదండ్రులకు ఐఏఎస్కి ప్రిపేరవ్వుతా, ఢిల్లీ వెళ్తానని అబద్ధం చెప్పి..మలేషియా విమానం ఎక్కాడు. అయితే ఇక్కడ విదేశీటూర్లకు వెళ్లాలంటే ఎంతో స్ట్రాంగ్ పాస్పోర్టులు చాలానే ఉండాలి. కేవలం భారత పాస్పోర్ట్తో అన్ని దేశాలు చుట్టిరావడం చాలా కష్టం.. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ఒత్తిడి, పరిమిత వీసా యాక్సెస్, వీసా స్టాంపులకు పాస్పోర్ట్లో తగినంత ఖాళీ పేజీలు ఉండాలి కూడా. ఆ క్రమంలో ఈక్వెడార్ పర్యటనకు దాదాపు బహిష్కరింపబడతానని భయపడ్డాడట శుభమ్. ఎందుకంటే అప్పటికే తన పాస్పోర్ట్లో ఖాళీ పేజీలు లేనందున తనకు ఈక్వెడార్లోకి ప్రవేశం దాదాపుగా నిరాకరిస్తారనే అనుకున్నాడు. పైగా అప్పటికే ఆరు పాస్పోర్ట్లను నింపాడు. అయితే శుభమ్ ప్రతి దేశానికి ఈ పాస్పోర్ట్తోనే వెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నాడట. అలాగే దీంతోనే వెళ్లగలను అని పూర్తిగా విశ్వసించాడట. ఆ నమ్మకంతోనే విజయవంతంగా విదేశాలు చుట్టిరాగలిగాను అంటున్నాడు శుభమ్. 16 ఏళ్లకు మొదలు పెట్టిన ఈ జర్నీని ఏడేళ్లు తన తండ్రి ఇచ్చిన డబ్బులతో పర్యటించగా, 23 ఏళ్లు వచ్చేటప్పటికీ తన పూర్తి సొంత నిధులతో టూర్లు ప్లాన్ చేసుకున్నాడట. అంటే శుభమ్ అప్లోడ్ చేసే వీడియోల ద్వారా వచ్చిన ఆదాయం..అలాగే ఆయా దేశాల్లో ఉంటూ కొంత సంపాదించిన డబ్బుతో తన ప్రయాణానికి నిధులు సమకూర్చుకునేవాడట. అలా శుభమ్ శుభప్రదంగా 197 దేశాలు పర్యటించాడు. అంతేకాదండోయ్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సైతం అతడికి ఫోన్చేసి మరి అభినందించారట. ఇప్పుడు అతని టూర్ బకెట్ లిస్ట్లో బ్రెజిల్ దేశం ఉంది. ప్రస్తుతం అక్కడే ఉన్నాడట శుభమ్. పరిమిత వనరులే ఉన్నా..గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి కూడా..తన ఆసక్తితో ఇంతటి అనితరసాధ్యమైనదాన్ని సాధించి చూపించి..ఇతర ట్రావెల్ వ్లాగర్లకు, నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు కదా..!. View this post on Instagram A post shared by Shubham Kumar || Extreme Traveller (@nomadshubham) (చదవండి: అత్యంత విషపూరితమైన పాయిజన్తో..ప్రాణాంతక వ్యాధులకు చెక్..!)
అంతర్జాతీయం
మూడోసారి.. ప్రయోగించిన 69 సెకన్లకే పేలిపోయిన జపాన్ రాకెట్
టోక్యో: జపాన్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ వన్ మరోసారి ఘోరంగా విఫలమైంది. ఆ సంస్థకు చెందిన కైరోస్ నం.3 రాకెట్ ప్రయోగించిన 69 సెకన్ల తర్వాత గాల్లోనే పేలిపోయింది. ఇలా జరగడం వరుసగా మూడోసారి. ప్రైవేటు రంగంలో అంతరిక్ష రంగాన్ని విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్న జపాన్కు ఇది గట్టి ఎదురుదెబ్బ.కైరోస్ రాకెట్ ఘన ఇంధనంతో పని చేస్తుంది. దాని ఎత్తు 18 మీటర్లు. పశ్చిమ జపాన్లోని స్పేస్పోర్ట్ కీ అనే ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని ఇవాళ ఉదయం 7:40 గంటలకు జరిపారు.రాకెట్ నిర్వహణ బాధ్యత జపాన్ సంస్థ స్పేస్ వన్ది. ఇందులో 5 ప్రయోగాత్మక ఉపగ్రహాలు ఉన్నాయి. టోక్యోకు చెందిన ఆర్క్ ఎడ్జ్ స్పేస్ సంస్థ తయారు చేసిన పరికరాలు, తైవాన్ అంతరిక్ష సంస్థ ఉపగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి. రాకెట్ విజయవంతంగా ఎగిరినప్పటికీ కొద్ది సమయంలోనే పేలిపోయింది. అందువల్ల కక్ష్యలోకి చేరుకోలేకపోయింది. ప్రయోగం ప్రారంభమైన కొద్దిసేపటికే రాకెట్ అస్థిర మార్గంలో వెళ్లినట్లు కనిపించింది. అనంతరం పసిఫిక్ మహాసముద్రం పైభాగంలో 29 కిలోమీటర్ల ఎత్తులో దాని ప్రయాణం ఆటోమేటిక్గా ముగిసింది.స్పేస్ వన్ ఉపాధ్యక్షుడు నోబుహిరో సెకినో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రయోగం ప్రారంభించిన సమయంలో, రాకెట్ పరికరాల్లో తమకేమీ లోపాలు కనిపించలేదని తెలిపారు. అయితే, ఆటోనొమస్ టెర్మినేషన్ సిస్టమ్ వ్యవస్థలో లోపం జరిగి ఉండవచ్చని చెప్పారు.వరుసగా మూడో వైఫల్యంస్పేస్ వన్ కైరోస్ రాకెట్కు ఇది వరుసగా మూడో వైఫల్యం. ఇదే రాకెట్ 2024లో జరిగిన రెండు ప్రయోగాల్లో కూడా విఫలమైంది. స్పేస్ వన్ సంస్థ జపాన్ కంపెనీల సంయుక్త ప్రాజెక్టులను కొనసాగిస్తుంది. ఆప్టికల్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ కానన్, ఏరోస్పేస్ సంస్థ ఐహెచ్ఐ, నిర్మాణ సంస్థ షిమిజు వంటి కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి.గత ఏడాది జపాన్ మొత్తం 3 రాకెట్ ప్రయోగాలు మాత్రమే చేసింది. 2030 నుంచి ప్రతి సంవత్సరం 30 ప్రయోగాలు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే, ఆ దిశగా విజయాలు సాధించడం లేదు.రక్షణ అవసరాలు పెరుగుతున్న పరిస్థితి, చైనా అంతరిక్ష ప్రోగ్రాం వేగంగా విస్తరించటం కారణంగా జపాన్పై ఒత్తిడి పెరిగింది. దేశీయంగా రాకెట్లు అభివృద్ధి చేసి అమెరికా రాకెట్లపై ఆధారపడడాన్ని తగ్గించాలని జపాన్ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే స్పేస్ వన్ సహా దేశీయ రాకెట్ స్టార్టప్ సంస్థలకు మిలియన్ డాలర్ల సబ్సిడీలు ఇచ్చింది. ఇప్పటివరకు జపాన్లో ఏ ప్రైవేట్ సంస్థ కూడా వాణిజ్య రాకెట్ ద్వారా ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా చేయలేకపోయింది. తదుపరి ప్రయోగం ఎప్పుడు జరుగుతుందో స్పేస్ వన్ ఇంకా ప్రకటించలేదు. 🚨BREAKING! Japan's SpaceOne KAIROS Rocket Launch Ends In Failure🚨Space One’s KAIROS No. 3 rocket suffered an anomaly during first stage flight following liftoff on March 5, 2026 at 11:10 a.m. local time from the Kii Spaceport in Japan.According to the company, the vehicle… pic.twitter.com/UFrYMJ0rhg— The Launch Pad (@TLPN_Official) March 5, 2026🚨🇯🇵JAPANESE STARTUP SPACE ONE FACES SECOND ROCKET FAILURESpace One's Kairos No. 2 rocket failed midflight, marking its second consecutive setback. After a successful first-stage separation, the rocket was "discontinued" 20 minutes post-launch. The payload included satellites… pic.twitter.com/M0dsKNHMbm— Info Room (@InfoR00M) December 18, 2024
‘ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు ఓటమి ఖాయం’.. కారణాలివే..
బీజింగ్: ప్రముఖ చైనీస్-కెనడియన్ విద్యావేత్త, జియోపాలిటికల్ విశ్లేషకుడు షూఏచిన్ జియాంగ్ (Xueqin Jiang) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన ప్రకారం, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్పై కొనసాగుతున్నప్పటికీ, ఈ యుద్ధంలో అమెరికా ఓటమి తప్పదని అంచనా వేశారు.జియాంగ్ ‘ప్రిడిక్టివ్ హిస్టరీ’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ, గేమ్ థియరీ ఆధారంగా జియోపాలిటికల్ విశ్లేషణలు చేస్తుంటారు. ఇటీవల విడుదల చేసిన వీడియోలో, అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ప్రాచీన గ్రీకు చరిత్రలోని అథెన్స్ సిసిలీ యాత్రతో పోల్చారు. ఆయన అభిప్రాయం ప్రకారం, అధిక ఖర్చులు, వ్యూహపరమైన తప్పిదాలు కారణంగా అమెరికా ఈ యుద్ధంలో ఓడిపోతుందని చెప్పారు.1976లో చైనాలో జన్మించిన జియాంగ్, యేల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం బీజింగ్లోని మూన్షాట్ అకాడమీలో చరిత్ర, తత్వశాస్త్రం బోధిస్తున్నారు. విద్యా రంగంలో ఆయన చేసిన సంస్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించే ప్రయత్నాలు ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. 2024లో ఆయన ఇచ్చిన ఒక లెక్చర్లో, అమెరికా-ఇరాన్ యుద్ధం తప్పనిసరిగా జరుగుతుందని, అది అథెన్స్ సిసిలీ యాత్ర లాంటి ఘోర పరాజయానికి దారితీస్తుందని చెప్పారు. ఆయన అంచనాలు ఇప్పటివరకు నిజమవుతున్నందున, ప్రపంచవ్యాప్తంగా ఆయనను చైనాకు చెందిన నోస్ట్రాడమస్గా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, జియాంగ్ చేసిన విశ్లేషణలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చరిత్ర ఆధారంగా భవిష్యత్తు అంచనా వేసే ఆయన విధానం, గేమ్ థియరీ వినియోగం, జియోపాలిటికల్ విశ్లేషణలు అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి, షూఏచిన్ జియాంగ్ ఒక విద్యావేత్త మాత్రమే కాకుండా, చరిత్రను ఆధారంగా చేసుకుని భవిష్యత్తు అంచనా వేసే విశ్లేషకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు.
యుద్ధం ఎఫెక్ట్.. ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్పై దెబ్బ!
న్యూయార్క్: హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకోవడంతో ముడి చమురు మాత్రమే కాకుండా ఇతర వస్తూత్పత్తుల సరఫరా సైతం స్తంభించిపోయింది. సముద్రమార్గంలో నౌకలతోపాటు గగనతలంలో కార్గో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ఇతర వస్తువుల సరఫరా గొలుసులు తెగిపోయి పలు దేశాల్లో ఆయా వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతోంది.భారత్లో తయారైన ఫార్మాసూటికల్స్, ఆసియా దేశాల్లో తయారైన సెమీకండక్టర్లు, బ్యాటరీలు, పశ్చిమాసియా దేశాల్లో తయారైన రసాయనాల వంటి చమురు ఉత్పత్తులు హర్మూజ్ జలసంధి గుండానే ఇతర దేశాలకు సరఫరా చేయాల్సి ఉంది. జలసంధి గుండా వెళ్లే నౌకలను తగలబెడతామని ఇరాన్ అల్టిమేటమ్ జారీచేయడంతో సరకు రవాణా గొలుసు తెగినట్లయింది. హార్మూజ్ దాకా రాలేక 3,200 నౌకలు పర్షియన్ గల్ఫ్లోనే ఆగిపోయాయి. యూఏఈ, ఒమన్ వద్ద మ రో 500 నౌకలు వేచిచూస్తున్నాయి. ఇంకొన్ని సుదీర్ఘ మార్గమైన ఆఫ్రికా దక్షిణ కొన గుండా గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి.‘ఆఫ్రికా చుట్టూ తిరిగిరావడం వల్ల ప్రయాణ ఖర్చులు ఎక్కువై చివరకు ఆయా దేశాల్లో సరకుల ధరలు ప్రియమవుతున్నాయి. తప్పని పరిస్థితుల్లో అదే జలసంధి గుండా నౌకలు వెళ్లాలంటే.. యుద్ధానికి తెరతీసిన అమెరికానే స్వయంగా తన యుద్ధ విమానాలను రక్షణగా పంపించి జాగ్రత్తగా నౌకలను ఆవలి వైపునకు దాటించాలి’ అని సియాకస్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ప్యాట్రిక్ పెన్ఫీల్డ్ విశ్లేషించారు. ‘మొత్తం ప్రపంచ వాయుమార్గ రవాణాలో పశ్చిమాసియాలో రవాణా కేవలం ఒక శాతమే ఉంటుంది. కానీ విలువ పరంగా చూస్తే యావత్ ప్రపంచ వాణిజ్యంలో 35 శాతం ఉంటుంది. ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల రవాణా ఎక్కువ’ అని ఆయన అన్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం.. ‘బ్లడ్ చిట్’ చూశారా? అంటే ఏంటంటే?
న్యూఢిల్లీ: అమెరికా వైమానిక దళానికి చెందిన మూడు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు మార్చి 1న రాత్రి 11.03 గంటలకు కువైట్ గగనతలంలో కుప్పకూలాయి. ఈ ఘటన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి సంబంధించిన యుద్ధ చర్యల సమయంలో జరిగింది.ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇరాన్ యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు దాడులు చేస్తున్న సమయంలో కువైట్ గగనతలరక్షణ వ్యవస్థలే పొరపాటుగా అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకున్నాయి.ఈ ఘటన తర్వాత ‘బ్లడ్ చిట్’ అనే చిన్న నోటీసుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాల పైలట్లే ‘బ్లడ్ చిట్’ను తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.వైరల్ అవుతున్న బ్లడ్ చిట్లో ఏముంది?అమెరికన్ పైలట్లు తమ జాకెట్ల లోపల ఈ బ్లడ్ చిట్ను కుట్టుకుని మరీ ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లిష్, అరబిక్, టర్కిష్, పర్షియన్, కుర్దిష్ భాషలలో అందులో సందేశం ఉంది. "నేను అమెరికన్ని. నాకు మీ భాష రాదు. నేను మీకు ఎటువంటి హాని చేయను. దయచేసి నాకు ఆహారం, నీరు, ఆశ్రయం, దుస్తులు అందించి వైద్య సాయం అందేలా చేయండి. అమెరికన్ లేదా మా మిత్ర దేశాల దళాల వద్దకు చేరుకోవడానికి నాకు సాయం చేయండి. మీరు నా పేరు, ఈ నంబర్ను అమెరికా అధికారులకు అందిస్తే, మీకు బహుమతి లభిస్తుంది" అని బ్లడ్ చిట్లో ఉంది. అయితే, ఈ బ్లడ్ చిట్ నిజంగా అమెరికా దళాలకు చెందిందేనా? అన్న విషయంపై అధికారికంగా ఎటువంటి నిర్థారణ లేదు. అయినప్పటికీ బ్లడ్ చిట్లు పెట్టుకెళ్లడం అమెరికా దళాలకు అలవాటే.బ్లడ్ చిట్ అంటే ఏంటి?బ్లడ్ చిట్ అనేది చిన్న నోటీసు. యుద్ధ సిబ్బంది, ముఖ్యంగా వైమానిక దళ సిబ్బంది తమ వద్ద దీన్ని పెట్టుకుంటారు. సాధారణ పౌరులను ఉద్దేశించి దీన్ని రాసిపెట్టుకుంటారు. తనకు సాయం అందించాలని అభ్యర్థిస్తూ ఓ సందేశాన్ని అందులో రాస్తారు. యుద్ధ విమానం కూలిపోతే లేదా ఏదైనా ప్రాంతంలో చిక్కుకుపోతే అక్కడి సాధారణ ప్రజలకు దీన్ని చూపిస్తారు. సైనికుడికి అక్కడి భాష రాకపోవచ్చు.దీంతో బ్లడ్ చిట్ను సాధారణంగా అనేక భాషల్లో ముద్రిస్తారు. దాన్ని చూపిస్తున్న వ్యక్తి మిత్ర దేశానికి చెందిన సైనికుడని అందులో ఉంటుంది. ఆ వ్యక్తికి ఆహారం, నీరు, ఆశ్రయం, వైద్య సాయం అందించాలని అందులోనే ముందుగానే రాసి పెట్టుకుంటారు. తనకు సాయం చేసి సురక్షితంగా తిరిగి పంపితే తమ దేశ ప్రభుత్వం ప్రతిఫలం ఇస్తుందన్న హామీ కూడా అందులో రాసి ఉంటుంది. “బ్లడ్ చిట్” అనే పదం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆ సమయంలో చైనా, బర్మా సహా ఆసియా ప్రాంతాల్లో అమెరికా వైమానిక సిబ్బంది తమ జాకెట్ వెనుక భాగంలో బ్లడ్ చిట్ కుట్టించుకునేవారు. అమెరికా జెండా ముద్రించి, స్థానిక భాషల్లో సందేశం రాసి బ్లడ్ చిట్ ఉండేది.American pilots shot down over Kuwait had a “blood chit” in English, Arabic, Turkish, Persian & Kurdish: asking locals for food, water, shelter, medical help, and to contact U.S. authorities for a reward. pic.twitter.com/NRSB73XW9X— Zar Hemi 🇬🇧 (@ZerdashtHami) March 3, 2026
జాతీయం
లొంగుబాటలో గణపతి..! కుమారుడి ఆడియో వైరల్
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయేందకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులతో టచ్లోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే నేపాల్ నుంచి గణపతి ఢిల్లీకి చేరినట్లు తెలుస్తోంది. వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గణపతి సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు సైతం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గణపతి కుమారుడు విడుదల చేసిన భావోద్వేగ ఆడియో వైరల్గా మారింది.ఆడియోలో గణపతి కుమారుడు ఏమన్నారంటే..‘‘తండ్రి ప్రేమను తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి. తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా "నాన్నా" అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని "నాన్నా" అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను. అనాలోచితంగా కానీ, అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది. ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో పన్నెండు రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి, మీ బంధాల్లో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనే అంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు...మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండి ఉండవచ్చు. నాన్నా! నా చిన్నతనం నుంచే మిమ్మల్ని చూడాలని, మీతో గడపాలని, నా కష్టసుఖాలు మీతో పంచుకోవాలని, మీ అండలో ఎదగాలని ఉండేది. మీ కోసం నా మనసు పడే ఆరాటం, నాలో ఉండే నా ఆవేదనతో నా కన్నులు ఎన్ని దిక్కులు చూసినా మీరు కనపడరు. నా హృదయ ఘోష మీకు వినపడదు. ప్రతీ కుటుంబపు చిరునవ్వు వెనుక కనబడని ఒక గొప్ప మనసున్న తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానే అయి పెంచింది నన్ను కన్న తల్లి. అమ్మా! నీకు వందనం. నాన్నా! మీ వివాహం తర్వాత అమ్మతో మీరు గడిపిన మధుర క్షణాలను అప్పుడప్పుడూ తన గుండె చప్పుడుగా నాతో పంచుకునేది...ఈ జీవితానికి ఆ మధుర క్షణాలు చాలు అనుకుంటూ బరువెక్కిన హృదయంతో ఓ నిట్టూర్పు విడిచేది. మన బంధువులు కూడా మీరు మనసున్న మనిషి అని, మితభాషి అని, అమ్మతో అన్యోన్యంగా ఉండేవారని అంటూ ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయం మీ ఇద్దరి జీవితాలను జీవితకాలానికి ఎడబాటు చేసింది. మీరెంచుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ అజ్ఞాత జీవితం ప్రారంభించాక అమ్మ ఎన్ని సంవత్సరాలు తన కన్నీటితో ఎన్ని మెత్తాలు తడిసిపోయాయో ఎవ్వరికీ తెలియదు. ఏ బట్ట కట్టిందో, ఏ తిండి తిన్నదో కూడా ఎవ్వరికీ తెలియదు. సమాజాన్ని ఎదురు పడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది...నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అమ్మ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నాన్నా! మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దీర్ఘకాలిక పోరాటం చేయడం అంటే అది ఆత్మార్పణే. విప్లవం అంటే కష్టనష్టాలతో కూడుకున్న దారి. ఎన్నో త్యాగాలు, ఎంతో మంది యోధుల వీరమరణాలు. ఎందరో తమ తల్లిదండ్రులను, తమ కుటుంబాన్ని వదిలి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ, ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే అది అసామాన్యమే.ఒకప్పటి పరిస్థితులతో పోల్చితే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉంది. సమాజ అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు. కానీ నేటితరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు. కానీ ఇది నా అభిలాష’’ అంటూ గణపతి కుమారుడు ఎమోషనల్గా మాట్లాడారు.
మూడు రోజులు ఫ్రీ ఫుడ్ : పోటెత్తిన జనం
బెంగళూరుకు చెందిన ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) ముంబై నగరంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన తొలి అవుట్లెట్ని ముంబైలోని ఈరోస్, చర్చ్గేట్లో మార్చి 2న ప్రారంభించింది ఈ సందర్భంగా ముంబై వాసుల కోసం కేఫ్ యాజమాన్యం ఒక అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది.రామేశ్వరం కేఫ్ పట్ల ఉన్న క్రేజ్తో ముంబై ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.ముంబైలో తన అరంగేట్రాన్ని పురస్కరించుకుని, రామేశ్వరం కేఫ్ నాలుగు రోజుల పాటు ఉచిత ఫుడ్ అంటూ ఇన్స్టాలో ప్రకటించింది. మార్చి 2 నుండి మార్చి 5వ తేదీవరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉచిత ఫుడ్ అందివ్వనున్నట్టు ప్రకటించారు. రుచికరమైన భోజనాన్ని ఉచితంగా ఆస్వాదించేందుకు వందలాదిమంది బారులు తీరారు. సూర్యాస్తమయం దాటిన తర్వాత కూడా ప్రజలు తమ వంతు కోసం ఓపికగా ఎదురుచూడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడిగా మారాయి.ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య Hehe…for that 1 FREE dish 😄😄😄@RameshwaramCafe u really need this & those social influencers? Really? pic.twitter.com/ro6pquBCYU— Neeta Kolhatkar (@neetakolhatkar) March 3, 2026 రామేశ్వరం కేఫ్రామేశ్వరం కేఫ్ రామేశ్వరం కేఫ్ను 2021లో బెంగళూరులో భార్యాభర్తల ద్వయం రాఘవేంద్రరావు , దివ్య రాఘవేంద్రరావు స్థాపించారు. సాంప్రదాయ వంటకాలతో ప్రజాదరణ పొందింది. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మస్థలానికి నివాళిగా, దక్షిణ భారత రుచులను , వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ కేఫ్కు "రామేశ్వరం" అని పేరు పెట్టారు. View this post on Instagram A post shared by SANJAY | The Travel Freak 🇮🇳 (@sanjay_thetravelfreak)
శబరిమలలో ‘మహిళలకు ప్రవేశం’ కేసు.. టీడీబీ ఆఫీస్ నుంచి ఫైళ్లు మాయం
తిరువనంతపురం: శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసు ఫైళ్లు.. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రధాన కార్యాలయం నుంచి మాయమైనట్లు సమాచారం. ఇటీవల సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించడానికి సిద్ధమవుతున్న సమయంలో అధికారులు పాత ఫైళ్ల కోసం వెతికిన వేళ ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు పత్రాల కాపీలు కూడా అందుబాటులో లేవని తెలియడంతో టీడీబీ అధ్యక్షుడు కె.జయకుమార్, బోర్డు ఇతర సభ్యులు షాక్ అయ్యారని తెలుస్తోంది. ఆయా రికార్డులు ఏమయ్యాయో తమకు తెలియదని అధికారులు తెలిపారు. కాగా, 2007లో శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించవచ్చని వీఎస్ అచ్యుతానందన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తమ వైఖరిని తెలిపింది.ఆ తర్వాత 2016లో ఊమెన్ చాందీ ప్రభుత్వం, ప్రయార్ గోపాలకృష్ణన్ నేతృత్వంలోని దేవస్వం బోర్డు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేశాయి. 2016 నవంబర్లో పినరయి విజయన్ ప్రభుత్వం మహిళల ఆలయ ప్రవేశానికి మద్దతు ఇస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఆ సమయంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రత్యేక అఫిడవిట్ సమర్పించలేదు.
పగిలిన ఇటుకలు.. వలస గుండె చప్పుళ్లు!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎన్ఎస్ఐసీ ఓఖ్లా మైదానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న 17వ ‘ఇండియా ఆర్ట్ ఫెయిర్ 2026’ కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో అనేక వినూత్న కళాఖండాలు కొలువుదీరాయి. శిథిలాల్లో దాగున్న జ్ఞాపకాలను, వలసల తాలూకు ఆవేదనను ప్రతిబింబించేలా కళాకారుడు గిర్జేష్ కుమార్ సింగ్ రూపొందించిన శిల్పాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. కూల్చివేసిన ఇళ్లకు సంబంధించిన ఇటుకలనే ముడిసరుకుగా మార్చుకుని, వాటికి అద్భుతమైన జీవం పోయడం ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రదర్శనశాల ముఖద్వారం వద్దే ఇటుకల కుప్పలా కనిపించే ఈ ఆవిష్కరణను గమనిస్తే శిథిలాల నుంచి కొత్త జీవం మొలకెత్తుతున్నట్లుగా కనిపిస్తుంది. ఏళ్ల తరబడి ఎందరో నివసించిన ఇళ్లు నేలమట్టమైనప్పుడు, ఆ శిథిలాల మధ్యే కొత్త మొక్కలు చిగురించడం అభివృద్ధి పేరిట జరుగుతున్న మార్పులకు ప్రతీకగా కనిపిస్తుంది. గిర్జేష్ కుమార్ సింగ్ రూపొందించిన ‘హాల్ ముకామ్: కరెంట్ అడ్రస్’ (ప్రస్తుత చిరునామా) అనే ప్రదర్శనలో భాగంగా ఈ ఇటుక శిల్పాలు ఈ భావజాలాన్ని మరింత లోతుగా వివరిస్తున్నాయి. ఇళ్లు కూల్చిన చోట సేకరించిన ఇటుకలను ముక్కలుగా చేసి, వాటిని పేర్చి, వలస వెళ్తున్న సామాన్యుల రూపాలను ఆయన మలిచారు.ఈ శిల్పాల్లో ముఖ్యంగా 'ఇన్ ట్రాన్సిట్' పేరుతో రూపొందించిన కళాఖండాలు చూపరులను ఆలోచింపజేస్తున్నాయి. చేతిలో సంచులు పట్టుకుని, మరో సంచిని కాళ్ల మధ్య ఉంచుకుని, వలస వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఓ వృద్ధుడి ప్రతిమ అత్యంత సహజంగా కనిపిస్తోంది. ఇక్కడ ఇటుక అనేది కేవలం భౌతికమైన వస్తువు మాత్రమే కాదు, మానవ జీవితంలో ఏ చిరునామా కూడా శాశ్వతం కాదనే సత్యాన్ని చాటిచెప్పే ఒక ప్రతీక. సొంత ఊరుని, గూడుని వదిలి వలస వెళ్లే క్రమంలో మనుషులు తమ వెంట తీసుకెళ్లేది కేవలం సంచులను మాత్రమే కాదు, ఆ పాత ఇళ్లతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను, చేదు తీపి అనుభవాలను కూడా బరువుగా మోస్తారని ఈ శిల్పాలు నిశ్శబ్దంగా నినదిస్తున్నాయి.ఉత్తరప్రదేశ్లోని సేమ్రాలో జన్మించిన గిర్జేష్ కుమార్ సింగ్ అలహాబాద్, వారణాసిలలో విద్యనభ్యసించి, బరోడాలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పట్టా పొందారు. ప్రస్తుతం వడోదరను తన నివాసంగా మార్చుకున్న ఆయన తన కళా సృజనలో వలసలు, అస్థిత్వం, నిర్వాసితుల ఇతివృత్తాలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు మనం చూస్తున్న వలసల సంక్షోభం, యుద్ధ విధ్వంసాల నేపథ్యంలో, గిర్జేష్ సృష్టించిన ఈ ఇటుక శిల్పాలు కేవలం కళాఖండాలుగానే కాకుండా, ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.భవనాలు కేవలం ఇటుకలు, సిమెంట్ తో కట్టిన కట్టడాలు మాత్రమే కావని, వాటికి మనుషులతో ఉన్న అనుబంధమే అసలైన జీవమని ఆయన తన కళ ద్వారా చాటిచెబుతున్నారు. కేవలం ఇటుకలే కాకుండా ఈ ఆర్ట్ ఫెయిర్లో కళాకారులు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ, అనేక వినూత్న ప్రయోగాలు చేశారు. మహిళల రక్షణను ఉద్దేశించి బ్లేడ్లతో తయారు చేసిన ‘అన్ టచబుల్’ బ్రాలెట్, దీపావళి టపాసుల (పాపింగ్ స్ట్రిప్స్) తో సృష్టించిన కళాఖండాలు, చన్నపట్నం చెక్క బొమ్మలతో రూపొందించిన భారీ ఛాండ్లియర్ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మనం నిత్యజీవితంలో చూసే వస్తువుల వెనుక ఎంతో శక్తివంతమైన కథలు ఉంటాయని ఈ 17వ ఇండియా ఆర్ట్ ఫెయిర్ నిరూపిస్తోంది.ఇది కూడా చదవండి: UAE: స్కూళ్లు బంద్.. సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా
ఎన్ఆర్ఐ
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
అమెరికాలోని కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి ఉదంతం విషాదాంతమైంది. తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభ్యమైంది. పోలీసులు అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.అతని మృతదేహాన్నివీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యంత క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి, ప్రియమైనవారికి తమ హృదయపూర్వక సానుభూతిని తెలియ జేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.Consulate General of India in San Francisco is deeply concerned about the disappearance of Saketh Sreenivasaiah, an Indian post-graduate student of UC Berkeley, hailing from the State of Karnataka. The Consulate is in touch with the family and also is in contact with the…— India in San Francisco (@CGISFO) February 14, 2026 కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు.మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. తమ కొడుకు ఎలాగైనా క్షేమంగా తిరిగి వస్తాడని ఎదురు చూసిన కుటుంబీకుల్లో శ్రీనివాసయ్య మరణవార్త తీరని విషాదాన్ని మిగిల్చింది.
అమెరికాలో కర్నాటక విద్యార్థి అదృశ్యం
న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోరి్నయాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా పోయారు. కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) అమెరికాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్కిలీలో కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ పీజీ చేస్తున్నాడు. మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. సాకేత్ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆచూకీ కనుగొనే విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కర్నాటకలోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని శనివారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి సాకేత్ కనిపించకుండాపోయాడంటూ అతడి రూమ్మేట్ బనీత్ సింగ్ ఈ నెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని చోట్లా వాకబు చేసిన తను ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపినట్లు బనీత్ తెలిపాడు. ప్రభుత్వానికి సాకేత్ తండ్రి వినతి అమెరికాలో గల్లంతైన తమ కుమారుడిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందజేసినట్లు తండ్రి శ్రీనివాసయ్య తెలిపారు. చివరిసారిగా తమ కుమారుడితో ఈ నెల 9వ తేదీన ఫోన్లో మాట్లాడామన్నారు. 12వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ అతడి రూమ్మేట్ తమకు తెలిపాడన్నారు. కుమారుడి కోసం అమెరికా వెళ్లే విషయమై తాము ఆలోచిస్తున్నామన్నారు. సాకేత్ విషయంలో కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్ అధికారులు అక్కడి పోలీసులతో మాట్లాడాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కర్నాటక ప్రభుత్వం శనివారం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది.
అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం
అమెరికాలోని సియాటిల్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన గ్రాడ్యుయేట్ జాహ్నవి కందులకుటుంబానికి భారీ పరిహారం లభించనుంది. జాహ్నవి మృతి చెందిన దాదాపు మూడేళ్ల తర్వాత, ఆమె కుటుంబానికి గణనీయమైన ఆర్థిక పరిహారం అందనుంది.ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిది ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోటి కలలతో సియాటెల్లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు 2021లో అమెరికాకు వెళ్లింది.కానీ 2023, జనవరి 23వ తేదీ రాత్రి ఒక మలుపు దగ్గర రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని, కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏముంది మామూలు మనిషేగా...11 వేల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మరిచిపోయాడు. అతని మాటలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.మరోవైపు సియాటిల్లో ప్రమాదం, తమ బిడ్డ మృతిపై జాహ్నవి కుటుంబం దావా వేసింది. ఈ సంఘటన తెలుగు, భారతీయ వర్గాల నుండి మాత్రమే కాకుండా, స్థానికులు కూడా ప్రజల ఆగ్రహాన్ని వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో భారీ పరిహారంతో ఈ కేసును పరిష్కరించు కుంది. సియాటిల్ నగరం దాదాపు రూ. 262 కోట్ల (28 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి ఎటువంటి నేరారోపణలు లేకుండా, 5000 డాలర్లు జరిమానా విధించారు. అలాగే విధుల నుండి గత ఏడాది సస్పెండ్ చేశారు. సియాటెల్ ప్రకటనకందుల మరణం "హృదయ విదారకం" అని సియాటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె నష్టం ఊహించలేని బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు మరియు మా సమాజానికి కూడా జాహ్నవి కందుల జీవితం చాలా ముఖ్యమైనదే అంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని నగరం ఆ శాభావాన్ని వ్యక్తం చేసింది. కందుల దుర్మరణం జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ (ICS)తో సహా న్యాయవాద సంఘాలు విస్తృత పోలీసు సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి. 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ పోలీసు అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరికాదని, స్పష్టమైన మార్గదర్శకాలను డిమాండ్ చేస్తున్నామని IACS లలితా ఉప్పల అన్నారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!
విదేశాలకు వెళ్లడం అక్కడే స్థిరపడటం చాలామంది డ్రీమ్. 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా విదేశాల్లోని అక్కడి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం రా..రమ్మని ఆకర్షిస్తుంటుంది. తీరా వెళ్లాక గానీ తెలియదు. అక్కడి సమస్యలు..పరిస్థితులు. ఇక్కడొక భారత మహిళకు కూడా అలా అనిపించే తక్షణమే భారత్కు కుటుంబంతో సహా వచ్చి వాలిపోయింది. ఎందువల్ల తాను ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కానీ ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపదగినవిగానూ విదేశాలకు చెక్కేద్దామనే ఔత్సాహుకులకు గొప్ప పాఠాలుగానూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎందవల్ల ఇలా కుటుంబంతో సహా ఆమె భారత్కు వచ్చేసిందో తెలుసా..!?..లీబా సుబిన్ అనే మహిళ కుటుంబం దుబాయ్ నుంచి భారత్లోని తన స్వస్థలం కేరళకు వచ్చేసింది. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఆమె కారణాన్ని వివరిస్తూ..ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా చేశానని అంటోంది. ఈ నిర్ణయాన్ని సమయా పాలన, మానసిక శాంతికి సంబంధించిన విషయంగా పేర్కొంది. అదీగాక తమ ఫ్యామిలీ వీసా రెన్యువల్, అలాగే ఇంటి అద్దె రెన్యువల్ చేయాల్సి ఉండగానే.. చకచక ఈ నిర్ణయం తీసుకుని వచ్చేసినట్లు తెలిపారు. అలాగని ఏదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదని, బాగా ఆలోచించి, తన భాగస్వామితో, పిల్లలతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇలా వెనక్కి వచ్చేసి కేరళలో తమ సొంతింటిలో నివశించడం వల్ల దుబాయ్లోని అద్దె టెన్షన్ తగ్గింది, అలాగే ఇక్కడి సమాజంలో నివశించడం వల్ల సామాజిక సంబంధాలు పునరుద్ధరింపబడతాయి. పైగా ఎలాంటి అప్పులు, ఈఎంఐల బెడద లేకుడా మానసిక ప్రశాంతతో గడపొచ్చు అని చెప్పుకొచ్చిందామె. పైగా పిల్లవాడికి కేరళలో అంతర్జాతీయ స్కూల్ ఇంటికి సమీపంలోనే ఉంది పదినిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ దుబాయ్లో 90 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుందని జోడించారామె. బహుశా మాకు అనిపించింది..మీకు వర్కౌట్ కాకపోవచ్చు, పైగా మీరు విదేశాల్లోనే కంఫర్ట్ లైఫ్ని లీడ్ చేస్తుండొచ్చని, అది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ..మొత్తం కుటుబ సభ్యులు కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అన్ని విధాల శ్రేయస్కరం అంటూ తన పోస్ట్ని ముగించింది లీబా సుబిన్. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయంతో ఏకభవించారు, పైగా తిరిగి వెళ్లకూదనుకుంటున్న ఆమె నిర్ణయానికి స్వాగతం, శుభాకాంక్షలు అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by leeba (@unfilteredvoiceswithinme) (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!
క్రైమ్
కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య
కెనడాలో నివసిస్తున్న భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రేవాల్ (Nancy Grewal) దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని లాసల్లె పోలీసులు ఈ హత్యను నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగుతోంది. పంజాబీ మూలానికి చెందిన 45 ఏళ్ల నాన్సీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పంజాబ్లో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను, ముఖ్యంగా ఖలిస్తానీలను విమర్శిస్తూ పాపులర్ అయ్యారు. ప్రసిద్ధి చెందింది.ఈ హత్య కెనడాలోని భారతీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది .ఘటన వివరాలు ఇలా ఉన్నాయి మార్చి 3, 2026, రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో. కెనడాలోని లాసల్లే (LaSalle) నగరంలోని టాడ్ లేన్ (Todd Lane) ప్రాంతంలోని ఆమె నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఎసెక్స్-విండ్సర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మరణించారు.షల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. రాజకీయ అంశాలపై ఆమె చాలా నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. సోషల్ మీడియా వేదికల ద్వారా పలు వివాదాస్పద అంశాలపై స్పందించేవారు. ముఖ్యంగా భారత్-కెనడా ఉద్రిక్తతల మధ్య ఖలిస్తానీ సానుభూతి పరులను ఆమె బహిరంగంగానే ఖండించేవారు. అకాలీదళ్ నాయకత్వంపై, ముఖ్యంగా బిక్రమ్ సింగ్ మజితియాపై ఆమె తరచుగా విమర్శలు చేసేవారు. అలాగే జైలులో ఉన్న ఎంపీ అమృత్పాల్ సింగ్, డేరా బియాస్ అధిపతి గురీందర్ సింగ్ ధిల్లాన్కు వ్యతిరేకంగా కూడా ఆమె మాట్లాడారు. దీంతోపాటు 2025 జూన్లో భటిండాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన మరో ఇన్ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారి (కమల్ కౌర్ భాభి) మరణంపై కూడా ఆమె గళమెత్తారు.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్)లాసల్లే పోలీసులు ఈ కేసును యాక్టివ్ ఇన్వెస్టిగేషన్గా పరిగణిస్తున్నారు. టాడ్ లేన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. ప్రస్తుతానికి నిందితుడి ఆచూకీ ఇంకా లభించలేదు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు లేదా 'క్రైమ్ స్టాపర్స్'కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదీ చదవండి: సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా!
ఇద్దరు స్నేహితుల ఆత్మహత్యాయత్నం
నల్గొండ జిల్లా: ప్రేమ విఫలమైందని ఒకరు.. స్నేహం కోసం మరొకరు.. ఇద్దరు యువకులు కలిసి ఒకేచోట మద్యంలో గడ్డిమందు (గ్లైఫోసెట్) కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన లోడె పవన్, కోనేటి అఖిల్లిద్దరూ క్లాస్మేట్స్తోపాటు ప్రాణ స్నేహితులు కూడా. పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. నల్లగొండలో ఐటీఐ కూడా కలిసే చదివారు. ఈ క్రమంలోనే పవన్ కట్టంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ప్రేమించాడు. ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వద్దని వారించారు. ఈ క్రమంలో పవన్, ఆ బాలిక పది రోజుల కిందట ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కట్టంగూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విషయాన్ని పవన్ కుటుంబీకులకు తెలియజేయగా.. అడ్రస్ తెలుసుకొని పవన్ను, ఆ బాలికను రప్పించారు. ఆపై బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ప్రేమ విఫలమైందని పవన్ కుమిలిపోతున్నాడు. ఇద్దరూ కలిసి..: పవన్, అఖిల్ రోజు మాదిరిగానే బుధవారం కలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. గడ్డిమందు, మద్యం, కూల్డ్రింక్ కొనుగోలు చేసి వాటిని తీసుకొని పవన్ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. మద్యంలో గడ్డిమందు కలుపుకొని తాగారు. ఆ తర్వాత తమ సన్నిహితులకు ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని చెప్పారు. వారు వచ్చేసరికి ఇద్దరూ అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించగా, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.
దంతేవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్: దంతేవాడ-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలోని అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు రాజీవ్ పునేమ్ మరణించాడు. ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్, ఐఎస్ఎస్ఏఎస్ రైఫిల్స్,పిస్టల్స్తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
రెండేళ్ల చిన్నారి.. రాత్రంతా చెట్లపొదల్లోనే
హైదరాబాద్: అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తల్లిదండ్రులతో వచ్చి తప్పిపోయిన రెండేళ్ల బాలుడు మంగళవారం రాత్రంతా చెట్ల పొదల్లోనే ఉన్నాడు. వందలాది కుక్కలు అక్కడే తచ్చాడుతున్నా బాలుడికి పెద్దగా ప్రమాదం తలపెట్టలేదు. ఒకటి, రెండు కాట్లు వేసి వదిలిపెట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన నార్సింగి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గండిపేట మైసమ్మ దేవాలయానికి మంగళవారం తెల్లాపూర్నకు చెందిన వడ్డె వెంకటే‹Ù, అనూష దంపతులు కుమారుడు అభిమన్యు (2)తో కలిసి మొక్కు చెల్లించుకునేందుకు వచ్చారు. సాయంత్రం 5.50కు అభిమన్యును తీసుకుని వెంకటేష్ కుళాయి వద్దకు వెళ్లారు. కొద్ది సేపట్లోనే అభిమన్యు అదృశ్యమయ్యాడు. వెతికినా ప్రయోజనం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు ఆలయ ఆవరణలోని చెట్ల పొదల్లోనే రాత్రంతా ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. ఆలయ పరిసరాల్లో ఉండే వందల కుక్కలు బాలుడిని ఏమీ చేయకపోవడంతో గమనార్హం. ఈ సందర్భంగా ఇటీవల చిన్నారులను కుక్కలు తీవ్రంగా కరిచిన ఘటనలను గుర్తు చేసుకున్నారు.
వీడియోలు
₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
విరోష్ రిసెప్షన్లో రాజకీయ నాయకులు
చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతీసారీ తిరుమలకు కల్తీ నెయ్యి
మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి.. మేము ఆడవాళ్ళం బొమ్మలు కాదు
ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న పెద్ది రన్ టైం..!
హైదరాబాద్ టోలీచౌక్ లో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి
తిరుమల లడ్డూపై అపచారం.. నిజాల్ని చూపిస్తున్న గోవిందుడు
Jaammalamadugu: యువతి హత్య కేసు 8 నెలలు గడుస్తున్నా వీడని మిస్టరీ
అచ్చెన్నాయుడి నోటి దురుసు... భయపడకండి లడ్డూ కోసం మాట్లాడును లెండి
ట్రంప్ కు జై కొట్టిన సెనేట్ వీగిపోయిన డెమొక్రాట్ల తీర్మానం

