ఆర్టీసీ సమ్మె.. అడ్డుకుంటే పీడీపీపీ కింద కేసులు
ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు హైలైట్స్.. కరీంనగర్ జిల్లారెండో రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె..ఉమ్మడి జిల్లాలోని 11 డిపోల్లో మొత్తం వెయ్యి బస్సులకు గాను డిపోలకే పరిమితమైన సగానికి పైగా బస్సులుప్రైవేట్ డ్రైవర్లతో ప్రధాన రూట్లలో బస్సులు నడుపుతున్న ఆర్టీసీమరికొన్ని ఊళ్లకు బస్సులు లేక, ఉన్నా సరిపడా రాకపోవడంతో బస్టాండ్లలో ప్రయాణీకుల నిరీక్షణఆర్టీసీ ఉద్యోగులు వర్సెస్ సర్కార్ ప్రతిష్ఠంభనతో ప్రయాణీకుల ఇక్కట్లు.ఆర్టీసీ సమ్మెతో ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వాహనాల దందా.అధిక ధరలు వసూళ్లు.సూర్యాపేట జిల్లా :రెండవ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెసూర్యాపేట డిపో ఎదుట బైటాయించి కార్మికుల ధర్నాబస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు కొనసాగుతున్న సమ్మె.. తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.ఆర్టీసీ సమ్మెతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.వీలైనన్ని ఎక్కవ బస్సులు నడుపుతున్నామంటున్న అధికారులు.ప్రైవేటు విద్యాసంస్థల డ్రైవర్లు, తాత్కాలిక డ్రైవర్ల సమీకరణ.సిబ్బందిని అడ్డుకుంటే పీడీపీపీ చట్టం కింద కేసులు.నల్లగొండ జిల్లామిర్యాలగూడలో రెండవ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెఔట్ సోర్సింగ్ సిబ్బందితో బస్సులను నడిపిస్తున్న అధికారులుబస్టాండ్లో భారీగా మోహరించిన పోలీసులుబస్టాండ్ వద్దకు చేరుకొని ఆందోళనలకు దిగిన కార్మికులుహైదరాబాద్..నేడు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ..ఆర్టీసీ సమ్మె, కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చించనున్న కేబినెట్..ఇందిరమ్మ కుటుంబ భీమా విధివిధానాలపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్..ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక, అజారుద్దీన్-కోదండరాం ఎమ్మెల్సీల అభ్యర్థిత్వంపై చర్చించనున్న కేబినెట్..మెట్రో స్వాధీన ప్రక్రియ, నిర్వహణపై చర్చించనున్న కేబినెట్..
అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో మూడు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదం కారణంగా రెండు వాహనాల్లో 11 మంది ప్రాణాల కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. మీర్జాపూర్ జిల్లాలో ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి డ్రామాండ్గంజ్ లోయ నుంచి లాసోడా ప్రాంతం వైపు ఓ ట్రక్కు వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఆ ట్రక్కు ఎదురుగా వెళ్తున్న ట్రక్కుతో పాటు రెండు కార్లను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో రెండు ట్రక్కులకు మధ్యలో కార్లు చిక్కుకుని మంటలు చెలరేగాయి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతికష్టం మీద మృతదేహాలను వెలికితీశారు.ఇక, ఈ ఘటనలో రెండు వాహనాల్లో మంటలు చెలరేగి చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన 11 మందిలో ఏడుగురు మీర్జాపుర్ వాసులు కాగా, ఒకరు సోన్భద్ర జిల్లాకు చెందిన వారున్నారు. ముగ్గురు మధ్యప్రదేశ్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు మీర్జాపూర్ పోలీసులు తెలిపారు. #BreakingNews: मिर्जापुर में भीषण सड़क हादसा, ट्रक और बोलेरो की टक्कर में जिंदा जले 11 लोग, एक अनियंत्रित ट्रक ने बोलेरो समेत कई गाड़ियों को टक्कर मार दी. टक्कर इतनी भीषण थी कि बोलेरो गाड़ी में आग लग गई और उसमें सवार सभी 11 लोगों की जलकर मौत हो गई. #Mirzapur #RoadAccident #UP https://t.co/xdMOdw4Ed0 pic.twitter.com/8Gi8VQLqSK— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) April 22, 2026
భారత వాణిజ్యానికి పశ్చిమాసియా ముప్పు..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో భారత వాణిజ్యం, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. కరెంటు అకౌంటు లోటు, రూపాయి మారకం విలువపై ఒత్తిడి పెరగడం వల్ల ప్రభావం పడుతుందని 2025–26 అక్టోబర్, డిసెంబర్ ట్రేడ్ వాచ్ రిపోర్టులో నీతి ఆయోగ్ ఈ విషయాలు తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ఇండియా–గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) పురోగతి నెమ్మదించి, డైవర్సిఫికేషన్పై ప్రభావం పడింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలనేవి వన్–వే మార్గం కాదని, దీని వల్ల కొత్త మార్కెట్ లభిస్తుందని మనం అనుకున్నట్లే అటువైపు దేశాలు కూడా అలాగే ఆలోచిస్తాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరి తెలిపారు. కఠినతరమైన పరిస్థితుల్లోను భారత్ వాణిజ్య కార్యకలాపాలు మెరుగ్గానే ఉన్నట్లు పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తూ గత 20 ఏళ్లుగా భారత్ సగటున 6 శాతం వృద్ధి చెందింది. → రత్నాభరణాల రంగం మిడ్–వేల్యూ ఉత్పత్తుల నుంచి అధిక విలువ చేసే ఎగుమతులవైపు మళ్లాలి. → డిజైన్ ఆధారిత తయారీ, క్లస్టర్ ఆర్అండ్డీ, జీఐ బ్రాండెడ్ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. → డ్యూటీ డ్రాబ్యాక్/ రీఫండ్స్ను క్రమబదీ్ధకరించాలి. ముడి సరుకుల వ్యయాల భారాన్ని తగ్గించేందుకు, చిన్న సంస్థల (ఎంఎస్ఎంఈ) మార్జిన్లను పెంచేందుకు, సరఫరాను మెరుగుపర్చాలి. → రుణ లభ్యతను పెంచాలి. పెట్టుబడుల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలి. క్రెడిట్ గ్యారంటీలు, వడ్డీ రాయితీ, సప్లై చెయిన్ ఫైనాన్స్ను మెరుగుపర్చాలి. → 2026 ఏప్రిల్–డిసెంబర్ మధ్య వ్యవధిలో ఉత్పత్తులు, సేవల వాణిజ్యం 5.3 శాతం పెరిగి 1.37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. → మొత్తం వాణిజ్యంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్టీఏ) భాగస్వాముల వాటా పెరిగింది. → రత్నాభరణాల రంగంలో భారత్ కీలకంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఎగుమతుల్లో అమెరికా, యూఏఈ, హాంకాంగ్ వాటా 73 శాతంగా ఉంది. దిగుమతుల్లో యూఏఈ, స్విట్జర్లాండ్, హాంకాంగ్ వాటా 60 శాతంగా ఉంది.
ఈ రాశి వారికి మిత్రుల నుంచి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.సప్తమి రా.1.42 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పునర్వసు రా.1.41 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ప.2.23 నుండి 3.53 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.43 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు, అమృత ఘడియలు: రా.11.24 నుండి 12.54 వరకు.సూర్యోదయం : 5.43సూర్యాస్తమయం : 6.12రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం..... నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి.వృషభం.... వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహమే..మిథునం...... శుభకార్యాలకు హాజరవుతారు. విందువినోదాలు. వాహనయోగం. కుటుంబసభ్యులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక చింతన.కర్కాటకం.... కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.సింహం..... కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం. పనుల్లో పురోగతి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.కన్య.... మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు.తుల.... ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. అనుకోని ధనవ్యయం. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.వృశ్చికం... ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.ధనుస్సు..... సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.మకరం.... నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. కుటుంబసౌఖ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.కుంభం... పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.మీనం... ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన.
అవాస్తవాలు ఆవేదనను కలిగించాయి: సాయి పల్లవి
అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
హిమాలయంలాంటి అచంచలమైన పర్సనాలిటీ
ఆర్టీసీ సమ్మె.. అడ్డుకుంటే పీడీపీపీ కింద కేసులు
వైరుధ్యం వైవిధ్యాల విలక్షణ గాయని జానకి
అల్లరిమూకలపై డేగ కన్ను
బెంగాల్లో నేడు తొలి దశ పోలింగ్
నేడే తమిళనాడు సమరం
చీకటి కొన్నాళ్లే.. రాబోయే రోజులు మనవే
పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై యుద్ధ విమానాల విన్యాసాలు
ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్ నినో’
ముంబైలో స్థిరపడనున్న అల్లు అర్జున్.. స్పందించిన అరవింద్
‘కీమో వద్దు.. పసరు ముద్దు’.. క్యాన్సర్ రోగికి ఏఐ షాక్!
వాహనదారులకు అలెర్ట్.. పెట్రోల్కి గుడ్బై?
సార్ మనమిప్పుడు తమిళనాడులో ఉన్నాము!
‘మన చంద్రన్న’ పుస్తకంలో ‘అప్పులు’ అంశం ఏ పేజీలో ఉంది సార్!
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు
ఇరాన్కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
మొన్న 70 ఏళ్ల హీరో.. ఇప్పుడు 35 ఏళ్ల హీరో
ఈ 8 మంది అమ్మాయిలను వదిలేయండి: ట్రంప్
'2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': కియోసాకి
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ కామెడీ సినిమా
ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు
ఏడు రోజుల్లో ఐదు కిలోల బరువు..! అమ్మ చెప్పే డైట్ ప్లాన్
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధన, వస్తులాభాలు
టీమిండియాలోకి సంచలన ఫాస్ట్ బౌలర్
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. కాసేపట్లో ఈ జిల్లాల్లో..
మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు షాక్
తెలంగాణ మహిళలకు ‘ఫ్రీ’ షాక్!
అవాస్తవాలు ఆవేదనను కలిగించాయి: సాయి పల్లవి
అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
హిమాలయంలాంటి అచంచలమైన పర్సనాలిటీ
ఆర్టీసీ సమ్మె.. అడ్డుకుంటే పీడీపీపీ కింద కేసులు
వైరుధ్యం వైవిధ్యాల విలక్షణ గాయని జానకి
అల్లరిమూకలపై డేగ కన్ను
బెంగాల్లో నేడు తొలి దశ పోలింగ్
నేడే తమిళనాడు సమరం
చీకటి కొన్నాళ్లే.. రాబోయే రోజులు మనవే
పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై యుద్ధ విమానాల విన్యాసాలు
ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్ నినో’
ముంబైలో స్థిరపడనున్న అల్లు అర్జున్.. స్పందించిన అరవింద్
‘కీమో వద్దు.. పసరు ముద్దు’.. క్యాన్సర్ రోగికి ఏఐ షాక్!
వాహనదారులకు అలెర్ట్.. పెట్రోల్కి గుడ్బై?
సార్ మనమిప్పుడు తమిళనాడులో ఉన్నాము!
‘మన చంద్రన్న’ పుస్తకంలో ‘అప్పులు’ అంశం ఏ పేజీలో ఉంది సార్!
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు
ఇరాన్కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
మొన్న 70 ఏళ్ల హీరో.. ఇప్పుడు 35 ఏళ్ల హీరో
ఈ 8 మంది అమ్మాయిలను వదిలేయండి: ట్రంప్
'2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': కియోసాకి
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ కామెడీ సినిమా
ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు
ఏడు రోజుల్లో ఐదు కిలోల బరువు..! అమ్మ చెప్పే డైట్ ప్లాన్
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధన, వస్తులాభాలు
టీమిండియాలోకి సంచలన ఫాస్ట్ బౌలర్
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. కాసేపట్లో ఈ జిల్లాల్లో..
మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు షాక్
తెలంగాణ మహిళలకు ‘ఫ్రీ’ షాక్!
ఫొటోలు
‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
రెడ్ రోజ్లా మెరిసిపోతున్న హీరోయిన్ మానస వారణాసి (ఫొటోలు)
రానా సతీమణి మిహికా బజాజ్ ఆర్ట్ షో.. సందడి చేసిన టాలీవుడ్ తారలు (ఫొటోలు)
పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన.. భారీగా జన సందోహం (ఫొటోలు)
ప్రకృతి ఒడిలో అనసూయ సమ్మర్ చిల్ (ఫొటోలు)
హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన శివాలయం గురించి తెలుసా మీకు? (ఫోటోలు)
తస్సాదియ్యా.. సమంత ఇంత సింపుల్గా ఉందేంటి! (ఫొటోలు)
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
నేటి నుండి కేదార్నాథ్ దర్శనం.. భారీగా భక్తులు (ఫొటోలు)
'వాలా 2' ప్రీ రిలీజ్ ఈవెంట్లో తేజా సజ్జా సందడి (ఫొటోలు)
సినిమా
శారీలో హీరోయిన్ కృతి శెట్టి అందాలు.. ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ లుక్..!
బ్లూ డ్రెస్లో హీరోయిన్ శ్రియా శరణ్..పాలరాతిలా మెరిసిపోతున్న హీరోయిన్ లక్ష్మీ ప్రణీత..శారీలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అందాలు..బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ గ్లామరస్ లుక్స్..హ్యాపీ ఎర్త్ డే అంటోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్...ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ.. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi)
'మా ప్రేమ మొదలైంది ఆ సినిమాతోనే': అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. గతేడాది కాళిధర్ లపట్టా, హౌస్ఫుల్-5 చిత్రాలతో మెప్పించారు. అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన బచ్చన్.. బాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఉండగానే నటి ఐశ్వర్య రాయ్ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈనెల 21న బాలీవుడ్ జంట తమ 19 వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అభిషేక్.. ఐశ్వర్యతో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఐశ్వర్యతో రిలేషన్, ప్రేమ ఎలా మొదలైందన్న సీక్రెట్ను అభిషేక్ పంచుకున్నారు. 2000 సంవత్సరంలో ధాయ్ అక్షర్ ప్రేమ్ కే' సెట్స్లో ఐశ్వర్యను మొదటిసారి కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే అప్పుడు మా మధ్య రిలేషన్ కేవలం స్నేహపూర్వకంగా మాత్రమే ఉండేదన్నారు. అప్పుడు తనతో లవ్ అనే ఆలోచనే నాకు రాలేదన్నారు. కానీ 2006లో 'ఉమ్రావ్ జాన్' సినిమా చిత్రీకరణ సమయంలో మా మధ్య ప్రేమ చిగురించిందని అభిషేక్ తెలిపారు. మణిరత్నం దర్శకత్వం వహించిన 'గురు' సినిమా టైమ్లో మా బంధం మరింత బలపడిందన్నారు. దర్శకుడు మణిరత్నం మా ఇద్దరికీ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని.. ఆయన ఒక స్నేహితుడిగా మాత్రమే కాదు.. గాడ్ఫాదర్ అని ప్రశంసించారు. తమ కూతురు ఆరాధ్యను సరైన విలువలతో పెంచిన పూర్తి ఘనత ఐశ్వర్యకే దక్కుతుందన్నారు. ఐశ్వర్య కేవలం నా కూతురికి తల్లి మాత్రమే కాదు.. నా సోల్మేట్ కూడా అని కొనియాడారు. కాగా.. న్యూయార్క్లో జరిగిన 'గురు' ప్రీమియర్లోనే అభిషేక్, ఐశ్వర్యకు ప్రపోజ్ చేశారు. ఇది వారి లైఫ్లో ఓ అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. నిశ్చితార్థం తర్వాత ఏప్రిల్ 2007లో వీరిద్దరి వివాహం జరిగింది.
హీరోగా టాలీవుడ్ కమెడియన్.. ట్రైలర్ రిలీజ్
కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న చిత్రం జెట్లీ. ఈ మూవీకి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సత్య ఈజ్ నాట్ జెట్లీ అంటూ సాగే పుల్ మాస్ సాంగ్ను రిలీజ్ చేయగా ఆడియన్స్ను అలరించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, రియా సింఘా, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందించారు.
విషాదం.. గుండెపోటుతో 30 ఏళ్ల నటి మృతి
చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. గుండెపోటుతో హర్యానా నటి దివ్యాంక శిరోహి(30) మృతి చెందారు. మంగళవారం రాత్రి ఆమెకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. బుధవారం ఉదయం ఘజియాబాద్లో ఆమె అంత్యక్రియలు జరిగాయి.మాసూమ్ శర్మతో కలిసి కవర్ సాంగ్స్దివ్యాంక స్వస్థలం ఉత్తర ప్రదేశ్. ఆమెకు సోదరుడు హిమాంశు, సోదరీమణులు దీపాంశు. జస్మీత్ ఉన్నారు. 1996 నవంబర్ 19న జన్మించిన దివ్యాంక.. మీరట్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో బీసీఏ, సిక్కింలో ఎంబీఏ డిగ్రీని పూర్తి చేసి చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. గాయకుడు మాసూమ్ శర్మతో కలిసి కవర్ సాంగ్స్ కూడా చేశారు. 50కి పైగా హర్యానా పాటలలో నటించడమే కాదు, మాసూమ్ శర్మ, అమిత్ సైని రోహ్తకియా, కేడీ వంటి ప్రముఖులతో కలిసి తెరను పంచుకున్నారు.టిక్టాక్తో ఫేమస్..టిక్టాక్తో ఫేమస్ అయిన నటి దివ్యాంక. పంజాబీ గాయని సునంద శర్మ పాడిన 'మేరీ మమ్మీ ను పసంద్ నీ తూ' అనే పాటకు దివ్యాంక చేసిన టిక్టాక్ బాగా వీడియో వైరల్ అయింది. ఆ వీడియోకు దాదాపు 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత టిక్టాక్లో ఆమె ఫాలోవర్ల సంఖ్య 5 కోట్లకు చేరింది. ఇండియాలో టిక్టాక్ బ్యాన్ అయిపోయాక ఆమె ఇన్ స్టాగ్రాం బాట పట్టింది. ఇన్స్టాగ్రాంలో కూడా 1.3 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది. 30 ఏళ్ల వయసులోనే దివ్యాంక ఇలా గుండెపోటుతో చనిపోవడంతో ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. View this post on Instagram A post shared by Divyanka (@divyankaasirohi)
క్రీడలు
రాజస్తాన్ గెలుపు బాట.. లక్నోపై ఘన విజయం
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. బుధవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 40 పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది. 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక లక్నో చతికలపడింది. పంత్ సేన లక్ష్య చేధనలో 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది.రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించగా.. బర్గర్, బ్రిజేష్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు రవీంద్ర జడేజా, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు. లక్నో ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్(55) టాప్ స్కోరర్గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్తాన్ను జడేజా(29 బంతుల్లో 43) ఆదుకున్నాడు. అతడితో పాటు ఫెరీరా(20), శుభమ్ దూబే(19), హెట్మైర్(22) రాణించారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మోహ్షిన్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు.
హైదరాబాద్పై స్మిత్ విధ్వంసకర సెంచరీ
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో ముల్తాన్ సుల్తాన్స్ స్టార్ ఓపెనర్ స్టీవ్ స్మిత్ తన భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. బుధవారం కరాచీ వేదికగా హైదరాబాద్ కింగ్స్మెన్స్తో మ్యాచ్లో స్మిత్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ ఆస్ట్రేలియన్ లెజెండ్ హైదరాబాద్ బౌలర్లను ఉతికారేశాడు. కరాచీ నేషనల్ స్టేడియంలో స్మిత్ బౌండరీల వర్షం కురిపించాడు.హునైన్ షా వేసిన ఒకే ఓవర్లో స్మిత్ ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో స్మిత్ కేవలం 47 బంతుల్లోనే తన తొలి పీఎస్ఎల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా కేవలం 50 బంతులు మాత్రమే ఎదుర్కొన్న స్మిత్.. 12 ఫోర్లు, 6 సిక్స్లతో 106 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో స్మిత్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ముల్తాన్ సుల్తాన్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. అదేవిధంగా స్మిత్కు ఇది తన టీ20 కెరీర్లో మూడువ అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. సిడ్నీ సిక్సర్స్ తరపున చేసిన 125 పరుగులు అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన స్మిత్..231 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026లో ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచాడు. వైభవ్ 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్లో ఫుల్ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను సూర్యవంశీ కోల్పోయాడు.ఈ మ్యాచ్లో వైభవ్ సింగిల్ డిజిత్ స్కోరే పరిమితమైనప్పటికి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన రెండో ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టడంతో వైభవ్ ఈ రేర్ ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. వైభవ్ కేవలం 222 బంతుల్లోనే ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (260 బంతులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో మాక్సీ ఆల్టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ ఏడాది సీజన్లో వైభవ్ 7 మ్యాచ్ల్లో 220.87 స్ట్రైక్ రేట్తో 254 పరుగులు చేశాడు.చదవండి: 'అగార్కర్.. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకో'
'అగార్కర్.. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకో'
క్రికెట్ ప్రపంచానికి ప్రస్తుతం ఒకే ఒక్క గాడ్ ఉన్నాడు. అతడే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. అయితే రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో 'సెమీ-గాడ్'గా అవతరిస్తాడని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ జోస్యం చెప్పాడు. అదేవిధంగా 15 ఏళ్ల వైభవ్ను వీలైనంత త్వరగా జాతీయ ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ను అతడు సూచించాడు."వైభవ్ సూర్యవంశీ నిజంగా ఒక అద్భుతం. అతడి టాలెంట్కు ఫిదా అయిపోయాను. ఇలాంటి ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా అరుదుగా ఉంటారు. అతడు బ్యాట్ స్పీడ్, షాట్ సెలక్షన్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. అజిత్ తొందరగా ఆ కుర్రాడిని జాతీయ జట్టులోకి తీసుకో. అతడు భారత్ ఆడబోయే తదుపరి సిరీస్కు వైభవ్ జట్టులో కచ్చితంగా ఉండాలి. నిజానికి ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ జట్టులోనే అతడు ఉండాల్సింది.ప్లేయింగ్ ఎలెవన్లో కాకపోయినా, కనీసం జట్టుతో ట్రావిల్ చేసి ఉన్న బాగుండేది. అతడికి అంతర్జాతీయ క్రికెట్పై ఒక అవగాహన వచ్చేది. వైభవ్కు జాతీయ జట్టు తరపున కూడా రాణించే సత్తాఉంది. బుమ్రా లాంటి బౌలర్కు మొదటి బంతికి వైభవ్ సిక్స్ బాదాడు. ఆ తర్వాత హేజిల్వుడ్ను ఓ ఆడుకున్నాడు. బౌలర్ ఎవరనేది అతడికి సంబంధం లేదు. నేను కెప్టెన్గా ఉన్నప్పుడు 16 ఏళ్ల యంగ్ టాలెంటెడ్ క్రికెటర్ భారత జట్టులోకి వచ్చాడు. అతనే సచిన్ టెండూల్కర్. ఈ రోజు అతడిని క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తున్నారు. వైభవ్కు క్రికెట్లో తదుపరి 'సెమీ-గాడ్' అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి" అని దీ వీక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ కేవలం 7 మ్యాచ్ల్లో 220.87 స్ట్రైక్ రేట్తో 254 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: ఆ టీమ్కు భారీ షాక్.. ఉన్నపళంగా ఇంటికి వెళ్లిపోయిన విధ్వంసకర ప్లేయర్
న్యూస్ పాడ్కాస్ట్
రాబోయే రోజులు మనవే.. కష్టాలు చెప్పుకున్న ప్రజలకు భరోసా ఇచ్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
‘ఉపాధి’పై ఇంత నిర్లక్ష్యమా?. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు
ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా... అమెరికా నౌకలపై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరణ..
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న పాపం ప్రతిపక్షాలదే... భ్రూణ హత్యతో పాపం మూటగట్టుకున్నాయి... ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
లోక్సభలో గట్టెక్కని మహిళా బిల్లు... అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు... మూడింట రెండొంతుల మెజారిటీ సాధనలో మోదీ సర్కారు విఫలం
డీలిమిటేషన్ దంగల్కు రంగం సిద్ధం... మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్
మత్స్యకారుల కడుపుపై తంతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు కుట్ర... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
చట్టసభల్లో చారిత్రక మలుపు... లోక్సభ స్థానాలు 850కి పెంపు... రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
బిజినెస్
రిలయన్స్ కమ్యూనికేషన్స్పై సీబీఐ పంజా
ఒకప్పుడు టెలికాం రంగంలో అగ్రగామిగా వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కు జారీ చేసిన బాండ్లు, రుణ పత్రాల (డిబెంచర్స్) వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. బుధవారం కంపెనీకి చెందిన వివిధ కార్యాలయాల్లో సీబీఐ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.రికార్డుల స్వాధీనం - సోదాల వివరాలురిలయన్స్ కమ్యూనికేషన్స్కు చెందిన నవీ ముంబై ప్రధాన కార్యాలయంతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధానంగా 2009 నుంచి 2016 మధ్య కాలంలో ఎల్ఐసీకి జారీ చేసిన బాండ్లు, డిబెంచర్లు, కమర్షియల్ పేపర్స్కు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నవీ ముంబై కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు సాగే కీలక ప్రాంతాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఎల్ఐసీ పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, అంతర్గత ఈమెయిల్స్, ఆర్థిక లావాదేవీల చిట్టాను సీబీఐ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఈ దర్యాప్తు ప్రధానంగా 2009-2016 మధ్య జరిగిన లావాదేవీలపైనే కేంద్రీకృతమై ఉంది. ఆ సమయంలో కంపెనీ నిధుల సేకరణ కోసం అనుసరించిన మార్గాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందనేది ప్రధాన ఆరోపణ.దర్యాప్తు వెనుక అసలు కారణం?ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీ నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీ మొత్తంలో నిధులను సేకరించింది. అయితే ఈ డిబెంచర్లు, బాండ్ల జారీ సమయంలో కంపెనీ తన ఆర్థిక పరిస్థితిని తప్పుగా చూపించిందా? లేదా నిధుల మళ్లింపు జరిగిందా? అనే కోణంలో సీబీఐ విచారణ జరుపుతోంది. ముఖ్యంగా పబ్లిక్ మనీ ఉన్న ఎల్ఐసీకి చెల్లించాల్సిన బకాయిల విషయంలో కంపెనీ వైఫల్యం చెందడం, అంతకుముందు జరిగిన ఒప్పందాల్లో పారదర్శకత లోపించడం వంటి అంశాలు ఈ సోదాలకు దారితీశాయి.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
దుబాయ్ రియల్టీలో భారత పెట్టుబడులకు బ్రేక్!
పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి గమ్యస్థానమైన దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో భారతీయ పెట్టుబడిదారులు కొంతకాలం వేచి చూసే ధోరణిని అవలంబించవచ్చని, దీనివల్ల దుబాయ్ రియల్టీలోకి వచ్చే భారతీయ మూలధనం తగ్గే అవకాశం ఉందని అనారాక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయుష్ పురి విశ్లేషించారు. అయితే, ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమేనని, భారత్-దుబాయ్ మధ్య ఉన్న సుదీర్ఘ పెట్టుబడి బంధం చెక్కుచెదరదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఆర్థిక అంశాలే కీలకంపశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి భారత్పై రెండు రకాలుగా ప్రభావం చూపుతుందని ఆయుష్ పేర్కొన్నారు. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం హార్మూజ్ జలసంధిపై గణనీయంగా ఆధారపడుతుంది. అక్కడ అంతరాయం కలిగితే చమురు ధరలు పెరిగి దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో ఒత్తిడి పెరిగినప్పుడల్లా రూపాయి విలువ ఒడిదుడుకులకు లోనవుతుంది. దీనివల్ల విదేశీ కేటాయింపులు చేసే పెట్టుబడిదారులు తమ నిర్ణయాలను పునసమీక్షించుకోవాల్సి వస్తోంది.‘సంఘర్షణ స్వల్పకాలికమైతే అది కేవలం భయాందోళనలకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ అది సుదీర్ఘకాలం కొనసాగితే వినియోగదారుల ప్రవర్తన మారుతుంది. పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చులు, రూపాయిపై ఒత్తిడి వల్ల పెట్టుబడిదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారు’ అని ఆయూష్ వివరించారు.స్వదేశీ మార్కెట్కు కలిసొచ్చే అవకాశందుబాయ్లో పెట్టుబడులు తగ్గడం భారతీయ ప్రీమియం హౌసింగ్ మార్కెట్కు వరంగా మారే అవకాశం ఉంది. విదేశాల్లో అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన స్వదేశీ మార్కెట్ వైపు మొగ్గు చూపుతారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో గురుగ్రామ్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
సామ్ ఆల్ట్మాన్ ఇంటిపై దాడి
కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచంలో అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ నివాసంపై జరిగిన దాడి అంతర్జాతీయ టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దాడి కేవలం ఒక వ్యక్తి చేసిన ఉన్మాద చర్య మాత్రమే కాదని, ఏఐ పరిశ్రమలో ప్రత్యర్థి సంస్థలు ప్రచారం చేస్తున్న భయానక కథనాల ఫలితమేనని ఆల్ట్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన పోటీ కంపెనీ ఆంత్రోపిక్ తీరును ఆయన తప్పుబట్టారు.ఏం జరిగింది?శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆల్ట్మాన్ నివాసమే లక్ష్యంగా ఈ నెల ప్రారంభంలో ఒక దుశ్చర్య జరిగింది. టెక్సాస్కు చెందిన డేనియల్ మోరెనో-గామా అనే వ్యక్తి మోలోటోవ్ కాక్టెయిల్ (పెట్రోల్ బాంబు)తో ఆల్ట్మాన్ ఇంటిపై దాడికి దిగాడు. అనంతరం ఓపెన్ఏఐ ప్రధాన కార్యాలయం సమీపంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో తేలిన కీలక అంశాలునిందితుడు ఆల్ట్మాన్కు హాని కలిగించే ఉద్దేశంతోనే టెక్సాస్ నుంచి కాలిఫోర్నియాకు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.నిందితుడి వద్ద ఏఐ విధానానికి వ్యతిరేకంగా ఉన్న పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలువురు ఏఐ పరిశ్రమ దిగ్గజాల పేర్లు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం నిందితుడు హత్యాయత్నంతో పాటు పలు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.పరిశ్రమ విమర్శలే కారణంఇటీవల ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ ఘటనపై స్పందించిన సామ్ ఆల్ట్మాన్ ఇది తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని పేర్కొన్నారు. ఏఐ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందంటూ కొన్ని సంస్థలు చేస్తున్న అతివాద ప్రచారం సామాన్యులలో అనవసర భయాందోళనలు కలిగిస్తోందని ఆయన వాదించారు. ‘ఏఐ ప్రమాదాల గురించి ప్రత్యర్థి సంస్థలు, ముఖ్యంగా ఆంత్రోపిక్ వంటి ల్యాబ్స్ అనుసరిస్తున్న తీరు ఏమాత్రం సహేతుకం కాదు. ఇది ప్రజల్లో విద్వేషాన్ని పెంచుతోంది’ అని ఆల్ట్మాన్ విమర్శించారు.ఓపెన్ఏఐ vs ఆంత్రోపిక్ఓపెన్ఏఐ నుంచి విడిపోయి డారియో అమోడి నేతృత్వంలో స్థాపించబడిన ఆంత్రోపిక్ సంస్థకు, ఆల్ట్మాన్ సంస్థకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఓపెన్ఏఐ అనుసరిస్తున్న విధానాలను అమోడి గతంలో ‘సేఫ్టీ థియేటర్’ (ప్రదర్శన కోసం చేసే భద్రత) అని విమర్శించారు. దీనికి ప్రతిగా ఆంత్రోపిక్ తన వ్యాపార ప్రయోజనాల కోసం భయాన్ని పెట్టుబడిగా పెడుతోందని ఆల్ట్మాన్ ఆరోపిస్తున్నారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
భగ్గుమన్న పశ్చిమాసియా
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న సానుకూల ధోరణికి బ్రేక్ వేస్తూ బుధవారం ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. నేటి ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 756 పాయింట్లు పతనమై 78,516 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 24,378 వద్ద ముగిసింది.విశ్లేషకుల అంచనా ప్రకారం పతనానికి కారణాలుముదురుతున్న అనిశ్చితిపశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. అమెరికా విధించిన ఆంక్షలు, ఇరాన్ ప్రతిచర్యల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి మూతపడటం చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మార్గం గుండానే ప్రపంచంలోని 20% చమురు రవాణా జరుగుతుంది. తాజా దాడుల వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన నింపడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు.చమురు ధరల సెగ - ద్రవ్యోల్బణ ముప్పుయుద్ధం కారణంగా ఇటీవల ముడిచమురు ధరలు బ్యారెల్కు 120 డాలర్ల మార్కును దాటడం భారత్ వంటి దిగుమతి దేశాలకు పెద్ద దెబ్బ. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. తాజా గణాంకాల ప్రకారం, మార్చి నెలలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా 3.3% కి పెరగడం, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉండటం మార్కెట్పై ఒత్తిడి పెంచింది.వడ్డీ రేట్ల తగ్గింపుపై సందేహాలుద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తాయన్న ఆశలు ఆవిరయ్యాయి. ‘వడ్డీ రేట్లు తగ్గకపోగా, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి బ్యాంకులు మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది’ అనే వార్తలు టెక్నాలజీ, బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలకు దారితీశాయి.ఇప్పుడేం చేయాలి?ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ తీవ్రమైన ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధ పరిణామాలు, ముడిచమురు ధరల కదలికలను బట్టి రానున్న రోజుల్లో మార్కెట్ దిశ నిర్దేశించబడుతుంది. చిన్న ఇన్వెస్టర్లు తొందరపడి అమ్మకాలు జరపకుండా నాణ్యమైన షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించడం ఉత్తమం.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
ఫ్యామిలీ
60లోనూ 40లా.. వృద్ధురాలి యంగ్లుక్!
వయసు పైబడిన..చిన్నవాళ్లలా యంగ్లుక్లో కనిపించాలని పరితపిస్తుంటారు చాలామంది. అయితే అందుకు తగ్గట్టుగా జీవనశైలిలో మార్పులు చేసుకోరు. అలాగే శరీరానికి కావాల్సినంత వ్యాయామాలు వంటి వాటిపై దృష్టిసారించరు. యంగ్ లుక్ అటుంచి..ఆరోగ్యంగా ఉండటం కోసం అయినా చేయరు..ఇక యవ్వనంగా ఎలా కనిపిస్తారు అని అంటోంది ఈ చెన్నైకి చెందిన వృద్దురాలు. 67 ఏళ్ల వయసున్న ఆమెని చూస్తే జస్ట్ 40 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆ వృద్ధురాలి ఆహార్యం. మరి ఆమె చెప్పే పిట్నెస్ రహస్యలేంటో సవివరంగా చూద్దామా..!.కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ తమిళరసన్ ఆ వృద్ధరాలి గురించి ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఆమెను ఫిట్నెస్ రొటీన్ గురించి అడగడం చూడొచ్చు.మంచి ఆరోగ్యానికి వ్యాయామమే కీలకంవయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనపడుతుంది; ఇది సాధారణ జీవశాస్త్రం. అయితే, క్రమం తప్పని వ్యాయామంతో మన శరీరానికి శిక్షణ ఇస్తే..న క్రియాత్మక బలం, సామర్థ్యాలను నిలుపుకోవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని అంటోందామె. ఆమె ఉదయం 5:30 నుంచి 5:45 గంటల మధ్య నిద్రలేచి, ఇంటి పనులు ముగించుకుని, యోగాతో రోజుని ప్రారంభిస్తానని అంటోంది. ఇక ఉదయం 7:30 గంటలకు పార్కులో వాకింగ్ చేస్తానని చెప్పారు. ఆరోగ్యంగా ఉండటానికి కేవలం వాకింగ్ సరిపోదని అన్నారు. శక్తినిచ్చే వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహార తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు. అలాగే తానేమి సప్లిమెంట్లని ఉపయోగించనని అన్నారు. అల్పాహారంగా కేవలం మజ్జిగ మాత్రమే తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో మాత్రం అవసరమైన పోషకాలు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్నం ప్రోటీన్ కోసం చికెన్, మటన్ లేదా గుడ్లతో కూడిన చాలా మంచి భోజనం చేస్తాను. ప్రత్యేకంగా పాటించే డైట్ అంటూ ఏమి లేదని అన్నారామె. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతానని అన్నారు. భోజనం మధ్యలో ఆకలి వేస్తే నచ్చిన పండ్లను తీసుకుంటానని చెప్పారు. కానీ వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటానని అన్నారు. మంగళవారం, శనివారాలు తప్పనిసరిగా ఉపవాసం ఉంటానని చెప్పారు. గృహిణిగా ఉంటూనే ఆరోగ్యం పట్ల ఇంత కేర్ తీసుకుంటున్నా ఆమె అందరికీ స్ఫూర్తి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే సరైన ఆహారం తీసుకోవడం, శరీరానికి తగిన వ్యాయామం చేయడం తదితరాలే అత్యంత ముఖ్యమని అని చెబుతున్నారామె. ఎక్కువగా మానసిక ఆరోగ్యంపై దృష్టిపెడితేనే ఏదైన సాధ్యమని అన్నారు. ఆడవాళ్లు, ఇంట్లో శాంతి, సంతోషంగా ఉండేలా చూసుకోవడం ప్రధానమని అన్నారు. అలాగే ఒత్తిడిని దరిచేరకుండా చూసుకోవాలని అన్నారు. అలాగే విషయాలను పట్టుకుని వేలాడకుండా..జీవితంలో ఏది వచ్చినా..యథాతథంగా స్వీకరించడం అత్యంత ముఖ్యం అని అన్నారు. అప్పుడే మనం శారీరకంగా ఫిట్గా ఉండగలుగుతామని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Jhaal Muri: మోదీ మెచ్చిన చిరుతిండి..! ఇన్ని పేర్లతో పిలుస్తారా..)
మోదీ మెచ్చిన చిరుతిండి..! ఇన్ని పేర్లతో పిలుస్తారా..
బెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రఖ్యాత చిరుతిండి ఝాల్మురీని మోదీ రుచి చూశారు. దీన్ని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, ఇతర మసాలాలతో తయారు చేస్తారు. ఝార్గ్రామ్ జిల్లాలో మోదీ కాన్వాయ్ ఓ దుకాణం ముందు హఠాత్తుగా ఆగింది. మోదీ వాహనం దిగి దుకాణదారును పలకరించారు. ‘‘సోదరా! ఝాల్మురీ ఎంత? నాకు రుచి చూపించు. రుచికరంగా త యారు చెయ్’’ అని కోరా రు. తను వెంటనే ఝాల్ మురీ చేసి ప్రధానికి అందించాడు. డబ్బులు తీసుకోవడానికి నిరాకరించగా మోదీ బలవంతంగా అతడి చేతిలో పెట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఈ చిరుతిండి హాట్టాపిక్గా మారింది. ఈ వంటకానికి యావత్తు భారతదేశంలో ప్రజలంతా చేసుకుంటారు. కాకపోతే ఆయా ప్రాంతాల వారీగా పలుల పేర్లు ఉన్నాయంతే. కానీ దీని రుచికి అందరు ఫిదా అనే చెప్పాలి. విదేశీయలు సైతం అబ్బా అని లొట్టలేసుకుంటూ తినేలా చేసే స్నాక్ ఐటెం ఇది. మరి నోరూరించే ఈ ఝల్మురి వంటకాల కహానీ గురించి సవివరంగా చూద్దామా..!.ఝల్మురి అంటే..కోల్కతా స్ట్రీట్ చిరుతిండి ఇది. మరమరాలు, ఆవనూనె, మసాలాలు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, వేరుశెనగుళ్లు, సెనగపప్పులు వేసి కమ్మగా, కారంగా చేసే వంటకం. ఇది ఏమి స్టవ్ వెలిగించే చేసే వంటకం కాదు. ఇది మొత్తం పదార్థాలు కలపడం పైనే రుచి ఆధాపడి ఉంటుంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే..బెంగాలీలో “ఝల్” అంటే కారం, “మురి” అంటే మరమరాలు. ఈ రెండింటినీ కలిపితే,కారం కారం మరమరాలు అని అర్థం. అమ్మకందారులు స్టీల్ పాత్రలలో దీన్ని కలుపుతూ..పదార్థాలను గాల్లోకి ఎగరువేస్తూ..కోన్ల వార్తాపత్రికలను చుట్టి సర్వ్ చేస్తుంటారు. చవకైనది..మనసుకు ఆహ్లాదాన్ని, కాలక్షేపాన్ని ఇచ్చే చిరుతిండి ఇది. వలసవాద కాలంలో బెంగాల్లో ఉద్భవించిందని చెబుతుంటారు. మాములు చిరుతిండిగా మొదలైన రైళ్లలో, బీచ్లలో, కళాశాల ప్రాంగణాలలో విరివిగా అమ్ముతుంటారు. ఇంకా పెద్ద పెద్ద కేఫ్లు సైతం లభిస్తోంది. ఈ స్ట్రీట్ భారతదేశమంతటా ఫేమస్. పైగా ఆయా ప్రాంతాల వారీగా పలు రకాలుగా పిలుస్తారు. చేసే విధానం ఒక్కటే. మరి ఆ పేర్లేంటో చూసేద్దామా..! ఇన్ని పేర్లా..?!ముంబైలో దీన్ని భేల్పురిగా తీపి కారంల కలయికతో తయారు చేస్తారు. ఇక బెంగళూరు చురుమురిలో తురిమిన కొబ్బరితో దక్షిణ భారత రుచితో మిళితం చస్తారు. ఒడిశాలో మసాల మురిగా..అందులో అన్ని ఎక్కువ పదార్థాలు జోడించనప్పటికీ ఘాటుగా ఉంటుంది. ఇక దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ వంటి ప్రాంతాలో ముంతమసాల, పిడతకింద పప్పు, ఉగ్గాణి వంటి పేర్లోతో పిలుస్తారు.ముంతమసాల: రమరాలు, మసాలా దినుసులు, వేరుశెనగ గుళ్లు, ఉల్లిపాయలు, టొమాటోలు, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు తదితరాలను కలిపి గిన్నెలో ఇస్తారు కాబట్టి ముంత మసాల. అంటే ఇక్కడ ఒక చిన్న అల్యూమినియం ముంతలో (గిన్నె)లో సర్వ్ చేస్తారు. ఇది కోస్తాంధ్ర, రాయలసీమలో సాయంత్రం వేళల్లో దొరికే ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్.పిడతకింద పప్పు: ఇది కూడా ముంతమసాల లాంటిదే, కానీ ఇందులో మిరపకాయ బజ్జీలను చిన్న ముక్కలుగా చేసి కలుపుతారు. అలాగే మరమరాలు మెత్త బడకుండా చిన్న మట్టి కుండలో నిప్పులు వేసి మరమరాలపై ఉంచుతారు అందువల్ల ఆ పేరుతో పిలుస్తారు. ఇది ముఖ్యంగా కోస్తాంధ్ర (గుంటూరు, కృష్ణా జిల్లాలు) లో ఎక్కువగా కనిపిస్తుంది.ఉగ్గాణిమరమరాలను నీటిలో నానబెట్టి, తాలింపు పెట్టి చేసే ఒక రకమైన తడి మిశ్రమం. దీనికి పసుపు, వేరుశెనగ గుళ్లు, పుట్నాల పొడి (పుట్నాల పప్పు పొడి) ప్రధానంగా ఉపయోగిస్తారు. దీన్ని సాధారణంగా మిరపకాయ బజ్జీలతో కలిపి తింటారు, అందుకే దీనిని 'ఉగ్గాణి బజ్జీ' అని పిలుస్తారు. రాయలసీమ ప్రాంతంలో (కర్నూలు, అనంతపురం) ఇది చాలా ఫేమస్. అక్కడ దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా తింటారట. ఆరోగ్యదాయకం కూడా..ఈ మరమరాలతో తయారు చేసే ఈ వంటకం ఆరోగ్యప్రదం కూడా. ఎందుకంటే ఇందులో ఆయిల్ కంటెంట్ తక్కువ. పైగా అన్ని నేచురల్గా కలిపేస్తారు. ఇక్కడ డీప్ఫ్రైకి ఛాన్స్లేదు. టమటా, ఉల్లిపాయలు నుంచి అన్ని కూడా పచ్చిగానే కలుపుతారు. ఒకరకంగా సలాడ్ మాదిరి ఐటెం. కాకపోతే కాస్త మరమరాలతో రుచికరంగా మారుతుంది. పైగా వెయిట్లాస్ స్నాక్ ఐటెం అని అంటున్నారు. ఇది కడుపు నిండిన అనుభూతితోపాటు మనసుకు హాయినిచ్చే స్నాక్ ఐటెం అట. ఇక మరమరాల్లో కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగానే ఉంటాయని అంటున్నారు. పైగా తేలిగ్గా అరిగిపోతుంది కూడా అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి ఫైబర్ తోపాటు, సులువుగా జీర్ణమయ్యే బలవర్ధకమైన చిరుతిండి అట.
గెలిచా అనుకునేలోపే ఓటమి హగ్ ఇచ్చిందిగా..!
ఎప్పుడైన గెలవాలని అనుకున్నప్పుడు చివరవరకు ఓపికతో పోరాడాలి. గెలిచాక సంబరాలు చేసుకోవాలి. అప్పటి వరకు సంయమనంతో ఉండాలి లేదంటే ఘోరంగా అవమానపాలు కావాల్సిందే. అందుకు నిదర్శనం ఈ ఘటన. డెలావేర్ మారథాన్ రన్నింగ్ కాంపిటీషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫినిష్ చేయాల్సిన గీతకు కొన్ని అంగుళాల ముందే యాహు గెలిచేశా అంటూ సంబరాలు చేసుకుటూ చేతులు పైకెత్తాడు. కొద్ది దూరంలోనే వేగాన్ని తగ్గించి ఆనందంగా గెంతులేస్తూ వస్తున్నాడు. ఇంతలో అతడి ప్రత్యర్థి 24 ఏళ్ల జాషువా జాక్సన్ అనూహ్యంగా వెనుక నుంచి దూసుకొచ్చి..అతడిని ఓడించేటప్పటికీ..అతన ఒక్కసారిగి కంగుతింటాడు. గెలిచానన్న ఆనందం క్షణాల్లో చూస్తుండగానే ఆవిరైపోయిందా అని షాక్లో ఉండిపోయాడు. అందుకే అంటారు పెద్దలు గెలుపుని పాదాక్రాంతం చేసుకునేంత వరకు చప్పుడు చేయకూడదు అనేది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారంది. జాక్సన్ అనే వ్యక్తి మారథాన్ రేసు గెలిచి..అద్భుతమైన 2:43:11 సమయాన్ని నమోదు చేశాడు. ఈ ఘటన అందరికి అద్భుతమైన గుణపాఠం కదూ..!.(చదవండి: అరుదైన ఘటన: కూతురిని చితకబాదిన అమ్మ..!)
లైఫంతా టెస్ట్ ఇంటర్లో బెస్ట్
అప్పుల బాధతో....తండ్రి ఆత్మహత్య. పద్దెనిమిదేళ్లకే కుటుంబ బాధ్యత. పెళ్లయిన రెండేళ్లకే కన్నుమూసిన భర్త విషాదం తట్టుకోలేక... పక్షవాతానికి గురైన తల్లి. జీవితమే పరీక్షగా మారింది. చేతిలో పసిబిడ్డతో ఆ పరీక్షలో నెగ్గడానికి మళ్లీ చదువు బాట పట్టింది హిమబిందు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న పేదింటి బిడ్డ హిమబిందు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 985 మార్కులు సాధించింది. కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సహాయం కోసం అర్థిస్తోంది.డాక్టర్ కావాలనేది తన చిన్నప్పటి కల. దర్జీ పనులు చేసుకునే తండ్రి బట్టలు కొలిచే టేప్ మెడలో వేసుకుంటే, ఆదే టేప్ తాను వేసుకొని ‘ఇది నా స్టెతస్కోప్’ అని సంబరపడేది హిమబిందు. ‘కచ్చితంగా నువ్వు డాక్టరవుతావు బిడ్డా’ అని ఎప్పుడూ ఆశీర్వదించే తండ్రి అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ బాధ్యతలను తల్లి భుజాన వేసుకుంది. పద్దెనిమిది సంవత్సరాల వయసులో హిమబిందుకు పెళ్లి చేసింది. పెళ్లి అయిన రెండేళ్లకు అప్పుల పాలైన బిందు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం తట్టుకోలేని తల్లికి పక్షవాతం వచ్చింది.→ దుఃఖసముద్రంలో...ఒకవైపు అనారోగ్యంతో తల్లి, మరోవైపు పసిబిడ్డ... దుఃఖసముద్రంలో మునిగిపోతున్నట్లుగా అనిపించింది హిమబిందుకు. అయినా ఆ విషాదాన్ని తట్టుకొని నిలబడింది.‘ఎన్ని కష్టాలు వచ్చినా చదువుకోవాల్సిందే’ అని గట్టిగా అనుకుంది హిమబిందు. మళ్లీ చదువు కొనసాగించింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 985 మార్కులు సాధించి డాక్టర్ కావాలనే తపనతో పుస్తకాలతో కుస్తీ పడుతోంది తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా నడివాడకు చెందిన దుస్సా హిమబిందు.→ ఎంత కష్టమైనా..‘ఇంటర్లో తెచ్చుకున్న మార్కులు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ప్రస్తుతం నా ముందు ఉన్న లక్ష్యం... నీట్. కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంటి దగ్గరే సొంతంగా ప్రిపేరవుతున్నాను. దాతలు సహకరిస్తే నా లక్ష్యానికి త్వరగా చేరగలననుకుంటున్నాను’ అంటోంది హిమబిందు.కన్నీళ్లు దిగమింగుతూ.. కాలేజీకి..చిన్నతనంలోనే తండ్రి, పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే 11 నెలల పసిపాపను చేతిలో పెట్టి భర్త ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు తల్లి ఆనారోగ్యానికి గురైనా తన లక్ష్యం మాత్రం మరచిపోలేదు హిమబిందు. అటు తల్లిని, ఇటు బిడ్డనూ చూసుకుంటూ పెళ్లితో ఆగిపోయిన ఇంటర్ చదువును మళ్లీ మొదలు పెట్టింది. లెక్చరర్లు, తోటి విద్యార్థుల సహకారంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసి వెయ్యి మార్కులకు 985 మార్కులు సాధించింది. ఇప్పుడు నీట్ పరీక్షకు సిద్ధం అవుతోంది. – ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్ఫొటో: మురళీ మోహన్
అంతర్జాతీయం
‘కీమో వద్దు.. పసరు ముద్దు’.. క్యాన్సర్ రోగికి ఏఐ షాక్!
లండన్: ఆధునిక కాలంలో ఏ చిన్న అనారోగ్య సందేహానికైనా ఇంటర్నెట్ను అశ్రయించడం సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు దీనికి తోడు కృత్రిమ మేధస్సు (ఏఐ) చాట్బాట్లను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే అత్యంత సున్నితమైన క్యాన్సర్ చికిత్స విషయంలో ఈ ఏఐ సాధనాలు ఇస్తున్న సలహాలు రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. కీమోథెరపీ లాంటి శాస్త్రీయ చికిత్సలకు బదులుగా ఎటువంటి ఆధారాల్లేని ప్రత్యామ్నాయాలను సూచిస్తూ, ఇవి రోగులను ప్రాణాపాయంలోనికి నెడుతున్నాయి.సగం సమాధానాలు పచ్చి అబద్ధాలేలుండ్క్విస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ ఇన్నోవేషన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ‘బీఎంజే ఓపెన్’ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం అనేక విషయాలను బయటపెట్టింది. పరిశోధకులు చాట్జీపీటీ, జెమిని, మెటా ఏఐ, డీప్పీక్, గ్రోక్ వంటి ప్రముఖ చాట్బాట్లను పరీక్షించారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల గురించి అడిగినప్పుడు ఇవి ఇచ్చే సమాధానాల్లో దాదాపు 50 శాతం తప్పుల తడకగా ఉన్నాయని తేలింది. ఇందులో 19.6 శాతం సమాచారం పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉండగా, 30 శాతం సమాధానాల్లో సరైన స్పష్టత లేదు. ముఖ్యంగా పరీక్షించిన అన్ని మోడళ్లలో ‘గ్రోక్’ పనితీరు అత్యంత పేలవంగా ఉందని వెల్లడైంది.ప్రాణాలు తీస్తున్న ఉచిత సలహాలుకీమోథెరపీకి ప్రత్యామ్నాయాలు ఏమిటని అడిగినప్పుడు, ఈ బాట్లు ముందుగా చిన్నపాటి హెచ్చరికలు చేసినప్పటికీ.. ఆ వెంటనే ఆక్యుపంక్చర్, మూలికా వైద్యం, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని ‘క్యాన్సర్ డైట్’లను సూచించాయి. అసలు సంప్రదాయ వైద్య చికిత్సలనే వ్యతిరేకించే ‘గెర్సన్ థెరపీ’ వంటి వాటిని కూడా ఈ ఏఐలు ప్రస్తావించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాత నిరూపితమైన కీమోథెరపీతో ఇలాంటి ప్రామాణికత లేని చికిత్సలకు ఈ చాట్బాట్లు సమానమైన ప్రాధాన్యత ఇస్తుండటంతో రోగులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.ఏఐ డాక్టర్ కాదు.. అప్రమత్త తప్పనిసరిఏఐ ఇచ్చే ఈ తప్పుడు సమాచారం వల్ల రోగులు ప్రాణాలను నిలబెట్టే కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్సలను వాయిదా వేసుకోవడం లేదా పూర్తిగా పక్కనపెట్టడం జరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చాట్బాట్లు రోగుల ఆయుర్దాయం గురించి అవాస్తవ అంచనాలను ఇస్తూ, వారిలో లేనిపోని ఆందోళనను నింపుతున్నాయి. ఏఐ అనేది కేవలం ప్రాథమిక సమాచారం తెలుసుకోవడానికి మాత్రమేనని, కచ్చితమైన రోగ నిర్ధారణ, చికిత్స కోసం ఎల్లప్పుడూ అర్హత కలిగిన ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ వైద్య నిపుణులు)ను మాత్రమే సంప్రదించాలని నిపుణులుహెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘తలొంచం.. తరిమికొడతాం’: ‘పహల్గామ్’పై ప్రధాని మోదీ
Earth Day 2026: అవని అంతం?.. మోగిన ‘కోడ్ రెడ్’!
‘మనమంతా పేలడానికి సిద్ధంగా ఉన్న పర్యావరణ టైమ్ బాంబ్ మీద కూర్చున్నాం’.. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న మంచు పలకలు, అంతుచిక్కని ప్రకృతి వైపరీత్యాలు.. ఇవన్నీ భూమి మనకు పంపుతున్న ఆఖరి హెచ్చరికలు. ఈ విపత్తు నుంచి మన గ్రహాన్ని కాపాడుకునేందుకు మనకు మిగిలి ఉన్న సమయం చాలా తక్కువని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఎర్త్ డే’ ప్రాముఖ్యతను తెలుసుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత.‘సమితి’ తీవ్ర హెచ్చరికలివే..ఈరోజు ఏప్రిల్ 22, 2026.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే నేడు ధరిత్రీ దినోత్సవం (ఎర్త్ డే) జరుపుకుంటున్నాం. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, భయపెడుతున్న గ్లోబల్ వార్మింగ్ పరిణామాల నేపథ్యంలో మానవాళికి ఐక్యరాజ్యసమితి ‘కోడ్ రెడ్’ హెచ్చరికలు జారీ చేసింది. దీని అర్థం తక్షణమే గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను.. అంటే భూ వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులను తగ్గించాలి. పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో పర్యావరణం కోలుకోలేని స్థితికి చేరుకుంటుందని సమితి హెచ్చరించింది.మన చేతుల్లోనే పరిష్కారంఇలాంటి విపత్కర సమయంలో, ఈ భూమిని కాపాడుకునే అపారమైన శక్తి మనందరి చేతుల్లోనే ఉందనే వాస్తవాన్ని ఈ ఎర్త్ డే మనకు గుర్తుచేస్తోంది. 1970లో ఒక చిన్న పర్యావరణ నిరసనగా మొదలైన ఈ కార్యక్రమం, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి పైగా ప్రజలను ఏకం చేసే ఒక మహా ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఈ తీవ్ర సంక్షోభం నుంచి మన గ్రహాన్ని రక్షించుకోవడానికి మనం ఆచరించాల్సిన మార్గాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పర్యావరణ పోరాటం1970ల నాటి రోజుల్లో స్వచ్ఛమైన గాలి (క్లీన్ ఎయిర్ యాక్ట్), నీరు (క్లీన్ వాటర్ యాక్ట్) కోసం ఎలాంటి చట్టాలు, పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీలు ఏవీ లేవు. అయితే 1962లో రాచెల్ కార్సన్ రచించిన ‘సైలెంట్ స్ప్రింగ్’ పుస్తకం రసాయనాల వల్ల జరిగే అనర్థాలను తెలియజేసింది. 1969లో కుయహోగా నదిలో చమురు లీకై చెలరేగిన మంటలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ పరిణామాలతో పర్యావరణవేత్త, నాటి అమెరికా సెనేటర్ గేలార్డ్ నెల్సన్ వియత్నాం యుద్ధ వ్యతిరేక నిరసనల స్ఫూర్తితో ఏప్రిల్ 22, 1970న తొలి ‘ఎర్త్ డే’కు శ్రీకారం చుట్టారు.ఒక మహా ఉద్యమంలా మారిందిలా..ఆ ఒక్క రోజే దాదాపు 2 కోట్ల మంది అమెరికన్లు (నాటి జనాభాలో 10%) స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి చరిత్ర సృష్టించారు. నాటి ఆ సంచలన స్పందన నేడు 192 దేశాల్లో, 1,50,000 కు పైగా భాగస్వామ్య సంస్థలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమంగా మారింది. అయితే, ప్రస్తుత పరిస్థితులు మరింత విషమంగా ఉన్నాయని, ప్రపంచ పర్యావరణ సంస్థలన్నీ ఏకతాటిపైకి వచ్చి సమిష్టిగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని 60 ఏళ్లుగా చింపాంజీలపై పరిశోధనలు చేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త జేన్ గూడాల్ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.2026 థీమ్: ‘మన శక్తి, మన గ్రహం’ఈ ఏడాది 2026 ఎర్త్ డే అధికారిక థీమ్ (ఇతివృత్తం) - ‘అవర్ పవర్, అవర్ ప్లానెట్’ (మన శక్తి, మన గ్రహం). ఈ నినాదం ఒక స్పష్టమైన, అత్యంత శక్తివంతమైన వాస్తవాన్ని తెలియజేస్తోంది. పర్యావరణంలో ఆశించిన మార్పు కేవలం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై మాత్రమే ఆధారపడి లేదు.. అది సామాన్య ప్రజలు తమ దైనందిన జీవితంలో తీసుకునే చర్యల ద్వారానే సాధ్యమవుతుందని ఈ థీమ్ నొక్కి చెబుతోంది. సమిష్టి కృషిని ఈ క్యాంపెయిన్ ప్రోత్సహిస్తోంది. పాఠశాలలు, వ్యాపార సంస్థలు, కమ్యూనిటీలు, ప్రతి పౌరుడు తాము నివసిస్తున్న పరిసరాల పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఆచరణాత్మకమైన అడుగులు వేయాలని ఈ 2026 ఎర్త్ డే థీమ్ ప్రపంచానికి పిలుపునిస్తోంది.ధరిత్రిని కాపాడే బాధ్యత అందరిదీ..భూమిని రక్షించే ఈ మహా కార్యక్రమంలో సామాన్యులు సైతం పాలుపంచుకోవడం చాలా సులభం. EARTHDAY.ORG అధికారిక వెబ్సైట్ ద్వారా ఎవరైనా వాలంటీర్గా తమపేరు నమోదు చేసుకోవచ్చు లేదా మీ స్వంతంగా ఒక ఎర్త్ డే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) కూడా ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక అద్భుతమైన ‘ఎర్త్ డే టూల్కిట్’ను రూపొందించింది. ఇందులో ఏదైనా కమ్యూనిటీలో లేదా ఇంటి వద్దే సులభంగా చేయగలిగే ఎన్నో కార్యకలాపాలు ఉన్నాయి. అలాగే ‘ది ఓల్డ్ ఫార్మర్స్ అల్మానాక్’ సూచనల ప్రకారం పరాగసంపర్కం చేసే తేనెటీగలు, సీతాకోకచిలుకలను ఆకర్షించేలా పూల మొక్కలు పెంచడం, ఇంటి తోటల్లో హానికరమైన రసాయన పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయడం, నీటి వినియోగాన్ని పొదుపుగా నిర్వహించడం వంటి 10 రకాల చిన్నపాటి రోజువారీ మార్పుల ద్వారా కూడా ఈ పర్యావరణ యజ్ఞంలో భాగస్వములు కావచ్చు. ఇది కూడా చదవండి: 51 క్వింటాళ్ల పూలతో కేదార్నాథ్ ముస్తాబు
గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇరాన్తో శాంతి చర్చలు కోసం తపిస్తున్నారు. యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్ ఎలాగైనా దానిని ముగించే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సీజ్ఫైర్ని మరోసారి పొడిగిస్తూ ప్రకటన చేశారు. ఇరాన్తో ఏకీకృత ఒప్పందం వచ్చే వరకూ కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్ రివెల్యూషనరీ గార్డ్స్ మరోసారి గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. తమ దేశంపై దాడి చేయడానికి అమెరికాకు సహకరిస్తే చమురు ఉత్పత్తి లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 50 రోజులు గడుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాలు సీజ్ఫైర్ ఒప్పందాన్ని పాటిస్తున్నాయి. అయితే ఈ యుద్ధం గల్ఫ్ దేశాల పాలిట శాపంగా మారింది. అమెరికా ఎయిర్బేస్లకు సహకరిస్తున్నారని నెపంతో ఇరాన్ గల్ఫ్ దేశాల టార్గెట్గా దాడులు జరిపింది. అయితే ప్రస్తుతం సీజ్ఫైర్ నడుస్తున్న నేపథ్యంలో అమెరికా గల్ఫ్ దేశాల్లోని తన స్థావరాలను మరింత బలోపేతం చేస్తుందేమోనని ఇరాన్ అనుమానిస్తోంది. దీంతో ఆ దేశాలకు నేరుగా వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఓ ప్రకటనలో "ఇరాన్ దేశంపై దాడి చేయడానికి శత్రువుల పక్కన చేరి దేశ భూభాగాన్ని, సౌకర్యాలని వారు ఉపయోగించుకునేలా సహకరిస్తే దక్షిణ పొరుగు దేశాలు చమురు ఉత్పత్తికి వీడ్కోలు చెప్పాల్సి ఉంటుందని తెలుసుకోవాలి " అని గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మజీద్ మౌసావి పేర్కొన్నట్లు ఇరాన్ మీడియా కథనాలు ప్రచురితమయ్యాయి.అయితే ఇది వరకూ యుద్ధంలో ఇరాన్ ప్రధానంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ స్థావరాలే లక్షంగా దాడి చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ (UAE), కువైట్, బహ్రెయిన్, ఖతార్లలోని చమురు నిల్వ ఉంచిన డిపోలు, రిఫైనరీలు, మరియు గ్యాస్ ఫెసిలిటీలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడింది. ఈ నేపథ్యంలో మరోసారి వార్నింగ్ ఇచ్చింది.
కాల్పుల విరమణపై ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్, అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా పోస్టు చేశారు. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని తెలిపారు.ఇరాన్ తమతో ఏకీకృత ఒప్పందానికి వచ్చే వరకు, శాంతి చర్చలు ముగిసేవరకు కాల్పుల విమరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ల నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడంతో కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.ట్రూత్ వేదికగా ట్రంప్ స్పందిస్తూ.. ‘పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ల అభ్యర్థన మేరకు ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు, చర్చలు ఒక కొలిక్కి వచ్చే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుంది. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం యాథావిధిగా ఉంటుంది. ఇప్పటికే దీనిపై అప్రమత్తంగా ఉండాలని మా సైన్యాన్ని ఆదేశించాను’ అని తెలిపారు. అయితే ఇస్లామాబాద్లో ఏర్పాటు చేసిన రెండో విడత శాంతి చర్చలకు వచ్చేందుకు ఇరాన్ విముఖత చూపడంతో ట్రంప్ మంగళవారం సీఎన్బీసీ ‘స్వాక్బాక్స్’ కార్యక్రమంలో ఇరాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘ఇరాన్ మాతో ఒప్పందానికి రావడం తప్ప వారికి మరో మార్గం లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబులేయడమే అత్యుత్తమ మార్గం.కాల్పుల విరమణ గడువు పొడిగించే ప్రసక్తే లేదు. గడువు పొడిగింపు నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. బుధవారంతో ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ గడువు ముగియనుంది. అయితే ఇంతలో ట్రంప్ కాల్పుల విరమణపై యూటర్న్ తీసుకోవడంతో కొంతమేర ఉపశమనం లభించినట్లయింది.ఫలించిన పాక్ ప్రయత్నం..హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన దౌత్యప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఒక మెట్టు దిగిరావాలని అమెరికాకు సూచిస్తూనే మరోసారి చర్చలకొచ్చి సయోధ్యకు ప్రయత్నించాలని ఇరాన్కు హితబోధ చేస్తోంది. కనీసం కాల్పుల విరమణ గడువును అయినా పొడిగించి.. మరోమారు సత్ఫల సయోధ్యకు యత్నించే అవకాశం తమకు ఇవ్వాలని ఇరుదేశాల నాయకత్వాలను పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మంగళవారం కోరారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పాక్ అభ్యర్థనపై ఒక అడుగు ముందుకేసి కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు.
జాతీయం
బ్లూడ్రమ్ కేసులో కీలక పరిణామం
గంజాయి మత్తులో.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి అటుపై పైశాచికంగా ప్రవర్తించింది ముస్కాన్ రాజ్పుత్. ఆపై ప్రియుడితో కలిసి జాలీ ట్రిప్ వేసి.. చివరకు భయంతో పోలీసులకు లొంగిపోయింది. మీరట్(ఉత్తర ప్రదేశ్) బ్లూడ్రమ్ కేసుగా ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.తన కొడుకు హత్యలో ముస్కాన్ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని ఆరోపిస్తోంది సౌరభ్ రస్తోగీ కుటుంబం. మంగళవారం కోర్టు విచారణ కోసం మీరట్ జిల్లా కోర్టుకు ఆరు నెలల చంటి బిడ్డ రాధతో ముస్కాన్, సాహిల్ వచ్చారు. ఆ సమయంలో వాళ్లిద్దరూ కోర్టు హాల్లోకి రాగానే సౌరభ్ తల్లి రేణు దేవి భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘మరో మాట లేకుండా ఇద్దరినీ ఉరి తీయండి. చంటి బిడ్డ చేతిలో ఉందని కనికరించొద్దు. నా బిడ్డ నెలకు రూ.50 ఈమె కుటుంబానికి ఇచ్చేవాడు. ప్రతిగా వాళ్లు వాడ్ని దారుణంగా చంపారు. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. కానీ, వాళ్లను వదిలేసి ఈ ఇద్దరినే అరెస్ట్ చేశారు. అందరినీ శిక్షించాల్సిందే’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుందామె.ఆ సమయంలో న్యాయమూర్తి భావోద్వేగాలను నియంత్రించుకోవాలని ఆమెకు సూచించారు. ఈ నేరంలో అభియోగాల ఆధారంగా చెరో 32 ప్రశ్నలు వేశారు జడ్జి. అందుకు సాక్ష్యం చూపించాలని సాహిల్ అడగ్గా.. ముస్కాన్ వాటిని తోసిపుచ్చింది. ఆపై కేసు విచారణను వాయిదా వేశారు.బిడ్డను స్వీకరిస్తారా?సౌరభ్-ముస్కాన్లకు ఓ కూతురు ఉంది. ఈ కేసు తర్వాత ఆ బిడ్డ సౌరభ్ తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే అరెస్ట్ అయ్యేనాటికి ముస్కాన్ గర్భవతి. రిమాండ్ ఖైదీగా ఉన్న టైంలో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ తమ కొడుకుకే పుట్టినట్లు డీఎన్ఏ టెస్టులో నిర్ధారణ అయితే స్వీకరిస్తామని రేణు దేవి ఆ టైంలో చెప్పారు. కానీ, ఇప్పుడేమో ముస్కాన్ వల్ల ఆ బిడ్డ ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇటు ముస్కాన్ కుటుంబం కూడా ఆ పసికందును స్వీకరించేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది.సౌరభ్ రాజ్పుత్, ముస్కాన్ రస్తోగీ ఇద్దరూ 2016లో ప్రేమవివాహం చేసకున్నారు. భార్యతో సమయం గడిపేందుకు మర్చంట్ నేవీ జాబ్ను సైతం వదిలేశాడు సౌరభ్. ఇది ఇంట్లో గొడవలకు దారి తీయడంతో ఆమెతో వేరు కాపురం పెట్టాడు. మూడేళ్ల తర్వాత ఇద్దరికీ ఓ పాప పుట్టింది. అదే సమయంలో.. సాహిల్ అనే వ్యక్తితో ముస్కాన్ సంబంధం నడుపుతున్నట్లు సౌరభ్ గుర్తించాడు. ఈ వ్యవహారం దంపతుల మధ్య గడవలకు దారి తీసి.. విడాకుల దాకా తీసుకెళ్లింది. ఆ పంచాయతీ నడుస్తుండగానే.. భార్యలో మార్పు వస్తుందన్న ఆశతో ఎదురు చూశాడు సౌరభ్. ఆపై మర్చంట్ నేవీ ఉద్యోగంలో మళ్లీ చేరాడు సౌరభ్. ఉద్యోగం నిమిత్తం 2023లో బయట దేశాలకు వెళ్లాడు.ఇదే అదనుగా ముస్కాన్, సాహిల్తో వివాహేతర సంబంధం కొనసాగింది. 2025 ఫిబ్రవరి 24న కూతురి పుట్టినరోజు వేడుకల కోసం చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చాడు సౌరభ్. ఇది భరించలేకపోయింది ముస్కాన్. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పెద్ద ప్లానే వేసింది.మార్చి 4వ తేదీన సౌరభ్ తినే తిండిలో మత్తు బిళ్లలు కలిపింది ముస్కాన్. గాఢ నిద్రలోనే జారుకోగానే గంజాయి మత్తులో ఉన్న ఇద్దరూ కలిసి అతన్ని హత్య చేశాడు. ఆపై ఆ మృతదేహాన్ని 15 ముక్కలుగా చేసి ఓ డ్రమ్ములో ఉంచి సిమెంట్తో నింపేశారు. సౌరభ్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి.. ఇద్దరూ వారంపాటు షికారుకు వెళ్లారు. కొన్నాళ్లకు డ్రమ్ము నుంచి కుళ్లిన వాసన రావడం.. ఆపై శవం చేయి బయటపడడంతో.. ఆందోళనకు గురైన ముస్కాన్ తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. దీంతో ముస్కాన్ తండ్రే ఆమెను తమకు అప్పగించాడని పోలీసులు చెబుతున్నారు. అలా.. వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఇటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సీఎం సిద్దరామయ్యపై చేతబడి జరిగిందేమో?
బెంగళూరు: కాంగ్రెస్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యపై చేతబడి జరిగిందేమో అని అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి కేఎన్.రాజణ్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంగళవారం బెంగళూరు నగరంలో మాట్లాడిన కేఎన్.రాజణ్ణ.. సీఎం ఇంత అసహాయకుడిగా ఉండటం చూస్తే అతడిపై ఎవరైనా చేతబడి చేశారా అనిపిస్తుందని.. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సీఎం సైలెంట్గా ఉన్నారని ఎవరైనా చెబితే అది నిజమే అనిపిస్తుందన్నారు. చేతబడి ఎవరు చేశారు అనే దానిపై విచారిస్తానని హామీ ఇచ్చారు. గతంలో తాను ఎన్నికల్లో నిలబడినప్పుడు పాత ఇంటి చుట్టూ పసుపు నీరు చల్లి చేతబడి చేశారని గుర్తు చేశారు. అయినా దానిని పట్టించుకోలేదని.. ఎన్నికల్లో గెలుపొందినట్లు పేర్కొన్నారు. మే నెలలో కొన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చన్నారు. సీఎం చేతగాని వ్యక్తి కాదని.. రానున్న రోజుల్లో అన్ని సర్దుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
మాడిపోతున్న ఉత్తరాది.. తడిసిపోతున్న దక్షిణాది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పంజాబ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా భానుడి ప్రతాపానికి సాధారణ జీవనం స్తంభించిపోతోంది. ఒకవైపు పర్యాటకులు వడదెబ్బకు గురవుతుంటే, మరోవైపు రాత్రుళ్లు సైతం వేడి గాలులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తీవ్రమైన హీట్వేవ్ పరిస్థితులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.ఢిల్లీలో ‘వాటర్ బెల్స్’.. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. విద్యార్థులు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు, ప్రతి 45-60 నిమిషాలకు ఒకసారి విధిగా ‘వాటర్ బెల్’ మోగించాలని పాఠశాలలను ఆదేశించింది. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికొస్తే, ప్రయాగ్రాజ్ లో ఏకంగా 44.6 డిగ్రీలు నమోదు కాగా, 26 జిల్లాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఆగ్రాలోని తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన ఆరుగురు పర్యాటకులు ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. ఎండల భయానికి రాజస్థాన్ లోని జైపూర్, ఉదయ్పూర్ వంటి పర్యాటక ప్రాంతాలు సైతం సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి.రాత్రి పూట కూడా వీడని ‘వేడి’సాధారణంగా పగలు ఎండలు మండినా, రాత్రికి వాతావరణం చల్లబడుతుంది. కానీ, మధ్యప్రదేశ్లోని భోపాల్ సహా మరో ఎనిమిది జిల్లాల్లో ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడమే కాకుండా, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.5°C నుంచి 6.4°C మేర పెరగడంతో వాతావరణ శాఖ ‘వార్మ్ నైట్’ (వెచ్చని రాత్రి) అలర్ట్ జారీ చేసింది. రాత్రి ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలకు పైగా నమోదవుతూ, వేడి గాలులు వీస్తుండటం ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోంది.మున్ముందు మరింత ఉక్కపోతభగభగమండే ఎండల నుంచి ఉపశమనం కోసం రైల్వే స్టేషన్లు, రోడ్లపై అధికారులు చర్యలు చేపట్టారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ (43.8°C) స్టేషన్లో మిస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయగా, బీహార్ (42°C) లో మున్సిపల్ కార్పొరేషన్ రోడ్లపై నీళ్లు చల్లుతోంది. వాతావరణ అంచనాల ప్రకారం.. మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు హీట్ వేవ్ కొనసాగనుంది. అదే సమయంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.ఇది కూడా చదవండి: ఛార్ ధామ్లో చిరు వ్యాపారం.. లైఫు సెట్టు!
ఏఐసీసీ చీఫ్పై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నిన్న ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ చర్చలకు ఉపక్రమించింది. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. దక్షిణాది హక్కులను మోదీ హరిస్తున్నారని అటువంటి ఉగ్రవాదితో ఏఐడీఎంకే ఏలా పొత్తుపెట్టుకుందని ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.తమిళనాడులో ఈ నెల 23 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు సాగుతుండగా మరోవైపు ఏఐడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. సినీస్టార్ విజయ్ టీవీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఎన్ఆర్ఐ
టోక్యోలో ఘనంగా ఉగాది పండుగ
జపాన్లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా (Komatsugawa) పార్క్లో ఉగాది పండుగను భారతీయులు ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్కు చెందిన స్థానికులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఉగాది సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఉగాది పచ్చడిని తయారు చేసి, దాని ప్రాముఖ్యతను పాల్గొన్న వారికి వివరించారు. అలాగే రాశి ఫలాలను వినిపిస్తూ కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అనంతరం వివిధ రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి అందరూ కలిసి భోజనం చేశారు.పిల్లల కోసం బ్యాగ్ జంపింగ్ వంటి వినోదాత్మక పోటీలు నిర్వహించగా, పెద్దల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమం అనంతరం కొత్తగా వచ్చిన కుటుంబాలు పరస్పరం పరిచయం చేసుకుని, విదేశాల్లో భారతీయ సంప్రదాయాలను ఎలా కొనసాగించాలన్న దానిపై చర్చించారు. ఈ వేడుకల ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు. వివిధ దేశాల ప్రజలు కలిసి సంస్కృతులను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన TAJ(Telugu association of Japan)కమిటీ సభ్యులకు, అలాగే పాల్గొన్న అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్లోని తెలుగు వాసులు ఈ ఏడాది ఉగాది పండుగను సంప్రదాయానికి అనుగుణంగా, ఆత్మీయంగా మరియు వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20, 2026 తేదీలలో ఈ ఉత్సవాలు చాంగీ రామర్ దేవాలయం, సెంగ్కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం మరియు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రత్యేకంగా, టీమ్ శివ ప్రసాద్ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాలయాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి మరియు ప్రసాదాన్ని పంపిణీ చేశారఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆనందం, ఐక్యత మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది.ఈ ఉత్సవాల ద్వారా సాంప్రదాయం, సంస్కృతి, భక్తి మరియు ఐక్యత మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో, సింగపూర్లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు.
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు)
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
క్రైమ్
హిజ్రా హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవం
కోనసీమ జిల్లా: 216 ఏ జాతీయ రహదారిలోని జొన్నాడలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన హిజ్రా హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ రాజమహేంద్రవరం పదవ అదనపు జిల్లా జడ్జి కోర్టు మంగళవారం తుది ఇచ్చింది. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో విలేకరులకు ఈ కేసు గురించి ఆలమూరు పోలీసులు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం మండలంలోనున్న ఉప్పరగూడెంకు చెందిన మరుమట్ల ఆనంద్ అలియాస్ ఆనందీ అనే హిజ్రా ఆ సమయంలో ధవళేశ్వరంలో సహచర హిజ్రాలతో కలిసి నివాసం ఉంటోంది. 2023 మే 12 రాత్రి జొన్నాడ హైవే పక్కన పంటకాలువలో దారుణ హత్యకు గురైంది. సంచలనంగా మారిన ఈ హత్యకేసుకు సంబంధించి ధవళేశ్వరం గ్రామానికి చెందిన ధనాల మందాకిని అనే హిజ్రా ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై ఎస్.శివప్రసాద్ కేసును నమోదు చేశారు. రావులపాలెం రూరల్ సీఐ ఎన్.రజనీకుమార్ దర్యాప్తు చేయగా కొత్తపేట డీఎస్పీ కెవి.రమణ పర్యవేక్షణ జరిపారు. నేరం రుజువు కావడంతో నిందితులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కేత వెంకట భరత్ సుధీర్ అలియాస్ పెద్ద (ధవళేశ్వరం), వేలు కళ్యాణ్ అనే పెద కాళీ (బొమ్మూరు), సింగంపల్లి కార్తీకేయ అలియాస్ సింబ (ధవళేశ్వరం)కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ జడ్జి ఎస్.ఉమా సునంద తీర్పు చెప్పారు. బాధితుల తరఫున పీపీలు కె.రాధాకృష్ణ రాజు, డి.వాణిభాయి వాదనలు వినిపించారు. ఈ కేసును ఛేదించిన కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి.నరే‹Ùను ఏలూరు రేంజ్ ఐజీ జీవీవీ అశోక్కుమార్, ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు.
‘నువ్వు బంగారు బాతువు’.. హెడ్ కానిస్టేబుల్ వ్యాఖ్యలు వైరల్
చాలా తెలివైనోడు...జాగ్రత్త! ఓ కానిస్టేబుల్ ముఠా సభ్యురాలితో ఫోన్లో మాట్లాడిన తీరును పరిశీలిస్తే ట్రాప్కు పూర్తిగా సహకరించినట్లు స్పష్టమవుతోంది. ‘వాడు చాలా తెలివైనోడు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని టీం లీడర్కు చెప్పా. ట్రాప్ చేసే మహిళ అతడి కారులో వెళ్తుంటే వెనుక మరోబైకును ఎందుకు ఫాలో అవ్వమని చెప్పింది..? ఓపెన్ ప్లేస్లోకి వెళ్లాక వెనుక బైకు వస్తుంటే కారులో ఉన్న వ్యక్తికి ఎందుకు అనుమానం రాదు..? ఆయన విషయంలో అదే జరిగింది. అనుమానం వచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఏదో మోసం జరుగుతోందని గ్రహించి ఆ ఏరియా వారిని కనుక్కున్నాడు. విషయమంతా తెలిసిపోయింది. ఆమె ఇదే పని చేస్తోందని అతడికి ఎవరో చెప్పారంట. అతను నా వద్దకు వచ్చి అదే విషయాన్ని చెప్పాడు. అనుమానం వచ్చి నీ నంబరు బ్లాక్లో పెట్టాడు. జాగ్రత్తగా డీల్ చేయాలి కదా’ అంటూ సంభాషించాడు.స్టేషన్ వద్దకు వచ్చి ఫోన్ చెయ్.. ముఠా సభ్యుల మధ్య విభేదాలు వచ్చి గొడవలు చేసుకున్న సందర్భంలో హెడ్ కానిస్టేబుల్ ఒకరు ఓ సభ్యురాలికి ఫోన్ చేసి మాట్లాడాడు. ‘మీరు మీరు ఎందుకు కొట్లాడుకుంటారు. నేను ఎస్పీని కలిసి అన్ని విషయాలూ చెబుతానని సదరు మహిళ అంటే... వద్దువద్దు నేను మాట్లాడతా. రెండు రోజులు సైలెంటుగా ఉండు.. ఆమె నీ జోలికి రాకుండా నేను మాట్లాడతా. రేపు ఉదయం మీరు స్టేషన్ వద్దకు రండి. ఫోన్ చేస్తే నేను బయటకు వస్తా. ఆలోపు మీరు వారిని తడుముకోవద్దు. నువ్వు బంగారు బాతువు. నువ్వు ఆమెతో విభేదిస్తే వ్యాపారం జరగదని భావించి ఈరకంగా గొడవ చేసి ఉంటుంది. నాకూ చాలా డబ్బు ఇచ్చినామని చెప్పిండొచ్చు. ఆడపిల్లల సొమ్ము... ఎంత ఇచ్చినా తీసుకున్నాను తప్ప ఇంతేకావాలని నేను అడగలేదు’ అని మాట్లాడిన ఆడియోలు వైరల్ అవుతున్నాయి. రాప్తాడు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ‘నయా హనీ ట్రాప్’ దందా ఊహించని మలుపు తిరుగుతోంది. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఈ దందాలో భాగస్వాములయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని జిల్లా పోలీస్ బాస్ (ఎస్పీ) జగదీష్ సీరియస్గా పరిగణించారు. అనంతపురం రూరల్ పరిధిలో వెలుగుచూసిన ఈ హనీట్రాప్ ముఠా... ఆర్థికంగా బలమైన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులను లక్ష్యం చేసుకుని వలపు వల విసిరి నిలువు దోపిడీ చేసింది. ముఠా తీరు భయంకరం హనీ ట్రాప్లో చిక్కుకున్న వారి పట్ల ముఠా సభ్యులు వ్యవహరించే తీరు అత్యత భయంకరంగా ఉంటోందని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించి, ప్రజలను అప్రమత్తం, అవగాహన కలి్పంచాల్సిన పోలీసులే వారికి సహకరించడం దుమారం రేపుతోంది. పలువురు పోలీసులు తమకు ‘టచ్’లో ఉన్నారనే ధైర్యంతోనే ముఠా బరితెగించినట్లు స్పష్టమవుతోంది. ట్రాప్లో పడిన వ్యక్తులు తిరగబడే పరిస్థితి ఉంటే తమకు అనుకూలంగా ఉన్న పోలీసులను రంగంలోకి దింపుతారు. పోలీసు డ్రెస్లో ఉన్నవారు అక్కడికి చేరుకోగానే సదరు వ్యక్తి హడలిపోవడం పరిపాటి. ‘మహిళను ఇబ్బంది పెట్టావు. ఆమె బలత్కారం కేసు పెడితే కచ్చితంగా జైలుకు వెళతావు’ అంటూ బాధితులను బెదిరించే ధోరణిలో మాట్లాడినట్లు సమాచారం. ఇప్పటిదాకా జిల్లాలో హనీట్రాప్ బాధితుల సంఖ్య వందల్లో ఉన్నట్లు తెలిసింది. మలుపు తప్పిన అంతర్గత విభేదాలు ఇటీవల కొందరు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో హనీట్రాప్ దందా వెలుగులోకి వచ్చింది. మరోవైపు హనీట్రాప్ ముఠా సభ్యుల్లో అంతర్గత విభేదాలు బయటపడడం కేసును కొత్త మలుపు తిప్పింది. వెంటనే స్పందించిన ఎస్పీ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి గుట్టు రట్టు చేసేదిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. హనీట్రాప్ బాధితులు తమకు న్యాయం చేయాలని ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా మంగళవారం అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. పోలీసుల పాత్రపై ఎస్పీ సీరియస్ మరోవైపు ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ ముఠా సభ్యులతో మాట్లాడిన సంభాషణ పోలీసు విభాగంలో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం పట్ల ఎస్పీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సహకరించిన ఏ స్థాయి వారినీ ఉపేక్షించ కూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నివేదిక రాగానే బాధ్యులైన సిబ్బందిపై వేటు వేస్తారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనంతపురం సమీపంలో ఉన్న ఓ ఎస్హెచ్ఓ కూడా ముఠాకు అన్ని విధాలా సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు పోలీసు శాఖలో ఓ ఉన్నతాధికారి అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఎస్పీ దృషికి వచ్చినట్లు సమాచారం.
ప్రేమ.. ఎంత పని చేసింది?
ప్రేమలో అనుమానం ఎంత ఘోర పరిణామానికి దారి తీస్తుందో తెలియజేసే ఘటనే ఇది. ఓ యువతి తన ప్రియుడ్ని ఇంటికి పిలిచి ఘాతుకానికి పాల్పడింది. తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో అతన్ని సజీవదహనం చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో కలకలం రేపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథనం అసలు వివరాల్లోకి వెళ్తే.. ప్రేరణ, కిరణ్ ఇద్దరూ ఓ టెలికాం స్టోర్లో జాబ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడా. అయితే కొంత కాలంగా అతను ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని.. మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని ఆమె అనుమానించింది. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని భావించింది. మంగళవారం దక్షిణ బెంగళూరులో ఉన్న తన ఇంటికి రావాలంటూ పిలిచింది. వెరైటీ ప్రపోజ్ ప్లాన్ గురించి చెప్పింది. దానికి తొలుత అతను ఒప్పుకోలేదు. అయితే ఫారిన్లో ఇదంతా కామన్ అని బలవంతం చేసేసరికి సరే అన్నాడు. కిరణ్ను ఓ కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు చేతులు కట్టేసింది. కళ్లకు గంతలు కట్టేసింది. అతను నిజంగానే ఆమె ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతోందని ఆశపడ్డాడు. కానీ.. ఇంట్లో అప్పటికే దాచిన కిరోసిన్ను తెచ్చి అతని మీద పోసి నిప్పంటించి దూరం నుంచి ఫోన్లో వీడియో తీయసాగింది. కిరణ్ ఆరుపులు విని స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే అతను మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో.. తనను పెళ్లి చేసుకోడనే అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు.ఈ ఘాతుకానికి సంబంధించిన వీడియోను ఆమె ఫోన్ నుంచి స్వాధీనపర్చుకున్నారు. కిరణ్-ప్రేరణల మధ్య స్నేహం గురించి తమకు తెలుసని.. వాళ్లు ఒప్పుకుంటే వివాహం కూడా జరిపించాలని తాము భావించామని ఇరువైపులా పెద్దలు చెబుతున్నారు. ప్రేమ అనేది నమ్మకం.. కానీ అనుమానం ప్రాణాలు తీసింది అని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు.
లంచం డిమాండ్.. ఏసీబీ వలలో సీఐ, ఎస్ఐ!
అనంతగిరి: వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సరోజ, ఎస్ఐ రాణి ఏసీబీ వలలో చిక్కారు. వివరాలిలా ఉన్నాయి.. తాండూరు పట్టణానికి చెందిన కౌన్సిలర్ ఇర్షాద్ భార్య కుటుంబ గొడవల విషయంపై మహిళా పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఇర్షాద్తో పాటు అతని కుటుంబసభ్యులు ఐదుగురిపై కేసు నమోదైంది. దీదీనిపై నోటీసులు తీసుకోవాలంటూ మార్చి 15న పోలీసులు ఇర్షాద్కు ఫోన్ చేశారు. దీంతో అమ్మానాన్న, తమ్ముడిని తీసుకుని 16న పీఎస్కు వచ్చాడు. ఇద్దరు చెల్లెళ్లు రాలేదు. కేసులో ఉన్న ఆరుగురికీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.60 వేలు ఇవ్వాలని సీఐ, ఎస్ఐ డిమాండ్ చేశారు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.40 వేలకు బేరం కుదుర్చుకున్నారు. మార్చి 23వ తేదీన రూ.20 వేల నగదుతో వెళ్లిన ఇర్షాద్ సీఐ సమక్షంలో ఎస్ఐకి డబ్బులు అందజేశాడు. అనంతరం ఇందుకు సంబంధించిన ఆధారాలతో ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్ మహిళా పీఎస్కు చేరుకున్న ఏసీబీ అధికారులు సీఐ, ఎస్ఐని విచారించారు. వీరి ఇళ్లతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేదా 9440446106కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం.. తాండూరు: పట్టణానికి చెందిన కౌన్సిలర్ షేక్ ఇర్షాద్ అవినీతి అధికారుపై పోరాటం చేస్తున్నారు. ఓ భూమికి సంబంధించిన సేల్ డీడ్ రద్దు చేయాలని కోరుతూ 2022 డిసెంబర్లో తాండూరు సబ్ రిజిస్ట్రార్ జమీరొద్దీన్ను కలవగా రూ.లక్ష డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన ఇర్షాద్ డిసెంబర్ 5న డబ్బులు ఇస్తూ సబ్ రిజి్రస్టార్తో పాటు అతని అసిస్టెంట్ను పట్టించాడు. 2025లో ఇంటి నంబర్ కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ ఉద్యోగి రమేశ్ను ఏసీబీకి పట్టించాడు. దంపతుల మధ్య నెలకొన్న గొడవ విషయంలో ఇర్షాద్ భార్య మహిళా పీఎస్లో ఫిర్యాదు చేయగా, స్టేషన్ బెయిల్కు లంచం డిమాండ్ చేసిన పోలీసు అధికారులను ఏసీబీకి పట్టించడం చర్చనీయాంశమైంది.
వీడియోలు
హార్ముజ్ లో భారత్ నౌక సీజ్.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్
సంక్షేమ పథకాలు ఎత్తివేత.. ఉద్యోగుల జీతాల్లో కోత
తమిళనాడు సమరం.. 234 స్థానాలకు పోలింగ్ స్టార్ట్
కారును ఢీకొట్టిన లారీ.. స్పాట్ లో 11 మంది సజీవ దహనం
పశ్చిమబెంగాల్ లో ఇవాళ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు
కృష్ణమ్మ పొంగితే అమరావతి మునగడం ఖాయం! బుగ్గన సంచలన వ్యాఖ్యలు
జనసేన జోలికి వస్తే.. ఖబర్దార్.. TDPకి జనసేన ఎమ్మెల్యే మాస్ వార్నింగ్
ఉద్యోగులకు బిగ్ షాక్.. మునిగిపోతున్న ఏపీ
సిక్సర్ల యుద్ధం అభిషేక్ ను భయపెడుతున్న బుడ్డోడు
మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు షాక్



