వైభవంగా... ఆహ్లాదకరంగా విరోష్ వివాహం
‘గీత గోవిందం’ సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి, ఫిబ్రవరి 26న ‘విరోష్’ (ఫ్యాన్స్ ఈ ఇద్దర్నీ అలానే పిలుస్తారు. తమ వివాహ వేడుకకు ఆ పేరునే పెట్టారు విజయ్–రష్మిక) భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది.ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాలు, చిరునవ్వులు మధ్య జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు నూతన వధూవరులిద్దర్నీ ఆశీర్వదించారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా తమ పెళ్లి ఫొటోలను షేర్ చేసి, ఒకరిపట్ల మరొకరికి ఉన్న మమకారాన్ని, నమ్మకాన్ని, ఇష్టాన్ని పంచుకున్నారు.ప్రాణ స్నేహితురాల్ని భార్యను చేసుకున్నాను: విజయ్ ‘‘ఒక రోజు ఆమెను నేను మిస్ అయ్యాను... ఆమె పక్కన ఉండి ఉంటే ఈరోజు ఇంకా బాగుండేది కదా అన్నంతగా ఆమెని మిస్ అయ్యాను. ఒకవేళ ఆమె నా పక్కన కూర్చుని ఉంటే.. నా భోజనం ఇంకా పరిపూర్ణంగా అనిపించేది కదా అనిపించింది... అలాగే నాతో కలిసి ఆమె వర్కవుట్స్ చేస్తే అది పనిష్మెంట్లా కాకుండా ఫన్లా ఉండేది అనిపించింది. నా జీవితానికి ఆమె అవసరం అనిపించింది. నేను ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్న అనుభూతిని, ప్రశాంతతను ఇచ్చే ‘ఇల్లు’ అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నేను నా ప్రాణ స్నేహితురాల్ని నా భార్యను చేసుకున్నాను... 26.02.2026’’ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) విజ్జూ... మాటలు సరిపోవడం లేదు: రష్మికహాయ్ మై లవ్స్, ఇప్పుడు మీకు ‘నా భర్త’ని పరిచయం చేస్తున్నాను! మిస్టర్ విజయ్ దేవరకొండ!! నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి. ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి. ప్రతి రోజూ పెద్ద కలలు కనడం మంచిదే అనీ, ఆ కలను సాకారం చేసుకునే సామర్థ్యం నీకు ఉందని చెప్పిన వ్యక్తి. ఎవరూ నన్ను చూడడంలేదనుకుంటూ నేను డ్యాన్స్ చేస్తుంటే నన్ను ఆపని వ్యక్తి. అలాగే స్నేహితులతో ప్రయాణం చేయడం ఎంత బాగుంటుందో చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి... ఈ వ్యక్తి గురించి ఓ పుస్తకం రాయొచ్చు. నేను ఎలాంటి స్త్రీగా ఉండాలని కలలు కన్నానో అలా ఉండేలా నువ్వు నన్ను మార్చావు.విజ్జూ... నీ గురించి ఎప్పుడు ఏం చెప్పాలన్నా నాకు మాటలు సరిపోవు. నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం... ఇవన్నీ హఠాత్తుగా నాకు అర్థవంతంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నందుకు.... వీటన్నింటికీ సాక్ష్యంగా నువ్వు ఉన్నందుకు... నేను నీ భార్యను కావడం, నీ భార్యగా పిలవబడడం నాకు చాలా ఎగ్జయిటింగ్గా ఉంది. ఇది పూర్తిగాపార్టీ టైమ్. మనిద్దరం కలిసి ఒక అందమైన జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యు.
ఈ రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.. ఆస్తిలాభం పొందుతారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: శు.ఏకాదశి రా.10.31 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఆరుద్ర ప.11.06 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.10.26 నుండి 11.57 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.34 వరకు, తదుపరి ప.12.35 నుండి 1.20 వరకు, అమృత ఘడియలు: లేవు, సర్వ ఏకాదశి.సూర్యోదయం : 6.25సూర్యాస్తమయం : 6.01రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. భూలాభాలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృషభం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభ వార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగావకాశాలు. కీలక నిర్ణయాలు.. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.కర్కాటకం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆధ్యాత్మిక చింతన. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.సింహం: పనుల్లో ప్రతిబంధకాలు..పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి.కన్య: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలోకొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.తుల: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.వృశ్చికం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. సోదరులు, సోదరీలతో కలహాలు. రుణయత్నాలు.పనులు వాయిదా పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.ధనుస్సు: చిరకాల స్వప్నం నెరవేరుతుంది. పోటీపరీక్షల్లో విజయం. భూ, వాహనయోగం. చర్చలు సఫలం. దైవదర్శనాలు. కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు హోదాలు.మకరం: పరిచయాలు పెరుగుతాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.కుంభం: రుణదాతల ఒత్తిడులు. అనుకున్న పనుల్లో జాప్యం. సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.మీనం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.
‘లక్ష్మి’ వినియోగదారుడికి లెక్సస్ కారు గిఫ్ట్
అమెరికాలోని దక్షిణాసియా కమ్యునిటీకి ఎఫ్ఎంసీజీ విభాగంలో సర్వీసులందిస్తున్న హెచ్ఓఎస్ గ్లోబల్ ఫుడ్స్ తమ ఫ్లాగ్షిప్ బ్రాండ్ ‘లక్ష్మి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రాబ్ మోర్, విన్ మోర్’ దీపావళి ఆఫర్ విజేతను ప్రకటించింది. ఈ ఆఫర్ను గతేడాది దీపావళికి ప్రవేశపెట్టారు. తాజాగా విజేతను ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలో న్యూజెర్సీకి చెందిన ప్రవాస భారతీయుడు ఉదయకుమార్ బాలతాండాయుధం విజేతగా నిలిచారు. ఇందులో భాగంగా లెక్సస్ ఆర్ఎక్స్ 350 కారు(సుమారు రూ.80 లక్షలు)ను సొంతం చేసుకున్నారు. యూఎస్లోని బ్రిడ్జ్వాటర్ ప్రాంతంలో ఉన్న లెక్సస్ షోరూమ్లో జరిగిన కార్యక్రమంలో ‘లక్ష్మి’ బ్రాండ్ ప్రతినిధుల సమక్షంలో ఉదయకుమార్ కుటుంబానికి కారు తాళాలను అందజేశారు.ఈ సందర్భంగా హెచ్ఓఎస్ గ్లోబల్ ఫుడ్స్ సీఈఓ నీల్ సోనీ మాట్లాడుతూ.. ‘చాలా కుటుంబాల్లో తమ సంప్రదాయాలు, రుచుల పట్ల మాకున్న అంకితభావానికి ఈ బహుమతి నిదర్శనం. ప్రామాణిక ఆహారం, రుచి ద్వారా కుటుంబ సంస్కృతిని సజీవంగా ఉంచాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. కంపెనీ సీఓఓ అమ్రపాలి సోనీ మాట్లాడుతూ ‘గత 50 ఏళ్లుగా లక్ష్మి బ్రాండ్ ప్రవాస భారతీయుల ఇళ్లలో భాగమైంది. సొంత ప్రాంతాలకు దూరంగా ఉన్నవారికి స్వదేశీ రుచులను అందిస్తున్నందుకు గర్విస్తున్నాం’ అని తెలిపారు.కారు తాళాలు అందుకున్న అనంతరం విజేత ఉదయకుమార్ తన సంతోషాన్ని పంచుకుంటూ.. ‘మేము గెలిచామంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏళ్ల తరబడి మా ఇంట్లో లక్ష్మి ఉత్పత్తులు వాడుతున్నాం’ అని ఉద్వేగానికి లోనయ్యారు. అమెరికాలో దక్షిణాసియా కమ్యూనిటీకి నాణ్యమైన, స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులను అందించడంలో ‘లక్ష్మి’ ప్రముఖంగా నిలుస్తోందని అధికారులు చెప్పారు. View this post on Instagram Shared post on TimeEmbed Instagram Postఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం..
తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?
2016 డిసెంబరులో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సంచలనమైంది. రూ.500 , రూ.1,000 నోట్లను రాత్రికి రాత్రే రద్దు చేయడంతో దేశ ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కేంద్ర సర్కారు కొంత సయమాన్ని కూడా ఇచ్చింది. అయితే ఆ సమయంలో పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రజలు క్యూలైన్లలో అష్టకష్టాలు పడ్డారు. ఈ సందర్భంగా అనేక విషాద ఘటనలు కూడా నమోదైనాయి. అంతేకాదు ఇంట్లో అల్మారాలు, లాకర్లు లేదా పెట్టెల్లో దాచిపెట్టి మర్చిపోయిన పాత కరెన్సీ నోట్ల కట్టలకు సంబంధించి అనేక హృదయ విదారక కథనాలను కూడా చదివాం. కానీ ఇన్నేళ్ల తరువాత కూడా అలాంటి కథ ఒకటి నెట్టింటవైరల్గా మారింది.పెద్ద నోట్లు రద్దైన దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఒక మహిళ తన భర్త నుండి దాచిన రూ.500, రూ.1,000 నోట్లను తాజాగా గుర్తించింది. దీనికి సంబంధించి ఆమె కుమార్తె రికార్డ్ చేసిన వీడియో ఇన్స్టాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను (@ayushidixit) అనే వినియోగదారు షేర్ చేశారు. దీని ప్రకారం.. పాతనోట్లను గుర్తించిన తరువాత అమ్మ తీవ్ర ఆందోళనకు లోనైంది. కంటతడి పెడుతోంది. నాన్నకు తెలియకుండా వీటిని దాచింది. ఇపుడు వీటిని బ్యాంకులు అంగీకరిస్తాయా, లేదా? అంటూ తన ఫాలోయర్స్ను ఉద్దేశించి అడగడాన్ని ఈ వీడియో క్లిప్లో చూడవచ్చు. View this post on Instagram A post shared by AD🧿 (@ayushidixit___)ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్తనెటిజన్లు ఏమన్నారంటేవైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. అయ్యో.. ఆంటీ తొమ్మిదేళ్ల తరువాత గుర్తొచ్చిందా అని కొందరు అంటే, దీనిపై మీ డాడీ రియాక్షన్ కూడా రికార్డ్ చేయండి, ఆయన ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని కొందరు చమత్కరించారు. ఆర్బీఐతో మాట్లాడండి.. ఏమైనా ప్రమోజనం ఉంటుందేమో అని మరికొందరు సలహా ఇచ్చారు.ఇదీ చదవండి: లాస్ట్ మినిట్లో సెలవు రద్దు, జెన్ జెడ్ స్పందన వైరల్
ఉగాదిన మూసీ పనులకు శ్రీకారం
ప్రతి పేదవాడికీ న్యాయం చేస్తాం
హైదరాబాద్కు ‘హార్వర్డ్’
భారత్ ఘన విజయం
100 పబ్లిక్ స్కూళ్లు
సెమీస్లో దక్షిణాఫ్రికా
శాసించేస్థితిలో జమ్మూకశ్మీర్
శ్రీకాంత్ పరాజయం
77 సెకన్లలోనే...
వసూళ్లు చూసి ధైర్యం వచ్చింది: సుహాస్
తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. తాళికట్టు శుభవేళ ఇదే
రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా?
ViRosh రెండు పద్ధతుల్లో వెడ్డింగ్, కాబోయే కోడలికి అత్తగారి అందమైన గిఫ్ట్
జస్ట్ 11 నెలల్లో 52 కిలోలు బరువు తగ్గింది..! నో జిమ్, నో స్ట్రిక్ట్ డైట్..
రష్మికకు మూడోసారి.. విజయ్కు మాత్రం తొలిసారి!
మన రెడ్బుక్కే సార్! బిహార్లో రంగు మారిపోయింది!!
నకిలీ డిగ్రీతో ఐదేళ్లు హైకోర్టు జడ్జిగా తీర్పులు!
శతమానం భవ! నువ్వయినా మన రాజధానిని చూడాలి
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
'ఆయా షేర్' పాట.. నా స్టెప్ కాపీ కొట్టేశారు
పెళ్లి వేళ.. రష్మిక ముద్దు సీన్ వ్యాఖ్యలు వైరల్
T20 WC 2026: పాక్ జట్టులో కలకలం
భారత్కు అమెరికా కొత్త ‘షాక్’.. 126% టారిఫ్!
కూటమి సర్కార్కు షాకిచ్చిన సోము వీర్రాజు
T20 WC: కివీస్, లంకకు భారీ షాక్!.. పాక్కు గుడ్న్యూస్?
తాతా.. అమ్మ ఉరి వేసుకుంది
ప్రేయసితో బిగ్బాస్ షణ్ముఖ్ ఎంగేజ్మెంట్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. శుభవార్తలు వింటారు
భారతీయ సినిమా ప్రయాణంలో ఇది కీలక ఘట్టం: నాగార్జున
ఉగాదిన మూసీ పనులకు శ్రీకారం
ప్రతి పేదవాడికీ న్యాయం చేస్తాం
హైదరాబాద్కు ‘హార్వర్డ్’
భారత్ ఘన విజయం
100 పబ్లిక్ స్కూళ్లు
సెమీస్లో దక్షిణాఫ్రికా
శాసించేస్థితిలో జమ్మూకశ్మీర్
శ్రీకాంత్ పరాజయం
77 సెకన్లలోనే...
వసూళ్లు చూసి ధైర్యం వచ్చింది: సుహాస్
తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. తాళికట్టు శుభవేళ ఇదే
రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా?
ViRosh రెండు పద్ధతుల్లో వెడ్డింగ్, కాబోయే కోడలికి అత్తగారి అందమైన గిఫ్ట్
జస్ట్ 11 నెలల్లో 52 కిలోలు బరువు తగ్గింది..! నో జిమ్, నో స్ట్రిక్ట్ డైట్..
రష్మికకు మూడోసారి.. విజయ్కు మాత్రం తొలిసారి!
మన రెడ్బుక్కే సార్! బిహార్లో రంగు మారిపోయింది!!
నకిలీ డిగ్రీతో ఐదేళ్లు హైకోర్టు జడ్జిగా తీర్పులు!
శతమానం భవ! నువ్వయినా మన రాజధానిని చూడాలి
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
'ఆయా షేర్' పాట.. నా స్టెప్ కాపీ కొట్టేశారు
పెళ్లి వేళ.. రష్మిక ముద్దు సీన్ వ్యాఖ్యలు వైరల్
T20 WC 2026: పాక్ జట్టులో కలకలం
భారత్కు అమెరికా కొత్త ‘షాక్’.. 126% టారిఫ్!
కూటమి సర్కార్కు షాకిచ్చిన సోము వీర్రాజు
T20 WC: కివీస్, లంకకు భారీ షాక్!.. పాక్కు గుడ్న్యూస్?
తాతా.. అమ్మ ఉరి వేసుకుంది
ప్రేయసితో బిగ్బాస్ షణ్ముఖ్ ఎంగేజ్మెంట్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. శుభవార్తలు వింటారు
భారతీయ సినిమా ప్రయాణంలో ఇది కీలక ఘట్టం: నాగార్జున
ఫొటోలు
ప్రియుడితో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ఇదిగో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు
ఒకదానికొకటి సంబంధమే లేదు.. మీనాక్షి చౌదరి ఫన్నీ (ఫొటోలు)
థాయ్ల్యాండ్ ఏనుగులతో రీతూవర్మ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)
నెల్లూరులో జనసందోహం.. కొత్త జంటకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ముంబైలో నా వారం ఇలా గడిచింది.. మృణాల్ లేటెస్ట్ (ఫొటోలు)
#Virosh : పెళ్ళి సందడి.. ట్రెండింగ్లో రష్మిక మందన్న (ఫొటోలు)
’విష్ణు విన్యాసం‘ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
సినిమా
రామ్ చరణ్ పెద్ది మూవీ.. సెకండ్ సింగిల్ అప్డేట్
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి రెండో తేదీన ఈ మాస్ సాంగ్ను విడుదల చేస్తామని డైరెక్టర్ ట్వీట్ చేశారు. నీ అయ్య వడ్డీ... నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే.. రై రై రారా రై రై రారా అంటూ సాగే పాట ఆడియన్స్ను అలరించనుంది.కాగా.. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. ఈ పాటకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆడియన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. నీ అయ్య వడ్డీ...నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే!! రై రై రారా రై రై రారా… 🔥🔥🔥COMING SOON… Nee Ayya Vaddee… Nee Bidda Kadithe…Nuvvemi Podichaavanee… RAI RAI RAA RAA🔥🔥🔥This is the anthem of GRIT, GUTS & GLORY 🔥🔥🔥#Peddi second single #RaiRaiRaaRaa out… pic.twitter.com/Xzruw0SZPh— BuchiBabuSana (@BuchiBabuSana) February 26, 2026
ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒక్కరోజే ఏకంగా 11 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం రాగానే కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ ఫిబ్రవరిలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఈ చివరి వారంలో బాక్సాఫీస్ సందడి చేసేందుకు విష్ణు విన్యాసం అంటూ వచ్చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈ మూవీపైనే ఆడియన్స్లో కాస్తా బజ్ క్రియేట్ అయింది. అలానే కమెడియన్ మహేశ్ విట్టా 'ఉత్తుత్త హీరోలు', 'సన్నాఫ్' చిత్రాలు రిలీజ్ కానున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్ థ్రిల్లర్ మూవీ హనీ భయపెట్టేందుకు వచ్చేస్తోంది. దీంతో పాటు తెలుగు సినిమా డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, అక్యూజ్డ్ అనే డబ్బింగ్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు సైతం ఈ ఫ్రైడే ఓటీటీల్లో అలరించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 27అమెజాన్ ప్రైమ్హనీ(తెలుగు సినిమా)- ఫిబ్రవరి 27జియో హాట్స్టార్ రోస్లిన్ (తెలుగు వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 27 బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28 బుగోనియా (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28జీ5 డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27 తడయమ్ (తమిళ సిరీస్) - ఫిబ్రవరి 27 క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) - ఫిబ్రవరి 27అబార్ ప్రోలోయ్- సీజన్-2(బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 27 అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో) - ఫిబ్రవరి 28ఆహా సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలిటీ షో) - ఫిబ్రవరి 27సన్ నెక్స్ట్ హనీ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 27 నీలి హక్కీ (కన్నడ మూవీ) - ఫిబ్రవరి 27ఆపిల్ టీవీ ప్లస్ మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 27
ఓటరును పడగొట్టే 'సినిమా'..ఇదో కొత్త రాజకీయం!
సాధారణంగా రాజకీయ నాయకులు బయట చూడడానికి కాస్త గంభీరంగా ఉంటారు. వారి ప్రసంగాలు, నిర్ణయాలు అన్నీ సీరియస్గానే ఉంటాయి. నిత్యం జనాల్లో ఉన్నప్పటికీ ‘మనవాడు’ అనే హోదా మాత్రం కొంతమందికే లభిస్తుంది. ఆ కొంతమందిలో తాము కూడా ఉండాలని చాలామంది నేతలు కోరుకుంటారు. అందుకే సామాన్య ప్రజలకు చేరువ కావడానికి 'సినిమా గ్లామర్'ను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ మధ్య జరిగిన తాజా ఇంటర్వ్యూ దీనికి తాజా ఉదాహరణ మాత్రమే. అయితే, ఈ వ్యూహం వెనుక దశాబ్దాల చరిత్ర, అంతర్జాతీయ రాజకీయ తంత్రం దాగి ఉంది.ఎన్నికల సమయంలో రాజకీయనాయకులు చేసే హడావుడి అంతా ఇంత కాదు. ఓటరుకు దగ్గరవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. రోడ్డు మీద బజ్జీలు వేస్తారు? పిల్లలతో కలిసి ఆటలు ఆడతారు, సెల్ఫీలు, ఇంట్లోకి వెళ్లి భోజనాలు.. ఇలా విచిత్రమైన పనులతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే కానీ, ఓటరుకు మరింత దగ్గరవ్వాలంటే 'తమలోనూ ఒక సామాన్యుడు ఉన్నాడు' అని నిరూపించుకోవాలి. ఇందుకోసం సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు నిర్వహించడం ఒక గ్లోబల్ ట్రెండ్గా మారింది.పినరయిలోని మరో కోణంకేరళ రాజకీయాల్లో పినరయి విజయన్ అంటే అత్యంత కఠినమైన నాయకుడనే పేరుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో పినరయి విజయన్ కు ఉన్న ఆ గంభీరమైన ముద్రను మార్చి, ఆయనలోని నవ్వు ముఖాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఛానల్ ఒక ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. మొదట మమ్ముట్టిని అనుకున్నప్పటికీ, ఇద్దరూ గంభీర స్వభావులే కావడంతో ఆ బాధ్యతను శ్రీనివాసన్ కు అప్పగించారు. శ్రీనివాసన్ అయితేనే పినరయిని నవ్వించగలరని భావించి చేసిన ఇంటర్వ్యూ సూపర్ హిట్ అయింది. తన చిన్నప్పటి దెయ్యాల భయం గురించి పినరయి సరదాగా చెప్పడం ప్రజల్లో ఆయనపై ఉన్న భయాన్ని పోగొట్టింది.నటి నవ్య నాయర్ కూడా గతంలో పినరయి కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసింది. అక్కడ ఆమె పినరయిని ‘విజయన్ అంకుల్’ అని పిలిచారు. గంభీరమైన నాయకుడి వెనుక ఉన్న తండ్రిని, భర్తను ప్రజలకు పరిచయం చేయడమే ఆ కార్యక్రమ ఉద్దేశం.కలిసొచ్చిన మోదీ ‘మామిడి పండ్ల’ ముచ్చట్లు2019 లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. ఇది పూర్తిగా రాజకీయేతర సంభాషణ. మోదీకి మామిడి పండ్లు అంటే ఇష్టమా? ఆయన రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతారు? వంటి వ్యక్తిగత విషయాల గురించి ఇందులో చర్చించారు.మమతా బెనర్జీ తనకు కుర్తాలు పంపిస్తారని చెప్పడం ద్వారా, రాజకీయ వైరం ఉన్నా వ్యక్తిగత సంబంధాలు బాగుంటాయని సందేశం ఇచ్చారు. ఇది సామాన్య ఓటర్లలో మోదీ పట్ల సానుకూలతను పెంచింది. ఇది ఎన్నికల గిమ్మిక్కు అని విపక్షాలు విమర్శించినా, ఫలితం మాత్రం మోదీకి అనుకూలంగానే వచ్చింది. ఇదే పంథాలో ప్రపంచ నాయకులుభారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాధినేతలు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు బరాక్ ఒబామా ‘బిట్వీన్ టూ ఫెర్న్స్’ వంటి హాస్య ప్రధాన్యత ఉన్న షోలలో పాల్గొన్నారు. తన ‘ఒబామా కేర్’ పథకం గురించి యువతకు చేరవేయడానికి సినీ తారల సహాయం తీసుకున్నారు. 2024లో జరిగిన అమెరికా ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ జో రోగన్ వంటి పాపులర్ పాడ్కాస్టర్లతో గంటల తరబడి మాట్లాడారు. తన సోదరుడి మరణం గురించి భావోద్వేగంగా మాట్లాడుతూ ఓటర్లకు చేరువయ్యారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వతహాగా నటుడు కావడంతో, ఆయన తన ప్రతిష్టను పెంచుకోవడంలో సినిమా మాధ్యమాన్ని చక్కగా వాడారు. హాలీవుడ్ నటుడు షాన్ పెన్ ఆయనపై ‘సూపర్ పవర్’ అనే డాక్యుమెంటరీ కూడా తీశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను ఒక శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచానికి చూపించుకోవడానికి హాలీవుడ్ దర్శకుడు ఆలివర్ స్టోన్ తో వరుస ఇంటర్వ్యూలు చేయించుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికన్ టాక్ షో హోస్ట్లు స్టీఫెన్ కోల్బెర్ట్, కోనన్ ఓబ్రియన్ వంటి వారితో సరదాగా ముచ్చటిస్తూ తన ‘కూల్ ఇమేజ్’ను ప్రదర్శించారు.కలిసొస్తున్న ‘గ్లామర్’ పాలిటిక్స్రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇవి కేవలం ఎన్నికల గిమ్మిక్కులు మాత్రమే కాదు. డిజిటల్ యుగంలో ప్రజలు నాయకుడిలోని 'మానవీయ కోణాన్ని' చూడాలని కోరుకుంటున్నారు.కఠినమైన విధాన నిర్ణయాల కంటే, ఇలాంటి సరదా సంభాషణలే ప్రజల మెదళ్లలో ఎక్కువ కాలం గుర్తిండిపోతాయి.దీంతో పాటు సెలబ్రిటీల ఫాలోయింగ్ను వాడుకోవడం ద్వారా యువ ఓటర్లను సులువుగా ఆకర్షించవచ్చు. కేరళలో పినరయి-మోహన్ లాల్ ఇంటర్వ్యూ అయినా, ఢిల్లీలో మోదీ-అక్షయ్ ముచ్చట్లయినా.. అంతిమ లక్ష్యం ఒక్కటే: "నేను మీలో ఒకడిని" అని చాటిచెప్పడం. గ్లామర్,పొలిటికల్ పవర్ కలిసినప్పుడు పుట్టే ఈ 'కొత్త రాజకీయం' భవిష్యత్తులో మరిన్ని వింత పోకడలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు.
ఒక రోజు రష్మికను చాలా మిస్ అయ్యా.. పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ విజయ్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు తెరదించుతూ, నేడు (ఫిబ్రవరి 26) ఉదయం 10.10 గంటలకు రాజస్తాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాగింది.వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ, తన లవ్స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. ‘ఒక రోజు ఆమెను చాలా మిస్ అయ్యాను. తను నా పక్కనే ఉంటే బాగుంటుందని, తను ఎదురుగా ఉంటే నేను తినే భోజనానికి ఒక అర్థం ఉంటుందని గ్రహించాను. జిమ్లో తను తోడుంటే ఆ కష్టం శిక్షలా కాకుండా సరదాగా అనిపించేది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మనశ్శాంతిని ఇచ్చే 'ఇల్లు' అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్నే నా భార్యగా చేసుకున్నాను’ అని విజయ్ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా తెలియజేశాడు. అటు రష్మిక కూడా ‘నా భర్తను పరిచయం చేస్తున్నా’ అంటూ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ జంటగా మారడం పట్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నటీనటులు, ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda)
క్రీడలు
77 సెకన్లలోనే...
టిరానా (అల్బేనియా): ముహమెత్ మాలో స్మారక వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్ సుజీత్ కల్కాల్ పసిడి పతకం సాధించాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో సుజీత్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సుజీత్ ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అజర్బైజాన్ రెజ్లర్ రషీద్ బాబాజాదెను చిత్తుగా ఓడించాడు. బౌట్ మొదలైన 77 సెకన్లకే సుజీత్ 10–0తో ఆధిక్యంలోకి వెళ్లి బంగారు పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం ప్రత్యర్థి పై 10 అంతకన్నా పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే రిఫరీ బౌట్ను నిలిపివేసి ఆ రెజ్లర్ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. ఫైనల్ చేరే క్రమంలో సుజీత్ మూడు బౌట్లలోనూ ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలోనే గెలుపొందడం విశేషం. సెమీఫైనల్లో సుజీత్ 11–0తో (5 నిమిషాల 17 సెకన్లు) జోసెఫ్ క్రిస్టోఫర్ (అమెరికా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో (4 నిమిషాల 6 సెకన్లు) నికా జకాష్విలి (జార్జియా)పై, తొలి రౌండ్లో 16–4తో (3 నిమిషాల 33 సెకన్లు) ఎండ్రియో అవిదిలి (అల్బేనియా)పై విజయం సాధించాడు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నీల్లో సుజీత్కిది నాలుగో స్వర్ణం కావడం విశేషం. 2022లో జుహైర్ ఎస్గెయిర్ టోర్నీలో, 2025లో పొల్యాక్ ఇమ్రె–వర్గా యోనస్ స్మారక టోర్నీలో, 2026 జాగ్రెబ్ ఓపెన్ టోర్నీలో సుజీత్ పసిడి పతకాలు గెలిచాడు.
జింబాబ్వే చిత్తు.. టీమిండియా సెమీస్ ఆశలు సజీవం
టీ20 వరల్డ్కప్-2026లో టీమిండియా తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. జింబాబ్వేను 72 పరుగుల తేడాతో సూర్య సేన చిత్తు చేసింది. ఈ కీలక పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఇండియా బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ(55), హార్దిక్ పాండ్యా(50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. తిలక్ వర్మ(16 బంతుల్లో 44), ఇషాన్ కిషన్(38), సూర్యకుమార్ యాదవ్(33), సంజూ శాంసన్(24) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్గర్వ, బ్లెసింగ్ ముజర్బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్ సికందర్ రజా తలా ఒక వికెట్ పడగొట్టారు.బెన్నెట్ ఒంటరి పోరాటం..255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ రియాన్ బెన్నెట్ ఒంటరి పోరాటం చేశాడు. 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 97 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. కెప్టెన్ సికిందర్ రజా(31) ఫర్వాలేదన్పించాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు.
చరిత్ర సృష్టించిన టీమిండియా
టీ20 వరల్డ్కప్-2026లో జింబాబ్వేతో మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మన బ్యాటర్లు జూలు విధిల్చారు. చెన్నైలోని చెపాక్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు.బ్యాటింగ్కు ప్రతీ ఒక్కరూ పరుగులు సాధించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(55), హార్దిక్ పాండ్యా(50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. తిలక్ వర్మ(16 బంతుల్లో 44), ఇషాన్ కిషన్(38), సూర్యకుమార్ యాదవ్(33), సంజూ శాంసన్(24) రాణించారు.అయితే మొత్తం ఆరుగురు బ్యాటర్లు కూడా 150+ స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేయడం విశేషం. తద్వారా టీమిండియా ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో ఆరుగురు బ్యాటర్లు 20 కంటే ఎక్కువ పరుగులు చేసి, 150+ స్ట్రైక్ రేట్ను నమోదు చేయడం ఇదే తొలిసారి.👉ఓ వరల్డ్కప్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన జాబితాలో భారత్ రెండో స్ధానంలో నిలిచింది. ఈ ఏడాది వరల్డ్కప్లో టీమిండియా ఇప్పటివరకు 63 సిక్సర్లు కొట్టింది. వెస్టిండీస్ 66 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉంది.👉టీ20 వరల్డ్కప్లో ఒక ఇన్నింగ్స్లో అతి తక్కువ బంతులు(26) డాట్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది.
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచ రికార్డు
టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా.. స్ట్రైక్రేటు పరంగా అత్యంత అరుదైన ఘనత సాధించింది. జింబాబ్వేతో గురువారం నాటి సూపర్-8 మ్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ సేన ఈ ఫీట్ నమోదు చేసింది.మెరుపులుచెన్నైలోని చెపాక్ స్టేడియంలో టాస్ ఓడిన టీమిండియా.. జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్గా తిరిగి వచ్చిన సంజూ శాంసన్ (Sanju Samson) 15 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్రేటు 160. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చి.. 183కు పైగా స్ట్రైక్రేటుతో 55 పరుగులు సాధించాడు.వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 38 పరుగులు చేయగా.. స్ట్రైక్రేటు 158.33గా నమోదైంది. మరోవైపు.. ధనాధన్ దంచికొట్టిన కెప్టెన్ సూర్యకుమార్ 13 బంతుల్లో 253కు పైగా స్ట్రైక్రేటుతో 33 పరుగులు రాబట్టాడు.𝙈𝙖𝙥𝙤𝙨𝙖 𝙬𝙚𝙣𝙩 𝙛𝙪𝙡𝙡, 𝙎𝙆𝙔 𝙬𝙚𝙣𝙩 𝙛𝙪𝙧𝙩𝙝𝙚𝙧. 🚀Total control from Suryakumar Yadav as he steers India forward!ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/QZBUsVXD6e— Star Sports (@StarSportsIndia) February 26, 2026అతడి స్ట్రైక్రేటు 275ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకుని.. 217కు పైగా స్ట్రైక్రేటు నమోదు చేయగా.. తిలక్ వర్మ 16 బంతుల్లోనే 44 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్రేటు 275గా ఉండటం విశేషం. హార్దిక్, తిలక్ ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్ల నష్టపోయి.. 256 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది.టీమిండియా ప్రపంచ రికార్డుఈ క్రమంలో టీమిండియా ప్రపంచ రికార్డు సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో... ఓ జట్టులోని ఆరుగురు లేదంటే అంతకంటే ఎక్కువ మంది బ్యాటర్లు 150కి పైగా స్ట్రైక్రేటుతో.. ఇరవైకి పైగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్గర్వ, బ్లెసింగ్ ముజర్బానీ, కెప్టెన్ సికందర్ రజా, టినోటెండా మపోసా తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకికాగా మొదటిసారి 2007లో ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియా.. 2024లో రెండోసారి టైటిల్ గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ లీగ్ దశలో సత్తా చాటింది. అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-8కు చేరుకుంది.అయితే, సూపర్-8 తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జింబాబ్వేతో మ్యాచ్లో భారీ విజయం సాధించడంతో పాటు తదుపరి వెస్టిండీస్పై భారీ తేడాతో గెలిస్తేనే సూర్యసేనకు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్న్యూస్!
న్యూస్ పాడ్కాస్ట్
హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం... చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల హెచ్చరిక
మహాపచారం మీదే చంద్రబాబూ..! కల్తీనెయ్యి వివాదంలో చంద్రబాబు పాత నిర్ణయాలు వెలుగులోకి
ఏపీలో మరణ మృదంగం మోగిస్తున్న ‘పాల’కూట విషం. ఐదుకు చేరిన మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ కుంభకోణం.. అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ
తాత్కాలిక సుంకాలు 10 శాతం నుంచి 15 శాతానికి పెంపు... వెంటనే అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు చెల్లవ్... పన్ను విధింపు కాంగ్రెస్ అధికారం మాత్రమే... అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
చంద్రబాబుదే కల్తీ పాపం.. కల్తీ నెయ్యి సరఫరా జరిగింది, వినియోగించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బాబు సర్కారు దగా... ఉప ప్రణాళిక నిధుల్లో 27 వేల కోట్ల రూపాయలు కోత
హెరిటేజ్తో ఇందాపూర్ డెయిరీ బంధంపై అట్టుడికిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి
నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచల తీర్పు.. లొంగిపోవాల్సిందే..!
బిజినెస్
అతిపెద్ద ఆర్థిక మార్పు ఎదుర్కొంటున్నాం: కియోసాకి
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఫెడరల్ రిజర్వ్ విధానాలు, ద్రవ్యోల్బణం, బిట్కాయిన్ భవిష్యత్తు వంటి అంశాలపై లోతైన విశ్లేషణతో రూపొందిన డాక్యుమెంటరీ ‘మనీ డిస్రప్టెడ్’ (Money Disrupted) ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ డాక్యుమెంటరీని ఫ్రూషన్ ప్రొడక్షన్స్ తరఫున క్రిస్టఫర్ డాడ్జ్ నిర్మించారు. ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఈ డాక్యుమెంటరీని తన సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రోత్సహించడంతో ఇది మరింత ప్రచారం పొందింది. దీంట్లో ఆయన మాట్లాడినదానికి సంబంధించి చిన్న వీడియో క్లిప్ను జోడిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో కియోసాకి పోస్ట్ చేశారు.చరిత్రలో అతిపెద్ద ఆర్థిక మార్పును ప్రపంచం ఎదుర్కొంటోందని వీడియోలో చెప్పుకొచ్చిన రాబర్ట్ కియోసాకి.. దీన్ని తాను ముందే ఊహించానన్నారు. అందుకే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకాన్ని రచించానన్నారు. ఆ తర్వాత తన జీవితమే మారిపోయిందన్నారు. ఇంకా ఆయన ఏమేమి మాట్లాడారన్నది పూర్తి డాక్యుమెంటరీ విడుదలయ్యాక తెలుస్తుంది. ఫెడరల్ రిజర్వ్ నుంచి బిట్కాయిన్ వరకూ...డాక్యుమెంటరీలో ముఖ్యంగా అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ (Federal Reserve) స్థాపన తర్వాతి ఆర్థిక పరిణామాలు, 1971లో గోల్డ్ స్టాండర్డ్ ముగింపు, పెరుగుతున్న జాతీయ అప్పులు, ద్రవ్యోల్బణ ప్రభావాలను విశ్లేషించారు.నిపుణుల అభిప్రాయాలతో పాటు, సంప్రదాయ ఫియాట్ కరెన్సీ వ్యవస్థపై విమర్శాత్మక దృష్టికోణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బ్లాక్చెయిన్ సాంకేతికత, బిట్కాయిన్ వంటి డిజిటల్ ఆస్తులు భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయ మార్గాలుగా మారవచ్చని చిత్ర బృందం సూచిస్తోంది.ప్రముఖుల అభిప్రాయాలుఈ డాక్యుమెంటరీలో మాజీ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాన్ పాల్, ఆర్థిక విశ్లేషకులు లినెట్ జాంగ్, ఆండి షెక్ట్మన్ తదితరులు తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ద్రవ్య విధానాలపై వీరి విమర్శలు, “సౌండ్ మనీ” అవసరంపై వారి వాదనలు ఈ డాక్యుమెంటరీకి వైవిధ్యాన్ని తీసుకురానున్నాయి.Check out the full documentary Money Disrupted by Christopher Dodge of Fruition Productions - here is a short clip https://t.co/uojn89SCoS— Robert Kiyosaki (@theRealKiyosaki) February 23, 2026
ఇద్దరు ప్రధానులతో ఇండియన్ బైక్
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ఇజ్రాయెల్లో అత్యాధునిక ఆవిష్కరణలను హైలైట్ చేసే ఒక టెక్ ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఇది మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ముఖ్యమైన భాగం మాత్రమే కాదు, భారత్–ఇజ్రాయెల్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కూడా నిదర్శనం.ఈ టెక్ ప్రదర్శనలో.. వ్యవసాయ సాంకేతికత, నీటి నిర్వహణ, వాతావరణ మార్పుల పరిష్కారాలు, బయోటెక్నాలజీ, స్మార్ట్ మొబిలిటీ, కృత్రిమ మేధస్సు (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, శక్తి వనరులు & అంతరిక్ష వ్యవస్థలు వంటి అనేక కీలక రంగాల్లో ముందంజలో ఉన్న కంపెనీలు, పరిశోధనా సంస్థలు పాల్గొన్నాయి. ప్రపంచ సమస్యలకు సుస్థిర పరిష్కారాలను కనుగొనే దిశగా ఇరు దేశాలు చేస్తున్న సంయుక్త కృషిని ఈ ప్రదర్శన ప్రతిబింబించింది.ఇండియా-ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ బ్రిడ్జి ప్రయత్నాలకు టెక్ ఎగ్జిబిషన్ ఒక నిదర్శనం. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం & ఇజ్రాయెల్కు చెందిన శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, పరిశ్రమల నాయకులు కలిసి పని చేయడానికి మార్గదర్శం అవుతుంది.వేదిక కల్పించబడుతోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించడం.ఈ ప్రదర్శన సందర్భంలో.. మోదీ చాలామంది పరిశోధకులు, కంపెనీల సీఈఓలు & స్టార్టప్ వ్యవస్థాపకులతో నేరుగా మాట్లాడి కొత్త సాంకేతిక పరిజ్ఞానాల ఉపయోగాల గురించి చర్చించారు. ఇజ్రాయెల్ ప్రపంచంలో ప్రముఖ ఆవిష్కరణ కేంద్రాల్లో ఒకటిగా నిలిచిన విషయం మరోసారి స్పష్టమైందిరాయల్ ఎన్ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350ఈ కార్యక్రమంలో 'రాయల్ ఎన్ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350' మోటార్ సైకిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బైక్ను మోదీ & నెతన్యాహు కలిసి పరిశీలించడం ఒక ముఖ్యమైన సందర్భంగా మారింది. ఇది భారత తయారీ శక్తిని & అంతర్జాతీయ మార్కెట్లో భారత ఉత్పత్తుల ప్రాధాన్యతను సూచించింది. ఇజ్రాయెల్లో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు మంచి ఆదరణ ఉంది.రాయల్ ఎన్ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350లో 349 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 20.2 బిహెచ్పీ పవర్ 27 న్యూటన్ మీటర్ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5గేర్ల గేర్బాక్స్తో వస్తుంది. 2026 మోడల్లో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి సరికొత్త సౌకర్యాలు చేర్చబడ్డాయి. అదనంగా, యూఎస్బీ టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: తలపాగా రంగుకో రోల్స్ రాయిస్ కారు: ఎవరీ రూబెన్ సింగ్!డిజైన్ పరంగా ఈ బైక్ చాలా ప్రత్యేకంగా ఉంది. బాబర్ శైలి ఆకృతి, ఫ్లోటింగ్ సీటు, ఎత్తైన హ్యాండిల్బార్, తెల్లటి సైడ్వాల్ టైర్లు వంటివి కలిగి ఉండటం వల్ల గోవన్ క్లాసిక్ 350 చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారణంగానే ఈ బైక్ ప్రపంచవ్యాప్తంగా రైడర్ల మనసును గెలుచుకుంటోంది. View this post on Instagram A post shared by NDTV (@ndtv)
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 45.52 పాయింట్ల నష్టంతో 82,230.55 వద్ద, నిఫ్టీ 14.05 పాయింట్ల లాభంతో 25,496.55 వద్ద నిలిచాయి.ఎక్స్టిగ్లోబల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్, రుద్ర గ్లోబల్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్, సనోఫీ కన్స్యూమర్ హెల్త్కేర్ ఇండియా లిమిటెడ్, రినైసాన్స్ గ్లోబల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఆర్ఎమ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ & సొల్యూషన్స్ లిమిటెడ్, జిందాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్, ట్రాన్స్వారంటీ ఫైనాన్స్ లిమిటెడ్, వీఎల్ ఈ గవర్నెన్స్ & ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
ఐటీ కొత్త రూల్: ఇంటి ఓనర్తో సంబంధం చెప్పాలి
ఆదాయపన్ను ముసాయిదా పత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంటి అద్దెపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునే వారు ఇకపై ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పంద రుజువును చూపించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి రానుండడం గమనార్హం. దీంతో ముసాయిదా పత్రాలు, నిబంధనలపై భాగస్వాములకు ఆదాయపన్ను శాఖ పంపిణీ చేసింది. వేతన జీవులు హెచ్ఆర్ఏ క్లెయిమ్ను చేసుకునే విషయంలో యాజమాన్యానికి ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఇకపై ఫారమ్ 124లో ప్రాపర్టీ యజమానితో ఉన్న సంబంధాన్ని (అసెసీ/పన్ను చెల్లింపుదారు/దాఖలుదారు) వెల్లడించాల్సి ఉంటుంది. కల్పిత, పెంచి చూపించే అద్దె మొత్తాలకు ఈ నిబంధన చెక్ పెడుతుందని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ ఆదాయంపై పన్ను జమ క్లెయిమ్లకు సంబంధించి ఆడిటర్లు, కంపెనీలపై బాధ్యతను పెంచడం కూడా కొత్త పత్రాల్లో భాగంగా ఉంది. భారత్కు వెలుపల ఏదైనా ప్రాంతానికి సంబంధించిన ఆదాయంపై ఫారీన్ ట్యాక్స్ విత్హోల్డింగ్ సర్టిఫికెట్లను అకౌంటెంట్లు స్వతంత్రంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపుల రుజువులు, కరెన్సీ మారకం లావాదేవీలు, పన్ను అర్హత నిబంధనలను, పన్ను చెల్లింపుదారు నివాస హోదాలను సైతం ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
ఫ్యామిలీ
జస్ట్ 11 నెలల్లో 52 కిలోలు బరువు తగ్గింది..! నో జిమ్, నో స్ట్రిక్ట్ డైట్..
బరువు తగ్గడం అందరికీ ఒకలా ఉండదు. కొందరికి చాలా కష్టమైనదిగా..మరికొందరికి చాలా తేలికైన వాటితో సులభంగా తగ్గే టాస్క్లా ఉంటుంది. అయితే ఇక్కడ స్థిరత్వాన్ని బ్రేక్ చేయకపోతేనే..లక్ష్యానికి చేరుకోగలం. ఇక్కడ ట్యునిషియాకు చెందిన హిబా అల్లా వెయిట్లాస్ స్టోరీ ఆ విధంగానే సాగింది. ఆమె ఓర్పుతో స్థిరత్వంతో బరువు తగ్గే ప్రయాణాన్ని మొదలు పెట్టి ఏకంగా 133 కిలోల బరువు నుంచి 52 కిలోలకు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అదికూడా జస్ట్ 11 నెలల్లో ఈ ఫలితాన్ని అందుకుని స్ఫూర్తిగా నిలిచిందామె. ఇంతకీ ఆమె ఎలాంటి ట్రిక్స్ అనుసరించిందంటే..ట్యునీషియాలోని ట్యునీస్కు చెందని 22 ఏళ్ల హిబా అల్లా అయాది ఒక స్టూడెంట్. ఆమె ఎత్తు 5 అడుగులు 8 అంగుళాలు, బరువు ఏకంగా 133.3 కిలోలు ఉండేది. ఆమె రూపం భారీగా ఉండి..కనీసం నాలుగు అడుగులు వేయాలన్నా..ఆయాసంతో ఇబ్బందిపడేది. శ్వాస తీసుకోవడంలో నిరంతరం అలసటను ఎదుర్కొనేది. ఆరోగ్యం రోజు రోజుకి భారంగా మారిపోవడం మొదలైంది. ఇక తనకు తానుగా బరువు తగ్గేందుకు ఉపక్రమించకపోతే..ఉనికే కష్టమవుతుందని అర్థమైంది హిబాకు. దాంతో వెయిట్లాస్ అయ్యేందుకు రెడీ అయ్యింది. అయితే ఆమె అందరు అనుక్నుట్లుగా బరువు తగ్గడం అంటే..తినడం తగ్గించడం, నోరు కట్టేసుకోవడం కాదంటోంది. ఆమె తింటూనే బరువు తగ్గే ప్రయత్నం చేసిందంటే. అయితే తినే వాటిలో ఆరోగ్యకరమైనవి, ప్రోటీన్,ఫైబర్ ఉండేవి ఎంచుకున్నట్లు తెలిపింది. ముందుగా ఆకలి తీరి సంతృప్తిని కలిగించేలా భోజనం ఉండేలా చూసుకునేదాన్ని. అప్పుడు బరువు తగ్గడం భారంగా..భయానకంగా ఉండదట. పైగా తరుచుగా అద్దంలో చూసుకోవడం..స్లిమ్గా మారాలనే లక్ష్యాన్ని నిరంతరం గుర్తుచేస్తుంది. నోరు ఆటోమేటిగ్గా అదుపులో ఉండేలా ఆహారం తీసుకునేలా మైండ్సెట్ అవుతుందట. ఆమెకు అధిక బరువు కారణంగా జిమ్ సభ్యత్వం లభించలేదట. అందుకని హిబా వర్కౌట్లకు బదులుగా నడకను ఎంచుకుందట. నెమ్మదిగా చిన్న అడుగులతో మొదలు పెట్టి..కిలోమీటర్ల కొద్ది నడకను పెంచుకుంటూ పోయేదాన్ని అంటోంది. అధికంగా నీటిని తీసుకోవడం, తాజా పండ్లను తీసుకోవడం వంటివి చేసేదట. అలేగు ఉప్పు, చక్కెరలను మితంగా తీసుకునేదట. ఇక బరువు తగ్గడం శారీరకం భావోద్వేగ పోరాటంగా అభివర్ణించింది. మొదట్లో అంత తొందరగా తన బాడీలో మార్పులు సంతరించుకోలేదని, అయినా..ఎక్కడ అసహనం చెందకుండా ఓర్పుతో తన దినచర్యను కొనసాగించానని చెప్పుకొచ్చింది. ఏం తీసుకున్నా..ఆరోగ్యకరమైన విధంగా ఎంచుకోవడం, వాకింగ్ని స్కిప్ చేయకపోవడం వంటి అలవాట్లతో బరువు తగ్గడం ప్రారంభమవ్వడం మొదలైంది. అయితే తాను ఆ ఉత్సాహంతో అలసిపోతున్నప్పుడూ కూడా ఓపికతో తన డైలీ యాక్టివిటీని కొనసాగించేదాన్ని అంటోంది. అలా ఇవాళ 52.45 కిలోలు బరువుతగ్గి 52 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నా అని నవ్వతూ చెప్పింది హిబా. అంతేగాదు బరువు తగ్గడం అనేది శిక్ష కాదని, శరీరం, జీవితానికి ఇచ్చే గౌరవప్రదమైన చర్యగా అభిర్ణించింది. ఈ రోజు తాను ఆరోగ్యంగా, హాయిగా శ్వాస తీసుకునే ఆహ్లాదభరితమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని ఆనందంగా చెబుతోంది. దయచేసి బరువు తగ్గడం అంటే..విపరీతమైన వర్కౌట్లు, కఠినమైన ఆహారంగా భావించొద్దు..సంతృప్తికరంగా తింటూ..ఎంజాయ్ చేస్తూ తగ్గాలి..అప్పుడే మంచి ఫలితాలు అందుకోగలం అని నమ్మకంగా చెబుతోంది హిబా.(చదవండి: బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారు..!కానీ ఆ మహిళ ..)
బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారు..!కానీ ఆ మహిళ ..
వైద్యశాస్త్రం రోజు రోజుకి పురోగమిస్తు బాధిత రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా సంతానం విషయంలో ఇటీవల కాలంలో ఎన్ని జంటలు ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందే. ఐవీఎఫ్, సరోగసీ ద్వారా కొంత ఉపశమనం లభించినప్పటికీ..కొందరు పుట్టుకతో గర్భాశయం లేని అమ్మాయిలకు మాత్రం సంతానం ఓ కలగానే మిగిలిపోతోంది. రూపం, ఆరోగ్యం.. పరంగా బాగుండి ఆ విషయంలో మాత్రం జీవితాంతం వారికో లోపం, శాపంగా ఉండిపోతోంది. ఇప్పుడు ఆ సమస్యకు చక్కటి ఉపశమనం అందించారు వైద్యులు. వైద్యశాస్త్రంలోనే సరికొత్త అద్భుతం చోటు చేసుకునేలా కొంగొత్త వైద్య ఆవిష్కరణలకు నాంది పలికి రోగుల్లో కొత్త ఆశలను నింపుతున్నారు. అందుకు ఈ జంట ఉదంతమే ఓ ఉదాహరణ. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 30 ఏళ్ల గ్రేస్ బెల్ పుట్టుకతోనే గర్భం లేదామెకు. గర్భం లేదు కాబట్టి పీరియడ్స్ ఉండవు గానీ సాధారణ అండశయాలు ఉంటాయి. ఈ పరిస్థితిని ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్గా పేర్కొంటారు. యూకేలో ప్రతి 5 వేల మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బెల్కి పిల్లలు పుట్టాలంటే గర్భమార్పిడి లేదా సరోగసీ ఒక్కటే మార్గం. దాంతో బెల్ భర్త స్టీవ్ పావెల్ ఇద్దరూ గర్భశయాన్ని దానం చేసే దాత కోసం ఎదురు చూస్తుండేవారు. గర్భం దొరికిందని, మార్పిడికి సిద్ధంగా ఉండమని ఆస్పత్రి నుంచి వచ్చిన కాల్ వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నమ్మశక్యం కానీ నిజంలా అనిపించింది ఆ జంటకు. అలా బెల్కి జూన్ 2024లో ఆక్స్ఫర్డ్లోని చర్చిల్ హాస్పిటల్లో దాదాపు 10 గంటలు శ్రమించి గర్భశయ మార్పిడి ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఐవీఎఫ్ని ఆశ్రయించి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నారు. ఆ విధంగా ఈ జంటకు 2025లో ఓ అద్భుత వరంలా 7 పౌండ్ల బరువుతో హ్యోగో అనే బిడ్డ జన్మించాడు. ప్రస్తుతం ఆ చిన్నారికి పదివారాల వయసు. ఆ దంపతులు ఇద్దరు తమకు సంతానభాగ్యాన్ని అందించిన ఆ మహిళకు, ఆమె కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటామంటూ భావోద్వేగంగా చెప్పారు. మా బిడ్డను చూసిన ప్రతిసారి వాళ్లే మాకు గుర్తొస్తారంని అన్నారు. అయితే ఆ జంట మరో బిడ్డను కనాలనుకునేంత వరకు మార్పిడి చేసిన గర్భాశయాన్ని ఉంచి, ఆ తర్వాత తొలిగిస్తారట. ఎందుకంటే ఆ అవయవంపై శరీర రోగ నిరోధక వ్యవస్థ దాడి చేయకుండా నిరోధించడానికి, అలాగే ఆమె జీవతాంత మందులు తీసకోకుండా నివారించేందుకు ఇది తప్పదని చెబుతున్నారు వైద్యులు. కాగా, ఇలాంటి ఘటనే 2025 ప్రారంభంలో యూకేలో మొదటి సజీవ గర్భదానం ద్వారా అమీ అనే శిశువు జన్మించింది. ఈకేసులో అక్క గర్భాన్ని పొందింది సదరు మహిళ. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉండటంతో చెలెల్లికి తన గర్భాన్ని దానం చేసింది. వైద్యశాస్త్రంలో ఈ పురోగతి..పుట్టుకతో గర్భంలేని యువతుల పాలిట వరంగా మారుతుంది. పైగా అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగేందుకు నాంది పలకడమే గాక..మరణం తర్వాత ఇతరుల జీవితాల్లో వెలుగులు పంచేలా బతకడం ఈ దానం వల్లే సాధ్యమని తెలుసుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: అద్దంలో కనిపించని అసలు రూపం)
ఐరన్ లేడీ అవుదాం
భారతదేశంలో చాపకింది నీరులా ముంచుకొస్తున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య రక్తహీనత. ముఖ్యంగా ప్రతి నలుగురు మహిళల్లో ముగ్గురు ఐరన్ లోపంతో ఉన్నారనే గణాంకాలు దేశంలో అనీమియా తీవ్రతను రుజువు చేస్తున్నాయి. ఇది నివారించదగినది, చికిత్స చేయదగినది అయినప్పటికీ విద్య, ఆదాయం, ప్రాంతం అనే వాటితో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు అనీమియాతో పోరాడవలసి రావడం దురదృష్టకరం. దేశవ్యాప్తంగా 70% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. 1549 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో 68.4% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.దేశంలోని 67.1% మంది చిన్న పిల్లలు రక్తహీనతతో పోరాడుతున్నారు. కౌమారదశలో ఉన్న అంటే 519 ఏళ్లు వయసులో ఉన్న బాలికల్లో 59.1% మంది రక్తహీనత బారిన పడ్డారు.⇒ గ్రామీణ మహిళల్లో రక్తహీనత 70.4% ఉండగా, పట్టణ మహిళల్లో 64.7% గా ఉంది.⇒ 50% పైగా గర్భిణులు రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు.⇒ గిరిజన ప్రాంతాల్లో రక్తహీనత 80% (అత్యధికంగా) ఉంది.⇒ ప్రతి నలుగురు భారతీయ మహిళల్లో ముగ్గురు అంటే 75% మంది తక్కువ ఐరన్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు.⇒ రక్తహీనత 20 శాతం మంది ప్రసూతి మరణాలకు కారణమవుతోంది. ⇒ అనీమియా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో జార్ఖండ్ 65.2%, హర్యానా 62.7%, పశ్చిమ బెంగాల్ 62.5% ఉన్నాయి. రక్తహీనత తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ప్రథమ స్థానంలో ఉంది.ప్రపంచవ్యాప్త గణాంకాలు ⇒ ప్రపంచవ్యాప్తంగా రక్తహీనత ఒక పెను సవాలుగా మారింది. 1549 ఏళ్ల మధ్య వయసున్న 500 మిలియన్ల మంది మహిళలు దీని బారిన పడ్డారు.⇒ 5 ఏళ్లలోపు పిల్లల్లో 269 మిలియన్ల మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.⇒ గర్భిణులలో సుమారు 37% మంది దీని ప్రభావానికి గురవుతున్నారు.ఏమిటీ సమస్య?రక్తహీనత అంటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయులు తగ్గడం. దీనివల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గి నీరసం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. పిల్లల్లో ఇది మెదడు ఎదుగుదలను దెబ్బతీస్తే, గర్భిణులలో అకాల ప్రసవం, శిశు మరణాలకు దారితీసే ప్రమాదం ఉంది.రక్తహీనతతో ప్రభావితమవుతున్నవారు⇒ 5 ఏళ్లలోపు పిల్లల్లో, ముఖ్యంగా 2 ఏళ్లలోపు ఉన్న చిన్నారుల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది.⇒ కౌమార బాలికలు, మహిళలు నెలసరి కారణంగా ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.⇒ గర్భిణులు, బాలింతలకు ఐరన్ అవసరాలు ఎక్కువగా ఉంటాయి.ఆహారమే ఔషధం⇒ ఐరన్ అధికంగా ఉండే ఆహారం పాలకూర, తోటకూర, బెల్లం, వేరుశనగలు, మాంసం వంటివి తీసుకోవాలి⇒ ఐరన్ గ్రహించడానికి శరీరానికి ఫోలేట్, విటమిన్ బి 12, విటమిన్ ఏ కూడా చాలా అవసరం.⇒ అన్ని రకాల పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.⇒ వైద్యుల సూచనతో ఐరన్ టాబ్లెట్లు, సిరప్లు వాడవచ్చు.రక్తహీనత అనేది కేవలం ఒక పోషకాహార లోపం మాత్రమే కాదు, అది ఒక దేశ భవిష్యత్తు ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశం. దీని నివారణకు ప్రభుత్వ కృషి, ప్రజల అవగాహన అవసరం.
జాతీ మతం కంటే మనిషి ముఖ్యం
బ్రిటిష్ అకాడెమీ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ చిత్రం ‘బూంగ్’ తెర వెనుక కథ మానవత్వాన్ని చాటుతోంది. ఈ సినిమా దర్శకురాలు లక్ష్మీ ప్రియాదేవి మణిపూర్లో మెయితి తెగకు చెందినామె. ముఖ్య పాత్ర పోషించిన బాలనటుడు గుగున్ కుకీ తెగకు చెందినవాడు. అయితే సినిమాలో అతను మెయితీ తెగకు చెందిన పిల్లాడిగా నటించాడు. సినిమా షూట్ ముగిశాక మొదలైన మణిపూర్ అల్లర్లలో మెయితీల దాడి నుంచి గుగున్ కుటుంబాన్నిలక్ష్మీ ప్రియాదేవి కాపాడింది. ఢిల్లీకి వలస వచ్చిన గుగున్ ప్రస్తుతం ఆరవ తరగతి పరీక్షలకు కూచుంటున్నాడు. 2023కు ముందు మతం, జాతీ తేడా లేకుండా ఉన్న తాము ఇప్పుడెందుకు ఇలా ఉన్నామని ప్రశ్నిస్తున్నారు వారు.మణిపురి భాషలో తీసిన ‘బూంగ్’ సినిమా ట్రైలర్ను చూసినా అది మనల్ని ఆకట్టుకుంటుంది. అందులో కనిపించే తల్లీకొడుకులు మనకు ఏదో లోతైన కథ చెప్తున్నారనిపిస్తుంది. ఆ సినిమాలో తండ్రి ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లి ఉంటాడు. స్కూల్ చదువులో ఉన్న కుమారుడు తండ్రి కోసం బయల్దేరడమే ‘బూంగ్’ సినిమా. మణిపురి దర్శకురాలు లక్ష్మీ ప్రియాదేవి దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘బ్రిటిష్ అకాడెమీ’ అవార్డ్స్లో మొదటిసారి మన దేశానికి అవార్డు సం పాదించిపెట్టింది. ఇది రికార్డు. ఈ కథ ఇక్కడ ముగిసినా ఈ సినిమా వెనుక ఉన్న కథ మాత్రం మనసుల్ని కదిలించేలా ఉంది.మెయితీ–కుకీమణిపూర్లో రెండు బలమైన జాతులు ఉన్నాయి. మెయితీ– కుకీ. ఇంఫాల్ లోయలో మెయితీలది పై చేయి అయితే కొండ ప్రాంతాలలో కుకీలది పై చేయి. లక్ష్మీ ప్రియాదేవి తీసిన ‘బూంగ్’ సినిమాలో కథ మెయితీ కుటుంబానిది. అయితే అందుకు కావలసిన బాల నటుడు కుకీ కుటుంబం నుంచి దొరికాడు. అతని పేరే గుగున్ కిప్జెన్. 2023లో షూటింగ్ జరుగుతున్నప్పుడు కిప్జెన్కు 11 ఏళ్లు. సినిమా షూటింగ్ ముగిశాక మే 3, 2023న హటాత్తుగా మణిపూర్లో అల్లర్లు మొదలయ్యాయి. మెయితీలు పైచేయిగా ఉండే ఇంఫాల్లో కుకీల మీద దాడులు జరుగుతున్నాయి.అప్పుడు కిప్జెన్ కుటుంబం ఇంఫాల్లోని కానన్వెంగ్ అనే ప్రాంతంలో ఉంది. మే4న మెయితీలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆ సమయంలో స్వయంగా మెయితీ తెగకు చెందిన లక్ష్మీ ప్రియాదేవి రంగంలో దిగి కిప్జెన్ కుటుంబాన్ని ఆ ప్రాంతం నుంచి దాటించింది. కిప్జెన్ కుటుంబం పోట్ట చేత్తో పట్టుకుని అస్సాం రైఫిల్స్ శిబిరానికి చేరి తల దాచుకుంది. అక్కడ కొన్నాళ్లు ఉన్నాక కుకీలు ఎక్కువ ఉండే కాంగ్ పోక్పి జిల్లాకు తరలి వెళ్లింది.ఇంఫాల్లో ఉన్న సొంత ఇంటిని కిప్జెన్ వదిలి పెట్టేశాడు. అతని స్కూల్లో అతను తిరిగి చదవలేడు. ఏ మెయితీ పిల్లాడి పాత్ర తాను పోషించాడు ఆ మెయితీల వల్లే కష్టాల్లోకి వెళ్లిపోయాడు. ఇతనిలాగే కుకీల వల్ల మెయితీ కుటుంబాలు, పిల్లలు అవస్థ పడ్డాయి. ఇరు వర్గాల ఘర్షణల్లో పై పై లెక్కల ప్రకారం 260 మంది చనిపోతే 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారు.ఢిల్లీకి చేరి...కొండ ప్రాంతానికి చేరినా కిప్జెన్ కుటుంబం సురక్షితంగా లేదు. అల్లర్లు కొనసాగుతూనే వచ్చాయి. దాంతో కిప్జెన్ చదువు కోసం కుటుంబం ఢిల్లీకి వలస వెళ్లాలనుకుంది. అదీ అంత సులభంగా జరగలేదు. మిలటరీ కాన్వాయ్లో ఒక బస్సులో కొన్ని కుటుంబాలతో పాటు ప్రాణాలు అరచేత పెట్టుకుని ఢిల్లీకి చేరారు. 2025 జనవరి నుంచి కిప్జెన్ కుటుంబం ఢిల్లీలోనే ఉంది. మణిపూర్లో అల్లర్లు పూర్తిగా తగ్గితే తప్ప వెనక్కు వెళ్లమని చెబుతోంది. కొత్త వాతావరణంలో కిప్జెన్ బడి బాట పట్టాడు. ప్రస్తుతం 6వ తరగతి పరీక్షకు కూచుంటున్నాడు. అతడు నటించిన సినిమా దేశ దేశాల్లో ఎంతో పేరు సం పాదిస్తున్నా ఆ సంతోషం అంతా అనుభవించలేకపోతున్నాడు. వలస జీవితం ఎంత దుర్భరమో అనుభవించినవారికే తెలుసు.దివ్యశక్తి ప్రతిఒక్కరిలో...బ్రిటిష్ అకాడెమీ అవార్డు పోందాక లక్ష్మీ ప్రియా దేవి తన ఉపన్యాసం ఇలా చేసింది– ‘మేమంతా ఎంతో బాగుండేవాళ్లం. ఆ మునుపటి శాంతి మణిపూర్కి తిరిగి రావాలి. చెదిరిపోయిన పిల్లలంతా తిరిగి తమ గూళ్లకు చేరుకుని ఆనందంగా గడ పాలి. ఎన్ని ఘర్షణలు జరిగినా మనిషిలో క్షమ అనే దివ్యశక్తి మనిషికి మాత్రమే సొంతం. ఆ క్షమతో మానవత్వాన్ని నిలబెట్టాలి’ అందామె. దేశంలో అందరికీ గౌరవంగా, సమానంగా బతికే హక్కు ఉంది. ఎవరికంటే ఎవరూ ఎక్కువ కాదు... తక్కువ కాదు. దాడులు, ప్రతి దాడులు, ద్వేషాలు పిల్లల భవిష్యత్తుకు ఎంతమాత్రం మంచివి కావు. మానవత్వమే మనిషి ప్రథమ గుణం కావాలి... ఇదే ఇప్పుడు ‘బూంగ్’ సినిమా విజేతలు లోకానికి ఇస్తున్న సందేశం.
అంతర్జాతీయం
అరుదైన నేతగా ప్రధాని మోదీ ఘనత
జెరూసలేం: అంతర్జాతీయ దౌత్య చరిత్రలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని అధిగమించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా వంటి పరస్పర విరుద్ధ దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్న అతికొద్ది మంది ప్రపంచ నేతలలో ఒకరిగా ప్రధాని మోదీ నిలిచారు. బుధవారం ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటు(క్నెసెట్)ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయడంలో ఆయన చూపిన అసాధారణ చొరవకు గుర్తింపుగా క్నెసెట్ స్పీకర్ అమీర్ ఓహానా ప్రధానికి ‘స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్’ను ప్రదానం చేశారు. ఈ అత్యున్నత గౌరవ పతకాన్ని అందుకున్న తొలి విదేశీ నేత కూడా మోదీయే కావడం విశేషం. ఇది వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని, ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన మైత్రికి, పంచుకున్న విలువలకు నిదర్శనమని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. #Jerusalem | PM Modi was awarded the Knesset Speaker's Medal during his address to the Israeli parliament on Wednesday, becoming the first Indian prime minister to receive the honour. The medal recognised his personal role in strengthening strategic ties between India and… pic.twitter.com/uYbPANKBvU— Deccan Chronicle (@DeccanChronicle) February 25, 2026నరేంద్ర మోదీ 2018లో పాలస్తీనా పర్యటన సందర్భంగా ఆ దేశ అత్యున్నత ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ పురస్కారాన్ని అందుకున్నారు. తద్వారా పశ్చిమాసియాలోని ఇరు పక్షాల గౌరవాన్ని చూరగొన్న అరుదైన దౌత్యవేత్తగా ఆయన ఘనత సాధించారు. తన తాజా ప్రసంగంలో ప్రధాని మోదీ.. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటాన్ని ప్రకటించారు. ఎక్కడ ఉగ్రవాదం తలెత్తినా అది ప్రపంచ శాంతికే ముప్పు అని హెచ్చరిస్తూ, హమాస్ అక్టోబర్ 7న జరిపిన అనాగరిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రవాద బాధితుల వేదనను భారత్ అర్థం చేసుకుంటుందని, ముంబై 26/11 దాడులను గుర్తు చేస్తూ ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’ విధానంలో ఇరు దేశాలదీ ఒకే బాట అని పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన ‘గాజా శాంతి చొరవ’కు భారత్ మద్దతు ప్రకటించింది. ఈ చొరవ పాలస్తీనా సమస్యతో పాటు ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ న్యాయమైన, శాశ్వతమైన శాంతిని చేకూరుస్తుందని ప్రధాని నమ్మకం వ్యక్తం చేశారు. సంభాషణలు, చర్చల ద్వారానే స్థిరత్వం సాధ్యమని, భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపు నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. తొమ్మిదేళ్లలో రెండోసారి ఇజ్రాయెల్ సందర్శించిన మోదీకి బెన్ గురియన్ విమానాశ్రయంలో ప్రధాని నెతన్యాహు దంపతులు ఘనస్వాగతం పలికారు.
మోదీ స్టైల్లో నెతన్యాహు.. అంతటా ఇదే చర్చ!
జరూసలేం: భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్య బంధం కేవలం రక్షణ, వ్యూహాత్మక ఒప్పందాలకు మాత్రమే పరిమితం కాదని, అది అంతకుమించిన ఆత్మీయమైనదని చాటిచెప్పే అరుదైన దృశ్యం జెరూసలేంలో ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో హాజరై, అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా పాశ్చాత్య దుస్తుల్లో (సూట్, టై) కనిపించే నెతన్యాహు.. ఈసారి తన మిత్రుడి కోసం ప్రత్యేక శైలిని ఎంచుకోవడం విశేషం. ఇది ప్రపంచ దృష్టిని అమితంగా ఆకర్షించింది.మిత్రుడి కోసం ప్రత్యేక సర్ప్రైజ్ప్రధాని మోదీకి ఎంతో ఇష్టమైన 'మోదీ జాకెట్' (నెహ్రూ జాకెట్), తెల్లటి కుర్తా ధరించి నెతన్యాహు తన మిత్రుడికి సాదర స్వాగతం పలికారు. స్టోన్ కలర్ జాకెట్, వైట్ కుర్తాలో మెరిసిపోయిన నెతన్యాహును చూసి మోదీ ఆశ్చర్యపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ప్రాణ మిత్రుడిని సంతోషపెట్టేందుకు ఈ ప్రత్యేక 'సర్ప్రైజ్' ప్లాన్ చేసినట్లు నెతన్యాహు స్వయంగా పేర్కొనడం వారి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి నిదర్శనంగా నిలిచింది. हमारे संयुक्त रात्रिभोज से पहले, मैंने अपने मित्र प्रधानमंत्री मोदी को पारंपरिक भारतीय परिधान पहनकर चौंका दिया। 🇮🇱🇮🇳@narendramodi pic.twitter.com/3ElIQeLY97— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) February 25, 2026సార్టోరియల్ గౌరవంఒక దేశాధినేత మరో దేశ సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు ధరించడం అనేది అంతర్జాతీయ దౌత్య నీతిలో అత్యున్నత గౌరవంగా భావిస్తారు. నెతన్యాహు చేసిన ఈ సార్టోరియల్ సంజ్ఞ (వస్త్రధారణ ద్వారా ఇచ్చే సందేశం) ఇరు దేశాల మధ్య ఉన్న ప్రగాఢ స్నేహానికి నిలువుటద్దంగా నిలిచింది. భాషలు, ఖండాలు వేరైనా భారత్-ఇజ్రాయెల్ దేశాల ఆలోచనా దృక్పథం ఒకటేనని ఈ సందర్భం మరోసారి నిరూపించింది.చరిత్రలో నిలిచిపోయే దృశ్యంఈ విందు కేవలం అధికారిక కార్యక్రమంగా కాకుండా, ఇద్దరు ఆత్మీయ మిత్రుల కలయికలా సాగింది. నెతన్యాహు వస్త్రధారణపై భారతీయులు ప్రశంసలు కురిపిస్తుండగా, ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఈ వినూత్న సందర్భాన్ని ఆసక్తిగా గమనించారు. ప్రధాని మోదీ విషయంలో నెతన్యాహు చూపిన ఈ గౌరవం అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ఒక మరపురాని ఘట్టంగా, ఇరు దేశాల చెక్కుచెదరని బంధానికి ప్రతీకగా నిలిచింది. ఇది కూడా చదవండి: ‘ఇన్స్టా’లో ప్రధాని మోదీ రికార్డు.. ట్రంప్ ఎక్కడంటే..
బ్రెజిల్ అతలాకుతలం.. భీకర వరదలతో 46 మరణాలు..
జూయిజ్ డీ ఫోరా: బ్రెజిల్లోని ఈశాన్య రాష్ట్రం మినాస్ గెరాయిస్ను భీకర వరదలు ముంచెత్తాయి. దీంతో రాష్ట్రంలోని జూయిజ్ డీ ఫోరా, ఉబా నగరాల్లో లక్షలాది మంది ప్రజల జనజీవన అస్తవ్యస్థమైంది. వరద సంబంధ ఘటనల్లో ఇప్పటిదాకా 46 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. ఇంకా చాలా మంది జాడ తెలీకుండా పోయిందని సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని అధికారులు ప్రకటించారు. 21 మంది గల్లంతు అయినట్టు అధికారులు చెబుతున్నారు.ఇక, రాత్రిళ్లు సైతం రిస్క్యూ బృందాలు తమ విధుల్లో నిమగ్నమయ్యాయి. ముంపు ప్రాంతాల్లోని 3,000 మందిని బుధవారం ఉదయం అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరి కొద్దిరోజులపాటు భారీ వర్షాలుకురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 5,60,000 జనాభా ఉండే జూయిజ్ డీ ఫోరా నగర వీధులన్నీ బురదలో నిండిపోయాయి. సమీపంలోని కొండచరియలు మరోసారి విరిగిపడే ప్రమాదముందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.🇧🇷🔴 ارتفاع حصيلة القتلى في البرازيلأعلنت فرق الإنقاذ والسلطات المحلية وفاة ما لا يقل عن 20 شخصًا، مع فقدان العشرات، واضطرار أكثر من 400 شخص إلى إخلاء منازلهم، جراء الأمطار الغزيرة التي ضربت جنوب شرق البرازيل.#Brazil #HeavyRain #Floods #Landslides #ExtremeWeather #BreakingNews pic.twitter.com/CHZr6VoFw7— طقس_العالم ⚡️ (@Arab_Storms) February 24, 20261,07,000 జనాభా ఉన్న ఉబా నగరంలో జనజీవనం స్తంభించింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సోమవారం ఉదయం నుంచి మొదలైన వానలకు ఇప్పటిదాకా 20 కొండచరియలు విరిగిన ఘటనలు నమోదయ్యాయని మేయర్ మార్గరీడా సాలమావో చెప్పారు. వరదబాధిత ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటోందని, బాధిత కుటుంబాలకు తగుసాయం అందిస్తామని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లాలూ డ సిల్వా భరోసా ఇచ్చారు. కొండలు, లోయలు, లోతట్టు ప్రాంతాలకు వైద్య బృందాలను పంపించారు. 🇧🇷 Dozens are still missing in southeastern #Brazil after floods killed at least 36 people in the state of Minas Gerais, officials said 👇 pic.twitter.com/B5xvJ4M8iT— FRANCE 24 English (@France24_en) February 25, 2026🚨⚡️At least 23 people were killed due to floods and landslides that struck Juiz de Fora in the state of Minas Gerais, Brazil, after heavy rainfall totaling 584 mm over two days, prompting authorities to declare a state of public calamity. pic.twitter.com/3ZLptDPXTu— RussiaNews 🇷🇺 (@mog_russEN) February 25, 2026🚨 At least 30 people are dead and hundreds displaced in Brazil’s Minas Gerais after record-breaking rainfall triggered landslides and flash floods⚠️ Juiz de Fora was hardest hit, with rivers bursting their banks and entire neighborhoods submerged pic.twitter.com/ZrvhyWwm0u— Anadolu English (@anadoluagency) February 25, 2026
అమెరికా.. మంచుమయం
న్యూయార్క్: ఈశాన్య అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. వీధులు, రోడ్లపై మంచు పేరుకుపోవడంతో బుధవారం జనం ఇబ్బందులకు గురయ్యారు. మేరీలాండ్ రాష్ట్రం నుంచి మెయినే రాష్ట్రం దాకా ఎక్కడ చూసినా మంచు కనిపిస్తోంది. 2.5 సెంటీమీటర్ల నుంచి 7.6 సెంటీమీటర్ల దాకా మందంగా మంచు పేరుకున్నట్లు జాతీయ వాతావరణ సేవల విభాగం వెల్లడించింది. ప్రధానంగా నగరాల్లో మంచు కారణంగా విధులకు ఆలస్యంగా హాజరు కావాల్సి వస్తోందని జనం చెబుతున్నారు. పిల్లలు కూడా పాఠశాలలకు ఆలస్యంగా వెళ్తున్నారు. మంచును తొలగించడానికి చాలా శ్రమించాల్సి వస్తోంది. మంగళవారం సాయంత్రం న్యూయార్క్ సిటీలో 65 మిలియన్ కిలోల ఉప్పును రోడ్లపై చల్లినట్లు మేయర్ జోహ్రాన్ మమ్దానీ ప్రకటించారు. మంచును తొలగించి, రహదారులను రాకపోకలకు అనువుగా మార్చడానికి 3,500 మందిని రంగంలోకి దించామని చెప్పారు. వీరికి గంటకు 30 డాలర్ల చెల్లిస్తున్నారు. మంచు వల్ల దివ్యాంగులకు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. రహదారులపై స్ట్రోలర్లు, రొలేటర్, వాకర్ లాంటివి ప్రయాణించే పరిస్థితి లేదు. జాగ్రత్తగా నడిచివెళ్లాల్సి వస్తోంది. అలా నడిచే వీలు లేని దివ్యాంగులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల పెద్ద సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. రైళ్ల రాకపోకలకు సైతం అంతరాయం కలుగుతోంది. విద్యుత్ లైన్లు దెబ్బతింటున్నాయి మంచు సంబంధిత ఘటనలో కనీసం ఒకరు మరణించారని అధికార వర్గాలు తెలిపాయి. రోడ్ ఐలాండ్లో 0.9 మీటర్ల మేర మంచు పేరుకుపోయింది. ఇలాంటి పరిస్థితి ఏర్పడడం 1978 తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మసాచుసెట్స్, న్యూజెర్సీ, డెలావెర్, రోడ్ ఐలాండ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని గంటల తర్వాత పునరుద్ధరించారు.
జాతీయం
పండ్లపై ఎలుకల మందు.. షాకవుతున్న జనం!
ముంబై: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పండ్ల వ్యాపారుల ఉదంతం వెలుగు చూపింది. అత్యంత ప్రమాదకరమైన ఎలుకల మందును పండ్లపై పూస్తున్న ఇద్దరు వ్యాపారులను ముంబైలోని మలాడ్ వెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో స్థానికంగా కలకలం రేపింది. మలాడ్ పశ్చిమ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న పండ్ల దుకాణం వద్ద ఒక వ్యాపారి అరటి పండ్లపై ‘రాటోల్’ అనే క్రీమ్ తరహా విషపూరిత పదార్థాన్ని రాస్తుందటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన మలాడ్ పోలీసులు సదరు పండ్ల దుకాణంపై దాడి చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఘటనా స్థలంలో ‘రాటోల్’ అనే ఎలుకల మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మందులో ‘ఎల్లో ఫాస్ఫరస్’ వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయని అధికారులు తెలిపారు. నిందితులను మలాడ్ వెస్ట్లోని రాజన్పాడకు చెందిన మనోజ్ సంగంలాల్ కేసర్వానీ (42), రాహుల్ సదన్ లాల్ కేసర్వానీ (25)గా గుర్తించి, వారిపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. मालाडमध्ये परप्रांतीय फळ विक्रेताचा बेजबाबदारपणा शिखरावर! फळांवर Ratol सारखी क्रीम लावून थेट मुंबईकरांच्या जीवाशी खेळ. Ratol सारखे विषारी पदार्थ वापरल्याने उलटी, पोटदुखी, विषबाधा, लिव्हर नुकसान आणि जीवाला धोका निर्माण होऊ शकतो. या विक्रेत्यावर कार्यवाही झालीच पाहिजे.#MNS #mybmc pic.twitter.com/RFtulkwO4h— शेख जब्बार (राजसाहेबांचा जब्बार) | SHAIKH JABBAR (@jabbarsmns) February 24, 2026బుధవారం వీరిని బోరివలిలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఆ పండ్ల దుకాణాన్ని పోలీసులు సీజ్ చేశారు.పోలీసుల విచారణలో నిందితులు విస్తుపోయే వివరాలు వెల్లడించారు. రాత్రి వేళల్లో ఎలుకలు తమ పండ్ల స్టాక్ను పాడు చేయకుండా ఉండేందుకే తాము ఆ మందును పూస్తున్నామని, వినియోగదారులకు హాని చేయాలనే ఉద్దేశ్యం తమకు లేదని వారు అన్నారు. కాగా ఆహార పదార్థాలపై ఇటువంటి విషపూరిత రసాయనాలను వాడటం క్షమించరాని నేరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఎల్లో ఫాస్ఫరస్ వంటి రసాయనాలు శరీరంలోకి చేరితే వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి, కాలేయ సంబంధిత వ్యాధులు సంభవించడమే కాకుండా, అవయవాలు వైఫల్యం చెంది ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు నగరవ్యాప్తంగా పండ్ల దుకాణాలపై నిఘా ఉంచాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని ముంబై వాసులు కోరుతున్నారు.ఇది కూడా చదవండి: మోదీ స్టైల్లో నెతన్యాహు.. అంతటా ఇదే చర్చ!
పోలీసు Vs పోలీసు.. కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్తో ఉద్రిక్తత
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు అరెస్ట్ కారణంగా ఢిల్లీ పోలీసులు, హిమాచల్ పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో, సిమ్లాలో బుధవారం అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. చివరకు మేజిస్ట్రేట్ నుంచి రిమాండ్ ఆర్డర్ రావడంతో ఈ వివాదానికి తెరపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ సమ్మిట్ యూత్ కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. వీరిలో హిమాచల్ ప్రదేశ్కు చెందిన ముగ్గురు యూత్ కాంగ్రెస్ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిమ్లాలోని ఒక హోటల్లో ఉన్న సౌరభ్, సిద్ధార్థ్, అర్బాజ్లను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు.. బుధవారం హిమాచల్ ప్రదేశ్కు వెళ్లారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం.. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ పోలీసులు మఫ్టీలో రావడంతో కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అలాగే, ముగ్గురి అరెస్ట్కు సంబంధించి విధి విధానాలు పాటించలేదని హిమాచల్ పోలీసులు.. ఢిల్లీ పోలీసులను అడ్డుకున్నారు. దీంతో, ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. #WATCH | Additional Chief Judicial Magistrate (ACJM-II) court in Shimla granted transit remand to three accused arrested by the Delhi Police from Rohru in Shimla district.The three accused, Saurav, Arbaaz and Siddharth, were produced at around 1.00 am at the residence court of… pic.twitter.com/VSyEK2Mr1u— ANI (@ANI) February 25, 2026అనంతరం, ఢిల్లీ పోలీసులు.. ముగ్గుర్ని రాత్రి అదనపు చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా.. వారికి కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు వారిని రాజధానికి తీసుకెళ్లే అనుమతి పొందారు. అనంతరం, ఢిల్లీ వెళ్తున్న క్రమంలో గురువారం తెల్లవారుజామున మరోసారి వారిని హిమాచల్ పోలీసులు అడ్డుకున్నారు. చివరికి ఢిల్లీ పోలీసులు సీజ్ మెమో కాపీని చూపించడంతో హిమాచల్ పోలీసులు వెనక్కి తగ్గారు. అయితే, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కారణంగానే ఇలా జరిగిందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. Delhi police went to arrest IYC members from Shimla and Himachal police arrested them in the morning, they got court order and got released and again arrested in the evening 😂😂👏🏼pic.twitter.com/mSezH1H96b— Vijay Thottathil (@vijaythottathil) February 25, 2026VIDEO | Shimla: A jurisdiction dispute has erupted after the Delhi Police detained three Youth Congress workers in connection with an AI Summit protest pic.twitter.com/H7o7eaYOb8— Press Trust of India (@PTI_News) February 25, 2026
‘ఇన్స్టా’లో ప్రధాని మోదీ రికార్డు.. ట్రంప్ ఎక్కడంటే..
న్యూఢిల్లీ: ప్రపంచ వేదికలపై తిరుగులేని ప్రజాదరణతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్ఫారమ్ ‘ఇన్స్టాగ్రామ్’లో 100 మిలియన్ల (10 కోట్ల) ఫాలోవర్ల మార్కును దాటిన తొలి ప్రపంచ నేతగా ప్రధాని మోదీ నిలిచారు. అంతర్జాతీయ నేతలతో పోలిస్తే ప్రధానమంత్రి మోదీ ప్రజాదరణ అందనంత ఎత్తులో ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. 2014లో ఈ ప్లాట్ఫారమ్లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ గత దశాబ్ద కాలంలో తన డిజిటల్ ఉనికిని అమితంగా చాటుకున్నారు. కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ యువతను ఆకర్షించడంలోనూ ఆయన ముందున్నారు. మోదీ సాధించిన ఈ ఘనత ఎంతటిదంటే.. ప్రపంచంలోని తదుపరి ఐదుగురు ప్రముఖ దేశాధినేతల మొత్తం ఫాలోవర్ల సంఖ్యను కలిపినా, అది మోదీ వ్యక్తిగత ఫాలోవర్ల సంఖ్య కంటే తక్కువగా ఉండటం గమనార్హం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, మోదీ ఆయన కంటే రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. వీరి తర్వాత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో (15 మిలియన్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా (14.4 మిలియన్లు), టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ (11.6 మిలియన్లు) వరుస స్థానాల్లో నిలిచారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ 6.4 మిలియన్ల ఫాలోవర్లతో జాబితాలో కొనసాగుతున్నారు.దేశీయ రాజకీయాల్లోనూ ఇతర నేతలతో పోలిస్తే ప్రధానమంత్రికి ఉన్న ఆదరణ అమితంగా ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 16.1 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుమారు 12.6 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో నిలిచారు. కేవలం సోషల్ మీడియా ఫాలోయింగ్లోనే కాకుండా, ప్రపంచ నేతల ‘అప్రూవల్ రేటింగ్’ (ఆమోదయోగ్యత)లోనూ మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. స్టాటిస్టా నివేదిక ప్రకారం 2025 డిసెంబర్ నాటికి ప్రధాని మోదీ 70 శాతం రేటింగ్తో ప్రథమ స్థానంలో ఉండగా, జపాన్ ప్రధాని సనే తకైచి (63 శాతం), అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ (60 శాతం) తరువాతి స్థానాల్లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43 శాతం రేటింగ్తో 11వ స్థానానికి పరిమితమయ్యారు.ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘మోర్నింగ్ కన్సల్ట్’ విడుదల చేసిన గణాంకాలు సైతం మోదీదే పైచేయి అని చెబుతున్నాయి. 2026 ఫిబ్రవరి 2 నుంచి 8 మధ్య సేకరించిన సమాచారం ప్రకారం 67 శాతం ఆమోదయోగ్యతతో మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు. చెక్ రిపబ్లిక్ నేత ఆండ్రెజ్ బాబిస్ (59 శాతం) రెండో స్థానంలో నిలవగా, డొనాల్డ్ ట్రంప్ 40 శాతంతో 11వ స్థానంలోనే కొనసాగుతున్నారు. అంతకుముందు 2025 నాటి డేటాలోనూ 75 శాతం రేటింగ్తో మోదీ అగ్రస్థానంలో నిలవగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ 59 శాతంతో తర్వాతి స్థానంలో నిలిచారు.
చదువుల బడిలో చిరుత
గాజియాబాద్: పాఠాలు వినేందుకు విద్యార్థులు రావాల్సిన పాఠశాలకు వాళ్ల కంటే ముందే ఒక చిరుతపులి రావడంతో పాఠశాల యాజమాన్యం అవాక్కైంది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి దానిని పట్టుకునేందుకు కృషిచేసింది. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లోని గోవిందాపురం ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పాఠశాల వైపుగా ఒక చిరుత రావడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఇది చూసిన పాఠశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయడం, వాళ్లు వెంటనే బోను, మత్తుమందు ఇంజెక్షన్లతో అటవీశాఖ సిబ్బందిని వెంటేసుకుని రంగంలోకి దిగడం చకచకా జరిగిపోయాయి. ఎట్టకేలకు చిరుతను పాఠశాల టాయిలెట్ గదిలో గుర్తించారు. గది గోడకు నాలుగు అడుగుల రంధ్రం చేసి అందులోంచే మత్తు ఇంజెక్షన్ను చిరుత మీదకు ప్రయోగించి అది నిద్రపోయేలా చేశారు. బోనులోకి ఎక్కించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సహరన్పూర్లోని శివాలిక్ కొండల్లో చిరుతను వదిలేస్తామని సబ్ డివిజనల్ అధికారి డాక్టర్ సలోని చెప్పారు.
ఎన్ఆర్ఐ
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!
విదేశాలకు వెళ్లడం అక్కడే స్థిరపడటం చాలామంది డ్రీమ్. 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా విదేశాల్లోని అక్కడి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం రా..రమ్మని ఆకర్షిస్తుంటుంది. తీరా వెళ్లాక గానీ తెలియదు. అక్కడి సమస్యలు..పరిస్థితులు. ఇక్కడొక భారత మహిళకు కూడా అలా అనిపించే తక్షణమే భారత్కు కుటుంబంతో సహా వచ్చి వాలిపోయింది. ఎందువల్ల తాను ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కానీ ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపదగినవిగానూ విదేశాలకు చెక్కేద్దామనే ఔత్సాహుకులకు గొప్ప పాఠాలుగానూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎందవల్ల ఇలా కుటుంబంతో సహా ఆమె భారత్కు వచ్చేసిందో తెలుసా..!?..లీబా సుబిన్ అనే మహిళ కుటుంబం దుబాయ్ నుంచి భారత్లోని తన స్వస్థలం కేరళకు వచ్చేసింది. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఆమె కారణాన్ని వివరిస్తూ..ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా చేశానని అంటోంది. ఈ నిర్ణయాన్ని సమయా పాలన, మానసిక శాంతికి సంబంధించిన విషయంగా పేర్కొంది. అదీగాక తమ ఫ్యామిలీ వీసా రెన్యువల్, అలాగే ఇంటి అద్దె రెన్యువల్ చేయాల్సి ఉండగానే.. చకచక ఈ నిర్ణయం తీసుకుని వచ్చేసినట్లు తెలిపారు. అలాగని ఏదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదని, బాగా ఆలోచించి, తన భాగస్వామితో, పిల్లలతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇలా వెనక్కి వచ్చేసి కేరళలో తమ సొంతింటిలో నివశించడం వల్ల దుబాయ్లోని అద్దె టెన్షన్ తగ్గింది, అలాగే ఇక్కడి సమాజంలో నివశించడం వల్ల సామాజిక సంబంధాలు పునరుద్ధరింపబడతాయి. పైగా ఎలాంటి అప్పులు, ఈఎంఐల బెడద లేకుడా మానసిక ప్రశాంతతో గడపొచ్చు అని చెప్పుకొచ్చిందామె. పైగా పిల్లవాడికి కేరళలో అంతర్జాతీయ స్కూల్ ఇంటికి సమీపంలోనే ఉంది పదినిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ దుబాయ్లో 90 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుందని జోడించారామె. బహుశా మాకు అనిపించింది..మీకు వర్కౌట్ కాకపోవచ్చు, పైగా మీరు విదేశాల్లోనే కంఫర్ట్ లైఫ్ని లీడ్ చేస్తుండొచ్చని, అది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ..మొత్తం కుటుబ సభ్యులు కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అన్ని విధాల శ్రేయస్కరం అంటూ తన పోస్ట్ని ముగించింది లీబా సుబిన్. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయంతో ఏకభవించారు, పైగా తిరిగి వెళ్లకూదనుకుంటున్న ఆమె నిర్ణయానికి స్వాగతం, శుభాకాంక్షలు అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by leeba (@unfilteredvoiceswithinme) (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!
ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
అమెరికాలోని జార్జియాలో ఉండే భారతీయ అమెరికన్కి చేదు అనుభవం ఎదురైంది. చేయని నేరానికి ఆరు వారాల జైలు శిక్ష అనుభవించారు. కానీ విచారణలో కోర్టు ఈ కేసు కొట్టి వేసింది. దీంతో ఆయన న్యాయాపోరాటానికి సిద్ధపడ్డారు. జార్జియాలోని వాల్మార్ట్ స్టోర్లో ఒక చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడనే తప్పుడు ఆరోపణతో ఆరు వారాల పాటు జైలు శిక్ష అనుభవించిన భారతీయ అమెరికన్ 57 ఏళ్ల మహేంద్ర పటేల్ ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.జార్జియాలోని అక్వర్త్లోని వాల్మార్ట్లోతన కొడుకును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించా డని రెండేళ్ల బాలుడి తల్లి కరోలిన్ మిల్లర్ ఆరోపించింది. ఈ సంఘటనను వాల్మార్ట్ ఉద్యోగికి, తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 57 ఏళ్ల మహేంద్ర పటేల్ను 2025, మార్చి 24న అరెస్టు చేశారు. ఈ విషయంలో తనకి, పటేల్కి మధ్య బాబు కోసం "టగ్ ఆఫ్ వార్" జరిగిందని కూడా పేర్కొంది. అయితే తాను నిరపరాధి నని మొదటినుంచి గట్టిగా వాదించారు మహేంద్ర పటేల్. 2025 మార్చి 18న, తాను వాల్మార్ట్లో షాపింగ్ చేస్తున్నప్పుడు, టైలెనాల్ (టాబ్లెట్స్) ఎక్కడ ఉన్నాయోమిల్లర్ను దిశానిర్దేశం చేయమని అడిగానని పటేల్ చెప్పాడు. అప్పుడు ఆమె కొడుకు బ్యాలెన్స్ కోల్పోతున్నాడని గమనించి, అతను పడిపోకుండా ఉండటానికి చేయి చాచానని చెప్పుకొచ్చాడు.SHOCKING & SAD !! Mahendra Patel has filed a federal civil rights lawsuit after being jailed for 47 days over a Walmart incident.He was arrested after a shopper accused him of trying to kidnap her child. Police video later showed no force, no injury, and no kidnapping… pic.twitter.com/cRlPZfwvEH— M9 USA🇺🇸 (@M9USA_) February 11, 2026 తప్పుడు ఆరోపణల వల్ల పటేల్ 46 రోజుల పాటు కాబ్ కౌంటీ జైలులో గడపాల్సి వచ్చింది. ఆరు వారాల తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. చివరికి ఆగస్టు 2025లో జిల్లా అటార్నీ కార్యాలయం ఈ కేసును కొట్టివేసింది. రెండు పార్టీలు ఒక పరిష్కారానికి వచ్చాయని కోబ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ చెప్పింది.నిజం నిరూపించిన సీసీటీవీ ఫుటేజ్అతను బిడ్డను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించలేదని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిరూపితమైంది.పటేల్ చాలా ప్రశాంతంగా ఆమె పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లడం, ఆమె అతనికి 'థంబ్స్ అప్' చూపించడం స్పష్టంగా కనిపించింది. అలాగే మిల్లర్ చెప్పినట్లుగా అక్కడ ఎలాంటి పెనుగులాట జరగలేదు. ఇదీ చదవండి: రైల్లో శాండ్విచ్...నెటిజన్ల రియాక్షన్స్ వైరల్ వీడియో మానసిక వేదన, వ్యాపార నష్టం ఈ అనుభవాన్ని "పీడకల"గా అభివర్ణించారు. ఈ దారుణమైన అనుభవం తనను మానసికంగా కుంగ దీసిందనీ, ఆర్థికంగా దెబ్బతీసిందని పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. "టైలెనాల్ కోసం వెళ్తే, నా జీవితంలోనే అతిపెద్ద తలనొప్పి ఎదురైంది" అని ఆయన పేర్కొన్నారు. తన కుటుంబం కూడా నరకం చూసిందన్నారు. ఒకవేళ వాల్మార్ట్ వీడియో లేకపోయి ఉంటే. ఆమె మాట వర్సెస్ నా మాటగా మారింది. నేనిక జైల్లో మగ్గిపోవాల్సి వచ్చేదన్నారు. ఆ ఫుటేజ్అక్షరాలా తన ప్రాణాన్ని కాపాడిందన్నారు.సుమారు రూ. 210 కోట్లుతాను అనుభవించిన మానసిక క్షోభకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆయన దావా వేశారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన ఆక్వర్త్ నగరంపై, తప్పుడు ఫిర్యాదు చేసిన మిల్లర్పై , పోలీసులపై 25 మిలియన్ల డాలర్లు ( సుమారు (రూ.210 కోట్లు) నష్టపరిహారం కోరుతూ ఆయన దావా వేశారు.ఇదీ చదవండి: ఇండియన్ ఫోటోగ్రాఫర్కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతంసీసీటీవీ ఫుటేజ్లో ఎలాంటి తప్పు కనిపించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం అధికార దుర్వినియోగమేనని పటేల్ తరపు న్యాయవాది మార్క్ గ్రాస్మన్ అన్నారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియో
టీడీపీది రాక్షసానందం.. జగనన్న మాకు ధైర్యం చెప్పారు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల దాడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శ్రీజ.. జగనన్న తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని.. మా తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ‘‘టీడీపీ వాళ్లు మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. కానీ నిన్న వేలమంది అభిమానంతో మా ఇంటికి వచ్చారు. మా నాన్న చెప్పినట్టే మాకు అండగా వెంకటేశ్వరస్వామి ఉన్నారు’’ అని శ్రీజ పేర్కొన్నారు.‘‘దేవుడి అండ ఉన్నంతవరకు మాపై వేసే ప్రతీ రాయి పువ్వుగా మారుతుంది. ఆయనే మాకు ఓ రక్షణ కవచంలా ఉంటారు. మా ఇంటిపై అత్యంత దారుణంగా అటాక్ చేశారు. 9 గంటల పాటు తండోపతండాలుగా జనం దాడి చేశారు. ఉదయం గుడికి వెళ్లిన నాన్నపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేశారు. టీడీపీ మహిళలు బూతులతో ఆయనను తిట్టారు. ఆ సమయంలోనే మా నాన్న అలా మాట్లాడారు. దానికి ఆయన రియలైజ్ అయ్యి ఆ మాట అనకూడదన్నారు. లీగల్గా ఎదుర్కొంటానని కూడా చెప్పారు..కానీ మా ఇంట్లో ఆడవాళ్లని దారుణంగా తిడుతూ అటాక్ చేశారు. కాపు కులంకి బూతులు జోడించి తిట్టారు. ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి దీనిని నడిపించడం దారుణం. ఆయన మేథస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోంది. అంబటి రాంబాబుని నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం దారుణం. ఆయనను వేధించి రాక్షసానందం పొందారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలుసుకొవాలి. దాడి చేసిన దానికంటే.. నాలుగు రెట్ల జనం అభిమానంతో వచ్చారు’’ అని శ్రీజ చెప్పారు.
ఎవరీ వంది వర్మ...? మార్స్ రోవర్స్ తొలి ప్లాన్ డ్రైవ్..
అంగారక గ్రహంపై నాసా తొలి ఏఐ ప్లాన్ డ్రైవ్ వెనుక ఉన్న ప్రధాన శాస్త్రవేత్తగా భారత సంతతి మహిళ వంది వర్మ చరిత్ర సృష్టించారు. భారత్కి చెందిన ఈ రోబోటిక్స్ ఇంజనీర్ వంది వర్మ విమానాయనానికి సంబంధించిన కుటుంబంలోనే పెరగడంతో సాంకేతికను అన్వేషించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. నాసా ప్రకారం..వర్మ జేపీఎల్ ప్రిన్సిపాల్ ఇంజనీర్గా, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో మొబిలిటీ అండ్ రోబోటిక్స్ విభాగానికి డిప్యూటీ సెక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థకు ముందు, అధికారికంగా ధృవీకరించిన ప్లాన్ అములు చేసే భాష PLEXIL, రోవర్లు, మానవ అంతరిక్ష ప్రయాణ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతికతను డెవలప్చేయడానికి రూపొందించిన బృందానికి ఆమె నాయకత్వం వహించినట్లు నాసా పేర్కొంది. ఆ కారణంతోనే రోబోటిక్ ఇంజనీరింగ్నే కెరీర్గా ఎంచుకుంది..వర్మ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. విమానాలు,ఇంజనీరింగ్ వాతావరణాలతో ఆమెకు తొలి దశలో పరిచయం ఉండటం వల్ల ఆమెకు టెక్నాలజీపై ఆసక్తి పెరిగింది. చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి, తర్వాత కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి రోబోటిక్స్లో మాస్టర్స్ అండ్ పిహెచ్డి పొందారామె. ఇక వర్మ డిసెంబర్ 8 నుంచి 10 తేదీల్లో ఏఐ ప్లాన్ పెర్సెవరెన్స్ మార్స్ రోవర్ మొదటి డ్రైవ్లను పూర్తి చేసినట్లు నాసా ధృవీకరించింది. ఈ ప్రదర్శనం మన సామర్త్యాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయో చెబుతుండటమే గాక, ఇతర ప్రపంచాలను ఎలా అన్వేషించాలో తెలుపుతుందని నాసా అడ్మినిస్ట్రేర్ జారెడ్ ఐజాక్మాన్ చెబుతున్నారు. (చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!)
క్రైమ్
ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోనలుగురి హత్య తీవ్ర కలకలం రేపింది. వీరిలో గర్భిణీ, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. హత్యలు జరిగిన తీరు చేసిన పోలీసులే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయిపోలీసులు అందించిన సమాచారం ప్రకారం బిహార్లోని పాట్నా జిల్లాకు చెందినఈ కుటుంబం ఢిల్లీలోని సమయ్పూర్ బద్లీలో గత రెండేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. కేవత్ ఆజాద్పూర్ మండిలో కూరగాయల విక్రేతగా పనిచేస్తున్నాడు. అయితే బుధవారం అద్దె ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ గదిలో అనిత (30), మూడు, నాలుగు, ఐదేళ్ల వయస్సున్న ఆమె కుమార్తెలు మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. వీరిని అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేసినట్టు తెలుస్తోంది.ఉదయం 8 గంటల ప్రాంతంలో సమీప బంధువు పోలీసులుకు, ఇతరులకు సమాచారం ఇవ్వడం విషయం వెలుగులోకి వచ్చింది. భర్త కేవత్ పరారీలో ఉండటంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.ఈ సంఘటనతో పొరుగువారు కూడా ఒక్కపారిగా షాక్కు గురయ్యారు. మొదట్లో కొంచెం గొడవపడినా, వీరంతా ఆ తరువాత సంతోషంగా ఉండేవారని పొరుగువారు చెప్పారు. అటుఅనిత వదిన, 36 ఏళ్ల సుగ్ని దేవి మాట్లాడుతూ, తన 10 ఏళ్ల కుమారుడు రక్తపు మడుగులో పడి వున్నవారిని గుర్తించి తమకు సమాచారం ఇచ్చారని, ఆ జంట మధ్య ఎటువంటి వైవాహిక విభేదాలు లేవని, అంతా బాగానే ఉందని చెబుతోంది. ఇద్దరూ చాలా ప్రేమగా ఉండేవారని మరో వదిన సోని దేవి వాపోయింది. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వారి మధ్య గొడవ జరిగిందని. కేవత్ తన భార్య, పిల్లలపై దాడి చేయడానికి ముందు వారిని మద్యం తాగించి ఉండవచ్చని ప్రాథమికంగా తేలిందని, నిర్దిష్ట కారణం వెలుగులోకి రాలేదని పోలీసు అధికారి తెలిపారు, వివాహేతర సంబంధం, మగపిల్లవాడి కోసం, సహా ఇతర అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. భర్తను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. హత్య వెనుక గల ఉద్దేశ్యాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు పారిపోయినట్టు గుర్తించారు.క్రైమ్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందాలు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.
నాడు ప్రేమించి పెళ్లి చేసుకుని.. నేడు ముఖం చాటేసి..
అన్నమయ్య జిల్లా: నాకు ఉద్యోగం ఉంది. మాకు వ్యవసాయ భూములు ఉన్నాయి. నన్ను పెళ్లు చేసుకుంటే మహరాణిలా చూసుకుంటానని యువతిని నమ్మించాడు. అతడి మాయమాటలను నమ్మిన యువతి కన్నవాళ్లను సైతం కాదనుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాదిన్నర కాలం కూడా గడవకనే ఆ యువతిని వదిలించుకోవాలని యువకుడు ముఖం చాటేస్తున్నాడు.దిక్కు తోచని ఆ యువతి న్యాయం కోసం బుధవారం పోలీసులను ఆశ్రయించింది. బాధిత యువతి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కందుకూరు పంచాయతీ నిలువురాతిపల్లికి చెందిన తెల్లగొర్ల గంగులప్ప కుమార్తె గాయత్రి (23) అనే యువతి డిగ్రీ వరకు చదివి బెంగళూరులోని ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేది. కొద్ది నెలలు గడిచాకా ఆమె బంధువుల ద్వారా బి.కొత్తకోట మండలం గట్టు గ్రామం దిన్నెమీదపల్లికి చెందిన కటార్ క్రిష్ణప్ప కుమారుడు రాజశేఖర్ (25)తో పరిచయం ఏర్పడింది. అతను కూడా మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేసేవాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. అయితే ఈ పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఆ యువతి కన్నవాళ్లను సైతం కాదని కాబోయే అత్తా, మామ సమక్షంలో రాజశేఖర్ను బెంగళూరులోని బన్నేరుగట్ట సమీపంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో 2024 డిశంబర్ 4న వివాహం చేసుకుంది. అనంతరం దిన్నెమీదపల్లిలో కాపురం పెట్టారు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అనంతరం ఆమె గర్భం దాల్చడంతో ఏడు నెలలకే నొప్పులు అధికమై ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందింది. కోలుకున్నాకా నా బిడ్డ ఎక్కడా అని భర్తను ప్రశ్నించగా చనిపోయాడని దిన్నెమీదపల్లిలోని వ్యవసాయ భూమిలో ఖననం చేసినట్లు చెప్పినట్లు యువతి వాపోయింది. కన్నబిడ్డ కడచూపు కూడా చూసుకోలోదని కంటతడి పెట్టింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాకా తాను అత్తారింట్లో రెండు రోజులు ఉండి భర్త, అత్తా,మామ కోరిక ప్రకారం గత ఏడాది డిసెంబర్ 15న పుట్టింటికి చేరానని, అప్పటి నుంచి తన భర్తలో చాలా మార్పు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 2న కన్నవాళ్లతో కలసి అత్తారింటికి వెళ్లగా లోనికి రావద్దని గేటు వేసారని యువతి వాపోయింది. ఎలాగైనా తనను వదిలించుకుని నా భర్తకు వేరే పెళ్లి చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో విసిగి వేసారిన తాను న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు యువతి పేర్కొంది.
నుమాయిష్లో 264 మంది పోకిరీల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో జరిగిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)లో పెద్దసంఖ్యలో పోకిరీలు పట్టుబడ్డారు. స్టాల్స్ను సందర్శించడానికి వచ్చే మహిళలు, యువతుల్ని వేధిస్తుండగా నగర షీ–టీమ్స్కు చిక్కారు. ఈ మేరకు బుధవారం డీసీపీ ఎన్జేపీ లావణ్య వివరాలు వెల్లడించారు. నుమాయిష్ సాగిన 45 రోజుల్లో 264 మందిని షీ టీమ్స్ పట్టుకున్నాయి. వీరిలో 22 మంది మైనర్లు ఉన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ నెల 15 వరకు జరిగిన ఎగ్జిబిషన్లో పోకిరీలపై షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచడంతోపాటు డెకాయ్ ఆపరేషన్లు కూడా నిర్వహించాయి. పట్టుబడిన పోకిరీల్లో 188 మందికి వారి కుటుంబసభ్యుల సమక్షంలో షీ–టీమ్స్ కౌన్సెలింగ్ ఇచ్చి తీవ్రంగా హెచ్చరించి పంపాయి. శృతి మించిన వ్యవహారాలు, తీవ్రమైన దు్రష్పవర్తనకు పాల్పడిన 56 మందిపై పోలీసులు పెట్టీ కేసులు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 52 మందికి రూ.1,050 చొప్పన జరిమానా పడింది. మరో నలుగురికి రెండు రోజుల జైలు, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు.
యూట్యూబర్ కోమలి వన్సైడ్ లవ్.. అఖిల్ స్టేట్మెంట్
హైదరాబాద్: యూట్యూబర్ కోమలి బోను(21) ఆత్మహత్య కేసు దర్యాప్తును రాయదుర్గం పోలీసులు ముమ్మరం చేశారు. చిత్రపురి కాలనీలో నివాసముంటున్న గాజువాకకు చెందిన కోమలి ప్రేమ విఫలం కావడంతో సోమవారం ఉరేసుకున్న విషయం తెలిసిందే. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోమలి డైరీ, సెల్ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. తన ప్రేమను ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడని డైరీలో రాసిందని, ప్రియుడు అఖిల్రెడ్డి మోసం చేసినట్లుగా పేర్కొనలేదని పోలీసులు చెబుతున్నారు. చిత్రపురి కాలనీలో మరో బ్లాక్లో సోదరి ఇంట్లో ఉంటున్న అఖిల్రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అఖిల్రెడ్డి ఫోన్ను స్వా«దీనం చేసుకుని, ఇద్దరి చాటింగ్లను పరిశీలిస్తున్నారు. మరో యువతితో రిలేషన్లో ఉన్నానని, తన వెంట పడొద్దని చెప్పినా ఆమె వినిపించుకోలేదని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులకు, స్నేహితులకు ‘మీరు బాగుండాలి’అని కోమలి వాయిస్ మేసేజ్లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. మూడేళ్లుగా ప్రేమించుకుని... మూడేళ్లుగా ప్రేమించుకున్న కోమలి, అఖిల్ సంవత్సరకిత్రం బ్రేకప్ చెప్పారు. ఈ క్రమంలో మరో యువతితో అతడు చనువుగా ఉండటాన్ని జీరి్ణంచుకోలేక పోయిన కోమలి ఆరు నెలల క్రితం ఆత్మహత్యకు యతి్నంచినట్లు తెలుస్తోంది. మూడురోజుల క్రితం అఖిల్, కోమలి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, కోమలిని అఖిల్ ట్రాప్ చేసి మోసం చేశాడని ఆమె తల్లి వరలక్ష్మి పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. YouTuber Dies by Suicide After Alleged Relationship Dispute📍HyderabadKomali, 21, a BSc student and YouTuber, allegedly died by suicide after ex-bf Akhil Reddy visited her home and rejected her request to reunite. Ongoing marriage disputes with Nikhil Reddy also contributed… pic.twitter.com/xMBKHrYAUy— زماں (@Delhiite_) February 25, 2026
వీడియోలు
షణ్ముఖ్ జస్వంత్ మరియు వైష్ణవి చోడిశెట్టి ఎంగేజ్మెంట్ వీడియో
రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి... గెస్ట్ లిస్ట్ & గ్రాండ్ ఫుడ్ మెనూ
రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి వీడియో వైరల్
టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే.. జింబాబ్వే & వెస్టిండీస్ పై ఎంత రన్ రేట్ గెలవాలి
ఇకపై ఫారిన్ వెళ్లక్కర్లేదు..! వారణాసితో అన్నపూర్ణ స్టూడియోస్లో గ్లోబల్ టెక్నాలజీ
బొత్స Vs టీడీపీ మంత్రులు...ఒకే ఒక్కడు మంత్రులను గడగడలాడించాడు
జెరూసలెంలో మోదీ.. 11 కీలక ప్రకటనలు
కొత్త కారు అని డ్యామేజ్ కారు అమ్మిన టాటా షోరూమ్ సిబ్బంది
భూదాన్ బాధితులకు అండగా కేటీఆర్
పవన్ పై అనుమానాలు.. మండిపడుతున్న జనసేన నేతలు

