అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఇరాన్ కొంప ముంచిన చైనా
టెహ్రాన్: అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల వేళ చైనా..ఇరాన్ కొంప ముంచింది. అణు చర్చల తర్వాత ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడులకు తెగబడ్డాయి. ప్రతి చర్యగా ఇరాన్ ఇటీవల చైనా నుంచి తెచ్చుకున్న హెచ్-9బీ (HQ-9B)ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (SAM) వ్యవస్థను ఉపయోగించింది. అయితే, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విఫలమైంది. తద్వారా ఇరాన్లో భారీ ఆస్తినష్టం, ప్రాణం నష్టం జరిగినట్లు సమాచారం.ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది క్షిపణుల ఆధారిత రక్షణ కవచం. నేల మీద గాని, నౌకల మీద గాని ఏర్పాటు చేసి, ప్రత్యర్థి విమానాలు లేదా క్షిపణులను గగనతలంలోనే కూల్చివేయడం దీని పని. ఇరాన్ శత్రు దేశాల నుంచి సురక్షితంగా ఉండేలా చైనా నుంచి ఆయిల్ ఫర్ వెపన్ ఒప్పందం కింద హెచ్క్యూ-9బీని తెచ్చుకుంది. గతేడాది ఇజ్రాయెల్ దాడుల సమయంలో రష్యా తయారు చేసిన ఎస్-300పీఎంయూ-2 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరిగా పనిచేయలేదు. అందుకు అప్గ్రేడ్గా ఈసారి రష్యా నుంచి కాకుండా చైనా నుంచి ఎయిర్ డిఫెన్స్ దిగుమతి చేసుకుంది. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల వేళ ఇరాన్ హెచ్క్యూ-9బీని ఉపయోగించింది. కానీ ఇప్పుడు ఈ కొత్త వ్యవస్థ విఫలమైంది.ఇరాన్లో నాటంజ్ అణు కేంద్రం,ఫోర్డో ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ, ఐఆర్సీజీ మిసైల్,యూఏవీ బేస్లు, అలాగే టెహ్రాన్, ఇస్ఫహాన్ సమీపంలో ఎయిర్బేసులు ఉన్నాయి. ఆ ఎయిర్బేస్లపై శత్రు దాడుల నుంచి రక్షించేలా హెచ్-9బీ ఎయిర్ డిఫెన్స్ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎస్-300పీఎంయూ-2, బావర్-373, ఖోర్దాద్-15,రాద్, టోర్-ఎం2, పాంటిసిర్-ఎస్1 వంటి ఇతర రక్షణ వ్యవస్థల్ని మోహరించింది. అయితే అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అణుకేంద్రాలను రక్షించడంలో హెచ్క్యూ-9బీ ఆధారిత రక్షణ పూర్తిగా విఫలమైంది. 31 ప్రావిన్స్లో 20కి పైగా ప్రాంతాలు అమెరికా,ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్ర ప్రభావితమయ్యాయి. ఒక్క ఇరాన్ మాత్రమే కాదు..గతంలో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ను తిప్పికొట్టేలా చైనా నుంచి పాకిస్థాన్ తెచ్చుకున్న హెచ్క్యూ-9బీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తేలిపోయింది. ఇప్పుడు ఇరాన్లో సైతం చైనా డిఫెన్స్ ఎయిర్ సిస్టం విఫలం కావడంతో ప్రపంచ దేశాల ఎదుట చైనా భంగపాటుకు గురైంది.
అంగన్వాడీల పై చంద్రబాబు ప్రభుత్వం నిర్భదం
సాక్షి,విజయవాడ: అంగన్వాడీ ఉద్యోగుల "చలో విజయవాడ" కార్యక్రమంపై చంద్రబాబు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు విజయవాడకు తరలివస్తుండగా, పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. నంద్యాల రైల్వే స్టేషన్లో అంగన్వాడీ ఉద్యోగులను పోలీసులు నిర్భంధించారు. అంగన్వాడీ లీడర్స్కి సిడిపివోలు ఫోన్ కాల్స్ చేస్తూ ఒత్తిడి తెస్తున్నారని యూనియన్ నాయకులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలు బెదిరింపులు చేస్తున్నారని యూనియన్ నేతలు వెల్లడించారు. ప్రభుత్వ నిర్భంధంపై సీఐటీయూ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడకు భారీగా తరలి వస్తున్నారు. చలో విజయవాడ కి వెళ్ళొదంటూ స్థానిక ఎమ్మెల్యేలు బెదిరింపులు.
ఖమేనీ కథ ముగిసింది.. ఫ్యామిలీతో సహా హతం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఆయన మృతిచెందినట్లు ఇరాన్ ప్రకటించింది. దాడ్లులో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందారు. 40 రోజులు సంతాపదినాలుగా ఇరాన్ ప్రకటించింది. ఖమేనీ నివాసంపై ఆధునిక క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఖమేనీ నివాసమే లక్ష్యంగా 30 క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్జాదే, రివల్యూషనరీ గార్డ్ ఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ కూడా మృతిచెందారు.ఖమేనీ, అధ్యక్షుడు పెజెష్కియానే లక్ష్యంగా ఇజ్రాయెల్ నిన్న(శనివారం) ఉదయాన్నే వారి నివాసాలు, కార్యాలయ సముదాయాలపై పెద్దపెట్టున క్షిపణి దాడులకు దిగింది. ఆ వెంటనే మొత్తం టెహ్రాన్తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. అనంతరం అమెరికా సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఇరాన్ అగ్ర నేతలతో పాటు అణు స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, భారీ బాంబులతో విరుచుకుపడింది. కొద్ది గంటల అనంతరం ఇరాన్ తేరుకుని ప్రతి దాడికి దిగింది. తొలుత ఇజ్రాయెల్పై రెండు దఫాలుగా క్షిపణులతో విరుచుకుపడింది. అనంతరం పలు గల్ఫ్ దేశాల్లోని పలు అమెరికా స్థావరాలపైనా దాడులకు తెర తీసింది. నెలల పాటు ప్లాన్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్.. శాటిలైట్ ద్వారా ఖమేనీ లోకేషన్ను గుర్తించాయి. ట్రెహాన్లోని తన ఆఫీసులోనే ఖమేనీ ఉన్నట్లు నిర్థారణ అయిన తర్వాత నిన్న శనివారం, ఫ్రిబవరి 28) ఉదయం 1:15 కు ఇరాన్పై మిస్సైల్ దాడులు ప్రారంభించాయి. ఖమేనీ కార్యాలయం సముదాయాలపై ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లను ఇజ్రాయెల్ ప్రయోగించగా.. తొమహాక్ మిస్సైళ్లతో అమెరికా ఎటాక్ చేసింది. లోకేషన్ గుర్తించిన 15 నిమిషాల్లో ఎటాక్ ప్రారంభించాయి. ట్రెహాన్లోని ఖమేనీ కార్యాలయంపై ఏకకాలంలో దాడులు చేపట్టాయి. ఆపరేషన్ కిల్ ఖమేనీ ఆపరేషన్కు సౌదీ, గల్ఫ్ దేశాలు మద్దతు తెలిపాయి.ఖమేనీ మరణించారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న(శనివారం) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఖమేనీను "చరిత్రలో అత్యంత దుష్టులలో ఒకరు" అంటూ పేర్కొన్న ట్రంప్.. ఇది ‘‘ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు అమెరికన్లకు, ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు న్యాయం" జరిగిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. తమ నిఘా, ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థ నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారన్న ట్రంప్.. ఇరాన్లోని ఇతర నాయకులు చేయగలిగేది ఏమీలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్లో ఖమేనీ నివాస సముదాయంపై 30 బాంబులు వేశారని ఇజ్రాయెల్ ఛానల్ 12 నివేదిక తెలిపింది.శనివారం జరిగిన దాడుల తర్వాత ఇరాన్ ప్రతిస్పందనగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై (బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఎఇ) దాడులు జరిపింది. ఈ పరిణామాలు ప్రాంతీయంగా పెద్ద ఎస్కలేషన్కు దారితీశాయి. అయతొల్లా అలీ ఖమేనీ 1989లో రుహొల్లా ఖొమేనీ తరువాత సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. గత 36 ఏళ్లుగా ఆయన ఇరాన్ను పాలించారు. చివరి సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభం, ప్రజా నిరసనలు, హమాస్–హిజ్బుల్లా బలహీనత, అమెరికా–ఇజ్రాయెల్ దాడులు వంటి పరిణామాలు ఆయన పాలనను కుదిపేశాయి.
‘ఎందుకుండరు.. బీఆర్ నాయుడు చాలాకాలం యాది ఉంటారు’
తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మూర్తి చెప్పినట్లే బీఆర్ నాయుడు చాలాకాలం యాది ఉంటారంటూ పేర్ని నాని చమత్కరించారు. అవి ఫేక్ వీడియోలని, తమద 30 ఏళ్ల బంధమని బీఆర్ నాయుడి చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు పేర్ని నాని స్పందిస్తూ .. ‘ఒకవైపు ఫేక్ వీడియోలు అంటారు.. మరొకవైపు వారిది 30 ఏళ్ల బంధమని బీఆర్ నాయుడే చెప్పినట్లే మీరు అంటున్నారు. సాధారణంగా ఏడేళ్ల బంధమే బలమైనది అనేది లోకరీతిన అంటుంటాం. మరి వారిది 30 ఏళ్ల బంధమైతే అది చాలా బలమైనదే’ అంటూ సెటైర్లు వేశారు. ‘సోషల్ మీడియాలో తిరిగేవి ఫేక్ వీడియోలు అయితే.. ఒరిజినల్ వీడియోలను బీఆర్ నాయుడు విడుదల చేయాలి. ఆ ఒరిజినల్ వీడియోలతో సమాజం నోరు మూయించండి. ఆ దేవ దేవుడు కాళ్ల దగ్గర కూర్చున్పప్పుడు ఈ బంధాలు, రాగ ద్వేషాలకు అతీతంగా ఉండాలని సమాజం చెబుతుంది. బీఆర్ నాయుడు కొండ దిగే టైమ్ దగ్గర్లనే ఉన్నట్లు ఉంది’’ అంటూ పేర్ని నాని మరో సెటైర్ వేశారు.ఇదీ చదవండి:వాత్సాయనుడికి వారసుడు బీఆర్ నాయుడు: భూమన
26 అరైవల్, 27 డిపార్చర్ విమానాల రద్దు
వాస్తవ ఘటనలతో టూ మచ్
టీజర్ బాగుంది: మంచు మనోజ్
రంగుల కల
అమ్మాయిలకు ధైర్యాన్నిచ్చే సినిమా సరస్వతి: రాధిక
సామ్సన్ ఆట... సెమీస్ బాట...
నాకౌట్కూ అజేయంగానే...
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి
ప్రియుడికి వివాహమైందని తెలిసి.. ఏం చేసిందంటే..?
ఆ్రస్టేలియా ‘హ్యాట్రిక్’
ఉసురు తగులుతుంది.. ఇచ్చిపడేసిన తనూజ
Telangana: పెన్షన్ రూ 4 వేలకు పెంపు!
వరల్డ్కప్ నుంచి నిష్క్రమించిన కొద్ది గంటల్లోనే పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం
హోలీ బోనంజా: మూడు రోజులు సెలవు.. ముందుగానే జీతం!
మూసీ మురిసేలా మహాత్ముడు
‘తొడిమ ఆకుపచ్చ.. పండు పసుపు పచ్చ’
ఇరాన్పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్
ఎట్టకేలకు సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తో ఒప్పందానికి బాబుసై
‘బాబా వంగ’ భవిష్యవాణిపై ఊపందుకున్న చర్చలు
IND vs WI: విండీస్ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?
రాత్రికి రేటెంత అని అడిగారు.. ఇదేనా మీ సంస్కారం?
ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్
స్టాక్ మార్కెట్ సెలవులు.. ట్రేడింగ్ బంద్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
అమెరికా-ఇరాన్ యుద్దం.. క్రికెట్ సిరీస్ రద్దు
ఏపీ మద్యం కేసుకూ ఇదే పరిస్థితి వస్తుందేమో!
T20 WC: హెడ్కోచ్ పదవికి సనత్ జయసూర్య గుడ్బై
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు
మదురోగా ఖమేనీ?.. ఏ క్షణమైనా..
విజయ్తో విడాకులు.. సంగీత ఎవరో తెలుసా..?
26 అరైవల్, 27 డిపార్చర్ విమానాల రద్దు
వాస్తవ ఘటనలతో టూ మచ్
టీజర్ బాగుంది: మంచు మనోజ్
రంగుల కల
అమ్మాయిలకు ధైర్యాన్నిచ్చే సినిమా సరస్వతి: రాధిక
సామ్సన్ ఆట... సెమీస్ బాట...
నాకౌట్కూ అజేయంగానే...
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి
ప్రియుడికి వివాహమైందని తెలిసి.. ఏం చేసిందంటే..?
ఆ్రస్టేలియా ‘హ్యాట్రిక్’
ఉసురు తగులుతుంది.. ఇచ్చిపడేసిన తనూజ
Telangana: పెన్షన్ రూ 4 వేలకు పెంపు!
వరల్డ్కప్ నుంచి నిష్క్రమించిన కొద్ది గంటల్లోనే పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం
హోలీ బోనంజా: మూడు రోజులు సెలవు.. ముందుగానే జీతం!
మూసీ మురిసేలా మహాత్ముడు
‘తొడిమ ఆకుపచ్చ.. పండు పసుపు పచ్చ’
ఇరాన్పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్
ఎట్టకేలకు సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తో ఒప్పందానికి బాబుసై
‘బాబా వంగ’ భవిష్యవాణిపై ఊపందుకున్న చర్చలు
IND vs WI: విండీస్ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?
రాత్రికి రేటెంత అని అడిగారు.. ఇదేనా మీ సంస్కారం?
ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్
స్టాక్ మార్కెట్ సెలవులు.. ట్రేడింగ్ బంద్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
అమెరికా-ఇరాన్ యుద్దం.. క్రికెట్ సిరీస్ రద్దు
ఏపీ మద్యం కేసుకూ ఇదే పరిస్థితి వస్తుందేమో!
T20 WC: హెడ్కోచ్ పదవికి సనత్ జయసూర్య గుడ్బై
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు
మదురోగా ఖమేనీ?.. ఏ క్షణమైనా..
విజయ్తో విడాకులు.. సంగీత ఎవరో తెలుసా..?
ఫొటోలు
తిరుమల శ్రీవారి సేవలో బ్రహ్మానందం కొడుకు (ఫొటోలు)
హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక (ఫొటోలు)
శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్-స్నేహ (ఫొటోలు)
ఇరాన్: ఖమేనీ మృతి.. మద్దతుదారుల కన్నీరుమున్నీరు (ఫొటోలు)
మహిళ కబడ్డీ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
విష్ణు విన్యాసం మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
సన్ ఆఫ్ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
లాంచనంగా మొదలైన శ్రీకాంత్ కొడుకు కొత్త సినిమా (ఫొటోలు)
లుక్ మార్చేసిన శ్రీముఖి.. అందంతో మెరిసిపోతుందిగా! (ఫొటోలు)
సినిమా
సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక.. గతవారం ఉదయ్పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని ఆలయాల్లో అన్నదానం, స్వీట్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేశారు. ఇకపోతే ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు రాబోతున్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' మొదలుపెట్టేశాడు.. బుచ్చిబాబుని ఆడుకున్న చరణ్)పెళ్లి జరగడానికే ముందే విజయ్ దేవరకొండ వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. అయితే అది పెళ్లి ఆహ్వానం కోసమే అని అంతా అనుకున్నారు. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు రష్మిక.. స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబాన్ని రిసెప్షన్కి వ్యక్తిగతంగా ఆహ్వానించింది. ఈ క్రమంలోనే రష్మికని సాదరంగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి దంపతులు.. తెలుగు సంప్రదాయంలో భాగంగా చీరపెట్టి గౌరవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రిసెప్షన్ సందర్భంగా అభిమానులని ఉద్దేశిస్తూ.. 'విరోష్' జోడి ఓ నోట్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో మార్చి 04 సాయంత్రం వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో అతిథులు ఇందులో పాల్గొనున్నారు. పోలీసులు ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దు. వచ్చి ఇబ్బంది పడొద్దు అని ఇందులో విజ్ఞప్తి చేశారు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా)
విజయ్, రష్మికల రిసెప్షన్.. ఫ్యాన్స్కు విజ్ఞప్తి
విజయ్ దేవరకొండ , రష్మికల వివాహం ఫిబ్రవరి 26న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్పూర్లో కొద్దిమంది సమక్షంలో వారిద్దరు వివాహం చేసుకున్నారు. అయితే, పరిశ్రమలోని ప్రముఖులతో పాటు పలు రాజకీయ నాయకుల కోసం హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూడా కొద్దిమంది మాత్రమే పాల్గొననున్నారు. తాజాగా విరోష్ జోడి తమ ఫ్యాన్స్కు, ఈ వేడుకకు హాజరయ్యే అతిథులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 4న సాయంత్రం జరిగే రిసెప్షన్ వేడుకకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆహ్వానం అందిన అతిథులు మాత్రమే హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఆహ్వానం లేకుండా ఇతరులు ఈ వేడకకు వచ్చి ఇబ్బంది పడొద్దని ప్రకటనలో పేర్కొన్నారు.విజయ్, రష్మిక రిసెప్షన్ కోసం సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావద్దని విరోష్ జంట కోరింది. మీ క్షేమమే మాకు ముఖ్యమని, మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్లు టీమ్ తెలిపింది.
లుక్ మార్చేసిన శ్రీలీల.. బ్లాక్ & వైట్లో నేహా శెట్టి
ఇటలీలో డిఫరెంట్ లుక్తో హీరోయిన్ శ్రీలీలవింటేజ్ కెమెరాతో ఫొటోలు తీస్తున్న సంయుక్తగ్లామర్తో హడల్ పుట్టించేస్తున్న నేహా శెట్టిఫిబ్రవరి జ్ఞాపకాలు పోస్ట్ చేసిన రుక్మిణి వసంత్ప్రెట్టీగా యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్అందాలు చూపించేస్తున్న బ్యూటీ లక్ష్మిరాయ్ View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Preity Mukhundhan (@preity_mukhundhan) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_)
నిహారిక నిర్మాతగా హారర్ కామెడీ సినిమా.. టీజర్ రిలీజ్
'మ్యాడ్' రెండు సినిమాలతో నటుడిగా ఆకట్టుకున్న సంగీత్ శోభన్.. హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాకాస'. మెగా డాటర్ నిహారిక ఈ చిత్రాన్ని నిర్మించింది. మానస శర్మ అనే దర్శకురాలు ఈ సినిమాతో టాలీవుడ్కి పరిచయమవుతోంది. హారర్ కామెడీ బ్యాక్డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా)టీజర్ బట్టి చూస్తే హీరో అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. అనుకోకుండా ఓ ఊరికి వెళ్తాడు. అయితే ఆ ఊరిని ఏళ్లుగా ఓ శాపం ఉంటుంది. పాడుబడ్డ భవంతి కూడా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఊరివాళ్ల సమస్యలోకి హీరో ఎంటర్ అవుతాడు. హీరోయిన్, మరో వ్యక్తి కూడా ఇతడికి తోడవుతారు. మరి బూత్ బంగ్లా నుంచి హీరో అండ్ గ్యాంగ్ బయటపడ్డారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తోంది.టీజర్ బట్టి చూస్తుంటే రెగ్యులర్ హారర్ కామెడీ టెంప్లేట్ స్టోరీలానే అనిపిస్తుంది కానీ కామెడీ, హారర్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయిపోవచ్చు. ఈ సంక్రాంతికి ప్రభాస్ నుంచి 'రాజాసాబ్' అనే హారర్ కామెడీ వచ్చింది. కంటెంట్ సరిగా లేకపోవడంతో ఫ్లాప్ అయింది. మరి 'రాకాస' టీమ్.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)
క్రీడలు
మూడు పరుగులతో సెంచరీ మిస్!.. సంజూ ఎమోషనల్
‘‘నా జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఇదొకటి. ఇదే (ఆట) నా ప్రపంచం. క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచే.. దేశం కోసం ఆడాలనే కల కన్నాను. ఇలాంటి రోజు కోసమే ఎదురుచూశాను. నా కెరీర్లో ఎన్నో ఎత్తు పళ్లాలు ఉన్నాయి.ఒక్కోసారి నా మీద నాకే సందేహం కలిగేది. నేనసలు ఆడగలనా.. ఒకవేళ ఆడితే ఎలా ఉంటుంది. అనుకున్న విధంగా రాణించగలనా.. ఇలా ఎన్నెన్నో సందేహాలు. అయితే, ఆ దేవుడి మీద నమ్మకం మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. ఈరోజు ఆయన నన్ను దీవించాడు. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. టీ20 ఫార్మాట్లో నాకెంతో అనుభవం ఉంది.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. గత మ్యాచ్లలో వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయాను. అయితే, ఈ రోజు భాగస్వామ్యాలు నిర్మించడంపైనే ఎక్కువ దృష్టి సారించాను. బంతిని చూస్తూ ఆడాను. ఈరోజు నా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాను’’ అంటూ టీమిండియా స్టార్ సంజూ శాంసన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.టీ20 ప్రపంచకప్-2026లో భారత్ సెమీ ఫైనల్కు దూసుకువెళ్లడంలో సంజూదే కీలక పాత్ర. టీ20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా పేరొందిన వెస్టిండీస్తో మ్యాచ్లో ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ టీమిండియాను గెలిపించాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్కు వరుస కడుతున్నా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిలకడగా బ్యాటింగ్ చేశాడు.This team! 🥹💙🫂Next Stop: Semi-finals 🚀ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 6 PM pic.twitter.com/CEMSGouFlO— Star Sports (@StarSportsIndia) March 1, 2026చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. సంజూ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా విండీస్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. కాగా గత కొన్ని రోజులుగా సంజూ ఫామ్లేమితో సతమతమయ్యాడు. ఫలితంగా ఓపెనర్గా స్థానం కోల్పోయాడు.అయితే, గత మ్యాచ్ (జింబాబ్వే)తో మళ్లీ తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. తాజాగా వెస్టిండీస్పై అదరగొట్టి తన విలువ చాటుకున్నాడు. చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్తో మెరిసి అభిమానులను ఖుషీ చేశాడు.భారత్ వర్సెస్ వెస్టిండీస్ స్కోర్లువేదిక- ఈడెన్ గార్డెన్స్, కోల్కతాటాస్- భారత్.. తొలుత బౌలింగ్వెస్టిండీస్ స్కోరు- 195/4(20)భారత్ స్కోరు- 199/5 (19.2)ఫలితం- ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు.. 97 పరుగులు నాటౌట్).
T20 WC 2026: విండీస్ను చిత్తు చేసి సెమీ ఫైనల్లో టీమిండియా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది. సూపర్-8 దశలో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ (IND Beat WI)ను ఓడించి టైటిల్ దిశగా కీలక ముందడుగు వేసింది. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్లో ఆదివారం టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.195 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ షాయీ హోప్ (33 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40) రాణించాడు.మిగిలిన వారిలో షిమ్రన్ హెట్మైర్ (12 బంతుల్లో 27) ధనాధన్ దంచికొట్టగా.. షెర్ఫానే రూథర్ఫర్డ్ (9 బంతుల్లో 14) రాణించాడు. ఆఖర్లో రోవ్మన్ పావెల్ (19 బంతుల్లో 34), జేసన్ హోల్డర్ (22బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచారు.నిరాశపరిచిన అభిషేక్, ఇషాన్భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (11 బంతుల్లో 10) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (6 బంతుల్లో 10) సైతం నిరాశపరిచాడు.సంజూ బాధ్యతాయుత ఇన్నింగ్స్కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 18) చేతులెత్తేయగా.. తిలక్ వర్మ (15 బంతులలో 27) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. ఇలాంటి దశలో ఓపెనర్ సంజూ శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్తో స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026 అయితే విజయానికి 10 బంతులలో 17 పరుగులు అవసరమైన వేళ హార్దిక్ పాండ్యా (14 బంతులలో 17) రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో శివం దూబే సంజూకు జతయ్యాడు. దూబే 4 బంతులలో 8 పరుగులు చేయగా.. సంజూ ఆఖరి ఓవర్లో సిక్సర్, ఫోర్ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలోఈ మ్యాచ్లో సంజూ మొత్తంగా 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా చిరస్మరణీయ ఇన్నింగ్స్తో జట్టుకు విజయం అందించాడు. ఇక మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విండీస్ను ఓడించింది.
టీమిండియా టార్గెట్ 196
కోల్కతా: టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో భారత్కు 196 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది వెస్టిండీస్, ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ ఆది నుంచి బ్యాట్ ఝుళిపించింది. ఓపెనర్లు షాయ్ హోప్( 32: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రోస్టన్ ఛేజ్(40: 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తరువాత హెట్ మెయిర్ ( 27: 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లు) చెలరేగి ఆడే యత్నం చేశాడు. విండీస్ స్కోరు బోర్డు వేగం పుంజుకునే క్రమంలో బూమ్రా బౌలింగ్ లో హెట్ మెయిర్ అవుటయ్యాడు. బూమ్రా బౌలింగ్ లో సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు హెట్ మెయిర్. అప్పటికి విండీస్ స్కోరు 11.3 ఓవర్లలో 102 పరుగులుగా ఉంది. అయితే హెట్ మెయిర్ రెండో వికెట్గా ఔటైన తర్వాత విండీస్ స్కోరు బోర్డులో వేగం తగ్గింది. అయితే రావెన్ పావెల్(34 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), జాసన్ హోల్డర్(37 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఈ జోడి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. వీరిద్దరూ 35 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.భారత బౌలర్లలో బుమ్రా మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. బుమ్రా నాలుగు ఓవర్లలో 36 పరుగులే ఇవ్వగా, హార్దిక్ పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో 40 పరుగులు, అర్షదీప్ 43 పరుగులు, వరుణ్ చక్రవర్తి 40 పరుగులు ఇచ్చారు. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు.పావెల్ అరుదైన ఘనతఈ మ్యాచ్లో రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా రోవ్మాన్ పావెల్ అరుదైన ఘనతను సాధించాడు. విండీస్ తరుఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. పావెల్ టీ20ల్లో 150 సిక్సర్లు మార్కును చేరుకోవడంతో విండిస్ తరుఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో నికోలస్ పూరన్ 149 సిక్సర్లు కొట్టిన జాబితాలో ఉండగా, వెవిన్ లూయిస్ 136 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక క్రిస్ గేల్ 124 సిక్సర్లతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.పొలార్డ్, హెట్మెయిర్లు 99 సిక్సర్లతో ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.
T20 WC 2026: విండీస్తో డూ ఆర్ డై మ్యాచ్.. టీమిండియా ఇదే..!
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (మార్చి 1) డూ ఆర్ డై మ్యాచ్ జరుగుతుంది. కోల్కతా వేదికగా జరుగనున్న ఈ సూపర్-8 మ్యాచ్లో భారత్, వెస్టిండీస్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్-1 నుంచి సెమీస్కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.అత్యంత కీలకమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్లో జింబాబ్వేపై ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. మరోవైపు ఈ మ్యాచ్ కోసం వెస్టిండీస్ ఓ మార్పు చేసింది. బ్రాండన్ కింగ్ స్థానంలో అకీల్ హొసేన్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..భారత్: సంజూ శాంసన్ (WK), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్వెస్టిండీస్: షాయ్ హోప్ (c & wk), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హోసేన్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్
న్యూస్ పాడ్కాస్ట్
భగ్గుమన్న పశ్చిమాసియా... ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు... భారీగా ప్రతిదాడులకు దిగిన ఇరాన్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు క్లీన్చిట్... కవిత, సిసోడియా సహా 23 మందీ నిర్దోషులే... ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
తిరుమల లడ్డూ ప్రసాదం, రాయలసీమ లిఫ్ట్పై ఏపీ శాసన మండలిలో చర్చించకుండా పలాయనం చిత్తగంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం
హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం... చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల హెచ్చరిక
మహాపచారం మీదే చంద్రబాబూ..! కల్తీనెయ్యి వివాదంలో చంద్రబాబు పాత నిర్ణయాలు వెలుగులోకి
ఏపీలో మరణ మృదంగం మోగిస్తున్న ‘పాల’కూట విషం. ఐదుకు చేరిన మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ కుంభకోణం.. అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ
తాత్కాలిక సుంకాలు 10 శాతం నుంచి 15 శాతానికి పెంపు... వెంటనే అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు చెల్లవ్... పన్ను విధింపు కాంగ్రెస్ అధికారం మాత్రమే... అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
చంద్రబాబుదే కల్తీ పాపం.. కల్తీ నెయ్యి సరఫరా జరిగింది, వినియోగించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
బిజినెస్
ఇరాన్పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్
బంగారం, వెండి, స్టాక్ మార్కెట్లు, బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పరిణామాలు, పెట్టుబడులపై ఎప్పటికప్పుడు తర అభిప్రాయాలను, సమాచారాన్ని పంచుకునే ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా విభిన్న అంశంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు.. దానికి ఇరాన్ ప్రతిదాడులతో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం (#IranWar)నెలకొన్న నేపథ్యంలో ఆయన చేసిన సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా చర్చకు దారితీశాయి.కియోసాకి తన ట్వీట్లో తాను హనోయి (వియత్నాం రాజధాని)లో దిగిన సమయానికే ఇరాన్పై యుద్ధం ప్రారంభమైందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఘర్షణలు మత, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ రక్షణ, చమురు ప్రయోజనాల అంశాలు కూడా యుద్ధాల వెనుక ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.అలాగే గతంలో జరిగిన వియత్నాం యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, ఆ సంఘర్షణలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తాను ఆ యుద్ధంలో సహచరులను కోల్పోయానని భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రపంచం ఎప్పుడు శాంతి వైపు అడుగులు వేస్తుందో అంటూ నిట్టూర్చారు.ఇదే ట్వీట్లో అమెరికా రాజకీయాలపై కూడా కియోసాకి స్పందించారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ హయాంలో మొదలైన ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అని ప్రశ్నించారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు.తర్వాత చేసిన మరో ట్వీట్లో మిన్నెసోటా రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఓమర్, గవర్నర్ టిమ్ వాల్జ్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. సైకాలజిస్ట్, రచయిత జోర్డన్ పీటర్సన్ మాటలను ఉదహరిస్తూ, “బలహీన నాయకత్వం మరింత నష్టం కలిగిస్తుంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను (Donald Trump) “దృఢ నాయకుడు”గా అభివర్ణించారు.WAR!!!! Whst is it good for?Ironically I was landing in Hanoi when the war against Iran started .If truth be told we all know the war against Iran is a war financed by American Jews and Christians against Muslims for oil and to protect Israel.Vietnam was a war of Christians…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 28, 2026
దారుణంగా పెరిగిన బంగారం ధరలు.. వార్ ఎఫెక్ట్!
దేశంలో బంగారం ధరలు (Today Gold Rate) భగ్గుమన్నాయి. వరుసగా మూడో రోజూ దారుణంగా పెరిగాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండివైపు మళ్లడంతో డిమాండ్ పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా ఈరోజు కాస్త పెరుగుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..
స్టాక్ మార్కెట్ సెలవులు.. ట్రేడింగ్ బంద్
భారత స్టాక్ మార్కెట్లకు (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ) మార్చి నెలలో వారాంతాలతోపాటు మూడు ప్రధాన సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు హోలీ, శ్రీరామ నవమి, మహావీర్ జయంతి పండుగలకు సంబంధించినవి. మార్చి 3 (మంగళవారం) హోలీ సెలవు, మార్చి 26 (గురువారం) శ్రీరామ నవమి సెలవు, మార్చి 31 (మంగళవారం) మహావీర్ జయంతి సెలవుగా ప్రకటించారు. ఈ రోజుల్లో ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ సెగ్మెంట్లలో ట్రేడింగ్ పూర్తిగా అందుబాటులో ఉండదు.ట్రేడింగ్ ఏయే రోజుల్లో..మార్చి నెలలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు, శని, ఆదివారాలు,పైన పేర్కొన్న సెలవులు మినహా అందుబాటులో ఉంటుంది. మార్చిలో మొత్తం 31 రోజులు ఉండగా, మార్చి 1, 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారాలు, మార్చి 7, 14, 21, 28 తారీఖుల్లో శనివారాలు వస్తాయి. వీటితోపాటు పండుగల సెలవులు పోగా మిగిలిన 19 రోజులు ట్రేడింగ్కు అందుబాటులో ఉంటాయి. ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ షెడ్యూల్ను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలుమార్కెట్ రీసెర్చ్: ఏదైనా స్టాక్ లేదా సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు పూర్తి అధ్యయనం చేయండి. కంపెనీ ఫండమెంటల్స్, మార్కెట్ ట్రెండ్స్, ఆర్థిక సూచికలను పరిశీలించండి.రిస్క్ మేనేజ్మెంట్: మొత్తం మూలధనాన్ని ఒకే స్టాక్లో పెట్టకుండా, డైవర్సిఫికేషన్ చేయండి. స్టాప్-లాస్ ఆర్డర్లు ఉపయోగించి నష్టాలను నియంత్రించండి.ఎమోషనల్ డెసిషన్స్ వద్దు: మార్కెట్ హెచ్చుతగ్గులకు భావోద్వేగాలతో స్పందించకుండా, లాంగ్-టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేయండి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ (FOMO) లాంటి భావనలను నివారించండి.ట్యాక్స్, రెగ్యులేటరీ అవగాహన: షార్ట్-టర్మ్, లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రూల్స్ తెలుసుకోండి. సెబీ రెగ్యులేషన్లకు అనుగుణంగా ట్రేడ్ చేయండి.సెలవుల సమయంలో ప్లానింగ్: సెలవుల ముందు లేదా తర్వాత మార్కెట్ వాల్యూమ్ తక్కువగా ఉండవచ్చు, దీంతో వోలటాలిటీ పెరగవచ్చు. అందువల్ల ముందుగానే పొజిషన్లను అడ్జస్ట్ చేయండి.ఈ సెలవులు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఎన్ఎస్ఈ, బీఎస్ఈ వెబ్సైట్లను చెక్ చేయాలి.
బడ్జెట్లో మెరిసే ఇంటీరియర్..
మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇల్లు ఒక భావోద్వేగం. అయితే, మారుతున్న కాలంతో పాటు నిర్మాణ ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం ఇల్లు కట్టడమే కాకుండా, నివసించడానికి యోగ్యంగా మార్చే ఇంటీరియర్ డెకరేషన్ కోసం అదనంగా లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సరైన ప్రణాళిక, మెటీరియల్ ఎంపికలో మెలకువలు పాటిస్తే.. తక్కువ బడ్జెట్లోనే మీ ఇంటిని ఒక ప్యాలెస్లా మార్చుకోవచ్చని ఇంటీరియర్ డిజైనింగ్ నిపుణులు సూచిస్తున్నారు.ఇంటీరియర్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..హాల్ (లివింగ్ రూమ్)ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపించేది హాల్. ఇక్కడ ఖర్చు తగ్గించి లుక్ పెంచడానికి మల్టీ ఫంక్షనల్ ఫర్నిచర్ ఉత్తమ మార్గం. గోడలకు ఖరీదైన టెక్స్చర్ పెయింట్లకు బదులుగా ఒక గోడకు మాత్రమే యాక్సెంట్ కలర్ లేదా తక్కువ ధరలో దొరికే పీవీసీ ఫ్లూటెడ్ ప్యానెల్స్ వాడవచ్చు. లైటింగ్కు సంబంధించి ఫాల్స్ సీలింగ్ కోసం భారీగా ఖర్చు చేసే బదులు కోవ్ లైటింగ్ లేదా స్టైలిష్ ఎల్ఈడీ స్ట్రిప్స్తో మంచి లుక్ తీసుకురావచ్చు.వంటగదివంటగదిలో మాడ్యులర్ కిచెన్ పేరుతో భారీగా ఖర్చు అవుతుంది. ఖరీదైన ప్లైవుడ్కు బదులుగా డబ్ల్యూపీసీ (Wood Polymer Composite) బోర్డులను వాడటం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా చెదలు పట్టకుండా ఉంటుంది. స్టోరేజ్ కోసం పైన ఉండే క్యాబినెట్లకు తలుపులు పెట్టకుండా ఓపెన్ షెల్వింగ్ పద్ధతిని పాటిస్తే మెటీరియల్ ఖర్చు తగ్గుతుంది. ఇది వంటగది విశాలంగా కనిపించేలా చేస్తుంది.బెడ్రూమ్అల్యూమినియం సెక్షన్లతో కూడిన వార్డ్రోబ్స్ లేదా స్లైడింగ్ డోర్ కబోర్డులు స్థలాన్ని ఆదా చేస్తాయి. లామినేట్ షీట్ల ఎంపికలో లేటెస్ట్ మ్యాట్ ఫినిష్ ఎంచుకుంటే తక్కువ ధరలో లగ్జరీ లుక్ వస్తుంది. స్టోరేజ్ సౌకర్యం ఉన్న బెడ్స్ ఎంచుకోవడం వల్ల అదనపు అల్మారాల అవసరం ఉండదు.వాష్రూమ్, క్యారిడార్బాత్రూమ్ గోడల మొత్తానికి టైల్స్ వేయకుండా కేవలం 7 అడుగుల ఎత్తు వరకు వేసి పైన పెయింట్ వేయడం ద్వారా 20 శాతం వరకు ఖర్చు తగ్గించవచ్చు. బ్రాండెడ్ ఫిట్టింగ్స్లో ఎంట్రీ లెవల్ సిరీస్లను ఎంచుకోండి. ఇవి క్వాలిటీతో పాటు వారంటీని ఇస్తాయి. క్యారిడార్లో రేయిలింగ్ కోసం అద్దాలను అమర్చడం వల్ల ఇరుకైన క్యారిడార్లు కూడా విశాలంగా కనిపిస్తాయి.బడ్జెట్ పెరగకుండా ఉండాలంటే..ఇంటి నిర్మాణం మొదలుపెట్టే ముందే ఇంటీరియర్ ప్లాన్ సిద్ధం చేసుకోండి. వైరింగ్, ప్లంబింగ్ పాయింట్లు ముందుగానే నిర్ణయించుకుంటే తర్వాత చేసే మార్పుల వల్ల అయ్యే వృధా ఖర్చును నివారించవచ్చు.ఇదీ చదవండి: సిటీలో సామాన్యుడు ఇల్లు కొనాలంటే..
ఫ్యామిలీ
మాల్ లో మొదలైన మ్యాజిక్
పసిపాపగా మొదలైన నటి సారా అర్జున్ ప్రయాణం, ఇప్పుడు పాన్ఇండియా స్టార్డమ్ వరకూ చేరింది. ఇంకా ఎన్నో కలలు, ఎన్నో పాత్రలు, ఎన్నో విజయాలు ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి. ఆ విషయాలే మీకోసం..రెండేళ్లు కూడా లేవు!‘‘ఇంత చిన్న వయసులోనే ఇన్ని సినిమాలు ఎలా చేశావు?’’ అని చాలామంది అడుగుతుంటారు. కాని, కెమెరా ముందు నిలబడినప్పుడు నాకు రెండేళ్లు కూడా లేవు! ఒకరోజు అమ్మానాన్నలతో కలిసి మాల్కు వెళ్లినప్పుడు, ఒక ప్రకటన సంస్థ ప్రతినిధి మీ పాప యాడ్లో నటిస్తుందా? మా పేరెంట్స్ని అడిగారు. అలా పద్దెనిమిది నెలల పసిపాపగా నా ప్రయాణం మొదలైంది. ఐదేళ్లకే వందకు పైగా ప్రకటనల్లో నటించాను.క్రేజీ మెమరీ!‘నాన్న’ సినిమా షూటింగ్ సమయంలో నా డైలాగులే కాదు, విక్రమ్ అప్పా డైలాగులు కూడా నాకు కంఠస్థం అయ్యేవి. ఆయన ఎక్కడైనా మర్చిపోతే, నేనే గుర్తు చేసేదాన్ని! ఆ సమయంలో అనుష్క శెట్టితో నాకు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. ‘జంక్ ఫుడ్ అస్సలు తినకు, మంచి ఆహారం తీసుకోవాలి’ అని ఆమె ఇచ్చిన సలహా ఇప్పటికీ గుర్తుంది.గాసిప్స్ మామూలే!‘ధురంధర్’ సినిమాలో రణవీర్ సింగ్తో ఉన్న వయస్సు తేడా గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇక ఇటీవల రాకేష్ బేడీ ఆప్యాయంగా పలకరించడాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. హీరోయిన్ గా మారిన తర్వాత గాసిప్స్ సహజమే అని చాలా త్వరగా అర్థమైంది. మిగతావన్నీ తర్వాతే!ఎన్ని సినిమాలు చేసినా, ఒక్కరోజు కూడా స్కూల్ మిస్ కాలేదు. చిత్రీకరణలన్నీ సెలవుల్లోనే ఉండేలా నాన్న జాగ్రత్తగా ప్లాన్ చేసేవారు. చదువు, సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేయటం మా కుటుంబం ఇచ్చిన పెద్ద బలం.ప్రశ్నలే నా గురువులు!‘నాకు కొత్త ప్రదేశాలను చూడటం అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్లో ఎంతోమంది రకరకాల మనుషులు పరిచయమవుతుంటారు. ఎవరిని కలిసినా వివిధ ప్రశ్నలు అడుగుతుంటాను. వారి అలవాట్లు, మాట్లాడే తీరు గమనిస్తూ ఉంటాను. ఆ పరిశీలనే నేను చేసే పాత్రలకు ప్రాణం పోయడానికి సహాయపడుతుంది.ప్రేమ అంతా సినిమాలపైనే!పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తాను. ‘యుఫోరియా’లో నేను చేసిన పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, భావోద్వేగ భరితమైన, శక్తిమంతమైన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను.రికార్డుల దిశగా దూసుకెళ్తూ! ఇటీవల ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్డీబీ) విడుదల చేసిన ‘అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సెలబ్రిటీల’ జాబితాలో తొలి స్థానంలో నిలవడం నాకు ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగించింది. దానిని నేను గౌరవంగా భావిస్తున్నాను. ఇది ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకు నిదర్శనం.ఇష్టాలు..!» అభిమాన నటుల్లో హీరో విజయ్ దేవరకొండ అంటే పెద్ద క్రష్! ఆయన ఎనర్జీ అంటే నాకు చాలా ఇష్టం. తమిళంలో సూర్య నా ఫేవరెట్. ఇక హీరోయిన్లలో ఐశ్వర్య రాయ్ని చూస్తూ పెరిగాను. ఆమె నా ఆదర్శం. »ఆహారంలో హైదరాబాద్ బిర్యానీ అంటే పిచ్చి. కాని, ఇప్పుడు ఆరోగ్యం కోసం డైట్ పాటిస్తున్నాను. అలాగే, నా డాగీతో గడిపే సమయం నాకు అత్యంత ప్రియమైనది.
విశేషాలకు కొదవ లేని కొడవ కళ్యాణం
అక్కడ పురోహితులు ఉండరు... వేద మంత్రోచ్చారణలు వినిపించవు... వధూవరులు ఏడడుగులు వేయరు... ‘కొడవ’ సంప్రదాయ పద్ధతిలో జరిగే వివాహ వేడక ఇలానే ఉంటుంది. అంతేనా? ఇంకా చాలా విశేషాలుంటాయి. తెలుగు సంప్రదాయానికి పూర్తి భిన్నంగా ఈ వేడుక ఉంటుంది. టాలీవుడ్ లవ్బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ఈ రెండు పద్ధతుల్లోనూ పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ఉదయం తెలుగు సంప్రదాయంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అదే రోజు సాయంత్రం కర్ణాటకలోని కొడవ పద్ధతిలో పెళ్లి జరిగింది. దీంతో కొడవ తెగకు సంబంధించిన వేడుక ఎలా జరిగి ఉంటుందా?! అనే చర్చలు మొదలయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...విజయ్ దేవరకొండది తెలంగాణలోని నాగర్కర్నూలు. రష్మికది కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట. కొడగునే కూర్గ్ అని కూడా పిలుస్తారు. అక్కడి స్థానిక వారియర్ కమ్యూనిటీనే కొడవగా పిలుస్తారు. కొడవ ప్రజల సంస్కృతి, ఆహార్యం, సంప్రదాయాలు మిగతా వారితో పోల్చితే భిన్నంగా ఉంటాయి. వారి పూర్వీకులను గౌరవిస్తూ వివాహ వేడుకలను జరుపుతారు. మామూలుగా జరిగే తెలుగు వివాహాలకు భిన్నంగా కొడవ వెడ్డింగ్ ఉంటుంది. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడుస్తూ ప్రమాణాలు చేసుకోవడం వంటిది ఏమీ ఉండదు. సుదీర్ఘంగా పెళ్లి మంత్రాలు వినిపించవు. అరిటాకుల్లో విందు, సంప్రదాయ అలంకరణలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ. ఈ వివాహ వేడుకను వాళ్లు ‘మంగళ’ అని పిలుస్తారు. అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుంది. వేదికను అరిటాకులతో పచ్చదనానికి ప్రతీకగా అలంకరిస్తారు.భిన్నమైన కట్టుకొడవ పెళ్లిలో వధూవరులిద్దరూ అభ్యంగన స్నానం చేస్తారు. అనంతరం తమ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు ‘కుష్య’ అనే నల్లని కోటు, ‘చేలే’ అని పిలిచే నడుముకు కట్టే పట్టీ, ‘పీచే కత్తి’ (చిన్న కత్తి) ధరిస్తాడు. ఇక వధువు చీరకట్టు సంప్రదాయం మిగతా చీరకట్టులతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. సాధారణంగా భారతీయ వస్త్రధారణలో చీర పల్లూను ముందు నుంచి వెనక వైపుకు వేస్తారు. కానీ కొడవ సంప్రదాయంలో చీర కొంగును వెనక నుంచి ముందుకు తీసి, వేస్తారు. అలాగే, వెనక వైపు కుచ్చిళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కట్టు ఈ కమ్యూనిటీలో కనిపిస్తుంది. ఇక వేడుక అంతా డ్రమ్ బీట్స్, పాటలతో వారియర్ నేపథ్యాన్ని గుర్తుచేసే నృత్యాలు చేస్తారు. అలాగే గన్ సెల్యూట్స్ కూడా ఆ వేడుకలో భాగమే. ఈ పద్ధతిని అనుసరిస్తూ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా కూడా ఈ నృత్యాలు చేశారు.కొడవలు ఎవరు కొడవలను ‘కూర్గులు’ అని కూడా అంటారు. వీరిది కర్ణాటక రాష్ట్రంలోని కొడగు (కూర్గ్) ప్రాంతం. వీరు సుమారు 1.6 లక్షల దాకా ఉన్నారని అంచనా. గతంలో వీరు వ్యవసాయం, ఇతర పనుల మీద ఆధారపడి జీవించేవారు. 19వ శతాబ్దంలో కాఫీ సాగు ద్వారా వీరి పనికి ప్రాధాన్యం లభించింది. మొదట వ్యవసాయ ఆధారిత పండుగలు జరుపుకునే వీరు అనంతరం ఇతర పండుగలూ జరుపుకోవడం మొదలుపెట్టారు. కావేరి నది వీరికి ప్రాధాన్యమైనది. బ్రిటిష్ పాలన సమయంలో వీరు ఇతర రంగాల్లోకి ప్రవేశించారు. వీరి నైపుణ్యాలను గమనించి బ్రిటిష్ అధికారులు వీరిని మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో వినియోగించారు. కొడవల్లో అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు.బంగారు నాణేల మూటపెళ్లి వేదికకు వచ్చే మార్గంలో అరటి చెట్టు నాటుతారు. వరుడు దీని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, అనంతరం ఆ చెట్టు కాండాన్ని నరకడం ఒక ముఖ్యమైన ఆచారంగా ఉంటుంది. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీకగా నిలుస్తుంది. తర్వాత వరుడు పెళ్లి పీటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, తూర్పు ముఖంగా కూర్చుంటాడు. ఆ సమయంలో ముందుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు వరుడిని ఆశీర్వదిస్తారు. తర్వాత వధువు అక్కడికి చేరుకుని వరుడికి పాలు, బహుమతులు, బంగారం, వెండి, రాగి నాణేలను అందిస్తుంది. ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతంగా భావిస్తారు.12 గులకరాళ్లతో వధువుపై సర్వహక్కులువధూవరులిద్ద్దరూ మల్లెపూల దండలు మార్చుకుంటారు. పవిత్ర దీపం ఎదురుగా నిలబడి వధువు బాధ్యత వరుడికి అప్పగిస్తున్నామని పెద్దలు చెబుతారు. దీంతో పాటు వధువు తరఫు పెద్దలు 12 గులకరాళ్లు వరుడి పెద్దలకు ఇచ్చి, వధువుపై సర్వహక్కులు ఇస్తున్నామని చెబుతారు. అయితే వరుడి వైపు పెద్దలు 11 రాళ్లు తీసుకొని ఒకటి తీసుకోకుండా వదిలేస్తారు. అవసరమైన సందర్భంలో వధువుపై వారికీ హక్కు ఉందనే అర్థంలో ఇలా చేస్తారు. పుట్టింటివారికి కూతురి పట్ల కొంత బాధ్యత ఉంటందని సూచించడానికే ఇలా చేస్తారని చెప్పవచ్చు.నీళ్ల బిందె తలపై పెట్టుకొని..పెళ్లి తర్వాత వధువు తమ అత్తగారి ఇంటి వద్ద గంగా పూజ చేస్తుంది. ఈ పూజ కోసం వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించడానికే ఈ ఘట్టం. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా కొడవ పెళ్లిళ్లలో మాంసాహారాన్ని వడ్డిస్తారు. అందులో ప్రధానంగా పంది మాంసం, మద్యం తప్పనిసరిగా ఉంటాయట. దీంతో విజయ్–రష్మిక పెళ్లి వేడుకలో ఈ వంటకాన్ని కూడా వడ్డించారు. ఇలా ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో, సాయంత్రం కొడవ సంప్రదాయ పద్ధతిలో జరిగిన విజయ్–రష్మికల వివాహ వేడుకలు ‘టాక్ ఆఫ్ ది నేషన్’ అయ్యాయి. మార్చి 4న హైదరాబాద్లో వీరి వివాహ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.విరోష్ సెలబ్రేషన్స్‘‘దేశంలోని ప్రజలందరూ ఎప్పుడూ మా ప్రయాణం, ప్రేమలో భాగమయ్యే ఉన్నారు. అందుకే మీ అందరితో మా వెడ్డింగ్ను సెలబ్రేట్ చేసుకోవడం మాకెంతో సంతోషం. ప్రతి వేడుకను ఇండియా ఎలా అయితే ఫుడ్ అండ్ మిఠాయిలతో సెలబ్రేట్ చేసుకుంటుందో అలా మా జీవితంలోని ఈ బిగ్ మూమెంట్ను మీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు మార్చి 1న దేశవ్యాప్తంగా ఫుడ్ అండ్ స్వీట్ ట్రక్స్ను పంపిస్తున్నాం (కొన్ని నగరాల్లో మాత్రమే). అలాగే దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నాం. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రేమతో విజయ్ అండ్ రష్మిక’’ అంటూ విజయ్ దేవరకొండ, రష్మిక ‘ఎక్స్’ లో శనివారం రాత్రి ఓ పోస్ట్ షేర్ చేశారు. అలాగే ‘విరోష్ సెలబ్రేషన్స్’ అంటూ, ఏయే నగరాల్లో స్వీట్స్ పంచనున్నారు, ఏయే దేవాలయాల్లో అన్నదానం నిర్వహించనున్నారన్న జాబితాను కూడా ఈ ఇద్దరూ షేర్ చేశారు.స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్... ∙తెలంగాణ – హైదరాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్, ∙ఢిల్లీ (ఎన్సీటీ) – ఢిల్లీ ∙చండీఘర్ (యూటీ)– చండీఘర్ ∙ఉత్తరప్రదేశ్ – నోయిడా, గజియాబాద్ ∙గుజరాత్ – అహ్మదాబాద్ ∙మధ్యప్రదేశ్ – భోపాల్ ∙మహారాష్ట్ర – ముంబై ∙రాజస్థాన్ – జైపూర్ ∙ఆంధ్రప్రదేశ్ – వైజాగ్, విజయవాడ, పుట్టపర్తి ∙కేరళ – కొచ్చి ∙కర్ణాటక – మైసూర్, కూర్గ్, బెంగళూరు ∙తమిళనాడు – కోయంబత్తూర్, చెన్నై ∙పాండిచ్చేరి (యూటీ) – పాండిచ్చేరి ∙బిహార్– (ట్రైన్ యాక్సిడెంట్ కారణంగా సోమవారానికి వాయిదా).
ఎత్తైన దిండ్లు వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే
దిండు లేకుండా నిద్ర పోవడం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గి గ్లాకోమా తీవ్రత తగ్గే అవకాశం ఉందని తాజా అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా శాశ్వత అంధత్వానికి దారితీసే కారణాలలో గ్లాకోమా ఒకటి. దీనికి ప్రధాన కారణం కంటిలో ఉండే అధిక ఒత్తిడి దృష్టి నరాన్ని దెబ్బతీయడం. ఎత్తైన దిండ్లు లేదా ఒకటి కంటే ఎక్కువ దిండ్లను వాడటం వల్ల మెడలోని జుగులార్ వెయిన్పై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కంటి ద్రవం సరిగ్గా బయటకు వెళ్లలేక, కంటి లోపల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి దృష్టి నరాన్ని (ఆప్టిక్ నెర్వ్)ప్రభావితం చేస్తుంది. ఇది గ్లాకోమా రావడానికి కారణం అవుతుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆప్తమాలజీలో ప్రచురించిన ప్రకారం, ఈ అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు 144 మంది గ్లాకోమా రోగులను పరీక్షించారు. కూర్చున్నప్పుడు, రెండు దిండ్లతో పడుకున్నప్పుడు, దిండు లేకుండా పడుకున్నప్పుడు వారి కంటి లోపల ఉండే ఒత్తిడిని ప్రతి రెండు గంటలకు ఒకసారి 24 గంటల΄ాటు పరిశీలించారు. దిండ్లతో తల ఎత్తుగా పెట్టి పడుకున్నప్పుడు, దాదాపు మూడింట రెండు వంతుల మంది రోగులలో కంటిలో ఒత్తిడి పెరిగినట్లు వారు గమనించారు. యువకులు, ప్రైమరీ ఓపెన్–యాంగిల్ గ్లాకోమా ఉన్నవారిపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు. ఈ ఫలితాలు ప్రాథమికమైనవే అయినప్పటికీ, గ్లాకోమా ఉన్నవారు తాము నిద్రించే విధానంలో జాగ్రత్త వహించడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.
కోపానికి టాటా చెప్పేద్దాం!
కోపం వలన గుండె సంబంధిత జబ్బులు రావచ్చని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. చిన్నపాటి కోపమైనా సరే అది రక్తనాళాలను ప్రభావితం చేయడం వల్ల రక్తప్రసరణపై ప్రభావం పడి గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనంలో తెలిసింది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆధునిక జీవన శైలి వలన ఇప్పటికే పలు రకాల గుండె జబ్బులు వస్తున్నాయి. సీటులో నుంచి కదలకుండా ఒకేచోట స్థిరంగా కూర్చోవడం, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం వంటి కారణాల వలన గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అనుకోకుండా వచ్చే కోపం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.కేవలం ఎనిమిది నిమిషాల పాటు ఉండే కోపం అనే భావోద్వేగం వల్ల రక్త నాళాలు విస్తరించే సామర్థ్యం దాదాపు సగానికి తగ్గిపోతుంది. అంతే కాదు కేవలం 8 నిమిషాల పాటు వచ్చే కోపం వలన దాని ప్రభావం 40 నిమిషాల వరకు ఉంటుందని గుర్తించారు. దీనితో పాటు ఎక్కువ కోపంగా ఉండటం వలన గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ పరిశోధనలో వెల్లడైంది.పరిశోధనలో అసలేం తెలుసుకున్నారు?అమెరికాలోని వివిధ సంస్థల నిపుణులు చేసిన పరిశోధనలో దాదాపు 300 మంది ఆరోగ్యంగా ఉన్నటువంటి పెద్దవయస్సు వారిని ఎనిమిది నిమిషాల పాటు కోపంగా ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవాలని కోరుతూ అధ్యయనం చేశారు. దీని ద్వారా వారు పొందిన ఫలితాలను బట్టి ఈ అధ్యయనం చేశారు. అయితే, విచారం లేదా ఆందోళన వంటి భావోద్వేగాలు గుండె ఆరోగ్యంపై ఇలాంటి ప్రభావాన్ని చూపలేదు.కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంటే...బాగా కోపం వచ్చినప్పుడు లోతుగా డీప్ బ్రీత్ తీసుకోవడం లేదా 10 వరకు అంకెలు లెక్కపెట్టడం బెటర్. కోపం కలిగించే వ్యక్తులకు, పరిస్థితులకు దూరంగా ఉండాలి.రెగ్యులర్గా వాకింగ్, ఎక్సర్సైజ్ చేయండి.రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు మంచి నిద్ర, విశ్రాంతి అవసరం. స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ధ్యానం లేదా యోగా రెగ్యులర్గా చేయడం అలవాటు చేసుకోవాలి. మీ కొలెస్ట్రాల్ లెవల్స్ మేనేజ్ చేసుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోండి. చదవండి: ముప్పై ఏళ్లకే ఎముకలు గుల్లబారుతున్నాయి
అంతర్జాతీయం
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అతనే.. ప్రతీకారం తీర్చుకుంటాం..
టెహ్రాన్: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఈ మేరకు ఇరాన్, అమెరికా.. ఖమేనీ మృతిని నిర్ధారించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత వారసుడు ఎవరనేది చర్చకు దారి తీసింది. అయితే, ఖమేనీ తన జీవితకాలంలో ఎవరినీ అధికారిక వారసుడిగా ప్రకటించలేదు. అయితే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కొడుకు రెండో కుమారురు మొజ్తబా ఖమేనీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఎంపిక బాధ్యత ఎవరిది? ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, కొత్త సుప్రీం లీడర్ను ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కి ఉంటుంది. ఇందులో 88 మంది అగ్రశ్రేణి మత పండితులు ఉంటారు. వీరు చర్చించి కొత్త నేతను ఎన్నుకుంటారు. కేవలం మత పెద్దలే కాదు, ఇరాన్ సైనిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) పాత్ర ఇందులో అత్యంత కీలకం. దేశంలో అత్యంత శక్తివంతమైన ఈ సైన్యం ఎవరికి మద్దతు ఇస్తే వారే పీఠం దక్కించుకునే అవకాశం ఉంది.కాగా, తాజా దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ పాక్పూర్ కూడా మరణించారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో కొత్త ఐఆర్జీసీ చీఫ్గా అహ్మద్ వహిదీ నియామకం అయ్యారు. అనంతరమే.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కొడుకు రెండో కుమారురు మొజ్తబా ఖమేనీని ఎన్నుకున్నట్టు తెలిసింది.మరోవైపు.. ఖమేని హత్య కారణంగా ఇరాన్ సైన్యం విరుచుకుపడుతోంది. యూఏఈ, ఖతార్, బహ్రెయిన్పై ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్ ఎయిర్పోర్టు ధ్వంసమైంది. ఇదే సమయంలో అమెరికా- ఇజ్రాయెల్పై కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్ కేబినెట్ పేర్కొంది. ఖమేనీ మృతిపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) సంతాపం తెలిపింది. ఈ సందర్బంగా తమ సుప్రీం నేతను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని.. చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణాల్లోనైనా జరగొచ్చని హెచ్చరించింది. ఇజ్రాయెల్, యూఎస్ స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఐఆర్జీసీ సిద్ధమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
‘ప్రతిజ్ఞ నెరవేర్చా’.. ఖమేనీ చివరి సందేశం?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (86) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా ధ్రువీకరించడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. ఖమేనీ మృతికి గల కారణాలను అధికారిక యంత్రాంగం వెల్లడించనప్పటికీ, ఆయన మృతి వెనుక కుట్ర కోణాలు ఉండవచ్చనే అనుమానాలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి.ఖమేనీ మరణ వార్త వెలువడిన కొద్ది నిమిషాల్లోనే ఆయన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఒక ఖురాన్ వాక్యం పోస్ట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘అల్లాకు ఇచ్చిన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్న వారే నిజమైన విశ్వాసులు.. వారిలో కొందరు తమ ప్రమాణాన్ని నెరవేర్చగా, మరికొందరు ఆ సమయం కోసం నిరీక్షిస్తున్నారు’ అనే అర్థం వచ్చే సూరా అల్-అహ్జాబ్ (33:23) వాక్యాన్ని అందులో ప్రస్తావించారు.ఇది ముందే షెడ్యూల్ చేసిన సందేశమా లేక వ్యూహాత్మకంగా పోస్ట్ చేసిన చివరి వీడ్కోలా అన్నది అస్పష్టంగా ఉన్నప్పటికీ, ఆయన అనుచరులు దీనిని ఆయన దైవానికి ఇచ్చిన మాటకు నిబద్ధతగా భావిస్తున్నారు. ఖమేనీ మృతి దరిమిలా ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలను, వారం రోజుల పాటు సెలవును ప్రకటించింది. بسم الله الرحمن الرحیممِنَ الْمُؤْمِنِینَ رِجالٌ صَدَقُوا ما عاهَدُوا اللّهَ عَلَیْهِ فَمِنْهُمْ مَنْ قَضى نَحْبَهُ وَ مِنْهُمْ مَنْ یَنْتَظِرُ وَ ما بَدَّلُوا تَبْدِیلاًhttps://t.co/vVE1NYLvr3 pic.twitter.com/H3xLBUullf— KHAMENEI.IR | فارسی (@Khamenei_fa) March 1, 2026మరోవైపు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరాన్ దాడులకు ప్రతిచర్యగా, తమ ప్రత్యేక దళాలు ఇజ్రాయెల్తో కలిసి ఖమేనీని మట్టుబెట్టాయని ఆయన పేర్కొన్నారు. ‘ఇరాన్ సాగించిన ఉగ్రవాద పాలన నేటితో ముగిసింది. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఆధిపత్యం నిరూపితమైంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై పెంటగాన్ అధికారులు అధికారికంగా స్పందించేందుకు నిరాకరించగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం సైతం ‘నో కామెంట్’ అంటూ గోప్యతను పాటించింది.కాగా ఖమేనీ వారసునిగా ఆయన కుమారుడు మోజ్తబా లేదా మరో వర్గానికి చెందిన నేతను ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ అధికార మార్పిడి సజావుగా సాగుతుందా లేక ఇది ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇరాన్ వ్యాప్తంగా ప్రార్థనలు, నిరసనలు మిన్నంటుతుండగా, ప్రపంచ దేశాలన్నీ పశ్చిమాసియా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.ఇది కూడా చదవండి: విప్లవ వీరుడి నుంచి.. క్షిపణి జ్వాలల వరకు..
వైరల్ వీడియో: ట్రంప్కు లేడీ యాంకర్ వార్నింగ్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణ వార్తను చదువుతూ... ఇరాన్ స్టేట్ టీవీ యాంకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ.. త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం. వారు ఏం చేశారో దానికి తగిన ఫలితం అనుభవిస్తారు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హెచ్చరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఖమేనీకి నివాళులర్పిస్తూ యాంకర్ అజర్చెహ్ర్.. ఖమేనీ నాయకత్వాన్ని, సిద్ధాంతాలను కొనియాడారు. ఆయన పాలస్తీనా పిల్లల కోసం నిలబడ్డారని.. లెబనాన్ పిల్లల కోసం పోరాడారన్నారు. ఈరోజు ఆయన కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనాథలు విలపిస్తున్నారన్నారు. ఖమేనీ చరిత్రలో ఇమామ్ అలీ వలె చిరస్థాయిగా నిలిచిపోతారంటూ యాంకర్ తెలిపింది.ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. దాడ్లులో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందారు. 40 రోజులు సంతాప దినాలుగా ఇరాన్ ప్రకటించింది. ఖమేనీ నివాసంపై ఆధునిక క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఖమేనీ నివాసమే లక్ష్యంగా 30 క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్జాదే, రివల్యూషనరీ గార్డ్ ఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ కూడా మృతిచెందారు.Anchor breaks down at Iran's Press TV announcing the death of Supreme leader Khamenei. Says, "A revenge is coming. A revenge is coming soon. They will see what they have done." pic.twitter.com/4WGtZ58SX0— Sidhant Sibal (@sidhant) March 1, 2026
విప్లవ వీరుడి నుంచి.. క్షిపణి జ్వాలల వరకు..
కొన్ని దశాబ్దాల పాటు ఇరాన్ రాజకీయాలను, సైనిక వ్యూహాలను తన కనుసన్నలతో శాసించిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రస్థానం ఊహించని రీతిలో ముగిసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడిలో ఆయన మరణించినట్లు వెలువడుతున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.విప్లవ వీరుడి నుంచి సుప్రీం లీడర్ వరకు..1939లో మషద్లోని ఒక సాంప్రదాయ మతపరమైన కుటుంబంలో జన్మించిన ఖమేనీ ప్రస్థానం ఒక పోరాట గాథలా సాగింది. 1979లో నాటి ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటి షా మహమ్మద్ రెజా పహ్లావీ అణచివేత పాలనకు వ్యతిరేకంగా గళమెత్తి, పలుమార్లు జైలు శిక్షను అనుభవించారు. విప్లవం విజయవంతం అయ్యాక, ఇరాన్ గణతంత్ర వ్యవస్థలో తిరుగులేని నేతగా ఎదిగి, 1981 నుండి 1989 వరకు దేశ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించి తనదైన పాలన సాగించారు.నాడు తృటిలో ప్రాణాపాయం తప్పించుకుని..ఖమేనీ జీవితంలో 1981 నాటి హత్యాయత్నం ఒక కీలక మలుపు. నాటి దాడిలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆయన కుడి చేయి పాక్షికంగా పక్షవాతానికి గురైంది. అప్పటి నుండి ఆయన తన వైకల్యాన్ని కూడా ఒక శక్తిగా మార్చుకుని, దేశాన్ని నడిపించడంలో ముందున్నారు. 1989లో ఖొమేనీ మరణానంతరం ఇరాన్ ‘అత్యున్నత నాయకుని’గా బాధ్యతలు చేపట్టి, మూడు దశాబ్దాలకు పైగా దేశ భవిష్యత్తును తన వేళ్లతో శాసించారు.ప్రాంతీయ శక్తిగా ఇరాన్ విస్తరణఖమేనీ నాయకత్వంలో ఇరాన్ ప్రభావం దేశ సరిహద్దులు దాటింది. లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్ వంటి దేశాల్లోని ఇరాన్ అనుకూల వర్గాలకు అండగా నిలుస్తూ, అమెరికా, ఇజ్రాయేల్లకు ఖమేనీ నిరంతరం సవాలు విసిరారు. ఆయన హయాంలోనే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం ప్రపంచ దేశాల దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.ఉక్కుపాదంతో అంతర్గత అణచివేతబాహ్య శత్రువులనే కాకుండా, అంతర్గతంగా తలెత్తిన అసమ్మతిని కూడా ఖమేనీ కఠినంగా ఎదుర్కొన్నారు. 2009 నాటి ‘గ్రీన్ మూవ్మెంట్’ నిరసనలు, అలాగే 2019, 2022లలో ప్రజల నుంచి వచ్చిన తీవ్ర తిరుగుబాట్లను ఆయన తన అధికార బలంతో పూర్తిగా అణచివేశారు. తనను తాను ఇరాన్ సార్వభౌమాధికార రక్షకుడిగా అభివర్ణించుకున్నప్పటికీ, ఆయన పాలనలో రాజకీయ స్వేచ్ఛ కరువైందన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి.అగ్రరాజ్యంతో అలుపెరుగని పోరాటంఅమెరికాతో ఖమేనీకి ఉన్న వైరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ముఖ్యంగా 2015 నాటి అణు ఒప్పందం నుంచి 2018లో డొనాల్డ్ ట్రంప్ వైదొలగడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ట్రంప్ ఇరాన్ సుప్రీం ఖమేనీని అత్యంత క్రూరమైన వ్యక్తిగా, ఆయన వర్గాన్ని ‘రక్తపిపాసి ముఠా’గా అభివర్ణించారు. అయితే ఖమేనీ ఏనాడూ అమెరికా ఒత్తిళ్లకు లొంగలేదు. ట్రంప్ ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ప్రతీకార జ్వాలల్లో మధ్యప్రాచ్యంఖమేనీ అంతంతో ఇరాన్ తన ‘ట్రూత్ ఫుల్ ప్రామిస్ 4’ ఆపరేషన్ను ప్రారంభించి, అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అబుదాబి, దోహాలతో పాటు బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయంపై పడుతున్న క్షిపణులు ఈ ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతను మరింతగా పెంచాయి.ఇది కూడా చదవండి: ఖమేనీ మృతితో నెతన్యాహు పరారీ?
జాతీయం
నేటి నుంచి బెంగాల్లో బీజేపీ ‘పరివర్తన్ యాత్ర’
సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాషాయదళం ముందుకు సాగుతోంది. పోలింగ్కు ముందు పార్టీ శ్రేణులను సన్న ద్ధం చేసేలా బృహత్ కార్యాచరణతో ముందుకెళుతోంది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేలా ఆదివారం నుంచి వారం పాటు ‘పరివర్తన్ యాత్ర’కు శ్రీకారం చుట్టింది. 260 భారీ సభలు..2021 అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ బీజేపీ 77 సీట్లు గెలుచుకుంది. ఈసారి 160 స్థానాలు లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో తృణముల్ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా యాత్రను మొదలు పెట్టనుంది. రాష్ట్రంలో రాజ్యాంగం అమలుకావడం లేదని, మహిళలపై నేరాలు పెరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తోంది. ముఖ్యంగా రైతులకు లబ్ధి చేకూర్చే పీఎం కిసాన్ వంటి పథకాలు రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదని చెబుతోంది. అక్రమ ఓటర్లు, చొరబాటుదారుల అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ జాతీయ భద్రతపై టీఎంసీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. వీటన్నింటినీ తమ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇందుకుగాను 260 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు, 250 చిన్నచిన్న సమావేశాలు ఏర్పాటు చేస్తూ మొత్తంగా 5 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేలా యాత్రను డిజైన్ చేశారు. దీనిద్వారా ప్రత్యక్షంగా కోటిన్నర మంది ప్రజలను కలవాలన్నది లక్ష్యంగా ఉంది. ఆదివారం ప్రారంభం కానున్న ఈ యాత్రలో తొలిరోజు కూచ్బెహర్ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరు కానుండగా, నదియా ఉత్తర్లో మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఘార్గ్రామ్లో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పురులియాలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి పాల్గొననున్నారు. 2వ తేదీన దక్షిణ 24 పరగణాలు, మథురాపూర్, రాయదిఘి సభలకు హోంమంత్రి అమిత్ షా, హౌరా, హూగ్లీ జిల్లాల సభలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాద్వాన్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు సభలకు హాజరు కానున్నారు. ఈ యాత్ర చివరి రోజు నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడమే లక్ష్యంగా ఈ యాత్ర ముందుకు సాగనుంది.
కూటమిలో మహా చిచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలల్లో జరగనున్న రాజ్య సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో విపక్ష కూటమైన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో రాజకీయ చిచ్చు రేగుతోంది. విపక్ష కూటమికి దక్కే ఒకే ఒక్క సీటుపై అటు ఎన్సీపీ (శరద్ పవార్), ఇటు శివసేన (ఉధ్దవ్ బాల్ఠాక్రే) పార్టీలు పట్టుబడుతుండటంతో వివాదం ముదురుతోంది. అత్యధిక సీట్లున్న తమకే రాజ్యసభ సీటు దక్కాలని పవార్ వర్గం బలంగా డిమాండ్ చేస్తోంది. ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సిన కూటమిలోని కాంగ్రెస్ మౌనంగా ఉండిపోవడం ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తోంది. ఎవరికి వారే..: మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, 7 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒక రాజ్యసభ సీటుకు 37 ఓట్లు అవసరం కాగా, ప్రస్తుతం 235 సీట్లున్న ఎన్డీయేకు 6 స్థానాలు దక్కడం ఖాయం. మిగతా ఒక్క స్థానం మాత్రమే విపక్షాలకు దక్కనుంది. విపక్ష కూటమి అయిన ఎంవీఏలో సేన యుబీటీకి 20, కాంగ్రెస్కు 16, శరద్ పవార్ వర్గానికి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న పవార్ వర్గానికి చెందిన ప్రియాంక చతుర్వేదిని తిరిగి కొనసాగించాలని ఆ పార్టీ మొదట డిమాండ్ చేసింది. అయితే గతంలో రాజ్యసభ ఎన్నికలకు మళ్లీ పోటీ చేయనని గతంలో ప్రకటించిన శరద్ పవార్, తాజా పరిణామాల నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నా రు. ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మర ణం తర్వాత మనసు మార్చుకున్న శరద్ పవార్ రాజ్యసభ కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పవా ర్ పార్టీ ఈ సీటు కోసం పట్టుబడుతోంది. దీనిపై పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే సైతం స్పందిస్తూ, ‘పవార్ రాజ్యసభకు వెళ్లాలన్నది పార్టీలో అందరి కోరిక’అని వ్యా ఖ్యానించారు. ఈ విషయమై ఆమె కాంగ్రెస అగ్రనేతలతో మంతనాలు సైతం ప్రారంభించారు. ఈ సమయంలోనే సేన యూబీటీ నేతలు పవార్ ఆరోగ్యాన్ని చర్చకు పెట్టారు. వృధ్ధాప్య సమస్యలతో తరుచూ ఆస్పత్రి పాలవుతున్న పవార్ నుంచి ప్రజా ప్రతినిధిగా ఏం ఆశించగలం అంటూ యూబీటీ నేతలు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే సైతం ఈ సీటుపై తమకే మొదటి హక్కు ఉందంటున్నారు. కూటమిలో విభజన వచ్చేలా మాటల మంటలు రేగుతున్నా కాంగ్రెస్ మాత్రం మౌనంగానే ఉంది. అభ్యర్థిత్వంపై ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ మాట్లాడుతూ, కూటమి భాగస్వాములు కలిసి అభ్యర్థిని నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ పరిణా మాలతో శివసేన యుబీటీ, శరద్ పవార్ వర్గాల మధ్య సర్దుబాటు ఎలా కుదురుతుందో చూడాల్సి ఉంది. ఈ నిర్ణయం కూటమి భవిష్యత్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి.
ఇది హరిత విద్యుత్ శకం
సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణ హిత ఇంధన వనరుల (క్లీన్ ఎనర్జీ) వినియోగం దిశగా దేశం శరవేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే కాలంలో పూర్తిగా పునరుత్పాదక ఇంధన వనరులపైనే ఆధారపడేలా కేంద్రం ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా శనివారం ’ఇంధన వనరుల పరిణామ క్రమం’పేరిట విడుదల చేసిన ప్రత్యేక నివేదికలో దేశ ఇంధన రంగ ముఖచిత్రాన్ని సమగ్రంగా వివరించింది.సౌరవిద్యుత్ వెలుగులుసౌర విద్యుత్ను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ’పీఎం సూర్య ఘర్’పథకం అద్భుత ఫలితాలు సాధిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 23.9 లక్షల ఇళ్లలో రూఫ్టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏకంగా 7 గిగావాట్ల స్వచ్ఛమైన విద్యుత్ సామర్థ్యం అదనంగా సమకూరింది. ఈ పథకం వల్ల సామాన్యులకు కరెంటు బిల్లుల భారం తగ్గడంతో పాటు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోంది.పెట్టుబడుల వెల్లువక్లీన్ ఎనర్జీ రంగంలో వస్తున్న మార్పులతో దేశంలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. విద్యుత్ రంగంలో సరికొత్త సంస్కరణల కారణంగా సుమారు రూ. 8 లక్షల కోట్లకు పైగా భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ సఫలమైంది. పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు తగినట్లుగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తూనే, కాలుష్య రహిత ఇంధన రంగం వైపు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో ఈ పెట్టుబడులు కీలకంగా మారనున్నాయి.గ్రీన్ హైడ్రోజన్.. మిషన్ లైఫ్భవిష్యత్ ఇంధనంగా భావిస్తున్న గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటి పోర్ట్ ఆధారిత (ఓడరేవు) గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా ప్రారంభించింది. దీనితో పాటు నీతి ఆయోగ్, ఆర్థిక శాఖల సమన్వ యంతో ’మిషన్ లైఫ్’ద్వారా పర్యావరణ హిత జీవనశైలిని అలవర్చుకునేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. విద్యుత్ పొదుపు, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి చర్యలతో వాతావరణ మార్పులను అడ్డుకోవచ్చని ఆ నివేదిక స్పష్టం చేసింది. మొత్తమ్మీద బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరుల నుంచి కాలుష్య రహిత హరిత ఇంధనం వైపు భారత్ చేస్తున్న ప్రయాణం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే దిశగా ఇది ఒక చారిత్రక ముందడుగుగా అభివర్ణించింది.
యువతలో మానసిక అనారోగ్యం
సాక్షి, స్పెషల్ డెస్క్: కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ స్నాక్స్, ఇన్స్టంట్ నూడుల్స్, రెడీ టు ఈట్.. ఇలా చెప్పుకూంటూ పోతే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ జాబితా పెద్దగానే ఉంటుంది. యువతలో ఉత్పాదకత, భావోద్వేగ స్థిరత్వం తగ్గడానికి వీటి వినియోగం ప్రధాన కారణమని ఒక అధ్యయనంలో తేలింది. పని చేసే జనాభా ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాలకు ఇది ఆందోళన కలిగించే విషయం. గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ కింద వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సేపియన్ ల్యాబ్స్ విడుదల చేసిన గ్లోబల్ మైండ్ హెల్త్ 2025 నివేదిక ప్రకారం.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రభావం కేవలం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులకే పరిమితం కాలేదు. మానసిక, మేధోపరమైన పనితీరు తగ్గడానికి కూడా కారణమవుతున్నాయని కొత్త ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా 18–34 ఏళ్ల వయస్సు వారిలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యువతపైనే ప్రభావం.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగిస్తున్న 18–34 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో 41% మంది వైద్యపరంగా నిర్ధారించదగిన తీవ్రమైన మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారు. 55 ఏళ్లు పైబడిన వారితో పోలిస్తే రోజువారీ జీవితంలో ఉత్పాదకతతో పనిచేయడంలో తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయని నివేదించిన యువత దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. 2024–25 మధ్య 85 దేశాల్లో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రజల అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగ తీరుతెన్నులను పరిశీలించింది. 18–34 ఏళ్ల వయస్సు గలవారు 2,21,190 మంది, 55 ఏళ్లు పైబడిన వారు 3,00,522 మంది ఇందులో పాల్గొన్నారు. ప్రతికూలత పెంచుతోంది.. యువతలో ఎదురవుతున్న మొత్తం మానసిక అనారోగ్య సమస్యల్లో 15–30% వరకు కేవలం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ను తరచుగా తీసుకోవడం వల్లేనని అధ్యయనం అంచనా వేస్తోంది. ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రధానంగా కుంగుబాటు లక్షణాలతోపాటు, భావోద్వేగ, మేధోపరమైన నియంత్రణ కోల్పోయే సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించారు. వీటి వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల మెరుగైన మానసిక ఆరోగ్య ఫలితాలు కనిపిస్తున్నట్లు తేలింది. ప్రాసెస్ చేసిన ఆహారంలో వాడే రసాయన మిశ్రమాల సంఖ్య, క్లిష్టత దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగాయని, ఇది మన శరీరంపై చూపే ప్రతికూల ప్రభావాన్ని మరింత పెంచుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే.. తయారీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి అయిన ఆహార పదార్థాలు. వీటిలో కొవ్వు, చక్కెర, ఉప్పు పరిమాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సహజ ఆహార పోషకాలు చాలా తక్కువ. ఇవి సాధారణంగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల మిశ్రమంతో తయారవుతాయి. వీటిలో ఆహారాన్ని ఎక్కువ కాలం మన్నికగా ఉంచే ప్రిజర్వేటివ్స్; నూనె; నీటిని చిక్కటి, సమాన మిశ్రమంగా ఉంచే ఎమల్సిఫైయర్స్; తీపిని ఇచ్చే స్వీట్నర్స్; కృత్రిమ రంగులు, రుచులు ఉంటాయి. ఎవరెవరు ఎంత తింటున్నారు? » ప్రపంచవ్యాప్తంగా: ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న జనాభాలో 18–34 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 54% మంది వారంలో ఎక్కువ రోజులు లేదా ప్రతిరోజూ అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలను తీసుకుంటున్నారు. 55 ఏళ్లు పైబడిన వారిలో ఇటువంటివారు కేవలం 26% ఉన్నారు. » భారత్: యువతలో 44% మంది క్రమం తప్పకుండా ఈ ఫుడ్ను ఆస్వాదిస్తున్నారు. 55 ఏళ్లు పైబడిన వారిలో ఈ ఫుడ్ను ఆరగించేవారు 11% మాత్రమే. అలవాట్లను మార్చుకోగలిగితే.. భావోద్వేగ, మేధోపరమైన నియంత్రణ, మానసిక పటిమ.. ఇవి కేవలం వ్యక్తిగత శ్రేయస్సుకే కాకుండా పని ప్రదేశంలో ఉత్పాదకత, విస్తృత సామాజిక స్థిరత్వానికి పునాది వంటిది. ఇలాంటి సామర్థ్యాలను ఈ పుడ్ దెబ్బతీస్తోందని తాజా ఆధారాలు వెల్లడిస్తున్నాయి. అయితే యువతలో మానసిక ఆరోగ్యం క్షీణించడానికి దారితీస్తున్న పలు అంశాలను ఈ నివేదిక గుర్తించింది. వీటిలో చిన్న వయస్సులోనే స్మార్ట్ఫోన్ల వాడకం, బలహీనపడిన కుటుంబ బంధాలు, తగ్గుతున్న ఆధ్యాత్మికత, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార వినియోగం ప్రధానమైనవి. వీటన్నింటిలో ఆహారపు అలవాట్లను మార్చుకోగలిగిన, ప్రభుత్వ విధానాల ద్వారా నియంత్రించగలిగే అంశంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రత్యేకంగా నిలుస్తాయి.
ఎన్ఆర్ఐ
అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం
అమెరికాలోని సియాటిల్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన గ్రాడ్యుయేట్ జాహ్నవి కందులకుటుంబానికి భారీ పరిహారం లభించనుంది. జాహ్నవి మృతి చెందిన దాదాపు మూడేళ్ల తర్వాత, ఆమె కుటుంబానికి గణనీయమైన ఆర్థిక పరిహారం అందనుంది.ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిది ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోటి కలలతో సియాటెల్లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు 2021లో అమెరికాకు వెళ్లింది.కానీ 2023, జనవరి 23వ తేదీ రాత్రి ఒక మలుపు దగ్గర రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని, కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏముంది మామూలు మనిషేగా...11 వేల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మరిచిపోయాడు. అతని మాటలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.మరోవైపు సియాటిల్లో ప్రమాదం, తమ బిడ్డ మృతిపై జాహ్నవి కుటుంబం దావా వేసింది. ఈ సంఘటన తెలుగు, భారతీయ వర్గాల నుండి మాత్రమే కాకుండా, స్థానికులు కూడా ప్రజల ఆగ్రహాన్ని వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో భారీ పరిహారంతో ఈ కేసును పరిష్కరించు కుంది. సియాటిల్ నగరం దాదాపు రూ. 262 కోట్ల (28 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి ఎటువంటి నేరారోపణలు లేకుండా, 5000 డాలర్లు జరిమానా విధించారు. అలాగే విధుల నుండి గత ఏడాది సస్పెండ్ చేశారు. సియాటెల్ ప్రకటనకందుల మరణం "హృదయ విదారకం" అని సియాటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె నష్టం ఊహించలేని బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు మరియు మా సమాజానికి కూడా జాహ్నవి కందుల జీవితం చాలా ముఖ్యమైనదే అంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని నగరం ఆ శాభావాన్ని వ్యక్తం చేసింది. కందుల దుర్మరణం జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ (ICS)తో సహా న్యాయవాద సంఘాలు విస్తృత పోలీసు సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి. 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ పోలీసు అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరికాదని, స్పష్టమైన మార్గదర్శకాలను డిమాండ్ చేస్తున్నామని IACS లలితా ఉప్పల అన్నారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!
విదేశాలకు వెళ్లడం అక్కడే స్థిరపడటం చాలామంది డ్రీమ్. 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా విదేశాల్లోని అక్కడి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం రా..రమ్మని ఆకర్షిస్తుంటుంది. తీరా వెళ్లాక గానీ తెలియదు. అక్కడి సమస్యలు..పరిస్థితులు. ఇక్కడొక భారత మహిళకు కూడా అలా అనిపించే తక్షణమే భారత్కు కుటుంబంతో సహా వచ్చి వాలిపోయింది. ఎందువల్ల తాను ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కానీ ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపదగినవిగానూ విదేశాలకు చెక్కేద్దామనే ఔత్సాహుకులకు గొప్ప పాఠాలుగానూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎందవల్ల ఇలా కుటుంబంతో సహా ఆమె భారత్కు వచ్చేసిందో తెలుసా..!?..లీబా సుబిన్ అనే మహిళ కుటుంబం దుబాయ్ నుంచి భారత్లోని తన స్వస్థలం కేరళకు వచ్చేసింది. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఆమె కారణాన్ని వివరిస్తూ..ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా చేశానని అంటోంది. ఈ నిర్ణయాన్ని సమయా పాలన, మానసిక శాంతికి సంబంధించిన విషయంగా పేర్కొంది. అదీగాక తమ ఫ్యామిలీ వీసా రెన్యువల్, అలాగే ఇంటి అద్దె రెన్యువల్ చేయాల్సి ఉండగానే.. చకచక ఈ నిర్ణయం తీసుకుని వచ్చేసినట్లు తెలిపారు. అలాగని ఏదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదని, బాగా ఆలోచించి, తన భాగస్వామితో, పిల్లలతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇలా వెనక్కి వచ్చేసి కేరళలో తమ సొంతింటిలో నివశించడం వల్ల దుబాయ్లోని అద్దె టెన్షన్ తగ్గింది, అలాగే ఇక్కడి సమాజంలో నివశించడం వల్ల సామాజిక సంబంధాలు పునరుద్ధరింపబడతాయి. పైగా ఎలాంటి అప్పులు, ఈఎంఐల బెడద లేకుడా మానసిక ప్రశాంతతో గడపొచ్చు అని చెప్పుకొచ్చిందామె. పైగా పిల్లవాడికి కేరళలో అంతర్జాతీయ స్కూల్ ఇంటికి సమీపంలోనే ఉంది పదినిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ దుబాయ్లో 90 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుందని జోడించారామె. బహుశా మాకు అనిపించింది..మీకు వర్కౌట్ కాకపోవచ్చు, పైగా మీరు విదేశాల్లోనే కంఫర్ట్ లైఫ్ని లీడ్ చేస్తుండొచ్చని, అది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ..మొత్తం కుటుబ సభ్యులు కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అన్ని విధాల శ్రేయస్కరం అంటూ తన పోస్ట్ని ముగించింది లీబా సుబిన్. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయంతో ఏకభవించారు, పైగా తిరిగి వెళ్లకూదనుకుంటున్న ఆమె నిర్ణయానికి స్వాగతం, శుభాకాంక్షలు అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by leeba (@unfilteredvoiceswithinme) (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!
ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
అమెరికాలోని జార్జియాలో ఉండే భారతీయ అమెరికన్కి చేదు అనుభవం ఎదురైంది. చేయని నేరానికి ఆరు వారాల జైలు శిక్ష అనుభవించారు. కానీ విచారణలో కోర్టు ఈ కేసు కొట్టి వేసింది. దీంతో ఆయన న్యాయాపోరాటానికి సిద్ధపడ్డారు. జార్జియాలోని వాల్మార్ట్ స్టోర్లో ఒక చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడనే తప్పుడు ఆరోపణతో ఆరు వారాల పాటు జైలు శిక్ష అనుభవించిన భారతీయ అమెరికన్ 57 ఏళ్ల మహేంద్ర పటేల్ ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.జార్జియాలోని అక్వర్త్లోని వాల్మార్ట్లోతన కొడుకును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించా డని రెండేళ్ల బాలుడి తల్లి కరోలిన్ మిల్లర్ ఆరోపించింది. ఈ సంఘటనను వాల్మార్ట్ ఉద్యోగికి, తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 57 ఏళ్ల మహేంద్ర పటేల్ను 2025, మార్చి 24న అరెస్టు చేశారు. ఈ విషయంలో తనకి, పటేల్కి మధ్య బాబు కోసం "టగ్ ఆఫ్ వార్" జరిగిందని కూడా పేర్కొంది. అయితే తాను నిరపరాధి నని మొదటినుంచి గట్టిగా వాదించారు మహేంద్ర పటేల్. 2025 మార్చి 18న, తాను వాల్మార్ట్లో షాపింగ్ చేస్తున్నప్పుడు, టైలెనాల్ (టాబ్లెట్స్) ఎక్కడ ఉన్నాయోమిల్లర్ను దిశానిర్దేశం చేయమని అడిగానని పటేల్ చెప్పాడు. అప్పుడు ఆమె కొడుకు బ్యాలెన్స్ కోల్పోతున్నాడని గమనించి, అతను పడిపోకుండా ఉండటానికి చేయి చాచానని చెప్పుకొచ్చాడు.SHOCKING & SAD !! Mahendra Patel has filed a federal civil rights lawsuit after being jailed for 47 days over a Walmart incident.He was arrested after a shopper accused him of trying to kidnap her child. Police video later showed no force, no injury, and no kidnapping… pic.twitter.com/cRlPZfwvEH— M9 USA🇺🇸 (@M9USA_) February 11, 2026 తప్పుడు ఆరోపణల వల్ల పటేల్ 46 రోజుల పాటు కాబ్ కౌంటీ జైలులో గడపాల్సి వచ్చింది. ఆరు వారాల తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. చివరికి ఆగస్టు 2025లో జిల్లా అటార్నీ కార్యాలయం ఈ కేసును కొట్టివేసింది. రెండు పార్టీలు ఒక పరిష్కారానికి వచ్చాయని కోబ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ చెప్పింది.నిజం నిరూపించిన సీసీటీవీ ఫుటేజ్అతను బిడ్డను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించలేదని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిరూపితమైంది.పటేల్ చాలా ప్రశాంతంగా ఆమె పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లడం, ఆమె అతనికి 'థంబ్స్ అప్' చూపించడం స్పష్టంగా కనిపించింది. అలాగే మిల్లర్ చెప్పినట్లుగా అక్కడ ఎలాంటి పెనుగులాట జరగలేదు. ఇదీ చదవండి: రైల్లో శాండ్విచ్...నెటిజన్ల రియాక్షన్స్ వైరల్ వీడియో మానసిక వేదన, వ్యాపార నష్టం ఈ అనుభవాన్ని "పీడకల"గా అభివర్ణించారు. ఈ దారుణమైన అనుభవం తనను మానసికంగా కుంగ దీసిందనీ, ఆర్థికంగా దెబ్బతీసిందని పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. "టైలెనాల్ కోసం వెళ్తే, నా జీవితంలోనే అతిపెద్ద తలనొప్పి ఎదురైంది" అని ఆయన పేర్కొన్నారు. తన కుటుంబం కూడా నరకం చూసిందన్నారు. ఒకవేళ వాల్మార్ట్ వీడియో లేకపోయి ఉంటే. ఆమె మాట వర్సెస్ నా మాటగా మారింది. నేనిక జైల్లో మగ్గిపోవాల్సి వచ్చేదన్నారు. ఆ ఫుటేజ్అక్షరాలా తన ప్రాణాన్ని కాపాడిందన్నారు.సుమారు రూ. 210 కోట్లుతాను అనుభవించిన మానసిక క్షోభకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆయన దావా వేశారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన ఆక్వర్త్ నగరంపై, తప్పుడు ఫిర్యాదు చేసిన మిల్లర్పై , పోలీసులపై 25 మిలియన్ల డాలర్లు ( సుమారు (రూ.210 కోట్లు) నష్టపరిహారం కోరుతూ ఆయన దావా వేశారు.ఇదీ చదవండి: ఇండియన్ ఫోటోగ్రాఫర్కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతంసీసీటీవీ ఫుటేజ్లో ఎలాంటి తప్పు కనిపించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం అధికార దుర్వినియోగమేనని పటేల్ తరపు న్యాయవాది మార్క్ గ్రాస్మన్ అన్నారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియో
టీడీపీది రాక్షసానందం.. జగనన్న మాకు ధైర్యం చెప్పారు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల దాడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శ్రీజ.. జగనన్న తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని.. మా తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ‘‘టీడీపీ వాళ్లు మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. కానీ నిన్న వేలమంది అభిమానంతో మా ఇంటికి వచ్చారు. మా నాన్న చెప్పినట్టే మాకు అండగా వెంకటేశ్వరస్వామి ఉన్నారు’’ అని శ్రీజ పేర్కొన్నారు.‘‘దేవుడి అండ ఉన్నంతవరకు మాపై వేసే ప్రతీ రాయి పువ్వుగా మారుతుంది. ఆయనే మాకు ఓ రక్షణ కవచంలా ఉంటారు. మా ఇంటిపై అత్యంత దారుణంగా అటాక్ చేశారు. 9 గంటల పాటు తండోపతండాలుగా జనం దాడి చేశారు. ఉదయం గుడికి వెళ్లిన నాన్నపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేశారు. టీడీపీ మహిళలు బూతులతో ఆయనను తిట్టారు. ఆ సమయంలోనే మా నాన్న అలా మాట్లాడారు. దానికి ఆయన రియలైజ్ అయ్యి ఆ మాట అనకూడదన్నారు. లీగల్గా ఎదుర్కొంటానని కూడా చెప్పారు..కానీ మా ఇంట్లో ఆడవాళ్లని దారుణంగా తిడుతూ అటాక్ చేశారు. కాపు కులంకి బూతులు జోడించి తిట్టారు. ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి దీనిని నడిపించడం దారుణం. ఆయన మేథస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోంది. అంబటి రాంబాబుని నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం దారుణం. ఆయనను వేధించి రాక్షసానందం పొందారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలుసుకొవాలి. దాడి చేసిన దానికంటే.. నాలుగు రెట్ల జనం అభిమానంతో వచ్చారు’’ అని శ్రీజ చెప్పారు.
క్రైమ్
ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం
భువనేశ్వర్ : ఒడిశాలో 23 ఏళ్ల మహిళ హత్యాచార ఘటన కలకలం రేపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు ఆమెపై అత్యాచారం చేసి వదిలేశాడు. ఆ తరువాత సాయం చేస్తానని చెప్పి నమ్మించిన మరో అగంతకుడు ఆమెను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా తీవ్ర ఆందోళన రేపిన హృదయవిదారకమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పోలీసుల సమాచారం ప్రకారం గుడిలో పెళ్లి చేసుకుందామని బాధితురాల్ని ప్రియుడు నమ్మించాడు. దీంతో ఫిబ్రవరి 22న ఆ మహిళ తన ఇంటి నుండి పారిపోయింది. అయితే ప్రియుడు ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, అత్యాచారం చేసి రహమా బస్ స్టాండ్లో వదిలేశాడు. ఒంటరిగా ఉన్న ఆమెను చూసి జార్ఖండ్కు చెందిన మరో వ్యక్తి గమనించాడు. ఆమె బలహీనతను ఆసరాగా తీసుకొని సాయం చేస్తానని నమ్మించి ఆమెను పారదీప్ పట్టణంలోని అద్దెకు తీసుకున్న వసతి గృహానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. చివరికి బాధిత మహిళను నాలుగు అంతస్తుల భవనం పైకప్పు నుండి తోసేశాడు. ఆ మహిళ మృతదేహాన్ని మరుసటి రోజు ఉదయం గుర్తించామని జగత్సింగ్పూర్ పోలీసు సూపరింటెండెంట్ అంకిత్ కుమార్ వర్మ తెలిపారు. బాధితురాలి సోదరుడు ఫిబ్రవరి 25న పారదీప్ మోడల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: Liquor Policy: కేజ్రీవాల్కు క్లీన్ చిట్, అన్నా హజారే కీలక వ్యాఖ్యలుబిజు జనతాదళ్ (BJD) అధినేత మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దీనిపై తీవ్రంగా స్పందించారు. మైనర్లు, వికలాంగుల సహా ఎవరికీ రాష్ట్రంలో రక్షణ లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇంకా ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోతాయని ప్రశ్నించారు. పట్టపగలు కూడా భయానక వాతావరణం నెలకొంది. ఇటువంటి దారుణాలు పదేపదే జరుగుతున్నా కనీస చర్యలు లేవనీ, అసలు రాష్ట్రంలో పాలన ఉందా అని ఆయన మండిపడ్డారు. అంగుల్లోని కనిహాన్, సంబల్పూర్లోని కుచిండా , పారాదీప్ ప్రాంతాల నుండి వస్తున్న దుశ్చర్యల వార్తలు కలవరపెడుతున్నాయన్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: కాకినాడ: వేట్లపాలెంలో భారీ పేలుడు..18 మంది సజీవ దహనం
వికారాబాద్లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
వికారాబాద్ జిల్లా: వికారాబాద్లో విషాదం నెలకొంది. పట్టణంలోని గంగారాం సాయి బాబా కాలనీలో మహిళా కానిస్టేబుల్ బలిజ దివ్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం.. దివ్య గత ఐదేళ్లుగా ధారూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.దివ్య మృతదేహం వద్ద పోలీసులు ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ” ప్రియమైన అమ్మ, నా కుటుంబసభ్యులు నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి. నా చావుకు ఎవరు కారణం కాదు. మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేక ఈ రాంగ్ స్టెప్ తీసుకుంటున్నా. అమ్మా.. నీకు నేను భారం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా. నాన్న ఉంటే బాగుండే అమ్మ. నాన్న లేనందుకే నీకు ఇన్ని కష్టాలు. నన్ను క్షమించు అమ్మా” అని అందులో రాసి ఉంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దివ్య ఆత్మహత్యకు గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది.
నిలదీసిన భర్తను నరమేధం చేసిన ప్రియుడు..!
తూర్పు గోదావరి జిల్లా: పెళ్లి బంధం ఎగతాళి అయ్యింది.. భార్య అక్రమ సంబంధానికి మూడుముళ్లు వేసిన భర్తే బలైపోవాల్సి వచ్చింది.. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో నిలదీసిన భర్తను, ప్రియుడు దారుణంగా హత్యచేసిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. రంగంపేట మండలం పెద్ద దొడ్డిగుంటకు చెందిన బక్కా నాగేంద్ర (32) భార్య వీరలక్ష్మితో రంగంపేట మండలం నల్లమిల్లికి చెందిన తోరాటి శివ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై నాగేంద్ర, వీరలక్ష్మి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి తన భార్య వీరలక్ష్మితో కలసి శివ ఉండటాన్ని నాగేంద్ర చూశాడు. ఆగ్రహానికి గురైన నాగేంద్ర.. శివను నిలదీయడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరిగి గొడవ పడుతూ పక్కనే ఉన్న పంట బోదె వరకూ వచ్చేశారు. ఈ నేపథ్యంలో శివ బలమైన ఆయుధంతో నాగేంద్రపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నాగేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య అనంతరం కొద్దిపాటి గాయాలైన శివ కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా నాగేంద్ర మరణం వెనుక భార్య వీరలక్ష్మి, అత్త హస్తం కూడా ఉందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అనపర్తి సీఐ సుమంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ హత్యపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి భార్య పాత్రపై వస్తున్న ఆరోపణలను కూడా విచారిస్తున్నామని సీఐ తెలిపారు. నిందితులకు తగిన శిక్ష పడేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుని కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు.ఎన్నడూ లేని విధంగా హత్యలు, దాడులు : మాజీ ఎమ్మెల్యేపెద్ద దొడ్డిగుంట గ్రామంలో హత్య జరిగిన ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సందర్శించి, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిచిన క్షణం నుంచే హత్యలు, దాడులు, మానభంగాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. ఇటీవల పందలపాక, రంగాపురంలలో మహిళల హత్య, అదే గ్రామంలో బాలికపై అత్యాచారయత్నం, ఇప్పుడు దొడ్డిగుంటలో హత్య.. ఇవన్నీ కూటమి పాలన వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనాలు అని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండ ఉందన్న ధైర్యం పెరిగిందని, నేరస్తులకు స్టేషన్ బెయిల్లు, బాధితులకు శిక్షలు పడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. నిందితుడు తోరాటి శివను, అతని బైకును రంగంపేట పోలీస్ స్టేషన్కు హత్యకు గురైన బక్క నాగేంద్ర అప్పగించినప్పటికీ, ఎస్సై కేసు నమోదు చేయకుండా అతనిని విడిచిపెట్టారని, అదే నిర్లక్ష్యం ఈ రోజు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని అని సూర్యనారాయణరెడ్డి అన్నారు. బిక్కవోలు, రంగంపేట మండలాల ఎస్సైలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏరికోరి తెచ్చుకున్నారని అన్నారు. బాధితులపై అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంపేట ఎస్సై శివప్రసాద్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనపర్తి నియోజకవర్గంలో నేరస్తులకు రాజకీయ అండ, పోలీసుల నిర్లక్ష్యం పెరిగి, ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని అన్నారు.ఎస్సైపై చర్యలకు డిమాండ్వివాహేతర సంబంధంపై ఈ నెల 6న రంగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మృతుడి నాగేంద్ర తండ్రి బక్కా వెంకటేశులు, తల్లి లక్ష్మి, చిన్నాన్న బక్కా వీర్రాజు, చిన్నమ్మ మంగ, సోదరుడు వీరబాబు తెలిపారు. ఫిర్యాదు చేయడంతో పాటు అక్రమ సంబంధం నడుపుతున్న తోరాటి శివకు సంబంధించిన బైక్ను కూడా పోలీస్ స్టేషన్లో అప్పగించి న్యాయం చేయమని ఎస్సై శివప్రసాద్ను వేడుకున్నామన్నారు. అయినా ఎస్సై పట్టించుకోలేదని, నిందితుడు శివ వద్ద లంచం తీసుకుని తాము అప్పగించిన బైక్ను కూడా ఇచ్చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో మరింత రెచ్చిపోయిన శివ విచ్చలవిడిగా వీరలక్ష్మి వద్దకు వచ్చేవాడని, తాము ఫిర్యాదు చేసినప్పుడే శివపై చర్యలు తీసుకుని ఉంటే తమ బిడ్డ బతికి ఉండేవాడని వాపోయారు. సంఘటనా స్థలం వద్దకు వచ్చిన సీఐ సుమంత్, డీఎస్పీ విద్య వద్ద కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసి ఎస్సై శివప్రసాద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని వారికి సీఐ, డీఎస్పీ హామీ ఇచ్చారు.
ఆర్టీసీ బస్సు–లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట జాతీయ రహదారి 65పై బైపాస్ రోడ్డులోని మూలమలుపు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జహీరాబాద్ నుంచి సదాశివపేట బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సదాశివపేట నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్లలో సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వీడియోలు
ఇరాన్ ప్రతీకార దాడులు.. దుబాయ్ ఎయిర్ పోర్ట్ ధ్వంసం
ఖమేనీ నివాసంపై 30 బాంబులు 1500KM నుండి వేసేసిన ఇజ్రాయెల్..
భయం భయంగా ఉంది.. దుబాయ్ లో తాజా పరిస్థితిపై PV సింధు వీడియో
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దెబ్బ.. మంటల్లో ఆయిల్ ట్యాంకర్లు
అంబటి రాంబాబు హీరో.. లోకేష్.. గుర్తుపెట్టుకో.. పిచ్చిపిచ్చి వేషాలేస్తే..
అమెరికా.. ఇజ్రాయెల్ దాడులు.. ఒంటరిగా వణికిస్తున్న ఇరాన్
ఇరాన్ రివర్స్ ఎటాక్ అమెరికా ఊహించని దెబ్బ
కిచెన్ లో కౌగిలింతలు అడ్డంగా దొరికిన BR నాయుడు
దుబాయ్ లో హైటెన్షన్ బుర్జ్ ఖలీఫాపై ఇరాన్ దాడి
చీకటి శకం ముగిసింది ఇరాన్ వీధుల్లో సంబరాలు

