‘కాంగ్రెస్తో చంద్రబాబు హాట్ రాజకీయాలు చేస్తున్నారు’
తాడేపల్లి: మోసపూరిత రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నెంబర్ వన్ అని విమర్శించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. బహిరంగంగా బీజేపీతో ఉంటూ తెరచాటున కాంగ్రెస్తో ఉంటున్నారని అంబటి విమర్శించారు. కాంగ్రెస్తో చంద్రబాబు హాట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు అంబటి. ఈరోజు(శుక్రవారం, మే 29వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. బీజేపీని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ సీఎం ఆవిష్కరించడం సిగ్గుచేటు. కాంగ్రెస్ సీఎంకి టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీలో చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ బీ టీమ్. తెలంగాణలో కాంగ్రెస్కు టీడీపీ బీ టీమ్. ఇలాంటి అనైతిక రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. చంద్రబాబు వైఖరిని బీజేపీ బాగా అబ్జర్వ్ చేస్తుంది. రాజ్యసభలో బీజేపీకి సీటు ఇవ్వనని చంద్రబాబు అనటం అందుకు సంకేతం. చీరలిచ్చి మహిళలను మహానాడుకు తీసుకెళ్లారు. డబ్బులిచ్చి జనాన్ని తీసుకెళ్లారంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహానాడులో చంద్రబాబును 25%, లోకేష్ ను 75% పొగిడారు. మెగా డీఎస్సీ పేరుతో పోస్టులు అమ్ముకున్న వ్యక్తి నారా లోకేష్. అసలు టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ను వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారు. తర్వాత ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, నారా రామ్మూర్తి నాయుడుని కూడా రాజకీయాల కోసం వాడుకున్న నీచ చరిత్ర చంద్రబాబుది. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణలను కూడా తొక్కేసిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇంతకుమించిన వెన్నుపోటుదారుడు ఇంకెవరైనా ఉన్నారా?, అలాంటి వ్యక్తికి జగన్ మీద విమర్శలు చేసే అర్హత లేదు. అప్పట్లో మోదీని దూషించి ఇప్పుడు వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు. కేఎన్నార్ మీద ఎల్లోమీడియా నీచపు రాతలు రాస్తోంది. చంద్రబాబు ఆస్తి రెండు ఎకరాల నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించారు?, సైకిల్ మీద తిరిగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడవి?, పచ్చళ్లు అమ్ముకునే రామోజీ, కిరణ్ లకు ఇప్పుడు వేల కోట్ల ఆస్తి ఎలా వచ్చింది?, వైఎస్ఆర్ సీపీని తొక్కేయటం ఎవరితరం కాదు. మా ఇంటి మీద దాడి, విధ్వంసం చేసిన వారిని ఇప్పటికీ ఎందుకు అరెస్టు చేయలేదు?, త్వరలోనే మళ్ళీ నా పోరాటం ప్రారంభిస్తా. మా ఇంటి నుంచి డీజీపీ ఆఫీసు వరకు ర్యాలీగా వస్తా. 29 కిలోమీటర్లు 'వినతి పాదయాత్ర' చేస్తా’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో తొలి విడత రూ. 2,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన రూ.4000 కోట్లు కూడా త్వరలోనే జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ (GPF) బకాయిలు 100 శాతం ప్రభుత్వం క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఇలాంటి గిఫ్ట్ పొందాలంటే అదృష్టం ఉండాలేమో! వైరల్ వీడియో
ఆధునిక పెళ్లిళ్లలో భారీ ఆర్భాటాలు, ధగధగలాడే నగలు, బరువైన పట్టుచీరలు, భారీ విందులే కాదు గిఫ్ట్, రిటన్ గిఫ్ట్లు చాలా ముఖ్యం. ఆత్మీయతలు, అనురాగాలు, పలకరింపులుకంటే.. వచ్చామా.. తిన్నామా.. ఫోటో తీయించుకున్నామా. అన్నట్టే ఉంటాయి సాధారణంగా. కానీ అస్సాంలో ఒక పెళ్లిలో చోటు చేసుకున్న ఘటన నెట్టింట అందర్నీ విశేషంగా ఆకర్షిస్తోంది.అస్సాంలో ఒక మానసిక వికలాంగుడు ఆహ్వానం లేకుండా ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. అతను నిశ్శబ్దంగా అతిథులతో కలిసి భోజనం చేశాడు,ఎవరూ అతన్ని ప్రశ్నించలేదు కూడా. అబ్బా.. పెళ్లి వారు ఎంత దయ గలవారు అనుకుంటున్నారా.. ఆగండి ఆగండి. ఇక్కడే మిమ్మల్ని ఆశ్చర్యపర్చే విషయం ఒకటి ఉంది.పెళ్లివారి కంటే తానే గొప్పవాడిని అని నిరూపించుకున్నాడు. ఎలా అంటారా? ఇదీ చదవండి: ఒక్కసారిగా పేలిన ఏసీ : మాజీ ఐఏఎస్ అధికారి దుర్మరణంతన కడుపునిండింది కదా, ఆకలి తీరింది కదా అని కామ్ గా అక్కడినుంచి వెళ్లిపోలేదు అతగాడు. వెళ్లే ముందు తన చిరిగిన జేబులోంచి రూ.10 లు తీసి వదువుకి కానుకగా అక్కడున్న వారికి అందించాడు. ఈ దృశ్యం చాలా హృద్యంగా నిలిచింది. ఈ హార్ట్ టచింగ్ వీడియో ఆన్లైన్లో వేలాది మందిని కదిలించింది. దయ,మానవత్వంతో కూడిన మనిషి అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఎంత ఇచ్చామన్నది కాదు.. ఎంత ప్రేమగా మనస్ఫూర్తిగా ఇచ్చారనేదే ముఖ్యం అంటున్నారు. బహుశా తన జేబులో 10 రూపాయలే ఉండి ఉంటాయ్ అని మరికొందరు కామెంట్చేశారు.எதுவும் இல்லாமல்… இதயமெல்லாம் கொடுத்தார் Assam திருமணத்தில், தன்னிடம் அதிகம் இல்லாவிட்டாலும் ₹10 கொடுத்து வாழ்த்திய விருந்தினரின் gesture இணையத்தில் அனைவரின் மனதையும் கவர்ந்துள்ளது பணத்தின் அளவு இல்லை… மனத்தின் அன்புதான் முக்கியம் pic.twitter.com/3W19ynUTrp— Rajini (@rajini198080) May 28, 2026 ఇదీ చదవండి: ఈ వెహికల్ తెచ్చిన లక్ : నెలకు రూ. 45 వేలు
ఎనిమిది దశాబ్దాలు, ఒక దుకాణం: వైరల్గా 94 ఏళ్ల వ్యాపారి కథ!
నేటి ఉరుకులు పరుగుల జీవితాల్లో నిజాయితీ, దయ, నిరాడంబరత అన్నవి అరుదైనవిగా మారిపోతున్నాయి. ఎంతసేపు పెద్ద అవకాశాలు, క్షణాల్లో విజయం, తక్షణ సంతృప్తి తదితరాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. రోజువారీ జీవితంలో ఉండాల్సిన కరుణ, సహనం, వినయం, మానవ సంబధాలు ప్రాముఖ్యతను విస్మరిస్తున్నారో లేక మర్చిపోతున్నారో తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఇంకా కొద్దరు ఆ విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా ఆచరిస్తూ అర్థవంతంగా, స్ఫూర్తిగా బతుకుతున్నవారు కూడా ఉన్నారు. ఈ 94 ఏళ్ల తాతగారు ఆ కోవకు చెందిన వ్యక్తే. అతడితో మాటలు కలిపితే మనసుకు హత్తుకునే ఎన్నో తియ్యటి జీవిత పాఠాలు తెలుసుకోవచ్చట. ఆ తాతగారితో కాసేపు సరదాగా సంభాషించిన వీడియోని కోల్కతాకు చెందిన డిజిటల్ క్రియేటర్ ఆరాధన ఛటర్జీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. వీడియోలో కనిపిస్తున్న తాతగారి పేరు సాదిక్పాల్. ఆయన ముంబైలోని ఖార్ రైల్వే స్టేషన్ ఎదురుగా 80 ఏళ్లకు పైగా చెరుకురసం దుకాణాన్ని నడుపుతున్నారట. అది ఆయన తండ్రి ప్రారంభించిన దుకాణమట. ఆ తర్వాత ఆయన దాన్ని మరింతగా అభివృద్ధి చేశారట. ప్రస్తుతం ఆ తాత గారు , ఆయన కుమారుడు ఆ దుకాణాన్ని నడుపుతున్నారు. ఆయన ఆ దుకాణ్నా నడిపేటప్పటికీ రెండో తరగతి చదువుతున్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ వ్యాపంలో తన అపార అనుభవాన్ని వివరిస్తూ.. ఎన్నో జీవిత సంఘటనల తోపాటు గొప్ప జీవిత పాఠాలను కూడా చెప్పుకొచ్చారట. ఆయన దృఢ సంకల్పంతో ఉండటం, ధైర్యంగా ఉండటం, కష్టపడి పనిచయడం వంటి ప్రాముఖ్యతలు గురించి నొక్కి చెప్పారు. అలాగే నిజాయితీగా, సద్గుణవంతుడిగా ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు అందుకోగలమో కళ్లకు కట్టినట్లు వివరించాడు. ఎవ్వరూ మిమ్మల్ని, మీ నిజాయితీని గుర్తించకపోయినా..మోసం చేసినా సరే..ఎవ్వరినీ వంచించొద్దు అని అమూల్యమైన సలహా ఇచ్చారు. నిజానికి ఆ క్షణంలో మన నిజాయితీ, ఆత్మవిశ్వాసాన్ని గుర్తించి గౌరవించకపోవచ్చేమో గానీ, ఎప్పటికీ మాత్రం కాదని అంటున్నాడు. మన లక్ష్యాలను సాధించడానికి, కలలను నెరవేర్చుకోవడానికి ఒకే ఒక్క మార్గం కష్టపడటం అని, అందరూ మంచిగా కష్టపడి ప్రయోజకులుగా మారండని కోరుతూ తన సంభాషణను ముగించాడు వృద్ధుడు సాదికపాల్. ఈ వీడియో నెటిజన్ల మనసులను గెలుచుకోవడమే గాక, ఆయన సలహా అద్భతంగా ఉందని ప్రశంసించారు. అలాగే ఆయనకున్న అభిరుచి, విలువలు నిజంగా ప్రశంసనీయం అంటూ పొగడ్తల జల్లు కురిపించారు. (చదవండి: ఒకే ఒక్కడు' సాధించిన ఘనత! జస్ట్ ఒక్కరోజులో..)
బిగ్ ప్లాన్.. సిద్ధరామయ్య కొత్త మెలిక
మరో ఓటీటీకి మార్క్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
‘కాంగ్రెస్తో చంద్రబాబు హాట్ రాజకీయాలు చేస్తున్నారు’
వైభవ్కు కళ్లు చెదిరే ఆఫర్.. కోహ్లీకి పోటీగా!
రిలయన్స్ ఫౌండేషన్ సేవ.. కోట్లాది జీవితాల్లో మార్పు!
రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ లైవ్ అప్డేట్స్
టాలీవుడ్ హీరో నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్
తెలంగాణ కేబినెట్లో భారీ మార్పులు.. ముహూర్తం ఫిక్స్!
సింగపూర్ ఓపెన్ నుంచి పీవీ సింధు అవుట్
ప్రముఖ సినీ జంట గుడ్ న్యూస్.. పెళ్లైన నాలుగేళ్లకు..!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ నగదు పట్టివేత
విజయ్ సర్కార్ ఎఫెక్ట్.. 162 మంది న్యాయవాదుల రాజీనామా
అక్కగా సీఎం విజయ్ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్
వైభవ్ బాధ్యత వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీలక వ్యాఖ్యలు
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం
నీటి ఎద్దడి నివారణలో విఫలమైన బాబు సర్కార్
ఓ కూతురు హీరోయిన్.. మరో కూతురు నిర్మాత
మన కన్నా, మన పార్టీకన్నా జగన్ గురించే ఎక్కువ మాట్లాడుకున్నామేమోననిపిస్తుంది సార్!
అన్నాడీఎంకే సంక్షోభంలో కీలక మలుపు
కోర్టు చెబితే ఇచ్చేయాలా?
కర్ణాటక కాబోయే సీఎం.. కుటుంబం గురించి తెలుసా?
ఎప్స్టెయిన్ సెక్స్స్కాండల్.. స్టాన్ఫోర్డ్ హిస్టరీ! ఇక్కడ డీఎస్సీ స్కాండల్ మిస్టరీ! ఔను సార్ అదే మీ బ్యాచ్!
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు.. నూతన ఉద్యోగలాభం
సౌదీ కొత్త వ్యూహం.. ప్రపంచానికే బిగ్ అలర్ట్
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 16 సినిమాలు
పాతిక వేల సాయం.. ఇప్పుడు దాని విలువ రూ.5 కోట్లు
కూటమిపై ఆధారపడడం ఇష్టం లేకనే ప్లాన్ బీ?
ఈ రాశి వారికి మిత్రుల నుంచి దనలబ్ధి
'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్
బిగ్ ప్లాన్.. సిద్ధరామయ్య కొత్త మెలిక
మరో ఓటీటీకి మార్క్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
‘కాంగ్రెస్తో చంద్రబాబు హాట్ రాజకీయాలు చేస్తున్నారు’
వైభవ్కు కళ్లు చెదిరే ఆఫర్.. కోహ్లీకి పోటీగా!
రిలయన్స్ ఫౌండేషన్ సేవ.. కోట్లాది జీవితాల్లో మార్పు!
రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ లైవ్ అప్డేట్స్
టాలీవుడ్ హీరో నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్
తెలంగాణ కేబినెట్లో భారీ మార్పులు.. ముహూర్తం ఫిక్స్!
సింగపూర్ ఓపెన్ నుంచి పీవీ సింధు అవుట్
ప్రముఖ సినీ జంట గుడ్ న్యూస్.. పెళ్లైన నాలుగేళ్లకు..!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ నగదు పట్టివేత
విజయ్ సర్కార్ ఎఫెక్ట్.. 162 మంది న్యాయవాదుల రాజీనామా
అక్కగా సీఎం విజయ్ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్
వైభవ్ బాధ్యత వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీలక వ్యాఖ్యలు
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం
నీటి ఎద్దడి నివారణలో విఫలమైన బాబు సర్కార్
ఓ కూతురు హీరోయిన్.. మరో కూతురు నిర్మాత
మన కన్నా, మన పార్టీకన్నా జగన్ గురించే ఎక్కువ మాట్లాడుకున్నామేమోననిపిస్తుంది సార్!
అన్నాడీఎంకే సంక్షోభంలో కీలక మలుపు
కోర్టు చెబితే ఇచ్చేయాలా?
కర్ణాటక కాబోయే సీఎం.. కుటుంబం గురించి తెలుసా?
ఎప్స్టెయిన్ సెక్స్స్కాండల్.. స్టాన్ఫోర్డ్ హిస్టరీ! ఇక్కడ డీఎస్సీ స్కాండల్ మిస్టరీ! ఔను సార్ అదే మీ బ్యాచ్!
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు.. నూతన ఉద్యోగలాభం
సౌదీ కొత్త వ్యూహం.. ప్రపంచానికే బిగ్ అలర్ట్
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 16 సినిమాలు
పాతిక వేల సాయం.. ఇప్పుడు దాని విలువ రూ.5 కోట్లు
కూటమిపై ఆధారపడడం ఇష్టం లేకనే ప్లాన్ బీ?
ఈ రాశి వారికి మిత్రుల నుంచి దనలబ్ధి
'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్
ఫొటోలు
ఫ్యామిలీ ట్రిప్లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)
టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ (ఫొటోలు)
ఎన్టీఆర్ పార్టీకి ఇదేం దుస్థితి? (చిత్రాలు)
పూల చీరలో రాశీసింగ్ మరింత అందంగా (ఫొటోలు)
అతిలోక సుందరిలా ఆషిక రంగనాథ్ (ఫొటోలు)
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ HD స్టిల్స్
సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)
తిరుపతి: వైభవంగా నారాయణవనం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
రష్మిక జపాన్ ట్రిప్.. యానిమే అవార్డ్ వేడుకలో ఇలా (ఫొటోలు)
సినిమా
అమ్మకు క్యాన్సర్ వస్తే జ్వరం అనుకున్నా.. నాన్న బుర్ర చెడిపోయింది
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో నటిగా మారి తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన తేజస్వి మదివాడ.. తర్వాత ఆర్జీవీ తీసిన 'ఐస్క్రీమ్'లో హీరోయిన్గా చేసింది. తెలుగు బిగ్బాస్ షోలోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పెద్దగా మూవీస్ చేయట్లేదు. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. తన చిన్నతనం ఎంత దారుణంగా ఉండేది అనే విషయాల్ని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: సనాతన ధర్మం ఓ మతం కాదు.. ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్)'మా అమ్మనాన్న ఎప్పుడు పెళ్లిచేసుకోలేదు. నాన్న కాలేజీలో, అమ్మ స్కూల్లో ఉన్నప్పుడు కిరికిరి పనిచేశారు. దీంతో అమ్మ ప్రెగ్నెంట్ అయింది. అప్పటికే మా నాన్న.. ఆర్మీలో జాయిన్ అయిపోయారు. దీంతో ఇంటి నుంచి బయటకొచ్చేసిన అమ్మ.. బిహార్లో ఉన్న నాన్న దగ్గరకు వెళ్లిపోయింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకో లేదంటే చనిపోతానని భయపెట్టింది. దీంతో దగ్గరలోని ఓ గుడికి వెళ్లారు. కలిసుండాలని నిర్ణయించుకున్నారు. కానీ పెళ్లి చేసుకోలేదు. నాకంటే ఐదేళ్ల పెద్దోడైన అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య తర్వాత ముగ్గురు బిడ్డలు చనిపోయారు. తర్వాత ఆమె గర్భంతో ఉన్నప్పుడు 7 నెలలకే నేను పుట్టేశాను''నేను మూడు నాలుగేళ్లన్నప్పుడు మేం సింగరేణిలో ఉన్నాం. అక్కడి నుంచి హైదరాబాద్ రావడం నాకు గుర్తుంది. బీహెచ్ఈఎల్లో చదువుకున్నాను. నేను స్కూల్ చదువుతున్న టైంలో అమ్మకు క్యాన్సర్ వచ్చింది. అబార్షన్స్ వల్ల ఆమె శరీరంలో పాలు ఉండిపోవడంతో రొమ్ము క్యాన్సర్ వచ్చింది. నాలుగో స్టేజీలో ఉన్నప్పుడు ఈ వ్యాధి గురించి మాకు తెలిసింది. ఇదంతా నాకు ఆరేడేళ్లు ఉన్నప్పుడు జరిగింది. క్యాన్సర్ గురించి చిన్నపిల్లలకు ఏం తెలుస్తుంది. నేను అది జ్వరం అనుకున్నా. చావు చూసేంతవరకు ఎవరికైనా దాని గురించి తెలియదు. నాకు పదకొండేళ్లు ఉన్నప్పుడు ఓ రోజు అమ్మ చనిపోయింది. దీంతో అప్పటినుంచి నా జీవితం సీరియస్ అయిపోయింది''నేను ఇప్పుడేం ఇండిపెండెంట్ అవ్వలేదు. చిన్నప్పటి నుంచి ఇలానే పెరిగాను. అయితే మా నాన్న బుర్ర చెడిపోయింది. మరి అమ్మ చనిపోవడం వల్లో ఏమో గానీ తాగుడుకు బానిస అయిపోయాడు. దీంతో ఇంట్లో నా పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో నాన్నని చూడటానికే భయపడి బెదిరిపోయేదాన్ని. 18 ఏళ్లొస్తే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నాకు పన్నెండుపదమూడేళ్లు ఉన్నప్పుడే డిసైడ్ అయ్యాను. ఇదంతా నాకు నేను చెప్పుకొనేదాన్ని. అలా ఎదురుచూసి 18 ఏళ్లు పూర్తవగానే ఇంటినుంచి బయటకొచ్చేశాను. ఇవన్నీ క్యాజువల్గా చెబుతున్నాను గానీ నా జీవితంలో చాలా బాధాకరమైన విషయాలు ఇవి''ఇంటినుంచి బయటకొచ్చేసిన తర్వాత రెండున్నరేళ్లు అనాథశ్రమంలో పెరిగాను. ఆ టైంలో నాకు తిండి పెట్టడంతో పాటు చదువుకు అయ్యే ఖర్చంతా వాళ్లు భరించారు. దీంతో డ్యాన్స్ టీచర్గా మారి డబ్బులు సంపాదించి నా కోసం ఖర్చు పెట్టినదంతా ఇచ్చాను. తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో అవకాశం వచ్చింది. తర్వాత సమంత పరిచయమైంది. అలా యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. చాలా చిన్నప్పుడే పెద్ద బాధ్యతలు మోయడం వల్ల ఇప్పుడు చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నాను' అని తేజస్వి మదివాడ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: స్టైల్ మార్చిన సీఎం విజయ్.. నిర్మాత ఇంటి వేడుకలో)
3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఈ వారం చాలానే సినిమాలు వచ్చాయి. ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్తో పాటు హాలీవుడ్ హారర్ మూవీ 'ద మమ్మీ' అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు వీటికి తోడుగా ఇదే నెలలో రిలీజైన తెలుగు మూవీ కూడా సైలెంట్గా స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హరర్ సినిమా.. తెలుగులోనూ)'మేమ్ ఫేమస్' సినిమాతో హీరో, దర్శకుడిగా ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్.. చాన్నాళ్లు గ్యాప్ తీసుకుని చేసిన మూవీ 'గోదారి గట్టుపైన'. నిధి ప్రదీప్ హీరోయిన్ కాగా 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసిన సుభాష్ చంద్ర.. ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. జగపతిబాబు, లైలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈనెల 08న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక ఫ్లాప్ అయింది. ఇప్పుడిది ఎలాంటి హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'గోదారి గట్టుపైన' విషయానికొస్తే.. రాజు (సుమంత్ ప్రభాస్) ఆటో డ్రైవర్. పదో తరగతి మధ్యలోనే ఆపేసి కుటుంబం, ఫ్రెండ్స్తో హ్యాపీగా బతికేస్తుంటాడు. తన చెల్లితో ఇంజినీరింగ్ చదువుతున్న మాయ(నిధి ప్రదీప్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా రాజుని ప్రేమిస్తుంది. మరోవైపు తన కూతురు మాయ అంటే శ్యాంబాబు(జగపతిబాబు)కి ప్రాణం. సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే ఈయన తన కూతురుకి తనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడితోనే పెళ్లి జరిపిస్తానని చెబుతుంటాడు. మరి ఇంజినీరింగ్ చదువుతున్న కూతురు ఓ ఆటోడ్రైవర్ని ప్రేమించిందని తెలిశాక శ్యాంబాబు ఏం చేశాడు? కూతురు ప్రేమని అంగీకరించాడా లేదా? చివరకు ఏమైందేనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్)
పేరున్న హీరోలే.. బడ్జెట్ ఎక్కువే.. కానీ ఏం లాభం?
సినిమా చూడటం సులభమే కానీ తీయడం చాలా కష్టం. 24 విభాగాలు పక్కాగా పనిచేస్తే తప్పితే మూవీ థియేటర్లో రిలీజ్ కాదు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోలు కూడా ఏడాది ఒకటి రెండు చిత్రాలతో ప్రేక్షకులని పలకరించేవారు. దీంతో సదరు హీరోలంటే ఆడియెన్స్కి కూడా ఓ గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా తయారైంది. పేరున్న హీరోల మూవీస్ కూడా ఎప్పుడు రిలీజవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ అలాంటివి ఏంటి?(ఇదీ చదవండి: స్టైల్ మార్చిన సీఎం విజయ్.. నిర్మాత ఇంటి వేడుకలో)ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు చిరంజీవి. 'విశ్వంభర' అనే సినిమా ఈయన 2023లో ప్రకటించారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేశారు. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్. ఏడు లోకాలు. ఇలా చాలానే ప్లస్సులు ఉన్నాయి. కానీ ఇప్పటికే రిలీజ్ డేట్ ఏంటో చెప్పలేని పరిస్థితి. రేపో మాపో వచ్చేస్తుందని సోషల్ మీడియాలో రూమర్స్ తప్పితే అసలు సంగతి ఏంటనేది హీరో, దర్శకుడికి తప్పితే మరెవరికీ తెలియదమో?యంగ్ హీరో నిఖిల్ చేసిన పాన్ ఇండియా సినిమా 'స్వయంభు'. బాహుబలి తరహా కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రం కూడా చాన్నాళ్లుగా సెట్స్పై ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి హీరోహీరోయిన్లు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. వేసవిలో రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు. మార్చి, ఏప్రిల్, మే నెలలు గడిచిపోయాయి గానీ దీని రిలీజ్ సంగతి మాత్రం ఇంకా తేలలేదు.(ఇదీ చదవండి: 3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)మెగాహీరో సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' కూడా ఇలానే తయారైంది. ఈ ప్రాజెక్టు కూడా అప్పుడెప్పుడో మొదలైంది. షూటింగ్ ఆగుతూ ఆగుతూ జరుగుతోంది. బడ్జెట్ సమస్యల కారణంగానే ఇన్నేళ్లుగా సెట్స్పై ఉందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. పై రెండింటి ఔట్పుట్ రెడీ అయిపోయింది గానీ దీనిది ఇంకా చాలా పెండింగ్లో ఉంది. అది పూర్తి చేసి ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి.పైన చెప్పిన సినిమాల్లో పేరున్న హీరోలే నటించారు. బడ్జెట్ కూడా వందల కోట్ల రూపాయలు పెట్టారు. కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో ఏళ్లకు ఏళ్లు గడిచిపోతూనే ఉన్నాయి కానీ రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ రావట్లేదు. సినిమాలు ఇలా ల్యాబ్ల్లో మగ్గిపోవడం వల్ల నిర్మాతకు వడ్డీ భారం పెరిగిపోతుంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాలపై బజ్ తగ్గిపోతుంది. ప్రస్తుతం జరుగుతున్నది అదే. మరి ఈ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఏంటో?(ఇదీ చదవండి: అమ్మకు క్యాన్సర్ వస్తే జ్వరం అనుకున్నా.. నాన్న బుర్ర చెడిపోయింది)
దర్శకధీరుడికి షాక్.. వారణాసికి తప్పని లీక్ల బెడద
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసేందుకే భారీ ఈవెంట్ నిర్వహించారు. అప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అదే సమయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి లీక్ల బెడద తప్పడం లేదు. ఒడిశాలో జరిగిన తొలి షెడ్యూల్ చిత్రీకరణ టైమ్లో కొన్ని సీన్స్ నెట్టింట వైరలయ్యాయి. తాజాగా కీలకమైన ఉగ్రభట్టి గుహ సన్నివేశానికి సంబంధించిన భారీ సెట్ స్టిల్స్ ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. దీంతో మన దర్శకధీరుడిని సైతం లీక్ల కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ఫోటోలు లీక్ కావడంపై మేకర్స్ నిరాశకు గురయ్యారు. ఇకనుంచి భద్రతను కట్టుదిట్ట చేసేలా చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. #Varanasi On Sets Is Just Another Level 💥💥💥 pic.twitter.com/va9BkiAF4c— Freak4Flims (@Freak4Flims) May 28, 2026
క్రీడలు
రిషబ్ పంత్ సంచలన నిర్ణయం
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి పంత్ వైదొలిగాడు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ శుక్రవారం అధికారికంగా ప్రకటిచింది. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ పంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. "రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతడి అభ్యర్థనను ఫ్రాంచైజీ తక్షణమే ఆమోదించింది. క్రికెట్లో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ సులువు కాదు. ఒక కెప్టెన్గా అతడు సూపర్ జెయింట్స్కు అందించిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు మా దృష్టి అంతా జట్టు ప్రయోజనాల పైనే ఉంది. రాబోయే రోజుల్లో జట్టును మళ్లీ పటిష్టంగా నిర్మించడమే మా లక్ష్యమని లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కెప్టెన్గా అట్టర్ ప్లాప్కాగా ఐపీఎల్-2025 వేలంలో రిషబ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ. 27 కోట్ల భారీ ధర వెచ్చించి మరి సొంతం చేసుకుంది. కేఎల్ రాహుల్ స్ధానంలో తమ జట్టు పగ్గాలను పంత్కు లక్నోకు అప్పగించింది. కానీ లక్నో యాజమాన్యం నమ్మకాన్ని రిషబ్ నిలబెట్టుకోలేకపోయాడు.ఐపీఎల్-2025, 26 సీజనల్లో అతడి కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ రెండు సీజన్లలో కనీసం ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కు చేరలేకపోయింది. ఈ ఏడాది సీజన్లో లక్నో మరింత ఘోరంగా విఫలమైంది. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. పంత్ కెప్టెన్గా మాత్రమే కాకుండా ఆటగాడిగా కూడా నిరాశపరిచాడు. దీంతో అతడిపై తీవ్ర స్ధాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే లక్నో కెప్టెన్సీ నుంచి పంత్ తప్పుకొన్నాడు.చదవండి: ‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్గా అతడే!’
టీ20 వరల్డ్కప్ టోర్నీకి వెస్టిండీస్ జట్టు ప్రకటన
ఇంగ్లండ్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా హేలీ మాథ్యూస్ వ్యవహరించనుంది. అదేవిధంగా ఈ జట్టులో డీండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్ వంటి సీనియర్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు.పదేళ్ల క్రితం పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచిన కరేబియన్ జట్టు.. ఆ తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సొంతం చేసుకోలేకపోయింది. అటు విండీస్ పురుషల జట్టు కూడా 2016 తర్వాత ఐసీసీ టైటిల్ను ముద్దాడలేకపోయింది. దీంతో తమ 10 ఏళ్ల సుదీర్ఘ నిర్ణీక్షణకు తెరదించాలని విండీస్ అమ్మాయిలు పట్టుదలతో ఉన్నారు. అయితే సాధరణంగా ఇంగ్లండ్ పిచ్లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి. కానీ వెస్టిండీస్ సెలెక్టర్లు అనూహ్యంగా స్పిన్ బౌలింగ్కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. . అష్మిని మునిసర్, అఫీ ఫ్లెచర్, మాండీ మంగ్రూ, కరిష్మా రామ్హారక్, హేలీ మాథ్యూస్, జైదా జేమ్స్ వంటి స్పిన్నర్లు విండీస్ ప్రపంచకప్ జట్టులో ఉన్నారు. ఇక ఈ టోర్నీలో విండీస్ జట్టు గ్రూప్-బిలో చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్లో వెస్టిండీస్తో పాటు ఐర్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, శ్రీలంక, ఆతిథ్య ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. వెస్టిండీస్ జట్టు జూన్ 13న సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్తో తన ప్రపంచ కప్ సమరాన్ని ప్రారంభించనుంది.మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 కు వెస్టిండీస్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), చినెల్ హెన్రీ, డీండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్, అఫీ ఫ్లెచర్, ఆలియా అల్లీన్, షెమైన్ కాంప్బెల్, అష్మిని మునిసర్, కరిష్మా రామ్హారక్, జాన్నిలియా గ్లాస్గో, జహజారా క్లాక్స్టన్, కియానా జోసెఫ్, జైదా జేమ్స్, మాండీ మంగ్రూ, షానిషా హెక్టర్.చదవండి: ‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్గా అతడే!’
ఆ జట్టుదే ఐపీఎల్ 2026 టైటిల్.. ఏఐ జోస్యం!
ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ జరగనున్న క్వాలిఫయర్-2 పోరుతో కలిపి ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికే క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ఆర్సీబీ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను ఓడించిన రాజస్తాన్ రాయల్స్ ఫైనల్లో బెర్తు దక్కించుకోవడం కోసం క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు మే 31న (ఆదివారం) జరగనున్న ఫైనల్లో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ విజేత ఎవరనేది ఏఐ ప్లాట్ఫామ్ క్లాడ్ అంచనా వేసింది. క్వాలిఫయర్-2లో విజేతతో పాటు టైటిల్ గెలుచుకోనున్న జట్టును కూడా అంచనా వేసింది. ఏఐ మాయతో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్న ఈ రోజుల్లో అది చెప్పిన జోస్యం నిజమవుతుందా అనేది చూడాలి. క్వాలిఫయర్-2లో రాజస్తాన్ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు దూసుకెళ్తుందని అంచనా వేసింది. కానీ ఫైనల్లో మాత్రం ఆర్సీబీ చేతిలో చతికిలపడి గుజరాత్ రన్నరప్తో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. ఇక ఆర్సీబీ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలవనుందని, ఆ జట్టుకే గెలుపు అవకాశాలు 65 శాతం ఉన్నట్లు తెలిపింది. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా పక్కాగా వివరించింది.ఈ సీజన్లో ఆర్సీబీ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తూ ఆరంభం నుంచే విజయాలు సాధించి మెరుగైన రన్రేట్తో 18 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. కోహ్లి, పాటిదార్, పడిక్కల్, టిమ్ డేవిడ్లతో కూడిన బలమైన లైనప్కు తోడు భువనేశ్వర్, హాజిల్వుడ్, రసిక్ సలామ్ వంటి బౌలర్లతో పటిష్టంగా ఉందని తెలిపింది. అదీగాక క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ను భారీ తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో బరిలోకి దిగనుందని, అదే ఆత్మవిశ్వాసంతో గుజరాత్ను మరోసారి ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ దక్కించుకోనుందని తెలిపింది. మరి ఏఐ చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.చదవండి: తగ్గేదేలే.. లక్ష్యం మరో 4 వేల కిలోమీటర్లే!
తగ్గేదేలే.. లక్ష్యం మరో 4 వేల కిలోమీటర్లే!
రాజస్థాన్కు చెందిన అల్ట్రా-మారథాన్ రన్నర్, భారత అథ్లెట్ సుఫియా సూఫీ సాహసయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరుకుంది. భారత సాయుధ దళాలకు నివాళిగా కన్యకుమారి నుంచి కారకోరం వరకు 88 రోజుల పాటు 5వేల కిలోమీటర్ల దూరం రన్నింగ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సుఫియా సూఫీ వెయ్యి కిలోమీటర్ల మార్క్ను చేరుకున్న క్రమంలో ఆ విశేషాలను తన ‘ఎక్స్’ వేదికగా ఫొటో రూపంలో పంచుకుంది. షూస్తో వెయ్యి సంఖ్య ఆకారాన్ని తయారు చేసిన సుఫియా .. ‘వెయ్యి కిలోమీటర్లు పూర్తైంది’ అని కామెంట్ చేసింది. 5 వేల కిలోమీటర్ల టార్గెట్లో మొదటి మెట్టును విజయవంతంగా పూర్తి చేయడం తనకు సంతోషంగా ఉందని సుఫియా తెలిపింది. కాగా సుఫియా సాహసయాత్రపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇది నిజంగా అద్భుతం. దేశ భద్రతకు గస్తీ కాస్తున్న సాయుధ దళాలకు మీరు ఇస్తున్న గౌరవం చాలా బాగుంది’.. ‘రన్నింగ్కు షూకు సరైన నిర్వచనం చెప్పారు.. సలాం సూఫీ’..‘కంగ్రాట్స్ సుఫియా.. మీరు ఇలాగే ముందుకు సాగండి’ అంటూ అభిమానులు కామెంట్లు పెట్టారు.ఎందుకీ మారథాన్ రన్?దక్షిణ భారత్ ఏరియా ప్రధాన కార్యాలయం మద్దతుతో ఈ మహత్తర కార్యక్రమాన్ని సుఫియా సూఫీ ప్రారంభించింది. దేశ భద్రత కోసం ప్రాణాలొదిలిన భారత సాయుధ దళాలకు నివాళిగా మారథాన్ రన్ ప్రారంభించింది. కాగా సూఫీ తన ప్రయాణంలో అన్ని ప్రధాన యుద్ధ స్మారక చిహ్నాలను గౌరవించనున్నట్లు తెలిపింది. తన సాహసయాత్రను లడఖ్లోని కార్గిల్ దివస్ వద్ద ముగించనున్నట్లు ఆమె పేర్కొంది. సుఫియా సూఫీ చేస్తున్న ఈ మారథాన్ ఫీట్ వరల్డ్ రికార్డు సాధించడంతో పాటు ఆమె అకుంఠిత స్ఫూర్తికి, దీక్షకు, పట్టుదలకు నిదర్శనంగా నిలవనుంది. తన ఆరో గిన్నిస్ ప్రపంచ రికార్డు కోసం కృషి చేస్తున్న సుఫియా అంకితభావానికి, మానసిక స్థైర్యానికి ఈ పరుగు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. కాగా జాతీయ ఐక్యత, దేశభక్తి, పట్టుదలకు ప్రతీకగా నిలిచే ఈ ప్రయాణానికి నాంది పలుకుతూ, కల్నల్ సూర్య ముఖర్జీ.. సుఫియా సూఫీ మారథాన్ను మే 12న అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు.1000 Km done.… #RunAcrossIndia #RunforDreams #TributetoBravehearts #worldrecordattempt pic.twitter.com/Ryr1NNuea0— Sufiya Sufi Runner (@sufirunner) May 29, 2026చదవండి: మెస్సీ ఆడడంపై క్లారిటీ.. అర్జెంటీనా జట్టు ప్రకటన View this post on Instagram A post shared by Sufiya Sufi Runner (@sufiyasufirunner)
న్యూస్ పాడ్కాస్ట్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా... కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
చంద్రబాబు రాక్షస పాలనపై పోరుబాట... వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పునకు సంకేతాలు.. సిద్ధరామయ్య రేపు రాజీనామా చేసే అవకాశం
మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా?... చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన మాజీ సీఎం వైఎస్ జగన్
యుద్ధమా? ఒప్పందమా?... ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో పగిలిన అక్రమాల పుట్ట... ఎస్సీఆర్టీ నుంచే కుంభకోణం..
అమరావతిలో చంద్రబాబు లూటీ... అవినీతి, దోపిడీతో ఎప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు.
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
బిజినెస్
బంగారం ఖరీదవడం లేదు.. కియోసాకి కామెంట్స్
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి డాలర్ విలువ, ద్రవ్యోల్బణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు పెరుగుతున్నాయనే భావన తప్పని, అసలు సమస్య డాలర్ కొనుగోలు శక్తి క్షీణించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.“బంగారం ఖరీదవడం లేదు.. డాలర్ చవకబారుతోంది” అంటూ కియోసాకి తన పోస్టులో స్పష్టం చేశారు. ఆర్థిక సలహాదారుగా ఆరు సంవత్సరాలకు పైగా పని చేసిన తన స్నేహితుడు కూడా 37 ఏళ్ల వయసులోనే ఈ నిజాన్ని అర్థం చేసుకున్నాడని తెలిపారు. ప్రజలు తమ జీతాలు పెరిగాయని భావిస్తున్నా, వాస్తవానికి డాలర్ విలువ తగ్గిపోవడంతో ఎక్కువ నోట్లు చేతికి వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.తన స్నేహితుడి తండ్రి ఉదాహరణను కూడా కియోసాకి ప్రస్తావించారు. ఒకప్పుడు 10 వేల డాలర్ల విలువైన ఇల్లు, అదే సమయంలో తీసుకున్న 10 వేల డాలర్ల జీవిత బీమా పాలసీ గురించి చెబుతూ.. నేడు ఆ ఇల్లు 7.5 లక్షల డాలర్లకు చేరగా, బీమా మాత్రం ఇప్పటికీ 10 వేల డాలర్లుగానే ఉందన్నారు. “ఒకటి ద్రవ్యోల్బణాన్ని అనుసరించింది.. మరొకటి అనుసరించలేదు” అని వ్యాఖ్యానించారు.1971 నుంచి అమెరికన్ డాలర్ తన కొనుగోలు శక్తిలో 93 శాతం కోల్పోయిందని కియోసాకి పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలను అదే కరెన్సీలో పొదుపు చేయమని ఆర్థిక వ్యవస్థ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాలు నిరంతరం కరెన్సీ ముద్రిస్తూనే ఉంటాయని, ఫలితంగా కరెన్సీ విలువ తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.రోమ్ సామ్రాజ్యం నుంచి అమెరికా వరకు చరిత్రలో ఇదే పునరావృతమైందని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో అమెరికా భారీగా డబ్బు ముద్రించిందని గుర్తుచేశారు. కరెన్సీ విలువ తగ్గినా, భూమి, బంగారం, వెండి, చమురు, వ్యాపారాల వంటి నిజమైన ఆస్తులు మాత్రం తమ విలువను నిలబెట్టుకుంటాయని అన్నారు.డాలర్ను ‘డబ్బు’గా కాకుండా ప్రతి ఏడాది కరిగిపోతున్న ‘కొలమానం’గా చూడాలని కియోసాకి సూచించారు. బంగారం ఐదు వేల ఏళ్లుగా తన విలువను నిలబెట్టుకుందని, పేపర్ కరెన్సీలు చివరికి విలువ కోల్పోతాయని పేర్కొన్నారు. చివరగా “డాలర్లు దాచుకోవద్దు.. నిజమైన ఆస్తులను సొంతం చేసుకోండి” అంటూ బంగారం, వెండి, బిట్కాయిన్, రియల్ అసెట్స్లో పెట్టుబడుల వైపు మొగ్గుచూపాలని ప్రజలకు సూచించారు.
ATMలో EPF అంతా డ్రా చేసుకుంటే.. పెన్షన్ వస్తుందా?
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ (EPFO) తీసుకురాబోతున్న ‘ఈపీఎఫ్ఓ 3.0’ వ్యవస్థపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. యూపీఐ, ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును సులభంగా ఉపసంహరించుకునే సదుపాయం అందుబాటులోకి రానుండటంతో ఉద్యోగుల్లో ఆనందం కనిపిస్తున్నా.. “పీఎఫ్ మొత్తం తీసుకుంటే పెన్షన్కు ప్రమాదమా?” అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది.పీఎఫ్ విత్డ్రాకు, పెన్షన్కు సంబంధం లేదుఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్), ఈపీఎస్ (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్) రెండూ ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నప్పటికీ, వాటి నిర్వహణ విధానం వేర్వేరుగా ఉంటుంది. ఉద్యోగి, యజమాని (కంపెనీ) చెల్లించే పీఎఫ్ కాంట్రిబ్యూషన్తో ఏర్పడే ఈపీఎఫ్ బ్యాలెన్స్పై మాత్రమే కొత్త ఉపసంహరణ సదుపాయం వర్తిస్తుంది. అంటే ఏటీఎం లేదా యూపీఐ ద్వారా సభ్యులు తమ పీఎఫ్ నిధుల్లో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈపీఎస్ కింద వచ్చే నెలవారీ పెన్షన్ మొత్తాలను ఈ విధానంలో ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు.10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే పెన్షన్ హక్కుకేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 58 ఏళ్ల వయస్సు అనంతరం లభించే పెన్షన్ అర్హతపై ఈ మార్పుల ప్రభావం ఉండదు. ఉద్యోగి తన ఈపీఎఫ్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నా, అతని ఈపీఎస్ సర్వీస్ కాలం రద్దు కావడం లేదా రీసెట్ కావడం జరగదు. అయితే పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్ల ఈపీఎస్ సభ్యత్వం తప్పనిసరి. ఆ అర్హత పూర్తి చేసిన సభ్యులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్కు అర్హులుగానే కొనసాగుతారు.ఉదాహరణకు 50 ఏళ్ల ఉద్యోగి తన ఈపీఎఫ్ ఖాతా నుంచి భారీ మొత్తాన్ని ఉపసంహరించుకున్నా, అతను ఇప్పటికే 10 ఏళ్ల అర్హత సర్వీస్ పూర్తి చేసి ఉంటే పెన్షన్ ప్రయోజనాలు కోల్పోడు. దీంతో ఉద్యోగుల్లో ఉన్న ప్రధాన సందేహానికి ప్రభుత్వం సమాధానం ఇచ్చినట్టైంది.ఈపీఎఫ్ఓ 3.0 గురించి..ఈపీఎఫ్ఓ 3.0 అనేది సంస్థ చేపడుతున్న పెద్ద డిజిటల్ మార్పు కార్యక్రమం. దీని ద్వారా సభ్యులు పూర్తిగా కాగితరహిత విధానంలో తమ పీఎఫ్ డబ్బును తక్షణమే బదిలీ చేసుకోవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు. యూపీఐ ఆధారిత చెల్లింపులు, యూపీఐ సపోర్ట్ ఉన్న ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో ఇప్పటివరకు ఉన్న క్లెయిమ్ ప్రాసెసింగ్ ఆలస్యాలు తగ్గి, సభ్యుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ కానుంది.కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల ఈ సేవల పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని వెల్లడించారు. యూపీఐ పేమెంట్ గేట్వే ద్వారా పీఎఫ్ ఉపసంహరణ వ్యవస్థను పరీక్షించామని, ఉపసంహరించిన మొత్తాన్ని నేరుగా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం సిద్ధమైందని తెలిపారు. అయితే ఈపీఎఫ్ఓ 3.0 అధికారిక ప్రారంభ తేదీని మాత్రం ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దాదాపు రూ.28 లక్షల కోట్ల కార్పస్ను నిర్వహిస్తోంది. భద్రత, స్థిరమైన రాబడులు, పన్ను మినహాయింపుల కారణంగా కోట్లాది మంది ఉద్యోగులు ఈ వ్యవస్థపై విశ్వాసం ఉంచుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 1.29 కోట్ల మందికి పైగా కొత్త కార్మికులు పేరోల్ వ్యవస్థలో చేరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఒక్కసారిగా రేటెక్కిన బంగారం, వెండి
దేశంలో పసిడి ధరల పతనానికి బ్రేకులు పడ్డాయి. గత మూడు రోజులుగా వరుసగా తగ్గిన బంగారం ధరలు నేడు (Today Gold Rate) ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారుల ఆనందం ఆవిరైంది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు పుంజుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:49 సమయానికి నిఫ్టీ(Nifty) 2 పాయింట్లు తగ్గి 23,906 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 83 పాయింట్లు పెరిగి 75,948 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.02బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 91.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.43 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.58 శాతం పెరిగింది.నాస్డాక్ 0.91 శాతం పుంజుకుంది.Today Nifty position 29-05-2026(time: 09:49 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ
త్యాగమే మహోన్నతం
ఈదుల్ అజ్హా– బక్రీద్ కేవలం ఒక మతపరమైన పర్వదినం కాదు. అది మనిషిలోని స్వార్థాన్ని అణిచి, ప్రేమను పంచే ఆత్మీయ సాధన. ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్సలాం) చూపిన త్యాగస్ఫూర్తి, అంకితభావం, దేవుని ఆజ్ఞ పట్ల విశ్వాసం ఈ పండుగకు మూలాధారాలు. కానీ బక్రీద్ సందేశం అక్కడితో ఆగిపోదు. ‘మనకు అత్యంత ప్రియమైనదాన్ని కూడా సమాజ మేలుకోసం విడిచిపెట్టగలగడం’ అనే గొప్ప మానవీయ విలువను ఇది ప్రపంచానికి గుర్తు చేస్తుంది. ఈ రోజున చేసే ఖుర్బానీ కేవలం జంతు తర్పణం కాదు; మనలోని అహంకారం, ద్వేషం, అసూయ, స్వార్థాన్ని త్యజించే ఆత్మపరిశీలన కూడా.నేటి ప్రపంచంలో మనుషుల మధ్య దూరాలు పెరుగుతున్నాయి. మతం, కులం, భాష, రాజకీయాల పేరుతో మనసులు విడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బక్రీద్ మనకు... పంచుకోవడం, పరస్పర సహకారం, పేదల పట్ల కరుణ, ఆకలితో ఉన్నవారిని గుర్తు చేసుకోవడం వంటి విలువలను నేర్పుతుంది. ఖుర్బానీ మాంసాన్నిబంధువులకు, పొరుగువారికి, అవసరమైనవారికి పంచడం వెనుక ఉన్న అసలు భావం కూడా ఇదే. సమాజంలో మనిషి మనిషికి అండగా నిలబడితేనే శాంతి సాధ్యమవుతుంది. నిజమైన భక్తి అనేది తోటి మనిషి కన్నీరు తుడిచినప్పుడే పరిపూర్ణమవుతుందని ఈ పండుగ చాటిచెబుతుంది. హృదయాల్లోని సంకుచితత్వాన్ని వీడి, అందరి శ్రేయస్సును ఆకాంక్షించడమే బక్రీద్ నేర్పే పాఠం. ఈ త్యాగనిరతి కేవలం ఒక్క రోజుకే పరిమితం కాకుండా మన నిత్య జీవితంలో అంతర్భాగం కావాలి. అప్పుడే సమాజంలో ద్వేషాల స్థానంలో శాంతి, కరుణ, పరస్పర నమ్మకం చిగురిస్తాయి.– యండి. ఉస్మాన్ ఖాన్ (బక్రీద్ పర్వదినం సందర్భంగా)
30 రోజుల్లో ఏడు కిలోలు..! ఆ 15 రూల్స్ మస్ట్
అందరికీ స్మార్ట్గా, స్లిమ్గా అవ్వాలని ఉంటుంది. కానీ తక్కువటైంలోనే తగ్గాలనేది అందరి కోరకి. కానీ ఆ క్రమంలో శరీరం కాస్త ఒత్తిడికి గురై బరువు తగ్గడం ఎలా ఉన్నా అధిక బరువు పెరిగిపోతుంటాం. అలాంటి వాళ్లు హెల్దీ కమ్ స్పీడ్గా బరువు తగ్గేందుకు ఈ 15 రూల్స్ని ఫాలో అయితే చాలని అంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్. కేవలం చీటింగ్కి తావు లేకుండా క్రమశిక్షణతో కూడిని దినచర్యకు కట్టుబడి ఉంటే చాలని అంటున్నారామె. అలాంటప్పుడే ఈ 15 నియమాలు చాలా సమర్థవంతంగా ఫలితాలనిస్తాయిని చెబుతున్నాడు.క్రమబద్దమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు, సరైన నిద్ర, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించే డెడికేషన్ తదితరాలు ఉంటే 30 రోజుల్లో బరువు తగ్గడం సులభమేనని అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్. అందుకోసం ప్లాన్ ఎలా ఉండాలో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నియంత్రిత ఆమారం, అధిక ప్రోటీన్తో కూడినా ఆహారాలు, శారీరక శ్రమ వంటి వాటితో కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెబుతున్నారు రాషిద్. అందుకోసం స్ట్రిక్ట్గా శిక్షణను కొనసాగించాలని నొక్కి చెప్పారు. ఆ వెయిట్లాస్ ప్లాన్ ఏంటంటే..కేలరీల లోటుతో తినండినిర్వహణ స్థాయి కంటే 500-750 తక్కువ. గరోజువారీ ప్రోటీన్ లక్ష్యాన్ని చేరుకోండిశరీర బరువులో ప్రతి పౌండ్కు 0.8-1 గ్రా. చాలా మందికి కనీసం 130-180 గ్రా.ప్రతి భోజనంలో 20-30 గ్రా ప్రోటీన్ తినండిప్రోటీన్కు అనుగుణంగా ప్రతి భోజనం ఉండాలివారానికి కనీసం 3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండివారానికి 3-5 సార్లు ఇంక్లైన్ వాక్ / స్టెయిర్మాస్టర్ చేయండి 30-45 నిమిషాలు. ఈ వారం నేను పంచుకున్న వాకింగ్ ఛాలెంజ్ లాగా.ప్రతిరోజూ పదివేల పైనే అడుగులు నడవడంఇది ఒత్తిడి లేకుండా కొవ్వును కరిగించడం.రాత్రికి 7-9 గంటలు నిద్రపోండినిద్ర లేకపోతే కొవ్వు కరగడం నెమ్మదిస్తుంది.భోజనాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోండిప్రణాళిక లేకపోతే ఇష్టం వచ్చినట్లు తినడంతో ఫలితం పొందలేరు. ప్రధానంగా సంపూర్ణ ఆహారాలనే తినండి. కొవ్వు తక్కువగా ఉండే మాంసం, అన్నం, గుడ్లు, పండ్లు, ఓట్స్, ఆకుకూరలు.అధిక కేలరీలు గల పానీయాలను మానుకోండినీళ్లు, కాఫీ, కేలరీలు లేని పానీయాలు. స్మూతీలను లెక్కపెడితే ఫర్వాలేదు.ప్రాసెస్ చేసిన చక్కెరను తగ్గించండిమిఠాయిలు, పేస్ట్రీలు, చక్కెర కలిపిన తృణధాన్యాలు, లేదా జంక్ ఫుడ్ వద్దు.చివరగా 30 రోజుల పాటు చీట్ మీల్స్ వద్దుప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే బరువు చూసుకోండిమొదట్లో కాస్త కష్టంగా అనిపించినా..స్మార్ట్గా మారాలన్న లక్ష్యంపై గురిపెడితే ప్రతి శారీరక బాధ ఇష్టంగా మారుతుందని అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్ . View this post on Instagram A post shared by Takai Raashid | MacroMaster® (@takai.raashid)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..)
వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..
ఇటీవలకాలంలో అందరు ఆరోగ్య స్పృహతో పోషకవంతమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా భోజనం విషయంలో వైట్రైస్ కంటే బ్రౌన్రైస్ని, చపాతీలను, తాజా పండ్లు, కూరగాయలను వినయోగిస్తున్నారు. కొందరు మితంగా వైట్ రైస్ తీసుకుంటూ ఆకుకూరలు, నట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతకీ వైట్రైస్ అసలు తినకపోవడమే మంచిదా?, బ్రౌన్ రైస్ మాత్రమే ఆరోగ్యానికి మంచిదా? అంటే ఆ ఆలోచనే సరైనది కాదంటున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ . బ్రౌన్ ఆరోగ్యానికి మంచిదనేది నిజమే అయినప్పటికీ పూర్తిగా వైట్ రైస్ తీసుకోకూడదని కాదు అంటున్నారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య రీత్యా ఏది తీసుకుంటే మంచిదనేది ఆధారపడి ఉంటుందంటున్నారు. అదెలాగంటే..తెల్లబియ్యం..తెల్ల బియ్యంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల, అది సులభంగా జీర్ణమవుతుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో కొంతమందికి ఇది ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు తీవ్రమైనప్పుడు, తప్పక ఫైబర్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదీగాక తెల్ల బియ్యం త్వరగా ఉడుకుతుంది, తినేందుకు మృదువుగా ఉంటుంది.బ్రౌన్రైస్ఇందులో పోషకమైన మొలక, పీచుపదార్థం గల ఊక, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఎండోస్పెర్మ్ తదితరాలు ఉంటాయి. దీని గరుకైన ఊక ఉపరితలం కారణంగా నమలడానికి గట్టిగానూ ఉడికేందుకు కాస్త సమయం ఎక్కువ తీసుకుంటుంది.పోలిస్తే..సమతుల్య ఆహారంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్ రెండూ ఉంటాయి. అయితే, తెల్ల బియ్యంతో పోలిస్తే, బ్రౌన్ రైస్లో ఊక, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఉదాహరణకు, తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ అనేక బి విటమిన్లు (బి1, బి3, బి6, మరియు బి9) అధిక స్థాయిలో ఉంటాయిఆరోగ్య పరంగా..ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తుంటే, బ్రౌన్ రైస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గడం, అలాగే బరువును మెరుగ్గా నియంత్రించుకోవడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే తెల్ల బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ 73 ± 4, ఇది అధికం. బ్రౌన్ రైస్ను మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ 68 ± 4 కారంగా ఆరోగ్యప్రదంగా పరిగణించారు నిపుణులు. అదీగాక, బ్రౌన్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది, కానీ తెల్ల బియ్యం తినడం వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.ఎలా తీసుకుంటే మంచిదంటే..చాలా మంది బ్రౌన్ రైస్ మంచిదన్న ఉద్దేశ్యంతో దీనికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే దీనిలోని అధిక ఫైబర్ జీర్ణం చేసుకోవడం కష్టతరం చేసి జీర్ణసంబంధిత రుగ్మతలు తీవ్రమై ప్రమాదం లేకపోలేదని అంటున్నారు ఆదర్శ గౌడ. అందువల్ల బ్రౌన్ రైస్, వైట్రైస్ రెండిటిని కలిపి ఎంచుకోమని సూచిస్తున్నారు నిపుణులు. మెరుగైన పోషకాహారం కోసం కొద్దిపాటి మార్పులతో రెండిటిని సమంగా తీసుకునే ప్రయత్నం చేయమని అంటున్నారు అప్పుడు శరీరానికి సమతుల్య పోషకాలు అందుతాయని చెబుతున్నారు ప్రముఖ నిపుణులు ఆదర్శ గౌడ.(చదవండి: బాదంపప్పులు నానబెట్టే ఎందుకు తినాలంటే..! పరిశోధనలో షాకింగ్ విషయాలు)
రోడ్డు రిఫ్లెక్టర్ల వెనుక పిల్లి కళ్ళు!
చిన్నారులూ! రాత్రి వేళల్లో రోడ్డు మధ్యలో చిన్న చిన్న లైట్లు మిలమిలా మెరుస్తూ కనిపించడాన్ని ఎప్పుడైనా గమనించారా? వాటినే రోడ్డు రిఫ్లెక్టర్లు లేదా క్యాట్ ఐస్ అని పిలుస్తారు. ఇవి రహదారిపై రాబోయే మలుపులు, లేన్ సరిహద్దులు, రోడ్డు అంచులను స్పష్టంగా చూపిస్తాయి. ప్రమాదాలు జరగకుండా రక్షిస్తాయి. ఎవరు కనిపెట్టారో తెలుసా? 1933లో బ్రిటన్కు చెందిన పెర్సీషా అనే వ్యక్తి దట్టమైన పోగమంచులో తన కారు నడుపుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. చీకటి ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు ఎటు ఉందో తెలియక కంగారు పడుతున్న సమయంలో, రోడ్డు పక్కన కూర్చుని ఉన్న ఒక పిల్లి అతని కారు వైపు చూసింది. కారు హెడ్లైట్ల వెలుతురు పడగానే ఆ పిల్లి కళ్ళు చీకట్లో వింతగా మెరిశాయి! ఆ మెరుపును చూసి పెర్సి షా అలర్ట్ అయ్యాడు. అక్కడ రోడ్డు మలుపు ఉందని గ్రహించి, కారును జాగ్రత్తగా పక్కకు తిప్పాడు. అలా ఆ పిల్లి కళ్ళ మెరుపు అతని ప్రాణాలను కా΄ాడింది. అపుడే పెర్సి షాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ‘పిల్లి కళ్ళు’ చీకట్లో వెలుతురును తిరిగి ప్రతిబింబిస్తాయి కదా! మరి రోడ్డుపై కూడా ఇలాంటివే ఏర్పాటు చేస్తే రాత్రిపూట డ్రైవర్లకు ఉపయోగపడతాయని ఆలోచించాడు. వెంటనే అతను ఒక కొత్త పరికరాన్ని తయారుచేసి దానికి ‘క్యాట్స్ ఐ’ అని పేరు పెట్టాడు. వాహనాల హెడ్లైట్ వెలుతురు దీనిపై పడగానే, అది తిరిగి వెలుగును వెనక్కి పంపుతుంది. కాలం మారుతున్న కొద్దీ ఈ రిఫ్లెక్టర్లు ఇంకా స్మార్ట్గా మారిపోయాయి.
అంతర్జాతీయం
భారత మామిడి పళ్లపై జపాన్ బ్యాన్ : ఎందుకో తెలుసా?
భారతీయ మామిడిపళ్ల ఎగుమతులపై జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి మామిడి పండ్ల శుద్ధి కేంద్రాలలో, మగ్గబెట్టడం (Fumigation) క్రిమిసంహారక (Disinfection) చర్యలలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన తరువాత భారత్ నుండి వచ్చే తాజా మామిడి పండ్ల దిగుమతులను జపాన్ నిలిపివేసింది. మామిడి పండ్ల ఎగుమతులకు అత్యంత కీలకమైన ఏప్రిల్-జూన్ సీజన్లోఈ నిర్ణయం తీసుకోవడంతో మామిడి ఎగుమతులపై భారీ ప్రభావం చూపుతోంది.'ది ఎకనామిక్ టైమ్స్' నివేదిక ప్రకారంజపాన్ క్వారంటైన్ ఇన్స్పెక్టర్లు తనఖీల తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అల్ఫోన్సో, కేసర్, లంగ్రా, బంగినపల్లి వంటి ప్రముఖ భారతీయ మామిడి రకాల ఎగుమతులకు తీవ్ర విఘాతం కలిగింది.ఇదీ చదవండి: ఢిల్లీ వ్యాపారవేత్తకు బెంగళూరులో ఇస్త్రీ ధరల షాక్!యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ మార్చి 31న ఒక ప్రకటన విడుదల చేస్తూ, మార్చి 25, 2026 లేదా ఆ తర్వాత భారతదేశం జారీ చేసిన తనిఖీ ధృవీకరణ పత్రాలు (Inspection certificates) ఉన్న షిప్మెంట్లను అనుమతించబోమని స్పష్టం చేసింది. భారతీయ కేంద్రాలలో నిర్వహణ ప్రమాణాలు మెరుగుపడ్డాయని జపాన్ అధికారులు సంతృప్తి చెందే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.ఇదీ చదవండి: అదే జరిగితే : సీనియర్లకు 400శాతం వేతనం పెంపుజపాన్ అధికారులు ఎలాంటి లోపాలను గుర్తించారు?మామిడి పండ్ల ఎగుమతి కోసం ఉపయోగించే వేపర్ హీట్ ట్రీట్మెంట్ (VHT) కేంద్రాలను పరిశీలించడానికి జపాన్ క్వారంటైన్ అధికారులు ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్లోని రెహమాన్పూర్ను సందర్శించారు.వేపర్ హీట్ ట్రీట్మెంట్ (VHT) అంటే ఏమిటి?ఇది ఎగుమతి చేయడానికి ముందు మామిడి పండ్లలోని పురుగులను, తెగుళ్లను నివారించడానికి ఎటువంటి రసాయనాలు లేకుండా, కేవలం వేడి మరియు తేమతో కూడిన గాలితో శుద్ధి చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి జపాన్ ప్రతి సంవత్సరం మామిడి సీజన్కు ముందు తన ఇన్స్పెక్టర్లను భారతదేశానికి పంపుతుంది.అయితే, ఈ ఏడాది పరిశీలనలో పొగబెట్టడం (Fumigation) మరియు దానికి సంబంధించిన క్రిమిసంహారక చర్యలలో లోపాలు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. దీనితో టోక్యో (జపాన్ ప్రభుత్వం) దిగుమతులను నిలిపివేయాలని నిర్ణయించింది. జపాన్ మార్కెట్లో మంచి ఆదరణ ఉన్న పలు రకాల మామిడి పండ్లపై ఈ నిషేధ ప్రభావం పడింది. వాటిలో ముఖ్యమైనవి ఇవి.అల్ఫోన్సో (Alphonso)కేసర్ (Kesar)లంగ్రా (Langra)బంగినపల్లి (Banganapalli)2025-26 ఆర్థిక సంవత్సరంలో జపాన్కు ఎగుమతి అయిన భారతీయ మామిడి పండ్లలో గుజరాత్కు చెందిన 'కేసర్' రకానిదే సింహభాగం. జపాన్కు జరిగిన మొత్తం తాజా మరియు ప్రాసెస్డ్ మామిడి ఉత్పత్తుల ఎగుమతుల విలువ $1.54 మిలియన్లు కాగా, అందులో కేసర్ రకం వాటానే సుమారు 0.2 మిలియన్ల డాలర్లుగా ఉంది.ఇది మొదటిసారి కాదు జపాన్ భారత్ నుండి మామిడి దిగుమతులను నిలిపివేయడం ఇది రెండోసారి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఎత్తివేసిన ఆంక్షలను జపాన్ మళ్లీ ఇన్నాళ్లకు విధించింది.1986లో తొలిసారి నిషేధంఫ్రూట్ ఫ్లైస్ (పండ్ల ఈగలు) వల్ల తెగుళ్లు వ్యాపించే ప్రమాదం ఉందనే ఆందోళనతో జపాన్ 1986లో తొలిసారి భారత మామిడి పండ్లపై ఆంక్షలు విధించింది. శాస్త్రీయ అధ్యయనాలు, చర్చలు జరిగినప్పటికీ ఆ నిషేధం 2006 వరకు (20 ఏళ్లు) కొనసాగింది.2006లో నిషేధం ఎత్తివేత: అప్పటి వాణిజ్య మంత్రి కమల్ నాథ్ నిరంతర ప్రయత్నాలు, జపాన్ క్వారంటైన్ బృందాల క్షేత్రస్థాయి పరిశీలనల అనంతరం.. భారతీయ మామిడి పండ్ల వల్ల ఎలాంటి తెగుళ్లు వచ్చే ప్రమాదం లేదని నిర్ధారించుకుని జపాన్ జూన్ 2006లో నిషేధాన్ని ఎత్తివేసింది. జపాన్ కోరినట్లుగా భారతదేశం వేపర్ హీట్ ట్రీట్మెంట్ (VHT) విధానాన్ని అమలు చేసింది.2006 తర్వాత ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని ఆమోదిత ప్రాంతాలలో పండే అల్ఫోన్సో, బంగినపల్లి, కేసర్, లంగ్రా, చౌసా, మల్లిక రకాల మామిడి పండ్ల దిగుమతికి జపాన్ అనుమతినిచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ లోపాలు బయటపడటంతో దిగుమతులను నిషేధించింది. భారతదేశానికి అత్యధికంగా మామిడి పండ్లను ఎగుమతి చేసే ప్రధాన దేశాలు: అమెరికా, యూఏఈ, యూకే, నెదర్లాండ్స్ మరియు సౌదీ అరేబియా.
ట్రంప్ షో.. అమెరికాలో కొత్త రాజకీయ తుపాను
అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా ప్రతిపాదన మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. వైట్హౌస్లో UFC (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) ఫైట్ నిర్వహించాలన్న నిర్ణయం రాజకీయ వివాదంగా మారింది. అధ్యక్ష భవనం ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించడం ఏంటని? ఆశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా అసలది అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల కోసమా? లేక ట్రంప్ పుట్టినరోజు నేపథ్యంలోనా? అన్న గందరగోళం రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ పెంచుతోంది. యూఎఫ్సీ విడుదల చేసిన ప్రారంభ ప్రణాళికల్లో వైట్హౌస్ ప్రాంగణంలో ప్రత్యేక “లెగసీ ఫైట్ నైట్” నిర్వహించాలన్న సూచన ఉంది. అయితే కొన్ని నివేదికలు ఈ ఈవెంట్ను ట్రంప్ పుట్టినరోజు(జూన్ 14) చుట్టూ ప్లాన్ చేస్తున్నారన్న సంకేతాలు ఇవ్వడంతో, దీనిపై డెమొక్రటిక్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ 250 ఏళ్ల వేడుకల్లో భాగంగా.. “అమెరికన్ స్పోర్ట్స్ షోకేస్”గా దీన్ని ప్రదర్శించాలన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో అసలు ఉద్దేశ్యం ఏంటన్నది ఇంకా స్పష్టత లేకుండా మారింది. వైట్హౌస్ దక్షిణ లాన్ ప్రాంతంలో తాత్కాలిక భారీ ఆక్టగాన్ రింగ్, వీఐపీ గ్యాలరీలు, మీడియా బాక్స్లు ఏర్పాటు ప్రయత్నాలు నడుస్తున్నాయి. వేలాది మంది ప్రేక్షకులను అనుమతించే స్థాయి సదుపాయాలు, అంతర్జాతీయ ప్రసారాల కోసం భారీ సెట్ అప్ అవసరమని అంచనా. భద్రతా కారణాల దృష్ట్యా సీక్రెట్ సర్వీస్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ ఆపరేషన్గా ఇది మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఖర్చుపై ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ప్రారంభ అంచనాల ప్రకారం.. ఈ ఈవెంట్ కోసం దాదాపు 60 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.500 కోట్లకు పైగా) వరకు ఖర్చవొచ్చని అమెరికన్ మీడియా కథనాలు చెబుతున్నాయి. అలాగే వైట్హౌస్ లాన్ దెబ్బతినడంతో దాన్ని మళ్లీ పునరుద్ధరించడానికి మాత్రమే దాదాపు 7 లక్షల డాలర్లు ఖర్చవుతుందని స్వయంగా యూఎఫ్సీ అధ్యక్షుడు డానా వైట్ వెల్లడించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయిఅమెరికాలో పెరుగుతున్న ద్రవ్య లోటు, ప్రజా వ్యయాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి “ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్” అవసరమా? అనే ప్రశ్న డెమొక్రాట్లు గట్టిగా లేవనెత్తుతున్నారు. “ట్రంప్ దుబారా ప్రాజెక్ట్”గా విమర్శిస్తున్నారు. వైట్హౌస్ అనేది పరిపాలనా కేంద్రం తప్ప వినోద వేదిక కాదని, అక్కడ పోరాట క్రీడల కోసం భారీ ఈవెంట్లు నిర్వహించడం అధ్యక్ష పదవికి తగదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. “ఇది పాలన కాదు.. పబ్లిసిటీ షో” అని కొందరు నేతలు ఘాటుగా విమర్శించారు. ఇక రిపబ్లికన్ వర్గాల్లో మాత్రం ఈ ప్రతిపాదనపై మిశ్రమ స్పందన ఉంది. కొందరు దీనిని అమెరికా 250 ఏళ్ల వేడుకలను ప్రపంచానికి చూపించే అవకాశంగా చూస్తుండగా.. మరికొందరు ఇది అనవసర రాజకీయ వివాదాలకు దారి తీస్తుందని అభిప్రాయపడుతున్నారు. చరిత్రలో చూస్తే వైట్హౌస్ ప్రాంగణంలో ఇలాంటి పెద్ద స్థాయి క్రీడా పోటీలు జరగలేదు. సాధారణంగా అధికారిక వేడుకలు, చిన్న స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే అక్కడ నిర్వహించబడతాయి. అంతర్జాతీయ స్థాయి ఫైట్ ఈవెంట్ మాత్రం వైట్హౌస్ చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది. ఇదే సమయంలో..ట్రంప్ ఆధ్వర్యంలో వైట్హౌజ్లో కొన్ని నిర్మాణ మార్పులు కూడా జరుగుతున్నాయన్న వార్తలు రాజకీయ వేడి పెంచుతున్నాయి. సమావేశ హాళ్ల ఆధునీకరణ, ఈవెంట్ స్పేస్ల విస్తరణ, భద్రతా మౌలిక సదుపాయాల మార్పులతో పాటు భారీ “బాల్రూమ్” నిర్మాణ ఆలోచన కూడా ఇందులో భాగంగా ఉండడం తెలిసిందే. అయితే.. అంతర్జాతీయ స్థాయి విందులు, భారీ రాజకీయ–సామాజిక ఈవెంట్లు నిర్వహించేందుకు అనువుగా ఈ మార్పులు చేపడుతున్నారన్న చర్చ సాగుతోంది. డెమొక్రాట్లు మాత్రం “వైట్హౌస్ను పరిపాలనా కేంద్రం నుంచి ఎంటర్టైన్మెంట్ వేదికగా మార్చేస్తున్నారు” అంటూ ట్రంప్పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఏది ఏమైనా ట్రంప్ మాత్రం తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. యూఎఫ్సీ ఈవెంట్ను “గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్”గా అభివర్ణిస్తూ భారీ ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు యూఎఫ్సీ అధ్యక్షుడు డానా వైట్తో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకే వైట్హౌస్లో యూఎఫ్సీ ఫైట్ ప్లాన్ను చాలామంది “రాజకీయ బ్రాండింగ్ ఈవెంట్”గా చూస్తున్నారు.ఏంటీ ఫైట్?యూఎఫ్సీ.. “అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్”. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) పోటీ సంస్థ. బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, కరాటే, జియూ-జిట్సు వంటి పలు యుద్ధ కళలను కలిపి జరిగే పోరాటాలను ఇందులో నిర్వహిస్తారు. అమెరికాలో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్గా ఎదిగింది. ఆక్టగాన్ అనే ఎనిమిది కోణాల రింగ్లో ఫైటర్లు తలపడటం యూఎఫ్సీ ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ పోటీలను వీక్షిస్తుంటారు. ప్రస్తుతం ఇది కేవలం క్రీడ మాత్రమే కాకుండా భారీ ఎంటర్టైన్మెంట్, బిజినెస్ ఇండస్ట్రీగా కూడా మారింది.
చైనా షాడో గేమ్లో పాక్.. కశ్మీర్పై హైవోల్టేజ్ డ్రామా!
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనా పర్యటన తర్వాత మళ్లీ కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. పాక్, చైనా కశ్మీర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించాయి. ‘చరిత్రలో మిగిలిన సమస్య(left over from history)’ అంటూ UN తీర్మానాల ప్రకారం పరిష్కారం కావాలని పేర్కొన్నాయి. అయితే, షరీఫ్.. చైనా పర్యటనలో ఏం జరిగిందనే అంశాలపై చర్చ మొదలైంది. భారత్పై కుట్రతో రెండు దేశాలు ఏం ప్లాన్ చేశాయనే చర్చ జోరందుకుంది. మరోవైపు.. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జమ్ముకశ్మీర్, లడఖ్ భారత్లో అంతర్భాగాలని స్పష్టం చేసింది.పాక్ పీఎం షరీఫ్ నాలుగు రోజుల చైనా పర్యటనలో అధ్యక్షుడు షీ జిన్పింగ్తో పాటు ఉన్నతాధికారులతో విస్తృత చర్చలు జరిపారు. అధికారికంగా ఈ భేటీల్లో CPEC (చైనా–పాకిస్థాన్ ఆర్థిక కారిడార్) విస్తరణ, గ్వాదర్ పోర్ట్ను ప్రాంతీయ ట్రేడ్ హబ్గా అభివృద్ధి చేయడం, రక్షణ సహకారం, ఆర్థిక పెట్టుబడులు ప్రధాన అంశాలుగా ఉన్నప్పటికీ అసలు వ్యూహాత్మక చర్చలు భిన్నంగా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రకటనలో కశ్మీర్ను మళ్లీ ప్రస్తావించడం వెనుక చైనా–పాక్ ఉమ్మడి వ్యూహం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్ దీర్ఘకాలంగా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. చైనా మద్దతుతో ఆ ప్రయత్నానికి కొత్త ఊపొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా భారత్ పెరుగుతున్న ఆర్థిక, సైనిక ప్రభావాన్ని కట్టడి చేయడం ఈ వ్యూహంలో ఒక భాగంగా కనిపిస్తోంది.ఇక చైనా వైపు నుంచి చూస్తే, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కీలక భాగమైన CPEC భద్రత అత్యంత ప్రాధాన్యం. గిల్గిట్–బాల్టిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లే ఈ కారిడార్పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ బీజింగ్ ఆ ప్రాంతాల్లో పెట్టుబడులు పెంచుతూ, గ్వాదర్ పోర్ట్ను అరేబియా సముద్రంలో వ్యూహాత్మక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ పరిణామాల వెనుక “కనిపించని ఒత్తిడి వ్యూహం” ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కశ్మీర్ అంశాన్ని మళ్లీ మళ్లీ లేవనెత్తడం ద్వారా భారత్పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచడం, అంతర్జాతీయ వేదికల్లో చర్చను కొనసాగించడం పాక్ లక్ష్యంగా కనిపిస్తోంది. చైనా ఈ అంశాన్ని నేరుగా రాజకీయంగా కాకుండా, వ్యూహాత్మక భాగస్వామ్యం రూపంలో ఉపయోగిస్తోందని భావిస్తున్నారు.India has firmly rejected Pakistan-China references on Jammu & Kashmir. 🇮🇳“No other country has the locus standi to comment.”MEA makes it crystal clear: Jammu & Kashmir and Ladakh “have been, are and will always remain integral and inalienable parts of India.” https://t.co/NTzHeyiCGh pic.twitter.com/ZJs2lpnW15— India First Post (@ifpost47) May 26, 2026అయితే, భారత్ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా తిరస్కరించింది. జమ్ము కశ్మీర్, లడఖ్ దేశానికి అంతర్భాగాలని స్పష్టం చేస్తూ, ఇతర దేశాలు ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి ఎలాంటి హక్కు లేదని విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. అంతేకాకుండా CPEC ప్రాజెక్ట్ను భారత సార్వభౌమాధికారానికి విరుద్ధంగా పేర్కొంటూ దీర్ఘకాల అభ్యంతరాన్ని పునరుద్ఘాటించింది. మొత్తం పరిణామాన్ని పరిశీలిస్తే, ఇది కేవలం ప్రకటన స్థాయిలో జరిగిన వ్యాఖ్యల కంటే ఎక్కువగా చైనా–పాక్ వ్యూహాత్మక సమన్వయాన్ని సూచిస్తోందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఆర్థిక కారిడార్ విస్తరణ, మరోవైపు దౌత్య వేదికలపై కశ్మీర్ ప్రస్తావన ద్వారా భారత్పై “డబుల్ ప్రెషర్ స్ట్రాటజీ” అమలు చేస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉందని, భారత్–చైనా–పాక్ మధ్య సంబంధాలు మరింత సంక్లిష్ట దశలోకి వెళ్లినట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.UN తీర్మానాల చరిత్ర👉1948లో UNSC Resolution 47 ద్వారా కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికపైకి తీసుకువచ్చారు. ఆ తీర్మానం ప్రకారం, పాకిస్తాన్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి, భారత్ సైన్యం తగ్గించుకోవాలి. తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ (plebiscite) జరగాలి. కానీ, అమలు జరగలేదు. అప్పటి నుంచి కాశ్మీర్ అంశం UNలో పునరావృతమవుతూ వస్తోంది.భారత్ ఆందోళనలు👉China–Pakistan Economic Corridor (CPEC) ప్రాజెక్టులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) మీదుగా వెళ్తున్నాయి. భారత్ దీన్ని సార్వభౌమత్వానికి విరుద్ధంగా భావిస్తోంది. గ్వాదర్ పోర్ట్ అభివృద్ధి, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు అన్నీ చైనా–పాకిస్తాన్ సంబంధాలను బలపరుస్తున్నాయి. దీని వల్ల భారత్కి వ్యూహాత్మకంగా ఒత్తిడి పెరుగుతోంది. చైనా–పాకిస్తాన్ కశ్మీర్ను అంతర్జాతీయ వేదికల్లో మళ్లీ ప్రస్తావించడం భారత్ను ఇరకాటంలో పడేస్తోంది.ఎందుకు మళ్లీ కశ్మీర్?పాకిస్తాన్ లాభం: చైనా సంయుక్త ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావన రావడం పాకిస్తాన్కి దేశీయంగా చూపించుకునే రాజకీయ విజయంగా ఉంటుంది.చైనా వ్యూహం: పాకిస్తాన్ One China Policy (తైవాన్, హాంకాంగ్, జిన్జియాంగ్)కి మద్దతు ఇస్తుంది.CPEC (China–Pakistan Economic Corridor), గ్వాదర్ పోర్ట్ అభివృద్ధి వంటి ప్రాజెక్టులకు పాకిస్తాన్ సహకారం కొనసాగుతుంది.కశ్మీర్ ప్రస్తావన చైనాకు తక్కువ ఖర్చుతో పాకిస్తాన్ అనుకూలతను పొందే మార్గం.ఈ భాగస్వామ్యం భారత్కి భౌగోళిక–రాజకీయ సవాలుగా మారింది.చైనా వ్యూహం ఏంటి?భారత్ ఎదుగుదలను అడ్డుకోవడమే డ్రాగన్ అసలు లక్ష్యంCPEC ద్వారా అరేబియా సముద్రానికి ప్రత్యక్ష మార్గం పొందాలని ప్లాన్గ్వాదర్ పోర్ట్ను మిలిటరీ & ట్రేడ్ హబ్గా మార్చే ప్రయత్నంభారత్ను రెండు వైపులా ఒత్తిడిలో పెట్టేందుకు పాక్కు మద్దతుక్వాడ్, ఇండో–పసిఫిక్ కూటములకు కౌంటర్గా దక్షిణాసియాలో ప్రభావం పెంపు
అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. మూడు నెలలుగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణల్లో తాజాగా మరో కీలక మలుపు చోటుచేసుకుంది. గురువారం హర్ముజ్ జలసంధి పరిసరాల్లో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతిదాడులు జరిపినట్లు సమాచారం. బందర్ అబ్బాస్ సమీపంలో అమెరికా నిర్వహించిన తాజా వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు టెహ్రాన్ ప్రకటించింది.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్కు అనుబంధ వర్గాలు విడుదల చేసిన ప్రకటనల్లో.. “ప్రాంతీయ భద్రతను ఉల్లంఘించే ప్రతి చర్యకు సమాధానం ఉంటుంది” అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే మరింత తీవ్రస్థాయిలో దాడులు కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశారు. హర్ముజ్ సమీపంలోని అమెరికా బలగాలు, సముద్ర మార్గాల్లో కదులుతున్న మిలిటరీ కార్యకలాపాలపై తమ నిఘా కొనసాగుతోందని ఇరాన్ పేర్కొంది.మరోవైపు అమెరికా కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారులు ఇరాన్లోని కొన్ని సైనిక కేంద్రాలపై రాత్రికి రాత్రే కొత్త వైమానిక దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, అమెరికా బలగాలకు ముప్పుగా మారే డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. పలు ఇరానియన్ డ్రోన్లను గాల్లోనే కూల్చివేసినట్లు కూడా అమెరికా వర్గాలు ప్రకటించాయి. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న వేళ.. ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయన్న వార్తలు రావడం పరిస్థితిని మరింత గందరగోళంగా మారుస్తోంది. ఇటీవల ఇరాన్ ప్రభుత్వ మీడియా “హర్ముజ్లో సంయుక్త నిర్వహణ, ఆంక్షల సడలింపు” వంటి అంశాలతో ఒప్పందం కుదిరిందని ప్రచారం చేయగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఆ వార్తలను ఖండించారు. “హర్ముజ్ తెరిచే ఉంటుంది.. నియంత్రణ అమెరికా మిత్రదేశాల భద్రతకే ప్రాధాన్యం” అని ట్రంప్ స్పష్టం చేశారు.ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గమైన హర్ముజ్ జలసంధి చుట్టూ యుద్ధ వాతావరణం మరింత తీవ్రమవుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా కలవరపడుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. దీంతో అక్కడ చిన్న ఉద్రిక్తత జరిగినా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు భారీ హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి.రష్యా, చైనా వంటి దేశాలు ఇరు పక్షాలు అదుపు పాటించాలని పిలుపునిస్తుండగా.. ఐక్యరాజ్యసమితి కూడా పరిస్థితిని అత్యంత ఆందోళనకరంగా చూస్తోంది. ఒకవైపు చర్చలు.. మరోవైపు క్షిపణులు, డ్రోన్ దాడులు కొనసాగుతుండటంతో “ఇది నిజంగా శాంతి ప్రయత్నమా? లేక యుద్ధానికి ముందు వ్యూహాత్మక ఒత్తిడా?” అన్న చర్చ అంతర్జాతీయ వేదికలపై మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా హర్ముజ్పైనే నిలిచింది. ఎందుకంటే అక్కడి ప్రతి కదలిక ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య యుద్ధమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది.
జాతీయం
రిజర్వ్ తీర్పులపై హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: “జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్”.. అంటే ఆలస్యమైన న్యాయం అనేది న్యాయం కాదనే సూత్రాన్ని మరోసారి గుర్తు చేసింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో.. శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కేసుల విచారణ పూర్తై తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత నెలలు, సంవత్సరాల తరబడి ఆలస్యం చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఇకపై రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్టంగా మూడు నెలల్లో ఇవ్వాలని స్పష్టం చేసింది.తీర్పుల ఆలస్యం కారణంగా ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం దెబ్బతింటోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ పూర్తయినా తీర్పు రాకపోవడంతో బాధితులు, పిటిషనర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని కోర్టు అభిప్రాయపడింది. ఈ మార్గదర్శకాలను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.హైకోర్టుల్లో రిజర్వ్ చేసిన తీర్పులు చాలా కాలం వెలువడకపోవడంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ముఖ్యంగా కొన్ని కేసుల్లో సంవత్సరాల పాటు తీర్పులు రాకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాల ప్రకారం:రిజర్వ్ చేసిన తీర్పులను సాధ్యమైనంత త్వరగా, గరిష్టంగా మూడు నెలల్లో ప్రకటించాలిమూడు నెలలు దాటితే ఆ కేసు వివరాలను సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) దృష్టికి తీసుకెళ్లాలిపెండింగ్లో ఉన్న రిజర్వ్ తీర్పుల జాబితాను క్రమం తప్పకుండా పరిశీలించాలిఆలస్యమైన తీర్పులపై పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలిపూర్తి కారణాలతో కూడిన తీర్పు ఏడు రోజుల్లో అప్లోడ్ చేయాలి.ప్రత్యేక పరిస్థితుల్లో 15 రోజుల్లో తీర్పు అప్లోడ్ చేయాలి.బెయిల్ లేదా శిక్ష సస్పెన్షన్ ఉత్తర్వులు వెంటనే అధికారులకు తెలపాలి.బెయిల్ ఉత్తర్వులు రద్దు చేస్తే మరుసటి రోజే ప్రకటించాలి.ఖైదీల విడుదల సాధ్యమైనంత వరకు అదే రోజు లేకపోతే మరుసటి రోజు జరగాలి. కొన్ని హైకోర్టుల్లో తీర్పులు సంవత్సరాల పాటు పెండింగ్లో ఉండటం “వ్యవస్థలోని తీవ్రమైన సమస్య”గా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక కేసులో జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తి రెండేళ్ల పాటు తీర్పును రిజర్వ్లో ఉంచడాన్ని సుప్రీంకోర్టు “షాకింగ్”గా అభివర్ణించిన విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.న్యాయపరమైన జాప్యాలు2025 నాటికి, భారతదేశంలోని హైకోర్టులన్నింటిలో 60 లక్షలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో అలహాబాద్, పంజాబ్, హర్యానా, మద్రాస్ హైకోర్టులలో అత్యధికంగా కేసులు పేరుకుపోయాయి. తీర్పుల జాప్యం: జార్ఖండ్ హైకోర్టులో (ఈ తీర్పుకు దారితీసిన కేసు), అనేక తీర్పులు రిజర్వ్ చేసిన తర్వాత 2 సంవత్సరాలకు పైగా ఆలస్యం కావడంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది.బెయిల్ ఉత్తర్వులుభారతదేశంలోని జైళ్లలో ఉన్నవారిలో 70 శాతానికి పైగా విచారణలో ఉన్న ఖైదీలేనని ఎన్సీఆర్బీ గణాంకాలు చూపిస్తున్నాయి. బెయిల్ ప్రకటనలు, సమాచార మార్పిడిలో జాప్యం కారణంగా, వేలాది మంది అవసరమైన దానికంటే ఎక్కువ కాలం జైలులోనే ఉండిపోతున్నారు.అప్లోడ్ ఆలస్యంకొన్ని హైకోర్టులలో తీర్పులను ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి వారాల నుండి నెలల సమయం పడుతోందని అధ్యయనాల ద్వారా వెల్లడైంది. ఇది పారదర్శకతను అందుబాటును పరిమితం చేస్తుంది. వేగవంతమైన బెయిల్సుప్రీంకోర్టు ఆదేశాల పర్యవసానంగా అదే రోజు బెయిల్ ప్రకటనలు, సమాచార మార్పిడి జైళ్లలో రద్దీని తగ్గిస్తాయి విచారణలో ఉన్న ఖైదీల హక్కులను కాపాడతాయి.పారదర్శకత24 గంటలలోపు తీర్పులను అప్లోడ్ చేయడం ద్వారా ప్రజలకు అందుబాటును కల్పించి, అనిశ్చితిని తగ్గిస్తుంది. జవాబుదారీతనం: 3 నెలలలోపు తీర్పులు వెలువడకపోతే రిజిస్ట్రార్ జనరల్స్ కేసులను ఉన్నతాధికారులకు నివేదించాలి, తద్వారా అంతర్గత తనిఖీలు ఏర్పడతాయి.జవాబుదారీతనం3 నెలల్లోగా తీర్పులు వెలువడకపోతే రిజిస్ట్రార్ జనరల్స్ కేసులను ఉన్నతాధికారులకు నివేదించాలి, తద్వారా అంతర్గత తనిఖీలు ఏర్పడతాయి. ఫలితంగా పౌరులకు త్వరితగతిన న్యాయం లభిస్తుంది, తద్వారా న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది.సవాళ్లు, పనిభారం, ఒత్తిడిన్యాయమూర్తులు వేగాన్ని, వాదనల నాణ్యతను సమతుల్యం చేసుకోవాలి. మౌలిక సదుపాయాల అవసరాలు24 గంటలూ అప్లోడ్లు జరిగేలా చూసేందుకు హైకోర్టులకు మరింత పటిష్టమైన ఐటీ వ్యవస్థలు అవసరం. అన్ని హైకోర్టులలో గడువుల పాటింపును పర్యవేక్షించడానికి యంత్రాంగాలు ఉండాలి.రాష్ట్రాల వారీగా వ్యత్యాసంఎక్కువ కేసుల భారం ఉన్న పెద్ద హైకోర్టులు (ఉదాహరణకు, అలహాబాద్) చిన్న వాటి కంటే ఎక్కువగా ఇబ్బంది పడవచ్చు.
ఒక్కసారిగా పేలిన ఏసీ : మాజీ ఐఏఎస్ అధికారి దుర్మరణం
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఏసీ ఇండోర్ యూనిట్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి మాజీ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ (80) మృతిచెందారు.పోలీసులకు సమాచారం ప్రకారం మే 27 బుధవారం రాత్రి 11:18 గంటల ప్రాంతంలో హౌజ్ ఖాస్లోని ఆర్-15 నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది, ఇంట్లోని ఏసీ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తీవ్రంగా గాయపడిన ధనేంద్ర కుమార్కు ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు. కానీ దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక ట్రామా సెంటర్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ప్రమాద సమయంలో ధనేంద్రకుమార్, ఆయన కుమారుడితోపాటు మరో ముగ్గురు పనివారు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ఆలస్యమైంది. ఫైర్ సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇంట్లో ఉన్న ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో ధనేంద్ర కుమార్ పొగ కారణంగా ఊపిరి తీసుకోలేక మరణించగా, ఆయన కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు ఈ ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని, విద్యుత్ లోపంపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.Delhi: Ramesh, domestic helper says, ''Actually, this accident happened last night. The accident happened due to short circuit. The short circuit was in the AC and that's why there was a fire. So, this accident happened...'' pic.twitter.com/5i8y6thXef— IANS (@ians_india) May 28, 2026 షార్ట్ సర్క్యూట్ : ఏసీలో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గృహ సహాయకుడు రమేష్ మీడియాకు వెల్లడించారు. Delhi: In South Delhi’s Hauz Khas area, a massive fire broke out late Wednesday night in house R-15 due to a short circuit. In the incident, 80-year-old retired IAS officer Dhanendra Kumar died of suffocation caused by smoke inhalation. pic.twitter.com/yZEX60EX3N— IANS (@ians_india) May 28, 2026ఎవరీ ధనేంద్ర కుమార్ ? ధనేంద్ర కుమార్ 1946లో జన్మించారు. ఆయన 1968 బ్యాచ్కు చెందిన ప్రతిభావంతుడైన ఐఏఎస్ (IAS) అధికారి. తన సుదీర్ఘ కెరీర్లో కేంద్ర, హర్యానా ప్రభుత్వాలలో పలు కీలక పదవుల్లో సేవలందించారు.ఈయన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తొలి ఛైర్మన్ కూడా. 2009 ఫిబ్రవరి- 2011 జూన్ వరకు పనిచేశారు. మార్కెట్లో పెద్ద కంపెనీల ఏకఛత్రాధిపత్యాన్ని అరికట్టే చట్టాలను అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేంద్ర రక్షణ శాఖ, రోడ్డు రవాణా & రహదారుల శాఖ, సాంస్కృతిక శాఖల్లో కార్యదర్శిగా (Secretary) పలు సేవలందించారు.2005, నవంబర్ -2009, జనవరి వరకు వరల్డ్ బ్యాంక్లో భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ దేశాల తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ముఖ్యంగా హర్యానా ముఖ్యమంత్రికి ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. అక్కడ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 'నేషనల్ సిటిజన్స్ అవార్డు' లభించింది. పదవీ విరమణ తర్వాత కూడా ఆయన చురుగ్గా ఉన్నారు. COMPAD సంస్థకు వ్యవస్థాపక చైర్మన్గా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో చీఫ్ మెంటార్గా సేవలందించారు.
రీల్స్తో పెట్టుబడులను ఆహ్వానిస్తున్న కొత్త తరం మంత్రులు
సాక్షి, చెన్నై: తమిళనాడు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన ఎంచుకున్న సరికొత్త డిజిటల్ పద్ధతి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, త్వరితగతిన లభించే అనుమతులపై ఆమె ఇన్స్ట్రాగామ్ ’రీల్స్’ రూపంలో ఒక వీడియోను విడుదల చేశారు. దీనిపై నెటిజన్ల నుండి ఒకవైపు భారీగా ప్రశంసలు దక్కుతుండగా, మరోవైపు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజల్ని రీల్స్ , డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ల వేదికగా ఆకర్షించిందన్నది జగమెరిగిన సత్యం. తాజాగా అధికారంలోకి వచ్చినానంతరం కూడా రీల్స్ హోరెతుత్తుతున్నాయి. ఈ పరిస్థితులలో మంత్రి మంత్రి కీర్తన తన రీల్స్ వీడియోలో ‘తమిళనాడు భవిష్యత్తు కోసం ఎదురుచూడటం లేదు.. ఆ భవిష్యత్తును మనమే స్వయంగా నిర్మిస్తున్నాం. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఫైళ్లు , అనుమతుల కోసం నెలల తరబడి వేచి ఉండే పాత పద్ధతులను ఎవరూ ఇష్టపడరు. ఆ లోపాన్ని సరిదిద్ది, వ్యవస్థను వేగవంతం చేయడానికే సీఎం విజయ్ తనను ఈ స్థానంలో నియమించారు’ అని వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కేవలం 21 రోజుల్లోనే అత్యంత వేగంగా సింగిల్ విండో ద్వారా అన్ని రకాల పారిశ్రామిక అనుమతులను ఇచ్చేందుకు కట్టుబడి ఉందని ప్రకటలించారు. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ తమిళనాడులో పెట్టు బడులు పెట్టండి‘ అని ఆమె ఆ వీడియోలో పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనే ’రీల్స్’ , చిన్న చిన్న వీడియోల ద్వారా ప్రజలను ఆకట్టుకుని గుర్తింపు తెచ్చుకున్న కీర్తన, ఇప్పుడు మంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి అదే సోషల్ మీడియా వ్యూహాన్ని అమలు చేయడం గమనార్హం. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా యువతను, ఆధునిక పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో మంత్రి రీల్స్ చేయడం అభినందనీయమని, ఇది పారదర్శకతను పెంచుతుందని ఒక వర్గం మద్దతు తెలుపుతోంది. అదే సమయంలో అంతర్జాతీయ , దేశీయ దిగ్గజ సంస్థల నుండి కోట్లాది రూపాయల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారిక సమావేశాలు కాకుండా, ఇలా ’రీల్స్’ ద్వారా పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రభుత్వ సీరియస్నెస్ను తగ్గిస్తుందంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఒక మంత్రి పారిశ్రామిక విధానాలను వివరించడానికి రీల్స్ రూపంలో ముందుకు రావడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్కు తెరలేపినట్లైంది. View this post on Instagram A post shared by Virudhai Magal Keerthana (@virudhai_magal_keerthana)
టీవీకేలో చేరుతారా? లేక రాజకీయాలకు విరామమా?
సాక్షి, చెన్నై: ప్రస్తుత రాజకీయ పరిణామాలు? మనం ఏం చేయాలి? అనే విషయాలపై తనకు ఘన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, భావాలను అడిగి తెలుసుకుంటున్నానని అన్నాడీఎంకే సీనియర్ నేత సీ విజయ భాస్కర్ ప్రకటించారు. వారి నిర్ణయానికి అనుగుణంగానే రాజకీయ భవిష్యత్తుపై తన తదుపరి అడుగు ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పుదుక్కోట్టై జిల్లా విరాలిమలైలోని తన నివాసంలో విజయభాస్కర్ గురువారం తన ముఖ్య అనుచరులు, నియోజకవర్గ నేతలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. పళనిస్వామితో రాజీపై అసంతృప్తి? పార్టీ మరింత బలహీనపడకుండా చూసేందుకు బుధవారం తిరుగుబాటు వర్గానికి చెందిన కీలక నేతలు ఎస్.పి. వేలుమణి నేతృత్వంలో పలువురు నేతలు చెన్నై గ్రీన్వేస్ రోడ్డులోని పళనిస్వామి నివాసానికి వెళ్లి రాయబార చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో ఇరు వర్గాలు సచివాలయానికి వెళ్లి, పరస్పరం ఎమ్మెల్యేలపై ఇచ్చిన అనర్హత వేటు లేఖలను ఉపసంహరించుకున్నారు. అలాగే అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా పళనిస్వామిని, విప్గా అగ్రి కృష్ణమూర్తిని ఎన్నుకున్నట్లు స్పీకర్ జేసీడీ ప్రభాకర్కు లేఖలు అందించారు.అయితే, ఈ రాజీ ప్రక్రియలో సి.వి. షణ్ముగం పాల్గొనలేదు. ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు , మద్దతు దారులతో మంతనాలలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ సమయంలో సి. విజయభాస్కర్ స్పీకర్ను కలవడానికి వచ్చినప్పటికీ, పళనిస్వామిని వ్యక్తిగతంగా కలవకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన కూడా ప్రస్తుత పరిణామాలపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుచరుల ముందు 3 ప్రత్యామ్నాయాలు ఈ నేపథ్యంలోనే విజయభాస్కర్ విరాలిమలైలో తన మద్దతుదారులతో అత్యవసర సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై ముఖ్యంగా మూడు ప్రతిపాదనలను అనుచరుల ముందు ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం అన్నాడీఎంకేలో కొనసాగాలా? లేదా, విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరాలా? లేదా ప్రస్తుతానికి రాజకీయాల నుంచే తప్పుకోవాలా? అన్న మూడు అంశాల ఆధారంగా ఈ మంతనాలు జరుగుతుండటం గమనార్హం. ప్రజల తీర్పు ప్రకారమే నిర్ణయం సమావేశం అనంతరం విజయభాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో తన తదుపరి అడుగు ఎలా ఉండాలనే దానిపై విజయానికి శ్రమించిన పార్టీ నిర్వాహకులు, జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నానని తెలిపారు. తనను గెలిపించిన దేవుళ్లు అయిన నియోజకవర్గ ప్రజల మనోభావాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే తదుపరి రాజకీయ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని పేర్కొన్నారు.
ఎన్ఆర్ఐ
నో వీసా, నో సిటిజన్షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?
లండన్: విద్యాభ్యాసం కోసం స్టూడెంట్ వీసాపై స్కాట్లాండ్కు వచ్చిన తమిళనాడు విద్యార్థి క్యూ మణివణ్ణన్ రాజకీయపథంలో పయనించి పార్లమెంట్లో అడుగుపెట్టడం ఇప్పుడు అక్కడ సరికొత్త చర్చకు దారితీసింది. విదేశీ విద్యార్థులు విదేశీగడ్డపై చదువుకుని ఉన్నతస్థాయిలో స్థిరపడాల్సిందిపోయి విదేశీ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గతేడాది తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో విదేశీ విద్యార్థులూ ఎన్నికల రణక్షేత్రంలో పోటీపడేందుకు అవకాశం చిక్కింది. ఈ సువర్ణావకాశాన్ని మణివణ్ణన్ అందిపుచ్చుకుని స్కాటిష్ గ్రీన్పార్టీ తరఫున ఎడిన్బర్గ్ అండ్ లూథియన్స్ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. దీంతో మెంబర్ ఆఫ్ స్కాటిష్ పార్లమెంట్(ఎంఎస్పీ) సభ్యుడయ్యాడు. తాత్కాలిక వీసాపై వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన తొలి విదేశీ అభ్యర్థిగా మణివణ్ణన్ చరిత్రసృష్టించాడు. తమిళనాడులో పుట్టిన ఇతను 2021లో స్కాట్లాండ్కు వచ్చాడు. ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు కోర్సులో పీహెచ్డీ విద్యారి్థగా చేరాడు. కనీసం మూడేళ్లుగా బ్రిటన్లో ఉంటున్న, శాశ్వత స్థిరనివాస హోదా లేని విదేశీ పీహెచ్డీ విద్యార్థులూ స్కాట్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయొచ్చని గతేడాది చట్టసవరణ తీసుకొచ్చారు. దీంతో పరిపాలనలో వైవిధ్యం చూపేందుకు తానూ ఎన్నికల యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టానని ట్రాన్స్జెండర్ అయిన మణివణ్ణన్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. గ్రీన్స్ పార్టీ పాలస్తీనా సంఘీభావ విభాగానికి కో–కన్వీనర్గా పనిచేశాడు. గతంలో ఐక్యరాజ్యసమితి ఆరోగ్య, దివ్యాంగ కార్యకర్తగా పనిచేశాడు. తానో తమిళ వలసదారుడినని ప్రచారం చేసుకున్నాడు. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనువిదేశీయుడు మనకు ఎలా ప్రాతినిథ్యం వహించగలడని ప్రత్యర్థి పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా కాలపరిమితి ముగిసేలోపే అతని వీసా గడువు ముగిస్తే బ్రిటన్ గడ్డపై ఉండేందుకు అతను అర్హత కోల్పోతాడు. అప్పుడు అతను స్కాట్లాండ్ను వీడక తప్పదు. అప్పుడు ఎడిన్బర్గ్, లూథియన్స్ ప్రాంతవాసుల బాగోగులను ఎవరు పట్టించుకుంటారు? ఎంపీ లేకుండా ఒక నియోజకవర్గం అలా నిస్సహాయంగా మిగిలిపోవాలా? దీనిని పరిష్కారం ఏంటి? స్కాట్లాండ్ స్థానిక ప్రజల సంస్కృతి, సంప్ర దాయాలు, అవసరాలకు అనుగుణంగా జరిగే చట్టాలు, విధాన నిర్ణయాల్లో మణివణ్ణన్ మేరకు క్రియాశీలక పాత్ర పోషించగలడు? అంటూ ప్రశ్నల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. విదేశీ విద్యార్థుల మార్గదర్శకంలో నడవడమేంటి? అంటూ వలసల వ్యతిరేక యూకే విభాగ షాడో చాన్స్లర్, మాజీ ఎంపీ రాబర్ట్ జెన్రిక్ అన్నారు. అయితే ఈ అంశంలో మణివణ్ణన్కు గ్రీన్స్ పార్టీ అండగా నిలిచింది. అతని వీసా ఖచి్చతంగా రెన్యూవల్అయ్యేలా చూస్తామని పార్టీ నేత గిలియన్ మెకే తెలిపారు. వామపక్ష భావాలున్న గ్రీన్స్ పార్టీ తాజా ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఇదీ చదవండి: విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం
ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి, భారత సంతతికి చెందినకమలా ప్రసాద్-బిస్సెసర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని తన పూర్వీకుల మూలాల పట్ల ప్రగాఢమైన గర్వాన్ని వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన ఆమె, తన మూలాలను గుర్తుచేసుకుంటూ, ఒకప్పుడు అవమానకరంగా భావించిన పదాన్ని ఆత్మగౌరవానికి చిహ్నంగా ఎలా మార్చుకున్నారో వివరించారు.భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ట్రినిడాడ్లో (మే 8-9 తేదీలలో) పర్యటన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కమలా మాట్లాడుతూ, తన భారతీయ గుర్తింపు కారణంగా ఇప్పటికీ తనను అవమానించాలని ప్రయత్నిస్తున్న వారికి కమలా ప్రసాద్ తగిన విధంగా సమాధానమిచ్చారు.ట్రినిడాడ్లో నేటికీ అనేక చోట్ల భారతీయులను 'కూలీలు' అని పిలుస్తారని, ఇది ఒక అవమానకరమైన పదంగా పరిగణించబడుతుందని కమలా ప్రసాద్ అన్నారు. "కానీ నేను ఈ విషయంలో ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఆ 'కూలీల' కష్టం, రక్తం, చెమట వల్లే ఈ దేశం అభివృద్ధి చెందింది. ఈ రోజు ఒక కూలీ కూతురు ట్రినిడాడ్ ప్రధానమంత్రి అయినందుకు గర్వపడుతున్నాను" అని ఆమె ఎంతో గర్వంగా చెప్పారు. ఆమె ప్రకారం, తన భారతీయ గుర్తింపు పట్ల ఆమెకు ఎలాంటి కలత గానీ, సిగ్గు గానీ లేదు.ట్రినిడాడ్లోని జనాభాలో సుమారు 45 శాతం మంది భారతీయ సంతతికి చెందినవారని ప్రధానమంత్రి కమలా ప్రసాద్ అన్నారు. బ్రిటిష్ వారు భారతీయ కార్మికులను బానిసలుగా ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు, వారు తమతో పాటు రామాయణం, గీత, ఖురాన్ను కూడా తీసుకొచ్చారని చెప్పారు. వారికి ఆంగ్లం తెలియకపోయినా, ఎన్నో అఘాయిత్యాలను ఎదుర్కొన్నప్పటికీ, వారు తమ ప్రాచీన భారతీయ నాగరికత, భాష, సంస్కృతిని పరిరక్షించుకున్నారని ఆమె వెల్లడించారు.అంతేకాదు చారిత్రాత్మక పర్యటన సందర్భంగా కమలా ప్రసాద్ ఒక సంచలన ప్రకటన చేశారు. భారతీయుల గౌరవార్థం నెల్సన్ ఐలాండ్ పేరును మార్చనున్నట్లు తెలిపారు. 1866 నుండి 1917 వరకు, ఈ ద్వీపాన్ని భారతీయ ఒప్పంద కార్మికుల కోసం ఒక ల్యాండింగ్ స్టేషన్గా, క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించారు. భారతీయ పూర్వీకులను గౌరవిస్తూనే, ప్రజలను సంప్రదించి, కొత్త పేరును సూచించమని కోరతామని ఆమె అన్నారు. ప్రధానమంత్రి కమలా ప్రసాద్తో పాటు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా నెల్సన్ ఐలాండ్ను సందర్శించారు. భారత్-ట్రినిడాడ్ మధ్య 150 ఏళ్ల సంబంధాలకు ఇది కొత్త బలాన్ని చేకూరుస్తున్నందున, ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.కేంద్ర మంత్రి జై శంకర్ పర్యటన చారిత్రాత్మకమైన నెల్సన్ ద్వీపంలో ఉండటం నిజంగా చాలా ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి జై శంకర్సంతోషం వ్యక్తం చేశారు. సరిగ్గా 180 సంవత్సరాల క్రితం, భారతదేశం మరియు ట్రినిడాడ్-టొబాగోల చరిత్రలో తొలి అడుగు ఇక్కడే పడిందని గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు, ధైర్యవంతులైన భారతీయులు తమ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొని, కొత్త జీవితాలను ఎలా నిర్మించుకున్నారో ఆలోచించడం సహజమనీ అంటూ వారి ధైర్యసాహసాలకు, వారి సంకల్పానికి , వారి దృఢ నిశ్చయానికి నమస్సులు అందజేశారు.వారు జీవన విధానాన్ని, సంప్రదాయాలను , విశ్వాసాన్ని తమతో పాటు తీసుకువచ్చారు. నిజానికి, తమతో పాటు ఒక సంపూర్ణ నాగరికతను తీసుకువచ్చారు. వీటిని ఒక వారసత్వ ప్రదేశంగా భవిష్యత్ తరాల కోసం నమోదు చేయడం ఎంతైనా సముచితమని తెలిపారు. భారతదేశ గ్రాంట్ సహాయంతో నెల్సన్ ద్వీపంలోని సాంస్కృతిక వారసత్వాన్ని ఉన్నతీకరించడానికి ఉద్దేశించిన ఒక క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలోకార్యక్రమంలో జై శంకర్ పాల్గొన్నారు. కమలా ప్రసాద్ ఘనతభారత సంతతికి చెందిన కమలా ప్రసాద్-బిస్సేసర్ 2010లో ట్రినిడాడ్ మరియు టొబాగోకు మొదటి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. 2010లో మొదటిసారి, ఆ తరువాత 2026లో కూడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.ఆమె వ్యక్తి. బ్రిటీష్ పాలనలో భారతదేశం నుండి చెరకు తోటలలో పనిచేయడానికి 'గిర్మిటియా' కార్మికులుగా వెళ్లిన వారి వారసురాలు ఆమె. 19వ శతాబ్దంలో బ్రిటీష్ వారు భారతదేశం నుండి ఒప్పంద కార్మికులను (Indentured Labourers) కరేబియన్ దేశాలకు తరలించారు. వారిని తక్కువ చూపు చూస్తూ "కూలీ" అని పిలిచేవారు. ఇది ఒక జాతి వివక్షతో కూడిన పదంగా (Racial Slur) ఉండేది. View this post on Instagram A post shared by Ministry of Health T&T (@minhealthtt)
కోటి రూపాయల శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!
మనం జీవితంలో ఏదో ఒక దశలో ఎత్తుపల్లాలు చూస్తుంటాం. కానీ ఆ క్రిటికల్ టైంలో కూడా ధైర్యంగా నిలబడిన వాడే మనిషి. అదే చెబుతోంది ఈ భారత సంతతి మహిళ కథ. ఒక్కోసారి మన రేంజ్ ఆకాశమంత ఉంటే..అకస్మాత్తుగా విధి అథఃపాతాళానికి పడేస్తుంటుంది. మళ్లీ లేచి నిలబడలేనంతగా విపత్కర పరిస్థితి ఎదురవ్వతుంటుంది. ఆ సమయంలో చాకచక్యంగా మనకు దొరికిన చిన్న చిన్న అవకాశాల నుంచి మళ్లీ మొదలు పెడుతూ నిలబడ్డ వ్యక్తి సత్తా ఉన్న హీరో. ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనం ఆమె.భారత సంతతి మహిళ శ్వేతా దేశాయ్ ఒకప్పుడు లండన్లోని ఒక ప్రముఖ వాణిజ్య వ్యాపార వెబ్సైట్లో హెడ్ ఆఫ్ ప్రొడక్ట్గా పనిచేశారు. ఏకంగా కోటి రూపాయల వేతనం అందుకుంటూ మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేసేవారామె. అలాంటి 37 ఏళ్ల శ్వేతకు 2023 చివరలో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మెల్బోర్న్కు వెళ్లడంతో ఆమె పరిస్థితి తలకిందులైపోయింది. అక్కడ తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరకడం చాలా కష్టమైపోయింది. మెల్బోర్న్ ఉద్యోగ మార్కెట్ అత్యంత చిన్నాభిన్నంగా ఉండటంతో జాబ్ వేట చుక్కలు చూపించిందామెకు. అప్పటి వరకు అంత పెద్ద హోదాలో ఉన్న శ్వేతకు తన గుర్తింపును కోల్పోతున్న వేదన ఎక్కువైంది. తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరక్క చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. దాంతో తనకు వస్తున్న ఉద్యోగాల ఆఫర్లలో జాయిన్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. అదెలాంటి ఉద్యోగం అంటే..కార్పొరేట్ ఉద్యోగ జీవితం నుంచి అపార్ట్మెంట్లు శుభ్రం చేసే స్థాయికి చేరిపోవాల్సి వచ్చింది. ఆమెకు వచ్చిన తొలి జాబ్ ఆఫర్ Airbnb అపార్ట్మెంట్ల నిర్వహణనే నిర్వర్తించేందుకు రెడీ అయినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఆమె అపార్ట్మెంట్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం , అతిథుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తదితరాలు ఉంటాయి. ఇక ముంబైలో పుట్టి పెరిగిన శ్వేత ఉన్నత చదువుల కోసం 2008లో లండన్కు వెళ్లింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు బ్రిటిస్ రాజధానిలో ఒక ఇంటిని, జీవితాన్ని నిర్మించడంలో గడిపింది. 2023 నాటికి లండన్ బోటిక్ వెడ్డింగ్ రిజిస్ట్రీలో వార్షిక ఆదాయం దాదాపు రూ. కోట్లు ఆదాయం ఆర్చించేది. భర్త ఉద్యోగ రీత్యా మెల్బోర్న్కి వెళ్లడంతో పరిస్థితి అత్యంత విభిన్నంగా మారిపోయింది. ఈ మార్పు సహజంగానే ఆమె జీవనశైలిని తగ్గించుకునేలా చేసింది. లండన్లో, శ్వేతకు డిజైనర్ బ్యాగులు, ఫ్యాన్సీ మేకప్, ఆర్థిక స్వేచ్ఛ ఉండేవి. కానీ మెల్బోర్న్లో ఆమెకు అదే విలాసవంతమైన జీవితం దొరకలేదు. ఈ అనూహ్యమైన మార్పు తనను చాలా దారుణంగా కుంగదీసిందని చెప్పుకొచ్చింది. పైగా ఎవ్వరైన స్నేహితులు, బంధువుల ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడూ ఏ చెప్పాలో తెలిసేది కాదు. ఒక్కోసారి హౌస్ వైఫ్ అని ముసుగు కప్పుకుని తిరగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలో తనకు దొరికిన మొదటి ఉద్యోగ ఆఫర్లో వెంటనే చేరిపోయినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఈ ఉద్యోగం కారణంగా మళ్లీ ఇదవరకటిలా ఆత్మవిశ్వాసంగా ఉండగలిగానంటోంది. తాను అపార్ట్మెంట్లు నిర్వహించడం తోపాటు పిల్లలకు ఇంగ్లీష్ బోధించడం, సొంతంగా వ్యాపారాన్ని, కోచింగ్ ప్రాక్టీస్ వంటి వాటిని నిర్వహిస్తున్నారామె. ఏ ఉద్యోగం దొరకలేదని ఆగిపోకుండా..దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అందులో జాయిన్ అయిపోవడమే మేలని అంటోంది. చాలామంది డబ్బుకు అంత విలువలేదని ఏవేవో చెబుతుంటారు కానీ వాస్తవికంగా అది కరెక్ట్ కాదని అంటోందామె. అంతేగాదు ఆర్థిక స్వతంత్రను కలిగి ఉండటం అంటే తన ఇష్టానుసారం జీవితాన్ని గడిపే స్వేచ్ఛను కలిగి ఉండటం. డబ్బు అంటే ఎన్నో అవకాశాలు, స్వేచ్ఛ, కొన్నిసార్లు సంతోషం కూడా అని చెప్పుకొచ్చిందామె. ఒకప్పుడు అంత పెద్ద ఉద్యోగ హోదాతో చాలా బాగా బతికాను, పైగా తెలియకుండా ఆ లెవెల్ అహం నాలో చాలా పెరిగిపోయిందని తెలసుకున్నా అంటోందామె. ఇలా ఈ రేంజ్కి వచ్చేసినా..ప్రస్తుతం మూడు వేర్వరే పనులు చేస్తున్నట్లు తెలిపింది. ఇలా తనలా వేరేప్రాంతానికి మారడంతో ఉద్యోగం కోల్పోయి, ఐడెంటిటీని కోల్పోయి నరకం చూస్తున్న మహిళలకు కోసం “ది రీబిల్డ్ రూమ్” అనే వాట్సాప్ కమ్యూనిటీని ప్రారంభించానని, పైగా అలాంటివాళ్ల కోసం ప్రత్యేక కోచింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Shweta (@shweta_lifecoach) (చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..)
స్నేహితురాలి పెళ్లికి వెళ్లి..
హైదరాబాద్: అమెరికాలో స్విమ్మింగ్పూల్లో పడి నగర యువతి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగోజిగూడ డివిజన్ న్యూ శివపురి కాలనీకి చెందిన ముద్దసాని దేవేందర్ రెడ్డి, సునీత దంపతుల కూతురు శ్రీవీణ (28)కు 2023లో ప్రశాంత్ రెడ్డితో వివాహమైంది. అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవీణ స్నేహితురాలి వివాహం సందర్భంగా రెండు రోజుల క్రితం ఫ్లోరిడా వెళ్లారు. అక్కడ శ్రీవీణ స్విమ్మింగ్పూల్లో విగతజీవిగా కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు.అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఒక్కగానొక్క కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో నగరంలోని దేవేందర్ రెడ్డి, సునీత దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీవీణ తల్లిదండ్రులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్రెడ్డి, మాజీ కార్పొరేటర్, టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్రెడ్డి పరామర్శించారు. ఆమె భౌతిక కాయాన్ని అమెరికా నుంచి భారత్కు వీలైనంత తొందరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
క్రైమ్
నేపాలీ ఇదేం పని.. వీధిలో చేయిపట్టుకొని అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి
హైదరాబాద్: రాత్రివేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులను గురువారం అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బుధవారం రాత్రి బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఓ యువతి ఒంటరిగా వెళుతోంది. దీంతో నేపాల్ యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. యువతి గట్టిగా అరవడంతో స్థానికులు బంధించి బంధించి దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని అబిడ్స్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. స్థానికంగా ఓ ఫాస్ట్ఫుడ్ కేంద్రంలో పనిచేస్తున్న సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్ నేవులుగా గుర్తించారు.
ఒక్కసారిగా పేలిన ఏసీ : మాజీ ఐఏఎస్ అధికారి దుర్మరణం
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఏసీ ఇండోర్ యూనిట్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి మాజీ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ (80) మృతిచెందారు.పోలీసులకు సమాచారం ప్రకారం మే 27 బుధవారం రాత్రి 11:18 గంటల ప్రాంతంలో హౌజ్ ఖాస్లోని ఆర్-15 నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది, ఇంట్లోని ఏసీ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తీవ్రంగా గాయపడిన ధనేంద్ర కుమార్కు ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు. కానీ దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక ట్రామా సెంటర్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ప్రమాద సమయంలో ధనేంద్రకుమార్, ఆయన కుమారుడితోపాటు మరో ముగ్గురు పనివారు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ఆలస్యమైంది. ఫైర్ సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇంట్లో ఉన్న ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో ధనేంద్ర కుమార్ పొగ కారణంగా ఊపిరి తీసుకోలేక మరణించగా, ఆయన కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు ఈ ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని, విద్యుత్ లోపంపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.Delhi: Ramesh, domestic helper says, ''Actually, this accident happened last night. The accident happened due to short circuit. The short circuit was in the AC and that's why there was a fire. So, this accident happened...'' pic.twitter.com/5i8y6thXef— IANS (@ians_india) May 28, 2026 షార్ట్ సర్క్యూట్ : ఏసీలో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గృహ సహాయకుడు రమేష్ మీడియాకు వెల్లడించారు. Delhi: In South Delhi’s Hauz Khas area, a massive fire broke out late Wednesday night in house R-15 due to a short circuit. In the incident, 80-year-old retired IAS officer Dhanendra Kumar died of suffocation caused by smoke inhalation. pic.twitter.com/yZEX60EX3N— IANS (@ians_india) May 28, 2026ఎవరీ ధనేంద్ర కుమార్ ? ధనేంద్ర కుమార్ 1946లో జన్మించారు. ఆయన 1968 బ్యాచ్కు చెందిన ప్రతిభావంతుడైన ఐఏఎస్ (IAS) అధికారి. తన సుదీర్ఘ కెరీర్లో కేంద్ర, హర్యానా ప్రభుత్వాలలో పలు కీలక పదవుల్లో సేవలందించారు.ఈయన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తొలి ఛైర్మన్ కూడా. 2009 ఫిబ్రవరి- 2011 జూన్ వరకు పనిచేశారు. మార్కెట్లో పెద్ద కంపెనీల ఏకఛత్రాధిపత్యాన్ని అరికట్టే చట్టాలను అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేంద్ర రక్షణ శాఖ, రోడ్డు రవాణా & రహదారుల శాఖ, సాంస్కృతిక శాఖల్లో కార్యదర్శిగా (Secretary) పలు సేవలందించారు.2005, నవంబర్ -2009, జనవరి వరకు వరల్డ్ బ్యాంక్లో భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ దేశాల తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ముఖ్యంగా హర్యానా ముఖ్యమంత్రికి ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. అక్కడ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 'నేషనల్ సిటిజన్స్ అవార్డు' లభించింది. పదవీ విరమణ తర్వాత కూడా ఆయన చురుగ్గా ఉన్నారు. COMPAD సంస్థకు వ్యవస్థాపక చైర్మన్గా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో చీఫ్ మెంటార్గా సేవలందించారు.
61 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక లైంగికదాడి
తిరువొత్తియూరు: చెన్నై వేళచ్చేరిలో వృద్ధురాలిపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. చెన్నై వేళచ్చేరికి చెందిన 61 ఏళ్ల వృద్ధురాలు బుధవారం తెల్లవారుజామున మడిపాక్కం ప్రాంతం నుంచి వేళచ్చేరి వైపు నడిచి వెళుతోంది. బైకుల్లో వచ్చిన ఐదుగురు యువకులు వాకింగ్ ముగించుకుని వస్తున్న ఆమెతో పరిచయం చేసుకుని బైకులో ఎక్కించుకుని జన సంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఐదుగురు యువకులు ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డు పక్కన పడేసి అక్కడి నుంచి పారిపోయారు. రక్తగాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్న ఆమెను గురువారం ఉదయం అటుగా వెళుతున్న వారు చూసి పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు. వేళచ్చేరి పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను ఎగ్మూర్లోని ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. వేళచ్చేరి పోలీసులు, బిహార్ రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ల బాలుడు సహా ముగ్గురు ఇతర రాష్ట్ర కారి్మకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా, వారు ఆ ప్రాంతంలోని హోటళ్లలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను చూసి వెంబడించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వారు నేరం అంగీకరించారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాలను సేకరించి విచారణను వేగవంతం చేశారు.
కూతురి ప్రేమ వివాహం.. మనవడిని కుక్కర్తో కొట్టి చంపిన తాత!
తమిళనాడు: నామక్కల్ జిల్లాలోని పల్లిపాలయానికి చెందిన వెంకటాచలం. ఇతని భార్య అముధ. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వెంకటాచలం మద్యపానానికి బానిసయ్యాడు. ఇతను ఇంట్లోని పాత్రలను అమ్ముతాడు. ఆ డబ్బుతో మద్యం తాగుతూ తిరుగుతాడు. ఈ క్రమంలో, అతని పెద్ద కుమార్తె మోనిషా, భవానికి చెందిన మయిలానందన్తో ప్రేమలో పడింది. తల్లిదండ్రుల వ్యతిరేకత ఉన్నప్పటికీ వీరికి వివాహం జరిగింది. ఈ పరిస్థితుల్లో, మోనిషా 10 రోజుల క్రితం తన 10 నెలల బాబు జోష్విక్తో కలిసి తల్లి ఇంటికి వచ్చింది. దీనికి వెంకటాచలం అభ్యంతరం తెలిపి, ‘ఎందుకు ఇంటికి వచ్చావు? అని అడిగి కూతురిని కొట్టి, హింసించాడు. కుక్కర్ మూత తీసుకుని మోనిషాపై విసిరాడు. అది ఆ పిల్లాడి తలపై పడడంతో, ఆ పిల్లాడు గాయపడి మరణించాడు. మోనిషా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెంకటాచలాన్ని అరెస్టు చేశారు.
వీడియోలు
తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
గాదె వెంకటరెడ్డి మృతిపై YS జగన్ సంతాపం
పవన్ కళ్యాణ్ ను చెప్పుతో కొట్టిన తెలంగాణ మహిళ!
లాంచ్ ప్యాడ్ పైనే పేలిన బ్లూ-ఆరిజన్ రాకెట్ LC-36
TVK విజయ్ ని చూసి నేర్చుకో..పవన్కు ఇచ్చిపడేసిన తోట
కోడలు చనిపోతే.. ” మొక్కలకు నీళ్లు పోసేది కాదని అసలు వెటకారం ఏంటి
స్టాక్ మార్కెట్ లో కాఫీ డే షేర్లకు రెక్కలు
నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ప్రీమియర్ షోస్ ఫిక్స్...


