ఈ రాశి వారికి ధనప్రాప్తి.. సంఘంలో గౌరవం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: శు.పం^è మి రా.12.31 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: పూర్వాభాద్ర ప.2.01 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: రా.11.20 నుండి 12.53 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.52 నుండి 9.37 వరకు, తదుపరి ప.12.35 నుండి 1.19 వరకు, అమృత ఘడియలు: ఉ.6.06 నుండి 7.41 వరకు, వసంత పంచమి.సూర్యోదయం : 6.38సూర్యాస్తమయం : 5.46రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం.... అనుకున్న పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.వృషభం... నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాలగవు.మిథునం... పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.కర్కాటకం.... రుణాలు చేస్తారు. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. దైవదర్శనాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.సింహం...... సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. పనుల్లో జాప్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.కన్య...... పాతమిత్రుల కలయిక. కుటుంబంలో ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.తుల.... వ్యవహారాలలో విజయం. ముఖ్య సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.వృశ్చికం.... కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో వివాదాలు. పనులు హఠాత్తుగా విరమిస్తారు. ఆరోగ్యభంగం. మానసిక అశాంతి. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.ధనుస్సు... ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.మకరం.. శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.కుంభం.... చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.మీనం... పరిచయాలు పెరుగుతాయి. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కారం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
నకిలీ ఉత్పత్తులపై అవగాహన.. ఇదిగో
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియు నిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి.
యువతకు బంపరాఫర్.. సైన్యంలో చేరితే రూ. 2.5 లక్షల జీతం
జర్మనీ.. రెండో ప్రపంచ యుద్దం తర్వాత తొలిసారి తమ సైనిక విస్తరణపై దృష్టిసారించింది. యూరప్ ఖండంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని తాయారు చేయడమే లక్ష్యంగా జర్మనీ అడుగులు వేస్తోంది. జర్మనీ సర్కార్ తమ సాయుధ దళాలను ఆధునీకరించడానికి 377 బిలియన్ యూరోల (సుమారు రూ.33,93,000 కోట్లు ) భారీ నిధిని కేటాయించింది.ఇది ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద రక్షణ బడ్జెట్లలో ఒకటి. రష్యా నుంచి పెరుగుతున్న ముప్పు, అంతర్జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.యువతకు బంపర్ ఆఫర్..యువతను సైన్యం వైపు ఆకర్షించడానికి జర్మనీ భారీ జీతాన్ని ఆఫర్ చేస్తోంది. కొత్తగా చేరే సైనికులకు నెలకు 2,600 యూరోలు(భారత కరెన్సీలో సుమారు రూ. 2,80,000) ఇవ్వనున్నారు. అదేవిధంగా ఉచిత నివాసం, ఉచిత వైద్య సౌకర్యాలు కూడా అందించనున్నారు. కాగా సైన్యం ఎంపిక సంబంధించి జర్మనీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం.. జర్మనీ సర్కార్ 18 ఏళ్లు నిండిన యువకులందరికీ ఒక ఫారమ్ను పంపుతోంది. అందులో వారు తమ ఫిట్నెస్ లెవెల్స్, సైన్యంలో చేరడంపై ఆసక్తిని తెలియజేస్తూ సమాధానం కచ్చితంగా ఇవ్వాలి. అయితే సైన్యంలో చేరాలా? వద్దా అనేది? యువత ఇష్టానికే ప్రభుత్వం వదిలేసింది. కానీ ఒకవేళ అనుకున్న సంఖ్యలో (ఏడాదికి కనీసం 80,000 మంది) వాలంటీర్లు రాకపోతే, బలవంతంగా చేర్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. జర్మనీ సైన్యాన్ని 'బుండెస్వెహర్' అని పిలుస్తారు. ప్రస్తుతమున్న 1.8 లక్షల మంది సైనికులను 2035 నాటికి 2.6 లక్షలకు పెంచాలని జర్మనీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా 2 లక్షల మంది రిజర్వ్ సైన్యాన్ని కూడా సిద్దం చేయనున్నారు.
ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు...
రాయ్పూర్: న్యూజిలాండ్తో తొలి టి20లో ఘన విజయం తర్వాత భారత్ మరో విజయంపై గురి పెట్టింది. గత పోరులో అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన జట్టు 2–0తో ఆధిక్యం అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు న్యూజిలాండ్ కోలుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో రెండో టి20 మ్యాచ్కు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకున్నాడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సామ్సన్, ఇషాన్లపై దృష్టి... తొలి టి20లో భారత బ్యాటర్లలో అభిõÙక్ శర్మ చెలరేగగా, సూర్యకుమార్ కూడా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్లో ఉన్నంత సేపు పాండ్యా ప్రభావం చూపించగా... ఫినిషర్గా రింకూ సింగ్ తన పేరును నిలబెట్టుకున్నాడు. అయితే సామ్సన్, ఇషాన్ కిషన్ మాత్రమే ప్రభావం చూపలేకపోయారు. గిల్ను తప్పించడంతో టి20 టీమ్లో ఓపెనర్గా తన స్థానం చేసుకున్న సామ్సన్ అంచనాలకు తగినట్లుగా ఆడాల్సి ఉంది. అదే విధంగా వరల్డ్ కప్ టీమ్లో కూడా చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్పై నమ్మకంతో మేనేజ్మెంట్ మూడో స్థానంలో ఆడే అవకాశం కల్పించింది. ఒక్క మ్యాచ్లో వైఫల్యం సమస్య కాకపోయినా... చెత్త షాట్లతో వీరు వికెట్లు సమర్పించుకున్నారు. ఈసారి తప్పులు దిద్దుకునే అవకాశం వీరికి ఉంది. పేస్ బౌలింగ్లో మరోసారి అర్‡్షదీప్, బుమ్రా ప్రదర్శనపై జట్టు ఆధారపడి ఉండగా, పాండ్యా కూడా కీలక పాత్ర పోషిస్తాడు. స్పిన్నర్లుగా వరుణ్, అక్షర్ ప్రత్యర్థిపై పైచేయి సాధించగలరు. అయితే తొలి మ్యాచ్లో చేతికి గాయంతో బౌలింగ్ నుంచి తప్పుకున్న అక్షర్ ఆడకపోతే మరో స్పిన్నర్ బిష్ణోయ్కు చోటు లభించవచ్చు. తుది జట్టులోకి బ్రేస్వెల్! భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ గత మ్యాచ్లో న్యూజిలాండ్ పోరాడినా ఫలితం లేకపోయింది. అయితే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి సిరీస్ను సమం చేయాలని జట్టు ఆశిస్తోంది. టాప్–3 విఫలం కావడంతో జట్టును దెబ్బ తీసింది. వన్డే సిరీస్లో కూడా ఘోరంగా విఫలమైన కాన్వే ఇప్పటికైనా రాణించాలని టీమ్ కోరుకుంటోంది. రచిన్పై కూడా ప్రధాన బాధ్యత ఉండగా, రాబిన్సన్ దూకుడుగా ఆడగల సమర్థుడు. ఫిలిప్స్, చాప్మన్ మరోసారి కీలకం కానుండగా, వన్డే ఫామ్ను కొనసాగిస్తున్న మిచెల్ ఈ సారైనా జట్టును గెలిపించాలని పట్టుదలగా ఉన్నాడు. గాయంతో ఆల్రౌండర్ బ్రేస్వెల్ గత మ్యాచ్కు దూరం కావడం కివీస్ను బలహీనపర్చింది. అతను కోలుకొని ఈ సారి బరిలోకి దిగే అవకాశం ఉంది. ముగ్గురు పేసర్లలో క్లార్క్ను తప్పించి బ్రేస్వెల్ను ఆడించవచ్చు. ఇతర స్పిన్నర్లు సాంట్నర్, సోధి ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేది చూడాలి.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, పాండ్యా, దూబే, రింకూ సింగ్, అక్షర్/బిష్ణోయ్, అర్‡్షదీప్, వరుణ్, బుమ్రా. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), కాన్వే, రాబిన్సన్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, క్లార్క్/బ్రేస్వెల్, జేమీసన్, సోధి, డఫీ.పిచ్, వాతావరణం బ్యాటింగ్కు బాగా అనుకూలమైన పిచ్. ఈ మైదానంలో రెండేళ్ల క్రితం జరిగిన ఏకైక టి20లో ఆ్రస్టేలియాపై భారత్ గెలిచింది. మంచు ప్రభావం చాలా ఎక్కువ. కాబట్టి ఛేదన సులువు. ఇటీవల భారత్పై వన్డేలో దక్షిణాఫ్రికా 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
మన తక్షణ కర్తవ్యమేంటి?
తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుంది
చంద్రబాబు కబంధ హస్తాల్లో ఏపీఈఆర్సీ
కరికి షాక్!
పోస్టు చేసేముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం!
దాహం తీర్చండి.. మహాప్రభో!
దళితులను కొట్టి.. ధనికులకు పెట్టి..
పరేడ్లో దళనాయకి
ప్రస్తుత నీటి వాడకానికి రక్షణ కల్పించాలి
ఎమ్మెల్యే అండ.. వాగు కబ్జా
ఎల్ఐసీ ఆఫీసులో ‘నమ్మకానికి’ నిప్పు..
సాయంత్రానికే మరింత షాక్.. మారిపోయిన పసిడి ధరలు
'వెంకటేశ్' రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన సుస్మిత
టీమిండియాకు భారీ షాక్
అప్పుడు ఇనుము.. ఇప్పుడు వెండి..
లిక్కర్ మాఫియా, మైనింగ్ కింగ్లు బైకు దొంగలు..ఎవరినీ మా పార్టీ చిన్న చూపు చూడదు!
తెలుగు వాడివి ఆ మాత్రం పౌరుషం లేదా! నువ్వే ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత కనపడు!
సినిమా ఫ్లాప్.. ప్రభాస్ రియాక్షన్ చెప్పిన నిధి అగర్వాల్
నాకు నాన్న లేరు.. 'చిరు' సార్ను చూస్తే ఏడుపొచ్చింది: ఖుషి
షాకిచ్చిన ఐసీసీ.. స్పందించిన బంగ్లాదేశ్
T20 WC 2026: మా నిర్ణయం ఇదే: బంగ్లాదేశ్
వందల కోట్ల అక్రమాస్తులను పట్టించిన రూ.60 వేల లంచం
పసిడి, వెండి ఢమాల్.. రెచ్చిపోయిన ధరలు రివర్స్!
బీజేపీ నూతన సారథికి 'ఐదు రాష్ట్రాల' ఎనికల సవాలు
నా భర్తను అందుకే చంపేశా..
వాళ్లతో సినిమాలు.. ప్రభాస్కి అస్సలు అచ్చిరాలేదు!
శాంతి గురించి ఆలోచించలేదు కాబట్టే నోబెల్ ఇవ్వలేదేమోనని అనిపిస్తుంది సార్!
తెలంగాణలో మద్యం ప్రియులకు బిగ్ షాక్!
ఈ రాశివారికి వస్తులాభాలు.. ఆదాయం పెరుగుతుంది
తెలంగాణలో రికార్డు స్థాయిలో అవినీతి కేసులు
మన తక్షణ కర్తవ్యమేంటి?
తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుంది
చంద్రబాబు కబంధ హస్తాల్లో ఏపీఈఆర్సీ
కరికి షాక్!
పోస్టు చేసేముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం!
దాహం తీర్చండి.. మహాప్రభో!
దళితులను కొట్టి.. ధనికులకు పెట్టి..
పరేడ్లో దళనాయకి
ప్రస్తుత నీటి వాడకానికి రక్షణ కల్పించాలి
ఎమ్మెల్యే అండ.. వాగు కబ్జా
ఎల్ఐసీ ఆఫీసులో ‘నమ్మకానికి’ నిప్పు..
సాయంత్రానికే మరింత షాక్.. మారిపోయిన పసిడి ధరలు
'వెంకటేశ్' రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన సుస్మిత
టీమిండియాకు భారీ షాక్
అప్పుడు ఇనుము.. ఇప్పుడు వెండి..
లిక్కర్ మాఫియా, మైనింగ్ కింగ్లు బైకు దొంగలు..ఎవరినీ మా పార్టీ చిన్న చూపు చూడదు!
తెలుగు వాడివి ఆ మాత్రం పౌరుషం లేదా! నువ్వే ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత కనపడు!
సినిమా ఫ్లాప్.. ప్రభాస్ రియాక్షన్ చెప్పిన నిధి అగర్వాల్
నాకు నాన్న లేరు.. 'చిరు' సార్ను చూస్తే ఏడుపొచ్చింది: ఖుషి
షాకిచ్చిన ఐసీసీ.. స్పందించిన బంగ్లాదేశ్
T20 WC 2026: మా నిర్ణయం ఇదే: బంగ్లాదేశ్
వందల కోట్ల అక్రమాస్తులను పట్టించిన రూ.60 వేల లంచం
పసిడి, వెండి ఢమాల్.. రెచ్చిపోయిన ధరలు రివర్స్!
బీజేపీ నూతన సారథికి 'ఐదు రాష్ట్రాల' ఎనికల సవాలు
నా భర్తను అందుకే చంపేశా..
వాళ్లతో సినిమాలు.. ప్రభాస్కి అస్సలు అచ్చిరాలేదు!
శాంతి గురించి ఆలోచించలేదు కాబట్టే నోబెల్ ఇవ్వలేదేమోనని అనిపిస్తుంది సార్!
తెలంగాణలో మద్యం ప్రియులకు బిగ్ షాక్!
ఈ రాశివారికి వస్తులాభాలు.. ఆదాయం పెరుగుతుంది
తెలంగాణలో రికార్డు స్థాయిలో అవినీతి కేసులు
ఫొటోలు
వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ (ఫోటోలు)
స్టన్నింగ్ అవుట్ఫిట్లో టాలీవుడ్ హీరోయిన్ ఇషా రెబ్బా (ఫోటోలు)
నిన్ను విసిగించడం నాకెంత ఇష్టమో!: భావన (ఫోటోలు)
ఇప్పుడు స్టార్ సెలబ్రిటీస్.. పదేళ్ల కిందట ఎలా ఉన్నారంటే? (ఫోటోలు)
బ్లాక్ & వైట్ డ్రెస్లో జిగేలుమంటున్న హీరోయిన్ (ఫోటోలు)
మేడారం మహాజాతరలో తొలిఘట్టం...ఘనంగా మండమెలిగె పండుగ (ఫొటోలు)
సుకృతి పుట్టినరోజు.. ఫోటోలు షేర్ చేసిన 'తబిత సుకుమార్' (ఫొటోలు)
ఫుల్ జోష్లో బిగ్బాస్ విష్ణు ప్రియ (ఫోటోలు)
ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
సినిమా
ఆస్కార్ నామినేషన్స్ 2026.. అఫీషియల్ జాబితా ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్-2026 లిస్ట్ విడుదలైంది. ఈ ఏడాది అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. గతేడాది రిలీజైన సత్తా చాటిన చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. ఏయే సినిమా ఏ విభాగంలో పోటీ పడుతుందో ఈ లిస్ట్ చూసేయండి. అయితే ఈ ఏడాది ఉత్తమ చిత్రం విభాగంలో ఏకంగా పది సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ గ్రాండ్ ఈవెంట్ మార్చి 15న లాస్ ఎంజిల్స్ వేదికగా జరగనుంది. హాలీవుడ్ డైరెక్టర్ రేయాన్ కూగ్లర్ దర్శకత్వంలో రూపొందిన సిన్నర్స్ అత్యధికంగా 16 కేటగిరిల్లో నామినేషన్స్ సాధించింది. ఇప్పటివరకూ 14 నామినేషన్స్తో ఆల్ అబౌట్ ఈవ్, టైటానిక్, లా లా ల్యాండ్ పేరిట ఈ రికార్డు ఉండేది. తాజాగా సిన్నర్స్ ఆ రికార్డ్ను తిరగరాసింది. ఈ మూవీ తర్వాత వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్కు ఎక్కువ నామినేషన్స్ దక్కించుకుంది. ఈ ఏడాది కొత్తగా క్యాస్టింగ్ డైరెక్టర్ కేటగిరీని తీసుకొచ్చారు. బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ.. బగోనియాఎఫ్-1ఫ్రాంకిన్స్టన్హ్యామ్నెట్మార్టీ సుప్రీంవన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ది సీక్రెట్ ఏజెంట్సెంటిమెంటల్ వాల్యూసిన్నర్స్ట్రైన్ డ్రీమ్స్బెస్ట్ డైరెక్టర్ కేటగిరీ... క్లోయి జావ్: హ్యామ్నెట్జాష్ షాఫ్డీ: మార్టీ సుప్రీంపాల్ థామస్ ఆండ్రూసన్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్యోఆకీమ్ ట్రియర్: సెంటిమెంటల్ వాల్యూరేయాన్ కూగ్లర్: సిన్నర్స్బెస్ట్ యాక్టర్...తిమోతి చాలమేట్: మార్టీ సుప్రీంలియోనార్డ్ డికాప్రియో: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ఈథన్ హాక్: బ్లూ మూన్మైఖేల్ బి జోర్డాన్: సిన్నర్స్వాగ్నర్ మౌరా: ది సీక్రెట్ ఏజెంట్బెస్ట్ యాక్ట్రెస్జస్సీ బక్లీ: హ్యామ్ నెట్రోజ్ బర్న్: ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ వుడ్ కిక్ యుకేట్ హడ్సన్: సాంగ్ సంగ్ బ్లూరెనాటా రైన్సావా: సెంటిమెంటల్ వాల్యూఎమ్మా స్టోన్: బగోనియాఉత్తమ సహాయ నటి ఎల్ ఫ్యానింగ్- సెంటిమెంటల్ వాల్యూ ఇంగా ఇబ్సిడాట్టర్ లిల్లాస్- సెంటిమెంటల్ వాల్యూ ఎమీ మాడిగన్- వెపన్స్ ఉన్మి మసాకు- సిన్నర్స్ టియానా టేలర్: వన్ బ్యాటిల్- ఆఫ్టర్ అనదర్ఉత్తమ సహాయ నటుడు బెనిసియో డెల్ టారో: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ జేకబ్ ఎల్రోడి: ఫ్రాంకిన్స్టన్ డెల్రాయ్ లిండో: సిన్నర్స్ షాన్ పెన్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ స్టెలెన్ స్కార్స్గార్డ్: సెంటిమెంటల్ వాల్యూబెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీ ది గర్ల్ హూ క్రైడ్ పెరల్స్ బటర్ఫ్లై ఫరెవర్ గ్రీన్ రిటైర్మెంట్ ప్లాన్ ది త్రీ సిస్టర్స్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కేటగిరీ.. ది స్మాషింగ్ మెషీన్ ది అగ్లీ స్టెప్ స్టిస్టర్ ఫ్రాంకిన్స్టన్ కొకుహో సిన్నర్స్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్.. బగోనియా సిన్నర్స్ ఫ్రాంకిన్స్టన్ హ్యామ్నెట్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ బుచర్స్ స్టెయిన్ ది సింగర్స్ ఎ ఫ్రెండ్ ఆఫ్ డార్ఫీ జేన్ ఆస్టన్స్ పీరియడ్ డ్రామా టూ పీపుల్ ఎక్స్ఛేంజ్ సలైవాఒరిజినల్ సాంగ్డియర్ మి (డయాన్ వారెన్ రెలెంట్లెస్)గోల్డెన్: కెపాప్ డెమెన్ హంటర్ఐ లైక్డ్ టు యు: సిన్నర్స్స్వీట్ డ్రీమ్స్ ఆఫ్ జాయ్ (వీవా వీర్డీ)ట్రైన్ డ్రీమ్స్: ట్రైన్ డ్రీమ్స్బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్.. ది సీక్రెట్ ఏజెంట్ (బ్రెజిల్)ఇట్ వాజ్ ఏ జస్ట్ యాక్సిడెంట్ (ఫ్రాన్స్)సెంటిమెంటల్ వాల్యూ (నార్వే)సిరాట్ (స్పెయిన్)ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ (తునీషియా) బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ప్లే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ బగోనియా ఫ్రాంకిన్స్టన్ హ్యామ్నెట్ ట్రైన్ డ్రీమ్స్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లేబ్లూమూన్ ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్ మార్టీ సుప్రీం సెంటిమెంటల్ వాల్యూ సిన్నర్స్బెస్ట్ క్యాస్టింగ్హ్యామ్నెట్మార్టీ సుప్రీంవన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ది సీక్రెట్ఏజెంట్సిన్నర్స్బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్అవతార్: ఫైర్ అండ్ యాష్ఫ్రాంకిన్స్టన్హ్యామ్నెట్మార్టీసుప్రీంసిన్నర్స్బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ది ఆలబామా సొల్యూషన్స్కమ్స్ సీ మి ఇన్ ది గుడ్ లైట్కటింగ్ థ్రూ రాక్స్మిస్టర్ నో బడీ అగైనెస్ట్ పుతిన్ది పర్ఫెక్ట్ నైబర్బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ఆల్ ది ఎంప్టీ రూమ్స్ఆర్డ్మ్ ఓన్లీ విత్ ఏ కెమెరా: ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ బ్రెంట్ రెనోడ్చిల్డ్రన్ నో మోర్: వర్ అండ్ ఆర్ గాన్ది డెవిల్ ఈజ్ బిజీపర్ఫెక్ట్లీ ఎ స్ట్రేంజ్నెస్బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ఆర్కోఎలియోకెపాప్ డెమన్ హంట్స్లిటిల్ ఆమలీ ఆర్ ది క్యారెక్టర్ ఆఫ్ రెయిన్జుప్టోపియా-2బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ఫ్రాంకిన్స్టన్హ్యామ్నెట్మార్టీ సుప్రీంవన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్సిన్నర్స్బెస్ట్ ఎడిటింగ్ఎఫ్1మార్టీ సుప్రీంవన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్సెంటిమెంటల్ వాల్యూసిన్నర్స్బెస్ట్ సౌండ్ఎఫ్1ఫ్రాంకిన్స్టన్వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్సిన్నర్స్సిరాట్బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్అవతార్: ఫైర్ అండ్ యాష్ఎఫ్1జురాసిక్ వరల్డ్ రీబర్త్ది లాస్ట్ బస్సిన్నర్స్బెస్ట్ సినిమాటోగ్రఫీఫ్రాంకిన్స్టైన్మార్టీ సుప్రీంవన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్సిన్నర్స్ట్రైన్ డ్రీమ్స్
నా వల్ల చిరంజీవి సినిమాకు నష్టం జరగకూడదనుకున్నా: హర్ష వర్ధన్
తన లైఫ్లో చిరంజీవి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టమని టాలీవుడ్ హర్షవర్ధన్ అన్నారు. మనశంకర వరప్రసాద్దగారు సూపర్ హిట్ కావడం సంతోషంగా ఉందన్నారు. ఇది నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అని తెలిపారు. తనకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చిందని హర్షవర్ధన్ సంతోషం వ్యక్తం చేశారు.అయితే ఈ సినిమాకు నా వల్ల నష్టం జరగకూడదని నిర్ణయించుకున్నాని హర్షవర్ధన్ తెలిపారు. తన కాలికి గాయం కావడంతో రెండు నెలలకు పైగా టైమ్ పడుతుందని అన్నారు. దీంతో చిరంజీవి సినిమా మిస్ అవుతానని చాలా బాధపడ్డానని తెలిపారు. అందుకే నా వల్ల మూవీ ఆలస్యం కాకూడదనే.. నా బదులు ఎవరినైనా తీసుకోండని అనిల్తో చెప్పానని హర్షవర్ధన్ వెల్లడించారు.కానీ అనిల్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.. మీరు అవన్నీ మాట్లాడొద్దు..అంతా నేను చూసుకుంటానని అన్నారు. మీరు కేవలం నడవకూడదు అంతేకదా.. డైలాగ్స్, యాక్టింగ్ చేస్తే చాలని నాకు ధైర్యం చెప్పారు. అనిల్కు నా పట్ల మంచి అభిప్రాయం ఉంది..నారాయణ క్యారెక్టర్కు నువ్వు తప్ప ఎవరినీ పెట్టే ప్రసక్తే లేదని అనిల్ రావిపూడి చెప్పారని హర్షవర్ధన్ పంచుకున్నారు. నా వల్ల సినిమా ఆలస్యమైతే ఎక్కడా తీరని మచ్చలా ఉండిపోతుందేమో భయపడ్డానని తెలిపారు. నా వల్ల #chiranjeevi గారి సినిమాకి భారీ నష్టం.. నా జీవితంలో అది తీరని మచ్చలా ఉండిపోతుంది- Actor #HarshaVardhan Exclusive Interview https://t.co/Fhr5TvdjTw#ManaShankaraVaraPrasadGarutrailer #anilravipudi pic.twitter.com/I8FPpPgBiW— TeluguOne (@Theteluguone) January 22, 2026
చిరు జీవికైనా.. చిరంజీవికైనా అదొక్కటే ముఖ్యం: టాలీవుడ్ నటుడు
టాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మూవీ ప్రమోషన్స్ చేస్తేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తారని అన్నారు. ఆది సాయికుమార్ నటించిన శంబాలకు అద్భుతంగా ప్రమోషన్స్ చేయడం వల్లే సక్కెస్ సాధించారని అన్నారు. నేను చేసింది చిన్న రోలే అయినా.. ఏప్రిల్ నుంచే ప్రమోషన్స్ ప్రారంభించారని అన్నారు.శ్రీకాంత్ తనయుడు ఛాంపియన్ మూవీ కూడా చాలా బాగుందని హర్షవర్ధన్ అన్నారు. కానీ జనాల్లోకి తీసుకెళ్లడంలో కొంత వెనకపడ్డారని తెలిపారు. ఈ వీడియో నిర్మాతలు కూడా చూడాలని అన్నారు. ఛాంపియన్ లాంటి మంచి సినిమాకు ఇంకా గొప్పగా ప్రమోషన్స్ చేయాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిరు జీవికైనా.. చిరంజీవికైనా పబ్లిసిటీ ఒక్కటే ప్రధామమని పేర్కొన్నారు. మూవీ ప్రమోషన్స్ బాగా చేస్తేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తారనేది వందశాతం నిజమన్నారు. ప్రమోషన్స్పై హర్షవర్ధన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘శంబాల’ సినిమా దెబ్బకి ‘ఛాంపియన్’ సినిమా కనిపించకుండా పోయింది...చిరు జీవికైనా.. చిరంజీవికైనా పబ్లిసిటీ ఒక్కటే...ఈ వీడియో ప్రొడ్యూసర్ #AswaniDutt చూడాలి- Actor #HarshaVardhan#Shambala #Champion #ManaShankarVaraPrasadGaru pic.twitter.com/FDhGLvMksW— TeluguOne (@Theteluguone) January 22, 2026
రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా వీడీ 14.. ప్రామిస్ చేసిన దర్శకుడు!
‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్లో వీడీ14 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి తమ హీరో విజయ్ దేవరకొండ కు మంచి హిట్ మూవీ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాహుల్ కు రిక్వెస్ట్స్ పంపుతున్నారు.రీసెంట్ గా యశ్వంత్ అనే విజయ్ దేవరకొండ ఫ్యాన్ తమ హీరోకు మెమొరుబల్ మూవీ ఇవ్వాలటూ హార్ట్ టచింగ్ రిక్వెస్ట్ ఒకటి పంపారు. ఆ అభిమాని రిక్వెస్ట్ కు స్పందించిన రాహుల్ సంకృత్యన్ 'మీ అభిమానులందరి ఆకలి తీర్చేలా వీడీ 14 ఉంటుంది..' అంటూ ప్రామిస్ చేశారు. విజయ్ అభిమానికి స్పందిస్తూ రాహుల్ ఇచ్చిన రిప్లైతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ వీడీ 14 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
క్రీడలు
శ్రీలంక బోణీ
కొలంబో: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన శ్రీలంక జట్టు తొలి వన్డేలో 19 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (117 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు) సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోగా... జనిత్ లియనాగె (53 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తలా కొన్ని పరుగులు చేయడంతో లంక మంచి స్కోరు చేయగలిగింది. కమిల్ మిశ్రా (27), నిసాంక (21), కెపె్టన్ అసలంక (17), దునిత్ వెల్లలాగె (25 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్), జో రూట్ (90 బంతుల్లో 61; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో పోరాడారు. ఈ ఇద్దరూ రాణించడంతో ఒక దశలో 129/1తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (6), జాక్ క్రాలీ (6), జోస్ బట్లర్ (19), సామ్ కరన్ (5) విఫలమయ్యారు. జేమీ ఓవర్టన్ (17 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్లు), రేహాన్ అహ్మద్ (27; 5 ఫోర్లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. లంక బౌలర్లలో ప్రమోద్ 3 వికెట్లు పడగొట్టగా... దునిత్, జెఫ్రీ వండర్సె చెరో రెండు వికెట్లు తీశారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన దునిత్ వెల్లలాగెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది.
ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు...
రాయ్పూర్: న్యూజిలాండ్తో తొలి టి20లో ఘన విజయం తర్వాత భారత్ మరో విజయంపై గురి పెట్టింది. గత పోరులో అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన జట్టు 2–0తో ఆధిక్యం అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు న్యూజిలాండ్ కోలుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో రెండో టి20 మ్యాచ్కు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకున్నాడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సామ్సన్, ఇషాన్లపై దృష్టి... తొలి టి20లో భారత బ్యాటర్లలో అభిõÙక్ శర్మ చెలరేగగా, సూర్యకుమార్ కూడా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్లో ఉన్నంత సేపు పాండ్యా ప్రభావం చూపించగా... ఫినిషర్గా రింకూ సింగ్ తన పేరును నిలబెట్టుకున్నాడు. అయితే సామ్సన్, ఇషాన్ కిషన్ మాత్రమే ప్రభావం చూపలేకపోయారు. గిల్ను తప్పించడంతో టి20 టీమ్లో ఓపెనర్గా తన స్థానం చేసుకున్న సామ్సన్ అంచనాలకు తగినట్లుగా ఆడాల్సి ఉంది. అదే విధంగా వరల్డ్ కప్ టీమ్లో కూడా చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్పై నమ్మకంతో మేనేజ్మెంట్ మూడో స్థానంలో ఆడే అవకాశం కల్పించింది. ఒక్క మ్యాచ్లో వైఫల్యం సమస్య కాకపోయినా... చెత్త షాట్లతో వీరు వికెట్లు సమర్పించుకున్నారు. ఈసారి తప్పులు దిద్దుకునే అవకాశం వీరికి ఉంది. పేస్ బౌలింగ్లో మరోసారి అర్‡్షదీప్, బుమ్రా ప్రదర్శనపై జట్టు ఆధారపడి ఉండగా, పాండ్యా కూడా కీలక పాత్ర పోషిస్తాడు. స్పిన్నర్లుగా వరుణ్, అక్షర్ ప్రత్యర్థిపై పైచేయి సాధించగలరు. అయితే తొలి మ్యాచ్లో చేతికి గాయంతో బౌలింగ్ నుంచి తప్పుకున్న అక్షర్ ఆడకపోతే మరో స్పిన్నర్ బిష్ణోయ్కు చోటు లభించవచ్చు. తుది జట్టులోకి బ్రేస్వెల్! భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ గత మ్యాచ్లో న్యూజిలాండ్ పోరాడినా ఫలితం లేకపోయింది. అయితే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి సిరీస్ను సమం చేయాలని జట్టు ఆశిస్తోంది. టాప్–3 విఫలం కావడంతో జట్టును దెబ్బ తీసింది. వన్డే సిరీస్లో కూడా ఘోరంగా విఫలమైన కాన్వే ఇప్పటికైనా రాణించాలని టీమ్ కోరుకుంటోంది. రచిన్పై కూడా ప్రధాన బాధ్యత ఉండగా, రాబిన్సన్ దూకుడుగా ఆడగల సమర్థుడు. ఫిలిప్స్, చాప్మన్ మరోసారి కీలకం కానుండగా, వన్డే ఫామ్ను కొనసాగిస్తున్న మిచెల్ ఈ సారైనా జట్టును గెలిపించాలని పట్టుదలగా ఉన్నాడు. గాయంతో ఆల్రౌండర్ బ్రేస్వెల్ గత మ్యాచ్కు దూరం కావడం కివీస్ను బలహీనపర్చింది. అతను కోలుకొని ఈ సారి బరిలోకి దిగే అవకాశం ఉంది. ముగ్గురు పేసర్లలో క్లార్క్ను తప్పించి బ్రేస్వెల్ను ఆడించవచ్చు. ఇతర స్పిన్నర్లు సాంట్నర్, సోధి ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేది చూడాలి.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, పాండ్యా, దూబే, రింకూ సింగ్, అక్షర్/బిష్ణోయ్, అర్‡్షదీప్, వరుణ్, బుమ్రా. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), కాన్వే, రాబిన్సన్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, క్లార్క్/బ్రేస్వెల్, జేమీసన్, సోధి, డఫీ.పిచ్, వాతావరణం బ్యాటింగ్కు బాగా అనుకూలమైన పిచ్. ఈ మైదానంలో రెండేళ్ల క్రితం జరిగిన ఏకైక టి20లో ఆ్రస్టేలియాపై భారత్ గెలిచింది. మంచు ప్రభావం చాలా ఎక్కువ. కాబట్టి ఛేదన సులువు. ఇటీవల భారత్పై వన్డేలో దక్షిణాఫ్రికా 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
సోఫీ డివైన్ ఆల్రౌండ్ ప్రదర్శన
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుసగా మూడు పరాజయాల తర్వాత గుజరాత్ జెయింట్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఆరు మ్యాచ్ల తర్వాత మూడో విజయంతో ఆ జట్టు ప్రస్తుతం రెండో స్థానానికి చేరింది. గురువారం జరిగిన పోరులో గుజరాత్ 45 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సోఫీ డివైన్ (42 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ నమోదు చేసింది. అనంతరం యూపీ 17.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది.రాజేశ్వరి (3/16) ప్రత్యర్థిని పడగొట్టగా ... సోఫీ డివైన్, రేణుకా సింగ్ చెరో 2 వికెట్లు తీశారు. నేడు డబ్ల్యూపీఎల్ మ్యాచ్లకు విరామం. శనివారం జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది.స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) నవ్గిరే (బి) ఎకెల్స్టోన్ 38; డానీ వ్యాట్ (బి) క్రాంతి 14; అనుష్క (సి) శ్వేత (బి) క్రాంతి 14; గార్డ్నర్ (బి) దీప్తి 5; సోఫీ డివైన్ (నాటౌట్) 50; భారతి (రనౌట్) 5; కనిక (సి) నవ్గిరే (బి) ట్రయాన్ 6; కాశ్వీ (బి) ఎకెల్స్టోన్ 11; రేణుక (రనౌట్) 1; హ్యాపీ కుమారి (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–23, 2–43, 3–65, 4–93, 5–105, 6–115, 7–131, 8–145. బౌలింగ్: క్రాంతి 4–0–18–2, శిఖ 4–0–53–0, దీప్తి 2–0–16–1, ఎకెల్స్టోన్ 4–0–22–2, ట్రయాన్ 4–0–32–1, శోభన 2–0–11–0. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) కాశ్వీ 14; నవ్గిరే (స్టంప్డ్) మూనీ (బి) రేణుక 0; లిచ్ఫీల్డ్ (సి) రేణుక (బి) గార్డ్నర్ 32; హర్లీన్ (సి) గార్డ్నర్ (బి) రేణుక 3; ట్రయాన్ (నాటౌట్) 30; దీప్తి (ఎల్బీ) (బి) రాజేశ్వరి 4; శ్వేత (స్టంప్డ్) మూనీ (బి) రాజేశ్వరి 3; శోభన (సి) గార్డ్నర్ (బి) రాజేశ్వరి 7; ఎకెల్స్టోన్ (సి అండ్ బి) డివైన్ 1; శిఖ (రనౌట్) 1; క్రాంతి (బి) డివైన్ 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (17.3 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1–2, 2–39, 3–57, 4–59, 5–67, 6–79, 7–93, 8–94, 9–97, 10–108. బౌలింగ్: రేణుక 4–0–20–2, కాశ్వీ 3–0–31–1, డివైన్ 3.3–0–16–2, గార్డ్నర్ 3–0–23–1, రాజేశ్వరి 4–0–16–3.
సర్ఫరాజ్, సిద్ధేశ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: సర్ఫరాజ్ ఖాన్ (142 బ్యాటింగ్; 11 ఫోర్లు, 5 సిక్స్లు), కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ (104; 10 ఫోర్లు, 2 సిక్స్లు) ‘శత’క్కొట్టారు. ఫలితంగా రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 87 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ఓపెనర్లు అఖిల్ (27), ఆకాశ్ ఆనంద్ (35)లతో పాటు ముషీర్ ఖాన్ (11) విఫలమయ్యారు. 82/3తో కష్టాల్లో పడ్డ ముంబైను సిద్ధేశ్, సర్ఫరాజ్ ఆదుకున్నారు. నాలుగో వికెట్కు 249 పరుగులు జత చేశారు. తొలి రోజు ఆట ముగుస్తుందనగా సిద్ధేశ్ అవుటయ్యాడు. హిమాన్షు (0 బ్యాటింగ్)తో కలిసి సర్ఫరాజ్ క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు రెండు వికెట్లు పడగొట్టగా... సిరాజ్, నితిన్ సాయి యాదవ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
న్యూస్ పాడ్కాస్ట్
వచ్చే ఏడాది మళ్లీ ప్రజల్లోకి. ఏడాదిన్నరపాటు పాదయాత్ర. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ
ఆదాయాన్నిచ్చే కొత్త వలస-కిరండోల్ లైన్ లేకుండానే విశాఖ రైల్వేజోన్. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం
స్వచ్ఛంద పంటల బీమాకూ మంగళం. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం
ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారిన మద్యం... సంక్రాంతి సీజన్లో టీడీపీ మద్యం సిండికేట్కు పండుగ
ఆంధ్రప్రదేశ్లో భూముల ‘రీ సర్వే’పై చంద్రబాబు దొంగాట... అప్పుడు దుష్ప్రచారం చేసి ఇప్పుడు క్రెడిట్ చోరీ కోసం పాకులాట
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా జూదాల జాతర.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో విచ్చలవిడిగా మద్యం ప్రవాహం
సంక్రాంతి సంబరాలను జూదంగా మార్చేసిన కూటమి నేతలు... ఏపీలో పండుగ వేళ యథేచ్ఛగా దోపిడీ... 2 రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల జూదం .
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ రిజిస్ట్రేషన్ల బాదుడు... వచ్చే నెల నుంచి పెంపు అమలు చేసేందుకు సన్నాహాలు... ఆదాయమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు పండుగ లేనట్లే... ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచిన ఏపీ సీఎం చంద్రబాబు
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు మరో డ్రామా. ఖజానాకు రాబడి తగ్గిందంటూ కార్యదర్శులు, కలెక్టర్లపై సీఎం చంద్రబాబు చిర్రుబుర్రు
బిజినెస్
డీప్ఫేక్కు చెక్ పెట్టే టెక్నాలజీ!
సోషల్ మీడియా ఎంత వేగంగా విస్తరిస్తోందో.. ఏఐ జనరేషన్, డీప్ఫేక్ వ్యాప్తి కూడా అంతే జోరుగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని ఉపయోగింగి యూజర్ల అనుమతి లేకుండానే.. కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి, వారిని అపఖ్యాతిపాలు చేస్తున్నారు. ఇది ఎక్కువగా మహిళలపై ప్రభావం చూపుతోంది.ఏఐ జనరేషన్, డీప్ఫేక్ భారిన పడిన ప్రముఖుల జాబితాలో రష్మికా మందన, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అనిల్ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి మొదలైనవారు ఉన్నారు. చాలామంది ఈ విషయంపై న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయినప్పటికీ.. మార్ఫింగ్ ఫోటోలు, ఇతర తప్పుడు సమాచారాలను ప్రచారం వంటివి ఇప్పటికీ ఎదో ఒక మూల బయటపడుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు చరమగీతం పాడేందుకు ఓ ఇద్దరు కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులు కొత్త ఏఐ ఇంటర్ఫేస్ అభివృద్ధి చేశారు.ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంకు చెందిన ఫైనల్ ఇయర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులైన ''జీ. వెంకట కార్తికేయ ఆర్యన్ & బి. లోకేష్'' ఎనిమిది నెలలు శ్రమించి అపరిక్స్ (APARYX) పేరుతో కొత్త ఏఐ ఇంటర్ఫేస్ అభివృద్ధి చేశారు. నష్టం జరగక ముందే అరికట్టడం మంచిది.. అనే సిద్ధాంతం ఆధారంగా దీనిని డెవలప్ చేశారు.అపరిక్స్ అనేది.. ఇతర వ్యవస్థల కంటే భిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా.. కంటెంట్ అప్లోడ్ అవ్వడానికి ముందే దానిని పరిశీలిస్తుంది. సెల్ఫ్ అడాప్టివ్ ఏఐ ఇంజిన్, అడ్వాన్స్డ్ డీప్ఫేక్ డిటెక్షన్ మోడల్స్ ఉపయోగించి.. ప్రతి ఫైల్నూ చెక్ చేస్తుంది. కంటెంట్ను మూడు విధాలుగా (లెవెల్స్) విభజిస్తుంది.➤0 నుంచి 0.35 వరకు: అప్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది➤0.35 నుంచి 0.75 వరకు: వార్నింగ్ ఇస్తుంది➤0.75 నుంచి 1 వరకు: అప్లోడ్ చేయడానికి అనుమతించదు / అప్లోడ్ బ్లాక్ చేస్తుందిడీప్ఫేక్, మార్ఫింగ్ వీడియోలు, ఏఐ క్రియేట్ న్యూడ్ కంటెంట్, లేదా అనుమతిని పొందని ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ గుర్తించినప్పుడు అపరిక్స్ ఆటోమేటిక్గా అప్లోడ్ చేయడాన్ని బ్లాక్ చేస్తుంది. అయితే కొంత తక్కువ మార్పులు చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ యాక్సెప్ట్ చేయకపోతే.. అప్లోడ్ చేయడానికి అనుమతించదు. కంటెంట్ హ్యాష్, టైమ్ స్టాంప్, ప్లాట్ఫామ్ యూస్డ్ వంటి వాటిని ఆడిట్ చేయడానికి ఇందులో శాండ్బాక్స్ ఉంటుంది. దీని ద్వారా డీప్ఫేక్ ఫోటోలను ఎవరు అప్లోడ్ చేసారనేది గుర్తించడానికి మాత్రమే కాకుండా.. వాటిని ఎన్నిసార్లు షేర్ చేసారు అనేది గుర్తించవచ్చు.అపరిక్స్ పేరును సంస్కృత పదమైన అపరిజిత నుంచి తీసుకున్నారు. దీని అర్థం అదృశ్య రక్షకుడు (కనిపించకుండా రక్షించేవాడు). పేరుకు తగిన విధంగా.. ఈ సిస్టం (అపరిక్స్) డీప్ఫేక్ వంటి వాటి నుంచి కాపాడుతుంది. దీనిని రూపొందించిన విద్యార్థులు ప్రస్తుతం పేటెంట్ కోసం అప్లై చేసుకున్నారు, పేటెంట్ పబ్లిష్ కూడా పూర్తయింది. అయితే ఇది ప్రస్తుతం టెక్నికల్ ఎగ్జామినేషన్స్లో ఉంది.
ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి..
ఆర్ధిక పరిస్థితులు ఎప్పుడు, ఎలా మారుతాయో.. ఎవరూ అంచనా వేయలేరు. స్టాక్ మార్కెట్లు కుప్ప కూలిపోవచ్చు, కరెన్సీ విలువ అమాంతం తగ్గిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారంకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ తరుణంలో పోలాండ్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఆర్ధిక రంగంలో హాట్ టాపిక్గా మారింది.ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం కొనుగోలుదారు అయిన నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్.. మరో 150 టన్నుల విలువైన బంగారం కొనుగోలు చేసింది. దీంతో ప్రస్తుతం పోలాండ్ వద్ద ఉన్న బంగారం నిల్వల పరిమితిని 550 టన్నులకు చేరింది. 2026 డిసెంబర్ 31 నాటికి దీనిని 700 టన్నులకు పెంచాలని సెంట్రల్ బ్యాంక్ మేనేజ్మెంట్ బోర్డును కోరుతున్నట్లు గవర్నర్ ఆడమ్ గ్లాపిన్స్కీ గత వారం ప్రకటించారు.పోలాండ్ వద్ద ఉన్న బంగారం.. ప్రస్తుతం యూరోపియన్ సెంట్రల్ బ్యాంకుల దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఉందని సమాచారం. గోల్డ్ అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక దేశాన్ని ఆర్థికంగా రక్షించే కవచం అని ఆడమ్ గ్లాపిన్స్కీ పేర్కొన్నారు. పసిడి విలువ ఎప్పటికీ దాదాపు పడిపోయే అవకాశం లేదు. ఆర్ధిక అస్థిరత్వం లేదా ఆర్ధిక మాంద్యం ఏర్పడినప్పుడు ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉందని. ఇతర దేశాల ద్రవ్య విధానంతో సంబంధం లేకుండా.. ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవచ్చు.విదేశీ మారక నిల్వల్లో పోలాండ్ వాటా 2024 నాటికి 16.86 శాతంగా ఉండేది. 2025 నాటికి ఇది 28.22 శాతానికి చేరింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. నిజానికి బంగారం పోగు చేసుకోవాలనే ఉద్దేశం ఒక్క పోలాండ్ దేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలకు ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.బంగారం ధరలు ఇలా..భారతదేశంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజు (గురువారం) రూ.1,54,310 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,41,450 రూపాయల వద్ద ఉంది. గోల్డ్ రేటు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా.ఇదీ చదవండి: బడ్జెట్ 2026.. ఆదివారం కూడా స్టాక్ మార్కెట్!
రోజుకో రూ.200.. అవుతాయి రూ.10 లక్షలు!
సంపద నిర్మించుకోవడానికి ఎప్పుడూ అధిక రిస్క్ పెట్టుబడులు లేదా స్టాక్ మార్కెట్పై లోతైన అవగాహనే అవసరం లేదు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ ఉంటే చిన్నపాటి రోజువారీ పొదుపు కూడా కాలక్రమేణా బలమైన ఆర్థిక భద్రతగా మారుతుంది. అలాంటి నమ్మదగిన పథకమే ‘పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్’ (RD). రోజుకు కేవలం రూ.200 పెట్టుబడి పెడితే, దీర్ఘకాలంలో రూ.10 లక్షలకు పైగా నిధిని నిర్మించుకోవచ్చు.చిన్న పొదుపు.. పెద్ద ఫలితంఈ పథకంలోని అసలైన బలం స్థిరత్వం. రోజుకు రూ.200 అంటే నెలకు రూ.6,000 మాత్రమే. ఇది చాలా కుటుంబాలకు సులభంగా నిర్వహించగలిగే మొత్తమే. ఈ చిన్న మొత్తాలు మీ నెలవారీ బడ్జెట్పై ఒత్తిడి లేకుండా, క్రమంగా పెద్ద మొత్తంగా మారతాయి.పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. పోస్టాఫీస్ భారత ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో, ఈ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా, రిస్క్ లేకుండా పొదుపు చేయాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూలమైన ఎంపిక.ఖాతా ప్రారంభం సులభంకేవలం రూ.100తోనే పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఖాతా ప్రారంభించవచ్చు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడు తమ సమీప పోస్టాఫీసులో ఈ ఖాతాను సులభంగా తెరవవచ్చు. నెలవారీ డిపాజిట్లు వెంటనే ప్రారంభించవచ్చు.రికరింగ్ డిపాజిట్కు ప్రాథమిక కాలపరిమితి 5 సంవత్సరాలు. మెచ్యూరిటీ అనంతరం, ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ పొడిగింపు వల్ల చక్రవడ్డీ ప్రయోజనం పెరిగి, సంపద మరింత వేగంగా పెరుగుతుంది.అత్యవసర అవసరాలకు రుణ సదుపాయంఖాతా తెరిచి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, మీరు జమ చేసిన మొత్తంలో 50% వరకు రుణం పొందవచ్చు. ఈ రుణంపై వడ్డీ, ఆర్డీ వడ్డీ రేటు కంటే కేవలం 2 శాతం మాత్రమే ఎక్కువ. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఇది తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా ఉపయోగపడుతుంది.కొన్ని షరతుల మేరకు ప్రీ-మెచ్యూరిటీ విత్డ్రాయల్కు కూడా అవకాశం ఉంటుంది. అనివార్య కారణాలతో ఖాతాదారు మరణించినప్పుడు, డిపాజిట్ మొత్తాన్ని నామినీ సులభంగా పొందవచ్చు.రోజుకు రూ.200.. రూ.10 లక్షలు ఎలా అవుతాయంటే?➕రోజుకు రూ.200 ➕నెలకు రూ.6,000➕5 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే➕మొత్తం డిపాజిట్: రూ.3.60 లక్షలు➕వడ్డీ: సుమారు రూ.68,197➕మెచ్యూరిటీ మొత్తం: రూ.4.28 లక్షలు➕అదే ఖాతాను మరో 5 ఏళ్లు పొడిగిస్తే➕మొత్తం డిపాజిట్: రూ.7.20 లక్షలు➕మొత్తం వడ్డీ: సుమారు రూ.2.05 లక్షలు➕తుది మెచ్యూరిటీ మొత్తం: సుమారు రూ.10.25 లక్షలుసున్నా మార్కెట్ రిస్క్, ప్రభుత్వ హామీ, క్రమశిక్షణతో కూడిన పొదుపు ద్వారా చిన్నపాటి రోజువారీ పొదుపులు కూడా గొప్ప ఆర్థిక మైలురాయిగా మారతాయని పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం నిరూపిస్తోంది.
మార్కెట్లో ఫుల్ డిమాండ్: ఈ కారు ధర ఎంతో తెలుసా?
కియా ఇండియా.. తన సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ 'సోనెట్'ను లాంచ్ చేసినప్పటినుంచి 5 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో దేశీయ అమ్మకాలు 35 శాతం. మార్కెట్లో స్థిరమైన అమ్మకాలను నమోదు చేస్తూ.. వరుసగా రెండో సంవత్సరం లక్ష యూనిట్ల వార్షిక సేల్స్ సాధించింది.ప్రీమియం ఫీచర్లు & కనెక్టెడ్ మొబిలిటీ ఎంపికల కారణంగా ఈ కారు గొప్ప అమ్మకాలను పొందగలిగిందని కంపెనీ వెల్లడించింది. కియా సోనెట్ ప్రారంభ ధర రూ. 7.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దేశీయ విఫణిలో హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్ వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.కియా సోనెట్ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. దాదాపు 70 దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇందులో మధ్యప్రాచ్యం & ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా - పసిఫిక్ ప్రాంతాలు ఉన్నాయి. కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా లక్ష కంటే యూనిట్ల కంటే ఎక్కువ కార్లను విక్రయించింది. సోనెట్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో మల్టిపుల్ పవర్ట్రెయిన్ & ట్రాన్స్మిషన్ ఎంపికలలో అందుబాటులో ఉంది.
ఫ్యామిలీ
తెల్లవారుజాము నుంచే క్యూ కట్టాల్సిందే!
కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుల్లా యూపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు బారులు తీరుతుండడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఐఫోన్ను ముందుగా దక్కించుకోవడానికి దుకాణాల ముందు యాపిల్ అభిమానులు గంటల తరబడి వేచివుంటారు. ఇంకా కొంతమంది అయితే ఏకంగా తెల్లవారుజాము నుంచే స్టోర్ల ముందు పడిగాపులు కాస్తుంటారు. తాజాగా ఇలాంటి దృశ్యాలు ఇండియన్ సిలికాన్వ్యాలీలో దర్శనమిచ్చాయి. అదేంటి.. కొత్త ఐఫోన్ ఏదీ మార్కెట్లోకి రాలేదు కదా అని ఆశ్చర్యపోతున్నారా?. ఈ క్యూ ఐఫోన్ల కోసం కాదు.. మరి దేనికోసం?బెంగళూరులోని ఓ దుకాణం ముందు మహిళలు పెద్ద ఎత్తున క్యూ కట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వారంతా తెల్లవారుజామున 4 గంటల నుంచే షాపు ముందు వేచివున్నట్టు తెలుస్తోంది. చీరల కోసం వీరు ఇలా లైన్లో నిలబడ్డారని తెలిసి జనం ఆశ్చర్యపోతున్నారు. అయితే అవేమి ఉచితంగా ఇచ్చేవో, సగం ధరకు అమ్మేవో కాదు.. చాలా ఖరీదైన పట్టు చీరలు. ఏంటీ.. అంతేసి డబ్బులు పెట్టి కొనే కాస్ట్లీ సారీలను దక్కించుకునేందుకు ఇంత కష్టపడాలా అని జనం నోరెళ్లబెడుతున్నారు. విషయం పూర్తిగా తెలిస్తే మీరు కూడా క్యూ కడతారు!మైసూరు పట్టు చీరలను దక్కించుకునేందుకు మహిళలంతా కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (కేఎస్ఐసీ) షోరూం ముందు మంగళవారం ఇలా క్యూ కట్టారు. లైన్లో వేచివున్న మహిళల కోసం ప్రత్యేకంగా స్టూల్స్ కూడా వేశారు. ఒక్క చీరనైనా దక్కించుకోవాలన్నట్టుగా మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ దృశ్యాలున్న వీడియోను రాకేశ్ కృష్ణన్ సింహ అనే వ్యక్తి 'ఎక్స్'లో షేర్ చేశారు. రూ.23 వేల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు ఖరీదు చేసే మైసూరు పట్టుచీరల కోసం మహిళలు తెల్లవారుజాము నుంచే కేఎస్ఐసీ షోరూం ముందు వేచివున్నారని తెలిపారు. క్యూలో ఉన్నవారికి టోకెన్లు కూడా ఇస్తున్నారని, టోకెన్ ఉన్నవారిని మాత్రమే దుకాణం లోపలికి అనుమతిస్తారని 'కన్నడప్రభ' తెలిపింది. అందరికీ చీరలు దక్కాలన్న ఉద్దేశంలో ఒక్కొక్కరికి ఒకటి మాత్రమే విక్రయిస్తారని వెల్లడించింది.కేఎస్ఐసీ (KSIC) మాత్రమే అసలు సిసలైన మైసూరు సిల్క్ సారీలను తయారు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధీకృత తయారీ హక్కులు, జీఐ ట్యాగ్ రైట్స్.. ఇది కలిగివుంది. దీంతో కేఎస్ఐసీ శిక్షణ ఇచ్చిన వారు మాత్రమే మైసూరు పట్టు చీరలను నేస్తుండడంతో డిమాండ్కు తగినట్టుగా సరఫరా చేయలేకపోతోంది. అందుకే తమ దుకాణానికి వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక చీర మాత్రమే విక్రయిస్తోంది. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా ఒరిజినల్ పట్టుచీరలను తయారు చేస్తోంది కాబట్టే మహిళలు కేఎస్ఐసీ దుకాణం ముందు బారులు తీరుతున్నారు. ఒరిజినల్ బ్రాండ్ వ్యాల్యూకు ఉండే క్రేజ్ అలాంటిది మరి!Women queue up from 4.00 AM outside a Karnataka Soviet (sorry Silk) Industries Corporation showroom to buy silk sarees starting from ₹23,000 and going up to ₹250,000. Only 1 saree per customer and you need a token to be in the queue.There is an ongoing shortage (or more… pic.twitter.com/d100w3hql0— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) January 20, 2026నెటిజన్ల స్పందన..''కొత్త ఐఫోన్ల కోసం ఆపిల్ స్టోర్ల ముందు మగాళ్లు 12 గంటలు ముందుగానే క్యూ కట్టడం మామూలు విషయం. కానీ చీరల కోసం మహిళలు క్యూలో వేచివుండడం ఆసక్తికరం.''''కొత్త ఐఫోన్ లాంచ్ అయినప్పుడు ఆపిల్ షోరూమ్ల వెలుపల కూడా ఇలాంటి దృశ్యాలే కన్పిస్తుంటాయి. అంటే ఆ ఫోన్ల కొరత ఉందని కాదు. ఐఫోన్ కోరుకునే ప్రతి ఒక్కరూ చివరకు దాన్ని దక్కించుకుంటారు. చీర కోసం 23 వేల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారంటే.. వారంతా బాగా డబ్బున్న ఉన్నవారే అయుంటారు.''''ప్రైవేటు దుకాణాల కంటే కేఎస్ఐసీ నాణ్యతపై నమ్మకంతోనే మహిళలు ఇక్కడ పట్టు చీరలు కొనేందుకు వస్తున్నారు.''చదవండి: కారును లాగే కొండ.. ఎక్కడుందో తెలుసా?
ట్రెండీగా లేటు వయసు ప్రెగ్నెన్సీ..! ఉషా వాన్స్, కత్రినా కైఫ్..
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ దంపతులు తాము నాలుగో బిడ్డకు స్వాగతం పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి కూడా. అంతేగాక అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఇలా భర్త పదవిలో ఉండగా 40 ఏళ్ల వయసులో గర్భవతి అయిన తొలి అమెరికా సెకండ్ లేడిగా నిలిచారామె. ఇదంతా ఎలా ఉన్నా..ఒక్కసారిగా ఇంత లేటు వయసులో గర్భధారణ మంచిదేనా అంటూ చర్చలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న 42 ఏళ్ల వయసులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది కత్రినా కైవ్. అదిమరువకమునుపే మళ్లీ భారత సంతతి మహిళ, అమెరికా ఉపాధ్యాక్షుడి సతీమణి ఉష సైతం ఆ జాబితాలో చేరిపోవడంతో..ఇక రాను ఆధునిక అమ్మల వయసు ఇలానే ఉంటుందా అంటూ ఊహగానాలు వెల్లువెత్తాయి. ఇంతకీ ఆ ఏజ్లో తల్లి అవ్వడం హెల్త్ పరంగా ప్రమాదామా కాదా? మరి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..2014లో వివాహం చేసుకున్న ఉషా-జేడీ వాన్స్ దంపతులకు ఇప్పటికే ఇవాన్, వివేక్ , మిరాబెల్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు ఈ ఏడాది జూలైకి నాల్గోబిడ్డకు స్వాగతం పలకనున్నారు. అలాగే గతేడాది సెప్టెంబర్ 25న నటి కత్రినాకైఫ్ ఇలానే 42వ ఏటనే తల్లి కాబోతున్నానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సరసన హాస్యనటి భారతి సింగ్ కూడా చేరిపోయారు. ఆమె 41వ ఏటా రెండో బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు షేర చేసుకున్నారు. మొన్నమొన్నటి వరకు 30లలో గర్భధారణ ప్రమాదం అంటూ పలు వార్తలు విన్నాం. ఇప్పుడు ఏకంగా అది కూడా కాదని ఏకంగా నాలుగు పదుల వయసులో మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు ఈ ఆధునిక అమ్మలు. ఇంతకీ ఈ ఆధునిక తల్లులకు వయసు రీత్యా ఆరోగ్యప్రమాదా లేమి ఎదురుకావా? ఇకపై ఆ భయాలకు కాలం చెల్లిపోయిందా అంటే..లేటు వయసులో ప్రెగ్నెన్సీ అనేది సురక్షితం కాదని, పలు ఆరోగ్య సమస్యలు ఉంటాయనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదే సమయంలో ఇకపై ఇంత లేటు వయసులో గర్భందాల్చడం అనేది ప్రమాదకరం కూడా కాకపోవచ్చని, పైగా ఇది అసాధారణమైనదిగా ఉండదని ధీమాగా చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం చాలామంది మహిళలు తగిన జాగ్రత్తలతో సానుకూల ఫలితాలను పొందుతున్నట్లు వెల్లడించారు. నిజానికి ఇంత లేటు వయసులో పిల్లలను కనడం కష్టం. పైగా అండాల నాణ్యత తగ్గి..సంతానోత్పత్తి సహజంగానే తగ్గుతుందన్నారు. అందువల్ల ఆ వయసులో ఐవీఎఫ్ వంటి సహాయక పునరుత్పత్తి సాంకేతికతలను ఆశ్రయించాల్సి ఉంటుందని కూడా అన్నారు.తల్లి, బిడ్డకు ఎదురయ్యే ప్రమాదాలు..వైద్య పురోగతి కారణంగా ఆలస్య గర్భధారణ సురక్షితంగా మారినప్పటికీ..35 ఏళ్లు దాటిన మహిళలు ప్రెగ్నెన్సీ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనని అన్నారు. సాధారణంగా 35 దాటిన తర్వాత గర్భధారణ అనేది మధుమేహం, రక్తపోటు, ప్రీకాంప్సియా వంటి అనారోగ్య ప్రమాదాలను పెంచుతుందట. పైగా ప్రసవ సమయంలో ఆ సమస్యల కారణంగా సీజేరియన్ డెలివరీ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయట.అందువల్ల ఆ ఏజ్లో ప్రెగ్నెంట్ అయ్యే మహిళలు ముందుగానే వైద్యులను సంప్రదిస్తే..రాను రాను తలెత్తే ప్రమాదాలను నివారించడంలో హెల్ప అవుతుందని అన్నారు. అలాగే వృద్ధ తల్లులకు జన్మించిన శిశువులు డౌన్ శిండ్రోమ్ వంటి క్రోమోజోమ్ అసాధారణతలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే అకాల జననం లేదా నెలలు నిండక ముందు జన్మనివ్వడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉందని అన్నారు.లేటు వయసులో ఆరోగ్యకరమైన గర్భధారణ కోసం..ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందుగానే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం.గర్భధారణ నిర్ధారించిన దగ్గర నుంచి క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించడం, సలహాలు, సూచనలు పాటించడంసమతుల్య ఆహారం, మితకరమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడంఒత్తిడి నిర్వహణ, కుటుంబ మద్దతు తదితరాలు అత్యంత అవసరం. అప్పుడే తల్లిబిడ్డ సురక్షితంగా ఉంటారు.
కొంపముంచిన వెయిట్లాస్ టిప్..! పాపం ఆ విద్యార్థిని..
ఇటీవల కాలంలో అందర్నీ వేధించే సమస్య అధిక బరువు. అందులోనూ సోషల్ మీడియా పుణ్యమా అని ఇది తింటే బరువు తగ్గుతారు, ఈ జ్యూస్ తాగితే సన్నజాజిలా నాజుగ్గా అయిపోతారంటూ..యూట్యూబ్ వీడియోలు ఎంతలా ప్రజలను ఊదరగొట్టేస్తున్నాయో తెలిసిందే. అయితే ఏ చిట్కా లేదా హెల్త్ టిప్స్ అనేవి మన శరీరానికి ఎంత వరకు సరిపడుతుందనేది వ్యక్తిగత వైద్యులు లేదా ఆరోగ్యనిపుణులని సంప్రదించడం అనేది అత్యంత ప్రధానం. గుడ్డిగా ఏది పడితే అది ఫాలో అయితే..ప్రాణాలకే ప్రమాదం అనేందుకు ఈఉదంతమే నిదర్శనం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఏఐ, సోషల్మీడియా సాయం తీసుకునేవాళ్లకు ఈ ఘటన ఓ కనువిప్పు కూడా. అసలేం జరిగిందంటే.. తమిళనాడు సెల్లూరులోని మీనాంబాల్పురం, కామరాజ్ క్రాస్ స్ట్రీట్కు చెందిన దినసరి కూలీ వేల్ మురుగన్ (51), విజయలక్ష్మీ దంపతుల కుమార్తె కలైయరసి(19) నరిమేడులోని ఒక ప్రముఖ ప్రైవేట్ మహిళా కళాశాలలో చదువుతోంది. కొద్దిగా అధిక బరువుతో ఉండటంతో ఆమె తరుచుగా బరువు తగ్గే చిట్కాలను యూట్యూబ్లలో చూస్తుండేది. గతవారం ఆమె కొవ్వుని తగ్గించి..శరీరాన్ని సన్నగా మార్చే..వెంకారాం(బొరాక్స్) అనే టైటిల్తో ఉన్న వీడియోని ఓ యూట్యూబ్ ఛానెల్లో చూసింది. జనవరి 16న, థెర్ముట్టి, కీళమాసి వీధి సమీపంలోని ఒక ఆయుర్వేద మందుల దుకాణంలో ఆ పదార్థాన్ని కొనుగోలు చేసిందామె. జనవరి 17న వీడియోలో చెప్పిన విధంగా సేవించింది. వెంటనే వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. తక్షణమే ఆమె తల్లి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఆ లక్షణాలు తగ్గుముఖం పట్టక పోగా..మళ్లీ తిరగబెట్టాయి..దాంతో సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చేసింది. అయినా పరిస్థితి చక్కపడక పోగా..తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం పడుతోందంటూ తండ్రిని పట్టుకుని భోరున విలపించింది. రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో వాంతులు, విరేచనాలు మరింత తీవ్రమవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించేందుకు తరలిస్తుండగా..మార్గ మధ్యలోనే తుదిశ్వాస విడిచింది. వైద్యులు సైతం అప్పటికే చనిపోయిందని దృవీకరించారు. ఆమె మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన తదనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సదరు యూట్యూబ్ ఛానెల్పై చర్యలు తీసుకునేలా దర్యాప్తు ప్రారంభించారు.(చదవండి: ఎనిమిది నెలల్లో 31 కిలోల బరువు..! ఆ సాకులకు స్వస్తి చెప్పాల్సిందే..!)
రూ.21 వేల జీతం నుంచి ఏడాదికి కోట్లు గడించే రేంజ్కి..!
ఎన్నో సక్సెస్ స్టోరీలు నెట్టింట ఆకర్షిస్తుంటాయి. అలానే ఈసారి రెడ్డిట్లో వైరల్ అవుతున్న ఈ స్టోరీ వచ్చే అవకాశాలను ఒడిసిపట్టుకుంటే..ఆకామంత గెలుపుని పాదాక్రాంతం చేసుకోవచ్చని చూపించే గాథ ఇది. కనీస అవసరాలు తీర్చుకోలేక అల్లాడుతూ చాలీచాలని జీతంతో మొదలైన అతడి జీవితం..చార్టర్ అకౌంటెంట్ని కలవగానే ఎలా మలుపు తిరిగిందో షేర్ చేశాడు. ఈ కథ నెటిజన్లను..అమితంగా ఆకర్షించడమే కాదు..చాలా స్ఫూర్తిదాయకమైన కథ అంటూ కితాబిచ్చేశారు కూడా.అదేంటంటే..ఒక మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్ రెడ్డిట్లో రూ.21 వేల నుంచి ఏడాదికి రూ. ఒక కోటి నుంచి రెండు కోట్లు వరకు ఆర్జించే రేంజ్కి ఎలా చేరుకున్నాడో పంచుకున్నారు. జాబ్ కెరీర్లో ఇంత పెద్ద సక్సెస్ని ఎలా సాధించాడో సవివరంగా తెలిపి..ప్రేరణగా నిలిచాడు. మొదట్లో అందరం చిన్నాచితకా ఉద్యోగాలే సంపాదిస్తూ..అక్కడ నుంచి అవకాశాలు వెతుక్కుంటూ పోవాలి. ఆ క్రమంలో మనకు ఎదురయ్యే కష్టాలు, సవాళ్లే..గొప్ప పరిష్కారాన్ని, విజయాన్ని అందిస్తాయిని చెప్పేందుకే తన కథను షేర్ చేస్తున్నానంటూ తన విజయగాథను చెప్పుకొచ్చాడు. తాను పనిచేసిన తొలి ఉద్యోగాన్ని గుర్తు చేసుకుంటూ..ఒక ఆర్థిక సంస్థలో "డాక్యుమెంట్ ఎగ్జిక్యూటివ్" ఉద్యోగం సంపాదించానని, ఎందుకంటే కరోనా సమయం కావడంతో ఉద్యోగ మార్కెట్ సవ్యంగా లేని గడ్డుపరిస్థితుల్లో ఆ చిన్న ఉద్యోగమే తనకు ఆదారమైందని చెప్పుకొచ్చాడు.ఆ ఉద్యోగం దగ్గర దగ్గర డెలివరీ బాయ్లాంటిదని తెలిపాడు. అప్పుడు రూ. 18 వేలు వేతనం అందుకునేవాడినని చెప్పాడు. తన పని క్లయింట్ల నుంచి ఫైళ్లను సేకరించడం, డాక్యుమెంట్లను వెరిఫై చేసి బ్యాంకులకు సమర్పించడమని అన్నారు. తాను ఢిల్లీలో వేసవి, శీతాకాలపు పొగమంచులను లెక్కచేయకుండా పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. అంతలా నాలుగేళ్లకు పైగా కష్టపడితే తన జీతం కేవలం రూ. 2 వేలు మాత్రమే పెరిగిందని, దాంతో రూ. 21,000 వేతనం అందుకునేవాడినని వివరించాడు. ఆ క్రమంలో ఒక చార్టడ్ అకౌంటెంట్ని(సీఏ)ని కలవగా..తన లైవ్ ఊహించిన మలుపు తిరిగి ..స్వతంత్రంగా ఫంఢింగ్ కేసును నిర్వహించి, నెట్వర్క్ ద్వారా ప్రాసెస్ చేస్తూ..50 శాతం ఆదాయం పొందేలా డీల్ కుదుర్చుకున్నట్ల తెలిపాడు. అలా ఇవాళ వందల కోట్లు విలువైన డీల్స్ నిర్వహిస్తూ..ఏడాదికి ఒక కోటి నుంచి రెండు కోట్లు వరకు గడిస్తున్నట్లు తెలిపాడు. జాబ్ మార్కెట్కి మన డిగ్రీతో పనిలేదని అన్నాడు. తాను ఇంతకుమందులా డెలివరీ బాయ్లా ఫైళ్లను బ్యాంకులకు డెలివరీ చేయడం లేదని, పూర్తిస్థాయి ఆర్థిక సలహాదారుగా పనిచేస్తూ..కోట్లు గడిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. తాను సంక్లిష్ట రుణ సాధనాలు నిర్వహిస్తానని,ప్రాజెక్ట్ ఫండింగ్ నుంచి ఈక్విటీ ఫండింగ్, పెట్టుబడులు, అధిక టికెట్ బీ2బీ రుణాలు వంటివి నిర్వహిస్తానని పోస్ట్లో తెలిపాడు. ప్రస్తుతం తాను వాణిజ్య రియల్ ఎస్టేట్ నుంచి ఆతిధ్య రంగంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపాడు. ఆ నేపథ్యంలోనే హోటళ్లు, ఆస్పత్రులు కొనుగోలు, అమ్మకాలను సులభతరం చేస్తున్నానని పోస్ట్లో రాసుకొచ్చాడు. నెటిజన్లు బ్రో చాలా బాగుంది మీ విజయగాధ..చాలా స్ఫూర్తిదాయకం, ప్రేరణ కూడా అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: బిర్యానీలలో హైదరాబాద్ బిర్యానీ రుచే వేరు..! సాక్షాత్తు జపాన్ రాయబారి సైతం..)
అంతర్జాతీయం
కరాచీ మాల్ అగ్ని ప్రమాదం.. ఒకే చోట 30 మృతదేహలు
కరాచీలోని 'గుల్ షాపింగ్ ప్లాజా'లో శనివారం(జనవరి 17) సంభవించిన భారీ అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. సంఘటన స్థలంలో వరుసగా ఐదో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగాయి. సహయక సిబ్బంది గురువారం పదుల సంఖ్యలో శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది.ఒకే చోట 30 మంది..సహాయక చర్యల్లో భాగంగా గుల్ షాపింగ్ ప్లాజా మెజానైన్ అంతస్తులోని 'దుబాయ్ క్రాకరీ' అనే షాప్ షట్టర్లు తెరిచిన సిబ్బంది షాకయ్యారు. ఒకే చోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి వీరంతా షాపు లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారని, అయితే బయట దట్టంగా అలుముకున్న పొగ కారణంగా ఊపిరాడక లోపలే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.అయితే ఈ విషాధ సంఘటనలో మరణించిన వారిని గుర్తించడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది. ఇప్పటివరకు లభ్యమైన 61 మృతదేహాలలో, కేవలం 12 మంది మాత్రమే గుర్తించినట్లు సింధ్ పోలీస్ సర్జన్ డాక్టర్ ఒకరు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా ఈ భవనంలో భద్రత లోపాలు అధికారులు గుర్తించారు. భవనంలో మొత్తం 16 ఎగ్జిట్ గేట్లు ఉండగా, ప్రమాద సమయంలో 14 గేట్లు మూసివేసి ఉండటం వల్ల ప్రాణనష్టం పెరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఇంకా దాదాపు 85 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా మృతుల కుటుంబాలకు సింధ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. కోటి (10 మిలియన్లు) పరిహారం ప్రకటించింది.
నాకు ముగ్గురు..నన్నెవరూ భయపెట్టలేరు హార్ట్ టచింగ్ వీడియో
‘‘నన్ను చూసి ఏడ్వకు’’, ‘‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’’ ఇలాంటి ఎన్నో సందేశాలను మనం సాధారణంగా ఆటోల వెనుక, లారీల వెనుక చూస్తూంటాం. వీటితో పాటు కొన్ని ఫన్నీ కోట్లు, చిత్ర విచిత్రమైన సందేశాలు కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. వీటన్నింటికి భిన్నంగా ఒక కారు వెనుక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన కొటేషన్ ఒకటి నెట్టింట సందడిగా మారింది. అదేంటో తెలుసుకుందామా.అమ్మాయి అనగానే ‘ఆడ’ బిడ్డ అంటూ అనేక కుటుంబాలలో ఇప్పటికీ ఆడపిల్లలను భారంగా భావించే ఈ రోజుల్లో, ఈ సందేశంతో కూడిన వీడియో అందరి హృదయాలను హత్తుకుంది. View this post on Instagram A post shared by SYED KAZIM🩶 (@syed_kazimkazmi110) “మీరు నన్ను భయపెట్టలేరు. నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.” అన్నమెసేజ్ . దీంతోపాటు, దీని “M,” “A” “S” అనే అక్షరాలు ఉన్నాయి. అంటే అవి అతని కుమార్తెల పేర్లను సూచిస్తాయని భావిస్తున్నారు. దీంతో ఇది ప్రత్యేకంగా నిలిచింది. ఒక్కోసారి చిన్న మాటలే ఎంత శక్తివంతమైన సందేశాన్ని ఇవ్వగలవో ఇది నిరూపించింది. ఈ క్లిప్ను కరాచీకి చెందిన వ్లాగర్ ఒకరు ఇన్స్టాలో పంచుకున్నారు. తను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ముందు వెళ్తున్న కారు వెనుక భాగంలో దీన్ని గమనించి రికార్డ్ చేశారు. ఆ రోజు తాను చూసిన అత్యంత హృద్యమైన విషయాలలో ఇది ఒకటి అంటూ పాకిస్థాన్కు చెందిన ఒక చిన్న వీడియోను ఇన్స్టాలో ఫాలోయర్లతో పంచుకున్నారు. "ఒక తండ్రి కల" అని క్యాప్షన్తో చేసిన వ్లాగర్ ఈ పోస్ట్ ఇప్పటికే 2 కోట్లకు పైగా వ్యూస్ను సంపాదించింది.నెటిజన్ల రియాక్షన్ఇతడు మేలిమి బంగారం అని ఒకరు, మరొకరు, “ప్రతి కుమార్తెకు ఇలాంటి తండ్రి ఉండాలని కలలు కంటుంది” అని వ్యాఖ్యానించారు.“ఆడపిల్లలను ఇప్పటికీ భారంలా చూసే సమాజంలో, ఈ వ్యక్తికి హ్యాట్సాఫ్,” అని మరొకరు వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి, “పప్పా మేరీ జాన్ బచావో” , “ఎంత గర్వపడే తండ్రి,” అని ఒక వ్యక్తి ఆశ్చర్యపోగా, “ఎంత ముద్దుగా ఉంది,” “అదృష్టవంతుడు,” “మా నాన్నలాగే,” లాంటి స్పందనలు వెల్లువెత్తాయి. మరోవైపు ఒక వ్యక్తి చమత్కారంగా, “మరొకరిని కనండి, అప్పుడు మీరు వారిని MASS అని పిలవవచ్చు” అని సూచించడం విశేషం.
అధ్వాన్నంగా అమెరికాలో ఆరోగ్యం : ఎండోస్కోపీ కోసం 6 వారాలు
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆధీనంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లోని ఒక ప్రధాన ఉద్యోగి ట్వీట్ వైరల్గా మారింది. అమెరికాలో H1b ఫీజు పెంపుతో, అమెరిలో వైద్యం అందని ద్రాక్ష మారుతోందని అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిపుణులైన విదేశీ డాక్టర్లు అందుబాటులో లేని కారణంగా మెడికల్ డెసర్ట్లు ఇంకా పెరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆధీనంలోని ఎక్స్ (ట్విటర్) ప్రొడక్షన్ హెడ్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది.ఎక్స్ ప్రొడక్షన్ హెడ్ నికితా బియర్ తన ఆరోగ్యం గురించి తన ట్వీట్ ద్వారా ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫ్రైడ్ చికెన్ తింటు న్నప్పుడు తనకు గొంతులో గాయమైందని, దీంతో తాను సరిగ్గా మాట్లాడలేక పోతున్నానని లేదా మింగలేకపోతున్నానని చెప్పారు. వైద్యులు ఎండోస్కోపీ చేయించు కోవాలని సలహా ఇచ్చారట. ఇక్కడే అసలు విషయం గురించి చెప్పారు. ముందు నష్టాన్ని అంచనా వేయడానికి చాలా వారాలు వేచి ఉండాలని తనకు సలహా ఇచ్చారని బియర్ పేర్కొన్నారు.ఎండోస్కోపీ పరీక్షకోసం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా , నాలుగు లేదా ఆరు వారాల తరువాతే మాత్రమే అని చెప్పడంతో షాక్ అవడం అతని వంతైంది. బియర్ ఈ అనుభవాన్ని “కాఫ్కా నవల” ను వర్ణిస్తూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది.అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ ఇంత దారుణంగా ఉందా అనేచర్చకు దారి తీసింది.అమెరికన్ హెల్త్కేర్ వ్యవస్థకు సంబంధించి అనేకమంది విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నిలిచిపోయిన ఉద్యోగ నియామకాలు, నిపుణుల కొరత, బీమా సంబంధిత ఆంక్షలు, అధిక ఖర్చులపై మాట్లాడారు. వీటి కారణంగానే సాధారణ రోగనిర్ధారణ విధానాలకు కూడా చాలా జాప్యం జరుగుతోందని మండిపడ్డారు.హాయిగా ఇండియా ట్రిప్ వేయండి! మరోవైపు బియర్ను భారతదేశంలో చికిత్స పొందాలని , అక్కడ ఆసుపత్రులలో రోగనిర్ధారణ పరీక్షలు చాలా తొందరగా అయిపోతాయని చెప్పారు. ఇండియాకు అలా విమానంలో వెళ్ళండి. గంటలోపే టాప్ డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఆరు గంటల్లో ఎండోస్కోపీ లాంటివి పూర్తి చేసుకుని మూడు రోజుల్లో తిరిగి వెళ్లిపోవచ్చు అంటూ మరొకరు సూచించారు. సత్వర చికిత్స కోసం బియర్ను దక్షిణ కొరియా, దుబాయ్ లేదా థాయ్లాండ్కు వెళ్లమని కొంతమంది నెటిజన్లు సలహా ఇచ్చారు.(అనంత్ అంబానీ మరో లగ్జరీ వాచ్, అదిరిపోయే డిజైన్, ధర ఎంత?)వ్యవస్థాపకుడు అమన్ గైరోలా కూడా భారతదేశ వైద్య మౌలిక సదుపాయాలను ప్రశంసిస్తూ వ్యాఖ్యానించారు. "ఇక్కడ అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా మహా అయితే 48 గంటలు పడుతుంది. దేశం అందించే సౌకర్యాలను ప్రజలు ఎప్పుడూ గ్రహించరు. ఇక్కడ కూడా ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి కానీ క్రమంగా మెరుగుపడుతోంది" అని ఆయన రాశారు.ఇదీ చదవండి: H-1B వీసా ఫీజు : లక్షలాది అమెరికన్ల ఆరోగ్యం సంక్షోభంలో!
గాజా శాంతి మండలిని ఆవిష్కరించిన ట్రంప్
దావోస్: గాజా శాంతి మండలిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించారు. దావోస్ వేదికగా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’ సంతకాలు జరిగాయి. అయితే, గాజా ’బోర్డ్ ఆఫ్ పీస్కు కార్యక్రమానికి భారత్ దూరంగా ఉంది. అయితే, గాజా శాంతిమండలిలో పాకిస్తాన్ సభ్య దేశంగా చేరింది. గాజా పునర్నిర్మాణం, శాంతి కోసమే బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ చెబుతున్న ట్రంప్.. ఆయుధాలు వీడకపోతే బూడిద చేస్తామంటూ హమాస్ను ఈ సందర్భంగా మరోసారి హెచ్చరించారు.అంతర్జాతీయ విభేదాలను పరిష్కరించడానికి సహాయపడుతుందని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగం కావాలని కోరుకుంటున్నారని ట్రంప్ అన్నారు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తామని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, శాంతి మండలిలో చేరాలని 50 మందికిపైగా ట్రంప్ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా పలు దేశాల అధినేతలకు ఆహ్వానాలు అందాయి.మధ్యప్రాచ్యంలో శాంతిని సుస్థిరం చేయడానికి, ప్రపంచ సంఘర్షణల పరిష్కారానికి కొత్త మార్గాన్ని అన్వేషించడానికి ఉద్దేశించిన ఈ బోర్డులో చేరాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ లేఖ రాశారు. ఈ బోర్డులో చేరిన దేశాల్లో ప్రస్తుతం పాకిస్థాన్తో పాటు బహ్రెయిన్, మొరాకో, అర్జెంటీనా, అర్మేనియా, అజర్బైజాన్, బల్గేరియా, హంగేరి, ఇండోనేషియా, జోర్డాన్, కజకిస్థాన్, కొసోవో, పరాగ్వే, ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ, ఉజ్బెకిస్థాన్, మంగోలియా ఉన్నాయి.గాజా శాంతి మండలిలో చేరాలంటూ ట్రంప్ ఆహ్వానంపై భారత్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ మండలిలో పాకిస్థాన్ చేరికను ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాక్ గడ్డపై పని చేస్తున్న లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు, హమాస్కు మధ్య సంబంధాలు పెరుగుతున్నాయని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ఐక్యరాజ్యసమితి స్థానంలో ట్రంప్ ఈ గాజా శాంతి మండలిని తీసుకువస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది.ఈ బోర్డుకు ట్రంప్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ మండలిలో ఉప విభాగాలు ఏర్పాటు, రద్దు చేసే సర్వాధికారాలు ఆయనకే ఉంటాయిట్. ట్రంప్ ఎంపిక చేసే ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు రెండేళ్ల పదవీకాలం కలిగి ఉంటారు. వైట్ హౌస్ (అధ్యక్ష పదవి) నుండి వైదొలిగినా, ట్రంప్ స్వచ్ఛందంగా రాజీనామా చేసే వరకు ఆయనే ఛైర్మన్గా కొనసాగేలా నిబంధనలు రూపొందించారు.
జాతీయం
ముంబై మేయర్ ఎంపికలో బిగ్ ట్విస్ట్!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ముంబై మేయర్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ముంబై మేయర్ పోస్టును ఏ కేటగిరికి కేటాయించాలి? అనే అంశంపై లాటరీ తీశారు. ఫలితాల్లో ‘జనరల్ మహిళ’ కేటగిరీ ఎంపిక కావడంపై ఉద్దవ్ థాక్రే శివసేన వ్యతిరేకిస్తోంది. దీంతో, మేయర్ స్థానంపై ఉత్కంఠ నెలకొంది.వివరాల మేరకు.. ముంబై మహిళా మేయర్ రానున్నారు. అయితే, సదరు మహిళా మేయర్.. ఏ కేటగిరి నుంచి రావాలనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో, ఈ పోస్ట్ను ఏ కేటగిరీకి కేటాయించాలనే దానిపై లాటరీ తీశారు. ఫలితాల్లో ‘జనరల్ మహిళ’ కేటగిరీ ఎంపికైంది. కాగా, ఈ లాటరీ ప్రక్రియ, ఫలితంపై ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది గందరగోళ పరిస్థితులకు దారితీసింది. బీఎంసీని ఓబీసీ కేటగిరీ కింద ఎందుకు పరిగణించలేదని మాజీ మేయర్ కిశోరి ఫడ్నేకర్ ప్రశ్నించారు. గతంలో రెండు దఫాలు కూడా ఈ పోస్టు ఓపెన్ కేటగిరీలోనే ఉందని గుర్తుచేశారు. అనంతరం, సభ నుంచి ఉద్దవ్ వర్గం సభ్యులు బయటకు వెళ్లిపోయారు. దీంతో, మేయర్ స్థానంలో ఉత్కంఠ నెలకొంది.#WATCH | Mumbai | Following reservation lottery announcement for mayor post, Shiv Sena (UBT) leader & former mayor, Kishori Pednekar says," There are many areas where OBC community stays in Mumbai. No chit with names of their representatives was put in the lottery. This is wrong.… pic.twitter.com/HtBViPvsm2— ANI (@ANI) January 22, 2026మరోవైపు.. మేయర్ పదవి కోసం డ్రా పూర్తయిన తర్వాత బీఎంసీలోని అర్హులైన కార్పొరేటర్లు నామినేషన్లు వేసేందుకు వీలవుతుంది. ఈ లాటరీ ప్రక్రియ తర్వాత పుణె, ధూలే, బీఎంసీ, నాందేడ్, నవీ ముంబయి, మాలేగావ్, మీరా భయందర్, నాసిక్, నాగ్పుర్ మేయర్ పోస్టులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. అలాగే.. లాతూర్, జల్నా, థానే మూడు మున్సిపల్ కార్పొరేషన్లు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో లాతూర్, జల్నా ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేయబడింది. మొత్తం ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లు ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) విభాగానికి రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో అకోలా, చంద్రపూర్, అహిల్యానగర్, జల్గావ్ ఓబీసీ మహిళలకు రిజర్వ్ చేయబడగా.. పన్వెల్, ఇచల్కరంజి, కొల్హాపూర్, ఉల్హాస్నగర్ ఓబీసీ అభ్యర్థులకు కేటాయించారు.Mumbai is set to have a woman mayor for the second term in a row after the BMC mayoral post was placed in the Open (Women) category during the reservation lottery. #MumbaiMayor #BMC #WomenLeadership #MaharashtraPolitics #CivicPolls #MayorReservation pic.twitter.com/RnNjhxIcT9— Mumbai Insights (@Mumbai_Insights) January 22, 2026
నిన్నగాక మొన్న పెళ్లి : చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్లు
గుజరాత్లోని అహ్మదాబాద్లో దారుణం చోటు చేసుకుంది. తన అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి తన భార్యను కాల్చి చంపి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్వల్ప వివాదమే ఈ విషాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసుల ప్రకారం మృతులను గుజరాత్ మారిటైమ్ బోర్డులో క్లాస్-1 అధికారి యశరాజ్సింగ్ గోహిల్ , అతని భార్య రాజేశ్వరి గోహిల్గా గుర్తించారు. ఈ జంటకు కేవలం రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. బుధవారం రాత్రి ఇంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే క్షణికావేశంతో యశరాజ్సింగ్ తన లైసెన్స్ రివాల్వర్తో రాజేశ్వరిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత, యశరాజ్సింగ్ 108 అత్యవసర సేవకు ఫోన్ చేశాడు. అధికారులు అక్కడికే చేరుకునేసమయానికే రాజేశ్వరి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అత్యవసర బృందం ఫ్లాట్ నుండి వెళ్లిపోయిన తర్వాత, యశరాజ్సింగ్ మరో గదిలోకి వెళ్లి అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: రూ. 40 వేల కోట్ల కంపెనీకి సారథి : వైఫల్యాలు వెక్కిరించినా!మరోవైపు యశరాజ్సింగ్ గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు , రాజ్యసభ ఎంపీ శక్తిసింగ్ గోహిల్ మేనల్లుడు. ఈ మరణాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషి విచారం వ్యక్తం చేస్తూ, ఈ ఘటనతో కుటుంబం తీవ్రంగా కలత చెందిందని అన్నారు. అతనొక యువ అధికారి, ఇటీవల పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గుజరాత్ మారిటైమ్ బోర్డులో చేరాడనీ, యూపీఎస్సీకి కూడా సిద్ధమవుతున్నాడని ఇంతలోనే ఈ విషాదం జరిగిందని విచారం వ్యక్తం చేశారు ఇద్దరి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అతని తుపాకీ లైసెన్స్, 108 కాల్ రికార్డులు వంటి వివరాలను పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: మొన్ననే పెళ్లి, తగాదా...నాలుక కొరికేసింది, తీవ్ర ఘర్షణ!
విజయ్ టీవీకేకు గుర్తు కేటాయించిన ఈసీ..
సాక్షి, ఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. ఈ క్రమంలో విజయ్ పార్టీ టీవీకేకు విజిల్ గుర్తును ఈసీ కేటాయించింది. అలాగే, కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తు కేటాయించినట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, తమిళనాడులో టీవీకేకు ఇవే తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఫిబ్రవరి 2024లో ఈ పార్టీ ఎన్నికల సంఘంలో రిజిస్ట్రర్డ్ అయ్యింది. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలతో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది.ఇదిలా ఉండగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎంకేను రాజకీయ విరోధిగా.. బీజేపీని భావజాల శత్రువుగా ప్రకటించేశారాయన. ఈ క్రమంలో దాదాపుగా ఏడాది కిందటే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన.. రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రతో దేశం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించారు. ఇక పొత్తులు ఉండబోవని విజయ్ ప్రకటించినప్పటికీ.. ఆ అంశం కూడా ఇప్పుడు పరిశీలనలో ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.BIG BREAKING 🚨The Election Commission has allotted the whistle symbol to TVK ✅🥳🔥#TVKVijay @TVKVijayHQ pic.twitter.com/eYnFgK6doO— Vijay Social Teamⱽˢᵀ (@TST_Offcl) January 22, 2026అయితే.. కరూర్ ఘటన తర్వాత విజయ్ ఒక్కసారిగా స్పీడ్ తగ్గించారు. ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయలేదు. తన చివరి చిత్రంగా చెబుతున్న జన నాయగన్ రిలీజ్ ఆగిపోయిన కూడా స్పందించలేదు. అయితే, ఆయన తన పనిని తాను సైలెంట్గా పని చేసుకుపోతున్నారని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఇప్పటికే టీవీకే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది కూడా. అతిత్వరలో టీవీకే మేనిఫెస్టో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక ర్యాలీలో విజయ్ దీనిపై అధికారికంగా ప్రకటన చేయొచ్చని సమాచారం. ఇదిలా ఉండగా.. పొంగల్ తర్వాత ఇటీవలే 10 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని విజయ్ ప్రకటించారు. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించబోతోంది. అదనంగా.. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలపరచడం అనే బాధ్యతను కూడా తీసుకుంది. అలాగే.. విజయ్ కూడా ఈ నెల 25వ తేదీ నుంచి తిరిగి రాజకీయ ప్రచారం ప్రారంభిస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.
జమ్మూలో ఘోరం
బందేర్వాహ్/జమ్మూ: ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లో పాల్గొనేందుకు వెళ్తున్న 10 మంది సైనికులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జ మ్మూకశ్మీర్లోని డోడా జిల్లాలోని భందేర్వాహ్–ఛంబా అంతర్రాష్ట్ర రహదారిలో 9,000 అడుగుల ఎత్తయిన ఖన్నీ పర్వత ప్రాంతంలో సైనిక వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని భారత ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. విషయం తెల్సిన వెంటనే సైన్యం, పోలీసులు అన్వేషణ, సహాయక చర్యలను ఆరంభించారు. 200 అడుగుల లోతైన లోయలో పడిపోయిన వాహనం నుంచి నలుగురు సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 17 మంది సైనికులను ఎలాగోలా పైకి తీసుకొచ్చి ఆస్పత్రుల్లో చేర్పించారు. అయితే వారిలో చికిత్స పొందుతూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సైనిక వాహనం చాలా ఎత్తు నుంచి పల్టీలు కొడుతూ లోయలో పడటంతో ఎక్కువ మంది చనిపోయారని అదనపు డిప్యూటీ కమిషనర్ సుమిత్ భుత్యాల్ వెల్లడించారు. అసలేమైంది?ఖన్నీ పర్వతం మీద ఉన్న ఆర్మీ పోస్ట్కు చేరుకునేందుకు పలువురు సైనికులు గురువారం మధ్యాహ్నం అత్యంత అధునాతన ‘క్యాస్పిర్’ ఆర్మీ వాహనంలో బయల్దేరారు. రహదారిలో పాతిపెట్టిన మందుపాతరలు, శక్తివంత పేలుడు పదార్థాలు(ఐఈడీ)లను గుర్తించే, ఉగ్రవాదుల తుపాకీ గుళ్ల వర్షాన్ని సైతం తట్టుకోగల బుల్లెట్ప్రూఫ్ వాహనంగా ‘క్యాస్పిర్’ పేరొందింది. గురువారం అననుకూల వాతావరణంలో వెళ్తున్న సమయంలో డ్రైవర్ చేతుల్లోంచి వాహనం అదుపుతప్పడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని జమ్మూ కేంద్రంగా పనిచేసే వైట్నైట్ కోర్ బలగం తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్పెట్టింది.దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధానిసైనికుల వీరమరణం ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘డోడా ఘటన అత్యంత విచారకరం. సాయుధ బలగాల్లో అత్యంత ధైర్యవంతులను కోల్పోయాం. దేశసేవలో ప్రాణాలు కోల్పోయిన మీ త్యాగాలను జాతిజనులు సదా గుర్తుంచుకుంటారు’’ అని ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని తన ఆకాంక్ష తెలియజేశారు. గాయపడిన సైనికులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికార యంత్రాంగానికి ప్రధాని సూచించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఎన్ఆర్ఐ
క్లీవ్ల్యాండ్లో శంకర నేత్రాలయ తొలి నిధి సమీకరణ కార్యక్రమం దిగ్విజయం
శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో “Echoes of Compassion – Where Arts Meet Heart” అనే శీర్షికతో, ఒహియో చాప్టర్ యొక్క తొలి నిధి సమీకరణ కార్యక్రమం క్లీవ్ల్యాండ్లో గర్వంగా నిర్వహించబడింది. ఈ చారిత్రక కార్యక్రమం డిసెంబర్ 13, శనివారం సాయంత్రం 4:00 గంటల నుండి 7:00 గంటల వరకు, ఒహియో రాష్ట్రం మెడినా నగరంలోని మెడినా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ (మిడిల్ స్టేజ్) లో ఘనంగా జరిగింది.ఒహియో రాష్ట్ర సాంస్కృతిక కమిటీ సభ్యురాలు శ్రీమతి కల్యాణి వేటూరి గారి సమర్థ మార్గదర్శకత్వంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో, గ్రేటర్ క్లీవ్ల్యాండ్ ప్రాంతానికి చెందిన అనేక సంగీత మరియు శాస్త్రీయ నృత్య పాఠశాలలు పాల్గొని, చూపు సంరక్షణ ద్వారా మానవ సేవ చేయాలనే శంకర నేత్రాలయ యొక్క మహత్తర సేవా లక్ష్యానికి తమ మద్దతును అందించాయి.ఈ సాయంత్రం శాస్త్రీయ సంగీతం మరియు భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాల అద్భుత సమ్మేళనంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి ప్రదర్శనకు ప్రేక్షకుల నుండి హర్షాతిరేక చప్పట్లతో అపూర్వ స్పందన లభించింది.సంగీత ప్రదర్శనలు⇒ సప్త స్వర అకాడమీ విద్యార్థులు(గురు శ్రీ విష్ణు పసుమర్తి మరియు గురు శ్రీ కృష్ణ పసుమర్తి గారి నాయకత్వంలో)⇒ మధురాలయ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ విద్యార్థులు(గురు శ్రీ లలిత్ సుబ్రహ్మణియన్ గారి మార్గదర్శకత్వంలో)శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు⇒ కూచిపూడి — శ్రీమతి కల్యాణి వేటూరి గారి శిష్యులు, శ్రీ మయూరి డాన్స్ అకాడమీ⇒ భరతనాట్యం — గురు శ్రీమతి సుజాత శ్రీనివాసన్ గారి శిష్యులు, శ్రీ కలామందిర్⇒ కథక్ — గురు శ్రీమతి అంతర దత్తా గారి శిష్యులు, అంగకళ కథక్ అకాడమీ⇒ కూచిపూడి — గురు శ్రీమతి సుధా కిరణ్మయి తోటపల్లి గారి శిష్యులు, నర్తనం డాన్స్ అకాడమీతీవ్రమైన మంచు తుఫాను మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, సేవాభావం ప్రకాశవంతంగా వెలిగింది. “వర్షమైనా మంచైనా, కార్యక్రమం కొనసాగాల్సిందే” అనే నమ్మకంతో ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించబడింది. 150 మందికి పైగా సమాజ సభ్యులు హాజరై, అపూర్వమైన సమాజ మద్దతును చాటిచెప్పారు.ఈ కార్యక్రమానికి ఇండియా ఫెస్ట్ U.S.A. స్థాపకులు శ్రీ భరత్ పటేల్ ప్రత్యేక అతిథిగా హాజరై, కార్యక్రమానికి మరింత గౌరవం మరియు ప్రోత్సాహాన్ని అందించారు.“ఎకోస్ ఆఫ్ కంపాషన్” కార్యక్రమం కళ, సంస్కృతి, సమాజం ఏకమై ఎలా అర్థవంతమైన మార్పును తీసుకురాగలవో స్పష్టంగా చాటింది. కరుణ మరియు సహకారంతో సేవ చేయాలనే శంకర నేత్రాలయ U.S.A. లక్ష్యాన్ని మరింత బలపరిచింది.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నాయకత్వం మరియు లాజిస్టిక్ మద్దతు అందించిన SNUSA అధ్యక్షులు శ్రీ బాల రెడ్డి ఇందుర్తి, శ్రీమతి నీలిమ గడ్డమనుగు, శ్రీ మూర్తి రేకపల్లి, డా. రెడ్డి ఊరిమిండి, శ్రీ వంశీ ఏరువరం, శ్రీ శ్యామ్ అప్పల్లి, శ్రీ రత్నకుమార్ కవుటూరు, శ్రీ గిరి కోటగిరి, శ్రీ అమర్ అమ్యరెడ్డి మరియు శ్రీ గోవర్ధన్ రావు నిడిగంటి గారికి SNUSA ఒహియో చాప్టర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
అలస్కాలో ‘గుంటూరు విద్యార్థి’ అదృశ్యం
అలాస్కా: అమెరికాలోని అలాస్కాకు ఒంటరిగా బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. ప్రకృతి అందాలను తిలకించడానికి వెళ్లి.. మంచు కొండల మధ్య ఆచూకీ లేకుండా పోయాడు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కరసాని హ్యూస్టన్లో నివాసం ఉంటున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో హరి డిసెంబర్ 22, 2025న ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు.అక్కడ హీలీ పట్టణంలోని ఔరోరా డెనాలి లాడ్జ్లో బస చేశారు జనవరి 4 నాటికి తిరిగి వస్తానని తన రూమ్మేట్స్కు కూడా సమాచారం ఇచ్చారు. అయితే, డిసెంబర్ 30న చివరిసారిగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన హరి.. ఆ మరుసటి రోజు డిసెంబర్ 31 హోటల్ నుంచి చెక్-ఔట్ కాగా.. అప్పటి నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.డిసెంబర్ 31న ఆయన హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక క్యాబ్ సర్వీస్ వాడినట్లు సమాచారం. హరికి డ్రైవింగ్ రాకపోవడంతో ఆయన క్యాబ్లు, స్థానిక రవాణాపైనే ఆధారపడ్డారు. హోటల్ నుంచి బయలుదేరిన హరి ఆ క్యాబ్లో ఎక్కడికి వెళ్లారు? ఆ డ్రైవర్ ఎవరు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 31 తర్వాత డెనాలి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల ఫారన్హీట్ వరకు పడిపోయాయని, హరి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అతని స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారతీయ విద్యార్థులకు అమెరికా బిగ్ వార్నింగ్
భారతీయ విద్యార్థులకు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వీసా అనేది హక్కేం కాదని.. తమ చట్టాలను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని హెచ్చరించింది. వీసా రద్దుతో పాటు దేశ బహిష్కరణ కూడా ఖాయమని స్పష్టం చేసింది. భారత్లోని యూఎస్ ఎంబసీ బుధవారం ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. అందులో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు హెచ్చరిక జారీ చేసింది. అందులో.. ‘‘అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీసా అనేది హక్కు కాదు. అది ఒక ప్రత్యేక అవకాశం మాత్రమే’’ అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. దేశం నుంచి వెల్లగొట్టడమే కాకుండా భవిష్యత్తులో వీసా అర్హత కోల్పోవచ్చని స్పష్టం చేసింది. Breaking U.S. laws can have serious consequences for your student visa. If you are arrested or violate any laws, your visa may be revoked, you may be deported, and you could be ineligible for future U.S. visas. Follow the rules and don’t jeopardize your travel. A U.S. visa is a… pic.twitter.com/A3qyoo6fuD— U.S. Embassy India (@USAndIndia) January 7, 2026ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. స్టూడెంట్ వీసా ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫీజులను గణనీయంగా పెంచడంతో పాటు సోషల్ మీడియా తనిఖీలు తప్పనిసరిగా మారాయి. అలాగే స్టూడెంట్ స్టేకు టైమ్ లిమిట్ వంటి నిబంధనలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ మార్పులు అమెరికాలో చదవాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బెదిరింపులు రావడం గమనార్హం.
అమెరికాలో తెలుగు దంపతుల దుర్మరణం
వాషింగ్టన్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రానికి చెందిన దంపతులు దుర్మరణం చెందారు. ఈరోజు(సోమవారం) వాషింగ్టన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణ కిషోర్, ఆశలు మృతిచెందారు. అమెరికాలో కృష్ణకిషోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తన్నాడు. ఓ కార్యక్రమం మీద బయటకు వెళ్లి తిరిగి కారలో వస్తుండగా వీరు రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతించెందారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిది భారత్లోని తెలుగు రాష్ట్రం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుగా గుర్తించారు. పది రోజుల క్రితమే కిషోర్ పాలకొల్లుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తన్నారు. పాలకొల్లు వచ్చిన సమయంలో తమ కలిసి వెళ్లాడని పలువురు స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు.
క్రైమ్
మృత్యువుతో పోరాడి ఓడిన యువ డాక్టర్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): డాక్టర్ అయిన బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు పడ్డ సంతోషం మూన్నాళ్లకే ఆవిరైంది. ఎండీ కోర్సు చదువుతున్న యువడాక్టర్ గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మోతె ప్రేమ్కుమార్–యశోద దంపతుల పెద్ద కుమార్తే రోస్లిన్(27) రష్యాలో ఎంబీబీఎస్ పూర్తిచేసింది. కొంతకాలం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి, ఎల్లారెడ్డిపేట పీహెచ్సీలో వైద్యసేవలు అందించింది. ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే రాజన్నపేటకు చెందిన సాయిబాబాను ప్రేమవివాహం చేసుకుంది. అనంతరం హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎండీ కోర్సు సెకండియర్ చదువుతుంది. ఇంతలోనే గర్భం దాల్చింది. అయితే గత డిసెంబర్లో తీవ్ర జ్వరంతో ఇంటికొచ్చి మందులు వాడింది. అదే నెల 24న ఇంట్లో హఠాత్తుగా ఊపిరి ఆగిపోవడంతో వెంటనే సీపీఆర్ చేసి స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు, అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. అక్కడ 4 రోజులు చికిత్స అందించారు. సుమారు రూ.7లక్షల వరకు ఖర్చు చేశారు. రికవరీ కాకపోవడంతో తిరిగి ఎల్లారెడ్డిపేటకు తీసుకొచ్చి చికిత్స అందించారు. మళ్లీ హైదరాబాద్లోని మరో హాస్పిటల్లో చేర్పించారు. 27 రోజులపాటు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
అమావాస్య వేళ.. తల మాయం
ఆదిలాబాద్ జిల్లా: ఏడాది క్రితం పాతిపెట్టిన మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల క్రితం బయటకు తీసి తలభాగం అపహరించుకుపోయారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండలంలోని ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన లాండ్గె వెంకట్ (19) 2024, నవంబర్ 19న వ్యవసాయ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అతని మృతదేహానికి తమ పొలంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే పాతిపెట్టిన మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల వెలికి తీశారు. ఆ ప్రాంతంలో గుంత తీసి ఉండటాన్ని మంగళవారం గుర్తించిన మృతుడి సోదరుడు దీపక్ పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహంలో తల భాగాన్ని వారు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. గత∙ ఆదివారం పుష్య అమావాస్య కావడంతో.. తల భాగాన్ని తీసుకెళ్లి ఉండవచ్చనే చర్చ సాగుతోంది. దీనిపై ఎస్హెచ్వో బండారి రాజును వివరణ కోరగా.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వందల కోట్ల అక్రమాస్తులను పట్టించిన రూ.60 వేల లంచం
సాక్షి, వరంగల్ హనుమకొండ కలెక్టరేట్ భవన సముదాయంలో అడ్డంగా దొరికిన అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ దాడులు ఆగడం లేదు. వెంకట్రెడ్డితోపాటు మరో ఇద్దరినీ అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి ఖమ్మం జైలుకు తరలించారు. ఇంతటితో కథ ముగిసిందని భావిస్తున్న సమయంలో బుధవారం రంగారెడ్డి, మిర్యాలగూడ జిల్లాల్లో మళ్లీ ఏసీబీ సోదాలు నిర్వహించడం కలకలంగా మారింది. ఆ ఉద్యోగి ఇచి్చన సమాచారంతోనే... సివిల్ సప్లయీస్ విభాగంలో జరిగిన భారీ అక్రమాలే ఈ దాడులకు కారణంగా తెలుస్తోంది. అన్నీ తానై వ్యవహరించిన ఓ కిందిస్థాయి ఉద్యోగిని అప్రూవర్గా మారినట్టు సమాచారం. అడిషనల్ కలెక్టర్ తాను పనిచేసిన ప్రాంతాల్లో ఉద్యోగం చేసిన సదరు ఉద్యోగినిని తాను హనుమకొండకు వచ్చాకే తీసుకొచి్చనట్టు సమాచారం. సదరు ఉద్యోగినిని వెంకట్రెడ్డిపై ఏసీబీ కేసు అయ్యాక హనుమకొండ నుంచి బదిలీ చేశారు. ఆ తర్వాత ఆ ఉద్యోగినే అప్రూవర్గా మారి ఇచి్చన సమాచారం ఆధారంగా ఏసీబీ మరిన్ని అక్రమాస్తులనుగుర్తించినట్టు చెబుతున్నారు. పౌర సరఫరాల శాఖలో విచ్చలవిడితనం రెవెన్యూశాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన వెంకట్రెడ్డి.. అడిషనల్ కలెక్టర్గా పౌర సరఫరాల శాఖలో విచ్చలవిడితనాన్ని ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి. జనగామ ఆర్డీఓగా, సూర్యాపేట అడిషనల్ కలెక్టర్గా పనిచేసిన సమయంలోనూ ఈయనపై భూ సేకరణలో భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. భువనగిరి–వరంగల్ 563 జాతీయ రహదారి భూసేకరణ సందర్భంగా అక్రమాలపై ఫిర్యాదులున్నాయి. అడిషనల్ కలెక్టర్గా హనుమకొండలో బాధ్యతలు చేపట్టిన తర్వాత కమలాపూర్ మండలంలో రెండు రైస్మిల్లులు నడుపుతున్న హసన్పర్తికి చెందిన ఓ వ్యాపారికి రూ.16 కోట్ల విలువైన ధాన్యాన్ని కేటాయించడం మిల్లర్లలో హాట్ టాపిక్గా ఉంది. ఇలా చాలామందికి సీఎంఆర్ ఇవ్వడంలో రూ.లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. భూ సేకరణ చెల్లింపుల్లో లెక్క లేనన్ని అక్రమాలు ఉన్నట్టు ఉప్పందుకున్న ఏసీబీ... తాజాగా మళ్లీ సోదాలు, దాడులు చేసినట్టు చర్చ జరుగుతోంది. జనగామ జిల్లా నెల్లుట్ల ఏరియాలో బినామీ పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్న దానిపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టు కూడా చెబుతున్నారు. మూడు చోట్ల సోదాలుఎల్బీనగర్లోని నాగోలు డివిజన్ పరిధి రాక్టౌన్కాలనీలో వరంగల్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రాధేశ్ మురళి ఆధ్వర్యంలో 8 మంది అధికారుల బృందం బుధవారం తెల్లవారుజామున వెంకట్రెడ్డి నివాసంలో సోదాలు చేసింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సాయి రెసిడెన్సీలో వెంకట్రెడ్డి బంధువుల ఇంటితోపాటు మిర్యాలగూడ మండలం దొండవారిగూడెం గ్రామంలోని బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. సోదాలకు సంబంధించి వివరాలు అధికారులు వెల్లడించలేదు. హనుమకొండ చైతన్యపురిలో గతంలో ఆయన అద్దెకున్న ఇంటిలో సోదాలు చేసేందుకు రాగా, అప్పటికే ఇల్లు ఖాళీ చేసినట్టు యజమాని చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు.రూ.7,69,38,332 ఆస్తుల సీజ్పాఠశాలకు అనుమతి విషయంలో గత నెల రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి సస్పెండ్ అయిన అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి ఇల్లుతోపాటు బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. స్థిర, చర ఆస్తులతో కలిపి దాదాపు రూ.7,69,38,332 ఆస్తులను సీజ్ చేశారు. ఈ మేరకు అధికారులు ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో పలుచోట్ల బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వెంకట్రెడ్డి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. వెంకట్రెడ్డి ఇల్లుతోపాటు అతని బంధువులకు చెందిన ఇళ్లల్లో ఏడు చోట్ల బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయనతోపాటు కుటుంబసభ్యుల పేర్లపై ఉన్న పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రిజి్రస్టేషన్ విలువ ప్రకారం అందులో రూ.4.65 కోట్ల రెండు ఇళ్లు (విల్లా, ఫ్లాట్), రూ.60 లక్షల గల వాణిజ్య దుకాణం, రూ.65 లక్షల విలువ గల 8 ప్లాట్లు, రూ.50 లక్షల విలువైన 14.25 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీటితోపాటు రూ.30,00,300 నగదు, రూ.44,03,032 బ్యాంక్ బ్యాలెన్స్, రూ.11 లక్షల గృహోపకరణాలు, రూ.40 లక్షల నాలుగు కార్లు, 297 గ్రాముల బంగారం సీజ్ చేసినట్టు చెప్పారు.
ప్రియుడితో దొరికిన భార్య.. గొంత కోసి హతమార్చిన భర్త..
అనంతపురం సెంట్రల్: భార్య ప్రవర్తన నచ్చని భర్త చివరకు ఆమె గొంతు కోసి హతమార్చిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం వన్టౌన్ పీఎస్ పరిదిలోని యల్లమ్మ కాలనీలో నివాసముంటున్న వీరాంజనేయులు, లక్ష్మీ గంగ (30) దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరాంజనేయులు బేల్దారి పనులకు వెళుతుండగా... లక్ష్మీగంగ ఇంట్లోనే చీరల వ్యాపారంతో పాటు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ డెయిరీలో పనిచేస్తోంది. కొంత కాలంగా భార్య మరో యువకుడితో చనువుగా ఉన్న విషయాన్ని భర్త గమనించాడు. ఈ విషయంగా పలుమార్లు భార్యకు నచ్చచెప్పాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. అంతేకాక ఇంటి నుంచి వెళ్లి పోయింది. దీంతో వీరాంజనేయులు ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు స్పందించి రెండు రోజుల క్రితం లక్ష్మీ గంగను పీఎస్కు పిలిపించి దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. మంగళవారం పొద్దుపోయాక దంపతులిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. బుధవారం వేకువజామున గాఢ నిద్రలో ఉన్న భార్య గొంతను కొడవలితో కోసి హతమార్చిన అనంతరం వీరాంజనేయులు పరారయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్లోని మార్చురీకి తరలించారు. అయితే తాగుడుకు బానిసైన వీరాంజనేయులు ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడలేదని, ఇందులో మరొకరి సాయం కూడా ఉందని హతురాలు లక్ష్మీ గంగ కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అనుమానం పెనుభూతమై.. రాయదుర్గం టౌన్: భర్తే కాలయముడిగా మారి భార్యను హతమార్చిన ఘటన రాయదుర్గంలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు... స్థానిక ముత్తరాసి కాలనీలో నివాసముంటున్న ఆంజనేయులు కుమార్తె కుళ్లాయమ్మ (45)కు పాతికేళ్ల క్రితం అనంతపురానికి చెందిన మారెన్నతో వివాహమైంది. లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని మారెన్న పోషించుకునేవాడు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. తరచూ గొడవనే బంగారం లాంటి ఇల్లాలు, రత్నాల్లాంటి బిడ్డలు ఉన్నప్పటికీ.. మూడు నెలలుగా కుళ్లాయమ్మ ప్రవర్తనపై మారెన్న అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తరచూ ఆమెతో గొడవ పడేవాడు. భార్య ఎంత నచ్చచెబుతున్నా వినేవాడు కాదు. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో నాలుగు రోజుల క్రితం ఆమె రాయదుర్గంలోని తన పుట్టింటికి చేరుకుంది. దీంతో మంగళవారం రాత్రి మారెన్న కూడా రాయదుర్గానికి వచ్చాడు. మారెన్నలో మార్పు వచ్చిందని అత్తింటి వారు సంతోష పడ్డారు. అల్లుడికి రాచమర్యాదలే చేశారు. అనుమానాలు వీడి కుమార్తెను చక్కగా చూసుకోవాలని హితవు పలికారు. ఆ రోజు రాత్రి మారెన్న తన భార్యతో కలసి ఆమె ఇంట్లోనే నిద్రించాడు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కుళ్లాయమ్మను కదిపి చూశాడు. ఆమె కూడా గాఢ నిద్రలో ఉన్నట్లుగా నిర్ధారించుకున్న అనంతరం మచ్చుకత్తి తీసుకుని తలపై నరికి అక్కడి నుంచి పరారయ్యాడు. చికిత్స పొందుతూ... ఇంటి తలుపులు తీసిన శబ్ధానికి కుళ్లాయమ్మ కుటుంబసభ్యులు మేల్కొన్నారు. అల్లుడు హడావుడిగా బయటకు వెళుతుంటే వారికి అర్థం కాలేదు. కాసేపటి తర్వాత కుమార్తె గదిలోకి వెళ్లారు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకున్న కుళ్లాయమ్మను గమనించి అల్లుడు ఎంత పనిచేశాడంటూ ఆక్రోశం వెళ్లగక్కుతూ ఆగమేఘాలపై 108 అంబులెన్స్లో రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కుళ్లాయమ్మ మృతి చెందింది. సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, రాయదుర్గం అర్బన్ సీఐ జయనాయక్, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హత్యకు గల కారణాలను బాధిత కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న మారెన్న కోసం గాలింపు చేపట్టారు. మద్యం మత్తులో స్నేహితుడి హత్య అనంతపురం సెంట్రల్: మద్యం మత్తు ప్రాణస్నేహితుల మధ్య చిచ్చురేపి ఒకరి హత్యకు కారణమైంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని కోవూరు నగర్కు చెందిన అతావుల్లా (34), అశోక్నగర్ ప్రాంతానికి చెందిన అల్లాబకాష్ మంచి స్నేహితులు. మంగళవారం రాత్రి ఇద్దరూ కలసి రామ్నగర్లో మద్యం సేవించి చిన్న పాటి విషయానికి గొడవ పడ్డారు. ఆ సమయంలో అల్లాబకాష్ బండరాయితో దాడి చేయడంతో అతావుల్లా కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చెవి నుంచి భారీగా రక్తస్రావం కావడంతో పాటు చికిత్సకు స్పందించక బుధవారం తెల్లవారుజామున అతావుల్లా మృతి చెందాడు. హతుడు అవివాహితుడు. అతావుల్లా సోదరుడు కరీముల్లా ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి, నిందితుడి అల్లాబకాష్ కోసం గాలిస్తున్నట్లు నాల్గో పట్టణ సీఐ జగదీష్ తెలిపారు.
వీడియోలు
జగన్ భూసర్వేపై అప్పుడు విషం చల్లారు.. ఇప్పుడు అదే దిక్కయ్యింది..
విజయ్ కి గుడ్ న్యూస్ TVK పార్టీ గుర్తు ఇదే..
RK Roja: రెడ్ బుక్ అని తిరిగేవాళ్లకు వడ్డీతో ఇచ్చేద్దాం
బాబు భూ సెర్వే... చంద్రబాబుపై మధుసూదన్ రెడ్డి పంచులు
కేతిరెడ్డి పెద్దారెడ్డి పై దాడి చేసేందుకు స్కేచ్ తెగించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
వైఎస్సార్సీపీ ఎంపీలతో వైఎస్ జగన్ కీలక సమావేశం
నువ్వు నాటిన విత్తనాలు వృక్షాలు అయితే ఎలా ఉంటుందో చూపిస్తా బాబుకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్
ట్రంప్ VS న్యూసమ్... సొంత దేశంలోనే గొడవలు
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తారా?: హరీష్ రావు
కేటీఆర్ కు సిట్ నోటీసులు
