పుతిన్ని, మోదీ ఆపకుంటే.. పోలండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: పోలండ్ మంత్రి భారత ప్రధానిని ప్రశంసిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చిన సమయంలో ప్రపంచాన్ని ఒక పెద్ద ముప్పు నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ కాపాడన్నారు. 2022 చివర్లో రష్యా వ్యూహాత్మక అణు ఆయుధాలను ఉపయోగించకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఒప్పించడంలో పీఎం మోదీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పోలాండ్ విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ థియోఫిల్ బార్టోస్జెవ్స్కీ ANIతో మాట్లాడుతూ, "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో సుప్రసిద్ధ, అత్యంత గౌరవనీయుడైన రాజనీతిజ్ఞుడు. అలీన దేశంగా భారతదేశానికి రష్యన్ ఫెడరేషన్తో, అంతకుముందు సోవియట్ యూనియన్తో చాలాకాలంగా సంబంధాలు ఉన్నాయి. అధ్యక్షుడు పుతిన్ ప్రధానమంత్రి మోదీ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. 2022 చివరిలో ఉక్రెయిన్లో వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించకుండా పుతిన్ను ఆపడంలో ప్రధానమంత్రి మోదీ పోషించిన పాత్ర గురించి నేను ప్రస్తావించాను. కానీ ఇది నిజం, అధ్యక్షుడు పుతిన్పై కొంత ఒత్తిడిని, ప్రభావాన్ని చూపగల కొద్దిమంది వ్యక్తులలో ప్రధానమంత్రి మోదీ ఒకరు." అని అన్నారు.రష్యా తనను శత్రువుగా భావించని దేశాల నుండి వచ్చే శాంతి విజ్ఞప్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని పోలండ్ మంత్రి తెలిపారు. యుద్ధం మరింత పెరగకుండా చూడటంలో భారత్తో పాటు చైనా (షీ జిన్పింగ్) పాత్ర కూడా ముఖ్యమైనదని, అయితే ఈ సంక్షోభాన్ని ముగించడంలో భారత్ పాత్ర అత్యంత కీలకంగా మారిందని ఆయన అన్నారు. రష్యా ఆయిల్ కొనుగోళ్లపై మారిన పోలండ్ వైఖరిభారత్ రష్యా నుండి రాయితీపై ముడి చమురు కొనుగోలు చేయడంపై గతంలో పోలండ్ చేసిన విమర్శలపైనా మంత్రి క్లారిటీ ఇచ్చారు.రష్యా నుండి చౌకగా లభించే చమురును కొనుగోలు చేయడం ద్వారా భారత్ రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా మద్దతు ఇస్తోందని తాము గతంలో భావించామని, అయితే మార్కెట్ ధర కంటే 40% తక్కువకు చమురు లభిస్తున్నందున ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ అంశం రెండు దేశాల మధ్య ఎలాంటి విభేదాలకు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.#WATCH | Delhi: On the Russia-Ukraine conflict, Secretary of State of the Polish Minister of Foreign Affairs, Władysław Teofil Bartoszewski, says, "Prime Minister Narendra Modi is a very well-known world statesman, who is very respected, and India has a long-standing relationship… pic.twitter.com/R38wQurE9u— ANI (@ANI) July 14, 2026
పిడుగుతో పగిలిపోయే శివలింగం..!
లోకాన్ని రక్షించడం కోసం పరమశివుడు హాలాహలాన్ని మింగి గరళకంఠుడయ్యాడని మనకు తెలుసు. కానీ.. తన భక్తులను కాపాడుకోవడం కోసం, ఆకాశం నుంచి విరచుకుపడే భీకరమైన పిడుగులను సైతం ఆ భోలాశంకరుడు తన గుండెపైకి తీసుకునే ఒక వింత ఆలయం మన దేశంలో ఉందనే విషయం మీకు తెలుసా? అవును.. ఇది నిజం..! సైన్స్ సైతం చేతులెత్తేసిన ఒక అద్భుతం..! ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆకాశం నుంచి వచ్చే మహా పిడుగు నేరుగా ఆ శివలింగంపైనే పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం ముక్కలు ముక్కలైపోతుంది. కానీ.. ఆ తర్వాత జరిగే వింత చూస్తే మీ ఒళ్లు గగుర్పొడుస్తుంది..! హిమాచల్ప్రదేశ్లోని మంచు కొండల మధ్య దాగున్న ఆ అంతుచిక్కని సైన్స్ ఏంటి..? ఆ ఆధ్యాత్మిక రహస్యం ఏంటి..? హిమాచల్ప్రదేశ్లోని అందమైన కులు లోయ ప్రాంతం అది..! సముద్ర మట్టానికి దాదాపు 2,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఆ లోయ.. చుట్టూ దట్టమైన అడవులు, హిమాలయ పర్వతాలు. ఈ కొండల పైభాగంలోనే కొలువై ఉన్నాడు బిజ్లీ మహాదేవుడు. హిందీలో 'బిజ్లీ' అంటే మెరుపు లేదా పిడుగు లేదా విద్యుత్తు అని అర్థం. పేరుకు తగ్గట్టే ఈ ఆలయం పిడుగులకు నిలయం. సాధారణంగా ఏదైనా కట్టడంపై పెద్ద పిడుగు పడితే ఆ కట్టడం నామరూపాలు లేకుండా పోతుంది. కానీ, శతాబ్దాలుగా ఈ ఆలయానికి ఎలాంటి ప్రమాదం జరగడం లేదు. అక్కడ ఉండే స్థానికులకు చిన్న గాయం కూడా కాదు. కానీ, ఆ పిడుగులు కేవలం గర్భగుడిలోని శివలింగాన్నే ఎందుకు టార్గెట్గా చేసుకుంటాయనే మిస్టరీని ఇప్పటికీ సైన్స్ ఛేదించలేకపోయింది. ప్రకృతి శక్తులను సైతం తన అధీనంలో ఉంచుకుని, భక్తుల కోసం పిడుగులను సైతం భరించే ఆ బిజ్లీ మహాదేవుని లీల నిజంగానే అమోఘం..! ఆ భోళా శంకరుడి లీల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..
అరుదైన మైలురాయిని తాకిన బుమ్రా
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన మైలురాయిని తాకాడు. హ్యారీ బ్రూక్ వికెట్ తీయడంతో వన్డేల్లో 150 వికెట్ల ఘనత సాధించాడు. ఈ మైలురాయిని అతడు కేవలం 90 వన్డే మ్యాచ్ల్లోనే అందుకున్నాడు. తద్వారా భారత తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా.. రీఎంట్రీలోనే ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో ఇప్పటివరకు 5 ఓవర్లు వేసిన అతడు కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి బ్రూక్ వికెట్ పడగొట్టాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. బెన్ డకెట్ (43), జేకబ్ బేతెల్ (14), బ్రూక్ (1) ఔట్ కాగా.. రూట్ (1), బట్లర్ (40 క్రీజ్లో ఉన్నారు. బ్రూక్ వికెట్ బుమ్రాకు దక్కగా.. డకెట్, బేతెల్ వికెట్లు యువ పేసర్ గుర్నూర్ బ్రార్ పడగొట్టాడు. భారత్ తరపున అత్యంత వేగంగా (బంతుల పరంగా) 150 వన్డే వికెట్లు సాధించిన బౌలర్లు4,070 – మహమ్మద్ షమీ4,513 – కుల్దీప్ యాదవ్4,605 – జస్ప్రీత్ బుమ్రా*
ఏఐని నమ్ముకుంటే ఇంజినీరింగ్ నైపుణ్యాలకు దెబ్బ
న్యూఢిల్లీ: ప్రాథమిక ఇంజినీరింగ్ నైపుణ్యాలను పెంపొందించడంలో పరిశ్రమ, విద్యా సంస్థలు గనుక విఫలమైతే భారత్లో సాంకేతిక నిపుణులు ఏఐని రూపొందించే వారిగా కాకుండా, ఏఐపై ఆధారపడిన ఉద్యోగులు గా మారిపోయే ప్రమాదం ఉందని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ హెచ్చరించింది. దేశంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న టెకీల్లో 90 శాతం మందికి పైగా ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని వాడుకుంటున్నారని.. అయితే, సాధారణ కోడింగ్ పనులను తగ్గించుకోవడం వల్ల ప్రాథమిక సాంకేతిక నైపుణ్యాలు పడిపోతే మొదటికే మోసం వస్తుందని పేర్కొంది.’భారత్లో ఏఐ–నేటివ్ టాలెంట్ పరిస్థితి’ పేరుతో మంగళవారం విడుదల చేసిన అధ్యయన నివేదిక మొదటి ఎడిషన్లో నాస్కామ్ ఈ అంశాలను వెల్లడించింది. ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులతో సహా మూడేళ్ల వరకు అనుభవం ఉన్న ప్రారంభ స్థాయి టెక్నాలజీ ప్రొఫెషనల్స్లో ఏఐ సామర్థ్యాలను అంచనా వేసేందుకు నిర్మాణాత్మక పరిశ్రమ ప్రామాణికతను ఇది అందిస్తుంది. ‘ఏఐ–నేటివ్ టెక్నాలజీ ప్రతిభకు గ్లోబల్ హబ్గా ఆవిర్భవించే వినూత్న అవకాశం భారత్ ముందుంది.ఏఐ నైపుణ్యాలను విస్తరించడం, ఏఐ రూపకల్పన ఒకటి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారత్లో ఏఐని అభివృద్ధి్ద చేసే ఉద్యోగులకు బదులు ఏఐపై ఆధారపడే వారిని తయారు చేసే ప్రమాదం పొంచి ఉంది. విద్యా సంస్థలు మౌలిక అంశాలను బలోపేతం చేయాలి. అలాగే ఏఐ వాడకం ద్వారా రోజువారీ కోడింగ్ పనులను తగ్గించుకోవడం వల్ల ప్రాథమిక ఇంజినీరింగ్ నైపుణ్యాలు పడిపోకుండా ఉండేలా పరిశ్రమ కూడా ఆన్బోర్డింగ్, మెంటార్íÙప్లను మెరుగుపరుచుకోవాలి’ అని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సంగీతా గుప్తా అభిప్రాయపడ్డారు. నివేదికలో ముఖ్యాంశాలివీ...⇒ భారత్లోని యువ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మందిలో ‘ఏఐ నైపుణ్యం’ ఉంది, కేవలం 23 శాతం మంది మాత్రమే ‘ఏఐ–నేటివ్’ అర్హతను కలిగి ఉన్నారు. ⇒ అయితే, ఇంజినీరింగ్ నైపుణ్యం, సాంకేతిక మూలాలను బలోపేతం చేయడం ద్వారా ఈ ప్రతిభావంతుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవచ్చు. ⇒ ఉత్పాదకతను మెరుగుపరచడం, వేగంగా నేర్చుకోవడంలో ఏఐ చాలా బాగా ఉపయోగపడుతోంది, అయితే, జూనియర్ ఇంజినీర్లు తమ ప్రాథమిక పరిజ్ఞానాన్ని పెంచుకునే సాధారణ పనులు సైతం ఏఐ వల్ల ఆటోమేట్ అవుతున్నాయి. ⇒ దీంతో గతంలో ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకున్న స్వతంత్ర నిర్ణయాధికారం, సమన్వయ నైపుణ్యాలను ఇంజినీర్లు అభివృద్ధి చేసుకునేందుకు కంపెనీలు, విద్యా సంస్థలు ఉద్దేశపూర్వకంగా అవకాశాలను తిరిగి సృష్టించాల్సి వస్తుంది. ⇒ ఈ మార్పు జరగాలంటే సుదీర్ఘ కాలంగా పాటిస్తున్న నిర్వహణ విధానాల విషయంలో ఐటీ పరిశ్రమ పునారాలోచించుకోవాల్సి ఉంటుంది. ⇒ నియామకాల మదింపు కోసం ప్రాథమిక కోడింగ్ పరిజ్ఞానం నుంచి సమగ్రమైన ఏఐ–నేటివ్ సామర్థ్యాలను అంచనా వేసే దిశగా మారాలి.
ఏఐని నమ్ముకుంటే ఇంజినీరింగ్ నైపుణ్యాలకు దెబ్బ
నాని–నితిన్ కాంబోలో కొత్త ప్రాజెక్టు.. హీరోయిన్గా రుక్మిణి వసంత్?
అక్షర్ ఆల్రౌండ్ షో.. ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం
‘ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలి’
తలెత్తుకునే సినిమాలు చేశారాయన: జగపతి బాబు
ముద్రగడ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్న వైఎస్ జగన్
‘ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి’
పిడుగుతో పగిలిపోయే శివలింగం..!
ది ఒడిస్సీ క్రేజ్.. ఒక్కో టికెట్ ధర అన్ని వేలా?
ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్సీపీ నేతల దిగ్భ్రాంతి
డిప్యూటీ సీఎం కొడుకుతో నిశ్చితార్థం.. ఎవరీ కైనత్?
ప్రియుడితో స్టార్ డైరెక్టర్ కూతురి నిశ్చితార్థం
కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి
అట్టర్ ఫ్లాప్గా నిలిచిన ‘దురంధర్’.. 900 మంది కూడా చూడలేదు!
ఇరాన్ చేరుకున్న రష్యా ప్రళయ విమానం
నా సినిమాలో మీరే హీరోయిన్.. ముందు శరీరమంతా చూపించండి..!
విమాన చార్జీల దోపీడీపై 'సుప్రీం' సీరియస్
మీకు సంతానం తక్కువ సంపద ఎక్కువ ఎలా సాధ్యం సార్!
ఇంగ్లండ్ టెస్టు హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్!
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్
వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో.. జులైలో ఏప్రిల్-మే ఎండలు!
యూట్యూబ్ను షేక్ చేస్తున్న 'బాసింగ బలాలే' పాట
మారిన పరిస్థితి.. బంగారం భారీ పతనం!
సాక్షి కార్టూన్: 13-07-2026
టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్!
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ
కావేరి నదిలో జానకి అస్థికల నిమజ్జనం
గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు
లెనిన్తో అఖిల్ హిట్.. అప్పుడే మొదలైన ట్రోల్స్..!
ఏఐని నమ్ముకుంటే ఇంజినీరింగ్ నైపుణ్యాలకు దెబ్బ
నాని–నితిన్ కాంబోలో కొత్త ప్రాజెక్టు.. హీరోయిన్గా రుక్మిణి వసంత్?
అక్షర్ ఆల్రౌండ్ షో.. ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం
‘ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలి’
తలెత్తుకునే సినిమాలు చేశారాయన: జగపతి బాబు
ముద్రగడ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్న వైఎస్ జగన్
‘ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి’
పిడుగుతో పగిలిపోయే శివలింగం..!
ది ఒడిస్సీ క్రేజ్.. ఒక్కో టికెట్ ధర అన్ని వేలా?
ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్సీపీ నేతల దిగ్భ్రాంతి
డిప్యూటీ సీఎం కొడుకుతో నిశ్చితార్థం.. ఎవరీ కైనత్?
ప్రియుడితో స్టార్ డైరెక్టర్ కూతురి నిశ్చితార్థం
కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి
అట్టర్ ఫ్లాప్గా నిలిచిన ‘దురంధర్’.. 900 మంది కూడా చూడలేదు!
ఇరాన్ చేరుకున్న రష్యా ప్రళయ విమానం
నా సినిమాలో మీరే హీరోయిన్.. ముందు శరీరమంతా చూపించండి..!
విమాన చార్జీల దోపీడీపై 'సుప్రీం' సీరియస్
మీకు సంతానం తక్కువ సంపద ఎక్కువ ఎలా సాధ్యం సార్!
ఇంగ్లండ్ టెస్టు హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్!
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్
వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో.. జులైలో ఏప్రిల్-మే ఎండలు!
యూట్యూబ్ను షేక్ చేస్తున్న 'బాసింగ బలాలే' పాట
మారిన పరిస్థితి.. బంగారం భారీ పతనం!
సాక్షి కార్టూన్: 13-07-2026
టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్!
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ
కావేరి నదిలో జానకి అస్థికల నిమజ్జనం
గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు
లెనిన్తో అఖిల్ హిట్.. అప్పుడే మొదలైన ట్రోల్స్..!
ఫొటోలు
పింక్ శారీలో బాలీవుడ్ భామ మాధురి దీక్షిత్ అందాలు.. ఫోటోలు
ఫ్రెండ్ పార్టీలో బాలీవుడ్ భామ ఆలియా భట్ సందడి.. ఫోటోలు
కూతురి పెళ్లి.. ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసిన నిర్మాత (ఫొటోలు)
శ్రుతి హాసన్ నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)
'వెంకట్రామయ్య గారి తాలూకా' సినిమా వేడుక... ముఖ్య అతిథిగా హాజరైన కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
శ్రీకాంత్ 'మిస్టర్ మిడిల్ క్లాస్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
చిన్నప్పుడు మహేశ్, పవన్ కల్యాణ్ తో అలా...ఇప్పుడు ఇలా! (ఫొటోలు)
ఏపీ : కొండ కోనల్లో అద్భుతమైన ఆలయం శనివారం మాత్రమే తెరుస్తారు! ఎక్కడో తెలుసా (ఫొటోలు)
సైలెంట్ గా బాయ్ ఫ్రెండ్తో నిశ్చితార్థం చేసుకున్న నటి బ్రిగిడా సాగా (ఫొటోలు)
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్లో అల..సెయిలింగ్లో (ఫొటోలు)
సినిమా
నాని ది ప్యారడైజ్.. ముచ్చటగా మూడో 'సారీ'..!
నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దసరాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరోసారి వస్తోన్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 1940-1970 బ్యాక్డ్రాప్లో సాగే ఒక పవర్ఫుల్ అండర్వరల్డ్ మాఫియా స్టోరీగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే మార్చిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆగస్టుకి వాయిదా పడింది.తాజాగా ఈ మూవీ మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వచ్చేనెల 21న ది ప్యారడైజ్ రిలీజ్ కావడం లేదని సోషల్ మీడియా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24కు పోస్ట్పోన్ చేశారని వార్తలొస్తున్నాయి. ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతోనే వాయిదా వేశారని సమాచారం. అంతేకాకుండా ప్రమోషన్స్కు తగినంత సమయం కావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా ఈ మూవీలో మోహన్బాబు, తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
'మా ముందే దుస్తులు వేసుకోవచ్చుగా?'.. హీరోయిన్కు చేదు అనుభవం
సల్మాన్ ఖాన్ 'వీర్' (2010) సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జరీన్ ఖాన్. ఆ మరుసటి ఏడాది అతడి మూవీలోనే స్పెషల్ సాంగ్లో మెరిసింది. అలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఐటం సాంగ్స్తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత హౌజ్ఫుల్ 2, హేట్ స్టోరీ 3, అక్సర్ 2తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్గా మెప్పించింది. ఇక తెలుగులో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ చిత్రంలో జరీన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించింది.ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో పెద్దగా చేయకపోయినా జరీన్ ఖాన్.. తాజాగా ముంబయిలో ఓ ఈవెంట్లో మెరిసింది. ఓ క్లాత్ స్టోర్ ఓపెనింగ్కు ఆమె హాజరైంది. ఈ సందర్భంగా డ్రెస్సులు చూస్తున్న జరీన్ ఖాన్ను ఓ ఫొటోగ్రాఫర్ అసభ్యకర ప్రశ్న వేశారు. ఈ డ్రెస్ మీరు ట్రయల్ వేయొచ్చుగా అని అడగాడు. దీంతో ఆమె వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటి.. మీ ముందేనా? ఇలాంటి ఫాల్తూ మాటలు నా ముందు మాట్లాడొద్దు.. మీ హద్దులు దాటొద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #ZareenKhan slammed the paparazzi after one of them allegedly asked her to "try the dress" in front of everyone at a Mumbai event.She immediately shut it down, saying, "Hadd mein rehna," and made it clear she won't tolerate such comments.Being a celebrity doesn't mean someone… pic.twitter.com/GsiIhprgnB— Anjali (@Vada_paaww) July 14, 2026
అసభ్యకరంగా హీరోయిన్ మార్ఫింగ్ ఫోటోలు.. పోలీసులకు ఫిర్యాదు
సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న సైబర్ వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ మలయాళ హీరోయిన్ అన్నా రేష్మా రాజన్ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న సైబర్ దాడిపై తీవ్రంగా స్పందించారు. తన ప్రమేయం లేకుండా, తన ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేసిన ఓ వ్యక్తిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అతని ఇన్స్టాగ్రామ్ ఖాతా వివరాలను బహిర్గతం చేస్తూ కేరళ పోలీసులు, సైబర్ సెల్కు ఆమె ఫిర్యాదు చేశారు.‘ఈ నీచమైన చర్య నా గౌరవానికి, వ్యక్తిగత ప్రైవసీకి తీవ్ర భంగం కలిగించింది. ఇలాంటి అసభ్యకర కంటెంట్ను సృష్టించేవారైనా, దాన్ని ఇతరులతో పంచుకునే వారైనా సరే చట్టానికి సమాధానం చెప్పుకోవాల్సిందే. ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతాపై అధికారికంగా ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపను, చట్టపరంగా ముందడుగు వేస్తాను’ అని ఆమె తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చింది.అన్నా రాజన్కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వివిధ వేదికలపై ఆమె ధరించిన దుస్తులను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. పలు సందర్భాల్లో ఆమె బాడీ షేమింగ్కు, అసభ్యకర వ్యాఖ్యలకు గురయ్యారు. అయినప్పటికీ ధైర్యంగా నిలబడి వాటన్నింటినీ ఆమె తిప్పికొట్టారు.అన్నా రాజన్ సినీ కెరీర్ విషయాలకొస్తే.. 2017లో లీజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్బస్టర్ సినిమా 'అంగమాలి డైరీస్' ద్వారా అన్నా రాజన్ వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో ఆమె పోషించిన 'లిచ్చి' పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో, ఆమెను అంతా 'లిచ్చి' అని పిలవడం ప్రారంభించారు. 'వెలిపడింతే పుస్తకం', 'మధుర రాజా', 'అయ్యప్పనుమ్ కోషియుమ్' వంటి చిత్రాలకు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 'జైలర్ 2' లో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆమె కోలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. View this post on Instagram A post shared by Anna raajan (@annaspeeks)
పెద్ది తర్వాత ప్రాజెక్ట్లో చిరంజీవి హీరోయిన్.!
పెద్ది తర్వాత రామ్ చరణ్ మూవీపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కించారు. జూన్ 4న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది.ఈ సినిమా సంగతి పక్కనపెడితే.. రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ సుకుమార్తో చేయనున్నారు. వీరిద్ది కాంబోలో వస్తోన్న ఆర్సీ17 చిత్రంపై తాజాగా ఓ న్యూస్ వైరల్గా మారింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుందని లేటేస్ట్ టాక్. అయితే ఆమె హీరోయిన్గా కాకుండా సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నయనతార ఎంట్రీ ఇస్తే RC17పై అంచనాలు మరింత పెరగనున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
క్రీడలు
భారత్తో వన్డేలు.. ఇంగ్లండ్ జట్టులో మరో ఫాస్ట్ బౌలర్
భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్ల కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కీలక మార్పు చేసింది. ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.ఐపీఎల్ 2026 సందర్భంగా చేతికి గాయం కావడంతో కార్స్ కొంతకాలం క్రికెట్కు దూరమయ్యాడు. అనంతరం మోచేతి సమస్య నుంచి కోలుకుని డర్హమ్ తరఫున వైటాలిటీ బ్లాస్ట్లో మూడు మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న తొలి వన్డేలో పేస్ బౌలర్లకు అనుకూల పరిస్థితులు కనిపించడంతో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి 30 ఓవర్లలో భారత్ బౌలింగ్లో స్పిన్నర్లకు కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఇవ్వగా, మిగిలిన 27 ఓవర్లు పేసర్లు వేశారు. ఇంగ్లండ్ కోల్పోయిన ఆరు వికెట్లు కూడా అన్నీ పేసర్ల ఖాతాలోకే వెళ్లాయి.ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ గాయాల చరిత్రను దృష్టిలో ఉంచుకుని, పేస్ దళాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కార్స్ను జట్టులో చేర్చినట్లు సమాచారం.భారత్తో వన్డే సిరీస్కు ఇంగ్లండ్ తాజా జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జో రూట్, టామ్ బాంటన్, బెన్ డకెట్, జేకబ్ బెథెల్, సామ్ కరన్, విల్ జాక్స్, జేమ్స్ కోల్స్, లియామ్ డాసన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహ్మూద్, జోష్ టంగ్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, బ్రైడన్ కార్స్.కార్స్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరఫున 30 వన్డేలు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో అతని ప్రదర్శన మెరుగ్గా ఉండటంతో, భారత్తో మిగిలిన రెండు మ్యాచ్ల్లో అతను కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రెండు, మూడు వన్డేలు జులై 16, 19 తేదీల్లో కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా జరుగనున్నాయి.ఇవాళ జరుగుతున్న తొలి వన్డే విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, భారత పేసర్ల ధాటికి 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా.. రూట్ (56), డాసన్ (65) ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్కు అజేయమైన 115 పరుగులు జోడించి ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు. 42.5 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 222-6గా ఉంది. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలో 2 వికెట్లు తీయగా.. బుమ్రా, శివమ్ దూబే తలో వికెట్ దక్కించుకున్నారు.
అదరగొట్టిన భారత ఓపెనర్లు
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టులో భారత్ అండర్ -19 ఓపెనర్లు అదరగొడుతున్నారు. లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ పట్టుదలగా నిలబడి భారత్ జట్టుకు శుభారంభం అందించారు.కాగా గాలె వేదికగా భారత్- శ్రీలంక మధ్య సోమవారం తొలి యూత్ టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్కు దిగి.. మొదటి ఇన్నింగ్స్ను భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్లు దిమంత మహావితన (2), దుల్నిత్ సిగెర (0) విఫలమైనా.. వన్డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ దుమ్ములేపాడు.మొత్తంగా 267 బంతులు ఎదుర్కొని 33 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 233 పరుగులు సాధించాడు. సెనుజ డబుల్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52), కవిజ గమాగె (49), చమిక హీనతిగల (45), ఒషాడా మనాహర (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు.ఈ క్రమంలో 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగుల వద్ద శ్రీలంక మంగళవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం భారత్ బ్యాటింగ్ మొదలుపెట్టగా వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం కలిగింది.అయితే, వాన తెరిపినివ్వడంతో తిరిగి ఆట మొదలుకాగా.. ఓపెనర్లు లక్ష్య, సాగర్ నిలకడగా ఆడారు. లక్ష్య 136 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 93 పరుగులు.... సాగర్ 215 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.ఫలితంగా రెండో రోజు పూర్తయ్యేసరికి భారత్ అండర్-19 జట్టు 58 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 186 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక కంటే 238 పరుగులు వెనుకబడి ఉంది. ఇక రెండో రోజు మొత్తంగా ఐదు వికెట్లు తీయడంతో పాటు.. 186 పరుగులు చేసిన భారత్ మొత్తానికి మంగళవారం పైచేయి సాధించింది.
టీమిండియా అసిస్టెంట్ కోచ్ రాజీనామా..!
టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డష్కటే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐతో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అంగీకారం లభిస్తే, ఇంగ్లండ్తో మూడో వన్డే అనంతరం ఆయన భారత జట్టుకు వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది.క్రిక్బజ్ అందించిన సమాచారం ప్రకారం, డష్కటే ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. వ్యక్తిగత కారణాల చేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. లండన్లో నివసిస్తున్న తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.నెదర్లాండ్స్ మాజీ ఆల్రౌండర్ అయిన డష్కటే రెండేళ్ల క్రితం భారత జట్టు సహాయ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ఆయన ఒప్పందం ఈ నెలతో ముస్తుంది. అందుకే ఇంగ్లండ్ పర్యటన పూర్తయ్యాక విధుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.గంభీర్ అంగీకరిస్తాడా..?డష్కటేను భారత జట్టు కోచింగ్ సిబ్బందిలోకి తీసుకురావడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఇద్దరి మధ్య మంచి వ్యక్తిగత, వృత్తిపరమైన అనుబంధం ఉంది. దీంతో ఆయన రాజీనామాను గంభీర్ అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్న నేపథ్యంలో, డష్కటే కొనసాగాలని గంభీర్ కోరే అవకాశం కూడా ఉంది.మరోపక్క ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కూడా జట్టును వీడుతున్నారన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. రాహుల్ ద్రవిడ్ హయాంలో నియమితులైన దిలీప్ భారత జట్టుతోనే కొనసాగనున్నారని సమాచారం.
అక్తర్, ఆసిఫ్ భారత్కు డ్రగ్స్ తెచ్చారు..!
పాకిస్తాన్ మాజీ పేసర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్పై భారత మాజీ కేంద్ర హోంశాఖ అధికారి ఆర్వీఎస్ మణి సంచలన ఆరోపణలు చేశారు. భారత్లో పర్యటించిన సమయంలో అక్తర్, ఆసిఫ్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ బాంబు పేల్చారు.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. "భారత్లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ బృందంలోని కొందరు డ్రగ్స్ను అక్రమంగా తీసుకొచ్చేవారు. షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్ భారత్కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పాకిస్తాన్ హైకమిషనర్ ఎదుట ఒప్పుకున్నారు. ఆ తర్వాత వారిని వెనక్కి పంపించారు" అని అన్నారు.మాజీ పాక్ కోచ్ బాబ్ వూల్మర్ మరణాన్ని కూడా ఈ వ్యవహారంతో ముడిపెట్టారు ఆర్వీఎస్ మణి. పాకిస్తాన్ జట్టులో జరుగుతున్న డ్రగ్ స్మగ్లింగ్ విషయాన్ని బయటపెట్టాలని వూల్మర్ ప్రయత్నించారని, అందుకే ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని ఆరోపించారు.మణి చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం క్రికెట్ సర్క్సిల్స్లో దుమారం రేపుతున్నాయి. మణి 2006 నుంచి 2010 వరకు కేంద్ర హోంశాఖ అంతర్గత భద్రత విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం 2013లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ల విషయానికొస్తే.. 2003-04 నుంచి 2007 వరకు ఇరు దేశాల మధ్య పరస్పర సిరీస్లు జరిగాయి. అయితే 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ఈ సిరీస్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ జట్లు ఐసీసీ లేదా ఏసీసీ టోర్నమెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి.
న్యూస్ పాడ్కాస్ట్
పల్నాడు కలను సాకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... 100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల కొత్త మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో మరో కుంభకోణానికి తెరతీసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... ల్యాప్టాప్ల కొనుగోలులో దోపిడీకి స్కెచ్
నిలబెట్టుకోలేనప్పుడు హామీలు ఎందుకిచ్చారు?.... ఆంధ్రప్రదేశ్లో కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు... భారీ ర్యాలీలు, ధర్నాలతో చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో తిష్టవేసిన సమస్యలు... 2024లో 43 లక్షలున్న విద్యార్థులు ఇపుడు 30 లక్షలే..
టీచర్ల ‘టెట్’ ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదు?... ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
టెట్ మినహాయింపునకు కృషి. టీచర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. తనను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలకు వైఎస్ జగన్ భరోసా
విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు
ప్రశ్నించే గొంతును నొక్కడానికి అత్యంత ప్రమాదకర ధోరణి వైపు పోలీసు వ్యవస్థను నడిపిస్తున్నారు... ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించాం. పౌరులపై ఆర్థిక భారాన్ని చాలావరకు తగ్గించాం. ప్రధాని మోదీ వెల్లడి
బిజినెస్
యూఎస్ మార్కెట్కు వన్ప్లస్ గుడ్బై?
ఒకప్పుడు తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ ఫోన్ అంటే.. చాలామందికి ముందుగా గుర్తొచ్చేది వన్ప్లస్. ప్రీమియం ఫీచర్లను అందుబాటు ధరలో అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాండ్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి.జర్మన్ వార్తా సంస్థ విన్ఫ్యూచర్ కథనం ప్రకారం, వన్ప్లస్ తన మాతృసంస్థ ఒప్పోతో కలిసి అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి పూర్తిగా వైదొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై మీడియాతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే.. ఈ నిర్ణయానికి అసలు కారణం ఏమిటనే విషయాన్ని కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు.నెట్టింట్లో వైరల్ అవుతున్న వార్తలు వన్ప్లస్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే భారత్లో మాత్రం తన వ్యవహారాలను కొనసాగించనుంది. దీనికి కారణం కంపెనీకి భారత్ అతిపెద్ద మార్కెట్ కావడమే. చైనాలో కూడా సంస్థ తన కార్యకలాపాలను యథావిధిగా జరపనుంది.ఇప్పటికే వన్ప్లస్ ఫోన్ ఉపయోగిస్తున్న వారికి కూడా కంపెనీ ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం.. వినియోగంలో ఉన్న ఫోన్లకు వాటి సపోర్ట్ గడువు పూర్తయ్యే వరకు సాఫ్ట్వేర్ అప్డేట్లు, సెక్యూరిటీ అప్డేట్లు, సర్వీస్ సెంటర్ సేవలు అందుబాటులోనే ఉంటాయని తెలిపింది. అయితే.. కొత్త ఫోన్ల విడుదల, లేటెస్ట్ స్టాక్ విక్రయం, స్థానిక మార్కెటింగ్ కార్యక్రమాలు మాత్రం నిలిచిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే యూరప్లోని కొన్ని దేశాల్లో వన్ప్లస్ అధికారిక వెబ్సైట్లలో ఫోన్ల స్టాక్ కూడా దాదాపు ఖాళీ అయిపోయినట్లు తెలుస్తోంది.
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 561.46 పాయింట్లు లేదా 0.72 శాతం నష్టంతో 77,054.94 వద్ద, నిఫ్టీ 158.95 పాయింట్లు లేదా 0.66 శాతం నష్టంతో 24,052.05 వద్ద నిలిచాయి.శ్రద్ధా రియల్టీ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్జీ జవేరి లిమిటెడ్, బాల్ ఫార్మా లిమిటెడ్, నూరేకా లిమిటెడ్, వ్రాజ్ ఐరన్ & స్టీల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బజాజ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్, ఎస్సార్ షిప్పింగ్ లిమిటెడ్, పీపీఏపీ ఆటోమోటివ్ లిమిటెడ్, బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
‘ఈ20’తో మైలేజ్ తగ్గిందా? అసలు నిజమిదే!
భారతదేశంలో ఈ20 (20% ఇథనాల్ కలిపిన పెట్రోల్) చుట్టూ గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రముఖ యూట్యూబర్, వ్లాగర్ సౌరవ్ జోషి తన మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ ఎస్యూవీ (జీఎల్సీ) మైలేజ్ ఈ20 పెట్రోల్ వాడటం వల్ల భారీగా పడిపోయిందంటూ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా అధికారికంగా స్పందించడం, ఆ తర్వాత సదరు యూట్యూబర్ తన తప్పు తెలుసుకోవడంతో ఈ వివాదానికి తెరపడింది.వివాదానికి కారణం ఏంటి?సామాజిక మాధ్యమంలో అధిక ఫాలోవర్లు ఉన్న సౌరవ్ జోషి తన మెర్సిడెస్ బెంజ్ ఎస్యూవీలో లోకల్ బంకులో పెట్రోల్ కొట్టించిన 48 గంటల్లోనే మైలేజ్ లీటరుకు 17 కిలోమీటర్ల నుంచి ఏకంగా 5 కిలోమీటర్లకు పడిపోయిందని ఆరోపించారు. ఫుల్ ట్యాంక్ చేస్తే 800 కిమీ రావాల్సిన రేంజ్ కేవలం 480 కిమీ మాత్రమే చూపిస్తోందని డిజిటల్ మీటర్ స్క్రీన్ను వీడియోలో చూపించారు. ‘ఇదంతా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్లే జరిగింది. ఇంజిన్ ఎప్పుడు పాడైపోతుందో అని భయమేస్తోంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వాహనదారుల్లో ఆందోళన రేకెత్తించాయి.మెర్సిడెస్ బెంజ్ అధికారిక స్పందనఈ వీడియో వైరల్ కావడంతో మెర్సిడెస్ బెంజ్ ఇండియా స్పందిస్తూ కస్టమర్ అడ్వైజరీని విడుదల చేసింది. ‘మెర్సిడెస్ బెంజ్ సంస్థకు కస్టమర్ల భద్రత, వాహన విశ్వసనీయత అత్యంత ప్రాధాన్యత కలిగినవి. భారతదేశంలో విక్రయించే అన్ని మెర్సిడెస్ బెంజ్ (BS6) పెట్రోల్ వాహనాలు ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలమైనవి. మైలేజ్ తగ్గడానికి ఇంధనం మాత్రమే కారణం కాదని.. డ్రైవింగ్ శైలి, ట్రాఫిక్ పరిస్థితులు, టైర్ ప్రెజర్, ఇంజిన్ సెన్సార్ల వంటి పలు అంశాలపై అది ఆధారపడి ఉంటుంది’ అని కంపెనీ స్పష్టం చేసింది.యూట్యూబర్ యూ-టర్న్మెర్సిడెస్ బెంజ్ స్పందన తర్వాత, సౌరవ్ జోషి తన కారును కంపెనీ సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లారు. అక్కడ సాంకేతిక నిపుణులు తనిఖీ చేయగా అసలు సమస్య ఇంధనంలో లేదు, కారు ఇంజిన్లో ఉన్న ఒక సాంకేతిక లోపం వల్లే మైలేజ్ అంత దారుణంగా పడిపోయిందని తేలింది. దీనితో సౌరవ్ జోషి వెంటనే స్పందిస్తూ.. అవగాహన లోపంతో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఈ20 ఇంధనం వల్ల సమస్య రాలేదని, ఇంజిన్ లోపం వల్లే అలా జరిగిందని స్పష్టం చేస్తూ తన పాత వీడియోలోని ఆ భాగాన్ని కూడా తొలగించారు.ఈ20 ఇంధనంపై నిపుణులు ఏమంటున్నారు?ఆటోమొబైల్ ఇంజినీర్ల ప్రకారం.. ఇథనాల్కు ప్యూర్ పెట్రోల్తో పోలిస్తే ఎనర్జీ డెన్సిటీ కాస్త తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఈ20 ఇంధనాన్ని వాడినప్పుడు సాధారణ మైలేజ్ కంటే కేవలం 3-5% వరకు మాత్రమే మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. అంతేకానీ, లీటరుకు 17 కిమీ ఇచ్చే కారు 5 కిమీకి పడిపోయే అవకాశం లేదని చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట
సీఎం విజయ్కు బొమ్మ కారు గిఫ్ట్.. ఎవరిచ్చారంటే?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకునే రాజకీయ నిర్ణయాలు, అధికారిక కార్యక్రమాల వల్ల మాత్రమే కాకుండా.. ఆయన సహజమైన, సరదా క్షణాల వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా.. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ఫాస్ట్ ఆసియా ఆపరేషన్స్ సీఈఓ ఫామ్ సాన్ చౌ (Pham Sanh Chau)తో జరిగిన సమావేశం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో గమనించినట్లయితే.. ఈ సమావేశంలో విన్ఫాస్ట్ కంపెనీ ప్రతినిధి.. ముఖ్యమంత్రి విజయ్కు తమ కంపెనీకి చెందిన విన్ఫాస్ట్ వీఎఫ్8 ఎలక్ట్రిక్ కారు స్కేల్ మోడల్ను గిఫ్ట్గా ఇచ్చారు. ఈ చిన్న కారు బొమ్మను విజయ్ తీసుకుని, పక్కన పెట్టకుండా ఆసక్తిగా చేతిలో పట్టుకుని పరిశీలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.చాలామంది నెటిజన్లు విజయ్ అమాయకత్వాన్ని, సరళ స్వభావాన్ని ప్రశంసించారు. కొందరు ఆయన ఆ చిన్న కారును ఎంతో ఆసక్తిగా చూస్తున్న తీరు చాలా క్యూట్గా ఉందని, చిన్నపిల్లాడిలా ఆనందపడ్డారని కామెంట్లు చేశారు.నిజానికి సీఎం విజయ్కు ఇచ్చిన టాయ్ కారు విన్ఫాస్ట్ వీఎఫ్8 అనే ఎలక్ట్రిక్ ఎస్యూవీకి చెందిన చిన్న నమూనా. దీనిని కంపెనీ పిల్లలు ఆదుకునే బొమ్మగా కాకుండా.. తమ వాహనాలను ప్రచారం చేయడానికి లేదా ప్రత్యేక అతిథులకు గిఫ్ట్గా ఇవ్వడానికి రూపొందించింది.విన్ఫాస్ట్ వీఎఫ్8 గురించిఅసలైన విన్ఫాస్ట్ వీఎఫ్8 ఎలక్ట్రిక్ కారు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండో తరం. ఇది 60.13 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 228 హార్స్పవర్, 330 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 500 కిమీ ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.#CMVijay's cute playtime with a Miniature Toy Car... 🤎🚗 pic.twitter.com/dmrxMCbeO2— 𝐒𝐚𝐤𝐭𝐡𝐢 𝐀𝐠𝐫𝐢 𝑻𝑽𝑲 (@mersal_sakthi03) July 13, 2026
ఫ్యామిలీ
కదులుతున్న రైలులో పూజలు..! వీడియో వైరల్..
రైలు బోగినే హనీమూన్ సూట్గా మార్చిన ఘటన మరువక ముందే మరో రైలు ఘటన నెట్టింట వైరల్గా మారింది. కదులుతున్న రైలులో పూజ పరమైన కార్యక్రమాలు జరుగుతున్న వీడియో..నెట్టించ చర్చలకు దారితీసింది. భారతీయ రైల్వేలోనే ఇలాంటి వాటికి అనుమతి ఉంటుందా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియలోఓ ప్రయాణికులు రైలు కోచ్ లోపల మతపరమైన పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టంగా కనిపించడంతోనే ఇలా కదులుతున్న రైలు ఇలాంటి ఆచారాలు నిర్వహించుకోవచ్చా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ఉత్తర మధ్య రైల్వేలో చోటు చేసుకుంది. అయితే రైలులో ఇలాంటి వాటికి అనుమతి ఉంటుందా అని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఉత్తర రైల్వే ఇలా వివరణ ఇచ్చింది. ఈ వైరల్ వీడియో ఘటనతో ఉత్తరరైల్లే ఇలా వివరణ ఇచ్చింది. ఐఆర్సిటిసి (IRCTC) ద్వారా వాణిజ్య బుకింగ్ ద్వారా ప్రేవేట్గా బుక్ చేసుకున్న సెలూన్ కోచ్గా పేర్కొది. అందులోనే ఈ మతపరమైన ఆచారాలు జరిగినట్లు ఉత్తర రైల్వే స్పష్టం చేసింది. ఆ కార్యక్రమం సాధారణ ప్యాసింజర్ కోచ్లో కాకుండా IRCTC ద్వారా ఒక ప్రైవేట్ వ్యక్తి బుక్ చేసుకున్న సెలూన్ కోచ్లో జరిగిందని తెలిపింది. ఈ సెలూన్ కోచ్ అనేది సీనియర్ రైల్వే అధికారులు, వీఐపీల కోసం ఉద్దేశించిన విలాసవంతమైన ప్రైవేట్ బోగీ. ఇందులో ఎయిర్ కండిషన్డ్ బెడ్రూమ్లు, ఒక చిన్న వంటగది, లివింగ్, డైనింగ్ రూమ్ల తోకూడిన వాష్రూమ్ సౌకర్యాలు ఉంటాయి. ఆ వ్యక్తి ఈ వాణిజ్య రిజర్వేషన్ కోసం అడ్వాన్స్గా రూ. 3 లక్షలకు పైగా జమ చేసినట్లు పేర్కొంది. ఈ సెలూన్ కోచ్ను జూలై 10న న్యూఢిల్లీ (NDLS) నుంచి ముంబై (BDTS)కి వన్-వే ప్రయాణం కోసం రైలు నెం. 12926 పశ్చిమ్ ఎక్స్ప్రెస్కు జతచేయాల్సి ఉందని వెల్లడించింది. అదే సమయంలో ప్రయాణికుల భద్రత, రైళ్లు సజావుగా నడపడం తమ అత్యంత ప్రాధాన్యత అని రైల్వే అదికారులు నొక్కి చెప్పారు. Hello @AshwiniVaishnaw, was this approved by @RailMinIndia? If so, What is the procedure? pic.twitter.com/9VUJP53lJQ— Mohammed Zubair (@zoo_bear) July 12, 2026 (చదవండి: 15 ఏళ్లకే చదువుకి మానేసింది..! కట్చేస్తే రూ 7 వేల కోట్ల కంపెనీ..)
15 ఏళ్లకే చదువు మానేసింది..! కట్చేస్తే రూ 7 వేల కోట్ల కంపెనీ..
సాధారణంగా కష్టపడి చదివి..నైపుణ్యాలు అందిపుచ్చుకుని ఒక్కోమెట్టు ఎక్కుతూ సక్సెస్ అందుకుంటాం. కానీ కొందరు చిన్న వయసులోనే అపార ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ కోవకు చెందిన పిల్లలు అందరి పిల్లల్లా క్లాస్రూమ్ పాఠాలకు అంకితమవ్వరు. అలా టైం వేస్ట్ చేసే కంటే..తనకేది ఇష్టమే ఏం చేస్తే బాగుంటుందో.. అంత చిన్న వయసులోనే నిర్ణయించుకోగలరు. ఆ దిశగా తమ టాలెంట్ని ప్రదర్శించి దిగ్గజ కంపెనీలే వచ్చి తమ సంస్థలో చేర్చుకునేలా చేసుకుంటారు. అలాంటి టాలెంటెడ్ గర్ల్ హర్షిత అరోరా. ఆమె స్కూల్ చదువుని మధ్యలోనే ఆపేసి పేరెంట్స్కి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత అత్యంత చిన్న వయసులోనే కోట్ల విలువ చేసే కంపెనీని నిర్మించి..ఇంటెలిజెన్స్కి కేరాఫ్గా నిలిచింది. ఆ అమ్మాయే ఉత్తప్రదేశ్లోని సహారన్పూర్ నగరానికి చెందిన హర్షిత అరోరా. చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు ఇంజీనర్ లేదా డాక్టరో అవ్వాలనే అనుకుంటారు. కానీ హర్షిత తన తల్లిదండ్రులే ఆందోళన చెందేలా భయానక నిర్ణయం తీసుకుని షాక్కి గురి చేసింది. చదువుకి అత్యంత కీలకమైన టీనేజ్ దశ అంటే 15 ఏళ్ల వయసుకే ఈ చదువులు నావల్ల అయ్యే పని కాదని స్టడీస్కి బై..బై చెప్పేసింది. తనకు తాను సొంతంగా టెక్నాలజీ గురించి నేర్చుకోవడం ప్రారంభించింది. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ సాయంతో 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒక క్రిప్టో పోర్ట్ఫోలియో ట్రాకింగ్ యాప్ను సృష్టించింది. అది చాలా సరళంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. ఆపిల్ దీన్ని గమనించి తన ఫ్లాట్ఫామ్లోకి చేర్చింది. ఈ యాప్ అమెరికా, కెనడా దేశాల వ్యాప్తంగా రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన ఫైనాన్స్ యాప్గా నిలిచింది. ఆ తర్వాత కొద్ది కాలానికే, ఒక కంపెనీ దీనిని కొనుగోలు చేసింది. అలా 2020లో, భారత ప్రభుత్వం హర్షిత విజయాలను గుర్తించింది. అందుకుగానూ ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాల పురస్కార్ను అందుకుంది కూడా. అదే ఏడాది ఆమె అమెరికా వెళ్లడానికి O-1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. తమ రంగంలో అసాధారణమైన సామర్థ్యాన్ని ప్రదర్శించిన వారికి ఈ వీసా ఇస్తారు. అందుకోసం ఆమెకు మొత్తం పదిమంది సీఈవోల నుంచి సిఫార్సులు అవసరం. కానీ హర్షితకు ఏకంగా 15 సిఫార్సులు లభించాయి. అంతేగాదు శాన్ ఫ్రాన్సిస్కో ఆమెకు స్వాగతం పలికింది. 2019లో, ఆమె విజ్ఞాన్ వెలివేల తుషార్ మిశ్రాలతో కలిసి AtoB అనే స్టార్టప్ను స్థాపించారు. వాళ్ల మంచి ఆలోచనతో స్టార్టప్ని ప్రారంభించడంతో Y కాంబినేటర్ సమ్మర్ 2020 బ్యాచ్కు ఎంపికయ్యారు.ఈ Y కాంబినేటర్ (Y Combinator) అనేది 2005లో స్థాపించిన ఒక ప్రముఖ అమెరికన్ స్టార్టప్ యాక్సిలరేటర్. ఇది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి (స్టార్టప్లకు) అవసరమైన ప్రాథమిక పెట్టుబడి (Seed Fund), శిక్షణను అందిస్తుంది. అయితే వారి ఆలోచన ప్రారంభం కాకముందే కరోనా మహమ్మారితో వారి స్టార్టప్కి బ్రేక్లు పడ్డాయి. అకస్మాత్తుగా మారిపోయిన ప్రపంచం ఒకవైపు..ఏదో నిర్మించాలనే తపనతో కష్టపడుతున్న హర్షిత బృందం ఇంకోవైపు. నిజానికి ఆ టైంలో చాలా స్టార్టప్లు మూతపడ్డాయి. చాలామంది వ్యవస్థాపకులు తిరిగి ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు కూడా. అయితే హర్షిత బృందం మాత్రం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ట్రంక్ స్టాప్లకు వెళ్లారు. వారాల తరబడి అక్కడే నిలబడి ఆ ట్రక్ డ్రైవర్లతో మాట్లాడేవారు. వారి సమస్యల గురించి, చెల్లింపుల గురించి అడిగారు. అలాగే ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. నిజానికి హర్షిత బృందానికి ట్రక్కింగ్ పరిశ్రమ గురించి ఏమీ తెలియదు. దానికి సంబంధించి..ఫ్లీట్ల కోసం చెల్లింపు వ్యవస్థల గురించి కూడా ఏమీ తెలియదు. వాళ్లకు అర్థమయ్యే వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంది ఆ బృందం. అలా వారు AtoBని మళ్ళీ మొదటి నుండి నిర్మించారు. ఈసారి ఈసారి అమెరికన్ ట్రక్కింగ్ పరిశ్రమ కోసం ఆర్థిక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి..దశాబ్దాలుగా పాత పద్ధతులను ఉపయోగిస్తున్న పరిశ్రమ కోసం ఆధునిక టెక్నాలజీని అందించారు.అలా ఇప్పుడు అమెరికాలోని 30 వేలకు పైగా ఫ్లీట్లు AtoBని ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ సుమారు $800 మిలియన్లు, అంటే దాదాపు రూ. 7,600 కోట్లు. ఇక్కడ హర్షిత చదువు మానేసి మరి..తనకు ఏ మాత్రం పరిచయంలోని పరిశ్రమలో భారీ విజయాన్ని అందుకోవడం విశేషం. ప్రారంభించాలనుకున్నా.. స్టార్టప్కు బ్రేకులు పడ్డాయేమో గానీ తనకు కాదని తన సక్సెస్తో నిరూపించింది. ఏప్రిల్ 2026లో, వై కాంబినేటర్ హర్షితను జనరల్ పార్టనర్గా పదోన్నతి కల్పించింది. అంతకుముందు ఏడాది ఆ సంస్థలో అత్యంత పిన్న వయస్కురాలైన విజిటింగ్ పార్టనర్గా ఉంటూ..ప్రారంభ దశలో ఉన్న వ్యవస్థాపకులకు ఒక కంపెనీని నిర్మించడంలో సహాయసహకారాలు అందించేది. దాంతో హర్షిత 24 ఏళ్లకే ప్రపంచంలోని అత్యంత తెలివైన బిల్డర్లతో పనిచేసే అవకాశం దక్కించుకుంది. ఇక్కడ ఆమె ఏ స్టార్టప్లకు నిధులు అందాలో, ఏ వ్యవస్థాపకులకు ప్రపంచాన్ని మార్చే అవకాశం లభించాలో హర్షితానే నిర్ణయిస్తుంది. కెరీర్ ప్రారంభించే వయసుకే వై కాంబినేటర్లో జనరల్ పార్టనర్ అవ్వడం అంటే మామలు విషయం కాదు. ఎవ్వరికైన ఏదైనా మొదలు పెట్టేటప్పుడూ ఆటంకాలు వస్తాయి..దాన్ని అధిగమించి ఎలా ముందుకు సాగుతున్నావనే దానిపై సక్సెస్ మొత్తం ఆధారపడి ఉంటుందని హర్షిత నిరూపించింది. (చదవండి: పింక్ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..!)
పాలు, చక్కెరలా సంసారం
జాతీయ లోక్ అదాలత్లో దాఖలు చేసిన తమ విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకుని ఒక యువ జంట మళ్లీ ఒక్కటయ్యారు. ఏడాది క్రితం, మండ్య జిల్లాలోని కె. ఆర్. పేట తాలూకాలోని ముద్దనహళ్లి గ్రామానికి చెందిన హరీష్ మైసూరుకు చెందిన కవన విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం లోక్ అదాలత్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు వారికి బుద్ధిమాటలు చెప్పారు. ‘జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న బాధలు, సమస్యల గురించి చింతించకుండా, పాలలో చక్కెర కలిసిపోయి రుచిని పెంచినట్లుగా, ఒకరిపై ఒకరు ప్రేమ, నమ్మకంతో జీవించాలి’ అని సీనియర్ జడ్జి సుధీర్ వివరించారు. కనువిప్పు కలిగిన ఆ యువ జంట రాజీపడి తిరిగి ఒక్కటి అవుతామని తెలిపారు. వెంటనే పూలదండలు తెప్పించి మార్పించారు. న్యాయవాదులు హొన్నెనహళ్లి హెచ్. వి. రవి, కామనహళ్లి బోరేగౌడ, వి. కె. స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. - బెంగళూరు
పింక్ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..!
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ సాంప్రదాయ శైలి చీరలతో ఆకట్టుకోవడంలో ముందుంటారు. తరుచుగా అద్భుతమైన చేనేత చీరలు, విలువైన ఆభరణాలతో మెరిస్తుంటారు. తాజాగా మరోసారి అద్బుతమైన చేనేత చీరలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆమె వారణాసిలో ఫార్చ్యూన్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ కార్యక్రమం కోసం స్వదేశ్ వారి అద్భుతమైన తంచోయ్ బనారసీ పట్టు చీరను ఎంచుకున్నారు. వారణాసిలో భక్తి, పండుగ ఆనందాల్లో ప్రధాన పాత్ర పోషించే గులాబీ రేకులలో నిండిపోయే హోలీ వేడుక స్ఫూర్తితో రూపొందిచారు నీతా తంచోయ్ బనారసీ పట్టు చీరను. ఈ చీరలో నీతా రాజసంగా కనిపించారు. ఈ లేత గులాబీ రంగు ఆ పవిత్ర నగర ప్రసిద్ధ పండుగతో ముడిపడి ఉన్న ప్రశాంతతను అందంగా ఆవిష్కరించింది నీతా పింక్ బనారసీ చీర. ఆమె దీన్ని వారణాసి గులాబ్ హోలీకి నివాళిగా ధరించారు. ఈ చీరపై అంత్యంత క్లిష్టమైన పూల జాలీ డిజైన్ ఉంది. దీనిపై లేత ఐవరీ, పురాతన బంగారు రంగులలో సుందరంగా నేసిన పూల బుట్టాలతో డెకరేట్ చేశారు. ఈ వివరమైన డిజైన్లు చీరకు గొప్ప ఆకృతిని, ప్రకాశవంతమైన మెరుపుని అందించాయి. ఈ నేత రెండు వైపులా ఒకలా ఉండి ఎటునుంచైనా ధరించేలా ఉండటమే దీని ప్రత్యేకత. దీన్ని ప్రఖ్యాత కళాకారులు ఆరుషి లోహియా, కృష్ణ లోహియా రెండు నెలల పాటు చేతితో నేశారు. ఈ బనారసీ పట్టు చీర నేత వారసత్వానికి, హస్త కళా నైపుణ్యానికి ప్రతీక. ఈ చీరకు సరిపోయే లేత గులాబీ రంగు బ్లౌజ్ వింత్ మోచేతి వరకు ఉండేలా జత చేశారు. ఈ బ్లౌజ్ క్లాసిక్ స్వేర్ నెక్లైన్ ఉంది. ఈ చీరకు అనుగుణంగా పూల స్టడ్ చెవిపోగులు, సున్నితమైన గుండె ఆకారపు డైమండ్ పెండెంట్, టెన్నిస్ బ్రాస్లెట్, ఒక స్టేట్మెంట్ రింగ్, లగ్జరీ వాచ్లను ధరించారు. ఈ చీర అందంగా కనిపించేలా చాలా తక్కువ ఆభరణాలనే ధరించారు నీతా. ఇక తన బ్యూటీ లుక్ కోసం నేచురల్ గ్లామర్నే ఎంచుకుంది. సాంప్రదాయా మహిళలా ఎర్రటి బొట్టు, పాపిడి తీసి జుట్టుని చక్కటి కొప్పులా తీర్చిదిద్దుకుంది. ఆ కార్యక్రమానికి అనుగుణంగా శక్తిమంతమైన సాంప్రదాయ శైలిలో హుందాగా కనిపించింది నీతా అంబానీ. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online) (చదవండి: వాకింగ్'కి అత్యంత అనుకూలమైన నగరం అదే..! కానీ హారన్ కొట్టారో..)
అంతర్జాతీయం
ఆషామాషీ కాదు.. ఇక్కడ విమానం దించడమంటే సాహసమే!
విమానాశ్రయం అనగానే మన కళ్ల ముందు కనిపించేది.. పొడవైన రన్వేలు, భారీ టెర్మినల్స్, విమానాల రాకపోకల సందడి. కానీ ప్రపంచంలో ఓ చిన్న దీవిలో మాత్రం విమానాలు దిగే దృశ్యం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ విమానాలకు కాంక్రీట్ రన్వే లేదు.. తారు రోడ్డు కూడా లేదు. సముద్ర తీరంలోని ఇసుకే అక్కడ రన్వే! అలలు తాకే బీచ్పైనే ప్రయాణికుల విమానాలు ల్యాండ్ అవుతాయి.స్కాట్లాండ్ పశ్చిమ తీరానికి సమీపంలోని బర్రా దీవిలో ఉన్న బర్రా ఎయిర్పోర్ట్ (Barra Airport) ఈ అరుదైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం నడిచే వాణిజ్య విమానాలు నేరుగా బీచ్పై దిగే ప్రపంచంలోని ఏకైక విమానాశ్రయంగా ఇది గుర్తింపు పొందింది.స్కాట్లాండ్లోని ఔటర్ హెబ్రిడ్స్ (Outer Hebrides) దీవుల సమూహంలో ఉన్న బర్రా ఐలాండ్లో ఈ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ విమానాలు ల్యాండ్ అయ్యే ప్రాంతం పేరు ట్రాయ్ మోర్ (Traigh Mhòr) బీచ్. సాధారణ విమానాశ్రయాల్లో కనిపించేలా ఇక్కడ కాంక్రీట్ లేదా తారు రన్వే ఉండదు. గట్టిగా ఉండే ఇసుకనే రన్వేగా ఉపయోగిస్తారు. బీచ్పై చెక్క స్తంభాలతో మూడు రన్వే మార్గాలను గుర్తిస్తారు.అయితే ఈ ఎయిర్పోర్ట్ నిర్వహణ ప్రకృతితో ముడిపడి ఉంటుంది. కారణం.. సముద్రం. హై టైడ్ సమయంలో ఈ బీచ్ మొత్తం నీటిలో మునిగిపోతుంది. అందుకే విమానాల రాకపోకల సమయాలను సముద్ర ఆటుపోట్లను బట్టి నిర్ణయిస్తారు.విమానం దిగే ముందు.. బీచ్ ఖాళీ!బర్రా ఎయిర్పోర్ట్లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విమానాలు లేని సమయంలో అదే బీచ్ను ప్రజలు సాధారణంగా ఉపయోగించుకోవచ్చు. పర్యాటకులు అక్కడ నడవొచ్చు.. ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు.కానీ విమానం ల్యాండ్ అయ్యే సమయం దగ్గరపడగానే దృశ్యం పూర్తిగా మారిపోతుంది. బీచ్ను ఖాళీ చేయించి.. విమాన రాకపోకలకు సిద్ధం చేస్తారు. ఆకాశం నుంచి విమానం వచ్చి ఇసుకపై సాఫీగా దిగే దృశ్యం పర్యాటకులకు ఓ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.పైలట్లకూ ప్రత్యేక సవాలే!సాధారణ రన్వేలతో పోలిస్తే బీచ్పై విమానాన్ని ల్యాండ్ చేయడం పైలట్లకు కూడా ప్రత్యేకమైన సవాల్. ఇసుక పరిస్థితి, గాలి వేగం, వాతావరణం, సముద్ర ఆటుపోట్లను పరిగణనలోకి తీసుకుని విమానాలను నడపాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్కాట్లాండ్కు చెందిన లాగనైర్ (Loganair) విమాన సంస్థ గ్లాస్గో నుంచి బర్రా వరకు ఈ ప్రత్యేక విమాన సేవలను నిర్వహిస్తోంది. View this post on Instagram A post shared by Amy 🇬🇧 Vanlife Adventure Family (@van_life_family_) ప్రయాణమే కాదు.. ఓ ప్రత్యేక అనుభవంబర్రా దీవి కేవలం ఈ ఎయిర్పోర్ట్ వల్లే కాకుండా తన ప్రకృతి అందాలతోనూ ప్రసిద్ధి చెందింది. తెల్లని ఇసుక తీరాలు, నీలిరంగు సముద్రం, తీర ప్రాంత నడక మార్గాలు, పురాతన కట్టడాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడి ప్రసిద్ధ కిసిముల్ క్యాసిల్ (Kisimul Castle), సముద్ర జీవులు, సంప్రదాయ హెబ్రిడియన్ గ్రామీణ జీవనం సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి.మే నుంచి సెప్టెంబర్ వరకు ది బెస్ట్బర్రా దీవిని సందర్శించేందుకు సాధారణంగా మే నుంచి సెప్టెంబర్ వరకు అనుకూల సమయంగా భావిస్తారు. ఈ సమయంలో వాతావరణం మెరుగ్గా ఉండటంతో పాటు.. బీచ్పై విమానం దిగే అరుదైన దృశ్యాన్ని చూసే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో అత్యాధునిక విమానాశ్రయాలు ఉన్నప్పటికీ.. ప్రకృతినే రన్వేగా మార్చుకుని విమానాలను ఆహ్వానించే బర్రా ఎయిర్పోర్ట్ మాత్రం ప్రత్యేకమే.
పగ తీర్చుకుందా?.. అదే ఏనుగు.. అదే కుటుంబం!
ఓ కుటుంబం ప్రాణభయంతో ఊరు విడిచింది.. ఇక ఆ ప్రమాదం తమ దరిచేరదని భావించింది. కానీ కాలం గడిచినా ఆ విషాద జ్ఞాపకం వారిని వెంటాడుతూనే వచ్చింది. ఏకంగా 14 ఏళ్ల తర్వాత అదే ఏనుగు మళ్లీ వారి జీవితాల్లోకి వచ్చి పెను విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలను బలిగొన్న ‘ధుర్బే’ అనే అడవి ఏనుగు ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.నేపాల్లోని చిత్వన్ నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ ఘటన.. మనిషి–వన్యప్రాణి ఘర్షణ ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి చూపించింది. ఏళ్ల క్రితం జరిగిన విషాదం నుంచి బయటపడేందుకు ఊరు మార్చుకున్న ఓ కుటుంబాన్ని.. అదే ఏనుగు మళ్లీ వెతుక్కుంటూ వచ్చినట్లు కనిపించడం స్థానికులను సైతం విస్మయానికి గురిచేసింది.2012లో మొదలైన విషాదం..షానిచర బోటే కుటుంబానికి ఈ విషాద ప్రయాణం 2012లో మొదలైంది. చిత్వన్ నేషనల్ పార్క్ సమీపంలోని మడి ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో.. ‘ధుర్బే’ అనే అడవి ఏనుగు దాడి చేసింది. ఆ ఘటనలో షానిచర తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు.కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోయిన షానిచర.. ఇక అక్కడ జీవించడం ప్రమాదకరమని భావించారు. కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో దాదాపు 9 మైళ్ల దూరంలోని జగత్పూర్కు వలస వెళ్లారు. మధ్యలో రాప్తి నది కూడా ఉండటంతో.. ఇక ఆ ఏనుగు తమను చేరుకోలేదని భావించారు. అయితే విధి మరోలా రాసింది. 14 ఏళ్ల తర్వాత.. మళ్లీ అదే ఏనుగుఇటీవల జగత్పూర్లోని షానిచర కుటుంబం నివసిస్తున్న ప్రాంతానికి ధుర్బే ఏనుగు చేరుకుంది. ఇంట్లోకి చొరబడిన ఆ ఏనుగు దాడిలో షానిచర కోడలు అశికా బోటే (25), నాలుగేళ్ల మనవడు భారత్ బోటే మృతి చెందారు. “పెద్ద నదులు దాటి వెళ్లినా మేము సురక్షితంగా ఉంటామని అనుకున్నాం. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా అదే ఏనుగు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మా ఇంటిపై దాడి చేసి నా కోడలు, చిన్న మనవడిని తీసుకెళ్లిపోయింది. ఇక మాకు పారిపోవడానికి చోటు లేదు” అని షానిచర బోటే ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనతో ధుర్బే ఏనుగు కారణంగా ఒకే కుటుంబంలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. 2012లో షానిచర తల్లిదండ్రులను బలిగొన్న ఇదే ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత ఆయన కోడలు, మనవడిని కూడా పొట్టన పెట్టుకుంది.‘పగ’ కాదు.. కానీ వెంటాడిన విషాదం!ఏనుగులు మనుషుల్లా పగ తీర్చుకుంటాయని చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే ఒకే కుటుంబాన్ని 14 ఏళ్ల వ్యవధిలో రెండుసార్లు విషాదంలోకి నెట్టిన ధుర్బే ఘటన మాత్రం అందరినీ కలచివేస్తోంది. ఒకప్పుడు తమ నుంచి దూరంగా వెళ్లిపోయిన కుటుంబం వద్దకే మళ్లీ అదే ఏనుగు చేరుకోవడం.. స్థానికుల్లో.. ఇది పగేనా?, అసలు ఎందుకు పగ బట్టింది?? అనే ప్రశ్నలను రేకెత్తిస్తోంది.25 మంది ప్రాణాలు తీసిన ధుర్బేధుర్బే నేపాల్లోని అత్యంత ప్రమాదకరమైన అడవి ఏనుగుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. చిత్వన్ నేషనల్ పార్క్ అధికారుల ప్రకారం.. 2010 నుంచి ఇప్పటివరకు ఈ ఏనుగు దాడుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏనుగు కదలికలను పర్యవేక్షించేందుకు అధికారులు పలుమార్లు ట్రాకింగ్ కాలర్లు అమర్చారు. 2016లో తొలిసారి కాలర్ అమర్చగా.. అది పనిచేయకపోవడంతో 2020లో మరోసారి, 2023లో మళ్లీ కొత్త కాలర్ను అమర్చారు. అయినప్పటికీ ధుర్బే కదలికలను పూర్తిగా నియంత్రించడం సవాల్గా మారింది.పెరుగుతున్న మనిషి–ఏనుగు ఘర్షణఅడవుల విస్తీర్ణం తగ్గడం, మానవ నివాసాలు అటవీ ప్రాంతాలకు చేరువ కావడంతో మనిషి–వన్యప్రాణుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. ఆహారం, నీటి కోసం అడవి జంతువులు జనావాసాల్లోకి రావడం.. ప్రజలు భయంతో జీవించాల్సి రావడం ఇలాంటి విషాదాలకు కారణమవుతోంది. 14 ఏళ్ల పాటు తప్పించుకున్నామని భావించిన ఓ కుటుంబాన్ని.. అదే ఏనుగు మళ్లీ విషాదంలోకి నెట్టిన ఘటన ఇప్పుడు నేపాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
రష్యాను షేక్ చేస్తున్న ‘బోరిస్ నదెజ్దిన్’ ఎవరు?
మాస్కో: రష్యాలో పార్లమెంటరీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న ప్రముఖ యుద్ధ వ్యతిరేక రాజకీయ నేత బోరిస్ నదెజ్దిన్ను రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు. 2023లో ఆయన విడుదల చేసిన ఒక వీడియోలో ‘తీవ్రవాద చిహ్నాలను’ ప్రదర్శించారనే ఆరోపణలపై అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఆ వీడియోలో దివంగత ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ ఫోటో ఉండటమే ఇందుకు కారణం.రాబోయే ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు మద్దతు కూడగడుతున్న తరుణంలో నదెజ్దిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ పరిపాలనను బహిరంగంగా విమర్శించడంతో 2024లో నదెజ్దిన్ దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చారు. సోమవారం ఆయన తన టెలిగ్రామ్ ఖాతాలో ‘పోలీసులు వచ్చారు’ అని పోస్ట్ చేశారు. ఆ తర్వాత, 2023 వీడియో ఆధారంగా తనపై తీవ్రవాద చిహ్నాల ప్రదర్శన కేసు నమోదు చేసినట్లు ధృవీకరించే పత్రాన్ని ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ఆయనను జైలుకు పంపుతారా లేదా దేశం నుండి బహిష్కరిస్తారా అనేది ఇంకా స్పష్టత లేదు. కాగా ఈ అరెస్ట్కు మూడు రోజుల ముందు రష్యా అధికారులు ఆయనను విదేశీ ఏజెంట్గా ప్రకటించారు.ఎవరీ బోరిస్ నదెజ్దిన్?నదెజ్దిన్ దాదాపు 30 ఏళ్ల పాటు మాస్కో ప్రాంతంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. 1999 నుండి 2003 వరకు ‘యూనియన్ ఆఫ్ రైట్ ఫోర్సెస్’ (ఎస్పీఎస్)పార్టీ తరఫున రష్యా పార్లమెంట్ (స్టేట్ డుమా) సభ్యుడిగా సేవలందించారు. వరుస ఎన్నికల ఓటముల తర్వాత ఈ పార్టీ 2008లో రద్దయింది. 1990ల చివరలో ఆయన దివంగత ప్రతిపక్ష నాయకుడు బోరిస్ నెమ్త్సోవ్కు సలహాదారుగా, సెర్గీ కిరియెంకోకు సహాయకుడిగా పనిచేశారు. వ్యవస్థలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన రష్యా ప్రభుత్వ టెలివిజన్ టాక్ షోలలో తరచూ కనిపించారు. క్రెమ్లిన్ తనపై వచ్చే స్వల్ప ఉదారవాద విమర్శలను నియంత్రిత పద్ధతిలో వినిపించడానికి ఆయనను ఒక నిపుణుడిగా ఉపయోగించుకునేదని నివేదికలు చెబుతున్నాయి.పూర్తిగా మారిన వైఖరిఅయితే, 2023లో నదెజ్దిన్ వైఖరి పూర్తిగా మారింది. ఆయన అనూహ్యంగా పుతిన్కు వ్యతిరేకంగా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్పై పుతిన్ చేపట్టిన ప్రత్యేక సైనిక చర్య ఒక ఘోరమైన పొరపాటు అని పేర్కొంటూ యుద్ధ వ్యతిరేక నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన ప్రచారానికి సాధారణ రష్యన్ల నుండి ఊహించని మద్దతు లభించింది. ఆయనకు మద్దతుగా సంతకాలు చేయడానికి వేలాది మంది ప్రజలు భారీ క్యూలలో నిలుచున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన దానికంటే రెట్టింపు సంతకాలను ఆయన సేకరించారు. అయితే ఒక నెల తర్వాత రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆయన సమర్పించిన సంతకాలలో 15 శాతానికి పైగా సాంకేతిక లోపాలు ఉన్నాయని పేర్కొంటూ ఆయన పోటీ చేయకుండా నిషేధించింది. తాజాగా జూలై 2026లో ఆయనను విదేశీ ఏజెంట్గా ముద్ర వేశారు.యూట్యూబ్లో విడుదల చేసిన ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ... ‘రష్యాలో పోటీ చేయడానికి సంతకాలు సేకరిస్తున్న ఏకైక స్వతంత్ర ప్రతిపక్ష అభ్యర్థిని నేనే. యుద్ధం వల్ల వస్తున్న పరిణామాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 25 ఏళ్లుగా పుతిన్ దేశాన్ని నడిపిస్తున్న తీరు మిలిటరైజేషన్ వైపు సాగుతోంది. ఈ మార్గం దేశాన్ని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తుంది. ఇది 1917 రష్యా విప్లవం లాంటి పరిస్థితులకు దారితీస్తుంది’ అని వ్యాఖ్యానించారు. రష్యాలో పార్లమెంటు ఎన్నికలు ఈ ఏడాది సెప్టెంబర్ 20న జరగనున్నాయి.ఇది కూడా చదవండి: 11 ఫ్లాప్లతో కెరీర్ క్లోజ్ అనుకున్న వేళ..
మొజ్తబా పని అయిపోయినట్లే!.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇరాన్ సైనిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని పేర్కొన్న ట్రంప్.. మొజ్తబా పరిస్థితి కూడా ఏమీ బాగోలేదని, ఆయన పని అయిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. "వారికి నౌకాదళం లేదు.. వైమానిక దళం లేదు.. గగనతల రక్షణ వ్యవస్థ కూడా ధ్వంసమైంది. వారి కీలక నాయకులంతా హతమయ్యారు" అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఖమేనీ కుటుంబం గురించి ప్రస్తావిస్తూ.. మేం జరిపిన దాడుల్లో అయతొల్లా ఖమేనీ చనిపోయారు. ఆ తర్వాత సుప్రీం లీడర్ అంటూ ఆయన వారసుడు మొజ్తబా ఖమేనీ వచ్చారు. ఆయన పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆయన 90 శాతం దెబ్బతిన్నారు. ఆయన పని కూడా దాదాపు అయిపోయినట్లే అని అన్నారు. అయితే మొజ్తబా పరిస్థితిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలను అమెరికా విడుదల చేయలేదు. ఇరాన్ కూడా దీనిపై అధికారికంగా స్పందించలేదు.తండ్రి మరణం తర్వాత తెరపైకి.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ పేరు ఒక్కసారిగా అంతర్జాతీయ చర్చల్లోకి వచ్చింది. ఇరాన్ రాజకీయ వ్యవస్థపై ప్రభావం ఉన్న వ్యక్తిగా మొజ్తబాను పరిగణిస్తుంటారు. అయతొల్లా మరణం తర్వాత సుప్రీం ఎవరు? అనే సమయంలో ఆయన పేరు పరిశీలనకు వచ్చింది. అయితే.. గతంలో ఆయనపై ఉన్న విమర్శలు, వివాదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఆ గౌరవం దక్కడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే మత పెద్దలు, ఐఆర్జీసీ మాత్రం ఆయన వైపే మొగ్గు చూపించింది. అయితే సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మొజ్తబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించకపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అయతొల్లా ఖమేనీ కుటుంబ సభ్యులు కొందరు మరణించారు. అయితే ఆ దాడిలో కొడుకు మొజ్తాబా మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారనే ప్రచారం ప్రచారం మాత్రం జోరుగా సాగింది. ముఖ్యంగా తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలకు కూడా మొజ్తబా హాజరు కాలేదు. టెహ్రాన్లో జరిగిన అంత్యక్రియల ప్రార్థనల్లో ఆయన సోదరులు మాత్రమే పాల్గొన్నారు. దేశ అత్యున్నత నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఇప్పటిదాకా కనిపించకపోవడం తీవ్ర చర్చకు కారణమైంది.త్వరలో ప్రజల ముందుకు వస్తారా?ఇటీవల మొజ్తబా ఖమేనీ త్వరలోనే ప్రజల ముందుకు రానున్నారనే ప్రచారం జరుగుతోంది. తన తండ్రి జ్ఞాపకార్థం నిర్వహించే భారీ స్మారక సభలో ఆయన పాల్గొనే అవకాశం ఉందని ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సభలో ఆయన ప్రత్యక్షమైతే.. సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి బహిరంగ కార్యక్రమం కానుంది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి, నాయకత్వ సామర్థ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందని భావించారు.‘తండ్రి మరణానికి ప్రతీకారం’ అంటూ ప్రకటనలుఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి గాయపడిన మొజ్తబా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. సందేశాలు ఏమున్నా సరే.. అత్యంత గోప్యంగా ఆయనకు చేరవేస్తూ వస్తున్నారు. అలాగే ఆయన నుంచి బదులు కూడా అలాగే ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తప్పదంటూ మొజ్తబా కూడా ప్రకటన ఇచ్చినట్లు ఇరాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మొజ్తబా ఖమేనీ ప్రజల ముందుకు నిజంగానే వస్తారా?.. ట్రంప్ ప్రకటన ఉత్తదేనని తేలుస్తారా? అన్నది కీలకంగా మారింది.హర్ముజ్పై ట్రంప్ ప్రకటన.. భగ్గుమన్న ఇరాన్ఇదే సమయంలో ట్రంప్ హర్ముజ్ జలసంధిపై కూడా కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై సముద్ర దిగ్బంధనాన్ని తిరిగి అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. హర్ముజ్ గుండా ప్రయాణించే కార్గో నౌకల నుంచి 20 శాతం రుసుము వసూలు చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనిపై ఇరాన్ భగ్గుమంది. హర్ముజ్ విషయంలో అమెరికా జోక్యం సహించబోమని.. తమ నౌకలపై ఆధిపత్యం ప్రదర్శిస్తే బలప్రయోగానికి దిగుతామని హెచ్చరించింది. ఇటు అమెరికాకు సహకరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గల్ఫ్ దేశాలను సైతం వారించింది.
జాతీయం
సీబీఐకి ఎదురుదెబ్బ.. దాణా స్కామ్లో లాలూకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు ఊరట లభించింది. ఆయన బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ.. సీబీఐ చేసిన బెయిల్ రద్దు అభ్యర్థనను తిరస్కరించింది.దాణా కుంభకోణంలోని డియోఘర్ ట్రెజరీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు 2021లో బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లాలూ బెయిల్ను రద్దు చేయాలని కోరింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎం.ఎం. సుంద్రేష్, జస్టిస్ పీబీ వరాలే ధర్మాసనం.. హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశంఅయితే లాలూ ప్రసాద్ యాదవ్ సహా పలువురి శిక్షపై దాఖలైన అప్పీల్ పిటిషన్లు జార్ఖండ్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఈ అప్పీల్ విచారణను వేగవంతం చేయాలని, సాధ్యమైనంత త్వరగా.. అంటే ఆరు నెలల్లో కేసును పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది.దాణా కుంభకోణం కేసులో శిక్ష1990లలో బిహార్లో జరిగిన దాణా కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పశువుల దాణా పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా నిధులు విత్డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్పై పలు అభియోగాలు నమోదయ్యాయి. డియోఘర్ ట్రెజరీ కేసులో 2018లో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూను దోషిగా తేల్చి శిక్ష విధించింది. అనంతరం ఆయన జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించగా.. 2021లో బెయిల్ లభించింది.బెయిల్ కొనసాగింపు.. అప్పీల్పై ఉత్కంఠతాజా సుప్రీంకోర్టు నిర్ణయంతో లాలూ ప్రసాద్ యాదవ్కు తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ.. అసలు శిక్షపై ఉన్న అప్పీల్ విచారణ మాత్రం కీలకంగా మారింది. ఆరు నెలల్లో హైకోర్టు విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
సీబీఎస్ఈ: మూడో భాష ఫెయిలైతే టెన్త్ సర్టిఫికెట్ రాదు!
న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)2020లో భాగంగా 9, 10 తరగతుల విద్యార్థులకు మూడో భాషను పాఠశాల స్థాయి అంతర్గత మూల్యాంకన (ఇంటర్నల్ అసెస్మెంట్) తప్పనిసరి సబ్జెక్టుగా మారుస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్ష బోర్డు ద్వారా కాకుండా పాఠశాల స్థాయిలోనే జరుగుతుందని, అయితే ఇందులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని బోర్డు స్పష్టం చేసింది. ఇందులో పాస్ కాని విద్యార్థులకు టెన్త్ క్లాస్ పాస్ సర్టిఫికెట్ లభించదు.ఈ నూతన త్రిభాషా సూత్రం ప్రకారం, విద్యార్థులు కచ్చితంగా రెండు భారతీయ భాషలను, ఒక పరభాషను (నాన్-నేటివ్ ల్యాంగ్వేజ్) చదవాల్సి ఉంటుంది. 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలోకి, 2027-28లో 10వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఒకవేళ 10వ తరగతిలో విద్యార్థి అంతర్గత పరీక్షలో ఉత్తీర్ణుడు కాకపోతే, బోర్డు ఫలితాల విడుదలకు ముందే పాఠశాలలు తిరిగి పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. 9వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులను 10వ తరగతికి ప్రమోట్ చేసినప్పటికీ, తదుపరి ఏడాదిలోగా ఆ పెండింగ్ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఒక సెమిస్టర్ చదివితే.. ఏడాది కింద లెక్కించలేం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చేపట్టిన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్ఓ) నియామకాల వ్యవహారంలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డిగ్రీలో కనీసం ఏడాదిపాటు స్టాటిస్టిక్స్ చదివి ఉండాలన్న నిబంధన ఉన్నప్పుడు, కేవలం ఒక సెమిస్టర్ (ఆరు నెలలు) మాత్రమే ఆ సబ్జెక్టును చదివిన అభ్యర్థులను అర్హు లుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అభ్యర్థుల అర్హత వివా దంపై వై.జగదీష్ తదితరులు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్తో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. బీటెక్ అభ్యర్థులు తమ కోర్సులో భాగంగా ఒక సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ చదివారని చెప్పారు. రాతపరీక్షలో వీరు 7వ ర్యాంకు లాంటి అత్యుత్తమ మెరిట్ సాధించినప్పటికీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో టీజీపీఎస్సీ వీరిని అనర్హులుగా ప్రకటించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. సెమిస్టర్ విధానంలో ఏడాది సిలబస్ను ఆరు నెలలకే కుదించి బోధిస్తారని, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ అకడమిక్ నిపుణుల కమిటీ సైతం దీనికి ఆమోదం తెలిపిందని వాదించారు.నిపుణుల కమిటీ నివేదికే కీలకంనిబంధనల్లో స్పష్టంగా ’ఒక ఏడాది’ అని పేర్కొన్నప్పుడు, కేవలం ఒక సెమిస్టర్ మాత్రమే చదివితే ఆ నిబంధనను ఎలా సంతృప్తి పరుస్తుందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ అంశంపై తెలంగాణ అకడమిక్ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ధర్మాసనం ప్రస్తావించింది. ఒక విద్యా సంవత్సరం అనగా 12 నెలలు లేదా రెండు సెమిస్టర్లు అని, ఫౌండేషన్ కోసం కేవలం ఆరు నెలలు చదివిన సబ్జెక్టును పూర్తి అకడమిక్ ఇయర్లో చదివినట్లుగా పరిగణించలేమని కమిటీ స్పష్టం చేసిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. అకడమిక్ అంశాలకు సంబంధించి నిపుణుల కమిటీలదే తుది నిర్ణయమని, వారి అభిప్రాయాన్ని కాదని న్యాయస్థానాలు తమ సొంత నిర్ణయాలను రుద్దలేవని జస్టిస్ మనోజ్ మిశ్రా స్పష్టం చేశారు.
అఫిడవిట్ ట్విస్ట్: ప్రశాంత్ కిషోర్ ఆస్తులు ఎంతంటే..?
ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిహార్లోని బంకీపూర్ ఉప ఎన్నిక బరిలోకి దిగిన ఆయన.. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ప్రశాంత్ కిషోర్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన పేరిట చరాస్తులు రూ.22.19 కోట్లు, స్థిరాస్తులు రూ.73.87 కోట్లు ఉన్నాయి. మొత్తంగా ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.96 కోట్లకు చేరింది. అఫిడవిట్లో తన అప్పుల వివరాలను కూడా ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ప్రస్తుతం తనపై రూ.5.77 కోట్ల బ్యాంకు రుణం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన ఆస్తుల్లో ఘజియాబాద్లోని అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లు, మరో రెండు ఫ్లాట్లలో 50 శాతం వాటా ఉన్నట్లు తెలిపారు. అలాగే పాట్నాలోని పటాలిపుత్ర కాలనీ, ఢిల్లీలోని వసంత్ విహార్లో ప్లాట్లు, బక్సర్, స్వగ్రామంలో ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.భార్య పేరిట భారీగానే..ఇక ఆయన భార్య జాన్వి దాస్ పేరిట ఉన్న ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ భార్య జాన్వి దాస్ వైద్యురాలు. ఆమెకు రూ.89.51 కోట్ల చరాస్తులు, రూ.12.42 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. ఆమెకు గువాహటిలో రెండు ఫ్లాట్లు, ఓ బంగ్లాలో మూడో వంతు వాటా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే నోయిడాలోనూ ఆస్తులు ఉన్నట్లు వివరించారు.ఆ కంపెనీ నుంచి పార్టీకి విరాళాలుప్రశాంత్ కిషోర్ ‘వేదా వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీకి యజమానిగా ఉన్నారు. ఈ సంస్థ 2024-25లో జన్ సురాజ్కు రూ.85 కోట్ల విరాళం ఇచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అంతకుముందు 2023-24లో జన్ సురాజ్ ఫౌండేషన్కు రూ.50 లక్షలు, ‘జాయ్ ఆఫ్ గివింగ్’కు రూ.2.75 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వివరాలు ఉన్నాయి.8 కేసులు.. ఇంకా విచారణ దశలోనే!ప్రశాంత్ కిషోర్పై ఎనిమిది కేసులు నమోదై ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. వీటిలో పరువు నష్టం, అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, మోసం వంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏ కేసులోనూ ఇప్పటివరకు అభియోగాలు నమోదు కాలేదని పేర్కొన్నారు.పీకే ఏం చదివారంటే..ప్రశాంత్ కిషోర్ లక్నో విశ్వవిద్యాలయం నుంచి బీబీఏ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో హెల్త్కేర్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ కోర్సు చేశారు. ఫ్రెంచ్ భాషలోనూ సర్టిఫికేషన్ కోర్సు పూర్తి చేశారు.ఎన్నికల వ్యూహకర్త నుంచి..ప్రశాంత్ కిషోర్ గతంలో దేశంలోని పలు ప్రధాన రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రూపొందించిన విషయం తెలిసిందే. అయితే 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ వ్యూహకర్తగా తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. అనంతరం బిహార్కు తిరిగి వెళ్లి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.2022 అక్టోబర్ 2న ‘జన్ సురాజ్ అభియాన్’ను ప్రారంభించిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజలను కలిశారు. ఆ తర్వాత జన్ సురాజ్ను రాజకీయ పార్టీగా మార్చారు. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆ ఎన్నికల్లో పీకే పోటీకి దూరంగా ఉన్నారు. అయితే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ ఉప ఎన్నిక ద్వారా పోటీ చేస్తున్నారు.పాట్నా జిల్లా పరిధిలో ఉన్న బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం నుంచి గెలిచిన బీజేపీ నేత నితిన్ నబీన్ రాజీనామా చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం(బీజేపీ జాతీయాధ్యక్షుడు+రాజ్యసభ సభ్యుడు)తో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీజేపీ తరఫున నీరజ్ కుమార్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. అతి త్వరలో బై ఎలక్షన్ జరగనుంది.బిహార్ రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్న ప్రశాంత్ కిషోర్.. ఎన్నికల బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే తన అఫిడవిట్తో రాజకీయ వర్గాల్లో మరో చర్చకు తెరలేపారు.
ఎన్ఆర్ఐ
మహిళ హత్య కేసు: అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్యను హత్య చేసిన ఆరోపణలపై ఒక తెలుగు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లేవ్లోని ఒక అపార్ట్మెంట్ బాత్రూమ్లో భార్య మృతదేహం లభ్యమైన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.నిందితుడిని అవినాష్ నార్నె (30)గా గుర్తించారు. జూన్ 27న బెల్లేవ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, భార్య సబ్బినేని రజిత (27) మరణానికి కారణమైనందుకు ఫస్ట్-డిగ్రీ మర్డర్ నిందారోపణలు మోపారు. ప్రస్తుతం అతడికి కింగ్ కౌంటీ జైలులో 5 మిలియన్ డాలర్ల (రూ. 47 కోట్లకు పైగా) భారీ బెయిల్ విధించారు. 2025 అక్టోబర్ 27న బెల్లేవ్ డౌన్టౌన్లోని ఉడ్ల్యాండ్ కామన్స్ అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న బాత్రూమ్లో రజిత అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అధికారులు గమనించారు.వైద్య సిబ్బంది కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆమె అప్పటికే మరణించినట్లు తేలింది. ఆఫీసు నుండి వచ్చేసరికి భార్య బాత్రూమ్ ఫ్లోర్పై పడి ఉందని అవినాష్ పోలీసులకు తెలిపాడు. వీరిద్దరికీ 2025 జూన్లో పెద్దలు కుదిర్చిన వివాహం జరగ్గా, ఆ తర్వాతే ఈ అపార్ట్మెంట్కు మారారు. మొదట అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నివేదికలో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో దీనిని హత్యకేసుగా మార్చారు.సుదీర్ఘ దర్యాప్తులో ఎలక్ట్రానిక్ డోర్ లాక్ రికార్డులు, మొబైల్ డేటా, వాట్సాప్ సందేశాలను డిటెక్టివ్లు పరిశీలించారు. రజిత మరణించిన సమయంలో అవినాష్ మినహా మరెవ్వరూ అపార్ట్మెంట్లోకి ప్రవేశించలేదని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, అవినాష్కు భారతదేశంలో మరో మహిళతో సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో నిందితుడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు, డిజిటల్ ఆధారాల బట్టి అతడే ప్రధాన నిందితుడిగా నిర్ధారించి కోర్టులో హాజరుపరిచారు.
విదేశాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం: మహానేత, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వ ర్యంలో జోహన్నెస్బర్గ్లోని మిడ్రాండ్లో జరిగిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షత వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి అన్నదానం చేపట్టారు. కెనడాలోని టొరొంటో నగరంలో వైభవంగా వైఎస్సార్ జయంతి వేడుకలు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బి వెంకట సుబ్బా రెడ్డి , వాసు సింగారెడ్డి , వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఎనుముల, శ్రీకృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ , శ్రీమతి కల్పన జోసెఫ్, శివమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు కెనడాలో.. కెనడాలోని టొరంటోలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అలూరు సాంబశివరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, కార్తీక్ ఎల్లాప్రగడ, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ చింతా, పార్టీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు వర్చువల్గా పాల్గొన్నారు. టొరంటోలో జరిగిన కార్యక్రమంలో నరసింహ రెడ్డి గుట్టిరెడ్డి, చెన్న కేశవ, ప్రతాప్ బొల్లారం, ఆరిఫ్, నూర్, శ్రీనివాస్ రెడ్డి మరెక్కగారి, చంద్రహాస్ చల్లా, శాలిని బెక్కం, కృష్ణ రెడ్డి అల్లంపాటి, కృష్ణ చిదిరాల, శ్రీకాంత్ మద్దిరెడ్డి, రమేష్ తుంపర, సుబ్బా రావు, గుణశేఖర్ కొనపల్లి, విష్ణు వంగాల, కల్యాణ్ గుర్రంకొండ, శైలేష్ పాల్యం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్బర్గ్లో భారీ కేక్ కట్ చేస్తున్న అభిమానులు ఆస్ట్రేలియాలో.. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్లో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అరి్పంచారు. అనంతరం కేక్ను కట్ చేశారు. ఈ వేడుకల్లో బ్రహ్మరెడ్డి ఎరువూరి, కిషోర్, జస్వంత్ బొమ్మిరెడ్డి, వంశీ చాగంటి, శ్రీనివాసులు రెడ్డి, చిన్నప్ప, శౌర్య పాల్గొన్నారు. అలాగే, కందుల భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్తన్ టెరిటోరీలోని డారి్వన్ నగరంలో కొమ్మిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, శివ హర్షవర్థన్ రెడ్డి వంగ, లక్ష్మణ్ రెడ్డి, రాఘవేంద్ర రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, రవితేజ మదినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెర్త్లో జరిగిన కార్యక్రమంలో వంశీ కృష్ణా రెడ్డి, యశ్వంత్, సతీష్ త్రినాథ్, వినయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్ అభిమానులు మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా కన్వీనర్ భరత్, విక్టోరియా కన్వీనర్ కృష్ణా రెడ్డి, సహ కన్వీనర్ రామాంజి, కోర్ టీమ్ సభ్యులు శిరీష, స్వాతి, యశు, బ్రహ్మ రెడ్డి, పవన్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అబ్దుల్, రవి వర్మ, తేరా జయవర్ధన్ రెడ్డి, శ్రీనాథ్, నితీష్, ప్రణీత్, రోహిత్, అభిష్క్, ఉదయ్, భార్గవ్, యశ్వంత్, దశరథ్ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేతలు నూర్ ఫాతిమా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.ఆస్ట్రేలియాలోని పెర్త్లో వైఎస్సార్ జయంతి వేడుకలు
సీఎం విజయ్ పర్యటనను నియంత్రించజాలం
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ కరూర్ తొక్కిసలాట కేసులో నిందితుడిగా లేరని, ఆయన పర్యటనను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. సీఎం విజయ్ పర్యటనను ప్రశ్నిస్తూ, అలాగే ఈ వ్యవహారంలో మంత్రులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ డీఎంకే వేసిన పిటిషన్పై మంగళవారం జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరా«ధేల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ముఖ్యమంత్రి పర్యటనను నియంత్రించాలని, ఆయన పర్యటన షెడ్యూల్ను కూడా మేమే ఖరారు చేయాలని మీరు కోరుకుంటున్నారా? ఇదెలా సాధ్యం?’అని ప్రశ్నించింది.న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చొద్దని వ్యాఖ్యానించింది. పిటిషనర్గా ఉన్న డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే ప్రభుత్వంలోని మంత్రులు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. అలాంటప్పుడు, సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర మంత్రి ఆధవ్ అర్జున్ చేస్తున్న వ్యాఖ్యలపై ధిక్కార పిటిషన్ వేయాలని కూడా డీఎంకే ఆలోచిస్తోందన్నారు.ఈ కేసు గురించి సీఎం, మంత్రులు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరారు. స్పందించిన ధర్మాసనం..‘అంటే వాక్ స్వాతంత్య్రంపై మేం నిషేధాజ్ఞలు విధించాలని కోరుకుంటున్నారా? వారి మాటలకు మీరు కూడా మాటలతోనే సమాధానం చెప్పండి. ఈ కేసును సుప్రీంకోర్టు ఇప్పటికే సీబీఐకి బదిలీ చేసింది. అలాంటప్పుడు, ఒక రాజకీయ ప్రత్యర్థి ఈ కేసులో ఒక పక్షంగా చేరాలని ఎలా కోరగలరు?’అని ప్రశ్నించింది. అయితే, సీబీఐ దర్యాప్తు ముగిసే వరకు కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, విచారణను ప్రభావితం చేయరాదన్నది మాత్రమే తమ ఉద్దేశమని రంజిత్ కుమార్ వివరించారు.వాక్ స్వాతంత్య్రాన్ని మరింత బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలన్నది డీఎంకే పార్టీ అభిమతమన్నారు. మరలాంటప్పుడు, ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచి్చన విధంగా తొక్కిసలాట బాధితులకు రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి చొప్పున ఉద్యోగం ఇవ్వడం దర్యాప్తును ఎలా ప్రభావితం చేయగలదని ధర్మాసనం లాయర్ రంజిత్ కుమార్ను అడిగింది. పిటిషన్ను ఉపసంహరించుకునే అవకా>శం డీఎంకేకు కల్పిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు నియమించిన రిటైర్డు జస్టిస్ అజయ్ రస్తోగి సారథ్యంలోని కమిటీని ఆశ్రయించవచ్చని సూచించింది.
ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర
సాక్షి, అమరావతి : మాట ఇస్తే మడమ తిప్పని నైజం.. కలిసిన ప్రతి ఒక్కరినీ పేరుతో పలకరింపు.. ఇలా ఎన్నో లక్షణాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డిని జననేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశాయని వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి కార్తీక్ యల్లాప్రగడ కొనియాడారు. జర్మనీలోని ఇన్గాల్స్ట్యాట్ నగరంలో ఆదివారం వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించి భారీ కేక్ను కట్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్తీక్ మాట్లాడుతూ.. జన సంక్షేమమే ధ్యేయంగా.. ప్రాంతాలకతీతంగా అభివృద్ధి చెందాలనే తలంపు.. సాగునీటితోనే సమగ్రాభివృద్ధి అనే ప్రగాఢ విశ్వాసం.. ఇవన్నీ కలగలిపిన రూపం మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ ఏపీ అభివృద్ధికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ కూడా తన ఐదేళ్ల పాలనలో తండ్రిని తలపించేలా పాలన అందించారని చెప్పారు. మాజీమంత్రి పేర్ని నాని, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కో–ఆర్డినేటర్ సాంబశివారెడ్డి వర్చువల్గా పాల్గొని మాట్లాడారు. జర్మనీ, ఐర్లాండ్, పోలాండ్, డెన్మార్క్, ఇటలీతో పాటు యూరప్లోని పలు దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని వైఎస్సార్కు నివాళులర్పించారు. వైఎస్ ఆశయాలు, దార్శనికతను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ జర్మనీ కమిటీ అధ్యక్షుడు కృష్ణతేజారెడ్డి గడ్డం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నెదర్లాండ్స్ కన్వీనర్ శరత్రెడ్డి వంగా, ఐర్లాండ్ కన్వీనర్ ఆకేపాటి కిషోర్రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
క్రైమ్
ఆరేళ్ల పరిచయం.. రూ.46 లక్షల అప్పు.. చివరకు..!
తిరుపతి: తిరుపతి నగర శివారులో పట్టపగలే ఓ మహిళపై హత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ముత్యాలరెడ్డిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎంపీడీఓ కార్యాలయాని సమీపంలోనే ఈ ఘటన జరగింది. ఎస్వీ యూనివర్సిటీ సీఐ నరేష్ కథనం మేరకు.. వైకుంఠపురం ఆర్చి సమీపంలో హిమబిందు (38) అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త మహమ్మద్ షరీఫ్ ప్రస్తుతం ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో హిమబిందు ఆటోలో వైకుంఠపురం నుంచి జీవకోనకు వెళుతుంగా, చెర్లోపల్లెకు చెందిన ఆకాష్ కారులో వచ్చి ఎంపీడీవో కార్యాలయం వద్ద అడ్డగించి కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తప్పించుకునేందుకు ఆమె రెండు చేతులను అడ్డుగా పెట్టుకోవడంతో వేళ్లతోపాటు మెడ, వీపుపై తీవ్రమైన గాయాలయ్యాయి. భయాందోళనకు గురైన హిమబిందు ఆటో నుంచి దిగి సమీపంలోని హోటల్లోకి పరుగెత్తింది. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో నిందితుడు ఆకాష్ తన కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు హిమబిందును తొలుత సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో హిమబిందు, ఆకాష్కు సుమారు ఆరేళ్లుగా పరిచయం ఉన్నట్లు వెల్లడైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆకాష్ కు హిమబిందు వివిధ దఫాల్లో మొత్తం రూ.46 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిసింది. కొంతకాలంగా ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని ఆమె కోరుతుండడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే హిమబిందును హత్య చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదనే దురాలోచనతోనే ఆకాష్ ముందస్తు ప్రణాళిక ప్రకారం హత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. రుయాలో చికిత్స పొందుతున్న హిమబిందును సీఐ నరేష్ విచారించి వివరాలు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి, పరారీలోని నిందితుడు ఆకాష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
క్షణికావేశం.. యువ సర్పంచ్ జ్యోతి మృతి
ఆదిలాబాద్: ఆమె ఒక గ్రామానికి సర్పంచ్. గ్రామంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతూ, ఎందరికో న్యాయం చేసింది. కానీ తన ఇంట్లో జరిగిన చిన్న గొడవకు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకొని తన ఇద్దరు చిన్నారులకు తీవ్ర అన్యాయం చేసింది. ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు క్షణికావేశంలో బోరిగాం గ్రామానికి చెందిన సర్పంచ్ పల్లె జ్యోతి (25) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి జ్యోతి ఆమె భర్త విఠల్ల మధ్య పిల్లలను పాఠశాలకు పంపించే విషయమై చిన్నపాటి గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన జ్యోతి అందరూ నిద్రిస్తున్న సమయంలో సోమవారం తెల్లవారుజామున వంట గదిలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచా రం అందించడంతో సీఐ రవీందర్ నాయక్, ఎస్సై షేక్ జుబేర్లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జ్యోతి తండ్రి మాదు ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై వెల్లడించారు. ఆమెకు నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారన్న విషయాన్ని మరిచి తల్లి ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
4 నెలలకే.. నవ దంపతుల విషాదం! అసలేం జరిగింది?
కర్ణాటక, తుమకూరు: పెళ్లయిన 4 నెలలకే నూతన జంట ఆత్మహత్య చేసుకుంది. వందేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలన్న పెద్దల దీవెనలు ఫలించలేదు. తుమకూరు జిల్లా శిర తాలూకాలోని హనుమానహళ్లిలో శరణ్య (20), గిరీష్ (28) ప్రాణాలు తీసుకున్నారు. పొరుగూరు సిద్ధనహళ్లి గ్రామానికి చెందిన శరణ్య డిగ్రీ చదువుతోంది. ఇటీవల ఆమెకు తల్లి సోదరుని కుమారుడైన గిరీష్తో వివాహం చేశారు. కొత్త సంసారం సజావుగా సాగుతోంది. సోమవారం అత్తమామలు, భర్త పత్తి విత్తనాలు వేసేందుకు పొలానికి వెళ్లారు.సాయంత్రం భర్త ఇంటికి వచ్చి పిలిచాడు. స్పందన రాకపోవడంతో, కిటికీలో నుంచి చూడగా, శరణ్య ఉరికి వేలాడుతూ కనిపించడంతో గిరీష్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తీవ్ర భయాందోళన చెంది పొలంలోని చెట్టుకు అతడూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యలకు గల కచ్చితమైన కారణం తెలియరాలేదు. పట్టణాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో గ్రామంలో విషాదం నెలకొంది.
నా చావుకు అతడే కారణం
మంచిర్యాల జిల్లా: ప్రేమించాను.. నిన్నే పెళ్లి చేసుకుంటానని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ యువతిని ఓ యువకుడు రెండేళ్లుగా వేధిస్తున్నాడు. దీంతో వేధింపులు తాళలేక యువతి ఉరేసుకు ని ఊపిరి తీసుకుంది. తన చావుకు యువకుడే కారణమంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఓ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆ గ్రామానికి చెందిన దంపతులకు నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు తన చదువు పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు గోనే వెంకటేశ్ రెండేళ్లుగా సదరు యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడుతున్నాడు. అతడి తల్లి శంకరమ్మ, అక్క శైలజ కూడా వెంకటేశ్ను పెళ్లి చేసుకోవాలని వేధించడంతో ఆ యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. తన వెంట పడొద్దని ప్రాధేయపడ్డా వినకుండా పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని బెదిరించాడు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి యువతి వెంట పడొద్దని సూచించారు. అయినా వెంకటేశ్ మానలేదు. అతడితోపాటు కుటుంబ సభ్యులు వేధించడంతో సోమవారం మధ్యాహ్నం ఆ యువతి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్యకు వెంకటేశ్, అతడి కుటుంబ సభ్యులే కారణమని, న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, ఐబీ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని సీఐలు ప్రమోద్రావు, నవీన్కుమార్, ఎస్సై భూమేశ్ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, నిందితుడు వెంకటేశ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
వీడియోలు
వియత్నాం బోటు ప్రమాదం.. స్వగ్రామానికి చేరుకున్న మృతదేహాలు
ముద్రగడ లేకపోవడం కాపు సమాజానికి తీరని లోటు..
ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి...
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
AO శ్రీహరి కేసులో.. ప్రధాన నిందితుడి కుటుంబం ఆత్మహత్య
రావణ్ ను ఉరితీస్తారా...!? పొన్నవోలు షాకింగ్ కామెంట్స్
జగన్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న మత్స్యకారులు
ఆంక్షలు పెట్టినా ఆగని జనం విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద జై జగన్ నినాదాలు
బరితెగించిన కూటమి నేతలు YSRCP నేత కృష్ణారెడ్డి పై దాడి
మీకు నేను అండగా ఉన్న.. వైఎస్ జగన్ POWERFULL SPEECH


