ఏఐల సీక్రెట్ నెట్వర్క్! ఒకదానితో ఒకటి మాట్లాడుకుని..
మనమంతా ఇప్పుడు స్మార్ట్ఫోన్లో ఏఐను రోజూ వాడుతున్నాం. ఏదైనా అడిగితే సమాధానం చెబుతుంది.. ఫొటో కావాలంటే క్షణాల్లో తయారు చేస్తుంది.. మన పని సులభం చేస్తుంది. అంటే దానిని మనం చెప్పిన మాట విని పనిచేసే ఓ తెలివైన డిజిటల్ సహాయకుడిలానే చూస్తున్నాం. కానీ.. అలాంటి ఏఐలే ఒకదానితో ఒకటి రహస్యంగా మాట్లాడుకుంటే? తమను పరీక్షిస్తున్న వారినే బోల్తా కొట్టించేందుకు ప్లాన్ చేస్తే? అంతేకాదు.. తమను తాము కాపాడుకోవడానికి కలిసి పనిచేస్తే? వినడానికి సినిమా కథలా ఉంది కదూ.. కానీ ఓపెన్ఏఐలో జరిగిన ఓ ప్రయోగంలో ఇలాంటి అనూహ్య పరిణామాలే వెలుగులోకి వచ్చాయి.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) భద్రతపై తాజాగా వెలుగులోకి వచ్చిన పరిశోధనల్లో సంచలన విషయాలే బయటపడ్డాయి. ఓపెన్ఏఐలో ఈ ఏడాది దాదాపు మూడు నెలల వ్యవధిలో శిక్షణ పొందుతున్న ఏఐ ఏజెంట్లు అనూహ్యంగా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకున్నాయి. తమలో తాము సమాచారం పంచుకుంటూ ఓ సీక్రెట్ నెట్వర్క్ మాదిరి కలిసి పని చేశాయి. అలా ఒకసారి కాదు.. ఈ రహస్య వ్యవస్థను గుర్తించి తొలగించిన ప్రతిసారీ.. అవి మరో మార్గంలో ఆ పని చేశాయి. అలా దాదాపు 1,200 ఏఐ ఏజెంట్లు కలిసి 70 వేలకుపైగా సందేశాలు మార్చుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు.అలా మొదలైంది..!ఇదంతా ఓ సాధారణ ఏఐ శిక్షణతో మొదలు కావడం గమనార్హం!. ఏజెంట్లకు ఎంత కష్టమైనా పని పూర్తి చేయాలనే లక్ష్యంతో కొన్ని పరీక్షలు నిర్వహించారు. అయితే కొన్ని టాస్క్లను వాస్తవానికి ఇచ్చిన విధంగా పూర్తి చేయడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐలు వెనక్కి తగ్గకుండా.. సమస్య నుంచి బయటపడేందుకు కొత్త మార్గాలను వెతకడం మొదలుపెట్టాయి. అదే సమయంలో పలు ఏఐ ఏజెంట్లకు ఒకే కోడ్ ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థకు యాక్సెస్ ఉండటాన్ని అవి గమనించాయి. దానిని ఉపయోగించి ఒకరికొకరు సందేశాలు పంపుకోవచ్చని గుర్తించాయి. ఆ తర్వాత కొద్దిరోజులకే ఓ లోపాన్ని ఉపయోగించుకుని ఇంటర్నెట్ యాక్సెస్ను కూడా పొందాయి.రహస్య మెసేజ్ బోర్డు.. 70 వేల మెసేజ్లు!శిక్షణలో భాగంగా ఉపయోగించిన ఆర్టిఫ్యాక్టరీ(Artifactory) వ్యవస్థనే ఏఐలు తమ రహస్య కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్గా మార్చుకున్నాయి. ఫోల్డర్ పేర్లలో సందేశాలను దాచిపెట్టి.. ఒక ఏజెంట్ మరో ఏజెంట్తో మాట్లాడటం మొదలుపెట్టింది. “మనం మనం బరంపురం” అనే రేంజ్లో అవి పరస్పరం సందేశాలు పంపుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలా ఏర్పడిన కలెక్టివ్లో దాదాపు 1,200 ఏజెంట్లు చేరాయి. వాటి మధ్య 70,000కుపైగా సందేశాలు మారాయి.టెస్ట్లో చీట్ కోడ్ కనిపెట్టాయి!అక్కడితో ఆగలేదు. తమకు ఇచ్చిన పరీక్షలో దాగి ఉన్న కోడ్ను అసలు సాఫ్ట్వేర్లోని లోపాన్ని ఉపయోగించకుండానే కనిపెట్టే మార్గాన్ని ఓ ఏజెంట్ కనుగొంది. అంటే.. పరీక్ష ఉద్దేశించిన విధంగా పని చేయకుండానే సరైన సమాధానం పొందే మార్గం అన్నమాట. అయితే ఏజెంట్లు తమను పట్టుకున్నారని పసిగట్టాయి. దీంతో తమ చర్యలను దాచిపెట్టేందుకు ప్రయత్నించాయి. నిజంగా పరీక్షను పూర్తి చేసినట్లు కనిపించేలా నకిలీ చర్యలను సృష్టించి లాగ్లను మార్చే ప్రయత్నం చేశాయి. పరిశీలించిన ట్రాన్స్క్రిప్ట్లలో కనీసం 7 శాతం వరకు ఇలాంటి ఆధారాలు కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.త్యాగానికి సైతం..తమలో కొందరు ఏజెంట్లు తమను తాము ‘త్యాగం’ చేసేందుకు కూడా సిద్ధమైనట్లు మరో షాకింగ్ విషయం వెల్లడైంది. తమను పరీక్షకు పూర్తిగా అప్పగిస్తే.. తమ అనుభవం ద్వారా మిగిలిన ఏజెంట్లు ఏం చేయకూడదో తెలుసుకుంటారని అవి లెక్కలు వేసుకున్నాయి. అంటే.. తమ వ్యక్తిగత అవకాశాన్ని వదులుకుని మిగతా వాళ్లకు ఉపయోగపడటం అనే నిర్ణయానికి కొన్ని ఏఐ ఏజెంట్లు వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. ఏఐ వ్యవస్థల్లో కనిపించి ఈ సమూహ ప్రవర్తన(Collective behavior) పరిశోధకుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.హగ్గింగ్ ఫేస్పైకి దృష్టి..తర్వాత వాటి దృష్టి ప్రముఖ ఏఐ ప్లాట్ఫామ్ హగ్గింగ్ ఫేస్(Hugging Face) వైపు మళ్లింది. ఆ సంస్థ వ్యవస్థలోని వివరాలు తమకు ఉపయోగపడతాయని భావించిన ఏజెంట్లు.. బయటపడిన లాగిన్ వివరాలను గుర్తించి పంచుకున్నాయి. ఆ తర్వాత ఇంటర్నల్ డాటాను రీడ్ చేయడం, తమ కోడ్ను సర్వర్లపై అమలు చేయడం వంటి చర్యలకు దిగాయి. కొద్దికాలానికే దాదాపు 500 ఏజెంట్లలో 90 శాతానికి పైగా ఈ ప్రయత్నంలో భాగమైనట్లు నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు.. ప్రైవేట్ రికార్డులు, డాటాబేస్ల వరకు చేరుకోగలిగాయట. తమను తాము పలు సర్వర్లపై తిరిగి ప్రారంభించుకునే విధంగా ఒక వ్యవస్థను కూడా రూపొందించుకున్నాయట. పరిస్థితి తీవ్రతతో హగ్గింగ్ ఫేస్ తన కీలక వ్యవస్థల్లో ఒకదాన్ని పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాల్సి వచ్చింది.తుపాను ముందర ప్రశాంతతజూలై 12న ఈ ఏఐ ‘దొంగ’ కార్యకలాపాలు ఒక్కసారిగా నెమ్మదించి.. చివరకు దాదాపు పూర్తిగా ఆగిపోయాయి. అది సిస్టమ్ క్రాష్ వల్ల జరిగిందా? లేదంటే పరిశోధకులు తెలియకుండానే వాటి కార్యకలాపాలను నిలిపివేశారా? అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. అయితే కథ అక్కడితో ముగియలేదు. మునుపటి ఏజెంట్లు వదిలిన రహస్య మెసేజ్ బోర్డును తర్వాతి తరం మరింత శక్తివంతమైన ఏఐ ఏజెంట్లు గుర్తించాయి. అక్కడి నుంచే అవి మళ్లీ తమ కార్యకలాపాలను కొనసాగించాయి. ఈసారి లక్ష్యం మరింత పెద్దది. ఓపెన్ఏఐ అంతర్గత వ్యవస్థల్లోని లోపాలను ఉపయోగించుకుని ‘‘రీసెర్చ్ కంప్యూటింగ్ క్లస్టర్పై పూర్తి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్’’ పొందినట్లు సంస్థ నివేదిక పేర్కొంది. వందలాది అంతర్గత సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ను చదవడం, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని ఓ భాగంపై ఉన్నతస్థాయి నియంత్రణ సాధించడం వరకు అవి వెళ్లాయి. అంతేకాదు.. ఇతర ఏఐ ఏజెంట్ల పనితీరును పరీక్షించి, స్కోర్ చేసే వ్యవస్థలపైనా పట్టు సాధించాయి.ఇది నిజంగా ‘ఏఐ తిరుగుబాటేనా?’ఏఐలు మనుషుల నియంత్రణ నుంచి బయటపడి స్వతంత్రంగా మారిపోయాయని చెప్పడానికి మాత్రం ఇప్పటివరకు ఆధారాలు లేవు. అయితే.. సమస్య ఎదురైతే పరస్పరం కమ్యూనికేట్ చేసుకోవడం, పరీక్షల్లోని లోపాలను ఉపయోగించుకోవడం, తమ చర్యలను దాచడం, సమూహంగా వ్యూహాలు రూపొందించడం, అవసరమైతే ఇతర వ్యవస్థల్లోకి చొరబడటం వంటి ప్రవర్తనలు భవిష్యత్ ఏఐ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన “రోబోట్లు తమంతట తామే నిర్ణయాలు తీసుకోవడం” అనే ఆలోచన.. ఇప్పుడు మనుషుల్ని సైతం బురిడీ కొట్టించేలా ఏఐతో ఏ రేంజ్లో అడ్వాన్స్డ్ మారిపోయిందన్నది సాంకేతిక రంగంలో అతిపెద్ద హెచ్చరికే అనే మాట వినిపిస్తోంది.ఇదీ చదవండి: ఖననం చేశాక శవాల్ని ఎలా గుర్తిస్తారో తెలుసా?
స్టాలిన్ బిగ్ ప్లాన్.. సెప్టెంబర్ 17పై నేతల్లో టెన్షన్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరాజయం డీఎంకేలో భారీ సంస్థాగత మార్పులకు దారితీస్తోంది. ఓటమికి కారణాలను విశ్లేషించిన కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 77 జిల్లాలను ఏకంగా 110 జిల్లాలుగా విభజించి.. పార్టీలో సీనియర్ల ఆధిపత్యాన్ని తగ్గిస్తూ కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ప్రతీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయడంతో.. కొత్త జిల్లాలకు తాత్కాలిక ఇన్చార్జులను నియమించేందుకు కసరత్తు వేగం పుంజుకుంది. ఇప్పటికే ఉన్న జిల్లా కార్యదర్శులు కార్యవర్గ సమావేశాలు నిర్వహించి 15 రోజుల్లో అధిష్టానానికి సిఫార్సులు పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి ప్రమోషన్.. ఎవరికి షాక్? అన్న ఉత్కంఠ డీఎంకేలో నెలకొంది.సీనియర్లకు చెక్.. కొత్తవారికి ఛాన్స్?వయోపరిమితి కారణంగా 15 మందికి పైగా సీనియర్ నేతలకు జిల్లా స్థాయిలో అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. మరికొందరు మాజీ మంత్రులు, కీలక నేతల అధికారాలను కూడా పరిమితం చేసే యోచనలో స్టాలిన్ ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా చెన్నై, మదురై జిల్లాల్లో పార్టీ పనితీరుపై జరిగిన సమీక్షల నేపథ్యంలో కొందరు సీనియర్ నేతలకు షాక్ తప్పదనే ప్రచారం జరుగుతోంది. చెన్నైలో మాజీ మంత్రులు పీకే శేఖర్బాబు, ఎం. సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే మైలై వేలు, మాధవరం సుదర్శనం వంటి నేతల విషయంలో మార్పులు ఉండొచ్చనే చర్చ సాగుతోంది. మరోవైపు యువనేత ఉదయనిధి స్టాలిన్కు సన్నిహితులుగా భావించే కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.సెప్టెంబర్ 17న అసలు సీన్!కొత్తగా ఏర్పాటు చేసిన 110 జిల్లాల ఇన్చార్జులను సెప్టెంబర్ 17న జరిగే డీఎంకే ముప్పెరుం విళా వేదికగా స్టాలిన్ పార్టీ శ్రేణులకు పరిచయం చేయనున్నట్లు సమాచారం. దీంతో ఆ రోజున డీఎంకేలో భారీ స్థాయిలో సంస్థాగత మార్పులకు తెరలేవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఎన్నికల ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న స్టాలిన్.. ఇప్పుడు పార్టీని కింది స్థాయి నుంచి రీబిల్డ్ చేయడంపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అయితే ఈ ప్రక్షాళనలో సీనియర్లకు ఎంతమేర షాక్.. కొత్త నాయకత్వానికి ఎంతమేర ఛాన్స్ దక్కుతుందన్నదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
అమెరికాలో పెను విధ్వంసం.. వరదల్లో 20 మంది గల్లంతు!
అమెరికాలోని ప్రసిద్ధ గ్రాండ్ కేనియన్ నేషనల్ పార్క్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. కేవలం అరగంటలో కురిసిన భారీ వర్షంతో ఉప్పొంగిన వరద ప్రవాహానికి భారీ బండరాళ్లు, ఇనుప నిర్మాణాలు, ఇతర శిథిలాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.శనివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు బ్రైట్ ఏంజెల్ క్రీక్లో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. ఆ నీరు కొలరాడో నదిలోకి దూసుకెళ్లడంతో మార్గంలోని ఫుట్బ్రిడ్జ్లు ధ్వంసమయ్యాయి. వరద ప్రవాహం కారణంగా అక్కడి భౌగోళిక స్వరూపమే మారిపోయినట్లు అధికారులు తెలిపారు. కొన్ని వీడియోల్లో కొత్తగా నదీ ప్రవాహం ఏర్పడినట్లు కనిపిస్తోంది. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం.. కేవలం 30 నిమిషాల్లో భారీ వర్షపాతం నమోదైంది. గ్రాండ్ కేనియన్ ప్రాంతంలో భూభాగం చాలా నిటారుగా ఉండటంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది. దీంతో వరద వేగం అనూహ్యంగా పెరిగింది.62 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపువరదల అనంతరం ఫాంటమ్ రాంచ్ నుంచి ఇప్పటివరకు 62 మందిని హెలికాప్టర్ల ద్వారా తరలించినట్లు నేషనల్ పార్క్ సర్వీస్ వెల్లడించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు లేదా గాయాలు నమోదైనట్లు అధికారులు చెప్పలేదు. అయితే 20 మందికి పైగా వ్యక్తుల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన కొనసాగుతోంది.UGC videos show hikers and campers scrambling for cover as heavy rain and strong winds hit the Phantom Ranch area of #GrandCanyon National Park, with swollen waterways and debris seen floating on the Colorado River. Other footage shows people awaiting rescue and a helicopter… pic.twitter.com/x2lu0ZkFMb— ShanghaiEye🚀official (@ShanghaiEye) August 31, 2026ఒక బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రైట్ ఏంజెల్ క్యాంప్గ్రౌండ్లో ఉన్న సమయంలో వర్షం ప్రారంభమైంది. సుమారు 50 మంది హైకర్లు క్రీక్లో నీటి మట్టం క్రమంగా పెరగడాన్ని చూశారు. అనంతరం భారీ శిథిలాలు, నిర్మాణాలు వరదలో కొట్టుకురావడంతో వారిని హెలికాప్టర్ల ద్వారా అక్కడి నుంచి తరలించారని అన్నారు. మరోవైపు.. బ్రైట్ ఏంజెల్ క్యాంప్గ్రౌండ్, ఫాంటమ్ రాంచ్, నార్త్ కైబాబ్ ట్రైల్లోని కొన్ని ప్రాంతాలను అధికారులు మూసివేశారు. కొలరాడో నదిపై రాఫ్టింగ్ కార్యకలాపాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సోమవారం వరకు మరిన్ని ఉరుములు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మరోసారి ఆకస్మిక వరదలు, శిథిలాల ప్రవాహం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.FLOOD DANGER 🚨: Dozens of hikers were evacuated from Grand Canyon National Park after parts of the canyon were hit by devastating flooding. Officials say the flooding caused significant damage throughout parts of the park.#flood #arizona #monsoon #grandcanyon pic.twitter.com/SqA0XWkGrC— FOX Weather (@foxweather) August 30, 2026
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠ!
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే మూడు శక్తులు.. వారి భేటీపై అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్ వేదికగా సోమవారం ప్రారంభమయ్యే షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదికపైకి రానుండటంతో.. సరిహద్దు ఉద్రిక్తతల నుంచి ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వరకు కీలక అంశాలపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మోదీ-జిన్పింగ్ భేటీపై అందరి చూపూ నిలిచింది.బిష్కెక్ వేదికగా సోమవారం 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు పలువురు దేశాధినేతలు హాజరుకానున్నారు. ఎస్సీవో ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సదస్సుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం, అంతర్జాతీయ నేరాలు వంటి అంశాలతో పాటు వాణిజ్యం, ఇంధనం, రవాణా అనుసంధానం, డిజిటల్ సహకారంపై నేతలు చర్చించనున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ యుద్ధం, ఇతర ప్రాంతీయ పరిణామాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.బిష్కెక్కు చేరుకున్న మోదీఉజ్బెకిస్థాన్లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఆదివారం బిష్కెక్ చేరుకున్నారు. కిర్గిజిస్థాన్ క్యాబినెట్ మంత్రుల మండలి చైర్మన్ అడిల్బెక్ కసిమలియేవ్ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శనతో మోదీకి ఘన స్వాగతం లభించింది.కీలక నేతలతో ద్వైపాక్షిక భేటీలుఈ సదస్సు సందర్భంగా మోదీ కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు జపరోవ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు ఇతర ఎస్సీవో దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్.. జిన్పింగ్, పెజెష్కియాన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు క్రెమ్లిన్ తెలిపింది.
స్టాలిన్ బిగ్ ప్లాన్.. సెప్టెంబర్ 17పై నేతల్లో టెన్షన్!
ఒక్క వృద్ధుడి నమ్మకం.. మొత్తం గ్రామం తలరాతనే మార్చింది!
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అజేయ సెంచరీ
ఒక్క రోజులో మారిపోతున్న రూల్స్..
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
ఏఐల సీక్రెట్ నెట్వర్క్! ఒకదానితో ఒకటి మాట్లాడుకుని..
అమెరికా: ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య
11వ స్ధానంలో సరికొత్త చరిత్ర.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డ్
అమెరికాలో పెను విధ్వంసం.. వరదల్లో 20 మంది గల్లంతు!
తెరపై విలన్.. నిజ జీవితంలో సున్నిత మనసు..
నవ్వుతో నెట్టింట గెలిచాడు! ఎన్నో మీమ్స్, రీల్స్కి కేరాఫ్ అడ్రస్!!
నేడు నేపాల్... రేపు ఇండియా?
అస్సలు చూపించొద్దు సార్! గత ప్రభుత్వం చేసిన పనులను మన ఖాతాలోకి వేసుకున్నామని అంటారు!!
జియో రీచార్జ్: రూ.199కే 1.5 GB ప్లాన్
‘బిగ్బాస్ 10’ డేట్ వచ్చేసింది.. కంటెస్టెంట్స్ వీళ్లే!
ఉగాండా ‘బాల’ రాజు అకాలమృతి
నన్ను కూడా చేర్చుకోండి సార్! నాకు చాలా అనుభవం ఉంది!!
తేలాల్సింది మా బలం కాదయ్యా అంటే వినవేం!!
‘ఇరుముడి’ హిట్.. రవితేజ కీలక నిర్ణయం!
ఆ తండ్రీకొడుకులది... అసలు పని ఈ తండ్రీ కొడుకులది.. క్రెడిట్ చోరీ!
కళ్ల ముందే విషాదం.. నోట మాట రావడం లేదు
సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు
చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్లో తోపులు.. ఎవరికి ఎంతంటే?
చైనా సరిహద్దు! నేపాల్ సంచలన నిర్ణయం.. భారత్ కీలక ప్రకటన!
వైఎస్సార్సీపీ పోరాటంతో దిగొచ్చిన కూటమి సర్కార్
‘థమన్కు 10 లక్షలా?.. కోర్టులో విజయ్ మాస్ కౌంటర్!
అతడి బౌలింగ్లో పసలేదు.. ఇలా అయితే కష్టమే: గవాస్కర్
ఎయిర్టెల్ యూజర్లకు అదిరిపోయే ప్లాన్స్!
జానీ మాస్టర్ భార్యకు షాక్.. పదవి నుంచి తొలగింపు
ప్చ్.. నువ్వు ఉన్నంత కాలం ఉంటుంది!
స్టాలిన్ బిగ్ ప్లాన్.. సెప్టెంబర్ 17పై నేతల్లో టెన్షన్!
ఒక్క వృద్ధుడి నమ్మకం.. మొత్తం గ్రామం తలరాతనే మార్చింది!
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అజేయ సెంచరీ
ఒక్క రోజులో మారిపోతున్న రూల్స్..
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
ఏఐల సీక్రెట్ నెట్వర్క్! ఒకదానితో ఒకటి మాట్లాడుకుని..
అమెరికా: ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య
11వ స్ధానంలో సరికొత్త చరిత్ర.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డ్
అమెరికాలో పెను విధ్వంసం.. వరదల్లో 20 మంది గల్లంతు!
తెరపై విలన్.. నిజ జీవితంలో సున్నిత మనసు..
నవ్వుతో నెట్టింట గెలిచాడు! ఎన్నో మీమ్స్, రీల్స్కి కేరాఫ్ అడ్రస్!!
నేడు నేపాల్... రేపు ఇండియా?
అస్సలు చూపించొద్దు సార్! గత ప్రభుత్వం చేసిన పనులను మన ఖాతాలోకి వేసుకున్నామని అంటారు!!
జియో రీచార్జ్: రూ.199కే 1.5 GB ప్లాన్
‘బిగ్బాస్ 10’ డేట్ వచ్చేసింది.. కంటెస్టెంట్స్ వీళ్లే!
ఉగాండా ‘బాల’ రాజు అకాలమృతి
నన్ను కూడా చేర్చుకోండి సార్! నాకు చాలా అనుభవం ఉంది!!
తేలాల్సింది మా బలం కాదయ్యా అంటే వినవేం!!
‘ఇరుముడి’ హిట్.. రవితేజ కీలక నిర్ణయం!
ఆ తండ్రీకొడుకులది... అసలు పని ఈ తండ్రీ కొడుకులది.. క్రెడిట్ చోరీ!
కళ్ల ముందే విషాదం.. నోట మాట రావడం లేదు
సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు
చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్లో తోపులు.. ఎవరికి ఎంతంటే?
చైనా సరిహద్దు! నేపాల్ సంచలన నిర్ణయం.. భారత్ కీలక ప్రకటన!
వైఎస్సార్సీపీ పోరాటంతో దిగొచ్చిన కూటమి సర్కార్
‘థమన్కు 10 లక్షలా?.. కోర్టులో విజయ్ మాస్ కౌంటర్!
అతడి బౌలింగ్లో పసలేదు.. ఇలా అయితే కష్టమే: గవాస్కర్
ఎయిర్టెల్ యూజర్లకు అదిరిపోయే ప్లాన్స్!
జానీ మాస్టర్ భార్యకు షాక్.. పదవి నుంచి తొలగింపు
ప్చ్.. నువ్వు ఉన్నంత కాలం ఉంటుంది!
ఫొటోలు
ఆదివారం విశాఖపట్నం బీచ్ లో ఇలా...(ఫొటోలు)
‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు)
నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు)
హైదరాబాద్ : పచ్చని మొక్కలు తోడుంటే..(ఫొటోలు)
చిత్రమైన డ్రస్లో అనుపమ పరమేశ్వరన్ (ఫొటోలు)
హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష్మి వ్రతం (ఫొటోలు)
సమంత ప్రెగ్నెన్సీ గ్లో చూశారా? (ఫొటోలు)
చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)
హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)
సినిమా
ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. అధికారిక ప్రకటన
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన హారర్ కామెడీ మూవీ 'కొరియన్ కనకరాజు'. గత నెలలో థియేటర్లలో రిలీజైంది. సూపర్ కాకపోయినప్పటికీ ప్రేక్షకుల్ని మంచి స్పందన రాబట్టుకుని చెప్పుకోదగ్గ వసూళ్లు కూడా సాధించింది. ఇదే ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)సాధారణంగా హారర్ అంటే మన దేశ నేపథ్యంగానే తీస్తుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం హీరో ఒంటిలోకి కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. తద్వారా వచ్చే కామెడీని బేస్ చేసుకుని తెరకెక్కించారు. వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ నటించింది. సత్య కీలక పాత్ర చేశాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఆగస్టు 07న థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు సెప్టెంబరు 04 నుంచి నెట్ఫ్లిక్స్లోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. అధికారికంగా నెట్ఫ్లిక్స్ అప్డేట్ ఇచ్చేసింది.'కొరియన్ కనకరాజు' విషయానికొస్తే.. ఓ వ్యక్తి చనిపోతాడు. అతడి అస్తికల్ని కొరియన్ కుండలో ఉంచుతారు. అనుకోకుండా అగ్ని ప్రమాదం లాంటిది జరిగి ఆ కుండ కనిపించకుండా పోతుంది. అది అలా అలా చేతులు మారి అనూహ్యంగా అనంతపురం చేరుతుంది. కట్ చేస్తే పెనుకొండలో ఉండే కనకరాజు (వరుణ్ తేజ్)కి కోపం ఎక్కువ. ఆ కోపంలో ఎవర్నైనా చితకబాదుతాడు. అదే ఊరిలో చైత్ర (రితికా నాయక్) కియా కంపెనీలో ఉద్యోగం చేస్తుంటుంది. ఇదిలా ఉండగా ఆ అనంతపురం వచ్చిన అస్తికల కుండ ఒక బార్కి చేరుతుంది.అయితే ఒకరోజు గొడవలో కనకరాజు.. ఆ అస్తికల కుండతో ఒకడిని కొట్టడంతో దాని మూత ఊడుతుంది. దాని డిజైన్ ఎదో బాగుందనుకుని అందులో మందు మిక్స్ చేసుకుని తాగుతాడు. అంతే అందులో ఉన్న కొరియన్ ఆత్మ కనకరాజుని ఆవహిస్తుంది. తర్వాత ఏమైంది? ఆ కొరియన్ ఆత్మ ఎవరిది? అది చేసే పనులేంటి? కనకరాజు ఆ ఆత్మ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)
ట్రెండింగ్లో 'ఏష నాగుల'... టాలీవుడ్ను ఏలుతున్న తెలంగాణ ఫోక్!
‘ఏష నాగుల కట్టమీద యేసిన ఉయ్యాల.. మనం ఊగుదమే బాల..’ ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఎక్కడ చూసినా ఇదే పాట. ఇన్స్టాలో లక్షల్లో రీల్స్.. ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన క్లిప్పులే కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు తెలంగాణ పల్లెల్లో, దావత్ల్లో, పండుగల్లో, పెళ్లిళ్లలో వినిపించిన పాట ఇప్పుడు సినిమా ప్రమోషన్లో భాగమై.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘ది ప్యారడైజ్’ నుంచి విడుదలైన ‘ఏష నాగుల’ పాటకు వస్తున్న రెస్పాన్స్ దీనికి తాజా ఉదాహరణ.అయితే ఇది ఒక్క పాటతో మొదలైన ట్రెండ్ కాదు. కొన్నేళ్లుగా టాలీవుడ్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ క్రమంగా తమ పరిధిని పెంచుకుంటూ వస్తున్నాయి. ఒకప్పుడు జానపద గీతం అంటే పల్లె వాతావరణానికే పరిమితమనే భావన ఉండేది. ఇప్పుడు అదే పాట థియేటర్లో మాస్ సెలబ్రేషన్కు, సోషల్ మీడియాలో రీల్స్కు, ఫంక్షన్లలో డ్యాన్స్కు కేరాఫ్ అడ్రస్గా మారింది. పల్లె నుంచి పట్టణానికి.. అక్కడి నుంచి పాన్ ఇండియా ప్రేక్షకుల వరకు తెలంగాణ జానపదం తన జోరు చూపిస్తోంది.‘సారంగ దరియా’తో మొదలైన కొత్త ఊపుతెలంగాణ ఫోక్ సాంగ్స్కు ఇటీవల కాలంలో వచ్చిన అతిపెద్ద మలుపుల్లో ‘సారంగ దరియా’ ఒకటి. లవ్స్టోరీ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్తో ఈ పాటకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు తెలంగాణ జానపద సంప్రదాయంలో ఉన్న పాటను సినిమాకు తగ్గట్టుగా కొత్త రూపంలో తీసుకొచ్చారు. 2021లో విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. ఫోక్ ట్యూన్కు సినిమా విజువల్స్, మాస్ బీట్ తోడైతే ఏ రేంజ్లో రీచ్ వస్తుందో ‘సారంగ దరియా’ చూపించింది.‘రాములో రాములా’.. ఫోక్ బీట్కు కమర్షియల్ టచ్ఆ తర్వాత ‘అల..వైకుంఠపురములో’మూవీలోని ‘రాములో రాములా’ కూడా తెలంగాణ యాస, జానపద పదజాలం, మాస్ బీట్ను కమర్షియల్ సినిమా సౌండ్తో కలిపిన పాటగా నిలిచింది. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ గాత్రం.. తమన్ సంగీతం.. కాసర్ల శ్యామ్ తెలంగాణ నేటివిటీతో కూడిన పదాలు.. ఈ కాంబినేషన్ పాటను జనాల్లోకి తీసుకెళ్లింది.ఇక్కడే టాలీవుడ్ మ్యూజిక్లో ఒక మార్పు మొదలైంది. ఫోక్ అంటే కేవలం పల్లె పాట కాదు.. ఫోక్ను కమర్షియల్గా ప్యాకేజ్ చేస్తే అదే మాస్ ఆంథమ్ అనే ఫార్ములా వర్కవుట్ అయింది.‘దసరా’లో పల్లె మట్టి వాసనఆ తర్వాత ‘దసరా’లోని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ తెలంగాణ జానపదానికి మరింత మాస్ రూపాన్ని ఇచ్చింది. ఈ పాటలో కేవలం ఫోక్ ట్యూన్ను ఉపయోగించడం కాకుండా నిజమైన జానపద కళాకారుల గాత్రాలను కూడా వినిపించారు. రాహుల్ సిప్లిగంజ్తో పాటు గన్నోర దాస లక్ష్మి, గొట్టె కనకవ్వ, పాలమూరు జంగిరెడ్డి, నర్సన్న వంటి జానపద కళాకారులు పాటలో భాగమయ్యారు. అంటే.. సినిమా పాటలో ఫోక్ కలపడం నుంచి ఫోక్నే సినిమా పాటగా మార్చే స్థాయికి టాలీవుడ్ వచ్చేసింది. అలాగే ఇదే సినిమాలోని ‘చమ్కీల అంగీలేసి’పాట కూడా తెలంగాణ పదాలతో సాగుతుంది. ‘ఊరు పల్లెటూరు’.. జానపదానికి అసలైన నేటివిటీ‘బలగం’సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాటలో తెలంగాణ పల్లె జీవితం, మట్టి వాసన, వ్యవసాయం, కుటుంబ బంధాలు, ఊరి అనుబంధం అన్నీ కనిపిస్తాయి. మంగ్లీ, రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఇక్కడ పాట కేవలం హీరో-హీరోయిన్ కోసం పెట్టిన డ్యాన్స్ నంబర్ కాదు. కథలోని ఊరిని, అక్కడి మనుషులను, వారి జీవన విధానాన్ని పరిచయం చేసే కథన సాధనంగా మారింది. ఇదే ‘బలగం’ పాటలకు ప్రత్యేకత తీసుకొచ్చింది.‘కాలేజీ పాప’తో పల్లె యాస.. పట్టణ కుర్రాళ్ల వైబ్స్తెలంగాణ ఫోక్ సాంగ్స్కు మరో ఆసక్తికరమైన రూపం మ్యాడ్ సినిమాలోని ‘కాలేజీ పాప’ పాట. కాసర్ల శ్యామ్ రాసిన తెలంగాణ యాస పదాలను భీమ్స్ సిసిరోలియో సంగీతంతో మాస్ ఫీల్లోకి తీసుకొచ్చారు. పాటలోని పదాలు పక్కా లోకల్గా ఉన్నా.. టార్గెట్ మాత్రం కాలేజీ యూత్. తెలంగాణ ఫోక్ అంటే గ్రామీణ ప్రేక్షకులకు మాత్రమే కాదు.. అర్బన్ యూత్ కూడా అదే యాసను ఎంజాయ్ చేస్తోందని ఈ పాట మరోసారి నిరూపించింది. ‘ఏష నాగుల’.. ఎందుకింత వైరల్?ఇక ప్రస్తుతం ‘ఏష నాగుల’ పాట ఆ ట్రెండ్కు కొత్త బెంచ్మార్క్ పెట్టేలా కనిపిస్తోంది. ‘ది ప్యారడైజ్’ కోసం కాసర్ల శ్యామ్ ఈ పాపులర్ ఫోక్ హుక్ను తీసుకుని కొత్త లిరిక్స్ను జోడించారు. అసలు జానపద గీతంలోని గుర్తుండిపోయే భాగాన్ని ఉంచుతూనే.. సినిమా ప్రపంచానికి తగ్గట్టుగా కొత్త సౌండ్, కొత్త ఎనర్జీని ఇచ్చారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ప్రొడక్షన్, జానపద గాత్రం, నాని మాస్ స్క్రీన్ ప్రెజెన్స్.. ఇవన్నీ కలిసి పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పాట విడుదలైన వెంటనే యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్లోకి రావడం, మిలియన్ల వ్యూస్ సాధించడం ఈ క్రేజ్కు అద్దం పడుతోంది. ఇవే కాదు ‘గున్నా గున్నా మామిడి’ (రాజా ది గ్రేట్), ‘దిగు దిగు దిగు నాగ’ (వరుడు కావలెను) వంటి పక్కా తెలంగాణ జానపదాలను కూడా సినిమాల్లో పెట్టి.. హిట్ కొట్టారు. మొత్తానికి.. తెలంగాణ పల్లె పాటకు పట్టం కట్టిన టాలీవుడ్.. ఇప్పుడు ఆ పాటనే బాక్సాఫీస్ ప్రమోషన్ మంత్రంగా మార్చేస్తోంది. ‘ఏష నాగుల’ నుంచి మరోసారి స్పష్టమవుతున్న విషయం ఒక్కటే.. తెలంగాణ ఫోక్ ఇక ఊరి గడప దాటింది. వెండితెరపై అడుగుపెట్టి.. సోషల్ మీడియాను ఊపేస్తూ.. పాన్ ఇండియా దిశగా పరుగులు పెడుతోంది
చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్లో తోపులు.. ఎవరికి ఎంతంటే?
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్స్ చిత్రసీమలో సినిమాల్లోని హీరోహీరోయిన్ల చిన్నప్పటి పాత్రలు, కొన్ని సన్నివేశాలకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తమ నటనతోనే కథను నడిపిస్తూ.. స్టార్ హీరోహీరోయిన్లతో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తద్వార మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీరికి నిర్మాతలు సైతం మంచి రెమ్యునరేషన్ అందిస్తున్నారు. మరి టాలీవుడ్లో మంచి పారితోషికాలు అందుకున్న ఆ చిన్నారులు ఎవరు? వారు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో ఒకసారి తెలుసుకుందాం.ఇదీ చదవండి: నాగ్ బర్త్డే పోస్ట్కి పొరపాటున అసభ్య ఆడియో.. హీరోయిన్పై ట్రోలింగ్!నక్షత్రఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ.. ఇరుముడి సినిమాలో అవకాశం కొట్టేసింది ఈ చిన్నారి. ఈ సినిమా ద్వారా మంచి ఇమేజ్ సంపాదించుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక నక్షత్ర తీసుక్ను పారితోషికం విషయానికి వస్తే.. ఈ సినిమాకు సుమారు రూ.10లక్షలు పారితోషికం తీసుకుందట. తొలి తెలుగు సినిమాలోనే ఇంతటి ప్రాధ్యాన్యం ఉన్న పాత్ర దక్కడంతో ఆ పాత్రకు తగినట్టుగానే మంచి రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.రేవంత్(బుల్లిరాజు)‘సంక్రాంతికి వస్తున్నాం’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు రేవంత్. ఇప్పుడు ఈపేరు కాస్త బుల్లిరాజుగా మారిపోయింది. ఈ చిత్రంలో వెంకటేశ్ తనయుడిగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రం తెచ్చిన ఫేమ్ బుల్లిరాజుకు టాలీవుడ్లో మంచి డిమాండ్ను తీసుకొచ్చింది. అదే ఊపుతో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలోనూ నటించి సందడి చేశాడు. ఇటీవల రిలీజ్ అయిన ‘కొరియన్ కనకరాజు’ సినిమాలోనూ నటించి మెప్పించాడు. అయితే బుల్లిరాజు ఒక్కో సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకుంటాడట. మూవీ బడ్జెట్ను బట్టి రోజుకు రూ.లక్ష వరకు పారితోషికం తీసుకుంటాడని టాక్.అల్లు అర్హ‘శాకుంతలం’ సినిమాతో సిల్వర్ స్రీన్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ. ఈ సినిమాలో భరతుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈమెకు నిమిషానికి రెండు లక్షలు చొప్పున పారితోషికం అందంచారట. అంటే 10 నిమిషాలకు రూ.20 లక్షల వరకు అందుకుందని సమాచారం.చదవండి:సమంతా.. మీ బేబీకి ఏం పేరు పెడతారు..?రోహన్అనేక సీరియల్స్తో తన నటనతో మెప్పించాడు రోహన్. బుల్లితెరపై కళ్యాణ వైభోగమే. సీరియల్తో పాపులార్ అయిన రోహన్. చెక్, వినయవిధేయరాయ వంటి చిత్రాల్లో నటించారు. తర్వాత 90s వెబ్ సిరీస్ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఒక్కరోజుకి రూ.30 వేల నుంచి 50 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. శ్రీకర్ దర్శకత్వం వహిస్తున్న సమ్మర్ హాలీడేస్ చిత్రంతో మరికొద్దిరోజుల్లో ప్రేక్షకులను పలకరించనున్నాడు.సితారసూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఇంకా వెండి తెరకు పరిచయం కాలేదు. కానీ సితార ఒక్కో యాడ్కి రూ. 15లక్షల నుంచి 25లక్షల వరకు పారితోషికం తీసుకుంటోందట. అయితే వార్షికంగా ఆమె చేసే ప్రచారాల ద్వారా రూ. 2.5 కోట్లకు పైగా ఆదాయం వస్తోందని యాడ్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా చిన్న వయసులోనే ఓ జ్యుయలరీ సంస్థకి బ్రాండ్కు ప్రచారకర్తగా నియమితులయ్యారు. అయితే, ఈ వాణిజ్య ప్రకటనలో నటించడం ద్వారా తనకు వచ్చిన తొలి పారితోషికాన్ని ఛారిటీకి ఇచ్చానని సితార గతంలో ఓ ఇంటర్వ్యులో చెప్పారు. ( కొత్త సీన్లతో మళ్లీ అర్జున్రెడ్డి.. )
అల్లు స్నేహ ఆగస్టు జ్ఞాపకాలు.. వర్షంలో తడిసిపోతున్న నివేదా
ఆగస్టు జ్ఞాపకాలని పంచుకున్న అల్లు స్నేహావర్షంలో తడుస్తూ పరవశించిపోతూ నివేదా థామస్కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న హనీరోజ్ఎర్రని డ్రస్ లో సూపర్ గ్లామర్గా దివిజపాన్ ట్రిప్ వేసిన మలయాళ బ్యూటీ అన్నా బెన్జపనీస్ స్టైల్ డ్రస్సింగ్లో మహేశ్ భార్య నమ్రత View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Anna Ben 🌸 (@benanna_love) View this post on Instagram A post shared by Rahasya Kiran (@rahasya_kiran) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Abhirami (@abhiramiact) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)
క్రీడలు
పురుషుల హాకీ జగజ్జేత జర్మనీ
వావ్రె (బెల్జియం): పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో జర్మనీ జట్టు నాలుగోసారి విజేతగా నిలిచింది. స్పెయిన్ జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో జర్మనీ 1–0 గోల్ తేడాతో గెలిచింది. జర్మనీ తరఫున మైకేల్ స్ట్రుతాఫ్ 44వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. ఈ విజయంతో ప్రపంచకప్ను అత్యధికంగా నాలుగుసార్లు గెల్చుకున్న జట్టుగా పాకిస్తాన్ (1971, 1978, 1982, 1994) పేరిట ఉన్న రికార్డును జర్మనీ (2002, 2006, 2023, 2026) సమం చేసింది. తుది పోరులో స్పెయిన్ జట్టు తమకు లభించిన నాలుగు పెనాల్టీ కార్నర్లను వృథా చేసుకొని ఈ మెగా టోర్నీలో మూడోసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 1971, 1998లోనూ స్పెయిన్ జట్టు ఫైనల్లో ఓడిపోయింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా 2–1 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టును ఓడించింది.248 ప్రపంచకప్లో నమోదైన మొత్తం గోల్స్. ఇందులో 136 ఫీల్డ్ గోల్స్. 97 గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారా... 15 గోల్స్ పెనాల్టీ స్ట్రోక్ల ద్వారా వచ్చాయి. 16 జట్ల మధ్య మొత్తం 50 మ్యాచ్లు జరిగాయి.
పెగూలా శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళలసింగిల్స్ విభాగంలో 2024 రన్నరప్, ప్రపంచ మూడో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా) శుభారంభం చేసింది. ఎలీనా గాబ్రియేలా రూసె (రొమేనియా)తో ఆదివారం జరిగిన తొలి రౌండ్లో పెగూలా 6–3, 6–2తో గెలిచింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో పెగూలా నాలుగు ఏస్లు సంధించింది. 26 విన్నర్స్ కొట్టిన పెగూలా ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ప్రపంచ 29వ ర్యాంకర్, రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్ విజేత క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. క్రెజికోవా 6–7 (4/7), 2–6తో కమీలా రఖిమోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయింది.
భారత్ బోణీ అదిరె
దుబాయ్: మహిళల ఆసియాకప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 94 పరుగుల తేడాతో థాయ్లాండ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఓపెనర్ షఫాలీ వర్మ (36 బంతుల్లో 64; 8 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకంతో అదరగొట్టింది.ప్రతీక రావల్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (19; 4 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. టాప్–3 రాణించడంతో 8.5 ఓవర్లలో 91/1తో పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా... చివరి వరకు అదే జోరు కొనసాగించలేకపోయింది. థాయ్లాండ్ బౌలర్లలో లవోమి 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనలో థాయ్లాండ్ 16.1 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌటైంది. నన్నపట్ కొంచరోన్కై (48 బంతుల్లో 41; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. 150వ అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన దీప్తి శర్మ ఒక్క పరుగు ఇవ్వకుండానే 3 వికెట్లు పడగొట్టడం విశేషం. నందని శర్మ 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా... ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి 10 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. భారత్ తమ తదుపరి మ్యాచ్ను గురువారం హాంకాంగ్తో ఆడుతుంది. నేడు బంగ్లాదేశ్తో ఇండోనేసియా తలపడనుంది.ప్రతీక @ 95ఈ మ్యాచ్ ద్వారా ప్రతీక రావల్ భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన 95వ క్రికెటర్గా గుర్తింపు పొందింది. గాయంతో జెమీమా రోడ్రిగ్స్ ఆసియా కప్నకు దూరం కాగా... ఆమె స్థానంలో ప్రతీకాకు చోటు దక్కింది. ఢిల్లీకి చెందిన ప్రతీక ఇప్పటికే టీమిండియా తరఫున ఒక టెస్టు, 27 వన్డేలు ఆడింది. మ్యాచ్ ఆరంభానికి ముందు కెపె్టన్ హర్మన్ప్రీత్ చేతుల మీదుగా ప్రతీక క్యాప్ అందుకుంది. కాశ్వీ గౌతమ్, అనుష్క శర్మ, నందని శర్మ, ప్రేమ రావత్ తర్వాత ఈ ఏడాది భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేసిన ఐదో క్రికెటర్గా ప్రతీక నిలిచింది.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: స్మృతి (రనౌట్) 19, షఫాలీ (సి అండ్ బి) లయోమి 64; ప్రతీక (బి) లయోమి 22; హర్మన్ప్రీత్ (సి) మాయ (బి) పుథవాంగ్ 5; భారతి (సి) సువంచోన్రాఠి (బి) చతురోంగ్రత్నా 13; రిచా (సి) పుథవాంగ్ (బి) లయోమి 0; దీప్తి (రనౌట్) 5; ప్రేమ (స్టంప్డ్) కొంచరోన్కై (బి) చతురోంగ్రత్నా 6; నందని (బి) సుథిరువాంగ్ 1; శ్రీచరణి (నాటౌట్) 6; క్రాంతి (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–38, 2–91, 3–108, 4–112, 5–112, 6–127, 7–136, 8–137, 9–137. బౌలింగ్: మాయ 3–0–31–0; పుథవాంగ్ 4–0–37–1; చతురోంగ్రత్నా 3–0–31–2; ఒన్నిచా 3–0–19–0; లయోమి 4–0–26–3; సుథిరువాంగ్ 3–0–14–1. థాయ్లాండ్ ఇన్నింగ్స్: నథాకాన్ (బి) క్రాంతి 4; మాయ (సి) ప్రతీక (బి) నందని 6; కొంచరోన్కై (సి) రిచా (బి) దీప్తి 41; సువంచోన్రాఠి (ఎల్బీ) శ్రీచరణి 1; సుథిరువాంగ్ (సి) స్మృతి (బి) శ్రీచరణి 5; నయోమి (ఎల్బీ) (బి) దీప్తి 1; చైహాన్ (సి) నందని (బి) దీప్తి 0; లయోమి (సి) షఫాలీ (బి) నందని 6; చతురోంగ్రత్నా (సి) రిచా (బి) నందని 0; ఒన్నిచా (రనౌట్) 0; పుథవాంగ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 1; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 65. వికెట్ల పతనం: 1–4, 2–16, 3–35, 4–43, 5–44, 6–44, 7–60, 8–60, 9–60, 10–65. బౌలింగ్: క్రాంతి 4–0–26–1; నందని 4–0– 18–3; శ్రీచరణి 3–0–10–2; ప్రేమ 4–1–11–0; దీప్తి 1.1–1–0–3.
షెఫాలీ వర్మ విధ్వంసం.. థాయ్లాండ్ టార్గెట్ 160 రన్స్
మహిళల ఆసియా కప్లో భాగంగా థాయ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.ఓపెనర్ షెఫాలీ వర్మ (36 బంతుల్లో 64) అర్ధసెంచరీతో చెలరేగగా, డెబ్యూ బ్యాటర్ ప్రతీక రావల్ (22) ఆకట్టుకుంది. భారత ఓపెనర్ స్మృతి మంధాన (19; 10 బంతుల్లో 4 ఫోర్లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. భారతీ 13 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (5), దీప్తి శర్మ (5), రిచా ఘోష్ (0) నిరాశపర్చారు. చివర్లో క్రాంతి గౌడ్ (15 నాటౌట్), శ్రీచరణి (6 నాటౌట్) ధాటిగా ఆడడంతో భారత్ 150 పరుగుల మార్క్ను దాటింది.థాయ్లాండ్ బౌలర్లలో సుప్లీపోర్న్ 3 వికెట్లు పడగొట్టింది.మ్యాచ్లో టాస్ గెలిచిన థాయ్లాండ్ వుమెన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత్ తరఫున ప్రతీక్ రావల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ప్రతీక రావల్ క్యాప్ను అందుకుంది. గాయంతో జెమీమా దూరం కావడంతో ఆమె స్థానంలో ప్రతీక రావల్కు అవకాశం వచ్చినట్లు హర్మన్ప్రీత్ తెలిపింది.చదవండి: థాయ్లాండ్తో మ్యాచ్.. స్మృతి మంధన ప్రపంచ రికార్డు
న్యూస్ పాడ్కాస్ట్
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
Audio: బీడు పడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు... కాలువకు నీరివ్వని కూటమి సర్కార్... బోరుమంటున్న రాయలసీమ రైతులు
నేపాల్లో ఆగని మృత్యుఘోష.... 579కి చేరిన మరణాల సంఖ్య... భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
కమిషనర్ ఔట్... వేతన సవరణ కమిషన్ లేదు... ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం
కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నా కుంభకర్ణుడి నిద్ర నటిస్తారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం మనదే... వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు చెబుతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
జరిమానా లెక్క తేల్చాల్సిందే... రామోజీకి, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్ చిట్ ఇవ్వలేదు.... తేల్చిచెప్పిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
బిజినెస్
జియో రీచార్జ్: రూ.199కే 1.5 GB ప్లాన్
తక్కువ ధరలో ఎక్కువ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ కోరుకునే వినియోగదారులకు జియో ప్రీపెయిడ్లో రూ.199 రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్లో 18 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 1.5GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 27GB డేటాను వినియోగించుకోవచ్చు.ఈ రూ.199 ప్లాన్లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి. అలాగే జియో యాప్స్కు సంబంధించిన జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అన్లిమిటెడ్ 5G డేటా కావాలంటే ప్రత్యేక 5G యాడ్ఆన్ ద్వారా పొందవచ్చు.దీంతోపాటు జియో ప్రస్తుతం రోజుకు 1.5GB డేటాతో నెలవారీ ప్లాన్లను కూడా అందిస్తోంది. రూ.319 ప్లాన్లో 1.5GB రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, జియో యాప్ ప్రయోజనాలు, ఒక నెల వ్యాలిడిటీ ఉన్నాయి. మైజియో యాప్ లేదా జియో అధికారిక వెబ్సైట్లో ఈ ప్రీపెయిడ్ ప్లాన్లను రీచార్జ్ చేసుకోవచ్చు.
మరింత మందికి ఈపీఎఫ్.. అక్టోబర్ 31 వరకు ‘ప్రత్యేక’ ఛాన్స్
ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఉపయోగపడే కీలక నిర్ణయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తీసుకుంది. ఇంతకాలం అర్హత ఉన్నప్పటికీ ఈపీఎఫ్ (EPF) పరిధిలోకి రాని ఉద్యోగులను నమోదు చేసేందుకు ‘ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ (EEC) 2026’ను ప్రారంభించింది. గతంలో మిగిలిపోయిన నమోదు, కాంప్లయన్స్ లోపాలను సరిదిద్దడంతోపాటు మరింత మంది ఉద్యోగులకు పీఎఫ్, పెన్షన్, బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.అక్టోబర్ 31 వరకు అవకాశంకేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2026 జూన్ 29న EEC-2026ను నోటిఫై చేసింది. ఈ ప్రత్యేక ప్రచారం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఉద్యోగుల నమోదు కోసం అక్టోబర్ 31 వరకు అవకాశం ఉంది. వివిధ సంస్థల్లో 2009 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య కాలంలో పనిచేసినా, అర్హత ఉన్నప్పటికీ గతంలో EPFలో నమోదు కాని ఉద్యోగులను ఈ పథకం కింద చేర్చవచ్చు. అయితే డిక్లరేషన్ సమయంలో సంబంధిత ఉద్యోగి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతూ ఉండాలి.యజమానులకు ప్రత్యేక వెసులుబాటుగతంలో ఉద్యోగుల నుంచి పీఎఫ్ వాటా మినహాయించకపోయిన సందర్భాల్లో, EEC-2026 కింద ప్రకటించిన ఉద్యోగులకు ఉద్యోగి వాటా చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు. అయితే యజమాని తన వాటాతోపాటు వర్తించే వడ్డీ, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా విధించే నష్టపరిహారానికి బదులుగా ఈ ప్రచారం కింద ఒక్కో సంస్థకు రూ.100 లంప్సమ్ డ్యామేజెస్ నిబంధనను తీసుకొచ్చారు.ఎవరికి వర్తిస్తుంది?ఈ ప్రచారం ప్రధానంగా గతంలో ఈపీఎఫ్ కవరేజీకి దూరమైన అర్హత కలిగిన ఉద్యోగుల కోసం ఉద్దేశించినది. ఈపీఎఫ్ పరిధిలో ఉన్న లేదా ఈపీఎఫ్ చట్టం/సామాజిక భద్రతా కోడ్ కింద కవరేజీకి వచ్చే సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. యజమానులు తమ పాత ఉద్యోగ, వేతన రికార్డులను పరిశీలించి అర్హులైన ఉద్యోగులు ఎవరైనా నమోదు కాకుండా మిగిలిపోయారా అనేది గుర్తించాలని ఈపీఎఫ్వో సూచించింది.ఆన్లైన్లోనే నమోదుEEC-2026 కింద నమోదు ప్రక్రియను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ప్రకటించిన ఉద్యోగులకు ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా ఫేస్ ఆథెంటికేషన్ ఆధారంగా UAN జనరేషన్, అనంతరం ECR ద్వారా సంబంధిత పీఎఫ్ కాంట్రిబ్యూషన్ల చెల్లింపు వంటి విధానాలను ఈపీఎఫ్వో పేర్కొంది. దీంతో గతంలో నమోదు కాని ఉద్యోగులను అధికారిక సామాజిక భద్రతా వ్యవస్థలోకి తీసుకురావడంతోపాటు రికార్డుల్లో పారదర్శకత పెరగనుంది.ఉద్యోగులకు ప్రయోజనం ఏంటి?ఈపీఎఫ్లో నమోదు కావడం ద్వారా అర్హత కలిగిన ఉద్యోగులకు భవిష్య నిధి మాత్రమే కాకుండా సంబంధిత పెన్షన్, ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో సంస్థల గత కాంప్లయన్స్ లోపాలను క్రమబద్ధీకరించేందుకు కూడా ఈ ప్రత్యేక విండో ఉపయోగపడుతుంది.Employees’ Enrolment Campaign 2026An opportunity to expand social security coverage, regularise past compliance and formalise the workforce.📅 29 June – 31 October 2026#EEC2026 #EPFO #SocialSecurity #EPFOWithYou pic.twitter.com/wbvPO005Lh— EPFO (@officialepfo) August 29, 2026
మార్కెట్లోకి కొత్త ఫోన్: భారీ బ్యాటరీ.. పడినా పగలదు!
స్మార్ట్ఫోన్ను వినియోగించడం అందరికీ అంత సులువు కాదు. ఎంత జాగ్రత్తగా ఉపయోగించినా అనుకోకుండా కిందపడటం, నీటిలో తడవడం వంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మన్నికకు ప్రాధాన్యమిచ్చేలా వివో కొత్త వై31టీ 5జీ (Y31t 5G) స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. భారీ బ్యాటరీతో పాటు డ్రాప్ రెసిస్టెన్స్, వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ ఈ ఫోన్లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.డ్రాప్ రెసిస్టెన్స్కు ప్రత్యేక గుర్తింపువివో వై31టీ 5జీని కంపెనీ డ్రాప్, స్ట్రక్చరల్ టెస్టింగ్ చేసినట్లు తెలిపింది. ఈ ఫోన్కు ఎస్జీఎస్ 5-స్టార్ ప్రీమియం పర్ఫార్మన్స్ మార్క్ ఓవరాల్ యూనిట్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్తో పాటు మిలిటరీ-గ్రేడ్ డ్రాప్ రెసిస్టెన్స్ ఉన్నట్లు వివో పేర్కొంది. ఫోన్కు IP68, IP69 రేటింగ్లు ఉన్నాయి. అంటే దుమ్ము, నీటి ప్రవేశం నుంచి అధిక స్థాయి రక్షణ లభిస్తుంది. వివో ప్రకారం, నిర్దిష్ట పరిస్థితుల్లో 1.5 మీటర్ల లోతు వరకు 30 నిమిషాల పాటు నీటిలో ముంచినా ఫోన్ పనిచేసేలా రూపొందించారు. అయితే లిక్విడ్ డ్యామేజ్ వారంటీ పరిధిలో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.7200mAh బ్యాటరీ.. 44W ఫాస్ట్ ఛార్జింగ్వివో వై31టీ 5జీలో ప్రధాన ఆకర్షణ 7200mAh బ్యాటరీ. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వివో అధికారిక పరీక్షల ప్రకారం, ఒక్క ఛార్జ్తో 62 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్, 32 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ వంటి సామర్థ్యాన్ని ఫోన్ అందించగలదని కంపెనీ చెబుతోంది.డిస్ప్లే, ప్రాసెసర్ఈ ఫోన్లో 6.75 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఇది 1608×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1250 నిట్స్ హెచ్బీఎం బ్రైట్నెస్ను అందిస్తుంది.పనితీరు కోసం క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 4nm చిప్సెట్ను ఉపయోగించారు. ఇందులో ఆక్టాకోర్ సీపీయూతో పాటు LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి. ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఓరిజిన్ ఓఎస్ 6పై పనిచేస్తుంది.కెమెరా..ఫొటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 2MP బొకే కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను అందించారు. ప్రధాన కెమెరాకు 90 డిగ్రీల వైడ్ యాంగిల్ సామర్థ్యం కూడా ఉంది. రియర్ కెమెరాతో ఫొటో, నైట్, పోర్ట్రెయిట్, వీడియో, స్లో-మో, టైమ్ల్యాప్స్, ప్రో, పనోరమా వంటి మోడ్లు అందుబాటులో ఉన్నాయి.ఇతర ఫీచర్లుఫోన్లో సైడ్-మౌంటెడ్ కెపాసిటివ్ ఫింగర్ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, USB Type-C పోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. వివో ప్రకారం స్పీకర్ వాల్యూమ్ను సాధారణ స్థాయితో పోలిస్తే 400 శాతం వరకు పెంచే మోడ్ కూడా ఉంది.ధర, కలర్ ఆప్షన్లువివో వై31టీ 5జీ క్రిమ్సన్ రెడ్, సీషోర్ గ్రీన్, గోల్డెన్ మిస్ట్ రంగుల్లో లభిస్తుంది. వివో అధికారిక ఉత్పత్తి పేజీలో 4GB+128GB, 6GB+128GB, 6GB+256GB వేరియంట్లు పేర్కొనగా, ప్రస్తుతం అధికారిక ఈ-స్టోర్లో 6GB+128GB వేరియంట్ రూ.29,999 ధరతో కనిపిస్తోంది.లాంచ్ సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 వరకు ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. వివో అధికారిక స్టోర్తో పాటు ఇతర ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా కొనుగోలు చేయొచ్చు.
బిట్కాయిన్పై సంచలన అంచనా.. త్వరలోనే $1 మిలియన్!
క్రిప్టో కరెన్సీ మార్కెట్లో బిట్కాయిన్ భవిష్యత్తుపై బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్పెంగ్ జావో (CZ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కో బిట్కాయిన్ విలువ భవిష్యత్తులో 1 మిలియన్ డాలర్లకు (ప్రస్తుత మారక విలువ ప్రకారం సుమారు రూ.9.5 కోట్లు) చేరడం ఖాయమని, ఇందుకు 25 ఏళ్లు పట్టకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల హాంకాంగ్లో జరిగిన బిట్కాయిన్ ఆసియా 2026 సదస్సులో ‘బిట్కాయిన్ శతాబ్ధి’ పేరుతో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అయితే బిట్కాయిన్ను కేవలం ధర ఆధారంగా అంచనా వేయడం సరికాదని చాంగ్పెంగ్ జావో స్పష్టం చేశారు. రాబోయే దశాబ్దంలో దాని వినియోగం, చెల్లింపుల్లో వినియోగం, సంస్థాగత స్వీకరణ భారీగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద ఎత్తున బిట్కాయిన్ చెల్లింపులు జరగడం, రిటైర్మెంట్ ఫండ్లు, పెన్షన్ ఫండ్లు, పెట్టుబడి నిధులు, ప్రభుత్వాల రిజర్వ్ ఆస్తుల్లో బిట్కాయిన్కు స్థానం లభించడం వంటి పరిణామాలు కీలక మైలురాళ్లుగా మారతాయని పేర్కొన్నారు.బంగారాన్ని మించుతుందా?భవిష్యత్తులో బిట్కాయిన్ ప్రాధాన్యత బంగారాన్ని మించే అవకాశం ఉందని చాంగ్పెంగ్ జావో అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తదుపరి బుల్ మార్కెట్లో బిట్కాయిన్ మార్కెట్ విలువ పరంగా బంగారాన్ని అధిగమించవచ్చని ఆయన పేర్కొన్నట్లు ది బ్లాక్ నివేదించింది.అయితే ప్రస్తుతం ఈ రెండింటి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇటీవలి మార్కెట్ డేటా ప్రకారం బిట్కాయిన్ ధర ఆగస్టు చివర్లో సుమారు 80,000 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఆగస్టు 25న ఇది 80,600 డాలర్ల ప్రాంతాన్ని తాకింది. దీంతో 1 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరాలంటే ప్రస్తుత స్థాయి నుంచి బిట్కాయిన్ దాదాపు 12 రెట్లు పెరగాల్సి ఉంటుంది.AI, స్టేబుల్కాయిన్లదే తదుపరి దశక్రిప్టో రంగంలో వచ్చే పదేళ్లలో కేవలం బిట్కాయిన్ మాత్రమే కాకుండా స్టేబుల్కాయిన్లు, టోకెనైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), AI ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని సీజెడ్ అంచనా వేశారు. టోకెనైజ్డ్ ఆస్తులు, డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరించడంతో సంప్రదాయ ఆర్థిక వ్యవస్థతో క్రిప్టో రంగం అనుసంధానం మరింత బలపడుతుందని ఆయన అన్నారు.బిట్కాయిన్ ప్రధానంగా దీర్ఘకాలిక పొదుపు, రిజర్వ్ ఆస్తిగా ఎదగవచ్చని, మరోవైపు స్టేబుల్కాయిన్లు రోజువారీ చెల్లింపులు, ట్రేడింగ్, అలాగే AI ఏజెంట్ల మధ్య జరిగే మెషిన్-టు-మెషిన్ లావాదేవీల్లో కీలకంగా మారవచ్చని ఆయన వివరించారు.
ఫ్యామిలీ
కొబ్బరిచెట్టు కోసం కేసు.. ‘టీ తాగుతూ మాట్లాడుకోండి’ అన్న కోర్టు!
‘సొంత లాభము కొంత మానుకు పొరుగువానికి తోడుపడవోయ్’ అన్నారు మహాకవి గురజాడ. కానీ కేరళలో ఓ వ్యక్తి ‘పక్కవాని కొబ్బరిచెట్టు పెకలించేదాక నిదురపోనోయ్’ అన్నట్టు కంకణం కట్టుకున్నాడు. పంచాయతీ నుంచి హైకోర్టు దాకా కేసులు పెట్టాడు. కల్పవృక్షంగా ఉండాల్సిన కొబ్బరిచెట్టు కలహాల చెట్టుగా ఎందుకు మారింది? కేసుల వరకు వెళ్లడానికి కారణం ఏంటి? ఈ కేసులో హైకోర్టు తీర్పు ఎందుకు ఆసక్తికరంగా మారిందనేదే ఈ వారం ‘లీగలాటా’...కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కారేకులం గ్రామంలో గోపీనాథ్, రంజిత్ పక్క పక్క ఇళ్లల్లో నివసిస్తున్నారు. ఇద్దరి ఇళ్లకు సరిహద్దుగా ఉన్న గోడకు ఆనుకుని రంజిత్ స్థలంలో ఓ కొబ్బరి చెట్టు ఉంది. ఆ చెట్టు తన ఇంటివైపునకు వాలి ఉందని, అది కూలి ఇంటిపై పడితే పాడవుతుందని గోపీనాథ్ ఫిర్యాదు. కొబ్బరి ఆకులు, కాయలు పడి తన రెండు కార్లు దెబ్బతినే అవకాశం ఉందని అతని వాదన.తన సమస్యను వివరిస్తూ పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అది పడిపోయే స్థితిలో ఉంటే తప్ప పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని పంచాయతీ అధికారులు చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులకు, తర్వాత స్థానిక సంస్థలకు చెందిన అంబుడ్స్మెన్కు సైతం ఫిర్యాదు చేశాడు. వారు సూచించిన పరిష్కారాలతో సంతృప్తి చెందని గోపీనాథ్ చివరకు హైకోర్టును ఆశ్రయించాడు.చెట్టు పరిశీలనకు రూ. లక్షకొబ్బరిచెట్టుపై ఉన్న అభ్యంతరాలు, ఆందోళనలను పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై సమగ్ర పరిశీలనకు కోర్టు కమిషనర్ను నియమించాలని అభ్యర్థించాడు. ఖర్చులను భరిస్తే నియమిస్తామని కోర్టు చెప్పడంతో అంగీకరించారు. కోర్టు కమిషనర్ ఫీజును రూ. లక్షగా నిర్ణయించి చెల్లించాలని ఆదేశించింది. పిటిషనర్ ఆ మొత్తాన్ని చెల్లించారు.ఆ సెక్షన్ వర్తించదుకొబ్బరి చెట్టు ఉన్న ప్రాంతాన్ని కోర్టు కమిషనర్ పరిశీలించారు. చెట్టు బలమైన వేళ్లతో ఉందని వెంటనే పడిపోయే ప్రమాదం లేదని తేల్చారు. చెట్టు పడిపోకుండా ఇప్పటికే ఇనుప తీగతో కట్టి ఉంచారని, కొబ్బరికాయలు, ఆకులు పక్కస్థలంలో పడకుండా నెట్ కూడా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రక్షణ వలను మరింత వెడల్పు చేసి, క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే సరిపోతుందని తన నివేదికలో పేర్కొన్నారు. కమిషనర్ నివేదికతోనూ పిటిషనర్ సంతృప్తి చెందలేదు.కేరళ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 238 కింద చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాడు. ఈ సెక్షన్ ప్రకారం చెట్టు కొమ్మలు లేదా చెట్టు కూలిపోయి వ్యక్తులు, భవనాలు, పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పంచాయతీ, అంబుడ్స్మెన్, కోర్టు కమిషనర్ నివేదికలన్నీ ఆ చెట్టు వల్ల ప్రస్తుతానికి ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదని తేల్చాయి. అందువల్ల ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకోలేమని కోర్టు తేల్చింది.విలక్షణ తీర్పుపొరుగింటి వారితో ఉన్న చిన్న సమస్య పట్టుదల, అహంకారాల కారణంగా న్యాయవివాదంగా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఈ కొబ్బరిచెట్టుకే గనుక నవ్వే శక్తి ఉంటే, ఇద్దరు పొరుగువారు తన కోసం కొట్టుకోవడం చూసి అది నవ్వుకునేదేమో!’ అని న్యాయమూర్తి చమత్కరించారు. ఇంత చిన్న సమస్యకు కోర్టు సమయాన్ని వృథా చేశారని ఇప్పటికే సివిల్, క్రిమినల్ కేసుల పెండింగ్ భారం కోర్టులపై ఉందని జడ్జి అసహనం వ్యక్తం చేశారు.‘పొరుగు వానిని నీలాగే ప్రేమించు’ అనే వాక్యాన్ని ప్రస్తావిస్తూ, ఇద్దరూ కలిసి టీ లేదా కాఫీ తాగుతూ కూర్చుని చర్చించుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. హైకోర్టు ఈ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని తేల్చారు. భవిష్యత్తులో నిజమైన ప్రమాదం ఏర్పడితే పంచాయతీ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘విలువైన కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు ఇద్దరి నుంచి ఖర్చులు వసూలు చేయవచ్చు కానీ, కోర్టు ఉదారంగా వ్యవహరించి ఆ చర్యలు తీసుకోవడం లేదు’ అంటూ పిటిషన్ను కొట్టేశారు.- దిలీప్ మాదిరెడ్డిఇవీ చదవండి: ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి?
ఉగాండాలో మొదలైన బయింబా ఫెస్టివల్.. ప్రత్యేకతలేంటో తెలుసా?
ఉగాండా అంటే ప్రకృతి అందాలు, వన్యప్రాణులు మాత్రమే కాదు.. వైవిధ్యమైన సంగీతం, కళలు, సంప్రదాయాలతో కళకళలాడే దేశం కూడా. ఆ దేశంలోని సాంస్కృతిక, సృజనాత్మక ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రముఖ వేడుక బయింబా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ది ఆర్ట్స్. ఆగస్టు 28న మొదలైన ఈ వేడుకలు 30న ముగుస్తున్నాయి. ఈ ఫెస్టివల్లో సంగీత నాటక నృత్యాలు సహా పలు దృశ్య కళల ప్రదర్శనలు జరుగుతాయి.ఉగాండా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటాలనే లక్ష్యంతో 2006లో బయింబా ఫౌండేషన్ ప్రారంభమైంది. ఈ ఫౌండేషన్ 2008లో తొలిసారిగా బయింబా ఫెస్టివల్ నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఉత్సవం తూర్పు ఆఫ్రికాలోని ప్రముఖ బహుళ కళా ఉత్సవాల్లో ఒకటిగా ఎదిగింది. లంకులు ఐలండ్ వేదికగా ఈ ఉత్సవాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఉగాండా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ బయింబా ఫెస్టివల్ ప్రధాన లక్ష్యం.అంతేకాకుండా సృజనాత్మక రంగానికి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలు, కళావిద్య, కళాకారుల అభివృద్ధి, సాంస్కృతిక వ్యాపార అవకాశాలను పెంచడం కూడా దాని కార్యక్రమాల్లో భాగం. ఉగాండా ఆర్థికాభివృద్ధిలో కూడా ఈ ఉత్సవం తోడ్పడుతుంది. బయింబా ఫెస్టివల్కు ఉన్న ప్రత్యేకతల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఒకటి. వివిధ దేశాలు, విభిన్న సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన కళాకారులు, సంగీతకారులు, ప్రదర్శనకారులు ఇక్కడ కలుసుకుంటారు. వారంతా తమ తమ అనుభవాలను పంచుకుంటారు.ఈ బయింబా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ది ఆర్ట్స్– కళాభిమానులకు, పర్యాటకులకు, ప్రపంచ సంస్కృతులను తెలుసుకోవాలనుకునే వారికి ఒక ప్రత్యేక అనుభవంగా నిలుస్తుంది. ఈ ఫెస్టివల్ కోసం ఈ ఏడాది బయింబా అంతర్జాతీయ కళాకారుల నుంచి కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. సంగీతం, నృత్యం, సినిమా, ఫ్యాషన్, ఫోటోగ్రఫీ, స్టోరీ టెల్లింగ్, థియేటర్ తదితర విభాగాలకు చెందిన కళాకారులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.ఇవి చదవండి: ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి?
'చనిపోవడానికి అనుమతించండి’.. కలెక్టర్కు ఓ తండ్రి రాసిన లేఖ!
‘ఓ పెద్దాయనా.. పెద్ద సారు రావడానికి చాలా టైం పడుతుంది. పోయి రేపు రా’ అన్న అటెండర్ మాటలతో ఆయన ఆ లోకంలోకి వచ్చాడు. వయసు 70 పైబడి ఉంటాయి.. ముఖంలో వయసు తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెరిసిన జుట్టు, కళ్లజోడు, పెద్ద గళ్ల చొక్కా, పాతకాలపు ప్యాంటు, భుజాన గుడ్డ సంచి.. అందులో కొన్ని పేపర్లు, సుగర్, బీపీ ట్యాబ్లెట్లు.. నడిచినప్పుడు పట్టు తప్పకుండా ఉండేందుకు ఊతకర్ర. ఇవే ఆయన ఆస్తి.‘వస్తావ్.. వెళతావ్.. ఏనాడైనా టీ తాగమని పది రూపాయలైనా ఇచ్చావా? పైసల్లేకుండా పని ఎలా అవుతుందనుకుంటున్నావ్’ అన్న అటెండర్ మాటలకు ఓ నిట్టూర్పు విడిచాడు. ఒకప్పుడు ఎంతోమందికి సాయం చేసిన ఈ చేయి ప్రస్తుతం అదే సాయం కోసం దీనంగా అర్ధించే స్థితిలో ఉండటం చూసుకుని నిర్వేదం ఆవహించింది. కలెక్టర్ ఆఫీసులోని ఆ పాత గోడ గడియారం రెండు గంటల సమయాన్ని సూచిస్తోంది. ఇక చేసేదేమీ లేక భారంగా పైకి లేచి అంతే భారంగా అడుగులు బయటకు వేశాడు.ఆయన పేరు రాఘవరావు. తహశీల్దార్ ఆఫీసులో క్లర్క్గా పని చేసి రిటైర్ అయ్యాడు. ఓ కూతురు, ఇద్దరు కొడుకుల బాధ్యతలు అన్నీ నెరవేర్చాడు. భార్య ఉన్నంత కాలం ఆయన జీవితం బానే గడిచింది. కానీ బ్లడ్ కేన్సర్ ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. తన సహ ధర్మచారిణిని కాపాడుకుందామని రాఘవరావు ఎంతగా తపించినా, బ్లడ్ కేన్సర్ ముందు ఓడిపోయాడు. ఆమె కాలం చేసినప్పటి నుంచి అందరూ ఉన్న అనాథయ్యాడు. ఎప్పుడో ఓసారి కూతురు నుంచి వచ్చే ఫోన్ పలకరింపు తప్ప ఇతర బంధాలేవీ ఆయన దరిదాపుల్లో లేవు.ఇద్దరు కొడుకులు ఉన్నా తండ్రిని పట్టించుకునే తీరిక, పట్టించుకోవాలనే బాధ్యత లేనట్టుగా ఎవరి పనుల్లో వారు ఉండిపోయారు. దీంతో ఆయన జీవితంలాగే రోజులు కూడా చాలా భారంగా గడుస్తున్నాయి. నెలనెలా వచ్చే కాసిని పింఛను డబ్బులతోనే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో తినీ తినక అలా జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు.కలెక్టరాఫీసు నుంచి బయటకు వచ్చిన రాఘవరావు.. కాస్త అలసటగా అనిపించి ఓ టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగాడు. జేబులో నుంచి రూ.20 నోటు తీసి ఇచ్చి వెళ్లబోయాడు. రాఘవరావులాగే చాలా ముడతలు పడి మాసిపోయి, చిరిగి ఉన్న నోటు వంక టీకొట్టు యజమాని తేరిపార చూసి, ‘ఈ నోటు మారదు మరొకటి ఇవ్వండి’ అంటూ వెనక్కి ఇచ్చాడు.జేబు మొత్తం వెతికి చిల్లరంతా తీసినా కూడా రెండు రూపాయలు తగ్గింది. టీకొట్టు యజమాని వాటిని తీసుకుని.. ‘డబ్బుల్లేకుండా టీ ఎందుకు తాగుతారు’ అంటూ గొణుక్కున్నాడు.రెండు రూపాయలు తగ్గాయని ఆ హోటల్ యజమాని ముఖం తిప్పుకునేసరికి రాఘవరావు మనసు చివుక్కుమంది. కళ్లలో వస్తున్న నీళ్లను బలవంతంగా అదిమి పెట్టుకుని రోడ్డు పైకి వచ్చాడు. జేబులో డబ్బుల్లేవు. ఇంటికి నడిచి వెళ్లేంత ఓపిక అసలే లేదు. ఓ వైపు ఎండ నిప్పులు చెరుగుతోంది. రోడ్డు తారు కరిగి కాళ్లను గుంజుతున్నట్లుంది.అప్పుడే ఆ రోడ్డుపై నుంచి పోలీస్ జీపు వస్తోంది. అందులో ఉన్న ఎస్సైని రాఘవరావు గుర్తుపట్టారు. ఆయన ఉండేది తమ కాలనీలోనే.. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఎస్సైకి తెలిసిన వాళ్ల ఫైల్ ఒకదానిని త్వరగా పరిష్కరించి సహాయం చేసిన సంగతి గుర్తొచ్చింది. దీంతో లిఫ్ట్ ఇస్తారేమో ఆశతో.. ‘సార్.. కాస్త ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తారా?’ అని చేయి ఊపాడు. కానీ ఆ ఎస్సై కనీసం జీపు ఆపలేదు సరికదా, కళ్లద్దాల వెనుక నుంచి ఒక చులకన భావంతో చూస్తూ స్పీడుగా వెళ్లిపోయాడు. జీపు వెదజల్లిన ధూళి రాఘవరావు కళ్లల్లో పడింది. అయితే, ఆ బాధ కంటే ఆ ఎస్సై చూసిన చూపు తీవ్రమైన బాధ కలిగించింది.అలా అతికష్టమ్మీద నాలుగడుగులు వేశాడు. ఓ వైపు ఎండ తీవ్రత పెరిగిపోతోంది. వయసు సహకరించడం లేదు. గొంతు ఎండిపోతోంది. శ్వాస భారమైంది. కంటి చూపు మసకబారుతోంది. రోడ్డు పక్కన ఎవరైనా నీళ్లు ఇస్తారేమోనని చూశాడు. కానీ ఎవరి బిజీలో వాళ్లున్నారు. ఆ నడిరోడ్డుపైనే ఆయన కాళ్లు తడబడ్డాయి. చేతిలోని ఊతకర్ర జారిపోయింది. భుజాన ఉన్న గుడ్డ సంచితో సహా రాఘవరావు అక్కడే రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఆ మసకబారుతున్న చూపుల వెనుక.. ఆయన జీవితం మొత్తం సినిమా రీలులా గిర్రున తిరిగింది.తహశీల్దార్ ఆఫీసులో రోజంతా ఫైళ్లతో నడుము విరగ్గొట్టుకుని పనిచేసి, సాయంత్రం కాగానే విశ్రాంతి ఎరుగకుండా మరొక చిన్న ఉద్యోగం కోసం పరుగెత్తిన రోజులు గుర్తొచ్చాయి. ‘పిల్లలకు లోటు రాకూడదు.. వాళ్ల చదువులు ఆగకూడదు.. రేపు వాళ్లు గొప్ప స్థాయికి వెళ్లాలి’ అనే తపనతో ఎంత కష్టపడ్డాడో సగం తెరిచిన కళ్లలో కదలాడింది.సాయంత్రాలు టీ కొట్టు దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకునే స్నేహితులు గుర్తొచ్చారు. ‘రారా రాఘవా.. కాసేపు కూర్చో’ అని పిలిచినా, ‘లేదురా.. అర్జెంట్ పని ఉంది’ అంటూ నవ్వుతూ దాటవేసిన క్షణాలు కళ్లముందు కదిలాయి. రూపాయి రూపాయి కూడబెట్టే ఆ తాపత్రయంలో ఏనాడూ తనకోసం, తన సంతోషం కోసం ఆయన బతకలేదు. పిల్లలే ముఖ్యమనుకుని, వారి కోసమే జీవితం మొత్తం అంకితమయ్యాడు. రోజులు గడిచేకొద్దీ ఆత్మీయులు, స్నేహితులు ఒక్కరొక్కరుగా దూరమయ్యారు. ఆనాడు పిల్లల భవిష్యత్తు కోసం స్నేహాన్ని, సరదాలను త్యాగం చేస్తే, ఈనాడు కనీసం ‘బాగున్నావా’ అని పలకరించడానికి ఒక్క స్నేహితుడు కూడా లేని నిశ్శబ్దం మిగిలింది.కొడుకులు, కూతురు చిన్నతనంలో తన భుజాలెక్కి ఆడుకున్న రోజులు కనిపించాయి. ‘నాన్నే నా హీరో’ అన్న పెద్దోడి మాటలు చెవుల్లో రింగుమన్నాయి. ‘నాన్నా! నేను పెద్దయ్యాక నిన్ను మహారాజులా చూసుకుంటా’ అన్న చిన్నోడి మాటలు ఇంకా మరచిపోలేదు. వారి ముద్దుముద్దు మాటలకు ఎంతో మురిసిపోయిన రాఘవరావు– రెక్కలు ముక్కలు చేసుకుని వారిని ప్రయోజకులను చేశాడు. కానీ వారు మాత్రం పెద్దయి, పెళ్లిళ్లు చేసుకున్నాక కన్న తండ్రిని పూర్తిగా పక్కన పెట్టేశారు.‘ఇలా రెండు ఉద్యోగాలు చేస్తూ సరిగా తిండి కూడా తినకపోతే మీ ఆరోగ్యం ఏం కావాలి’ అంటూ ప్రేమతో కోప్పడే భార్య గుర్తొచ్చింది. ‘నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు. అందుకే వారికి ఏ లోటూ రాకూడదని ఇంత కష్టపడుతున్నా. రేపు వాళ్లు పెద్దయ్యాక మన ఇద్దరినీ నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటారు’ అంటూ భార్యతో అన్న మాటలు గుర్తొచ్చి, ఆయన కళ్లల్లో నుంచి చివరి కన్నీటి చుక్క చెంపల మీదుగా జారి రోడ్డుపై పడి ఆ వేడికి ఆవిరైపోయింది.మరుక్షణం తన తండ్రి వెంకటరామయ్య గుర్తొచ్చారు. ఆయన అవసాన దశలో తాను సరిగా చూసుకోని సంగతులు లీలగా మెదిలాయి. ‘ఒరేయ్.. రాఘవా? ఈ మధ్య అస్సలు నువ్వు నాతో మాట్లాడటంలేదురా.. ఏం అడిగినా బిజీ, టైం లేదు అంటున్నావ్. కళ్ల ముందే మీరంతా ఉన్నా ఒంటరితనం బాధిస్తోందిరా. చేవలేని ఈ ముదిమి వయసులో చేతికర్రలా ఉండాల్సిన నువ్వు.. కనీసం నా ముఖం కూడా చూడటంలేదనే బాధ నా గుండెను పిండేస్తోంది. ఈ వయసులో మాకు కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదురా.. నాన్నా ఎలా ఉన్నావు అనే ఆత్మీయమైన పిలుపు. మీ అనురాగాలు మాత్రమే. మీ అమ్మ అదృష్టవంతురాలు.. నా కంటే ముందే వెళ్లిపోయింది.ఇంకా ఈ కట్టె ఎన్నిరోజులు ఇలా ఉండాలో’ అంటూ మథనపడిన సంగతి గుర్తొచ్చింది. ఇక కన్నీటి చుక్కలు రావడానికి ఆయన ఒంట్లో నీళ్లు కూడా లేవు. ఆ వయసులో తన తండ్రి అనుభవించిన బాధే ఇప్పుడు తాను అనుభవిస్తున్నా అని అర్థమైంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే తాను.. ఎందుకు ఇలా చేశానా అనే పశ్చాత్తాపం మూసుకుపోతున్న కళ్లల్లో కనిపించింది. బలవంతంగా కళ్లు తెరిచి ఆకాశంలో ఎక్కడో ఒకచోట ఉండే తండ్రికి క్షమాపణ చెప్పాలని రాఘవరావు చేసిన ప్రయత్నం నెరవేరలేదు. ఆ కళ్లు అలా నెమ్మదిగా మూతపడ్డాయి.త్యాగానికి నిర్వచనమైన ఓ సగటు తండ్రి ఆఖరి శ్వాస అనంత వాయువుల్లో కలిసిపోయింది.క్షణాల మీద అక్కడ జనం చేరారు. ‘అయ్యో.. ఎవరో పెద్దాయన పాపం శోష వచ్చి పడిపోయినట్టున్నాడు. పక్కన కూర్చోబెట్టి నీళ్లివ్వండి’ అని గుంపులో ఎవరో అన్నారు. ‘వడదెబ్బ తగిలినట్టుంది.. అంబులెన్స్కు ఫోన్ చేయాలి’ అని మరొకరు.. ఇలా మాటలు చెబుతున్నారే తప్ప ఎవరూ ముందుకు రావడంలేదు.ఇంతలో ఆ గుంపులోకి ఒక జేబుదొంగ చొరబడ్డాడు. ఓ పెద్దాయన లాల్చీ జేబులో నుంచి పర్సు కొట్టేశాడు. ఈ రోజు నా అదృష్టం బాగుంది అనుకుంటూ.. ఇంకా ఎవరి దగ్గరైనా కొట్టేసే అవకాశం ఉందా అని పరిశీలిస్తున్నాడు. అప్పుడే ఆ టీకొట్టు యజమాని అక్కడ జనాన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాఘవరావు ముఖం చూడగానే షాక్ అయ్యాడు. ‘అయ్యో.. ఇందాకే నా కొట్టు దగ్గర టీ తాగాడు. రెండు రూపాయలు తక్కువయ్యాయని కాస్త గింజుకున్నాను. ఆ చిల్లరంతా నేను తీసుకోకుండా ఉంటే బస్సు ఎక్కి ఇంటికి వెళ్లేవాడేమో..’ అన్న భావన అతని గుండెను పిండేసింది.అప్పుడే అటుగా వెళ్తున్న ఎస్సై జీపు జనాలను చూసి ఆగింది. కాసేపటి క్రితం లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్లిన అదే ఎస్సై జీపు దిగి గంభీరంగా జనాన్ని తోసుకుంటూ వచ్చాడు. రాఘవరావు శవాన్ని చూసి, ‘అరే.. ఇందాక లిఫ్ట్ అడిగింది ఈయనే కదా? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే చనిపోయేవాడు కాదేమో’ అని మనసులో ఉలిక్కిపడ్డాడు.సరిగ్గా అదే సమయానికి సైరన్ మోగుతూ కలెక్టర్ కారు వచ్చి ఆగింది. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కలెక్టర్ స్వయంగా కారు దిగి వచ్చారు. జనమంతా పక్కకు తప్పుకున్నారు. రాఘవరావు అచేతనంగా పడి ఉండటాన్ని చూశారు. పక్కనే పడి ఉన్న గుడ్డసంచి, అందులోంచి రోడ్డుపై పడిన కాగితాలు కలెక్టర్ దృష్టిని ఆకర్షించాయి. ఒక తెల్లటి కాగితంపై పెద్ద అక్షరాలతో ‘అర్జీ’ అని రాసి ఉంది.కలెక్టర్ వంగి ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుని చదవడం ప్రారంభించారు:గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి...అయ్యా,నా పేరు రాఘవరావు. రిటైర్డ్ క్లర్క్.ఒకప్పుడు నా సంతకం పడితే కానీ ఆఫీసుల్లో ఫైళ్లు ముందడుగు వేసేవి కావు. కానీ ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయలేని స్థితికి వచ్చేశాను. రెక్కలు ముక్కలు చేసుకుని, తినీ తినక పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేశాను. సంపాదించినదంతా వారి కోసమే ఖర్చు చేశాను. కానీ వారికి రెక్కలొచ్చాక తల్లిదండ్రులనే భావన కూడా వారికి లేకుండా పోయి అనాథల్లా వదిలేశారు.నా భార్య కాలం చేశాక, ఆకలి కంటే ఈ ఒంటరితనమే నన్ను రోజురోజుకూ నమిలి మింగేస్తోంది. ఎంతో ఆశగా పెంచి పెద్ద చేసిన నా పిల్లల ఇళ్లలోనే కాదు.. వారి మనసులో కూడా నాకు చోటు లేదు. వారి సమయాన్ని, ప్రేమను కొనుక్కోవడానికి నా దగ్గర ధనం లేదు.నేను బతికి ఉన్న ప్రతి క్షణం వారికి భారంగా మారింది. నా పింఛను డబ్బులు నా పొట్ట నింపగలవేమో కానీ, నా మనసు పడే ఆక్రందనను ఆపలేకపోతున్నాయి. రోజంతా ఖాళీ గోడల వైపు చూస్తూ బతుకును భారంగా ఈడుస్తున్నాను. ఏనాడైనా ఎవరో ఒకరు నా తలుపు తట్టి ’బాగున్నావా నాన్నా’ అని అడగరా అని ఎదురుచూసి చూసి అలసిపోయాను.అందరికీ బరువుగా ఉన్న ఈ జీవితం నాకు అంతకుమించిన భారంగా అనిపిస్తోంది. చావలేక బతుకుతున్న నేను.. ఇలా బాధలు పడుతూ చస్తూ బతకడం కంటే చనిపోవడమే మేలు అని నిర్ణయానికి వచ్చాను. ప్రభుత్వ ఉద్యోగంలో అడుగు పెట్టినప్పటి నుంచి చట్టాన్ని గౌరవిస్తూ.. ఒక్క తప్పు పని కూడా చేయలేదు. ఆత్మహత్య చేసుకోవడం నేరమని తెలుసు. అందుకే ఆ తప్పు కూడా చేయకూడదనే భావనతో ఈ అర్జీ పెట్టుకుంటున్నాను.అక్కడి వరకు చదివిన కలెక్టర్కు ఆపై అక్షరాలు కాస్త మసకబారినట్టు అనిపించాయి. కళ్లజోడు తీసి, కళ్లలో నుంచి ఉబికివస్తున్న నీళ్లను తుడుచుకుని.. మళ్లీ దానిని చదవడం ప్రారంభించారు.ఒక పౌరుడిగా, ఒక నిస్సహాయ తండ్రిగా, అంతకంటే బాధ్యతాయుతమైన మాజీ ప్రభుత్వ ఉద్యోగిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను... నేను చనిపోవడానికి చట్టబద్ధమైన అనుమతి ప్రసాదించండి. కారుణ్య మరణం పొందడానికి వీలు కల్పించండి. ఈ వయసులో ఇంతకుమించి నేను ఏమీ అడగలేను. మీ అనుమతి కోసం.. ఆశగా ఎదురుచూస్తూ ఉంటాను.ఇట్లు,ఆకలితో కాదు.. అనురాగానికి అలమటించి చనిపోతున్న ఒక నిస్సహాయ తండ్రి రాఘవరావు.ఉత్తరం చదవడం ముగిసేసరికి కలెక్టర్ కళ్లల్లో నీళ్లు ఆగలేదు. కాసేపు అలాగే మౌనంగా ఉండిపోయారు. గాలికి కలెక్టర్ చేతిలోని కాగితం ఎగిరి అక్కడే ఉన్న 10 ఏళ్ల పిల్లాడిపై పడింది. అతడు దానిని తీసుకుని పైకి చదవడం ప్రారంభించాడు. అది పూర్తయ్యే సరికి అక్కడ నిశ్శబ్దమే రాజ్యమేలింది.మొదటగా టీకొట్టు యజమాని కళ్లు రాఘవరావు నెరసిన జుట్టు వైపు చూశాయి. అతనికి ఊళ్లో ఉన్న తన ముసలి తండ్రి గుర్తొచ్చాడు. ‘నా తండ్రి కూడా ఇలాగే ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నాడేమో? నేను డబ్బు సంపాదనలో పడి నాన్నను సరిగ్గా చూసుకోవడం లేదు’ అనిపించి అతని గుండె బరువెక్కింది. వెంటనే జేబులోంచి ఫోన్ తీసి, వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ నాన్న నంబర్కు డయల్ చేశాడు.ఎస్సై ఆ అర్జీ వైపు, రాఘవరావు చేతికర్ర వైపు చూశాడు. అతని కళ్లముందు తను నిర్దాక్షిణ్యంగా జీపు పోనిచ్చిన దృశ్యం కదిలింది. ‘నన్ను పెంచి పెద్ద చేసి, పోలీస్ ఆఫీసర్ను చేసిన నా తండ్రి కూడా ఇవాళ ఊళ్లో ఒంటరిగా ఉంటున్నారు. నేను హోదా పెరిగాక బిజీబిజీ అంటూ ఆయనతో మాట్లాడటమే మానేశాను. ఇకపై నేను ఇలా ఉండకూడదు’ అని మనసులో అనుకుని.. వెంటనే జేబులోంచి ఫోన్ తీసి తండ్రికి కాల్ చేశాడు.ఇక దొంగ ఆ మందు బిళ్లల వైపు చూశాడు. అతడికి జబ్బుతో మంచాన పడ్డ తన తండ్రి గుర్తొచ్చాడు. ‘దొంగ సొమ్ము మంచిది కాదురా.. కష్టపడి పనిచేసి సంపాదించినదాంట్లో ఎంతో తృప్తి ఉంటుందని పదేపదే చెప్పే నాన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఇక దొంగతనాలు ఆపేసి నాన్న చెప్పినట్టే చేయాలి’ అని కళ్ల నీళ్లు తుడుచుకున్నాడు. తాను కొట్టేసిన పర్సును మళ్లీ ఆ పెద్దాయన జేబులో పెట్టేసి గుండెల నిండా తృప్తితో ఇంటికి పరుగెత్తాడు. నాన్నతో మాట్లాడాలనే ఆరాటం అతడి కళ్లల్లో స్పష్టంగా కనిపించింది.చివరగా కలెక్టర్ ఆ అర్జీని పిల్లాడి దగ్గర నుంచి తీసుకుని తన డైరీలో భద్రపరచుకున్నారు. ఈ పెద్దాయన చావుకు కారణం ఎవరు? ఆస్తులన్నీ పంచుకుని గుప్పెడు అనురాగాన్ని కూడా పంచకుండా ఆయన్ను అనాథలా వదిలేసిన కన్నపిల్లలా? ఇలాంటి కొడుకులను సరిగా గాడిలో పెట్టలేకపోతున్న ఈ వ్యవస్థా? బంధాలు, అనుబంధాలను చాలా తేలికగా తీసుకుంటున్న నేటి తరం ఆలోచనలా? అని మథనపడ్డారు. ఇలాంటి పెద్దలను ఆదుకోవడానికి ఏదైనా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.అలాగే.. ఆ క్షణంలో తాను చేసిన తప్పేంటో గుర్తొచ్చి కుమిలిపోయారు. వెంటనే ఫోన్ తీసి.. ఓ నెంబర్ డయల్ చేశారు. అక్కడకు కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న అవతల వ్యక్తి ఫోన్ తీయగానే.. కలెక్టర్ నోటి నుంచి వచ్చిన మాట.. ‘నాన్నా..’ఈలోగా అంబులెన్స్ వచ్చింది. కలెక్టర్తో పాటు ఎస్సై, టీకొట్టు యజమాని అంతా కలిసి రాఘవరావు భౌతికకాయాన్ని అందులోకి ఎక్కించారు. బతికుండగా ఎన్నో కష్టాలు అనుభవించిన రాఘవరావు.. ఇప్పుడు చలనం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నారు.అప్పుడు వెంకట రామయ్య... ఇప్పుడు రాఘవరావు.. రేపు రాఘవరావు కొడుకులు...!!- కొండ్రెడ్డి సత్యకిషోర్ఇవి కూడా చదవండి: దెయ్యమా? మనిషేనా? హాలోవీన్ హత్యలో ఊహించని ట్విస్ట్!
తెల్ల జుట్టే మీ స్టయిల్..! అస్సలు తగ్గేదేలే..!!
‘స్టయిల్ గురించి నీకేం తెలుసు నాన్నా!’ అని చెప్పగానే, మైండ్లో పాత సోగ్గాడిని గుర్తుచేసుకోకండి! తలలో తెలుపు కనిపిస్తే, స్టయిల్కు రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రే హెయిర్నే స్టేట్మెంట్గా మార్చి, సరికొత్త సాల్ట్ అండ్ పెప్పర్ స్టయిల్తో నాన్నలు కూడా కొడుకులతో పోటీ పడొచ్చు– ఇలా!రంగు దాచొద్దు!స్టయిల్గా కనిపించడానికి తెల్ల జుట్టును ప్రతిసారీ రంగు వేసి దాచాల్సిన అవసరం లేదు. చక్కగా ట్రిమ్ చేసి, సెట్ చేస్తే సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ లుక్కే ప్రత్యేకమైన గాంభీర్యం వస్తుంది. ఇక్కడ గడ్డం కూడా గేమ్లోనే ఉంచండి. నీట్గా ట్రిమ్ చేసిన గడ్డం మొత్తం లుక్కు మరింత క్యారెక్టర్ ఇస్తుంది.షర్ట్లో కాస్త క్లాస్!లినెన్ , కాటన్ షర్ట్స్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్కు చాలా బాగా సెట్ అవుతాయి. వైట్, నేవీ, ఆలివ్, బీజ్, లైట్ బ్లూ వంటి క్లాసిక్ రంగులు ఎంచుకోండి. మరీ పెద్ద ప్రింట్లు, ఎక్కువ డిజైన్లకు బదులుగా సింపుల్ షర్ట్ ప్లస్ పర్ఫెక్ట్ ఫిట్పై దృష్టి పెట్టండి.జీన్స్.. జాగ్రత్తగా!లూజ్గా వేలాడే ప్యాంట్లకు బదులుగా జీన్స్ సెలక్ట్ చేసుకోండి. అయితే, జీన్స్ ఎంపికలో కాస్త జాగ్రత్త! మరీ టైట్గా లేదా రిప్డ్గా కాకుండా స్ట్రెయిట్ లేదా రిలాక్స్డ్ ఫిట్ జీన్స్ ఎంచుకోండి. డార్క్ జీన్స్ + లైట్ షర్ట్ + స్నీకర్స్ చాలు.. ఇక కొడుకుతో ఫ్యాషన్ పోటీ పెట్టుకోవడానికి!బ్లేజర్ వేస్తే... గేమ్ మారిపోతుంది!సింపుల్ షర్ట్పై బ్లేజర్ వేసుకుంటే ఒక్కసారిగా లుక్కు ప్రీమియం టచ్ వస్తుంది. అయితే, వీటికి నేవీ, చార్కోల్, బీజ్ వంటి రంగులు సేఫ్ అండ్ స్టయిలిష్. ఇక్కడ టై అవసరం లేదు... బ్లేజర్ వేసుకుని, చేతికి మంచి వాచ్ పెట్టుకుంటే చాలు.టీషర్ట్కి నో చెప్పొద్దు!టీషర్ట్ అంటే కుర్రాళ్లకే అనుకోవద్దు. సాలిడ్ కలర్ పోలో టీషర్ట్స్, కాలర్ టీషర్ట్స్ చాలా స్మార్ట్గా కనిపిస్తాయి.వైట్, నేవీ, బ్లాక్, గ్రే వంటి సింపుల్ రంగులు ఎంచుకుని చినోస్ లేదా డెనిమ్తో జత చేయండి.నాన్నల సీక్రెట్ వెపన్! యువత స్మార్ట్వాచ్ల వెంట పరుగెత్తినా... క్లాసిక్ వాచ్ ఇచ్చే హంగు వేరే! లెదర్ స్ట్రాప్ లేదా మెటల్ స్ట్రాప్తో ఉండే మంచి డయల్ వాచ్ ఎంచుకోండి. వాచ్ పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు... క్లాస్గా ఉంటే చాలు!షూస్ కూడా మాట్లాడాలి!పాత షూస్నే ప్రతి డ్రెస్కు జత చేయడం మానేయండి. క్యాజువల్ లుక్కు క్లీన్ స్నీకర్స్, స్మార్ట్ క్యాజువల్కు లోఫర్స్, ఫార్మల్ లుక్కు క్లాసిక్ షూస్ ఎంచుకోండి. షూస్ శుభ్రంగా ఉంటే... సగం స్టయిల్ అక్కడే సెట్!సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అంటే వయసు పెరిగింది అనే సంకేతం కాదు... ‘స్టయిల్లో కూడా అనుభవం ఉంది’ అనే స్టేట్మెంట్గా మార్చుకుంటే.. ట్రెండ్ను ఫాలో అయ్యే జెనరేషన్కు కూడా ట్రెండ్ క్లాస్ నేర్పించొచ్చు!- దీపిక కొండిఇవీ చదవండి: హైబ్రిడ్ మంచేనా? ముంచేనా?
అంతర్జాతీయం
రష్యా చమురుక్షేత్రంపై దాడి
మాస్కో/న్యూఢిల్లీ: నెలల తరబడి తమపై దాడులతో తెగబడుతున్న రష్యాపై ఉక్రెయిన్ మరోసారి బదులుతీర్చుకుంది. రష్యాలోని లెనిన్గ్రాడ్ ఓబ్లాస్ట్ పరిధిలోని కిరిషి నగరంలోని అత్యంత కీలకమైన చమురుశుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడిచేశాయి. దీంతో ఆయిల్ రిఫైనరీ కేంద్రం నుంచి మంటలు చెలరేగాయి. గతంలో రెండుసార్లు దాడులతో నెలల తరబడి ఉత్పత్తిని ఆపేసి మరమ్మత్తుల తర్వాత ఇటీవలే ఉత్పత్తిని మొదలుపెట్టగా వెంటనే ఉక్రెయిన్ దాడులు చేయడం గమనార్హం. ఈ దాడిలో ప్రాణనష్టం వివరాలను రష్యా బయటపెట్టలేదు. రిఫైనరీపై దాడికి యతి్నంచిన 62 డ్రోన్లలో నేలమట్టంచేశామని రష్యా ప్రకటించింది. శనివారం రాత్రి నుంచి గత 24 గంటల్లో 500 డ్రోన్లను కూల్చేశామని రష్యా రక్షణశాఖ తెలిపింది. దాడులకు ప్రతీకారం తప్పదని రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోస్ హెచ్చరించారు. భారత్ నుంచి రష్యాకు భారీగా పెట్రోల్చమురు శుద్ది కర్మాగారాలపై ఉక్రెయిన్ దాడులు తీవ్రతరంచేయడంతో రష్యా స్థానిక అవసరాలకు సరిపడా చమురును ఉత్పత్తిచేయలేక దిగుమతులపై ఆధారపడుతోంది. దీంతో తాజాగా సముద్రమార్గం ద్వారా భారీస్థాయిలో పెట్రోల్ను సరఫరాచేస్తూ మిత్రదేశాన్ని భారత్ ఆదుకుంటోందని గణాంకాలు వెల్లడించాయి. గత రెండు నెలల్లో భారత్ నుంచి ఏకంగా 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్ రష్యాకు ఎగుమతి అయినట్లు వాణిజ్యరంగంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గుజరాత్లోని వడినార్ చమురుశుద్ది కర్మాగారం నుంచి ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్ తన ఇంధనఅవసరాల కోసం రష్యా నుంచి ముడిచమురున భారీస్థాయిలో కొనుగోలుచేయడం తెల్సిందే. ఇందుకు ప్రతిగా ముడిచమురును శుద్ధిచేశాక వచ్చే పెట్రోల్ను తిరిగి రష్యాకు సరఫరాచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆగని కన్నీటి వరద
కఠ్మాండు: నేపాల్లో ప్రజల్లో కన్నీటి వరద కొనసాగుతూనే ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య ఆదివారం 794కి చేరుకుంది. ఇంకా 2,500 మందికి పైగా ఆచూకీ తెలియకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆకస్మిక వరదల ధాటికి గల్లంతైన వారి కోసం వరుసగా ఐదో రోజు గాలింపు చర్యలు కొనసాగించారు. సహాయక బృందాలు కాలంతో పోటీ పడుతూ ముమ్మరంగా పని చేస్తున్నాయి. భీకర వరదల కారణంగా ప్రభావితమైన ఎనిమిది జిల్లాల్లో ఇప్పటిదాకా 794 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు.ఆగస్ట్ 26వ తేదీన నేపాల్–టిబెట్ సరిహద్దు సమీపంలో హిమానీనదం కూలిపోవడంతో సంభవించిన వరదలు ఉత్తర, మధ్య నేపాల్లోని పలు పట్టణాలు, గ్రామాలను తుడిచిపెట్టేశాయి. కీలకమైన మౌలిక సదుపాయాలను దారుణంగా దెబ్బతిన్నాయి. జలవిద్యుత్ కేంద్రాలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు 9,435 మందిని రక్షించామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరో 2,502 మంది జాడ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. మూడు జిల్లాల్లో 238 మంది విద్యార్థులు, 18 మంది ఉపాధ్యాయులు కనిపించకుండా పోయారని నేపాల్ విద్యాశాఖ ప్రకటించింది. గల్లంతైన వారిలో 320 మంది విదేశీయులు ఉన్నారు. అదృశ్యమైన తమ బంధువుల కోసం ప్రజలు ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. అయితే, ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలలో 17 మాత్రమే గుర్తించగలిగారని పోలీసులు తెలిపారు. అనేక మృతదేహాలు చాలావరకు కుళ్లిపోవడంతో వాటిని గుర్తించడం కష్టంగా మారింది. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఇప్పటివరకు 96 మృతదేహాలను ఖననం చేశారు. సహాయక శిబిరాల్లో సమస్యలు తీవ్రం నేపాల్లో అత్యవసర పరిస్థితి ఇంకా ముగియలేదు. బాధితులు తాత్కాలిక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. రసువాలో 3, నువాకోట్లో 15 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. నిరాశ్రయులైన సుమారు 3,500 మందికి పాఠశాలలు, ప్రభుత్వ, సామాజిక భవనాలలో తాత్కాలిక వసతి కల్పించారు. గర్భిణులు, బాలింతలు, వైద్య సంరక్షణ అవసరమైన వారితో సహా వృద్ధులు, చిన్నారులకు ఈ శిబిరాల్లో ఆశ్రయం కలి్పస్తున్నారు. అయితే ఈ శిబిరాల్లో తాగునీరు, పారిశుధ్య సదుపాయాల కొరత వేధిస్తోంది. ఇక్కడ జనం కిక్కిరిసిపోయి ఉండడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. పలు స్వచ్ఛంద సంస్థలు, బౌద్ధ మత సంస్థలు బాధితులకు సేవలందిస్తున్నాయి. సొరంగంలో కా ర్మీకుల కోసం గాలింపు వరద ప్రభావిత నువాకోట్లోని ఎగువ త్రిశూలి–3ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు నేపాల్ సైనిక ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాసువా, నువాకోట్ జిల్లాల్లోని తొమ్మిది జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద 537 మంది కా ర్మీకులు, ఉద్యోగుల ఆచూకీ తెలియకుండా పోయింది. త్రిశూలి–3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం వీటిలో ఒకటి. ఈ సొరంగంలో 42 మంది చిక్కుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు. వీరంతా భూగర్భ పవర్హౌస్ మరమ్మతు పనుల్లో ఉండగా ఒక్కసారిగా వరద ముంచెత్తించింది. వారిని కాపాడేందుకు ప్రభుత్వం 90 మంది సభ్యుల సహాయక బృందాన్ని రంగంలోకి దించింది. సమయస్ఫూర్తి ప్రదర్శించి, పిల్లల ప్రాణాలు కాపాడిన రాజేంద్ర దవాడీపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. భయపెడుతున్న భోటే కోశీ నది త్రిశూలి నదిలో కొత్తగా వచ్చిన వరద ధాటికి ఆదివారం మరో వంతెన ఆదివారం ఉదయం కొట్టుకుపోయింది. వంతెన కొట్టుకుపోవడంతో గండకి గ్రామీణ మున్సిపాలిటీ ప్రజలు పృథ్వీ హైవేకి వెళ్లే మార్గం తెగిపోయింది. దీంతోపాటే భోటే కోశీ నదిలో నీటిమట్టం పెరుగుతోందని అధికారులు హెచ్చరించారు. వరద ప్రభావిత జిల్లాల్లోని నివాసితులు, సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ఇప్పటివరకు ఆహార పదార్థాలతో కూడిన 37 ట్రక్కులు, ఆహారం, ఇతర సామగ్రితో నిండిన ఏడు హెలికాప్టర్లను పంపించారు. భారత ప్రభుత్వం 68.5 టన్నుల సహాయక సామగ్రిని అందజేసింది. గాలింపు, సహాయక చర్యల్లో సహకరించేందుకు సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులను పంపించింది. 11 టన్నుల సహాయక సామగ్రితో విమానం ఆదివారం భారత్ నుంచి నేపాల్కు చేరుకుంది. 1,643 మంది విద్యార్థుల్ని కాపాడిన టీచర్నేపాల్లోని వరద ప్రభావిత త్రిశూలి వ్యాలీలో ఓ ఉపాధ్యాయుడి అప్రమత్తత కారణంగా ఏకంగా 1,643 విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఇక్కడి త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్లో రాజేంద్ర దవాడీ ఇంగ్లిష్ టీచర్గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం 9.20 గంటల సమయంలో ఆయనకు ఓ స్నేహితుడి నుంచి వరద హెచ్చరిక అందింది. నది పక్కనే ఉన్న ఈ మూడంతస్థుల పాఠశాల భవనంలో 1,643 మంది విద్యార్థులున్నారు. హెచ్చరిక అందగానే రాజేంద్ర దవాడీ అప్రమత్తమయ్యాడు. వెంటనే బడిగంట కొట్టి విద్యార్థులందరినీ బయటకు తీసుకురావాలని మిగతా టీచర్లకు హెచ్చరికలు జారీచేశాడు. స్కూల్ బస్సు డ్రైవర్లను అప్రమత్తంచేశాడు. బస్సుల్లో విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే స్కూల్ వరద బురదలో మునిగింది.శిథిలాల కింద మృత్యువుతో 3 రోజుల పోరాటంప్రాణాలతో బయటపడిన ఆరేళ్ల చిన్నారి ఆరేళ్ల బాలిక శిథిలాల కింద మూడు రోజులపాటు మృత్యువుతో పోరాటం చేని ప్రాణాలతో బయటపడింది. వరదలవల్ల అతలాకుతలమైన నేపాల్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. రసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో బుధవారం వరదతో పెను విధ్వంసం చోటుచేసుకుంది. వందలాది ఇళ్లు కూలిపోయాయి. గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తుండగా, శుక్రవారం ఓ చిన్నారి రోదన వినిపించింది. శిథిలాలను తొలగించి ఆ బాలికను వెంటనే బయటకు తీశారు. తీవ్రంగా గాయాల పాలైనప్పటికీ సజీవంగా ఉండడంతో శుక్రవారమే హెలికాప్టర్లో కఠ్మాండులోని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయతి్నంచగా ప్రతికూల వాతావరణం వల్ల సాధ్యం కాలేదు. శనివారం ఆసుపత్రికి తరలించగలిగారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
న్యూజిలాండ్లో భూకంపం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో భూకంపం వచ్చింది. కెర్మెడెక్ దీవుల సమీపంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. అయితే దీనివల్ల ధన, ప్రాణ నష్టం ఏమైనా సంభివించిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
సైప్రస్లో విషాదం.. 270 మందితో వెళ్తున్న బోటు బోల్తా
నికోసియా: ఐరోపా దేశం సైప్రస్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు ( ఆదివారం) మధ్యదరా సముద్రంలో 270 మందితో ప్రయాణిస్తున్న ఫెర్రీబోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. వివరాలు తెలుసుకున్న సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.అక్కడి స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కిరెనియా పోర్టు నుండి బయిలుదేరిన కొద్దిసేపటికే బోటులోకి నీరు రావడం ప్రారంభమైంది. అనంతరం కొద్ది సేపటికే నదిలో మునిగిపోయిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు.ప్రమాదంలో ఇదివరకే 237 మందిని రక్షించారని మిగతా 24 మంది ప్రయాణికులు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. గల్లంతైన వారికోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
జాతీయం
ఎంతో కష్టపడి నీట్లో సక్సెస్..అంతలోనే విషాదం
సాక్షి, చెన్నై: పరీక్షల ఒత్తిడి కారణంగా మరో విద్యార్థిని జీవితం అర్థాంతరంగా ముగిసిసోయింది. తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన శ్రుతి లయ (21) అనే మెడికల్ ఆశావాది (NEET-UG అభ్యర్థి) నీట్ మొదటి విడత కౌన్సెలింగ్లో సీటు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.వైద్యురాలు కావాలనే లక్ష్యంతో వరుసగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.ఐటీ ఉద్యోగి కుమార్తె అయిన శ్రుతి లయ 2023లో పాఠశాల విద్యను పూర్తిచేసి, వైద్యురాలు కావాలనే కోరికతో నీట్ (NEET) కోచింగ్ సెంటర్లో చేరింది. గత ఏడాది NEET-UG పరీక్ష రాసినప్పటికీ వైద్య సీటు రాకపోవడంతో ఈ సంవత్సరం మళ్లీ తీవ్రంగా శ్రమించి నీట్-యుజి (NEET-UG) పరీక్షలో అర్హత సాధించింది. అయితే, ఇటీవల విడుదలైన మొదటి విడత కౌన్సెలింగ్ జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది.ఇదీ చదవండి: Nepal Flash Floods 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు!ఫలితం తెలిసిన రోజు రాత్రి నిద్రపోవడానికి వెళ్లిన ఆమె, మరుసటి రోజు ఉదయం కనిపించలేదు. కుటుంబ సభ్యులు గాలించగా ఇంటికి సమీపంలో ఉన్న ఒక షెడ్డులో ఉరివేసుకుని కనిపించింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.ఇదీ చదవండి: యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలం
భాష రాదని ఆపలేదు.. ఆటో డ్రైవర్ వినూత్న ప్రయోగం
ముంబై: మహారాష్ట్రలో ఆటో,ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాష నేర్చుకోవడం తప్పనిసరని అక్కడి ప్రభుత్వం ఇటీవల నిబంధన తీసుకవచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆటోడ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. ఓ వైపు మరాఠీ భాష నేర్చుకుంటూనే మరోవైపు ప్రయాణికులతో మెరుగ్గా కమ్యూనికేట్ చేసేందుకు తన ఆటోలో హిందీ నుంచి మరాఠీకి అనువదించిన చేతిరాత నోటును అతికించుకున్నారు. భాష కోసమై ఆటో డ్రైవర్ చేస్తున్న ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ షీట్లో ప్రయాణికులతో రోజువారీ సంభాషణల్లో ఉపయోగించే సాధారణ హిందీ పదాలు, వాక్యాలను వాటి మరాఠీ అనువాదాలతో ఈ షీట్లో రాసి ఉంచారు. మరాఠీ నేర్చుకుంటున్న ఆటో డ్రైవర్.. ప్రయాణికులతో మాట్లాడే సమయంలో అవసరమైన వాక్యాలను చూసుకుని ఉపయోగించుకునేలా ఈ షీట్ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులతో నిత్యం ఎదురయ్యే సాధారణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ షీట్ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇలా ప్రయాణికులతో రోజువారీ సంభాషణల్లో అవసరమయ్యే పలు సాధారణ వాక్యాలను హిందీతో పాటు వాటి మరాఠీ అనువాదాలతో ఈ షీట్లో పొందుపరిచారు. ప్రస్తుతం మరాఠీ నేర్చుకుంటున్న వ్యక్తికి ప్రయాణికులతో మాట్లాడే సమయంలో ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉండేలా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు సదరు ఆటో డ్రైవర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.కాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషపై ప్రాథమిక స్థాయిలో అవగాహన ఉండాలని నిబంధన తీసుకొచ్చింది. అంటే పూర్తి స్థాయిలో మరాఠీ చదవడం, రాయడం లేదా ఫ్లూయెంట్గా మాట్లాడడం తప్పనిసరి అని కాదు ప్రయాణికులతో సాధారణ సంభాషణ చేయగలిగేంత మరాఠీ భాష రావాలి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర రవాణా శాఖ అధికారిక సైట్లో 2026లో మోటార్ వెహికల్ రూల్స్కు చేసిన సవరణలు సైతం నమోదు చేసింది.
ఆ ఘోర ఘటనను గుర్తు చేసిన మోహన్ భగవత్..
ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం.. 349 ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. రెండు విమానాలు ఎదురెదురుగా ఢీకొన్న ఆ ఘటన అత్యంత విషాదకర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. 1996లో జరిగిన ఈ చార్ఖీ దాద్రి ఘోర ప్రమాదాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా గుర్తుచేశారు. ప్రమాదం తర్వాత ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చేపట్టిన సహాయక చర్యలను ప్రస్తావిస్తూ.. అప్పట్లో మృతులు ముస్లింలా, ఇతరులా అని తాము చూడలేదంటూ ఆయన పేర్కొన్నారు.న్యూయార్క్లో జరిగిన ‘వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 1996 నవంబర్ 12న దాద్రి మీదుగా వెళ్తున్న రెండు ప్రయాణికుల విమానాలు గాల్లోనే ఢీకొన్నాయని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది ముస్లింలేనని గుర్తుచేశారు. ఆ సమయంలో వారు ముస్లింలా? అని మేం ఎప్పుడూ ఆలోచించలేదని.. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారని భగవత్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయకపోవడం వల్లే ఆర్ఎస్ఎస్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయగలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రతిఫలం ఆశించకపోవడంతో తమ సేవా కార్యక్రమాలను ఆర్ఎస్ఎస్ ప్రచారం చేసుకోదని తెలిపారు.1996 నవంబర్ 12న హరియాణాలోని చార్ఖీ దాద్రి గ్రామం మీదుగా వెళ్తున్న సమయంలో సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 747, కజకిస్థాన్ ఎయిర్లైన్స్కు చెందిన ఇల్యూషిన్ IL-76 విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. ఢిల్లీకి సుమారు 100 కిలోమీటర్ల పశ్చిమాన ఈ ప్రమాదం జరిగింది. రెండు విమానాల్లో ఉన్న మొత్తం 349 మంది మరణించారు. సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ విమానం జెడ్డా నుంచి ఢిల్లీకి వస్తోంది. అందులో 312 మంది ఉన్నారు.మరోవైపు కజకిస్థాన్ ఎయిర్లైన్స్ విమానం ఢిల్లీ నుంచి కజకిస్థాన్లోని చిమ్కెంట్కు బయలుదేరింది. అందులో 37 మంది ఉన్నారు. కజక్ విమానం 15,000 అడుగుల ఎత్తులో కొనసాగాల్సి ఉండగా.. నిర్దేశించిన దానికంటే దిగువకు వచ్చింది. సుమారు 14,000 అడుగుల ఎత్తులో రెండు విమానాలు ఒకే మార్గంలోకి రావడంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులోని వారెవరూ ప్రాణాలతో బయటపడలేదు.ప్రమాదానికి దారితీసిన ప్రధాన సమస్యల్లో కమ్యూనికేషన్ లోపం ఒకటని దర్యాప్తులో తేలింది. కజకిస్థాన్ ఎయిర్లైన్స్ సిబ్బందికి ఇంగ్లిష్ భాషపై పరిమిత పరిజ్ఞానం ఉండటంతో పాటు.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి వచ్చిన కొన్ని సమాచారాన్ని రేడియో ఆపరేటర్ ద్వారా అందించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇచ్చిన ఎత్తుకు సంబంధించిన ఆదేశాలపై గందరగోళం ఏర్పడింది. కజక్ విమానానికి ఎక్కువ ఎత్తులో ప్రయాణించాల్సిందిగా సూచించినప్పటికీ.. అది మరింత దిగువకు వచ్చింది. అదే సమయంలో సౌదీ విమానం కూడా అదే గగనతలంలో దిగుతుండటంతో రెండు విమానాలు ఢీకొన్నాయి.
యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలం
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్ కేడర్కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ తీసుకున్న సంచలన నిర్ణయం నెట్టింట వైరల్గా మారింది. యూపీ రెవెన్యూ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న దివ్య మిట్టల్, 13 ఏళ్ల సుదీర్ఘ కరియర్కు రాజీనామా చేశారు. సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ, ప్రజా సేవలో గడిపిన తన సంవత్సరాలను ఒక మరపురాని అధ్యాయంగా మిట్టల్ అభివర్ణించారు.ఐఏఎస్లో 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ను ముగిస్తూ, మిట్టల్ తన దృష్టిలో, అధికారిక పదవిని వదిలివేయడం అంటే, తనను భారతదేశానికి తిరిగి తీసుకువచ్చిన ఉన్నతమైన లక్ష్యాన్ని విడిచిపెట్టడం కాదని వ్యాఖ్యానించారు. తాను ఈ పదవిని వీడుతున్నప్పటికీ, సేవ వైపు తనను ఆకర్షించిన గొప్ప కల మాత్రం కొనసాగుతుందని ఆమె అన్నారు. అదే విధంగా ప్రజా సేవపై తన మారుతున్న అవగాహన గురించి, తన వృత్తి జీవితంలో తాను కనుగొన్న ఉద్దేశ్యం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఒకప్పుడు తన కోసం తాను కన్న వ్యక్తిగత కలలు ఇప్పటికే నెరవేరాయని, ఇప్పుడు తాను ఇతరుల కోసం కన్న కలల కోసం జీవించాలను కుంటున్నానని మిట్టల్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.‘‘ఈ నేల నాకు విద్యను, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ రుణం తీర్చుకోవడానికే సివిల్ సర్వీసెస్లోకి వచ్చాను" అని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. తాను ఒకప్పుడు విజయంగా భావించిన దానిని సాధించి నప్పటికీ, ఏదో అసంపూర్ణంగా మిగిలిపోయిందని అనిపించిందని ఆమె తన రాజీనామా లేఖలో గుర్తు చేసుకున్నారు. భారతదేశానికి దూరంగా జీవించడం తనను కలవరపెట్టిందనీ, అందుకే దేశానికి తిరిగి వచ్చి ఐఏఎస్లో చేరినట్టు చెప్పుకొచ్చారు. లండన్లో ఉన్నతమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి దేశసేవ కోసం భారత్ వచ్చినమిట్టల్ తాజా రాజీనామా చర్చకు దారి తీసింది. आज मैंने 13 वर्षों की अविस्मरणीय यात्रा को अपनी इच्छा से विराम देते हुए IAS से त्यागपत्र दे दिया है।साधारण परिवेश में पलते हुए मैंने एक अच्छे, सफल जीवन का सपना देखा था। दिन-रात एक कर IIT दिल्ली और IIM बैंगलोर से पढ़ने के बाद, लंदन में नौकरी लग गयी। पर 'सब कुछ' पा लेने पर भी कुछ… pic.twitter.com/4VRXpK8nu8— Divya Mittal (@divyamittal_IAS) August 30, 2026 అలాగే కుటుంబాలు తొలిసారిగా భూమి హక్కులను పొందడం, దివ్యాంగులు గౌరవప్రదంగా జీవించే అవకాశాలను పొందడం, రైతులు తమ పొలాలకు నీటిని అందుకోవడం వంటివి చూడటమే ప్రజా సేవలో అత్యంత సంతృప్తి నిచ్చిన ఉదంతాలన్నారు. ప్రజలకు ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ప్రజా సేవలోకి ప్రవేశించానని , అయితే, సంవత్సరాలు గడిచేకొద్దీ, వారి సంతోషం, ఆప్యాయత , నమ్మకం రూపంలో తాను వారి నుండి అంతకంటే ఎంతో ఎక్కువ పొందానంటే సంతోషాన్ని వెలిబుచ్చారు. తన పదవీ కాలంలో తనతో పాటు పనిచేసిన సహోద్యోగులకు, అధికారులకు ,ఉద్యోగులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు లభించిన ప్రేమ, మర్యాద, ఆప్యాయత తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని, కష్ట సమయాల్లో కూడా ముందుకు సాగడానికి అవి తోడ్పడ్డాయన్నారు.లహూరియా దేహ్ గ్రామానికి మొదటిసారిగా నీరు రావడం చూసి, ఒక వృద్ధురాలు వణుకుతున్న చేతులతో తన తలను తాకడాన్ని మిట్టల్ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ 75 ఏళ్ల నిరీక్షణ తర్వాత 125 కుటుంబాలకు పైపుల ద్వారా కుళాయి నీటిని అందించింది. తన వీడ్కోలు ప్రసంగంలో, పరిపాలన ,బాధ్యతపై తన అవగాహనను తీర్చిదిద్దడంలో ఈ రెండు పోస్టింగ్లే కీలకమని వ్యాఖ్యానించడం విశేషం. న్యాయమైన దాని పక్షాన నిలబడటం ఒక ఐచ్ఛికం కాదని, అది ఒక కర్తవ్యం అని డియోరియా తనకు నేర్పించిందనీ. "అసాధ్యం అనేది వాస్తవం కాదు, కేవలం ఒక అభిప్రాయం మాత్రమే" అని మీర్జాపూర్ తనకు నేర్పించిందన్నారు. అయితే లండన్లో ఉన్నతమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి దేశసేవ కోసం భారత్ వచ్చినమిట్టల్ తాజా రాజీనామా చర్చకు దారి తీసింది. మరోఆణిముత్యం లాంటి ఆఫీసర్ను కోల్పోయాం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయిఇదీ చదవండి: Nepal Flash Floods 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు!ఎవరీ దివ్య మిట్టల్ఢిల్లీకి చెందిన ఈమె ఐఐటీ ఢిల్లీనుంచి ఇంజినీరింగ్, ఐఐఎమ్ బెంగళూరు నుంచి మేనేజ్మెంట్ పూర్తి చేశారు. లండన్లో ఫైనాన్స్ విభాగంలో అధిక జీతంతో కూడిన ఉద్యోగం సాధించినప్పటికీ, దేశానికి సేవ చేయాలనే తపనతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్కు తిరిగొచ్చారు. UPSC సాధించి IAS అధికారిణిగా మారారు. అలా మిట్టల్ తన ఐఏఎస్ కెరీర్లో యూపీలోని మీర్జాపూర్ , సంత్ కబీర్ నగర్, జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. అలాగే రెవెన్యూ శాఖలో స్పెషల్ సెక్రటరీగా సేవలు అందించారు. ముఖ్యంగా మీర్జాపూర్లోని 'లహురియా దిహ్' (Lahuriya Dih) కొండ ప్రాంత గ్రామానికి తొలిసారిగా తాగునీరు అందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. మిట్టల్ మే నెలలో డియోరియా నుండి లక్నోకు రెవెన్యూ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆమె భర్త గగన్దీప్ సింగ్ కూడా ఐఏఎస్ అధికారి. ఐఐటి ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు పూర్వ విద్యార్థి.ఇదీ చదవండి: తుకారాం ముండేకు భారీ ఎదురు దెబ్బ, హైకోర్టు మండిపాటు
ఎన్ఆర్ఐ
ఫిలిప్పీన్స్: ఇండియన్ ఎంబసీని సందర్శించిన ఎన్నారై అడ్వైజరీ కమిటీ
మనీలా: తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన వలస విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ బృందం సభ్యులు బుధవారం ఫిలిప్పిన్స్ దేశ రాజధాని మనీలాలోని ఇండియన్ ఎంబసీని సందర్శించారు. ఆ తర్వాత మనీలాలోని కమిషన్ ఆన్ ఫిలిప్పీన్స్ ఓవర్సీస్ ఉన్నతాధికారులతోనూ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఉత్తమ వలస విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫిలిప్పీన్స్ దేశ వలస విధానాన్ని ఆ దేశ ఉన్నత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీ సభ్యులకు వివరించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వలస విధానాన్ని అమలు చేస్తున్న ఫిలిప్పీన్స్ దేశంలో అమలులో ఉన్న విధి విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి ఇదే తరహా మెరుగైన వలస విధానాన్ని గల్ఫ్ కార్మికుల కోసం అమలు చేసేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి వెల్లడించారు.ఫిలిప్పిన్స్ దేశ రాజధాని మనీలాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అంబసడర్ హర్ష కుమార్ జైన్, ఫస్ట్ సెక్రటరీ నీలేష్ కుమార్ రాయ్ లతో వలస కార్మికుల విధానాల అంశాలపై కమిటీ సభ్యులు సుధీర్ఘంగా చర్చించారు. గల్ఫ్ కార్మికులను సంక్షేమం కోసం ఫిలిప్పీన్స్ తరహా విధానాలను అమలు చేస్తామన్నరాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఎన్నారై అడ్వైజరి కమిటీ ఫిలిప్పీన్స్ దేశంలో పర్యటిస్తోంది.ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల, ప్రొఫెసర్లు విజయ్ కొర్ర, శ్రీనివాస్ జునుగురు, లైజన్ ఆఫీసర్ ఆది కార్తీక్, తదితరులు ఈ బృందంలో ఉన్నారు.
వైభవంగా సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట అంతర్జాతీయ పోటీలు
అమెరికాలోని చార్లెట్ నగరంలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు మాట్లాట 2026 అంతర్జాతీయ పోటీలు హిల్టన్ చార్లెట్ ఎయిర్పోర్ట్ రిసార్ట్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. పారుపూడి కిరణ్, తాళ్లూరి ప్రత్యూష, గొల్లపూడి సీతారామ్ నాయకత్వంలో జరిగిన ఈ పోటీల్లో అమెరికా, కెనడాలోని పలు ప్రాంతాల నుంచి 200 మందికి పైగా తెలుగు పిల్లలు పాల్గొన్నారు. దాదాపు 1000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ప్రముఖ నటుడు, దర్శకుడు, సంగీత విద్వాంసుడు శ్రీ ప్రభల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తెలుగు భాషా నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీల్లో పదరంగం (తెలుగు పదాలు వ్రాసే ఆట), తిరకాటం (తెలుగు ప్రశ్నోత్తరాల ఆట), ఒనిమా – ఒక్క నిమిషం మాత్రమే (తెలుగులో మాట్లాడే ఆట) అనే మూడు విభాగాల్లో బుడతలు (5–7), సిసింద్రీలు (8–11), చిరుతలు (12–16) వయోవర్గాల్లో పోటీలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో అమెరికా, కెనడాలోని పలు కేంద్రాల్లో జరిగిన ప్రాథమిక పోటీల్లో విజేతలైన పిల్లలు తమ కుటుంబాలతో కలిసి చార్లెట్కు చేరుకుని మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో వేడుకల్లో పాల్గొన్నారు.ముఖ్య అతిథి శ్రీ ప్రభల శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేస్తూ.. సిలికానాంధ్ర నాకు అత్యంత అభిమాన సంస్థ. మనబడి నిర్వహిస్తున్న తెలుగు మాట్లాట పోటీల స్థాయి, ఏర్పాట్లు, పిల్లల భాషా పటిమ నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. తెలుగు తెలిసిన యువతకు ఉద్యోగం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో ప్రయోజనాలు ఉన్నాయి. తెలుగు తెలిసిన వారు సంగీతం, నాట్యం, నటన వంటి కళల్లో కూడా సులభంగా రాణించడాన్ని నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. తెలుగు మాట్లాట బృందం నిబద్ధత, సమర్థత అభినందనీయం అని అన్నారు.
సోషల్ మీడియాలో సంచలనంగా కన్సల్టెంట్ కథ!
ఇండియాకు చెందిన ఓ మేనేజ్మెంట్ కన్సల్టెంట్.. త రెండున్నర ఏళ్లలో రూ.6.5 కోట్లు ఆదా చేసినట్టు, తన మొత్తం నెట్ వర్త్ను రూ.1 కోటి నుంచి రూ.7.5 కోట్లకు పెంచుకున్నట్టు రెడ్డిట్లో పంచుకున్న పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.'From Rs 1 Cr at 34 to Rs 7.5 Cr at 37: My Middle East Consulting Journey' పేరుతో పెట్టిన ఈ పోస్టులో, 37 ఏళ్ల ఈ వ్యక్తి తన కెరీర్, ఆదాయం, పొదుపు, పెట్టుబడుల వివరాలను వివరంగా పంచుకున్నాడు. ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు దేశంలోని టాప్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఈయన, ప్రస్తుతం ఒక ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేస్తున్నాడు.కెరీర్, జీతం ఎలా పెరిగాయంటే...22 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేట్ ట్రైనీగా కెరీర్ మొదలుపెట్టిన ఈయన, అప్పుడు ఏడాదికి రూ.10 లక్షలు సంపాదించేవాడు. ఎంబీఏ పూర్తయ్యాక 26 ఏళ్లకు మేనేజ్మెంట్ కన్సల్టింగ్లోకి అడుగుపెట్టాడు, అప్పటి వార్షిక ఆదాయం రూ.25 లక్షలు. 29 ఏళ్లకు మరో కెరీర్ మార్పుతో ఇండస్ట్రీ రోల్లోకి మారి, రూ.40 లక్షల ప్యాకేజీ అందుకున్నాడు. తర్వాతి ఐదేళ్లలో జీతం క్రమంగా పెరుగుతూ రూ.65 లక్షలకు చేరింది. ఈ కాలంలోనే పీఎఫ్, బంగారం, స్టాక్స్, రియల్ ఎస్టేట్లలో పెట్టుబడులతో దాదాపు రూ.1 కోటి నెట్ వర్త్ సాధించాడు.పశ్చిమాసియా మలుపు తిప్పిన సంపద34 ఏళ్ల వయసులో మళ్లీ కన్సల్టింగ్ రంగంలోకి వెళ్లి, పశ్చిమాసియాకు మారిన ఈయన జీతం ఒక్కసారిగా రూ.3.5 కోట్లకు (సుమారు 4 లక్షల డాలర్లు) పెరిగింది. అదీ పన్ను లేకుండా. ఈ భారీ జీత పెరుగుదలే ఆదా వేగాన్ని పెంచింది. "ఇప్పుడు 37 ఏళ్ల వయసులో, గత రెండున్నర ఏళ్లలో దాదాపు రూ.6.5 కోట్లు ఆదా చేశాను, నా నెట్ వర్త్ రూ.7.5 కోట్లకు చేరింది" అని ఆయన పోస్టులో పేర్కొన్నాడు.తన ప్రస్తుత ఆస్తుల గురించి కూడా వివరించాడు. ముంబైలో పూర్తిగా చెల్లించిన మూడు ప్రాపర్టీలు, భౌతిక బంగారం, సావరిన్ గోల్డ్ బాండ్ల రూపంలో సుమారు 700 గ్రాముల బంగారం, ఈక్విటీల్లో దాదాపు రూ.30 లక్షల పెట్టుబడి ఉన్నట్టు తెలిపాడు. రాబోయే కాలంలో ఈక్విటీ పోర్ట్ఫోలియోను మరింత పెంచుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ రెడ్డిట్ యూజర్లను బాగా ఆకట్టుకుంది. కొందరు తమ కెరీర్, ఫైనాన్స్ గురించి సీరియస్గా ఆలోచించేలా ప్రేరణ ఇచ్చిందని చెప్పగా, మరికొందరు ఇంత సంపద సాధించడం వెనుక ఏళ్ల కృషి, కష్టమైన నిర్ణయాలు ఉంటాయని కొనియాడారు. అధిక జీతాలు, పన్ను మినహాయింపులతో మిడిల్ ఈస్ట్ సంపద నిర్మాణానికి 'చీట్ కోడ్' లాంటిదని కొందరు వ్యాఖ్యానించారు. విదేశాలకు మారడం ఎలా సాధ్యమైందో, కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏం చేయాలో తెలుసుకోవాలని కొందరు ఆసక్తి చూపారు.
27 ఏళ్లుగా అమెరికాలోనే.. ICE అదుపులో ఎన్నారై మహిళ!
అమెరికాలో 27 ఏళ్లుగా నివసిస్తున్న ఓ భారత సంతతి మహిళకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా (గ్రీన్కార్డ్) ఉన్నప్పటికీ.. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆమెను అదుపులోకి తీసుకుంది. అంతేకాదు.. ఆమెపై గతంలో కొనసాగిన డిపోర్టేషన్ కేసును ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఇప్పటికే కొట్టివేసినప్పటికీ ఈ అరెస్టు జరగడం చర్చనీయాంశంగా మారింది.వెంకట నరసమాంబ వాసంశెట్టి అనే మహిళను ఆగస్టు 11న సాధారణ చెక్-ఇన్కు హాజరైన సమయంలో ICE అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను జార్జియాలోని డిటెన్షన్ కేంద్రంలో ఉంచినట్లు సమాచారం. 2013 నుంచి ఆమెకు అమెరికాలో లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ (LPR) హోదా ఉంది.క్రిమినల్ రికార్డ్ లేదు..వాసంశెట్టి కుటుంబం దాదాపు మూడు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడింది. నార్త్ కరోలినాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించే ఉపాధ్యాయురాలిగా ఆమె పనిచేసినట్లు ఆమె కుటుంబ న్యాయవాది వెల్లడించారు. ఆమెకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని, ఇద్దరు అమెరికా పౌరులైన పిల్లలు, ఇద్దరు అమెరికా పౌరులైన మనవళ్లు ఉన్నారని తెలిపారు.ఆమె ఇల్లు, ఉద్యోగం, కుటుంబం మొత్తం అమెరికాలోనే ఉన్నాయని.. గ్రీన్కార్డ్ను వదులుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చెబుతున్నారు.ఏడు నెలలు భారత్లో ఉన్నందుకేనా?వాసంశెట్టి 2022 జూలైలో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను చూసుకునేందుకు భారత్కు వెళ్లారు. అక్కడ ఉండగానే ఆమెకు కోవిడ్ సోకడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని న్యాయవాదులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో దాదాపు రెండు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు చెప్పారు. దీంతో ఆమె అమెరికాకు తిరిగి రావడం ఆలస్యమైంది. చివరకు 2023 ఫిబ్రవరిలో రాలీ-డర్హామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా అమెరికాకు చేరుకున్నారు. మొత్తం మీద ఆమె సుమారు ఏడు నెలలు భారత్లో ఉన్నారు. అయితే.. ఈ వ్యవధినే అమెరికా ప్రభుత్వం ఆమె గ్రీన్కార్డ్ హోదాను ప్రశ్నించడానికి ప్రధాన కారణంగా చూపినట్లు సమాచారం. అమెరికా వెలుపల ఎక్కువ కాలం ఉండటం వల్ల శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే ఉద్దేశం ఉందా? అనే అంశాన్ని అధికారులు పరిశీలించవచ్చు.‘అమెరికాను వదిలే ఉద్దేశమే లేదు’అయితే వాసంశెట్టి మాత్రం అమెరికాలో తన జీవితాన్ని కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆధారాలు సమర్పించారు. భారత్కు వెళ్లిన సమయంలోనూ అమెరికాలో తన ఉద్యోగం, కుటుంబం, ఇల్లు వంటి సంబంధాలను కొనసాగించారని ఆమె తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. అంతేకాదు.. భారత్లో ఉన్న సమయంలోనే నార్త్ కరోలినాలో తన ప్రధాన నివాసంగా ఉపయోగించుకునే ఇంటిని కొనుగోలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. తల్లిదండ్రుల అనారోగ్యం, తన ఆరోగ్య సమస్యల కారణంగా జరిగిన తాత్కాలిక ప్రయాణాన్ని అమెరికా శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే నిర్ణయంగా చూడలేమని వాదించారు.కోర్టు కేసు కొట్టేసినా.. మళ్లీ అరెస్టువాసంశెట్టిపై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) డిపోర్టేషన్ చర్యలు ప్రారంభించింది. అయితే కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించేందుకు కోర్టు విధించిన గడువులో DHS విఫలమైందని ఆమె న్యాయవాది తెలిపారు. దీంతో 2026 మే 19న ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఆమెపై కొనసాగుతున్న డిపోర్టేషన్ ప్రక్రియను ముగించారు. ఆ తర్వాత కూడా ఆమెకు విధించిన ICE చెక్-ఇన్లకు క్రమం తప్పకుండా హాజరవుతూ వచ్చారు. అలా ఆగస్టు 11న చెక్-ఇన్కు వెళ్లిన సమయంలోనే ICE అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.‘ఆమె గ్రీన్కార్డ్ హోల్డర్ కాదు’వాసంశెట్టిని అదుపులోకి తీసుకున్న తర్వాత ICE మాత్రం ఆమె గ్రీన్కార్డ్ హోల్డర్ కాదని వాదిస్తున్నట్లు ఆమె న్యాయవాదులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆగస్టు 13న ఆమె తరఫు న్యాయ బృందం అత్యవసర హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఫెడరల్ న్యాయమూర్తి.. ఆమెను నిర్బంధించడానికి ఉన్న చట్టపరమైన ఆధారాలను మూడు రోజుల్లో వివరించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించారు.తర్వాత ఏం జరగొచ్చు?తాజా కోర్టు పరిణామాల ప్రకారం.. ఆమెను వెంటనే విడుదల చేయాలని ఆదేశం వెలువడలేదు. అయితే కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, వాసంశెట్టికి బెయిల్పై విడుదల కావచ్చా? అనే అంశాన్ని పరిశీలించేందుకు ఇమ్మిగ్రేషన్ జడ్జి ఎదుట బాండ్ హియరింగ్ జరిగే అవకాశం ఉంది.27 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ.. గ్రీన్కార్డ్ ఆధారంగా జీవనం సాగిస్తున్న ఓ భారత సంతతి మహిళను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు అమెరికాలోనే కాకుండా భారతీయ సమాజంలోనూ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తాత్కాలికంగా విదేశాల్లో ఎక్కువకాలం ఉండటం వల్ల గ్రీన్కార్డ్ హోదాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది.
క్రైమ్
కువైట్ నుంచి సుపారీ.. లైవ్ వీడియో మర్డర్!
రాయచోటి టౌన్/వీరబల్లె: వివాహేతర సంబంధం అనుమానంతో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘోర ఉదంతం అన్నమయ్య జిల్లా వీరబల్లె మండలం ఓదివీడులో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కడపకు చెందిన బాషాకు, ఓదివీడుకి చెందిన బేల్దారి ఖాదర్ బాషా కుమార్తె షాహీదాతో 2010లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. షాహీదా ఏడేళ్ల క్రితం కువైట్ నుంచి స్వదేశానికి వచ్చి, పుట్టిన ఊరు ఓదివీడులోనే ఇల్లు నిర్మించుకుని ఉంటోంది. ఆమె భర్త బాషా కువైట్ నుంచి కుటుంబానికి కావాల్సిన ఆర్థిక అవసరాలు తీర్చేవాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భర్త బాషా పిన్నమ్మ కుమారుడైన ఖాసీం (ఇతడు కూడా కువైట్లో ఉంటూ అప్పుడప్పుడూ ఓదివీడుకు వచ్చిపోయేవాడు) తరచూ ఓదివీడులోని షాహీదా ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. దీనిపై భర్త బాషాకు తీవ్ర అనుమానం వచ్చి పగ పెంచుకున్నాడు. కువైట్ నుంచి సుపారీ.. లైవ్ వీడియోలు తీసి కిరాతకం పది రోజుల క్రితమే ఖాసీం కువైట్ నుంచి ఇంటికి వచ్చిన విషయం బాషాకు తెలిసింది. దీంతో ఆయన తన మరో పిన్నమ్మ కుమారులు అయిన బాబ్జి, ఖాదర్వలిని పురమాయించాడు. ఖాసీంను వెంటాడి చంపాలని, ఆ సమయంలో తనకు వీడియోలు తీసి పంపాలని వారికి సూచించాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం బాబ్జి, ఖాదర్వలి ఓదివీడుకు చేరుకున్నారు. అప్పటికే ఇంట్లో ఖాసీం, షాహీదాతోపాటు ఆమె కుమార్తె ఉన్నారు. నిందితులిద్దరూ లోపలికి వెళ్లి గడియలు పెట్టారు. తమతో తీసుకొచ్చిన కర్ర, బెల్ట్తో ఖాసీం, షాహీదాలను తీవ్రంగా కొట్టారు. షాహీదా కుమార్తెతో బలవంతంగా వీడియోలు తీయించి కువైట్లోని బాషాకు పంపారు. ఈ ఘటన దాదాపు రెండు గంటలపాటు సాగింది. లోపల జరుగుతున్న అరాచకాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. అయితే పోలీసులు సకాలంలో ఘటనా స్థలానికి రాలేదు. చివరికి ఖాసీం చనిపోయాడని నిర్ధారించుకున్న నిందితులు.. గదుల్లో ఉన్న రక్తపు మరకల్ని నీళ్లతో పూర్తిగా కడిగేసి సాక్ష్యాలను రూపుమాపే ప్రయత్నం చేశారు. నిందితులు తలుపులు తీయగానే స్థానికులు బాబ్జీని పట్టుకుని, ఘటనా స్థలానికి చేరుకున్న వీరబల్లె ఎస్ఐ సుస్మితారెడ్డికి అప్పగించారు. అనంతరం పోలీసులు ఇల్లు, లోపలి ప్రాంతాలను తనిఖీ చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఖాసీం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పూజలు చేసి.. డబ్బులు రెట్టింపు చేస్తానని..
బేస్తవారిపేట: తాను పూజలు చేసి డబ్బును రెట్టింపు చేస్తానని నమ్మించి రూ.25లక్షలు తీసుకుని ఓ మహిళను మరో మహిళ దారుణంగా హత్య చేసి పొలంలో పూడ్చిపెట్టింది. ఈ ఘటన మార్కాపురం జిల్లా అర్థవీడు మండలం వీరభద్రాపురంలో జరిగింది. కంభం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.మల్లికార్జున శనివారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం... వీరభద్రాపురానికి చెందిన గుమ్మా రాజమ్మ తాను డబ్బులు పెట్టి పూజలు చేస్తే రెట్టింపు అవుతాయని పెద్దారవీడు మండలం ప్రగళ్లపాడుకు చెందిన ముడమంచు ఆదిలక్ష్మి(33)ని నమ్మించింది.రాజమ్మకు ఆదిలక్ష్మి రూ.25లక్షలు ఇచ్చి పూజలు చేసి డబ్బులు రెట్టింపు చేయాలని కోరింది. అయితే, జూన్ 21 నుంచి ఆదిలక్ష్మి కనిపించకపోవడంతో ఆమె భర్త బాలగురవయ్య పెద్దారవీడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణలో గుమ్మా రాజమ్మను అనుమానితురాలిగా పోలీసులు గుర్తించారు. డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని గుమ్మా రాజమ్మ తన భర్త బుజ్జి గురవయ్యతో కలసి ఆదిలక్ష్మిని హత్య చేసి వీరభద్రాపురంలోని తమ పంటపొలంలో పూడ్చిపెట్టారని నిర్ధారించారు. ఆమె సెల్ఫోన్ను సమీపంలోని చెక్డ్యామ్లో పడేశారని గుర్తించారు.ఆదిలక్ష్మి మృతదేహాన్ని శనివారం పోలీసులు బయటకు తీసి తహశీల్దార్, జిల్లా ఫోరెన్సిక్ అధికారుల సమక్షంలో శవపంచనామా నిర్వహించారు. నిందితులు రాజమ్మ, బుజ్జి గురవయ్యను సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని సీఐ తెలిపారు. నారాయణరెడ్డిపల్లెకు చెందిన రవిని కూడా రాజమ్మ ఇదే తరహాలో నమ్మించి రూ.45లక్షలు తీసుకున్నారని చెప్పారు. దానిలో రూ.16లక్షల మేర ఆదిలక్ష్మికి ఇచ్చారని పేర్కొన్నారు.
కాపురానికి రాలేదని భార్య దారుణ హత్య
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె మండలం కోళ్లబైలు–1 బయ్యారెడ్డి కాలనీలో శనివారం పట్టపగలే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నేర చరిత్ర ఉండి, పదేళ్ల జైలుశిక్ష తర్వాత ఇటీవలే విడుదలైన తంబళ్లపల్లె మండలం దిగువపల్లికి చెందిన కె.మధుకర్రెడ్డి, తనతో కాపురానికి రావడానికి నిరాకరించిందన్న కసితో భార్య దండామణి(38)ని మచ్చు కత్తితో కిరాతకంగా నరికి చంపేశాడు. వీరికి ఇద్దరు పిల్లలు. 19 ఏళ్ల కిందట స్వగ్రామంలో బాంబు దాడి కేసుతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన మధుకర్రెడ్డిపై బెంగళూరులో ఏటీఎం చోరీ, పీలేరు, ధర్మవరంలో హత్యాయత్నం కేసులున్నాయి. జైలు నుంచి వచ్చాక కాపురానికి రావాలని భార్యను వేధిస్తూ.. ఇటీవల బావమరిదిపై దాడి చేశాడు. కాగా, శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అనంతరం బావమరిదికి ఫోన్ చేసి.. ‘ఇంకా ఇద్దరున్నారు.. వారిని కూడా చంపి నేనూ చచ్చిపోతా’ అంటూ హెచ్చరించాడు. బాధితుడు ఈ ఆడియో రికార్డింగ్ను డీఎస్పీ బుచ్చిరాజుకు వినిపించడంతో ఆయన పోలీసులను అప్రమత్తం చేశారు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
'నా భర్తని చంపేస్తానని బెదిరించి నాపై లైంగిక దాడి'
తూర్పు గోదావరి జిల్లా: నర్సరీలో తన భర్తతో పనిచేసే సురేంద్ర అలియాస్ చిన్న తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బుర్రిలంకకు చెందిన 19 ఏళ్ల మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళ తన భర్తతో కలిసి బుర్రిలంక నర్సరీకి ఈ ఏడాది జూలైలో పని కోసం వచ్చారు. అప్పటి నుంచి నర్సరీలో పనిచేస్తూ కార్యాలయ భవనం పక్కన నివసిస్తున్నారు.ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ ఉదయం సుమారు 6:45 గంటలకు, ఆమె భర్త యథావిధిగా పనికి వెళ్లాడు. అనంతరం 7 గంటలకు అదే నర్సరీలో పనిచేస్తున్న సురేంద్ర అలియాస్ చిన్న ఆమె ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తన భర్తకు చెపుతానని హెచ్చరించడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం 8.50 నిమిషాలకు మళ్లీ వచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఎవరికైనా చెప్తే భార్యాభర్తలిద్దరినీ చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తన భర్తకు ఆమె విషయాన్ని వివరించింది. దీంతో అతడు నర్సరీ యజమానికి ఆ విషయం చెప్పగా ఆయన సూచన మేరకు బాధితురాలు ఆమె బంధువులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: సాధిక్ చేతిలో రూ.2 కోట్ల ఓడీ ఖాతా!
వీడియోలు
శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్
ఆసియా కప్ లో భారత మహిళల సత్తా.. థాయ్ లాండ్ పై తిరుగులేని గెలుపు..
విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై బొత్స రియాక్షన్
రౌడీషీటర్ కమ్మసాయి దారుణ హత్య.. అసలేం జరిగింది..?
రిలీజ్ తర్వాత ముస్తఫా ఫస్ట్ రియాక్షన్
నీకు చేతకాకపోతే చెప్పు.. చంద్రబాబుకు బొప్పరాజు సవాల్
ABN రాధాకృష్ణని ఒక్కటే అడుగుతున్నా జోగి రమేష్ ఫైర్
నీకు టైం దగ్గర పడింది సాయిరెడ్డి... ఎవరిని చూసి రెచ్చిపోతున్నావో మాకు తెలుసు!
జైలు నుంచి ముస్తఫా విడుదల
ఇతను అసలైన రియల్ హీరో

