వడగాలులతో అట్టుడుకుతున్న యూరప్
వడగాలుల ధాటికి ఐరోపా ఖండం అట్టుడికిపోతుంది. గతంలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎండ వేడిమి తట్టుకోలేక వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. వడగాలల ధాటికి కేవలం ఒక్క వారంలోనే సాధారణం కంటే సుమారు 16,000 మందికి పైగా అదనంగా మరణించారని యూరోపియన్ మోర్టాలిటీ మానిటరింగ్ నెట్వర్క్ సర్వేలో తేలింది.ఈ మరణాలలో అత్యధికంగా ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ వంటి ఉత్తర,వాయువ్య ఐరోపా దేశాల నుంచే నమోదయ్యాయి. సాధారణంగా చల్లటి వాతావరణానికి అలవాటుపడిన ఈ దేశాల ప్రజలు, ఒక్కసారిగా సంభవించిన ఈ తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఐరోపా అంతటా ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు, కేవలం ఫ్రాన్స్, బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ బెల్జియం ,జర్మనీ దేశాలలో మరణాల సంఖ్య పెద్దఎత్తున పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఆయా దేశాలు ఇటువంటి ఆకస్మిక వేడిని తట్టుకునేందుకు ముందస్తుగా సిద్ధంగా లేకపోవడమే అని సర్వే తేల్చింది.ఉత్తర ఐరోపాలోని ఇళ్లలో ఎయిర్ కండిషనింగ్ (AC) వాడకం చాలా తక్కువగా ఉండటం వల్ల, ప్రజలు ఇళ్లలోనే ఉక్కపోతతో అల్లాడిపోయారనిపేర్కొంది. ఇది ఇప్పుడు అక్కడ ఒక పెద్ద రాజకీయ అంశంగా కూడా మారింది. దీనికి భిన్నంగా, శతాబ్దాలుగా అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్న దక్షిణ ఐరోపా దేశాలు మాత్రం ఈ వేడిని తట్టుకునేందుకు కొన్ని సాంప్రదాయ మార్గాలను కలిగి ఉండటంతో అక్కడ ప్రాణనష్టం కొంత మేర తగ్గిందని తెలిపింది.సాధారణంగా వైరస్ల వల్ల శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే శీతాకాలం కంటే కూడా, ఈ జూన్ నెలలో సంభవించిన వడగాల్పుల వల్లనే ఎక్కువ మంది చనిపోయారు.గతంలో 2003లో వచ్చిన భయంకరమైన హీట్వేవ్ కారణంగా వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఆ తర్వాత, 2022 జూలై నెలలో కూడా తీవ్రమైన వడగాల్పులు రావడంతో 16,000 మందికి పైగా అదనపు మరణాలు సంభవించాయని యూరోపియన్ మోర్టాలిటీ మానిటరింగ్ నెట్వర్క్ గుర్తుచేసింది. ఆ సమయంలో స్పెయిన్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. చరిత్రలోనే అత్యంత వేడి నెలగా ఈ ఏడాది జూన్ రికార్డు సృష్టించినప్పటికీ, భూతాపం వల్ల భవిష్యత్తులో ఇంతకంటే ఘోరమైన రోజులను చూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం ఐరోపాలోని మెజారిటీ ప్రాంతాలు మరో భయంకరమైన వడగాల్పుల తదుపరి దశను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నమోదైన రికార్డు స్థాయి ఎండల వల్ల నదులలో నీటి మట్టాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి, అలాగే చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అడవుల్లో కార్చిచ్చులు చెలరేగి వేలాది మంది మరణానికి కారణమయ్యాయి. బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలలో ఈ వారంలోనే తీవ్రమైన హీట్వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి, అక్కడ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఐదు నిమిషాలు లేట్.. ఫోన్ లాక్కుని డెలివరీ బాయ్పై దాడి.. ఆపై బిగ్ ట్విస్ట్!
ఐదు నిమిషాల ఆలస్యం.. కస్టమర్కు కోపం కట్టలు తెంచుకుంది! ఆర్డర్ లేట్గా వచ్చిందన్న ఆగ్రహంతో ఓ డెలివరీ బాయ్పై కస్టమర్ దాడికి దిగాడు. ఫోన్ లాక్కొని, చెంపదెబ్బలు కొట్టి, తన్నడమే కాకుండా ఇంట్లోకి తీసుకెళ్లి మరీ దాడి చేశాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ మొత్తం ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు నిలిపివేస్తామని ప్రకటించి, నిరసనకు దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకోగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో గంగాసాగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమిత్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేందుకు అపార్ట్మెంట్కు వెళ్లాడు. అక్కడ కస్టమర్ యమన్తో డెలివరీ ఆలస్యంపై వాగ్వాదం జరిగింది. అమిత్ ప్రకారం ఆర్డర్ సుమారు ఐదు నిమిషాలు ఆలస్యమైంది. కానీ యమన్ మాత్రం తాను 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చానంటూ ఆరోపించినట్లు అమిత్ తెలిపాడు.ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సీసీటీవీ దృశ్యాల్లో యమన్.. అమిత్ ఫోన్ లాక్కొని, అతడిని కొట్టడం, తన్నడం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ కూడా దాడి కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమిత్ ఫిర్యాదు ప్రకారం.. యమన్ తనపై హత్య బెదిరింపులకు పాల్పడ్డాడని, డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించాడు. అంతేకాదు, తన భార్యకు సంబంధించిన వేధింపుల కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు కూడా చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తోటి డెలివరీ ఏజెంట్లు స్పందించారు. అమిత్ను గుర్తించి అతడిని సంప్రదించారు. అనంతరం అందరూ కలిసి భవన్పూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.An FIR has been registered against the couple who beat up a Blinkit delivery boy in Meerut, UP. Both have fled after locking their flat. Police raids are ongoing. pic.twitter.com/Sfke34hWFj— subash kumar (@Krishan10_) August 15, 2026డెలివరీ ఏజెంట్ల బంద్..ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన డెలివరీ ఏజెంట్లు పనులు నిలిపివేశారు. అమిత్కు కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు చేయబోమని ప్రకటించారు. “ఆర్డర్ కొన్ని నిమిషాలు ఆలస్యమైతే దాడి చేసే హక్కు ఎవరికీ లేదు” అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి 34 ఏళ్ల యమన్ను అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తామని భవన్పూర్ పోలీసులు తెలిపారు. ఐదు నిమిషాల ఆలస్యం.. ఆపై గొడవ.. చివరకు సీసీటీవీలో బయటపడిన దాడి! ఈ ఘటన ఇప్పుడు డెలివరీ ఉద్యోగుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.
రూపారెడ్డిని హత్య చేసింది 20 ఏళ్ల యువకుడేనా?
నల్లగొండ జిల్లా: పట్టణ కేంద్రంలోని జేబీ కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన కల్లు రూపా రెడ్డి హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. హంతకుడు గ్లౌజులు ధరించి ఈ దారుణానికి పాల్పడటంతో ఘటనా స్థలంలో ఎలాంటి ఆనవాళ్లూ లభించలేదు. దీంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే, లభ్యమైన సీసీ ఫుటేజీల ఆధారంగా హత్య చేసిన నిందితుడి వయసు 20 నుంచి 25 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా, విన్నా రూపారెడ్డి హత్య గురించే సర్వత్రా చర్చ సాగుతోంది. హత్య మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాఠశాల సిబ్బందిని, కాలనీ వాసులను, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు, శనివారం ప్రత్యేక నిఘా విభాగానికి (స్పెషల్ బ్రాంచ్) చెందిన పోలీసులు సైతం రంగంలోకి దిగారు. మృతురాలు రూపారెడ్డి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న పాఠశాలలో.. 2010 నుంచి 2025 బ్యాచ్ల వరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల వివరాలను సేకరించి, ఆ కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేసినట్లు సమాచారం.
"భూమి, ఆకాశం, పాతాళం" ఆపరేషన్ సిందూర్పై అజిత్ దోవల్
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ ఈ పేరు చెబితే చాలు ప్రతి భారతీయుడు హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. దాయాది పాకిస్థాన్ దేశానికి చెందిన ముష్కరులను వారి సొంత దేశంలోకే చొరబడి తుదముట్టించారు. భారత్ జోలికోస్తే ఎక్కడున్నా వదిలేది లేదంటూ ప్రపంచానికి భారత్ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా దీనిపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.ఈ ఘటనపై మాట్లాడుతూ..“ ఈ దాడి జరిగిన తర్వాత విమానాశ్రయంలోనే ప్రధాని మోదీతో మాకు సమావేశం జరిగింది. మొదట, ఆయన వాస్తవాలన్నీ తెలుసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత నన్ను అడిగిన మొదటి ప్రశ్న, ‘ఇది ఎవరు చేశారు?’ "మేము వారిని వెంబడిస్తాము. వారు భూమిపై ఉన్నా, ఆకాశంలో ఉన్నా, పాతాళంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే... మేము వారిని క్షమించము," అని మోదీ తనతో ఆగ్రహంగా అన్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గూడఛార సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. వారు అద్భుతంగా పనిచేశారు. తక్కువ సమయంలోనే మనం నిందితులను గుర్తించి, కచ్చితత్వంతో చర్యలు తీసుకోగలిగామన్నారు. భారతదేశం చూపే ఉదారత లేదా సహనాన్ని ఎవరూ బలహీనతగా భావించకూడదని ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చామని తెలిపారు. పహల్గామ్ దాడికి కారణమైన శత్రువుల ఉగ్రవాద శిబిరాలను ముఖ్యంగా ధ్వంసం చేయడమే ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పరిణామాలతో సంబంధం లేకుండా భారతదేశం ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనగలదని, శత్రువులపై తీవ్రంగా ఎదురుదాడి చేయగలదని ఆయన స్పష్టం చేశారు.2025 ఏప్రిల్ 22న జరిగిన ఘోరమైన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న 'ఆపరేషన్ సింధూర్' ప్రారంభమైంది. పాకిస్తాన్ డ్రోన్ దాడులను తిప్పికొడుతూ, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసి కీలక నేతలను అంతమెుందించింది.
వాటితో ఫేషియల్..'గ్లో' మాములుగా లేదు..!
పుడమితల్లి వేడుక 'పాచామామా'!
బంగ్లా బౌలర్ అద్భుత బంతి.. బిత్తరపోయిన ఆసీస్ స్టార్
టీమిండియాను భారీ దెబ్బేసిన బంగ్లాదేశ్
కుర్చీలో ఇరుక్కుపోయిన మెడ.. షాకింగ్ వీడియో!
క్లూ..! హత్యకు టూత్పిక్ సాక్ష్యం!
బండ్ల గణేశ్ కూతురి పెళ్లి.. టాలీవుడ్ సినీతారల సందడి
ఏడాదిగా శారీరక సంబంధం.. ఇప్పుడు పెళ్లికి నో..!
హంగరీలో ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది మృతి
మూగవాని పిల్లనగ్రోవి!
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
ఆరాధ్య బచ్చన్ కేసు: ‘ఇంటి పేరు ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా’
చంద్రబాబు వస్తే వర్షాలు రావంటున్నారు - టీడీపీ నేత జేసీ
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
బ్రిటిష్ వారు మొత్తం ఎన్ని దేశాలు పాలించారు?
మళ్లీ మీకు ఇబ్బంది లేకుండా ఇంటి ముందే ఆఫీసు తెరిచార్సార్!
జైసూను రనౌట్ చేయనా?.. ఇందులో తప్పేముంది?.. కానివ్వు!
ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
'అగధ' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ
AUS vs BAN: నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్క్రిస్ట్
కార్మికశాఖ దగ్గరకు ఐటీ ఉద్యోగులు.. స్పందించిన విప్రో
ప్చ్.. యథా రాజా తథా ప్రజా!!
కియోసాకి ప్రశ్న.. ఘాటుగా స్పందించిన నెటిజన్లు!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారు వాహనాలు, ఆభరణాలు కొంటారు
రూ.50 కూలీ.. రూ.4,000 కోట్ల బడ్జెట్ సినిమాకు స్టార్ హీరో
IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్!
ఇదేం బ్యాటింగ్.. ముసలోళ్ల జట్టు: ఆసీస్పై పాంటింగ్ ఫైర్
మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. మరో టీజర్ వచ్చేసింది
వాటితో ఫేషియల్..'గ్లో' మాములుగా లేదు..!
పుడమితల్లి వేడుక 'పాచామామా'!
బంగ్లా బౌలర్ అద్భుత బంతి.. బిత్తరపోయిన ఆసీస్ స్టార్
టీమిండియాను భారీ దెబ్బేసిన బంగ్లాదేశ్
కుర్చీలో ఇరుక్కుపోయిన మెడ.. షాకింగ్ వీడియో!
క్లూ..! హత్యకు టూత్పిక్ సాక్ష్యం!
బండ్ల గణేశ్ కూతురి పెళ్లి.. టాలీవుడ్ సినీతారల సందడి
ఏడాదిగా శారీరక సంబంధం.. ఇప్పుడు పెళ్లికి నో..!
హంగరీలో ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది మృతి
మూగవాని పిల్లనగ్రోవి!
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
ఆరాధ్య బచ్చన్ కేసు: ‘ఇంటి పేరు ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా’
చంద్రబాబు వస్తే వర్షాలు రావంటున్నారు - టీడీపీ నేత జేసీ
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
బ్రిటిష్ వారు మొత్తం ఎన్ని దేశాలు పాలించారు?
మళ్లీ మీకు ఇబ్బంది లేకుండా ఇంటి ముందే ఆఫీసు తెరిచార్సార్!
జైసూను రనౌట్ చేయనా?.. ఇందులో తప్పేముంది?.. కానివ్వు!
ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
'అగధ' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ
AUS vs BAN: నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్క్రిస్ట్
కార్మికశాఖ దగ్గరకు ఐటీ ఉద్యోగులు.. స్పందించిన విప్రో
ప్చ్.. యథా రాజా తథా ప్రజా!!
కియోసాకి ప్రశ్న.. ఘాటుగా స్పందించిన నెటిజన్లు!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారు వాహనాలు, ఆభరణాలు కొంటారు
రూ.50 కూలీ.. రూ.4,000 కోట్ల బడ్జెట్ సినిమాకు స్టార్ హీరో
IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్!
ఇదేం బ్యాటింగ్.. ముసలోళ్ల జట్టు: ఆసీస్పై పాంటింగ్ ఫైర్
మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. మరో టీజర్ వచ్చేసింది
ఫొటోలు
శ్రీహరి కొడుకు మేఘాంశ్ 'ఆస్మాన్' చిత్రం మోషన్ పోస్టర్ లాంచ్ (ఫొటోలు)
హైదరాబాద్లో సందడి చేసిన నటుడు సోనూసూద్ (ఫొటోలు)
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం (ఫొటోలు)
‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు)
‘వణక్కం జెన్జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు)
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు
విలన్ నుంచి రియల్ స్టార్గా.. శ్రీహరి అరుదైన (ఫోటోలు)
'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు)
బాక్ల్ డ్రెస్లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
సినిమా
'సూర్య హిట్ సినిమా.. నాకు అన్యాయం'.. మన్సూర్ అలీఖాన్ షాకింగ్ కామెంట్స్
కోలీవుడ్ వివాదాస్పద నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూర్య మూవీలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరుప్పు చిత్రంలో తాను ఎంతో కష్టపడి డ్యాన్స్ చేశానని తెలిపారు. అయితే ఎలాంటి కారణం చెప్పకుండానే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాలు యూట్యూబ్లో వస్తాయని నిర్మాత చెప్పారని.. కానీ అది కూడా జరగలేదని అన్నారు. సూర్య, కార్తీ పెద్ద స్టార్స్ అని.. వాళ్లు జీవించాలని కోరుకుంటానని అన్నారు. అయితే తమ లాంటి చిన్ననటులను కూడా బతకనివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను చాలా ఏళ్లుగా నటుడిగా, నిర్మాతగా చిత్రాలు చేస్తున్నానని తనకు న్యాయం జరగాలని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. ఆల్ పాస్ మూవీ ఈవెంట్కు హాజరైన ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు.కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పులో తన సన్నివేశాలు తొలగించడంపై మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డ్యాన్స్ సీన్ కోసం తాను ఎంతో శ్రమించానని.. కానీ అది మూవీలో లేకపోవడం చాలా బాధగా ఉందన్నారు. ఆ పాటకు నేను విలన్లతో కలిసి డ్యాన్స్ చేశానని.. ప్రసాద్ ల్యాబ్స్లో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశానని వెల్లడించారు. ఈ సినిమాలో నా నటనను, కష్టాన్ని నా కొడుకులకు స్వయంగా చూపించా.. కానీ ఆ సన్నివేశాన్ని తొలగించారు. మీరు నటించిన సీన్ ఎందుకు తొలగించారని నా బిడ్డలు అడిగినప్పుడు నా చేతుల్లో ఏం లేదని చెప్పాను. కనీసం ఆ సన్నివేశం యూట్యూబ్లో కూడా లేకపోవడంతో మరింత బాధేసిందని అలీఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన మూవీ కరుప్పు. ఈ చిత్రాన్ని వీరభద్రుడు పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. బిగ్ బాస్ ఫేమ్ జనని నాయకిగా నటించిన చిత్రం ఆల్ పాస్. నిరంగళ్ మూండ్రు, తరుణం చిత్రాల ఫేమ్ దుష్యంత్ హీరోగా నటించారు. ఈ సినిమాకు మైదీన్ దర్శకత్వం వహించగా.. వన్ స్టెప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మోహన.ఆర్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఆడియో, ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఈ ఈవెంట్కు దర్శకుడు ఆర్వీ ఉదయ్ కుమార్ ,విక్రమన్ ,నటుడు మన్సూర్ అలీ ఖాన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ సినిమాకు జేమ్స్ వసంతన్ సంగీతం అందించారు. #Suriya மீது கடும் கோபத்தில் கொந்தளித்த Mansoor Ali Khan🤬🤬 உனக்கு ஆண்மை இருந்தா அத போடு 💥😬 என்னைய டம்மியா நிக்க வச்சானுங்க😣😖 நீ விக்ரம் படத்துல 5நிமிசம் தான வந்த 😬 #SuriyaSivakumar #MansoorAliKhan #TamilCinema pic.twitter.com/fGCK1sPMAd— BingooBox (@BingooBox) August 14, 2026
'గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్
తెలుగువారి బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్కు సమయం ఆసన్నమవుతోంది. ఈ షోలో పాల్గొని వారిని అగ్నిపరీక్ష పేరుతో సెలెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అగ్నిపరీక్ష నడుస్తోంది. పదో సీజన్ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వచ్చేనెల ప్రారంభం కానున్న ఈ షోకు నాగార్జునే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలో అగ్నిపరీక్ష పేరుతో జరుగుతోన్న సెలెక్షన్ ప్రాసెస్లో ఎంతోమంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు పాల్గొన్నారు. వీరందరినీ వడపోసి ఫైనల్కు ఓ 15 మందిని ఎంపిక చేశారు. మొత్తం 55 మంది ఎలిమినేట్ చేయగా.. వీరిలో ఉప్పల్ బాలు కూడా ఉన్నారు. తనకు అన్యాయం చేశాడంటూ నవదీప్పై ఫైరవుతున్నాడు. తాజాగా ఈ షో యాంకర్ శ్రీముఖి తీరుపై విమర్శలొస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏ చేసింది? ఎందుకు ట్రోల్ చేస్తున్నారో తెలుసుకుందాం.అయితే ఇదే బిగ్బాస్ అగ్నిపరీక్షలో మరో సోషల్ మీడియా ఇన్ప్లూయన్సర్ రన్నింగ్ రాజా కూడా పాల్గొన్నారు. బిగ్బాస్ ఛాన్స్ కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి వచ్చాడు. అయితే టాస్క్లో భాగంగా అతను శ్రీముఖిని ఇమిటేట్ చేసేందుకు యత్నించాడు. శ్రీముఖి మేకప్ ఇలా వేసుకుంటుందని తన హావాభావాలతో చూపించాడు. అదే సమయంలో శ్రీముఖి దగ్గరికీ రన్నింగ్ రాజా వెళ్లాడు. దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నన్ను టచ్ చేస్తే చెంప పగలగొడతా అంటూ ఆమె దురుసుగా ప్రవర్తించింది.దీంతో శ్రీముఖి తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మా ఊర్లో గొర్రెలు కాయడానికి కూడా శ్రీముఖి పనికిరాదంటూ ట్రోల్ చేస్తున్నారు. పల్లెటూరి వాళ్లను షోలకు పిలిచి అవమానించడమే వీళ్ల పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనలాంటి పల్లెటూరి వాళ్లను స్టేజీల మీదకు తీసుకెళ్లి బకరాలను చేస్తారని ఆవేదన చెందుతున్నారు. ఏదేమైనా ఇదంతా షోలో భాగమైతే ఓకే కానీ.. గ్రామీణ ప్రాంతాల ప్రజల టాలెంట్ను మాత్రం హేళన చేస్తే సరికాదని మరికొందరు అంటున్నారు. View this post on Instagram A post shared by Khadeer Palleturi (@palleturikurrallu2)
బిగ్బాస్ సీజన్-10.. ఈ సారి దశవతారమే..!
తెలుగువారి బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్కు సమయం ఆసన్నమవుతోంది. ఈ షోలో పాల్గొని వారిని అగ్నిపరీక్ష పేరుతో సెలెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అగ్నిపరీక్ష నడుస్తోంది. పదో సీజన్ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వచ్చేనెల ప్రారంభం కానున్న ఈ షోకు నాగార్జునే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ సారి సరికొత్తగా.. సవాల్గా ఉండనుందని చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే బిగ్బాస్ మరో ప్రమోషన్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున విభిన్నంగా కనిపించారు. మీరు ఎంతైనా ఆశించండి. 'బిగ్బాస్ సీజన్-10 నెక్ట్స్ లెవల్, వెరైటీ, సర్ప్రైజ్, డ్రామా, ఛాలెంజ్ పదింతలు..వారం వారం సరికొత్త అవతారం.. ఈ సారి దశవతారం' అంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ ఆడియన్స్లో మరింత ఆసక్తి క్రియేట్ చేశారు. తాజాగా రిలీజైన ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి.
ఫ్యామిలీ పోషణ కోసం చీర, జాకెట్ కట్టుకున్నా: నటుడు
‘జబర్దస్త్’ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడ శాంతి స్వరూప్. తెరపై ఎప్పుడు లేడీ గెటప్లో కనిపిస్తూ..తనదైన కామెడీతో నవ్విస్తుంటాడు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. అయితే చాలా మంది ఆర్టిస్టుల్లాగే శాంతి స్వరూప్ కూడా ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నాడు. తాజాగా ఓ న్యూస్ చానల్ నిర్వహించే టాక్ షోలో పాల్గొన్న శాంతి స్వరూప్.. తన పర్సనల్ లైఫ్తో పాటు సినిమా ఇండస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.తాగి కక్కింది ఊడ్చేవాడినిప్రతి రోజు రాత్రి పడుకునే ముందు నేను అనుభవించిన కష్టాలన్నీ గుర్తు చేసుకుంటా. తినడానికి తిండి లేక గుడిలోకి వెళ్లి ప్రసాదాలు తినేవాడిని. ఏ ఏ చర్చిలోకి వెళ్లి అన్నం తిన్నానో గుర్తు చేసుకుంటా. రెంట్ కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ రూంలో ఉండేవాడిని. వాళ్లు తాగి కక్కితే ఊడ్చి ఎత్తేవాడిని. నాన్న అంత్యక్రియలకు డబ్బుల్లేవు..2007లో మా నాన్న చనిపోయాడు. అప్పుడు నేను అసిస్టెంట్గా చేస్తున్నా. తినడానికి ఏమి లేదు. అంత్యక్రియలు చేయడానికి రూ. 2000 కావాలి. నా దగ్గరు రూపాయి లేదు. మా ఐదు మంది అన్నదమ్ములు తలా ఇన్ని పైసలు వేసుకుంటున్నాను. నేను మా సార్కి ఫోన్ చేసి డబ్బులు అడుక్కొని అంత్యక్రియలు పూర్తి చేశా. నేను ఇప్పుడు ఉన్నట్లుగా ఉండి ఉంటే.. మా నాన్న ఇంకా బతికేవాడు’ అంటూ శాంతి స్వరూప్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఫ్యామిలీ పోషించుకోవడం కోసం చీర, జాకెట్ కట్టుకున్నానేను రూమ్ రెంట్ కోసం వెళ్తే చాలా మంది ‘వద్దండి..లేడీ గెటప్స్’ఇవ్వలేం అంటారు. మేము కేవలం లేడీ గెటప్ మాత్రమే వేస్తున్నాం. ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలో తెలియనప్పుడు నేను ఈ చీర, జాకెట్ కట్టుకొని పైన విగ్గు పెట్టుకొని ఇలా ఉండబట్టే.. నా ఫ్యామిలీని పోషించుకోగలుగుతున్నా. నేనేం తప్పు చేయట్లేదే? చిల్లరపనులేవి చేయట్లేదు.పెళ్లి చేసుకోను..ఇదే ఇంటర్వ్యూలో ‘నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా?’ అని హోస్ట్ అడగ్గా.. ‘ఎవరినీ పెళ్లి చేసుకోను. నా లైఫ్ ఇలా ఉంది. లేడీ గెటప్లు వేసుకునేవాడివి అని వేరేలాగా అంటే వచ్చే వాళ్లకు బాధ అవుతుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్లు రారు. కాళ్లు చేతులు బాగున్నంతవరకు కష్టపడతాను. ఒంట్లో బాగలేకపోయినా చూసేవాళ్లు ఎవరూ లేరు. నేనే క్యాబ్ బుక్ చేసుకొని ఆస్పత్రికి వెళ్లి వస్తాను. నాది ఒక దుర్భరమైన జీవితం. కాళ్లు చేతులు బాగున్నప్పడే, నిద్రలోనే చనిపోతే బాగుంటుందని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అంటూ శాంతి కన్నీళ్లు పెట్టుకున్నాడు.అమ్మాయిలు చెడిపోయారుఇక ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘అమ్మాయి కానీ, అబ్బాయిలు ఏదో సాధించాలని ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. కొంతమంది అమ్మాయి అయితే ఫోన్ చేసి..‘నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్.. వచ్చేస్తా’ అని అగుతున్నారు. మీకు ఇబ్బంది అవుతుందని చెబితే.. ‘పర్వాలేదండి.. కమిట్మెంట్ ఇవ్వడానికైనా రెడీ’ వాళ్లే అంటున్నారు. డైరెక్టర్లు కూడా ‘నేను మీకు ఇస్తాను..నువ్వు నాకేమి ఇస్తావు’ అని అడుగుతున్నారు. అమ్మాయిలు పూర్తిగా చెడిపోతున్నారు. శని, ఆదివారం వస్తే.. హైదరాబాద్లోని ప్రతి పార్కు.. లవర్స్తో నిండిపోతుంది. పెళ్లి తర్వాత జరగాల్సిన పనులన్నీ పెళ్లికి ముందే అయిపోతున్నాయి’ అంటూ శాంతి అసహనం వ్యక్తం చేశాడు.
క్రీడలు
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రక విజయం
సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయి ఛేదించింది. షాద్మన్ ఇస్లామ్ (25 నాటౌట్), మోమినుల్ హక్ (30 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి జరగనుంది. రెండు ఇన్నింగ్స్లు కలిపి 9 వికెట్లు తీసిన హసన్ మహ్ముద్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.అంతకముందు రెండో ఇన్నింగ్స్లో ఓవర్నైట్ స్కోరు 161 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 284 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (104 పరుగులు) శతకంతో మెరవగా, స్మిత్ (44), అలెక్స్ క్యారీ (30) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా, హసన్ మహ్ముద్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 426 పరుగులకు ఆలౌటైంది. తంజిద్ సెంచరీతో చెలరేగగా, నజ్ముల్, మెహదీ హసన్లు అర్ధశతకాలతో రాణించారు. అంతకముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. మహ్ముద్ హసన్ 6 వికెట్లతో చెలరేగాడు. 👉23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను వారి హోంగ్రౌండ్లో మట్టికరిపించడం ఇదే తొలిసారి. ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఓడించడం బంగ్లాకు ఇది రెండోసారి. గతంలో 2017లో మీర్పూర్లో జరిగిన టెస్టులో ఆసీస్ను తొలిసారి ఓడించింది.సంక్షిప్త స్కోర్లు:ఆస్ట్రేలియా: 198 ఆలౌట్ & 284 ఆలౌట్బంగ్లాదేశ్: 426 ఆలౌట్ & 57/1Dominant. Commanding. Controlling.These are all words to describe a proud moment in Bangladesh history, because they have THUMPED Australia in Australia to win a Test by nine wickets! pic.twitter.com/MGUXtIySP9— 7Cricket (@7Cricket) August 16, 2026Read: క్రికెట్ చరిత్రలో అద్భుతం.. నాడు కోహ్లి, నేడు పడిక్కల్!
క్రికెట్ చరిత్రలో అద్భుతం.. నాడు కోహ్లి, నేడు పడిక్కల్!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా క్రికెటర్ దేవదత్ పడిక్కల్ అజేయ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో పడిక్కల్కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక రికార్డు విషయంలో మాత్రం పడిక్కల్ తన గురువు విరాట్ కోహ్లితో సమంగా నిలిచాడు. అదేంటంటే విరాట్ కోహ్లి తన తొలి టెస్టు సెంచరీని రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) రోజున చేశాడు. 2012 జనవరి 26న అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో కోహ్లి 116 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లికి టెస్టుల్లో అదే తొలి సెంచరీ కావడం విశేషం. తాజాగా దేవదత్ పడిక్కల్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన తొలి టెస్టు సెంచరీని బాదడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఇలా తన గురువు కోహ్లి రిపబ్లిక్ డే రోజున మెయిడెన్ టెస్టు శతకం సాధిస్తే.. శిష్యుడు పడిక్కల్ ఇండిపెండెన్స్ రోజున తొలి టెస్టు శతకం అందుకోవడం గమనార్హం. మరో విషయమేంటంటే.. రిపబ్లిక్ డే రోజున సెంచరీ చేసిన ఒకే ఒక్క బ్యాటర్గా కోహ్లి చరిత్ర సృష్టిస్తే.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున టీమిండియా తరఫున సెంచరీ బాదిన ఏకైక క్రికెటర్గా పడిక్కల్ రికార్డులకెక్కాడు. కోహ్లి ఇండిపెండెన్స్ రోజున కూడా సెంచరీ బాదినప్పటికీ, అది వన్డే ఫార్మాట్లో వచ్చింది.తొలి బ్యాటర్గా రికార్డుపడిక్కల్ కంటే ముందు భారత తరపున ఏ బ్యాటర్ కూడా ఇండిపెండెన్స్ డే రోజు టెస్టుల్లో మూడంకెల స్కోర్ను అందుకోలేదు. గతంలో విరాట్ కోహ్లి వెస్టిండీస్పై ఆగస్టు 15న వన్డే సెంచరీ చేయగా.. టెస్టు సెంచరీ చేసింది మాత్రం పడిక్కలే కావడం గమనార్హం. అదేవిధంగా 21వ శతాబ్దంలో టీమిండియా తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్గా పడిక్కల్ రికార్డులెక్కాడు.పడిక్కల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్గా భారత్ తరఫున నెంబర్ 3 పొజిషన్లో టెస్ట్ సెంచరీ సాధించిన ఎడమ చేతి వాటం బ్యాటర్గా సలీమ్ దురానీ, బాపూ నాడ్కర్ణి, అజిత్ వాడేకర్, ఏక్నాథ్ సోల్కర్, సురీందర్ అమర్నాథ్, వినోద్ కాంబ్లీ పడిక్కల్ చేరాడు.Virat Kohli was the only Indian batter to score a century on Republic Day, achieving the feat in 2012, which was also his maiden Test century. 🇮🇳Now, Devdutt Padikkal becomes the only Indian batter to score a century on Independence Day, and it’s his maiden Test century too!… pic.twitter.com/CxgE0Q3VnV— CREX (@Crex_live) August 15, 2026Read: మూడో స్థానంపై బేఫికర్.. గిల్ నమ్మినబంటు పడిక్కల్
మూడో స్థానంపై బేఫికర్.. గిల్ నమ్మినబంటు పడిక్కల్
దేశవాళీల్లో దుమ్మురేపి భారత జట్టుకు ఎంపికైన దేవదత్ పడిక్కల్ అంతర్జాతీయ స్థాయిలోనూ అదే జోరు కనబరిచాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో ప్రత్యర్థి బౌలర్లతో చెడుగుడు ఆడుకున్న పడిక్కల్ శ్రీలంకతో తొలి టెస్టులో అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ నమ్మకాన్ని ఒక్క శతకంతో పడిక్కల్ నిలబెట్టుకున్నాడు. 'లంకతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియాలో మూడో స్థానంలో బ్యాటింగ్కు ఎవరు వస్తున్నారు?' అనే ప్రశ్న గిల్కు ఎదురైంది. కానీ గిల్ ఏమాత్రం తడబడకుండా దేవదత్ పడిక్కల్ పేరును బయటికి చెప్పాడు. మూడో స్థానంలో అంతకంటే మంచి బ్యాటర్ను తాను చూడలేదని, ఈ సిరీస్లో పడిక్కల్ బ్యాటింగ్కు వెన్నుముకలా మారుతాడని గిల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాజాగా తొలి టెస్టులో సూపర్ సెంచరీతో గిల్కు నమ్మిన బంటు అయ్యాడు పడిక్కల్.2024లో అనూహ్య పిలుపు..2024లో ఆ్రస్టేలియాపై చివరి టెస్టు మ్యాచ్ ఆడిన దేవదత్ పడిక్కల్ శ్రీలంక పర్యటనకు ఎంపికైనా... అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే గాయం కారణంగా సాయి సుదర్శన్ సిరీస్కు దూరం కావడం... అదే సమయంలో శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారీ సెంచరీ చేయడంతో పడిక్కల్కు ఆ అవకాశం వచ్చింది. రెండేళ్ల తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న పడిక్కల్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గత 20 టెస్టుల్లో భారత జట్టు తరఫున మూడో స్థానంలో బరిలోకి దిగిన ప్లేయర్ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోగా... ఆ లోటును పడిక్కల్ భర్తీ చేశాడు. ఆరంభంలో వన్డే తరహాలో బంతికో పరుగు చొప్పున రాబట్టిన అతడు... ఆ తర్వాత మంచి బంతులను గౌరవిస్తూ ముందుకు సాగాడు. స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో చక్కటి స్వీప్ షాట్లు ఆడిన పడిక్కల్... పేసర్లకు ‘నటరాజ్’ షాట్లతో బదులిచ్చాడు. స్క్వేర్ లెగ్ దిశగా సులువుగా పరుగులు రాబట్టిన అతడు... తన ట్రేడ్మార్క్ పంచ్ షాట్లతో అలరించాడు. కర్ణాటక తరఫున దేశవాళీల్లో రాహుల్తో కలిసి ఎన్నో మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్... అంతర్జాతీయ స్థాయిలోనూ అదే దూకుడు కనబర్చాడు. సెంచరీ అనంతరం కూడా అలసత్వానికి తావివ్వకుండా పూర్తి నియంత్రణతో బ్యాటింగ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. రెండో రోజు కూడా అతడు ఇదే జోరు కొనసాగిస్తూ క్రీజులో పాతుకుపోతే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. అంతేకాదు పుజారా రిటైర్మెంట్ తర్వాత తన స్థానాన్ని భర్తీ చేసేందుకు పడిక్కల్కు ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాదు. ఈ సిరీస్లో విశేషంగా రాణిస్తే మాత్రం పడిక్కల్ స్థానానికి ఢోకా ఉండదు.MAIDEN TEST HUNDRED! 💯A special moment on a special day for Devdutt Padikkal in Galle 🥳Updates ▶️ https://t.co/M9LVyCAp8y#TeamIndia | #SLvIND pic.twitter.com/8x1HcYeFbA— BCCI (@BCCI) August 15, 2026Read: నడవలేని స్థితిలో కేఎల్ రాహుల్.. గాయంపై బిగ్ అప్డేట్!
నడవలేని స్థితిలో కేఎల్ రాహుల్.. గాయంపై బిగ్ అప్డేట్!
గాలే వేదికగా మొదలైన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ కండరాల నొప్పితో మైదానం వీడడం భారత శిబిరంలో ఆందోళన కలిగించింది. అర్ధశతకం సాధించిన రాహుల్ శతకం వైపు పరుగులు తీస్తున్న క్రమంలోనే కండరాల నొప్పితో విలవిల్లాడిపోయాడు. కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడడంతో టీ బ్రేక్ తర్వాత బ్యాటింగ్కు రాలేకపోయాడు.దీంతో లంకతో టెస్టు సిరీస్కు కేఎల్ రాహుల్ దూరమవుతాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కేఎల్ రాహుల్ గాయంపై బిగ్ అప్డేట్ ఇచ్చాడు. రాహుల్ ఫిట్నెస్పై అందోళన వద్దని అంటున్నాడు. కండరాలు పట్టేశాయని, భారత ఓపెనర్ ఫిట్గానే ఉన్నాడని సితాన్షు వెల్లడించాడు.‘కేఎల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నా దృష్టిలో అతడికి క్రాంప్స్ వచ్చాయంతే. రోజు ముగిసే సరికి అతడు బాగానే ఉన్నాడు. కండరాలు పట్టేయడం మొదలయ్యాక .. తొడ కండరాలు నొప్పి మొదలవుతుంది. ఒక్కోసారి గజ్జల్లోనూ నొప్పి వస్తుంది. కానీ, అతడు బాగానే ఉన్నాడు. రేపు అతడు బ్యాటింగ్కు సిద్ధంగా ఉంటాడు’ అని సితాన్షు పేర్కొన్నాడు.గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టును భారత్ ఘనంగా ఆరంభించింది. మొదటి రోజు ఆటలో ఆతిథ్య జట్టుపై టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ బ్యాటర్ దేవ్దత్త్ పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. పడిక్కల్ 131 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు రిషబ్ పంత్ (31) క్రీజులో ఉన్నాడు. A worrying moment in Galle. 😟💔KL Rahul has retired hurt after struggling with an issue in his right-hand finger, along with severe cramps.He was seen receiving treatment before walking back to the dressing room. Hoping it’s nothing serious and KL is back soon. 🙏❤️📸:… pic.twitter.com/Q8w6XdHuwx— CricTracker (@Cricketracker) August 15, 2026Read: ఆఫ్గన్ కెప్టెన్ రికార్డు సెంచరీ.. ఐర్లాండ్ క్లీన్స్వీప్
న్యూస్ పాడ్కాస్ట్
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
దేశ భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే... పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్య
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
బిజినెస్
అమెరికా అప్పులు.. కియోసాకి సంచలన వ్యాఖ్యలు!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు పెరుగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో డబ్బు విలువ తగ్గే అవకాశం ఉందని, అందుకే బంగారం, వెండి వంటి ఆస్తులపై దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు.అమెరికా అప్పులుఅమెరికా అప్పు త్వరలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని కియోసాకి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేస్తే.. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అప్పులు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగితే.. చేతిలో ఉన్న డబ్బు విలువ తగ్గుతుంది. ఇది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.బంగారం, వెండి భారీగా పెరుగుతాయా?కియోసాకి తనకు తెలిసిన ఆర్థిక నిపుణుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు బంగారం, వెండి ధరలపై భారీ అంచనాలు వేస్తున్నారని చెప్పారు. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బంగారం ధర ఔన్సుకు 10,000 డాలర్లకు చేరొచ్చన్న అంచనాలను ఆయన ప్రస్తావించారు. అయితే.. ఇవి ఖచ్చితమైన ధరలు కావు. కొందరు నిపుణులు చేస్తున్న అంచనాలు మాత్రమే. మార్కెట్ పరిస్థితులు మారితే ఈ అంచనాలు కూడా మారవచ్చు.కియోసాకి బంగారం, వెండి రెండింటినీ ప్రస్తావించినప్పటికీ.. 2026 ఆగస్టులో తనకు మాత్రం వెండే మంచి ఎంపికగా కనిపిస్తోందని కియోసాకి చెప్పారు. వెండికి ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం పెట్టుబడి లోహం మాత్రమే కాదు. సౌర విద్యుత్, ఎలక్ట్రానిక్స్, ఇతర పారిశ్రామిక రంగాల్లో కూడా వెండిని ఉపయోగిస్తారు. దీంతో భవిష్యత్తులో పారిశ్రామిక డిమాండ్ పెరిగితే వెండికి అదనపు మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు.$40 TRILLION US NATIONAL soon!!Q: What are you doing about it?Friends who are much smarter than me, such as Jim Rickards are predicting $200 an ounce for silver and $10,000 an ounce gold soon.Of the two…. I think silver is the best choice in August 2026.Q: What do you…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 15, 2026
అందుకే అమెరికా వదిలి వెళ్ళాను!: భారతీయ వ్యాపారవేత్త
చదువుకోవడానికో లేదా ఉద్యోగం చేయడానికో చాలామంది అమెరికా వెళ్లాలనుకుంటారు. కానీ.. అమెరికాలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. ఓ భారతీయ వ్యాపారవేత్త యూరప్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.సాధారణంగా.. విదేశాలకు వెళ్లాలంటే మంచి ఉద్యోగం, ఎక్కువ జీతం, వ్యాపార అవకాశాలు వంటి కారణాలు ఉంటాయి. కానీ.. నంద్ జావియా విషయంలో మాత్రం కారణం పూర్తిగా భిన్నం. ప్రపంచాన్ని చూడాలనే కోరికతో యూరప్కు వెళ్లినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.2022లో యూరప్తో పరిచయంనంద్ జావియాకు యూరప్తో మొదటి పరిచయం 2022లో ఏర్పడింది. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్లో భాగంగా తొలిసారి స్పెయిన్కు వెళ్లాడు. అప్పటి వరకు యూరప్ను ప్రత్యక్షంగా చూడకపోవడంతో అక్కడి జీవన విధానం, సంస్కృతి, వాతావరణం గురించి తెలియదు. స్పెయిన్ పర్యటన ఆయన ఆలోచనా విధానాన్నే మార్చేసింది. యూరప్ తనకు ఎంతగానో నచ్చిందని, అక్కడ ఎక్కువ కాలం ఉండాలనే ఆలోచన అప్పుడే మొదలైందని ఆయన చెప్పారు. యూరప్తో పూర్తిగా ప్రేమలో పడిపోయాను అని అన్నారు.ఒక దేశానికే ఎందుకు పరిమితం కావాలి?విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం వెళ్లిన తర్వాత చాలామంది అక్కడే స్థిరపడిపోతారు. కానీ నంద్ జావియా మాత్రం అలా ఆలోచించలేదు. ఒక దేశానికి వెళ్లిన తర్వాత.. ప్రపంచంలో ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయని, ప్రతి దేశానికీ ప్రత్యేకమైన సంస్కృతి, జీవన విధానం, అనుభవాలు ఉంటాయని ఆయన గుర్తించారు.అవకాశం ఉంటే.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లి కొత్త జీవితాన్ని అనుభవించవచ్చని భావించారు. అందుకే.. స్పెయిన్ తర్వాత యూరప్లోని మరో దేశమైన చెక్ రిపబ్లిక్లోని ప్రాగ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదుఅయితే అమెరికాను వదిలి యూరప్కు వెళ్లడం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని నంద్ జావియా చెప్పారు. దాదాపు నాలుగైదేళ్ల క్రితమే ఏదో ఒక సమయంలో యూరప్కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆయన కంపెనీ కూడా క్రమంగా ఎదిగింది. కంపెనీ కార్యకలాపాలను యూరప్లో ఉంటూనే నిర్వహించగల స్థాయికి వ్యాపారం చేరుకుంది. దీంతో తాను అనుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి సరైన సమయం వచ్చిందని భావించారు.డబ్బు కంటే అనుభవాలకే ప్రాధాన్యంనంద్ జావియా చెప్పిన మాటల్లో ఎక్కువగా ఆకట్టుకునే అంశం ఇదే. యూరప్కు వెళ్లడానికి డబ్బు ప్రధాన కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.తన జీవితంలో ప్రధాన లక్ష్యం మిలియనీర్ కావడం కాదని, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ అక్కడి ప్రజలను, సంస్కృతులను, జీవన విధానాలను తెలుసుకుని ‘గ్లోబల్ సిటిజన్’గా మారడం తన లక్ష్యమని చెప్పారు. అంటే.. ఒకే చోట ఉండి సంపాదించడం కంటే.. ప్రపంచాన్ని చుట్టి చూడటం, కొత్త అనుభవాలు పొందడం తనకు ఎక్కువ విలువైనదని ఆయన భావిస్తున్నారు.అమెరికాలో డబ్బు.. యూరప్లో జీవితం?అమెరికా, యూరప్లను పోల్చుతూ నంద్ జావియా చేసిన వ్యాఖ్య కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.మిలియనీర్ కావాలంటే అమెరికా మంచి ప్రదేశం అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. తన జీవిత లక్ష్యం కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం కాదని చెప్పారు. యూరప్లో ఉంటే సంపాదించే విషయంలో కొన్ని అవకాశాలను వదులుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. అయితే దానికి బదులుగా తనకు కావాల్సిన జీవిత అనుభవాలు లభిస్తాయని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Nand Javia | Scaling Human Potential (@nand.javia)
టాటా మోటార్స్ జోరు.. రూ.2,556 కోట్ల లాభం!
వాణిజ్య వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ సీవీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 83 శాతం దూసుకెళ్లి రూ. 2,556 కోట్లను తాకింది. టాటా క్యాపిటల్లో పెట్టుబడులపై ఎంటూఎం లాభాలు ఇందుకు దోహదపడ్డాయి.గతేడాది(2025–26) ఇదే కాలంలో కేవలం రూ. 1,397 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 17,324 కోట్ల నుంచి రూ. 20,667 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 15,982 కోట్ల నుంచి రూ. 18,038 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో వాహన టోకు(హోల్సేల్) అమ్మకాలు 26 శాతం వృద్ధితో 1,08,700 యూనిట్లకు చేరాయి.పటిష్ట ఎగ్జిక్యూషన్, మార్కెట్ పరిస్థితులకు అనుగుణమైన నిర్ణయాలు, విభిన్న పోర్ట్ఫోలియో సహకారంతో అమ్మకాలలో 26 శాతం పురోగతి సాధించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో గిరీష్ వా పేర్కొన్నారు. ఐవెకో కొనుగోలుపై నియంత్రణ సంస్థల అనుమతులు తుది దశలో ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది.
అభివృద్ధి చెందిన భారత్ కోసం.. 'సప్తధార' సూత్రం!
2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక దిశానిర్దేశం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఎర్రకోట నుంచి జాతి ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశ ప్రగతికి ఏడు ప్రధాన శక్తులు అవసరమని పేర్కొన్నారు. వీటినే 'సప్తధార'గా అభివర్ణించారు.ఉత్పాదక శక్తి (Manufacturing power)మోదీ 'సప్తధార'లో మొదటి స్థానాన్ని తయారీ రంగానికి ఇచ్చారు. చిన్న వస్తువుల నుంచి భారీ పరిశ్రమల వరకు సాధ్యమైనంత ఎక్కువగా భారత్లోనే తయారు చేయాలి అనేది ప్రధాని ఆలోచన. కేవలం ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా.. డిజైన్, తయారీ, నాణ్యత, సరఫరా వంటి మొత్తం విలువ గొలుసును దేశంలోనే అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ప్రపంచ దేశాలకు భారత్ ఒక నమ్మకమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, పారిశ్రామికవేత్తలు ధరతో పాటు నాణ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై కూడా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.వ్యవసాయం, ఆహార ఉత్పత్తి (Agriculture and food production)రెండో శక్తిగా వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ప్రధాని ప్రస్తావించారు. మన రైతులు కేవలం దేశీయ మార్కెట్పైనే ఆధారపడకుండా.. ప్రపంచ మార్కెట్ను కూడా లక్ష్యంగా చేసుకోవాలని ఆయన అన్నారు. చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పూలు, సంప్రదాయ ఆహార పదార్థాలు, రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంటే.. పొలంలో పంట పండించడం దగ్గరే ప్రక్రియ ఆగిపోకూడదు. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఎగుమతుల వరకు పూర్తి వ్యవస్థను అభివృద్ధి చేయాలి చెప్పారు.టెక్నాలజీ, ఆవిష్కరణ (Technology and innovation)మూడో శక్తిగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ను ప్రధాని ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం టెక్నాలజీ, అంతరిక్ష రంగం, రోబోటిక్స్, డేటా సెంటర్లు వంటి భవిష్యత్ రంగాల్లో భారత్ మరింత ముందుకు వెళ్లాలని అన్నారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. తదుపరి తరం కమ్యూనికేషన్ టెక్నాలజీలో కూడా దేశం నాయకత్వం వహించాలని చెప్పారు. ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా 6జీను ప్రపంచానికి అందించే స్థాయికి భారత్ ఎదగడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.గతి శక్తి (Gati Shakti)నాలుగో శక్తిగా గతిశక్తిని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో రవాణా, కనెక్టివిటీ మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. హైస్పీడ్ రైళ్లు, కొత్త పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు వంటి మౌలిక వసతులను విస్తరించడంతో పాటు.. దేశంలోని నగరాలు, పరిశ్రమలు, పోర్టులు పరస్పరం మెరుగ్గా అనుసంధానమయ్యేలా చూడాలని సూచించారు. పోర్టులను కేవలం సరుకులు ఎగుమతి, దిగుమతి చేసే ప్రాంతాలుగా కాకుండా.. ఆర్థిక అభివృద్ధికి కేంద్రాలుగా మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు.రక్షణ శక్తి (Raksha Shakti)ఐదో శక్తిగా రక్షణ రంగం గురించి పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా.. భారత్ మరింత ఆత్మనిర్భర్గా మారాలని ప్రధాని చెప్పారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, హైపర్సోనిక్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల్లో భారత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. భారత్ కేవలం ప్రపంచ దేశాలకు మార్కెట్గా ఉండకుండా.. అత్యాధునిక రక్షణ సాంకేతికతను తయారు చేసి ఇతర దేశాలకు అందించే స్థాయికి ఎదగాలన్నది లక్ష్యం.గ్రీన్, బ్లూ ఎకానమీ (Green economy and blue economy)ఆరవ శక్తిగా గ్రీన్, బ్లూ ఎకానమీలను ప్రధాని ప్రస్తావించారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, పర్యావరణహిత తయారీ వంటి రంగాల్లో భారత్ భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు.అదే సమయంలో.. దేశానికి ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని కూడా ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు. మత్స్య పరిశ్రమ, సముద్ర సాంకేతికత, తీర ప్రాంత పర్యాటకం వంటి రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా బ్లూ ఎకానమీకి మరింత ఊతమివ్వాలని అన్నారు.యువశక్తి, సాఫ్ట్ పవర్ (India’s soft power)'సప్తధార'లో చివరి శక్తిగా యువశక్తి, భారత సాఫ్ట్ పవర్ను ప్రధాని వివరించారు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, ఆరోగ్యం, హస్తకళలు వంటి సంప్రదాయ రంగాలతో పాటు సినిమాలు, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ వంటి ఆధునిక సృజనాత్మక రంగాల్లో కూడా భారత్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని పెంచుకోవాలని అన్నారు.అంతే కాకుండా.. వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడం, భారతదేశంలోని ప్రకృతి అందాలు, జాతీయ పార్కులు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి మరింతగా పరిచయం చేయడం ద్వారా దేశ సాఫ్ట్ పవర్ను పెంచుకోవాలని సూచించారు.'సప్తధార'లో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఏడు రంగాలను వేర్వేరుగా చూడకూడదని ప్రధాని స్పష్టం చేయడం. ఉదాహరణకు తయారీ రంగానికి టెక్నాలజీ అవసరం. వ్యవసాయానికి ఫుడ్ ప్రాసెసింగ్ అవసరం. ఎగుమతులకు మెరుగైన లాజిస్టిక్స్ అవసరం. రక్షణ రంగానికి ఆవిష్కరణలు అవసరం. గ్రీన్ ఎకానమీకి యువత, టెక్నాలజీ అవసరం. అంటే.. ఒక రంగం అభివృద్ధి చెందితే దాని ప్రభావం మరో రంగంపైనా పడుతుంది. ఈ రంగాలన్నింటినీ కలిపి ముందుకు తీసుకెళ్లడమే 'సప్తధార' ఆలోచనలోని అసలు ఉద్దేశం.వికసిత్ భారత్ లక్ష్యానికి.. సప్తధార!మన దేశం స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తిచేసుకునే 2047 నాటికి వికసిత్ భారత్గా మారాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం ఒకటి రెండు రంగాలు అభివృద్ధి చెందితే సరిపోదు. తయారీ నుంచి వ్యవసాయం వరకు, టెక్నాలజీ నుంచి రక్షణ వరకు, గ్రీన్ ఎకానమీ నుంచి యువశక్తి వరకు అన్ని రంగాలు కలిసి ముందుకు సాగాలి.ఇదీ చదవండి: 80 ఏళ్లలో 1711 రెట్లు పెరిగిన బంగారం!
ఫ్యామిలీ
నొప్పి లేకున్నా... నిర్లక్ష్యం వద్దు!!
కొందరిలో ఒక్కోసారి తమ కాళ్లలో లేదా చేతుల్లో గడ్డ కనిపించవచ్చు. అది నొప్పి లేని గడ్డ కావడంతో పాటు క్రమంగా పెరుగుతూపోవచ్చు. కారణం లేకుండా ఎముకల్లో నొప్పి కనిపించడంతో రాత్రివేళల్లో ఆ నొప్పి పెరుగుతూ పోవచ్చు. ఆటల్లో గాయపడటమో లేదా తమకు తెలియకుండా ఏదైనా చిన్నపాటి దెబ్బతగలడం వల్లనో ఇలా జరుగుతుండవచ్చని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ లక్షణాలు కొన్నిసార్లు ‘సార్కోమా’ అనే క్యాన్సర్కు సూచనలు కావచ్చు. ఈ సార్కోమా తరహా క్యాన్సర్పై అవగాహన కోసం ఈ కథనం.సార్కోమా అనేది అరుదైన క్యాన్సర్లలో ఒకటి. సార్కోమా అంటే ఏమిటో చూద్దాం...మన దేశంలో సార్కోమా విస్తృతి... భారతదేశంలో ప్రతి ఏడాది సుమారు 20 వేల కొత్త సార్కోమా కేసులు నమోదవుతున్నట్లు అంచనా. అయితే అవగాహన లోపం, లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామంది వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తే మంచి ఫలితాలు కనిపించడంతో పాటు బాధితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తుందని గుర్తుంచుకోవడం ముఖ్యం. సార్కోమా అంటే..? సార్కోమా అనేది దేహంలోని ఎముకలు, కండరాలు, కొవ్వు, రక్తనాళాలు, నరాలు, కార్టిలేజ్, టెండన్లు వంటి మృదుకణజాలా (సాఫ్ట్ టిష్యూస్)లో వచ్చే అరుదైన క్యాన్సర్. సాధారంగా కనిపించే మిగతా క్యాన్సర్లతో పోలిస్తే ఇది కాస్త అరుదుగా కనిపించినప్పటికీ, చిన్నపిల్లలు, యువత, మధ్యవయస్కుల్లోనూ ఇటీవల కొంత ఎక్కువగానే కనిపిస్తోంది. ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ముఖ్యంగా చేతులు, కాళ్లు, తొడలు, భుజాలు, పొత్తికడుపు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.లక్షణాలు... తొలి దశల్లో ‘సార్కోమా’లో పెద్దగా నొప్పి ఉండకపోవడంతో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. సార్కోమాలో కనిపించే సాధారణ లక్షణాలవి... ∙నొప్పి లేకుండా క్రమంగా పెరుగుతున్న గడ్డ ∙చేతులు లేదా కాళ్లలో అసాధారణ వాపు ∙రాత్రివేళల్లో ఎక్కువయ్యే ఎముకల నొప్పి ∙కారణం లేకుండా నెలల తరబడి నొప్పి కొనసాగడం ∙గడ్డ పరిమాణం వేగంగా పెరుగుతుండటం ∙కదలికల్లో ఇబ్బంది లేదా గడ్డ వచ్చిన అవయవం పనితీరు తగ్గడం ∙ఐదు సెంటీమీటర్లకు మించిన గడ్డలు రావడం, కొన్ని వారాలుగా ఆ గడ్డల్లో వాపు తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయడం సరికాదు. పైన పేర్కొన్న లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది.నిర్ధారణ ఇలా... సార్కోమా నిర్ధారణ కోసం చేసే పరీక్షల్లో కొన్ని... ∙ఎంఆర్ఐ స్కాన్ ∙పీఈటీ–సీటీ స్కాన్ ∙బయాప్సీ. ఈ పరీక్షలతో కణితి రకం, సైజు, వ్యాప్తితో పాటు అది ఏ దశలో ఉందన్న విషయాలను నిర్ధారణ చేశాక... దాన్ని బట్టి చికిత్సను ΄్లాన్ చేస్తారు. చికిత్స ... బాధితుల పరిస్థితిని బట్టి శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీనిలలో పేషెంట్కు అవసరమైనదాన్ని నిర్ణయిస్తారు. ఒక్కోసారి ఈ చికిత్సలన్నింటినీ సమన్వయంతో అందించాల్సి రావచ్చు. అయితే తొలిదశల్లోనే చికిత్స మొదలుపెట్టడం వల్ల చాలా మంది జీవితం తిరిగి సాధారణంగా అయ్యేందకు అవకాశాలెక్కువ.ఆధునిక చికిత్సలతో అవయవాన్ని కాపాడే అవకాశం... గతంలో సార్కోమా చికిత్సలో చాలాసార్లు చెయ్యి లేదా కాలిని తొలగించాల్సి వచ్చేది. కానీ ఇటీవల వైద్యరంగంలోని అధునాత సాంకేతిక పురోగతితో లింబ్ సాల్వేజ్ సర్జరీలు, అత్యాధునిక ఇం΄్లాంట్లు, రీకన్ స్ట్రక్షన్ పద్ధతుల ద్వారా గడ్డను పూర్తిగా తొలగించడంతో పాటు అవయవాన్ని కాపాడే అవకాశాలూ గణనీయంగా పెరిగాయి.చికిత్స తర్వాత కూడా జాగ్రత్తలు అవసరం... శస్త్రచికిత్సతో లేదా ఇతరత్రా అవసరమైన చికిత్సల తర్వాత పరిస్థితి అంతా తిరిగి సాధారణ స్థితి చేరుకుందని అనుకోవడం సరికాదు. నిజానికి పేషెంట్లు తమ చికిత్స తర్వాత కూడా ఫిజియోథెరపీ, పునరావాస చికిత్స (రీ–హ్యాబిలిటేషన్ థెరపీ) వంటివి చేస్తూ ఉండటంతో పాటు క్రమం తప్పకుండా ఫాలోఅప్కు రావడమూ తప్పనిసరి. అలాగే కుటుంబ సభ్యుల సహకారమూ పేషెంట్లు పూర్తిగా కోలుకోవడంలో కీలక భూమిక పోషిస్తుందని గుర్తుంచుకోవాలి. డాక్టర్ రాజీవ్ రెడ్డిఆర్థోపెడిక్ ఆంకోసర్జన్– సార్కోమా స్పెషలిస్ట్
మెదడుకు కావాలి ఒక సెలవు
ఉదయం మీరు లేవకముందే లేస్తుంది. మంచం దిగక ముందే పని మొదలుపెడుతుంది. రాత్రి నిద్రపోయాక కూడా పని చేస్తూనే ఉంటుంది. ఆఫీస్కు వెళ్లినా... ఇంట్లో ఉన్నా... ట్రిప్కు వెళ్లినా... ఒక్క సెకను కూడా విరామం తీసుకోకుండా... ప్రతి మెసేజ్లు చదువుతుంది... రీల్స్ చూస్తుంది... పనులు ప్లాన్ చేస్తుంది... భవిష్యత్తు గురించి భయపడుతుంది... ఇంత చేసినా... జీతం అడగదు... బోనస్ కోరదు... అదే మన మెదడు! ఇలా 24 గంటలు... 365 రోజులు... ఓవర్టైమ్ చేసే మెదడుకు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, మనోవైజ్ఞానిక నిపుణులు ఒకటే చెబుతున్నారు. శరీరానికే కాదు... మెదడుకూ ఒక సెలవు అవసరం! అదే ఆరోగ్యమూ కూడా!బ్రెయిన్ హాలిడే ఎలా పుట్టిందిఇది క్యాలెండర్లో ఉండే పండుగ కాదు... ఎవరో ఒక్కరు కనిపెట్టిన ఆవిష్కరణా కాదు. 2000ల తర్వాత స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా, 24/7 వర్క్ కల్చర్, వర్క్ ఫ్రం హోమ్, డిజిటల్ జీవితం పెరిగేకొద్దీ... మానసిక అలసట, బర్నౌట్, స్క్రీన్ ఒత్తిడిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అప్పుడు వైద్యులు, మనోవైజ్ఞానిక నిపుణులు, నిద్రా నిపుణులు ఒకే మాట చెప్పారు... ‘మెదడు కూడా విశ్రాంతి కోరుకుంటుంది.’ అలా అప్పటి నుంచి డిజిటల్ డిటాక్స్, మైండ్ఫుల్నెస్, స్లో లివింగ్ వంటి భావనలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. అలా ఇవన్నీ చేస్తున్నప్పటికీ మెదడు ఇంకా బ్రేక్ కోరుకుంటూనే ఉంది. అందుకే, ఇప్పుడు తాజాగా... పూర్తి బ్రెయిన్ హాలిడే ట్రెండ్ మొదలైంది. ఇది ఒక ట్రావెల్ డెస్టినేషన్ కాదు. మెదడుకు ఇచ్చే చిన్న విరామం.హాలిడే... మెదడుకే ఎందుకు?శరీరం అలసిపోతే మనకు వెంటనే తెలుస్తుంది. కాళ్లు నొప్పి, కళ్లు బరువు, నీరసం, కానీ మెదడు అలసిపోతే? అదే పనిని మళ్లీ మళ్లీ వాయిదా వేయడం; చిన్న విషయానికే చిరాకుపడటం; ఏకాగ్రత లేకపోవడం; ఏమీ చేయాలనిపించకపోవడం; ఎప్పుడూ ఫోన్ చూడాలనిపించడం– ఇలా చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తుంది. అప్పుడు ‘కాఫీ తాగాలి’ అనుకునే ముందు ‘ఒక్క బ్రేక్ తీసుకోవాలి’ అని ఆలోచించండి.అంటే ఏంటి?బ్రెయిన్ హాలిడే అంటే, చాలామంది ఏదైనా కొండెక్కి, చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయాలని అనుకుంటారేమో! కానీ, బ్రెయిన్ హాలిడే అంటే అది కాదు. మెదడుకి కాసేపు ‘ఏం చేయొద్దు బాస్!’ అని చెప్పడమే. అసలూ ఏ పనీ లేకుండా, కాసేపు ఏమీ ఆలోచించకుండా అలా కూర్చోవడమే అసలైన బ్రెయిన్ హాలిడే! అయితే ఇదే ఇప్పుడు చాలామందికి కష్టంగా మారింది.ఎందుకంటే, ఒకప్పుడు ‘ఏమీ చేయకుండా ఉండటం’ బద్ధకం అంటుంటే, ఇప్పుడది ఒక విలాసమే! కాదు, అవసరం కూడా! ఎందుకంటే, 2025లో 36,245 మందిపై జరిగిన 54 పరిశోధనల విశ్లేషణలో బోర్ కొట్టే భావనకు, లేజీనెస్కు సంబంధం లేదని తేల్చారు. మరోవైపు, అమెరికాలో 2025లో నిర్వహించిన సర్వేలో 62 శాతం మంది ‘ఫోన్ లేకున్నా, ఏ పని చేయకుండా ఉన్నా, ఆందోళనగా అనిపిస్తుంద’ని చెప్పారు. దీంతో ఆరోగ్యం కోసం శరీరానికే కాదు, బ్రెయిన్కి కూడా విరామం తప్పనిసరి అయింది.ఫోన్ పక్కన పెట్టినా సరిపోదు!బ్రెయిన్ హాలిడే కోసం ‘ఫోన్ ఎక్కువగా వాడొద్దు’ అనేది కొత్త సలహా కాదు. కానీ అసలు సమస్య ఏంటంటే... ఫోన్ మన చేతిలో ఉన్నంతకాలం అది కేవలం ఫోన్ గా ఉండటం లేదు! అది ఆఫీస్, సినిమా హాల్, షాపింగ్ మాల్, న్యూస్ చానెల్స్, ఫ్రెండ్స్, బ్యాంక్, కెమెరా, మ్యాప్, ఎంటర్టైన్మెంట్... ఇలా ఒకేసారి అన్నీ అయిపోతోంది! ఇలా ప్రతి చిన్న ఖాళీని ఫోన్ తో నింపేస్తుండటంతో మన మెదడుకి కాసేపు ఊపిరి పీల్చుకునేంత ఖాళీ కూడా దొరకడం లేదు. అందుకే కొన్ని దేశాల్లో ఫోన్ రహిత కార్యక్రమాలు, ఫోన్ లేకుండా గడిపే సమావేశాలు, తెరలకు దూరంగా ఉండే అనుభవాలు పెరుగుతున్నాయి.బ్రిటన్ లో 2024 నుంచి 2025 మధ్య ఇలాంటి ఫోన్ రహిత కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య 21 శాతం పెరిగిందని ‘ది గార్డియన్ ’ అనే సర్వే నివేదించింది. కానీ ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం! ఫోన్ కి దూరంగా ఉండటమూ కూడా మెదడుకి పూర్తి సెలవు కాదని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. ఫోన్ లేకపోయినా మన మనసు, మెదడును మరో ఆలోచనతో బిజీగానే ఉంటుంది. మరి మెదడుకి కావాల్సిన సెలవు ఏంటి? అనేదే ఇక్కడ అసలు ప్రశ్న!ఖాళీగా ఉండటం కష్టమైపోయింది?ఒకప్పుడు ఖాళీ దొరికితే, కాసేపు అలా కూర్చునేవాళ్లం. కిటికీలోంచి బయటకు చూస్తూ ఏవేవో ఆలోచించేవాళ్లం. ఇప్పుడు మాత్రం రెండు నిమిషాలు ఖాళీగా ఉంటే చాలు... ‘ఏదైనా చూద్దాం!’ అంటూ ఫోన్ చేతిలోకి వచ్చేస్తుంది. బోర్ కొట్టినా ఫోన్ ... ట్రాఫిక్లో వాహనాలు కదలకపోయినా ఫోన్ ... భోజనం ముందున్నా ఫోన్ ... ఎవరైనా రెండు నిమిషాలు ఆలస్యమైనా ఫోన్ ... చివరికి నిద్ర రావడం లేదని ఫోన్ తీసుకుని, ఫోన్ చూసి నిద్ర పారిపోయిందని బాధపడటం కూడా మనదే! ఇలా మన జీవితంలో దొరికే ప్రతి చిన్న ఖాళీని సందేశాలు, వార్తలు, చిన్నచిన్న వీడియోలు, ప్రకటనలు, వినోదంతో నింపేస్తున్నాం. అసలు మనకు బోర్ కొట్టడం లేదు... బోర్ కొట్టేంత ఖాళీనే ఇవ్వడం లేదు! అందుకే, ప్రస్తుతం చాలామందికి ఖాళీగా ఉండటమే అసలైన పెద్ద సమస్యగా మారింది.ట్రిప్కి వెళ్లి... ట్రాప్లో పడొద్దు!హాలిడే అంటే ఒత్తిడికి బ్రేక్ చెప్పడానికి వెళ్లేది. కానీ చాలామంది ట్రిప్కి వెళ్లాక కూడా అదే టెన్షన్ ను వెంట తీసుకెళ్తారు. ఎక్కడ తినాలి? ఏం చూడాలి? ఫొటోలు ఎన్ని తీయాలి? రీల్ ఎప్పుడు పెట్టాలి? ఆఫీస్ మెయిల్ వచ్చిందా? ఇలా ట్రిప్ని కూడా మరో పనిలా చేస్తుంటారు. అందుకే, ఈసారి ట్రిప్కు వెళ్లినప్పుడు, హాలిడే ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఇవీ గుర్తుంచుకోండి!ప్లాన్ మొత్తం ముందే!చివరి నిమిషంలో టికెట్లు, హోటళ్లు, బ్యాగులు, బడ్జెట్ గురించి టెన్షన్ పడితే, హాలిడే మొదలయ్యేలోపే మెదడు అలసిపోతుంది. అందుకే ముందుగానే ప్లాన్ చేసుకోండి. అప్పుడే ప్రయాణం మొదలయ్యే ముందే హాలిడే ఫీలింగ్ మొదలవుతుంది.కొత్త ప్రదేశం... కొత్త మెదడు!ఎప్పుడూ చూసిన రోడ్లు, అదే రెస్టరెంట్లు, అదే రొటీన్ ... ఇవి మెదడుకు కొత్తదనం ఇవ్వవు. కొత్త ప్రదేశాలు, కొత్త రుచులు, కొత్త అనుభవాలు మాత్రం మెదడుకు చిన్న పండుగలాంటివి.అడ్రెస్ మర్చిపోకండి!కొత్తదనం బాగానే ఉంటుంది. కానీ మరీ దారి తెలియని అడవులు, భాష రాని ఊళ్లు, ప్లాన్ లేని ప్రయాణాలు– చివరికి హాలిడేను సర్వైవల్ చాలెంజ్గా మార్చొచ్చు. కొత్తదనం ఉండాలి, కానీ కంఫర్ట్ కూడా ఉండాలి.సరైన వాళ్లతో వెళ్లండి!ట్రిప్ను గుర్తుండిపోయేలా చేసేది ప్రదేశం కంటే... తోడున్న వాళ్లు. నవ్వించే వాళ్లతో వెళ్లండి. ప్రతి ఐదు నిమిషాలకు గొడవపడే వాళ్లతో కాదు, లేకపోతే ట్రిప్ ముగిసేలోపే గ్రూప్ కూడా ముగిసిపోతుంది!బ్రెయిన్ కు వార్మప్!రోజంతా స్క్రీన్ లో మునిగిపోయిన మెదడు– హాలిడే మొదలైందని ఒక్కసారిగా ప్రశాంతంగా మారదు. అందుకే ట్రిప్కు కొన్ని రోజుల ముందే రాత్రిళ్లు ఫోన్ ను కాస్త దూరంగా పెట్టడం, ప్రశాంతంగా గడపడం అలవాటు చేసుకోండి.మొదటి రోజే మ్యాజిక్!ట్రిప్లో మొదటి అనుభవాలే ఎక్కువకాలం గుర్తుంటాయి. అందుకే మొదటి రోజే మీకు బాగా నచ్చే పని చేయండి. మంచి సూర్యోదయం కావచ్చు, ఇష్టమైన రెస్టరెంట్ కావచ్చు, ఎప్పటి నుంచో చూడాలనుకున్న ప్రదేశం కావచ్చు.ట్రిప్ ముగిసిందా... పరవాలేదు!హాలిడే ముగిసిన వెంటనే రొటీన్ లోకి దూకేయకండి. సూట్కేస్ తెరిచినంత ఈజీగా మెదడు హాలిడే మూడ్ నుంచి బయటకు రాదు. ఇంటికి వచ్చాక నెమ్మదిగా గడపండి. ట్రిప్ ఫొటోలు చూడండి. జ్ఞాపకాలను గుర్తు చేసుకుని నవ్వుకోండి. ఆఫీస్ పనులకు దూరంగా ఉండండి.హాలిడే అంటే కేవలం ప్రదేశం మార్చడం కాదు, మనసును మళ్లీ ఉల్లాసపరచడం! అలా ఉల్లాసపరచాక వెంటనే, తిరిగి వెంటనే కష్టపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి.సెలవిస్తే... ఏం లాభం?రోజంతా ఆగకుండా పరిగెత్తిన మెదడుకు కూడా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికితే? ముందుగా ఒత్తిడి తగ్గుతుంది. మనసు తేలికగా అనిపిస్తుంది. ఏకాగ్రత మెరుగవుతుంది. చిన్న చిన్న విషయాలకే వచ్చే చిరాకు తగ్గుతుంది. నిర్ణయాలు కూడా స్పష్టంగా తీసుకోగలుగుతాం. కొన్నిసార్లు గంటల తరబడి ఆలోచించిన సమస్యకు... నిశ్శబ్దంగా కూర్చున్న పది నిమిషాల్లోనే పరిష్కారం దొరుకుతుంది.కొత్త ఉత్సాహం మొదలవుతుంది... చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఎప్పుడూ ఏదో ఒకటి చూస్తూ, వింటూ, స్క్రోల్ చేస్తూ, ఆలోచిస్తూ ఉండే మెదడుకు కాసేపు విరామం దొరుకుతుంది. అక్కడే కొత్త ఆలోచనలు పుడతాయి. కొన్నిసార్లు జీవితాన్ని మార్చే ఐడియాలు కూడా అక్కడి నుంచే మొదలవుతాయి. అందుకే మెదడుకు హాలిడే అంటే సమయాన్ని వృథా చేయడం కాదు. ఆలోచనలకు కొత్త చిరునామా ఇవ్వడం కూడా!ఆఫ్లో ఉన్నప్పుడే ఆన్ !మన మెదడు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. కానీ మనం కాసేపు చేసేపనిని ఆపేసినప్పుడు, మెదడు కూడా పూర్తిగా ఆగిపోదు. బదులుగా ‘డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్’ (డీఎమ్ఎన్) అనే సిస్టమ్ యాక్టివ్ అయి, ఆ రోజంతా దొరికిన సమాచారాన్ని మెదడు సర్దుకుంటుంది. పాత జ్ఞాపకాలను కొత్త సమాచారంతో కలుపుతుంది. సంబంధం లేని రెండు ఆలోచనల మధ్య కొత్త లింక్ కూడా కనిపెడుతుంది. అందుకే, షవర్లో ఉన్నప్పుడు సూపర్ ఐడియా రావడం; వాకింగ్ చేస్తుంటే సమస్యకు సొల్యూషన్ దొరకడం; నిద్రకు ముందు ఒక్కసారిగా ‘అరే... ఇదే కదా!’ అనిపించడం; ఇవన్నీ అంత యాదృచ్ఛికం కాకపోవచ్చు! అందుకే, మీరు పూర్తిగా బ్రెయిన్కి సెలవు ఇవ్వాలంటే ఈ చిన్న చిన్న పనులను తప్పకుండా చేయాలి.అన్నింటికీ దూరంగా.. మెదడుకు హాలిడే ఇవ్వాలంటే ముందుగా దానికి వచ్చే సమాచార ప్రవాహాన్ని తగ్గించాలి. వారానికి ఒకరోజు డిజిట్ డిటాక్స్: ఒంటరిగా ఉండటం, ఎక్కడికీ వెళ్లకుండా ఉండటం, ఇంటి పనులకు కూడా దూరంగా ఉండడం లాంటి చిన్న మార్పులు ఉపయోగపడొచ్చు.కళ్లకు 20 –20 బ్రేక్! మొదడకు హాలిడే ఇచ్చేటప్పుడు ప్రకృతితో 20 నిమిషాల డీల్ని తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే, పచ్చని చెట్లు, ఓపెన్ స్పేస్, నిశ్శబ్దమైన వాతావరణాన్ని అలా ఒక ఇరవై నిమిషాలు చూస్తే, అదే మెదడుకు మంచి బ్రేక్! అయితే, హాలిడేకి వెళ్లేంత బడ్జెట్, టైమ్ లేనివాళ్లు, ప్రతి 20 నిమిషాలకు... 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును అసలు ఏమీ ఆలోచించకుండా కనీసం 20 సెకన్లు చూస్తే చాలు.డూ నథింగ్!ఇది చాలా కష్టం! ఎందుకంటే, మనకు చిన్నప్పటి నుంచి ‘ఖాళీగా కూర్చోకు!’, ‘ఏదో ఒకటి చేయి!’, ‘టైమ్ వేస్ట్ చేయకు!’ అంటూనే పెంచుతారు. కానీ, మెదడు ఎప్పుడూ పనిలోనే ఉండాల్సిన అవసరం లేదు కాసేపు ఖాళీగా కూర్చోవటం. ఒంటరిగా గడపటం వంటివేవి ఎవరూ నేర్పించరు. ఇవన్నీ మీ ఆరోగ్యం కోసం మీరే నేర్చుకోవాలి.నిశ్శబ్దమూ కావాలి!రోజులో కొద్దిసేపు ఇష్టమైన పాట వినండి. వర్షం శబ్దం వినండి. పక్షుల కిలకిలలు వినండి. మెదడుకు నిరంతరం కంటెంట్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు కాస్త నిశ్శబ్దమూ కావాలి!నిద్రతో రీచార్జ్!మెదడుకు అసలు విశ్రాంతి ఇచ్చేది అంతరాయం లేని మంచి నిద్ర. నిద్రలోనే మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. అందుకే హాలిడేలో కనీసం ఒకరోజైనా అలారం లేకుండా ప్రశాంతంగా నిద్రపోండి.చిన్న హాలిడే! మెదడుకు హాలిడే ఇవ్వాలంటే ఒకరోజు మొత్తం ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. రోజుకు 15–30 నిమిషాల చిన్న విరామమే చాలాసార్లు మంచి ఆరంభం అవుతుంది. కాసేపు అన్నింటినీ పక్కన పెట్టి, నిశ్శబ్దంగా నడవండి. ఈ చిన్న అలవాటే, మెదడుకు మంచి హాలిడే!ఒక్కరోజు ప్రయోగం!ఒక్కరోజు మీ మెదడును వీఐపీ గెస్ట్లా ట్రీట్ చేసి చూడండి. ఉదయం లేచిన వెంటనే ప్రపంచాన్ని కాదు, మీ చుట్టూ ఉన్న ప్రశాంతతను పలకరించండి. రోజంతా తొందరపడకుండా, ఒకసారి ఒక పనికే సమయం ఇవ్వండి. మధ్యలో కొద్దిసేపు నిశ్శబ్దాన్ని ఆస్వాదించండి. సాయంత్రం మీకు నిజంగా ఆనందం ఇచ్చే పనిలో మునిగిపోండి. రాత్రి నిద్రకు గంట ముందు అన్నింటినీ పక్కన పెట్టి, మీ మెదడుకు కూడా ‘ఇవాళ్టి డ్యూటీ అయిపోయింది... వెళ్లి హాయిగా నిద్రపో!’ అని చెప్పండి.ఇది కేవలం సరదా చాలెంజ్ కాదు, చిన్న సైన్స్ కూడా! కొన్ని పరిశోధనల ప్రకారం మన మెదడు రోజుకు సుమారు ఆరువేలకు పైగా ఆలోచనలు చేస్తుంది. అలాంటి మెదడుకు కొద్దిసేపు నిశ్శబ్దం దొరికినా, రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరించుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ప్రకృతిలో కేవలం 20 నిమిషాలు గడిపినా ఒత్తిడి తగ్గుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక్క రోజు ఇలా గడిపి చూడండి– వచ్చే హాలిడే కోసం ఎదురుచూసేది మీరు కాదు, మీ మెదడే! కుటుంబంలో అందరికీ!బ్రెయిన్ హాలిడే అంటే ఉద్యోగస్తులకు మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ అవసరమే. పిల్లలు రోజంతా చదువు, హోంవర్క్, క్లాసులతో అలసిపోతారు. టీనేజర్లు సోషల్ మీడియా, పరీక్షల ఒత్తిడితో సతమతమవుతారు. తల్లిదండ్రులు ఉద్యోగం, ఇంటి పనులు, బాధ్యతల మధ్య తమ కోసం క్షణం కూడా కేటాయించలేరు. పెద్దవాళ్లు కూడా ఆందోళనలు, ఆరోగ్య సమస్యలతో మానసికంగా అలసిపోతారు.అందుకే వారానికి ఒకరోజు ఇంట్లో ‘నో స్క్రీన్ డే’ పెట్టండి. టీవీ ఆఫ్, ఫోన్లు పక్కన, ల్యాప్టాప్లకు సెలవు. కలిసి అల్పాహారం చేయండి... పార్క్కు వెళ్లండి... బోర్డ్ గేమ్స్ ఆడండి... పాత ఫొటోలు చూస్తూ నవ్వుకోండి... లేదా గంటసేపు కబుర్లు చెప్పుకోండి. ఆ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు... ఆ రోజు జ్ఞాపకం మీ మెదడులో సేవ్ అయితే చాలు! కొన్నిసార్లు కుటుంబంతో కలిసి గడిపే క్షణాలు కూడా బెస్ట్ హాలిడేనే! శరీరానికి విశ్రాంతి ఇస్తే, అలసట పోతుంది. మనసుకు ప్రశాంతత ఇస్తే, ఉల్లాసం వస్తుంది. అదే మెదడుకు సెలవిస్తే, జీవితం మళ్లీ కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే, మెదడు హ్యాంగ్ అయితే జీవితం బఫరింగ్లో పడిపోతుంది!∙కొండి దీపిక
ఆర్కైవ్ అద్భుతః
‘ఆర్కైవ్లు అనేవి వ్యవస్థలు, ప్రభుత్వాల పని’ అనే అభిప్రాయం ఉంది. అయితే ఇటీవలి కాలంలో వ్యక్తిగత స్థాయిలో ఆన్లైన్ ఆర్కైవ్లు ప్రజాదరణ పొందుతున్నాయి. ‘నా రాష్ట్ర చరిత్రను మహిళల కోణం నుంచి చూడాలి’ అనే లక్ష్యంతో ఒక ఇంజినీర్ ఆన్లైన్ ఆర్కైవ్ మొదలు పెట్టాడు. హిట్! ‘పాత వస్తువులు చరిత్రకు అద్దాలు. మీ ఇంట్లోని పా...త వస్తువుల గురించి మీ జ్ఞాపకాలను పంచుకోండి’ అంటూ ప్రారంభమైన ఆర్కైవ్ సూపర్ హిట్!!దిల్లీలో పుట్టి టొరంటోలో స్థిరపడ్డాడు హర్లిన్ సింగ్. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చిన ఈ ఇంజినీర్ దేశవిభజన రోజుల నాటి ఎన్నో విషయాలను పెద్దల నోటి నుంచి విన్నాడు. అయితే తాను విన్న వాటిలో మహిళలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఉన్న విషయాన్ని గ్రహించాడు. ఈ నేపథ్యంలో తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ‘ది సింగింగ్సింగ్’లో పంజాబ్ చరిత్రను మహిళల కోణం నుంచి చూసే ఆర్కైవ్కు శ్రీకారం చుట్టాడు. అదే...ది లాస్ట్ హీర్.పంజాబీ జానపద కథల్లోని సాహసవంతురాలైన వీర వనిత హీర్. కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి వీర వనితకు ప్రతీకగా నిలుస్తుంది హీర్. ఆ వీరవనితను గుర్తుకు తెచ్చేలా తన ఆర్కైవ్కు ‘ది లాస్ట్ హీర్’ అని పేరు పెట్టాడు హర్లిన్ సింగ్.వెలుగులోకి...1936లోనే పైలట్ లైసెన్స్ పొందిన మొట్ట మొదటి పంజాబీ మహిళ సర్లా థక్రాల్. ఎప్పుడూ వినని ఇలాంటి అరుదైన మహిళల గురించి సమాచారాన్ని సేకరించి ‘ది లాస్ట్ హీర్ ప్రాజెక్ట్: విమెన్ ఇన్ కలోనియల్ పంజాబ్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చాడు హర్లిన్సింగ్. ప్రసిద్ధ పెంగ్విన్ సంస్థ ద్వారా ఈ పుస్తకాన్ని విడుదల చేశాడు.లాహోర్లో నిరసనల హోరుభగత్సింగ్ అరెస్ట్ను నిరసిస్తూ ఆనాటి లాహోర్ రాజకీయ ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఆసియా నలుమూలల నుంచి వచ్చిన మహిళా కార్యకర్తలు, నాయకులతో ఒక సమావేశం ఏర్పాటైంది.ఈ సమావేశంలో పురుషాధిపత్య భావజాలానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. ...ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో ఎన్నో ‘ది లాస్ట్ హీర్’ ఆర్కైవ్లో కనిపిస్తాయి.బ్రౌన్ హిస్టరీటొరంటోకు చెందిన ఇంజినీర్ అహ్సున్ జాఫర్ తమ కుటుంబ మూలాలను అన్వేషించే క్రమంలో ఇన్స్టాగ్రామ్లో ‘బ్రౌన్ హిస్టరీ’ పేరుతో పేజీ క్రియేట్ చేశాడు. తన కుటుంబ ఆర్కైవ్గా ప్రారంభమైన ‘బ్రౌన్ హిస్టరీ’ తన పరిధిని విస్తృతం చేసుకొంది. తమ బంధువులకు మాత్రమే కాదు ఎంతో మంది ప్రజలకు ఈ ఆర్కైవ్ చేరువైంది. ‘బ్రౌన్ హిస్టరీ’కి వేలాదిమంది ఫాలోవర్లు ఉన్నారు. ‘మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలనే ఆసక్తితోనే ఈ ఆర్కైవ్ మొదలు పెట్టాను’ అంటున్న జాఫర్ ఒక న్యూస్లెటర్ను నిర్వహిస్తున్నాడు. రచయితలు, మేధావులతో పాడ్కాస్ట్ షోలు చేస్తున్నాడు.ఒక వ్యక్తి తన సొంత చరిత్ర కోసం చేసిన అన్వేషణ, వేలాది మంది వ్యక్తులు తమ సొంత చరిత్రను అన్వేషించుకునే వేదికగా రూపుదిద్దుకుంది.చీరకట్టుతో...బ్రిటిష్ చెస్ పోటీల్లో (1930 ప్రారంభంలో) పాల్గొన్న అతికొద్దిమంది భారతీయ మహిళల్లో పెరిన్ ముర్సా ఒకరు. 1932లో లండన్లో జరిగిన బ్రిటిష్ చెస్ ఛాంపియన్షిప్లో ఆమె చీర కట్టుకొని పోటీలో పాల్గొనడం విశేషంగా నిలిచింది. ఇది అప్పుడెప్పుడో తీసిన ఫొటో అయినప్పటికీ ఇప్పటికీ చెస్ అభిమానులు, చరిత్రకారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.చెస్ ఆటలో యూరోపియన్లు, పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఆ కాలంలో ప్రతిష్ఠాత్మకమైన ఒక టోర్నమెంట్లో భారతీయ మహిళ పాల్గొనడం అరుదైన విశేషంగా నిలిచింది. విషాదం ఏమిటంటే, ఆమె గురించి పెద్దగా వివరాలు తెలియవు. పెరిన్ ముర్సా ఏ ప్రాంతానికి చెందిన వారు, ఆమె కుటుంబ నేపథ్యం ఏమిటి? ఈ టోర్నమెంట్ తరువాత కూడా చెస్ ఆడడం కొనసాగించారా లేదా... మొదలైన వివరాలు తెలియవు. అయితే ఈ ఆర్కైవ్కు ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తుంటుంది కాబట్టి ఏదో ఒకరోజు ఆమె గురించి చాలా సమాచారం తెలిసే అవకాశం ఉంది. మనం ఎప్పుడూ వినని పెరిన్ ముర్సాలాంటి ఎంతోమంది ప్రతిభావంతులు ‘బ్రౌన్ హిస్టరీ’లో కనిపిస్తారు.వస్తువుల్లో చరిత్ర!‘చరిత్ర అనేది మాటల్లో మాత్రమే జీవించదు. కొన్నిసార్లు అది ఒక వస్తువు రూపంలో, మసకబారిన ఛాయాచిత్రంలో కూడా జీవించవచ్చు. వస్తువులు, ఫొటోలు వాటి సొంతదారుల కంటే ఎక్కువ కాలం జీవించి చారిత్రక ఆనవాళ్లుగా మిగిలిపోతాయి’... ఈ మాటలే ‘మ్యూజియం ఆఫ్ మెటీరియల్ మెమొరీ’ ఆవిర్భావానికి కారణం అయ్యాయి. వారసత్వ సంపద, కుటుంబ చరిత్రలను అన్వేషించడానికి ప్రజల సహకారంతో ఆంచల్ మల్హోత్రా, నవధా మల్హోత్రా డిజిటల్ ఆర్కైవ్ ‘మ్యూజియం ఆఫ్ మెటీరియల్ మెమొరీ’ని ప్రారంభించారు. వివిధ కుటుంబాలకు సంబంధించిన వస్తువులతో ముడిపడిన జ్ఞాపకాలను వారి మాటల్లో రాసుకునే అవకాశం కల్పిస్తోంది ఈ ఆర్కైవ్.....ఈ స్టోరీ చదివిన తరువాత మీకు కూడా సరికొత్త ఆర్కైవ్ ఆలోచన వస్తే సంతోషమే కదా!
కొబ్బరి పీచుతో సముద్ర కాలుష్యానికి చెక్..! టెన్త్ స్టూడెంట్ ఆవిష్కరణ
కాలుష్యంతో నిండిన సముద్రపు నీటిని శుభ్రం చేయడానికి హవాయి హైస్కూల్ విద్యార్థి వేరావాంగ్(vera wang) అద్భుతమైన ఆవిష్కరణకు నాంది పలికాడు. సముద్రపు నీటి నుంచి మైక్రోప్లాస్టిక్, సన్స్క్రీన్లు(మనం స్నానం చేసేటప్పుడు లేదా సముద్రంలో ఈత కొట్టేటప్పుడు ఈ రసాయనాలు నీటిలో కలుస్తాయి.) ఫిల్టర్ చేయడానికి కొబ్బరి వ్యర్థాలు ప్రభావంతంగా పనిచేస్తాయని గుర్తించింది. సాధారణ హైస్కూల్ ప్రాజెక్టుగా మొదలైన ఈ పరిశోధన ఓ సరికొత్త శాస్త్రీయ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. కొబ్బరి పీచులో సహజంగా లభించే శిలీంధ్రాలు ప్లాస్టిక్, సన్స్క్రీన్ను విచ్ఛిన్నం చేయగలవని తెలిసింది. ఆ నేపథ్యంలోనే కొబ్బరి ఆధారిత సముద్ర ఫిల్టర్లను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ని రూపొందించాడు. ఈ ఫిల్టర్లలో ఉపరితల నీటి నుంచి మైక్రోప్లాస్టిక్లు, సన్స్క్రీన్ను తొలగించేలా కొబ్బరి ఉప-ఉత్పత్తులను ఉపయోగించినట్లు పేర్కొంది. ఆ విధ్యార్ధి హవాయిలోని మానోవా విశ్వవిద్యాలయంలో ఆంథోనీ అమెండ్ ప్రయోగశాలలో ఈ పరిశోధన చేసింది. కొబ్బరిపీచుకు గాలి, నీరు ప్రవహించడానికి వీలు కల్పించే రంధ్రాల నిర్మాణం ఉందని, ఇది సూక్ష్మజీవుల పెరుగదలకు ఉపకరిస్తుందని గుర్తించింది. అందువల్ల ఈ కొబ్బరి పీచు కేవలం కాలుష్య కారకాలను బంధించడం కంటే ఎక్కువ చేయగలదా అనే దిశగా చేయగా..అది అద్భుతమైన ఫలితాలను అందించిందని తెలిపింది. ఆకొబ్బరిపీచులో సహజంగా లభించే శిలీంధ్ర సముదాయాలు సన్స్క్రీన్, ప్లాస్టిక్లను విచ్చిన్నం చేయగలదని అధ్యయనంలో నిరూపితమైందని వెల్లడించింది. ఇది పర్యావరణ శుద్ధిలో రెండు దశలను ప్రభావవంతంగా చేయగలదని పేర్కొంది. మాములుగా అయితే సముద్రంలో ప్లాస్టిక్ని వడకట్టి..దాన్ని ప్రాసెస్ చేసి విచ్ఛిన్నం చేయడం లేదా రీసైకిల్ చేయడం జరుగుతుంది. కానీ సన్స్క్రీన్ సమ్మేళనాలను మాత్రం విచ్చిన్నం చేయడం సులభం కాదు. అవి నీటిలో కలసిపోయి ఉంటాయి. కానీ ఈ కొబ్బరి పీచు ప్లాస్టిక్ని వడపోసి విచ్చిన్నం చేయడం తోపాటు సన్స్క్రీన్ వంటి ఇతర సమ్మేళనాలను సైతం విచ్చిన్నం చేసి శుభ్రపర్చగలదని వెల్లడించింది వాంగ్. అంతేగాదు ఈ హైస్కూల్ విద్యార్థి వాంగ్ పరిశోధనకు హవాయి స్టేట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్లో గుర్తింపు లభించడమే కాకుండా సముద్ర పర్యావరణాలను పీడిస్తున్న కొన్ని అత్యంత మొండి కాలుష్య కారకాలను ఎదుర్కోవడానికి సరికొత్త మార్గాన్ని అందించింది.(చదవండి: ఎవరీ కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్ ? స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీకి..)
అంతర్జాతీయం
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
బెర్లిన్: సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడవద్దని డాక్టర్లు హెచ్చరికలు జారీ చేసిన మనం లెక్కచేయం.. ఏమవుతుందిలే అని నేరుగా గ్రహణాన్ని చూస్తుంటాం తాజా ఇలాంటి నిర్లక్షం వందల మందిని ఆసుపత్రి పాలు చేసింది. ఐరోపాలో ఇటీవల వచ్చిన సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం ద్వారా పెద్ద సంఖ్యలో జనం ఆసుపత్రికి క్యూ కట్టాల్సి వచ్చింది. అయితే వారికి పెద్ద ప్రమాదమేది లేదని డాకర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఇటీవలే ఆగస్టు 12 న ఐరోపా ఖండంలో లో సూర్యగ్రహణం సంభవించింది. దీంతో అక్కడి స్థానిక ప్రభుత్వాలు సూర్యగ్రహాణాన్ని నేరుగా చూడవద్దంటూ సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ (రక్షణ కళ్లద్దాలు) ధరించే దానిని వీక్షించాలని ఆదేశాలు జారీ చేశాయి. అయితే కొంతమంది ప్రజలు అత్యుత్సాహం, నిర్లక్షంతో నేరుగా సూర్యగ్రహణాన్ని చూశారు. దీంతోవారు తీవ్రమైన కంటి సమస్యలతో ఆసుపత్రులపాలయ్యారు.బాధితులు ప్రధానంగా కళ్లలో మంట, దృష్టి లోపాలు, కంటి చూపు మందగించడం, తలనొప్పి మరియు కళ్లు తిరగడం వంటి సమస్యలతో బాధపడుతూ పెద్దఎత్తున ప్రజలు అత్యవసర చికిత్స కోసం వచ్చారని వైద్య సిబ్బంది తెలిపారు. ఐరోపావ్యాప్తంగా వందల సంఖ్యలో ఇటువంటి కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. జర్మనీ బెర్లిన్ బెర్లిన్ నగరంలోని ప్రముఖ ఆసుపత్రులైన చారిటే, వివాంటెస్ వంటి వైద్య కేంద్రాల అత్యవసర విభాగాలకు బాధితులు వరుసకట్టారని అక్కడి వైద్యులు తెలిపారు. అయితే వారిలో చాలా మందికి తాత్కాలిక సమస్యలేనని తీవ్రమైన సమస్యలు ఏవరికి లేవని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు ముందస్తు ప్రభుత్వ హెచ్చరికల కారణంగా మెజారిటీ ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడంతో బాధితుల సంఖ్య పరిమితంగానే ఉండిపోయింది. అయినప్పటికీ, సరైన సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ ధరించకుండా సూర్యుడిని నేరుగా చూడటం వల్ల కంటిలోని రెటీనా తీవ్రంగా దెబ్బతింటుందని, దీనివల్ల తాత్కాలికంగా లేదా శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఖగోళ అద్భుతాలను వీక్షించే సమయంలో ప్రజలు తప్పనిసరిగా సర్టిఫైడ్ సోలార్ సేఫ్టీ గ్లాసెస్ లేదా ప్రత్యేక టెలిస్కోపిక్ ఫిల్టర్లను మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
‘మరీ ఇలా ఉన్నారేంటి!’.. ఇజ్రాయెల్ సెటిలర్ల దుశ్చర్య
ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదం కేవలం భూమి, సరిహద్దులకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు నీటి వనరులపై ఆధిపత్య పోరు కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. సహజ ఊటలను ఇజ్రాయెలీ సెటిలర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరా నిలిచిపోవడంతో తమ వ్యవసాయం, జీవనాధారం దెబ్బతింటోందని కన్నీరు పెడుతున్నారు. అయితే మరో వాదనతో ఇజ్రాయెలీ వర్గాలు తమ చర్యలను సమర్థించుకుంటున్నాయి.జోర్డాన్ లోయలోని ఫసాయిల్ గ్రామం ఈ వివాదానికి కేంద్రంగా మారింది. తరతరాలుగా స్థానిక రైతులకు ఆధారంగా ఉన్న ఓ సహజ ఊట నీటిని ఇజ్రాయెల్ సెటిలర్లు మళ్లించుకున్నారు. ఆ సమీపంలోని ఓ పురాతన కొలనును నింపి.. ఈతలు కొడుతూ వినోదం పొందుతున్నారు. అదే సమయంలో కొందరు.. ఉత్త పుణ్యానికే ట్యాంకర్లలో ఊట నీటిని నింపి దారి పొడవునా పారబోసుకుంటూ పోవడం, నిర్జన ప్రదేశంలో వదిలేయడం లాంటి దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పాలస్తీనా రైతులు ఆందోళనకు గురవుతున్నారు.Israeli settler terrorists deliberately emptied Palestinian water tanks onto the ground in Ein al-Hilweh, in the northern Jordan Valley of the occupied West Bank.Palestinians in this herding community struggle every day for water after Israeli settlers seized their main spring… pic.twitter.com/EzRjMz621l— Ihab Hassan (@IhabHassane) August 10, 2026ఈ నీటితో గతంలో తమ పొలాల్లో వంకాయలు, సొరకాయలు, పుచ్చకాయలు వంటి పంటలు పండించేవారమని.. ఇప్పుడు సాగు నిలిచిపోయిందని వాపోతున్నారు. “నీరు లేకపోవడంతో మా పొలాలు ఎండిపోయాయి. కుటుంబాల జీవనోపాధి దెబ్బతింది” అని ఫసాయిల్కు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి పైపులను స్వాధీనం చేసుకున్నారని, ఊట వైపు వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.కొలనుగా మారిన ఊట.. పర్యాటక ప్రాంతమా?స్థానికులు చెబుతోంది ఏంటంటే.. ఊట నీటిని మళ్లించి పురాతన కొలనును నీటితో నింపారు. అనంతరం దానిని పర్యాటక ఆకర్షణగా ప్రచారం చేశారు. అయితే ఇజ్రాయెల్కు చెందిన కొందరు సెటిలర్లు మాత్రం మరోలా వాదిస్తున్నారు. ఈ ప్రాంతం తమ చారిత్రక వారసత్వంలో భాగమని చెబుతున్నారు. కానీ ఇందులో నిజమెంత? అనేదానిపై పురావస్తు నిపుణులు మరోలా స్పందించారు.Israeli "settlers" in the occupied West Bank diverted a spring that had long served as a lifeline for the Palestinian village of Fasayil, redirecting its water to fill a pool at an archaeological site and turning it into a tourist attraction.Palestinian farmers said the loss of…— Clash Report (@clashreport) August 14, 2026ఈ ప్రాంత చరిత్రపై పూర్తి స్పష్టత లేదని అంటున్నారు. దీంతో చరిత్ర, పురావస్తు అంశాలను ఉపయోగించి వెస్ట్ బ్యాంక్పై ఆధిపత్య భావనను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.‘ఇది నీటి యుద్ధం’.. పాలస్తీనా ఆరోపణపాలస్తీనా అధికారులు మాత్రం నీటి వనరుల నియంత్రణను పెద్ద సమస్యగా చూస్తున్నారు. నీటిని నిలిపివేయడం ద్వారా ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. “ఇది శబ్దం లేని బుల్లెట్లాంటి నీటి యుద్ధం” అని పాలస్తీనా వాటర్ అథారిటీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. వెస్ట్ బ్యాంక్లోని పలు నీటి, పారిశుద్ధ్య వనరులపై ఈ ఏడాది దాడులు జరిగినట్లు నమోదైంది. ముఖ్యంగా జోర్డాన్ లోయ ప్రాంతాల్లో నీటి వనరులపై నియంత్రణ కోసం ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అతిత్వరలో ఇది తాగునీటికి విస్తరించవచ్చనే ఆందోళన సైతం వ్యక్తమవుతోంది అక్కడ. గ్రామాలపై పెరుగుతున్న ఒత్తిడినీటి సమస్యతో పాటు సెటిలర్ల దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయని పాలస్తీనియన్లు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపివేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని చెప్పారు. మరోవైపు.. ఇజ్రాయెల్ సెటిలర్లు మాత్రం అవంతా ఆరోపణలనే అంటున్నారు. ఈ ప్రాంతాలు తమ చారిత్రక, మతపరమైన వారసత్వంతో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. పురాతన ప్రదేశాల అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహంలో భాగంగానే చర్యలు తీసుకుంటున్నట్లు సమర్థించుకుంటున్నారు.భవిష్యత్లో మరింత ఉద్రిక్తత?వెస్ట్ బ్యాంక్లో భూమి తర్వాత నీరు మరో ప్రధాన వివాద అంశంగా మారుతోంది. వ్యవసాయం, తాగునీరు, జీవనోపాధికి ఆధారమైన సహజ వనరులపై నియంత్రణ కోసం జరుగుతున్న పోరు భవిష్యత్లో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకే రోజు.. మూడు విపత్తులు.. చిగురుటాకులా వణికిన ఇండోనేషియా
అత్యంత శక్తివంతమైన భూకంపం ఇండోనేషియాను కుదిపేసింది. ప్రకంపనల ధాటికి భవనాలు పేకమేడల్లా ఒరిగిపోతూ నేల కూలాయి. అదే సమయంలో సముద్ర గర్భంలో అలజడి రేగడంతో సునామీ వస్తుందేమోనని వణికిపోయారు. మరోవైపు.. అగ్నిపర్వతం బద్దలు కావడం అలజడి రేపింది. ఫ్లోరెస్ దీవి, మరికొన్ని చోట్ల రికార్డైన భయానక దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వేకువ జామున 7.7 తీవ్రతతో వచ్చిన ప్రధాన భూకంపంతో ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ఆ తర్వాత వరుసగా ఆఫ్టర్షాక్స్ భయపెట్టాయి. 6.1, 5.9, 5.6 తీవ్రతలతో వరుస ప్రకంపనలు కొనసాగడంతో ఫ్లోరెస్ తీర ప్రజలు భయం భయంగా గడిపారు. ఎండె నగరానికి సమీపంలో భూకంప కేంద్రం నమోదు కాగా.. తూర్పు నుసా టెంగారా, పశ్చిమ నుసా టెంగారా, దక్షిణ సులవేసి ప్రాంతాల్లో సైతం జనాలు ప్రాణాలు అరచేత పట్టుకుని రోడ్ల మీదే గడిపారు. బలమైన ప్రకంపనలు పలు ప్రాంతాల్లో దాదాపు నిమిషం పాటు నమోదయ్యాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.🚨 The earthquake in Indonesia was magnitude 7.7. For many people, the early morning began with disaster. 🇮🇩#Indonesia #Earthquake #BreakingNews #EarthquakeAlert pic.twitter.com/c4edaQnCEh— Mahrosh Pervaiz (@MahroshPervaiz1) August 15, 2026#BREAKING : New Footage shows the Aftermath of Flores Indonesia Following 7.7m earthquake. 10 Dead & More than 1000 injured: Reports #Indonesia #Earthquake #BreakingNews #EarthquakeAlert #IndonesiaEarthquake #EarthquakeNews #NaturalDisaster https://t.co/2V8cg4oQ7m pic.twitter.com/NrAVUu5g5u— Indian Observer (@ag_Journalist) August 15, 2026🚨 7.7-MAGNITUDE EARTHQUAKE HITS INDONESIA 🇮🇩A powerful earthquake struck off the coast of Ternate, causing panic and evacuations. Authorities are assessing possible damage and casualties.#Indonesia #Earthquake #BreakingNews #Ternate pic.twitter.com/WdP3JgvAGF— Mahrosh Pervaiz (@MahroshPervaiz1) August 14, 2026🚨🇮🇩 BREAKING | 7.7-Magnitude Earthquake Hits IndonesiaA powerful 7.7-magnitude #earthquake struck off #Flores Island in eastern #Indonesia early Saturday, causing buildings to collapse and triggering widespread panic and evacuations. A #tsunami warning was issued but later… pic.twitter.com/OKTgVxpBaH— pradhyumn sharma (@pradhyu78651514) August 15, 2026కుప్పకూలిన భవనాలు.. వీధుల్లోకి పరుగులుభూకంపం తీవ్రతకు ఫ్లోరెస్ దీవిలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. మౌమెరే ప్రాంతంలోని పోర్టు టెర్మినల్ వెయిటింగ్ రూమ్ కూలిపోయింది. భవనాల శిథిలాలు పడుతుండటంతో ప్రజలు భయంతో పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. “భూకంపం చాలా తీవ్రంగా అనిపించింది. ఇంట్లో ఉన్న వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశాం” అని స్థానికులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు, గిడ్డంగులు, ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ఆసుపత్రుల్లో కలకలం.. బయటే చికిత్సప్రకంపనలతో ఆసుపత్రుల్లోనూ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోగులను భద్రత దృష్ట్యా బయటకు తరలించారు. బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను బయట ఏర్పాటు చేసి తాత్కాలిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు.సిక్కా ప్రాంతంలోని సెయింట్ పీటర్ మేజర్ సెమినరీలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో భవనం పైకప్పు కూలిపోయింది. అందులోని విద్యార్థులు, నన్స్ భయంతో పరుగులు తీశారు. పాస్టర్ ఒకరు రెండో అంతస్తు నుంచి దూకడంతో గాయపడ్డారు.సునామీ హెచ్చరిక.. ఎత్తివేతఫ్లోరెస్ సముద్ర గర్భంలో భూకంపం సంభవించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే కొన్ని గంటల తర్వాత హెచ్చరికను ఉపసంహరించారు.INDONESIA 🇮🇩 | #EARTHQUAKE 7.7 📹 IMAGES OF PANIC: Fear broke out near the coast of Ternate, and people had to be evacuated to safe areas. Authorities are assessing possible damage and casualties. There is a tsunami alert 🌊 pic.twitter.com/CSjsv5ckqW— Elizabeth J Trump (@eliza_Trump212) August 15, 2026మరింతగా మృతులు?ఈ ప్రకృతి విలయంలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. భవనాల శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి నష్టం అంచనా వేస్తున్నాయి. ప్రాణ నష్టంపై ఇప్పుడే అంచనాకు రావడం కష్టమని ఓ అధికారి అంటున్నారు. ఇక ఆస్తి నష్టం భారీగానే జరగొచ్చని తెలుస్తోంది.బద్ధలైన అగ్నిపర్వతం.. బూడిద మేఘాలుహల్మహెరా దీవిలోని మౌంట్ ఇబు అగ్నిపర్వతం బద్దలై.. భారీగా బూడిదను వెదజల్లింది. ఏకంగా 5 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు వ్యాపించాయి.🚨 BREAKING: Double disaster strikes Indonesia!🌋 Mount Ibu erupted on Halmahera, blasting a massive 5 km ash plume into the sky.💥 Shortly after, a powerful 7.7-magnitude earthquake rocked Flores Island.🌊 A tsunami warning has been activated for coastal areas.Stay safe and… pic.twitter.com/xviRMcR5i6— Byte Brief (@Byte_brief) August 15, 2026రింగ్ ఆఫ్ ఫైర్..భూకంపాలు, అగ్నిపర్వతాలకు ఇండోనేషియా అత్యంత ప్రమాదకర ప్రాంతం. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉండటంతో అక్కడ తరచూ భారీ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. 1992లో ఇదే ఫ్లోరెస్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం సునామీకి దారితీసి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 2004లో సుమత్రా సమీపంలో సంభవించిన భారీ భూకంపం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన సునామీల్లో ఒకదానికి కారణమైంది. ప్రస్తుతం ఫ్లోరెస్ దీవిలో ఆఫ్టర్షాక్స్ కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం వేళ రూబియో కీలక సందేశం
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. భారత ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహపూర్వక సంబంధం ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని రూబియో అన్నారు.అమెరికా తరఫున భారత ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు రూబియో తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న స్నేహం, కుటుంబ సంబంధాలే భారత్-అమెరికా భాగస్వామ్యానికి బలమైన పునాది అని ఆయన వివరించారు. రక్షణ, ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు (AI), అంతరిక్ష రంగం, వాణిజ్యం తదితర కీలక రంగాల్లో ఇరు దేశాల సహకారం కొనసాగుతోందని తెలిపారు. ఈ సహకారం భారత్, అమెరికాతో పాటు మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని మరింత సురక్షితంగా, బలంగా, సుసంపన్నంగా మార్చేందుకు దోహదపడుతోందని అన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాలు కలిసి నిర్మించబోయే భాగస్వామ్యంపై అమెరికా ఆశాభావంతో ఉందని పేర్కొన్నారు.అమెరికాలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని పలు రాష్ట్రాలు ప్రత్యేక ప్రకటనలు జారీ చేశాయి. ఆగస్టు 15, 2026ను ‘ఇండియా డే’గా గుర్తిస్తూ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికాలోని భారతీయ ప్రవాసుల సేవలు, ఆ దేశ అభివృద్ధికి వారు అందిస్తున్న సహకారాన్ని పలువురు అమెరికన్ సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు కొనియాడారు. భారత్-అమెరికా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు ఇరు దేశాల ప్రజల మధ్య బలపడుతున్న సంబంధాలు కూడా ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
జాతీయం
బుల్లెట్ రైలు: ముంబై-సూరత్ స్టేషన్ల ఫస్ట్ లుక్!
ముంబై: ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), సూరత్ స్టేషన్ల తాజా దృశ్యాలు ప్రాజెక్ట్ పురోగతిని స్పష్టం చేస్తున్నాయి. సూరత్ స్టేషన్లో ఇంటీరియర్ ఫినిషింగ్ పనులు తుది దశకు చేరుకోగా, ముంబైలోని భూగర్భ బీకేసీ స్టేషన్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. భారతదేశపు తొలి ప్రత్యేక హై-స్పీడ్ రైలు ప్రాజెక్టైన 508 కిలోమీటర్ల ఈ కారిడార్ ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు 12 స్టేషన్లతో అనుసంధానమై ఉంది. ఈ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా ఈ ప్రాజెక్ట్ను రూపకల్పన చేశారు. #WATCH | Surat, Gujarat: Construction work is progressing at the Surat station for the Mumbai-Ahmedabad Bullet Train project, with structural and roofing work completed and interior finishing underway. The station's design draws inspiration from Surat's diamond-cutting industry.… pic.twitter.com/b6CTQBO7Tp— ANI (@ANI) August 15, 2026సూరత్ డైమండ్ ఇండస్ట్రీ స్ఫూర్తితో స్టేషన్ డిజైన్ఈ కారిడార్లో అత్యంత ఆధునిక స్టేషన్లలో సూరత్ ఒకటి. దీని నిర్మాణం, రూఫింగ్ పూర్తికాగా ప్రస్తుతం ఇంటీరియర్ ఫినిషింగ్ కొనసాగుతోంది. సూరత్ నగరానికి గుర్తింపు అయిన వజ్రాల కటింగ్ పరిశ్రమ స్ఫూర్తితో ఈ స్టేషన్ను తీర్చిదిద్దారు. మెట్లు, ప్లాట్ఫారమ్లు, సీలింగ్ పనులతో పాటు ట్రాక్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే గుజరాత్లో సూరత్-వాపి సెక్షన్ మధ్య సివిల్ పనులు పూర్తయ్యాయి.భూగర్భంలో ముంబై బీకేసీ స్టేషన్ముంబై వైపు ఈ కారిడార్కు ప్రారంభ స్టేషన్గా ఉన్న బీకేసీ స్టేషన్ను భూగర్భంలో సుమారు 30 మీటర్ల లోతులో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఇదే అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ పనులలో ఇది ఒకటి. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో ముంబై బీకేసీ, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి సహా మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి.మొదటి సర్వీస్ ఎప్పుడంటే?ఈ ప్రాజెక్ట్కు సంబంధించి తొలి సెక్షన్ సేవలు 2027 ఆగస్టులో ప్రారంభం కానున్నాయి. సూరత్ నుంచి వాపి మధ్య సుమారు 100 కిలోమీటర్ల మేర తొలి సర్వీస్ నడుపనున్నారు. ఈ తొలి సర్వీస్ కోసం బీఈఎంఎల్లో తయారవుతున్న మేడ్ ఇన్ ఇండియా ‘భారత్’ బుల్లెట్ రైలును ఉపయోగించనున్నారు. ఈ పూర్తి కారిడార్ అందుబాటులోకి వస్తే ముంబై-అహ్మదాబాద్ ప్రయాణ సమయం కేవలం ఒక గంట 58 నిమిషాలకు తగ్గనుంది.ఇది కూడా చదవండి: ఒకే నంబరుతో రెండు విమానాలు.. తప్పిన పెను ప్రమాదం!
జార్ఖండ్లో విద్యార్థుల రణరంగం: 20న సీఎం నివాసం ముట్టడి!
రాంచీ: జార్ఖండ్లో జేపీఎస్సీ , జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నిరసనలు శనివారంతో 23వ రోజుకు చేరుకోగా, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార జేఎంఎం, కాంగ్రెస్ కూటమి తమ భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆరోపిస్తూ, తమ డిమాండ్లు నెరవేరకపోతే ఆగస్టు 20న ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించాయి.ఈ నిరసనల్లో భాగంగా ఆగస్టు 16న జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లా కేంద్రాల్లో సీఎం సోరెన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల దిష్టిబొమ్మలను దహనం చేయాలని విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ నాయకుడు రవీంద్ర పాశ్వాన్ మాట్లాడుతూ ‘మేము సీఎం రాజీనామాను కోరుతున్నాం. ముఖ్యమంత్రి స్పందించకపోతే, రాహుల్ గాంధీ జేఎంఎం కూటమి నుంచి మద్దతు ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఇటీవల అసెంబ్లీ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం ఉద్రిక్తతలకు దారితీసింది.మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం 14వ జేపీఎస్సీ ప్రిలిమ్స్ సహా మూడు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను రంగంలోకి దించుతామని తెలిపింది. అయితే, కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న విద్యార్థుల డిమాండ్ను మాత్రం ప్రభుత్వం అంగీకరించలేదు. సీఐడీ దర్యాప్తులో భాగంగా జేపీఎస్సీ మాజీ చీఫ్ ఎల్. ఖియాంగ్టెను పోలీసులు అరెస్టు చేశారు.ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. పారదర్శకమైన పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. కొందరు ప్రతిపక్ష నేతలు రాజకీయ లబ్ధి కోసం అమాయక విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి ప్రలోభాలకు లోనుకావొద్దని సోరెన్ సూచించారు.ఇది కూడా చదవండి: ప్రమాదంలో ‘జెన్ జీ’: పార్టీలు, విహారయాత్రలకు భారీగా అప్పులు?
ప్రమాదంలో ‘జెన్ జీ’: పార్టీలు, విహారయాత్రలకు భారీగా అప్పులు?
క్రెడిట్ కార్డులు సులభంగా లభ్యం కావడం..‘ఇప్పుడే కొనండి, తర్వాత చెల్లించండి’ లాంటి సరికొత్త చెల్లింపు విధానాలు అందుబాటులో ఉండటం నేటి యువతను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. సంగీత కచేరీలు, విదేశీ ప్రయాణాలు, విలాసవంతమైన జీవనశైలి కోసం ‘జెన్ జీ’ అంటే నేటి తరం యువత ఆలోచించకుండా ఖర్చు చేస్తుండటం దేశ ఆర్థిక భవిష్యత్తుగా ముప్పగా పరిణిమిస్తోంది. రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకోకుండా క్షణికానందం కోసం చేస్తున్న ఈ అప్పుల ప్రయాణంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిఘా పెట్టింది.విలాసాల కోసం పెరిగిన అప్పుల భారంనేటి యువత తమ జీవనశైలిని మెరుగుపరచుకునే పేరుతో భారీగా అప్పులు చేస్తోంది. ముంబైకి చెందిన ఇద్దరు యువతులు తమ తల్లితో కలిసి దక్షిణ కొరియాలో జరిగిన ‘బీటీఎస్’ సంగీత కచేరీకి వెళ్లేందుకు క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా ఉపయోగించారు. అదేవిధంగా గతంలో థాయ్లాండ్ విహారయాత్రకు వెళ్లిన ఒక జంట తమ బడ్జెట్కు మించి ఖర్చు చేసి, ఆ తర్వాత నగదు సర్దుబాటు కోసం నానా ఇబ్బందులు పడ్డారు. చిన్న విలాసాల కోసం రుణాలపై ఆధారపడటం భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది.రికార్డు స్థాయిలో పెరుగుతున్నరుణాలుదేశంలో గృహ రుణాలు సాధారణ వృద్ధిని కనబరుస్తున్నప్పటికీ, వినియోగం కోసం తీసుకునే గృహేతర రిటైల్ రుణాల జోరు అంతా ఇంతా కాదు. మార్చి 2026 నాటికి ఈ రుణాలు మొత్తం గృహ రుణాల్లో ఏకంగా 58.4 శాతానికి చేరుకున్నాయి. కేవలం ఏడేళ్ల వ్యవధిలో ప్రతి రుణగ్రహీతపై సగటు బకాయి రుణం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాలు, ఇతర వ్యక్తిగత రుణాల పరిమాణం కోట్లాది రూపాయలకు ఎగబాకడంతో కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ నిపుణులు అప్రమత్తమయ్యారు.ఫిన్టెక్ సంస్థల ఆధిపత్యం రూపాయి నోట్లతో పని లేకుండా కేవలం ఒక్క క్లిక్తో లభించే చిన్న వ్యక్తిగత రుణాలను ఫిన్టెక్ కంపెనీలు విరివిగా అందిస్తున్నాయి. యాభై వేల రూపాయల కంటే తక్కువ రుణాలు ఇచ్చే ఈ రంగంలో ఫిన్టెక్ సంస్థలు భారీ మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నాయి. అయితే, ఈ రుణాల్లో సకాలంలో చెల్లించకపోవడంతో ఏర్పడే డిఫాల్ట్ లేదా డెలిన్క్వెన్సీ రేటు ఆందోళనకరంగా మారుతోంది. ఈ రుణగ్రహీతలలో సగానికి పైగా 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారే ఉండటం గమనార్హం.చిన్న వయస్సులోనే రుణభారంగతంతో పోలిస్తే నేటి యువత చాలా చిన్న వయస్సులోనే రుణాల వలలో చిక్కుకుంటున్నారు. 1960, 70లలో ప్రజలు తమ ముప్ఫైల చివరలో మొదటిసారిగా గృహ లేదా ఇతర రుణాల ద్వారా క్రెడిట్ వ్యవస్థలోకి ప్రవేశించేవారు. కానీ, నేటి జెన్ జీ యువత 22 ఏళ్ల ప్రాయంలోనే మొబైల్ గ్యాడ్జెట్లు, చిన్న రుణాలు, క్రెడిట్ కార్డుల వాడకంతో ఆర్థిక వ్యవస్థలోకి అడుగుపెడుతున్నారు. దీనివల్ల ఆర్థిక పరిపక్వత లేని వయస్సులోనే వారు భారీ వడ్డీ భారాలను మోయాల్సి వస్తోంది.విదేశీ పర్యటనల కోసం..దేశంలో గత కొద్ది సంవత్సరాలుగా పెద్ద ఎత్తున జరుగుతున్న మ్యూజిక్ కాన్సర్ట్లు, విదేశీ పర్యటనల వెనుక యువత క్రెడిట్ కార్డుల హస్తం బలంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అంచనాల ప్రకారం, గత రెండు సంవత్సరాల్లో కేవలం సంగీత కచేరీల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఎయిర్బీఎన్బీ నివేదిక ప్రకారం, 60 శాతానికి పైగా యువకులు విహారయాత్రలు, ఈవెంట్లలో పాల్గొనేందుకు తమ నెలవారీ సంపాదనలో గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు.ఆర్బీఐ హెచ్చరికలు.. భవిష్యత్తు ముప్పుతక్కువ రేటింగ్ ఉన్న రుణగ్రహీతలు, అసురక్షిత రిటైల్ రుణాల పెరుగుదలపై ఆర్బిఐ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఆర్థిక వాతావరణం దెబ్బతింటే, అప్పులు తీసుకున్న వారి నగదు ప్రవాహం పూర్తిగా నిలిచిపోయి అసెట్ క్వాలిటీ తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్షణ ఆనందాల కోసం అప్పులు చేసే ఈ ధోరణిని యువత నియంత్రించుకోకపోతే వ్యక్తిగత ఆర్థిక జీవితం ఛిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: రైల్వేశాఖ నిధులతో తీసిన ఏకైక సీరియల్ చూశారా?
కాబోయే దంపతుల ఆత్మహత్య
మూడుముళ్ల వేడుకతో జీవితాంతం సంతోషంగా గడపాల్సిన యువ జంట పెళ్లికి ముందే ప్రాణాలు వదిలారు. మైసూరు జిల్లాలోని హుణసూరులో వివాహ నిశ్చయం చేసుకున్న యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, కాబోయే భర్త కేరళలోని ఎర్నాకుళంలో ఉసురు తీసుకున్నాడు. ఇద్దరూ ఉద్యోగులు.. వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని కాసరగోడ్ జిల్లా, హోస దుర్గ తాలూకాలోని పల్లకెరెకు చెందిన చందన్ పెద్ద కుమార్తె అనుశ్రీ (26), హుణసూరులో స్టేట్ బ్యాంకులో పనిచేస్తుంది. కేరళలోని కన్నూర్ జిల్లా, ఎరట్టి తాలూకా మదతి గ్రామవాసి సుధాకర్ కుమారుడు, అమల్ (30) అక్కడే ఉద్యోగం చేస్తుంటాడు. అనుశ్రీ, అమల్కు పెద్దలు ఇటీవల నిశ్చితార్థం చేసి, డిసెంబరు 26న పెళ్లి ఖాయం చేశారు. ఇద్దరూ తరచూ మొబైల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. శుక్రవారం రాత్రి మొబైల్లో మాట్లాడుకుంటూ గొడవపడ్డారు. దీంతో అనుశ్రీ అమల్కు వీడియో కాల్ చేసి గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుంది. అది చూసి అమల్ భయాందోళనతో ఓ లాడ్జికి వెళ్లి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనుశ్రీ తండ్రి చందన్ హుణసూరుకు చేరుకుని కూతురిని చూసి బోరున విలపించాడు. స్థానిక పోలీసులు ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. అమల్ ఫోన్లో వేధించడం వల్లనే తన కూతురు చనిపోయిందని తండ్రి చెప్పాడు.
ఎన్ఆర్ఐ
తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) /TCSS యొక్క పదమూడో వార్షిక సర్వసభ్య సమావేశం ఆగస్టు 2వ తేదీన స్థానిక కుర్తాళం బోర్డర్, లిటిల్ ఇండియాలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 65-70 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. సమావేశంలో ముందుగా పన్నెండో సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2025-2026 ఆర్థిక సంవత్సరపు రాబడి ఖర్చుల పట్టికను సభ్యులకు వివరించి ఆమోదం పొందడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా సభ్యులు సమ్మయ్య మోలుగూరి, ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ పూర్వ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల,కోశాధికారి నంగునూరి వెంకట రమణ సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి మోడరేటర్ ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల వ్యవహరించారు.2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సేవలందించిన కిరణ్ కుమార్ ఎర్రబోయిన నీలం సుఖేందర్ గార్లకు కృతజ్ణతలు తెలియజేశారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ప్రస్తుత పదవీకాల అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన నల్ల భాస్కర్ గుప్త, ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుంచి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లు ప్రకటించారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అధ్యక్షుడు నల్ల భాస్కర్ తెలిపారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు శాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.ఈ సారి ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ణతలు తెలియజేశారు. దీని తోపాటు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సురేష్ మాటేటి, శ్రీధర్ బండారు గార్లను ప్రకటించి ఎన్నుకోవడం జరిగింది.నూతన కార్యవర్గం కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు నల్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు, శివ ప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్య, సరావేణి విజయ కుమార్ ఉన్నట్టు తెలిపారు.మాజీ అధ్యక్షుడు రమేష్ బాబు గడప, తన పదవీకాలంలో సొసైటీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన అసాధారణ, అద్భుతమైన సేవలను ఏవి (AV) రూపంలో ప్రదర్శించి కార్యనిర్వాహక సభ్యులందరూ మర్యాదపూర్వకంగా సన్మానించారు. గత పన్నెండు సంవత్సరాలుగా రమేష్ బాబు గడప అందించిన సేవలను పూర్వ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, నీలం మహేందర్ గార్లు ఘనంగా కొనియాడారు. గత పదమూడు సంవత్సరాలుగా సొసైటీలో భాగమై రెండు సార్లు అధ్యక్షుడిగా సేవచేసే అవకాశం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ సేవలందించిన దుర్గా ప్రసాద్, సుగుణాకర్ రెడ్డి గార్లకు కార్యనిర్వాహక సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి కార్యనిర్వాహక సభ్యులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. చివరిగా సర్వ సభ్యులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన హై టీని ఆస్వాదించారు.(చదవండి: అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్)
హైదరాబాద్కు శ్రీపతి దీపారెడ్డి పార్థీవదేహం
హైదరాబాద్: చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీకి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) అమెరికా న్యూజెర్సీలో గతనెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దీపారెడ్డి 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.గత నెల 28న భర్త రామకృష్ణారెడ్డిని కారులో కార్యాలయంలో దించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న దీపారెడ్డి కారును, ఓ మెడికల్ విద్యార్థి కారుతో ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆమె అవయవాలను మెడికల్ విద్యార్థులకు అందజేస్తానని అంగీకరించడంతో ఆమె అవయవాలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. సంబరపడే లోపే..రెండు రోజుల్లో మాదాపూర్లో ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ గృహప్రవేశానికి వస్తుందని సంబరపడ్డాం.. అన్ని ఏర్పాట్లు చేశాం, ఈవిధంగా వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టారు. నేడు చంపాపేటలో అంత్యక్రియలు దీపారెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం నగరానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంపాపేటలోని రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు.
అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్
సాక్షి,హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ 19వ మహసభలు శనివారం అమెరికాలోని బాల్టిమోర్లో ఘనంగా ప్రారంభమైయ్యాయి. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారితో పాటు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ల నుండి భారీ ఎత్తున వివిధ రంగాల ప్రముఖులు తొలి రోజు ఆరంభవేడుకలకు హాజరైయ్యారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎంఎల్ఎలు సినీ,సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరైయ్యారు.దాదాపు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు తెలుగు సంస్కృతిని చాటిచెప్పే కళాప్రదర్శనలు నిర్వహించారు.వివిధ రంగాల్లో విశేషసేవ చేసిన 15 మంది ప్రముఖులను ఆటా అవార్డులతో సత్కరించారు. అవార్డులు అందుకున్న వారిలో ఆర్.రవికాంత్రెడ్డి(జర్నలిజం) డాక్టర్ రవీందర్(వైద్యం), కిరణ్ చుక్కపల్లి(ఇండస్ట్రీ) తదితరులను ఆటా మాజీ అధ్యక్షులు పారిశ్రామికవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి సత్కరించారు.
ఎన్ఆర్ఐలు పార్టీకి సేవలు అందించాలి
సాక్షి, అమరావతి: అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో గురువారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, టెక్నాలజీ, కంటెంట్, డేటా, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఎన్ఆర్ఐలు తమ సేవలను పార్టీకి అందించాలని కోరారు. కేవలం పోస్టులు, లైకులు, షేర్లకు పరిమితం కాకుండా, స్పష్టమైన లక్ష్యాలు, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఉన్న ప్రజాభిప్రాయాన్ని వాస్తవాలు, సానుకూల కమ్యూనికేషన్, టెక్నాలజీ, సృజనాత్మక కంటెంట్ను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్ సమావేశంలో పాల్గొన్న ఆలూరు సాంబశివారెడి, తదితరులు
క్రైమ్
చిట్టి గుండె ఆగింది
నిజామాబాద్ రూరల్ : పంద్రాగస్టు రోజు ఉదయాన్నే లేచి జెండా పండుగను సంబురంగా జరుపుకుందామనుకున్న విద్యార్థిని గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందింది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేశాపూర్కు చెందిన సుంకె మౌనిక కూతురు సుంకే సాత్విక(11) సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. చిన్నారి గుండెకు గతంలో శస్త్రచికిత్స జరిగింది. కాగా, రెండు రోజుల క్రితం సాతి్వకకు గుండెలో నొప్పి రావడంతో ప్రిన్సిపల్ నళిని తల్లికి సమాచారం అందించారు. దీంతో మౌనిక తన కూతురిని నిజామాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా గతంలో గుండె ఆపరేషన్ చేసిన ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో హైదరాబాద్లోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారం పరిస్థితి విషమించి సాతి్వక ఆస్పత్రిలో మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. చిన్నారి మృతితో కేశాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మౌనిక భర్త గతంలోనే మృతి చెందగా, ఉన్న ఒక్కగానొక్క కూతురు మరణించడంతో గ్రామస్తులను కలచివేసింది.
ముందు కొడుకు, తర్వాత భర్త.. ఇప్పుడు తల్లి!
వెంటాడిన మృత్యువు.. రెండేళ్ల వ్యవధిలో ఆ కుటుంబాన్ని పూర్తిగా కబళించింది. మొదట కొడుకు.. ఆ తర్వాత భర్త.. ఇప్పుడు ఆ తల్లే అనంతలోకాలకు వెళ్లిపోయారు. తాడ్వాయి మండలం కొండపర్తి సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లా మార్కెటింగ్ అధికారి కలకోట్ల సురేఖ మృతి చెందడంతో హనుమకొండ జూలైవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న విషాదాలు బంధువులు, స్థానికులను కలచివేశాయి.వరంగల్: ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. మృత్యువు ఒక్కొక్కరిని తన ఒడికి చేర్చుకుంది. రెండేళ్లలో కుటుంబాన్ని మొత్తం కబళించింది. రెండేళ్ల క్రితం కొడుకు, ఐదు నెలల క్రితం భర్త మృతి చెందగా.. శనివారం భార్య సైతం అనంతలోకాలకు చేరుకుంది. హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన వరంగల్ మార్కెటింగ్ శాఖ అధికారి (డీఎంఓ) కలకోట్ల సురేఖ(43) శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలుసుకున్న స్థానికుల రోదనలతో పెద్దమ్మగడ్డ దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృత్యుపాశమైన ఇసుకలారీ..హనుమకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన కలకోట్ల సురేఖ వరంగల్ డీఎంఓగా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ ఇన్చార్జ్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఆమె గుడెప్పాడ్ మార్కెట్ యార్డులో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వ్యక్తిగత పనుల నిమిత్తం కారులో చింత విజయబాబు అనే వ్యక్తితో కలిసి ఏటూరునాగారం వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఇసుకలారీ ఢీకొట్టడంతో సురేఖతోపాటు విజయబాబు కూడా దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో కొడుకు.. అనారోగ్యంతో భర్తసురేఖ, కిరణ్ స్వస్థలం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ అయినప్పటికీ పదిహేనేళ్ల క్రితం జూలైవాడలో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. సురేఖ ఒక్కగానొక్క కుమారుడు సుక్రీత్ (16) రెండేళ్ల క్రితం క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తుండగా.. బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు. సురేఖ భర్త బొక్క కిరణ్ (50) అనారోగ్యంతో బాధపడుతూ ఐదు నెలల క్రితం మృతిచెందాడు. శనివారం సురేఖ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండేళ్లలో కుటుంబమంతా మృత్యు ఒడిలోకి చేరినట్లయ్యిందని కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చివరి స్టేటస్లో కొడుకు జ్ఞాపకాలు..పతాకావిష్కరణ అనంతరం సురేఖ తన విధి నిర్వహణకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకున్నారు. అదే సమయంలో తన కుమారుడు బతికున్నప్పుడు పాఠశాలలో దిగిన ఫొటోలు, అతడితో సరదాగా గడిపిన సందర్భాల ఫొటోలను కూడా స్టేటస్గా ఉంచుకున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకంకొడుకు, భర్త మరణించిన తర్వాత సురేఖ తన వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జూలైవాడలోని ఇంట్లో నివసిస్తున్నారు. సురేఖ తండ్రి సురేందర్ సీపీఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. కూతురుకు వరుసగా ఎదురైన విషాదాలను తలచుకుంటూ ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘ముందు మనవడిని.. ఆ తర్వాత అల్లుడిని కోల్పోయాం.. ఇప్పుడు కూతురిని కూడా కోల్పోయాం.. ఈ ఘోరాన్ని ఎలా భరించాలి..?’ అంటూ బంధువులను పట్టుకుని వారు గుండెలవిసేలా రోదించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సురేఖకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. సురేఖ మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషాదంలో పాలకవర్గం, సిబ్బందిఅప్పటివరకు తమతో ఉన్న అధికారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలియగానే గూడెప్పాడ్ మార్కెట్ పాలకవర్గం, సిబ్బంది, వరంగల్ మార్కెటింగ్శాఖ అధికారులు విషాదంలో మునిగిపోయారు. మంచి అధికారిని కోల్పోయామని పాలకవర్గం విచారం వ్యక్తం చేసింది. సిబ్బంది.. అధికారి సురేఖతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు.
నా అంత్యక్రియలు నా కొడుకుతోనే జరిపించండి
కర్ణాటక: భారీగా కట్న కానుకలు ఇచ్చి వివాహం జరిపించినా భర్త, అత్తమామల ధనదాహం తీరలేదు. వారి వేధింపులను తట్టుకోలేక వివాహిత ఉరివేసుకొని అత్మహత్య చేసుకొన్న సంఘటన చింతామణి పట్టణంలోని సొణ్ణశెట్టిహశ్లి బడావణెలో శనివారం జరిగింది. వివరాలు.. మృతురాలు మమతశ్రీ (26). పట్టణంలోని గణేష్నగరకి చెందిన శ్రీనివాసరెడ్డి కూతురు మమతశ్రీని ఐదేళ్ల కిందట తాలూకాలోని భక్తరహళ్లికి చెందిన మోహన్రెడ్డికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. వీరికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తకు చేళూరు రోడ్డులో బైకు షోరూం ఉంది. మధ్యాహ్నం భోజనానికి రాగా ఇంటి తాళాలు వేసి ఉన్నాయి, కిటికీలో నుంచి చూడగా మమత ఫ్యాన్కు ఉరివేసుకుని శవమైంది. దీంతో భర్త పోలీసులు సమాచారమిచ్చాడు. పోలీసులు తనిఖీలు చేయగా డెత్నోట్ లభించింది. తన అంత్యక్రియలను భర్త కాకుండా కొడుకుతో నిర్వర్తించాలని రాసి ఉంది. భర్త ఎంతగా సతాయించాడో దీనిని బట్టి అర్థమవుతుంది. ఎస్పీ జగన్నాథ్రై, తహశీల్దార్ సుదర్శన్ యాదవ్, సీఐ విజికుమార పరిశీలించి కేసు నమోదు చేశారు.
రూపారెడ్డిని హత్య చేసింది 20 ఏళ్ల యువకుడేనా?
నల్లగొండ జిల్లా: పట్టణ కేంద్రంలోని జేబీ కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన కల్లు రూపా రెడ్డి హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. హంతకుడు గ్లౌజులు ధరించి ఈ దారుణానికి పాల్పడటంతో ఘటనా స్థలంలో ఎలాంటి ఆనవాళ్లూ లభించలేదు. దీంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే, లభ్యమైన సీసీ ఫుటేజీల ఆధారంగా హత్య చేసిన నిందితుడి వయసు 20 నుంచి 25 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా, విన్నా రూపారెడ్డి హత్య గురించే సర్వత్రా చర్చ సాగుతోంది. హత్య మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాఠశాల సిబ్బందిని, కాలనీ వాసులను, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు, శనివారం ప్రత్యేక నిఘా విభాగానికి (స్పెషల్ బ్రాంచ్) చెందిన పోలీసులు సైతం రంగంలోకి దిగారు. మృతురాలు రూపారెడ్డి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న పాఠశాలలో.. 2010 నుంచి 2025 బ్యాచ్ల వరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల వివరాలను సేకరించి, ఆ కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేసినట్లు సమాచారం.
వీడియోలు
కర్నూల్ లో జగన్ సునామీని చూసి కూటమికి మైండ్ బ్లాంక్ అయినట్టుంది
గాలె టెస్టులో దుమ్ము దులిపిన దేవ్ దత్..
GEN-Z జోరుతో కూటమికి షాక్..! చంద్రబాబు, లోకేష్ కు కొత్త టెన్షన్
అద్దెకు బాయ్ ఫ్రెండ్.. రాత్రికి స్పెషల్ రేట్..
ఐఫోన్ 18 ప్రో.. అప్డేట్ అదిరింది.. కొత్త వెర్షన్ ఫీచర్స్ ఇవే..
కారు కాలువలో పడి ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సంచలన నిజాలు
20 లక్షలిస్తే.. నా కూతురు తిరిగివస్తుందా..! మోసం చేసావ్ చంద్రబాబు..
అభివృద్ధి లేదు కానీ అప్పులు మాత్రం సరిపడా ఉన్నాయి..
వందేమాతరం ఆపండి! సోనియా సైగలపై.. BJP ఫైర్
మిస్టరీ మర్డర్.. రూపా రెడ్డిని చంపిందెవరు! స్థానికులు చెప్పిన సంచలన విషయాలు


