రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి
‘నాకు జన్మ ఇవ్వమని అడిగానా అమ్మా..ఎందుకు పుట్టిన వెంటనే పేగుబంధం తెంచ్చుకొని రోడ్డుపై వదిలేసి వెళ్లావ్’ అంటూ ఒక నవజాత శిశువు మూగరోదన ఇది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును రోడ్డుపై వదిలేసి వెళ్లిన అమానుష ఘటన మహబూబ్నగర్ నగరంలో చోటుచేసుకుంది. రన్నింగ్ ఆటోలోనే ప్రసవం జరిగిన అనంతరం గుర్తుతెలియని మహిళ శిశువును రోడ్డుపై వదిలేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రక్తపు మరకలను గమనించిన వాహనదారులు వాటిని అనుసరించడంతో శిశువు ఆచూకీ లభించింది. సకాలంలో గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. నగరంలోని న్యూటౌన్ హెచ్డీఎఫ్సీ సమీపంలో శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని మహిళ ఆటోలో ప్రసవించిన అనంతరం శిశువును చీరలో చుట్టి కేఎఫ్సీ దుకాణం ఎదుట రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్తున్న వాహనదారులు రోడ్డుపై రక్తపు మరకలను గుర్తించారు. వాటిని అనుసరించగా శిశువు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నవజాత శిశువును మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూలో చికిత్స పొందుతున్నాడు. సీసీ కెమెరాల్లో రికార్డు శిశువును ఆటో నుంచి రోడ్డుపై వదిలేస్తున్న దృశ్యాలు సమీపంలోని దుకాణాల సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు పోలీసులు గుర్తించారు. వాటిని పరిశీలిస్తూ శిశువును వదిలేసిన మహిళతో పాటు ఆటో వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డుపై పడివున్న శిశువును వాహనదారులు సకాలంలో గుర్తించకపోయి ఉంటే పరిస్థితి మరింత విషమంగా మారేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ తెలిపారు. శిశువును ఎవరు వదిలేసి వెళ్లారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, సీసీ కెమెరాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.మహబూబ్నగర్ క్రైం: చదవండి: చిన్న పిల్లలు ఉన్నారన్నా.. నన్ను బతికించండి!
లోహగఢ్ కోట.. కేతన్ హత్యలో మరో షాకింగ్ ట్విస్ట్
మహారాష్ట్రలోని పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘గుట్టు రట్టయితే గుండెల్లో గుబులు’ అన్నట్టుగా పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె సన్నిహితుడు చేతన్ చౌదరి అరెస్టు కాగా.. తాజాగా వారి కుట్రలో భాగమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రితేష్ హాంగే కూడా పోలీసులకు చిక్కాడు. దీంతో ఈ కేసులో అసలు కథ మరింత ఆసక్తికరంగా మారింది.మూడో నిందితుడు అరెస్ట్జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ను కొండపై నుంచి తోసి హత్య చేసిన కేసులో 22 ఏళ్ల రితేష్ హాంగేను పుణె రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రితేష్ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య మూడుకు చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రితేష్ హాంగే ప్రధాన నిందితుడు చేతన్ చౌదరికి స్నేహితుడు. కేతన్ హత్యకు సంబంధించిన కుట్రలో రితేష్ కూడా భాగస్వామిగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేతన్ను హత్య చేయాలన్న ప్లాన్ గురించి అతడికి ముందే తెలుసునని పోలీసులు వెల్లడించారు.ముందు పెళ్లిని అడ్డుకోవాలనుకున్నారు..‘అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి’ అన్నట్టుగా ఈ హత్య వెనుక మొదట మరో ప్లాన్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేతన్, సియా గోయల్ వివాహానికి సిద్ధమవుతున్న సమయంలో.. పెళ్లిని అడ్డుకునేందుకు సియా, చేతన్ తొలుత కేతన్ను తీవ్రంగా గాయపరచాలని భావించినట్లు తెలుస్తోంది. కేతన్ చేతులు, కాళ్లు విరగ్గొట్టి అతడిని గాయపరిస్తే పెళ్లి వాయిదా పడుతుందని వారు భావించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ ప్లాన్ ప్రమాదకరంగా మారొచ్చని భావించిన ఇద్దరూ.. చివరకు ఏకంగా కేతన్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుట్ర గురించి రితేష్కు కూడా ముందుగానే తెలుసునని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న కంగనా.. పక్కా స్కెచ్.. కేతన్ మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ‘పాము చావాలి.. కర్ర విరగకూడదు’ అన్నట్టుగా హత్య చేసినా తమపై అనుమానం రాకుండా ఉండేందుకు పలు మార్గాలను అన్వేషించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ఇంటర్నెట్లో సమాచారం వెతికినట్లు, సస్పెన్స్ సినిమాలను కూడా చూసినట్లు పోలీసులు తెలిపారు. టైగర్ పాయింట్, విసాపూర్ కోటతో పాటు పూణే పరిసరాల్లోని మరికొన్ని కోటలను నిందితులు పరిశీలించారు. ఆయా ప్రాంతాల ఫొటోలను పరస్పరం పంపించుకుని.. కేతన్ మరణాన్ని ప్రమాదంగా చూపించేందుకు ఏ ప్రదేశం అనువుగా ఉంటుందో అంచనా వేశారు. చివరకు లోహగఢ్ కోటను ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.హత్య తర్వాత రితేష్కు ఫోన్..అనుకున్నట్టుగానే జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ను కొండపై నుంచి తోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం చేతన్.. తన స్నేహితుడు రితేష్కు ఫోన్ చేసి కేతన్ హత్యకు సంబంధించిన విషయాన్ని చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో రితేష్ పాత్రకు సంబంధించిన ఆధారాలు లభించడంతో అతడిని అరెస్ట్ చేసినట్లు పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేతన్ హత్యకు ముందు జరిగిన కుట్ర, ముగ్గురు నిందితుల మధ్య జరిగిన సంభాషణలు, హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు రితేష్ను పోలీసులు విచారిస్తున్నారు.
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ ఇప్పటికే వరస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఈయన కొడుకు ప్రణవ్ ఇప్పటికే హీరోగా పలు చిత్రాలు చేశాడు. రీసెంట్గా మోహన్ లాల్ కూతురు విస్మయ కూడా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. ఈమె ప్రధాన పాత్రలో చేసిన మూవీ థియేటర్లలోకి వచ్చి హిట్ కొట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)విస్మయ మోహన్ లాల్ లీడ్ రోల్ చేసిన సినిమా 'తుడక్కం'. సర్వైవల్ థ్రిల్లర్ కథతో దీనిని తెరకెక్కించారు. '2018' మూవీతో జాతీయ అవార్డ్ దక్కించుతున్న జూడ్ ఆంటోని జోసెఫ్ దీనికి దర్శకుడు. ఆగస్టు 7న మలయాళం వరకు థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 18వ తేదీ నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.'తుడక్కం' విషయానికొస్తే.. మీను (విస్మయ మోహన్ లాల్) తన తండ్రితో కలిసి ఓ కొత్త ప్రాంతానికి మారుతుంది. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన మీను.. ఓ రోజు రాత్రి ఇద్దరు స్కూల్ అమ్మాయిలని ఆపద నుంచి కాపాడుతుంది. ఈ క్రమంలోనే ఓ ప్రమాదకర వ్యక్తి(ఆశిష్ జో ఆంటోనినీ)తో ఈమెకు శత్రుత్వం ఏర్పడుతుంది. తర్వాత ఈమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటి నుంచి ఎలా తప్పించుకుందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ)
పుతిన్కు బిగ్ షాక్.. ఒడెసాలో సంచలన నిర్ణయం!
యుద్ధం తుపాకులతోనే కాదు.. ఇప్పుడు భాషతోనూ మొదలైంది! రష్యా దాడులతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్లో రష్యన్ భాషపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలోని మూడో అతిపెద్ద నగరమైన ఒడెసాలో కళలు, సంగీతం, సాహిత్యంలో రష్యన్ భాషను బహిరంగంగా ఉపయోగించడాన్ని పూర్తిగా నిలిపివేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రష్యన్ మాట్లాడేవారు అధికంగా ఉన్న ఈ నగరంలో ఈ నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో, పుతిన్కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. వీధులు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళా, వినోద ప్రదేశాల్లో రష్యన్ పాటలు, సాహిత్యాన్ని ప్రదర్శించకుండా చేయాలని ప్రతిపాదించారు. పబ్లిక్ లైబ్రరీల్లో రష్యన్ పుస్తకాలను ప్రముఖంగా ప్రదర్శించడంపైనా ఆంక్షలు రానున్నాయి. అయితే ఇళ్లలో లేదా ప్రైవేట్ ప్రదేశాల్లో వ్యక్తిగతంగా రష్యన్ మాట్లాడటంపై నిషేధం ఉండదు. రష్యన్ భాష ద్వారా మాస్కో తన సాంస్కృతిక ప్రభావాన్ని కొనసాగిస్తోందని ఉక్రెయిన్ భాషా ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా యువతపై రష్యన్ సంగీతం, సాహిత్యం ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నవారు కూడా గట్టిగానే ఉన్నారు. రష్యన్ భాష కేవలం పుతిన్ భాష కాదని.. దొస్తొయెవ్స్కీ, బుల్గాకోవ్ వంటి ప్రముఖ రచయితల భాష కూడా అదే అని ఒడెసా హాస్య నటుడు బోరిస్ బార్స్కీ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ను ప్రేమించే రష్యన్ మాట్లాడేవారిని దూరం చేయడం వల్ల చివరకు లాభపడేది పుతిన్ మాత్రమేనని అన్నారు. ఉక్రెయిన్లో ఇప్పటికే విద్య, ప్రభుత్వ సేవలు, కస్టమర్ సర్వీసులు వంటి అనేక రంగాల్లో ఉక్రేనియన్ భాష వినియోగం తప్పనిసరిగా ఉంది.కాగా, 2022లో రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించిన తర్వాత చాలామంది రష్యన్ మాట్లాడే ప్రజలు ఉక్రేనియన్ భాష వైపు మారారు. ఇప్పుడు ఒడెసాలో రష్యన్ భాషపై కొత్త ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం లభిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. రష్యా ప్రభావాన్ని తుడిచేయడమా.. లేక భాషా స్వేచ్ఛను కాపాడడమా? అనే ప్రశ్నతో ఒడెసాలో రాజకీయ, సాంస్కృతిక పోరు మరింత ముదురుతోంది.ఇదీ చదవండి: కోర్టు సంచలన తీర్పు.. టీవీ యాంకర్కు ఉరిశిక్ష
బొప్పాయి మన దేశంలో పుట్టలేదా? ఘనాంకాలు ఏం చెప్తున్నాయంటే?
ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సత్యనికేతన్ ప్రాంతంలో కుప్పకూలిన భవనం
ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..!
గతం గతః! ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందా?
బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా?
ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావ్?
ఆల్ఫా ఫలితం.. అలాంటి సినిమాలకు శాపం: తాప్సీ పన్ను
ఏపీకి బిగ్ అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
బ్రేకింగ్ న్యూస్!
జియో రూ.77 రీచార్జ్ ప్లాన్ గురించి తెలుసా?
కృష్ణాష్టమి స్పెషల్.. అనుసూయ డ్యాన్స్ వైరల్
ఈసారి ప్రారంభోత్సవానికి హెల్మెట్, స్విమ్సూట్ తప్పనిసరి సార్!
.. రెండో స్థానం ఏంటి సార్!మనమెప్పుడూ నెంబర్ 1 స్థానంలో ఉంటాం.. అంతే!
జియో రూ.55 రీచార్జ్ ప్లాన్: బెనిఫిట్స్ ఇవే..
ఇక రాజకీయాలకు గుడ్ బై.. అయ్యన్నపాత్రుడు
వచ్చేస్తోంది సూపర్ ఎల్నినో!
సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!
రోడ్డు కింద 20 వేల పాత టైర్లు.. ఎందుకు పాతిపెట్టారంటే?
గంజాయి వాసన వస్తుందని మ్యాచ్ను ఆపిన సబలెంకా
సాక్షి కార్టూన్: 04-09-2026
సాక్షి కార్టూన్: 05-09-2026
‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది’
డబ్బు త్వరగా చేతికి రావాలంటే?..కియోసాకి పెట్టుబడి విధానం!
వాటిని మర్చిపోలేక ఇప్పుడు డీఎస్సీ దెబ్బలతో రియాక్షన్ చూపిస్తున్నారా సార్!
ముక్కుతో ఒకేసారి 10 చేపలు పట్టే ఈ పక్షిని గురించి విన్నారా?
ఎప్పుడూ విమానంలో ఉంటారు.. ఎంత సంపాదిస్తారు?
జియో రీచార్జ్ ప్లాన్: 200 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్లు!
చెదల బెడదకు ఇంట్లోనే పరిష్కారం.. ఈ పద్ధతులు ట్రై చేయండి!
అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
బొప్పాయి మన దేశంలో పుట్టలేదా? ఘనాంకాలు ఏం చెప్తున్నాయంటే?
ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సత్యనికేతన్ ప్రాంతంలో కుప్పకూలిన భవనం
ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..!
గతం గతః! ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందా?
బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా?
ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావ్?
ఆల్ఫా ఫలితం.. అలాంటి సినిమాలకు శాపం: తాప్సీ పన్ను
ఏపీకి బిగ్ అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
బ్రేకింగ్ న్యూస్!
జియో రూ.77 రీచార్జ్ ప్లాన్ గురించి తెలుసా?
కృష్ణాష్టమి స్పెషల్.. అనుసూయ డ్యాన్స్ వైరల్
ఈసారి ప్రారంభోత్సవానికి హెల్మెట్, స్విమ్సూట్ తప్పనిసరి సార్!
.. రెండో స్థానం ఏంటి సార్!మనమెప్పుడూ నెంబర్ 1 స్థానంలో ఉంటాం.. అంతే!
జియో రూ.55 రీచార్జ్ ప్లాన్: బెనిఫిట్స్ ఇవే..
ఇక రాజకీయాలకు గుడ్ బై.. అయ్యన్నపాత్రుడు
వచ్చేస్తోంది సూపర్ ఎల్నినో!
సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!
రోడ్డు కింద 20 వేల పాత టైర్లు.. ఎందుకు పాతిపెట్టారంటే?
గంజాయి వాసన వస్తుందని మ్యాచ్ను ఆపిన సబలెంకా
సాక్షి కార్టూన్: 04-09-2026
సాక్షి కార్టూన్: 05-09-2026
‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది’
డబ్బు త్వరగా చేతికి రావాలంటే?..కియోసాకి పెట్టుబడి విధానం!
వాటిని మర్చిపోలేక ఇప్పుడు డీఎస్సీ దెబ్బలతో రియాక్షన్ చూపిస్తున్నారా సార్!
ముక్కుతో ఒకేసారి 10 చేపలు పట్టే ఈ పక్షిని గురించి విన్నారా?
ఎప్పుడూ విమానంలో ఉంటారు.. ఎంత సంపాదిస్తారు?
జియో రీచార్జ్ ప్లాన్: 200 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్లు!
చెదల బెడదకు ఇంట్లోనే పరిష్కారం.. ఈ పద్ధతులు ట్రై చేయండి!
అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
ఫొటోలు
‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
ట్రెండింగ్లో సీరియల్ బ్యూటీ.. బిగ్బాస్లోకి ఎంట్రీ (ఫొటోలు)
చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)
అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)
దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)
హైదరాబాద్లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)
పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)
'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)
'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
సినిమా
ఓటీటీలో 'లస్ట్ స్టోరీస్ 3' స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన
ఓటీటీల్లో చాలామంది సినిమాలు చూస్తుంటారు. అదే టైంలో కొన్ని సిరీస్లు కూడా ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఆశ్చర్యపరుస్తాయి. అలా దాదాపు ఎనిమిదేళ్ల క్రితం రిలీజై సెన్సేషన్ సృష్టించిన సిరీస్ 'లస్ట్ స్టోరీస్'. తర్వాత కాలంలో దీనికి రెండో పార్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు మూడో సీజన్ కూడా సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసి ఓ వీడియోని విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)నెట్ఫ్లిక్స్ పాపులర్ ఆంథాలజీ ఫ్రాంచైజీ 'లస్ట్ స్టోరీస్' మూడో భాగాన్ని ఈనె 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సీజన్లో ఉండే నాలుగు కథలకు విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ప్రేమ, ఆకర్షణ, సంబంధాలు, అణచివేసిన కోరికలు అనే అంశాల ఆధారంగా వీటిని తెరకెక్కించారు. ఈ సీజన్లో రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అదితి రావు హైదరీ, రాధికా మదన్, సనా థంపి, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, సిద్ధార్థ్, అలీ ఫజల్, గుర్ఫతేహ్ పిర్జాదా తదితరులు ప్రధాన పాత్రలు చేశారు.‘లస్ట్ స్టోరీస్’ ఫ్రాంచైజీ 2018లో ప్రారంభమైంది. తొలి భాగంలోని స్టోరీలకు అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఈ ఆంథాలజీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్కు నామినేట్ అయింది. 2023లో ‘లస్ట్ స్టోరీస్ 2’ విడుదలైంది. ఇప్పుడు మూడో సీజన్ రానుంది.మరి ఇదెలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ)I won’t tell this to y’all but I am too excitedddd 🤭❤️🔥 pic.twitter.com/7jQlq9MAXw— Netflix India (@NetflixIndia) September 5, 2026
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ ఇప్పటికే వరస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఈయన కొడుకు ప్రణవ్ ఇప్పటికే హీరోగా పలు చిత్రాలు చేశాడు. రీసెంట్గా మోహన్ లాల్ కూతురు విస్మయ కూడా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. ఈమె ప్రధాన పాత్రలో చేసిన మూవీ థియేటర్లలోకి వచ్చి హిట్ కొట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)విస్మయ మోహన్ లాల్ లీడ్ రోల్ చేసిన సినిమా 'తుడక్కం'. సర్వైవల్ థ్రిల్లర్ కథతో దీనిని తెరకెక్కించారు. '2018' మూవీతో జాతీయ అవార్డ్ దక్కించుతున్న జూడ్ ఆంటోని జోసెఫ్ దీనికి దర్శకుడు. ఆగస్టు 7న మలయాళం వరకు థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 18వ తేదీ నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.'తుడక్కం' విషయానికొస్తే.. మీను (విస్మయ మోహన్ లాల్) తన తండ్రితో కలిసి ఓ కొత్త ప్రాంతానికి మారుతుంది. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన మీను.. ఓ రోజు రాత్రి ఇద్దరు స్కూల్ అమ్మాయిలని ఆపద నుంచి కాపాడుతుంది. ఈ క్రమంలోనే ఓ ప్రమాదకర వ్యక్తి(ఆశిష్ జో ఆంటోనినీ)తో ఈమెకు శత్రుత్వం ఏర్పడుతుంది. తర్వాత ఈమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటి నుంచి ఎలా తప్పించుకుందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ)
టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్తో సినిమా
‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, 'ఇదీ సంగతి', ‘ఆటగదరా శివా’ తదితర సినిమాలతో మెప్పించిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తీసిన లేటెస్ట్ మూవీ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో ఇదే పొడవైన టైటిల్ అని చెప్పొచ్చు. ఫిల్మోత్సవ్ బ్యానర్పై సొంతగా ఈయనే నిర్మించారు. ప్రముఖ దర్శక రచయిత మదన్ కథ అందించారు. హర్ష హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రలు చేశారు. సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.(ఇదీ చదవండి: అమ్మ చీరలే నా స్టైల్.. నివేతా థామస్ ఆసక్తికర విషయాలు)‘ఆ నలుగురు’తో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్.. ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. మొట్టమొదటి మిస్టరీ మ్యూజికల్ మూవీ ఇది. సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ ఈ చిత్రం రూపొందింది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది.ధ్వని, న్యూరోసైన్స్, జ్ఞాపకాలు, అపరాధ భావన, ప్రేమ వంటి అంశాలని మేళవిస్తూ రూపొందిన ఈ హై కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించడానికి ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నం ఇది అని చంద్రసిద్ధార్థ్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
బిగ్బాస్ 10: అగ్ని పరీక్ష నుంచి ఆరుగురు.. హౌస్లోకి వెళ్లేది వీళ్లే!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ 10 మరికొన్ని గంటల్లో(సెప్టెంబర్ 10) గ్రాండ్గా ప్రారంభం కానుంది.ఈ సారి దాదాపు 20 మంది వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సీజన్లో సామాన్యుల కోటా నుంచి కూడా భారీగానే వెళ్లనున్నారు. దీని కోసం ఇప్పటికే ‘అగ్ని పరీక్ష’ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో నుంచి ఐదు లేదా ఆరుగురిని హౌస్లోకి పంపనున్నారు. అయితే ఆ జాబితాలో ఎవరెవరకు ఉంటారా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే రైతు బిడ్డ ఝాన్సీ కన్ఫామ్ అయింది.తాజాగా అగ్నిపరీక్ష గ్రాండ్ ఫినాలేలో మేకర్స్ 'టికెట్ టు బిగ్బాస్' ప్రకటించారు. ఈ టికెట్ గెలిచిన వారికి నేరుగా బిగ్బాస్ తెలుగు 10 హౌస్లోకి ఎంట్రీ లభిస్తుంది. ఈ పోటీలో ఝాన్సీ విజయం సాధించింది. దీంతో బిగ్బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే తొలి కంటెస్టెంట్గా ఝాన్సీ నిలిచింది. దీంతో సెప్టెంబర్ 6న జరగనున్న బిగ్బాస్ 10 గ్రాండ్ లాంచ్లో ఝాన్సీ హౌస్లోకి అడుగుపెట్టనుంది. మిగిలిన వారిలో ఇప్పటికే తనదైన ఆటతీరుతో మూడు గ్రీన్స్ సాధించిన మిథిలేష్ని కూడా హౌస్లోకి పంపనున్నారు. వీరితో పాటు చరణ్, రాజకుమారి, రోహిత్, అమన్ కచ్చితంగా బిగ్బాస్ 10లో పాల్గోనే అవకాశం ఉంది. ఆరుగురి కంటే ఎక్కువ పంపిస్తే..శ్రష్టి, షాలినీ వంటి వారు కూడా ఈ సీజన్లో పాల్గోనే అవకాశం ఉంది. అగ్ని పరీక్ష నుంచి హౌస్లోకి వెళ్లేది ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక సెలెబ్రెటీ కోటాలో ఈ సారి పది మంది వరకు హౌస్లోకి వెళ్లే అవకాశం ఉంది. వారిలో జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రాంప్రసాద్, నరేశ్, 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ఫేమ్ దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం ముఖేష్ గౌడ, యాంకర్ వర్షిణి, ముఖేష్, చైత్ర రాయ్, నటులు టెంపర్ వంశీ, కృష్ణుడు, ఎక్స్ప్రెస్ హరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో నుంచి ఎవరు హౌస్లోకి వెళ్లేది ఎవరనేది దానిపై రేపు(సెప్టెంబర్ 6) స్పష్టత రానుంది. సీజన్ 10కి కూడా కింగ్ నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
క్రీడలు
టీమిండియా ప్లేయర్ విధ్వంసం.. 6 ఫోర్లు, 8 సిక్సలతో వీర విహారం
షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్లో మొహాలీ కింగ్స్ మరో సంచలన విజయం సాధించింది. శనివారం మొహాలీ వేదికగా జలంధర్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో మొహాలీ గెలుపొందింది. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన జలంధర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మొహాలీ బ్యాటర్లలో విశ్వనాథ్ సింగ్(40), కెప్టెన్ ప్రభ్సిమ్రాన్ సింగ్(37), హర్జస్ సింగ్(37) రాణించారు. మొహాలీ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్, హర్ష్దీప్ సింగ్, తేజ్ప్రీత్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.రమణ్దీప్ మెరుపులుఅనంతరం లక్ష్య చేధనలో మొహాలీ కింగ్స్ కెప్టెన్ రమణ్దీప్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. నాలుగో స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన రమణ్దీప్.. ప్రత్యర్ది బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 35 బంతుల్లోనే 6 ఫోర్లు, 8 సిక్స్లతో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.అతడితో పాటు అన్మోల్ప్రీత్ సింగ్(29 బంతుల్లో 61) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా 178 పరుగుల లక్ష్యాన్ని మొహాలీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ విజయంతో మొహాలీ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది. ఇక రమణ్దీప్ విషయానికి వస్తే.. టీమిండియా తరపున కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 2024లో సౌతాఫ్రికా టూర్లో ఆడిన రమణ్దీప్కు తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. ఇండియా-ఎ టీమ్లో మాత్రం అతడు కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో మరింత మెరుగ్గా రాణించి సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని ఈ పంజాబ్ ఆల్రౌండర్ భావిస్తున్నాడు.
అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్
మహిళల ఆసియాకప్-2026లో పాకిస్తాన్కు తొలి ఓటమి ఎదురైంది. శనివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పాక్ ఘోర పరాజయం పాలైంది. మరోసారి దాయాది జట్టుపై హర్మన్ సేన ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్కు భారత బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. ముఖ్యంగా పాక్ బ్యాటర్లు భారత స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడారు. శ్రీచరణి, ప్రేమా రావత్ తలా మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును దెబ్బతీశారు. వీరిద్దరితో పాటు దీప్తి శర్మ రెండు, షెఫాలీ వర్మ ఓ వికెట్ సాధించారు. పాక్ బ్యాటర్ల విషయానికి వస్తే.. ఓపెనర్లు మునీబా(13), షవాల్ జుల్ఫికర్(14) మినహా మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.బ్యాటింగ్లో విఫలమైన కెప్టెన్ ఫాతిమా సనా.. బౌలింగ్లో మాత్రం మూడు వికెట్లు పడగొట్టింది. అయినప్పటికి ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి 8.4 ఓవర్లలో చేధించింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ ఫాతిమా స్పందించింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని సనా చెప్పుకొచ్చింది."ఈ ఓటమి మమ్మల్ని ఎంతగానో బాధించింది. మ్యాచ్లో కనీసం ఒక్క భాగస్వామ్యం కూడా నెలకొల్పలేకపోయాం. ఇన్నింగ్స్ ఆరంభం నుండి ముగిసే వరకు పరుగులు సాధించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. కొత్త పిచ్ కావడంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం. బోర్డుపై మంచి స్కోరు ఉంచి, మా బౌలింగ్ బలాన్ని వాడుకోవాలనుకున్నాం.కానీ మా ప్రణాళికలను మైదానంలో అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాం. నేను బౌలింగ్లో రాణించినా, జట్టు ఓడిపోయినప్పుడు ఆ ప్రదర్శనకు ఏ విలువా ఉండదు. అదే జట్టు గెలిచి ఉంటే ఆ సంతోషం వేరుగా ఉండేది. ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. మా తదుపరి మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి సెమీఫైనల్కు అర్హత సాధిస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సనా పేర్కొంది. కాగా పాక్ తమ తదుపరి మ్యాచ్లో సెప్టెంబర్ 7న హాంకాంగ్తో తలపడనుంది.చదవండి: IND vs PAK: ఆడింది చాలు పో!.. పాక్ కెప్టెన్ ఓవరాక్షన్?
ఆడింది చాలు పో!.. పాక్ కెప్టెన్ ఓవరాక్షన్?
మహిళల ఆసియాకప్-2026లో భారత్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. దుబాయ్ వేదికగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో దాయాది పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 55 పరుగులకే కుప్పకూలింది.స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమా రావత్ తలా మూడు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు దీప్తి శర్మ రెండు, షెఫాలీ వర్మ ఓ వికెట్ సాధించింది. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు మునీబా అలీ(13), షవాల్ జుల్ఫికర్(14) మినహా మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి 8.4 ఓవర్లలో చేధించింది.ఫాతిమా ఓవరాక్షన్కాగాస్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా దాటికి టాపార్డర్ బ్యాటర్లు షెఫాలీ వర్మ (12), స్మృతి మంధాన (9), ప్రతీక రావల్ (4) పెవిలియన్ చేరారు.అయితే షెఫాలీని ఔట్ చేసిన అనంతరం ఫాతిమా ఓవరాక్షన్ చేసింది. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సనా.. షెఫాలీకి గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించింది. ఆ బంతిని షెఫాలీ లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించింది. కానీ బంతి లీడింగ్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. దీంతో పాక్ కెప్టెన్ ఈజీ రిటర్న్ క్యాచ్ అందుకుంది. వెంటనే ఫాతిమా షెఫాలీ వైపు చేయి చూపిస్తూ "ఇక ఆడింది చాలు వెళ్లు" అన్నట్లుగా సైగలు చేస్తూ సెండాఫ్ ఇచ్చింది.కానీ షెఫాలీ మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్గా మైదానం వీడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పాక్ కెప్టెన్కు ఎందుకంత పొగరు? అని కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇదే మ్యాచ్లో పాక్ ఓపెనర్ మునీబాను షెఫాలీ క్లీన్ బౌల్డ్ చేసినప్పటికి ఎలా సెలబ్రేషన్స్ చేసుకోవడం గమనార్హం. కానీ పాక్ కెప్టెన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది.Fatima Sana turning up the heat despite the scoreline. 🥵 Watch India vs Pakistan LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #DPWorldWomensAsiaCup2026 #NotAGentlemansGame pic.twitter.com/j2ohXqlZSV— Sony Sports Network (@SonySportsNetwk) September 5, 2026
భారీ మైలురాయిని తాకనున్న షమీ
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తన కెరీర్లో ఓ భారీ మైలురాయిని తాకనున్నాడు. ఆదివారం సౌత్ జోన్తో మొదలయ్యే దులీప్ ట్రోఫీ ఫైనల్ అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 100వ మ్యాచ్ కానుంది. ఈ టోర్నీలో షమీ ఈస్ట్ జోన్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.షమీ ఇప్పటివరకు 99 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 382 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ 8-90గా (ఇన్నింగ్స్లో) ఉంది. ప్రస్తుత దులీప్ ట్రోఫీలో షమీ ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు.ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉన్న షమీ రీఎంట్రీ కోసం చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా టీమిండియా సెలెక్టర్లు అతడిని కనికరించడం లేదు. 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్కు ముందు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (అతడి రంజీ జట్టు అసోసియేషన్) షమీని సత్కరించింది. అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంతకం చేసిన 100వ నంబర్ జెర్సీని బహుకరించింది. ఈస్ట్ జోన్ సహచరులు కూడా సంతకాలు చేసిన జెర్సీని షమీకి బహుకరించారు.MOHAMMED SHAMI 100* 🇮🇳- A special gift from Cricket Association of Bengal for Mohammed Shami.Indian legend will be playing his 100th First Class matches tomorrow. pic.twitter.com/SVwDBKsL9p— Johns. (@CricCrazyJohns) September 5, 2026షమీ తన 100వ మ్యాచ్పై స్పందిస్తూ, ఈ ప్రయాణం హార్డ్ వర్క్, సవాళ్లు, నేర్చుకోవడం, మరచిపోలేని జ్ఞాపకాలతో సాగిందని అన్నాడు. ఈ ప్రత్యేక మైలురాయికి తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, కోచ్లు, సహచరులు, అభిమానులతో పాటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కు కృతజ్ఞతలు తెలిపాడు.చదవండి: పాకిస్తాన్ మ్యాచ్లో చరిత్ర సృష్టించిన షఫాలీ.. సరికొత్త ప్రపంచ రికార్డులు
న్యూస్ పాడ్కాస్ట్
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
కొండా సురేఖను తప్పించాల్సిందే.... కేసీ వేణుగోపాల్తో భేటీలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
Audio: బీడు పడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు... కాలువకు నీరివ్వని కూటమి సర్కార్... బోరుమంటున్న రాయలసీమ రైతులు
నేపాల్లో ఆగని మృత్యుఘోష.... 579కి చేరిన మరణాల సంఖ్య... భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
కమిషనర్ ఔట్... వేతన సవరణ కమిషన్ లేదు... ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం
బిజినెస్
సుభాష్ చంద్ర కేసులో ట్విస్ట్.. నెట్వర్త్పై CBI దర్యాప్తు!
మాజీ ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రతో పాటు.. పలువురిపై రూ.980 కోట్ల రుణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. ఈ కేసు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైంది. ఇందులో నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, అక్రమంగా లాభం పొందడం వంటి ఆరోపణలను సీబీఐ పరిశీలిస్తోంది.నికర ఆస్తుల విలువఈ కేసులో అత్యంత కీలకమైన అంశం సుభాష్ చంద్ర నికర ఆస్తుల విలువ. ఈ వ్యవహారంలో రెండు వేర్వేరు రుణాలు ప్రధానంగా ఉన్నాయి. మొదటిది వసంత్ సాగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని కో-బారోయర్ పాన్ ఇండియా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఇచ్చిన సుమారు రూ.500 కోట్ల రుణం. వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ రుణాన్ని 'టేకోవర్ అండ్ టాప్-అప్ ఫెసిలిటీ'గా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ మంజూరు చేసింది. ఈ రుణానికి సుభాష్ చంద్ర గ్యారంటర్గా నిలిచారు.రుణం మంజూరు సమయంలో సమర్పించిన నికర ఆస్తుల సర్టిఫికెట్లో సుభాష్ చంద్ర ఆస్తుల విలువ చాలా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నట్లు సీబీఐ ఫిర్యాదులో ఉంది. 2018 మార్చి 28న సమర్పించిన ఆ సర్టిఫికెట్ ప్రకారం, 2017 మార్చి 31 నాటికి ఆయన నికర విలువ 6,197.62 మిలియన్ డాలర్లు, అంటే అప్పటి లెక్కల ప్రకారం సుమారు రూ.59,000 కోట్ల స్థాయిలో ఉన్నట్లు చూపించారు.ఇక రెండో రుణం డిజిటల్ సబ్స్క్రైబర్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించినది. దాని కో-బారోయర్ అయిన స్పిరిట్ ఇన్ఫ్రా పవర్ అండ్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సుమారు రూ.480 కోట్ల రుణం మంజూరైంది. ఈ రుణానికి కూడా సుభాష్ చంద్ర గ్యారంటీ ఇచ్చారు. ఈ సందర్భంలో సమర్పించిన మరో నికర విలువ సర్టిఫికెట్లో ఆయన నికర ఆస్తుల విలువ రూ.40,000 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొన్నట్లు సీబీఐ తెలిపింది.అంటే.. రెండు రుణాలను కలిపితే సుమారు రూ.980 కోట్లు. రుణాలు తీసుకునే సమయంలో సుభాష్ చంద్ర ఆర్థికంగా వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కలిగిన వ్యక్తిగా పత్రాల్లో చూపించారు.ఈ రెండు రుణాలు తరువాత డిఫాల్ట్ అయ్యాయి. అంటే.. రుణాలను తిరిగి చెల్లించడంలో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో విషయం మరింత తీవ్రంగా మారి, సుభాష్ చంద్రపై ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (IBC) కింద వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలు ప్రారంభమయ్యాయి.పత్రాల్లో వేలకోట్లురుణాలు తీసుకునే సమయంలో సమర్పించిన పత్రాల్లో సుభాష్ చంద్ర నికర విలువ వేల కోట్ల రూపాయలుగా చూపించబడింది. అయితే తర్వాత జరిగిన ఇన్సాల్వెన్సీ ప్రక్రియలో ఆయన ఆ స్థాయి ఆస్తులు తనకు లేవని పేర్కొన్నట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో ఉంది. ముఖ్యంగా, 2024 సంవత్సరానికి తన నికర విలువ సుమారు రూ.31.79 కోట్లు మాత్రమేనని ఆయన పేర్కొన్నట్లు ఫిర్యాదులో వెల్లడైంది. అంతేకాకుండా.. 2017-18 కాలంలో కూడా తన నికర విలువ రూ.40,000 కోట్లకు మించలేదని ఆయన చెప్పినట్లు సీబీఐ పేర్కొంది.ఇక్కడే సీబీఐ దర్యాప్తు ప్రధానంగా కేంద్రీకృతమవుతోంది. ఒకవైపు రుణాలు తీసుకునే సమయంలో సమర్పించిన పత్రాల్లో సుభాష్ చంద్ర నికర విలువ రూ.40,000 కోట్ల నుంచి రూ.59,000 కోట్ల స్థాయిలో ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు.. ఇన్సాల్వెన్సీ ప్రక్రియలో ఆయన ఆస్తుల విలువ చాలా తక్కువగా ఉందని పేర్కొన్నట్లు సీబీఐ చెబుతోంది. కాబట్టి.. రుణం పొందేందుకు నికర ఆస్తుల విలువను కావాలనే ఎక్కువగా చూపించారా? అనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది.ఇదీ చదవండి: SBI స్కీమ్.. డబ్బు దాచుకోవడానికి మంచి మార్గం!
SBI స్కీమ్.. డబ్బు దాచుకోవడానికి మంచి మార్గం!
డబ్బును సురక్షితంగా దాచుకోవాలని భావించే వారికి ఫిక్స్డ్ డిపాజిట్ (FD) ఒక మంచి మార్గం. ముఖ్యంగా.. మార్కెట్లో వచ్చే హెచ్చుతగ్గుల గురించి ఆందోళన చెందకుండా, స్థిరమైన వడ్డీ పొందాలనుకునేవారు ఎఫ్డీలను ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అందిస్తున్న 'అమృత్ వృష్టి' అనే 444 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ పెట్టుబడిదారుల దృష్టిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో సాధారణ ఎఫ్డీలతో పోలిస్తే.. మంచి వడ్డీ రేటును పొందే అవకాశం ఉంది.ఈ స్కీమ్లో కస్టమర్ వర్గాన్ని బట్టి వడ్డీ రేట్లు మారుతాయి. సాధారణ కస్టమర్లకు 6.45 శాతం, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం, 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే.. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ ఎఫ్డీ కాలపరిమితి 444 రోజులు అంటే సుమారు 14.5 నెలలు మాత్రమే.అమృత్ వృష్టి ఎఫ్డీలో కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడిదారులు తమ అవసరాన్ని బట్టి వడ్డీని నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధసంవత్సర ప్రాతిపదికన పొందే అవకాశం ఉంటుంది. అత్యవసర సమయంలో ఎఫ్డీపై లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. అలాగే అవసరమైతే గడువు పూర్తికాకముందే ఎఫ్డీను క్లోజ్ చేసి డబ్బు తీసుకోవచ్చు.ఈ ఎఫ్డీలో పెట్టుబడి పెట్టడం కూడా చాలా సులభం. ఎస్బీఐ కస్టమర్లు యోనో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా అమృత్ వృష్టి ఎఫ్డీను ప్రారంభించవచ్చు. తక్కువ కాలంలో స్థిరమైన రాబడి పొందాలని భావించే వారికి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, ఈ ఎఫ్డీ ఒక మంచి పెట్టుబడి ఎంపిక. అయితే పెట్టుబడి పెట్టే ముందు SBIలో ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేట్లు, నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.ఇదీ చదవండి: మనశ్శాంతి కోసం జాబ్ మానేసి.. నెలకు రూ.కోటి టర్నోవర్!
ఆడి కొత్త మోడల్.. ఆవిష్కరించిన హీరో సుమంత్
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆడి సెంట్రల్ షోరూమ్లో ఆడి ఇండియా కొత్త క్యూ3 మోడల్ కారును ప్రముఖ హీరో సుమంత్ ఆవిష్కరించారు. శనివారం ఆడి సెంట్రల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా హీరో సుమంత్ మాట్లాడుతూ.. వీవీసీ గ్రూప్తో తనకు ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఆడి క్యూ3 మోడల్ అద్భుతంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం వాహనాల్లో క్యూ3 ఒకటిగా నిలవనుందని అన్నారు. సరికొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన న్యూ క్యూ3 కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వీవీసీ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో న్యూ క్యూ3 మోడల్ను అధికారికంగా లాంచ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, వచ్చే నెల నుంచి వాహనాల డెలివరీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.సరికొత్త ఫీచర్లు, అధునాతన సాంకేతికతతో న్యూ క్యూ3 వినియోగదారుల ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. ఈ వాహనానికి ఇప్పటికే అద్భుతమైన స్పందన లభిస్తోందని, ఆల్ ఇండియా స్థాయిలోనూ భారీగా బుకింగ్స్ వస్తున్నాయని చెప్పారు. ఆడి న్యూ క్యూ3కు వినియోగదారుల నుంచి లభిస్తున్న స్పందన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీవీసీ గ్రూప్ డైరెక్టర్లు విశాల్ చౌదరి, వికాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
రూ.6.10 లక్షలకే కొత్త బాలెనో.. ఫుల్ అప్డేట్స్తో లాంచ్!
మారుతి సుజుకి ఎట్టకేలకు బాలెనో ఫేస్లిఫ్ట్ను భారత మార్కెట్లో.. రూ. 6.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా డిజైన్ మార్పులతో పాటు, ఫీచర్లు, భద్రత, పవర్ట్రెయిన్లలో కూడా ఎక్కువ అప్డేట్లను పొందింది.మారుతి సుజుకి బాలెనో ఫేస్లిఫ్ట్ పాత మోడల్ మాదిరిగా.. అదే సిల్హౌట్ పొందుతుంది. అయితే.. డీఆర్ఎల్, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్ల కోసం కొద్దిగా సవరించిన డిజైన్ను పొందుతుంది. ముందు భాగంలోని గ్రిల్కు కొత్త డిజైన్, అలాగే బంపర్కు కూడా సరికొత్త డిజైన్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ మాత్రం అలాగే ఉంది, కానీ కొత్త అల్లాయ్ వీల్స్తో వస్తుంది.2026 మారుతి సుజుకి బాలెనో క్యాబిన్ బ్లూ అండ్ బ్లాక్ రంగులతో కూడిన డ్యూయల్ టోన్ లేఅవుట్తో వస్తుంది. డాష్బోర్డ్ లేఅవుట్ పాత మోడల్ను పోలి ఉంటుంది. కానీ మధ్యలో ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ప్రాథమిక నియంత్రణల కోసం ఫిజికల్ బటన్లు ఉంటాయి. ఈ కారు మౌంటెడ్ కంట్రోల్స్తో కూడిన స్టీరింగ్ వీల్ కోసం అదే డిజైన్ను కొనసాగిస్తుంది.కొత్త బాలెనోలో.. మొదటిసారిగా ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా.. ఈ బ్రాండ్ వైర్లెస్ ఛార్జర్, క్లారియన్ సౌండ్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటివి కూడా ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్బ్యాగ్లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.ఇంజిన్ విషయానికి వస్తే.. మారుతి సుజుకి బాలెనో ఫేస్లిఫ్ట్ 1.2-లీటర్ Z-సిరీస్ ఇంజన్తో వస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో లభిస్తుంది. అంతేకాకుండా.. ఈ బ్రాండ్ ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన CNG వేరియంట్ను కూడా అందిస్తోంది. కాగా ఇది హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఆవిష్కరించిన స్పెషల్ బైక్
ఫ్యామిలీ
సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూ..12 వేల అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగు!
శారీరకం మానసికంగా ఉండే వైకల్యం ఎల్లప్పుడూ మన గమనాన్ని ఆపలేవు. అవి బలమైన సంకల్పం ముందు ఓడిపోతాయి. అందుకు ఉదాహరణ అనురాగ్ రావత్. ఒకప్పుడూ అతను ఎలా బతుకుతాడు, అతడి జీవితం ఎలా ఉంటుంది అని సందేహం వ్యక్తం చేసిన వాళ్లే ఆశ్చర్యపోయాలా స్ఫూర్తిదాయకంగా జీవిస్తున్నాడు.సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తున్న రావత్ భారతదేశంలో రెండోసారి ఎత్తైన ప్రదేశంలో పరుగును పూర్తి చేసి, తన ఫిట్నెస్ ప్రయాణంలో మరో అద్భుతమై మైలురాయిని అందుకున్నాడు. అతని ఘనతను ప్రశంసిస్తూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఇలా ఉంది. “సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూనే, 12,500 అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి, భారతదేశంలో ఒక వ్యక్తి దేశానికి ప్రపంచవ్యాప్త కీర్తిని తీసుకురావడం ఇది రెండోసారి” అని యూజర్ పేర్కొన్నాడు పోస్ట్లో. రావత్ మారథాన్లు, ఫిట్నెస్ ఛాలెంజ్లు, సాధారణ వ్యాయామాల్లో పాల్గొంటూ తన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకునేవాడు. అది కాస్తా కాలక్రమేణా అతని పోస్ట్లకు రెండు లక్షలకు పైగా ఫాలోవర్లతో కూడిన ఆన్లైన్ కమ్యూనిటీని నిర్మించుకోవడానికి దారితీసింది. కాగా, రావత్కు రెండేళ్ల వయసులో సెరిబ్రల్పాల్సీ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆయన తన తండ్రి స్ఫూర్తితో సైన్యంలో చేరాలని కలలు కంటూ పెరిగాడు కానీ ఎనిమిదో తరగతితోనే చదువు మానేయక తప్పలేదు. చదువు మానేయడం రావత్కు చాలా కష్టంగా అనిపించినా తప్పలేదు. దాంతో అంతా అతడి భవిష్యత్తు ఎలా ఉంటుందా అని అనుకున్నారు. చివరికి తనకంటూ ఒక మార్గాన్ని నిర్మించుకుని అందరూ తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. అంతేగాదు రావత్ వీడియోలు చిత్రీకరించడం, ఎడిట్ చేయడం స్వయంగా నేర్చుకుని, పరుగు, జిమ్ వర్కౌట్లు, ఫిట్నెస్ ఛాలెంజ్లు, తోసహా తన దైనందిన జీవితానికి సంబంధించి ప్రతీ కంటెంట్ను పంచుకునేవాడు. అప్పటి నుంచే అతని జర్నీ యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అతన కంటెంట్ తన సామార్థ్యాలపై దృష్టిని సారిస్తోంది. పైగా ఆ వ్యాధి తన సామార్థాలను ఆపలేదు, పరిమితులను విధించలేదు అని చెబుతున్నట్లుగా ముందుగా సాగుతున్నాడు రావత్. నెటిజన్లు కూడా నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు మాకు స్ఫూర్తివి. వదిలేయడం అనేది రక్తంలోనే లేదు అనడానికి నువ్వే నిదర్శనం అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by _अनुराग_रावत_🇮🇳 (@_the_distinctive_) (చదవండి: 104 ఏళ్లకు బెయిల్... 105లో స్వేచ్ఛ)
పెట్రోలు కొరతతో క్యూబా ఏం చేసిందో తెలుసా?
పెట్రోలు కొరతతో అల్లాడుతున్న క్యూబా.. ఇప్పుడు సరికొత్త దారిని ఎంచుకుంది! బస్సులు, ట్యాక్సీలు కనిపించాల్సిన రోడ్లపై.. సోలార్ ఆటోలు దూసుకెళ్తున్నాయి! చైనాలో తయారైన ఈ వాహనాలు క్యూబా రవాణా ముఖచిత్రాన్నే మార్చేస్తున్నాయి!అమెరికా–ఇరాన్ యుద్ధం ఒకవైపు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోవైపు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా దేశాలు పెట్రోలు కొరతతో ఇబ్బందిపడుతున్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతూ వస్తోంది. అయితే, పెట్రోలు సమస్యను అధిగమించడానికి, ప్రజల రవాణా సౌకర్యాన్ని సులభతరం చేయడానికి క్యూబా ఇటీవల సోలార్ ఆటోలను రంగంలోకి దించింది. చైనాలో తయారైన సోలార్ ఆటోలను దిగుమతి చేసి, స్థానిక ఆటో డ్రైవర్లకు అందుబాటులోకి తెచ్చింది. వీటి ధర ఒక్కొక్కటి రెండువేల నుంచి నాలుగువేల డాలర్ల వరకు ఉంటోంది. వీటిని ప్రజల రవాణాతో పాటు సరుకుల రవాణా కోసం కూడా వాడుతున్నారు. క్యూబా నగరాలు, పట్టణాల్లో ఒకప్పుడు బస్సులు, ట్యాక్సీలు తిరిగిన వీథుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సోలార్ ఆటోలే దూసుకుపోతూ కనిపిస్తున్నాయి.ఇవీ చదవండి: ఏఐతో వైరస్ సృష్టి.. మానవాళికి వరమా? శాపమా?
ఆమె రచనల వెనుక దాగిన ఆ విషాద చరిత్ర ఏంటి?
కవితాత్మక వచన రచయిత్రిగా రాణించి, వచన కవనాల మధ్య సరిహద్దులు చెరిపేసిన సాహసి హాన్ కాంగ్. ఆమె 2024లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నారు. హాన్ కాంగ్ విజయానికి బలమైన నేపథ్యమే వుంది. అది ఆమె ఇంట్లో నెలకొన్న సాహిత్య వాతావరణం. హాన్ కాంగ్ తండ్రి, హాన్ స్యూంగ్ వాన్ ప్రముఖ కొరియన్ రచయిత– ఆమె అన్న హాన్ డాంగ్ రిమ్, తమ్ముడు హాన్ కాంగ్ యిన్ కూడా రచయితలే.కొరియా ద్వీపకల్పంలో ప్రవహించే హాన్ నది పేరే ఆమె వంశ నామం. ఆమె తొమ్మిదో యేట, హాన్ కుటుంబం సియోల్ సమీపంలోని సుయూ–రీ పట్టణప్రాంతానికి తరలిపోయింది. ఆమె తండ్రి ఉపాధ్యాయ వృత్తికి ఉద్వాసన చెప్పి పూర్తికాలం రచయితగా బతకాలని నిర్ణయించుకోవడమే దానికి కారణం. ఆ నిర్ణయం కాబోయే రచయిత్రి హాన్ కాంగ్ జీవితాన్ని చిన్న మలుపు తిప్పింది. 1982లో, ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పిన సంఘటన మరొకటి జరిగింది. తమ యింట్లో పడివున్న ఓ ఆల్బం హాన్ కాంగ్ కంటపడ్డమే ఆ మలుపు! 1980 మే నెలలో– హాన్ కుటుంబం సియోల్ సమీపంలోని ఓ శివారు పట్టణానికి తరలిపోవడానికి కొద్ది నెలల ముందు– దక్షిణ కొరియాలో గ్వాంగ్ జూ తిరుగుబాటు చెలరేగింది. అక్కడి సైనిక పాలకులు దాన్ని ఎంత నిర్దాక్షిణ్యంగా అణిచేశారో ఆ ఆల్బం ద్వారా హాన్ కాంగ్ తెలుసుకోగలిగింది. సదరు ఆల్బంలోని ఫొటోలు తీసినవాడు యెర్గెన్ హింట్జ్–పియెర్ అనే పాత్రికేయుడు, ఫొటోగ్రాఫర్.ఇరవై మూడేళ్ళ వయసులో, కొరియన్ భాషాసాహిత్యాల్లో పట్టా పుచ్చుకుని, యోన్సెయ్ విశ్వవిద్యాలయం నుంచి బయటపడిన హాన్, కొంతకాలం పత్రికల్లో పనిచేసింది. అదే సంవత్సరం ఆమె ‘అచ్చులోన తన పేరును ముచ్చటగా’ చూసుకున్నారు! ‘సాహిత్యం–సమాజం’ అనే త్రైమాసిక పత్రికలో ఆమె రాసిన అయిదు కవితలు అచ్చయ్యాయి. మరుసటి సంవత్సరం ‘సియోల్ షిన్మున్’ అనే వార్తాపత్రిక నిర్వహించిన కథానికల పోటీలో హాన్ కథానిక ‘ఎర్ర లంగరు’ బహుమతి పొందింది.ఆ పై సంవత్సరం, అంటే 1995లో, హాన్ తొలి కథా సంకలనం ‘యోసూ– ఓ ప్రేమకథ’ విడుదలైంది. అందులోని ప్రతి ఒక్క వాక్యం –కాలెరిజ్ చెప్పినట్లు– ‘అత్యుత్తమ క్రమంలో పేర్చిన, ఉత్తమమైన పదాల’తో అలరారి, అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె తన జర్నలిస్టు ఉద్యోగాన్ని వదిలిపెట్టి, పూర్తికాలం రచనలకే కేటాయించే నాటికి, హాన్ వయసు అక్షరాలా పాతిక సంవత్సరాలు!2007లో, హాన్ జీవితం ఇంకో మలుపు తిరిగింది. ‘తీయగా చల్లగా పాడుకునే పాట’ శీర్షికతో ఆమె మరో కథాసంకలనం వెలువరించారు. హాన్ జియోంగ్–రిమ్ అనే సంగీతజ్ఞుడూ, సంగీత దర్శకుడు ఆ కథలన్నీ హాన్ సొంతగొంతులో పాడి వినిపించి తీరాలని పట్టుబట్టారట! ఆయన మాట కొట్టిపారేయలేక రచయిత్రి అలానే చేశారట! ఆ తర్వాత, ఆమె ప్రధానంగా నవలలపై దృష్టి కేంద్రీకరించారు. ఇంతవరకూ ఆమె ఏడు నవలలు వెలువరించారు. వాటిల్లో ‘శాకాహారి’ సుప్రసిద్ధం. ఈ మూడు భాగాల గొలుసుకట్టు రచనకు చిన్న నేపథ్యముంది.కొరియన్ కవయిత్రి యీ–సాంగ్ కవితలోని ‘మనుషులు మొక్కలైతే ఎంత బాగుంటుంది?’ అనే పాదంలోని అంతరార్థం ఏమిటనే అన్వేషణ హాన్లో విద్యార్థి దశలోనే మొదలైంది. యీ–సాంగ్ ఆ కవితను ఎప్పుడు రాశారు? దాని చారిత్రక నేపథ్యమేమిటి? అన్న ప్రశ్నలకు జవాబు వెతికే క్రమంలో కవయిత్రి హృదయం ఈ రచయిత్రికి బోధపడింది. అలా ‘శాకాహారి’ అనే నవలా త్రయానికి ఇతివృత్తం రూపొందింది. ఆ త్రయంలో రెండు–మూడు భాగాలుగా ‘మంగోలియన్ ముద్ర’, ‘అగ్నివృక్షం’ వెలువడ్డాయి.ఇరవయ్యో శతాబ్ది అంతం కాబోతోందనగా, హాన్–కాంగ్ విజయ ప్రస్థానం మొదలైందని చెప్పొచ్చు. హాన్ నవలిక ‘బుద్ధ శిశువు’ 1995లో కొరియన్ నవలా పురస్కారం గెల్చుకుంది. ఇరవై ఒకటో శతాబ్ది తొలిపాదం ముగియబోతోందనగా నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడంతో ఈ యాత్ర పతాకస్థాయికి చేరినట్లయింది. ‘శాకాహారి’ నవలా త్రయంలో ‘మంగోలియన్ ముద్ర’ 2005లో ‘యీ– సాంగ్ సాహిత్యపురస్కారం’ గెల్చుకుంది.పదకొండేళ్ళ తర్వాత ‘శాకాహారి’ నవలకు డెబోరా స్మిత్ చేసిన ఆంగ్లానువాదం అంతర్జాతీయ బుకర్ పురస్కారం గెల్చుకుంది. అదే సంవత్సరం– 2016లోనే– ‘ద న్యూ యార్క్ టైమ్స్ బుక్ రెవ్యూ’ ఎంపిక చేసిన పది ఉత్తమ రచనల జాబితాలో ఈ నవలకు స్థానం దక్కడం విశేషమే మరి! అదే సంవత్సరం హాన్ వెలువరించిన ‘మనుషుల చేతలు’ నవలకు అడల్ఫీ ఎడిజియోనీ చేసిన ఇటాలియన్ అనువాదం, ‘ప్రీమియో మలపార్టీ’ పురస్కారం గెల్చుకుంది.2021లో వెలువడిన హాన్ అయిదో నవల ‘మనం విడిపోం’ రెండేళ్ళ తర్వాత ఫ్రెంచ్ భాషలోకి అనువాదమై ‘ప్రీ మెడిసిస్’ పురస్కారం గెల్చుకుంది. ప్రతిభకు తగినంత పేరు పొందని రచయితలకిచ్చే పురస్కారమిది! హాన్ సాధించిన ఈ విజయంతో పాశ్చాత్య సాహిత్య ప్రపంచం పెద్దలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఆ ఉలికిపాటుకు పర్యవసానమే, 2024లో హాన్ నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడం!- మందలపర్తి కిషోర్ఇవి కూడా చదవండి: నాన్నకు చేయాల్సిన కర్మలు వద్దన్నాడు.. చివరికి ఏం జరిగిందంటే?
ఈ వారం కథ: 'ఆత్మబలం'
‘నేను ఇప్పట్లో ఇండియా రాలేను. ఫుల్ బిజీగా ఉన్నాను. మీరే చూసుకోండన్నయ్యా!’ ఇక అంతకన్నా చెప్పాల్సిందేమీ లేదన్నట్లు ఫోన్ చేసి చెప్పాడు రాఘవ.‘అది కాదురా రాఘవా! నాన్న సంవత్సరీకానికయినా రాకపోతే ఎలారా? ఒకసారి ఆలోచించు.!’ ‘లేదన్నయ్యా! అర్థం చేసుకో! కావాలంటే వీడియో కాల్లో అటెండ్ అవుతానులే!’ అంటూ ఫోన్ కట్ చేశాడు రాఘవ.మాధవరావు, సుమతి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రామారావు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. చిన్న కొడుకు రాఘవ అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసుకుని, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ పెళ్లిళ్లయి ఎవరికి వారు జీవిస్తున్నారు. తల్లి సుమతి పెద్ద కొడుకు రామారావు వద్దనే ఉంటుంది.మాధవరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొంది, అంతా సెటిల్ అయ్యారు అనుకుంటున్న తరుణంలో అనారోగ్యంతో సంవత్సరం క్రితం కాలం చేశాడు.యాభై సంవత్సరాల పాటు ఏమాత్రం అరమరికలు లేకుండా, అన్యోన్యంగా జీవించిన తమ బంధం భౌతికంగా వీడటంతో ఆనాటి నుంచి కుమిలి కుమిలి రోదిస్తూనే ఉంది సుమతి. అంత్యక్రియలు, కర్మకాండలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తే తన భర్త ఆత్మ శాంతిస్తుందని, ఆ విధంగానే శ్రాద్ధ కర్మలు నిర్వహించాలని కొడుకులను కోరింది సుమతి. పెద్ద కొడుకు రామారావు ఆచార వ్యవహారాలను అనుసరిస్తుంటాడు. కానీ చిన్న కొడుకు రాఘవ మాత్రం ఆస్తికులకు నాస్తికులకు మధ్యలో ఉండి, కొన్నింటిని అనుసరిస్తూ, కొన్నింటిని త్యజిస్తూ ఉండే స్వభావం. అదీగాక తన తండ్రి తనకేమీ చేయలేదనే కోపంతో ఉంటుంటాడు. అన్నను చూసుకున్నట్లుగా తనను చూసుకోలేదని బాధపడుతుంటాడు. మాధవరావు చనిపోయిన రోజు అన్న రామారావు బలవంతం మీద అమెరికా నుంచి వచ్చి చివరి చూపు చూసి, అంత్యక్రియల్లో పాల్గొని, వెంటనే వెళ్లిపోయాడు.అంత్యక్రియల తర్వాత మాధవరావు కుటుంబ స్నేహితుడు నారాయణ శాస్త్రిగారితో మిగతా కర్మకాండల విషయమై చర్చించిన విషయాలు ఒక్కొక్కటిగా రామారావు మదిని తొలుస్తున్నాయి.ప్రతి నెలా మాసికం పెడుతూ, శాస్త్రోక్తంగా సంవత్సరీకం వరకు జరపాలని అమ్మ కోరడంతో పాటు, శాస్త్రిగారు కూడా శాస్త్రం ప్రకారం నిర్వహించాలని కుటుంబ సభ్యులకు సూచించాడు. దీనికి అసహనానికి గురైన రాఘవ, ‘శాస్త్రిగారూ! మళ్లీ ఇండియా నేను రాలేను. నన్ను ఇబ్బంది పెట్టకండి’ అనడంతోశాస్త్రిగారికి కోపం వచ్చి, ‘చిన్నపిల్లోడిలా మాట్లాడకు రాఘవా! నాన్న ఎంత నిష్టాగరిష్ఠుడో అందరికీ తెలుసు. నాన్న ఆత్మ శాంతించాలంటే సంవత్సరం వరకు అన్ని తిథులూ పెట్టాల్సిందే. ఆ విధంగా చేయకపోతే మీ కుటుంబానికే అరిష్టం.’ అని హెచ్చరించారు.‘భయపెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? ఇక్కడ ఉన్నవాళ్లు చేస్తే చేసుకోండి.. నాకవసరం లేదు.’ అని రాఘవ కరాఖండిగా చెప్పాడు.‘కర్మాధికారంతో పెద్దవాడు కర్మ చేస్తున్నప్పటికీ, ఒకే చోట అన్నదమ్ములిద్దరూ ఈ క్రతువును చేయాల్సిందే. అంతేకాదు ఏటి సూతకం కూడా ఉంటుంది. సంవత్సరం పాటు మరే శుభకార్యాలు చేపట్టకూడదు. పితరుల ఆత్మశాంతికి, కుటుంబ సభ్యుల అభివృద్ధికి తర్పణాలు విడవాల్సిందే రాఘవా!’ హెచ్చరించాడు శాస్త్రిగారు.‘శాస్త్రిగారూ! ప్రతినెలా మాసికం, మధ్యలో వచ్చే తిథులు, ఇవన్నీ కాకుండా సంవత్సరానికి ఒకసారే పెట్టుకోవచ్చు కదా! మాకంతా టైం వేస్ట్. వ్యయ ప్రయాసలతో కూడినది. కాస్త ఆలోచించండి మా వైపు కూడా!’ రాఘవ తనకు అనుకూలమైన సమాధానాన్ని తెప్పించుకునేందుకు ప్రయత్నించాడు.‘పురాణాల ప్రకారం అంత్యక్రియలు, కర్మ కాండలు మరణానంతరం జీవికి శాంతి చేకూర్చడమే కాక, కుటుంబ సభ్యుల శ్రేయస్సు, ధార్మిక సంప్రదాయాన్ని చాటుతాయి. సంవత్సరం వరకు కూడా ఆత్మ కుటుంబ సభ్యుల మధ్యనే తిరుగుతూనే ఉంటుంది. విధిగా అన్ని తిథులలో శ్రాద్ధాలు పెట్టాల్సిందే. సంవత్సర దీక్ష తప్పదు.’ అని శాస్త్రిగారు మరింత వక్కాణించడంతో, గుటకలు మింగిన రాఘవ..‘సరేలెండి! ఏం చేస్తాం!? నేను లేకపోయినా ప్రతినెలా అన్నయ్య ఇక్కడ ఏర్పాటు చేస్తాడు. నేను సంవత్సరీకానికి వస్తాను. వీలైతే ప్రతి నెలా నేనక్కడ పెట్టుకుంటాలేండి.’ అసహనంగా చెప్పాడు రాఘవ.‘లేదు రాఘవ! అన్నదమ్ములిద్దరూ ఒకే చోట కలిసి చేయాల్సిందే. ఇది శాస్త్రమే కాదు. కలిసి మెలిసి ఉండే కుటుంబ ఐక్యత సూత్రం, మాసిక ధర్మాన్ని చాటుతుంది. నాన్నగారి ఆత్మశాంతికి ఆ మాత్రం సమయం కేటాయించలేవా..?‘ నిలదీస్తున్నట్లు ప్రశ్నించడంతో, చేసేది చేయొచ్చు ఈయనతో వాదనెందుకని మాట్లాడకుండా ఉండిపోయాడు రాఘవ.కొత్తగా పెళ్లయిన తన తమ్ముడిని ఇబ్బంది పెట్టటం ఎందుకనుకుని..‘సరే రాఘవ! కనీసం నాన్నగారి సంవత్సరీకానికైనా తప్పనిసరిగా నువ్వు, వనజ వచ్చేయండి.’ అన్నాడు. ముసిరిన జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చాడు రామారావు. సంవత్సరీకానికైనా తమ్ముడొస్తే బాగుండు అనుకుంటూ, వచ్చే నెలలో వున్న నాన్న సంవత్సరీకం ఏర్పాట్ల ఆలోచనలో నిమగ్నమయ్యాడు.∙∙ ‘ఏవండీ! మామగారి సంవత్సరీకం వచ్చేనెల ఉంది కదా! ఇండియా వెళ్దామండి.’‘నీకేమైనా పిచ్చా? ఇక్కడ బోలెడన్ని పనులున్నాయి. అదేదో వాళ్లే చేసుకుంటారు. ఏదో ఒక సాకు చెప్పొచ్చులే.’ విసుగ్గా అన్నాడు రాఘవ.‘అదేంటండి అలా అంటారు? తండ్రికి శ్రాద్ధ కర్మలు పెట్టకపోతే, మనకు మంచిది కాదండి. ప్లీజ్ కొన్ని పాటించాలి. అయినా తండ్రి ఋణం తీర్చుకోవడం, ఆయన ఆత్మశాంతికి ఈ మాత్రం చేయడానికి వెనుకాడటం ఏమాత్రం బాగోలేదు.’ వనజ గట్టిగానే అంది.‘వనజా...నీకేం తెలియదు ఊరుకో! నాకేం చేశాడని మా నాయన? అందరిలాగే చదువుకున్నాను. సొంతంగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాను. అన్నయ్యను చూసినట్లు నన్నేమైనా చూశాడా? ఆ రోజు ఏదో ఒకటి చెప్పి, అక్కడి కార్యక్రమం వీడియో కాల్లో చూసి ఓ నమస్కారం పెట్టేద్దాం సరిపోతుంది. ఎటువంటి సంస్కారాలు చేయనవసరం లేదు. ఇక నన్ను విసిగించకు.’ అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు రాఘవ.‘జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఏంచేస్తే ఋణం తీరుతుంది? జీవించినంత కాలం సేవ చేయాలి. చనిపోయిన తర్వాత శ్రాద్ధకర్మలు పెట్టి వారి ఆత్మను శాంతింపచేయాలి.’ అంటూ రాఘవను కన్విన్స్ చేయబోయింది వనజ.‘ఏమోలే! పనికిరాని టాపిక్. ఎట్టి పరిస్థితుల్లో నాన్న తిథికి తిరిగి ఇండియాకు వెళ్ళేది లేనేలేదు.ఉన్నాడుగా అన్న... ఆయన చూసుకుంటాడులే. ఇక దాని గురించి వదిలేయ్! అవునూ! నాన్న అంత్యక్రియలకు వెళ్లినప్పుడు హైదరాబాదులో ఒక విల్లా చూశాను కదా! దానికి అడ్వాన్స్ ఇవ్వాలి. ఈ వారం రోజుల్లో చెల్లిస్తాను.’ ‘అదేమిటండీ! మీకు మొన్ననే ఉద్యోగం కూడా పోయింది కదా, మళ్లీ ఇంకో ఉద్యోగం వచ్చేవరకు ఆగుదాం. పైగా మామగారు పోయి సంవత్సరం కూడా కాలేదు. సంవత్సరం లోపు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు కదా! ఇప్పుడు డబ్బు కట్టడం అంత శ్రేయస్కరం కాదు, ఆలోచించండి.’ భర్తకు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది వనజ.‘ఛత్! చాదస్తం మాటలు మాట్లాడకు. ఇవన్నీ ట్రాష్. మానసిక బలహీనతతో ఆడుకునే శాస్త్రాలు. వీటిని నమ్మను. సిద్ధాంతాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, మూఢత్వాలతో ప్రాక్టికల్ లైఫ్కు అడ్డం చెప్పకు. ఇప్పటివరకు నేను దాచుకున్న డబ్బుతో వచ్చేవారం అడ్వాన్స్ చెల్లిస్తాను.’ అంటూ ఒంటి కాలిపై లేచాడు రాఘవ. ఇక ఆ విషయం కొనసాగిస్తే భర్త సీరియస్ అవుతున్నాడని గ్రహించింది వనజ.‘సర్లేండి... రేపు ఆదివారం ఎక్కడికో వెళ్దామని చెప్పారు.’ టాపిక్ మార్చడానికి ప్రయత్నం చేసింది వనజ.‘యస్. బాగా గుర్తు చేశావు. మనం రేపు పిక్నిక్కి వెళ్దామనుకున్నాము. కాస్త మనసన్నా రిలాక్స్డ్గా ఉంటుంది, వెళదాం.’ ఉద్యోగం, సంవత్సరీకం ఈ రంధి నుంచి కాస్తంత ఉపశమనం కావాలనుకున్నాడు రాఘవ.∙∙ ఆరోజు ఆదివారం సమీపంలోని వాటర్ ఫాల్ సైట్ సీయింగ్కు వచ్చారు రాఘవ, వనజలు. వాటర్ ఫాల్స్ సమీపంలో ఓ నది ప్రవహిస్తోంది. అందులో పర్యాటకులు బోటింగ్ షికారు చేస్తున్నారు.‘ఏవండీ..! మనం కూడా బోటింగ్ చేద్దామండి.‘ గోముగా అడిగింది వనజ.‘వామ్మో! నాకు నీళ్లంటే భయం. ఆడపిల్లవైనా మీ నాన్న నీకు ఈత నేర్పాడు. మీ మామగారున్నారే– అదే– మా నాయన– మా ఊరి చెరువులో కొన్ని రోజులే సగం వరకే ఈత నేర్పారు. పూర్తిగా నేర్చుకోకముందే నుమోనియా రావడంతో, ఇక నేర్పలేకపోయాడు. దాంతో నాకు ఈత రాకుండా పోయింది. అందులో కూడా ఆయన వల్లే ఫెయిలయ్యాను.’ అని గతాన్ని గుర్తు చేసుకుంటూ...‘వెళితే నువ్వు వెళ్ళు. నేను ఇక్క డే ఉంటాలే’ అన్నాడు.‘అదేంటండి చోద్యం కాకపోతే! షికారు ఎవరైనా ఒక్కరే చేస్తారా? జంటగా వెళితేనే సరదా ఉంటుంది. అయినా ప్రతి ఒక్కరికి బెల్టు పెడతారు. భద్రంగానే ఉంటుంది. మగవారయుండి అంత భయపడితే ఎలా? పదండి పోదాం.’ అనగానే తన ఇగో పనిచేసి, బోటింగ్కు సిద్ధమయ్యాడు రాఘవ.బోట్లో నదిలో కొద్ది దూరం వెళ్లేసరికి ఒకచోట ప్రవాహం ఉద్ధృతమై, బోటులో చివర కూర్చున్న రాఘవ బెల్టు ఊడి అదుపు తప్పి నీళ్లలో పడిపోయాడు. పడీ పడగానే నీటిలో మునుగుతూ హాహాకారాలు చేస్తున్నాడు. భర్త ప్రమాదాన్ని గమనించిన వనజ వెంటనే నీటిలో దూకింది. కానీ ఇద్దరికీ పోను పోను చాలా దూరం పెరగడంతో, ఆమె రాఘవను అందుకోలేకపోతుంది. రాఘవ నీటిలో మునుగుతూ తేలుతూ, నీళ్లు మింగుతూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.కాకతాళీయంగా పైకి ఒక్కసారి ఆకాశం వైపు చూపు పడిన రాఘవకు నాన్న ఆకారం కనిపించినట్లయింది. ఆనాడు తమ ఊరి చెరువులో నాన్న ఈత నేర్పిన దృశ్యం గుర్తుకొచ్చింది. టైరు మధ్యలో తనను కట్టి ఈత ప్రాక్టీస్ చేయించిన దృశ్యం కళ్ళ ముందు కదలాడింది.పైనుంచి నాన్న...‘కమాన్ రాఘవా! కమాన్! అలాగే చేతులు, కాళ్లు ఆడించి పైకి తేలు... మునగకు... శరీరాన్ని తేలికగా చేసుకో... కాళ్లు చేతులు వేగంగా ఆడించు కమాన్... కమాన్... అలాగే... ఇంకా ముందుకు... ఇంకా ముందుకు... అంటున్నట్లుగా, ఉత్సాహపరుస్తూ, తనకు మరోసారి ఈత నేర్పుతున్నట్లుగా అనిపించి తన శక్తినంత కూడ తీసుకొని ఈత కొడుతూనే ఉన్నాడు రాఘవ. ‘నీకు ఈత బాగా వచ్చు... బాగా ఈదుతున్నావు. వెరీ గుడ్... అలాగే వచ్చేయ్..! అలాగే...’ అంటూ వెన్ను తడుతున్నట్లుగా నాన్న ఆత్మదర్శనంతో రాఘవ మరింత బలాన్ని కూడతీసుకొని చేతులు కాళ్లు వేగంగా కదిలిస్తూ, నీటిపై తెలియాడటం మొదలెట్టాడు. ఇంతలో ఎవరో ఒకరు బలంగా ఒక్క తోపు తోసినట్లు అనిపించడంతో, ఒక్కసారిగా ఒడ్డు సమీపంలోని చిన్న చెట్టును అందుకోగలిగాడు. ఆ చెట్టు ఆసరాతో నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నాడు రాఘవ. ఒడ్డుకు చేరిన రాఘవ అంత చల్లదనంలో కూడా చెమటలు కక్కుతూ, ప్రాణ భయంతో వణుకుతూ ఆయాసపడుతూ కూర్చున్నాడు. ఇంతలో వెనకనుంచి వచ్చి భర్తను పట్టుకున్న వనజకు దుఃఖం కట్టలు తెంచుకుంది.లోపల నుంచి పీలగా వస్తున్నట్లుగా, జీర గొంతుతో, రోప్పుతూ...‘వనజా... వనజా..! నాన్న కనిపించాడు. ఆత్మదర్శనమైంది.’ అంటూ తల పైకెత్తి చూపించాడు.‘నన్ను రక్షించింది... పునర్జన్మ నిచ్చింది నాన్నే వనజా..! ఆనాడు సగం నేర్పిన ఈత, ఈనాడు పైనుంచి పూర్తిగా నేర్పాడు. అంతేకాకుండా అదృశ్య శక్తిగా, నేను కొట్టుకుపోకుండా బలంగా ఒడ్డుకు నెట్టడంతో నేను బతికాను వనజా..!’ అంటూ వల వల ఏడుస్తున్న భర్త వైపు లాలనగా చూసింది వనజ.అంత బాధలోనూ ఆమె మోములో ఓ చిరుదరహాసం మెరిసింది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, ‘మీ సంకల్పం గొప్పది మామగారు..! ఎవరితో ఏ పని చేయించాలో ఆ పని చేయించే ఆత్మబలం మీది. మీ కుమారుడిని కాపాడటానికి ఆత్మ శక్తిగా సగం మీరు పనిచేస్తే, వేగంగా డైవ్ చేసుకుంటూ నా భర్తను రక్షించుకునే మిగతా సగం బాధ్యతను నేను పూర్తి చేశాను. నేను చేసిన ఆ సగం మీ అదృశ్య శక్తిగా విశ్వసిస్తున్న నా భర్తకు, మీపై కలకాలం అదే గౌరవం, నమ్మకం ఉండే విధంగా, ఈ విషయాన్ని మనసులోనే దాచుకుంటాను మామగారు.’ అంటూ వనజ చేతులెత్తి నమస్కరించింది.∙∙ ‘అన్నయ్యా..! నాన్న తిథికి నేనూ వనజ ఇద్దరం వచ్చేస్తున్నాం! అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయండి..! టికెట్లు కూడా తీసుకున్నాం.’ రామారావుకి ఫోన్ చేసి చెప్పాడు రాఘవ.‘వనజా..వనజా.’ అంటూ గట్టిగా పిలిచాడు రాఘవ.‘ఏంటండీ..! ప్రతిదానికి హడావుడే... మీకు ఏదొచ్చినా తట్టుకోలేము. ఏంటో చెప్పండి.’ అంటూ వంటింట్లో నుంచి వచ్చింది వనజ.‘ఏం లేదు వనజా! గత నెల నాకు లేఆఫ్లో ఉద్యోగం పోయిందిగా... ఈ రోజు మెయిల్ వచ్చింది వేరే కంపెనీలో మరింత ప్యాకేజ్తో పైస్థాయి ఉద్యోగం వచ్చింది.’ అంటూ సంతోషంతో వనజను కౌగిలించుకుని ఉక్కిరిబిక్కిరి చేశాడు రాఘవ.‘ఓహ్! సూపర్... మంచి వార్త చెప్పారు. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. హైదరాబాదులో విల్లాకు అడ్వాన్స్ చెల్లించవద్దని మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. అదేదో డబుల్ రిజిస్ట్రేషన్ వివాదంలో ఉందట.’ వనజ చెప్పడంతో మరింత ఆనందంతో మరోసారి నాన్నను మనసులో తలచుకున్నాడు రాఘవ.‘యస్... వనజా..! సంవత్సరంలోపు శుభకార్యం మన చేత చేయించకుండా అడ్డుపడి, మనకు మేలు చేసింది మీ మామగారే. శాస్త్రాన్ని నమ్మకపోవడంతో చేయాల్సిన కర్మలు సరిగా చేయలేదేమో, అందుకే ఆ రోజున నాకు ఉద్యోగం పోయింది. నాన్న ఆత్మ దర్శనం కావడంతో, నాన్నపై విశ్వాసం పెరగడంతో, మళ్లీ పాత దానికన్నా పెద్ద ఉద్యోగం వచ్చింది. నిజంగా ఇది నాన్న ఇచ్చిన వరప్రసాదమే కదా వనజ!’ అంటూ ఆత్మ సంతృప్తితో ఆనందాన్ని వ్యక్తం చేశాడు రాఘవ. మంచి పరివర్తనతో తన భర్తలో వచ్చిన మార్పుకు వనజ లోలోన సంతోషించి, మామగారికి కృతజ్ఞతలు చెప్పుకుంది. మాధవరావు సంవత్సరీకానికి రాఘవ, వనజలు ఇండియా బయలుదేరారు.∙∙ ఇల్లు చేరీ చేరగానే అమ్మను పట్టుకొని, కుమిలి కుమిలి ఏడ్చాడు రాఘవ. ‘నాన్నను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా! నాకు నాన్న ఆత్మ దర్శనమైంది.’ అంటూ జరిగిందంతా చెప్పాడు. నేను మళ్ళీ బతికి నీ ముందున్నాను అంటే, నాన్న ఇచ్చిన పునర్జన్మేనమ్మా!’ అంటున్న రాఘవను పొదివి పట్టుకుని ఓదార్చింది సుమతి.‘నీకు ఇంకో విషయం చెప్పనా రాఘవా! నాన్న విషయంలో ఇంకోటి కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయావు. నాన్న నీకు చెరువులో ఈత నేర్పుతున్న కాలంలో, నాన్నకు న్యుమోనియా వచ్చింది. దాంతో పూర్తిగా ఈత నేర్పలేకపోయాడు.కాలం గడుస్తున్నా కొద్దీ, వ్యాధి ముదిరి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఆ పరిస్థితుల్లోనే నీ అమెరికా ప్రయాణం రావడంతో చికిత్సకు వెచ్చించాల్సిన డబ్బును నీ అమెరికా ప్రయాణానికి, చదువుకు పెట్టాడు. సరైన సమయంలో చికిత్స లేకపోవడంతో, వ్యాధి ముదిరి ప్రాణాంతకమైంది. ఒక రకంగా తన ప్రాణాన్ని నీ చదువు, ఉన్నతికి పణంగా పెట్టాడు.అంతే కాదు రాఘవా..! నువ్వు అనుకున్నట్లు అన్నయ్యను ఎక్కువగా ఏమీ చూడలేదు. ఇంకా.. అన్నయ్యే నీకోసం త్యాగం చేశాడు తెలుసా..? మీ ఇద్దరికీ సమానంగా వచ్చిన వాటాలో, అన్నయ్యకు వచ్చిన ఎకరం పొలంలో సగం అమ్మి నీ చదువుల ఖర్చుకు పెట్టాడు. నీకు నాన్న, అన్నయ్యల పట్ల అపోహలు ఉండటంతో, ఇప్పటివరకు ఈ విషయాలు చెప్పలేకపోయాను. నీ అంతట నీవే పరివర్తన చెందావు కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు చెప్పగలిగాను.’ అమ్మ చెబుతున్న విషయాలు వింటున్న రాఘవ ఒక్కసారిగా నిలువెల్లా ద్రవించిపోయాడు. అంతలో అప్పుడే అటుగా వస్తున్న రామారావును పరుగు పరుగున వెళ్లి గాఢంగా హత్తుకున్నాడు.‘నన్ను మన్నించు అన్నయ్యా...! నన్ను క్షమించు నాన్నా..!’ అంటూ పశ్చాత్తాపంతో కుంగిపోతూ గుక్కపట్టి ఏడుస్తుంటే, అమ్మ, అన్నయ్యలు మరింత ప్రేమ పూర్వకంగా అక్కున చేర్చుకుని ఓదార్చారు.‘ఇదే రాఘవా..! మన ఆత్మ బలం’ అని రామారావు తమ్ముడిని ఆప్యాయంగా నిమిరాడు.మాధవరావు సంవత్సరీకానికి కావలసిన ఏర్పాట్లను చర్చించటానికి అక్కడికి వచ్చిన నారాయణ శాస్త్రిని చూసిన రాఘవ కన్నీటిని ఆపుకోలేకుండానే‘శాస్త్రిగారూ...! నా మూర్ఖత్వానికి మన్నించండి.’ అంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. జరిగిందంతా తెలుసుకున్న నారాయణ శాస్త్రి ‘మాధవా..నీ ఆత్మ సంకల్పం గొప్పది.’ అనుకుంటూ మనసులోనే అభినందించాడు.‘కర్మాణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచనా... కర్తవ్యాన్ని చేయడమే నీ బాధ్యత, ఫలములపై ఎప్పుడూ హక్కు లేదు. ఇది నిష్కామ కర్మ సిద్ధాంతం రాఘవా!’ అంటూ వేదాంత ధోరణిలో వివరించాడు నారాయణ శాస్త్రి. ‘అంతేకాదు..! శాస్త్రం, శాస్త్రీయత, విశ్వాసం, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, విలువలు, కుటుంబ బంధాల మేళవింపే జీవిత సారం..! అదే మన ఆత్మబలం..!’ అని సత్ జీవన విధాన బోధ చేసిన నారాయణ శాస్త్రికి వినమ్రంగా నమస్కరించారు అందరూ.- మంత్రిప్రగడ శ్రీనివాసరావుఇవీ చదవండి: 104 ఏళ్లకు బెయిల్... 105లో స్వేచ్ఛ
అంతర్జాతీయం
ప్రపంచం మారిపోయింది!
అవును. మీరు చదివింది అక్షరాలా నిజం. ఎప్పుడో జీపీఎస్, లైడార్ వంటి టెక్నాలజీలేవీ లేని కాలంలో ఫ్రెంచ్ కార్టోగ్రాఫర్ మెర్కాటర్ తయారు చేసిన మ్యాప్ స్థానంలో ఐక్యరాజ్యసమితి సరికొత్త ప్రపంచ పటాన్ని అధికారికంగా ఆమోదించింది. పాత మ్యాప్లో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియాలు వాటి వాస్తవ సైజు కంటే తక్కువగా కనిపిస్తున్నాయని, దాన్ని సరిచేస్తూ ‘ఈక్వల్ ఎర్త్’పేరుతో కొత్త మ్యాప్ తయారు చేశామని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. భారత్ సహా మొత్తం 164 దేశాలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపగా అగ్రరాజ్యం అమెరికా వ్యతిరేకించింది. ఆరు దేశాలు ఓటింగ్కు దూరంగా ఉండిపోయాయి. విద్య, మీడియా, అంతర్జాతీయ విధానాల్లో దేశాలకు తగిన ప్రాధా న్యం లభించాలన్నది ఈ మార్పు ఉద్దేశం. ఒకసారి ప్రపంచపటాన్ని చూడండి. ఎగువభాగంలో గ్రీన్ల్యాండ్.. దిగువన ఆఫ్రికా ఖండం కనిపిస్తాయి. రెండింటిలో ఏది పెద్దదంటే మీరేమంటారు? సహజంగానే గ్రీన్ల్యాండ్ అని సమాధానం వస్తుంది. కానీ.. దీంతోపోలిస్తే ఆఫ్రికా ఒకటి కాదు..రెండు కాదు.. 14 రెట్లు ఎక్కువ సైజుంటుంది. మెర్కాటర్ అనే మ్యాపుల తయారీదారు 1569లో సిద్ధం చేసిన మ్యాప్నే మనం ఇప్పటికీ వాడుతూండటం దీనికి కారణం. ఇదొక్కటే కాదు.. ఇలాంటి తేడాలు ఇంకా చాలానే ఉన్నాయి దీంట్లో. ప్రపంచాన్ని కాగితంపై చూపించడానికి చేసుకున్న ఎన్నో రాజీల్లో మెర్కాటర్ మ్యాప్ ఒకటి. భూమి గుండ్రంగా త్రీడీలో ఉంటే.. కాగితం 2డీలో ఉండటం అసలు సమస్యకు కారణం. దీన్ని సరిచేసేందుకు మ్యాప్ ప్రొజెక్షన్ పద్ధతిని ఉపయోగించారు. ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాత మెర్కాటర్ ప్రొజెక్షన్లో తేడాలు వచ్చేశాయి. భూమధ్య రేఖకు దూరంగా జరుగుతున్న కొద్దీ మ్యాప్లోని భూభాగాల పరిమాణం పెరిగిపోతూ ఉంటుంది. అయితే అప్పట్లో మెర్కాటర్ ఈ మ్యాపును కేవలం సముద్రయానం కోసం మాత్రమే తయారు చేశాడు. అందుకే ఆఫ్రికా విస్తీర్ణం 303.7 కోట్ల చదరపు కిలోమీటర్లయినా.. మెర్కాటర్ మ్యాప్లో 21.7 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్న గ్రీన్ల్యాండ్ కంటే చిన్నగా కనిపిస్తూంటుంది. అప్పట్లో సముద్రయానానికి మెర్కాటర్ మ్యాప్ బాగా పనిచేసింది కానీ.. ఈ తేడాలు అనేక ఇతర సమస్యలను తీసుకొచ్చాయి. ఈక్వల్ ఎర్త్ మ్యాప్ అవసరం ఏర్పడింది ఇందుకే. బోజన్ సావ్రిచ్, టామ్ ప్యాటర్సన్, బెర్న్హార్డ్ జెన్నీ అనే ముగ్గురు కార్టోగ్రాఫర్లు 2018లో ‘ఈక్వల్ ఎర్త్’మ్యాప్ను రూపొందించారు. భూభాగాల విస్తీర్ణాన్ని సరిగ్గా చూపించడం ఈ ప్రొజెక్షన్ ముఖ్య ఉద్దేశం. అంతేకాదు...లెక్కల్లో గట్టిగా ఉండటమే కాకుండా.. చూసేందుకు కూడా సహజంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాస్తవానికి ప్రపంచ పటం విషయంలో కొన్ని వందల ప్రొజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిల్లో మెర్కాటర్ సహా ఓ డజను మాత్రమే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్లో భూభాగాల పరిమాణాలు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండటం వల్ల ఎవరో పెద్ద... మిగిలిన వారు చిన్న అన్న భావన భావన ఏర్పడే అవకాశం ఉండదని మద్దతుదారుల అంచనా.ఆఫ్రికా దేశాల ఉద్యమం ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ మ్యాప్ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల ఉద్యమం ఫలితంగానే సాకారమైందని చెప్పాలి. ఆఫ్రికన్ దేశం టోగో కొత్త మ్యాప్ ప్రతిపాదన చేయగా ఆఫ్రికన్ యూనియన్ మద్దతు ఇచ్చింది. ఆఫ్రికా పరిమాణాన్ని సరిగ్గా చూపడమే కాకుండా... పాత అసమానతలను సరి చేయాలన్నది ఆఫ్రికా దేశాల ఉద్దేశం. ఇందుకు తగ్గట్టుగానే ఐరాస తీర్మానం కూడా పాఠశాలల్లో, పాఠ్యపుస్తకాల్లో మీడియా, సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఈక్వల్ ఎర్త్ వంటి ప్రొజెక్షన్ల వినియోగాన్ని పెంచమని కోరుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్
మరో ఇద్దరు మృత్యుంజయులు
కఠ్మాండు: నేపాల్లో మరో అద్భుతం చోటుచేసుకుంది. వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. నువాకోట్ జిల్లా బిదుర్ పట్టణంలో ఆకస్మిక వరదల వల్ల కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలు చండికా శ్రేష్ట 10 రోజుల తర్వాత సజీవంగా బయటపడింది. సహాయక సిబ్బంది బురద, ఒండ్రు మట్టిని తొలగించి ఆమెను శనివారం క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. నేపాల్ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళ నెమ్మదిగా స్పృహలోకి రావడం వీడియోలో కనిపిస్తోంది. సహాయక సిబ్బంది ఆమెను దుప్పటి, జాకెట్తో కప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈ వృద్ధురాలిని చికిత్స కోసం వెంటనే హెలికాప్టర్లో కఠ్మాండు ఆసుపత్రికి తరలించారు. సొరంగంలో చైనా జాతీయుడు రసువా జిల్లాలో భారీ వరదల ధాటికి ధ్వంసమైన అప్పర్ త్రిశూలి 1 జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం నుంచి ఒక చైనా జాతీయుడిని శనివారం రక్షించారు. అతడిని లూహైటతావోగా గుర్తించారు. వరదల సమయంలో ‘ఆడిట్ టన్నెల్ 4’లో చిక్కుకుపోయాడు. లూహైతావోను నేపాలీ సైన్యం, విదేశీ సహాయక సిబ్బందితో కూడిన బృందం కాపాడినట్లు అధికారులు ప్రకటించారు. సొరంగ మార్గంలో సుమారు 225 మీటర్ల లోపల ఉన్న ఒక ప్రదేశం నుంచి సజీవంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగాల సజీవంగా బయటకు తీసిన కార్మికుల సంఖ్య మొత్తం మూడుకు చేరింది. శుక్రవారం త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్లాంట్లోని ఒక సొరంగం నుంచి ఇద్దరు కార్మికులు కబిర్ మహర్జన్, సంజయ్ షాను రక్షించిన సంగతి తెలిసిందే. నేపాల్లో పదికిపైగా జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద కనీసం 900 మంది కార్మికులు గల్లంతయ్యారని, వీరిలో దాదాపు 500 మంది సొరంగాల లోపలే ఉండి ఉంటారని అధికారులు వెల్లడించారు. 1,344కి చేరిన మృతుల సంఖ్య నేపాల్ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం 1,344కి చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల్లో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 589 మంది విదేశీయులతో సహా దాదాపు 5,000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు 13,000 మందికి పైగా బాధితులను రక్షించామని పేర్కొన్నారు. ఎనిమిది జిల్లాల్లో ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాల్లో 758 పెద్దలవి, 85 పిల్లలవి కాగా, 501 మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభించాయని తెలిపారు. డీఎన్ఏ సేకరణ సహా చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత మొత్తం 1,030 మృతదేహాలను ఖననం చేశారు. కేవలం 96 మృతదేహాలను మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మిస్ వరల్డ్ 2026 విజేతగా డొమినికన్ రిపబ్లిక్ భామ
వియత్నాంలో జరిగిన మిస్ వరల్డ్ 2026 గ్రాండ్ ఫినాలేలో డొమినికన్ రిపబ్లిక్కు చెందిన జోహెయిరీ మోలా విజేతగా నిలిచారు. థాయ్లాండ్కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ ఒపల్ సుచాటా చువాంగ్స్రీ ఆమెకు ప్రపంచ సుందరి కిరీటం అలంకరించారు.ఈ పోటీలో స్పెయిన్కు చెందిన ఎలిసబెత్ రేయ్నెస్ ఫస్ట్ రన్నరప్గా, మలేషియాకు చెందిన తానుసియా చెట్టి సెకండ్ రన్నరప్గా నిలిచారు.టాప్ 6 ఫైనలిస్టులుడొమినికన్ రిపబ్లిక్ – జోహెయిరీ మోలా: విజేతస్పెయిన్ – ఎలిసబెత్ రేయ్నెస్: ఫస్ట్ రన్నరప్మలేషియా – తానుసియా చెట్టి: సెకండ్ రన్నరప్వియత్నాం – లే న్గుయెన్ బావో న్గోక్దక్షిణాఫ్రికా – రొమాండా హోంబిర్ఎరిట్రియా – స్నిట్ హబ్టియాబ్: పీపుల్స్ ఛాయిస్భారత్కు నిరాశభారత్ తరఫున పాల్గొన్న నిఖిత పోర్వాల్ టాప్ 40లో చోటు దక్కించుకున్నప్పటికీ, టాప్ 20కి అర్హత సాధించలేకపోయారు. దీంతో ఆమె మిస్ వరల్డ్ 2026 ప్రయాణం టాప్ 40 వద్ద ముగిసింది. అయితే భారత్ వరుసగా ఐదు మిస్ వరల్డ్ ఎడిషన్లలో ప్లేస్మెంట్ సాధించిన రికార్డును కొనసాగించింది.
మిస్ వరల్డ్ పోటీ నుంచి మిస్ ఇండియా ఔట్
వియత్నాం వేదికగా జరుగుతున్న 73వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నిఖిత పోర్వాల్ నిష్క్రమించింది. ఈ పోటీలో నిఖిత టాప్-40 వరకు చేరుకున్నప్పటికీ, టాప్-20లో స్థానం సంపాదించలేకపోయింది. దీంతో భారత్కు ఏడో మిస్ వరల్డ్ కిరీటం అందించాలనుకున్న నిఖిత కల చెదిరింది.ఫైనల్ సందర్భంగా నిఖిత భవ్నా రావు రూపొందించిన ప్రత్యేక గౌన్ను ధరించింది. పూల ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబెలిష్మెంట్, ఇటాలియన్ ట్యూల్తో రూపొందించిన ఈ దుస్తులు ఆమె లుక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఉజ్జయినికి చెందిన నిఖిత ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేత. పేజెంట్ ప్రపంచంలోకి రాకముందు నిఖిత టీవీ యాంకర్గా పని చేసింది. నటనలోనూ ఆమెకు అనుభవం ఉంది.
జాతీయం
విషాదం.. గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి!
రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో విషాదకర చోటుచేసుకుంది. రాష్ట్ర ఉన్నత విద్య, సాంకేతిక విద్యాశాఖ మంత్రి, జేఎంఎం సీనియర్ నేత సుదివ్య కుమార్ సోను (56) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గిరిడీహ్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.సుదివ్య సోను గిరిడీహ్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)లో కీలక నేతగా కొనసాగుతున్న ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతిపై సీఎం హేమంత్ సోరేన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మృతి జేఎంఎం కుటుంబానికి, జార్ఖండ్ రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదివ్య సోను సేవలు, పార్టీకి చేసిన కృషిని స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.Jharkhand Mukti Morcha tweets, "The Jharkhand Mukti Morcha family is stunned and heartbroken by the untimely demise of Sudivya Kumar, a dedicated comrade of Jharkhand Mukti Morcha and a minister in the Jharkhand government. His departure is an irreplaceable loss for the party,… pic.twitter.com/Qapd1IKWaj— ANI (@ANI) September 6, 2026మరోవైపు.. జేఎంఎం నేత, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి దీపక్ బిరువా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదివ్య సోను ఆరోగ్యం గత రాత్రి అకస్మాత్తుగా క్షీణించిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని తెలిపారు. జేఎంఎం కుటుంబానికి ఇది తీరని లోటని పేర్కొంటూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు.ఇదీ చదవండి: లోహగడ్ కోట.. కేతన్ హత్యలో మరో షాకింగ్ ట్విస్ట్..
Bittu Tabahi : ‘బిట్టు’కు బంపరాఫర్
భోపాల్: డబ్బు లేకపోవచ్చు, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు.. కానీ గుండెల్లో కసి, చేసే పనిలో నిజాయితీ ఉంటే చాలు. ఎదిగేందుకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు! డిజిటల్ రీల్స్, ఫాలోవర్ల కోసం పాకులాడే ఈరోజుల్లో.. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, కనీసం ఈత రాకపోయినా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పర్యావరణాన్ని కాపాడాలనే తపనతో ప్లాస్టిక్ చెత్తను తొలగించాడు ఆ యువకుడు. అతని అంకితభావాన్ని గుర్తించిన నెదర్లాండ్స్కు చెందిన ప్రఖ్యాత ‘ది ఓషన్ క్లీనప్’ సంస్థ సీఈఓ బోయాన్ స్లాట్ స్వయంగా మాతో కలిసి పనిచేయండి అంటూ ఉద్యోగ అవకాశం ఇచ్చారు. ఇంతకీ ఎవరీ నయా సోషల్ మీడియా సెన్సేషన్?సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ ‘బిట్టు తబాహి’(ఉర్దూలో ‘తబాహి’ అంటే విధ్వంసం). మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బియోరాలో నివసించే 21 ఏళ్ల యువ పర్యావరణ వాలంటీర్. పర్యావరణ ప్రేమికుడైన బిట్టు, ఒక రోజు తన ఇంటి సమీపంలో ప్రవహిస్తున్న అజ్నార్ నది పూర్తిగా కాలుష్యంతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడాన్ని గమనించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒంటిచేత్తో నదిని శుభ్రం చేసేందుకు పూనుకున్నాడు.సాయం కోసం ఎదురు చూడలేదు. డబ్బులు ఉన్నాయా? లేదా? అని ఆలోచించలేదు. ఈ ఏడాది జనవరి 26 రిపబ్లిక్ డేని పురస్కరించుకొని నదిలో చెత్తను తొలగించే యజ్ఞాన్ని ప్రారంభించాడు. మొదట్లో బిట్టుకు అతని స్నేహితులు, స్థానికులు సాయం చేశారు. కానీ రోజులు గడిచే కొద్దీ అతనొక్కడే సైన్యంలా మారాడు. కేవలం ప్రాథమిక పనిముట్లతో, సరైన భద్రతా పరికరాలు లేకుండా, ఈత కూడా రాకపోయినా, అతను చేతితో నది నుండి టన్నుల కొద్దీ చెత్తను బయటకు తీశాడు.👉ఇదీ చదవండి: సీఏని వదిలేయ్.. దోసెలేసుకో!ఈ క్రమంలో బిట్టు తబాహి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడింది. రకరకాల ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు ఇబ్బంది పెట్టాయి. కొన్ని సార్లు పాముల బెడద ఎక్కువైంది. అయినా, వెనక్కి తగ్గకుండా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాడు. దీంతో బిట్టు లోకల్ హీరో అయ్యాడు. అతని పనితీరు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దృష్టిని ఆకర్షించడంతో, ఆయన బిట్టును తన ఇంటికి ఆహ్వానించారు. సీఎం అతని చొరవను ప్రశంసించడమే కాకుండా, ప్రభుత్వ మద్దతు ఉంటుందని కూడా హామీ ఇచ్చారు.అతని ప్రయత్నాలకు ప్రశంసలు మాత్రమే కాకుండా, డచ్ స్వచ్ఛంద సంస్థ జాబ్ ఆఫర్ చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాలుషితమైన నదిని నెలల తరబడి స్వతంత్రంగా శుభ్రం చేసిన యువకుడిగా అతన్ని ప్రశంసిస్తూ, నది ప్రక్షాళనకు ముందు, తర్వాత తీసిన చిత్రాలను డచ్ కంపెనీ ఫౌండర్, సీఈఓ ట్వీట్ చేశారు. అతని అంకితభావాన్ని చూసి ముగ్ధుడైన స్లాట్ వచ్చి మా దగ్గర పని చేయండి అంటూ బహిరంగంగా ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. A 20 year old Indian man, Surendra Singh Choudhry, known as “Bittu Tabahi,” has been cleaning the heavily polluted Ajnar River himself for months pic.twitter.com/U7N4BkItkf— non aesthetic things (@PicturesFoIder) September 4, 2026Come work for us @Surendr75950620— Boyan Slat (@BoyanSlat) September 4, 2026
లోహగఢ్ కోట.. కేతన్ హత్యలో మరో షాకింగ్ ట్విస్ట్
మహారాష్ట్రలోని పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘గుట్టు రట్టయితే గుండెల్లో గుబులు’ అన్నట్టుగా పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె సన్నిహితుడు చేతన్ చౌదరి అరెస్టు కాగా.. తాజాగా వారి కుట్రలో భాగమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రితేష్ హాంగే కూడా పోలీసులకు చిక్కాడు. దీంతో ఈ కేసులో అసలు కథ మరింత ఆసక్తికరంగా మారింది.మూడో నిందితుడు అరెస్ట్జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ను కొండపై నుంచి తోసి హత్య చేసిన కేసులో 22 ఏళ్ల రితేష్ హాంగేను పుణె రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రితేష్ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య మూడుకు చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రితేష్ హాంగే ప్రధాన నిందితుడు చేతన్ చౌదరికి స్నేహితుడు. కేతన్ హత్యకు సంబంధించిన కుట్రలో రితేష్ కూడా భాగస్వామిగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేతన్ను హత్య చేయాలన్న ప్లాన్ గురించి అతడికి ముందే తెలుసునని పోలీసులు వెల్లడించారు.ముందు పెళ్లిని అడ్డుకోవాలనుకున్నారు..‘అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి’ అన్నట్టుగా ఈ హత్య వెనుక మొదట మరో ప్లాన్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేతన్, సియా గోయల్ వివాహానికి సిద్ధమవుతున్న సమయంలో.. పెళ్లిని అడ్డుకునేందుకు సియా, చేతన్ తొలుత కేతన్ను తీవ్రంగా గాయపరచాలని భావించినట్లు తెలుస్తోంది. కేతన్ చేతులు, కాళ్లు విరగ్గొట్టి అతడిని గాయపరిస్తే పెళ్లి వాయిదా పడుతుందని వారు భావించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ ప్లాన్ ప్రమాదకరంగా మారొచ్చని భావించిన ఇద్దరూ.. చివరకు ఏకంగా కేతన్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుట్ర గురించి రితేష్కు కూడా ముందుగానే తెలుసునని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న కంగనా.. పక్కా స్కెచ్.. కేతన్ మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ‘పాము చావాలి.. కర్ర విరగకూడదు’ అన్నట్టుగా హత్య చేసినా తమపై అనుమానం రాకుండా ఉండేందుకు పలు మార్గాలను అన్వేషించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ఇంటర్నెట్లో సమాచారం వెతికినట్లు, సస్పెన్స్ సినిమాలను కూడా చూసినట్లు పోలీసులు తెలిపారు. టైగర్ పాయింట్, విసాపూర్ కోటతో పాటు పూణే పరిసరాల్లోని మరికొన్ని కోటలను నిందితులు పరిశీలించారు. ఆయా ప్రాంతాల ఫొటోలను పరస్పరం పంపించుకుని.. కేతన్ మరణాన్ని ప్రమాదంగా చూపించేందుకు ఏ ప్రదేశం అనువుగా ఉంటుందో అంచనా వేశారు. చివరకు లోహగఢ్ కోటను ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.హత్య తర్వాత రితేష్కు ఫోన్..అనుకున్నట్టుగానే జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ను కొండపై నుంచి తోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం చేతన్.. తన స్నేహితుడు రితేష్కు ఫోన్ చేసి కేతన్ హత్యకు సంబంధించిన విషయాన్ని చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో రితేష్ పాత్రకు సంబంధించిన ఆధారాలు లభించడంతో అతడిని అరెస్ట్ చేసినట్లు పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేతన్ హత్యకు ముందు జరిగిన కుట్ర, ముగ్గురు నిందితుల మధ్య జరిగిన సంభాషణలు, హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు రితేష్ను పోలీసులు విచారిస్తున్నారు.
స్వతంత్రకు ఒకరోజు పోలీస్ కస్టడీ
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్తో శుక్రవారం అరెస్ట్ అయిన హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్ స్వతంత్ర భారద్వాజ్కు ఢిల్లీ కోర్టు శనివారం ఒకరోజు పోలీస్ కస్టడీ విధించింది. పోలీసులు స్వతంత్ర భరద్వాజ్ను శనివారం మధ్యాహ్నం ఢిల్లీ అదనపు సెషన్స్ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ లలేర్ నివాసంలో హాజరుపరిచారు. స్వతంత్ర తరఫున వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరైన న్యాయవాది తన వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి అతడికి ఒక రోజు పోలీస్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చారు. వాస్తవానికి ఇతడిని పాటియాలా హౌస్కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండింది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీపై కాక్రోచ్ జనతాపార్టీ నేతృత్వంలో జూలై 20న ఆందోళన సందర్భంగా ఓ మైనర్ బాలిక తండ్రి సంజయ్పై దాడి చేశారన్న ఆరోపణలపై భారద్వాజ్పై కేసు నమోదైంది. దీంతోపాటు అతడిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద, క్రిమినల్ బెదిరింపులకు పాల్పడటంపై కూడా కేసులు నమోదైనట్లు ఎఫ్ఐఆర్ ద్వారా తెలిసింది. అంతేకాకుండా పోక్సో చట్టం కింద మరో కేసు నమోదైంది.
ఎన్ఆర్ఐ
దుబాయ్లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా దుబాయ్లోని బిన్ సనత్ లేబర్ క్యాంప్, సోనాపూర్లో అన్నదాన సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గల్ఫ్ కో-కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా, ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్ రెడ్డి, ప్రసన్న సోమిరెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రాజా రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, కోటేశ్వర రెడ్డి, నరేష్ చౌదరి, జనార్దన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, రమణ రెడ్డి , ఇషాల్ , వెంకట్ రెడ్డి, షరీఫ్, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలో ప్రియతమ మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా..ఆయన చేసిన సేవలు, అమలు చేసిన కార్యక్రమాలు నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయన్నారు. అంతేగాదు వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ, భవిష్యత్తులో కూడా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు గల్ఫ్ కో-కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా.(చదవండి: మరపురాని మహానేత.. జలప్రదాత వైఎస్సార్)
అమెరికాలో ఘనంగా మనబడి తెలుగుకు పరుగు రన్4తెలుగు 2026
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని, పురస్కరించుకొని నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘తెలుగుకు పరుగు – Run4Telugu 2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది.వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, జార్జియా, ఇల్లినాయిస్, మిషిగన్, మిన్నెసోటా, మిస్సోరీ, న్యూ జెర్సీ, ఒక్లాహోమా, టెన్నెస్సీ, టెక్సాస్, వర్జీనియా తదితర రాష్ట్రాలలోని సుమారు 25 ప్రాంతాల నుంచి మూడువేల మందికి పైగా తెలుగు భాషాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశాన్ని సమాజానికి అందించాలనే లక్ష్యంతో మనబడి భాషా సైనికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ‘తెలుగుకు పరుగు’లో ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకులు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ, మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతుల గురించి వివరించారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను తెలియజేస్తూ, తెలుగు భాషను భావితరాలకు అందించడం ప్రతి తెలుగు కుటుంబం బాధ్యత అని గుర్తుచేశారు. అమెరికా, కెనడాతో పాటు వివిధ దేశాలలో మనబడి నిర్వహిస్తున్న తెలుగు తరగతులు, కార్యక్రమాల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన మనబడి అధ్యక్షులు, కులపతి చమర్తి రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగుకు పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు శుభాభినందనలు తెలిపారు. Run4Telugu పోటీలను రెండు విభాగాలలో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి మెడల్స్తో సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనబడి ధృవపత్రాలను అందజేశారు. ఆయా ప్రాంతాలలో పాల్గొన్న వారికి అల్పాహార విందును కూడా ఏర్పాటు చేశారు. అంతేగాదు “తెలుగు నేర్చుకుందాం… తెలుగు మాట్లాడుదాం… తెలుగు భాషను భావితరాలకు అందిద్దాం” అనే మనబడి సందేశాన్ని అమెరికా వ్యాప్తంగా ధ్వనింపచేసేలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. (చదవండి: స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు)
లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?
ఆరంకెల జీతం, హెచ్1-బీ వీసా కలలతో అమెరికాకు ఎగిరిపోయే భారతీయులకు ఈ కల సాకారమైనాక ఇక లైఫ్ సెట్ అనుకుంటారు. కానీ ఒక భారత సంతతి మహిళ అలా అనుకోలేదు. వాటన్నింటినీ వదులుకుని మాతృదేశానికి తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకో తెలుసా?'బిజినెస్ ఇన్సైడర్' అందించిన వివరాల ప్రకారం 28 ఏళ్ల దిశా లాంబా, 2021లో న్యూయార్క్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికాకు వెళ్లింది. అక్కడ విజయ వంతమైన కెరీర్ను నిర్మించుకుని, 2024లో CVS హెల్త్లో డేటా సైంటిస్ట్ ఉద్యోగాన్ని పొందింది. ఆరెంకల భారీ వేతనంతో కూడిన ఉద్యోగం. H-1B వీసా లాటరీ ప్రక్రియలోనూ విజయం సాధించింది. కానీ తన కుటుంబానికి దగ్గరగా ఉండటంతో పాటు,మారుతున్న పరిస్థితుల రీత్యా వాటన్నింటినీ వదులుకోవాలని నిర్ణయించుకుంది.ఒంటరితనం, అమెరికా సమయానికి అనుగుణంగా ఇండియాలోని తల్లిదండ్రులతో మాట్లాడాల్సి రావడం ఆమెను మానసికంగా ఇబ్బందికి గురి చేసినట్టు ఆమె వెల్లడించారు. H-1B వీసా పొందినప్పటికీ ఉద్యోగం మారడం, ఇతర ఆదాయ మార్గాలు (Side hustles) వెతుక్కోవడం, ప్రయాణాలు లేదా కెరీర్ గ్యాప్ తీసుకోవడం H-1B నిబంధనల వల్ల చాలా కష్టంతో కూడుకున్నవి కావడం కూడా ఆమె నిర్ణయానికి ఊతమిచ్చాయి.ఇదీ చదవండి: రూ. 15 లక్షల కారు, 70 తులాల గోల్డ్ : అయినా కట్నదాహానికి టీచర్ భువనేశ్వరి ఆహుతి2026 మేలో ఉద్యోగానికి రాజీనామా చేసి గురుగ్రామ్లోని తన తల్లిదండ్రుల వద్దకు తిరిగొచ్చేశారు. ప్రస్తుతం ఒక చిన్న కెరీర్ బ్రేక్ తీసుకుని, భారతదేశంలోనే కొత్త అవకాశాలు లేదా స్వంతంగా వ్యాపారం ప్రారంభించే యోచనలో ఉన్నారు. H-1B వీసాలపై కొత్త ప్రతిపాదనలప్రకారం, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసాలకు సంబంధించి కొన్ని కఠినమైన మార్పులను ప్రతిపాదించింది: H-1B వీసా ఫీజు పెంచే ప్రతిపాదనతోపాటు. గ్రేస్ పీరియడ్ రద్దచేయాలని భావిస్తోంది. దీంతో ఉద్యోగం కోల్పోయిన H-1B హోల్డర్లకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగిస్తారు.అలాగే H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకిచ్చే (H-4 వీసా) ఇచ్చే పని అనుమతులను రద్దు చేసే ప్రతిపాదన కూడా ఉంది. ఈ నిబంధనలు ఎక్కువ మంది భారతీయ కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
90 ఏళ్ల వయసులో మాతృదేశానికి పయనం.. డాలస్లో ఘన సత్కారం!
డాలస్, టెక్సస్: అనేక దశాబ్దాలుగా పార్క్ల్యాండ్ హాస్పిటల్, డాలస్ కౌంటీ ఫ్యామిలీ కోర్ట్ సర్వీసెస్, డాలస్ కౌంటీ చైల్డ్ వెల్ఫేర్ తదితర సంస్థల ద్వారా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బాలల సంక్షేమం, కుటుంబ న్యాయస్థాన సేవలు, గృహహింస, వృద్ధుల సంక్షేమం, డయాలసిస్ సేవలు వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందించిన ప్రముఖ సామాజిక సేవకురాలు డా. భానుమతి ఇవటూరికి డాలస్లో ఘన సత్కారం లభించింది. 90 ఏళ్ల వయస్సులో అమెరికాలో 50 సంవత్సరాలకు పైగా జీవితం గడిపిన ఆమె ఇకపై మాతృదేశంలో జీవించేందుకు పయనమవుతున్న సందర్భంగా ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, షబ్నం మాడ్గిల్, తైయాబ్ కుండావాల, సుష్మా మల్హోత్రా, సత్యన్ కళ్యాణ్ దుర్గ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (TANTEX) అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, శ్రీధర్ కోడెల, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, రామకృష్ణ నూనె; అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఉత్తరాధ్యక్షులు సతీష్ రెడ్డి; నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (NATS) పూర్వాధ్యక్షులు బాపు నూతి; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, TANA బోర్డు పూర్వ కార్యదర్శి మురళి వెన్నం; కమ్యూనిటీ నాయకులు ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, డా. జగదీశ్వరన్ పుడూర్ తదితరులు డా. భానుమతి ఇవటూరిని జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించారు.సభాధ్యక్షత వహించిన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “సమస్యకు–పరిష్కారానికి మధ్య, వివాదానికి–అవగాహనకు మధ్య, గందరగోళానికి–స్పష్టతకు మధ్య, నిరాశకు–ఆశకు మధ్య డా. భానుమతి ఒక వెలుగుదారిగా నిలిచారు. అమెరికాలో కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం అంత సులభమైన విషయం కాదు. తల్లిదండ్రులు తమతో పాటు మాతృభూమి విలువలు, సంప్రదాయాలు, ఆశలు, ఆకాంక్షలను తీసుకువస్తారు. అయితే వారి పిల్లలు మాత్రం పూర్తిగా భిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో పెరుగుతారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, పిల్లలపై ఉన్న ఆశలు అపార్థాలకు, చివరకు కుటుంబ కలహాలకు దారితీస్తాయి. ఈ సమస్యను ఎంతో లోతుగా అర్థం చేసుకున్న భానుమతి.. తల్లిదండ్రుల ఆశలు, అంచనాల కారణంగా పిల్లలనే దూరం చేసుకునే పరిస్థితి రాకూడదని చెబుతారు” అన్నారు.“జీవితంలో విజయం అంటే కేవలం డిగ్రీలు, పదవులు, బిరుదులు కాదు. మన వల్ల ఎన్ని కుటుంబాలకు సహాయం అందింది, ఎంతమంది జీవితాలు మెరుగుపడ్డాయి అనేదే నిజమైన విజయానికి కొలమానం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ డా. భానుమతి ఇవటూరి జీవితం. 50 సంవత్సరాలకు పైగా అమెరికాలో జీవితం గడిపి, తొమ్మిది పదులు దాటిన వయస్సులో మాతృదేశంలో తన భవిష్యత్ జీవితాన్ని గడపాలనుకోవడం హర్షనీయమైన విషయం. ఆమె మిగిలిన జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని డా. ప్రసాద్ తోటకూర అన్నారు.వివిధ సందర్భాల్లో డా. భానుమతి ఇవటూరితో సన్నిహితంగా పనిచేసిన ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, డా. కృష్ణబాబు చుండూరి, డా. కిశోర్ సుంకర, రాధికా కోడెల, రామకృష్ణ నూనె, డోరిస్ మార్షల్, స్యూ యాన్ రూత్, అవ్యం రమణి తదితరులు భానుమతి సామాజిక సేవలను కొనియాడారు.డా. భానుమతి ఇవటూరి మాట్లాడుతూ.. “అతి తక్కువ సమయంలో, వారాంతం కానప్పటికీ, ఇర్వింగ్లోని మైత్రీ ఇండియన్ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశానికి దాదాపు వంద మందికి పైగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు నా జీవితంలో ఒక మధురమైన రోజుగా మిగిలిపోతుంది. నా సుదీర్ఘ సామాజిక సేవా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు.ఇవీ చదవండి: 8 ఏళ్లకే చెస్లో సంచలనం.. 9/9 గెలిచిన తెలుగు బాలిక!
క్రైమ్
సీన్ రీక్రియేట్ చేయమంటే ఇలా చేశారేంటి?
గాంధీనగర్ : గుజరాత్ భావ్నగర్ ఎస్టీ బస్టాండ్లో జరిగిన హత్య కేసుకు సంబంధించి, పోలీసులు నిందితుడితో కలిసి క్రైమ్ సీన్ను రీకన్స్ట్రక్ట్ చేశారు. అయితే, ఈ సందర్భంగా చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది పోలీసుల వివరాల మేరకు.. భావ్నగర్ ఎస్టీ బస్ స్టాండ్ ప్రాంతంలో ఫైసల్ (అలియాస్ ఖాట్కి లఖాని), కాజల్బెన్ గత ఏడేళ్లుగా కలిసి నివసిస్తున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. వివాహేతర సంబంధంందనే అనుమానంతో తలెత్తిన గొడవ కారణంగా ఫైసల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. బస్ స్టాండ్లోనే కాజల్బెన్ను కిందపడేసి, తలపై, శరీరంపై తీవ్రంగా కాళ్లతో తన్నుతూ, పిడిగుద్దులతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీన్ని అడ్డుకోబోయిన రవి అనే వ్యక్తిపై కూడా ఫైసల్ దాడి చేసి గాయపరిచాడు.ఈ భయానక దాడి బస్ స్టాండ్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. చుట్టూ జనం చూస్తున్నప్పటికీ దాదాపు నిమిషాల తరబడి ఈ దాడి కొనసాగడం గమనార్హం. తీవ్ర గాయాలపాలైన కాజల్బెన్ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సెప్టెంబర్ 4న ఆమె మృతి చెందింది.మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫైసల్పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడికి ఇదివరకే దోపిడీలు, శారీరక దాడులకు సంబంధించిన క్రిమినల్ రికార్డు కూడా ఉంది. ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడు ఫైసల్ను నేరుగా భావ్నగర్ ఎస్టీ బస్ స్టాండ్లోని ఘటనా స్థలానికి తీసుకువచ్చారు. అతను ఏ విధంగా మహిళపై దాడికి పాల్పడ్డాడో పోలీసులు అక్కడే పూసగుచ్చినట్లు రికన్స్ట్రక్ట్ చేసి పరిశీలించారు. ఈ క్రమంలో బస్ స్టాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడిని పోలీసులు చుట్టుముట్టి అక్కడికి తీసుకెళ్లగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంఘటన స్థలంలో నిందితుడిని పోలీసులు దండించిన తీరు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, వైద్యం, పోస్ట్మార్టం నివేదికల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు #BREAKING Bhavnagar Crime IncidentFaisal Khan was arrested by Gujarat Police after allegedly beating his live-in partner, Kajal Baraiya, to death in Bhavnagar. The assault, captured on CCTV, also injured her brother.#Bhavnagar #GujaratPolice @GujaratPolice @SPBhavnagar pic.twitter.com/VRyTmxTnZr— jarvis ☠️ (@Vishii14) September 5, 2026
నడిరోడ్డుపై భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్?
బనశంకరి: బెంగళూరులో నడిరోడ్డున శనివారం తెల్లవారుజామున దంపతులను అడ్డగించి దోచుకున్న దుండగులు.. అంతటితో ఆగకుండా భర్త ఎదురుగా భార్యపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన పులకేశినగర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఓ దంపతులు స్నేహితుని ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆటోలో తిరి వెళ్తున్నారు. భారతీనగర వద్ద ఐటీసీ ఫ్లై ఓవర్ పైన వెళుతుండగా బైకులలో వచ్చిన ఐదారుమంది అల్లరి మూకలు కత్తులతో ఆటోడ్రైవరు, దంపతులను బెదిరించి మొబైల్, బంగారు గొలుసు, పర్సు లాక్కున్నారు. మహిళను ఆటోలో నుంచి కిందికి లాగి భర్త ఎదురుగా ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అల్లరిమూకలు ఉడాయించారు. భార్యాభర్తలు నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలు ఆధారంగా దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.చదవండి: రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి
పిచ్చికుక్క కాటుకు రిన్తో శుభ్రం చేస్తారా?
అమలాపురం టౌన్: అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన కొందరు చిన్నారులు పిచ్చి కుక్క దాడిలో గాయపడి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ శనివారం పార్టీ నాయకులతో కలసి వచ్చి పరామర్శించారు. ఆ సమయంలో పిచ్చి కుక్క కరిచిన పిల్లల గాయాలకు హైడ్రోజన్ ఫైరాక్సైడ్, స్పిరిట్, బెటాడిన్, నార్మల్ సైలన్ వంటి వాటితో కాకుండా సరైన వైద్య విధానాలు పాటించకుండా చికిత్స చేస్తున్న తీరను చూసి డాక్టర్ శ్రీకాంత్ వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయాలను దుస్తులు ఉతికే రిన్ సబ్బుతో శుభ్రపరిచే విధానాన్ని ఆయన తప్పు పట్టారు. కుక్క కరిచిన బాధిత చిన్నారుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య నిబంధనల ప్రకారం బాధితులకు మెరుగైన, నాణ్యమైన చికిత్స అందించాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడడంపై ఆయన మండిపడ్డారు. చిన్నారులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుంటే స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు పట్టదా...? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రిన్ సబ్బుతో వైద్యం చేస్తున్న తీరును, వైద్యులు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని డాక్టర్ శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు.
చిన్న పిల్లలు ఉన్నారన్నా.. నన్ను బతికించండి!
కర్నూలు: ఓ వైపు రక్తమోడుతున్నా ఇంటి వద్ద ఉన్న భార్యా పిల్లలను గుర్తు చేసుకుంటూ.. ‘అన్నా.. నన్ను రక్షించండి.. నాకు చిన్న పిల్లలన్నా’ అంటూ విలపించాడు. కదలలేనిస్థితిలో ఇరుక్కుపోయినా ‘మా ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడాలా’ అంటూ విలవిలలాడాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ క్షతగాత్రుని వేదన అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై మంగంపల్లె స్టేజీ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వాహన డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు ఐరన్ మెటీరియల్ లోడ్తో వెళ్తున్న లారీ మంగంపల్లె స్టేజ్ వద్ద టైర్ బరస్ట్ అయ్యి రహదారికి కుడి వైపు డివైడర్ పక్కనే నిలిచిపోయింది. లారీ డ్రైవర్ కిందకు దిగి పరిస్థితిని చూసి 1032 ద్వారా సమాచారమిచ్చాడు. అయితే నిమిషాల వ్యవధిలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఐచర్ వాహ నం లారీని ఢీకొంది. దీంతో ఐచర్ వాహన డ్రైవర్ తాడిపత్రికి చెందిన నాగేంద్ర (35) డ్రైవింగ్ సీటులోనే ఇరుక్కుపోయాడు. వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న హైవే పోలీసులు ఆనంద్, శివ, హైవే అంబులెన్స్ సిబ్బంది, క్రేన్ సిబ్బంది ఇరుక్కుపోయిన డ్రైవర్ను దాదాపు గంటపాటు శ్రమించి బయటకు తీశారు. ఆ సమయంలో డ్రైవర్ ‘త్వరగా తీయండన్నా.. తట్టుకోలేకపోతున్నాను.. నాకు చిన్న పిల్లలన్నా.. మా ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడాలి’ అంటూనే సృహ కోల్పోతుండడం అక్కడి వారి హృదయాలను కలచివేసింది. అతి కష్టం మీద బయటకు తీయగా అప్పటికే తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. చదవండి: రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి
వీడియోలు
ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్.. ఆత్మహత్యాయత్నం!
సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు
అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో
ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?
శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..
టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..
SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!
10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!
DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

