సెట్స్లో కుప్పకూలిన సల్మాన్ ఖాన్.. ఆరోగ్యంపై క్లారిటీ
హిందీ బిగ్ బాస్ తాజా సీజన్ ‘వీకెండ్ కా వార్’ ప్రోమో సల్మాన్ ఖాన్ అభిమానులను ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది. ఆ ప్రోమోలో సల్మాన్ ఛాతి నొప్పితో బాధపడుతున్నట్లు, నీళ్లు అడుగుతూ డాక్టర్ను పిలవాలని చెప్పినట్లు కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.అయితే, ఈ ఘటనపై సల్మాన్ ఖాన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అసలు తన ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేదని, బిగ్ బాస్ ప్రోమోను కట్ చేసిన విధానం వల్లే ఈ అపార్థం ఏర్పడిందని తెలిపారు. బిగ్ బాస్ హౌస్మేట్ క్వాజీ తౌకీర్ చేసిన నాటకం వల్ల ఇతరులపై ఎలాంటి ప్రభావం పడుతుందో అతడికి అర్థమయ్యేలా చెప్పేందుకే తాను అలా నటించినట్లు వివరించారు.ప్రోమో కట్ చేసిన తీరు వల్ల దానిని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. మేకర్స్ తరఫున అందరికీ సల్మాన్ క్షమాపణలు చెప్తున్నానని అన్నాడు. తర్వాత మేకర్స్ జరిగిన పూర్తి విషయాన్ని చూపించేలా ప్రోమోను కూడా సవరించారని సల్మాన్ తెలిపారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
జింబాబ్వే ప్లేయర్ ప్రపంచ రికార్డు.. వన్డే క్రికెట్ చరిత్రలోనే
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే వెటరన్ బ్యాటర్, మాజీ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ అద్భుత హాఫ్ సెంచరీతో రాణించాడు. ఐదో స్థానంలో మైదానంలోకి దిగిన ఎర్విన్ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. మొత్తంగా 79 బంతుల్లో 59 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ అద్భుత ఇన్నింగ్స్తో ఎర్విన్ వన్డే క్రికెట్లో ఒక ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న జట్ల తరఫున వన్డేల్లో హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఎర్విన్ చరిత్ర సృష్టించాడు. 41 సంవత్సరాల 32 రోజుల వయస్సులో ఎర్విన్ ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ సీనియర్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ పేరిట ఉండేది. నబీ 40 ఏళ్ల 286 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, తాజాగా ఎర్విన్ దానిని అధిగమించాడు.వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కులు వీరేక్రెగ్ ఎర్విన్ (జింబాబ్వే): 41 ఏళ్ల 32 రోజులు (వర్సెస్ ఆస్ట్రేలియా, 2026)మహ్మద్ నబీ (అఫ్గానిస్థాన్): 40 ఏళ్ల 286 రోజులు (వర్సెస్ బంగ్లాదేశ్, 2025)మిస్బా ఉల్ హక్ (పాకిస్థాన్): 40 ఏళ్ల 283 రోజులు (వర్సెస్ దక్షిణాఫ్రికా, 2015)జియోఫ్రీ బాయ్కాట్ (ఇంగ్లండ్): 40 ఏళ్ల 226 రోజులు (వర్సెస్ ఆస్ట్రేలియా, 1981)క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్): 40 ఏళ్ల 155 రోజులు (వర్సెస్ శ్రీలంక, 1985)చరిత్రలో తొలిసారి!ఈ మ్యాచ్లో ఎర్విన్ రికార్డుతో పాటు మరొక అరుదైన రికార్డు నమోదైంది. జింబాబ్వే తుది జట్టులో క్రెగ్ ఎర్విన్, సికందర్ రజా, బ్రెండన్ టేలర్, గ్రేమ్ క్రీమర్ రూపంలో ఏకంగా నలుగురు 40 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు బరిలోకి దిగారు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక జట్టు తరఫున ఒకే మ్యాచ్లో నలుగురు 40 ప్లస్ ఏళ్ల ప్లేయర్లు ఆడటం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.చదవండి: IND vs WI: విండీస్ టీమ్లో మరో పూరన్.. ఈ కొత్త 'పూరన్' మామూలోడు కాదు!
26 ఏళ్ల ఎమ్మెల్యే మైథిలీపై ట్రోలింగ్.. వాళ్లకు గడ్డి పెట్టిన కంగనా రనౌత్
బిహార్లోని అలీనగర్ ఎమ్మెల్యే, జానపద గాయని మైథిలీ ఠాకూర్ (26) ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో కనిపించడంతో సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందిస్తూ మైథిలీకి మద్దతుగా నిలిచారు.మైథిలీ ఠాకూర్ 2025లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం బిహార్లోని అలీనగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల పంచాయత్ ఆజ్తక్ కార్యక్రమంలో తన నియోజకవర్గంలో చేస్తున్న పనుల గురించి ఆమె మాట్లాడారు. ఇదే సమయంలో ఆమెపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు, ట్రోలింగ్ మొదలైంది.మైథిలీ సుమారు రూ.13 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారులో కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతే ఆమె ఈ కారును కొనుగోలు చేశారంటూ పలువురు పోస్టులు చేశారు. అయితే ఆ కారుకు యజమాని ఎవరో మాత్రం ధ్రువీకరించలేదు.ఎన్నికల అఫిడవిట్లో మైతిలీ ఒక హోండా యాక్టివా స్కూటర్, రూ.3 నికర ఆస్తులను ప్రకటించారు. దీంతో కొన్ని నెలల్లోనే రూ.13 కోట్ల కారును ఎలా కొనుగోలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు, ట్రోలింగ్ మొదలయ్యాయి. అయితే కారును ఆమె కొనుగోలు చేశారనే విషయాన్ని ఏ ప్రముఖ సంస్థ కూడా నిర్ధారించలేదు.ఈ ట్రోలింగ్పై కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించారు. “మేము ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. కానీ మాకు ఉద్యోగం, వృత్తి, జీవితం, ప్రజాదరణ కూడా ఉన్నాయి” అని ఆమె పేర్కొన్నారు. ప్రజల డబ్బును వాడాలన్న ఆసక్తి తమకు లేదని, అయితే రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పుడూ పేదరికంలోనే, ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉండాలని ఆశించడం తర్కరహితమని అన్నారు.మైథిలీపై జరుగుతోన్న చర్చలో ప్రధానంగా కారు యాజమాన్యం, ఆమె ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తుల వివరాలపైనే ప్రశ్నలు కొనసాగుతున్నాయి. కారు యజమాని గురించి స్పష్టత వచ్చే వరకు ఈ అంశంపై వస్తున్న వాదనలను నిర్ధారిత వాస్తవాలుగా చూడలేం.Bihar MLA Maithili Thakur, who declared a Honda Activa and ₹3 net worth in her election affidavit, arrived in a ₹13 crore Rolls Royce. Ownership remains unconfirmed. https://t.co/QxgulIqrzq— 🚨Indian Gems (@IndianGems_) September 20, 2026
సినిమా రేంజ్లో.. బస్సు హైజాక్!
ఇంగ్లాండ్లోని టెల్ఫోర్డ్లో భారత సంతతికి చెందిన సిక్కు బస్సు డ్రైవర్పై యెమెన్ దేశస్థుడు దాడి చేశాడు. దాడి చేయడమే కాదు.. బస్సును కూడా దొంగిలించాడు. ఆ బస్సును రాంగ్ రూట్లో నడుపుతూ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అవ్వగా.. ఆ వీడియో వైరల్గా మారింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.డ్రైవర్ దగ్గరకు వెళ్లిన నిందితుడు.. ఆయన గడ్డం పట్టుకుని లాగాడు. గొడవ వద్దని చెబుతున్నా ఆ వ్యక్తి వినలేదు. తన తలను డ్రైవర్ తలతో ఢీకొట్టినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ దాడి ఘటనను ఓ మహిళ వీడియో తీసింది. అసలు ఏం చేస్తున్నావంటూ అంటూ దుండగుడిని ఆ మహిళ ప్రశ్నిచింది. డ్రైవర్పై దాడి చేయొద్దంటూ ఆమె చెబుతున్నా దుండగుడు పట్టించుకోకుండా దాడికి పాల్పడ్డాడు. దీంతో డ్రైవర్.. పోలీసులకు ఫోన్ చేయాలని ఆ మహిళను కోరాడు. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితుడు బస్సులోని వస్తువులను కూడా ధ్వంసం చేశాడు.డ్రైవర్ క్యాబిన్లోని లైట్లా కనిపించే ఒక వస్తువును తీసి.. దాంతో సిక్కు డ్రైవర్పై దాడి చేస్తానని బెదిరించాడు. బస్సును తనకు ఇవ్వాలని డ్రైవర్ను పదేపదే కోరాడు. చివరకు డ్రైవర్ను బస్సు నుంచి బయటకు తోసి.. తానే డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. బస్సు నడుపుకుంటూ వెళ్లాడు. ఆ బస్సును రాంగ్రూట్లో నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు.వీడియోలో ఓ మహిళ భయంతో ఏడుస్తూ.. ప్రజలను పక్కకు తప్పుకోవాలని పదేపదే కోరుతూ.. ‘ఓ మై గాడ్’ అంటూ అరుస్తున్నట్లు వినిపిస్తుంది. ఘటన జరుగుతున్న సమయంలో ఆమె బస్సు వెనుక పరుగెత్తుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకుని దుండగుడిని అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.A Sikh bus driver was assaulted by a man in his 20s. The accused attacked the driver, pulled his beard and forced him out of the bus and hijacked the bus.The incident took place on Court Street, telford near to London. The police have arrested the suspect. #Uk #Telford pic.twitter.com/s9KBZ3BxqA— Ravinder Singh (@ravindraJourno) September 19, 2026ఇదీ చదవండి: బ్రిడ్జిపై నుంచి పడిన బీఎండబ్ల్యూ కారు
మార్నింగ్ ఓ పది, మధ్యాహ్నం ఓ ఇరవై, నైట్ ఓ నలభై లైకులొచ్చేట్లు చూడండి! నిద్ర దానంతటికదే తన్నుకుని వస్తుంది!!
తడారి.. ఎడారి
ఏఐ.. బుక్స్ భోంచేస్తోంది
అసలు నకిలీ
ఒంటరిగా తింటే.. తంటానే!
కావాల్సింది... 'ఇంటిగ్రేటివ్ ఇంటెలిజెన్స్'!
ఎమోషన్... థ్రిల్
సెట్స్లో కుప్పకూలిన సల్మాన్ ఖాన్.. ఆరోగ్యంపై క్లారిటీ
జపాన్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు
రూ.13 కోట్ల కారులో వచ్చిన 26 ఏళ్ల మహిళా ఎమ్మెల్యే
సాక్షి కార్టూన్ 19-09-2026
అప్పు.. అప్పుతోనే చెల్లు! ఇదే ‘రిచ్ డాడ్’ సీక్రెట్!!
అవన్నీ ‘కొవ్వెక్కిన’ మాటలు! ఇప్పుడు తేలిపోయిందిగా!!
‘ఇరుముడి’.. ఇంకాస్త ఆగితే బాగుండేది!
వినాయక నిమజ్జనంలో దిల్ రాజు సతీమణి మాస్ డ్యాన్స్..వీడియో వైరల్
నేను ఎదుర్కొన్న కఠినమైన భారత బ్యాటర్ అతడే: కమిన్స్
బిగ్బాస్ తొలి కెప్టెన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ
భారత్కు భారీ ముప్పు.. 180 మంది శాస్త్రవేత్తల హెచ్చరిక
డబ్బు సమస్యలు తగ్గాలంటే?: కియోసాకి చెప్పిన సీక్రెట్
క్లాస్ పీకిన సుప్రీంకోర్టు.. వెనక్కి తగ్గని విజయ్ సర్కార్
ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలు
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
పుల్లను తీపి చేసే... మిరాకిల్ ఫ్రూట్!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్.. డోంట్ మిస్
వచ్చేవారం.. బ్యాంక్ హాలిడేస్ ఇవే!
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
బీసీసీఐ కీలక నిర్ణయం.. 31 ఏళ్ల తర్వాత స్పెషల్ మ్యాచ్?
మార్నింగ్ ఓ పది, మధ్యాహ్నం ఓ ఇరవై, నైట్ ఓ నలభై లైకులొచ్చేట్లు చూడండి! నిద్ర దానంతటికదే తన్నుకుని వస్తుంది!!
తడారి.. ఎడారి
ఏఐ.. బుక్స్ భోంచేస్తోంది
అసలు నకిలీ
ఒంటరిగా తింటే.. తంటానే!
కావాల్సింది... 'ఇంటిగ్రేటివ్ ఇంటెలిజెన్స్'!
ఎమోషన్... థ్రిల్
సెట్స్లో కుప్పకూలిన సల్మాన్ ఖాన్.. ఆరోగ్యంపై క్లారిటీ
జపాన్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు
రూ.13 కోట్ల కారులో వచ్చిన 26 ఏళ్ల మహిళా ఎమ్మెల్యే
సాక్షి కార్టూన్ 19-09-2026
అప్పు.. అప్పుతోనే చెల్లు! ఇదే ‘రిచ్ డాడ్’ సీక్రెట్!!
అవన్నీ ‘కొవ్వెక్కిన’ మాటలు! ఇప్పుడు తేలిపోయిందిగా!!
‘ఇరుముడి’.. ఇంకాస్త ఆగితే బాగుండేది!
వినాయక నిమజ్జనంలో దిల్ రాజు సతీమణి మాస్ డ్యాన్స్..వీడియో వైరల్
నేను ఎదుర్కొన్న కఠినమైన భారత బ్యాటర్ అతడే: కమిన్స్
బిగ్బాస్ తొలి కెప్టెన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ
భారత్కు భారీ ముప్పు.. 180 మంది శాస్త్రవేత్తల హెచ్చరిక
డబ్బు సమస్యలు తగ్గాలంటే?: కియోసాకి చెప్పిన సీక్రెట్
క్లాస్ పీకిన సుప్రీంకోర్టు.. వెనక్కి తగ్గని విజయ్ సర్కార్
ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలు
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
పుల్లను తీపి చేసే... మిరాకిల్ ఫ్రూట్!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్.. డోంట్ మిస్
వచ్చేవారం.. బ్యాంక్ హాలిడేస్ ఇవే!
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
బీసీసీఐ కీలక నిర్ణయం.. 31 ఏళ్ల తర్వాత స్పెషల్ మ్యాచ్?
ఫొటోలు
హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)
నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్.. (ఫోటోలు)
మహా గణపతిని చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)
గణేశుడి సన్నిధిలో విజయ్ దేవరకొండ..(ఫోటోలు)
అందాల అషు.. (ఫోటోలు)
కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)
ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)
గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు
అమ్మతో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ఫారిన్ ట్రిప్.. (ఫోటోలు)
టాలీవుడ్ను ఊపేస్తున్న మలయాళ బ్యూటీ లేటెస్ట్ (ఫోటోలు)
సినిమా
మెగాస్టార్ విశ్వంభర.. రిలీజ్ డేట్ వైరల్..!
మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రాల్లో విశ్వంభర ఒకటి. ఈ ఏడాది సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కించిన ఈ సోషల్ ఫాంటసీ చిత్రం రిలీజ్ డేట్పై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. చిరు మరో మూవీ కాకా.. వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుండగా.. విశ్వంభరపై మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు.అయితే ఇటీవల ఓటీటీ డీల్ కుదిరినట్లు వార్తలొచ్చాయి. దీంతో మరోసారి విశ్వంభర రిలీజ్పై చర్చ మొదలైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో టాక్ వినిపిస్తోంది. ఇదే ఏడాదిలోనే విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానుందని లేటేస్ట్ టాక్ వైరలవుతోంది. వచ్చేనెల దసరాకు టైమ్ సరిపోనందున వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.అయితే దసరా తర్వాత నవంబర్లో విశ్వంభర రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఈ ఏడాదిలోనే విశ్వంభర చూసే ఛాన్స్ మెగా ఫ్యాన్స్కు దక్కనుంది. రాబోయే రోజుల్లోనైనా రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన వస్తుందేమో వేచి చూడాల్సిందే. కాగా..విశ్వంభరలో చిరు సరసన త్రిష హీరోయిన్గా చేసింది. ఈ చిత్రంలో సురభి, ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషించగా.. కీరవాణి సంగీతమందించారు.
ఏజ్ ఉంది.. ఓపిక ఉంది.. అన్ని నేనే చేశా : నాని
స్టార్ హీరోల సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తెరపై హీరో ఎంత రిస్క్ తీసుకున్నట్లు కనిపించినా.. వాస్తవానికి కొన్ని యాక్షన్ సీన్లను డూప్ల సాయంతో పూర్తి చేయడం సాధారణమే. ముఖ్యంగా ప్రమాదకరమైన ఫైట్లు, హై-రిస్క్ స్టంట్స్ ఉన్నప్పుడు హీరోలకు బదులుగా డూప్లు రంగంలోకి దిగుతుంటారు. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం తన సినిమాల విషయంలో ఈ పద్ధతికి వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడట. తనకు డూప్తో సన్నివేశాలు చేయించడం అసలు ఇష్టం లేదని చెబుతున్నాడు.నాని నటించిన భారీ మాస్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’ ఈ నెల 24న విడుదల కాబోతుంది.మూవీ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాలోని యాక్షన్ సీన్లను డూప్తో చేశారా? లేక మీరే చేశారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. నాని ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.‘నాకిప్పుడు ఏజ్ ఉంది.. ఓపిక ఉంది..అందుకే అన్నీ నేనే చేశాను. 50 ఏళ్లు దాటిన తర్వాత డూప్ని పెడతానేమో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం నా సినిమాల్లో డూప్ని పెట్టడం నాకు నచ్చదు. నా సినిమాలో ఒక్క డూప్ షాట్ కనిపించినా ఎంజాయ్ చేయలేను. సినిమా చూస్తున్నప్పుడు ఆ షాట్ నాది కాదనుకోండి.. సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూనే.. ఆ సీన్ రాగానే ‘అబ్బా.. డూప్ షాట్’ అనుకుంటా. దాన్ని నేను ఓన్ చేసుకోలేను. ప్రశంసలు కూడా తీసుకోలేను. ఎవరైనా ‘నాని బాగా చేశావ్’ అంటే.. ‘ఆ నాలుగు డూప్ షాట్లు తప్పితే’ అని నా మనసు నాకు చెబుతూనే ఉంటుంది. అందుకే చిన్న చిన్న లెగ్ షాట్స్ కూడా నేనే చేస్తా. ఒక్కోసారి అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలాంటి సీన్లను డూప్తో చేద్దామని అనుకుంటారు. కానీ నేను ముందుగానే వాళ్లకు చెబుతా.. నా సీన్లన్నీ నేనే చేస్తానని చెప్పి క్యారవ్యాన్లోకి వెళతా. అయితే ఈ కసి, ఓపిక మరో పదేళ్ల తర్వాత కూడా ఇలాగే ఉంటుందో లేదో చెప్పలేను. ప్రస్తుతానికి మాత్రం సినిమాల్లో డూప్ లేకుండా వీలైనంత వరకు అన్ని సన్నివేశాలను నేనే చేయాలని అనుకుంటున్నాను’అని నాని చెప్పుకొచ్చాడు.
ఏషియన్ గేమ్స్లో స్టార్ హీరో తనయుడు.. ఎవరో తెలుసా?
జపాన్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో స్టార్ హీరో కుమారుడు పోటీ పడుతున్నారు. ఈ విషయాన్ని హీరోనే స్వయంగా వెల్లడించారు. బాలీవుడ్ హీరో, నటుడు ఆర్ మాధవన్ తన కుమారుడు స్విమ్మింగ్లో పోటీ పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. ఆర్ మాధవన్ కుమారుడైన వేదాంత్.. స్విమ్మింగ్ ఫ్రీస్టైల్ విభాగంలో పోటీకి రెడీ అయ్యారు. కాగా.. ఆర్ మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ స్విమ్మింగ్ పోటీల్లో ఎన్నో రికార్డులు సాధించారు. పలు అంతర్జాతీయ ఈవెంట్స్లో ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించారు. మలేషియన్ ఓపెన్లో ఐదు స్వర్ణాలు, డానిష్ ఓపెన్లో ఒక స్వర్ణం, ఒక రజతం గెలుపొందారు. లాత్వియన్, థాయ్లాండ్ ఓపెన్ టోర్నీల్లో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. కామన్వెల్త్ యూత్ గేమ్స్లో ఐదో స్థానంలో నిలిచి తన టాలెంట్ నిరూపించుకున్నారు. భారత్ తరపున స్విమ్మింగ్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తోన్న యువ క్రీడాకారుల్లో వేదాంత్ ఉన్నారని ఒలింపిక్స్ అధికారిక వెబ్సైట్ ప్రశంసించింది.
చిరు లీక్స్.. కాకాలో మెగాస్టార్ రోల్ ఇదే..!
చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కాకా. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.అయితే మెగాస్టార్ అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించి లీక్స్ చేస్తుంటారు. గతంలో చాలాసార్లు టైటిల్స్ లీక్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తుంటారు. తాజాగా కాకాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని లీక్ చేశారు. ఈ మూవీలోని తన పాత్ర పేరును బయట పెట్టేశారు. ఇటీవల ఓ ఈవెంట్కు హాజరైన చిరంజీవి తన రోల్ వెల్లడించారు.కాకాలో తాను కదిరి కాళీదాస్ పాత్రలో కనిపించనున్నట్లు చిరు వెల్లడించారు. తన పక్కనే ఉన్న యాంకర్ స్రవంతిని చూపిస్తూ.. తన ఊరి పేరునే తన క్యారెక్టర్లో పెట్టుకున్నానని నవ్వుతూ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. కాకా… కదిరి కాళిదాస్ ❤️🔥❤️🔥❤️🔥#KAAKA - JAN 13th Sankranthi 2027🔥#KAAKAOnJan13 pic.twitter.com/tfaa5Nmadk— Kaaka (@KaakaMovie) September 20, 2026
క్రీడలు
క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లిన సింధు బృందం
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 (ప్రీక్వార్టర్స్) పోరులో భారత్ 3-0తో కజకిస్థాన్ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో భారత షట్లర్లు పి.వి. సింధు, ఉన్నతి హుడా, తన్వి శర్మలు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించారు. వీరి ధాటికి కజకిస్థాన్ ఆటగాళ్లు చేతులెత్తేశారు.మొదటి సింగిల్స్లో కామిలా స్మాగులోవాపై 21-7, 21-9 తేడాతో పి.వి. సింధు ఘనవిజయం సాధించింది. అనంతరం రెండో సింగిల్స్లో అలెస్సా కులేషోవాను 21-7, 21-10 తేడాతో ఉన్నతి హుడా ఓడించి భారత ఆధిక్యాన్ని 2-0కి పెంచింది. ఇక మూడో సింగిల్స్తో డయానా నమేనోవాపై 21-5, 21-10 తేడాతో తన్వి శర్మ విజయం సాధించి 3-0తో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. ఈ భారత త్రయం కేవలం 65 నిమిషాల్లోనే ప్రత్యర్థులను మట్టికరిపించడం విశేషం. మంగళవారం రోజున క్వార్టర్ఫైనల్లో ఆతిథ్య జపాన్ జట్టుతో భారత బృందం తలపడనుంది. మొదటి రౌండ్లో 'బై' పొందిన జపాన్, క్వార్టర్స్లో భారత జట్టుకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉంది.చదవండి: IND vs NZ: టీమిండియాకు కొత్త కెప్టెన్?
జట్టు ప్రకటన.. కెప్టెన్గా మహ్మద్ సిరాజ్
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లోని మొదటి రెండు మ్యాచ్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నాయకత్వం వహించనుండగా, సి.వి. మిలింద్ వైస్ కెప్టెన్గా (డిప్యూటీ) ఎంపికయ్యాడు. తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరత్ రెడ్డి వంటి ప్రముఖ ప్లేయర్లకు ఈ జట్టులో చోటు దక్కింది.ఎలైట్ గ్రూప్-బిలో ఉన్న హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్లో త్రిపురతో (అక్టోబర్ 11-14) తలపడనుంది. అనంతరం విజయనగరం వేదికగా జరిగే రెండో మ్యాచ్లో ఆంధ్ర జట్టును ఢీకొట్టనుంది. అయితే ఈ మొదటి రెండు మ్యాచ్లకు మాత్రమే సిరాజ్ అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత అతడు న్యూజిలాండ్ పర్యటన కోసం భారత జట్టుతో కలిసి వెళ్లనున్నాడు.మరోవైపు కల్నల్ సి.కె. నాయుడు ట్రోఫీలో రైల్వేస్ (అక్టోబర్ 12), ఉత్తరాఖండ్ (అక్టోబర్ 19) జట్లతో తలపడే అండర్-23 జట్టును కూడా హెసీఎ ప్రకటించింది. ఈ జట్టుకు పేరాల అమన్ రావు నాయకత్వం వహించనుండగా, ఆరోన్ జార్జ్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.హైదరాబాద్ రంజీ జట్టుమహ్మద్ సిరాజ్ (కెప్టెన్), సి.వి. మిలింద్ (వైస్-కెప్టెన్.), తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, రాహుల్ సింగ్, హిమ తేజ, రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), సాయి ప్రగ్నయ్ రెడ్డి (వికెట్ కీపర్), వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, రక్షన్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, రుతిక్ యాదవ్ మెండే, సాయి వికాస్ రెడ్డి.హైదరాబాద్ అండర్-23 జట్టుఅమన్రావు (కెప్టెన్), ఆరోన్ జార్జ్ (వైస్ కెప్టెన్), ఎ. అవనీష్ రావ్ (వికెట్ కీపర్), రాఘవ్ పట్టాపు, వాఫీ కచ్చి, ఎ. విఘ్నేష్ రెడ్డి, సుంకరి ధీరజ్ (వికెట్ కీపర్), ఆర్. సాయి శరణ్, ప్రణవ్ వర్మ, మురుగన్ అభిషేక్, కుష్ అగర్వాల్, నిశాంత్ మహోద్లీ, డినేష్. రాహుల్. కార్తికేయ.చదవండి: IND vs NZ: టీమిండియాకు కొత్త కెప్టెన్?
టీమిండియాకు కొత్త కెప్టెన్?
వెస్టిండీస్తో స్వదేశంలో వైట్-బాల్ సిరీస్ పూర్తి చేసుకున్న తర్వాత భారత క్రికెట్ జట్టు ఆల్-ఫార్మాట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య కివీస్ జట్టుతో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్లలో తలపడనుంది. అయితే వైట్-బాల్ మ్యాచ్లతో పోలిస్తే ఈ టూర్లో టెస్టు సిరీస్ భారత్కు అత్యంత కీలకం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఖచ్చితంగా కివీస్ను ఓడించాల్సి ఉంది. ఇందుకోసం టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది.చివరి వన్డే ముగిసిన కేవలం మూడు రోజులకే మొదటి టెస్టు ప్రారంభం కానుంది. దీంతో కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు టెస్టు జట్టుకు ఎంపికైన ముఖ్య ఆటగాళ్లు చివరి రెండు వన్డేల నుంచి విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరంతా వెల్లింగ్టన్లో జరిగే మొదటి టెస్టు కోసం ముందుగానే రెడ్-బాల్ ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. గిల్ గైర్హాజరీలో చివరి రెండు వన్డేలకు భారత జట్టు నాయకత్వ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్ చేపట్టే అవకాశం ఉంది. గిల్తో పాటు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ వంటి ప్లేయర్లు కివీస్తో చివరి రెండు వన్డేలకు దూరమయ్యే ఛాన్స్ ఉంది.టీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20: అక్టోబర్ 22 – క్రిస్ట్చర్చ్ (మధ్యాహ్నం 12:30) రెండో టీ20: అక్టోబర్ 24 – క్రిస్ట్చర్చ్ (మధ్యాహ్నం 12:30)మూడో టీ20: అక్టోబర్ 27- వెల్లింగ్టన్ (మధ్యాహ్నం 12:30)నాలుగో టీ20: అక్టోబర్ 30-ఆక్లాండ్ (మధ్యాహ్నం 12:30)ఐదో టీ20: నవంబర్ 1 – హామిల్టన్ (మధ్యాహ్నం 12:30)వన్డే సిరీస్ షెడ్యూల్తొలి వన్డే: నవంబర్ 4 – ఆక్లాండ్ (ఉదయం 7:30) రెండో వన్డే: నవంబర్ 7 – వెల్లింగ్టన్ ((ఉదయం 7:30)మూడువ వన్డే: నవంబర్ 10 - హామిల్టన్ (ఉదయం 7:30)నాలుగో వన్డే: నవంబర్ 13 : మౌంట్ మాంగనుయ్ -ఆక్లాండ్ (ఉదయం 7:30)5వ వన్డే: నవంబర్ 15 – మౌంట్ మాంగనుయ్ (బే ఓవల్) (ఉదయం 7:30)టెస్టు సిరీస్తొలి టెస్టు: నవంబర్ 19 - నవంబర్ 23 – వెల్లింగ్టన్ (ఉదయం 3:30)రెండో టెస్టు: నవంబర్ 27 - డిసెంబర్ 1 – హ్యాగ్లే ఓవల్, క్రిస్ట్చర్చ్ (ఉదయం 3:30)
టీమిండియా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. ఫాస్టెస్ట్ సెంచరీ!
ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్ పోటీల్లో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన రెండో సెమీఫైనల్లో 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసి తుది పోరుకు భారత్ అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ప్రీత్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగింది. షెఫాలీ 49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్ప్రీత్ కౌర్ (40), స్మృతి మంధాన(37) రాణించారు. అనంతరం ఈ భారీ లక్ష్య చేధనలో బంగ్లా జట్టు భారత బౌలర్ల ధాటికి 81 పరుగులకు కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్లో తుపాన్ సెంచరీతో విరుచుకుపడ్డ షెఫాలీ వర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.షెఫాలీ సాధించిన రికార్డులు ఇవే👉మహిళల ఆసియా గేమ్స్ క్రికెట్ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్గా షెఫాలీ రికార్డు సృష్టించింది.👉మహిళల టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన హర్మన్ప్రీత్ కౌర్ రికార్డును షాఫాలీ సమం చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ కూడా ఇంతకుముందు న్యూజిలాండ్పై 49 బంతుల్లోనే శతక్కొట్టింది.👉టీ20 సెంచరీ చేసిన మూడో భారత మహిళా బ్యాటర్గా షెఫాలీ నిలిచింది. ఆమె కంటే ముందు స్మృతి మంధాన (2 సెంచరీలు), హర్మన్ప్రీత్ కౌర్ ఈ ఫీట్ సాధించారు.👉మహిళల టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మార్కును అందుకున్న రెండో భారత బ్యాటర్గా షెఫాలీ రికార్డులకెక్కింది. ఓవరాల్గా ప్రపంచంలో ఐదో బ్యాటర్గా ఆమె నిలిచింది.👉మహిళల టీ20 క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా షాఫాలీ వర్మ (104) రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ ఫీట్ మంధాన(100) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో ఆమెను షెఫాలీ అధిగమించింది.👉మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఒక క్యాలెండర్ ఈయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా షెఫాలీ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది టీ20ల్లో షెఫాలీ వర్మ ఏకంగా 35 సిక్సర్లు బాదింది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు (32 సిక్సర్లు, 2024) పేరిట ఉండేది.👉ఒక క్యాలెండర్ ఇయర్లో భారత మహిళల జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా షెఫాలీ నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఆమె 815 పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు స్మృతి మంధాన (763 పరుగులు, 2024) పేరిట ఉండేది. తాజా నాక్తో మంధాన ఆల్టైమ్ రికార్డును షెఫాలీ బ్రేక్ చేసింది.చదవండి: టీమిండియాతో సిరీస్కు వెస్టిండీస్ జట్ల ప్రకటన
న్యూస్ పాడ్కాస్ట్
మద్యం అక్రమ కేసులో కొత్త నాటకం... సత్యప్రసాద్ చేత విజయవాడ ఏసీబీ కోర్టు ముందు తప్పుడు వాంగ్మూలం
తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేసిన హైకోర్టు... ఆయన పార్టీ ఫిరాయించినట్లు నిర్ధారణ
ఏపీలో ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్... సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఏపీలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో ‘పోలీసింగ్’... మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
డీఎస్సీ అక్రమాలపై పోరాటం ఉధృతం.. 21న భారీ నిరసనకు YSRCP పిలుపు..
డీఎస్సీ స్కాంకు బాధ్యత వహిస్తారా? లేదా?... చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
ఇదేనా నిష్పాక్షిక, పారదర్శక నియామకం... మెగా డీఎస్సీ వ్యవహారంపై చంద్రబాబు బాధ్యత వహించాలి... వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
ప్రపంచ పరిపాలనకు రూల్స్ మనమే రూపొందించాలి.... బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
బిజినెస్
జియో రీచార్జ్ ప్లాన్: ఒక్కసారి చేస్తే 3 నెలలు ఫుల్ బెనిఫిట్స్!
దేశంలోని టాప్ టెలికమ్ ఆపరేటర్లలో ఒకటైన రిలయన్స్ జియో తమ అన్ని వర్గాల కస్టమర్లకు అవసరమైన అనేక రకాల ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. పదేపదే రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని తగ్గించుకోవాలనుకునే కస్టమర్ల కోసం రూ.899 ప్లాన్ అందుబాటులో ఉంది. 90 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్లో రోజుకు 2GB చొప్పున హైస్పీడ్ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా 20GB డేటాను అందిస్తున్నారు. మొత్తంగా వ్యాలిడిటీ కాలంలో 200GB డేటాను వినియోగించుకోవచ్చు.పూర్తి ప్రయోజనాలు ఇవే..అర్హత ఉన్న కస్టమర్లు, 5G సదుపాయం ఉన్న ప్రాంతాల్లో 5G హ్యాండ్సెట్ ఉపయోగిస్తే అన్లిమిటెడ్ 5G డేటా ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. దీంతో 5G నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నాన్ స్టాప్గా డేటాను వాడుకోవచ్చు.డేటాతో పాటు వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏ నెట్వర్క్కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 SMSలు ఉచితంగా పంపుకోవచ్చు. దీంతో మూడు నెలల వ్యాలిడిటీ సమయంలో సాధారణ కాలింగ్, SMS అవసరాల కోసం ప్రత్యేకంగా అదనపు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.రూ.899 ప్లాన్లో కస్టమర్లకు కొన్ని డిజిటల్ ప్రయోజనాలను కూడా అందిస్తున్నారు. మొబైల్లో సినిమాలు, వెబ్ సిరీస్లు, లైవ్ స్పోర్ట్స్ వంటి కంటెంట్ను వీక్షించేందుకు OTT ప్రయోజనం లభిస్తుంది. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఇతర ముఖ్యమైన ఫైళ్లను భద్రపరుచుకునేందుకు 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉంది.ఇవే కాకుండా టెక్నాలజీపై ఆసక్తి ఉన్న వినియోగదారులకు 18 నెలల పాటు అధునాతన AI సర్వీస్కు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్లో భాగంగా అందిస్తున్నారు. మొత్తంగా 90 రోజుల వ్యాలిడిటీ, డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, SMSలు, OTT, క్లౌడ్ స్టోరేజ్, AI ప్రయోజనాలను ఒకే రీఛార్జ్లో పొందాలనుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
అప్పు.. అప్పుతోనే చెల్లు! ఇదే ‘రిచ్ డాడ్’ సీక్రెట్!!
అప్పుల నుంచి బయటపడాలంటే సాధారణంగా వాటిని వీలైనంత త్వరగా తీర్చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చెడ్డ అప్పులను (Bad Debt) తీర్చేందుకు సొంత డబ్బును ఉపయోగించకుండా.. ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తుల కోసం ‘మంచి అప్పు’ (Good Debt) తీసుకుని, ఆ ఆదాయంతో పాత అప్పులను తీర్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్లో చేసిన ఓ పోస్టులో తన అభిప్రాయాలను పంచుకున్నారు.కియోసాకి ప్రకారం.. క్రెడిట్ కార్డు వంటి అధిక వడ్డీ అప్పులను జీతంతో నెలనెలా తీర్చుకుంటూ 20 ఏళ్ల పాటు కొనసాగడం కంటే, నగదు ప్రవాహం (Cash Flow) అందించే ఆస్తులను కొనుగోలు చేయడానికి రుణాన్ని ఉపయోగించుకోవడం ఒక ప్రత్యామ్నాయ మార్గం. ఆ ఆస్తి నుంచి వచ్చే ఆదాయంతో రుణ వాయిదాలను చెల్లిస్తూ, మిగిలిన మొత్తాన్ని చెడ్డ అప్పులను తీర్చడానికి ఉపయోగించుకోవచ్చని ఆయన వివరించారు.తన భార్య కిమ్ మొదటిసారి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన ఉదాహరణను ఈ సందర్భంగా కియోసాకి ప్రస్తావించారు. ఆమె 5,000 డాలర్లు పెట్టుబడిగా పెట్టి, మరో 40,000 డాలర్లను రుణంగా తీసుకున్నారని చెప్పారు. అయితే ఆ రుణాన్ని ఆమె సొంత డబ్బుతో చెల్లించలేదని, ఆ ప్రాపర్టీలోని అద్దెదారుల నుంచి వచ్చిన అద్దె ఆదాయమే రుణ చెల్లింపులకు ఉపయోగపడిందని పేర్కొన్నారు. అద్దె ఆదాయం మార్ట్గేజ్ చెల్లింపులను కవర్ చేయడంతో పాటు కొంత మిగిలేదని వివరించారు.తన ‘రిచ్ డాడ్’ నుంచి నేర్చుకున్న పాఠాన్ని వివరించేందుకు కియోసాకి మోనోపొలీ గేమ్ను కూడా ఉదాహరణగా తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ను రుణంతో కొనుగోలు చేసే విధానాన్ని అర్థం చేసుకునేలా ఈ ఆట ద్వారా నేర్పించారని చెప్పారు. ఒక ప్రాపర్టీపై అద్దె చెల్లించినప్పుడు, ఆ డబ్బులో కొంత భాగం బ్యాంకు రుణాన్ని తీర్చేందుకు వెళ్లేలా ఉండేదని వివరించారు.ఇదీ చదవండి: ఇల్లు ఆస్తి కాదు.. అప్పుల కుప్ప: కియోసాకిఅందువల్ల ఆదాయం తీసుకువచ్చే ఆస్తుల ద్వారా వచ్చే నగదు ప్రవాహాన్ని ఉపయోగించి రుణాన్ని చెల్లించడమే తన ఉద్దేశమని కియోసాకి చెప్పారు. జీతంతో మాత్రమే అప్పులను తీర్చేందుకు శ్రమించే బదులు.. ఇతరుల నుంచి వచ్చే నగదు ప్రవాహం ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు.అయితే రుణంతో ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల వడ్డీ భారం, ఆస్తి విలువ తగ్గడం, అద్దె ఆదాయం రాకపోవడం వంటి ఆర్థిక నష్టాలు కూడా ఉండొచ్చన్న విషయాన్ని కియోసాకి ఈ పోస్టులో ప్రస్తావించలేదు.
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం, వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు (Today Gold Rate) స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
కియా కొత్త సీఎన్జీ కార్లు వచ్చేశాయ్.. ధరల్లో భారీ తేడా!
కియా ఇండియా తన పాపులర్ ఎమ్పీవీలైన క్యారెన్స్, క్యారెన్స్ క్లావిస్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ వేరియంట్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. క్యారెన్స్ సీఎన్జీ ప్రారంభ ధర రూ.12.12 లక్షలు, క్యారెన్స్ క్లావిస్ సీఎన్జీ ధర రూ.12.39 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఏడు సీట్ల ఎమ్పీవీ విభాగంలో తక్కువ ఇంధన వ్యయాన్ని కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ వేరియంట్లను ప్రవేశపెట్టింది.మూడు వేరియంట్లు.. ధరలు ఇలా..క్యారెన్స్ సీఎన్జీని ప్రీమియం (ఓ) ట్రిమ్లో మాత్రమే అందిస్తోంది. దీని ధర రూ.12.12 లక్షలు. క్యారెన్స్ క్లావిస్ సీఎన్జీని హెచ్టీఈ, హెచ్టీఈ (ఓ) అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. హెచ్టీఈ ధర రూ.12.39 లక్షలు, హెచ్టీఈ (ఓ) ధర రూ.13.35 లక్షలు. సంబంధిత పెట్రోల్-మాన్యువల్ వేరియంట్లతో పోలిస్తే సీఎన్జీ మోడళ్ల ధర సుమారు రూ.1 లక్ష అధికంగా ఉంది.ఈ విభాగంలో మారుతి ఎర్టిగా సీఎన్జీ ధర రూ.10.94 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉండగా, టయోటా రూమియన్ సీఎన్జీ రూ.11.69 లక్షల నుంచి, మారుతి ఎక్స్ఎల్6 సీఎన్జీ రూ.12.61 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.1.5 లీటర్ ఇంజిన్.. 6-స్పీడ్ మాన్యువల్క్యారెన్స్, క్యారెన్స్ క్లావిస్ సీఎన్జీ రెండింటిలోనూ కియా 1.5 లీటర్ స్మార్ట్స్ట్రీమ్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్నే ఉపయోగించింది. సీఎన్జీకి అనుగుణంగా ఇంజిన్ను రీకాలిబ్రేట్ చేసింది. సీఎన్జీ మోడ్లో ఈ ఇంజిన్ పెట్రోల్ వెర్షన్తో పోలిస్తే 19 బీహెచ్పీ తక్కువ పవర్, 21 ఎన్ఎం తక్కువ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే సీఎన్జీ వేరియంట్లు లభిస్తాయి. పెట్రోల్ మోడళ్లలో లభించే ఐఎంటీ, డీసీటీ ఆప్షన్లు సీఎన్జీ వెర్షన్లలో లేవు.అయితే, ఈ కొత్త సీఎన్జీ వేరియంట్లకు సంబంధించిన అధికారిక మైలేజీ గణాంకాలను కియా ఇంకా వెల్లడించలేదు. పెట్రోల్ సిస్టమ్కు అదనంగా 60 లీటర్ల సీఎన్జీ ట్యాంక్ను అమర్చింది. 4.2 అంగుళాల కలర్ టీఎఫ్టీ ఎంఐడీలో ఫ్యూయల్-ఛేంజ్ స్విచ్తో పాటు సీఎన్జీకి ప్రత్యేకమైన డిస్టెన్స్-టు-ఎంప్టీ సమాచారం ఉంటుంది.తగ్గిన బూట్ స్పేస్సీఎన్జీ ట్యాంక్ను రెండు మోడళ్లలోనూ బూట్ ఫ్లోర్ కింద అమర్చారు. దీంతో మూడు వరుసల సీట్లు వినియోగంలో ఉన్నప్పుడు బూట్ సామర్థ్యం 216 లీటర్ల నుంచి 116 లీటర్లకు తగ్గుతుంది. అయితే స్పేర్ వీల్ను అండర్బాడీ కిందనే ఉంచారు.సీఎన్జీ ట్యాంక్ కారణంగా పెరిగిన బరువుకు అనుగుణంగా సస్పెన్షన్ను రీట్యూన్ చేసినట్లు కియా తెలిపింది. ముందు డిస్క్ బ్రేక్లను 16 అంగుళాల యూనిట్లకు అప్గ్రేడ్ చేసి, ఆర్16 వీల్స్ను కూడా అందించింది. సీఎన్జీపై డ్రైవబిలిటీ మెరుగ్గా ఉండేలా ఇంజిన్ కంట్రోల్ను సైతం సర్దుబాటు చేసింది.సీఎన్జీకి సంబంధించిన ఈ మార్పులు మినహా, మిగిలిన ఫీచర్ల విషయంలో సంబంధిత పెట్రోల్ వేరియంట్లతో సమానమైన పరికరాలను అందిస్తోంది. దీంతో మారుతి సుజుకి, టయోటా తర్వాత ఏడు సీట్ల ఎమ్పీవీ విభాగంలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ ఆప్షన్ను అందిస్తున్న మరో సంస్థగా కియా నిలిచింది.ఇదీ చదవండి: కియా నుంచి భారీ ఎలక్ట్రిక్ వ్యాన్ వచ్చేస్తోంది..
ఫ్యామిలీ
ది మైక్రో స్పై: సీల్ చెక్కుచెదరలేదు.. అయినా లీక్!
డీజీపీ చాంబర్...మేజర్ సూరజ్ మెహతా మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.ఎదురుగా క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు.‘దేశ సరిహద్దు రక్షణకు సంబంధించిన అత్యంత రహస్యమైన డ్రోన్ ఆటోమేషన్ బ్లూప్రింట్స్– కీలకమైన డిఫెన్స్ డాక్యుమెంట్స్ ఉన్న కవరును తీసుకుని ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చారు. మేజర్ సూరజ్ మెహతా– ఆ పత్రాలను ఐటీ కారిడార్లోని డిఫెన్ ్స రీసెర్చ్ విభాగానికి అందజేయాల్సి ఉంది.‘మేజర్ సూరజ్ మెహతా నిన్న రాత్రి బంజారాహిల్స్లోని ఒక లగ్జరీ హోటల్లో బస చేశారు. రాత్రి ఆయన భద్రంగా దాచుకున్న ఆ రహస్య కవరు ఉదయం చూసేసరికి మాయమైంది. ప్రభుత్వ అధికారిక లక్క ముద్ర ఉన్న ఆ కవరు పోవడం చాలా ప్రమాదకరం...’ డీజీపీ గంభీరంగా చెప్పాడు.‘అవును మిస్టర్ అభిమన్యు! ఎన్ ఐఏ, సీబీఐ ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగే పరిస్థితి లేదు. చాలా కాన్ఫిడెన్షియల్... మీ ప్రతిభ గురించి విన్నాం... మీరే ఈ కేసును సాల్వ్ చేయాలి.’ మేజర్ మెహతా అన్నాడు.‘డోంట్ వర్రీ... దేశ రక్షణ మన బాధ్యత, మీరు నిశ్చింతగా వుండండి.’ చెప్పి బయటకు నడిచాడు అభిమన్యు.అతడిని అనుసరించాడు మేజర్ సూరజ్ మెహతా.అభిమన్యు వెంటనే మేజర్ సూరజ్ మెహతాతో కలిసి హోటల్ రూమ్ నంబర్ 404కి చేరుకున్నాడు. రూమ్లో ఎలాంటి గొడవ జరిగిన ఆధారాలు లేవు. లాకర్ తాళాలు మేజర్ సూరజ్ పాకెట్లోనే ఉన్నాయి. ‘రాత్రి నేను గది తాళం వేసుకుని పడుకున్నాను. కిటికీలు కూడా లోపలి నుంచే బంధించి ఉన్నాయి. మరి కవరు ఎలా మాయమైంది?’హోటల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న అభిమన్యుకు గ్రౌండ్ ఫ్లోర్లో డస్ట్ బిన్లను తీసుకువెళ్తున్న రూమ్ బాయ్ కనిపించాడు. ఆ డస్ట్ బిన్లలో ఉన్న చెత్తను ఇంకా మునిసిపల్ వ్యాన్లో తరలించలేదు. వెంటనే ఆ చెత్తలో వెతికితే కవర్ దొరికింది.‘కవర్ దొరికింది. కానీ డస్ట్ బిన్లోకి ఎలా వెళ్ళింది?’ తనలో తానే గొణుక్కుంటున్నట్టు అన్నాడు మేజర్ సూరజ్ ఆ కవర్ వంక చూసి.ఇన్స్పెక్టర్ అభిమన్యు తన ట్రెంచ్ కోట్ జేబులోంచి భూతద్దం తీసి ఆ కవర్ను పరిశీలించాడు. ‘లక్క ముద్ర అలాగే ఉంది కానీ, లోపల ఉన్న దేశ రహస్యాలు ఇప్పటికే లీక్ అయిపోయాయి!’ అభిమన్యు అన్నాడు.మేజర్ సూరజ్ షాకింగ్గా చూస్తూ వుండిపోయాడు ‘ ఇప్పుడెలా? అతని గొంతులో ఆందోళన.‘లీకైన రహస్యాలు బయటకు పొక్కకముందే లాక్ అవుతాయి.’ అభిమన్యు చెప్పాడు. అప్పటికే అతని బ్రెయిన్ మ్యాప్ పనిచేస్తోంది.అభిమన్యు వెంటనే హోటల్లో బస చేసిన వారి రికార్డులను పరిశీలించాడు. అదే ఫ్లోర్లో ఉన్న ఒక విదేశీ ప్లాస్టిక్ సర్జన్ ప్రొఫైల్ అతని దృష్టికి వచ్చింది.వెంటనే డూప్లికేట్ కీతో గది ఓపెన్ చేశాడు.∙∙ ఫెడరిక్ మాస్టర్ కీతో గది తలుపు తెరిచి షాకయ్యాడు. అతనిలో ఏదో అనుమానం.‘హలో మిస్టర్ ఫ్రెడరిక్ అమెరికా ఎఫ్బీఐకి కూడా దొరక్కుండా మా దేశానికి ఎందుకు వచ్చావ్? ఆ మాటలు విని ఆ స్పై సర్జన్ ఫెడరిక్ జేబులో నుంచి రివాల్వర్ తీయబోయాడు. అప్పటికే అతని వెనుక రివాల్వర్తో అభిమన్యు.∙∙ ‘ఫెడరిక్ మిమ్మల్ని ఢిల్లీ నుంచి ఫాలో అవుతూ వచ్చాడు. ఒక ప్రొఫెషనల్ మాత్రమే ఇలా చేయగలడు. అతని గురించి ఆరా తీస్తే డొంక కదిలింది. ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో వున్నాడు.కవరు సీల్ పాడవకుండా ఉండటానికి, దాని అంచున ఒక చిన్న సూదితో రంధ్రం చేశాడు. ఆ రంధ్రం గుండా 0.5 ఎంఎం వ్యాసం కలిగిన అత్యంత సన్నని ఆప్టికల్ ఫైబర్ ఎండోస్కోపీ స్పై కెమెరా కేబుల్ను కవరు లోపలికి చొప్పించాడు. వైద్య రంగంలో శరీర భాగాలను పరీక్షించడానికి వాడే ఈ సాంకేతికతను, నేరగాళ్లు మన దేశ రహస్యాలను దొంగిలించడానికి వాడారు. లోపల ఉన్న పేపర్ల మడతలను, అందులోని అక్షరాలను ఆ కెమెరాకు ఉన్న మైక్రో–లైట్ సాయంతో స్పష్టంగా స్కాన్ చేశాడు. ఆ డేటా మొత్తం వై–ఫై ద్వారా వాళ్ల సర్వర్కు సెకన్ల వ్యవధిలో చేరిపోయింది. పని పూర్తయ్యాక, కెమెరాను బయటకు తీసి, ఆ రంధ్రం ఎవరికీ కనపడకుండా ఒక ప్రత్యేకమైన బూడిద రంగు గ్లూతో మూసేసి, కవరును డస్ట్బిన్ లో పడేశాడు. కవర్ దొరికిందని మీరు అనుకుంటారు. కానీ రహస్యాలు వెళ్లిపోతాయి.’ఫెడరిక్ లగేజీని తనిఖీ చేయగా, అందులో ఫెడరిక్ వాడిన మైక్రో–ఎండోస్కోపీ పరికరం ల్యాప్టాప్ దొరికాయి. ల్యాప్టాప్ను పరిశీలించగా, డిఫెన్ ్స పేపర్ల డిజిటల్ కాపీలు అందులో ఉన్నాయి. వాటిని ఇంకా వేరే సర్వర్కు అప్లోడ్ చేయలేదు. మన దేశ రక్షణకు ఏ సమస్యా లేదు. ఇతడిని ఎఫ్బీఐకి అప్పగించండి.ఒక చిన్న సూది రంధ్రం వెనుక ఉన్న అంతర్జాతీయ సాంకేతిక నేరాన్ని ఇన్స్పెక్టర్ అభిమన్యు ఎనలైజ్ చేస్తూ చెప్పాడు.‘థాంక్యూ మిస్టర్ అభిమన్యు. మీ మేలు మర్చిపోలేను... మీరు జీనియస్.. బుద్ధిబలం, భుజబలం, మీ సొత్తు. మీ శక్తియుక్తులు రెండు రాష్ట్రాలకే కాదు మొత్తం దేశానికే అవసరం. మా ఆర్మీ మీ కోసం ఎదురు చూస్తుంది.’ అంటూ కరచాలనం చేస్తూ వీడ్కోలు తీసుకున్నాడు సూరజ్ మెహతా.అవును... అభిమన్యుకు ఏదో రోజు దేశ రక్షణకు పిలుపు వస్తుంది.- శ్రీసుధామయిఇదీ చదవండి: కూతురి కోసం తండ్రి మొక్కు.. 75 ఏళ్లుగా దేశానికే పండుగ!
అహం బ్రహ్మాస్మి: గడ్డిపరక ప్రశ్నకు.. సింహం సమాధానం ఏంటి?
తెలుగు సినిమాలు, తెలుగు రాజకీయాలు బాగా ఫాలో అవుతుందేమో, సింహం అద్దం ముందు నిలబడి గడ్డం సవరించుకుంటూ దరహాసంతో ‘నేను సింహంలాంటి దాన్ని’ అనుకుంది.వెంటనే, ‘ఛ... ఛ... నేను సింహంలాంటి దాన్నేమిటీ? నేనే సింహాన్ని’ ఆలోచనను సవరించుకుంది. ‘ఈ అడవికి రాజును. ఏనుగు నుంచి ఎలుకపిల్ల వరకు, మహావృక్షం నుంచి గడ్డిపరక వరకు, పక్షి నుంచి పారాడే పురుగు వరకు ప్రతిదీ నా అదుపాజ్ఞల్లో ఉండాల్సిందే!’ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని, గుహ బయటికి రావటానికి సమాయత్తమవుతుంటే, మనసుకు ఏదో సంకేతం అందుతున్నట్టు అనిపించింది.ఏమిటది?కొత్త ఉపద్రవమా?అడవుల్లో వుండే జంతువులకి, పక్షులకి, ఇతర జీవచరాలకీ దినదినగండం నూరేళ్ళ ఆయుష్షు జీవితమే! ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి సెకనూ ఉపద్రవమే! క్రూర జంతువుల రూపంలో, వేటగాళ్ల రూపంలో. అయినా తను ఈ అడవికి రారాజు. తనకి ఎవరివల్ల ఉపద్రవం ఉంటుంది? తనే మిగిలిన జంతుజాలానికి ఉపద్రవం కాని. తనని తాను సమాధానపరచుకుంది సింహం.ఆలోచిస్తూ గుహ బయటికి వచ్చి బోర విరుచుకు నిలబడి చుట్టూ ఒకసారి తేరిపార చూసింది. ఎదురుగా కుక్క, నక్క!పుట్టుకతో బద్ధశత్రువులైన రెండూ అక్కడ ఒకదాని పక్క మరోటి నిలబడి వున్నాయి– అదీ పెళ్లి చేసుకున్న ఆనవాళ్లతో, అలంకరణలతో...సింహాన్ని చూసి కుక్క అంది ‘మహారాజా, కొత్తగా పెళ్లి చేసుకున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి.’సింహం తన కళ్ళని తానే నమ్మలేక పోయింది.‘పెళ్లా? మీరా?’ అన్నది పైకి.‘చరిత్రలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఇలాంటిది జరిగిందా? పరస్పరం కలహించుకునే రెండు జాతులు పెళ్లి చేసుకోవటం ఉపద్రవం కాక మరేమిటీ?’ మనసులో అనుకుంది.‘అవును మహారాజా. ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకున్నాం. ఆశీర్వదించండి’ ఈసారి నక్క అంది వినయంగా. దాని వినయం తెలుస్తూనే వుంది.‘మీ ఇళ్లల్లో ఒప్పుకున్నారా ఈ పెళ్ళికి?’‘లేదు మహారాజా. విభిన్న జాతుల మధ్య ప్రేమను సమాజం ఎప్పుడూ సులభంగా అంగీకరించలేదు. అయినా మేము ఒకరినొకరం ఎంచుకున్నాం. మా అభిప్రాయాలు కలిశాయి. మేము పెళ్లి చేసుకున్నాము. ఇతరులతో మాకు పనేముంది మహారాజా?’ అంది కుక్క.‘అభిప్రాయాలు కలవటమా? అసలు మీ జాతులే వేరైనప్పుడు, అలవాట్లే వేరైనప్పుడు, అభిప్రాయాలు కలవటం వింతగా వుంది.’‘అభిప్రాయాలు కలవటానికి, జాతులు వేరవటానికి సంబంధమేమిటి మహారాజా. ఆ మాటకొస్తే ఎన్ని సినిమాల్లో చూళ్ళేదూ హీరో హీరోయిన్లు దెబ్బలాడుకుంటూనే ప్రేమలో పడటం. ఇదీ అంతే అనిపించింది.’‘మనుషుల గురించి వదిలెయ్యండి. సృష్టిలో వాళ్ళని మించిన నమ్మక ద్రోహులు, స్వార్థపరులు మరెవరూ వుండరు. ఒక పని చేస్తే కొంత లాభం వస్తుందనుకుంటే స్వంత వాళ్లనే వదులుకోవడానికి సిద్ధపడతారు. అలాంటి నీతి, జాతి లేని వాళ్ళతో– మనకి పోలికేమిటి?’ సింహం గర్జించింది.ఆ అరుపుకు కుక్క, నక్క గాభరా పడ్డాయి.‘అవసరం కోసం మనుషులు ఎంతకిందికైనా దిగజారతారు. డబ్బుకోసం నానా గడ్డీ కరుస్తారు. అలాంటి వాళ్ళు అంతకంటే మంచి సినిమాలు తియ్యలేరులే. అయినా– సినిమాలు చూసే మీరు ఇవన్నీ చేశారా?’ సింహం అడిగింది.‘అవును, కాదు’ల మధ్యగా రెండూ తల ఊపాయి.‘అయినా ఒక విషయం అడుగుతాను. సూటిగా సమాధానం చెప్పండి. రేపు మీ పిల్లల్ని తోటి సమాజం సంకర జాతి అని హేళన చెయ్యదా?’రెండూ తలలు వంచుకున్నాయి– తప్పు చేసిన వాళ్ళలా.‘దానికంటే ముఖ్యంగా’ సింహం కుక్కని చూసి, ‘విశ్వాసానికి ప్రతీకగా నిన్నూ’ అని నక్క వైపు చూసి, ‘వంచనకు, అతి వినయానికి గుర్తుగా నిన్నూ చెప్తారు కదా. రేపెప్పుడైనా ఈ అడవిలో మిగిలిన జంతువులు మిమ్మల్ని ఒకరి గురించి మరొకరి ముందు అలా అవహేళన చేస్తే మీరు తట్టుకోగలరా?’సమాధానం ఏం చెప్పాలో తెలీక కుక్కా, నక్కా రెండూ మౌనంగా ఉండిపోయాయి.సింహమే అంది ‘రేపు మీ పిల్లలకి మీ అసలు బుద్దులు తారుమారై.. నక్క విశ్వాసం, కుక్క వినయం వస్తే, మిగిలినవి వాటిని ఎగతాళి చేస్తే వాటి చిన్ని మనసుకు గాయం అవ్వదా?’‘మహారాజా, క్షమించండి. దాని గురించి మేము ఇంకా ఆలోచించలేదు కానీ, విషయం అంతదాకా వస్తే, మా పిల్లలు ఈ అడవిలోనే, ఈ జంతువుల మద్యే ఉండాలన్న నియమమేమీ లేదు కదా. రేపు మా పిల్లలు మెరుగైన జీవితం కోసం, దేశంలోని ఇంకో అడవికో, మరోదేశానికో వలస పోవచ్చు. మనుషులు కూడా అలానే దేశాంతరం వెళుతున్నారు కదా?’ ప్రశ్నించింది నక్క.సింహానికి ఇది వాదనలతో తెగే వ్యవహారంలా అనిపించలేదు. ‘మూర్ఖులతో వాదించటమంత మూర్ఖత్వం లేదు’ అనుకుంది.చివరగా అంది ‘సరే అయిందేదో అయింది. ఇద్దరూ కుటుంబ సమస్యలతో వీధికెక్కకుండా నడుచుకోండి. ఇప్పటి ఏకాభిప్రాయాలు రేపటి అభిప్రాయభేదాలు కానివ్వకండి. అలాటిదేదైనా ఉంటే, ఇద్దరూ సామరస్యంగా చర్చించి పరిష్కరించుకోండి. జంతు సమాజం మొత్తం కళ్లన్నీ మీమీదే ఉంటాయి. రేపేదైనా జరిగితే మీ బతుకు ఎగతాళి అవుతుంది. జాగ్రత్తగా మసలుకోండి. నా అవసరం మీకు రాకూడదనే కోరుకుంటున్నా. ఒక వేళ వస్తే మాత్రం నాకు కబురుపెట్టి కలవండి.’దీవించినట్టు చెయ్యెత్తింది సింహం. కుక్క, నక్క కృతఙ్ఞతలు చెప్పి బయలుదేరాయి. ఆ ఇద్దరూ వెళ్లిపోయాక అడవి మళ్లీ నిశ్శబ్దమైంది.కానీ ఆ నిశ్శబ్దంలో ఒక గడ్డిపరక మాత్రమే వంగి నిలబడింది. ఏడురోజులుగా అది నీటిని తాకలేదు; సూర్యరశ్మిని కూడా స్వీకరించలేదు. బాగా వడలిపోయివుంది. దాని సమస్యేమిటో ఎవ్వరికీ తెలీదు. తన సమస్య ఎవరితో చెప్పుకోవాలో తెలీక అది కూడా సతమతమవుతోంది. ఈ విషయం ఆకాశంలో ఎగురుతున్న పాలపిట్ట ఒకటి గమనించింది. దాన్ని రారాజు సింహం వేగుగా నియమించుకుంది. రాజ్యంలోని క్షేమసమాచారాల్ని రాజుకు విన్నవించటమే దాని పని. సరిగ్గా– రెండురోజుల తర్వాత సింహం నుంచి గడ్డిపరకకు పిలుపొచ్చింది. గడ్డి భయంభయంగానే రాజు దగ్గిరకి పయనమయ్యింది.∙∙ పులులు, సింహాలు, ఏనుగులు, గుర్రాలు, గాడిదలు, కుందేళ్లు, నక్కలు, జింకలు, పాములు, పక్షులు, చెట్టు, పుట్ట సహా అడవిలోని ప్రతి ప్రాణి, జీవి ఈ సమావేశానికి హాజరు కావలసిందే అని సింహం హుకుం జారీచేసింది. అన్నీ వచ్చి ఆసీనులయ్యాయి.సమావేశం ప్రారంభమయింది. క్షేమసమాచారాలయ్యాక– సింహం గడ్డిపరకని ఎగాదిగా చూసి ‘ఏమిటి నీ సమస్య?’ అడిగింది.‘వ్యక్తిగతంగా అయితే నాకు ఏ సమస్యా లేదు మహారాజా. ఇది మా సమూహం మొత్తం సమస్య. సమస్యలు ఎవరూ తమ దృష్టికి తీసుకురావటంలేదు అంటే దానర్థం సమస్యల్లేవని కాదు మహారాజా. పరిష్కారం లభిస్తుందో లేదోనని’ అర్ధోక్తిలో ఆపుచేసింది గడ్డిపరక.‘పరిష్కారం లేని సమస్యలేమీ వుండవు. కాకపోతే, చిత్తశుద్ధే కావాలి. ముందసలు నీ సమస్యేమిటో చెప్పు, పరిష్కరించ టానికి ప్రయత్నిస్తా’ అంది సింహం.‘మహారాజా, మా సమస్యలు రెండు. ఒకటి ఆత్మగౌరవం. రెండు సామాజికం.’సింహం ఆశ్చర్యంగా చూసింది.గడ్డిపరక చెప్పటం మొదలెట్టింది.‘అవును మహారాజా, అందరూ... ముఖ్యంగా మనుషులు మమ్మల్ని ‘గడ్డిపరక’ అంటూ హేళనగా మాట్లాడతారు. మేము వారికి ఎంత సేవ చేస్తామో, ఎంతగా ఉపయోగపడతామో తమకు మాత్రం తెలీదా? అందరూ పలుచన చేస్తున్నట్టు మేమంతా విడివిడిగా పరకలమే కావొచ్చు కానీ, ఐకమత్యంగా ఏనుగునే బంధించిన మా చరిత్ర గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకోవటం వింత కాదు, కొత్త కూడా కాదు.’గడ్డిపరక గతవారం రోజుల్నించి ఆహారంగా కనీసం నీటిని కూడా పీల్చుకోకపోవటాన వచ్చిన నీరసంతో ఆగింది. క్షణం తర్వాత తిరిగి కొనసాగించింది.‘సమస్త భూమండలంలో మనుషులకి, పక్షులకి, జంతువులకి మాత్రమే కాదు, మాకు కూడా ప్రాణం ఉంటుంది మహారాజా. ఆ మాటకొస్తే అన్నిటికంటే అల్పప్రాణులం మేమే. ఈ సృష్టిలో మిగతా ఎవ్వరికీ అపకారం తలపెట్టని జాతి అంటే మాదే. మనుషులు ప్రకృతిని, మిగిలిన ప్రాణుల్ని నాశనం చేస్తారు. కొన్ని క్రూర జంతువులు వేటాడి మరీ అవతలివాటిని చంపుతాయి. ప్రకృతి సిద్ధమైన నీరు ఇళ్లనీ, ఊళ్ళనీ ముంచేస్తుంది. నిప్పు దేన్నయినా తగలబెడుతుంది. గాలి ఎంతటి దాన్నయినా చెదరగొడుతుంది. మేమొక్కళ్ళమే– కేవలం మేమొక్కళ్ళమే ఎవరికీ ఏ హానీ తలపెట్టకుండా మా బతుకేదో మేం బతుకుతుంటాము. అలాంటిది మమ్మల్ని బతకనీయకుండా చేస్తున్నారు మహారాజా.ఏనుగుల్లాంటి బలమైన జంతువులు ఒకసారి మా మీద కాలేస్తే అధఃపాతాళానికి వెళ్ళిపోతాము. కొన్ని కొన్నిసార్లు పునర్జన్మ అంటూ కూడా ఉండదు. మేకలు, గొర్రెలు, కుందేళ్లు తమతమ కోర పళ్లతో కొరికి పరపరా నములుతుంటే మా బాధ వర్ణనాతీతం. అదైనా పర్లేదు మహారాజా, పుట్టి నాల్రోజులు కూడా కాని పచ్చటి పసికందు పసరికల్ని కూడా వదలకుండా అలానే తింటుంటే, మా కళ్ళముందే అవి నిర్జీవమై పోతుంటే, మా గోడు ఎవరికి చెప్పుకోవాలి మహారాజా. తలచుకుంటుంటేనే కడుపు తరుక్కుపోతుంది.’ గడ్డిపరక కన్నీరు పెట్టుకుంది.సింహానికి జాలేసింది. కానీ, దాని బాధ విచిత్రంగా అనిపించింది. ఏనుగులాంటివి నడుస్తుంటే గడ్డి నలగదా? కుందేళ్ళ ఆహారమే పసిరిక ఐతే వాటిని తినకూడదా? మరి జంతువులు నడవకూడదా? మేకలు పస్తులుండాలా? సృష్టిలోని ప్రతి జీవి మనుగడకి ప్రకృతి కొన్ని దిశానిర్దేశాలు చేసింది కదా. అది కాకూడదంటే ఎలా? ఆ మాటే గడ్డిపరకతో అంది.‘గడ్డీ! నీ కోరికెందుకో విచిత్రంగా అన్పిస్తుంది. ప్రకృతి ధర్మం ప్రకారం పులులు, సింహాలకి మిగిలిన జంతువులే ఆహారం.గద్దలకి కోడిపిల్లలు ఆహారం. పాములకు కప్పలు ఆహారం. అలాగే నువ్వూ కొన్నిటికి ఆహారం. పెద్దపెద్ద జంతువులు నడుస్తుంటే నువ్వే కాదు, కొన్ని వేల జీవరాశులు కంటికి కనిపించనివి మరణిస్తుంటాయి. అంత మాత్రం చేత అవన్నీ నిషిద్ధమైతే ఎలా? అయినా– నీ బాధేమిటో నాకు స్పష్టంగా అర్థం కావటం లేదు. ఇంకొంచం వివరంగా చెప్పు.’‘అదే మహారాజా, నేనూ అక్కడికే వస్తున్నా. ప్రకృతి ధర్మం ఎప్పుడూ బలవంతుల వైపే ఉంటుంది. ఎందుకంటే– అది తయారుచేసేది బలవంతులు, అధికారం ఉన్నవాళ్ళే కదా. అల్పప్రాణులమైన మాలాంటి వాళ్ళు వాటిని కచ్చితంగా పాటించాల్సిందే. అంతెందుకు మహారాజా, ఒక ప్రశ్న అడుగుతాను. నిజాయితీగా సమాధానం చెప్పండి. ఒక మనిషి కారులో వెళుతున్నాడనుకోండి. ఒక సైకిలో, స్కూటరో తెలిసో, తెలియకో ఆ కారుకి అడ్డంగా వస్తే అతడెంత కోప్పడతాడు? వీలైతే ఒకసారి తొక్కిస్తే, జీవితంలో ఇంకెప్పుడూ ఇలా ఎవరికీ అడ్డుపడకూడదనే గుణపాఠం నేర్పించాలనుకుంటాడా లేదా? మరి అదే మనిషి కారుకి ఏ లారీనో, బస్సో ఎదురుగా వస్తే ఏమనుకుంటాడు? మనసులో వాళ్ళను తిట్టుకున్నా ‘వాడితో మనకెందుకులే గొడవ? పక్కకి జరిగి వెళితే మనకే మంచిది’ అనుకుంటాడు కదా.ఒకే మనిషి ఒకే సందర్భంలో రెండు రకాలుగా ఎందుకు ఆలోచించాడు? తనకంటే బలహీనమైన సైకిలువాణ్ణి చూస్తే ఎందుకు కొట్టాలనిపించింది? బలవంతుణ్ణి చూస్తే శాంతం దానంతట అదే ఎందుకు, ఎలా వచ్చింది? అంటే – మనిషి ఆలోచన, ధర్మం.. సందర్భాన్ని బట్టి మారాయి తప్ప ప్రకృతి నిర్దేశించిన నియమాల ప్రకారం కాదు కదా? ఐతే – ఇక్కడ నేను మనిషి ఆలోచనా విధానం గురించి ఎందుకు చెప్పానంటే, మనలో చాలామంది ఇప్పుడు మానవుల్లాగే ఆలోచిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు చెప్పండి మహారాజా, నా ప్రశ్న న్యాయమైనదా కాదా? పరిష్కరించవలసిందా కాదా?’అన్ని ప్రాణులు ఆశ్చర్యంగా చూస్తుంటే, గడ్డిపరక చేతులు జోడించి ‘మహారాజా, ఇప్పుడు మీరు చెప్పబోయే పరిష్కారం భవిష్యత్ తరాలకు, మాలాంటి అల్ప జీవులకు ఒక వేదం కావాలి. దయచేసి అన్నీ అలోచించి నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయమే మాకు శిరోధార్యం’ వినమ్రంగా అంది.మిగిలిన జంతువులు, పక్షులు అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్నాయి. ఇన్నాళ్లూ తాము ఎప్పుడూ ఈ కోణంలోంచి ఆలోచించలేదు. ఏదో పుట్టాం... తింటున్నాం... బతుకుతున్నాం... అనుకుంటున్నామే గానీ, మొదలేదో తుదియేదో తెలీని అంత అల్పప్రాణి గడ్డిపోచలో ఇంత ఆలోచన ఉందా? దాని గుండెల్లో ఇంత విషాదం గూడుకట్టుకుని ఉందా?రాజైన సింహం దానికి ఏం సమాధానం చెప్పబోతుందో అని జంతువులు, పక్షులు, మిగిలిన జీవజాలం అన్నీ చెవులు రిక్కించి వినటానికి సిద్ధంగా వున్నాయి. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరీ అందుకోసం ఎదురుచూస్తున్నాయి.ఇప్పుడు సింహం చెప్పబోయే సమాధానం భవిష్యత్ తరాలకు ఒక మార్గనిర్దేశనం అవుతుంది. చరిత్ర పుస్తకంలో అది ఒక పాఠమవుతుంది. ఎన్నో ఒడిదుడుకులు చూసి, జీవితాన్ని కాచి వడబోసిన సింహం దీనికి ఏం సమాధానం చెబుతుంది?ఇన్ని రోజులూ ఒకెత్తు! ఇక మీదట మరోఎత్తు! సృష్టిలో ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంటుంది. అవతలి వాళ్ళని బాధపెట్టి, వారి బలహీనతల్ని సోపానాలుగా మార్చుకుని పైకెదిగే, ఎదగాలనుకునే వాళ్ళ ఆలోచనలకు ఇపుడు సింహం ఇవ్వబోయే తీర్పు ఒక చెంపపెట్టు కావాలి. అన్నీ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. సింహం కూడా ఆలోచనలో పడింది. ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని కోణం ఇది. ఎప్పుడూ ఎదుర్కోని ప్రశ్న. ప్రశ్న చాలా చిన్నదే. కానీ, జవాబు చాలా పెద్ద చిక్కే. ఏం సమాధానం చెప్పాలి? ఎదో ఒక తీర్పయితే చెప్పొచ్చు, కానీ అది ఎవ్వరినీ నొప్పించకూడదు. అందరినీ ఒప్పించగలగాలి. చరిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోయేటప్పుడు అన్ని విషయాలూ కూలంకషంగా ఆలోచించాలి.తప్పొప్పుల్ని బేరీజు వేసుకోవాలి. సమస్యను అన్ని వైపులనించీ నిశితంగా పరిశీలించాలి. రేప్పొద్దున ఎవరూ తనని గాని, తానిచ్చిన తీర్పుని గాని వేలెత్తి చూపకూడదు. దానికి గానూ, సింహానికి తనకున్న అనుభవం చాలదనిపించింది. దీని గురించి తన మంత్రులతో, న్యాయ కోవిదులతో, మేధావులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకు గానూ కొంత సమయం పడుతుంది.ఆ మాటే చెప్పింది ‘ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గడ్డిపరక చిన్నదే కానీ, అదడిగిన ప్రశ్న భూమండలమంత పెద్దది. అంతపెద్ద సమస్యకి సమాధానం ఒక నిమిషంలో వెల్లడించతరం కాదు. దానికిగానూ నాక్కొంత సమయం కావాలి. నాలుగోరోజు ఉదయం తిరిగీ మనందరం ఇక్కడే కలుద్దాం. అప్పటికి నేను దీనికి ఒక న్యాయసమ్మతమైన పరిష్కారం కనుగొనగలనని భావిస్తున్నాను. అందరూ సహకరించగలరని విజ్ఞప్తి.’సింహం లేచింది. అన్ని జంతువులూ అక్కణ్ణించి నిష్క్రమించాయి. ఆ రాత్రి అడవిలో ప్రతి జీవి ఒకే ప్రశ్నతో నిద్రపోయింది– గడ్డిపరకకు న్యాయం జరుగుతుందా?∙∙ అయితే– రేపు తీర్పు అనగా, ముందురోజు రాత్రి. చిన్నగా ప్రారంభమైన వర్షం పెనుతుఫానుగా మారింది. చెట్లు నేల కూలాయి, రాళ్లు విరిగి పడ్డాయి, కొండలమీది నుంచి ప్రవహించిన నీరు అడ్డొచ్చిన ప్రతి ఊరునీ, వాడనీ తనలో కలిపేసుకుని సముద్రంలో లీనమైంది. అడవిలోని జంతువులు చెల్లాచెదురయ్యాయి. మిగిలిన జీవరాశులు కకావికలమయ్యాయి. ఎన్ని బతికాయో, ఎన్ని చనిపోయాయో ఎవరికీ తెలీదు. సింహం గుహ మొత్తం కూలబడింది. ఆ అర్ధరాత్రిలో, ఆ నిశీధిలో ఎవరు ఎటువైపు వెళ్లాలో తెలీక పక్షుల అరుపులు, జంతువుల రోదనలు, హాహాకారాలు... వెరసి అదొక శ్మశానాన్ని తలపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా – నేనే బలవంతుడినని గర్వపడిన ఏనుగుల్లేవు.రాజునని అహంకరించిన సింహాల్లేవు. పరులని మోసగించే నక్కల్లేవు. పక్షులకి గూళ్ళులేవు. పాములకు బొరియల్లేవు.పులులూ, అడవి దున్నలూ, జింకలూ, కొమ్ములు విసిరే ఎద్దులూ– ఏవీ లేవు. దేని జాడా తెలియటం లేదు. ఉన్నదల్లా నిర్జనమైన అడవి, నిర్వీర్యమైన ప్రకృతి, శ్మశాన నిశ్శబ్దం!అప్పడు, ఆ దృశ్యం ‘ఎంతటి బలవంతుడైన ప్రకతి ముందు దిగదుడుపే’ అన్న జీవిత సత్యాన్ని చెబుతుంది.తెలుసుకున్న వాళ్లకి తెలుసుకున్నంత.తెల్లవారింది.ఆ నిర్జనారణ్యంలో, ఆ శ్మశాన సమాధుల్లో, అల్లకల్లోలాల మధ్యలో... కొండాకోనల వెనకనించి దిక్కుల్ని చీల్చుకుంటూ వస్తున్న ప్రభాత సూర్యకిరణాలు.! భూమి బద్దలైనా, ఆకాశం తలక్రిందులైనా, సముద్రాలు ఉప్పొంగినా... అలుపెరగని సైనికుడిలా, నిద్రావస్థ నుంచి ప్రపంచాన్ని జాగృతం చేయటానికి అప్పుడప్పుడే భూమిపైకి వస్తున్న తొలి రవికిరణాలు! వాటినే చూడటానికన్నట్టు ధీటుగా నిలబడ్డ గడ్డిపోచ ఒకటి! నడుము మీద చెయ్యేసి, రొమ్ము విరగదీసి సూర్యుడికి అభిముఖంగా, దమ్ము చూపిస్తూ నిటారుగా నిలబడ్డ ఆ గడ్డి పరక... ఏం పాఠం చెబుతుంది?కొన్నిసార్లు తగ్గటమే– నెగ్గటం – ప్రపంచంలో అయినా, జీవితంలో అయినా!‘ప్రకృతికి, పరమాత్ముడికి ఎంతటి వీరుడైనా, ధీరుడైనా తలవంచాల్సిందే’ అర్థం చేసుకున్నోళ్లకి అర్థం చేసుకున్నంత!!తనను తాను బ్రహ్మంగా భావించిన సింహం కనుమరుగైంది. బ్రహ్మంలో తానొక భాగమని తెలుసుకున్న గడ్డిపరక మాత్రం నిలిచింది.అహం బ్రహ్మాస్మి!! సడ్డా సుబ్బారెడ్డిఇదీ చదవండి: ‘అమ్మా.. నా ఇంటికి నన్ను తీసుకెళ్లు!’ బాలుడి మాటలలో మిస్టరీ!
కూతురి కోసం తండ్రి మొక్కు.. 75 ఏళ్లుగా దేశానికే పండుగ!
కొన్ని పండుగల వెనుక సంస్కృతీ సంప్రదాయాల చరిత్ర ఉంటే, మరికొన్ని పండుగలు భావోద్వేగాలు, విశ్వాసాలతో ముడిపడి ఉంటాయి. అలాంటి అరుదైన పండుగే ‘నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లా మెజొరానా’. పనామాలోని గ్వరారేలో ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో ఈ వేడుకలను నిర్వహిస్తారు. పనామా ప్రజల గ్రామీణ సంస్కృతి, సంగీతం, నృత్యం, సంప్రదాయ దుస్తులు, రైతుల జీవన విధానాన్ని ప్రతిబింబించే ఈ ఉత్సవం 1949లో ప్రారంభమైంది.ఈ మెజొరానా పండుగ ప్రారంభం వెనుక ఓ తండ్రి వేదన ఉంది. ఈ పండుగ నిర్వాహకులలో ఒకరైన మాన్యుయెల్ ఫెర్నాండో జారాతె కుమార్తె లుకీమియాతో బాధపడేది. దీంతో జారాతె ‘వర్జిన్ డి లాస్ మెర్సిడెస్’ అమ్మవారిని వేడుకున్నాడు. తన కుమార్తె ఆరోగ్యం బాగుపడితే, అమ్మవారి దయకు కృతజ్ఞతగా ప్రతి ఏడాది జానపద సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తానని మొక్కుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ బాలిక కోలుకోవడంతో– ఇచ్చిన మాట ప్రకారం 1949లో మొదటిసారి ఈ జానపద సంబరాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా సెప్టెంబర్లో నిర్వహించే ఈ వేడుకలకు వేలాదిమంది భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తరలివస్తారు. ఈ ఏడాది ఈ వేడుకలను సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు.పనామా గ్రామీణ సంప్రదాయాలను కాపాడటమే ఈ మెజొరానా పండుగ లక్ష్యం. ముఖ్యంగా రైతుల జీవన విధానం, వారి పాటలు, సంగీతం, నృత్యాలు, దుస్తులు, చేతివృత్తులు, స్థానిక కళలను తరువాతి తరాలకు అందించాలనుకున్నారు. అందులో ప్రధాన పాత్రను ‘మెజొరానా’ అనే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ సంగీత వాయిద్యానికి ఇచ్చారు. పరిమాణంలో చిన్నదిగా కనిపించినా దాని శబ్దానికి ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పనామా గ్రామీణ కవులు పాడే ‘దెసిమా’ పాటలకు ఇది సంగీత సహకారం అందిస్తుంది. సెడార్, బాల్సో, వోలడార్ వంటి స్థానిక కలపతో ఈ మెజొరానాలను తయారు చేస్తారు. గతంలో వీటి తంత్రుల కోసం కోడి పేగులను ఉపయోగించేవారు, ప్రస్తుతం నైలాన్ తీగలను ఉపయోగిస్తున్నారు.కారెటాస్ పరేడ్ మరో ప్రత్యేకత అలంకరించిన ఎద్దుల బండ్ల ఊరేగింపు. పండుగ ముగింపు వేడుకల్లో ఈ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.‘ఫెస్టివల్ ఆఫ్ మెజొరానా’ కేవలం ఒక సంగీత వేడుక కాదు. అనేక సంప్రదాయ కళలకు వేదిక. దాదాపు 75 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఈ వేడుక ప్రాంతీయ అస్తిత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యానికి కూడా వేదిక కల్పిస్తోంది. ఒక కుటుంబం మొక్కుకున్న మొక్కు ఓ దేశానికి పండుగగా మారి, జానపద సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.పాటల్లో పలికే రైతు జీవితం..ఈ ఉత్సవంలోని ‘దెసిమా’ పాటలు ప్రత్యేక ఆకర్షణ. గ్రామీణ జీవితం, రైతుల కష్టాలు, ప్రేమ, ప్రకృతి వంటి ఎన్నో విషయాలను పాటల రూపంలో చెప్పే సంప్రదాయం ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పోటీల్లో పాల్గొంటారు.- రమా జంబులఇదీ చదవండి: శాపంతో చెట్లుగా మారిన దంపతులు.. వినాయక పూజలో దాగిన కథ!
శాపంతో చెట్లుగా మారిన దంపతులు.. వినాయక పూజలో దాగిన కథ!
పూర్వం మాళవదేశంలో ఔరవుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు వేదవేదాంగవేత్త, పండితుడు, మేధావి. అతడి భార్య సుమేధ. భర్తకు తగిన ఇల్లాలు. ఆ దంపతులకు ఒక బాలిక జన్మించింది. వారు ఆమెకు శమీక అని నామకరణం చేసి, అల్లారుముద్దుగా పెంచసాగారు.శమీకకు ఎనిమిదేళ్లు వచ్చాక ఔరవుడు కుమార్తె కోసం వరాన్వేషణ ప్రారంభించాడు. ధౌమ్యుడి పుత్రడు, శౌనక మహర్షి శిష్యుడు, గురుసేవాతత్పరుడు అయిన మందారుడు అనే బాలుడి గురించి విన్నాడు. ధౌమ్య శౌనకులతో తన ఇంటికి సకుటుంబ సపరివారంగా ఆహ్వానించి, మందారుడితో తన కుమార్తె శమీక వివాహాన్ని జరిపించాడు. వివాహం తర్వాత మందారుడు తన గురుకులానికి వెళ్లిపోయాడు.కొంతకాలానికి శమీక వ్యక్తురాలైంది. ఈ సంగతి తెలుసుకుని, మందారుడు అత్తవారింటికి వచ్చాడు. ఔరవుడు అతడికి మృష్టాన్న భోజనం పెట్టి, అల్లుడి మర్యాదలన్నీ చేశాడు. ధన కనక రాశులతో కుమార్తెను అప్పగించాడు. ‘విప్రపుత్రా! నా కుమార్తెను విధి విధానంగా నీకు అప్పగిస్తున్నాను. ఆమెను అత్యంత ప్రేమగా చూసుకుంటూ, జాగ్రత్తగా దాంపత్యం చేయాలి’ అని పరిపరి విధాలుగా జాగ్రత్తలు చెప్పి, సాగనంపాడు. శమీక మందారులు వెంటనే ఆశ్రమానికి వెళ్లక వనంలోనే సల్లాపాలాడుతూ గడపసాగారు. కొద్ది రోజులకు వారు ఉంటున్న వనానికి భృశుండి మహర్షి వచ్చాడు. దీర్ఘతపస్సు ఆచరించడం వల్ల ఆయన భ్రూమధ్యంలో తొండం అంకురించింది. నుదుట తొండం ఉన్న ఆ మహర్షి రూపాన్ని చూసి, శమీక మందారులు యవ్వన చాపల్యంతో పరిహసించారు.వారి పరిహాసానికి భృంశుడికి కోపం వచ్చింది. ‘మూర్ఖులారా! మీరు నన్ను పరిహసించి నవ్వారు. అందువల్ల మీరు సర్వప్రాణులూ వర్జించే వృక్షాలుగా మారిపోండి’ అని శపించారు. భృంశుడి శాపానికి శమీక మందారులు భయంతో వణికిపోయారు. వెంటనే క్షమించమంటూ ఆయన పాదాల ముందు మోకరిల్లారు.‘మీరు నా నుదుటనున్న తొండాన్ని చూసి నవ్వారు. అందువల్ల తొండమున్న దేవుడైన వినాయకుడు మిమ్మల్ని కటాక్షించినప్పుడు మీకు మీ నిజరూపాలు తిరిగి వస్తాయి’ అని చెప్పి, వెళ్లిపోయాడు. శమీక శమీవృక్షంగా, మందారుడు మందారవృక్షంగా మారిపోయారు. అత్తవారింటికి వెళ్లిన శిష్యుడు ఎన్నాళ్లయినా తిరిగి రాకపోవడంతో శౌనకుడు శిష్య సమేతంగా ఔరవుని ఇంటికి వెళ్లి, మందారుడి గురించి అడిగాడు. తాను కూతురితో సహా అల్లుడిని చాలారోజుల కిందటే పంపానని ఔరవుడు బదులిచ్చాడు. పిల్లలు జాడలేకుండా పోవడంతో శౌనకుడు, ఔరవుడు– ఇద్దరూ చింతాక్రాంతులయ్యారు. అడవిమార్గంలో వారిని ఏ క్రూరమృగాలైనా చంపేసి ఉంటాయేమోనని లేదా చోరుల బారినపడి హతమైపోయి ఉంటారేమోనని భయపడ్డారు. చివరకు ఇద్దరూ కలసి శమీక మందారులను వెదకడానికి అడవిలోకి వెళ్లారు. అటవీమార్గంలో వారి పాదచిహ్నాలను గుర్తించారు. అలసిపోవడంతో ఔరవ శౌనకులు అడవిలోని కొలనులో స్నానం చేసి, ధ్యానమగ్నులయ్యారు. ధ్యానంలో వారికి జరిగినదంతా తెలిసింది.‘మందారుడిని చదువు కోసం అతడి తండ్రి నా గురుకులంలో వదిలి వెళ్లాడు. అతడికి నేనిప్పుడు ఏమని బదులివ్వాలి?’ అని శౌనకుడు శోకతప్తుడయ్యాడు. ఔరవుడిదీ అదే పరిస్థితి. గణేశుడిని ఆరాధించి, వీరి శాపవిమోచనను కోరుకుందాం అని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే వారు ఒంటికాలిపై నిలబడి గణేశుని కోసం తపస్సు ప్రారంభించారు. నిరాహారులై వారు ఒంటికాలిపై ఏకధాటిగా సాగిస్తున్న తపస్సుకు గణేశుడు ప్రసన్నుడయ్యాడు. వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఏకదంతుడు కళ్లముందు నిలిచే సరికి శౌనక ఔరవులు భక్తిపారవశ్యంతో అతడిని స్తుతించారు.‘భక్తులారా! మీ తపస్సుకు మెచ్చాను. మీ మనోభీష్టమేమిటో చెప్పండి, నెరవేరుస్తాను’ అని పలికాడు గజాననుడు. శౌనక ఔరవులు శమీక మందారుల వృత్తాంతాన్ని చెప్పి, వారికి శాపవిమోచనం కలిగించాలని కోరారు. గణేశుడు ‘తథాస్తు’ అని పలికాడు.‘నేను ఎల్లప్పుడూ మందారవృక్ష మూలంలో నిలిచి ఉంటాను. శమీవృక్షంలోనూ కొలువై ఉంటాను. నాకు దూర్వాంకురాలే కాకుండా శమీపత్రాలు కూడా ప్రీతిపాత్రమవుతాయి. దూర్వాంకురాలు, మందార పత్రాలు లభించనప్పుడు శమీపత్రాలతో పూజిస్తే, నేను ప్రసన్నుడనవుతాను. దూర్వాంకుర, మందారపత్ర, శమీపత్రాలతో నన్ను పూజించేవారికి మనోవాంఛిత సిద్ధి, మోక్షప్రాప్తి కలుగుతాయి’ అని పలికి గణపతి అంతర్ధానమయ్యాడు.పురావిశేషం..ఇది దేశంలోనే అత్యంత అరుదైన ఆలయం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లా కుమావూ కొండల ప్రాంతంలో చితాయి గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని స్థానికులు ‘గోలూ దేవతా’ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడి మూలవిరాట్టు ‘చితాయీ గోలూ దేవత’ శివుడి అవతారమైన గౌరభైరవుడు. గౌరభైరవుడు సత్వరన్యాయం చేస్తాడని భక్తుల విశ్వాసం. న్యాయం కోరుతూ రాసే విజ్ఞాపనపత్రాలను భక్తులు ఈ ఆలయంలో వేలాడదీస్తారు. తమకు న్యాయం జరిగితే, ఆలయానికి తిరిగి వచ్చి కంచు లేదా రాగి లేదా ఇత్తడి లోహాలతో తయారు చేసిన గంటలను వేలాడదీస్తారు. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా, అసంఖ్యాకంగా గంటలు, భక్తులు వేలాడదీసే విజ్ఞాపనపత్రాల కాగితాలు కనిపిస్తాయి.- సాంఖ్యాయనఇదీ చదవండి: కృష్ణాష్టమి తెలిసిందే.. ‘రాధాష్టమి’ ఎంతమందికి తెలుసు?
అంతర్జాతీయం
పశ్చిమాసియాలో మళ్లీ భీకర యుద్ధం.. ట్రిప్ను అర్ధంతరంగా ముగించిన ట్రంప్!
వాషింగ్టన్: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తారాస్థాయికి చేరడంతో వైట్హౌస్ తీవ్ర అప్రమత్తమైంది. ఈ భద్రతా సంక్షోభం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వీకెండ్ క్యాంప్ డేవిడ్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. హుటాహుటిన రాజధాని వాషింగ్టన్కు తిరుగుపయనమయ్యారు. ఉద్రిక్తతల తీవ్రత దృష్ట్యా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తన టెక్సాస్ పర్యటనతో పాటు, ఎలాన్ మస్క్తో జరగాల్సిన కీలక భేటీని కూడా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం అనంతరం తిరిగి ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, మేరీలాండ్లోని క్యాంప్ డేవిడ్ నిర్బంధ గగనతలంలోకి అనుమతి లేకుండా ఒక సాధారణ విమానం ప్రవేశించడం కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు, ఫ్లేర్లను వదులుతూ ఆ విమానాన్ని అడ్డగించి, పైలట్ను సురక్షిత ప్రాంతానికి తరలించాయి.9 దేశాల్లో అమెరికా హై-అలర్ట్పశ్చిమాసియాలో ఎప్పుడైనా భారీ సైనిక ఘర్షణ చెలరేగే ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఓమాన్, లెబనాన్, జోర్డాన్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్, యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియాతో సహా మొత్తం తొమ్మిది దేశాల్లోని తమ పౌరులకు అమెరికా రాయబార కార్యాలయాలు అత్యవసర భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. గగనతలాలు అకస్మాత్తుగా మూతపడే అవకాశం ఉన్నందున, విమాన సర్వీసుల రద్దుకు సిద్ధంగా ఉండాలని సూచించాయి.సౌదీపై హూతీల దాడి.. రియాద్లో ఎయిర్ అలర్ట్ యెమెన్కు చెందిన ఇరాన్ మద్దతుదారులు హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని సున్నితమైన ప్రాంతాలపై, ఎర్రసముద్ర తీరంలోని ఇంధన కేంద్రాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీగా పొగలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సౌదీ రక్షణ దళాలు ఒక బాలిస్టిక్ క్షిపణిని గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు ప్రకటించాయి. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో సౌదీ సివిల్ డిఫెన్స్ చరిత్రలోనే మొదటిసారిగా రియాద్, అల్-ఖర్జ్ నగరాల్లో వైమానిక దాడుల హెచ్చరికల సైరన్లు మోగించింది.రూ.26 వేల కోట్ల భారీ ఆయుధ ప్యాకేజీపశ్చిమాసియా ఘర్షణల వేళ.. ఇజ్రాయెల్కు సుమారు రూ.26 వేల కోట్ల భారీ ఆయుధ ప్యాకేజీని అమెరికా ఆమోదించింది. ఇందులో ఒక్కొక్కటి టన్ను బరువున్న సుమారు 40 వేల అత్యాధునిక బాంబులు ఉన్నాయి. అమెరికా ఆయుధాగారంలో ఉన్న అత్యంత విధ్వంసకరమైన ఆయుధాల్లో 'ఎంకే-84' ఒకటి. ఇందులో భాగంగా ఇజ్రాయెల్కు 20 వేల 'ఎంకే-84' బాంబులతో పాటు మరో 20 వేల 'బీఎల్యూ-117' బాంబులను పంపేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. వీటితో పాటు 20 వేల 'ఐ-2000' పెనెట్రేటర్ వార్హెడ్స్ను కూడా ఈ ప్యాకేజీలో చేర్చారు. ఈ 'ఎంకే-84' బాంబులు విస్ఫోటనం చెందితే, వాటి లోహపు శకలాలు వేలాది అడుగుల దూరం వరకు ఎగిరిపడి తీవ్ర ప్రాణనష్టాన్ని కలిగిస్తాయి.ఇదీ చదవండి : అమెరికాతో ఇక కురుక్షేత్రమే.. ట్రంప్కు ఇరాన్ వార్నింగ్
సౌదీకి బిగ్ రిలీఫ్.. హౌతీల దాడుల వేళ తుర్కియే సంచలన నిర్ణయం!
సౌదీపై హౌతీల దాడులు.. రియాద్లో వరుస పేలుళ్లు.. ఆకాశంలో క్షిపణులు, డ్రోన్ల కలకలం. పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్న వేళ తుర్కియే సంచలన ప్రకటన చేసింది. సౌదీకి అవసరమైన సైనిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అంకారా స్పష్టం చేసింది. ఇప్పటికే పాకిస్తాన్తో కలిసి సౌదీతో రక్షణ ఒప్పందం చేసుకున్న తుర్కియే ఇప్పుడు సైనిక-సాంకేతిక సాయం చేస్తామని ప్రకటించడం పశ్చిమాసియాలో కొత్త టెన్షన్కు తెరలేపింది. హౌతీల దాడులు మరింత పెరిగితే ఈ రక్షణ కూటమి ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.కాగా, యెమెన్ హౌతీల వరుస క్షిపణి, డ్రోన్ దాడులతో సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌదీకి అవసరమైన సైనిక సహాయం అందించేందుకు తుర్కియే సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ ప్రకటించారు. ముఖ్యంగా సైనిక సాంకేతిక అవసరాలను తీర్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామం ఇటీవల తుర్కియే, సౌదీ, పాకిస్తాన్ మధ్య కుదిరిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై మరోసారి దృష్టిని మళ్లించింది.సౌదీ రాజధాని రియాద్ సహా పలు ప్రాంతాలపై హౌతీలు దాడులు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం రియాద్లోని కీలక ప్రాంతాలను క్షిపణులు, డ్రోన్లతో లక్ష్యంగా చేసుకున్నట్లు హౌతీలు వెల్లడించారు. ఇదే సమయంలో నగరంలోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మంటలు, భారీగా పొగ కనిపించింది. సౌదీ అధికారులు రియాద్ వైపు వచ్చిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాణనష్టం జరిగినట్లు వెల్లడించలేదు. అయితే, హౌతీల దాడులు కేవలం రాజధాని రియాద్కు మాత్రమే పరిమితం కావడం లేదు. ఇంధన మౌలిక వసతులు, నగరాలు, సముద్ర రవాణా మార్గాలపైనా దాడుల ముప్పు పెరిగింది. దీంతో ప్రపంచ చమురు సరఫరా, ఎర్ర సముద్ర వాణిజ్య మార్గాలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.విమానాశ్రయం వద్ద ఏం జరిగింది?రియాద్ విమానాశ్రయం సమీపంలో భారీగా పొగ కనిపించడంతో పాటు మంటలు కూడా చెలరేగిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మంటలు ఇంధన నిల్వ ప్రాంతానికి సమీపంలో కనిపించినట్లు రాయిటర్స్ దృశ్యాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దాడుల హెచ్చరికల నేపథ్యంలో సౌదీ అధికారులు రియాద్, అల్-ఖర్జ్ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం పరిస్థితి అదుపులోకి రావడంతో ‘ఆల్ క్లియర్’ ప్రకటించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో రియాద్లో ఈ స్థాయిలో వైమానిక దాడి హెచ్చరికలు రావడం ఇదే తొలిసారి అని నివేదికలు చెబుతున్నాయి.తుర్కియే కీలక ప్రకటన..ఈ పరిస్థితుల్లో తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సౌదీ అరేబియా ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వంపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సౌదీకి కొన్ని సైనిక అవసరాలు, ముఖ్యంగా సాంకేతిక రంగంలో అవసరాలు ఉండొచ్చని.. వాటిని తీర్చేందుకు తుర్కియే సిద్ధంగా ఉందని చెప్పారు. అంటే వెంటనే తుర్కియే సైన్యాన్ని యెమెన్లోకి పంపుతామని హింట్ ఇచ్చారు. ఇదే సమయంలో యుద్ధాన్ని మరింత విస్తరించకుండా దౌత్యపరమైన పరిష్కారం కోసం కూడా తుర్కియే ప్రయత్నిస్తున్నట్లు ఫిదాన్ తెలిపారు.🇾🇪🇸🇦 King Khalid International Airport in Riyadh, Saudi Arabia is burning pic.twitter.com/5sugQvpgUP— Megatron (@Megatron_ron) September 19, 2026‘మక్కా డిఫెన్స్ ప్యాక్ట్’ ఏంటి?ఇటీవల తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఒప్పందంలోని కీలక అంశం ఏమిటంటే.. మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించేలా పరస్పర రక్షణ సూత్రాన్ని రూపొందించారు. అందుకే సౌదీపై హౌతీల దాడులు పెరిగిన సమయంలో తుర్కియే నుంచి వచ్చిన ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ ఒప్పందం ఆధారంగా పాకిస్తాన్, తుర్కియే తక్షణమే ప్రత్యక్ష సైనిక చర్యకు దిగుతాయని చెప్పడానికి ప్రస్తుతానికి అధికార ప్రకటన చేయలేదు. మరోవైపు.. సౌదీపై హౌతీల దాడుల నేపథ్యంలో మక్కా ఒప్పందం కింద పాక్ సైనిక చర్యపై ఎలాంటి చర్చలు జరగలేదని ఇస్లామాబాద్ తెలిపింది. అదే సమయంలో సౌదీ భద్రతకు సంబంధించిన తమ బాధ్యతలను పాకిస్తాన్ గుర్తిస్తోంది. దీంతో ఒప్పందంలోని పరస్పర రక్షణ హామీ ఇప్పుడు ఆచరణలో ఎలా అమలవుతుందన్నది కీలక అంశంగా మారింది.హౌతీల హెచ్చరిక..ఇదిలా ఉండగా తుర్కియే, పాకిస్తాన్.. సౌదీకి సైనికంగా మద్దతు ఇచ్చే అవకాశాలపై హౌతీలు కూడా హెచ్చరికలు జారీ చేశారు. తాము సైనికంగా జోక్యం చేసుకుంటే తీవ్రమైన గట్టి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఒకవైపు సౌదీపై దాడులు.. మరోవైపు తుర్కియే మద్దతు ప్రకటన.. ఇంకోవైపు పాకిస్తాన్ ముందు ఉన్న కీలక రక్షణ ఒప్పంద బాధ్యతలు.. మొత్తం పరిణామం పశ్చిమాసియాలో కొత్త భద్రతా సమీకరణాలకు దారితీసే పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో హౌతీల దాడులు మరింత విస్తరిస్తే ఈ మూడు దేశాల పరస్పర రక్షణ హామీ ఏ రూపంలో ఆచరణలోకి వస్తుందన్నది ఇప్పుడు పశ్చిమాసియా పరిణామాల్లో కీలకంగా మారింది.ఇదీ చదవండి: సౌదీలో మోగిన హెచ్చరిక సైరన్లు..
అమెరికాతో ఇక కురుక్షేత్రమే.. ట్రంప్కు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని ఇరాన్ అమెరికాకు పిలుపునిచ్చింది. యుద్ధం ముగియాలంటే అమెరికా తమ ఏడు డిమాండ్లకు అంగీకరించాలని, లేదంటే ఆ దేశంతో చావోరేవో తేల్చుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది.ఒకవేళ తాము పెడుతున్న ఏడు షరతులకు అమెరికా ఒప్పుకుంటే, ఖతార్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుపుతామని తెలిపింది. మరి ఇరాన్ డిమాండ్లపై అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సేన్ రెజాయీ ప్రముఖ ఖతార్ ఆంగ్ల మీడియా సంస్థ 'అల్ జజీరా'తో మాట్లాడారు. “అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా ఖతార్ మధ్యవర్తిత్వంతో మా డిమాండ్లు ఏంటో అమెరికాకు తెలియజేశాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం” అని ఆయన వెల్లడించారు.ఇరాన్ డిమాండ్లు ఇవేఅన్ని రకాల సరిహద్దుల్లోనూ యుద్ధాన్ని పూర్తిగా ఆపివేయడం,విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం.ఇరాన్పై విధించిన నావికా దిగ్బంధాన్ని ఎత్తివేయడం. ఇలా మొత్తం ఏడు స్పష్టమైన డిమాండ్లను ఖతార్ ద్వారా అమెరికాకు తెలియజేసినట్లు రెజాయ్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.ఈ సందర్భంగా ట్రంప్ బెదిరింపుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈ షరతులను అంగీకరించడమే అమెరికాకు మంచిదని రెజాయ్ స్పష్టం చేశారు. అమెరికా వైపు నుంచి భవిష్యత్తులోనూ దాడులు జరిగే అవకాశం ఉందని తమ సైనిక అంచనాలు చెబుతున్నాయని, దానిని ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతం నుంచి అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్న అమెరికా నావికాదళ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని తమ సైనిక వ్యూహాలను మార్చుకున్నట్లు తెలిపారు. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే, ప్రాంతీయంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, వాణిజ్య సంస్థలపై తీవ్ర ప్రతిస్పందన ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.అణు విధానం ఇరాన్ అణు విధానంలో ఎలాంటి మార్పు లేదని రెజాయ్ స్పష్టం చేశారు. అణు ఆయుధాలను నిషేధించే మతపరమైన ఫత్వాకు (డిగ్రీకి) తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయితే, అమెరికా అనుసరించే దురుసు విధానాల వల్ల తాము 'న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీ' నుంచి వైదొలగవలసి వచ్చే పరిస్థితి రావొచ్చని హెచ్చరించారు.మధ్యవర్తిత్వ ప్రయత్నాలు గతేడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత ప్రారంభమైన ఈ సంఘర్షణను ముగించేందుకు ఖతార్,పాకిస్థాన్ దేశాలు దౌత్యపరమైన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఒకవైపు దౌత్య చర్చలకు సిద్ధమంటూనే, మరోవైపు సైనిక సన్నద్ధతను కూడా ఇరాన్ విడనాడలేదని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఇరాన్ ప్రతినిధి బృందానికి అమెరికా విదేశాంగ శాఖ వీసాలు జారీ చేసినట్లు సమాచారం.
ఎల్ నినో సంక్షోభం: 5 కోట్ల మందికి ‘ఒక్క పూట’ కూడా కష్టమే..
ఆసియాను భారీ వాతావరణ ముప్పు అతలాకుతలం చేయనుందా? సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పుల ప్రభావం కలిసి ఈ ఏడాది ఎల్ నినోను మరింత శక్తిమంతంగా మారుస్తున్నాయన్న హెచ్చరికలు ఆందోళనకరంగా మారాయి. దీని ప్రభావంతో ఆసియాలో సుమారు 5 కోట్ల మంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూపీ) హెచ్చరించింది. భారత్, శ్రీలంకతో పాటు పలు దేశాలు ఇప్పటికే కరువు, నీటి కొరత, ఆహార భద్రతపై ముందస్తు చర్యలు ప్రారంభించాయి.ఎల్ నినో ఎందుకింత ప్రమాదకరం?ఐక్యరాజ్యసమితి వర్గాల హెచ్చరికల ప్రకారం ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణంగా వేడెక్కుతున్న నీరు, వాతావరణ మార్పులు కలిసి పరిస్థితిని క్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ ఏడాది ఎల్ నినో గత కొన్ని దశాబ్దాల రికార్డులను అధిగమించే స్థాయికి చేరవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ కూడా ఎల్ నినో ప్రభావం క్రమంగా తీవ్రతరం అవుతున్నదని హెచ్చరించారు. వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు వ్యవసాయం, నీటి లభ్యత, ఆహార సరఫరాపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది.భారత్లో ఇప్పటికే కనిపిస్తున్న సంకేతాలేంటి?భారత్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతున్న రుతుపవన కాలంలోనే కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. జూన్, ఆగస్టు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవగా, సెప్టెంబర్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు తగ్గినట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కరవు పరిస్థితుల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖరీఫ్ పంటలైన వరి, పప్పుధాన్యాలు, పత్తి, మొక్కజొన్నల దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దిగుబడులు తగ్గితే ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉండటంతో తక్కువ ఆదాయ, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై భారం పెరగవచ్చని అంచనా.భారత్ ఏం చేస్తోంది?శాస్త్రవేత్తల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి పెట్టింది. రైతులకు రక్షణ చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 350కిపైగా జిల్లాల్లో నీటి సంరక్షణ చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. తక్కువ నీటితో పండే, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలైన పప్పుధాన్యాలు, సజ్జలు వంటి వాటిని సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడం, నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.శ్రీలంకలో నీటి కష్టాలు ముదిరాయా?ఎల్ నినో ప్రభావంతో శ్రీలంకలో గత దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నట్లు నివేదిక తెలిపింది. 1.6 లక్షలకుపైగా ప్రజలు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. పలు జలాశయాలు ఎండిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. యాలా నేషనల్ పార్క్ వంటి పర్యాటక ప్రాంతాలను సైతం మూసివేయాల్సి వచ్చింది. వన్యప్రాణులకు నీటిని ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. ఈశాన్య ప్రాంతాల్లో చెరువులు ఎండిపోవడంతో వేలాది చేపలు మృతి చెందాయి. సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే ప్రణాళికపై శ్రీలంక విపత్తు నిర్వహణ సంస్థ పనిచేస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఆ సామర్థ్యం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.ఆగ్నేయాసియాలో బియ్యం కొరత ముప్పు?ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఆహార భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఈసారి బియ్యం ఉత్పత్తి 8 నుంచి 10 శాతం వరకు తగ్గవచ్చని అంచనాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో కుటుంబ ఆదాయంలో గణనీయమైన భాగం ఆహారానికే ఖర్చవుతుంది. పంట దిగుబడులు తగ్గి ధరలు స్వల్పంగా పెరిగినా కుటుంబాలపై ఆర్థిక భారం పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆహార భద్రతను కేవలం వ్యవసాయ సమస్యగా కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పలు దేశాలు పరిగణిస్తున్నాయి. సేంద్రియ ఎరువులు, పునరుత్పాదక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే చర్యలు కూడా చేపడుతున్నాయి.వేడి, భారీ వర్షాలు.. తుపాన్ల ముప్పు కూడా?తూర్పు ఆసియాలో ఎల్ నినో ప్రభావం కేవలం వర్షాభావానికే పరిమితం కాకుండా తీవ్ర వేడి, భారీ వర్షాలు, తుపాన్ల రూపంలోనూ కనిపించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. దక్షిణ కొరియాలో జూలై అత్యంత పొడి నెలగా నమోదైన తర్వాత భారీ వర్షాలు కురిశాయి. 18 ఏళ్ల తర్వాత అక్కడ హీట్వేవ్ హెచ్చరిక వ్యవస్థను మార్చారు. జపాన్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైన రోజును అధికారికంగా ‘క్రూరమైన వేడి’ రోజుగా గుర్తించారు. సూపర్ టైఫూన్ల ముప్పు నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. హాంకాంగ్లో తీవ్ర వేడి సమయంలో ఉద్యోగులకు చల్లదనం కల్పించే ఏర్పాట్లు కంపెనీలకు తప్పనిసరి చేశారు. చైనాలో 100 రోజుల వాతావరణ ప్రమాద నివారణ కార్యక్రమం ప్రారంభించగా, తైవాన్ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే పరిస్థితులపై సిమ్యులేషన్ నిర్వహించింది. మొత్తంగా అల్ నినో ప్రభావం ఆహారం, నీరు, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థలపై ఒకేసారి ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలు కీలకంగా మారాయి.ఇదీ చదవండి: ‘మరో రోహిత్ వేముల..’ దళిత పీహెచ్డీ విద్యార్థి ఆవేదన
జాతీయం
ఏఐ చూపిన దారి.. క్లైమాక్స్ మాములుగా లేదు!
తీర్థయాత్రకు వెళ్లిన పంజాబ్కు చెందిన ఓ వృద్ధుడు దారి తప్పి తన ఇంటికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గయకు చేరుకున్నాడు. ఓ వ్యక్తి చాట్జీపీటీ సాయంతో చివరకు ఆయనను కుటుంబంతో కలిపారు. లుధియానా జిల్లాలోని ఫతేగఢ్ గుజ్రాన్ గ్రామానికి చెందిన చమన్ లాల్ సెప్టెంబర్ 11న పంజాబ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి తీర్థయాత్ర పథకం ద్వారా హర్మందిర్ సాహిబ్ను దర్శించేందుకు అమృత్సర్ వెళ్లారు.అయితే, ఆయనకు కొంతకాలంగా జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అమృత్సర్లో ఎక్కడో ఆయన తన బృందం నుంచి తప్పిపోయి.. చివరకు రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకున్నారు. అక్కడి నుంచి బిహార్ వెళ్లే రైలు ఎక్కి.. ఇంటికి 1,200 కిలోమీటర్లకు పైగా దూరంలోని గయకు చేరుకున్నారు.అక్కడే గయకు చెందిన నీరజ్ ఆయనను మొదట గమనించాడు. చమన్ లాల్ ఆందోళనగా.. ఆకలితో కనిపించడంతో పాటు తాను ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. ఆయన చెప్పగలిగిన ఏకైక సమాచారం తన గ్రామం పేరు ఫతేగఢ్ గుజ్రాన్. నీరజ్ ఆయనను తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి.. ఆశ్రయం కల్పించారు. కుటుంబంతో కలిసి నాలుగు రోజుల పాటు ఆయనను చూసుకున్నాడు. అదే సమయంలో ఆ వృద్ధుడి కుటుంబాన్ని ఎలా గుర్తించాలా? అని ప్రయత్నించాడు.చమన్ లాల్ కేవలం పంజాబీ మాత్రమే మాట్లాడటం నీరజ్కు తొలి ఆధారంగా మారింది. గ్రామం పేరును ఆధారంగా చేసుకుని అది పంజాబ్లో ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఆన్లైన్లో శోధించడం ప్రారంభించాడు. ఇందుకోసం చాట్ జీపీటీతో పాటు సాధారణ ఇంటర్నెట్ సెర్చ్లను కూడా ఉపయోగించాడు. మూడు రోజుల పాటు సాగిన శోధన చివరకు ఫలించింది. లుధియానా జిల్లాలోని మచ్చివారా సాహిబ్ సమీపంలో ఫతేగఢ్ గుజ్రాన్ అనే గ్రామం ఉన్నట్లు ఆయన గుర్తించాడు. గ్రామం ఆచూకీ లభించిన తర్వాత.. చమన్ లాల్ను ఒంటరిగా పంపకుండా నీరజ్ స్వయంగా ఆయనతో కలిసి గయ నుంచి లుధియానా వరకు, అక్కడి నుంచి మచ్చివారా వరకు ప్రయాణించాడు.మచ్చివారాలో నీరజ్ చమన్ లాల్ ఫొటోను స్థానికులకు చూపిస్తూ.. ఎవరైనా ఆయనను గుర్తుపడతారేమోనని ప్రయత్నించాడు. అప్పుడు ఆ ప్రాంతానికి చెందిన కృష్ణన్ లాల్ ఆ వృద్ధుడిని గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం చేరింది. చమన్ లాల్ మనవడు సుఖ్చైన్ సింగ్ మచ్చివారాకు చేరుకుని.. ఆయన తన తాతేనని నిర్థారించాడు. అమృత్సర్లో చమన్ లాల్ కోసం కుటుంబ సభ్యులు విస్తృతంగా గాలించారని.. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని సుఖ్చైన్ సింగ్ తెలిపారు.గ్రామస్తులు, బంధువులు ఆయన ఫొటోను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసి.. ఎక్కడైనా ఆయన కనిపిస్తే సమాచారం అందించాలని కోరారు. తన తాతను సురక్షితంగా చూసుకోవడంతో పాటు, గయ నుంచి పంజాబ్ వరకు స్వయంగా తీసుకొచ్చి ఇంటికి చేర్చిన నీరజ్కు సుఖ్చైన్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం చమన్ లాల్ కుటుంబ సభ్యులు నీరజ్ను తమ ఇంటికి ఆహ్వానించి, పూలమాలలు వేసి సత్కరించారు. ఆయనకు నగదు, దుస్తులు కూడా అందించారు. గయాలో నిర్మాణ రంగంలో పనిచేసే నీరజ్ మాట్లాడుతూ.. ఇబ్బందుల్లో ఉన్న వృద్ధుడిని చూసి తాను అలా వెళ్లిపోలేకపోయానని చెప్పారు. గ్రామం పేరు తెలిసిన తర్వాత ఆయన కుటుంబాన్ని కనిపెట్టడం తన వ్యక్తిగత బాధ్యతగా భావించానని తెలిపారు.ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. బస్సు హైజాక్!
షాకింగ్.. మమతా బెనర్జీ ఎవరూ ఊహించని నిర్ణయం
నందిగ్రామ్లో వరుసగా చోటుచేసుకున్న పరిణామాలను చూస్తే.. ఇది కేవలం ఓ ఉప ఎన్నికకు సంబంధించిన పరిణామంగా మాత్రమే కనిపించడం లేదు. తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం, పార్టీ పేరు-గుర్తుపై ఎన్నికల సంఘం నిర్ణయం, మమతా బెనర్జీ వర్గం అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవడం, వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్కు మద్దతు ప్రకటించడం, ఆ తర్వాతే 2007 నందిగ్రామ్ కేసుల్లో ఆయన అరెస్టు కావడం.. ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి జరగడంతో నందిగ్రామ్ రాజకీయ ప్రాధాన్యం మరింత పెరిగింది.మిలన్ అరెస్టుకు పెండింగ్లో ఉన్న 4 నాన్-బెయిలబుల్ వారెంట్లే కారణమని పోలీసులు చెబుతుండగా, అరెస్టు చేసిన సమయాన్ని కాంగ్రెస్, మమతా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ మాత్రం ఇది న్యాయ ప్రక్రియలో భాగమేనని చెబుతోంది. గతంలో పరస్పరం తీవ్రంగా పోరాడిన రెండు పార్టీల మధ్య నందిగ్రామ్ వేదికగా ఏర్పడిన అసాధారణ రాజకీయ సమీకరణాన్ని సూచిస్తోంది. అక్టోబర్ 6న జరగనున్న పోలింగ్ వరకు మిలన్ ప్రధాన్ బెయిల్ పొందుతారా, కాంగ్రెస్ ఆయన గైర్హాజరీలో ప్రచారాన్ని ఎలా కొనసాగిస్తుంది, కాంగ్రెస్కు మమతా మద్దతు ఎంతవరకు కొనసాగుతుంది, ఈ పరిణామాలు తృణమూల్ అంతర్గత సంక్షోభంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నదే ఇప్పుడు నందిగ్రామ్లో కీలకంగా మారింది.కాంగ్రెస్ అభ్యర్థికి మమత మద్దతు పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్కు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. అక్టోబర్ 6న జరగనున్న ఉప ఎన్నిక బరిలో తమ వర్గం నుంచి నిలబెట్టిన సంచిత ప్రధాన్ పోటీ నుంచి తప్పుకున్న కొన్ని గంటలకే మమత ఈ నిర్ణయం తీసుకున్నారు.మిలన్ ప్రధాన్కు మద్దతు ప్రకటించిన మమత.. కాంగ్రెస్ను సోదర పార్టీ, సహజ మిత్రపక్షంగా అభివర్ణించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, ఇండియా కూటమిని బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బెంగాల్ నుంచి ప్రతిపక్ష కూటమి భవిష్యత్తుపై సందేశం ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.నందిగ్రామ్తో పాటు రెజినగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత వివాదం నెలకొంది. ఈ వివాదం నేపథ్యంలో ఎన్నికల సంఘం తృణమూల్ కాంగ్రెస్ పేరు, సంప్రదాయ ‘గడ్డి పువ్వు’ గుర్తును స్తంభింపజేసింది. మమతా బెనర్జీ వర్గానికి, అసమ్మతి వర్గానికి వేర్వేరు పేర్లు, గుర్తులను కేటాయించింది.మిలన్ ప్రధాన్ నందిగ్రామ్ భూసేకరణ ఉద్యమానికి సంబంధించిన 2007 కేసులో మమత మద్దతు ప్రకటించిన కొద్దిసేపటికే అరెస్టయ్యారు. అనంతరం ఆయనను జైలుకు పంపారు. కాంగ్రెస్ నేతలు ఈ అరెస్టును విమర్శించారు. రాహుల్ గాంధీ దీనిని రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తూ పార్టీ పోరాడుతుందని అన్నారు.కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధురి మాత్రం తాజా పరిణామాన్ని తక్షణ రాజకీయ సఖ్యతగా చూడొద్దని అన్నారు. మరోవైపు, బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ మద్దతును స్వాగతించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య మాత్రం కాంగ్రెస్, తృణమూల్ మధ్య సాధ్యమైన అవగాహనను తిరస్కరించారు.నందిగ్రామ్ ఉప ఎన్నిక ఫలితాలు అక్టోబర్ 6న జరగనున్న పోలింగ్ తర్వాత వెలువడనున్నాయి. ఈ ఉప ఎన్నికలో తాజా రాజకీయ సమీకరణాలు ఎలా ప్రభావం చూపుతాయన్నది తదుపరి కీలక అంశంగా మారింది.
విమానంలో ఎగరాల్సిన నేహా.. ఇప్పుడు వేల కి.మీ. ట్రక్ నడుపుతూ..
హిమాచల్ప్రదేశ్లోని మండీకి చెందిన నేహా ఠాకూర్ చిన్నప్పటి నుంచి ఉన్న భారీ ట్రక్కులపై ఆసక్తిని వృత్తిగా మార్చుకున్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత చండీగఢ్లో విమాన సహాయకురాలి శిక్షణ తీసుకున్నప్పటికీ, చివరకు ట్రక్ డ్రైవింగ్నే వృత్తిగా ఎంచుకున్నారు. ప్రస్తుతం ఆమె హిమాచల్ప్రదేశ్ తొలి మహిళా ట్రక్ డ్రైవర్గా గుర్తింపు పొందారు.నేహాకు చిన్నప్పటి నుంచే పెద్ద టైర్లు, భారీ ట్రక్కులంటే ఆసక్తి ఉండేది. ఆమె తండ్రి కూడా ట్రక్ డ్రైవర్ కావడంతో ఆయన పనితీరు, కష్టపడే విధానం నేహాపై ప్రభావం చూపాయి. తండ్రి తరచూ ట్రక్లోనే ఆమెను పాఠశాలకు తీసుకెళ్లేవారు. 2022లో ట్రక్ నడపాలని నేహా నిర్ణయించుకున్నప్పుడు ఆమె తండ్రి పూర్తి మద్దతు ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ట్రక్ డ్రైవింగ్ ప్రారంభించారు. ఆ నిర్ణయంతో హిమాచల్ప్రదేశ్లో తొలి మహిళా ట్రక్ డ్రైవర్గా నిలిచారు.అయితే అంతకుముందు నేహా మరో వృత్తి వైపు అడుగులు వేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత చండీగఢ్కు వెళ్లి విమాన సహాయకురాలి వృత్తిపరమైన శిక్షణ తీసుకున్నారు. విమానయాన రంగంలో కొనసాగేందుకు అవకాశం ఉన్నప్పటికీ, తనకు చిన్నప్పటి నుంచి ఉన్న ట్రక్ డ్రైవింగ్ ఆసక్తినే ఎంచుకున్నారు. ఈ నిర్ణయానికి కుటుంబం కూడా మద్దతు ఇచ్చింది.ట్రక్ నడపడమే కాకుండా తన రోజువారీ జీవితాన్ని కూడా నేహా సామాజిక మాధ్యమాల్లో వీడియోల రూపంలో పంచుకుంటున్నారు. వర్షం, ఎండ వంటి వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ట్రక్కు సంబంధించిన వీడియోలను ఆమె షేర్ చేస్తున్నారు. ట్రక్ ప్రారంభమైన వెంటనే తన కెమెరా కూడా ప్రారంభమవుతుందని ఆమె ఓ వీడియోలో చెప్పింది. ప్రస్తుతం నేహా ట్రక్ డ్రైవింగ్ అనుభవాలు, రోజువారీ ప్రయాణాలను వీడియోల ద్వారా షేర్ చేస్తున్నారు. దీంతో ఆమె వృత్తి ప్రయాణం సామాజిక మాధ్యమాల్లో మరింతగా దృష్టిని ఆకర్షిస్తోంది. View this post on Instagram A post shared by Instagram’s @Creators (@creators)
బ్రిడ్జిపై నుంచి పడిన బీఎండబ్ల్యూ కారు
ముంబై: ముంబై కోస్టల్ రోడ్డుపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి బ్రిడ్జి గోడను ఢీకొట్టి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.బీఎండబ్ల్యూ కారు మెరైన్ డ్రైవ్ నుంచి హాజీఅలీ వైపు కోస్టల్ రోడ్డుపై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగం కారణంగా కారు నడుపుతున్న వ్యక్తి నియంత్రణ కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కారు ముందుగా బ్రిడ్జి గోడను ఢీకొట్టి.. అక్కడి నుంచి కిందకి పడిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కార్ల పార్కింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రమాదంపై తెల్లవారుజామున 5:20 గంటల సమయంలో కోస్టల్ రోడ్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందింది. కారులో ఉన్న నలుగురినీ వెంటనే నాయర్ ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు ముగ్గురు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు.మృతులను షనాయ్ గజ్జల్(21), ధైర్య దర్శన్ సేథ్(17), ఆదిత్య జకాస్నియా(19)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆదిత్య కల్పేశ్వర్ ఓస్వాల్(23)కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Three killed, one injured as speeding BMW crashes on Coastal Road in Mumbai.#Mumbai #BMWcrash pic.twitter.com/Mt0fXslLdN— Ravinder Singh (@ravindraJourno) September 20, 2026ఇదీ చదవండి: హైదరాబాద్లో ఒరిగిన భవనం.. ఎలా కూల్చేశారంటే..
ఎన్ఆర్ఐ
లండన్లో తెలంగాణ వ్యక్తి చారిత్రాత్మక ఘనత!
లండన్కు సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గౌరవాల్లో ఒకటైన “లండన్ నగర స్వేచ్ఛా పౌరసత్వం” (Freedom of the City of London) అవార్డును తెలంగాణకు చెందిన గణేశ్ కుప్పాల స్వీకరించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గణేశ్ కుప్పాల ఉద్యోగరీత్యా లండన్లో స్థిరపడ్డారు. కాగా సెప్టెంబర్ 16న గణేష్ కుప్పాల ప్రతిష్ఠాత్మకమైన లండన్ సిటీ “ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్” గౌరవాన్ని అధికారికంగా స్వీకరించారు.ఈ సందర్భంగా, చట్టప్రకారం అవసరమైన ప్రతిజ్ఞ చేసి, డామే సూసన్ కరోల్, కరోలిన్ లూసి సమక్షంలో ఆయనను Freedom of the Cityలో అధికారికంగా చేర్చారు. ఫ్రీమెన్ హక్కుల కొనుగోలు, వారి అధికారిక ప్రవేశాలకు సంబంధించిన I అక్షరంతో గుర్తించబడిన అధికారిక రిజిస్టర్ పుస్తకంలో, కింగ్ చార్లెస్ III పాలనలోని 6వ సంవత్సరంలో నమోదు చేయబడింది. లండన్ నగర చరిత్రలో ఎంతో విశిష్టమైన ఈ గౌరవాన్ని అందుకున్న ప్రముఖుల జాబితాలో కింగ్ చార్లెస్ III, క్వీన్ ఎలిజబెత్ II, ఫ్లోరెన్స్ నైటింగేల్, జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. తాజాగా ఇంతటి ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడిగా గణేష్ కుప్పాల నిలిచారు. అంతేకాదు తెలంగాణకు చెందిన తొలి వ్యక్తిగా లండన్లో అరుదైన గౌరవం పొందిన వ్యక్తిగా నిలిచారు ఈ ఘనత తెలంగాణ ప్రజలకు, తెలుగు వారందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజానికి ఎంతో గర్వకారణం. గణేష్, ఒక గొప్ప గౌరవాన్ని అందుకోవడమే కాకుండా, తెలంగాణ మరియు తెలుగు సమాజానికి ఒక చారిత్రాత్మక గుర్తింపును తీసుకువచ్చారు.ప్రతిష్ఠాత్మకమైన లండన్ సిటీ ఫ్రీడమ్ (Freedom of the City of London) గౌరవాన్ని అందుకున్న గణేష్ కుప్పాలను పలువురు బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులతో పాటు మాజీ ఎంపీ అభినందించారు. గణేశ్ను అభినందించిన వారిలో ఎంపీ సీమా మల్హోత్రా, ఎంపీ జస్ అథ్వాల్, ఎంపీ వెస్ స్ట్రీటింగ్, మాజీ యూకే ఎంపీ వీరేంద్ర శర్మ ఉన్నారు. ఇదీ చదవండి: వడ్డీ రేట్లు పెంచిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్
జీబ్రా క్రాసింగ్ ఉపయోగించకుంటే పదివేలు జరిమానా!
రోడ్డు దాటేటప్పుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని అబుదాబి పోలీసులు వాహదారులకు, పాదాచారులకు హెచ్చరించారు. రహదారి భద్రతను నిర్ధారించే చర్యల్లో భాగంగా, సోషల్ మీడియాలో పోలీసులు అవగాహన సందేశాన్ని విడుదల చేశారు. నిర్ధేశిత ప్రాంతాల్లో ఉండే జీబ్రా క్రాసింగ్లను పాదాచారులను ఉపయోగించకుంటే వారికి ఇకనుంచి జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. యూఏఈ వ్యాప్తంగా, ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించని లేదా నిర్దేశిత ప్రాంతానికి వెళ్లకుండా రోడ్లు దాటే పాదచారులకు 400 దిర్హమ్ల(భారత కరెన్సీలో రూ. 10వేలు) జరిమానా విధించబడుతుంది. ఇటువంటి ప్రవర్తనను అరికట్టి, సురక్షితమైన వాటిని ప్రోత్సహించడానికి ఎమిరేట్స్లోని అధికారులు అనేక హెచ్చరికలు జారీ చేశారు.రోడ్లపై నడిచే పాదచారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సిగ్నళ్లు కూడళ్ల వద్ద వేగాన్ని తగ్గించాలని వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక పాదాచారులను ఉద్దేశించి పోలీసులు మాట్లాడుతూ.. నిర్దేశించిన క్రాస్వాక్లు, వంతెనలు, సొరంగాలను ఉపయోగించాలి. ముఖ్యంగా పాదాచారులు ట్రాఫిక్ లైట్ సంకేతాలను అనుసరించండి.#فيديو | دعت #شرطة_أبوظبي السائقين والمشاة على أهمية الالتزام بقواعد السلامة المرورية، محذرة من مخاطر عبور الطرق من الأماكن غير المخصصة لما قد يسببه من حوادث دهس، وناشدت السائقين إلى توخي الحيطة والانتباه للمشاة وخفض السرعة بالقرب من مناطق العبور، فيما حثّت المشاة على استخدام… pic.twitter.com/B4Dalb7Fae— شرطة أبوظبي (@ADPoliceHQ) September 16, 2026
వంట గదిలో కుప్పకూలి భారతీయ వైద్యురాలు మృతి
షార్జాలో ఇంట్లో వంటగదిలో అకస్మాత్తుగా కుప్పకూలి కేరళకు చెందిన దంత వైద్యురాలు డాక్టర్ అఫీనా రహీమ్ (32) మృతి చెందారు. ఇద్దరు చిన్నారుల తల్లైన ఆమె తన భర్త యాసర్ టీ, పిల్లలతో కలిసి అల్ ఖాసిమియా ప్రాంతంలో నివసిస్తున్నారు.అఫీనా గతంలో దంత వైద్యురాలిగా పనిచేసినా, పిల్లల సంరక్షణ కోసం కొంతకాలంగా వృత్తికి దూరంగా ఉన్నట్లు కుటుంబ సభ్యుడు తెలిపారు. ఆమె భర్త ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఆయన విధుల్లో ఉన్నారు.అఫీనా తన కుమారుడిని పాఠశాలకు పంపిన తర్వాత తిరిగి నిద్రకు వెళ్లినట్లు ఆమె బావ హకీమ్ తెలిపారు. సోమవారం ఉదయం సుమారు 9 గంటలకు అఫీనాతో తాను మాట్లాడినట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత అఫీనా పిల్లల్లో ఒకరు ఏడుస్తున్న శబ్దం విని ఆమె వదిన రమ్షీనా నిద్రలేచారు. వంటగదిలో అఫీనా కుప్పకూలి ఉండటాన్ని గుర్తించి వెంటనే ఆమెకు సీపీఆర్ చేశారు. అనంతరం అంబులెన్స్కు సమాచారం అందించారు.అఫీనాను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యులు ఆమెను రక్షించలేకపోయారు. ఆమె మృతికి కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.అఫీనా ఆరోగ్యంగా ఉండేవారని, ఆమెకు ఎలాంటి తెలిసిన అంతర్గత అనారోగ్య సమస్యలు లేవని భర్త తెలిపారు. ఆమె మృతిపై అధికారిక ధ్రువీకరణ పత్రం, ఇతర ప్రక్రియలు పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని కేరళలోని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
భద్రతా కారణాలతో విజయ్ లండన్ కార్యక్రమం రద్దు
తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ కోసం లండన్లో భారీగా తరలివచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. లండన్లోని ప్రముఖ ‘ది షార్డ్’ భవనం వద్ద విజయ్ పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని భద్రతా కారణాలతో అధికారులు రద్దు చేశారు. వందలాది మంది అభిమానులు గంటల తరబడి వేచి చూసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.విజయ్ ప్రస్తుతం తమిళనాడుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో అధికారిక పర్యటనలో భాగంగా యూకేలో ఉన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు మంగళవారం ‘ది షార్డ్’ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పలువురు అభిమానులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి అక్కడే నిరీక్షించారు. అయితే భారీగా జనసమీకరణ జరగడంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.‘అనుమతి రాలేదు.. కార్యక్రమం రద్దు’భద్రతా కారణాలతో కార్యక్రమానికి అవసరమైన అనుమతి లభించలేదని విజయ్ బృందం ప్రకటించింది. లౌడ్స్పీకర్ ద్వారా అభిమానులకు సమాచారం అందిస్తూ.. ప్రజల భద్రత దృష్ట్యా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో విజయ్ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు అభిమానులు గంటల తరబడి ఎదురు చూసినట్లు పీటీఐ తెలిపింది.VIDEO | UK: Vijay fan greeting event in London called off due to 'health and safety' reasons after large number of people gather to see Tamil Nadu CM.Announcement was made by the authorities outside CM Vijay's hotel at the Shard in London on Tuesday.(Full video available on… pic.twitter.com/l4GDVUL6Fk— Press Trust of India (@PTI_News) September 15, 2026తలా-దళపతి.. విమర్శలకు టీవీకే కౌంటర్ఇదిలా ఉండగా.. విజయ్ లండన్ పర్యటనపై డీఎంకే విమర్శలు గుప్పించింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి లండన్ వెళ్లినట్లు చెబుతున్న విజయ్.. తన స్నేహితుడు, నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న కార్ రేసును వీక్షించడంపై డీఎంకే నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. పెట్టుబడుల పర్యటన పేరుతో వెళ్లి రేసు కార్యక్రమానికి హాజరయ్యారని విమర్శించారు. దీనిపై టీవీకే నేతలు స్పందిస్తూ.. విజయ్ అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ అజిత్ను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అంతేకాకుండా అంతర్జాతీయ రేసింగ్లో అజిత్కు ఉన్న గుర్తింపును తమిళనాడు బ్రాండ్ ప్రమోషన్కు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.పెట్టుబడుల కోసం విజయ్ యూకే పర్యటనఇదిలా ఉండగా విజయ్ యూకే పర్యటన ప్రధానంగా తమిళనాడుకు భారీ పెట్టుబడులను తీసుకురావడంపైనే సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో సుమారు రూ.12,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వీటి ద్వారా రాష్ట్రంలో 9,400కు పైగా హై-వాల్యూ ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తమిళనాడును ఆసియాలో అధునాతన తయారీ, సాంకేతిక రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పెట్టుబడుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విజయ్ తన యూకే పర్యటనను ముగించుకుని బుధవారం భారత్కు తిరిగి రానున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: విజయ్పై అనుచిత కామెంట్ల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
క్రైమ్
మొదటి భార్యతో రిలేషన్ : కొడుకు, ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది!
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్త మొదటి భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడనే ఆగ్రహంతో తన ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య ఉదంతం కలకలం రేపింది. రామ్కిశోర్ వాల్మీకిగా గుర్తించిన బాధితుడి మృతదేహం సెప్టెంబర్ 17న భావఖేడ కాలువ సమీపంలోని ఒక బాక్సు (ట్రంక్)లో లభ్యం కావడంతో ఈ విషయం వెలుగు చూసింది.నిందితురాలు సుఫియా బానోకు రామ్కిశోర్తో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లైన రామ్కిశోర్ భార్యకు దూరంగా ఉంటున్నాడు. దీంతో రెండేళ్ల క్రితం ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సుఫియాకు మున్నా అలియాస్ ముచ్ఛద్ (52) అనే వ్యక్తితో సంబంధం ఉన్నట్లు రామ్కిశోర్కు తెలిసిపోయింది. దీనిపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీనికితోడు రామ్కిశోర్ తన మొదటి భార్య కవితా దేవిని మళ్లీ కలుసుకోవడం, ఆర్థిక సాయం చేయడం మొదలుపెట్టాడు. దీన్ని సుఫియా వ్యతిరేకించింది. ఫలితంగా వివాదం మరింత ముదిరింది.హత్యకు పథకం మొదటి భార్యతో రామ్కిశోర్ సాన్నిహిత్యాన్ని సహించలేని సుఫియా.. తన ప్రియుడు మున్నా, అతని సహచరుడు ఇక్బాల్తో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. సెప్టెంబర్ 14-15 మధ్య రాత్రి సమయంలో తన ప్రియుడు మున్నాను, అతని సహచరుడు ఇక్బాల్ను తన ఇంటికి ఆహ్వానించి, తలుపు గడియ పెట్టకుండా వదిలేసింది. నిద్రపోతున్న రామ్కిశోర్పైకి ఎటాక్ చేసిన దుండగులు అతనిని కత్తితో పొడిచి చంపారు.హత్య తర్వాత నేల మీద అంటిన రక్తపు మరకలను ప్లాస్టరింగ్ చేసి, రక్తంతో ఉన్న చీపురు, బాధితుడి దుస్తులు, కత్తిని దాచిపెట్టారు. ఆ తర్వాత తన 16 ఏళ్ల కుమారుడి సహాయంతో మృతదేహాన్ని మంచం కింద ఉన్న చెక్క పెట్టెలో దాచారు. మరుసటి రోజు రాత్రి ఆ మృతదేహాన్ని ఈ-రిక్షాలో తీసుకెళ్లి కాలువ వంతెన కింద పడవేశారు. ఇదీ చదవండి: పూణె వ్యాపారి కిడ్నాప్ కేసు ట్విస్ట్ : మలేషియా ట్రిప్ అని చెప్పి!సెప్టెంబర్ 17న రామ్కిశోర్ మొదటి భార్య కవితా దేవి మోహన్లాల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అదే రోజు మృతదేహాన్ని కనుగొన్నారు. సుమారు 180 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఈ-రిక్షా ఆధారంగా కేసు చేధించారు.నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పూణె వ్యాపారి కిడ్నాప్ కేసు ట్విస్ట్ : మలేషియా ట్రిప్ అని చెప్పి!
ప్రియురాలితో కలిసి మలేషియా టూర్ ఎంజాయ్ చేసొద్దామని భావించిన ఒక వ్యాపారవేత్తకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పూణెకు చెందిన ఒక వ్యాపారవేత్త, తాను బిజినెస్ ట్రిప్ అని చెప్పి మరో మహిళతో కలిసి మలేషియా వెళ్లాలని ప్లాన్ వేశాడు. కట్ చేస్తే...వ్యాపార పర్యటన నిమిత్తం తాను మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తున్నట్లు తన భార్యకు చెప్పాడు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత కనిపించడం లేదంటూ భార్య కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే, తాను మరో మహిళా స్నేహితురాలితో కలిసి ప్రయాణిస్తున్న నిజం బయటపడకుండా ఉండేందుకే ఆయన ఇమ్మిగ్రేషన్ సమస్యలంటూ అబద్ధం ఆడినట్లు పోలీసులు తెలిపారు.లాండ్రీ వ్యాపారం చేసే 46 ఏళ్ల ఆ వ్యాపారి, బిజినెస్ ట్రిప్ పేరుతో సెప్టెంబర్ 14న ఒక మహిళా స్నేహితురాలితో కలిసి కౌలాలంపూర్ వెళ్లాలని ప్లాన్ చేశారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో ఆ మహిళ గతంలో పోగొట్టుకున్నట్లు ప్రకటించిన పాత పాస్పోర్ట్తో ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆమెను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఇదీ చదవండి: కాటేసిన పాముతో ఆసుపత్రికి : పాము హల్చల్, వణికిన రోగులుభార్యకు అబద్దం చెప్పి..!చట్టపరమైన చిక్కులు రావడం, మరో మహిళతో ప్రయాణిస్తున్న విషయం భార్యకు తెలిసిపోతుందనే భయంతో ఇమ్మిగ్రేషన్ సమస్యలంటూ కట్టుకథ చెప్పాడు. అక్కడితో ఆగలేదు విమానాశ్రయం ల్యాండ్లైన్ నుంచి భార్యకు ఫోన్ చేసి, ఇమ్మిగ్రేషన్ సమస్యల వల్ల తన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారని అబద్ధం చెప్పాడు. మళ్లీ మరుసటి రోజు వాట్సాప్ వీడియో కాల్లో కూడా సేమ్ స్టోరీ రిపీట్ చేశాడు. ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. దీంతో ఆందోళన చెందిన భార్య బుధవారం పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కిడ్నాప్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.తనపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి బుధవారం రాత్రి సాహర్ పోలీస్ స్టేషన్కు వచ్చి తానే అబద్ధం ఆడినట్లు అంగీకరించారు. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల్లో కోర్టులో "సి సమ్మరీ" (C Summary) క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి : గంటలో 106 పుల్-అప్స్ : చీరకట్టుతో నటి ఫిట్నెస్ ఫీట్
హఫీజ్పేట్ హోంగార్డ్ ఎపిసోడ్లో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై హోంగార్డ్ దాడి చేసిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా హోంగార్డ్ ఆనంద్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించిన అనంతరం రిమాండ్కు తరలించినట్లు వీడియోను రిలీజ్ చేశారు.వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మహిళపై సదరు హోంగార్డు విచక్షణారహితంగా దాడి చేశాడు. తనతో వాగ్వాదానికి దిగడంతో మహిళపై హోంగార్డు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా, అతడు హఫీజ్పేట్ రైల్వే స్టేషన్లో డిప్యూటేషన్పై అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటన అనంతరం హోంగార్డును తిరిగి తెలంగాణ పోలీస్ శాఖకు రైల్వే అధికారులు పంపించేశారు. అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సైతం తెలిపారు.https://t.co/NEZsAOdnPg pic.twitter.com/iIuyboVgfB— CV Anand IPS (@CVAnandIPS) September 19, 2026డీజీపీ సీరియస్..మరోవైపు ఈ ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. వెంటనే హోంగార్డ్ ఆనంద్పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది ఏ స్థాయి వారైనా.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఇలాంటి ప్రవర్తనను క్షమించలేమన్నారు. ఇది శిక్షణ, ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు. మహిళ పట్ల హోంగార్డు ప్రవర్తన ఖండించదగినదని డీజీపీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు.. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండ్ కేటీఆర్ కూడా స్పందించారు. ఎక్స్ వేదికగా కేటీఆర్.. పోలీసుల ప్రవర్తన అత్యంత దారుణంగా ఉందని మండిపడ్డారు. డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వీడియోను కూడా కేటీఆర్ షేర్ చేశారు. This is atrocious behaviour by Telangana police Hope you will act @TelanganaDGP https://t.co/CFA6SWxDUe— KTR (@KTRBRS) September 19, 2026
స్పాల్లోకి వెళ్లిన పోలీసులు.. లోపల సీన్ చూసి షాక్!
స్పా సెంటర్ల మాటున చీకటి దందాలు జరగడం కొత్తేమీ కాదు. అయితే పోలీసుల తనిఖీల్లో సైతం బయటపడకుండా కొందరు నిర్వాహకులు పక్కా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఇలాంటి నేపథ్యంలో ఓ ప్రముఖ మాల్లోని స్పా సెంటర్లపై పోలీసులు చడీచప్పుడు లేకుండా మెరుపుదాడులు నిర్వహించారు. ఒకటి కాదు.. ఏకంగా 18 స్పాల్లో ఒకేసారి సోదాలు చేశారు. అయితే అక్కడ లోపల కనిపించిన సీన్లు, అక్కడ లభించిన వస్తువులు చూసి పోలీసులే అవాక్కయ్యారు.హరియాణాలోని గురుగ్రామ్లో గత రాత్రి జరిగిన స్పా సెంటర్లపై గురుగ్రామ్ పోలీసులు, హరియాణా రాష్ట్ర మహిళా కమిషన్ జాయింట్గా నిర్వహించిన తనిఖీలు.. ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీశాయి. ఆ సమయంలో తలుపులు తీయకుండా నిర్వాహకులు ప్రయత్నించగా.. వెల్డింగ్ మెషీన్లతో తెరిపించి బలవంతంగా పోలీసులు లోపలికి వెళ్లారు. Gurugram में आधी रात 18 मसाज पार्लरों पर चला ग्राइंडर, 100 पुलिसकर्मियों ने मारे छापे, 40 युवक युवतियां मिली, एक ही मॉल में चल रहे थे सभी स्पा सेंटर, मसाज की आड़ में देहव्यापार का काला कारोबार#SpaCentre #SapphireMall #GurugramNews #GurgaonNews #SexRacket pic.twitter.com/TcYpsHu2Q3— Gurugram News गुरुग्राम न्यूज़ (@TheGurugramNews) September 19, 2026లోపల మరో ప్రపంచమే!సెక్టార్-90లో ఉన్న సఫైర్ 90 మాల్లో గత అర్ధరాత్రి ఈ భారీ ఆపరేషన్ జరిగింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సుమారు ఐదు గంటలపాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉషా ప్రియదర్శిని, ఆమె బృందం, డ్యూటీ మేజిస్ట్రేట్ సమక్షంలో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. స్పా సెంటర్ల కోసం ఏర్పాటు చేసిన బోర్డుల వెనుక.. ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. ఆ తలుపులు తెరిచి లోపలికి వెళ్లగా.. లోపల దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. అలాగే కొన్ని స్పా కేంద్రాలకు బయట నుంచి తాళాలు వేసి ఉండగా.. తెరిచి లోపలికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. లోపల ప్రత్యేక గదులతో పాటు సెక్స్ టాయ్స్, కొన్ని వస్తువులు కనిపించాయి. అలాగే 30 మంది మహిళలు, 20 మంది పురుషులు అభ్యంతరకర పరిస్థితుల్లో కనిపించారు. వాళ్లలో కొందరు వీడియోలు తీయొద్దంటూ పోలీసులను వేడుకున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. కొందరు నిర్వాహకులు అందులోని వస్తువుల్ని డస్ట్ బిన్లలో పడేసి దాక్కునే ప్రయత్నం చేశారు. తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ సోదాలు కొనసాగగా.. దాదాపు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. ఆ సెంటర్ల నుంచి ఎలక్ట్రానిక్, డిజిటల్ పరికరాలతో పాటు ఇతర వస్తువులు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాళ్లందరినీ స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ జరుపుతున్నారు. అసలు.. అంత పెద్ద మాల్లో చీకటి కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి? వాటి వెనుక ఎవరున్నారు? ఎవరైనా పెద్దల పాత్ర ఉందా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.#WATCH | Gurugram, Haryana: The Haryana Women’s Commission and Gurugram Police conducted a joint operation at a Sector 90 mall, raiding 18 spa centres. Several objectionable items and suspected narcotic substances were also recovered. (18.09) pic.twitter.com/9NpIoOqhCB— ANI (@ANI) September 19, 2026
వీడియోలు
నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై
టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు
రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?
తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..
గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్
చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన
పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు
నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?
అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం
