భారతి సిమెంట్స్ వద్ద ఆగని టీడీపీ మూకల దౌర్జన్యం
కడప: ఏపీ రాష్ట్ర ఖజానాకు భారీగా పన్నులు చెల్లిస్తున్న భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (భారతి సిమెంట్స్)పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పరాకాష్టకు చేరింది. నాలుగు రోజులుగా టీడీపీ మూకలు చేస్తున్న దౌర్జన్యంతో కాప్టివ్ మైన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.మైన్లోకి వాహనాలు వెళ్లకుండా టీడీపీ మూకలు పదే పదే అడ్డుకుంటున్నాయి. సున్నపురాయి సరఫరా జరగకుండా భారతి సిమెంట్స్ ఉత్పత్తిని అడ్డుకునే కుట్రకు తెరలేపారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్సీ, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. టీడీపీ మూకల దౌర్జన్యంతో భారతి సిమెంట్స్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. టీడీపీ మూకల దౌర్జన్యంతో ఉత్పత్తి ఆగిపోతు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 15 వేల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.చంద్రబాబు నుంచి అందిన ఆదేశాలతో అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందనే విషయం అర్థమవుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ కార్యకలాపాలను టీడీపీ మూకలు అడ్డుకుంటున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదంటే చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందా? అనే అనుమానం కలగమానదు.పరిశ్రమ నడవకూడదన్నదే లక్ష్యమా? రాజకీయ పగ కోసం రాష్ట్ర పారిశ్రామిక ప్రయోజనాలనే పణంగా పెడతారా? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇదే తరహాలో రాజకీయ కక్షతో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కార్యకలాపాలను అడ్డుకుని ఉంటే ఆ సంస్థ ప్రశాంతంగా వ్యాపారం కొనసాగించగలిగేదా? అని పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ తరహా దాడులకు ప్రభుత్వ పెద్దలు ఉసిగొల్పుతున్నారని అభిప్రాయపడుతున్నారు.
మధ్య తరగతి వాళ్ల భావోద్వేగాలు ఇంత తీవ్రంగా ఉంటాయ్
విదేశాలకు వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటి వచ్చే క్షణం ప్రతి కుటుంబానికీ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఎన్నో రోజుల ఎదురుచూపులు, జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఆనందం, ఆశ్చర్యం, ప్రేమ కలిసిన అలాంటి సందర్భాలు ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. కుటుంబ బంధాల విలువను గుర్తు చేసే క్షణాలు సోషల్ మీడియాలోనూ విశేష ఆదరణ పొందుతుంటాయి. అలాంటి హృదయాలను హత్తుకునే ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది.కెనడా నుంచి ఐదేళ్ల తర్వాత వచ్చి తల్లిదండ్రులకు సర్ప్రైజ్ ఇచ్చాడు ఓ యువకుడు. అతడు ఇంటికి తిరిగి రావడాన్ని చూసిన కుటుంబ సభ్యుల భావోద్వేగానికి లోనయ్యారు. కెనడాలో ఐదేళ్లు గడిపిన తర్వాత సూర్య నాయర్ తన ఇంటికి సర్ప్రైజ్గా రావడం అతనికి, అతని కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తింది. తాను ఇంటికి వస్తున్న విషయం తెలియని తన తల్లిదండ్రులకు ఎలా సర్ప్రైజ్ ఇచ్చాడో చూపిస్తూ నాయర్ తన రాకకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు.“వారిని కలవబోతున్నందుకు నేను నిజంగా చాలా ఆత్రుతగా ఉన్నాను” అని చెప్పాడు. నాయర్ తన కుటుంబ సభ్యులను కలుసుకున్న క్షణాలు ఈ వీడియోలో ఉన్నాయి. అతడిని చూసిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనై భావోద్వేగానికి గురైనట్టు కనిపించారు.నాయర్ ఇంటికి తిరిగి రావడాన్ని చూసిన కుటుంబ సభ్యుల భావోద్వేగాలను ఈ అనుకోని కలయిక ప్రతిబింబించింది. సూర్య ఇచ్చిన సర్ప్రైజ్, అతని స్పందనలు ఆ క్షణాన్ని హృదయానికి హత్తుకునేలా చేశాయి.సోషల్ మీడియా యూజర్లు సూర్య, అతని కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఓ యూజర్ “ఈ రోజు ఇంటర్నెట్లో ఇదే అత్యుత్తమ వీడియో” అని పేర్కొన్నాడు. మరో యూజర్ “కొన్ని రీల్స్ను ఇష్టపడకుండా ఉండలేం” అని పేర్కొన్నాడు. “ఇది ఎంతో హృదయానికి హత్తుకునే వీడియో” అని మరో వినియోగదారు వ్యాఖ్యానించాడు. View this post on Instagram A post shared by Surya Nair (@suryanair79)
తమ చిన్నారి తిరిగి వస్తుందేమోననే ఆశతో..
కాకినాడ: 65 రోజుల కిందట కాకినాడ జిల్లాలోని సీహెచ్ అగ్రహారంలో ఇంటి నుండి వెళ్లి అదృశ్యమైన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లి దండ్రులు నేటికి ఎదురుచూస్తూనే ఉన్నారు. తమ కూతురు ఎలా తప్పిపోయిందో అలానే ఇంటికి తిరిగి వచ్చేస్తే బాగుండు అనుకుంటూ కోటి ఆశలతో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరొకవైపు తమ కుమార్తెను ఎవరో వెంట తీసుకు వెళ్లిపోయారనే అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లి భవాని.. కూతురి ఆచూకీ చెప్పాలంటూ వేడుకుంటోంది. చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటికి కొత్తగా వచ్చిన అతిధిఅయితే వారి ఇంటికి ఓ అతిథి కొత్తగా వచ్చింది. జ్ఞానేశ్వరి తో పాటుగా వెంట వెళ్ళి మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చి కుక్క చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే తమ కూతురు జ్ఞాపకాల నుంచి ఉపశమనం పొందడానికి మరో కుక్కను తెచ్చుకున్నారు జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు. *జ్ఞానేశ్వరి ముద్దు పేరైనా "జాను" పేరును కుక్క కు పెట్టారు చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు భవానీ, గణేష్లు.కాగా, కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో ఈ ఏడాది జూన్ 6వ తేదీన అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యం లేదా బలమైన క్లూ లభించలేదు.
టీడీపీకి షాక్.. వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పెనుమంట్ర మండలంలో ఈ రోజు (ఆదివారం) టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ మంత్రి రంగనాథరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. పెద్దఎత్తున కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడంతో పచ్చపార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది.
మంచివాళ్లకే ఎందుకు ఇలా కష్టాలొస్తాయ్?
శ్రీలంకతో తొలి టెస్ట్.. భారత తుది జట్టు ఇదే..!
మూడు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా
డీఎస్సీ స్కామ్: వైఎస్సార్సీపీ ర్యాలీలపై కక్ష సాధింపు
కేటీఎం బైకుల ధరలు పెరిగాయ్.. కొత్త రేట్లు ఇవే!
ల్యాబ్ అడ్డాగా డ్రగ్స్ దందా.. రూ. 54 కోట్లు సీజ్
‘‘నా తల పగిలిపోయేది.. నేను చనిపోయేదాన్ని’’
తెలంగాణ కెనోయ్ స్ప్రింట్ జట్టుకు పతకాల పంట
బుల్లిగౌనులో ఆషిక బర్త్ డే సెలబ్రేషన్.. బాలనటిని గుర్తుపట్టారా?
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా
ఒకప్పుడు తోపు యాక్టర్.. ఇప్పుడు ఆటో డ్రైవర్!
చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి..! ఆఖరికి స్వలింగ సంపర్కుడైన కుమారుడి కోసం..
నా రెండో బిడ్డ కళ్లలో ఆయనని చూసుకుంటున్నా
దగ్గు మందు అడిగితే 'దగ్గుతున్నాడు' తప్ప మందు ఇవ్వడం లేదు!
ఇది చాలదన్నట్టు ఆ మినిస్టర్ ఎవరు సార్!
'కొరియన్ కనకరాజు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
పరిపాలన ప్రైవేట్కు ఇవ్వడం కుదర్దు వెళ్లవయ్యా.. వెళ్లు!
సాక్షి కార్టూన్ : 08-08-2026
సమంత తిండిగోల.. తల్లి కూతురి బర్త్ డే సెలబ్రేషన్
165 Km రేంజ్తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
ఏదడిగినా.. అలా ఖాళీ జేబులు చూపిస్తున్నారు!!
నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా
హీరోగా హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు
దూకుడు తగ్గించిన పసిడి.. తులం ధర ఇలా..
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. గృహయోగం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ బిగ్ సిగ్నల్
మంచివాళ్లకే ఎందుకు ఇలా కష్టాలొస్తాయ్?
శ్రీలంకతో తొలి టెస్ట్.. భారత తుది జట్టు ఇదే..!
మూడు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా
డీఎస్సీ స్కామ్: వైఎస్సార్సీపీ ర్యాలీలపై కక్ష సాధింపు
కేటీఎం బైకుల ధరలు పెరిగాయ్.. కొత్త రేట్లు ఇవే!
ల్యాబ్ అడ్డాగా డ్రగ్స్ దందా.. రూ. 54 కోట్లు సీజ్
‘‘నా తల పగిలిపోయేది.. నేను చనిపోయేదాన్ని’’
తెలంగాణ కెనోయ్ స్ప్రింట్ జట్టుకు పతకాల పంట
బుల్లిగౌనులో ఆషిక బర్త్ డే సెలబ్రేషన్.. బాలనటిని గుర్తుపట్టారా?
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా
ఒకప్పుడు తోపు యాక్టర్.. ఇప్పుడు ఆటో డ్రైవర్!
చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి..! ఆఖరికి స్వలింగ సంపర్కుడైన కుమారుడి కోసం..
నా రెండో బిడ్డ కళ్లలో ఆయనని చూసుకుంటున్నా
దగ్గు మందు అడిగితే 'దగ్గుతున్నాడు' తప్ప మందు ఇవ్వడం లేదు!
ఇది చాలదన్నట్టు ఆ మినిస్టర్ ఎవరు సార్!
'కొరియన్ కనకరాజు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
పరిపాలన ప్రైవేట్కు ఇవ్వడం కుదర్దు వెళ్లవయ్యా.. వెళ్లు!
సాక్షి కార్టూన్ : 08-08-2026
సమంత తిండిగోల.. తల్లి కూతురి బర్త్ డే సెలబ్రేషన్
165 Km రేంజ్తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
ఏదడిగినా.. అలా ఖాళీ జేబులు చూపిస్తున్నారు!!
నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా
హీరోగా హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు
దూకుడు తగ్గించిన పసిడి.. తులం ధర ఇలా..
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. గృహయోగం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ బిగ్ సిగ్నల్
ఫొటోలు
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16)
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు)
టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)
వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు)
సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్
‘కొరియన్ కనకరాజు’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ (ఫొటోలు)
హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్
హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ (ఫొటోలు)
విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్లో ఫ్యామిలీ ఫోటోలు
సినిమా
నటిగా కాదు.. భార్యగా ఆ ఛాన్స్ వదులుకున్నా: ఐశ్వర్య
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా 2014లో ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో దీపికా పాత్రకు ముందుగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ను సంప్రదించారట దర్శకురాలు ఫరాఖాన్. కానీ ఆ సమయంలో భర్త అభిషేక్ బచ్చన్తో కూడా నటిస్తుండటం, షారుఖ్తో ఎక్కువ కెమిస్ట్రీ సీన్లు ఉండటంతో ఆమె ఆ అవకాశాన్ని తిరస్కరించిందట.ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘‘ఆరాధ్య పుట్టిన తర్వాత సినిమాలకు కొంత విరామం తీసుకున్నా. ‘హ్యాపీ న్యూ ఇయర్’ చేసి ఉంటే మంచి కంబ్యాక్ అయ్యేది. నటిగా ఆ అవకాశాన్ని వదులుకోవడం అంత సులభం కాదు. కానీ భార్యగా ఆ నిర్ణయం తీసుకున్నా’’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా ఐశ్వర్య చివరిగా ‘పొన్నియిన్ సెల్వన్’లో కనిపించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా విషయానికి వస్తే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కింగ్’ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాలోనూ నటిస్తోంది.
అప్పుడు కలవనివ్వలేదు.. ఇప్పుడు అదే హీరోతో!
మలయాళ నటి మమితా బైజు ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్లో ఉంది. ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘డ్యూడ్’ ‘జన నాయకన్’ చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. సూర్యతో కలిసి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఈ శుక్రవారం(ఆగస్టు 14) ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కేరళలో శనివారం జరిగింది. ఇందులో మాట్లాడిన మమిత తన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుచేసుకుంది.‘2015లో సూర్య ఓ కార్యక్రమం కోసం కొచ్చి వచ్చారు. అప్పుడు నేను ఎనిమిది, మా అన్నయ్య ఇంటర్ చదువుతున్నాం. సూర్యని చూసేందుకు అన్నయ్య తన స్నేహితులతో కలిసి కొచ్చి వెళ్లాడు. నేనూ వెళ్తానంటే మా తల్లిదండ్రులు పంపించలేదు. అన్నయ్య సూర్యతో ఫొటో దిగి చూపించాడు. నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు అదే హీరోతో కలిసి నటించే అవకాశం దక్కింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్యతో కలిసి ఒకే వేదికపై నిలబడటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని మమిత చెప్పుకొచ్చింది. అభిమానిగా సూర్యని చూడాలనుకున్న తనకు.. ఇప్పుడు ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప ఆశీర్వాదమని పేర్కొంది.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 45 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్తో తెరకెక్కించారు. ఇందులో రవీనా టాండన్, రాధికా శరత్కుమార్, నాజర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు.
ఆమె బదులు మరెవరున్నా తల పీక్కుని పారిపోయేవాళ్లు
తమిళ హీరో విశాల్ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా 'మకుటం'. హీరో కూడా ఇతడే. అంజలి, దుషారా విజయన్ హీరోయిన్లు. ఆర్బీ చౌదరి నిర్మించిన 99వ చిత్రమిది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతమందించాడు. ఈ శుక్రవారం(ఆగస్టు 14) తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇందులో విశాల్ త్రిపాత్రాభినయం చేశాడు. తాజాగా చైన్నెలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ)దర్శకుడుగా నాకు అవకాశమిచ్చిన నిర్మాత ఆర్బీ చౌదరికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఆయన పరిచయం చేసిన 45వ దర్శకుడిని నేను. ఆమధ్య 14 నెలలుగా ఖాళీగా ఉన్నప్పుడు నా కష్టకాలంలో అండగా నిలిచి ప్రోత్సహించిన నా కాబోయే భార్య సాయి ధన్సికకు ధన్యవాదాలు. ఆమె స్థానంలో ఎవరైనా ఉంటే తల పీక్కుని పారిపోయేవారు. నా గురువు అర్జున్కి కృతజ్ఞతలు. నన్ను నటించమని ప్రోత్సహించింది ఆయనే. రాంగోపాల్ వర్మ తీసిన 'శివ' చూసిన తర్వాత దర్శకుడిని అవ్వాలనే కోరిక కలిగింది. అది 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు నెరవేరింది. నా తల్లిదండ్రులకు ఎప్పుడు రుణపడి ఉంటాను. వారి ప్రోత్సాహమే నన్ను స్థాయికి చేర్చింది అని విశాల్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: త్రివిక్రమ్ మాతో మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తారంటే?: నాగవంశీ)
'కింగ్డమ్' విలన్... తెలుగులోకి హీరోగా ఎంట్రీ
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమాలో విలన్గా మెప్పించిన వెంకటేశ్ వీపీ.. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. పక్కా తెలంగాణ బ్యాక్డ్రాప్లో తీస్తున్న 'డీజీపీ' (వర్కింగ్ టైటిల్) మూవీలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. గోదావరిఖనికి చెందిన సురేశ్ తేజ్ దర్శకుడు కాగా శివ బొమ్మక్ నిర్మాత.(ఇదీ చదవండి: లోకేశ్ 'డిసి'.. విజయ్ దేవరకొండే చేయాలి కానీ)ఈరోజు (ఆగష్టు 9) వెంకటేశ్ వీపీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం అతడికి ఆహ్వానం పలుకుతూ వినూత్న రీతిలో వీడియో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వెంకీ.. మూవీ యూనిట్కు ధన్యవాదాలు తెలిపాడు. 'దాదాపు ఏడాది కాలంగా ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఎట్టకేలకు ఇది జరిగింది. రుద్రాంశ్ సెల్యూలాయిడ్తో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. నా జీవితంలో దక్కిన ఈ సంతోషాలకు ఎంతో కృతజ్ఞుడిని. కొత్త ప్రయాణం మొదలు' అని వెంకీ భావోద్వేగానికి లోనయ్యాడు.కేరళకు చెందిన వెంకటేశ్ వీపీ బుల్లితెరపై యాంకర్గా గుర్తింపు తెచ్చుకుని ఒక్కోమెట్టు ఎక్కుతూ హీరోగా ఎదిగాడు. మలయాళంలో పలు సినిమాల్లో నటించిన అతడు కింగ్డమ్ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. మురుగన్ అనే విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. తెలుగులో రెండో సినిమాతోనే హీరోగా అవకాశం దక్కించుకున్నాడు.(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Ruudranshcelluloid (@ruudranshcelluloid)
క్రీడలు
టీమిండియాకు గ్రేట్ న్యూస్.. టచ్లోకి వచ్చిన జైస్వాల్, గిల్
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ భారత బ్యాటింగ్ విభాగానికి బాగా ఉపయోగపడింది. ప్రతి బ్యాటర్ ఏదో ఒక ఇన్నింగ్స్లో మంచి ప్రాక్టీస్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్), రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్), కేఎల్ రాహుల్ (40).. రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (61 రిటైర్డ్ హర్ట్), శుభ్మన్ గిల్ (44) పరుగులు రాబట్టారు. ఆగస్ట్ 15 నుంచి శ్రీలంకతో జరుగబోయే తొలి టెస్ట్కు ముందు ఇది శుభపరిణామం. ఇదే జోరును బ్యాటర్లు తొలి టెస్ట్లోనూ కొనసాగిస్తే టీమిండియా గెలుపు తథ్యం.టచ్లోకి వచ్చిన జైస్వాల్, గిల్తొలి ఇన్నింగ్స్లో డకౌటై నిరాశపర్చిన యశస్వి జైస్వాల్, రెండో ఇన్నింగ్స్లో పుంజుకొని మెరుపు అర్ద సెంచరీతో చెలరేగాడు. గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దూరంగా ఉన్న కెప్టెన్ శుభ్మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్లో గాయాన్ని అధిగమించడంతో పాటు ఫామ్ను కూడా చాటుకున్నాడు. జైస్వాల్, గిల్ టచ్లోకి రావడం టీమిండియాకు శుభసూచకం. వీరికి పడిక్కల్, రాహుల్ కూడా తోడైతే తొలి టెస్ట్లో టీమిండియా గెలుపును లంక బౌలర్లు అడ్డుకోలేరు.విజయం దిశగా భారత్207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ గెలుపు దిశగా సాగుతోంది. ఆట చివరి రోజు కావడం, అందులోనూ సమయం కూడా కొద్దిగానే ఉండటంతో భారత బ్యాటర్లు వేగంగా ఆడుతున్నారు. ముఖ్యంగా జైస్వాల్ పరిమిత ఓవర్ల తరహాలో బ్యాటింగ్ చేసి భారత గెలుపుకు పునాది వేశాడు. 30 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 152-2గా ఉంది. పంత్ (28), జడేజా (0) క్రీజ్లో ఉన్నారు. మరో 55 పరుగులు చేస్తే ఈ మ్యాచ్లో టీమిండియా గెలుస్తుంది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన పంత్ ఈ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే భారత్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. జురెల్ (17) ఒక్కడే కాస్త నిరుత్సాహపరిచాడు.టార్గెట్ 207లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.పడిక్కల్ అజేయ శతకంభారత్ తొలి ఇన్నింగ్స్ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
టీమిండియాతో మరిన్ని సిరీస్లు.. ఈసీబీ కీలక ప్రకటన
భారత క్రికెట్కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) భావిస్తోంది. టీమిండియాతో మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించేందుకు ఈసీబీ ఆసక్తి చూపుతోంది. ముఖ్యంగా వన్డేల్లో మూడు దేశాల ట్రై-సిరీస్లను తిరిగి తీసుకురావాలని యోచిస్తోంది. అలాగే భారత్తో ఐదు టెస్టుల సిరీస్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఈసీబీ సీఈఓ రిచర్డ్ గౌల్డ్ వెల్లడించారు.12-18 నెలల్లో ట్రై-సిరీస్లు..?వన్డే క్రికెట్లో మూడు దేశాల ట్రై-సిరీస్లను తిరిగి ప్రవేశపెట్టే దిశగా చర్చలు జరుగుతున్నాయని రిచర్డ్ గౌల్డ్ తెలిపారు. వచ్చే 12 నుంచి 18 నెలల్లో కొన్ని ట్రై-సిరీస్లు నిర్వహించే అంశంపై ఇప్పటికే ప్రణాళికలు రూపొందుతున్నాయని ఆయన వెల్లడించారు.భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా అంతర్జాతీయ క్రికెట్లో ట్రై-సిరీస్లను తిరిగి తీసుకురావాలని గతంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఈసీబీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ట్రై-సిరీస్లు సాధారణంగా ఉండేవి. అయితే గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్లు, ఐసీసీ టోర్నీలకే ఎక్కువ ప్రాధాన్యం లభించడంతో మూడు దేశాల సిరీస్లు దాదాపుగా కనుమరుగయ్యాయి.భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య చివరి ప్రధాన పురుషుల వన్డే ట్రై-సిరీస్ 2015లో జరిగింది. ఆ టోర్నీలో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.భారత్తో ఐదు టెస్టుల సిరీస్కు ప్రాధాన్యంవన్డేలతో పాటు టెస్టు క్రికెట్పైనా ఈసీబీ ప్రత్యేక దృష్టి పెట్టింది. భారత్, ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల సిరీస్లను ఇంగ్లండ్ క్రికెట్లో అత్యున్నత స్థాయి పోటీగా రిచర్డ్ గౌల్డ్ అభివర్ణించారు. భారత్తో ఐదు టెస్టుల సిరీస్లు ఆడేందుకు ఈసీబీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో దక్షిణాఫ్రికాతో కూడా ఇలాంటి సుదీర్ఘ టెస్టు సిరీస్లు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు.ఐదు టెస్టుల సిరీస్ వల్ల ఇరు జట్లకు పుంజుకునే అవకాశం లభించడంతో పాటు, ఆటగాళ్ల సామర్థ్యానికి అసలైన పరీక్ష ఎదురవుతుంది. ఫ్రాంచైజీ టీ20 లీగ్ల ప్రభావం పెరుగుతున్న సమయంలో టెస్టు క్రికెట్కు ఇలాంటి సుదీర్ఘ సిరీస్లు మరింత ప్రాధాన్యం కలిగిస్తాయని ఈసీబీ భావిస్తోంది.మళ్లీ వన్డేల వైపు ఎందుకు..?ప్రస్తుతం టెస్టు, టీ20 క్రికెట్ మధ్య వన్డే ఫార్మాట్ తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పోరాడుతోంది. ద్వైపాక్షిక వన్డే సిరీస్లకు పెద్ద టోర్నీలతో పోలిస్తే అంతగా ఆదరణ లభించడం లేదు.అయితే వన్డేలకు ఇప్పటికీ ప్రత్యేక ఆకర్షణ ఉంది. టీ20లకు దూరమైన పలువురు స్టార్ ఆటగాళ్లు వన్డేల్లో కొనసాగుతున్నారు. అందువల్ల టెస్టు క్రికెట్, ఫ్రాంచైజీ టీ20ల మధ్య వన్డేలు ఒక కీలకమైన వారధిగా మారే అవకాశం ఉంది.భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు పాల్గొనే వన్డే ట్రై-సిరీస్లకు భారీ ప్రేక్షకాదరణ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్వైపాక్షిక సిరీస్లకు భిన్నంగా ట్రై-సిరీస్లో ప్రతి మ్యాచ్కు పాయింట్ల పట్టిక పరంగా ప్రాధాన్యం ఉంటుంది.వన్డేలకు కొత్త ఊపు వస్తుందా..?ట్రై-సిరీస్లు తిరిగి వస్తే వన్డే క్రికెట్కు కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. ప్రతి మ్యాచ్కు ఫలితంతో పాటు పాయింట్ల పట్టిక ప్రభావం ఉండటం వల్ల పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుంది.అంతేకాకుండా, ఐసీసీ టోర్నీలకు ముందు యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు భారత్, ఇంగ్లండ్ వంటి జట్లకు ఇవి మంచి వేదికగా మారవచ్చు. కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తూనే కొత్త ఆటగాళ్లకు అవకాశాలు కల్పించే అవకాశం కూడా ఉంటుంది.మొత్తంగా చూస్తే, ట్రై-సిరీస్ల పునరాగమనం, భారత్తో ఐదు టెస్టుల సిరీస్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఈసీబీ వైఖరి అంతర్జాతీయ క్రికెట్లో భారత్-ఇంగ్లండ్ సంబంధాలకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది.
కెనడా ఓపెన్లో సంచలనం.. వరల్డ్ నంబర్ 1 సబలెంకాకు షాక్
కెనడా ఓపెన్లో సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్ వన్, నాలుగు సార్లు గ్రాండ్స్లామ్ విజేత ఆర్యనా సబలెంకా అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. నాలుగో రౌండ్లో రష్యాకు చెందిన 16వ సీడ్ ఎకతెరీనా అలెగ్జాండ్రోవా చేతిలో సబలెంకా ఓటమిపాలైంది.దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన హోరాహోరీ పోరులో అలెగ్జాండ్రోవా 7-6(3), 4-6, 6-4తో సబలెంకాపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.ఈ ఓటమి సబలెంకా యూఎస్ ఓపెన్ సన్నాహకాలకు గట్టి దెబ్బగా మారింది. గత ఏడాది యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన సబలెంకా.. ఈసారి కూడా తన టైటిల్ రక్షణకు సిద్ధమవుతున్న సమయంలో కెనడా ఓపెన్లోనే అనూహ్యంగా నిష్క్రమించింది.తొలి సెట్లో టైబ్రేక్.. సబలెంకాకు షాక్మ్యాచ్ ఆరంభంలో సబలెంకా బ్రేక్ సాధించి ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే అలెగ్జాండ్రోవా వెంటనే పుంజుకుని స్కోరును సమం చేసింది. చివరకు తొలి సెట్ టైబ్రేక్కు వెళ్లగా.. రష్యా ప్లేయర్ 7-3తో టైబ్రేక్ను సొంతం చేసుకుంది. దీంతో సబలెంకా మ్యాచ్లో వెనుకబడింది.రెండో సెట్లో పుంజుకున్న నంబర్ వన్రెండో సెట్లో సబలెంకా తన అనుభవాన్ని చూపించింది. 4-3తో ఆధిక్యంలో ఉన్న సమయంలో అలెగ్జాండ్రోవా సర్వీస్ను బ్రేక్ చేసిన సబలెంకా.. ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకుని సెట్ను 6-4తో గెలుచుకుంది. దీంతో మ్యాచ్ నిర్ణాయక మూడో సెట్కు చేరింది.కీలక సమయంలో సబలెంకా తప్పిదాలుమూడో సెట్లో అలెగ్జాండ్రోవా దూకుడైన షాట్లతో సబలెంకాపై ఒత్తిడి పెంచింది. మరోవైపు సబలెంకా తప్పిదాల సంఖ్య పెరగడంతో రష్యా ప్లేయర్కు అవకాశాలు లభించాయి.4-5తో వెనుకబడి మ్యాచ్లో నిలవాలంటే తప్పక సర్వీస్ నిలబెట్టుకోవాల్సిన సమయంలో సబలెంకా రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుంది. అయితే మూడో మ్యాచ్ పాయింట్ వద్ద డబుల్ ఫాల్ట్ చేయడంతో మ్యాచ్ అలెగ్జాండ్రోవా చేతుల్లోకి వెళ్లిపోయింది.క్వార్టర్స్లో స్వితోలినాతో పోరుక్వార్టర్ ఫైనల్లో అలెగ్జాండ్రోవా ఉక్రెయిన్ స్టార్ ఎలినా స్వితోలినాను ఎదుర్కోనుంది. నాలుగో రౌండ్లో స్వితోలినా అమెరికా ఎనిమిదో సీడ్ అమాండా అనిసిమోవాను 6-2, 6-4తో ఓడించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.
టీమిండియా టార్గెట్ 207
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో భారత్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆట ఇవాళ (మూడో రోజు) చివరి రోజు కావడంతో ఫలితం తేలే అవకాశం లేదు. ఆటలో మరో సెషన్ మాత్రమే మిగిలి ఉంది.లంక ఎలెవెన్ రెండో ఇన్నింగ్స్లో నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి మొదలుకానుంది. రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్ట్ 23న ప్రారంభం కానుంది.
న్యూస్ పాడ్కాస్ట్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
చంద్రబాబు పాలన రైతులకు హానికరం... చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ... వైఎస్ జగన్ ఆగ్రహం
అసత్య ప్రచారంలో ఆరితేరిన ఏపీ సీఎం చంద్రబాబు... రెండు మినహా హామీలన్నీ అమలు చేశానంటూ బుకాయింపు...
బీసీ నేతలపై రెడ్బుక్!. బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అక్రమ అరెస్టులు
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
ఏపీలో దగా డీఎస్సీపై దండయాత్ర... రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు విజయవంతం
దేశంలో పసిడికి తగ్గిన డిమాండ్... ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6 శాతం డౌన్
బిజినెస్
‘వెండి’ మండిపోతుంది: కియోసాకి భారీ అంచనా
వెండి ధరలు రికార్డు స్థాయిల్లో కొనసాగుతున్న వేళ ప్రముఖ ఆర్థిక రచయిత, ఇన్వెస్ట్ గురూ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి వెండిపై తన అంచనాను వెల్లడించారు. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాబర్ట్ కియోసాకి తన ఫేస్బుక్ పోస్టులో వెండి భవిష్యత్ ధరపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఔన్సు వెండి ధర 3 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పటి నుంచే కొనుగోలు చేశానని, ప్రస్తుతం ధరలు రికార్డు స్థాయిల్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ వెండిని కొనుగోలు చేస్తున్నానని తెలిపారు.కియోసాకి తన పోస్టులో వెండి సరఫరా, డిమాండ్ మధ్య పెరుగుతున్న అంతరాన్ని ప్రస్తావించారు. ప్రపంచ జనాభాలో దాదాపు 40 శాతాన్ని కలిగి ఉన్న మూడు ప్రభుత్వాలు ఒకే లోహాన్ని భారీగా నిల్వ చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది ఆభరణాల కోసం కాకుండా భవిష్యత్ అవసరాలు, భద్రత కోసం నిల్వ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఈ వాదనకు ఆయన పోస్టులో ప్రభుత్వాల పేర్లను వెల్లడించలేదు.బంగారాన్ని ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు నిల్వ చేస్తుంటే.. వెండిలో మాత్రం పారిశ్రామిక వినియోగం భారీగా ఉందని కియోసాకి వివరించారు. స్మార్ట్ఫోన్లు, సోలార్ ప్యానెల్స్, రక్షణ రంగ పరికరాలు సహా అనేక ఉత్పత్తుల్లో వెండి వినియోగమవుతుందని, ఈ వినియోగం కారణంగా అందుబాటులో ఉన్న సరఫరాపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. సరఫరా పరిమితంగా ఉండటం, డిమాండ్ ఏటా పెరుగుతుండటం భవిష్యత్లో వెండి ధరలకు మద్దతు ఇవ్వవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.తాను 30 ఏళ్లుగా ఈ ధోరణిని గమనిస్తున్నానని కియోసాకి పేర్కొన్నారు. ఔన్సు వెండి ధర 3 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఆ తర్వాత 13 డాలర్ల వద్ద ఉన్నప్పుడు కూడా తాను వెండిపై అంచనాలు చెప్పానని, అప్పట్లో చాలామంది తనను విమర్శించారని గుర్తుచేశారు. ఇప్పుడు మూడు ప్రభుత్వాలు వెండిని నిల్వ చేయడం ద్వారా తాను చెబుతున్న ధోరణిని బలపరుస్తున్నాయని ఆయన అన్నారు. ఇక వెండి ధర భవిష్యత్లో ఔన్స్కు 200 డాలర్లకు చేరుతుందంటూ ఈ పోస్టుకు అనుబంధంగా షేర్ చేసిన వీడియోలో వివరించారు.
రూ.25 లక్షల జీతం.. రూ.50 లక్షలకు పెంపు! అయినా టెన్షన్..
భారీ జీతం పెంపు వస్తే ఎవరైనా ఆనందిస్తారు. కానీ ఓ టెక్ ఉద్యోగికి మాత్రం 100 శాతం జీతం పెరిగినా సంతోషం కంటే ఉద్యోగ భద్రతపై భయమే ఎక్కువైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ‘ఎక్స్’ పోస్టు ప్రకారం.. ఓ ఉద్యోగి వార్షిక ప్యాకేజీ రూ.25 లక్షల నుంచి ఏకంగా రూ.50 లక్షలకు పెరిగింది. అయితే, ఈ పెంపు కంపెనీలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుల తర్వాత రావడం చర్చనీయాంశంగా మారింది.వైరల్ పోస్టు ప్రకారం.. కంపెనీలో సాధారణంగా జూన్లో ఉద్యోగుల పనితీరు మదింపు, జీతాల పెంపు ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మొత్తం 150 మంది ఉద్యోగుల్లో 50 మందిని కంపెనీ తొలగించినట్లు పోస్టులో పేర్కొన్నారు. దీంతో మిగిలిన ఉద్యోగులు తమకు ఇంక ఎలాంటి జీతాల పెంపు ఉండదని భావించారట. ‘‘కనీసం ఉద్యోగం మిగిలింది.. అదే చాలు’’ అనే పరిస్థితికి వచ్చారని పోస్టు పేర్కొంది.అయితే, అదే సమయంలో ఓ ఉద్యోగికి మాత్రం ఊహించని ఈమెయిల్ వచ్చింది. ప్రమోషన్తో పాటు ఏకంగా 100 శాతం జీతం పెంపు ప్రకటించినట్లు పోస్టులో ఉంది. దీంతో అతని వార్షిక ప్యాకేజీ రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు చేరింది.ఈ భారీ పెంపునకు కారణం కూడా ఆసక్తికరంగా ఉంది. ఉద్యోగి వారాంతంలో స్వయంగా రూపొందించిన ఓ చిన్న AI చాట్బాట్ ఆ సంస్థకు గణనీయమైన విలువను తీసుకొచ్చినట్లు వైరల్ పోస్టు పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అతని సామర్థ్యాన్ని కంపెనీ గుర్తించి భారీగా పరిహారం పెంచినట్లు చెబుతోంది. అయితే, మేనేజర్ ఈ పెంపు సంస్థలోనే అత్యధికమైన వాటిలో ఒకటని చెప్పడంతో పాటు, తన జీతం గురించి ఇతర ఉద్యోగులతో మాట్లాడవద్దని సూచించినట్లు పోస్టులో ఉంది.అయితే ఇక్కడే ఉద్యోగికి ఆందోళన మొదలైంది. ఇప్పటికే కంపెనీ 50 మందిని తొలగించిన పరిస్థితిలో తన జీతం రెట్టింపు కావడం భవిష్యత్తులో తన ఉద్యోగానికి ప్రమాదంగా మారుతుందా? మరోసారి తొలగింపులు జరిగితే అధిక ప్యాకేజీ కారణంగా కొత్త ఉద్యోగం దొరకడం కష్టమవుతుందా? అనే సందేహాలు అతడిని వెంటాడుతున్నట్లు పోస్టు తెలిపింది.ముఖ్యంగా సిస్టమ్ డిజైన్ వంటి అంశాల్లో తనకు నైపుణ్యం ఉన్నప్పటికీ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ (DSA) అంటే తనకు ఇష్టం లేదని, అదే సమయంలో రూ.50 లక్షల ప్యాకేజీ స్థాయి ఉద్యోగాలకు మారాలంటే ఇంటర్వ్యూల్లో డీఎస్ఏ నైపుణ్యాలు అవసరమవుతాయా అనే ఆందోళన కూడా అతడికి ఉందట.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఉద్యోగి ప్రస్తుత కంపెనీని వదిలి వెళ్లాలని అసలు కోరుకోవడం లేదు. తన మేనేజర్ అద్భుతమైన వ్యక్తి అని, మంచి వర్క్-లైఫ్ బ్యాలెన్స్తో పాటు తన ఉద్యోగాన్ని నిజంగా ఇష్టపడుతున్నానని చెప్పినట్లు పోస్టులో ఉంది. అందుకే అతని అసలు ప్రశ్న ‘ఇప్పుడే ఉద్యోగం మారాలా?’ అనేది కాదు.. ‘రేపు ఉద్యోగం పోతే మరో అవకాశానికి నేను సిద్ధంగా ఉన్నానా?’ అనేదే.ఈ కథనంపై సోషల్ మీడియాలోనూ భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొందరు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంపును గొప్ప అవకాశంగా అభివర్ణించగా, మరికొందరు ఉద్యోగ భద్రత, నైపుణ్యాల అప్డేట్, అత్యవసర పొదుపులపై దృష్టి పెట్టాలని సూచించారు.ఇదిలా ఉంటే, 2026లో టెక్ ఉద్యోగ మార్కెట్లో అధిక వేతనాలపై ఆకర్షణతో పాటు ఉద్యోగ భద్రతపై ఆందోళనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల రూ.25 లక్షల ఉద్యోగాన్ని వదిలి విదేశాల్లో మాస్టర్స్ చేసిన ఓ భారతీయ టెకీ.. తిరిగి వచ్చాక వందలాది దరఖాస్తులు చేసినా కేవలం కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ మాత్రమే వచ్చాయని, రూ.40–50 లక్షల ప్యాకేజీ ఆశించిన చోట రూ.25 లక్షల ప్యాకేజీ ఆఫర్లు మాత్రమే లభించాయని వెల్లడించాడు.The company doubled a guy’s salary to ₹50 LPAbut instead of just happiness, the hike brought a whole new fear. Every year, appraisals happened in june. This time, instead of appraisals, the company suddenly laid off around 50 out of 150 employees.Those of them who…— Pooja (@poojaofficial5) August 8, 2026
ఒక్క రోజులో పెరగనున్న ఐఫోన్ ధర?
యాపిల్ ఐఫోన్ కొనుగోలుదారులకు షాక్ ఇచ్చే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఐఫోన్ 17 (iPhone 17) సిరీస్ ధరలను ఆగస్టు 10 అంటే సోమవారం నుంచే పెంచే అవకాశం ఉందని తాజా లీక్ వెల్లడించింది. చైనీస్ సోషల్ మీడియాలో ఫిక్స్డ్ ఫోకస్ డిజిటల్ (Fixed Focus Digital) అనే టెక్ లీకర్ చేసిన పోస్టు ఈ ఊహాగానాలకు కారణమైంది. అయితే ధర ఎంత పెరుగుతుంది, ఏ మోడళ్లకు వర్తిస్తుంది అనే వివరాలను లీకర్ వెల్లడించలేదు. అయితే యాపిల్ నుంచి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఈ వార్తకు ప్రధాన కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మెమరీ, స్టోరేజ్ చిప్ల ధరలు కనిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల విస్తరణతో మెమరీ చిప్లకు డిమాండ్ పెరగడం, సరఫరాపై ఒత్తిడి ఏర్పడటం వల్ల హార్డ్వేర్ తయారీ వ్యయాలు పెరిగాయి. ఈ ప్రభావం ఇప్పటికే యాపిల్ ఉత్పత్తులపై కనిపించింది. జూన్లో కంపెనీ భారత్లో మ్యాక్బుక్, ఐపాడ్ తదితర ఉత్పత్తుల ధరలను భారీగా పెంచింది. కొన్ని మోడళ్లలో పెంపు రూ.1 లక్ష వరకు వెళ్లింది.అయితే ఆ ధరల పెంపు సమయంలో ఐఫోన్ ధరలు మాత్రం పెంచలేదు. అందుకే ఇప్పుడు ఐఫోన్ 17పై కూడా ధరల భారం పడుతుందన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. యాపిల్ గతంలో పెరిగిన కాంపోనెంట్ వ్యయాలను కొంతకాలం భరించినప్పటికీ, మెమరీ ధరల పెరుగుదల తీవ్రంగా మారడంతో వినియోగదారులపై కొంత భారాన్ని మోపాల్సి వస్తోందని కంపెనీ వివరణ ఇచ్చింది.ఐఫోన్ 17కు ఎక్కువ కాలం డిమాండ్?ఇక 2026లో యాపిల్ ఐఫోన్ లాంచ్ వ్యూహంలో మార్పులు చేయనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఐఫోన్ 18 Pro, ఐఫోన్ 18 Pro Max, అలాగే యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ సెప్టెంబర్లో రావచ్చని సమాచారం. అదే సమయంలో సాధారణ ఐఫోన్ 18, ఐఫోన్ 18e మోడళ్లను 2027 రెండో త్రైమాసికానికి వాయిదా వేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి.అది నిజమైతే ఐఫోన్ 17 సాధారణం కంటే ఎక్కువ కాలం యాపిల్ లైనప్లో కొనసాగాల్సి ఉంటుంది. దీంతో కొత్త Pro మోడళ్లు వచ్చిన తర్వాత కూడా సాధారణ ధర శ్రేణిలో ఐఫోన్ 17కు డిమాండ్ కొనసాగవచ్చు. ఈ నేపథ్యంలో ధరల పెంపు జరిగితే, ప్రస్తుత ఐఫోన్ 17 కొనుగోలు చేయాలనుకునే వారికి ఆగస్టు 10 కీలక తేదీగా మారే అవకాశం ఉంది.అన్ని ఐఫోన్ 17 మోడళ్ల ధరలు పెరుగుతాయా?ప్రస్తుత లీక్ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ముఖ్యంగా ఐఫోన్ 17 Pro, Pro Max ధరలు పెంచితే, వాటి తర్వాతి తరం మోడళ్లు త్వరలోనే రానున్న నేపథ్యంలో ఆ నిర్ణయం యాపిల్కు కొంత సంక్లిష్టంగా మారవచ్చు. కాబట్టి యాపిల్ అధికారిక ధరల జాబితాను విడుదల చేసే వరకు ఎదురుచూడక తప్పదు.
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం ధరలకు బ్రేక్ పడింది. నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
ఫ్యామిలీ
సర్జికల్ మెనోపాజ్తో పెరిగే మూత్ర సంబంధ సమస్యలు!
సహజంగా మెనోపాజ్ వచ్చిన మహిళలతో పోలిస్తే... శస్త్రచికిత్స ద్వారా మెనోపాజ్ (సర్జికల్ మెనోపాజ్) వచ్చిన మహిళల్లో లైంగిక సమస్యలూ, మూత్ర సంబంధిత సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తాయని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. సర్జికల్ మెనోపాజ్ అంటే ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ ద్వారా అండాశయాలను తొలగించడం వల్ల వచ్చే మెనోపాజ్ అని అర్థం.మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోవడంతో... జననేంద్రియాలు, దిగువ మూత్రనాళ వ్యవస్థలో మార్పుల కారణంగా వచ్చే దీర్ఘకాలిక సమస్యలతో కూడిన సిండ్రోమ్ను ‘జెనిటో యూరినరీ సిండ్రోమ్ ఆఫ్ మెనోపాజ్’ (జీఎస్ఎమ్) అంటారు. సర్జికల్ మెనోపాజ్కు గురైన మహిళల్లో జీఎస్ఎమ్ లక్షణాలు చాలా ఎక్కువ తీవ్రతతో ఉన్నట్లు తేలింది. లైంగిక సమస్యల్లో యోని పొడిబారడం, కలయిక సమయంలో నొప్పి, కోరిక తగ్గడం, కలయిక తర్వాత రక్తస్రావం ప్రధానంగా కనిపించాయి.ఇక మూత్ర సంబంధ సమస్యల్లో మూత్ర విసర్జన సమయంలో నొప్పి కనిపించడం, తరచుగా లేదా అత్యవసరంగా మూత్ర విసర్జన చేయాలనిపించడం, మూత్రాన్ని అదుపులో ఉంచుకోలేక΄ోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ రావడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. సర్జికల్ మెనోపాజ్కు గురైన మహిళల తాలూకు ఇతర ఫిజికల్ పరీక్షల్లోనూ జీఎస్ఎమ్ తీవ్రతను సూచించే స్కోర్లు చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. (చదవండి: మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా?)
విమానం కాలిపోతోంది... కాపాడండి! అర్ధరాత్రి బాలుడి కేకలు..
1945 మార్చి 3 – జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని ఇవోజిమా ద్వీపం...రెండో ప్రపంచ యుద్ధం ఉద్ధృతంగా సాగుతున్న సమయం... అప్పుడే అమెరికాకు చెందిన యుద్ధ విమాన పైలట్ జేమ్స్ హూస్టన్– యుద్ధనౌక నుంచి టేకాఫ్కు సిద్ధమయ్యాడు.‘జాక్! ఈరోజు శత్రువుల పీచమణిచి విజయంతో తిరిగొస్తా. పార్టీ చేసుకుందాం’ అని తన సహచరుడికి చెప్పి ఇవోజిమా ద్వీపం వైపు దూసుకెళ్లాడు జేమ్స్ హూస్టన్. జపాన్ సేనలపై బాంబుల వర్షం కురిపించాడు. అయితే, జపాన్ సైన్యం చేసిన దాడిలో ఇంజిన్కు మంటలంటుకుని విమానం సముద్రంలో కూలిపోయింది. విమానంలో ఉన్న జేమ్స్ చనిపోయాడు.2000 ఏప్రిల్ 10 – అమెరికాలోని లూసియానాలో నివసించే బ్రూస్ లైనింజర్, ఆండ్రియా లైనింజర్ దంపతులు తమ రెండేళ్ల కుమారుడు జేమ్స్ లైనింజర్తో కలిసి ఎప్పటిలాగే నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆ బాలుడు గట్టిగా కేకలు వేశాడు.‘విమానం కాలిపోతోంది! మంటలు అంటుకున్నాయి! ఆ చిన్న మనిషి బయటకు రాలేకపోతున్నాడు... కాపాడండి!’ అంటూ అరిచాడు. దీంతో ఉలిక్కిపడ్డ అతడి తల్లిదండ్రులు జేమ్స్ను దగ్గరకు తీసుకుని బుజ్జగించి నిద్రపుచ్చారు. ఇక ఆ రోజు నుంచి వారికి నిద్ర కరువైంది. ప్రతిరోజూ రాత్రివేళ నిద్రపోతున్న బాలుడు ఉన్నట్టుండి గాల్లో కాళ్లు, చేతులు విసిరేస్తూ, ఊపిరి ఆడనట్లు విలవిలలాడిపోయేవాడు. చెమటలతో తడిసిపోతూ గట్టిగా కేకలు వేసేవాడు.వారంలో నాలుగైదు రోజులు ఇదే సీన్. మొదట్లో తల్లిదండ్రులు ఏదో పీడకల అనుకున్నారు. కానీ అంతకంతకూ ఆ చిన్నారి ప్రవర్తన విచిత్రంగా మారింది. బొమ్మ విమానాలతో ఆడుకుంటూ, వాటిని నేలకేసి కొడుతూ ‘విమానం క్రాష్ అయిపోయింది’ అని అరిచేవాడు.రోజులు గడిచేకొద్దీ ఆ చిన్నారి చెబుతున్న మాటలకు తల్లిదండ్రులు షాకయ్యేవారు. ఆ వయసు పిల్లలకు అస్సలు తెలియని ‘విమాన çపరిభాష’ గురించి జేమ్స్ మాట్లాడటం చూసి నిర్ఘాంతపోయేవారు. విమానం కింద ఉండే ‘డ్రాప్ ట్యాంక్’ గురించి, దాన్ని ఎలా డిస్కనెక్ట్ చేయాలో స్పష్టంగా చెప్పేవాడు. దీంతో ఒకరోజు తండ్రి బ్రూస్ తన కొడుకుని దగ్గరకు తీసుకుని నెమ్మదిగా ఆరా తీశాడు.‘నాన్నా, అసలు ఆ విమానం ఎక్కడి నుంచి ఎగిరేది?’ అని అడిగితే, ‘అది నటోమా అనే పెద్ద యుద్ధనౌక మీద నుంచి ఎగిరేది డాడీ’ అని బదులిచ్చాడు. ఆ చిన్న మనిషి ఎవరు నాన్నా అని ప్రశ్నిస్తే, ‘అది నేనే.. నా పేరు కూడా జేమ్సే’ అని సమాధానమిచ్చాడు. ‘నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా?’ అంటే.. ‘నా బెస్ట్ ఫ్రెండ్ జాక్ లార్సన్ నాతోనే ఉండేవాడు’ అని చెప్పాడు. ‘జపాన్ సైనికులు తన విమానం ఇంజిన్ పై దాడి చేసి కూల్చివేశారు. విమానానికి మంటలు అంటుకుని సముద్రంలో పడిపోయి చనిపోయాను’ ఆ పసివాడు కళ్లు పెద్దవి చేసి మరీ వివరించాడు.ఇదంతా పసివాడి ఊహాజనిత కథ అని నిరూపించాలని బ్రూస్ నిశ్చయించుకున్నాడు. సైనిక రికార్డులు, రెండో ప్రపంచ యుద్ధ పత్రాలను జల్లెడ పట్టాడు. అవి చూసిన తర్వాత ఆయన వెన్నులో వణుకు పుట్టింది.పసిఫిక్ మహాసముద్రంలో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పేరు యూఎస్ఎస్ నటోమా బే అని, ఆ నౌకపై జాక్ లార్సన్ అనే పైలట్ పనిచేశాడని, అప్పటికి ఆయన ఇంకా జీవించే ఉన్నాడని తెలుసుకున్నాడు.1945 మార్చి 3న జేమ్స్ హూస్టన్ జూనియర్ అనే 21 ఏళ్ల పైలట్ విమానంపై జపాన్ సైనికులు దాడి చేయడంతో అది సముద్రంలో కూలిపోయి అతడు మరణించాడని మిలిటరీ రికార్డులను బట్టి బ్రూస్ నిర్ధారణకు వచ్చాడు. ఈ నమ్మలేని నిజాలను ప్రత్యక్షంగా నిరూపించుకోవడానికి లైనింజర్ కుటుంబం– చనిపోయిన పైలట్ జేమ్స్ హూస్టన్ సోదరి యాన్ బారన్ దగ్గరకు వెళ్లింది. అప్పటికి వృద్ధురాలైన యాన్ బారన్ ను చూడగానే జేమ్స్– పరిగెత్తుకుంటూ వెళ్లి ‘అక్కా’ అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాడు. వారి చిన్నతనంలో ఆడుకున్న ఆటలు, హూస్టన్ ఇంట్లో ఉన్న బొమ్మల పేర్లు, కేవలం ఆ ఇద్దరికీ మాత్రమే తెలిసిన కుటుంబ విషయాలను పూసగుచ్చినట్లు చెప్పాడు.అవన్నీ విన్న తర్వాత ఆనందబాష్పాలతో యాన్ బారన్ అన్న మాట: ‘ఇతడు నా తమ్ముడు జేమ్స్ హూస్టన్... నా తమ్ముడే మళ్లీ పుట్టాడు’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అనంతరం అప్పటికి బతికి ఉన్న సహచర పైలట్ జాక్ లార్సన్ను కలిసినప్పుడు కూడా చిన్నారి జేమ్స్ ఆయనను గుర్తుపట్టి, నాటి యుద్ధ జ్ఞాపకాలను పంచుకున్నాడు.చిన్నారి జేమ్స్ లైనింజర్ కథ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియాను, పారాసైకాలజీ పరిశోధకులను ఆకర్షించింది. గత జన్మ వివరాలన్నీ చెప్పిన జేమ్స్... తను మరణించిన జపాన్ సముద్ర తీర ప్రాంతానికి వెళ్లి నివాళులర్పించాడు. అంతే, అప్పటి నుంచి అతడికి పీడకలలు రావడం ఆగిపోయాయి. శాస్త్రవేత్తలు, డాక్టర్లు దీనికి ఎటువంటి శాస్త్రీయ వివరణ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం సాధారణ యువకుడిలా జీవితం గడుపుతున్న జేమ్స్ లైనింజర్ కథ– ‘పునర్జన్మ’ ఉందనే నమ్మకానికి ప్రపంచంలోనే అత్యంత బలమైన, సజీవ ఆధారంగా ఉంది.- సత్యకిశోర్ కొండ్రెడ్డి
మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా?
ప్రపంచం లో అత్యంత వేగంగా పెరుగుతున్న వ్యాధుల్లో మధుమేహం (డయాబెటిస్) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లమందికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. డయాబెటిస్తో బాధపడేవారిలో వినికిడి శక్తి కూడా తగ్గుతుందా అనే అంశంపై జరిగిన కొన్ని పరిశోధనల్లో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో... డయాబెటిస్ లేని వారితో పోలిస్తే ఆ సమస్య ఉన్నవారికి వినికిడి లో΄ాలు వచ్చే అవకాశం రెండు రెట్లకు పైనే ఉన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్తో బాధపడుతున్న యుక్తవయస్కుల్లో (అడల్ట్స్)లో నాలుగోవంతు మంది (అంటే దాదాపు 25% మంది)లో వినికిడి లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ‘డయాబెటిస్ మెటబాలిజమ్ రీసెర్చ్ రివ్యూ’ అనే జర్నల్లో ప్రచురితమైన అంశాలను బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డయాబెటిస్ బాధితుల్లో దాదాపు 13 కోట్ల మందిలో తీవ్రమైన వినికిడి సమస్యలున్నాయని తేలింది. సాధారణంగా డయాబెటిస్తో బాధపడే వ్యక్తుల్లో వారికి ఉన్న ఆ సమస్య కళ్లు, మూత్రపిండాలు, నరాలకు ఏదైనా నష్టం చేసిందా అన్నకోణంలో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ పరిశోధనల నేపథ్యం లో ఇకపైపై పరీక్షల్లాగే వినికిడి పరీక్షలూ చేయాలంటూ పరిశోధకులు వైద్యవర్గాలకు ఓ సూచన చేస్తున్నారు. ‘‘ఈ వినికిడి సమస్యను తేలిగ్గా తీసుకోకూడదు. డయాబెటిస్తో వచ్చే వినికిడి లోపం చాలాసార్లు 40–50 ఏళ్ల మధ్య వయసులోనే మొదలువుతుంది. దాంతో సంభాషణలు వినడం, ఎదుటివారితో కమ్యూనికేషన్ నెరపడం కష్టమై క్రమంగా ఒంటరితనం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి తగ్గడమూ వేగవంతమవుతుంది. అందుకే డయాబెటిస్ అన్నది నెమ్మదిగా దెబ్బతీసే పెద్దసమస్య. అందుకే ఇకపై డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చేసే పరీక్షల్లో వినికిడి పరీక్షనూ చేర్చాల్సిన సమయం వచ్చింద’’నేది ఈ అధ్యయనం తాలూకు ప్రధాన పరిశోధకుల మాట. తక్కువ ఖర్చుతో చేసే వినికిడి పరీక్షల ద్వారా సమస్యను మొదటే గుర్తిస్తే సత్వర చికిత్స సాధ్యమని పరిశోధకులు తెలిపారు. అవసరమైనప్పుడు హియరింగ్ ఎయిడ్స్ ఉపయోగించడం లాంటి సకాలంలో చేసే చికిత్సతో సంభాషణ సామర్థ్యం, జీవననాణ్యత మెరుగుపడే అవకాశం ఉందనీ, అలాగే రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించడం ద్వారా వినికిడి మరింత దెబ్బతినకుండా కొంతవరకు నిరోధించవచ్చనీ పేర్కొన్నారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు అన్ని పరీక్షల్లాగే వినికిడి పరీక్షలూ చేయడం మంచిదని వారి సూచన. (చదవండి:
ఫొటోలు సరిగా తీయలేదని...
పెళ్లంటే పందిళ్లు ... సందళ్లు... తప్పెట్లు... తాళాలు... రెండు మనసుల కలయికే కాదు, జీవితంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాల వేడుక. ఆ జ్ఞాపకాలను పదిలంగా ఉంచి కలకాలం గుర్తుండేలా వాటికి శాశ్వత రూపం ఇచ్చేవి ఫొటోలు, వీడియోలు. ప్రీ వెడ్డింగ్ షూట్ల నుంచి పెళ్లిలో బంధువుల సందడి, ఆప్యాయ ఆలింగనాలు, వధువును అత్తారింటికి పంపే తల్లిదండ్రుల కంటతడి వరకు ప్రతి ఆనంద క్షణాలూ భావోద్వేగాలూ కాలగర్భంలో కలిసి పోకుండా అవి పదిలంగా ఉంచుతాయి. అందుకే నేటి పెళ్లి తంతులో ఈ ఖర్చు తప్పని సరైంది. లక్షలకు చేరింది.అయితే వీటి చిత్రీకరణలో పొరపాటు జరిగితే; ఆ జ్ఞాపకాలను సరిగా బంధించకపోతే; ఫొటోలు, వీడియోలు ఆశించిన స్థాయిలో రాకపోతే; ఒప్పందం అమలు చేయకపోతే; మానసిక వేదనే మిగులుతుంది. అయితే ఓ జంట ఇలా వేదనతో సరిపుచ్చుకోలేదు. ఒప్పంద ఉల్లంఘనపై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. తమ మనో వేదనకు మూల్యం చెల్లించేలా ఆదేశించాలని, ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు పరిహారాన్ని ఇప్పించాలని వేడుకుంది. సేవల్లో లోపంతో పాటు భావోద్వేగాలను ఫోరం అర్థం చేసుకుని తీర్పు వెలువరించింది.కేరళకు చెందిన ఓస్టిన్ ఊమచెన్, కావ్య సంతోష్ ఇద్దరూ వైద్యులు. వీరిద్దరికి పెళ్లి నిశ్చయం అయింది. కొచ్చిలోని పికోలో వెడ్డింగ్స్ సంస్థ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ పెళ్లి ఫొటోలు, వీడియోలు చూశారు. తమ వివాహ వేడుకను అలాగే పదిలపరుచుకోవాలని భావించి, ఆ సంస్థను సంప్రదించారు.ఒప్పందం... ఉల్లంఘన...బ్రైడ్ అండ్ గ్రూమ్ సైడ్ ప్యాకేజీని ఆ జంట ఎంచుకుంది. ఆ ప్యాకేజీ కింద అందించే సేవలను సంస్థ వివరించింది. మొత్తం రూ.95 వేలకు వారి మ«ధ్య ఒప్పందం కుదిరింది. రూ.10 వేలు అడ్వాన్స్గా, పెళ్లిరోజు మరో రూ. 70 వేలు చెల్లించారు. 2024లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం డ్రోన్ కెమెరా ద్వారా పెళ్లిని షూట్ చేయలేదు. ఆ విషయాన్ని ముందుగా తెలియజేయలేదు. దీంతో మరొకరిని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆ జంట వాదన. మరోవైపు వధువు ఇంట్లో జరిగే వివాహ తంతును చిత్రీకరించేందుకు వెళ్లాల్సిన క్యాండిడ్ ఫొటోగ్రాఫర్ వెళ్లలేదు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన మూడు వెడ్డింగ్ రీల్స్ ఊసే ఎత్తలేదు. వివాహం జరిగిన ఆరు నెలల తర్వాత హైలైట్స్ వీడియోను వాట్సాప్ ద్వారా పంపారు. యూఎస్బీలో ఇచ్చిన వెడ్డింగ్ స్టోరీ కరెప్ట్ అయింది. ఫొటోలు, వీడియో ఎడిటింగ్ పరమ నాసిగా ఉన్నాయి. ముఖ్యమైన వేడుకల ఫొటోలు, ఆనంద క్షణాలు క్యాప్చర్ కాలేదు. ఇలా ఒప్పందంలోని పలు అంశాలను సంస్థ ఉల్లంఘించింది.ఫోరంలో ఫిర్యాదుఒప్పందాన్ని సంస్థ ఉల్లంఘించిందంటూ ఆ జంట కొట్టాయంలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. అయితే కమిషన్ జారీ చేసిన నోటీసులకు పికోలో వెడ్డింగ్స్ సంస్థ స్పందించలేదు. చివరకు ఓ దినపత్రికలో పబ్లిక్ నోటీసు ఇచ్చినప్పటికీ ఆ సంస్థ కమిషన్ ఎదుట హాజరు కాలేదు. దీంతో ఎక్స్పార్టీగా ఫోరం కేసును కొనసాగించింది. ఫిర్యాదుదారులు సమర్పించిన ఆధారాలను పరిశీలించింది. హెలీకామ్(డ్రోన్) సేవలను అందించనందుకు బిల్లులో ఆ మేరకు తగ్గిస్తూ సంస్థ రశీదు ఇవ్వడాన్ని కోర్టు గుర్తించింది. యూఎస్బీ కరెప్ట్ అయిన విషయాన్ని పరిశీలించి నిర్ధారించింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం ఇటువంటి చర్య ‘సేవల్లో లోపం’ పరిధిలోకి వస్తుందని ఫోరం స్పష్టం చేసింది.తీర్పు ఇలా...సంస్థకు చెల్లించిన మొత్తాన్ని ఫిర్యాదుదారులకు తిరిగి ఇవ్వాలని ఫోరం ఆదేశించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.2.50 లక్షలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో 10,000 చెల్లించాలని ఆదేశిస్తూ ఫోరం తీర్పు వెలువరించింది. నిర్ణీత గడువులోగా ఈ మొత్తం అందించకపోతే 9% వడ్డీ చెల్లించాలని పేర్కొంది. ఈ తీర్పు కేవలం ఓ జంటకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించిన కేసు మాత్రమే కాదు. వృత్తి పరమైన సేవలు అందించే ప్రతి సంస్థపై ఉన్న బాధ్యతను గుర్తు చేసే తీర్పు. ఈ తరహా ఒప్పందాలు కేవలం వ్యాపార లావాదేవీలు కావని, విశ్వాసం, జవాబుదారీతనం, ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.- దిలీప్ మాదిరెడ్డి
అంతర్జాతీయం
గర్ల్ ఫ్రెండ్కి రూ. 6 లక్షల రింగ్ : లవర్ చేసిన పని ఇదే!
నచ్చిన నెచ్చెలి కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు ప్రేమికులు. తాజాగా తమ నిశ్చితార్థ కలను నిజం చేసుకోవడానికి ఒక వ్యక్తి ఎంతటి కష్టానికైనా వెనుకాడడని నిరూపించాడు అమెరికాకు చెందిన బ్రాడ్లీ చో (Bradley Cho). తన ప్రియురాలికి విలువైన డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ గిప్ట్గా ఇవ్వాలనే కోరికతో చాలానే కష్టపడ్డాడు. ఒకపక్క పగలు కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే మరో పక్క రాత్రుళ్లు ఫుడ్ డెలివరీ బాయ్గా అదనపు పనిచేశాడు. చివరికి..బ్రాడ్లీ చో ఇటీవల తన ప్రియురాలితో కలిసి ఒక కాండో (ఇల్లు) కొనుగోలు చేశాడు. దీంతో అతని వద్ద ఉన్న సేవింగ్స్ అన్నీ ఖర్చైపోయాయి. ఇక నిశ్చితార్థపు ఉంగరం కొనడానికి డబ్బులు లేకుండా పోయాయి. ఎలాగైనా ఆమెకు లగ్జరీ డైమండ్ రింగ్ కానుకగా ఇవ్వాని నిర్ణయించుకున్నాడు. అంతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డోర్డాష్ (DoorDash) ద్వారా డెలివరీ ఏజెంట్గా పనిచేశాడు. రోజూ పగటిపూట రెగ్యులర్ కార్పొరేట్ ఉద్యోగం ముగించుకుని, రాత్రి 2 గంటల వరకు డెలివరీలు చేసేవాడు. మళ్లీ ఉదయం 6 గంటలకే నిద్రలేచి ఆఫీస్కు వెళ్లేవాడు. ఇలా రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతూ ఇలా ఒకటీ రెండూ కాదు ఏకంగా 8 నెలల పాటు కష్టపడ్డాడు. ఈ క్రమంలో రెండు వారాల పాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు కూడా. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల వల్ల తన కార్పొరేట్ ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి కూడా వచ్చింది. అయినా పట్టువీడలేదు. View this post on Instagram A post shared by Bradley Cho (@bradjcho) చివరికి 8 నెలల కష్టం తర్వాత 6,500 డాలర్లు (దాదాపు రూ. 6 లక్షలు) విలువైన డబ్బును సమకూర్చుకున్నాడు. దీంతో ల్యాబ్-గ్రోన్ డైమండ్తో (Lab-grown diamond) పాటు వారిద్దరి 'బర్త్ స్టోన్స్' (జన్మ రాశి రత్నాలు) అమర్చిన ప్రత్యేకమైన నిశ్చితార్థపు ఉంగరాన్ని తయారు చేయించాడు. View this post on Instagram A post shared by Bradley Cho (@bradjcho) ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ నెటిజన్ల స్పందన"డే 89.. మై గర్ల్ఫ్రెండ్కు రింగ్ కొనేవరకు" అంటూ రోజూ తన ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసిన బ్రాడ్లీకి నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభించింది. లక్షలాది మంది ఆయన పట్టుదలను, ప్రేమికురాలి పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు అందించడం విశేషం.ఇదీ చదవండి: 8 అడుగుల జుట్టు : ఇండియన్ యూట్యూబర్ వరల్డ్ రికార్డ్, ఎన్నేళ్ల కష్టమో తెలుసా?
కిమ్ వింత సలహా!.. ఏంటో తెలుసా?
ఉత్తర కొరియాలో మండుతున్న ఎండలు ఇప్పుడు మరో ఆసక్తికర చర్చకు దారితీశాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ప్రజలు వేడిని తట్టుకునేందుకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఓ వింత సలహా ఇచ్చారు!. ఆయన సూచన మేరకు.. ప్రజలంతా కుక్క మాంసం సూప్ తినాలని అక్కడి ప్రభుత్వ మీడియా సూచిస్తోంది. అంతేకాదు దీనిని సంప్రదాయ ఆరోగ్య ఆహారంగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తోంది.ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో ఇటీవల ఉష్ణోగ్రతలు 36.7 డిగ్రీల సెల్సియస్ (98.1 ఫారెన్హీట్)కు చేరుకున్నాయి. దీంతో వేసవి వేడిని ఎదుర్కొనే ఆహారాలపై అధికార పార్టీ పత్రిక రోడాంగ్ సిన్మున్ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. పుచ్చకాయ, దోసకాయలు, చేపల గంజి, పెసరపప్పు వంటి చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలతో పాటు.. డాంగోగి (కుక్క మాంసం) సూప్ను కూడా "పోషకాహారం"గా పేర్కొంది.‘వేడి వేడితోనే పోతుంది’.. పాత నమ్మకంకొరియన్ సంస్కృతిలో కొన్ని ప్రాంతాల్లో కుక్క మాంసాన్ని గతంలో నుంచి బలాన్నిచ్చే ఆహారంగా భావించే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా వేసవిలో అత్యంత వేడి రోజులుగా భావించే సాంబోక్ (Dog Days of Summer) సమయంలో దీనిని తినే ఆచారం ఉందని చెబుతారు. "వేడిని వేడితోనే జయించాలి" అనే నమ్మకంతో కుక్క మాంసం సూప్ శరీరానికి శక్తినిస్తుందని కొందరు విశ్వసిస్తారు.అసలు శాస్త్రీయ నిజం ఏమిటి?కుక్క మాంసం తింటే శరీరంలోని వేడి తగ్గుతుందని లేదంటే ఎండ వేడిని ప్రత్యేకంగా తట్టుకునే శక్తి వస్తుందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే ఇతర మాంసాహారాల మాదిరిగానే ఇందులో ప్రోటీన్, కొవ్వు, కొన్ని పోషకాలు ఉండవచ్చు. అవి శరీరానికి శక్తిని అందించవచ్చు. కానీ తీవ్రమైన ఎండలో శరీరాన్ని చల్లబరచడానికి ప్రధానంగా అవసరమయ్యేవి మాత్రం తగినంత నీరు తాగడం, ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉంచుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం అని వైద్య నిపుణులు చెబుతారు. వేసవిలో అధిక కొవ్వు, బరువైన ఆహారాలు కొందరిలో జీర్ణ సమస్యలు కూడా కలిగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.సంప్రదాయమా? ప్రచారమా?కుక్క మాంసాన్ని వేసవి ఆహారంగా ప్రచారం చేయడం వెనుక కేవలం ఆరోగ్య నమ్మకం మాత్రమే కాకుండా.. ఉత్తర కొరియా ప్రభుత్వ ప్రచార కోణం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల సంప్రదాయాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం స్థానిక సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అదే సమయంలో కఠిన వాతావరణ పరిస్థితుల్లో ప్రజలకు "పరిష్కారాలు" చూపిస్తున్నామనే సందేశాన్ని కూడా ఇవ్వాలనుకుంటోంది.కిమ్ ఇమేజ్కు మరో ప్రచారంవేసవి వేడి నేపథ్యంలో ఉత్తర కొరియా మీడియా మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ ప్రజల కోసం కష్టపడే నాయకుడిగా చూపించే కథనాలను కూడా ప్రసారం చేస్తోంది. గతంలో తీవ్రమైన ఎండలు, వర్షాలను లెక్కచేయకుండా నిర్మాణ పనులను పరిశీలించారని, ప్రజల సంక్షేమం కోసం పనిచేశారని అధికారిక మీడియా పేర్కొంది. ఇప్పుడు ఆయన ఈ సలహా ఇచ్చారంటూ ప్రచారం చేస్తోంది.ప్రపంచవ్యాప్తంగా చర్చఉత్తర కొరియా సూచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఒకవైపు ఇది అక్కడి సంప్రదాయ ఆహార సంస్కృతిలో భాగమని కొందరు చెబుతుండగా.. మరోవైపు ఆధునిక వైద్య శాస్త్రం మాత్రం దీన్ని వేడిని తగ్గించే ప్రత్యేక పరిష్కారంగా గుర్తించడం లేదు. రికార్డు వేడి వేళ కిమ్ సర్కార్ ఇచ్చిన ఈ సలహా.. సంప్రదాయం, నమ్మకం, శాస్త్రం మధ్య చర్చకు తెరలేపింది.
35 కోట్ల బ్రాలు, 43 కోట్ల బనియన్లు, అండర్వేర్లు.. అయినా తప్పని కష్టాలు!
గ్వారావో: చైనాలోని గ్వారావో (Guurao) నగరాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ‘అండర్వేర్ సిటీ’గా పిలుస్తారు. ఇక్కడ కేవలం అండర్వేర్లు, బ్రా, బనియన్ల తయారీ పరిశ్రమపైనే మొత్తం ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ప్రతిరోజూ లక్షలాది ఇన్వర్వేర్లు తయారయ్యే ఈ నగరంలో ఏటా సుమారు 35 కోట్ల బ్రాలు, 43 కోట్ల బనియన్లు, అండర్వేర్లు ఉత్పత్తి అవుతున్నాయి.ఇక్కడి పారిశ్రామిక ఉత్పత్తిలో అండర్వేర్ రంగానికి దాదాపు 80 శాతం వాటా ఉంది. 1982లో ప్రారంభమైన ఈ పరిశ్రమ హాంకాంగ్, తైవాన్ పెట్టుబడుల సహాయంతో క్రమంగా విస్తరించి, 1995-2005 మధ్య కాలంలో భారీ పారిశ్రామిక కేంద్రంగా అవతరించింది. అయితే, కేవలం ఒకే రకమైన పరిశ్రమపై పూర్తిగా ఆధారపడటం ఆ నగరానికి ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. పెరిగిపోతున్న ఉత్పత్తి వ్యయం, గిరాకీకి తగినట్లుగా ధరలు పెంచలేకపోవడం వంటి కారణాల వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.దీనికితోడు, థాయ్లాండ్, వియత్నాం దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో తయారీ ఖర్చులు తక్కువగా ఉన్న ఆ ప్రాంతాలకు ఆర్డర్లు తరలిపోతున్నాయి. దీంతో ఎగుమతులు తగ్గి, స్థానిక ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోలేకపోతే, కేవలం ఒకే రంగంపై ఆధారపడిన ఇటువంటి ‘వన్-ఇండస్ట్రీ టౌన్లు’ భవిష్యత్తులో తీవ్ర సంక్షోభాన్ని చవిచూసే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: గాల్లో దూసుకెళ్లే ఫ్లయింగ్ వెహికల్.. దిమ్మతిరిగే ఆవిష్కరణ!
భారత్పై 100 శాతం టారిఫ్.. తిప్పలు అమెరికాకే?
రష్యా చమురు వంకతో.. భారత్, చైనాలపై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే ప్రతిపాదన అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ నిర్ణయం అమెరికా ప్రయోజనాలకే నష్టం కలిగిస్తుందని రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ హెచ్చరించారు. భారీ టారిఫ్లు విధించడం అంటే.. స్వయంకృతాపరాధమేనని వ్యాఖ్యానించారు.రష్యాపై ఆంక్షలకు సంబంధించిన బిల్లుపై అమెరికా సెనేట్లో చర్చ సందర్భంగా భారత్, చైనాల నుంచి వచ్చే వస్తువులపై 100 శాతం వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే సెనేట్ ఆమోదం పొందడంతో.. నెక్స్ట్ ప్రతినిధుల సభ వద్దకు వెళ్తుంది. ఆ తర్వాత ట్రంప్ దాని మీద సంతకం చేస్తే.. అమల్లోకి వస్తుంది. అయితే ఈ బిల్లుపై చర్చ సందర్భంగా స్పందించిన సెనేటర్ రాండ్ పాల్.. ఇలాంటి చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు.“భారం అమెరికన్లపైనే పడుతుంది”టారిఫ్ల వల్ల విదేశీ కంపెనీలే నష్టపోతాయన్న ట్రంప్ వాదనను రాండ్ పాల్ కొట్టిపారేశారు. దిగుమతి సుంకాల అసలు భారం అమెరికా దిగుమతిదారులు, వినియోగదారులపైనే పడుతుందని అన్నారు. ఇప్పటికే జీవన వ్యయాల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న అమెరికన్లపై మరింత భారం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.Breaking: "America imposing 100% tariffs on India and China is the economic equivalent of shooting ourselves in the foot," warns US Senator Rand Paul pic.twitter.com/C2GvQOg3HY— Shashank Mattoo (@MattooShashank) August 8, 2026“100 శాతం టారిఫ్లు విధించడం ఆర్థికంగా మన కాళ్లపై మనమే తుపాకీతో కాల్చుకున్నట్లే” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి నిర్ణయాలు అమెరికా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.భారత్తో సంబంధాలపై ప్రభావం?భారత్ అమెరికాకు కీలక భాగస్వామి అని పేర్కొన్న రాండ్ పాల్.. ఇలాంటి భారీ సుంకాలు రెండు దేశాల మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని సూచించారు. సెనేటర్ రాన్ వైడెన్ కూడా ఈ టారిఫ్ ప్రతిపాదనలపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సమాచారం.రష్యా చమురు కొనుగోళ్లే కారణంరష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ టారిఫ్ ప్రతిపాదన తీసుకొచ్చారు. భారత్, చైనాలతో పాటు రష్యా ఇంధన వాణిజ్యానికి సహకరిస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఇచ్చేలా బిల్లు రూపొందించారు. ఈ బిల్లు అమెరికా సెనేట్లో 86-11 ఓట్లతో ఆమోదం పొందింది. అయితే ఇది చట్టంగా మారాలంటే ప్రతినిధుల సభ ఆమోదం పొందాల్సి ఉంది.ట్రంప్ విధానాలపై చర్చగతంలో కూడా రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేయడాన్ని కారణంగా చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 25 శాతం టారిఫ్లు విధించారు. అయితే విస్తృత వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నాల నేపథ్యంలో తర్వాత వాటిని సడలించారు.ప్రస్తుతం 100 శాతం టారిఫ్ల ప్రతిపాదన మళ్లీ తెరపైకి రావడంతో భారత్పై ప్రభావం కంటే.. అమెరికా వినియోగదారులపై పడే భారం, రెండు దేశాల సంబంధాలపై దాని ప్రభావంపై చర్చ మొదలైంది.
జాతీయం
రాజా రఘువంశీ సోదరుల అరెస్ట్
ఇండోర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు బాధితుడు రాజా రఘువంశీ సోదరులను, మరో ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది హనీమూన్లో భార్య చేతిలో దారుణ హత్యకు గురైన వ్యాపారవేత్త రాజా రఘువంశీ సోదరులైన సచిన్ రఘువంశీ, విపిన్ రఘువంశీలు రావు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రెస్టారెంట్ను, వైన్షాపును నిర్వహిస్తున్నారు.ఈ వైన్షాప్, రెస్టారెంట్లో నిబంధనలకు విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై తక్షణమే విచారణ చేపట్టిన పోలీసులు.. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రాజా రఘువంశీ సోదరులతో పాటు అక్కడ పనిచేసే ముగ్గురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఎక్సైజ్ చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ సక్సేనా వెల్లడించారు.ఇండోర్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజా రఘువంశీకి, సోనమ్ రఘువంశీతో వివాహమైన అనంతరం గతేడాది మేలో హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే అక్కడ భార్య సోనమ్ తన ప్రియుడితో కలిసి పథకం ప్రకారం రాజా రఘువంశీని దారుణంగా హత్య చేయించింది. ఈ సంచలన కేసులో ప్రధాన నిందితురాలైన భార్యతో పాటు ఆమె ప్రియుడు, కిరాయి హంతకులను మేఘాలయ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
విద్యార్థి పోరుపై థరూర్ ఆత్మపరిశీలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యార్థి పోరుపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను సొంత పార్టీ నాయకత్వాన్ని విమర్శించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన ‘ఐఐఎంయూఎన్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై విపక్షాలు సరిగ్గా స్పందించలేకపోయాయని, యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించే మార్గాలను పార్టీలు తెరవాలని తాను కోరినట్లు తెలిపారు.రాహుల్ గాంధీ చేపట్టిన 'ఛాత్రోంకీ గూంజ్' కార్యక్రమం పేపర్ లీక్ అంశాలను ముందే లేవనెత్తిందని, అయితే యువత ఆకాంక్షలకు తగినట్లుగా మన విధానాలు ఎందుకు ప్రతిధ్వనించలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలని థరూర్ పేర్కొన్నారు. కొందరు మీడియా ప్రతినిధులు తన మాటలను అసందర్భంగా వక్రీకరించి, పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు.ఈ మేరకు తన పూర్తి ప్రసంగ వీడియోను ‘ఎక్స్’ వేదికగా విడుదల చేస్తూ, రాజకీయాల్లో యువత కేవలం ప్రేక్షకులుగా కాకుండా నాయకత్వ స్థానాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతకు ఇవ్వాలని, రాజకీయ పార్టీలు తమ తలుపులను కొత్త తరానికి తెరవాలని శశిథరూర్ పిలుపునిచ్చారు.ఇది కూడా చదవండి: భారత యువతి హత్య: ఏడు నెలల తర్వాత ప్రియుడి అరెస్ట్!
ప్రియుడు.. ప్రియురాలు.. 10 తూటాలు..!
ప్రియుడిపై ప్రేమ.. తండ్రి భయం.. చివరకు జైలు గేటు ముందు జరిగిన ఘటన సంచలనంగా మారింది. ప్రియుడిని కలిసేందుకు వచ్చిన బాలిక దగ్గర 10 బుల్లెట్ తూటాలు దొరకడం ఉత్తరప్రదేశ్లో కలకలం రేపింది. నకిలీ ఆధార్ కార్డు, కొంత నగదును కూడా ఆమె నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గోండా డివిజనల్ జైలులో ఉన్న తన ప్రియుడు హర్షు కశ్యప్ను కలిసేందుకు బాలికతో పాటు మరో వ్యక్తి గురువారం జైలుకు వచ్చినట్లు జైలర్ అఫ్తాబ్ ఆలం అన్సారీ తెలిపారు. జైలు ప్రధాన గేటు దగ్గర తనిఖీల సమయంలో బాలిక తప్పుడు గుర్తింపుతో రావడం భద్రతా సిబ్బందికి అనుమానం కలిగించింది. ఆధార్ కార్డులో ఉన్న పేరుకు భిన్నంగా ఆమె మరో పేరు చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆమెను తనిఖీ చేయగా.. జేబులో 10 లైవ్ బుల్లెట్ కార్ట్రిడ్జ్లు బయటపడ్డాయి. వెంటనే జైలు ఔట్ పోస్ట్ ఇన్ఛార్జ్కు సమాచారం అందించి.. బాలికతో పాటు వచ్చిన వ్యక్తితో పాటు వారి దగ్గర ఉన్న వస్తువులను పోలీసులకు అప్పగించారు.విచారణలో బాలిక తన అసలు వివరాలను బయటపెట్టింది. ఆ బుల్లెట్లు తన తండ్రి లైసెన్స్ గన్లోనివని.. తన తండ్రికి కోపం ఎక్కువని.. తాను జైలులో ఉన్న ప్రియుడిని కలవడానికి వెళ్లిన విషయం తెలిస్తే ఆయన ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భయపడి బుల్లెట్లను వెంట తీసుకువచ్చానంటూ చెప్పింది. దీంతో అధికారులు షాక్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వారే టార్గెట్.. ఫోన్లో 600కి పైగా వీడియోలు!
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్లు, యువకులకు డబ్బు ఆశ చూపి వలలో వేసుకుని.. వారిని బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఫోన్లో 600కుపైగా అశ్లీల వీడియోలు, ఫొటోలను పోలీసులు గుర్తించారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రైజింగ్పురాకు చెందిన చేతన్ ప్రకాశ్ కోలి (22).. 2022 నుంచి మైనర్లు, యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. డబ్బులు ఇస్తానని నమ్మించి బాధితులను ఆకర్షించిన నిందితుడు.. వారితో అసభ్యకర వీడియోలు చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరిస్తూ వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడి మొబైల్ ఫోన్ను పరిశీలించగా అందులో పెద్ద సంఖ్యలో అశ్లీల వీడియోలు, ఫొటోలు బయటపడ్డాయని నందుర్బార్ ఎస్పీ అశ్విని సనప్ వెల్లడించారు. ఫోరెన్సిక్ బృందం ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలనకు పంపినట్లు తెలిపారు. వీడియోల్లో ఉన్న బాధితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వారి వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం.. నిందితుడు 2022 నుంచి ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
ఎన్ఆర్ఐ
న్యూయార్క్లో వైభవంగా ఆషాఢమాస బోనాలు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా ప్రతిబింబించేలా స్థానిక ఐసెన్ హోవర్ పార్క్లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. లాంగ్ ఐలాండ్ (నాస్సా కౌంటీ) డిప్యూటీ డైరెక్టర్ మెంగ్ లీ, లెజిస్లేటర్ రోజ్ మేరీ వాకర్, టౌన్ క్లర్క్ రాగిని శ్రీవాస్తవ ఈ వేడుకలకు అతిథులుగా హాజరయ్యారు..ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రముఖ కళాకారులు, కవులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, గాయకుడు సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్యలు ప్రత్యేకంగా తమ పాటలు, ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు.అలాగే పద్మ కోడెల చేతుల మీదుగా జరిగిన అమ్మవారి అలంకరణ, పోతురాజు వేషధారణలో ఆశోక్ చింతకుంట చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అమెరికా నేలపై తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన ఈ బోనాల సంబరాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి.
లండన్లో అట్టహాసంగా 'టాక్' బోనాల సంబురం
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. హౌంస్లౌ నగరంలోని కింగ్స్లే అకాడమిలో జూలై 19న జరిగిన ఈ వేడుకలకు బ్రిటన్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ గణేష్ కుప్పాల.. వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హైకమిషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని.. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని ముఖ్య అతిథులు తమ సందేశంలో పేర్కొన్నారు. మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలతో తమ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరును ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల కోసం తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలానికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.బోనాల వేడుకలు విజయవంతం కావడం పట్ల టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు, అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. టాక్ కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగళి, సత్య చిలుముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లారెడ్డి, గణేష్ పాస్తాం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్రీ విద్య, దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, కార్తీక్, స్నేహ, అమరేశ్వరి, సాయిరావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఈమె న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడైన శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు. స్థానిక వివరాల ప్రకారం.. దీప ఐటీ ఉద్యోగిని అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్తతో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. శ్రీపాతి దీప మరణవార్త విన్న హైదరాబాద్లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. దీప మరణంతో ఆకుతోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఘనంగా తానా ప్రపంచసాహిత్యవేదిక 94వ సమావేశం
తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. “ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత” అనే అంశం మీద ఆదివారం జరిగిన 94 వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది. యూకేలో శస్త్రచికిత్సా వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా. చంద్ర చెరువు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తమ కుటుంబం తరపున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో శస్త్రచికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అలాగే ఇదే సందర్భంలో వెలువరించిన “మహర్షి సుశ్రుత ఏ కంపెండియం – ఫాదర్ ఆఫ్ సర్జరీ” అనే గ్రంధంలో విలువైన వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదములు అన్నారు. వేల సంవత్సరాలనాడే సుశ్రుతుడు సోదాహరణంగా వివరించిన వైద్య పద్దతులు, ఉపయోగించిన శస్త్ర పరికరాల జాబితా పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని అన్నారు. సుశ్రుతుడు రచించిన “సుశ్రుత సంహిత” గ్రంధంలోని అనేక విషయాలను ఇతర భారతీయ భాషలలోకి, ప్రపంచ భాషలలోకి అనువాదం కావలసిన అవసరం ఉందని, వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కారాలు స్ఫూర్తి దాయకంగావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.” తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వేల సంత్సరాలనాడే ప్రపంచం ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలగా ఉన్న “సుశ్రుత సంహిత” అనే ఆయుర్వేద గ్రంథం వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం అన్నారు. మనిషి సాధారణంగా 1,120 రకాల వ్యాధులకు గురిఅవుతాడని, 700 కు పైగా మొక్కల గురించి ఏ మొక్క, ఏ వ్యాధిని, ఎలా తగ్గిస్తుందో ప్రయోగాత్మకంగా నిరూపించాడు. 64 రకాల ఖనిజాల నుంచి అవసరమైన మందులను ఎలా తయారుచేసుకోవచ్చో వివరించాడు. ఈ గ్రంథంలో 120 శస్త్రపరికరాల గురించి వివరించాడు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! అనస్తీషియా ప్రక్రియకు ఆద్యుడు సుశ్రుతుడు. ప్రొస్టేట్ గ్రంథిని జాగ్రత్తగా తొలగించే పద్ధతి, విరిగిన ఎముకలు తిరిగి అతుక్కునేందుకు శస్త్రచికిత్స సూత్రాలు, తెగిన శరీర భాగాలను అతికించటం, అతి సున్నితమైన పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించగల్గడం, గర్భిణీస్త్రీ ఉదరంలో శిశువు పరిణామ క్రమం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్లు చేసే విధానం, వ్యాధిరహితంగా ఉండేందుకు ఏ ఏ కాలాల్లో, ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి, ఎలాంటి తృణధాన్యాలు, పప్పుదినుసుల వాడాలి అనే సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాధమికదశనుండే విద్యార్థులకు పాట్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి (డెట్రాయిట్ నుండి) సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి, డా. వి. కె రాజు (వెస్ట్ వర్జీనియా నుండి) సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్దతుల గురించి, డా. శేషు శర్మ (వాషింగ్టన్ డి.సి నుండి) సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహరం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే డా. పండరి గంటి (లాస్ ఏంజిల్స్ నుండి) సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంధంలో పేర్కొన్నారని, అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్న అతిథులందరికీ, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. (చదవండి: ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు)
క్రైమ్
విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి మహిళ దుర్మరణం
కరీంనగర్: వంటగ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యావనవేని విజ్ఞత(27) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి మహాకవి పోతనకాలనీలోని నివాసం ఉంటున్న సింగరేణి కారి్మకుడు యాదనవేని వసంత్ – విజ్ఞత దంపతులు ఈనెల 2న గ్యాస్స్టౌవ్ పేలి తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. 80శాతం కాలిన గాయలతో విజ్ఞత, 60 శాతం కాలిన గాయాలతో వసంత్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజ్ఞత చనిపోయింది. వసంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, దంపతుల ఇద్దరు పిల్లలు బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. దీంతో పోతనకాలనీలో విషాదచాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తీసుకురానున్నట్లు స్థానికులు తెలిపారు. విజ్ఞత తల్లిగారి గ్రామమైన బెల్లంపల్లిలోని బుచ్చంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ పేలి దంపతులకు తీవ్ర గాయాలు
బెలూన్లు నింపుతుండగా పేలుడు
హైదరాబాద్: మదీనాగూడలోని జీఎస్ఎం మాల్ వద్ద శనివారం సాయంత్రం బెలూన్లలో గ్యాస్ నింపుతుండగా సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి కాలు తెగిపోయింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇన్స్పెక్టర్ జయరాం తెలిపిన ప్రకారం ఉత్తర్ప్రదేశ్కు చెందిన అవినాష్ అనే యువకుడు జీఎస్ఎం మాల్ ముందు సైకిల్పై గ్యాస్ సిలిండర్ పెట్టుకొని గ్యాస్ బెలూన్లు విక్రయిస్తుంటాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో బెలూన్లో గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా సిలిండర్ భారీ శబ్ధంతో పేలింది. దీంతో అక్కడే ఐస్క్రీమ్లు విక్రయిస్తున్న ఉత్తర్ప్రదేశ్కు చెందిన వివేక్ పాల్ కుడి కాలుకు సిలిండర్ ముక్కలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలు కింది భాగం తెగి పడింది. అలాగే అదే రూట్లో వెళ్తున్న కొండాపూర్కు చెందిన ఎం.జనార్ధన్, శ్రీ చైతన్య కళాశాలకు చెందిన ఎన్.ధనూషకు కూడా గాయాలయ్యాయి. సింధుప్రియ అనే మహిళ షాపింగ్ పూర్తి చేసుకొని కారులో కూర్చున్న సమయంలో సిలిండర్ పేలుడు ధాటికి కారు అద్దాలు పగిలి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న మరికొందరికి కూడా చిన్న చిన్న గాయాలైనట్లు చెప్పారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వారందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాలు తెగిపడిన వివేక్ పాల్ను మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బెలూన్లు విక్రయిస్తున్న అవినాష్కు కూడా చేతికి గాయమైందని, పేలుడు జరగ్గానే అక్కడ నుండి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు. ఉలిక్కిపడిన స్థానికులు రద్దీ ప్రాంతంలో అకస్మాత్తుగా సంభవించిన పేలుడుతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మాల్లోకి వెళ్లే మార్గం పక్కనే పేలుడు జరగడంతో చాలా మంది గాయపడ్డారు. అసలేం జరిగిందో తెలియక రోడ్డు వెంట వెళ్లే వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
వెంటిలేటర్పై డాక్టర్ ప్రియాంక
హైదరాబాద్: రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కర్నూలుకు చెందిన ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్లు కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, గ్లాస్గో కోమా స్కేల్ (జీసీఎస్) తక్కువగా ఉండటంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. వారిని వదిలిపెట్టరాదు కొద్ది రోజుల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని వైద్యురాలిగా సేవలు అందిస్తుందని అనుకున్నాం. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి అన్నీ చూసుకోవాలని అనుకునేది. కానీ ఆమెను ఈ పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందనుకోలేదు. మా కుమార్తె బతకాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఆప్నియా టెస్టుకు ఆమె శరీరం సహకరించడం లేదు అందుకే వైద్యులు విరమించుకున్నారు. మా కుమార్తెకు ఈ గతి పట్టించిన వాళ్లను వదలిపెట్టకూడదు. నడిరోడ్డులో ఉరితీయాలి. – తండ్రి వెంకటేష్
పనిమనిషి హత్య.. ఇంటిపై నాటు బాంబులతో దాడి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం తాళంబేడు పంచాయతీ పరిధిలోని మంగాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు పెంపుడు కుక్కలకు మత్తుమందు ఇచ్చి, పనిమనిషిని గొంతుకోసి హతమార్చడమే కాకుండా నాటు బాంబులతో కలకలం సృష్టించారు. బీఎన్ఆర్పేట ఎస్ఐ మణికంఠేశ్వర్రెడ్డి కథనం ప్రకారం.. మంగాపురం గ్రామానికి చెందిన పట్టాభినాయుడు అమెరికాలో ఉంటున్నారు.ఆ ఇంట్లో ఆయన సోదరి, ఆమె భర్తతోపాటు పనిమనిషి ఆనందరావు(50) ఉంటున్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన ఆనందరావు ఇక్కడ 11ఏళ్లుగా పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు, ముందుగా ఇంట్లోని పెంపుడు కుక్కలకు మత్తుమందు ఇచ్చి అచేతనంగా మార్చారు. ఆ తర్వాత ఇంట్లో ఆనందరావును అడ్డగించి గొంతు కోసి హత్య చేశారు. నాటు బాంబుల మోత... హత్య అనంతరం దుండగులు ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేసేందుకు నాటు బాంబులను పేల్చారు. పెద్ద ఎత్తున బాంబు పేలుడు శబ్దాలు రావడంతో ఇంట్లోని వారు అరుపులు కేకలు పెట్టారు. దీంతో గ్రామస్తులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.ఘటన స్థలంతో పాటు రోడ్డులో రెండు నాటు బాంబులను స్వాదీనం చేసుకున్నారు. ఆనందరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వెల్లువెత్తుతున్న అనుమానాలు హత్యకు గురైన ఆనందరావు గత 11 ఏళ్లుగా పట్టాభినాయుడు ఇంట్లోనే నమ్మకంగా పనిచేస్తున్నాడు. యజమాని ఆర్థిక సహాయంతోనే ఆనందరావు తన కుమారుడిని పుత్తూరులోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివిస్తున్నాడు. ఆనందరావు భార్య, కుమార్తె బాపట్ల జిల్లాలోని సొంత ఊరిలోనే ఉంటున్నారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో బాంబులు పేల్చి మరి హత్యకు పాల్పడడం వెనుక అసలు కారణాలు ఏమిటి? కేవలం పనిమనిషినే లక్ష్యంగా చేసుకుని దాడి చేశారా? లేక ఇంటి యజమానులను భయపెట్టేందుకు ఏమైనా ముఠా పన్నాగమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
వీడియోలు
వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా డాక్టర్ ప్రియాంకకు లేదా? అనితపై అడ్వకేట్ రజిని ఫైర్
జార్ఖండ్ లో ఆగని నిరుద్యోగుల ఆందోళన
ప్రజల తరపున పోరాడుతుంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం..?
BB 10 లోకి శివ్ కుమార్.. ఆ సీక్రెట్ రివీల్..?
నువ్వేం మంత్రివయ్యా! పేకాటలో గెలిస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారా..?
ప్రాణాల మీదికి తెచ్చిన సెల్ఫీ
పెరిగిన బంగారం ధరలతో తగ్గిన కొనుగోళ్లు..
నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది..! చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ప్రియాంక తండ్రి ఫైర్
అమెరికాకు ఇరాన్ పెట్టిన షరతులు ఇవే..!
గిరిజనులకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్


