పోలవరంపై మీ డ్రామాలు ఆపండి బాబూ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రచారంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం నుంచి.. ఇప్పటికే ఉన్న పంపుల ద్వారా గోదావరి నీటిని ఎత్తి, వైఎస్సార్ హయాంలో నిర్మించిన పోలవరం ఎడమ కాలువలోకి వదిలి, తామేదో ‘పోలవరం నీళ్లు ఉత్తరాంధ్రకు తెచ్చేశాం’ అంటూ డప్పు కొట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అవి పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీళ్లు కావని అందరికీ తెలిసినా ప్రచారం మాత్రం వేరే లెవల్లో చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న క్రెడిట్ చోరీపై ఈ మేరకు వైఎస్ జగన్ తన ‘ఎక్స్’« ఖాతా ద్వారా ధ్వజమెత్తారు. ‘నీళ్లు పురుషోత్తపట్నానివి.. కాలువ వైఎస్సార్ హయాంలో నిర్మించింది.. మరి ఇందులో తాను చేసిందేమిటి? క్రెడిట్ కోసమే బాబు ఆరాటం..’ అని ట్వీట్లో దుయ్యబట్టారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...బాబు పబ్లిసిటీ ఈవెంట్లుసాగునీటి ప్రాజెక్టుల విషయంలో మీరు వరుసగా చేస్తున్న పబ్లిసిటీ ఈవెంట్లన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా? మొన్న వెలిగొండ.. ఇవాళ పోలవరం ఎడమ కాలువ.. ఇంకోరోజు ఇంకోటి. మీరు మొదలు పెట్టని, మీరు పూర్తి చేయని ప్రాజెక్టులకు మీ పేరు చెప్పుకోవడం, మీ అనుకూల మీడియాతో వాటి సృష్టికర్తలు మీరే అన్నట్టుగా భజన చేయించుకోవడం మీకు అలవాటే. ఒకవేళ అరకొర పనులు చేసినా, అవి కూడా అంచనాలు పెంచేసి దోచేయడానికే. ఏ సాగునీటి ప్రాజెక్టును తీసుకున్నా మీ మోడస్ ఆపరెండీ, మీ ధోరణి, మీ నైజం ఇదే.అంతా నేనే చేశానని చెప్పుకోవడం మీకే చెల్లిందిపురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు. ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవి కాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా? అసలు పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనుల్లో 79% పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తైతే, ఇప్పుడు.. పూర్తయిన ఆ పనుల మీద నిలబడి ‘‘అంతా నేనే చేశా’’ అని చెప్పుకోవడం చంద్రబాబు గారూ మీకే చెల్లింది!మీ డ్రామాలు రాష్ట్రానికి శాపంపోలవరం విషయంలో 2014–19 మధ్య మీరు చేసిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలు, చేసిన తప్పిదాలు, అవినీతి, దోపిడీ.. ఇవన్నీ రాష్ట్రానికి శాపంలా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముందుచూపు, సరైన ప్రణాళిక, ప్రాధాన్యతలు పాటించకుండా, పద్ధతీ పాడూ లేకుండా మీరు తప్పులు చేస్తే, ఆ చేసిన తప్పులను సరిదిద్దడానికి మా ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. స్పిల్వే, కాఫర్ డ్యాం పనులను అరకొరగా చేసి ప్రాజెక్టును చెల్లాచెదురు చేశారు. చివరకు స్పిల్వే పనులు పూర్తి కాకుండానే, నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేయకుండానే, మెయిన్ డ్యాం పునాది పనుల్లో భాగమైన డయాఫ్రం వాల్ చేపట్టారు. మీరు చేసిన తప్పుల వల్ల, మీ నిర్వాకాల వల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడం ఒక్కటే కాకుండా.. వరదల వల్ల వచ్చిన నీరు, అప్పటికి పాక్షికంగా చేసిన స్పిల్వే ద్వారా డైవర్ట్ కాక, ఎగువన అరకొరగా చేసిన కాఫర్ డ్యాంవల్ల, ఆ గ్యాప్ల ద్వారా నీరు చొచ్చుకుని వచ్చి, మెయిన్ డ్యాం కింద పునాదులు, అంటే డయాఫ్రంవాల్ కొట్టుకుపోయి నష్టం కూడా జరిగింది. వీటన్నింటినీ సరిదిద్దుతూ ముందుగా అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్వే పనులు, కాఫర్ డ్యాంలను పూర్తిచేసి, ఆ తర్వాత మెయిన్ డ్యాం ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన పనులను ఒక్కొక్కటిగా ప్రణాళికా బద్ధంగా ముందుకు తీసుకెళ్లాం. పోనీ ఇప్పుడైనా సవ్యంగా చేస్తున్నారంటే అదీ లేదు. ప్రాజెక్టును మళ్లీ సుడిగుండంలోకి నెడుతున్నారు.ముందు పోలవరం ఎత్తు సంగతి తేల్చండిఅన్నింటికంటే ముఖ్యంగా పోలవరం ఎత్తు సంగతి తేల్చండి చంద్రబాబు గారూ. పోలవరం ఎఫ్ఆర్ఎల్ 45.72 మీటర్లు అయితే, నీటినిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. తాము 41.15 మీటర్ల వరకే నిధులిస్తామని కేంద్రం చెబుతోంది. మరి పూర్తి స్థాయి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది? పూర్తి సామర్థ్యంతో నీటిని ఎలా నిల్వ చేస్తారు? నిర్వాసితులకు ప్యాకేజీ ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి చంద్రబాబు గారూ?ఉత్తరాంధ్ర మీద ప్రేమ ప్రసంగాల్లోనేనా?మరోవైపు ఉత్తరాంధ్రకు గొప్ప మేలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. పురుషోత్తపట్నం పంపుల నుంచి వచ్చే నీళ్లతోనే ఉత్తరాంధ్రకు మేలు జరిగిపోతుందా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంగతేంటి? ఈ స్కీమ్కు వైఎస్సార్ గారు 2009లోనే రూ.7,214.10 కోట్లతో పరిపాలనా అనుమతి ఇస్తే.. మారిన ధరలు, భూసేకరణ, నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని 2022లో మా ప్రభుత్వంలో రూ.17,050.20 కోట్లకు అంచనాలను సవరించి పరిపాలనా అనుమతి ఇచ్చాం. కీలకమైన ప్యాకేజ్–1, ప్యాకేజ్–2 పనులను టెండర్లు, అగ్రిమెంట్ల దశ వరకు తీసుకెళ్లాం. భూసేకరణకు ప్రత్యేక యూనిట్లు కూడా ఏర్పాటు చేశాం. మరి మీ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉత్తరాంధ్ర మీద ప్రేమ ప్రసంగాల్లోనేనా? పనులపై దృష్టి పెట్టండిచంద్రబాబు గారూ.. పోలవరం విషయంలో డ్రామాలు మానండి. పనులపై దృష్టి పెట్టండి. 41.15 మీటర్లు కాకుండా, 45.72 మీటర్ల నిర్దేశిత ఎత్తులో పోలవరాన్ని పూర్తి చేయండి. దీనివల్ల పూర్తిస్థాయి స్టోరేజీ సాధ్యపడుతుంది, తద్వారా పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడంతో పాటు పూర్తి గ్రావిటీతో కుడి, ఎడమ కాలువల ద్వారా నీళ్లు అందించగలుగుతాం. అప్పుడు పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతలతో సంబంధం లేకుండానే గ్రావిటీతోనే పోలవరం ఎడమ కాలువతోపాటు కుడి కాలువలకు నీళ్లు పుష్కలంగా పంపగలం. మరి ఇది చేయకుండా ఇన్ని డ్రామాలు ఎందుకు?
పాతికేళ్ల జలయుద్ధానికి తెర: బిహార్, జార్ఖండ్ల కీలక ఒప్పందం!
రెండున్నర దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసిన జల వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల మధ్య సోన్ నది నీటి పంపకాలపై గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం ఢిల్లీ వేదికగా ముగిసింది. కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర అవగాహన ఒప్పందం కుదిరింది. రెండు రాష్ట్రాల అన్నదాతల భవితవ్యాన్ని మార్చే ఈ కీలక ఒప్పందం ప్రాజెక్టుల శకానికి కొత్త నాంది పలికింది.25 ఏళ్ల పగ ముగిసింది: ఢిల్లీలో చారిత్రక ఘట్టంసోన్ నది నీటి పంపకాలపై పాతికేళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభనకు దేశ రాజధానిలో తెరపడింది. ఈ తాజా చారిత్రక ఒప్పందం ప్రకారం మొత్తం కేటాయింపుల్లో బిహార్కు 5.75 మిలియన్ ఎకరాల అడుగుల ( ఎంఏఎఫ్) నీరు, జార్ఖండ్కు 2 ఎంఏఎప్ నీటిని కేటాయించారు. ఈ కీలక నిర్ణయంతో ఇరు రాష్ట్రాల్లోని కరువు పీడిత ప్రాంతాలలో దశాబ్దాలుగా మూలనపడిన సాగునీరు, రిజర్వాయర్ నిర్మాణాలు, నదుల అనుసంధాన ప్రాజెక్టులు శరవేగంగా పట్టాలెక్కనున్నాయి.విభజన తెచ్చిన చిచ్చు: వివాదం పుట్టిందిక్కడే!ఈ వివాదానికి మూలాలు నవంబర్ 2000 నాటి ఉమ్మడి బిహార్ విభజనలో ఉన్నాయి. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో సోన్ నది ప్రధాన ఎగువ పరివాహక ప్రాంతం, దాని ఉపనదులు జార్ఖండ్ పరిధిలోకి వెళ్లిపోయాయి. దిగువ మైదాన ప్రాంతాల్లోని సారవంతమైన వ్యవసాయ భూములు బిహార్లో ఉండిపోయాయి. నది పుట్టుక ఒకచోట, వ్యవసాయ క్షేత్రాలు మరోచోట కావడంతో సహజంగానే నీటి నియంత్రణ, వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.1973 బాణ్సాగర్ లింక్: 7.75 ఎంఏఎఫ్ వివాదంఈ సంక్షోభం వెనుక 1973 నాటి బాణ్సాగర్ ఒప్పందం కీలక పాత్ర పోషించింది. నాటి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉమ్మడి బిహార్ మధ్య జరిగిన ఆ త్రైపాక్షిక ఒప్పందంలో ఉమ్మడి బిహార్కు మొత్తం 7.75 ఎంఏఎఫ్ నీటిని కేటాయించారు. అయితే 2000లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ 7.75 ఎంఏఎఫ్ నీటిని బిహార్, జార్ఖండ్లు ఎలా పంచుకోవాలనే దానిపై ఎలాంటి స్పష్టమైన చట్టబద్ధ నిబంధనలు రూపొందించలేదు. దాంతో రెండు దశాబ్దాలుగా అనేక కమిటీలు ప్రయత్నించినా రిజర్వాయర్ ఎత్తు, గ్రామాలు మునిగిపోతాయన్న భయాల నడుమ పంచాయితీ కొలిక్కి రాలేదు.ఇంద్రపురి బ్యారేజ్: సీన్ మొత్తం మారింది!ఈ తాజా ఒప్పందంతో రోహ్తాస్ జిల్లాలోని దేహ్రీ-ఆన్-సోన్కు సమీపంలో ఉన్న ప్రసిద్ధ ఇంద్రపురి బ్యారేజ్ పూర్తిస్థాయి నిర్వహణకు మార్గం సుగమమైంది. జార్ఖండ్లోని గఢ్వా, పలాము జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ బ్యారేజీ.. బిహార్లోని షాహాబాద్ వ్యవసాయ ప్రాంతానికి ప్రధాన జీవనాధారం. తాజా ఒప్పందంతో బిహార్కు సాగు కోసం అదనపు నీరు లభించడమే కాకుండా, జార్ఖండ్ భూములు ముంపునకు గురికాకుండా రిజర్వాయర్ నీటిమట్టాన్ని పరిమిత స్థాయిలో ఉంచేందుకు, అవసరమైన పునరావాసం కల్పించేందుకు స్పష్టమైన నియమావళి ఖరారైంది.రాజకీయ ప్రకంపనలు: ఇరు రాష్ట్రాల్లో దశాబ్దాల సెగగత పాతికేళ్లలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నేరుగా యుద్ధ వాతావరణం కనిపించకపోయినా, ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ సోన్ నది అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఖరీఫ్ సీజన్లో కాలువలకు నీరు రాకపోతే బిహార్ నాయకులు సర్కారుపై విరుచుకుపడేవారు. మరోవైపు ఇంద్రపురి డ్యామ్ ఎత్తు పెంచితే తమ భూములు మునిగిపోతాయని, ప్రజలు నిరాశ్రయులవుతారని జార్ఖండ్ నేతలు అడ్డుకున్నారు. వేర్వేరు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉండటంతో పరస్పర నిందారోపణల నడుమ ఈ సమస్య దశాబ్దాల పాటు నలిగిపోయింది.రంగంలోకి కేంద్ర జల సంఘం: చివరకు పరిష్కారం!ఈ సుదీర్ఘ ప్రతిష్టంభనను ఛేదించడంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కీలక దౌత్యం నడిపింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా సాంకేతిక అధ్యయనాలు, హైడ్రాలజీ సర్వేలు జరిపి డ్యామ్ ఎత్తుపై ఆమోదయోగ్యమైన మార్పులను ప్రతిపాదించింది. జల్శక్తి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ ఫైలును ఓ కొలిక్కి తెచ్చారు. ఫలితంగా జార్ఖండ్లోని పలాము, గఢ్వా జిల్లాల దాహం తీరడంతో పాటు బిహార్లోని రోహ్తాస్, భోజ్పూర్, ఔరంగాబాద్ పొలాలకు పుష్కలంగా సాగునీరు అందనుంది.ఇది కూడా చదవండి: రాజస్థాన్ అంటే జైపూర్, ఉదయ్పూర్ కాదు.. మరి?
ట్రంప్ అన్నాడో లేదో.. మ్యాప్ మార్చేసిన వైట్హౌస్!
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న హార్ముజ్ జలసంధి పేరును మార్చే అంశం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై వైట్హౌస్ ఏకంగా మ్యాప్నే మార్చి ‘ట్రంప్ స్ట్రెయిట్’గా చూపించింది. అంతేకాదు.. దానికి ‘It’s got a nice ring to it’ అంటూ క్యాప్షన్ పెట్టింది. అంటే.. ‘పేరు వినడానికి బాగానే ఉంది’ అన్నట్టుగా స్పందించింది. దీంతో, అమెరికా చర్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.ట్రంప్ బుధవారం తన ట్రూత్ సోషల్ ఖాతాలో హార్ముజ్ జలసంధికి ‘ట్రంప్ స్ట్రెయిట్’గా పేరు మార్చాలా? అని ప్రశ్నించారు. ‘ఇప్పుడు ఇది అమెరికా నియంత్రణలో ఉంది కాబట్టి.. హార్ముజ్ స్ట్రెయిట్ పేరును ట్రంప్ స్ట్రెయిట్గా మార్చాలా? అమెరికా మాదిరిగానే ఇది కూడా మునుపెన్నడూ లేనంత ‘హాట్’గా ఉంటుంది!’ అంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలు వెలువడిన కొద్దిసేపటికే వైట్హౌస్ అధికారిక సోషల్ మీడియా ఖాతా స్పందించింది. హార్ముజ్ జలసంధిని ‘Trump Strait’గా పేర్కొంటూ ఓ మ్యాప్ను పోస్టు చేసి.. ‘It’s got a nice ring to it’ అని రాసుకొచ్చి అందరికీ షాకిచ్చింది. దీంతో అధ్యక్షుడి వ్యాఖ్యను వైట్హౌస్ కూడా సరదాగా స్వీకరించినట్టు స్పష్టమైంది.నిజంగానే పేరు మారుస్తారా?అయితే ప్రస్తుతానికి హార్ముజ్ జలసంధికి అధికారికంగా ‘ట్రంప్ స్ట్రెయిట్’ అనే పేరు పెట్టినట్లు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఇది ట్రంప్ చేసిన ప్రతిపాదన, దానికి వైట్హౌస్ ఇచ్చిన వ్యంగ్యాత్మక స్పందన మాత్రమే. అంతర్జాతీయ జలమార్గమైన హార్ముజ్ పేరును అమెరికా ఒక్కపక్షంగా మార్చడం అంత సులభం కాదు. అంతేకాదు.. ట్రంప్ తర్వాత తన ప్రతిపాదనను కొంత తేలికగా తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. పేరు మార్చడం గురించి తాను సీరియస్గా అన్నారా అని ప్రశ్నించగా, ‘అది అలా సరదాగా చెప్పాను’ అన్నట్టుగా పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, ట్రంప్ గతంలో సరదాగా ప్రస్తావించిన కొన్ని పేరు మార్పులు తర్వాత అధికారిక చర్యలుగా మారడంతో ఈ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది.ఇది మొదటిసారి కాదు..ట్రంప్ భౌగోళిక పేర్ల మార్పుపై ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి కాదు. 2025లో ఆయన ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా పిలవాలని ఆదేశించారు. ఇటీవల కెనడాతో వాణిజ్య వివాదం మధ్య లేక్ ఒంటారియోకు ‘లేక్ అమెరికా’ అనే పేరు ప్రతిపాదించి, దానిపై అధికారిక చర్యలు కూడా చేపట్టారు.ఇదీ చదవండి: ఇరాన్పై ఇజ్రాయెల్ మిషెన్ ఇంకా పూర్తి కాలేదు: నెతన్యాహు
తిరుపతిలో దారుణం.. రూ.6 కోట్ల వ్యవహారంలో కలకలం!
సాక్షి, తిరుపతి: డబ్బు ఆశతో స్నేహితుడినే కిడ్నాప్ చేసిన ఘటన తిరుపతిలో కలకలం రేపింది. రూ.6 కోట్ల ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో స్నేహితుడిని కిడ్నాప్ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో కీలక నిందితులుగా ఉన్న గౌతమ్, మనోజ్, యశ్వంత్రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానికంగా ఈ కిడ్నాప్ వార్త చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతిలోని చంద్రగిరి మండలం నాగపట్నం గ్రామానికి చెందిన సుమంత్ యూకేలో చదువు పూర్తి చేసుకుని ఇటీవల భారత్కు తిరిగి వచ్చాడు. అనంతరం ‘నాని క్రికెట్ ప్రిడిక్షన్’ పేరుతో టెలిగ్రామ్ ఛానల్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నార్త్ ఇండియాకు చెందిన వ్యక్తులకు సుమంత్ రూ.6 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఇందుకు అడ్వాన్స్గా రూ.30 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ హవాలా మార్గాల్లో సుమంత్కు భారీ మొత్తంలో నగదు చేరినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అతడి స్నేహితులు అత్యాశకు గురై సుమంత్ను కిడ్నాప్ చేయాలని పథకం వేశారు.ఇండోనేషియా నుంచి రాగానే కిడ్నాప్ఇండోనేషియాకు వెళ్లిన సుమంత్ తిరిగి వచ్చిన వెంటనే జూలై 29న బెంగళూరులో అతడిని కిడ్నాప్ చేసిన స్నేహితులు.. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని ఓ హోమ్స్టేకు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో మనోజ్కు చెందిన అపార్ట్మెంట్కు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ మనోజ్, చరణ్ మద్యం మత్తులో ఉండగా సుమంత్ తన యూరప్లో ఉన్న గర్ల్ఫ్రెండ్కు వాట్సాప్లో మెసేజ్ పంపాడు. తనను కిడ్నాప్ చేశారని ఆమెకు సమాచారం అందించాడు. దీంతో ఆమె హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.రూ.30 లక్షలు స్వాధీనంఈ ఘటనపై కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల నుంచి రూ.30 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తిరుపతి రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన కిడ్నాప్ ఘటనపై సుమంత్ ఆగస్టు 28న ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన తిరుపతి రూరల్ పోలీసులు చంద్రగిరికి చెందిన బాలాజీ, చరణ్, వాజిద్ భాషాలను అరెస్ట్ చేశారు. అయితే ఈ కిడ్నాప్ వెనుక ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యశ్వంత్, మనోజ్, గౌతమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు.
మనిషిపై తిరగబడిన రోబో.. హడలెత్తిస్తున్న వీడియో!
రాఘవ్ చద్దా సంచలన ఆరోపణలు
అలాంటి సినిమాల విషయంలో తాప్సీ సంచలన నిర్ణయం
డుప్లెసిస్ విధ్వంసం.. అశ్విన్ టీమ్కు నాలుగో ఓటమి
విద్యార్థిని తీర్చిదిద్దే అసలైన శిల్పి గురువే!
పంటి మెరుపులకు ఏఐ నిఘా!
చట్టం సవరించిన చైనా.. భారత్కు గట్టి హెచ్చరిక!
బాప్తిస్మం అంటే ఏమిటి? అసలు అర్థం ఇదే!
HYD: ఆర్మీ క్యాంప్ సమీపంలో డిటోనేటర్ల కలకలం..
ఒక్క ప్రశ్న.. మారిపోయిన ఓ యువకుడి జీవితం!
జైలు ఖైదీ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా..
బేరాలాడకండి.. ఇదేమీ డీఎస్సీ ఉద్యోగం కాదు చౌకగా దొరికేదానికి..!!
శుభవార్త చెప్పిన హీరోయిన్ నిత్యామేనన్
...మన ‘కష్టమంతా’ వృథా అయినట్లేనా సార్!
నేపాల్ విలయం.. ఇస్రో-నాసా నిసార్ నిద్రపోయిందా?
'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని
రైతు బిడ్డకు రూ.46 లక్షల జీతం
‘నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’
తమ్ముడితో మూవీ.. అన్నతో పెళ్లి.. హాట్టాపిక్గా బలగం బ్యూటీ..!
రాబోయేది నిశ్శబ్దంగా నలిపేసే సంక్షోభం!
3, 4 తేదీల్లో చికెన్ దుకాణాలు బంద్?
‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ రా.. రా కూల్డ్రింక్ తాగుదాం!’
రవితేజ ఇరుముడి.. డైరెక్టర్ రాసిన సాంగ్ రిలీజ్
తమిళ రాజకీయంలో ‘ధనుష్’ వేడి!
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు
కొత్త కెరీర్ను ప్రారంభించిన అభినందన్ వర్ధమాన్
కరువు, ధరల బరువు, అప్పుల అరువు.. ఈ టైంలో వెళితే దరువు తప్పేలా లేదు సార్!
సీఎం రేవంత్పై కొండా సురేఖ తిరుగుబాటు
మనిషిపై తిరగబడిన రోబో.. హడలెత్తిస్తున్న వీడియో!
రాఘవ్ చద్దా సంచలన ఆరోపణలు
అలాంటి సినిమాల విషయంలో తాప్సీ సంచలన నిర్ణయం
డుప్లెసిస్ విధ్వంసం.. అశ్విన్ టీమ్కు నాలుగో ఓటమి
విద్యార్థిని తీర్చిదిద్దే అసలైన శిల్పి గురువే!
పంటి మెరుపులకు ఏఐ నిఘా!
చట్టం సవరించిన చైనా.. భారత్కు గట్టి హెచ్చరిక!
బాప్తిస్మం అంటే ఏమిటి? అసలు అర్థం ఇదే!
HYD: ఆర్మీ క్యాంప్ సమీపంలో డిటోనేటర్ల కలకలం..
ఒక్క ప్రశ్న.. మారిపోయిన ఓ యువకుడి జీవితం!
జైలు ఖైదీ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా..
బేరాలాడకండి.. ఇదేమీ డీఎస్సీ ఉద్యోగం కాదు చౌకగా దొరికేదానికి..!!
శుభవార్త చెప్పిన హీరోయిన్ నిత్యామేనన్
...మన ‘కష్టమంతా’ వృథా అయినట్లేనా సార్!
నేపాల్ విలయం.. ఇస్రో-నాసా నిసార్ నిద్రపోయిందా?
'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని
రైతు బిడ్డకు రూ.46 లక్షల జీతం
‘నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’
తమ్ముడితో మూవీ.. అన్నతో పెళ్లి.. హాట్టాపిక్గా బలగం బ్యూటీ..!
రాబోయేది నిశ్శబ్దంగా నలిపేసే సంక్షోభం!
3, 4 తేదీల్లో చికెన్ దుకాణాలు బంద్?
‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ రా.. రా కూల్డ్రింక్ తాగుదాం!’
రవితేజ ఇరుముడి.. డైరెక్టర్ రాసిన సాంగ్ రిలీజ్
తమిళ రాజకీయంలో ‘ధనుష్’ వేడి!
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు
కొత్త కెరీర్ను ప్రారంభించిన అభినందన్ వర్ధమాన్
కరువు, ధరల బరువు, అప్పుల అరువు.. ఈ టైంలో వెళితే దరువు తప్పేలా లేదు సార్!
సీఎం రేవంత్పై కొండా సురేఖ తిరుగుబాటు
ఫొటోలు
ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)
అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు
మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు)
అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)
ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు)
పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)
'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)
సినిమా
రామ్చరణ్ ఉంటే అద్భుతమే..‘ఇరుముడి 2’పై శివ నిర్వాణ క్లారిటీ
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్చరణ్ క్యామియో ఇస్తారంటూ సినిమా రిలీజ్కు ముందు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో చరణ్ అయ్యప్ప మాల వేయడం, సినిమా నేపథ్యం కూడా అయ్యప్ప స్వామికి సంబంధించినదే కావడంతో ఈ వార్త వైరల్గా మారింది.తాజాగా ‘ఇరుముడి’ సూపర్ హిట్ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్లో చరణ్ నటిస్తారా? అనే ప్రశ్న దర్శకుడు శివ నిర్వాణకు ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘చరణ్ మా సినిమాలో ఉంటే అద్భుతంగా ఉండేది. కానీ ‘ఇరుముడి’ తీసేటప్పుడు ఆయనను క్యామియోగా తీసుకోవాలనే ఆలోచనే మాకు రాలేదు. ఈ ప్రచారం సోషల్ మీడియాలోనే మొదట చూశాను. ఆ తర్వాత మీడియా మిత్రులు కూడా అడగడంతో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది’’ అని చెప్పారు.అయితే కథకు సహజంగా అలాంటి పాత్ర అవసరమైతే చరణ్తో పనిచేయడం అద్భుతంగా ఉంటుందని శివ నిర్వాణ తెలిపారు. ముందుగా స్టార్ను అనుకుని పాత్రను సృష్టించడం తన విధానం కాదని స్పష్టం చేశారు. ‘ఇరుముడి’ కథ సహజంగా పుట్టింది. మాలలో ఉన్న ఓ వ్యక్తికి తాగుడు అలవాటు ఉండటం, ఆ వ్యక్తి తన కూతురు కోసం అయ్యప్ప మాల వేయడం, ఆ 41 రోజుల దీక్షలో అతని జీవితంలో చోటుచేసుకున్న మార్పుల ఆధారంగా ఈ కథను చాలా సహజంగా అభివృద్ధి చేశాం. అందుకే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిందనే కారణంతో వెంటనే ‘ఇరుముడి 2’ కథ రాయలేను. మరో సహజమైన కథా పాయింట్ దొరికితేనే ఇరుముడి సీక్వెల్పై ఆలోచిస్తానని శివ నిర్వాణ స్పష్టం చేశారు.'ఇరుముడి' సినిమా ఇప్పటికే రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అయ్యప్ప స్వామిలా పులిపై కూతురి పాత్రధారి కూర్చుని ఉండగా.. పక్కనే రవితేజ, ప్రియా భవానీ శంకర్ నిలబడి ఉన్నారు. మూడో వారాంతంలోకి వచ్చినా 'ఇరుముడి' జోరు ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ వారం వచ్చే సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ కనిపించట్లేదు. చూస్తుంటే ఈ వీకెండ్ కూడా రవితేజ తన హవా చూపించేలానే కనిపిస్తున్నాడు.
ఓటీటీలోకి హారర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
90ల్లో పుట్టి పెరిగిన చాలామంది ఇప్పుడు 30స్లో ఉన్నారు. వీళ్లంతా చిన్నతంలో హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ వీళ్లని చాలానే భయపెట్టింది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే పలు భాగాలు రిలీజయ్యాయి. కానీ అవన్నీ అడ్వెంచర్ కామెడీ తరహాలో తెరకెక్కాయి. ఈ ఏడాది ఈ జానర్ నుంచి హారర్ బ్యాక్డ్రాప్ స్టోరీతో ఓ మూవీ వచ్చింది. అదిప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ద మమ్మీ' సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్ని ఆకట్టుకుని పర్లేదనిపించింది. అనంతరం మే నెలలో విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్లోకి వచ్చింది. మన దేశంలో మాత్రం ఈ నెల 17 నుంచి హాట్స్టార్లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చూడొచ్చు.'ద మమ్మీ 2026' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం చాలా ఆనందపడుతుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు సదరు కుటుంబాన్ని దారుణంగా ఇబ్బంది పెడతాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా భయపెట్టేలా ఉన్నాయి.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by JioHotstar (@jiohotstar)
ప్రభాస్ని కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్
సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం ‘రొమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు గోపాల్రెడ్డి దర్శకత్వం వహించారు. రేపు(సెప్టెంబర్ 3) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరో సుమంత్ ప్రభాస్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు.→ తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది.→ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్తై కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో అవకాశం వచ్చింది.→ రోమాంచకం సినిమా ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఎవరైనా చూసి ఒకేలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో ఎవరితో అయినా ఈ మూవీని చూడొచ్చు. నేను హీరోగా రెండు సినిమాలు చేసినా.. డైరెక్టర్ వేణుగోపాల్ ఆయనకు ఈ క్యారెక్టర్ కు ఎలా ఉండాలో అలా మార్చుకునేందుకు ఆర్నెళ్లు వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు. ఈ క్యారెక్టర్ లో ఎలా నటించాలి అనేది నాకు ఐడియా ఉంది. కానీ వర్క్ షాప్స్ తో షార్ప్ అయ్యాను. వర్క్ షాప్స్ అంతా కంప్లీట్ అయ్యాక మొదటి నుంచి చివరి దాకా నా పర్ ఫార్మ్ చూసుకుంటే ఎంతో మార్పు కనిపించింది. కొన్నిసార్లు ఒకే సీన్ రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేసిన సందర్భాలున్నాయి.→ సందీప్ అన్న ఒక అవార్డ్ ఫంక్షన్ లో కలిసి ఒక క్యూట్ స్టోరీ ఉంది నువ్వు విను అన్నారు. ఆయన చెప్పాడంటే తప్పకుండా బాగుంటుందని కథ విన్నాను. వేణు అన్న చెప్పిన నెరేషన్ రెండున్నర గంటలు ఎంజాయ్ చేశాను.సందీప్ అన్న, ప్రణయ్ అన్న బయటకు అలా కనిపిస్తారు కానీ వాళ్లు చాలా స్వీట్ పర్సన్స్. వాళ్లతో ట్రావెల్ అయిన వాళ్లకు తెలుస్తుంది.→ విజయ్ దేవరకొండ అన్న మా మూవీ ప్రీ రిలీజ్ కు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నా గురించి బాగా మాట్లాడటం కూడా సంతోషాన్నిచ్చింది. విజయ్ అన్నను చూసి నేను చాలా ఇన్స్ పైర్ అవుతుంటాను. రోమాంచకం సినిమా ఫస్ట్ కాపీ చూసి సందీప్ అన్న బాగా పర్ ఫార్మ్ చేశావంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. రోమాంచకం టైటిల్ కొత్తగా ఉంది ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందా అనిపించింది. కానీ ఇప్పుడు అదొక ఊతపదంలా మారిపోతోంది. సినిమా రిలీజ్ అయ్యాక చాలా మందికి ఈ పదం వాడుకలోకి వస్తుందని నమ్ముతున్నా.→ అనంతిక టాలెంటెడ్ యాక్ట్రెస్. ఆమెకు చాలా ఆర్ట్ ఫామ్స్ తెలుసు. ఏ విద్యనైనా తక్కువ టైమ్ లో నేర్చుకుంటుంది. ఆమెతో ఈ మూవీలో వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. తనకు కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుంది. మా సినిమా ఆద్యంతం రోమాంచకం ఫీల్ ను ప్రేక్షకులకు కలిగిస్తుంటుంది. సినిమాలో ఫ్రెష్ నెస్ చూస్తారు. ప్రతి సీన్ మీకు నవ్వు తెప్పిస్తుంది. నాకు సినిమా చూసినంత సేపు మజా వచ్చింది. మా మూవీలో వాసుకి వైభవ్ మ్యూజిక్ ఇరగదీశాడు. రాధారమణ నా ఫేవరేట్ సాంగ్. ఇంకో లవ్ సాంగ్ ప్రభాస్ గారు రిలీజ్ చేశారు.→ హీరోగా అన్నిరకాల చిత్రాల్లో నటించాలని ఉంది. ఇప్పుడు లవ్ స్టోరీస్ వస్తున్నాయి. హీరోగా పేరొచ్చాక యాక్షన్, కమర్షియల్ ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. నెక్ట్స్ ఏషియన్ బ్యానర్ లో రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ సాయిలు కంపాటితో ఒక మూవీ చేయబోతున్నా. ఈ నెలలోనే ఆ మూవీ స్టార్ట్ కానుంది.
శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్.. అంత పెద్ద రిస్క్ చేస్తాడా?
ఒకప్పుడు ఓ భాషలో సినిమా హిట్ అయిందంటే చాలు.. మరో భాషలో రీమేక్ చేసేందుకు పోటీ పడేవారు. కథ నచ్చితే చాలు స్టార్ హీరోలు సైతం రీమేక్లకు సై అనేవారు. అయితే పాన్ ఇండియా సినిమాల హవా మొదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం కంటే.. అదే సినిమాను డబ్ చేసి ఇతర భాషల్లో విడుదల చేయడానికే మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్లో ఓ సూపర్హిట్ గుజరాతీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఇందులో శ్రీకృష్ణుడి పాత్ర కోసం మెగా పవర్స్టార్ రామ్ చరణ్ పేరును పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.రూ.50 లక్షలతో సినిమా.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లుగత ఏడాది గుజరాతీలో విడుదలైన ‘లాలో – కృష్ణ సదా సహాయతే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. చిన్న బడ్జెట్తో తెరకెక్కి భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. అదే దక్షిణాదిలో అయితే రూ.50 లక్షలతో సినిమా తీయడం సంగతి పక్కన పెడితే.. ఆ మొత్తంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం కూడా కష్టమేననే కామెంట్లు వినిపించాయి.ఈ నేపథ్యంలో ‘లాలో’ను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం. ఈ రీమేక్లో కీలకమైన శ్రీకృష్ణుడి పాత్రను రామ్ చరణ్తో చేయించాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.‘లాలో’ కథేంటి?‘లాలో – కృష్ణ సదా సహాయతే’ కథ విషయానికొస్తే.. లాలో అనే ఆటో డ్రైవర్ తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల భార్యతో గొడవపడి తీవ్రంగా కుంగిపోతాడు. జీవితంలో ఎదురైన సమస్యలను మర్చిపోవడానికి చెడు అలవాట్లకు బానిసవుతాడు. పరిస్థితులు మరింత దిగజారడంతో ఓ నిర్మానుష్య ప్రదేశంలో తలదాచుకుంటాడు. అలాంటి సమయంలో మనిషి రూపంలో శ్రీకృష్ణుడు అతని జీవితంలోకి వస్తాడు. లాలోతో స్నేహం చేస్తూ.. అతని జీవితాన్ని నెమ్మదిగా మార్చే ప్రయత్నం చేస్తాడు. పైకి చూస్తే చాలా సింపుల్గా అనిపించే కథే అయినప్పటికీ.. భావోద్వేగాలను బలంగా పండిస్తూ, కథలో మంచి లోతును చూపించడంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ చిత్రానికి అంకిత్ సకియా దర్శకత్వం వహించారు. ఎమోషనల్ కంటెంట్ ప్రధాన బలంగా నిలవడంతో చిన్న సినిమా కాస్తా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.తమిళ దర్శకుడికి రీమేక్ బాధ్యతలు?తెలుగు రీమేక్కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ప్రచారంలో ఉంది. ఈ సినిమాను తెరకెక్కించేందుకు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేరును టీమ్ పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అలాగే శ్రీకృష్ణుడి పాత్రలో రామ్ చరణ్ నిజంగానే నటిస్తారా? లేదా ఈ ప్రాజెక్ట్ను పక్కన పెడతారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది. చరణ్ ఓకే చెప్పిన తర్వాతే ఈ ప్రాజెక్ట్పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ‘పెద్ది’ తర్వాత కొంత విరామం తీసుకున్న చరణ్.. త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆర్సీ 17’ని సెట్స్పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఇలాంటి సమయంలో ‘లాలో’ రీమేక్ చర్చ తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.గతంలో రీమేక్ సినిమాలు టాలీవుడ్లో ఎన్నో సంచలన విజయాలు అందుకున్నాయి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ విస్తరించడంతో రీమేక్లకు దాదాపుగా కాలం చెల్లిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ రీమేక్ రిస్క్ చేస్తాడా? ‘లాలో’ను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎంత వరకు సక్సెక్ అవుతాయి? శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్ కనిపిస్తారో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
క్రీడలు
సెమీఫైనల్ లక్ష్యంగా...
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీ తొలి మ్యాచ్లో స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయిన భారత మహిళల బృందం తమ తర్వాతి పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో మరో బలహీన జట్టు హాంకాంగ్తో హర్మన్ప్రీత్ కౌర్ బృందం తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత జట్టుకు సెమీఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. గత మ్యాచ్లో థాయ్లాండ్పై విజయం సాధించినా... షఫాలీ వర్మ మినహా ఇతర ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. టి20ల్లో అరంగేట్రం చేసిన ప్రతీక రావల్తో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్, ఓపెనర్ స్మృతి, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్, దీప్తి శర్మ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో 29 పరుగుల వ్యవధిలోనే జట్టు 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది. బౌలింగ్లో రాణించడంతో తుది ఫలితం భారత్కు అనుకూలంగా వచ్చినా... తమ మిడిలార్డర్ను చక్కదిద్దుకునేందుకు భారత్కు ఇది సరైన అవకాశం. షఫాలీ మరోసారి చెలరేగితే జట్టుకు మంచి ఆరంభం లభించడం ఖాయం. స్మృతి అంచనాలకు అనుగుణంగా చెలరేగాల్సి ఉండగా, జెమీమా గాయంతో ఈ టోర్నీకి అవకాశం దక్కించుకున్న ప్రతీక భవిష్యత్తుకు ఇక్కడి ప్రదర్శన కీలకం కానుంది. ఇటీవలి టి20 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత ఈ ఫార్మాట్లో తన కెరీర్ ముగింపు దశలో ఉన్న హర్మన్ కూడా బ్యాటింగ్లో మెరుగవ్వాల్సి ఉంది. బౌలింగ్లో మాత్రం జట్టు పటిష్టంగా ఉండటం సానుకూలాంశం. గత మ్యాచ్లో పేసర్లు క్రాంతి, నందని శర్మలతో పాటు ముగ్గురు స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమ రావత్, దీప్తిలను ఆడించిన మన జట్టు ఈసారి వ్యూహం మారుస్తుందా అనేది చూడాలి. మరోవైపు భారత్తో పోలిస్తే ప్రత్యర్థి హాంకాంగ్ అన్ని రకాలుగా బలహీనమైన జట్టు. తమ తొలి మ్యాచ్లో ఆ జట్టు ఆరు పరుగుల తేడాతో థాయ్లాండ్ చేతిలో ఓడింది. ఆల్రౌండర్ కేరీ చాన్, యాస్మిన్, కెప్టెన్ మర్యమ్, పేసర్ అలీసాన్ జట్టులో కీలక సభ్యులుగా తమ వంతు పాత్ర పోషించగలరు.
మహిళల తొలి చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు భారత్కే
దుబాయ్: ఆరు దేశాలతో తొలిసారి నిర్వహించనున్న మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే నిర్వహణాపరమైన సమస్యలవంటి కారణాలతో ఐసీసీ వేదికను మార్చాల్సి వచ్చింది. శ్రీలంకలో ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం నియమించిన తాత్కాలిక బోర్డు పని చేస్తోంది. దీనిని ఐసీసీ గుర్తించకపోవడంతో వేదికను మార్చక తప్పలేదు. ఆతిథ్య హక్కుల విషయంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ల గురించి కూడా చర్చ జరిగినా చివరకు భారత్లోనే టోర్నీని జరపాలని ఐసీసీ నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంతో పాటు వడోదరలో మ్యాచ్లు నిర్వహిస్తారు. అయితే పురుషుల చాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తుండగా, మహిళల టోర్నీ టి20 ఫార్మాట్లో జరుగుతుంది. ఈ ఏడాది జూలై 6 కటాఫ్ తేదీ కాగా... అప్పటి వరకు ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్–6 స్థానాల్లో ఉన్న భారత్, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక ఈ టోర్నీకి అర్హత సాధించాయి. ఆరు జట్లు లీగ్ దశలో భాగంగా ఐదు ప్రత్యర్థి జట్లతో తలపడతాయి. టాప్–2 జట్లు ఫైనల్కు చేరతాయి.
గట్టెక్కిన జ్వెరెవ్
న్యూయార్క్: కాస్త అటు ఇటు అయి ఉంటే... యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో మరో సంచలనం నమోదయ్యేది. ఇప్పటికే సెర్బియా దిగ్గజం, 24 గ్రాండ్స్లామ్ టైటిల్స్ విజేత జొకోవిచ్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టగా... టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కూడా జొకోవిచ్ సరసన చేరేవాడు. కానీ ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న జ్వెరెవ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి ఓటమి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 4 గంటల 53 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జ్వెరెవ్ 6–4, 3–6, 6–7 (7/9), 7–5, 6–4తో ప్రపంచ 89వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ)పై కష్టపడి గెలుపొందాడు. నాలుగో సెట్ పదో గేమ్లో జ్వెరెవ్ ఓటమికి రెండు పాయింట్ల దూరంలో నిలిచాడు. పదో గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకున్న జ్వెరెవ్ ఆ తర్వాత లొరెంజో సర్వీస్ను బ్రేక్ చేసి 6–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. పన్నెండో గేమ్లో మళ్లీ తన సర్వీస్ను కాపాడుకొని జ్వెరెవ్ సెట్ను సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లోని ఐదో గేమ్లో సొనెగో సర్వీస్ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ ఆ తర్వాత తన సర్వీస్లను నిలబెట్టుకొని గ్రాండ్స్లామ్ టోర్నీల్లో తన 100వ విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో 12 ఏస్లు కొట్టిన జ్వెరెవ్ 8 డబుల్ ఫాల్ట్లు చేశాడు. నెట్ వద్దకు 54 సార్లు దూసుకొచ్చి 38 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. 61 విన్నర్స్ కొట్టిన ఈ జర్మనీ స్టార్ 39 అనవసర తప్పిదాలు చేశాడు. ఈ ఏడాది జ్వెరెవ్ ఆ్రస్టేలియన్ ఓపెన్లో సెమీఫైనల్ చేరుకొని, ఫ్రెంచ్ ఓపెన్లో టైటిల్ సాధించాడు. వింబుల్డన్ టోర్నీలో రన్నరప్గా నిలిచాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్లో ఐదో సీడ్, ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ ఫ్లావియో కొబోలి (ఇటలీ) 4 గంటల 13 నిమిషాల్లో 3–6, 2–6, 6–3, 6–4, 6–4తో ఫ్రాన్సిస్కో కమ్సానా (అర్జెంటీనా)పై శ్రమించి గెలిచాడు. తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ నిశేష్ బసవారెడ్డి తొలి రౌండ్లో 6–7 (4/7), 6–3, 4–6, 4–6తో ట్రిస్టన్ స్కూల్కేట్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో ఓడిన నిశేష్ కు 1,40,000 డాలర్లు (రూ. 1 కోటీ 32 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. మెద్వెదెవ్ ముందంజ పురుషుల సింగిల్స్లో 2021 చాంపియన్, 2019, 2023 రన్నరప్ మెద్వెదెవ్ (రష్యా) మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ మెద్వెదెవ్ 6–1, 6–3, 7–5తో గోర్జ్నీ (అమెరికా)పై గెలుపొందాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్లో అలెక్స్ మిచెల్సన్ (అమెరికా) 6–3, 6–4, 6–4తో 16వ సీడ్ బ్రాండన్ నకíÙమా (అమెరికా)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్లో మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), 19వ సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో పెగూలా 6–3, 6–1తో 2020 ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా)పై, పావోలిని 6–4, 6–1తో తన దేశానికే చెందిన లుక్రెజియా స్టెఫానినిపై గెలుపొందారు. బెన్చిచ్కు షాక్ మహిళల సింగిల్స్లో 12వ సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్) తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. బెన్చిచ్ 2 గంటల 51 నిమిషాల్లో 6–4, 5–7, 3–6తో యూలియా పుతింత్సెవా (కజకిస్తాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. రెండో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఐదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) అలవోక విజయాలతో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో రిబాకినా 6–3, 6–2తో థియా ఫ్రోడిన్ (అమెరికా)పై, కోకో గాఫ్ 6–3, 6–4తో జెనెప్ సోన్మెజ్ (టర్కీ)పై, ఆండ్రీవా 6–2, 6–2తో జెనిస్ జెన్ (ఇండోనేసియా)పై నెగ్గారు.
అనాహత్ ముందంజ
లండన్: ప్రతిష్టాత్మక లండన్ స్క్వాష్ క్లాసిక్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లు అనాహత్ సింగ్, రమిత్ టాండన్ శుభారంభం చేశారు. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) గోల్డ్ ఈవెంట్లో భాగంగా బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో వీరిద్దరూ విజయాలు సాధించి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ జూనియర్ చాంపియన్ అనాహత్ 11–3, 11–2 తేడాతో ఈజిప్ట్ ప్లేయర్ మరియం మెత్వాలీపై ఘనవిజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 20వ స్థానంలో ఉన్న అనాహత్ జోరు ముందు మరియం నిలవలేకపోయింది. ప్రత్యర్థి నుంచి కనీస పోటీ ఎదుర్కోకుండానే 18 ఏళ్ల అనాహత్ రెండో రౌండ్లో అడుగుపెట్టింది. ఇటీవల జూనియర్ ప్రపంచ టైటిల్ నెగ్గిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పిన అనాహత్... గత రెండు సీజన్లుగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ఇక పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 42వ ర్యాంకర్ రమిత్ టాండన్ 11–6, 11–7 తేడాతో ఖతార్కు చెందిన అబ్దుల్లా అల్ తమీమిపై గెలుపొందాడు. కాగా... మరో భారత ప్లేయర్, ప్రపంచ 38వ ర్యాంకర్ వీర్ చోత్రాని తొలి రౌండ్లో 9–11, 9–11 తేడాతో స్విట్జర్లాండ్ ప్లేయర్ యానిక్ విల్మెల్మీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
న్యూస్ పాడ్కాస్ట్
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
కొండా సురేఖను తప్పించాల్సిందే.... కేసీ వేణుగోపాల్తో భేటీలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
Audio: బీడు పడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు... కాలువకు నీరివ్వని కూటమి సర్కార్... బోరుమంటున్న రాయలసీమ రైతులు
నేపాల్లో ఆగని మృత్యుఘోష.... 579కి చేరిన మరణాల సంఖ్య... భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
కమిషనర్ ఔట్... వేతన సవరణ కమిషన్ లేదు... ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం
కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నా కుంభకర్ణుడి నిద్ర నటిస్తారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం మనదే... వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు
బిజినెస్
ఉద్యోగాల్లో ‘కొత్త రిజర్వేషన్లు’ కావాలి!!
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు.. ఇలా రకరకాల రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ప్రయివేటు ఉద్యోగాల విషయానికి వస్తే ఇక్కడ ఇలాంటి రిజర్వేషన్లు లేవు. అయితే కృత్రిమ మేధ (AI) విస్తృతంగా పెరుగుతూ ఉద్యోగాలను మింగేస్తున్న నేపథ్యంలో కొత్త రకం రిజర్వేషన్లు కావాలన్న భావనలు పెరుగుతున్నాయి. అవే ‘మానవ రిజర్వేషన్లు’.కృత్రిమ మేధ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఉద్యోగాల భవిష్యత్తుపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కీలక ప్రతిపాదన చేశారు. సాంకేతికంగా ఏఐ చేయగలిగినప్పటికీ, కొన్ని ఉద్యోగాలను పూర్తిగా మనుషులకే కేటాయించే ‘హ్యూమన్ రిజర్వ్డ్’ (Human Reserved) కేటగిరీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇటీవల ప్రచురించిన దాదాపు 6,000 పదాల వ్యాసంలో గేట్స్ ఈ ఆలోచనను వెల్లడించారు.వేగంగా మారనున్న ఉద్యోగ ప్రపంచంఏఐ ప్రభావం గతంలోని కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సాంకేతిక మార్పుల కంటే వేగంగా ఉండొచ్చని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే డిజిటల్ వ్యవస్థల్లో ఏఐని అమలు చేసే అవకాశం ఉండటంతో, ఉద్యోగాల్లో మార్పులు దశాబ్దాల సమయం తీసుకోకపోవచ్చని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్, మిడ్-లెవల్ ఉద్యోగాలు గణనీయంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందన్నారు.కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా విశ్లేషణ, రుణాల అంచనా వంటి అనేక పనులను భవిష్యత్తులో ఏఐ నిర్వహించే అవకాశం ఉందని గేట్స్ పేర్కొన్నారు. కేవలం ఉద్యోగాలు కోల్పోయిన వారికి మరో ఉద్యోగం కోసం శిక్షణ ఇవ్వడం మాత్రమే సరిపోదని, ప్రభుత్వాలు ముందుగానే ప్రణాళిక రూపొందించాలని సూచించారు.‘హ్యూమన్ రిజర్వ్డ్’ అంటే?గేట్స్ ప్రతిపాదించిన ఈ విధానం ప్రకారం, AI లేదా రోబోట్లు ఒక పనిని చేయగలిగినా.. సమాజం నిర్ణయిస్తే ఆ పనిని మనుషులకే పరిమితం చేయవచ్చు. ప్రకృతి రిజర్వ్లలో కొన్ని ప్రాంతాలను అభివృద్ధికి దూరంగా ఉంచినట్లే, కొన్ని ఉద్యోగాలను కూడా సాంకేతిక ఆటోమేషన్ నుంచి రక్షించాలన్నది ఈ ఆలోచన.ప్రత్యేకంగా వృద్ధుల సంరక్షణ, పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్య సేవలు వంటి రంగాల్లో మానవ సంబంధాలు, భావోద్వేగం, నమ్మకం కీలకమని గేట్స్ అభిప్రాయపడ్డారు. తన తండ్రికి అల్జీమర్స్ వ్యాధి సమయంలో అందిన సంరక్షణను ఉదాహరణగా తీసుకున్న ఆయన.. కొన్ని సందర్భాల్లో మానవీయ స్పర్శకు ప్రత్యామ్నాయం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.అయితే ప్రతి రంగంలోనూ AIని నిషేధించాలని ఆయన చెప్పలేదు. ఉదాహరణకు విద్య, వైద్యంలో AIని పూర్తిగా తొలగించడం కాకుండా, మనుషుల సామర్థ్యాన్ని పెంచే సాధనంగా ఉపయోగించవచ్చని సూచించారు. కొన్ని ఉద్యోగాలను శాశ్వతంగా, మరికొన్నింటిని కొంతకాలం మాత్రమే ‘హ్యూమన్ రిజర్వ్డ్’గా ఉంచే అవకాశం ఉండాలని గేట్స్ అభిప్రాయపడ్డారు.AI వినియోగంపై ‘టోకెన్ ట్యాక్స్’ఉద్యోగాలపై AI ప్రభావాన్ని తగ్గించేందుకు మరో ఆసక్తికరమైన ప్రతిపాదనను గేట్స్ చేశారు. AI టోకెన్లు, రోబోట్లపై పన్ను విధించాలని సూచించారు. ప్రస్తుతం ఒక ఉద్యోగిని నియమిస్తే కంపెనీ పేరోల్ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అదే పనిని రోబోట్ లేదా AI ద్వారా చేయిస్తే ఆ విధమైన పన్ను భారం ఉండకపోవడం వల్ల కంపెనీలు ఆటోమేషన్ వైపు వేగంగా వెళ్లే అవకాశం ఉందని ఆయన వాదించారు.ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగాలు కోల్పోయిన వారికి రీ-స్కిల్లింగ్, శిక్షణ, సామాజిక భద్రతా కార్యక్రమాలకు వినియోగించవచ్చని గేట్స్ సూచించారు. AI వినియోగాన్ని పూర్తిగా అడ్డుకోవడం కాకుండా, మానవ కార్మికులను ఒక్కసారిగా భర్తీ చేసే వేగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన ఉందని తెలుస్తోంది.40 శాతం ఉద్యోగాలు రిజర్వ్ చేయొచ్చా?గేట్స్ చేసిన వ్యాఖ్యల్లో మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. అమెరికన్ మీడియా సంస్థ ఆక్సియోస్తో మాట్లాడిన సందర్భంగా, అత్యంత కఠినమైన రూపంలో అమలు చేస్తే ప్రారంభ దశలో దాదాపు 40 శాతం ఉద్యోగాలను ‘హ్యూమన్ రిజర్వ్డ్’గా ఉంచే అవకాశం ఉందని ఆయన ఊహించారు. అయితే ఇది తుది లక్ష్యం లేదా అధికారిక విధాన ప్రతిపాదన కాదని, ఇలాంటి సంఖ్యను నిర్ణయించడం కూడా చాలా క్లిష్టమని ఆయన అంగీకరించారు.ప్రభుత్వాలకు గేట్స్ సూచనAI ప్రభావాన్ని ఎదుర్కోవడానికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ కొత్త వ్యవస్థలు అవసరమని గేట్స్ చెబుతున్నారు. ఉద్యోగాలు మాత్రమే కాకుండా సైబర్ భద్రత, ఆరోగ్యం, విద్య, పిల్లలపై AI ప్రభావం, ఆర్థిక అసమానతలు వంటి అంశాలపైనా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. AI ప్రయోజనాలు అందరికీ చేరాలంటే, దాని వల్ల ఏర్పడే నష్టాలను కూడా సమాజం ముందుగానే నిర్వహించాల్సిన అవసరం ఉందన్నది ఆయన వాదన.
LIC నుంచి రెండు కొత్త పాలసీలు.. సరికొత్త బెనిఫిట్లు!
దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త జీవిత బీమా పథకాలను ప్రకటించింది. ఎల్ఐసీ బీమా ప్లాటినం (ప్లాన్ 770), ఎల్ఐసీ జీవన్ రక్ష (ప్లాన్ 894) పేరుతో వీటిని సంస్థ విడుదల చేసింది. ఎల్ఐసీ సీఈఓ, ఎండీ ఆర్. దొరైస్వామి ఈ కొత్త ప్లాన్లను ప్రారంభించారు. ఈ రెండు పాలసీలు సెప్టెంబర్ 7 నుంచి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి.బీమా ప్లాటినం.. బీమా ప్లాటినం (Plan 770)ను పొదుపు, జీవిత రక్షణ, భవిష్యత్ ఆదాయం కలిపిన పాలసీగా ఎల్ఐసీ రూపొందించింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత ప్లాన్. పరిమిత కాలంపాటు ప్రీమియం చెల్లించే విధానం ఇందులో ఉంటుంది.ఈ పాలసీలో ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి సంవత్సరం చెల్లించిన ప్రతి రూ.1,000 వార్షిక ప్రీమియానికి రూ.70 గ్యారెంటీడ్ అడిషన్ జమ అవుతుంది. ప్రీమియం చెల్లింపు కాలం పూర్తయిన ఐదో సంవత్సరం చివర్లో పాలసీదారు జీవించి ఉంటే బేసిక్ సమ్ అష్యూర్డ్లో 70 శాతానికి సమానమైన బూస్టర్ ఇన్కమ్ బెనిఫిట్ లభిస్తుంది.అంతేకాకుండా, పాలసీ పేఔట్ పీరియడ్లో ప్రతి సంవత్సరం బేసిక్ సమ్ అష్యూర్డ్లో 10 శాతం రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. పేఔట్ పీరియడ్ అంటే పాలసీ కాలవ్యవధి నుంచి ప్రీమియం చెల్లించే కాలాన్ని మినహాయించిన తర్వాత మిగిలే కాలం.రూ.3 లక్షల నుంచి కవర్బీమా ప్లాటినంలో కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.3 లక్షలు. గరిష్ఠ పరిమితిని నిర్దిష్టంగా పేర్కొనలేదు. అయితే ఎల్ఐసీ బోర్డు ఆమోదించిన అండర్రైటింగ్ పాలసీ నిబంధనలు వర్తిస్తాయి. బీమా మొత్తాన్ని రూ.10,000 చొప్పున పెంచుకుంటూ ఎంచుకోవచ్చు.ప్రీమియం చెల్లింపు వ్యవధిని 7, 10, 12, 15 లేదా 18 సంవత్సరాలు ఎంచుకోవచ్చు. ఎంచుకున్న టర్మ్ను బట్టి ప్రవేశ వయసు కనీసం 30 రోజులు, గరిష్ఠంగా 55 సంవత్సరాల వరకు ఉంటుంది. గరిష్ఠ మెచ్యూరిటీ వయసు 75 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అదనపు రక్షణ కోసం రైడర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.జీవన్ రక్ష.. రెండో కొత్త పాలసీ ఎల్ఐసీ జీవన్ రక్ష (Plan 894). ఇది బీమా ప్లాటినంతో పోలిస్తే పూర్తిగా భిన్నమైనది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్యూర్ రిస్క్ ప్లాన్. అంటే పొదుపు లేదా పెట్టుబడి రాబడికంటే, పాలసీ కాలంలో బీమా చేసిన వ్యక్తి మరణిస్తే కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.పాలసీ నిబంధనలకు లోబడి మరణించిన సందర్భంలో గ్యారెంటీడ్, ఫిక్స్డ్ డెత్ బెనిఫిట్ చెల్లిస్తుంది. ఇందులో బోనస్ లేదా ఎల్ఐసీ మిగులులో వాటా వంటి అదనపు ప్రయోజనాలు ఉండవు.రూ.5 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు కవర్జీవన్ రక్షలో కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు, గరిష్ఠంగా రూ.24 లక్షలు. రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య బీమా మొత్తాన్ని రూ.50,000 చొప్పున, రూ.7 లక్షలకు పైగా రూ.1 లక్ష చొప్పున ఎంచుకోవచ్చు.ఈ పాలసీకి ప్రవేశ వయసు 18 నుంచి 45 సంవత్సరాలు. మెచ్యూరిటీ వయసు పాలసీ నిబంధనల ఆధారంగా 33 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుంది. ప్రీమియంను సింగిల్, రెగ్యులర్ లేదా లిమిటెడ్ ప్రీమియం విధానాల్లో చెల్లించవచ్చు. మహిళలకు ప్రత్యేక ప్రీమియం రేట్లు, అధిక బీమా మొత్తంపై రాయితీ, రైడర్ సదుపాయాలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: ప్రీమియం రిటర్న్ ఇండియాఫస్ట్ లైఫ్ గోల్డ్ టర్మ్ ప్లాన్
నెలకు రూ.2 లక్షల జీతం చాలా డేంజర్ అంటున్న టెకీ..
నెలకు రూ.2 లక్షల జీతం వస్తే.. ఇంకేం కావాలి.. ఇక జీవితానికి తిరుగులేదని చాలామంది భావిస్తారు. కానీ బెంగళూరుకు చెందిన టెక్ ప్రొఫెషనల్ శశాంక్ దీక్షిత్ మాత్రం ఇదే ఆదాయం ఒక దశలో కెరీర్కు ‘డేంజర్’గా మారొచ్చంటున్నారు. ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం ఉద్యోగ నెటిజన్లలో విస్తృత చర్చకు దారితీసింది.జీతం ఎక్కువ కావడం సమస్య కాదు..శశాంక్ దీక్షిత్ వాదన ప్రకారం.. నెలకు రూ.2 లక్షలు సంపాదించడం ప్రమాదకరమని చెప్పడానికి కారణం ఆ మొత్తం ఎక్కువగా ఉండటం కాదు. ‘జస్ట్ ఎనఫ్’గా అనిపించడం అసలు సమస్య. ఈ స్థాయి ఆదాయం ఒక వ్యక్తికి మంచి జీవనశైలిని అందించడంతో పాటు, ప్రస్తుత ఉద్యోగం, కెరీర్ గురించి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదనే భావనను కలిగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.తల్లిదండ్రులకు ‘బాగానే సంపాదిస్తున్నా’ అని చెప్పడానికి, వారాంతాల్లో హాయిగా గడపడానికి, రోజువారీ ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ ఆదాయం సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఒక దశలో ఉద్యోగి తన సామర్థ్యాన్ని పెంచుకోవడం కంటే.. ప్రస్తుత జీతాన్ని కాపాడుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని వివరించారు.జీతమే గుర్తింపుగా మారితే..దీక్షిత్ చెప్పిన మరో కీలక అంశం ‘కంఫర్ట్ జోన్’. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం అలవాటైన తర్వాత ఉద్యోగం వదిలి స్టార్టప్ ప్రారంభించడం, కెరీర్ మార్చుకోవడం లేదా తక్కువ జీతంతో కొత్త అవకాశాన్ని ఎంచుకోవడం రిస్క్గా కనిపిస్తుంది.‘ఇప్పటికే కోల్పోవడానికి ఏదో ఉంది’ అనే ఆలోచన అక్కడ మొదలవుతుందని ఆయన అంటున్నారు. ఫలితంగా ఒకప్పుడు చేయాలనుకున్న పనులను ‘వచ్చే నెల’, ‘వచ్చే ఏడాది’ అంటూ వాయిదా వేసుకుంటూ వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. చివరకు ఆశయం పోయిందని కాదు.. దాన్ని పట్టించుకోనంతగా సంపాదించడం మొదలుపెట్టామని గ్రహించే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలుదీక్షిత్ పోస్ట్కు పలువురు ఉద్యోగులు మద్దతు తెలిపారు. మంచి జీతం కొన్నిసార్లు ‘బంగారు పంజరం’లా మారుతుందని, సౌకర్యాన్ని వదులుకోవడం కష్టమవుతుందని కొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. మరికొందరు మాత్రం రూ.2 లక్షల జీతాన్ని సమస్యగా చూడటం సరికాదని అన్నారు.ఇదీ చదవండి: యాపిల్ కొత్త సీఈవో వచ్చేశారు.. ఎంత భారీ జీతమో తెలుసా?ఒక యూజర్ ప్రకారం.. అసలు ప్రమాదం రూ.2 లక్షల ఆదాయం కాదు; నెలకు రూ.2 లక్షలు ఖర్చు చేసే జీవనశైలి ఏర్పడటమే. ఆదాయం పెరిగిన కొద్దీ ఖర్చులు, రుణాలు, కుటుంబ బాధ్యతలు పెరిగితే ఉద్యోగాన్ని వదిలే స్వేచ్ఛ తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఇదే సమస్య అధిక ఆదాయం ఉన్నవారికీ ఎదురవుతుందని మరొకరు వ్యాఖ్యానించారు.₹2L/month is the most dangerous number Not because it's too little, because it's just enough, Just Enough !!!Enough to stop asking questionsEnough to tell your parents you're doing wellEnough to enjoy weekendsSlowly, your salary becomes your identity, You focus on… pic.twitter.com/kJYTuEGYCY— Shashank Dixit (@ShashankDixit_x) September 1, 2026
భారీ రేంజ్తో ‘సింపుల్’ ఎలక్ట్రిక్ స్కూటర్..
మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ‘సింపుల్ ఎనర్జీ’ మరో కొత్త మోడల్తో సందడి చేసింది. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సింపుల్ వేవ్ (Simple Wave) ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1,09,999 (ఎక్స్షోరూమ్)గా నిర్ణయించింది. మాస్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకున్న ఈ స్కూటర్కు ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 25 నుంచి డెలివరీలు మొదలుకానున్నాయి.నాలుగు బ్యాటరీ ఆప్షన్లు.. 243 కి.మీ. వరకు రేంజ్సింపుల్ వేవ్ను వేవ్ ఎస్, వేవ్, వేవ్+ పేర్లతో మూడు ప్రధాన వేరియంట్లలో, మొత్తం ఆరు కాన్ఫిగరేషన్లలో అందిస్తోంది. ఇందులో 2.2kWh, 2.7kWh, 3.7kWh, 5kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి IDC రేంజ్ 110 కి.మీ. నుంచి 243 కి.మీ. వరకు ఉంటుంది.టాప్ వేరియంట్ సింపుల్ వేవ్+లో 5kWh బ్యాటరీ ప్యాక్, 6.4kW PMSM మోటార్ ఉన్నాయి. ఇది ఒక్కసారి ఛార్జ్తో 243 కి.మీ. వరకు IDC రేంజ్ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. దీని గరిష్ఠ వేగం గంటకు 90 కి.మీ. కాగా, 179Nm వీల్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 3.7kWh బ్యాటరీ వెర్షన్ 171 కి.మీ., 2.7kWh వెర్షన్ 132 కి.మీ., 2.2kWh వెర్షన్ 110 కి.మీ. వరకు రేంజ్ను అందిస్తాయి.ఛార్జింగ్..సింపుల్ వేవ్లో పోర్టబుల్ ఛార్జర్ సదుపాయం ఉంది. టాప్ వేరియంట్ ఫాస్ట్ ఛార్జింగ్కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జర్తో 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీని సుమారు 2 గంటల 15 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ, మోటార్ రెండింటికీ IP67 రేటింగ్ ఉండటంతో పాటు 300 మి.మీ. వరకు వాటర్ వాడింగ్ సామర్థ్యం ఉందని సంస్థ తెలిపింది.70 లీటర్ల స్టోరేజ్..వేవ్ ప్రధాన ఆకర్షణల్లో భారీ స్టోరేజ్ ఒకటి. మొత్తం 70 లీటర్ల వరకు స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. ఇందులో 63 లీటర్ల వరకు అండర్-సీట్ స్టోరేజ్, 3 లీటర్ల గ్లోవ్ బాక్స్, మరో 4 లీటర్ల ‘పిల్’ అనే ప్రత్యేక స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఉన్నాయి. రోజువారీ షాపింగ్, హెల్మెట్, బ్యాగులు, ఇతర వస్తువులను సులభంగా పెట్టుకునేలా ఈ స్కూటర్ను రూపొందించారు.కుటుంబ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని 920 మి.మీ. పొడవైన ఫ్లాట్ సీటును కూడా అందించారు. 1,347 మి.మీ. వీల్బేస్, 775 మి.మీ. సీటు ఎత్తు, 150 కిలోల పేలోడ్ సామర్థ్యం, 175 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి.ఫీచర్లు అదుర్స్..వేరియంట్ను బట్టి 7 అంగుళాల TFT డిస్ప్లే లేదా EBN డిస్ప్లే లభిస్తుంది. అధిక వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, GPS, కాల్-మ్యూజిక్ కంట్రోల్స్, USB ఛార్జింగ్, OTA అప్డేట్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి.అదనంగా ట్రాక్షన్ కంట్రోల్, రీజెనరేటివ్ బ్రేకింగ్, హిల్-హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, క్రాల్ మోడ్, వెహికల్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రైడ్, ఎకో, ECOX రైడింగ్ మోడ్లు అన్ని వేరియంట్లలో ఉండగా.. అధిక వేరియంట్లలో స్పోర్ట్ మోడ్ కూడా లభిస్తుంది. పూర్తి LED లైటింగ్ స్టాండర్డ్గా ఉంటుంది.డిజైన్, సేఫ్టీ..సింపుల్ ఎనర్జీ తన గత స్పోర్టీ మోడళ్లకు భిన్నంగా వేవ్కు సింపుల్, కర్వీ డిజైన్ను అందించింది. ఫ్యామిలీ కస్టమర్లను ఆకట్టుకునేలా ఫ్లాట్ ఫుట్బోర్డ్, పెద్ద సీటు, ఎక్కువ స్టోరేజ్కు ప్రాధాన్యం ఇచ్చింది. ట్యూబ్యులర్ స్టీల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్లు, 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్లతో పాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ లభిస్తుంది.ఆకర్షణీయ రంగుల్లో..సింపుల్ వేవ్ పెర్ల్ వైట్, కోరల్ రెడ్, ట్విలైట్ బ్లాక్, పోలార్ బ్లూ, డాల్ఫిన్ గ్రే, ఫారెస్ట్ గ్రీన్ వంటి ఆకర్షణీయ రంగుల్లో లభిస్తుంది. ధర, రేంజ్, భారీ స్టోరేజ్తో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఇది ఏథర్ కొనార్క్, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.ఇక దేశవ్యాప్తంగా సర్వీస్ సదుపాయాలను విస్తరించేందుకు ‘సింపుల్ సూపర్ ల్యాబ్స్’ను కంపెనీ ఏర్పాటు చేయనుంది. తొలి దశలో బెంగళూరు, చెన్నై, కొచ్చి, గోవా, పుణె, ఢిల్లీ, ఒడిశా, కోల్కతాలో ఈ సదుపాయాలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.
ఫ్యామిలీ
అమ్మా, నాన్న క్షేమమే కదా..! నీట్ పీజీ విద్యార్థి భావోద్వేగం
నేపాల్లో సంభవించిన జలప్రళయం వేలాది కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. అందులో గల్లంతైన వారి ఆచూకి కోసం కొండంత ఆశతో చూస్తూన్న ఘోష మాటలకందనిది. ఈ నేపథ్యంలో ఓ కంటెంట్ క్రియేటర్ నీట్ పీజీ వైద్య విద్యార్థి తన్వి షేర్ సోషల్ మీడియా వేదకగా షేర్ చేసిన వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆమె పేరెంట్స్ కూడా నేపాల్ వరదల్లో గల్లంతయ్యారు. ఇంతవరకు వారి ఆచూకీ కానరాలేదు. అయినా సరే తన అమ్మనాన్న ఎక్కడోఒక చోట క్షేమంగా ఉంటారని కొండంత ఆశతో చూస్తున్నా అటూ కన్నీటి పర్యంతమైందామె వీడియోలో. తన్వి తల్లిదండ్రలు 67 మంది సభ్యుల బృందంతో కలిసి కైలాస యాత్రకు వెళ్లినట్లు పేర్కొంది. ఆ బృందం చివగా ఇమ్మిగ్రేషన్ సెంటర్ ఫ్రెండ్షిప్బ్రిడ్జ్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ రెండు ప్రదేశాలు ఇప్పడు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ తన తల్లిదండ్రులు అక్కడున్న ఏదో ఒక పునరాసవ కేంద్రానికి చేరుకుని సురక్షితంగా ఉంటారేమోనని ఆశిస్తోందామె. ఆ బృందంలోని ఎవ్వర్నీ సంప్రదించలేకపోవడంతో ఆమె తల్లిదండ్రలు ఆచూకీ మరింత క్లిష్టంగా మారింది. ఆ విషయాన్నే ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియోలో వివరిస్తూ..కన్నీళ్లు పెట్టుకుంది. తాను భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల శాక, నేపాల్, చైనా అధికారులను సైతం సంప్రదించామని, అయినా ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంది. తాను నీట్ పీజీ పరీక్ష రాస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నానని, కన్నీళ్లు వచ్చేయడంతో కొన్ని ప్రశ్నలు చదవలేకపోయానని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. తన తండ్రి ఈ పరీక్ష రాయాలని కోరుకున్నారు, అందువల్ల కచ్చితంగా ఈ పరీక్ష రాసి తీరాల్సి వచ్చింది. అంతకంటే బాధకరం ఏంటంటే..పరీక్షకు వెళ్లేమందు అమ్మ పెరుగు చక్కెర కలిపి తినిపించి ఆల్ది బెస్ట్ చెప్పి దీవించేవారు. అది మరింత గుర్తు వచ్చి కన్నీళ్లు ఆగలేదు అంటూ ఆవేదనగా చెప్పింది. ఎలాగైన వాళ్లు తిరిగి రావాలి, కచ్చితంగా తిరిగి రావాలంటే ఉబికివస్తున్న కన్నీళ్లతో చెబుతూ తన సంభాషణను ముగించింది. కాగా, నేపాల్ విపత్తులో మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 939కి చేరగా, గల్లంతైన వారి సంఖ్య నాలుగువేలకు చేరుకుందని అధికారులు తెలిపారు. సుమారు 158 మంది భారతీయులను రక్షించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. View this post on Instagram A post shared by Tanvi (@tanvimakesvideos) (చదవండి: విపత్తు మిగిల్చిన విషాదం..! తల్లిదండ్రుల ఆచూకీ కోసం..ఆ పసివాడు..)
సిక్కు కథక్ నర్తకుడు..! నటి రేఖ మూవీ..
శాస్త్రీయ నృత్యం అనగానే సర్వసాధారణంగా అమ్మాయిలే ఎక్కువగా నేర్చుకుంటారు. ఒకప్పుడు నాటకాల్లో అది అబ్బాయిలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం జనరేషన్లో అబ్బాయిలు శాస్త్రీయ నృత్యం నేర్చుకునే వాళ్లు అరుదు. పైగా వేళ్ల మీద లెక్కించి చెప్పొచ్చు కూడా. కానీ ఒక సిక్కు అబ్బాయి కాళ్లకు గజ్జెలు కట్టుకుని శాస్త్రీయ నృత్యం అంటే..కచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక వేళ నేర్చుకున్నా.. అతడిపై ఎన్నో ఆంక్షలు, అవమానాలు తప్పవు. ముందుగా ఈ సవాళ్లని తట్టుకుని నేర్చుకుని మంచి నర్తకుడి అనిపించుకోవం మాటులు కాదు. కానీ సిక్కు అబ్బాయ్ నృత్యం ఎంత ముగ్ధమనోహరంగా ఉంటుందంటే..కనులు ఆర్పడమే మర్చిపోతాం. అతడే ఆసా విల్లోబీ. భారతీయ శాస్త్రీయ నృత్యానికి లింగ భేదం లేదు. పైగా నటరాజుకి అంకితమిచ్చేలా మగవాళ్లు కూడా ఆ కాలంలో నృత్యం చేసేవారు. అయితే ప్రస్తుతం మాత్రమే ఆ శాస్త్రీయ నృత్యం కేవలం స్తీలకే పరిమితం అనేలా ఉంది అందరి ధోరణి. అలాంటి కాలంలో ఇంగ్లాండ్కి చెందిన ఆసా విలేబీ అనే సిక్కు కథక్ నేర్చుకోవాలని ఆశపడ్డాడు. అది కూడా బాలీవుడ్ ప్రసిద్ద నటి రేఖ నటించిన 'ఉమ్రావ్ జాన్' మూవీ అతడిని కథక్ భంగిమల పట్ల ఆకర్షితుడయ్యేలా చేసింది. అలా 17 ఏళ్ల వయసులో ఆ కథక్ నృత్యం నేర్చుకోవాలని తరగతులకు వెళ్తే..అక్కడంతా స్త్రీలే..తనొక్కడే మగవాడు. అంతేగాదు సిక్కు మతస్థుడిగా 21 ఏళ్ల వయసు నుంచి తలపాగా ధరించడం మొదలయ్యాక..ఇది నీకు అవసరమా అన్నట్లు చూసే చూపులు, ఈసడింపులు ఎక్కువయ్యాయి. అసలు అతడు మగవాడేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేసి ఇబ్బంది పెట్టేవారు. ఆ క్రమంలో అతడికి తన అమ్మే వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించింది. స్టేజ్పై ప్రదర్శనలిచ్చేటప్పుడు కూడా ఆమె ఎంతో మద్దతిచ్చారామె. అంతేగాదు మగవాళ్లకు ఇది హుందాతన కాదు అంటూ ఎగతాళి మాటలు కూడా ఎక్కువయ్యాయి. కానీ ఆసా హుందాతనం అనేది లింగ భేధం ద్వారా వచ్చేది కాదని, మనల్ని మనం ఎలా ప్రదర్శించుకుంటున్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటుందని అంటున్నాడు. అంతేగాదు ఆశా భరత నాట్యం, కథక్లో మంచి ప్రావిణ్యం ఉన్న నర్తకుడు. ప్రస్తుతం ఆసా సోషల్ మీడియాలో ఒక డాన్స్ పేజీని ప్రారంభించి భారతీయ శాస్త్రీయ నృత్యానికి లింగభేదం లేదా సరిహద్దులు లేవని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే తానే యూకే నుంచి యూఎస్కి రావడంతోనే తన దృక్పథం మారిందని చెబుతున్నాడు. ఇక్కడకు వచ్చాక దేవాలయాలు, ఉత్సవాల బుకింగ్ల నుంచి ఆహ్వానాలు అందయాని ఆనందంగా చెబుతున్నాడు. కాగా, కథక్ని యూకేకి చెందిన అనురాధ చతుర్వేది శిష్యుడు సుజాతా బానర్జీ వద్ద శిక్షణ తీసుకున్నాడు . అలాగే భరతనాట్యం అనన్య ఛటర్జీ, తంగమణి కుట్టి, మార్సియా మాధవి మైల వద్ద నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన యూఎస్లో పీహెచ్ చేస్తున్నారు. సమాజపు మూస పద్ధతులను సవాలు చేస్తూ తన కళతోటే నిశబ్దంగా మాట్లాడుతున్నాడు ఆశా విల్లోబీ. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay)(చదవండి: క్లౌడ్ కిచెన్తో లక్షల్లో నష్టం..కానీ పదినెలల్లోనే రూ. 2 కోట్లు!)
సీఎం విజయ్ వృద్ధురాలికి గిఫ్ట్గా సన్గ్లాసెస్.. ధర ఎంతో తెలుసా..!
తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్ ఇటీవల సేలం పర్యటించారు. ఆయన అక్కడ ఒక వృద్ధురాలికి డియోర్ సన్గ్లాసెస్ను బహుమతిగా ఇచ్చారు. ఈ అపురూపమైన ఘటన నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ సీఎం విజయ్ బహుమతిగా ఇచ్చిన ఆ సన్గ్లాసెస్ ధర ఎంత ఉంటుందో తెలుసా..!.ఆ సన్గ్లాస్ ప్రత్యేకత ఇది..ఇక్కడ క్రిస్టియన్ డియోర్ అనేది ఫ్యాషన్కి సంబంధించిన బ్యూటీ లేబుల్ దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని పారిస్లో ఉంది. ఇది విలాసవంతమైన హ్యాండ్బ్యాగులు, నాణ్యమైన దుస్తులు, ప్రత్యేకమైన యాక్సెసరీలకు ప్రసిద్ధిగాంచింది. ఇది బ్లాక్ రెక్టాంగులర్ సన్ గ్లాసెస్ అని తెలుస్తోంది. ఆ బ్రాండ్ వెబ్సైట్ ప్రకారం..ఈ సన్గ్లాసెస్ ఖరీదు వచ్చేసి రూ. 46,450లు. దీనిలో సన్నని నల్లటి ఫ్రేమ్కు క్రిస్టల్-టోన్, సిల్వర్-ఫినిష్ మెటల్ టెంపుల్స్ అమర్చబడి, సూక్ష్మంగా కాంట్రాస్ట్గా ఉండే 'క్రిస్టియన్ డియోర్' సంతకం కూడా ఉంటుంట. ఇటలీలో తయారైన ఈ యాక్సెసరీ నీలి రంగు లెన్సులు, నీలి రంగు టెంపుల్ చివరలు, నల్లటి ఎసిటేట్ ఫ్రేమ్ ఉన్నాయి. ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ ఇచ్చే చలువ కళ్లజోడే. కాగా, కావేరీ డెల్టాలో సాంబ వరి సాగు కోసం మెట్టూరు డ్యామ్ గేట్లను తెరిచి నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి విజయ్ సేలంలో ఉన్నారు. పవర్ స్టేషన్ను తనిఖీ చేసిన తర్వాత, ఆయన రోడ్డు పక్కన ఉన్న ఒక ఫామ్హౌస్ను సందర్శించారు. అక్కడ ఆయనకు చెల్లం అనే వృద్ధురాలిని కలిశారు. అంతేగాదు ఆయన ఆమెను భోజనం చేశారా అని అడగగా, తన కోసం ఎదురుచూస్తూ తినలేదని చెప్పిందామె. అలాగే ఆమె ఆరోగ్యం గురించి అడిగాను. కానీ ఆ వృధ్దురాలు విజయ్ని చూసిన ఆనందంలో తను పడుతున్న కష్టాల గురించి వెళ్లబోసుకోవడం మర్చిపోయిందామె.#WATCH | Salem | Tamil Nadu CM Joseph Vijay visits the house of a farmer and gifts his glasses to an elderly woman in Mettur(Source: TN CMO) https://t.co/VQy07Jy7kt pic.twitter.com/NhZN3FfXmF— ANI (@ANI) September 1, 2026(చదవండి: క్లౌడ్ కిచెన్తో లక్షల్లో నష్టం..కానీ పదినెలల్లోనే రూ. 2 కోట్లు!)
క్లౌడ్ కిచెన్తో లక్షల్లో నష్టం..కానీ పదినెలల్లోనే రూ. 2 కోట్లు!
ఏ వ్యాపారమైన మొదలుపెట్టగానే వెంటనే సక్సెస్ అందుకోలేం. పక్కా ప్లాన్తో వచ్చినవాళ్లు చిన్నగా పుంజుకోగలరేమో గానీ..చాలామంది మొదట్లో నష్టాలే చవిచూస్తారు. ఆ తర్వాత రానురాను అందులో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ..మంచి విజయంతో నిలదొక్కుకుని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తుంటారు. అచ్చం అలాంటి కోవకు చెందన వాళ్లే ఈ బెంగుళూరు దంపతులు. వాళ్లు ఏ వ్యాపారంలో అయితే తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారే దానికే చిన్ని మార్పులు జోడించి ఏ రేంజ్లో లాభాలు అందుకున్నారో తెలిస్తే..ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ జంటే బెంగుళూరుకి చెందిన కుశాల్ రెడ్డి, చాహక్ జైన్లు. వాళ్ల వ్యాపారం ప్రయాణం చిన్న క్లౌడ్ కిచెన్తో ప్రారంభమైంది. అయితే దీని ప్రారంభ పెట్టుబడి రూ. 4 లక్షలతో మొదలైంది. అయితే ఈ వ్యాపారానికి తగినన్ని ఆర్డర్లు సంపాదించుకోవడంలో విఫలమయ్యారు. ఫలితంగా ఫుడ్ డెలివరీ ఫ్లాట్ఫామ్లు వసూలు చేసే అధిక కమీషన్లు, ప్రకటనల ఖర్చులు, ప్రత్యక్ష ఆర్డర్ కొరత వంటివి సంస్థపై ఒత్తిడి పెంచాయి. దాంతో ఆ దంపతులు దాన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ జంట వెనక్కి తగ్గకుండా ఎక్కడైతే నష్టపోయామో అక్కడే తిరిగి సక్సెస్ సాధించి లాభం పొందాలని గట్టిగా అనుకుని ఈ సారి వంటగదిని, మార్కెటింగ్ చేసే విధానాన్నే మార్చారు. ఈసారి ఫుడ్ ట్రక్తో బెంగళూరులోని జేపీ నగర్లో ఎంట్రీ ఇచ్చారు. దానికి క్రీడ్ అనే ఫ్రైడ్ ఫుడ్ బ్రాండ్గా నామకరణం చేసి వ్యాపారం ప్రారంభించారు. అలాగే తాము మొదలుపెట్టబోయే ఫుడ్ ట్రక్ వ్యాపారం గురించి ముందుగానే సోషల్ మీడియాలో వెల్లడించి..దాని నమునా తాలుకా వీడియోని కూడా షేర్ చేశారు. దాంతో తమ వ్యాపారంలోని మొదటి బర్గర్ సేల్ అవ్వక మునుపే యూజర్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అంటే ఆ జంట వ్యాపార క్రీడ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఏకంగా ఐదువేలకు పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. అలా ఆ జంట ఆ వ్యాపారాన్ని సెప్టెంబర్ 2025లో ప్రారంభించారు. తొలిరోజే వందమందికి పైగా కస్టమర్లు వచ్చారట. ఈ వ్యాపారం మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా ముప్పై వేల అమ్మకాలు జరిగాయట. ఆ ఊపు ఇప్పటికీ అలానే కొనసాగుతూ రోజుకి సుమారు 350 నుంచి 450 మంది కస్టమర్లకు సేవలు అందిస్తూ..రోజుకి దాదాపు రూ. 1 లక్ష పైగానే ఆర్జిస్తున్నట్లు ఆ దంపతులే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. పైగా తమ మెనూలో ఫ్రైడ్ చికెన్, పనీర్ బర్గర్లతో పాటు, చికెన్ పాప్కార్న్, స్ట్రిప్స్, ఫ్రైస్ వంటి ఐటమ్స్ని కూడా అందిస్తున్నారు. అంతేగాదు ఆ దంపతులు విఫలమన క్లౌడ్ కిచెన్కు లాభలా బాటలో నడుస్తున్న క్రీడ్ వ్యాపారంల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపుతు ప్రథమ్ అనే యూజర్ ఎక్స్పోస్ట్లో వివరించారు. ఈ పోస్ట్ నెటిజన్లును అమితంగా ఆకర్షించింది. పైగా పోస్ట్ ప్రకారం..ఆ క్రీడ్ వ్యాపారం రూ. 4 లక్షల పెట్టుబడితో ప్రారంభిస్తే..కేవలం పది నెలల్లో సుమారు రూ. 2 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం విశేషం. ఇది చిన్న ఆహార వ్యాపారాలకు ఒక గొప్ప ఆర్థిక పాఠంగా మారింది. అంతేగాదు సోషల్ మీడియాను వ్యాపార ప్రచారానికి ఎలా ఉపయోగించుకోవచ్చో తెలియజేసింది కూడా. అంతేకాదండోయ్ ఈ దంపతులు రెడ్డి-జైన్లు తమ ఫుడ్ ట్రక్ మోడల్ నుంచి ఒక పెద్ద సెంట్రల్ కిచెన్, ఫాస్ట్-క్యాజువల్ రెస్టారెంట్ అవుట్లెట్గా తమ వ్యాపారాన్ని విస్తరించే ప్లాన్లో ఉన్నారట. ఈ జంట కథ..ఓడిపోయిన చోటే గెలుపుని వెతుక్కోవాలే తప్ప వెనక్కి రాకూడదని చెబుతోంది. అలాగే ఓటమికి గల కారణాలను విశ్లేషించి..ఆ తప్పులకు తావివక్కుండా మంచి ప్రారంభంతో ముందుకు రావాలని చెబుతోంది కదూ..!.Meet Kushal Reddy & Chahak Jain.They invested ₹4 lakh into a cloud kitchen in Bengaluru.It failed.Zomato/Swiggy commissions, expensive ads and low direct orders killed the business.So they started again.They launched Kried, a fried-chicken burger food truck.Before… pic.twitter.com/e3jevufBVn— Pratham (@CapitalLens_) September 1, 2026 (చదవండి: Miss World 2026: సర్వాంగ సుందరీ మాత్రమేకాదు..అద్భుతమైన నటి..! మిస్ ఇండియా సైతం..)
అంతర్జాతీయం
ఉక్రెయిన్పై కొనసాగిన దాడుల పర్వం
కీవ్: ఉక్రెయిన్ లక్ష్యంగా రష్యాసేనల దాడు లు బుధవారమూ కొనసాగాయి. దీంతో డినిప్రో నగరంలోని పలు అపార్ట్మెంట్ భవంతులు దాడులతో దద్దరిల్లాయి. బుధ వారం రష్యా జరిపిన 174 డ్రోన్ దాడులు, రెండు క్షిపణి దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయ పడ్డారు. యుద్ధం మొదలై నాలుగేళ్లు పూర్త యినా ఇరు దేశాల మధ్య దాడుల తీవ్రత ఏమాత్రం తగ్గట్లేదు. తూర్పు, దక్షిణ ఉక్రెయి న్ ప్రాంతాల్లో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. సయోధ్యకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సానుకూల ఫలితాలు కనుచూపు మేరలో కన్పించట్లేవు. మరోవైపు మంగళవారం అర్ధరాత్రి తదుపరి దాడులు భీకరంగా ఉంటాయని అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ పరస్పరం హెచ్చరికలు చేసుకోవడం గమనార్హం. ‘‘రష్యా గగనత లంలో ప్రయాణించే విదేశీ ఎయిర్లైన్స్ సంస్థల విమానాలకు దాడులు ముప్పు పెరగొచ్చు. ఎందుకంటే ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్ దాడులతో పరిస్థితి మారుతోంది. శాంతి చర్చలకు ముందుకొచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచడమే మా లక్ష్యం’’ అని జెలెన్స్కీ అన్నారు. దీనిపై పుతిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఇది ప్రభుత్వ ప్రయోజిత ఉగ్రవాదంలా ఉంది. ఇలాంటి ఉగ్రవాదులతో మేం చర్చలు జరపబోం’’ అని అన్నారు. పుతిన్ వ్యాఖ్యలను ఉక్రెయిన్లోని తప్పుడువార్తలను ఖండించే ప్రభుత్వ విభాగం తప్పుబట్టింది. ‘‘రష్యానే ఏకపక్షంగా ఈ యుద్ధం మొదలెట్టింది. రోజూ ఉక్రెయిన్ అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. తీరా ఇప్పుడేమో మమ్మల్ని ఉగ్రవాదులు అంటోంది. తమను బాధిత దేశంగా చిత్రీకరించుకునే కుట్ర ఇది’’ అని ఆ విభాగం తూర్పారబట్టింది. ‘‘ఉక్రెయిన్ బెదిరింపులకు బెదరబోం. మా గగనతల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తాం. విమానాల రాకపోకలకు యతాతథంగా సాగుతాయి’’ అని రష్యా రవాణా మంత్రి ఆండ్రీ నికితిన్ తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ దాడులతో బెల్గార్డ్ సరిహద్దు ప్రాంతంలో ఇద్దరు చనిపోయారని రష్యా రక్షణ శాఖ బుధవారం తెలిపింది. 130 డ్రోన్లను కూల్చేశామని వెల్లడించింది.
ఆపిల్ మ్యాప్స్లో మారిన లేక్ ఆంటారియో పేరు
షికాగో: అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’ వెంటనే అమలుచేసింది. అమెరికా, కెనడా సరిహద్దుల్లో ఉన్న సరస్సు ‘లేక్ ఆంటారియో’పేరును ఇటీవల ట్రంప్ ‘లేక్ అమెరికా’గా మార్చిన విషయం తెల్సిందే. ఈ మేరకు యాపిల్ తన ‘మ్యాప్స్’ యాప్లోనూ కొత్త పేరుకు తగ్గట్లు మార్పులు చేసింది. ఇకపై అమెరికాలోని యాపిల్ సంస్థ యూజర్లు తమ స్మార్ట్ఫోన్లు, ఐప్యాడ్లలో లేక్ ఆంటారియోను వెతికితే ‘లేక్ అమెరికా’ అని మాత్రమే చూపిస్తుంది. ఇతర దేశాల్లోని యూజర్లకు మాత్రం పాత పేరు కన్పించేలా సెట్టింగ్లను మార్చేసింది. కెనడాతో అమెరికా సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదరకపోవడంతో కోపంతో ట్రంప్ ఈ పేర్ల మార్పు ప్రక్రియ చేపట్టడం తెల్సిందే.
ట్రంప్ చిత్రంతో డాలర్ నాణెం
వాషింగ్టన్: అమెరికా 250వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా టంకశాల ప్రత్యేక నాణేన్ని ముద్రించింది. ఒకవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖం కనిపించే ఈ ఒక డాలర్ నాణెం విక్రయానికి సిద్ధంగా ఉందని యూఎస్ మింట్ ప్రకటించింది. నాణెంపై ఒక వైపు ట్రంప్ ముఖచిత్రం, లిబర్టీ, 1776 అని ముద్రించారు. మరోవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధికారిక ముద్ర ఉండేలా డిజైన్ చేశారు. దీనికి ఈ ఏడాది యూఎస్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆమోదం తెలియజేసింది. ఈ కమిషన్ సభ్యులను డొనాల్డ్ ట్రంప్ స్వయంగా నియమించారు. నాణెంపై తన ముఖచిత్రాన్ని ముద్రించాలనే ఆలోచన చాలా అసాధారణమైనదని, ఇది గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని అమెరికా కరెన్సీపై ముద్రించడాన్ని నిషేధించే సమాఖ్య చట్టం అమల్లో ఉంది. కానీ, కొన్ని పరిస్థితుల్లో ప్రత్యేక నాణేలను ముద్రించడానికి, జారీ చేయడానికి ట్రెజరీ సెక్రటరీకి అధికారం ఉంటుంది. 25 నాణేలున్న ఒక రోల్ ధర 61 అమెరికన్ డాలర్లు, అలాగే 100 నాణేలున్న ఒక బ్యాగ్ ధర 154.50 అమెరికన్ డాలర్లు ఉంటుంది. ..
నేపాల్ నెత్తిన మరో జలఖడ్గం
కఠ్మాండు: మెరుపు వరద బురదతో జలమయమైన నేపాల్ దిగువ ప్రాంతాలపై మళ్లీ వరద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు స్థానికుల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కనీవినీ ఎరుగని జల ప్రళయం దాటికి ఇప్పటికే దిగువ ప్రాంతాల్లో జనజీవనం కకావికలంకాగా మరోసారి అపార జలరాశి వరదరూపంలో వచ్చి పడే ఆస్కారముందని నేపాల్ వాతావరణ శాఖలోని వరద అంచనాల విభాగం బుధవారం హెచ్చరికలు జారీచేసింది. సింధూరి జిల్లాలో సున్ కోశి నది, గూర్ఖా జిల్లాలో బుధి గండకీ నది, దదేల్ధురా జిల్లాలో మహాకాళీ నది, లామ్జుంగ్ జిలాల్లో మార్షా్యంగ్డి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నట్లు వరద అంచనాల విభాగం ప్రకటించింది. దిగువ ప్రాంతాల ప్రజలు జనావాసాల నుంచి ఎగువ ప్రాంతాలకు తరలిపోవాలని సూచనలుచేసింది. భుకుందేబేసీ వాటర్ లెవల్ మానిటరింగ్ కేంద్రంలో మంగళవారం రాత్రి 11.15 గంటలకే నది డేంజర్ మార్క్ను దాటేసింది. మార్షా్యంగ్డి నదిలో నీటి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు ఇప్పటికే వినాశనం సృష్టించిన వరద విలయంలో మృత్యువాత పడిన వారి సంఖ్య బుధవారానికి 1243కు పెరిగింది. మరో 4,216 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉంది. భారీ వర్షం, బురద మధ్యే భవన శిథిలాల్లో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని ఆశతో అన్వేషణ బృందాలు కాలంతో పోటీపడుతూ సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. 1,113 మృతదేహాల గుర్తింపు, చట్టపర ప్రక్రియ పూర్తయిందని, 95 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. 21,314 మంది సైనికులు, పోలీసులు, వలంటీర్లు ఈ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే రాసువా, నువాకోట్లో కురుస్తున్న భారీ వర్షం సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కల్గిస్తోంది. వర్షపు నీరు చేరుతుండటంతో జలవిద్యుత్కేంద్ర సొరంగంలో అన్వేషణ ఆగిపోయిందని జాతీయ విపత్తు ముప్పు తగ్గింపు, నిర్వహణ సంస్థ తెలిపింది. భూగర్భ జలవిద్యుత్ కేంద్రాల సొరంగాల్లో అన్వేషణకు భారత్, చైనా, ద.కొరియా నిపుణుల బృందాలు కృషిచేస్తున్నాయి. వాతావరణ మార్పులతోనే దారుణం: ప్రధాని సంపన్న దేశాలు వాతావరణంలోకి భారీగా విడుదలచేస్తున్న కర్భన ఉద్గారాలు, వాతావరణ మార్పుల కారణంగానే హిమానీనదాలు అమిత వేగంగా కరిగిపోతూ కొత్త ఉత్పాతాలను తీసుకొస్తున్నాయని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఆరోపించారు. బుధవారం నేపాల్ పార్లమెంట్ దిగువ సభలో ఆయన మాట్లాడారు. ‘‘భోటె కోశీలో వరద రావడానికి ప్రత్యక్షంగా వాతావరణమార్పులు(క్లైమేట్ చేంజ్) కారణమని నిపుణులు తేల్చేశారు. అంతర్జాతీయ సమాజానికి మేం చెప్పేదొక్కటే. మేం అనుభవిస్తున్న ఈ బాధలకు వాతావరణ మార్పులే కారణం.ప్రపంచ దేశాలతో పోలిస్తే నేపాల్ గ్రీన్హౌస్ వాయువులను అత్యల్పంగా విడుదలచేస్తుంది. కానీ ఇతర దేశాలు చేసిన పాపాలకు మేం బలవుతున్నాం’అని అన్నారు. ఆపన్న హస్తం అందిస్తున్న భారత్కు ప్రధాని బాలేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. కాఠ్మండులో సోనూ సూద్ సాయం కోవిడ్ సంక్షోభం వేళ భారీ సంఖ్యలో కరోనా బాధితులను ఆదుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారత చాటారు. కాఠ్మండుకు పెద్ద మొత్తంలో సహాయక సామగ్రిని తీసుకెళ్లి వరద బాధితులకు అందజేశారు. ‘‘ఇక్కడి వాళ్లకు సరిపడా సరకులు, ఆహారం, దుప్పట్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వరదతో సర్వం కోల్పోయిన వాళ్లకు మళ్లీ పాత జీవితాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని చెప్పారు.
జాతీయం
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ స్కామ్లో ఆరుగురు ఐఏఎస్లపై కేసు
న్యూఢిల్లీ: హరియాణా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నగదు నిల్వలను అక్రమంగా విత్డ్రా చేసి పలు కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థల ఖాతా ల్లోకి మళ్లించిన ఉదంతంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై బుధవారం ఆరుగురు హరియా ణా కేడర్ ఐఏఎస్లపై సీబీఐ అభియోగాలు నమోదుచేసింది. ప్రభుత్వ విభాగాలు, సంస్థల కు సంబంధించిన రూ.504 కోట్ల నగదు నిల్వ లను కాజేసిన ఉదంతంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్కు చెందిన ముగ్గురు అధికారులతోపాటు ఏ యూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కు చెందిన మరొకరి పైనా సీబీఐ అధికారులు చార్జ్షీట్ నమోదు చేశారు. పంచకులలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ ఈ మేరకు మూడో అనుబంధ చార్జ్షీట్ను దాఖలుచేసింది. 13 మంది హరియాణా ప్రభు త్వ ఉన్నతాధికారుల పేర్లను చార్జ్షీట్లో జత చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, సాక్ష్యాధారా లను నాశనంచేయడం, ఫోర్జరీ, నగదు విత్డ్రా కోసం నకిలీ చెక్ బుక్లు, తప్పుడు డాక్యుమెంట్లు తయారుచేయడం, బ్యాంక్ ఖాతాలోని నగదు మొత్తాలను తప్పుగా చూపడం, నమ్మక ద్రోహం, ముడుపులు తీసుకోవడం, నేరపూరిత ప్రవర్తన తదితర నేరాలకుగాను భారతీయ న్యాయ సంహిత చట్టాల్లోని పలు సెక్షన్ల కింద వీళ్లపై అభియోగాలు నమోదుచేశారు. పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్, స్కూల్ శిక్షా పరియోజనా పరిషత్, కార్మిక సంక్షేమం, వ్యవసాయ మార్కెటింగ్ బోర్డ్ ఇలా హరియణా ప్రభుత్వంలోని ఆరు శాఖలు, విభాగాలకు చెందిన నగదు లావాదేవీల కోసం హరియాణా సర్కార్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్కు చెందిన చండీగఢ్ బ్రాంచీలోని తన ఖాతాను ఉపయోగిస్తోంది. ఇందులో వందల కోట్ల రూపాయలున్నాయి. అయితే ఈ ఖాతా వివరాలను దొంగచాటుగా తెల్సుకున్న ఆ బ్రాంచ్ మేనేజర్ రిభవ్ రిషీ, మాజీ బ్యాంక్ రిలేషన్షిప్స్ మేనేజర్ అభయ్ కుమార్ ఈ కుట్రకు తెరతీశారు. రిషి భార్య స్వాతి, బామమరిది అభిషేక్లకు చెందిన కంపెనీల్లోకి ఈ ఖాతా నగదు నిల్వలను కొద్దికొద్ది గా తరలించడం మొదలెట్టారు. స్వాతికి చెందిన స్వస్తిక్ దేశ్ ప్రొడక్ట్స్లోకిఏకంగా రూ.300 కోట్లు బదిలీచేశారు. ఇటీవలికాలంలో ప్రభుత్వం ఈ బ్రాంచ్లోని తమ అకౌంట్ను శాశ్వతంగా మూ సేసి నగదును వేరే బ్యాంక్లోకి మార్చాలని భా వించింది. పుస్తకాల్లోని నగదుకు, వాస్తవ నగదు కు భారీ వ్యత్యాసం ఉండటంతో ఈ కుంభకో ణం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన హరియాణా అవినీతి నిరోధక శాఖకేసు నమోదుచేసింది. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట రేట్ సైతం 19 చోట్ల సోదాలుచేసి కీలక డాక్యు మెంట్లను స్వాధీనంచేసుకుంది. రిభవ్ రిషీ, అభయ్ తదితరులను ఇప్పటికే అరెస్ట్చేశారు.
5న శ్రీరామ్ కాలేజీకి ప్రధానమంత్రి మోదీ
న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఐదో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ హస్తినలోని ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రముఖ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్(ఎస్ఆర్సీసీ)ని సందర్శించనున్నారు. అదే రోజు జరిగే కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. యువతతో మమేకం కావాలన్న బీజేపీ లక్ష్యానికి చేరుక కావాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాని మోదీ ఈ శనివారం కాలేజీ విద్యార్థులనుద్దేశించి మాట్లాడతారని తెలుస్తోంది. చివరిసారిగా 13 సంవత్సరాల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ఈ కాలేజీని మోదీ సందర్శించారు.
‘ఖగంతక్–243’ డ్రాప్ టెస్ట్ విజయవంతం
న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ ‘ఖగంతక్–243’డ్రాప్ టెస్ట్ను భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విజయవంతంగా నిర్వహించింది. కచ్చితమైన లక్ష్య ఛేదన సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయత్నాల్లో ఇదొక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ ఆయుధాన్ని భారతీయ రక్షణ రంగ సంస్థ ‘జేఎస్ఆర్ డైనమిక్స్’అభివృద్ధి చేసింది. డ్రాప్ టెస్ట్లో ఇది తన నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. అధునాతన సుదూర గగనతల ప్రయోగ ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు భారతదేశం చేస్తున్న విస్తృత ప్రయత్నంలో ఖగంతక్–243 ఒక భాగం. విమానం నుండి విడుదల చేసిన తర్వాత గ్లైడ్ బాంబులు తమ లక్ష్యం వైపు ప్రయాణించేలా రూపొందించారు. సాంప్రదాయ గ్రావిటీ బాంబులతో పోలిస్తే ఇవి ఎక్కువ దూరం నుంచి లక్ష్యాలను ఛేదిస్తాయి. ఖగంతక్–243 గ్లైడ్ బాంబ్ రాకతో స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు గొప్ప ఊతం లభించిందని వైమానిక దళం హర్షం వ్యక్తంచేసింది.
ఊయలలోనే పసికందుల చితి పేర్చిన తల్లి
దొడ్డబళ్లాపురం: సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరులో ఘోర విషాదం సంభవించింది. లేకలేక పుట్టిన కవల పిల్లలను తల్లే నీటి బకెట్లో ముంచి హతమార్చింది. తలఘట్టపురలో ఈ దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఉమాదేవి (42), రామలింగప్ప (50) దంపతులకు 2002లో వివాహమైంది. రామలింగప్ప వ్యాపారం చేస్తుండగా, ఉమాదేవి గృహిణి. వీరికి పిల్లలు పుట్టకపోవడంతో అనేక ప్రయత్నాల తరువాత ఐవీఎఫ్ చికిత్స ద్వారా ఉమాదేవి గర్భం దాల్చింది. మే 5న ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అయితే, పిల్లలు పుట్టాక ఉమాదేవి మానసిక అనారోగ్యం బారిన పడింది. పిల్లలను పోషించడంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడసాగింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం శిశువులను నీళ్లున్న బకెట్లో ముంచి ప్రాణాలు తీసింది. తరువాత వారిని ఊయలలో ఉంచింది. ఆపై ఆత్మహత్యాయత్నం చేస్తుండగా.. అదే సమయంలో ఇంటికొచ్చిన భర్త రామలింగప్ప ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించాడు. ప్రసవం తరువాత వచ్చే మానసిక వైకల్యానికి తన భార్య గురైందని, నిమ్హాన్స్ వైద్యులతో చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో భర్త రామలింగప్ప తెలిపారు. తాను పిల్లలను చూసుకోలేనని, అనాథాశ్రమంలో ఇచ్చేయాలని ఆమె గొడవ చేసేదని చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఎన్ఆర్ఐ
అమెరికాలో తెలంగాణ యువకుల దుర్మరణం
ఎన్నారై న్యూస్: అమెరికా స్టేట్ ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్లని సమాచారం. మృతుల్లో ఓ యువకుడు నిజామాబాద్ వాసిగా నిర్ధారణ అయ్యింది. మిగతా ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.ఫ్లోరిడా హైవే పెట్రోల్ అందించిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున వాళ్లు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి కుటుంబ సభ్యులకు అక్కడి అధికారులు సమాచారం చేరవేశారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్.. మూడు నెలల కిందట ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ప్రమాదంలో అతనూ మరణించినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ వార్తతో ముగ్గురి స్వస్థలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాల్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదీ చదవండి: నేపాల్లో ప్రకృతి విలయ తాండవం
స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు
ప్రపంచ రికార్డు సాధించడమే జీవితాశయంగా పెట్టుకుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన పుష్పజ్యోతి రవికుమార్ (29). రికార్డులోకెక్కడానికి ఒక చిన్న స్టిక్కీ నోట్పై ఏకంగా 150 పదాలను స్పష్టంగా రాసి, గిన్నిస్బుక్లోకెక్కింది. మొదటి ప్రయత్నంలోనే పుష్పజ్యోతి ఈ రికార్డుని సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మనలో చాలామంది స్టిక్కీ నోట్ను కేవలం షాపింగ్ జాబితాలకో లేదా చిన్న విషయాలు గుర్తుంచుకోవడానికో వాడతాం. కానీ, దుబాయ్లో సీనియర్ క్లౌడ్ ఇంజనీర్గా పనిచేస్తున్న పుష్పజ్యోతికి మాత్రం అది ఒక ప్రపంచ వేదికగా కనిపించింది. అదే చిన్న కాగితం ముక్కపై ఏకంగా 150 పదాలను అత్యంత స్పష్టంగా రాసి, ఒకే స్టిక్కీ నోట్పై అత్యధిక పదాలు రాసిన రికార్డును తన పేరుపై లిఖించుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే..ఈ సవాలులో కేవలం పదాలను ఇరికించి రాయడం మాత్రమే కాదు, అవి చదవడానికి వీలుగా ఉండడం కూడా ముఖ్యం. తక్కువ స్థలంలో ఎక్కువ పదాలను పట్టించడానికి ఆమె జాగ్రత్తగా చిన్న చిన్న పదాలను ఎంచుకున్నారు. అందులోనూ ఎక్కువ శాతం కేవలం మూడు అక్షరాలు ఉన్న పదాలనే ఉపయోగించారు. వేర్వేరు చేతిరాత శైలులలో ప్రయోగాలు చేయడం పుష్పజ్యోతికి అలవాటు. అందువల్ల తక్కువ స్థలంలో స్పష్టంగా రాయడం ఆమెకు సులువైంది. బాల్యం నుంచే గిన్నిస్ బుక్లో రికార్డు సాధించాలని పుష్పజ్యోతి ఆకాంక్ష. అలా ఆమె తన తొలి ప్రయత్నంలోనే ఈ ఘనతను సాధించింది.ప్రశంసల జల్లులుపుష్పజ్యోతి తన విజయానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకోగానే ఆమెపై ప్రశంసల జల్లులు కురిసాయి. సుమారుగా పది లక్షల వ్యూస్ వచ్చాయి. ఆశయానికి అంకితభావం తోడైతే, సాధించలేనిది ఏదీ లేదని పుష్పజ్యోతి నిరూపించింది.గిన్నిస్ వరల్డ్ రికార్డు విజేతగా మారడం నాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంత గానో పెంచింది. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉంటుంది. దానిని వెలికితీసి ప్రపంచానికి ప్రదర్శించడానికి ఇటువంటి వేదికలు దోహదపడతాయి. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సాధించడమే నా లక్ష్యం. View this post on Instagram A post shared by Varnam MY (@varnammalaysia)– పుష్యజ్యోతి రవికుమార్ (చదవండి: కంటతడి పెట్టించే ప్రేమకథ..! ఆఖరికి విధి సైతం..)
అమెరికా నుంచి వచ్చిన యువతి అదృశ్యం
హైదరాబాద్: అమెరికాలో నివాసం ఉంటున్న యువతి అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు..పీర్జాదిగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన బుడిగె శైలజ కుమార్తె బుడిగె విహారిక (27), అల్లుడు హరీష్ లు ఈ ఏడాది జనవరి 26 నుంచి అమెరికాలో నివసిస్తున్నారు. అయితే ఈ నెల 20న విహారిక కనిపించడం లేదంటూ భర్త కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకోగా... విహారిక అమెరికా నుంచి తన పాస్పోర్ట్తో బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆమె హైదరాబాద్కు వస్తుందని భావించి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లగా ఆమె అక్కడికి చేరుకోలేదు. అయితే ఆగస్టు 21న విహారిక ముంబై విమానాశ్రయంలో ఉన్నట్లు సమాచారం అందింది. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ కలవకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. మేడిపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు.
ప్రేయసి దూరమైందని అమెరికాలో ఆత్మహత్య..!
హైదరాబాద్: చదువుకునేందుకు అమెరికా వెళ్లిన ఓ యువకుడు ప్రేమించిన యువతి దూరం కావడంతో ఆ బాధ తట్టుకోలేక ఈనెల 21న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపిన మేరకు.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ దమ్మాయిగూడలోని శ్రీనివాస్నగర్ కాలనీకి చెందిన కృష్ణ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు సాయిప్రదీప్(29) 2024లో మాస్టర్స్ చదువు కోసం అమెరికా వెళ్లారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో తన అన్న ప్రణీత్తో కలిసి ఉంటూ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ నుండి మూడు నెలల క్రితం మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న సిద్ధిపేటకు చెందిన యువతిని ప్రదీప్ 9 నెలల పాటు ప్రేమించారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని సాయి ప్రదీప్ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముందు తల్లిదండ్రులు అంగీకరించకపోయినా చివరకు ఒప్పుకున్నారు. ఇంతలోనే ప్రేమించిన యువతి దూరంగా ఉంటోంది. సున్నిత మనస్తత్వం కలిగిన ప్రదీప్ ఇది తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న ప్రేయసికి దాదాపు పది సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. తను చేస్తున్న జాబ్ బాధ్యతలను రెండు గంటల పాటు నిర్వర్తించాలని అన్నకు అప్పగించారు. ఆ తరువాత ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఘటన గురించి తల్లిదండ్రులకు ప్రణీత్ తెలిపారు. ప్రేయసి దూరం కావడంతోనే తమ్ముడు ప్రదీప్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని అమెరికాలో పోలీసులకు ప్రణీత్ ఫిర్యాదు చేశారని మృతుని తండ్రి కృష్ణ తెలిపారు. మృతదేహాన్ని ఈ నెలాఖరులోపు తెప్పించేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇదిఆ ఉండగా ప్రదీప్కు చిన్నతనంలోనే కిడ్నీ సమస్య ఉండటంతో ఒక కిడ్నీని వైద్యులు తొలగించారు. సాయిప్రదీప్ తల్లిదండ్రులను కాంగ్రెస్ పార్టీ దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షుడు రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, బీఆర్ఎస్ నేత హరిగౌడ్ తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు.
క్రైమ్
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కత్తిపోట్లు, సంచలన విషయాలు
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్లో చోటుచేసుకున్న కత్తిపోట్ల ఘటనలో (Times Square Stabbing) సంచలన విషయం వెలుగులోకివచ్చింది. మరణించిన మహిళను 'బ్యాంక్ ఆఫ్ అమెరికా' (BofA) వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (Erin Piacenti)గా పోలీసులు గుర్తించారు. ఐవీ లీగ్ గ్రాడ్యుయేట్ అయిన ఈమె ఫోర్ధమ్ లా స్కూల్ నుంచి న్యాయ విద్యను పూర్తిచేసింది. ఇటీవల ప్రసూతి సెలవు (Maternity Leave) ముగించుకుని తిరిగి ఉద్యోగంలో చేరిన ఆమె అకాల మరణం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దారుణ ఘటనపై బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఫోర్ధమ్ లా స్కూల్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశాయి.న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ స్టేషన్కు సమీపంలోనే 49 ఏళ్ల మహిళ అకస్మాత్తుగా షాపింగ్ బ్యాగ్ నుంచి రెండు కత్తులు బయటకు తీసి ఎటాక్ చేసింది. ఈ దాడిలో ఎరిన్ పియాసెంటి ప్రాణాలు కోల్పోగా, 68 ఏళ్ల మరో వృద్ధుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.దాడికి పాల్పడిన మహిళను క్వీన్స్కు చెందిన పామెలా సిస్నెరోస్ (49)గా గుర్తించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఈమె తన షాపింగ్ బ్యాగ్ నుంచి రెండు పెద్ద కత్తులు తీసి ఇద్దరిపై దాడి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శోధించగా, ఆమె కత్తులతో పోలీసులపైకి దూసుకురావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితురాలు అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇదీ చదవండి: ఎర్రకోట పేలుడుకు నిధులిచ్చారంటూ రూ. 30 లక్షలు దోచేశారుమరోవైపు ఈ ఘటనపై అని న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీవిచారాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలు వేదనను అర్థం చేసుకోగలమని, వారికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు
అల్లుడు నువ్వు అడిగినంత ఇచ్చాం..అయినా!
పెళ్లితో ఒక్కటైన జీవితాలు.. పరస్పర అవగాహన, నమ్మకం, సహనంతో సాగాల్సిన కాపురాలు కలహాలతో కకావికలమయ్యాయి. చిన్నచిన్న విభేదాలు పెద్ద గొడవలకు దారితీయడంతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. వేర్వేరు ఘటనల్లో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాలతో ఇద్దరు భర్తలు మృతి చెందగా.. అదనపు కట్నం కోసం జరిగిన వేధింపులు భరించలేక ఓ నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ మూడు ఘటనలూ వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోనే చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కుటుంబసమస్యలను పరస్పర చర్చలతో పరిష్కరించుకోవాల్సిన చోట క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. ఆయా కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చాయి. --- వనపర్తి జిల్లా ఉషారాణి అదనపు కట్నం వేధింపులు భరించలేక.. కనిమెట్ట గ్రామానికి చెందిన ఉషారాణి (20) అదనపు కట్నం వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరో విషాదాన్ని మిగిల్చింది. ఉషారాణికి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన మల్లేష్ తో ఈ ఏడాది జూన్ 25న వివాహమైంది. వివాహ సమయంలో ఆరు తులాల బంగారం, రూ.2 లక్షల నగదు కట్నంగా ఇచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కొంతకాలం సజావుగా సాగిన దాంపత్యంలో.. నెల రోజులుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తమామలు వేధిస్తున్నారని ఉషారాణి తల్లిదండ్రులకు చెప్పినట్లు సమాచారం. ఈ విషయమై తల్లిదండ్రులు అల్లుడికి సర్దిచెప్పినప్పటికీ వేధింపులు కొనసాగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన ఉషారాణి మంగళవారం ఉదయం నాగారం నుంచి కనిమెట్టలోని పుట్టింటికి వచ్చి.. మధ్యాహ్నం చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి పద్మమ్మ ఫిర్యాదు మేరకు భర్త మల్లేష్ అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం.విక్రమ్ తెలిపారు.వివాదంతో యువకుడి మృతి కొత్తకోట మండలంలోని పాలెం గ్రామానికి చెందిన గుండె నవీన్కుమార్(26) గత కొంతకాలంగా కొత్తకోట పట్టణంలోని బీపీఆర్ గార్డెన్స్లో వాచ్మన్గా పనిచేస్తూ, భార్య గౌత మి, కుమారుడితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇటీవల గ్రామంలో నూతన ఇంటి నిర్మా ణం కొరకు అప్పులు చేయడంతో పాటు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. సోమవారం రాత్రి దంపతుల మధ్య మరోసారి వివాదం జరగడంతో భార్య గౌతమి తన సోదరుడితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్ సోమవారం అర్ధరాత్రి తాను పనిచేస్తున్న గార్డెన్స్లో ఉన్న గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.. వారు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తండ్రి గుండె ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఆచూకీ కోసం గాలిస్తే.. కాల్వలో మృతదేహం మరో ఘటనలో భార్యాభర్తల మధ్య విభేదాల తో ఇంటి నుంచి వెళ్లిపోయిన రాములు కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్కర్నూల్ జిల్లా బాజాపురానికి చెందిన రాములు (35) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో కొత్తకోట మండలం రాణిపేటలో పెరిగాడు. 15 ఏళ్ల క్రితం అడ్డాకుల మండలానికి చెందిన సుజాతను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. గొర్రెల కాపరిగా జీవనం సాగించే రాములు ఇటీవల కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వెళ్లి.. సుమారు 20 రోజుల క్రితం రాణిపేటకు తిరిగొచ్చాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆగస్టు 29న ఇంటి నుంచి వెళ్లిపోయిన రాములు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు పలుచోట్ల గాలించారు. గ్రామ శివారులోని రంగసముద్రం కాల్వ సమీపంలో మంగళవారం ఆయన చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అధికారుల సహకారంతో గాలింపు చేపట్టగా ముమ్మళ్లపల్లి శివారులో రాములు మృతదేహం లభ్యమైంది. భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం.విక్రమ్ తెలిపారు.
ఎర్రకోట పేలుడుకు నిధులిచ్చారంటూ రూ. 30 లక్షలు దోచేశారు
సాక్షి, ఢిల్లీ: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు సంబంధించి ఢిల్లీలో ఒక దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (NIA,ATS) అధికారులమని చెప్పుకొని ఒక ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నుంచి 30 లక్షల రూపాయలను కాజేసీన వైనం కలకలం రేపింది.ఢిల్లీలోని ద్వారకాకు చెందిన 74 ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి గత ఏడాది జరిగిన రెడ్ ఫోర్ట్ పేలుడులో నిందితులకు నిధులిచ్చారని భయపెట్టేశారు. ఎర్రకోట పేలుడు కేసు నిందితులకు అతని బ్యాంక్ ఖాతా నుంచే నిధులు వెళ్లాయని బెదిరించారు. బ్యాంక్ ఖాతాను ఉపయోగించారని చెప్పి కేటుగాళ్లు అధికారిని, ఆయన భార్యను భయభ్రాంతులకు గురిచేశారు. దాదాపు ఏడు రోజుల పాటు 'డిజిటల్ అరెస్టు'లో ఉంచారు. దీంతో బెంబేలెత్తిపోయిన భయపడిన ఆ దంపతులు, తమ జీవితకాలం లో దాచుకున్న సొమ్ము రూ. 30 లక్షలను మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు.ఇదీ చదవండి: సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలువీడియో కాల్స్ ద్వారా వారిని బెదిరించి, నిఘా పెట్టి, ('డిజిటల్ అరెస్ట్') బయటివారితోగానీ, పిల్లలతోగానీ మాట్లాడకుండా భయభ్రాంతులకు గురిచేశారు. వాట్సాప్లో నకిలీ రహస్య ఒప్పంద పత్రాలు (Confidentiality Agreement) పంపి సంతకాలు కూడా చేయించుకున్నారు. ఖాతాలోని డబ్బులను తనిఖీ చేయాలని, విచారణ ముగిశాక తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. దీంతో బాధితుడు తన ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసి రెండు విడతలుగా (రూ. 15 లక్షలు చొప్పున) మొత్తం రూ. 30 లక్షలను ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేశారు. ఆ తర్వాత నేరగాళ్లు ఆర్బీఐ గవర్నర్ సీల్తో ఉన్న నకిలీ వెరిఫికేషన్ లెటర్ పంపారు. ఆతరువాత యధావిధిగా ముఖం చాటేశారు.బాధితుడి ఫిర్యాదుతో క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టింది. హర్యానాకు చెందిన సునీల్ సింగ్లా అనే వ్యక్తికి చెందిన 'శ్రీ బాలాజీ ట్రాక్టర్' కంపెనీ బ్యాంక్ ఖాతాకు ఈ డబ్బు బదిలీ అయినట్లు మే నెలలో గుర్తించి, అతడిని మే 11న అరెస్ట్ చేశారు. ఇతని ఖాతా ద్వారా దాదాపు రూ. 1 కోటికి పైగా సైబర్ మోసాల లావాదేవీలు జరిగినట్లు తేలింది. పోలీసులు వెంటనే స్పందించి బాధితుడు పంపిన రూ. 15 లక్షల ట్రాన్సాక్షన్ బ్లాక్ చేయగలిగారు. అందులో రూ. 12 లక్షలను రికవరీ చేసి తిరిగి బాధితుడికి అందించారు.
సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు
సాక్షి, ముంబై: Disha Salian's Death Case దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ అనుమానాస్పద మరణం కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బాంబే హైకోర్టు బుధవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ని ఆదేశించింది. దర్యాప్తు అధికారికి ఎవరిపైనైనా తగిన ఆధారాలు లభిస్తే తప్ప, వారిని నిందితులుగా పరిగణించ కూడదని కోర్టు స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులు హత్య అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయకుండా కేవలం ప్రమాదవశాత్తు మృతి (ADR) గా మాత్రమే ఎందుకు పరిగణించారని న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే, ఐదేళ్లు గడుస్తున్నా పోస్టుమార్టం నివేదికను కుటుంబానికి అందజేయక పోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఈ కేసులో బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేయాలని కూడా బాంబే హైకోర్టు ఆదేశించింది.దిశ తండ్రి సతీష్ సాలియాన్ తన పిటిషన్లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన కుమార్తె దిశపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధారంగా, కేసు నమోదు చేసి, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ను విచారించిన బాంబే హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా, ధర్మాసనం పోలీసుల ప్రవర్తనపై దృష్టి సారిస్తూ ఈ క్రింది ముఖ్యమైన అంశాలను లేవనెత్తింది.రాజకీయ నాయకులపై వచ్చిన ఫిర్యాదులు లేదా రాజకీయ ఆరోపణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నిస్సహాయుడైన ఒక తండ్రి మనోభావాలను, న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ విషయంపై చట్టబద్ధమైన, శాసనబద్ధమైన, పారదర్శకమైన విచారణ జరిపి, సరైన ముగింపు ఇవ్వడం అవసరమని పేర్కొంది. ఇదీ చదవండి : లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?మాల్వాణి పోలీసు స్టేషన్ పరిధిలోని సంబంధిత కేసు రికార్డులన్నింటినీ సీబీఐకి అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. సరిపడా ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించవద్దని, ఆధారాలు లభించిన వారిపైనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ సీబీఐ నెగెటివ్ రిపోస్ట్ ఇస్తే, దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 'ప్రోటెస్ట్ పిటిషన్' దాఖలు చేసే హక్కు పిటిషనర్కు ఉంటుందని తెలిపింది.కాగా నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ వద్ద మేనేజర్గా పనిచేసిన సెలబ్రిటీ మేనేజర్ దిశ సాలియాన్, 2020 జూన్ 8న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని నివాస భవనం 14వ అంతస్తు నుండి కిందపడి కన్నుమూసింది. ఆమె మరణించిన ఆరు రోజులకే (2020, జూన్14న) సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా తన నివాసనంలో అనుమానాస్పదంగా మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశం 2022 నాటి మహారాష్ట్ర శాసనసభలో ప్రకంపనలు రేపింది. ఈ కేసులో, నితేష్ రాణే ఆదిత్య థాకరేకు నార్కో పరీక్ష చేయాలని కూడా షిండే వర్గం డిమాండ్ చేసింది.
వీడియోలు
ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!
హిమాలయాలు కరుగుతున్నాయ్!
ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?
లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం
సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే
snake plant ఈ మొక్కలని కిచెన్లో పెట్టుకుంటే..
మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు
Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి
పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం
Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

