ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్?
సాక్షి, అమరావతి : గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మానవత్వానికి మచ్చ మాత్రమే కాదని, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమని నిప్పులు చెరిగారు. ఈ దారుణంపై చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలన్నారు. ‘ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్?’ అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. పోలీస్స్టేషన్లు ఉన్నది ఎందుకు? ‘‘గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికి మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టారు. చివరకు ఆ వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు. ఆ వీడియోలను కప్పిపుచ్చే దానిపై శ్రద్ధ చూపే బదులు, బుధవారమే తనపై తొలిసారి దాడి జరిగిన తర్వాత.. బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదుకదా? ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంత వరకు న్యాయం?ఇక పోలీస్స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా.. లేక అధికార పార్టీ నాయకులు ఏం చెబితే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్? చంద్రబాబు తీరు వల్లే మహిళలకు రక్షణ కరువు రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైన, బాధితులపైన వేధింపులకు.. అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్రాజ్గా దిగజార్చింది. అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్బుక్ పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకు పాకింది. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు. ఎలాంటి దారుణాలు చేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడ్డానికి చంద్రబాబు ఉన్నారనే ధైర్యం వారిలో పెరిగిపోయింది. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసింది. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసింది. చంద్రబాబు గారూ.. ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుంది’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొండకు టెండర్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రాచీన శైవక్షేత్రమున్న పంచదార్ల కొండ అది. పవిత్రమైన బౌద్ధారామాలకు, ప్రకృతి అందాలకు నెలవు. కొండ నుంచి వచ్చే జలధారలతో నిండే రిజర్వాయర్, తాగునీటికి, ఇతర అవసరాలకు దానిపై ఆధారపడిన రెండు గ్రామాల ప్రజలు.. ఆ కొండపై విచ్చుకత్తుల్లాంటి గోళ్లతో పచ్చమూలాలున్న గద్ద ఒకటి వాలింది. కొండను తవ్వేస్తూ మింగేస్తోంది. ముఖ్యనేత అండతో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. విజయకుమార్నాయుడు అనే అనుచరుడి పేరుతో నడిపిస్తున్న అక్రమ మైనింగ్ వ్యవహారమిది. వెంకటాపురం నుంచి పంచదార్ల వరకు విస్తరించి ఉన్న పంచదార్ల కొండను భారీ యంత్రాలతో తవ్వించేస్తున్నారు. రోజుకు 150 నుంచి 200 ట్రిప్పుల వరకు గ్రావెల్ తరలించేస్తున్నారు. రోజుకు రూ.30 లక్షల చొప్పున ఏడాదికి దాదాపు రూ.100 కోట్లు కొట్టేయడానికి పథకం వేశారు. వీటికి తోడు బినామీల పేరుతో తాజాగా మరో 9.99 హెక్టార్లలో కూడా అనుమతులు సంపాదించారన్న విషయం బయటపడింది. వీటి మొత్తం మైనింగ్ విలువ రూ. 500 కోట్లకు పైమాటే. పంచాయతీ తీర్మానం లేదు.. ప్రజాభిప్రాయ సేకరణ లేదు.. నిలదీసిన స్థానికులను టిప్పర్లతో తొక్కించేస్తామని గూండాలు బెదిరిస్తున్నారు. రెండు నెలల నుంచి సాగుతున్న ఈ అక్రమ మైనింగ్ను నిజానికి సాక్షి గత నెలలోనే వెలుగులోకి తెచ్చింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళనలు చేశారు. దాంతో పక్కనే ఉన్న పారిశ్రామిక పార్కు అవసరాల కోసం అనే పేరుతో అనుమతులు వచ్చేశాయి. వాటిని అడ్డంపెట్టుకుని అనుమతులకు మించి ఏకంగా 3 లక్షల నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు జరిపేశారు. ఈ వ్యవహారంపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో అధికారులు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై తూతూ మంత్రంగా విచారణ జరిపి.. నామమాత్రపు అపరాధ రుసుంతో క్లోజ్ చేయాలని మైనింగ్ అధికారులు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఎన్నో విషయాలపై గొంతు చించుకున్న పవన్ కళ్యాణ్ లిస్టులో పంచదార్ల కొండ కూడా ఉంది. అక్కడ మైనింగ్కు అనుమతివ్వబో మన్నారు. కానీ మరెందుకో సీఎం రమేష్ అక్రమ మైనింగ్ విషయంపై ఆయన ఇపుడు నోరుమెదపడం లేదు. పంచాయతీ తీర్మానం లేదు.. ప్రజాభిప్రాయ సేకరణ లేదు ఏ ప్రాంతంలోనైనా కొత్తగా మైనింగ్కు అనుమతి ఇవ్వాలంటే పంచాయతీ తీర్మానం ఉండాలి. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. అయితే సీఎం రమేష్ పలుకుబడి, ఒత్తిళ్ల నేపథ్యంలో అవేవీ లేవు సరికదా... కనీసం మైనింగ్శాఖ అనుమతులు కూడా లేకుండానే అక్రమ తవ్వకాలు మొదలుపెట్టేశారు. స్థానికుల ఆందోళనల నేపథ్యంలో భూగర్భ గనులశాఖ అనుమతులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలోని పారిశ్రామిక పార్కుకు గ్రావెల్ తరలింపు పేరుతో అనుమతులు మంజూరు చేశారు.వాస్తవానికి 50 వేల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలకు అనుమతులు ఇస్తే 3లక్షల నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు చేపట్టారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళన బాట పట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మైనింగ్ తవ్వకాలపై విచారణ చేపట్టి... అనుమతికి మించి తవ్వారంటూ నివేదిక రూపొందించారు. కానీ నామమాత్రపు అపరాధ రుసుం విధించి యథావిధిగా మైనింగ్ జరిగేలా వ్యవహారం చక్కబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆగని అనుమతులు.. మొత్తం విలువ రూ.500 కోట్లు మొదట అనుమతులు ఇచ్చిన 2.153 హెక్టార్లపైనే ఆందోళనలు, విచారణలు సాగుతుండగా అదే విజయ్కుమార్నాయుడు పేరుతో ఈ ఏడాది మే 15న మరో 4.99 హెక్టార్లల్లో మైనింగ్ అనుమతులు ఇస్తూ అనకాపల్లి జిల్లా మైనింగ్ అధికారులు అనుమతులు జారీ చేశారన్న విషయం బయటపడింది. అంటే మొత్తం విజయ్కుమార్ నాయుడుకు 7.143 హెక్టార్లల్లో మైనింగ్ అనుమతులు జారీ అయ్యాయి. మరోవైపు ఇక్కడే మరో 5 హెక్టార్లలో కూడా మైనింగ్ జరిపేందుకు తాజాగా లక్ష్మీ మినరల్స్ పేరుతో వై.శ్రీనివాస్కు తాజాగా అంటే శనివారం లీజుకు ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్టుకు మైనింగ్ లీజుదారువిజయ్కుమార్ నాయుడు గ్రావెల్ సరఫరా‡ చేస్తున్నట్టు చెబుతున్న రసీదు తాజాగా శ్రీలక్ష్మి మినరల్స్కు జారీ చేసిన మైనింగ్ అనుమతులు దశమ్నాని విజయకుమార్ నాయుడు చిరునామా ఈ వై.శ్రీనివాస్.. స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ అనుచరుడని సమాచారం.. అంటే జనసేన ఎమ్మెల్యేను కూడా కలుపుకుని కొండకు టెండర్ వేశారని వినిపిస్తోంది. విజయ్కుమార్ నాయుడుకు, శ్రీ లక్ష్మీ మినరల్స్కు ఇచ్చిన 5 హెక్టార్లకు కలుపుకుంటే మొత్తం 12.143 హెక్టార్లకు అనుమతులు జారీచేశారు.. సీఎం రమేష్ నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే అనుమతులు జారీచేసినట్టు అధికారవర్గాల్లో వినిపిస్తోంది. మొదట్లో జారీచేసిన 2.153 హెక్టార్లలో ఏడాదికి రూ.100 కోట్ల అక్రమ మైనింగ్ జరుగుతుందని తెలుస్తోంది. వీటికి తోడు తాజా 9.99 హెక్టార్లను కలుపుకుంటే ఇది ఏడాదికి రూ.500 కోట్లకు చేరుకుంటుందని అర్థమవుతోంది. ప్రశ్నించిన వారిపైనే కేసులా? అక్రమ మైనింగ్ ఆపాలంటూ స్థానికులు ఆందోళన చేస్తుంటే.. వారికి సహకరించాల్సిన పోలీసులు బెదిరిస్తున్నారు. ఆందోళన చేస్తున్న వారిపై కేసులు పెడతామని రాంబిల్లి పోలీసులు బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాళ్లే కాదు. కూటమికి చెందిన స్థానిక నాయకులు కూడా బాధితులే. సీఎం రమేష్ అండతోనే మైనింగ్ చేస్తున్నామని, ఎవరైనా ఆందోళన చేసినా అడ్డుగా వచ్చినా లారీలతో తొక్కించేస్తామని విజయకుమార్ గ్యాంగ్ బెదిరిస్తోందట. ప్రాచీన శైవ క్షేత్రానికి ముప్పు! వాస్తవానికి పంచదార్ల క్షేత్రానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. పంచాధారల వద్ద స్వయంభూ లింగం ఉండేదని తెలుస్తోంది. కాలక్రమంలో ఇది మరుగునపడింది. నారదమహర్షి సూచన మేరకు యమధర్మరాజు కుçష్టు నివారణ కోసం మరో లింగాన్ని తిరిగి ప్రతిష్ట చేసినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అందువల్ల ఈ పంచదార్ల క్షేత్రానికి యమధర్మ పేరుతో ధర్మ లింగేశ్వరాలయం అనే పేరు వచ్చిందని కూడా చెబుతుంటారు. ఇక్కడ నిరంతరాయంగా లింగాలనుంచి నీరు పారుతుంది. ఈ ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ రహస్యమే. ఈ నీటిని తాగితే అనారోగ్యం పాలుకాకుండా కాపాడతాయనేది ప్రజల నమ్మకం. అంతేకాకుండా నరసింహస్వామి మొదటిసారిగా ఇక్కడే పాదాలు మోపారని పురాణాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో గోల్కొండ తరహాలో ఇక్కడ కూడా మండపంలో చప్పట్లు కొడితే తిరిగి మనకు రీసౌండ్గా వినపడుతుంది. ఇది పురాతన రక్షిత కట్టడమని పేర్కొంటూ పురావస్తుశాఖ గుర్తించి బోర్డు కూడా ఏర్పాటు చేసింది. ఇంతటి ఘనచరిత్ర ఉన్న పంచదార్ల శైవ క్షేత్రానికి ముప్పువాటిల్లేలా చంద్రబాబు ప్రభుత్వంలో భారీగా అక్రమ మైనింగ్ సాగుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కొండకు ఆనుకుని ఉన్న ఫణిగిరి కొండపై ఉన్న బౌద్ధారామాలకు కూడా ఈ విచ్చలవిడి అక్రమ మైనింగ్తో ముప్పు ఉందన్న ఆందోళన నెలకొని ఉంది. ఎవరీ విజయ్కుమార్ నాయుడు? విజయ్కుమార్ నాయుడు సీఎం రమేష్ బినామీ అని వినిపిస్తోంది. ఈయన కడపజిల్లా ఎర్రగుంట్ల గ్రామంలోని నాయుడు స్ట్రీట్ నెం. 4–136 లో నివాసం ఉంటున్నారు. సీఎం రమేష్ సొంత గ్రామం కూడా ఇదే ఎర్రగుంట్ల కావడం గమనార్హం. విజయ్కుమార్నాయుడు పేరుతో తీసుకున్న లీజు ద్వారా వచ్చిన గ్రావెల్ను సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్కు సరఫరా చేస్తున్నారు. ఆమేరకు బిల్లులు కూడా తీసుకుంటున్నారు. ఈ రిత్విక్ ప్రాజెక్ట్స్ బార్క్లో జరుగుతున్న పనులకు గ్రావెల్ను సరఫరా చేస్తోంది. అంటే నేరుగా రిత్విక్ పేరుతో కాకుండా తన గ్రామానికే చెందిన విజయ్కుమార్నాయుడు పేరుతో లీజుకు తీసుకుని... తద్వారా వచ్చిన గ్రావెల్ను రిత్విక్ ప్రాజెక్ట్స్ ద్వారా సరఫరా చేస్తున్నారన్నమాట. రిజర్వాయర్ కనుమరుగయ్యే ప్రమాదం..కొండ నుంచి వచ్చే నీటితో కొండ కింద 15 ఎకరాల్లో రిజర్వాయర్ నిండుతుంటుంది. 400 ఎకరాల ఆయకట్టుకే కాదు, రెండు గ్రామాల ప్రజల తాగునీరు, ఇతర అవసరాలకు ఇది కీలకం. ఈ రిజర్వాయర్ ఎప్పుడో బ్రిటీషు కాలం నుంచీ ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. 2023లో గత ప్రభుత్వ హయాంలో ఏషియన్ పెయింట్స్ సీఎస్ఆర్ నిధులతో అప్పటి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆధ్వర్యంలో ఈ రిజర్వాయర్ను అభివృద్ధి చేసి మరింత నీరు ఇక్కడ నిల్వ ఉంచేలా చేశారు. అంతేకాకుండా వెంకటాపురం రెవెన్యూ పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో కొండ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. ఇప్పుడు ఈ అక్రమ మైనింగ్తో రిజర్వాయర్ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతనెలలో వెలుగులోకి తెచ్చిన సాక్షి రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఫణిగిరి కొండపై తవ్వకాలకు సంబంధించి సాక్షి జూన్ 4న ‘పంచదార్ల కొండపై పచ్చగద్దలు’ శీర్షిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ తరువాత ప్రజాసంఘాలు, వామపక్షాలు, వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పురావస్తు, మ్యూజియంల శాఖ (విశాఖపట్నం) అసిస్టెంట్ డైరెక్టర్ (టెక్నికల్) నేతృత్వంలో ఈ నెల 15న వివాదాస్పద క్వారీ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. క్వారీలో తవ్వకాలు, డ్రిల్లింగ్, బ్లాస్టింగ్, లోడింగ్, రవాణా సహా అన్ని రకాల కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని గనులు, భూగర్భ వనరుల శాఖ ఏడీ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం..కొన్ని చికాకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని విషయాలలో మీ మాటకు ఎదురుండదు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువుల నుంచి ఆహ్వనాలు అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఏæ పనైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలు, క్రీడాకారులకు పురోగతి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమ. గులాబీ, లేత పసుపు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.వృషభం....ఆర్థికంగా పడిన ఇబ్బందులు తీరతాయి. సోదరులతో మనస్పర్థలు సర్దుకుంటాయి. ఆస్తుల విషయంలో ఒక ఒప్పందానికి వస్తారు. కీలక వ్యక్తుల సమావేశాలలో పాల్గొంటారు. మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. విద్యార్థుల కృషి ఫలించే సమయం. స్వయం కృషితో కొన్ని పనులు చక్కదిద్దుతారు.. వ్యాపారాలు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తారు. కొత్త పెట్టుబడులకు అవకాశాలున్నాయి.. ఉద్యోగాలలో బాధ్యతలు క్రమేపీ తగ్గుతాయి. కళాకారులు, రాజకీయవర్గాలకు అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో లేనిపోని ఖర్చులు. ఆరోగ్యం మందగిస్తుంది. మానసిక అశాంతి. ఆకుపచ్చ, ఎరుప రంగులు. దేవీస్తుతి మంచిది.మిథునం...మిమ్మల్ని ఆకట్టుకునే సంఘటనలు ఎదురుకావచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో క్రమేపీ పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగులు ఊహించని ఉద్యోగాలు సాధిస్తారు. భూవివాదాల తీరి లబ్ది పొందుతారు. వ్యాపారాలను సజావుగా నడిపి లాభాల బాట ఎక్కిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు. కళాకారులు, రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. మంచి గుర్తింపు సైతం దక్కుతుంది. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు, సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. గులాబీ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కర్కాటకం...ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. మరోవైపు అప్పుల కోసం యత్నాలు సాగిస్తారు. శ్రమ తప్పకపోవచ్చు. అనుకున్న కార్యక్రమాలలో అవరోధాలు.. బంధువులు, మిత్రులు కొంత అలక వహించే వీలుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురై ఇబ్బంది పెట్టవచ్చు. . సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తుల వ్యవహారాలు కొంత జఠిలం కావచ్చు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడొచ్చు.. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు పసుపు, ఎరుపు రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.సింహం...మీపై నిందలు మోపాలనుకున్న వారే పశ్చాత్తాపం చెందుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. సమాజంలో మంచి పేరు గడిస్తారు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దూరమైన బంధువులు కూడా దగ్గరకు వస్తారు.. కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. అలాగే, మరిన్ని వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి.. కళాకారులు, రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. . వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు.ఆకస్మిక ప్రయాణాలు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. హనుమాన్ను పూజించండి.కన్య....ముఖ్యమైన వ్యవహారాలు సమయానుసారం పూర్తి చేస్తారు. బంధువుల చేయూతతో ముందుకు సాగుతారు. శుభకార్యాలకు సన్నాహాలు చేసుకుంటారు. జీవిత భాగస్వామితో తగాదాలు పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఆనందాన్ని కుటుంబçసభ్యులతో పంచుతారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు కీలక సమాచారం. క్రీడాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. కష్టమే తప్ప ఫలితం ఉండదు. ఆకుపచ్చు, పసుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.తుల....ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా ముగిస్తారు. ఆప్తుల సూచనలు స్వీకరిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కారవుతాయి. సోదరుల ఆహ్వానాలు రాగలవు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి æ మెరుగుపడుతుంది. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు మరింత రాణిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతి సూచనలు.కళాకారులు, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. నీలం, నేరేడు రంగులు. నవగ్రహారాధన మంచిది.వృశ్చికం...ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకుల నుండి బయటపడతారు. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొ ంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు ఊహించని అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి, అనుకున్నంత లాభాలు రాగలవు.. ఉద్యోగాలలో చాకచక్యంగా వ్యవహరించి విధులు చక్కదిద్దుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల ఆశలు నెరవేరతచాయి. వారం చివరిలో అనారోగ్యం, బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దత్తస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...కొన్ని విషయాలలో నిక్కచ్చిగా మాట్లాడి అందర్నీ ఆకట్టుకుంటారు. . ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్ధిక విషయాలు అంచనాల మేరకు కొనసాగుచతాయి. అప్పుల బాధలు తొలగుతాయి. సంఘ సేవలో పాలుపంచుకుంటారు. కుటుంబసభ్యుల సలహాల మేరకు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంతో సాగుతారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, నేరేడు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.మకరం...పట్టుదలతో అనుకున్న పనులు చక్కదిద్దుతారు. జీవిత భాగస్వామి ద్వారా కొంత ఆస్తిలాభం ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ప్రయోజనం పొందుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో్ర వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. కనక«ధారా స్తోత్రాలు పఠించండి.కుంభం...నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. నిరుద్యోగులకు స్థిర ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యతిరేకులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. కళారంగం వారి సేవలకు గుర్తింపు రాగలదు. వారం మధ్యలో సోదరులతో కలహాలు. అనారోగ్యం సూచనలు. దూరప్రయాణాలు. తెలుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.మీనం....కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేసి సమర్థత చాటుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తి వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత కలసివస్తాయి. కీలక సమావేశాలలో పాల్గొంటారు. విద్య, వివాహయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. గృహ నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో బంధువిరోధాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్య సూచనలు. గులాబీ, లేత నీలం రంగులు. . గణేశ్ను పూజించండి.
వశీకరణం.. మారణం.. చేతబడులు.. నిజానిజాలు ఇవే?
సాక్షి శుభమస్తు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రొ.ముళ్లపూడి సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. అథర్వణ వేదం ప్రత్యేకత, బీజ మంత్రాల శక్తి, సామాన్య ప్రజల అవసరాలకు వేదం, వేదవ్యాసుడు అథర్వవేదాన్ని వేరుగా చూపిన కారణం, తంత్రం, అభిచార క్రియలపై అభిప్రాయం, చేతబడులు, వశీకరణంపై, యక్షిణి గురించి వివరణ ఇచ్చారు. ఆయుర్వేదం, గణితం, ప్రకృతి విజ్ఞానం వంటి అనేక శాస్త్రాలకు సంబంధించిన అంశాలు అథర్వణ వేదంలో ఉన్నాయని పేర్కొన్నారు. సంతానం, ఆరోగ్యం, శత్రు బాధ నివారణ, ఓజస్సు, తేజస్సు వంటి జీవిత అవసరాలకు సంబంధించిన మంత్రాలు అథర్వణవేదంలో ఉన్నాయని చెప్పారు. కలియుగంలో గతంలో ఉన్నట్లు శక్తిమంతమైన మారణ, మోహన, వశీకరణ విద్యలు మనుషుల చేత సాధ్యం కావని, అలాంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. మూఢనమ్మకాల వెంట వెళ్లకుండా వేదాలను శాస్త్రీయ దృష్టితో అధ్యయనం చేయాలని, నిజమైన గురువుల బోధనలు చదవాలని, "సింపుల్ లివింగ్ – హై థింకింగ్"తో జీవించాలని యువతకు సూచించారు. అథర్వణ వేదం అందరూ చదవచ్చా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను ప్రొ.ముళ్లపూడి సత్యనారాయణ మూర్తి అందించారు. ఈ వివరాలు కింది వీడియోలో చూడండి..
'ఆవిరి..' - ప్రాచీన్ కారు కొన్నప్పటి నుంచి..
చిన్నదని వదిలేస్తే... పెద్ద సమస్య కావచ్చు!
అక్క ప్రేమ వివాహం చేసుకుందని..
జాతీయ అవార్డుల తీరుపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం!
అర్ధరాత్రి నగ్నంగా వెళ్లి.. గుడిలో విగ్రహం తీసుకుని..
గోవర్ధన తీర్థం: ఒకానొకప్పుడు జాబాలి అనే..
ఎంబాపె ప్రపంచ రికార్డు.. మెస్సీకి కష్టమేనా!
15 రోజుల క్రితమే పెళ్లి.. నవ వధువు దుర్మరణం
డైవర్స్ కావాలి: భర్త - బిడ్డను కనాలి: భార్య
నిన్న ‘చడ్డీ గ్యాంగ్’.. నేడు ‘బాల్ కట్వా’.. భయాందోళనలో ఊళ్లకు ఊళ్లు
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి
ఓటీటీలోకి వచ్చేసిన 'బంగారం'.. మరోవైపు సమంత సీమంతం
ఎంత వెతికినా నీ ఓటు మాత్రం కనపడటం లేదు
అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది: శుబ్మన్ గిల్
ఇలా అన్నిచోట్లా ఉంటే బావుండు.. హాయిగా ప్రచారం చేసుకోవచ్చు..!!
ఓటీటీలోకి వచ్చేసిన సాయిపల్లవి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కొత్తింట్లోకి అడుగుపెట్టిన తెలుగు సీరియల్ జంట
ట్రెండింగ్ హీరోయిన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా?
బంగారంపై మళ్లీ కియోసాకి ‘భారీ’ కామెంట్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. యత్నకార్యసిద్ధి
భారత్లోకి కరోనా రీఎంట్రీ! అసలు కారణం ఏంటంటే..
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. శుభ్మన్ గిల్ సహచరుడు అరెస్ట్
IND vs ENG: మూడో వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
మూడు వారాల కనిష్టానికి పసిడి
సంపద సృష్టించడం ఎలా..?: కియోసాకి సలహా
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్కి లక్కీ ఛాన్స్
హైదరాబాద్లో దిగొచ్చిన బంగారం ధర!
సైదాబాద్ హోం వర్క్ వివాదం.. NHRC నోటీసులు..
ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్బీఐ తొలి అడుగు!
'ఆవిరి..' - ప్రాచీన్ కారు కొన్నప్పటి నుంచి..
చిన్నదని వదిలేస్తే... పెద్ద సమస్య కావచ్చు!
అక్క ప్రేమ వివాహం చేసుకుందని..
జాతీయ అవార్డుల తీరుపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం!
అర్ధరాత్రి నగ్నంగా వెళ్లి.. గుడిలో విగ్రహం తీసుకుని..
గోవర్ధన తీర్థం: ఒకానొకప్పుడు జాబాలి అనే..
ఎంబాపె ప్రపంచ రికార్డు.. మెస్సీకి కష్టమేనా!
15 రోజుల క్రితమే పెళ్లి.. నవ వధువు దుర్మరణం
డైవర్స్ కావాలి: భర్త - బిడ్డను కనాలి: భార్య
నిన్న ‘చడ్డీ గ్యాంగ్’.. నేడు ‘బాల్ కట్వా’.. భయాందోళనలో ఊళ్లకు ఊళ్లు
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి
ఓటీటీలోకి వచ్చేసిన 'బంగారం'.. మరోవైపు సమంత సీమంతం
ఎంత వెతికినా నీ ఓటు మాత్రం కనపడటం లేదు
అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది: శుబ్మన్ గిల్
ఇలా అన్నిచోట్లా ఉంటే బావుండు.. హాయిగా ప్రచారం చేసుకోవచ్చు..!!
ఓటీటీలోకి వచ్చేసిన సాయిపల్లవి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కొత్తింట్లోకి అడుగుపెట్టిన తెలుగు సీరియల్ జంట
ట్రెండింగ్ హీరోయిన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా?
బంగారంపై మళ్లీ కియోసాకి ‘భారీ’ కామెంట్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. యత్నకార్యసిద్ధి
భారత్లోకి కరోనా రీఎంట్రీ! అసలు కారణం ఏంటంటే..
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. శుభ్మన్ గిల్ సహచరుడు అరెస్ట్
IND vs ENG: మూడో వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
మూడు వారాల కనిష్టానికి పసిడి
సంపద సృష్టించడం ఎలా..?: కియోసాకి సలహా
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్కి లక్కీ ఛాన్స్
హైదరాబాద్లో దిగొచ్చిన బంగారం ధర!
సైదాబాద్ హోం వర్క్ వివాదం.. NHRC నోటీసులు..
ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్బీఐ తొలి అడుగు!
ఫొటోలు
ట్రాఫిక్ టాస్క్ఫోర్స్... పనిచేస్తుందిలా.. (ఫొటోలు)
కేరళ క్రికెట్ లీగ్ వేలం.. కీర్తి ముస్తాబైందిలా! (ఫొటోలు)
చీరలో శ్రుతి హాసన్.. ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)
మోడ్రన్ దేవకన్యలా దివ్యభారతి.. చూసేందుకు రెండు కళ్లు సరిపోవు (ఫొటోలు)
గోవాలో అల్లువారి కోడళ్లు.. సతీమణితో శిరీష్ సందడి (ఫోటోలు)
బర్త్డే స్పెషల్.. ప్రియాంక చోప్రా గురించి ఈ విషయాలు తెలుసా ? (ఫొటోలు)
అబ్బో.. ఈ రైల్వే స్టేషన్ పేరుకు తగ్గట్లే ఉందే! (చిత్రాలు)
కామాఖ్య ఆలయంలో నిక్కీ గల్రానీ దంపతుల పూజలు..ఫోటోలు
ఓ సుకుమారి బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ లేటేస్ట్ స్టిల్స్.. ఫోటోలు
లండన్ వీధుల్లో హీరోయిన్ హెబ్బా పటేల్ చిల్.. ఫోటోలు
సినిమా
జాతీయ సినీ అవార్డులు: ఉత్తమ నటి యామీ.. ఉత్తమ నటుడు మమ్ముట్టి
న్యూ ఢిల్లీ వేదికగా 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలని ప్రకటించారు. 2024 సంవత్సరానికిగానూ 34 భాషల్లో 400 సినిమాలని వడబోసి ఈ పురస్కారాలని ప్రకటించారు. ఉత్తమ నటుడిగా మమ్ముట్టి-కార్తిక్ ఆర్యన్ నిలవగా, ఉత్తమ నటిగా యామీ గౌతమ్, ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370 నిలిచింది. ఇక మిగిలిన విభాగాల్లో ఎవరు ఏ అవార్డులు దక్కించుకున్నారంటే?72వ జాతీయ అవార్డుల పూర్తి జాబితాఉత్తమ నటుడు: కార్తిక్ ఆర్యన్ (చందు ఛాంపియన్), మమ్ముట్టి (భ్రమయుగం)ఉత్తమ నటి: యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370ఉత్తమ దర్శకుడు: రాజ్ కుమార్ పెరియాసామి (అమరన్)ఉత్తమ సహాయ నటి: రూపశ్రీ వర్కాడి (మిథ్య), సచన నమిదాస్ (మహారాజా)ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ మిశ్రా (భక్షక్)ఉత్తమ సంగీత దర్శకత్వం: శాశ్వత్ సచ్ దేవ్ (ఆర్టికల్ 370)ఉత్తమ సంగీతం (నేపథ్యం): జీవీ ప్రకాశ్ కుమార్ (అమరన్)ఉత్తమ మేకప్: పీ రవికుమార్ (కమిటీ కుర్రోళ్లు)ఉత్తమ సినిమాటోగ్రఫీ: షెహనాద్ జలాల్ (భ్రమయుగం)ఉత్తమ సింగర్: వైకం విజయలక్ష్మి (ఏఆర్ఎమ్)ఉత్తమ మేల్ సింగర్ : అభయ్ జోధ్ (నవసచి గౌరి మాజీ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: దీపాళి నూర్-శీతల్ శర్మ (పుష్ప 2)ఉత్తమ బాలల చిత్రం: 35 ఇది చిన్న కథ కాదు (తెలుగు)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)ఉత్తమ ఎడిటింగ్: ఆర్ కలైవన్నన్ (అమరన్)ఉత్తమ సౌండ్ డిజైన్: భూల్ భులయ్యా 3 (మానస్ చౌదరి)ఉత్తమ స్క్రీన్ప్లే (డైలాగ్): వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టెడ్): యోగేశ్ దేశ్ పాండేఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజనల్): సుకుమార్ (పుష్ప 2)ఉత్తమ బాలనటి: రిధిమన్ బెనర్జీ, తపమోయ్ దేబ్, గీతాశ్రీ చక్రబర్తి, అరుణ్ దేవ్ (35 ఇది చిన్న కథ కాదు), అతీశ్ శెట్టి (మిథ్య)ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం: కెప్టెన్ మిల్లర్ఉత్తమ ప్రజాదరణ చిత్రం: కల్కి 2898 ఏడీఉత్తమ పరిచయ దర్శకుడు: రణ్దీప్ హుడా (స్వాతంత్ర్య వీర్ సావర్కర్)ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: మహారాజా (అనలు అరసు)ఉత్తమ తెలుగు చిత్రం: కమిటీ కుర్రోళ్లుఉత్తమ తమిళ చిత్రం: రాయన్ఉత్తమ మలయాళ చిత్రం: ఫెమించి ఫాతిమాఉత్తమ కన్నడ చిత్రం: మిథ్యఉత్తమ హిందీ చిత్రం: శ్రీకాంత్
రైతుల్ని ఉగ్రవాదులు అంటావా? కాజల్ కొత్త సినిమా ట్రైలర్
ఒకప్పటితో పోలిస్తే మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి ప్రతిదీ కల్తీ అయిపోయింది. కాదు కాదు కొందరు వ్యాపారాలు చేసేస్తున్నారు. దీని వల్ల యువతరం, చిన్న పిల్లలు.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. ఈ సంగతులన్నీ జనాలకు తెలుసు. రోజూ పేపర్, టీవీ, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. అలాంటి కాన్సెప్ట్తో తీసిన సినిమా 'ద ఇండియా స్టోరీ'. కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రలు పోషించారు. వచ్చే శుక్రవారం(జూలై 24) మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)దేశ సరిహద్దుల్లో సైనికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి ఏడేళ్ల కూతురు క్యాన్సర్తో చనిపోతుంది. అయితే తన కుమార్తెని అన్యాయంగా చంపేశారని చెప్పి సదరు తండ్రి.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. ఓ లాయర్తో కలిసి క్రిమి సంహారకాలు తయారు చేసే కంపెనీలు, కల్తీ చేసే సంస్థలపై పోరాటానికి దిగుతాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఓ మహిళా లాయర్తో కలిసి ఏం చేశాడు? రైతులు వీళ్లిద్దరిపై ఎందుకు తిరగబడ్డారు? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్ అయితే బాగానే ఉంది. ఇందులో చూపించినవన్నీ చేదు నిజాలే. జనాలకు కూడా ఇలాంటి కల్తీ, క్రిమి సంహారక మందుల గురించి తెలుసు. అయినా సరే వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇవి తింటున్న పరిస్థితి. ఇవి కాకుండా మూవీలో ఇంకేం చూపిస్తారో చూడాలి? ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ప్రస్తుతానికైతే ఈ చిత్రంపై ఏ మాత్రం బజ్ లేదు.(ఇదీ చదవండి: హీరోయిన్ ప్రీతి ముకుందన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా?)
ట్రెండింగ్ హీరోయిన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా?
మన దేశం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్తల్లో శ్రీనివాస రామానుజన్ ఒకరు. ఈయన గణిత సిద్ధాంతాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈయన ఘనతలు గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. అయితే పుట్టినరోజు, వర్ధంతి లాంటివి ఇప్పుడేం లేవు అయినా సరే శ్రీనివాస రామానుజన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతున్నారు. దీనికి కారణం. లేటెస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్.. ఈయనకు మునిమనవరాలు అవుతుందనే వార్త.(ఇదీ చదవండి: రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్కి లక్కీ ఛాన్స్)తమిళనాడులోని ఈరోడ్లో 1887లో పుట్టిన శ్రీనివాస రామానుజన్ 32 ఏళ్లకే మశూచి వ్యాధి బారినపడి చనిపోయారు. ఇదంతా జరగడానికి చాన్నాళ్ల క్రితమే జానకి అమ్మళ్ అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్లకు ఎలాంటి సంతానం లేదు. కానీ గత రెండు రోజుల నుంచి హీరోయిన్ ప్రీతి ముకుందన్ తల్లికి శ్రీనివాస రామానుజన్తో బంధుత్వం ఉందని, తద్వారా ప్రీతి, రామానుజన్కి ముని మనవరాలు అవుతుందని అంటున్నారు.కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని అనిపిస్తుంది. శ్రీనివాస రామానుజన్ చనిపోయిన ముప్పై ఏళ్ల తర్వాత జానకి అమ్మళ్.. డబ్ల్యూఎస్ నారాయణ్ అనే వ్యక్తిని పెంచుకుందని చెప్పి గూగుల్లో ఉంది. బహూశా ఈయన తర్వాత తరం వాళ్లతో ప్రీతి ముకుందన్ కుటుంబానికి ఏమైనా బంధుత్వం ఉంటే ఉండాలి. ఒకవేళ ఉన్నాగానీ ఈ విషయం గురించి ప్రీతి స్పందిస్తే తప్పితే ఏదో ఒకటి క్లారిటీ రాదు.ప్రీతి ముకుందన్ విషయానికొస్తే.. ఓం భీం బుష్, కన్నప్ప లాంటి తెలుగు సినిమాలు చేసింది గానీ ఈమెకు సక్సెస్ రాలేదు. తమిళంలో ఈ ఏడాది వచ్చిన 'బ్లాస్ట్' ఈమె ఫేట్ మార్చింది. ఓవర్ నైట్ సెన్సేషన్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)
‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ అంటే సంక్లిష్టమైన కథలు, కాలాల ఇంద్రజాలంతో ఆడుకునే కథన శైలి, అద్భుతమైన విజువల్ అనుభవాలకే ఇప్పటివరకు చిరునామా, అయితే ’ది ఒడిస్సీ’ తర్వాత తో ఆయన పట్ల ఈ అభిప్రాయాలు సమూలంగా మారిపోతాయి. వేల ఏళ్ల క్రితం హోమర్ రాసిన మహాకావ్యాన్ని ఆధునిక తరపు ప్రేక్షకులకు సైతం సులభంగా అర్థమయ్యేలా నోలన్ తెరకెక్కించాడు. విశేషం ఏమిటంటే ఈ చిత్రం కేవలం యాక్షన్ లేదా ఫాంటసీ కాదు; యుద్ధం, పశ్చాత్తాపం, కుటుంబం, ప్రేమ, విముక్తి వంటి మానవీయ భావోద్వేగాల సమ్మేళనంగా సాగిన సమున్నత ప్రయాణం.కధ ఏమిటి?యుద్ధకళల్లో ఆరితేరిన పరాక్రమవంతుడైన రాజు... తప్పని పరిస్థితుల్లో ఒక భీకర యుద్ధంలో పాల్గొని అతి కష్టం మీద గెలిచి తిరిగి తన రాజ్యానికి తిరిగివచ్చే మార్గంలో ఎదుర్కున్న అడ్డంకులు, రాజ్యానికి తిరిగి వచ్చాక ఎదురైన అనూహ్య పరిస్థితులు అక్కడ మళ్లీ తన వాళ్లతోనే యుద్ధం చేయాల్సి రావడం...వీటన్నింటినీ ఎలా ఎదుర్కున్నాడు? దీనికి సమాధానమే ఈ చిత్రం.. కట్టె కొట్టె తెచ్చేలా చెప్పాలంటే ఇంతే ’ది ఒడిస్సీ’ కథ, గతంలో వచ్చిన ’ట్రాయ్’ సినిమాకు ఒక విధంగా కొనసాగింపులా అనిపిస్తుంది. ఆ సినిమాలో ట్రోజన్ యుద్ధం ఎలా ముగిసిందో చూసిన ప్రేక్షకులకు, ఆ యుద్ధంలో విజేతలైన గ్రీకు వీరులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి చేసిన పోరాట సహిత ప్రయాణమే ఈ చిత్రంలో ప్రధాన కథ.హైలెట్...దర్శకత్వం...తన గత సినిమాల్లోలాగే ఈ సినిమా సక్సెస్లో కూడా దర్శకుడు నోలన్ ఫుల్ మార్కులు అందుకుంటాడు. ఆయన ప్రతీసారీలాగే ఈసారి కూడా చిత్రీకరణలో తన మేధస్సును ప్రదర్శించడమే కాకుండా, భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేశాడు. అయితే గత చిత్రాల్లా ప్రేక్షకుడిని పజిల్స్తో గందరగోళానికి గురిచేయకుండా, కథనం సాగే క్రమంలో ప్రతీ దశలోనూ మానవీయ కోణాన్ని స్పర్శించడం ఆకట్టుకుంటుంది.సాంకేతి‘కధ’నోలన్ సినిమాల్లో సాంకేతిక నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో కూడా హోయ్టే వాన్ హోయ్టెమా సినిమాటోగ్రఫీ అద్భుతంగా మెరిసింది. సముద్ర ప్రయాణాలు, యుద్ధ దృశ్యాలు, ప్రకృతి ప్రకోపాల సమయంలో సన్నివేశాలు... ప్రతీ ఫ్రేమ్ భారీ కాన్వాస్పై వేసిన చిత్రంలా కనిపిస్తుంది. దీని తర్వాత తప్పకుండా చెప్పుకుని తీరాల్సింది లుడ్విగ్ గోరాన్సన్ నేపథ్య సంగీతం. అది ప్రతి భావోద్వేగాన్ని మరింత బలంగా ప్రేక్షకుడికి చేరుస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాల్లో ఎంత ప్రభావం చూపుతుందో, నిశ్శబ్దమైన భావోద్వేగ భరిత సన్నివేశాల్లో కూడా అంతే గాఢతను ప్రేక్షకులు అనుభవించేలా చేయగలిగారు.నటీనటుల ప్రదర్శనఒడిసియస్ పాత్రలో మ్యాట్ డేమన్ తన కెరీర్లోని అత్యుత్తమ నటనల్లో ఒకదాన్ని కనబరిచాడు. యుద్ధ వీరుడి గర్వం, తన అనుచరులను కాపాడలనే థీరత్వం, కుటుంబాన్ని చేరాలనే తపన, యుద్ధ ఫలితాలపై అంతర్మధనం... అన్నింటినీ సమ తూకంలో ప్రదర్శించాడు. ప్రేక్షకులను తన పాత్రతో ప్రయాణం చేసేలా చేయగలిగాడు. ఆయన భార్యగా నటించిన యాన్ హాతవే పెనెలోపీగా తక్కువ సన్నివేశాలున్నా, భావోద్వేగాలకు బలమైన కేంద్రంగా నిలుస్తుంది. ఆమె నటన సినిమాకు ఆత్మలా మారిందనొచ్చు. రాజ కుమారుడిగా, టామ్ హాలండ్ టెలిమాకస్ పాత్రలో పరిపక్వతను చూపించాడు. రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రతి నాయకుడిగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు...గ్రీకు పురాణాల ఆధారంగా రూపొందిన కథ అయినప్పటికీ, ఇందులో కనిపించే అనేక అంశాలు భారతీయ ఇతిహాసాలను గుర్తు చేస్తాయి. యుద్ధం ముగిసిన తర్వాత ఎన్నో కష్టాలు దాటి ఇంటికి చేరాలనే నాయకుడి ప్రయాణం, రెండు దశాబ్ధాల సుదీర్ఘకాలం గడిచినా భార్యాభర్తల మధ్య సడలిపోని అనుబంధం , తండ్రి మరణించలేదని నమ్ముతూ కుమారుడు తండ్రి కోసం ఎదురుచూడటం వంటి కుటుంబ విలువలు మన ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి. అలాగే ధర్మం కోసం చేసే యుద్ధంలో గెలిచినా ఎందరో ఆప్తుల్ని కోల్పోవడం లాంటి బాధించే వాస్తవాల్ని గుర్తించడం...ఇలాంటి భావాలు రామాయణం, మహాభారతంలో కనిపించే విలువలను తలపిస్తాయి. అందుకే ఈ కథ భారతీయ ప్రేక్షకులకు కొత్తగా కాకుండా, బాగా పరిచయమున్నట్టు అనుభూతిని కలిగిస్తుంది. చివర్లో వచ్చే విల్లు ఎక్కుపెట్టే పరీక్ష చాలామందికి రామాయణంలో శ్రీరాముడు శివధనుస్సును ఎత్తిన ఘట్టాన్ని గుర్తు చేస్తుంది. అలాగే బలవంతుడే కాదు, నిజమైన అర్హుడే ఆ విల్లును ప్రయోగించగలడనే భావన మన పురాణాల్లో కనిపించే వీర పరీక్షలను తలపిస్తుంది.హైలెట్స్...ట్రోజన్ యుద్ధంలో గ్రీకులు ఉపయోగించిన భారీ చెక్క గుర్రం ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో అత్యంత తెలివైన యుద్ధ వ్యూహంగా చెప్పుకుంటారు. ఓటమి అంచుల్లో నిలిచినప్పటికీ... గుర్రం లోపల సైనికులను దాచిపెట్టి ట్రోయ్ నగరంలోకి ప్రవేశించి చివరి క్షణంలో యుద్ధాన్ని గెలిచిన ఘట్టాన్ని ఈ సినిమాలో కూడా గుర్తు చేస్తారు. ఆ సినిమా చూడని ప్రేక్షకులకు ఇది ఉపశమనం ఇస్తుంది. గెలుపు తర్వాత ప్రారంభమయ్యే ఒడిసియస్ తిరుగు ప్రయాణంలో దేవతల శాపాలు ఎదుర్కుంటాడు. అలాగే సముద్ర తుఫాన్లు, భయంకరమైన రాక్షసులు, మంత్రగత్తెలు, ప్రాణాంతక ద్వీపాలు... ఇలా ప్రతి అడుగూ ఒక పరీక్షగా మారుతుంది. ఇవన్నీ విజువల్ ట్రీట్స్ అందిస్తాయి. ప్రత్యేకంగా ఒంటికన్ను రాక్షసుడు సైక్లోప్స్ తో జరిపే పోరాటం సినిమా హైలైట్లలో ఒకటి. బలంతో కాకుండా తెలివితో అతడిని ఓడించే విధానం ఆకట్టుకుంటుంది. అలాగే సముద్ర దేవుడు పోసైడన్ కోపం వల్ల ఎదురయ్యే తుఫాన్లు, మోహింపజేసే సైరన్స్ , మంత్రగత్తె సిర్సే, చివర్లో తన రాజ్యంలోకి చేరాక శత్రువులను ఎదుర్కొనే పోరాటం... వేటికవే అన్నట్టుగా కళ్లకు విందు చేస్తాయి. దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ ప్రయాణాన్ని కేవలం ఫాంటసీగా కాకుండా, ఇంటికి చేరాలనే ఒక మనిషి ఆరాటం, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆరాటం, యుద్ధం తర్వాత మనిషి మానసిక సంఘర్షణ వంటి భావోద్వేగాలతో ముడిపెట్టడం వల్ల సినిమా మరింతగా హృదయానికి దగ్గరవుతుంది. ’ది ఒడిస్సీ’ కేవలం ఒక గ్రీకు పురాణ చిత్రం కాదు; భారతీయ ప్రేక్షకులు తమ ఇతిహాసాల జ్ఞాపకాలను కూడా ఆస్వాదిస్తూ చూడగలిగే గొప్ప విజువల్, ఎమోషనల్ అనుభవంగా నిలుస్తుంది. లోపాలుహెలెన్ పాత్రలో నటించిన లుపిటా న్యోంగో నటనపై పెద్దగా విమర్శలు లేవు. కానీ "ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ"గా వర్ణించిన హెలెన్ పాత్రకు ఆమె ఎంపిక సరిపోలేదు. ఇది ప్రధానంగా నటన కంటే కాస్టింగ్కు సంబంధించిన చర్చ. మరోవైపు, నోలన్ తన కథన దృష్టికోణానికి అనుగుణంగానే ఈ ఎంపిక చేశారని, అందం కంటే పాత్రలోని మానవీయ కోణాన్ని చూపించాలని భావించారని అయన టీమ్ సభ్యులు అంటున్నారు.హోమర్ రచనతో పోలిస్తే అథీనా, సిర్సే, కాలిప్సో వంటి పాత్రలను నోలన్ కుదించేశాడనే భావన కలుగుతుంది. అలాగే నిడివి కూడా కాస్త తగ్గిస్తే బాగుండేది.ఒడిసియస్ ఎదుర్కొనే అనేక అడ్డంకుల్ని ఒకే సినిమాలో చెప్పాల్సి రావడంతో ముఖ్య మైన కొన్ని సంఘటనలు వేగంగా ముగిసి పోయాయి అనిపిస్తుందిగ్రీకు పురాణ కథ అయినప్పటికీ, అమెరికన్ యాసలో సంభాషణలు, కొన్ని దుస్తులు, ఆయుధాల రూపకల్పన, విభిన్న జాతుల నటీనటుల ఎంపిక వల్ల "చారిత్రక వాస్తవికత తగ్గింది" అనిపిస్తుంది. అయితే ఇవి నోలన్ సృజనాత్మక నిర్ణయాలని టీం స్పష్టత ఇచ్చింది .పెద్ద తారాగణం ఉన్నప్పటికీ, కొందరు ప్రముఖ నటీనటులకు చాలా తక్కువ స్క్రీన్ టైమ్ మాత్రమే దక్కడం ముఖ్యంగా హెలెన్ పాత్ర కథపై పెద్దగా ప్రభావం చూపలేకపోవడం...లోపాలు గా కనిపిస్తాయి.–సత్యబాబు
క్రీడలు
రోహిత్ కాదు..! త్వరలో ఆ ముగ్గురు రిటైర్మెంట్ ఫిక్స్?
టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్కు సంబంధించి జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా ఆదివారం ఇంగ్లండ్తో జరగనున్న మూడో వన్డేనే రోహిత్కు భారత్ తరపున ఆఖరి మ్యాచ్ అని జాతీయ మీడియాలో సైతం కథనాలు వెలువడ్డాయి.అయితే 'హిట్మ్యాన్' భవిష్యత్తు ప్రణాళికల్లో కొనసాగుతాడని, లార్డ్స్ వన్డే అతడి చివరి మ్యాచ్ కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ రోహిత్ కంటే ముందే మరో ముగ్గురు భారత స్టార్ ఆటగాళ్లు వన్డే ఫార్మాట్కు గుడ్-బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఆ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం.మహ్మద్ షమీఈ జాబితాలో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ఉంటాడు. షమీ గతేడాదిగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. వన్డే ప్రపంచకప్- 2023లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలర్గా నిలిచిన షమీ.. ఆ తర్వాత గాయాల కారణంగా రెండేళ్లపాటు ఆటకు దూరమయ్యాడు. తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు అతడు భారత జట్టులోకి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి.. అతడు మళ్లీ జట్టులో చోటు కోల్పోయాడు. ఫిట్నెస్ సమస్యల పరంగా అతడిని పక్కన పెట్టనట్లు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఆ తర్వాత అతడు దేశవాళీ క్రికెట్లో రాణించినప్పటికి సెలక్టర్లు మాత్రం జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. అతడి స్దానంలో యువ బౌలర్లను సెలెక్షన్ కమిటీ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్ యువ పేసర్లు సత్తాచాటుతున్నారు. దీంతో షమీకి తిరిగి భారత జట్టులో చోటు దక్కే సూచనలు కనిపించం లేదు. ఈ క్రమంలో 35 ఏళ్ల షమీ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆశ్చర్యపోనక్కర్లేదు. షమీ తన కెరీర్లో మూడు ఫార్మాట్లు కలిపి 405 వికెట్లు పడగొట్టాడు.యుజ్వేంద్ర చహల్ఇక ఈ జాబితాలో రెండో పేరు యుజ్వేంద్ర చహల్. చాహల్ 2023 నుంచి ఇప్పటివరకు భారత్ తరపున ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుతం జట్టులో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఫ్రంట్లైన్ స్పిన్నర్లుగా ఉన్నారు. అంతేకాకుండా హర్ష్ దూబే, మానవ్ సుతార్ వంటి యువ ఆటగాళ్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. వీరికి తోడు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో చాహల్ కూడా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది.రవీంద్ర జడేజాఇక స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా త్వరలోనే వన్డేల నుంచి తప్పుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రెండేళ్ల కిందట టీ20లకు వీడ్కోలు పలికిన జడ్డూ.. ప్రస్తుతం కేవలం వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డేల్లో కూడా అతడికి అవకాశం రావడం లేదు. అఫ్గాన్ సిరీస్తో పాటు ఇంగ్లండ్తో వన్డేలకు అతడిని పక్కన పెట్టారు. 2023 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత జడేజా కేవలం 13 వన్డేలు మాత్రమే ఆడాడు. ముఖ్యంగా 2026లో ఆడిన 3 వన్డేల్లో కేవలం 43 పరుగులు మాత్రమే చేసి, ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో అతడికి ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. దీంతో జడేజా వన్డేలకు వీడ్కోలు పలికి కేవలం టెస్టుల్లోనే కొనసాగే ఛాన్స్ ఉంది.
ఇజ్రాయెల్ సెటిలర్ల దాడి.. పాలస్తీనా ఫుట్బాల్ ప్లేయర్ మృతి
పాలస్తీనా క్రీడా రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆక్రమిత పశ్చిమ తీరం (వెస్ట్ బ్యాంక్)లో ఇజ్రాయెల్ సెటిలర్లు, సైన్యం జరిపిన దాడిలో గాయపడిన పాలస్తీనా యువ ఫుట్బాల్ ప్లేయర్ ఫాదీ హమ్దల్లా అల్-నస్సాన్ (17) శనివారం రాత్రి మరణించాడు. ఫాదీ తీవ్రమైన గాయాలతో వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయినట్లు అధికారులు ప్రకటించారు.ఏమి జరిగిందంటే?జూలై 11న వెస్ట్ బ్యాంక్లోని ఫాదీ హమ్దల్లా గ్రామంపై ఇజ్రాయెల్ సెటిలర్లు, బలగాలు దాడులు జరిపాయి. ఈ దాడిలో మహిళల అరుపులు విని వారిని రక్షించడానికి వెళ్లిన ఫాదీపై ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరిపాయి. తీవ్రంగా గాయపడిన ఫాదీని అస్పత్రికి తరలించారు.గాయం తీవ్రమవడంతో వైద్యులు అతడి కాలును తొలగించాల్సి వచ్చింది, అయినప్పటికీ పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఈ ఘటనపై పాలస్తీనా ఫుట్బాల్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించింది.2023 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 568 ఫుట్బాల్ ప్లేయర్లు మరణించినట్లు పీఫ్ఎ అధికారికంగా తెలిపింది. కాగా ఫాదీ అల్-నస్సాన్ స్థానిక 'అల్-ముఘయ్యిర్' క్లబ్కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు, పాలస్తీనా జాతీయ యువ ఫుట్బాల్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.
రోహిత్పైనే అందరి దృష్టి
లండన్: భారత ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్పై గత మూడు రోజులుగా సాగుతున్న చర్చకు నేడు తెరపడనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో టీమిండియా మూడో వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్తోనే రోహిత్ అంతర్జాతీయ కెరీర్ ముగియనుందనే వార్తలు వెలువడటంతో... అభిమానులందరి దృష్టి ‘హిట్ మ్యాన్’పైనే ఉండనుంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని రోహిత్ భావిస్తున్నా... సెలక్టర్లు అందుకు సుముఖంగా లేరని రోహిత్ సన్నిహిత వర్గాలు అంటుండగా... లార్డ్స్ మ్యాచ్ రోహిత్ శర్మకు చివరిది కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. రోహిత్ కుటుంబ సభ్యులు లండన్ చేరుకోవడంతో అతని అంతర్జాతీయ కెరీర్ ముగియనుందనే వాదనకు బలం చేకూరుతోంది. అదే జరిగితే వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ను భారత జెర్సీలో చూడటం ఇదే చివరిసారి కానుంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా... రెండో మ్యాచ్లో గెలిచి ఇంగ్లండ్ లెక్క సరిచేసింది. దీంతో ఈ పోరులో గెలిచిన జట్టు సిరీస్ చేజిక్కించుకోనుంది. రో‘హిట్’ కొట్టేనా! గత రెండు మ్యాచ్ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన రోహిత్ బ్యాట్ నుంచి మెరుపు ఆరంభం ఆశిస్తుండగా... కెపె్టన్ శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ నిలకడ కొనసాగించాల్సిన అవసరముంది. అస్వస్థతతో గత మ్యాచ్కు దూరమైన కేఎల్ రాహుల్ తిరిగి రావడం ఖాయం కావడంతో ఇషాన్ కిషన్ బెంచ్కే పరిమితం కానున్నాడు. గాయం కారణంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరం కాగా... అతడి స్థానంలో ఎంపికైన లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబేకు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా మునపటి వాడి ప్రదర్శిస్తుండగా... ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ అతడికి అండగా నిలుస్తున్నారు. మరోవైపు గత మ్యాచ్లో టాపార్డర్ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోయినా... ఒంటరి పోరాటంతో జట్టును గెలిపించిన రూట్పై ఇంగ్లండ్ భారీ ఆశలు పెట్టుకుంది. గత మూడు వన్డేల్లోనూ నాటౌట్గా నిలచిన రూట్... భారత్పై తొలి వన్డేలో 76, రెండో వన్డేలో 99 పరుగులు చేశాడు. రూట్ నిలకడకు ఇతర బ్యాటర్ల దూకుడు తోడైతే ఇంగ్లండ్ను ఆపడం కష్టతరమే! బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్పైనే ఆ జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. పిచ్ ఎలా ఉందంటే... లార్డ్స్లో టీమిండియాకు గొప్ప రికార్డేమీ లేదు. ఈ మైదానంలో భారత జట్టు వన్డే మ్యాచ్ గెలిచి రెండు దశాబ్దాలు దాటింది. చివరగా 2004లో దినేశ్ కార్తీక్ అరంగేట్రం చేసిన మ్యాచ్లో భారత్ గెలిచింది. ఓవరాల్గా ఈ మైదానంలో తొమ్మిది వన్డేలు ఆడిన టీమిండియా నాలుగు మ్యాచ్ల్లో నెగ్గింది. అందులో 1983 వన్డే ప్రపంచకప్ ఫైనల్ కూడా ఉంది. పిచ్ బౌలింగ్కు అనుకూలం. ఇటీవల న్యూజిలాండ్తో టెస్టు సందర్భంగా పిచ్ అనూహ్యంగా స్పందించింది. గత రికార్డు చూసుకుంటే లక్ష్యఛేదన కన్నా... మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. మ్యాచ్కు వర్ష సూచన లేదు. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, అక్షర్, శివమ్ దూబే, కుల్దీప్/హర్ష్ దూబే, బుమ్రా, గుర్నూర్, ప్రసిధ్. ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), డకెట్, బెథెల్, రూట్, బట్లర్, సామ్ కరన్, విల్ జాక్స్, అట్కిన్సన్, ఆర్చర్, సాఖిబ్/టంగ్, ఆదిల్ రషీద్.
ఫైనల్ 'కిక్'
39 రోజులు, 103 మ్యాచ్ల తర్వాత ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మెస్సీ మెరుపులతో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ టైటిల్ను నిలబెట్టుకుంటుందా? టీనేజ్ సంచలనం లమీన్ యామల్ నైపుణ్యం 2010 విశ్వవిజేత స్పెయిన్కు రెండోసారి ప్రపంచకప్ అందిస్తుందా? అటాకింగ్ ఆటతీరుతో ఈ ప్రపంచకప్ను ఊపేసిన అర్జెంటీనా ఆటగాళ్లు అదే జోరును తుది పోరులో కొనసాగిస్తారా? అడ్డుగోడలా నిలబడుతూ ప్రత్యర్థి జట్లకు గోల్ కొట్టడమే గగనంలా చేసిన స్పెయిన్ డిఫెన్స్ తుది పోరులోనూ విజయవంతం అవుతుందా? వరుసగా రెండోసారి ప్రపంచకప్ను సొంతం చేసుకొని ఇటలీ, బ్రెజిల్ సరసన అర్జెంటీనా నిలుస్తుందా? అర్జెంటీనా ఆశలను వమ్ము చేసి ప్రపంచకప్తో స్పెయిన్ పూర్వ వైభవం సాధిస్తుందా? వీటన్నింటికి సమాధానం నేడు అర్ధరాత్రి తర్వాత లభిస్తుంది. న్యూయార్క్: ఒక్క పరాజయం లేకుండానే అంతిమ సమరానికి అర్హత సాధించిన అర్జెంటీనా, స్పెయిన్ జట్లు ప్రపంచకప్ను ముద్దాడేందుకు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. ఆఖరి పోరులోనూ గెలిచి టోర్నీని అజేయంగా ముగించాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే 23వ ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ ఫైనల్పై యావత్ క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మైదానంలో ప్రత్యక్షంగా 80 వేల మంది... ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మందికి పైగా ప్రేక్షకులు టీవీల ద్వారా ఈ తుది పోరును వీక్షించనున్నారు.2022లో ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టులోని 17 మంది ప్లేయర్లు ప్రస్తుత ప్రపంచకప్లోనూ ఆడుతున్నారు.ముఖ్యంగా 39 ఏళ్ల లియోనెల్ మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా ఈ టోర్నీలో అద్భుత ఆటతీరుతో అలరిస్తోంది. నాకౌట్ మ్యాచ్ల్లో ఓటమి అంచుల్లో నుంచి విజయకేతనం ఎగురవేస్తోంది. చివరి క్షణం ముగిసేవరకు తమను తక్కువ అంచనా వేయొద్దని.... అవకాశం దొరికితే ఏ క్షణంలోనైనా మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా తమలో ఉందని మెస్సీ బృందం నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ గెలుపు కిక్ తమదే కావాలని అర్జెంటీనా పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగనుంది. మరోవైపు 2010లో ఏకైకసారి ప్రపంచకప్ గెలిచిన స్పెయిన్ జట్టులోని ఆటగాళ్లెవరూ ప్రస్తుత ప్రపంచకప్లో లేరు. అయితే 2024లో యూరోపియన్ చాంపియన్షిప్ గెల్చుకున్న స్పెయిన్ జట్టులోని 16 మంది ప్రస్తుత ప్రపంచకప్లో ఆడుతున్నారు. స్పెయిన్ భవిష్యత్ ఆశాకిరణం, 19 ఏళ్ల యామల్పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. చివర్లో చెలరేగుతూ... ఫైనల్ చేరే క్రమంలో అర్జెంటీనా జట్టు 19 గోల్స్ సాధించింది. ప్రత్యర్థి జట్లకు 7 గోల్స్ సమ ర్పించుకుంది. అర్జెంటీనా చేసిన 19 గోల్స్లో 12 గోల్స్ మ్యాచ్లో 75 నిమిషాలు ముగిశాకే వచ్చాయి. ముందుగా నెమ్మదిగా ఆడటం... ప్రత్యర్థి జట్టు గోల్ చేశాక అర్జెంటీనా జోరు పెంచుతూ తమ సత్తా చాటుకుంటోంది. చివర్లో సబ్స్టిట్యూట్గా వస్తున్న ఆటగాళ్లు కూడా గోల్స్ చేస్తూ అర్జెంటీనాను గట్టెక్కిస్తున్నారు. మరోవైపు స్పెయిన్ జట్టు పూర్తి డిఫెన్స్ ఆటతీరుకు ప్రాధాన్యమిస్తోంది. అవకాశం దొరికినపుడు గోల్ చేసి ఆ తర్వాత ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయతీరానికి చేరుతోంది. ఈ టోర్నీలో స్పెయిన్ జట్టు 13 గోల్స్ సాధించి... ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ మాత్రమే సమ ర్పించుకుంది. మొత్తం ఏడు మ్యాచ్ల్లో స్పెయిన్ గోల్పోస్ట్పై ప్రత్యర్థి జట్లు 11 సార్లు మాత్రమే షాట్లు కొట్టడం గమనార్హం.విజేత జట్టుకు రూ. 481 కోట్లు ఈసారి ప్రపంచకప్ గెలిచిన జట్టుకు 5 కోట్ల డాలర్లు (రూ. 481 కోట్లు) ప్రైజ్మనీగా లభించనుంది. రన్నరప్ జట్టుకు 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 317 కోట్లు) దక్కుతాయి. మూడో స్థానం పొందిన జట్టు ఖాతాలో 2 కోట్ల 90 లక్షల డాలర్లు (రూ. 279 కోట్లు) చేరుతాయి. నాలుగో స్థానం సంపాదించిన జట్టుకు 2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 259 కోట్లు) లభిస్తాయి. 5 నుంచి 8 స్థానాల మధ్య నిలిచిన జట్లు 1 కోటీ 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 182 కోట్లు చొప్పున) అందుకుంటాయి. 9 నుంచి 16 స్థానాల మధ్య నిలిచిన జట్లకు 1 కోటీ 50 లక్షల డాలర్ల చొప్పున (రూ. 144 కోట్లు చొప్పున) లభిస్తాయి. 17 నుంచి 32 స్థానాల మధ్య నిలిచిన జట్లు 1 కోటీ 10 లక్షల డాలర్ల చొప్పున (రూ. 105 కోట్లు చొప్పున) అందుకుంటాయి. 33 నుంచి 48 స్థానాల్లో నిలిచిన జట్ల ఖాతాలో 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 86 కోట్లు) లభిస్తాయి. 37 ప్రపంచకప్లో ఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ జట్టు వరుసగా 37 మ్యాచ్ల్లో పరాజయం రుచి చూడలేదు. 2024 నుంచి ఇప్పటి వరకు స్పెయిన్ 27 మ్యాచ్ల్లో గెలిచింది. 10 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో స్పెయిన్ గెలిస్తే ఇటలీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతుంది. ఇటలీ జట్టు 2018 నుంచి 2021 వరకు వరుసగా 37 మ్యాచ్ల్లో ఓడిపోలేదు.3 మెస్సీ బృందం ఈసారి టైటిల్ గెలిస్తే ప్రపంచకప్ను అత్యధికంగా నాలుగుసార్లు గెలిచిన మూడో జట్టుగా నిలుస్తుంది. అర్జెంటీనా ఇప్పటికి మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా నిలిచింది. బ్రెజిల్ జట్టు అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. ఇటలీ, జర్మనీ జట్లు నాలుగుసార్లు చొప్పున సాధించాయి. 1 ప్రపంచ ఫుట్బాల్ ర్యాంకింగ్స్ను 1992లో ప్రవేశపెట్టాక వరల్డ్కప్ టైటిల్ కోసం ర్యాంకింగ్స్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తుది పోరులో తలపడుతున్నాయి. 4 ఫైనల్లో స్పెయిన్పై అర్జెంటీనా గెలిస్తే ఆడిన అన్ని మ్యాచ్ల్లో గెలిచి ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన నాలుగో జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో బ్రెజిల్ (2002, 1970), ఉరుగ్వే (1930), ఇటలీ (1934) మాత్రమే ఈ ఘనత సాధించాయి.3 అర్జెంటీనా ఫైనల్లో విజయం సాధిస్తే వరుసగా రెండు ప్రపంచకప్లు గెలిచిన మూడో జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) మాత్రమే ఈ ఘనత సాధించాయి.1 మూడు ప్రపంచకప్ ఫైనల్స్లో ఒక జట్టుకు కెపె్టన్గా వ్యవహరించిన తొలి ప్లేయర్గా మెస్సీ గుర్తింపు పొందనున్నాడు. 2014 ప్రపంచకప్ ఫైనల్స్లో మెస్సీ కెప్టెన్సీలో అర్జెంటీనా జట్టు జర్మనీ చేతిలో ఓడిపోయింది. 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్పై గెలిచింది.
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లయితే రాజకీయ సన్యాసం చేస్తా... సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్
నంబర్ 1 నుంచి నేలచూపులే... నీతి ఆయోగ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు భారీగా పతనం
ఏపీ సమస్యలపై ఎలుగెత్తాలి. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తాం... ఆక్వా రైతులతో ముఖాముఖిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
పల్నాడు కలను సాకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... 100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల కొత్త మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో మరో కుంభకోణానికి తెరతీసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... ల్యాప్టాప్ల కొనుగోలులో దోపిడీకి స్కెచ్
నిలబెట్టుకోలేనప్పుడు హామీలు ఎందుకిచ్చారు?.... ఆంధ్రప్రదేశ్లో కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు... భారీ ర్యాలీలు, ధర్నాలతో చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో తిష్టవేసిన సమస్యలు... 2024లో 43 లక్షలున్న విద్యార్థులు ఇపుడు 30 లక్షలే..
బిజినెస్
లెక్కల్లో 51 మార్కులే.. కట్ చేస్తే రూ.వేల కోట్ల కంపెనీ!: ఎవరీ పవన్ కుమార్ చందన?
జీవితంలో విజయాన్ని నిర్ణయించేది కేవలం పరీక్షల్లో వచ్చిన మార్కులు మాత్రమే కాదు. ఎందుకంటే.. ఒకప్పుడు గణితంలో కేవలం 51 మార్కులు మాత్రమే సాధించిన విద్యార్థి, నేడు భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించి చరిత్ర సృష్టించాడు. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన 'పవన్ కుమార్ చందన'.. చిన్నప్పటి నుంచే యంత్రాలు ఎలా పనిచేస్తాయనే విషయంపై ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అయితే.. చదువులో ముఖ్యంగా గణితంలో మాత్రం ఆశించిన ప్రతిభ కనపరచలేకపోయేవారు. ఒక పరీక్షలో ఆయనకు లెక్కల్లో కేవలం 51 మార్కులే వచ్చినట్లు సమాచారం.లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చాయని.. ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. తండ్రి ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. ఆ తరువాత మ్యాథ్స్, సైన్స్ మీద ప్రత్యేక శ్రద్ద చూపించి.. తొలి ప్రయత్నంలోనే ఐఐటీ జేఈఈలో విజయం సాధించిన ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజినీరింగ్ చదివే అవకాశం పొందారు.ఇస్రోలో జాబ్ఐఐటీ పూర్తి చేసిన తరువాత.. చాలామంది విద్యార్థులు అధిక వేతనాలు ఇచ్చే ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఎంచుకున్నప్పటికీ, పవన్ కుమార్ చందన మాత్రం భారత అంతరిక్ష రంగంలో సేవ చేయాలనే లక్ష్యంతో ఇస్రోలో చేరారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), తిరువనంతపురంలో సుమారు ఆరు సంవత్సరాలు పనిచేశారు.స్కైరూట్ ఏరోస్పేస్ఇస్రోలో పనిచేస్తున్న సమయంలో.. అత్యంత శక్తివంతమైన ప్రయోగ వాహనం జీఎస్ఎల్వీ మార్క్-III (GSLV Mk III) రూపకల్పన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఇస్రోలో ఉద్యోగం వదిలేసి.. భారతదేశంలో ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్ష రంగంలో ముందుకు రావాలనే ఆలోచనతో పవన్ కుమార్ చందన, తన సహచరుడు నాగ భరత్ డాకాతో కలిసి 2018 జూన్లో హైదరాబాద్లో స్కైరూట్ ఏరోస్పేస్ స్థాపించారు.🚨 𝗟𝗶𝗳𝘁𝗼𝗳𝗳 𝗼𝗳 𝗦𝗸𝘆𝗿𝗼𝗼𝘁 𝗔𝗲𝗿𝗼𝘀𝗽𝗮𝗰𝗲'𝘀 𝗩𝗶𝗸𝗿𝗮𝗺-𝟭 𝗿𝗼𝗰𝗸𝗲𝘁 𝗮𝘁 𝟭𝟮:𝟬𝟱 𝗣𝗠 𝗜𝗦𝗧 𝗳𝗿𝗼𝗺 𝘁𝗵𝗲 𝗙𝗶𝗿𝘀𝘁 𝗟𝗮𝘂𝗻𝗰𝗵 𝗣𝗮𝗱 𝗮𝘁 𝗦𝗛𝗔𝗥! 🚀The era of commercial spaceflight has begun in India 🇮🇳#Skyroot | #Vikram1 pic.twitter.com/yba2WRW1Ck— ISRO Spaceflight (@ISROSpaceflight) July 18, 20262018లో ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్థాపించడం అనేది ఒక సవాలుతో కూడుకున్న పని అనే చెప్పాలి. పెట్టుబడులు సమకూర్చడం కష్టమైంది. అయితే ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ సంస్థపై నమ్మకం ఉంచి తొలి పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత కరోనా మహమ్మారి కారణంగా నిధుల సేకరణ కష్టతరమైనా, గ్రీన్కో సంస్థ ఆర్థిక సహాయం అందించడంతో స్కైరూట్ తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించింది. రూ వేలకోట్ల విలువైన కంపెనీగా అవతరించింది.స్కైరూట్ విజయాలు2020లో స్కైరూట్ భారతదేశంలో తొలిసారిగా ఒక ప్రైవేట్ సంస్థగా.. రామన్-1 రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించింది. 2021లో భారత ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవడంతో, ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ నిలిచింది.2022 నవంబర్ 18న స్కైరూట్ అభివృద్ధి చేసిన విక్రమ్-ఎస్ అనే భారత తొలి ప్రైవేట్ సబ్-ఆర్బిటల్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ ప్రయోగం భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఒక కీలక మలుపు.ORBIT ACHIEVED. 🚀 Vikram-1 Test Flight-1 has reached orbit. India's first privately developed orbital rocket has completed its final burn and injected its payloads into a ~450 km orbit, making India the third country in the world with private orbital launch capability.…— Skyroot Aerospace (@SkyrootA) July 18, 2026విక్రమ్-1 చారిత్రక విజయంఇక నేడు (జూలై 18న) స్కైరూట్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా భూమి కక్ష్యలోకి చేరి, తనతో తీసుకెళ్లిన అన్ని ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో భారతదేశంలో పూర్తిగా ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ రాకెట్గా విక్రమ్-1 చరిత్ర సృష్టించింది. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. స్వదేశీ సాంకేతికత, భారత యువత ప్రతిభ, ప్రభుత్వ సహకారం కలిసి ప్రపంచానికి భారత సామర్థ్యాన్ని చాటిచెప్పాయి.పవన్ కుమార్ చందన ప్రకారం.. విజయం సాధించడానికి కేవలం డిగ్రీలు లేదా విదేశీ విద్య మాత్రమే అవసరం కాదు. బలమైన పునాది, సరైన ఆలోచన, కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా గొప్ప విజయాలను సాధించగలరు. యువతకు వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆయన చెబుతారు. అప్పుడే దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం లభిస్తుంది.ఇదీ చదవండి: కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం.. E20 పెట్రోల్పై ఆందోళన!
ఐపీవో బాటలో మేక్ మై ట్రిప్ ఇండియా
ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫాం మేక్మైట్రిప్ ఇండియా (ఎంఎంటీ ఇండియా) పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉంది. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కాన్ఫిడెన్షియల్ ప్రాతిపదికన ముసాయిదా ప్రాస్పెక్టస్ను సమర్పించింది. దీని ప్రకారం.. కంపెనీ మాతృ సంస్థ మేక్మైట్రిప్, దాని అనుబంధ సంస్థ ఐబిబో గ్రూప్ హోల్డింగ్స్ కొంత వాటాలను విక్రయించనున్నాయి. తద్వారా వచ్చిన నిధులు దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడనున్నాయి. ఐపీవో అనంతరం కూడా మేక్మైట్రిప్కి ఎంఎంటీ ఇండియా అనుబంధ సంస్థగానే కొనసాగుతుంది.
బంగారంపై మళ్లీ కియోసాకి ‘భారీ’ కామెంట్
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం, వెండి పెట్టుబడులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పెట్టుబడిదారుడు జిమ్ రోజర్స్ అభిప్రాయాలను ప్రస్తావిస్తూ, "బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగి 'చంద్రుడి' దాకా వెళ్తాయి" అని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు.అయితే ధరలు నేరుగా పెరగవని, మధ్యలో భారీ పతనాలు (రిట్రేస్మెంట్లు) కూడా తప్పవని జిమ్ రోజర్స్ చెప్పిన విషయాన్ని కియోసాకి గుర్తు చేశారు. ఇటీవల బంగారం గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా తగ్గిందని, వెండి కూడా భారీ కరెక్షన్ను ఎదుర్కొందని తెలిపారు.చాలా మంది ఇన్వెస్టర్లు ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు కొనుగోలు చేసి, తర్వాత ధరలు పడిపోగానే భయంతో విక్రయిస్తారని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను మాత్రం ఈ ధరల పతనాన్ని అవకాశంగా తీసుకుని మరింత బంగారం, వెండి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.బంగారం, వెండి ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఒక స్నేహితుడు అడిగితే, "ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఈ సమస్యలను పరిష్కరిస్తాయనే నమ్మకం నాకు లేదు. నిజానికి అప్పులు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలకు వారే కారణం. ఇవి ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువ" అని తాను సమాధానం ఇచ్చినట్లు కియోసాకి తెలిపారు.చివరగా ఇన్వెస్టర్లను ఉద్దేశించి, "ఎక్కువ ధరకు కొనుగోలు చేసి, తక్కువ ధరకు అమ్ముతారా? లేక తక్కువ ధర వద్ద కొనుగోలు చేసి సంపదను సృష్టిస్తారా? బంగారం, వెండి ధరలు ఇంకా భారీగా పెరుగుతాయి" అంటూ తన పోస్టును ముగించారు. అయితే ఇవి ఆయన వ్యక్తిగత పెట్టుబడి అభిప్రాయాలేనని, పెట్టుబడులు పెట్టే ముందు సొంతంగా విశ్లేషించుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.“Gold and silver going to the moon.”Legendary investor Jim Rogers.Jim states further, that the prices of gold and silver will go to the moon, yet not without severe retracements. Gold and silver just went through a severe retracements.Recently gold hit a high of…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 17, 2026
ఇకపై అలాగైతేనే డ్రైవింగ్ లైసెన్స్..
సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను రవాణా శాఖ కఠినతరం చేసింది. రోడ్డు భద్రతా నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న అభ్యర్థి ఇక నుంచి తప్పనిసరిగా ఆన్లైన్లో రోడ్డు భద్రతపై మూడు గంటల పాటు వీడియో పాఠాలను చూసి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. వీడియో పాఠాలకు హాజరైన వారిని మాత్రమే డ్రైవింగ్ లైసెన్సుల కోసం నిర్వహించే ట్రాక్ టెస్టులకు అనుమతిస్తారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా కూకట్పల్లి ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ప్రారంభించారు. ఈ ఫలితాలను అనుసరించి నగరంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఈ విధానాన్ని విస్తరించనున్నారు. ముఖ కవళికల నమోదు ఉంటేనే.. సాధారణంగా లెరి్నంగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత 30 రోజుల నుంచి 6 నెలల్లోపు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఇందుకోసం నాగోల్, కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, తదితర డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే లైసెన్స్ లభిస్తుంది. ఇక నుంచి ఈ రెండు పరీక్షలతో పాటు 3 గంటల వీడియో పాఠాలను చూసి రోడ్డు భద్రతా నియమాలను తెలుసుకొని డ్రైవింగ్ టెస్ట్కు వెళ్లాల్సి ఉంటుంది. రవాణాశాఖ ఆధ్వర్యంలోని టీజీ ఆన్లైన్లో ఈ పాఠాలకు సంబంధించిన మాడ్యూల్స్ ఉంటాయి. ఆన్లైన్లో ఈ పాఠాలను వీక్షించే సమయంలో అభ్యర్థుల ముఖకవళికల నమోదు (ఫేస్ రికగ్నిషన్) తప్పనిసరి. అలాగే స్కూల్ జోన్లలో వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా హారన్ మోగించాలి. ఆసుపత్రులు ఉన్న చోట హారన్ మోగించొద్దు. డిఫెన్సివ్ డ్రైవింగ్ తెలిసి ఉండాలి. రోజుకు 2,500 డ్రైవింగ్ టెస్టులు... ప్రస్తుతం నగరంలోని అన్ని టెస్ట్ ట్రాక్లలో నిత్యం 2,500 మందికిపైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. కాగా.. కొన్ని చోట్ల ఎలాంటి పరీక్షలు లేకుండానే డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో రవాణాశాఖ తాజాగా ప్రవేశపెట్టిన రోడ్డు భద్రతా పాఠాలు సత్ఫలితాలిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఫ్యామిలీ
రెక్కల రాకెట్: ఎవరెస్ట్ దాటిన బాతు!
పిల్లలూ, మీకో సూపర్ పక్షి కథ చెప్పనా? ఊపిరి ఆడని ఎత్తులో, వణికించే చలిలో, ఎవరెస్ట్ పైనుంచి టప్ అని దూకేసే బాతు గురించి! బార్ హెడెడ్ గూస్. ‘చారల తల బాతు’ అని కూడా అనొచ్చు. తల మీద రెండు నల్ల చారలు. అదే దీని గుర్తు. రాకెట్లా ఎవరెస్ట్ శిఖరం పై నుంచి అంటే తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో హాయిగా ఎగురుతుంది. మనకు అక్కడ ఊపిరి ఆడదు. దీనికి మాత్రం అది రాజమార్గం!ఎందుకు అంత కష్టపడుతుంది?చలికాలం వస్తే మంగోలియా, టిబెట్లో పూర్తిగా మంచు. తినడానికి గడ్డిపోచ కూడా దొరకదు. అందుకే సెప్టెంబర్ వచ్చిందంటే చాలు, ‘పదండి ఇండియా యాత్ర వెళ్దాం’ అని ఐదు వేల మంది నేస్తాలతో బయల్దేరుతుంది ఈ బాతు. మధ్యలో హిమాలయాలు అడ్డొస్తే? ‘దాటేద్దాం పద’ అని పైనుంచి వెళ్లిపోతుంది. దీనివి గొప్ప ఊపిరితిత్తులు. మనకన్నా మూడు రెట్లు ఎక్కువ గాలిని పీల్చుకుంటుంది. బలమైన గుండె. నిమిషానికి నాలుగు వందల సార్లు కొట్టుకుంటుంది. కొండల మధ్య, లోయల మధ్య పైకి కిందికి ఊగుతూ శక్తిని పొదుపు చేస్తుంది.ప్రపంచంలోనే గొప్పది... ‘ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఎగిరే పక్షి’ అని దీనికి పేరుంది. శాస్త్రవేత్తలు పరిశీలిస్తే ఎనిమిది గంటల్లో హిమాలయాలు దాటేసింది. కాబట్టి నెక్స్ట్ టైమ్ ‘‘నేను చేయలేను’’ అనిపిస్తే ఈ చారల తల బాతుని గుర్తు తెచ్చుకోండి. రెక్కలు లేకపోయినా పర్లేదు, గుండె ధైర్యం ఉంటే చాలు.
భయం వేస్తే వీపు తట్టేదెందుకో తెలుసా?
సడన్గా మనం భయపడినప్పుడు అమ్మో, నాన్నో వచ్చి వీపు తడతారు కదా. ఎందుకో తెలుసా? మన వీపు మీద చాలా సున్నితమైన నరాలు ఉంటాయి. పెద్దలు తట్టినప్పుడు ఆ నరాలు మెదడుకు కబురు పంపిస్తాయి... ‘భయపడకు, నీ పక్కన నీవాళ్లు ఉన్నారు’ అని.ఆ సిగ్నల్ రాగానే మన మెదడు ‘సేఫ్’ అని ఫీల్ అవుతుంది. భయం వేస్తే మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. వీపు మీద లయగా తడితే ఆ తట్లు గుండెకి ‘మెల్లగా కొట్టుకో’ అని మెసేజ్ చేస్తాయి. డాక్టర్లు దీన్ని ‘టచ్ థెరపీ’ అంటారు.పూర్వం అడవిలో మనుషులు గుంపులుగా తిరిగేవాళ్లు. క్రూరమృగాలు తమను పసిగట్టకుండా మెల్లగా నడిచేవారు. అప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తే పెద్దవాళ్లు వీపు తట్టి ‘ష్... పడుకో. పులి వస్తుంది’ అని కాపాడేవాళ్లు. ఆ అలవాటు ఇప్పటికీ మన రక్తంలోనే ఉంది. కాబట్టి నెక్ట్స్ టైమ్ భయం వేస్తే, పెద్దల దగ్గరికి పరిగెత్తి వీపు అప్పగించేయండి. తట్టు ఫ్రీ... భయం పరార్.
రోబో అంకుల్! చాక్లెట్ కావాలా... చిప్స్ కావాలా?
పిల్లలూ... మనం షాపుకెళితే ‘చాక్లెట్ కావాలా... చిప్స్ కావాలా’ అని అంకుల్ అడుగుతాడు. కాని ఇక్కడ అంకుల్ లేడు రోబో ఉంది. అందుకే ఈ షాపు పేరు ‘గెలాక్సీ రోబో కియోస్క్’.2026 జూలై 17న చైనాలోని బీజింగ్లో తీసిన ఫోటో ఇది. ఈ షాపులో ఏం కావాలన్నా రోబోనే అమ్ముతుంది. జ్యూస్ బాటిల్స్, నీళ్లు, చిన్న బొమ్మలు.... ఏవైనా సరే. పిల్లలు క్యూలో నిలబడి స్క్రీన్ పై ఏది కావాలో టచ్ చేస్తే, లోపల ఉన్న రోబో ఆ వస్తువును తీసి ఇస్తుంది. చూశారా ఎంత బాగుందో! పిల్లలకు ఇది కొత్త అనుభవం. ‘వావ్! రోబో మనకు జ్యూస్ ఇస్తోంది‘ అని సంతోషంగా చూస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి రోబో షాపులు ఇంకా ఎక్కువ అవుతాయట. అప్పుడు మన ఊళ్లో కూడా వస్తాయేమో! అన్నట్టు ఈ రోబో పేరు ‘హ్యూమనాయిడ్ సెల్లర్ రోబో’. అంటే మనిషిలా నిలబడి సామాన్లు అమ్మే రోబో. బీజింగ్లోని ‘గెలాక్సీ’ కంపెనీ దీనిని తయారు చేసింది. వెల దాదాపు 15 లక్షల నుంచి 25 లక్షల వరకు. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 8 నుంచి 12 గంటల వరకు ఆగకుండా పని చేస్తుంది. లోపల కెమెరా, సెన్సార్లు ఉంటాయి. మీరు ఏ బటన్ నొక్కితే ఆ వస్తువును తీసి ఇస్తుంది. అలసి΄ోదు, కోప్పడదు, లెక్క తప్పదు!
గోల్ఫ్ ఆటకు గద్ద కాపలా!
పిల్లలూ... ఈ ఫోటోలో పెంపుడు గద్ద కనిపిస్తుంది చూశారా? ఇది ఏం చేస్తుందో తెలుసా? ఇది గోల్ఫ్ ఆటగాళ్లకు కాపలాదారుగా పని చేస్తోంది! అవును, నిజంగా! మొన్న జూలై 16న ఇంగ్లాండ్లోని సౌత్పోర్ట్లో 154వ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ మొదలైంది. వేదిక రాయల్ బిర్క్డేల్ గోల్ఫ్ క్లబ్.ప్రపంచంలోనే అతి పెద్ద గోల్ఫ్ టోర్నమెంట్ ఇది. ఇక్కడ ఆటగాళ్లు చాలా దూరం బంతిని కొట్టాలి. కానీ ఒక చిన్న సమస్య. ‘గల్స్’ అని సముద్ర పక్షులు ఈ మైదానానికి వస్తుంటాయి. నేల మీద గడ్డిని పాడు చేస్తాయి. గోల్ఫ్ బంతిని కూడా తన్నేస్తాయి. అప్పుడు ఆటగాళ్లు ఇబ్బంది పడతారు. అందుకే నిర్వాహకులు గద్దను కాపలా పెట్టారు. ఈ ఫోటోలో కనిపించే గద్దకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీని పని ఏంటంటే గల్స్ పక్షులను చూస్తూనే భయపెట్టి తరిమేయడం.గ్రద్దను చూడగానే చిన్న పక్షులు దగ్గరకు రావడానికి భయపడతాయి కదా! గద్ద గాల్లో ఎగురుతూ మొత్తం మైదానంపై కాపలా కాస్తుంది. ఎక్కడైనా పక్షులు కనిపిస్తే వెంటనే అరుస్తూ వాటిని పారిపోయేలా చేస్తుంది. గద్దకు కూడా ఇది ఒక ఉద్యోగం లాంటిదే. మంచి ఆహారం, పోషణ దొరుకుతాయి. మరి మీకు కూడా ఇలాంటి పెంపుడు పక్షి ఉంటే అది మీకు ఏ పనిలో సహాయం చేయాలని ఉంటుంది?
అంతర్జాతీయం
డొనాల్డ్ ట్రంప్ను హతమారిస్తే. రూ. 96కోట్లు
ఇరాన్పై వరుసగా ఏడవ రాత్రి కూడా అమెరికా దాడులు నిర్వహించింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింత బలహీనపరిచేలా ఈ దాడులు జరిగాయని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) శుక్రవారం నాటి ప్రకటనలో పేర్కొంది. మరోవైపు అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చి వేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టాన్ని కలిగించామని ఇరాన్ గురువారం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ మిలీషియా (సాయుధ ముఠాల) సంకీర్ణ కూటమి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల (సుమారు 96.28 కోట్ల రూపాయలు) బహుమతిని ఇస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన రగులుతున్న ఇప్పటికే యుద్ధ జ్వాలలకు మరింత ఆజ్యం పోసింది. డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి లేదా ఆ ఆపరేషన్కు నిధులు సమకూర్చిన వారికి, సహాయం చేసిన వారికి ఈ బహుమతి అందుతుందని 'ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్' (IRI) తెలిపింది. ఈ 10 మిలియన్ డాలర్ల మొత్తాన్ని తమ సభ్యులు, మద్దతుదారుల నుండి సేకరించిన విరాళాల ద్వారా సమకూర్చినట్లు వారు పేర్కొన్నారు. అయితే దీనిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు చూపలేదు.ఇటీవల వైట్ హౌస్లో ఇరాక్ ప్రధాన మంత్రి అలీ అల్-జైదీతో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ... 2020లో ఇరాన్ అగ్ర సైనిక కమాండర్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ, ఇరాకీ మిలీషియా నాయకుడు అబూ మహదీ అల్-ముహందిస్లను చంపడంలో తన పాత్రను బహిరంగంగా ప్రస్తావించారు. దీనికి ప్రతిచర్యగా ఐఆర్ఐ ఈ ప్రకటన చేసింది.ఇరాక్, సిరియా , గల్ఫ్ ప్రాంతంలోని ఇతర చోట్ల ఉన్న అమెరికా దళాలు, దౌత్య కార్యాలయాలు మరియు మిత్రదేశాలపై వందలాది డ్రోన్, రాకెట్, క్షిపణి దాడులకు ఈ గ్రూపులే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. ప్రస్తుత అమెరికా-ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో, ఇరాన్ సరిహద్దుల వెలుపల తన సైనిక ఒత్తిడిని కొనసాగించడానికి టెహ్రాన్కు ఈ మిలీషియాలు ప్రధాన ఆయుధాలుగా మారాయి.
స్టీరింగ్ చేతిలో.. సడన్గా డ్రైవర్ మాయం!
కొన్నిసార్లు ప్రమాదాలు కూడా నవ్వులు పూయిస్తాయి. అలాంటి ఓ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సరదా ట్రిప్లో భాగంగా గోల్ఫ్ కార్ట్ నడుపుతున్న ఓ యువతి.. రోడ్డుపై ఫోకస్ కోల్పోవడంతో చివరకు వాహనం నేరుగా పొదల్లోకి వెళ్లిపోయింది.వైరల్గా మారిన 13 సెకన్ల వీడియోలో.. కొందరు గోల్ఫ్ కార్ట్లో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆకులతో నిండిన సన్నని దారిలో కార్ట్ వెళ్తుండగా.. డ్రైవర్ ఒక్కసారిగా రోడ్డుపై దృష్టి కోల్పోయింది. పక్కనే ఉన్న యువతి కింద పడిపోగా.. డ్రైవింగ్ చేస్తున్న సంగతి మరిచిపోయి కంగారులో స్టీరింగ్ వదిలేసింది. కింద పడిన యువతి కోసం ఈమె కూడా దూకేసింది. వెనక కూర్చున్నవాళ్లు ఆ షాకింగ్ పరిణామాన్ని తొంగి చూస్తూ ఉండిపోయారు. మరి డ్రైవర్ మాయమైతే.. వాహనం నడిపేదెవరు?.. అందుకే వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ప్రయాణికుల్లో ఒకరు ఒక్కసారిగా కిందకు జారిపడటం, ఆ వెంటనే డ్రైవర్ సీట్లో యువతి కూడా దూకేయడం.. ఆ వీడియోను మరింత వినోదంగా మార్చింది.did she forget she was the driver 🥲 pic.twitter.com/cjAKlyYGZR— Peché Africa 🇿🇦 (@pmcafrica) July 17, 2026వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. “డ్రైవర్ అని మర్చిపోయి పార్టీకి వచ్చిందా?” అంటూ కొందరు సరదాగా స్పందించగా.. మరికొందరు “రోడ్డుపై చూపు ఎప్పుడూ ముందే ఉండాలి” అంటూ జాగ్రత్తలు సూచించారు.మిలియన్లకు పైగా వ్యూస్.. కామెంట్ల వర్షంపెచే ఆఫ్రికా షేర్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. లక్షల సంఖ్యలో లైక్స్, షేర్స్ రావడంతో పాటు.. ఈ ఘటనపై మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. కొందరు దీనిని జీవితానికి ఉదాహరణగా పోల్చుతూ.. “దృష్టి ఎక్కడ ఉంటే ప్రయాణం కూడా అక్కడికే వెళ్తుంది” అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు.ఈ ఘటన సరదాగా ముగిసినప్పటికీ.. వాహనం నడిపేటప్పుడు దృష్టి మరల్చడం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తుచేసింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో.. ఈ గోల్ఫ్ కార్ట్ ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వుల పండుగగా మారింది. “రోడ్డుపై డ్రైవింగ్.. పార్టీలో డ్యాన్స్ కాదు!” అంటూ నెటిజన్లు ఈ వీడియోకు ఫన్నీ టచ్ ఇస్తున్నారు.
పాక్ పవర్ సెంటర్లో ప్రకంపనలు.. మునీర్ సామ్రాజ్యానికి కొత్త సవాల్
పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి అధికారం ఎవరి చేతుల్లో ఉంది? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. సైన్యం ప్రభావం, మతపరమైన రాజకీయాలు, ఆఫ్ఘనిస్థాన్తో సంబంధాలు.. ఈ మూడు అంశాలు ఒకే సమయంలో ఢీకొంటూ ఇస్లామాబాద్లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ప్రముఖ మతపరమైన రాజకీయ నేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ‘రాజకీయాలు చేయాలనుకుంటే యూనిఫాం తీసేసి ఎన్నికల్లోకి రండి.. ప్రజల తీర్పును ఎదుర్కోండి’ అన్న ఫజ్లుర్ రెహ్మాన్ వ్యాఖ్యలు పాకిస్తాన్లో సైన్యం పాత్రపై మరోసారి చర్చను రేపాయి.ఫజ్లుర్ రెహ్మాన్ ఎవరు?మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సాధారణ రాజకీయ నాయకుడు కాదు. పాకిస్తాన్లో దశాబ్దాలుగా ప్రభావం చూపుతున్న మతపరమైన రాజకీయ నేతల్లో ఆయన ఒకరు. ఆయన నేతృత్వంలోని జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (JUI-F) పార్టీకి ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్థాన్ ప్రాంతాల్లో ప్రభావం ఉంది. అలాగే, పాకిస్థాన్ పార్లమెంట్లో పలుమార్లు సభ్యుడిగా ఉన్నారు. మతపరమైన చట్టాల అమలుకు మద్దతు ఇచ్చే రాజకీయ వర్గానికి ప్రతినిధిగా గుర్తింపు పొందారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్తో చారిత్రక సంబంధాలు ఉన్న మత పెద్దగా కూడా ఆయనకు పేరు ఉంది.రెహ్మాన్ పేరు వినగానే ఆఫ్ఘనిస్థాన్ అంశం కూడా తెరపైకి వస్తుంది. కాగా, పాకిస్థాన్ సైన్యం ప్రస్తుతం తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్థాన్తో సంక్లిష్ట సంబంధాలను ఎదుర్కొంటోంది. అయితే, ఆయన రాజకీయాలు ప్రధానంగా ఎన్నికలు, పార్లమెంటరీ మార్గాల ద్వారా సాగుతాయి. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద నిరసనలకు నాయకత్వం వహించారు. రాజకీయ వ్యవస్థలో సైన్యం పాత్రపై విమర్శలు చేశారు. అందుకే ఆయన తాజా వ్యాఖ్యలు సాధారణ రాజకీయ విమర్శగా కాకుండా, సైన్యం ప్రభావంపై నేరుగా ప్రశ్నగా భావిస్తున్నారు.1990ల నుంచి..రెహ్మాన్ తాలిబాన్ భావజాలానికి దగ్గరగా ఉన్న మత వర్గాలతో సంబంధాలు కొనసాగించారు.పలువురు తాలిబాన్ నాయకులు పాకిస్థాన్లోని JUI అనుబంధ మదర్సాల్లో చదివినట్లు నివేదికలు ఉన్నాయి.2001లో అమెరికా ఆఫ్ఘనిస్థాన్పై దాడి చేసినప్పుడు ఆయన అమెరికా వ్యతిరేక ర్యాలీలు నిర్వహించారు.2021లో తాలిబాన్ మళ్లీ ఆఫ్ఘనిస్థాన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని పిలుపునిచ్చారు.కాబూల్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని పాకిస్థాన్కు సూచించారు.అయితే ప్రస్తుతం పాకిస్థాన్–ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. అయినప్పటికీ ఫజ్లుర్ మాత్రం చర్చల ద్వారానే పరిష్కారం రావాలని చెబుతున్నారు.మునీర్తో విభేదాలు ఎందుకు?ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకప్పుడు ఫజ్లుర్ రెహ్మాన్, ఆసిమ్ మునీర్ ఎదుగుదలకు పరోక్షంగా సహకరించిన రాజకీయ పరిణామాల్లో భాగమయ్యారు. 2018లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2020లో ప్రతిపక్షాలు కలిసి పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (PDM) ఏర్పాటు చేశాయి. దీనికి ఫజ్లుర్ రెహ్మాన్ నాయకత్వం వహించారు. ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం తెచ్చింది. 2022లో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. అదే సమయంలో ఆసిమ్ మునీర్ 2022లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయ్యారు. తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి.పాకిస్తాన్లో సైన్యం ఎప్పటి నుంచో అత్యంత శక్తివంతమైన సంస్థగా ఉంది. దేశ రాజకీయాల్లో సైన్యం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపుతుందనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ఆసిమ్ మునీర్ ప్రస్తుతం పాకిస్తాన్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరు. ఆర్మీ చీఫ్గా ఉన్నారు. భద్రతా విధానాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పాక్ రక్షణ వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. అందుకే ఆయనపై వచ్చే విమర్శలు వ్యక్తిగత విమర్శలుగా కాకుండా సైన్యం పాత్రపై రాజకీయ చర్చగా మారుతాయి. సైన్యం రక్షణ వ్యవహారాలకు పరిమితం కావాలి.. రాజకీయ నిర్ణయాలు ప్రజలు ఎన్నుకున్న నాయకులు తీసుకోవాలి అని ఫజ్లుర్ డిమాండ్ చేశారు.సైన్యం చరిత్రాత్మక పాత్ర..పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి అక్కడి రాజకీయ వ్యవస్థలో సైన్యం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. దేశంలో పలు మార్లు సైనిక పాలనలు వచ్చాయి. ప్రస్తుతం ప్రత్యక్ష సైనిక పాలన లేకపోయినా, విదేశాంగం, భద్రత, భారత్-ఆఫ్ఘనిస్థాన్ విధానాల్లో సైన్యం ప్రభావం కొనసాగుతుందని విమర్శకులు చెబుతారు.1958: జనరల్ అయూబ్ ఖాన్ తొలి సైనిక పాలన.1977: జనరల్ జియా ఉల్ హక్ అధికారం స్వాధీనం.1999: జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు.పాక్ ముందున్న సవాల్ ఇదే..ఒకవైపు దేశ భద్రతను కాపాడే శక్తివంతమైన సైన్యం.. మరోవైపు ప్రజల ఓట్లతో వచ్చే రాజకీయ నాయకత్వం.. ఇంకోవైపు మత ప్రభావంతో ఎదిగిన రాజకీయ శక్తులు.. ఈ మూడు శక్తుల మధ్య సమతుల్యత ఎటు వెళ్తుందో రాబోయే రోజులు నిర్ణయించనున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్లో పోరు కేవలం ఇద్దరు నాయకుల మధ్య కాదు.. అది అధికారం ఎవరి చేతుల్లో ఉండాలనే దశాబ్దాల ప్రశ్నకు కొనసాగింపు. ఈ మూడు ఢీకొంటున్న వేళ ఇస్లామాబాద్లో కొత్త పవర్ గేమ్ మొదలైంది.
15 నిమిషాల ఓవర్టైమ్కీ డబ్బులిచ్చే వింత దేశం!
టోక్యో: జపాన్లో ఉద్యోగం చేస్తున్న ఒక భారతీయుడు అక్కడి పని సంస్కృతిని వివరిస్తూ చేసిన వ్యంగ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజయ్ పాండే అనే వ్యక్తి గత 11 ఏళ్లుగా జపాన్లో పనిచేస్తున్నారు. అక్కడి అద్భుతమైన పని వాతావరణాన్ని, సౌకర్యాలను ‘సమస్యలు’గా పేర్కొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.హైబ్రిడ్ వర్క్ విధానం గురించి మాట్లాడుతూ, ‘వారానికి మూడు రోజులు మాత్రమే కార్యాలయానికి వెళ్లాల్సి ఉండటం, మిగిలిన రెండు రోజులు ఇంటి నుంచే పనిచేయడం చాలా కష్టంగా ఉంది’ అని ఆయన ఎద్దేవా చేశారు. వారాంతాల్లో మేనేజర్ నుంచి ఫోన్ కాల్స్ రాకపోవడాన్ని తప్పుబడుతూ, తనను ఎవరూ గుర్తుంచుకోవడం లేదని, వారాంతాలను క్యాంపింగ్, బైక్ రైడింగ్లతో వృథా చేసుకోవాల్సి వస్తోందని ఆయన వ్యంగ్యంగా చెప్పారు.అంతేకాకుండా, ఓవర్ టైం (అదనపు పని) చేసిన ప్రతి 15 నిమిషాలకు కంపెనీ డబ్బులు చెల్లిస్తుందని, దీనివల్ల తనకు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. దీపావళికి లడ్డూలు, పెన్నులు ఇచ్చే బదులు, జీతంలో రెండు, మూడు నెలల అదనపు మొత్తాన్ని బోనస్గా ఇవ్వడం వల్ల తాను విసిగిపోయానని ఆయన నవ్వుతూ చెప్పారు. జపాన్ పని పరిస్థితులపై ఆయన చేసిన ఈ సరదా వ్యాఖ్యలకు నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఇది ‘విజయం వల్ల కలిగే బాధ’ అని వ్యాఖ్యానిస్తున్నారు.ఇది కూడా చదవండి: ప్రధాని ఇందిర దిగివచ్చేలా.. వాంగ్చుక్ తండ్రి పోరాటం!
జాతీయం
కోర్టులపై రీల్స్, లాయర్ లైఫ్ వీడియోలకు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు ప్రాంగణాలు, కేసుల విచారణలు, న్యాయవాదుల కార్యాలయా లు, ఇంటర్న్షిప్లు, క్లయింట్ల వివరాలకు సంబంధించిన వీడియోలు, రీల్స్, సోషల్ మీడియా పోస్టులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కఠిన ఆంక్షలు విధించింది. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, ఇంటర్న్లు సోషల్ మీడియాలో పాటించాల్సిన నైతిక ప్రమాణాలు, వృత్తి గోప్యత, కోర్టు మర్యాదలకు సంబంధించిన కొత్త మార్గదర్శ కాలను జారీ చేసింది. వీటిని దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు, న్యాయ విద్యా సంస్థలు వెంటనే అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బీసీఐ జారీ చేసిన సర్క్యులర్ ను సాధారణ సూచనగా కాకుండా తప్పని సరిగా అమలు చేయాల్సిన ఆదేశంగా పరిగణించాలని పేర్కొంది. సర్క్యులర్ను కేవలం వెబ్సైట్లో ఉంచడం లేదా వాట్సాప్లో పంపించడం సరిపోదని, విద్యార్థులు, న్యాయవాదుల్లో దీనిపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది.ఇవి అందరికీ వర్తిస్తాయి‘సోషల్ మీడియాలో న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, ఇంటర్న్ల వృత్తి గౌరవం, నైతికతను కాపాడడం’పేరుతో విడుదల చేసిన ఈ సర్క్యులర్లో కోర్టు ప్రాంగణాలు, కోర్టు కారిడార్లు, న్యాయమూర్తుల విచారణలు, లైవ్స్ట్రీమ్ విచారణల క్లిప్పింగులు, చాంబర్లు, ఇంటర్న్షిప్లు, కేసుల నిర్వహణకు సంబంధించిన రీల్స్, వీడియోలు, షార్ట్ క్లిప్స్, మీమ్స్, థంబ్నెయిల్స్, ప్రచార పోస్టులు రూపొందించడం, ప్రచారం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మార్గదర్శకాలు ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు, పరిశోధన విద్యార్థులు, ఇంటర్న్లు సహా న్యాయ విద్యను అభ్యసిస్తున్న వారందరికీ వర్తిస్తాయని బీసీఐ పేర్కొంది. ఆ వీడియోలపై నిషేధంఇంటర్న్షిప్ సమయంలో చాంబర్లో జరిగే చర్చలు, కేసు ఫైళ్లు, క్లయింట్ సమావేశాలు, న్యాయ వ్యూహాలు, డ్రాఫ్టింగ్, పరిశోధన, కోర్టు సందర్శనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం వృత్తి గోప్యతకు విరుద్ధమని బీసీఐ స్పష్టం చేసింది. ప్రత్యేకంగా ‘డే ఇన్ కోర్ట్‘, ‘డే ఇన్ చాంబర్‘, ‘ఇంటర్న్షిప్ రివీల్‘, ‘కేస్ ఫైల్‘, ‘కోర్ట్ రూమ్ డ్రామా‘, ‘లాయర్ లైఫ్‘వంటి శీర్షికలతో వీడియోలు, రీల్స్ రూపొందించడం నిషేధిత చర్యలుగా పేర్కొంది. కోర్టు విచారణలను రికార్డు చేయడం, క్లయింట్ల వివరాలు, కేసు వ్యూహాలు, డ్రాఫ్టులు, పిటిషన్లు, అంతర్గత చర్చలను బహిర్గతం చేయడాన్ని కూడా పూర్తిగా నిషేధించింది. ఇంటర్న్షిప్ అనేది క్రమశిక్షణ, వినయం, న్యాయ పరిశోధన, డ్రాఫ్టింగ్, కోర్టు విధా నాల అవగాహన, వృత్తి నైతికత, బాధ్యత లను నేర్చుకోవడానికి మాత్రమేనని, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకో వడానికి లేదా వ్యక్తిగత ప్రచారం కోసం కాదని విద్యార్థులకు స్పష్టంగా తెలియ జేయాలని బీసీఐ సూచించింది.హామీ తప్పనిసరిఇకపై న్యాయ విద్యార్థులు అడ్మిషన్ సమయంలో ప్రత్యేక అండర్టేకింగ్ సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్ ప్రారంభానికి ముందు మరో ప్రత్యేక అఫిడవిట్ ఇవ్వడం కూడా బీసీఐ తప్ప నిసరిగా చేసింది. ఈ అండర్టేకింగ్ను సాధార ణ అడ్మిషన్ ఫారంలో భాగంగా కాకుండా విడిగా తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించింది. అలాగే అన్ని న్యాయ కాలేజీలు, విశ్వవిద్యాల యాలు ఈ మార్గదర్శకాలపై అవగాహన కార్య క్రమాలు నిర్వహించాలని కోరింది. అధ్యాపకు లు, విద్యార్థులకు సర్క్యులర్ను వివరించాలని, అమలు పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై ఇంటర్న్షిప్ రద్దు, సంబంధిత ‘లా’ కాలేజీలకు సమాచారం ఇవ్వడం, ఇంటర్న్షిప్ కోఆర్డినేట ర్లు, బార్ అసోసియేషన్లు, లా ఫర్మ్లకు ఫిర్యాదు చేయడం, అడ్మిషన్ లేదా ఎన్రోల్మెంట్ కమిటీల ముందు కేసులు ఉంచడం, కౌన్సెలింగ్, హెచ్చరికలు, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని బీసీఐ హెచ్చరించింది.
మాజీ ప్రధాని దేవెగౌడ సతీమణి కన్నుమూత
భారత మాజీ ప్రధానమంత్రి హెచ్.డి. దేవెగౌడ సతీమణి, కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి తల్లి చెన్నమ్మ (89) కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం తుది శ్వాసవిడిచారు. ఆమె మరణసమయంలో దేవెగౌడ, కుమారస్వామి సహా కుటుంబ సభ్యులంతా హాస్పటిల్లోనే ఉన్నారు.చెన్నమ్మ గత కొంతకాలంగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో బుధవారం ఆమెను మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. గత మూడు రోజులగా చికత్స పొందుతున్న చెన్నమ్మకు శనివారం తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటలో తెలిపాయి.చెన్నమ్మ భౌతికకాయాన్ని బెంగళూరులోని పద్మనాభనగర్లోని వారి నివాసానికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం సోమవారం హాసన్ జిల్లాలోని వారి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. చెన్నమ్మ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమెను ఒక మాతృమూర్తిగా అభివర్ణించారు. కాగా 1954లో దేవెగౌడతో చెన్నమ్మ వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో కుమారస్వామి కేంద్ర మంత్రి కాగా, హెచ్.డి. రేవణ్ణ హాసన్ జిల్లా హోలెనరసిపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.
పాట పాడింది.. దేశం చప్పట్లు కొట్టింది
ఒక పాట.. భాషల సరిహద్దులను దాటి కోట్లాది మనసులను తాకుతుంది. ఒక స్వరం... కళ్లతో కాదు, హృదయంతో ప్రపంచాన్ని చూస్తుందని నిరూపిస్తుంది. అలాంటి అరుదైన గాయని వైక్కం విజయలక్ష్మి. 2024 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ మహిళా నేపథ్య గాయని అవార్డును ఆమె సొంతం చేసుకున్నారు.కేరళలోని కొట్టాయం జిల్లా వైకోమ్లో విజయలక్ష్మి అనంత సుబ్రహ్మణియన్ జన్మించారు. పుట్టుకతోనే తీవ్రమైన దృష్టిలోపంతో జన్మించిన ఆమెకు ఈ ప్రపంచాన్ని కళ్లతో చూసే అదృష్టం లేకపోయినా, సంగీతాన్ని మాత్రం హృదయంతో ఆస్వాదించే వరం లభించింది. చిన్నప్పటి నుంచే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్న ఆమె, వీణ వాయించడంలోనూ విశేష ప్రతిభ కనబరిచారు. సంగీతమే జీవితంగా భావిస్తూ నిరంతర సాధనతో తన ప్రతిభను మెరుగుపరుచుకున్నారు.2013లో విడుదలైన సెల్యులాయిడ్ సినిమాతో నేపథ్య గాయనిగా సినీ రంగంలో అడుగుపెట్టిన వైక్కం విజయలక్ష్మి, తొలి పాటతోనే సంగీత దర్శకులు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రంలోని కైక్కొట్టుం కండిట్టిల్లా పాట ఆమెకు అపారమైన గుర్తింపును తీసుకొచ్చింది. అనంతరం ‘తెరి’ చిత్రంలోని ఎన్ జీవనే, కనా చిత్రంలోని వాయాడి పెట్ట పుల్ల వంటి పాటలు దక్షిణ భారత సంగీత ప్రపంచంలో ఆమె స్థానాన్ని మరింత బలపరిచాయి. భావోద్వేగాన్ని స్వరంలో పలికించడంలో ఆమెకు ఉన్న ప్రత్యేక నైపుణ్యమే ప్రతి పాటను శ్రోతల హృదయాలకు చేరువ చేసింది.ఆమె ప్రయాణంలో గుర్తింపులు కూడా తక్కువేం కాదు. ఫిల్మ్ఫేర్ పురస్కారం, ఏషియానెట్ పురస్కారం, వనిత పురస్కారం, కేరళ ప్రభుత్వ గౌరవాలు సహా అనేక అవార్డులు ఆమెను వరించాయి. అయితే భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర పురస్కారం మాత్రం కాస్త సమయం పట్టింది. ఆ నిరీక్షణకు ముగింపు పలికింది ఏఆర్ఎమ్ చిత్రంలోని అంగు వాన కొనిలు పాట.భావోద్వేగాలతో నిండిన ఈ గీతంలో వైక్కం విజయలక్ష్మి తన గాత్రంతో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లారు. మలయాళంలో పుట్టిన ఈ పాట భాషల సరిహద్దులను దాటి తెలుగు ప్రేక్షకుల హృదయాలను సైతం తాకింది. పదాలు అర్థం కాకపోయినా.. ఆమె స్వరంలో వినిపించిన ఆవేదన, మమకారం, ప్రేమ ప్రతి ఒక్కరి మనసును కదిలించాయి. అదే గీతం ఇప్పుడు ఆమెకు జాతీయ ఉత్తమ మహిళా నేపథ్య గాయని పురస్కారాన్ని అందించింది.వైక్కం విజయలక్ష్మి ప్రయాణం ఒక గాయని విజయగాథ మాత్రమే కాదు.. జీవితం మనకు ఏమి ఇవ్వలేదన్నది కాదు, ఉన్న ప్రతిభతో ఎంత ఎత్తుకు ఎదిగామన్నదే ముఖ్యమని చెప్పే స్ఫూర్తిదాయకమైన కథ. కళ్లలో వెలుగు లేకపోయినా.. తన గాత్రంతో కోట్లాది మంది హృదయాల్లో వెలుగులు నింపిన ఆమె ఇప్పుడు భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె గెలిచింది ఒక అవార్డును మాత్రమే కాదు... కోట్లాది మంది అభిమానుల మనసులను కూడా.
కార్పొరేటర్ బెయిల్ రద్దు చేసిన హైకోర్టు.. మళ్లీ జైలుకి!
ముంబై: వైద్యులు, ఇతర సిబ్బందిపై శివసేన( (ఏకనాథ్ షిండే వర్గం) ) కార్పొరేటర్ రమేష్ మహాత్రే జరిపిన దాడిని బాంబే హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కార్పొరేటర్ రమేష్ మహత్రే బెయిల్ను రద్దు చేసింది. అదే సమయంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది బాంబే హైకోర్టు.జూలై 6వ తేదీన డోంబివిలిలోని మున్సిపల్ శాస్త్రి నగర్ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు, నర్సులపై కార్పొరేటర్ రమేష్ మహాత్రే, అతని అనుచరులు తీవ్రంగా దాడి చేశారు. దిగువ కోర్టు తీర్పు: ఈ కేసులో అరెస్టయిన రమేష్ మహాత్రేకు జూలై 14న కల్యాణ్ లోని స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. వారి బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. రమేష్ మహాత్రేపై గతంలో హత్య, హత్యాయత్నం వంటి సుమారు 18 నేరారోపణ కేసులు ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. వాటిలో 17 కేసులలో అతను నిర్దోషిగా విడుదలైనప్పటికీ, బెయిల్ ఇచ్చేటప్పుడు అతని నేర చరిత్ర తీవ్రతను మేజిస్ట్రేట్ కోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ క్రమంలోనే వారి బెయిల్ను రద్దు చేసి తిరిగి పోలీసులకు లొంగిపోవాలంటూ ఆదేశించింది. ప్రభుత్వ, మున్సిపల్ ఆసుపత్రుల వైద్యులపై ఇలాంటి దాడులు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రమేష్ మహాత్రే నిర్ణీత సమయంలోగా లొంగిపోకపోయినా, పరారైనా ఆయన స్థిరాస్తులను జప్తు చేయడంతో పాటు చట్టపరమైన తదుపరి చర్యలకు తీసుకోవడానికి అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉందని బాంబే హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ ఘటనకు నిరసనగా జూలై 22 నుండి సమ్మెకు పిలుపునిచ్చిన వైద్యులను ఆ సమ్మెను విరమించుకోవాలని కోరింది హైకోర్టు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తమ సమ్మెను విరమించుకోవాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. కాగా, వైద్యులపై దాడికి సంబంధించి జూలై 8వ తేదీన అరెస్టైన సదరు కార్పొరేటర్.. జూలై 14వ తేదీన బెయిల్పై బయటకొచ్చాడు. దీన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జూలై 22వ తేదీన మహారాష్ట్ర అంతటా ఆస్పత్రుల్లో 24 గంటల షట్డౌన్ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో అత్యవసర సేవా విభాగాలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని పేర్కొంది.
ఎన్ఆర్ఐ
ఉద్యోగం లేదు, ఎలాంటి వేతనం లేదు..!దర్జాగా స్విట్జర్లాండ్లో..
ఎలాంటి ఆదాయం లేకుండా ఏ ఒక్క పని కాదు కదా..బయటికి కాలు కదపడం కూడా కష్టమే. అలాంటిది ఈ మహిళ ఏకంగా అత్యంత ఖరీదైన స్విట్జర్లాండ్ దేశంలో బేషుగ్గా బతికేస్తోందామె. కార్పొరేట్ ఉద్యోగం లేకుండా అలాంటి దేశంలో నివశించడం అంటే..అత్యంత హాస్యాస్పదం, నమ్మశక్యం కానీ విషయం. కానీ ఈ భారత సంతతి మహిళ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్న ఉదంతం వింటే..ఔనని అంగీకరిస్తారు. మరి ఆమె దాన్ని ఎలా సాధ్యం చేసిందంటే..భారత సంతతి మహిళ స్నేహ గౌర్ తాను కార్పొరేట్ ఉద్యోగం లేకుండా ఆరు నెలలపాటు స్విట్జర్లాండ్లో ఎలా గడపగలిగిందో పంచుకుంది. చాలామందికి ఆర్థిక భద్రత అనేది పూర్తికాలపు ఉద్యోగంతో ముడిపడి ఉంటుంది. కానీ ఒక భారతీయ కంటెంట్ క్రియేటర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశాలలో ఒకటైన స్విట్జర్లాండ్లో ఏ కంపెనీలో పనిచేయకుండానే ధీమాగా స్పెండ్ చేస్తోంది. అంతకుముందు తాను ఒక కార్పొరేట్ ఉద్యోగంలో నెలకు సుమారు రూ. 45,000 సంపాదిస్తున్నప్పటి నుంచి తన ప్రయాణం ప్రారంభమైందని అన్నారు. డిగ్రీ సంపాదించడం, జీతం తీసుకోవడం, ఉద్యోగం సంపాదించడం,తదుపరి ప్రమోషన్ పొందడం వంటివే అతిపెద్ద విజయాలుగా భావించానని చెప్పుకొచ్చింది. కానీ కాలక్రమేణ స్వేచ్ఛగా బతకడమే అసలైన జీవితం అని తెలిసి వచ్చింది. ముఖ్యంగా తాను ఎక్కడ నివశించాలో ఎంచుకునే స్వేచ్ఛ, ప్రయాణించే స్వేచ్ఛ, నచ్చిన విషయాలపై పనిచేసే స్వేచ్ఛ ఉంటేనే లైఫ్ అని గ్రహించానని అంటోందామె. అందుకే స్పానిష్ నేర్చుకోవడంపై పెట్టుబడి పెట్టి..చివరికి ఆ నైపుణ్యమే తన జీవిత గమనాన్ని మార్చేసిందని చెబుతోంది. ఆ భాష ఆమెకు స్పెయిన్కు వెళ్లడానికి, అంతర్జాతీయ అనుభవాన్ని పొందడానికి ఉపకరించిందని పేర్కొంది. అదే క్రమంగా ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అయ్యేందుకు అవకాశాలు కల్పించింది. ఏళ్ల తర్వాత ఆ నైపుణ్యాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నట్లు వెల్లడించింది. అలా క్రమంగా తన ఆదాయ మార్గాలను విస్తరింపచేయడంతో శాలరీపై ఆధారపడాల్సిన అవసరం రాలేదంటోంది. అందువల్లే తనకు స్విట్జర్లాండ్కు వెళ్లినప్పుడూ కంపెనీ జీతంపై ఆధారపడలేదని అంటోంది. జస్ట్ ఒక ల్యాప్టాప్, రిమోట్ టీమ్ సరిపోయాయని చెబుతోంది. కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది కేవలం ప్రమోషన్ కాదని అది ఒక నైపుణ్యం కూడా అంటూ పోస్ట్ని ముగించింది. అందుకు సంబంధించిన వీడియో తోపాటు క్యాప్షన్లో గౌర్ ఇలా రాసుకొచ్చారు. ‘ఆఫీసు లేదు.. బాస్ లేరు.. అనుమతి అంతకన్నా అవసరం లేదు’ అయినా స్విట్జర్లాండ్ హాయిగా నిద్రపోగలను అని రాసి మరి వీడియోని పోస్ట్ చేసింది. అలాగే తాను స్పెయిన్లో ఉన్నప్పుడే ఒక వ్యవస్థను రూపొందించుకున్నానని, అది తనకు నచ్చిన చోట నివశించే స్వేచ్ఛను అందించిందని తెలిపింది. నిజంగా సాధించదగిన స్వేచ్ఛ అంటే ఇదే అని చెబుతుండటం విశేషం. View this post on Instagram A post shared by Sneh Gaur (@snehgaur_) (చదవండి: 14 ఏళ్ల వయసులో టాయిలెట్ క్లీనింగ్.. ఇప్పుడేమో మార్స్ మిషన్కు లీడర్!)
సౌదీలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
రియాద్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని సౌదీ అరేబియా సెంట్రల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్ నగరంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా సెంట్రల్ కమిటీ కన్వీనర్ రబ్బానీ సయ్యద్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని కొనియాడారు. వైఎస్సార్సీపీ ఘన విజయం కోసం కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా కలిసికట్టుగా పని చేయాలో దిశా నిర్దేశం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘మావిగన్’ కార్యక్రమం గురించి రబ్బానీ సయ్యద్ ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మావిగన్’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రియాద్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన కరతాళ ధ్వనులు, ‘జై మావిగన్’ నినాదాలతో ఆడిటోరియం మార్మోగింది.ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులు సిరుమల సుబ్బారెడ్డి, పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి, కరీముల్లా బాషా షేక్, వెలంపాటి వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గొల్ల విజయ్, గానుగపెంట శ్రీకాంత్, సుభాన్ ఖాన్ పఠాన్, నాగినేని ఉదయ్ కృష్ణ చౌదరి, షేక్ షాదక్ వలి, కంది శశిధర్ రెడ్డితో పాటు వందలాది మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ జయంతి వేడుకలను విజయవంతం చేశారు.
YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో డా. వై.ఎస్.ఆర్ జయంతి వేడుకలు
ఫీనిక్స్, అరిజోనా : మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఘనంగా నిర్వహించింది. YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, YSRCP ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ చ ముఖ్యమంత్రి మాజీ సలహాదారు (విద్య) ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఎన్ఆర్ఐ వ్యవహారాలు) డాక్టర్ ప్రదీప్ చింతా గారు హాజరయ్యారు. డాక్టర్ వై.ఎస్కు పుష్పాంజలి ఘటించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం, ఆయన అద్భుతమైన జీవితం, దార్శనిక నాయకత్వం, ప్రజా సంక్షేమం పట్ల అచంచలమైన నిబద్ధతను తెలియజేస్తూ ఒక ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన జరిగింది.డా. వైయస్సార్తో తమ జ్ఞాపకాలను పలువురు పంచుకున్నారు. ఆయన వినయం, కరుణ, ధైర్యం, ప్రజా సేవ పట్ల అచంచలమైన అంకితభావాన్ని వారు గుర్తు చేసుకున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ను నిజమైన ప్రజానాయకుడు అంటూ ముఖ్య అతిథి ఆలూరు సాంబ శివారెడ్డి అభివర్ణించారు. సామాన్య పౌరులతో ఆయనకున్న అసాధారణ అనుబంధాన్ని, పరిపాలన పట్ల ఆయన అనుసరించిన పరివర్తనాత్మక విధానాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ నిరంతర సంక్షేమం, అభివృద్ధి కోసం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలను, దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలవాలని ఆయన కోరారు.ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఎన్నారై చాప్టర్లను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన జగనన్న టెక్ఫోర్స్ కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించారు. సాఫ్ట్వేర్ నిపుణులు మరియు ఎన్నారైల కీలక పాత్రను నొక్కిచెబుతూ, పార్టీ ప్రపంచవ్యాప్త విస్తరణ,భాగస్వామ్యానికి సభ్యులు చురుకుగా పాల్గొని, తమ వంతు సహకారం అందించాలని ఆయన ప్రోత్సహించారు.అలాగే ఆంధ్రప్రదేశ్లోని తమ కుటుంబ సభ్యులు , స్నేహితులలో అవగాహన కల్పించడం ద్వారా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో ఎన్నారైలు చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. ప్రతి అర్హతగల ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, నమోదు ప్రక్రియను సరిగ్గా పూర్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.ముఖ్య అతిథి డా. ప్రదీప్ చింత, దివంగత డా. వై.ఎస్. స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం మరియు శాశ్వత వారసత్వం గురించి ప్రస్తావించారు. ఆయన పదవీకాలంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ మరియు గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో అమలు చేసిన పరివర్తనాత్మక సంస్కరణల గురించి మాట్లాడారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న అణచివేతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు, ప్రజా చైతన్యానికి మద్దతుగా సోషల్ మీడియా వేదికల ద్వారా చురుకుగా పాల్గొనాలని ఎన్నారైలకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల SIR పథకంపై ఒక వాక్త్రూ సెషన్ను నిర్వహించారు. SIR పథకం కింద ఓటరు వివరాలను ధృవీకరించుకోవడానికి, గణన పత్రాలను సరిగ్గా పూరించడానికి అవసరమైన దశలవారీ ప్రక్రియను ఆయన వివరించారు. నిర్దేశించిన కాలపరిమితిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు తమ కుటుంబ సభ్యులకు, స్థానిక సమాజాలకు మార్గనిర్దేశం చేయాలని పాల్గొన్నవారిని ప్రోత్సహించారు.డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి కమిటీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ ఈ సమావేశం ముగిసింది. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆశించిన సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమ ఆధారిత పాలన అనే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి మద్దతు కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను వక్తలు నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అత్యంత ప్రియమైన నాయకులలో ఒకరికి ఈ కార్యక్రమాన్ని ఒక అర్థవంతమైన నివాళిగా మార్చడంలో పాల్గొన్న సభ్యులు, మద్దతుదారులు మరియు సామాజిక నాయకులందరికీ వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల, వంశీ ఏరువరం, చెన్నారెడ్డి మద్దూరి, సోమ శేఖర్ రెడ్డి యర్రపురెడ్డి, బోగారపు లక్ష్మీ & గురు, బలరాంరెడ్డి, శ్రీధర్ లక్కిరెడ్డి, రమేష్, శ్రీధర్ చెమిడ్తి, అంజిరెడ్డి, విఘ్నేష్, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగేష్పొర్లక్లు పాల్గొన్నారు. శిరసనంబేడు, సాయి రోహిత్ చెరుకుమిల్లి, శ్రవణ్, విష్ణు చొప్పా, విజయ్, ప్రవీణ్, ప్రక్ష్, పురంధర్, శివ కోడూరు, నాగరాజు దాసరి, ప్రక్షా, లోకనాధ్, అనిల్ ప్రవీణ్ అవుతారు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం ముగిసింది.
మహిళ హత్య కేసు: అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్యను హత్య చేసిన ఆరోపణలపై ఒక తెలుగు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లేవ్లోని ఒక అపార్ట్మెంట్ బాత్రూమ్లో భార్య మృతదేహం లభ్యమైన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.నిందితుడిని అవినాష్ నార్నె (30)గా గుర్తించారు. జూన్ 27న బెల్లేవ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, భార్య సబ్బినేని రజిత (27) మరణానికి కారణమైనందుకు ఫస్ట్-డిగ్రీ మర్డర్ నిందారోపణలు మోపారు. ప్రస్తుతం అతడికి కింగ్ కౌంటీ జైలులో 5 మిలియన్ డాలర్ల (రూ. 47 కోట్లకు పైగా) భారీ బెయిల్ విధించారు. 2025 అక్టోబర్ 27న బెల్లేవ్ డౌన్టౌన్లోని ఉడ్ల్యాండ్ కామన్స్ అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న బాత్రూమ్లో రజిత అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అధికారులు గమనించారు.వైద్య సిబ్బంది కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆమె అప్పటికే మరణించినట్లు తేలింది. ఆఫీసు నుండి వచ్చేసరికి భార్య బాత్రూమ్ ఫ్లోర్పై పడి ఉందని అవినాష్ పోలీసులకు తెలిపాడు. వీరిద్దరికీ 2025 జూన్లో పెద్దలు కుదిర్చిన వివాహం జరగ్గా, ఆ తర్వాతే ఈ అపార్ట్మెంట్కు మారారు. మొదట అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నివేదికలో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో దీనిని హత్యకేసుగా మార్చారు.సుదీర్ఘ దర్యాప్తులో ఎలక్ట్రానిక్ డోర్ లాక్ రికార్డులు, మొబైల్ డేటా, వాట్సాప్ సందేశాలను డిటెక్టివ్లు పరిశీలించారు. రజిత మరణించిన సమయంలో అవినాష్ మినహా మరెవ్వరూ అపార్ట్మెంట్లోకి ప్రవేశించలేదని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, అవినాష్కు భారతదేశంలో మరో మహిళతో సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో నిందితుడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు, డిజిటల్ ఆధారాల బట్టి అతడే ప్రధాన నిందితుడిగా నిర్ధారించి కోర్టులో హాజరుపరిచారు.
క్రైమ్
భార్య వేధింపులు.. నవ వరుడు ఆత్మహత్య
సాక్షి, బళ్లారి: పెళ్లి కాక ముందే ఓ యువకున్ని ప్రేమించింది. తల్లిదండ్రులు ఆమెకు మరొక వ్యక్తితో వివాహం జరిపించారు. కానీ ప్రియునితో సంబంధం కొనసాగించడం చూసి విరక్తి చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దావణగెరె జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. న్యామతి తాలూకా కడదహట్టి గ్రామానికి చెందిన మణికంఠ (28)కు, 3 నెలల క్రితం రాణిబెన్నూరు తాలూకాకు చెందిన యువతితో పెళ్లయింది. కానీ ఆమె ప్రియునితో అక్రమ సంబంధం కొనసాగించేది. పాత సంబంధాలు వదులుకుని కొత్త జీవితం కొనసాగించాలని భర్త హితబోధ చేసినా, వినకుండా గొడవకు దిగేది. తీవ్ర మనోవేదనకు గరైన మణికంఠ డెత్నోట్ రాసి శుక్రవారం సాయంత్రం సమీపంలోని తుంగా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలించి శనివారం మృతదేహాన్ని వెలకితీశారు. మృతుని కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ప్రమాదాల్లో ఏడుగురు జల సమాధి
ఎటపాక/ఉయ్యాలవాడ/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు నీట మునిగి మృత్యువాత పడ్డారు. పోలవరం జిల్లా ఎటపాక మండలంలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో పడి చనిపోగా.. నంద్యాల జిల్లాలో జీవాలు మేపుకునేందుకు వెళ్లి కుందూ నదిలో పడి ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. వివరాలివీ.. పోలవరం జిల్లా ఎటపాక మండలంలోని గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన 11 మంది గిరిజనులు శనివారం ఉదయం గొల్లగూడెం సమీపాన గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లారు. ఊకే రమేష్ (37) నదిలో పడిపోయాడు. ఈత రాకపోవటంతో నీటిలో మునిగిపోతుండడంతో బాసిబోయిన బాలరాజు (40) అతడిని కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో బాలరాజును రమేష్ గట్టిగా పట్టుకోవటంతో ఇద్దరూ మునిగిపోసాగారు. వారితో పాటే వల పట్టుకుని ఉన్న ఊకే లక్ష్మి (37), ఊకే సుశీల (37), తుర్రం భారతి (40) తమ వద్దనున్న చున్నీలు, వలలు విసిరి వారిద్దరినీ కాపాడే ప్రయత్నం చేయగా వీరు కూడా మునిగిపోసాగారు. అది గమనించిన మరికొందరు మహిళలు ఆ ఐదుగురినీ కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ ఐదుగురూ గల్లంతవగా.. ఒడ్డునున్న మహిళలు కేకలు వేయడంతో సమీపంలోని జాలర్లు గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.కొద్దిసేపటికి ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎటపాక పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెలంగాణలోని భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతులందరూ వ్యవసాయ కూలీలు. వీరిలో నలుగురుకి వివాహం కాగా రమేష్ అవివాహితుడు. వారి ఆకస్మిక మృతితో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం అలముకుంది. పశువులు మేపుకునేందుకు వెళ్లి.. నంద్యాల జిల్లా బోడెమ్మనూరు గ్రామంలో చోటుచేసుకున్న మరో ఘటనలో.. జీవాలను మేపేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృత్యువాత పడ్డారు. రోజులానే శనివారం ఉదయం పశువులు మేపుకునేందుకు రసూల్బీ (38), బీబీ అలియాస్ దేవి (50)తో పాటు మౌనిక కుందూ నది ఆవల ఇంజేడు గ్రామ పొలాల్లో మేపుకునేందుకు బయల్దేరారు.అయితే, నదిలోని నీటి గుంతలోకి మేకలు వెళ్లడంతో రసూల్బీ వాటికోసం ఆ గుంతలోకి దిగింది. ఈమె మునిగిపోతుండడాన్ని గమనించిన బీబీ (దేవి) ఆమెను కాపాడేందుకు నీటిలోకి దిగింది. ఇద్దరూ ఊపిరాడక నదిలో గల్లంతయ్యారు. ఒడ్డునున్న మౌనిక జరిగిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా వారు నదిలో గాలించి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు. మృతులిద్దరూ వరుసకు అత్తాకోడళ్లు. వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనులు మృత్యువాత పడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన బృందం చేపలు పట్టేందుకు గోదావరిలోకి వెళ్లగా వీరిలో ఐదుగురు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండటం హృదయవిదారకమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ కోరారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
6 నెలల్లో 554 మంది భర్తల మరణాలు : షాకింగ్ సర్వే
గురుగ్రామ్కు చెందిన 'ఏకం న్యాయ్ ఫౌండేషన్' (Ekam Nyaay Foundation) అనే స్వచ్ఛంద సంస్థ (NGO) సంచలన నివేదకను వెల్లడించింది. జెండర్ సమానత్వం కోసం, ముఖ్యంగా సమాజంలో పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల నివారణకు పనిచేసే ఈ ఎన్జీవో 2026 తొలి ఆరు నెలల్లో (జులై 14 వరకు) దేశవ్యాప్తంగా 554 మంది భర్తల హత్యలు లేదా ఆత్మహత్యలు చేసుకున్నట్టు తేలిందని ఈ నివేదిక పేర్కొంది. మీడియాలో వచ్చిన వార్తలు, తాము సేకరించిన వివరాల ఆధారంగా ఈ డేటాను సేకరించినట్టు తెలిపింది.ఇటీవలి కాలంలో ప్రియులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేస్తున్న దారుణ ఉదంతాలు ఆందోళన రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల కాబోయే భార్య చేతిలో పుణే రియల్టర్ హత్య సంచలనంగా మారింది. అయితే ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ జరుగుతున్నాయని ఏకం న్యాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఫిలిం మేకర్, దీపికా నారాయణ్ భరద్వాజ్ వెల్లడించారు. అధికారిక నేరాల డేటాలో పురుషులపై జరిగే గృహహింసకు లేదా భర్తల హత్యలకు ప్రత్యేక వర్గీకరణ (classification) లేకపోవడం వల్ల ఈ సమస్య తీవ్రతను అంచనా వేయడం కష్టంగా మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ గణాంకాల ప్రకారం భారతదేశంలో 2026 మొదటి ఆరు నెలల్లో ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు హత్యకు గురవుతుండగా, ఒకరి కంటే ఎక్కువ మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఫౌండేషన్ తెలిపింది. అయితే ఇవి కేవలం మీడియా నివేదికల ఆధారంగా సేకరించినవేనని, ప్రభుత్వ అధికారిక గణాంకాలు కావని స్పష్టం చేసింది. పురుషులపై జరిగే గృహహింసను ట్రాక్ చేయడానికి ప్రత్యేక జాతీయ డేటాబేస్ లేనందున, వాస్తవ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చన్నారు. ఇదీ చదవండి: తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్ సక్సెస్ స్టోరీభార్యలు లేదా వారి ప్రియుల చేతిలో హత్యకు గురైన భర్తల కేసులు: 322వైవాహిక వివాదాలు, గృహహింస, వేధింపులు, తప్పుడు కేసుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న భర్తల కేసులు: 232హత్యలకు ప్రధాన కారణాలు322 హత్య కేసుల్లో 194 కేసులు (60.2%) వివాహేతర సంబంధాల వల్లే జరిగాయి. వివాహేతర సంబంధాన్ని భర్త వ్యతిరేకించడంతో, భార్యలు తమ ప్రియుళ్లతో కలిసి భర్తలను చంపడానికి కుట్ర పన్నినట్లు నివేదిక పేర్కొంది. 88 కేసులు పాత గృహ వివాదాల కారణంగా జరిగాయి. మిగిలిన హత్యలు డబ్బు గొడవలు, కుటుంబ కుట్రలు మొదలైన కారణాలతో సంభవించాయి.ఇదీ చదవండి: తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్ సక్సెస్ స్టోరీవణికిస్తున్న హత్యా పద్దతులువిషం పెట్టడం, సజీవ దహనం, కరెంట్ షాక్ ఇవ్వడం, గొంతు నులమడం, మృతదేహాలను ముక్కలుగా నరకడం, పూడ్చిపెట్టడం, హత్యలను ప్రమాదాలు లేదా ఆత్మహత్యలుగా చిత్రీకరించడం వంటివి ఉన్నాయని ఫౌండేషన్ తెలిపింది. ఈ కాలంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 93 భర్తల హత్యలు, 103 ఆత్మహత్యలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి.ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్పాట్ : నిద్రలేమే వరంలా మారిందిఫౌండేషన్ ఈ ఏడాది జరిగిన 25 అత్యంత ఘోరమైన కేసులను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇందులో భర్తల తలలు నరకడం, ముక్కలుగా కోయడం, ఇళ్లల్లోనే పూడ్చిపెట్టడం వంటి ఘటనలు ఉన్నాయి. మరికొన్ని ఆత్మహత్య కేసుల్లో బాధితులు చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్లు లేదా రికార్డ్ చేసిన వీడియోలలో... తాము ఎదుర్కొన్న మానసిక క్షోభ, పిల్లలను చూడనివ్వకపోవడం, తప్పుడు కేసుల వేధింపులు ఉన్నాయని దీపికా నారాయణ్ భరద్వాజ్ వివరించారు.ఇదీ చదవండి: రెచ్చిపోయిన పోకిరీకి, యువతి గుణపాఠం : వీడియో వైరల్
మునుకుంట్ల ప్రేమికుల మృతి ఘటనలో ట్విస్ట్..!
నల్లగొండ జిల్లా: కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో 24 గంటల వ్యవధిలో చోటుచేసుకున్న ఇద్దరు యువతీయువకుల మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముందుగా అనుమానాస్పద పరిస్థితుల్లో యువతి మృతి చెందగా, మరుసటి రోజే ఆమెతో ప్రేమలో ఉన్నట్లు చెబుతున్న యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రెండు ఘటనల మధ్య ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.వివరాల ప్రకారం.. మునుకుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న (23) శుక్రవారం అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యులు ఆమెను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.లక్ష్మీ ప్రసన్న సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడిపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా లక్ష్మీ ప్రసన్న, చరణ్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.అయితే, ప్రసన్న మృతి ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలోనే శనివారం ఉదయం చరణ్ గ్రామ శివారులో తాటి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వరుసగా 24 గంటల్లో ఇద్దరు యువతీయువకులు ప్రాణాలు కోల్పోవడంతో మునుకుంట్ల గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.అయితే, లక్ష్మీ ప్రసన్న మృతి, చరణ్ ఆత్మహత్య ఘటనలకు పరస్పర సంబంధం ఉందా? ప్రేమ వ్యవహారమే ఈ విషాదానికి కారణమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.
వీడియోలు
రెచ్చిపోతున్న MLA మాధవి
భూమా ట్యాక్స్ గురించి మీకు తెలుసా..?
హోంమంత్రికి సిగ్గుంటే.. బయటపడ్డ వీడియోలు
TDP ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు చంద్రబాబు షాక్
పార్లమెంట్ దద్దరిల్లే బిల్లులు
లోకేష్ రెడ్ బుక్ కి మించి.. ల జగన్ 2.0 సూపర్ యాప్ సంచలనం
ఎండ నుంచి యూరప్ ను రక్షించిన చంద్రబాబు
నడిరోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్లిన పచ్చమూక
9 విభాగాల్లో పురస్కారాలు గెలుచుకున్న టాలీవుడ్
గుంటూరు నడిబొడ్డున..మహిళపై 9 మంది


