బయటికి రావాలంటే రూ.84 లక్షల బ్లడ్మనీ చెల్లించాల్సిందే..
నిజామాబాద్: పొట్టకూటి కోసం వలస వెళ్లిన యువకుడు సౌదీ అరేబియా దేశంలోని రియాద్ జైలులో మగ్గుతున్నాడు. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దివ్యాంగురాలైన భార్య చంటి బిడ్డను పట్టుకుని భర్త రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. తమ బిడ్డ తిరిగి రావాలని ఆ యువకుడి తల్లిదండ్రులు దేవుళ్లను వేడుకుంటున్నారు. కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాననే ఆశతో వలస వెళ్లిన యువకుడు శ్రావణ్కుమార్ కుటుంబ పరిస్థితి ఇది. సాలూర మండలం కుమ్మన్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రామయ్య, రాజమణి దంపతుల కుమారుడు శ్రావణ్కుమార్ (32). జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతల్పేటకు చెందిన దివ్యాంగురాలు మమతను 2022లో శ్రావణ్ పెళ్లి చేసుకున్నాడు. 2023 నవంబర్లో ఉపాధి కోసం సౌదీ అరేబియా దేశం రియాద్కు వెళ్లిన శ్రావణ్ అక్కడి ఓ ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ కంపెనీలో అంబులెన్స్ డ్రైవర్గా పనిలో చేరాడు. మంచి ఉద్యోగం రావడంతో తన కలలు సాకరమవుతాయని సంబురపడిన శ్రావణ్పై కోలుకోలేని దెబ్బపడింది. 2024 మే 6వ తేదీన శ్రావణ్ నడుపుతున్న అంబులెన్స వాహనం రోడ్డు ప్రమాదానికి గురికాగా.. ఈ ప్రమాదంలో స్థానికులైన భార్యాభర్తలు మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడి పోలీసులు శ్రావణ్ను అరెస్టు చేసి జైలు తరలించారు. కొన్ని నెలల్లోనే అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రోడ్డు ప్రమాద ఘటనకు శ్రావణ్కుమార్ను నేరస్థుడిగా నిర్ధారించింది. రూ.3.30 లక్షల సౌదీ రియాళ్లు (బ్లడ్ మనీ – రక్తపరిహారం) బాధితకుటుంబానికి చెల్లించాలని తీర్పులో పేర్కొంది. మన దేశ కరెన్సీలో ఆ మొత్తం సుమారు రూ.84 లక్షలు. బాధిత కుటుంబాల అంగీకారం మేరకు పరిహారం చెల్లిస్తే శ్రావణ్కుమార్కు జైలు నుంచి విముక్తి పొందే అవకాశం కలుగుతుంది. పరిహారం చెల్లించకపోతే జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి ఉండదు. అంత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించే ఆర్థిక స్థోమత లేక శ్రావణ్కుమార్ కుటుంబీకులు నిస్సహాయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ్కుమార్ పై అక్కడి దేశం ట్రావెలింగ్ బ్యాన్ ఆంక్షలు పెట్టింది. గడపగడపకు వెళ్తున్న మమత తన భర్తను జైలు నుంచి విడిపించాలని దివ్యాంగురాలైన మమత కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులను వేడుకుంటోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తోపాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాకు చెందిన ఎంపీకి, పలువురు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు అందజేసింది. ఈ ఏడాది మే 29న హైదరాబాద్లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలో తమ పరిస్థితిని వివరించింది. తన భర్తను తీసుకురావాలని వేడుకుంది. ప్రభుత్వం ఆదుకోవాలి మాది నిరుపేద కుటుంబం. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న నా కొడుకు రెండేళ్ల నుంచి సౌదీ అరేబియా జైలులో ఉన్నాడు. రెక్కల కష్టంపై బతుకుతున్నాం. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి. – కుమ్మరి రామయ్య, శ్రావణ్కుమార్ తండ్రి మమ్మల్ని ఆదుకోండి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మానవతావాదులు స్పందిస్తేనే మా కుటుంబం ఈ గండం నుంచి గట్టెక్కుతుంది. నేనే దివ్యాంగురాలిని చంటి బిడ్డను పట్టుకుని తిరుగుతున్నా. మా అత్తామామలు తల్లడిల్లుతున్నారు. సౌదీ అరేబియా కోర్టు చెప్పిన జరిమానా చెల్లించే స్థోమత మాకు లేదు. – మమత, శ్రావణ్కుమార్ భార్య
కొలంబియా భూకంపం: ఒక్క కుదుపు.. సెకన్లలో శవాల దిబ్బలు!
ప్రకృతి కన్నెర్ర చేస్తే.. మనిషి నిర్మించిన ప్రపంచం క్షణాల్లో తుడిచిపెట్టుకుపోతుంది. అప్పటివరకు జనజీవనంతో కళకళలాడిన నగరాలు భూమి ఒక్కసారి కంపించగానే శిథిలాల గుట్టలుగా మారిపోతాయి. కట్టుకున్న ఇళ్లు కూలిపోతాయి.. కుటుంబాలు చెల్లాచెదురవుతాయి.. ప్రాణాలతో బయటపడిన వారి కళ్ల ముందు తమ ఆత్మీయులను కోల్పోయిన విషాదం జీవితాంతం వెంటాడుతుంది..భూకంపాలకు అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటైన లాటిన్ అమెరికా.. ఇలాంటి ఎన్నో ప్రకృతి విలయాలకు సాక్షిగా నిలిచింది. భూమి పొరల్లో చోటుచేసుకున్న కదలికలు కొన్ని సెకన్లలోనే నగరాల రూపురేఖలను మార్చేశాయి. లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. తాజాగా కొలంబియాలో సంభవించిన భారీ భూకంపం మరోసారి ఈ ప్రాంతంలోని పాత విషాదాలను ప్రపంచానికి గుర్తుచేసింది. ఈ ప్రకంపనల ధాటికి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. అనేక భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Powerful 7.4-magnitude earthquake hits Manizales, Colombia 🇨🇴 (10.08.2026)@AmirSaeedAbbasi @HussainAhmedCh8 @KulAalam #Colombia pic.twitter.com/FI2lrySjd8— Media Talk (@mediatalk922) August 11, 2026హైతీ.. ప్రపంచాన్ని కదిలించిన విషాదంలాటిన్ అమెరికా చరిత్రలో అత్యంత భయానక భూకంపాల్లో 2010లో హైతీలో సంభవించిన ప్రకంపనలు ఒకటి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0 మాత్రమే అయినప్పటికీ.. దాని ప్రభావం మాత్రం ఊహించని స్థాయిలో కనిపించింది. రాజధాని పోర్ట్–ఔ–ప్రిన్స్ నగరం తీవ్రంగా దెబ్బతింది. వేలాది భవనాలు కూలిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, నివాస ప్రాంతాలు శిథిలాలుగా మారాయి. భూకంప నిరోధక ప్రమాణాలు లేని నిర్మాణాలు భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి.ఈ విపత్తులో సుమారు 3.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఒక దేశం మొత్తం కోలుకోవడానికి ఏళ్లు పట్టింది.నిద్రలోనే మృత్యువు ఒడిలోకి వేలమంది.. 1868లో ఈక్వెడార్, కొలంబియా ప్రాంతాలను కుదిపేసిన భూకంపాలు మరో మహా విషాదాన్ని మిగిల్చాయి. **7.7 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు** అనేక పట్టణాలను నేలమట్టం చేశాయి. ప్రజలు గాఢనిద్రలో ఉన్న సమయంలో సంభవించిన ఈ భూకంపం.. క్షణాల్లో వేలాది ఇళ్లను శిథిలాలుగా మార్చింది. ఈక్వెడార్లో సుమారు 40 వేల మంది, కొలంబియాలో మరో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. చారిత్రక రికార్డుల ప్రకారం.. ఇబారా నగరం కొన్ని క్షణాల్లోనే విధ్వంసానికి గురైందని అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.పెరూలో భూకంపం.. కదిలిన పర్వతం1970లో పెరూలో సంభవించిన భూకంపం ప్రకృతి శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచానికి చూపించింది. 7.9 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు అండీస్ పర్వతాల్లో భారీ మంచు, రాళ్ల కొండచరియలు విరిగిపడేలా చేశాయి. మంచు, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం వేగంగా దూసుకొచ్చి యుంగే, రన్రాహిర్కా ప్రాంతాలను కప్పేసింది. కొన్ని నిమిషాల్లోనే అక్కడి జనజీవనం పూర్తిగా తారుమారైంది. ఈ ఘటనలో సుమారు 66,794 మంది మరణించారు. ప్రకృతి విపత్తుల్లో కొండచరియలు ఎంతటి ప్రాణాంతకంగా మారతాయో ఈ ఘటన చాటిచెప్పింది.ఈక్వెడార్లో ప్రకృతి ప్రకోపం.. 40 వేల మంది బలి1797లో ఈక్వెడార్లో సంభవించిన భూకంపం ఆ దేశ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఘటనల్లో ఒకటి. 8.3 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకంపనలు భారీగా కొండచరియలు విరిగిపడేలా చేశాయి. రియోబాంబా, లతకుంగా, అంబాటో వంటి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ విషాదంలో సుమారు 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.చిలీ.. భూకంపాల దేశంలో విషాద జ్ఞాపకంప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం 1960లో చిలీలో 9.5 తీవ్రతతో నమోదైంది. అయితే అత్యధిక మరణాలు మాత్రం 1939లో వచ్చిన చిల్లాన్ భూకంపంలో చోటుచేసుకున్నాయి. 8.3 తీవ్రతతో వచ్చిన ఆ ప్రకంపనలు చిల్లాన్, కాన్సెప్సియన్ నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. బలహీన నిర్మాణాల కారణంగా సుమారు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం తర్వాత చిలీ భూకంప నిరోధక నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.వెనిజులా నుంచి అర్జెంటీనా వరకు.. విషాదాల ఆనవాళ్లులాటిన్ అమెరికాలో మరెన్నో భూకంపాలు వేలాది కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చాయి. 1812 వెనిజులా భూకంపం సుమారు 26 వేల మందిని, 1868 అరికా భూకంపం దాదాపు 25 వేల మందిని, 1976 గ్వాటెమాలా భూకంపం 23 వేల మందిని బలిగొన్నాయి. 1797 వెనిజులా భూకంపం, 1861 అర్జెంటీనా భూకంపం కూడా వేలాది ప్రాణాలను హరించాయి. కొన్ని ప్రాంతాల్లో భూకంపం తర్వాత వచ్చిన సునామీలు, అగ్ని ప్రమాదాలు మరణాల సంఖ్యను మరింత పెంచాయి.ఎందుకింత ప్రాణ నష్టం?లాటిన్ అమెరికా భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారడానికి ప్రధాన కారణం.. ఈ ప్రాంతం భారీ టెక్టానిక్ పలకల సరిహద్దులపై ఉండటమే. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉన్న చిలీ, పెరూ, ఈక్వెడార్, కొలంబియా వంటి దేశాలు తరచూ భౌగోళిక కదలికలను ఎదుర్కొంటుంటాయి.సముద్రపు అడుగున ఉన్న నాజ్కా టెక్టానిక్ ప్లేట్.. దక్షిణ అమెరికా ప్లేట్ కిందికి జారిపోవడం వల్ల భూమి లోపల భారీ ఒత్తిడి పేరుకుపోతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భారీ ప్రకంపనలు సంభవిస్తాయి. అందుకే ఈ ప్రాంతంలో తరచూ శక్తివంతమైన భూకంపాలు చోటుచేసుకుంటుంటాయి.ప్రకృతి హెచ్చరిక.. మనిషికి గుణపాఠంభూకంపాలను ఆపడం మనిషి చేతుల్లో లేదు. కానీ వాటి ప్రభావాన్ని తగ్గించడం మాత్రం సాధ్యమే. భూకంప నిరోధక నిర్మాణాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సమర్థవంతమైన విపత్తు నిర్వహణ ప్రణాళికలు ఎన్నో ప్రాణాలను కాపాడగలవు. లాటిన్ అమెరికా భూకంప చరిత్ర ఒక చేదు నిజాన్ని చెబుతోంది. భూమి కదిలేది కొన్ని సెకన్లే.. కానీ ఆ ప్రకంపనలు మిగిల్చే విషాదం తరతరాల పాటు నిలిచిపోతుంది అని.
‘‘సీబీఐ విచారణ జరపాలి.. లోకేశ్ రాజీనామా చేయాలి’’
నగరి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని చెప్పారు. నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.మెగా డీఎస్సీలో అక్రమాలకు బాధ్యతవహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలంటూ నగిరి నియోజక వర్గంలో ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన రాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పుత్తూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రోజా మాట్లాడారు.‘‘ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మొదటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇది. ఆ తర్వాత జరిగిన అవకతవకతల గురించి చూశాం. క్వశ్చన్ పేపర్ తయారు చేసే నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అక్కడే మీకు పేపర్ లీకేజ్ అయింది అనేది అందరికీ అర్థమయింది. పేపర్ లీకేజ్ కాకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? రెండో ర్యాంక్ నుంచి ఎందుకు ఇచ్చారు అనేది వాళ్లు చెప్పాలి. రెండోది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం. ఎప్పుడు కూడా స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ పెట్టి, ఆ ఎగ్జామ్ ద్వారా సర్టిఫికేట్లు వెరిఫై చేసే ఉద్యోగాలు ఇస్తారు. కానీ వీళ్లు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాక దొంగ జీవోలు తీసుకొచ్చారు. పోస్ట్ లను అమ్ముకునేందుకు దాని ద్వారా డబ్బులు దోచుకోవడానికి ఈ జీవోలని వాడారు’’ అని వ్యాఖ్యానించారు.
భారతి సిమెంట్స్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత
వైఎస్సార్ జిల్లా: భారతి సిమెంట్స్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. హైకోర్టును ఆశ్రయించినప్పటికీ టీడీపీ మూకలు వెనక్కి తగ్గట్లేదు. స్థానిక టీడీపీ నేతల ప్రోద్బలంతో ఇప్పటికీ మైనింగ్ పనుల అడ్డగింత కొనసాగుతోంది. వాహనాలను మైనింగ్లోకి వెళ్లకుండా టీడీపీ మూకలు అడ్డుకుంటున్నాయి. అంతా సవ్యంగానే ఉందని, మైనింగ్ జరుగుతుందంటూ మభ్య పెడుతున్నారు పోలీసులు. అధికార పార్టీ ఆదేశాల ప్రకారం భారతి సిమెంట్స్ సజావుగా జరుగుతుందంటూ నివేదికలు ఇస్తున్నారు. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో టీడీపీ మూకల గూండాయిజం కొనసాగుతోంది. భారతి సిమెంట్స్ లో ఉత్పత్తి నిలిచిపోయినా యంత్రాంగం స్పందించడం లేదు. వారం రోజులుగా భారతి సిమెంట్స్ పై పచ్చ మూకలు దండయాత్ర చేస్తున్నా చర్యలు శూన్యంగా ఉన్నాయి. అధికార పార్టీ ప్రోద్బలంతో భారతి సిమెంట్స్ ను దెబ్బతీసేందుకు భారీ కుట్ర పన్నారు. ఎన్నిసార్లు విన్నవించినా స్థానిక పోలీసులు స్పందించడం లేదు. యథాతథంగా టీడీపీ మూకల గూండాగిరి కొనసాగుతోంది.
మార్గాని భరత్ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
యశ్ టాక్సిక్.. రన్ టైమ్ అంతేనా?
మాన్యువల్ కార్లకు ఎందుకింత డిమాండ్?
‘కేసీఆర్ను మోసం చేయాలనుకోలేదు’
T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్గా SRH మాజీ ప్లేయర్
కొలంబియాలో భూకంప బీభత్సం.. 169 మంది మృతి
‘ఎన్టీఆర్ చికెన్’ కామెంట్స్పై ఎంఎస్ రాజు క్లారిటీ
FCRA: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
హైదరాబాద్లో ట్రంప్ టవర్స్!
కొత్త భార్యపై ప్రేమ.. మాజీ భార్యను గుర్తుచేస్తున్న నెటిజన్లు
చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి..! ఆఖరికి స్వలింగ సంపర్కుడైన కుమారుడి కోసం..
హెరిటేజ్ - విజయ డెయిరీ
వరుస యుద్ధాలతో అడుగంటిన ఆయుధ సామగ్రి
కారు ప్రమాదంలో ఏఆర్ రెహమాన్ కొడుకు
సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా'
ఏదడిగినా.. అలా ఖాళీ జేబులు చూపిస్తున్నారు!!
‘వెండి’ మండిపోతుంది: కియోసాకి భారీ అంచనా
‘నీట్’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
బుల్లిగౌనులో ఆషిక బర్త్ డే సెలబ్రేషన్.. బాలనటిని గుర్తుపట్టారా?
సచిన్ మెరుపులు వృథా.. 240 టార్గెట్ హాంఫట్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యవహారాలలో పురోగతి
79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్?
వారణాసిలో హనుమంతుడి పాత్ర.. రాజమౌళి ప్లాన్ అదేనా?
కేంద్రానికి పసిడి పంట
మహేశ్ బాబు బర్త్ డే.. నమ్రతా స్పెషల్ పోస్ట్
ఈ రాశి వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది.. స్థిరాస్తివృద్ధి
కూరగాయల కొట్టు నుంచి అండర్వరల్డ్ సింహాసనం వరకు..
మార్గాని భరత్ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
యశ్ టాక్సిక్.. రన్ టైమ్ అంతేనా?
మాన్యువల్ కార్లకు ఎందుకింత డిమాండ్?
‘కేసీఆర్ను మోసం చేయాలనుకోలేదు’
T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్గా SRH మాజీ ప్లేయర్
కొలంబియాలో భూకంప బీభత్సం.. 169 మంది మృతి
‘ఎన్టీఆర్ చికెన్’ కామెంట్స్పై ఎంఎస్ రాజు క్లారిటీ
FCRA: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
హైదరాబాద్లో ట్రంప్ టవర్స్!
కొత్త భార్యపై ప్రేమ.. మాజీ భార్యను గుర్తుచేస్తున్న నెటిజన్లు
చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి..! ఆఖరికి స్వలింగ సంపర్కుడైన కుమారుడి కోసం..
హెరిటేజ్ - విజయ డెయిరీ
వరుస యుద్ధాలతో అడుగంటిన ఆయుధ సామగ్రి
కారు ప్రమాదంలో ఏఆర్ రెహమాన్ కొడుకు
సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా'
ఏదడిగినా.. అలా ఖాళీ జేబులు చూపిస్తున్నారు!!
‘వెండి’ మండిపోతుంది: కియోసాకి భారీ అంచనా
‘నీట్’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
బుల్లిగౌనులో ఆషిక బర్త్ డే సెలబ్రేషన్.. బాలనటిని గుర్తుపట్టారా?
సచిన్ మెరుపులు వృథా.. 240 టార్గెట్ హాంఫట్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యవహారాలలో పురోగతి
79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్?
వారణాసిలో హనుమంతుడి పాత్ర.. రాజమౌళి ప్లాన్ అదేనా?
కేంద్రానికి పసిడి పంట
మహేశ్ బాబు బర్త్ డే.. నమ్రతా స్పెషల్ పోస్ట్
ఈ రాశి వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది.. స్థిరాస్తివృద్ధి
కూరగాయల కొట్టు నుంచి అండర్వరల్డ్ సింహాసనం వరకు..
ఫొటోలు
హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)
ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)
ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)
కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)
‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
హైదరాబాద్ లో అద్భుత ఘట్టం (ఫొటోలు)
కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం..(ఫొటోలు)
హైదరాబాద్ గచ్చిబౌలి లో సందడి చేసిన టాలీవుడ్ ముద్దుగుమ్మ మానస చౌదరి (ఫొటోలు)
‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన నటి కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)
సినిమా
'రంభ, ఊర్వశి, మేనక భూలోకానికి వస్తే..' ఆసక్తిగా టీజర్
అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. కామెడీ గోస్ కాస్మిక్ అన్నది ట్యాగ్లైన్ ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్– హాస్య మూవీస్ బ్యానర్స్పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇంద్రలోకం నుంచి భూలోకానికి రంభ, ఊర్వశి, మేనక వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికర కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు. టీజర్లో సన్నివేశాలు ఫుల్ కామెడీని తలపిస్తున్నాయి. ఈ మూవీతో అల్లరి నరేశ్ తన కామెడీ ట్రాక్లో సక్సెస్ కొట్టేలా కనిపిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీలో నరేష్ వీకే, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 4న గ్రాండ్ రిలీజ్ కానుంది.
అగ్నివీర్గా స్టార్ నటుడి కుమార్తె.. ఎవరో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలోకి సినీ స్టార్స్ ఫ్యామిలీ నుంచి చాలామంది ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తుంటాం. మన పిల్లలు కూడా తల్లిదండ్రులను ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చేవారు దాదాపు సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వస్తుంటారు. అది మన టాలీవుడ్లో కాస్తా ఎక్కువగానే ఉంటుంది.కానీ అందుకు భిన్నంగా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది స్టార్ నటుడి కుమార్తె. ఆమె మరెవరో కాదు.. రేసుగుర్రంలో విలన్గా మెప్పించిన రవికిషన్ కూతురు. బాలీవుడ్ నటుడు రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఇండస్ట్రీని కాదని విభిన్నమైన కెరీర్ ఎంచుకుంది. అగ్నివీర్గా రక్షణ దళంలో చేరారు. తండ్రిలా కాకుండా డిఫరెంట్ కెరీర్ను ఎంచుకుంది.రవి కిషన్ కుమార్తె అయిన ఇషితా శుక్లాకు చిన్న వయసులోనే ఆర్మీలో పని చేయాలన్న ఆసక్తి పెరిగింది. బాలీవుడ్కు వెళ్లకుండా.. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)లో చేరారు. ఆ తర్వాత సైనిక శిక్షణ పొంది రక్షణ రంగంలో పనిచేసేందుకు సిద్ధమైంది. ఇషిత ఢిల్లీ డైరెక్టరేట్కు చెందిన 7 గర్ల్స్ బెటాలియన్లో పనిచేశారు. కర్తవ్య పథ్లో గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం కూడా శిక్షణ తీసుకున్నారు. కాగా.. ఇషిత శుక్లా 2023లో అగ్నివీర్గా చేరినట్లు తెలుస్తోంది. దీంతో దేశానికి సేవ చేయాలన్న ఇషిత నిర్ణయాన్ని అనుపమ్ ఖేర్తో సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు.
పెట్టింది చీమంతా.. వచ్చింది కొండంతా.. ఆ సినిమాలు ఇవే!
వందల కోట్లు ఖర్చు చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రాలు కోలీవుడ్లో చాలానే ఉన్నాయి. పరిమిత బడ్జెట్తో తెరకెక్కి అంచనాలను తారుమారు చేసిన తమిళ సినిమాలూ ఉన్నాయి. స్టార్డమ్తో పనిలేకుండా కథలో దమ్ముండి బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది భారీ వసూళ్లు రాబట్టిన కొన్ని తమిళ సినిమాల కోసం ఓ లుక్కేద్దాం..!విత్ లవ్:‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో సత్తా చాటిన యువ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘విత్ లవ్’. ఇందులో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్, మాగేశ్ రాజ్ కలిసి నిర్మించారు. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని ఏకంగా రూ.39 కోట్ల వసూళ్లను రాబట్టింది.తాయ్ కిళవి:ఒకప్పటి హీరోయిన్ రాధిక ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తమిళ సూపర్హిట్ చిత్రం ‘తాయ్ కిళవి’. రాధికను లీడ్ రోల్లో పెట్టి తమిళ హీరో శివకార్తికేయన్ నిర్మించిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. రూ.10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.82 కోట్ల మేర వసూళ్లను సాధించింది.యూత్:తమిళ నటుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ హీరోగా పరిచయమైన చిత్రం ‘యూత్’. ఈ సినిమాకు కెన్ కరుణాస్ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కురప్పయ్య సీ రామ్, సులోచన కుమార్ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. రూ.8 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.81 కోట్ల వసూళ్లు రాబట్టింది.బ్లాస్ట్:అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్లాస్ట్’. తెలుగులో ‘బ్లాస్ట్ జోన్’ పేరుతో విడుదలైంది. సుభాష్ కె.రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. లీడ్ రోల్స్లో నటించిన వారు పెద్ద స్టార్లు కాకపోయినా.. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రూ.18 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.75 కోట్ల వసూళ్లను రాబట్టింది.
'విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ.. సెట్స్లో రియల్ చిరుతపులి ఎంట్రీ'
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో ప్రేమలు బ్యూటీ మమతా బైజు హీరోయిన్గా నటించింది. మధ్య వయస్కుడితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ షూటింగ్ టైమ్లో ఎదురైన భయానక అనుభవాన్ని షేర్ చేశారు. ఊటీలో ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు సెట్స్లోకి చిరుతపులి వచ్చిందని తెలిపారు. అది తమ కళ్ల ముందు నుంచే వెళ్లిందని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా గడ్డ కట్టే చలిలో 102-103 ఫీవర్తో సూర్య, మమిత బైజు దాదాపు 11 రోజుల పాటు ఊటీలోనే షూట్లో పాల్గొన్నారని వెంకీ తెలిపారు. కాగా..ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో సందడి చేయనుంది.
క్రీడలు
ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అరెస్టు
ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్టయ్యాడు. అత్యాచార ఆరోపణల కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బెంగాల్కు చెందిన అభిషేక్ పోరెల్ 2023లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న 24 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఇప్పటికి 35 మ్యాచ్లు ఆడి 769 పరుగులు చేశాడు.పెళ్లి చేసుకుంటానని నమ్మించి..క్యాపిటల్స్ కీలక ప్లేయర్లలో ఒకడిగా ఎదిగిన అభిషేక్ పోరెల్పై జూన్లో అత్యాచార ఆరోపణలతో కేసు నమోదైంది. గత మూడేళ్లుగా తనతో రిలేషన్షిప్లో ఉన్న పోరెల్.. ఏడాది కాలంగా తనను దూరం పెట్టాడని వైద్య విద్యార్థిని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అన్ని రకాలుగా వాడుకున్నాడని ఫిర్యాదు చేసింది.ఈ క్రమంలో తనపై అనేకమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. తమ వ్యక్తిగత వీడియోలు రికార్డు చేసి ఇప్పుడు వాటిని చూపించి బెదిరిస్తున్నాడని బాధితురాలు తీవ్రమైన ఆరోపణలు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బెంగాల్ పోలీసులు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో..ఈ క్రమంలో అభిషేక్ పోరెల్ మొబైల్ ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను వెంటనే సీజ్ చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. అతడిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో డుమ్ డుమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమామి సిటీ పోలీసులు అభిషేక్ పోరెల్ను తాజాగా అరెస్టు చేసినట్లు సమాచారం. హూగ్లీ రూరల్ పోలీస్ ఎస్పీ కున్వార్ భూషణ్ సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాగా అభిషేక్ పోరెల్ గతంలో భారత్-ఎ క్రికెట్ జట్టు తరఫున యూకే, ఆస్ట్రేలియా గడ్డ మీద మ్యాచ్లు ఆడాడు. ఇదిలా ఉంటే.. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని అభిషేక్ పోరెల్ కొట్టిపారేశాడు. కాగా బెంగాల్ తరఫున 2021-11 సీజన్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన అభిషేక్ పోరెల్.. 32 మ్యాచ్లు ఆడాడు. ఇక లిస్ట్-ఎ క్రికెట్లో అతడు 23 మ్యాచ్లలో భాగమయ్యాడు.
స్టబ్స్ విధ్వంసం.. ట్రెంట్ రాకెట్స్కు షాక్!
హండ్రెడ్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సదరన్ బ్రేవ్.. వరుస విజయాలతో పట్టికలో తొలి స్థానంలో ఉన్న ట్రెంట్ రాకెట్స్ను ఊహించని దెబ్బ కొట్టింది. ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా ట్రెంట్ రాకెట్స్తో జరిగిన మ్యాచ్లో సదరన్ బ్రేవ్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. మిచెల్ సాంట్నర్ (35 నాటౌట్), లూయిస్ జార్జరీ (28 నాటౌట్) ఆఖర్లో మెరవడంతో ట్రెంట్ రాకెట్స్ మంచి స్కోరును సాధించింది. అంతకముందు ఫిన్ అలెన్ (23) పర్వాలేదనిపించాడు. సదరన్ బ్రేవ్ బౌలర్లలో నిఖిల్ చౌదరీ, డానియెల్ వోర్రల్, స్టోయినిస్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం సదరన్ బ్రేవ్ 97 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ట్రిస్టన్ స్టబ్స్ (28 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, మార్కస్ స్టోయినిస్ (25 బంతుల్లో 46) మెరిశాడు. ఓపెనర్ జేమి స్మిత్ (26) పరుగులు చేశాడు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో క్లావిన్ హారిసన్ 2 వికెట్లు తీయగా, బెన్ సాండర్సన్, క్రెయిగ్ ఓవర్టన్ చెరొక వికెట్ పడగొట్టారు.Tristan Stubbs reaches his 50 with a six! It's game on 👊#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/yfoaFvNGMK— The Hundred (@thehundred) August 8, 2026Read: లంకతో తొలి టెస్టుకు భారత జట్టు.. తెరపైకి ఊహించని పేరు!
లంకతో తొలి టెస్టుకు భారత జట్టు.. తెరపైకి ఊహించని పేరు!
భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ శ్రీలంకతో టెస్టు సిరీస్కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. తన జట్టులో సర్ఫరాజ్ ఖాన్కు చోటు కల్పించిన కైఫ్.. ధ్రువ్ జురెల్ కంటే సర్ఫరాజ్ ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది కూడా స్పష్టంగా వివరించాడు. ధ్రువ్ జురెల్తో పోలిస్తే సర్ఫరాజ్ స్పిన్ బౌలింగ్ను సమర్థంగా ఆడగలడని, గాలే పిచ్ పరిస్థితులకు సర్ఫరాజ్ బ్యాటింగ్ శైలి సరిగ్గా నప్పుతుందని పేర్కొన్నాడు. "ట్రెండ్ను ఫాలో అవుతూ ప్రస్తుతం ఉన్న జట్టులో జురెల్కు అవకాశం కల్పిస్తారేమో. అతడు నిలకడ ప్రదర్శన చేయనప్పటికీ, ఇప్పటికే జురెల్ జట్టులో భాగమని భావిస్తే మాత్రం సర్ఫరాజ్ అవకాశం కోసం వేచి చూడాల్సిందే. కానీ నా దృష్టిలో మాత్రం ఐదు లేదా ఆరో స్థానంలో స్పిన్ను సమర్థంగా ఆడగల సత్తా సర్ఫరాజ్ ఖాన్కు ఉందని అనుకుంటున్నా. సుదీర్ఘంగా సాగే టెస్టు ఫార్మాట్లో పిచ్ పరిస్థితులు అర్ధమయ్యేకొద్దీ సర్ఫరాజ్ రకరకాల షాట్లు ఆడుతూ తన శైలి బ్యాటింగ్ కొనసాగించగలడు. ముఖ్యంగా ఉపఖండపు పిచ్ల్లో టెస్టుల్లో నాలుగు లేదా ఐదో రోజు వచ్చేసరికి స్పిన్కు బాగా అనుకూలిస్తుంది. ఈ సమయంలో బ్యాటింగ్ కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలోనే సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు బాగా ఉపయోగపడగలడు. అతనికి స్వీప్లు, రివర్స్ స్వీప్లు, ఎక్స్ట్రా కవర్స్, బ్యాక్ఫుట్ ఇలా ఏ షాటైనా స్పిన్ బౌలింగ్లో ఆడగలడు. ఇక జురెల్ ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల శ్రీలంక ఎలెవెన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో జురెల్ రెండు ఇన్నింగ్స్లు కలిపి 18 పరుగులు మాత్రమే చేశాడు. దీన్నిబట్టి ఇటీవలి అతడి టెస్టు రికార్డు, ఫామ్ అంత గొప్పగా లేవనిపిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.ధ్రువ్ జురెల్ ఇప్పటివరకు 10 టెస్టులాడి 478 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, అర్ధసెంచరీ ఉన్నాయి. మరోవైపు 2024లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఆరు టెస్టుల్లో 371 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలున్నాయి. శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.కైఫ్ ప్లేయింగ్ ఎలెవెన్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్/ సారాంశ్ జైన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
కళ్లు చెదిరే ఎండార్స్మెంట్లు.. వైభవ్ సంపాదన ఎంతంటే?
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించాడు. మ్యాచ్ల పరంగా ఆట ఎలా ఉన్నా ఎండార్స్మెంట్ల విషయంలో మాత్రం వైభవ్ సూర్యవంశీ దూసుకెళ్తున్నాడు. దీంతో 15 ఏళ్ల వయసుకే కళ్లు చెదిరే మొత్తాన్ని అందుకుంటున్న వైభవ్ సంపాదనలోనూ స్టార్ హోదా పొందాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న సమయంలోనే వైభవ్ సూర్యవంశీ తన బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులు పెంచినట్లు సమాచారం. అయినప్పటికీ అతడి కోసం ఎండార్స్మెంట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. వైభవ్ వాణిజ్య విలువకు సంబంధించి ఒక్కోటి కోటి రూపాయల మార్కును దాటినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అతడి నికర ఆస్తి విలువ రూ. 7 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. దీనికి తోడు ఐపీఎల్ జీతం, మ్యాచ్ ఫీజులు, దేశవాళీ క్రికెట్ రూపంలో వస్తున్న డబులు అదనమని చెప్పొచ్చు.వైభవ్ ఆమోదించిన బ్రాండ్లు..👉ఎస్ఎస్ బ్యాట్స్: సచిన్ టెండూల్కర్ తన ఐకానిక్ MRF బ్యాట్ స్పాన్సర్షిప్తో ప్రసిద్ధి చెందగా, సూర్యవంశీ ఇంకా ఏ కార్పొరేట్ దిగ్గజంతోనూ భారీ ఒప్పందం కుదుర్చుకోలేదు. అయితే, అతను ప్రస్తుతం సరీన్ స్పోర్ట్స్ (SS)తో సంవత్సరానికి సుమారు రూ. 50 లక్షల విలువైన పరికరాల ఒప్పందాన్ని కలిగి ఉన్నాడు. SS మార్కెట్లో ప్రత్యేకమైన "వైభవ్ సూర్యవంశీ ఎడిషన్" బ్యాట్లను కూడా విడుదల చేసింది.👉కాంప్లాన్: 2026 ప్రారంభంలో వైభవ్ కాంప్లాన్ వారి "థోడా ప్లాన్, థోడా కాంప్లాన్" ప్రకటన ప్రచారానికి అంబాసిడర్గా మారాడు. సరైన పోషణ , అంకితభావంపై దృష్టి సారించే ఈ ప్రకటన, ఒక యువ అథ్లెట్గా సూర్యవంశీ నిజ జీవిత దినచర్యను ప్రతిబింబిస్తుండడం విశేషం.👉గూగుల్ పే: ప్రస్తుతం వైభవ్ గూగుల్ పే ప్రచారకర్తగా ఉన్నాడు. ఈ ప్రకటనలో, అతడు తన తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాకు అనుసంధానించబడిన UPIని ఉపయోగిస్తూ, టీనేజర్ల కోసం సురక్షితమైన డబ్బు నిర్వహణను హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాడు.👉రెడ్బుల్: ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ తరఫున ధ్రువ్ జురెల్తో కలిసి వైభవ్ రెడ్బుల్ చాలెంజ్లో పాల్గొని అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు.👉జార్ఖండ్ ఆరోగ్యశాఖ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతను చురుకుగా, ఫిట్గా, ఆరోగ్యంగా ఉండేలా ప్రేరేపించడానికి వైభవ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తామని జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి 2026 మేలో ఒక ప్రకటన విడుదల చేశారు.👉ఇక ఇంగ్లండ్ పర్యటన ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ గత నెలలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో రెండు మెరుపు అర్ధశతకాలతో 151 పరుగులు చేశాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఈస్ట్జోన్కు ప్రాతినిధ్యం వహించనున్న వైభవ్ వైస్కెప్టెన్గా జట్టును నడిపించనున్నాడు.Read: ‘అతడి జోలికి వెళ్లొద్దు’.. ఫిఫాకు ట్రంప్ వార్నింగ్!
న్యూస్ పాడ్కాస్ట్
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్య
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
చంద్రబాబు పాలన రైతులకు హానికరం... చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ... వైఎస్ జగన్ ఆగ్రహం
అసత్య ప్రచారంలో ఆరితేరిన ఏపీ సీఎం చంద్రబాబు... రెండు మినహా హామీలన్నీ అమలు చేశానంటూ బుకాయింపు...
బీసీ నేతలపై రెడ్బుక్!. బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అక్రమ అరెస్టులు
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
బిజినెస్
దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్హౌస్ కొనుగోలు
భారతీయ రియల్ ఎస్టేట్ రంగ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఉన్న డీఎల్ఎఫ్ లగ్జరీ ప్రాజెక్ట్ ‘ది దాలియాస్’లోని ఒక సూపర్ లగ్జరీ పెంట్హౌస్ ఏకంగా రూ.271 కోట్లకు అమ్ముడై దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రముఖ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థ ‘ఇంపీరియల్ ఆటో’ గ్రూప్నకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మానవ్ సర్దానా ఈ డీల్ను దక్కించుకున్నారు.దేశంలోనే అత్యధిక ధరఈ ప్రాపర్టీ ధరల వివరాలు రియల్టీ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ పెంట్హౌస్ సూపర్ ఏరియా 17,200 చదరపు అడుగులు కాగా కార్పెట్ ఏరియా 10,500 చదరపు అడుగులు. సూపర్ ఏరియా ప్రాతిపదికన చదరపు అడుగుకు రూ.1.58 లక్షలు పడగా, కార్పెట్ ఏరియా లెక్కన చదరపు అడుగుకు ఏకంగా రూ.2.6 లక్షలు వ్యయమైంది. సాధారణంగా ముంబైలోని వర్లీ, మలబార్ హిల్స్ వంటి ప్రాంతాల్లో మాత్రమే ఇటువంటి భారీ ధరలు కనిపిస్తాయి. అయితే గురుగ్రామ్లో ఒక్క సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ రూ.271 కోట్లకు అమ్ముడవడం భారతదేశపు అత్యంత ఖరీదైన హౌసింగ్ డీల్స్లో ఒకటిగా నిలిచింది.ఎవరీ మానవ్ సర్దానా?1969లో ఫరీదాబాద్లో ఎస్.బి. సర్దానా, జగ్జీత్ సింగ్లు ప్రారంభించిన ఇంపీరియల్ ఆటో ఇండస్ట్రీస్ ప్రపంచస్థాయి సంస్థగా ఎదిగింది. ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్ ప్రొడక్ట్స్ (పైప్లైన్లు, హోస్ అసెంబ్లీలు) తయారీలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థకు భారత్లో 20కి పైగా, విదేశాల్లో 3 ఉత్పాదన కేంద్రాలు ఉన్నాయి. గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం 'వార్బర్గ్ పింకస్' ఈ సంస్థను కొనుగోలు చేసుకున్నప్పటికీ సర్దానా కుటుంబం ఇంపీరియల్ ఆటో గ్రూప్లో క్రియాశీలకంగా కొనసాగుతోంది.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..
టీసీఎస్ ఉద్యోగుల డేటా లీక్!
దేశీయ ఐటీ సేవల రంగానికి చెందిన ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగుల వ్యక్తిగత వివరాల లీకేజీ వార్తలపై అధికారికంగా స్పందించింది. కొంతమంది ఉద్యోగులకు సంబంధించిన ప్రాథమిక సమాచారం బహిర్గతం అయ్యే అవకాశం ఉందంటూ 'త్రెట్ ఇంటెలిజెన్స్' హెచ్చరికలు జారీ చేసింది. దాంతో సంస్థ స్పందించి సైబర్ భద్రతా తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో తమ కస్టమర్ల డేటా, వ్యాపార వ్యవస్థలు, అంతర్గత నెట్వర్క్లు అత్యంత సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి డేటా చోరీ జరగలేదని టీసీఎస్ స్పష్టం చేసింది.నాలుగేళ్ల క్రితం నాటి డేటా?బహిర్గతం అయినట్లు ప్రచారం జరుగుతున్న ఉద్యోగుల డేటా దాదాపు నాలుగేళ్ల క్రితం నాటిదని, అది కూడా కేవలం ప్రాథమిక వివరాలకు మాత్రమే పరిమితమైందని టీసీఎస్ వెల్లడించింది. హ్యాకర్లు ‘పాస్వర్డ్ స్ప్రే’, 'మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఫెటీగ్' వంటి సైబర్ దాడి పద్ధతులను ఉపయోగించినట్లు దావా వేసినప్పటికీ తమ రక్షణ వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా ఈ తరహా సైబర్ దాడులను నిరోధించేందుకు అత్యంత బలమైన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ను అమలు చేస్తున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ దాఖలు చేసిన నివేదికలో పేర్కొంది.సైబర్ భద్రతపై ముమ్మర నిఘాక్లయింట్ల నమ్మకాన్ని, డేటా భద్రతను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యతని స్పష్టం చేసిన టీసీఎస్ ప్రస్తుతం ఐటీ నెట్వర్క్ వాతావరణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. సైబర్ ముప్పులపై క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ అవసరమైన తక్షణ చర్యలు తీసుకుంటున్నామని వివరించింది.ఇటీవలే టాటా గ్రూప్నకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి సంస్థలు సైబర్ దాడులను ఎదుర్కొన్న నేపథ్యంలో ఐటీ దిగ్గజం టీసీఎస్ సైబర్ భద్రతా విభాగాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపింది. సంస్థల సమాచార భద్రతపై గ్లోబల్ క్లయింట్లలో ఎటువంటి ఆందోళన కలగకుండా ముందస్తుగా ఈ ప్రకటన విడుదల చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..
నిఫ్టీ-50 నుంచి విప్రో అవుట్!
భారతీయ స్టాక్ మార్కెట్ బెంచ్మార్క్ సూచీ నిఫ్టీ-50లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా నిఫ్టీలో నిలకడగా కొనసాగుతున్న స్వదేశీ ఐటీ దిగ్గజం విప్రో ప్రధాన సూచీ నుంచి వైదొలగనుంది. దాని స్థానంలో దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఆపరేటర్ అయిన బీఎస్ఈ ప్రవేశించనుంది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఇండెక్స్ మెయింటెనెన్స్ కమిటీ తన అర్ధవార్షిక సమీక్ష వివరాలను వెల్లడించింది. ఈ మార్పులు సెప్టెంబర్ 30, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.ఈ పరిణామం కేవలం ఒక సాంకేతిక సూచీ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాదు; భారత కార్పొరేట్ రంగంలో సంభవిస్తున్న నాటకీయ మార్పునకు బలమైన నిదర్శనం. గత ఆరు నెలల సగటు ఫ్రీ-ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా చూస్తే బీఎస్ఈ విలువ రూ.1,40,879 కోట్లకు చేరగా విప్రో విలువ రూ.55,930 కోట్లకు పరిమితమైంది. నిబంధనల ప్రకారం కనిష్ట పరిమాణంలో ఉన్న కంపెనీ కంటే 1.5 రెట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ సాధించిన బీఎస్ఈ ప్రధాన సూచీకి అర్హత సాధించగా విప్రో 'నిఫ్టీ నెక్స్ట్ 50'కి మారనుంది.ఒకప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా నిలిచిన ఐటీ పరిశ్రమ వర్తమాన సవాళ్లను ఎదుర్కొంటోందని ఇది స్పష్టం చేస్తోంది. గ్లోబల్ టెక్నాలజీ క్లయింట్ల బడ్జెట్ కోతలు, డిస్క్రిషనరీ వ్యయాల్లో మందగమనం, ఏఐ తెస్తున్న సాంకేతిక విప్లవం సంప్రదాయ అవుట్సోర్సింగ్ ప్రాజెక్టుల లాభదాయకతను ఒత్తిడిలోకి నెట్టాయి. నిఫ్టీ-50లో టాప్-5 ఐటీ కంపెనీల ఉమ్మడి వెయిటేజీ ఈ ఏడాది 9 శాతం కంటే దిగువకు పడిపోవడం గమనార్హం. 2002 సంవత్సరం తర్వాత ఐటీ రంగానికి ఇది అత్యల్ప నిష్పత్తి కావడం విశేషం.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..
ఏఐ వ్యయం పెంచాల్సిందేనన్న ఆర్బీఐ!
భారతీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా డిజిటలైజ్ అవుతున్న తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశీయ బ్యాంకింగ్ రంగానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన దిశానిర్దేశం చేసింది. వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలను విస్తరించేందుకు సంబంధిత డిజిటల్ మౌలిక సదుపాయాలపై తమ వ్యయాన్ని వేగవంతం చేయాలని కేంద్ర బ్యాంకు పిలుపునిచ్చింది.సాంకేతిక పరివర్తన.. వ్యూహాత్మక ప్రాధాన్యంప్రస్తుత ఆధునిక బ్యాంకింగ్లో సాంకేతిక వ్యయం అనేది కేవలం ఒక సాధారణ నిర్వహణ ఖర్చు కాదని, అది బ్యాంకుల భవిష్యత్తు మనుగడకు, స్థిరత్వానికి అవసరమైన వ్యూహాత్మక మూలధన పెట్టుబడి అని ఆర్బీఐ స్పష్టం చేసింది. రుణ అర్హతల సమగ్ర విశ్లేషణ (క్రెడిట్ రిస్క్ అసెస్మెంట్), తక్షణ రుణాల మంజూరు, సైబర్ దాడుల ముందస్తు గుర్తింపు, ఆన్లైన్ మోసాల నివారణ, ఖాతాదారులకు అనుగుణమైన సేవలను వేగంగా అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది.రెస్పాన్సిబుల్ ఏఐసాంకేతికత వాడకం పెరిగే కొద్దీ దానితో పాటు వచ్చే వ్యవస్థాగత సవాళ్లను కూడా బ్యాంకులు సమానంగా పరిగణనలోకి తీసుకోవాలి. జనరేటివ్ ఏఐ సాధనాల వినియోగంలో డేటా ప్రైవసీ (సమాచార గోప్యత), సైబర్ సెక్యూరిటీ లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలి. బిగ్-టెక్ సంస్థలు, థర్డ్-పార్టీ ఫిన్టెక్ ప్లాట్ఫామ్లపై మితిమీరిన ఆధారపడటం వ్యవస్థాగత ప్రమాదాలకు దారితీయవచ్చని ఆర్బీఐ గుర్తుచేసింది. అందుకే బాధ్యతాయుతమైన ఏఐ విధానాలను అమలు చేస్తూ పారదర్శకమైన అంతర్గత నియంత్రణ చట్రాన్ని రూపొందించుకోవడం అనివార్యం.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..
ఫ్యామిలీ
నిరాశకు చెక్ పెట్టి...
పదే పదే పరాజయమే పలకరిస్తూ ఉండడంతో నిరాశలోకి జారిపోయి.. ‘ఇక ఆడింది చాలు’ అని చెస్కు టాటా చెప్పేద్దాం అనుకుంటున్న సమయంలో... తల్లిదండ్రులు, కోచ్ మాటల వెలుగు ఆమె మదికి చేరింది. ‘ఈసారి ఓడిపోయినా, వచ్చేసారి కచ్చితంగా గెలుస్తాను’ అనే క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లి ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది గుంటూరుకు చెందిన నిహారిక చల్లా. తాజా విషయానికి వస్తే... ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (మహిళా అంతర్జాతీయ మాస్టర్) హోదా సాధించి తన ప్రత్యేకతను చాటుకుంది. స్పెయిన్లోని పోంటెవెడ్రా మాస్టర్స్ ఓపెన్ టోర్నమెంట్లో మూడవ నార్మ్తో ఈ ఘనత సాధించింది నిహారిక.కొన్ని సంవత్సరాల క్రితం...తండ్రి రమేష్తో సరదాగా చెస్ ఆడడం మొదలుపెట్టింది నిహారిక. ఈ క్రమంలో కూతురిలోని ప్రతిభను గుర్తించిన తండ్రి గుంటూరులోని ‘రవీంద్ర రాజు అకాడమీ ఆఫ్ చెస్ ఎడ్యుకేషన్’లో చేర్పించారు. కోచ్ రవీంద్ర రాజు శిక్షణలో తన ఆట తీరును మరింతగా మెరుగు పరుచుకోవడం మొదలుపెట్టింది నిహారిక. నిహారిక పట్టుదల, ఆటలో చురుకుదనం గమనించిన కోచ్ ప్రతి రోజూ ఆరు నుంచి ఏడు గంటలు సాధన చేయించే వారు. ఒకవైపు ఎంబిఏ చదువు, మరోవైపు చదరంగ సాధన... దీంతో ఆమెకు సరదా సమయాలు అంటూ లేకుండా పోయాయి. మొబైల్ ఫోన్లు, టీవి చూడడం లాంటి వాటికి చాలా తక్కువ సమయం కేటాయించేది. చెస్ ఆపేద్దామని...‘ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్’ అయ్యేందుకు దేశవిదేశాల్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. 2023లో పోలెండ్లో జరిగిన టోర్నీలో 9 రౌండ్లకు గాను నిహారిక కేవలం ఒక్క పాయింటే గెలుచుకుంది. దీంతో ఆమెను నిరాశ ఆవరించింది.ఆ బాధలోనే ‘ఇక చెస్ వదిలేద్దాం అనుకుంటున్నాను’ అన్నది కుటుంబ సభ్యులతో.‘ఆ మాట నీ నోటి నుంచి ఎప్పుడూ రాకూడదు. నువ్వు గెలిచే రోజు కచ్చితంగా వస్తుంది’ అని చెప్పారు తల్లిదండ్రులు.‘విజేతల వెనకాల కూడా పరాజయాలు ఉంటాయి. వాటిని దాటుకునే విజయాలు సాధించారు’ అంటూ ఎంతోమంది ప్రముఖ చెస్ ఛాంపియన్ల గురించి చెప్పారు కోచ్ రవీంద్ర రాజు.కుటుంబ సభ్యులు, కోచ్ మాటలు నిహారికలో కొత్త కాంతిని, ఉత్తేజాన్ని నింపాయి.మళ్లీ పూర్వ ఉత్సాహంతో ఆడడం మొదలు పెట్టింది. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అద్భుత విజయాలు సాధించింది. తాజాగా ‘ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్’ హోదా గెలుచుకుంది.నా కల... గ్రాండ్ మాస్టర్విజయాలు సాధించాలంటే ఓటములను తట్టుకునే శక్తిని పెం΄÷ందించుకోవాలి. ప్రతి ఓటమినీ అద్భుతమైన పాఠం కిందే తీసుకున్నాను. సమయాన్ని సమర్థంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల రోజుకు ఆరు గంటల చెస్ సాధనతో ‘ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్’ హోదా సాధించాను. 80 ప్లస్ మార్కులతో ఎంబిఏ పూర్తి చేసాను. కాస్పరోవ్, హంపీ నా అభిమాన ప్లేయర్స్. జియం ఆవడమే నా లక్ష్యం.– నిహారిక చల్లా – మురమళ్ళ శ్రీనివాసరావు, సాక్షి స్పోర్ట్స్, గుంటూరుఫొటోలు: గజ్జల రామ్గోపాల్ రెడ్డి
ఆలనాపాలన... రోడ్డుపాలు చేయొద్దు!
డాక్టర్ కావాల్సిన ప్రియాంక నూరేళ్ల జీవితం క్షణాల్లో కడతేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఘటన అందరి మనసునూ కలచివేసింది. పిల్లలకు కార్లిచ్చి పంపుతున్న తల్లిదండ్రులు ఆ పిల్లల ధోరణి గమనిస్తున్నారా?రేస్ ఉన్మాది – స్పీడ్ కోసం ప్రాణాలు తీసేవాడుఈగో ఉన్మాది – ‘దారి ఇవ్వలేదు’ అని గుద్దేవాడుమత్తు ఉన్మాది – తాగి స్టీరింగ్ పట్టేవాడుడాడీ పవర్ ఉన్మాది – ‘నాన్న చూసుకుంటాడు’ అని నడిపేవాడు. ఇంట్లో ‘బంగారు తండ్రి’ అని పిలుచుకునే కొడుకు రేపు ఈ నలుగురిలో ఒకడు కాకుండా చూసుకుంటున్నామా?ఆగస్టు 3, 2026 రాత్రి 10:00 గంటలు. రాజమండ్రిలోని ఒక మాల్లో సినిమా చూసి బయటకు వచ్చిన ప్రియాంక (28) తన స్కూటీ తీసి ఫ్రెండ్తో కలిసి ఇంటికి బయలుదేరింది. బహుశా ఆమె సినిమా కబుర్లలో మునిగి ఉంటుంది. హాస్టల్ నుంచి ఫోన్ వస్తే ‘ఇంకో పావుగంటలో చేరుకుంటున్నాం’ అని కూడా చెప్పి ఉంటుంది. కాని ప్రియాంక జీవితం సడన్గా విషాదంలో కూరుకుపోయింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ వాహనంతో ప్రియాంక స్కూటీని ఢీకొట్టడమే కాదు, ప్రియాంక తలపై నుంచి కారును పోనిచ్చి పరారయ్యారు.ఆ క్షణమే కోమాలోకి వెళ్లిన ప్రియాంక ఆగస్టు 9న మృతి చెందింది. ఆ అమ్మాయి చేసిన నేరం ఏమిటి? ఏ కొద్ది మందికో దక్కే ఎంబీబీఎస్ కోర్సు చదివి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఉన్న అమ్మాయి క్షణంలో ఉన్మాద చర్యకు ప్రాణం కోల్పోవడం ఏమిటి? ఆమె మృతికి ఇద్దరు వ్యక్తులే కారణంగా పైకి కనిపించవచ్చు. కాని వారి ‘మైండ్సెట్’ను అలా తయారు చేసిన వ్యవస్థ, పెంపకం, వ్యసనం, లెక్కలేనితనం... ఇవన్నీ కారణాలే. ఇవి సరికానంత వరకూ ఇలాంటి ఉత్పాతాలు జరగవని గ్యారంటీ ఇవ్వలేము. రోడ్డు మీద క్షేమంగా తిరగలేము.నాలుగు రకాల ఉన్మాదాలురోడ్ల మీద తిరిగే వాహనాల బ్రాండ్ కంటే వాటిని నడుపుతున్న మనుషుల మనస్తత్వాలు ముఖ్యం. నేటి రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే వాటికి కారణమైన వారిలో నాలుగు రకాల ఉన్మాదులు కనిపిస్తున్నారు.రేస్ ఉన్మాది: కేవలం స్పీడ్ కోసం, రోడ్డుపై థ్రిల్ కోసం పక్కవారి ప్రాణాలు తీసేవాడు. ‘మావాడు బైక్ స్పీడ్గా నడుపుతాడు’ అని తల్లిదండ్రులే గొప్పగా చెప్పి ఇలా తయారు చేస్తున్నారు. ‘ఫాస్ట్గా నడిపే వాడే గొప్ప’ అని కుర్రాడి బుర్రలో ఉంటే ఎవరిది దోషం?ఈగో ఉన్మాది: ‘నాకు దారి ఇవ్వలేదు’ అని, అహం దెబ్బతిన్నదని కావాలనే వెనుక నుంచి గుద్దేసేవాడు. ‘వాడికి ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు’ అని తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి అహాన్ని సాకుతారు.మత్తు ఉన్మాది: ఒంట్లో ఎంత మద్యం ఉందో తెలియకుండానే స్టీరింగ్ పట్టి, రోడ్డుపై నడిచే ప్రతి ఒక్కరినీ టార్గెట్గా మార్చేవాడు. స్నేహితులు ఎలాంటివారో తల్లిదండ్రులు చూడకపోవడం, రాత్రి ఒంటి గంటకు కూడా రాకపోతే పార్టీకి వెళ్లాడు అని సరిపెట్టుకోవడం... దాని ఫలితం ఇది.డాడీ పవర్ ఉన్మాది: ‘నా వెనుక నాన్న ఉన్నాడు, ఏ తప్పు చేసినా చూసుకుంటాడు’ అనే నమ్మకంతో బరితెగించి వాహనం నడిపేవాడు. కొడుక్కు పద్దెనిమిదేళ్లు రాకముందే తండ్రి కారు కీ చేతికి ఇవ్వడం, పోలీసు ఆపితే నా పేరు చెప్పు అని తండ్రి అనడం... ఇంకేముంది?రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను బలితీసుకున్నది ఈ ఉన్మాదాల కలయికే. ఈ విపరీత ధోరణులు రాత్రికి రాత్రి పుట్టవు. చిన్నప్పటి నుంచి తయారై ఉంటాయి. 20 సెకన్లలో జరిగిన ప్రియాంక మృత్యుఘటన వెనుక ‘20 ఏళ్ల బాధ్యతారాహిత్యపు పెంపకం’ కారణమై ఉండొచ్చు. రాత్రి పది తర్వాత కొడుకు బయట ఉంటే కారో, బైకో వేసుకుని తిరుగుతుంటే ‘ఎక్కడ ఉన్నావు?’ అని అడగ్గలిగే స్థితిలో తల్లిదండ్రులు లేకపోయినా, ‘చెప్పాల్సిన పని లేదనే’ ధోరణిలో పుత్రరత్నాలు ఉన్నా అది సమాజానికి అపాయకరం. మరవకూడని పాఠంఈ రోజు డాక్టర్ ప్రియాంక మన మధ్య లేదు. కానీ ఆమె మరణం నేర్పిన పాఠం చాలా పెద్దది. తల్లిదండ్రులారా.. మీ కొడుకులకు ఎదుటివారికి గౌరవం ఇవ్వడం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్పండి. రోడ్డు మీద కారు స్టీరింగ్ చేతిలో ఉందనో, వెనుక అండ ఉందనో అహంకారంతో ప్రవర్తిస్తే చట్టం ముందు, సమాజం ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించండి. కొడుకులను బాధ్యతగల పౌరులుగా పెంచినప్పుడే మన ఇళ్లలో, సమాజంలో నిజమైన భద్రత ఉంటుంది. బతుకును మింగే ‘బెల్టు’కంటి రెప్ప కునుకేస్తేనే స్టీరింగ్ ఎటో పోతుంది. మరి మత్తు తలకెక్కితే? అడుగుకొక బెల్టు షాపు రారమ్మని పిలుస్తుంటే దారిన పోయేవాడు ఆగి కాసింత పోసుకొని బయల్దేరుదాం అనుకుంటాడు. ఆ తర్వాత ప్రాణాల మీదకు తెస్తాడు. వ్యవస్థ ఇలా ఉంటే దానిని ఆపాల్సిన బాధ్యత పాలనది, పౌర సమాజానిది. అధిక అందుబాటు, వేళాపాళా లేకుండా సాగే అమ్మకాలు సహించరానివి. దీనికి కారకులెవరు... నిజంగా మత్తులో తేలుతున్నది ఎవరు అనేది కూడా తేలాలి.ఏం చేయాలి?→ లైసెన్స్ తీసుకోకుండా, 21 ఏళ్లు రాకుండా కారు ఇవ్వకండి. ఇచ్చే ముందు ‘నువ్వు తప్పు చేస్తే నేను కేసు నుంచి తప్పించను’ అని గట్టిగా చెప్పండి → ప్రతి రాత్రి 9 గంటలకల్లా కొడుకు ఇంటికి వచ్చాడా? కారు ఎక్కడుంది? పార్టీలో ఉన్నాడా... ఫోన్ చేసి చెక్ చేయండి. ఇది అనుమానం కాదు. బాధ్యత → ‘సారీ’ చెప్పడం నేర్పండి. రోడ్డుపై ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే దిగి క్షమాపణ చెప్పే అలవాటు చేయండి. ఈగో కంటే మనిషితనం గొప్పదని చూపించండి → సినిమా, రీల్స్ గురించి మాట్లాడండి. ‘రేసింగ్ సీన్లు సినిమాకే బాగుంటాయి... నిజ జీవితంలో చాలా ప్రాణాంతకం’ అని కూర్చుని చెప్పండి. హీరోయిజం అంటే స్పీడ్ కాదు.... బాధ్యత అని చెప్పండి.→ శిక్ష నుంచి తప్పించకండి. చిన్న స్క్రాచ్ అయినా, చిన్న ఫైన్ అయినా అబ్బాయినే కట్టనివ్వండి. ‘నాన్న ఉన్నాడు’ అనే నెట్ తీసేయండి. భయం ఉంటేనే బుద్ధి వస్తుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద గుహ.. ఇదొక ట్రావెల్ అడ్వెంచర్!
ప్రపంచంలోనే అతి పెద్ద గుహ అయిన సాన్ డూంగ్ కేవ్లోకి ఎంటర్ అయితే మనం మరో గ్రహంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. వియత్నాంలోని ఫోంగ్ నా కే బ్యాంగ్ నేషనల్ పార్క్లో సాన్ డూంగ్ కేవ్ ప్రపంచంలోనే అతిపెద్ద నేచురల్ కేవ్గా ప్రసిద్ధి పొందింది.ఈ గుహ లోపల పెద్ద పెద్ద అడవులు, ప్రవహిస్తున్న నదులు, 200 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తైన రాక్ వాల్స్, పై నుంచి పడే సూర్య కిరణాలు కలిసి ఒక మ్యాజికల్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. నేచర్ తన కళతో క్రియేట్ చేసిన మాస్టర్ పీస్ అని చెప్పడం అతిశయం కాదు.ఎందుకు స్పెషల్ ?సాన్ డూంగ్ గుహను 1991లో కనుగొన్నారు. కానీ 2009 లో అంతర్జాతీయ పరిశోధకులు పూర్తిగా సర్వే చేసిన అనంతరం ఈ గుహకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. సుమారు 9 కిమీ పొడవు, 200 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల వెడల్పు ఉన్న ఈ గుహలో ఒక చిన్న అడవి, మేఘాలు క్రియేట్ అయ్యే వాతావరణం, అండర్గ్రౌండ్ నది కూడా ఉంటాయి. అందుకే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద గుహ అని కూడా అంటారు.హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ముందుగా వియత్నాంలోని హానోయ్ లేదా హో చి మిన్ సిటీ కి కనెక్టింగ్ విమానం తీసుకోవాలి. అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్లో డాంగ్ హోయ్ ఎయిర్పోర్టుకు చేరుకోవాలి. డాంగ్ హోయ్ నుండి సుమారు 45 కిమీ దూరంలో ఫోంగ్ నా విలేజ్కి ట్యాక్సీ లేదా షటిల్ బస్లో చేరుకోవచ్చు. సాన్ డూంగ్ కేవ్కి గవర్నమెంట్ అప్రూవ్డ్ గైడ్ ద్వారా మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి.బడ్జెట్ ఎంత అవుతుంది? అఫిషియల్ సాన్ డూంగ్ ఎక్స్పిడిషన్ అనేది 4 నుంచి 6 రోజులు ఉంటుంది. గైడ్, పర్మిట్స్, క్యాంపింగ్, ఫుడ్ అన్నీ కలిసి ఒక వ్యక్తికి రూ.2 లక్షల 80 వేల నుంచి రూ.3 లక్షల 5 వేల వరకు ఖర్చు అవుతుంది. వియత్నాం ట్రిప్ని సాన్ డూంగ్ ఎక్స్పిడిషన్ లేకుండా ఫోంగ్ నా రీజియన్ వరకు ప్లాన్ చేస్తే రూ.60 వేల నుంచి రూ.90 వేల బడ్జెట్లో కంఫర్టబుల్గా పూర్తి చేయవచ్చు.ఏం తినాలి?వియత్నాం ఫుడ్ లవర్స్కి స్వర్గంలాంటిది. ఒక్క ఫో నూడిల్ సూప్, బాన్ మీ శాండ్విచ్, ఫ్రెష్ స్ప్రింగ్ రోల్స్, కామ్ టామ్ చాలా ఫేమస్. శాఖాహారుల కోసం వెజ్ ఆప్షన్స్ కూడా బాగానే ఉంటాయి. వియత్నాం లోకల్ కాఫీని మాత్రం మిస్ అవ్వకండి.దగ్గర్లో చూడాల్సినవిసాన్ డూంగ్ కేవ్తో పాటు ఫోంగ్ నా కేవ్, ప్యారడైజ్ కేవ్, డార్క్ కేవ్, మూక్ స్ప్రింగ్ ఎకో ట్రెయిల్, బొటానిక్ గార్డెన్ లాంటి ప్రాంతాలను అన్వేషించవచ్చు. ఈ ప్రాంతం మొత్తం యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపద కాబట్టి ప్రతీ చోట నేచర్ బ్యూటీ కనిపిస్తుంది.సాహసమే శ్వాసగా సాగిపోయేవారికి, నేచర్, ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్ ఈ నాలుగు మీకు ఇష్టం అయితే సాన్ డూంగ్ కేవ్ని లైఫ్లో ఒక్కసారి అయినా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశం. ఇది ఒక గుహ మాత్రమే కాదు... భూమిలోపల దాగున్న అద్భుత ప్రపంచం ఇది. వియత్నాం ట్రిప్ ప్లాన్ చేస్తున్న వాళ్లకి ఇది ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది.
వర్షం పడినా జర్నీ స్టైల్ తగ్గకూడదంటే… ఇలా చేయండి!
వర్షాకాలం అంటే కేవలం వర్షాలు మాత్రమే కాదుం చల్లని గాలి, పచ్చని ప్రకృతి, తాజా వాతావరణంతో ట్రావెల్కి పర్ఫెక్ట్ సీజన్ కూడా. కానీ వర్షాకాలంలో డ్రెస్సింగ్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటే జర్నీ మరింత కంఫర్టబుల్గా ఉంటుంది. స్టైల్తో ΄ాటు కంఫర్ట్ని మెయింటేన్ చేయడం మాన్ సూన్ ఫ్యాషన్ లో ముఖ్యం.తక్కువ బరువు ఉన్న ఫ్యాబ్రిక్ ఎంచుకోండివర్షాకాలంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాటన్, లైనిన్, రేయాన్ లాంటి లైట్వెయిట్ ఫ్యాబ్రిక్స్ కంఫర్టబుల్గా ఉంటాయి. హెవీ ఫ్యాబ్రిక్స్ వర్షపు నీటిని పీల్చుకుని ఎక్కువసేపు తడిగా ఉంటాయి. సులువుగా ఆరి΄ోయే బట్టలు అయితే బెటర్.బ్రైట్ కలర్స్ బెస్ట్వర్షాకాలంలో వాతావరణం ఆల్రెడీ కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ΄ాస్టల్ షేడ్స్, బ్రైట్ కలర్స్, ఎర్తీ టోన్స్ మీ ఔట్ఫిట్కి ఫ్రెష్ లుక్ ఇస్తాయి. వైట్ షేడ్స్ కన్నా మురికి అంతగా కనిపించని రంగుల దుస్తువులు ఈ సీజన్ లో పెర్ఫెక్ట్గా సెట్ అవుతాయి.కంఫర్టబుల్ ఫుట్వేర్ ముఖ్యంవర్షాకాలం సీజన్ లో ఫుట్వేర్ సెలెక్షన్ చాలా ఇం΄ార్టెంట్. వాటర్ రెసిస్టెంట్ శాండిల్స్, క్విక్ డ్రై షూస్ లేదా కంఫర్టబుల్ స్లిప్పర్స్ ట్రావెల్కి చాలా సూట్ అవుతాయి. తడిసిన రోడ్డుల్లో కంఫర్ట్ కోసం గ్రిప్ ఉన్న ఫుట్వేర్ ఎంచుకోవడం మంచిది.లేయరింగ్తో స్మార్ట్ లుక్హిల్ స్టేషన్ లేదా చల్లని ప్రదేశాలకు ఈ వర్షాకాలంలో వెళ్తే మాత్రం లైట్ జాకెట్, హుడీ లేదా విండ్చీటర్ క్యారీ చేయడం మంచిది. ఉదయం, సాయంత్రం ఉష్ణోగ్రతల్లో మార్పు ఉంటుంది. కాబట్టి లేయరింగ్ స్టైల్తో కంఫర్ట్ మెయింటేన్ చేయవచ్చు.రెయిన్ ఆక్సెసరీస్గొడుగు, లైట్వెయిట్ రెయిన్ కోట్, వాటర్ప్రూఫ్ బ్యాగ్ కవర్ లాంటి యాక్సెసరీలు మాన్ సూన్ వార్డ్రోబ్లో భాగం అవుతాయి. మరీ ముఖ్యంగా ట్రావెల్లో కెమెరా, మొబైల్, డాక్యుమెంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వాటర్ప్రూఫ్ ΄ûచెస్ బాగా ఉపయోగపడతాయి.హెయిర్, పర్సనల్ కేర్ కూడా ముఖ్యంతేమ వల్ల హెయిర్ కేర్ కొంచెం కష్టంగా అనిపించవచ్చు. సింపుల్ హెయిర్ స్టైల్, కంఫర్టబుల్ క్యాప్స్ లేదా స్కార్ఫ్లు వినియోగించడం వల్ల కాస్త లుక్ మెయింటేన్ చేయవచ్చు. అలాగే జుట్టును ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.వర్షాకాలంలో డ్రెస్సింగ్ అంటే కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు.. వర్షాకాలం అందాన్ని ఎంజాయ్ చేస్తూ కంఫర్టబుల్గా ఉండటం. సరైన ఔట్ఫిట్ ఛాయిస్తో వర్షాకాలంలో ప్రతి ట్రిప్ను స్టైలిష్గా మార్చుకోవచ్చు.
అంతర్జాతీయం
రష్యాపై ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి
కీవ్: ఉక్రెయిన్ తన లాంగ్రేంజ్ డ్రోన్ల సత్తాను మరోసారి రష్యాకు రుచి చూపింది. ఆదివారం రాత్రి రష్యాలోని టాటార్స్తాన్ ప్రాంతంలోని నిజ్నెకామ్స్క్ నగరంపై పాల్పడిన డ్రోన్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 48 మంది గాయాలపాలయ్యారు. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ దాడి ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. అయితే, రష్యా చమురు ప్లాంట్లను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించుకుంది. ఉక్రెయిన్ సరిహద్దుకు 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజ్నెకామ్స్క్ నగర జనాభా 2.40 లక్షలు.నగరంలో రెండు అత్యాధునిక, అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలతోపాటు ఒక పెట్రో కెమికల్ ప్లాంటు ఉన్నాయి. ఉక్రెయిన్ తరచుగా రష్యా ఇంధన మౌలిక వనరులే లక్ష్యంగా దాదాపు ప్రతి రోజూ దాడులకు పాల్పడుతుండటం తెల్సిందే. రష్యాలో చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతినడంతో ఇంధన కొరత తలెత్తింది. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నాలుగేళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ను చర్చలకు దిగేలా చేయడమే తమ దాడుల లక్ష్యమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు. ‘రష్యా పాల్పడిన ప్రతి దాడికీ ధీటుగా మేం బదులిస్తాం. యుద్ధం ప్రభావం రష్యన్లకు కూడా తెలిసేలా చేస్తాం’అని ఆయన వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ దేశీయంగా అభివృద్ధి చేసుకున్న లాంగ్ రేంజ్ డ్రోన్లతో రష్యాలోని సుదూర ప్రాంతాలపైనా దాడులకు పాల్పడుతోంది. సరిహద్దు నుంచి సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలో గల సైబీరియా ప్రాంతంపైనా ఇటీవల దాడి చేసింది. కాగా, ఉక్రెయిన్కు గగనతల రక్షణ వ్యవస్థల కొరత తీవ్రంగా ఉందని తెలిసిన రష్యా నిత్యం శక్తివంతమైన గ్లైడ్ బాంబులు, రకరకాల క్షిపణులు, డ్రోన్లతో పౌర ఆవాసాలపై దాడులు చేస్తోంది. ఉక్రెయిన్లోని నీప్రో ప్రాంతంలో ఉన్న తమ రెండు గోదాములపై రష్యా 24 గంటల వ్యవధిలో రెండుసార్లు దాడులకు పాల్పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం వెల్లడించింది. ఈ దాడుల్లో యుద్ధ క్షేత్రంలోని వారికి ఉద్దేశించిన 5 లక్షల డాలర్ల విలువైన అత్యవసర సాగ్రి ధ్వంసమైందని తెలిపింది. ప్రాణనష్టం మాత్రం సంభవించలేదంది. కాగా, ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వివిధ ప్రాంతాలపైకి ఉక్రెయిన్ ప్రయోగించిన 450కిపైగా డ్రోన్లను మధ్యలోనే కూల్చినట్లు రష్యా తెలిపింది. ఇలా ఉండగా, రష్యాలోని సరిహద్దు బెల్గొరోడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ గత 24 గంటల్లో జరిపిన దాడుల్లో మరో నలుగురు చనిపోయారని అధికారులు తెలిపారు.
ప్రియురాలి హత్య, జర్మనీలో భారతీయ విద్యార్థి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలో ప్రియురాలి హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరవై ఏళ్ల భారతీయ విద్యార్థిని పోలీసులు జర్మనీలో అరెస్టు చేశారు. స్వదేశానికి వెళ్లే క్రమంలో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కేలోపే అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... బచ్చిగారి వరుణ్ అనే విద్యార్థి అరిజోనా యూనివర్సిటీలో బిజినెస్ అనలిటిక్స్ విద్యనభ్యసిస్తున్నాడు. ఈ నెల ఆరవ తేదీ ప్రియురాలు ’జులిస్సా రూబీ సలజార్ (19)ను టక్సన్ సిటీలోని ఆమె అపార్ట్మెంట్లో హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు హత్య అనంతరం వరుణ్ టక్సన్ నుంచి జర్మనీ మీదుగా భారత్కు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు టక్సన్ పోలీసులు తెలిపారు. అయితే టక్సన్ పోలీసులు, ఎఫ్బీఐలు సమన్వయంతో వ్యవహరించి జర్మనీలో విమానం దిగుతూండగానే వరుణ్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ తన ప్రియురాలిని హత్య చేసిన తరువాత ఆమె ఫోన్, క్రెడిట్ కార్డులు తీసుకుని ఆమె తల్లికి మోసేజ్లు పెడుతూ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. అయితే ఆ మెసేజీలపై అనుమానంతో కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆమె యోగక్షేమాలు కనుక్కునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆగస్టు ఆరవ తేదీ సాయంత్రం టక్సన్ అగ్నిమాపక సిబ్బందికి గుండెపోటు ఘటనకు సంబంధించిన సమాచారం ఒకటి అందింది. వారు సలజార్ అపార్ట్మెంట్కు వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. మెడవరకూ బ్లాంకెట్ ఒకటి కప్పి ఉన్నట్లు గుర్తించారు. సలాజర్ మెడపై గొంతు నులిమిన గుర్తులు, గీతలు ఉన్నట్లు తెలిసింది. గతంలో దాడి కేసు... వరుణ్పై గతంలోనే ఒక దాడి కేసు నమోదైనట్లు, దీనిపై అరిజోనా యూనివర్శిటీ పోలీసులు దర్యాప్తు చేసినట్లు అరెస్ట్ వారంట్ ద్వారా తెలిసింది. మనస్పర్ధల కారణంగా సలాజర్ గత ఏడాది ఆఖరు నుంచి వేరుగా ఉంటోందని, గృహ హింస ఆరోపణల నేపథ్యంలో అతడితో తెగతెంపులు చేసుకోవాలని తీర్మానించుకుందని ప్రత్యక్ష సాక్షుల విచారణలో తెలిసింది. పలు సందర్భాల్లో వరుణ్ హింసకు పాల్పడినట్లు కూడా సాక్షులు తెలిపారు. ఈ ఏడాది మే నెలలో పిమా కౌంటీ కోర్టులో వరుణ్పై దాడి, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం వంటి ఆరోపణలపై ఒక కేసు నమోదైనట్లు న్యూయార్క్ పోస్ట్ వెబ్సైట్ తెలిపింది. వరుణ్ ఈ మధ్యే ఉద్యోగం కోల్పోయాడని, అద్దె చెల్లించే స్థితిలోనూ లేకపోవడంతో అతడి వీసా పరిస్థితి ప్రమాదంలో పడిందని కూడా పోస్ట్ వెబ్సైట్ తెలిపింది. వరుణ్ ఒకానొక హాలోవీన్ పారీ్టలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, కానీ తాను ఆ విషయాన్ని పోలీసులకు తెలపలేదని ఒక సాక్షి విచారణ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. వరుణ్ తాలూకూ రికార్డులను పరిశీలించిన ఫాక్స్ న్యూస్ అతడు యూనివర్శిటీ నుంచి బహిష్కృతుడైనట్లు గుర్తించింది. అయితే హత్యారోపణలు వచ్చే నాటికి అతడి వీసా చెల్లుబాటులోనే ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం వరుణ్ను అమెరికాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. అనంతరం అతడిని అరిజోనాకు తరలించి పిమా కౌంటీ అడల్ట్ డిటెన్షన్ కాంప్లెక్స్లో ఉంచనున్నారు.
ఇరాన్కు ట్రంప్ బిగ్ షాక్.. ఇక పరిహారం కూడా చెల్లించాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. భవిష్యత్లో జరిగే శాంతి చర్చల్లో భాగంగా.. దశాబ్దాలుగా ఇరాన్ మద్దతుతో జరిగిన దాడులు, ఘర్షణల్లో అమెరికన్లకు జరిగిన నష్టానికి ఇరాన్ నుంచి నష్టపరిహారం కోరాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఆయన ఓ పోస్ట్ చేశారు.గత ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్కు జరిగిన నష్టానికి ఆ దేశం పరిహారం కోరుతున్న విషయాన్ని ప్రస్తావించిన ట్రంప్.. అదే తరహాలో అమెరికా కూడా ఇరాన్ నుంచి పరిహారం కోరడం ‘ఆసక్తికరమైన ఆలోచన’ అని పేర్కొన్నారు. ఇరాన్ కోరుతున్న నష్టపరిహారం అంశం అమెరికాతో జరిగిన చర్చల్లో ఇప్పటివరకు ప్రస్తావనకు రాలేదని ఆయన అన్నారు.దశాబ్దాల నాటి ఘటనల ప్రస్తావనతన నష్టపరిహారం డిమాండ్కు మద్దతుగా గతంలో జరిగిన పలు ఘటనలను ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ మద్దతుతో జరిగిన రోడ్డు పక్క బాంబు దాడులు, ఇతర ఘర్షణల్లో అమెరికా సైనికులు మరణించడం, తీవ్రంగా గాయపడటాన్ని ఆయన ప్రస్తావించారు. ఇరాన్ మాజీ సైనిక కమాండర్ ఖాసిమ్ సొలైమానీ పేరు కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.2000 అక్టోబర్లో యెమెన్లోని ఓడరేవులో అమెరికా నావికాదళానికి చెందిన యూఎస్ఎస్ కోల్పై జరిగిన బాంబు దాడిని కూడా ట్రంప్ ఉదహరించారు. ఆ ఘటనలో 17 మంది అమెరికా నావికులు మరణించగా.. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ దాడికి అల్ఖైదానే కారణమని ఎఫ్బీఐ గతంలో పేర్కొంది.నిరసనకారుల కుటుంబాలకూ పరిహారం?గత ఐదు దశాబ్దాల్లో ఇరాన్లో జరిగిన ప్రజా ఉద్యమాలు, నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందించాలని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ఐదు నెలల యుద్ధంలో మరణించినట్లు తాను పేర్కొన్న సుమారు 52 వేల మందికి సంబంధించిన నష్టపరిహారం అంశాన్ని కూడా చర్చల్లో చేర్చాలని తన ప్రతినిధులకు సూచించినట్లు తెలిపారు.హర్మూజ్పై ఇరాన్ కీలక డిమాండ్మరోవైపు హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని స్పష్టం చేసింది. అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు.. యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించి, ఆర్థిక ఆంక్షలను తొలగించి, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేసే వరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవబోమని ఇరాన్ చెబుతోంది.ప్రాంతీయ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా డిమాండ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్-అమెరికా మధ్య భవిష్యత్ శాంతి చర్చలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది.
కొలంబియాలో భూకంప విలయం.. పెరుగుతున్న మృతుల సంఖ్య!
బొగోటా: దక్షిణ అమెరికా ఖండంలో వరుస భూకంపాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు నెలల క్రితం వెనెజువెలాలో సంభవించిన భూకంప ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఆ విషాదం నుంచి కోలుకోకముందే తాజాగా పొరుగు దేశమైన కొలంబియాలో సంభవించిన తీవ్ర భూకంపం పెను నాశనాన్ని మిగిల్చింది.అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. పశ్చిమ కొలంబియాలోని చోకో ప్రావిన్స్లో భూగర్భంలో 107 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 7.4 రిక్టర్ స్కేలు ఎక్కువగా ఉండటం వల్ల ఉపరితలంపై భారీ ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించాయి. సోమవారం అర్ధరాత్రి సమయానికి ఈ ప్రకృతి విలయం కారణంగా కనీసం 111 మంది మరణించగా, 87 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పసిఫిక్ తీరానికి సమీపంలోని చోకో ప్రావిన్స్లో ఉన్న 'శాన్ జోస్ డెల్ పాల్మార్' పట్టణానికి తూర్పున ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు భూగర్భ పరిశోధన కేంద్రాలు వెల్లడించాయి. ఈ భూకంపం ధాటికి కాలి నగరంలోనే దాదాపు 25 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. పెరీరా, మనిజాలెస్ నగరాల్లో వందలాది ఇళ్లు, చారిత్రక చర్చిలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భూకంప తీవ్రతకు భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలడంతో నగరాలన్నీ శిథిలాల కుప్పలుగా మారాయి.ఈ భూకంప ప్రభావం చోకో రాజధాని క్విబ్డో, పెరీరా, కాలి, మనిజాలెస్ వంటి నగరాలపై అత్యంత తీవ్రంగా ఉంది. దీని ప్రకంపనలు కొలంబియా రాజధాని బొగోటాతో పాటు పొరుగు దేశాలైన ఈక్వెడార్, పనామా, వెనెజువెలా వరకు తీవ్రంగా వ్యాపించాయి. ఈ విపత్తు కారణంగా పెరీరా అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశంలోని సుమారు ఆరు ప్రధాన విమానాశ్రయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.ఈ ఘోర విపత్తుపై కొలంబియా నూతన అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రిల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ దేశంలో 'జాతీయ అత్యవసర పరిస్థితి' ప్రకటించారు. శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను సురక్షితంగా బయటకు తీసి, ప్రాణాలు కాపాడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. కాగా,ఈ ఏడాది జూన్లో పొరుగున ఉన్న వెనెజువెలాలో సంభవించిన భారీ భూకంపాల తర్వాత, ఈ ప్రాంతంలో సంభవించిన మరో అత్యంత ఘోరమైన విపత్తుగా ఇది నమోదైంది.Manizales, Colombia. Terremoto. pic.twitter.com/BzKcaWIHm1— Jupac (@Jupacg) August 10, 2026
జాతీయం
పోటాపోటీ నినాదాలు.. పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న వేళ.. అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలు, ఇతర అంశాలపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తుండగా.. ప్రతి వ్యూహంలో భాగంగా ఎన్డీయే ఎంపీలు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందనకు దిగారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్లమెంట్ ఆవరణలో అధికార ఎన్డీయే ఎంపీలు భారీ నిరసన చేపట్టారు. మకర్ ద్వార్ వరకు ర్యాలీ నిర్వహించిన ఎంపీలు.. విపక్షాలకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. సభను అడ్డుకుంటున్నారంటూ నినాదాలు చేశారు. ఇదే ఆవరణలో.. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు ఇన్ని రోజులు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడం గమనార్హం.పోటాపోటీ నిరసనలు.. పార్లమెంట్ ఆవరణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ నిరసనలు కొనసాగాయి. ఎన్డీయే ఎంపీలు విపక్షాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన సమయంలోనే విపక్షాల ఎంపీలు సైతం నిరసనకు దిగారు. ఎన్డీయే ఎంపీలేమో.. సభను అడ్డుకుంటున్నారంటూ నినాదాలు చేశారు. చర్చకు రావాల్సింది పోయి పారిపోతున్నారని ఆరోపిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు జార్ఖండ్లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి వ్యతిరేకంగా కూడా ఎన్డీయే ఎంపీలు నిరసన తెలిపారు. దీనికి కౌంటర్గా ఇండియా కూటమి ఎంపీలు నీట్, ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ అంశంపై కాంగ్రెస్తో కలిసి డీఎంకే ఎంపీలు కూడా నిరసనలో పాల్గొన్నారు. దీంతో పార్లమెంట్ ఆవరణ రాజకీయ నినాదాలతో హోరెత్తింది.చర్చకు సిద్ధం.. ఎందుకు పారిపోతున్నారు?విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన అంశంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎన్డీయే ఎంపీలు స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే విపక్షాలు చర్చకు రావాల్సింది పోయి.. పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయని ఎన్డీయే నేతలు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సభను స్తంభింపజేయడం సరికాదని ఆరోపించారు.#WATCH | Delhi | NDA MPs protest against the Opposition, alleging they are running from discussion. BJP MP Sanjay Jaiswal says, "We are ready for disocussion but Rahul Gandhi is not. He has stalled the Lok Sabha. The Home Minister is ready to answer." pic.twitter.com/hUbmpRetdl— ANI (@ANI) August 11, 2026మోదీ నేతృత్వంలో మంతనాలు.. ఆ తర్వాత ర్యాలీఎన్డీయే ఎంపీల నిరసనకు ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళ్ మిలాన్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ పరిణామాలు, ప్రతిపక్షాల వ్యూహంపై చర్చించిన అనంతరం ఎంపీలు ర్యాలీ చేపట్టారు. విపక్షాల ఆందోళనలకు ప్రతిస్పందనగా అధికార పక్షం ఈసారి “రివర్స్ స్ట్రాటజీ” అమలు చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.Prime Minister @narendramodi waves the Tiranga along with all Ministers and MPs during NDA Parliamentary Party Meeting, Mangal Milan.#MangalMilan pic.twitter.com/PbgWdLaUBf— All India Radio News (@airnewsalerts) August 11, 2026గురువారంతో ముగియనున్న సమావేశాలుప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు గురువారంతో ముగియనున్నాయి. కీలక బిల్లుల ఆమోదం నేపథ్యంలో చివరి రోజులు సజావుగా సాగాలని కేంద్రం కోరుతోంది. నిన్న ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే నాలుగు బిల్లులకు ఆమోదం లభించింది. మరికొన్ని కీలక అంశాలపై చర్చ జరగాల్సి ఉండటంతో సభకు ఆటంకాలు కలిగించవద్దని ప్రభుత్వం కోరుతోంది.విపక్షాల డిమాండ్లు ఇవేమరోవైపు విపక్షాలు మాత్రం జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే అయోధ్య రామమందిరం విరాళాల హుండీ చోరీ ఆరోపణలపైనా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి.పార్లమెంట్లో పోరు.. బయటా నిరసనలుఒకవైపు విపక్షాల ఆందోళనలు.. మరోవైపు ఎన్డీయే ఎంపీల ప్రతిఆందోళనలు.. దీంతో పార్లమెంట్ ఆవరణ రాజకీయ వేడికి వేదికగా మారింది. సమావేశాల చివరి రోజుల్లోనైనా సభ సజావుగా సాగుతుందా? లేదంటే రాజకీయ పోరు కొనసాగుతుందా? అన్నది ఆసక్తిగా మారింది.
‘సిలిండర్ల’తో కన్వర్ యాత్ర.. 80 ఏళ్ల వృద్ధుడి సాహసం!
ముజఫ్ఫర్ నగర్: ఆరోగ్యం సహకరించకపోయినా, వైద్యులు ఎంత వారించినా శివునిపై ఉన్న అచంచల భక్తితో ఓ 80 ఏళ్ల వృద్ధుడు సాహసోపేత యాత్ర పూర్తి చేశారు. ఉత్తరాఖండ్లోని జ్వాలాపూర్కు చెందిన పశురామ్ శర్మ శ్వాసకోస సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినా ఆయన ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో ఈ ఏడాది కూడా కన్వర్ యాత్ర చేయాలని నిశ్చయించుకున్నారు.డాక్టర్లు ఇంట్లోనే ఉండాలని సలహా ఇచ్చినా లెక్కచేయకుండా, తన స్కూటీ వెనుక రెండు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని సుమారు 93 కిలోమీటర్ల ప్రయాణం సాగించారు. జ్వాలాపూర్ నుంచి బయలుదేరి, ఉత్తరప్రదేశ్లోని ముజఫ్ఫర్ నగర్లోని శివ చౌక్ చేరుకున్నారు. మార్గమధ్యంలో శ్వాస ఇబ్బంది తలెత్తినప్పుడల్లా సిలిండర్ సాయంతో ఆక్సిజన్ తీసుకుంటూ ముందుకు సాగారు.ముజఫ్ఫర్ నగర్లోని శివ చౌక్లో ఆశుతోషుడికి జలాభిషేకం చేసి, తన కన్వర్ యాత్రను విజయవంతంగా ముగించారు. అంతకుముందు ఆయన బాగ్పత్లోని పురా మహాదేవ్ ఆలయం వరకు వెళ్లాలని భావించారు. అయితే ఆ ప్రాంతం ఎత్తైన ప్రదేశంలో ఉండటం, అక్కడకు ఆక్సిజన్ సిలిండర్లు మోసుకెళ్లడం కష్టమని భావించి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ముజఫ్ఫర్ నగర్లోనే శివుణ్ణి దర్శించుకున్నారు. ఇప్పటివరకు ఆయన 13 సార్లు కన్వర్ యాత్ర పూర్తి చేశారు. వయసు, అనారోగ్యం మొదలైనవి తన భక్తికి అడ్డంకి కాలేదని, జీవితంలో ఏ కష్టమొచ్చినా శివుడే తనకు ధైర్యమని పరశురామ్ పేర్కొన్నారు. వృద్ధుడి సంకల్పాన్ని చూసి స్థానికులు, భక్తులు ఆయనను అభినందిస్తున్నారు.ఇది కూడా చదవండి: బొద్దింకల్లో ‘బ్లింకిట్’ స్టాక్.. లైసెన్స్ రద్దు!
బొద్దింకల్లో ‘బ్లింకిట్’ స్టాక్.. లైసెన్స్ రద్దు!
మలాడ్ (వెస్ట్): ముంబైలోని మలాడ్ (వెస్ట్) ప్రాంతంలో క్విక్ కామర్స్ బ్రాండ్ 'బ్లింకిట్' (Blinkit) నిర్వహిస్తున్న గిడ్డంగిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు ఉల్లంఘనలు వెలుగుచూశాయి. పెద్ద ఎత్తున బొద్దింకలు ఉండటం, నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను నిల్వ చేయడం, గడువు ముగిసిన, పాడైపోయిన ప్యాకేజ్డ్ ఆహార వస్తువులు లభించడంతో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) బ్లింకిట్ మాతృ సంస్థ ‘బ్లింక్ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆహార లైసెన్స్ను సస్పెండ్ చేసింది. ఈ గిడ్డంగిలో ఆహార పదార్థాలను తుప్పుపట్టిన రాక్లపై ఉంచినట్లు అధికారులు గుర్తించారు.కోల్డ్ స్టోరేజ్ ప్రాంతాలలో కూడా సరైన పరిశుభ్రత పాటించలేదని తేలింది. ఈ ఉదంతంపై స్పందించేందుకు బ్లింకిట్ నిరాకరించింది. మరోవైపు, అమెజాన్ రిటైల్ ఇండియాకు చెందిన భివండి గిడ్డంగిలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను మార్కెట్కు తరలిస్తున్నారనే ఆరోపణలపై మహారాష్ట్ర ఎఫ్డీఏ గతంలో చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై బాంబే హైకోర్టు స్పూరిస్తూ.. గడువు ముగిసిన, పాడైపోయిన సరుకులన్నింటినీ శాస్త్రీయ పద్ధతిలో నాశనం చేసేందుకు ఎఫ్డీఏ అధికారులకు అప్పగించాలని అమెజాన్ను ఆదేశించింది.ఇది కూడా చదవండి: నీట్ పేపర్ లీక్: ‘రసాయనశాస్త్రం’తో నమ్మించి..
సీఎం విజయ్పై కమల్ హాసన్ ప్రశంసలు
తమిళనాడు సీఎం విజయ్పై ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నిర్వహించే అన్ని అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర గీతమైన తమిళ్ తాయ్ వాల్తుకు తొలి ప్రాధాన్యతను ఇచ్చి ఆలపించాలని అసెంబ్లీ వేదికగా చేసిన తీర్మానాన్ని కమల్ హాసన్ స్వాగతించారు. ప్రభుత్వం నిర్ణయం అభినందనీయం అని.. రాష్ట్ర హక్కులు, సాంస్కృతిక గుర్తింపుపై గట్టిగా నిలబడే ధోరణిని కొనసాగించాలని ఆయన ట్వీట్ చేశారు.సీఎం విజయ్ తీసుకొచ్చిన ఈ తీర్మానాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ సీఎం విజయ్ అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడారు. సీఎం విజయ్ ప్రసంగిస్తూ భాష అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ మాత్రమే కాదని, ప్రపంచంలో ఏ భాషకైనా అది వర్తిస్తుందన్నారు. అయితే, తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదని, అది మన ప్రాణం, మన భావోద్వేగం. అమ్మ అని పిలిచినప్పుడు ఏ బంధం, ప్రేమ మనలో ఉప్పొంగుతుందో, మన మాతృభాష అయిన తమిళం కూడా అంతే పవిత్రమైనదని వ్యాఖ్యలు చేశారు.1891లో మనోన్మణియం సుందరనార్ రాసిన గీతాన్ని ప్రస్తావిస్తూ భారత ఉపఖండం అనే అందమైన ముఖానికి నొసటిపై రూపకమైన తిలకం వంటిది తమిళనాడు అని, దాని పరిమళం ప్రపంచమంతా వ్యాపించాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో తమిళులు లేని దేశమంటూ లేదని, తమిళం అంటే కేవలం ఒక భాష కాదని, అదొక సంస్కృతి, ఆలోచన , ఆతిథ్యానికి ప్రతీక అని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే తమిళం అంటే గెత్తు (స్టైల్ లేదా గెలుపు), తమిళం అంటే పవర్‘ అని సీఎం స్పష్టం చేశారు. అనంతరం ఈ ప్రత్యేక తీర్మానానికి అసెంబ్లీలోని డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, పిఎంకే, వీసీకే సహా అన్ని రాజకీయ పక్షాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి.அரசு நிகழ்ச்சிகளில் தமிழ்த்தாய் வாழ்த்து முதலாவதாகப் பாடப்பட வேண்டும் என சட்டமன்றத்தில் தீர்மானம் நிறைவேற்றியிருப்பது மகிழ்ச்சிக்குரியது; வரவேற்கத்தக்கது. மாநில உரிமைகளை விட்டுத்தராத இந்தப் போக்கு தொடரவேண்டும்.— Kamal Haasan (@ikamalhaasan) August 11, 2026
ఎన్ఆర్ఐ
శ్రీ బాలాజీ దేవాలయంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం
యూకేలోని గ్లౌసెస్టర్షైర్ ప్రాంతంలో తాత్కాలిక శ్రీ బాలాజీ ఆలయం ఏర్పాటు తోపాటు ఘనంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది ఆధ్యాత్మిక శక్తి, ఐక్యతలకు నిదర్శంనగా నిలిచింది ఈ వేడుక. విదేశీగడ్డపై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు భక్తులంతా వాలంటీర్గా ముందుకు వచ్చి.. సనాతన ధర్మ స్ఫూర్తిని చాటడం విశేషం. ఈ వేడుకలో పురోహిత విధులను అరవింద్, లక్ష్మి, సహస్ర నిర్వహించగా, ఆలయ కార్యక్రమాల్ని దిగ్విజయంగా జరిగేలా శ్రీనిరెడ్డి, మాధురి కుటుంబం, అలాగే శ్రీలక్ష్మీ, శ్రీని అర్గిల్ల, శిల్ప కుటుంబం పర్యవేక్షించింది. నరేష్, సురేష్ బండారులు విగ్రహాలను సమకూర్చగా, మహిళలు, చిన్నారులు స్వామి అలకంరణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు శ్రీలక్ష్మీ, రాజేష్, నానీ, సోను కుటుంబ సభ్యులు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలా వాలంటీర్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవిశ్రాంతంగా సేవలందించారు. ఇది గ్లౌసెస్టర్ హిందూ సమాజపు బలాన్ని, సనాతన ధర్మ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. (చదవండి: న్యూయార్క్లో వైభవంగా ఆషాఢమాస బోనాలు)
అట్లాంటా: విజయవంతంగా ‘వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్’
అట్లాంటాలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలను వివరించారు. వైఎస్సార్సీపీ చేపడుతున్న Let’s Speak for Jagananna, Let’s Write for Jagananna, Let’s Post for Jagananna, Let’s Code for Jagananna’’ కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో Online Reputation Management-ORM ప్రాధాన్యతను ప్రత్యేకంగా వివరించారు. కేవలం పోస్టులు చేయడం, కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా.. స్పష్టమైన లక్ష్యం, సమన్వయంతో ముందుకు సాగాలని ఎన్ఆర్ఐ కార్యకర్తలకు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు.వాస్తవాలను ప్రజలకు సమర్థంగా చేరవేయాలన్న సాంబశివారెడ్డి.. తప్పుడు ప్రచారాలను ఆధారాలతో ఎదుర్కోవాలని సూచించారు. YSRCP NRI Wing Portal, Jagan 2.0 Super యాప్ల కూడా అవగాహన కల్పించారు. మన గ్లోబల్ డిజిటల్, సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
న్యూయార్క్లో వైభవంగా ఆషాఢమాస బోనాలు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా ప్రతిబింబించేలా స్థానిక ఐసెన్ హోవర్ పార్క్లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. లాంగ్ ఐలాండ్ (నాస్సా కౌంటీ) డిప్యూటీ డైరెక్టర్ మెంగ్ లీ, లెజిస్లేటర్ రోజ్ మేరీ వాకర్, టౌన్ క్లర్క్ రాగిని శ్రీవాస్తవ ఈ వేడుకలకు అతిథులుగా హాజరయ్యారు..ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రముఖ కళాకారులు, కవులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, గాయకుడు సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్యలు ప్రత్యేకంగా తమ పాటలు, ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు.అలాగే పద్మ కోడెల చేతుల మీదుగా జరిగిన అమ్మవారి అలంకరణ, పోతురాజు వేషధారణలో ఆశోక్ చింతకుంట చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అమెరికా నేలపై తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన ఈ బోనాల సంబరాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి.
లండన్లో అట్టహాసంగా 'టాక్' బోనాల సంబురం
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. హౌంస్లౌ నగరంలోని కింగ్స్లే అకాడమిలో జూలై 19న జరిగిన ఈ వేడుకలకు బ్రిటన్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ గణేష్ కుప్పాల.. వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హైకమిషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని.. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని ముఖ్య అతిథులు తమ సందేశంలో పేర్కొన్నారు. మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలతో తమ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరును ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల కోసం తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలానికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.బోనాల వేడుకలు విజయవంతం కావడం పట్ల టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు, అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. టాక్ కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగళి, సత్య చిలుముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లారెడ్డి, గణేష్ పాస్తాం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్రీ విద్య, దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, కార్తీక్, స్నేహ, అమరేశ్వరి, సాయిరావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
క్రైమ్
పెళ్లైన 24 గంటల్లోనే భార్యను బేరం పెట్టిన భర్త..!
ఏలూరు జిల్లా: ప్రియురాలిని ప్రేమ వివాహం చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లిన యువకుడిపై యువతి తల్లిదండ్రులు రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గొల్లపల్లికి చెందిన యువతి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని తన మేనమామ ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ, మూడు రోజుల క్రితం వివాహం చేసుకుని బాపులపాడు మండలం వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు. వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి, యువతిని భర్త ఇంటికి పంపించారు. అయితే, తమ అమ్మాయిని తమ దగ్గరకు పంపించాలంటే ఆమె భర్త రూ.12 లక్షలు డిమాండ్ చేస్తున్నాడంటూ సోమవారం నూజివీడు రూరల్ పోలీస్స్టేషన్లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కానీ యువకుడిని పెళ్లి చేసుకున్న యువతినుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో.. యువతి తల్లిదండ్రులు పెట్టిన ఆరోపణలు ఎంత వరకు నిజం ఉందేనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
భర్తను చంపేందుకు భార్య భారీ స్కెచ్..!
తమిళనాడు: మాదక ద్రవ్యాలతో భర్తను హత్య చేసేందుకు యత్నించిన భార్యను పోలిసులు అరెస్టు చేశారు. కల్లకురిచి జిల్లాలోని చిన్నసేలం గ్రామానికి చెందిన రాజీవ్ గాంధీ(40) వ్యవసాయ కూలీ. ఇతను తన భార్య కనగ, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, గత 6వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటలకు రాజీవ్ గాంధీ తన ఇంటి ముందు నిలబడి ఉండగా, పొలం బయట రోడ్డు నుండి బైకు పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అతని మెడపైనా, నడుముపైనా పొడిచారు. కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చారు. వారు రావడం చూసిన, ఆ గుర్తుతెలియని వ్యక్తులు బైకు పై పారిపోయారు .దీని తరువాత, రాజీవ్ గాందీని రక్షించి కల్లకురిచి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఈ విషయమై చిన్నసేలం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశారు. అందులో, రాజీవ్ గాంధీ భార్య కనక, ఆమె వివాహితర ప్రియుడు, మాజీ పంచాయత్ అధ్యక్షుడు ధనపాల్ (53), ఇద్దరు అనుచరులతో కలిసి రాజీవ్ గాందీని హత్య చేయడానికి యత్నించినట్లు వెల్లడైంది. దీంతో చిన్నసేలం పోలీసులు ఆ గ్రూపు మాజీ నాయకుడు ధనపాల్, కనక, కిరాయి హంతకులైన పాల్ రాజ్ (24), కార్తీక్తో సహా మరో నలుగురి పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం..!
అనంతపురం సెంట్రల్: అనంతలో హైటెక్ వ్యభిచారం గుట్టు బయట పడింది. గుంటూరు, అమలాపురం, రాజమండ్రి ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను, మహిళలను తీసుకొచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. నగరానికి చెందిన విటులను రప్పించి ఎవరికి నచ్చిన వారు.. వారితో గడిపే విధంగా సెటప్ చేశారు. నగరానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయనతో మరికొందరు చోటా నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధర్ధరాత్రి వన్టౌన్ పోలీసులు సదరు వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. మొత్తం 10 మంది వేశ్యలు, 10 విటులను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళలను విచారణ నిమిత్తం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడస్తున్న ఓ హోంకు తరలించారు. ఈ వ్యభిచార కేంద్రం వెనుక పెద్ద రాకెట్ ఉండడంతో కూపీ లాగేందుకు పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. త్వరలో దీనిపై వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.
డాక్టర్ ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల సాయం
తూర్పు గోదావరి జిల్లా: జీఎస్ఎల్ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతికి విచారాన్ని వ్యక్తం చేస్తూ కళాశాలలో సోమవారం సంతాప సభ నిర్వహించారు. పీజీలో డెర్మటాలజీ ఫస్టియర్ చదువుతున్న ఆమె ఇకలేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నామని, ఆమె కుటుంబానికి మనోధైర్యాన్ని అందించి, ఆమె ఆత్మకు శాంతిని చేకూర్చాలని దేవుడిని ప్రార్థించారు. ఆఖరి నిమిషం వరకు ఆమెను బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఆమె చిత్రపటం వద్ద సహ విద్యార్థులు, అధ్యాపకులు, మేనేజ్మెంట్ ప్రతినిధులు పుష్పాంజలి ఘటించారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించాలని జీఎస్ఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందని వైద్య కళాశాల ఎండీ డాక్టర్ గన్ని సందీప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి ఈడీ డాక్టర్ గన్ని సాధిక ద్వారా త్వరలోనే అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గన్ని సారిక, డాక్టర్ సీతారామ్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ తేజస్విని, డాక్టర్ సుభాషిణి, విద్యార్థులు పాల్గొన్నారు.
వీడియోలు
కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్
ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..?
భారతి సిమెంట్స్ వద్ద హై టెన్షన్.. TDP గూండాల బీభత్సం
ప్రభుత్వ భూమిపై కన్నేసిన మంత్రి నారాయణ
YS జగన్ కర్నూల్ పర్యటన షెడ్యూల్ ఇదే... పోలీసులకు మా విజ్ఞప్తి ఏంటంటే..?
మంత్రి అనుచరుల ఆడియో లీక్.. లంచం ఇవ్వాల్సిందే..
డ్రగ్ ఫ్రీ తమిళనాడు' కోసం సీఎం విజయ్ కీలక అడుగు
జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడి! ABVP పై పోలీసుల లాఠీచార్జ్
కూటమి సర్కార్కు జూనియర్ డాక్టర్ల వార్నింగ్
రేపు MLA,MLCలతో YS జగన్ కీలక భేటీ


