అరుదైన ఈ రైల్వే స్టేషన్ గురించి తెలుసా?
మనకు ఇప్పుడు రైలు ప్రయాణం ఎంతో ఈజీ, అసలు రైలు ప్రయాణమంటేనే సౌఖ్యవంతమైన జర్నీగా భావిస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రయాణం చేయొచ్చనేది మనకు తెలిసిన విషయం. అయితే రైలు.. నది ఒడ్డున ఆగితే పరిస్థితి ఏమిటి.. ప్రయాణికులు ఎలా దిగి గమ్యస్థానాలకు వెళతారు?, ఈ తరహా పరిస్థితులు కూడా ఉంటాయా?, అంటే ఉన్నాయి అనక తప్పదు. పూర్వకాలంలో నది ఒడ్డున ఆగే రైలు.. ఆపై పడవల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరే సంఘటనలు కూడా ఉన్నాయట. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఘాజీపూర్లో తారీ ఘాట్ రైల్వే స్టేషన్ ఇందుకు నిదర్శనం. గంగా నదిపై ప్రయాణించే రైలు తారీ ఘాట్ రైల్వే స్టేషన్లో నది ఒడ్డు వరకే ట్రాక్ ఉంటుంది. దాంతో ప్రయాణికులు ఒడ్డున దిగి పడవల్లో వారి స్థానాలకు వెళ్లేవారు. ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా ఇక్కడ రైలు ట్రాక్ నది ఒడ్డునే ముగుస్తుంది, ఈ స్టేషన్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. అప్పట్లో గంగపై పెద్ద రైల్వే బ్రిడ్జ్ లేకపోవడంతో, రైలు మార్గం ఇక్కడే ఆగిపోయేది. ప్రయాణికులు రైలు దిగిన తర్వాత పడవల ద్వారా గంగాను దాటి తమ ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చేది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు గంగానదిపై గంగానదిపై రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. తారీ ఘాట్ స్టేషన్ ప్రాముఖ్యత తగ్గిపోయింది, కానీ ఇది చారిత్రక గుర్తుగా నిలిచింది. భారత రైల్వే చరిత్రలో అరుదైన ఉదాహరణగా నిలిచిపోతోంది.గతంలో స్టేషన్ ఎంత ఉత్సాహంగా ఉండేదో ఇక్కడ అనుభవాలను ఎదుర్కొన్న వారిని పలకరిస్తే అర్థమవుతుంది. తారీ ఘాట్ వైభవం, టీ దుకాణాలు, పడవల కోసం వేచి ఉండటం ఇవన్నీ తలుచుకుంటే తమ కళ్లలో మెరుపులు తీసుకొస్తాయని ఓ వృద్ధుడు స్పష్టం చేశాడు.
దా‘రుణ’మైన ‘పెళ్లి కానుక’
అనంతపురం టౌన్: నిరుపేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు పెళ్లి కానుకలను అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ‘పెళ్లి కానుక’ పథకానికి మంగళం పాడారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రూ.లక్ష, బీసీ వర్గాలకు రూ.50వేలు, కులాంతార వివాహాలకు రూ.లక్ష చొప్పున అందిస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయలేక చేతులేత్తేశారు. కల్యాణలక్ష్మి పేరిట రుణ పథకానికి శ్రీకారం ఈ నెలలో ఉగాది పండుగ తర్వాత ‘ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి’ పథకాన్ని అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పెళ్లి కానుకైతే ఉచితంగా ఇవ్వాల్సి వస్తుందని, ఆ భారం నుంచి తప్పించుకునేందుకు ‘కల్యాణలక్ష్మి’ పేరుతో రుణ పథకాన్ని అమలు చేస్తోంది. ఆడబిడ్డ పెళ్లి కోసం బ్యాంక్ల ద్వారా రూ.10 వేల నుంచి రూ.లక్ష మేర రుణం మంజూరు చేయనుంది. తీసుకున్న రుణాన్ని 48 వాయిదాల్లో 4 శాతం వడ్డీతో బ్యాంక్లకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంతో నిరుపేదలకు ‘పెళ్లి కానుక’ ఇవ్వకుండా రుణాలు ఇవ్వడం ఏంటని మహిళా సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. గతంలో అమలు చేసిన విధంగా ‘పెళ్లికానుక’ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. కల్యాణలక్ష్మి రుణ పథకానికి అర్హతలు ఇవే.. పెళ్లికూతురికి కచ్చితంగా 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. కూతురు పెళ్లికి రుణం పొందే మహిళలు డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలల సభ్యత్వం కలిగి ఉండాలి. పెళ్లి కూతురు ఆధార్కార్డు, పెళ్లి పత్రిక, పెళ్లికి అయ్యేఖర్చు అంచనాతో కూడిన పత్రం సమరి్పంచాలి. అన్ని రకాల వర్గాల ప్రజలకు ఈ పథకం వర్తిస్తుంది. మండల పరిషత్ కార్యాలయాలు, డీఆర్డీఏ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలి పెళ్లికి రెండు రోజుల ముందు పెళ్లి కూతురు తల్లి ఖాతాలో రుణం మొత్తాన్ని జమ చేస్తారు. మార్గదర్శకాలు రావాల్సి ఉంది ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి రుణ పథకం ఈ నెలలో ఉగాది పండుగ తర్వాత అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. – శైలజ, డీఆర్డీఏ ఇన్చార్జ్ పీడీ
గల్ఫ్ ఫ్యూచర్ డిసైడ్ చేసేది మీరు కాదు.. మేమే: ఇరాన్
యుద్ధానికి సంబంధించి ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. ఇరాన్ ప్రధానమైన నేవీ, ఆర్మీ, ఎయిర్ఫోర్స్లతో పాటు కీలకమైన స్థావరాలను నాశనం చేశామని, యుద్ధం ముగింపు ఒక్కటే మిగిలి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు ప్రకటనలపై ప్రకటనలు చేస్తుంటే.. ఇరాన్ మాత్రం అందుకు ధీటుగా బదులిస్తోంది. తమకు ఏమీ కాలేదని, ఇక నుంచి తమ నుంచి ఎదుర్కోబోయే పరిణామాలను ప్రపంచం చూడబోతుందనే అర్ధం వచ్చేలా ఇరాన్ కౌంటర్ల మీద కౌంటర్ల ఇస్తోంది. తమను తక్కువగా అంచనా వేయొద్దని ట్రంప్కు నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చింది. తమతో యుద్ధాన్ని ముగించేది మీరు కాదని, ఆ యుద్ధానికి ముగింపు తామిస్తామంటూ స్పష్టం చేసింది. ‘ యుద్ధం ముగించేది మీరు కాదు. మేం. గల్ఫ్ ఫ్యూచర్ డిసైడ్ చేసేది కూడా మేమే. మీపై(అమెరికా-ఇజ్రాయెల్) దాడులు చేస్తూనే ఉంటాం’ అని ఇరాన్ హెచ్చరించింది. కాగా, ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు దొరుకుతుందన్నారు. ఇరాన్పై తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిండానికి చాలా చేరువలో ఉన్నామన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా చమురు సరఫరాకు సంబంధించి ఇరాన్ను హెచ్చరించారు. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అంతరాయం కలిగిస్తే ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ ఆందోళనఅమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం ఉంటుందన్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం 30 రోజుల్లో హర్మూజ్ జలసంధి పూర్తిగా మూతబడిపోతుందని, అదే గనుక జరిగితే ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అందరినీ మెప్పించడం లేదా అందరినీ ఎదిరించడమని చాలామంది అపోహపడుతుంటారు. మీరు గమనిస్తే, ఆఫీసులోనో లేదా కుటుంబంలోనో కొందరు వ్యక్తులు ఎప్పుడూ అందరినీ ప్లీజ్ చేస్తూ ఉంటారు, కొందరు మాత్రం ఎప్పుడూ గొడవ పడుతుంటారు. ఈ రెండూ సరైన పద్ధతులు కావు. అసలైన పర్సనాలిటీ గ్రోత్ 'Assertiveness' (నిశ్చయత) లో ఉంది. ఇది ఎదుటివారిని గౌరవిస్తూనే, మన హక్కులను మనం కాపాడుకోవడం.1. మూడు రకాల ప్రవర్తనలు (The Behavioral Spectrum)సైకాలజీలో మనం మనుషులతో ప్రవర్తించే విధానాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు.Passive (అణగిపోవడం): ఎదుటివారు ఏమనుకుంటారో అని మీ అభిప్రాయాలను దాచుకోవడం. దీనివల్ల మీ ఆత్మగౌరవం తగ్గుతుంది, దీనివల్ల మీకు లేనిపోని ఒత్తిడి పెరుగుతుంది.Aggressive (అతిగా అరవడం): ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం, డామినేట్ చేయడం. దీనివల్ల మనుషులు మీకు దూరమవుతారు, మీ చుట్టూ ఉన్నవారు భయపడతారు తప్ప గౌరవించరు.Assertive (The Golden Mean): "నా అభిప్రాయం ముఖ్యం, అలాగే నీ అభిప్రాయం కూడా ముఖ్యం." ఇది ఎదుటివారిని హర్ట్ చేయకుండా మీ బౌండరీని మీరు సెట్ చేసుకోవడం.2. Assertiveness ఎందుకు అవసరం? Assertiveness అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ స్కిల్ మాత్రమే కాదు, అది మీ ఆత్మగౌరవానికి (Self-Respect) ప్రతిరూపం.మీరు 'Assertive' గా ఉన్నప్పుడు, మీ నిర్ణయాలకు ఒక విలువ ఉంటుంది.మీరు చెప్పే 'Yes' కు ఒక గౌరవం, చెప్పే 'No' కు ఒక క్లారిటీ ఉంటుంది.అతిగా అరవాల్సిన అవసరం లేదు, అణగిపోవాల్సిన అవసరం అస్సలు లేదు.3. మోటివేషన్ మాయ vs నిజమైన సైకాలజీట్రైనర్స్ "ఎవ్వరినీ వదిలిపెట్టకు, సింహంలా ఉండు, గర్జించు" అని చెప్తారు. ఇది మీకు అగ్రెసివ్ ట్యాగ్ను ఇస్తుంది. కానీ సైకాలజీ మీ గొంతును కాదు, మీ పాయింట్ని బలంగా చెప్పమంటుంది. కోపం తగ్గించి, స్పష్టతను పెంచుకోమంటుంది. నిజమైన నాయకుడు అరిచి పని చేయించడు, తన క్లారిటీతో పని చేయిస్తాడు.4. Assertive గా ఉండటం ఎలా?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ ఆర్ట్ను ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం.Step 1: మొహమాటాన్ని బ్రేక్ చేయండిమొహమాటం అనేది ఒక జబ్బు. "నేను వాళ్ళని ఏమీ అనకూడదు" అనే ఆలోచనని బ్రేక్ చేయండి. మీరు ఎదుటివారికి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే, వారు చెప్పే ప్రతి తప్పుకు తల ఊపడం కాదు. మీ బౌండరీలను దాటినప్పుడు సున్నితంగా, బలంగా 'No' చెప్పడం ప్రాక్టీస్ చేయండి.Step 2: Build 'I' స్టేట్మెంట్స్ఇతరులను విమర్శించేటప్పుడు "నువ్వు తప్పు చేస్తున్నావు" అనకుండా, "నీ వల్ల నాకు ఇలా ఇబ్బందిగా ఉంది" (I feel... when you...) అని చెప్పండి. ఇది ఎదుటివారిని డిఫెన్సివ్ మోడ్లో పడకుండా, మీ పాయింట్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. దీన్నే మనం బిల్డ్ చేసుకోవాలి.Step 3: ప్రశాంతతే బలంమీరు ఏ పరిస్థితిలో అయినా ప్రశాంతంగా, క్లారిటీతో మాట్లాడగలిగినప్పుడు, అది మీ వ్యక్తిత్వానికి ఒక గొప్ప బలాన్ని ఇస్తుంది. మీరు ఎవరినీ డామినేట్ చేయరు, ఎవరూ మిమ్మల్ని డామినేట్ చేయలేరు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీరు ఎక్కడ ఉన్నారు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీరు నిన్నటి రోజున ఎవరికైనా ఇష్టం లేకపోయినా 'సరే' అని అన్నారా? (Passive)మీరు ఎవరి మీదైనా అనవసరంగా కోప్పడ్డారా? (Aggressive)ఏ సందర్భంలో మీరు మీ పాయింట్ను గౌరవంగా చెప్పగలిగారు? (Assertive)మీ గొంతుకే మీ ఆయుధం!బ్రో, మీ గొంతులో ఉండేది కేవలం శబ్దం మాత్రమే కాదు, మీ అస్తిత్వం (Identity). దాన్ని అణచివేయనివ్వకండి, అలాగని దాన్ని ఎదుటివారిపైకి గర్జనలా వాడకండి. ఒక స్పష్టమైన, ప్రశాంతమైన, దృఢమైన గొంతుకను డెవలప్ చేసుకోండి."Assertiveness is not about what you say, but how you say it."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: దెబ్బ తగిలినా తిరిగి నిలబడే తత్వం)
నాన్న నాకిచ్చే అతిపెద్ద గిఫ్ట్ అదే: సుస్మిత కొణిదెల
బాస్ కుర్చీలో ‘బాట్’.. ‘ఏజెంట్’ చెప్పింది చేయాల్సిందే!
కడుపులో బుజ్జాయిలు ఎందుకు అడ్డ తిరుగుతారంటే..!
సాక్షి కార్టూన్ 10-03-2026
బిగ్బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం
30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!
టైటిల్ నిరీక్షణ ముగించేందుకు... స్విస్ ఓపెన్ బరిలో శ్రీకాంత్
విజయశ్రీ!
బంగ్లాదేశ్కు భారత్ ఆపన్నహస్తం
గుజరాత్ జెయింట్స్ కోచ్గా ఆసీస్ క్రికెట్ దిగ్గజం
గ్యాస్ సిలిండర్ బుకింగ్.. కొత్త రూల్స్!
100 ఎకరాలు ఉంటే చెప్పండి: మీనాక్షి
మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..
ఉగాదికి 'అల్లు సినిమాస్' ప్రారంభం.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
భారీగా పెరిగిన గ్యాస్ ధరలు - యుద్ధంతో భగ్గుమన్న ధరలు
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
వరల్డ్కప్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ పేసర్
పతనమైన వెండి.. రూ.35 వేలు తగ్గిన రేటు!
ప్రేమలో పడ్డ కోర్ట్ జంట? రోషన్, శ్రీదేవి రియాక్షన్ ఇదే!
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్లో నీటి యుద్ధం మొదలైందా?
మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
సూపర్ సిక్స్ అమలు చేయకపోగా ఉన్న పథకాలు ఎత్తేయడానికి మీరు భలే ప్లాన్లు వేస్తున్నారు సార్!
పాత బంగారు లోకం
పడిపోయిన పసిడి ధరలు.. వారమంతా ఆనందమే!
బుజ్జి అభిమానిని సర్ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ
డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు!
నాన్న నాకిచ్చే అతిపెద్ద గిఫ్ట్ అదే: సుస్మిత కొణిదెల
బాస్ కుర్చీలో ‘బాట్’.. ‘ఏజెంట్’ చెప్పింది చేయాల్సిందే!
కడుపులో బుజ్జాయిలు ఎందుకు అడ్డ తిరుగుతారంటే..!
సాక్షి కార్టూన్ 10-03-2026
బిగ్బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం
30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!
టైటిల్ నిరీక్షణ ముగించేందుకు... స్విస్ ఓపెన్ బరిలో శ్రీకాంత్
విజయశ్రీ!
బంగ్లాదేశ్కు భారత్ ఆపన్నహస్తం
గుజరాత్ జెయింట్స్ కోచ్గా ఆసీస్ క్రికెట్ దిగ్గజం
గ్యాస్ సిలిండర్ బుకింగ్.. కొత్త రూల్స్!
100 ఎకరాలు ఉంటే చెప్పండి: మీనాక్షి
మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..
ఉగాదికి 'అల్లు సినిమాస్' ప్రారంభం.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
భారీగా పెరిగిన గ్యాస్ ధరలు - యుద్ధంతో భగ్గుమన్న ధరలు
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
వరల్డ్కప్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ పేసర్
పతనమైన వెండి.. రూ.35 వేలు తగ్గిన రేటు!
ప్రేమలో పడ్డ కోర్ట్ జంట? రోషన్, శ్రీదేవి రియాక్షన్ ఇదే!
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్లో నీటి యుద్ధం మొదలైందా?
మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
సూపర్ సిక్స్ అమలు చేయకపోగా ఉన్న పథకాలు ఎత్తేయడానికి మీరు భలే ప్లాన్లు వేస్తున్నారు సార్!
పాత బంగారు లోకం
పడిపోయిన పసిడి ధరలు.. వారమంతా ఆనందమే!
బుజ్జి అభిమానిని సర్ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ
డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు!
ఫొటోలు
సినిమా ఈవెంట్లో మెరిసిన అనన్య నాగల్ల (ఫొటోలు)
విశాఖపట్నంలో వైభవంగా పైడిమాంబ తొలేళ్ల సంబరం (ఫొటోలు)
'లేచింది మహిళా లోకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
కాబోయే భార్యని పరిచయం చేసిన హీరో బెల్లంకొండ (ఫొటోలు)
చీరలో పవర్ఫుల్గా హీరోయిన్ ధన్సిక (ఫొటోలు)
సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు (ఫొటోలు)
#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్ హైలైట్స్.. (ఫొటోలు)
టీ–20 వరల్డ్ కప్ : హైదరాబాద్ లో క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
గ్రాండ్గా హీరోయిన్ శ్రద్ధాదాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
సినిమా
'జైలర్-2'లో పోలీస్ ఆఫీసర్గా బాలీవుడ్ కింగ్
జైలర్-2 సినిమాలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ముత్తువేల్ పాండియన్గా మరోసారి రజనీకాంత్ సందడి చేయనున్నారు. 2023లో విడుదలైన జైలర్ సినిమాకు సీక్వెల్గా పార్ట్-2ను దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇదే ఏడాదిలో ఈ మూవీ విడుదల కానుంది. అయితే, ఇప్పుడీ సీక్వెల్కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.జైలర్-2లో ప్రత్యేక పాత్రలో షారుఖ్ ఖాన్ నటిస్తున్నట్లు బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటించేందుకు ఆయన ఓకే అన్నట్లు సమాచారం. ఏడు నుండి ఎనిమిది రోజుల పాటు చిత్రీకరించబడే అతని సన్నివేశాలతో సినిమా ముగుస్తుందని భావిస్తున్నారు. మార్చి చివరి వారంలో జైలర్-2 సెట్స్లోకి షారుఖ్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.‘జైలర్’లో శివరాజ్కుమార్, మోహన్లాల్ వంటి స్టార్ నటులు సినిమాను మలుపుతిప్పే అతిథి పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా అలాంటి పాత్రలోనే కనిపిస్తారని సమాచారం. ఇందులో ఎస్.జె. సూర్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ కోడలు శ్వేతా పాండియన్ పాత్ర పోషించిన నటి మిర్నా కూడా ఈ సీక్వెల్లో కీలక పాత్ర పోషించనుందని వర్గాలు చెబుతున్నాయి.
48 గంటల్లో 312 మిలియన్స్ వ్యూస్.. ‘ధురంధర్ 2’ రికార్డు
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ధురంధర్ 2’. గతేడాది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. అంతేకాదు రిలీజ్కి ముందే ఈ సినిమా రికార్టులను కొల్లగొడుతోంది. యూట్యూబ్లో ఈ మూవీ ట్రైలర్కి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కేవలం 48 గంటల్లో అంటే రెండో రోజుల్లేనే 312 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ మధ్యకాలంలో ఒక మూవీ ట్రైలర్కు ఈ స్థాయి వ్యూస్ వచ్చిన దాఖలాలు లేవు.ట్రైలర్లో పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్ట్రైకింగ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఆడియో ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతూ, అనేక రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్కు ప్రేరణగా మారింది. ఇదే సమయంలో గూగుల్ ట్రెండ్స్లో కూడా ఈ సినిమా, నటీనటులపై సెర్చ్లు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. తండ్రిని కోల్పోయిన యువతికి సాయం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంచి మనసు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న బాణసంచా పేలుళ్ల ఘటనలో తండ్రిన కోల్పోయిన మానసిక దివ్యాంగురాలికి సాయం అందించారు. కడింపల్లి దుర్గ పోషణ కోసం జీవితాంతం నెలకు రూ.7,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాటు చేశారు.ఈ అగ్ని ప్రమాదంలో ఆమె తండ్రి కడింపల్లి ధనరాజు మరణించగా.. ఆమె తల్లి చాలా ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. మానసిక దివ్యాంగురాలైన కుమార్తె దుర్గను తండ్రి ధనరాజు చాలా జాగ్రత్తగా చూసుకునేవారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే, పేలుళ్ల ఘటనలో ఆయన మృతి చెందడంతో దుర్గ ఒంటరి అయిపోయింది. ఆమెకు అన్నం పెట్టే వారు కూడా లేకపోవడంతో చాలామంది చలించిపోయారు. అయితే, ఈ విషయాన్ని సోషల్మీడియా ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ స్పందించారు. నిర్మాత బన్నివాసు ద్వారా తన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులను వేట్లపాలెం పంపించారు. అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఆయన చలించిపోయారు. దుర్గకు కావాల్సిన సాయం చేయాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సాగర్ తెలిపారు. Hero #AlluArjun once again showed his big heart ❤️After learning about the tragic fire accident at a fireworks factory in Kakinada district that claimed her father’s life, he extended support to mentally challenged girl Kadimpalli Durga.He announced that ₹7,500 will be… pic.twitter.com/34q252I8FN— Milagro Movies (@MilagroMovies) March 10, 2026
గిరిజన యువతిగా క్రేజీ హీరోయిన్.. ఫస్ట్ లుక్ విడుదల
టాలీవుడ్ నటి రీతూ వర్మ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించింది. హీరో గోపీచంద్ ప్రతిష్టాత్మక చిత్రంలో ఆమె అలరించేందుకు సిద్ధమయింది. ప్రస్తుతానికి టైటిల్ ఖరారు కాని ఈ మూవీని దర్శకుడు సంకల్ప్రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఘాజీ, ఐ.బి 71, అంతరిక్షం చిత్రాలతో భిన్నమైన చిత్రాలతో మెప్పించిన సంకల్ప్ రెడ్డి... ఈసారి భారతదేశ చరిత్రలో మరిచిపోయిన ఓ కీలకఘట్టాన్ని వెండతెరపై చూపించనున్నాడు. ఈ క్రమంలో తాజాగా రీతూ వర్మ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. (Gopichand 33) పేరుతో ప్రారంభమైనే ఈ ప్రాజెక్ట్లో సత్యవతి అనే గిరిజన యువతిగా రీతూ వర్మ పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్లో ఆమె అత్యంత కీలకమైన పాత్రలోనే నటిస్తున్నట్లు పోస్టర్ సూచిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ దీనిని సమర్పిస్తున్నారు. 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించనున్నారు.భారతదేశ చరిత్రలో అందరూ మరిచిపోయిన ఓ కీలకఘట్టాన్ని ఈ చిత్రంతో తెరపై చూపించనున్నారు. ఇప్పటివరకూ ఎక్కడా కూడా చర్చల్లోలేని ఈ కథను చెప్పబోతున్నామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా కోసం గోపీచంద్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ మణికందన్ ఎస్ (హిట్ 1, హిట్ 2, గీత గోవిందం, సైంధవ్), ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా, యాక్షన్ కొరియోగ్రాఫర్ పృథ్వీ మాస్టర్ ఉన్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. View this post on Instagram A post shared by Srinivasaa Silver Screen (@srinivasaasilverscreenoffl)
క్రీడలు
అందరూ మ్యాచ్ విన్నర్లే!
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ముగిసింది. టీమిండియా ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచకప్ను కైవసం చేసుకొని ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు భారత క్రికెట్ జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా టీమిండియాను పొగడ్తలతో ముంచెత్తాడు. జట్టులో అందరూ మ్యాచ్ విన్నర్లు కావడమే భారత్ టైటిల్ గెలిచేందుకు కారణమైందని అఫ్రిది తెలిపాడు. ఇదే విషయమై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్ ముగిసింది. టైటిల్ గెలవడంలో టీమిండియాకు అర్హత ఉంది. జట్టు కాంబినేషన్ అద్భుతం. అంతేకాదు తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లే కాదు బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లు కూడా మ్యాచ్ విన్నర్లే. ఒకవేళ ఫైనల్కు ముందు తుది జట్టులో మార్పులు చేసి బెంచ్ నుంచి ఆడించినా భారత్ కప్ కొట్టేందుకు సిద్ధంగా ఉండేది. నిజానికి టోర్నీమొత్తం చాంపియన్ ఆటతీరును ప్రదర్శించారు.సంజూ శాంసన్ ఒక అద్భుతం. తనదైన హిట్టింగ్తో ఇన్నింగ్స్లను నిర్మించడంలో కీలకపాత్ర పోషించేవాడు. అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టోర్నీ ఆసాంతం విఫలమైనా కెప్టెన్ సూర్యకుమార్కు అభిషేక్పై ఉన్న నమ్మకం అతన్ని ఫైనల్ వరకు ఆడించింది. కీలకమైన ఫైనల్లో అభిషేక్ తనలోని అసలైన ఆటతీరును పరిచయం చేశాడు. ఇషాన్ కిషన్ కూడా తనదైన శైలిలో చెలరేగడం, ఆఖర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే హిట్టింగ్ జట్టుకు అదనపు ఆకర్షణ. ఇక బౌలింగ్ లో బుమ్రా అద్భుత ప్రదర్శనతో టోర్నీ ఆసాంతం బౌలింగ్ టీమ్ను తన భుజస్కందాలపై నడిపించాడు. కొత్త బంతి, పాత బంతి అనే తేడా లేకుండా, పదునైన యార్కర్లు సంధించి అతని బౌలింగ్ విలువను చాటిచెప్పాడు’ అని తెలిపాడు. ఇక ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు చచ్చీచెడీ సూపర్-8కు చేరినప్పటికీ మూడు మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్
పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్
పాకిస్తాన్ దేశవాళీ క్రికెటర్, సియాల్కోట్ స్టార్ ఆల్రౌండర్ షహజైబ్ భట్టి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాక్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ 24 ఏళ్లకే భట్టి రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశీయ క్రికెట్లో రాజకీయ జోక్యం, అవినీతి ఎక్కవైందని అతడు ఆరోపించాడు. అస్తవ్యస్తమైన వ్యవస్థ కారణంగా తాను క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు షహజైబ్ వెల్లడించాడు."పాకిస్తాన్ క్రికెట్కు గుడ్బై. 24 ఏళ్ల వయసులోనే నేను క్రికెట్ నుంచి తప్పుకొంటున్నాను. గతేడాది క్వైడ్-ఎ-అజం ట్రోఫీ ఫైనల్లో నా జట్టును గెలిపించాను. కానీ ఆ తర్వాత వరుసగా 40 మ్యాచ్ల పాటు నన్ను ఆడించకుండా పక్కన పెట్టారు" అని భట్టి ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.షహజైబ్ భట్టి పాక్ దేశవాళీ క్రికెట్లో టాలెంటెడ్ ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. క్వైడ్-ఎ-అజం ట్రోఫీ (2024-25)ను సియాల్కోట్ సొంతం చేసుకోవడంలో భట్టి కీలక పాత్ర పోషించాడు. పెషావర్ రీజియన్తో జరిగిన ఫైనల్లో భట్టీ అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్లో 40, రెండో ఇన్నింగ్స్లో అజేయంగా 32 పరుగులు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 2024 చివరలో తన రెండో ఫస్ట్-క్లాస్ మ్యాచ్లోనే 5 వికెట్ల హాల్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఇంతటి అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికి , గత 14 నెలలుగా అతనికి ఒక్క ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. దాదాపు 40 మ్యాచ్ల పాటు అతడిని వరుసగా బెంచ్కే పరిమితం చేయడం గమనార్హం.ఈ క్రమంలోనే భట్టీ తన కెరీర్ను అర్థవంతంగా ముగించాడు. తనలాంటి ఎందరో ఆటగాళ్ల కెరీర్లు ఈ విషపూరిత రాజకీయాల వల్ల నాశనమవుతున్నాయని భట్టీ ఆరోపించాడు. కాగా ఆ దేశ మాజీ క్రికెటర్లు సైతం పాకిస్తాన్ క్రికెట్లో రాజకీయం జోక్యం ఎక్కవైందని గత కొన్నాళ్లగా విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు షహజైబ్ భట్టి తీసుకున్న ఈ నిర్ణయం పాక్ బోర్డులోని లోపాలను మరోసారి ఎత్తిచూపింది.చదవండి: ఇండియా క్రికెట్ను నాశనం చేసింది: షోయబ్ అక్తర్
టీ20 ప్రపంచకప్ బెస్ట్ టీమ్ ఇదే.. పాక్ నుంచి ఒక్కరు కూడా!
టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను భారత్ కైవసం చేసుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా.. ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో టైటిల్ను ముద్దాడింది. ఇది భారత్కు మూడో టీ20 వరల్డ్కప్ విజయం కావడం గమనార్హం. మూడు టీ20 వరల్డ్కప్ ట్రోఫీలను సొంతం చేసుకున్న ఏకైక జట్టుగా మెన్ బ్లూ చరిత్ర సృష్టించింది. అయితే తాజాగా ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో కూడిన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రకటించాడు. ఆకాశ్ చోప్రా తన జట్టులో ఓపెనర్లుగా సంజూ శాంసన్, ఫిన్ అలెన్లను ఎంపిక చేశాడు. ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్పై చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు."శాంసన్ నాలుగు మ్యాచ్లు ఆడకపోయినా భారత్ తరపున లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్లో వరుసగా హాఫ్ సెంచరీలు బాదడం నిజంగా అద్భుతం. అందుకే అతడికి ఓపెనర్గా అవకాశమిచ్చా" అని చోప్రా పేర్కొన్నాడు.అదేవిధంగా సాహిబ్జాదా ఫర్హాన్, టిమ్ సీఫెర్ట్, పాతుమ్ నిస్సంక బ్రియన్ బెన్నెట్, ఐడెన్ మార్క్రమ్లు ఓపెనర్లగా రాణించినప్పటికి ఫిన్ అలెన్ వైపే తను మొగ్గు చూపుతున్నట్లు చోప్రా తెలిపాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్లో అలెన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక వరుసగా రెండు మూడు స్ధానంలో ఇషాన్ కిషన్, జాకబ్ బెథెల్కు చోప్ర అవకాశమిచ్చాడు. ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్కు చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్లగా అమెరికా పేసర్ షాడ్లీ షాల్క్విక్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడీలకు ఛాన్స్ లభించింది. భారత్ నుంచి ఆరుగురు ఈ జట్టులో చోటు దక్కింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను మాత్రం చోప్రా పరిగణలోకి తీసుకోలేదు.ఆకాశ్ చోప్రా ఎంచుకున్న టీ20 ప్రపంచకప్ బెస్ట్ ఎలెవన్ ఇదేసంజు శాంసన్, ఫిన్ అలెన్, ఇషాన్ కిషన్, జాకబ్ బెథెల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్, షాడ్లీ షాల్క్విక్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడీచదవండి: ఇండియా క్రికెట్ను నాశనం చేసింది: షోయబ్ అక్తర్
ఇండియా క్రికెట్ను నాశనం చేసింది: షోయబ్ అక్తర్
టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంటే.. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు మాత్రం విషం చిమ్ముతున్నారు. పాక్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ మరోసారి భారత్పై తన అక్కసు వెల్లగక్కాడు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ అధిపత్యం క్రికెట్ను పూర్తి నాశనం చేసిందంటూ అక్తర్ ఆరోపించాడు."ఓ ధనిక పిల్లాడు.. పక్కవీధిలో ఉన్న పేద పిల్లలందరినీ పిలిచి క్రికెట్ ఆడదాం రండి అని చెబుతాడు. ముందుగా 8 జట్లలో నాలుగు జట్లను ఉంచుకొని, తర్వాత అందులో మూడు జట్లను ఇంటికి పంపించి చివరకు నేనే గెలిచాను అంటాడు. ఇప్పుడు భారత్ చేస్తుంది కూడా అదే. ఇలా క్రికెట్ను భారత్ పూర్తిగా నాశనం చేసింది" అని ఓ ఛానల్ డిబేట్లో అక్తర్ పేర్కొన్నాడు.కాగా ఫైనల్కు ముందు న్యూజిలాండ్ కప్ గెలవాలని కోరుకుంటున్నట్లు అక్తర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఓ వైపు భారత్ను విమర్శిస్తునే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై షోయబ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కష్టకాలంలో ఆటగాళ్లకు అండగా ఉంటూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో గంభీర్ సక్సెస్ అయ్యారని అక్తర్ కొనియాడాడు. మరో పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ అమీర్ సైతం భారత విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.చదవండి: మరో 10 ఏళ్లు ఆడతా.. 10 ఐసీసీ ట్రోఫీలు గెలుస్తా: హార్దిక్
న్యూస్ పాడ్కాస్ట్
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
భవిష్యత్ అభివృద్ధి శూన్యం... ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్. సెమీస్లో 7 పరుగులతో ఇంగ్లండ్పై గెలుపు
హాజరైన సెలబ్రిటీలు... విరోష్ రిసెప్షన్ కు
‘లడ్డూ’పై బాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. శాసన మండలిలో చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు
స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెద్ది
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలపై ఆటవిక దాడి... మహిళా దినోత్సవ వేళ చంద్రబాబు మార్కు గిఫ్ట్
బిజినెస్
రూ.లక్ష కోట్లకు లోన్ బుక్..
ప్రభుత్వరంగ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్సీఎల్) వచ్చే ఆర్థిక సంవత్సరంలో (రూ.2026–27) రూ.లక్ష కోట్ల రుణ మార్క్ను అధిగమించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ‘‘2025 డిసెంబర్ 31 నాటికి రుణ పుస్తకం రూ.80,515 కోట్లుగా ఉంది. ప్రస్తుత ధోరణి, వివిధ రంగాల్లో ప్రస్తుత ప్రాజెక్టుల ఆధారంగా చూస్తే మా రుణ పుస్తకం విలువ 2027 మార్చి నాటికి రూ.లక్ష కోట్లు దాటనుంది’’అని ఐఐఎఫ్సీఎల్ ఎండీ రోహిత్ రిషి తెలిపారు. అంతేకాదు, వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల్లో రుణ పుస్తకాన్ని రెట్టింపు చేసుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.క్రమశిక్షణతో కూడిన మదింపు ప్రమాణాలు, మెరుగైన ఆస్తుల నాణ్యత, నిధుల సమీకరణ వ్యూహాలు వృద్ధికి దోహదం చేస్తున్నట్టు చెప్పారు. ‘‘బ్యాలన్స్ షీటును విస్తరించుకోవడమే కాకుండా, అధిక నాణ్యతతో, వైవిధ్యమైన, జాతీయ మౌలిక ప్రయోజనాలకు అనుగుణంగా పటిష్ట రుణ పోర్ట్ఫోలియో నిర్మాణంపైనే మా ప్రధాన దృష్టి’’అని వివరించారు. మౌలిక రంగ అవసరాలకు అనుగుణంగా, తక్కువ వ్యయాలతో దీర్ఘకాలం కోసం దేశ, విదేశీ మార్కెట్ల నుంచి సైతం నిధులను సమీకరించుకోనున్నట్టు చెప్పారు.లోగడ ఏడీబీ, కేఎఫ్డబ్ల్యూ, జికా, ఈఐబీ, ప్రపంచ బ్యాంక్ తదితర సంస్థల నుంచి నిధులను పొందినట్టు తెలిపారు. ఎంఐజీఏ (ప్రపంచ బ్యాంక్ సంస్థ) సహకారంతో సావరీన్ గ్యారంటీ లేకుండా దీర్ఘకాలానికి బిలియన్ డాలర్ల నిధులు సమీకరించనున్నట్టు రోహత్ రిషి తెలిపారు. ఐఐఎఫ్సీఎల్లో కేంద్రానికి నూరు శాతం వాటా ఉంది.ఇదీ చదవండి: బెంగళూరులో హోటళ్లు బంద్!?
వేసవిలో ఏసీ ధరల మంటలు
వేసవి ఎండలు అప్పుడే తారా స్థాయికి చేరుతున్నాయి. ఈ క్రమంలో ఇంట్లో చల్లదనం కోసం ఎయిర్ కండీషనర్ (ఏసీ) కొనుగోలు చేద్దామనుకుంటున్న వారు.. కాస్తంత అదనంగా సమకూర్చుకోక తప్పదు. ఎందుకంటే సరిగ్గా సీజన్ ఆరంభానికి ముందు ఎసీ తయారీ సంస్థలు 5–15 శాతం మధ్య ధరల పెంపును అమలు చేస్తున్నాయి. ముడి సరుకుల ధరలు ప్రియంగా మారడం, సరఫరా చైన్ వ్యయాలు తగ్గించుకునేందుకు ధరల పెంపు బాటలో పయనిస్తున్నాయి. డైకిన్, వోల్టాస్, బ్లూస్టార్, ఎల్జీ, హైయర్, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ పలు మోడళ్ల ఏసీల ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయి.ఏసీల తయారీలోకి వినియోగించే రాగి తదితర ముడి సరుకుల ధరలు పెరిగాయి. దీనికితోడు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు, అధిక రవాణా చార్జీలను కారణాలుగా కంపెనీలు పేర్కొంటున్నాయి. ధరలు పెంచినప్పటికీ.. అధిక ఉష్ణోగ్రతల అంచనాలతో ఈ ఏడాది అమ్మకాలు బలంగానే నమోదవుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. గతేడాది సెపె్టంబర్లో జీఎస్టీ రేట్ల సవరణ ఫలితంగా ఏసీల ధరలు దిగిరాగా.. తాజా పెంపుతో ఆ ప్రయోజనం పూర్తిగా ఆవిరికానుంది. అప్పుడు రూమ్ ఏసీలపై పన్ను రేటు 28 శాతం నుంచి 18 శాతానికి దిగిరావడం గమనార్హం. డైకిన్ 12 శాతం పెంపు..జపనీస్ సంస్థ డైకిన్ ఏప్రిల్ నుంచి తన ఏసీ ధరలను 12 శాతం పెంచనున్నట్టు ప్రకటించింది. మోడళ్లను బట్టి ధరల పెంపు మారుతుందని డైకిన్ ఇండియా చైర్మన్, ఎండీ కన్వల్జిత్ జావా తెలిపారు. ‘‘కొత్త ఇంధన నిబంధనలతో ఉత్పత్తుల సామర్థ్యం పెరగనుంది. కాపర్ వంటి ముడి సరుకుల ధరలు పెరిగాయి. రూపాయితో డాలర్ ఆల్టైమ్ గరిష్టాల్లో ఉంది. అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నాయి. రవాణా చార్జీలు కూడా పెరిగాయి. దీంతో దిగుమతులు (విడిభాగాలు) వ్యయంగా మారాయి. కనుక కంపెనీలకు ధరలు పెంచడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు’’అని జావా వివరించారు. ఈ సీజన్లో అమ్మకాలు 2024 స్థాయిలో ఉంటాయంటూ.. కనీసం 15 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. తాము ఫిబ్రవరి మధ్య నుంచే 8–10 శాతం మేర ధరలను పెంచినట్టు బ్లాస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. ‘‘ధరల పెంపునకు ముందుగానే డీలర్లు అదనపు నిల్వలను సమకూర్చుకున్నారు. పెరిగిన ధరలతో కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది’’ అని పేర్కొన్నారు. గతేడాది జీఎస్టీ రేటు తగ్గింపు.. ఇప్పుడు ధరల పెరుగుదల ప్రభావాన్ని భర్తీ చేయనుందన్నారు. డిసెంబర్ నుంచి కాకుండా, గతేడాది వేసవి సీజన్తో పోలి్చతే ధరల పెరుగుదల పెద్దగా ఉండదని త్యాగరాజన్ పేర్కొన్నారు. గతేడాది వేసవిలో అసాధారణ వర్షాలు, ముందుగానే నైరుతి సీజన్ రావడం ఏసీ అమ్మకాలను ప్రభావితం చేయడం గమనార్హం.పోటీ తీవ్రతరంఈ ఏడాది రూమ్ ఏసీల మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంటుందన్నది మార్కెట్ విశ్లేషకుల అంచనా. గతేడాది సీజన్ ఆశించిన మేర లేకపోవడంతో ఈ ఏడాది అధిక విక్రయాల ద్వారా మార్కెట్ వాటా పెంచుకునేందుకు కంపెనీలు పోటీపడే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్ సైతం తన ఏసీల ధరలను 5–15 శాతం మధ్య పెంచనున్నట్టు ప్రకటించింది. తయారీ వ్యయాలు పెరగడం, రూపాయి విలువ క్షీణత, మెరుగైన ఇంధన సామర్థ్యాలతో కూడిన నాణ్యమైన ఏసీలను వినియోగదారులకు అందించాలంటే ధరలను పెంచక తప్పదని వోల్టాస్ ఎండీ ముకుందన్ మీనన్ తెలిపారు. ఎల్జీ ఎల్రక్టానిక్స్ 3 స్టార్ ఏసీల ధరలను 7 శాతం మేర, 5 స్టార్ ఏసీలను 9–10 శాతం మేర పెంచినట్టు ప్రకటించింది.కొత్త ఇంధన సామర్థ్యాలతో కూడిన ఏసీలతో వినియోగదారులకు 11 శాతం మేర ఇంధనం అదా అవుతుందని.. దీనివల్ల విద్యుత్ బిల్లు రూపంలో గణనీయంగా ఆదా అవుతుందని ఎల్జీ ఎల్రక్టానిక్స్ డైరెక్టర్ సంజయ్ చిట్కర తెలిపారు. హైయర్ ఇండియా తన ఏసీ ధరలను 5–8 శాతం వరకు పెంచగా, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ 5 శాతం పెంచినట్టు వెల్లడించాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ కొత్త స్టార్ రేటింగ్ ప్రమాణాలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం 5 స్టార్ ఏసీలు 10 శాతం మేర మరింత ఇంధనాన్ని ఆదా చేయనున్నాయి.ఇదీ చదవండి: బెంగళూరులో హోటళ్లు బంద్!?
ఐటీ కంపెనీలూ...పారాహుషార్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళికరాజకీయ ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో కార్యకలాపాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ హెచ్చరించింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేలా ఆపరేషనల్ సన్నద్ధతను పెంచుకోవాలని, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచిస్తూ తాజాగా అడ్వైజరీ జారీ చేసింది.ప్రస్తుతానికి వ్యాపార కార్యకలాపాలు నిలకడగానే ఉన్నప్పటికీ పరిస్థితులు దిగజారితే ఎదురయ్యే అవరోధాలను అదిగమించేందుకు కంపెనీలు క్రియాశీలకంగా తమ అత్యవసర ప్రణాళికలను పునఃసమీక్షించుకుంటున్నాయని, పటిష్టమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయని నాస్కామ్ పేర్కొంది. కీలకమైన సరీ్వసులు దెబ్బతినకుండా సిస్టంలు పటిష్టంగా ఉండేందుకు క్లౌడ్ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లకు ప్రత్యామ్నాయ రూటింగ్ ఆప్షన్లను కూడా పరిశీలించాలని సూచించింది. ప్రభావిత ప్రాంతాల్లో ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నాయని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను నిశిచంగా పరిశీలిస్తున్నాయని వివరించింది. అనిశ్చితితో సైబర్ దాడుల ముప్పులు సాధారణంగా భౌగోళికరాజకీయ అనిశ్చితి ఏర్పడినప్పుడు మూకుమ్మడి సైబర్ దాడులు, తప్పుడు ప్రచారాలు, మౌలిక సదుపాయాలను దెబ్బతీయడంలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయని నాస్కామ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ని అమల్లోకి తేవడం, పశి్చమాసియా దేశాల్లో కార్యకలాపాలున్న థర్డ్ పార్టీ వెండార్లతో లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం తదితర చర్యలు తీసుకోవాలని సూచించింది.యుద్ధ పరిస్థితులు, ప్రభుత్వం నుంచి అలర్టుల్లాగా మభ్యపెట్టే థీమ్లతో జరిగే సోషల్ ఇంజినీరింగ్ దాడులపై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నాస్కామ్ పేర్కొంది. పశ్చిమాసియాలో పరిణామాలను తాము కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైన మద్దతును అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని వివరించింది.
వెండి కిందికి.. బంగారం పైకి..
న్యూఢిల్లీ: వెండి వరుసగా మూడో రోజు అమ్మకాలతో నష్టపోయింది. ఢిల్లీ మార్కెట్లో కిలోకి రూ.3,400 తగ్గి (1.3 శాతం) రూ.2,68,300 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.1,64,300 స్థాయికి చేరింది.‘‘ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరగడంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరోసారి తీవ్రతరమయ్యాయి. దీంతో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు జాప్యం కావొచ్చన్న అంచనాలు పెరిగాయి. ఈ పరిస్థితులు యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్కు మద్దతునిస్తున్నాయి. ఈ ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతోంది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ గోల్డ్ ఔన్స్కు 65 డాలర్లు నష్టపోయి 5,105 డాలర్ల స్థాయిలో, వెండి ఔన్స్కు అర డాలర్ తగ్గి 83.92 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మార్కెట్వ్యాప్తంగా అమ్మకాలతో మార్జిన్కాల్స్ ఎదురై, పొజిషన్లను బలవంతంగా విక్రయించుకోవాల్సి రావడం సైతం బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపించినట్టు కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం ఏవీపీ కేనత్ చైన్వాలా తెలిపారు.
ఫ్యామిలీ
ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..
ప్రసవానంతరం బరువు తగ్గడం చాలా సవాలుగా ఉంటుంది. మాములుగా బరువు తగ్గడానికి గర్భధారణ అనంతరం తగ్గడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పైగా శరీరంలో వచ్చే మార్పులకు తోడు నవజాత శిశువుని హ్యాండిల్ చేస్తూ బరువు తగ్గడం తదితరాలన్ని చాలా సవాలుగా ఉంటాయి. ముందుగా శరీరం మునపటి పటుత్వం లేక..కొద్దిపాటి వ్యాయామాలను ఓర్చుకునే శక్తి స్వతహాగా కొత్త తల్లులకు ఉండదు. మరి అలాంటప్పుడు ఎలాంటి తేలిక పాటి వ్యాయామాలు చేయాలి..? కొత్త తల్లులు నిజంగానే తీవ్రమైన వ్యాయామాల జోలికి పోకపోవడమే మంచిదా..? తదితరాల గురించి కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిధి త్యాగి చెప్పే సలహాలు సూచనలే గురించి సవివరంగా చూద్దామా..!.ప్రసవానంతరం బరువు తగ్గం అనేది సాధారణ విషయం కాదని అంటోంది నిధి త్యాగి. దీని గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అమూల్యమైన సలహాలు సూచనలు షేర్ చేశారు. ఇక్కడ కొత్త తల్లులు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కంటే..కేలరీలలోటు, కదలికలపై దృష్టిపెట్టాలని అంటోంది. చాలామంది డెలివరీ తర్వాత పాలిస్తారు కాబట్టి బరువు తగ్గిపోతారని అనుకుంటుంటారు. కానీ అది ముమ్మాటికీ అబద్ధమని అంటోంది. తాను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మామిడపండ్లు అధికంగా తినేదాన్ని అని ఆ టైంలో ఏకంగా 20 కిలోలకు పైగా అదనపు బరువు ఉన్నానని చెప్పుకొచ్చింది. ప్రసవం తర్వాత పదికిలోలు మాత్రమే తగ్గానని, మిగిలిని పదికిలోల బరువు అలాగే ఉందని తెలిపింది. ఏడాదికి పైగా బిడ్డకు పాలిచ్చానని, ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకున్నానని, అలాగే తేలికపాటి వాకింగ్ వంటివి చేసేదాన్ని అని వెల్లడించింది. కానీ అంతలా కేర్ తీసుకున్నా..బరువులో అంతగా మార్పులు కనిపించలేదని అంటోంది. పైగా డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి తీవ్రమైన వ్యాయామాల జోలికి అస్సలు పోకూడదని అంటోంది. ఎందుకంటే కొత్త తల్లుల శరీరం సున్నితంగా మారిపోయి ఉంటుంది..దాంతో ఆ వర్కౌట్లు తట్టుకోవడం అంత సులభం కాదని చెబుతోంది. కనీసం 15 నిమిషాలు కూడా చేయలేమని అంటోంది. అలా అని బయటకు జిమ్ వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో హోమ్ ఇన్స్ట్రక్టర్ని నియమించుకున్నట్లు తెలిపింది. అతను సూచించిన కోర్ వ్యాయామాలు, కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలతో బలం పుంజుకోగలిగానని అంటోంది. వీటివల్ల కండరాలు బలోపేతం అవుతుతాయి. కొద్దిపాటి బరువులు ఎత్తి..బోడ్డులోపలికి కోర్ని స్ట్రాంగ్గా మార్చుకోగలిగానని అంటోంది. అలా తాను నాలుగు నెలల్లో నాలుగు నుంచి ఐదు కిలలోలు వరకు తగ్గగలిగానని అంటోంది. ప్రస్తుతం తాను ప్లాంక్లు కూడా వేయగలనని, వెన్నునొప్పి లేదని అంటోంది. కానీ ప్రసవానంతరం వేగవంతంగా బరువు తగ్గాలనుకోవడం తప్పులేదు గానీ..ఆ క్రమంలో తప్పుడు మార్గంలో వెళ్లొద్దని, ఆరోగ్యకరమైన మార్గాన్ని ఎంచుకోమని చెబుతోంది కంటెంట్ క్రియేటర్ నిధి త్యాగి. View this post on Instagram A post shared by Nidhi Tyagi (@thenidhityagi) (చదవండి: చీరకట్టులో స్నోబోర్డింగ్ స్టంట్..!)
Hyderabad: రంజాన్ ఉపవాసం పాటిస్తున్న పిల్లి
మనమేం చేస్తే పిల్లలు చూస్తారు.. అదే చేస్తారు.. కుటుంబ సభ్యులు ఏం చేస్తే ఇంట్లోని పెట్స్ కూడా అలాగే చేయడం చూస్తూనే ఉంటాం. కుటుంబ సభ్యుల్లా కలిసిపోయిన పెట్స్ చేసే కొన్ని పనులు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఓ పిల్లి రంజాన్ ఉపవాస దీక్షను అనుసరిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. మోతీనగర్ డివిజన్లో నివాసం ఉండే ఓ ముస్లిం కుటుంబం కొన్ని నెలల క్రితం ఆన్లైన్లో ఓ పిల్లిని కొనుగోలు చేసింది. దానికి జీజీ అని పేరుపెట్టి ప్రేమతో పెంచుకుంటున్నారు. రంజాన్ మాసం కావడంతో కుటుంబ సభ్యులంతా ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఈ క్రమంలో నిత్యం వారిని అనుసరిస్తున్న ఆ పిల్లి ఉపవాస దీక్షలను పాటిస్తూ వారితో పాటు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రతిరోజూ సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటుంది. ఇఫ్తార్ సమయంలో కుటుంబ సభ్యుల వద్దకు వచ్చి కూర్చుంటుంది. ఎలాంటి ఆహార పదార్థాలు స్వీకరించదు. వారంతా ఇఫ్తార్ పూర్తి చేసుకున్న తర్వాత దానికి ఆహారం పెడితే మాత్రమే తింటుంది. పిల్లి క్రమశిక్షణతో మెలగడంపై ఇంటి యజమాని షేక్ రియాజ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – మోతీనగర్
తల్లీబిడ్డల ‘ఎల్లిపాయ కారం’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల నగరానికి చెందిన తల్లీకూతుళ్లు రాచకొండ చందన, సాయిశ్రీ కొత్త రకం వంటలను రుచి చూపిస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల సోనీ టీవీ మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్–9 వంటల రియాలిటీ షోలో రన్నరప్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్శించారు. గతంలోనే ఎల్లిపాయ కారంతో వైరెటీలు చేస్తూ కొత్త రుచులను పరిచయం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో ఎల్లిపాయ కారం పేరుతో ఓ రెస్ట్రారెంట్ నిర్వహిస్తున్నారు. చందన తన భర్త రవీందర్ సహకారంతో మంచిర్యాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇక కూతురు సాయిశ్రీ బీటెక్ చేయగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ తనకు ఇష్టమైన వంటల రంగాన్నే ఎంచుకున్నారు. నాలుగో తరగతి నుంచే వంట చేసేందుకు ఆసక్తి చూపడంతో తల్లిదండ్రులు అదే దిశగా ప్రోత్సాహించారు. గతంలో జెమిని టీవీలో తెలుగు మాస్టర్లో పాల్గొన్నప్పటికీ ఫైనల్ వరకు చేరలేదు. తాజాగా తల్లీకూతురు మాస్టర్ ఇండియా చెఫ్ జోడిగా కొనసాగిన 45ఎపిసోడ్స్లో వంటల్లో వైవిధ్యతను ప్రదర్శించారు.పుష్పరాజ్ చికెన్, స్పెషల్ లడ్డురియాలిటీ షోలో కఠిన పరీక్షలైన అగ్ని పరీక్ష, నీరు లేకుండా వంట, కట్టల పొయ్యిపై వండడం, వెజ్, నాన్వెజ్ వంటకాలు చేశారు. దేశంలో పలు ప్రాంతాల వంటకాల్లో మసాలాలు, పదార్థాలతో కొత్త రుచులు వచ్చేలా చేసి సత్తా చాటారు. ప్రఖ్యాత చెఫ్ సంజీవ్ కపూర్తోపాటు న్యాయనిర్ణేతలు వికాస్ ఖన్నా, రణవీర్ బ్రార్, కునాల్ కపూర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.ఆ సమయంలో పుష్పరాజ్ పేరుతో వండిన చికెన్తో న్యాయనిర్ణేతలను ఆకర్షించారు. ‘మా రెస్టారెంట్లో లడ్డుకు ప్రత్యేక ఆదరణ ఉంది. మహిళలు వంట తెలియకుండానే నేర్చుకునే ఓ గొప్ప నైపుణ్యం. మా పాప అభిరుచి కోసం నేను తోడుగా నిలిచా’ అని తల్లి చందన చెబుతుంటే, అమ్మ అందించిన ప్రోత్సాహంతోనే తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని సాయిశ్రీ అంటున్నారు.
సమయపాలన
ప్రపంచంలో విజయవంతమైన వ్యక్తులందరిలో కనిపించే ఒకే ఒక ఉమ్మడి లక్షణం సమయపాలన. సమయాన్ని సరిగ్గా నిర్వహించే వ్యక్తి తన పనులను సకాలంలో పూర్తి చేయడమే కాకుండా, ఇతరుల గౌరవాన్ని కూడా పొందుతాడు. ప్రకృతి కూడా సమయపాలననుపాటిస్తుంది. సూర్యోదయం, చంద్రోదయం, రుతువులు అన్నీ సమయానికే జరుగుతాయి. మనిషి కూడా ప్రకృతిని చూసి సమయపాలన నేర్చుకోవాలి. మనం పనులను వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేస్తే, చివరి నిమిషంలో పడే కంగారు లేదా ఒత్తిడి ఉండదు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమయపాలన అనేది కేవలం గడియారం చూసి పని చేయడం కాదు, అది ఒక క్రమశిక్షణ.సమయాన్ని గౌరవించడం అంటే సాక్షాత్తు భగవంతుడిని గౌరవించడమే. సమయాన్ని వృథా చేసేవాడు దైవనింద చేసినట్లే అని ఆధ్యాత్మిక భావన. ఒక వ్యక్తి సమయానికి వస్తున్నాడంటే, అతనికి తన బాధ్యతల పట్ల పూర్తి అవగాహన ఉందని అర్థం. సమయపాలనపాటించకపోయినా, సద్వినియోగం వేసుకోకపోయినా ఏ మనిషి కూడా ఆలోచనలను, ఉన్నత లక్ష్యాలను యిప్పుడే కాదు, ఎప్పటికీ చేరుకోలేడు. సోమరిపోతుగానే జీవితాన్ని గడపక తప్పదు. ఒకసారి సమయం దాటిపోయింది. అంటే తిరిగి దానిని అందుకోవడం మన వల్ల కాదు. అందుకనే ప్రతి క్షణం కూడా మనం మెలకువతో ఉండి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలిగితేనే విజయం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది.మనం చేసే ప్రతి పనికి ఒక సమయం ఉంటుంది. విత్తనం నాటడానికి ఒక సమయం, ఫలం రావడానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు వేచి ఉండటం (ఓర్పు), అలాగే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆధ్యాత్మిక లక్షణం. ఒక కార్యం తలపెట్టినప్పుడు ప్రణాళిక ఎంత ముఖ్యమో, ఆ పనిని పూర్తి చేయడానికి ఒక నిర్దిష్ట సమయం కూడా అంతే ముఖ్యం. ఆ సమయ పరిపాలన మనంపాటించకపోతే ఆ కార్యం ఫలాలను మనం పూర్తిగా అందుకోలేం. సమయాన్ని నిరుపయోగంగా మొబైల్ ఫోన్లకే కేటాయించడం అనేది ఒక సామాజిక సమస్యగా మారుతోంది.మొబైల్ అనేది ఒక అద్భుతమైన సాధనం అయినప్పటికీ, దానిని అతిగా వాడటం వల్ల యువత తమ విలువైన భవిష్యత్తును పణంగా పెడుతున్నారు యువత ఈ మొబైల్ మాయలో పడి తమలోని దైవత్వాన్ని కోల్పోతున్నారు. ఈ అనవసరపు యాప్ల నుండి బయటపడి, రోజులో కనీసం 15 నిమిషాలు మౌనంగా లేదా ధ్యానంలో గడిపితే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో వారు గ్రహించ గలరు. మొబైల్ ఫోన్ మన అవసరానికి ఉండాలి కానీ, మనల్ని శాసించేలా ఉండకూడదు. యువత తమ కాలాన్ని కెరీర్ నిర్మాణానికి, జ్ఞానసముపార్జనకు వాడుకుంటేనే దేశానికి, వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. విలువైన ఈ జీవిత పయనంలో సమయం విలువ నేటి యువత తెలుసుకోవాల్సిందే,పాటించాల్సిందే. లేకుంటే వారి జీవితాలు అధోగతిపాలుకావడం ఖాయం. ఎంత ప్రతిభ ఉన్నా సమయపాలనపాటించనపుడు అతని ప్రతిభ నిరుపయోగంగా మారిపోతుంది. ఏ సమయంలో అది అందించాలో తెలియనపుడు అతడు ఎంత నాణ్యమైన వస్తువు తయారుచేసినా నిరుపయోగంగా మారిపోతుంది. వీటన్నిటికీ కూడా సమయమే ముఖ్యం. ఈ సమయ పరిపాలన అనే మంత్రం మాత్రమే వారి ఆలోచనలను, లక్ష్యాలను, దీర్ఘకాలిక ప్రణాళికలను నెరవేర్చగలుగుతుంది. సమయం ఎంతో విలువైనది. ప్రతి క్షణం ఎంతో అమూల్యమైనది. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వారే పనులను విజయవంతంగా నెరవేర్చుకోగలుగుతారు. ఆ సమయం విలువను గుర్తించి దాన్ని అనుసరించగలిగితే ఆ వ్యక్తి ఉన్నత స్థితికి చేరుకోవటానికి మార్గం సులభమైనట్లే. – రామలక్ష్మీ సదానందమ్
అంతర్జాతీయం
పాకిస్తాన్లో పాఠశాలలు బంద్.. ఆఫీసులు 4 రోజులే..
ఇస్లామాబాద్: ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల పెర్షియన్ గల్ఫ్లోని హార్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా ఆగిపోయే ప్రమాదం ఏర్పడటంతో పాకిస్తాన్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. దీని ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం టెలివిజన్ ద్వారా ఇంధన ఆదా కోసం కఠిన చర్యలను ప్రకటించారు.ప్రధాన నిర్ణయాలుమార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు రెండు వారాల పాటు మూసివేయనున్నారు. యూనివర్సిటీలు, కళాశాలలు వెంటనే ఆన్లైన్ తరగతులకు మారనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు (బ్యాంకులను మినహాయించి) వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయనున్నాయి. సగం ఉద్యోగులు (50 శాతం) వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి.ప్రభుత్వ శాఖలకు ఇంధన అలవెన్సులు వచ్చే రెండు నెలల పాటు 50 శాతం తగ్గించారు.ప్రధాని షరీఫ్ తన ప్రసంగంలో “ఇంధన వినియోగాన్ని తగ్గించి, దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడం మన ముఖ్య లక్ష్యం. ఈ నిర్ణయాలు కష్టమైనవే అయినా, ప్రజల సహకారంతో ఈ సంక్షోభాన్ని అధిగమిస్తాం” అని పేర్కొన్నారు.
ఇరాన్ యుద్ధంపై ఫ్రాన్స్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
ఇరాన్పై జరుగుతున్న యుద్ధం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఈ సంఘర్షణ ముగిసే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు.ఈ యుద్ధం ప్రస్తుత తీవ్ర స్థాయిలో ఇంకా చాలా రోజులు, బహుశా పలు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని మాక్రాన్ అంచనా వేశారు. ఇది పూర్తిగా ప్రతి పక్షం తమ తుది లక్ష్యాలను ఎలా నిర్వచిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు."అంతిమంగా ఏ తుది స్థితిని సాధించాలనుకుంటున్నారో అదే ఈ యుద్ధం ఎంతకాలం ఉంటుందో నిర్ణయిస్తుంది" అని మాక్రాన్ పేర్కొన్నారు. ఈ సంఘర్షణలో ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా మాత్రమే ఇరాన్ రెజీమ్లో లోతైన మార్పులు తీసుకురాలేవని, అయితే బాలిస్టిక్ సామర్థ్యాలు లేదా నావికాదళాన్ని నిర్వీర్యం చేయడమైతే కొన్ని వారాల్లో సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు.ప్రస్తుతం యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా, ఫ్రాన్స్ ఈ సంఘర్షణలో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదని, కేవలం రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నట్టు మాక్రాన్ స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి పునరుద్ధరణకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం డీ-ఎస్కలేషన్పై దృష్టి పెట్టాలని ఫ్రాన్స్ పదేపదే పిలుపునిచ్చింది.
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు.. డ్రోన్ సెంటర్ ధ్వంసం!
టెహ్రాన్: ఇరాన్పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ అంతటా డజన్ల కొద్దీ పాలన, సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) తీవ్రమైన దాడుల తరంగాన్ని కొనసాగిస్తోంది. ఇటీవలి దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) డ్రోన్ ప్రధాన కార్యాలయంపై బాంబులు వేశాయి.ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ కేంద్ర ప్రధాన కార్యాలయం నుంచి డ్రోన్లు ప్రయోగిస్తారు. "ఇరాన్ ఉగ్రవాద పాలన ఈ ప్రధాన కార్యాలయం నుంచి ఇజ్రాయెల్ వైపు డ్రోన్లను ప్రయోగించింది. అలాగే, ప్రయోగానికి సిద్ధంగా ఉన్న అదనపు డ్రోన్లను అక్కడ నిల్వ చేసింది" అని ఐడీఎఫ్ తెలిపింది.ఈ దాడి ఇరాన్లోని వివిధ సైనిక స్థావరాలు, మిసైల్ ఉత్పత్తి యూనిట్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఏరోస్పేస్ సదుపాయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో భాగమే. ఇజ్రాయెల్ వైమానిక దళం టెహ్రాన్లోని ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ కమాండ్ సెంటర్ను కూడా లక్ష్యంగా చేసుకుందని తెలుస్తోంది. ఈ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై ప్రతీకార దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. రెండు వైపులా దాడులు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి.
అమెరికాలో ఆకలికేకలు... ఆపన్న హస్తంగా భారతీయ హిందువు
ఓ వైపు అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందిన దేశంగా అభివర్ణించుకుంటూ ఉన్న అమెరికాలో ప్రస్తుతం ఆహార అభద్రత అత్యంత ఆందోళన కలిగించే అంశాలలో ఒకటిగా మారింది. మాట వినని వారిపై కయ్యాలకు కాలు దువ్వుతూ ఇతర దేశాలపై ఆంక్షల కొరడా ఝులిపిస్తూ ఏ అంతర్గత సమస్యలూ లేనట్టు పైకి కనిపిస్తున్న ఆ దేశంలో కనీసపాటి నాణ్యమైన భోజనం పొందలేకపోతున్నవారి సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ విషయాన్ని ఫుడ్ రీసెర్చ్ – యాక్షన్ సెంటర్ అందించిన 2024 డేటా నిర్ధారించింది.ఈ అధ్యయనం ప్రకారం ఆ దేశంలోని ఏడు ఇళ్లలో కనీసం ఒక ఇల్లు ఆహార అభద్రతను ఎదుర్కుంటోంది. అంటే దాదాపుగా 47.9% మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్నారని అంచనా. దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం దేశవ్యాప్తంగా ఇళ్లలో తృప్తికరమైన భోజనాలు ఆస్వాదించడాన్ని కష్టతరం గా మార్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపధ్యంలో పలువురు వ్యక్తులు సంస్థలు అవసరార్ధులకు రుచికరమైన, ఉచిత భోజనాన్ని అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. అలాంటి వారిలో జన్మతః భారతీయుడైన గోవింద దత్తా కూడా ఒకరు. ఆయన ఆధ్వర్యంలోని లాస్ ఏంజిల్స్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కృష్ణ లంచ్ అనే సంస్థ ఒక ఫుడ్ ట్రక్ను నిర్వహిస్తోంది. ఇది వెస్ట్వుడ్లోని లే కాంటే అవెన్యూలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వెలుపల కొలువుదీరిన ఓ ఫుడ్ ట్రక్. ఈ కృషగోవింద దత్తా... ఆధ్వర్యంలో ఈ ట్రక్ విద్యార్ధులు, కార్మికులకు నామమాత్రపు ధరకే శాఖాహార భోజనాలను అందిస్తోంది.‘ ఆహార అభద్రతను ఎదుర్కోవడంలో ఇక్కడి సమాజానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం‘ అని దత్తా మీడియాతో అంటున్నారు. ఆయన శృకృష్ణుని ఆదర్శాల వ్యాప్తికి వెలసిన హిందూ భక్తి ఉద్యమం ఇస్కాన్లోని హరేకృష్ణ కు దీర్ఘకాల సభ్యుడు, కర్మ సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తాను అంటున్న ఆయన భగవద్గీతను వ్యాప్తి చేయాలనే లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నానంటారు.అతి తక్కువగా, చిన్న పాటి విరాళానికి (షుమారు 5 డాలర్లు) ప్రతిగా స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని ఈ ట్రక్ అందిస్తుంది. అయితే, ఆ కనీస విరాళం మొత్తాన్ని ఇవ్వలేని వారు కూడా ఇక్కడ భోజనానికి అర్హులే. తమ ట్రక్ లో వడ్డించే వంటకాల కోసం రూపొందిన మెనూ ఆయుర్వేద పురాతన వంట శైలులపై ఆధారంగా ఉందని ఆయన వెల్లడించారు, ‘కూరగాయలు, ధాన్యాలు, బీ¯Œ ్స‘ కలయిక గా ఈ ఆహారపదార్ధాలు రూపొందుతాయి.ఆయన తో పాటు మరొక స్వచ్ఛంద సేవకుడు శాంతాత్మ ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు మేల్కొంటారు.. అక్కడ నుంచి తమ ట్రక్ పనులను చూసుకుని సాయంత్రం 7 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంటారు. వారానికి ఐదు రోజుల పాటు ఈ ప్రాజెక్టును అందించగలుగుతారు. ఈ ఫుడ్ ట్రక్ సోమవారం నుంచి శుక్రవారం వరకు స్థిరమైన మెనూ షెడ్యూల్ను అనుసరిస్తుంది.‘ఆహారం ఒక బహుమతి, అదే మా ప్రేరణ‘ అని దత్తా అంటున్నారు. దేశంలో 20% మంది విద్యార్థులు డబ్బు కారణంగా ఆహార స్వీకరణను వాయిదా వేస్తున్నారని, మొత్తంగా 42% మంది ఆహార అభద్రతతో ఉన్నారని అంటున్న వీరు తమ వంతుగా ఈ సమస్య పరిష్కారంలో భాగం అవుతున్న తీరు హర్షణీయం.
జాతీయం
ఏఐ, ఆటోమేషన్పై పట్టు పెంచుకోవాలి
న్యూఢిల్లీ: దేశ విద్యా రంగాన్ని వాస్తవిక ప్రపంచ ఆర్థికవ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను మరింత వేగవంతంచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ(ఏఐ), ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ వంటి సబ్జెక్టులపై మరింత దృష్టిపెట్టడం ద్వారా అనుసంధానం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీలో జరిగిన పోస్ట్–బడ్జెట్ వెబినార్లో మోదీ మాట్లాడారు. ‘‘విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సాంస్కృతిక రంగాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే మాధ్యమాలు. సంస్థలు, పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యారంగం మారాలి.అందుకే మార్కెట్ అవసరాలు, వాస్తవిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్లుగా నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చాం’’ అని అన్నారు. ‘‘యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. ఆవిష్కరణల ఆధారిత ఆర్థికవ్యవస్థకు అనుగుణంగా పరిశ్రమలు, పరిశోధనశాలలతో విద్యాలయాలు అనుసంధానం కావాలి. పారిశ్రామిక సౌజన్యం, పరిశోధనల ఆధారిత అభ్యసనలకు కేంద్రాలుగా రూపాంతరం చెందాలి.అప్పుడు విద్యార్థులు విద్యాలయాల్లో పారిశ్రామికావసరాలకు తగ్గ పరిశోధనలు చేసి సఫలీకృతులవుతారు’’ అని మోదీ అన్నారు. ‘‘స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్) కోర్సులపై అమ్మాయిలు ఆసక్తిచూపడం శుభసూచకం. భావి సాంకేతికతల గురించి మాట్లాడుకునే వేళ దేశంలో ఏ అమ్మాయీ అవకాశాల కొరతతో వెనుకబడొద్దు’’ అన్నారు. పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల అధికారులు, నిపుణులు, ప్రైవేట్ రంగ భాగస్వాములతో పాటు పలువురు ప్రముఖులు వెబినార్లో పాల్గొన్నారు.
ఎల్పీజీ ఎఫెక్ట్... బెంగళూరులో హోటళ్లు బంద్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో హోటళ్లకు ఎల్పీజీ షాక్ తగిలింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం నుంచి నగరమంతటా హోటళ్లు మూతబడనున్నాయి. బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ఒక ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. ‘‘ఎల్పీజీ లేకుండా హోటళ్లను నడపడం అసాధ్యమని అందరికీ తెలుసు.అందుకే మాకిష్టం లేకపోయినా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు’’అని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.సి.రావు విలేకరులకు తెలిపారు. కేంద్రం తక్షణం ఈ సమస్యపై దృష్టి పెట్టి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. బెంగళూరుకు చెందిన పలువురు ఎంపీల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. హోటళ్లకు పరిమిత స్థాయిలోనైనా ఎల్పీజీ సరఫరాలు కొనసాగేలా చూడాలని కోరారు. ఎల్పీజీ కొరతపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు చెన్నైలో కూడా బెంగళూరు తరహా పరిస్థితే నెలకొన్నట్టు వార్తలొస్తున్నాయి.
మనోళ్ల భద్రతే ముఖ్యం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా తక్షణం ఉద్రిక్తతలకు తెర దించాలని సూచించింది. దేశాల సార్వభౌమాధికారాలను గౌరవించాలని అభిప్రాయపడింది. పశ్చిమాసియా ప్రాంతంలోని దాదాపు కోటి మంది భారతీయుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రత, వర్తక, భద్రత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని పేర్కొంది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఈ మేరకు ప్రకటన చేశారు.పశ్చిమాసియాలో పరిస్థితిని కేంద్రం నిరంతరం సమీక్షిస్తోందని చెప్పారు. ఇప్పటిదాకా 67 వేల మంది విద్యార్థులను సురక్షితంగా భారత్కు తీసుకొచ్చినట్టు వివరించారు. పశ్చిమాసియాలోని భారతీయుల భద్రత నిమిత్తం అక్కడి దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలుమార్లు మాట్లాడారని గుర్తు చేశారు. ‘‘మన ఇంధన భద్రతపై ఆందోళన అనవసరం. ఈ విషయంలో మన వినియోగదారుల ప్రయోజనాలే పరమావధి. వాటిని కాపాడే దిశగా కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోంది’’అని తెలిపారు. ‘‘మన ఇంధన భద్రతకు, వర్తకానికి గల్ఫ్ ప్రాంతం కీలకం. ఆ ప్రాంతంతో ఏటా 200 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్యం జరుగుతోంది’’అని గుర్తు చేశారు. నౌకలకు ఆశ్రయం కోరిన ఇరాన్ ఇరాన్కు చెందిన నౌక భారత్లో ఆశ్రయం పొందేందుకు మానవతా కోణంలో అనుమతించినట్టు జైశంకర్ వెల్లడించారు. ‘‘మూడు నౌకలకు ఇరాన్ ఆశ్రయం కోరింది. ఈ మేరకు ఫిబ్రవరి 28న విజ్ఞప్తి చేసింది. కేంద్రం మార్చి 1న అనుమతులు జారీ చేసింది. ఐఆర్ఐఎస్ లావన్ నౌక మాత్రమే మార్చి 4న కోచిలో లంగరు వేసింది’’అని చెప్పారు. మిగతా రెండు నౌకల్లో ఐఆర్ఐఎస్ దేనాను మార్చి 4న శ్రీలంక తీరంలో అమెరికా ముంచేయడం తెలిసిందే. అనంతరం మూడో నౌక ఐఆర్ఐఎస్ బుషెర్ శ్రీలంకలోని ట్రింకోమలీ రేవులో లంగరు వేసింది. చర్చకు ఖర్గే డిమాండ్జైశంకర్ ప్రకటనపై ఉభయ సభల్లోనూ విపక్ష సభ్యులు పెద్దపెట్టున నిరసనలకు దిగారు. ప్రకటనకు ముందే పశ్చిమాసియా సంక్షోభంపై పూర్తిస్థాయి చర్చకు పట్టుబట్టారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ దేశ ఇంధన భద్రతపై స్వల్ప అవధి చర్చకు డిమాండ్ చేశారు. వంట గ్యాస్ ధర పెంపు సామాన్యునిపై భారం మోపిందని ఆయన విమర్శించారు.‘‘పశ్చిమాసియా కల్లోలం తాలూకు ప్రభావం భారత ఇంధన భద్రతతో పాటు ఆర్థిక స్థిరత్వంపైనా పడుతోంది. దేశ ఇమేజీని, ప్రతిష్టను కూడా ఆ యుద్ధం ప్రభావితం చేస్తోంది. కనుక ఈ అంశంపై 176వ నిబంధన కింద చర్చ చేపట్టాలి’’అని కోరుతూ నోటీసిచ్చారు. దాన్ని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ వెల్లడించారు. అనంతరం జైశంకర్ ప్రకటన చేసేందుకు అనుమతించారు. అందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ వాకౌట్ చేశారు. మంత్రి ప్రకటన చేస్తుండగానే వాకౌట్ చేయడాన్ని సభా నాయకుడు జె.పి.నడ్డా తీవ్రంగా తప్పుబట్టారు. సభలో అరాచక పరిస్థితులు సృష్టించేందుకు కాంగ్రెస్, విపక్షాలు ప్రయతి్నస్తున్నాయంటూ మండిపడ్డారు.
చర్చకు రాని అవిశ్వాసం
న్యూఢిల్లీ: పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజైన సోమవారం కూడా లోక్సభలో పాత దృశ్యాలే పునరావృతమయ్యాయి. విపక్ష సభ్యులు పదేపదే కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటన చేయబోతుండగా అడ్డుకున్నారు. ఆ సంక్షోభంపై పూర్తిస్థాయి చర్చకు పట్టుబట్టారు. తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో తాము లేవనెత్తిన పలు ఇతర అంశాలకు సంబంధించి ప్లకార్డులు ప్రదర్శించారు. వాటన్నింటికీ ప్రభుత్వం అప్పుడే వివరంగా బదులిచ్చిందని సభాపతి స్థానంలో ఉన్న జగదంబికా పాల్ గుర్తు చేశారు. పశ్చిమాసియాపై చర్చకు వారిచ్చిన వాయిదా తీర్మానాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు.‘‘స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానం ఇప్పటికే ఈ రోజు ఎజెండాలో ఉంది. ఒకే రోజు రెండు అంశాలపై చర్చ ఎలా సాధ్యం? పశ్చిమాసియాపై చర్చ కావాలంటే సభా వ్యవహారాల కమిటీని సంప్రదించండి’’అని సూచించారు. వారు పట్టువీడకపోవడంతో ఆగ్రహించారు. ‘‘విపక్ష సభ్యులు పరిణతి లేకుండా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. రాజకీయ ఎజెండా ప్రకారం వ్యవహరిస్తున్నారు’’అంటూ మందలించారు. వారు సభా మర్యాద పాటించడం లేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆక్షేపించారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సభ పదేపదే వాయిదా పడింది. మధ్యాహ్నం మూడింటికి సమావేశమయ్యాక కూడా అవే పరిస్థితులు కొనసాగాయి. బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపడదామని విపక్ష సభ్యులకు పాల్ విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది. దాంతో ఆ అంశాన్ని చర్చకు చేపట్టకుండానే సభ మంగళవారానికి వాయిదా పడింది. పశ్చిమాసియాపై చర్చ ఉండబోదు: కేంద్రం పశ్చిమాసియా సంక్షోభంపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ చేపట్టాలన్న విపక్షాల డిమాండ్లకు కేంద్రం అంగీకరించే అవకాశం లేదని సమాచారం. దీనిపై విదేశాంగ మంత్రి ఉభయ సభల్లో ఇప్పటికే ప్రకటన చేసినందున ఇక చర్చ అనవసరమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మోదీ బండారం బయటపడుతుందనే! ⇒ పశ్చిమాసియాపై చర్చకు వెనుకంజ: రాహుల్ ⇒ పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమాసియా కల్లోలంపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ఉభయ సభల్లో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన అనంతరం పార్లమెంట్ మకరద్వారం వద్ద విపక్ష ఎంపీలు ధర్నాకు దిగారు. ఈ సంక్షోభానికి సంబంధించిన కీలకాంశాలపై మోదీ సర్కారు మౌనం పాటిస్తోందని ఆరోపించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ కేంద్రానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిరసనలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్గాం«దీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ , తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియా విషయంలో అమెరికా బ్లాక్మెయిలింగ్కు మోదీ లొంగిపోయారని రాహుల్ ఆరోపించారు. ‘‘ఈ అంశంపై పార్లమెంటులో చర్చ చేపడితే అవన్నీ బయటపడతాయని కేంద్రం భయపడుతోంది. అందుకే చర్చకు వెనకాడుతోంది’’అని ఆరోపించారు.‘అవిశ్వాసం’పై నేడు చర్చ? న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సభ మంగళవారం చర్చకు చేపట్టే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తదితరులు చర్చలో పాల్గొంటారు. అనంతరం చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బదులిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తీర్మానాన్ని వీలైనంత త్వరగా చర్చకు చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్టు వెల్లడించాయి.స్పీకర్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ 118 మంది విపక్ష ఎంపీలు తొలి విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయనపై అవిశ్వాస తీర్మానానికి నోటీసివ్వడం తెలిసిందే. నాటినుంచీ లోక్సభ సమావేశాలకు బిర్లా సారథ్యం వహించడం లేదు. అవిశ్వాస తీర్మానంపై సభ నిర్ణయం వెలువడేదాకా స్పీకర్ విధులకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. మంగళవారం ఆయన సాధారణ ఎంపీగా చర్చలో పాల్గొనే అవకాశముందని లోక్సభ వర్గాలు తెలిపాయి. గతంలో మూడుసార్లు స్పీకర్లపై అవిశ్వాస తీర్మానాలిచ్చినా ఒక్కటి కూడా నెగ్గలేదు.
ఎన్ఆర్ఐ
అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత
అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..
అమెరికాలో ఉండే మన భారతీయులు ఏ రేంజ్లో ప్యాకేజ్లు అందుకుంటారో తెలిసిందే. అంతలా వేతనాలు వస్తాయనే..విదేశాలంటే మోజు మనవాళ్లకు. కానీ ఆ వ్యక్తి కోట్లలో వచ్చే వేతనం కాదనుకుని మరి భారత్కి వచ్చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాదు దానికి గల కారణాన్ని వివరిస్తూ..అది సరైనదో కాదో సలహా ఇవ్వండి అంటూ రెడ్డిట్లో పోస్ట్ పెట్టాడు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అతడి ఉద్దేశానికి ఫిదా అవ్వతూ ప్రశంసలజల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.ఇంతకీ కారణం ఏంటేంటే..అమెరికాలో 12 ఏళ్లకు పైగా గడిపిన తర్వాత తిరిగి కుటుంబంతో సహా భారత వచ్చేయాలనకుంటున్నట్లు ఓ ఎన్నారై పోస్ట్లో తెలిపాడు. ఈ జూన్ కల్లా తాము ఐదుగురు ముంబైకి వచ్చేయాలని నిర్ణయించుకున్నామని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు. తన వయసు 36 ఏళ్లు అని, 2018లో నవంబర్ నుంచి హెచ్1బీ విసాతో అమెరికాలో నివశిస్తున్నట్లు తెలిపాడు. పైగా తన వార్షిక ఆదాయం రూ. 2.9 కోట్లు అని, నెట్వర్త్ వచ్చేసి రుణ రహిత ఇల్లుతో కలిపి దగ్గర దగ్గర రూ. 9 కోట్లు అని వెల్లడించారు. భారత్ తన ఉద్యోగ ఆఫర్ ఏడాదికి రూ. 1.5 కోట్ల ప్యాకేజ్ అని కూడా వివరించాడు. అయితే తన తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉన్నారని, కుటుబానికి దగ్గరగా ఉండటమే మేలని ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అందులోనూ తన పిల్లలు తాతయ్య నానమ్మల, దగ్గర బంధువులతో పెరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు పోస్ట్లో. అక్కడ అమెరికాలో ఇంటి అద్దె చెల్లించకుండా లగ్జరియస్గా గడిపినా తన కుటుంబానికి ఈ నిర్ణయం కారణంగా.. చాలా పెద్ద మార్పుని స్వాగతించాల్సి ఉంటుందని అంటున్నాడు. ఎందుకంటే ముంబైలో అద్దె చెల్లిస్తూ..ఏడాదికి రూ. 1.5 కోట్లతో బతకడం సాధ్యమేనా? అని సందేహం వ్యక్తం చేశాడు. అలాగే యూఎస్లో పుట్టి..అక్కడే పెరిగిన పిల్లలు ఇక్కడ జీవనశైలికి, ఎడ్యుకేషన్కి సులభంగా అలవాటుపడగలరా, అసలు తన నిర్ణయం సరైనదేనా..? ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని పోస్ట్ పెట్టాడు. అయితే నెటిజన్లు అది మంచి ప్యాకేజీ అని, ముంబైలో ధీమాగా బతకొచ్చు అని అన్నారు. పైగా ఇలా భారత్కి రావాలనుకుంటున్న మీ నిర్ణయానికి స్వాగతం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తల్లిదండ్రలు గురించి ఆలోచిస్తున్నందుకు మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: లే ఆఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే..?: మాజీ అమెజాన్ టెక్కీ)
13 ఏళ్ల టీనేజర్ అమెరికాలో మైనర్లపై వేధింపులు, దొంగతనాలు
అమెరికాలో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఒక భారతీయుడిని అరెస్టు చేశారు. ఓదెల యశస్వి కొత్తపల్లిగా గుర్తించబడిన నిందితుడు అక్రమ వలసదారు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రకటించింది. న్యూజెర్సీలో పిల్లలపై లైంగిక వేధింపులతోపాటు, దొంగతనానికి సంబంధించిన ఆరోపణలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించింది.సరైన పత్రాలు లేకుండా అమెరికాలోని ప్రవేశించిన నిందితుడు యశస్విని చైల్డ్ రేపిస్తూ అని పేర్కొంది. అతడిపై యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం తొలగింపు చర్యలు పెండింగ్లో ఉన్నాయని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఈసీఇ) ఎక్స్లో ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుమైనర్లపై లైంగిక నేరాలకుపాల్పడినట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, దొంగతనం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే నిందితుడిపై కేసు ఎప్పుడు, ఎక్కడ నమోదైంది, ఎప్పుడు అరెస్టు చేశారనే విషయాలపై స్పష్టతనివ్వలేదు.—SEXUAL ASSAULT OF A CHILD UNDER 13 —SHOPLIFTING —PUBLIC DISORDER Vodela Yashaswi Kottapalli, a criminal illegal alien from India, has pending charges for sexual assault and larceny in New Jersey. We’ll keep him in custody pending removal proceedings. pic.twitter.com/VM97e9KUD9— U.S. Immigration and Customs Enforcement (@ICEgov) February 16, 2026 ఇదీ చదవండి: పెళ్లయ్యి ఆరునెలలే.. వాలెంటైన్స్డే రోజే హత్య
క్రైమ్
యువ జంట ఆత్మహత్య
కర్ణాటక: కలిసి ఏడడుగులు వేశారు, ఎంత కష్టం వచ్చిందో గానీ కలిసే తనువు చాలించారు. జిల్లాలోని కెఆర్ పేట పట్టణంలోని జయనగర బ్లాక్లో యువ దంపతులు ఒకే తాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. హోస్కోటే గ్రామానికి చెందిన దర్శన్ (29), నతనహళ్లికి చెందిన భార్య ఎన్.ఎల్. దివ్య (25) మృతులు. వీరికి 3 ఏళ్ల కిందట పెళ్లయింది, ఏడాదిగా ఇక్కడ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దర్శన్ క్యాబ్ డ్రైవర్ కాగా, దివ్య ఓ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నారు. వీరికి రక్ష అనే రెండేళ్ల కుమార్తె ఉంది. ఏం సమస్యలు వచ్చాయోగానీ.. ఆదివారం రాత్రి వారితో పాటు పాపకు ఉరి బిగించి ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఉరి జారిపోవడంతో పాప క్షేమంగా తప్పించుకుంది. చిన్నారి ఏడుస్తూ ఉండడంతో ఇరుగు పొరుగు వచ్చి చూడగా దంపతులు ఉరికి వేలాడుతూ కనిపించారు. దర్శన్ తండ్రి గణేష్ గౌడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలవారు చేరుకుని మీరంటే మీరు కారణమని ఆరోపణలు చేసుకున్నారు. తల్లిదండ్రులు కానరాని లోకాలకు చేరడంతో కూతురు అనాథగా మారింది.
ఢీ కొట్టి.. 200 మీటర్లు ఈడ్చుకెళ్లి
హైదరాబాద్: మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై రవీందర్రెడ్డి కథనం ప్రకారం... షాద్నగర్కు చెందిన సర్ఫరాజ్, హుస్సేన్, షమీర్, మాజీద్లు రెండు బైక్లపై పల్లెచెరువు మీదుగా చార్మినార్కు షాపింగ్ నిమిత్తం వెళ్తున్నారు. అదే సమయంలో నగరానికి చెందిన కిషోన్, టోటన్లు పల్లెచెరువు మీదుగా కారులో ఇంటికి వెళ్తున్నారు. అతివేగంగా వచ్చిన ఆ కారు వారి బైక్లను బలంగా ఢీ కొట్టింది. నలుగురు యువకులు పక్కకు పడిపోయి, స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే కారు డ్రైవర్ కిషోర్ భయంతో కారును మరింత వేగంగా పోనివ్వడంతో దాని కింద భాగంలో బైక్ చిక్కుకుపోయింది. 200 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. కేసు దర్యాప్తులో ఉంది.
ఊపిరి తీసిన ఊయల
అన్నమయ్య జిల్లా: ఊయలలో నవ్వులు..క్షణాల్లో కన్నీళ్లుగా మారాయి. ఆనందంగా ఊయల ఊగుతున్న చిన్నారులను కాపాడే ప్రయత్నంలో విద్యుత్ షాక్ రూపంలో ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. అప్పటి వరకు జాతర సందడిలో మునిగి తేలిన ఆకుటుంబం క్షణాల్లో విషాదంలో మునిగిపోయింది. చూపరుల హృదయాలను కలచి వేసింది. కురబలకోట మండలం ముదివేడు గ్రామం రెడ్డివారిపల్లిలో ఈ విషాదకర సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ రూపంలో ఆ ఇంటిపై మృత్యువు మాటు వేసినా అదృష్టవశాత్తు ఇద్దరు బాలికలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇంటిలోని మిగిలిన వారికి ఇరుగుపొరుగు వారికి గుండె ఆగినంత పనైంది. ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడు, గ్రామస్థుల కథనం మేరకు...నిమ్మనపల్లి మండలం వలసపల్లికి చెందిన శివకుమార్ రెడ్డి ఆదివారం ముదివేడులో జరిగే దండు మారెమ్మ జాతరకు సమీపంలోని రెడ్డివారిపల్లికి చెందిన బంధువు జగదీశ్వర్ రెడ్డి ఇంటికి భార్యా పిల్లలు, అత్త పద్మావతమ్మ ఇంకో మిత్రుడు రాపూర్ వెంకటేష్తో కలసి వచ్చారు. వీరంతా రెడ్డివారిపల్లిలో ఇంటి వద్ద ఉండగా శివకుమార్ రెడ్డి కుమార్తెలు మధుప్రియ (11), లిఖిత (9) ఇంట్లో ఉన్న ఊయల ఊగసాగారు. అది రేకుల ఇళ్లు. ఉన్నట్టుండి మధుప్రియ ఊగుతున్న ఊయలకు విద్యుత్ షాక్ తగిలింది. బాలిక ఒక్కసారిగా అరిచింది. అక్కడే ఉన్న పద్మావతమ్మ (58) ఏమో జరిగిందన్న ఆత్రుతలో పాపను కాపాడాలి..అని ఊయల నుంచి కిందకు దింపబోయింది. ఊయల తగిలి విద్యుత్ షాక్తో ఆమె చనిపోయింది. అక్కడే ఉన్న వెంకటేష్ (38) కూడా చిన్నారికి ఏదో అయ్యిందని కాపాడాలని అతను కూడా ఊయలను పట్టుకున్నారు. అతను కూడా విద్యుత్షాక్కు గురై చనిపోయాడు. బాలిక మధు ప్రియ అప్పటికే ఊయల నుంచి కిందకు పడిపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. ఈమెకు దగ్గరగా ఉన్న సోదరి లిఖిత (9) కూడా అదృష్టవశాత్తు బయటపడింది. హుటాహుటిన గ్రామస్తులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అంతకు ముందు అంతా జాతర హడావుడిలో ఆనందంగా కాలం గడుపుతుండగా ఒక్కసారిగా గ్రామంలో విషాదం అలుముకుంది. మనవరాలిని కాపాడబోయి అవ్వ పద్మావతమ్మ, వారింటికి వచ్చిన వెంకటేష్ ఒకరి తర్వాత ఒకరు క్షణాల వ్యవధిలోనే చనిపోయారు. అంతా కోలుకోలేని షాక్కు గురయ్యారు. మృతి చెందిన ఎస్.పద్మావతమ్మది పుంగనూరు దగ్గర గోళ్లపల్లి కాగా రాపూర్ వెంకటే‹Ùది చిత్తూరు దగ్గర కొంగారెడ్డిపల్లి. ఇతను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేసేవారు. మధు ప్రియకు స్వల్ప గాయాలు కావడంతో ఆసపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాలను కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు. తోడుగా వచ్చి.. విద్యుత్ షాక్తో మృతి చెందిన రాపూర్ వెంకటేష్ బెంగళూరులో ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న శివకుమార్రెడ్డితో పరిచయం పెరగడంతో ఇద్దరు మిత్రులయ్యారు. ఇండ్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. దీంతో జాతర చూద్దామని ఇద్దరూ ముదివేడు దగ్గర రెడ్డివారిపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడ మధుప్రియ ఊగుతున్న ఊయలకు విద్యుత్ సరఫరా రావడం, ఆమెను కాపాడబోయి రాపూర్ వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందడం తీరని వేదనగా మారింది. స్నేహితుడి కోసం జతగా వచ్చి మృత్యువాత పడటం విచారకరం. ఇక మాకెవరు దిక్కని ఇతని కుటుంబీకుల బోరున విలపించారు. అల్లుడి ఇంటికి వచ్చి... పద్మావతమ్మకు ఇద్దరు కుమార్తెలు. ఒకరిని నిమ్మనపల్లి మండలం వలసపల్లికి చెందిన శివకుమార్ రెడ్డికి, మరో కుమార్తెను రెడ్డివారిపల్లిలోని జగదీశ్వర్ రెడ్డికి ఇచ్చారు. ఆమె రెడ్డివారిపల్లిలోని అల్లుడి ఇంటికి చాన్నాళ్ల తర్వాత జాతరకు వచ్చారు. చుట్టాలు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతుండగా మనవరాలు ఊగుతున్న ఊయలకు విద్యుత్ సరఫరా కావడంతో కాపాడబోయి విద్యుత్ షాక్ గురై పద్మావతమ్మ మృతి చెందడం తీరనిలోటుగా మారింది.కుంగిపోయిన శివకుమార్ రెడ్డి బెంగళూరులో ఉన్న శివకుమార్ రెడ్డి పిల్లలతో పాటు స్నేహితుడు, అత్త పద్మావతమ్మతో జాతరకు రావడం, తీరని విషాదం చోటుచేసుకోవడంతో కుంగిపోయాడు. ఆఊరిలో వీరి ఇంటి వద్దే చాందినీ బండి కూడా కట్టారు. సాయంత్రం జాతరకు వెళ్లాల్సి ఉంది. ఇంతలో ఊయల ఊగుతున్న మధుప్రియకు విద్యుత్షాక్ తగలడం, వారిని కాపాడబోయి పద్మావతమ్మ, రాపూర్ వెంకటేష్ అక్కడికక్కడే విగత జీవులయ్యారు. దీంతో ఒక వైపు బిడ్డలు తృటిలో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడటం, మరో వైపు అత్త, జతగా వచ్చిన మిత్రుడు మృత్యు ఒడికి చేరడం అతన్ని దహించి వేస్తోంది. ఇలా అవుతుందని ఊహించలేదని కంటతడిపెట్టారు.
మహిళల పట్ల టీడీపీ నాయకుడి అమానుషం
గుంటూరు జిల్లా: మహిళల ఫొటోలను ఐటీడీపీకి చెందిన నాయకుడు తీసి మార్ఫింగ్ చేస్తున్న సంఘటన వెలుగు చూసింది. ప్రశ్నించిన మహిళలపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఆగ్రహించిన మహిళలు ఆందోళనకు దిగారు. సేకరించిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన నల్లమామిడి అంజయ్య కళాశాల విద్యార్థునులు, మహిళల ఫొటోలు తీసి మార్ఫింగ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ విద్యార్థిని గుర్తించి శనివారం రాత్రి అంజయ్య ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ నర్రా శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని ‘ఏం చేస్తారు మీరు అంటూ దురుసుగా మాట్లాడి, కేసులు పెట్టినా, వెంటనే తీసుకువచ్చి ఇదే రోడ్డులో తిప్పుతానని’ బెదిరించాడు. సమాచారం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల మహిళలు తెనాలి– మంగళగిరి రహదారిపై ఆందోళనకు దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకోకుండా సుమారు మూడు గంటల పాటు పక్కన ఉన్న చర్చిలో ఉంచారు. గతంలో కూడా ఫొటోలు తీస్తున్న విషయం గమనించి కొందరు మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు. అయినా కూడా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని బాధితులు అంటున్నారు. కేవలం దళిత పిల్లల్ని ఫొటోలు తీయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతు పలికారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాలుగు గంటల అనంతరం పోలీసులు నిందితుడిని దుగ్గిరాల పోలీసుస్టేషన్కు తరలించారు.
వీడియోలు
Samson: నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
T20 World Cup: రూ.131 కోట్ల నగదు బహుమతి ప్రకటన
అదే జరిగితే సంక్షోభం తప్పదు యుద్ధంపై పుతిన్ వార్నింగ్
నన్ను చంపుతారా?. బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి వార్నింగ్
వస్తే చంపేస్తామంటున్న టీడీపీ ఎమ్మెల్యే చంపినా వస్తా అంటున్న బీజేపీ నేత
భూకబ్జా ఆరోపణలపై బుగ్గన రియాక్షన్
భారీగా గ్యాస్ కొరత... మూతపడ్డ హోటళ్లు కేంద్రం కీలక నిర్ణయం
Gold Prices: మహిళలు గుడ్ న్యూస్.. మళ్లీ పడిపోయిన పసిడి ధరలు..
2025లో జరిగిన చోరీ ఇప్పటివరకూ ఎందుకు దాచారు ?
వంటగదికి యుద్ధం సెగ పెరిగిన నిత్యావసరాల ధరలు..!

