బీటెక్ రవి.. నువ్వెంత.. నీ బతుకెంత?: అవినాష్ రెడ్డి హెచ్చరిక
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలు బుద్దుందా?.. ఎవరిది గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా?. దస్తగిరిని నెత్తిన పెట్టుకుంది టీడీపీ కాదా?. బీటెక్ రవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నువ్వెంత.. నీ బతుకెంత.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.పులివెందులలో వైఎస్సార్సీపీ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఇతర కీలక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అమరావతిలో చంద్రబాబు కట్టే బిల్డింగుల అద్దాలకు అయ్యే ఖర్చుతో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలన్నిటినీ పూర్తి చేయవచ్చు. ఇలాంటి దోపిడీని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.. ఎదురుదాడికి దిగుతారు. గతంలో పన్నులు తగ్గిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ పని మాత్రం చేయడం లేదు. వీటన్నిటిపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే జవాబు లేదు.మీరు చేస్తున్న తప్పులను సరిచేసుకోండి అంటే వాళ్లు.. స్వర్గీయ రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు. లేదంటే వైఎస్సార్ గురించి మాట్లాడతారు. గొడ్డలి పార్టీ అంటారు. అసలు చంద్రబాబుకు బుద్ధుందా?. తానే గొడ్డలితో కిరాతకంగా చంపానని దస్తగిరి చెప్తే.. అతన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నది మీ పార్టీ కాదా?. ఏరకంగా మాది గొడ్డలి పార్టీ అవుతుంది.. గొడ్డలి పార్టీ మీది. గొడ్డలితో నరికి చంపిన వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నది మీరు. మా ప్రశ్నలకి సమాధానం లేక.. చేతిలో అధికారం ఉందని నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇక్కడ పులివెందులలో ఉన్న టీడీపీ నాయకులు కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. వీళ్లు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పులివెందులకు కన్నం వేసి దోచేసుకుంటున్నారు.నోరు జాగ్రత్తగా పెట్టుకో..ఇక్కడి బైరెటిస్, ఇసుక మొత్తాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నారు. పులివెందులలో వీళ్లు ఏ ఒక్క సమస్యనైనా పట్టించుకుంటున్నారా?. పులివెందుల ప్రజలు పట్టరు కానీ.. కేవలం జగన్నను తిడితే మీకు రాజకీయంగా మనుగడ అని భ్రమల్లో బతుకుతున్నారు. మీ ప్రతి ఒక్క మాటకూ జవాబు తప్పకుండా చెప్తాం. నిన్న బీటెక్ రవి.. వాడు వీడు అనే లెవల్లో మాట్లాడాడు. నీ గురించి అలా మాట్లాడాలంటే మాకు ఎంత సేపు?. నువ్వెంత.. నీ బతుకెంత? ఇసుక, ముగ్గురాయికి కన్నం వేసి బతికేవాడివి నువ్వు. అలాంటి నువ్వు వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడేవాడివా? నోరు జాగ్రత్తగా పెట్టుకో.బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా?మేం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చావ్.. ఎందుకొచ్చావో ప్రజలకు చెప్పు. ఆయన ఎమ్మెల్సీ పదవి అమ్ముకోడానికి 12 కోట్లు ఇప్పించండని విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చాడు. ఆనాడు జగన్ అలాంటి పనులు చేయనని తిరస్కరించారు. తన ఎమ్మెల్సీ పదవి అమ్మేస్తా.. మీరు ఒప్పుకుంటే వైఎస్సార్సీపీ కండువా కప్పుకుంటా అన్నది నువ్వు కాదా?. మా పార్టీలో చేర్చుకోకపోతే సీఎం రమేష్ను పట్టుకుని బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా?. ఇదీ బీటెక్ రవి బతుకు. ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకు అతనిది. అలాంటి వ్యక్తి ఈరోజు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారందరికీ మనం అధికారంలోకి రాగానే మంచి సమాధానం చెబుదాం. కక్షలు, కార్పణ్యాలు కాకుండా.. మనం ప్రజలకు మంచి చేసి ఇలాంటి వారికి బుద్ధి చెబుదాం.
వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కంటే వంటను చౌకగా చేయగల, కొత్త ఇథనాల్ ఆధారిత స్టవ్ టెక్నాలజీని ఆవిష్కరించారు. ఇది భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న బయోఫ్యూయల్ మిషన్లో మరో ప్రధాన ముందడుగును సూచిస్తుంది.నాగ్పూర్లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. ఇథనాల్ ఆధారిత కొత్త స్టవ్ ద్వారా, వంట గ్యాస్ సిలిండర్ల కంటే తక్కువ ఖర్చుతోనే వంట చేయవచ్చని తెలిపారు. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతగా పేర్కొన్నారు. ఇథనాల్ను నీటితో కలిపి మంటను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ స్టవ్ పనిచేస్తుంది. ఇది సంప్రదాయ ఎల్పీజీ వంటి ఇంధనాల కంటే తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి గృహ వినియోగానికి ఇది ఒక ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.భారతదేశం చమురు అవసరాల కోసం.. సుమారు 87 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ పరిస్థితిని తగ్గించేందుకు ప్రభుత్వం ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచుతోంది. ఇప్పటికే దేశంలో పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం కలిపి వినియోగించడం కొనసాగుతోంది. 2014లో 1.5 శాతం నుంచి 2025 నాటికి దాదాపు 20 శాతానికి ఇథనాల్ వినియోగం పెరిగింది.ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక!ఇథనాల్ అనేది ప్రధానంగా.. చెరకు, మొక్కజొన్న, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇది మండినప్పుడు కూడా తక్కువ కాలుష్యం విడుదలవుతుంది. అందువల్ల దీనిని పర్యావరణహిత ఇంధనంగానే పరిగణిస్తారు.ఈ కొత్త టెక్నాలజీ విజయవంతమైతే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వంట గ్యాస్పై ఆధారపడటం చాలావరకు తగ్గుతుంది. ఇదే జరిగితే.. ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే దీనికోసం భారీ మొత్తంలో ఇథనాల్ ఉత్పత్తి అవసరం అవుతుంది. సరఫరా మాత్రమే కాకుండా.. భద్రత కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ సాధ్యమైతేనే ప్రజలు దీనిని విశ్వసిస్తారు. వినియోగించడానికి ముందుకు వస్తారు.
నా లివర్ ఏమైనా ఐరన్తో చేశారా?: సీఎం భగవంత్ మాన్
చండీగఢ్: తాను అసెంబ్లీకి తాగి వచ్చాననే విమర్శలు, రాత్రి-పగలు తాగుతూ ఉంటారనే ఆరోపణల్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ స్పందించారు. తనపై విమర్శలు చేయడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని, అంతకుమించి వారికి పనీపాటా ఏమీ లేనట్లు ఉందన్నారు భగవంత్ మాన్. ఎన్డీటీవీ నిర్వహించిన నవ పంజాబ్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ.. ఇక రాష్ట్రంలో ఏ అంశం లేనట్లు తాను నిరంతరం తాగుతూ ఉంటాననే ఆరోపణలు తప్పితే ఇంకా ఏమీ ప్రతిపక్షాలకు లేవా అని ప్రశ్నించారు. తాను 2012లో యాక్టివ్ పాలిటిక్స్లో అడుగుపెట్టానని, ఇప్పటికి 14 ఏళ్లు అయ్యిందన్నారు భగవంత్ మాన్సింగ్. అప్పట్నుంచీ తాను పగలు-రాత్రి లేకుండా తాగుతూనే ఉంటానని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారని, ఇది చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.నిజంగా తాను 14 ఏళ్ల నుంచి పగలు-రాత్రి తేడా లేకుండా తాగుతూనే ఉంటే బ్రతికే ఉండేవాడినా? అని ఎదురు ప్రశ్నించారు. మనకు తెలిసిన మిత్రులు కానీ, బంధువులు కానీ, వేరే ఎవరైనా కానివ్వండి.. 14 ఏళ్ల నుంచి రాత్రి-పగలు అనే తేడా లేకుండా తాగితే బ్రతుకుతారా?, అలా బ్రతికి ఉన్నవాళ్లని చూశారా? అంటూ చమత్కరించారు. ఒకవేళ తన లివర్ను ఏమైనా ఐరన్ రాడ్తో చేశారని వారు అనుకుంటున్నారా? వారే చెప్పాలన్నారు. ఇది తనపై జరిగే వ్యక్తిత్వ హననం తప్పితే ఏమీ లేదన్నారు. తన ప్రత్యర్థులకు తనను సవాలు చేయడానికి గట్టి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు.ఇతరులపై కూడా ఇలాంటి ఆరోపణలు చేసినట్లు ఆయన సూచించారు. ఉదాహరణకు, శిరోమణి అకాలి దళ్ నేత సుఖ్బీర్ బాదల్ అఫీమ్ వాడతారని, అందుకే ఆయనను "సుఖ్మాలి" అని పిలుస్తారని ఆరోపణలు ఉన్నాయి. ముందుగా ఆ ఆరోపణపై బాదల్ స్పష్టత ఇవ్వాలని సూచించారు.
స్టార్ హీరోలకు అచ్చొచ్చిన త్రిష.. వాళ్లందరికీ లక్కీ ఛార్మ్!
హీరోయిన్ త్రిషకు 43 ఏళ్ల వయసొచ్చినా అందం, చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. కొత్త హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. తాజాగా కరుప్పుతో బ్లాక్బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే కొంతకాలంగా త్రిష పేరు అటు రాజకీయాల్లో, ఇటు ఫిల్మీదునియాలో మారుమోగిపోతోంది. హీరో విజయ్- త్రిష ప్రేమలో ఉన్నారని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది.లక్కీ చార్మ్ఇటీవల విజయ్ భార్యతో విడాకులకు సిద్ధపడటం.. సీఎంగా గెలిచాక త్రిషతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ ప్రేమాయణం నిజమని అందరికీ అర్థమైపోయింది. పైగా తను కూడా రాజకీయాల్లో అడుగుపెడుతుందని మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తమిళ స్టార్ హీరోలకు త్రిష బాగా అచ్చొచ్చిందట. అందుకు కారణం.. విజయ్, అజిత్, సూర్యల కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తనే హీరోయిన్. ఈ ఆసక్తికర విషయాన్ని ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాన్ని త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తిరిగి పంచుకుంది.విజయ్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'లియో'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. 2023లో దసరాకి ముందు విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.600 కోట్లకు పైగా రాబట్టి విజయ్ కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డుకెక్కింది.అజిత్: హీరో అజిత్ 'గుడ్బ్యాడ్ అగ్లీ' ద్వారా తన కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. 2025లో విడుదలైన ఈ సినిమాలోనూ త్రిషయే కథానాయిక. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది.సూర్య: కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య ఈ ఏడాది బ్లాక్బస్టర్ కొట్టాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'కరుప్పు'. ఈ ఏడాది మే 15న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇందులోనూ త్రిషయే కథానాయిక. అలా త్రిష నటించిన పై మూడు సినిమాలు భారీ కలెక్షన్ల రికార్డులతో ఆయా హీరోల కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. దీంతో ఆమెను లక్కీ ఛార్మ్ అని కొనియాడుతున్నారు.చదవండి: 30 ఏళ్ల తర్వాత ఆపద్బాంధవుడు హీరోయిన్ రీఎంట్రీ
‘‘పుష్ప’’ సినిమాలో చేసినట్లు ఇలా చేస్తున్నారు: పళనిస్వామి
అమెరికా-ఇరాన్ చర్చల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
పెట్రోల్ మంటలు.. వంటింటికి సెగలు!
ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో క్రికెటర్
ఇంగ్లండ్ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
అనకాపల్లి జిల్లాలో మత్స్యకారుల నిరసన
నా లివర్ ఏమైనా ఐరన్తో చేశారా?: సీఎం భగవంత్ మాన్
ఆదితి గౌతమ్ నాభి అందాలు.. బిగ్బాస్ బ్యూటీ సావిత్రి హోయలు..!
వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!
పద్మశ్రీ అందుకున్న టీమిండియా కెప్టెన్
’వద్దే వద్దు’.. త్రిషాకు సీఎం విజయ్ చెక్..!
బంగారం, వెండిపై కియోసాకి కొత్త అంచనాలు!
‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’
రీ–వెరిఫికేషన్లో టెన్త్ విద్యార్థినికి జీరో మార్కులు..!
వారిద్దరూ అద్భుతం.. ఎంత పొగిడినా తక్కువే: కమిన్స్
చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ బౌలర్
సాక్షి కార్టూన్ 23-05-2026
తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు
మే 23.. నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు : నాగార్జున
మా సిద్ధాంతాలను కాంగ్రెస్ కాపీ కొడుతుంటే చూస్తూ ఊరుకోం!
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి ఇండియన్గా
అర్జున్ టెండూల్కర్కు ఘోర అవమానం
25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్!
BCCI: వరల్డ్కప్ ఓపెనర్ రేసులో ఊహించని పేరు!
చక్కనమ్మకు ముక్కెరందం
వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇరాన్ సంచలన ప్రకటన
హార్ముజ్ను మింగేస్తున్న ‘ఎల్లో ఫ్లీట్’
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
‘‘పుష్ప’’ సినిమాలో చేసినట్లు ఇలా చేస్తున్నారు: పళనిస్వామి
అమెరికా-ఇరాన్ చర్చల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
పెట్రోల్ మంటలు.. వంటింటికి సెగలు!
ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో క్రికెటర్
ఇంగ్లండ్ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
అనకాపల్లి జిల్లాలో మత్స్యకారుల నిరసన
నా లివర్ ఏమైనా ఐరన్తో చేశారా?: సీఎం భగవంత్ మాన్
ఆదితి గౌతమ్ నాభి అందాలు.. బిగ్బాస్ బ్యూటీ సావిత్రి హోయలు..!
వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!
పద్మశ్రీ అందుకున్న టీమిండియా కెప్టెన్
’వద్దే వద్దు’.. త్రిషాకు సీఎం విజయ్ చెక్..!
బంగారం, వెండిపై కియోసాకి కొత్త అంచనాలు!
‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’
రీ–వెరిఫికేషన్లో టెన్త్ విద్యార్థినికి జీరో మార్కులు..!
వారిద్దరూ అద్భుతం.. ఎంత పొగిడినా తక్కువే: కమిన్స్
చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ బౌలర్
సాక్షి కార్టూన్ 23-05-2026
తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు
మే 23.. నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు : నాగార్జున
మా సిద్ధాంతాలను కాంగ్రెస్ కాపీ కొడుతుంటే చూస్తూ ఊరుకోం!
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి ఇండియన్గా
అర్జున్ టెండూల్కర్కు ఘోర అవమానం
25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్!
BCCI: వరల్డ్కప్ ఓపెనర్ రేసులో ఊహించని పేరు!
చక్కనమ్మకు ముక్కెరందం
వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇరాన్ సంచలన ప్రకటన
హార్ముజ్ను మింగేస్తున్న ‘ఎల్లో ఫ్లీట్’
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
ఫొటోలు
కర్నాటకలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్
కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ గ్లామరస్ పిక్స్(ఫోటోలు)
గ్రీన్ డ్రెస్లో బుట్టబొమ్మ పూజా హేగ్డే అందాలు (ఫొటోలు)
తమిళ హీరో కార్తీ మరో తెలుగు సినిమా లాంచ్ (ఫొటోలు)
'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకుందన్ మరింత అందంగా (ఫొటోలు)
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
విజయవాడలో గాలివాన బీభత్సం (ఫొటోలు)
హైదరాబాద్ : అందమా.. అందుమా.. (ఫొటోలు)
మృణాల్ని ఇంత అందంగా చూసుండరేమో! (ఫొటోలు)
'పాటశాల' ఈవెంట్లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
సినిమా
పెళ్లి కంటే ఆ పని చేయడం వందరెట్లు బెటర్: టాలీవుడ్ హీరోయిన్
స్వాతి అంటే గుర్తు పట్టరేమో కానీ.. కలర్స్ యాడ్ చేస్తే ఇట్టే పసిగడతారు. అంతలా ఆ పేరుతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పేరు సంపాదించుకుంది. డేంజర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన తెలుగమ్మాయి.. ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత అష్టా చెమ్మా, త్రిపుర, కలవరమాయే మదిలో, మిరపకాయ్ చిత్రాల్లో నటించింది. కొన్నేళ్ల తర్వాత మంత్ ఆఫ్ మధు చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది.ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా ఈ ముద్దుగుమ్మ.. తాజా ఇంటర్వ్యూలో పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ముఖ్యంగా పెళ్లి టాపిక్పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోవడం కన్నా ఓ కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని తన మనసులోని మాటను బయటకు చెప్పేశారు. ఈ రోజుల్లో ఒక మనిషిని నమ్మి, వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఉండటం చాలా కష్టంగా మారిపోయిందని తెలిపింది.ఈ రోజుల్లో ఎవరికీ కూడా కొంచే కూడా ఓపిక ఉండడం లేదని.. అందుకే ముక్కు, మొహం తెలియని వ్యక్తిని పెళ్లాడి ప్రతిరోజూ మానసిక ప్రశాంతతను కోల్పోవడం నాకు ఇష్టం లేదన్నారు. అందుకే ఎలా చింతా లేకుండా హాయిగా ఒక కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని అన్నారు. ఎందుకంటే అది మనకు ఎప్పుడూ నమ్మకంగా ఉంటుందని.. ఎలాంటి కండిషన్లు లేకుండా మనల్ని ప్రేమిస్తుందని హీరోయిన్ స్వాతిరెడ్డి చెప్పుకొచ్చింది.
హైదరాబాద్లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్
పది పదిహేనేళ్ల ముందు వరకు తెలుగులో మాత్రమే సినిమాలు చేసే ప్రభాస్.. ఇప్పుడు గ్లోబల్ రేంజ్ ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ తదితర చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు హైదరాబాద్లో తన డ్రీమ్ హౌస్ పనులు కూడా మొదలుపెట్టేశాడు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో డిస్కషన్కి కారణమైంది. ఇంతకీ ఈ ఇంటి సంగతేంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ప్రభాస్కి ఇల్లు ఉంది. రాయదుర్గ్లో ఓ గెస్ట్ హస్ ఉంది. అయితే ఈ ప్రాంతమంతా ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంది. అందుకే రెండేళ్ల క్రితం ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ కోకాపేటలో రెండేళ్ల క్రితం ప్రభాస్ రెండు ఎకరాల స్థలం కొన్నాడు. ఇప్పుడు ఆ చోటులోనే నిర్మాణ పనులు మొదలైనట్లు తెలుస్తోంది.ఈ మధ్యే సదరు స్థలానికి మున్సిపల్ అధికారుల నుంచి అవసరమైన అన్ని అనుమతులు లభించడంతో.. డార్లింగ్ ప్రభాస్ తన లగ్జరీ మ్యాన్షన్ నిర్మించే పనిలో పడ్డాడు. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్కి ఈ స్థలం చాలా దగ్గరగా ఉంది. ఇక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెళ్లొచ్చు. ప్రయాణ సౌకర్యాల పరంగా సదుపాయం ఉండటంతోనే ఇక్కడ మ్యాన్షన్ కడుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం కోకాపేటలో ఎకరం విలువ రూ.80 కోట్లు పలుకుతున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రభాస్ మ్యాన్షన్ కట్టబోయే స్థలమే రూ.160 కోట్ల పైచిలుకు అన్నమాట. ఇప్పుడు కడుతున్న డ్రీమ్ హౌస్లో లగ్జరీ వసతులు చాలానే ఉండబోతున్నాయని మాట్లాడుకుంటున్నారు. హై ఎండ్ ఫిట్నెస్ సెంటర్, మోడరన్ సౌండ్ సిస్టమ్తో ప్రైవేట్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, లాన్ ఏరియా ఇందులో ఉండబోతున్నాయట. ఈ భారీ ప్యాలెస్ నిర్మాణ పనులు పూర్తి కావడానికి మరో రెండేళ్లు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: చిరంజీవి దగ్గరకు ఎగ్జిబిటర్స్ .. 'పెద్ది' గురించి ఏం తేలుస్తారో?)
దళపతి బాటలో వెళ్తారా?.. స్టార్ హీరో ఆసక్తికర సమాధానం..!
టాలీవుడ్లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా. కన్నడకు చెందిన అర్జున్.. తెలుగులోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన బ్లాస్ట్ జోన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు.ఈవెంట్కు హాజరైన అర్జున్ సర్జా మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ సర్జాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ సీఎం అయ్యారు కదా?.. మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా అని అడిగారు. దీనికి అర్జున్ సర్జా బదులిస్తూ.. రాజకీయాల్లోకి వెళ్లాలంటే డబ్బులు కావాలి... ఖర్చు పెట్టడానికి నా దగ్గర అంత డబ్బు లేదన్నారు. మరి విజయ్ కూడా డబ్బు పంచిబెట్టకుండా సీఎం అయ్యారని రిపోర్టర్ గుర్తు చేశారు. అయితే ఆయనకు ఉన్న మంచి ఇమేజ్ నాకు లేదు.. అందుకే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
30 ఏళ్ల తర్వాత ఆపద్బాంధవుడు హీరోయిన్ రీఎంట్రీ
ఒకప్పుడు తన అందంతో, హావభావాలతో, అద్భుతమైన డ్యాన్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది మీనాక్షి శేషాద్రి. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఈమె తెలుగులో చిరంజీవి సరసన 'ఆపద్బాంధవుడు' చిత్రంలో నటించింది. అవురా అమ్మకు చెల్ల పాటలో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అయితే మీనాక్షి పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేసి అమెరికా వెళ్లిపోయింది. 30 ఏళ్ల తర్వాత స్వదేశానికి..అక్కడ డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేసి ఎంతోమందికి నాట్యం నేర్పించింది. దాదాపు 30 ఏళ్లపాటు అమెరికాలో ఉన్న ఈ నటి కొన్ని నెలల క్రితమే భారత్కు తిరిగి వచ్చేసింది. తనకు సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుందన్న కోరికను మీనాక్షి శేషాద్రి ఆమె సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. 'నన్ను అభిమానిస్తున్న అందరికీ నమస్కారం.. మీ ప్రేమానురాగాలకు, మీరు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు. 30 ఏళ్ల తర్వాత నా కర్మభూమికి తిరిగొచ్చేశాను.అలాంటి పాత్రలు చేయాలనుందిఇప్పుడు ముంబైలో ఉంటున్నాను. సానుకూల దృక్పథం, ఆశ, ప్యాషన్తో మరోసారి చలనచిత్రపరిశ్రమలో అడుగుపెడుతున్నాను. చిన్న, పెద్ద, ప్రధాన పాత్ర అని తేడా లేకుండా మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. సినిమాలతో పాటు ఓటీటీ షోలు, వెబ్సిరీస్లైనా చేసేందుకు రెడీగా ఉన్నాను. చాలెంజింగ్ రోల్స్ చేయాలనుంది. నేను భారత్ తిరిగి వచ్చాక అనేక ఆఫర్లు వచ్చాయి. ఏదో నిరూపించుకోవాలని కాదుకానీ అందులో కొన్ని ఏమంత ఎగ్జయిటింగ్గా లేవు. మరికొన్నేమో ముందుకు కదల్లేవు. అయినా సరే ఎటువంటి టీమ్, ఏజెన్సీ లేకుండా నేనే అంతా మేనేజ్ చేసుకుంటున్నాను. నేను ఏదో నిరూపించుకోవడానికి రీఎంట్రీ ఇవ్వడం లేదు. నా కుటుంబసభ్యుల ఎంకరేజ్మెంట్ వల్లే ఇక్కడున్నాను. నాకు సంతోషాన్నిచ్చేదే సినిమా.. అందుకే మళ్లీ ఇండస్ట్రీలో భాగం అవాలని కోరుకుంటున్నాను' అని నటి చెప్పుకొచ్చింది.కెరీర్మీనాక్షి శేషాద్రి హిందీలో.. హీరో, పైసా యే పైసా, దిల్వాలా, స్వాతి, జుర్మ్, దామిని, గంగా జమున సరస్వతి వంటి అనేక చిత్రాల్లో నటించింది. చివరగా స్వామి వివేకానంద (1998) బయోపిక్లో కనిపించింది. ఆ తర్వాత ఘాయల్: వన్స్ ఎగైన్ మూవీలో ఫ్లాష్బ్యాక్లో తళుక్కుమని మెరిసింది. మరి మీనాక్షి ఇప్పుడెలాంటి సినిమాలు ఎంపిక చేసుకుంటుందో చూడాలి!చదవండి: కదిలే రైలుపై నేను, విజయ్.. ఆరోజు చనిపోయేవాళ్లం: విలన్
క్రీడలు
ఫ్రెంచ్ ఓపెన్లో తెలుగు సంతతి కుర్రాడి సంచలనం!
ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో సంచలనం నమోదయ్యింది. తెలుగు మూలాలున్న భారత సంతతి కుర్రాడు నిశేష్ బసవరెడ్డి తొలి రౌండ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ను ఓడించాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అమెరికాకు చెందిన 148వ ర్యాంకర్ బసవరెడ్డి 7-6, 7-6, 6-7, 6-1తో తన దేశానికే చెందిన టేలర్ ఫ్రిట్జ్ను మట్టికరిపించాడు. దీంతో నిశేష్ బసవరెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు.ఎవరీ నిశేష్ బసవరెడ్డి?నిశేష్ రెడ్డి 2005 మే 5న కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్లో జన్మించాడు. సాయి ప్రసన్న, మురళీకృష్ణ అతడి తల్లిదండ్రులు. అయితే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు వారి స్వస్థలం. కాగా 1999లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నిశేష్ చిన్న వయసులోనే తన తండ్రి టెన్నిస్ పరిచయం చేశాడు. కోచ్ బ్రయాన్ స్మిత్ వద్ద శిక్షణ పొందాడు. మాజీ ప్రపంచ నంబర్ 1 డబుల్స్ ప్లేయర్ రాజీవ్ రామ్ మార్గదర్శకత్వం కూడా నిశేష్కు లభించింది. 2022లో జరిగిన యూఎస్ ఓపెన్లో నిశేష్.. ఓజాన్ బారిస్తో కలిసి.. బాయ్స్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇలా.. జూనియర్ సర్క్యూట్లో తొలిసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2023లో ఐటీఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్-3 స్థానానికి చేరుకున్నాడు. అలాగే ఏటీపీ ఛాలెంజర్ టూర్ 2024 సీజన్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. రెండు ఏటీపీ ఛాలెంజర్ టైటిళ్లు గెలిచి టెన్నిస్ ప్రపంచంలో తన ముద్ర వేశాడు. 2025లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా గ్రాండ్ స్లామ్ అరంగేట్రం చేసిన నిషేశ్.. తొలి మ్యాచ్లోనే దిగ్గజ ఆటగాడు జకోవిచ్పై తొలి సెట్ గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్లో టేలర్ ఫ్రిట్జ్ను ఓడించడం ద్వారా మరోసారి తన సత్తా చాటాడు.HUGE win for Nishesh Basavareddy against Taylor Fritz 🇺🇸#RolandGarros pic.twitter.com/Ze36UzxubO— Roland-Garros (@rolandgarros) May 24, 2026చదవండి: ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా!
అత్యంత అరుదైన క్లబ్లో అక్షర్ పటేల్
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ సాధించలేకపోయింది. లీగ్ దశ చివరి వరకు రేసులో ఉన్నా, పంజాబ్ కింగ్స్ ఈ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. అక్షర్ పటేల్ నేతృత్వంలో ఢిల్లీ ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడి 7 విజయాలు, 7 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.ఢిల్లీని ప్లే ఆఫ్స్కు చేర్చలేకపోయినా, కెప్టెన్ అక్షర్ పటేల్ వ్యక్తిగతంగా ఓ భారీ మైలురాయిని తాకాడు. ఐపీఎల్లో అత్యంత అరుదైన 2000+ పరుగులు, 100+ వికెట్లు, 100+ సిక్సర్ల క్లబ్లో చేరాడు. అక్షర్కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (3469 పరుగులు, 178 వికెట్లు, 121 సిక్సర్లు), కేకేఆర్ మాజీ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ (2653, 123, 223) మాత్రమే ఈ అరుదైన ట్రిపుల్ ఫీట్ను సాధించారు.కేకేఆర్తో జరిగిన చివరి లీగ్ దశలో మ్యాచ్లో అక్షర్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 2 సిక్సర్లు బాదడంతో అతడి సిక్సర్ల సంఖ్య 100కు చేరింది. దీంతో అతడు జడేజా, రసెల్ సరసన చేరాడు.ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో (బ్యాటంగ్లో 39 పరుగులు, బౌలింగ్లో ఓ వికెట్, ఫీల్డింగ్లో 2 క్యాచ్లు) సత్తా చాటిన అక్షర్ తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ గెలిచినా ఢిల్లీకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే నిన్ననే ఈ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది (లక్నోపై పంజాబ్ గెలుపుతో).ఈ సీజన్లో ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. రేపు (మే 26) జరుగబోయే తొలి క్వాలిఫయర్లో ఆర్సీబీ, గుజరాత్ తలపడనుండగా.. 27న జరుగబోయే ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ అమీతుమీ తేల్చుకుంటాయి.
ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 14 మ్యాచ్లాడిన వైభవ్ 583 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్థసెంచరీలున్నాయి. ఆదివారం ముంబై ఇండియన్స్పై గెలిచిన రాజస్తాన్ రాయల్స్ నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది.మే 27న (బుధవారం) ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఫ్యామిలీ వీడియో వైరల్గా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ను వీక్షించడానికి వైభవ్ కుటుంబం మొత్తం తరలివచ్చింది.మ్యాచ్లో వైభవ్ తుస్సుమన్నప్పటికీ రాజస్తాన్ గెలవడం, ప్లేఆఫ్ చేరడంతో అతడి కుటుంబం సంతోషంతో ఇంటిబాట పట్టారు. ఈ నేపథ్యంలో స్టేడియం నుంచి బయటికి వస్తున్న వైభవ్ సూర్యవంశీ కుటుంబం సహా అతడి సోదరులు కెమెరా కంటికి చిక్కారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'ఫ్యామిలీ అంతా ఒకేలా ఉంది' అంటూ కామెంట్స్ చేయడం ఆసక్తి కలిగించింది.కాగా, వైభవ్కు ముగ్గురు సోదరులు ఉన్నారు. ఉజ్వల్, విశాల్ అతడి కంటే పెద్దవాళ్లు కాగా, ఆశీర్వాద్ అందరికంటే చిన్నవాడు. ఈ నలుగురు అన్నదమ్ములు కూడా హైట్లో తేడా ఉన్నప్పటికీ ముఖ కవలికల్లో మాత్రం అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉండడం విశేషం. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జురెల్ (38), జోఫ్రా ఆర్చర్ (32) సహా మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో రాజస్తాన్ 200 పరుగుల మార్క్ను దాటింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకే పరిమితమైంది. View this post on Instagram A post shared by Filmymantra Media (@filmymantramedia)Vaibhav’s carbon copy cute Family 🩷🤭 pic.twitter.com/WLUDhFyg0c— Charvi Vyas (@4Vvyas) May 25, 2026చదవండి: మెగాటోర్నీకి ముందు ఆసీస్ స్టార్ షాకింగ్ నిర్ణయం!
మెగాటోర్నీకి ముందు ఆసీస్ స్టార్ షాకింగ్ నిర్ణయం!
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మేగన్ స్కట్ రిటైర్మెంట్పై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు మేగన్ స్కట్ వెల్లడించింది. తర్వాతి జనరేషన్కు అవకాశాలు ఇవ్వా లనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది.దీంతో మహిళల టీ20 ప్రపంచకప్ మేఘన్ స్కట్కు చివరి అంతర్జాతీయ టోర్నీ కానుంది. 33 ఏళ్ల మేగన్ స్కట్ 2012లో 20 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. అనతికాలంలోనే ఆసీస్ స్టార్ ప్లేయర్గా పేరు పొందిన మేగన్ స్కట్ ఆ జట్టు తరఫున నాలుగు టెస్టులు, 111 వన్డేలు, 125 టీ20 మ్యాచ్లు ఆడింది. మొత్తం 240 అంతర్జాతీయ మ్యాచ్లాడిన మేగన్ స్కట్ 309 వికెట్లు పడగొట్టింది. ఇందులో వన్డేల్లో 148 వికెట్లు, టీ20ల్లో 152 వికెట్లు ఉన్నాయి. మహిళల క్రికెట్ చరిత్రలో వన్డేల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు పూర్తి చేసిన రెండో బౌలర్గానూ రికార్డులకెక్కింది. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మేగన్ అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్గానూ మేగన్ రికార్డులకెక్కింది.ఇక తన రిటైర్మెంట్ ప్లాన్పై మేగన్ స్కట్ స్పందించింది. ‘14 ఏళ్ల కెరీర్ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. తర్వాతి తరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయిం చుకున్నా. ఐసీసీ టీ20 ప్రపంచకప్ నాకు చివరి టోర్నీ కానుంది.’ అని చెప్పుకొచ్చింది. మేగన్ స్కట్.. రెండు వన్డే ప్రపంచకప్(2013, 2022)లతో పాటు మూడు టీ20 ప్రపంచకప్లు (2108, 2020, 2026) గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యురాలిగా ఉంది. జూన్ 12న ప్రారంభం కానున్న మెగా టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు తమ తొలి మ్యాచ్ను జూన్ 13న సౌతాఫ్రికాతో ఆడనుంది.లెస్బియన్తో వివాహంఅడిలైడ్కు చెందిన మేఘన్ స్కట్ తన దీర్ఘకాల భాగస్వామి జెస్ హోలియోక్ను వివాహం చేసుకుంది. ఆస్ట్రేలియాలో స్వలింగ వివాహాలు చట్టబద్ధం అయిన తర్వాత 2019లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. 2021 ఆగస్టులో, అత్యవసర సి-సెక్షన్ సరోగసి ద్వారా నెలలు నిండని బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డకు రైలీ లూయిస్ అని పేరు పెట్టారు. అయితే 2025లో జెస్తో తన పదేళ్ల రిలేషిన్షిప్ ముగిసిందంటూ మేగన్ స్కట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం విడిగా ఉంటున్నప్పటికీ మేగన్, జెస్లు కలిసి మిరాకిల్ బేబీస్ ఫౌండేషన్కు రాయబారులుగా పనిచేస్తూ, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. చదవండి: 25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్!
న్యూస్ పాడ్కాస్ట్
యుద్ధమా? ఒప్పందమా?... ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో పగిలిన అక్రమాల పుట్ట... ఎస్సీఆర్టీ నుంచే కుంభకోణం..
అమరావతిలో చంద్రబాబు లూటీ... అవినీతి, దోపిడీతో ఎప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు.
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో దోపిడీ విజన్, స్కామ్కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
బిజినెస్
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్లో కొత్త పద్ధతి!
రైల్వే కౌంటర్లలో తత్కాల్ టికెట్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాసే ప్రయాణికుల ఇబ్బందులకు స్వస్తి పలికేందుకు భారతీయ రైల్వే కీలక అడుగు వేసింది. పశ్చిమ మధ్య రైల్వే (WCR) పరిధిలోని ప్రతిష్టాత్మక కోటా డివిజన్ తన పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో వినూత్నమైన ‘టోకెన్ వ్యవస్థ’ను ప్రవేశపెట్టింది. తత్కాల్ బుకింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, కౌంటర్ల వద్ద తోపులాటలు, గందరగోళాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కోటా డివిజన్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త విధానం ఎలా పనిచేస్తుంది?కౌంటర్ల వద్ద క్యూ లైన్ల నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు రైల్వే శాఖ ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. ప్రయాణికులు ముందుగా నిర్ణయించిన సమయానికి బుకింగ్ కార్యాలయానికి చేరుకోవాలి. కౌంటర్ సిబ్బంది నుండి కేటగిరీకి సంబంధించిన టోకెన్ను తీసుకోవాలి. టోకెన్ నంబర్ల వరుస క్రమం ఆధారంగానే ప్రయాణికులను కౌంటర్ వద్దకు అనుమతిస్తారు. మీ వంతు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తత్కాల్ టికెట్ పొందవచ్చు.టోకెన్ పంపిణీ సమయాలు ఇవే..తత్కాల్ బుకింగ్ ప్రారంభం కావడానికి ముందే కౌంటర్ల వద్ద ఈ టోకెన్ల పంపిణీ జరుగుతుంది. ఏసీ క్లాస్ (AC Classes) కేటగిరీ ప్రయాణికులకు ఉదయం 9:00 నుండి 9:25 వరకు టోకెన్లు ఇస్తారు. ఉదయం 10:00 గంటలకు తత్కాల్ బుకింగ్ ప్రారంభవుతుంది. ఇక స్లీపర్ క్లాస్ (Sleeper Class) ప్రయాణికులకు ఉదయం 9:30 నుండి 9:55 వరకు టోకెన్ పంపిణీ ఉంటుంది. ఉదయం 11:00 గంటలకు తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రారంభం మొదలవుతుంది. సాధారణ రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణ తేదీకి ఒక రోజు ముందే తత్కాల్ విండో తెరుచుకుంటుంది. కౌంటర్లతో పాటు ఐఆర్సీటీసీ (IRCTC) అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా డిజిటల్గా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.రైల్వే చార్ట్ తయారీలో మార్పులుప్రయాణికుల సౌకర్యార్థం రైలు బయలుదేరే సమయాన్ని బట్టి మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాలను కూడా రైల్వే శాఖ ఇటీవల పునరుద్ధరించింది. ఉదయం 05:01 నుండి మధ్యాహ్నం 14:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు ప్రయాణానికి ముందటి రోజు రాత్రి 20:00 గంటల (8:00 PM) లోపు మొదటి చార్ట్ సిద్ధం చేస్తారు. మధ్యాహ్నం 14:01 నుండి రాత్రి 23:59 వరకు, అర్ధరాత్రి 00:00 నుండి తెల్లవారుజామున 05:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు రైలు ప్రయాణ సమయానికి కనీసం 10 గంటల ముందే మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారు చేశారు.రైల్వే కౌంటర్ల వద్ద దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు, సాధారణ ప్రయాణికులకు సులభంగా టికెట్లు అందించేందుకు కోటా డివిజన్ తెచ్చిన ఈ టోకెన్ విధానం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇదే పద్ధతిని ఇతర రైల్వే డివిజన్లలోనూ అమలు చేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం లాభల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,073.61 పాయింట్లు లేదా 1.42 శాతం లాభంతో 76,488.96 వద్ద, నిఫ్టీ 312.40 పాయింట్లు లేదా 1.32 శాతం లాభంతో 24,031.70 వద్ద నిలిచాయి.సుందరం బ్రేక్ లైనింగ్ లిమిటెడ్, రూబీ మిల్స్ లిమిటెడ్, కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రేవతి ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్, థాకర్ & కంపెనీ లిమిటెడ్ వంటివి లాభాలను పొందాయి. సూర్య రోష్ని లిమిటెడ్, సాన్స్టార్ లిమిటెడ్, ఎక్సెల్సాఫ్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్, సతియా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
ఫాస్ట్ట్యాగ్ పనిచేయడం లేదా?: NHAI సూచనలివే..
భారతదేశంలోని జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులందరికీ ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి. టోల్గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి, వేగంగా ముందుకు వెళ్లడానికి ఎన్హెచ్ఏఐ ఫాస్ట్ట్యాగ్ విధానం ప్రవేశపెట్టింది. అయితే.. చాలామంది వాహనదారులు ఫాస్ట్ట్యాగ్ అకౌంట్లో సరిపడా బ్యాలెన్స్ ఉన్నప్పటికీ టోల్గేట్ల వద్ద ఆలస్యాన్ని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఏమిటనే విషయాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.ఫాస్ట్ట్యాగ్లో ఉండే.. ఆర్ఎఫ్ఐడీ చిప్ టోల్ ప్లాజా స్కానర్లతో కమ్యూనికేట్ చేస్తుంది. ఈ చిప్ సరిగా పనిచేయకపోతే స్కానర్ ఫాస్ట్ట్యాగ్ను రీడ్ చేయలేవు. ఫలితంగా వాహనం టోల్గేట్ వద్ద ఎక్కువసేపు ఆగాల్సి వస్తుంది. దీంతో ట్రాఫిక్ పెరిగి పొడవైన క్యూలు ఏర్పడే అవకాశం ఉంటుంది.ఎన్హెచ్ఏఐ ప్రకారం ఫాస్ట్ట్యాగ్ దెబ్బతినడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.ఒకటి.. వెహికల్ విండ్ షీల్డ్ తరచుగా శుభ్రం చేయడం. కొంతమంది గట్టిగా రుద్దడం లేదా కెమికల్స్ ఉపయోగించడం వల్ల ఫాస్ట్ట్యాగ్లోని ఆర్ఎఫ్ఐడీ చిప్ దెబ్బతింటుంది.రెండవది.. ఎండ, దుమ్ము, వర్షం వంటి వాతావరణ ప్రభావాలు. ఎక్కువకాలం ఫాస్ట్ట్యాగ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల కూడా టోల్ ప్లాజా స్కానర్లు రీడ్ చేయలేవు.మూడవది.. పాతబడిన ఫాస్ట్ట్యాగ్లు. చాలా రోజుల పాటు ఉపయోగించిన ట్యాగ్లు సహజంగానే పనితీరును కోల్పోతాయి.Are you facing FASTag scanning issues at Toll Plazas? Your FASTag could be damaged causing delays at Toll Plazas. Contact your issuer bank today and get your FASTag replaced.@NHAI_Official @MORTHIndia pic.twitter.com/hdqCoARVp1— FASTagOfficial (@fastagofficial) May 4, 2026ఫాస్ట్ట్యాగ్ ఐదేళ్లకు పైబడితే లేదా తరచూ స్కాన్ సమస్యలు ఎదురైతే వెంటనే మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే టోల్ గేట్ల వద్ద అనవసర ఆలస్యం, ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్నిసార్లు డబుల్ డిడక్షన్ లేదా ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ సమస్యలు కూడా వస్తాయి.ఇదీ చదవండి: పెట్రోల్ కష్టాలకు చెక్.. వచ్చేస్తోంది కొత్త కారు!వాహనదారులు ఫాస్ట్ట్యాగ్ను జాగ్రత్తగా ఉపయోగించాలి. విండ్షీల్డ్ మీద ట్యాగ్ ఉన్న ప్రాంతాన్ని గట్టిగా రుద్దకూడదు. ఫాస్ట్ట్యాగ్ను వంచడం, తీసి మళ్లీ అతికించడం చేయకూడదు. ట్యాగ్పై ఇతర స్టిక్కర్లు లేదా సన్ ఫిల్మ్లు ఉండకూడదు. సమస్యలు కనిపించిన వెంటనే ఫాస్ట్ట్యాగ్ జారీ చేసిన బ్యాంకును సంప్రదించి కొత్త ట్యాగ్ తీసుకోవాలి.
అమెరికా డాలర్కు చావేనా? ఇరాన్ ఏం చేసిందంటే..
ప్రముఖ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంలో రాబోయే ఒక భారీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అమెరికా డాలర్కు పొంచి ఉందంటూ ఆయన హెచ్చరించారు.ఇరాన్ దేశం తన చమురు విక్రయాల కోసం అమెరికా డాలర్ స్థానంలో చైనా కరెన్సీ 'యువాన్' (Yuan)లో చెల్లింపులను స్వీకరించడం ప్రారంభించిందని, ఇది "పెట్రో డాలర్" (Petro-dollar) వ్యవస్థ అంతానికి నాంది కానుందని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు.'పెట్రో డాలర్'కు మరణ శాసనం?రాబర్ట్ కియోసాకి తన ట్వీట్లో ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన పరిణామమని అభివర్ణించారు."ఇరాన్ చమురు కోసం చైనా యువాన్ను అంగీకరించడం ప్రారంభించింది. దీని అర్థం ఏమిటి? మీ భవిష్యత్తుపై, అమెరికా డాలర్ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇరాన్తో యుద్ధం కంటే ఇది అత్యంత ఘోరమైన పరిస్థితి. అమెరికా డాలర్ అంతం కాబోతోందా?" అని కియోసాకి ప్రశ్నించారు.ఈ అంతర్జాతీయ మార్పుల వల్ల సామాన్యులు నష్టపోకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కనీసం ఒక గంట సమయాన్ని కేటాయించాలని ఆయన కోరారు. మన పాఠశాలల్లో ఇలాంటి ముఖ్యమైన విషయాలను ఎప్పటికీ నేర్పరని ఆయన గుర్తుచేశారు.ప్రస్తుతం జరుగుతున్న ఈ భారీ ఆర్థిక సంక్షోభం గురించి ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ రే డాలియో (Ray Dalio) మాత్రమే స్పష్టంగా వివరిస్తున్నారని కియోసాకి పేర్కొన్నారు. రే డాలియో నిర్వహించిన “ఇరాన్ జస్ట్ కిల్డ్ ది పెట్రో డాలర్” అనే పాడ్కాస్ట్ను తప్పకుండా వినాలని కియోసాకి ప్రజలకు సూచించారు."మీ జీవితంలో మీరు పెట్టే అత్యుత్తమ పెట్టుబడి... మీ ఆర్థిక విద్యపై పెట్టే పెట్టుబడే" అని కియోసాకి ట్వీట్లో స్పష్టం చేశారు.అసలు ఏమిటీ పెట్రో డాలర్ సంక్షోభం?గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చమురు వ్యాపారం అంతా అమెరికా డాలర్లలోనే సాగుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు తిరుగులేని ఆధిక్యత లభించింది. అయితే, ఇటీవల కాలంలో అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్, రష్యా వంటి దేశాలతో పాటు చైనా కూడా డాలర్ రహిత వ్యాపారానికి (De-dollarization) తెరలేపాయి. చమురు వ్యాపారంలో చైనా యువాన్ వాడకం పెరిగితే, అది అమెరికా డాలర్ పతనానికి దారితీస్తుందనే ఆందోళనలు ప్రపంచ ఆర్థిక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ ఆందోళనలనే రాబర్ట్ కియోసాకి తాజాగా తన ట్వీట్ ద్వారా మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు.WORSE THAN WAR in IRANDeath of the US Dollar?Iran began accepting payment for oil in Chinese Yuan. What does that mean to you and your future and the future of the US dollar?I strongly encourage you to invest about and hour in your financial education. I strongly…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 24, 2026
ఫ్యామిలీ
అహంకారంతో అసువులు బాసిన శిశుపాలుడు
మహాభారతంలో శిశుపాలుడిది ఒక ప్రత్యేక పాత్ర... నాలుగు చేతులు, మూడు కళ్ళతో చూసేందుకు భీతిగొల్పేలా పుట్టిన శిశుపాలుని ఎవరు ఎత్తుకొంటే సాధారణ రూపానికి చేరుకుంటాడో అతని చేతిలోనే మృత్యువు రాసి పెట్టి ఉందని ఆకాశవాణి పలుకుతుంది.శిశుపాలుడు ఛేది రాజ్య చక్రవర్తి ధర్మఘోషుడు, సాత్వతిల కుమారుడు. సాత్వతి స్వయానా కృష్ణుని తండ్రి వసుదేవునికి సోదరి. అంటే కృష్ణుడికి మేనత్త. శిశుపాలుడు మేనత్త కొడుకు. ఇదిలావుండగా అంగవైకల్యంతో, చూసేందుకు భీతి గొలుపుతున్న శిశుపాలుని ఎత్తుకోమని, సాత్వతి అందరినీ కోరసాగింది.ఒకరోజు బలరామకృష్ణులు మేనత్తని చూడాలని ఛేది రాజ్యానికి వచ్చారు. అప్పుడే శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు ఎత్తుకున్నాడు. దీంతో అతడి వికృత రూపం పోయింది. తన కుమారుడు శిశుపాలునికి సాధారణ రూపం వచ్చినందుకు కలిగిన ఆనందం కంటే, మేనల్లుడి చేతిలో తన కొడుకు మరణిస్తాడనే ఆందోళన తో తనకు పుత్రభిక్ష పెట్టమని జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుని వేడుకుంది సాత్వతి. అర్హమైన వంద తప్పుల వరకు మన్నిస్తానని, ఆపై తప్పులు మీరితే సంహరిస్తానని తన మేనత్త అయిన సాత్వతి కి మాట ఇచ్చాడు. అందుకే శిశుపాలుడు వంద తప్పులు చేసేవరకు కృష్ణుడు ఎంతో సంయమనంతో ఉన్నాడు. దీనిని అలుసుగా తీసుకొని అహంకారం తో విర్రవీగిన శిశుపాలుడు తనకు తిరుగులేదని తప్పుమీద తప్పు చేసుకుంటూ పోయాడు. వసుదేవుని యజ్ఞాన్ని అడ్డుకుని అశ్వాన్ని దొంగలించడమే కాదు, దాన్ని సంహరించాడు. కృష్ణుడు లేని సమయంలో ద్వారకకు నిప్పంటించడమే కాదు, రుక్మిణిని వివాహం చేసుకోవాలని చూశాడు. బభ్రువాహనుడి భార్యని అపహరించి తనదాన్ని చేసుకున్నాడు. ఇన్ని తప్పులు, ఘోరాలు శిశుపాలుడు చేసినా ఇచ్చిన మాట ప్రకారం శ్రీకృష్ణుడు ఓపిక పట్టాడు. ధర్మరాజు తలపెట్టిన రాజసూయ యాగంలో భాగంగా ఛేది దేశానికి వచ్చిన భీముడిని, శిశుపాలుడు ఆదరించాడు. యాగం కోసం ధనం కూడా అందించాడు. ధర్మరాజు ఆహ్వానం మేరకు సభకు వచ్చాడు. తొలి అర్ఘ్యానికి శ్రీ కృష్ణుడే అర్హుడని భీష్ముడు చెప్పడంతో శిశుపాలుడు ఆగ్రహించాడు.ఒక యాదవుడు పూజ్యుడెలా అవుతాడని నోటికి వచ్చినట్లు మాట్లాడి శ్రీ కృష్ణుని అవమానించాడు శిశుపాలుడు. భీష్మపితామహుని తప్పుబట్టి ధర్మరాజుని దుయ్యబట్టాడు. దీంతో భీముడు, సహదేవుడు ఆవేశపడితే భీష్ముడు వారిని వారించాడు. కృష్ణుడు సభనుద్దేశించి ‘‘శిశుపాలుడి తల్లికిచ్చిన మాట ప్రకారం అతడి వంద అపరాధాలను మన్నించాను... నేటితో వంద తప్పులు పూర్తయ్యాయి. ఈ మూర్ఖుని ఇప్పుడే సంహరిస్తాను’’ అని పలికి సుదర్శన చక్రంతో శిశుపాలుని శిరస్సు ఖండించాడు.శిశుపాలుడు ఎవరు?బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందాదులు విష్ణు మూర్తిని దర్శించుకోవాలని వైకుంఠానికి వెళ్ళినపుడు అక్కడ ఉన్న ద్వార పాలకులైన జయ, విజయులు, ఈ సమయంలో విష్ణుమూర్తి ఏకాంత సమయంలో ఉన్నారని, దర్శనానికి తగిన సమయం కాదని వారించడంతో పాటు, వారిని లోనికి పంపకపోవడంతో, ఆగ్రహించిన సనక, సనందాదులు, జయ, విజయులను వైకుంఠ లోకంలో ఉండేందుకు అర్హత లేకుండా శపిస్తారు. అనంతరం తమ తప్పును తెలుసుకున్న జయ, విజయులు శాప విమోచనం కోరగా విష్ణుమూర్తితో 7 జన్మల మిత్రుత్వం కానీ 3జన్మల శత్రుత్వం అనంతరం మరలా విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని సూచిస్తారు. దీనితో జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించి మూడు జన్మల శత్రుత్వం నెరపి విష్ణుమూర్తి చేతిలో హతులై, మరలా విష్ణుమూర్తి ద్వారపాలకులయ్యారు జయవిజయలు...– సి.ఎన్.మూర్తి, సీనియర్ జర్నలిస్ట్
చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..!
మోడు వారిని భూమిని కొంచెం మనసుపెట్టి, శ్రమించి పచ్చదనంతో కళకళలాడేలా చేయొచ్చు. అదే ఎడారిలో అంత ఈజీకాదు. చాలామటుకు అసాధ్యమనే చెప్పొచ్చు. ఎడారిలో అడవిని పెంచడం మాటల్లో చెప్పినంత సులభం అస్సలు కాదు. ఒక వేళ పెంచినా.. మనుగడ సాధించగలడంమనేది ప్రశ్నార్థకమే. అలాంటిది సుసాధ్యం చేసి చూపించింది ఓ మహిళ. ఆనాడు ఆ చేస్తున్న పనికి సాయం అందిస్తూ కూడా..ఎడారిలో పచ్చదనం వస్తుందా అన్న ప్రశ్న ఎదురైన వెరవక ముందుకు సాగిన పచ్చని తల్లి ఆమె.అంతర మంగోలియాలోని మావోవుసు ఎడారిలో ఎడారీకరణను ఎదుర్కోవడానికి దశాబ్దాలుగా చెట్లను నాటుతోంది చైనాకు చెందిన 60 ఏళ్ల యుజెన్. 1980లలో వివాహం అనంతరం భర్తతో కలిసి మంగోలియాలోని మావోసు ఎడారికి వెళ్లింది. ఆ ప్రదేశం బలమైన గాలులు, కరువుతో సహా తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. అలాంటి వాతావరణంలో నివశిస్తూ..ఎడారి వ్యాప్తిని ఆపేలా చెట్లను నాటే ప్రయత్నం చేశారు ఆ దంపతులు. ఆ పని అత్యంతకష్టమైనప్పటికీ ఆ జంట ఏళ్ల తరబడి ఆ ప్రయత్నం కొనసాగించింది. 1996లో ఆమె కథ చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీలో ప్రసారమైంది. దాంతో ఒక్కసారిగా యుజెన్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆమె అంకిత భావానికి స్ఫూర్తి పొందిన రోనాల్డ్ సకోల్స్కీ అనే అమెరికన్ ఉపాధ్యాయుడు ఆమె లక్ష్యానికి మద్దతుగా సుమారు రూ. 4,80,000 ఇచ్చాడు. అంత పెద్ద మొత్తం చూసి ఆశ్చర్యపోయిన యుజెన్..ఆ డబ్బులు మొత్తం మొక్కలు నాటేందుకే వినియోగించింది. సకోల్స్కీ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ స్కూల్లో పనిచేస్తుండేవారు. ఆయన ఒక రోజు ఎడారిలో మొక్కలు నాటుతున్న యుజెన్ను చూసి అబ్బురపడ్డారు. కానీ ఆమె ప్రయత్నం సాధ్యమవుతందా? లేక నిరర్థకం అవుతుందో? తెలియదు గానీ..తన వంతుగా మద్దతు అంటూ అంత సొమ్ము ఇచ్చారాయన. కాలక్రమేణ ఎడారిలో 50 వేలకు పైగా చెట్లు పెరిగి బీడు వారిని ఎడారి కాస్తా పచ్చని భూమిలా కనువిందు చేయడం ప్రారంభించింది. ఆ అడవిని ఎలాగైనా.. ఆ ఉపాధ్యాయుడు సకోల్స్కీకి చూపించాలని యుజెన్ ఎంతో ప్రయాసపడి సదరు స్కూల్ సాయంతో అతడి ఆచూకిని తెలుసుకుని మరి ఆ అడవిని చూసేందుకు ఆహ్వానించింది. అతను ఆ ఆహ్వానానికి ఉబ్బితబ్బిబవ్వుతూ..ఆ ఫలితాన్ని చూడాలని ఎంతో కుతూహలంగా ఉందని చెప్పాడు. ఈ కథ చైనాలోని ప్రతిఒక్కరిని కదలించింది. యుజెన్ ప్రయత్నమే అభినందనీయం అనుకుంటే.. ఆయన ఆమె ప్రయత్నానికి మద్దుతివ్వడం మరింత విశేషం. పైగా చాలామంది దీనిని సరిహద్దులు దాటి చూపిన దయ, నమ్మకం, సహకారానికి సంబంధించి..హృదయాన్ని తాకే కథగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పర్యావరణ ప్రయత్నాల ద్వారా ఇటీవల సంవత్సరాలలో ఎడారీకరణకు గురైన భూమిని తగ్గించడంలో చైనా గణనీయమైన పురోగతి సాధించిందని అధికారులు కూడా పేర్కొన్నారు.(చదవండి: ఐదు నెలల్లో 30 కేజీలు..! నో షార్ట్కట్, నో స్ట్రిక్ట్ డైట్)
పరిశోధనా రంగంలో నకీలల కలకలం
శాస్త్ర రంగంలో వాస్తవ పరిశోధనల కంటే నకిలీల ప్రాబల్యం పెరిగిపోతుండటం పట్ల అంతర్జాతీయ పరిశోధక సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. శాస్త్ర విజ్ఞాన రంగానికి సంబంధించి నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల వెల్లడించిన దిగ్భ్రాంతికరమైన విషయాలు యావత్ సైన్స్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేశాయి.‘అమ్ముడుబోతున్న’ జర్నల్స్!ఎటువంటి క్షేత్రస్థాయి పరిశోధనలు లేదా ప్రయోగాలు లేకుండానే, ధనార్జనే ధ్యేయంగా కొన్ని ముఠాలు నకిలీ అధ్యయన పత్రాలను విక్రయిస్తున్నాయి. అంతకంటే ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, శాస్త్రీయ ప్రమాణాలను పాటించాల్సిన కొన్ని గుర్తింపు పొందిన జర్నల్స్ (సైన్స్ పత్రికలు) సైతం ఈ ముఠాలతో చేతులు కలపటం! భారీ మొత్తంలో డబ్బు, ఇతర ప్రయోజనాల కోసం ఆ పత్రికలు నాణ్యత లేని, అశాస్త్రీయమైన సమాచారాన్ని ప్రచురిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా రంగం విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి!నెట్వర్క్గా సాగుతోందినార్త్వెస్టర్న్ యూనివర్సిటీ నిర్వహించిన లోతైన సత్యాన్వేషణలో భాగంగా, లక్షలాది పాత రికార్డులను తనిఖీ చేసినప్పుడు ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మధ్యవర్తులు, నకిలీ పరిశోధకులు ఒక నెట్వర్క్గా ఏర్పడి, పరిశోధనా పత్రాలను విక్రయిస్తున్నట్లు బయటపడింది. దీంతో, నికార్సైన పరిశోధనా పత్రాన్ని కూడా అది నిజమైనదా కదా అని సూక్ష్మంగా పరిశీలించాల్సిన అగత్యం ఏర్పడింది.అబద్దపు నివేదికలు, ప్రసంశలుప్రచురణల రంగంలోని పెద్దల బలహీనతలను ఆసరాగా చేసుకుని, కొన్ని ముఠాలు ప్రధానంగా మూడు రూపాల్లో మోసానికి పాల్పడుతున్నట్లు నార్త్వెస్టర్న్ బృందం గుర్తించింది ఆ మూడూ : ఎటువంటి ప్రయోగాత్మక ఆధారాలు లేకుండానే, కేవలం ఊహాజనిత లెక్కలతో అబద్ధపు నివేదికలను కల్పిత డేటాతో సిద్ధం చేయడం; నిర్ణీత రుసుము చెల్లిస్తే చాలు, ఎవరి పేరునైనా సరే ‘ప్రధాన పరిశోధకుడి’ (ఫస్ట్ ఆథర్) గా నివేదికలో చేర్చటం; ఆ తప్పుడు పరిశోధనకు ప్రాధాన్యం కల్పించేందుకు కొన్ని పత్రికల్లో రివ్యూలు రాయించటం, అలాగే ‘గ్రంథ రచయిత’లుగా కొందరికి ప్రశంసాపత్రాలు అందచెయ్యటం! ‘‘ఈ ధోరణి పట్ల మనం ఉదాసీనంగా ఉండిపోతే, సైన్స్ ప్రామాణికతే ప్రశ్నార్థకంగా మారుతుంది’’ అని ప్రొఫెసర్ అమరల్ కలవరపడుతున్నారు. అమరల్ నార్త్వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన సోషల్ సిస్టమ్స్, ఇంజనీరింగ్ సైన్సెస్ నిపుణుడు. ఆయన తన సహ పరిశోధకుడు రీస్ రిచర్డ్సన్తో కలిసి కూపీ లాగినప్పుడు ఈ నకిలీ పరిశోధనల పత్రాల గుట్టలు బయటపడ్డాయి. వాటిపై వీరిచ్చిన సంచలన నివేదిక ప్రతిష్టాత్మకమైన పి.ఎన్.ఎ.ఎస్. (ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్) జర్నల్లో రావటంతో అంతర్జాతీయంగా నకిలీ పరిశోధనా పత్రాలపై చర్చ మొదలైంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘నేషనల్ సైన్స్ ఫౌండేషన్’ మద్దతు కూడా వీరికి లభించింది. తవ్వి తీశారుఅమరల్ పరిశోధక బృందం కేవలం ప్రాథమిక పరిశీలనకే పరిమితం కాలేదు. అంతర్జాతీయ స్థాయిలోని అతి పెద్ద డేటాబేస్లను క్షుణ్ణంగా పరిశీలించి, ఈ అక్రమాలను వెలికి తీసింది. ఇందుకోసం వారు ‘వెబ్ ఆఫ్ సైన్స్’, ‘స్కోపస్’, ‘పబ్మెడ్’ వంటి పేరున్న డేటాబేస్ల నుండి లక్షలాది రికార్డులను సేకరించి తూర్పార పట్టారు. ఒకే రకం చిత్రాలను లేదా ఒకే రకం డేటాను వేర్వేరు పరిశోధనా పత్రాల్లో మళ్లీ మళ్లీ వాడటం వంటి మేధోచౌర్యాన్ని గుర్తించారు. నాణ్యత ప్రమాణాలు పాటించనందున డేటాబేస్ల నుండి తొలగింపునకు గురైన జర్నల్స్ జాబితాను నిశితంగా చెరిగి, వాటిలో వచ్చిన పరిశోధనా పత్రాల వెనుక ఉన్న ఉమ్మడి నెట్వర్క్లను వెలికితీశారు. ‘రిట్రాక్షన్ వాచ్’, ‘పబ్పీర్’ వంటి వాచ్డాగ్ ప్లాట్ఫామ్లలోని చర్చలను, ఎడిటర్ల నేపథ్యాలను, పరిశోధనా పత్రాల సమర్పణ తేదీలను బేరీజు వేసుకున్నారు. ఇంత నిశితంగా తవ్వుకుంటూ వెళ్లాక మాత్రమే, అశాస్త్రీయ పద్ధతుల్లో పత్రాలను ప్రచురిస్తున్న ముఠాల ఉనికిని తెలుసుకోగలిగారు.ఎంత డబ్బుకు అంత హోదా!శాస్త్ర పరిశోధన అనేది నిరంతర శ్రమతో కూడిన విషయం. అయితే, ఈ నేరపూరిత పగడ్బందీ నెట్వర్క్లు శ్రమ లేకుండా డబ్బు సంపాదించటం కోసం నకిలీ పరిశోధనా పత్రాలను సృష్టిస్తున్నాయి. ఈ పత్రాల్లో నిజాలు ఉండవు, వీటిలోని సమాచారానికి పొంతనలు కుదరవు. ఇదంతా కూడా మనీ లాండరింగ్లా సాగుతుంది. భారీ మొత్తంలో నిధులు చెల్లించే వారికి పరిశోధనతో సంబంధం లేకపోయినా ‘ప్రధాన రచయిత’ హోదాను కల్పిస్తారు. ఇచ్చే డబ్బును బట్టి రచయితల జాబితాలో నాలుగో స్థానం లేదా ఐదో స్థానం కేటాయిస్తారు. ఈ అశాస్త్రీయ పత్రాలపై ఎటువంటి సమీక్ష లేదా అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు, జర్నల్స్ యాజమాన్యాలకు కూడా భారీగా ముడుపులు అందిస్తున్నట్లు అమరల్ టీమ్ పసిగట్టింది.నివారించటం ఎలా?!ఈ వ్యవస్థీకృత ‘ఫేక్ రీసెర్చ్’ వైరస్ను అడ్డుకోవడానికి అమరల్, రిచర్డ్సన్ల బృందం అత్యంత కీలకమైన, ఆచరణాత్మక పరిష్కారాలను సూచిస్తోంది. అవి: పరిశోధన పత్రాలపై సంపాదకీయ పర్యవేక్షణ ఉండాలి. జర్నల్న్ పనితీరుపై నిరంతర నిఘా పెట్టాలి. ఎడిటర్లు అనుసరిస్తున్న సమీక్షా పద్ధతులు పారదర్శకంగా ఉన్నాయా లేదా అని నిశితంగా గమనించాలి. అనైతిక పద్ధతులకు పాల్పడే ఎడిటర్లను గుర్తించి, జర్నల్స్ విశ్వసనీయతను కాపాడాలి. అలాగే, కృత్రిమ మేధ, డేటా ఎనలిటిక్స్ ఆధారంగా సరికొత్త టూల్స్ను అభివృద్ధి చేయాలి. అబద్ధపు సమాచారాన్ని, మే«ధా చౌర్యాన్ని, కల్పిత డేటాను ప్రాథమిక దశలోనే గుర్తించగల సాంకేతికతను పబ్లిషింగ్ హౌస్లు తప్పనిసరిగా వాడాలి.ఏఐతో మరింత ముప్పు!శాస్త్ర పరిశోధనా రంగంలోప్రస్తుతం జరుగుతున్న ఈ మోసాలకు తోడు, ‘జనరేటివ్ ఏఐ’ ప్రవేశం కూడా పరిశోధనా రంగాన్ని మరింత ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని పరిశోధకుడు రిచర్డ్సన్ హెచ్చరించారు. అదెలా అంటే, ఏఐ సాయంతో అతి తక్కువ సమయంలో వేల సంఖ్యలో నకిలీ పరిశోధనా పత్రాలను సృష్టించే అవకాశం ఉంది. దీనివల్ల వాస్తవ పరిశోధనలు ఈ కృత్రిమ సమాచార ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇక నకిలీ పరిశోధనా పత్రాలలోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తు ఏఐ మోడల్స్ శిక్షణ పొందితే, అవి మరింత తప్పుడు సమాచారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ఒక విషవలయంలా మారి, వాస్తవానికి, కల్పితానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా చెరిపివేస్తుంది. ఈ పరిణామం వల్ల అంతిమంగా శాస్త్రీయ విజ్ఞానం ప్రామాణికత దెబ్బతింటుంది. అబద్ధపు పునాదుల మీద నిర్మితమయ్యే మేధో సంపత్తి మానవాళికి ఎటువంటి ఉపయోగం లేకపోగా, తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ‘‘శాస్త్ర విజ్ఞానం మానవజాతి మనుగడకు అత్యంత కీలకం అని మనం విశ్వసిస్తే, దాని పవిత్రతను కాపాడటానికి ఈ అనైతిక శక్తులపై పోరాడక తప్పదు’’ అని అమరల్ తాజాగా పిలుపునిచ్చారు. శాస్త్ర విజ్ఞాన రంగంలో నైతికతను పునరుద్ధరించడమే నేటి తక్షణ కర్తవ్యం అని ఆయన అంటున్నారు. నిజమే. సత్యాన్వేషణే లక్ష్యంగా సాగే సైన్స్ రంగం, ఈ నకిలీ ప్రభావం నుండి బయటపడి తన పూర్వ వైభవాన్ని, విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన చారిత్రక అగత్యం నేడు ఏర్పడింది!∙ సాక్షి స్పెషల్ డెస్క్మేధా దోపిడీకి పరాకాష్ఠనకిలీ పరిశోధనా రంగంలోని ముఠాలు అనుసరిస్తున్న వ్యూహాలు, మాయోపాయాలను ప్రొఫెసర్ అమరల్ బృందం శాస్త్రీయంగా విశ్లేషించింది. దాని ప్రకారం, ఈ నెట్వర్క్లు ఒకే పరిశోధనా పత్రాన్ని ఏకకాలంలో పలు జర్నల్స్లో వచ్చేలా చేసి, త్వరగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తాయి. ఒకవేళ భవిష్యత్తులో ఆ పత్రం నకిలీదని తేలి, తొలగింపునకు గురైనప్పటికీ అప్పటికే వారు పొందాల్సిన లబ్ధిని వారు పొంది ఉంటారు. అలాగే ప్రచురణ నిలిచిపోయిన పాత పత్రికల వెబ్సైట్ డొమైన్లను ఈ ముఠాలు కొనుగోలు చేస్తాయి. ఉదాహరణకు, బ్రిటన్కు చెందిన ‘హెచ్.ఐ.వి. నర్సింగ్’ జర్నల్ మూత పడగానే దానిని కొని, దాని పేరును వాడుకుంటూ నర్సింగ్ రంగానికి ఏమాత్రం సంబంధంలేని వేలాది అశాస్త్రీయ పత్రాలను వారు ప్రచురించారు. మేధా దోపిడీకి ఇది పరాకాష్ఠ. ఇవి కాక, రచయితలకు, జర్నల్ ఎడిటర్లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ; పరిశోధనా పత్రాల ప్రచురణకు ‘ప్యాకేజీ’ ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పరిశోధనా పత్రం తయారీ నుండి ప్రచురణ వరకు కొనసాగుతున్న ఈ పకడ్బందీ కుంభకోణంపై అమరల్ బృందం అంతర్జాతీయ సమాజానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. శాస్త్ర రంగంలో తగిన భద్రతా ప్రమాణాలు, పారదర్శకతను పెంచకపోతే, భవిష్యత్తులో మేధో ప్రపంచం ఈ మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.ఆటోమేటిక్ స్కానింగ్ సిస్టమ్నకిలీ పరిశోధనల వ్యవస్థ జాడలను ఛేదించేందుకు ప్రొఫెసర్ అమరల్ బృందం ఒక అధునాతన ‘ఆటోమేటిక్ స్కానింగ్ సిస్టమ్’ను అభివృద్ధి చేసింది. ఈ సాంకేతిక విధానం ప్రధానంగా మెటీరియల్ సైన్సెస్, ఇంజినీరింగ్ రంగాల్లోని పరిశోధనా పత్రాలను నిశితంగా విశ్లేషిస్తుంది. చాలామంది నకిలీ పరిశోధకులు పరిశోధన కోసం తాము అత్యాధునిక పరికరాలను ఉపయోగించినట్లు పత్రాల్లో పేర్కొంటారు. అయితే, వారు పేర్కొన్న పరికరాల సామర్థ్యానికి, వారు చూపిన ఫలితాలకు మధ్య ఎటువంటి శాస్త్రీయ సంబంధమూ ఉండదు. దానిని ఈ ‘ఆటోమేటిక్ స్కానింగ్ సిస్టమ్’ సాఫ్ట్వేర్ తక్షణమే గుర్తిస్తుంది. అలాగే క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రయోగాలు చేయకుండానే, కేవలం ఊహాజనిత పరికరాల పేర్లతో పేపర్లు సృష్టించే వారిని ఈ వ్యవస్థ సమర్థవంతంగా గుర్తించి, అడ్డుకుంటుంది. ఈ వినూత్న పరిష్కారాన్ని ప్రతిష్ఠాత్మకమైన ‘ప్లాస్ వన్’ జర్నల్ ప్రశంసించింది. శాస్త్రీయ పరిశోధనల నాణ్యతను కాపాడటంలో కీలక ముందడుగుగా దీనిని అభివర్ణించింది.
ఐదు నెలల్లో 30 కేజీలు..! నో షార్ట్కట్, నో స్ట్రిక్ట్ డైట్
బరువు తగ్గడం అనగానే కఠినమైన వ్యాయామాలు, స్ట్రిక్ట డైట్నే ఫాలో అయిపోతుంటారు. నిజానికి ఇలా ఎప్పుడైతే శరీరాన్ని ఒకేసారి కష్టపెడతామో అదికాస్తా సహకరించడానికి బదులుగా వ్యతిరేకించడం మొదలుపెడుతుంది. ఫలితంగా బరువు తగ్గడం దేవుడెరుగు మొత్తానికి మరిన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురవ్వుతాయని అంటోంది ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. చిన్నచిన్న మార్పులే అద్భుతం చేస్తాయని..త్వరిగతిన బరువు తగ్గుతామని అంటున్నారామె. అదెలాగంటే..ఫ్యాట్ లాస్ కోచ్ అంజలి సచన్ కేవలం ఐదు నెలల్లో 30 కేజీలు తగ్గారు. అందుకోసం ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అయ్యారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. నిజానికి కఠినమైన వ్యాయామాలు, డైట్లు త్వరిగతగతిన అలిసిపోయేలా చేసి, బరువు తగ్గడాన్న మధ్యలోనే వదిలేస్తారని చెబుతోందామె. అదే చిన్నగా శరీరం అలవాటుపడేలా నెమ్మదిగా పెంచుకుంటూ పోతే అద్భుతమైన ఫలితాలు పొందుతామని అంటోంది. తానేమి కఠినమైన డైట్లు, రెండు గంటల జిమ్ సెషన్లు వంటివి చేయలేదన్నారామె. తాను అనుసరించిన విధానం అందరు చూసి నవ్వేలా, సిగ్గుపడేంతగా మొదలైందని చెబుతోంది. అంటే అంతా రోజూ పదివేల అడుగులతో దినచర్య మొదలుపెడితే, తానే కేవలం 4000 అడుగులతో తన వెయిట్లాస్ని మొదలుపెట్టానని అంటోంది. ఎందుకంటే అధిక బరువు ఉన్నవాళ్లకు ప్రారంభంలోనే అధిక వర్కౌట్లు సమస్యాత్మకమవుతాయని అంటోందామె. శరీరం మనం చేసే వ్యాయామాలకు అలవాటుపడుతుందనగా, నెమ్మదిగా, నిధానంగా వర్కౌట్లు, అడుగులు పెంచాలని సూచిస్తోంది. ఇక్కడ లక్ష్యం కేవలం కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడం కాదని అంటోంది. అలాగే ఆయాసం, శ్రమతో కూడిన విధంగా వర్కౌట్లు చేయొద్దని అంటున్నారు. సంతోషంగా ఎంజాయ్ చేసేలా మొదలుపెట్టండి, బాడీ అలవాటు పడుతుందనగా చిన్నగా కార్డియోసెషన్ వంటి వేగవంతమైనవి మొదలు పెట్టమని అంటోంది. అలా చేయడం వల్ల కీళ్లు మరింత బలపడతాయి, తెలియకుండానే ఆ వర్కౌట్లకు అలవాటుపడేలా కోలుకుంటారు. అదీగాక భారాన్ని తట్టుకునే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది. నెమ్మదగా దశల వారీగా సాగే ప్రక్రియని, రాత్రికి రాత్రే జరిగేది కానీ తేల్చి చెప్పారామె. కేవలం స్థిరంగా నిదానంగా, ఓపికతో చేస్తుకుంటూ వెళ్తే..అనుకున్నది సాధ్యమవుతుందని చెబుతోందామె. View this post on Instagram A post shared by Anjali Sachan (@_anjali_sachan_) (చదవండి: 40 డిగ్గ్రీల ఉష్ణోగ్రతల్లో సైతం ఇళ్లను కూల్గా..! ఆ ఐడియాకు ఆనంద్ మహీంద్రా ఫిదా)
అంతర్జాతీయం
ఇంటి అద్దెలు భరించలేక ఆగ్రహం కట్టలు తెంచుకుని..
మాడ్రిడ్: మన దేశంలోని పలు నగరాల్లో ఇంటి అద్దెలు ఎంతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అంతెందుకు హైదరాబాద్లో అద్దెకు ఉండి ఉద్యోగాలు చేసుకునే చాలా మంది .. తమ జీతం అద్దెలు కట్టుకోవడానికే సరిపోతుందంటూ వాపోతుంటారు. అయితే, అద్దెల బాధల వల్ల వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన వార్తను ఎప్పుడైనా విన్నారా? స్పెయిన్లో ఆదివారం అదే జరిగింది.మాడ్రిడ్, బార్సెలోనా లాంటి నగరాల్లో పెరుగుతున్న ఇంటి అద్దె ఖర్చులు చాలా మందికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. మరోవైపు, కొంత డబ్బు కూడబెట్టుకున్న వారు ఇళ్లు కొందామన్నా అందుబాటు ధరల్లో ఉండడం లేదని నిరసనకారులు చెప్పారు. స్పెయిన్ ప్రజలను ఇళ్ల మార్కెట్కు దూరం చేస్తున్నాయంటూ మాడ్రిడ్లో నిరసన చేపట్టారు.స్పెయిన్లో హౌసింగ్ క్రిసిస్, సోషలిస్టు ప్రధాని పెర్డో సాంచెజ్కు తలనొప్పిగా మారింది. 2027 ఎన్నికలకు ముందు ఇది అతిపెద్ద సవాలు. ఆ దేశంలో సొంత ఇల్లు ఉండాలన్న సంప్రదాయం బలంగా ఉంది. పర్యాటకం, వలసలతో పెరిగిన జనాభా కారణంగా డిమాండ్ పెరగడంతో ఇళ్ల అద్దెలు భారీగా పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.నిరసనకారులు నినాదాలు చేస్తూ ఇంటి హక్కును గుర్తు చేస్తూ బ్యానర్లు ప్రదర్శించారు. “మాకు పర్యాటకులు కాదు, నేబర్స్ కావాలి” అని ఒక బ్యానర్లో రాసి ఉంది.ఓ ర్యాలీని మరవకముందే మరొకటిస్పెయిన్లో శనివారం కూడా ఓ ర్యాలీ జరిగింది. సాంచెజ్కు వ్యతిరేకంగా మాడ్రిడ్లో వేలాది మంది నిరసన చేపట్టారు. అవినీతి ఆరోపణలు, ప్రభుత్వంపై అసంతృప్తితో రాజకీయ ఉద్రిక్తతలు, విమర్శలు పెరిగాయి. దీంతో స్పెయిన్లో ఉద్రిక్తతలు పెరిగాయి.ఆ ర్యాలీ మరవకముందే ఆదివారం మరో ర్యాలీ జరగడం గమనార్హం. స్పెయిన్లో ఇల్లు కొనడం చాలా మందికి భారంగా మారింది. మార్కెట్ ఒత్తిళ్లు, ఊహాగానాలు ధరలను పెంచుతున్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాలు, తీర ప్రాంతాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.గత నెలలో స్పెయిన్ ప్రభుత్వం 7 బిలియన్ యూరోల ($8.23 బిలియన్) విలువైన భారీ ప్రణాళికను ఆమోదించింది. వచ్చే నాలుగేళ్లలో మరిన్ని ప్రభుత్వ గృహాలు నిర్మించడం, అధిక అద్దెలు, ఇళ్ల ధరలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం.గత కొన్ని ఏళ్లుగా స్పెయిన్ ప్రజలు దేశవ్యాప్తంగా అనేక నిరసనల్లో పాల్గొంటున్నారు. అధిక అద్దెలు, ఇళ్ల ధరలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తున్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 97 మిలియన్ అంతర్జాతీయ పర్యాటకులు స్పెయిన్ను సందర్శించారు. నగర కేంద్రాల్లో విస్తరించిన పర్యాటక అద్దె ఇళ్లపై ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్గా ఉంది. 2025 చివర్లో ఇళ్లకు సంబంధించిన ఖర్చులు ఏడాది ప్రాతిపదికన దాదాపు 13 శాతం పెరిగాయని యూరోపియన్ యూనియన్ గణాంక సంస్థ యూరోస్టాట్ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ అంచనా ప్రకారం.. 50 మిలియన్ జనాభా ఉన్న స్పెయిన్లో 7,00,000 ఇళ్ల కొరత ఉంది. డిమాండ్తో పోల్చితే కొత్త నిర్మాణాల వేగం తక్కువగా ఉంది.
ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్ : ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ‘మాకు అణ్వాయుధాలు అవసరం లేదు. అణ్వాయుధాల విషయంలో ప్రపంచానికి భరోసా ఇస్తున్నాం. ప్రపంచ అణు నిబంధనలకు కట్టుబడి ఉంటాం’అని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికారిక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం..నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ తన యురేనియం నిల్వలను ఒప్పందం ప్రకారం అమెరికాకు ఇవ్వడానికి సిద్ధమైంది.భారత్లోని వారణాసిలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ మాట్లాడుతూ.. ‘అణ్వాయుధాలు ఇస్లాంలో హరామ్ (నిషిద్ధం). ముప్పై ఏళ్ల క్రితమే ఇరాన్ వాటిని వద్దని ప్రకటించింది. సుప్రీం లీడర్ ఇచ్చిన ఫత్వా ప్రకారం అవి మతపరంగా నిషిద్ధం’ అని స్పష్టం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను ‘న్యూక్లియర్ డస్ట్’ అని పేర్కొంటూ, ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడం తమ ప్రధాన లక్ష్యం అని పునరుద్ఘాటించారు. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా ఇరాన్ నాయకులతో సమావేశమై, పశ్చిమ ఆసియాలో శాంతి ప్రయత్నాలపై చర్చించారు. అమెరికా,ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హర్మూజ్ జలసంధి పునఃప్రారంభంపై చర్చలు కొనసాగుతున్నాయి.
‘ఒరెష్నిక్ హైపర్సోనిక్’తో రష్యా భీకరదాడులు
కీవ్: ఉక్రెయిన్పై రష్యా పెద్ద ఎత్తున దాడులు చేసింది. కొన్ని వందల డ్రోన్లు, డజన్లకొద్దీ క్షిపణులను ప్రయోగించింది. కీవ్ నగరంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నలుగురు మృతిచెందగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఆ ప్రాంతమంతా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇళ్లకు, పాఠశాలలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.బిలా సెర్క్వా నగరంపై జరిగిన దాడిలో ఒరెష్నిక్ హైపర్సోనిక్ క్షిపణి వాడినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఆ నగరం కీవ్ ప్రాంతంలో ఉంది. ఒరెష్నిక్ హైపర్సోనిక్ క్షిపణి శబ్ద వేగం కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.ఉక్రెయిన్ శుక్రవారం స్టారోబిల్స్క్ పట్టణంలోని విద్యార్థుల వసతి గృహంపై దాడి చేసిందని ఆరోపించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. చెప్పినట్లే ఆదివారం దాడులు చేశారు. రష్యా దాడులు చేయడానికి ముందే జెలెన్ స్కీ మాట్లాడుతూ.. తమ దేశంపై దాడి చేసే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. రష్యా ఒరెష్నిక్ క్షిపణి వాడే అవకాశం ఉందని ఉక్రెయిన్ నిఘా సంస్థలకు సమాచారం వచ్చినట్టు కూడా ఆయన చెప్పారు. ఆ క్షిపణిని అడ్డుకోవడం అసాధ్యమని చెబుతున్నారు. ఉక్రెయిన్ జాతీయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కీవ్ ప్రాంతంలో 50కు పైగా చోట్ల దాడి జరిగింది. ఇళ్లు, షాపింగ్ కేంద్రాలు, అత్యవసర సేవల భవనాలు, పోలీస్ భవనాలు దెబ్బతిన్నట్టు సమాచారం.నీటి సరఫరా కేంద్రంపై కూడా దాడి జరిగినట్టు జెలెన్స్కీ చెప్పారు. “రాజధానిపై భారీ బాలిస్టిక్ దాడి జరిగింది. ఇంకా దాడులు జరిగే అవకాశం ఉంది” అని కీవ్ సైనిక పరిపాలన అధిపతి టిమూర్ ట్కాచెంకో టెలిగ్రామ్లో గత అర్ధరాత్రి తర్వాత పోస్ట్ చేశారు.కీవ్ మేయర్ విటలి తెలిపిన వివరాల ప్రకారం నగరంలో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చిన్నారులు సహా 30 మంది ఆసుపత్రిలో చేరారు. మధ్య షెవ్చెంకో జిల్లాలో 9 అంతస్తుల భవనంపై దాడి జరిగింది. పై అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఒకరు చనిపోయారు.అదే జిల్లాలో పాఠశాల వద్ద ఉన్న ఎయిర్ రైడ్ షెల్టర్ సమీపంలో దాడి జరిగింది. శిథిలాలు పడటంతో ప్రవేశ ద్వారం మూసుకుపోయింది. పలువురు లోపల చిక్కుకున్నారు. ఎమర్జెన్సీ సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాలకు చేరుకుని మంటలు ఆర్పారు. శిథిలాలను తొలగించారు. గాయపడిన వారికి చికిత్స అందించారు.రాజధాని చుట్టూ ఉన్న కీవ్ ప్రాంతంలో మరో ఇద్దరు చనిపోయినట్టు ప్రాంతీయ అధిపతి మైకోలా కలాష్నిక్ తెలిపారు. కీవ్ బయట చెర్కాసీ, ఖార్కివ్, క్రోపీవ్నిట్స్కీ, ఒడెసా, పోల్టావా, సుమీ, జైటోమిర్ ప్రాంతాలపైనా దాడులు జరిగాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబియా తెలిపారు.
రష్యా ఆర్మీలో 217 మంది భారతీయులు.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో చిక్కుకొని, రష్యా ఆర్మీలో చేరిన భారతీయుల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పలు వివరాలు సమర్పించింది. సుమారు 217 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరగా, అందులో 49 మంది యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో ఆరుగురు ఆచూకీ తెలియకుండా పోగా, మొత్తం 139 మందిని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత రాయబార కార్యాలయం కృషి చేస్తోందని కేంద్రం తెలిపింది.రష్యా వల: ఆశచూపి.. బలిపశువులుగారష్యా తమ సైన్యంలో చేర్చుకునేందుకు విదేశీయులను ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ప్రలోభపెట్టింది. నెలకు సుమారు 2,500 డాలర్ల జీతం, 5,000 డాలర్ల సైనింగ్ బోనస్, రష్యా పౌరసత్వం, మరణిస్తే 1,68,000 డాలర్ల పరిహారం ఇస్తామని నమ్మబలికింది. ఈ ఆశతోనే చాలా మంది భారతీయులు రష్యా సైన్యంతో స్వచ్ఛందంగా ఒప్పందాలు చేసుకున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో జైలు శిక్ష అనుభవిస్తున్న కొందరు తమ శిక్ష నుంచి విముక్తి పొందాలనే ఆశతోనే రష్యా ఆర్మీలో చేరడం గమనార్హం.ప్రభుత్వ ప్రయత్నాలు- సవాళ్లుప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం రష్యాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటివరకు 48 మందికి విమాన టిక్కెట్లను ప్రభుత్వం అందించింది. అయితే, యుద్ధ పరిస్థితుల దృష్ట్యా మృతదేహాలను గుర్తించడం, స్వదేశానికి తరలించడం అత్యంత క్లిష్టంగా మారిందని రష్యా అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యుల డిఎన్ఏ నివేదికలను ఇప్పటికే సేకరించి, రష్యన్ అధికారులకు అందజేశామని, మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించే ప్రక్రియను వేగవంతం చేశామని ప్రభుత్వం తెలిపింది.కోర్టు ముందు వాస్తవాలుసుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా కేంద్రం కీలక విషయాలను బయటపెట్టింది. పిటిషన్లో పేర్కొన్న 26 మందిలో ఇప్పటికే 14 మంది మరణించగా, 11 మంది ఆచూకీ తెలియలేదు. ఒక వ్యక్తి వేధింపుల కేసులో రష్యాలో ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సంచలనం చేయవద్దని కోరిన కేంద్రం, మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపింది.
జాతీయం
ముంబై ఇండియన్స్పై చమక్కులు : నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ
సాక్షి,ముంబై: ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన స్నాతకోత్సవంలో ఒకవిద్యార్థి ప్రసంగం నెట్టింట వైరల్గా మారింది. అందులోనూ ముంబై ఇండియన్స్ను ఉద్దేశించి చమత్కారంగా ప్రస్తావించడంతో ఊహించని విధంగా నవ్వుల పువ్వులై పోయారు. మరీ ముఖ్యంగా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ (Nita Ambani) కూడా నవ్వు ఆపుకోలేక పోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగా మారింది.2026 బ్యాచ్ స్నాతకోత్సవ వేడుకకు సంబంధించిన ఒక వీడియోలో అంబానీ కుటుంబానికి చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజీపై ఆ విద్యార్థి సరదా వ్యాఖ్యలు విశేషంగా నిలుస్తున్నాయి. సాధారణంగా స్నాతకోత్సవ ప్రసంగాలు భావోద్వేగపూరితమైన స్మృతులు, భవిష్యత్ సలహాలతో నిండి ఉంటాయి. కానీ ఈ విద్యార్థి క్రికెట్ హాస్యాన్ని జోడించి, అక్కడున్నవారినందరినీ ఆకట్టుకున్నాడు.Student make fun of Mumbai Indians in front of Nita Ambani - Look at reaction of Nita Ambani. 🤣🤣 pic.twitter.com/xk3Ih0IhNP— Jeet (@JeetN25) May 24, 2026 ఈ సందర్బంగా ఆ హెడ్ బాయ్ విద్యార్థుల పాఠశాల ప్రయాణాన్ని ,తాము కలిసి పంచుకన్న మధుర స్మృతులను గుర్తు చేసుకున్నాడు. స్నాతకోత్సవం తర్వాత జీవితం గురించి మాట్లాడుతూ, "మన ప్రియమైన ముంబై ఇండియన్స్ (MI) లాగే, జీవితంలోనూ కష్టమైన కాలాలు (సీజన్స) ఉంటాయి’’ అని అనడంతో ఒక్కసారిగా అందరూ అలర్ట్ పోయారు. ఆ తర్వాత అతను ప్రసంగాన్ని కొనసాగిస్తూ, “ఏదీ సరిగ్గా జరగనట్లు అనిపించే సీజన్స్, మన శ్రమకు తగ్గ ఫలితాలు రానప్పుడు, ప్రతీదాన్నీ ప్రశ్నించుకునే చోట..ఈ ఫ్రాంచైజీ మనందరికీ నేర్పిన ఒక విషయం ఏమిటంటే, మీరెవరో ఎప్పటికీ మర్చిపోకూడదు. మీ వారసత్వాన్ని, మీకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు,” అని అతను వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి. దీంతో కెమెరా నీతా అంబానీ వైపు మళ్లింది. ఆ ఊహించని వ్యాఖ్యకు ఆమె నవ్వుతూ ముఖం చేతులతో కప్పుకోవడం కనిపించింది.అక్కడితో ఆగిపోలేదు.. అతను ముంబై ఇండియన్స్ నినాదాన్ని ప్రస్తావిస్తూ, “'దునియా హిలా దేంగే హమ్' అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి” అనడంతో నీతా సహా అందరూ ఆప్యాయంగా నవ్వుతూ చప్పట్లు మారు మోగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి పీవీ సింధుతో సహా పలువురు ప్రముఖులు ప్రసంగాలు చేశారు. ఈ యువ పిడుగు చమత్కారానికి ఇంటర్నెట్ కూడా పాజిటివ్గా స్పందించింది.
కాక్రోచ్ దుమారం.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శర్మ చేసిన బొద్దింకల వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం.. ఆ తర్వాత “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. సమర్థనలు, ఖండనలు.. తీవ్ర అభ్యంతరాలతో ఈ క్యాంపెయిన్పై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అయితే అటు ఇటు తిరిగి చివరకు.. ఈ రాజకీయ సెటైర్ క్యాంపెయిన్ కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.. సీజేఐ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం సాగుతోందని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని అత్యవసర విచారణలు జరపాలని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆ పిటిషన్లను పరిశీలించారు. అయితే ఇది అత్యవసర విచారణ జరిపే పిటిషనేం కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. మే 15న జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా ‘‘కొందరు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు..’’ అంటూ సీజేఐ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక, వృత్తుల్లో స్థానం దక్కని కొందరు యువకులు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు. కొందరు మీడియాగా, ఇంకొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరినీ టార్గెట్ చేస్తుంటారు అని పేర్కొన్నారాయన. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో.. సీజేఐ తర్వాత వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు యువతపై కాకుండా నకిలీ, బోగస్ డిగ్రీలతో వ్యవస్థల్లోకి చొరబడుతున్న వారినే ఉద్దేశించాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ “కాక్రోచ్ జనతా పార్టీ” (సిజెపి) పేరిట సోషల్ మీడియాలో వ్యంగ్య ప్రచారం కొనసాగింది. ఈ పరిణామాలను ప్రాక్టీసింగ్ లాయర్ రాజా చౌదరి సుప్రీంకోర్టులో పిటిషన్ రూపంలో దాఖలు చేశారు. సీజేఐ వ్యాఖ్యలను కొందరు సోషల్ మీడియాలో వక్రీకరించి.. నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడినట్టుగా ప్రచారం చేశారని.. ఈ దుష్ప్రచారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని అందులో పేర్కొన్నారాయన. ఈ పిటిషన్లపై న్యాయవాది గోస్వామి వాదనలు వినిపించారు. కోర్టు విచారణల్లో జరిగిన మాటల మార్పిడిని.. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే నకిలీ లా డిగ్రీలు, బోగస్ న్యాయవాదుల వ్యవహారాలపై సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దంటూ సీజేఐ సూర్యకాంత్ పిటిషనర్కు సూచించారు. ఈ అంశంలో ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి అత్యవసర విచారణ జరపాల్సినంత సీన్ లేదు. సమయం వచ్చినప్పుడు కోర్టు ఈ అంశాన్ని తప్పక పరిశీలిస్తుంది అని లాయర్ గోస్వామిని ఉద్దేశిస్తూ సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యల ప్రస్తావన, మళ్లీ వివరణ అంశాల్ని ఆయన ప్రస్తావించలేదు."Don’t take it so sentimentally’, says Chief Justice of India Surya Kant, as a lawyer mentions PIL, saying a distorted and malicious narrative is being continued to malign the judiciary despite clarification by the CJI on the 'cockroach' remark.CJI says there is no such grave… pic.twitter.com/gi0yp91N9h— ANI (@ANI) May 25, 2026మరో పిటిషన్లో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరిట సాగుతున్న ఆన్లైన్ క్యాంపెయిన్ కార్యకలాపాలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని దాఖలైంది. సీజేఐ వ్యాఖ్యలను సెలెక్టివ్గా తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని పిటిషనర్లు ఆరోపించారు. మెర్చండైజ్, బ్రాండింగ్, రాజకీయ సెటైర్ పేరుతో ప్రచారం సాగిస్తూ వాణిజ్య లాభాలు పొందే ప్రయత్నం జరుగుతోందని కూడా పేర్కొన్నారు. ఈ పిటిషన్ను కోర్టు పరిశీలించాల్సి ఉంది. అలా మొదలై..మహారాష్ట్రకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ అభిజిత్ దిప్కే ప్రారంభించిన “కాక్రోచ్ జనతా పార్టీ” మొదట సరదా సెటైర్లా మొదలైనా.. క్రమంగా ఇది వ్యవస్థలపై అసంతృప్తి వ్యక్తం చేసే డిజిటల్ ఉద్యమంగా మారింది. సీజేఐ సూర్యకాంత్ చేసిన “కాక్రోచ్” వ్యాఖ్యలను తమపై అవమానంగా భావించిన కొంతమంది నిరుద్యోగ యువత, సోషల్ మీడియా యూజర్లు ఈ పేరును వ్యంగ్య చిహ్నంగా మార్చుకున్నారు. “మమ్మల్ని బొద్దింకలు అంటారా..? అయితే ఇదే మా పార్టీ” అన్నట్లుగా ఈ క్యాంపెయిన్ను నడిపిస్తున్నారు.చదవండి: కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల బరిలోనికి దిగుతుందా?ఈ గ్రూప్ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టర్లు, వ్యంగ్య నినాదాలు, డిజిటల్ పోస్టర్లతో భారీ ప్రచారం చేస్తోంది. “Wherever WiFi Works is our headquarters”, “Party for the unemployed and overqualified” లాంటి ట్యాగ్లైన్లతో యువతలో వైరల్ అవుతోంది. రాజకీయాలపై, న్యాయవ్యవస్థపై, ఉద్యోగ వ్యవస్థపై వ్యంగ్య వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.ట్రోలింగ్ మాత్రమే కాదు..అయితే ఇది కేవలం ట్రోలింగ్కే పరిమితం కాలేదు. మాజీ ప్రధాన న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ అవకాశాలు ఇవ్వొద్దని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు-ఎంపీలకు 20 ఏళ్ల అనర్హత విధించాలని, మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, పరీక్షల లీకేజీలపై కఠిన చట్టాలు తీసుకురావాలని వంటి డిమాండ్లను కూడా తమ మేనిఫెస్టోలో చేర్చింది. దీంతో ఇది పూర్తిగా సరదా క్యాంపెయినా..? లేక వ్యవస్థలపై డిజిటల్ నిరసనా..? అనే చర్చ మొదలైంది.మరోవైపు విమర్శకులు మాత్రం ఈ క్యాంపెయిన్ న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతోందని ఆరోపిస్తున్నారు. సీజేఐ వ్యాఖ్యలను సెలెక్టివ్గా కట్ చేసి వైరల్ చేయడం, మెర్చండైజ్, బ్రాండింగ్, రాజకీయ సెటైర్ పేరుతో ప్రచారం చేయడం ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఇదే అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.
ఇలా చేస్తే 5 నెలల్లో 30 కిలోలు తగ్గవచ్చు !
బరువు తగ్గాలి..తగ్గాలి..అని ఊరికే జపం చేసినంత మాత్రాన సరిపోదు. దానికి నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం కృషి చేయాలి. ఒక్కోసారి ఈ ప్రయత్నాన్ని సుదీర్ఘం కాలం చేయాల్సి ఉంటుంది. తొందరపాటు అస్సలు పనికిరాదు. నాలుగు రోజు చేసి, సరైన ఫలితం రాలేదు అని నిరాశ పడి ఆ ప్రయత్నాన్ని వదిలేస్తే మరింత నిరాశ, ఒత్తిడి తప్పదు. ఇదే విషయాన్ని ఫ్యాట్ లాస్ కోచ్ అంజలి సచన్ ఆచరించి చూపించారు. పక్కా ప్లాన్తో క్రమశిక్షణతో, ఓపిగ్గా ప్రయత్నించి 30 కిలోల బరువు తగ్గారు. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే చాలా మంది విఫలం కావడానికి కారణం క్రమశిక్షణ లేకపోవడం కాదు; మొదలుపెట్టడమే చాలా కఠినంగా, అతి వేగంగా మొదలుపెట్టి, శరీరం మారే లోపే అలసిపోయి ఆపేయడమే అంటారు అంచని సచన్. అంతేకాదు క్రమశిక్షణ లేకపోవడం వల్ల విఫలం కారు ప్లాన్ లేకుండా తొందర పాటుతో ఫశ్రీయిల్ అవతారు అంటారామె. చాలా కఠినంగా, వేగంగా ప్రారంభించడం వల్ల, వారి శరీరంలో మార్పు రావడానికి అవకాశం కూడా రాకముందే అలసిపోతారని వివరించారు.ఫ్యాట్ లాస్ కోచ్ అంజలి సచన్ స్వయంగా 30 కిలోల అధికబరువును తగ్గించుకుంది. ఇందుకోసం ఆమె అందరిలా కఠినమైనది కాదు. ఎలాంటి నరకం చూపించే పరుగు పందాలు, గంటల కొద్దీ జిమ్ వర్కవుట్లు ఇందులో లేవు.ఆమె 84 కేజీల నుండి 54 కేజీల దాకా, అంటే 30 కిలోగ్రాములు తగ్గింది. అంజలిబరువును ఆ స్థాయికి చేర్చిన దినచర్య సాధారణమైనది కాదు. మీరి ముఖ్యంగా వెయట్ లాస్ జర్నీలో కఠినమైన స్ప్రింట్లు లేవు. రెండు గంటల జిమ్ సెషన్లు లేవు.ఒకే ఒక సూత్రాన్ని నమ్ముకుంది. ప్రస్తుతం ఉన్న స్థితిని గౌరవిస్తూనే, పక్కా ప్లాన్, క్రమబద్ధమైన కార్డియోతో ఫలితం సాధించింది. ఇందుకోసం తాను పాటించిన ప్లాన్తో తన అభిమానులతో పంచుకున్నారు.చాలా చిన్నగా ప్రారంభించండి: అంజలి మొదటి దశలో రోజుకు కేవలం 4,000 అడుగులతో ప్రారంభించాలని చెబుతారు. ప్రతిరోజూ "కనీసం 10,000 అడుగులు నడవాలి" అనే మాటలు వినేవారికి ఇది చాలా తక్కువగా అనిపించవచ్చు. కానీ ఆమె లాజిక్ ఏంటంటే—శరీరంపై ఎక్కువ బరువు ఉన్నప్పుడు, మీ కీళ్లు , నరాలు ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాయి. కాబట్టి మొదట్లోనే ఎక్కువ భారం వేయకూడదు. క్రమంగా ఈ అడుగుల సంఖ్యను పెంచుకుంటూ పోవాలని ఆమె చెబుతారు.వేగం పెంచే ముందు బలాన్ని పెంచుకోండిఫేజ్ 2 (రెండవ దశ): రోజుకు 8,000 అడుగులు + వారానికి ఒక 'జోన్ 2 కార్డియో' సెషన్ ( ఆయాసపడకుండా, హాయిగా మాట్లాడుతూ).ఫేజ్ 3: 10,000–12,000 అడుగులు + వారానికి రెండు జోన్ 2 సెషన్లు.ఫేజ్ 4: 15,000 అడుగులు.ఫేజ్ 5 : 20,000 అడుగులు + వారానికి రెండు నుండి మూడు సెషన్లు.ఈ పద్ధతి ఎందుకు పనిచేస్తుందంటే, ఒక దశ పూర్తయ్యాకే తర్వాతి దశకు వెళ్తాం. అప్పటికే కీళ్లు బలంగా మారతాయి, అలసట నుండి శరీరం త్వరగా కోలుకుంటుంది. అంటే శరీరానికి కొన్ని రోజుల సమయం కాకుండా, కొన్ని నెలల సమయం ఇవ్వడం వల్ల అది ఎక్కువ శ్రమను తట్టుకోగలుగుతుంది.అందరూ మర్చిపోయే ముఖ్యమైన విషయంఫిట్నెస్ ప్రపంచంలో చాలా మంది దాచేసే ఒక నిజాన్ని అంజలి స్పష్టం చేశారు. "కేవలం కార్డియో చేయడం వల్లే బరువు తగ్గరు. క్యాలరీల లోటు (Calorie Deficit) వల్ల మాత్రమే బరువు తగ్గుతారు." కార్డియో అనేది ఖర్చు చేసే శక్తిని పెంచి, ఆ క్యాలరీల లోటును బ్యాలెన్స్ చేయడానికి సహాయపడే ఒక సాధనం (Tool) మాత్రమే, అదే పూర్తి పరిష్కారం కాదు అంటూ తన అనుభవాలను షేర్ చేశారు.నోట్ : కార్డియోనే సర్వస్వం అనుకునేవారు బరువు తగ్గకపోగా త్వరగా అలసిపోయి నిరాశకు గురవుతారు. కానీ ఆహారం, నిద్ర, కోలుకునే సమయంతో పాటు కార్డియోను కూడా ఒక భాగంగా చూసేవారే ఆరు నెలల తర్వాత కూడా ఆరోగ్యంగా మనగలుగుతారు. 30 కిలోల బరువు అనేది ఒకే రాత్రిలో తగ్గింది కాదు; ఓపికగా, క్రమంగా, స్థిరమైన అడుగులతో సాధించిన విజయం అనేది గుర్తించాలి.
తెగిన జిప్లైన్.. 45 అడుగుల నుంచి పడి బాలుడు మృతి
ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో జరిగిన విషాద ఘటన ఒక కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. తాజ్ మహల్ సందర్శన ముగించుకుని తిరిగి వెళ్లే క్రమంలో ‘ఆగ్రా చౌపటి’ వద్ద సరదాగా జిప్లైన్ రైడ్ ఎక్కిన 16 ఏళ్ల కునాల్ అగర్వాల్, కళ్లెదుటే మృత్యుఒడిలోకి చేరాడు. రైడ్ ప్రారంభించిన కొద్ది క్షణాల్లోనే పుల్లీ లాక్ తెగిపోవడంతో, కునాల్ 45 అడుగుల ఎత్తు నుంచి అమాంతం కిందపడిపోయాడు. అది చూసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.సరదాగా మొదలై విషాదంలో..ఫిరోజాబాద్కు చెందిన అగర్వాల్ కుటుంబం ఆదివారం విహారయాత్ర కోసం ఆగ్రా వచ్చారు. తాజ్ మహల్ సందర్శన అనంతరం, సాయంత్రం 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ‘ఆగ్రా చౌపటి’కి చేరుకున్నారు. కునాల్ అగర్వాల్ (16) పట్టుబట్టడంతో, రూ. 400 పెట్టి అతనికి జిప్లైన్ టికెట్ కొనిచ్చారు. తల్లిదండ్రులు, తమ్ముడు కింద ఉండి చూస్తుండగానే, కునాల్ రైడ్ ప్రారంభించాడు. అయితే, రైడ్ మొదలైన కొన్ని అడుగుల దూరంలోనే పుల్లీ లాక్ విఫలం కావడంతో, అతను కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.నిర్లక్ష్యానికి బలిఈ ఘటనపై కునాల్ తండ్రి పంకజ్ అగర్వాల్ మాట్లాడుతూ, నిర్వాహకుల ఘోర నిర్లక్ష్యం వల్లే తాను కొడుకును కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక దర్యాప్తులో భద్రతా ప్రమాణాలు పాటించలేదని తేలింది. రైడ్ చేస్తున్న సమయంలో కునాల్కి హెల్మెట్ లేకపోవడం, కింద ఎలాంటి రక్షణ వలలు లేదా కుషనింగ్ ఏర్పాటు చేయకపోవడం నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. కేవలం లాభాపేక్షతో భద్రతను గాలికి వదిలేయడం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చట్టపరమైన చర్యలుఘటనపై సమాచారం అందుకున్న ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు, బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద యజమాని, మేనేజర్పై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే సంతోష్ కుమార్ దుబే (58), అభిషేక్ (27) అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పరికరాల లోపాలపై సాంకేతిక నిపుణులతో సమగ్ర విచారణ జరిపి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆగ్రా డీసీపీ సయ్యద్ అలీ అబ్బాస్ తెలిపారు. ఇది కూడా చదవండి: రహస్య బంకర్లో మొజ్తబా ఖమేనీ.. వీడని దాడుల భయం!
ఎన్ఆర్ఐ
కాన్వొకేషన్ ముగిసిన మరుక్షణమే కానరాని లోకాలకు..
లక్కిరెడ్డిపల్లె(అన్నమయ్య జిల్లా): కన్న కొడుకు విదేశాల్లో గొప్ప చదువులు చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు విధి తీరని అన్యాయం చేసింది. ఎంఎస్ పూర్తి చేసి పట్టా అందుకున్న సంబరం నిండకముందే, అదే రాత్రి మృత్యువు గుండెపోటు రూపంలో వచ్చి ఆ యువకుడిని బలితీసుకుంది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన షేక్ తాజ్ కుమారుడు మహమ్మద్ కుమేల్ షేక్ (28) అమెరికాలో గురువారం రాత్రి హఠాన్మరణం చెందాడు. కుమేల్ షేక్ ఇంజినీరింగ్ విద్యను చెన్నైలోని సత్యభామ వర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసుకున్న ఆయన, గురువారం జరిగిన కాన్వొకేషన్ వేడుకలో పట్టా అందుకున్నారు. ఆ ఆనందంలో కుటుంబ సభ్యులతో మాట్లాడి, స్నేహితులతో కలిసి ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వెళ్లారు. నిద్రలోనే గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. మృతుడి తండ్రి స్టాంప్ రైటర్గా పనిచేస్తున్నారు.
ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ వార్షికోత్సవాలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ తన సప్తమ వార్షికోత్సవం (ఏప్రిల్25, 2026) ఘనంగా జరుపుకుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమం ప్రొఫెసర్ బి.వి.ఎస్. చౌదరి, రాజ్యలక్ష్మి చౌదరి సమక్షంలో సింగపూర్ శివకృష్ణ దేవాలయంవారి ఫంక్షన్ హాలు వేదికగా జరిగింది.స్వరలయ సంస్థ విద్యార్ధుల సంగీత మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. కుమారి శ్రీవిద్య పంతువరాళి రాగంలో “ఎన్నగాను రామభజన” త్యాగరాజ కీర్తనను హృద్యంగా గానం చేశారు. స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు, గురు శేషుకుమారి సంగీత ప్రదర్శనలో ఆలపించిన త్యాగరాజ కీర్తన “ప్రక్కల నిలబడి”, ఒక “మీరా భజన్” , విద్యార్థులతో కలిసి చేసిన జానపద గీతం ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకున్నాయి.తరువాత తెలుగు విశ్వవిద్యాలయం గ్రేడ్ , యూనివర్సిటీ కోర్సులలో ఉత్తీర్ణులైన సంగీత విద్యార్ధులకు VC నిత్యానందరావు అర్హతాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేషుకుమారి సంగీత ప్రస్థానాన్ని ప్రశంసించారు. సంగీతకళను భావితరాలకి అందించేలా ఆమెను నడిపిస్తున్నాయన్నారు. స్వరలయ విద్యార్ధులు భవిష్యత్తులో కర్నాటక సంగీతరంగంలో తమవైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.హార్మనీ & హ్యూస్ అధ్యక్షురాలు శ్యామల ప్రసంగిస్తూ 2025లో తిరుపతిలో అన్నమాచార్య 500వ జయంతి ఉత్సవాలలో చేసిన సంగీత కచేరీ, శేషుకుమారి వంశీ-సీల్వెల్ ఫౌండేషన్ వారి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డ్ అందుకోవడం స్వరలయసంస్థ సాధించిన కొత్త మైలురాళ్ళని కొనియాడారు.అలాగే కుమారి మనోజ్ఞ అనే గాత్రసంగీత విద్యార్ధి మాట్లాడుతూ కర్నాటక గాత్ర సంగీతాన్ని ఒక O-level ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలు వ్రాసేందుకు MOE (సింగపూర్ విద్యాశాఖ) తాను అనుమతి సాధించగలగటం విశేషం అనీ, ఇది తన గురువు ఇచ్చిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం వల్లనే సాధ్యమైందనీ, సంగీతం ఒక సబ్జెక్టుగా తీసుకోవడంతో ఇటు సంగీతంలో కృషి, అటు చదువుకునే సమయాన్ని సమర్ధవంతంగా వాడుకోవడం వీలవుతోందని చెప్పారు. ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా, గురు శేషుకుమారి తాళం మరియు రాగం నేర్పించేందుకు వినూత్నమైన సంగీత ఆటలను ప్రవేశపెట్టారు. ఇవి ప్రత్యక్షంగా వేదికపై నిర్వహించబడి, సంగీత శిక్షణలో ఒక కొత్త పోకడను పరిచయం చేశాయి.యూ.టీ.ఐ.ఏ.ఈ.సీ చైర్మన్ రాయ్, ట్రెజరర్ v. Adesh బాబు , కళ , శివ కృష్ణ ఆలయ చైర్మన్ ,మేనేజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీసాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కాకతీయ సాంస్కృతిక పరివారం నుంచి సబ్బుపాలకుర్తి , సింగపూర్ తెలుగు వనితలు సమూహం నుంచి క్రాంతి, జయ, దీపు , రేఖ , రాణి, గాయత్రి వంటి అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. పిల్లల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించి, వేడుకను విజయవంతంగా ముగించాయి. సౌజన్య చక్కటి వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు
ఘనంగా తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026
తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు నాలుగు వారాంతాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో, సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .“సైట్లో కష్టం… గ్రౌండ్లో శక్తి” అనే నినాదంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్, సింగపూర్ తెలుగు సమాజ ఐక్యత, శక్తి కృషికి ప్రతీకగా నిలిచింది.మొత్తం 18 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో, లీలా నాగేశ్ నాయకత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు విజేతగా నిలవగా, సాహు చంద్రశేఖర్ నాయకత్వంలోని మెగాయార్డ్ రైడర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగగా, 250కి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు వరుసగా SGD1,116 మరియు SGD558 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.వ్యక్తిగత విభాగంలో బండి శ్రీనివాస్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోగా, శ్యామ్ ఉత్తమ ఆల్రౌండర్గా, ఆంథోనీ ఉత్తమ బౌలర్గా, విజ్జు ఉత్తమ బ్యాట్స్మన్గా ఎంపికయ్యారు. మెగాయార్డ్ రైడర్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారిక ప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే రాంబాబు పాతూరి (కాకతీయ కల్చరల్ అసోసియేషన్), రత్న కుమార్ కవుటూరు (శ్రీ సాంస్కృతిక కళాసారథి), సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్ష్యులు రంగా రవి, చౌదరి జె తదితరులతో పాటు శేషారావు గూడూరి, వినయ్ కుమార్ సూర్యదేవర, సురేంద్ర చెబ్రోలు, చంద్రశేఖర్ చిలుకూరి, హనుమంతరావు మాదాల, అమ్మయ్య చౌదరి, గంగాధర్ తాటి, సతీష్ పారేపల్లి, వేణు నార్నే తదితర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను మరియు క్రీడాకారులను అభినందించారు.శివ ప్రసాద్ కొల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి వర ప్రసాద్, గిరిధర్ సరాయి, అనిల్ కుమార్ బొమ్మారెడ్డి తదితరులతో పాటు కోఆర్డినేటర్లు, లాజిస్టిక్స్ టీమ్, అంపైర్లు, స్కోరర్లు, వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సురేంద్ర చేబ్రోలు, ఉమా మహేశ్వర రావు, గురురాజ్ బనకర్, శ్రీను యాదవ్, గొర్రెపాటి లక్ష్మీ రెడ్డి అంపైర్లుగా వ్యవహరించగా, రమేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చారు.టీం శివప్రసాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది టీంను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల విభాగం ప్రవేశపెట్టడం, మెరుగైన లైవ్ స్ట్రీమింగ్, మరిన్ని సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
షాకింగ్ : పక్కా ప్లాన్తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్రే టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
క్రైమ్
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలోని మహాదేవపుర నియోజకవర్గం హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాజేష్ ఆరాధ్య భార్య లక్ష్మీప్రియ (26) శుక్రవారం కృష్ణరాజపురలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. రాజేష్ ఆరాధ్య–లక్ష్మీప్రియల వివాహం 2023లో జరిగింది. రాజేష్ ఆరాధ్య, అతని తండ్రి పాలక్ష రాధ్య, తల్లి భాగ్యమ్మ తమ కుమార్తెను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని లక్ష్మీప్రియ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం లక్ష్మీ ప్రియ వాట్సాప్ ద్వారా తన సోదరి జయశ్రీకి ఫోన్ చేయగా ఆమె కాల్ స్వీకరించలేదు. ఆ తర్వాత రాజేష్ ఆరాధ్య ఆమెకు ఫోన్ చేసి లక్ష్మీ ప్రియ మరణించినట్లు తెలియజేశాడు. లక్ష్మీప్రియ కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాతో ఉంటావా.. చస్తావా?
వికారాబాద్: ‘నాతో ఉంటావా.. లేదా చస్తావా’ అని ఓ వ్యక్తి మహిళ గొంతు కోశాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల మండలం తిమ్మాయిపల్లికి చెందిన వివాహిత రేణుకకు.. తాండూరు పట్టణానికి చెందిన వడ్డె రాజుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరగగా.. ఆమె సదరు వ్యక్తికి దూరంగా ఉంటోంది. తాజాగా ఆదివారం ఎదురు పడిన వివాహితను ఆపి, తనతోనే ఉండాలంటూ బెదిరింపులకు దిగగా.. ఆమె ఎదురుతిరిగింది. దీంతో రాజు బ్లేడుతో రేణుక గొంతు కోశాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందుతున్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు రాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
పోలీసులపైకే దూసుకొచ్చాడు..
హైదరాబాద్: వీకెండ్లో ఐటీ కారిడార్ కార్ రేస్, బైక్ స్టంట్లకు వేదికవుతోంది. రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో కారు రేస్ రేసింగ్ పాల్పడటం పరిపాటిగా మారింది. శనివారం రాత్రి కార్ రేసింగ్ చేస్తున్నారనే విషయం పోలీసులకు తెలిసింది. దీంతో వారు ఘటన స్థలానికి వెళ్లారు. తమపైకే కారు దూసుకురావడంతో వారు కంగుతిన్నారు. రేసింగ్కు పాల్పడిన డిగ్రీ విద్యార్థిని అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న చెప్పిన వివరాల ప్రకారం.. టీ హబ్, హై హోంభూజ, ఐకియా రోడ్లలో కారు రేసింగ్ చేస్తున్నారని సమాచారం అందడంతో శనివారం రాత్రి 12.30 గంటలకు బ్లూకోల్ట్ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఎం.రమేష్ హెడ్కానిస్టేబుల్ అక్కడికి వెళ్లారు. నాలెడ్జి సిటీలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి నిలోఫర్ కేఫ్ వైపు హోండా సిటీ కారు భారీ శబ్దాలు చేస్తూ రోడ్డుపై మితిమీరిన వేగంతో చక్కర్లు కొడుతోంది. బ్లూకోల్ట్ సిబ్బంది కారును ఆపేందుకు ప్రయత్నించగా అందులోని వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కారు సైడ్ మిర్రర్ తాకడంతో కానిస్టేబుల్ రమేష్ కుడిచేతికి గాయాలయ్యాయి. ఫిరోజ్గాం«దీనగర్కు చెందిన మహ్మద్ రెహా్మన్ (18) మెహిదీపట్నంలోని ఓ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి కారు రేసింగ్కు వచ్చాడు. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన రెహా్మన్ను పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. కారులోంచి పారిపోయిన ఒయాసిస్, అయాన్, వాసిమ్లపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కారు, బైక్ రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
రూ. 16 వేలు, 10 చీరల కోసం కన్నకూతుర్నే అమ్మేసింది!
ఉత్తర ప్రదేశ్లోని పవిత్ర పుణ్య క్షేత్ర వారణాసిలో దారుణం చోటు చేసుకుంది. కేవలం చీరలు, డబ్బుల కోసం 12 కన్నకూతుర్ని విక్రయించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఆ బిడ్డ భయంకరమైన వేధింపులు, అత్యాచారాలకు గురైన ఘటన కలకలం రేపింది.టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) కథనం ప్రకారం 12 ఏళ్ల బాలికను స్వయనా ఆమె తల్లే ఉత్తరప్రదేశ్లోని చందౌలి జిల్లాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి అమ్మేసింది. అదీ రూ.16,000 , 10 చీరలకు విక్రయించింది. ఆ తరువాత ఆమెకు ఘోరమైన నరకం అంటే ఏంటో చూపించారు. పదేపదే అత్యాచారం చేసి, వారణాసిలో వదిలేశారు.అసలేం జరిగిందంటే నిందితుడు 40 ఏళ్ల లహ్రూ యాదవ్ (అలియాస్ రాకేష్) ఈ ఏడాది జనవరిలో బాలిక తల్లి నుంచి ఆమెను కొనుగోలు చేశాడు. చందౌలీలోని ఒక గుడిలో నకిలీ వివాహం చేసుకున్నాడు. తానేదో చిన్న వయస్కుడిగా కనిపించడం కోసం అతను ఢిల్లీలో దాదాపు రూ. 90,000 ఖర్చు చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయించుకున్నాడు.పెళ్లి పేరుతో బాలికను తన ఇంటికి తీసుకెళ్లిన యాదవ్, ఆమెపై అమానుషంగా నిరంతరం అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, పనిమనిషిగా మార్చి చిత్రహింసలు పెట్టాడు. మైనర్ బాలికను ఇంట్లో ఉంచుకుంటే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని స్థానికులు హెచ్చరించడంతో ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని చూశాడు. మే 19న బనారస్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆ బాలికను నిందితుడు వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడ రవి వర్మ అనే ఆటో డ్రైవర్, ఆ బాలికకు సహాయం చేసి తల్లి వద్దకు చేరుస్తానని నమ్మించి తీసుకెళ్లాడు. కానీ, అతను కూడా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత రెండు రోజులకే ఆమెను మళ్లీ రోడ్డుపై వదిలేశాడు.మే 21న వారణాసిలోని సార్నాథ్ ప్రాంతంలో బాలిక ఒంటరిగా ఏడుస్తూ తిరుగుతుండటం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ముందు బాలిక తన గోడును వెళ్లబోసుకుంది. బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు మే 22న భారతీయ న్యాయ సంహిత (BNS) అత్యాచార సెక్షన్లు, అలాగే పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.ఈ కేసులో బాలికను అమ్మేసిన సొంత తల్లిని, కొనుగోలు చేసిన లహ్రూ యాదవ్ను, మరియు ఆటో డ్రైవర్ రవి వర్మను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసుపై సమగ్ర విచారణ జరుగుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సార్నాథ్ ఏసీపీ విదూష్ సక్సేనా తెలిపారు.
వీడియోలు
కోహ్లి VS ట్రావిస్ హెడ్.. హెడ్ భార్యకు వేధింపులు..
వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేసిన భార్య
మెగా కాదు దగా డీఎస్సీ.. బాబు,లోకేష్ పై జగన్ ఫైర్
గుడ్డలతో గొంతులు కోసే.. తడి గుడ్డల పార్టీ !
పారాచూట్ ని ఢీ కొట్టిన విమానం.. ఇంతలోనే మహిళ ఏం చేసిందో చూడండి..!
కూటమిలో చీలికలు.. ఎమ్మెల్యే నానికి చెప్పు చూపించిన జనసేన నేత
పెట్రో మోత.. లీటర్ పెట్రోల్ రూ. 117
అబ్బబ్బబ్బా చంద్రబాబు వండిన చేపల పులుసు ఎంత రుచికరం..
త్రిష ఏ హీరోతో నటించినా.. సినిమా బ్లాక్ బస్టర్ !
ఛీ..ఛీ..! నడిరోడ్డుపై ప్రేమజంట రాసలీలలు


