వ్యవ‘సాయానికి’ ఉరి!
రైతులకు అన్నీ కష్టాలే.. ఐదేళ్లుగా నేను ఎకరా భూమిలో కౌలు సాగు చేస్తున్నాను. రెండేళ్లుగా పెట్టుబడి సాయం అందట్లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా సాయం అందింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలే మిగిలాయి. చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నాను. ఈ ఏడాదిలో ఈ విడతలోనైనా వస్తుందేమో అని ఆశతో ఎదురు చూశాను. కానీ నా ఆశ నిరాశగానే మారింది. నష్టాలే తప్ప లాభం లేదు. భవిష్యత్తులో కౌలుకు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. – పినిశెట్టి అచ్చెంనాయుడు, కేజేపురం, మాడుగుల మండలం, ఉమ్మడి విశాఖ జిల్లాసాక్షి, అమరావతి: అన్నదాతా సుఖీభవ.. అంటూ చంద్రబాబు ప్రభుత్వం రైతన్నలను నిలువునా మోసగిస్తోంది. ‘అధికారంలోకి రాగానే కేంద్రం ఇచ్చే దాంతో సంబంధం లేకుండా ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం’ అంటూ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీకి తూట్లు పొడుస్తోంది. తొలి ఏడాది నిస్సిగ్గుగా రూ.20 వేలు ఎగ్గొట్టింది. రెండో ఏడాది అరకొర సాయంతో చేతులు దులుపుకుంటోంది. భూ యజమానులకు రెండు విడతల్లో రూ.5 వేల చొప్పున రూ.10 వేలు అందించిన ప్రభుత్వం.. మూడో విడతగా శుక్రవారం మరో రూ.4 వేలు జమ చేయబోతున్నట్టు ప్రకటించింది. భూ యజమానులకు రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.26 వేలు ఎగ్గొట్టడమే కాకుండా, కౌలు రైతులకైతే పైసా సాయం చేయకుండా పూర్తిగా మొండి చేయి చూపిస్తూ ఏకంగా రూ.6,400 కోట్లు ఎగ్గొట్టింది. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులుండగా.. 2024–25లో 9.25 లక్షల మందికి, 2025–26లో 8.24 లక్షల మందికి మాత్రమే సీసీఆర్సీలు (కౌలు రైతు గుర్తింపు కార్డులు) జారీ చేశారు. ఈ లెక్కన చూసినా తొలి ఏడాది 9.25 లక్షల మందికి రూ.20 వేల చొప్పున రూ.1,850 కోట్లు, రెండో ఏడాది 8.24 లక్షల మందికి రూ.1,648 కోట్లు జమ చేయాల్సి ఉండగా, అది కూడా చేయలేదు. మొత్తంగా అన్నదాతలకు రూ.21,273.28 కోట్లు ఎగ్గొట్టింది. మరో వైపు ఐదేళ్ల పాటు పైసా భారం లేకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి.. సున్నా వడ్డీకి చాప చుట్టేసి.. ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం పెట్టింది. విత్తు నుంచి విఫణి వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయి పట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. మరో వైపు గత రెండేళ్లలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కకపోయినా ఆదుకున్న పాపాన పోలేదు. అయినా సరే నిస్సిగ్గుగా తామేదో రైతులను ఉద్దరిస్తున్నట్టు అన్నదాత సుఖీభవ వారోత్సవాల పేరిట సంబరాలు నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 7 లక్షల మందికి ఎగనామంసూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.40 వేల పెట్టుబడి సాయం అందించాలి. 2023–24లో అర్హత పొందిన 53,58,366 మందికి రూ.20 వేల చొప్పున ఏటా రూ.10,716.73 కోట్లు జమ చేయాలి. కానీ 2024–25 తొలి బడ్జెట్లో ఈ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. అదిగో ఇదిగో అంటూ తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టేసింది. పాత బకాయిలతో కలిపి 2025–26 బడ్జెట్లో రూ.21,433.46 కోట్లు కేటాయింపులు జరపాల్సి ఉండగా, కేవలం రూ.6,300 కోట్లతో సరిపెట్టింది. గతంలో వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందుగానే పెట్టుబడి సాయం అందించి వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తొలి ఏడాది ఎగ్గొట్టి, రెండో ఏడాది తనకు నచ్చినప్పుడు రూ.5 వేల చొప్పున 2 విడతల్లో రూ.10 వేలు జమ చేసింది. వాస్తవానికి 2023–24 అర్హుల జాబితా ప్రకారం 53.58 లక్షల మందికి జమ చేయాల్సి ఉండగా, పలు సాకులతో 46.85 లక్షల మందికి కుదించింది. అంటే దాదాపు 7 లక్షల మందికి కోత పెట్టింది. మరో వైపు భూ యజమానులతో పాటు తొలి ఏడాది కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. రెండో ఏడాది వాస్తవ సాగుదారులకు పంగనామాలు పెట్టింది. రైతు కూలీలు, కౌలు రైతులను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో కృష్ణాజిల్లా పామర్రు, ఉయ్యూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఇచ్చిన హామీ మూడో విడతలోనూ కోతలే⇒ నిజానికి ఏటా భూ యజమానులతో పాటు కౌలుదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2019–20లో 46.69 లక్షల మందికి లబ్ధి చేకూర్చగా, 2023–24కు వచ్చేసరికి లబ్ధిదారుల సంఖ్య 53.58 లక్షలకు పెరిగింది. ఇలా ఐదేళ్లలో ఈ పథకం కింద రూ.34,288.17 కోట్ల లబ్ధి చేకూరింది. ఆ లెక్కన గడిచిన రెండేళ్లలో లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గిపోయింది. ⇒ ఆరు దశల వడపోత అనంతరం లబ్ధిదారుల సంఖ్య 46.86 లక్షలకు కుదించారు. పైగా వీరిలో 1.16 లక్షల మంది అటవీ సాగుదారులున్నారు. ఆ లెక్కన వెబ్ల్యాండ్ డేటా ప్రకారం తొలి రెండు విడతల్లో లబ్ధి పొందిన భూ యజమానుల సంఖ్య కేవలం 45.70 లక్షల మంది మాత్రమే. ⇒ చనిపోయిన రైతుల స్థానంలో గతంలో వారి వారసులకు పెట్టుబడిసాయం అందించేవారు. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. తొలి విడతలో తామిస్తామన్న రూ.20 వేల చొప్పున రూ.10,716.73 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. రెండో ఏడాది 46.86 లక్షల మందికి రూ.ఐదు వేల చొప్పున రెండు విడతల్లో రూ.4,685.84 కోట్లు జమ చేసింది. కాగా పీఎం కిసాన్ కింద కేంద్రం జమ చేసే సొమ్ములను కూడా తమ ఖాతాలో వేసుకొని అసెంబ్లీ సాక్షిగా రూ.6,309.44 కోట్లు జమ చేశామని నిస్సిగ్గుగా ప్రకటించుకుంది.⇒ జగన్ హయాంలో అర్హత ఉండీ లబ్ధి పొందని వారు ఎవరైనా ఉంటే వెతికి వెతికి సాయం అందించేవారు. కానీ నేడు అన్నదాత సుఖీభవ తమకు జమ కాలేదంటూ వేలాది మంది గ్రీవెన్స్లో ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. శుక్రవారం నుంచి మూడో విడత పంపిణీ కార్యక్రమంలో రూ.4 వేల చొప్పున రూ.1,874.34 కోట్లు జమ చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాయంతో కలిపి 2025–26 సీజన్లో రూ.6,560.18 కోట్లు జమ చేసినట్టవుతుంది. వాస్తవానికి రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేల చొప్పున రూ.21,433.46 కోట్లు జమ చేయాల్సి ఉండగా, ఏకంగా రూ.14,873.28 కోట్లు నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది.సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి రైతుకూ ఏడాదికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామంటూ తెలుగుదేశం కరపత్రిక ఈనాడులో చంద్రబాబు ఇచ్చిన ప్రకటన , తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో వ్యవసాయరంగానికి ఇచ్చిన హామీలు కౌలు రైతులకు రూ.6,400 కోట్లు ఎగనామం⇒ భూ యజమానులతో పాటు సామాజిక వర్గాలకు అతీతంగా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులతో పాటు దేవదాయ, ధర్మాదాయ భూ సాగుదారులందరికీ ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ఊరూవాడ విస్తృతంగా ప్రచారం చేసింది. ఆచరణకు వచ్చేసరికి తొలి ఏడాది భూ యజమానులతో పాటు కౌలు రైతులకు ఎగ్గొట్టారు. ⇒ రెండో ఏడాది తొలివిడత సాయం పంపిణీ వేళ.. ఖరీఫ్–2025 సీజన్లో పంట నమోదు (ఈ క్రాప్) ప్రామాణికంగా కౌలు రైతుల డేటా ధ్రువీకరణ చేపట్టి, ఆ తర్వాత అర్హత పొందిన వారికి రెండు విడతలు కలిపి జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడత సాయం పంపిణీ సమయంలో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావచ్చిందని, త్వరలోనే జమ చేస్తామంటూ వారిని మభ్యపెట్టారు. ⇒ కనీసం చివరి విడతలోనైనా తమకు ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తుందేమోనని రాష్ట్రంలోని కౌలు రైతులందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశలను ఆడియాశలు చేస్తూ వారి నోట్లో మట్టికొట్టారు. దేవదాయ భూ సాగుదారులనూ మోసం చేశారు. సీసీఆర్సీలతో సంబంధం లేకుండా కౌలు సాగుదారులందరికీ పథకాన్ని వర్తింప చేయాలంటే రెండేళ్లలో రూ.6,400 కోట్లు జమ చేయాలి. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిండా ముంచారు. అటకెక్కిన ఉచిత పంటల బీమా⇒ గత ప్రభుత్వ హయాంలో సాగైన ప్రతీ పంటను ఈ క్రాప్లో నమోదు చేసేవారు. ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా ఉచిత పంటల బీమా పరిహారంతో పాటు వైపరీత్యాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేవారు. కానీ నేడు ఈ క్రాప్ నిర్వీర్యమైపోయింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. స్వచ్ఛంద నమోదు బీమా అంటూ రైతుల నోట్లో మట్టికొట్టారు. ⇒ 2023–24 వ్యవసాయ సీజన్కు సంబంధించి రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటా ప్రీమియం మొత్తం రూ.930 కోట్లు జూన్ 2024లో జమ చేయాల్సి ఉండగా, అదే సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఫలితంగా 2023–24 సీజన్కు సంబంధించి రూ.1,324 కోట్ల బీమా పరిహారం రైతులకు అందకుండా మోకాలొడ్డింది. ⇒ ఖరీఫ్ 2024 సీజన్లో రైతుల వాటాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.834.44 కోట్లతో పాటు రబీ 2024–25, ఖరీఫ్–2025 సీజన్లలో ప్రభుత్వం తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.260.67 కోట్లు ఎగ్గొట్టడంతో రబీ 2025–26 సీజన్లో ఏపీని కంపెనీలు బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. ఇలా గడిచిన మూడు సీజన్లలో రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం రైతులకు అందకుండా దగా చేసింది.⇒ దాదాపు 12 లక్షల మంది రైతులకు రెండేళ్లలో రూ.500 కోట్ల సున్నా వడ్డీ రాయితీని ఎగ్గొట్టారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న దాదాపు ఆరున్నర లక్షల మందికి రూ.1,000 కోట్లకు పైగా పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.రెండేళ్లలో రూ.500 కోట్ల సున్నా వడ్డీ రాయితీకి ఎగనామంఏ ఒక్క పంటకూ దక్కని మద్దతు ధర⇒ మద్దతు ధర దక్కని సమయంలో మార్కెట్లో జోక్యం చేసుకొని రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్దేశించిన ధరల స్థిరీకరణ నిధిని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. ధాన్యం మొదలు పత్తి, మిరప, పొగాకు, టమాటా, ఉల్లి, మినుము, పెసలు, కంది, శనగ, జొన్న, మొక్కజొన్న, సజ్జ ఇలా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కకపోయినా ఆదుకోలేదు.ధరల స్థిరీకరణ నిధికి మంగళం⇒ వైఎస్ జగన్ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. తద్వారా ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకుని, వ్యాపారుల మధ్య పోటీ పెంచి రైతులకు మద్దతు ధర కల్పించే వారు. ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,577 కోట్ల మేర పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు.అప్పుల ఊబిలో రైతులు⇒ చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో 21 నెలల్లో రూ.35 వేల కోట్లకుపైగా రైతులు నష్టపోయారు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2024–25లో దాదాపు 150 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడగా, 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర పోలీస్ శాఖే అధికారికంగా వెల్లడించింది. రైతులను చేయి పట్టుకుని నడిపించిన ఆర్బీకేలు నిర్వీర్యంఇది నమ్మించి మోసం చేయడమే నాలుగు ఎకరాల ఆలయ మాన్యం భూమిని కౌలుకు సాగు చేస్తున్నాను. డ్రిప్ సహాయంతో వేరుశనగ, టమాటా పంట వేశాను. పంట దిగుబడి రాక, పెట్టుబడులు తలకు మించిన భారమై రెండేళ్లుగా రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్క పైసా కూడా సహాయం అందించలేదు. మొదటి ఏడాది ఆశలు వదులుకున్నాం.ఈ ఏడాది అయినా నగదు జమ చేస్తుందని ఆశించిన మాకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. కౌలు రైతులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయారు. ఇది నమ్మించి మోసం చేయడమే. – కురుబ రాము, కోనాపురం, ఉరవకొండ మండలం, అనంతపురం జిల్లా కౌలు రైతులను గుర్తించాలి కూటమి ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల ఊసే లేకుండా పోయింది. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవకు ఎగనామం పెట్టారు. రెండో ఏడాది గడుస్తున్నా కౌలు రైతు గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. ప్రస్తుతం రబీ సీజన్లో సైతం 1.5 ఎకరాల్లో మినుము పంట సాగు చేశా. ఎకరాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. అధిక వర్షాలతో పంట సరిగా చేతికందక అప్పులపాలయ్యా. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కౌలు రైతులను గుర్తించి అన్నదాత సుఖీభవ మంజూరు చేయాలి. – సుబ్బరాయుడు, మీరాపురం, కమలాపురం మండలం, వైఎస్సార్ కడప జిల్లాకౌలు రైతులకు మొండిచేయి ప్రతి ఏడాది మూడెకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. ప్రస్తుత ప్రభుత్వంలో కౌలు రైతుల్లో కొందరికే గుర్తింపు కార్డులు ఇచ్చారు. చాలా మందికి ఇవ్వలేదు. గుర్తింపు కార్డులు ఇచ్చిన వారికి కూడా పెట్టుబడి సాయం కింద అందజేసే అన్నదాత సుఖీభవ వర్తింప చేయక పోవడం అన్యాయం. నాలాంటి కౌలు రైతులకు ఒక్క సంక్షేమ పథకం కూడా అందడం లేదు. గత ప్రభుత్వంలో కౌలు రైతులకు సైతం రైతు భరోసా ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. – పట్టాభయ్య, యానాదివెట్టు, వరదయ్యపాళెం మండలం, తిరుపతి జిల్లా ధరలేక తెగనమ్ముకున్నా నాకు రెండు ఎకరాల సొంత భూమి ఉంది. ఏటా రెండు కార్లు వరి పండిస్తున్నాను. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ధాన్యానికి గిట్టుబాటు ధర లభించేది. అప్పట్లో పుట్టి (850 కేజీలు) రూ.22 వేలకు అమ్ముకున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024, 2025లో వేసిన ఎడగారుకు గిట్టుబాటు ధర లభించక పుట్టి రూ.14 వేలు చొప్పున తెగనమ్ముకున్నాను. పుట్టికి రూ.8 వేలు చొప్పున 5 పుట్లకు ఏటా రూ.40 వేలు నష్టపోయాను. రెండేళ్లల్లో నాలుగు పంటలకు రూ.1.60 లక్షలు నష్టపోయాను. రైతులకు గిట్టుబాటు ధర కలి్పంచలేని ఈ ప్రభుత్వాలు ఎందుకు? మేనిఫెస్టోలో ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారు?– గుడిపాటి ప్రభాకర్నాయుడు, యనమదల, చేజర్ల మండలం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మద్దతు ధర అడియాశే చంద్రబాబు కూటమి పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చాక దళారులు, మిల్లర్లు దోచేశారు. గత ఖరీఫ్ సీజన్లో మూడెకరాల్లో వరి సాగు చేశాను. వరిలో తేమ శాతం సాకుగా చూపి 75 కిలోలు బస్తాకు రూ.300పైగా దోచేశారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వం, అధికారుల్లో చలనం లేదు. రైతు పక్షాన నిలబడలేదు. పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా దళారులు, మిల్లర్లు మిలాకత్ అయ్యి రైతులను అడ్డంగా దోచుకున్నారు. ఆఖరికి రవాణా వాహనాలు కూడా మేమే చూసుకోవాల్సి వచ్చింది. పేరుకేమో రైతు సంక్షేమ ప్రభుత్వం. వాస్తవంలో మాత్రం రైతు గోడు పట్టించుకోవటం లేదు. – కొండవీటి వెంకట సుబ్బారావు, మంతెన, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా చాలా అన్యాయం నేను నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాను. కానీ నాకు అన్నదాత సుఖీభవ పథకం రాలేదు. ఇదేమని ప్రశ్నిస్తుంటే అధికారులు సమాధానం చెప్పడం లేదు. కౌలు రైతులకు సైతం అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ ఇప్పుడు మాకు వర్తించలేదు. వైఎస్సార్సీపీ హయాంలో రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు ఆగిపోయింది. అసలు కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తారా.. ఇవ్వరా తేల్చి చెప్పండి. – అమర లింగడు, కాగువాడ గ్రామం, పాతపట్నం మండలం, శ్రీకాకుళం జిల్లా వడ్డీకి అప్పుతెచ్చి పంటల సాగు నేను రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి, అపరాల పంటలు సాగు చేస్తున్నాం. జగన్ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి సాయం అందలేదు. అన్నదాత సుఖీభవ పథకం సాయం కోసం సచివాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. – దివిలి శ్రీను, తోడుగెడ్డ, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా రెండేళ్లుగా ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గరగా రెండేళ్లవుతోంది. ఇప్పటి వరకు రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ సమయానికి అందేది. – అనుసూరి గోవిందు, ఉండూరు, రామచంద్రపురం మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మొత్తంగా రూ.40 వేలు జమ చేయాలిపీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయం కౌలు రైతులకు తొలి ఏడాది ఎలాగూ ఎగ్గొట్టారు. రెండో ఏడాది అయినా ఇస్తారనుకుంటే దగా చేశారు. కనీసం మూడో విడతతో కలిపి అయినా ఇస్తారనుకుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. గతేడాది ఎగ్గొట్టిన బకాయిలతో పాటు మొత్తంగా రూ.40 వేలు జమ చేయాలి. – వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీ కౌలు రైతుల సంఘంఇతని పేరు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కలవకూరు గ్రామం. ఇతనికి నాలుగు ఎకరాల పొలం ఉంది. కొంత వరి పంట, మరి కొంత మొక్కజొన్న సాగు చేస్తుంటాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వేసిన పంట నష్టపోయి దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. ఎకరాకు 25 బస్తాలు వరి ధాన్యం దిగుబడి వచ్చింది. కొనుగోలు చేసిన నాథుడే లేదు. కూటమి ప్రభుత్వం క్వింటా రూ.1,800కు కొనుగోలు చేస్తుందని చెప్పిందే కానీ ఆ ధరతో కొనలేదు. దీంతో చివరకు రూ.1300కే దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. మొక్కజొన్న దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. మద్దతు ధర క్వింటా రూ.2,300తో ప్రభుత్వం కొనలేదు. దళారులకు రూ.1600కే అమ్ముకున్నాడు. దాంతో అప్పుల పాలయ్యాడు. వర్షాలకు పంట దెబ్బతిన్నా నష్ట పరిహారం ఇంత వరకు అందలేదు. ఇతని పేరు శేఖర్రెడ్డి. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పి.లింగాపురం గ్రామం. 2025ృ26 ఖరీఫ్ సీజన్లో ఎనిమిది ఎకరాల్లో మొక్కజొన్న, నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ప్రస్తుతం రబీ సీజన్కు ఎనిమిది ఎకరాల్లో మొక్కజొన్న, 13ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశాడు. ఖరీఫ్లో నాలుగు ఎకరాల్లో సాగుచేసిన పత్తిపంటకు రూ.6 వేల ప్రీమియం చెల్లించి పంటల బీమా చేయించాడు. 2025 ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసిన అధిక వర్షాలతో పత్తిపంట దెబ్బతిని దిగుబడి ఎకరాకు మూడు క్వింటాళ్లే వచ్చింది. పత్తిపంట దెబ్బతిన్న విషయాన్ని రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సిబ్బందికి తెలపటంతో పంట ఫొటోలు తీసుకొని వెళ్లి ప్రభుత్వానికి పంపించారు. ఇప్పటిదాకా ఒక్కరూపాయి కూడా బీమా డబ్బులు మంజూరు చేయలేదు. జగన్ పాలనలో పైసా ప్రీమియం చెల్లించకపోయినా రూ.50 వేల వరకు పంటనష్ట పరిహారం మంజూరైంది.ఇతని పేరు తామరపల్లి ముసలయ్య. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జునుడుపాలెం శివారు పెద్దిరెడ్డిపాలెం స్వగ్రామం. 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తున్నాడు. ఏటా పంట సాగు ఖర్చు రూ.లక్ష వరకు అవుతోంది. గత ప్రభుత్వంలో ఏటా పెట్టుబడి సాయం అందేది. ఈ ప్రభుత్వం వచ్చాక మరింతగా పెట్టుబడి సాయం అందుతుందని ఎదురు చూశాడు. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అయినా ఇస్తారనుకుంటే రూపాయి కూడా ఇవ్వలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు మూడో విడతలో అయినా సాయం అందుతుందని ఎంతగానో ఆశలు పెట్టుకున్నా, నిరాశే ఎదురైందని నిట్టూరుస్తున్నాడు. ఇలాంటప్పుడు కౌలు రైతుగా గుర్తింపు కార్డు ఇచ్చినా ఏం ఉపయోగం? అని ప్రశ్నిస్తున్నాడు.
ఇల్లు కొంటే ఖరీదైన బైక్.. తులం బంగారం
షాపుల్లో మెగా సేల్స్.. బంపర్ ఆఫర్లు చూస్తుంటాం.. ఈ కామర్స్ సంస్థల ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్లు చూస్తుంటాం.. మైక్ పట్టుకొని ‘రండి బాబూ రండి.. ఇలాంటి సువర్ణావకాశం మళ్లీ రాదు..’ అంటోంది స్థిరాస్తి రంగం. అందుబాటు ధరలు ఉండే హైదరాబాద్లో ఒకప్పుడు ప్రాపర్టీలు హాట్ కేక్లు. నిర్మాణం పూర్తి కాకముందే బ్రోచర్ల మీదే ఫ్లాట్ల అమ్మకాలు పూర్తయ్యేవి. ధరలు, నాణ్యత, బిల్డర్ల ట్రాక్ రికార్డ్లు, మార్కెట్ సెంటిమెంట్ అలా ఉండేది. 360 డిగ్రీల కోణంలో గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించేలా, ఆకర్షించేలా ఉండేది. కానీ, కొన్నేళ్లుగా మార్కెట్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. – సాక్షి, సిటీబ్యూరోమారిన పరిస్థితులతో పాటు కొన్ని ప్రతికూలతలతో స్థిరాస్తి రంగంలో సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతింది. దీంతో విక్రయాలు లేక నిర్మాణ రంగం క్షీణించే దశకు చేరుకుంది. ఈ రంగంపైనే ఆధారపడిన నిర్మాణ సంస్థలు, బిల్డర్లు కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్ల వల వేయక తప్పడం లేదు. ఇళ్ల అమ్మకాలను పెంచుకునేందుకు విలువైన బైక్, ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈవీ), తులం బంగారం, ఉచిత ఇంటీరియర్.. ఇలా రకరకాల ఆఫర్లతో ముందుకొస్తున్నారు.నిర్మాణ సంస్థలెన్నో.. స్థిరాస్తి రంగంలో ఆఫర్ల వల కొత్తేమీ కాదు. గతంలో ఉచిత ఇంటీరియర్, క్లబ్హౌస్ సభ్యత్వం, మాడ్యులర్ కిచెన్ వంటి పరిమిత స్థాయిలో ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్లో గృహ విక్రయాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో నగరంలోని చిన్నా, పెద్దా డెవలపర్లు, నిర్మాణ సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రీమియం మోటార్ సైకిళ్లు, 24 క్యారెట్ల బంగారం నాణేలు, ఈవీ వాహనాలు, ఉచిత ఇంటీరియర్ వంటి ఖరీదైన బహుమతులను అందజేస్తున్నాయి. ఉదాహరణకు నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కోకాపేట, కూకట్పల్లి, ఉప్పల్, పటాన్చెరు, రాజేంద్రనగర్లలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లలో అపార్ట్మెంట్ బుకింగ్తో ప్రతి కొనుగోలుదారుడికి రూ.3 లక్షల విలువైన హార్లీ డేవిడ్సన్ బైక్ను ఉచితంగా అందజేస్తామని ప్రచారం చేస్తోంది. మరో డెవలపర్ ఉప్పల్, రామాంతాపూర్లలో రాబోయే ప్రాజెక్ట్లో ప్రతి కస్టమర్కు రూ.8 లక్షల విలువైన ఈ–వాహనాన్ని అందిస్తామని ప్రచారం చేస్తున్నారు.ఆఫర్లతో విక్రయాలు స్పల్పకాలమే.. వేగంగా విక్రయాలు జరుపుకునేందుకు ఇలాంటి ఆఫర్లతో ప్రయత్నాలు చేస్తుంటారని డెవలపర్ల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రతికూల మార్కెట్లో అమ్ముడుపోని ఇన్వెంటరీని విక్రయించేందుకు ఇలాంటి ప్రత్యేక డీల్స్ను ప్రవేశపెడుతుంటారు. అయితే ఈ ఉచితాల ధర ప్రాజెక్ట్ ధరలో భాగం అవుతుందని, ఈ తరహా మార్కెట్ స్వల్పకాలంలో అమ్మకాలను పెంచినా.. స్థిరమైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే ఉచితాలు కాకుండా ధర, నిర్మాణ నాణ్యత, ప్రాంతాన్ని చూసి ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.బంగారంతో ఆకర్షణ.. పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆఫర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఫ్లాట్ బుకింగ్ చేసుకునే కస్టమర్లకు రిటర్న్ గిఫ్ట్ అందజేసే సంప్రదాయంగా పెరుగుతోంది. మియాపూర్కు చెందిన ఓ డెవలపర్ రూ.75–85 లక్షల మధ్య ధర కలిగిన రెండు, మూడు పడక గదుల ఇంటి కొనుగోలుపై కస్టమర్కు రూ.3 లక్షల విలువైన బంగారం ఇస్తామని ప్రకటించారు. అంటే దగ్గరిదగ్గర 10–14 గ్రాముల బంగారం ఇస్తున్నారు. అలాగే పిల్లల బెడ్ రూమ్కు ఇంటీరియర్, మాడ్యులర్ కిచెన్తో పాటు అందజేస్తామని ప్రచారం చేస్తున్నారు.రెరా పరిధిలోకి రావు.. ఆఫర్లు, ప్రోత్సాహకాలు కస్టమర్లను ఆకర్షించేందుకు డెవలపర్లు పన్నే వాణిజ్య వ్యూహాలు. అయితే ఈ ఉచిత ఆఫర్ల ప్రకటనలు తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(టీజీ రెరా) నియంత్రణ పరిధిలోకి రావు. ఇవి గృహ కొనుగోలుదారులకు రక్షణ కల్పించలేవు. అయితే సేల్డీడ్లో పేర్కొన్న విధంగా హామీలను అమలు చేయడంలో డెవలపర్ విఫలమైతే ఈ ఉచితాలు, బహుమతులతో సహా కొనుగోలుదారులు టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. ఆయా డెవలపర్లపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటారు.
‘ఉరి అలా కాదు, ఇలా వేసుకోవాలి‘
వైఎస్ఆర్ కడప జిల్లా: ఓ పైశాచిక భర్త కట్టుకున్న భార్యను చిత్రవధకు గురిచేశాడు. మానసికంగా వేధించి.. ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఆమె బలవన్మరణానికి పాల్పడబోతే నివారించాల్సింది పోయి సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిస్తూ ఉరి ఇలా వేసుకోవాలంటూ మానసికంగా మరింత కుంగదీశాడు. ఉరి బిగుసుకుని బాధితురాలు దుర్మరణం పాలైంది. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలంలోని బోయనపల్లెలో జరిగిన ఈ అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ నందలూరు రైల్వే కేంద్రంలో లోకోపైలట్గా పనిచేస్తున్నారు. ఆయన రెండో భార్య కృష్ణవేణి తన నివాసంలో గురువారం ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. అయితే, భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సిన భర్త, ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించడం అతనిలోని క్రూరత్వాన్ని బయటపెట్టింది. శ్రీరామ్ శ్రీనివాస్, కృష్ణవేణి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం కూడా ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఆత్మహత్య చేసుకుంటానని ఉరితాడు సిద్ధం చేసుకుంది. భర్త ఆమెను ఆపడానికి బదులు.. ‘ఉరి అలా కాదు, ఇలా వేసుకోవాలి‘ అంటూ సూచనలు చేస్తూ ఆ ఘటనను తన మొబైల్లో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలోని సెల్ఫోన్ ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడిని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహోదగ్రులైన కృష్ణవేణి బంధువులు నిందితుడిపై దాడికి యతి్నంచారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. గతంలో శ్రీనివాస్ తొలి భార్య కూడా తిరుపతిలో రైలు కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. కృష్ణవేణి మృతిపై మన్నూరు సీఐ లింగప్ప మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిన సమయంలో కృష్ణవేణి తలుపు వేసుకుని ఆత్మహత్యకు యతి్నంచిందని, దానిని భర్త కిటికీలో నుంచి వీడియో తీసినట్లు అందులోని మాటలను బట్టి అర్థమవుతోందని చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.
‘ఘోస్ట్ టౌన్’గా మారిన దుబాయ్!
దుబాయ్ అంటే సాధారణంగా మెగా భవనాలు, విలాసవంతమైన రిసార్ట్లు, మిచెలిన్-స్టార్ రెస్టారెంట్లతో ఆకర్షణీయమైన పర్యాటక నగరంగా ప్రపంచానికి తెలుసు. అయితే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులతో దుబాయ్ పరిస్థితి మారిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడులు ప్రారంభించిన తర్వాత భద్రతా ఆందోళనలు పెరగడంతో దుబాయ్ నగరం క్రమంగా వెలవెలబోతూ ‘ఘోస్ట్ టౌన్’ను తలపిస్తోంది.ఇరాన్ క్షిపణి దాడుల ప్రభావం గల్ఫ్ ప్రాంతంపై తీవ్రంగా పడింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్లోని పలు బీచ్ బార్లు, స్విమ్మింగ్ పూల్స్, పర్యాటక ప్రదేశాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. గూచీ వంటి హై-ఎండ్ దుకాణాలు కూడా తాత్కాలికంగా మూతపడ్డాయి. అలాగే దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్, గ్లోబల్ విలేజ్ థీమ్ పార్క్, ఐన్ దుబాయ్ అబ్జర్వేషన్ వీల్ వంటి ప్రముఖ పర్యాటక ఆకర్షణలను కూడా తాత్కాలికంగా మూసివేశారు.సాధారణంగా వీకెండ్ సమయంలో ట్రాఫిక్తో కిక్కిరిసే నగరం ఇప్పుడు అసాధారణంగా ప్రశాంతంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అనేక హోటళ్లలో అతిథులు తగ్గిపోవడంతో యజమానులు తమ సిబ్బందికి సెలవులు ఇచ్చి పంపుతున్నారు. పర్యాటకులు లేకపోవడంతో హోటళ్లు తక్కువ ధరలకు గదులు అందిస్తున్నాయి.ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చాలా మంది స్థానికులు, పర్యాటకులు దుబాయ్ను విడిచివెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యం నుంచి బయలుదేరే విమానాల్లో దాదాపు సగం విమానాలు రద్దు అయినట్లు ట్రావెల్ అనలిటిక్స్ సంస్థ తెలిపింది. ముఖ్యంగా దుబాయ్లో నివసిస్తున్న విదేశీయులు, వలస కార్మికులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచిన దుబాయ్ గత సంవత్సరం 19.59 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించింది. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల వల్ల నగర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధికారులు మాత్రం తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలు ధ్రువీకరించని సమాచారాన్ని పంచుకోరాదని హెచ్చరిస్తున్నారు.
అద్దె గృహాలకు ఫుల్ డిమాండ్.. ఎక్కడంటే?
అనసూయపై అసభ్యకర పోస్ట్..నిందితుడి అరెస్టు
అంతులేని ప్రేమతో.. మహిళ లోదుస్తులు చోరీ!
అల్లు సినిమాస్ ఏర్పాటుకు కారణాలివే!: అల్లు అరవింద్
ఇరాన్తో యుద్ధం.. అమెరికా మరో వ్యూహం!
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్ !
ఇది కాదు.. గంభీర్కు ముందుంది అసలైన సవాల్: గంగూలీ
TG: పదవ తరగతి పరీక్షలు ప్రారంభం
ధురంధర్ 2 ఛాన్స్ వస్తే వదిలేసుకున్నా: నటుడు
పైసా తీసుకోని మ్యూజిక్ డైరెక్టర్.. మెచ్చుకున్న హీరో
ఇంటి పేరు మార్చుకున్న విజయ్ వారసుడు
సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
దొరికినవి.. దేవతల నగలు
నాలుగు పెళ్లిళ్లు.. మీ కన్నా హిందువులే నయం: ముంతాజ్
42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు
పాక్ వివాదాస్పద బౌలర్కు జాక్పాట్
దేశంలో గ్యాస్ సంక్షోభం
శాంసన్ కాదు.. అతడే అందుకు అర్హుడు: డివిలియర్స్
ఏ పని చేయకుండా నిత్యం అవే ఆలోచిస్తున్నారు!
రాజేంద్ర ప్రసాద్ గారు.. సారీ చెప్పండి : విశాల్ ట్వీట్
సిలిండర్ డెలివరీపై కఠిన నియమం
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
షాహీన్ అఫ్రిది సంచలన నిర్ణయం
T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్
మొట్టమొదటి మెసేజ్.. మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
'ఆ రోజు మా వాళ్లు వణికిపోయారు.. అందుకే గెలిచే మ్యాచ్లో ఓడాం'
AUS Vs SA: అసాధ్యం సుసాధ్యమైన రోజు!
ఓటీటీని షేక్ చేసేలా విజయ్ సేతుపతి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
అద్దె గృహాలకు ఫుల్ డిమాండ్.. ఎక్కడంటే?
అనసూయపై అసభ్యకర పోస్ట్..నిందితుడి అరెస్టు
అంతులేని ప్రేమతో.. మహిళ లోదుస్తులు చోరీ!
అల్లు సినిమాస్ ఏర్పాటుకు కారణాలివే!: అల్లు అరవింద్
ఇరాన్తో యుద్ధం.. అమెరికా మరో వ్యూహం!
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్ !
ఇది కాదు.. గంభీర్కు ముందుంది అసలైన సవాల్: గంగూలీ
TG: పదవ తరగతి పరీక్షలు ప్రారంభం
ధురంధర్ 2 ఛాన్స్ వస్తే వదిలేసుకున్నా: నటుడు
పైసా తీసుకోని మ్యూజిక్ డైరెక్టర్.. మెచ్చుకున్న హీరో
ఇంటి పేరు మార్చుకున్న విజయ్ వారసుడు
సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
దొరికినవి.. దేవతల నగలు
నాలుగు పెళ్లిళ్లు.. మీ కన్నా హిందువులే నయం: ముంతాజ్
42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు
పాక్ వివాదాస్పద బౌలర్కు జాక్పాట్
దేశంలో గ్యాస్ సంక్షోభం
శాంసన్ కాదు.. అతడే అందుకు అర్హుడు: డివిలియర్స్
ఏ పని చేయకుండా నిత్యం అవే ఆలోచిస్తున్నారు!
రాజేంద్ర ప్రసాద్ గారు.. సారీ చెప్పండి : విశాల్ ట్వీట్
సిలిండర్ డెలివరీపై కఠిన నియమం
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
షాహీన్ అఫ్రిది సంచలన నిర్ణయం
T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్
మొట్టమొదటి మెసేజ్.. మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
'ఆ రోజు మా వాళ్లు వణికిపోయారు.. అందుకే గెలిచే మ్యాచ్లో ఓడాం'
AUS Vs SA: అసాధ్యం సుసాధ్యమైన రోజు!
ఓటీటీని షేక్ చేసేలా విజయ్ సేతుపతి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఫొటోలు
అల్లు సినిమాస్ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)
కూకట్పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)
ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)
‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, బన్నీ (ఫోటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)
హైదరాబాద్ : ఓ షాపింగ్ మాల్లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)
హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ కార్యకలాపాలు (ఫోటోలు)
వాళ్లిద్దరి వల్లే ట్రిప్ ఎంతో స్పెషల్: మెహరీన్ (ఫోటోలు)
తాడేపల్లి : వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్ జగన్ (ఫొటోలు)
సినిమా
రిచ్ కావాలంటే...
సముద్ర ఖని ప్రధాన పాత్రలో, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కార్మేని సెల్వం’. రామ్ చక్రి దర్శకత్వంలో అరుణ్ రంగరాజులు తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించి, తెలుగు టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ మూవీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్లో భాగస్వామిగా ఉంది.‘డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి’ అంటూ సముద్ర ఖని చెప్పే డైలాగ్తో టీజర్ ప్రారంభం అవుతుంది. ‘రిచ్ కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి. డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి’ అంటూ సముద్ర ఖని చెప్పే డైలాగ్స్ కూడా టీజర్లో ఉన్నాయి.
రాజేంద్రప్రసాద్ క్షమాపణలు.. విశాల్ కృతజ్ఞతలు
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కి కోలీవుడ్ నటుడు విశాల్ కృతజ్ఞతలు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో ఎంజీఆర్ని అభిమానించేవారు, అలాగే ఆయనతో పనిచేసిన చాలా మంది బాధపడ్డారు. ఈ విషయంపై సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ వివరణ కోరింది.ఎంజీఆర్పై వ్యాఖ్యల పట్ల చింతిస్తూ రాజేంద్రప్రసాద్ హృదయపూర్వక క్షమాపణ కోరారు. దీనికి నేను రాజేంద్ర ప్రసాద్ గారిని అభినందిస్తున్నానని విశాల్ చెప్పారు. ఇది రాజేంద్రప్రసాద్ నిజమైన గొప్పతనం, వినయానికి నిదర్శనమని పేర్కొన్నారు.అంతకు ముందు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానన్నాడు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, అనుకోకుండా దొర్లాయని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపాడు.ఏం జరిగిందంటే..కాగా ఇటీవల ఓ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ కాస్త నోరు జారాడు. తెలుగు నటుడు కాంతారావును పొగిడే క్రమంలో ఎంజీఆర్పై చులకన వ్యాఖ్యలు చేశాడు. కాంతారావును చూసి ఎంజీఆర్ ప్యాంటు తడుపుకునేవాడని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్ సెలబ్రిటీలు విశాల్, నాజర్ మండిపడ్డారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ప్రతి తమిళుడి మనసును నొచ్చుకునేలా ఉన్నాయన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు.
సినిమాలు చేస్తానని వేషాలు వేస్తున్న అయాన్
అల్లు కుటుంబం నుంచి మరొకరు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ ఒక్కరు మరెవరో కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్. ఇప్పటికే తన మాటలు, ప్రవర్తనతో సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిపోయాడు. ఈ మధ్యే మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాడు. అయితే తను కూడా హీరో అవుతానంటున్నాడట!వేషాలు వేస్తున్నాడుఈ విషయాన్ని స్వయంగా బన్నీ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించాడు. అల్లు సినిమాస్ ప్రారంభోత్సవ వేడుకలో అరవింద్ మాట్లాడుతూ.. మా నాన్న, నేను, బన్నీయే కాదు.. వాళ్లబ్బాయి అయాన్ కూడా ఈ ఇండస్ట్రీలోనే ఉంటాడు. ఆల్రెడీ వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్నాడు. ఎంట్రీ ఎప్పుడో?మా నాలుగు జనరేషన్స్ ఈ ఇండస్ట్రీపైనే ఉన్నాయి. అలాంటి చిత్రపరిశ్రమకు ఏదైనా తిరిగివ్వాలన్న సంకల్పంలో నుంచి పుట్టిందే అల్లు సినిమాస్ అని పేర్కొన్నాడు. మరి అయాన్ బాలనటుడిగా వెండితెరపై ఎంట్రీ ఇస్తాడా? లేదా పెరిగి పెద్దయ్యాక నేరుగా హీరోగా పరిచయమవుతాడా? చూడాలి! అల్లు అర్జున్ వాళ్ల అబ్బాయి కూడా వేషాలు వేస్తానని. ఇంట్లో వేషాలు వేస్తున్నాడు- #AlluAravind about #AlluAyaan at #AlluCinemas launch pic.twitter.com/F1JvV9FieK— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) March 12, 2026 చదవండి: 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఆన్సరిదే
పెళ్లికి ముందే పిల్లల విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాం: అల్లు శిరీష్
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 6న తన ప్రియురాలు నయనికను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఈ జంట తమకు పుట్టబోయే పిల్లల గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. పుట్టబోయే పిల్లలను తెలుగులో మాట్లాడేలా పెంచాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీషే చెప్పారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్స్టోరీ గురించి వివరించాడు.అత్తయ్యకు దొరికిపోయాం..మేమిద్దరం ప్రేమలో ఉన్న విషయం మొదట మా అత్తయ్య(చిరంజీవి సతీమణి సురేఖ)కు తెలిసింది. మేమిద్దరం ఓ రోజు కాఫీ తాగేందుకు బయటకు వెళ్లాం. కాఫీ షాపులో మా అత్తయ్యకు తెలిసివాళ్లు కూడా ఉన్నారు. అది మాకు తెలియదు. మేము కాఫీతాగి బయటకు రాగానే.. వాళ్లు మా అత్తయ్యకు ఫోన్ చేసి చెప్పారు. అలా మా ప్రేమ విషయంలో ఇంట్లో తెలిసింది. నేను కూడా నయనికను ప్రేమిస్తున్నానే విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పాను. వాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం.నయనిక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే నాకు ఇష్టంనయనిక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ విషయానైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. నచ్చకపోతే ముఖం మీదనే నచ్చలేదని చెప్పెస్తుంది. నా సినిమాల్లో నచ్చిన విషయాలను షేర్ చేసుకునేది. పెళ్లికి ముందే మేము పిల్లల గురించి కూడా మాట్లాడుకున్నాం. మాకు పుట్టబోయే పిల్లలు ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలనేది నా కోరిక. దీనిపై మేమిద్దరం చర్చించుకున్నాం’ అని శిరీష్ చెప్పుకొచ్చాడు.
క్రీడలు
‘మమ్మల్ని ఎవరూ తప్పించలేరు’
జెనీవా: ‘ఫిఫా’ ప్రపంచకప్లో తమ జట్టు పాల్గొనకుండా ఎవరూ ఆపలేరని ఇరాన్ జట్టు ప్రకటించింది. ఇరాన్ ఆటగాళ్ల భద్రతకు తాము హామీ ఇవ్వలేం అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. నిజంగా వరల్డ్ కప్ నుంచి ఎవరినైనా తప్పించాలంటే అది ఆతిథ్య అమెరికానేనని ఇరాన్ బృందం అభిప్రాయ పడింది. గల్ఫ్లో అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జూన్–జూలైలో అమెరికా, కెనడా, మెక్సికోలలో జరిగే ‘ఫిఫా’ వరల్డ్ కప్లో ఇరాన్ పాల్గొనడం సందేహంగా మారింది.లీగ్ దశలో ఇరాన్ తమ మూడు మ్యాచ్లు కూడా అమెరికా వేదికగానే ఆడాల్సి ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 20వ స్థానంలో ఉన్న ఇరాన్ వరుసగా నాలుగోసారి వరల్డ్ కప్కు క్వాలిఫై అయింది. అయితే ఇరాన్ టీమ్ గురించి మాట్లాడుతూ... ‘ఆ జట్టు ఇక్కడికి వచ్చి ఆడుతుందని నేను అనుకోవడం లేదు. వారి భద్రత, జీవితం గురించి కూడా ఆలోచించాలి కదా’ అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. దీనిపై ఇరాన్ టీమ్ స్పందిస్తూ... ‘వరల్డ్ కప్ ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్.ఇది ‘ఫిఫా’ ఆధ్వర్యంలో జరుగుతుందే తప్ప ఏదో ఒక దేశం నిర్వహించడం లేదు. కాబట్టి వరల్డ్ కప్ ఆడకుండా ఇరాన్ను ఎవరూ తప్పించలేరు. ఇంత పెద్ద టోర్నీలో ఆటగాళ్లకు భద్రత కల్పించడం చేతకాదని చెబుతున్న అమెరికానే నిజానికి తప్పించాలి’ అని ట్వీట్ చేసింది.
IPL 2026: కేకేఆర్కు మరో భారీ షాక్
ఐపీఎల్-2026కు ముందు కోల్కతా నైట్రైడర్స్కు మరో భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది సీజన్కు ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్, యువ సంచలనం హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. హర్షిత్ గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ వార్మాప్ మ్యాచ్లో గాయపడ్డాడు.దీంతో తన బౌలింగ్ స్పెల్ మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత పలు స్కాన్ల తర్వాత అతడికి మోకాలి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో రాణా ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నాడు. అతడు ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు.అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఐపీఎల్-19 సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. హర్షిత్ తన ఐపీఎల్(2022) తన అరంగేట్రం నుంచి కేకేఆర్కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఐపీఎల్-2024 టైటిల్ కేకేఆర్ గెలవడంలో హర్షిత్ కీలక పాత్ర పోషించాడు. గత సీజన్లో కూడా హర్షిత్ 15 వికెట్లతో సత్తాచాటాడు. అంతేకాకుండా టీమిండియా తరపున కూడా అద్బుతమైన ప్రదర్శనలు కనబరిచాడు. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్కు శ్రీలంక స్పీడ్ స్టార్ మతీషా పతిరాన సైతం గాయం కారణంగా దూరమయ్యే అవకాశముంది.గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో పతిరానను రూ.18 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది. కానీ టీ20 వరల్డ్కప్ సందర్భంగా పతిరాన కూడా గాయపడ్డాడు. అతడు ఇంకా శ్రీలంకలోనే ఉన్నాడు. ఇక ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానంలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీని జట్టులోకి కేకేఆర్ తీసుకుంది.చదవండి: BAN vs PAK: పాకిస్తాన్ ప్లేయర్ వింత రనౌట్.. క్రికెట్ చరిత్రలోనే!
పాకిస్తాన్ ప్లేయర్ వింత రనౌట్.. క్రికెట్ చరిత్రలోనే!
ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ సల్మాన్ అలీ అఘా వివాదస్పద రీతిలో రనౌటయ్యాడు. అతడు ఔటైన తీరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్కు ఓపెనర్లు మాజ్ సదాకత్(75), ఫర్హాన్(31) మంచి ఆరంభం ఇచ్చారు.ఆ తర్వాత పాక్ వెంటవెంటే మూడు వికెట్లు కోల్పోయి బ్యాక్ఫుట్లోకి వెళ్లింది. ఈ క్రమంలో సీనియర్ బ్యాటర్లు సల్మాన్ అలీ అఘా(64), మహ్మద్ రిజ్వాన్(44) నిలకడగా ఆడి తమ జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు. అయితే పాక్ ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన మోహది హసన్ మిరాజ్ బౌలింగ్లో సల్మాన్ అలీ ఊహించని విధంగా ఔటయ్యాడు.ఏమి జరిగిందంటే?ఆ ఓవర్లో మెహదీ వేసిన నాలుగో బంతిని మహమ్మద్ రిజ్వాన్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. ఆ బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న సల్మాన్ అలీ ఆఘా బ్యాట్కు తగిలింది. ఆ సమయంలోనే బౌలర్ మిరాజ్, సల్మాన్ ఒకరినొకరు ఢీకొన్నారు. అయితే బంతి 'డెడ్' అయిందని భావించిన సల్మాన్, దానిని చేత్తో తీసి బౌలర్కు ఇవ్వబోయాడు. కానీ అదే సమయంలో బంతిని అందుకున్న మిరాజ్ స్టంప్స్ను గిరాటేశాడు.వెంటనే రనౌట్కు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. స్టంప్స్ కిందపడే సమయానికి సల్మాన్ క్రీజు బయట ఉండడంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. సల్మాన్ అలీ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. గ్రౌండ్లోనే తన గ్లౌవ్స్, హెల్మెట్ను నేలకేసి కొట్టాడు.అంతేకాకుండా బంగ్లా కెప్టెన్ మిరాజ్తో పాటు వికెట్ కీపర్ లిట్టన్ దాస్తో సల్మాన్ వాగ్వాదానికి దిగాడు. అంపైర్లు జోక్యంతో చేసుకోవడంతో సల్మాన్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రూల్స్ ఏమి చెబుతున్నాయి?బంతి లైవ్లో ఉన్నప్పుడు బ్యాటర్ బంతిని బ్యాట్తో కానీ చేతితో కానీ టచ్ చేయకూడదు. ఫీల్డర్ అనుమతి లేకుండా బ్యాటర్ కావాలని బంతిని తాకినా లేదా ఫీల్డర్ను అడ్డుకున్నా‘అబ్స్ట్రాకింగ్ ది ఫీల్డ్’ గా పరిగణిస్తారు. ఒకవేళ మిరాజ్ స్టంప్స్ పడగొట్టకుండా.. ‘అబ్స్ట్రాకింగ్ ది ఫీల్డ్’ అప్పీల్ చేసినా సల్మాన్ ఔటయ్యే వాడు. ఎందుకంటే అప్పటికే సల్మాన్ క్రీజుకు సుమారు ఒక అడుగు దూరంలో ఉండి, బంతిని బౌలర్కు అందించడానికి ప్రయత్నించాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది.Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026
WC: ఫీల్డింగ్లో ‘వరస్ట్’!.. భారత మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
సొంతగడ్డపై టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచింది. గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి.. స్వదేశంలో తొలిసారి టీ20 వరల్డ్కప్ గెలిచిన ఏకైక జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది.కానీ.. లీగ్ దశలో అజేయంగా నిలిచినా టీమిండియా ప్రదర్శన సగటు అభిమానితో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్కు కూడా సంతృప్తినివ్వలేదు. ఇక సూపర్-8 దశలో తొలి మ్యాచ్లోనే సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో భారత జట్టు చిత్తుగా ఓడింది.చాంపియన్గాఆ తర్వాత వరుస విజయాలతో టైటిల్ దిశగా అడుగులు వేసి చాంపియన్గా అవతరించింది టీమిండియా. అయితే, ఫీల్డింగ్ మాత్రం చెత్తగా ఉందనే విమర్శలు మూటగట్టుకుంది. సెమీస్, ఫైనల్లో భారత ఫీల్డర్లు కాస్త ఫర్వాలేదనిపించగా.. అంతకు ముందు మాత్రం దారుణంగా విఫలమయ్యారు.ఫీల్డింగ్లో ‘వరస్ట్’!ముఖ్యంగా సూపర్-8 చేరిన జట్లలో Catching Efficiencyలో ఇంగ్లండ్ అత్యుత్తమంగా 87.2 శాతం నమోదు చేయగా.. టీమిండియా 72.7 శాతంతో అత్యంత చెత్త రికార్డుతో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.భారత మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలుఇన్సైడ్ స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్ చేయాల్సింది. క్యాచ్లు పట్టడంలో సఫలమైన విషయంలో మిగతా జట్లతో పోలిస్తే మరీ వెనుకబడి ఉందన్నది బహిరంగ రహస్యమే.ఒత్తిడిలో ఒక్కోసారి ఇలాంటివి జరగవచ్చు. అలాంటపుడు కూర్చుని చర్చించుకుని లోపాలు సరిచేసుకోవాలి. అలా కాకుండా పదే పదే అవే తప్పులు పునరావృతం చేస్తే ముందుకు సాగడం కష్టమవుతుంది. కొన్నిసార్లు అద్భుతమైన క్యాచ్లు అందుకున్నారు. కొన్నిసార్లు అత్యంత సులువైన క్యాచ్లు వదిలేశారు.ఫీల్డింగ్ విషయంలో మనం కాస్త వెనుబడి ఉన్నామనే చెప్పవచ్చు. ఏదేమైనా పగటి పూట ఫీల్డింగ్ చేయడానికి.. రాత్రి లైట్ల వెలుగులో ఫీల్డింగ్ చేయడానికి తేడా ఉంటుంది. అయితే, ఇప్పటికే ప్రొఫెషనల్ అనిపించుకున్న ఆటగాళ్లు ఇలాంటి కారణాలతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరు’’ అని అంజుమ్ చోప్రా చెప్పుకొచ్చింది.టీ20 ప్రపంచకప్-2026లో సూపర్-8 జట్ల క్యాచింగ్ సామర్థ్యంఇంగ్లండ్- 87.2%జింబాబ్వే- 85.4%వెస్టిండీస్- 84.6%న్యూజిలాండ్- 83.9%పాకిస్తాన్- 83.3%సౌతాఫ్రికా- 81.1%శ్రీలంక- 77.8%ఇండియా- 72.7%.చదవండి: T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
న్యూస్ పాడ్కాస్ట్
రైతులతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొండాట.. పేరుకే అన్నదాత సుఖీభవ, ఆచరణలో అంతా మోసం
విలువలు, విశ్వసనీయతకు వైఎస్సార్సీపీ మారుపేరు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఆదాయం... కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఇక్కడ బాబు, అక్కడ BR నాయుడు కోట్లల్లో భారీ స్కాం
పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు..ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
భవిష్యత్ అభివృద్ధి శూన్యం... ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
బిజినెస్
తెలుగు రాష్ట్రాల్లో రూ. 1,150 కోట్ల క్లెయిమ్ల సెటిల్మెంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ 2026 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు తెలుగు రాష్ట్రాల్లో 1.7 లక్షల క్లెయిమ్లకు సంబంధించి రూ. 1,150 కోట్లు సెటిల్ చేసింది. 24 లక్షల మందికి పైగా బీమా కవరేజీ అందిస్తోంది. నగదురహిత క్లెయిమ్స్లో 96% క్లెయిమ్స్ని 3 గంటల వ్యవధిలోనే సెటిల్ చేస్తున్నట్లు సంస్థ హోల్టైమ్ డైరెక్టర్ హిమాంశు వాలియా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 75 శాఖల వ్యాప్తంగా 89,000 మంది అడ్వైజర్లు, 1,800 నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయని, తమ వ్యాపారంలో ఈ రాష్ట్రాల వాటా 10%గా ఉంటుందని చెప్పారు.బీమా పాలసీలను మరింత చౌకగా పెద్ద సంఖ్యలో ప్రజలకు అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను పాలసీదారులకు పూర్తిగా బదలాయించామని, ప్రీమియంలు సైతం పెంచలేదని పేర్కొ న్నారు. కృత్రిమ మేధ దన్నుతో 20 శాతం క్లెయిమ్లను పరిష్కరిస్తుండగా, వచ్చే రెండేళ్లలో దీన్ని 50%కి పెంచుకోనున్నామని హిమాంశు తెలిపారు. ఇందుకోసం టెక్నాలజీపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామని పేర్కొన్నారు.
అదే భయం... అదే పతనం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతోపాటు.. చమురు ధరలు మండుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు బేర్మంటున్నాయి. వరుసగా మూడో రోజు అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,580 పాయింట్లు పడిపోయి 74,455కు చేరింది. ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం నీరసించడం సెంటిమెంటును దెబ్బతీసింది.ముంబై: చమురు ధరల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు తెరతీస్తున్నాయి. దీనికితోడు ఇంధన కొరత ఆర్థిక వ్యవస్థల వృద్ధికి విఘాతం కలిగించనున్న అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో ఆసియాసహా అమెరికావరకూ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. దేశీయంగా మూడో రోజూ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,471 పాయింట్లు పడిపోయి 74,564 వద్ద ముగిసింది. నిఫ్టీ 488 పాయింట్లు కోల్పోయి 23,151 వద్ద నిలిచింది. మిడ్సెషన్కల్లా సెన్సెక్స్ 1,580 పాయింట్లు క్షీణించి 74,455 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 23,112 వరకూ నీరసించింది. మెటల్స్ మెల్టింగ్.. ఎన్ఎస్ఈలో అన్నిరంగాలూ నీరసించగా.. మెటల్స్ 5 శాతం పతనమైంది. క్రూడ్ సెగతో ఆటో, పీఎస్యూ బ్యాంక్స్, మీడియా, కన్జూమర్ డ్యురబుల్స్, కెమికల్స్ 3.6–2.7 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎల్అండ్టీ 7.5 శాతం పడిపోగా.. హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ, గ్రాసిమ్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, టీఎంపీవీ, మారుతీ, ఎంఅండ్ఎం, ఐషర్, అల్ట్రాటెక్, యాక్సిస్ బ్యాంక్ 6–3 శాతం మధ్య డీలాపడ్డాయి. కేవలం టాటా కన్జూమర్, ఎయిర్టెల్ 2–1 శాతం బలపడ్డాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు పీపా ధర 102 డాలర్లకు ఎగువన కదులుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం పెరగనున్నట్లు తెలియజేశారు. చిన్న షేర్లు విలవిల తాజా అమ్మకాలతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2.5 శాతం పతనమయ్యాయి. ట్రేడైన షేర్లలో 3,439 నష్టపోగా.. కేవలం 858 లాభపడ్డాయి. నగదు విభాగంలో తాజాగా ఎఫ్పీఐలు రూ. 10,717 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 9,977 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. గత 4 రోజుల్లోనూ ఎఫ్పీఐలు రూ. 24,320 కోట్లకుపైగా పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 27,450 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. కాగా.. ఈ నెల 2–6 మధ్య సైతం ఎఫ్పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే.మరో 10 లక్షల కోట్లు ఆవిరిఅమ్మకాల సునామీతో ఒక్క రోజులోనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువకు రూ. 10.24 లక్షల కోట్ల మేర చిల్లు పడింది. రెండు వారాల్లో సెన్సెక్స్ 8.3% (6,723 పాయింట్లు) పతనంకాగా.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 33.68 లక్షల కోట్లు ఆవిరైంది. వెరసి మార్కెట్ క్యాప్ రూ. 429.82 లక్షల కోట్లు (4.65 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది.
సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!
భారతదేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ రోజు (మార్చి 13) 24 గంటలు గడవక ముందే గోల్డ్ రేటు మరోమారు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు మారిపోయింది. ఈ కథనంలో పసిడి ధరలు ఏ నగరం ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1530 తగ్గి.. రూ.1,60,690 వద్ద ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర 1400 రూపాయలు తగ్గి.. రూ. 147300 వద్ద నిలిచింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా 24 క్యారెట్ల బంగారం ధర, 22 క్యారెట్ల పసిడి ధర వరుసగా రూ. 1530, రూ.1400 తగ్గింది. దీంతో తులం గోల్డ్ రేటు వరుసగా రూ. 1,60,840 & రూ. 1,47,450 వద్ద ఉన్నాయి.చెన్నైలో మాత్రం గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఉదయం ఎంత ధర ఉందో, సాయంత్రానికి కూడా అదే ధర వద్ద నిలిచింది. దీంతో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 162560 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,49,000 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
వాట్సాప్లో కొత్త ఫీచర్.. పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్
వాట్సాప్ చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఒక కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇది ముఖ్యంగా 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించిన 'పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్'. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.గతంలో వాట్సాప్ను పిల్లలు కూడా పెద్దవాళ్ల మాదిరిగానే ఉపయోగించేవారు. అప్పుడు తల్లిదండ్రులకు వారి చాట్స్ లేదా కాంటాక్ట్స్పై ఎక్కువ నియంత్రణ ఉండేది కాదు. ఇప్పుడు వచ్చిన పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ ద్వారా తల్లిదండ్రులు నేరుగా పిల్లల ఖాతాను పర్యవేక్షించవచ్చు. ఎవరు పిల్లలకు మెసేజ్ చేయాలి, ఏ గ్రూపుల్లో చేరాలి, ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉండాలి వంటి విషయాలను తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు.పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ సెటప్● ముందుగా పిల్లల ఫోన్లో వాట్సాప్ యాప్ను ఇన్స్టాల్ చేయాలి. ● తరువాత యాప్ను ఓపెన్ చేసి భాషను ఎంచుకుని అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికపై క్లిక్ చేయాలి.● తరువాత మోర్ ఆప్షన్స్లోకి వెళ్లి.. క్రియేట్ పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ అనే ఎంపికను ఎంచుకోవాలి● పిల్లల ఫోన్ నంబర్ను నమోదు చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.● తరువాత పిల్లల పుట్టిన తేదీ నమోదు చేయాలి. దీని ద్వారానే వారి వయస్సు 13 సంవత్సరాల కంటే తక్కువ అని వాట్సాప్ నిర్ధారిస్తుంది.● ఇవన్నీ పూర్తయిన తరువాత.. పిల్లల ఖాతాను తల్లిదండ్రుల ఖాతాతో లింక్ చేయడానికి కంటిన్యూపై క్లిక్ చేయాలి.పిల్లల ఖాతాతో ఎలా లింక్ చేయాలిపిల్లల ఫోన్ స్క్రీన్పై ఒక QR కోడ్ కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఫోన్తో ఆ కోడ్ను స్కాన్ చేయాలి. ఆ తరువాత వాట్సాప్ తల్లిదండ్రుల పర్యవేక్షణను నిర్ధారించడానికి అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికను చూపిస్తుంది. తరువాత తల్లిదండ్రులు ఒక 6 అంకెల పేరెంట్ పిన్ సెట్ చేసుకోవాలిసెట్ చేయాలి. ఈ పిన్ ద్వారా మాత్రమే పిల్లల ఖాతాకు సంబంధించిన ప్రైవసీ & సేఫ్టీ సెట్టింగ్స్ను మార్చగలుగుతారు. ఈ పిన్ నెంబరును పిల్లలతో షేర్ చేసుకోకూడదు.
ఫ్యామిలీ
ఇస్మార్ట్ స్లీప్... హాయి హాయిగా
సుఖమెరుగని నిద్రకు సమస్యల కష్టాలు ఎదురవుతున్నాయి. ‘నాకు కంటినిండా నిద్రపడుతుంది’ అనే వాళ్లు అదృష్టవంతులయ్యారు. ఆరోగ్యంతో ముడి పడి ఉన్న నిద్ర ఈ డిజిటల్ కాలంలో నిర్లక్ష్యానికి గురవుతోంది. ఉరుకు పరుగుల మీద నిద్ర మన దగ్గరకు రావాలంటే మంత్రదండం ఏదీ అక్కర్లేదు, ఆ శక్తి మన దగ్గరే ఉంది. స్లీప్ టెక్ అనేది ఈ సంవత్సరం ప్రముఖ అంశాల్లో ఒకటిగా మారింది. స్లీప్ యాక్సెసరీలను కొనేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. యాంటి–స్నోరింగ్ టెక్నాలజీకిప్రాధాన్యత పెరుగుతోంది....హూప్ 5. ఓ బ్యాండ్ఇన్–డెప్త్ స్లీప్ ఇన్ఫర్మేషన్, పర్సనలైజ్డ్ రికమండేషన్లకు సంబందించి ఉపకరించే స్లీప్ ట్రాకర్...హూప్ 5.ఓ బ్యాండ్. బటన్లు, స్క్రీన్స్లాంటివేమీ లేకుండా సరళంగా ఉంటుంది. బ్యాండ్లోని ఎల్ఈడీ, బాడీ టెంపరేచర్ సెన్సర్లు, ఫొటో డియోడ్లు మన నిద్రకు సంబంధించి విలువైన సమాచారాన్ని అందిస్తాయి. ఆరోగ్యకరమైన అలవాట్లకు శ్రీకారం చుట్టడానికి ఇందులోని ఏఐ హూప్ కోచ్ ఉపయోగపడుతుంది. నిద్ర తక్కువైతే, స్లీప్ స్ట్రెస్కు గురవుతుంటే దాని నుంచి బయట పడి సుఖనిద్ర పోవడానికి ఈ ఏఐ కోచ్ అందించే వివరాలు ఉపయోగపడతాయి. ఫీచర్లు: స్లీప్, స్ట్రెయిన్ అండ్ రికవరీ, పర్సనలైజ్డ్ కోచింగ్, హార్ట్ రేట్ జోన్స్యాంటీ–స్నోరింగ్ గ్యాడ్జెట్స్స్లీప్ ట్రాకర్స్తోపాటు ‘స్మార్ట్స్లీప్ ఆప్నియా ఎయిడ్’లాంటి యాంటీ–స్నోరింగ్ టెక్నాలజీ గ్యాడ్జెట్లకుప్రాధాన్యత పెరిగింది. ఈ డివైజ్ గురకను నివారించడంలో సహాయపడడమే కాకుండా నిద్రనాణ్యతను మెరగుపరుస్తుంది. ‘బ్రీతింగ్ కరెక్షన్’లాంటి ఫీచర్లు ఉన్న ఈ పరికరాన్ని తేలికగా ఉపయోగించవచ్చు.గార్మిన్ ఫోర్రన్నర్ వితింగ్స్ వాచ్‘గార్మిన్ ఫోర్రన్నర్ 165’ స్లీప్ట్రాకర్లో స్లీప్ కోచ్, స్లీప్ స్కోర్, న్యాప్ డిటెక్షన్లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది స్లీప్ సైకిల్స్, రెస్ట్లెస్ మూమెంట్స్... మొదలైన వాటిని ట్రాక్ చేస్తుంది. ‘వితింగ్స్ వాచ్ 2’ అనేది హై–క్వాలిటీ స్లీప్ ట్రాకర్. తేలికగా, సౌకర్యవంతంగా ఉండే ఈ ట్రాకర్ సంప్రదాయ వాచ్లాగే కనిపిస్తుంది. రాత్రిపూట దృష్టి మరల్చే ఎల్ఈడీ స్క్రీన్కు దూరంగా ఉండాలనుకునేవారికి ఈ ట్రాకర్ సరైన ఎంపిక. దీని స్లీప్–ట్రాకింగ్ ఫీచర్లు మార్కెట్లో ఇతర స్మార్ట్ వాచ్ల మాదిరిగానే ఉంటాయి.ఆరా రింగ్సుఖనిద్రకు సంబంధించి ఆకర్షణీయమైన, ఆరోగ్యకరమైన ఎంపిక...ఆరా రింగ్. తేలికైన ఈ హైటెక్ పరికరం ‘స్లీప్ రీడింగ్స్’ను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య అంశాలపై కూడా దృష్టి పెట్టి అప్రమత్తం చేస్తుంది. ప్రతిరోజూ నిద్ర లేవగానే స్లీప్ స్కోర్ చూసుకోవచ్చు. యాక్టివిటీని ఆటోమేటిక్గా ట్రాక్ చేస్తూ యాపిల్ హెల్త్, స్ట్రవ, గూగుల్ ఫిట్లాంటి యాప్లతో అనుసంధానం అవుతుంది. నిద్రను ట్రాక్ చేయడానికి, గురకను గుర్తించడానికి ఉపకరించి సౌకర్యవంతమైన స్మార్ట్ రింగ్....శాంసంగ్ గెలాక్సీ. నిద్రకు సంబంధించి విశ్లేషణతో పాటు వర్కవుట్లు, యాక్టివిటీస్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, టెంపరేచర్లాంటి హెల్త్ మెట్రిక్స్ను ఆటోమేటిక్గా ట్రాక్ చేయడానికి శాంసంగ్ గెలాక్సీ రింగ్ ఉపకరిస్తుంది. స్నోర్ డిటెక్షన్, గెశ్చర్ కంపాటిబిలిటీలాంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.స్మార్ట్ దిండు... స్లీప్ మాస్క్!మరో ట్రెండ్...స్మార్ట్ స్లీప్ సపోర్ట్ సిస్టమ్. ఈ ట్రెండులో భాగంగా సంప్రదాయ దిండ్లను వాడకుండా, గాఢమైన నిద్ర కోసం మెడలు, వెన్నెముకకు సపోర్ట్ చేసే కంటోర్డ్, అడాప్టివ్ డిజైన్లను వాడుతున్నారు. ఉదాహరణకు... 3డీ ఆర్థోపెడిక్ నెక్ పిల్లో. ‘మెడనొప్పి, గురక సమస్యకు మా 3డీ ఆర్థోపెడిక్ నెక్ పిల్లో పరిష్కారం చూపుతుంది. హై–ఎలాస్టిక్, బ్రీతబుల్ మెమరీ ఫోమ్ నుంచి రూపొందించిన ఈ దిండు మెడకు సౌకర్యంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది’ అని తెలియజేసింది కంపెనీ. స్లీప్ మాస్క్ అనేది నిద్ర ప్రేమికుల తప్పనిసరి అవసరం అయింది. పరిసరాల కాంతికి దూరంగా చీకటి వాతావరణంలో త్వరగా నిద్రపోవడానికి, నాణ్యమైన నిద్రకు, నిద్రలేమి చికిత్సకు ఈ మాస్క్లు ఉపయోగపడతాయి.
నీలాల కన్నుల్లో మెలమెల్లగా....
బాగా నిద్ర పోండి... హాయిగా జీవించండి⇒ ప్రపంచ నిద్ర దినోత్సవం 2026 థీమ్: స్లీప్ వెల్, లివ్ బెటర్ శారీరక, మానసిక ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర అవసరం అని వరల్డ్ స్లీప్ సొసైటీ నొక్కి చెబుతోంది. ⇒ 3–3–3 రూల్ అనేది నిద్ర నాణ్యతను విశ్లేషించుకునే రూల్.⇒ ఒకటి... మూడు రోజులుగా మీకు సరిగా నిద్ర పట్టడం లేదా?⇒ రెండు... మూడు నెలలుగా మీకు సరిగా నిద్ర పట్టడం లేదా?⇒ మూడు... నిద్ర లేమి అనేది మూడు సమస్యల (అలసట, మూడ్ సరిగా లేకపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం)కు కారణం అవుతుందా? అని ఎవరికి వారు విశ్లేషించుకోవడమే 3–3–3 రూల్.‘నిద్ర సుఖమెరగదు’ అని అంటారు గానీ...మొద్దు నిద్రకు మించిన భాగ్యం లేదని నిద్ర పట్టనివారు వగస్తుంటారు. ఎంత వైభవం ఉన్నా. కంటి నిండా నిద్ర... అసలైన భాగ్యం. అందుకే పెద్దలు ‘జోకొట్టే’ పాటలు పాడేవారు పసిపిల్లలకు. మరి పెద్దలకు? సినిమా పాటలు ఉన్నాయిగా. వినండి. కంటి నిండా నిద్రపోండి.‘నీలాల కన్నుల్లో మెలమెల్లగానిదురా రావమ్మ రావే నిండారా రావే’....నిద్రను కూడా బుజ్జగించి లాలించాలేమో. ముద్దు చేస్తూ ఆహ్వానించాలేమో. నిద్రను ప్రతి మనిషి తన మనసు పాదులో మొక్కలా చేసి రోజూ కాసిని నీళ్లు పోసి పెంచుకుంటూ రావాలేమో. పచ్చటి చెట్టులా అది ఎదిగితే కోరినన్ని నిద్రాఫలాలు ఇస్తుందేమో. రోజూ కొన్ని ఆరగించి బజ్జోవాలేమో.ఉన్నప్పుడు విలువ తెలీదు. లేనప్పుడు ఏం చేసినా పొందడానికి రాదు. కష్టాలు లేని జీవితం కోసం పోరాడాల్సిందే. మరి కలత ఎరుగని నిద్ర కోసం ఏం చేయాలి? పాట వినాలి.కరుణ లేని ఈ జగానా కలత నిదురే మేలురా...కలలు పండే కాలమంతా కనుల ముందే కదలిపోయేలేత మనసున చిగురుటాశ పూతలోనే రాలిపోయేనిదుర పోరా తమ్ముడా...ఎవరైనా ఉండాలి స్నేహానికో. మాట సాయానికో. మనసుకు దగ్గరగానో. మనెద పంచుకోవడానికో. ఉండాలి ఒకరు. మనల్ని గమనించి, మన కొరకు అక్కర ప్రదర్శించి వారొక ఆలంబనగా ఉంటా పాటగా ఉంటే నిదురెందుకు రాదు?పాడుతా తీయగా సల్లగాపసిపాపలా నిదురపో తల్లిగాబంగారు తల్లిగా...సడి సేయకో గాలి సడి సేయబోకేబడలి ఒడిలో రాజు పవళించెనేసడి సేయకో గాలి...శిశుర్వేత్తి పశుర్వేత్తి... గానం విలువ అది. పసిపాపకు జోల పాడితే జోలకు మాత్రమే కాదు నిదుర పట్టేది. పెరిగి పెద్దదయ్యి జీవన లాలిత్యం ఏర్పరుచుకుంటే అందుక్కూడా నిదురపడుతుంది. గాలి తగిలే శయ్య ఉంటే సరిపోదు.. స్వీయ జీవితంలోగాని, ఎదుటివారి జీవితంలోగాని తెలిసి తెలిసి కర్కశపు చప్పుళ్లు, సద్దులూ చేయకపోతే ఆ మనసుకు తప్పక హాయిగా నిదుర పడుతుంది.ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడుసద్దు చేశారంటే ఉలికులికి పడతాడు....అందాల పసిపాప అన్నయ్యకు కనుపాపబజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకేనీకన్నా నాకెవరే...పసి పిల్లల్ని చూసినప్పుడు చిరునవ్వు మీకు రాలేదంటే మీకు నిదుర కూడా రాదు. సుకూమారమైనవి కదా కన్నులు. అంతటి సుకుమారమైన కన్నుల్లో నిదుర రావాలంటే ఎంతటి కరుణ మీలో ఉండాలి. జగతి పట్ల ఎంతటి కారుణ్యం కలిగి ఉండాలి.ముద్దుముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వుజాజిమల్లె పూవు బజ్జోమ్మ నువ్వు...నిదుర పట్టాలంటే స్థిమితత్వం కూడా ఉండాల్లేంటి. అంటే ఏమిటి? స్థితికి సంబంధించిన మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, చక్కటి కుటుంబం... ఇవి సరే. బాంధవ్యాలు? ఒకప్పటి బంధుత్వాలు ఇప్పుడు సన్నగిల్లిపోయాయి. తల్లిదండ్రులతో, అవ్వా తాతలతో కలిసి ఉండలేని స్థితి. పెదనాన్న, బాబాయి, మేనమామ, మేనత్త... వీరు మనకు ఉన్నారు అనే భావన కూడా మొద్దు నిద్ర పట్టడానికి మంచి టాబ్లెట్ ఏమో.అత్త ఒడి పువ్వు వలే మెత్తనమ్మాఆదమరిచి హాయిగా ఆడుకొమ్మాఆడుకొని ఆడుకొని అలసిపోతివాఅలుపుతీర బజ్జొమ్మ అందాల బొమ్మ...పిల్లల్ని బాగా పెంచుకోవాలి. ప్రేమగా అక్కున చేర్చుకోవాలి. వారి మంచి అలవాట్లు తల్లిదండ్రులకు మంచి నిద్ర. వారి పట్ల ఆర్తి, వారితో గడిపే సమయం తిరిగి మనల్ని సంతోష సమీరంగా తాకుతుంది. మన కోసం పాడి మురిపాల నిద్రను ప్రసాదిస్తుంది.పచ్చని చెట్టు ఒకటివెచ్చని చిలుకలు రెండుపాటలు పాడి జోకొట్టాలిజో...జో... జో...నిదుర రావడం లేదంటే అది కేవలం భౌతిక ఆరోగ్యానికి సంబంధించిన సంగతి కాదు. మీ నిద్ర మీ అందమైన ΄÷దరింట్లో ఉంది. తప్పులకు బలహీనతలకు వ్యసనాలకు లొంగని జీవనంలో ఉంది. మీరు నిలబెట్టుకునే బాంధ్యవాల్లో ఉంది. మీ మంచి స్నేహాల్లో ఉంది. మీ కళాభిరుచుల్లో ఉంది. పిసరంత సాయగుణం... చిటికెడంత ఆర్ద్రత... ఇవి ఉంటే నిదుర మీకే తోకాడించే బుజ్జి కుక్కపిల్ల.– కె
పేద గుండెల అందెల రవళి
మట్టిలో మాణిక్యాలకుప్రోత్సాహం తోడైతే ఎలాంటి ఫలితం వస్తుందో ఆచరణా త్మకంగా చూపిస్తోంది నృత్య పరిచయ్.ముంబైలోని మురికివాడలో నివసించే పేదింటి బిడ్డ మానస్ అహిరేకు డ్యాన్స్ నేర్చుకోవడం అనేది ఒకప్పుడు కలలో మాట. డ్యాన్స్ అంటే అతడికిప్రాణం. కాని చాలామంది పిల్లలలాగే మానస్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి డబ్బు, సరైన వేదిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ) మానస్ కలను నిజం చేసింది. సంగీత నాటక అకాడమీ అవార్డ్ అందుకున్న లతసనాదేవి ఆధ్వర్యంలో మానస్ మణిపురి నేర్చుకోవడంప్రారంభించాడు. శిక్షణ ఉచితం. ఈ నృత్యశిక్షణ అభిరుచికి మాత్రమే కాదు క్రమశిక్షణ విషయంలోనూ మానస్లాంటి విద్యార్థులకు బాగా ఉపయోగపడింది. మూడు సంవత్సరాల డి΄÷్లమా పూర్తి చేసిన తరువాత, మానస్ అసిస్టెంట్ టీచర్గా ఎంపికయ్యాడు. ఈ ఉద్యోగం ద్వారా వచ్చే జీతం తన ఇంజినీరింగ్ చదువుకు ఉపయోగపడుతోంది. ‘నృత్యం నాలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అంటున్నాడు మానస్.‘ఎన్సీపీఏ’ నృత్య పరిచయ్ కార్యక్రమం ద్వారా పేదపిల్లలకు నృత్యంలో ఉచిత శిక్షణ ఇస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మానస్లాంటి ఎంతోమంది పేదింటి పిల్లలు లబ్ధి పొందుతున్నారు. ముంబై శివారులోని నెరూల్కు చెందిన సిద్ది మాత్రే 2019లో తన నృత్యప్రస్థానాన్నిప్రారంభించింది. నెరూల్లోని ధ్యాన్దీప్ సేవా మండపంలో గురు శర్మిష్ఠ చటోపాధ్యాయ ఆధ్వర్యంలో ఒడిస్సీలో శిక్షణ పొందింది. ఇప్పుడు సిద్ధి అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తోంది. ఖజురహో ఉత్సవంలో ఏడు వందల మంది విద్యార్థులతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వనుంది సిద్ది మాత్రే.నృత్య పరిచయ్ కార్యక్రమంలో భాగంగా వెయ్యి మందికి పైగా పేదింటి విద్యార్థులు నృత్యం నేర్చుకున్నారు. ‘నృత్యం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచన నుంచి పుట్టిందే నృత్య పరిచయ్’ అంటారు ఎన్సీపీఏ నృత్యవిభాగం అధిపతి స్వ΄్నోకల్పదాస్ గుప్తా.‘పిల్లలకు ప్రతిభ ఉండవచ్చు. సరిౖయెన ఆదరణ,ప్రోత్సాహం లేకపోతే తమ అభిరుచి నుంచి దూరం జరుగుతారు. దీన్ని నివారించడానికి నృత్య పరిచయ్ పేద పిల్లలకు చేరువ అవుతుంది’ అంటారు గుప్తా. నృత్యపరిచయ్తో పాటు ఎన్సీపీఏ ‘నృత్య గురుకుల్’ అనే అధునాతన మార్గదర్శక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ‘నృత్యగురుకుల్’ కార్యక్రమం క్రింద ఇరవైనాలుగు మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ప్రతిభ, అంకితభావం, నిబద్ధత ఆధారంగా ఎనిమిది మంది గురువులు వీరిని ఎంపిక చేశారు. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకుప్రాధాన్యత ఇస్తారు.
గోల్ఫ్కి అమూల్యం
మాజీ ఐఆర్ఎస్ అధికారి, గోల్ఫ్ ప్రేమికుడు డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి టీ గోల్ఫ్ ఫౌండేషన్ స్థాపించి అమెచ్యూర్ గోల్ఫర్లనుప్రోత్సహిస్తున్నారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు టోర్నీల్లో ఆడేందుకు వీలుగా టికెట్లు, వసతి సౌకర్యం వంటి వాటిని అందిస్తున్నారు.గోల్ఫ్ అంటే ఖరీదైన క్రీడ కదా మనకెందుకులే అని ఆమె అనుకోలేదు. రైతులం కదా అంతటి ఖరీదైన ఆటకు శిక్షణ ఇప్పించడం మన తరమవుతుందా అని ఆమె తల్లిదండ్రులూ వెనకడుగు వేయలేదు.. తండా అమ్మాయి కదా గోల్ఫ్కిప్రోత్సహించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అని ఆమె కోచ్ కూడా భావించలేదు. పట్టుదలతో ఆటపై పట్టు సాధిస్తే, అవకాశాలు వాటంతట అవే వస్తాయి అని ఆమె.. బిడ్డ ఆసక్తి, పట్టుదలే వెన్నుదన్నుగా నిలవడం ఖాయమని ఆమె తల్లిదండ్రులు.. వెన్నుతట్టిప్రోత్సహిస్తే ఆమె అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి కావడం తథ్యమని ఆమె కోచ్ బలంగా విశ్వసించారు.వారి నమ్మకం నిజమైంది. తండా నుంచి వచ్చిన ఓ సాధారణ అమ్మాయి.. గోల్ఫ్లో అదరగొడుతోంది. ఎందరో దిగ్గజ గోల్ఫర్లను వెనక్కి నెట్టి ఇటీవల జరిగిన హైదరాబాద్ ఓపెన్ కప్ని కైవసం చేసుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. ఆమె పేరు జి.అమూల్య. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం ఎర్ర సోమ్లా తండాకు చెందిన రైతులు జి.రవికుమార్, సునీత దంపతుల కుమార్తె. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతోంది.వాస్తవానికి మన దేశంలో బాగా క్రేజ్ ఉండేది క్రికెట్కే... తర్వాత బ్యాడ్మింటన్ , టెన్నిస్, హాకీ.. గత కొంతకాలంగా ఒలింపిక్స్ పతకాలు వస్తున్న రెజ్లింగ్, బాక్సింగ్, షూటింగ్ వంటి వాటినీ క్రీడాభిమానులు ఫాలో అవుతున్నారు. దీంతో చాలామంది తల్లిదండ్రులు దాదాపుగా ఇవే క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ధనవంతుల క్రీడగా భావించే గోల్ఫ్ పట్ల ఎవరూ ఆసక్తి చూపించరు. ఎందుకంటే ఈ ఆటలో ఉపయోగించే గోల్ఫ్ స్టిక్, బాల్స్ వంటివన్నీ ఇతర క్రీడలతో పోలిస్తే చాలా ఖరీదు. అయినా అమూల్య మాత్రం గోల్ఫ్ పై ఆసక్తి పెంచుకుంది.స్థానికంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆమెలో గోల్ఫ్ ఆటపై ఉన్న ఆసక్తిని, నైపుణ్యాన్ని కోచ్ భాస్కర్ గుర్తించారు. కెరీర్ ఆరంభం నుంచే అమూల్యను వెన్నుతట్టిప్రోత్సహించారు. రాష్ట్రస్థాయి, సౌత్ జోన్ లెవెల్ టోర్నీల్లో ఆడేలాప్రోత్సహించారు. అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అమూల్యను హైదరాబాద్ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్సు, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో శిక్షణ తీసుకునేలా సిఫార్సు చేశారు. ఈప్రోత్సాహానికి తగ్గట్టే అమూల్య పలు టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా 2022–23 మధ్యలో పలు జూనియర్, సౌత్ జోన్ స్థాయి టోర్నీల్లో ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది.మలుపు తిప్పిన హైదరాబాద్ ఓపెన్మాజీ ఐఆర్ఎస్ అధికారి, గోల్ఫ్ ప్రేమికుడు డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి టీ గోల్ఫ్ ఫౌండేషన్ స్థాపించి అమెచ్యూర్ గోల్ఫర్లనుప్రోత్సహిస్తున్నారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు టోర్నీల్లో ఆడేందుకు వీలుగా టికెట్లు, వసతి సౌకర్యం వంటి వాటిని అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనే తొలిసారి అమెచ్యూర్ గోల్ఫర్ల కోసం హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ పేరుతో జాతీయస్థాయి టోర్నీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 300 మందికి పైగా గోల్ఫర్లు దీనిలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అమూల్య కూడా ఎన్ఆర్ఎన్ రెడ్డిని కలిసి టోర్నీలో ఆడతానని అడగడంతో.. ఆమె నేపథ్యం తెలుసుకున్న ఆయన ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా అవకాశమిచ్చారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అమూల్య క్వాలిఫైయింగ్ రౌండ్లో అదరగొట్టి, ప్రధాన రౌండ్లో పెద్ద పెద్ద గోల్ఫర్లను వెనక్కి నెట్టి ఓవరాల్ గ్రాస్ విన్నర్గా నిలిచింది. తద్వారా రూ.90వేల ప్రైజ్ మనీతో పాటు గవర్నర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఓపెన్ ట్రోఫీ, గోల్ఫర్లు ధరించే గ్రీన్ జాకెట్ అందుకుంది. గోల్ఫ్ ట్రిప్ సంస్థ ద్వారా బ్యాంకాక్లో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్సులో ఆడే అవకాశాన్ని కూడా గెలుచుకుంది. గోల్ఫ్ కిట్ను టీ గోల్ఫ్ ఫౌండేషన్ అందించింది. భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి సహకారం కావాలన్నా తమ ఫౌండేషన్ కు రావొచ్చని ఎన్ఆర్ఎన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓ మారుమూల తండా నుంచి వచ్చి గోల్ప్ లో అదరగొడుతున్న అమూల్య భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – సత్య కిషోర్ కొండ్రెడ్డి
అంతర్జాతీయం
దుబాయ్లో జరిమానాలపై కొత్త చట్టానికి ఆమోదం
దుబాయ్లో ప్రభుత్వ సంస్థలు, ప్రజలకు వర్తించే ఉల్లంఘనలు, జరిమానాలపై కొత్త చట్టానికి దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆమోదం తెలిపారు. పారదర్శకత, న్యాయాన్ని పెంపొందించే ఉద్దేశంతో 2026 సంవత్సరానికి సంబంధించి చట్టం నెం.6ను ప్రకటించారు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే విధానంపై మరింత స్పష్టత తీసుకొచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు.ఈ చట్టం ప్రధానంగా ప్రభుత్వ స్థాయిలో జరిగే ఉల్లంఘనలకు స్పష్టమైన చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటుచేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అధికార దుర్వినియోగాన్ని నిరోధించడం, చట్టాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కూడా దీని ఉద్దేశంగా ఉంది. ఉల్లంఘనలను వాటి తీవ్రత ఆధారంగా చిన్న, మధ్యస్థ, తీవ్రమైనవిగా వర్గీకరించి, ప్రతి ఉల్లంఘనకు తగిన శిక్షను విధించేలా నిబంధనలు రూపొందించారు.చట్టం ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులు లేదా సంస్థలపై అధికారులు పలు రకాల చర్యలు తీసుకోవచ్చు. జరిమానా విధించే ముందు లేదా తరువాత పరిస్థితిని సరిచేసుకునే అవకాశం కల్పిస్తూ హెచ్చరికలు జారీ చేయవచ్చు. అవసరమైతే సంస్థలను ఆరు నెలల వరకు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూసివేయవచ్చు. అలాగే వ్యక్తులు లేదా సంస్థలకు ఇచ్చిన లైసెన్సులు, అనుమతులను రద్దు చేయడం లేదా సవరించడం కూడా చేయవచ్చు. ఉల్లంఘనలకు సంబంధించిన ప్రాజెక్టులు లేదా కార్యకలాపాలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేసే అధికారాన్ని కూడా ఈ చట్టం కల్పిస్తోంది.ఇక చర్యల ప్రక్రియలో పారదర్శకతను తప్పనిసరి చేశారు. ప్రతి ఉల్లంఘనను స్పష్టంగా నిర్వచించాల్సి ఉంటుంది. జరిమానాలు లేదా శిక్షలు నిర్ణయించే సమయంలో ఉల్లంఘన తీవ్రత, అది పునరావృతమైందా లేదా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.క్రమశిక్షణా చర్యలను ప్రకటించే ముందు సంబంధిత ప్రభుత్వ సంస్థల అధిపతుల అనుమతి తప్పనిసరి. అదేవిధంగా సమాచారం విడుదలలో దుబాయ్ మీడియా ఆఫీస్తో సమన్వయం చేయాలని కూడా నిబంధనలు పేర్కొంటున్నాయి.శాంతి భద్రతను కాపాడుతూ చట్టబద్ధమైన పాలనను మరింత బలోపేతం చేయడమే ఈ కొత్త ఉత్తర్వుల ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. అధికారిక గెజిట్లో ప్రచురించిన తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. దీనికి విరుద్ధంగా ఉన్న పాత చట్టాలు రద్దయినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
‘ఇరాన్ గగనతలం పూర్తిగా మా గుప్పిట్లోకి వచ్చింది’
వాషింగ్టన్: ఇరాన్ గగనతలం పూర్తిగా తమ గుప్పిట్లోకి వచ్చిందని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ ఆయుధ నిల్వలు బలహీనపడిన క్రమంలో ఆ దేశ గగనతలాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నామని అమెరికా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇరాన్పై కొనసాగిస్తున్న యుద్ధంపై అమెరికా తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో దాడులు చేశాం. ఫైటర్ జెట్లు, బాంబర్లతో ఇరాన్పై దాడులు చేశాం. ఇరాన్ అణు సామర్థ్యాలు, మిస్సైల్ స్థావరాలు, నేవీ వ్యవస్థను నాశనం చేయడమే మా టార్గెట్. ఇరాన్ గగనతలం పూర్తిగా మా గుప్పిట్లోకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు ఆపేది లేదు. యుద్ధంలో ఏడుగురు అమెరికా సైనికులు మృతి చెందారు. 140 మంది సైనికులకు గాయాలయ్యాయి. ఇరాన్ ఒంటరి అయిపోయింది. ఇరాన్ ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇరాన్పై దాడులను మరింత ఉధృతం చేస్తాం’ అని అమెరికా పేర్కొంది.అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహుల సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్ తమకు సరెండర్ కాబోతుందన్న ట్రంప్.. తమ దాడులకు ఇరాన్ భయపడిందంటూ వ్యాఖ్యానించారు. యుద్ధంపై నిర్ణయం తీసుకోవడానికి టెహ్రాన్లో అధికారులు ఎవరూ సజీవంగా లేరని.. ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందన్నారు. లొంగిపోతున్నట్లు ప్రకటించేవారు ఎవరూ లేరని.. మొజ్తబా ఖమేనీ ఎవరికీ తెలియదని ట్రంప్ అన్నారు.మరో వైపు, తమ దేశం ఎప్పటికన్నా బలంగా మారుతోందంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు.. ఇరాన్ కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు. "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని నెతన్యాహు అన్నారు.
భారీ పేలుళ్లు : బుర్జ్ ఖలీఫా చుట్టూ దట్టమైన పొగ
ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్దాడులు, ఇరాన్ ప్రతిదాడులోగల్ఫ్ ప్రాంతం గజగజ లాడుతోంది. ఈ రోజు (శుక్రవారం)దుబాయ్లోని కొన్నిప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) దగ్గర దట్టమైన పొగ వ్యాపించిన వీడియోలు వైరల్గా మారాయి.బుర్జ్ ఖలీఫా దగ్గర కనిపించిన పొగఆన్లైన్లో వైరల్ అవుతున్న వీడియోలలో ఐకానిక్ బుర్జ్ ఖలీఫా భవనాల పైన నుండి భారీ పొగ ఎగసిపడుతున్నట్లు కనిపించింది. ఆకాశహర్మ్యాల మీదుగా పొగ మేఘాలు అలుముకున్నాయి. ఈ ఘటననగరంలోని కేంద్ర వ్యాపార మండలాల్లో ఆందోళనను పెంచింది. పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల భవనాల్లో గణనీయమైన ప్రకంపనలు వచ్చాయని సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మీడియా ప్రతినిధులు వెల్లడించారు.Scenes from downtown #Dubai, United Arab Emirates. The impact on a building in the area can be seen. pic.twitter.com/jg8JrXBXdK— Mina (@Mina696645851) March 13, 2026 >ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్ ప్రతినిధి ప్రకారం, మొదటి పేలుడు సమీపంలోని నిర్మాణాలను కదిలించేంత బలంగా ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికే రెండో పెద్ద పేలుడు సంభవించింది. ఆ ప్రాంతంలోని నివాసితులు, కార్మికులలో ఆందోళన రేపింది.అయితే ఇది స్వల్ప నష్టం మాత్రమేనని అధికారులు ప్రకటించారు.
వారు సజీవంగా లేరు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్ తమకు సరెండర్ కాబోతుందన్న ట్రంప్.. తమ దాడులకు ఇరాన్ భయపడిందంటూ వ్యాఖ్యానించారు. యుద్ధంపై నిర్ణయం తీసుకోవడానికి టెహ్రాన్లో అధికారులు ఎవరూ సజీవంగా లేరని.. ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందన్నారు. లొంగిపోతున్నట్లు ప్రకటించేవారు ఎవరూ లేరని.. మొజ్తబా ఖమేనీ ఎవరికీ తెలియదని ట్రంప్ అన్నారు.మరో వైపు, తమ దేశం ఎప్పటికన్నా బలంగా మారుతోందంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు.. ఇరాన్ కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు. "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని నెతన్యాహు అన్నారు.
జాతీయం
కుమారుడు లేని జీవితం ఎందుకని..
కాసరగోడ్ (కేరళ): ఏకైక కుమారుడు దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. రైలు ప్రమాదంలో కుమారుడు ప్రాణాలు కోల్పోయిన నాటి నుంచి వారు దుఃఖంలో మునిగిపోయారు. చివరకు ‘వాడు లేని లోకంలో మేము ఉండలేం’ అంటూ ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కేరళలోని కాసరగోడ్ జిల్లా చెమ్నాడ్ పంచాయతీ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.పొయినాచిలోని పరంబ ప్రాంతానికి చెందిన వేణుగోపాలన్ నాయర్ (50), ఆయన భార్య స్మిత (42) శుక్రవారం ఉదయం తమ నివాసంలో విగతజీవులుగా కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న మేల్పరంబ పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. ఏకైక కుమారుడు ఎం. శివానందన్ (19) మరణాన్ని జీర్ణించుకోలేక మనస్తాపంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.మంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న శివానందన్, గత ఏడాది డిసెంబర్ 29న జరిగిన ఒక దుర్ఘటనలో మరణించాడు. బేకల్ బీచ్ ఫెస్టివల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరికి తన స్నేహితుడు అజేష్తో కలిసి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వేదికకు చేరుకోవడానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న రైల్వే పట్టాలను దాటుతుండగా, ‘తిరునెల్వేలి జంక్షన్ - జామ్నగర్ ఎక్స్ప్రెస్’ వీరిని ఢీకొంది. ఈ ఘటనలో శివానందన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అజేష్ గాయాలతో బయటపడ్డాడు.కొడుకు మరణం తర్వాత వేణుగోపాలన్, స్మిత దంపతులు తీవ్రమైన కుంగుబాటులోకి వెళ్లిపోయారని బంధువులు, పొరుగువారు కన్నీటి పర్యంతమవుతూ తెలిపారు. ‘వాడు లేకుండా మేము బతకలేము’ అని వారు తరచూ చెబుతుండేవారని, కుటుంబ సభ్యులు ఎంత ఓదార్చినా వారిలో మార్పు రాలేదని తెలిసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు జ్ఞాపకాలు వారిని ప్రతిక్షణం వెంటాడటంతో, మరణమే శరణ్యమని భావించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాసరగోడ్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.ఇది కూడా చదవండి: ఎల్పీజీ కొరత.. మారిన ఆహార అలవాట్లు
శశికళ కొత్త పార్టీ పేరు ఇదే..!
చెన్నై:తమిళనాడు చిన్నమ్మ శశికళ ఇటీవలే ఆ రాష్ట్రంలో పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన పార్టీ గుర్తును ప్రకటించారు..'ఆల్ ఇండియా పురుచ్చి తలైవార్ మక్కల్ మునేత్ర కళగం' పార్టీ పేరుగా తెలిపారు. కొబ్బరిచెట్టు తన పార్టీ చిహ్నంగా పేర్కొంది. ఈ మేరకు తన అభిమానుల సమక్షంగా ఈ ప్రకటన చేశారు. కాగా ఇదివరకే తమిళనాడులో జరిగిన సభలో పార్టీ జెండా ఆవిష్కరించిన శశికళ తాజాగా పార్టీ పేరు గుర్తు ప్రకటించింది. శశికళ పార్టీ జెండాను తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో పార్టీ జెండాను రూపొందించారు. దివంగత నేతలు జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్ గుర్తులతో జెండా ఉంది. అయితే పార్టీ పేరు మాత్రం త్వరలోనే ప్రకటిస్తానని చెప్పిన చిన్నమ్మ తాజాగా ఆ ప్రకటన చేసింది.. తమిళనాడులో త్వరలో జరిగే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని పార్టీ ఆవిర్భావ సభలో పేర్కొంది.కాగా శశికళ, జయలలితకు అత్యంత సన్నిహితురాలు ఆమె మరణానంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవించి, తదనంతరం ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ, గత కొంతకాలంటా చెన్నై వేదికగా తన మద్దతుదారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కృతురాలైనప్పటికీ, రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించాలనే పట్టుదలతో ఆమె ఉన్నారనే మాట వినిపిస్తోంది.ఈ క్రమంలోనే ఆమె అనుచరులు సైతం ‘చిన్నమ్మ’ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. దీంతో తమిళనాట పొలిటికల్ హీట్ మరింత ముదిరింది. తమిళనాడులో ఇది వరకే ఫిలిం స్టార్ విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు శశికళ ఎంట్రీతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. కాగా ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి.
ఎల్పీజీ కొరత.. మారిన ఆహార అలవాట్లు
న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాల కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థలో ఆటంకాలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత తీవ్రతరమవుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాల్లో సిలిండర్ల కోసం వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. గ్యాస్ సరఫరాలో అనిశ్చితి నెలకొనడంతో హోటళ్లు తమ మెనూలను కుదిస్తుండటంతో ఇడ్లీలు, దోశలు తినేవారు టీ, కాఫీలతోనే సరిపెట్టుకుంటున్నారు. మెనూలో కోతలుదేశ రాజధాని ఢిల్లీలోని విద్యాసంస్థల క్యాంటీన్లపై ఎల్పీజీ కొరత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని పలు క్యాంటీన్లు ఇప్పటికే మెనూలోని స్నాక్స్ ఐటమ్స్ను నిలిపివేశాయి. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ క్యాంటీన్ తన ‘మటన్ దోశ’ను తాత్కాలికంగా తొలగించింది. ధరలు పెంచలేక, గ్యాస్ దొరకక వంటకాలను తగ్గించుకుంటున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముంబైలో మరీ దారుణంసిలిండర్ రీఫిల్ కోసం ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ డీలర్ల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి ముంబైవాసులకు ఏర్పడింది. గ్యాస్ కొరత కారణంగా ముంబైలోని పలు రెస్టారెంట్లు మళ్లీ పాత కాలపు బొగ్గు పొయ్యిల బాట పట్టాయి. మరోవైపు బెంగళూరులో ఆటో గ్యాస్ ధరలు రెండు రోజుల్లోనే లీటరుకు రూ. 10 వరకు పెరగడం వాహనదారులను కోలుకోలేని దెబ్బతీసింది. ఇందిరా క్యాంటీన్ల నిర్వహణపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.టిఫిన్ బాక్సుల షేరింగ్..పుణెలో విద్యార్థుల మెస్ నిర్వహణ భారంగా మారడంతో ధరలు పెంచక తప్పడం లేదు. దీంతో విద్యార్థులు ఒకే టిఫిన్ బాక్సును ఇద్దరు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోల్కతా, అజ్మీర్ తదితర నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల కొరత వల్ల హోటల్ యజమానులు కట్టెలు, బొగ్గును వినియోగిస్తున్నారు. దీంతో మార్కెట్లో బొగ్గు, కట్టెల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. కేజీ బొగ్గు ధర రూ. 30 నుంచి రూ. 35కి చేరగా, కట్టెల ధరలు కూడా అమాంతం పెరిగాయి. పశ్చిమాసియా సంక్షోభం త్వరగా ముగియకపోతే, రాబోయే రోజుల్లో ఇంధన కష్టాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: వార్ ఎఫెక్ట్: మూసివేత దిశగా ప్రముఖ కాఫీ హౌస్?
అలా అయితే మహిళలకు ఉద్యోగాలు కష్టమే : సుప్రీం కోర్టు
ఢిల్లీ: మహిళల పీరియడ్ లీవ్కు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు రుతుస్రావం సమయంలో సెలవులు తప్పనిసరి చేస్తే ఏ కంపెనీలు వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి మెుగ్గు చూపవని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. రుతుస్రావం సమయంలో మహిళలకు తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలని నమోదైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజు శుక్రవారం విచారించింది. మహిళల సహజ రుతుస్రావం సమయంలో విద్యార్థినిలకు, ఉద్యోగస్థులకు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని లాయర్ శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విధంగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఆ పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ‘పీరియడ్ సమస్యపై, దాని సున్నితత్వంపై అవగాహన కల్పించడం వేరు. రుతుక్రమం సమయంలో సెలవులు తప్పనిసరి అనిచట్టం చేస్తే మహిళలకే నష్టకరంగా మారవచ్చు. వారిని ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోరు. గవర్నమెంట్ ఉద్యోగాలు, జ్యూడీషియరీ జాబ్స్ ఎందులోనూ వారికి చోటు ఉండదు. కంపెనీల మనస్థత్వం మీకు తెలియదు’ అని అన్నారు. అయితే దీనిపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఇదే అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 21 ప్రకారం ఆడపిల్లలకు గౌరవంగా జీవించే హక్కు ఉందని ఆరోగ్యం, విద్య, గౌరవం వారికి ప్రభుత్వాలు కల్పించాల్సిన బాధ్యత అని తెలిపింది.ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు వారికి ఉచితంగా నాప్కీన్స్, ప్రత్యేకమైన టాయిలెట్స్, మెంటల్ హెల్త్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది.
ఎన్ఆర్ఐ
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు భారత్కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్ ఎవరు? ఆ వివరాలు మీకోసం.లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలోజన్మించారు నిత్య రామన్. ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య కుటుంబం, అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కరెన్ బాస్కు గట్టి పోటీప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!
అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత
అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..
అమెరికాలో ఉండే మన భారతీయులు ఏ రేంజ్లో ప్యాకేజ్లు అందుకుంటారో తెలిసిందే. అంతలా వేతనాలు వస్తాయనే..విదేశాలంటే మోజు మనవాళ్లకు. కానీ ఆ వ్యక్తి కోట్లలో వచ్చే వేతనం కాదనుకుని మరి భారత్కి వచ్చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాదు దానికి గల కారణాన్ని వివరిస్తూ..అది సరైనదో కాదో సలహా ఇవ్వండి అంటూ రెడ్డిట్లో పోస్ట్ పెట్టాడు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అతడి ఉద్దేశానికి ఫిదా అవ్వతూ ప్రశంసలజల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.ఇంతకీ కారణం ఏంటేంటే..అమెరికాలో 12 ఏళ్లకు పైగా గడిపిన తర్వాత తిరిగి కుటుంబంతో సహా భారత వచ్చేయాలనకుంటున్నట్లు ఓ ఎన్నారై పోస్ట్లో తెలిపాడు. ఈ జూన్ కల్లా తాము ఐదుగురు ముంబైకి వచ్చేయాలని నిర్ణయించుకున్నామని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు. తన వయసు 36 ఏళ్లు అని, 2018లో నవంబర్ నుంచి హెచ్1బీ విసాతో అమెరికాలో నివశిస్తున్నట్లు తెలిపాడు. పైగా తన వార్షిక ఆదాయం రూ. 2.9 కోట్లు అని, నెట్వర్త్ వచ్చేసి రుణ రహిత ఇల్లుతో కలిపి దగ్గర దగ్గర రూ. 9 కోట్లు అని వెల్లడించారు. భారత్ తన ఉద్యోగ ఆఫర్ ఏడాదికి రూ. 1.5 కోట్ల ప్యాకేజ్ అని కూడా వివరించాడు. అయితే తన తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉన్నారని, కుటుబానికి దగ్గరగా ఉండటమే మేలని ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అందులోనూ తన పిల్లలు తాతయ్య నానమ్మల, దగ్గర బంధువులతో పెరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు పోస్ట్లో. అక్కడ అమెరికాలో ఇంటి అద్దె చెల్లించకుండా లగ్జరియస్గా గడిపినా తన కుటుంబానికి ఈ నిర్ణయం కారణంగా.. చాలా పెద్ద మార్పుని స్వాగతించాల్సి ఉంటుందని అంటున్నాడు. ఎందుకంటే ముంబైలో అద్దె చెల్లిస్తూ..ఏడాదికి రూ. 1.5 కోట్లతో బతకడం సాధ్యమేనా? అని సందేహం వ్యక్తం చేశాడు. అలాగే యూఎస్లో పుట్టి..అక్కడే పెరిగిన పిల్లలు ఇక్కడ జీవనశైలికి, ఎడ్యుకేషన్కి సులభంగా అలవాటుపడగలరా, అసలు తన నిర్ణయం సరైనదేనా..? ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని పోస్ట్ పెట్టాడు. అయితే నెటిజన్లు అది మంచి ప్యాకేజీ అని, ముంబైలో ధీమాగా బతకొచ్చు అని అన్నారు. పైగా ఇలా భారత్కి రావాలనుకుంటున్న మీ నిర్ణయానికి స్వాగతం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తల్లిదండ్రలు గురించి ఆలోచిస్తున్నందుకు మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: లే ఆఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే..?: మాజీ అమెజాన్ టెక్కీ)
క్రైమ్
బామ్మర్ది పెళ్లి.. బావ బలవన్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా: మరికాసేపట్లో బామ్మర్ది పెళ్లి జరగాల్సి ఉండగా.. కుటుంబ సమస్యలతో ఉరేసుకుని బావ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచమ్మగుడి ప్రాంతానికి చెందిన చిన్నం రమేష్(32) టోయింగ్ వెహికిల్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య ఉమారాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. రమేష్ కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఇటీవల అతడి తల్లి మృతిచెందడంతో మానసికంగా మరింత కుంగిపోయాడు. గురువారం రమేష్ సొంత బామ్మర్ది వివాహం జరగాల్సి ఉండగా.. బుధవారం చిన్నరామచర్ల గ్రామంలో జరిగిన హాల్ది వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం రాత్రి కారులో రమేష్ ఆలేరులోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. గురువారం ఉదయం భార్య, కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రమేష్ స్పందించలేదు. దీంతో పక్కింటి వారికి చెప్పడంతో వారు వెళ్లి చూడగా.. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని రమేష్ కనిపించాడు. మృతుడి సోదరి చిన్నం స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. ఇదిలా ఉండగా రమేష్ ఆత్మహత్యతో గురువారం జరగాలి్సన అతడి బావమర్ది పెళ్లి నిలిచిపోయింది.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ దంపతుల దుర్మరణం
కర్నూలు జిల్లా: సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ.. సొంతిల్లు కట్టుకుని ఆనందంగా జీవిస్తున్న దంపతులను మృత్యువు మింగేసింది. కర్ణాటక సరిహద్దు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరిని మింగేసింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పట్టణంలోని తిరుమలనగర్ కాలనీకి చెందిన కార్పొరేషన్ బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి అమరేష్ సుమతి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు అనురాగ్(31), బళ్లారికి చెందిన ఐశ్యర్య కూడా ఒక్కగానొక్క కుమార్తె. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వీరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తూ సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. అనురాగ్ భార్యతో కలసి తల్లిదండ్రులను చూసేందుకు రెండు రోజుల క్రితం ఆదోనికి చేరుకున్నారు. బెంగళూరుకు తిరిగివెళ్తూ బళ్లారిలో ఉన్న ఐశ్యర్య తల్లిదండ్రులను పలకరించి వెళ్లాలనుకున్నారు. ఈ మేరకు ఇద్దరు బుధవారం సాయంత్రం కారులో వెళ్తుండగా కర్ణాటక రాష్ట్రం మోకా సమీపంలో శివపుర గ్రామశివారులో కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలపాలైన అనురాగ్ను వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు రెఫర్ చేశారు. కాగా మార్గమధ్యలో అనురాగ్ మృతి చెందాడు. బళ్లారిలో పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాలను ఆదోనికి తరలించారు. గురువారం ఆదోని లో అంత్యక్రియలు పూర్తి చేశారు. తిరుమలనగర్లో విషాదం అలుముకుంది.
కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
హైదరాబాద్: చార్మ్ బ్యూటీ స్పా సెంటర్పై దాడి చేసి ఆరుగురు మహిళలను, ఒక విటుడుని, నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్పల్లి పోలీసులు, యాంటి ఉమెన్ ట్రాఫిక్ సైబరాబాద్ టీం ఆధ్వర్యంలో దాడి చేశారు. భాగ్యనగర్కాలనీలోని చార్మ్ బ్యూటీ స్పా సెంటర్ను నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా విటులను ఆకర్షించి స్పా సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసుల దాడి చేసి ఆరుగురు మహిళలను, విటుడిని, ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేశారు. వారి నుంచి 4 స్మార్ట్ ఫోన్లు, రూ.9100 నగదు స్వా«దీనం చేసుకున్నారు. మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. జగద్గిరిగుట్టకు చెందిన నిర్వాహకురాలు (31), మలక్ పేటకు చెందిన సబ్ ఆర్గనైజర్ (36)ని, గుంటూరుకు చెందిన జయప్రకాష్ (25)లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
టెస్ట్ డ్రైవ్ పేరుతో బెంజ్ కారుతో జంప్
హైదరాబాద్: టెస్ట్ డ్రైవ్ పేరుతో తీసుకెళ్లిన విలాసవంతమైన కారును తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... 2024 డిసెంబర్ 16న అక్బర్ఖాన్ అనే వ్యక్తి సయ్యద్ అషా్ఫక్ అహ్మద్(66)కు చెందిన మెర్సిడెస్బెంజ్ జీఎల్ఏ 200డి (టీఎస్ 09 ఈఎక్స్ 8199) కారును టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకువెళ్లాడు. అనంతరం కారును తిరిగి ఇవ్వకపోగా మహమ్మద్ సఫీర్ అహ్మద్, కార్స్ గలోర్లతో కలిసి అక్బర్ఖాన్ ఆ కారును విక్రయించాడు. అయితే ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన రూ. 25 లక్షల్లో కేవలం రూ. 2.50 లక్షలు మాత్రమే చెల్లించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోవడంతో పాటు కారును కూడా తిరిగి ఇవ్వలేదు. పైగా సయ్యద్ అషా్ఫక్ అహ్మద్ను బెదిరించాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు
రెచ్చగొడుతున్న జనసైనికులు.. అర్ధరాత్రి ఉద్రిక్తత
ఇఫ్తార్ పార్టీలో కొడాలి నాని
ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. నీ కేసులన్నీ రీ ఓపెన్ చేయించలేకపోతే నా వృత్తినే వదిలేస్తా..
అయ్యా చంద్రబాబు.. ప్రధాని పదవి ఖాళీగా ఇరాన్ లో మాత్రమే ఉంది
ఎక్కువ తక్కువ మాట్లాడావంటే ఇంటికొచ్చి చెప్పుతీసి కొడతాం..
మీ కోడలిని కూడా ముగ్గురిని కనుమను.. బాబుపై అడ్వకేట్ రజిని నాన్ స్టాప్ సెటైర్లు
7 లక్షల మంది రైతులకు బిగ్ షాక్.. వ్యవసాయానికి బాబు ఉరి
అత్యంత శక్తివంత దేశాలను వణికిస్తున్న ఇరాన్.. అసలైన బలం అదే..!
పవన్ సినిమాకు భారీగా టికెట్ ధరల పెంపు
డోస్ పెంచిన అమెరికా.. పశ్చిమాసియాకు భారీగా బలగాలు
