కాక్రోచ్ జనతా పార్టీ.. అభిజిత్ దిప్కే ఇంటికి పోలీసుల భద్రత
ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ. సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చి కేవలం ఒక వారం వ్యవధిలోనే ప్రధాన పార్టీల సోషల్ మీడియా సభ్యత్వాన్ని దాటి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నివాసానికి పోలీసులు భద్రత కల్పించారు. అతని నివాసం వద్ద అవాంచనీయ ఘటనలు జరగకుండా నిరంతరం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీకేజీలు, విద్యా సంబంధిత సమస్యలపై మీమ్స్,రాజకీయ వ్యాఖ్యానాల ద్వారా గతవారం సోషల్మీడియాలో పురుడుపోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ కొద్ది రోజుల్లోనే రెండుకోట్లకు పైగా ఫాలోవర్స్ను దాటిపోయింది. సీజేఐ ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన వాఖ్యల నేపథ్యంలో ఈ పార్టీ ఆవిర్భావం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతాపార్టీ సంచలనం సృష్టిస్తున్ననేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఇంటికి పోలీసులు రక్షణ కల్పించారు. అతని నివాసం వద్ద రద్దీ లేకుండా చూసేందుకు, ఎంఐడీసీ వాలుజ్ ప్రాంతంలోని ఆయన నివాసానికి తాము ఇరవై నాలుగు గంటల సాధారణ పోలీసు భద్రతను కల్పించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంకజ్ అతుల్కర్ తెలిపారు. అంతేకాని ఎటువంటి బెదిరింపులు దీనికి కారణం కాదని పేర్కొన్నారు. కాగా కాక్రోచ్ జనతా పార్టీకి పాకిస్థాన్, బిలియనీర్ జార్జ్ సోరోస్ నెట్వర్క్ల నుంచి మద్దతు లభిస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఈ ఆరోపణలను కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఖండించారు. మా పార్టీకి పాకిస్థాన్తో ఎలాంటి సంబంధం లేదు. కేంద్రమంత్రి చేసిన ఆరోపణలు నిరాదారమైనవన్నారు. పార్టీ ఉద్దేశ్యం కేవలం భారతీయ ప్రజల సమస్యలను వినిపించడం, యువతలో అవగాహన పెంచడమేనని స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీకి కేవలం భారత్లోనే 94శాతం మంది ఫాలోవర్స్ ఉన్నారని తెలిపారు. పార్టీ డిజిటల్ ఉద్యమంపై విస్తృతమైన అణచివేత జరుగుతోందని, తమ సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ, వెబ్సైట్ను తొలగించారని లేదా హ్యాక్ చేశారని, దీంతో తమ అధికారిక వేదికల్లో దేనికీ తమకు ప్రాప్యత లేకుండా పోయిందని అభిజిత్ దిప్కే ఆరోపించారు.
ఫల్తా రీపోలింగ్లో బీజేపీ లక్ష ఓట్ల తేడాతో ఘన విజయం.. ఇక టీఎంసీ..
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం రీపోలింగ్లో బీజేపీ భారీ విజయం సాధించింది. ఫల్తా స్థానానికి గురువారం (మే 21) రీపోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవాంగ్షు పాండా తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి శంభు నాథ్ కుర్మీపై లక్షకు పైగా (1,09,021) ఓట్ల తేడాతో గెలిచారు.తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, తనను తాను ‘‘పుష్ప’’గా చెప్పుకున్న జహంగీర్ ఖాన్ గత వారం రీపోలింగ్ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ‘‘పుష్ప’’ సంగతి తాను చూసుకుంటానని ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా అన్నారు. ‘‘పుష్ప’’ సినిమాలో అల్లు అర్జున్లా జహంగీర్ ఖాన్ తనను తాను పోల్చుకునేవారు. అందుకే ఆయనను ‘‘పుష్ప’’ అని అంటుంటారు.ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్ సమయంలో ఓటింగ్ యంత్రాల్లో జోక్యం జరిగిందన్న ఆరోపణలు, ఎన్నికల అక్రమాల ఫిర్యాదుల తర్వాత ఈ నియోజకవర్గంలోని మొత్తం 285 బూత్లలో రీపోలింగ్ నిర్వహించారు. గురువారం జరిగిన రీపోలింగ్లో మొత్తం 2.36 లక్షల ఓటర్లలో 87 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.రీపోలింగ్ సందర్భంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఈ నియోజకవర్గంలో భద్రతను రెట్టింపు చేశారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరిపేందుకు కేంద్ర బలగాల 25 కంపెనీలను మోహరించారు.ఫల్తా నియోజక వర్గం తృణమూల్కు బలమైన కోటగా ఉండేది. లోక్సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆధిపత్యం ఉన్న డైమండ్ హార్బర్ పరిధిలో ఈ స్థానం ఉంది. 2011 నుంచి ఈ స్థానంలో తృణమూల్ గెలుస్తోంది. అయినప్పటికీ తృణమూల్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ కొన్ని రోజుల ముందే పోటీ నుంచి తప్పుకున్నారు.ఈ ఎన్నికలో దేవాంగ్షు పాండా (బీజేపీ)తో పాటు అబ్దుర్ రజాక్ మోల్లా (కాంగ్రెస్), శంభు నాథ్ కుర్మీ (సీపీఎం), ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. పాండాకు 1,49,666 ఓట్లు, కుర్మీకి 40,645 ఓట్లు, మోల్లాకు 10,084 ఓట్లు, ఖాన్కు 7,783 ఓట్లు వచ్చాయి. ఖాన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ అప్పటికే నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ కూడా అయిపోవడంతో ఆయన పేరు, టీఎంసీ గుర్తు ఈవీఎంలపై ఉంది.రీపోలింగ్కు రెండు రోజుల ముందు జహంగీర్ ఖాన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫల్తా ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చినందుకు తాను పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చారు. జహంగీర్ ఖాన్ నిర్ణయంతో తమకు సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. “బీజేపీ బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం” అని పేర్కొంది.
ప్రెగ్నెన్సీలో హారర్ సీన్ చూసి భయపడ్డా.. అబార్షన్ అయింది: ఉదయభాను
ఉదయభాను..ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్. ఆమె ఎనర్జీ, స్టైల్, మాటతీరుతో టెలివిజన్ రంగంలో ప్రత్యేకమైన ట్రెండ్ చేసిన యాంకర్ ఆమె. డాన్స్ బేబీ డాన్స్, సాహసం చేయరా ఢింభకా, ఢీ లాంటి షోల విజయంలో ఉదయభాను కీలక పాత్ర పోషించింది. అయితే పెళ్లి తర్వాత ఆమె ఎక్కువ షోలు చేయలేకపోయింది. ఇక పిల్లలు(ట్విన్స్) పుట్టిన తర్వాత కొన్నాళ్ల పాటు పూర్తిగా బుల్లితెరకు, వెండితెరకు దూరమైంది. చాలాకాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ముఖానికి మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వస్తోంది. ఒకవైపు సినిమాలతో పాటు కొన్ని ఈవెంట్స్కి హోస్ట్గాను చేస్తోంది. అయితే తన మొదటి ప్రాధాన్యత మాత్రం పిల్లలు, కుటుంబమే అంటోంది ఉదయ భాను. పిల్లలే తన ప్రపంచం అని.. వాళ్ల కోసం ఏదైనా వదులుసుకుంటానని చెబుతోంది. తాజాగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో పడిన బాధల గురించి, అంతకు ముందు జరిగిన అబార్షన్ గురించి చెబుతు ఎమోషనల్ అయింది.విమానం ఎక్కేముందు తెలిసిందిపెళ్లి తర్వాత కూడా నేను వరుస ఈవెంట్స్తో బిజీ అయిపోయాను. ఓ సారి ఈవెంట్ కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అంతా రెడీ చేసుకొని వెళ్లే ముందు డౌట్ వచ్చి చెక్ చేసుకుంటే నేను గర్భం దాల్చిన విషయం తెలిసింది.వెంటనే వైధ్యులను సంప్రదించా. ఫ్లైట్ జర్నీ చేయొచ్చా లేదా? అని అడిగా. ఏం పర్లేదు.. వెళ్లమని డాక్టర్లు చెప్పారు. అక్కడకు వెళ్లిన తర్వాత వరుస ఈవెంట్స్ చేశాను. చాలా అలసిపోయా. మరుసటి రోజు ఆస్పత్రికి వెళ్లా.అక్కడ చెక్ చేసి బేబీ ఆరోగ్యం చాలా బాగుందని చెప్పారు.ఫ్లోర్ మొత్తం రక్తమే.. నాకు హారర్ సినిమాలంటే చాలా భయం. అస్సలు చూడలేను. భయపడే సీన్స్ వస్తే కళ్లు, చెవులు మొత్తం మూసుకుంటా. ఓ రోజు అమెరికాలోనే కజిన్స్, ఫ్రెండ్స్ హారర్ సినిమా చూస్తున్నారు. అప్పుడు నేను కూడా ఇంట్లోనే ఉన్నా. కానీ సినిమా మాత్రం చూడనని చెప్పేశా. అనుకోకుండా ఆ సినిమాలో ఓ సీన్ చూశా. చాలా భయపడిపోయా. నా బాడీతో ఏదో తేడా వచ్చిందనే విషయం అర్థమవుతుంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాం.డాక్టర్లు ఏదేదో చెక్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటేది చెప్పట్లేదు. నాకు పెద్ద ఎత్తున రక్తస్త్రావం జరుగుతోంది. ఫ్లోర్ మొత్తం బ్లడ్తో నిండిపోయింది. కాసేపటి తర్వాత మిస్ క్యారీ(అబార్షన్) అయిందని చెప్పారు.ఏడాది పాటు డిప్రెషన్.. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ప్రెగ్నెంట్ విషయం తెలియగానే చాలా ఆనంద పడ్డాను. కానీ అనుకోకుండా మిస్ క్యారీ కావడంతో చాలా బాధపడ్డా. ఏడాది పాటు డిప్రెషన్లోకి వెళ్లా. కానీ ఆ భగవంతుడు నాకు సహాయం చేశాడు. ఏడాది తర్వాత మళ్లీ గర్భవతిని అయ్యాను. టెస్ట్ చేస్తే కలవలు అని తెలిసింది. మా ఆనందం డబుల్ అయింది. వెంటనే ఈవెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నా. నేను చేస్తున్న షో కూడా రద్దు చేసుకున్నా. దాదాపు మూడేళ్ల పాటు నేను దేని గురించి ఆలోచించలేదు. ట్రావెల్ చేయడం వల్లే అబార్షన్ అయిందనే అనుమానంతో ఎక్కడకు వెళ్లలేదు. ప్రెగ్నెంట్ సమయంలో 100 కిలోల బరువు పెరిగాను. పొట్టలో ఇద్దరు 3 కిలోల చొప్పున ఉండడంతో బెడ్ మీద నుంచి దిగలేకపోయా. ఒక పక్క నుంచి మరో పక్కకు తిరగానికే దాదాపు 15 నిమిషాల సమయం పట్టేది. డెలివరీ కాస్త ముందుగానే చేసుకోమని వైద్యులు చెప్పారు. కానీ ఎంత బాధనైన భరిస్తా.. సరైన సమయానికే సర్జరీ చేయమని చెప్పా. పిల్లలు పుట్టాక నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు వాళ్లే నా ప్రపంచం’ అని ఉదయభాను చెప్పుకొచ్చింది.
90% మార్కులతో పాసైనా పొడిచేదేం లేదు: పూరీ జగన్నాథ్
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’ తాజా ఎపిసోడ్లో ప్రస్తుత విద్యా విధానం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఫ్యూచర్ ఎడ్యుకేషన్' అనే అంశంపై మాట్లాడుతూ.. నేటి స్కూళ్లు పిల్లలపై అధిక ఒత్తిడి పెంచి వారిని డిప్రెషన్లోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం ప్రస్తుత విద్యావిధానం కేవలం మార్కులు, ఎగ్జామ్స్, కాంపిటీషన్ మీద దృష్టి పెట్టి విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. పిల్లలకు చిన్న వయసులోనే నైతిక విలువలు,సమయపాలన, సర్వైవల్ స్కిల్స్ నేర్పాలని ఆయన సూచించారు. అలాగే డిజిటల్ డిసిప్లిన్, మెడిటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో 90% మార్కులు తెచ్చుకున్నా ఆ విద్యార్థికి జీవితంలో దాని ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ క్యారెక్టర్, మనోస్థైర్యం, సంస్కారం నేర్పితే వారు మంచి పౌరులుగా తయారవుతారని పూరీ స్పష్టం చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను ప్రస్తావిస్తూ.. ప్రతి సంవత్సరం 13,000–15,000 మంది విద్యార్థులు అకాడమిక్ ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరగా.. చదువు కంటే ముఖ్యం సంస్కారం. భవిష్యత్ విద్యావ్యవస్థ పిల్లలకు మనోస్థైర్యం, నైతిక విలువలు, స్వీయ నియంత్రణ నేర్పేలా ఉండాలని పూరీ జగన్నాథ్ కోరుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పూరి-విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. దానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్ని కూడా ఖరారు చేశారు. కానీ దానికి సంబంధించిన ఎలాంటి గ్లింప్స్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు విడుదల కాలేదు. దాని తరువాత సూర్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఫైనల్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పూరి స్టైల్ లో సూర్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి మాస్ ఎంటర్టైనర్ వస్తుందో చూడాలి.
90% మార్కులతో పాసైనా పొడిచేదేం లేదు: పూరీ జగన్నాథ్
విజయంతో ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్
‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’
ముగిసిన లీగ్ దశ.. ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే
ఎమ్మెల్యే పులవర్తికి ‘చెప్పు’ చూపించిన మరో కూటమి నేత
పంజాబ్ చేజేతులా.. నిరీక్షణ ఇంకెన్నాళ్లు!
అప్పటివరకు ఇంతే..: మరో బాంబ్ పేల్చిన ట్రంప్
నన్ను జాబ్ నుంచి తొలగించండి.. మెటా ఉద్యోగిని
హీరోయిన్ పనివాళ్ల కోసం రూ.51 కోట్ల విలువైన ఫ్లాట్స్?
ఉండవల్లి రైతుల కీలక తీర్మానం
’వద్దే వద్దు’.. త్రిషాకు సీఎం విజయ్ చెక్..!
బంగారం, వెండిపై కియోసాకి కొత్త అంచనాలు!
రీ–వెరిఫికేషన్లో టెన్త్ విద్యార్థినికి జీరో మార్కులు..!
వారిద్దరూ అద్భుతం.. ఎంత పొగిడినా తక్కువే: కమిన్స్
చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ బౌలర్
సాక్షి కార్టూన్ 23-05-2026
మే 23.. నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు : నాగార్జున
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి ఇండియన్గా
BCCI: వరల్డ్కప్ ఓపెనర్ రేసులో ఊహించని పేరు!
అర్జున్ టెండూల్కర్కు ఘోర అవమానం
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇరాన్ సంచలన ప్రకటన
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
హార్ముజ్ను మింగేస్తున్న ‘ఎల్లో ఫ్లీట్’
విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు
కాంగ్రెస్ టార్గెట్.. స్టాలిన్ కీలక నిర్ణయం
ఈ రాశి వారికి భూలాభాలు.. యత్నకార్యసిద్ధి
కీలక మ్యాచ్లో తుస్సుమన్న వైభవ్ సూర్యవంశీ
90% మార్కులతో పాసైనా పొడిచేదేం లేదు: పూరీ జగన్నాథ్
విజయంతో ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్
‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’
ముగిసిన లీగ్ దశ.. ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే
ఎమ్మెల్యే పులవర్తికి ‘చెప్పు’ చూపించిన మరో కూటమి నేత
పంజాబ్ చేజేతులా.. నిరీక్షణ ఇంకెన్నాళ్లు!
అప్పటివరకు ఇంతే..: మరో బాంబ్ పేల్చిన ట్రంప్
నన్ను జాబ్ నుంచి తొలగించండి.. మెటా ఉద్యోగిని
హీరోయిన్ పనివాళ్ల కోసం రూ.51 కోట్ల విలువైన ఫ్లాట్స్?
ఉండవల్లి రైతుల కీలక తీర్మానం
’వద్దే వద్దు’.. త్రిషాకు సీఎం విజయ్ చెక్..!
బంగారం, వెండిపై కియోసాకి కొత్త అంచనాలు!
రీ–వెరిఫికేషన్లో టెన్త్ విద్యార్థినికి జీరో మార్కులు..!
వారిద్దరూ అద్భుతం.. ఎంత పొగిడినా తక్కువే: కమిన్స్
చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ బౌలర్
సాక్షి కార్టూన్ 23-05-2026
మే 23.. నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు : నాగార్జున
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి ఇండియన్గా
BCCI: వరల్డ్కప్ ఓపెనర్ రేసులో ఊహించని పేరు!
అర్జున్ టెండూల్కర్కు ఘోర అవమానం
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇరాన్ సంచలన ప్రకటన
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
హార్ముజ్ను మింగేస్తున్న ‘ఎల్లో ఫ్లీట్’
విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు
కాంగ్రెస్ టార్గెట్.. స్టాలిన్ కీలక నిర్ణయం
ఈ రాశి వారికి భూలాభాలు.. యత్నకార్యసిద్ధి
కీలక మ్యాచ్లో తుస్సుమన్న వైభవ్ సూర్యవంశీ
ఫొటోలు
మృణాల్ని ఇంత అందంగా చూసుండరేమో! (ఫొటోలు)
'పాటశాల' ఈవెంట్లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
తమిళ స్టార్ హీరోలతో మహేశ్ క్రికెట్ ఆడితే? (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 24-31)
'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో విజేతలుగా వాసంతి- కల్యాణ్ (ఫోటోలు)
కరుప్పు సక్సెస్: కేక్ కట్ చేసిన త్రిష (ఫోటోలు)
చీరలో చందమామలా సమీరా(ఫోటోలు)
రామ్చరణ్ 'పెద్ది కీ ఆవాజ్' ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ (ఫోటోలు)
భర్తతో కలిసి ఆఫ్రికా ట్రిప్లో హీరోయిన్ మెహ్రీన్ (ఫొటోలు)
కమెడియన్ అవినాష్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
సినిమా
త్రిష వీకెండ్ మూడ్.. మృణాల్ మెరుపులు
వీకెండ్ మూడ్లో తమిళ హీరోయిన్ త్రిషమెరిసిపోతున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకుర్సన్నగా మారిపోయి షాకిచ్చిన హెబ్బా పటేల్ముద్దొచ్చేంత అందంగా బుట్టబొమ్మ పూజా హెగ్డేఆషికా రంగనాథ్ ఈ వారం గడిచిందిలాక్యూట్ లుక్స్తో మలయాళ హీరోయిన్ నజ్రియా View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani)
ఇప్పుడా సినిమా తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి
పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తీస్తున్న 'డ్రాగన్' మూవీతో బిజీగా ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే తారక్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ లాంటి మూవీ అంటే అందరూ చెప్పేది 'టెంపర్' గురించే. ఇప్పుడా చిత్రం గురించి నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాజాగా నటుడు రాజా రవీంద్రతో చేసిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు)'ఎన్టీఆర్ కెరీర్లో రెండు సూపర్ హిట్స్ ఇచ్చాను. 'బాద్షా' ముందు ఆయనకు ఫ్లాపులు ఉన్నాయి. ఆ రోజుకి ఎన్టీఆర్ కెరీర్ 'బాద్షా' బిగ్గెస్ట్ హిట్. దాని తర్వాత 'రామయ్య వస్తావయ్యా' అనే డిజాస్టర్ చేశారు హరీశ్ శంకర్తో. తర్వాత 'రభస' అనే అట్టర్ఫ్లాప్ తీశారు. తర్వాత 'టెంపర్' అనే బ్లాక్బస్టర్ తీశాను. ఈ కథ వక్కంతం వంశీ చెప్పగానే.. ఇది పెద్ద హిట్టవుద్దిరా వంశీ అని చెప్పి.. నేను దాన్ని పూరీ దగ్గరకు తీసుకెళ్లా. పూరీ స్టోరీ వినగానే ఇది నీకు మరో 'గబ్బర్సింగ్' అని అన్నాడు. ఆ సినిమా ఇప్పుడు గనక తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి. హీరో కూడా ఫెర్ఫార్మెన్స్ చింపి చాటేశాడు' అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు.2015లో రిలీజైన 'టెంపర్' ముందు వరకు ఎన్టీఆర్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉండేది. ఒక సినిమా అయితే వరసగా ఫ్లాప్లులు ఎదురయ్యేవి. 'టెంపర్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ మాట్లాడుతూ.. ఇకపై అభిమానులు కాలర్ ఎత్తుకునేలాంటి మూవీస్ చేస్తానని అన్నాడు. అందుకు తగ్గట్లే మాట మీద నిలబడుతూ వచ్చాడు. కానీ ఈ సెంటిమెంట్ని గతేడాది రిలీజైన 'వార్ 2' దారుణంగా బ్రేక్ చేసింది. ఘోరాతీ ఘోరంగా ఫ్లాప్ అయింది. సాధారణంగా పూరీ జగన్నాథ్ తాను తీసే సినిమాల్లో వేరొకరి స్టోరీ ఉపయోగించుకోడు. కానీ 'టెంపర్' కోసం ఆ సెంటిమెంట్ పక్కనబెట్టాడు. అటు పూరీ, ఇటు ఎన్టీఆర్.. ఇద్దరూ ఈ మూవీతో అదిరిపోయే సక్సెస్ కొట్టారు.(ఇదీ చదవండి: ఇలాంటి టాక్తో 'దృశ్యం 3'కి రూ.100 కోట్ల కలెక్షన్ ఎలా సాధ్యం?)Temper cinema ippudu teesthe 1000 kotlu Chestundi– Producer Bandla Ganesh pic.twitter.com/iNvrla8Nev— cinee worldd (@Cinee_Worldd) May 24, 2026
లుక్ కోసం ప్లాస్టిక్ సర్జరీ.. అవికా గోర్ ఏమన్నారంటే..?
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్తో చిన్న వయసులోనే స్టార్డమ్ అందుకున్న నటి అవికా గోర్. ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ..తొలి చిత్రంతోనే భారీ హిట్ని అందుకుంది. ఆ తర్వాత ఇక్కడ వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. గతేడాదిలో పెళ్లి కూడా చేసుకుంది. అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ అవికాను ఇంకా ‘చిన్నారి పెళ్లికూతురు’గానే చూస్తారు. తాజాగా ఈ బ్యూటీ ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అందమైన లుక్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే పుకార్లపై స్పందించింది. లుక్ కోసం తాను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదని స్పష్టం చేసింది.మొటిమల కోసం ట్రీట్మెంట్ తీసుకున్నాలుక్ కోసం నేనెప్పుడు ట్రీట్మెంట్ తీసుకోలేదు. నా జీవితంలో ఒకే ఒక్కసారి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా. అది కూడా మొటిమలు పోగోట్టుకోవడానికి. టీనేజ్లో నా ముఖంపై చాలా మొటిమలు ఉండేవి. వాటిని తొలగించుకునేందుకు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా. అది కూడా సరిగా వర్కౌట్ అవ్వలేదు(నవ్వుతూ). ఇప్పటికీ నా ముఖంపై మొటిమలు ఉన్నాయి. సర్జరీలు ఏం చేసుకోలేదు కానీ..స్కీన్ పాడవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నా. నేనే కాదు ప్రతి ఒక్క నటీనటులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. నేను 7 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చా. చిన్నప్పటి నుంచే మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. అందుకే సన్స్క్రీన్ ఎక్కువగా వాడేదాన్ని.అమ్మ తిట్టేది.. లుక్ కోసం ట్రీట్మెంట్ కాదు..కనీసం నా హెయిర్ కట్ చేసుకుంటా అని చెప్పిన అమ్మ తిట్టేది. ఇక టాటూ వేసుకుంటా అన్నప్పుడు అయితే పెద్ద గొడవే జరిగింది. అలాంటిది నేను లుక్ కోసం ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటా? వయసు పెరిగేకొద్ది మన ముఖంలో మార్పులు వస్తాయి. నేను చిన్నప్పటి నుంచే అందరికి తెలియడంతో పెద్దయ్యాక నా ముఖంలో వచ్చిన మార్పులు చూసి సర్జరీ చేయించుకుందనే పుకార్లను సృష్టించారు. అంతేకాదు నేను బరువు పెరిగి తగ్గడం వల్ల కూడా ఇలాంటి పుకార్లకు కారణం అయింది. అందులో ఏమాత్రం వాస్తవం లేదు’ అని అవికా స్పష్టం చేసింది.
హీరో పక్కన నీ ఏడుపేంటి?.. దృశ్యం నటిపై ట్రోలింగ్
ఎస్తర్ అనిల్.. మలయాళంలో అనేక సినిమాలు చేసినప్పటికీ దృశ్యం నటిగానే ఎక్కువ ఫేమస్. దృశ్యం మూడు భాగాల్లోనూ హీరో చిన్న కూతురిగా నటించింది. మలయాళంతో పాటు తెలుగు దృశ్యం మూవీలోనూ యాక్ట్ చేసింది. ఇకపోతే మోహన్లాల్ దృశ్యం 3 ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే! ఈ సినిమా ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఏడ్చేసిన దృశ్యం నటిఇక సినిమా రిలీజైనరోజు చిత్రయూనిట్ థియేటర్కు వెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్ కళ్లారా చూసింది. ఈ సమయంలో మోహన్లాల్ పక్కనే కూర్చున్న ఎస్తర్ సంతోషంతో ఏడ్చేసింది. తనకు తెలియకుండా వస్తున్న కన్నీళ్లను తుడుచుకునే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియో కింద ఓ నెటిజన్ ఎస్తర్కు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. నటి కౌంటర్డియర్.. ఆయన కెరీర్లో ఇలాంటివి చాలా చూశాడు.. ఇంతకంటే పెద్ద విజయాలు కూడా అందుకున్నాడు. కానీ, నువ్వేంటి? ఆయన పక్కన ఇలా ఏడుస్తూ కూర్చున్నావ్? అని సెటైర్ వేశాడు. ఈ కామెంట్ ఎస్తర్ కంట పడింది. దాన్ని అలాగే చూసి వదిలేయలేదు. మధ్యలో నీకేంటి సమస్య? అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు అతడికి బాగా బుద్ధి చెప్పావ్ అని నటికి సపోర్ట్ చేస్తున్నారు.చదవండి: 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎవరూ గుర్తుపట్టట్లే.. ఇంకెందుకు బతకడం?: నటి
క్రీడలు
ప్లే ఆఫ్స్కు రాజస్తాన్.. ఇంటికి పంజాబ్, కేకేఆర్
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది . ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 30 పరుగుల తేడాతో విజయం రాజస్తాన్(16 పాయింట్లు).. నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాయి.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్తాన్ ఇన్నింగ్స్లో ధ్రువ్ జురెల్(38), జోఫ్రా ఆర్చర్(32) జడేజా(19), శనక(29) రాణించారు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, శార్థూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, ఘజన్ఫర్,బాష్ తలా వికెట్ సాధించారు.నిప్పులు చెరిగిన ఆర్చర్అనంతరం 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్(60), హార్దిక్ పాండ్యా(34) క్రీజులో ఉన్నప్పుడు గెలిచేలా కన్పించిన ముంబై .. వారిద్దరూ వరుస క్రమంలో అవుట్ కావడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఇక రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగాడు. మూడు వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బతీశాడు. అతడితో పాటు బర్గర్, యశ్రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. మే 27న ముల్లాన్పూర్ వేదికగా జరగనున్న ఎలిమినేటర్లో సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది.
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ధ్రువ్ జురేల్కు క్యాచ్ ఇచ్చిన రోహిత్ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ డకౌట్తో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు సున్నా పరుగులకే అవుట్ అయిన ఆటగాడిగా గ్లెన్ మాక్స్వెల్తో కలిసి రోహిత్ శర్మ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఐపీఎల్లో ఇప్పటివరకు మొత్తం 19 సార్లు డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన గ్లెన్ మాక్స్వెల్ కూడా 19 డకౌట్లతో రోహిత్ శర్మతో పాటే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. వీరి తర్వాత దినేష్ కార్తీక్, సునీల్ నరైన్ చెరో 18 డకౌట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే స్పిన్ బౌలర్లు పియూష్ చావ్లా, రషీద్ ఖాన్ లు కూడా చెరో 16 సార్లు సున్నా పరుగులకే అవుటయ్యి ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే ముంబై ఇండియన్స్పై రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకు పరిమితమైంది. ముంబైపై విజయంతో రాజస్తాన్ ప్లేఆఫ్స్ చేరుకోగా ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్, కేకేఆర్లు కూడా లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి.చదవండి: 'మోసగాడు.. వచ్చాడు 18 కోట్లు పట్టుకెళ్లాడు!'
IPL 2026: కేకేఆర్పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
కోల్కతా వేదికగా జరిగిన సీజన్ చివరి మ్యాచ్లో కేకేఆర్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రహానే (63) అర్థసెంచరీ సాధించగా, పావెల్ (29), మనీశ్ పాండే (25) పర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఎన్గిడి చెరో మూడు వికెట్లతో విజృంభించగా, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60) అర్థశతకంతో రాణించాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కేకేఆర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మొదట రహానే (63) ఔటవ్వగా, మరుసటి బంతికి రింకూ సింగ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. 14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. పావెల్ (15), తేజస్వి (1) పరుగుతో ఆడుతున్నారు.13 ఓవర్లలో కేకేఆర్ 123/313 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. రహానే (59), రోవ్మెన్ పావెల్ (14) పరుగులతో క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ 87 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన మనీశ్ పాండే ఎన్గిడి బౌలింగ్లో మిచెల్ స్టార్క్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. రహానే (45), కామెరున్ గ్రీన్ (1) పరుగులతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన ఓపెనర్ ఫిన్ అలెన్ ఎన్గిడి బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. రహానే (23), మనీశ్ పాండే (4) పరుగులతో ఆడుతున్నారు.కేకేఆర్ టార్గెట్ 204 పరుగులురాజస్తాన్ ప్లేఆఫ్స్కు చేరడంతో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నామమాత్రంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60) అర్థసెంచరీతో తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (39), డేవిడ్ మిల్లర్ (28), అశుతోశ్ శర్మ (18 నాటౌట్) రాణించడంతో ఢిల్లీ 200 పరుగుల మార్క్ను దాటింది. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్లు తలా ఒక వికెట్ పడగొట్టారు.హాఫ్ సెంచరీ బాది కేఎల్ రాహుల్ ఔట్ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 30 బంతులకే హాఫ్ సెంచరీ బాది జోరు మీదున్న కేఎల్ రాహుల్ అనుకుల్ రాయ్ బౌలింగ్లో రోవ్మన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఢిల్లీ స్కోరు 14 ఓవర్లకు 135-3గా ఉంది.మరో వికెట్ డౌన్ఢిల్లీ క్యాపిటల్స్ మరో వికెట్ కోల్పోయింది. సాహిల్ పరాఖ్ 24 పరుగులు చేసి, సునిల్ నరైన్ బౌలింగ్లో అజింక్యా రహానెకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఢిల్లీ స్కోరు 10 ఓవర్లకు 88-2గా ఉంది. 8 ఓవర్లలో ఢిల్లీ 70/18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. సాహిల్ పరాఖ్ (15), కేఎల్ రాహుల్ (31) పరుగులతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీకేకేఆర్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన అభిషేక్ పొరేల్ సౌరభ్ దూబే బౌలింగ్లో తేజస్వీ దహియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది.టాస్ గెలిచిన కేకేఆర్టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కేకేఆర్కు చాలా కీలకం. కాగా ఢిల్లీ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. ముకేశ్ కుమార్, కుల్దీప్ స్థానంలో అకిబ్ నబీ, త్రిపురానా జట్టులోకి వచ్చారు. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 36 సార్లు తలపడితే ఢిల్లీ 15 సార్లు, కేకేఆర్ 21 సార్లు నెగ్గాయి. సీజన్ తొలి అంచె పోటీల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.పంజాబ్, రాజస్తాన్లు ప్లేఆఫ్ రేసులో ఉన్నప్పటికీ కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో, ఢిల్లీ విధించే టార్గెట్ను 13 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది.ఢిల్లీ క్యాపిటల్స్: అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి నిగిడి.కోల్కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే(కెప్టెన్), మనీష్ పాండే, కెమెరూన్ గ్రీన్, రోవ్మన్ పావెల్, రింకు సింగ్, తేజస్వి దహియా(వికెట్కీపర్), అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, సౌరభ్ దూబే, వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి.🚨 TOSS update from Kolkata🚨@KKRiders won the toss and will bowl first against @DelhiCapitals Updates ▶️ https://t.co/Uo07zwiknq#TATAIPL | #KhelBindaas | #KKRvDC pic.twitter.com/BS2ulpHJIT— IndianPremierLeague (@IPL) May 24, 2026
'మోసగాడు.. వచ్చాడు 18 కోట్లు పట్టుకెళ్లాడు!'
శ్రీలంక క్రికెటర్ మతీశా పతీరానా ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా ముద్రపడిన పతీరానాను రూ. 18 కోట్లు పెట్టి కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న పతీరానా సీజన్లో కేకేఆర్ ఆడిన 12 మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న పతీరానా గుజరాత్ టైటాన్స్తో జరిగిన గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. వచ్చీ రావడంతోనే తన ప్రతాపం చూపిస్తాడని అంతా భావించారు. కానీ విధి వింత నాటకం ఆడింది. గుజరాత్తో మ్యాచ్లో 8 బంతులు వేసిన అనంతరం పతీరానాకు కాలి పిక్క కండరాలు పట్టేయడంతో పెవిలియన్ చేరాడు. తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పతీరానా కేకేఆర్ జట్టును వీడి స్వదేశానికి వెళ్లిపోయినట్లు ఆ జట్టు ఫ్రాంచైజీ ఆదివారం తెలిపింది. ఇవాళ కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్తో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పతీరానా స్థానంలో లవ్నిత్ సిసోడియాతో భర్తీ చేయనున్నట్లు కేకేఆర్ తెలిపింది.ఈ సీజన్లో తన బౌలింగ్తో కేకేఆర్కు ఎక్స్-ఫ్యాక్టర్గా మారతాడని భావించిన కేకేఆర్కు నిరాశే మిగిలింది. పైగా ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్క మ్యాచ్ ఆడినా ఆటగాడికి మొత్తం పారితోషికం చెల్లించాల్సిందే. ఈ లెక్కన పతీరానా సీజన్లో ఒక్క మ్యాచ్లోనే ఆడినప్పటికీ అతనికి రూ. 18 కోట్లు దక్కనున్నాయి. దీంతో కేకేఆర్ అభిమానులు పతీరానాపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పతీరానా ఒక మోసగాడు.. కోలుకున్నానని అబద్ధం చెప్పి సర్టిఫికేట్ చూపించాడు.. కేకేఆర్ తరఫున ఈ సీజన్లో ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన పతీరానా డబ్బు మూటతో లంకకు వెళ్లిపోయాడు.. ఏం లాభం వచ్చాడు.. 18 కోట్లు పట్టుకెళ్లాడు.' అంటూ కామెంట్లు చేశారు.చదవండి: ‘హమ్మయ్య ఔట్ చేశా’.. వైభవ్ అంటే అంత భయమా?
న్యూస్ పాడ్కాస్ట్
యుద్ధమా? ఒప్పందమా?... ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో పగిలిన అక్రమాల పుట్ట... ఎస్సీఆర్టీ నుంచే కుంభకోణం..
అమరావతిలో చంద్రబాబు లూటీ... అవినీతి, దోపిడీతో ఎప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు.
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో దోపిడీ విజన్, స్కామ్కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
బిజినెస్
పెట్రోల్ కష్టాలకు చెక్.. వచ్చేస్తోంది కొత్త కారు!
వియత్నాంకు చెందిన ఈవీ తయారీ సంస్థ విన్ఫాస్ట్.. భారతదేశంలో కొత్త తరం విన్ఫాస్ట్ VF8 ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఇది లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ క్యాబిన్.. మెరుగైన టెక్నాలజీ వంటివి పొందుతుంది. కంపెనీ దీనికోసం మే 27 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు జులై నుంచి ప్రారంభమవుతాయి.విన్ఫాస్ట్ VF8 మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారు ముందు భాగంలో వింగ్స్ ఆకారంలో ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్, వీ షేప్ లైటింగ్ ఎలిమెంట్తో అనుసంధానమై ఉంటాయి. దీనితో పాటు పెద్ద గ్లాస్-బ్లాక్ ఫేషియా కూడా ఉంటుంది. బంపర్లో పెద్ద ఎయిర్ ఛానెల్స్ కూడా ఉన్నాయి, ఇవి ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇక్కడ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మరింత స్పోర్టీ లుక్ అందిస్తుంది. వెనుక డిజైన్ను కూడా కనెక్టెడ్ V-ఆకారపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.విన్ఫాస్ట్ VF8 పూర్తిగా కొత్త డిజైన్ క్యాబిన్ను పొందుతుంది. డాష్బోర్డ్లో 12.9 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉంది. ఈ కారు కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్-కాలమ్పై అమర్చిన గేర్ సెలెక్టర్ను కూడా పొందుతుంది. ఎయిర్ ప్యూరిఫికేషన్తో కూడిన డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ ఫంక్షన్తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, రిక్లైనింగ్ రియర్ సీట్లు, వైర్లెస్ కనెక్టెడ్ టెక్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, మరియు 8-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ ఎన్నో ఇందులో ఉన్నాయి.ఈ ఎలక్ట్రిక్ SUVలో ఏడీఏఎస్ ఫీచర్లు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, హైవే అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా సెటప్ కూడా ఉన్నాయి. ఈ కారులో 60.13 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 500 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో ఎలక్ట్రిక్ మోటారు.. 228 హార్స్ పవర్, 330 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అయితే సంస్థ ఈ కారు ధరలను త్వరలోనే వెల్లడించనుంది.ఇదీ చదవండి: 2026 హోండా సిటీ: 27 కిమీ/లీ మైలేజ్!
ఆలియా ఉన్న హోటల్.. ఒక్కరోజుకు రూ.8.6 లక్షలా?!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సినిమా కార్యక్రమాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఫ్రాన్స్లోని అందమైన సముద్రతీర నగరం కేన్స్లో ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు, దర్శకులు, ఫ్యాషన్ ప్రముఖులు రెడ్ కార్పెట్పై మెరిసిపోతారు. ఈ ఏడాది భారతీయ నటి అలియా భట్ ధరించిన సాఫ్ట్ బ్లష్ గౌన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.ఈ ఫెస్టివల్కు హాజరయ్యే ప్రముఖులు ఎక్కువగా దిగే హోటళ్లలో 'హోటల్ మార్టినెజ్' ఒకటి. ఇది కేవలం ఒక విలాసవంతమైన హోటల్ మాత్రమే కాదు, సినీ ప్రముఖుల అభిమాన కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. గతంలో దీపికా పదుకొనే, ఐశ్వర్య రాయ్ బచ్చన్, బెల్లా హడిడ్ వంటి ఎంతోమంది ప్రముఖులు ఈ హోటల్లో బస చేశారు.1929లో ప్రారంభమైన ఈ హోటల్.. అద్భుతమైన ఆర్ట్ డెకో శైలిలో ఉంది. దీని నిర్మాణం కేవలం 14 నెలల్లో పూర్తయింది. ఈ హోటల్లోని బాల్కనీల నుంచి సముద్రం కనిపిస్తుంది. ఈ కారణంగానే చాలామంది సినీ ప్రముఖులు ఇక్కడ ఉండటానికి ఇష్టపడతారు.2013లో ఈ హోటల్ను హయత్ కొనుగోలు చేసింది. ఆ తరువాత దీనిని 'ది అన్బౌండ్ కలెక్షన్ బై హయత్'లో విలీనం చేసింది. ఈ హోటల్ ఆతిథ్యానికి, సౌకర్యానికి, విలాసానికి ప్రతీకగా నిలిచింది.బౌలేవార్డ్ డి లా క్రోయిసెట్ అనే వీధిలో ఈ హోటల్ ఉంది. ఇక్కడ నుంచి పలైస్ డెస్ ఫెస్టివల్స్ అనే ఫిల్మ్ ఫెస్టివల్ ప్రధాన వేదికకు కొన్ని నిమిషాల దూరమే ఉంటుంది. అందువల్ల ఫెస్టివల్ సమయంలో ఇక్కడ భారీ రద్దీ కనిపిస్తుంది. హోటల్లోని గదులు సాధారణ డీలక్స్ రూమ్స్ నుంచి సముద్ర వీక్షణం కలిగిన విలాసవంతమైన సూట్స్ వరకు ఉంటాయి. ఫెస్టివల్ సమయంలో ధరలు మరింత పెరుగుతాయి. ఇక్కడ ఒక రాత్రి బస చేయడానికి గరిష్టంగా రూ.8.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా.. కార్పొరేట్ సమావేశాలు, పెళ్లిళ్లు, కుటుంబ విహార యాత్రల కోసం కూడా ఈ హోటల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. దాదాపు శతాబ్దకాల చరిత్ర కలిగిన హోటల్ మార్టినెజ్.. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా విలాసానికి, ఫ్యాషన్కు, సినీ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.ఇదీ చదవండి: పదేళ్ల కనిష్ఠానికి గోల్డ్ డిమాండ్.. కారణాలివే!
కోకాపేటలో కళ్లు చెదిరే భవనం.. సౌత్ఇండియాకే ‘టాప్’
హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తూ కోకాపేట ఐటీ కారిడార్లో ‘ది స్కైవెన్’ (The Skyven) పేరిట సరికొత్త లగ్జరీ రెసిడెన్షియల్ టవర్ ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ‘ఈ-ఇన్ఫ్రా’ మరియు ‘పింగ్లే వెంచర్స్ & రియాల్టీ’ (PVR) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్కైస్క్రాపర్ 63 అంతస్తులు, 755 అడుగులు అంటే దాదాపు పావు కిలోమీటరు (233 మీటర్లు) ఎత్తుతో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనంగా రికార్డు సృష్టించనుంది. కేవలం ఎత్తులోనే కాకుండా, నిర్మాణంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను పొందుపరిచిన దక్షిణ భారత దేశపు మొట్టమొదటి ‘AI-రెడీ’ స్మార్ట్ బిల్డింగ్ కూడా ఇదే కావడం విశేషం.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పెంట్హౌస్లు, ఆకాశంలో విల్లా అనుభూతినిచ్చే ‘స్కై విల్లాస్’, లగ్జరీ 4BHK నివాసాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇక్కడ సాధారణ ప్రాజెక్టుల లాగా కాకుండా, నివాసాల సంఖ్య పరిమితంగా ఉండటం వల్ల ప్రతి నివాసికి లభించే లగ్జరీ సదుపాయాల వాటా (Amenity-to-Resident Ratio) చాలా ఎక్కువగా ఉంటుంది. భవన నిర్వహణ, విద్యుత్ ఆప్టిమైజేషన్, అత్యాధునిక 24x7 భద్రతా వ్యవస్థలను ఇక్కడి AI నెట్వర్క్ స్వయంచాలకంగా నియంత్రిస్తుంది.భవనం పైభాగంలో ఏర్పాటు చేస్తున్న ‘ది ఎవరెస్ట్’ రూఫ్టాప్ క్లబ్ ఈ ప్రాజెక్ట్కే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో నగర స్కైలైన్తో కలిసిపోయే ‘ఇన్ఫినిటీ పూల్’తో పాటు, హైదరాబాద్ నివాస మార్కెట్లోనే తొలిసారిగా నక్షత్రాలను వీక్షించేందుకు ‘స్టార్ అబ్జర్వేటరీ’, లగ్జరీ క్లబ్హౌస్, స్పా, మరియు హెలిప్యాడ్ వంటి ఐదు నక్షత్రాల వసతులను కల్పిస్తున్నారు. స్థిరమైన మార్కెట్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్ గ్లోబల్ ప్రొఫెషనల్స్ను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ గగన విహారి రూపుదిద్దుకుంటోంది.
స్టాక్ మార్కెట్ అలర్ట్: 3 రోజులు నో ట్రేడింగ్
వచ్చే వారం ట్రేడింగ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు అలర్ట్. మే 25 నుండి మే 31 మధ్య భారతీయ స్టాక్ మార్కెట్లు పరిమిత రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఈ వారంలో శని, ఆదివారాలతో పాటు అదనంగా మరో రోజు కూడా మార్కెట్లు మూతపడనున్నాయి. దీంతో మొత్తం 3 రోజుల పాటు ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.సెలవులు ఇలా..కేంద్ర ప్రభుత్వం తాజాగా చంద్ర దర్శనం ఆధారంగా బక్రీద్ (ఈదుల్ అజ్హా) సెలవు దినాన్ని సవరించింది. మొదట ప్రకటించిన తేదీకి బదులుగా, మే 28 (గురువారం) నాడు అధికారిక సెలవుగా ఖరారు చేసింది. దీనిని అనుసరిస్తూ దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలైన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లు మే 28న ట్రేడింగ్కు విరామం ప్రకటించాయి.ఆ తర్వాత మే 30 (శనివారం), మే 31 (ఆదివారం) వారాంతపు సెలవులు కావడంతో ఆ రోజుల్లోనూ మార్కెట్లు యథావిధిగా మూసివుంటాయి. ఫలితంగా వచ్చే వారంలో కేవలం 4 రోజులు (సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు) మాత్రమే ట్రేడింగ్ సాగుతుంది.ఏయే విభాగాల్లో ట్రేడింగ్ బంద్?మే 28 గురువారం నాడు బక్రీద్ సందర్భంగా మార్కెట్లోని దాదాపు అన్ని ప్రధాన విభాగాలు పనిచేయవు. ఈక్విటీ సెగ్మెంట్, డెరివేటివ్స్ సెగ్మెంట్ (F&O), కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్, కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ (MCX కూడా ఉదయం సెషన్ మూసివుంటుంది)లో కార్యకలాపాలు ఉండవు.గత వారం ఎలా ముగిసిందంటే?గత ట్రేడింగ్ వారంలో భారత మార్కెట్లు అత్యంత అస్థిరత మధ్య సాగినప్పటికీ, ముగింపులో సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్లాయి. నిఫ్టీ 50 (Nifty 50) గత వారంతో పోలిస్తే 1.50% వృద్ధితో 23,719 వద్ద ముగసింది. సెన్సెక్స్ (Sensex) 1.55% వృద్ధితో 75,415 దగ్గర స్థిరపడింది. కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల సానుకూలత, విదేశీ పెట్టుబడుల మద్దతుతో సూచీలు బలపడ్డాయి.వచ్చే వారం కేవలం నాలుగు రోజులే ట్రేడింగ్ అందుబాటులో ఉండటం, అందులోనూ గురువారం సెలవు రావడం వల్ల వీక్లీ డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్స్పైరీ (Expiry) బుధవారమే (మే 27) జరిగే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్లు తమ పొజిషన్లను ముందుగానే ప్లాన్ చేసుకోవడం, అస్థిరతను గమనిస్తూ తగిన స్టాప్-లాస్లు నిర్వహించడం మంచిది.
ఫ్యామిలీ
ఈ బీచ్ మహిళలకు మాత్రమే!
దుబాయ్ మునిసిపాలిటీ ఇటీవల మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన బీచ్ను ప్రారంభించింది. ‘ఖోర్ అల్ మమ్జర్’ పేరుతో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బీచ్లో స్థానిక మహిళలతో పాటు మహిళా పర్యాటకులు కాలక్షేపం చేయడానికి కావలసిన వసతులను ఏర్పాటు చేశారు. దుబాయ్–2040 అర్బన్ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ బీచ్ను 27.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దడం విశేషం.ఇక్కడ మహిళలు రాత్రివేళ కూడా నిరాటంకంగా ఈతకొట్టడానికి, వినోద కాలక్షేపాలు చేయడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఈతకొట్టే మహిళల భద్రత కోసం లైఫ్గార్డులను కూడా ఏర్పాటు చేశారు. దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దీనిని ప్రారంభించారు. ఈ బీచ్లో ఫ్లోటింగ్ వాక్వే, జిమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ బీచ్ నిర్మాణం కోసం దుబాయ్ ప్రభుత్వం 500 మిలియన్ దీనార్లు ఖర్చు చేసింది.ఎడారిలో లైట్హౌస్లైట్హౌస్లు సాధారణంగా సముద్ర తీరాల్లో ఉంటాయి. రాత్రివేళల్లో నావికులకు దారి చూపడానికి ఇవి పనికొస్తాయి. సముద్ర తీరాలు లేని ప్రాంతాల్లో లైట్హౌస్లు కనిపించవు. కనుచూపు మేరలో సముద్ర తీరంలేని ఎడారి నడిబొడ్డున లైట్హౌస్ ఉండటం విడ్డూరమే! ఈ ఇరవై అంతస్తుల లైట్హౌస్ రష్యాలోని అస్త్రాఖాన్ ప్రాంతంలోని ఎడారిలో ఉంది. ‘పెత్రోవ్స్కీ లైట్హౌస్’ పేరిట దీనిని 1741లో నిర్మించారు. తొలుత దీనిని కలపతో నిర్మించారు. గాలి దుమారానికి కూలిపోవడంతో తిరిగి 1876లో దీనిని ఇటుకలతో నిర్మించారు. ఈ లైట్హౌస్ తొలుత నిర్మించే నాటికి కాస్పియన్ సముద్రం దీనికి చేరువలోనే ఉండేది. తర్వాతి కాలంలో కాస్పియన్ సముద్రం వెనక్కు మళ్లడంతో ఈ ప్రాంతం ఎడారిగా మారింది.
మొబైల్ మాస్టారు
గోడల మధ్య బంధించిన చదువు, ఇప్పుడు స్క్రీన్ ల వెలుగుల్లో విహరిస్తోంది. చాక్పీస్ రాతలతో నిండిన బ్లాక్బోర్డ్ స్థానంలో, వేలి స్పర్శకే తెరుచుకునే డిజిటల్ నోట్స్ నిలుస్తోంది. స్కూల్ బస్ హారన్ లతో మొదలయ్యే విద్యార్థుల ఉదయాలు, నేడు మొబైల్ నోటిఫికేషన్స్తో స్టార్ట్ అవుతున్నాయి. ‘హోంవర్క్ చేశావా?’ అని గట్టిగా అడిగే టీచర్ స్వరం, ‘నెట్ వస్తుందా? లేదా?’ అనే ఆందోళనతో పెద్దదైపోతోంది. ఇప్పుడు చదువుకోవాలంటే, ఫీజులతో కొనాల్సిన అవసరం లేదు. ఒక చేతిలో మొబైల్, మరో చేతిలో చార్జర్, మనసులో తపన ఉంటే సరిపోతుంది. అప్పుడు, ఐఐటీ సార్ కూడా మీ చిన్న స్క్రీన్ పై ‘గుడ్మార్నింగ్ స్టూడెంట్స్’ అంటూ చిరునవ్వు చిందిస్తారు. ఈ స్క్రీన్ స్కూల్లో పుస్తకాల బరువు తగ్గిపోయింది. కానీ కలల ఎత్తు పెరిగిపోయింది. చిన్న డేటా ప్యాక్ దూరంలోనే నిలుస్తున్న ఈ డిగ్రీలు నిజంగా లాభామా? నష్టమా?ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విద్య ఇప్పుడు రాకెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం, 2024 నాటికి దేశంలో 88.6 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. పట్టణాల్లో అయితే పరిస్థితి హై లెవెల్! ప్రతి 100 మందికి 116 కనెక్షన్లు ఉన్నాయి. అంటే ఒక మనిషికి రెండు సిమ్లు, మూడు ఓటీపీలు, నాలుగు వైఫై పాస్వర్డులు కామన్ అయిపోయాయి! కానీ గ్రామాల్లో అది 47.6 శాతం మాత్రమే. అయినా మొత్తం యూజర్లలో 57 శాతం మంది గ్రామీణ ప్రాంతాలవారే ఉంటున్నారు. మరో ట్విస్ట్ ఏమిటంటే, 86 శాతం ఇళ్లలో ఇంటర్నెట్ ఉంది, కానీ కంప్యూటర్లు మాత్రం 10 శాతం కూడా లేవు! అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ కాదు, చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్సే అసలైన కాలేజ్, క్లాస్రూమ్, లైబ్రరీ, ఎగ్జామ్ హాల్ అన్నీ మొబైలే అయిపోయింది! అందుకే, ఆడుతూ, పాడుతూ విద్యార్థులు చదువు సాగించేలా డిజిటల్ స్కూల్ కూడా గేమ్ బేస్డ్ లర్నింగ్ టెక్నిక్స్ ఫాలో అవుతున్నాయి.డిజిటల్ గురువులుటీచర్ చెప్పింది అర్థం కాకపోతే, అడిగే ధైర్యం లేనివారందరూ, డౌట్ను కూడా నోట్బుక్లో మడిచేసుకుని ఇంటికి తీసుకెళ్లేవారు. మరికొంతమంది తోటి విద్యార్థి సాయంతో తీర్చుకునేవారు. ఇప్పుడు, పరిస్థితి పూర్తిగా రివర్స్! అర్థం కాలేదా? వీడియోని పాజ్ చేసి, రివైండ్ చేసి ఇంకోసారి చూడొచ్చు? ఇంకా క్లియర్గా కావాలంటే, 0.5 స్పీడ్లో స్లో మోషన్ లో కూడా చూడొచ్చు. చదువు యూట్యూబ్ వీడియోలాగే చాలా ఈజీగా మారిపోయింది. ఇలా యాప్లో కనిపించే ప్రతి వీడియో, ప్రతి యానిమేషన్ , ప్రతి నోటిఫికేషన్ కూడా ఒక చిన్న డిజిటల్ గురువుగా మారిపోయింది.గేమ్లో గెలుపు, చదువు కోసమే!ఒకప్పుడు ‘మొబైల్ గేమ్స్ ఆడొద్దు, చదువు పాడవుతుంది!’ అని పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు, అదే గేమ్స్ పిల్లలకు మ్యాథ్స్, కోడింగ్, సైన్స్ కూడా నేర్పిస్తున్నాయి! అంటూ మొబైల్స్ చేతికి ఇస్తున్నారు. అవును చదువు ఇప్పుడు బోరింగ్ బ్లాక్బోర్డ్ నుంచి బయటికి వచ్చి, ‘నెక్ట్స్ లెవెల్ అన్ లాక్’ చేసే గేమ్లా మారిపోయింది. ఒక ప్రశ్నకు సరైన సమాధానం చెబితే పాయింట్లు, మరో లెసన్ పూర్తి చేస్తే బ్యాడ్జీలు, రోజూ లాగిన్ అయితే స్టికర్స్ ఇలా చదువు కూడా ఇప్పుడు వీడియో గేమ్ ఫీల్ ఇస్తోంది. అందుకే పిల్లలు ‘ఇంకో ఐదు నిమిషాలు’ అంటూ గేమ్ ఆడినట్టే, ఇప్పుడు ‘ఇంకో క్విజ్’ అంటూ చదువులో కూడా మునిగిపోతున్నారు! ముఖ్యంగా మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులు ఇప్పుడు భయం కాదు, మొబైల్లో ఫన్ చాలెంజెస్లా మారిపోయాయి. ఒకప్పుడు మార్కుల కోసం చదివిన పిల్లలు, ఇప్పుడు లీడర్బోర్డ్లో టాప్ రావడానికి చదువుతున్నారు!ఫ్రీగా ఇంత చదువా?ఒక్క మొబైల్లో డేటా ఆన్ చేస్తే చాలు– ఇంజినీరింగ్ నుంచి మెడిసి న్ వరకు, కోడింగ్ నుంచి విదేశీ భాషల వరకు, మాక్ టెస్టుల నుంచి మాస్టర్ క్లాస్ల వరకు అన్నీ స్క్రీన్ పై క్యూలో నిల్చుంటున్నాయి. అంతేకాదు, ఐఐటీ ప్రొఫెసర్ కూడా ‘సబ్స్క్రైబ్’ బటన్ దూరంలోనే ఉంటున్నారు. ‘ఇంత ఖరీదైన నాలెడ్జ్ని నిజంగానే ఫ్రీగా ఇస్తారా?!’ అని స్టూడెంట్స్ షాక్ అవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన చాలా విద్యాసంస్థలు, ఇదే విధానాన్ని ఫాలో అయ్యి, క్యాష్ చేసుకుంటున్నాయి. ఇక్కడే మోసాలు కూడా మొదలయ్యాయి.క్లిక్ చేస్తే క్లాస్.. తర్వాత షాక్ !ప్రతి ‘బై నౌ’ బటన్ వెనుక నిజంగా నాలెడ్జ్ ఉంటుందా? అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. కొన్నిసార్లు ‘లైవ్ క్లాసులు’ అని చెప్పి పాత వీడియోలు చూపిస్తారు. ‘ఫ్రీ ట్రయల్’ అంటూ మొదలై, తర్వాత సైలెంట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. ఇలా చదువు పేరుతో స్క్రీన్ వెనుక ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు సిలబస్ చదవడం కంటే, ముందు స్క్రీన్ మీద కనిపించే ప్రతి ‘క్లిక్’ను జాగ్రత్తగా చదవాల్సిన పరిస్థితి.ప్రభుత్వ డిజిటల్ దిగ్గజాల దూకుడు! ⇒ ప్రైవేట్ సంస్థలకంటే, ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ విద్యా ప్లాట్ఫారమ్లు ఇప్పుడు మరింత ఉపయోగకరంగా దూసుకు పోతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా..దీక్ష: ఇప్పటికే 2 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. 36 భారతీయ భాషల్లో కంటెంట్ అందుబాటులో ఉండటం దీని అతిపెద్ద బలం.స్వయం: 4,400కిపైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 5.8 కోట్లకు పైగా ఎన్రోల్మెంట్లు నమోదయ్యాయి. అలాగే, 52 లక్షల మందికి పైగా ఈ ప్లాట్ఫారమ్ ద్వారా సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేశారు.ఎన్ పీటీఈఎల్: ఐఐటీలు, ఐఐఎంల కోర్సులు ఇప్పుడు మొబైల్ స్క్రీన్ పైనే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఇందులో 3.79 కోట్లకు పైగా కోర్స్ ఎన్రోల్మెంట్లు నమోదయ్యాయి. చాలామంది దీన్ని ‘ఎడ్యుకేషన్ నెట్ఫ్లిక్స్’గా కూడా చూస్తున్నారు.స్వయం ప్రభ: ఇంటర్నెట్ లేకున్నా చదువు ఆగకూడదనే ఉద్దేశంతో, 48 ప్రత్యేక టీవీ చానెల్స్ ద్వారా విద్యా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఇక్కడ టీవీ కూడా టీచర్ అయ్యింది.డిజిటల్ స్కూల్ vs రియాల్టీ స్కూల్.. డిజిటల్ స్కూల్, రియాల్టీ స్కూల్ అనే ఈ రెండు ప్రపంచాల్లో స్టూడెంట్స్కి అసలు ఏది బెస్ట్? ఏది ఈజీ? ఏది నిజంగా ప్రభావం చూపుతోంది? అసలు ఈ రెండింటి మధ్య తేడాలను ఇక్కడ చూద్దాం.. స్క్రీన్ క్లాస్రూమ్⇒ వీడియోలను పాజ్, రివైండ్, స్లో మోషన్ లో కూడా చూడొచ్చు.⇒ ఇంట్లో నుంచే ఐఐటీ, టాప్ ఫ్యాకల్టీ క్లాసులు అటెండ్ కావచ్చు.⇒ టైమ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ.⇒ ప్రెజెంటేషన్స్ , క్విజ్లు, డిజిటల్ నోట్స్ ఈజీగా అందుబాటులో ఉంటాయి.⇒ సిగ్గు పడే స్టూడెంట్స్ కూడా చాట్బాక్స్లో యాక్టివ్గా పాల్గొంటారు.⇒ స్మార్ట్ఫోన్ ఇప్పుడు చిన్న యూనివర్సిటీలా మారిపోయింది.⇒ ఈజీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ, ఆన్లైన్ మోసాలకు బలయ్యే అవకాశాలు ఎక్కువ.⇒ క్లాస్తో పాటు రీల్స్, నోటిఫికేషన్స్ కూడా పోటీ పడుతుంటాయి.⇒ ‘మైక్ ఆఫ్.. కెమెరా ఆఫ్.. అటెన్షన్ కూడా ఆఫ్!’ అనే సీన్ కామన్ .నిజమైన క్లాస్రూమ్⇒ టీచర్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది.⇒ డౌట్స్ వెంటనే క్లియర్ చేసుకోవచ్చు.⇒ కాన్సెప్ట్లు మరింత బాగా అర్థమవుతాయి.⇒ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి.⇒ ఫిజికల్ యాక్టివిటీ, ఫ్రెండ్స్తో డిస్కషన్స్ , గ్రూప్ లెర్నింగ్ ఎక్కువ.⇒ టీచర్లు స్టూడెంట్స్ అటెన్షన్ ను సులభంగా గమనించగలరు.⇒ చదువుతో పాటు క్లాస్రూమ్ మెమరీస్ కూడా క్రియేట్ అవుతాయి.⇒ బెంచ్ ఫ్రెండ్స్, చిన్న నవ్వులు, హోంవర్క్ టెన్షన్స్ ప్రత్యేకమైన ఫీలింగ్ ఇస్తాయి.⇒ టైమ్, ట్రావెల్, ఫీజుల ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు.ఎగ్జామ్కి డెమో వెర్షన్ !పోటీ పరీక్షలు అంటే ఒకప్పుడు టెన్షన్ , భయం, రాత్రంతా నిద్రలేని ప్రిపరేషన్ . కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది! అసలు పరీక్షకు వెళ్లే ముందే, స్టూడెంట్స్కి ‘ట్రైలర్ షో’ చూసే చాన్స్ వచ్చేసింది. ఫ్రీ మాక్ టెస్టులు, ప్రాక్టీస్ పేపర్లు, టైమ్బేస్డ్ ఎగ్జామ్లు అన్నీ ఇప్పుడు ఒక క్లిక్ దూరంలోనే ఉన్నాయి. అంటే అసలు పరీక్ష హాల్లో కూర్చోకముందే, ‘ఎగ్జామ్ ఎలా ఉంటుంది?’ అన్న ఫీలింగ్ను ముందుగానే అనుభవించొచ్చు. దీంతో ఇప్పుడు స్టూడెంట్స్కి టెన్షన్ కంటే, ‘ర్యాంక్ స్క్రీన్ షాట్ను స్టేటస్లో ఎప్పుడు పెట్టాలి?’ అన్న ఆసక్తే ఎక్కువైపోతోంది!బిలియన్ డాలర్ల బిజినెస్!గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ మార్కెట్⇒ ఈ–లెర్నింగ్ సర్వీసుల మార్కెట్ విలువ 2024లో సుమారు 300 బిలియన్ డాలర్లకు చేరింది.⇒ ఇది 2030 నాటికి 840 బిలియన్ డాలర్లకు పైగా పెరిగే అవకాశముందని విశ్లేషకుల అంచనా.ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లెర్నింగ్ మార్కెట్ ఇప్పుడు భారీ బిజినెస్గా మారిపోయింది. మార్కెట్ రిపోర్టుల ప్రకారం, మొత్తం ఈ–లెర్నింగ్ సర్వీసుల మార్కెట్ విలువ 2024లో సుమారు 300 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది 2030 నాటికి 840 బిలియన్ డాలర్లకు పైగా పెరిగే అవకాశముందని విశ్లేషకుల అంచనా. అంటే, ఒక్కో యూజర్ నుంచి సగటున 69 డాలర్లకు పైగా ఆదాయం వస్తోంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా 86 శాతం మంది విద్యార్థులు ఇప్పుడు చదువులో ఏఐ టూల్స్ను ఉపయోగిస్తున్నారని ఈ సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇండియాలో స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడం, చౌకైన డేటా అందుబాటులోకి రావడం, ప్రభుత్వ డిజిటల్ లిటరసీ కార్యక్రమాలు ఊపందుకోవడంతో ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కంపెనీలు భారీగా క్యాష్ చేసుకుంటున్నాయి.చదువు కూడా కన్జ్యూమర్ ప్రొడక్టే! చదువు ‘కొనడం’ కూడా ఇప్పుడు ఒక అధికారిక కొనుగోలు! అంటే మీరు డిజిటల్ లెర్నింగ్ యాప్, ఎగ్జామ్ సబ్స్క్రిప్షన్ , కోడింగ్ కోర్స్ లేదా ఆన్ లైన్ క్లాస్ కోసం డబ్బులు చెల్లిస్తే, ఆ ప్లాట్ఫారమ్లు కూడా వినియోగదారుల చట్టాల పరిధిలోకి వస్తాయి. భారతదేశంలోని వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్లు కూడా జవాబుదారులే. అందుకే సీసీపీఏ (సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ) ఎడ్టెక్ కంపెనీలపై ప్రత్యేక గైడ్లైన్స్ తీసుకొచ్చింది. అంతేకాదు, స్టూడెంట్స్కి కూడా కొన్ని ముఖ్యమైన హక్కులు ఉన్నాయి.డిజిటల్ మోసాలకు చెక్ పెట్టే స్మార్ట్ స్టెప్స్!డిజిటల్ ప్రపంచంలో బటన్ నొక్కే ముందు ఒక్కసారి బ్రెయిన్ ను కూడా రిఫ్రెష్ చేయాలి. ఆన్ లైన్ మోసాల నుంచి సేఫ్గా ఉండేందుకు ఈ చిన్న సర్వైవల్ గైడ్ను తప్పకుండా ఫాలో అవ్వాలి. ఒకవేళ మోసపోతే, అందులో నుంచి ఇలా బయటపడోచ్చు.కస్టమర్ కేర్కు కాల్ చేయండిముందుగా యాప్, వెబ్సైట్ లేదా కోచింగ్ సంస్థకు సమస్యను క్లియర్గా చెప్పండి. ఆర్డర్ నంబర్, ఇన్వాయిస్ పంపండి. చాలాసార్లు ఒక స్ట్రాంగ్ మెయిల్కే రీఫండ్ వచ్చేస్తుంది!ముందుగా ప్రూఫ్ సేవ్ చేయండిడిజిటల్ ప్రపంచంలో స్క్రీన్ షాట్ కూడా ఒక ఆయుధమే! బిల్లులు, మెయిల్స్, చాట్లు, స్క్రీన్ షాట్లు అన్నీ వెంటనే సేవ్ చేసుకోండి. ‘ప్రూఫ్’ ఉంటేనే మీ ఫిర్యాదుకు పవర్ వస్తుంది.ట్రయల్ ట్రాప్ను చెక్ చేయండి‘ఫ్రీ’ అని మొదలై, తర్వాత సైలెంట్గా డబ్బులు కట్ అవ్వడం కామన్ ! ఆటో రెన్యూవల్ ఆన్ లో ఉందో లేదో ముందే చూసుకోండి.టైమర్ చూసి టెన్షన్ పడకండి‘ఇంకా 2 సీట్లు మాత్రమే!’, ‘ఆఫర్ ఇంకో 5 నిమిషాలే!’ ఇవి చాలాసార్లు మార్కెటింగ్ డ్రామాలే! వెంటనే క్లిక్ చేయకుండా, రెండు నిమిషాలు ఆలోచించండి.చిన్న అక్షరాలు కూడా చదవండిషరతులు వర్తిస్తాయి అని కనిపించనంత చిన్నగా చివర్లో రాసిన వాటిని కూడా క్షుణ్ణంగా చూడాలి. లేకుంటే, రూ.99 అని కనిపించే కోర్స్, చివరికి రూ.499 బిల్లుగా మారొచ్చు! ట్యాక్స్లు, ప్లాట్ఫామ్ ఫీజులు ముందే చెక్ చేయండి.స్పందన లేకపోతే.. 1915కంపెనీ స్పందించకపోతే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ 1915కు ఫిర్యాదు చేయండి. డిజిటల్ మోసాల్లో ఇది మీ బ్యాకప్ బటన్ లాంటిది!మారుతున్న కాలంతో పాటు మనం మారడంలో తప్పు లేదు. కాని, అతిగా అందుబాటులో ఉందని ‘రేపటి నుంచి చదువుతా’ అనే అలసత్వాన్ని మాత్రం ఆఫ్ చేయాలి! అప్పుడు చదువు ఎలా చదివినా చదువే అవుతోంది. స్క్రీన్ ఇప్పుడు గురువు అయినప్పటికీ, చదవాలా? స్క్రోల్ చేయాలా? అన్న నిర్ణయం మాత్రం ఇంకా విద్యార్థి చేతిలోనే ఉంది.కొండి దీపిక
ఈ తరం పిల్లల ఆటలు
ఒకప్పుడు పిల్లలు ఆరుబయట గిల్లీదండా, బొంగరాలు, గోలీలు వంటి ఆటలాడుతూ కనిపించేవారు. ఇప్పుడు గల్లీల్లో క్రికెట్ తప్ప వేరే ఆటలాడే పిల్లలు కనిపించడం బాగా అరుదుగా మారిపోయింది. స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చాక పిల్లల ఆటల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. స్మార్ట్ఫోన్ పిల్లలకు క్రీడావేదికగా మారిపోయింది. మన దేశ జనాభాలో పంతొమ్మిదేళ్ల లోపు పిల్లలు దాదాపు 40% వరకు ఉంటారు. స్మార్ట్ఫోన్లలో పిల్లలు ఇష్టంగా ఆడుకుంటున్న ఆటల గురించి గణాంకాలు...పిల్లలు స్మార్ట్ఫోన్లలో ఆడే ఆటలు గేమింగ్ పరిశ్రమకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో మన దేశంలో స్మార్ట్ఫోన్లో ఆటలాడే పిల్లల సంఖ్యతో పాటు గేమింగ్ ఇండస్ట్రీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. ఈ పెరుగుదల ఏ స్థాయిలో ఉందో గణాంకాల్లో చూద్దాందేశంలో స్మార్ట్ఫోన్ వాడకం అందుబాటులోకి వచ్చిన కొత్తలో పిల్లలు వీటిలోని ఆటలతో వారానికి మూడు నాలుగు గంటల వరకు మాత్రమే గడిపేవారు. ఇప్పుడు స్మార్ట్ఫోన్ల వాడకం మరింత పెరగడమే కాకుండా, వీటిలో గేమ్స్తో పిల్లలు గడిపే సమయం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం మన దేశంలోని పిల్లలు వారానికి సగటున 14 గంటల వరకు మొబైల్గేమ్స్తో గడుపుతున్నట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. మొబైల్ గేమ్స్లో పిల్లలు గడిపే సమయం పెరుగుతూ వస్తోందనేందుకు పై గణాంకాలే నిదర్శనం.
సముద్రమంత ప్రేమ : ఎవరీ సతీష్ భాస్కర్
World Turtle Day ‘సతీష్ భాస్కర్’ అనే పేరు వినబడగానే చాలామందికి తాబేళ్లు గుర్తుకు వస్తాయి.ఆయనకు ‘తాబేళ్ల సంరక్షకుడు’ అని పేరు. చిన్నప్పటి నుంచి సతీష్ భాస్కర్కు సముద్రపు తాబేళ్లు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనను తాబేళ్ల ప్రపంచంలోకి తీసుకు వెళ్లింది. ఆ ప్రపంచంలో ఆయన వాటి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు.తన ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు.అయితే ఆయన ఉక్కు సంకల్పం ముందు ఆ ఆటంకాలు నిలవలేకపోయాయి... తాబేళ్ల పరిరక్షణ కోసం ఎవరి తోడూ లేకున్నా వేల కిలోమీటర్ల దూరం ఒంటరి ప్రయాణం చేశారు సతీష్ భాస్కర్. తీర్ర΄ాంత మార్గాలలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక చిన్న ట్రాన్సిస్టర్ రేడియో, అలుపెరుగని స్ఫూర్తి ఆయనకు తోడుగా ఉండేవి. అండమాన్ దీవుల తీరాలలో సముద్ర తాబేళ్ల పరిరక్షణకు భాస్కర్ చేపట్టిన కార్యక్రమాలు విస్తృతమైన ఆయన పరిశోధనకు గీటురాయిగా మారాయి.ఆకలితో కొన్ని రోజులు...లక్షద్వీప్లోని జనావాసాలు లేని సుహేలి ద్వీ΄ానికి వెళ్లారు భాస్కర్. అక్కడ అయిదు నెలల పాటు తాబేళ్లపై సర్వేలు నిర్వహించారు. ఆ ద్వీపానికి వెళ్లడం చాలా కష్టం. అయినా అష్టకష్టాలు పడి అక్కడికి చేరుకున్నారు. అండమాన్ ద్వీపంలో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో తినడానికి అతడి దగర్గ ఏమీ లేదు. ఆకలిని తట్టుకోలేని పరిస్థితులలో అక్కడి ఆదిమ గిరిజన తెగ వారి దగ్గర కాల్చిన మాంసం తెచ్చుకొని కడుపు నింపుకున్నారు.టర్టిల్ వాకర్సుహేలి ద్వీపంలో ఉన్నప్పుడు కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు, ఇండోనేషియాలోని వెస్ట్ పపువా వంటి తీర్ర ప్రాంతాల వెంబడి అలుపెరుగకుండా ప్రయాణిస్తున్నప్పుడు, ప్రతిచోట తన ప్రయాణానికి పరమార్థాన్ని వెదుక్కున్నారు భాస్కర్. తాబేళ్ల ప్రపంచం గురించి సూక్ష్మస్థాయిలో అర్థం చేసుకోవడానికి తాను చేసిన ప్రయాణాలు ఉపకరించాయి. ‘టర్టిల్ వాకర్’ పేరుతో భాస్కర్పై 75 నిమిషాల డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు తైరా మాలనీ. ఈ డాక్యుమెంటరీ జాక్సన్ వైల్డ్ మీడియా అవార్డ్స్లో కన్జర్వేషన్, గ్రాండ్ టెటాన్ అవార్డులను అందుకుంది. సతీష్ భాస్కర్ ప్రయాణం గురించి ఈ డాక్యుమెంటరీ చెప్పే మాట...‘అతడిది...మృత్యువును ధిక్కరించే అన్వేషణ’సముద్ర తాబేళ్ల ఆవాసాలను గుర్తించే ప్రయత్నంలో మన దేశంలో తీర్ర΄ాంతంలో నాలుగువేల కిలోమీటర్లు ప్రయాణించారు భాస్కర్. గూళ్లు కట్టే విధానం నుంచి గుడ్ల స్వభావం వరకు తాబేళ్లకు సంబంధించి అనేక కోణాలలో అధ్యయనం చేశారు. ఆయన సాహసాలు, ప్రయత్నాలు రాబోయే తరాలు తాబేళ్లను అర్థం చేసుకోవడానికి మార్గదర్శకంగా నిలిచాయి.తాబేళ్ల సంరక్షణ కోసం...గుడ్లు, మాంసం, పెంకులు, చర్మం కోసం తాబేళ్లను వధిస్తున్నారు వేటగాళ్లు. మరోవైపు... చేపల వలలతో ప్రమాదవశాత్తు తాబేళ్ల ఆవాసాలు నాశనం అవుతున్నాయి. ఈ విషయాలు సతీష్ భాస్కర్ను తీవ్రంగా కలచివేశాయి. బాధపడడానికి మాత్రమే పరిమితం కాకుండా తన జీవితాన్ని తాబేళ్ల సంరక్షణకు అంకితం చేశారు. తాబేళ్ల స్థితి గతులు, పరిరక్షణపై యాభైకి పైగా రిపోర్ట్లు వెలువరించారు.
అంతర్జాతీయం
హార్ముజ్ను మింగేస్తున్న ‘ఎల్లో ఫ్లీట్’
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ దాదాపు 90 రోజులుగా స్తంభించిపోయింది. ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ కూటమి.. ఇరాన్ మధ్య మొదలైన ఘర్షణలు, ఈ జలమార్గాన్ని మూసుకుపోయేలా చేశాయి. 1967 నాటి సూయజ్ కాలువ ఘటనలో పలు నౌకలు చిక్కుకుపోయి తుప్పు పట్టిన ‘ఎల్లో ఫ్లీట్’ మాదిరిగానే ఇప్పుడు హార్ముజ్ జలసంధి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. చరిత్ర నేర్పుతున్న హెచ్చరికలను విస్మరిస్తే, రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కుదుపులకు లోనయ్యే ప్రమాదం కనిపిస్తోంది.చరిత్ర పునరావృతమైతే?1967లో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో సూయజ్ కాలువలో చిక్కుకున్న 15 నౌకలు, ఎనిమిదేళ్ల పాటు అక్కడే ఉండిపోయి ‘ఎల్లో ఫ్లీట్’గా మిగిలిపోయాయి. ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో అదే పరిస్థితి తలెత్తితే? ఇది సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా, 90 రోజులుగా సాగుతున్న ఈ అప్రకటిత దిగ్బంధనం చూస్తుంటే, అదే జరగబోతోందనే భయాలు వెంటాడుతున్నాయి. రాబోయే ముప్పును పసిగట్టిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) హార్ముజ్ జలసంధిపై ఆధారపడకుండా చమురును రవాణా చేసేందుకు ప్రత్యామ్నాయ పైప్లైన్ నిర్మాణాన్ని వేగవంతం చేసింది. 2027 నాటికి ఇది సిద్ధం కావచ్చని అంచనా. దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నా, వాస్తవ క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా కాలం పాటు ఉద్రిక్తంగానే ఉండవచ్చని అబుదాబి భావిస్తోంది.వాల్ స్ట్రీట్ ఆశలు ప్రస్తుతం వాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులు ఈ సంక్షోభం త్వరలోనే ముగుస్తుందని ఆశిస్తున్నారు. చమురు ధరలు మరీ విపరీతంగా పెరగకుండా, మార్కెట్ సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు త్వరగా పరిష్కారం వస్తుందని వారు నమ్ముతున్నారు. అయితే, హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల కలిగే ఆర్థిక భారం ఇంకా పూర్తిస్థాయిలో బయటపడలేదన్నది వాస్తవం. అమెరికాలో స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ఉన్నంత వరకు, వాషింగ్టన్ పెద్దగా ఆందోళన చెందడం లేదు.ఇరాన్ వ్యూహంమరోవైపు, ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆ దేశం వెనక్కి తగ్గేలా లేదు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, కరెన్సీ విలువ పడిపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నా, ఉనికి కోసం పోరాడుతున్న ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగేలా కనిపించడం లేదు. ఇరు పక్షాలు ఎవరికి వారు అవతలి వైపు ముందుగా దిగివస్తారేమోనని వేచి చూస్తున్నారు.నిల్వలతో కాలక్షేపం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా ఆగిపోయింది. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను వాడుకోవడం, ఎమర్జెన్సీ రిజర్వులను విడుదల చేయడం ద్వారా ఈ ప్రభావాన్ని ఇప్పటివరకు నియంత్రించగలిగారు. కానీ ఈ నిల్వలు శాశ్వతం కాదు. ప్రతిరోజూ మనం ఆ గడువుకు దగ్గరవుతున్నాం.రాబోయే రోజుల్లో భారీ సవాల్చివరగా, హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా మూసి ఉంచడం ఏ దేశానికీ మంచిది కాదు. ఒక తాత్కాలిక ఒప్పందం తక్షణ అవసరం. అయితే, గతంలో జరిగిన చరిత్రను గుర్తుంచుకుంటే అసాధ్యమైనది అనుకున్నవి కాలక్రమేణా సాధారణం అయిపోయే ప్రమాదం ఉంది. యుద్ధం ముగిసినా, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రపంచ ఇంధన భద్రతకు రాబోయే రోజుల్లో పెద్ద సవాలుగా నిలవనున్నాయి.ఇది కూడా చదవండి: ‘జెన్ జెడ్’ మంత్రం.. ‘హార్ట్ఫుల్నెస్’ ధ్యానం
వైట్హౌస్ వద్ద కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ సమీపంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సీక్రెట్ సర్వీస్ చెక్పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.వైట్హౌస్ సమీపంలో వరుస కాల్పుల శబ్దాలు విన్నట్లు జర్నలిస్టులు తెలిపారు. దీంతో జర్నలిస్టులను వైట్హౌస్ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్లోకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు వైట్హౌస్ వద్ద భారీగా మోహరించారు. కాల్పుల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల శబ్దాలు వినిపించడంతో భవనం మొత్తం కొద్దిసేపు లాక్డౌన్లోకి వెళ్లింది.
మేజర్ అభిలాషకు ఐరాస అవార్డు
ఐక్యరాజ్యసమితి: లెబనాన్లోని ఐక్యరాజ్యసమితి శాంతి మిషన్లో భారత శాంతి పరిరక్షక దళం తరఫున సేవలందిస్తున్న మేజర్ అభిలాష బారక్ ప్రతిష్టాత్మక మిలటరీ జెండర్ అడ్వొకేట్ అవార్డుకు ఎంపికయ్యారు. విధుల్లో భాగంగా మహిళలు, బాలికలకు చేరువయ్యేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఐరాస శుక్రవారం ఎక్స్లో తెలిపింది. యూఎన్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్(యూనిఫిల్)లో ఫిమేల్ ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్గా బారక్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత ఆర్మీలో కంబాట్ హెలికాప్టర్ పైలట్గా ఎంపికైన మొట్టమొదటి మహిళ అభిలాష బారక్. ఈ నెల 29వ తేదీన ఐరాస శాంతిపరిరక్షక దళాల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అభిలాషకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును గతంలో ఐరాస శాంతిపరిరక్షక దళాల్లో పనిచేసిన భారత్కు చెందిన మేజర్ సుమన్ గవానీ, మేజర్ రాధికా సేన్ తమ సేవలకు గుర్తింపుగా అందుకోవడం విశేషం.
యుద్ధమా? ఒప్పందమా?
వాషింగ్టన్/ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో సంక్షోభానికి తెరదించడానికి ఇరాన్ తమతో ఒప్పందానికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇరాన్పై బాంబు దాడులు పునఃప్రారంభించాలా? లేదా? అనే దానిపై తన ఆలోచనలు ఫిఫ్టీ.. పిఫ్లీగా ఉన్నాయని తేల్చిచెప్పారు. ఆదివారం నాటికి తుది నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఆయన శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఇరాన్ వ్యవహారంలో రెండు అంశాల్లో ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటున్నానని వెల్లడించారు. ఒకటి.. వారు(ఇరాన్) ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోనంత గట్టిగా తాను దెబ్బకొడతానని వ్యాఖ్యానించారు. రెండోది.. ఒక మంచి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు చేస్తాయని పేర్కొన్నారు. యుద్ధం కావాలో లేక ఒప్పందం కావాలో ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని సూచించారు. ఇరాన్తో తాను చక్కటి ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని లేదా ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇరాన్, పాకిస్తాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీని ప్రకారం.. అమెరికా, ఇరాన్లు సైనిక చర్యను నిలిపివేయాలి. ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడమే లక్ష్యంగా 30 రోజుల పాటు విస్తృతస్థాయిలో చర్చలు జరపడానికి ఇరుదేశాలు అంగీకరించాలి. చివరి నిమిషంలో జరిగే చర్చలు శాంతి ఒప్పందానికి దారితీయకపోతే, ఇరాన్పై కొత్తగా దాడులు చేసే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నారని అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ వెల్లడించింది. ఇరాన్ నేతలతో అసిమ్ మునిర్ భేటీ పశ్చిమాసియాలో ఘర్షణను తెరదించాలని పాకిస్తాన్ తన వంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునిర్ ఇరాన్లో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితోపాటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ను కలుసుకున్నారు. తాజా పరిణామాలపై వారితో చర్చించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను నివారించడం.. శాంతి, స్థిరత్వం, భద్రతను ప్రోత్సహించడంపై సంప్రదింపులు జరిపారు. ఇరాన్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలు, వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకొనే మార్గాలపై పెజెష్కియాన్, అసిమ్ మునిర్ చర్చించుకున్నట్లు ఇరాన్ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ తెలియజేసింది.
జాతీయం
బొద్దింకలకే భయపడుతున్నారా?.. కేంద్రంపై విజయన్ ఫైర్!
తిరువనంతపురం: ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) సంచలనంగా మారింది. కేవలం ఒక వ్యంగ్య రాజకీయ వేదికగా మొదలైన ఈ వేదికకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి బీజేపీ భయపడుతోందని కేరళ ప్రతిపక్ష నేత పినరయి విజయన్ ఆరోపించారు. ప్రజాస్వామ్య నిరసనలపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.అసహనమే అధికార పక్షం ఆయుధమా?యువ కార్యకర్త అభిజీత్ దిప్కే స్థాపించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. కొన్ని వేదికల్లో అధికార బీజేపీ కంటే ఈ సంస్థకే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే సీజేపీకి చెందిన ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేయడం, చివరకు వ్యవస్థాపకుడు అభిజీత్ వ్యక్తిగత ఖాతాను కూడా సస్పెండ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.నిరసనను అణచివేసే ప్రయత్నంతమను ‘బొద్దింకలు’గా పిలుచుకుంటూ చేపట్టిన ఈ నిరసనను కేవలం ఒక సాధారణ స్పందనగా కొట్టిపారేయకూడదని పినరయి విజయన్ పేర్కొన్నారు. తన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా స్పందించిన ఆయన, కేంద్రం అనుసరిస్తున్న నిరంకుశ ధోరణిని ఎండగట్టారు. ఇలాంటి వ్యంగ్య రాజకీయ ప్రయోగాలను చూసి అధికార పక్షం కంగారు పడటం, భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు.అంతర్జాతీయ స్థాయికి ‘బొద్దింక’ పోరుభారతదేశంలో మొదలైన ఈ ‘కాక్రోచ్’ ట్రెండ్ ఇప్పుడు సరిహద్దులు దాటుతోంది. ఈ సంస్థపై సైబర్ దాడులు, పోలీసు హెచ్చరికలు, విదేశీ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్నా, ప్రజాదరణ తగ్గడం లేదు. ముఖ్యంగా ఇలాంటి వినూత్న నిరసనలు భారత్ నుంచే కాకుండా పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల్లో కూడా కొత్త రాజకీయ కదలికలకు దారితీస్తుండటం విశేషం.
‘వాళ్లను ఎప్పటికీ మన దరిదాపుల్లోకి రానివ్వద్దు’
చెన్నై: తమిళగ వెట్రి కజగం (టీవీకే)కి కాంగ్రెస్ మద్దతు తెలపడంపై డీఎంకే నేత, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే క్యాడర్ అండతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంతో సీట్లు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ నేతలకు కనీస కృతజ్ఞత, మర్యాద" లేదంటూ డీఎంకే యువజన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మండిపడ్డారు. డీఎంకే ఇకపై కాంగ్రెస్ను ఎప్పటికీ నమ్మకూడదన్నారు."కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకోవడానికి డీఎంకే క్యాడరే కారణం. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు వారికి ఓటు వేశారు. కానీ ఈరోజు కొన్ని పదవుల కోసం వారు మాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా పారిపోయారు. వాళ్లను ఎప్పటికీ మన దరిదాపుల్లోకి రానివ్వద్దు. అతి త్వరలోనే తమిళనాడు ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారు" అంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుగుదలకు కూడా కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన విమర్శలు గుప్పించారు. "దేశవ్యాప్తంగా బీజేపీ విజయాలకు ప్రధాని మోదీ, అమిత్ షాలే కారణమని నేను అనుకునేవాడిని. కానీ భారత్లో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఇప్పుడు స్పష్టమవుతోంది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మా నాయకుడు ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ను తన భుజాలపై మోశారు" అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. యువతకు, ముఖ్యంగా జెన్ జెడ్ (Gen Z) ఓటర్లకు రాజకీయంగా అవగాహన కల్పించాలని, కుటుంబాలు, తొలిసారి ఓటు వేసే వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంచాలని డీఎంకే యువజన విభాగం కార్యకర్తలను ఉదయనిధి స్టాలిన్ కోరారు.
ఇకపై అమెరికా వీసా ఈజీ.. భారతీయులకు శుభవార్త
న్యూఢిల్లీ: భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. అమెరికాలో వ్యాపారం ప్రారంభించాలనుకునే భారతీయులకు త్వరితగతిన వీసా అందించే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ‘అమెరికా ఫస్ట్’ వీసా షెడ్యూల్ను ప్రకటించారు. ఈ కొత్త విధానం వ్యాపార సంబంధాలను బలోపేతం చేసే ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తూ.. భారత్-అమెరికా ఆర్థిక, వ్యూహాత్మక బంధాలను మరింతగా పెంచే ప్రయత్నంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.మార్కో రూబియో నాలుగు రోజుల భారత్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని అమెరికా ఎంబసీ సపోర్ట్ యానెక్స్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత్-అమెరికా సంబంధాలు కేవలం మీడియాకే పరిమితం కాదని..అంతకు మించిన బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం భారత్ కంపెనీలు అమెరికాలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. ‘అమెరికా ఫస్ట్’ వీసా షెడ్యూల్ఈ కొత్త వీసా షెడ్యూల్ వ్యాపార నిపుణులు, పెట్టుబడిదారులు, అమెరికా ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేసే వ్యక్తులకు ముందస్తు ప్రాధాన్యత ఇస్తుంది. అంటే, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణ కోసం అమెరికాకు వెళ్లే భారతీయులకు వీసా అపాయింట్మెంట్ త్వరగా లభిస్తుంది. వీసా ప్రక్రియలో ఆలస్యం కారణంగా వ్యాపార ప్రయాణాలు, పెట్టుబడి సమావేశాలు,భాగస్వామ్య చర్చలకు అడ్డంకిగా మారుతుంది. అందుకే ఈ కొత్త విధానం అవసరమని ఆయన వివరించారు.ఈ పర్యటనలో రూబియో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున వైట్ హౌస్ ఆహ్వానం అందించారు. ఇరువురు నేతలు ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, ఇంధన సరఫరాలు, అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం వంటి అంశాలపై చర్చించారు.ఈ పర్యటనలో రూబియో చేసిన ప్రకటనలు భారత్-అమెరికా సంబంధాలను కొత్త దశలోకి తీసుకెళ్తున్నాయి. వీసా ప్రక్రియలో మార్పులు కేవలం సాంకేతిక సౌలభ్యం మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య వ్యాపార, వ్యూహాత్మక బంధాలను మరింతగా బలపరచే ప్రయత్నం. అమెరికా ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, భారత్తో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ పర్యటన స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | Delhi: At the US Embassy Support Annex Building dedication ceremony, US Secretary of State Marco Rubio says, "We're introducing a new America First visa schedule that prioritises business professionals that strengthen these ties. But the facility, as I said, is not just… pic.twitter.com/pkY5nlb6r5— ANI (@ANI) May 23, 2026
ఎబోలా కలకలం.. కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: ఆఫ్రికా ఖండంలోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ), ఉగాండా, దక్షిణ సూడాన్లలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రాణాంతకమైన ‘బుండిబుగ్యో’ రకం ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో, భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని భారత పౌరులను హెచ్చరించింది.అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిప్రపంచ ఆరోగ్య సంస్థ మే 17న, ఈ ఎబోలా వ్యాప్తిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’గా ప్రకటించింది. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం ఈ వైరస్ ముప్పు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ఆఫ్రికా సీడీసీ) సైతం, దీనిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంటినెంటల్ సెక్యూరిటీ’గా పేర్కొంటూ కఠిన నిఘా ఉంచాలని సూచించింది.ఎబోలా వ్యాప్తి ఎలా జరుగుతుంది?ఎబోలా అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది సోకిన వ్యక్తుల రక్తం, వాంతులు, వీర్యం, చెమట, ఇతర శరీర ద్రవాలతో నేరుగా సంబంధం ఏర్పడినప్పుడు ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. ఒకసారి వైరస్ సోకిన తర్వాత, వ్యాధి తీవ్రత చాలా వేగంగా పెరుగుతుంది. సకాలంలో సరైన చికిత్స అందకపోతే, ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.గుర్తించాల్సిన లక్షణాలుఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, తీవ్రమైన నీరసం, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ, శరీరంలో అంతర్గత లేదా బాహ్య రక్తస్రావం జరగవచ్చు. ఈ లక్షణాలు ఏమాత్రం కనిపించినా, వెంటనే వైద్య సహాయం పొందడం అత్యవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాలకు వెళ్లే భారతీయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.
ఎన్ఆర్ఐ
ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ వార్షికోత్సవాలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ తన సప్తమ వార్షికోత్సవం (ఏప్రిల్25, 2026) ఘనంగా జరుపుకుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమం ప్రొఫెసర్ బి.వి.ఎస్. చౌదరి, రాజ్యలక్ష్మి చౌదరి సమక్షంలో సింగపూర్ శివకృష్ణ దేవాలయంవారి ఫంక్షన్ హాలు వేదికగా జరిగింది.స్వరలయ సంస్థ విద్యార్ధుల సంగీత మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. కుమారి శ్రీవిద్య పంతువరాళి రాగంలో “ఎన్నగాను రామభజన” త్యాగరాజ కీర్తనను హృద్యంగా గానం చేశారు. స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు, గురు శేషుకుమారి సంగీత ప్రదర్శనలో ఆలపించిన త్యాగరాజ కీర్తన “ప్రక్కల నిలబడి”, ఒక “మీరా భజన్” , విద్యార్థులతో కలిసి చేసిన జానపద గీతం ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకున్నాయి.తరువాత తెలుగు విశ్వవిద్యాలయం గ్రేడ్ , యూనివర్సిటీ కోర్సులలో ఉత్తీర్ణులైన సంగీత విద్యార్ధులకు VC నిత్యానందరావు అర్హతాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేషుకుమారి సంగీత ప్రస్థానాన్ని ప్రశంసించారు. సంగీతకళను భావితరాలకి అందించేలా ఆమెను నడిపిస్తున్నాయన్నారు. స్వరలయ విద్యార్ధులు భవిష్యత్తులో కర్నాటక సంగీతరంగంలో తమవైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.హార్మనీ & హ్యూస్ అధ్యక్షురాలు శ్యామల ప్రసంగిస్తూ 2025లో తిరుపతిలో అన్నమాచార్య 500వ జయంతి ఉత్సవాలలో చేసిన సంగీత కచేరీ, శేషుకుమారి వంశీ-సీల్వెల్ ఫౌండేషన్ వారి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డ్ అందుకోవడం స్వరలయసంస్థ సాధించిన కొత్త మైలురాళ్ళని కొనియాడారు.అలాగే కుమారి మనోజ్ఞ అనే గాత్రసంగీత విద్యార్ధి మాట్లాడుతూ కర్నాటక గాత్ర సంగీతాన్ని ఒక O-level ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలు వ్రాసేందుకు MOE (సింగపూర్ విద్యాశాఖ) తాను అనుమతి సాధించగలగటం విశేషం అనీ, ఇది తన గురువు ఇచ్చిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం వల్లనే సాధ్యమైందనీ, సంగీతం ఒక సబ్జెక్టుగా తీసుకోవడంతో ఇటు సంగీతంలో కృషి, అటు చదువుకునే సమయాన్ని సమర్ధవంతంగా వాడుకోవడం వీలవుతోందని చెప్పారు. ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా, గురు శేషుకుమారి తాళం మరియు రాగం నేర్పించేందుకు వినూత్నమైన సంగీత ఆటలను ప్రవేశపెట్టారు. ఇవి ప్రత్యక్షంగా వేదికపై నిర్వహించబడి, సంగీత శిక్షణలో ఒక కొత్త పోకడను పరిచయం చేశాయి.యూ.టీ.ఐ.ఏ.ఈ.సీ చైర్మన్ రాయ్, ట్రెజరర్ v. Adesh బాబు , కళ , శివ కృష్ణ ఆలయ చైర్మన్ ,మేనేజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీసాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కాకతీయ సాంస్కృతిక పరివారం నుంచి సబ్బుపాలకుర్తి , సింగపూర్ తెలుగు వనితలు సమూహం నుంచి క్రాంతి, జయ, దీపు , రేఖ , రాణి, గాయత్రి వంటి అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. పిల్లల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించి, వేడుకను విజయవంతంగా ముగించాయి. సౌజన్య చక్కటి వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు
ఘనంగా తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026
తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు నాలుగు వారాంతాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో, సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .“సైట్లో కష్టం… గ్రౌండ్లో శక్తి” అనే నినాదంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్, సింగపూర్ తెలుగు సమాజ ఐక్యత, శక్తి కృషికి ప్రతీకగా నిలిచింది.మొత్తం 18 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో, లీలా నాగేశ్ నాయకత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు విజేతగా నిలవగా, సాహు చంద్రశేఖర్ నాయకత్వంలోని మెగాయార్డ్ రైడర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగగా, 250కి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు వరుసగా SGD1,116 మరియు SGD558 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.వ్యక్తిగత విభాగంలో బండి శ్రీనివాస్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోగా, శ్యామ్ ఉత్తమ ఆల్రౌండర్గా, ఆంథోనీ ఉత్తమ బౌలర్గా, విజ్జు ఉత్తమ బ్యాట్స్మన్గా ఎంపికయ్యారు. మెగాయార్డ్ రైడర్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారిక ప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే రాంబాబు పాతూరి (కాకతీయ కల్చరల్ అసోసియేషన్), రత్న కుమార్ కవుటూరు (శ్రీ సాంస్కృతిక కళాసారథి), సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్ష్యులు రంగా రవి, చౌదరి జె తదితరులతో పాటు శేషారావు గూడూరి, వినయ్ కుమార్ సూర్యదేవర, సురేంద్ర చెబ్రోలు, చంద్రశేఖర్ చిలుకూరి, హనుమంతరావు మాదాల, అమ్మయ్య చౌదరి, గంగాధర్ తాటి, సతీష్ పారేపల్లి, వేణు నార్నే తదితర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను మరియు క్రీడాకారులను అభినందించారు.శివ ప్రసాద్ కొల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి వర ప్రసాద్, గిరిధర్ సరాయి, అనిల్ కుమార్ బొమ్మారెడ్డి తదితరులతో పాటు కోఆర్డినేటర్లు, లాజిస్టిక్స్ టీమ్, అంపైర్లు, స్కోరర్లు, వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సురేంద్ర చేబ్రోలు, ఉమా మహేశ్వర రావు, గురురాజ్ బనకర్, శ్రీను యాదవ్, గొర్రెపాటి లక్ష్మీ రెడ్డి అంపైర్లుగా వ్యవహరించగా, రమేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చారు.టీం శివప్రసాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది టీంను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల విభాగం ప్రవేశపెట్టడం, మెరుగైన లైవ్ స్ట్రీమింగ్, మరిన్ని సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
షాకింగ్ : పక్కా ప్లాన్తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్రే టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
క్రైమ్
అర్ధరాత్రి ఆగిన ఊపిరి
సాక్షి, బళ్లారి, రాయచూరు రూరల్: బంధువుకు అనారోగ్యంగా ఉండడంతో ఉదయమే ఊరి నుంచి మరో ఊరికి వచ్చారు. అర్ధరాత్రి తిరిగి బయల్దేరారు. కొంతసేపు ఉంటే క్షేమంగా చేరేవారే. కానీ మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చి పొట్టనబెట్టుకుంది. ట్రాక్స్ క్రూయిజర్ను లారీ ఢీకొగా, 5 మంది క్షణాల్లోనే చనిపోయారు. కలబుర్గి జిల్లా చిత్తాపూర్ తాలూకా లాడ్లాపూర్ సమీపంలో జాతీయ రహదారి– 50 పై జరిగింది. తుక్కయిన క్రూయిజర్ చిత్తాపూర్ తాలూకా వాడి పట్టణం దగ్గర ఇంగళిగి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 5 మంది క్రూయిజర్లో యాదగిరికి వచ్చి శుక్రవారం అర్ధరాత్రి తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన తమిళనాడు లారీ అతివేగంతో ఢీకొట్టింది. ఆ ధాటికి క్రూయిజర్ గుర్తుపట్టలేనంతగా తుక్కయింది. అందులోని మహ్మద్ హుస్సేన్ (60), ఫాతిమా (40), రసూల్బీ (40), మహబూబ్ (34), టోలూసాబ్ కాశ్వర్ (27) అనే అందరూ మరణించారు. మృతదేహాలు వాహనంలో చిక్కుకుపోయాయి. ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, స్థానికులతో కలిసి బయటకు తీసి సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లారీ డ్రైవరు కోసం గాలిస్తున్నారు. ఐదుమంది మరణంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
మహిళతో అసభ్యంగా ప్రవర్తించి..సీసీ కెమెరాల్లో చిక్కి
హైదరాబాద్: రోడ్డుపై వెళుతున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని నార్సింగి పోలీసులు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈనెల 14న అలకాపూర్ టౌన్షిప్లో ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నార్సింగి పోలీసులు.. తీవ్రంగా పరిగణించి బాధితురాలి నుంచి 19న ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. శనివారం పుప్పాలగూడలో ఉంటున్న నిందితుడు నాగరాజు(26)ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నిందితుడు పుప్పాలగూడలో స్థిరపడ్డాడని ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు.
గాంధీలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. గాంధీ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ కోర్సు చదువుతున్న పల్లవిగౌడ్ (19) అనే విద్యార్థిని శస్త్రచికిత్స అనంతరం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మరణించిందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో గాంధీ మార్చురీ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బాధితులు, చిలకలగూడ పోలీసులు తెలిపిన మేరకు.. జియాగూడకు చెందిన పల్లవి గౌడ్ కుడిఛాతీపై వాపు (గడ్డ) రావడంతో ఈనెల 16న గాంధీ ఆస్పత్రికి వచి్చంది. చిన్నపాటి సర్జరీ చేయాలని వైద్యులు చెప్పడంతో 18న అడ్మిట్ కాగా..19న సర్జరీ చేశారు. మరుసటి రోజు వైద్యులు పరీక్షించి మరోసారి సర్జరీ (రీఎక్స్ప్లొరేషన్) చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది.ఇదిలా ఉండగా.. సీనియర్ వైద్యులతో కాకుండా జూనియర్లతో సర్జరీ చేయించి తమ కుమార్తె ప్రాణాలపై ప్రయోగాలు చేశారని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి తండ్రి వెంకటే‹Ùగౌడ్ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క బాధితులను పరామర్శించి, ప్రభుత్వపరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ముగ్గురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ పల్లవి మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని గాంధీ సూపరింటెండెంట్ ప్రొ.వాణి స్పష్టం చేశారు. పల్లవికి సర్జరీ అనంతరం రక్తపుగడ్డలను తొలగించామని తెలిపారు. ఆ తర్వాత బీపీ పడిపోవడం, ఊపిరితిత్తుల సమస్యల కారణంగా వెంటిలేటర్పై ఉంచి అత్యుత్తమ వైద్యం అందించామని.. అయినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ ఘటనపై ముగ్గురు వైద్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
దోసెలు ఎక్కువగా తింటున్నావని తల్లి మందలింపు
ఫిలింనగర్: దోసెలు ఎక్కువగా తింటున్నావని, దీని వల్ల అన్నం సరిగ్గా తినడం లేదని తల్లి మందలించినందుకు ఓ బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫిలింనగర్లోని జ్ఞానీజైల్సింగ్ నగర్ బస్తీలో నివసించే కార్తీక్ (15) స్థానికంగా పదో తరగతి చదువుతున్నాడు. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచిస్తూ అతిగా స్పందించడం కార్తీక్ నైజంగా మారింది. ఈ నేపథ్యంలోనే దోసెలు ఎక్కువగా తింటున్నావంటూ అన్నం తినడం లేదని తల్లి చెప్పింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కార్తీక్.. తండ్రి చెన్నప్ప మేస్త్రీ పనికి, తల్లి ఇళ్లలో పనికి వెళ్లిన సమయంలో తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వీడియోలు
నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్
నాదే బాధ్యత.! సలార్ 2పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్
బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?
3 నెలల్లోనే రూ. 5.6 లక్షల కోట్ల లాభం..
బాబు మాటలు.. APలో అగ్గి రాజేస్తున్న మనువాద రాజకీయం
తాటి చెట్టులా పెరిగావ్.. బుర్ర లేదు.. మీ అన్న చావు వెనుక ఉన్నది నువ్వేనా?!
నోటికాడి కూడు లాక్కున్నావ్.. దీనికి అనుభవిస్తావ్..
సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ముంబై పైనే
స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు
బుమ్రాకు రామ్ చరణ్ క్షమాపణలు


