ఓటమి దిశగా సాగుతున్న ఎస్ఆర్హెచ్
ఓటమి దిశగా సాగుతున్న ఎస్ఆర్హెచ్6.5వ ఓవర్- 81 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ ఓటమి దిశగా సాగుతోంది. యశ్రాజ్ పూనియా బౌలింగ్లో హెన్రిచ్ క్లాసెన్ (18) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. నిప్పులు చెరుగుతున్న ఆర్చర్4.4వ ఓవర్- 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎస్ఆర్హెచ్ పోరాడకుండానే చేతులెత్తేశేలా ఉంది. 57 పరుగుల వద్ద ఆ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ట్రవిస్ హెడ్ (17) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ వికెట్ ఈ మ్యాచ్లో ఆర్చర్కు మూడవది.పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్హెచ్3.3వ ఓవర్- భారీ లక్ష్య ఛేదనలో ఎస్ఆర్హెచ్ 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్కు క్యాచ్ ఇచ్చి స్మరణ్ రవిచంద్రన్ (1) ఔటయ్యాడు. హెడ్, క్లాసెన్ క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్2.5వ ఓవర్- 11 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఫెరియెరాకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా వెనుదిరిగాడు. ఎస్ఆర్హెచ్కు భారీ షాక్244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎస్ఆర్హెచ్కు రెండో బంతికే భారీ షాక్ తగిలింది. ఆర్చర్ బౌలింగ్లో వికెట్కీపర్ జురెల్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ డకౌటయ్యాడు.రాజస్థాన్ భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97), ధృవ్ జురెల్ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఓ దశలో 260-270 వచ్చేలా కనిపించిన రాజస్థాన్ స్కోర్.. చివరి 5 ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా నెమ్మదించింది. చివరి రెండు ఓవర్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉండింది. 12 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. చివర్లో సాకిబ్ హుసేన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఎషాన్ మలింగ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్15.2వ ఓవర్- 207 పరుగుల వద్ద రాజస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రఫుల్ హింగే బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (26) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్13.5వ ఓవర్- 192 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసిన అనంతరం ధృవ్ జురెల్ ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్10.2వ ఓవర్- 137 పరుగుల వద్ద రాజస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. శివాంగ్ కుమార్ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (29) ఔటయ్యాడు. వైభవ్ సెంచరీ మిస్7.6వ ఓవర్- 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ప్రఫుల్ హింగే బౌలింగ్లో స్మరణ్ రవిచంద్రన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 125-1గా ఉంది. 6 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 80-0వైభవ్ సూర్యవంశీ 60 (20 బంతుల్లో, 2 ఫోర్లు, 8 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ 19 (16 బంతుల్లో 3 ఫోర్లు)దూకుడుగా ఆడుతున్న వైభవ్ 3 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్ సూర్యవంశీ(36), యశస్వి జైస్వాల్(8) పరుగులు చేశారు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ఐపీఎల్ 2026లో ఇవాళ జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఎలిమినేటర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజాసన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w), హెన్రిచ్ క్లాసెన్, స్మరన్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(c), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే
సేమ్ సీన్: 1992లో బంగారప్ప రాజీనామా.. ఇప్పుడు సిద్ధరామయ్య!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పుకునేలా చేసి డీకే శివకుమార్కు ఆ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రచారానికి బలాన్నిస్తున్నాయి. గురువారం మీడియాతో మాట్లాడతానని సిద్ధరామయ్య అన్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు సమాచారం.సిద్ధరామయ్యకు కాంగ్రెస్ షాక్! తాజాగా, న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం తర్వాత సిద్ధరామయ్య వర్గానికి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత అగ్రనేత రాహుల్ గాంధీ తన నివాసానికి వెళ్లి తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీతో చర్చించారు. ఆ సమయంలో శివకుమార్కు ఇచ్చిన హామీ గుర్తుచేసిన సోనియా గాంధీ దాన్ని అమలు చేసే సమయం వచ్చిందని సూచించినట్టు తెలుస్తోంది. శివకుమార్కు ఎప్పటి నుంచో మద్దతుగా నిలిచిన ప్రియాంక గాంధీ కూడా పార్టీకి ఆయన చూపిన విధేయత దృష్ట్యా ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని వాదించినట్టు సమాచారం.లంచ్ బ్రేక్ తర్వాత మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా, సిద్ధరామయ్య, శివకుమార్ మరోసారి సమావేశమైన వేళ రాహుల్ గాంధీ లోపలికి వచ్చి నేరుగా సిద్ధరామయ్యను చూస్తూ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని చెప్పినట్టు సమాచారం. ఆ వార్త విన్న వెంటనే సిద్ధరామయ్య ముఖంలో షాక్ స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. అయితే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాత్రం ఎన్నికల అంశాలపైనే చర్చ జరిగిందని, మిగతావన్నీ ఊహాగానాలేనని మీడియాకు చెప్పారు. 1992లోనూ ఇలాంటి పరిణామాలు తాజాగా, చోటుచేసుకున్న ఈ పరిణామాలన్నీ 1992 ఘటనను గుర్తుచేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన ప్రముఖ నేత ఎస్.బంగారప్ప ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రభుత్వంపై అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి బంగారప్పపై ఫిర్యాదులు చేసేవారు.అప్పుడు ప్రధానమంత్రి పీవీ నరసింహరావు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కర్ణాటక రాజకీయ పరిణామాలు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఒక రోజు బంగారప్పను ఢిల్లీకి పిలిపించారు. ప్రధానమంత్రి నివాసానికి వెళ్లిన బంగారప్ప ఎదుట పీఎంవో సిద్ధం చేసిన భారీ ఫైల్ ఉంచిన నరసింహరావు, కొన్ని ఫిర్యాదులు చదివి ఆయన స్పందన అడిగారని ప్రచారం జరిగింది. బంగారప్ప మౌనంగా ఉండటంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తున్నానని తెలిపారు. బెంగళూరులో రాజ్ భవన్కు వెళ్లి రాజీనామా సమర్పించాలని చెప్పినట్టు అప్పట్లో ఢిల్లీలో పనిచేసిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.చేసేది ఏమీలేక బంగారప్ప రాజీనామా బంగారప్ప బయటకు రాగానే మీడియా ఆయనను రాజీనామా చేస్తారా? అంటూ పలు ప్రశ్నలు అడిగింది. సమాధానం చెప్పకుండా బంగారప్ప చాణక్యపురిలోని కర్ణాటక భవన్కు వెళ్లి తన అనుచర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. వెంటనే బెంగళూరుకు ఫోన్ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు వేలాది మంది మద్దతుదారులను విమానాశ్రయానికి రప్పించాలని ఆదేశించారు.వెనుకబడిన వర్గాల ప్రజలు అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తారని, ఎమ్మెల్యేల మద్దతుతో రాజకీయ సంక్షోభం సృష్టించి ప్రధానమంత్రి నిర్ణయాన్ని మార్చగలనని బంగారప్ప భావించారు. అయితే మరుసటి రోజు ఆయన విమానం బెంగళూరు విమానాశ్రయానికి చేరేసరికి అక్కడ కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, కొన్ని వందల మంది మద్దతుదారులే కనిపించారు. ఆ తర్వాత బంగారప్ప ఆలస్యం చేయకుండా రాజ్ భవన్కు వెళ్లి రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత వీరప్ప మొయిలీ ముఖ్యమంత్రిగా 1992 నవంబర్ 19న బాధ్యతలు స్వీకరించారు.సిద్ధరామయ్య కర్ణాటకలో వెనుకబడిన వర్గాల నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తి. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నాయకుడిగానూ రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంతో ఆయన మౌనంగా ఉంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ అధిష్ఠానం చెబితే ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో..?
గాంధీ భవన్లో రగడ.. గల్లాలు పట్టుకుని కాంగ్రెస్ నేతలు ఫైటింగ్
హైదరాబాద్: గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కలకలం చెలరేగింది. నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ను కార్వాన్ ఇన్చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీ ఉస్మాన్ తోసేశారు. ప్రొటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగడంతో ఈ గొడవ చెలరేగింది. ఫిరోజ్ఖాన్, ఉస్మాన్ గల్లాలు పట్టుకున్నారు.మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సమక్షంలోనే గొడవ జరిగింది. మంత్రి అజారుద్దీన్ పక్క కూర్చునే విషయంలో గొడవ మొదలైంది. గొడవ పడుతుంటే కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీహెచ్ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గొడవ ఆపాలని పొన్నం ప్రభాకర్ చెప్పినా ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ వినలేదు. గొడవ పడుతున్న వారికి అక్కడి నేతలు అడ్డుకున్నారు. గొడవ మొదలుకావడంతో సమావేశం ముగిసినట్లు ప్రకటించారు. క్షమాపణలు చెప్పాను: ఉస్మాన్ గొడవపై కార్వాన్ ఇన్చార్జి ఉస్మాన్ స్పందిస్తూ... ‘‘ఫిరోజ్ ఖాన్కు క్షమాపణలు చెప్పాను. ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవ. మాది కాంగ్రెస్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో గొడవకు జరుగుతూ ఉంటాయి. నేను తోసేసింది చూశారు. అంతకు ముందు జరిగింది కూడా తెలుసుకోండి’’ అని అన్నారు.అందుకే గొడవ: ఫిరోజ్ ఖాన్ గొడవపై ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘కుర్చీలో కూర్చోవడం విషయంలో ఇబ్బంది జరిగింది. చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల గొడవ అయింది. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ అనుకున్నారు. ఉస్మాన్ నాకు పెద్దన్న లాంటి వాడు. ఉస్మాన్ నన్ను స్టేజీపైకి రమ్మంటే నేను వెళ్లలేదు. ఉస్మాన్ అన్న నాకు ముద్దు పెట్టాడు’’ అని చెప్పారు.
బాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’.. వైఎస్సార్సీపీ బుక్ విడుదల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలనపై వైఎస్సార్సీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్ విడుదల చేశారు. జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరుపుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ప్రజల నిరసన సెగలు తగలాలి అని అన్నారు.నిరసనలు ఇలా..జూన్ 4న మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు.జూన్ 8 లేదా 9న నియోజకవర్గ హెడ్క్వార్టర్స్లో టౌన్హాల్ సదస్సులు నిర్వహించాలి.జూన్ 12న ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు. బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అని రుజువైంది. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని బాబు నమ్మించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైంది. మూడోసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. సూపర్-6, సూపర్-7 లేదు. ఆడబిడ్డ నిధికి నిధుల్లేవు.18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మెలకు ఏడాదికి రూ.18 వేలు లేవు. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వలే. నిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. మావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారు. వ్యాట్ తగ్గించుకోమంటే బీపీ ఎందుకు?. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీనే కదా? ఎందుకు తగ్గించడం లేదు. రాష్ట్ర పన్నులతో తగ్గించుకోవచ్చు కదా చంద్రబాబూ!. తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతోంది. ఇప్పటికీ హామీల అమలు లేదు. మేనిఫెస్టో అడ్రస్ కనిపించదు. ఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్కు దిగారు. గొడ్డళ్లు కత్తులు,కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారు. ప్రజలను పిచ్చోళ్లని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ, తెలివైన వాళ్లని గుర్తించాలి’ అని చెప్పుకొచ్చారు.
‘‘రాజీనామా చేయాలని సిద్ధరామయ్య నిర్ణయం’’
బెర్క్షైర్ హాత్వే పోర్ట్ఫోలియోలో షాకింగ్ మార్పులు!
ఓటీటీలోకి సచిన్ బయోపిక్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈఎస్సీఐతో నరెడ్కో తెలంగాణ ఒప్పందం
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
సేమ్ సీన్: 1992లో బంగారప్ప రాజీనామా.. ఇప్పుడు సిద్ధరామయ్య!
సినిమాలు తీయకండి.. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోండి
నెల్లూరు సమీపంలో పడవ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం
ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. డాక్టర్తో నిశ్చితార్థం
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్లో కొత్త పద్ధతి!
విజయ్ సర్కార్ ఎఫెక్ట్.. 162 మంది న్యాయవాదుల రాజీనామా
25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్!
ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
‘వచ్చే పదేళ్లు మామూలుగా ఉండదు’
ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా!
వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!
నీటి ఎద్దడి నివారణలో విఫలమైన బాబు సర్కార్
అక్కగా సీఎం విజయ్ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్
కవలలకు జన్మనిచ్చిన సీరియల్ హీరోయిన్
మా సిద్ధాంతాలను కాంగ్రెస్ కాపీ కొడుతుంటే చూస్తూ ఊరుకోం!
దేవతల రాజధాని అంటే మన ఆలయాల భూములు కూడా ఆక్రమించి అమ్మేసి కట్టేది అని ఇప్పుడే అర్థమైంది స్వామి!!
అన్నాడీఎంకే సంక్షోభంలో కీలక మలుపు
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు.. నూతన ఉద్యోగలాభం
హైదరాబాద్లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో క్రికెటర్
సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం
చూసి సభ్యత నేర్చుకోవడానికి ఇక్కడకి ఆహ్వానించడం లేదయ్యా!
‘‘రాజీనామా చేయాలని సిద్ధరామయ్య నిర్ణయం’’
బెర్క్షైర్ హాత్వే పోర్ట్ఫోలియోలో షాకింగ్ మార్పులు!
ఓటీటీలోకి సచిన్ బయోపిక్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈఎస్సీఐతో నరెడ్కో తెలంగాణ ఒప్పందం
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
సేమ్ సీన్: 1992లో బంగారప్ప రాజీనామా.. ఇప్పుడు సిద్ధరామయ్య!
సినిమాలు తీయకండి.. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోండి
నెల్లూరు సమీపంలో పడవ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం
ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. డాక్టర్తో నిశ్చితార్థం
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్లో కొత్త పద్ధతి!
విజయ్ సర్కార్ ఎఫెక్ట్.. 162 మంది న్యాయవాదుల రాజీనామా
25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్!
ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
‘వచ్చే పదేళ్లు మామూలుగా ఉండదు’
ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా!
వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!
నీటి ఎద్దడి నివారణలో విఫలమైన బాబు సర్కార్
అక్కగా సీఎం విజయ్ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్
కవలలకు జన్మనిచ్చిన సీరియల్ హీరోయిన్
మా సిద్ధాంతాలను కాంగ్రెస్ కాపీ కొడుతుంటే చూస్తూ ఊరుకోం!
దేవతల రాజధాని అంటే మన ఆలయాల భూములు కూడా ఆక్రమించి అమ్మేసి కట్టేది అని ఇప్పుడే అర్థమైంది స్వామి!!
అన్నాడీఎంకే సంక్షోభంలో కీలక మలుపు
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు.. నూతన ఉద్యోగలాభం
హైదరాబాద్లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో క్రికెటర్
సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం
చూసి సభ్యత నేర్చుకోవడానికి ఇక్కడకి ఆహ్వానించడం లేదయ్యా!
ఫొటోలు
'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
ఈ బుక్లెట్ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్ జగన్ (ఫొటోలు)
మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు)
హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)
చిట్టి గౌనులో నజ్రియా క్యూట్ లుక్స్(ఫోటోలు)
మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్
విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)
సొంత ఊరు జాతరలో స్టెప్పులు వేసిన దేవిశ్రీ ప్రసాద్ (ఫొటోలు)
ఎలిమినేటర్ పోరు.. నితీశ్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
హైదరాబాద్ : జలవిహార్ లో జనం సందడి (ఫొటోలు)
సినిమా
అక్కగా సీఎం విజయ్ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్
తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి విజయ్కు ప్రజలు, ప్రతిపక్షాలు కొంత సమయం ఇవ్వాలని ప్రముఖ సినీ నటి, బుల్లితెర నిర్మాతల సంఘం అధ్యక్షురాలు కుష్బూ అభిప్రాయపడ్డారు. కేవలం పది రోజుల్లోనే అన్ని మార్పులను ఎలా తీసుకురాగలరని ఆమె ప్రశ్నించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్, విద్యా , సాంస్కృతితిక శాఖ మంత్రి రాజమోహనన్ను కుష్బూ నేతృత్వంలోని బుల్లితెర నిర్మాతల సంఘం ప్రతినిధులు కలిసి ఒక కోరికల వినతిపత్రాన్ని సమర్పించారు.సమస్యల పరిష్కారానికి సీఎం హామీముఖ్యమంత్రితో సమావేశం అనంతరం కుష్బూ మీడియాతో మాట్లాడారు. బుల్లితెర రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న, మధ్యతరహా నిర్మాతల సంక్షేమం కోసం కొన్ని ముఖ్యమైన డిమాండ్లను ముఖ్యమంత్రి ముందు ఉంచామన్నారు. తమ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన సీఎం విజయ్, మంత్రి రాజమోహన్ వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కుష్బూ తెలిపారు.విజయ్ నా తమ్ముడు.. ముఖ్యమంత్రి విజయ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కుష్బూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం విజయ్ను నా సొంత తమ్ముడిగా చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాననని పేర్కొన్నారు.. ఒక అక్కగా ఈరోజు ఆయనను ముఖ్యమంత్రి హోదాలో చూసినప్పుడు నా మనసు నిండిపోయిందంటూ చాలా ఎమోషనల్ అయ్యానని తెలిపారు. ఆయన పనితీరు, ఆలోచనలు చూస్తుంటే భవిష్యత్తులో తమిళనాడులో కచ్చితంగా ఒక మంచి మార్పును తీసుకువస్తారనే నమ్మకం నాకు కలిగిందన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నింటినీ ఒకే రోజులో సర్దుబాటు చేయడం ఎవరికై నా సాధ్యమేనా?, విజయ్ పగ్గాలు చేపట్టిన కేవలం 10 రోజుల్లోనే ఎలా మార్చగలరు? ముఖ్యమంత్రికి కాస్త సమయం ఇవ్వండి. తమిళనాడులో కచ్చితంగా మార్పు వస్తుంది అని వ్యాఖ్యలుచేశారు.
కాజల్ ఇలా కామ్నా అలా.. మధ్యలో రష్మిక
అందంతో రచ్చ లేపుతున్న కాజల్ అగర్వాల్ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ కామ్నా గ్లామర్ డోస్మోడ్రన్ డ్రస్లో మాయ చేసేలా ఐశ్వర్య రాజేశ్పొడుగు కాళ్ల సుందరి హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంయుక్తజపాన్ ట్రిప్ లో హీరోయిన్ రష్మిక ఎంజాయ్ View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Preity Mukhundhan (@preity_mukhundhan)
తెలుగులో చాన్నాళ్ల తర్వాత పిల్లల సినిమా.. టీజర్ రిలీజ్
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల మూవీస్ దగ్గర నుంచి పిల్లల చిత్రాల వరకు అన్ని రకాలవి వచ్చేవి. ప్రస్తుతం మాత్రం కమర్షియల్, రెగ్యులర్ సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. వీటికి మొహం మొత్తేసిన ప్రేక్షకులు కూడా థియేటర్కి వచ్చే ఆసక్తి చూపించట్లేదు. అయితే చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్లో ఓ పిల్లల మూవీ వచ్చేస్తోంది. దాని పేరు 'సమ్మర్ హాలీడేస్'. తాజాగా దీని టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్)ఇప్పుడంటే వేసవి వస్తే పిల్లలందరూ సమ్మర్ క్యాంపుల పేరిట బిజీ అయిపోతున్నారు గానీ ఒకప్పుడు అమ్మమ్మ ఊరికి వెళ్లేవాళ్లు. ఆ జ్ఞాపకాలని గుర్తుచేసేలా ఈ సినిమాని తీసినట్లు తెలుస్తోంది. పట్నంలో ఉండే ఓ పిల్లాడు.. వేసవిలో అమ్మమ్మ ఉండే పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ ఈ పిల్లాడికి మరో అల్లరి పిల్లాడు పరిచయమవుతాడు. తర్వాత వీళ్లిద్దరూ ఎలాంటి సందడి చేశారనేదే స్టోరీ అనిపిస్తుంది. రోహన్, అరుణ్ లీడ్ రోల్స్ చేశారు. త్వరలో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)
మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి...‘ధురంధర్’ ప్రొడక్షన్ డిజైనర్పై కేసు
చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆడిషన్ల పేరుతో, షూటింగ్ లొకేషన్స్లో, వర్కింగ్ కండిషన్స్లో మహిళా నటీనటులు మాత్రమే కాదు టెక్నీషియన్లు కూడా నిరంతరం వేధింపులను ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ధురంధర్’మూవీకి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా పని చేసిన ఓ యువతిని ఆ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ సైనీ జోహ్రే లైంగిక వేధింపులకు గురి చేశాడు. పని పేరుతో హోటల్కి పిలిపించుకొని అసభ్యకరంగా ప్రవర్తించాడు. తాజాగా ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.మత్తుమందు ఇచ్చి.. యువతి ఫిర్యాదు ప్రకారం.. గతేడాది సెప్టెంబర్ 10న సినిమాకు సంబంధించిన చర్చల కోసం సైనీ ఆమెను ఛండీగడ్లోని హోటల్కి రమ్మని చెప్పాడు. టీమ్ మీటింగ్ అనుకొని రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె అక్కడకు వెళ్లింది. గదిలోకి వెళ్లేసరికి అక్కడ ఎవరూ లేరు. ప్లాన్ ప్రకారం సైనీ జోహ్రే ఆమెను మాత్రమే ఆహ్వానించాడు. ఆమె రాగానే వైన్లో మత్తుమందు కలిపి తాగమని బలవంతం చేశాడు. ఆమె అది సేవించగానే తలతిరిగినట్లుగా అనిపించింది. అదే సమయంలో ఆమెతో అసభ్యకరంగా ప్రవరించాడు.(చదవండి: చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు)కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులుతనకు అనారోగ్యంగా ఉందని చెప్పినా వినిపించుకోలేదు. బాత్రూంకి వెళ్లి వాంతులు చేసుకున్నా. అక్కడ కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు. బయటకు వెళ్లనీయకుండా బలవంతం చేశాడు. రాత్రంతా అక్కడే ఉన్నా. మరసటి రోజు ఉదయమే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్లిపోయా. ఆ తర్వాత ఈ విషయం బయటకు చెప్తే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు. ఈ బెదిరింపులు రోజు రోజుకి ఎక్కువైపోయాయి. అందుకే ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నా’ అని సదరు యువతి పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రీడలు
WWEని తాకిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ క్రేజ్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) లాంటి అంతర్జాతీయ ఈవెంట్ను తాకింది. ఆ ఈవెంట్ సూపర్ స్టార్ డ్రూ మెక్ఇన్టైన్ (Drew McIntyre) వైభవ్పై అభిమానాన్ని బహిరంగంగా చాటుకున్నాడు. వైభవ్ ఐపీఎల్ జెర్సీతో జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియోను తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ.. Chosen One అని క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్ట్ కొద్ది నిమిషాల్లోనే వైరలైంది. వైభవ్కు వచ్చిన క్రేజ్ చూసి భారత క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Drew McIntyre (@dmcintyrewwe)బుడ్డోడు అతి స్వల్పకాలంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడని ప్రశంసిస్తున్నారు. సచిన్, ధోని, విరాట్ లాంటి దిగ్గజాలను ఇప్పటికీ చాలామంది అంతర్జాతీయ అథ్లెట్లు గుర్తు పట్టలేరని కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా వైభవ్ క్రేజ్ చూసి ఔరా అంటున్నారు.డ్రూ మెక్ఇన్టైన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించడం మరింత వైరల్గా మారింది. "2K గేమ్లో నేను ఎన్ని Future Shock DDTలు వేసానో గుర్తులేదు" అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ అధికారిక సోషల్మీడియా ఖాతా కూడా "Certainly" అంటూ స్పందిస్తూ.. వైభవ్ నిజంగానే "Chosen One" అన్నట్లుగా వ్యాఖ్యానించింది.ఇదిలా ఉంటే, రాజస్థాన్ రాయల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్లో గెలిచి చివరి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ముల్లాన్పూర్ వేదికగా ఇవాళ (మే 27) జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో ఆ జట్టు ఎస్ఆర్హెచ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో వైభవ్పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సీజన్లో ఇప్పటివరకు అతనాడిన 14 మ్యాచ్ల్లో 232.27 స్ట్రయిక్రేట్తో 583 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు సహా 53 సిక్సర్లు, 50 బౌండరీలు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనూ ఇదే విధ్వంసం కొనసాగుతుందని రాయల్స్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.పైగా వైభవ్కు ప్లే ఆఫ్స్లో (నాకౌట్స్) మరింత ఘనమైన ట్రాక్ రికార్డు ఉండటం వారి ఆనందానికి అవథుల్లేకుండా చేస్తుంది. ఇప్పటివరకు వైభవ్ ఆడిన 8 నాకౌట్స్లో 209.62 స్ట్రయిక్రేట్తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 392 పరుగులు చేశాడు. రాయల్స్ ఫ్యాన్స్ ధీమాకు మరో కారణం కూడా ఉంది. ఇదే సీజన్ లీగ్ మ్యాచ్లో వైభవ్ ఆ జట్టుపై కేవలం 37 బంతుల్లో శతక్కొట్టాడు.ఇన్ని సానుకూల అంశాల నడుమ నేటి మ్యాచ్లో వైభవ్ విధ్వంసం ఖాయమని అంతా భావిస్తున్నారు. మరి వైభవ్ ఏం చేస్తాడో చూడాలి.
వైభవ్ బాధ్యత వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీలక వ్యాఖ్యలు
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలన్న డిమాండ్లు ఎక్కువ అయ్యాయి. ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే ఈ యువ సంచలనం అంతర్జాతీయ క్రికెట్కు సిద్ధమయ్యాడని అభిమానులు,మాజీలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ ఆఖరిలో ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు వైభవ్ను ఎంపిక చేయాలని పలువురు సూచిస్తున్నారు. అయితే అంతకంటే ముందు వచ్చే నెలలో శ్రీలంక వేదికగా జరగనున్న ముక్కోణపు సిరీస్లో భారత్-ఎ జట్టు తరపున వైభవ్ బరిలోకి దిగనున్నాడు. తిలక్ వర్మ సారథ్యంలో అతడు ఆడనున్నాడు. ఈ సిరీస్లో కూడా అతడు మెరుగ్గా రాణిస్తే భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమవుతోంది.ఈ నేపథ్యంలో వైభవ్ భవిష్యత్తుపై ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ఒక అద్భుతమైన ఆటగాడని.. అతడిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత రాజస్తాన్ రాయల్స్, బీసీసీఐపై ఉందని ధుమాల్ అన్నారు. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 583 పరుగులు సాధించి ఆరెంజ్క్యాప్ రేసులో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్లలో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి."వైభవ్ సూర్యవంశీ టెంపరామెంట్ దెబ్బతినకుండా ఉండటానికి బీసీసీఐ, రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం అతడికి అండగా నిలబడాలి. అతడికి సరైన మార్గం చూపించాల్సిన బాధ్యత బోర్డుతో పాటు రాయల్స్పై కూడా ఉంది. క్రీడలు అంటే కేవలం శారీరక నైపుణ్యం మాత్రమే కాదు, మానసిక దృఢత్వం కూడా ముఖ్యమే.అతడు భవిష్యత్తులో సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహించేలా మా వందు మద్దతు అందిస్తామని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధుమాల్ పేర్కొన్నాడు. కాగా చిన్నవయస్సులోనే స్టార్డమ్ రావడం వల్ల ఆటగాళ్లు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. అందుకే వైభవ్కు సరైన గైడెన్స్ ఇవ్వాలని ధుమాల్ సూచించారు.చదవండి: IPL 2026: రాజస్తాన్తో ఎలిమినేటర్.. సన్రైజర్స్ తుది జట్టు ఇదే!
సత్తా చాటిన స్టబ్స్
ఐపీఎల్ 2026లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయిన సౌతాఫ్రికా ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్).. ఇంగ్లండ్లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్లో చెలరేగాడు. హ్యాంప్షైర్ తరఫున అరంగేట్రంలోనే ఇరగదీశాడు. ఫలితంగా ఆ జట్టు ఎసెక్స్పై 30 పరుగుల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్షైర్.. ట్రిస్టన్ స్టబ్స్ (42 బంతుల్లో 69 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), హిల్టన్ కార్ట్రైట్ (21 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జో వెథర్లీ (34 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.హ్యాంప్షైర్ ఇన్నింగ్స్లో టాబీ అల్బర్ట్ (13), కెప్టెన్ జేమ్స్ విన్స్ (8), టామ్ ప్రెస్ట్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఎసెక్స్ బౌలర్లలో ఛార్లీ బెన్నెట్ 2, మాథ్యూ క్రిచ్లీ, కెప్టెన్ సైమన్ హార్మర్ తలో వికెట్ తీశారు.అనంతరం 201 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఎసెక్స్.. స్కాట్ కర్రీ (4-0-18-4) ధాటికి 170 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితమై, ఓటమిపాలైంది. కర్రీతో పాటు క్రిస్ వుడ్ (4-0-33-2), ఆండ్రూ జాన్ నీల్ (4-0-36-1) కూడా వికెట్లు తీశారు. ఎసెక్స్ ఇన్నింగ్స్లో లూక్ బెన్కెన్స్టైన్ (48) టాప్ స్కోరర్గా నిలువగా.. ఆఖర్లో హార్మర్ (36 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. మిగతా ప్లేయర్లలో మైఖేల్ పెప్పర్ (25), వియాన్ ముల్దర్ (14), నోవా థైన్ (18) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో ట్రిస్టన్ స్టబ్స్ 14 మ్యాచ్ల్లో రెండు అర్ద సెంచరీలు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ సీజన్లో ఢిల్లీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది. ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. నిన్న జరిగిన క్వాలిఫయర్-1లో ఆర్సీబీ గుజరాత్ను ఓడించి నేరుగా ఫైనల్కు చేరింది. ఇవాళ ఎస్ఆర్హెచ్-రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది.
SRH vs RR: వర్షం పడితే ఇంటికే!.. ఆ ఛాన్సే లేదు!
ఐపీఎల్-2026 తొలి ఫైనలిస్టు ఖరారైంది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ను 92 పరుగుల తేడాతో మట్టికరిపించి.. ఫైనల్లో అడుగుపెట్టింది.అయితే, ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడినప్పటికీ గుజరాత్కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం మిగిలే ఉంది. ఇక బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్తో గుజరాత్తో తలపడేది ఎవరన్న అంశం తేలిపోనుంది.రిజర్వ్ డేలు ఉండవుఇక ఈ మ్యాచ్లో ఓడిన జట్టు ఇంటి బాట పడుతుంది. మరి ఈ నాకౌట్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించినా.. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏమిటి?.. కాగా ఐపీఎల్లో ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్లకు రిజర్వ్ డేలు ఉండవు. కాబట్టి వాన వల్ల ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దైతే.. నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న సన్రైజర్స్ నేరుగా క్వాలిఫయర్-2లో అడుగుపెడుతుంది. కాగా సన్రైజర్స్ లీగ్ దశలో పద్నాలుగింట తొమ్మిది గెలిచి మూడో స్థానంలో ఉండగా.. రాజస్తాన్ రాయల్స్ ఎనిమిది విజయాలు సాధించి నాలుగో స్థానంతో ముగించింది.వాతావరణం ఎలా ఉందంటే?అయితే, చండీగఢ్లో మధ్యాహ్నం ఎండలు మండిపోతున్నాయి. సగటుల 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదువుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇక సాయంత్రం వేళ కూడా దాదాపు 32 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. కాబట్టి ఎలిమినేటర్ మ్యాచ్కు వేదికైన ముల్లన్పూర్లో వర్షం పడే సూచనలైతే దాదాపుగా లేవు.చదవండి: వైభవ్ మాపై శతక్కొట్టవచ్చు.. కానీ: కమిన్స్
న్యూస్ పాడ్కాస్ట్
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పునకు సంకేతాలు.. సిద్ధరామయ్య రేపు రాజీనామా చేసే అవకాశం
మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా?... చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన మాజీ సీఎం వైఎస్ జగన్
యుద్ధమా? ఒప్పందమా?... ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో పగిలిన అక్రమాల పుట్ట... ఎస్సీఆర్టీ నుంచే కుంభకోణం..
అమరావతిలో చంద్రబాబు లూటీ... అవినీతి, దోపిడీతో ఎప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు.
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో దోపిడీ విజన్, స్కామ్కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
బిజినెస్
ఏఐ బూమ్తో శామ్సంగ్ బంపర్ ఆఫర్
కృత్రిమ మేధ (ఏఐ) విప్లవం ప్రపంచ టెక్ రంగాన్ని ఏ విధంగా శాసిస్తోందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి ఉండదు. గ్లోబల్ సెమీకండక్టర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న దక్షిణ కొరియా దిగ్గజం శామ్సంగ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తన చిప్ విభాగం ఉద్యోగులకు కళ్లు చెదిరే బోనస్ ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ సాధించిన బంపర్ ప్రాఫిట్స్ నేపథ్యంలో చిప్ విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి సగటున 3,40,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.3.25 కోట్లు) బోనస్ లభించనుంది. బుధవారం నాడు శాంసంగ్కు చెందిన అతిపెద్ద కార్మిక సంఘం (యూనియన్) ఈ మెగా బోనస్ ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపింది. దాదాపు 18 రోజుల పాటు సమ్మెకు దిగుతామంటూ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె హెచ్చరికల నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం దిగివచ్చి ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఏకంగా 49 రెట్లు పెరిగిన ఆదాయం!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఏఐ బూమ్ కారణంగా చాట్ జీపీటీ, జెమిని వంటి అధునాతన ఏఐ మోడల్స్, భారీ డేటాసెంటర్లకు మెమరీ చిప్స్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ మెమరీ చిప్స్ తయారీలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న శామ్సంగ్.. గత త్రైమాసికంలో తన చిప్ విభాగం ఆదాయంలో ఏకంగా 49 రెట్ల వృద్ధిని నమోదు చేసింది. ఈ అసాధారణ వృద్ధి కారణంగానే తైవాన్కు చెందిన టీఎస్ఎంసీ తర్వాత మార్కెట్ విలువలో ట్రిలియన్ డాలర్లను దాటిన రెండో ఆసియా కంపెనీగా శామ్సంగ్ ఇటీవల రికార్డు సృష్టించింది.ఎవరు అర్హులు?ఈ భారీ బోనస్ ప్యాకేజీ శామ్సంగ్ ఉద్యోగులందరికీ వర్తించదు. కేవలం కంపెనీకి చెందిన ప్రాసెసర్లు, ర్యామ్, హై-ఎండ్ మెమరీ చిప్స్ తయారు చేసే సెమీకండక్టర్ (చిప్) విభాగానికి మాత్రమే ఇది పరిమితం. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఏఐ డేటాసెంటర్లలో వాడే చిప్స్ అన్నీ ఈ విభాగంలోనే తయారవుతాయి.ఈ ఏడాది మార్చిలో శామ్సంగ్ సమర్పించిన అధికారిక ఫైలింగ్ ప్రకారం.. 2025లో కంపెనీ ఉద్యోగులు సగటున 158 మిలియన్ వాన్ (సుమారు రూ.1 కోటి) ఆర్జించారు. కానీ ఈసారి రాబోయే బోనస్ ఆ మొత్తాన్ని ఎన్నో రెట్లు అధిగమించింది.కేవలం బోనస్ల కోసమే 26.5 బిలియన్ డాలర్లుశామ్సంగ్ అధికారిక గణాంకాల ప్రకారం.. కంపెనీ చిప్ విభాగంలో సుమారు 78,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ లెక్కన ప్రతి ఒక్కరికీ సగటున 3,40,000 డాలర్ల బోనస్ ఇవ్వాలంటే కంపెనీ కేవలం బోనస్ కోసమే ఏకంగా 26.5 బిలియన్ డాలర్లను ఖర్చు చేయబోతోంది. కార్పొరేట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు వ్యయంగా మారనుంది.ఓటింగ్లో భారీ మెజారిటీయూనియన్ ప్రతినిధులు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఒప్పందంపై నిర్వహించిన ఓటింగ్లో అర్హులైన సభ్యులలో 95 శాతానికి పైగా పాల్గొన్నారు. మొత్తం 62,600 బ్యాలెట్లలో 73.7 శాతం మంది ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేశారు. నిబంధనల ప్రకారం సగానికి పైగా మద్దతు అవసరం కాగా, ఉద్యోగులు భారీ మెజారిటీతో దీనిని ఆమోదించారు.తప్పిన గ్లోబల్ సప్లై చైన్ సంక్షోభంఈ ఒప్పందం కేవలం శామ్సంగ్కు మాత్రమే కాదు, అంతర్జాతీయ టెక్ రంగానికి సైతం పెద్ద ఊరటనిచ్చింది. ఎందుకంటే దక్షిణ కొరియా మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో శామ్సంగ్ వాటా ఏకంగా 12.5 శాతం. అలాగే ఆ దేశ ఎగుమతుల్లో మెమరీ చిప్స్ వాటా 35 శాతం వరకు ఉంటుంది. ఒకవేళ యాజమాన్యం ఈ డిమాండ్లకు ఒప్పుకోకపోయి ఉంటే ఉద్యోగులు 18 రోజుల పాటు సమ్మెకు వెళ్లేవారు. దీనివల్ల ప్రపంచవ్యాప్టింగా స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల తయారీ నిలిచిపోయి సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతినేది. వారం రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ముప్పు తప్పింది.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు
కరుగుతోన్న బంగారు కొండ!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
ఐఐపీ లెక్కల్లో భారీ మార్పులు
దేశ పారిశ్రామిక వృద్ధి రేటును అంచనా వేసే ‘పారిశ్రామిక ఉత్పత్తి సూచీ’ (ఐఐపీ-ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్) లెక్కింపు పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. మారుతున్న ఆర్థిక ముఖచిత్రానికి అనుగుణంగా మరింత పారదర్శకంగా పారిశ్రామిక ప్రగతిని ప్రతిబింబించేలా ఐఐపీ పరిధిని విస్తరిస్తోంది. ‘బేస్ ఇయర్ రివిజన్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ’ (టీఏసీ-ఐఐపీ) చేసిన ప్రతిపాదనల మేరకు సరికొత్త ఐఐపీ సిరీస్ను జూన్ 1వ తేదీన ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది.ఈ కొత్త సిరీస్లో ఇప్పటివరకు ఉన్న బేస్ ఇయర్ 2011-12 స్థానంలో 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని నూతన ఆధారిత సంవత్సరంగా (బేస్ ఇయర్) ఖరారు చేశారు. ఇటీవల మార్చిన దేశ జీడీపీ బేస్ ఇయర్ 2022-23, వినియోగదారుల ధరల సూచీ - సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ ఇయర్ 2024ల తర్వాత వాస్తవిక ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా మారుస్తున్న మూడో కీలక ఆర్థిక సూచిక ఇదే కావడం గమనార్హం.కొత్తగా చేరిన రంగాలుగణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పారిశ్రామిక రంగంలో వస్తున్న నూతన మార్పులను అందిపుచ్చుకునేలా ఐఐపీ పరిధిని పెంచారు. అరుదైన ఖనిజాల విభాగంలో మైనింగ్, క్వారీయింగ్ విభాగం కింద రేర్ ఎర్త్ మెటల్స్, మైనర్ మినరల్స్ను కొత్తగా ఈ సూచీలో చేర్చారు. అంతేకాకుండా, సాంప్రదాయ (నాన్ రెన్యువబుల్), పునరుత్పాదక (రెన్యువబుల్) ఇంధన వనరుల ద్వారా జరిగే విద్యుత్ ఉత్పాదనను ఇకపై విడివిడిగా చూపిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నల్లా కనెక్షన్ల సంఖ్య ఆధారంగా నీటి సరఫరా విభాగాన్ని అంచనా వేస్తారు. అమృత్ పథకం కింద ఉన్న 500 నగరాల్లోని డ్రైనేజీ కనెక్షన్ల ఆధారంగా మురుగునీటి నిర్వహణను, పట్టణాల్లో సేకరించి ప్రాసెస్ చేసిన వ్యర్థాల ఆధారంగా వేస్ట్ మేనేజ్మెంట్ రంగాన్ని ట్రాక్ చేస్తారు.ఆరు విభాగాల వర్గీకరణ యథాతథంబేస్ ఇయర్ మారినప్పటికీ.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు రకాల వర్గీకరణలను కమిటీ యథాతథంగా కొనసాగించింది. ఇందులో ప్రాథమిక వస్తువులు, మూలధన వస్తువులు, మధ్యంతర వస్తువులు, మౌలిక సదుపాయాలు-నిర్మాణ రంగ వస్తువులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కన్స్యూమర్ నాన్-డ్యూరబుల్స్ ఉన్నాయి.జూన్ 1న తొలి నివేదికజూన్ 1న విడుదలయ్యే తొలి నివేదికలో ఏప్రిల్ 2023 నుంచి గణాంకాలను పొందుపరుస్తారు. ఇందులో ఏప్రిల్ 2026కి సంబంధించిన ముందస్తు అంచనాలు కూడా ఉంటాయి. ఆల్ ఇండియా జనరల్ ఇండెక్స్తో పాటు.. మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ సప్లై, వాటర్ సప్లై, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి రంగాల వారీ సూచీలను కూడా ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు. ఈ నూతన సంస్కరణల ద్వారా దేశ పారిశ్రామిక రంగానికి సంబంధించిన మరింత స్పష్టమైన, వాస్తవిక లెక్కలు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:37 సమయానికి నిఫ్టీ(Nifty) 24 పాయింట్లు తగ్గి 23,886 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 149 పాయింట్లు నష్టపోయి 75,838 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.11బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 97.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.47 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.61 శాతం పెరిగింది.నాస్డాక్ 1.19 శాతం పుంజుకుంది.Today Nifty position 27-05-2026(time: 09:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ
వంట చేయడం రాకపోతే విడాకులు ఇవ్వొచ్చా? ధర్మాసనం ఏం చెప్పిందంటే..
ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే కోర్టు మెట్లు ఎక్కి విడిపోతున్న జంటలు కోకొల్లలు. తీవ్రంగా పరిగణించాల్సిన సమస్యలేవి లేకపోయినా..విడాకులు కోరుతుండటం బాధకరం. ఇక్కడ ఈ కేసులో కూడా అలాంటి వింతే చోటు చేసుకుంది. కేవలం భార్యకు వంట రాదని విడాకులు ఇవ్వమంటూ హైకోర్టు మెట్లు ఎక్కాడు భర్త. అతడికి ధర్మాసనం దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి చివాట్లు పెట్టింది. అసలేం జరిగిందంటే..ఈ జంటలకు 2002లో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే వివాదాలు మొదలయ్యాయి. అదే సంవత్సంరలో అతడు "మానసిక క్రూరత్వం" అనే కారణంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. తన భార్యకు వంట చేయడం రాదని, ఆమె మొరటుగా, మాట వినకుండా ఉంటుందని, ఇంటి పనులను సరిగ్గా చేయలేదని, దీనివల్ల తనకు మానసిక ఒత్తిడి కలిగిందని ఆరోపణలు చేశాడు. పైగా వైవాహిక చట్టం ప్రకారం ఈ చర్యలు క్రూరత్వం కిందకు వస్తాయని కూడా అతను వాదించాడు.అయితే భార్య ఆ ఆరోపణలన్నింటిని ఖండించింది. వాస్తవానికి, పాత్రలు కడగడం, శుభ్రం చేయడం, వంట చేయడం వంటి అన్ని ఇంటి పనులను తనతోనే చేయించారని, మిగిలిపోయిన ఆహారాన్ని కూడా తినమని బలవంతం చేశారని ఆమె పేర్కొంది.ధర్మాసనం ఏం చెప్పిందంటే..జస్టిస్ భారతి డాంగ్రే మరియు జస్టిస్ మంజుషా దేశ్పాండేలతో కూడిన డివిజన్ బెంచ్ భార్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వివాహం అనేది సమానుల భాగస్వామ్యం, అంతేగాని సేవా ఒప్పందం కాదు. భార్యను పనిమనిషిగా పరిగణించకూడదని స్పష్టం చేసింది. వంట చేయడం లేదా శుభ్రపరచడం వంటి పనులు చేయడంలో విఫలమైనంత మాత్రాన అది మానసిక క్రూరత్వంగా పరగణించలేమని పేర్కొంది. వివాహం జరిగిన తొలినాళ్లలో జరిగిన అభిప్రాయ భేదాలను సర్దుబాటు చేసుకునే ధోరణిలో చూడాలి తప్ప క్రూరత్వ ఆరోపణల కిందకు రాదంటూ మండిపడింది. పైగా ఫ్యామిలీ కోర్టు 2010లో భార్య ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తరగతుల కోసం ఇచ్చిన ప్రకటన ఆధారంగా స్వతంత్రంగా సంపాదించుకోగలదని నిర్థారించి, ఆమెకు భరణం నిరాకరిస్తూ.. భర్తకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని సవాలు చేస్తూ భార్య ముంబై హైకోర్టుని ఆశ్రియంచింది. ఆ నేపథ్యంలోనే ధర్మాసనం ఫ్యామిలీ కోర్టు తీర్పుని కొట్టివేస్తూ..చిన్న తరహా కార్యకలాపాలను ఆదాయానికి రుజువుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అలాగే విడాకుల కేసులలో చట్టపరంగా మానసిక క్రూరత్వం అంటే ఏమిటో కూడా ధర్మాసనం వివరించింది. క్రూరత్వంలో అవమానం, భావోద్వేగ బాధ కలిగించే లేదా వివాహాన్ని కొనసాగించడం అసాధ్యం చేసే తీవ్రమైన ప్రవర్తన ఉండాలని పేర్కొంటూ విడాకులను రద్దు చేసింది. అలాగే భర్తను నెలకు రూ. 20,000 చెల్లించాలని అదేశించింది. (చదవండి: విజయవంతమైన వివాహబంధం అంటే అదేనా..!: డేటింగ్ యాప్ సీఈఓ)
ప్రపంచంలో ఎన్ని రకాల కోకిలలు ఉన్నాయో తెలుసా?
వసంతకాలం వచ్చిందంటే లేతచివుళ్లు ఆరగించి "కుహూ.. కుహూ.. రాగాలతో మనల్ని ఆదరించే పక్షి కోకిల. దాని గాత్రం అంత మధురం కాబట్టే, గాన కోకిల అంటారు. ముఖ్యంగా వసంత కాలంలో మగ కోకిలలు పాడే రాగాలు ప్రకృతికి ప్రాణం పోస్తాయి. కోకిలలు తమ సొంత గూళ్ళను నిర్మించుకోవు. ఆడ కోకిలలు కాకులు లేదా ఇతర చిన్న పక్షుల గూళ్ళను కనిపెట్టి, వాటి గూటిలో తమ గుడ్లను పెడతాయి. వీటికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు చూద్దామా.ప్రపంచంలో మొత్తం 54 రకాల కోకిలలు ఉన్నాయి. వీటి ప్రధాన ఆహారం...గొంగళి పురుగులు. ఆకులు, పండ్లు కూడా తింటాయి కానీ, గొంగళి పురుగులను చాలా ఇష్టంగా తింటాయి! కాకికీ కోకిలకీ తేడా కనిపెట్టాలంటే వాటి ఈకలు చూడాలి. మగ కోకిల మెడ నుంచి తల వరకూ నలుపు కాకుండా నీలం, బూడిదరంగు కలిసినట్టుగా ఉంటుంది. కొన్ని ఆడవి కూడా ఇలానే ఉంటాయి కానీ... వాటికి ఛాతీమీద ఈకల రంగు ముదురుగా ఉంటుంది. పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని ఎరుపు, బ్రౌన్ కలర్స్లో కూడా ఉంటాయి. కాకపోతే... అత్యంత దగ్గర్నుంచి చూస్తే తప్ప ఈ తేడాలను మనం గమనించలేం! వీటి రెక్కలు పొడవుగా, సూదిగా ఉంటాయి. ముక్కు కూడా సూదిగా ఉంటుంది. ఎగిరినప్పుడు కాస్త గద్దల మాదిరిగా కనిపిస్తాయివి! వేసవికాలం కోకిలలకు సంతానోత్పత్తి కాలం. మగ కోకిల ప్రధానంగా ఆడ కోకిలను ఆకర్షించడానికి పాడుతుంది. దాని పాట ఆడ కోకిలలకు సంభోగ సంకేతంగా పనిచేస్తుంది. ఇవి గూళ్లు కట్టుకోవు. పిల్లల్ని పొదగవు. వేరే పక్షుల గూళ్లలో గుడ్లు పెడతాయి. పట్టుకు పది నుంచి 22 గుడ్లు పెడతాయి. అయితే అన్నీ ఒక గూటిలో పెట్టవు. వేర్వేరు చోట్ల పెడతాయి. ఆయా పక్షులన్నీ తమ గుడ్లతో పాటు తన గుడ్లను పొదుదుగుతున్నాయో లేదో గమనిస్తూ ఉంటాయి.
అక్కడ గంగానదిలో పిల్లలు గాజు ముక్కతో ఎందుకలా వెతుకుతారో తెలుసా..!
భక్తులు పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు గంగానది ఒడ్డున పిల్లలు గాజుముక్కతో ఏదో వెదుకుతూ, ఆడుతుండటం చూస్తుంటారు. ఈ దృశ్యం చూడడానికి ఎంతో ఉల్లాసంగానూ, ముచ్చటగా కనిపించినా.. దాని వెనక ఎంతో సహనం, ఓర్పు, శ్రమ కూడుకుని ఉంటుందని తెలుసా? నిజానికి పిల్లలు ఎందుకలా చూస్తుంటారు? ఇంతకీ ఏం వెతుకుతుంటారనేది తెలుసుకుందాం!గంగానది మన దేశ విశ్వాసానికి, సంస్కృతికి గొప్ప ప్రతీక. ప్రతిరోజూ వేలాదిమంది ప్రజలతో పుణ్యక్షేత్రాలు కిటకిటలాడటం, వేలాదిమంది తరలి రావటంవంటి దృశ్యం ఒకవంతు అయితే, గంగానది తీరంలో నివసిస్తున్న కొంతమంది పిల్లల జీవితాలు మరోవంతు. ఆ తీరంతో వారి జీవితాలే ముడిపడి ఉన్నాయి. ప్రజలు పూజ చేసేటప్పుడు, తరచుగా నాణెములు, విలువైన వస్తువులను, ఆభరణాలను వారి మొక్కుబడిగా నదిలో విసిరేస్తారు. కాలక్రమేణా.. ఇవి నీటి అడుగున పూడుకుపోతాయి. అలా నీటి అడుగున స్పష్టంగా చూడడానికి ఈ గాజుముక్క వారికి ఎంతగానో సహాయపడుతుంది. దాంతో పిల్లలు నీటిలో పడిపోయిన పాత నాణేలు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల కోసం వెతుకుతుంటారు. కొన్నిసార్లు గంటల తరబడి చూస్తున్నాగానీ వారికి ఏమీ దొరకదు.నిజానికి ఈ గాజుముక్క వారికి ఎలా ఉపయోగపడుతుందంటే? నీటి ఉపరితలంపై పడే సూర్యకాంతి కింద ఉన్న దృశ్యాన్ని అస్పష్టంగా మారుస్తుంది. ఆ పరిస్థితులలో పిల్లలు గాజును ఒక ప్రత్యేక పద్ధతిగా.. నీటిలో ముంచడంతో సూర్యకాంతి తగ్గి, నది అడుగున ఉన్న వస్తువులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా వెతకడం చూడడానికి చాలా సులభంగా అనిపించినా, గంటల తరబడి కష్టపడినా పిల్లలకు ఏమీ దొరకదు. కానీ అదృష్టం కలిసొచ్చి పాత వెండి ఆభరణాలు, విలువైన నాణాలు, ఏదైనా లోహ వస్తువు దొరికితే లాభం పొందవచ్చనేది వారి ఆశ.కొందరు దీనిని అదృష్టంతో కూడిన ఆటగా భావిస్తే, మరికొందరు ఇది కఠోర శ్రమ, నైపుణ్యానికి సంబంధించిన విషయమని అంటారు. నిజం ఏమిటంటే? ఈ నది తీరాన నివసిస్తున్న పిల్లలు తమ ఇంటి ఖర్చులు తీర్చడానికో? కుటుంబ కష్టాలను తగ్గించడానికో ఉపయోగపడే ఏదైనా వస్తువు గంగానదిలో దొరుకుతుందని ఇలా వెతుకుతుంటారు. వీటిని పురాతన వస్తువుల సేకర్తలు అధిక ధరలకు కొనుగోలు చేస్తారు. ఆ ఆశతో పిల్లలు ప్రతిరోజూ గంగా నది ఒడ్డుకు తరలివస్తుంటారు.చూడటానికి ఇదొక ఆటలా అనిపించినా, ఈ పని చాలా ప్రమాదకరమైనది. నదిలోని బలమైన ప్రవాహాలు, లోతైన నీటిస్థలాలు, జారే నేల తరచుగా ప్రమాదాలకు దారితీస్తాయి. స్థానికంగా నివసిస్తున్న పిల్లలు నదిలోకి దిగి తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కొన్నిసార్లు గాయపడతారు కూడా. గాజు ముక్కతో గంగానదిలోకి తొంగిచూస్తున్న ఈ పిల్లలు కేవలం వస్తువుల కోసం వెతకడమే కాదు, తమ అదృష్టాన్ని కూడా పరీక్షిస్తుంటారు.
అచ్చం సంతూర్ యాడ్ మాదిరిగా 47 ఏళ్ల మామ్..!
40 ప్లస్ అనగానే వృద్ధాప్య ఛాయలు ప్రారంభమవుతుంటాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు అటాక్ అయ్యే సమయం కూడా. ఈ వయసులోనే అత్యంత కేర్ఫుల్గా ఉండాలి. కానీ ఇక్కడొ తల్లి 47 ఏళ్ల వయసులో కూడా పదహారణాల అమ్మాయిలా అందర్నీ ఆకర్షిస్తుంది. అచ్చం సంతూర్ యాడ్ మాదిరిగా ఆ పిల్లల తల్లి యంగ్లుక్లో కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వయసులో అంతలా యవ్వనంగా కాంతింగా కనిపించేందుకు ఆమె ఏమి ఐస్బాత్లు, విపరీతమైన డిటాక్స్లు ఫాలో అవ్వనని చెబుతోందామె. కేవలం సాధారణ దినచర్యతోనే ఇలాంటి యవ్వనపు లుక్ని సొంతం చేసుకోవచ్చని అంటోంది. అవేంటంటే..చెఫ్ కమ్ డైటీషియన్ రాఖీ గనేరివాల్ ఇద్దరు పిల్లల తల్లి 47 ఏళ్ల వయసులోనే ఎంతో అందంగా ఆకర్షణీయమైన లుక్లో ఉంటారామె. అందుకోసం కేవలం పది సాధారణ పనులనే చేస్తానని అంటోంది. తీవ్రమైన వెల్నెస్ ట్రెండ్ల కంటే..నిలకడకే ప్రాధాన్యత ఇస్తానంటోంది.చురుగ్గా ఉండటం..ప్రతిరోజూ పదివేలకు పైగా అడుగులు వేస్తానని చెబుతుంది. ఇంటి పనులు దగ్గర నుంచి ఉద్యోగ విధుల వరకు అన్నీ చురుగ్గా చేస్తానని చెబుతుంది. అయితే ఒక వ్యూహంలా చేసుకుంటూ పోతానంటోంది. అయితే ఎంత తీరిక లేకపోయినా..ఒక గంట పాటు వర్కౌట్లు చేసేందుకు కట్టుబడి ఉంటానంటోంది. రోజంతా బాడీ వెయిట్, స్క్వాట్స్, క్యాల్ఫ్ రైజర్ వంటి వ్యాయామాలు చేస్తానని చెబుతోంది. అయితే సాధారణ చిన్న చిన్న వ్యాయామాలే చాలా ప్రభావవంతంగా ఉంటాయని అంటోంది.డిజిటల్ డిటాక్స్..అలాగే రాత్రినిద్రపోయే ముందు, రోజులో మొదటి మూడు గంటలు ఫోన్కి దూరంగా ఉంటానని అంటున్నారు. దీనివల్ల నాడివ్యవస్థ మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. పైగా ఒత్తిడిని నియంత్రించి మంచిగా నిద్రపోగలుగుతామని అంటున్నారామె.మంచి ఆహారం..ప్రతి ఉదయం నిమ్మరసం,కొబ్బరి నూనె డ్రింక్తో రోజుని ప్రారంభిస్తుందట. ఇది రోజంత శక్తిమంతంగా ఉండేలా చేసి ఆకలి కోరికలను నియంత్రిస్తుందట. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయట. కడుపు నిండిన భావన కోసం రోజూ 110–120 గ్రాముల ప్రోటీన్ని తీసుకునేలా కేర్ తీసుకుంటారట. సాధారణంగా నిద్రలేచిన గంటలోపు ప్రోటీన్ పౌడర్ను తీసుకుని, ఆ తర్వాత గుడ్లు, పనీర్, టోఫు, గ్రీకు యోగర్ట్, వంటి ఇతర ఆహారాలను తీసుకుంటుందట. అయితే అన్నింట్లకంటే ముఖ్యం మూడు లీటర్ల నీళ్లు తాగడం అనేది కీలకం అంటోంది. రోజూ రెండు పండ్లు తప్పనిసరి అని చెబుతోంది. అలాగే ఆయురారోగ్యాలతో ఉండాలనే సాధారణ చిన్న చిన్న పనులతోనే ఇదంతా సాధ్యమని అంటోందామె. పరిపూర్ణత కంటే నిలకడక పాటించేందుకు ప్రాధాన్యత ఇవ్వమని కోరుతోంది. View this post on Instagram A post shared by Chef-Dietitian Raakhi Ganerriwal (@raakhiganerriwal)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: విజయవంతమైన వివాహబంధం అంటే అదేనా..!: డేటింగ్ యాప్ సీఈఓ)
అంతర్జాతీయం
బాంబుల మోత మధ్య ట్రంప్ బిగ్ డిమాండ్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి తీవ్రంగా మారాయి. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బందర్ అబ్బాస్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తాజా దాడులు చేసినట్లు ప్రకటించింది. మిసైల్ స్థావరాలు, మైన్లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఇవి తమ దళాల రక్షణ కోసం “స్వీయరక్షణ చర్యలు”గా చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.ఇరాన్ దళాల నుంచి ఉన్న ప్రమాదాలను అడ్డుకునేందుకే ఈ దాడులు జరిగాయని అమెరికా ప్రకటించుకుంది. అయితే ఇదే సమయంలో దోహాలో అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఖతార్ ప్రధానితో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. బందర్ అబ్బాస్ ప్రాంతంలో పలు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనంతరం అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని, శత్రు లక్ష్యాలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నాయని సమాచారం. పర్షియన్ గల్ఫ్ సమీపంలోని సిరిక్, జాస్క్ ప్రాంతాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది.ఈ ఘటనలపై ఇరాన్ ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి ప్రతిస్పందన ఇవ్వలేదు. అయితే దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నూతన నేత కఠిన వ్యాఖ్యలు చేస్తూ “మేము వెనక్కి తగ్గేది లేదు” అని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్పై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ట్రంప్ బిగ్ డిమాండ్ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం (enriched uranium) ను పూర్తిగా నియంత్రించాల్సిందేనని.. అది రెండు మార్గాల్లో జరగొచ్చని ఆయన సూచించారు. ఒకటి.. ఇరాన్ తమ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించాలి. రెండోది.. అంతర్జాతీయ పర్యవేక్షణలోనైనా ధ్వంసం చేయాలి. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన నియంత్రణ అవసరమని ఆయన ఉధాట్టించారు.ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఈ తాజా దాడులు మరియు హెచ్చరికలు ఆ చర్చలకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతోంది. ఇక్కడ కూడా కాల్పుల విరమణ అమల్లోకి ఉన్నప్పటికీ.. హెజ్బొల్లా గ్రూపుపై దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతోంది. సుమారు 70 స్థావరాలను లక్ష్యంగా చేసుకోగా.. 10 కమాండ్ సెంటర్లు సహా ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. లెబనాన్ వర్గాలు ఈ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించాయి.
ట్రంప్ పోస్ట్ బాంబ్.. పాక్ ప్రధానికి ఘోర అవమానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. అబ్రహం అకార్డ్స్ విస్తరణపై మాట్లాడిన ట్రంప్.. తన సోషల్ మీడియా సందేశంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పేరును ప్రస్తావించలేదు. బదులుగా ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను పేర్కొనడం ఇస్లామాబాద్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.అబ్రహం అకార్డ్స్ విస్తరణపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే పశ్చిమాసియా రాజకీయాల్లో కొత్త ఒత్తిడిని సృష్టించాయి. ఇజ్రాయెల్తో సంబంధాలను విస్తరించే ప్రయత్నంలో పాకిస్తాన్ పేరు కూడా చర్చలోకి రావడం ఇస్లామాబాద్కు అత్యంత సున్నితమైన పరిణామంగా మారింది. ఇజ్రాయెల్ను గుర్తించే అంశం దేశంలో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించే అవకాశం ఉండటంతో ఈ ప్రతిపాదన పాకిస్తాన్ ప్రభుత్వానికి రాజకీయంగా కఠిన పరీక్షగా మారింది.ఈ పరిస్థితుల్లో ట్రంప్ వ్యాఖ్యలు మరింత సంక్లిష్టతను తెచ్చాయి. ఆయన తన పోస్టులో సౌదీ అరేబియా, యూఏఈ, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాల నాయకులను ప్రస్తావించినప్పటికీ.. పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ను పక్కన పెట్టి అసిమ్ మునీర్ను మాత్రమే పేర్కొన్నారు. ఇది పాకిస్తాన్ రాజకీయ నిర్మాణంలో సైనిక వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యంపై అంతర్జాతీయ దృష్టిని మరింత బలపరిచినట్టుగా కనిపిస్తోంది.మిగిలిన దేశాల నాయకులను వారి రాజ్యాంగ పదవుల ద్వారా గుర్తించగా, పాకిస్తాన్ను మాత్రం దాని సైనిక అధిపతి ద్వారా గుర్తించారు. అక్కడ షరీఫ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అంతర్జాతీయ సంప్రదాయానికి భిన్నంగా.. ఈసారి ట్రంప్ చేసిన ఎంపిక పాకిస్తాన్లో అధికార కేంద్రం ఎక్కడ ఉందన్న చర్చను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. గత కొంతకాలంగా పాకిస్తాన్లో విదేశాంగ విధానాలు, భద్రతా నిర్ణయాల్లో సైన్యం ప్రభావం పెరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన ప్రస్తావన ఆ వాదనలకు మరింత బలం చేకూర్చినట్లు భావిస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వం ఉన్నప్పటికీ కీలక నిర్ణయాల్లో సైన్యం ప్రభావమే ఎక్కువగా ఉందన్న పాత చర్చను ఇది మళ్లీ వేడెక్కించింది.ఇది కేవలం ఒక డిప్లొమాటిక్ అవగాహన లోపం కాదని.. దేశంలో సివిలియన్ ప్రభుత్వం కంటే సైనిక వ్యవస్థ ప్రభావం ఎక్కువగా ఉందన్న వాస్తవాన్ని మరోసారి బయటపెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అబ్రహం అకార్డ్స్ అంశం పాకిస్తాన్కు మరో దౌత్యపరమైన చిక్కును తెచ్చిపెట్టింది. ఒకవైపు అమెరికాతో సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం, మరోవైపు దేశంలో ఉన్న తీవ్ర భావోద్వేగ రాజకీయ వాతావరణం మధ్య ఇస్లామాబాద్ సున్నితమైన సమతుల్యతను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు ఒత్తిడుల మధ్య ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశ రాజకీయ స్థిరత్వంపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
సీజ్ఫైర్ ఉన్నా ఆత్మరక్షణ కోసం తప్పట్లేదు
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. యుద్ధ విరమణ, శాంతి చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే అమెరికా దళాలు ఇరాన్పై దాడులకు దిగాయి. ఈ దాడులు “ఆత్మరక్షణ చర్యలు”గా ప్రకటించినప్పటికీ.. ఘర్షణలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ Reuters నివేదిక ప్రకారం.. సోమవారం అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్ ప్రాంతంలో బందర్ అబ్బాస్ వద్ద పలు లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో.. హర్ముజ్లో సీమైన్స్ అమర్చేందుకు ప్రయత్నిస్తున్న బోట్స్తో పాటు మిస్సైల్ లాంచ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించుకుంది.అయితే ఈ చర్యలు తమ సైనిక బలగాలను రక్షించుకోవడానికే అని యూఎస్సీసీ స్పష్టం చేసింది. “ప్రస్తుతం కొనసాగుతున్న సీజ్ఫైర్ పరిస్థితుల్లో కూడా మా బలగాల రక్షణ కోసం జాగ్రత్తగా, పరిమితంగా చర్యలు తీసుకుంటున్నాం” అని నేవీ కెప్టెన్ టిమ్ హాకిన్స్ పేర్కొన్నారు.అమెరికా వర్గాల ప్రకారం.. ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు తమ దళాలపై ముప్పు కలిగించే ప్రయత్నాల్లో ఉన్నాయని, అందుకే ఈ “ప్రివెంటివ్ స్ట్రైక్స్” తప్పనిసరి అయ్యాయని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల్ని ధృవీకరించాల్సి ఉంది. ఈ దాడులపై ఇరాన్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఇటు లెబనాన్లోనూ కాల్పుల విరమణకు తూట్లు పడింది. హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. ఈ దాడులపై ఇజ్రాయెల్ వర్గాలు “సరిహద్దు భద్రత కోసం అవసరమైన చర్యలు”గా వివరణ ఇస్తుండగా.. లెబనాన్ వర్గాలు మాత్రం దీనిని కాల్పుల విరమణ ఉల్లంఘనగా ఖండిస్తున్నాయి.ఇరాన్–అమెరికా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ తాజా దాడులు చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయా? అనే ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఇరాన్ పూర్తి స్థాయి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. అలాగే అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాన్ని ఎలా చూడబోతుందన్నది కూడా కీలకంగా మారింది.
అతిచిన్న ఆక్టోపస్
వాషింగ్టన్: సముద్ర జీవులైన ఆక్టోపస్లు సాధారణంగా ఒక మీటర్ పొడవు, 9 కిలోల వరకు బరువు ఉంటాయి. కానీ, కేవలం గోల్ఫ్ బంతి పరిమాణంలోని అతిచిన్న ఆక్టోపస్ను పసిఫిక్ మహాసముద్రంలో పరిశోధకులు గుర్తించారు. ఈక్వెడార్ తీరానికి సమీపంలో గాలాపాగోస్ దీవుల వద్ద సముద్ర ఉపరితలం నుంచి 6 వేల అడుగుల లోతున చిమ్మచీకటిలో ఇది సంచరిస్తుండగా జాగ్రత్తగా బయటకు తీశామని చెబుతున్నారు. ఇది ఇప్పటిదాకా ఎవరికీ తెలియని కొత్తరకం ఆక్టోపస్ అని అంటున్నారు. గాలాపాగోస్ దీవులు అరుదైన జీవజాలానికి నిలయంగా మారాయి. భూమిపై మరెక్కడా కనిపించని వెయ్యికి పైగా వృక్ష, జంతు జాతులు ఇక్కడున్నాయి. ఈ ద్వీపాల చుట్టూ ఉన్న లోతైన జలాల్లో కొత్తరకం ఆక్టోపస్ ఉనికి తొలిసారిగా బయటపడింది. ఈ నీలి రంగు బుల్లి ఆక్టోపస్కు మైక్రోఎలిడోన్ గాలాపాగెన్సిస్ అని పేరుపెట్టారు. షికాగోలోని ఫీల్డ్ మ్యూజియం, చార్లెస్ డారి్వన్ ఫౌండేషన్, గాలాపాగోస్ నేషనల్ పార్క్ డైరెక్టరేట్లోని సైంటిస్టులు 2015 నుంచి సంయుక్తంగా ఈ పరిశోధన చేశారు. ఈవీ నాటిలస్ అనే అన్వేషణ నౌక ద్వారా లోతైన సముద్ర యాత్రలో ఆక్టోపస్ను మొదటిసారిగా గుర్తించారు. ఓడ నుంచి సిబ్బంది రిమోట్తో పనిచేసే అండర్వాటర్ రోబోను సముద్రం అడుగుభాగంలోకి పంపించారు. సముద్ర ఉపరితలం నుంచి 5,800 అడుగుల లోతులో ఒక పర్వతం సమీపంలో ఆక్టోపస్ను గమనించి, రోబోటిక్ వాహనాన్ని ఉపయోగించి పట్టుకున్నారు. గోల్ఫ్ బంతి పరిమాణంలో ఉన్న నీలిరంగు చిన్న ఆక్టోపస్ చాలా ప్రత్యేకంగా కనిపించింది. కొత్త ఆక్టోపస్ జాతిని అధ్యయనం చేయాలంటే సాధారణంగా దానికి కోసి చూడాల్సి ఉంటుంది. కానీ, గోల్ఫ్ బంతి పరిమాణంలోని ఆక్టోపస్ ఇదొక్కడే దొరకడంతో జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. మైక్రో సీటీ స్కానింగ్తో ఆక్టోపస్ శరీరం లోపలి భాగాలను పరిశీలించారు. 3డీ నమూనాను తయారు చేశారు. దానికి అధికారికంగా ఒక కొత్త జాతి ఆక్టోపస్గా ధ్రువీకరించారు. సువిశాలమైన మన భూగోళంపై ఇప్పటిదాకా మానవుడి దృష్టికి రాని జీవులు ఎన్నో ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.
జాతీయం
శ్రీనగర్లో ఎనిమిదో ఏటా ఈద్ ప్రార్థనలకు నో ఎంట్రీ
శ్రీనగర్: శ్రీనగర్లోని చరిత్రాత్మక ఈద్గా, జమా మసీదులో ఈద్ ప్రార్థనలను నిర్వహించేందుకు స్థానిక అధికారులు ఈసారి కూడా అనుమతి నిరాకరించారు. వరుసగా ఎనిమిదో ఏడాది కూడా ఈ ఆంక్షలు కొనసాగాయి. మరోవైపు ఈద్ పండుగ రోజున తనను గృహ నిర్బంధం చేశారని మత పెద్ద మీర్వాజ్ ఉమర్ ఫరూక్ వెల్లడించారు. ప్రార్థనల కోసం బయటకు వెళ్లేందుకు కూడా అధికారులు అనుమతించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ వేదికగా పంచుకుంటూ, గత ఎనిమిది ఏళ్లుగా కశ్మీరీ ముస్లింలు తమ సంప్రదాయబద్ధమైన ప్రార్థనా స్థలాలను వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బారికేడ్లు, తాళాలు.. ఆంక్షల నీడలో పండుగపండుగ వేళల్లో ప్రార్థనల కంటే భద్రతాపరమైన ఆంక్షలే కనిపిస్తున్నాయని మీర్వాజ్ విమర్శించారు. మసీదుల ముందు బారికేడ్లు ఏర్పాటు చేయడం, తాళాలు వేయడం ద్వారా ప్రజలను అడ్డుకోవడం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇది పరిపాలన కాదని, ప్రజల మతపరమైన హక్కులపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడిగా ఆయన అభివర్ణించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆంక్షల వల్ల కశ్మీర్లోని పిల్లలు, యువత పండుగలోని అసలైన ఆధ్యాత్మిక అనుభూతికి దూరమవుతున్నారని మీర్వాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈద్గా వంటి చారిత్రక ప్రదేశాల్లో సామూహిక ప్రార్థనల సంప్రదాయం కనుమరుగవుతుండటం బాధాకరమని అన్నారు.
ఎవరెస్ట్ ‘డెత్ జోన్’లో హైదరాబాదీ.. బాడీ వదిలేసిన ఫ్యామిలీ!
న్యూఢిల్లీ: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే పట్టుదలతో అక్కడకు వెళ్లిన హైదరాబాద్కు చెందిన పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ(53) విషాదాంతం అందరినీ కలచివేస్తోంది. ఆయన శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినప్పటికీ, తిరిగి వస్తుండగా ‘డెత్ జోన్’గా పిలిచే 8,000 మీటర్లకు పైగా ఎత్తులో ప్రాణాలు కోల్పోయారు.హిల్లరీ స్టెప్ సమీపంలో రక్తపు వాంతులతో అరుణ్ కుమార్ కుప్పకూలిపోగా, ఆయనతో ఉన్న షెర్పాలు రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడి విపరీతమైన చలి, అత్యంత ప్రమాదకర పరిస్థితుల కారణంగా ఆయన మృతదేహాన్ని ప్రస్తుతానికి అక్కడే వదిలివేయాల్సి వచ్చింది. అరుణ్ కుమార్ మృతదేహాన్ని కిందకు తీసుకురావడం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది.పయనీర్ అడ్వెంచర్ అనే సంస్థ ఈ మృతదేహాన్ని వెనక్కి తీసుకురావడానికి మొదట రూ. 1.1 కోట్లు కోట్ చేయగా, ఆ తర్వాత రాయితీతో రూ. 89.7 లక్షలు అవుతుందని తెలిపింది. 8,000 మీటర్ల ఎత్తులో, మంచులో కూరుకుపోయిన మృతదేహాన్ని వెలికితీసి కిందకు తీసుకురావాలంటే దాదాపు 8 నుండి 10 మంది షెర్పాలు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం హెలికాప్టర్ ద్వారా చేసే రెస్క్యూ ఆపరేషన్లకు మాత్రమే నిధులు ఇస్తాయి తప్ప, ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన మాన్యువల్ రికవరీలకు నిధులు కేటాయించవని సదరు సంస్థ స్పష్టం చేసింది.ఈ పరిస్థితులు, భారీ ఖర్చు, ఇతరుల ప్రాణాలకు ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని అరుణ్ కుమార్ తివారీ కుటుంబ సభ్యులు భావోద్వేగ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన మృతదేహాన్ని వెనక్కి తీసుకురావద్దని వారు నిర్ణయించుకున్నారు.‘హిమాలయాలు పవిత్రమైన దైవభూమి. అక్కడ మరణించడం అంటే వైకుంఠ ప్రాప్తి లభించడమే. ఆ పవిత్ర స్థలమే ఆయనకు చిరకాల నివాసం. హిమాలయాల్లో ఆయన ఇప్పుడు ఆ పరమశివునిలో భాగమయ్యారు’ అని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.ఇది కూడా చదవండి: మండుతున్న ఎండలు.. ప్రధాని మోదీ కీలక సూచనలు
మండుతున్న ఎండలు.. ప్రధాని మోదీ కీలక సూచనలు
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిని దాటేస్తుండటంతో, వడగాల్పుల తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితికి దారితీసే ఈ ఎండల నుండి రక్షించుకునేందుకు అప్రమత్తతతో ఉండాలని ఆయన సూచించారు.ఎండల వేళ పాటించాల్సిన నియమాలుతీవ్రమైన ఎండల కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రధాని కోరారు. దాహం వేయకపోయినా క్రమం తప్పకుండా నీరు తాగాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు వాటర్బాటిల్ వెంట ఉంచుకోవాలని సూచించారు. తల తిరగడం, వాంతులు, తీవ్ర అలసట వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నీడ ఉన్న చోటికి చేరాలని, వైద్య సహాయం పొందాలని సూచించారు. Different parts of India are witnessing soaring temperatures and the challenges that come with it. This heat is harsh on all of us and I urge you all to take as many precautions as possible. Please stay hydrated, keep water with you when stepping out. Offer a glass of water to…— Narendra Modi (@narendramodi) May 27, 2026మానవత్వంతో స్పందించండిప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తోటి వారికి సాయం చేయాలని ప్రధాని కోరారు. దాహంతో ఉన్న వారికి మంచి నీరు అందించడం, నీరసంగా ఉన్నవారిని చల్లని ప్రదేశానికి తరలించి ఓఆర్ఎస్ వంటివి అందించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. వృద్ధ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని, మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకుండా వారిని అప్రమత్తం చేయాలని సూచించారు.మూగజీవాలపై మానవత్వంఎండల తీవ్రత కేవలం మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా ఇబ్బందికరమని ప్రధాని గుర్తు చేశారు. మన ఇళ్ల బాల్కనీలు, టెర్రస్లు, దుకాణాల ముందు ఒక చిన్న పాత్రలో నీటిని ఉంచడం ద్వారా దాహంతో ఉన్న పక్షులు, జంతువుల ప్రాణాలను కాపాడవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఈ కష్టకాలంలో మనలో ఉన్న కరుణే మూగజీవాలకు జీవనాధారమని, అందరూ ఈ మానవీయ బాధ్యతను నెరవేర్చాలని కోరారు.
బెంగళూరుకు తప్పిన ఎబోలా భయం!
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు నగరాన్ని వణికించిన ఎబోలా భయం తొలిగిపోయింది. ఇటీవల ఉగాండా నుండి వచ్చిన ఒక 28 ఏళ్ల మహిళకు ఎబోలా సోకిందన్న అనుమానంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అయితే, పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన రక్త పరీక్షల్లో ఆమెకు ఎబోలా లేదని స్పష్టమైంది. దేశంలో ఎబోలా కేసు ఏదీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.సందేహాల నుంచి ఉపశమనం వైపు..ఉగాండా నుంచి అహ్మదాబాద్ మీదుగా బెంగళూరుకు చేరుకున్న సదరు మహిళకు ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపించడంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఆమెను వెంటనే బెంగళూరులోని ఎపిడెమిక్ డిసీజెస్ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్లో ఉంచారు. రక్త నమూనాలను పుణెకు పంపగా, ఫలితాలు నెగటివ్గా రావడంతో ఆందోళన వీడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.ప్రభుత్వ అప్రమత్తత, ప్రజలకు విజ్ఞప్తిఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, భారత్లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిశితంగా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎబోలాపై ఎటువంటి వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. అనవసర భయాందోళనలకు లోనుకావద్దని హెచ్చరించింది.ప్రయాణాలపై ఆంక్షలుప్రపంచవ్యాప్తంగా ఎబోలాను 'గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ'గా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడంతో, భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణించవద్దని కేంద్రం ఇప్పటికే ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పటిష్టం చేయడంతో పాటు, ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.
ఎన్ఆర్ఐ
కోటి రూపాయల శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!
మనం జీవితంలో ఏదో ఒక దశలో ఎత్తుపల్లాలు చూస్తుంటాం. కానీ ఆ క్రిటికల్ టైంలో కూడా ధైర్యంగా నిలబడిన వాడే మనిషి. అదే చెబుతోంది ఈ భారత సంతతి మహిళ కథ. ఒక్కోసారి మన రేంజ్ ఆకాశమంత ఉంటే..అకస్మాత్తుగా విధి అథఃపాతాళానికి పడేస్తుంటుంది. మళ్లీ లేచి నిలబడలేనంతగా విపత్కర పరిస్థితి ఎదురవ్వతుంటుంది. ఆ సమయంలో చాకచక్యంగా మనకు దొరికిన చిన్న చిన్న అవకాశాల నుంచి మళ్లీ మొదలు పెడుతూ నిలబడ్డ వ్యక్తి సత్తా ఉన్న హీరో. ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనం ఆమె.భారత సంతతి మహిళ శ్వేతా దేశాయ్ ఒకప్పుడు లండన్లోని ఒక ప్రముఖ వాణిజ్య వ్యాపార వెబ్సైట్లో హెడ్ ఆఫ్ ప్రొడక్ట్గా పనిచేశారు. ఏకంగా కోటి రూపాయల వేతనం అందుకుంటూ మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేసేవారామె. అలాంటి 37 ఏళ్ల శ్వేతకు 2023 చివరలో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మెల్బోర్న్కు వెళ్లడంతో ఆమె పరిస్థితి తలకిందులైపోయింది. అక్కడ తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరకడం చాలా కష్టమైపోయింది. మెల్బోర్న్ ఉద్యోగ మార్కెట్ అత్యంత చిన్నాభిన్నంగా ఉండటంతో జాబ్ వేట చుక్కలు చూపించిందామెకు. అప్పటి వరకు అంత పెద్ద హోదాలో ఉన్న శ్వేతకు తన గుర్తింపును కోల్పోతున్న వేదన ఎక్కువైంది. తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరక్క చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. దాంతో తనకు వస్తున్న ఉద్యోగాల ఆఫర్లలో జాయిన్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. అదెలాంటి ఉద్యోగం అంటే..కార్పొరేట్ ఉద్యోగ జీవితం నుంచి అపార్ట్మెంట్లు శుభ్రం చేసే స్థాయికి చేరిపోవాల్సి వచ్చింది. ఆమెకు వచ్చిన తొలి జాబ్ ఆఫర్ Airbnb అపార్ట్మెంట్ల నిర్వహణనే నిర్వర్తించేందుకు రెడీ అయినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఆమె అపార్ట్మెంట్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం , అతిథుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తదితరాలు ఉంటాయి. ఇక ముంబైలో పుట్టి పెరిగిన శ్వేత ఉన్నత చదువుల కోసం 2008లో లండన్కు వెళ్లింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు బ్రిటిస్ రాజధానిలో ఒక ఇంటిని, జీవితాన్ని నిర్మించడంలో గడిపింది. 2023 నాటికి లండన్ బోటిక్ వెడ్డింగ్ రిజిస్ట్రీలో వార్షిక ఆదాయం దాదాపు రూ. కోట్లు ఆదాయం ఆర్చించేది. భర్త ఉద్యోగ రీత్యా మెల్బోర్న్కి వెళ్లడంతో పరిస్థితి అత్యంత విభిన్నంగా మారిపోయింది. ఈ మార్పు సహజంగానే ఆమె జీవనశైలిని తగ్గించుకునేలా చేసింది. లండన్లో, శ్వేతకు డిజైనర్ బ్యాగులు, ఫ్యాన్సీ మేకప్, ఆర్థిక స్వేచ్ఛ ఉండేవి. కానీ మెల్బోర్న్లో ఆమెకు అదే విలాసవంతమైన జీవితం దొరకలేదు. ఈ అనూహ్యమైన మార్పు తనను చాలా దారుణంగా కుంగదీసిందని చెప్పుకొచ్చింది. పైగా ఎవ్వరైన స్నేహితులు, బంధువుల ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడూ ఏ చెప్పాలో తెలిసేది కాదు. ఒక్కోసారి హౌస్ వైఫ్ అని ముసుగు కప్పుకుని తిరగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలో తనకు దొరికిన మొదటి ఉద్యోగ ఆఫర్లో వెంటనే చేరిపోయినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఈ ఉద్యోగం కారణంగా మళ్లీ ఇదవరకటిలా ఆత్మవిశ్వాసంగా ఉండగలిగానంటోంది. తాను అపార్ట్మెంట్లు నిర్వహించడం తోపాటు పిల్లలకు ఇంగ్లీష్ బోధించడం, సొంతంగా వ్యాపారాన్ని, కోచింగ్ ప్రాక్టీస్ వంటి వాటిని నిర్వహిస్తున్నారామె. ఏ ఉద్యోగం దొరకలేదని ఆగిపోకుండా..దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అందులో జాయిన్ అయిపోవడమే మేలని అంటోంది. చాలామంది డబ్బుకు అంత విలువలేదని ఏవేవో చెబుతుంటారు కానీ వాస్తవికంగా అది కరెక్ట్ కాదని అంటోందామె. అంతేగాదు ఆర్థిక స్వతంత్రను కలిగి ఉండటం అంటే తన ఇష్టానుసారం జీవితాన్ని గడిపే స్వేచ్ఛను కలిగి ఉండటం. డబ్బు అంటే ఎన్నో అవకాశాలు, స్వేచ్ఛ, కొన్నిసార్లు సంతోషం కూడా అని చెప్పుకొచ్చిందామె. ఒకప్పుడు అంత పెద్ద ఉద్యోగ హోదాతో చాలా బాగా బతికాను, పైగా తెలియకుండా ఆ లెవెల్ అహం నాలో చాలా పెరిగిపోయిందని తెలసుకున్నా అంటోందామె. ఇలా ఈ రేంజ్కి వచ్చేసినా..ప్రస్తుతం మూడు వేర్వరే పనులు చేస్తున్నట్లు తెలిపింది. ఇలా తనలా వేరేప్రాంతానికి మారడంతో ఉద్యోగం కోల్పోయి, ఐడెంటిటీని కోల్పోయి నరకం చూస్తున్న మహిళలకు కోసం “ది రీబిల్డ్ రూమ్” అనే వాట్సాప్ కమ్యూనిటీని ప్రారంభించానని, పైగా అలాంటివాళ్ల కోసం ప్రత్యేక కోచింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Shweta (@shweta_lifecoach) (చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..)
స్నేహితురాలి పెళ్లికి వెళ్లి..
హైదరాబాద్: అమెరికాలో స్విమ్మింగ్పూల్లో పడి నగర యువతి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగోజిగూడ డివిజన్ న్యూ శివపురి కాలనీకి చెందిన ముద్దసాని దేవేందర్ రెడ్డి, సునీత దంపతుల కూతురు శ్రీవీణ (28)కు 2023లో ప్రశాంత్ రెడ్డితో వివాహమైంది. అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవీణ స్నేహితురాలి వివాహం సందర్భంగా రెండు రోజుల క్రితం ఫ్లోరిడా వెళ్లారు. అక్కడ శ్రీవీణ స్విమ్మింగ్పూల్లో విగతజీవిగా కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు.అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఒక్కగానొక్క కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో నగరంలోని దేవేందర్ రెడ్డి, సునీత దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీవీణ తల్లిదండ్రులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్రెడ్డి, మాజీ కార్పొరేటర్, టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్రెడ్డి పరామర్శించారు. ఆమె భౌతిక కాయాన్ని అమెరికా నుంచి భారత్కు వీలైనంత తొందరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కాన్వొకేషన్ ముగిసిన మరుక్షణమే కానరాని లోకాలకు..
లక్కిరెడ్డిపల్లె(అన్నమయ్య జిల్లా): కన్న కొడుకు విదేశాల్లో గొప్ప చదువులు చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు విధి తీరని అన్యాయం చేసింది. ఎంఎస్ పూర్తి చేసి పట్టా అందుకున్న సంబరం నిండకముందే, అదే రాత్రి మృత్యువు గుండెపోటు రూపంలో వచ్చి ఆ యువకుడిని బలితీసుకుంది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన షేక్ తాజ్ కుమారుడు మహమ్మద్ కుమేల్ షేక్ (28) అమెరికాలో గురువారం రాత్రి హఠాన్మరణం చెందాడు. కుమేల్ షేక్ ఇంజినీరింగ్ విద్యను చెన్నైలోని సత్యభామ వర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసుకున్న ఆయన, గురువారం జరిగిన కాన్వొకేషన్ వేడుకలో పట్టా అందుకున్నారు. ఆ ఆనందంలో కుటుంబ సభ్యులతో మాట్లాడి, స్నేహితులతో కలిసి ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వెళ్లారు. నిద్రలోనే గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. మృతుడి తండ్రి స్టాంప్ రైటర్గా పనిచేస్తున్నారు.
ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ వార్షికోత్సవాలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ తన సప్తమ వార్షికోత్సవం (ఏప్రిల్25, 2026) ఘనంగా జరుపుకుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమం ప్రొఫెసర్ బి.వి.ఎస్. చౌదరి, రాజ్యలక్ష్మి చౌదరి సమక్షంలో సింగపూర్ శివకృష్ణ దేవాలయంవారి ఫంక్షన్ హాలు వేదికగా జరిగింది.స్వరలయ సంస్థ విద్యార్ధుల సంగీత మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. కుమారి శ్రీవిద్య పంతువరాళి రాగంలో “ఎన్నగాను రామభజన” త్యాగరాజ కీర్తనను హృద్యంగా గానం చేశారు. స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు, గురు శేషుకుమారి సంగీత ప్రదర్శనలో ఆలపించిన త్యాగరాజ కీర్తన “ప్రక్కల నిలబడి”, ఒక “మీరా భజన్” , విద్యార్థులతో కలిసి చేసిన జానపద గీతం ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకున్నాయి.తరువాత తెలుగు విశ్వవిద్యాలయం గ్రేడ్ , యూనివర్సిటీ కోర్సులలో ఉత్తీర్ణులైన సంగీత విద్యార్ధులకు VC నిత్యానందరావు అర్హతాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేషుకుమారి సంగీత ప్రస్థానాన్ని ప్రశంసించారు. సంగీతకళను భావితరాలకి అందించేలా ఆమెను నడిపిస్తున్నాయన్నారు. స్వరలయ విద్యార్ధులు భవిష్యత్తులో కర్నాటక సంగీతరంగంలో తమవైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.హార్మనీ & హ్యూస్ అధ్యక్షురాలు శ్యామల ప్రసంగిస్తూ 2025లో తిరుపతిలో అన్నమాచార్య 500వ జయంతి ఉత్సవాలలో చేసిన సంగీత కచేరీ, శేషుకుమారి వంశీ-సీల్వెల్ ఫౌండేషన్ వారి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డ్ అందుకోవడం స్వరలయసంస్థ సాధించిన కొత్త మైలురాళ్ళని కొనియాడారు.అలాగే కుమారి మనోజ్ఞ అనే గాత్రసంగీత విద్యార్ధి మాట్లాడుతూ కర్నాటక గాత్ర సంగీతాన్ని ఒక O-level ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలు వ్రాసేందుకు MOE (సింగపూర్ విద్యాశాఖ) తాను అనుమతి సాధించగలగటం విశేషం అనీ, ఇది తన గురువు ఇచ్చిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం వల్లనే సాధ్యమైందనీ, సంగీతం ఒక సబ్జెక్టుగా తీసుకోవడంతో ఇటు సంగీతంలో కృషి, అటు చదువుకునే సమయాన్ని సమర్ధవంతంగా వాడుకోవడం వీలవుతోందని చెప్పారు. ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా, గురు శేషుకుమారి తాళం మరియు రాగం నేర్పించేందుకు వినూత్నమైన సంగీత ఆటలను ప్రవేశపెట్టారు. ఇవి ప్రత్యక్షంగా వేదికపై నిర్వహించబడి, సంగీత శిక్షణలో ఒక కొత్త పోకడను పరిచయం చేశాయి.యూ.టీ.ఐ.ఏ.ఈ.సీ చైర్మన్ రాయ్, ట్రెజరర్ v. Adesh బాబు , కళ , శివ కృష్ణ ఆలయ చైర్మన్ ,మేనేజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీసాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కాకతీయ సాంస్కృతిక పరివారం నుంచి సబ్బుపాలకుర్తి , సింగపూర్ తెలుగు వనితలు సమూహం నుంచి క్రాంతి, జయ, దీపు , రేఖ , రాణి, గాయత్రి వంటి అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. పిల్లల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించి, వేడుకను విజయవంతంగా ముగించాయి. సౌజన్య చక్కటి వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు
క్రైమ్
బలైపోతున్న భర్తలు.. కలవరపెడుతున్న ఘటనలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత మూడు రోజుల్లో వరుసగా భర్తల హత్యలు చోటుచేసుకోవడం కలవరపెడుతోంది. ఈ హత్యలకు ప్రాంతం, కులం, మతం అనే తేడా లేదు. ఇలా వివాహేతర సంబంధాల కారణంగా భార్యల చేతిలో భర్తలు బలైపోతున్న ఘటనలు వరుస వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో మనూర్ మండలానికి చెందిన ఓ మహిళ తన ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీనికి అడ్డుగా ఉన్న భర్త ముత్యంరెడ్డిని ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం తన భర్తను జేసీబీతో గొయ్యి తవ్వించి మరీ పాతిపెట్టారు. అలానే మంచిర్యాల జిల్లాలో హాజీపూర్ మండలం ముల్కల గ్రామానికి చెందిన కుమార్ను అతని భార్య భారతి, తన ప్రియుడు సురేందర్తో కలిసి హతమార్చింది. ఈ స్కెచ్కు సురేందర్ స్నేహితుడు మల్లేశ్ కూడా తోడయ్యాడు. అయితే చేసే హత్యలో కూడా లాభం ఉండాలనుకుంది భారతి. దానికోసం హత్యకు ముందే భర్త పేరుతో రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ కట్టించింది. ఆ తర్వాత హత్య జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటిదే మరో ఘటన ఈమధ్య విశాఖ జిల్లా భీమిలిలో జరిగింది. ఓ మహిళ తన భర్తను గొడవల మధ్య చున్నీతో గొంతు బిగించి హతమార్చింది. ఇలా ఈ మూడు ఘటనలు కేవలం మూడు రోజుల్లోనే చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలోనూ హనీమూన్ మర్డర్ వంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటిలో చాలా సందర్భాల్లో భర్త తన తప్పు లేకపోయినా బలైపోతున్నాడు. ఈ సంఘటనలు కుటుంబ బంధాలు, భార్య-భర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండాల్సిన నమ్మకం, వారి దాంపత్యంలోని విలువలు ఎంతగా దెబ్బతింటున్నాయో చూపిస్తున్నాయి. వివాహం అనేది జీవిత భాగస్వామ్యానికి ప్రతీక. కానీ కొంతమంది మహిళలు దాన్ని నేరానికి వేదికగా మార్చడం ఆందోళనకరంగా మారింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇటు సమాజంతో పాటు చట్టవ్యవస్థ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
66 హార్డ్ డిస్క్లు, లక్షల విలువైన డేటా మాయం : షాక్లో డైరెక్టర్లు
ప్రముఖ చలనచిత్ర దర్శకులు జోయా అక్తర్, రీమా కాగ్తీలకు భారీ షాక్ తగిలింది. వీరి నిర్మాణ సంస్థ ‘టైగర్ బేబీ’ (Tiger Baby)లో విలువైన డేటాను తస్కరించిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ సంస్థ కార్యాలయం నుండి, ముఖ్యమైన సినిమా , OTT సంబంధిత డేటా నిక్షిప్తమై ఉన్న 66 హార్డ్ డిస్క్లు దొంగతనం ఆరోపణలపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా షాకింగ్ నిజాలు తెలిశాయి. ఈ డిస్క్ల మార్కెట్ విలువ సుమారు రూ. 13 లక్షలు ఉంటుందని అంచనా. ఇంకా విడుదల కాని సినిమాలు, వెబ్ సిరీస్లకు సంబంధించిన 2026 మే నెలలో 66 హార్డ్ డిస్క్లు దొంగతనానికి గురయ్యాయి. ఈ డిస్క్లలో 16TB నుండి 72TB వరకు నిల్వ సామర్థ్యం ఉంటుందని వారి ఫిర్యాదు ద్వారా తెలుస్తోంది. ఈ ఫుటేజ్తోఆటు, రఫ్ ఎడిట్స్, యాడ్ ప్రాజెక్ట్లు, పోస్ట్-ప్రొడక్షన్ మెటీరియల్స్ , ముగిసిన సినిమాల బ్యాకప్ డేటా ఉన్నాయి.ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ‘మేడ్ ఇన్ హెవెన్’ (Made in Heaven) సిరీస్, అలాగే 2020లో నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘ఘోస్ట్ స్టోరీస్’ (Ghost Stories) ప్రాజెక్ట్లకు సంబంధించిన డేటా కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం.వీటిల్లో కొన్ని డిస్క్లు గ్రే మార్కెట్లో విక్రయించగా, గోప్యమైన డేటా లీక్ అయ్యే అవకాశాలపై నిపుణుల విచారణ చేపట్టారు.ఇంటిదొంగల పనే మే 21న ఆఫీస్ సిబ్బంది పని కోసం హార్డ్ డిస్క్లను వెతకగా అవి కనిపించలేదు. కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ , హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్న మెహజబీన్ ముస్తాక్ షేక్ అంతర్గతంగా తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. స్టోరేజ్ క్యాబినెట్లో ఉన్న అసలైన హార్డ్ డిస్క్లను దొంగిలించి, వాటి స్థానంలో ఖాళీ లేదా పాడైపోయిన డబ్బాలను ఉంచినట్లు గుర్తించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈకేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటివాడు ఆ స్టోరేజ్ క్యాబినెట్ను పర్యవేక్షించే ఆఫీస్ ఉద్యోగే ఈ దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. గ్రే మార్కెట్ (Grey Market)లో ఒక్కో హార్డ్ డిస్క్ను రూ. 15,000 నుండి రూ. 20,000 లకు విక్రయించినట్లు తెలిపాడు. ఇక రెండో నిందితుడు బోరివలికి చెందిన ఒక వ్యక్తి ఈ డిస్క్లను కొనుగోలు చేయగా, పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేశారు. కోర్టు వీరికి మే 29 వరకు పోలీస్ కస్టడీ విధించింది.సైబర్ నిపుణుల దర్యాప్తుదొంగిలించబడిన వాటిలో 24 హార్డ్ డిస్క్లను నిందితుడు అమ్మేయగా, మిగిలిన వాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, హార్డ్వేర్ దొరకడం కంటే కూడా అందులోని రహస్య డేటాను ఎవరైనా కాపీ చేశారా? లేదా ఆన్లైన్లో ఎక్కడైనా లీక్ చేశారా? అనే కోణంలో సైబర్ క్రైమ్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. వినోద పరిశ్రమలో డేటా సెక్యూరిటీ (సమాచార భద్రత) ఎంత ముఖ్యమనే దానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది.
బైక్పై స్టంట్లు.. లైక్ల కోసం స్టేటస్..
హైదరాబాద్: బైక్పై స్టంట్లు చేయడమే కాక లైక్ల కోసం స్టేటస్ పెట్టిన బంజారాహిల్స్ రోడ్ నంబర్–5 దేవరకొండ బస్తీ యువకుడు షాదాబ్ (19)ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. జెప్టో డెలివరీ బాయ్గా పనిచేసే ఇతడు ఇటీవల శామీర్పేట రోడ్లోకి వెళ్లి బైక్ను గాల్లోకి లేపి ఫోన్ మాట్లాడుతూ విన్యాసాలు చేశాడు. దానిని వాట్సప్ స్టేటస్లో పెట్టుకున్నాడు. సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. షాబాద్ను అదుపులోకి తీసుకుని బైక్ను సీజ్ చేశారు. స్నేహితుల్లో తాను ప్రత్యేకత చాటుకోవాలని, తన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలనే స్టంట్లు చేసినట్లుగా నిందితుడు వెల్లడించాడు. షాదాబ్పై చోరీ కేసు నమోదై ఉందని దర్యాప్తులో తేలింది. బైక్పై ప్రమాదకర స్టంట్లు చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులులైక్ల కోసం బైక్ పై స్టంట్లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బంజారాహిల్స్ రోడ్ నంబర్-5 దేవరకొండ బస్తీ యువకుడు షాదాబ్ (19)గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు https://t.co/gipROq3UKL pic.twitter.com/wdx1J8kxMN— Telugu Scribe (@TeluguScribe) May 26, 2026
3 రోజులు, 10 గంటలు : సీబీఐ విచారణలో ట్విషా భర్త షాకింగ్ ఆరోపణలు
మోడల్ , నటి ట్విషా శర్మ మరణం కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త (రిటైర్డ్ జడ్జి) గిరిబాల సింగ్లపై సీబీఐ కొత్తగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది. ట్విషా శర్మ మృతి కేసు ఇప్పుడు అత్యంత కీలక దశలోకి ప్రవేశించింది.భోపాల్ పోలీసులు మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అత్త, భార్తలను నిందితులుగా చేర్చింది. సీబీఐ స్పెషల్ క్రైమ్ యూనిట్కు చెందిన ఒక బృందం ఢిల్లీ నుంచి భోపాల్ చేరుకుని, స్థానిక పోలీసులు ఇప్పటివరకు సేకరించిన కేస్ డైరీ, పోలీసు పత్రాలు, వాంగ్మూలాలు, వైద్య పత్రాలు, ఇతర భౌతిక సాక్ష్యాలను సేకరించింది.ఇదీ చదవండి: ట్విషా కేసులో సీబీఐ కోణం : అపుడే అత్త రూ. 2 లక్షలు డిమాండ్ఇప్పటికే వరకట్నం డిమాండ్ చేశారన్న ఆధారాలు లభించినట్లు ఆరోపణలు రావడంతో, వరకట్నం మరణనం సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటి) చీఫ్ రజనీష్ కశ్యప్ కౌల్ను ఫిర్యాదిదారుగా పేర్కొన్నారు.మరోవైపు పోలీసు విచారణలో భర్త సమర్థ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్కు, లభించిన ఆధారాలకు మధ్య తేడాలను సీబీఐ గమనించింది. తనకు గర్భం రావడంపై అనుమానంతో, బలంతంగా అబార్షన్ చేయించారని ట్విషా వాట్సాప్ ద్వారా తెలుస్తుండగా, తనకు తండ్రి కావాలని ఉందని, కానీ ట్విషాకు ఇష్టం లేకపోవడం వల్లే వైద్యుల సలహా మేరకు పరస్పర అంగీకారంతో గర్భస్రావం చేయించామని చెప్పాడు. గర్భం దాల్చినప్పటి నుండి ట్విషా తీవ్ర ఆందోళనకు గురైందని పేర్కొన్నాడుబైపోలార్ డిజార్డర్దీంతోపాటు మరో షాకింగ్ ఆరోపణలు కూడా చేశాడు భర్త. ట్విషాకు బైపోలార్ డిజార్డర్ (Bipolar Disorder) 'అడ్జస్ట్మెంట్ డిజార్డర్' ఉన్నాయని, ఆమె ప్రవర్తన అకస్మాత్తుగా మారేదని తెలిపాడు. ఒత్తిడి తగ్గించడానికి వైద్యుల సలహా పైనే నిద్రమాత్రలు ఇచ్చామని చెప్పాడు.ట్విషా కుటుంబం వాదన: పెళ్లికి ముందు ఆమెకు ఎలాంటి సమస్యలు లేవని, గర్భం దాల్చిన తర్వాత వచ్చిన గొడవల వల్లే మానసిక చికిత్స, మందులు మొదలయ్యాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కాలంలో ట్విషా సుమారు 15 కిలోల బరువు తగ్గిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అసలు ఈ చికిత్స గురించి ఆమెకు, పుట్టింటివారికి సమాచారం ఉందా లేదా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.ఉద్యోగం మానేయాలని భర్త ఒత్తిడి తెచ్చాడని, కనీసం ఆన్లైన్ జాబ్స్ కూడా చేసుకోనివ్వడం లేదని ట్విషా చనిపోవడానికి ముందు తన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్విషా తన సొంత ఇష్టపూర్వకంగా, ఇద్దరి పరస్పర అంగీకారంతోనే ఉద్యోగం మానేసిందని, తాము ఎక్కువ సమయం కలిసి గడపడానికే ఈ నిర్ణయం తీసుకుందని సమర్థ్ తెలిపాడు. చనిపోయే రోజు కూడా ఆమె మామూలుగానే ఉందనీ, ఇద్దరమూ జిమ్కు వెళ్లామని, కలిసి భోజనం చేసి, వాకింగ్కు కూడా వెళ్లామని సీబీఐకి చెప్పాడు.సమర్థ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పెళ్లయిన కొత్తలో అంతా నార్మల్గానే ఉందని, శారీరక, మానసిక వేధింపులేవీ లేవని చెప్పినప్పటికీ, అతని మొబైల్ ఫోన్ నుండి ట్విషాకు, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన వాట్సాప్ చాట్ హిస్టరీ పూర్తిగా డిలీట్ చేశాడు. ఇది మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ చాట్లను రికవర్ చేయడానికి టెక్నికల్ టీమ్ ప్రయత్నిస్తోంది. ఒకవేళ చాట్స్ రికవర్ అయితే, సమర్థ్ చెప్తున్న "నార్మల్ రిలేషన్షిప్" వాదనలోని నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది అంటున్నారు దర్యాప్తు అధికారులు. ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్ రజనీష్ కాశ్యప్ కౌల్ ఫిర్యాదుదారుగా సీబీఐ ఈ కేసును దేశ రాజధాని ఢిల్లీ నుండి ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తోంది. అయితే, దర్యాప్తు చేతులు మారుతున్న కొద్దీ, మూడు రోజులు, దాదాపు 10 గంటల పాటు జరిగిన విచారణలో సమర్థ్ సింగ్ పోలీసులకు ఏమి చెప్పాడు, వాట్సాప్ చాట్లు, వైద్య రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ, ఇతర డిజిటల్ సాక్ష్యాలు, కుటుంబ సభ్యుల ఆరోపణలకు వ్యతిరేకంగా అతని వాదనలో ఎంత నిజం ఉంది అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
వీడియోలు
పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి
రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్
పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్
భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు
ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి
మెగా DSCపై చంద్రబాబు వీడియో అంబటి నెక్స్ట్ లెవెల్ ర్యాగింగ్
ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంది
ఎక్స్ ట్రా ప్లేయర్ గా వచ్చి.. RCB రూపురేఖలు మార్చేసిన పటీదార్ కథ ..
హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను
భారీ వర్షం లోయలో ఇరుక్కుపోయిన బొలెరో


