ఢిల్లీ పేలుళ్లు.. అమిత్ షా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష
ఢిల్లీ: ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటన పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో హోంశాఖ కార్యదర్శి గోవిందు మోహన్, ఐబి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చీఫ్లు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.జమ్మూ కశ్మీర్ డీజీపీ వర్చువల్గా హాజరయ్యారు. పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కేంద్రం హై అలర్ట్ జారీ చేసింది. పలు దర్యాప్తు సంస్థలు.. బాంబు పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టాయి. పేలుడు ప్రాంతంలో ఫోరెన్సిక్ నిపుణులు, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ బృందాలు క్లూస్ సేకరించాయి. ఎర్ర కోట ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎర్రకోట మెట్రో స్టేషన్, చాందిని చౌక్, గురు ద్వారాలన్నీ పోలీసులు మూసివేశారు. జమ్మూ కశ్మీర్లోని అనంత్ నాగ్లో డాక్టర్ ఆదిల్ అరెస్టుతో భారీ ఉగ్రకుట్ర వెలుగు చూసింది.ఫరీదాబాద్లో 2900 కిలోల పేలుడు పదార్థాలను జమ్మూ కశ్మీర్, హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోని ఎర్రకోట వద్ద ఉగ్ర దాడి జరిగింది. ఉగ్ర నెట్వర్క్ను ఛేదిస్తున్న సమయంలోనే ఎర్రకోట వద్ద డాక్టర్ ఉమర్ మహమ్మద్ బాంబు పేలుడుకు పాల్పడ్డాడు.
100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద
ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ధర్మేంద్ర (89)పై వస్తున్న అనేక ఫేక్ న్యూస్ మధ్య ఆయన కోలుకుంటారనే వార్త ఎంతోమంది అభిమానులకు ఊరటనిచ్చింది. ఫూల్ ఔర్ పత్తర్, మేరా గావ్ మేరా దేశ్, షోలే, ఖామోషి, జానీ గద్దర్, ఇలాంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలతో బాలీవుడ్ ఐకాన్గా నిలిచారు. కళా రంగంలో ఆయన చేసిన సేవలకు గాను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును కూడా పొందారు ధర్మేంద్ర అయితే తాజాగా ఆయన ఆస్తి ఎంత అనేది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అసలైన హీ-మ్యాన్గా పాపులర్ అయిన ధర్మేంద్ర, బాలీవుడ్లోని అత్యంత ధనిక స్టార్స్ లో ఒకరు.నటనతోపాటు ఆయన వ్యాపారం రంగంలోకూడా తనదైన ముద్రను చాటుకున్నారు. 2015లో న్యూఢిల్లీలోని గరం ధరం ధాబాతో రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు ధర్మేంద్ర. 2022లో, కర్నాల్ హైవేలో హీ-మ్యాన్ అనే మరో హోటల్ను కూడా స్థాపించారట.100 ఎకరాల విశాలమైన ఫామ్హౌస్ధర్మేంద్ర తన కుటుంబంతో ముంబైలో నివసిస్తున్నప్పటికీ, నగరానికి దూరంగా ప్రశాంతతకు మారుపేరైనా లోనావాలాలోని తన విశాలమైన 100 ఎకరాల ఫామ్హౌస్ ఉంది. ఆధునిక సౌకర్యాలతో ముఖ్యంగా ఆక్వా థెరపీ తీసుకునేందుకు వీలుగా వేడి నీటితో కూడిన స్విమ్మింగ్ పూల్ ఉండే ఈ ఫాం హౌస్కి ఇక్కడికి తరచూ వెళుతూ ఉంటారు కూడా. అంతేకాదు ఇక ఒక రిసార్ట్ను అభివృద్ధి చేయడం ద్వారా హాస్పిటాలిటీ వ్యాపారంలోకి మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు సమాచారం.ధర్మేంద్ర మహారాష్ట్రలో రూ.17 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. రూ.88 లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమి రూ.52 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి కూడా ఉన్నాయి. పలునివేదికల ప్రకారం ఒక రెస్టారెంట్ చైన్తో భాగస్వామ్యంతో 12 ఎకరాల స్థలంలో 30-కాటేజ్ రిసార్ట్ను నిర్మించారుట.ధర్మేంద్ర మొత్తం ఆస్తుల విలువ రూ. 335 కోట్లు ఉంటుందని అంచనా. ఇదీ చదవండి: 20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యంలగ్జరీ కార్లు లగ్జరీ కార్లు అంటే ధర్మేంద్రకు చాలా ఇష్టం. ఆయన దగ్గరున్న అద్భుతమైన కార్ల కలెక్షనే ఇందుకు నిదర్శనమంటారు. వింటేజ్ ఫియట్ కారు విలువ రూ. 85.74 లక్షలు. రూ. 98.11 లక్షల విలువైన రేంజ్ రోవర్ ఎవోక్ మెర్సిడెస్-బెంజ్ SL500 వంటి ఆధునిక లగ్జరీ కార్లతో అతని గ్యారేజ్ నోస్టాల్జియా , ఐశ్వర్యం ప్రతిబింబంగా ఉంటుంది. ప్రొడక్షన్ హౌస్నటనతో పాటు, ధర్మేంద్ర నిర్మాతగా కూడా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. 1983లో తన నిర్మాణ సంస్థ విజయ్తా ఫిల్మ్స్ను ప్రారంభించాడు. ఈ బ్యానర్ కింద, అతను తన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్లను బేతాబ్ (1983) , బర్సాత్ (1995) సినిమాలతో వరుసగా విజయ వంతమైన అరంగేట్రాలతో బాలీవుడ్కు పరిచయం చేశారు. 2019లో తన మనవడు కరణ్ డియోల్ను తొలి చిత్రం పాల్ పల్ దిల్ కే పాస్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ధర్మేంద్ర రెండు పెళ్లిళ్లు. సినీ జీవితంలోకి అడుగుపెట్టకముందే 1954లో ప్రకాష్ కౌర్ పెళ్లాడారు. మొదటి భార్య ద్వారా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. బాలీవుడ్ స్టార్హీరోగా మారిన తరువాత ప్రకాష్ కౌర్ నుంచి విడాకులు తీసుకోకుండానే 1980లో డ్రీమ్గర్ల్ హేమా మాలినిని వివాహం చేసుకున్నారు. వీరికి ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్కు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ.హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు నూరీ ఫాతిమా, షేక్ ఆసిఫ్, మెహబూబ్ షేక్ తదితరులు పాల్గొన్నారు.‘‘ఆ మహనీయునికి ఘన నివాళులు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు అజరామరం. మైనార్టీ సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. "భారత రత్న" మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు అజరామరం.మైనార్టీ సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/rKD6LTwvNb— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2025
నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్
బాలీవుడ్ దిగ్గజ హీరో ధర్మేంద్ర చనిపోయారని ఉదయం నుంచి వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాన్న మరణించలేదని, మీడియాలో వస్తున్నవి అవాస్తవాలని ఈయన కూతురు ఈషా డియోల్ అంటోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో తాజాగానే పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు తికమక పడుతున్నారు.గత కొన్నాళ్లుగా శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈయన.. వెంటిలేటర్పై ఉన్నారని సోమవారం సాయంత్రం వార్తలొచ్చాయి. దీంతో స్పందించిన ఆయన టీమ్.. ఏం ఇబ్బంది లేదని, బాగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు (మంగళవారం) ఉదయానికల్లా మొత్తం మీడియాలో ధర్మేంద్ర చనిపోయారని న్యూస్ వచ్చింది. కానీ ఈయన కూతురు ఈషా మాత్రం తండ్రి ప్రస్తుతం కోలుకుంటున్నారని క్లారిటీ ఇచ్చింది.అలానే ధర్మేంద్ర భార్య, నటి హేమమాలిని కూడా చనిపోలేదని క్లారిటీ ఇచ్చారు. 'జరిగిన దాన్ని క్షమించలేం. చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్న వ్యక్తి గురించి అవాస్తవాలు ఎలా ప్రచారం చేస్తారు? ఇది ఆయన్ని అగౌరవపరచడమే. మా కుటుంబానికి గౌరవం ఇవ్వడంతో పాటు కాస్త ప్రైవసీ కూడా ఇవ్వండి' అని హేమమాలిని ట్వీట్ చేశారు.ధరేంద్రకు ఇద్దరు భార్యలు ప్రకాశ్ కౌర్, హేమమాలిని. ప్రకాశ్ కౌర్కి పుట్టిన కొడుకు సన్నీ డియోల్, బాబీ డియోల్. హేమామాలినికి ఈషా డియోల్, అహనా డియోల్ అని కూతుళ్లు ఉన్నారు.What is happening is unforgivable! How can responsible channels spread false news about a person who is responding to treatment and is recovering? This is being extremely disrespectful and irresponsible. Please give due respect to the family and its need for privacy.— Hema Malini (@dreamgirlhema) November 11, 2025
ధర రూ. 3 లక్షల నుంచి రూ. 30 కోట్లకు పెరిగింది!
పాక్లో భారీ పేలుడు.. 12 మంది మృతి
న్యూమరస్ ఎన్–ఫస్ట్ ఈవీ బైక్: రూ. 64,999 మాత్రమే!
'శివ తీయడానికి అసలు కారణమదే'.. ఆర్జీవీ కామెంట్స్
శ్రేయస్ గాయం.. షాకింగ్ విషయాలు
100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద
ఢిల్లీ పేలుడు ఘటన: మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. అక్కినేని కోడలి రివ్యూ
3800 మంది పిల్లల ప్రాణాలు కాపాడిన సింగర్.. ఏకంగా గిన్నిస్ బుక్లో!
నష్టాలకు బ్రేక్: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళగిరిలో టిఫిన్.. తిరుపతిలో లంచ్.. హైదరాబాద్లో డిన్నర్
మాపై చిన్నచూపు.. బతకాలనిపించలేదు: రాము తల్లి భావోద్వేగం
డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా..
అంతా ఓకేనా? అని 17 సార్లు అడిగాడు: నటి
'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..
పసిడి, వెండి.. ధరల తుపాను
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ఆరోసారి ఛాంపియన్
వెండి ధర అక్కడికి!.. కియోసాకి ట్వీట్
అసలు ఓటర్ల లిస్టే డస్ట్ బిన్లో వేశారు..!!
నేను నా చాంబర్ నుంచి బయటికి వెళ్లినా ‘ఇన్’ అనే ఉంచు.. పరిస్థితులు బాగోలేవ్
ఈ రాశి వారికి ఆస్తి ఒప్పందాలు.. ఆర్థికాభివృద్ధి
ఈ రాశి వారికి ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.. ఆర్థికాభివృద్ధి
సాక్షి సాక్షిగా.. నాగార్జునకు ఇచ్చే వెళ్తా..!
రాము ఔట్.. ఇమ్మూ స్వార్థం! టాప్ 6 వీళ్లే..!
వరుస ఫ్లాప్స్.. రవితేజ షాకింగ్ డెసిషన్!
మూరెడు పాము.. ముప్పుతిప్పలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి తెర
మనసున్న శ్రీ చరణి!
సర్ప్రైజ్.. మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్ రిలీజ్
ధర రూ. 3 లక్షల నుంచి రూ. 30 కోట్లకు పెరిగింది!
పాక్లో భారీ పేలుడు.. 12 మంది మృతి
న్యూమరస్ ఎన్–ఫస్ట్ ఈవీ బైక్: రూ. 64,999 మాత్రమే!
'శివ తీయడానికి అసలు కారణమదే'.. ఆర్జీవీ కామెంట్స్
శ్రేయస్ గాయం.. షాకింగ్ విషయాలు
100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద
ఢిల్లీ పేలుడు ఘటన: మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. అక్కినేని కోడలి రివ్యూ
3800 మంది పిల్లల ప్రాణాలు కాపాడిన సింగర్.. ఏకంగా గిన్నిస్ బుక్లో!
నష్టాలకు బ్రేక్: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళగిరిలో టిఫిన్.. తిరుపతిలో లంచ్.. హైదరాబాద్లో డిన్నర్
మాపై చిన్నచూపు.. బతకాలనిపించలేదు: రాము తల్లి భావోద్వేగం
డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా..
అంతా ఓకేనా? అని 17 సార్లు అడిగాడు: నటి
'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..
పసిడి, వెండి.. ధరల తుపాను
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ఆరోసారి ఛాంపియన్
వెండి ధర అక్కడికి!.. కియోసాకి ట్వీట్
అసలు ఓటర్ల లిస్టే డస్ట్ బిన్లో వేశారు..!!
నేను నా చాంబర్ నుంచి బయటికి వెళ్లినా ‘ఇన్’ అనే ఉంచు.. పరిస్థితులు బాగోలేవ్
ఈ రాశి వారికి ఆస్తి ఒప్పందాలు.. ఆర్థికాభివృద్ధి
ఈ రాశి వారికి ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.. ఆర్థికాభివృద్ధి
వరుస ఫ్లాప్స్.. రవితేజ షాకింగ్ డెసిషన్!
రాము ఔట్.. ఇమ్మూ స్వార్థం! టాప్ 6 వీళ్లే..!
మూరెడు పాము.. ముప్పుతిప్పలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి తెర
మనసున్న శ్రీ చరణి!
సర్ప్రైజ్.. మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్ రిలీజ్
తిరుమలలో మరో అపచారం.. తప్పు ఒప్పుకున్న టీటీడీ!
సినిమా
సినిమా ప్రారంభోత్సవంలో సందడిగా నిహారిక (వీడియో)
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘ఇరువురి భామల కౌగిలిలో’. తాజాగా ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగా డాటర్ నిహారిక సందడిగా కనిపించారు. ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిహారిక తన మొదటి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో నిహారిక తన రెండో ప్రాజెక్ట్ను సంగీత్ శోభన్, నయన్ సారికతో చేస్తోంది. తను నిర్మాతగా మాత్రమే కాదు.. సోషల్మీడియాలో ఫుల్ యాక్టివ్గా కనిపిస్తుంటారు. ఏదేమైనా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఇప్పుడు నిర్మాతగా సత్తా చాటుతున్నారు.‘ఇరువురి భామల కౌగిలిలో’ సినిమా పూజా కార్యక్రమంలో నిహారిక సందడిగా కనిపించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతో ఆమె సరదాగా మాట్లుడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సోషల్మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఆమె కామెంట్స్ను ఆఫ్ చేయడం విశేషం.‘ఇరువురి భామల కౌగిలిలో’ సినిమా విషయానికొస్తే.. త్రినాథ్వర్మ, వైష్ణవి కొల్లూరు, మలినా ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అచ్యుత్ చౌదరి దర్శకుడు కాగా.. శ్రీనివాసగౌడ్ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి నిహారిక కొణిదెల క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రం త్వరలో రెగ్యూలర్ షూటింగ్ జరగనుంది. View this post on Instagram A post shared by @nihakonidela18
ట్రెండింగ్ బ్యూటీ.. ఇంతకీ ఎవరీమె? డీటైల్స్ ఏంటి?
గత మూడు నాలుగు రోజుల నుంచి ఓ నటి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దానికి కారణం ఓ ఇంటర్వ్యూ. అలా అని ఆమె గ్లామరస్ హీరోయిన్ కాదు, ఇంటర్వ్యూలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఏం చేయలేదు. అయినా సరే ఈమె గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈమె ఎవరా అని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే నటి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎందుకు వైరల్ అవుతుందనేది చూద్దాం.సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు వైరల్ అవుతారనేది చెప్పలేదు. తాజాగా ఓ హిందీ ఇంటర్వ్యూలో మరాఠీ నటి గిరిజా ఓకే పాల్గొంది. తన గురించి పలు విషయాలు చెప్పింది. 'కాంతార 1' ఫేమ్ గుల్షన్ దేవయ్య.. తనతో ఓ రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు నువ్వు ఓకేనా అని 17 సార్లు తనని అడిగాడని, అలాంటి యాక్టర్స్తో కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుందని గిరిజా చెప్పుకొచ్చింది. ఈ బిట్తో పాటు ఇంటర్వ్యూకి సంబంధించిన పలు వీడియో క్లిప్స్ ట్విటర్లో తెగ కనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్)స్లీవ్ లెస్ బ్లౌజ్, స్కై బ్లూ చీరలో గిరిజా ఓకే చాలా సింపుల్గా ఉన్నప్పటికీ.. నెటిజన్లు ఎందుకో ఈమెని చూసి ఫిదా అయిపోయినట్లు ఉన్నారు. అందుకే ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యేసరికి ఈమె ఎవరా అని తెగ కామెంట్స్ పెడుతున్నారు. అలా అని ఈమేం కొత్తగా ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన నటి కాదు. 2004 నుంచి సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్లు చేస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది.స్వతహాగా మరాఠీ నటి అయిన గిరిజా ఓక్.. హిందీలోనూ పలు మూవీస్ చేసింది. బాలీవుడ్లో 'తారే జమీన్ పర్' ఈమె మొదటి చిత్రం. ఇందులో చిన్న రోల్ చేసినప్పటికీ ఫేమ్ సంపాదించింది. తర్వాత సొంత భాష మరాఠీతో పాటు హిందీలోనూ షోర్ ఇన్ ద సిటీ(2010), కాలా, జవాన్ (2023) చిత్రాలు చేసింది. రీసెంట్గా ఓటీటీలో రిలీజైన ఇన్స్పెక్టర్ జెండే మూవీలోనూ కనిపించింది. ఇప్పుడు ట్రెండ్ కావడం ఏమో గానీ ఈమె యాక్ట్ చేసిన పాత మూవీ క్లిప్స్ అన్నీ ఇప్పుడు వైరల్ చేస్తున్నాడు. ఇలా వైరల్ అయిన వీడియోల్లో సందీప్ కిషన్తో గిరిజ చేసిన రొమాంటిక్ సీన్ కూడా ఒకటుంది.గిరిజ వ్యక్తిగత జీవితానికొస్తే.. తండ్రి గిరీష్ ఓకే కూడా నటుడే. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత థియేటర్స్లో చేరింది. తొలుత అడ్వర్టైజ్మెంట్స్ చేసి గుర్తింపు తెచ్చుకుని తర్వాత నటిగా మారింది. సుహ్రుద్ గోడ్బోలే అనే నిర్మాతని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇన్నాళ్ల నుంచి సినిమాలు చేస్తున్నా 37 ఏళ్ల వయసులో ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతానని ఈమె కూడా అనుకుని ఉండదేమో?(ఇదీ చదవండి: తిరుమలలో పెళ్లి చేసుకున్న 'కేజీఎఫ్' సింగర్)
'బిగ్బాస్'కే చుక్కలు చూపుతున్న కంటెస్టెంట్స్.. అందరూ నామినేట్
బిగ్బాస్ సీజన్-9లో పదో వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి. సీజన్ కూడా అయిపోవస్తుంది. కానీ, హౌస్లోని కంటెస్టెంట్స్ మాత్రం నామినేషన్లో కూడా చెత్త పాయింట్లతోనే ముగించేశారు. దీంతో బిగ్బాస్కు కూడా చిరాకు అనిపించినట్లుంది. హౌస్లో వారి ఆటకు తిక్కరేగిన బిగ్బాస్ సూపర్ ట్విస్ట్తో అందరికీ షాకిస్తూ.. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ మినహా ఈ వారం అందరినీ ఎలిమినేషన్లో నిలబెట్టాడు. 9 వారాలుగా ఇమ్ము ఎలిమినేషన్లో లేడంటూ రీసెంట్ ఎపిసోడ్లో నాగార్జున గుర్తుచేశారు. ఇదే క్రమంలో అతన్ని నామినేషన్లో పెట్టమని పరోక్షంగా బిగ్బాస్ రంగంలోకి దిగి ఛాన్స్ ఇస్తే దానిని కూడా హౌస్లో ఎవరూ ఉపయోగించుకోలేదు. ఇలా చెత్తగా నామినేషన్ ప్రక్రియను ముగించేశారు. తనూజ కోసం భరణి అంటూ ఇమ్మూ ఫైర్బిగ్బాస్ హౌస్లో ఆరు వారాల ఆట మాత్రమే ఉంది. ప్రస్తుతం హౌస్లో 11మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలని.. అందుకోసం ఐదు నిమిషాల టైమ్ లిమిట్ ఇచ్చాడు. నామినేట్ అయిన వారు అక్కడొక కుర్చీలో కూర్చుంటే బురదనీళ్లు వచ్చి వారి మీద పడుతాయి. మొదట ఇమ్మాన్యుయేల్ నామినేషన్ ప్రక్రియ మొదలుపెడుతాడు. భరణిని నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్లో మీరు తనూజ కోసం గివప్ చేయడం నచ్చలేదనే పాయింట్ తెరపైకి తెస్తాడు. మీకంటే తనూజనే బెస్ట్ ప్లేయర్ అని ఒప్పుకోవడం ఏంటి అంటూ భరణిని ప్రశ్నిస్తాడు. ఈసారి కొత్త భరణిని చూస్తారన్నారని రీఎంట్రీ ఇచ్చారు. కానీ, రోజురోజుకి ఆ ఫైర్ కనిపించడంలేదంటూ ఇమ్మూ ఫైర్ అవుతాడు. అయితే, భరణి సరైన సమాధానాలు చెప్పలేకపోయాడు. అయితే, ఎక్కువ మంది గౌరవ్, నిఖిల్ను నామినేషన్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడారు.దివ్యను నామినేషన్ చేసిన భరణిఈ వారం నామినేషన్లో ప్రత్యేకత ఏదైనా ఉందంటే.. దివ్యను భరణి నామినేట్ చేయడమని చెప్పాలి. ఈ క్రమంలో భరణి ఇలా చెప్తాడు. 'నా గేమ్ నీ వల్ల పాడవ్వలేదు.. నేను నీ వల్ల హౌస్ నుంచి బయటికి వెళ్లలేదనేది నాకు మాత్రమే తెలుసు. కానీ, హౌస్మేట్స్ మాత్రం దివ్య వల్లనే భరణి వెళ్లారు అనుకుంటున్నారు. అది తప్పని ప్రూ చేయాల్సిన బాధ్యత నీపైన కూడా ఉంది కదా.. కాబట్టి నువ్వు నామినేషన్కి వెళ్లి సేఫ్గా వచ్చి ప్రూ చేసుకో..' అంటూ భరణి చెప్పాడు. దీంతో దివ్య కౌంటర్ గట్టిగానే ఇస్తుంది. నా వల్ల మీ గేమ్ పాడైందా..? ఇది ఏ రకమైన కారణం..? అంటూ భరణిపై విరుచుకుపడింది. నా వల్ల మీరు హౌస్ నుంచి వెళ్లిపోలేదనే విషయంలో మీకు క్లారిటీ ఉన్నప్పుడు నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నారు. మీరు వెళ్లిపోయింది నా వల్లే అని ఎవరూ అనలేదు బాండింగ్స్లో నేను ఒక్కదాన్నే ఉన్నానా.. అని దివ్య ఫైర్ అయింది. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్దం గట్టిగానే నడిచింది.భరణి మాత్రమే ప్రత్యేకంనామినేషన్స్ తంతు ముగిసిన తర్వాత బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తూ.. ఈ వారం హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరినీ నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, కెప్టెన్ ఇమ్మాన్యుయేల్కి మినహాయింపు ఇవ్వాలా, వద్దా అనేది సీక్రెట్ ఓటింగ్తో నిర్ణయించమని కోరుతాడు. అప్పటికీ కూడా ఎవరూ ఇమ్మూను నామినేట్ చేయలేదు. కేవలం భరణి మాత్రమే ఇమ్మాన్యుయేల్ను నామినేషన్లో ఉంచాలని ఓట్ వేస్తాడు. మిగిలిన అందరూ ఇమ్మూకు మద్దతు తెలుపుతూ నామినేషన్స్ నుంచి తప్పిస్తారు. దీంతో ఈ వారం ఇమ్మాన్యుయేల్ను మినహాయించి హౌస్లో ఉన్న అందరూ నామినేషన్ లిస్ట్లోకి వచ్చారు.
తిరుమలలో పెళ్లి చేసుకున్న 'కేజీఎఫ్' సింగర్
కన్నడ సినిమా రేంజుని 'కేజీఎఫ్' సినిమా ఎంతో మార్చేసింది. హీరోహీరోయిన్, దర్శకుడితో పాటు మూవీ కోసం పనిచేసిన చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే ఫ్రాంచైజీలో రెండు చిత్రాల్లోనూ చాలావరకు పాటలు పాడిన సింగర్ అనన్య భట్ కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె తిరుమలలో చాలా సింపుల్గా పెళ్లి చేసుకుంది.(ఇదీ చదవండి: నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్)కన్నడలో ఫోక్ సింగ్స్, సినిమా పాటలు పాడే అనన్య భట్.. ఆదివారం (నవంబరు 09) వివాహం చేసుకుంది. తనలానే సంగీత పరిశ్రమకు చెందిన డ్రమ్మర్ మంజునాథ్తో ఏడడుగులు వేసింది. తిరుమలలో జరిగిన ఈ శుభకార్యం.. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో చాలా సింపుల్గా జరిగిపోయింది. తన పెళ్లి గురించి అనన్య.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సింగర్ మంగ్లీతో పాటు తోటి గాయనీగాయకులు అనన్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు.అనన్య.. 'కేజీఎఫ్' ఒరిజినల్ వెర్షన్లోని మెహబూబా, ధీర ధీర, సుల్తాన్ పాటలు పాడింది. అలానే తెలుగు వెర్షన్లోని 'తరగని బరువైనా' అంటూ సాగే తల్లి సెంటిమెంట్ సాంగ్ కూడా పాడింది. ఇది కాకుండా 'పుష్ప' కన్నడ వెర్షన్లోని 'సామి సామి' పాటలో వినిపించే గొంతు ఈమెదే. రీసెంట్ టైంలో తెలుగులో అయితే 'షష్టిపూర్తి', 'గరివిడి లక్ష్మి' సినిమాల్లో ఈమె పాటలు పాడింది.(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్ రిలీజ్)
న్యూస్ పాడ్కాస్ట్
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు. తొమ్మిది మంది దుర్మరణం. 20 మందికి గాయాలు. రంగంలోకి దర్యాప్తు బృందాలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
ప్రజాధనాన్ని ప్రైవేటుకు దోచిపెడుతున్న కూటమి సర్కారు...
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
ఏపీ సీఎం చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి... ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం సాగిస్తాం... మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి.
కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం
Chevella Bus Incident: రెప్పపాటులో ప్రమాదం అతివేగం వల్లే జరిగింది
క్రీడలు
ఢిల్లీ పేలుడు ఘటనపై గౌతమ్ గంభీర్ దిగ్భ్రాంతి
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను కలిగించింది. ఈ భయంకర పేలుడులో మొత్తం 13 మంది మృతి చెందగా..17 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఢిల్లీలో జరిగిన పేలుడు కారణంగా అమాయకుల ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని గంభీర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. గంబీర్ ప్రస్తుతం భారత జట్టుతో పాటు కోల్కతాలో ఉన్నాడు. నవంబర్ 14 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు ప్రారంభం కానుంది.భద్రతా వలయంలో ఈడెన్..కాగా ఢిల్లీ ఘటన నేపథ్యంలో కోల్కతా పోలీస్లు అలర్ట్ అయ్యారు. మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తొలి టెస్టు కోసం ఇరు జట్లు ఇప్పటికే కోల్కతాకు చేరుకున్నాయి. దీంతో ఆటగాళ్లు బస చేసే హోటల్స్ వద్ద, స్టేడియంకి వెళ్లే మార్గంలో సెక్యూరిటీని మరింత పెంచారు. సోమవారం నుంచి ఈడెన్ గార్డెన్స్ చుట్టూ పోలీసులు ప్రత్యేక నాకా తనిఖీలు (NAKA checks) చేశారు.
శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం!
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్.. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అయ్యర్ తన ప్రక్కెటుమకల గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడు. అయితే అయ్యర్కు వైద్యులు దాదాపు ఐదు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఈ ముంబై ఆటగాడిని సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో ఆడించి రిస్క్ తీసుకోడదని బీసీసీఐ భావిస్తుందంట. శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పడుతోంది. అయ్యర్ విషయంలో బోర్డు, సెలక్షన్ కమిటీ ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. అయ్యర్ స్దానంలో సెలక్టర్లు సాయిసుదర్శన్కు చోటు ఇచ్చే అవకాశముంది.అయ్యర్కు ఏమైందంటే?ఆసీస్తో జరిగిన మూడో వన్డేలో క్యారీ ఇచ్చిన క్యాచ్ను అందుకునే క్రమంలో బంతి అయ్యర్ పక్కటెముకలకు బలంగా తాకింది. ప్లీహానికి (Spleen Injury) తీవ్ర గాయమైంది. ఆ తర్వాత అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉంచి చికిత్స అందించారు. దాదాపు నాలుగు రోజుల తర్వాత శ్రేయస్ అయ్యర్ అస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయ్యర్ ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు.చదవండి: మహ్మద్ షమీ వర్సెస్ అగార్కర్.. ఎవరు గొప్ప బౌలర్?
భారత్- ‘ఎ’ తరఫునా ఫెయిల్.. జట్టులోకి ఎలా వస్తారు?
సౌతాఫ్రికా- ‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్లో భారత్- ‘ఎ’ (IND A vs SA A) జట్టు మిశ్రమ ఫలితం చవిచూసింది. బెంగళూరు వేదికగా జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసుకుంది. రెండో టెస్టులో పంత్ సేన విజయం ఖాయమని భావించగా.. ప్రొటిస్ జట్టు సంచలన రీతిలో గెలుపును తన్నుకుపోయింది.ఈ మ్యాచ్లో అదే పెద్ద హైలైట్!ఏకంగా 400 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ ‘ఎ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టులో 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. 2 మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. భారత్లాంటి స్పిన్ వేదికలపై నాలుగో ఇన్నింగ్స్ (ఛేదించే జట్టు రెండో ఇన్నింగ్స్) అది కూడా చివరి రోజు చాలా కష్టం. అయినాసరే సఫారీ ‘ఎ’ జట్టు భారత రెగ్యులర్ టెస్టు బౌలర్లు సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్లను ఎదుర్కొని మరీ భారీ లక్ష్యాన్ని ఛేదించడమే ఈ మ్యాచ్లో పెద్ద హైలైట్! ఓవరాల్గా ‘ఎ’ జట్ల అనధికారిక నాలుగు రోజుల మ్యాచ్ల్లోనే ఇది అత్యధిక పరుగుల ఛేదనగా ఘనతకెక్కింది. ధ్రువ్ జురెల్ ఒక్కడే..ఇదిలా ఉంటే.. ఈ సిరీస్లో టీమిండియా స్టార్లలో ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. రెండో టెస్టులో రెండుసార్లు శతక్కొట్టి సత్తా చాటాడు. తద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో కేవలం వికెట్ కీపర్ బ్యాకప్ ఆప్షన్గా కాకుండా.. స్పెషలిస్టు బ్యాటర్గా రాణించగలనని మరోసారి నిరూపించాడు.దారుణంగా విఫలంమరోవైపు.. తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్ (Sai Sudharsan), కర్ణాటక క్రికెటర్ దేవదత్ పడిక్కల్ మాత్రం ఈ సిరీస్లో విఫలమయ్యారు. సాయి నాలుగు ఇన్నింగ్స్లో కలిపి 84 పరుగులు చేయగా.. పడిక్కల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఇన్నింగ్స్లో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 6,5,5,24.ఇక టీమిండియా తరఫున టెస్టుల్లో బ్యాకప్ ఓపెనర్గా ఎంపికవుతూ.. ఇప్పటికీ అరంగేట్రం చేయలేకపోయిన బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ పూర్తిగా ఫెయిలయ్యాడు. రెండో టెస్టుతో జట్టులో చేరిన అతడు డకౌట్ అయ్యాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్ దేవాంగ్ గాంధీ సాయి, పడిక్కల్, అభిమన్యులపై విమర్శలు గుప్పించాడు. ‘‘విఫలమైనా... సాయి సుదర్శన్ ఇంకా యువకుడే కాబట్టి సెలక్టర్లు అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వవచ్చు. టెస్టు ఫార్మాట్లో బ్యాకప్ బ్యాటర్ల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.భారత్- ‘ఎ’ తరఫునా పరుగులు చేయలేరు.. జట్టులో చోటెలా?పడిక్కల్ భారత్- ‘ఎ’ తరఫున కూడా పరుగులు రాబట్టలేకపోతున్నాడు. బ్యాకప్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ ఇలాగే కొనసాగితే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. జట్టులోకి రావడం కలగానే మిగిలిపోతుంది.స్పష్టతకు రావాలి..ఏదేమైనా జురెల్ ఒక్కడే ప్రస్తుతం నిలకడగా రాణిస్తున్నాడు. అయితే, అతడిని కేవలం బ్యాకప్ వికెట్ కీపర్గా మాత్రమే వాడకుంటామంటే.. రిషభ్ పంత్ కారణంగా అతడికి తుదిజట్టులో చోటు దక్కదు. కాబట్టి అతడి పాత్రపై సెలక్టర్లు స్పష్టతకు రావాలి.అంతేకాదు.. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లను సెలక్టర్లు కవర్ చేయాలి. సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాలి. ఈ దేశీ సీజన్లో సెలక్టర్లు ఈ విషయంలో కఠినంగా శ్రమిస్తేనే మెరుగైన ఎంపికలు చేయగలరు’’ అని దేవాంగ్ గాంధీ టైమ్స్ ఆఫ్ ఇండియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.చదవండి: వన్డే ఆల్టైమ్ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్కు దక్కని చోటు
మహ్మద్ షమీ వర్సెస్ అగార్కర్.. ఎవరు గొప్ప బౌలర్?
టీమిండియా స్పీడ్ స్టార్ మహ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్ తుది దశకు చేరుకుందా? జాతీయ జట్టులోకి అతడి రీ ఎంట్రీ అసాధ్యమేనా..? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. షమీ గత ఎనిమిది నెలల నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు.ఈ ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత జెర్సీలో షమీ కన్పించలేదు. టెస్టుల్లో అయితే అతడు చివరగా 2023లో ఆస్ట్రేలియాపై ఆడాడు. షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి సెలక్టర్లు మాత్రం అతడిని పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన షమీ.. 91 ఓవర్లు బౌలింగ్ చేసి 15 వికెట్లు పడగొట్టాడు. లాంగ్ స్పెల్స్ బౌలింగ్ చేస్తూ తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. దీంతో సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఈ స్పీడ్ స్టార్ను సెలక్టర్లు ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం మరోసారి షమీకి నిరాశే మిగిల్చారు.షమీ× అగార్కర్అయితే తనను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదని, కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని షమీ ఇటీవల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. రంజీల్లో ఆడే వాడిని.. వన్డేలు ఆడలేనా? అని ప్రశ్నించాడు. షమీ వ్యాఖ్యలపై అగార్కర్ కూడా స్పందించాడు. షమీకి ఫిట్నెస్ ప్రధాన సమస్యగా ఉందని అందుకే అతడిని ఎంపిక చేయడం లేదని చీఫ్ సెలక్టర్ చెప్పుకొచ్చాడు. షమీ తన ముందు ఉండింటే సమాధనము చెప్పేవాడని అని అగార్కర్ అన్నాడు.అయితే తాజాగా బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు కూడా షమీ ఆరోపణలపై స్పందించారు. "సెలక్టర్లు, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ సపోర్ట్ స్టాఫ్ షమీతో నిరంతరం టచ్లోనే ఉన్నారు. ఇంగ్లండ్ టూర్లో కొన్ని మ్యాచ్ల్లో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చినందున షమీ లాంటి సీనియర్ బౌలర్ను జట్టులోకి తీసుకోవాలని భావించాము.ఓ సీనియర్ సెలెక్టర్ అతడితో చర్చలు జరిపారు. ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో కాంటర్బరీ లేదా నార్తాంప్టన్లో జరిగే ఇండియా-ఎ మ్యాచ్ ఆడాలని కోరారు. షమీ సుదీర్ఘ స్పెల్స్ వేయగలడా లేడా అని సెలక్టర్లు పరీక్షించాలి అనుకున్నారు. కానీ షమీ మాత్రం సెలక్టర్ల ప్రతిపాదనను తిరష్కరించాడు. అగార్కర్ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని "సదరు బోర్డు అధికారి పేర్కొన్నారు.ఎవరు గొప్ప..?ఈ నేపథ్యంలో షమీ, అగార్కర్లలో ఎవరూ గొప్ప బౌలర్ అన్న చర్చ క్రికెట్ వర్గాల్లో నడుస్తోంది. అగార్కర్ భారత క్రికెట్లో తనంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ ముఖ్యంగా వన్డేల్లో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ బౌలింగ్ చేశాడు.ఈ ఢిల్లీ బాయ్ తన కెరీర్లో మొత్తంగా 191 వన్డేలు ఆడి 288 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో (అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్ తర్వాత) మూడో స్థానంలో అగార్కర్ ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్గా కూడా అజిత్ చానాళ్లపాటు కొనసాగాడు. అతడు కేవలం 23 మ్యాచ్లలోనూ ఈ రికార్డును అందుకున్నాడు. చాలా మ్యాచ్లలో బ్యాట్తో కూడా అజిత్ సత్తాచాటాడు. వన్డేల్లో భారత్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ(కేవలం 21 బంతుల్లో) సాధించిన రికార్డు ఇప్పటికీ అగార్కర్ పేరిటే ఉంది.అదే విధంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్పై అగార్కర్ సాధించిన టెస్టు సెంచరీ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోడు. దాదాపు 15 ఏళ్ల పాటు భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన అగార్కర్.. ఇప్పుడూ చీఫ్ సెలక్టర్గా తన సేవలను అందిస్తున్నాడు.ఇక షమీ విషయానికి వస్తే ఇప్పటివరకు 108 వన్డేలు ఆడాడు. షమీ పేరిట ప్రస్తుతం 206 వికెట్లు ఉన్నాయి. అదే అగర్కార్ 108 వన్డేల్లో 158 వికెట్లు మాత్రమే సాధించాడు. ఇద్దరూ మధ్య దాదాపుగా 48 వికెట్లు తేడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే షమీ తిరిగి వన్డేల్లో ఆడుతాడన్నది అనుమానమే. ఒకవేళ రీ ఎంట్రీ ఇచ్చినా అగార్కర్ ఆడిన వన్డేలకు సంఖ్యకు దారిదాపుల్లోకి కూడా వెళ్లలేడు. షమీ ఇప్పటివరకు 108 వన్డేల మ్యాచ్ల ఆడగా అందులో భారత్ 69 విజయాలు సాధించిందంటే అతడి ట్రాక్ రికార్డు ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. ఈ 69 వన్డేల్లో అతడు 5.24 ఎకానమీ రేటుతో 150 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఐదు ఫైవ్ వికెట్ల హాల్స్, ఎనిమిది ఫోర్ వికెట్ల హాల్స్ను షమీ నమోదు చేశాడు.అదే భారత్ ఓడిపోయిన 33 మ్యాచ్లలో షమీ 6.12 ఎకానమీ రేటుతో 47 మాత్రమే వికెట్లు పడగొట్టాడు. అంటే షమీ మెరుగైన ప్రదర్శన కనబరిచిన ప్రతీసారి భారత్ దాదాపుగా విజయం సాధించింది. అతడు విఫలమైన చోట టీమిండియా ఓటమి పాలైంది. వన్డే వరల్డ్కప్-2023లోనూ షమీ సంచలన ప్రదర్శన కనబరిచాడు. షమీ పేరిట టెస్టుల్లో కూడా 229 వికెట్లు ఉన్నాయి. అదే అగర్కార్ టెస్టుల్లో కేవలం 58 వికెట్లు మాత్రమే సాధించాడు.చదవండి: అతడి రీ ఎంట్రీ తప్పనిసరి.. మూడు ఫార్మాట్లలోనూ ఆడించాలి: గంగూలీ
బిజినెస్
వామ్మో.. బంగారం ఊసు ఎత్తకపోవడమే బెటర్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
విద్య అంటే కేవలం చదువేనా?
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఏటా నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవం(National Education Day)గా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి మౌలానా ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా అనేక దార్శనిక నిర్ణయాలు తీసుకున్నారు.దేశంలోని ప్రతి పౌరుడికి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రాథమిక విద్య కోసం కృషి చేశారు.దేశంలో పరిశోధనలు, సాంకేతిక విద్యను ప్రోత్సహించడానికి ఆయన అనేక ఉన్నత విద్యా సంస్థలను స్థాపించడంలో కీలక పాత్ర వహించారు.యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs) వంటి సాంకేతిక విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు.విద్య అంటే కేవలం చదువు మాత్రమే కాదనే ఉద్దేశంతో భారతీయ కళలు, సంస్కృతిని ప్రోత్సహించడానికి సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీ, సంగీత నాటక అకాడమీ వంటి సంస్థలను స్థాపించారు.సెకండరీ విద్యలో మార్పులు తీసుకురావడానికి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ (ముదలియార్ కమిషన్) ఏర్పాటుకు సహకరించారు.అసలు విద్య అంటే..మౌలానా ఆజాద్ ఆశయాలను నెరవేర్చేందుకు శ్రమిస్తూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త విద్యా విధానాన్ని అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తరుణంలో నేటి భారతీయ విద్యావ్యవస్థలో ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. విద్య అంటే కేవలం పుస్తకాల్లోని చదువు మాత్రమేనా? నిజానికి విద్య అనేది విద్యార్థిని విమర్శనాత్మక ఆలోచనాపరుడిగా, సమస్య పరిష్కరించే వ్యక్తిగా, సృజనాత్మక పౌరుడిగా తీర్చిదిద్దాలి. కానీ ప్రస్తుతం ఉన్న పాఠ్యాంశాల ధోరణి ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతోంది.పాత సిలబస్ - పరిశోధనలకు అవరోధంభారత్లో ఏళ్లుగా వస్తున్న సిలబస్నే ఇప్పటికీ చాలా ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధిస్తున్నారు. సిద్ధాంతాలకే(Theory) ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విద్యార్థులకు పరిశ్రమకు అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలు లోపిస్తున్నాయి. గుడ్డిగా బట్టీ పట్టే విధానం వల్ల పిల్లల్లో పరిశోధన, ఆవిష్కరణ, కొత్త ఆలోచనలు చేసే సామర్థ్యం దెబ్బతింటోంది.కొన్ని ప్రైవేట్ సంస్థలు ట్రెండ్కు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ సంస్థల్లో ఆ మేరకు చర్యలు లేకపోవడంతో మెజారిటీ విద్యార్థులు పాత పద్ధతుల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పరిశోధనలు, ఆవిష్కరణల పరంగా భారత్ భవిష్యత్తులో ప్రపంచ దేశాల కంటే వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.భవిష్యత్తు కోసం విద్యా విధానం ఎలా ఉండాలి?భారతదేశం విద్యారంగంలో ప్రపంచంలోనే మెరుగైన స్థాయికి ఎదగాలంటే మన విద్యా విధానాన్ని పూర్తిగా పునర్నిర్మించాలి. జాతీయ విద్యా విధానం (NEP) 2020 లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలి. కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా ప్రయోగశాలలు, ప్రాజెక్టులు, ఫీల్డ్ ట్రిప్ల ద్వారా విద్యను బోధించాలి. విభిన్న సబ్జెక్టులను (ఉదా: సైన్స్, ఆర్ట్స్, టెక్నాలజీ) కలిపి బోధించాలి. తద్వారా విద్యార్థికి సమగ్ర దృక్పథం ఏర్పడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా సైన్స్, డిజిటల్ అక్షరాస్యత వంటి ఫ్యూచర్ స్కిల్స్ను పాఠ్యాంశాల్లో చేర్చాలి. ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ, ఆధునిక బోధనా పద్ధతులను నేర్పించాలి. బట్టీ పట్టడాన్ని ప్రోత్సహించే పరీక్షలకు బదులుగా విద్యార్థుల సమస్య పరిష్కార సామర్థ్యాన్ని అంచనా వేసే పద్ధతులు ప్రవేశపెట్టాలి.విద్యా సంస్థల యాజమాన్యాలు చేయాల్సిన తక్షణ చర్యలుచాలా విద్యా సంస్థలు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఫీజుల వసూళ్లపై (Focus on Fees) అధికంగా దృష్టి సారిస్తున్నాయి. లాభాపేక్ష కంటే విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. ప్రతి పైసా విద్యార్థి అభ్యసన వనరుల కోసం ఖర్చు పెట్టాలి. పాతబడిన తరగతి గదులకు బదులుగా డిజిటల్ లైబ్రరీలు, అత్యాధునిక ప్రయోగశాలలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధనా పరికరాలను అందించాలి. అత్యంత ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను నియమించుకోవాలి. వారికి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి. మంచి జీతాలు ఇవ్వడం ద్వారా బోధనను గౌరవప్రదమైన వృత్తిగా మార్చాలి.ఫీజుల విషయంలో పారదర్శకత పాటించాలి. పేద విద్యార్థులకు, ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు, ఆర్థిక సహాయాన్ని అందించాలి. విద్యను వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా చూడాలి. విద్యార్థులు సైద్ధాంతిక పరిజ్ఞానంతో(Theoritical Knowledge)పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందడానికి పరిశ్రమ నిపుణులతో శిక్షణ తరగతులు, ఇంటర్న్షిప్లను తప్పనిసరి చేయాలి.ఇదీ చదవండి: మాజీ ఉద్యోగిపై రూ.2 కోట్లు దావా వేసిన ఇంటెల్
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:25 సమయానికి నిఫ్టీ(Nifty) 36 పాయింట్లు తగ్గి 25,539కు చేరింది. సెన్సెక్స్(Sensex) 134 పాయింట్లు దిగజారి 83,389 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
మాజీ ఉద్యోగిపై రూ.2 కోట్లు దావా వేసిన ఇంటెల్
ఇంటెల్ కంపెనీలో పని చేసిన మాజీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ జిన్ఫెంగ్ లువోపై కంపెనీ 2,50,000 డాలర్లు (దాదాపు రూ.2 కోట్లు) దావా వేసింది. కంపెనీ నుంచి 18,000 రహస్య ఫైళ్లతోపాటు ‘ఇంటెల్ టాప్ సీక్రెట్’అని లేబుల్ చేసిన డేటాను దొంగిలించినట్లు లువోపై ఆరోపణలు ఉన్నాయి.ది మెర్క్యురీ న్యూస్ నివేదిక ప్రకారం, లువో 2014లో ఇంటెల్లో చేరాడు. కంపెనీ ఆర్థిక సంక్షోభాన్ని నిర్వహించడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి ఇటీవల చాలా మందిని తొలగించింది. అందులో భాగంగా జులై 7, 2024న లువోకు లేఆఫ్ ఇచ్చింది. గత రెండేళ్లలో ఇంటెల్ సుమారు 35,000 ఉద్యోగాలను తొలగించింది.డేటా దొంగతనంకంపెనీ దావా పత్రాల్లోని వివరాల ప్రకారం, లువోకు లేఆఫ్ ప్రకటించిన తర్వాత మొదట తన ఇంటెల్ ల్యాప్టాప్ నుంచి ఫైళ్లను ఎక్స్టర్నల్ డ్రైవ్లో కాపీ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఇంటెల్ భద్రతా వ్యవస్థలు ఈ మొదటి ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి. టామ్స్ హార్డ్వేర్ నివేదిక ప్రకారం, లువో తన చివరి పని దినానికి మూడు రోజుల ముందు మరోసారి ఫైళ్లను దొంగలించేందుకు ప్రయత్నించాడు. ఈసారి అతను ఫైళ్లను నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ (NAS) పరికరానికి విజయవంతంగా బదిలీ చేశాడు. తర్వాత లువో సంస్థను విడిచిపెట్టే వరకు మరిన్ని అత్యంత గోప్యమైన, కంపెనీ అంతర్గత వివరాలతో కూడిన డేటాను డౌన్లోడ్ చేస్తూనే ఉన్నాడు.ఇంటెల్ భద్రతా వ్యవస్థలు డేటా బదిలీలు పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించాయి. దాంతో కంపెనీ అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది. ఇంటెల్ చెప్పినదాని ప్రకారం, ఉద్యోగం తొలగించిన తర్వాత మూడు నెలలకు పైగా కాల్స్, ఈమెయిల్లు, పోస్టల్ లెటర్ల ద్వారా లువోను అనేకసార్లు సంప్రదించడానికి ప్రయత్నించారు. కాని అతను స్పందించలేదు. లువో ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో ఇంటెల్ దొంగిలించిన సమాచారాన్ని తిరిగి పొందటానికి 2,50,000 డాలర్ల నష్టపరిహారం కోరడానికి కోర్టులో దావా వేసింది.గతంలోనూ ఇన్సైడర్ డేటా దొంగతనం కేసులులువో ఇంతవరకు ఏ ఆరోపణలకూ సమాధానం ఇవ్వలేదు. ఇంటెల్ అంతర్గత డేటా దొంగతనం కేసును ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల మైక్రోసాఫ్ట్లో చేరడానికి ముందు కంపెనీ డేటాను కాపీ చేసినందుకు ఓ మాజీ ఇంటెల్ ఇంజినీర్కు 34,000 డాలర్ల జరిమానా విధించారు. ఆ కేసులో తాను దొంగిలించిన సమాచారాన్ని మైక్రోసాఫ్ట్ ప్రయోజనం పొందడానికి ఉపయోగించిందనే ఆరోపణలున్నాయి.ఇదీ చదవండి: డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా..
ఫ్యామిలీ
డెసర్ట్ టూర్: పర్యాటక మెరుపు వీచిక..!
నగరాలలో చారిత్రక సౌందర్యం. కోటలలో నిర్మాణ నైపుణ్యం. రాజమందిరాల్లో శిల్పచాతుర్యం. థార్ ఎడారిలో రాజస లాంఛనం. రాజస్థాన్కు మణిమకుటాలు. చిత్రమైన పిచ్వాయ్ కృష్ణుడు. నాథ్ద్వారా స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్. గోల్డెన్ సాండ్స్ టూర్ ఆకర్షణలు. పర్యటనలో మెరుపు వీచికలు.హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయ్పూర్ చేరడం. ఉదయ్పూర్లో హోటల్ గదిలో చెక్ ఇన్ కావడం. లంచ్ తర్వాత సిటీప్యాలెస్, లేక్ పిచోలా సందర్శనం. బస ఉదయ్పూర్లో. లేక్ సిటీ విహారం ఉదయ్పూర్లో అడుగుపెట్టినప్పటి నుంచి నగర చారిత్రక సౌందర్యం మెరుపు వీచికలుగా కనువిందు చేస్తుంటుంది. సిటీ ఆఫ్ లేక్స్ అని ఎందుకంటారో నగరంలో ఓ అరగంట ప్రయాణంలోనే తెలుస్తుంది. ఫతే సాగర్, పిచోలా, స్వరూప్ సాగర్, రంగ్ సాగర్, దూద్ తలాయ్ సరస్సులు ప్రధానమైనవి. ఈ సరస్సుల్లో కనీసం రెండయినా అరగంట ప్రయాణంలో కనిపిస్తాయి. వాటి మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. ఇక చారిత్రక కట్టడాల్లో ఆరు కిలోమీటర్ల సిటీ వాల్, నగరంలో ప్రవేశించడానికి సూర్జా΄ోల్, చాంద్΄ోల్, ఉదయ్΄ోల్, హాథీ΄ోల్, అంబా΄ోల్, బ్రహ్మపోల్, దిల్లీ గేట్, కిషన్పోల్ పేర్లతో ద్వారాలున్నాయి. ఇవి కూడా తారసపడతాయి. ఎయిర్పోర్ట్ నుంచి నగరంలో హోటల్ గదికి చేరే లోపే రెండు లేక్లు, రెండు ద్వారాలు, చేతక్ సర్కిల్ పర్యాటకులను చరిత్రయుగంలోకి తీసుకెళ్తాయి. పిచోలా సరస్సు ఒడ్డున సిటీ ప్యాలెస్. సరస్సు మధ్యలో లేక్ ప్యాలెస్, ఒక వైపుగా జగ్మందిర్, జగ్మోహన్ ప్యాలెస్లను పడవలో విహరిస్తూ చుట్టిరావచ్చు. కొంతకాలంగా ట్రెండింగ్లో ఉన్న ఫ్యాషన్ ఐకాన్ గోమాత ప్రింట్. ఫ్యాషన్ డిజైనర్లు చీరలు, చుడీదార్ల మీద గోమాత బొమ్మను డిజిటల్ ప్రింట్ చేస్తున్నారు. ఈ గోమాత చిత్రలేఖనం జగ్మందిర్ గోడల మీద కనిపిస్తుంది. లేక్కు మరొక ఒడ్డున దర్బార్హాల్ ఉంది. బొమ్మలతో కొలువు దీరిన దర్బార్హాల్ నాటి రాజకొలువును తలపిస్తుంది.2వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత సజ్జన్గఢ్ ఫోర్ట్ విజిట్. ఆ తర్వాత హల్దీఘాటీకి ప్రయాణం. మహారాణా ప్రతాప్ మ్యూజియం సందర్శనం తర్వాత నాథ్ద్వారాకు ప్రయాణం. స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ విజిట్ తర్వాత హోటల్ గదికి చేరడం. బస ఉదయ్పూర్లోనే.సినీ ప్యాలెస్సజ్జన్గఢ్ ప్యాలెస్కు ప్రయాణం మొదలైన తరవాత ఉదయ్పూర్ నగర శివారు నుంచి మలుపు తిరగ్గానే జనసమ్మర్దం కొరవడుతుంది. దూరంగా కొండ మీద మూడు వేల అడుగుల ఎత్తులో చిన్న నిర్మాణం కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే అక్కడ ఒక సామ్రాజ్యాన్ని విస్తరించడానికి జరిగిన ఏర్పాట్లు అర్థమవుతాయి. అటవీ ప్రదేశం మధ్యలో వాహనం వెళ్లడానికి మార్గం ఉంది. వెకేషన్కి వచ్చిన వాళ్లు ఒకరోజు ఈ ట్రెకింగ్కు కేటాయించవచ్చు. మేవార్ రాజు సజ్జన్సింగ్ ఖగోళ పరిశోధన, అధ్యయన కేంద్రం ఏర్పాటు కోసం నిర్మించిన ప్యాలెస్ ఇది. సజ్జన్సింగ్ మరణం తర్వాత ఆ ఉద్దేశం నెరవేరలేదు. అటవీ ప్రదేశం నేపథ్యంలో ఒక కోట కేంద్రంగా కథ నడిచే సినిమాల్లో ఈ ప్యాలెస్ కనిపిస్తుంది. జేమ్స్ బాండ్ సినిమా అక్టోపసీ సినిమాలో రోజర్మూర్ ఈ కోట నుంచి పారిపోయే సన్నివేశం చిత్రీకరణ ఇక్కడే జరిగింది. ద చీటా గర్ల్స్ వంటి మరికొన్ని సినిమాలకు కూడా ఈ ప్యాలెస్... విజువల్ రిచ్నెస్నిచ్చింది. రాణాప్రతాప్ పోరుగడ్డమేవార్ రాజ్యానికి మొఘల్ పాలకులకు మధ్య యుద్ధం జరిగిన పోరుగడ్డ హల్దీఘాటీ. మేవార్ రాజ్యం తరఫున రాణా ప్రతాప్, మొఘల్ సామ్రాజ్యం తరఫున మాన్సింగ్ యుద్ధంలో పాల్గొన్నారు. ఉదయ్పూర్ నుంచి ఈ ప్రదేశానికి వెళ్లే మార్గం ఒక అడ్వెంచరస్ టూర్ని తలపిస్తుంది. కొండల నడుమ కనుమ గుండా దట్టమైన అడవి మధ్యలో సాగుతుంది ప్రయాణం. దాదాపుగా 30 కిలోమీటర్ల ప్రయాణంలో మట్టిలో ఎర్రదనం తగ్గుతూ పసుపు చారలు మొదలవుతాయి. కొంతదూరం వెళ్లేసరికి నేల గోరంత పసుపురాసుకున్నట్లు ఉంటుంది. యుద్ధభూమికి చేరే లోపు చేతక్ స్మారకం పాలరాతి నిర్మాణం కనిపిస్తుంది. రాణాప్రతాప్కు ఇష్టమైన గుర్రం, ఎన్నో విజయాలను సాధించి పెట్టిన గుర్రం ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది. అక్కడి నుంచి బరువెక్కిన గుండెతో హల్దీఘాటీకి చేరతాం. యుద్ధక్షేత్రానికి చేరే లోపే ఆకాశమంత ఎత్తులో ఠీవిగా సింహాసనం మీద ఆసీనుడైన రాణాప్రతాప్ కంచు విగ్రహం కనిపిస్తుంది. అక్కడ నిర్మించిన భారీ మ్యూజియాన్ని చూస్తే రాణాప్రతాప్ జీవితం మొత్తం కళ్లకు కడుతుంది. హల్దీఘాటీలో జరిగిన యుద్ధంలో రాణాప్రతాప్ తన రాజ్యాన్ని మొఘలుల ఆధీనంలోకి వెళ్లకుండా కాపాడుకోగలిగాడు. రాజస్థాన్ కృష్ణుడుఇక్కడ శ్రీకృష్ణుడిని శ్రీనాథ్గా పిలుచుకుంటారు. వల్లభాచార్యుడి సంప్రదాయం శుద్ధ అద్వైతాన్ని ఆచరిస్తారు. స్థానికులు గోవర్ధన గిరిధారి రూపంలో ఉన్న కృష్ణుడిని కొలవడమే కాదు, ఇక్కడ చిత్రకారులు కూడా ఈ రూపంలో కృష్ణుడి బొమ్మలో వేయడంలో నిష్ణాతులు. వీరిది ప్రత్యేకమైన శైలి. ఈ చిత్రాలను పిచ్వాయ్ పెయింటింగ్స్ అంటారు. మేవార్లో విస్తరించిన చిత్రలేఖనాల శైలి ఇది. ఈ టూర్ గుర్తుగా ఒక పెయింటింగ్ కొనుక్కోవడం మరువద్దు. నాథ్ద్వారాకు మరొక టూరిస్ట్ అట్రాక్షన్ స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ శివుడి విగ్రహం. విశ్వాస స్వరూపం పేరుతో 369 అడుగుల శివుడి విగ్రహాన్ని 2022లో ప్రతిష్ఠించారు. ప్రపంచంలోని శివుడి విగ్రహాలన్నింటిలోకి ఎత్తైన రూపం ఇదే.3వ రోజుబ్రేక్ఫాస్ట్ త్వరగా ముగించుకుని గది చెక్ అవుట్ చేసి జయ్ సల్మేర్కు బయలుదేరాలి. జయ్సల్మేర్లో డెసర్ట్ క్యాంప్లో చెక్ ఇన్. రాత్రి భోజనం, బస అక్కడే.జీవిస్తున్న కోటజయ్సల్మేర్ కోట ఒక ఊరంత... కాదు, పట్టణమూ కాదు, ఓ మోస్తరు నగరమంత ఉంటుంది. ఈ కోటను క్రీ.శ 12వ శతాబ్దంలో రాజపుత్ర పాలకుడు రావల్ జయ్సల్ నిర్మించాడు. అందుకే ఈ కోటకు జయ్సల్మేర్ అని పేరు. ఇది మన వరంగల్లోని వేయి స్తంభాల గుడి కాలానిది. యునెస్కో ఈ రెండింటినీ వరల్డ్ హెరిటేజ్ సైట్లుగా గుర్తించింది. జయ్సల్మేర్ కోట లివింగ్ ఫోర్ట్. అంటే ఈ కోటలో జనజీవనం కొనసాగుతోంది. జనజీవితం కొనసాగుతున్న ప్రాచీన కోటలు అరుదుగా ఉంటాయి. జయ్ సల్మేర్ కోట గోడలు పసుపురంగు రాతితో నిర్మించడంతో దీనిని గోల్డెన్ ఫోర్ట్రెస్ అంటారు. ఈ కోటలోని పాలరాతి ఆలయాలు, రాజమందిరాల గోడలకు చెక్కిన గవాక్షాల డిజైన్లను ఎంత సేపు చూసినా ఇంక చాలు అనే సంతృప్తి కలగదు. ఇంకా ఇంకా చూడాలనే ఉంటుంది. కలంకారీ అద్దకాలు, స్క్రీన్ ప్రింటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్లో కనిపించే ట్రెండింగ్ డిజైన్లు ఈ గోడల మీదవే. బాలీవుడ్ ఇండస్ట్రీకి గొప్ప లొకేషన్ ఇది. హమ్ దిల్ దే చుకే సనమ్, షోలే, ద ఫాల్, భజరంగ్ భాయీ జాన్తోపాటు తెలుగు సినిమా కొండపల్లి రాజాలో ఒక పాట చిత్రీకరణ జయ్సల్మేర్ కోటలో జరిగింది.ఎడారిలో ఓ రాత్రిరాజపుత్రుల రిచ్ లైఫ్స్టైల్ని ఎక్స్పీరియెన్స్ చేయాలంటే థార్ ఎడారి డెసర్జ్ క్యాంప్లో గడపాలి. సాయంత్రం నీరెండలో బంగారు రజను రాశిపోసినట్లున్న ఎడారి ఇసుకలో జీప్ సఫారీ ఒక రకమైన సంతోషం. ఒంటె మీద విహారం లయబద్ధంగా కదులుతూ ముందుకు సాగుతుంటే మరో లెవెల్ ఎంజాయ్మెంట్. ఇక ఎడారిలో ఆధునిక సౌకర్యాలతో గుడారాలు, చలిమంట, నాటలు, డాన్సులు, రాజస్థానీ రుచులతో చక్కటి భోజనాలు పూర్తయిన తర్వాత గుడారంలో నిద్ర. తెల్లవారే సరికి అంతా కలలోలాగ గడిచిపోతుంది.4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత డెసర్ట్ క్యాంప్ బస నుంచి చెక్ అవుట్ అయి జయ్ సల్మేర్ కోటకు ప్రయాణమవ్వాలి. కోట తర్వాత పట్వోన్ కీ హవేలీ, గాడిసర్ లేక్ విహారం తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్, డిన్నర్, బస జయ్సల్మేర్ సిటీలో.శిలకు పూచిన పూలుజయ్ సల్మేర్ కోటలో ఒక ఆర్కిటెక్చురల్ అద్భుతం ఈ హవేలీ. దూరం నుంచి చూస్తే గోడల నిండుగా పెయింటింగ్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. దగ్గరకు వెళ్లి చూస్తే అవన్నీ గోడకు పూసిన పూలే. కొన్ని శిలకు చెక్కిన విరిశిల్పాలు, మరికొన్ని కట్టడంలో గోడకు పూలతీగలు, విరిసిన పూలను నిర్మించారు. వాటికి రంగులద్దారు. భవనంలో విరిసిన ఉద్యానవనం విరిసినట్లుంది. ఈ హవేలీ క్రీ.శ 18వ శతాబ్దం నాటి నిర్మాణకౌశలానికి నిలువెత్తు నిదర్శనం. 5వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత జో«ద్పూర్కు ప్రయాణం. మెహరాన్గఢ్ కోట వీక్షణం తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్, డిన్నర్, రాత్రి బస జోద్పూర్లో.విజయద్వారాల కోటఉదయ్పూర్ నగరంలో ద్వారాలున్నట్లే ఇక్కడ కూడా ద్వారాలున్నాయి. అయితే ఇవి కోట నిర్మాణ సమయంలో కట్టినవి కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో నిర్మించినవి. జయ్΄ోల్ను జయ్పూర్, బికనీర్ రాజ్యాలతో యుద్ధం చేసి గెలిచిన సందర్భంలో మహారాజా మాన్సింగ్ కట్టాడు. మొఘలుల మీద గెలిచినప్పుడు ఫతేపోల్ నిర్మాణం జరిగింది. లోహ΄ోల్ దగ్గర గోడ మీద మహిళల చేతి ముద్రలను చూడగానే మనసు బరువెక్కుతుంది, స్త్రీలకు జరిగిన అన్యాయానికి సమాజం మొత్తం సిగ్గుతో తలవంచుకోవాల్సిన నేపథ్యం అది. భర్తను కోల్పోయిన రాణులు, యువరాణులు సతిలో పాల్గొనే ముందు తమ చేతిముద్రలను గోడకు అద్దేవారు. నాటి దురాచానికి నిదర్శనంగా ఆ ఆనవాళ్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. మెహరాన్గఢ్ కోటలోపల మోతీమహల్, ఫూల్ మహల్, శీష్ మహల్లు అందమైన నిర్మాణాలు. ఇక్కడ మ్యూజయంలో బంగారు పల్లకి ఉంది. కోట పై భాగంలో పెద్ద ఫిరంగిని చూడగానే కొద్దిగా భయం వేస్తుంది. మనసు కుదుటపరుచుకున్న తర్వాత అక్కడి నుంచి చూస్తే నగరం వ్యూ అందంగా ఉంటుంది.6వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. ఉమైద్ భవన్ ΄్యాలెస్ మ్యూజయం వీక్షణం తర్వాత మధ్యాహ్నం జో«ద్పూర్ ఎయిర్΄ోర్టులో డ్రాప్ చేస్తారు. విమానం సాయంత్రం ఐదున్నరకు బయలుదేరి ఏడున్నరకు హైదరబాద్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.ఉపాధి హామీ భవనంరాజపుత్రుల కోటలు, ప్యాలెస్లలో ఉమైద్ భవన్ ప్యాలెస్ కొత్తదనే చెప్పాలి. ఇది 20వ శతాబ్దపు నిర్మాణం. ఇది అత్యంత ఆధునికమైన నిర్మాణం. క్రీ.శ 1929లో మొదలై, 1943లో పూర్తయింది. అప్పటికే దేశంలో బ్రిటిష్ వలస పాలన వేళ్లూనుకుని ఉంది. వలస పాలకులు వద్దంటూ స్వాతంత్య్రం కోసం పోరాటం కూడా ఊపందుకుని ఉంది. అలాంటి సమయంలో ఇంత పెద్ద నిర్మాణం చేపట్టడానికి కారణం అనావృష్టి. అవును వరుసగా మూడేళ్లుగా వర్షాలు లేక పంటలు వేసే అవకాశం లేక పొలాలు బీళ్లుగా మారాయి. రైతులకు పని లేదు. అలాంటి సమయంలో ఉపాధి కల్పన కోసం మహారాజా ఉమైద్ సింగ్ ఈ నిర్మాణాన్ని తలపెట్టాడు. రోజూ రెండు నుంచి మూడు వేల మంది పని చేసేవారు. మఖరానా మార్బుల్, బర్మా టేకుతో నిర్మాణపరంగా ప్రత్యేకమైనదే. ప్రస్తుతం ఇది తాజ్ హోటల్స్ నిర్వహణలో ఉంది. కోటలో కొంత భాగం, మ్యూజియంలోకి పర్యాటకులను అనుమతిస్తారు.ప్యాకేజ్ పేరు: గోల్డెన్ సాండ్స్ ఆఫ్ రాజస్థాన్.ప్యాకేజ్ కోడ్: ఎస్హెచ్ఏ 20. ఇందులో ప్రధానంగా ఉదయ్పూర్, జై సల్మీర్, జోద్పూర్ కవర్ అవుతాయి.టారిఫ్ ఇలా: సింగిల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 49,650 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 38 వేలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 36,550 రూపాయలు. ప్రయాణం ఎప్పుడు? ఆరు రోజుల ఈ పర్యటన నవంబర్ 22వ తేదీన మొదలయ్యి 27వ తేదీతో ముగుస్తుంది. ఇదే టూర్ 23 నుంచి మరొక ట్రిప్ మొదలవుతుంది. అది 28వ తేదీ పూర్తవుతుంది. 22వ తేదీ ఉదయం 8.45 గంటలకు 6ఈ 846 విమానం హైదరాబాద్లో మొదలవుతుంది. 10. 25 గంటలకు ఉదయ్పూర్కి చేరుతుంది (23వ తేదీ ట్రిప్కి కూడా ఇదే నంబరు విమానం, ఇదే టైమ్)తిరుగుప్రయాణం 27వ తేదీన జో«ద్పూర్ నుంచి 6ఈ 6816 విమానం సాయంత్రం 17. 30 గంటలకు బయలుదేరి, 19.25 గంటలకు హైదరాబాద్కు చేరుతుంది.ప్యాకేజ్లో ఏమేమి వర్తిస్తాయి?విమానం టికెట్లు (హైదరాబాద్ నుంచి ఉదయ్పూర్, జోద్పూర్ నుంచి హైదరాబాద్) హోటల్ బస(4 రోజులు), డెసర్ట్ క్యాంప్ బస (ఒకరోజు) బ్రేక్ఫాస్ట్లు 5, లంచ్ 1, డిన్నర్లు 5 n సైట్ సీయింగ్కి (ఐటెనరీలో ప్రకటించిన ప్రదేశాలకు మాత్రమే) ఏసీ బస్సు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఐఆర్సీటీసీ టూర్ ఎస్కార్ట్ప్యాకేజ్లో ఇవి వర్తించవు!భోజనంలో మెనూలో లేకుండా అదనంగా ఆర్డర్ చేసుకున్న పదార్థాలు, పానీయాలు ఫ్లయిట్లో ఆర్డర్ చేసుకున్న ఆహారం సైట్ సీయింగ్లో ఇతర ప్రదేశాల వీక్షణం వంటివి (ఆయా ప్రదేశాల్లో ఉన్న ఆలయాలు, ప్రార్థనమందిరాలు, ఆసక్తి కలిగించే ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి రవాణా, ఎంట్రీ టికెట్లు, దర్శనం టికెట్ల వంటివి ప్యాకేజ్లో వర్తించవు) టిప్లు, గైడ్, లాండ్రీ ఖర్చులు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలై హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో ముగుస్తుంది. కాబట్టి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి చేరడానికి, ఎయిర్పోర్ట్ నుంచి రవాణా ఇందులో వర్తించవు. – వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఈ కార్తీకంలో ఉసిరితో పసందైన వంటకాలు చేసేద్దాం ఇలా..!)
ఖండాంతరాలకు.. కడలుంగీలు
ప్రాంతానికో ప్రత్యేకత, ఊరికో వైవిధ్యం, ప్రతి దాని వెనకా ఓచరిత్ర.. అలాంటివెన్నో రఘునాథపురం, పుట్టపాక ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చాయి. ఇక్కడి చేనేత, పవర్లూమ్ కార్మికుల చేతిలో రూపుదిద్దుకున్న వస్త్రాలు ఎంతోమంది ప్రముఖులను ఆ‘కట్టు’కున్నాయి. జిల్లా కీర్తిని నలుదిశలా ఇనుమడింపజేస్తున్నాయి. రఘునాథపురం కడలుంగీలు, పుట్టపాక తేలియా రూమాల్, దుబీయన్ వస్త్రాలు నేతన్నల కళాప్రతిభకు నిదర్శనాలుయాదాద్రి భువనగిరి జిల్లా : రాజాపేట మండలంలోని రఘునాథపురం అనగానే మదిలో మెదిలేది పవర్లూమ్(మరమగ్గం) పరిశ్రమ. వీటిపై తయారైన కడలుంగీలు జిల్లా పేరును దేశ, విదేశాలకు తీసుకెళ్లాయి. ఇంత ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత ఇక్కడి కార్మికులకే దక్కుతుంది. అర్ధ శతాబ్దానికి పైగా కడలుంగీలు ఇక్కడ రూపుదిద్దుకుంటున్నాయి. గ్రామంలో 800 వరకు పవర్లూమ్స్ ఉండగా అందులో 400 మరమగ్గాలపై కడలుంగీలు తయారు చేస్తున్నారు. ఒక మరమగ్గంపై పది చొప్పున రోజుకు 3వేల వరకు కడలుంగీలు ఉత్పత్తి అవుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి పైగా జీవనోపాధి పొందుతున్నారు. పుట్టపాక ప్రత్యేకత.. దుబీయన్ వస్త్రం సంస్థాన్నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ చేనేత కళాకారులు రూపొందించిన వస్త్రాలను ఫ్రాన్స్, సింగపూర్, అమెరికా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ ప్రథమ పౌరురాలు బ్రిగిట్టే మెక్రాన్కు పుట్టపాక చేనేత కళాకారులు నేసిన దుబీయన్ సిల్క్ చీరను చందనం పెట్టెలో పెట్టి బహూకరించారు. చీరను చూసిన బ్రిగిట్టే మెక్రాన్ పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యంపై అప్పట్లో ప్రశంసలు కురిపించారు. లండన్ మ్యూజియం, అమెరికా అధ్యక్షుని భవనంతో పాటు ముఖ్య కార్యక్రమాల్లో, విదేశాల్లోని ప్రముఖ మహిళలు పుట్టపాకలో తయారైన వస్త్రాలను ధరిస్తుంటారు.తొలినాళ్లలో షేర్గోలా వస్త్రాల తయారీకి ప్రసిద్ధి రఘునాథపురంలో పవర్లూమ్ పరిశ్రమ స్థాపించిన తొలినాళ్లలో షేర్గోలా వస్త్రాలను ప్రసిద్ధి. ఈ వస్త్రాలను హైదరాబాద్లోని రిక్షా కార్మికులు ఎక్కువగా ఉపయోగించేవారు. క్రమేణా హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబయికి షేర్గోల వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. కాలానుగుణంగా నక్కీ, జననీలు, అక్రాలిక్, ఎల్లో ట్రైప్, రీడ్ బైపిక్ వంటి రకరకాల కడలుంగీలను తయారు చేస్తున్నారు. రఘునాథపురానికి చెందిన కొందరు మాస్టర్ వీవర్స్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి కేంద్రాలుగా దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్ తదితర అరబ్ దేశాలతో పాటు ఆఫ్రికాలోని ఉగాండాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ దేశాల్లో కడలుంగీలను పురుషులు లుంగీలుగా ఉపయోగిస్తే, మహిళలు డ్రెస్ మెటీరియల్గా వినియోగిస్తుంటారు.
మూత్రం ఆపుకొంటే ముప్పే !
లబ్బీపేట(విజయవాడతూర్పు): వాష్రూమ్స్ కంపు కొడుతున్నాయని కొందరు, అందుబాటులో లేక ఇంకొందరూ, సమయం లేని మరికొందరూ యూరిన్ వస్తున్నా.. గంటల కొద్ది ఆపుకొంటున్న వారు అనేక మంది ఉంటున్నారు. అంతేకాదు ఇంటి నుంచి విధులకు, కళాశాలలకు వెళ్లే వారు తిరిగి ఇంటికి వచ్చే వరకూ మూత్ర విసర్జన చేయని వారు కూడా ఉంటున్నారు. నీళ్లు తాగితే వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తుందని తక్కువగా తాగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో మూత్రాశయ, కిడ్నీ సమస్యలు తలెత్తుతుండటంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. నగరంలోని యూరాలజిస్టుల వద్దకు వస్తున్న వారిలో ఇలాంటి వారు అధికంగా ఉంటున్నారు. మూత్రం వస్తున్నట్లు సిగ్నల్ వచ్చిన తర్వాత ఆపుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. అలా చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇవే నిదర్శనం.. గవర్నర్పేటకు చెందిన డిగ్రీ విద్యార్థిని మూత్రం వస్తే ఆపుకోలేక అర్జెంట్గా వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. తరగతి గదిలో ఉన్నప్పుడు కూడా తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో యూరాలజిస్టును సంప్రదించారు. ఎక్కువ సేపు మూత్రానికి వెళ్లకుండా ఆపుకోవడం వలన ఇలాంటి సమస్య తలెత్తినట్లు వైద్యులు తెలిపారు. పటమటకు చెందిన ఓ ఉద్యోగిని 36 గంటల వరకూ యూరిన్ రాకపోవడంతో యూరాలజిస్టు వద్దకు వెళ్లారు. అక్కడ పరీక్ష చేస్తే యూరినరీ బ్లాడర్ పెరిగినట్లు ఉంది. అంటే ఎక్కువ సేపు మూత్రం ఆపుకోవడం వలన ఇలాంటి సమస్య తలెత్తినట్లు నిర్ధారించారు. ఇలా అనేక మంది మూత్ర సమస్యలు, కిడ్నీలో రాళ్లతో వైద్యులను సంప్రదిస్తున్నారు. సమస్యలివే.. యూరిన్ బ్లాడర్లో రెండు లీటర్ల వరకూ యూరిన్ నిల్వ ఉంటుందని, పెరిగితే యూరిన్కు వెళ్లాలనే సిగ్నల్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మూత్ర విసర్జన చేయకుండా, బ్లాడర్లో యూరిన్ మూడు, నాలుగు లీటర్లకు చేరుతుంది. అలా యూరిన్ పెరగడం వలన యూరిన్ బ్లాడర్ ఎన్లార్జ్ అవుతుంది. కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, వాటి పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి వారిలో యూరినరీ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. యూరిన్కు సిగ్నల్ వచ్చిన వెంటనే అర్జంట్గా వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి వాష్రూమ్కు వెళ్తుండగానే యూరిన్ పడిపోతుంది. కొందరిలో అసలు యూరిన్ రాకుండా ఆగిపోతుంది. ఇలాంటి సమస్యలతో టీనేజ్ పిల్లలతో పాటు పెద్ద వారు ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నీళ్లు తాగడం లేదు.. నీళ్లు తాగితే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందని, విద్యార్థులే కాదు, ఉద్యోగుల్లో కూడా చాలా మంది తక్కువగా నీరు తాగుతున్నారు.ఇలాంటి వారిలో మూత్ర కోశ సమస్యలతో పాటు, కిడ్నీలో రాళ్లు కూడా వస్తున్నాయి. కిడ్నీలో రాళ్లు రావడానికి ఆహార అలవాట్లతో పాటు తక్కువగా నీళ్లు తాగడమే ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో యూరినరీ ట్యూబ్ సన్నబడటం కూడా జరగవచ్చు. కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఉండేందుకు రోజుకు 3 నుంచి 4 లీటర్లు నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ్రప్రొస్టేట్ సమస్యలతో... ప్రస్తుతం 50 ఏళ్లు దాటిన వారిలో ప్రొస్టేట్ సమస్య కామన్గా మారినట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రొస్టేట్ సమస్య కారణంగా అతిగా మూత్రం రావడం, అసలు రాకపోవడం, తక్కువగా రావడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 50 ఏళ్లు దాటిన వారు ప్రొస్టేట్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రొస్టేట్ సమస్యలున్న 90 శాతం మందిలో మందులతోనే నయం చేయవచ్చునంటున్నారు. కేవలం 10 శాతం మందికి మాత్రమే సర్జరీ అవసరం అవుతుందంటున్నారు. మూత్రం వస్తున్న సిగ్నల్ వచ్చిన తర్వాత ఎక్కువ సేపు ఆపుకోవడం సరికాదు. అలా చేయడం ద్వారా మూత్రాశయ, కిడ్నీల సమస్యలు తలెత్తుతున్నాయి. మా వద్దకు వచ్చే వారిలో కిడ్నీలో రాళ్లు, ప్రొస్టేట్ సమస్యలు, యూరినరీ ట్యూబ్ సన్నబడటం, అర్జంట్గా యూరిన్ రావడం, అసలు రాకపోవడం వంటి వారు ఉంటున్నారు. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్ సమస్యలున్న వారికి అందరికీ సర్జరీ అవసరం లేదు. చాలా మందిలో మందులతో నయం చేయవచ్చు. యూరిన్ ట్యూబ్ సన్నబడటం వంటి సమస్య పుట్టుకతో పిల్లల్లో కూడా ఉంటుంది. అలాంటి వారికి మందులు, సర్జరీ ద్వారా సరిచేస్తున్నాం. 10 ఏళ్లలో 12,500 వరకూ యూరాలజీ సర్జరీలు చేశాం. – డాక్టర్ గుంటక అజయ్కుమార్, యూరాలజిస్ట్
ప్రసన్న వదనం
ప్రపంచంలోని అత్యంత విలువైన ఆస్తి ఏదంటే, అది అపారమైన ధనరాశులు కాదు, తిరుగులేని అధికార పీఠం కాదు; అది మన ముఖంలో నిరంతరం వెలిగే ప్రసన్నత. ‘ముఖంలో ప్రసన్నతతో కీర్తి లభిస్తుంది. కీర్తి వృద్ధి చెందడం వల్ల సుఖాలు అనుభవిస్తారు. ప్రసన్నత లేని వారిని సజ్జనులు ఇష్టపడరు. కాబట్టి, ముఖ ప్రసన్నతే గొప్ప సంపద’.నేటి ఆధునిక, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో, అంతరంగిక ఆనందం కొరవడుతున్న ఈ తరుణంలో, ఈ ప్రసన్న వదనం ఒక దివ్యౌషధంగా పనిచేస్తూ, అంతరాత్మ అపురూపమైన ప్రతిబింబంగా ప్రకాశిస్తుంది. ఇది కేవలం పెదవుల వంపు మాత్రమే కాదు, మన అంతర్గత శాంతికి, ఎదుటివారి పట్ల మనకున్న నిష్కల్మషమైన ఆదరణకు, మన అజేయమైన స్థితప్రజ్ఞతకు దేదీప్యమానమైన ప్రతీక.మానవ సంబంధాలలో అత్యంత శక్తిమంతమైన, అత్యంత సులభమైన సామరస్య సాధనం ఏదైనా ఉందంటే అది చిరునవ్వే. మాటలు లేకున్నా, భాష తెలియకున్నా, ఒక నిర్మలమైన చిరునవ్వు వేల భావాలను పలకగలదు. ఇది మౌనంగా వినిపించే మధుర గీతం లాంటిది. ఈ చిరునవ్వు మనస్సులోని మంచితనాన్ని, స్వచ్ఛమైన అంగీకారాన్ని నిస్సందేహంగా వ్యక్తీకరిస్తుంది. అది హృదయాలను అద్భుతంగా కలుపుతుంది, అపరిచితులను ఆత్మీయులుగా మారుస్తుంది, బంధాలను పటిష్టంగా దృఢపరుస్తుంది. చిరునవ్వు అనేది సార్వత్రిక భాషకు తిరుగులేని తాళం చెవి.దానికి సంస్కృతి, భౌగోళిక, ఆర్థిక భేదాలు ఏవీ అడ్డుకావు. చరిత్రను పరిశీలిస్తే, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప నాయకులు తమ ప్రశాంతమైన ప్రసన్న వదనంతోనే కోట్లాదిమందిలో నమ్మకాన్ని, భరోసాను నింపారు. ఉదాహరణకు, మహాత్మా గాంధీ తన మౌనంలో సైతం చిరునవ్వుతో పలికే స్థితప్రజ్ఞత, లక్షలాది మందికి స్వాతంత్య్రపోరాటంలో అపారమైన ధైర్యాన్నిచ్చింది. అలాగే, మదర్ థెరిసా అందించిన నిస్వార్థ, నిర్మలమైన చిరునవ్వు, నిరాశ్రయులలో సైతం ఆశావాదాన్ని, జీవితేచ్ఛను ఉత్తేజపరిచింది. ఈ ఉదాహరణలు చిరునవ్వుకు ఉండే అంతర్గత శక్తిని, అది సంక్షోభ సమయాల్లోనూ ఎలా స్థైర్యాన్ని, భరోసాను ఇస్తుందో విశదీకరిస్తాయి.చిరునవ్వు మన శారీరక, మానసిక ఆరోగ్యంపై సానుకూల విప్లవాన్ని సృష్టిస్తుంది.ఇది మెదడులో ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపించడం ద్వారా సహజమైన నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. అలాగే, ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ స్థాయులను నియంత్రించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. వత్తి జీవితంలోనూ, వ్యక్తిగత సంబంధాలలోనూ చిరునవ్వు ఒక అద్భుతమైన మానసిక ఆయుధం. ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో, అత్యంత క్లిష్టమైన చర్చల్లో చిరునవ్వుతో పలకరించే నాయకుడు కేవలం నమ్మకాన్ని పొందడమే కాక, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను, విజయవంతమైన సహకారాలను నిర్మించగలరు. మనస్పర్ధలు వచ్చినప్పుడు, కోపానికి బదులు చిరునవ్వుతో కూడిన సున్నిత సంభాషణ, బంధాలను తెగిపోకుండా అత్యంత సమర్థంగా నిలుపుతుంది.ఆనందంలో చిరునవ్వు సహజం, కానీ కష్టాల్లోనూ, సవాళ్లలోనూ చిరునవ్వును దాల్చడం మన అజేయమైన అంతర్గత స్థైర్యానికి పరాకాష్ఠ. చిరునవ్వు కేవలం పెదవుల యాంత్రిక కదలిక కాదు, అది హదయం నుండి వచ్చే ఒక సుమధుర స్పర్శ. అది అహంకారాన్ని తగ్గిస్తుంది, సహానుభూతిని పరిపూర్ణం చేస్తుంది. చిరునవ్వు లేని జీవితం, రంగులు లేని నిస్తేజమైన చిత్రం లాంటిది. ప్రతి మనిషిలో దాగి ఉన్న దైవిక సంపద ఈ చిరునవ్వు.ప్రతిరోజూ మన ఈ చిరునవ్వును ఇతరులతో దాతత్వంతో పంచుకోవడం ద్వారా మనం కేవలం మన బంధాలనే కాదు, సమాజాన్ని కూడా ప్రేమ, సామరస్యపు వారధిగా రూపుదిద్దగలం. చిరునవ్వును మీ ఆదర్శ జీవన శైలికి మార్గదర్శక దీపంగా మార్చుకుందాం. ఇది ద్వేషాన్ని, అపనమ్మకాన్ని సమర్థంగా దూరం చేసి, స్నేహాన్ని, విశ్వాసాన్ని సుస్థిరం చేస్తుంది. చిరునవ్వుతో కూడిన సజీవనం, ప్రతి మనిషిని ఈ లోకంలో ఒక తేజోవంతమైన ఆశా కిరణంగా మారుస్తుంది. ప్రసన్న వదనం ఈ జగత్తుపై చెరగని సంతకం, తరాలు దాటి పలికే దివ్య సందేశం. – కె. భాస్కర్ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు)
ఫొటోలు
'గత వైభవం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు (ఫొటోలు)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)
‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్ వద్ద భారీ పేలుడు (చిత్రాలు)
తెలుగమ్మాయి ఆనంది గ్లామరస్ ఫొటోలు
కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)
నాథ్ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్ అంబానీ (ఫొటోలు)
నా హ్యాపీ బర్త్డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్ (ఫొటోలు)
Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)
అంతర్జాతీయం
నేడు వైట్ హౌస్కు అల్ ఖైదా మాజీ నేత
వాషింగ్టన్: రెండు దశాబ్దాల క్రితం అమెరికా దళాలకు వ్యతిరేకంగా పోరాడిన అల్ ఖైదా మిలిటెంట్ అహ్మద్ అల్–షరా(Ahmed al-Sharaa) వైట్హౌస్లో సోమవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమవబోతున్నారు. 1946లో స్వాతంత్య్రం పొందాక ఆధునిక సిరియా అధ్యక్షుడొకరు వాషింగ్టన్ రావడం ఇదే మొదటిసారి. ఈ కీలక భేటీ కోసం ఆయన శనివారమే అమెరికా చేరుకున్నారు. సిరియాపై ఉన్న ఆంక్షల పూర్తిగా తొలగింపు, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికా నాయకత్వంలోని అంతర్జాతీయ కూటమిలో అధికారికంగా చేరడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. తిరుగుబాటు నేత నుంచి అధ్యక్షుడి దాకా అల్ షరా నాయకత్వంలోని తిరుగుబాటు దళాలు గత డిసెంబర్లో బషర్ అసద్ను గద్దెదించాయి. అంతకుమునుపు, అల్ ఖైదా నేతగా ఉన్న అల్ షరా సిరియాలోని అమెరికా బలగాలతో తలపడ్డారు. ఆయన్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. ఆయన తలపై రివార్డును కూడా ఉంది. కొంతకాలం అమెరికా బలగాల నిర్బంధంలోనూ ఆయన ఉన్నారు. ఇంతలోనే చకచకా అనూహ్య పరిణామాలు సంభవించాయి. అల్ ఖైదాతో సంబంధాలు తెంచుకున్న అల్ షరా, తాజాగా అంతర్యుద్ధం కారణంగా సిరియాను దూరం పెట్టిన ప్రపంచ దేశాలతో సంబంధాలను తిరిగి నెలకొల్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో, మేలో సౌదీ అరేబియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. దీని తర్వాతే ట్రంప్ దశాబ్దాలుగా సిరియాపై కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేస్తామని ప్రకటించారు. సోమవారం వాషింగ్టన్లో ఆయన ట్రంప్తో మళ్లీ భేటీ కానున్నారు. ట్రంప్తో జరిగే చర్చల్లో అల్–షరా ప్రధానంగా సీజర్ చట్టం రద్దు కోసం ఒత్తిడి చేయనున్నారు. గత అసద్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ అమెరికా ఈ చట్టం కింద తీవ్ర ఆంక్షలను విధించింది.
రాజ్యాంగ సవరణపై పాక్లో ఆందోళనలు
ఇస్లామాబాద్: ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు విశేషాధికారాలు కట్టబెట్టడంతోపాటు సమూల మార్పులకు ఉద్దేశించిన 27వ రాజ్యాంగ సవరణకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేయగా, ప్రతిపక్ష పార్టీలు ఆదివారం దేశవ్యాప్త ఆందోళనలకు దిగాయి. రాజ్యాంగ పునాదులనే కదిలించే సవరణలను ఆపివేయాలని డిమాండ్ చేశాయి. 27వ రాజ్యాంగ సవరణతో మిలటరీ అధికారం మరింత బలపడనుంది.ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ల చీఫ్గా రాజ్యాంగ గుర్తింపు లభించనుంది. ఫీల్డ్ మార్షల్గా ఆయన జీవిత కాలం కొనసాగుతారు. దీనివల్ల జీవించి ఉన్నంతకాలం ఆయనపై కేసులు పెట్టకూడదు. సుప్రీంకోర్టు అధికారాలకు సైతం కోత పడనుంది. ఈ బిల్లుపై సోమవారం సెనేట్లో ఓటింగ్ జరగనుంది. అవసరమైన మూడింట రెండొంతుల మంది సభ్యుల ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ధీమాతో ఉంది. దీనిపై ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ సహా ఐదు పార్టీల కూటమి నిరసనలను కొనసాగించాలని నిర్ణయించింది.
ఒక్కో అమెరికన్కు 2వేల డాలర్లు ఇస్తా
వాషింగ్టన్: విదేశాలపై సుంకాల భారం మోపడం వల్లే దేశాదాయం విపరీతంగా పెరిగిందని, తద్వారా సమకూరిన ఆదాయం నుంచి అర్హులైన అమెరికన్లకు సుంకాల డివిడెండ్గా 2,000 డాలర్లు పంపిణీ చేస్తానని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ప్రకటించారు. విదేశాలపై సుంకాలను ఇష్టారీతిగా పెంచే విచక్షణాధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుందా? అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాలు అధ్యక్షుడికి వర్తిస్తాయా? అనే అంశాలపై సుప్రీంకోర్టు లోతైన సమీక్ష జరపనున్న నేపథ్యంలో ట్రంప్ ఆదివారం ఈ మేరకు తనదైన రీతిలో స్పందించారు.సొంత సామాజిక మాధ్యమ ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. ‘‘సుంకాలను వ్యతిరేకించే వాళ్లంతా మూర్ఖులు. అధిక సుంకాలతో రెవిన్యూ వసూళ్ల వరద మొదలయ్యాక మనం అత్యంత ధనిక, గౌరవప్రద దేశంగా మారాం. మన దగ్గర ద్రవ్యోల్బణం దాదాపు లేదు. స్టాక్మార్కెట్ దూసుకుపోతోంది. ట్రిలియన్ల డాలర్లు వచ్చిపడుతున్నాయి. త్వరలోనే 37 ట్రిలియన్ డాలర్ల అప్పులను తీర్చే ప్రక్రియ మొదలెడతా. అమెరికాలోకి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. దాదాపు మిగతా వాళ్లందరికీ సుంకాల డివిడెండ్గా 2,000 డాలర్లు నేరుగా బదిలీచేస్తా’’ అనిట్రంప్ అన్నారు.
అమెరికా ఉన్నతాధికారులతో బాస్కెట్ బాల్ ఆడిన సిరియా అధ్యక్షుడు
వాషింగ్టన్: సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా (Ahmed al-Sharaa) అంతర్జాతీయంగా అందరినీ ఆశ్చర్యపరిచారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ (Brad Cooper)తో పాటు పలువురు అమెరికా అధికారులతో కలిసి అల్-షరా బాస్కెట్ బాల్ ఆడారు.ఈ స్నేహపూర్వక ఆట వాషింగ్టన్లో నిర్వహించబడిందని సమాచారం. సిరియా అధ్యక్షుడు అల్-షరా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సిరియా అధ్యక్షుడిగా అల్-షరా చేసిన తొలి అధికారిక అమెరికా పర్యటనగా గుర్తించబడింది.
జాతీయం
ఢిల్లీ పేలుడు: ఈ కష్టం పగవాడికి కూడా.. కండక్టర్ విషాదాంతం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడులో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మందిలో అశోక్ కుమార్ ఒకరు. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన అశోక్ తన రెక్కల కష్టంతో ఎనిమిది మంది కుటుంబ సభ్యులను పోషిస్తున్నాడు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో కండక్టర్గా అశోక్ పనిచేస్తున్నాడు. పాత ఢిల్లీ మార్గంలో విధులు నిర్వహిస్తుంటాడు.ఢిల్లీ పేలుడు బాధితుల జాబితాలో తన బంధువు అశోక్ పేరును చూడగానే పప్పు షాక్ అయ్యాడు. ఎల్ఎన్జేజీ ఆస్పత్రి వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘నేను జాబితాలో అశోక్ పేరు చూశాను. అతను నాకు బంధువు. దీనిని ధృవీకరించడానికి నేను ఫోన్ చేశాను. అశోక్ బైక్ ఏమయ్యిందో తెలియడం లేదు’ అని అన్నారు. పేలుడు సమయంలో అశోక్ విధుల్లో ఉన్నారా? అని అడగగా, అతను ఈ రూట్లోనే విధులు నిర్వహిస్తుంటాడని, డ్యూటీ లేనప్పుడు కూడా ఇదే మార్గంలో వెళుతుంటాడని’ తెలిపారు.అశోక్కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి 15 కి.మీ దూరంలో ఉన్న జగత్పూర్లో కుటుంబంతో పాటు ఉంటున్నాడు. అతని తల్లి సోమవతి పెద్ద కుమారుడు సుభాష్తో కలిసి గ్రామంలో ఉంటోంది. సుభాష్ తరచుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. అశోక్ వారి కుటుంబ బాధ్యతలు కూడా మోసేవాడు. పగటిపూట కండక్టర్గా, రాత్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ అశోక్ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు.ఇది కూడా చదవండి: Delhi 10/11 Blast: యూపీ నుంచి వస్తువుల కొనుగోలుకు వచ్చి..
Delhi 10/11 Blast: యూపీ నుంచి వస్తువుల కొనుగోలుకు వచ్చి..
న్యూఢిల్లీ: సోమవారం సాయంత్రం దేశ రాజధానిని కుదిపేసిన పేలుడులో మరణించిన వారిలో ఉత్తరప్రదేశ్లోని షామ్లి జిల్లాకు చెందిన 22 ఏళ్ల నౌమాన్ కూడా ఉన్నాడు. షామ్లీలోని జింఝానకు చెందిన నౌమాన్ తాను నిర్వహిస్తున్న సౌందర్య సాధనాల వ్యాపారం కోసం సంబంధిత వస్తువులు కొనుగోలు చేసేందుకు ఢిల్లీకి వచ్చాడు. ఇంతలో అతనిని మృత్యువు కబళించింది.నౌమాన్ కుటుంబ సభ్యులకు ఈ వార్త తెలియగానే వారంతా కుంగిపోయారు. మంగళవారం ఉదయం వారు లోక్ నాయక్ ఆస్పత్రికి చేరుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో నౌమాన్తో పాటు ఉన్న అతని బంధువు 21 ఏళ్ల అమన్ కూడా పేలుడులో గాయపడ్డాడు. సోమవారం సాయంత్రం గౌరీ శంకర్ ఆలయం నుండి బైక్పై తిరిగి వస్తున్న 28 ఏళ్ల అంకుష్ శర్మ , 20 ఏళ్ల రాహుల్ కౌశిక్ సాయంత్రం 6:52 గంటలకు జరిగిన పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు అంకుష్ ముఖం, శరీరం 80 శాతం మేరకు తీవ్రంగా కాలిపోయింది.ఈ పేలుడులో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అంతటి బాధలోనూ అతను అంకుష్ను ఆసుపత్రికి తరలించడంలో సాయపడ్డాడు. ఆస్పత్రి వెలుపల బాధితుల కుటుంబాలు గుమిగూడి, తమవారి కోసం వెదుకుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని దృశ్యాలు చూపరులకు కంటతడి పెట్టిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6:52 గంటలకు జరిగిన ఈ పేలుడులో తొమ్మిది మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన హ్యుందాయ్ కారు ఎర్రకోట సమీపంలోని ట్రాఫిక్ స్టాప్ వద్ద పేలిపోయింది. దీంతో సమీపంలోని పలు వాహనాలు తునాతునకలయ్యాయి. ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు.ఇది కూడా చదవండి: Delhi 10/11 Blast: అనుమానితుడి మొదటి ఫొటో..
ఢిల్లీ పేలుళ్లు.. అమిత్ షా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష
ఢిల్లీ: ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటన పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో హోంశాఖ కార్యదర్శి గోవిందు మోహన్, ఐబి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చీఫ్లు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.జమ్మూ కశ్మీర్ డీజీపీ వర్చువల్గా హాజరయ్యారు. పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కేంద్రం హై అలర్ట్ జారీ చేసింది. పలు దర్యాప్తు సంస్థలు.. బాంబు పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టాయి. పేలుడు ప్రాంతంలో ఫోరెన్సిక్ నిపుణులు, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ బృందాలు క్లూస్ సేకరించాయి. ఎర్ర కోట ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎర్రకోట మెట్రో స్టేషన్, చాందిని చౌక్, గురు ద్వారాలన్నీ పోలీసులు మూసివేశారు. జమ్మూ కశ్మీర్లోని అనంత్ నాగ్లో డాక్టర్ ఆదిల్ అరెస్టుతో భారీ ఉగ్రకుట్ర వెలుగు చూసింది.ఫరీదాబాద్లో 2900 కిలోల పేలుడు పదార్థాలను జమ్మూ కశ్మీర్, హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోని ఎర్రకోట వద్ద ఉగ్ర దాడి జరిగింది. ఉగ్ర నెట్వర్క్ను ఛేదిస్తున్న సమయంలోనే ఎర్రకోట వద్ద డాక్టర్ ఉమర్ మహమ్మద్ బాంబు పేలుడుకు పాల్పడ్డాడు.
Delhi 10/11 Blast: అనుమానితుడి మొదటి ఫొటో..
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో ఆత్మాహుతి బాంబర్గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ మొదటి ఫొటో బయటకు వచ్చింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పేలిని తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు డాక్టర్ ఉమర్కు చెందినది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమానిత ఆత్మాహుతి బాంబర్ మొదటి చిత్రాన్ని ‘ఎన్డీటీవీ’ యాక్సెస్ చేసింది. జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో 1989, ఫిబ్రవరి 24న జన్మించిన ఉమర్.. అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్, హర్యానా పోలీసు బృందాలు అరెస్టు చేసిన వైద్యులు డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్లకు డాక్టర్ ఉమర్ అత్యంత సన్నిహితుడు.దర్యాప్తు అధికారులు మాడ్యూల్లోని ఇద్దరు కీలక సభ్యులను అరెస్టు చేశారని, 2,900 కిలోల అనుమానిత పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని తెలుసుకున్న డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్ నుండి పారిపోయాడు. తరువాత అతను భయాందోళనకు గురై పేలుడుకు పాల్పడ్డాడని సమాచారం. ఉమర్ మొహమ్మద్, అతని సహచరులు దాడి చేయడానికి అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ (ఏఎన్ఎఫ్ఓ)ఉపయోగించారు. వారు కారులో డిటోనేటర్ను ఉంచి ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతంలో దాడికి పాల్పడ్డారని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.ఎర్రకోట సమీపంలో పేలిన తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు బదర్పూర్ సరిహద్దు నుండి ఢిల్లీలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ వీడియో, ఫొటోలలో కనిపిస్తోంది. కారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి పాత ఢిల్లీకి వచ్చింది. HR 26CE7674 నంబర్ ప్లేట్తో ఉన్న ఈ వాహనం ఎర్ర కోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు నిలిపి ఉంచారు. మధ్యాహ్నం 3:19 గంటలకు ప్రవేశించి సాయంత్రం 6:30 గంటలకు కారు బయలుదేరిందని భద్రతా వర్గాలు తెలిపాయి. అనుమానిత ఆత్మాహుతి దళ సభ్యుడు కారును ఒక్క నిమిషం కూడా వదిలి వెళ్లలేదని సమాచారం.
ఎన్ఆర్ఐ
డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు
డాలస్, టెక్సస్: ఈ అవగాహనా సదస్సు ఏర్పాటుచేసిన ప్రముఖ ప్రవాస భారతీయ నాయుకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రపంచంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రయాలున్న దేశం అమెరికా. అందుకే అమెరికా దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి.అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి దోహద పడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్రయాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో ఒక అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసేందుకు యీ సదస్సు ఏర్పాటుచేశాం అన్నారు”.➢ ముందుగా అమెరికాదేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదికమీద కేవలం ఒక్క భారతీయ జెండా మాత్రమే ఉంచకూడదు. భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. వేదికపైన ఉన్న జెండాలలో వేదికముందు ఉన్న ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి.జాతీయగీతాలు ఆలపించేడప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలాపించాలి. భారత జాతీయగీతం పాడుతున్నపుడు నిశబ్దంగా, నిటారుగా నిలబడి ఉండాలి. అమెరికా జాతీయగీతం ఆలపిస్తున్నపుడు, అమెరికాదేశ జాతీయపతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండెదగ్గర ఉంచుకోవాలి. టోపీలుధరించి ఉన్నట్లయితే జాతీయ గీతాలు ఆలపిస్తున్నంతసేపు వాటిని తీసిఉంచడం మర్యాద. ➢ భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలాలో దైవిక, ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో కొన్ని రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణసంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. దీనికి సిటీ పర్మిషన్ ఉన్నట్లయితే, ట్రాఫిక్ డైవర్షన్ గుర్తులు, తగు పోలీస్ రక్షణ సిబ్బంది సహాయం తప్పనిసరి. ఇలాంటివి ఇళ్ళమధ్యలోగాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం. అలా కాకపోతే ఎన్నో ఉపద్రవాలకు గురిఅయ్యే ప్రమాదంఉంది.➢ ఉదాహరణకు ఇటీవలే ఇలాంటి సంఘటనతో తన కారులో రోడ్ మీద ఎటూ వెళ్ళడానికి వీలులేక, ఈ ఉత్సవాల జనంమధ్య చిక్కకుని, విసిగిపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో, అందరూ బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. ఆ తుపాకీ పేలినా, బంగారు ఆభరణాలు ధరించి ఆ ఉత్సవాలలో పాల్గొన్న పిల్లలు, పెద్దల సమూహంలో తొక్కిసలాట జరిగినా, ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ఇళ్ళ మధ్యలోగాని, ఆరు బయటగాని బాణాసంచా ఏ ఉత్సవాలలోనైనా కాల్చకూడదు. అలా చేయడానికి ‘పైరోటెక్ లైసెన్స్’ ఉండాలి, అనుభవజ్ఞులైన, లైసెన్స్ ఉన్న టెక్నీషియన్స్ మాత్రమే ఆ పనిచేయడానికి అర్హులు. ➢ మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు దియేటర్లవద్ద హడావిడి శ్రుతిమించి రా(రో) గాన పడుతుంది. హీరోలకు అభిమానులు ఉండడం తప్పుగాదు గాని, దియేటర్లలో వారికి వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమాలు వీక్షించేవారు భయకంపితులవుతున్నారు.నిజానికి ఎంతో ఖర్చుపెట్టి సినిమా చూద్దామని వచ్చిన ఆయా హీరోల అభిమానులుకూడా కేకలు, అరుపుల మధ్య ఆ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేక అసంతృప్తికి లోనవుతున్నారు. పోలీసులువచ్చి ఈ గోల, గందరగోళాల మధ్య ఆడుతున్న సినిమాను మధ్యలో ఆపివేసి అందరినీ బయటకు పంపి వెయ్యడం లాంటి సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు, అవమానకరం. ➢ ఇక ఆయా రాజాకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి వారు, ఆయా నాయకులకు అభిమానం చూపడం, సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాకూడదు. కాని సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో అనేక వందలమంది అమెరికన్లు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేసున్న అరుపులు, కేకలకు పోలీస్లు వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.➢ చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగంఅవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంభందాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.➢ మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. ఉదాహరణకు-1856లో ఏర్పడ్డ ‘డాలస్’ నగరాన్ని ‘డాలస్ పురం’ గా “ఉల్లాసపురం” గా పలకడం;1913లో ఏర్పడ్డ “క్యారల్టన్” అనే నగరాన్ని “కేరళాటౌన్” గా పలకడం ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక; 1950లో ఏర్పడ్డ “గంటర్” అనే నగరాన్ని “గుంటూరు” గా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి అన్నీ వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలోపడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు!. ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.➢ వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.➢ వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ మొదలైన సాధనాల ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.➢ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, రాజకీయ నాయకులు, సినిమా కధానాయకులు వారి అభిమానులకు సరైన దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడ దగ్గది.➢ రెండు గంటలకు పైగా సాగిన ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన నాయకులకు, అనివార్యకారణాలవల్ల హాజరుకాలేకపోయినా సందేశాలను పంపిన వారికి, రుచికరమైన విందుభోజన ఏర్పాట్లు చేసిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారికి, అన్ని వసతులతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ను సమకూర్చిన డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఒకేసారి రెండు ఉద్యోగాలు : డాలర్లకు కక్కుర్తి పడితే ముప్పు తప్పదు!
మూన్లైటింగ్ ఆరోపణలపై భారత సంతతికి చెందిన వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన వార్త ఇంటర్నెట్లో దావాలనంలా వ్యాపించింది. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన మెహుల్ గోస్వామిని యుఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నగోస్వామి మాల్టా పట్టణంలో మరో కాంట్రాక్ట్ ఉద్యోగం చేయడాన్ని నేరంగా పరిగణించింది. 2022 మార్చిలో గోస్వామి న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్లో రిమోట్ వర్క్(work from home) తోపాటు, మాల్టాలోని సెమీకండక్టర్ కంపెనీకి కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. గోస్వామిపై అందిన ఫిర్యాదును విచారణ చేపట్టిన మోహుల్ గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. గోస్వామి మూన్ లైటింగ్ కారణంగా రాష్ట్రఖజానాకు రూ.44 లక్షల నష్టం జరిగిందని అధికారులు భావించారు. డ్యూయల్ ఎంప్లాయ్ మెంట్ రూల్ ప్రకారం అమెరికాలో రెండు ఉద్యోగాలు చేయడం నేరంగా పరిగణించిన దర్యాప్తు సంస్థప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం ప్రజలను మోసం చేయడమే అని, ప్రజా వనరుల దుర్వినియోగం అని పేర్కొంది.ప్రభుత్వ ఉద్యోగులకు నిజాయితీతో సేవ చేసే బాధ్యత ఉంది కానీ గోస్వామి ఆ నమ్మకాన్ని తీవ్రంగా ఉల్లంఘించాడని న్యూయార్క్ స్టేట్ ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ అన్నారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రెండో పూర్తికాలం ఉద్యోగం చేయడం అంటే ప్రజల డబ్బుతోపాటు ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడమే అవుతుందని లూసీ లాంగ్ పేర్కొన్నారు.ఏంటీ నేరం; ఏలాంటి శిక్షసరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ,రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం ఈ విషయంపై సంయుక్త దర్యాప్తు చేపట్టి,గోస్వామి అరెస్టు చేసింది. సొంత పూచీకత్తుపై విడుదలయ్యాడు. ఈ కేసు ప్రస్తుతం తదుపరి చట్టపరమైన చర్యలు పెండింగ్లో ఉంది. రెండవ డిగ్రీలో గ్రాండ్ చోరీ అభియోగం మోపబడింది, ఇది న్యూయార్క్లో తీవ్రమైన క్లాస్ సి నేరం. ఈ నేరం రుజువైతే గోస్వా మికి గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.13 లక్షల వరకు లేదా పొందిన ఆర్థిక ప్రయోజనాలకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది.చదవండి: ఇషా, ఆకాష్ అంబానీ బర్త్డే: తరలి వెళ్లిన తారలుడాలర్లకు కక్కుర్తిపడితేడాలర్లకు ఆశ పడి విదేశాల్లో ఉద్యోగాలు చేసకుంటున్న నిపుణులైన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షలకోసం ఆశపడితే దేశం పరువు ప్రతిష్టలకు భంగం కలగడంతో పాటు,వ్యక్తిగతంగా కూడా భారీ నష్టం తప్పదని, ఉద్యోగులు నిబద్దతగా నిజీయితీగా ఉండాలని సూచిస్తున్నారు.గతంలో అమెరికా సంస్థలతో మూన్లైట్ చేస్తూ మరో భారతీయుడు పరేఖ్, పట్టుబడ్డాడు. మూన్ లైటింగ్ ద్వారా ఐదు యుఎస్ స్టార్టప్లను మోసం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాన్ని మొదట మిక్స్ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ CEO సుహైల్ దోషి సోషల్మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)
మనోళ్ల దీపావళి ఎఫెక్ట్: వెల్లువెత్తిన ఫిర్యాదులు
భారత్తో పాటు ప్రపంచంలోని నలుమూలలా భారతీయులు, మన మూలాలు ఉన్నవాళ్లు దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అయితే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేడుకల్లోనూ పలు చోట్ల అపశ్రుతి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తగా.. అదే సమయంలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. దీపావళి వేడుకల్లో.. గాయాలు, ప్రమాదాలు, చివరాఖరికి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఈ ఏడాది జరిగిన వేడుకల్లో ‘నష్టం’ కాస్త ఎక్కువే జరిగిందని పరిస్థితులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. అర్ధరాత్రి పూట అక్కడి భారతీయులు చేసిన హంగామాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో జరిగిన డ్యామేజ్ ఉదాహరణంగా నిలిచింది!.న్యూయార్క్ నగరం క్వీన్స్ ప్రాంతంలో.. బాణాసంచా కారణంగా లింకన్ స్ట్రీట్లోని మూడు నివాసాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇక్కడి దీపావళి వేడుకలకు.. అదీ కూడా అర్ధరాత్రి పూట నిర్వహణకు అసలు అనుమతే లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఫైర్వర్క్స్ గాల్లోకి ఎగసి ఓ ఇంట్లోకి నేరుగా దూసుకెళ్లిన తర్వాత మంటలు వ్యాపించాయి. మరోపక్క.. Your #Diwali celebration? My house is gone!What a sad incident, disappointing beyond words.Indians in the U.S., wake up before it's too late!! pic.twitter.com/7SQjiVBgfV— M9 USA🇺🇸 (@M9USA_) October 24, 2025UPDATE: We have received video from the homeowner showing the damage caused by the illegal and irresponsible Diwali fireworks.In addition, a vehicle and the garage were completely burned and damaged. https://t.co/vOh5Oa58o3 pic.twitter.com/436GvhB9KD— YEGWAVE (@yegwave) October 24, 2025న్యూజెర్సీలో ఒక్క ఎడిసన్ నుంచే 40 ఎమర్జెన్సీ కాల్స్ అధికారులకు వెళ్లాయట. ఆస్తి నష్టంతో పాటు ముందస్తు జాగ్రత్తగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారట. తమ నిద్రకు భంగం వాటిల్లిందనే ఫిర్యాదులు చేసిన వాళ్లు ఉన్నారట. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేడుకలను జరగనివ్వకుండా ఆపేశారు కూడా. ఇంకోపక్క.. Look at the aftermath of these Diwali celebrations.It’s chaos. Litter everywhere. Police holding people back. Indians hanging out of cars speeding by.And these people have the audacity to compare Christmas parades to this.I’m fed up.pic.twitter.com/2gX57IcKW3— Anti-Taxxer (@mapleblooded) October 23, 2025దీపావళి వేడుకల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించి కొందరి నివాసాలు పూర్తిగా ధ్వంసమై అయ్యాయని.. కట్టుబట్టలతో వాళ్లు రోడ్డు మీద పడ్డారని కొన్ని వీడియోలు, కథనాలు బయటకు వచ్చాయి. ‘‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. మాకేం మిగల్లేదు. నా కొడుకు ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. హోటల్ గదిలో జీవించాల్సి వస్తోంది’’ అని బాధితురాలు జువానిటా కొలన్ ఓ మీడియా సంస్థతో పేర్కొనడం గమనార్హం. దీంతో.. Indians were celebrating Diwali in US. Their police and fire department came to join the celebration and played Holi. pic.twitter.com/nLLlnFlh8p— Joy (@Joydas) October 23, 2025అమెరికా దీపావళి వేడుకలపై మునుపెన్నడూ లేనిస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అందుకు ఆ స్థాయిలో జరిగిన నష్టమే కారణమని స్పష్టమవుతోంది. దీంతో అధికారులు ఇలాంటి వేడుకలను అనుమతించొద్దని.. ఒకవేళ అనుమతించినా.. సురక్షిత నిబంధనలు పాటించేలా కఠిన మార్గదర్శకాలను తీసుకురావాలని పలువురు అమెరికన్లు కోరుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించి.. పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని సమాచారం.Indians have been living a respectful life in USA, UK, Canada and other Countries for over a century. What has really changed with the current expats creating such a ruckus, nuisance, civic garbage, displaying absolute lack of civic sense, cultural bankruptcy, this Diwali❓… pic.twitter.com/dGzt3SrtIs— Raju Parulekar (@rajuparulekar) October 24, 2025
అమెరికాలో భార్యకు వేధింపులు ఎన్నారై భర్త అరెస్టు
భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఎన్జీవో ప్రతినిధి తరుణి పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఎన్ఆర్ఐ కుటుంబాలలో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
క్రైమ్
మృత్యువుతో పోరాడి.. తుది శ్వాస విడిచి
కాకినాడ క్రైం / జగ్గంపేట: జగ్గంపేట మండలం సోమవరం జాతీయ రహదారిపై ఈ నెల 8న కారు ప్రమాద ఘటనలో తీవ్ర గాయాల పాలైన కూండ్రపు దుర్గా చైతన్య (17) కాకినాడ జీజీహెచ్లో ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. దీనితో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదానికి గురైన చైతన్యకు రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన కొద్దిసేపటికే కాకినాడ జీజీహెచ్కు తరలించగా, ఆమెను తొలుత అత్యవసర విభాగంలో ఉన్న సీఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ఆర్ఐసీయూ–2లో చేర్చారు. కాళ్లు రెండూ ఛిద్రమవడంతో రెండు రోజుల పాటు అక్కడే ఉంచి చికిత్స అందించారు. తీవ్ర గాయాలు కావడంతో కాలి నుంచి ఇన్ఫెక్షన్ శరీరానికి వ్యాప్తి చెందింది. ఈ విషయాన్ని గుర్తించిన వైద్యులు ఆదివారం దుర్గాచైతన్య ఎడమ కాలిని తొలగించారు. ఎమర్జెన్సీ ఓటీలో నిర్వహించిన ఈ శస్త్రచికిత్స ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి పూర్తయ్యింది. అనంతరం ఆమెను ఆర్ఐసీయూ–1కి తరలించి పరిశీలనలో ఉంచారు. రాత్రి 2 గంటల సమయంలో దుర్గాచైతన్య ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్కు గురైంది. వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలు నిలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చైతన్య చివరికి ప్రాణాలు విడిచింది. ముక్కుపచ్చలారని వయసులో చేయని తప్పుకు ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ ప్రాణాలు విడిచిన బాలిక దయనీయ స్థితి వైద్య సిబ్బందితో కన్నీళ్లు పెట్టించింది.ఇర్రిపాకలో విషాదంనిరుపేద కుటుంబానికి చెందిన దుర్గాచైతన్యది జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామం. ఆమె తండ్రి సన్యాసిరావు, తల్లి కుమారి. వీరికి ఇద్దరు కుమార్తెలు. దుర్గాచైతన్య పెద్ద కుమార్తె. సన్యాసిరావు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలను తనలా కాకుండా ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలని ఎంతో ఆశపడేవాడు. అందుకే కాకినాడలో పెద్ద కుమార్తెను నర్సింగ్ కోర్సులో చేర్పించాడు. ఆమె ఉద్యోగంలో స్థిరపడితే తన కాళ్లపై తాను నిలబడుతుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి దుర్గాచైతన్య మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
పెళ్లైన ఆరు నెలలకే నవ వధువు ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పెళ్లయి ఆరు నెలలు నిండకముందే వరకట్న వేధింపులకు ఓ అబల బలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కమటం వెంకటేశ్వర్లు కుమార్తె అంజలి (19)ని అదే గ్రామానికి చెందిన చిట్టూరి ఉపేందర్–ఉమ దంపతుల కుమారుడు సాయికుమార్కు ఇచ్చి ఈ ఏడాది మే 14న వివాహం జరిపించారు. రెండెకరాల పొలం, ఐదు తులాల బంగారం, రూ.10 లక్షల నగదు వరకట్నంగా అందజేశారు. హైదరాబాద్లో ఇంటీరియల్ డెకరేషన్ పని చేస్తున్న సాయికుమార్ భార్యను స్వగ్రామంలోనే ఉంచి తరచూ వచ్చి వెళ్లేవాడు. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. ఈ క్రమంలో మరికొంత కట్నం తేవాలని భర్తతోపాటు అత్తమామలు, ఆడపడుచు నిరంజని, ఆమె భర్త మోహన్ప్రసాద్ వేధించసాగారు. దీంతో వెంకటేశ్వర్లు కుల పెద్దల వద్ద మాట్లాడగా.. ఇకపై మంచిగా చూసుకుంటానని సాయికుమార్ చెప్పినా ఆ రోజు నుంచి అంజలికి వేధింపులు మరింత పెరిగాయి. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి ఆమెను గృహ నిర్బంధం చేశారు. గ్రామంలో ఎవరితో మాట్లాడకుండా కట్టుదిట్టం చేయగా అంజలి మానసిక క్షోభకు గురైంది. సాయికుమార్ ఆదివారం మరోసారి ఘర్షణ పడడంతో మనస్తాపానికి గురైన అంజలి ఇంట్లోనే పురుగులమందు తాగింది. వెంటనే సాయికుమార్ ఇల్లెందు ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. కానీ సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు అంజలి మృతి చెందినట్లు వైద్యులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే సాయికుమార్, అతడి కుటుంబసభ్యులు ఇల్లెందుకు చేరుకుని పోలీసులకు సరెండర్ అయ్యారు. అంజలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు అత్తింటివారిపై వరకట్నం కేసు నమోదు చేసినట్లు సీఐ సురేశ్ తెలిపారు.
అల్లుడు కాదమ్మో యముడు
పశ్చిమ గోదావరి జిల్లా: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త భార్యను, అడ్డు వచ్చిన మామ, బావమరిదిని నరికిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. పాలకోడేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లలకోడేరు శివారు తుమ్మలగుంట పాలెంకు చెందిన కడలి సత్యనారాయణ తన కూతురు శ్రీలక్ష్మిని 17 ఏళ్ల క్రితం అత్తిలి మండలం మంచిలికి చెందిన వీరవల్లి రామచంద్రరావు అలియాస్ చందుకు ఇచ్చి పెళ్లి చేశారు. చందు తరచూ ఖతర్ వెళ్ళి వస్తుంటాడు. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రెండు సార్లు పంచాయతీ పెట్టి పరిష్కారం చేసుకున్నారు. మూడేళ్ల నుంచి తిట్టడం, కొట్టడం చేస్తున్నాడు. కూతురు మహేశ్వరికి కత్తి చూపి మీ అమ్మను చంపేస్తాను అని బెదిరించేవాడు. ఆ విషయం తాత సత్యనారాయణకు చెప్పింది. భయపడ్డ అతను శీలక్ష్మని తన ఇంటికి తీసుకొచ్చాడు. పాలకోడేరు, అత్తిలి పోలీసులు చందుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ నెల 9న రాత్రి చందు కత్తితో వచ్చి బయట ఉన్న శ్రీలక్ష్మీ భుజంపై నరికాడు. అడ్డు వచ్చిన మామ సత్యనారాయణ, బావమరిది రాజేష్ ను కూడా నరికాడు. చుట్టుపక్కల వారు వచ్చి ముగ్గురిని భీమవరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై రవివర్మ తెలిపారు. మామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విశాఖ: భర్త శారీరకంగా దూరం పెట్టాడని..
విశాఖపట్నం జిల్లా: వివాహమై ఏడాది కాకముందే దేశంశెట్టి విజయ శ్యామల (25) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణానగర్లో చోటు చేసుకుంది. శారీరకంగానే కాదు.. మానసికంగానూ భర్త పెట్టిన వేధింపులే ఈ బలవన్మరణానికి కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గోపాలపట్నం సీఐ సన్యాసి నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామానికి చెందిన విజయ శ్యామలకు 2024 డిసెంబర్ 6న చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన దేవాడ దిలీప్ శివకుమార్తో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 5 లక్షల కట్నం, ఎకరా భూమి, రూ. 1.60 లక్షల విలువైన ద్విచక్ర వాహనం, 8 తులాల బంగారం, ఆడపడుచు కట్నం రూ.లక్ష, సారె ఇచ్చామని శ్యామల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఎన్ఎస్టీఎల్లో ఆర్కిటెక్చర్ డిజైనర్గా పనిచేస్తున్న శ్యామల ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చింది. భర్త దిలీప్ శివకుమార్ తరచుగా ఆమెకు దూరంగా ఉంటూ, ఇతరులతో పోల్చుతూ ద్వేషిస్తూ మానసికంగా వేధించేవాడని తెలుస్తోంది. ఆదివారం రాత్రి 11 గంటల తరువాత ఆమె ఉరి వేసుకుంది. అదే సమయంలో ఇంటికి వచ్చిన దిలీప్ శివకుమార్ తలుపు కొట్టినా తీయకపోవడంతో విరగ్గొట్టి వెళ్లి చూడగా, శ్యామల ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకి దించి, తన అన్నావదినలకు సమాచారం అందించాడు. వారు వచ్చిన తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన జరిగిన విధానంపై ఆరా తీశారు. సోమవారం ఉదయం ఏసీపీ పృధ్వీతేజ ఘటనా స్థలికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడారు. సూసైడ్ నోట్లో పేర్కొన్న అంశాలను బట్టి, భర్త తనను పూర్తిగా దూరం పెట్టడం, అర్ధరాత్రి ఇంటికి రావడం, శారీరకంగా, మానసికంగా దూరం పెడుతున్న కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అల్లుడే చంపేశాడు మృతురాలి తల్లిదండ్రులు దేశంశెట్టి రోజారమణి మాట్లాడుతూ తమ కుమార్తెను అల్లుడే చంపేశాడని ఆరోపించారు. తమ కూతురు చనిపోయిన తర్వాత తమకు సమాచారం ఇవ్వకుండా, అన్నావదినలకు సమాచారమందించడం, వారు వచ్చిన తరువాత పోలీసులకు చెప్పడం ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. ఎకరా భూమి గురించి పలుమార్లు అల్లుడు ఫోన్ చేసి అడిగేవాడని తల్లి రోజారమణి ఆరోపించారు. తమ కూతురిని వారే పొట్టన పెట్టుకున్నారని, వారికి తగిన శిక్ష వేయాలని రోదించారు. ఎయిర్పోర్ట్ సీఐ శంకరనారాయణ, ఎస్ఐ అప్పలనాయుడు ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. తల్లి రోజారమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు
Jubilee By Poll: కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ ఫిర్యాదు
Ande Sri Final Rites: పాడె మోసిన సీఎం రేవంత్
Nedurumalli Ramkumar: పిలిచి మరీ సంతకాలు పెడుతున్నారు.. ఇది చంద్రబాబు నీ పరిస్థితి
Jubilee Hills: సాయంత్రం 6 వరకు కొనసాగనున్న పోలింగ్
Maganti Sunitha: ఆకు రౌడీలూ.. గుర్తుపెట్టుకోండి.. 14 తర్వాత ఒక్కొక్కడినీ..
మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు వైఎస్ జగన్ నివాళి
బాంబు బ్లాస్ట్ కు వాడిన కారు.. పేలుడుకు ముందు CCTV ఫుటేజ్
మొయినుద్దీన్ విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు
అజిత్ దోవల్ తో మోదీ భేటీ.. టెర్రరిస్టులకు బిగ్ వార్నింగ్
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

