Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Transfer of shares without informing the court1
చట్టాన్ని గౌరవించటం తప్పా?

కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమంగా పెట్టిన కేసులు­న్నాయి. ఏడాదిన్నర జైల్లో ఉండి బెయిలుపై బయటకు వచ్చారాయన. పైపెచ్చు ఆ కంపెనీల ఆస్తులన్నీ ఈడీ, సీబీఐ జప్తులో ఉన్నాయి. ఆ ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలూ జరపకూడదని హైకోర్టు ఇచ్చిన ‘స్టే’ ఉత్త­ర్వులూ ఉన్నాయి. మరి ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఏమవుతుంది? దీనికి సమాధాన­మివ్వ­టానికి న్యాయనిపుణులే అక్కర్లేదు. కాస్త చదువు, ఇంకాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరైనా చాలు. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే దాని ప్రభావం బెయిలుపైనా పడే ప్రమాదముంటుంది! ఇదిగో... సరస్వతీ పవర్‌ షేర్ల బదిలీ వ్యవహా­రంలో ఇదే జరిగింది. వైఎస్‌ జగన్‌కు తెలియ­కుండా ఆయన పేరిట ఉన్న షేర్లను తల్లి పేరిట సోదరి షర్మిలే దగ్గరుండి మార్పించేశారు. షేరు హోల్డరైన జగన్‌కు కనీసం సమాచారమూ ఇవ్వలేదు. కోర్టు స్టే ఉత్తర్వులున్నా... కనీసం కోర్టుకూ చెప్పలేదు. పెద్ద మనుషుల ఒప్పందం మాదిరి తల్లి పేరిట రాసిన అన్‌ రిజిస్టర్డ్‌ గిఫ్ట్‌డీడ్‌ను ఉపయోగించుకుని షేర్లను తల్లి పేర మార్పించేశారామె. దీంతో కంపెనీ యాజ­మాన్యం పూర్తిగా తల్లి చేతికి వచ్చినట్లవుతుంది. మరి ఇది కోర్టు ఉల్లంఘనే కదా? జగన్‌కు తెలియకుండా జరిగినా... కోర్టు దృష్టిలో తప్పే కదా? మరి ఈ తప్పును కోర్టు దృష్టికి తేవాల్సిన అవసరం జగన్‌కు లేదా? ఈ లావా­దేవీని కోర్టు దృష్టికి తెచ్చి... రద్దు చేయమంటూ కోరటం తప్పెలా అవుతుంది? తనకు తెలియ­కుండా తన పేరిట చెల్లెలు చేసిన తప్పును సరిదిద్దడానికి ఆయన నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీని) ఆశ్రయించటాన్ని చంద్రబాబు కూటమి ఎందుకంత ఘోరమైన తప్పిదం మాదిరి ప్రచారం చేస్తోంది? దాన్ని తల్లిపై కేసు వేసినట్లుగా ఎందుకు చూడాలి? న్యాయపరంగా రక్షించుకోవటానికి జగన్‌ ఎన్‌సీఎల్‌టీకి వెళ్లటం తప్పెలా అవుతుంది? ఆలోగా చేయటం చట్టవిరుద్ధం కాబట్టే..సొంత అన్న న్యాయపరంగా ఇబ్బంది పడతాడని తెలిసి కూడా షర్మిల ఇలా చేయటానికి అసలు కారణం... చంద్రబాబు నాయుడు. బాబు పన్నిన లోతైన కుట్రలో షర్మిల భాగం. అంతా కలిసే జగన్‌ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. అందుకే రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. వీటిని పసిగట్టి జగన్‌ వెంటనే కోర్టును ఆశ్రయించటంతో... తమ పన్నాగం బెడిసికొట్టిందని గ్రహించి దీనికి ‘తల్లిపై వేసిన కేసు’గా కలర్‌ ఇస్తున్నారు. ఆస్తుల కోసం జగన్‌ తన కుటుంబీకులతోనే పోరాడుతున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు సరస్వతీ పవర్‌లో 100 శాతాన్ని షర్మిలకు ఇచ్చేస్తానని చెప్పాక... అప్పటికే 49 శాతం తల్లిపేరిట మార్పించి... తన మాటపై మరింత భరోసా కలిగేలా మిగిలిన 51 శాతాన్ని కూడా గిఫ్ట్‌గా ఇస్తానని రాసేశారంటే ఏమిటర్థం? ఆ ఆస్తిని పూర్తిగా వదులుకున్నట్లేగా? కాకపోతే కేసులున్నాయి కనక... అవన్నీ పూర్తిగా తొలగిపోయాకే ఆ షేర్లను చట్టబద్ధంగా షర్మిల పేరిట బదిలీ చేస్తానన్నారు.ఆలోగా చేయటం చట్టవిరుద్ధం కనక తాను చేయనన్నారు. అందుకే ఒరిజినల్‌ షేర్‌ సర్టిఫికెట్లు తనవద్దే ఉంచుకున్నారు. కానీ షేర్‌ సర్టిఫికెట్లు పోయాయనే అబద్ధాలతో తల్లి ద్వారా షర్మిల అలాంటి చట్టవిరుద్ధమైన పని చేసేయటంతో... విధిలేక కోర్టును ఆశ్రయించారు. ఇదీ నిజం. ఇదే నిజం.

India’s 12-year streak at home ends as New Zealand bring 18-series record to grinding halt2
టీమిండియాకు ఏమైంది..? 12 ఏళ్ల త‌ర్వాత తొలిసారి! కార‌ణాలు ఇవే?

సొంత‌గ‌డ్డ‌పై తిరుగులేని టీమిండియాకు న్యూజిలాండ్ భ‌యాన్ని ప‌రిచయం చేసింది. గ‌త 12 ఏళ్లగా టెస్టు క్రికెట్‌లో స్వ‌దేశంలో ఏక ఛత్రాధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్ దూకుడుకు కివీస్ కళ్లెం వేసింది. పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కోల్పోయింది.స్వదేశంలో చివరగా 2012లో ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. మళ్లీ ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత రెడ్ బాల్ సిరీస్‌ను ప్రత్యర్ధికి సమర్పించుకుంది. ఈ సిరీస్ ఓట‌మితో టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్‌కు చేరే అవ‌కాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్ర‌మంలో సొంత గ‌డ్డ‌పై ప్ర‌త్య‌ర్ధుల‌ను చిత్తుచేసే భార‌త్‌కు ఇప్పుడు ఏమైంద‌న్న చ‌ర్చ క్రీడావ‌ర్గాల్లో మొద‌లైంది. పుష్క‌ర కాలం త‌ర్వాత స్వ‌దేశంలో టెస్టు సిరీస్ టీమిండియా కోల్పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ఓ సారి ప‌రిశీలిద్దాం. ఓట‌మి కారణాలు ఇవే..బ్యాటింగ్ ఫెయిల్‌..టీమిండియా సిరీస్‌ను కోల్పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం బ్యాటింగ్ వైఫ‌ల‌మ్య‌నే చెప్పుకోవాలి. బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో ఒక్క స‌ర్ఫ‌రాజ్ ఖాన్,రిషబ్ పంత్‌ మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఇప్పుడు పుణే టెస్టులో కూడా అదే ప‌రిస్థితి. రెండు ఇన్నింగ్స్‌ల‌లో య‌శ‌స్వీ జైశ్వాల్ మిన‌హా క‌నీసం హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకులేక‌పోయారు.మొద‌టి టెస్టులో కివీస్ పేస‌ర్ల దాటికి 46 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టులో స్పిన్న‌ర్ల ముందు బ్యాట్లెత్తేశారు. న్యూజిలాండ్ స్పిన్నర్ల వలలో చిక్కుకుని భారత్ విల్లాడింది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు సైతం చెత్త షాట్లు ఆడి తమ వికెట్లను కోల్పోయారు. కనీసం ఒక్కరు కూడా కివీస్ బౌలర్లను అడ్డుకుని భాగస్వా‍మ్యం నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలోనే మొదటి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు కుప్పకూలిన భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 13 వికెట్లు పడగొట్టి టీమిండియా ఓటమిని శాసించాడు.నో డిఫెన్స్‌, ఓన్లీ హిట్టింగ్‌..ముఖ్యంగా ప్రస్తుత భాత జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఒక్కరికి కూడా టెస్టు క్రికెట్ ఆడే సహనం లేదు. ఒకప్పుడు సంప్రదాయ క్రికెట్ అంటే రాహుల్ ద్రవిడ్‌, లక్ష్మణ్‌, పుజారా వంటి ఆటగాళ్లు గంటల కొద్దీ క్రీజులో పాతుకుపోయేవారు. వారిని పెవిలియన్‌కు పంపేందుకు ప్రత్యర్థి బౌలర్లు తీవ్రంగా శ్రమించే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. క్రీజులోకి వచ్చామా వన్డే, టీ20 తరహాలో ఆడామా అన్నట్లు భారత బ్యాటర్ల తీరు ఉంది. హిట్టింగ్ చేసే ప్రయత్నంలో తమ వికెట్లను కోల్పోతున్నారు. అంతేకాకుండా భారత బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడానికి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో టెస్టు క్రికెట్‌లో రాణించాలంటే భారత జట్టు కచ్చితంగా స్పిన్ బలహీనతను అధిగిమించాలి.కొంప‌ముంచిన పిచ్‌..పుణే టెస్టులో భారత్‌ ఓటమికి మరో కారణం పిచ్‌. సాధారణంగా పుణే పిచ్ అటు పేస్ బౌలింగ్‌కు, స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కానీ భారత జట్టు మెనెజ్‌మెంట్ కివీస్‌పై పూర్తిగా స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించాలని చూసింది. పుణే వికెట్‌ను స్పిన్‌కు అనుకూలించేలా తయారు చేశారు.కానీ భారత్‌ అనుకున్నది ఒక్కటి.. అయింది ఒక్కటి. కివీస్‌ను స్పిన్‌తో దెబ్బ‌కొట్టాల‌ని భావించిన టీమిండియా.. అదే స్పిన్ ట్రాప్‌లో చిక్కుకుని విల్ల‌విల్లాడింది. భార‌త బ్యాట‌ర్ల‌కంటే న్యూజిలాండ్ ప్లేయ‌ర్లే స్పిన్న‌ర్ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్నారు. ఫలితంగా భార‌త గ‌డ్డ‌పై తొలి టెస్టు సిరీస్ విజ‌యాన్ని కివీస్ అందుకుంది.

Varudu Kalyani Serious On Sharila Chandrababu or Jagan Assets issue3
చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: వరుదు కళ్యాణి

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు చేతిలో వైఎస్‌ షర్మిల కీలు బొమ్మలా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. షర్మిల మాటలు వైఎస్సార్‌ కుమార్తెల లేవని విమర్శించారు.సొంత అన్న అనే అనుబంధం లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో కలిసి షర్మిల చేసే కుట్రలు చూసి, స్వర్గంలో వైఎస్సార్‌ కూడా బాధపడతారని అన్నారు. షర్మిలలో అడుగడుగునా స్వార్థం కనిపిస్తుందని దుయ్యబట్టారు.చంద్రబాబు అడుగుజాడల్లో షర్మిల నడుస్తున్నారని అన్నారు వరుదు కళ్యాణి. ఈడీ కేసుల్లో భారతి ఆస్తులు కూడా జప్తు చేశారని చెప్పారు. నాడు కేసుల్లో వైఎస్సార్‌ పేరును కాంగ్రెస్ పార్టీ చేర్చిందని.. అయితే ఆనాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా పోరాడి వైఎస్సార్‌ పేరును తొలగించారని ప్రస్తావించారు. తప్పుడు మార్గంలో షేర్లు బదిలీ చేశారని జగన్ కోర్టుకు వెళ్ళారని, షర్మిల అండ్ కో చేసే కీడు నుంచి తప్పించుకోడానికి మాత్రమే ఆయన కోర్టుకు వెళ్లారని స్పష్టం చేశారు.చదవండి:షర్మిలకు మానవత్వం ఉందా..?: టీజేఆర్‌ సుధాకర్‌బాబు‘జగన్ బెయిల్ రద్దు అయితే లక్షల కుటుంబాలు రోడ్డున పడేవి. సొంత అన్న కోసం ఇంత దారుణంగా ఎవరైనా మాట్లాడుతారా? రక్తం పంచుకొని పుట్టిన అన్న కోసం ఇలా మాట్లాడటం దుర్మార్గం. మహిళలను గొప్పగా చూసే వ్యక్తి వైఎస్ జగన్. షర్మిల చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఎవరూ నమ్మరు. 2019లో షర్మిల అధికారంలోకి తీసుకొస్తే.. 2014లో ఎందుకు అధికారానికి దూరం అయ్యాం. షర్మిల ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు కనుసన్నల్లో నడవడం దుర్మాగం. వైఎస్సార్‌ వారసత్వన్ని నిలబెట్టిన వ్యక్తి జగన్. పుట్టింటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత షర్మిలపై ఉంది. షర్మిల చంద్రబాబు కబంద హస్తాల నుంచి బయటకు రావాలి’ అని వరుదు కళ్యాణి తెలిపారు.

Story About Business Tycoon Isha Ambani Sister in law Nandini Piramal4
అంబానీ అల్లుడితో సమానంగా బాధ్యతలు.. ఎవరీ నందిని?

భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ.. తన కుమార్తె 'ఇషా అంబానీ'కి వ్యాపార రంగానికి చెందిన అజయ్ పిరమల్ కుమారుడు 'ఆనంద్ పిరమిల్'తో వివాహం జరిపించారు. ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న పిరమల్ వ్యాపార సామ్రాజ్యంలో 'నందిని పిరమల్' కీలకమైన వ్యక్తి. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె నెట్‍వర్త్ ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ నందిని పిరమల్?నందిని పిరమల్ అజయ్ పిరమల్ కుమార్తె. ఈమె పిరమల్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలు. నందిని తన తల్లిదండ్రులు అజయ్, డాక్టర్ స్వాతి పిరమల్.. సోదరుడు ఆనంద్ పిరమల్‌తో కలిసి కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ప్రస్తుతం పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, పిరమల్ ఫార్మా చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఓవర్-ది-కౌంటర్ (OTC) వ్యాపార విభాగాన్ని పర్యవేక్షించడం ఆమె ప్రధాన పాత్ర వహిస్తోంది.నందిని పిరమల్ నాయకత్వంలో ఓటీసీ విభాగం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటిగా మారింది. దీని అనేక ఉత్పత్తులు వాటి సంబంధిత విభాగాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. అంతే కాకుండా ఆమె పిరమల్ గ్రూప్‌లో హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అధిపతిగా ఉంది.2010లో నందిని కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి. ఆమె పిరమల్ గ్రూపుకు చెందిన దేశీయ ఫార్ములేషన్స్ వ్యాపారాన్ని అబాట్ లాబొరేటరీస్‌కు విక్రయించడంలో కీలక పాత్ర పోషించింది. 3.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 31,638 కోట్లు) విలువైన ఈ డీల్ ఆ సమయంలో భారతీయ ఔషధ రంగంలో అతిపెద్ద లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగునందిని పిరమల్ కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్, ఫిలాసఫీ, ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది. చదువు పూర్తయిన తరువాత మెకిన్సే & కంపెనీలో బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేసింది. ఆ తరువాత 2006లో కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టింది.ఇదీ చదవండి: దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్2009 మార్చిలో నందిని.. పీటర్ డీ యంగ్‌ను వివాహం చేసుకుంది. పీటర్ పిరమల్ గ్లోబల్ ఫార్మా సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతడు కూడా స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలోనే చదువుకున్నాడు. ఆ తరువాత మెకిన్సే & కంపెనీలో పనిచేసారు. నందిని పిరమల్ నెట్‍వర్త్ గురించి అధికారిక వివరాలు అందుబాటులో లేదు. కానీ ఈమె తండ్రి అజయ్ పిరమల్ నికర విలువ 2.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 23,307 కోట్లు). 2023 ఆర్ధిక సంవత్సరంలో పిరమల్ గ్రూప్ రూ. 9087 కోట్ల ఆదాయాన్ని గడించింది.

KSR Comment On Chandrababu Super Six And Jagan Sharmila assets issue5
Chandrababu: ఏమిటో.. అవన్నీ సిగ్గుపడాల్సిన విషయాలు కావట!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరే వేరుగా ఉంటుంది. అసత్యాలను సమర్ధంగా, అలవోకగా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అని ఎవరైనా ఒప్పుకోవల్సిందే. 2024 ఎన్నికలలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలను మాయ చేసిన చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న అత్యాచారాలు, హత్యలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నా, వాటి గురించి ప్రస్తావించడం లేదు .పలు గ్రామాలలో డయేరియా వ్యాపిస్తున్నా, దానిపై ఆయన సీరియస్‌గా స్పందించడం లేదు. ప్రస్తుతం ఆయనకు మెయిన్ సబ్జెక్ట్ ఏమిటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన సోదరి షర్మిల మధ్య జరుగుతున్న పరిణామాలు వివాదంగా కనిపిస్తుంది. తనకు సంబంధం లేదంటూనే ఆయన చేయవలసిన విమర్శలన్నీ చేశారు. పైగా అన్నిటిని మించి జగన్‌కు సమాధానం చెప్పవలసి రావడం ఆయనకు సిగ్గు అనిపిస్తోందట. తల్లి, చెల్లిని జగన్ రోడ్డుపైకి లాగారట. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో చూడండి. షర్మిల తన సోదరుడు జగన్ బెయిల్ రద్దు అయినా ఫర్వాలదన్నట్లుగా వ్యవహరిస్తుంటే, ఆమెకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు. సడన్‌గా షర్మిల మీద ఆయనకు సానుభూతి ఏర్పడింది. ఆమె తన రాజకీయ ట్రాప్‌లో నుంచి జారి పోకుండా, ఆమెను అడ్డం పెట్టుకుని కధ నడిపిస్తూ, ఇతర ముఖ్యమైన అంశాలను డైవర్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. మాజీ మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాదానాలు చెప్పగలిగితే , అవి కన్విన్సింగ్‌గా ఉంటే కచ్చితంగా చంద్రబాబు ఎవరికి సిగ్గుపడనవసరం లేదు. ఒకవైపు జగన్‌పై కుట్రలు చేస్తూ, ఇంకో వైపు ఏమీ ఎరగనట్లుగా నటించడం చంద్రబాబు అర్ట్‌గా చెప్పాలి. ఆయన చేసిన ఒక వ్యాఖ్యను గమనించండి. ఆస్తి ఇవ్వడానికి తల్లి, చెల్లికి కండిషన్లు పెట్టే జగన్, ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి షరతులు పెడతారో అని ఆయన అన్నారని టీడీపీ మీడియా పేర్కొంది. ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తానని ఊహించలేదు. ఇవేం చిల్లర రాజకీయాలు? అలాంటి వారికి సమాధానం చెప్పడానికి సిగ్గు అనిపిస్తోందని ఆయన అంటున్నారు.సిగ్గుపడాల్సిన విషయం కాదటఅసలు ఎవరికి అర్దం కాని విషయం ఏమిటంటే సొంత కుటుంబంలో గత నాలుగు దశాబ్దాలుగా సాగిన ఉదంతాలపై సిగ్గు పడకుండా, జగన్ కుటుంబంలో వివాదాలపై చంద్రబాబు సిగ్గుపడడం ఏమిటో ఎవరికి అర్దం కాదు. సూపర్ సిక్స్ హామీలు అంటూ చేసిన హామీలను అమలు చేయలేకపోవడం సిగ్గుపడాల్సిన పని కాదట. మహిళాశక్తి అంటూ ప్రతి మహిళకు 1500 ఇస్తానని చెప్పి మహిళా లోకానికి ఆశపెట్టి ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం విషయమే కాదట. తల్లికి వందనం పేరుతో, నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ చిన్నపిల్ల్ని సైతం చాక్లెట్ల మాదిరి ఊరించి చివరకు ఇవ్వకుండా మోసం చేయడం సిగ్గుపడాల్సిన విషయం కాదట. షర్మిలకు జగన్ అదనంగా ఇస్తానని చెప్పిన ఆస్తులు ఇవ్వలేదని చంద్రబాబు సిగ్గుపడతారట. ఒక పక్క తానిచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు షరతులు పెడుతూ ప్రజలకు సేవ చేయడానికి జగన్ ఎలాంటి షరతులు పెడతారో అంటూ ఈయన సిగ్గు పడుతున్నారట. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను జగన్ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేసిన విషయాన్ని కప్పిపుచ్చడానికి బాబు ఎలాంటి డ్రామా ఆడుతున్నారో. చంద్రబాబు సుద్దులు చెబుతున్నారు..జగన్‌వి చిల్లర రాజకీయాలట. ప్రతిపక్షంలో ఉన్నా , అధికారపక్షంలో ఉన్నా చిల్లర విషయాల్ని సైతం తన రాజకీయాలకు వాడుకునే చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. సరే! జగన్, షర్మిల మధ్య ఏదో వివాదం నడుస్తోంది. మరి చంద్రబాబు కుటుంబంలో అసలు వివాదాలే జరగలేదా! ఆయన చేసినవి చాలా నాణ్యమైన రాజకీయాలా? లేక నాసిరకం రాజకీయాలా? అన్నవి ఆయన గత చరిత్ర చూస్తేనే తెలిసిపోతుంది కదా. 1978 కాంగ్రెస్ టికెట్‌ పొంది గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లో గ్రూప్‌ రాజకీయాలు నడపడం, పార్టీనుంచి సస్పెండ్ అవ్వడం, మామ ఎన్టీఆర్ మీదనే పోటీచేస్తానని తొడకొట్టి సవాల్ చేయడం, ఆ తర్వాత తుస్సుమని జారుకోవడం ఆయన దృష్టిలో ఇవేవీ చిల్లర రాజకీయాలు కాకపోవచ్చు. 1983లో కాంగ్రెస్ అభ్యర్దిగా ఘోర పరాజయం తర్వాత తన భార్యను అడ్డంపెట్టుకొని మామ ఎన్టీఆర్‌పై ఒత్తిడి తెచ్చి టీడీపీలో చేరడానికి నానా తంటాలు పడడం, విలువలతో కూడిన రాజకీయమని చంద్రబాబు భావన కావచ్చు. పార్టీలోకి వచ్చాక టీడీపీలో ఒక వర్గాన్ని నడిపి చివరకు తన మామ ఎన్టీఆర్ సీఎం కుర్చీకే ఎసరు పెట్టడం అత్యంత విలువైన రాజకీయమని ఆయన ఉద్దేశ్యం. ఇందుకోసం వైస్రాయ్ హోటల్‌ను వేదికగా చేసుకోవడం, అక్కడకు తన భార్య లక్ష్మీపార్వతితో కలిసి వచ్చిన ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం చాలా ఆప్యాయతతో కూడిన రాజకీయమన్నమాట. ఇలాంటి అల్లుడిని రాజకీయంగా ఆదరిస్తానని ఎన్టీఆర్ ఊహించలేకపోయారు. ఆ విషయాన్ని ఆయనే వెల్లడిస్తూ చంద్రబాబును ఎంత ఘోరంగా దూషించారో వినడానికి సిగ్గేసింది కానీ, చంద్రబాబు రాజకీయం ప్రకారం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అప్పట్లో లక్ష్మీపార్వతిపై అభూత కల్పనలు, వదంతులు సృష్టించడం, ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవని చెప్పడం ఆయన మరణం తర్వాత తానే ఎన్టీఆర్ కు అసలైన వారసుడినని అంటూ చెప్పుకొని తిరగడానికి ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన భావించి ఉండాలి. తన బావమరిది హరికృష్ణతో జరిగిన గొడవలేవీ కుటుంబ తగాదా కాదు. హరికృష్ణను ఈయన రోడ్డు పైకి లాగలేదు. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని చంద్రబాబును విమర్శించలేదు. ఇన్ని జరిగినా చంద్రబాబు మాత్రం నీతులు చెప్పగల సమర్థుడు. చెత్త రాజకీయాలు ప్రజలను కాపాడలేవని చంద్రబాబు సెలవిచ్చారు. నాలుగు నెలల్లో ఎన్ని ఘోరాలు!మంచిదే! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోజూ చెత్తరాజకీయాలు చేయడానికి ఎక్కడా సిగ్గుపడకపోయినా ఇప్పుడు జగన్ కేవలం ప్రజాసమస్యలనే మాట్లాడుతున్నా, వాటిని చెత్త రాజకీయాలు అని ప్రచారం చేస్తున్నారు. విలువల్లేని మనుషులు సమాజానికి చేటు, కనీసం విలువలు ఉండాలి, ''బురద వేస్తాను. మీరు తుడుచుకోండి అన్నట్టుగా'' జగన్ వ్యవహరిస్తున్నారట. ఇంతకంటే అన్యాయమైన ఆరోపణ ఏమైనా ఉంటుందా? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ఈవీఎంల మాయో, మరో విధంగానో అధికారంలోకి వచ్చాక ఈ నాలుగు నెలల్లో జరిగినన్ని ఘోరాలు ఇంకెప్పుడైనా జరిగాయా? తిరుమల లడ్డూలో వాడిన నేతిలో జంతుకొవ్వు కలిసిందని దారుణైమన అబద్దపు ఆరోపణ చేయడం, ఆ తర్వాత నాలుక కరుచుకోవడం మంచి రాజకీయమవుతుందా? విలువలతో కూడిన రాజకీయమవుతుందా? చెత్త రాజకీయమవుతుందా? వరదల సమయంలో సమర్థంగా పని చేయలేక ప్రకాశం బ్యారేజ్‌ వద్దకు కొట్టుకొచ్చిన బోట్లను కుట్రగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం విలువలతో కూడిన రాజకీయం అవుతుందా? చెత్త రాజకీయం అవుతుందా? ఈ అంశాల్లో జగన్‌పై చంద్రబాబు వేసింది బురదగా చూడాలా? పన్నీరుగా చూడాలా? గాజు అద్దాల మేడలో కూర్చొని ఎదుటివాళ్లపై రాళ్లు వేసి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిని అడ్డం పెట్టుకొని ఎంతసేపూ రాజకీయ ప్రత్యర్ధులపై బురద చల్లడం , డైవర్షన్ రాజకీయాలు చేయడం ఇవన్నీ నీచ రాజకీయాల కిందకు వస్తాయా? లేక స్వచ్ఛమైన రాజకీయాల కిందకు వస్తాయా ? అనేది చంద్రబాబే ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. కానీ ఆత్మతో సంబంధం లేకుండా ఎలాంటి రాజకీయాలనైనా నడపగలిగిన చంద్రబాబునుంచి విలువలతో కూడిన రాజకీయాలను ఆశించడమంటే ఇసుకనుంచి తైలం తీసినట్టే అవతుందేమో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Prakash Raj Comments On Movie Chances6
సినిమా ఛాన్సులు పోయినా పర్వాలేదు ప్రశ్నిస్తా: ప్రకాష్ రాజ్‌

సౌత్‌ ఇండియాలో పాపులర్‌ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాష్‌ రాజ్‌ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏబీపీ స‌ద‌ర‌న్ రైజింగ్ స‌మ్మిట్‌లో పాల్గొన్న ఆయన తన కుటుంబంతో పాటు సినిమా ఛాన్స్‌ల విషయం గురించి కూడా మాట్లాడారు. తన జీవితంలో ఎక్కువగా బాధించిన ఘటనలు రెండు ఉన్నాయని ఆయన అన్నారు. తన కుమారుడి మరణమంతో పాటు స్నేహితురాలు గౌరీ (గౌరీ లంకేష్) మరణం అని ప్రకాష్‌ రాజ్‌ పేర్కొన్నాడు.ప్రకాశ్ రాజ్- లలిత పెద్ద కుమారుడు సిద్ధు (5) 2004లో మృతి చెందాడు. మేడపై గాలిపటాన్ని ఎగురవేస్తున్న సమయంలో ఒక స్టూల్‌ నుంచి జారిపడి కన్నుమూశాడు. ఆ సమయం నుంచి ప్రకాష్‌ రాజ్‌, లలిత మధ్య విభేదాలు పెరిగాయి. అలా చివరికి 2009లో లలితకు ప్రకాష్‌ రాజ్‌ విడాకులు ఇచ్చారు. అనంతరం 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను ఆయన రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, కుమారుడి మరణం తీవ్రంగా బాధపెట్టిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రకాష్‌ రాజ్‌ పంచుకున్నారు. కానీ, అలాగే బాధలో ఉండిపోతే ఎలా..? అని ముందుకు సాగానంటూ పంచుకున్నారు. 'ఆ సంఘటనతో నేను స్వార్థపరుడిగా మారలేను. నాకు కుమార్తెలు ఉన్నారు, నాకు కుటుంబం ఉంది, నాకు వృత్తి ఉంది, నాకు మనుషులు ఉన్నారు. నేనూ ఒక మనిషి, నాకు జీవితం ఉంది, నాపై ఆధారపడి ఉన్న వాళ్లకు నేను చేయాల్సింది చాలా ఉంది. అందుకే తిరిగి నిలబడ్డాను.' అని ఆయన అన్నారు.ప్రశ్నించడం ఆపనుఇండస్ట్రీలో బాల‌చంద‌ర్‌, కృష్ణ‌వంశీ, మ‌ణిర‌త్నం లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కులు ఇచ్చిన అవ‌కాశాలే తనను ఇంతటి స్థాయికి చేర్చాయని ప్ర‌కాష్‌రాజ్ గుర్తుచేసుకున్నారు. క‌థ బాగుంటే ఎలాంటి సినిమానైనా చేస్తాన‌ని ఆయన తెలిపారు. తనకు ఉన్న టాలెంట్‌కు ప్రజల నుంచి ఆదరణ, ప్రేమ వ‌ల్లే ఇక్కడ తాను న‌టుడిగా కొన‌సాగుతోన్నాన‌ని చెప్పారు. నేటి సమాజంలో గ‌ళం వినిపించ‌లేని ప్ర‌జ‌ల‌కు గొంతుక‌గా ఉంటానని ఆయన అన్నారు. సమాజంలో జరిగే త‌ప్పుల‌ను చూస్తూ నోరు మెద‌ప‌కుండా ఉండ‌లేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు సినిమా అవ‌కాశాలు కోల్పోయినా ప్ర‌శ్నించ‌డం మాత్రం ఆపనని బలంగా చెప్పారు. ఇప్పటి వరకు తనపై ఎన్ని కుట్ర‌లు పన్నినా త‌ట్టుకొని నిల‌బ‌డ్డానని ఆయన గుర్తుచేసుకున్నారు. భవిష్యత్‌లో కూడా అంతే స్థాయిలో నిల‌బ‌డ‌తానని ప్ర‌కాష్ రాజ్ అన్నారు.

Telangana Cabinet Meeting On 26 October 2024 Updates7
తెలంగాణ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలివే..

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ శనివారం(అక్టోబర్‌ 26) సాయంత్రం సమావేశమైంది. భేటీ ఇంకా కొనసాగుతోంది. కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ములుగులో సమ్మక్క సారలమ్మ వర్శిటీకి భూ కేటాయింపుతో పాటు హన్మకొండ, వరంగల్‌ జిల్లాల పరిధి పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేబినెట్‌ కీలక నిర్ణయాలు..మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ఎల్బీనగర్‌ టు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, నాగోల్‌ టు ఎల్బీనగర్‌ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు కేందద్రాల ఏర్పాటునకు ఆమోదంఉస్మానియా ఆస్పత్రి పునర్‌నిర్మాణానికి గోషామహల్‌ గ్రౌండ్స్‌ భూమి బదలాయింపుకొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌రేరాలో 54 పోస్టుల భర్తీకి నిర్ణయంములుగులో సమ్మక్కసారక్క గిరిజన యూనివర్సిటీ నిర్ణయానికి భూ కేటాయింపులుఎకరా రూ.250 చొప్పున భూమి కేటాయింపు ఇదీ చదవండి: ఆ నిర్మాణాలపై ‘హైడ్రా’ కొరడా తప్పదు: భట్టి

Bollywood PR Team Trolls On Sai Pallavi8
వీడియో షేర్‌ చేస్తూ 'సాయి పల్లవి'ని టార్గెట్‌ చేస్తుందెవరు..?

శివ కార్తికేయన్‌- సాయిపల్లవి జోడిగా నటించిన 'అమరన్‌' తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 31న విడుదలవుతోంది. మేజర్ ముకుందన్ జీవితంలోని కొన్ని సంఘటనలను తీసుకుని ఈ చిత్రాన్ని పూర్తి ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామి తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమా విడుదల నేపథ్యంలో కొందరు సాయిపల్లవిని టార్గెట్‌ చేస్తూ నెట్టింట తప్పుడు ప్రచారం చేస్తున్నారు.సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. అయితే, ఆ సమయంలో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నుంచి కొంత భాగాన్ని కట్‌ చేసి కొందరు ఇప్పుడు వైరల్‌ చేస్తున్నారు. నక్సల్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి ఆమె ఇలా చెప్పారు. 'పాకిస్తాన్‌లో ఉన్న వాళ్లు.. మన జవాన్లు టెర్రరిస్ట్‌లు అని అనుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. వాళ్లకు ఏమైనా హాని చేస్తామని భావిస్తారు. అదే సమయంలో మనకు కూడా వాళ్లు అలానే కనిపిస్తారు. ఈ రెండింటి మధ్య మనం చూసే విధానం మారిపోతుంది. ఇందులో ఎవరు రైట్..? ఎవరు రాంగ్..? అని నేను చెప్పలేను.’ అని ఆమె అన్నారు. ఇప్పుడు ఈ వీడియోను కొందరు పనికట్టుకొని సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. మన జవాన్లను టెర్రరిస్ట్‌లతో పోల్చిందంటూ ఆమెను తప్పు పడుతున్నారు.బాలీవుడ్‌ వాళ్లే టార్గెట్‌ చేస్తున్నారా..?'అమరన్‌' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా సాయి పల్లవి మాట్లాడుతూ.. బాలీవుడ్‌ నుంచి ఓ వ్యక్తి వచ్చి తన ఇమేజ్‌ను మరింత పెంచుతామంటూ పీఆర్‌ ఏజెన్సీ వారు సంప్రదించారని తెలిపింది. అయితే, దానిని తాను రిజక్ట్‌ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ‘రామాయణ’ సినిమాతో బాలీవుడ్‌కి ఆమె ఎంట్రీ ఇస్తున్నారు. కొందరు ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. సీత పాత్రలో సాయి పల్లవిని తొలగించాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా కావాలనే బాలీవుడ్‌ పీఆర్‌ టీమ్‌ వాళ్లు సాయి పల్లవిని టార్గెట్‌ చేశారని తెలుస్తోంది.The whole hatred towards #SaiPallavi is due to bad subtitle by the TV channel.She clearly says “Pakistan people will think our Soldiers as Terrorists bacause they think we are harming, Likewise for us too…May be perspective I am not sure…”pic.twitter.com/GH9V4LTxAa— Sathyamoorthy V (@sathyaonX) October 26, 2024

Delhi Bjp Chief Takes Dip In Yamuna 9
యమునలో మునకేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్‌.. ఆస్పత్రిలో చికిత్స

న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకు ఢిల్లీ బీజేపీ చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవ పెద్ద సాహసమే చేశారు. కాలుష్య కాసారంగా మారి విషపు నురగలు కక్కుతున్న యమునా నదిలో సచ్‌దేవ మునిగారు. నదిలో మునిగిన మూడు రోజుల తర్వాత సచ్‌దేవపై యమున కాలుష్యం ఎఫెక్ట్‌ పడింది.చర్మంపై దురదలు రావడంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సచ్‌దేవను శనివారం(అక్టోబర్‌ 26) ఆస్పత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నట్లు బీజేపీ పార్టీ సోషల్‌మీడియా వెల్లడించింది. యమునలో కాలుష్యం ఇంతగా పెరగడానికి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాలే కారణమని బీజేపీ విమర్శించింది. కాగా, ఢిల్లీలో కాలుష్య నివారణకు కేటాయించాల్సిన నిధులను ఆప్‌ ప్రభుత్వం దారి మళ్లించిందని నిరసన తెలపడంలో భాగంగా సచ్‌దేవ గురువారం యమునలో మునిగారు. అయితే సచ్‌దేవ యమునలో మునగడంపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్‌ విమర్శలు గుప్పించారు. అదంతా ఒక పెద్ద డ్రామా అని కొట్టిపారేశారు.ఇదీ చదవండి: అక్కడ కనిపించని దీపావళి వేడుకలు.. కారణమిదే

CE Sudhakar Reddy Attend To Inquiry On kaleshwaram Commission Harish Rao10
కాళేశ్వరం కమిషన్‌ విచారణ.. మూడుసార్లు హరీష్‌ రావు పేరు ప్రస్తావన

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌ రెడ్డి శనివారం హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల టెండర్లపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఆయన్ను విచారించింది. విచారణలో భాగంగా మాజీ జలవనరులశాఖ మంత్రి హరీష్‌ రావు పేరును సుధాకర్‌ రెడ్డి మూడుసార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టు కోసం చేసిన టెస్టుల రిపోర్టులను వ్యాప్కోస్ సంస్థకు ఇవ్వనని ఎవరు ఆదేశించారని కమిషన్‌ ప్రశ్నించగా.. ఆ సమయంలో హరీష్‌ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని, ఆయనే ఆదేశించారని తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టింది అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలోనేనని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో 40 వేల కోట్ల నుంచి 127 వేల కోట్లకు పెంచారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేవలం అదనంగా రెండు లక్షల ఎకరాల కోసమా?: కమిషన్‌డీపీఆర్‌ ప్రకారం కాఫర్‌ డ్యామ్‌కు డబ్బులు ఇచ్చాం-సుధాకర్ రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ టెండర్ల ప్రాసెస్ జరిగిందా? కమిషన్‌టెండరింగ్ ప్రాసెస్ జరగలేదు. నామినేషన్ ప్రాసెస్ ద్వారా వ్యాప్కొస్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు- సుధాకర్ రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ ప్రాసెస్ ఎందుకు చేయలేదు చెయ్యొద్దు అని ఎవరు ఆదేశించారు?- కమిషన్బ్యారేజీ పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఏ సమయంలో ఇస్తారు?- కమిషన్దాదాపు 90 శాతం పనులు పూర్తయితే సబ్ స్టాన్షల్ సర్టిఫికేట్ విడుదల చేస్తారు?- సుధాకర్ రెడ్డిపనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చేముందు ఫీల్డ్ విజిట్ లేదా డాక్యుమెంట్స్ చెక్ చేశారా?- కమిషన్ఫీల్డ్ విసిట్, డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఎలా ఇస్తారు?- కమిషన్42.2b క్లాజ్ ఉపయోగించి సర్టిఫికెట్‌ను రిజెక్ట్ చేసే అర్హత ఉన్నప్పటికీ ఎందుకు ఆపలేదు?- కమిషన్సర్టిఫికెట్ ఇచ్చేముందు అసలు నిజాలు చూడకుండా ఎలా గుడ్డిగా సంతకాలు పెడుతారు?- కమిషన్కాపర్ డ్యాం నిర్మాణం తొలగింపు కోసం అదనంగా ఖర్చు చేసే నిధులు ప్రభుత్వానికి నష్టమే కదా?- కమిషన్మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులు ఆలస్యం ఎందుకు అయ్యాయి? - కమిషన్అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులను నిర్మాణ సంస్థలు ఇచ్చాయి,.మేడిగడ్డ బ్యారేజీ ఫైనల్ బిల్లులు ఇంకా సబ్మిట్ చేయలేదు.- సుధాకర్ రెడ్డిబిల్లుల చెల్లింపుల అంశంలో కాళేశ్వరం కార్పొరేషన్ ప్రస్తావన..కాళేశ్వరం కార్పొరేషన్ ఎవరు పెట్టారు? పెట్టమని ఎవరు ఆదేశించారు;- కమిషన్కాళేశ్వరం కార్పొరేషన్ ప్రభుత్వం పెట్టింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగింది. సుధాకర్ రెడ్డిమేడిగడ్డ బ్యారేజీ కింద బొగ్గు గనుల ఆనవాళ్లు ఉన్నట్లు జోధాపూర్ యూనివర్సిటీ సర్దార్ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చింది. సుధాకర్ రెడ్డిబ్యారేజీలలో నీళ్లు స్టోరేజ్ చేయొచ్చా చేస్తే ఎంత చేయొచ్చు?- కమిషన్మేడిగడ్డ బ్యారేజీలో 100 మీటర్ల లెవెల్ వరకు స్టోర్ చేయొచ్చు.- సుధాకర్ రెడ్డిచేసుకున్న అగ్రిమెంట్ కంటే ఎక్కువ నిధులు ఏజెన్సీకి పే చేస్తే అది ప్రభుత్వానికి నష్టమే కదా- కమిషన్డిజైన్లలో లోపాల వల్ల బ్యారేజీల వద్ద డ్యామేజ్ జరిగింది నిజమేనా? - కమిషన్మేడిగడ్డ బ్యారేజీ లోని బ్లాక్ లలో లెన్త్ అండ్ విడ్త్ డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్లే డ్యామేజి జరిగింది- సుధాకర్ రెడ్డి వరద వేగాన్ని అంచనా వేయకపోవడం వల్లే బ్లాకులు దెబ్బతిన్నాయి-సుధాకర్‌ రెడ్డి.

Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
బాంబు బెదిరింపు‌లు.. సోషల్‌ మీడియాపై కేంద్రం సీరియస్

న్యూఢిల్లీ: ఇటీవల దేశీయ విమానాలతోపాటు అంతర్జాతీయ విమానాలకు న

title
Maharashtra: బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగను

title
‘నన్ను క్షమించండి’.. జేఈఈ పరీక్ష ఫెయిల్‌ అవ్వడంతో..!

న్యూఢిల్లీ: చిన్న చిన్న కారణాలతోనే విలువైన ప్రాణాలు బలి తీసు

title
రెండు చేతులు చాచి ఆహ్వానం పలుకుతున్నా అంటూ విజయ్‌ లేఖ

దళపతి విజయ్‌ కొన్ని గంటల్లో తన అభిమానులను కలవనున్నాడు.

title
యమునలో మునకేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్‌.. ఆస్పత్రిలో చికిత్స

న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి

International View all
NRI View all
title
కెనడా డ్రీమ్స్‌ : వాక్-ఇన్ ఓవెన్‌లో శవమై తేలిన వాల్‌మార్ట్‌ ఉద్యోగి

కెనడాలోని హాలిఫాక్స్‌లోని  వాల్‌మార్ట్ వాక్-ఇన్ బేకరీ ఓవెన్‌లో వాల్‌మా

title
హెచ్‌1బీ వీసా రెన్యువల్‌ కోసం తిప్పలు!

అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న మనోళ్లకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి.

title
చికాగో ఫ్యాన్స్‌ మీట్‌లో శృతిహాసన్ సందడి

శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

title
న్యూజెర్సీలో బ్రెస్ట్ కేన్సర్‌పై నాట్స్ వాక్ అండ్ టాక్ ఈవెంట్

అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో బ్రెస్ట్ కే

title
డల్లాస్‌లో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్ టోర్నీ

అమెరికాలో తెలుగు వారిని ఒక్కటి చేసే విధంగా నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Advertisement
Advertisement