Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Publicity Peak, TDP Govt Called For Tenders In News And Communications1
బాబును పాన్ ఇండియా స్టార్‌ను చేద్దాం!!

దేశంలో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్లు..పాన్ ఇండియా క్రికెటర్లు..పాన్ ఇండియా బిజినెస్ మెన్..పాన్ ఇండియా హీరోలు..పాన్ ఇండియా మార్కెట్ ఉన్న నటీనటులు.. ఇదీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న అంశం .అయితే పబ్లిసిటీ అంటే పీక కోసుకునే చంద్రబాబుకు కూడా ఇప్పుడు జాతీయస్థాయి లీడర్‌గా ఎదగాలనే పిచ్చి పట్టుకుంది. దేశంలో తన కన్నా సీనియర్ నాయకులు లేరని. మోడీ తదితరులు కూడా తనకన్నా జూనియర్లు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు పబ్లిసిటీతో అయినా సరే మీడియాను కొనేసి అయినా సరే.. లేకుంటే కొత్త పబ్లిసిటీ వ్యవస్థను ఏర్పాటు చేసి అయినా సరే యమర్జంట్‌గా పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అవ్వాలని తెగ ఆరాట పడుతున్నారు.ఈ క్రమంలోనే దావోస్ సదస్సుకు చంద్రబాబు లోకేష్ వెళ్లగా దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ప్రచారం చేసే నిమిత్తం ఎన్డీటీవీ.. ఐబీఎన్ వంటి జాతీయ ఇంగ్లీష్ ఛానల్ కు భారీ ఎత్తున డబ్బు గుమ్మరించారు. దీంతో ఆ చానళ్ళు చంద్రబాబు ఆహా ఓహో అంటూ జాకీలు పెట్టి లేపుతున్నాయి.👉చదవండి : భజన బ్యాచ్.. కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉండండమ్మాఆ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఏ మేరకు పెట్టుబడులు వస్తాయన్నది గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడే తేటతెల్లమైంది. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్న ఏటా దావో సదస్సుకు వెళ్లడం.. ఫోటోలు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఒక్క పరిశ్రమ కూడా వచ్చింది లేదు. కానీ అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరుగుతున్నాయి... అదిగో భారీ పరిశ్రమ.. ఇదిగో వేలల్లో ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టడం అందరికీ తెలిసిందే.వాస్తవానికి చంద్రబాబుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహా టీవీ, తోపాటు పదుల సంఖ్యలో వెబ్‌సైట్లు . వందల సంఖ్యలో ఫేస్‌బుక్‌,ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలు.. వేలల్లో సోషల్ మీడియా కార్యకర్తలు నిత్యం భజన చేస్తూ ఎలివేషన్లు ఇస్తున్నారు.చంద్రబాబు ప్రస్తుతం ఏం చేస్తానన్నది ప్రజలకు చెప్పారు కానీ వచ్చే పాతికేళ్లు.. రానున్న 50 ఏళ్లలో రాష్ట్రాన్ని అలా మారుస్తా? ఇలా మారుస్తా అంటూ మభ్య పెట్టడం అందరికీ తెలిసిందే. 30 ఏళ్ల కిందట విజన్ 2020 అంటూ కథలు చెప్పారు కానీ ఏమీ చేసింది లేదు. ఇప్పుడు ఏకంగా విజన్ 2047 అంటున్నారు. ఈ కథలన్నీ ప్రజలతో నమ్మించడానికి సరికొత్త ఏజెన్సీ సృష్టించడానికి ప్రభుత్వం పథకం సిద్ధం చేసింది.👉చదవండి : దావోస్ వెళ్దాం.. పబ్లిసిటీ బారెడు.. దక్కేది చెంచాడు!ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు సమాచారం అందించడానికి ప్రభుత్వం తరఫున సమాచార శాఖ ఉండనే ఉన్నది. దీనిలో ఐఏఎస్ అధికారి తో పాటు ఎంతమంది సీనియర్ జర్నలిస్టులు, జేడీలు, డీడీలు, ఏడీలు, డీపిఆర్ఓ, కేడర్లో పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్లంతా సరిపోలేదని మరో ప్రైవేట్ ఏజెన్సీని తీసుకొచ్చి చంద్రబాబు కు ఎలివేషన్..జాతీయ స్థాయి ప్రచారం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అంటే ఆ ఏజెన్సీకి ప్రజాధనం ధారవోసి చంద్రబాబుకు పబ్లిసిటీ ఇప్పిస్తారన్నమాట. దీనికోసం కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భారీ ఎత్తున సిబ్బందిని నియమించి వారితో బాబుకి ఎలివేషన్ ఇప్పిస్తారన్నమాట.దీంతోపాటు ఇద్దరు ఉద్యోగులను ప్రోగ్రాం కోఆర్డినేటర్లుగా నియమించి వారికి రూ.లక్షన్నర జీతం ఇవ్వాలని నిర్ణయించారు. వారు చంద్రబాబు పర్యటనకు..సభలు సమావేశాలకు సంబంధించిన వివరాలను మీడియాకు అందజేస్తారు. ఇటు తమ అనుకూల మీడియాకు కోట్లు దారబోస్తూనే ప్రైవేటు ఏజన్సీ ద్వారా కూడా భారీ ఎత్తున పబ్లిసిటీ చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మొత్తానికి ఎదైనాగానీ చంద్రబాబు తక్షణం జాతీయ స్థాయి నాయకుడు అయిపోవాలి..అదే టీడీపీ లక్ష్యం. 👉చదవండి : లోకేష్‌కు ఫుల్ ఎలివేషన్.. ​కాబోయే డిప్యూటీ సీఎం?సిమ్మాదిరప్పన్న

Varun Chakravarthy Shines, England All Out 132 Runs2
కోల్‌కత్తా టీ-20లో భారత్‌ ఘన విజయం

కోల్‌కాతా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్‌ విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో భారత్‌ గెలుపొందింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 133 పరుగుల టార్గెట్‌ను 12.5 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. ఈ విజయంతో 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌ నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ అభిషేక్ శర్మ 79(5 ఫోర్లు, 8 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.స్కోర్లు: ఇంగ్లాండ్‌132/9 భారత్‌ 133/3ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టీ20లో భార‌త బౌల‌ర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. భార‌త బౌల‌ర్ల దాటికి కేవ‌లం 132 ప‌రుగుల‌కే ఆలౌటైంది. తొలి ఓవ‌ర్‌లోనే విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేసి అర్ష్‌దీప్ సింగ్ భార‌త్‌కు అద్బుత‌మైన ఆరంభాన్ని ఇచ్చాడు.ఆ త‌ర్వాత మ‌ళ్లీ మూడో ఓవ‌ర్‌లో బెన్ డ‌కెట్‌ను అర్ష్‌దీప్ పెవిలియ‌న్‌కు పంపాడు. అనంత‌రం స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఒకే ఓవ‌ర్‌లో హ్యారీ బ్రూక్‌, లివింగ్ స్టోన్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బ‌తీశాడు. అయితే ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికి కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ మాత్రం అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఓవరాల్‌గా భారత బౌలర్లలో వరుణ్‌​ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్‌, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.తుది జట్లుభారత్‌: సంజూ శాంసన్ (వికెట్ కీపర్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), జోస్ బట్లర్ (కెప్ట‌తెన్‌), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన అర్ష్‌దీప్‌ సింగ్‌..

Husband Assassination Wife In Meerpet Hyderabad3
మీర్‌పేట్‌లో కిరాతం.. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడకబెట్టి..

సాక్షి, హైదరాబాద్‌: మీర్‌పేటలో దారుణం జరిగింది. డీఆర్‌డీవో కాంట్రాక్ట్‌ ఉద్యోగి గురుమూర్తి.. అనుమానంతో భార్యను కిరాతకంగా చంపేశారు. భార్య వెంకట మాధవిని చంపి ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడకబెట్టిన భర్త.. ఉండకబెట్టిన మాంసాన్ని చెరువులో పడేశారు.ఈ నెల 13వ తేదీ నుంచి వెంకట మాధవి కనిపించకుండా పోయింది. ఈ నెల 18న తన భార్య వెంకటమాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త గురుమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమర్షియల్‌ సిలిండర్‌ తీసుకొచ్చి ముక్కలను ఉడకబెట్టిన భర్త.. ముక్కలను ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చాడు. తర్వాత మృతదేహం పొడిని చెరువులో కలిపాడు. మూడు రోజుల పాటు ఇంట్లో మృతదేహాన్ని కాల్చివేసి పొడిగా మార్చేశాడు. బాడీ మొత్తాన్ని పొడిగా మార్చడంతో ఆనవాళ్లు దొరకలేదు.గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయ్యారు. 13 ఏళ్ల క్రితం వెంకటమాధవితో గురుమూర్తికి వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. తూప్రాన్‌పేట్‌లోని దండుపల్లిలో నివాసముంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని గుర్తించారు.దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించానని, ఆ తర్వాత వాటిని జిల్లెలగూడ చెరువులో పడేసినట్టు తెలిపాడు. దీంతో మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.ఇదీ చదవండి: ఓసారి మా ఇంటికొచ్చి.. టీ తాగి వెళ్లండి!

Maha Kumbh Mela As Seen From Space: ISRO Beams Down Images4
అంతరిక్షం నుంచి మహాకుంభ మేళా ఎలా కనిపిస్తుందంటే?.. ఫొటోలు విడుదల చేసిన ఇస్రో

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbh Mela)కు భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన పూర్తికానుంది. మౌని అమావాస్య (రెండో షాహీ స్నానం) వచ్చే జనవరి 29న , ఫిబ్రవరి మూడో తేదీన వసంత పంచమి రోజు (మూడో షాహీ స్నానం), ఫిబ్రవరి 12న (మాఘ పూర్ణిమ) అధిక సంఖ్యలో జనం రావచ్చని అంచనా.. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర గణాంకాల ప్రకారం జనవరి 20 నాటికి 8.81 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తాజాగా మహాకుంభ మేళాకు సంబంధించిన కొన్ని చిత్రాలను విడుదల చేసింది. స్పేస్‌ సెంటర్‌ నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. మహాకుంభ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు చేయకముందు, తర్వాత తీసిన ఫొటోలను షేర్‌ చేసింది. ఆ ఫొటోల్లో గతేడాది ఏప్రిల్‌లో మహాకుంభ్‌ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా కనబడగా, డిసెంబర్‌ 22 నాటికి నిర్మాణాలతో కనిపించింది. ఈ నెల 10న తీసిన ఫొటోల్లో ఓ పెద్ద నగరాన్ని తలపించేలా మహాకుంభ్‌ ప్రాంతం దర్శినమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇదీ చదవండి: స్వచ్ఛ కుంభమేళాకాగా, అశేష భక్త జనవాహిని తరలివస్తోన్న ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొనబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి ఐదో తేదీన ప్రధాని మోదీ త్రివేణి సంగమ స్థలిలో పుణ్యస్నానం ఆచరిస్తారని ఆయా వర్గాలు మంగళవారం తెలిపాయి. మరోవైపు ఈనెల 27వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించనున్నారు. గంగా హారతి కార్యక్రమంలోనూ పాల్గొంటారు. అధికారులతో భేటీ కానున్నారు. అమిత్‌ షా వారంరోజుల్లో వస్తుండటంతో కుంభమేళాలో భద్రతను మరోసారి సమీక్షించారు. ప్రధాన కూడళ్ల వద్ద మరోసారి తనిఖీలుచేశారు. Maha Kumbh Tent City, Prayagraj, India as viewed by EOS-04 (RISAT-1A) satellite. 🛰️#MahaKumbh2025 #ISRO pic.twitter.com/J9nT6leYIJ— ISRO InSight (@ISROSight) January 22, 2025

Major Train Accident in Maharashtra5
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి

ముంబై : మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జల్‌గావ్‌ జిల్లా పరండా రైల్వేస్టేషన్‌ సమీపంలో ‍ట్రైన్‌ ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంపై ప్రయాణికుల తెలిపిన వివరాల మేరకు.. జల్‌గావ్‌ జిల్లా పరండా రైల్వేస్టేషన్‌ సమీపంలోని పాచోరా ప్రాంతంలో వేగంగా వెళ్తున్న పుప్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ లోకో పైలెట్‌ బ్రేకులు వేశారు. బ్రేకులు వేయడంతో ట్రైన్‌ చక్రాల నుంచి పొగ వ్యాపించింది. దీంతో ఆ పొగను చూసిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పుప్పక్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయంటూ బిగ్గరగా అరుస్తూ ప్రాణభయంతో పరుగులు తీశారు. వారిలో 35-40 మంది ట్రైన్‌ నుంచి దూకారు. ట్రైన్‌ చైన్‌ లాగడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు పుష్పక్‌ ఎక్స్‌ ప్రెస్‌ ట్రైన్‌ నుంచి పట్టాలు దాటే ప్రయత్నం చేశారు. పట్టాలు దాటుతుండగా..ఎదురుగా వస్తున్న కర్నాటక ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారని సమాచారం. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. VIDEO | At least six persons were killed after they stepped down from their train on the tracks and were run over by another train coming from the opposite direction in North Maharashtra's Jalgaon district on Wednesday evening. Visuals from the spot near Pachora station, where… pic.twitter.com/EKQU5LE50w— Press Trust of India (@PTI_News) January 22, 2025

Nitish Kumar JDU Withdraws Support To BJP Led Government In Manipur6
బీజేపీకి షాక్‌.. కూటమికి సీఎం నితీష్‌ కుమార్‌ గుడ్‌బై.. ఎక్కడంటే?

ఇంఫాల్‌ : బీహార్‌ సీఎం నితిష్‌ కుమార్‌ (cm nitish kumar) బీజేపీకి ఝలక్‌ ఇచ్చారు. మణిపూర్‌ (manipur) బీజేపీ (bjp) నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో జనతా దళ్‌ (యునైటెడ్‌) తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జేడీయూ యూనిట్‌ అధినేత కాష్ బీరెన్ సింగ్ రాష్ట్ర అధికార బీజేపీకి మద్దతు ఉప సంహరించుకుంటున్నట్లు మణిపూర్‌ గవర్నర్‌ అజయ్‌ కుమార్‌ బహ్లాకు లేఖ రాశారు. ప్రతిపక్ష బాధ్యత వహిస్తారని సూచించారు.మణిపూర్‌లో తమపార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్‌ నసీర్‌కు అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో సీటును కేటాయించాలని కోరారు. ఇకపై రాష్ట్రంలో బీజేపీకి జేడీయూ మద్దతు ఉండబోదని, అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతారని లేఖలో పేర్కొన్నారు. గతంలో బీజేపీకి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్‌ పీపుల్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. తాజాగా, జేడీయూ సైతం కమలానికి గుడ్‌ బై చెప్పడం మణిపూర్‌ రాష్ట్ర రాజకీయాలు చర్చాంశనీయంగా మారాయి. 2022 మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు స్థానాలను గెలుచుకుంది. అయితే ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల తర్వాత ఐదురుగు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 60 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే బీహార్‌లో అభివృద్ది ఆగిపోతుందనే అనుమానాల్ని జేడీయూ నేతలు కొట్టి పారేస్తున్నారు. కేంద్ర ఎన్‌డీఏ కూటమిలో జేడీయూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాదు కూడదు అంటే .. అది బీజేపీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు.

Niranjan Hiranandani Global Pioneer In Real Estate Still Commutes In Mumbai Local Trains7
రూ.వేల కోట్ల సంపన్నుడు.. లోకల్‌ ట్రైనే ఎక్కుతాడు..

దేశంలోని కొందరు పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖలు తమ నిరాంబర శైలితో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో నిరంజన్ హీరానందని (Niranjan Hiranandani) ఒకరు. వేల కోట్ల సంపదకు అధిపతి అయినా లోకల్‌ ట్రైన్‌లోనే ప్రయాణిస్తూ పలువురి ఆదర్శంగా నిలుస్తున్నారు. రియల్ ఎస్టేట్ పరిశ్రమలో 'ఇండస్ట్రీ గురు'గా పేరొందిన ఆయన హీరానందని గ్రూప్ పేరుతో భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి కొత్త శిఖరాలకు నడిపించారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండి డేటా సెంటర్స్, ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ బిజినెస్‌ కొత్త యుగం వరకు విస్తరించిన హీరానందని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు నిరంజన్ హీరానందని నాయకత్వం వహిస్తున్నారు. తన పదునైన వ్యాపార చతురత, నైపుణ్యంతో హీరానందని గ్రూప్‌ను ప్రపంచ ఖ్యాతి పొందిన కంపెనీగా మార్చడంలో ప్రసిద్ది చెందారు. నిరంజన్ హిరానందని గురించి, ఆయన విజయవంతమైన ప్రయాణం గురించి ఈ కథనంలో తెలుసుకుందామా..?నిరంజన్ హీరానందని నెట్‌వర్త్‌హురున్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. భారతదేశంలోని 50 మంది ధనవంతులలో నిరంజన్ హీరానందనీ ఉన్నారు. నిరంజన్‌కు రూ. 12 వేల కోట్లకుపైగా విలువైన ఆస్తులు ఉన్నాయి . విలాసవంతమైన కార్ల కలెక్షన్‌ కూడా ఉంది. అయితే నిరంజన్ గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయన ఇప్పటికీ ముంబై లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తూ కనిపిస్తారు.లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణం ఇందుకే..ముంబై మహా నగరంలో ట్రాఫిక్‌ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. అంతటి ట్రాఫిక్‌లో ప్రయాణించాలంటే చాలా సమయం పడుతుంది. దీంతో టైమ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే నిరంజన్‌ హీరానందని ట్రాఫిక్‌లో సమయాన్ని వృథా చేయకుండా ముంబై లోకల్ రైలులో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. ఇలా రైలులో వెళ్తున్నప్పుడు సాధారణ వ్యక్తులతో ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చన్నది ఆయన భావన."ఆయన (నిరంజన్ హీరానందానీ) తెలివిగల పెట్టుబడి వ్యూహాలు, మార్గదర్శక పరిణామాలకు ప్రసిద్ధి చెందారు. అతని ఆర్థిక విజయం రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్దాల అంకితభావం కృషి ప్రత్యక్ష ఫలితం" అని నిరంజన్ హీరానందానీ అధికారిక వెబ్‌సైట్ తెలిపింది. "ఆయన ప్రయత్నాలు ముంబై స్కైలైన్‌ను మార్చడమే కాకుండా, పట్టణ జీవన ప్రమాణాలను కూడా మార్చేశాయి, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, స్థిరమైన జీవనం ,విలాసవంతమైన జీవనశైలి అనేకమందికి అందుబాటులోకి తీసుకువచ్చాయి" వెబ్‌సైట్ పేర్కొంది.స్వీయ నిర్మిత బిలియనీర్నిరంజన్ హీరానందని సెల్ఫ్ మేడ్ బిలియనీర్‌గా గుర్తింపు పొందారు. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్న లక్ష్యంతో సీఏ చదువును అభ్యసించిన ఆయన తర్వాత అకౌంటింగ్ టీచర్‌గా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. వాణిజ్య రంగంలో కొన్ని సంవత్సరాల తరువాత, హీరానందని తన సోదరుడితో కలిసి హీరానందని గ్రూప్‌ను స్థాపించారు. తరువాత 1981లో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. కాలక్రమేణా, హీరానందని తన దృష్టిని రియల్ ఎస్టేట్ పరిశ్రమపైకి మళ్లించి చివరికి ఆ రంగంలో తనను తాను ప్రముఖ వ్యక్తిగా స్థాపించుకున్నారు.

Mahakumbh Mela Monalisa gets Bollywood Movie Chance Goes Viral8
మహాకుంభ్ మేళా తేనే కళ్ల బ్యూటీ.. ఏకంగా సినిమాలో ఆఫర్!

సోషల్ మీడియా ఆ మహిళను ప్రపంచానికి పరిచయం చేసింది. అంతకుముందు తాను ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కాదు.. రాజకీయ నాయకురాలు అంత కన్నా కాదు. ఆమె ఓ సాధారణ మహిళ. పొట్టికూటి కోసం రోడ్డు వెంట చిన్న చితకా వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఇప్పుడేమో ఆ మహిళ ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ తెచ్చుకుంది. ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. అంతేకాదు బాలీవుడ్‌ సినిమాలో ఛాన్స్ కొట్టిసిందేనే వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటో తెలుసుకుందాం.యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహకుంభ్ మేళా మోనాలిసా అనే మహిళకు ఒక్కసారిగా ఫేమ్ తీసుకొచ్చింది. ఆమెను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. దానికి కారణం ఆమె కళ్లు. తేనేలాంటి కళ్లతో మహాకుంభ్‌ మేళాలో పూసల దండలు విక్రయిస్తున్న మోనాలిసా అనే మహిళను ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఆ తర్వాత అది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఏ సోషల్ మీడియా చూసిన ఆమె వీడియోలే దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోనాలిసా పేరు వైరల్ కావడంతో ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఆమెకు ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఏకంగా సినిమా ఛాన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాడు.మహాకుంభ్‌ మేళాలో అందరి కళ్లను తనవైపు తిప్పుకున్న తేనేకళ్ల సుందరి మోనాలిసా. ఆమెను చూసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన మూవీలో ఛాన్స్‌ ఇస్తానని ప్రకటించాడు. దీనికి కారణం ఆమెకున్న స్పెషల్ ‍అట్రాక్షన్‌ కళ్లు. ఆ అందమైన కళ్లతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తన సినిమాలో అమ్మాయి కోసం వెతుకున్న బాలీవుడ్ డైరెక్టర్‌కు మోనాలిసా గురించి తెలిసింది. డైరీ ఆఫ్ మణిపూర్ మూవీలో ఆమెకు అవకాశమివ్వనున్నట్లు సనోజ్ మిశ్రా తెలిపారు. ఆమెకు తన సినిమాలో ఓ రైతుకు బిడ్డగా నటించే పాత్ర ఇస్తానని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా వల్ల ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిన మోనాలిసా ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Mlc Varudu Kalyani Comments On Women Safety In Chandrababu Govt9
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ(YSRCP) మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి (Varudu Kalyani) ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. హోం మంత్రి సొంత జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఇద్దరు మైనర్‌ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, బెల్ట్‌ షాప్‌లు, గంజాయి, కొకైన్‌ వంటి మాదకద్రవ్యాల లభ్యతతో అసాంఘిక శక్తులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.వరుదు కళ్యాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:మహిళలకు భద్రత లేదు: రాష్ట్రంలో మహిళలు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్ళే విద్యార్ధులకు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో రోజులు గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఇంత దారుణమైన సంఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదు. భీమిలి నియోజకవర్గంలో దివ్యాంగురాలైన ఒక మైనర్‌ బాలికపైన మద్యం తాగిన దుండగుడు అత్యాచారం చేశాడు. అలాగే మరో మైనర్‌ బాలికను కారులో బలవంతంగా తీసుకువెళ్ళి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించి అక్కడ పని చేస్తున్న మహిళలపై దౌర్జన్యం చేశాడు. కర్నూలు జిల్లా కోడుమూరు మండల ప్రాధమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన స్కూల్‌ లో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కేవలం రోజుల వ్యవధిలోనే ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉంటే, ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా వీటిని నివారించడంలో విఫలమయ్యారు. మహిళల రక్షణ కోసం ఎటువంటి ప్రత్యేక చర్యలు లేవు.గతంలో జగన్‌గారి ప్రభుత్వంలో తీసుకువచ్చిన దిశ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొత్తగా ఎటువంటి వ్యవస్థను తీసుకు రాకపోవడం వల్ల నిత్యం మన రాష్ట్రంలో ప్రతి గంటకు రెండుమూడు సంఘటనలు మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఇవి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు. దీనికి ప్రధానంగా మద్యం ఏరులై పారుతోంది. 50వేలకు పైగా బెల్ట్‌షాప్‌లు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో కూడా వెలిశాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సంబరాల్లో ఇష్టారాజ్యంగా బెల్ట్‌షాప్‌లు నిర్వహించినా ప్రభుత్వం పట్టించకోలేదు. ఎనీటైం మద్యం లభించే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ మద్యం మత్తులో మందుబాబులు పట్టపగలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన జాతరలో ఎనబై శాతం మద్యం మత్తులో జరిగినవే.మాదక ద్రవ్యాల నియంత్రణలో చర్యలు ఏవీ?గంజాయిని వంద రోజుల్లో అరికడతామని చెప్పిన హోం మంత్రి తాను నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్‌ లోనూ, విశాఖ జైలు ఆవరణలోనూ గంజాయిని పండిస్తుంటే ఏం చేస్తున్నారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి సాగు జరుగుతోంది. హోం మంత్రి సొంత నియోజకవర్గం మీదుగా గంజాయి రవాణా జరుగుతోంది. సాక్షాత్తు స్పీకర్‌ చెప్పిన మాటల ప్రకారం విశాఖ కేంద్రంగా గంజాయి సాగు, రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో అసమర్థమైన పాలన జరగుతోంది. మహిళా రక్షణపై నిత్యం హోం మంత్రి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపుంజులతో ఫోటోలు దిగడం, పోలీసుల పహారాలో కోడిపందాలు, బెల్ట్‌షాపల్‌ నిర్వాహణ కొనసాగించారు.హోం మంత్రినే స్వయంగా అలా చేస్తే ఇక అసాంఘిక శక్తులకు పట్టపగాలు ఉంటాయా? మరోవైపు ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలోనే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కొకైన్‌ వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇలాంటి పరిస్థితి ఉంటే మహిళల గౌరవానికి రక్షణ లేదు. రాష్ట్రంలోని పోలీసులను ఎంతసేపు రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టేందుకే వినియోగించుకుంటున్నారు. చివరికి దావోస్‌ వెళ్ళిన మంత్రి నారా లోకేష్‌ అక్కడ కూడా తన రెడ్‌బుక్‌ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు.దాడుల ఘటనల్లో బాధితులకు భరోసా ఏదీ?:యలమంచిలి ఏటికొప్పాకలో నాలుగేళ్ళ బాలికపై లైంగిక దాడి జరిగితే రాష్ట్ర హోం మంత్రి ఏమైనా స్పందించారా? మీ పక్క నియోజకవర్గం యలమంచిలిలో రాంబిల్లి గ్రామంలో ఒక యువతిని సురేష్‌ అనే నిందితుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన జరిగి ఆరు నెలలు అయినా, నేటికీ హోమంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందించలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యతా యుతమైన ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ స్పందించి, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్నారని తెలియగానే హడావుడిగా కూటమి ప్రభుత్వంలోని మంత్రులు అక్కడికి పరుగులు పెడుతుంటారు.ఇదీ చదవండి: కూటమి సర్కార్‌.. పరిశ్రమలకు శాపం: నాగార్జున యాదవ్ఎక్కడ తమకు చెడ్డపేరు వస్తుందోనని మాత్రమే వారు స్పందిస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్దితో వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. బాధిత కుటుంబాలకు మేం అండగా ఉంటామనే భరోసాను కల్పించలేక పోతున్నారు. ఎంతసేపు రాజకీయాలు చేయడం, ఇసుక, మద్యం ఆదాయాన్ని పంచుకోవడం, సీఎం, డిప్యూటీ సీఎం అంటూ పదవులను పంచుకోవడంపైనే శ్రద్ద కనపరుస్తున్నారు. మధ్యం, మాదక ద్రవ్యాల కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయి. అందుకే వెంటనే రాష్ట్రంలోని బెల్ట్‌షాప్‌లన్నింటినీ తొలగించాలని, మద్యం విక్రయాలను నియంత్రించాలని, లేని పక్షంలో బెల్ట్‌షాప్‌లను మహిళలే ధ్వంసం చేస్తారని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు.

Jio finance enters broking industry to compete with Angel one Zerodha and other brokers10
స్టాక్‌ బ్రోకింగ్‌లోకి జియో అడుగు.. ఇక దూకుడే!

జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ (Jio Financial Services), యూఎస్‌ కంపెనీ బ్లాక్‌ రాక్‌ (BlackRock) తమ మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారంపై రూ.117 కోట్లను తాజాగా ఇన్వెస్ట్‌ చేసినట్టు ప్రకటించాయి. జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బ్లాక్‌ రాక్‌ చెరో 50 శాతం వాటాతో ‘జియో బ్లాక్‌రాక్‌ అస్సెట్‌ మేనేజర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ను ఏర్పాటు చేయడం తెలిసిందే.జియో బ్లాక్‌ రాక్‌ అస్సెట్‌ మేనేజర్స్‌కు సంబంధించి రూ.117 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లను (రూ.10 ముఖ విలువ) జియో ఫైనాన్షియల్, బ్లాక్‌రాక్‌కు (చెరో 5.85 కోట్ల షేర్లు) కేటాయించినట్టు జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వెల్లడించింది. ఇరు సంస్థలు ఇప్పటికే చెరో రూ.82.5 కోట్ల చొప్పున ఆరంభ పెట్టుబడి పెట్టడం గమనార్హం. అలాగే, ఇరు సంస్థలూ కలసి తమ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ జియో బ్లాక్‌రాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ద్వారా ‘జియో బ్లాక్‌రాక్‌ బ్రోకింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ను ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ ద్వారా స్టాక్‌ బ్రోకింగ్‌ వ్యాపారం నిర్వహించనున్నాయి. వృద్ధిలో స్టాక్‌ బ్రోకరేజ్ పరిశ్రమభారతీయ స్టాక్‌ బ్రోకరేజ్ పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధించింది. ముఖ్యంగా కోవిడ్ అనంతరం డిజిటల్ స్వీకరణలో పెరుగుదల నేపథ్యంలో ఎక్కువ మంది రిటైల్ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్‌లకు తరలివస్తున్నారు. మార్కెట్‌లు, పెట్టుబడి అవకాశాలను సులభంగా అందుకునేందుకు ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల ఇన్వెస్టర్లు మళ్లుతున్నారు. దీంతో జెరోధా (Zerodha), ఏంజిల్‌ వన్‌ (Angel One), అప్‌స్టాక్స్‌ (Upstox), ఫైవ్‌పైసా (5Paisa) వంటి ప్రముఖ సంస్థల వృద్ధికి దారితీసింది.ఈ ప్లాట్‌ఫామ్‌లు యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌లు, పోటీ ధర, అధునాతన సాధనాలను అందించడం ద్వారా పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చాయి. స్టాక్ ట్రేడింగ్‌ను ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చాయి. పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యత, ఈక్విటీ మార్కెట్లలో పెరుగుతున్న ఆసక్తి, డిజిటల్ ఫైనాన్స్‌ను ప్రోత్సహించే ప్రభుత్వ కార్యక్రమాలతో భారతీయ బ్రోకరేజ్ పరిశ్రమ అపారమైన వృద్ధి సామర్థ్యంతో బలమైన భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంది.జియో ఫైనాన్స్‌ క్యూ3 ఫలితాలుజియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 2024 డిసెంబర్‌కి అమ్మకాలలో స్వల్ప పెరుగుదలను నివేదించింది. 2023 డిసెంబర్‌ నాటి రూ. 414 కోట్ల నుంచి 5.8% వృద్ధిని నమోదు చేసి రూ. 438 కోట్లకు పెరిగాయి. అయితే ఎబిటా (EBITDA) 2.2% స్వల్ప క్షీణతను చూసింది. రూ.320 కోట్ల నుంచి రూ. 313 కోట్లకు తగ్గింది. నిర్వహణ లాభాల మార్జిన్ (OPM) కూడా క్షీణిచించింది. 2023 డిసెంబర్‌లో ఉన్న 77% నుండి 2024 డిసెంబర్‌లో 71%కి పడిపోయింది. మార్జిన్‌లలో క్షీణత ఉన్నప్పటికీ, నికర లాభం స్థిరంగా ఉంది. స్వల్పంగా 0.3% రూ. 294 కోట్ల నుంచి రూ. 295 కోట్లకు పెరిగింది. కార్యాచరణ సామర్థ్యం, మార్జిన్ కంప్రెషన్‌లో సవాళ్లు ఉన్నప్పటికీ ఇది స్థిరమైన లాభదాయకతను సూచిస్తోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
ట్రంప్‌ సంచలన నిర్ణయాలు.. మీరేమంటారు?

అందరూ ఊహించినట్టుగానే అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

title
టాప్‌ హెజ్‌బొల్లా కమాండర్‌ షేక్‌ ముహమ్మద్‌ అలీ హమాదీ హతం

బీరూట్‌ : ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( FBI ) హిట్‌ లిస

title
వణికిస్తున్న ట్రంప్‌.. అమెరికాలో బెంబేలెత్తుతున్న 7 లక్షల మంది భారతీయులు!

వాషింగ్టన్‌ : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (don

title
అమెరికా చమురు ఎగుమతులు పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంతంటే..

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యూఎస్‌ కీలక ప్రకటనలు చేస్తోంది.

title
ట్రంప్‌ మాటకు హిల్లరీ నవ్విన వేళ..

అమెరికాలో స్వర్ణయుగం తెస్తానని ట్రంప్‌ ప్రమాణస్వీకార ప్రసంగంలో పలు ప్రతిజ్ఞలు చేస్తున్నవేళ విపక్ష నాయకురాలు, అమెరికా మాజ

NRI View all
title
ట్రంప్‌ సంచలన నిర్ణయాలు.. మీరేమంటారు?

అందరూ ఊహించినట్టుగానే అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

title
ఆమెకున్న తెలివితేటలకు హ్యాట్సాఫ్‌!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రమాణస్వీకారోత్సవం సంద

title
తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మీట్ అండ్ గ్రీట్’

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో జనవరి 18న ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం జరిగింది.

title
డుం.. డుం.. డుం..

ప్రేమ‌కు స‌రిహ‌ద్దులు లేవ‌ని నిరూపించింది త‌మిళ‌నాడుకు చెందిన ఓ యువ‌తి.

title
ట్రంప్‌, జేడీ వాన్స్‌ ప్రమాణం.. ప్రత్యేక ఆకర్షణగా ఉషా చిలుకూరి

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప

National View all
title
అంతరిక్షం నుంచి మహాకుంభ మేళా ఎలా కనిపిస్తుందంటే?.. ఫొటోలు విడుదల చేసిన ఇస్రో

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో

title
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి

ముంబై : మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.

title
వణికిస్తున్న ట్రంప్‌.. అమెరికాలో బెంబేలెత్తుతున్న 7 లక్షల మంది భారతీయులు!

వాషింగ్టన్‌ : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (don

title
బీజేపీకి షాక్‌.. కూటమికి సీఎం నితీష్‌ కుమార్‌ గుడ్‌బై.. ఎక్కడంటే?

ఇంఫాల్‌ : బీహార్‌ సీఎం నితిష్‌ కుమార్‌ (cm nitish kumar) బీజ

title
Delhi Election: కేజ్రీవాల్‌ ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎ‍న్నికలు జరగనున్నాయి.

Advertisement
Advertisement