Top Stories
ప్రధాన వార్తలు

‘ఫిరాయింపు’లపై ప్రారంభమైన విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు తామేం పార్టీ ఫిరాయించలేదంటూ అఫిడవిట్లలో పేర్కొన్నారు. తాజాగా.. పిటిషనర్ల ఉద్దేశాలను తప్పుబడుతూ స్పీకర్ తరఫున కౌంటర్ను అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేశారు.‘‘రీజనబుల్ టైం అంటే గరిష్టంగా మూడు నెలలే అని అర్థం కాదు. ఒక్కో కేసు విచారణకు ఒక్కో రకమైన సమయం అవసరం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. కానీ, స్పీకర్కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టుకు వెళ్లారు. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే.. న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. .. అనర్హత పిటిషన్ లను విచారించి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం స్పీకర్ కే ఉంది. గత సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. స్పీకర్కు ఫిర్యాదు చేసిన వెంటనే....పిటీషనర్లే దురుద్దేశపూర్వకంగా కోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్నది సరికాదని.. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని.. కాబట్టి ఈ పిటిషన్లను డిస్మిస్ చేయాలి’’ అని కోరారు. దీంతో ఇవాళ జరగబోయే విచారణపై ఆసక్తి నెలకొంది. 👉కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు అయ్యింది. పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలైంది. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది సుప్రీం కోర్టు(Supreme Court). కేటీఆర్, పాడి కౌశిక్రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు ఈ పిటిషన్లు వేశారు. అయితే.. 👉పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించి నెలలు గడుస్తున్నా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ క్రమంలో.. గత విచారణ సందర్భంగా స్పీకర్, స్పీకర్ కార్యదర్శి, ప్రభుత్వం, ఎన్నికల సంఘం, 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. మార్చి 22వ తేదీలోపు దీనిపై రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. కొద్దిరోజుల క్రితం మహిపాల్రెడ్డి, తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అఫిడవిట్లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సీఎంను కలిశామని తెలిపారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్కు తాము రాజీనామా చేయలేదని.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేరలేదని.. మీడియాలో వచ్చిన వార్తలలో నిజం లేదని.. కాబట్టి ఈ అనర్హత పిటీషన్లకు విచారణ అర్హత లేదని వాటిల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఉన్న ఫొటోలు, పోస్టర్లను, తమ ఫొటోలతో కూడిన పార్టీ ఫ్లెక్సీల ఫొటోలనూ అఫిడవిట్లో జత చేశారు. తాజాగా.. సోమవారం(మార్చి 24) స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి కూడా అఫిడవిట్ వేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. గతంలో తెలంగాణ స్పీకర్పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తగినంత సమయం అంటే ఎంతో చెప్పాలని కోరింది. గత విచారణలో.. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదన్న పేర్కొంది. ఈ నేపథ్యంలో.. తాజా పరిణామాల దృష్ట్యా సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందనేది చూడాలి.

చట్టం అందరికీ సమానమేనా?: స్టూడియో విధ్వంసంపై కునాల్ కమ్రా
న్యూఢిల్లీ: ముంబైలోని హాబిటాట్ స్టూడియోను కూల్చివేయడంపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా(Stand-up comedian Kunal Kamra) ఘాటుగా స్పందించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కమ్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన దరిమిలా, జరిగిన పరిణామాల నేపధ్యంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ స్టూడియో కూల్చివేతలకు ఉపక్రమించింది. దీనిని కునాల్ కమ్రా ఖండించారు. శివసేన కార్యకర్తలు స్టూడియోపై దాడిచేయడం, ఆ తరువాత ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేతలకు పాల్పడటం తగదని, చట్టం అందరికీ సమానంగా వర్తించదా? అని కమ్రా ప్రశ్నించారు.స్టూడియోను కూల్చివేయడం అర్థరహితంసోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో కునాల్ కమ్రా స్పందిస్తూ వినోద వేదిక అనేది వినోదించడానికి మాత్రమే ఉందని, దానిని నియంత్రించే హక్కు ఎవరికీ లేదని, దీనికి ప్రతిగా స్టూడియోను కూల్చివేయడం అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ఎంటర్టైన్మెంట్ వెన్యూ(Entertainment venue) అనేది అన్ని రకాల ప్రదర్శనలకు కేటాయించిన స్థలమని, తాను చేసే కామెడీకి స్టూడియో బాధ్యత వహించదన్నారు. ఒక హాస్యనటుడి మాటలకు స్పందిస్తూ స్టూడియోపై దాడి చేయడం అనేది.. టమోటాలతో వెళుతున్న లారీని బోల్తా కొట్టించినంత తెలివితక్కువ పని అని, తాను వడ్డించిన బటర్ చికెన్ వారికి నచ్చకపోవడం తన తప్పుకాదని కమ్రా పేర్కొన్నారు.పోలీసులకు, కోర్టుకు సహకరించడానికి సిద్ధంకొందరు రాజకీయ నేతలు తనను బెదిరిస్తున్నారని, అయితే వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ధనవంతుల మీద అభిమానం పెంచుకోవడానికి మాత్రమే లేదన్నారు. రాజకీయ నేతపై వేసిన జోక్ను వారు తీసుకోలేకపోవడం అనేది తన స్వభావాన్ని మార్చబోదన్నారు. తనకు తెలిసినంతవరకు నేతలను, లేదా సర్కస్గా మారిన రాజకీయ వ్యవస్థను ఎగతాళి చేయడం చట్ట విరుద్ధం కాదని కుమ్రా అన్నారు. తనపై తీసుకునే చట్టబద్ధమైన చర్య విషయంలో పోలీసులకు, కోర్టులకు సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఒక జోక్కు మనస్తాపం చెంది, విధ్వంసానికి దిగడం సరైన ప్రతిస్పందన కాదన్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా స్టూడియోను కూల్చివేసినవారి విషయంలోనూ చట్టం సమానంగా వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. ఆదివారం రాత్రి శివసేన కార్యకర్తలు హాబిటాట్ స్టూడియో(Habitat Studio), యూనికాంటినెంటల్ హోటల్పై దాడికి దిగిన తరువాత బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) స్టూడియో కూల్చివేతలు చేపట్టింది. హోటల్ బేస్మెంట్లో నిర్మించిన తాత్కాలిక షెడ్ , ఇతర నిర్మాణాలను కూల్చివేసినట్లు బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు.‘తమిళనాడుకు రండి’: శివసేన మద్దతుదారునితో కమ్రామహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగుతున్న తరుణంలో శివసేన మద్దతుదారుడొకరు ఆయనను హెచ్చరిస్తున్నట్లు ఉన్న ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్గా మారింది. 53 సెకన్ల ఈ ఆడియో క్లిప్లో కాల్ చేసిన వ్యక్తి కమెడియన్ కమ్రాను దూషిస్తూ, ముంబైలోని స్టూడియోకు జరిగినట్లే మీకూ జరుగుతుందని హెచ్చరించడం వినిపిస్తుంది.ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను జగదీశ్ శర్మ(Jagdish Sharma)గా పరిచయం చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ తాము ముంబైలోని హోటల్, స్టూడియోలపై ఏమి చేసామో చూడండి. మీరు ఎక్కడ కనిపించినా మీకు కూడా ఇలాంటి గతి పడుతుంది అని హెచ్చరించాడు. దీనికి స్పందించిన కమ్రా తాను ప్రస్తుతం తమిళనాడులో ఉన్నానని జగదీశ్ శర్మకు తెలిపారు. వెంటనే అతను ఆ దక్షిణ రాష్ట్రాన్ని సందర్శించి కొడతానని మరోమారు హెచ్చరించాడు. తరువాత అతను ‘ఎక్కడికి రావాలి?’ అని అడగగా, కమ్రా తాను తమిళనాడులో ఉన్నానని పునరుద్ఘాటించారు. తరువాత అతను ‘మా సార్తో ఒక్క నిమిషం మాట్లాడండి’ అని అంటాడు. ఆ తర్వాత కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ఇది కూడా చదవండి: అస్సలు పశ్చాత్తాప పడను: షిండే వ్యాఖ్యల కేసులో కునాల్ కమ్రా

DC Vs LSG: అదృష్టం కూడా కలిసి రావాలి.. విప్రాజ్ మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు: పంత్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 24) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ తేడాతో గెలుపొందింది. లక్నో నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన ఢిల్లీని ఆశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విప్రాజ్ నిగమ్ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్లు ఆడి గెలిపించారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 72; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 75; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మార్ష్, పూరన్ మినహా లక్నో ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు లక్నో 250 పైచిలుకు పరుగులు సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే మార్ష్, పూరన్ ఔటయ్యాక ఆ జట్టు మిడిలార్డర్ అనూహ్యంగా కుప్పకూలింది. రిషబ్ పంత్ 6 బంతుల్లో డకౌట్ కాగా.. ఆయుశ్ బదోని 4, శార్దూల్ ఠాకూర్ 0, షాబాజ్ అహ్మద్ 9, బిష్ణోయ్ 0 పరుగులకు ఔటయ్యారు. చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రెండు సిక్సర్లు బాదడంతో లక్నో 200 పరుగుల మార్కును దాటింది. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 3, కుల్దీప్ 2, విప్రాజ్, ముకేశ్ కుమార్ తలో వికెట్ తీశారు.అనంతరం 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకుంది. ఈ దశలో అశుతోష్ అద్భుతం చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ (22 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు), విప్రాజ్ నిగమ్ సాయంతో ఢిల్లీకి ఊహించని విజయాన్నందించాడు. చివరి ఓవర్ మూడో బంతికి సిక్సర్ కొట్టి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ ఇన్నింగ్స్లో డుప్లెసిస్ (29), అక్షర్ పటేల్ (22) రెండంకెల స్కోర్లు చేయగా, మిగతా వారంతా సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. లక్నో బౌలరల్లో శార్దూల్ ఠాకూర్, మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ రతీ, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు తీశారు.కాగా, ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆ జట్టు ఓటమికి ప్రత్యక్ష కారకుడయ్యాడు. తొలుత బ్యాటింగ్లో 6 బంతులు ఆడి డకౌటైన పంత్.. ఛేదనలో (ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయిన దశలో) చివరి ఓవర్ తొలి బంతికి స్టంపింగ్ మిస్ చేసి లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్ను వదిలేశాడు. పంత్ ఈ స్టంపింగ్ చేసుంటే లక్నో మ్యాచ్ గెలిచేది.మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ పంత్ ఇలా అన్నాడు. మా టాపార్డర్ బ్యాటర్లు చాలా బాగా ఆడారు. ఈ వికెట్పై ఇది చాలా మంచి స్కోర్. దురదృష్టవశాత్తు మేము ఆ స్కోర్ను కాపాడుకోలేకపోయాము. మేము ప్రారంభంలో వికెట్లు తీసినప్పటికీ.. ఇది బ్యాటింగ్ చేయడానికి మంచి వికెట్ అని తెలుసు. వారు (ఢిల్లీ) రెండు మంచి భాగస్వామ్యాలు (స్టబ్స్తో, విప్రాజ్ నిగమ్తో అశుతోష్) నెలకొల్పారు. విప్రాజ్ నిగమ్ చాలా బాగా ఆడాడు. అతడే మా నుంచి మ్యాచ్ను దూరం చేశాడు.బౌలర్లకు ఈ పిచ్పై తగినంత ఉంది. కానీ మేము కొన్ని బేసిక్స్ మిస్ అయ్యాము. చివర్లో ఒత్తిడికి లోనయ్యాము. ఇది ఇంకా తొలి మ్యాచే. ఓటమిని అధిగమించి ట్రాక్లో పడతాము. ఈ మ్యాచ్ నుండి తీసుకోవలసిన సానుకూల అంశాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఆటలో అదృష్టం కీలక పాత్ర పోషిస్తుంది. స్టంపింగ్ మిస్పై స్పందిస్తూ.. బంతి మోహిత్ ప్యాడ్లకు తాకకపోయుంటే స్టంపింగ్కు అవకాశం ఉండేది. క్రికెట్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటినే పట్టించుకుంటూ పోతే ఆటపై దృష్టి పెట్టలేము.

పార్లమెంట్కు చేరిన ‘నోట్ల కట్టల జడ్జి’ వ్యవహారం
న్యూఢిల్లీ, సాక్షి: అధికారిక బంగ్లాలో కాలిపోయిన నోట్ల కట్టలతో వార్తల్లోకి ఎక్కిన జస్టిస్ యశ్వంత్ శర్మ వ్యవహారం పార్లమెంట్కు చేరింది. ఈ అంశంపై చర్చ జరగాలంటూ లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ ఘటన న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు కలిగించడంతో పాటు ఆ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్న ఆయన.. సంబంధిత న్యాయ శాఖ మంత్రి నుంచి ఈ వ్యవహారంపై వివరణ ఇప్పించాలని స్పీకర్ను కోరారు. ఈ మేరకు లోక్సభ కార్యదర్శికి సోమవారమే లేఖ రాశారాయన. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో.. తీవ్ర అభ్యంతరాల నడుమే ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు కొలిజీయం. అయితే జస్టిస్ వర్మను హైకోర్టులోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటామని అలహాబాద్ బార్ అసోషియేషన్ నిరసనకు సిద్ధమైంది. నివారమే ఈ వ్యవహారంపై ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజేఐ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువంటూ లేని ఈ కమిటీ విచారణ.. సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కానుంది.హోలీ రోజు జడ్జి బంగ్లాలో అగ్నిప్రమాదం జరగ్గా.. ఓ గదిలో కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ వీడియోను పోలీస్ కమిషనర్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయకు సమర్పించగా.. ఆయన దానిని తన నివేదికలో పొందుపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించారు. దీనిపై సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి నివేదిక మొత్తాన్ని ఫొటోలు, వీడియోలతో సహా తన వెబ్సైట్లో పెట్టింది. వెబ్సైట్లో పెట్టిన ఆ వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు.. జస్టిస్ వర్మ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా దీనిని పేర్కొన్నారు.

ఎంఎంటీఎస్ ఘటన: నిందితుడి గుర్తించిన బాధితురాలు
హైదరాబాద్, సాక్షి: ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్నం కేసును పోలీసులు చేధించారు. నిందితుడిని మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ యువకుడిగా నిర్ధారించారు. బాధితురాలు గుర్తించడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన యువకుడు.. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో గంజాయికి బానిసై నేరాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్ రైల్లో వెళ్తున్న ఒంటరి యువతిపై అఘాయిత్యానికి యత్నించినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు.. నిందితుడిని ఫొటో ద్వారా గుర్తు పట్టింది. ఆ తర్వాతే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గంజాయి మత్తులోనే ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్ఫోన్ రిపేర్ చేయించుకుని సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్లో మేడ్చల్కు బయలుదేరింది. అయితే మహిళల కోచ్లో ఆమె యువతి ఒక్కతే ఉండగా నిందితుడు (25) ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని రైల్వే ఎస్పీ చందనా దీప్తి పరామర్శించారు. మరోవైపు ఈ ఘటన రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు సంకేతమంటూ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విరుకుపడుతోంది.

White House: ముందే లీక్.. మరీ ఇంత నిర్లక్ష్యమా?
వాషింగ్టన్: వైట్హౌజ్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరపాటున యెమెన్ యుద్ధ ప్రణాళికను ఓ జర్నలిస్టుతో పంచుకున్నారు. అదీ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటన చేయకమునుపే కావడం ఇక్కడ గమనార్హం. అమెరికా రక్షణశాఖమంత్రి పీట్ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు ఉన్న గ్రూప్లోకి ఓ యూఎస్ జర్నలిస్టుకు ప్రవేశం కల్పించారు. ఆ గ్రూప్లో అతనున్నాడనే విషయం కూడా హౌతీ రెబల్స్పై యుద్ధానికి సమాచారం పోస్ట్ చేశారు. ‘ద అట్లాంటిక్’ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ జెఫ్రీ గోల్డ్బర్గ్ స్వయంగా ఈ విషయం తెలియజేశారు. మార్చి 15వ తేదీన యెమెన్పై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ, అంతకంటే ముందే సిగ్నల్లోని గ్రూప్చాట్ ద్వారా తనకు నోటీసు అందిందని తెలిపారు. ఈ ఘటన జరిగిన రెండ్రోజుల ముందే ఆయన్ని ఆ గ్రూప్లో యాడ్ చేశారట!. అయితే అవకాశం ఉన్నా.. ఆయన ఆ సమాచారాన్ని పబ్లిష్ చేయలేదు. జెఫ్రీ ప్రకటన తర్వాత విషయం ధృవీకరించుకున్న వైట్హౌజ్ అధికారులు నాలిక కర్చుకున్నారు. ఈ విషయంలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని సోమవారం వైట్హౌజ్ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఎలాంటి దాడులు జరపుతామనే ప్రణాళిక అందులో ప్రస్తావించలేదని పేర్కొన్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. ముమ్మాటికీ ఇది భద్రతా లోపమేనంటున్న డెమోక్రట్లు.. ట్రంప్ అధికారంలోకి వచ్చాక జాతీయ భద్రతకు సంబంధించిన నిర్లక్ష్యపూరిత వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. అమెరికా నౌకలు, విమానాలపై యెమెన్ హౌతీలు దాడులు జరపడాన్ని ఖండిస్తూ.. ట్రంప్ సర్కారు సైనిక చర్యను మొదలుపెట్టింది. ‘‘హౌతీలు మీ సమయం ఆసన్నమైంది. మీ దాడులు వెంటనే ఆపేయాలి. ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ముందుగానే ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలో హౌతీలకు మద్ధతుగా ఉన్న ఇరాన్ను హెచ్చరించారాయన. మార్చి15-16 నుంచి మొదలైన దాడులు.. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడాలే లక్ష్యంగా జరుగుతున్నాయి. అయితే.. అగ్రరాజ్య దాడులను హూతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్ దళాలు ధీటుగానే అమెరికా సైనిక చర్యకు స్పందిస్తున్నాయి.

దిగొస్తున్న బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర మంగళవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు రోజున గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.81,850 (22 క్యారెట్స్), రూ.89,290 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.300, రూ.330 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.300, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.330 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.81,850 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,290 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.300 దిగి రూ.82,000కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.330 తగ్గి రూ.89,440 వద్దకు చేరింది.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?వెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినా వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,10,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

నన్ను దెబ్బ కొట్టేందుకు వాళ్లు కోట్లు ఖర్చు పెట్టారు: పూజా హెగ్డే
హిందీ, తెలుగు, తమిళం అంటూ అన్ని ఇండస్ట్రీలలో పరుగులు పెడుతున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే( Pooja Hegde). మొదట్లో మాతృభాషలో నటించడం ప్రారంభించిన ఈ మరాఠీ బ్యూటీ ఆ తరువాత హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్నారు. అయితే ప్రతి విజయం వెనుక కఠిన శ్రమ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఎన్నో అవమానాలు, బాధలు, మనస్థాపం వంటి చేదు అనుభవాలు ఉంటాయి. ఇందుకు నటి పూజా హెగ్డే అతీతం కాదు. తెలుగులో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్తో బీస్ట్ చిత్రంలో జత కట్టారు. ప్రస్తుతం నటుడు సూర్య సరసన నటించిన రెట్రో చిత్రం మే 1వ తేదీన తెరపైకి రానుంది. కాగా తాజాగా విజయ్కి జంటగా మరోసారి జననాయకన్ చిత్రంలో నటిస్తున్నారు. నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్కు జంటగా కాంచన 4 లో నటిస్తున్నారు.కాగా అగ్ర కథానాయకి రాణిస్తున్న పూజా హెగ్డే తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. తన గురించి సామాజిక మాధ్యమాల్లో ఎన్నో రకాలుగా ట్రోలింగ్స్ చేశారన్నారు. అవి తన కుటుంబాన్ని చాలా బాధించాయని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంకో విషయం ఏమిటంటే నటిగా తన ఎదుగుదలను దెబ్బ కొట్టాలని కొందరు కోట్ల రూపాయలు ఇచ్చి ట్రోలింగ్స్ చేయించారని అర్ధం అయ్యిందన్నారు. అయితే, తనపై వచ్చిన ట్రోలింగ్ చూసి తల్లిదండ్రులు బాధపడినట్లు ఆమె చెప్పారు. ఆ ట్రోలింగ్ ఆపేయాలన్నా డబ్బు చెల్లించాలని తనను కొందరు కోరారని ఆమె తెలిపారు. అయితే, తానెవరికీ ఎలాంటి చెడు చేయలేదని, అయినా తనపై ఎందుకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. అయితే కొంత కాలం తర్వాత అలాంటి ట్రోలింగ్స్ను పట్టించుకోవడం వదిలేశానని పూజా హెగ్డే చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల పైనేనని నటి పూజా హెగ్డే పేర్కొన్నారు.

7 నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో ఏప్రిల్ 7 నుంచి సేవలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందచేసినట్లు అసోసియేషన్ తెలిపింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ 26 సార్లు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు సీఈఓను, వైద్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, ఐటీ శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని కలిసి తమ ఇబ్బందులను వివరించినట్లు తెలిపారు.అయినప్పటికీ తమ సమస్యలపట్ల సానుకూల స్పందన కొరవడటంతో, ఆస్పత్రులు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయి నిర్వహించలేని దయనీయ స్థితిలో ఉన్నందున.. వచ్చేనెల 7 నుంచి పూర్తిగా సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆషా అధ్యక్షుడు డాక్టర్ కె. విజయ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం తక్షణమే రూ.1,500 కోట్లు రిలీజ్ చేయడంతో పాటు, అనంతరం చెల్లింపులపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తేగానీ ఆరోగ్యశ్రీని నిర్వహించలేని స్థితిలో నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఏకంగా రూ.3,500 కోట్ల మేర ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉందని నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ చెబుతోంది.వివిధ రూపాల్లో నిరసనలుఏప్రిల్ 7 వరకూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విజయ్కుమార్ వివరించారు. అందులో భాగంగా.. మార్చి 25న జిల్లా కలెక్టర్లు, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్స్, డీఎంహెచ్ఓలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. అంతేకాక.. తమ ఇబ్బందులను మీడియాకు వివరించనున్నట్లు తెలిపారు. మార్చి 27న ఎంఎల్ఏలు, ఎంపీలు, జిల్లా ఇన్ఛార్జిలను కలిసి వినతిపత్రాలు అందించనున్నట్లు తెలిపారు. 29న నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమాలు.. ఏప్రిల్ 3న కార్పొరేట్ హాస్పిటల్స్ హెడ్స్, ఆషా ప్రతినిధులు విజయవాడ, విశాఖపట్నంలలో ప్రెస్మీట్ల నిర్వహణకు కార్యాచరణను రూపొందించినట్లు ఆషా ప్రతినిధులు తెలిపారు.నగదు రహిత వైద్యం అందించలేంనిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 నెలల్లో 26 సార్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ బకాయిలపై ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయినప్పటికీ సర్కారు నుంచి సరైన స్పందనలేదు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఆమోదించిన బిల్లులు రూ.1,300 కోట్లు, సీఈఓ ఆమోదించనివి రూ.1,700 కోట్లు ఉన్నాయి. ఇక ఆస్పత్రులు అప్లోడ్ చేయాల్సిన బిల్స్ మరో రూ.500 కోట్ల మేర ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పెద్దఎత్తున బిల్లులు నిలిచిపోవడంతో గతేడాది నుంచే చాలావరకూ ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవల కల్పనకు వెనుకడుగు వేస్తున్నాయి. పేదలు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే.. ‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదు. నగదు రహిత వైద్యసేవలు అందించలేం’ అని యాజమాన్యాలు చెబుతున్నాయి.

ఆస్కార్ దర్శకుడిపై దాడి.. ఆచూకీ కూడా గల్లంతు
అస్కార్ అవార్డ్ గ్రహిత దర్శకుడు హమ్దాన్ బల్లాల్పై ఇజ్రాయెల్ స్థిరనివాసులు దాడి చేశారు. 'నో అదర్ ల్యాండ్' డాక్యుమెంటరీ చిత్రానికి ఆయన కో-డైరెక్టర్గా పనిచేశారు. ఈ చిత్రం విడుదల సమయంలో ఇజ్రాయెల్తో పాటు చాలా విదేశాల్లో ఉన్న ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. పాలస్తీనాకు చెందిన బల్లాల్ ఈ సినిమాలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా చూపారు. దీనిని వారు జీర్ణించుకోలేకపోయారు. ఆయనపై దాడి చేస్తామని గతంలోనే వారు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కొన్నేళ్లుగా హింస జరుగుతున్న నేపథ్యంలో 'నో అదర్ ల్యాండ్' అనే డాక్యుమెంటరీతో దర్శకుడు హమ్దాన్ బల్లాల్ సంచలనం రేపాడు. దీంతో ఆగ్రహం చెందిన ఇజ్రాయెల్లోని వలసదారులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. కారులో వెళ్తున్న బల్లాల్ను అడ్డగించిన ఇజ్రాయెల్ స్థిరనివాసులు సుమారు 20 మంది ముసుగులు ధరించి రాళ్ళు, కర్రలతో దాడి చేశారు. ఆపై ఇజ్రాయెల్ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుందని సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు చెప్పినట్లు ఆయన మిత్రుడు యువల్ అబ్రహం తెలిపారు. తీవ్రంగా గాయపడిన బల్లాల్ తల నుంచి అధిక రక్తస్రావం అవుతుందని ఆయన పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు అతని ఆచూకి ఎక్కడ ఉందో తెలియదని ఆయన చెప్పుకొచ్చాడు.
సెబీ సభ్యుల ఆస్తుల వివరాల వెల్లడికి ప్రతిపాదనలు
మరోసారి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
న్యూజిలాండ్ మళ్లీ సాధించింది.. ఇది మూడోసారి
అకాలవర్షంతో నష్ట నివారణకు ఉద్యాన పంటల్లో జాగ్రత్తలు
గురు శిష్యుల కాకమ్మ కథలు
సరైన సమయంలో రిటైర్మెంట్.. గర్వంగా ఉంది!
ఎంఎంటీఎస్ ఘటన: నిందితుడి గుర్తించిన బాధితురాలు
దిగొస్తున్న బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే..
SLBC: టన్నెల్లో మరో మృతదేహం గుర్తింపు
బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?
అమెరికాలో విద్యాశాఖను మూసేసిన ట్రంప్
'6 నెలల సమయమివ్వండి.. అర్జున్ వరల్డ్లోనే బెస్ట్ బ్యాటర్ అవుతాడు'
అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని
అమెరికాలో గుడివాడ యువకుడి బలవన్మరణం
నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
అతడిని ఆపటం ఎవరితరం కాలేదు: భారత మాజీ క్రికెటర్
హీరో నితిన్పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్కు రానన్నా..: హర్షవర్ధన్
‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’
BCCI: వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ.. వాళ్లపై వేటు
ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్.. కట్ చేస్తే! ఆ జట్టు కెప్టెన్గా డేవిడ్ వార్నర్
సెబీ సభ్యుల ఆస్తుల వివరాల వెల్లడికి ప్రతిపాదనలు
మరోసారి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
న్యూజిలాండ్ మళ్లీ సాధించింది.. ఇది మూడోసారి
అకాలవర్షంతో నష్ట నివారణకు ఉద్యాన పంటల్లో జాగ్రత్తలు
గురు శిష్యుల కాకమ్మ కథలు
సరైన సమయంలో రిటైర్మెంట్.. గర్వంగా ఉంది!
ఎంఎంటీఎస్ ఘటన: నిందితుడి గుర్తించిన బాధితురాలు
దిగొస్తున్న బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే..
SLBC: టన్నెల్లో మరో మృతదేహం గుర్తింపు
బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?
అమెరికాలో విద్యాశాఖను మూసేసిన ట్రంప్
'6 నెలల సమయమివ్వండి.. అర్జున్ వరల్డ్లోనే బెస్ట్ బ్యాటర్ అవుతాడు'
అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని
అమెరికాలో గుడివాడ యువకుడి బలవన్మరణం
నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
అతడిని ఆపటం ఎవరితరం కాలేదు: భారత మాజీ క్రికెటర్
హీరో నితిన్పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్కు రానన్నా..: హర్షవర్ధన్
‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’
BCCI: వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ.. వాళ్లపై వేటు
ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్.. కట్ చేస్తే! ఆ జట్టు కెప్టెన్గా డేవిడ్ వార్నర్
సినిమా

హారర్ కామెడీ షురూ
వరుణ్ తేజ్ హీరోగా ‘వీటీ 15’(వర్కింగ్ టైటిల్) సినిమా షురూ అయింది. రితిక నాయక్ హీరోయిన్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లోప్రారంభమైంది.‘‘ఇండో–కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతోన్న చిత్రం ‘వీటీ 15’. సోమవారం నుంచే హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ప్రారంభించాం. వరుణ్ తేజ్ సరికొత్త పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: తమన్.

మీకు.. సమస్య ఎందుకు ?
సల్మాన్ ఖాన్ , రష్మికా మందన్నా జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మించిన హిందీ చిత్రం ‘సికందర్’. ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈవెంట్లో సల్మాన్ ఖాన్ , రష్మికా మందన్నాల మధ్య 31 సంవత్సరాల వయసు వ్యత్యాసం విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ–‘‘నాకు, హీరోయిన్ కు (రష్మికా మందన్నాను చూస్తూ..) మధ్య ఏ సమస్య లేదు. హీరోయిన్ తండ్రికీ ఏ ఇబ్బంది లేదు.మరి.. మీకు సమస్య ఎందుకు భాయ్? (ఆడియన్స్, నెటిజన్లను ఉద్దేశిస్తూ కావొచ్చు). భవిష్యత్లో హీరోయిన్ కు వివాహం జరిగి, ఆమెకు ఓ కుమార్తె జన్మించి, ఆ అమ్మాయి కూడా ఇండస్ట్రీలో స్టార్ అయితే తనతోనూ కలిసి నటిస్తాను. వాళ్ల అమ్మ అనుమతి తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మా కెరీర్లో రాబిన్ హుడ్ బెస్ట్: వెంకీ కుడుముల
‘‘అవసరం ఉన్న వారి కోసం నిలబడే హీరో ‘రాబిన్హుడ్’. మా చిత్ర కథకి ఈ టైటిల్ యాప్ట్. ఈ మూవీ చాలా వైవిధ్యంగా ఉంటుంది. మంచి సందేశం కూడా ఉంటుంది. నితిన్, నా కెరీర్లో ‘రాబిన్ హుడ్’ బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రం ఇది’’ అని డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్పారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.ఈ సందర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘భీష్మ’ సినిమా తర్వాత చిరంజీవిగారి కోసం ఒక కథ అనుకున్నాను. ఆయనకి ఫస్ట్ ఐడియా చెప్తే చాలా ఎగై్జట్ అయ్యారు. అయితే ఎక్కడో ఓ దగ్గర చిరంజీవిగారిని సంతృప్తి పరచలేకపోయాను. దీంతో మరో కథతో వస్తానని ఆయనకి చెప్పాను. కచ్చితంగా చిరంజీవిగారితో సినిమా చేస్తాను. నేను చెప్పిన ‘రాబిన్ హుడ్’ ఐడియా నితిన్కి నచ్చింది. ‘భీష్మ’ సినిమాతో నాకు, నితిన్కి మధ్య మంచి బంధం ఏర్పడింది. మైత్రీ మూవీ మేకర్స్ రాజీ పడకుండా సినిమాని నిర్మించారు’’ అని తెలిపారు.వార్నర్ సరదాగా తీసుకున్నారుఇదిలా ఉంటే... ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ గురించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మీ అబీప్రాయం ఏంటి? అని వెంకీని అడిగితే... ‘‘ఫంక్షన్ అయిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్గారి మాటలకు అర్థం ఏమిటనేది నేను వార్నర్గారికి చెప్పాను. ఆయన నవ్వి.. క్రికెట్లో కూడా ఇలాంటివి సహజమే అన్నారు. సీనియర్ ఆర్టిస్టుగా రాజేంద్ర ప్రసాద్గారు తన కోస్టార్స్ని చిన్న పిల్లల్లా అనుకుని, అలా సరదాగా అంటుంటారు. వార్నర్గారిని కూడా అలా సరదాగా అన్నారు’’ అని పేర్కొన్నారు.

శివభక్తుడిగా మారిపోయా: విష్ణు మంచు
‘‘నేను ఆంజనేయస్వామి భక్తుడిని. కానీ ‘కన్నప్ప’ సినిమా ప్రయాణంతో శివభక్తుడిగా మారిపోయాను. మా చిత్రం అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని విష్ణు మంచు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూపొందిన సినిమా ‘కన్నప్ప’. మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. కాగా హైదరాబాద్లో జరిగిన ‘రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘కన్నప్ప’ యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్రని ఆడియన్స్ ఎంత ఊహించుకున్నా.. అంతకుమించి ఉంటుంది’’ అని తెలిపారు.‘‘2016 జనవరిలో నేను శ్రీకాళహస్తికి వెళ్లి శివుణ్ణి దర్శించుకున్నాను. ఆ శివుడే నన్ను ‘కన్నప్ప’ప్రాజెక్ట్లోకి పంపించాడు. అదే శివ లీల’’ అని చెప్పారు ముఖేష్ కుమార్ సింగ్. బ్రహ్మాజీ, రఘుబాబు పాల్గొన్నారు.
న్యూస్ పాడ్కాస్ట్

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...

25 ఏళ్లపాటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొద్దు... చెన్నైలో జేఏసీ తొలి సమావేశంలో తీర్మానం

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు మాయం... దాదాపు 2 లక్షల మేర తగ్గిపోయిన ఉద్యోగుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్లో హజ్ యాత్రికులకు కూటమి సర్కార్ ద్రోహం... ఏపీ హజ్ కమిటీ ఇచ్చిన లేఖ ఆధారంగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను రద్దు చేసిన కేంద్రం

‘చేతి’లో ఉన్నంత కాలం.. పాలన పరుగు!. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 3లక్షల4వేల965 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి

భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్, విల్మోర్

‘బీసీ’ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం...

‘విద్య’లో గందరగోళం.. లక్ష్యం బడికి తాళం. ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యను భ్రష్టు పట్టిస్తోన్న కూటమి ప్రభుత్వం

బీఆర్ఎస్ నాయకుల స్టేచర్ గుండుసున్నా.. కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా, ప్రతిపక్ష నేతగా ఉండాలి, నేను సీఎంగా ఉండాలి ..రేవంత్రెడ్డి
క్రీడలు

రాహుల్ తండ్రయ్యాడు...
కేఎల్ రాహుల్ ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ ఢిల్లీ తరఫున తొలి మ్యాచ్లో బరిలోకి దిగలేదు. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్కు దూరమైనట్లు ముందుగా ఫ్రాంచైజీ ప్రకటించింది. మ్యాచ్ సాగుతున్న సమయంలో రాహుల్ శుభవార్త ట్వీట్ చేశాడు. తమకు అమ్మాయి పుట్టినట్లు రాహుల్, అతియా శెట్టి ప్రకటించారు. 2023 జనవరిలో వీరిద్దరి పెళ్లి జరిగింది.

అరుంధతి రెడ్డి తొలిసారి...
న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్ (2024–25)ల జాబితాను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మొత్తం 16 మంది ప్లేయర్లను ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రేడ్లుగా విభజించి బోర్డు కాంట్రాక్ట్లు అందించింది. గత సీజన్లో ఈ జాబితాలో 17 మంది ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 16కు తగ్గింది. 2022 అక్టోబర్ తర్వాత భారత జట్టుకు ఆడని ఆంధ్ర ఓపెనింగ్ బ్యాటర్ సబ్బినేని మేఘన, 2023 జనవరి తర్వాత టీమిండియాకు ప్రాతినిధ్యం వహించని ఆంధ్ర లెఫ్టార్మ్ పేస్ బౌలర్ అంజలి శర్వాణిలకు కొత్త కాంట్రాక్ట్ జాబితాలో స్థానం లభించలేదు. హైదరాబాద్కు చెందిన పేస్ బౌలర్ అరుంధతి రెడ్డికి తొలిసారి ఈ అవకాశం దక్కింది. అరుంధతి భారత్ తరఫున 5 వన్డేలు, 33 టి20 మ్యాచ్లు ఆడింది. ఆరుగురు ప్లేయర్లను కాంట్రాక్ట్ నుంచి తొలగించి ఐదుగురిని కొత్తగా ఎంపిక చేశారు. అనూహ్యాలేమీ లేకుండా టాప్ ప్లేయర్లు కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్, ఓపెనర్ స్మృతి మంధాన, ఆల్రౌండర్ దీప్తి శర్మలు ‘ఎ’ గ్రేడ్లోనే కొనసాగుతున్నారు. గత ఏడాది అక్టోబర్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయినా... షఫాలీ వర్మ తన ‘బి’ గ్రేడ్ కాంట్రాక్ట్ను నిలబెట్టుకోవడం విశేషం. హెడ్ కోచ్ అమోల్ మజుందార్, సెలక్షన్ కమిటీ చైర్మన్ నీతూ డేవిడ్ సిఫారసు ప్రకారం బోర్డు ఈ కాంట్రాక్ట్లను అందించింది. భారత క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితా గ్రేడ్ ‘ఎ’ (ఏడాదికి రూ. 50 లక్షలు): హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ. గ్రేడ్ ‘బి’ (ఏడాదికి రూ. 30 లక్షలు): రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ. గ్రేడ్ ‘సి’ (ఏడాదికి రూ. 10 లక్షలు): యస్తిక భాటియా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్జోత్ కౌర్, ఉమా ఛెత్రి, స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్.

IPL 2025: విశాఖలో అశుతోష్ ‘షో’
లక్నోతో మ్యాచ్లో 210 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ స్కోరు 113/6... మరో 45 బంతుల్లో 97 పరుగులు రావాలి. అశుతోష్, తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న విప్రాజ్ కలసి 22 బంతుల్లో 55 పరుగులు జోడించి ఆశలు రేపారు. మరో 42 పరుగులు చేయాల్సిన స్థితిలో విప్రాజ్ వెనుదిరగడంతో ఢిల్లీ గెలుపు కష్టమనిపించింది. కానీ అశుతోష్ మరోలా ఆలోచించాడు. తాను ఎదుర్కొన్న తర్వాతి 8 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్స్లతో 35 పరుగులు బాది జట్టును విజయతీరం చేర్చాడు. మూడు బంతులు మిగిలి ఉండగానే గెలిపించి టీమ్ మెంటార్ పీటర్సన్ను అనుకరిస్తూ విజయనాదం చేశాడు. గెలుపునకు చేరువగా వచ్చి అనూహ్యంగా ఓడటంతో లక్నో కొత్త కెపె్టన్ పంత్లో తీవ్ర నిరాశ కనిపించింది. సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ పైచేయి సాధించింది. సోమవారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో లక్నోపై చిరస్మరణీయ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (30 బంతుల్లో 75; 6 ఫోర్లు, 7 సిక్స్లు), మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 72; 6 ఫోర్లు, 6 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్కు 42 బంతుల్లోనే 87 పరుగులు జోడించారు. అనంతరం ఢిల్లీ 19.3 ఓవర్లలో 9 వికెట్లకు 211 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు) అద్భుత బ్యాటింగ్తో జట్టును గెలిపించగా... విప్రాజ్ నిగమ్ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్లు), ట్రిస్టన్ స్టబ్స్ (22 బంతుల్లో 34; 1 ఫోర్, 3 సిక్స్లు) అండగా నిలిచారు. పంత్ విఫలం... లక్నో ఇన్నింగ్స్ను మార్ష్ దూకుడుగా మొదలు పెట్టగా, తడబడుతూ ఆడిన మార్క్రమ్ (13 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) ఆరంభంలోనే వెనుదిరిగాడు. అయితే మార్ష్, పూరన్ భాగస్వామ్యం ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించింది. వీరిద్దరు వరుస బౌండరీలతో చెలరేగి ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిక్యం కనబర్చారు. ఈ జోరులో 21 బంతుల్లోనే మార్ష్ హాఫ్ సెంచరీ పూర్తయింది. మార్ష్ వెనుదిరిగిన అనంతరం వచ్చిన రిషభ్ పంత్ (6 బంతుల్లో 0) డకౌటై నిరాశపర్చాడు. ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్తో లక్నో 33 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు చేజార్చుకుంది. అయితే చివరి రెండు బంతుల్లో డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) రెండు సిక్స్లు బాదడంతో స్కోరు 200 పరుగులు దాటింది. ఆ రెండు ఓవర్లు... లక్నో ఇన్నింగ్స్లో రెండు వేర్వేరు ఓవర్లు హైలైట్గా నిలిచాయి. తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన లెగ్స్పిన్నర్ విప్రాజ్ నిగమ్ వేసిన 7వ ఓవర్లో తొలి బంతికి మార్ష్ సిక్స్ కొట్టగా, అదే ఓవర్లో పూరన్ 3 సిక్సర్లు బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పూరన్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను రిజ్వీ వదిలేశాడు. స్టబ్స్ వేసిన 13వ ఓవర్లో పూరన్ పండగ చేసుకున్నాడు. తొలి బంతికి పరుగు రాకపోగా, తర్వాతి ఐదు బంతుల్లో అతను వరుసగా 6, 6, 6, 6, 4 కొట్టడం విశేషం. దాంతో మొత్తం 28 పరుగులు లభించాయి. అద్భుత పోరాటం... ఆరంభంలో ఢిల్లీ స్కోరు 7 పరుగులకు 3 వికెట్లు. దీని ప్రభావం తర్వాతి బ్యాటర్లపై పడింది. డుప్లెసిస్ (18 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ అక్షర్ పటేల్ (11 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు కొంత ప్రయతి్నంచారు. చేయాల్సిన రన్రేట్ బాగా పెరిగిపోతున్న దశలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు భారీ షాట్లతో పోరాడారు. దూకుడుగా ఆడి స్టబ్స్ ని్రష్కమించిన తర్వాత గెలుపు కష్టమే అనిపించినా... అశుతోష్, నిగమ్ కలిసి సాధ్యం చేసి చూపించారు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) స్టార్క్ (బి) నిగమ్ 15; మార్ష్ (సి) స్టబ్స్ (బి) ముకేశ్ 72; పూరన్ (బి) స్టార్క్ 75; పంత్ (సి) డుప్లెసిస్ (బి) కుల్దీప్ 0; మిల్లర్ (నాటౌట్) 27; బదోని (సి) స్టబ్స్ (బి) కుల్దీప్ 4; శార్దుల్ (రనౌట్) 0; షహబాజ్ (సి) (సబ్) విజయ్ (బి) స్టార్క్ 9; రవి బిష్ణోయ్ (బి) స్టార్క్ 0; దిగ్వేష్ రాఠీ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–46, 2–133, 3–161, 4–169, 5–177, 6–177, 7–194, 8–194. బౌలింగ్: స్టార్క్ 4–0–42–3, అక్షర్ 3–0–18–0, విప్రాజ్ నిగమ్ 2–0–35–1, ముకేశ్ కుమార్ 2–0–22–1, కుల్దీప్ 4–0–20–2, మోహిత్ 4–0–42–2, స్టబ్స్ 1–0–28–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: జేక్ ఫ్రేజర్ (సి) బదోని (బి) శార్దుల్ 1; డుప్లెసిస్ (సి) మిల్లర్ (బి) బిష్ణోయ్ 29; పొరేల్ (సి) పూరన్ (బి) శార్దుల్ 0; రిజ్వీ (సి) పంత్ (బి) సిద్ధార్థ్ 4; అక్షర్ (సి) పూరన్ (బి) రాఠీ 22; స్టబ్స్ (బి) సిద్ధార్థ్ 34; అశుతోష్ (నాటౌట్) 66; విప్రాజ్ (సి) సిద్ధార్థ్ (బి) రాఠీ 39; స్టార్క్ (సి) పంత్ (బి) బిష్ణోయ్ 2; కుల్దీప్ (రనౌట్) 5; మోహిత్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 9 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–7, 4–50, 5–65, 6–113, 7–168, 8–171, 9–192. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 2–0–19–2, సిద్ధార్థ్ 4–0–39–2, దిగ్వేశ్ రాఠీ 4–0–31–2, రవి బిష్ణోయ్ 4–0–53–2, ప్రిన్స్ యాదవ్ 4–0–47–0, షహబాజ్ అహ్మద్ 1.3–0–22–0.

DC Vs LSG: ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు.. కట్ చేస్తే! ఒంటి చేత్తో ఢిల్లీని గెలిపించాడు
ఐపీఎల్-2025లో వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది. ఓటమి తప్పదనుకున్నచోట ఢిల్లీ క్యాపిట్స్ ఆటగాడు అశుతోష్ శర్మ అద్బుతం చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన అశుతోష్.. తన విరోచిత పోరాటంతో ఢిల్లీకి సంచలన విజయాన్ని అందించాడు.తొలుత 20 బంతుల్లో 20 పరుగులు చేసిన అశుతోష్.. 15వ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఎండ్లో ఉన్న విప్రజ్ నిగమ్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే దూకుడుగా ఆడుతున్న విప్రజ్ నిగమ్, వెంటనే మిచెల్ స్టార్క్ కూడా ఔట్ కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పదని అంతా అనుకున్నారు. కానీ క్రీజులో ఉన్న అశుతోష్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు బ్యాటింగ్ చేశాడు. వరుసగా బౌండరీలు బాదుతూ ప్రత్యర్ధి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు.తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేసిన అశుతోష్ ఆఖరి ఓవర్లో సిక్స్ కొట్టి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. అశుతోష్ తన ఎదుర్కొన్న ఆఖరి 11 బంతుల్లో ఏకంగా 44 పరుగులు చేయడం విశేషం. మొత్తంగా 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 66 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. అతడి విధ్వంసం ఫలితంగా ఢిల్లీ.. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో అందుకుంది. ఢిల్లీ బ్యాటర్లలో అశుతోష్తో పాటు విప్రజ్ నిగమ్( 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 39), స్టబ్స్(34) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. లక్నో బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్, సిద్దార్ద్, బిష్ణోయ్, దిగ్వేష్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్( 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 72), నికోలస్ పూరన్( 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్లతో 75 పరుగులు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు సాధించగా.. విప్రాజ్ నిగమ్, ముఖేష్ కుమార్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్లో విరోచిత ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ ఎక్స్లో ట్రెండింగ్గా నిలిచాడు. ఈ క్రమంలో ఎవరీ అశుతోష్ అని నెటిజన్లు తెగవెతికేస్తున్నారు.ఎవరీ అశుతోష్?26 ఏళ్ల అశుతోష్ రాంబాబు శర్మ.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మధ్యప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 8 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, 7 లిస్ట్-ఏ, 31 టీ20లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేసిన అశుతోష్.. టీ20ల్లో 47 అర్దసెంచరీలు నమోదు చేశాడు. ఇక అశుతోష్ ఐపీఎల్ అభిమానులకు సుపరిచితడే. ఐపీఎల్-2024 సీజన్తో పంజాబ్ కింగ్స్ తరపున అశుతోష్.. ఈ క్యాష్ రిచ్ లీగ్లోకి అడుగుపెట్టాడు. మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ తన బేస్ ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. గతేడాది సీజన్లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన తన అద్బుత ప్రదర్శనతో రెండు మ్యాచ్ల్లో పంజాబ్ను గెలిపించాడు. అయినప్పటికి పంజాబ్ మాత్రం ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన ఈ పవర్ హిట్టర్ను రూ.3.8 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. ఢిల్లీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ నిలబెట్టుకున్నాడు. LONG LIVE, IPL.....!!! 👏- One of the greatest run chases in history, take a bow Ashutosh Sharma. 🫡pic.twitter.com/rxVzthPDC0— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2025
బిజినెస్

హైదరాబాద్లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. జనవరి–మార్చి కాలంలో హైదరాబాద్లో 11,114 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదవుతాయని రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా. క్రితం ఏడాది తొలి మూడు నెలల కాలంలోని అమ్మకాలు 20,835 యూనిట్లతో పోల్చి చూస్తే 47 శాతం తగ్గనున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా టాప్ 9 నగరాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 23 శాతం తక్కువగా 1,05,791 యూనిట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. క్రితం ఏడాది మొదటి మూడు నెలల్లో ఈ నగరాల్లో అమ్మకాలు 1,36,702 యూనిట్లుగా ఉన్నాయి. అధిక ధరలతో డిమాండ్ బలహీనపడడం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు విక్రయాలు పడిపోవడానికి కారణాలుగా ప్రాప్ ఈక్విటీ తన నివేదికలో పేర్కొంది. తొమ్మిది నగరాల్లో ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు మాత్రం వృద్ధిని చూసినట్టు తెలిపింది. ‘‘మూడేళ్లపాటు రికార్డు స్థాయి సరఫరా అనంతరం హౌసింగ్ మార్కెట్లో దిద్దుబాటు చోటుచేసుకుంది. అమ్మకాలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. కొత్త ఇళ్ల సరఫరా సైతం జనవరి–మార్చి మధ్య 34 శాతం క్షీణించి 80,774 యూనిట్లకు పరిమితం కావచ్చు. క్రితం ఏడాది మొదటి త్రైమాకంలో సరఫరా 1,22,365 యూనిట్లుగా ఉంది. ఇళ్ల ధరలు పెరగడం, బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దేశ ఆర్థిక వ్యవస్థలో కొంత బలహీనత అమ్మకాలు తగ్గడానికి కారణాలుగా ఉన్నాయి’’అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు.పట్టణాల వారీగా విక్రయ అంచనాలు.. → బెంగళూరులో జనవరి–మార్చి మధ్య విక్రయాలు 18,508 యూనిట్లుగా ఉండొచ్చు. క్రితం ఏడాది తొలి క్వార్టర్లో అమ్మకాలు 16, 768 యూనిట్లతో పోల్చితే 10%పెరుగుతాయి. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లోనూ 10 శాతం వృద్ధితో 11,221 యూనిట్ల అమ్మకాలు నమోదు కావచ్చు. → చెన్నైలో 4,858 యూనిట్లు అమ్మడు కావచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 4,962 యూనిట్లతో పోల్చి చూస్తే 2 శాతం క్షీణించే అవకాశం ఉంది. → కోల్కతాలో 28 శాతం తక్కువగా 4,219 యూనిట్ల విక్రయాలు నమోదవ్వొచ్చు. → ముంబై మార్కెట్లో 10,432 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 16,204 యూనిట్లుగా ఉన్నాయి. → నవీ ముంబైలో 7 శాతం తక్కువగా 8,551 యూనిట్లకు పరిమితం కావొచ్చు. → పుణెలోనూ అమ్మకాలు 33 శాతం తక్కువగా 17,634 యూనిట్లుగా ఉంటాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 26,364 యూనిట్లుగా ఉన్నాయి. → థానేలో 27 శాతం క్షీణతతో అమ్మకాలు 19,254 యూనిట్లుగా ఉంటాయి.

మహిళలకు భారీగా కాంట్రాక్టు ఉద్యోగాలు
ముంబై: మహిళలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు, ముఖ్యంగా కాంట్రాక్టు పనులు మెట్రోల్లో, పారిశ్రామిక కేంద్రాల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయని.. భవిష్యత్తులో టైర్ 2, 3 పట్టణాల్లో విస్తరణకు అపార అవకాశాలున్నాయని టీమ్లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో 28.7 శాతం వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు 14.2 శాతం, కర్ణాటక 14.1 శాతం మేర అవకాశాలను అందిస్తున్నట్టు తెలిపింది. ఆ తర్వాత తెలంగాణలో 7.8 శాతం, గుజరాత్లో 7.2 శాతం, యూపీలో 6.6 శాతం చొప్పున మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాలు లభిస్తున్నట్టు వెల్లడించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మరింత మందికి ఈ అవకాశాల కల్పనకు గణనీయమైన అవకాశాలున్నట్టు గుర్తు చేసింది. టీమ్లీజ్ సర్వీసెస్ తన అంతర్గత డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. రిటైల్లోనే ఎక్కువ మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో 29.8 శాతం ఒక్క రిటైల్ రంగమే కల్పిస్తోందని టీమ్లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగంలో 20.7 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో 18.9 శాతం చొప్పున ఉద్యోగాలు లభిస్తున్నట్టు తెలిపింది. తయారీలో 10.8 శాతం, విద్యుత్, ఇంధన రంగంలో 5 శాతం, టెలికంలో 4 శాతం చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం ఉన్నట్టు పేర్కొంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్తో కూడిన స్టెమ్ విద్యలో ఎక్కువ మంది మహిళలు చేరడం అన్నది ఐటీ, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో మరింత మందికి అవకాశాలను చేరువ చేస్తుందని తెలిపింది. కాంట్రాక్టు మహిళా ఉద్యోగుల్లో 62.2 శాతం మంది వయసు 18–27 ఏళ్ల మధ్యలో ఉంటే.. 29.4 శాతం మంది 28–37 ఏళ్ల వయసులో ఉండడం అన్నది యువ ప్రాతినిధ్యాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. 38–47 ఏళ్ల వయసులోని మహిళలు 6.6 శాతం, 48 ఏళ్లకుపైన వయసున్న మహిళలు 1.9 శాతం చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.

హల్దీరామ్లో టెమాసెక్కు వాటా
న్యూఢిల్లీ: ప్యాక్డ్ స్నాక్, స్వీట్స్ కంపెనీ హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్లో సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ టెమాసెక్ హోల్డింగ్స్ 10 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు అనుమతించమంటూ అనుబంధ సంస్థ జాంగ్సాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ పీటీఈ ద్వారా కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)కు దరఖాస్తు చేసింది. ప్రతిపాదిత లావాదేవీ ద్వారా కంపెనీ చెల్లించిన మూలధనంలో 10 శాతానికంటే తక్కువ వాటా సొంతం చేసుకుకోనున్నట్లు సీసీఐకి తెలియజేసింది. షేర్లు, వోటింగ్ హక్కుల ద్వారా వాటా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 85,700 కోట్లు) విలువలో హల్దీరామ్ స్నాక్స్లో 10 శాతం వాటా కొనుగోలుకి టెమాసెక్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బ్లాక్స్టోన్, అల్ఫా వేవ్ గ్లోబల్, బెయిన్ క్యాపిటల్ తదితర పీఈ దిగ్గజాలతో చర్చల అనంతరం టెమాసెక్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అగర్వాల్ కుటుంబ నిర్వహణలోని హల్దీరామ్ స్నాక్స్ రెస్టారెంట్లను సైతం నిర్వహించే సంగతి తెలిసిందే. 1937లో రాజస్తాన్లోని బికనీర్లో ఏర్పాటైన కంపెనీ వచ్చే ఏడాది(2025–26)లో పబ్లిక్ ఇష్యూ చేపట్టే ప్రణాళికల్లో ఉంది. తాజాగా అందుకోనున్న నిధులను విస్తరణకు వినియోగించే వీలుంది.

రిజిస్టర్డ్ ఫిన్ఫ్లుయెన్సర్లు 2 శాతమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు, ఇతరత్రా పెట్టుబడులపై రిటైల్ మదుపరుల మీద ఫిన్ఫ్లుయెన్సర్లు చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. సరైన అర్హతలు, తగిన అనుమతులు లేకుండా వారిచ్చే ఆర్థిక సలహాలను పట్టుకుని ఇన్వెస్ట్ చేస్తూ, ఎంతో మంది నష్టాల పాలవుతున్నారు. ఫిన్ఫ్లుయెన్సర్లపై అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషనల్స్ సంస్థ సీఎఫ్ఏ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారి వివరాల ప్రకారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద నమోదు చేసుకున్న ఇన్ఫ్లుయెన్సర్లు (ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు) రెండు శాతమే ఉన్నారు. కానీ 33 శాతం మంది బాహాటంగానే క్రయ, విక్రయాలకు సంబంధించిన రికమెండేషన్లు ఇస్తున్నారు. దీంతో సదరు సలహాల విశ్వసనీయతపైనా, ఇన్ఫ్లుయెన్సర్ల జవాబుదారీతనంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిన్ఫ్లుయెన్సర్ల సానుకూల, ప్రతికూల ప్రభావాలు, పరిణామాలను తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సర్వేలో 51 మంది ప్రముఖ ఫిన్ఫ్లుయెన్సర్ల తీరును లోతుగా విశ్లేషించారు. ఇందులో 1,600 మంది ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ‘‘ఆర్థిక అంశాలపై అవగాహన పెంచేందుకు దేశీయంగా ఫిన్ఫ్లుయెన్సర్ వ్యవస్థ ద్వారా ఎంతో చేయడానికి ఆస్కారం ఉంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు బాధ్యతాయుతమైన విధానాలను పాటించడం, పూర్తి సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఫిన్ఫ్లుయెన్సర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సెబీ వద్ద రిజిస్టర్ చేసుకున్న అడ్వైజర్ల నుంచే పెట్టుబడులకు సంబంధించిన గైడెన్స్ తీసుకోవాలి. తాము ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్సర్ల వివరాలను ధృవీకరించుకోవాలి’’ అని సీఎఫ్ఏ ఇనిస్టిట్యూట్–ఇండియా కంట్రీ హెడ్ ఆరతి పోర్వాల్ తెలిపారు. నివేదికలోని మరిన్ని వివరాలు.. → 21 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సున్న యువ ఇన్వెస్టర్లు ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం లేదు. పొదుపు రూపంలో కాస్త చెప్పుకోతగిన మొత్తాన్ని పోగేసుకునే వరకు వేచి చూస్తున్నారు. వయస్సులో పెద్దవారైన ఇన్వెస్టర్లు మాత్రం నెలవారీగా ఇన్వెస్ట్ చేయడంలో స్థిరమైన విధానాలను పాటిస్తున్నారు. → విశ్వసనీయత, ఉపయోగించడానికి సులభతరంగా ఉండటమనేవి ప్లాట్ఫామ్ను ఎంచుకోవడంలో కీలకాంశాలుగా ఉంటున్నాయి. యువ ఇన్వెస్టర్లు తక్కువ బ్రోకరేజీ ఉండే ప్లాట్ఫామ్లను ఎంచుకుంటుండగా, కాస్త సీనియర్లు ఫుల్–సర్వీస్ బ్రోకరేజీలను, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా గైడెన్స్ ఇచ్చే ఫ్లాట్ఫామ్లను ఎంచుకుంటున్నారు. → సంక్లిష్టమైన ఆర్థికాంశాలను ఇన్ఫ్లుయెన్సర్లు సరళంగా వివరిస్తున్నప్పటికీ, తమకు ఒనగూరే ప్రయోజనాల వివరాలను సరిగ్గా వెల్లడించడం లేదు. 63 శాతం మంది ఇన్ఫ్లుయెన్సర్లు తమకు వచ్చే స్పాన్సర్షిప్ల గురించి, ఆర్థిక సంస్థలతో ఉన్న సంబంధాల గురించి సరైన వివరాలు వెల్లడించలేదు. → ఈ నేపథ్యంలో నియంత్రణ, అవగాహనకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సర్టీఫికేషన్ ప్రమాణాలను పటిష్టం చేయాలి. ఆర్థిక సలహాలు ఇచ్చే ఇన్ఫ్లుయెన్సర్లు, సెబీలో రిజిస్టర్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేయాలి. పర్యవేక్షణ విధానాలను కఠినతరం చేయాలి. సోషల్ మీడియాల్లో స్పాన్సర్డ్ కంటెంట్ను స్పష్టంగా పేర్కొనాలి. ఫిన్ఫ్లుయెన్సర్ల విశ్వసనీయతను ధృవీకరించే విధానాలను రూపొందించాలి. అలాగే, రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.ఉపయోగాలు ఉన్నాయి, రిస్కులూ ఉన్నాయి..గత అయిదేళ్లుగా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య అనేక రెట్లు పెరిగింది. ఇది స్వాగతించతగిన పరిణామమే అయినప్పటికీ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అధ్యయనం ప్రకారం వీరిలో చాలా మంది స్పెక్యులేటర్లే ఉంటున్నారు తప్ప నిజమైన ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువే ఉంటోంది. వీరిని ప్రభావితం చేస్తూ, అక్రమంగా లబ్ధి పొందుతున్న ఫిన్ఫ్లుయెన్సర్లను కట్టడి చేసేందుకు సెబీ భారీ జరిమానాలు విధిస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. దీంతో ఫిన్ఫ్లుయెన్సర్లను నియంత్రించడానికి ఇంకా చాలా సమయమే పట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా తగు చర్యలు తీసుకోవాలంటే ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణులను అర్థం చేసుకోవడం, ఫిన్ఫ్లుయెన్సర్లు అందిస్తున్న కంటెంట్ను సమీక్షించడం కీలకమైన అంశాలని సీఎఫ్ఏ గుర్తించింది. ఇందులో భాగంగానే నిర్వహించిన అధ్యనయంలో ఇన్వెస్టర్లను ఫిన్ఫ్లుయెన్సర్లు గణనీయంగా ప్రభావితం చేస్తున్న సంగతి వెల్లడైంది. ఇన్ఫ్లుయెన్సర్ల సలహాల మేరకు పెట్టుబడులు పెట్టినట్లు 82 శాతం మంది ఫాలోయర్లు తెలిపారు. వీరిలో 72 శాతం మందికి ఆర్థికంగా ప్రయోజనాలు కూడా లభించాయి. అయితే, ఇందులో రిసు్కలూ ఉంటున్నాయి. వయస్సులో కాస్త పెద్దవారైన ఇన్వెస్టర్లలో (40 ఏళ్లు అంతకు పైబడి) 14 శాతం మంది తాము తప్పుదోవ పట్టించే సలహాలు విని మోసపోయినట్లు వెల్లడించినట్లు నివేదిక తెలిపింది.
ఫ్యామిలీ

'విద్యార్థి భవన్ బెన్నే దోసె': యూకే ప్రధాని, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి ఇంకా..
కొన్ని రెస్టారెంట్ ఏళ్లనాటివి అయినా.. అక్కడ అందించే రుచే వేరు అనిపిస్తుంది. ఎన్నో కొంగొత్త హైరేంజ్ రెస్టారెంట్లు వచ్చినా..! ఏళ్ల నాటి మధురస్మృతులకు నిలయమైన ఆ పాత రెస్టారెంట్లకే ఎక్కువ ప్రజాదరణ ఉంటుంది. ఎన్ని హంగు ఆర్భాటలతో ఐదు నక్షత్రాలలాంటి హోటల్స్ వచ్చినా.. వాటి క్రేజ్ తగ్గదు. కేవలం సామాన్యులే కాదు ప్రముఖులు, సెలబిట్రీలు సైతం అలనాటి రెస్టారెంట్ పాక రుచికే మొగ్గుచూపుతారు. వాటి టేస్ట్కి ఫిదా అంటూ కితాబిస్తారు కూడా. అలాంటి ప్రఖ్యాతిగాంచిన రెస్టారెంటే ఈ బెంగళూరుకి చెందిన 'విద్యార్థి భవన్'. ఈ రెస్టారెంట్ అందించే విభిన్న దోసె, వాటిని మెచ్చిన ప్రముఖులు గురించి ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందామా..!. బెంగళూరు వాసులు ఇష్టపడే 1943ల నాటి రెస్టారెంట్ ఈ 'విద్యార్థి భవన్'. ఇది ఐకానిక్ బెన్నే దోసెలకు ఫేమస్. ఇక్కడ చేసే బెన్నే దోసెల రుచే వెరేలెవెల్. గాంధీనగర్లోని గల్లో ఉండే ఈ ఐకానిక్ రెస్టారెంట్ స్థానికులు, పర్యాటకులకు నోరూరించే రుచులతో మైమరిపిస్తోంది. ఎవ్వరైనా బెన్నే దోస తినాలంటే అక్కడకే వెళ్లాలనేంతగా పేరు తెచ్చుకుంది ఈ రెస్టారెంట్. నిత్యం రద్దీగా క్యూలైన్లు కట్టి ఉంటారు జనాలు ఆ రెస్టారెంట్ వద్ద. అంతేగాదు అక్కడ యాజమాన్యం 50% అడ్వాన్స్డ్ బుకింగ్ సీటింగ్కి ప్రాద్యాన్యత ఇస్తుందంటే..ఆ రెస్టారెంట్ ఎంత బిజీగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందుగా బుక్ చేసుకోకపోతే వారాంతల్లో వెళ్లక పోవడమే బెటర్.ఈ రెస్టారెంట్ చరిత్ర..ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ రెస్టారెంట్లో బెన్నే దోసెలు, ఫిల్టర్ కాఫీలను ఆస్వాదించడానికి వచ్చే కస్టమర్లే ఎక్కువట. ఇక్కడ ఉండే సిబ్బంది కూడా విలక్షణంగా ఉంటారు. ఎందుకంటే ఒకేసారి ఎనిమిది ప్లేట్ల బెన్నెదోసెలను సర్వ్ చేస్తుంటారు. ఆ విధానం చూస్తే..కచ్చితం కళ్లు బైర్లుకమ్ముతాయి. దీన్ని 1943-1944 ప్రారంభంలో వెంకటరామ ఉడల్ నగరం వెలుపల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. అదీగాక ఆ టైంలో రెస్టారెంట్లకు చివర్లో భవన్ అని పెట్టేవారట. అలా దీనికి విద్యార్థి భవన్ అని పెట్టడం జరిగింది. అప్పట్లో ఈ రెస్టారెంట్ సమీపంలో ఉంటే ఆచార్య పబ్లిక్ స్కూల్, నేషనల్ కాలేజ్ తదితర సమీప పాఠశాల విద్యార్థులకు బోజనం అందుబాటులో ఉండేలా దీన్ని ఏర్పాటు చేశారు. అదీగాక ఆ రెస్టారెంట్ ఉన్న ప్రాంతం విద్యాసంస్థలకు నిలయం కావడంతో అనాతికాలంలోనే మంచి ఫేమస్ అయిపోయింది. అంతేగాదు ఇక్కడకు వచ్చే కస్టమర్లలో ఎక్కువ మంది ప్రముఖుల, సెలబ్రిటీలు, రచయితలేనట.ఈ దోసెను మెచ్చిన అతిరథులు..ముఖ్యంగా యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, చెఫ్ సంజీవ్ కపూర్, స్టార్బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సీగల్, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి వంటి ఎందరో ఈ రెస్టారెంట్ బెన్నే దోసకు అభిమానులట. అంతేగాదు ఈ రెస్టారెంట్ అనగానే ఠక్కున గుర్తువచ్చేది బెన్నేదోసనే అట. అందువల్ల ఆ హోటల్ సిగ్నేచర్ డిష్గా ఆ వంటకం మారిపోవడం విశేషం. ఇక్కడ ఆ దోస తోపాటు ఇడ్లీలు, కేసరి బాత్ లేదా రవా బాత్, మేడు వడ వంటి విభిపకప అల్పాహారాలను కూడా సర్వ్ చేస్తారు. అంతేగాదు అక్కడ టిఫిన్ ముగించి చివరగా ఫిల్టర్ కాఫీని ఆస్వాదించకుండా వెళ్లరట. అంతలా ప్రజాదారణ పొందిన ఈ ఐకానిక్ విద్యార్థి భవన్ రెస్టారెంట్ రుచిని మీరు కూడా ఓ పట్టు పట్టేయండి మరీ..!.(చదవండి: work life Balance: అలా చేస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజీ..! టెకీ సలహ వైరల్)

World TB Day: క్షయకు కళ్లెం పడేనా!
కర్నూలుకు చెందిన 45 ఏళ్ల మహిళ క్షయ వ్యాధితో కోలుకోలేక కన్నుమూసింది. మందులపై సరైన అవగాహన లేక మొదట్లో కాస్త బాగా అనిపించగానే మందులు మానేసింది. ఆమెకు షుగర్ కూడా ఉండటంతో వ్యాధి తిరగబెట్టి ఎండీఆర్ టీబీగా రూపాంతరం చెందింది. తర్వాత మందులు వాడినా కోలుకోలేక మృతిచెందింది. ఈ మందులు ఎలా వాడాలో వైద్యులు, సిబ్బంది అవగాహన కలి్పంచకపోవడం వల్లే ఆమె కన్నుమూయాల్సి వచ్చింది. – కర్నూలు(హాస్పిటల్)ఎంతో మంది క్షయ వ్యాధికి మందులు వాడుతూ మధ్యలో ఆపేసి, ఆ తర్వాత మొండి టీబీతో మరణిస్తున్నారు. క్షయ బాధితులు మొదటిసారి మందుల వాడకం ప్రారంభించగానే కొందరికి కడుపులో తిప్పుతుంది. ఇందుకోసం కొందరు వైద్యులు గ్యాస్ట్రబుల్ మందులు ఇస్తారు. మరికొందరికి తీవ్ర ఆకలి అవుతుంది. ఇంకొందరికి రెండు నెలలు మందులు వాడగానే ఆరోగ్యం కుదుట పడుతుండటంతో బాగైందని భావించి మందుల ప్రభావానికి భయపడి మానేస్తున్నారు. కానీ మందులు మధ్యలో ఆపకూడదని, కచ్చితంగా 6 నుంచి 8 నెలలు వాడాలని చెప్పేవారు లేరు. గతంలో లాగా డాట్స్ విధానంలో ఇచ్చే మందుల పద్ధతి కూడా ఇప్పుడు లేకపోవడంతో రోగుల్లో తీవ్రత పెరిగిపోతోంది. నేడు వరల్డ్ టీబీ డే (ప్రపంచ క్షయ వ్యాధి అవగాహన దినం) సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లాలో ప్రతి 2 లక్షల నుంచి 2.5 లక్షల జనాభాకు ఒక టీబీ యూనిట్ చొప్పున 9 యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో ఒక సీనియర్ టీబీ సూపర్వైజర్, సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ విధులు నిర్వహిస్తున్నారు. రోగులను పర్యవేక్షించేందుకు ప్రతి సూపర్వైజర్కు ఒక మోటార్ సైకిల్ ఇచ్చారు. దీంతో పాటు ప్రతి పీహెచ్సీలో ఎక్స్రే యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా క్షయ నిర్ధారణ చేయవచ్చు. గతేడాది 78,368 మందికి పరీక్షలు చేయగా 3,077 మందికి క్షయ నిర్ధారణ అయ్యింది. గత కేసులతో కలుపుకొని మొత్తం 4,571 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు 6 నుంచి 8 నెలల పాటు ఉచితంగా అందిస్తారు. గతేడాది క్షయ నుంచి కోలుకోలేక 104 మంది మరణించారు. వ్యాధినిర్దారణ ఇలా ! రెండు వారాలకు మించి దగ్గ, సాయంత్రం వేళల్లో జ్వరం, దగ్గితే గళ్ల పడటం, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, ఉమ్మిలో రక్తం పడటం వంటి లక్షణాలుంటే క్షయగా అనుమానించి సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలి. రోగి గళ్లను వైద్య సిబ్బంది సేకరించి మైక్రోస్కోప్, ట్రూనాట్, సీబీ నాట్ మిషన్ల ద్వారా నిర్దారిస్తారు. పెరుగుతున్న ఎండీఆర్టీబీ కేసులు క్షయవ్యాధిలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ (ఎండీఆర్టీబీ) కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్షయ మందులపై అవగాహన లేక చాలా మంది కోర్సు మధ్యలోనే మానేస్తున్నారు. దీనివల్ల వ్యాధి తిరగబెట్టి మరింత మొండిగా తయారవుతోంది. అప్పుడు సాధారణ టీబీ మందులు పనిచేయవు. వారికి ఖరీదైన ఎండీఆర్ టీబీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఖరీదు రూ.2 లక్షల దాకా ఉంటుంది. ఈ మందులకు కూడా లొంగకపోతే బెడాక్విలిన్ అనే రూ.18 లక్షల విలువైన 11 నెలల కోర్సు మందును ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎండీఆర్ టీబీ రోగులు 135 మంది ఉండగా, బెడాక్విలిన్ మందులు వాడే వారు 52 మంది ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మందులతో పాటు రోగి పోష కాహారం కోసం నెలకు రూ.వెయ్యి అందిస్తున్నారు. నిక్షయ్ మిత్ర ద్వారా సరుకులు నిక్షయ్ మిత్ర ద్వారా కో–ఆపరేటివ్, కార్పొరేట్, ప్రజాప్రతినిధులు, దాతల ద్వారా క్షయ రోగులకు అవసరమైన పోషకాహార కిట్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 129 సంస్థలు రిజిస్టర్ కాగా 2,117 మంది క్షయ రోగులను దత్తత తీసు కుని 12,045 పోషకాహార ప్యాకెట్లను అందజేశారు. నేడు అవగాహన సదస్సు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో ఈ నెల 24వ తేదీన ర్యాలీ నిర్వహించనున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. క్షయ వ్యాధిపై వైద్య, ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు. క్షయను తగ్గించడమే లక్ష్యం జిల్లాలో ప్రస్తుతం ప్రతి 3 వేల మందికి పరీక్ష చేయగా 170 దాకా కేసులు బయటపడుతు న్నాయి. ఈ సంఖ్యను 50లోపు తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకకుండా చర్యలు తీసుకుంటు న్నాం. వ్యాధిసోకిన వారి ఇంట్లో అందరికీ టీబీ ప్రీవెంటివ్ థెరపీ కింద ఆరు నెలల పాటు మందులు ఉచితంగా ఇస్తున్నాం. ఇటీవల పెద్దవారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. –డాక్టర్ ఎల్.భాస్కర్, జిల్లా క్షయ నియంత్రణాధికారి, కర్నూలు

సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?
సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ తన లేడీ లవ్తో ఏడడగులు వేశాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. అయితే అందరి పెళ్లి ఫోటోలను అత్యంత అందంగా తీసే ఈ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు ఎవరు తీశారు అనేది నెట్టింట చర్చకు దారి తీసింది. నిజమే కదా.. ఎవ్వరికైనా ఇలాంటి సందేహం రావడం సహజమే కదా? మరి ఇంకెందుకు ఆలస్యం.. అసలింతకీ ఎవరీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. వీరి బిగ్ డేకు సంబంధించిన ఫోటోలను బంధించింది ఎవరు? ఏమిటి? తెలుసుకుందాం.సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ విశాల్ పంజాబీ ఒక ఇంటి వాడయ్యాడు. ప్రేయసి నిక్కీ కృష్ణన్తో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. తద్వారా ఇటీవల బ్యాచిటర్ లైఫ్ కి గుడ్ బై చెబుతున్న సెలబ్రిటీల సరసన చేరాడు. మార్చి 23,ఇన్స్టాగ్రామ్ పేజీలో తన వెడ్డింగ్ ఫోటోలను పంచుకున్నాడు. ఎంతో ఆనందకరమైన వేడుకను విశాల్ స్నేహితుడు, మరో ప్రముఖ వివాహ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ బంధించడం విశేషం. అంతేకాదు తన స్నేహితుడు విశాల్ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలనుంచి పవిత్ర హోమం చుట్టూ ప్రదక్షిణలు దాకా, అనేక ఇతర వేడుకల ఫోటోలను అందమైన క్యాప్షన్లతో తన ఇన్స్టాలో పోస్ట్ చేయడం మరో విశేషం.ఇదీ చదవండి: Tamannaah Bhatia: సమ్మర్ స్పెషల్ : పింక్ పూల చీరలో ఎథ్నిక్ లుక్‘‘15 ఏళ్ల తన కరియర్లో చాలా తక్కువ సార్లుమాత్రమే తన సన్నిహితుల పెళ్లి వేడుకలను బంధించే అవకాశం లభించింది. అదీ పెళ్ళళ్లలో మాట్లాడే అవకాశం కేవలం రెండు సార్లు మాత్రమే. ఇపుడు నిక్కీ, విశాల్ ఫోటోలను తీయడం అదృష్టం . ఈ అవకాశం కల్పించినందుకు ఇద్దరికీ కృతజ్ఞతలు’’ అంటూ ఇన్స్టాలో ఒక నోట్ ద్వారా కొత్త జంటకు అభినందనలు తెలిపాడు.మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో వధూవరులు పెళ్లి కళతో కళ కళలాడిపోయాడు. హ్యాండ్లూమ్ పింక్ బనారసి బ్రోకేడ్ లెహంగా, పుదీనా ఆకుపచ్చ టిష్యూ దుపట్టాతో నిక్కీ కృష్ణన్ డిఫరెంట్ లుక్లో కనిపించగా, విశాల్ పంజాబీ కాశ్మీరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో చేసిన సాంప్రదాయ ఓపెన్ షేర్వానీని ఎంచుకున్నాడు. ఫ్లేర్డ్ కుర్తా, వైడ్-బాటమ్ ప్యాంటు , క్యాస్కేడింగ్ డ్రేప్తో దీన్ని జత చేశాడు. రష్యన్ పచ్చలు, అన్ కట్ డైమండ్ జ్యుయల్లరీ, 18K బంగారంతో కూడిన ఇంపీరియల్ హెయిర్లూమ్స్తో కొత్త జంట అందంగా మెరిసిపోయారు.విశాల్-నిక్కీ లవ్ స్టోరీవిశాల్ పంజాబీ , నిక్కీ కృష్ణన్ గత ఏడాది జూన్ 2024లో లండన్లో క్రైస్తవ వేడుకలో వివాహం చేసుకున్నారు. నిక్కీ సోదరి వివాహంలో తాము మొదట కలుసుకున్నారు. ఆ పెళ్లికి విశాల్ ఫోటోగ్రాఫర్. ఆ సమయంలో వారి పరిచయం ప్రేమగా మారింది. అయితే నిక్కీ లండన్కు చెందినది కావడంతో ఆరంభంలో వీరి ప్రేమకు కొన్ని ఇబ్బందులొచ్చాయి, మొత్తానికి తమ బంధం వివాహ బంధంగా బలపడింది. ఎవరీ జోసెఫ్ రాధిక్హై ప్రొఫైల్ పెళ్లిళ్లు అనగానే ప్రముఖ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ గుర్తొస్తాడు. బాలీవుడ్ పవర్ కపుల్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ,విక్కీ కౌశల్, నయనతార విఘ్నేష్ శివన్, అలాగే అదితి రావు హైదరి, సిద్ధార్థ్ కలల వివాహ క్షణాలను బంధించిన ఘనత జోసెఫ్దే. అంతేకాదు అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ల డ్రీమీ వెడ్డింగ్ ఫోటోలు తీసింది కూడా జోసెఫ్.

అలా చేస్తే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఈజీ..!
ఇటీవల "వర్క్ లైఫ్ బ్యాలెన్స్" తెగ చర్చనీయాంశంగా మారింది. వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే మన భారత్ మరింత అభివృద్ధి చెందడానికి అని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఏ ముహర్తానా అన్నారో గానీ అప్పటి నుంచి వర్క్లైఫ్ బ్యాలెన్స్ తెరపైకి వచ్చేంది. అందరూ ఇక పనికే అంకితమైతే వ్యక్తిగత జీవితం, బాంధవ్యాల పరిస్థితి ఏంటీ...?. ఆ తరువాత జీవిత చరమాంకలో ఎవ్వరూ మనతో ఉండరు అంటూ రకరకాలు మాటలు లెవెనెత్తారు నెట్టింట నెటిజన్లు. సరిగ్గా ఈ సమయంలో ఓ బెంగళూరు టెకీ ఇలా చేస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సులభంగా మెయింటైన్ చేయొచ్చు అంటూ ఓ సలహా సూచించాడు. ఇప్పుడది నెట్టింట తెగ వైరల్గా మారి నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అతడు చెప్పిన సలహా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు గానీ కానీ కాస్త ఆలోచింపచేసేలా ఉందంటున్నారు నెటిజన్లు. మరీ అదెంటో చూసేద్దామా..!.బెంగళూరు టెకీ హర్షిత్ మహావర్ లింక్డ్ ఇన్ పోస్ట్లో పని జీవిత సమతుల్య సాధించడానికి ఇలా చేయండి అంటూ ఓ ఉచిత సలహ ఇచ్చాడు. అదేంటంటే..మీ సహోద్యోగినే పెళ్లాడండి సింపుల్గా. అంతే ఇక ఎన్నో ప్రయోజనాలు పొందుతారంటూ జాబితా చిట్టా చెప్పుకొచ్చాడు. క్యాబ్లపై డబ్బు ఆదా అవుతుంది. ఇంటి నుంచి పనిచేసిన అనుభూతే ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్లో అనుక్షణం మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది కదా..!. కాబట్టి ఆఫీస్లో ఉన్నాం అనిపించదు. ఏ మాత్రం విరామం దొరికినా..కాసేపు మీ శ్రీమతి లేదా శ్రీవారితో ముచ్చటించొచ్చు. ఇక తిరిగి ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడూ ఏదో ఊరు నుంచి వెళ్తున్నట్లుగా జాలీగా గడపండి. మీ భాగస్వామితో గడపలేదన్న భాధ కూడా ఉండదు. అటు వర్కు హయిగా చేసుకోవచ్చు..ఇటు భార్యతోనూ హ్యాపీగా స్పెండ్ చెయ్యొచ్చు. ఇలా చేస్తే కుటుంబాన్ని మిస్ అవుతున్నాం అనే ఫీల్ ఉండదు. రెండింటికి న్యాయం చేసినవారు అవుతారంటూ రాసుకొచ్చాడు లింక్డ్ఇన్ పోస్ట్లో హర్షిత్. అయితే నెటిజన్లు ఇదేదో బాగుందే..!.. ట్రై చేస్తా అని కొందరు, సహోద్యోగిని పెళ్లిచేసుకోవడం అనేది శాశ్వత పరిష్కారం కాకపోవచ్చు అని మరికొందరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఊపిరి సలపని ఒత్తిడులు..ఆగిపోతున్న ఖాకీల గుండెలు..!)
ఫొటోలు


అగ్నిగుండాలతో ముగిసిన కొమురవెల్లి మల్లన్న జాతర (ఫొటోలు)


జపాన్లో ఎన్టీఆర్ మాస్ జాతర - అభిమానితో 'దేవర' స్టెప్పులు (ఫొటోలు)


‘రాబిన్ హుడ్’ ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ కేతిక శర్మ (ఫొటోలు)


‘ఓ భామ అయ్యో రామ’ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


విశాఖలో ఐపీఎల్ మ్యాచ్.. అభిమానుల సందడే సందడి (ఫొటోలు)


గ్లామర్తో మెరిసిపోతున్న అదితి రావు హైదరీ.. (ఫోటోలు)


Soniya Singh: కొత్త కారు కొన్న విరూపాక్ష నటి (ఫోటోలు)


బాలిలో బర్త్ డే సెలబ్రేషన్స్.. సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)


Vishal- Nikki సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ గ్రాండ్ వెడ్డింగ్, ఫోటోలు వైరల్


తాతిరెడ్డిపల్లెలో అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
International

రష్యా డ్రోన్ల దాడిలో తొమ్మిది మంది మృతి
కీవ్: ఓవైపు కాల్పుల విరమణ చర్చలకు సిద్ధమవుతూనే ఉక్రెయిన్పై రష్యా దాడులను కొనసాగిస్తోంది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున జరిపిన డ్రోన్ల దాడిలో తొమ్మిది మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఖార్కివ్, సుమి, చెర్నిహివ్, ఒడెసా, డొనెట్స్క్ ప్రాంతాలతోపాటు రాజధాని కీవ్పైనా ఐదు గంటలకు పైగా రష్యా దాడులు కొనసాగాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. గగనతల రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకునేందుకు తక్కువ ఎత్తులో ఎగిరిన రష్యా డ్రోన్లు నివాస భవనాలపై పడ్డాయి. కీవ్పై జరిపిన డ్రోన్ దాడిలో ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. డ్రోన్ శిథిలాలు పడటంతో డ్నిప్రో జిల్లాలోని రెండు నివాస భవనాలకు మంటలు అంటుకున్నాయి. 9 అంతస్తుల భవనంపై అంతస్తులో మంటలు చెలరేగడంతో ఒక మహిళ మృతి చెందింది. పొదిల్ జిల్లాలో 25 అంతస్తుల భవనంలోని 20వ అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. హోలోసివ్స్కీలో గోదాము, కార్యాలయ భవనంలో మంటలు చెలరేగి ఒకరు మృతి చెందారు. డొనెట్స్క్ ప్రాంతంపై జరిపిన దాడుల్లో నలుగురు చనిపోయారు.

ట్విట్టర్ పిట్టకు రూ.30 లక్షలు!
సామాజిక మాధ్యమం ట్విట్టర్ లోగో బ్లూబర్డ్ గుర్తుంది కదా. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆ సంస్థను కొనుగోలు చేశాక ఎక్స్గా పేరు మార్చినా ఇంకా అంతా ట్విట్టర్ అనే పిలుస్తారంటే దాని ప్రభావం అర్థం చేసుకోవచ్చు! ట్విట్టర్ కార్యాలయంపై 2012 నుంచి 2023 వరకూ సగర్వంగా వేలాడిన బ్లూ బర్డ్ లోగో తాజా వేలంలో రూ.30లక్షలకు అమ్ముడు పోయింది. 560 పౌండ్ల బరువున్న ఈ లోగోను ఓ అజ్ఞాత వ్యక్తి కొనుగోలు చేశాడు. మస్క్ 2022లో ట్విట్టర్ను టేకోవర్ చేయగానే శాన్ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుంచి ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్ను తొలగించడం తెలిసిందే. ప్రధాన కార్యాలయాన్ని కూడా టెక్సాస్కు మార్చారు. ట్విట్టర్కు సంబంధించిన వస్తువులు, ఆఫీస్ ఫర్నిచర్తో పాటు లోగోను కూడా 2023 ఆగస్టులో మస్క్ వేలం వేశారు. అప్పుడు దాన్ని దక్కించుకున్న ఆర్ఆర్ సంస్థ తాజాగా తిరిగి వేలం వేసింది.

అనంత దూరంలోని... ఆ గెలాక్సీలో ఆక్సిజన్!
అనంతమైన విశ్వంలో మన భూమిపై తప్ప ఇంకెక్కడా ప్రాణవాయువు(ఆక్సిజన్) ఉండకపోవచ్చని శాస్త్రజు్ఞలు ఇప్పటిదాకా భావించేవారు. కానీ మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలం (గెలాక్సీ)లో ఆక్సిజన్ ఆనవాళ్లను గుర్తించారు. అంతేగాక భారీ లోహాల జాడను సైతం కనిపెట్టారు. ఈ గెలాక్సీ భూమి నుంచి ఏకంగా 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది! విశ్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఇది ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్బ్యాంగ్ 1,380 కోట్ల ఏళ్ల క్రితం సంభవించిందన్న వాదనలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నక్షత్ర మండలానికి జేడ్స్–జీఎస్–జెడ్14–0 అని నామకరణం చేశారు. నిజానికి దీన్ని 2024 జనవరిలోనే ప్రాథమికంగా గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ గెలాక్సీ ఉనికిని వెలుగులోకి తెచ్చింది. కాకపోతే దానిపై ప్రాణవాయువు ఉన్నట్లు కనిపెట్టడం కీలక పరిణామమని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ ఆక్సిజన్ ఏ రూపంలో, ఎంత పరిమాణంలో ఉందన్నది తేల్చడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పరిమాణంలో అత్యంత భారీగా ఉన్న ఈ నక్షత్ర మండలం కాంతివంతమైనది కూడా. మన భూగోళమున్న గెలాక్సీకి సమీపంలో ఇప్పటిదాకా మరో 700 గెలాక్సీలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించింది. – సాక్షి, నేషనల్ డెస్క్

పోప్ ఫ్రాన్సిస్కు పూర్తి స్వస్థత
వాటికన్ సిటీ: ప్రాణాంతక నిమోనియాతో ఐదు వారాల పాటు పోరాడిన పోప్ ఫ్రాన్సిస్ (88) పూర్తి ఆరోగ్యం సంతరించుకున్నారు. జెమెల్లీ ఆసుపత్రి నుంచి ఆదివారం వాటికన్లోని నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం వందలాది మంది ఆస్పత్రి దగ్గర గుమిగూడి ఆయనకు వీడ్కోలు పలికారు. ఆసుపత్రి ప్రధాన ప్రవేశం ఎదురుగా ఉన్న బాల్కనీ నుంచి వారికి పోప్ అభివాదం చేశారు. ఆయనను చూడటానికి రోగులు కూడా బయటికొచ్చారు. అనంతరం పోప్ ఆక్సిజన్ పైపులను ధరించి తెల్ల ఫియట్ కారులో వాటికన్ చేరుకున్నారు.తన నివాసానికి వెళ్లడానికి ముందు ఆనవాయితీ మేరకు సెయింట్ మేరీ మేజర్ బాసిలికాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. పోప్కు శుభాకాంక్షలు తెలిపేందుకు సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ప్రజలు భారీగా గుమిగూడారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ కండరాలు దెబ్బతినడంతో పోప్ ఇప్పటికీ మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. ‘‘వృద్ధులైన రోగుల్లో ఇవి మామూలే. గొంతు త్వరలో సాధారణ స్థితికి చేరుకుంటుంది. అప్పటిదాకా శ్రమ పడకూడదు. ఎక్కువమందిని కలవకూడదు’’ అని సూచించారు. దాంతో ఆయన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు. పోప్ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో ఫిబ్రవరి 14న ఆస్పత్రిలో చేరడం తెలిసిందే. రెండు ఊపిరితిత్తుల్లో నిమోనియా ఉన్నట్లు నిర్ధారించి 38 రోజులపాటు చికిత్స అందించారు. 12 ఏళ్ల పదవీకాలంలో పోప్కు ఇదే అతిపెద్ద విరామం. ఒకానొక దశలో ఆయన వారుసుడు ఎవరన్న చర్చ కూడా జరిగింది. అంత పెద్ద వయసులో డబుల్ నిమోనియాతో బాధపడే రోగులు ఆరోగ్యంగా బయటపడటం చాలా అరుదు. కానీ పోప్ మాత్రం ఇంత సమస్యలోనూ నిబ్బరంగా వ్యవహరించారు. ఎలా ఉందన్న వైద్యులతో బతికే ఉన్నానంటూ చెణుకులు విసిరారు.
National

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్ఫోర్స్
న్యూఢిల్లీ: ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం వంటి ఘటనల నేపథ్యంలో ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధానంగా దృష్టిపెట్టింది. రెండేళ్ల క్రితం ఐఐటీ(ఢిల్లీ)లో విద్యనభ్యసిస్తూ ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థుల విషయంలో ఎఫ్ఐఆర్లు నమోదుచేయాలంటూ సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ల ధర్మాసనం సోమవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఆత్మహత్యల అంశంలో దర్యాప్తు చేయాలని సూచిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘ వేర్వేరు ఉన్నతవిద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు కలచివేస్తున్నాయి. విద్యార్థులు తనవు చాలిస్తూ తమ జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్న ఉదంతాలకు చరమగీతం పాడాల్సిందే. విద్యార్థులు ఆత్మహ త్యలు చేసుకోకుండా నివారించే సమగ్ర, విస్తృతస్థాయి, స్పందనా వ్యవస్థలను బలోపేతం చేయాలి. ప్రైవేట్ కాలేజీలు సహా ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితిని పట్టించుకునే చట్టపరమైన, సంస్థాగతమైన వ్యవస్థ సమర్థంగా లేదు. ఒకవేళ ఉన్నా అందులో అసమానతలు ఎక్కువయ్యాయి. విద్యార్థులు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా నివారించే నివారణ వ్యవస్థ కావాలి. అందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవీంద్రభట్ సారథ్యంలో నేషనల్ టాస్క్ఫోర్స్ (ఎన్టీఎఫ్)ను ఏర్పాటుచేస్తున్నాం. ఇందులో రాష్ట్రాల ఉన్నతవిద్య, సామాజిక న్యాయం, సాధికారత, న్యాయ, మహిళ, చిన్నారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాల గుర్తింపు, ఆత్మహత్యల నివారణకు సంబంధించి నియమనిబంధనల పటిష్ట అమలుపై ఎన్టీఎఫ్ ఒక సమగ్ర నివేదికను రూపొందించనుంది. ఈ నివేదిక తుది రూపు కోసం ఎన్టీఎఫ్ దేశంలోని ఎలాంటి ఉన్నత విద్యాసంస్థలోనైనా ఆకస్మిక తనిఖీలు చేస్తుంది. ప్రస్తుత నిబంధనలకు తోడు అదనపు సిఫార్సులు చేసే అధికారమూ ఎన్టీఎఫ్కు ఉంది’’అని సుప్రీంకోర్టు పేర్కొంది.4 నెలల్లో మధ్యంతర నివేదికఎన్టీఎఫ్ తమ మధ్యంతర నివేదికను నాలుగు నెలల్లోపు సమర్పించాల్సి ఉంటుంది. 8 నెలల్లోపు సమగ్ర నివేదికను సమర్పించాలి. 2023లో ఢిల్లీ ఐఐటీలో ఇద్దరు విద్యార్థులు మరణిస్తే ఎఫ్ఐఆర్ నమోదుకు ఢిల్లీ హైకోర్టు గతేదాడి జనవరిలో నిరాకరించిన నేపథ్యంలో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టు ఆదేశించడంతో తాజాగా సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. 2018 నుంచి 2023 ఏడాది వరకు ఉన్నతవిద్యాసంస్థల్లో 98 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయక మంత్రి 2023లో ప్రకటించడం తెల్సిందే. ఈకాలంలో ఐఐటీల్లో 39, ఎన్ఐటీల్లో 25, కేంద్రీయ వర్సిటీల్లో 25, ఐఐఎంలలో నలుగురు, ఐఐఎస్ఈఆర్లలో ముగ్గురు, ఐఐఐటీల్లో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

ఏప్రిల్ 23న హైదరాబాద్ ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు.. కేంద్ర ఎన్నికల సంఘం సోమ వారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ ప్రభా కర్ రావు పదవీకాలం మే 1తో ముగియనుంది. తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 4న నామినేషన్లు స్వీకరిస్తారు, ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 గడువు. ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 25న ఓట్ల లెకింపు, ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ తెలిపింది.

శంకర్-దివ్య విడాకుల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్
ప్రముఖ టెక్ ఎంట్రాప్రెన్యూర్ ప్రసన్న శంకర్ నారాయణ ఇంటి వ్యవహారం.. మొత్తంగా రచ్చకెక్కింది. అరెస్ట్ భయంతో పరారీలో ఉన్న ఆయన.. సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ చేశారు. అది కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. అరెస్ట్ చేయబోమని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఈ రచ్చ కాస్త శాంతించింది. చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ(Prasanna Sankar Narayana).. ప్రముఖ హెచ్ఆర్ టెక్ స్టార్టప్ 'రిప్లింగ్' సహ వ్యవస్థాపకుడు. అంతేకాదు.. అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య దంపతులు. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలైంది. అయితే.. .. దివ్య, అమె కుమారుడు అమెరికా పౌరులు. ఈ నేపథ్యంలో, భరణంగా నెలకు రూ. 9 కోట్లు చెల్లించాలని దివ్య డిమాండ్ చేయగా, దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఈలోపు హఠాత్తుగా సీన్ చెన్నైకి మారింది. భారత్కు వచ్చిన దివ్యఅమెరికా కోర్టు ప్రసన్నకు ప్రతి వారాంతంలో కుమారుడితో గడిపేందుకు అనుమతినిచ్చింది. వారం క్రితం దివ్య తన కుమారుడితో అమెరికా నుంచి చెన్నైకి వచ్చింది. అమెరికా కోర్టు ఆదేశాల మేరకు, ప్రసన్న తన స్నేహితుడు గోకుల్ ద్వారా కుమారుడిని వీకెండ్ లో తీసుకువెళ్ళాడు. అయితే, దివ్య తన కుమారుడిని ప్రసన్న కిడ్నాప్ చేశాడని చెన్నై పోలీసులకు(Prasanna Sankar) ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది.అయితే కుమారుడు తనతో సంతోషంగా ఆడుకుంటున్నాడని ప్రసన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దివ్య ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు, డబ్బుల కోసం డిమాండ్ చేశారని ప్రసన్న ఆరోపించాడు. రూ.25 లక్షలు డిమాండ్ చేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది.కొడుకును కిడ్నాప్ చేసినట్టు తన భార్య దివ్య ఫిర్యాదు చేయడంతో, ప్రస్తుతం తాను చెన్నై పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నానని.. పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే తన మొబైల్ ఫోన్ లొకేషన్, కారు, యూపీఐ, ఐపీ అడ్రస్ లను ట్రాక్ చేస్తున్నారని ప్రసన్న శంకర్ ఆరోపించారు. చివరకు.. పోలీసుల హామీతో ఆయన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారు.దివ్య ఏమన్నారంటే..ప్రసన్న శంకర్ ఒక కామ పిశాచి అని భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. రహస్యంగా మహిళల వీడియోలు రికార్డు చేసేవాడని తెలిపారు. ఈ కారణంగానే అతడు సింగపూర్ లో అరెస్టయ్యాడని, ఆ తర్వాత విడుదలయ్యాడని వివరించారు. తన పేరిట ఉన్న ఆస్తులను కూడా బదలాయించుకున్నాడని ఆరోపించారు. English Translation of @myprasanna 's video:"My name is Prasanna. I was born and brought up in Chennai. I went to US and founded a 10B dollar company. I'm a Tech Entrepreneur. Recently me and my wife got divorced and we had 50/50 custody of our son after signing a MOU.." https://t.co/uxSvgS1Xar— 7y913.acc (@aayeinbaigan) March 23, 2025అయితే.. తన భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయమై గొడవలు జరిగాయని వెల్లడించారు. అంతేకాకుండా, తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు దివ్య ఫిర్యాదు చేసిందని... అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్లతో కేసు నమోదైందని వివరించారు. అమెరికా పోలీసులు, కోర్టు ఈ ఆరోపణలను విచారించి, అవి నిరాధారమైనవని తేల్చి తనకు అనుకూలంగా తీర్పునిచ్చాయని అన్నారు. ఆ తర్వాత కూడా... నేను దాడి చేసి అత్యాచారం చేసినట్టు, నగ్న వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నట్టు దివ్య తనపై సింగపూర్లో ఫిర్యాదు చేయగా, సింగపూర్ పోలీసులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు.

8 వారాలు కాదు.. 4 వారాలే గడువు
లక్నో: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వానికి(Rahul Gandhi Citizenship) సంబంధించిన కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పౌరసత్వ వ్యవహారం తేల్చే విషయంలో కేంద్రానికి నాలుగు వారాల గడువు విధించింది అలహాబాద్ హైకోర్టు.రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ కర్ణాటకకు చెందిన విగ్నేష్ శిశిర్ అనే బీజేపీ కార్యకర్త అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్లో ఈ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని, కాబట్టి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 84(ఏ) ప్రకారం ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. తాజాగా.. జరిగిన విచారణ సందర్భంగా సంచలన విషయాల పేరిట కోర్టు ముందు కొన్ని విషయాలు ఉంచారు. ‘‘రాహుల్ గాంధీ పౌరసత్వంపై యూకే ప్రభుత్వం నుంచి వచ్చిన మెయిల్ సమాచారం మా దగ్గర ఉంది. అక్కడి పౌరసత్వ జాబితాలో రాహుల్ గాంధీ పేరు ఉంది. అందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను మేం కోర్టుకు సమర్పించాం. భారత చట్టాల ప్రకారం.. ద్వంద్వ పౌరసత్వం చెల్లదు. వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే.. భారత పౌరసత్వం రద్దు అయిపోతుంది’’ అని శిశిర్ అంటున్నారు.ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది నవంబర్లోనే ద్విసభ్య ధర్మాసనం కేంద్ర హోం శాఖ నుంచి ఈ పిటిషన్పై వివరణ కోరింది. అయితే అందుకు సమగ్ర వివరాల సేకరణకు గడువు కావాలని కేంద్రం కోరడంతో అనుమతించింది. తాజా విచారణలోనూ 8 వారాల గడువు కోరగా.. అందుకు నిరాకరిస్తూ 4 వారాల గడువు మాత్రమే ఇచ్చింది. మరోవైపు.. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఆరోపణలతో 2019లోనే ఓ పిటిషన్ వేశారు. 2003లో స్థాపించబడిన ఓ బ్రిటిష్ కంపెనీ రికార్డుల్లో రాహుల్ గాంధీ పేరు యూకే పౌరుడిగా ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతకు నాలుగేళ్ల ముందే.. 2015లో అప్పటి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ టీఆర్ గెడెలకు ఈ అంశంపై సుబ్రహ్మణ్య స్వామి లేఖ రాశారు. అయితే ఆ టైంలో ప్రతిస్పందన రాలేదు. తాజాగా.. అలహాబాద్ హైకోర్టులోనూ ఒకే తరహా పిటిషన్ ఫైల్ కావడాన్ని ప్రస్తావించిన ఢిల్లీ హైకోర్టు.. తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. మరోవైపు.. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలను కాంగ్రెస్ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వస్తోంది. ఆయన భారతీయుడేనంటూ చెబుతోంది. మరోవైపు ఇది తన ప్రతిష్టను దెబ్బ తీసే ప్రయత్నమేనని రాహుల్ గాంధీ, తన సోదరుడు పుట్టింది.. పెరిగింది ఈ గడ్డ మీదేనంటూ వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఇంతకు ముందే ప్రకటించారు.
NRI

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్పర్సన్గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

లండన్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్: అతి వేగం ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలను తీసుకుంది. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం దుమ్ముగూడెం ప్రగలపల్లి గ్రామానికి చెందిన బంటు రాజ్కుమార్(20), పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన అటికెటి సిద్దార్ధ(21) ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఆదివారం రాత్రి వీరు ఓయూ హాస్టల్ నుంచి బైక్పై విద్యానగర్ వెళుతుండగా అడిక్మెట్ ఫ్లైఓవర్పై వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

గృహిణికి అండగా ఉన్నందుకు...అంతమొందించాడు
హైదరాబాద్: లైంగిక వేధింపులకు గురవుతున్న ఓ మహిళకు అండగా ఉన్న లాయర్ను కక్షగట్టి దారుణంగా హత్య చేశాడు. చంపాపేటలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలి్పన వివరాల ప్రకారం..మహేశ్వరం మండల కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్ (56) నగరంలోని చంపాపేట డివిజన్ న్యూమారుతీనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. తన ఇంటి సమీపంలోనే ఓ అపార్ట్మెంట్లో ఇటీవల ఫ్లాట్ను కొనుగోలు చేసి..ఓ గృహిణి కుటుంబ సభ్యులకు అద్దెకు ఇచ్చాడు. అదే కాలనీ సమీపంలోని సుల్తానా అల్వా కాలనీ శ్మశాన వాటిక కాపలాదారుడుగా పని చేస్తున్న గులాం దస్తగిరి ఖాళీ సమయంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా కూడా పనిచేస్తున్నాడు.ఇజ్రాయిల్ కొనుగోలు చేసిన ఫ్లాట్లో దస్తగిరి విద్యుత్ మరమ్మతు పనులకు వెళ్తుండే వాడు. ఈ క్రమంలోనే ఫ్లాట్లో అద్దెకు ఉంటున్న గృహిణితో పరిచయం ఏర్పడింది. దీన్ని అలుసుగా తీసుకున్న దస్తగిరి తనను ప్రేమించాలని, అండగా ఉంటానని ఆమెను వేధించసాగాడు. వేధింపులు భరించలేని ఆ గృహిణి ఫ్లాట్ యజమాని ఇజ్రాయిల్కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఆయన దస్తగిరిని మందలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయించి.. దస్తగిరి వేధింపులు ఎక్కువ అవడంతో 25 రోజుల క్రితం ఇజ్రాయిల్ ఐఎస్సదన్ పోలీసులకు గృహిణితో ఫిర్యాదు చేయించాడు. ఆమెకు దస్తగిరి నుంచి ప్రాణహాని ఉందని హెచ్చరించాడు. ఆమెను బంధువుల ఇంటికి పంపించి వేశాడు. ఈ క్రమంలో పోలీసులు దస్తగిరిని స్టేషన్కు పిలిపించి..నామమాత్రంగా మందలించి, కౌన్సిలింగ్ చేసి పంపించేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దస్తగిరి..ఇజ్రాయిల్పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. గత మూడు రోజులుగా ఇజ్రాయిల్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించిన దస్తగిరి సోమవారం ఉదయం 9 గంటలకు ఇజ్రాయిల్ తన స్కూటీపై ఒంటరిగా రావటాన్ని పసిగట్టి..ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.విషయం తెలసుకున్న స్థానికులు రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇజ్రాయిల్ను సమీపంలోని డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చేరి్పంచారు. పరీక్షించిన వైద్యులు ఇజ్రాయిల్ అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా పోలీసులు గృహిణి ఫిర్యాదును సీరియస్గా తీసుకోలేదని, తీసుకుని ఉంటే ఈ హత్య జరిగేది కాదని స్థానికులు విమర్శిస్తున్నారు. కాగా ఇజ్రాయిల్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర మాజీ డైరెక్టర్గా పనిచేశాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు.

తిరుపతమ్మని ఎవరు చంపి ఉండొచ్చు?
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని కొలనుకొండలో సాయిబాబా గుడి వెనుక కృష్ణాకెనాల్కు వచ్చే జంక్షన్లో జనవరి 31న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని ప్రాథమిక దర్యాప్తు చేయకుండా రాత్రికిరాత్రే పోలీసులు మార్చురీకి తరలించారు. 45 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేదు. తాజాగా ఆదివారం రాత్రి కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే జరిగిన లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసులోనూ పోలీసులు ఇలాగే వ్యవహరించారు. రాత్రి 9 గంటలకు వచ్చిన పోలీసులు 11 గంటలకల్లా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలం వద్దకు డాగ్ స్క్వాడ్ను తీసుకు రావడంలో పోలీసులు విఫలమయ్యారు. తెల్లవారుజామున ఎప్పుడో నాలుగు గంటలకు డాగ్స్కా్వడ్ వచ్చింది. అప్పటికే ఘటనా స్దలం వద్ద ఉన్న సిమెంటుతో కూడిన చెప్పులు, కండోమ్స్, హ్యాండ్బ్యాగ్, అమెరికన్ క్లబ్ సిగరెట్ పెట్టెలను తీసివేయడంతో డాగ్ స్క్వాడ్ వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు ఎస్పీ సతీష్కుమార్ వచ్చేంత వరకు కూడా మృతదేహాన్ని ఉంచకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయానికి సమీపంలో వీవీఐపీలు నిత్యం తిరిగే ప్రాంతంలో మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైనా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎవరు చంపి ఉండొచ్చు? జెస్సీ, నజీరాతోపాటు లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం రాత్రి కూడా కొలనుకొండ జాతీయ రహదారి వద్దకు వచ్చింది. జెస్సీ విటులను పిలిచి లక్ష్మీతిరుపతమ్మతో పంపేది. ఆదివారం రాత్రి కూడా తొలుత ఇద్దరు విటులు వెళ్లారు. అనంతరం చేతిలో ఒక సంచి పట్టుకుని హిందీలో మాట్లాడే పొట్టిగా నల్లగా ఉన్న వ్యక్తి లక్ష్మీ తిరుపతమ్మ వద్దకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తరువాత ముళ్ల పొదలలో నుంచి తిరుపతమ్మ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన జెస్సి, నజీరా లోపలకు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి వున్న తిరుపతమ్మ కనిపించింది. దీంతో భయపడిన వారిద్దరూ పెద్దగా కేకలు వేశారు. 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది రావడంతో లక్ష్మీ తిరుపతమ్మ మృతి చెందిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకు ఘటన జరిగితే తాడేపల్లి పోలీసులు రాత్రి 9.30 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో తిరుపతమ్మ మాజీ ప్రియుడు చింటూ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా తిరుపతమ్మ తనను దూరం పెడుతుందని చింటూ కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అనాథలుగా పిల్లలు లక్ష్మీతిరుపతమ్మ మృతి వార్త తెలుసుకుని ఘటనాస్థలానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని రోధించారు. పిల్లలను ప్రభుత్వం సంరక్షించాలని విన్నవించారు.హతురాలు పామర్రు వాసి.. తాడేపల్లి రూరల్: డీజీపీ కార్యాలయం సమీపంలో ఆదివారం జరిగిన హత్యాచారం కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీ‹Ùకుమార్ విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ సతీ‹Ùకుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. దీంతోపాటు విజయవాడకు చెందిన సీసీఎస్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పామర్రు స్వగ్రామం.. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన సజ్జ లక్ష్మీ తిరుపతమ్మ (32)గా పోలీసులు గుర్తించారు. ఈమె భర్త అయిన నవీన్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి శీలం ఝాన్సీ వద్ద పిల్లలిద్దరినీ ఉంచింది. విజయవాడలో వంటపని చేస్తున్నానని ఆమెకు చెబుతూ వస్తోంది. విజయవాడలోని కృష్ణలంకలో ఉంటోంది. ఏడాది క్రితం ట్రాన్స్జెండర్ జెస్సీ పరిచయమైంది. ఆమె లక్ష్మీతిరుపతమ్మను వ్యభిచార వృత్తిలోకి దించినట్టు సమాచారం. ఆ తర్వాత మరో ట్రాన్స్జెండర్ నజీరాతోనూ తిరుపతమ్మకు పరిచయం అయింది. వీరిద్వారా తిరుపతమ్మ మాజీ ప్రియుడు రాధారంగా నగర్కు చెందిన చింటూ గురించి పోలీసులు తెలుసుకున్నారు. అతడినీ అదుపులోకి తీసుకుని ప్రశి్నస్తున్నట్టు సమాచారం. తిరుపతమ్మ తన ఇద్దరు బిడ్డలను చదివించుకోవడం కోసమే ఈ వృత్తి చేపట్టినట్లు తెలుస్తోంది.వీడియోలు, రీల్స్.. హత్య జరిగిన ప్రాంతంలో ఎన్నాళ్లగానో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలూ విస్తృతంగా జరుగుతున్నట్టు సమాచారం. మూడునెలలుగా ఇక్కడే లక్ష్మీ తిరుపతమ్మ, మరికొంతమంది మహిళలు రీల్స్, ఇంస్టాగ్రామ్ లో పాటలు పాడుతూ సెల్ఫీ వీడియోలు చిత్రీకరించినట్టు సమాచారం. తిరుపతమ్మ, ఆమె ప్రియుడు చింటూ, జెస్సీ కొలనుకొండ ప్రాంతంలో దౌర్జన్యం చేస్తూ వ్యభిచార వృత్తిలో ఉన్న ఇతరులను రానీయకుండా విటులను తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటారని, ఇక్కడ వీరి ఆధిపత్యం ఏమిటనే భావనతో ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమానమూ వ్యక్తమవుతోంది.

లైంగిక దాడికి యత్నం.. రైలు నుంచి దూకిన యువతి
సికింద్రాబాద్/గాంధీ ఆస్పత్రి: ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకటంతో తీవ్రంగా గాయపడింది. ఈ నెల 22న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ప్రస్తుతం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో కోలుకుంటోంది. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ జి.సాయీశ్వర్గౌడ్ తెలిపారు.బోగీలో ఒంటరిగా ఉండటంతో..అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్లోని ఒక ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తెల్లాపూర్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. ఆమె ఎక్కిన లేడీస్ కోచ్లో ఉన్న మరో ఇద్దరు మహిళలు రాత్రి 8 గంటల సమయంలో అల్వాల్ స్టేషన్లో దిగిపోవటంతో బోగీలో బాధితురాలు ఒక్కరే మిగిలింది. అది గమనించిన ఒక ఆగంతకుడు బోగీలోకి ప్రవేశించి బాధి తురాలిపై అఘాయిత్యం చేయబోయాడు. భయాందోళనకు గురైన ఆమె కొంపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో నడుస్తున్న రైలు నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితికి చేరిన యువతిని గుర్తించిన స్థానికులు అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.రెండు స్టేట్మెంట్లుగాంధీ ఆస్పత్రిలో అదే రోజు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అయితే, తాను ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడ్డట్లు ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే పోలీసులు రికార్డు చేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి వచ్చిన తన కుటుంబ సభ్యులకు తనపై అత్యాచార యత్నం జరిగిందన్న విషయాన్ని బాధితురాలు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరోమారు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్న పోలీసులు అత్యాచార యత్నం కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నాలుగు బృందాలతో గాలింపుబాధితురాలిని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) ఎస్పీ చందనదీప్తి సోమవారం పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. రెండు బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన, సాంకేతిక ఆధారాల సేకరణలో ఉన్నాయని వివరించారు. నిందితుడిని గుర్తించడంలో పురోగతి సాధించామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.మెరుగైన వైద్యం అందించాంబాధితురాలిని 22న రాత్రి 11.30 గంటలకు గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సునీల్కుమార్ తెలిపారు. ఆ సమయంలో ఆమె స్పృహలోనే ఉన్నప్పటికీ మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించిందని చెప్పారు. ఆమె చేయి మణికట్టు వద్ద విరిగిందని, శరీరంపై గాయాలున్నాయని వివరించారు. బాధితురాలికి వెంటనే ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు తగిన వైద్యసేవలు అందించారని, సీటీ స్కానింగ్ చేయించామని వెల్లడించారు. కాగా, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సూచన మేరకు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. మంత్రుల ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. లెఫ్ట్ ఎగనెస్ట్ మెడికల్ ఎడ్వైజ్ (లామా) ద్వారా బాధితురాలు గాంధీ ఆస్పత్రి నుంచి వెల్లిపోయినట్లు ప్రొఫెసర్ సునీల్ కుమార్ ఆ తర్వాత వెల్లడించారు.
వీడియోలు


భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసా జారీలో 38 శాతం తగ్గుదల


విడదల రజిని మరిది గోపి, పీఏ రామకృష్ణ, ఎస్పీ జాషువాపై కేసులు


ఒకవైపు డబ్బులు లేవు అంటారు.. మరోవైపు విలాసాలకు ఖర్చు పెడుతున్న కూటమి సర్కార్


లక్నోతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఒక వికెట్ తేడాతో విజయం


చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: ఆశావర్కర్లు


ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్, మంత్రులు భట్టి, ఉత్తమ్


విదేశీ విద్యార్థులకు షాక్ ఇస్తున్న అమెరికా


Satyameva Jayate: నమ్మించి ప్రాణాలు తీస్తున్నారు.. వీళ్లా మన హీరోలు?


అమెరికాలో ఆంధ్రా యువకుడు ఆత్మహత్య


డేవిడ్ వార్నర్ ని బూతులు తిట్టినా రాజేంద్ర ప్రసాద్..