Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Delhi Assembly Election Result 2025 Live Updates: Check Counting Of Votes BJP And AAP And Congress
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. మినిట్‌ టూ మినిట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

Jail Superintendent reports that Chaitanya Reddy did not meet Dastagiri in jail2
పాత కుట్ర.. కొత్త సిరా!

సాక్షి, అమరావతి / సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు సర్కారు రంగంలోకి దిగింది! తానే స్వయంగా వైఎస్‌ వివేకాను హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరి తప్పుడు ఫిర్యాదు ఆధారంగా అక్రమ కేసు నమోదు చేసి కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దస్తగిరి గతంలో న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌ను కొట్టివే సినప్పటికీ... అదే ఫిర్యాదుపై తాజాగా కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయడం అందుకు నిదర్శనం. వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయిన అనంతరం రూపుదిద్దుకున్న కుట్ర కార్యాచరణను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. బెడిసికొట్టిన పన్నాగం..వైఎస్‌ వివేకా హంతకుడు దస్తగిరి ద్వారా నర్రెడ్డి సునీత దంపతులు గతంలో వేసిన పన్నాగం బెడిసికొట్టింది. 2023 నవంబరులో తాను కడప జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డి తనను కలసి బెదిరించినట్లు దస్తగిరి న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాడు. జైలులో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ సందర్భంగా చైతన్య రెడ్డి జైలులోకి తన బ్యారక్‌ వద్దకు రూ.20 కోట్లు తెచ్చి లోబరుచుకునేందుకు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించాడు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణతో అసలు విషయాలు వెల్లడయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు కడప జైలు సూపరింటెండెంట్‌ ప్రకాశ్‌ దీనిపై సమగ్ర నివేదిక సమర్పించారు. జైలులో ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాలు నిర్వహించడం దశాబ్దాలుగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇతర జైళ్లలో నిర్వహించిన వైద్య శిబిరాల వివరాలను సైతం నివేదించారు. దస్తగిరి రిమాండ్‌ ఖైదీగా జైలుకు రాకముందు కూడా డాక్టర్‌ చైతన్య రెడ్డి ఖైదీలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు వెల్లడించారు. జైలులో ప్రత్యేక బ్యారక్‌లో ఉన్న దస్తగిరిని చైతన్యరెడ్డిగానీ ఇతరులుగానీ కలువ లేదని స్పష్టం చేశారు. జైలులో అన్ని ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయని, వాటిలో అటువంటి దృశ్యాలేవీ రికార్డు కాలేదన్నారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. జైలుకు రూ.20 కోట్లు తీసుకెళితే సీసీ టీవీ కెమెరాల్లో నమోదు కావాలి కదా? అని ప్రశ్నిస్తే దస్తగిరి తరపు న్యాయవాది సమాధానం చెప్పలేకపోయారు. ఈ క్రమంలో దస్తగిరి అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. కూటమి సర్కారు వచ్చాక మరోసారి స్పష్టం...గతేడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే కుట్రను మరోసారి తెరపైకి తెచ్చారు. చైతన్యరెడ్డి కడప జైలులో దస్తగిరిని కలిశారన్న ఫిర్యాదుపై విచారించాలని జైళ్ల శాఖ ఐజీ శ్రీనివాసరావును ఆదేశించారు. 2024 నవంబరు 25న ఆయన కడప జైలుకు వచ్చి విచారించగా.. దస్తగిరిని చైతన్యరెడ్డి బెదిరించినట్లుగానీ కనీసం కలిసినట్లుగానీ నిర్ధారణ కాలేదు. అదే విషయాన్ని ఆయన ప్రభుత్వానికి నివేదించారు. దాంతో చంద్రబాబు కుట్ర మరోసారి బెడిసికొట్టింది.అయినా తప్పుడు ఫిర్యాదు... అక్రమ కేసువైఎస్‌ వివేకా హత్య వెనుక అసలు వాస్తవాలు వెల్లడి కాకూడదన్నదే నర్రెడ్డి సునీత దంపతుల లక్ష్యంగా మారింది. అందుకే దేవిరెడ్డి శివశంకర్‌రెడిని లక్ష్యంగా చేసుకుని అక్రమ ఫిర్యాదులు, అక్రమ కేసుల పరంపర కొన సాగించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కొన్నాళ్ల క్రితం నర్రెడ్డి సునీత కలిశారు. అప్పటి నుంచి కుట్ర కార్యాచరణ వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో దస్తగిరి గతంలో ఇచ్చిన తప్పుడు ఫిర్యాదునే మరోసారి తెరపైకి తెచ్చారు.2023 నవంబరులో తాను కడప జైలులో ఉండగా డాక్టర్‌ చైతన్య రెడ్డి బెదిరించారని.. రూ.20 కోట్లు ఆఫర్‌ చేసి లొంగదీసుకునేందుకు యత్నించారని పులివెందుల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నెల 3న అర్ధరాత్రి 11.30 గంటలకు దస్తగిరి ఫిర్యాదు చేయడం... ఆ వెంటనే కనీసం ప్రాథమిక దర్యాప్తు కూడా చేయకుండానే పోలీసులు చైతన్యరెడ్డితో పాటు ఇతరులపై అక్రమ కేసు నమోదు చేయడం అంతా పక్కా కుట్రతో చకచకా సాగిపోయాయి. 15 నెలల క్రితం జరిగిందని దస్తగిరి చెబుతున్న ఉదంతంపై కనీసం ప్రాథమిక విచారణ జరపా­లని కూడా పోలీసులు భావించక పోవడం విస్మ­యం కలిగిస్తోంది. పైగా గతంలో న్యాయస్థానం కొట్టివేసిన పిటిషన్‌లోని అభియోగాల ఆధారంగా హడావుడిగా అర్ధరాత్రి కేసు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రమేనని స్పష్టమవుతోంది. అనంతరం ఈ కుట్రకు మరింత పదును పెడుతూ దస్తగిరి ఫిర్యాదుపై విచారించాలని జైళ్ల శాఖ ఎస్పీ రాహుల్‌ను ఆదేశించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత నవంబరులో జైళ్ల శాఖ ఐజీ శ్రీనివాసరావు ఇదే ఫిర్యాదుపై విచారించారు. దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నవి అవాస్తవాలని నిగ్గు తేల్చారు. కానీ అదే ఆరోపణలపై టీడీపీ కూటమి ప్రభుత్వం మరోసారి విచారణకు ఆదేశించడం గమనార్హం. ఇప్పటికే ఐజీ స్థాయి అధికారి దర్యాప్తు చేసిన ఉదంతంపై.. ఆయన కంటే కింది స్థాయి అధికారి అంటే ఎస్పీ రాహుల్‌తో విచారణకు ఆదేశించడంపై పోలీసు వర్గాలు విస్తుపోతున్నాయి. మరోసారి విచారించాలని భావిస్తే గతంలో విచారించిన ఐజీ స్థాయి కంటే ఉన్నత స్థాయి అధికారికి ఆ బాధ్యతలు అప్పగించాలి. కానీ ఐజీ కంటే చిన్న స్థాయి అధికారి అయిన ఎస్పీతో విచారించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. అంటే తమ మాట వినే అధికారితో విచారణ తంతు ముగించి అక్రమ కేసులు, వేధింపులకు పాల్పడాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్రగా వెల్లడవుతోంది. కాగా దస్తగిరిని జైళ్లశాఖ ఎస్పీ రాహుల్‌ శుక్రవారం విచారించారు. డాక్టర్‌ చైతన్యరెడ్డి, ఏఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్యను కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది.

Delhi Election bjp aap congress Family members of leaders and mlas Contesting3
Delhi Election: కుటుంబ ప్రతిష్టకు అగ్నిపరీక్ష

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన మూడు రోజుల తర్వాత, ఈరోజు(ఫిబ్రవరి 8)న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతల కుటుంబాలకు అగ్నిపరీక్షగా మారాయి. ఈ మూడు పార్టీల నేతలు తమ కుటుంబ సభ్యులను, బంధువులను ఎన్నికల బరిలోకి దింపడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ మూడు పార్టీల నేతలు తాము బంధుప్రీతికి వ్యతిరేకమని చెబుతూనే తమ కుటుంబ సభ్యులను ఎన్నికల రణరంగంలోకి దించారు. ఈ కేటగిరీలో మొత్తం 22 మంది అభ్యర్థులున్నారు. ఏ పార్టీ ఎంతమంది అభ్యర్థులను నిలబెట్టింది? ఏ పార్టీ ఎందరు నేతల బంధువులకు టిక్కెట్లు ఇచ్చిందనే వివరాల్లోకి వెళితే..మీడియాకు అందిన డేటా ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) రాజకీయ వారసుల జాబితాలో 11 మంది అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ ఎనిమిది మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ కేటగిరిలో ముగ్గురు అభ్యర్థులకు బీజేపీ అవకాశం ఇచ్చింది.కాంగ్రెస్న్యూఢిల్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి సందీప్ దీక్షిత్‌(Sandeep Dixit) పేరు ఈ జాబితాలో ముందుగా వస్తుంది. ఆయన ఢిల్లీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ కుమారుడు.మరో పేరు మాజీ ఎంపీ జై ప్రకాష్ అగర్వాల్ కుమారుడు ముదిత్ అగర్వాల్, అతను చాందిని చౌక్ స్థానం అభ్యర్థి.మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) మనవడు ఆదర్శ్ శాస్త్రిని కూడా కాంగ్రెస్ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. అతనికి ద్వారక అసెంబ్లీ స్థానం టికెట్ ఇచ్చింది.కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంగత్ రామ్ సింఘాల్ కుమారుడు శివంక్ సింఘాల్‌ ఆదర్శ్ నగర్ నుండి పోటీకి దిగారు.ఫరీదాబాద్ మాజీ ఎంపీ(కాంగ్రెస్‌) అవతార్ సింగ్ భదానా కుమారుడు అర్జున్ భదానాకు హర్యానా సరిహద్దులోని బదర్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై జంగ్‌పురా స్థానం నుంచి ఫర్హాద్ సూరికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఆయన ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ తాజ్‌దర్ బబ్బర్ కుమారుడు.కాంగ్రెస్ పార్టీ అరిబా ఖాన్ కు ఓఖ్లా స్థానం టికెట్ ఇచ్చింది. ఆమె కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్ కుమార్తె.ఇదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అలీ మొహమ్మద్‌ను ముస్తఫాబాద్ అభ్యర్థిగా నిలిపింది. ఆయన మాజీ ఎమ్మెల్యే హసన్ మెహందీ కుమారుడు.ఆమ్ ఆద్మీ పార్టీఆమ్ ఆద్మీ పార్టీ కూడా బంధుప్రీతిని కనబరిచింది. ఈ జాబితా కింద పార్టీ మొత్తం ఏడుగురు అభ్యర్థులను నిలబెట్టింది. ఇంతే కాకుండా ఆప్ తమ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్ల భర్తలకు కూడా టిక్కెట్లు ఇచ్చింది. మొత్తం 11 మందికి ఆప్ ఈ కేటగిరీ కింద టిక్కెట్లు ఇచ్చింది.ఆప్ పార్టీ మతియా మహల్ స్థానం నుంచి ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ కుమారుడు అలే ఇక్బాల్‌ను బరిలోకి దింపింది.సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.కె. బగ్గా కుమారుడు వికాస్ బగ్గాకు కృష్ణ నగర్ సీటు టికెట్ ఇచ్చారు.ఆమ్ ఆద్మీ పార్టీ చాందినీ చౌక్ స్థానం నుండి ఎమ్మెల్యే ప్రహ్లాద్ సింగ్ సాహ్ని కుమారుడు పురందీప్ సింగ్ సాహ్నిని పోటీకి దింపింది.సీలంపూర్ స్థానం నుండి, మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్ కుమారుడు చౌదరి జుబైర్ అహ్మద్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది.ఆప్ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మహాబల్ మిశ్రా కుమారుడు వినయ్ కుమార్ మిశ్రాకు ద్వారక స్థానం నుంచి టికెట్ ఇచ్చింది.ప్రస్తుత ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్‌కు బదులుగా ఈసారి ఆప్ ఆయన భార్య పోష్ బల్యాన్‌కు టికెట్ కేటాయించింది.బీజేపీబీజీపీ ఈ ఎన్నికల్లో మిగిలిన పార్టీలతో పోల్చి చూస్తే, బంధుప్రీతి కాస్త తక్కువే చూపినట్లు కనిపిస్తోంది.ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీకి దిగారు.మోతీ నగర్ స్థానం నుండి హరీష్ ఖురానాను పార్టీ నిలబెట్టింది. ఆయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా కుమారుడు.ఈ జాబితాలో మూడవ పేరు ఢిల్లీ కాంట్ బీజేపీ అభ్యర్థి భువన్ తన్వర్. ఆయన మాజీ ఎమ్మెల్యే కరణ్ సింగ్ తన్వర్ కుమారుడు.ఇది కూడా చదవండి: Delhi Election: ఆ సీట్లలో ఆప్‌కు చుక్కలే..

PM Narendra Modi to visit France and US from Feb 10 to 134
10న ఫ్రాన్స్‌కు.. 12న అమెరికాకు 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)విదేశీ పర్యటన(foreign tour) ఖరారయ్యింది. ఆయన ఈ నెల 10 నుంచి 12వ తేదీ దాకా ఫ్రాన్స్‌లో(France)12, 13వ తేదీల్లో అమెరికాలో(America) పర్యటిస్తారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌తో కలిసి కృత్రిమ మేధ(ఏఐ) కార్యాచరణ సదస్సులో మోదీ పాల్గొంటారని చెప్పారు. అలాగే ఇండియా–ఫ్రాన్స్‌ సీఈఓల సదస్సుకు హాజరవుతారని అన్నారు. ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్‌ థర్మోన్యూక్లియర్‌ ఎక్స్‌పరిమెంటల్‌ రియాక్టర్‌ను మోదీ సందర్శిస్తారని వెల్లడించారు.అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధానమంత్రి సమావేశమవుతారని పేర్కొన్నారు. మోదీ పర్యటనతో భారత్‌–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని తెలియజేశారు. ఇరుదేశాల మధ్య పరస్పర సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలు, కీలక రంగాల్లో భాగస్వామ్యంపై మోదీ, ట్రంప్‌ చర్చిస్తారని వివరించారు. అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వం కొలువుదీరిన మూడు వారాల్లోపే నరేంద్ర మోదీకి ఆహ్వానం అందిందని అన్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా ట్రంప్‌ ప్రభుత్వం ఆయనను ఆహ్వానించిందని చెప్పారు. ఇండియాతో భాగస్వామ్యానికి అమెరికా ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదొక ప్రతీక అని విక్రమ్‌ మిస్త్రీ వివరించారు. ట్రంప్‌ను ఒప్పిస్తారా? డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా అమెరికాలో అడుగుపెట్టబోతున్నారు. వారిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదార్లను వెనక్కి పంపిస్తున్న సమయంలో మోదీ, ట్రంప్‌ సమావేశం కాబోతున్నారు. భారత్‌–అమెరికా మధ్య వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై వారు విస్తృతంగా చర్చించబోతున్నట్లు సమాచారం. ఇరు దేశాల నడుమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇంధన భద్రత, కృత్రిమ మేధ(ఐఏ) వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకొనేలా నిర్ణయం తీసుకోవచ్చు. అక్రమ వలసదార్ల సమస్యను పరిష్కరించే విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం చురుగ్గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. మోదీతో భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే వీలుంది. భారతీయ అక్రమ వలసదార్లపై కఠినంగా వ్యవహరించకుండా మోదీ తన మిత్రుడైన ట్రంప్‌ను ఒప్పిస్తారా? అనేది వేచి చూడాలి. అమెరికాలో ఎలాన్‌ మస్క్‌ సహా ప్రముఖ వ్యాపారవేత్తలతో మోదీ సమావేశం కానున్నారు. ట్రంప్‌ ప్రియమిత్రుడు..మోదీ గొప్ప నాయకుడు ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో మాట్లాడిన అతికొద్ది మంది ప్రపంచ దేశాల నేతల్లో మోదీ కూడా ఉన్నారు. గతవారం కూడా ఇరువురు నేతలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. వలసలు, భద్రత, వాణిజ్య సంబంధాలపై వారు చర్చించుకున్నారు. ట్రంప్, మోదీ మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని వైట్‌హౌస్‌ ప్రకటించింది. ట్రంప్‌తో మోదీకి చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ట్రంప్‌ తనకు ప్రియమిత్రుడు అని మోదీ చెబుతుంటారు. మోదీ గొప్ప నాయకుడు అని ట్రంప్‌ సైతం ప్రశంసించారు. అయితే, ఇండియాలో అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు అధికంగా విధిస్తున్నారని ట్రంప్‌ ఆక్షేపించారు. ఇండియాను టారిఫ్‌ కింగ్‌గా అభివరి్ణంచారు. గత వారం భారత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ట్రంప్‌ వ్యాఖ్యల ప్రభావం కనిపించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల మోటార్‌ సైకిళ్లతోపాటు పలు ఉత్పత్తులపై టారిఫ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. మోదీ చివరిసారిగా 2024 సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించారు. క్వాడ్‌ దేశాల అధినేతల సదస్సులో పాల్గొన్నారు.

Airtel Calls for Further Tariff Hike for Financial Stability5
‘మొబైల్‌ టారిఫ్‌లు మరింత పెంచాల్సిందే’

ఇప్పటికే పలు విడతలుగా మొబైల్‌ టెలిఫోన్‌ చార్జీలను (Tariff Hike) పెంచినప్పటికీ.. మరింత పెంపు అవసరమని భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel) వైస్‌ చైర్మన్, ఎండీ గోపాల్‌ విఠల్‌ వ్యాఖ్యానించారు. టెలికం రంగ ఆర్థిక స్థిరత్వం కోసం ఇది అవసరమన్నారు. డిసెంబర్‌ క్వార్టర్‌ కంపెనీ త్రైమాసిక ఫలితాల అనంతరం ఇన్వెస్టర్లతో ఏర్పాటు చేసిన ఎర్నింగ్స్‌ కాల్‌లో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు.నెట్‌వర్క్‌పై పెట్టుబడులు తగ్గించి, ట్రాన్స్‌మిషన్‌ సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. తద్వారా కస్టమర్ల అనుభవంలో అంతరాలను తొలగించి, గృహ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను విస్తరించనున్నట్టు తెలిపారు. ‘‘2023–24 కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలు తక్కువగా ఉంటాయి. 2025–26లోనూ మరింత తగ్గుతాయి. డిజిటల్‌ సామర్థ్యాల ఏర్పాటుపై మేము పెట్టిన దృష్టి ఇప్పుడు ఫలితాలనిస్తోంది’’అని చెప్పారు.భారత్‌లో సగటు టెలికం యూజర్‌ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) ప్రపంచంలోనే తక్కువగా ఉందన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుని, నిలకడైన రాబడుల కోసం మరో విడత టారిఫ్‌లకు చికిత్స అవసరమని వ్యాఖ్యానించారు. గతేడాది జూలైలో ఎయిర్‌టెల్‌ సహా ఇతర టెలికం కంపెనీలు టారిఫ్‌లను సగటున 10–21 శాతం మధ్య పెంచడం గమనార్హం.మార్జిన్లు తక్కువగా ఉండే హోల్‌సేల్‌ వాయిస్, మెస్సేజింగ్‌ సేవల నుంచి ఎయిర్‌టెల్‌ తప్పుకుంటున్నట్టు విఠల్‌ ప్రకటించారు. కంపెనీ లాభాలపై దీని ప్రభావం ఉండదన్నారు. డిసెంబర్‌ త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ రూ.16,134 కోట్ల లాభాలను నమోదు చేయడం గమనార్హం. ఒక్కో యూజర్‌ నుంచి సగటున రూ.245 ఆదాయం సమకూర్చుకుంది. ఇది కనీసం రూ.300 ఉండాలని ఎయిర్‌టెల్‌ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది.

Myanmar will be in news more this year than ever before6
మయన్మార్‌ ముక్కలవడం ఖాయమా?

2025 ఫిబ్రవరి 1న మయన్మార్‌ అంత ర్యుద్ధం ఐదో సంవత్సరంలోకి ప్రవేశించింది. ‘తమడో’ (మయన్మార్‌ సైనిక బలగాలు) తిరుగుబాటు చేసినప్పటి నుండి దేశంలో జనజీవితం మారిపోయింది. 2020 ఎన్ని కలలో గెలిచినప్పటికీ ‘నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ’ నేతృత్వంలోని ప్రభుత్వం అధి కారంలోకి రావడానికి సైనిక నాయకత్వం ఎన్నడూ అనుమతించలేదు. దాని నాయకు లను, మద్దతుదారులను అరెస్టు చేశారు. ఏడాదిపాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సైన్యం ద్వారా నూతన ప్రభుత్వం ‘స్టేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కౌన్సిల్‌’ ఏర్పడింది. దీనికి సైన్యం కమాండర్‌ ఇన్‌చీఫ్‌ అయిన సీనియర్‌ జనరల్‌ మిన్‌ ఆంగ్‌ హ్లైంగ్‌ నాయకత్వం వహి స్తున్నారు. ఆయన తనను తాను మయన్మార్‌ ప్రధానమంత్రిగా ప్రక టించుకున్నారు. 2008 రాజ్యాంగం ప్రకారం ఈ పదవి లేదు. సంవ త్సరం లోపే ఎన్నికలు జరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు.2025లో మయన్మార్‌ ఎన్నికలపై ఊహాగానాలు జరుగు తున్నాయి. ప్రతిపక్ష నాయకులను, జుంటా (సైనిక నాయకత్వం) వ్యతిరేకులను అరెస్టు చేస్తూనే ఉన్నారు. అంతర్యుద్ధానికి పరిష్కారా లను కనుగొనే ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. మయన్మార్‌ ప్రజలు బాధలకు గురవుతూనే ఉన్నారు. గ్రామాలను తగలబెట్టడం, వైమానిక బాంబు దాడులు, మరణ శిక్షలు వంటి పాత వ్యూహాలనే సైనిక నాయకత్వం ఉపయోగిస్తున్న క్రమంలో, మయన్మార్‌లో అంత ర్గతంగా స్థానభ్రంశం చెందిన వ్యక్తుల సంఖ్య 33 లక్షలను దాటింది.తగ్గుతున్న సైన్య ప్రాభవంగత రెండేళ్ల కాలంలో, మయన్మార్‌లో సైనిక బలగాల అధికారం, భూభాగంపై నియంత్రణ తగ్గిపోవడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. జనరల్‌ నే విన్‌ తలపెట్టిన 1962 సైనిక కుట్ర, సైనిక కుట్రకు దారితీసిన 1988 తిరుగుబాటు రెండు సందర్భాల్లోనూ అధికారం చేజిక్కించుకున్నాక సైన్యం బలపడింది. కానీ 2021 సైనిక కుట్ర తర్వాత విషయాలు భిన్నంగా ఉన్నాయి. ప్రజా ప్రతిఘటన మరింత ఆచరణీయమైన నిర్మాణంతో తన బలాన్ని పెంచుకుంది.ప్రవాసంలో ఉన్న ‘నేషనల్‌ యూనిటీ గవర్నమెంట్‌’ ఏర్పర్చిన ‘పీపుల్స్‌ డిఫెన్స్ ఫోర్స్‌’ సైనిక అణచివేతను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా సహ కరించింది. ఇది పౌర అవిధేయతా ఉద్యమానికి ఊపునిచ్చింది. ప్రజా స్వామ్యం నుండి మయన్మార్‌ వెనక్కి తగ్గడం వల్ల నిరాశ చెందిన యువత ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో చేరారు. దీనికి సమాంతరంగా, అనేక జాతి సాయుధ సంస్థలు ఈ అవ కాశాన్ని ఉపయోగించుకుని అవి చాలా కాలంగా పోరాడుతున్నప్రాంతాల నుండి తమడో బలగాలను వెనక్కి నెట్టాయి. షాన్ లోని ‘మయన్మార్‌ నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్ ఆర్మీ’, ‘తాంగ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ’, రఖైన్ లోని ‘అరకాన్‌ ఆర్మీ’, కరెన్నిలోని ‘కరెన్ని ఆర్మీ’ దీనికి కొన్ని ఉదాహరణలు. ఆసక్తికరంగా, ‘కాచిన్‌ ఇండిపెండెన్్స ఆర్మీ’ వంటి అనేక జాతీయ సాయుధ సంస్థలు ‘పీపుల్స్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌’కు బహిరంగంగా మద్దతు ఇచ్చాయి. తమడోకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇలాంటి వివిధ సంయుక్త ఫ్రంట్‌ల ఉనికి మయన్మార్‌లో దీర్ఘకాలిక అంతర్యుద్ధానికి ప్రారంభ సంకేతం. గతంలో మాదిరిగా కాకుండా, మయన్మార్‌ అంతటా ఉన్న 330 టౌన్ షిప్‌లలో కనీసం 321 పట్టణాలకు ఈ పోరాటం వ్యాపించిందని వార్తలు వస్తున్నాయి.మయన్మార్‌ సైనిక బలగమైన తమడో అనేక కీలకమైన అంశా లలో విఫలమైంది. బలగాల పరంగా, 2024లో ఉన్న సైనికుల సంఖ్య 4,00,000 నుండి కేవలం 70,000కు పడిపోయింది. చాలా మంది సైన్యాన్ని విడిచిపెట్టి, వెళ్లిపోయారు. దీనికి ప్రాథమిక వేతనం, బీమా లేకపోవడంతో పాటు ఇతర కారణాలు ఉన్నాయి. తమడో బలగా లకు నైతిక స్థైర్యం, యుద్ధరంగంలో నైపుణ్యాలు లేకపోవడం కూడా ఉంది. నాయకత్వ పరంగా, మిన్‌ ఆంగ్‌ హ్లైంగ్‌ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నారు. 2024 ఆగస్టులో జరిగిన ఒక అంతర్గత కుట్ర గురించిన పుకార్లు, మయన్మార్‌లో పరిస్థితులు అంత చక్కగా లేవని సూచి స్తున్నాయి. సైన్యంలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న మిన్‌ ఆంగ్‌హ్లైంగ్, సో విన్‌ ఇద్దరూ 2023లో నేపిటా ప్రాంతంలో త్రుటిలో తప్పించుకున్నారు. ఇది వారి రక్షణ దుర్బలత్వాన్ని బహిర్గతంచేసింది. తమడో తన భూభాగాలను నిలుపుకోలేకపోవడం మరింత ముఖ్యమైనది. మయన్మార్‌ నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్ ఆర్మీ, తాంగ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ, అరకాన్‌ ఆర్మీలతో కూడిన ‘త్రీ బ్రదర్‌హుడ్‌ అలయన్స్’ 2023 అక్టోబర్‌లో నిర్వహించిన ‘ఆపరేషన్‌ 1027’ ఈ విషయంలో ఒక మలుపు అని చెప్పాలి.దీని తర్వాత కరెన్ని రాష్ట్రంలో జరిగిన ‘ఆపరేషన్‌ 1111’ ద్వారా ప్రతిఘటనా బలగాలు ప్రయోజనాలు సాధించాయి. కొత్త పాలనా వ్యవస్థలను ఎలా రూపొందిస్తున్నారో చూపించే తాత్కాలిక కార్య నిర్వాహక మండలిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. 2024 ప్రారంభం నాటికి, మయన్మార్‌ భూభాగంలో 50 శాతాన్ని సైనికేతర దళాలే నియంత్రిస్తున్నట్లు నివేదికలు వచ్చాయి. అంతర్యుద్ధం ముగిసిపోతుందా?సైనిక నియంతృత్వం విఫలమైతే, అంతర్యుద్ధం ముగిసిపోతుందా? అంతర్యుద్ధానికి అంత తేలికైన ముగింపు లేదు. ఈ అంత ర్యుద్ధంలో పాల్గొంటున్న పార్టీల సంఖ్య చాలా ఎక్కువ. 2021 నుండి యుద్ధంలో పాల్గొంటున్న కొత్త ప్రభుత్వేతర సైనికుల సంఖ్య 2,600 అని ఒక అంచనా. ఉదాహరణకు, ‘మయన్మార్‌ నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్ ఆర్మీ’, ‘షాన్‌ స్టేట్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ’ వంటి వాటి మధ్య కూడా పోరాటం ఉంది. ఇవి రెండూ ‘ఫెడరల్‌ పొలిటికల్‌ నెగో షియేషన్‌ అండ్‌ కన్సల్టేటివ్‌ కమిటీ’లో భాగం.‘త్రీ బ్రదర్‌హుడ్‌ అల యన్స్’ కూడా మయన్మార్‌ పరిణామాలపై భిన్నమైన అభిప్రాయా లను కలిగి ఉంది. చైనా ఆదేశం మేరకు, ‘తాంగ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ’ 2024లో కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ‘మయన్మార్‌ నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్ ఆర్మీ’ ఇటీవలే దానిని అనుసరించింది. కానీ తమడో ఆధీనంలో ఉన్న రఖైన్ లోని చివరి కీలకప్రాంతాలలో ఒకటైన సిట్వే వద్ద సైన్యంతో పూర్తి యుద్ధానికి ‘అరకాన్‌ ఆర్మీ’ సిద్ధమవుతోంది. అందువల్ల, మయన్మార్‌ ముఖచిత్రం చాలా అస్పష్టంగా ఉంది.ఇప్పుడు ఏమి జరగవచ్చు? మొదట, మయన్మార్‌ విచ్ఛిన్నం కావడం ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న జాతి రాజ్యాలు సైనిక దళాల నియంత్రణ నుండి దాదాపుగా బయటపడ్డాయి. ప్రత్యేక రాజ్యాలు లేదా ముఖ్యంగా రఖైన్ లో ఏదో ఒక రకమైన సమాఖ్య కోసం ప్రకటన కూడా తయారు కావచ్చు. అయినప్పటికీ, బామర్లు నివసించే ప్రాంతాల్లో సైనిక దళాలు అధికారంలో ఉంటాయని ఒక అంచనా. సైనిక దళాలు ప్రతి పాదిస్తున్నట్లుగా 2025లో ఎన్నికలు జరిగితే, అది సైన్యం ఆధ్వర్యంలోని ‘స్టేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కౌన్సిల్‌’(ఎస్‌ఏసీ) పాలనను మరింత చట్టబద్ధం చేయడానికే ఉపయోగపడుతుంది. దీని అర్థం సైనిక కుట్ర తర్వాత గత వారం ఏడవసారి పొడిగించిన అత్యవసర పరిస్థితి ఈ ఏడాది కూడా ముగిసిపోదు. చైనా ప్రాబల్యంలోని పార్టీలను చర్చ లకు తీసుకురాగలిగితే, కొత్త సైనిక ప్రభుత్వం ఎస్‌ఏసీ స్థానంలోకి రావచ్చు. కానీ, ఇది మయన్మార్‌ కోసం మరొక కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే పనిలో పడుతుంది. మళ్లీ దేశ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మయన్మార్‌ గతంలోకంటే ఈ ఏడాది మరింత వార్తల్లో ఉంటుంది.- వ్యాసకర్త అసోసియేట్‌ ప్రొఫెసర్, డైరెక్టర్‌ ఓపీ జిందాల్‌ విశ్వవిద్యాలయంలోని నెహ్గిన్ పావో కిప్జెన్‌ సెంటర్‌ ఫర్‌ ఆగ్నేయాసియా స్టడీస్‌ (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)-శ్రబణ బారువా

Rasi phalalu: Daily Horoscope On 08 Feb 2025 In Telugu7
ఈ రాశి వారు బంధువులను కలుసుకుంటారు.. పరిచయాలు పెరుగుతాయి.

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం,శిశిర ఋతువు మాఘ మాసం, పుష్య మాసం, తిథి: శు.ఏకాదశి రా.9.26 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం: మృగశిర రా.7.32 వరకు తదుపరి ఆరుద్ర, వర్జ్యం: తె.3.44 నుండి 5.16 వరకు (తెల్లవారితే ఆదివారం), దుర్ముహూర్తం: ఉ.6.38 నుండి 8.07 వరకు, అమృతఘడియలు: ఉ.11.10 నుండి 12.40 వరకు, భీష్మ ఏకాదశి.సూర్యోదయం : 6.35సూర్యాస్తమయం : 5.54రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు.వృషభం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు. సోదరులు, మిత్రులతో అకారణంగా తగాదాలు.మిథున: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. నూతన పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.కర్కాటకం: శ్రమ తప్పదు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో నిరుత్సాహం. నిరుద్యోగుల యత్నాలు వాయిదా.సింహం: బంధువులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.కన్య: కార్యజయం. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పాతమిత్రుల కలయిక.తుల: పనుల్లో తొందరపాటు. బంధువులతో విభేదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు. విద్యార్థులకు ఒత్తిడులు.వృశ్చికం: మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో సమస్యలు., ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. విద్యార్థులకు కొత్త సమస్యలు.ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.మకరం: నూతన ఉద్యోగలాభం. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం. దైవదర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.కుంభం: పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిభారం. విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకావచ్చు.మీనం: బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. ఆస్తుల వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి.

Jasprit Bumrahs fitness report from BCCI medical team today8
బుమ్రా ఫిట్‌గా ఉన్నాడా!

బెంగళూరు: ప్రతిష్టాత్మక చాంపియన్స్‌ ట్రోఫీలో భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah) ఆడే అవకాశాలపై సందిగ్ధత వీడనుంది. వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటూ జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్న బుమ్రా ఫిట్‌నెస్‌పై నేడు స్పష్టత రానుంది. అతనికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం శనివారం బీసీసీఐకి తమ నివేదికను అందజేస్తుంది. ఇందులో బుమ్రా గాయం తీవ్రత, చికిత్సతో పాటు మ్యాచ్‌ ఫిట్‌నెస్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ప్రస్తుతానికి భారత పేసర్‌ బెంగళూరులోనే ఉండనున్నాడు. నివేదికను అందుకున్న తర్వాత బోర్డు అధికారులు బుమ్రాను ఆడించే విషయంపై భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో చర్చించే అవకాశం ఉంది. జనవరిలో సిడ్నీ టెస్టు అనంతరం ఆ్రస్టేలియా నుంచి తిరిగొచ్చిన తర్వాత బుమ్రా గాయానికి స్కానింగ్‌ తీశారు. వెన్ను నొప్పి కారణంగానే ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌కు దిగలేదు. నాడు ఆ రిపోర్టులను న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ క్రీడా వైద్యుడు డాక్టర్‌ రోవన్‌ షూటెన్‌కు చూపించారు. అతని పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగింది కాబట్టి ఇప్పుడు కూడా రోవన్‌ అభిప్రాయం కీలకం కానుంది. చాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు ఈ నెల 12 వరకు గడువు ఉంది. బుమ్రా పూర్తిగా కోలుకోకపోతే అతని స్థానంలో భారత జట్టు స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి లేదా పేసర్‌ హర్షిత్‌ రాణాలలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మార్చి 1న బీసీసీఐ ఎస్‌జీఎం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్త కార్యదర్శి పదవి కోసం ఆసక్తికర పోటీ సాగుతోంది. బోర్డులో ఇప్పటికే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు సీనియర్‌ సభ్యులు ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు. అవిషేక్‌ దాల్మియా (బెంగాల్‌ సంఘం), రోహన్‌ జైట్లీ (ఢిల్లీ సంఘం), సంజయ్‌ నాయక్‌ (ముంబై సంఘం)లలో ఒకరికి ఈ అవకాశం దక్కనుంది. అయితే కార్యదర్శి, కోశాధికారి ఎంపిక తరహాలోనే ఈ పదవికి కూడా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. నిబంధనల ప్రకారం సంయుక్త కార్యదర్శి ఎంపిక కోసం మార్చి 1న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) నిర్వహించనుంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్ర సంఘాలకు నోటీసులు పంపించారు. ఇప్పటి వరకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న దేవ్‌జిత్‌ సైకియా కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది.

Govt proposes to close thousands of primary and upper primary schools in state9
విలీనం కిరికిరి.. బడులకు ఉరే మరి!

ఇది కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రామానగరం ఏడో వార్డులోని ప్రాథమిక పాఠశాల. విద్యార్థుల సౌకర్యం కోసం గత ప్రభుత్వంలో జగనన్న నాడు–నేడు పథకం కింద ఆధునికీకరించి సదుపాయాలు కల్పించారు. ఇక్కడ 1–5 తరగతుల వరకు పది మంది విద్యార్థులు చదువుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాల మూతబడనుంది. ఇదొక్కటే కాదు చల్లపల్లి మండలంలోని 32 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 15 పాఠశాలలు మూత పడనున్నాయి. ఇందులో నాడు–నేడు కింద పనులు జరిగినవి నాలుగు స్కూళ్లున్నాయి.ఇదే జిల్లాలోని మోపిదేవి మండలంలో 28 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వాటిలో 17 బడు­లను ఇతర బడుల్లో విలీనం చేసేలా ప్రతిపాదనలు పంపారు. ఈ విధంగా రాష్ట్రంలో వేలాది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూసి వేసేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇలా ఈ ఒక్క జిల్లాలోనే 136 స్కూళ్లను పూర్తిగా మూసి వేస్తుండగా, మరో 314 పాఠశాలలను ఇతర స్కూళ్లలో విలీనం చేయనున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వేలాది ప్రాథమిక, ప్రాథ­మి­కోన్నత పాఠశాలలను మూసివేసేలా ప్రభు­త్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న విధానాల కంటే మెరుగైన విద్యను అందించడమే తమ లక్ష్యంగా చెప్పుకుంటున్న కూటమి సర్కారు.. బడుల మూసివేత, విలీనం దిశగా అడుగులు వేస్తోంది. విద్యా హక్కు(Right to education) చట్టాన్ని కాలరాస్తూ విద్యార్థులను ఊరికి దూరంగా ఉండే బడులకు పంపించే ఏర్పాట్లు చేస్తోంది. తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చిన చోట వారిని ఒప్పించే బాధ్యతను డీఈవోలు, ఎంఈవోలు, ఎమ్మెల్యేలు, ముఖ్య రాజకీయ నేతలకు అప్పగించింది. ముఖ్యంగా 25 లోపు విద్యార్థులున్న పాఠశాలలను సమీపంలోని మరో పాఠశాలలో విలీనం చేసేలా మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సమా­చా­­రం. ఇలాంటి పాఠశాలలు(Schools) రాష్ట్రంలో దాదాపు 12 వేలకు పైగానే ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో ఆ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. జీవో 117 ప్రకారం 3–5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్‌ బోధన అందించేందుకు గత ప్రభుత్వం ఈ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. అదీ కేవలం కి.మీ లోపు పరిధిలోని 4,731 స్కూళ్లలోని 3–5 తరగతుల విద్యార్థులను 3,348 యూపీ, హైస్కూ­ళ్లలో పెట్టారు. మిగిలిన ఒకటి రెండు తరగతులు అవే స్కూళ్లల్లో కొనసాగాయి. కానీ, కూటమి సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ స్కూళ్లు మూత­బడేలా చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1–5 తరగ­తులు కొనసాగుతున్న స్కూళ్లు 32,596 ఉండగా, వాటిలో కేవలం 17 శాతం స్కూళ్లల్లోనే 60 మంది ఎన్‌రోల్‌ ఉందని, మిగిలిన 83 శాతం స్కూళ్లల్లో విద్యార్థులు తక్కువ మంది ఉన్నందున మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ ప్రారంభించలేమని మార్గ­దర్శకాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మోడల్‌ ప్రయిమరీ స్కూల్‌ ఏర్పాటుకు అనువుగా ఇతర స్కూళ్లను విలీనం చేయాలని నిర్ణయించినట్టు తెలు­స్తోంది. ఈ విలీన ప్రక్రియలో 2014–18 మధ్య మూతబడి, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో పునఃప్రారంభమైనవి, నాడు–నేడు పథకంలో అభివృద్ధి చెందిన స్కూళ్లు కూడా ఉండడం గమనార్హం. పైగా ఉన్నత లక్ష్యంగా కి.మీ పరిధిలోని 3–5 తరగతులను మాత్రమే ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే, నాడు తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నేతలు.. ఇప్పు­డు వేలా­దిగా స్కూళ్లను మూసివేసే పరిస్థితి తీసుకొ­చ్చినా ఎవరూ ప్రశ్నించకపోవడం గమనార్హం.మార్గదర్శకాలకు భిన్నంగా జీవో 117 ఉపసంహరణ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 117 ప్రకారం ప్రస్తుతం 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులను కి.మీ.లోపు ఉన్న హైస్కూల్, యూపీ స్కూళ్లలో విలీనం చేసి, వారికి స్కూల్‌ అసిస్టెంట్లతో బోధన అందిస్తున్నారు. మిగిలిన 1, 2 తరగతుల్లో 10 మంది, అంత కంటే తక్కువ విద్యార్థులున్నా ఎస్‌జీ­టీలతో చదువు చెబుతున్నారు. కానీ ఉప సంహరణ మార్గదర్శకాల్లో 3–5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లోకి తెస్తామని పేర్కొన్నారు. అనంతరం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ‘మోడల్‌ ప్రైమరీ స్కూల్‌’ను ఏర్పాటు చేసి, ఇతర పాఠశాలల్లోని 3–5 తరగతులను వాటిలో కొనసాగిస్తామని ప్రకటించారు.కానీ, ఇప్పుడు మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటులో భాగంగా నాలుగు లేదా ఐదు ప్రాథమిక పాఠశాలలను విలీనం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు 5 కి.మీ పైగా దూరం వెళ్లే పరిస్థితి తలెత్తుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం కి.మీ దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ లోపు ప్రాథమికోన్నత పాఠశాల, 5 కి.మీ దూరంలోపు ఉన్నత పాఠశాల ఉండాలి. కానీ, మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటులో భాగంగా ‘ప్రాథమిక’ విద్యార్థులను 3 కి.మీ దూరానికి మించి విలీనం చేయడం గమనార్హం. తొలుత 3–5 తరగతు­లను ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగిస్తామని ప్రకటించి, తర్వాత ఆ తరగతులను మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చాలంటూ అధికారులను ఆదేశించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలను మరో ఎంపీపీ స్కూల్లో విలీనం చేసేందుకు నివేదిక సిద్ధం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. విద్యార్థులు తక్కువగా ఉన్నారని 2014–18 మధ్య దాదాపు 1,785 స్కూళ్లను నాటి టీడీపీ సర్కారు రద్దు చేసింది. తాజా విలీన ప్రక్రియతో మండలానికి కనీసం 10–16 స్కూళ్లు రద్దవుతాయని, రాష్ట్ర వ్యాప్తంగా 12 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు(Public schools) మూత బడతాయని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విలీన విద్యార్థులకు రవాణా చార్జీలు!» తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌తో పాటు కొన్ని జిల్లాల్లో ఒక కి.మీ లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలు మాత్రమే విలీనం చేసేందుకు ప్రతిపాద­నలు సిద్ధం చేయగా, కృష్ణా జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో అందుకు విరుద్ధంగా ప్రక్రియ చేపట్టినట్టు తెలుస్తోంది. » విలీన పాఠశాల విద్యార్థులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున చెల్లిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతేగాక, ప్రభుత్వం ఈ డబ్బులు ఇచ్చే వరకు ఆయా స్కూళ్లల్లో ఉపాధ్యాయులే ఆ మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయం చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులతో ఒప్పించాలని ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.» ఉపాధ్యాయ సంఘాల సమావేశాల్లో విలీనం ఉండదని చెప్పి, ఇప్పుడు అదే ప్రక్రియను అనుసరిస్తే వ్యతిరేకత వస్తుందని తాము చెబుతుంటే, ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడులు వస్తున్నాయని కింది స్థాయి అధికారులు వాపోతు­న్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కొన్ని స్కూళ్ల విలీనంతో విద్యార్థులు 10 కి.మీ దూరం వెళ్లే పరిస్థితి తలెత్తుతుందని, తద్వారా ప్రభుత్వ విద్యకు తీవ్ర నష్టం జరుగుతుందని చెబుతున్నారు. »మరోపక్క స్కూళ్ల విలీనంపై పేరెంట్స్‌ కమిటీల అనుమతి తీసుకోవాలని, అంగీకారం తెలిపిన ప్రాంతాల్లోనే విలీనం చేయాలని చెబుతున్నా.. ఇప్పటికే విలీన ప్రక్రియకు చేయాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో 117 ద్వారా ఒక్క పాఠశాల కూడా మూత పడలేదని, కానీ కూటమి సర్కారు నిర్ణయాలతో భారీగా పాఠశాలలు మూతబడే పరిస్థితి తలెత్తుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.» పాఠశాలల్లో టీచర్‌ పోస్టులను కాపాడేందుకు ఎంఈవోలు తప్పుడు వివరాలు అందిస్తున్నాంటూ ఆరోపణలు చేసిన పాఠశాల విద్యాశాఖ.. అసలు లెక్కలు తేల్చాలంటూ రెవెన్యూ శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.ఏకపక్ష తరలింపుపై తీవ్ర నిరసన» జీవో 117 రద్దు అనంతరం ప్రతిపాదిత పాఠశాలల ఏర్పాటుపై ఇచ్చిన మెమోకు భిన్నంగా, విద్యా హక్కు చట్టానికి విరుద్దంగా ప్రభుత్వం వెళ్లడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన దానికి భిన్నంగా తరగతులను తరలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తగ్గిపోతుందని చెబుతున్నారు. » జనవరి 9న ఇచ్చిన ప్రతిపాదనల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెరుగుదల, డ్రాప్‌ అవుట్ల తగ్గింపు వంటి లక్ష్యాలతో నూతన పాఠశాలల విధానాన్ని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పంచాయతీలో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల ఆమోదంతో ఒక కి.మీ. పరిధిలోని 3–5 తరగతులను ప్రతిపాదిత మోడల్‌ ప్రైమరీ స్కూల్లో విలీనం చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు 2 కి.మీ. పైనున్న పాఠశాలల నుంచి కూడా తరగతులను విలీనం చేస్తున్నట్టు తెలుస్తోంది.» కొన్ని జిల్లాల్లో పూర్తిగా స్కూళ్లనే తరలించడాన్ని అంగీకరించడం లేదు. అయినప్పటికీ విద్యాశాఖ ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసేందుకే నిర్ణయించినట్టు తెలుస్తోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలి. కానీ ప్రభుత్వం ప్రకటించిన ఫౌండేషన్‌ పాఠశాలలో 30 మంది విద్యార్థుల వరకు ఒక టీచర్‌నే నియమిస్తా­మని పేర్కొంది. ఈ ప్రక్రియ అంతా ఉపాధ్యాయులను మిగులుగా చూపడమే లక్ష్యంగా సాగుతోందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. » కాగా, ఇటీవల గుడ్లవల్లేరు మండలం అంబేద్కర్‌నగర్‌ పాథమిక పాఠశాలను 2 కి.మీ దూరంలోని నీలకంఠేశ్వరపురం పాఠశాలలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని అంగీకరించమని, విద్యార్థులతో కలిసి స్థానికులు ఆందోళనకు దిగారు.

Malayalam film industry to go on strike from June 1 onwards over double taxation on movie tickets10
జూన్‌ 1 నుంచి మలయాళ చిత్రాల షూటింగ్‌ బంద్‌

‘‘మలయాళ చిత్రపరిశ్రమ(Malayalam film industry) తీవ్ర సంక్షోభంలో ఉంది... ఇలానే కొనసాగితే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది’’ అంటూ మాలీవుడ్‌ చిత్రసీమకు చెందిన పలు శాఖలు ఆందోళన చెందుతున్నాయి. ఈ మేరకు కొన్ని మార్పులు చేయకపోతే... జూన్‌ 1 నుంచి సంపూర్ణంగా షూటింగ్స్, అలానే సినిమాలకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలని, చివరికి సినిమాల ప్రదర్శనలను కూడా ఆపాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకొచ్చాయి.కేరళ చిత్ర నిర్మాతల మండలి, కేరళ చిత్ర పంపిణీదారుల సంఘం, కేరళ చలన చిత్ర కార్మికుల సమాఖ్య, కేరళ సినిమా ఎగ్జిబిటర్ల సంఘం... ఇవన్నీ కలిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందరూ కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మలయాళ అగ్రనిర్మాత, కథానాయిక కీర్తీ సురేష్‌ తండ్రి సురేష్‌కుమార్‌(Suresh Kumar) ప్రకటించారు.60 శాతం పారితోషికాలకే... ‘‘సినిమా పరిశ్రమ 30 శాతం పన్ను కడుతోంది. ఇలా 30 శాతం పన్ను విధింపబడుతున్న ఇండస్ట్రీ ఏదీ లేదు. ఈ 30 శాతంలో జీఎస్‌టీ కాకుండా అదనంగా వినోదపు పన్ను కూడా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పన్ను రద్దు చేయాలి. అలాగే ఇండస్ట్రీపరంగా నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలు బాగా పెరిగిపోయాయి.వాటిని తగ్గించాలి. సినిమాకి అవుతున్న బడ్జెట్‌లో 60 శాతం యాక్టర్ల పారితోషికాలకే కేటాయిస్తున్న పరిస్థితుల్లో నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇది మాత్రమే కాకుండా కొత్తగా వస్తున్న యాక్టర్లు, డైరెక్టర్లు కూడా ఎక్కువ పారితోషికం డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి కారణాల వల్ల సినిమా నిర్మాణం అనేది లాభదాయకంగా లేదు’’ అని సురేష్‌కుమార్‌ పేర్కొన్నారు.50 రోజుల్లో పూర్తి చేయకుండా... ఇంకా సినిమా నిర్మాణానికి అవుతున్న సమయం గురించి పేర్కొంటూ... ‘‘50 రోజుల్లోనే పూర్తి చేయడానికి వీలున్న సినిమాలకు కూడా 150 రోజులు చేస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపో తోంది. ఇలా తక్కువ రోజుల్లో పూర్తి చేయలేకపోవడంతో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను తీవ్రతరం చేస్తోంది’’ అన్నారు. 176 చిత్రాలు... అపజయంపాలు... బాక్సాఫీస్‌ ఫెయిల్యూర్స్‌ సినిమా పరిశ్రమని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయని చెబుతూ – ‘‘2024లో విడుదలైన చిత్రాల్లో 176 చిత్రాలు వసూళ్లపరంగా నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ఒక్క జనవరిలోనే రూ. 101 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ నష్టం సినిమా కోసం తెరవెనుక పని చేస్తున్న నిపుణుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది’’ అని పేర్కొన్నారు సురేష్‌కుమార్‌. ఇక తాజాగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో పన్ను తగ్గింపు లేదా ఎత్తివేతను కోరుతూ మలయాళ చిత్రసీమకు చెందిన కీలక శాఖల అధ్యక్షులు త్వరలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ని, ఇతర సంబంధిత మంత్రులను కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. నటీనటుల పారితోషికం తగ్గింపు, తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయడం... వంటి విషయాల్లో సరైన పరిష్కారం లభించకపోతే జూన్‌ 1 నుంచి షూటింగ్స్, సినిమాకి సంబంధించిన ఇతర కార్యకలాపాలు నిలిపివేయడం ఖాయం అని బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మరి... మలయాళ చిత్రాల షూటింగ్స్‌ ఆగుతాయా? చర్చలు సజావుగా జరిగి, పరిష్కార మార్గం వెతుక్కుని షూటింగ్స్‌ చేస్తారా? అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
National View all
Advertisement
Advertisement