ప్రధాన వార్తలు

ఏం జరగబోతోంది?.. ట్రంప్ గరం గరం.. సిట్యుయేషన్ రూమ్ రెడీ
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఏదో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందనే భయాలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. జీ 7 సదస్సు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా నిష్క్రమించడం.. పైగా ఆయన నేతృత్వంలోని సిట్యుయేషన్ రూమ్ హడావిడిగా సమావేశం అవుతుండడమే అందుకు కారణం. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించగా.. ఆ ప్రకటనను తోసిపుచ్చుతూ ‘అంతకు మించే జరగబోతోంది’ అని ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయి చేరుకున్న నేపథ్యంలో.. జీ7 సదస్సు నుంచి ముందుగానే ట్రంప్ నిష్క్రమించారు. పర్యటనను కుదించుకున్న ఆయన.. తాను జీ7 సదస్సు నుంచి వచ్చేలోపు సిట్యువేషన్ రూమ్లో సిద్ధంగా ఉండాలని జాతీయ భద్రతా మండలి(NSC)ని ట్రంప్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరికొన్నిగంటల్లో ట్రంప్ చేరుకుంటారని, ఈ సమావేశం తర్వాత ఆయన కీలక ప్రకటన చేస్తారని వైట్హౌజ్ వర్గాలు వెల్లడించాయి.ట్రంప్ ఆఫర్ ఉత్తదే.. పరిస్థితి చేజారిందా?అంతకు ముందు.. ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణకు ట్రంప్ ఆఫర్ చేశారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అధికారికంగా ఓ ప్రకటన చేశారు. తొలుత కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుని.. ఆ తర్వాత సరిహద్దు చర్చలు ప్రారంభించాలని ట్రంప్ ప్రతిపాదించారని, అయితే ఈ ఆఫర్ను ఇరు దేశాలు అనుసరిస్తాయా? లేదా? అనేది చూడాలని మేక్రాన్ అన్నారు. అయితే.. మేక్రాన్ ప్రకటనను ట్రంప్ తోసిపుచ్చారు. పబ్లిసిటీ కోసమే మేక్రాన్ అలాంటి ప్రకటన చేసి ఉంటారని, అసలేం జరగబోతోందో ఆయన ఊహించలేరని, తాను వాషింగ్టన్ వెళ్లేది కాల్పుల విరమణ కోసం కాదని.. అంతకు మించిందే జరగబోతోందని ట్రంప్ సోషల్మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిణామాలపై ట్రంప్ గరం గరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో.. ఈ వారంలో న్యూక్లియర్ డీల్పై ఇరాన్ ప్రతినిధులతో ఆరో దఫా ట్రంప్ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఆ వార్తలను తోసిపుచ్చారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అలాంటి చర్చల ప్రస్తావన కనుమరుగైందని స్పష్టత ఇచ్చారాయన. ఇక.. టెహ్రాన్ను వీడాలని ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు పరిస్థితి చేజారిందనే సంకేతాలు అందిస్తున్నాయి. ట్రంప్ ఆ ప్రకటన చేసిన కాసేపటికే టెహ్రాన్లో బాంబుల వర్షం కురుస్తోందని సమాచారం. అమెరికా రంగంలోకి దిగి భారీ బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్ అణుస్థావరాలపై ప్రయోగించవచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.ట్రంప్పై ఒత్తిడి..ఇరాన్ మాస్టర్ ప్లాన్గల్ఫ్ దేశాలతో ట్రంప్ను దారిలోకి తెచ్చేందుకు ఇరాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఖతర్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలను ఆశ్రయించింది. ఇజ్రాయెల్ తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా ట్రంప్పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్ దేశాలను ఇరాన్ కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని ఆ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. సర్వీసు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు హడలెత్తిస్తున్నాయి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత బయట పడుతున్న సాంకేతిక లోపాల ఘటనలు ‘వామ్మో.. ఎయిరిండియా’ అనేలా చేస్తున్నాయి. తాజాగా.. మంగళవారం మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిరియిండియా విమానంలో సాంకేతిక సమస్య బయటపడింది. మధ్యాహ్నం 1.10 గంటలకు AI 159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు బయల్దేరాల్సి ఉండగా.. పైలట్ టేకాఫ్ కంటే ముందు సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో విమానంలోని 200 మంది ప్రయాణికులను దించేశారు. తొలుత సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన నిర్వాహకులు.. చివరకు ఫ్లైట్ సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. జూన్ 12వ తేదీన ఇదే రూట్లో ప్రయాణించే ఎయిరింయా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో ఏఐ 171 విమానాన్ని పూర్తిగా రద్దు చేసింది ఎయిరిండియా. దాని స్థానంలోనే AI 159 విమానానికి తీసుకు వచ్చింది. అయితే.. అనూహ్యంగా.. ఇవాళ ఆ విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తడం.. టేకాఫ్కి ముందే ఆ సమస్యను గుర్తించడం.. చివరకు సర్వీస్ రద్దు కావడం జరిగిపోయాయి.Air India crashed after taking off. The plane was seen struggling to gain altitude before crashing into a fire ball.. Over 200 people were on board..#AirIndiaCrash pic.twitter.com/xacH20AlSe— Sudhir Byaruhanga (@Sudhirntv) June 12, 2025

సుప్రీం కోర్టులో కమల్ సినిమాకు భారీ ఊరట!
కమల్ హాసన్ హీరోగా నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రానికి సుప్రీ కోర్టులో భారీ ఊరట లభించింది. కర్ణాటకలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు ఈ సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీం కోర్టు హెచ్చరించింది. థియేటర్స్లో ఏమి ప్రదర్శించాలనే అధికారం గుంపులకు, ఆరాచక శక్తులకు లేదని, మూక బెదిరింపులకు చట్ట పాలనను తాకట్టు పెట్టలేమని కోర్టు పేర్కొంది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన ఏ సినిమానైనా విడుదల చేయాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.అసలేం జరిగిందంటే.. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకీ దారి తీశాయి. కమల్ వ్యాఖ్యలపై కన్నడిగులు భగ్గుమన్నారు. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పకపోవడంతో కర్ణాటకలో ఈ సినిమా విడుదలను నిషేధించారు. దీనిపై చిత్రబృందం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నేడు ఆదేశాలు జారీ చేసింది.

సీఎం చంద్రబాబు ఇలాకాలో దారుణం
కుప్పం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడిరోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన కుప్పం మండలం నారాయణపురంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు.తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప వద్ద రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో తిమ్మరాయప్పఊరొదిలి వెళ్లిపోయాడు. ఆయన భార్య శిరీష ఇద్దరు బిడ్డలతో కలిసి గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తనకు వచ్చిన కూలి డబ్బుల్లోనే భర్త తిమ్మరాయప్ప చేసిన చిన్నపాటి అప్పులను వీలైనంత వరకు తీరుస్తూ వస్తోంది. పెద్దమొత్తం కావడంతో మునికన్నప్పకు అప్పు తీర్చలేకపోయింది. ఈ నేపథ్యంలో మునికన్నప్ప వేధింపులు ఎక్కువయ్యాయి.సోమవారం శిరీష రోడ్డుపై నడిచి వెళ్తుండగా తక్షణమే అప్పు తీర్చాలంటూ మునికన్నప్ప ఒత్తిడి చేశాడు. గ్రామస్తులు చూస్తుండగా అసభ్య పదజాలంతో శిరీషను దూషిస్తూ అప్పు తీర్చకపోతే చంపేస్తానని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా శిరీషను నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేపచెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. దిక్కుతోచని స్థితిలో శిరీష అలాగే నరకం అనుభవించింది. ఈ విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు గ్రామానికి చేరుకుని శిరీషకు కట్లు విప్పి వివరాలు సేకరించారు. టీడీపీ కార్యకర్త మునికన్నప్పను అదుపులోకి తీసుకుని బీఎన్ఎస్ సెక్షన్లు 341/323/324/506/34 కింద కేసు నమోదు చేశారు.కుప్పంలో పచ్చ మాఫియా దౌర్జన్యం: ఎమ్మెల్సీ భరత్కుప్పంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. ‘‘కుప్పంలో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. మహిళపై ఇష్టారాజ్యంగా దాడులు చేస్తున్నారు. చిన్న పిల్లాడు ఏడుస్తున్నా కూడా కనికరించలేదు. నారాయణపురంలో ఈ అనాగరిక ఘటన జరిగింది. కుప్పంలో పచ్చ మాఫియా దౌర్జన్యం చేస్తోంది. పోలీసులు కూడా బాధితులపైనే కేసులు పెడుతున్నారు. కుప్పంలో మహిళా అధికారులకు కూడా భద్రత లేదు’’ అని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

డబ్ల్యూటీసీ 2023-25 అత్యుత్తమ జట్టు ఇదే.. ఛాంపియన్ జట్టు నుంచి ఒక్కరికే అవకాశం
9 జట్లతో రెండేళ్ల పాటు సాగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్ మే 14న ముగిసింది. ఈ సైకిల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఫైనల్స్కు చేరాయి. లార్డ్స్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో సౌతాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాకిచ్చి విజేతగా అవతరించింది. తద్వారా సౌతాఫ్రికా 27 తర్వాత తొలి ఐసీసీ టైటిల్ సాధించింది. ఈ టైటిల్ సౌతాఫ్రికాకు తొలి ప్రపంచ టైటిల్. 1998లో ఆ జట్టు గ్రేమ్ స్మిత్ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. తాజాగా ముగిసిన సైకిల్లో సౌతాఫ్రికా విజేతగా ఆవిర్భవించడంతో డబ్ల్యూటీసీ ప్రారంభమైన సీజన్ నుంచి వరుసగా మూడు సీజన్లలో మూడు కొత్త ఛాంపియన్ జట్లు అవతరించినట్లైంది.అరంగేట్రం ఎడిషన్ ఫైనల్లో (2019-21) న్యూజిలాండ్ భారత్ను ఓడించి విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్ ఫైనల్లో (2021-23) ఆస్ట్రేలియా భారత్ను ఓడించి విజేతగా అవతరించింది. తాజాగా జరిగిన మూడో ఎడిషన్లో (2023-25) సౌతాఫ్రికా ఆసీస్ను చిత్తు చేసి టెస్ట్ ఛాంపియన్షిప్ను చేజిక్కించుకుంది. తొలి రెండు ఎడిషన్లలో ఫైనల్స్కు చేరిన భారత్ తాజాగా ముగిసిన సీజన్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ముగిసిన నేపథ్యంలో ఈ ఎడిషన్ అత్యుత్తమ జట్టు ఇదే అంటూ సోషల్మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గత ఎడిషన్లో అత్యుత్తమ ప్రదర్శలు చేసిన ఆటగాళ్లను ఈ జట్టుకు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్కు కెప్టెన్గా ఆసీస్ సారధి పాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో టీమిండియా, ఆసీస్ నుంచి తలో ముగ్గురు, ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, న్యూజిలాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా నుంచి ఒక్కొక్కరు చోటు దక్కించుకున్నారు.ఈ జట్టు ఓపెనర్లుగా టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్, ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ ఎంపికయ్యారు. వన్డౌన్లో రూట్, నాలుగో స్థానంలో విలియమ్సన్, ఐదో ప్లేస్లో కమిందు మెండిస్ అవకాశాలు దక్కించుకున్నారు. వికెట్కీపర్గా అలెక్స్ క్యారీ, ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, పేసర్లుగా కమిన్స్, రబాడ, బుమ్రా, స్పెషలిస్ట్ స్పిన్నర్గా నాథన్ లయోన్ ఎంపికయ్యారు. ఛాంపియన్ జట్టు సౌతాఫ్రికా నుంచి ఈ జట్టుకు కేవలం ఒక్కరు మాత్రమే (రబాడ) ఎంపికయ్యారు. ఫాబ్ ఫోర్లో ముఖ్యుడైన విరాట్ కోహ్లి ఇటీవలే టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతనికి చోటు దక్కలేదు. ఆశ్చర్యకరంగా ఫాబ్ ఫోర్లోని మరో ఆటగాడు స్టీవ్ స్మిత్కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ జట్టులో చోటు దక్కని మరికొంత మంది అర్హులు కూడా ఉన్నారు. ఇంగ్లండ్కు చెందిన హ్యారీ బ్రూక్, ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య కూడా ఈ జట్టులో చోటు దక్కించుకునేందుకు అర్హులే. డబ్ల్యూటీసీ 2023-25 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్..యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, జో రూట్, కేన్ విలియమ్సన్, కమిందు మెండిస్, అలెక్స్ క్యారీ (వికెట్కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమిన్స్ (కెప్టెన్), కగిసో రబాడ, జస్ప్రీత్ బుమ్రా, నాథన్ లయోన్

నమ్మించి గొంతుకోసి.. కారు ప్రమాదంగా చిత్రీకరించి..
సంగీత ప్రపంచంలో పాపులారిటీ సంపాదించుకుంటోందనుకున్న సమయంలోనే.. ఆమె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే దర్యాప్తులో కేసు కీలక మలుపు తిరిగింది. ఆమెది ప్రమాదం కాదని.. హత్య చేశారనే విషయం బయటపడడంతో అంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ప్రముఖ హర్యానా మోడల్ శీతల్ చౌద్రీ హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను నమ్మించి.. గొంతుకోసి హత్య చేశాడని క్రైమ్బ్రాంచ్ పోలీసులు నిర్ధారించారు. ఆపై ఘటనను ఓ కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. నిందితుడు సునీల్ తన నేరం ఒప్పుకోవడంతో హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. హర్యానా మోడల్ అయిన శీతల్ చౌద్రీ.. అక్కడి మ్యూజిక్ ఇండస్ట్రీలోనూ ఆల్బమ్స్ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమె తన బంధువుల అమ్మాయిలతో పానిపట్ సత్కర్తర్ కాలనీలో నివసించసాగింది. అయితే జూన్14వ తేదీన ఓ ఆల్బమ్ షూట్కు వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మాత్లౌదా పీఎస్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈలోపు.. ఆదివారం(జూన్ 15న) ఓ కాలువలో ఆమె ప్రయాణించిన కారు కొట్టుకువచ్చింది. అయితే అందులో ఆమె మృతదేహాం లేదు. ఆ మరుసటిరోజు.. కారు దొరికిన 80 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేతిపై ఉన్న టాటూల ఆధారంగా అది శీతల్ మృతదేహామేనని నిర్ధారించుకున్నారు. ఈలోపు.. ఆమె ప్రియుడు, ప్రమాదం నుంచి బయటపడ్డ సునీల్ చెప్పిన మాటల్ని అంతా నమ్మారు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పోస్ట్మార్టం నివేదికలో ఆమె గొంతు, శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయని, ఆ గాయాల కారణంగానే ఆమె మరణించిందని తేలింది. లోతుగా దర్యాప్తు చేపట్టిన హర్యానా క్రైమ్ బ్రాంచ్ విభాగం.. చివరగా ఆమె కారులో వెళ్లిన ప్రియుడు సునీల్ను గట్టిగా విచారించడంతో విషయం బయటకు వచ్చింది. శీతల్ గతంలో సునీల్ పని చేసిన ఓ హోటల్లో రిసెప్షనిస్ట్గా పని చేసింది. వీళ్ల మధ్య ఆరేళ్లుగా పరిచయం ఉంది. శీతల్ ఐదు నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్తాబిడ్డలను వదిలేసి తనను వివాహం చేసుకోవాలని సునీల్ శీతల్కు ప్రపోజ్ పెట్టారు. ఈలోపు సునీల్కు ఇదివరకే పెళ్లైందని.. ఇద్దరు బిడ్డలకు తండ్రి అనే విషయం శీతల్కు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. తన పరువును బజారున పడేస్తుందన్న భయంతో.. మాట్లాడుకుందామని శీతల్ను పిలిచాడు సునీల్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఆ మృతదేహాన్ని కారులో ఉంచి కాలువలోకి నెట్టేశాడు. నిందితుడు సునీల్ నేరం అంగీకరించడంతో.. పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. జూన్ 14వ తేదీ.. పానిపట్లో శీతల్ ఆల్బమ్ షూటింగ్.. ఆపై సునీల్తో ఔటింగ్. అర్ధరాత్రి దాకా కలిసి తాగిన శీతల్-సునీల్. ఆపై తన సోదరికి కాల్ చేసి సునీల్ దాడి చేస్తున్నాడని చెప్పిన శీతల్. కాల్ కట్ కావడంతో కంగారుపడిపోయిన శీతల్ సోదరి. జూన్ 15వ తేదీ.. మిస్సింగ్ కేసు నమోదు. పోలీసులు ఎంక్వైరీ. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ను ప్రశ్నించిన పోలీసులు. తాము కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, తాను ఈత కొడుతూ బయటకు వచ్చి ఆస్పత్రిలో చేరానని, శీతల్ కారుతో సహా కొట్టుకుపోయిందని సునీల్ వాంగ్మూలం. శీతల్ ప్రయాణించిన కారు స్వాధీనం.జూన్ 16వ తేదీ.. శీతల్ మృతదేహాం లభ్యం. పోస్ట్మార్టం నివేదికలో హత్య జరిగిందని నిర్ధారణ.జూన్ 17వ తేదీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ నేరాంగీకరణ. ఉదయాన్నే మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడంతో రిమాండ్ విధింపు.

జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా
న్యూఢిల్లీ: జీ20 షెర్పా పదవికి అమితాబ్ కాంత్ రాజీనామా సమర్పించారు. 1980వ బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అమితాబ్ కాంత్ 45 ఏళ్లపాటు వివిధ హోదాల్లో సుదీర్ఘకాలంపాటు సేవలు అందించిన అనంతరం చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టడానికి ముందు.. 2022 జూలైలో ఆయనను జీ20 షెర్పాగా కేంద్రం నియమించింది. ‘నా కొత్త ప్రయాణం’ అంటూ లింక్డెన్లో అమితాబ్ కాంత్ (Amitabh Kant) తాజాగా ఒక పోస్ట్ చేశారు.‘‘45 ఏళ్లపాటు ప్రభుత్వ సేవల తర్వాత కొత్త అవకాశాలను స్వీకరించి, జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. భారత వృద్ధికి, పురోగతికి ఎన్నో అభివృద్ది చర్యల దిశగా నాకు అవకాశం కల్పించడమే కాకుండా.. జీ20 షెర్పా పదవికి నేను సమర్పించిన రాజీనామాకు ఆమోదం తెలిపినందుకు భారత ప్రధానమంత్రికి ఎంతో కృతజ్ఞతలు’’ అని పోస్ట్లో రాసుకొచ్చారు. భారత జీ20 షెర్పాగా ఎన్నో బహుపాక్షిక చర్చలకు నాయకత్వం వహించడం తన కెరీర్లో ఒకానొక పెద్ద మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.జీ20 షెర్పా బాధ్యతలకు ముందు 2016 నుంచి 2022 మధ్య నీతి ఆయోగ్ సీఈవోగా అమితాబ్ కాంత్ పనిచేయడం గమనార్హం. ఆ కాలంలో 115 వెనుకబడిన జిల్లాలను ప్రగతి పథకంలోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. అంతకుముందు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం సెక్రటరీగానూ కాంత్ సేవలు అందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ చూపించిన మార్గదర్శనం, ప్రోత్సాహకానికి కాంత్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.చదవండి: ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతులపై చైనా నియంత్రణలు.. భారత్ కంపెనీల విలవిల

ఆలస్యం చేయొద్దు.. తక్షణమే టెహ్రాన్ను వీడండి.. భారతీయులకు అడ్వైజరీ
టెహ్రాన్/న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారతీయులకు(Indians In Iran) ఇండియన్ ఎంబసీ తాజాగా మంగళవారం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్లోని భారతీయులంతా వెంటనే నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఇప్పటివరకు ఎంబసీని సంప్రదించని భారతీయులు.. తక్షణమే అధికారులతో మాట్లాడి తమ లొకేషన్లను షేర్ చేయాలని సూచించింది. ఈ క్రమంలో హెల్ప్ లైన్ నెంబర్లు +98 9010144557, +98 9128109115, +98 9128109109 లకు తమ వివరాలు తెలియజేయాలని కోరింది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్పై ఇజ్రాయెల్ సైన్యం డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడుతోంది. అమెరికా రాయబార కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి.. ‘‘ఆలస్యం చేయకుండా నగరాన్ని వీడాలి’’ అంటూ భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్లో సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నట్లు ఒక అంచనా. వీళ్లలో 6,000 మందికి పైగా విద్యార్థులే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సత్వర చర్యలు ప్రారంభించింది. విమాన మార్గం మూసేయడంతో.. ఇప్పటికే 100 మందితో కూడిన తొలి బృందాన్ని టెహ్రాన్ నుంచి భూమార్గం ద్వారా అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మీదుగా భారత్కు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు.. భారత రాయబార కార్యాలయం విద్యార్థులకు కీలక సూచనలు జారీ చేసింది. ఎల్లప్పుడూ టచ్లో ఉండాలని, అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో సహకరించాలని కోరింది. ఇదీ చదవండి: యుద్ధం ముగిసేది అప్పుడే.. ఇజ్రాయెల్ స్పష్టీకరణ

Shubhanshu Shukla: ఆహా... అంతరిక్షంలో గాజర్ హల్వా
శుభాంశు శుక్లా అంతరిక్షయాత్రకు సంబంధించిన ఆసక్తి శాస్త్రీయ విషయాలకే పరిమితం కాలేదు.‘అక్కడ ఏంతింటారు?’ లాంటివి కూడా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు.శుక్లా తనతో పాటు భారతీయ రుచులను కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్లనున్నాడు.‘ఇస్రో’ ప్రత్యేకంగా సిద్ధం చేసిన వంటకాలు, గాజర్ హల్వా తీసుకువెళతాడు. ఈ వంటకాలను మొదట భారతదేశ గగన్యాన్ మిషన్ కోసం తయారుచేశారు. వాటిని ఇప్పుడు ‘యాక్సియం–4’ మిషన్ కోసం ఉపయోగించనున్నారు.అంతరిక్ష పరిస్థితులను తట్టుకునేలా, మై క్రో గ్రావిటీలో తినడానికి తేలికగా, సురక్షితంగా, తాజాగా ఉండేలా ఈ ఆహారపదార్థాలను తయారుచేశారు. భారతీయ వంటకాలను ‘యాక్సియం–4’ మిషన్ కోసం ఆమోదించడం అంత తేలికగా జరగలేదు.ఇదీ చదవండి: Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా?‘భారతీయ వంటకాలలో మసాలాలు అధికంగా ఉన్నందున వాటిని తీసుకువెళ్లడానికి అనుమతి లభించడం కష్టం అయింది. చివరకు కొన్ని రకాల ఆహారపదార్థాలను అనుమతించారు. తన వెంట తీసుకువెళుతున్న భారతీయ వంటకాలను తోటి వారికి రుచి చూపించాలని శుభాంశు ఉత్సాహంగా ఉన్నాడు’ అంటుంది లక్నోలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శుక్లా సోదరి సుచి శుక్లా.

ప్రపంచంలో అత్యధిక వ్యక్తిగత పన్ను రేట్లు ఉన్న దేశాలు
ప్రతి దేశ ఆర్థిక చట్రంలో పన్నులు కీలకమైన పాత్ర పోషిస్తాయి. దేశ ఆర్థిక విధానాలు, సామాజిక కార్యక్రమాలు, పొరుగు దేశాలతో ఆర్థిక పోటీతత్వాన్ని ఇవి రూపొందిస్తాయి. 2025లో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు వివిధ దేశాల్లో గణనీయంగా మారింది. కొన్ని దేశాలు సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి ప్రగతిశీల పన్ను నమూనాలను నిర్వహిస్తున్నాయి. మరికొన్ని ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడానికి తక్కువ పన్నులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2025లో అత్యధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు ఉన్న టాప్ 10 దేశాల వివరాలు కింద తెలుసుకుందాం.భారత్లో ఇది గరిష్ఠంగా 30 శాతం ఉంది.
ఇకపై వాట్సప్లో ప్రకటనలు?
'ఆవేశం' కోసం ఆశపడ్డ మంచు విష్ణు.. కానీ
జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా
అంబులెన్స్లో కేదార్నాథ్.. బెడిసికొట్టిన ‘ప్లాన్’
అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. సర్వీసు రద్దు
సుప్రీం కోర్టులో కమల్ సినిమాకు భారీ ఊరట!
డబ్ల్యూటీసీ 2023-25 అత్యుత్తమ జట్టు ఇదే.. ఛాంపియన్ జట్టు నుంచి ఒక్కరికే అవకాశం
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
అబ్బే తుప్పుపట్టింది ప్రభుత్వనికి కాదయ్య! వంతెనకు!!
హిట్ బ్యూటీని పట్టేసిన పూరీ జగన్నాథ్
‘తండ్రి’కి వందనం
బీజేపీలోకి స్వప్న?
'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన
శ్రీవారి సేవలో అలనాటి టాలీవుడ్ హీరోయిన్లు (ఫొటోలు)
‘నాలుగు రోజులైంది.. నా భార్యను నాకు అప్పగించండి సార్’
ఇంగ్లండ్ గడ్డపై సునామీ శతకంతో విరుచుకుపడిన శార్దూల్ ఠాకూర్
విజయవాడలో వెడ్డింగ్ రిసెప్షన్లో చరణ్ దంపతులు (ఫొటోలు)
బతికుండగానే శ్మశానవాటికకు..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు
Plane Crash: నా భార్యకింకా తెలియదు..!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభం
వివాదంలో డీఎస్పీ సతీమణి.. పార్టీ ఇలా కూడా చేసుకుంటారా?
అమెరికా వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు
అఖిల్ పెళ్లి బరాత్ జ్ఞాపకాలతో శోభిత (ఫొటోలు)
అలాగే గాజాకు, పాలస్తీనాకు, ఇరాన్కు.. మొత్తం ప్రపంచానికే క్షమాపణలు చెప్పాలి సార్!
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో పురోగతి
అది సరే! ఇక్కడ లక్షలాది మంది రోడ్డెక్కొద్దని ఎవరు చెప్పాలి సర్..!
విజయ్ దేవరకొండ నుంచి అన్నీ తీసేసుకుంటా: రష్మిక
కేవలం ఆత్మరక్షణ కోసమే గాలిలో కాల్పులు జరపాల్సి వచ్చింది!
ఇకపై వాట్సప్లో ప్రకటనలు?
'ఆవేశం' కోసం ఆశపడ్డ మంచు విష్ణు.. కానీ
జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా
అంబులెన్స్లో కేదార్నాథ్.. బెడిసికొట్టిన ‘ప్లాన్’
అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. సర్వీసు రద్దు
సుప్రీం కోర్టులో కమల్ సినిమాకు భారీ ఊరట!
డబ్ల్యూటీసీ 2023-25 అత్యుత్తమ జట్టు ఇదే.. ఛాంపియన్ జట్టు నుంచి ఒక్కరికే అవకాశం
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
అబ్బే తుప్పుపట్టింది ప్రభుత్వనికి కాదయ్య! వంతెనకు!!
హిట్ బ్యూటీని పట్టేసిన పూరీ జగన్నాథ్
‘తండ్రి’కి వందనం
బీజేపీలోకి స్వప్న?
'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన
‘నాలుగు రోజులైంది.. నా భార్యను నాకు అప్పగించండి సార్’
ఇంగ్లండ్ గడ్డపై సునామీ శతకంతో విరుచుకుపడిన శార్దూల్ ఠాకూర్
బతికుండగానే శ్మశానవాటికకు..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Plane Crash: నా భార్యకింకా తెలియదు..!
తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభం
వివాదంలో డీఎస్పీ సతీమణి.. పార్టీ ఇలా కూడా చేసుకుంటారా?
అమెరికా వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో పురోగతి
అలాగే గాజాకు, పాలస్తీనాకు, ఇరాన్కు.. మొత్తం ప్రపంచానికే క్షమాపణలు చెప్పాలి సార్!
అది సరే! ఇక్కడ లక్షలాది మంది రోడ్డెక్కొద్దని ఎవరు చెప్పాలి సర్..!
విజయ్ దేవరకొండ నుంచి అన్నీ తీసేసుకుంటా: రష్మిక
కేవలం ఆత్మరక్షణ కోసమే గాలిలో కాల్పులు జరపాల్సి వచ్చింది!
సీక్రెట్ చెప్పిన శోభిత.. ట్రోలర్స్కు కౌంటర్?
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
‘సన్రైజర్స్’ ఓనర్తో పెళ్లి.. స్పందించిన అనిరుధ్!
సినిమా

'అల్లు అర్జున్' అందుకున్న అత్యుత్తమ అవార్డ్స్ ఇవే
పుష్ప–2 సినిమాతో 'అల్లు అర్జున్' ఉత్తమ నటుడిగా 'గద్దర్' అవార్డు అందుకున్నారు. గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ చరిత్రలో బన్నీ పేరు చిరస్థాయిలో ఉండిపోనుంది. ఉత్తమ నటుడిగా గద్దర్ తొలి అవార్డ్ అందుకుని చరిత్ర పుటల్లోకి అల్లు అర్జున్ పేరు చేరింది. అదే విధంగా 69వ జాతీయ అవార్డుల్లో కూడా తెలుగు సినిమా సత్తా చాటింది. అక్కడ కూడా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప) నిలవడం సరికొత్త ఘనత అని చెప్పొచ్చు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్.'ఆ బిడ్డ మీద ఒక్క చిన్న గీత పడాలా... గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. ఒక్కొక్కడిని రప్పా రప్పా రప్పా...' అంటూ విలన్లకి వార్నింగ్ ఇస్తాడు పుష్పరాజ్. ఇదే డైలాగ్ రీసెంట్గా గద్దర్ అవార్డ్ అందుకుని మరోసారి చెప్పి తన అభిమానుల్లో జోష్ నింపారు. ప్రస్తుతం అల్లు అర్జున్- అట్లీ (AA22) చిత్రం కోసం పనిచేస్తున్నారు. బన్నీ ఇప్పటి వరకు నటించిన సినిమాలు 21.. అయితే, ఉత్తమ నటుడిగా 11సార్లు నామినేట్ అయ్యాడు. ఏడు చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా అత్యుత్తమ అవార్డ్స్ అందుకున్నాడు. మొత్తంగా దేశంలో పేరు పొందిన 18 అవార్డ్స్ను ఆయన సొంతం చేసుకున్నాడు.ఫిలింఫేర్ అవార్డులుపరుగు (2009)- ఉత్తమ నటుడువేదం (2011)- ఉత్తమ నటుడురేసు గుర్రం (2015)- ఉత్తమ నటుడురుద్రమదేవి (2016)- ఉత్తమ సహాయ నటుడుసరైనోడు (2017)- క్రిటిక్స్ ఉత్తమ నటుడుపుష్ప (2022)- ఉత్తమ నటుడుగద్దర్ అవార్డ్పుష్ప-2 (2024)- ఉత్తమ నటుడుఐఫా అవార్డ్స్రుద్రమదేవి (2016)- ఉత్తమ సహాయ నటుడుసైమా అవార్డ్స్సన్నాఫ్ సత్యమూర్తి (2015)- దక్షిణ భారత సినిమా స్టైలిష్ యూత్ ఐకాన్రుద్రమదేవి (2016)- ఉత్తమ నటుడుఅలా వైకుంఠపురంలో (2021)- ఉత్తమ నటుడుపుష్ప (2022)- ఉత్తమ నటుడు నంది అవార్డ్స్గంగోత్రి (2003) ఆర్య (2004)పరుగు(2008)వేదం(2010)రుద్రమదేవి (2015)నేషనల్ అవార్డ్పుష్ప(2022)- ఉత్తమ నటుడిగా 2023లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్

'రజనీకాంత్ కంటే విజయ్ ఎందులో గొప్ప'
నటుడు విజయ్ రాజకీయ పార్టీని నెలకొల్పి 2026లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈనెల 22న విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇప్పటి నుంచే ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవేడుకలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ.అప్పు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2026లో విజయ్ ముఖ్యమంత్రి కావడం తథ్యం అన్నారు. తమిళగ వెట్రి కళగం పార్టీకి తమిళ ప్రజలు ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 365రోజులు తమ తలైవన్ పుట్టినరోజును వేడుకను జరుపుకునే ఒకే ఒక్క పార్టీ తమిళగ వెట్రి కళగం అని ఆయన అన్నారు.రజనీకాంత్ కంటే విజయ్ ఎందులో గొప్ప: వేల్మురుగన్ఇదిలా ఉంటే తమిళ వాళ్ ఉరిమై పార్టీకి చెందిన వేల్మురుగన్ విజయ్పై విమర్శల దాడి చేశారు. ఒక వేడుకలో ఆయన మాట్లాడుతూ కరుణానిది పాలనలో పోరాడి, వాదాడి రాష్ట్రంలో 36 మెడికల్ కళాశాలను తీసుకొచ్చింది తానేనన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన నటులు తమిళ సమాజానికి చేసిందేమిటని ప్రశ్నించారు. ఒక నటుడు (విజయ్) 10,12వ తరగతి విద్యార్థులను అభినందించడానికి మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. సూపర్స్టార్ రజనీకాంత్, విజయకాంత్ల కంటే విజయ్ ఏమైనా గొప్పా అంటూ ఫైర్ అయ్యారు. చిన్న నటుడు బాలా కూడా తాను స్వయంగా సంపాదించిన డబ్బును పేదలకు సాయం చేస్తున్నారని, రాఘవ లార్సెన్ తాను సంపాదించిన మొత్తంలో వృద్ధులు, వికలాంగుల కోసం ఆశ్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈయన మాత్రం సమావేశాలు మాత్రమే నిర్వహిస్తున్నారని ధ్వజం మెత్తారు.

ఏఆర్.మురుగదాస్ కూతురి ఫంక్షన్.. రెట్రో పాటకు డ్యాన్స్
కోలీవుడ్ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తనలోని మరో కోణాన్ని అభిమానులకు పరిచయం చేశాడు. తన కుటుంబంతో పాటు డ్యాన్స్ చేసి అందరినీ ఆనందపరిచాడు. తన కూతురు హర్షిత హాఫ్ శారీ వేడుకలో సూర్య రెట్రో సినిమాలోని కన్నిమా అనే పాటకు మురుగదాస్, భార్య, కుమరుడు, కూతురు కలిసి వీర లెవల్లో డాన్స్ చేశారు. వీరి కుటుంబ డాన్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మురుగదాస్లోని ఈ యాంగిల్ను చూసి ప్రేక్షకులు ఆశ్యర్యపోతున్నారు. చిత్ర పరిశ్రమలో చాలా మంది దర్శకులు నటులుగా మారుతున్న విషయం తెలిసిందే. మురుగదాస్ కూడా నటుడవుతారేమో అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.గజని, స్టాలిన్, సర్కార్, దర్బార్,స్పైడర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మురుగదాస్ రీసెంట్గా సికందర్ అనే బాలీవుడ్ సినిమాను తెరకెక్కించాడు. అయితే, ఆ చిత్రం భారీ డిజాస్టర్గా మిగిలింది. దీంతో ఏఆర్.మురుగదాస్ మార్కెట్ డౌన్ అయ్యిందనే ప్రచారం జోరందుకుంది. కాగా ప్రస్తుతం ఈయన శివకార్తికేయన్ హీరోగా మదరాసి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తదుపరి ఏఆర్.మురుగదాస్ చేసే చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. ఇలాంటి సమయంలో ఆయన ఇంట్లో ఒక వేడుక జరిగింది.

హనుమాన్ జంక్షన్లో...
అర్జున్, జగపతి బాబు, వేణు తొట్టెంపూడి, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హనుమాన్ జంక్షన్’. మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఎడిటర్ మోహన్ సమర్పణలో ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్ బ్యానర్పై ఎంవీ లక్ష్మి నిర్మించిన ఈ చిత్రం 2001 డిసెంబరు 21న విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాని ఈ నెల 28న రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.‘‘యాక్షన్ , అద్భుతమైన హ్యూమర్ మేళవించిన సినిమా ‘హనుమాన్ జంక్షన్’. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఆకట్టుకునే సంభాషణలు, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు కల్ట్ స్టేటస్ను తీసుకువచ్చాయి. అలాంటి ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ మరోసారి ప్రేక్షకులను థియేటర్లో అలరించబోతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: సి. రామ్ప్రసాద్, సంగీతం: సురేశ్ పీటర్స్.
న్యూస్ పాడ్కాస్ట్

తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్, 9 రోజుల్లో 9వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ

సూపర్ సిక్స్ కాదు.. ఫస్ట్ బాల్కే కూటమి ఔట్. ఏపీలో చంద్రబాబు ఏడాది పాలనపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా

పొగాకు రైతుల సమస్య డైవర్ట్ చేయడానికి దుర్మార్గానికి పాల్పడటం భావ్యమా?... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

నవ్వితేనే అరెస్టు చేస్తారా?... సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్రావు అరెస్టు విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం... మెడికల్ కాలేజీపై కుప్పకూలి పేలిపోయిన ఎయిర్ ఇండియా విమానం.. 265 మంది దుర్మరణం... మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ

చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు శాపంగా మారింది... పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలి... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్

ఏడాది కూటమి పాలనతో ఏపీలో ప్రభుత్వ విద్య నిర్వీర్యం. పాఠశాలల్లో అటకెక్కిన నాడు-నేడు అభివృద్ధి పనులు. అమ్మ ఒడికి వీడ్కోలు.. ఇంగ్లిష్ మీడియంకు మంగళం

పత్రికా స్వేచ్ఛపై పైశాచికత్వం... ఆంధ్రప్రదేశ్లో ‘సాక్షి’ మీడియా సంస్థ కార్యాలయాలపై టీడీపీ కూటమి నేతల దాడులు... కార్యకర్తలు, రౌడీగ్యాంగ్లతో కలిసి బీభత్సం

ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో ఆగని అఘాయిత్యాల పర్వం... బాలికలు, మహిళలపై అత్యాచారాలతో భయానక పరిస్థితులు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం... ప్రభుత్వం చెప్పేదానికి కాగ్ నివేదికలు పూర్తి విరుద్ధం... చంద్రబాబు కూటమి ప్రభుత్వ విధానాలను తప్పుపట్టిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
క్రీడలు

కాబోయే భార్యతో ఫోటోలు పోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేసిన కుల్దీప్ యాదవ్.. ఏం జరిగింది..?
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇటీవలే (జూన్ 4న) తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో నిశ్చితార్ధం చేసుకున్నాడు. లక్నోలోని ఓ హోటల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కుల్దీప్-వన్షిక సంప్రదాయ బద్దంగా ఉంగరాలు మార్చుకున్నారు. కాన్పూర్లోని శ్యామ్ నగర్ ప్రాంతానికి చెందిన వన్షిక ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తుంది. కుల్దీప్-వన్షిక ఎంగేజ్మెంట్కు యూపీకి చెందిన పలువురు క్రికెటర్లు, టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ హాజరయ్యారు. వివాహా తేదీని త్వరలో ప్రకటిస్తామని కుల్దీప్ చెప్పాడు.కాగా, కుల్దీప్-వన్షిక నిశ్చితార్ధం జరిగి రెండు వారాలు కూడా గడవకముందే వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందని సోషల్మీడియాలో పుకార్లు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ ఉదంతం ఈ పుకార్లకు బలం చేకూరుస్తుంది. కుల్దీప్ వన్షికతో కలిసి దిగిన ఫోటోలను నిన్న తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేశాడు. కుల్దీప్ ఇలా చేయడంపై క్రికెట్ ఫాలోవర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరి మధ్య ఏదో జరిగిందని గుసగుసలాడుకుంటున్నారు. కుల్దీప్-వన్షిక బంధం పెళ్లి వరకు కూడా సాగేలా లేదని కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కుల్దీప్ ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఉన్నాడు. ఈ సిరీస్లో కుల్దీప్ టీమిండియాకు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కుల్దీప్ ఇంగ్లండ్ గడ్డపై ఇప్పటివరకు ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అందులోనూ అతను కేవలం తొమ్మిది ఓవర్లు మాత్రమే వేశాడు. ఇంగ్లిష్ కండీషన్స్పై పెద్ద అవగాహన లేని కుల్దీప్ ఏమేరకు రాణిస్తాడో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ సిరీస్లో భారత స్పిన్ విభాగం బరువును కుల్దీప్తో పాటు రవీంద్ర జడేజా మోయనున్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత ఈ ఇద్దరు భారత్ స్పిన్ విభాగానికి పెద్ద దిక్కుగా మారారు. అక్షర్ పటేల్ రూపంలో భారత్కు మరో స్పిన్ ఆప్షన్ ఉన్నా ఈ సిరీస్కు అతన్ని ఎంపిక చేయలేదు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ ఉన్నా అతనికి తుది జట్టులో అవకాశం దొరకడం అనుమానమే. జూన్ 20 నుంచి హెడింగ్లేలో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

క్రికెట్ చరిత్రలో అసాధారణ మ్యాచ్.. మూడో సూపర్ ఓవర్ వరకు తేలని ఫలితం
క్రికెట్ చరిత్రలో ఓ అసాధారణ మ్యాచ్ జరిగింది. ఓ అంతర్జాతీయ టీ20లో ఏకంగా మూడో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. నెదర్లాండ్స్-నేపాల్ మధ్య స్కాట్లాండ్ ట్రై సిరీస్లో భాగంగా జరిగిన మ్యాచ్ ఈ అద్భుతానికి వేదికైంది. భారతకాలమానం ప్రకారం నిన్న (జూన్ 16) రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్లో తొలుత ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. అనంతరం తొలి సూపర్ ఓవర్లో, రెండో సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమమయ్యాయి. చివరికి మూడో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. నేపాల్పై నెదర్లాండ్స్ చారిత్రక విజయం సాధించింది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్ మూడో సూపర్ ఓవర్లో ఫలితం తేలడం ఇదే మొదటిసారి.పూర్తి వివరాల్లోకి వెళితే.. నేపాల్, నెదర్లాండ్స్ జట్లు ఆతిథ్య స్కాట్లాండ్తో కలిసి టీ20 ముక్కోణపు సిరీస్లో పాల్గొంటున్నాయి. ఈ సిరీస్లో భాగంగా గ్లాస్గో వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లో నేపాల్, నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్లో తేజ నిడమానూరు (35) టాప్ స్కోరర్గా నిలువగా.. విక్రమ్జిత్ సింగ్ (30), సాకిబ్ జుల్ఫికర్ (25 నాటౌట్), మైఖేల్ లెవిట్ (20), మ్యాక్స్ ఓడౌడ్ (19), లయన్ క్యాచెట్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. నేపాల్ బౌలర్లలో సందీప్ లామిచ్చేన్ 3, నందన్ యాదవ్ 2, రాజ్బంశీ, కుశాల్ భుర్టెల్ తలో వికెట్ తీశారు.A T20 MATCH GOING TILL THE 3RD SUPER OVER BETWEEN NEPAL AND NETHERLANDS. 🤯pic.twitter.com/RUFOk5qPFb— Mufaddal Vohra (@mufaddal_vohra) June 16, 2025అనంతరం బరిలోకి దిగిన నేపాల్ కూడా నిర్ణీత ఓవర్లలో 152 పరుగులే (8 వికెట్ల నష్టానికి) చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. నేపాల్ ఇన్నింగ్స్లో రోహిత్ పౌడెల్ (48), కుశాల్ భుర్టెల్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో నందన్ యాదవ్ (4 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు) నేపాల్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో డోరమ్ 3, విక్రమ్జిత్ 2, కైల్ క్లెయిన్, బెన్ ఫ్లెచర్, లయన్ క్యాచెట్ తలో వికెట్ తీశారు.తొలి సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ వికెట్ నష్టపోయి 19 పరుగులు చేసింది. ఛేదనలో నెదర్లాండ్స్ వికెట్ నష్టపోకుండా అన్నే పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్కు దారి తీసింది.రెండో సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్లు తలో 17 పరుగులు చేయడంతో మ్యాచ్ మూడో సూపర్ ఓవర్కు వెళ్లింది. ఈ సూపర్ ఓవర్లో నేపాల్ 4 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండా 2 వికెట్లు కోల్పోయింది. దీంతో నెదర్లాండ్స్ టార్గెట్ ఒక్క పరుగుగా మారింది. ఛేదనలో మైఖేల్ లెవిట్ తొలి బంతికే సిక్సర్ బాది నెదర్లాండ్స్కు చారిత్రక విజయాన్ని అందించాడు.

అండర్సన్–సచిన్ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సంబంధించి అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ (ఏటీటీ)ని ఈ నెల 14నే ఆవిష్కరించాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదం నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో భారతీయులతో పాటు 50కి పైగా బ్రిటీష్ జాతీయులు కూడా మరణించారు. దాంతో ట్రోఫీ కార్యక్రమం నిర్వహించడం సరైంది కాదని వారు భావించారు. ఇదే విషయాన్ని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. అయితే ఒకటి, రెండు రోజుల్లోనే ట్రోఫీని ఆవిష్కరిస్తారని ఆయన చెప్పారు. మరోవైపు ఇప్పటి వరకు భారత మాజీ కెపె్టన్ మన్సూర్ అలీఖాన్ పేరుతో ‘పటౌడీ ట్రోఫీ’గా ఉన్న పేరును ‘అండర్సన్–సచిన్ ట్రోఫీ’గా మార్చడంపై చాలా మందిలో అసంతృప్తి ఉంది. పటౌడీ గౌరవార్ధం దీనిని అదే పేరుతో కొనసాగించాలని స్వయంగా సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)ను కోరినట్లు సమాచారం. అయితే ట్రోఫీ పేరు విషయంలో కొత్త నిర్ణయానికే ఈసీబీ కట్టుబడి ఉంటే... ఈ సిరీస్లో పటౌడీ పేరుతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ లాంటి అవార్డును అందించైనా సరే మరో రూపంలో ఆయనను స్మరించుకునే విషయాన్ని పరిశీలించాలని బీసీసీఐ కోరింది.

శ్రీలంక @ బంగ్లాదేశ్
గాలే: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) తాజా విజేత దక్షిణాఫ్రికా సంబరాలు ఇంకా ముగియక ముందే తర్వాతి డబ్ల్యూటీసీకి తెర లేచింది. 2025–27 డబ్ల్యూటీసీ సైకిల్లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్లో తలపడనున్నాయి. గాలే వేదికగా నేటి నుంచి తొలి టెస్టు జరుగుతుంది. కొన్నాళ్ల క్రితమే సొంతగడ్డపై ఆ్రస్టేలియా చేతిలో 0–2తో చిత్తయిన లంక కోలుకొని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్ కోసం లంక ఏకంగా ఆరుగురు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసింది. రెండు చేతులతో స్పిన్ బౌలింగ్ చేయగల తరిందు రత్ననాయకే ఈ టెస్టుతో అరంగేట్రం చేయడం ఖాయమైంది. టీమ్లో సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ ఈ సిరీస్ తర్వాత రిటైర్ కానున్న నేపథ్యంలో విజయంతో వీడ్కోలు పలకాలని జట్టు భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ పరిస్థితి ఎప్పటిలాగే బలహీనంగా కనిపిస్తోంది. జింబాబ్వేతో సిరీస్ను 1–1తో ముగించిన తర్వాత మళ్లీ ఆ టీమ్ ఇప్పుడే బరిలోకి దిగుతోంది. ఒక్క ఆటగాడు కూడా ఫామ్లో కనిపించడం లేదు. కెపె్టన్ నజు్మల్ గత 10 టెస్టుల్లో 2 అర్ధ సెంచరీలు మాత్రమే చేయగా, సీనియర్ బ్యాటర్ ముషి్ఫకర్ గత 13 ఇన్నింగ్స్లలో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. గాలే పిచ్ స్పిన్కు బాగా అనుకూలించే అవకాశం ఉండటంతో ఇరు జట్లు స్పిన్పై బాగా దృష్టి పెట్టాయి. మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్ జట్టుకు కీలకం కానున్నారు. మ్యాచ్కు వర్షం కొంత అంతరాయం కలిగించవచ్చు.
బిజినెస్

దేశీ కంపెనీలకు రేర్ తిప్పలు!
న్యూఢిల్లీ: రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతులపై చైనా నియంత్రణలను కఠినతరం చేయడంతో భారతీయ కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. ప్రధానంగా వాహన విడిభాగాల పరిశ్రమను ఈ అనిశ్చితి వెంటాడుతోంది. నేరుగా చైనా నుంచి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల దిగుమతి కోసం లైసెన్స్లకు దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన రెండు వారాల్లో దేశీ కంపెనీల దరఖాస్తుల సంఖ్య రెట్టింపైనట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. జూన్ మధ్య నాటికి సుమారు 21 కంపెనీలు మీడియం, హెవీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ దిగుమతి పరి్మట్ల కోసం చైనా వాణిజ్య శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎగుమతిదారులు కొనుగోలుదారు నుంచి ఎండ్–యూజర్ సరి్టఫికెట్ను తీసుకోవడం సహా అధికారిక అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ చైనా ఏప్రిల్ 4న ఆదేశాలు చేసిన నేపథ్యంలో వీటి ఎగుమతులకు తీవ్ర అండ్డంకులు నెలకొన్నాయి. ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్ మెటీరియల్స్ను ఎలాంటి ఆయుధాల ఉత్పత్తిలోనూ ఉపయోగించబోమని హామీ ఇవ్వడంతో పాటు నిర్దిష్ట డిక్లరేషన్లు ఈ సరి్టఫికెట్లో ఉంటాయి. చైనాకు దరఖాస్తు చేసిన కంపెనీల్లో బాష్ ఇండియా, మారెల్లి పవర్ట్రెయిన్ ఇండియా, మాహల్ ఎలక్ట్రిక్ డైవŠస్ ఇండియా, టీవీఎస్ మోటార్స్, యూనో ఇండియా తదితర దిగ్గజాలు ఉన్నాయి. విధానపరమైన కారణాలతో గతంలో తిరస్కరణకు గురైన సోనా కామ్స్టర్ తిరిగి దరఖాస్తు చేసుకుంది. చైనా ఆమోదం కోసం వేచి చూస్తోంది. 52 కంపెనీలు... భారతీయ వాహన తయారీ సంస్థల సంఘం (సియామ్) వివరాల ప్రకారం భారతీయ ఆటోమబైల్ కంపెనీలకు సరఫరా చేయడం కోసం దాదాపు 52 కంపెనీలు పూర్తిగా చైనా మాగ్నెట్లపైనే ఆధారపడుతున్నాయి. వీటిలో చాలా వరకు తమ తాజా పర్మిట్ల కోసం అన్ని లాంఛనాలను పూర్తి చేసి చైనా సరఫరాదారులకు డాక్యుమెంట్లను పంపించాయి. అయితే, చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి వాటికి ఇంకా తప్పనిసరి ఎగుమతి లైసెన్స్ రాకపోవడంతో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోపక్క, భారతీయ అధికారులు కూడా చైనాతో చర్చల కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పెద్దగా పురోగతి కనిపించడం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అమెరికా, యూరోపియన్ సంస్థలు మాత్రం ఈ విషయంలో వేగంగా చర్యలు తీసుకున్నాయి. వాస్తవానికి యూఎస్ సుంకాలకు ప్రతిగా చైనా రేర్ ఎర్త్ మాగ్నెట్లపై నిబంధనలను కఠినతరం చేయగా.. అమెరికా ప్రభుత్వం వాటి సరఫరా విషయంలో ఇప్పటికే ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. యూరప్ వాహన విడిభాగాల తయారీ సంస్థలకు కూడా అనుమతులు లభించాయి. భారతీయ కంపెనీలు మాత్రం అనుమతుల కోసం నానాతప్పలు పడుతున్నాయి.ఉత్పత్తికి విఘాతం... వీలైనంత త్వరగా లైసెన్స్లు దక్కకపోతే తయారీకి తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మన పరిశ్రమ స్థాయితో పోలిస్తే రేర్ ఎర్త్ మాగ్నెట్ల దిగుమతుల విలువ తక్కువే అయినప్పటికీ.. వాటిని ఉపయోగించి తయారు చేసే ఒక్క విడిభాగం లేకపోయినా వాహనాల తయారీ నిలిచిపోతుందని ఆటోమొబైల్ కంపెనీకి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. 2024–25లో భారత్ రూ.306 కోట్ల విలువైన 870 టన్నలు రేర్ ఎర్త్ మాగ్నెట్లను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం కంపెనీల వద్దనున్న నిల్వలు జూన్ మొదటి నాటికి పూర్తిగా అయిపోతాయని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.

పీఎఫ్ సేవల కోసం ఏజెంట్ల సాయం తీసుకోవద్దు
న్యూఢిల్లీ: పీఎఫ్ క్లెయిమ్లు, ఆన్లైన్ సేవల విషయంలో ఏజెంట్ల సాయం తీసుకోవద్దంటూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తన సభ్యులకు కీలక సూచన చేసింది. తమ భవిష్యనిధికి సంబంధించి సేవల కోసం ఆన్లైన్ పోర్టల్ను వినియోగించుకోవాలని సూచించింది. దీనివల్ల వ్యక్తిగత వివరాలు రిస్క్ లో పడకుండా ఉంటాయని పేర్కొంది. వేగవంతమైన, పారదర్శకమైన సేవలు, వినియోగ అనుకూలమైన ఎన్నో సంస్కరణ చర్యలను ఈపీఎఫ్వో అమలు చేసినట్టు కేంద్ర కారి్మక శాఖ సైతం గుర్తు చేసింది. ఈపీఎఫ్వో సభ్యులు ఉచితంగా పొందాల్సిన సేవలపై సైబర్ కేఫ్ ఆపరేటర్లు, ఫిన్టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండడం తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. సభ్యులు నేరుగా ఉచితంగా వినియోగించుకోతగిన ఈపీఎఫ్వో ఆన్లైన్ ఫిర్యాదుల పోర్టల్ను ఈ ఆపరేటర్లు వినియోగిస్తున్నట్టు పేర్కొంది. మూడో పక్ష కంపెనీలు లేదా ఏజెంట్లను ఆశ్రయించడం వల్ల సభ్యుల సున్నితమైన ఆర్థిక డేటా లీకయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. సీపీజీఆర్ఏఎంఎస్ లేదా ఈపీఎఫ్ఐజీఎంఎస్ పోర్టల్స్లో ఫిర్యాదు చేయొచ్చని, సకాలంలో పరిష్కారమయ్యేంత వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపింది. క్లెయిమ్ దాఖలు, నిధుల బదిలీ, కేవైసీ అప్డేషన్, ఇతర ఏ ఫిర్యాదు అయినా ఉచితమేనని.. వీటి కోసం ఎవరికీ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏవైనా సమస్యలు ఉంటే ఈపీఎఫ్వో హెల్ప్ డెస్క్లు లేదా ప్రాంతీయ కార్యాలయాల్లో పీఆర్వోలను సంప్రదించొచ్చని సూచించింది. ఈపీఎఫ్వో పరిధిలో 7 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు.

ఎస్బీఐ ఇంటి రుణం కారు చౌకగా..!
న్యూఢిల్లీ: రుణ గ్రహీతలకు ఎస్బీఐ పెద్ద ఉపశమనాన్ని కలి్పంచింది. ఆర్బీఐ రెపో రేటు 0.50 శాతం తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిగా రుణ గ్రహీతలకు బదలాయించింది. వివిధ రకాల రుణాలపై 50 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తూ నిర్ణయించింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు తగ్గనున్నాయి. ఎస్బీఐ రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 50 బేసిస్ పాయింట్లు (0.50 శాతం) తగ్గించింది. ఈ తగ్గింపు అనంతరం ఆర్ఎల్ఎల్ఆర్ రేటు 7.75 శాతానికి దిగొచి్చంది. అలాగే, ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత రుణ రేటును (ఈబీఎల్ఆర్) సైతం 8.65 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గించింది. సవరించిన రేట్లు జూన్ 15 నుంచే అమల్లోకి వచ్చాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ (ఎంసీఎల్ఆర్) రేట్లలో ఎస్బీఐ ఎలాంటి సవరణలు చేయలేదు. దీంతో ఓవర్నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటు 8.2 శాతంగా, మూడు నెలల రేటు 8.55 శాతం, ఆరు నెలల రేటు 8.90 శాతం, ఏడాది ఎంసీఎల్ఆర్ 9 శాతం, రెండేళ్ల రేటు 9.05 శాతం, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 9.10 శాతం చొప్పున ఉన్నాయి. ఆర్బీఐ ఈ నెల ఆరంభంలో రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంక్లు తమ రుణ రేట్లను సైతం వేగంగా సవరించడం గమనార్హం. ఇప్పుడు ఎస్బీఐ సైతం ఇదే నిర్ణయాన్ని అమలు చేసింది. రుణ గ్రహీతల క్రెడిట్ స్కోరును బట్టి ఎస్బీఐ గృహ రుణ రేటు 7.50 శాతం నుంచి 8.45 శాతం మధ్య ఉండనుంది. డిపాజిట్ రేట్లకూ కోతమరోవైపు వివిధ కాల వ్యవధి డిపాజిట్లపై రేటును సైతం ఎస్బీఐ తగ్గించింది. రూ.3 కోట్ల వరకు అన్ని కాల వ్యవధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 1–2 ఏళ్ల డిపాజిట్లపై రేటు తగ్గింపు అనంతరం 6.50 శాతానికి దిగొచి్చంది. 2–3 ఏళ్ల డిపాజిట్లపై రేటు 6.70 శాతం నుంచి 6.45 శాతానికి తగ్గింది. 3–5 ఏళ్లలో మెచ్యూరిటీ తీరే డిపాజిట్లపై వడ్డీ రేటు 6.30 శాతం, 5–10 ఏళ్ల డిపాజిట్లపై రేటు 6.05 శాతానికి తగ్గింది. 444 రోజుల అమృత్ వృష్టి డిపాజిట్పై రేటు 6.85 శాతం నుంచి 6.60 శాతానికి తగ్గింది. 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు సాధారణ రేట్లపై 50 బేసిస్ పాయింట్లు, 80 ఏళ్లు నిండిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 60 బేసిస్ పాయింట్ల అదనపు రేటు డిపాజిట్లపై లభిస్తుంది. పెద్ద ఊరటే.. రూ.50 లక్షల గృహ రుణం, 8 శాతం రేటుపై 20 ఏళ్ల కాలానికి తీసుకునేట్టు అయితే తాజా 50 బేసిస్ పాయింట్ల తగ్గింపు రూపంలో రుణ గ్రహీతకు రూ.3.70 లక్షలు ఆదా కానుంది. 8 శాతం రేటుపై రేటు సవరణకు ముందు నెలవారీ ఈఎంఐ 41,822 కాగా, సవరణ తర్వాత రూ.40,280కు దిగివస్తుంది. ఈఎంఐ తగ్గించుకోకుండా పూర్వపు మాదిరే చెల్లిస్తూ వెళ్లేట్టు అయితే నిర్ణీత కాల వ్యవధి కంటే ముందుగానే రుణం తీరిపోతుంది.

ఇదిగో ఈ ఖర్చులే జేబులు ఖాళీ చేసేది!
ఆదాయం అస్సలు సరిపోవడం లేదు.. నెలాకరు రాకుండానే జేబులు ఖాళీ అవుతున్నాయి.. చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదు.. సగటు మధ్యతరగతి జీవి తరచూ చెప్పుకొనే మాటలివి. నిజమే.. ప్రస్తుత రోజుల్లో ఖర్చులు బాగా పెరిగిపోయాయి. కొన్ని వ్యయాలు మన అదుపులో ఉండవు. కానీ నిశ్శబ్దంగా, తెలియకుండానే జేబులు ఖాళీ చేసే ఖర్చులు కొన్ని ఉన్నాయి. సబ్స్క్రిప్షన్లు, చిన్న రోజువారీ కొనుగోళ్లు లేదా రుసుములు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా పెరుగుతాయి. ఈ ఖర్చులను తెలుసుకోవడం, తగ్గించడం వల్ల మీరు తీవ్రమైన జీవనశైలిలో మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా మీ పొదుపును చాలా వరకు పెంచుకోవచ్చు.సబ్స్క్రిప్షన్ ఆడిట్అనవసరమైన సబ్స్క్రిప్షన్ లను గుర్తించండి. చాలా మంది తాము అరుదుగా ఉపయోగించే సేవలకు సబ్ స్క్రైబ్ చేసుకుంటుంటారు. అన్ని యాక్టివ్ సబ్ స్క్రిప్షన్ లను జాబితా రాసుకుని వాటి అవసరాన్ని అంచనా వేయడం ద్వారా సబ్ స్క్రిప్షన్ ఆడిట్ నిర్వహించండి. పనికిరాని లేదా అరుదుగా ఉపయోగించే వాటిని రద్దు చేయండి. ఈ చిన్న నని మీకు ప్రతి నెలా చాలా డబ్బును ఆదా చేస్తుంది. దీన్ని మరింత ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాలకు వినియోగించుకోవచ్చు.రోజువారీ ఖర్చులపై పర్యవేక్షణరోజువారీ చేసే చిన్న చిన్న కొనుగోళ్లను పర్యవేక్షించండి. రోజువారీ చిరు ఖర్చులు అంటే కాఫీ, స్నాక్స్ వంటి కోసం చేసేవి. ఇవి తక్కువే కదా అనిపించవచ్చు. కానీ నెలాఖరున లెక్కిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుస్తుంది. ఈ ఖర్చులను ఒక వారం పాటు తనిఖీ చేయండి. అవి మీ బడ్జెట్ను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడండి. అలా అని సరదా విషయంలో రాజీపడాల్సిన పని లేదు. ఈ ఖర్చులను తగ్గించడానికి ఇంట్లో కాఫీ, స్నాక్స్ చేసుకుని ఆస్వాదించవచ్చు.అనవసర షాపింగ్ వద్దుషాపింగ్ అంటే అందరికీ ఇష్టమే. కానీ కొంత మంది తరచూ షాపింగ్కు ప్రేరేపితం అవుతుంటారు. ఈ ప్రేరేపిత కొనుగోలు అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయిస్తుంది. బయటకు వెళ్ళే ముందు షాపింగ్ జాబితాలను తయారు చేయడం లేదా అత్యవసరం కాని వస్తువులను కొనుగోలు చేయడానికి ముందు వెయిటింగ్ పీరియడ్ సెట్ చేయడం వంటి వ్యూహాలను అమలు చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా, మీరు ఆకస్మిక నిర్ణయాలను నియంత్రించగలుగుతారు. బదులుగా మీ ఆర్థిక ప్రాధాన్యతలకు సరిపోయే ఆలోచనాత్మక కొనుగోళ్లు చేయగలరు.ఛార్జీలపై అవగాహనబ్యాంకు ఫీజులు, ఛార్జీలను సమీక్షించుకోవడం అవసరం. ఇవే నిశ్శబ్దంగా వచ్చే ఖర్చులు. వీటిని అవగాహన, అప్రమత్తతో తగ్గించుకోవచ్చు. మెయింటెనెన్స్ ఛార్జీలు లేదా ఏటీఎం ఫీజులు వంటి ఏదైనా పునరావృత రుసుము కోసం బ్యాంక్ స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా సమీక్షించండి. తక్కువ ఖర్చులు లేదా ఎటువంటి రుసుము లేని ఖాతాల కోసం ఎంపికలను అన్వేషించండి. బ్యాంకులు లేదా ఖాతా రకాలను మార్చడం కాలక్రమేణా గణనీయమైన పొదుపునకు దారితీస్తుంది.వినియోగ సామర్థ్యంయుటిలిటీ బిల్లులు మన అసమర్థ వినియోగ అలవాట్ల కారణంగా నిశ్శబ్ద ఖర్చుల ఉచ్చులో పడే మరొక ప్రాంతం. గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లను ఆపివేయడం. విద్యుత్తును తక్కువ వినియోగించే ఉపకరణాలను ఉపయోగించడం లేదా థర్మోస్టాట్ సెట్టింగులను సర్దుబాటు చేయడం వంటి సాధారణ చర్యలు ఇంట్లో సౌకర్య స్థాయిలతో రాజీపడకుండానే కాలక్రమేణా యుటిలిటీ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. ఒక్క నెల ఇవన్నీ ప్రయత్నించి చూడండి. మీ ఖర్చుల్లో ఎంత మార్పు వస్తుందో మీరే తెలుసుకుంటారు.
ఫ్యామిలీ

మోడ్రన్ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవుతారు!
తొమ్మిది పదుల వయసులో చాలా చలాకీగా ఓ బామ్మ వ్యాయామాలు చేసేస్తోంది. ఆ క్రమంలోనే ఆమె ఒక్కసారిగా నెటిజన్లను ఓ రేంజ్లో ఆకర్షించింది. యంగ్గా ఉండేవాళ్లు సైతం చేయలేని వ్యాయమాలను ఈ బామ్మ 90ల వయసులో సునాయాసంగా చేసి ఆశ్చర్యపరుస్తోంది. ఆ ఏజ్లో ఉండే కీళ్ల సమస్యలు, కాళ్ల నొప్పులు వంటివి ఏమి లేవు ఆమెకు. పైగా వృద్ధాప్యాన్ని ఇంతలా ఆరోగ్యకరంగా నిర్వహించుకోవచ్చని చాటిచెప్పింది. జీవితం అనేది ఆస్వాదించడానికేనని, అది మన చేతుల్లోనే ఉంది అని క్లియర్గా చెప్పింది. ఇంతకీ ఎవరా బామ్మ అంటే..చైనాకు చెందిన ఈ బామ్మ పేరు లీ. ఆమెకు పుష్ అప్, సిట్ అప్లు చేయడం వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు వేస్తుందామె. ఇరవై, ముప్పైలలో ఉండే యువత సైతం చేయడానికి ఇబ్బండిపడే కష్టతరమైన వర్కౌట్లన్ని బామ్మ లీ హుషారుగా చేసేస్తుంది. ఆమె హునాన్ ప్రావిన్స్లోని జియాంగ్వా యావో అటానమస్ కౌంటీలో నివసిస్తోంది. నిజానికి ఆ ప్రాంతంలో నిరంతరం వర్షాలు పడుతూనే ఉంటాయి. అయితే ఆ వర్షం కూడా ఆమె ఉత్సాహాన్ని నియంత్రించలేకపోయింది. అంటే ఆమె తన వ్యాయామాలు ఇంట్లోనే చేసుకునేలా చక్కగా సర్దుబాటు చేసుకుంది. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ఆమె అభిరుచి అని చెప్పొచ్చు. అంతలా నిబద్ధతతో చేస్తోందా బామ్మ. పైగా ఆమె ప్రతిరోజూ 200 పుష్-అప్లు, 100 సిట్-అప్ల మిస్అవ్వకుండా చూసుకుంటుందట. జూన్ ప్రారంభంలో యావో ఎత్నిక్ మైనారిటీ మెడిసిన్ ఫెస్టివల్ సందర్భంగా ఆ బామ్మ తన ఆరోగ్యకర అలవాట్లు వెలుగులోకి వచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అంతేగాదు ఆమె తన దీర్ఘాయువు సీక్రెట్ని కూడా షేర్ చేసుకుంది. ప్రతి రాత్రిపూట పాదాలను వేడినీళ్లలో ఉంచే అవాట్లతో కాళ్ల నొప్పులను తగ్గించుకున్నానంటోంది. మంచి ఆహారపు అలవాట్లతో జుట్టు నెరిసిపోకుండా చూసుకుంటుందట. ఇక తన చలాకి కదలికలకు కారణం 1959లో చాంగ్షాలోని కళాశాల నుండి పట్టభద్రురాలైన వెంటనే కిండర్ గార్టెన్ టీచర్గా పనిచేయడమేనని అంటోందామె. ఎందుకంటే పిల్లలు కదలికలు చాలా అద్భుతంగా ఉంటాయి. వారిలో ఉండే చురుకుదనం తనకెంతో ఇష్టమని అంటోంది. అలానే యాక్టివ్గా జీవితాంతం ఉండాలనే ఆకాంక్ష..ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేసిందని అంటోంది బామ్మ లీ.వయస్సుతో పాటు మన శరీర కదలికలు తగ్గుతాయి..దాన్ని గమనించి మంచి ఆరోగ్య అలవాట్లు, జీవనశైలిని సరిచేసుకుంటే.. వృద్ధాప్యంలో ఎవ్వరిపై ఆధారపడకుండా..ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆశ్వాదించగలమని చెబుతోంది ఈ బామ్మ. నెటిజన్లు సైతం ఆమె కథని విని..ఆమె మాములు బామ్మ కాదంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.(చదవండి: UK: సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్కు సారథిగా ఆమె..! 115 ఏళ్ల చరిత్రలో..)

బాధ అయినా, భారం అయినా.. తప్పడం లేదు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంత ఇష్టమో ఊహించలేం. అలాంటిది ఇటీవల కాలంలో పిల్లలు ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వెళ్తారా అని వేచిచూస్తున్న పరిస్థితి. బిడ్డల అల్లరిని తల్లిదండ్రులు నియంత్రించలేక పోతున్నారు. గారాబం కాస్త ఎక్కువ కావడంతో పిడుగుల్లా మారుతున్నారు. ఈ క్రమంలో చేసేది లేక పిల్లల్ని హాస్టళ్లలో వదులుతున్నారు. బాధను దిగమింగుకుని బిడ్డ భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు. ఆర్థికంగా భారమైనా.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేలాదిమంది తల్లిదండ్రులు తమ పిల్లలను రెసిడెన్షియల్ ప్రైవేటు స్కూళ్లలో వేస్తున్నారు. తమ తాహత్తుకు మించి ఫీజులున్నా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటుకు తరలిస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మధ్య తరగతి, పేద కుటుంబాలే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో 6వ తరగతి నుంచే పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిస్తుండడం ఆర్థికంగా ఆయా కుటుంబాలను చిదిమేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని రెసిడెన్షియల్ ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి విద్యార్థికి అన్నీ కలిపి రూ.80 వేల నుంచి రూ.1.20 లక్షలకు తక్కువ ఎక్కడా లేదు. డే స్కాలర్ స్కూళ్లలోనూ ఏడాదికి పుస్తకాలతో కలిపి రూ.60 వేల నుంచి రూ.80వేల వరకూ ఉంది. గుడివాడ లాంటి ప్రాంతాలకు రూ.2.50 లక్షలు చెల్లించి పంపిస్తున్న కుటుంబాలూ ఉన్నాయి. ఫీజుల భారం ఇంతలా ఉన్నా.. ఇంట్లో ఉంటే చదవడం లేదని, అప్పు చేసి అయినా హాస్టళ్లలో వేయాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. పదో తరగతిలోపే ఒక్కో విద్యారి్థపై రూ.10 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు అప్పుల్లో కూరుకు పోతున్నాయి. ఒక రకంగా సామాన్యులను ఈ ఫీజులు కోలుకోలేకుండా చేస్తున్నాయి. మొబైల్ బంధంతోనే అనర్థాలు.. చిన్నారులు మొబైల్కు బానిసలుగా మారుతుండడం తల్లిదండ్రులను దిక్కుతోచని స్థితిలోకి నెడుతున్నట్లుగా తెలుస్తోంది. నాల్గో తరగతి నుంచే పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇవ్వడం, వాళ్లు దాన్ని జీవితంలో భాగం చేసుకోవడం విపరీత పరిణామాలకు దారి తీస్తోంది. 70 శాతం విద్యార్థులు మొబైల్ వ్యసనంతోనే తల్లిదండ్రులను ఖాతరు చేయడం లేదు. అనంతపురం వేణుగోపాల్నగర్కు చెందిన శ్రీలత ప్రభుత్వ టీచర్. భర్త ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరి కుమారుడు 7వ తరగతి చదువుతున్నాడు. రెండేళ్ల నుంచి కర్నూలులోని ఓ ప్రైవేటు స్కూల్లో ఉంచి చదివిస్తున్నారు. పిల్లాడు ఇంట్లో చేసే అల్లరి భరించలేక కర్నూలులోని స్కూల్లో వేయాల్సి వచ్చిందని శ్రీలత చెబుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన మహబూబ్బీ గృహిణి. భర్త పోస్టల్ శాఖలో పనిచేస్తారు. వీరికి ఇద్దరు కొడుకులైతే.. ఇద్దరినీ తిరుపతిలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంచి చదివిస్తున్నారు. ఇంట్లో ఉంటే తమ మాట వినరు కాబట్టి హాస్టల్లో వేశాం అని దంపతులు తెలిపారు. హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాంఅనంతపురం సాయినగర్లో హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నా. ఇంట్లో పిల్లలు ఎప్పుడూ సెల్ఫోన్ మాయలోనే ఉంటున్నారు. అందుకే మా అక్క పిల్లలతో పాటు బంధువుల పిల్లలనూ హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాం- మమత, సోదనపల్లి, శింగనమల మండలం ఖర్చయినా తప్పడం లేదునాకు ముగ్గురు పిల్లలు. ఇంట్లో ఉంటే చదవడం లేదు. దీంతో చిన్నప్పటి నుంచే అనంతపురంలో రెసిడెన్షియల్ స్కూల్లో వేశా. ఖర్చయినా వారి బాగు కోసమే హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నా. –బసవ, నేమకల్లు, బొమ్మనహాళ్లి మండలంపల్లెలో చదివించడం కష్టంనాకు ఒక అమ్మాయి. అనంతపురంలో హాస్టల్ ఉన్న స్కూల్లో 10 వరకూ చదివించాను. ఇప్పుడు ఇంటర్కు కూడా హాస్టలున్న కళాశాలలోనే వేస్తు న్నాను. పల్లెలో చదివించడం కష్టంగా ఉంది. – సుజాత, పుట్లూరు మండలం

ఎవరీ బ్లేజ్ మెట్రెవెలి? 115 ఏళ్ల చరిత్రలో..
యూకే సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్కు అధికారిణిగా బ్లేజ్ మెట్రెవెలిని బ్రిటన్ నియమించింది. ఈ సీక్రెట్ ఏజెన్సీ 115 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. చెప్పాలంటే మహిళలు ఎలాంటి క్లిష్టతరమైన పదవులనైనా సునాయసంగా అలకరించగలరు అని ఈ మెట్రెవెలిని నియామకంతో నిరూపితమైంది. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న సర్ రిచర్డ్ మూర్ నుంచి మెట్రెవెలి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె 'సీ' అనే కోడ్నేమ్తో ఈ సీక్రెట్ ఏజెన్సీ M16 చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్న అధికారి. అయితే ఆమె ప్రస్తుతం ఇదే సీక్రెట్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్ 'Q'గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ అదనపు బాధ్యతలతో పూర్తి కార్యాచరణ బాధ్యతను కలిగి ఉంటారు. అంతేగాదు ఆమె నేరుగా విదేశాంగా కార్యదర్శికి తన విధులను నివేదిస్తారు. జేమ్స్ బాండ్ చిత్రాలలో చూసే గాడ్జెట్ నిపుణుడి మాదిరిగా మెట్రెవెలి MI6లో సాంకేతికత తోపాటు ఆవిష్కరణలను పర్యవేక్షిస్తారు. ఆమె గతంలో MI5లో సీనియర్ పదవిని నిర్వహించారు. నిజానికి దేశీయ నిఘా సంస్థ MI5లో స్టెల్లా రిమింగ్టన్, ఎలిజా మానింగ్హామ్-బుల్లర్ అనే ఇద్దరు మహిళా చీఫ్లు ఉండగా, మెట్రెవెలి MI6కు నాయకత్వం వహించనున్న తొలి మహిళ మెట్రెవెలి కావడం విశేషం. ఈ సందర్భంగా బ్లేజ్ మెట్రెవెలి మాట్లాడుతూ.." నాసర్వీస్కు నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నందుకు అత్యంత గర్వంగానూ, గౌరవంగానూ ఉంది. ఈ MI6 అనేది MI5, GCHQ లతో పాటు, బ్రిటిష్ ప్రజలను సురక్షితంగా ఉంచడం, విదేశాలలో UK ప్రయోజనాలను ప్రోత్సహించడం వంటి వాటిల్లో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. అంతేగాదు మా MI6లో పనిచేసే ధైర్యవంతులైన అధికారులు, ఏజెంట్లు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి సమర్థవంతంగా పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం ". అని వెల్లడించింది మెట్రెవెలి. బ్లేజ్ మెట్రెవేలి నేపథ్యం..బ్లేజ్ మెట్రెవేలి కేంబ్రిడ్జ్లోని పెంబ్రోక్ కళాశాలలో ఆంత్రోపాలజీని అభ్యసించింది. ఆ తర్వాత 1999లో కేస్ ఆఫీసర్గా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (MI6)లో చేరారు. మెట్రెవేలి తన కెరీర్లో ఎక్కువ భాగం మిడిల్ ఈస్ట్, యూరప్ అంతటా ఆపరేషనల్ పాత్రలలో గడిపారు. ఆమె ఈ MI6లో వివిధ బాధత్యలను నిర్వర్తించారు.అంతేగాదు యునైటెడ్ కింగ్డమ్ దేశీయ నిఘా సేవ అయిన MI5లో డైరెక్టర్ స్థాయి పదవులను కూడా నిర్వర్తించారామె. ఆ తర్వాత MI6లో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్కు డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. అలాగే బ్రిటిష్ విదేశాంగ విధానానికి ఆమె చేసిన సేవలకు గాను కింగ్స్ బర్త్డే ఆనర్స్లో సెయింట్ మైఖేల్, సెయింట్ జార్జ్ (CMG)ల కంపానియన్గా కూడా నియమితులయ్యారు.MI6 అంటే.. MI6, లేదా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అనేది UK విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ జాతీయ భద్రత తోపాటు విదేశాంగ విధానానికి మద్దుతు ఇచ్చే బాద్యతను కలిగి ఉంది. దీన్ని 1909లో స్థాపించారు. ఈ ఏజెన్సీ ఉగ్రవాదం, సైబర్ దాడులు, శత్రు దేశాల వంటి బెదిరింపులపై దృష్టిపెడుతుంది. ఈ ఎమ్ఐ6 చీఫ్ని 'సీ' అనే కోడ్ నేమ్తో పిలుస్తారు. ఇది దేశీయ ఇంటెలిజెన్స్ నిర్వహించే MI5 వలె కాకుండా MI6 ప్రత్యేకంగా విదేశాలలో పనిచేస్తుంది.(చదవండి: ఎవరీ లీనా నాయర్? ఏకంగా బ్రిటిష్ అత్యున్నత గౌరవం..)

Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా?
వంటిల్లు మన మొత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే వంటిల్లు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. గాలి వెలుతురు ఉండేలా జాగ్రత్త పడాలి. గిన్నెలను కడిగిన తరువాత శుభ్రంగా ఆరనివ్వాలి. వంటఇంట్లో వాడే తువ్వాలు దగ్గర్నుంచీ వంట దినుసులు దాకా అన్నీ ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. మరి టిప్ ఆప్ ది డేలో భాగంగా వంటిట్లో బొద్దింకలను నివారించాలంటే ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలో పాటించాలో తెలుసుకుందాం. వంటింట్లో సింకుల వద్ద బొద్దింకలు ఎక్కువగా చేరుతుంటాయి.అలా చేరకుండా ఉండాలంటే వెల్లుల్లి ముక్కలను దంచి ఆ పేస్ట్ను అవి వచ్చే చోట ఉంచాలి. వీటితో పాటు సింక్లో ఎంగిలి గిన్నెలను అలా వదిలి వేయకూడదు. ఎప్పటికపుడు పాత్రలను కడిగేసుకోవాలి. ప్రతీ ఏడాదికి ఒకసారి తీవ్రతను బట్టి పెస్ట్ కంట్రోల్ చేయించుకోవాలి. ఈ సమయంలో, పిల్లలు, పెడ్ యానిమల్స్తో జాగ్రత్తగా చూసుకోవాలి.వంటింటిని శుభ్రం చేసే నీళ్లలో కాసింత పసుపు కలపాలి. దాని వల్ల ఈగలు రాకుండా ఉంటాయి.ఇంట్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. బొద్దింకలు కిటికీలు, తలుపుల ద్వారా ప్రవేశించవచ్చు. కాబట్టి అవసరం లేనప్పుడు వీటిని మూసివేయాలి.అవసరం లేని అట్ట పెట్టెలపై వంట ఇంట్లో ఉంచుకోవద్దు. వీటిల్లో చెక్క గుజ్జు బొద్దింకలకు అద్భుతమైన ఆహారం. వాటికి మంచి ఆవాసం కూడా.బొద్దింకలు కొన్ని వాసనలను ద్వేషిస్తాయి, ఉదాహరణకు: నిమ్మ, యూకలిప్టస్, లావెండర్, పుదీనా, వేప నూనెలు. ఈ నూనెలను స్ప్రే చేయడం లేదా వాటిని ఇంటి చుట్టూ ఉంచడం వల్ల బొద్దింకలను దూరం చేయవచ్చు, బేకింగ్ సోడా, చక్కెరను సమాన నిష్పత్తిలో కలిపి బొద్దింకలు వచ్చే ప్రదేశాలలో ఉంచుకోవచ్చు.. బోరిక్ యాసిడ్ , మైదా కలిపి మాత్రలు చేసి బొద్దింకలు ఉన్న ప్రదేశాలలో ఉంచడం కూడా మంచిది.వెనిగర్ తో ఇంటిని శుభ్రం చేయడం వల్ల బొద్దింకలు రాకుండా ఉంటాయి.
ఫొటోలు


ఏపీలో అమ్మకు కష్టాలు (చిత్రాలు)


‘కుబేర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మికా క్యూట్ ఫోజులు


ఏపీలో ఈ ‘అద్భుతం’ చూశారా.. (ఫొటోలు)


చిత్తూరు : రోడ్డెక్కిన మామిడి రైతులు..పట్టించుకోని కూటమి సర్కార్ (ఫొటోలు)


సుహాస్ కొత్త సినిమా గ్రాండ్ లాంచ్..గెస్ట్గా కల్కీ మూవీ డైరెక్టర్! (ఫొటోలు)


పాలక్కాడ్ అందాలు.. కమనీయ పర్యాటక ప్రదేశాలివే..!


అఖిల్ పెళ్లి బరాత్ జ్ఞాపకాలతో శోభిత (ఫొటోలు)


శ్రీవారి సేవలో అలనాటి టాలీవుడ్ హీరోయిన్లు (ఫొటోలు)


ప్రభాస్ 'ది రాజాసాబ్' HD మూవీ స్టిల్స్


ఇది కేసీఆర్ సైన్యం.. ఎవరూ టచ్ చేయలేరన్న కేటీఆర్ (చిత్రాలు)
అంతర్జాతీయం

ఇరాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై దాడి
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ప్రభుత్వ వార్తా చానల్ ‘ఇరిన్’ప్రధాన కార్యాలయ భవనంపై ఇజ్రాయెల్ సోమవారం క్షిపణులతో దాడి చేసింది. భవనం కొంతభాగం ధ్వంసమైంది. ఆ సమయంలో యాంకర్ సహర్ ఎమామి చదువుతున్న వార్తలతోపాటు దాడితో సంభవించిన పేలుడు శబ్ధం సైతం ప్రతిధ్వనించింది. భవన శిథిలాలు కింద పడుతున్న శబ్దాలు సైతం వినిపించాయి. స్టూడియో మొత్తం దుమ్ముతో నిండిపోయింది. యాంకర్ వెనుకనున్న స్క్రీన్ తెగిపోయింది. భయపడిన సహర్ ఎమామి వెంటనే కెమెరాను ఆపేసి, బయటకు పరుగుతీశారు. దీంతో కొద్దిసేపు వార్తల ప్రసారం నిలిచిపోయింది. అనంతరం సహర్ ఎమామి, మరో యాంకర్తో కలిసి ఇంకో స్టూడియోలో ప్రీ రికార్డెడ్ కార్యక్రమాలను కొనసాగించారు. పేలుడు కారణంగా భవనం అద్దాలు ధ్వంసమైన, ఇతర భాగాల్లో చెలరేగిన మంటలతో కూడిన వీడియోలు తర్వాత ఇరిన్లో టెలికాస్ట్ అయ్యాయి. కాగా, ఇరిన్ కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ దాడికి గంట ముందు ఇజ్రాయెల్ హెచ్చరికలు పంపింది. ఇరిన్పై దాడికి తామే కారణమని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఇరాన్ సాగించే దుష్ప్రచారానికి ప్రధాన వేదికపై ఆర్మీ దాడి చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. ఇరాన్ నియంతృత్వం ఏరూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. టెహ్రాన్ మూడో నంబర్ జిల్లాలో పలు టీవీ, రేడియో చానెళ్లతోపాటు ఇరిన్ కార్యాలయముంది. ఈ ప్రాంతంలో సుమారు 3.30 లక్షల మంది పనిచేస్తుంటారు. టెహ్రాన్ను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భీకర స్థాయిలో దాడులు చేయబోతున్నట్లు ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. టెహ్రాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని సాధారణ ప్రజలకు సూచించింది. గతంలో గాజా, లెబనాన్లోనూ దాడులకు ముందు ఇజ్రాయెల్ సైన్యం ఇలాంటి హెచ్చరికలే జారీ చేసింది. టెహ్రాన్ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ స్పష్టంచేశారు. ఇరాన్లోని అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసి తీరుతామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. తాము ఏం చేయాలని అనుకుంటున్నామో అది చేసి చూపిస్తామన్నారు.ఇరాన్లో వైద్యుడికి ఉరి 2023 నుంచి జైలులో ఉంటున్న మెడికల్ డాక్టర్ ఇస్మాయిల్ ఫెక్రీకి ఇరాన్ అధికారులు సోమవారం ఉరిశిక్ష అమలు చేశారు. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్కు అతడు సహరించినట్లు, ఇరాన్కు సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించినట్లు ఆరోపణలు రుజువయ్యాయని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.Israeli Air Force bombed Iran’s State TV headquarters live on air !Moments before the strike, they issued a evacuation warnings also TV headquarters is now completely destroyed..it’s a massive hit on Tehran’s media narrative stronghold. pic.twitter.com/Pu8xiAFcyG— Major Surendra Poonia (@MajorPoonia) June 16, 2025

అమెరికా అతలాకుతలం.. వాతావరణ మార్పుతో వరద బీభత్సం
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరద బీభత్సానికి పశ్చిమ వర్జీనియా, టెక్సాస్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. వర్జీనియాలో కురిసిన కుండపోత వర్షాలు, వరదలకు ఐదుగురు మృతిచెందారు. ఫెయిర్మాంట్లో ఒక భవనం పాక్షికంగా కూలిపోయింది. అమెరికాలో ఆకస్మిక వరదలకు వాతావరణ మార్పే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.భారీ వరదల కారణంగా పశ్చిమ వర్జీనియాలోని వీలింగ్ క్రీక్ నదిలో 90 నిముషాల వ్యవధిలో ఏడు అడుగుల మేరకు నీటిమట్టం పెరిగి, మౌలిక సదుపాయాలను దెబ్బతీసింది. ఒహియో కౌంటీలో భారీ వర్షాల కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆస్టిన్, వాకోతో సహా సెంట్రల్ టెక్సాస్లు ఆకస్మిక వరద ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతాల్లో నాలుగు అంగుళాల మేరకు వర్షపాతం నమోదయ్యింది. కాన్సాస్లో, ఆకస్మిక వరదల కారణంగా ప్రభుత్వం అత్యవసర సహాయ చర్యలు చేపట్టింది.ఎల్ డొరాడోలో వాల్నట్ నది ఉప్పొంగి సమీపంలోని ఇళ్లను ముంచెత్తింది. టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో జూన్ 11 రాత్రి నుండి జూన్ 12 ఉదయం వరకు 10 అంగుళాల వర్షపాతం కురిసింది. ఇది ఇక్కడి సాధారణ నెలవారీ సగటు కంటే చాలా ఎక్కువ. అలబామా, లూసియానా, న్యూయార్క్లను కూడా తుఫాను ముప్పు వెంటాడుతోంది. అమెరికాలో వాతావరణ మార్పు కారణంగా తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పాటు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. శాన్ ఆంటోనియోలో 12 గంటల వ్యవధిలో 10 అంగుళాల వర్షం కురిసింది. ఇది జూన్ నెల మొత్తం సగటు వర్షపాతం కంటే రెండింతలు అధికం.అమెరికాలో ఆకస్మిక వరదలకు గల ప్రధాన కారణాలలో వాతావరణ మార్పు ఒకటి. పసిఫిక్ ఇన్స్టిట్యూట్ తెలిపిన వివరాల ప్రకారం వాతావరణ మార్పు వల్ల అధిక వర్షపాతం నమోదు కావడం, సముద్ర మట్టాల పెరుగుదల, వరద ముప్పు లాంటివి చోటుచేసుకుంటున్నాయి. సముద్ర మట్టం పెరగడం కారణంగా తీరప్రాంతాల్లో వరద ముప్పు అంతకంతకూ పెరుగుతోంది. అధిక ఆటుపోట్లు, తుఫానులు ఏర్పడే పరిస్థితుల్లో ఈ ముప్పు మరింత పెరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా తుఫానులు మరింత విధ్వంసకరంగా మారి, భారీ వర్షపాతం కురవడంతో పాటు వరదలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో వాతావరణ మార్పు కారణంగా నేలలోని తేమ తగ్గుతుంది, దీంతో వర్షపు నీరు భూమిలోకి చొచ్చుకుపోయే బదులు ఉపరితలంపైకి వెళ్లిపోతుంది. ఇది ఆకస్మిక వరదలకు దారితీస్తోంది.అటవీ నిర్మూలన, పట్టణీకరణ వరదల ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. పట్టణ ప్రాంతాలలోని కాంక్రీటు నిర్మాణాలు వర్షపు నీటిని భూమిలోనికి వెళ్లకుండా నిరోధిస్తాయి. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం, అటవీ నిర్మూలనను నిరోధించడం, పట్టణ ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం లాంటివి తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ

ఇరాన్కు ‘అణు’ సాయం.. నాలుక మడతేసిన పాక్
ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట తమపై ఇజ్రాయెల్ అణ్వాయుధాలు ఉపయోగిస్తే.. మద్దతుగా పాకిస్తాన్ అణు దాడులకు దిగుతుందని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) కమాండర్ జనరల్ మొహ్సెన్ రెజాయ్ స్వయంగా ఈ ప్రకటన చేయడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ప్రకటనపై ఇప్పుడు పాక్ యూటర్న్ తీసుకుంది.ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే.. పాకిస్థాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్, ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ మొహ్సెన్ రెజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రభుత్వం నడిపించే ఓ టీవీ చానెల్తో ఆయన మాట్లాడుతూ. ‘‘ఇజ్రాయెల్ మాపై అణు దాడి చేస్తే.. ఇస్లామాబాద్(పాక్) కూడా టెల్అవీవ్పై అణుబాంబును ప్రయోగిస్తుందది. ఈ మేరకు పాక్ నుంచి స్పష్టమైన హామీ లభించింది’’ అని మొహసిన్ వెల్లడించారు.అంతేకాదు.. తుర్కియే, సౌదీ, పాకిస్థాన్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటుచేయాలని మొహసిన్ అన్నారు. కానీ, ఆయా దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవన్నారు. వీటిల్లో ఒక్క దేశమైనా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు. అబ్బే.. అలా అనలేదుఇరాన్ ఇచ్చిన ప్రకటనను పాక్ ఖండిచింది. తాము అలాంటి కమిట్మెంట్ ఏదీ ఇవ్వలేదని పాకిస్తాన్ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ ఇరాన్కు తమ విస్తృత మద్దతు ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని పాక్ ఇదివరకే ఖండించింది. యూదు దేశం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్కు తాము మద్దుగా నిలుస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ జూన్ 14వ తేదీన పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు. ఇరాన్, యెమెన్, పాలస్తీనాలకు ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికైనా ఇస్లాం దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ దేశాలకు పట్టిన గతే రేపు మనకూ పడుతుంది. ఓఐసీ(Organisation of Islamic Cooperation) దేశాలు ఇజ్రాయెల్ దాడులపై వ్యూహరచన కోసం ఓ సమావేశం నిర్వహించాల్సి ఉంది’’ అని ఖ్వాజా చేసిన వ్యాఖ్యలను తుర్కియే టుడే ప్రముఖంగా ప్రచుచురించింది. భగ్గుమన్న పశ్చిమాసియాఇరాన్ నుంచి ప్రపంచ దేశాలకు అణు ముప్పు పొంచి ఉందని, ఇప్పటికే కీలక పరీక్షలు నిర్వహించిందని చెబుతూ ఆపరేషన్ రైజింగ్ లయన్(Operation Rising Lion) పేరిట ఇజ్రాయెల్ దాడులకు దిగింది. అయితే ఇరాన్ ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ప్రతిగా.. ఇజ్రాయెల్పైనా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ ఉద్రిక్తతలతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ప్రపంచంలో ప్రస్తుతం అణ్వాయుధాలున్న దేశాల్లో ఇజ్రాయెల్, పాకిస్థాన్ స్థానం దక్కించుకొన్నాయి. ఈ జాబితాలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, భారత్, ఉత్తర కొరియా కూడా ఉన్నాయి.

ఇరాన్ టార్గెట్ ట్రంప్.. హత్యకు ప్లాన్: నెతన్యాహు
జెరూసలేం: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. పరస్పర దాడుల కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇలాంటి క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఇరాన్ చంపాలని చూస్తోందని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్కు నంబర్ వన్ శత్రువు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్తో జరిగిన నకిలీ అణు ఒప్పందాన్ని ట్రంప్ రద్దుచేశారు. ఇందులో ట్రంప్ నిర్ణయాత్మక నాయకుడు. తమ అణు కార్యక్రమానికి ముప్పుగా ట్రంప్ను ఇరాన్ గుర్తించింది. అందుకే ట్రంప్ లేకుండా చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు ట్రంప్ను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు. ఇజ్రాయెల్ తననే కాకుండా ప్రపంచాన్ని కూడా రక్షిస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలా వరకు వెనక్కి నెట్టాయి’ అని చెప్పుకొచ్చారు.Netanyahu claims that Iran tried to assassinate Trump twice, strongly implying that Iran was behind the two assassination attempts in 2024 -- with virtually no pushback from Bret Baier. He then goes on to thank Trump for the extensive US involvement in the current operation pic.twitter.com/savpcfxMMX— Michael Tracey (@mtracey) June 15, 2025ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్, ఇరాన్ వరుసగా మూడో రోజూ పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు గ్యాస్, చమురు శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ భారీగా దాడులు చేసింది. క్షిపణి దాడులతో టెహ్రాన్ దద్దరిల్లిపోయింది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్లో భారీ విధ్వంసం సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలు తదితరాల జోలికి రావొద్దని ఇరాన్ను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. వాటిపై దాడులు చేస్తే కనీవినీ ఎరగని రీతిలో సైనిక శక్తిని ప్రయోగించి ఇరాన్ను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. తక్షణం దిగొచ్చి తమతో అణు ఒప్పందం చేసుకుంటేనే దాడులు తగ్గుముఖం పడతాయని పునరుద్ఘాటించారు.క్షిపణులతో హోరెత్తించిన ఇరాన్ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. యుద్ధవిమానాల ఇంధన తయారీ కేంద్రాలపై మిసైళ్లు ప్రయోగించింది. హైఫా సిటీలో చమురుశుద్ది కర్మాగారంపై దాడులు చేయడంతో పైప్, ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతిన్నాయి. దాడుల్లో ఇప్పటిదాకా 14 మంది చనిపోయినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 390 మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. టెల్అవీవ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వరుసగా మూడోరోజు మూసేశారు. టెల్అవీవ్ వీధుల్లో కుప్పకూలిన భవనాలు, కాలిపోయిన కార్లు, బద్దలైన కిటికీలు, తలుపులూ దర్శనమిస్తున్నాయని అసోసియేటెట్ ప్రెస్ రిపోర్టర్ తెలిపారు.టెల్ అవీవ్కు దక్షిణాన బాట్యామ్ ప్రాంతంలోని 8 అంతస్తుల అపార్ట్మెంట్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా 35 మంది జాడ గల్లంతైంది. పలువురిని రెస్క్యూ బృందాలు శిథిలాల నుంచి కాపాడాయి. ఘటనాస్థలిని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సందర్శించారు. ఇరాన్ కావాలనే జనావాసాలపైనే దాడులు చేస్తోందని మండిపడ్డారు.మీరు ఆపితే మేమూ ఆపుతాందాడుల వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ దాడులను ఆపితే తామూ దాడులను నిలిపేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘మాకు యుద్ధ విస్తరణ కాంక్ష లేదు. కానీ ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని పశ్చిమాసియాలో మరింత విస్తరించాలని తహతహలాడుతోంది. అందుకే బుషెహర్ ప్రావిన్సులో ఖతార్తో కలిసి ఇరాన్ నిర్వహిస్తున్న అసాలుయే ఆయిల్ రిఫైనరీపై దాడి చేసింది’’ అంటూ మండిపడ్డారు. తమ ఆర్థికమూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని దుయ్య బట్టారు. ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ మధ్య ఆదివారం జరగాల్సిన ఆరో విడత కీలక అణు చర్చలు రద్దయ్యాయి. ఇజ్రాయెల్ను తమపైకి ఎగదోస్తున్న అమెరికా చర్చలు అర్ధరహితమని ఇరాన్ ప్రకటించింది. చర్చలకు సాయపడేందుకు బ్రిటన్, ఫ్రాన్స్తో పాటు తామూ సిద్ధమని జర్మనీ పేర్కొంది.
జాతీయం

బైక్ను లారీ ఢీ.. డ్యాన్సర్లు మృతి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): నృత్య వేడుకలో ప్రదర్శన ఇచ్చి బైక్ పై ఇంటికి తిరిగి వస్తున్న ఇద్దరు యువ డాన్సర్లకు అదే చివరి ప్రయాణమైంది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన నెలమంగల కుణిగల్ బైపాస్లో సోమవారం వేకువన జరిగింది. బెంగళూరు శ్రీరాంపుర కు చెందిన ప్రజ్వల్ (22), సహన (21) ఇద్దరూ సినిమాల్లో డాన్సర్లుగా నటించడంతో పాటు వేడుకలలో పాల్గొని ప్రదర్శనలిచ్చేవారు. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో స్నేహంగా ఉండేవారు. ఆదివారంనాడు కుణిగల్లో జరిగిన ఈవెంట్లో పాల్గొని తెల్లవారుజామున బైక్పై తిరిగి వస్తున్నారు. వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయాలై ఇద్దరూ అక్కడే మరణించారు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించిన ఆస్పత్రి..
ముంబై: అస్థవ్యస్థమైన ఆరోగ్య వ్యవస్థ అత ని కూతురు ప్రాణాలు తీసింది. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే బిడ్డ ప్రాణాలు పోయాయి. పసికందు శవాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వడానికి ఆస్ప త్రి వర్గాలు నిరాకరించాయి. కూతురు మృతదేహాన్ని సంచిలో వేసుకుని 90 కిలోమీటర్లు ప్రయాణించాడు మహారాష్ట్రకు చెందిన ఓ గిరిజనుడు. జూన్ 12న నాసిక్ జిల్లాలో జరిగి న అత్యంత అమానవీయ ఘటన సోమవా రం వెలుగులోకి వచ్చింది. పాల్ఘర్ జిల్లాలోని జోగల్వాడి కుగ్రామానికి చెందిన సఖారామ్ కవార్ భార్య అవిత జూన్ 11న ప్రసవ వేదనకు గురైంది. సమీపంలోని ఖోడాలా ప్రాథ మిక ఆరోగ్య కేంద్రానికి తరలించడానికి అంబులెన్స్ దొరకలేదు. 108కు కాల్ చేస్తే స్పందన రాలేదు. ప్రైవేట్ వాహనంలో పీహెచ్సీకి తీసుకెళ్లారు. గంటసేపు ఎదురుచూసినా డాక్టర్లు రాలేదు. సమీపంలోని మోఖడా గ్రా మీణ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యు లు నాసిక్ సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్స్ అందుబాటులో లేక మళ్లీ ఆలస్యమైంది. జూన్11న అర్ధరాత్రి దాటిన తరువాత ఆస్పత్రికి చేరుకుంది. తెల్లవారుజామున ఆమెకు చనిపోయిన ఆడ శిశువును ప్రసవించింది. ఆస్పత్రి జూన్ 12న శిశువు మృతదేహాన్ని సఖారామ్కు అప్పగించింది. కానీ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించింది. బిడ్డను బట్టలో చుట్టుకుని, బస్టాండ్కు వెళ్లి.. రూ. 20 క్యారీ బ్యాగ్ కొనుక్కుని, అందులో పెట్టుకుని ఎమ్ఎస్ఆర్టీసీ బస్సులో దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఏమి మోసుకెళ్తున్నావని ఆయనను ఎవరూ అడగలేదు. ఆ దుఃఖాన్ని ఆయన కూడా ఎవరితో పంచుకోలేదు. అదే రోజు శిశువును ఖననం చేసి.. జూన్ 13న మళ్లీ ఆస్పత్రిలో ఉన్న భార్యకోసం నాసిక్కు తిరిగి వచ్చాడు. ఈసారి కూడా అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. పచి్చబాలింత అయిన భార్యను.. బస్సులోనే ఇంటికి తీసుకెళ్లాడు. ‘ఆస్పత్రి ఉదాసీనత వల్ల నేను బిడ్డను కోల్పోయాను. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి బాధ ఎదురు కాకూడదు’అంటూ నిస్సహాయతతో కూడిన బాధతో చెప్పాడు సఖారామ్.

కులగణన ఉంటుంది: కేంద్రం
న్యూఢిల్లీ: జనగణనలో భాగంగా ఈసారి కులగణన కచ్చితంగా ఉంటుందని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ‘సోమవారం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో కులగణన ప్రస్తావన లేదని, ఆ కసరత్తు ఉండబోదని తప్పుదోవ పట్టించే ప్రచారం జరుగుతోంది. దాన్ని నమ్మొద్దు‘ అని ఒక ప్రకటనలో పేర్కొంది. గెజిట్ లో కులగణన ప్రస్తావనే లేదని కాంగ్రెస్ దుయ్యబట్టింది. ఇది మోదీ సర్కారు యూ టర్న్ అని విమర్శలు గుప్పించింది. అనంతరం కేంద్ర హోం శాఖ ప్రకటన చేసింది. కేవలం కులగణనకే పరిమితం కారాదని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ‘ఈ విషయంలో తెలంగాణ మోడల్ ను అనుసరించాలి. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన సమగ్ర వివరాలను కూడా కులాలవారీగా పొందుపరచాలి‘ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు.

అన్ని పోలింగ్ బూత్లలో వెబ్కాస్టింగ్: ఈసీ
న్యూఢిల్లీ: ఓటింగ్ సమయంలో పోలింగ్ ప్రక్రియపై పర్యవేక్షణను మరింతగా పెంచాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ను ప్రస్తుతమున్న 50 శాతం నుంచి వందశాతానికి పెంచనుంది. అయితే, వెబ్కాస్టింగ్ డేటా ఈసీ వినియోగానికి మాత్రమే పరిమితం. ఈ విధానాన్ని ఈ ఏడాదిలో బిహార్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా అమలు పర్చనుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న అన్ని పోలింగ్ బూత్లలోనూ వెబ్కాస్టింగ్ అమలు చేయాలని ఈసీ తాజాగా రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు తెలిపింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో వీడియో గ్రఫీ, ఫొటో గ్రఫీ వంటివాటిని వాడుకోవాల్సి ఉంటుందని తెలిపింది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్నదీ లేనిదీ పరిశీలించేందుకు 50 శాతం పోలింగ్ కేంద్రాల్లోనూ, సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నవాటిలోనూ ప్రస్తుతం వెబ్కాస్టింగ్ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్ఆర్ఐ

Junicorn Summit 2025: అంతర్జాతీయ వేదికపై పల్లె బాలల ప్రతిభ
సాన్ మార్కస్, టెక్సాస్: టెక్సాస్ స్టేట్ యూనివర్శిటీలో నిర్వహించిన ISF గ్లోబల్ జ్యూనికార్న్ అండ్ AI సమ్మిట్ 2025 చరిత్ర సృష్టించింది. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్కి చెందిన గ్రామీణ ప్రాంతాల నుండి ఎంపికైన 50 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులు ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అభివృద్ధి తదితర రంగాల్లో చిన్నారులు రూపొందించిన ఆవిష్కరణలు దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ఈ సమ్మిట్ ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ స్పెషల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సమ్మిట్కు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ISF) ఆధ్వర్యం వహించగా, వ్యవస్థాపకుడు డా. జె.ఎ. చౌదరి దూరదృష్టితో, ISF USA అధ్యక్షుడు అట్లూరి సమన్వయ నాయకత్వంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. విద్యార్థులకు విమాన ప్రయాణం, నివాసం, వర్క్షాపులు, డెమో డే వంటి సౌకర్యాలు ఉచితంగా అందించారు.ప్రత్యక్షంగా ఆకట్టుకున్న విద్యార్థుల ఆవిష్కరణలుNaturaShe: బయోడిగ్రేడబుల్ సానిటరీ ప్యాడ్స్ – గ్రామీణ మహిళల ఆరోగ్యం కోసం రూపొందించిన ప్రయోగం.Sense Vibe: దివ్యాంగుల కోసం రూపొందించిన నావిగేషన్ పరికరం.Jalapatra: తక్కువ ఖర్చుతో నీటి శుద్ధి పరికరంNGreenTech: ఈ-వేస్ట్ రీసైక్లింగ్ మోడల్.. వీటికి తోడు మరెన్నో ఆవిష్కరణలకు ఇన్నోవేషన్, సోషల్ ఇంపాక్ట్, బ్రేకిత్రూ థింకర్, ప్రోటోటైప్, స్టోరిటెల్లింగ్ విభాగాల్లో ప్రత్యేక అవార్డులు ప్రదానం చేశారు.రామ్ పుప్పాల ఇన్నోవేషన్ అవార్డుగత నెలలో ఆకస్మికంగా కన్నుమూసిన రామ్ పుప్పాల జ్ఞాపకార్థం ‘రామ్ పుప్పాల ఇన్నోవేషన్ అవార్డు’ను ప్రదానం చేయనున్నట్లు ISF USA అధ్యక్షుడు అట్లూరి ప్రకటించారు.లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు – 2025ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి గౌరవప్రదంగా అవార్డులు అందజేశారు.జయ్ తల్లూరి – ఇన్ఫ్రా & సామాజిక అభివృద్ధి,ప్రసాద్ గుండుమోగుల – డిజిటల్ ట్రావెల్ టెక్నాలజీ,స్వాతి అట్లూరి – కళా, సాంస్కృతిక సేవలు,నిశిత్ దేశాయ్ – న్యాయ రంగ మార్గదర్శకత, లాక్స్ చెపూరి – ఇన్నోవేషన్ అవార్డు – టెక్ టాలెంట్ డెవలప్మెంట్.పద్మా అల్లూరి, ప్రకాశ్ బొద్ధాలు ఈవెంట్ యాంకర్లు వ్యవహరించగా, డా. మహేష్ తంగుటూరు, సత్యేంద్ర, శేషాద్రి వంగల, విశాలా రెడ్డి నిర్వాహణలో ముఖ్యపాత్ర వహించారు. వందలాది వాలంటీర్లు, స్పాన్సర్లు, మద్దతుదారులు కలిసి ఈ అరుదైన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమ్మిట్ అనంతరం విద్యార్థులు NASA స్పేస్ సెంటర్, Texas Science Museum, డల్లాస్, ఆస్టిన్ పరిధిలోని ఇన్నోవేషన్ హబ్లను సందర్శించే అవకాశం పొందారు. ఫాలో-అప్ మెంటారింగ్, పెట్టుబడులు, స్టార్టప్ స్కేలింగ్ అవకాశాలపై పలువురు ఆసక్తి వ్యక్తం చేశారు.విజన్ 2030 – లక్ష్యంISF ప్రకటించిన దీర్ఘకాలిక విజన్ ప్రకారం, 2030 నాటికి లక్ష మంది గ్రామీణ యువ స్టార్టప్ వ్యవస్థాపకులను రూపొందించాలనే ధ్యేయంతో ఈ ఉద్యమం ముందుకు సాగుతోంది. ఇది కేవలం ఒక సమ్మిట్ మాత్రమే కాదు – ఒక సామాజిక ఆవిష్కరణ ఉద్యమం. ISF అధికారికంగా ప్రకటించిన ప్రకారం, జ్యూనికార్న్ సమ్మిట్ 2026 ను న్యూజెర్సీలో నిర్వహించనున్నారు.

‘వీసా’ భయాలతో భారతీయ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వరుస నిర్ణయాలతో విదేశీ విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్నవాళ్లను సొంత దేశాలకు పంపించేయడం.. కొత్త వాళ్లను అమెరికాలో అడుగుపెట్టనివ్వకుండా కఠిన ఆంక్షల దిశగా అడుగులేస్తున్నారాయన. ఈ క్రమంలో వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థులు(Indian Students) అప్రమత్తం అయ్యారు. కొందరు తాము చేసిన పోస్టులు తొలగిస్తుండగా.. మరికొందరు ఏకంగా సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులకు వీసాలు(American Visas) మంజూరు చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీలు చేసే పనిలో అమెరికా అధికార యంత్రాంగం ఉంది. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగిస్తోంది. పాలస్తీనా మద్దతుదారుల దగ్గరి నుంచి.. యూఎస్ క్యాంపస్లలో జరిగిన వివిధ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను ఈ సాంకేతికత ఉపయోగించే బయటకు పంపించేసింది. ఈ క్రమంలో.. అతిగా ఉన్న పోస్టులు చూస్తే చిక్కుల్లో పడతామనే భావనతో అలాంటి వాటిని భారతీయ విద్యార్థులు డిలీట్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఎక్స్, లింక్డిన, టిక్టాక్ ఇలా ఇతర ఫ్లాట్ఫారమ్లన్నింటిని జల్లెడ పడుతున్నారు. వాటిల్లో తమ యాక్టివిటీ( పోస్టులు చేయడంతో పాటు లైకులు, షేర్లు, కామెంట్లు.. వగైరా)ని తొలగిస్తున్నారు. కొందరైతే ఏకంగా అకౌంట్నే తొలగిస్తున్నట్లు సమాచారం.అభిప్రాయాల దగ్గరి నుంచి పొలిటికల్ జోక్స్ దాకా వేటిని తమ టైం లైన్లో ఉంచడం లేదు. అమెరికా అధికారులు వాటిని చూస్తే వీసాలు రిజెక్ట్ అవుతాయని భయపడుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా అకౌంట్లనూ తొలగించడమూ మంచిది కాదనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

టీఏడీ కార్య నిర్వహక బోర్డు ఎన్నిక
కోపెన్హాగన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(Telangana Association of Denmark)(టీఏడీ) 2025–2027 సంవత్సరానికి గాను కొత్తగా కార్యనిర్వాహక బోర్డును ఎన్నుకుంది. ఈ సందర్భంగా బోర్డు సభ్యులకు టీఏడీ అభినందనలు తెలియజేసింది. 2025–2027 కాలానికి ఎన్నికైన కార్యనిర్వాహక బోర్డు సభ్యుల జాబితాను, వారి హోదాను టీఏడీ అధికారికంగా ప్రకటించింది. టీఏడీలోని సభ్యులు అంకితభావంతో బాధ్యతాయుతంగా సమాజానికి సేవ చేయడానికి, బోర్డుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపిక అయ్యారని టీఏడీ తెలిపింది. త్వరలో నిర్వహించబోయే ప్రమాణ స్వీకారోత్సవంలో ఈ సభ్యులు అధికారికంగా తమ బాధ్యతలు చేపట్టనున్నారు. బోర్డుకు ఎంపికైన సభ్యులు, వారి హోదాలు ఇలా ఉన్నాయి.1. ఉపేందర్ గిలకథుల (అధ్యక్షులు) 2. సురేందర్ కేసాని (ఉపాధ్యక్షులు) 3. విజయ్ మోహన్ గోపి (కార్యదర్శి)4. ఈశ్వర్ ఎమ్మడి (కోశాధికారి), 5. పవన్ కుమార్ పబ్బా (టెక్నికల్ మేనేజర్) 6. సతీష్ సామ (విదేశీ వ్యవహారాల మేనేజర్), 7. రాజ్ కుమార్ కలువల (అసెట్ మేనేజర్), 8. రమేష్ వనపర్తి (పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్)9. సులక్షణ చౌదరి కోర్వా (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 10. సాయ గౌడ్ పడాల (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 11. సాయికృష్ణా రెడ్డి మిల్కా (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు),12. మహేష్ ఆలేటి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 13. దయానంద్ గౌడ్ పడాల (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 14. వాసుదేవ్ గౌడ్ బిక్కి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 15. అఖిల్ కర్నాటి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 16. గోకుల్ దేసు (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 17. రాజేశ్వర్ నీరడి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 18. శరణ్ యాల్కా ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు)

NRI News : వెన్నుపోటు దినం యూకేలో ఎన్ఆర్ఐల నిరసన
జూన్ 4 వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా వైస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో UK లోని ఈస్ట్ లండన్ మరియు లెస్టర్ నుంచి నిరసన తెలియజేసారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అనేక సంక్షేమ పథకాలనుతుంగలోకి వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మలిరెడ్డి కిషోర్ రెడ్డి , చల్లా మధుసూదన్ యాదవ్ , ప్రణయ్ గడిమే ఆనంద్ అక్కిదాసు, రామిరెడ్డి జయచంద్రా రెడ్డి , చలపతి గుర్రం,యశ్వంత్ గరికపాటి,సాయి ప్రదీప్ పాల్గన్నారు.ఒకరికి ముగ్గురు చొప్పున( చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పురందరేశ్వరి ) చెప్పిన అబద్దాన్ని పదే పదే చెప్పి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టిన ఏపీ సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆర్థిక విద్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి
స్టేషన్ఘన్పూర్: గ్రామంలో వారివి సమీప ఇళ్లు. హైస్కూల్, ఇంటర్ చదువులు నమిలిగొండ శివారులోని మోడల్ స్కూల్లో చదివారు.. ఇద్దరూ ఒకే తరగతి వారు కావడంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. కానీ, కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన ప్రేమజంట కోటె వినయ్కుమార్(25), మచ్చ శృతి(23) ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందరితో కలివిడిగా ఉండే వినయ్కుమార్, శృతి ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారంతో సోమవారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగినమిలిగొండ గ్రామానికి చెందిన కోటె రాజయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు వినయ్కుమార్, మచ్చ కుమారస్వామి, రేణుక దంపతుల కుమార్తె శృతి బాల్యం నుంచే స్నేహితులు. శృతి బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్లో విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వినయ్కుమార్ జనగామ పిన్కేర్ బ్యాంకులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరి ప్రేమను ఒప్పుకోకపోవడంతోపాటు శృతికి ఇంటిలో వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న వినయ్కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఇక ఎప్పటికీ తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే ఆవేదనతో ఇద్దరు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు భువనగిరిలో పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను వేర్వేరుగా అంబులెన్స్లలో గ్రామానికి తరలించారు. వారివారి ఇళ్ల వద్దకు మృతదేహాలను చేర్చగానే మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించాయి. ఛిద్రమైన మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు చేసిన రోదనలు మిన్నంటాయి. అనంతరం శృతి, వినయ్కుమార్ల అంత్యక్రియలు వేర్వేరుగా వారి కుటుంబసభ్యులు చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా సీఐ జి.వేణు ఆదేశాల మేరకు ఎస్సై వినయ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో బందోబస్తు చేపట్టారు.

బైక్ను లారీ ఢీ.. డ్యాన్సర్లు మృతి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): నృత్య వేడుకలో ప్రదర్శన ఇచ్చి బైక్ పై ఇంటికి తిరిగి వస్తున్న ఇద్దరు యువ డాన్సర్లకు అదే చివరి ప్రయాణమైంది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన నెలమంగల కుణిగల్ బైపాస్లో సోమవారం వేకువన జరిగింది. బెంగళూరు శ్రీరాంపుర కు చెందిన ప్రజ్వల్ (22), సహన (21) ఇద్దరూ సినిమాల్లో డాన్సర్లుగా నటించడంతో పాటు వేడుకలలో పాల్గొని ప్రదర్శనలిచ్చేవారు. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో స్నేహంగా ఉండేవారు. ఆదివారంనాడు కుణిగల్లో జరిగిన ఈవెంట్లో పాల్గొని తెల్లవారుజామున బైక్పై తిరిగి వస్తున్నారు. వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయాలై ఇద్దరూ అక్కడే మరణించారు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఛాతికి గురిపెట్టి.. కటకటాల్లోకి రివాల్వర్ రాణి
డబ్బు ఉందనే పొగరు.. అధికారం ఉందనే అహంకారంతో కిందిస్థాయి సిబ్బందితో కొందరు వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంటుంది. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. కారు దిగమని మంచిమాటగా చెప్పినందుకు.. పెట్రోల్ బంకు సిబ్బందిపైనే ఓ కుటుంబం దౌర్జన్యానికి దిగింది. ఆ ఇంటి బిడ్డ అయితే ఏకంగా తుపాకీతో సిబ్బందినే చంపుతానంటూ బెదిరించింది. వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్ హర్దోయ్లో(Hardoi Viral Video) జరిగిన ఘటన తాలుకా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇషాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి కారులో బయటకు వచ్చాడు. బిల్గ్రామ్ ఏరియాలోని ఓ సీఎన్జీ పెట్రోల్ పంప్ దగ్గర వాళ్ల కారు ఆగింది. అయితే.. గ్యాస్ నింపుతున్న టైంలో కారు దిగాలంటూ ఇషాన్ను మర్యాదపూర్వకంగా అక్కడి సిబ్బంది కోరారు. దీంతో.. ఊగిపోతూ నన్నే కారు దిగమంటావా? అంటూ దుర్భాషలాడుతూ సిబ్బందితో గొడవకు దిగాడు ఇషాన్. ఈలోపు.. అతని భార్య, కూతురు కూడా బయటకు వచ్చి ఆ గొడవలో చేరారు. కూతురు సురుష్ఖాన్(అరిబా) కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అందులో ఉన్న రివాల్వర్ను బయటకు తీసుకొచ్చింది. నేరుగా అక్కడి సిబ్బంది ఛాతీకి గురిపెట్టి ‘‘కాల్చేయమంటావా?’’ అంటూ బెదిరింపులకు దిగింది. ఈలోపు.. అక్కడున్న జనం వాళ్లను దూరం తీసుకెళ్లి సర్దిచెప్పి పంపించి వేశారు. అయితే అక్కుడున్న సీసీ ఫుటేజీలో ఆ వీడియో అంతా రికార్డయ్యింది.'इतनी गोली मारूंगी की परिवार वाले...' यूपी में 'रिवॉल्वर रानी' की दबंगई का वीडियो वायरलउत्तर प्रदेश के हरदोई जिले से एक सनसनीखेज़ मामला सामने आया है, जहां सीएनजी पंप पर कहासुनी के बाद एक लड़की ने कर्मचारी पर लाइसेंसी रिवॉल्वर तान दी. घटना उस वक्त हुई जब एहसान ख़ान नाम का शख्स… pic.twitter.com/tVNOM5IfJb— NDTV India (@ndtvindia) June 16, 2025ఘటనపై బాధితుడు రజనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ భార్యభర్తలతో కూడా ఆ రివాల్వర్ రాణిని కూడా అరెస్ట్ చేశారు. రివాల్వర్తో పాటు 25 క్యాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ రివాల్వర్ ఇషాన్ లైసెన్స్డ్ ఆయుధంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే దురుసుగా ర్తించడంతో పాటు చంపుతామని బెదిరించినందుకుగానూ ఆ కుటుంబంపై మొత్తానికి కేసు నమోదయ్యింది. #HardoiPoliceथाना बिलग्राम पुलिस द्वारा मु0अ0सं0 268/25 धारा 115(2)/352/351(3) बीएनएस व धारा 30 आर्म्स एक्ट से संबंधित कृत कार्यवाही के संबंध में-#UPPolice pic.twitter.com/hsYiegkb1v— Hardoi Police (@hardoipolice) June 16, 2025

మోసం చేశాడు సరే.. డబ్బులిప్పిస్తాం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో బాలికలు, మహిళలు, దళితులకు రక్షణ లేకుండా పోతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండ చూసుకుని వారి అనుచరులు, వందిమాగధులు చెలరేగిపోతున్నారు. మహిళలపై జరుగుతున్న దారుణాలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా, ప్రజా సంఘాల నుంచి నిరసన జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఈ తరుణంలో రాజమహేంద్రవరం నగర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు అల్లుడు వరుసయ్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అనుచరుడు పులపర్తి సత్యదేవ్ పెళ్లి చేసుకుంటానంటూ ఒక దళిత మైనర్ బాలిక (17)ను గర్భవతిని చేసి.. అధికారం అండతో ధైర్యంగా తిరిగాడు.ఆమె బిడ్డను కన్న తర్వాత కూడా బుకాయిస్తూ వచ్చాడు. ఏడాది కాలంగా ఈ విషయం బయటకు రాకుండా అధికార పార్టీ నేతలు తొక్కిపెట్టారు. డబ్బులిప్పిస్తామని.. పెళ్లొద్దంటూ దుప్పటి పంచాయితీ చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని వైఎస్సార్సీపీ మహిళా నేతలు బయట పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు ఎట్టకేలకు పోక్సో కేసు పెట్టారు. అయితే అధికార పార్టీ అండదండలతో నిందితుడు పరారీలో ఉన్నాడు. టీడీపీ పెద్దలు డబ్బులిప్పిస్తామంటూ దుప్పటి పంచాయితీ చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటకు చెందిన ఓ బాలికను ప్రేమిస్తున్నానంటూ సత్యదేవ్ రెండేళ్లుగా వెంటపడుతూ వచ్చాడు. తనకు టీడీపీలో ముఖ్య నేతలంతా సన్నిహితంగా ఉంటారని, తాను ఎంత చెబితే అంత అంటూ నమ్మించి.. ప్రేమ, పెళ్లి అంటూ మోసం చేశాడు. సత్యదేవ్ మాటలు నమ్మి ఆ బాలిక మోసపోయింది. బాలికతో శారీరక సంబంధాన్ని కూడా పెట్టుకుని గర్భవతిని చేశాడు. ఆ బాలిక ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్లు తేలడంతో పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. దీంతో కులం తక్కువ దానివి ఎలా పెళ్లి చేసుకోవాలంటూ దూషిస్తూ అబార్షన్ చేయించుకోవాలని డిమాండ్ చేశాడు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు సత్యదేవ్ మోసంపై రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథానికి బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ సమయంలో కేసు లేకుండా ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకునేలా అధికార పార్టీ నేతలు ఆ కుటుంబంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పెళ్లి చేసుకోవడమే పరిష్కారమని బాధిత బాలిక, ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. దీంతో అయ్యప్ప దీక్ష తీసుకున్నానని నిందితుడు పెళ్లి వాయిదా వేశాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలికకు ఎనిమిదవ నెల వచ్చేసింది. అబార్షన్ చేయడం ప్రమాదమని వైద్యులు చెప్పి, సిజేరియన్ చేసి మగ బిడ్డను బయటకు తీశారు. ఆపరేషన్ తర్వాత తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఆ తర్వాత బిడ్డ్డ ఉన్నట్లుండి చనిపోయాడు. బిడ్డకు వైద్యం అందకుండా చేసి చనిపోయేందుకు సత్యదేవే కారకుడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ అప్పటి నుంచి బొమ్మూరు పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధిత కుటుంబం తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఈ నెల 4న జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడు సత్యదేవ్ను పిలిపించి పెళ్లి చేసుకోవాలని వారం గడువు ఇచ్చారు. అయినప్పటికీ బాలికకు న్యాయం జరగలేదు. దీంతో ఈ బాగోతాన్ని వైఎస్సార్సీపీ మహిళా నేతలు పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి మీడియా ఎదుట బయటపెట్టారు. బాలికకు చట్ట ప్రకారం న్యాయం జరగాలని వారు డిమాండ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒక దళిత బాలికకు తన అనుచరుడి కారణంగా ఏడాదిగా అన్యాయం జరుగుతున్నా టీడీపీ ఎమ్మెల్యే వాసు ఏమీ ఎరగనట్టు ఉండటం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆక్షేపించారు. ఇప్పటికీ బాధిత బాలికకు న్యాయం చేసే బదులు ప్రైవేట్ సెటిల్మెంట్కు ఒత్తిడి తెస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు.మానవతా దృక్పథంతోనే కేసు నమోదులో ఆలస్యంమానవతా దృక్పథంతో ఆలోచించడం వల్లే కేసు నమోదుకు ఆలస్యమైంది. ఈనెల 4న బాధితురాలు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. జిల్లా వన్స్టాప్ సెంటర్ అడ్మిన్ సౌజన్య బాధితురాలిని బొమ్మూరు పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆమెకు నేను, సౌజన్య కౌన్సెలింగ్ చేశాం. సత్యదేవ్తో తనకు పెళ్లి జరిపించాలని కోరింది. సత్యదేవ్ను, అతని బాబాయిని పిలిపించి మాట్లాడాం. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని పది రోజులు గడువు కోరాడు. ఏడు రోజుల్లో స్పష్టం చేయాలని ఇద్దరికీ చెప్పాం. నిందితుడు పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన మాటతో కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు ఆ గడువు తీరిపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యదేవ్పై క్రైంనెంబర్ 197/2025 యు/ఎస్64(2)(ఎం), 89బిఎన్ఎస్,సెక్షన్ 5(1)ఆర్/డబ్ల్యూ 6ఆఫ్ పోక్సో యాక్ట్ అండ్ సెక్షన్ 3(2)(వి) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ యాక్ట్ 1989 కింద కేసు నమోదు చేశాం. సత్యదేవ్ కోసం గాలిస్తున్నాం. బిడ్డ ఎలా చనిపోయిందో కూడా విచారిస్తాం. – బి.విద్య, డీఎస్పీ, తూర్పు జోన్, రాజమహేంద్రవరంఆరేళ్ల బాలికపై అత్యాచారం కర్నూలులో దారుణం నిందితుడిపై పోక్సో కేసుకర్నూలు: కర్నూలులో ఆరేళ్ల బాలికపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రం టీచర్స్ కాలనీలో విజయ్కుమార్ అలియాస్ రాజు (40) ఉంటున్నాడు. అదే కాలనీలో ఉంటున్న ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్డాడు. ఇతనికి పెళ్లయి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న బాలికను ఇంట్లోకి పిలిచి ఈ నెల 13న దారుణానికి ఒడిగట్టాడు. శనివారం బాలిక మూత్రానికి వెళ్లడానికి ఇబ్బంది పడుతుండటంతో తల్లి కర్నూలులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరిశీలించి అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదే రోజు విజయ్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని అంగీకరించడంతో అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు.
వీడియోలు


తక్షణమే టెహ్రాన్ నగరం విడిచి వెళ్లాలని భారతీయులకు ఎంబసీ ఆదేశాలు


Himachal Pradesh: లోయలో పడిన బస్సు


గన్ మెన్ మదన్ ముఖం, వీపుపై తీవ్రంగా కొట్టిన పోలీసులు


Chandrasekhar Reddy: ఈ రాష్ట్రం మీ అబ్బ సొత్తు కాదు..


విధ్వంసకాండకు తెరతీసేలా జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు


చెవిరెడ్డి భాస్కర్రెడ్డి గన్మెన్ను వేధించిన సిట్ బృందం


మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య


Birthday Celebrations: అట్లుంటది.. హనుమంతన్న తోని


జన నేత పర్యటనకు ఆంక్షల అడ్డంకులు


చంద్రబాబుపై RK రోజా పంచులు