Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Sweeps Local Body By Elections1
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం

సాక్షి, తాడేపల్లి : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చావుదెబ్బ తగిలింది. వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్సార్‌సీపీ కేడర్‌ ఎదురొడ్డి పోరాడింది. అక్రమ కేసులు, కిడ్నాపులు, దాడులను ఎదుర్కొని వైఎస్సార్‌సీపీ గెలిచింది. రాష్ట్రంలో గురువారం జడ్పీలు, మండల పరిషత్‌లలో మొత్తం 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏకంగా 32 పదవులను కైవసం చేసుకుంది. వాస్తవానికి ఆ 53 పదవులూ గతంలో వైఎస్సార్‌సీపీవే. అయితే, పలు కారణాల వల్ల ఖాళీ అవ్వడంతో ఎన్నికలు అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా కూటమి ప్రభుత్వం బరిలోకి దిగింది. రెడ్‌బుక్ అమలు చేసి గెలవటానికి అనేక కుట్రలు, కుతంత్రాలు చేసింది. అన్నిటినీ ఎదర్కొని ధైర్యంగా వైఎస్సార్‌సీపీ కేడర్ నిలిచింది. దీంతో టీడీపీ కేవలం తొమ్మిది స్థానాల్లో గెలుపును సరిపెట్టుకుంది. ఆ గెలుపును కూడా వైఎస్సార్‌సీపీ సభ్యులను తమవైపు తిప్పుకుని ఆ గెలుపుని తమ ఖాతాలో వేసుకుంది. కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్యులైన బీజేపీ, జనసేనలు పోలీసులను ప్రయోగించి చెరో ఎంపీపీని కైవసం చేసుకున్నాయి.కోరం లేక 10 చోట్ల ఎన్నికలు వాయిదా పడింది. వైఎస్సార్‌సీపీ కేడర్‌ పోరాట స్పూర్తికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.పది నెలల్లోనే మోసకారి ప్రభుత్వంపై ఇది తిరుగుబాటుగా ప్రజల్లో చర్చ కొనసాగుతోంది.

Ysrcp Zptc Ramagovinda Reddy Was Unanimously Elected As Chairman Of Ysr Zilla Parishad2
వైఎస్సార్‌ జిల్లా జడ్పీ ఛైర్మన్‌ పదవి వైఎస్సార్‌సీపీ కైవసం

సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌ జిల్లా జడ్పీ ఛైర్మన్‌ పదవి వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్‌ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం రామగోవిందరెడ్డి జడ్పీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.కాగా, బ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డిని వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేశారు.కాగా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్‌ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్‌ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్‌ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్‌ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్‌ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్‌కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.కాగా, చైర్మన్‌ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన ఎన్నికలో వైఎస్సార్‌ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికల అధికారి అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

IPL 2025: Sunrisers hyderabad vs Lucknow super giants Live Updates And Highlights3
IPL 2025 LSG vs SRH: దూకుడుగా ఆడుతున్న మార్ష్, పూర‌న్‌..

SRH vs LSG Live Updates And Highlights: ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి.నికోలస్‌ పూరన్‌ విధ్వసం..నికోల‌స్ పూర‌న్ విధ్వ‌సం సృష్టిస్తున్నాడు. కేవలం 18 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పూరన్ (24 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67) తన బ్యాటింగ్‌ను తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 8 ఓవర్లకు లక్నో వికెట్ నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజులో పూరన్‌తో పాటు మార్ష్‌(32) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న మార్ష్,పూర‌న్‌..6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో వికెట్ న‌ష్టానికి 77 ప‌రుగులు చేసింది. క్రీజులో నికోల‌స్ పూర‌న్‌(44), మిచెల్ మార్ష్‌(25) ఉన్నారు. వీరిద్ద‌రూ దూకుడుగా ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన ల‌క్నో..191 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసిన ఐడైన్ మార్‌క్ర‌మ్‌..మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి నికోల‌స్ పూర‌న్ వ‌చ్చాడు.నాలుగేసిన శార్థూల్‌.. ఎస్ఆర్‌హెచ్ స్కోరంతంటే?ఉప్ప‌ల్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్లు ప‌ర్వాలేద‌న్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ 9 వికెట్ల న‌ష్టానికి 190 ప‌రుగులు చేసింది. ల‌క్నో బౌల‌ర్లు అద్బుతంగా రాణించారు. బ్యాటింగ్ అనుకూలించే వికెట్‌పై స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌ను బౌల‌ర్లు క‌ట్ట‌డి చేశారు. ల‌క్నో పేస‌ర్ శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్ల‌తో చెల‌రేగాడు. అత‌డితో పాటు ప్రిన్స్ యాద‌వ్‌, దిగ్వేష్‌, ర‌వి బిష్ణోయ్‌, ప్రిన్స్ యాద‌వ్ త‌లా వికెట్ సాధించారు. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో ట్రావిస్ హెడ్‌(47) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. అనికేత్ వ‌ర్మ‌(36), నితీశ్ కుమార్ రెడ్డి(32),క్లాసెన్‌(26) రాణించారు.ఎనిమిది వికెట్ డౌన్.. క‌మ్మిన్స్ ఔట్‌ప్యాట్ క‌మ్మిన్స్(4 బంతుల్లో 18) రూపంలో ఎస్ఆర్‌హెచ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 18 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్‌ స్కోర్‌: 180/8ఎస్ఆర్‌హెచ్ ఆరో వికెట్ డౌన్‌.. అనికేత్ ఔట్‌అనికేత్ వర్మ రూపంలో ఎస్ఆర్‌హెచ్ ఆరో వికెట్ కోల్పోయింది. 36 ప‌రుగుల‌తో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అనికేత్‌.. దిగ్వేష్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 17 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్‌ స్కోర్‌: 169/7ఎస్ఆర్‌హెచ్ ఐదో వికెట్ డౌన్‌.. నితీశ్ రెడ్డి ఔట్‌నితీశ్ కుమార్(32) రూపంలో ఎస్ఆర్‌హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. ర‌వి బిష్ణోయ్ బౌలింగ్‌లో నితీశ్ క్లీన్ బౌల్డ‌య్యాడు.ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్ డౌన్‌.. క్లాసెన్ ఔట్‌హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 26 ప‌రుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్‌.. దురుదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజులో నితీశ్ కుమార్ రెడ్డి(30), అంకిత్ వర్మ(7) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్‌హెచ్ మూడో వికెట్ డౌన్‌.. హెడ్ ఔట్‌ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 47 ప‌రుగులు చేసిన హెడ్‌.. ప్రిన్స్ యాద‌వ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. క్రీజులోకి హెన్రిచ్ క్లాసెన్ వ‌చ్చాడు.7 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్ స్కోర్‌: 71/27 ఓవ‌ర్లు ముగిసే స‌రికి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రెండు వికెట్ల న‌ష్టానికి 71 ప‌రుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్‌(47), నితీశ్ కుమార్ రెడ్డి(15) ఉన్నారు.ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్ వేసిన శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తొలి బంతికి అభిషేక్ శ‌ర్మ ఔట్ కాగా.. రెండో బంతికి ఇషాన్ కిష‌న్ ఔట‌య్యాడు. 3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్ రెండు వికెట్ల న‌ష్టానికి 27 ప‌రుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్‌(14), నితీశ్ కుమార్ రెడ్డి(5) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరుకు తెర‌లేచింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జ‌ట్లులక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్‌), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), సిమర్జీత్ సింగ్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్టిట్యూట్స్:లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, మణిమారన్ సిద్ధార్థ్, ఆకాష్ సింగ్సన్‌రైజర్స్ హైదరాబాద్: సచిన్ బేబీ, వియాన్ ముల్డర్, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కట్, జీషన్ అన్సారీ

Telangana Assembly Budget Session Mar 26th Live Updates4
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

Telangana Assembly Session Updates..తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా11 రోజుల పాటు జరిగిన సమావేశాలు97 గంటల 32 నిమిషాలు సాగిన సభమూడు తీర్మానాలను ఆమోదించిన సభ12 బిల్లులకు ఆమోదం తెలిపిన అసెంబ్లీద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదంసభ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల వాకౌట్‌.. శాసనసభ నుంచి నిరసనలు తెలుపుతూ బయటకు వెళ్లిపోయిన బీఆర్‌ఎస్‌ సభ్యులు.వద్దురా నాయన కాంగ్రెస్ పాలన.. 30% పాలన అంటూ నినాదాలు.అసెంబ్లీ గేటు ఎంట్రన్స్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన. ఎం‍ట్రీ-4 వద్ద మెట్లపై కూర్చుని బీఆర్‌ఎస్‌ సభ్యుల నినాదాలుఅక్కడ నిరసనలు తెలుపవద్దని చీఫ్‌ మార్షల్‌ సూచనలుమార్షల్స్‌తో బీఆర్‌ఎస్‌ సభ్యులు వాగ్వాదం మంత్రి పొన్నం ప్రభాకర్‌ కామెంట్స్‌..దళితుడు అనే భట్టి విక్రమార్కపై విమర్శలు చేస్తున్నారు.గతంలో సీఎల్పీ లీడర్‌గా ఉన్నప్పుడు కూడా ఇలానే కామెంట్స్ చేశారు.దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండొద్దు అని ప్రతిపక్షం అనుకుంటుందా?గతంలో సీఎల్పీ లీడర్‌గా దళిత లీడర్ భట్టి విక్రమార్క ఉన్నప్పుడు విమర్శలు చేశారు.తెలంగాణ శాసనసభలో కమీషన్లపై రచ్చ..అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం.40, 30, 20 శాతం ప్రభుత్వం కమీషన్లు తీసుకుంటుందన్న బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌బీఆర్‌ఎస్‌ వ్యాఖ్యలను ఖండించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకమీషన్లపై స్పందించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.గత ప్రభుత్వం పెట్టిన 40,000 కోట్ల బకాయిలను కట్టడానికి నాన్న తంటాలు పడుతున్నాం.ఒక స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.గత ప్రభుత్వం లాగా వ్యవహరించడం లేదు.దోచుకోవడానికి మేము అధికారంలోకి రాలేదు.ప్రతిపక్షం వెంటనే క్షమాపణ చెప్పాలి.ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదు.కమీషన్లు తీసుకున్నట్లు నిరూపించాలి.సభలో కమీషన్లపై ఆధారాలతో చూపించాలి.కేటీఆర్ ఆధారాలు నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలి.కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి.కేటీఆర్ ను నేను ఎక్కడ విమర్శించలేదుసభలో మాట్లాడేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మాత్రమే అన్నాను.కేటీఆర్‌పై నేనెక్కడా అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించలేదు శాసనసభలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనలు.డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నిరసన.కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన. ఇరుపక్షాలకు సర్ది చెబుతున్న ప్యానెల్ స్పీకర్కేటీఆర్ వ్యాఖ్యలతో గొడవ మొదలైంది.అన్ పార్లమెంటరీ పదాలు ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తాం.సీనియర్ సభ్యులుగా ఉండి నిరసన చేయడం కరెక్ట్ కాదు.కేటీఆర్ అన్‌ పార్లమెంటరీ పదాన్ని వాడారుకేటీఆర్ వ్యాఖ్యలకు ఆవేదనతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్..నేను పని మీదే దృష్టి పెట్టా.. సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోను.మంత్రి వర్గ విస్తరణ కూడా పట్టించుకోలేదు..మొదటి కేబినెట్ సమయంలో కూడా నేను మంత్రి పదవి అడగలేదు.గద్దర్ అవార్డులను భట్టి చూసుకుంటుంన్నారు. మంత్రి భట్టి విక్రమార్క కామెంట్స్‌..భూములపై రైతులకు హాక్కు కల్పించింది కాంగ్రెస్..భూ రక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందే.కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం.ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుంది.భూస్వాముల చట్టం ధరణి.ధరణి మారుస్తాం అని చెప్పాం.. చేసి చూపిస్తున్నాం.లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్.రైతుల హక్కులను కాల రాసారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్‌..ధరణి రెఫరెండంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం.. ప్రజలు తీర్పు ఇచ్చారు.ధరణితో బీఆర్ఎస్ సభ్యులు ఇబ్బంది పడ్డారు.భూ భారతి కాన్సెప్ట్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోతాం..ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు.భూ భారతిని రెఫరెండంగా తీసుకుంటాం..ఎవరిని ఆదరిస్తారో చూద్దాం.పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్‌..భూ భారతి అయితదో.. భూ హారతి అయితదో చూద్దాం..భూ భారతి రెఫరెండం కాదు.. ఆరు గ్యారెంటీల రెఫరెండంతో ఎన్నికలకు వెళ్లండి.అనుభవదారుడి కాలంతో మళ్ళీ వివాదాలు వస్తాయి.మంత్రి పొంగులేటి కామెంట్స్‌.. అసత్యాన్ని సత్యాన్ని చేసేందుకు పల్లా ప్రయత్నం చేస్తున్నారు.2020న ధరణి చట్టం తీసుకువచ్చి.. 2023 వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు.వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని చట్టంలోనే పెట్టాం.. భట్టి విక్రమార్క కామెంట్స్‌..జమాబందీ వల్ల లాభం తప్ప నష్టం లేదు.ప్రతీ సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి.. సభలో పదే పదే మంత్రులకు మైక్ ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ అభ్యంతరం..తాము మాట్లాడుతుంటే మంత్రులు ఎందుకు అడ్డు వస్తున్నారన్న బీఆర్ఎస్ సభ్యులు..ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాష్ రెడ్డి కామెంట్స్‌..మంత్రులు అడిగితే మైక్ ఇవ్వాలి.. ఇది అసెంబ్లీ రూల్స్‌లో ఉంది.పదేళ్లు ప్రభుత్వం నడిపిన బీఆర్ఎస్ సభ్యులకు ఇది తెలియంది కాదు..రూల్స్ ప్రకారమే సభ్యులకు అవకాశం ఇస్తున్నా.. బీఆర్‌ఎస్‌ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్‌ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారం జరిగితే.. పోలీసులు పట్టించుకోలేదు.అడ్వకేట్‌ను హత్య చేసినా పట్టించుకోవడం లేదు..క్రైం రేటు పెరుగుతోంది.మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్‌..ఎంఎంటీఎస్ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది .కేసు దర్యాప్తుపై పోలీసులు దృష్టి సారించారు.పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడొద్దు.మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్‌..గతం గురించి మాట్లాడేది కాంగ్రెస్ సభ్యులే..మేము చేసిన మంచి పనులు చెబుతున్నాం..ఇంకా బాగా పని చేయాలని సూచిస్తున్నాం..బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నిరసన.. శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనతక్షణమే తులం బంగారం ఇవ్వాలని నినాదాలుబంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుఇప్పటివరకు పెళ్లి చేసుకున్న వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..శాసనసభ ఐదో సెషన్ పదో రోజు బిజినెస్ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం.ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దుతెలంగాణ శాసనమండలిలో ఏడవ రోజు బిజినెస్మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2023-24 నివేదికను మండలిలో టేబుల్ చేయనున్నారు.ప్రభుత్వ తీర్మానం..శాసన సభ ఆమోదం పొందిన రెండు బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారురాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీ రాజ్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారు.శాసనమండలిలో తెలంగాణలో విద్య అనే అంశంపై స్వల్పకాలిక చర్చశాసనసభలో బడ్జెట్ పద్దులపై నాలుగో రోజు చర్చ

Comedian Dhanraj Wife Sirisha About  Personal Life and Divorce5
కమెడియన్‌ ధనరాజ్‌తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య

టాలీవుడ్‌లో కమెడియన్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు ధనరాజ్‌ (Dhanraj). బుల్లితెర నుంచి వెండితెరకు సాగిన అతడి ప్రయాణంలో భార్య శిరీష వెన్నంటే నిలబడిందని ఎన్నోసార్లు ఎమోషనలయ్యాడు. తాజాగా శిరీష తొలిసారి ఓ ఇంటర్వ్యూకు హాజరై ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. శిరీష (Dhanraj Wife Sirisha) మాట్లాడుతూ.. ధనరాజ్‌ది విజయవాడ. నాది ఖమ్మం. నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ను. ధనరాజ్‌ ఫిలిం నగర్‌లో ఓ డ్యాన్స్‌ స్టూడియో పెట్టినప్పుడు టీచర్‌ కోసం వెతుకుతున్నారు. అలా నన్ను కలిశాడు. క్యాన్సర్‌తో కన్నుమూసిన ధనరాజ్‌ తల్లిఅదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ నేను పరిచయమైన రోజే అతడి అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. ఆమె వెళ్లిపోతూ నన్ను అతడికి ఇచ్చిందని ధనరాజ్‌ ఫీలయ్యాడు. తల్లి అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బు లేకపోతే నా దగ్గరున్న బంగారం ఇచ్చేశాను. నవంబర్‌లో ఆమె చనిపోతే మార్చిలో మా పెళ్లి జరిగింది. మాది ప్రేమ వివాహం. అది కూడా నేనే ప్లాన్‌ చేశాను. రేపు మన పెళ్లి అనగానే సరేనని తలూపాడు. ఇంట్లో వాళ్లను కాదని 15 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లయ్యాకే అతడికి పేరొచ్చిందిమా పెళ్లయిన మూడో రోజే జగడం సినిమా రిలీజైంది. అక్కడి నుంచి ధనరాజ్‌కు అవకాశాలు, ఫేమ్‌ మొదలైంది. అయితే ఆయన నిర్మాతగా ధనలక్ష్మి తలుపు తడితే అని ఓ సినిమా తీశాడు. అది నాకిష్టం లేదు. ఆయన మాత్రం కచ్చితంగా ఆడుతుందని నమ్మి తీశాడు. ఒకవేళ సినిమా పోతే జీరో నుంచి మొదలుపెట్టాల్సిందే! నేను అనుకున్నట్లుగానే జీరో నుంచి మళ్లీ స్టార్ట్‌ చేశాం.. సోషల్‌ మీడియాలో మా గురించి ఏవేవో పుకార్లు రాస్తుంటారు. పదిరోజులు మాట్లాడుకోంఆ మధ్య మేము రోడ్డున పడ్డామని రాశారు. ఇల్లు కూడా అమ్మేశామని ప్రచారం చేశారు. ఇప్పుడేమో విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు! మా మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి. వారం, పది రోజులపాటు మాట్లాడుకోం. అంతేకానీ విడాకులు తీసుకునేంత సీన్‌ ఏం లేదు. మేము సంతోషంగా ఉన్నాం. ఏవి పడితే అవి రాయొద్దు. ఇకపోతే ధనరాజ్‌ ఫ్రెండ్స్‌ మా ఇంటికి వస్తూ ఉంటారు. సుడిగాలి సుధీర్‌ నాకు ఎక్కువ క్లోజ్‌. ప్రస్తుతానికైతే వాడు పెళ్లే చేసుకోను అంటున్నాడు. మరి ఏం చేస్తాడో చూడాలి! అని శిరీష చెప్పుకొచ్చింది.చదవండి: ఆలియాను చూసి ఈర్ష్య పడ్డా.. ఈమెకేంటి.. లైఫ్‌ సెట్టు అనుకున్నా!

Babu Participated Iftar Makes Controversy MLA Former MLa6
Chandrababu: ఇఫ్తార్ విందులో టీడీపీ టోపీ పంచాయితీ

విజయవాడ: ఇఫ్తార్ విందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టోపీ పెట్టే క్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్ జలీల్ ఖాన్ ల మధ్య పంచాయితీ జరిగింది. చంద్రబాబుకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మొదట టోపీ పెట్టగా, దాన్ని జలీల్ ఖాన్ తీసేసి ఆ స్థానంలో తాను తెచ్చిన టోపీని పెట్టారు. తాను పెట్టిన టోపీని తీయడమేంటని ఆగ్రహించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్.. జలీల్ ఖాన్ పెట్టిన టోపీని కూడా తీసేయబోయారు. దాన్ని జలీల్ ఖాన్ అడ్డగించారు. తాను పెట్టిన టోపీని తీయడానికి వీల్లేదంటూ ఎమ్మెల్యేని అడ్డుకున్న జలీల్ ఖాన్.. ఎమ్మెల్యే చేయిన పక్కకు తోసేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం కనిపించింది. ప్రభుత్వ ఇఫ్తార్‌ బహిష్కరణవక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్‌ విందును ముస్లిం సంఘాలన్నీ బహిష్కరిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్‌ (జేఐహెచ్‌) రాష్ట్ర అధ్యక్షులు రఫీక్‌ అహ్మద్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని జమాతే ఇస్లామీ హింద్‌ కార్యాలయంలో బుధవారం ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రఫీక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ, కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఇఫ్తార్‌లను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 27న ఇచ్చే ఇఫ్తార్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేసి ముస్లింలపై ప్రేమ చూపిస్తూ, మరోపక్క బీజేపీ ప్రవేశపెట్టిన ముస్లిం నల్ల చట్టాలకు జైకొట్టడం సమర్థనీయం కాదన్నా­రు.సీఎం చంద్రబాబు వక్ఫ్‌ సవరణ బిల్లు ఆమో­దం కాకుండా తిరస్కరించాలని, రాష్ట్ర శాసన­సభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయా­లని డిమాండ్‌ చేశారు. కాగా, ఈ అంశంపై ఈ నెల 29న ధర్నా చౌక్‌ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇఫ్తార్‌ విందు ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు వక్ఫ్‌ ప్రొటెక్షన్‌ జేఏసీ ప్రకటించింది. ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సమావేశం జరిగింది. వక్ఫ్‌ ప్రొటెక్షన్‌ జేఏసీ నేతలు అబ్దుల్‌ రహమాన్, సూఫీ ఇమ్మాన్, ఎంఏ చిష్టి మాట్లా­డుతూ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన మతోన్మాద అజెండాను మరింత దూకుడుగా అమలు చేస్తోందని విమర్శించారు

Bill Gates says AI will replace humans in most tasks except for these 3 professions7
వాళ్లకు మాత్రం ఏఐ ముప్పు ఉండదు.. బిల్‌ గేట్స్‌

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశ్రమలను వేగంగా మార్చివేసింది. ముఖ్యంగా 2022లో చాట్‌జీపీటీ వచ్చినప్పటి నుంచి దీని విస్తృతి మరింతగా పెరిగింది. చాలా మంది తమ రోజువారీ జీవితంలో, వృత్తుల్లో జెమినీ, కోపైలట్‌, డీప్‌సీక్‌ వంటి చాట్‌బాట్‌లను వినియోగిస్తున్నారు. దీని ప్రయోజనాలు ఎలా ఉన్నా సరే.. మానవ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగేసుకుంటుందన్న ఆందోళనలు మాత్రం ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ఈ సరికొత్త సాంకేతిక విప్లవం నడుమ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. కనీసం కొన్ని రోజులైనా కృత్రిమ మేధ ఆధారిత ఆటోమేషన్ నుండి సురక్షితంగా ఉండటానికి అవకాశం ఉన్న వృత్తులపై తన భావాలను పంచుకున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో గేట్స్ ప్రత్యేకమైన మానవ నైపుణ్యాలు అవసరమయ్యే మూడు కీలక రంగాలను హైలైట్ చేశారు. అవి కోడింగ్, ఎనర్జీ మేనేజ్‌మెంట్, బయాలజీ.కోడర్లు.. వీళ్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్స్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి బాధ్యత వహించే నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకునే అవకాశం ఉంది. ఏఐ కోడ్ జనరేట్ చేయడం, కొన్ని ప్రోగ్రామింగ్ పనులను ఆటోమేట్ చేయడంలో పురోగతి సాధించినప్పటికీ, సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఖచ్చితత్వం, లాజిక్‌, సమస్య పరిష్కార నైపుణ్యాలు దీనికి లేవు. డీబగ్గింగ్ చేయడానికి, రిఫైనింగ్ చేయడానికి, మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మెరుగుపరచడానికి కూడా హ్యూమన్ ప్రోగ్రామర్లు అనివార్యమని గేట్స్ అభిప్రాయపడ్డారు.ఎనర్జీ ఎక్స్‌పర్ట్స్శిలాజ ఇంధనాలు, అణుశక్తి, పునరుత్పాదక ఇంధన వనరులతో కూడిన ప్రపంచ ఇంధన రంగం అత్యంత సంక్లిష్టమైనది. కృత్రిమ మేధస్సు.. సామర్థ్యాన్ని మెరుగుపరచడం, డిమాండ్‌ను అంచనా వేయడం, మౌలిక సదుపాయాలను నిర్వహించడంలో సహాయపడుతుంది. అయితే ఇది ఇంధన పరిశ్రమను నిర్వచించే సంక్లిష్టమైన నియంత్రణ భూభాగాలు, భౌగోళిక రాజకీయ సవాళ్లు, అనూహ్య మార్కెట్ హెచ్చుతగ్గులను స్వతంత్రంగా నిర్వహించలేదు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో, సుస్థిర పరిష్కారాలను అమలు చేయడంలో, విద్యుత్ అంతరాయాలు లేదా వనరుల కొరత వంటి సంక్షోభాలకు ప్రతిస్పందించడంలో మానవ నైపుణ్యం కీలకమని గేట్స్ నొక్కి చెప్పారు.జీవశాస్త్రవేత్తలుజీవశాస్త్రంలో.. ముఖ్యంగా వైద్య పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణలో మానవ అంతర్దృష్టి, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన అవసరం. కృత్రిమ మేధ పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్ చేయడంలో, నమూనాలను గుర్తించడంలో రాణిస్తున్నప్పటికీ, ఇది అద్భుతమైన పరికల్పనలను రూపొందించే లేదా పరిశోధనలో సహజమైన పురోగతిని సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉండదు. వ్యాధుల నిర్ధారణకు, జన్యుక్రమాలను విశ్లేషించడానికి, ఔషధ ఆవిష్కరణకు మాత్రం ఏఐ సహాయపడుతుందని గేట్స్ పేర్కొన్నారు.

YS Jagan Heavily Slams CBN Pawan Over Kasinayana Kshetram Row8
దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి పాలనలో ఒకవైపు యధేచ్చగా జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు, మరోవైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే ఆలయాల పరిరక్షణ కొనసాగిందన్న ఆయన.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతోనే ఇప్పుడు ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెబ్బ తింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్‌ జగన్‌(YS Jagan) ట్వీట్‌లో ఏమన్నారంటే.. నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్‌ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?. ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రం(Kasinayana Kshetram)లో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మం(Hindu Dharmam)పై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?.. .. అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా? అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్‌ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు. ఆలయాలపట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణపట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. .. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్‌ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు(Chandrababu)గారి ఆదేశాలమేరకు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడిచేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటీ మీ సమాధానం? తామే ఉత్తర్వులిచ్చి, తమ చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారు. వీళ్ల తీరే అంత? .. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమనుతాము చిత్రీకరించుకునేది వీళ్లే. .. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్‌ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో… pic.twitter.com/gTRsvBfnia— YS Jagan Mohan Reddy (@ysjagan) March 27, 2025

YSRCP MLC Bharat Slams TDP Govt Conspiracy Over MPP Elections In Kuppam9
‘మా ఎంపీటీసీల బస్సును అడుగడుగునా అడ్డగించారు’

కుప్పం(చిత్తూరు జిల్లా): కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భరత్ ధ్వజమెత్తారు. ఎంపీటీసీలను ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోకి ఆడ్డుకున్నారని మండిపడ్డారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో భాగంగా కుప్పంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును భరత్ ఎండగట్టారు.‘పోలీసులు నామమాత్రంగా బందోబస్తు నిర్వహించారు. మా ఎంపీటీసీలు వెళ్తున్న బస్సును అడుగు అడుగునా అడ్డగించారు. పోలీసులు సెక్యూరిటీ ఉన్నా చోద్యం చూస్తున్నారు. టీడీపీ సీనియర్ నేతలు గంజాయి కేసులు పెడతాము అని ఎంపీటీసీలను బెదిరించారు. రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోందని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ఏం జరుగుతుందో అందరూ చూశారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈరోజు మాపై దాడి కూడా చేయాలని కుట్ర చేశారు. ఈ ఎన్నికలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం. కోరం లేకుండా ఎంపీపీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు’ అని భరత్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వాదులు ఒకసారి కుప్పం వైపు చూడండిప్రజాస్వామ్య వాదులుగా చెప్పుకుంటున్న వారు ఒకసారి కుప్పం వైపు చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు\ చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు. ‘కోరం లేకుండా రామకుప్పం ఎంపిపి ఎన్నికలు నిర్వహించారు. టీడీపీ నాయకులతో కుమ్మక్కు రాజకీయం చేశారు. కుప్పం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యంను ఖూనీ చేశారు. టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది’ అని మండిపడ్డారు గోవిందప్ప.ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదుఈ తరహా ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు.. జరగలేదన్నారు రామకుప్పం ఎంపీపీ కుందనందన రెడ్డి,. ‘ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అంటే ఒక ఆదర్శంగా ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీటీసీలు అందరినీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మాపై కేసులు పెడతాం అని బెదిరించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం’ అని రామకుప్పం ఎంపీపీ కుందనందన రెడ్డి స్పష్టం చేశారు.

Ram Charans Diet And Fitness Secrets For Toned Body At 4010
గ్లోబల్‌ స్టార్‌ రామ​ చరణ్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌..! డైట్‌లో అవి ఉండాల్సిందే..

చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. నటన పరంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌ ఎందులోనైనా తండ్రికి ధీటుగా చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు. ఈ రోజుతో ఆయనకు 40 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చరణ్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌, డైట్‌ప్లాన్‌లు ఏంటో చూద్దామా. ఆయన తొలి చిత్రం చిరుత మూవీ నుంచి ఇటీవల విడుదలైన గేమ్‌ఛేంజర్‌ మూవీ వరకు అదే లుక్‌తో కనిపించేలా బాడీని మెయింటైన్‌ చేస్తున్నారు. అంతలా ఫిట్‌గా కనిపించేందుకు వెనుక ఎంతో డెడీకేషన్‌తో చేసే వర్కౌట్‌లు అనుసరించే డైట్‌లే అత్యంత ప్రధానమైనవి. అవేంటో చూద్దామా..రామ్‌ చరణ్‌ ఒకసారి అపోలా లైఫ్‌ డాట్‌ కామ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఫిట్‌గా యాక్టివ్‌గా ఉండేందుకు ఎలాంటి వ్యాయమాలు, ఆహారం తీసుకుంటారో షేర్‌ చేసుకున్నారు. జంపింగ్ జాక్‌లు, సీటెడ్ మెషిన్ ప్రెస్‌ల నుంచి మిలిటరీ పుషప్‌లు, బార్‌బెల్ స్టిఫ్-లెగ్ డెడ్ లిఫ్ట్‌ల వరకు ప్రతిదీ చేస్తానని అన్నారు. అయితే ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకుంటానని అన్నారు. సమతుల్య జీవనశైలికి ప్రాధన్యాత ఇస్తానని చెప్పారు. ప్రతిరోజూ కొన్ని క్రీడలు తప్పనిసరిగా ఆడతానని అన్నారు. వారంలో నాలుగు రోజులు అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తానని అన్నారు. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పారు. అలాగే ప్రతిరోజు ఒక గంటన్నర పాటు వ్యాయామం చేస్తానని తెలిపారు. అంతేగాదు శరీర బరువుని అదుపులో ఉంచే వ్యాయామాలపై దృష్టి పెడతానని చెప్పారు. 80% ఆహారంపైనే..ఫిట్ బాడీని నిర్వహించడంలో ఆహారం ప్రాముఖ్యతను హైలెట్‌ చేశారు రామ్‌చరణ​. మన ఆరోగ్యం 80 శాతం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందన్నారు. అందువల్ల మనం ఏం తింటున్నాం అనేది అత్యంత ముఖ్యం అని చెప్పారు. అలాగే తాను ఆహారం విషయంలో చాలా కేర్‌ తీసుకుంటానని చెప్పారు. అనారోగ్యకరమైన ఆహారాలకు చాలా దూరంగా ఉంటానని చెప్పారు. అంతేగాదు ప్రతి ఆదివారం చీట్‌మీల్స్‌లో పాల్గొంటా, కానీ అది సృతి మించకుండా చూసుకుంటానని అన్నారు. డైట్ సీక్రెట్స్ఫిట్‌నెస్ కోచ్ రాకేష్ ఉడియార్ రూపొందించిన డైట్ ప్లాన్ ప్రకారం..కెఫిన్, ఆల్కహాల్, చక్కెర పానీయాలు, రెడ్ మీట్, గోధుమలు, ప్రోటీన్ షేక్‌లకు దూరంగా ఉంటారట రామ్‌చరణ్‌. తన రోజుని గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లేట్‌ లేదా పూర్తి గుడ్లు, ఓట్స్‌, బాదంపాలతో ప్రారంభిస్తారట. ఆ తర్వాత మధ్యాహ్నం కూరగాయలతో చేసి సూప్‌ని తీసుకుంటారట. ఇక భోజనంలో చికెన్‌ బ్రెస్ట్‌, బ్రౌన్‌ రైస్‌, గ్రీన్‌ వెజిటేబుల్‌ కర్రీ తీసుకుంటారట. సాయంత్రం స్నాక్స్‌ కోసం గ్రిల్డ్ ఫిష్, చిలగడదుంప, గ్రిల్డ్ వెజిటేబుల్స్‌ను ఇష్టపడతారని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనంలో 'లార్జ్ మిక్స్‌డ్ గ్రీన్ సలాడ్', కొన్ని అవకాడోలను తీసుకుంటారని తెలిపారు ఫిట్‌నెస్ కోచ్ రాకేష్ ఉడియార్.వారంలో చేసే వర్కౌట్‌లు:సోమవారం: బైసెప్స్ (తప్పనిసరి)మంగళవారం: క్వాడ్స్బుధవారం: క్లేవ్స్‌ అండ్‌ అబ్స్గురువారం: ఛాతీ ట్రైసెప్స్శుక్రవారం: బ్యాక్‌ వర్కౌట్‌లుశనివారం: హామ్ స్ట్రింగ్ అండ్‌ ఇన్నర్‌ థై అబ్స్ఆదివారం: ఫుల్‌ రెస్ట్‌ View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) (చదవండి: బాబోయ్‌ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్‌నెస్ ఇన్ఫ్లుయెన్సర్‌ జీవనశైలి)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement