టీమిండియా వైపు దూసుకొస్తున్న పేస్ గుర్రం
దేశవాళీ క్రికెట్ నుంచి మరో పేస్ బౌలింగ్ సంచలనం టీమిండియా వైపు దూసుకొస్తున్నాడు. తన అసాధారణ వేగంతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తన పేస్ బౌలింగ్తో నిప్పులు చేరుగుతున్నాడు. అతడిని ఎదుర్కొవడం బ్యాటర్ల తరం కావడం లేదు. తన తండ్రి ఆశయానికి భిన్నంగా కెరీర్ను ఎంచుకున్న ఆ ఫాస్ట్ బౌలర్.. అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటేందుకు అతృతగా ఎదురు చూస్తున్నాడు. అతడే జమ్మూ కాశ్మీర్కు చెందిన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ (Auqib Nabi).రంజీల్లో అదుర్స్..29 ఏళ్ల ఆకిబ్ నబీ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆకిబ్ 19 వికెట్లు పడగొట్టాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి 7 వికెట్లు పడగొట్టిన ఆకిబ్ నబీ.. రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఒకే ఇన్నింగ్స్లో 7 వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా ఆ మ్యాచ్లో అతడు పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ తర్వాత ఛత్తీస్గఢ్ పై 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో నబీ తొలి ఇన్నింగ్స్లో ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. ప్రస్తుత రంజీ సీజన్లో నకీబ్ ఇప్పటివరకు మొత్తంగా ఈ 24 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. నబీ తన ఫాస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 34 మ్యాచ్లు ఆడి 115 వికెట్లు సాధించాడు.డెయిల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లాఆకిబ్ బౌలింగ్ శైలి దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డెయిల్ స్టెయిన్ను పోలి ఉంటుంది. అందుకే అతన్ని 'బారాముల్లా డెయిల్ స్టెయిన్' అని పిలుస్తుంటారు. అద్భుతమైన పేస్తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సత్తా ఆకిబ్కు ఉంది. అయితే జమ్మూలోని బారాముల్లాకు చెందిన ఆకిబ్ను తన తండ్రి డాక్టర్ చేయాలని ఆశించాడు. కానీ ఆకిబ్కు మాత్రం క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నాడు. అతడు తన అద్భుత ప్రదర్శనలతో భారత సెలక్టర్ల దృష్టిలో పడినట్లు తెలుస్తోంది. నబీ ఇదే జోరును కొనసాగిస్తే త్వరలోనే భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. కాగా జమ్మూకు చెందిన మరో స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ ఇప్పటికే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గాయాల కారణంగా అతడు ఎక్కవ కాలం పాటు జాతీయ జట్టుకు ఆడలేకపోయాడు.
దెయ్యం పట్టిందని మద్యం, బీడీ తాగించి, మహిళకు చిత్రహింసలు
కేరళలో దారుణం చోటు చేసుకుంది. 21వ శతాబ్ధంలో శరవేగంగా పరుగులు పెడుతున్న అత్యాధునిక సమాజంలో మూఢనమ్మకాల ఆనవాళ్లు ఇంకా బలంగానే ఉన్నాయి అనడానికి ఊతమిచ్చే ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను దెయ్యం పేరుతో చిత్రహింసలకు గురి చేసిన వైనం దిగ్భ్రాంతి రేపింది.కేరళలోని కొట్టాయం జిల్లాలో ఒక యువతికి దెయ్యం పట్టిందంటూ మాంత్రికుడిని తమ ఇంటికి తీసుకొచ్చారు ఆమె అత్తింటి వారు, భర్త, ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటూ మంత్రాలు, దెయ్యాలు పేరుతో గంటల తరబడి శారీరక, మానసిక హింసకు గురి చేశాడా మాంత్రికుడు బలవంతంగా మద్యం తాగించి, బీడీ తాగిస్తూ నానా చిత్రహింసలకు గురి చేశారు. దీంతో ఆమె మానసిక పరిస్థితి మరింత దిగజారిపోయింది. దుష్టశక్తి ఆవరించిందంటూ ఉదయం 11.00గంటల నుంచి రాత్రివరకు చిత్ర హింసలు పెట్టారని, చివరికి స్పృహ కోల్పోయానని బాధితురాలు వాపోయింది. బలవంతంగా మద్యం ఇచ్చారని, బలవంతంగా బీడీ తాగించారని, "పవిత్ర బూడిద" తాగించారని, కాల్చడం సహా ఇతర రకాల శారీరక హింసలు పెట్టారని తెలిపింది.చదవండి: ఎంపీకి స్కామర్ల షాక్ : ఎస్బీఐ నుంచి రూ.56 లక్షలు మాయంబాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత మహిళ భర్త, అత్తింటివారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన తర్వాత ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎట్టకేలకు ప్రధాన నిందితుడైన మంత్రగాడు శివదాస్ (54)ని తిరువల్లలోని ముత్తూర్ ప్రాంతం నుండి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే అరెస్ట్ అయినవారిలో మహిళ భర్త అఖిల్ దాస్ (26) , తండ్రి దాస్ (54) ఉన్నారు.ఇదీ చదవండి: నగల దుకాణంలో ‘అమ్మగారికి’ దేహశుద్ధి
శీతల్ దేవికి వైఎస్ జగన్ అభినందనలు
ఆసియాకప్ టోర్నీ కోసం భారత జట్టుకు ఎంపికైన భారత పారా అర్చర్ శీతల్ దేవికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "శీతల్ దేవి ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకం. ఓపెన్ ఆర్చరీ (ఏబుల్డ్) ఈవెంట్కు అర్హత సాధించిన తొలి భారతీయ పారా ఆర్చర్గా నిలిచిన శీతల్కు అభినందనలు. పట్టుదల, అంకితభావం ఉంటే ఏదైనా సాధించవచ్చని శీతల్ నిరూపించింది. ఆసియాకప్లో పాల్గోనున్న ఆమెకు ఆల్ది బెస్ట్" అంటూ ఎక్స్లో ఆయన పేర్కొన్నారు.A highly inspiring achievement! My heartiest congratulations to @archersheetal on this historic milestone of being the first Indian Para Archer to Qualify for Able-Bodied International event.Your journey is a shining example of what dedication and belief can achieve.We are… https://t.co/oSrtHVgdmW— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2025 చరిత్ర సృష్టించిన శీతల్..శీతల్ దేవికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. కాళ్లతో విల్లును పట్టుకుని టార్గెట్ను గురిపెడుతూ పారా ఆర్చరీ ప్రపంచంలో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. 2024 పారాలింపిక్స్లో మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో కాంస్యం సాధించిన శీతల్... భారత జూనియర్ జట్టులోకి ఎంపికైంది. సౌదీ అరేబియాలోని జిద్దాలో జరిగే ఆసియా కప్ స్టేజ్–3 టోర్నీలో వైకల్యం లేని, సాధారణ ఆర్చర్లతో కలిసి ఆమె పోటీపడనుంది.
బిగ్బాస్ 9లో సెల్ఫ్ ఎలిమినేషన్.. అలానే మరొకరు!
బిగ్బాస్ షోలో వీకెండ్ వచ్చిందంటే చాలు హౌస్ట్ నాగార్జున వచ్చేస్తారు. కాస్త సందడి చేస్తారు. ఈసారి కూడా అలానే 'శివ' రీ రిలీజ్ ప్రమోషన్ సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ, మూవీలో హీరోయిన్-నాగ్ భార్య అమల షోలో సందడి చేశారు. నాగ్-అమల స్టెప్పులు కూడా వేశారు. ఇవన్నీ సరే గానీ వీకెండ్ వస్తే కచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈసారి బిగ్బాస్కి ఛాన్స్ ఇవ్వకుండా సెల్ఫ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)9వ సీజన్లో ప్రస్తుతం తొమ్మిదో వారం నడుస్తోంది. ఈసారి సంజన, సుమన్ శెట్టి, భరణి, కల్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, తనూజ నామినేషన్స్లో ఉన్నారు. సేవ్ చేసేందుకు ఓటింగ్ లైన్స్ శుక్రవారం రాత్రి వరకు ఉంటాయి. ఇది పూర్తయిన తర్వాత చివరి స్థానంలో సాయి శ్రీనివాస్ నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీకెండ్ ఇతడు బయటకెళ్లిపోవడం గ్యారంటీ అని అంతా ఫిక్సయ్యారు. సరిగ్గా ఇలాంటి టైంలో ట్విస్ట్. గత కొన్నాళ్ల నుంచి డల్గా ఉన్న రాము.. సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.ఐదోవారం వరకు రాము రాథోడ్ బాగానే బండి లాక్కొచ్చాడు గానీ తర్వాత మాత్రం పూర్తిగా డల్ అయిపోయాడు. నామినేషన్స్లో వాదించట్లేదు, పైపెచ్చు తానే నామినేట్ అవుతానని అంటున్నాడు. మరోవైపు గేమ్స్ వేటిలోనూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంట్లో వాళ్లు గుర్తొస్తున్నారని పదే పదే అంటున్నాడు. శనివారం ఎపిసోడ్లోనూ హౌస్ట్ నాగార్జున ఇదే విషయం అడిగారు. దీంతో తనదైన స్టైల్లో పాటపడి తనకు ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారని చెప్పకనే చెప్పాడు. 'బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా' అంటూ ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: విజయ్ చివరి సినిమా.. 'తళపతి కచేరీ' సాంగ్ రిలీజ్)'చిన్నప్పుడే మా అమ్మనాన్న పనికోసం వేరే ఊరికి వెళ్లిపోయారు. అలా 5-6 ఏళ్లు దూరంగా ఉన్నా. ఇప్పుడు లైఫ్ అంతా సెట్ అయింది. ఇక వాళ్లని చూసుకుందాం అనే టైంలో ఇన్నిరోజులు దూరంగా ఉన్నాను' అని రాము అన్నాడు. దీంతో బిగ్బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అని నాగ్ చెప్పడంతో తలుపులు తెరుచుకున్నాయి. మరి వెళ్తావా లేదా తేల్చుకో అని నాగ్ అడగడంతో.. 'వెళ్తాను సర్' అని రాము దీనంగా చెప్పాడు. ప్రోమోలో డ్రామా చూపించినప్పటికీ నిజంగానే రాము బయటకొచ్చేశాడట. శనివారం ఎపిసోడ్లోనే ఈ సెల్ఫ్ ఎలిమినేషన్ ఉండబోతుంది.ప్రతివారం ఒకే ఎలిమినేషన్ ఉంటుందిగా. రాము సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోవడంతో రెగ్యులర్గా జరగాల్సిన ఉంటుందా లేదా అందరూ అనుకుంటున్నారు. అయితే సాయి శ్రీనివాస్ని కూడా పంపిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాలావరకు అయితే రాము మాత్రమే హౌస్ నుంచి బయటకు రావొచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: చెల్లి సీమంతం గ్రాండ్గా చేసిన బిగ్ బాస్ వితిక)
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
సౌతాఫ్రికాను చిత్తు చేసిన పాకిస్తాన్
హెల్మెట్ ధరించనందుకు రూ.21 లక్షల ఫైన్!
విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
‘గోపీనాథ్ ఆస్తులను కాజేయలని కుట్ర చేస్తున్నారు’
రష్మిక 'గర్ల్ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు
ఇదో విచిత్రమైన ప్రమాదం.. ఎప్పుడైనా చూశారా?
'మా కుర్రాళ్లు అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది'
వంటగదిలో నిహారిక.. అను 'గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాలు
బాప్రే.. రెడ్జోన్లోకి ఢిల్లీ, ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటన
ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా పటేలా..
నూయార్క్ మేయర్గా మమ్దానీ - ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
తమిళ సినిమాలో అనసూయ రొమాంటిక్ సాంగ్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవమర్యాదలు.. వస్తులాభాలు
దద్దరిల్లుతున్న పెద్ది సాంగ్ ప్రోమో.. దుమ్మురేపుతున్న రామ్ చరణ్ డాన్స్
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
అఫ్గానిస్తాన్ సంచలనం.. 6 ఓవర్లలో 148 పరుగులు
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కొత్తింట్లోకి కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్
అంతలా విసిగించకు.. కావాలంటే నీకు మలిదశలో ఓటేస్తాలే!!
ఈ విషయంలో బాగా నోరు పారేసుకుంటున్నాడు!
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ
ఒక్క బ్రెజిల్ మోడల్కే ఇస్తే ఎలాగయ్యా! మిగత దేశాల మోడల్స్ గొడవ చేస్తే ఎలా? వారికి కూడా ఇచ్చేయండి!
వారిద్దరూ అద్భుతం.. గంభీర్, నేను ఒక్కటే: సూర్య కుమార్
బంగారం, వెండి, బిట్కాయిన్.. కియోసాకి మరో హెచ్చరిక!
నిలబడిన కేఎల్ రాహుల్.. ఆధిక్యంలో టీమిండియా
టీమిండియాకు భారీ షాక్..
బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. తప్పిన జ్యోతిషం
కష్టాల్లో టీమిండియా
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
సౌతాఫ్రికాను చిత్తు చేసిన పాకిస్తాన్
హెల్మెట్ ధరించనందుకు రూ.21 లక్షల ఫైన్!
విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
‘గోపీనాథ్ ఆస్తులను కాజేయలని కుట్ర చేస్తున్నారు’
రష్మిక 'గర్ల్ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు
ఇదో విచిత్రమైన ప్రమాదం.. ఎప్పుడైనా చూశారా?
'మా కుర్రాళ్లు అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది'
వంటగదిలో నిహారిక.. అను 'గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాలు
బాప్రే.. రెడ్జోన్లోకి ఢిల్లీ, ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటన
ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా పటేలా..
నూయార్క్ మేయర్గా మమ్దానీ - ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
తమిళ సినిమాలో అనసూయ రొమాంటిక్ సాంగ్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవమర్యాదలు.. వస్తులాభాలు
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
అఫ్గానిస్తాన్ సంచలనం.. 6 ఓవర్లలో 148 పరుగులు
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కొత్తింట్లోకి కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్
అంతలా విసిగించకు.. కావాలంటే నీకు మలిదశలో ఓటేస్తాలే!!
ఈ విషయంలో బాగా నోరు పారేసుకుంటున్నాడు!
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ
ఒక్క బ్రెజిల్ మోడల్కే ఇస్తే ఎలాగయ్యా! మిగత దేశాల మోడల్స్ గొడవ చేస్తే ఎలా? వారికి కూడా ఇచ్చేయండి!
వారిద్దరూ అద్భుతం.. గంభీర్, నేను ఒక్కటే: సూర్య కుమార్
నిలబడిన కేఎల్ రాహుల్.. ఆధిక్యంలో టీమిండియా
బంగారం, వెండి, బిట్కాయిన్.. కియోసాకి మరో హెచ్చరిక!
టీమిండియాకు భారీ షాక్..
బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. తప్పిన జ్యోతిషం
కష్టాల్లో టీమిండియా
గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్
సినిమా
హీరో మెటీరియల్ నుంచి హీరోయిన్ బరువు దాకా...
ఇది సోషల్ మీడియా యుగం. కారెవరూ ఫేమస్ అవడానికి అనర్హం అన్నట్టుగా తయారు చేసిన సామాజిక మాధ్యమాల యుగం. ఇవి ప్రతీ ఒక్కరికీ కీర్తి దాహాన్ని పాప్యులారిటీ పిచ్చిని పెంచేస్తున్నాయి. ఉఛ్చనీచాలు, కనీస విలువలను మర్చిపోయేలా చేస్తున్నాయి. అయితే ఆ మైకంలో జర్నలిజం కూడా చిక్కుకుపోవడమే దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. నలుగురిలో ప్రత్యేకంగా నిలవడానికి ఒకప్పుడు పాత్రికేయులు గొప్ప గొప్ప కధనాలు రాసేవారు. సినిమాలపై అద్భుతమైన సమీక్షలతో ప్రేక్షకులకు మార్గదర్శకత్వం వహంచేవారు. ఇప్పుడు.. దాని కోసం కొందరు ఎంచుకుంటున్న దారులు సినీ జర్నలిస్టులు అంటేనే సెలబ్రిటీలు చీదరించుకునే స్థాయికి దిగజార్చుతున్నాయి.ఆ మధ్య ఓ సినీ జర్నలిస్ట్ నటి మంచులక్ష్మి వస్త్రధారణపై ప్రశ్నించడం ద్వారా తల బొప్పి కట్టించుకున్న వైనం చూశాం. ఐదు పదుల వయసులో ఉన్న మహిళ అయి ఉండీ ఇలాంటి దుస్తులు ధరించడం కరెక్టా? అనే అసంబద్ధమైన ప్రశ్న ద్వారా మంచులక్ష్మి కోపాన్ని నషాళానికి ఎక్కించారాయన. ఇది చిలికి చిలికి చివరకి మా అసోసియేషన్కి మంచులక్ష్మి ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది.ఆ ఉదంతం ఇంకా మరవకముందే... మరో పాత్రికేయ నారీమణి... తమిళ నటీనటుల సాక్షిగా తెలుగు జర్నలిస్ట్ల పరువు తీసిపారేశారు. ఒక యువ కధానాయకుడు, దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్(pradeep ranganathan)ను ప్రశ్నించే క్రమంలో మీరు హీరో మెటీరియల్ కాదు కదా అంటూ వ్యాఖ్యానించడం ద్వారా ఆ మహిళా జర్నలిస్ట్ వివాదం రాజేసింది. దీంతో ఆమెపై నెటిజన్ల నుంచి సినీ జనం దాకా దుమ్మెత్తి పోశారు. సీనియర్ నటుడు శరత్కుమార్ నుంచి మన యువనటుడు కిరణ్ అబ్బవరం దాకా... సదరు జర్నలిస్ట్ ప్రశ్నలోని డొల్లతనాన్ని లేకితనాన్ని ఎత్తిచూపారు.సరే... ఇప్పుడిప్పుడే ఆ సంగతి మరుగునపడుతోంది అనుకునేంతలో... తమిళ నాట మరోసారి మరో సినీ జర్నలిస్ట్ తన నోటికి పని కల్పించాడు. మార్గంకాలి, అనుగ్రహీతన్ అంటోనీ వంటి మళయాళ సినిమాల ద్వారా ప్రతిభావంతురాలైన యువనటిగా పేరు తెచ్చుకుంటున్న యువ కధానాయిక గౌరీ కిషన్(Gouri kishan) ను... తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మీ బరువు ఎంత? అంటూ ప్రశ్నించడం ద్వారా నోటికి ఉండే అన్ని హద్దులనూ చెరిపేశాడు. ఈ ప్రశ్నను ఎదుర్కున్న గౌరీ కిషన్ అదే సమావేశంలో సదరు జర్నలిస్ట్ను పట్టుకుని ఎదురు ప్రశ్నలతో ఉతికి ఆరేయడం వేరే సంగతి. ఈ ఘటన జరిగిన కాసేపటికే ఖుష్బూ, నటి రాధిక, గాయని చిన్మయి... వంటివారు గౌరీ కిషన్కు మద్ధతుగా పోస్టులు పెడుతున్నారు. ఆమె జర్నలిస్ట్ను ఉతికి ఆరేసిన తీరును ప్రత్యేకంగా శభాష్ అంటున్నారు.ఇప్పుడు ఇకనైనా సినిమా జర్నలిజం తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజానికి ఈ మూడు సందర్భాల్లోనూ జర్నలిస్ట్లు వేసిన ప్రశ్నలు అత్యంత అసందర్భం, అసంబద్ధం అనేది నిస్సందేహం. అయినప్పటికీ అలా వారు అడగడం వెనుక పాప్యులారిటీ లేదా వైరల్ అవ్వాలనే దురాశ ఉండవచ్చునని అనిపిస్తోంది. వ్యక్తి దురాశ వ్యవస్థకు చేటు కాకూడదు. సినీ జర్నలిజం మొత్తానికి దీని వల్ల కలుగుతున్న, కలగబోతున్న నష్టాన్ని సీనియర్ పాత్రికేయులు, సినిమా పెద్దలు వెంటనే గుర్తించి తగిన మరమ్మతులు చేయడం తక్షణావసరంగా కనిపిస్తోంది.
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ సినిమాలతో వివాదాస్పద దర్శకుడిగా వివేక్ అగ్నిహోత్రి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన చివరి చిత్రం 'ద బెంగాల్ ఫైల్స్'. 1947లో ఇండియా-పాక్ విభజన బ్యాక్డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందే చర్చనీయాంశమైన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'ద బెంగాల్ ఫైల్స్' సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడున్నర గంటల నిడివితో దీన్ని తీశారు. తొలి రెండు చిత్రాల్లానే ఇది కూడా జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. ఈనెల 21 నుంచి హిందీ భాషలో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'కె- ర్యాంప్'.. అధికారిక ప్రకటన)'ద బెంగాల్ ఫైల్స్' విషయానికొస్తే.. 1947వ సంవత్సరంలో భారత్-పాక్ ఎలా విడిపోయాయి. ఈ విషయంలో గాంధీ ఎలాంటి పాత్ర పోషించారు. అప్పుడు హిందువులు, ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు చేలరేగాయి. ఎవరు ఎవరిని ఎందుకు చంపారు. ఈ అనర్థాలన్నీ ఎందుకు జరిగాయనేది ఈ సినిమా స్టోరీ.ప్రధానంగా భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయే సమయంలో గాంధీ, మహమ్మద్ అలీ జిన్నాని ఇదంతా వద్దని అంటారు. జిన్నా మాత్రం.. ముస్లింలు ఎప్పుడూ ముస్లింలే, హిందూ ముస్లిం భాయ్ భాయ్ కాదు అని అంటాడు. తర్వాత జిన్నా మనుషులు అప్పటి దేశ రాజధాని అయిన కలకత్తాలో మారణహోమం సృష్టిస్తారు. హిందూ స్త్రీలని, మహిళలని, చిన్నపిల్లలని చూడకుండా దారుణంగా కాల్చి చంపేస్తారు. ఇలాంటి సమయంలో మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటీషర్లు ఏం చేశారు? ముస్లింలపై భారతీయులు ఎలా తిరుగుబాటు చేశారు? తమని తాము ఎలా కాపాడుకున్నారనే అంశాల్ని ఇందులో చూపించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
చెల్లి సీమంతం గ్రాండ్గా చేసిన వితిక
హీరోయిన్గా టాలీవుడ్లోకి వచ్చిన తెలుగమ్మాయి వితికా షేరు.. తనతో పాటు కలిసి నటించిన హీరో వరుణ్ సందేశ్ని తర్వాత కొన్నాళ్లకు పెళ్లిచేసుకుంది. మధ్యలో వీళ్లిద్దరూ కలిసి బిగ్బాగ్ 3వ సీజన్లో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కాకపోతే ఈ షో నుంచి వచ్చిన తర్వాత వరుణ్ సందేశ్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాడు గానీ వితిక మాత్రం యూట్యూబ్లో వీడియోలు చేస్తోంది.ఎప్పటికప్పుడు తన జీవితంలో జరిగే విశేషాలని పంచుకునే వితికా షేరు.. తన చెల్లి క్రితిక సీమంతం చేసిన విషయాన్ని పంచుకుంది. సోషల్ మీడియాలో ఫొటోలు, యూట్యూబ్లో ఈ శుభకార్యానికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో వితిక కుటుంబంతో పాటు క్రితిక అత్తగారి కుటుంబం కూడా ఆనందంగా కనిపించారు.(ఇదీ చదవండి: ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్ చేసిన సాయికిరణ్)'సీమంతం అనేది మహిళ జీవితంలో ఓ అందమైన సంప్రదాయ వేడుక. ఇది కేవలం కార్యక్రమం మాత్రమే కాదు. అమ్మతనం, ప్రేమ అనే కొత్త ప్రారంభానికి ఇదో సెలబ్రేషన్' అని వితిక తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇకపోతే నెలన్నర క్రితం అంటే సెప్టెంబరు చివరి వారంలోనూ చెల్లికి సింపుల్గా బేబీ షవర్ (సీమంతం) చేసింది. అప్పుడు కేవలం స్నేహితురాళ్లతో దీన్ని సెలబ్రేట్ చేసుకోగా.. ఇప్పుడు సంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకని జరుపుకొన్నారు.చెల్లి కృతికని చంటిపాపలా చూసుకునే వితికా షేరు.. చెల్లి పెళ్లిని తన చేతుల మీదుగానే చేసింది. 2022లో కృతిక, కృష్ణ అనే వ్యక్తిని వివాహమాడింది. కొన్ని నెలల క్రితమే కృతిక.. తాను తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను సైతం షేర్ చేసింది. ఇప్పుడు సీమంతం జరిగింది.(ఇదీ చదవండి: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)
బిగ్బాస్ ప్రోమో: అమలతో డ్యాన్స్ చేసిన నాగార్జున..
టాలీవుడ్ పవర్ఫుల్ కపుల్ నాగార్జున (Nagarjuna Akkineni)-అమల.. కిరాయిదాదా, చినబాబు, శివ, ప్రేమ యుద్ధం, నిర్ణయం సినిమాల్లో కలిసి నటించారు. వీటిలో శివ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. 1989 అక్టోబర్ 4న విడుదలైన ఈ సినిమా 36 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. శివ సాంగ్తో ఎంట్రీఅన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సందర్భంగా నవంబర్ 14న శివ రీరిలీజ్ (Siva Movie ReRelease) చేస్తున్నారు. దీంతో బిగ్బాస్ స్టేజీపైకి ఆర్జీవీతో పాటు శివ రీల్ కమ్ రియల్ లైఫ్ హీరోయిన్ అమల సైతం వచ్చారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. అందులో నాగార్జున.. బోటనీ పాఠముంది, మ్యాట్నీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా.. పాటతో ఎంట్రీ ఇచ్చాడు. అమలతో నాగ్ డ్యాన్స్ఆ వెంటనే అమల రంగంలోకి దిగి.. నాగార్జునతో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ జంట కోసం బిగ్బాస్ కంటెస్టెంట్లు సైతం జోడీలుగా విడిపోయి స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. బిగ్బాస్ హౌస్లో వారు డ్యాన్స్ చేస్తుంటే స్టేజీపై అమల ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. నిన్ను బిగ్బాస్ హౌస్లో వంద రోజులు ఉండమంటే ఉంటావా? అని నాగ్.. ఆర్జీవీని అడిగాడు. అందుకాయన.. అందరూ సంజనాలాంటి అందమైన అమ్మాయిలుంటే కచ్చితంగా ఉంటానన్నాడు వర్మ. చదవండి: ఓరీపై ట్రోలింగ్.. కొంచెమైనా బుద్ధుందా? అవేం మాటలు!
న్యూస్ పాడ్కాస్ట్
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
ఏపీ సీఎం చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి... ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం సాగిస్తాం... మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి.
కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం
Chevella Bus Incident: రెప్పపాటులో ప్రమాదం అతివేగం వల్లే జరిగింది
మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట... తొమ్మిది మంది భక్తులు మృతి... 20 మందికి పైగా గాయాలు
ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకంలో భారీ కోత... ఈ ఏడాది 13 శాతానికిపైగా తగ్గిన పనుల కల్పన
క్రీడలు
ఒలింపిక్స్లో దాయాదుల పోరు డౌటే
క్రికెట్.. 128 ఏళ్ల సదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ పోటీలను నిర్వహించేందుకు ఒలింపిక్ కమిటీ (IOC) ఇప్పటికే ఆమోదం తెలిపింది. టీ20 ఫార్మాట్లో ఈ పోటీలు జరగనున్నాయి.ఈ టోర్నీలో ఆరు జట్లు చొప్పున పురుషులు, మహిళల జట్లు పాల్గొననున్నాయి. అయితే ఈ విశ్వక్రీడల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. ఎందుకంటే ఒలింపిక్స్లో పాల్గొనే జట్లను ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా కాకుండా రీజియన్ల వారీగా ఎంపిక చేయాలని ఐసీసీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.తొలుత ర్యాంకింగ్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేయాలని ఐసీసీ భావించినప్పటికి.. తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా నాలుగు రీజియన్లలో టాప్లో ఉన్న జట్లకు ఒలింపిక్స్లో నేరుగా ప్రవేశం లభిస్తుంది. ఐదో జట్టుగా ఆతిథ్య హోదాలో అమెరికా లేదా వెస్టిండీస్ గానీ అర్హత సాధిస్తోంది. ఇక ఆరో జట్టును గ్లోబల్ క్వాలిఫయర్ ద్వారా నిర్ణయిస్తారు. కాగా అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా నంబర్ వన్ జట్టుగా కొనసాగుతుండడంతో ఆసియా ఖండం నుంచి పాకిస్తాన్కు చోటు దక్కే అవకాశం లేదు. ఒకవేళ టాప్-2 జట్లకు అవకాశమిస్తే మినహా పాకిస్తాన్ ఒలింపిక్స్లో పాల్గోనడం కష్టమే అనే చెప్పుకోవాలి. అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్లో పాక్ ప్రస్తుతం ఏడో స్ధానంలో కొనసాగుతోంది. ఇక లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ జులై 12న ప్రారంభం కానున్నాయి.రీజియన్ల వారీగా ఒలింపిక్స్కు అర్హత సాధించే జట్లు ఇవే?ఆసియా: భారత్ఓషియానియా: ఆస్ట్రేలియాయూరప్: ఇంగ్లండ్ఆఫ్రికా: దక్షిణాఫ్రికాచదవండి: IND A Vs SA A: ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్
ప్రతీకారం తీర్చుకున్న భారత్.. టీ20 సిరీస్ మనదే
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు అందుకు ప్రతీకారం తీర్చుకుంది. శనివారం బ్రిస్బేన్ వేదికగా ఆసీస్-భారత్ మధ్య జరుగుతోన్న ఐదో టీ20 వర్షం కారణంగా అర్ధంతరంగా రద్దయింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.తొలి టీ20 కూడా వర్షార్పణం కాగా.. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆసీస్ ఘన విజయం సాధించింది. అనంతరం మూడు, నాలుగు టీ20ల్లో కంగారులను చేసిన భారత జట్టు.. సిరీస్లో 2-1తో ముందంజ వేసింది. ఆ తర్వాత కీలకమైన ఐదో టీ20 రద్దు కావడంతో సిరీస్ భారత్ కైవసమైంది. చివరి మ్యాచ్లో ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. తొలుత ఉరుములు, మెరుపులు రావడంతో ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత భారీ వర్షం కూడా తోడవడంతో మ్యాచ్ను అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.ఇక ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎంపికయ్యాడు. అభిషేక్ ఈ సిరీస్ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు మ్యాచ్లలో 159.09 స్ట్రైక్ రేటుతో 140 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు వన్డే సిరీస్ను 2-1 తేడాతో మార్ష్ సేన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.చదవండి: ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్
ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ను కనబరిస్తున్నాడు. సౌతాఫ్రికా-తో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జురెల్ సెంచరీల మోత మ్రోగించాడు. తొలి ఇన్నింగ్స్లో తన సూపర్ జెంచరీతో జట్టును ఆదుకున్న జురెల్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లోనూ శతక్కొట్టాడు. జురెల్ 159 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో తన ఆరువ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తొలుత హర్ష్ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ధ్రువ్.. ఆ తర్వాత కెప్టెన్ పంత్తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జురెల్ ఓవరాల్గా 169 బంతులు ఎదుర్కొన్న జురెల్.. 15 ఫోర్లు, ఒక సిక్సర్తో 127 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్..ఇక ఇండియా-ఎ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ను 382-7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో లభించిన 34 పరుగుల ఆధిక్యాన్ని జోడించి సఫారీల ముందు 416 పరుగుల టార్గెట్ను ఉంచింది. ఇక భారత బ్యాటర్లలో జురెల్తో పాటు రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.తొలుత రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగిన పంత్.. దూబే ఔటయ్యాక మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ఈసారి మాత్రం పంత్ చెలరేగిపోయాడు. 54 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఒకుహ్లే సెలె మూడు వికెట్లు పడగొట్టగా.. షెపో మోరెకి, వుర్రెన్, సుబ్రెయిన్, సిమండ్స్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు సఫారీ ‘ఎ’ జట్టు 47.3 ఓవర్లలో 221 పరుగుల వద్ద ఆలౌటైంది. మొత్తం 11 మందిలో ఏకంగా 8 మంది బ్యాటర్లు సెనొక్వనే (0), జుబేర్ హమ్జా (8), బవుమా (0), ఎస్తర్హ్యుజెన్ (0), టియాన్ వాన్ (6), కైల్ సిమండ్స్ (5), షెపొ మొరెకి (4 నాటౌట్), ఒకులె సెలె (0)లను భారత సీమర్లు సింగిల్ డిజిట్కే కట్టడి చేశారు. భారత పేస్ త్రయం ప్రసిధ్ కృష్ణ (3/35), ఆకాశ్ దీప్ (2/28), సిరాజ్ (2/61) నిప్పులు చెరిగారు. ప్రోటీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ మార్కెస్ అకెర్మన్ (118 బంతుల్లో 113; 17 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కాడు. కాగా భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది.
హ్యాట్రిక్ ఓటములు.. టోర్నీ నుంచి టీమిండియా ఔట్
హాంగ్ కాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్లో భారత జట్టు కథ ముగిసింది. శనివారం(నవంబర్ 8) కువైట్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా.. క్వార్టర్-ఫైనల్స్కు చేరుకోకుండానే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. పూల్ సిలో ఉన్న పాకిస్తాన్ (-0.111), కువైట్( (+1.683) కూడా ఒక్కో విజయం సాధించినప్పటికి.. భారత్(-2.256) కంటే మెరుగైన రన్రేట్ ఉండడంతో ఆ రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాయి. కాగా కువైట్ చేతిలో ఓడి క్వార్టర్ ఫైనల్స్ రేసు నుంచి నిష్క్రమించిన భారత్.. ఆ తర్వాత బౌల్ గ్రూపులో అదే తీరును కనబరిచింది. నాలుగు గ్రూపుల నుంచి క్వార్టర్స్కు అర్హత సాధించని జట్లు ఈ బౌల్ గ్రూపులో తలపడతాయి. ఈ క్రమంలో దినేష్ కార్తీక్ సారథ్యంలో భారత జట్టు వరుసగా యూఏఈ, నేపాల్ వంటి పసికూనల చేతిలో పరాజయం పాలైంది. తొలుత యూఏఈతో జరిగిన మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 6 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. అనంతరం యూఏఈ 5.5 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి గెలుపొందింది. అనంతరం నేపాల్తో మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ ఏకంగా 92 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఇక చివరగా ఆదివారం భారత్ తమ చివరి బౌల్ మ్యాచ్లో శ్రీలంకతో తలపడనుంది.ఆరు ఓవర్లు.. ఆరుగురు ప్లేయర్లుకాగా హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ ఒక డిఫరెంట్ ఫార్మాట్. ఈ టోర్నీలో ఒక్కో జట్టులో కేవలం ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. అంతేకాకుండా ఒక్కో ఇన్నింగ్స్కు 6 ఓవర్లు కేటాయిస్తారు. ఈ విభిన్నమైన టోర్నీలో మొత్తం 12 జట్లు బరిలోకి దిగాయి. ఈ 12 జట్లను 4 గ్రూప్లుగా విభజించారు. రౌరౌండ్ రాబిన్ పద్దతిలో ప్రతీ గ్రూప్లోని జట్టు.. ఆ గ్రూపులోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతోంది. ఆ తర్వాత ప్రతీ గ్రూపు నుంచి రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఇక క్వార్టర్స్లో గెలిచిన జట్టు ప్రధాన సెమీఫైనల్కు అర్హత సాధించగా.. ఓడిన జట్టు ప్లేట్ సెమీఫైనల్కు క్వాలిఫై అవుతాయి. అదేవిధంగా లీగ్ స్టేజిలో ఇంటిముఖం పట్టిన జట్లు బౌల్ గ్రూపులో మరోసారి తలపడతాయి. మొత్తంగా మెయిన్ ఫైనల్తో పాటు ప్లేట్ ఫైనల్, బౌల్ ఫైనల్ మ్యాచ్లు కూడా జరగనున్నాయి.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా..
బిజినెస్
భారత్ వైపు జపాన్ చూపు: 2030 నాటికి..
భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ కేవలం దేశీయ కంపెనీలు మాత్రమే కాకుండా.. విదేశీ కంపెనీలు కూడా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఈ తరుణంలో జపనీస్ ఆటో దిగ్గజాలైన టయోటా, హోండా, సుజుకి దేశీయ విఫణిలో ఏకంగా 11 బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్దమయ్యాయి. ఇది దేశంలోని అతిపెద్ద విదేశీ పెట్టుబడులలో ఒకటిగా నిలిచింది.ప్రపంచ వాహన తయారీదారులు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో.. ప్రత్యామ్నాయంగా భారతదేశాన్ని ఎంచుకుంటున్నాయి. ఇండియా కేవలం తయారీకి మాత్రమే కాకుండా.. ఎగుమతికి కూడా అనువైన దేశం కావడంతో చాలా దేశాల చూపు మనదేశంపై పడింది. అంతే కాకుండా ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్లో ఖర్చులు కొంత తక్కువగా ఉంటాయి. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, మద్దతు ఇచ్చే ప్రభుత్వ విధానాలు విదేశీ కంపెనీలను ఆకట్టుకుంటున్నాయి.భారతదేశ కార్ల మార్కెట్లో దాదాపు 40 శాతం వాటా ఉన్న సుజుకి, ఏటా 40 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయడానికి 8 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది.టయోటా కంపెనీ కూడా 3 బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. హైబ్రిడ్ కాంపోనెంట్ సరఫరా గొలుసును విస్తరించాలని, మహారాష్ట్రలో కొత్త ప్లాంట్ను నిర్మించాలని యోచిస్తోంది.హోండా కంపెనీ కూడా.. భారతదేశాన్ని ఎగుమతి స్థావరంగా చేసుకోబోతున్నట్లు.. ఇక్కడ నుంచే జీరో సిరీస్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకదాన్ని ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించింది.చైనాకు దూరం!2021 నుంచి భారతదేశ ఆటోమొబైల్ రంగంలో జపాన్ పెట్టుబడులు ఏడు రెట్లు పెరిగాయి. ఇదే సమయంలో చైనాకు నిధులను 80 శాతం కంటే ఎక్కువ తగ్గించాయి. చైనా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో.. ధరలు పెరిగిపోవడం వల్ల, కంపెనీలకు వచ్చే లాభాలు క్రమంగా తగ్గిపోయాయి. ఈ కారణంగానే చైనాకు.. జపాన్ పెట్టుబడులు తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు.వేగం పెంచిన టయోటా & సుజుకిటయోటా 2030 నాటికి.. భారతదేశంలో 15 కొత్త లేదా అప్డేటెడ్ మోడళ్లను లాంచ్ చేయాలని యోచిస్తోంది. దీంతో తన మార్కెట్ వాటాను 8 నుండి 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ పెడుతున్న పెట్టుబడులు.. వాహనాల ఉత్పత్తిని మరో 10 లక్షలు పెంచుతాయి.సుజుకి కూడా భారతదేశాన్ని తన ప్రపంచ ఎగుమతి స్థావరంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ & అంతర్జీతీయ మార్కెట్లలో మారుతి సుజుకి ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే.. సుజుకి యొక్క ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామని కంపెనీ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి అన్నారు.ఇదీ చదవండి: 42 ఏళ్లు.. ఇండియాలో మూడు కోట్ల సేల్స్!హోండా కంపెనీ.. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను పెంచే యోచనలో ఉంది. హోండాకు, భారతదేశం దాని ప్రపంచ కార్ల వ్యూహంలో కేంద్రంగా మారుతోంది. ఇండియా ఇప్పుడు అమెరికా, జపాన్లతో పాటు హోండా యొక్క టాప్ మూడు కార్ల మార్కెట్లలో ఒకటిగా ఉందని సీఈఓ తోషిహిరో మిబే పేర్కొన్నారు.
హైదరాబాద్లో పెరుగుతున్న హౌసింగ్ ఇన్వెంటరీ
‘ఆదిభట్లలో ఓ నిర్మాణ సంస్థ రెండేళ్ల క్రితం భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఇప్పటి వరకు వంద అపార్ట్మెంట్లను కూడా విక్రయించలేకపోయింది. దీంతో నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేసి, ఆఫీసును తాత్కాలికంగా మూసివేశారు. ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులను కూడా భరించలేని పరిస్థితి ఏర్పడటంతో ప్రస్తుతం బిల్డర్ కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్నాడు.’ ..ఒకరిద్దరు కాదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో చాలా మంది పరిస్థితి ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ)పై ఆంక్షలు లేకపోవడం, అపరిమిత సరఫరా, వడ్డీ రేట్లు, అధిక ధరలు, ప్రభుత్వ ప్రతికూల విధానాలు వంటి రకరకాల కారణాలతో అపార్ట్మెంట్ల విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో నగరంలో ఇన్వెంటరీ పెరిగిపోయింది. కస్టమర్ల వాకిన్స్ లేకపోవడంతో అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. – సాక్షి, సిటీబ్యూరోనిర్ధిష్ట కాలంలో మార్కెట్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు లేదా అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లను ఇన్వెంటరీగా పరిగణిస్తుంటారు. ప్రస్తుతం దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలలో ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 5,61,756 ఇన్వెంటరీ యూనిట్లున్నాయి. ఇందులో అత్యధికంగా ముంబైలో 1.76 లక్షల యూనిట్లుండగా.. రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ప్రస్తుతం నగరంలో 95,331 ఇన్వెంటరీ యూనిట్లున్నాయి. గతేడాది సెప్టెంబర్లో ఏకంగా లక్షకుపైగా ఇన్వెంటరీ ఉండగా.. ప్రస్తుతం కొంతమేర తగ్గాయి. అయితే దక్షిణాది నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఇన్వెంటరీ అత్యధికంగా ఉంది. బెంగళూరులో 59,244, చెన్నైలో 32,379 ఇన్వెంటరీ యూనిట్లున్నాయి.పశ్చిమంలోనే ఎక్కువ..దేశంలో భవనాల ఎత్తుపై ఆంక్షలు లేని ఏకైక నగరం హైదరాబాదే. ఇక్కడ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)పై ఆంక్షలు లేకపోవడంతో డెవలపర్లు పోటీపడుతూ హైరైజ్ ప్రాజెక్ట్లను చేపడుతున్నారు. ఎకరం, రెండెకరాల స్థలంలోనే రెండు వేలు, మూడు వేల అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. దీంతో ప్రతికూల సమయంలో విక్రయాలు లేక అపార్ట్మెంట్లు ఖాళీగా ఉంటున్నాయి. నగరంలో సగానికి పైగా ఇన్వెంటరీ పశ్చిమ హైదరాబాద్లోనే ఉంది. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి, మణికొండ వంటి ప్రాంతాలలో డిమాండ్కు మించి అపార్ట్మెంట్ల సరఫరా రావడమే ఇందకు ప్రధాన కారణం.నాలాలు, చెరువులంటే భయం..నాలాలు, చెరువులకు సమీపంలో ప్రాజెక్ట్ల పేరు వింటేనే కస్టమర్లు జంకుతున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ వంటి ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నా సరే లేక్ వ్యూ ప్రాజెక్ట్లలో కొనుగోళ్లకు వెనకడుగేస్తున్నారు. ఎందుకంటే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటూ ఏ కారణంతో ఎప్పుడు కూలుస్తారో? అక్రమ నిర్మాణం అంటారోనని గృహ కొనుగోలుదారులు వెనుకడుగేస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందనో, ఆహ్లాదకర వాతావరణం ఉంటుందనో ధైర్యం చేసి అపార్ట్మెంట్ కొని, బ్యాంక్ ఈఎంఐ భారం భరించడం కంటే లేక్ వ్యూలకు దూరంగా ఉండటమే ఉత్తమమనే అభిప్రాయం కస్టమర్లలో నెలకొంది. దీంతో గతంలో లేక్వ్యూ అంటే ఎగబడి కొన్న జనం.. నేడు విక్రయాలు లేక ప్రాజెక్ట్లు విలవిల్లాడుతున్నాయి.లేఆఫ్లు కూడా కారణమే..స్థిరాస్తి రంగంలో సగానికి పైగా కొనుగోళ్లు ఐటీ సెక్టార్ నుంచే జరుగుతుంటాయి. కృత్రిమ మేధస్సు(ఏఐ) శరవేగంగా దూసుకొస్తుండటంతో ఐటీ విభాగంలో లే ఆఫ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రాపర్టీ విక్రయాలు మందగించాయి. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని అయోమయంలో ఐటీ ఉద్యోగులు అపార్ట్మెంట్ల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు.ఎక్కువ లగ్జరీ ఇళ్ల ఇన్వెంటరీ..రూ.2–3 కోట్ల ధర ఉన్న లగ్జరీ ప్రాజెక్ట్లలో ఇన్వెంటరీ ఎక్కువగా ఉంది. విలాసవంతమైన ఇళ్ల కొనుగోళ్లకు కస్టమర్లు వేచి చూసే ధోరణిలో ఉండటంతో ఈ విభాగంలో ఇన్వెంటరీ పెరిగింది. కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరగడంతో బిల్డర్లు కూడా లగ్జరీ ప్రాజెక్ట్లను ఇబ్బడిముబ్బడిగా ప్రారంభించారు. ఇది కూడా ఇన్వెంటరీ పెరిగేందుకు కారణమే. పెరిగిన భూముల ధరల నేపథ్యంలో రూ.60 లక్షల లోపు ధర ఉండే మధ్య తరగతి ఇళ్లను నిర్మించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిమిత సరఫరా కారణంగా ఈ విభాగంలో ఇన్వెంటరీ ఎక్కువగా లేదు. లగ్జరీ సెగ్మెంట్లో డెవలపర్లు పోటీపడి మరీ ప్రాజెక్ట్లను చేపట్టడంతో ప్రస్తుతం విక్రయాలు లేక అపార్ట్మెంట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.
గెంటేశారనే కోపంతో రూ.12వేల కోట్ల కంపెనీ ఏర్పాటు!
అవమానాలు జరిగిన చోటే సత్తా ఏంటో చూపించాలని పెద్దలు చెబుతుంటారు. సరిగ్గా సుధీర్ జాటియా జీవితంలో ఇదే జరిగింది. ఒకప్పుడు తాను నడిపిన సంస్థ నుంచి కొన్ని కారణాల చేత తనను బయటకు పంపించారనే ఆరోపణలున్నాయి. దాంతో అదే రంగంలో అంతకుమించిన శక్తిగా ఎదిగాలనుకున్నారు. ఫలితంగా ఇప్పటికే ఆ రంగంలో లాభాలులేక కొట్టుమిట్టాడుతున్న ఓ కంపెనీని కొనుగోలు చేసి తనను బయటకు పంపిన కంపెనీకి అతిపెద్ద పోటీదారుగా మారారు. ఓటమిని గెలుపు మెట్టుగా మార్చుకున్న సుధీర్ జాటియా వ్యాపారం ప్రయాణం తెలుసుకుందాం.దాదాపు రెండు దశాబ్దాల పాటు సుధీర్ జాటియా ఒకే పరిశ్రమలో, అందులోనూ వీఐపీ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థలో కీలక పాత్ర పోషించారు. అయితే, 2010లో ఆ సంస్థ నుంచి వైదొలగాల్సి వచ్చినప్పుడు సుధీర్ జాటియా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అంతటితో నిరాశ చెందకుండా ఒక కొత్త లక్ష్యానికి పునాది వేశారు. ఆయన కొనుగోలు చేసిన సఫారీ ఇండస్ట్రీస్ నేడు రూ.12,000 కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగి భారీ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది.ముంబై నగరంలో జన్మించిన సుధీర్ జాటియా ముంబై విశ్వవిద్యాలయం నుంచి కామర్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన జీవితంలో తొలి వ్యాపార అనుభవం తండ్రి నిర్వహించిన టెక్స్టైల్ వ్యాపారంతో మొదలైంది. 1988లో ఆయన తండ్రి, దిలీప్ పిరమల్ (వీఐపీ) సంయుక్తంగా అరిస్టోక్రాట్ (Aristocrat) అనే లగేజ్ కంపెనీని కొనుగోలు చేశారు. దాంతో 21 ఏళ్ల వయసులో జాటియా కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అరిస్టోక్రాట్, VIP వంటి పెద్ద సంస్థల మధ్య పనిచేస్తూ ఆయన కేవలం రెండేళ్లలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎదిగారు.ఊహించని మలుపుతన కుటుంబ ప్రయోజనాలను కాపాడుకుంటూ వ్యాపారంలో నైపుణ్యం సంపాదించిన సుధీర్ జాటియా 2003లో వీఐపీ, అరిస్టోక్రాట్ రెండింటికీ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఆ సంస్థను భారతదేశంలోనే అతిపెద్ద లగేజ్ సామ్రాజ్యంగా నిలబెట్టడంలో ఆయన ఎంతో కృషి చేశారు. అయితే, 2010లో VIP వ్యవస్థాపకుల్లో కొందరు తమ కుటుంబ సభ్యులను(తరువాతి తరం) సంస్థ నాయకత్వంలోకి తీసుకురావాలని నిర్ణయించుకోవడంతో జాటియాను ఆ కంపెనీ నుంచి పంపించాలని నిర్ణయించిట్లు ఆరోపణలున్నాయి(వీటిని అధికారికంగా ధ్రువీకరించలేదు). జీవితంలో కష్టపడి పనిచేసిన సంస్థ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన మనసులో బలమైన సంకల్పం ఏర్పడింది.సఫారీవీఐపీ నుంచి బయటకు వచ్చిన తరువాత సుధీర్ జాటియాకు తన వ్యాపార నైపుణ్యాన్ని నిరూపించుకోవాలనే కసి పెరిగింది. ఆయన దృష్టి అప్పటికే మార్కెట్లో బలహీనంగా ఉన్న సఫారీ ఇండస్ట్రీస్ (Safari Industries)పై పడింది. 2011లో జాటియా కేవలం రూ.29 కోట్లతో సఫారీ ఇండస్ట్రీస్లో 56% వాటాను కొనుగోలు చేశారు. ఆ సమయంలో సఫారీ కంపెనీ మొత్తం విలువ రూ.55 కోట్లు మాత్రమే. సఫారీ అమ్మకాలు అప్పటివరకు ఎక్కువగా సైనిక క్యాంటీన్లపై ఆధారపడి ఉండేవి. ఆయన మొదటగా ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచాలనే నిర్ణయం తీసుకున్నారు. నాణ్యత లేనిదే మార్కెటింగ్ పనికిరాదని గట్టిగా నమ్మారు.ఆన్లైన్ మార్కెటింగ్కు సంబంధించి VIP వంటి పాత కంపెనీలు సంకోచిస్తున్న సమయంలో సుధీర్ జాటియా ముందడుగు వేసి ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఏర్పరచుకున్నారు. ఆన్లైన్ ప్రకటనలపై భారీగా పెట్టుబడి పెట్టారు. ఇది సఫారీకి మార్కెట్లో విపరీతమైన వృద్ధిని అందించింది.రూ.12,000 కోట్ల సామ్రాజ్యంతన అనుభవం, మార్కెట్పై ఉన్న పట్టు, ముక్కుసూటి నిర్ణయాలతో సుధీర్ జాటియా సఫారీని అనూహ్యంగా వృద్ధి చేశారు. ముఖ్యంగా కొవిడ్ తర్వాత సఫారీ మార్కెట్ విలువ వేగంగా పెరిగింది. 2018-19 ప్రాంతంలో సుమారు రూ.1,500 - రూ.1,800 కోట్లుగా ఉన్న సఫారీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆయన వ్యూహాత్మక నాయకత్వంలో ప్రస్తుతం సుమారు రూ.12,000 కోట్లకు పైగా చేరుకుంది. ఈ వృద్ధి, ఆయన పూర్వ సంస్థ వీఐపీ కంటే మూడు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం.ఇదీ చదవండి: బీమా రంగానికి ఏఐ ధీమా
నన్నెవరూ తొలగించలేరు: రాబర్ట్ కియోసాకి
ఆర్థిక రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) ఈ సంవత్సరం తన థాంక్స్ గివింగ్ సందేశాన్ని తొలగింపులను ఎదుర్కొంటున్న అమెరికన్ ఉద్యోగుల పట్ల కరుణను వ్యక్తం చేయడానికి ఉపయోగించారు. అదే సమయంలో ఉద్యోగం కంటే కూడా వ్యాపారం, వ్యవస్థాపకత ప్రాముఖ్యతపై తన దీర్ఘకాల నమ్మకాన్ని పునరుద్ఘాటించారు.సోషల్ మీడియాలో పంచుకున్న ఒక పోస్ట్లో, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత ఉపాధి కన్సల్టెన్సీ ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ నుంచి వచ్చిన తాజా డేటాను ఉదహరించారు. ఇది 1,53,000 మంది అమెరికన్ ఉద్యోగులు ఈ హాలిడే సీజన్లో (క్రిస్మస్ వేళ) ఉద్యోగాలు కోల్పోతారని నివేదించింది.‘నా హృదయం ముక్కలైంది. ఎవరి జీవితంలోనైనా కొన్ని సంఘటనలు ఉద్యోగం కోల్పోవడం కంటే కూడా బాధాకరంగా ఉంటాయి’ అని రాసుకొచ్చిన కియోసాకి ఎంటర్ప్రెన్యూర్గా తన సొంత అనుభవాన్ని ప్రతిబింబించారు. తానెప్పుడూ తొలగింపునకు గురికాలేదని పేర్కొన్నారు. ఏదేమైనా, సాంప్రదాయ ఉపాధిపై ఆధారపడే వారిపై ఉద్యోగం కోల్పోవడం.. భావోద్వేగ, ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని ఆయన అంగీకరించారు."నేను ఎంటర్ప్రెన్యూర్ను కాబట్టి నన్ను ఎప్పుడూ, ఎవరూ తొలగించలేరు.ఎందుకంటే నేను ఉద్యోగిని కాదు" అన్నారు కియోసాకి. అయితే తన స్నేహితుల్లో కొందరి తండ్రులు ఉద్యోగాలు కోల్పోయారని, ఇది కుటుంబం మొత్తాన్ని బాధించే అంశమని పేర్కొన్నారు.ఆర్థిక స్వాతంత్య్రం ఆవశ్యతను ఎత్తిచూపుతూనే ఆనందంగా ఉండాల్సిన పండుగ వేళ ఉద్యోగాలు కోల్పోయినవారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అటువంటివారి పట్ల మరింత కరుణ, దయ కలిగిఉండాలని, అవసరమైతే వారి బాధ్యతను తీసుకోవాలని తన సందేశంలో సూచించారు.HAPPY THANKSGIVING “You’re Fired.” Employment Consultant: Challenger Grey and Christmas just announced 153,000 American employees are going to be fired.Breaks my heart. Few events in anyone’s life are more painful than being fired.I’ve never been fired because I am an…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 8, 2025
ఫ్యామిలీ
అమ్మ సినిమాలు వాస్తవం తెలిపాయి
ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక అమ్మ ఉంటుంది. న్యూయార్క్ మేయర్గా గెలిచి చరిత్ర సృష్టించిన జొహ్రాన్ మమ్దానీ తన ఆలోచనా విధానం, వ్యక్తిత్వం ద్వారానే ఓటర్లను ఆకట్టుకున్నాడు. ‘మా అమ్మ మీరా నాయర్ సినిమాలే నా ఆలోచనలను తీర్చిదిద్దాయి’ అన్నారాయన. మీరా నాయర్ ప్రపంచ సినిమాలో భారతీయ ప్రతిభను చాటిన దర్శకురాలు.‘ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే’ అంటుంటారు. ఇప్పుడు కాస్త మార్చి ‘న్యూయార్క్కు మేయర్ అయినా..అమ్మకు కొడుకే’ అనాలేమో. అవును! 400 ఏళ్ల చరిత్ర ఉన్న న్యూయార్క్ మహా నగరానికి మేయర్గా ఎన్నికైన దక్షిణాసియా తొలి వ్యక్తిగా జోహ్రాన్ మమ్దానీ (34) తాను వార్తలలో ఉండటమే కాదు తల్లి మీరా నాయర్ను కూడా వార్తలలోకి ఎక్కించారు. మేయర్గా గెలిచినందుకు మమ్దానీ ఎంత గర్వపడుతున్నారో అతణ్ణి చూసి మీరా నాయర్ కూడా అంతే గర్వపడుతున్నారు. మమ్దానీ కోసం ఆమె స్వయంగా ప్రచారం చేశారు కూడా. సంచలన సినీ దర్శకురాలిగా పేరు తెచ్చుకుని ఆస్కార్కు నామినేట్ అయిన మీరా ప్రత్యక్షంగా పరోక్షంగా కుమారుణ్ణి ప్రభావితం చేశారు. ప్రత్యక్షంగా పెంపకం ద్వారా అయితే పరోక్షంగా తన సినిమాల ద్వారా. ‘ఎల్ల లోకము ఒక్క ఇల్లై’న్యూయార్క్ మేయర్ ఎలక్షన్ ప్రచారం మొదలైనప్పుడు గెలుపు అవకాశం ఉన్న వ్యక్తుల జాబితాలో పదవ స్థానంలో ఉన్న మమ్దానీ ఒకటవ స్థానానికి ఎగబాకి విజయం సాధించడం సినిమాటిక్గా అనిపించవచ్చు. కాని అతని గెలుపు సినిమాటిక్ కాదు. మమ్దాని ఇచ్చిన నినాదం ‘న్యూయార్క్ వలసవాదుల నగరంగానే ఉంటుంది’ అనేది యాదృచ్చికంగా రాలేదు. తల్లి మీరా నాయర్ సినిమాల ప్రభావంతో అంది పుచ్చుకున్నది. మీరా నాయర్ తీసిన ‘సలాం బాంబే’, ‘మిసిసిపి మసాలా’ పరాయి దేశాల్లో, పరాయి నగరాల్లో తమ స్థాయి, స్థానం కోసం పెనుగులాడే వలసజీవుల కథలు. ‘మీరు మావాళ్లు కాదు వెళ్లిపోండి’ అంటే మానవ పరిణామక్రమం, వలసతో వికసించిన నాగరికతలను నిరాకరించడమే. అందుకే మమ్దాని వలసవాదుల కోసం గట్టిగా నిలబడ్డారు. అలాగే నగరంలో సగటు వ్యక్తి జీవించగలిగేలా, అన్ని సంస్కృతులను ఇనుమడించేలా చూస్తానని మమ్దాని హామీ ఇవ్వడం మీరా నాయర్ ప్రభావమే. యువకుడిగా ఉన్నప్పుడు ఆమె సినిమా సెట్లలో పని చేసేవారు మమ్దాని. స్వతహాగా అతను రాప్ సింగర్ కూడా.వాస్తవ ప్రపంచం‘అమ్మ సినిమాలు చూడటం అంటే వాస్తవ ప్రపంచంలో ఉండటమే’ అంటారు మమ్దాని. వాస్తవికవాద సినిమాలనే మీరానాయర్ తీశారు. ఆమె తీసిన ‘మాన్సూన్ వెడ్డింగ్’ భారతీయ సంపన్న కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న బోలుతనాన్ని చూపితే, ‘నేమ్సేక్’ వలస జీవనంతో భారతీయులు తమ సాంస్కృతిక అస్తిత్వం కోసం చేసే అన్వేషణను చూపుతుంది. మీరా చిత్రాల్లో స్త్రీవాదం ఉంటుంది. అయితే ఆమె మహిళా కథానాయకులు బాధితులు కారు, ఆ బాధల్లోంచి బయటపడాలని భావించేవారు, అందుకు తగ్గ పోరాటాలు చేసేవారు. ఇప్పుడు మమ్దాని ఏ న్యూయార్క్ నగరానికైతే మేయర్ అయ్యారో అదే నగరంపై జరిగిన 9/11 దాడి నేపథ్యంలో మీరానాయర్ ‘ది రిలక్టెంట్ ఫండమెంటలిస్ట్’ సినిమా తీశారు. తల్లికి ఉన్న ఈ బలమైన దృష్టికోణం, వ్యక్తిత్వం, సత్యం వైపు నిలబడే ధీమత్వం తనకు దిశా నిర్దేశం చేసిందంటారు మమ్దాని. తండ్రి మహమూద్ మమ్దానీ కొలంబియా యూనివర్సిటీలో ్ర΄÷ఫెసర్ మాత్రమే కాదు సామ్రాజ్యవాద రాజకీయాల నిపుణుడు కావడం జొహ్రాన్ మమ్దానీకి లాభించింది.మమ్దాని సలహా– మీరా ‘ది నేమ్సేక్’తన జీవితంలోని అతి ముఖ్యమైన నిర్ణయాల్లో తన కుమారుడి సలహా ఉందని మీరా నాయర్ అంటారు. అందుకు ఒక ఉదాహరణ చెబుతారు. ‘ది నేమ్సేక్’ సినిమా తీద్దామనుకుంటున్న సమయంలో ‘హ్యారీ పోటర్–4’కు దర్శకత్వం వహించే అవకాశం మీరాకు వచ్చింది. వార్నర్ బ్రదర్స్ సంస్థ నుంచి వచ్చిన ఆఫర్, ప్రపంచ ప్రఖ్యాత నవల, బోలెడంత డబ్బు, పేరు. కానీ అప్పటికే ‘ది నేమ్సేక్’ పనుల్లో ఆమె నిమగ్నమయ్యారు. ఆ సమయంలో మమ్దానీకి 14 ఏళ్లు. ఇప్పుడేం చేయాలని కొడుకును అడగ్గా, ’అమ్మా! హ్యారీ పోటర్ తీయడానికి చాలామంది దర్శకులున్నారు. కానీ ‘ది నేమ్సేక్’ సినిమా నువ్వే తీయగలవు’ అని చె΄్పాడు. అది చాలా స్వేచ్ఛాయుతమైన, స్పష్టమైన ప్రకటన అని, అందుకే తాను ‘హ్యారీపోటర్’ అవకాశం వదులుకున్నానని ఆమె వివరించారు. ‘నేను ముగింపును నమ్మను, ప్రారంభాలను నమ్ముతాను.‘ అంటారు మీరా నాయర్. ఆ లెక్కన మమ్దానీకి ఇది ప్రారంభం. మేయర్గా ఆయన ఎదుర్కోవాల్సిన సమస్యలు బోలెడున్నాయి. ఎల్లప్పుడూ తల్లి పంచే స్ఫూర్తి ఆయనకు తోడుగా ఉంటుంది.
స్పెల్బౌండ్ చేస్తూ ‘శభాష్’ అనిపించుకున్నాడు!
పాట పాడితే ఎలా ఉండాలి? ఇలా... అలా కాదు... ‘వన్స్మోర్’ అంటూ ప్రేక్షకులు అరుస్తూనే ఉండాలి!అలాంటి ఒక మాంత్రిక గాయకుడు కరణ్ కాంచన్.తన స్వరంతో ప్రేక్షకులను స్పెల్బౌండ్ చేస్తూ ‘శభాష్’ అనిపించుకుంటున్నాడు...కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలోని మహాలక్ష్మి రేస్ కోర్స్లో జరిగిన మ్యాడ్ డీసెంట్ బ్లాక్ పార్టీకి హాజరైన పద్దెనిమిది సంవత్సరాల కరణ్ కాంచన్కు (karan kanchan) మేజర్ లాజర్ లాంటి కళాకారుల ప్రదర్శన తెగ నచ్చేసింది. ఆ ప్రదర్శన అతడిపై చెరగని ముద్ర వేసింది.‘ఏదో ఒకరోజు నేను కూడా ఇదే వేదికపై ప్రదర్శన ఇవ్వాలి’ అని గట్టిగా కల కన్నాడు.తన కలను నిజం చేసుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. డైనమిక్ విజువల్స్, లైటింగ్, రకరకాల జానర్లతో కూడిన సంగీతంతో ఆ షో సూపర్ డూపర్ హిట్ అయింది.ఆ ఇంట్లో ఎందరో గాయకులు‘మా ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు మహ్మద్ రఫీ, కిశోర్ కుమార్, జగ్జీత్సింగ్లాంటి మహాగాయకులు ఉంటారు’ అంటాడు సరదాగా కరణ్!ఎందుకంటే వారి ఇంట్లో ఆ గాయకుల గొంతు ఏదో ఒక రూపంలో వినిపిస్తూనే ఉంటుంది. అందుకే వారిని కూడా కుటుంబ సభ్యులను చేసుకున్నాడు. సంగీత కుటుంబంలో చేరిపోయాడు!యూట్యూబ్లో గంటల కొద్దీ సమయం కొత్త సాఫ్ట్వేర్ కోసం వెదకడం అనేది కరణ్ హాబీ. అలా వెదికే క్రమంలో డిప్లోలో, టియెస్టోల ఎలక్ట్రానిక్ సాంగ్ విన్నాడు. వేదికపై డిజే హంగామా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాడు. ఈ ఎలక్ట్రానిక్ సాంగ్ తనకు ఎంతో ఎనర్జీ ఇచ్చింది. టర్నింగ్ పాయింట్ అయింది.సాఫ్ట్వేర్ను ఉపయోగించి ల్యాప్టాప్లో మ్యూజిక్ క్రియేట్ చేయవచ్చు అని తెలిశాక సంగీత ప్రపంచంలో ప్రయాణం ప్రారంభించాడు కరణ్.అతడి ప్రతిభ అమోఘం‘కరణ్ హాటెస్ట్ బీట్ మేకర్. అతడి ప్రతిభ అమోఘం’ అంటాడు సింగర్, సాంగ్ రైటర్ అంకుర్ తివారీ.వీనుల విందైన సంగీతాన్ని అందిస్తున్న కాంచన్ మరో వైపు మ్యూజిక్ ఆర్టిస్ట్లకు మెరుగైన లైవ్ షోలను రూపొందించడంలో సహాయపడే ‘కన్సర్టెన్సీ’ అనే కన్సల్టెన్సీ స్థాపించాడు.జపనీస్ మ్యూజిక్లో...వివిధ సంగీత ధోరణులపై ఆసక్తితో జపనీస్ శాస్త్రీయ సంగీతంలోకి కూడా అడుగు పెట్టాడు. జపనీస్ ట్రాప్ నుంచి ఇండియన్ హిప్ హాప్ (Indian hip hop) వరకు అన్ని రకాల సంగీతం గురించి తెలుసుకున్నాడు. ‘కరణ్ క్రమశిక్షణ, సంగీతం పట్ల అంకితభావం ఆదర్శనీయం’ అంటున్నాడు స్పాటిఫై ఇండియా, ఆర్టిస్ట్ప్ అండ్ లేబుల్ పార్టనర్షిప్ హెడ్ పద్మనాభన్.ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితా(2025) చోటు సాధించిన 27 ఏళ్ల సింగర్, సాంగ్ రైటర్ కరణ్ కాంచన్కు అభినందనలు తెలియజేద్దాం.సాధనతో అద్భుత సంగీతంగతంతో పోల్చితే మ్యూజిక్ (Music) క్రియేట్ చేయడం సులువు అయింది. కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. అంతమాత్రానా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించడం అంతసులువు కాదు. క్రియేటివిటీ ఉన్నప్పుడే శ్రోతలకు నచ్చే. మెచ్చే సంగీతాన్ని సృష్టించగలం. అందుకు ఎంతో సాధన కావాలి. సరైన వ్యక్తులను కలుసుకుంటే వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అలా నేర్చుకున్నది మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మనకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్ గురించి నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. మ్యూజిక్కు సంబంధించి తొలి రోజుల్లో ఎంత కుతూహలంగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే.– కరణ్ కాంచన్
వివాహ వేడుకలో... ఫ్యూజన్ స్టైల్
వివాహ వేడుకలలో సంప్రదాయ పట్టు చీరల రెపరెపలు ఆధునికపు హంగులతో మరింత వైభవంగా వెలిగిపోతున్నాయి. కట్టు, కట్స్, కలర్తో కొంగొత్తగా రూపుకడుతున్నాయి. ఫ్యూజన్ స్టైల్స్ని ఇష్టపడుతున్న నవతరం ఈ వెడ్డింగ్ సీజన్ని అటు సంప్రదాయం ఇటు ఆధునికతల మేళవింపుతో సరికొత్తగా చూపుతోంది.ట్రెడిషన్ – ట్రెండ్ కలయికకంచిపట్టు లెహంగా ధరించి, దానిపైన సీక్వెన్స్ బ్లౌజ్ వేసుకోవడం. అలాగే, క్లాసిక్ ఫ్యాబ్రిక్ శారీ (Classic fabric saree) అయితే మోడ్రన్ కట్ బ్లౌజ్ ధరించడం ఈ స్టైల్ ప్రత్యేకత.ఇండియన్ – వెస్టర్న్లెహంగాకి క్రాప్టాప్ లేదా ష్రగ్ వంటి వెస్టర్న్ టాప్స్ ధరించడం. ఇది ట్రెడిషనల్ సిల్హౌట్కి వెస్ట్రన్ టచ్ ఇస్తుంది. షరారా ప్యాంట్స్, జాకెట్ స్టైల్ చోలీలు లేదా అంగరఖా టాప్స్ ఇవి వధువుల రిసెప్షన్ లుక్స్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.పీచ్ టోన్స్గతంలో రెడ్, మెరూన్ వివాహవేడుకలలో ప్రధానంగా కనిపించేవి. ఇప్పుడు పీచ్, రోజ్ గోల్డ్, బీజ్ టోన్స్ ట్రెండ్లో ఉన్నాయి. ఇవి సాఫ్ట్ లుక్ (Soft look) ఇవ్వడంతో పాటు అందాన్ని పెంచుతున్నాయి.లెహంగా విత్ కేప్ దుపట్టాట్రెడిషనల్ దుపట్టా స్థానంలో లైట్ షిమ్మర్ కేప్ వాడటం ఈ సీజన్లో హిట్. ఇది లుక్కు రాయల్ టచ్ ఇస్తుంది. ఇవి సంగీత్ వంటి వేడుకలకు హైలైట్గా మారాయి. సంప్రదాయ స్టైల్స్కి ఆధునికపు హంగులను జోడించడమే నేటి ట్రెండ్. ఫ్యూజన్ స్టైల్గా పిలిచే ఈ ఫ్యాషన్లో క్రియేటివిటీ ప్రధానంగా చూస్తున్నారు. చదవండి: నాన్నలూ అమ్మలవుతారు.. కుంగిపోతారుసంప్రదాయానికి ఆధునికతను జత చేస్తున్న ఈ ఫ్యూజన్ లుక్స్ ఈ తరం వధువులలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తున్నాయి పట్టు బ్లౌజ్కి నెటెడ్ స్లీవ్స్, ఆర్గంజా దుపట్టాతో బెనారసీ లెహంగా మ్యాచ్ చేయడం.. వంటివి నేటి ట్రెండ్ టెంపుల్ నెక్లెస్కి మరో డైమండ్ పెండెంట్ ఉన్న చైన్ లేదా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీని సిల్క్ శారీస్తో ధరించడం ఫ్యూజన్ స్టైల్గా మారింది సంప్రదాయ ఆభరణాలతో న్యూడ్ మేకప్, లైట్ బీచ్ వేవ్స్ హెయిర్స్టైల్స్ ఈ అలంకరణకు బాగా సూట్ అవుతున్నాయి.పేస్టెల్ షేడ్స్ ఎంపికఈ సీజన్ లో పెళ్లి కూతురి లుక్ పూర్తిగా నేటి కాలానికి తగినట్టుగా మారిపోతోంది. వధువు ధరించే సంప్రదాయ పట్టు చీరలకు బదులు ఫ్యూజన్ స్టైల్స్ బాగా హిట్ అవుతున్నాయి. బెనారస్ ఫ్యాబ్రిక్ మోడర్న్ కట్స్, టాప్ టు బాటమ్ ఒకే కలర్తో ఉండే మోనోటోన్ లెహెంగాస్ లేదా పేస్టెల్ షేడ్స్ లో శారీస్ ఇవే ఇప్పుడు నూతన వధువుల ఎంపిక అవుతుంది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సీక్విన్ వర్క్, పెర్ల్ డీటైలింగ్ వంటివి వధువు లుక్కి రాయల్ టచ్ ఇస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు లైట్వెయిట్ చీరలు (light weight saree) లేదా జామెట్రిక్ ప్యాటర్న్స్తో కూడిన లెహెంగాస్ను ఇష్టపడుతున్నారు. ఇవి ఫొటోలలో చాలా బ్రైట్గా కనిపిస్తాయి. వధువులే కాదు, వధువు తరపున వేడుకలో పాల్గొనబోయే అమ్మాయిలు కూడా పేస్టెల్ కలర్స్, ఫ్లోరల్ ప్రింట్స్ తో తమదైన స్టేట్మెంట్ని సృష్టిస్తున్నారు. మొత్తానికి, ఈ సంవత్సరం వధూవరుల ఫ్యాషన్ అనేది ‘ట్రెడిషన్ మీట్స్ మోడర్నిటీ‘ అని చెప్పొచ్చు.– చంద్రిక కంచెర్ల, ఫ్యాషన్ డిజైనర్
ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని.. అండగా నిలుస్తూ..
ఎన్నో భయాలు, ఎన్నో ప్రతికూలతలలో నుంచి బయటికి వచ్చి, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లిన స్టార్స్ వీరు. సోనాలి బింద్రే నుంచి హీనా ఖాన్ వరకు ఎంతోమంది స్టార్స్ క్యాన్సర్ సర్వైవర్స్ మాత్రమే కాదు వారియర్స్ (Warriors) కూడా. సదస్సులలో ప్రసంగించడం నుంచి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడం వరకు క్యాన్సర్పై అవగాహన కోసం ఎంతో పనిచేస్తున్నారు...సోనాలి బింద్రేకు స్టేజ్ 4 మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు 2018లో నిర్ధారణ అయిన తరువాత ఆమె, ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులు షాక్ అయ్యారు. న్యూయార్క్లో ఆరు నెలల చికిత్స తర్వాత సోనాలి బింద్రే (Sonali Bendre) ముంబైకి తిరిగి వచ్చింది. ఆమె క్యాన్సర్ చికిత్సలు అక్కడితో ముగియక పోయినా క్యాన్సర్ అవగాహన కోసం నడుం కట్టింది. క్యాన్సర్ ముందస్తు గుర్తింపు, క్యాన్సర్పై అవగాహన కోసం ప్రచారకర్తగా మారింది. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు వివిధ రకాల క్యాన్సర్ చికిత్సలు పొందుతున్న వేలాది మందికి స్ఫూర్తిగా మారాయి. ఎంతో ధైర్యాన్నిచ్చాయి. తాను దిగులు పడిన కాలం, ఆ దిగులు, నిరాశ నీడల నుంచి బయటపడి ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకున్న కాలం గురించి మాటల రూపంలోనో, రచనల రూపంలోనో చెబుతూనే ఉంది సోనాలి. తనకు క్యాన్సర్ అని నిర్ధారణ అయిన క్షణం నుంచి అందులో నుంచి బయటపడే వరకు ఆమె ఏడ్చింది, నవ్వింది, గెలిచింది!మందులే కాదు మానసిక బలం కూడా...అది 2012 సంవత్సరం. గతంలో ఎన్నడూ లేనంతగా తరచుగా అలసిపోయేది మనీషా కోయిరాలా (Manisha Koirala). కడుపు ఉబ్బిపోయేది. నొప్పిగా ఉండేది. చాలామంది మహిళలలాగే మనీషా కూడా తన ఇబ్బందిని సీరియస్గా తీసుకోలేదు. అయితే ఆరోగ్యం క్షీణించడం మొదలైన తరువాత డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఎన్నో పరీక్షల తరువాత వైద్యులు ఆమెకు షాకింగ్ న్యూస్ చెప్పారు. మనీషాకు అండాశయ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. ఆ సమయంలో ఆమె భయపడింది. గందరగోళంలో పడింది. గుండె పగిలిపోయినంతగా ఏడ్చింది.‘ఇలా ఏడుస్తూ కూర్చుంటే కుదరదు’ అని తనకు తాను చెప్పుకొని ధైర్యం తెచ్చుకుంది. ‘క్యాన్సర్తో పోరాటం అనేది మందులకు పరిమితమైన విషయం కాదు. మానసిక బలం ఉండాలి’ అంటున్న మనీషా చికిత్స కాలంలో తనలో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నిర్మించుకోవడానికి, మనశ్శాంతికి చేరువ కావడానికి మానసిక నిపుణులను సంప్రదించింది. క్యాన్సర్పై పోరాడే క్రమంలో కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులు అన్ని రకాలుగా అండగా ఉన్నారు. ఇప్పుడు మనీషాఎంతోమంది బాధితులకు అండగా నిలుస్తోంది. క్యాన్సర్ (Cancer) అని నిర్ధారణ అయిన వ్యక్తులకు ధైర్యం చెప్పి, అండగా నిలుస్తోంది. క్యాన్సర్పై అవగాహన కలిగించడానికి ఎన్నో సదస్సులలో ప్రసంగించింది. క్యాన్సర్ బాధితులకు అండగా ఉంటున్న ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడంలోని ప్రాముఖ్యత గురించి నొక్కి చెబుతోంది. అండాశయ క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి ‘ఓవాకోమ్’లాంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ర్యాలీలు, క్యాన్సర్ బాధితుల కోసం నిధుల సేకరణ కార్యక్రమాలలో పాల్గొంటుంది.ఒక మేలుకొలుపుతనకు బ్లడ్క్యాన్యర్ అని 2009లో నిర్ధారణ అయిన తరువాత మోడల్, నటి లిసా రేకు చికిత్స మొదలైంది. శారీరక మార్పులు మొదలయ్యాయి. అయినా ఎప్పుడూ అధైర్యపడలేదు. ఆత్మస్థైర్యం అనే ఆయుధాన్ని వదల్లేదు. ‘ఇది నాకు పునర్జన్మ’ అంటున్న రే క్యాన్సర్ను ఎదుర్కోవడంలో తన అనుభవాలను ‘ది ఎల్లో డైరీస్’ పేరుతో రాసింది. ‘క్యాన్సర్ అనేది పెద్ద మేలుకొలుపులాంటిది. క్యాన్సర్పై మరింత అవగాహన పెరగాలని కోరుకుంటున్నాను. క్యాన్సర్పై అవగాహన పెంచే కార్యక్రమాల్లో పాల్గొంటాను. అది నా కెరీర్లో భాగం’ అంటుంది లిసా రే.ఆ సంకేతాలు పసిగట్టాలిరొమ్ము క్యాన్సర్ బారిన పడిన హీనా ఖాన్ (Hina Khan) భయంతో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. తన ధైర్యమే తనను ముందుకు నడిపించింది. క్యాన్సర్పై పోరాటం గురించి తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఒకవైపు చికిత్స తీసుకుంటూనే సోషల్ మీడియా వేదికగా రొమ్ము క్యాన్సర్పై అవగాహన కలిగిస్తోంది. ‘ముందస్తు సంకేతాల ద్వారా ఆరోగ్య సమస్యల గురించి మన శరీరం తెలియజేస్తుంది. రెగ్యులర్ చెకప్స్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎప్పుడు ఇబ్బందిగా అనిపించినా, అనుమానం వచ్చినా వైద్యులను సంప్రదించాలి’ అంటుంది హీనా ఖాన్.అవగాహన కోసం అక్షరాలా...అండాశయ క్యాన్సర్పై తన అనుభవాలు, పోరాటం గురించి ‘హీల్డ్’ పేరుతో పుస్తకం రాసింది మనీషా కొయిరాలా. లిసా రే (Lisa Ray) రాసిన ‘క్లోజ్ టు ది బోన్’ పుస్తకంలో ఆమె వ్యక్తిగత, కెరీర్ విషయాలతో పాటు క్యాన్సర్పై తన పోరాటానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్ సర్వైవర్ల స్ఫూర్తిదాయకమైన జీవితకథలపై డా.సోనమ్ వర్మ రాసిన పుస్తకాన్ని బాలీవుడ్ నటి టిస్కా శర్మ ఆవిష్కరించింది. బ్రెస్ట్ క్యాన్సర్కు సంబంధించిన తన అనుభవాల గురించి స్టాండప్–కమేడియన్, నటి టిగ్ నొటరో ‘ఐయామ్ జస్ట్ ఏ పర్సన్’ పుస్తకం రాసింది. స్వయంగా రచయిత్రి అయిన సోనాలి బింద్రేకు కాన్యర్ చికిత్స సమయంలో కొన్ని పుస్తకాలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. అందులో కొన్ని... ది లాస్ట్ బ్లాక్ యూనికార్న్–టిఫనీ హడిష్, ఇకిగై–హెక్టర్ గార్సియా, ఫ్రాన్సిస్క్ మిరల్లెస్, ది టావో ఆఫ్ బిల్ ముర్రే–గవిన్ ఎడ్వర్ట్స్. చదవండి: నాన్నలూ అమ్మలవుతారు.. కుంగిపోతారు
ఫొటోలు
అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)
ఫ్రెండ్ పెళ్లిలో అనన్య సందడే సందడి (ఫొటోలు)
'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో రోజా, ప్రియ (ఫోటోలు)
వీకెండ్ స్పెషల్.. హైదరాబాద్ సమీపంలోని బెస్ట్ పిక్నిక్ స్పాట్లు (ఫొటోలు)
ఎన్ఎస్ఈలో సందడి చేసిన అంబానీ, పిరమల్ ఫ్యామిలీ (ఫొటోలు)
రష్మికా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
టీమిండియా టీ20 మ్యాచ్లో కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)
ముద్దమందారం అంతా క్యూట్గా బ్రిగిడ (ఫొటోలు)
రష్మిక 'ద గర్ల్ఫ్రెండ్' సినిమా (ఫొటోలు)
అంతర్జాతీయం
18 ఏళ్ల తర్వాత.. కరాచీలో బంగ్లా కళాకారులు
కరాచీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక సంబంధాల్లో నూతన అధ్యాయం మొదలైంది. బంగ్లాదేశ్ కళాకారులు 18 ఏళ్ల అనంతరం పాకిస్తాన్లో అడుగుపెట్టారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా వీరు కరాచీలో బుధవారం ప్రదర్శన ఇచ్చారు. నిహారికా ముంతాజ్ సారథ్యంలోని బంగ్లాదేశ్ బృందంలో కొందరు హిందూ కళాకారులు సైతం ఉండటం విశేషం. షిరీన్ జవాద్ పాడిన బెంగాలీ పాటలు ఆహూతులను అలరించాయి. అక్టోబర్ 30వ తేదీన మొదలైన వీరి ప్రదర్శనలు డిసెంబర్ 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాల్లో 140 దేశాలకు చెందిన కళాకారులున్నారు. రెండు దేశాల నడుమ తలెత్తిన దౌత్యపరమైన రాజకీయ విభేదాల కారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక సంబంధాలు పదేళ్లపాటు కొనసాగలేదు. షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కనిష్టస్థాయిలో కొనసాగాయి. 2024లో విద్యార్థుల సారథ్యంలో కొనసాగిన ఉద్యమంతో హసీనా ప్రభుత్వం పడిపోయింది. యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకిస్తాన్తో సంబంధాలు తిరిగి గాడినపడ్డాయి.
జర్మనీ నగరంలో మానవరక్తంతో స్వస్తికా గుర్తులు
హనావూ: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పాలనాకాలంలో యూదుల ఊచకోత చరిత్రలో ఎంతటి చీకటి అధ్యాయంగా మారిందో స్వస్తికా గుర్తు సైతం అంతటి చెడ్డ పేరు తెచ్చుకుంది. హిట్లర్ నాజీ సైనికులు ధరించిన ఈ స్వస్తికా గుర్తు తాజాగా జర్మనీలోని హనావూ నగరంలో పలు చోట్ల ప్రత్యక్షమవడంతో స్థానికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగాయి. మనిషి రక్తంతో కార్లు, గోడలు, పోస్ట్బాక్స్లపై స్వస్తికా చిహ్నం కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన ఫిర్యాదుతో ఎట్టకేలకు ఒక అనుమానితుడిని అరెస్ట్చేశారు. అతని మానసిక స్థితి సరిగా లేదని, సొంత రక్తంతోనే ఇవన్నీ రాసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో అసలు కారణాలు బయటికొస్తాయని పోలీస్ అధికారి థామస్ లీపోల్డ్ చెప్పారు. చట్టవ్యతిరేక సంఘాలతో ఇతనికి భాగస్వామ్యం ఉందా అనే కోణంలోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడిని 31 ఏళ్ల రొమేనియా దేశస్తుడిగా గుర్తించారు. అతనిని నివాసంలో పోలీసులు అరెస్ట్చేసినప్పుడు పూటుగా తాగి ఉన్నాడని తెలుస్తోంది. యూదులపై విద్వేషానికి గుర్తుగా అప్పట్లో హిట్లర్ సైన్యం ఈ గుర్తును తమ యూనిఫామ్లపై ధరించేవాళ్లు.
భారత్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లే నౌకపై.. సొమాలియా తీరంలో పైరేట్ల దాడి
దుబాయ్: సొమాలియా పైరెట్లు మరోసారి రెచ్చిపోయారు. భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్తున్న నౌకపై సొమాలియా తీరానికి సమీపంలో దాడికి దిగారు. మెషీన్ గన్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో నౌకపై కాల్పులకు దిగారు. మాల్టాకు చెందిన ఈ నౌక గుజరాత్లోని సిక్కా ఓడరేవు నుంచి బయలుదేరి దక్షిణాఫ్రికాలోని డర్బన్ వైపు వెళ్తోందని ఆంబ్రే అనే ప్రైవేట్ భద్రతా సంస్థ తెలిపింది. నౌకలో ప్రత్యేకంగా భద్రత సిబ్బంది లేరని పేర్కొంది. అందులోని మొత్తం 24 మంది సిబ్బంది ఓడలోని ఓ గదిలో లోపలి నుంచి తాళం వేసుకుని ఉండిపోయారంది. దాడి నేపథ్యంలో నౌక మార్గం మార్చుకుని, వేగం తగ్గించుకుందని వివరించింది. సముద్రం దొంగల దాడి కొనసాగుతోందని వివరించింది. ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు అప్రమత్తంగా ఉండాలని బ్రిటిష్ మిలటరీలోని యునైటెడ్ కింగ్డమ్ మారిటైం ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఇరాన్కు చెందిన మత్స్యకార పడవను అడ్డగించి, స్వా«దీనం చేసుకున్న పైరేట్లు దాడులకు పాల్పడుతున్నారంది. తాజాగా కేమెన్ దీవులకు చెందిన నౌకపై పైరేట్లు కాల్పులకు తెగబడ్డారని, ఓడలోని భద్రతా సిబ్బంది ప్రతిదాడికి దిగడంతో వారు తోకముడిచారని పేర్కొంది. సొమాలీ తీరంలో 2011లో అత్యధికంగా 237 దాడులు జరిగాయి. అంతర్జాతీయ సహకారం, నిఘాతో పైరేట్ల బెడద చాలా వరకు తగ్గిపోయింది. గతేడాది నాలుగు దాడులు జరిగినట్లు సమాచారం. తిరిగి ఈ ఏడాదిలో మళ్లీ దాడుల పరంపర మొదలవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
నిషిద్ధ నగరానికి ‘వంద’నం
‘భయంకరం’..!! సింగపూర్కు చెందిన ఆర్కిటెక్ట్ హో పుయ్–పెంగ్, 1980ల చివర్లో బీజింగ్లోని నిషిద్ధ నగరాన్ని మొదటిసారి సందర్శించినప్పుడు, ఆయన నోటి నుండి వచ్చిన మొదటి మాట ఇదే. 600 ఏళ్ల చరిత్ర ఉన్న ఒకప్పటి రాజప్రాసాదం చెత్తతో, పాడుబడిన గిడ్డంగులతో నిండిపోవడం ఆయనను నివ్వెరపరిచింది. కానీ అదే ’భయంకరమైన’ దృశ్యం ఇప్పుడు చైనా అత్యంత అద్భుతమైన వారసత్వ సంపదగా ఎలా మారింది? ఒకప్పుడు మూతపడిన ఓ చిన్న వనం, యావత్ ప్రపంచ దృష్టిని ఎలా ఆకర్షిస్తోంది? ఈ మార్పు వెనుక శతాబ్దపు రహస్యం దాగుంది. పాతికేళ్ల కఠోర శ్రమ ఉంది. చరిత్రలో నిషిద్ధ నగరం పదిహేనో శతాబ్దంలో మింగ్ రాజవంశం పాలనలో కుటుంబం నివాసం, కార్యకలాపాల కోసం దీనిని నిర్మించారు. ఆ తర్వాత క్వింగ్ రాజవంశపు చక్రవర్తులు దీనిని స్వా«దీనం చేసుకుని ఎన్నో భాగాలను పునరుద్ధరించారు. 1925లో, చివరి క్వింగ్ చక్రవర్తి పు యీని ఇక్కడి నుంచి పంపించేసిన తర్వాత ఈ ప్రదేశంలో ’ప్యాలెస్ మ్యూజియం’ ప్రారంభమైంది. అయితే, పునరుద్ధరణ పనులు చాలా ఆలస్యంగా మొదలయ్యాయి. చాలా ఏళ్లపాటు ఆ ప్రాంతాల మరమ్మతులు సరిగ్గా జరగకపోవడం, ఈ కట్టడాలు ఎక్కువగా చెక్కతో నిర్మించడం వల్ల తరచూ మంటలు చెలరేగి తీవ్రంగా దెబ్బ తిన్నాయి. వందేళ్ల తర్వాత గార్డెన్ కనువిందుదశాబ్దాలు గడిచాయి.. మళ్లీ హో పుయే–పెంగ్ సందర్శించేసరికి రూపురేఖలు మారిపోయాయి. ప్యాలెస్ మ్యూజియం 100వ వార్షికోత్సవం సందర్భంగా, దాని ఈశాన్య భాగంలోని ఒక చిన్న ప్రదేశంపై అందరి దృష్టి పడింది. సెపె్టంబర్ 30న ప్రజల కోసం తెరిచిన ఈ ప్రాంతాన్ని మ్యూజియం వర్గాలు ‘మొత్తం ప్రాంగణంలోనే అత్యంత అందమైన తోట’గా అభివరి్ణంచాయి.అదే ’ఖియాన్ లాంగ్ గార్డెన్’ సుమారు ఒక శతాబ్దం పాటు మూతపడిన ఈ గార్డెన్, 1770ల్లో కేవలం ఐదేళ్లలోనే నిర్మాణం పూర్తి చేసుకుంది. దీని పునరుద్ధరణకు ప్యాలెస్ మ్యూజియం, వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్తో కలిసి ఏకంగా 25 ఏళ్లపాటు శ్రమించింది. వానలోనూ సందర్శకుల తాకిడి ఇటీవల చైనాలో గోల్డెన్ వీక్ సెలవుల్లో, వర్షం పడుతున్నా ఈ ’ఖియాన్ లాంగ్ గార్డెన్’ లోపల సందర్శకులు బారులు తీరారు. చక్రవర్తి ఖియాన్ లాంగ్ పేరు మీదుగా ఈ తోటకు ఆ పేరు వచ్చింది. ఇది చక్రవర్తికి ఒక వ్యక్తిగత ఏకాంత నివాసంగా ఉండాలనే ఉద్దేశంతోనే దీనిని చాలా గోప్యంగా డిజైన్ చేశారు. 6,000 చదరపు మీటర్ల విస్తీర్ణంతో, ఇది ఒక ఫుట్బాల్ మైదానం కంటే చిన్నది. ఈ అద్భుత ప్రయత్నాన్ని చైనా నాయకుడు జి జిన్పింగ్ కూడా ప్రశంసించారు, నిషిద్ధ నగరం కేవలం ఒక భవన సముదాయం కాదు.. అది గత వైభవం. ఆ వంద సంవత్సరాల ప్రయాణానికి ‘వందనం’. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం
మేం ల్యాప్ టాప్స్ ఇస్తే.. వారు గన్స్ ఇస్తున్నారు: మోదీ
సీతామర్హి: ‘‘మేం ల్యాప్ టాప్స్ ఇస్తే.. వారు గన్స్ ఇస్తున్నారు.. బిహార్కు తుపాకుల ప్రభుత్వం అక్కర్లేదు’’ అంటూ ఆర్జేడీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిహార్లోని సీతామర్హిలో శనివారం.. ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ.. బీహార్కు స్టార్టప్లు అవసరం.. 'హ్యాండ్స్ అప్' గ్యాంగ్ కాదంటూ విమర్శలు గుప్పించారు.ఆర్జేడీ, ఇతర ప్రతిపక్ష పార్టీల టార్గెట్గా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని మోదీ.. రాష్ట్ర యువతను గూండాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్డీఏ యువతకు కంప్యూటర్లు, క్రీడా సామగ్రి అందిస్తుండగా.. ఆర్జేడీ మాత్రం తుపాకులు ఇవ్వాలనుకుంటోందంటూ మండిపడ్డారు.ఇవాళ్టి నాయకులు తమ పిల్లలను ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెలేలు చేయాలనుకుంటున్నారు. కానీ మీ పిల్లలను మాత్రం గూండాలుగా తయారు చేయాలనుకుంటున్నారు. బీహార్ దీన్ని ఎప్పటికీ అంగీకరించదు. జంగిల్ రాజ్ అంటే ‘తుపాకులు, క్రూరత్వం, అవినీతి, శత్రుత్వం’గా మోదీ అభివర్ణించారు. బిహార్లో నవంబర్ 11న రెండవ దశ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ విమర్శల దాడి మరింత పెంచారు. ఆర్జేడీ ప్రచార గీతాలు, నినాదాలు వినగానే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. ఆ పార్టీ నాయకుల ప్రచారంలో బీహార్ పిల్లల కోసం వారు ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్జేడీ వేదికలపై అమాయక పిల్లలను గ్యాంగ్స్టర్లుగా మారాలనుకుంటున్నట్లు చెప్పిస్తున్నారు’’ అంటూ మోదీ ఆరోపించారు.
Chhattisgarh: 12 చోట్ల ఎన్ఐఏ దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం
దంతేవాడ: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ, సుక్మా జిల్లాల్లోని 12 ప్రదేశాలలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఏకకాలంలో దాడులు నిర్వహించింది. 2023 అరన్పూర్ ఐఈడీ పేలుడుకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. నాడు జరిగిన పేలుళ్లలో 11 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఈ దాడులకు కుట్ర పన్నడం, లెవీ వసూలు చేయడం, ఆర్థిక నెట్వర్క్ను నిర్వహించడం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిషేధిత సంస్థ సీపీఐ (మావోయిస్ట్)క్రియాశీల సభ్యులు, మద్దతుదారులపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది.ఈ ఆపరేషన్లో ఎన్ఐఏ అధికారులు పలు నేరారోపణ పత్రాలు, చేతితో రాసిన లేఖలు, లెవీ రసీదులు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అలాగే మావోయిస్టు పరిచయాలకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయని సమాచారం. కాగా ఇప్పటివరకు ఈ కేసులో 27 మంది అనుమానితులను అరెస్టు చేశారు. రెండు ఛార్జిషీట్లు దాఖలు చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా మరిన్ని అరెస్టులు చేయనున్నామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.2023, ఏప్రిల్ 26న, దంతేవాడ జిల్లాలోని అరన్పూర్ ప్రాంతంలో నక్సలైట్లు.. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ)సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేశారు. ఈ దాడిలో పది మంది సైనికులతో పాటు ఒక డ్రైవర్ అమరులయ్యారు. రోడ్డు పక్కన 50 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను అమర్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ పేలుడు అత్యంత శక్తివంతంగా ఉండటంతో రోడ్డుపై ఏడు అడుగుల లోతున గుంత ఏర్పడింది. ఈ కేసును ఎన్ఐఏ చేపట్టి, ఉగ్రవాద కుట్ర, నిధుల నెట్వర్క్పై దర్యాప్తు ప్రారంభించింది.ఇది కూడా చదవండి: Bihar: ఎంపీ రెండు వేళ్లకూ సిరా గుర్తులు.. వీడియో వైరల్
కానిస్టేబుళ్లకు రామచరితమానస్ , గీతా పాఠాలు ఎక్కడో తెలుసా?
భోపాల్: పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికై శిక్షణ పొందుతున్న వారందరికీ భగవద్గీత తరగతులు నిర్వహించాలని మధ్యప్రదేశ్ పోలీసుల శిక్షణ విభాగం నిర్ణయించింది. ఇది వారు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఎనిమిది శిక్షణ పాఠశాలల సూపరింటెండెంట్లకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శిక్షణ) రాజా బాబు సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో దాదాపు 4,000 మంది యువతీ యువకులు తొమ్మిది నెలల పాటు కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్నారు, ఇది గత జూలైలో ప్రారంభమైంది. The saffronisation (भगवाकरण) of Madhya Pradesh police. These young recruits have a mandatory training which involves recitation of Hindu verses.... Although had it been that they are trained to practice all the religions it wouldn't have been a problem.Now imagine a hardcore… pic.twitter.com/rZ27N4yyse— Vishnukant Tiwari (@vishnukant_7) November 7, 2025రామచరితమానస్ పఠనం ఐపీఎస్ అధికారి సింగ్, ఈ శిక్షణ తరగతులను జూలైలో ప్రారంభించినప్పుడే.. రామచరితమానస్ పఠనానికి కూడా ఆదేశించారు. ఇది వారిలో క్రమశిక్షణను పెంపొందిస్తుందని అప్పుడే ఆయన స్పష్టం చేశారు. తాజాగా, శిక్షణ పాఠశాలల డైరెక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సాధ్యమైతే, శ్రీకృష్ణుడి పవిత్ర మాసమైన మార్గశిరంలో శిక్షణలో భాగంగా... కనీసం భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని చదవడం ప్రారంభించాలని సూచించారు. కాగా, ఈ అధికారి గతంలో 2019 ప్రాంతంలో గ్వాలియర్ రేంజ్ పోలీసు అధిపతిగా పనిచేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ప్రచారాన్ని ప్రారంభించి, స్థానిక జైలు ఖైదీలు, ఇతరులకు భగవద్గీత ప్రతులను పంపిణీ చేశారు. (తండ్రి త్యాగం, కొడుకు సర్ప్రైజ్ : నెటిజనుల భావోద్వేగం)
ఢిల్లీలోని చారిత్రక కట్టడాల్లో ఇక డ్రీమ్ వెడ్డింగ్స్!
న్యూఢిల్లీ: ఇకపై ఢిల్లీలోని పలు చారిత్రక ప్రదేశాలలో వివాహాలు జరుపుకోవడం ఇక కల కానేకాదు.. ఎందుకంటే, త్వరలోనే ఈ అద్భుతమైన కట్టడాలను వివిధ వేడుకల కోసం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎంపిక చేసిన వారసత్వ కట్టడాలను పెళ్లిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు బుక్ చేసుకునేందుకు అనుమతించే పథకం ప్రస్తుతం సిద్ధమవుతోందని ఓ అధికారి తెలిపారు. ఢిల్లీ ఆర్కియాలజీ శాఖ పరిధిలోని అనేక స్మారక చిహ్నాలను ఇప్పటికే ఎంపిక చేశారు. నార్తర్న్ రిడ్జ్లోని మ్యుటినీ మెమోరియల్ : 1857 తిరుగుబాటులో మరణించిన సైనికులకు గుర్తుగా 1863లో నిర్మితమైంది.కశ్మీర్ గేట్లోని దారా షికో లైబ్రరీ : ఇది ఒకప్పుడు మొఘల్ యువరాజు దారా షికో నివాసం, ఆ తర్వాత బ్రిటిష్ కార్యాలయంగా మారింది. చదవండి: తండ్రి త్యాగం, కొడుకు సర్ప్రైజ్ : నెటిజనుల భావోద్వేగంమక్బరా పైక్ : మొఘల్ కాలం నాటి సమాధి. ఇది ఇంపీరియల్ కొరియర్లలో ఒకరికి చెందినదని భావిస్తున్నారు. సాధనా ఎన్క్లేవ్లోని సమాధి : ఇది లోడీ కాలం నాటి నిర్మాణం. ఇది తొలి ఇండో–ఇస్లామిక్ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. ఖుద్సియా గార్డెన్లోని పెవిలియన్లు : 18వ శతాబ్దపు ప్యాలెస్ కాంప్లెక్స్లో భాగం. చక్రవర్తి ముహమ్మద్ షా భార్య అయిన ఖుద్సియా బేగం దీనిని నిర్మించారు. వీటితో పాటు, లోడి, సయ్యద్ కాలాల నాటి మధ్యయుగపు సమాధులు, గోడల అవశేషాలున్న వసంత విహార్లోని ప్రాంతాలు, ప్రఖ్యాత ఉర్దూ కవి మీర్జా గాలిబ్ నివాసమైన గాలిబ్ హవేలీ (చాందినీ చౌక్), ప్రయాణికుల విశ్రాంతి గృహంగా భావించే 14వ శతాబ్దపు గోపుర నిర్మాణమైన బరా లాయో కా గుంబద్ వంటివి కూడా పెళ్లి వేడుకలకు వేదికలుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి వారసత్వ వేదికల బుకింగ్ ఫీజుపై జీఎస్టీలో సడలింపు కూడా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరి ఈ అద్భుతమైన చారిత్రక వేదికల్లో వేడుకలు జరుపుకోవాలనే ఆలోచన మీకు ఉందా?.. ఇదీ చదవండి : నగల దుకాణంలో ‘అమ్మగారికి’ దేహశుద్ధి
ఎన్ఆర్ఐ
మనోళ్ల దీపావళి ఎఫెక్ట్: వెల్లువెత్తిన ఫిర్యాదులు
భారత్తో పాటు ప్రపంచంలోని నలుమూలలా భారతీయులు, మన మూలాలు ఉన్నవాళ్లు దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అయితే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేడుకల్లోనూ పలు చోట్ల అపశ్రుతి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తగా.. అదే సమయంలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. దీపావళి వేడుకల్లో.. గాయాలు, ప్రమాదాలు, చివరాఖరికి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఈ ఏడాది జరిగిన వేడుకల్లో ‘నష్టం’ కాస్త ఎక్కువే జరిగిందని పరిస్థితులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. అర్ధరాత్రి పూట అక్కడి భారతీయులు చేసిన హంగామాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో జరిగిన డ్యామేజ్ ఉదాహరణంగా నిలిచింది!.న్యూయార్క్ నగరం క్వీన్స్ ప్రాంతంలో.. బాణాసంచా కారణంగా లింకన్ స్ట్రీట్లోని మూడు నివాసాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇక్కడి దీపావళి వేడుకలకు.. అదీ కూడా అర్ధరాత్రి పూట నిర్వహణకు అసలు అనుమతే లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఫైర్వర్క్స్ గాల్లోకి ఎగసి ఓ ఇంట్లోకి నేరుగా దూసుకెళ్లిన తర్వాత మంటలు వ్యాపించాయి. మరోపక్క.. Your #Diwali celebration? My house is gone!What a sad incident, disappointing beyond words.Indians in the U.S., wake up before it's too late!! pic.twitter.com/7SQjiVBgfV— M9 USA🇺🇸 (@M9USA_) October 24, 2025UPDATE: We have received video from the homeowner showing the damage caused by the illegal and irresponsible Diwali fireworks.In addition, a vehicle and the garage were completely burned and damaged. https://t.co/vOh5Oa58o3 pic.twitter.com/436GvhB9KD— YEGWAVE (@yegwave) October 24, 2025న్యూజెర్సీలో ఒక్క ఎడిసన్ నుంచే 40 ఎమర్జెన్సీ కాల్స్ అధికారులకు వెళ్లాయట. ఆస్తి నష్టంతో పాటు ముందస్తు జాగ్రత్తగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారట. తమ నిద్రకు భంగం వాటిల్లిందనే ఫిర్యాదులు చేసిన వాళ్లు ఉన్నారట. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేడుకలను జరగనివ్వకుండా ఆపేశారు కూడా. ఇంకోపక్క.. Look at the aftermath of these Diwali celebrations.It’s chaos. Litter everywhere. Police holding people back. Indians hanging out of cars speeding by.And these people have the audacity to compare Christmas parades to this.I’m fed up.pic.twitter.com/2gX57IcKW3— Anti-Taxxer (@mapleblooded) October 23, 2025దీపావళి వేడుకల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించి కొందరి నివాసాలు పూర్తిగా ధ్వంసమై అయ్యాయని.. కట్టుబట్టలతో వాళ్లు రోడ్డు మీద పడ్డారని కొన్ని వీడియోలు, కథనాలు బయటకు వచ్చాయి. ‘‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. మాకేం మిగల్లేదు. నా కొడుకు ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. హోటల్ గదిలో జీవించాల్సి వస్తోంది’’ అని బాధితురాలు జువానిటా కొలన్ ఓ మీడియా సంస్థతో పేర్కొనడం గమనార్హం. దీంతో.. Indians were celebrating Diwali in US. Their police and fire department came to join the celebration and played Holi. pic.twitter.com/nLLlnFlh8p— Joy (@Joydas) October 23, 2025అమెరికా దీపావళి వేడుకలపై మునుపెన్నడూ లేనిస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అందుకు ఆ స్థాయిలో జరిగిన నష్టమే కారణమని స్పష్టమవుతోంది. దీంతో అధికారులు ఇలాంటి వేడుకలను అనుమతించొద్దని.. ఒకవేళ అనుమతించినా.. సురక్షిత నిబంధనలు పాటించేలా కఠిన మార్గదర్శకాలను తీసుకురావాలని పలువురు అమెరికన్లు కోరుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించి.. పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని సమాచారం.Indians have been living a respectful life in USA, UK, Canada and other Countries for over a century. What has really changed with the current expats creating such a ruckus, nuisance, civic garbage, displaying absolute lack of civic sense, cultural bankruptcy, this Diwali❓… pic.twitter.com/dGzt3SrtIs— Raju Parulekar (@rajuparulekar) October 24, 2025
అమెరికాలో భార్యకు వేధింపులు ఎన్నారై భర్త అరెస్టు
భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఎన్జీవో ప్రతినిధి తరుణి పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఎన్ఆర్ఐ కుటుంబాలలో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణం
చిన్న వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్లో భారతీయ విద్యార్థి (Indian Student) ఒకరు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. దీపావళి వేడుకల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు స్థానిక మీడియా 'గల్ఫ్ న్యూస్' వెల్లడించింది. మృతుడు కేరళకు చెందిన వైష్ణవ్ కృష్ణకుమార్ (18)గా గుర్తించారు. దుబాయ్లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం బీబీఏ మార్కెటింగ్ చదువుతున్నాడు. అతడికి యూఏఈ గోల్డెన్ వీసా (Golden Visa) ఉందని సమాచారం.దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీలో మంగళవారం జరిగిన దీపావళి వేడుకల్లో వైష్ణవ్ పాల్గొన్నాడు. సంబరాల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటు కారణంగా మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే వైష్ణవ్కు ఎటువంటి గుండె సమస్యలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తదుపరి దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.వైష్ణవ్ మృతదేహాన్ని కేరళకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని అతడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు తాను చూసుకుంటున్నట్టు దుబాయ్లోని వైష్ణవ్ బంధువు నితీశ్ 'ఖలీజ్ టైమ్స్'తో చెప్పారు. శుక్రవారం నాటికి వైష్ణవ్ మృతదేహం కేరళకు చేరుకుంటుందని భావిస్తున్నారు.రెండేళ్ల క్రితం స్వస్థలానికి..అలప్పుజ జిల్లా చెన్నితల పంచాయతిలోని కరాజ్మా ప్రాంతానికి చెందిన వైష్ణవ్ కుటుంబంలో దుబాయ్లో సెటిలయింది. వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 ఏళ్లుపైగా దుబాయ్లోని ఉద్యోగం చేస్తున్నారు. వైష్ణవ్, అతడి చెల్లెలు దుబాయ్లోనే పుట్టిపెరిగారని వారి బంధువు గోపి కర్ణవర్ తెలిపారు. అలప్పుజలో ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. వైష్ణవ్ చాలా తెలివైన కుర్రాడని చెప్పారు. వైష్ణవ్ కుటుంబం చాలా అరుదుగా స్వస్థలానికి వస్తుందని, రెండేళ్ల క్రితం వారు కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుక కోసం చివరిసారిగా ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!సంతాప ప్రకటనవైష్ణవ్ కృష్ణకుమార్ మరణం పట్ల మిడిల్సెక్స్ యూనివర్సిటీ సంతాపం తెలిపింది. చిన్న వయసులోనే అతడు చనిపోవడం ఎంతో కలచివేసిందని సంతాప ప్రకటనలో పేర్కొంది. వైష్ణవ్ చదువుకున్న జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ కూడా సంతాపం ప్రకటించింది. వైష్ణవ్ ప్రతిభావంతుడైన విద్యార్థి అని కొనియాడింది. వైష్ణవ్ మరణంతో అతడి తండ్రి కృష్ణకుమార్, తల్లి విధు, చెల్లెలు వృష్టి విషాదంలో మునిగిపోయారు.
జార్జియాలో అద్భుతంగా 'చెంచు లక్ష్మి' నృత్య నాటిక
విద్యా సేవ కోసం సంస్కృతి పండుగ, హృదయాలను తాకిన “చెంచు లక్ష్మి” 2025 అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం, జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్ ఒక అద్భుతమైన సాంస్కృతిక వేదికగా మారింది. నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ నిర్వహించిన “చెంచు లక్ష్మి” నృత్య నాటిక, కళా పరిమళాలను విరజిమ్ముతూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ సౌత్ ఫోర్సిత్ కౌంటీ తోడ్పాటు అందించింది. కళను విద్యా సేవతో మిళితం చేస్తూ, సమీకరించిన నిధులను ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (FCEF) కు అందజేశారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు కాంతివంతమైన మార్గం వేస్తుందనే సంకేతంగా నిలిచింది. వేదికపై దీపాల కాంతి, పూజా మంత్రాల నినాదం మధ్య వేడుక ప్రారంభమైంది. మంచినీటి వంటి స్వరంతో హర్షిణి చుండి మరియు శ్రీలేఖ ఆదుసుమిల్లి సమన్వయకర్తలుగా ప్రవేశించి కార్యక్రమాన్ని నడిపారు.మాలతి నాగభైరవ ఒక అందమైన వీడియో ద్వారా ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రేరణను వివరించారు — “కళ మనసును మేల్కొలుపుతుంది, విద్య భవిష్యత్తును వెలిగిస్తుంది” అనే మంత్రాన్ని ప్రతిధ్వనిస్తూ. తర్వాత దీపప్రజ్వలన కార్యక్రమంలో, ఫోర్సిత్ కౌంటీకి చెందిన ఎన్నో ప్రముఖులు ఒకచోట చేరారు రాన్ ఫ్రీమన్ (షెరీఫ్), విలియం ఫించ్ (సొలిసిటర్ జనరల్), ఆల్ఫ్రెడ్ జాన్ (బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ చైర్మన్),మైఖేల్ బారన్ (ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్), రినీ వెల్చ్ (రోటరీ క్లబ్ డైరెక్టర్), కళ్యాణి చుండి (HC Robotics – డైమండ్ స్పాన్సర్), భారత్ గోవింద (Assure Guru CEO), నీలిమ గడ్డమనుగు (నటరాజ నట్యాంజలి), శ్రీరామ్ రొయ్యాల (Zoning Board చైర్మన్).దీప కాంతుల జ్యోతి విరజిమ్మగా, వేదిక ఒక ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. “చెంచు లక్ష్మి” — ప్రేమ, పరమాత్మకత, ప్రకృతి గాథకథ — దేవుడు నరసింహ స్వామి, భక్తి రూపిణి లక్ష్మి, మరియు అరణ్యాల గుండెల్లో పుట్టిన చెంచు లక్ష్మి మధ్య ఆధ్యాత్మిక ప్రేమగాథ.నల్లమల అడవుల సౌందర్యం, మనసుని తాకే సంగీతం, భక్తి పుష్టి తో నిండిన నాట్యరూపాలు — అన్నీ కలగలసిన ఆ అద్భుత నాటిక.నీలిమ గడ్డమనుగు దర్శకత్వంలో కళాకారులు నృత్యం, భావం, సంగీతం, కవిత్వం అన్నింటినీ మేళవించారు. తాళం, లయ, అభినయం — ప్రతి క్షణం కళా కాంతుల విరిసిన పుష్పంలా అనిపించింది.ఈ వేడుకకు 500 మందికి పైగా కళాభిమానులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.రాష్ట్ర ప్రతినిధులు టాడ్ జోన్స్ (District 25) మరియు కార్టర్ బారెట్ (District 24) ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. HC Robotics, Assure Guru వంటి సంస్థలు ప్రధాన స్పాన్సర్లుగా నిలిచి, విద్యా సేవకు తోడ్పాటును అందించాయి.వేదికపై సత్కారాలు, పుష్పగుచ్ఛాలు, ప్రశంసా ఫలకాలు అందజేయబడ్డాయి. ByteGraph వంటి సాంకేతిక బృందాలు కార్యక్రమాన్ని మల్టీమీడియా అద్భుతంగా మలిచాయి. నిర్వాహకుడు శ్రీరామ్ రొయ్యాల ,టాడ్ జోన్స్ ఈకార్యక్రమం విజయవంతంపై సంతోషం వ్యక్తం చేశారు.
క్రైమ్
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ఎన్టీఆర్ జిల్లా: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయనపాడు సమీపంలో శుక్రవారం జరిగింది. గ్రామ సమీంలోని వ్యవసాయ పొలాల్లో కాలిన గాయాలతో మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితురాలిని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలు కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న సాతుపాటి సాయికుమార్ భార్య సాతుపాటి జ్యోతి (20) గా గుర్తించారు. భార్య భర్తల మధ్య ఇటీవల మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో భార్య కాలిన గాయాలతో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిందా లేక హత్యా ప్రయత్నం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తండ్రి మేడా సాంబయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలికి ఐదేళ్ల కుమార్తె, రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నారు.
మొక్కజొన్న తోటలో బాలుడి మృతదేహం
ప్రకాశం జిల్లా: మండల పరిధిలోని చిలకచర్లలో దారుణం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొక్కజొన్న తోటతో అదే గ్రామానికి చెందిన గిరిజన బాలుడు ఆర్తి నాగన్న(16) మృతదేహాన్ని పాతి పెట్టి ఉండటం కలకలం రేపింది. ఈ సంఘటన కొద్ది రోజుల ముందు చోటు చేసుకోగా శుక్రవారం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్, తహసీల్దార్ అశోక్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పంచనామా అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. యువకుడి మృతదేహం మొక్కజొన్న తోటలో పూడ్చిపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. కొద్ది రోజులుగా కనబడకుండా పోయిన తమ కుమారుడు ఇలా మొక్కజొన్న తోటలో శవమై తేలడంతో మృతుని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించటం అందరినీ కలిచివేసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టనున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
అమ్మా.. అంకుల్ చేతులతో తాకుతున్నాడు..
పల్నాడు జిల్లా: తల్లితో శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడు ఆమె కుమార్తైపె కన్నేసినప్పటికీ తల్లి నివారించకపోగా కుమార్తె ఫిర్యాదు చేసినా కూడా సహకరించాలంటూ ప్రోత్సహించేందుకు యత్నించిన ఘటన సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శివాజీనగర్లోని ఓ ఆపార్ట్మెంట్లో నివసిస్తున్న సచివాలయ మహిళా ఉద్యోగికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె భర్తతో వివాదం కారణంగా తొమ్మిదేళ్ల కిందట విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి సత్తెనపల్లిలో నివసిస్తూ పట్టణానికి చెందిన అక్రమ రేషన్ వ్యాపారి తులసీకృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.అతడు నిత్యం ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో ఆమె కుమార్తైపె కూడా ఎక్కడబడితే అక్కడ చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగంతో ఆమె తల్లికి చెప్పి విలపించింది. అయినప్పటికీ తల్లి నివారించే ప్రయత్నం చేయకపోగా సహకరించాలంటూ ప్రోత్సహించే ప్రయత్నం చేయడంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. ఈ క్రమంలో పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని బంధువైన వృద్ధురాలు ఇటీవల శివాజీనగర్లోని మహిళా పోలీస్ తిరుమల లక్ష్మి దృష్టికి తీసుకు రావడంతో వ్యవహారం బట్టబయలైంది. మహిళా పోలీస్ ఈనెల 5న డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జయరాజుకు సమాచారం అందించింది. ఆయన ఈనెల 6న సత్తెనపల్లి ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీల నేతృత్వంలో ఆ విద్యార్థిని పట్టణ పోలీసుల వద్దకు తీసుకువచ్చి, జరిగిన ఘటనను వివరించారు. ఆ విద్యార్థిని కనిపించకుండా చేసేందుకు ఆమె తల్లి శతవిధాలా ప్రయత్నించగా పట్టణ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు తొలుత ఆమెను గురువారం నరసరావుపేట వన్స్టాప్ సెంటర్కు తరలించారు. శుక్రవారం మంగళగిరి లోని వన్స్టాప్ సెంటర్కు తరలించారు. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తులసీకృష్ణను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించటంతో సత్తెనపల్లి సబ్జైలుకు తరలించారు.
మాలీలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం
పశ్చిమ ఆఫ్రికా దేశం ఐదుగురు భారతీయుల కిడ్నాప్ వార్త కలకలం రేపింది. ఈ విషయాన్ని భద్రతా వర్గాలు శుక్రవారం ధృవీకరించాయి. ఒక పక్క అశాంతి, జిహాదీ హింసతో అల్లాడి పోతుండగా మరోపక్క కోబ్రీ సమీపంలో ఉగ్రవాదుల చేతిలో భారతీయుల కిడ్నాప్ మరింత ఆందోళన రేపింది. పశ్చిమ మాలిలోని కోబ్రీ సమీపంలో గురువారం కార్మికులను ముష్కరులు కిడ్నాప్ చేశారని, వారు విద్యుదీకరణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న కంపెనీలో పనిచేస్తున్నారని భద్రతా వర్గాలు AFPకి తెలిపాయి. మరోవైపు బాధితులు పనిచేస్తున్న కంపెనీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ముందుజాగ్రత్త చర్యగా మిగిలిన వారిని రాజధాని బమాకోకు సురక్షితంగా తరలించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తామే ఈ కిడ్నాప్ చేసినట్టు ఇప్పటివరకు ఏ గ్రూపు ప్రకటించలేదు.2012 నుండి తిరుగుబాట్లు, ఘర్షణలతో అట్టుడుడుతున్న దేశంలో విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్లు సర్వసాధారణంగా మారిపోయాయి. అల్ఖైదాదీ సంబంధిత గ్రూప్ ఫర్ ది సపోర్ట్ ఆఫ్ ఇస్లాం అండ్ ముస్లింస్ (JNIM) జిహాదీలు సెప్టెంబర్లో బమాకో సమీపంలో ఇద్దరు ఎమిరాటీ జాతీయులను మరియు ఒక ఇరానియన్ను కిడ్నాప్ చేశారు.50 మిలియన్ల డాలర్ల చెల్లింపు తరువాత వారిని గత వారం విడుదల చేశారు.
వీడియోలు
చేపల వర్షం..ఇదేందయ్యా, ఇది!
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
బీహార్ లో గెలిచేశాం.. ఇక తుపాకులు ఉండవు
కూటమి నేతల తీరుపై విడదల రజిని తీవ్ర ఆగ్రహం
రాజమౌళి కొత్త సినిమా నుంచి ప్రమోషన్ స్టార్ట్.. మహేష్ బాబు టైటిల్ ఇదేనా?
నువ్వు 100 జన్మలెత్తినా జగన్ స్థాయిని చేరుకోలేవు
టికెట్ కోసం కొలికపూడి 5 కోట్లు.. క్రమశిక్షణ కమిటీ చేతికి కేశినేని చిన్ని దందాల చిట్టా
రూ.7 కోట్లకు టికెట్ ఇస్తానని వేమన సతీష్ మోసం
పెద్ది పాటలో చరణ్ స్టెప్స్, సలామ్ అనాలిని గుర్తు చేస్తున్నాయా?
వాగులో వజ్రాలు.. ఎగబడుతున్న జనం

