Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Education sector in Chandrababu Govt By Vardhelli Murali1
రంగంలోకి అంగడి చదువు!

పేదరికం కారణంగా కొంతమంది ఏపీ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయలేకపోయారన్న వార్తలు వస్తున్నాయి. మన పాలక వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవలసిన పరిణామం ఇది. ఉన్న ఊళ్లో ఉపాధి లేక పొట్టకూటికోసం వెనుకబడిన ప్రాంతాల ప్రజలు వలసబాట పడుతున్నారు. చదువుకుంటున్న వారి పిల్లలు కూడా గత్యంతరం లేక తల్లిదండ్రులను అనుసరించవలసి వస్తున్నది. వారిలో పదో తరగతి చదివిన పిల్లలు కూడా ఉన్నారు. వలస కారణంగా వారు కీలకమైన పదో క్లాసు పరీక్షలకు దూరమయ్యారు. వారి భవిష్యత్తు గురించి వ్యవస్థ పట్టించు కోనట్టయితే డ్రాపవుట్లుగా మిగిలే అవకాశం ఉన్నది. వారి భావి జీవితం వలసకూలి టైటిల్‌తో ముడిపడే ప్రమాదం ఉన్నది.‘‘ఒక్క మలినాశ్రు బిందువొరిగినంత వరకు... ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను’’ అంటాడు కవి బాలగంగాధర తిలక్‌. నిజంగా ప్రజల ఆలనాపాలనా చూడవలసిన ఏపీ సర్కార్‌కు మాత్రం అటువంటి సెంటిమెంట్లేవీ లేవు. ఇప్పుడు ఒక్క కన్నీటి బొట్టు రాలడం కాదు. మూర్తీభవించిన కన్నీరు దారిపొడుగునా ప్రవహిస్తున్నది. ‘‘జగన్‌ సర్కార్‌ అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకాన్ని కొనసాగించి ఉన్నట్లయితే మా పిల్లలు తప్పకుండా పదో తరగతి పరీక్ష రాసేవార’’ని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. నాణ్యమైన సార్వత్రిక విద్యను అమలు చేయడం కోసం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎంతగా మేధామథనం జరిపి పథకాన్ని రూపొందించి ఉంటారో ఈ విషాద పరిణామాన్ని చూస్తే అర్థమవు తున్నది.మన దేశంలో విద్యాహక్కు చట్టం అమలులో ఉన్నది. అటు వంటి చట్టాన్ని అమలు చేయాలని భారత రాజ్యాంగం కూడా ఆదేశించింది. దురదృష్టవశాత్తు ఇది మొక్కుబడి తతంగంగా మారిందన్న సంగతి అందరికీ తెలిసిందే. బడికి వచ్చే పిల్లలకు అరకొర చదువు చెప్పడం ప్రభుత్వ స్కూళ్ల కర్తవ్యంగా మారి పోయింది. ఉద్దేశపూర్వకంగా తలెత్తిన ఈ ధోరణి ఫలితంగా తామరతంపరగా ప్రైవేట్‌ విద్యాసంస్థలు పట్టుకొచ్చాయి. స్థోమత ఉన్నవాళ్లంతా ప్రైవేట్‌ స్కూళ్లలో మెరుగైన విద్యను కొనుగోలు చేయడం, పేద పిల్లలు సర్కారు బడి చదువులతో పోటీలో నిలవలేకపోవడం... గత మూడు దశాబ్దాలుగా బాగా ఎక్కువైంది. ఈ ధోరణి పట్ల పలువురు ప్రగతిశీల సామాజిక వేత్తలు, మేధావులు అసహనాన్నీ, ఆందోళననూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు.ఐక్యరాజ్య సమితి సైతం తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్‌డీజీలు) పిల్లలందరికీ నాణ్యమైన విద్య ఉచితంగా సమా నంగా అందుబాటులో ఉండాలని నాలుగో లక్ష్యంగా నిర్దేశించింది. మన్నికైన జీవన ప్రమాణాలతో మానవజాతి దీర్ఘకాలం పాటు ఈ భూగోళంపై మనుగడ సాగించాలంటే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం అవసరమేనని మేధాప్రపంచం అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. కానీ పాలకుల్లో చిత్త శుద్ధి లేకపోవడం ఈ లక్ష్యాలకు ఆటంకంగా మారింది. ఉదార ప్రజాస్వామిక వ్యవస్థలు క్రమంగా ‘ప్లుటానమీ’ (సంపన్నులు శాసించే వ్యవస్థలు)లుగా పరివర్తనం చెందుతున్నాయని పలు వురు పొలిటకల్‌ ఎకనామిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన దశాబ్ద్ద కాలానికి ఈ పదప్రయోగం వ్యాప్తిలోకి వచ్చింది.సంస్కరణలు ప్రారంభమైన తొలి దశాబ్దిలో క్రియాశీలకంగా ఉన్న రాజకీయ నాయకుల్లో చంద్రబాబు కూడా ఒకరు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వరాదనే వాదాన్ని ఆయన బలంగా వినిపించేవారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ డిమాండ్‌ను ఆయన ఎంత తీవ్రంగా వ్యతిరేకించేవారో చాలామందికి గుర్తుండే ఉంటుంది. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అమలుచేసిన తర్వాత ఈ అంశానికి సర్వత్రా ఆమోదం లభించింది. అలాగే ప్రభుత్వ సేవలన్నింటికీ ప్రజలు యూజర్‌ ఛార్జీలు చెల్లించాలనే నియమం పెట్టింది కూడా చంద్రబాబే! మితిమీరిన ప్రైవేటీకరణ సూపర్‌ రిచ్‌ వర్గాన్ని సృష్టించడం, తిరిగి ఆ వర్గం మొత్తం ఆర్థిక – రాజకీయ వ్యవస్థలను ప్రభా వితం చేయడం ప్లుటానమీకి దారి తీస్తున్నది.ఇటువంటి వ్యవస్థల్లో సహజ వనరుల దగ్గ ర్నుంచి సర్వే సర్వత్రా ప్రైవేటీకరణే తారకమంత్రంగా పనిచేస్తుంది. విద్యారంగం ఇందుకు మినహాయింపేమీ కాదు. విభజిత రాష్ట్రానికి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ‘విద్య ప్రభుత్వ బాధ్యత కాద’ని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతిని గుర్తు చేసుకోవడం అవసరం. ఈ నేపథ్యాన్ని అర్థం చేసు కుంటేనే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ రంగంలో నిర్మించిన 17 మెడికల్‌ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని ఎందుకనుకుంటున్నారో అర్థమవుతుంది. అమరావతి కోసం అరవై వేల కోట్ల రూపాయల అప్పును ఆగమేఘాల మీద పుట్టించగలిగిన వ్యక్తి, తాను పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ‘తల్లికి వందనం’ ఎందుకు అమలుచేయలేకపోయాడో అర్థమవుతుంది. ఈ పూర్వరంగం అర్థం కానట్లయితే ఆర్థిక వెసులుబాటు లేకనే అమలు చేయలేకపోయారనే మోసపు ప్రచారానికి తలూప వలసి వస్తుంది.విద్యారంగంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పూర్తి ప్రజాస్వామికీకరణ చర్య లను చేపట్టింది. ప్రజల ఆకాంక్షల మేరకు ఇంగ్లిష్‌ మీడియం బోధనను ప్రారంభించింది. భాషా – సంస్కృతుల ముసుగులో పెత్తందారులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా చలించలేదు. సీబీఎస్‌ఈ సిలబస్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. నగరాల్లో సూపర్‌ రిచ్‌ పిల్లలకు మాత్రమే పరిమితమైన అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్‌ను పిల్లలందరికీ ఉచితంగా ఈ సంవత్సరం నుంచి అమలుచేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసింది. అంతర్జా తీయ స్థాయిలో మన పిల్లలు పోటీపడాలన్న తపనతో చేపట్టిన కార్యక్రమాలివి. డిజిటల్‌ యుగంలో తన రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో వెలుగొందాలని పాఠశాలల్లో డిజిటల్‌ బోర్డు లను ఏర్పాటు చేయించారు. ఎనిమిదో క్లాసు నుంచి విద్యార్థుల చేతికి ట్యాబ్‌లను ఉచితంగా అందజేశారు.పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి స్వయంగా పూనుకొని తయారు చేయించిన మెనూతో మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులపై పైసా భారం పడకుండా పుస్తకాలు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్‌లను పాఠశాలల ప్రారంభానికి ముందే సిద్ధం చేసి ఉంచేవారు. మూడు నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు అన్ని సబ్జెక్టులూ ఏకోపాధ్యా యుడే బోధించే పద్ధతికి స్వస్తిచెప్పి వారికి సబ్జెక్టు వారీగా బోధించే టీచర్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆ మూడు తరగతులను కిలోమీటర్‌ పరిధి లోపల ఉండే అప్పర్‌ ప్రైమరీ, హైస్కూళ్లలో విలీనం చేశారు. ఫలితంగా ఆ విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల సదుపాయం ఏర్పడింది. ఆ వయసు పిల్లల్లో గ్రాహ్యశక్తి బలంగా ఉంటుందన్న అధ్యయనాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల తన పదవీ కాలంలో రెండేళ్లు కోవిడ్‌ కోతకు గురైనప్పటికీ పాఠశాల విద్యారంగంలో పెను మార్పులకు జగన్‌ తెరతీశారు.పేద – ధనిక తేడాల్లేని, లింగవివక్ష అసలే లేని ఒక నవ యుగ విద్యాసౌధ నిర్మాణం కోసం ఇన్ని ఇటుకల్ని పేర్చిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి తప్ప ఈ దేశంలో మరొకరు లేరు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విద్యావ్యవస్థ పునర్నిర్మాణా నికి ఇంత వేగంగా అడుగులు వేసిన వ్యక్తి కూడా మరొకరు కాన రారు. కేరళ రాష్ట్ర విద్యారంగం మొదటి నుంచీ కూడా మిగతా దేశంతో పోల్చితే ఆరోగ్యంగానే ఉన్నది. ఆర్థిక సంస్కరణల తర్వాత కూడా అది తన ప్రతిష్ఠను కాపాడుకోగలిగింది.చదువుల తల్లి సరస్వతిని అమ్ముకోవడం తరతరాలుగా మన సంస్కృతిలో తప్పుగానే భావిస్తున్నారు. ఇందుకు ఆంధ్ర మహాభారత కర్త బమ్మెర పోతనామాత్యులే ఉదాహరణ. ‘‘బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్‌ / కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్‌ / హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల / కౌద్దాలికు లైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై’’ అన్నారు. తాను రాసిన కావ్యాన్ని సరస్వతిగా భావించి, దాన్ని రాజులకు అంకిత మివ్వడానికి ఆయన నిరాకరించారు. అలా వచ్చిన సొమ్ము పడుపువృత్తితో వచ్చిన సొమ్ముగా ఆయన అసహ్యించుకున్నారు. ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ఇప్పుడు చదువుల తల్లిని అంగట్లో నిలబెట్టి అమ్ముకుంటున్నారు. దానికి మనం ఎన్ను కున్న ఏలికలు వత్తాసుగా నిలబడుతున్నారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను విడిచిపెట్టి ప్రైవేట్‌ స్కూళ్లలో చేరారు. ఆయన అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం రద్దవుతుందన్న భయం ఒక కారణం. ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ కింద డబ్బులొస్తా్తయనే నమ్మకం కూడా ఇంకో కారణం కావచ్చు. అట్లా మారిన విద్యార్థులు ఇప్పుడు ఫీజులు కట్టలేక అల్లాడు తున్నారు. ఇంగ్లీషు మీడియాన్ని రద్దు చేస్తారనే ప్రచారం, సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఎత్తేయడం దేన్ని సూచిస్తున్నాయి? ఎని మిదో తరగతి నుంచి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లను నిలిపి వేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లలో కొత్త కంటెంట్‌ లోడ్‌ చేయలేదు. ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద దాదాపు ఇరవై వేల స్కూళ్లలో సౌకర్యాలను ప్రైవేట్‌ స్కూళ్ల కంటే మిన్నగా జగన్‌ ప్రభుత్వం మెరుగుపరిచింది. మిగిలిన స్కూళ్లలో ఆ కార్యక్ర మాన్ని నిలిపివేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత చాలాచోట్ల నాసిరకంగా మారింది. మూడు నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ను ఎత్తేస్తారట! ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలకు ఏర్పడ్డ నమ్మకాన్ని చంపేయడమే లక్ష్యంగా పెట్టు కున్నట్టు కనిపిస్తున్నది. మరోపక్క పెద్ద ఎత్తున ప్రైవేట్‌ స్కూళ్లకు, జూనియర్‌ కాలేజీలకు అనుమతులిస్తున్నారన్న ప్రచారం సాగుతున్నది. ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. మెడికల్‌ కాలేజీల సంగతి తెలిసిందే! మరోసారి ఆంధ్రప్రదేశ్‌ విద్యారంగంలో ప్రైవేట్‌ జేగంట మోగుతున్నది. అంగడి చదువులు మళ్లీ రంగప్రవేశం చేస్తున్నాయి. విద్యా విప్లవానికి గ్రహణం పట్టింది. ఈ ప్రభుత్వం మారితేనే గ్రహణం విడిచేది!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

JAC demand of southern states to central govt on Delimitation2
పాతికేళ్ల దాకా పునర్విభజన వద్దు

సాక్షి, చెన్నై: జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ నేతృత్వంలోని ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘పునర్విభజన ప్రక్రియపై ప్రస్తుతమున్న నిషేధాన్ని మరో పాతికేళ్ల దాకా పొడిగించాలి. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేసిన లోక్‌సభ స్థానాల ప్రస్తుత సంఖ్యనే అప్పటిదాకా కొనసాగించాలి’’అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. పునర్విభజన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా, అందరి ఆమోదంతో మాత్రమే జరగాలని తేల్చిచెప్పింది. స్టాలిన్‌ నేతృత్వంలో జేఏసీ శనివారం చెన్నైలో తొలిసారిగా సమావేశమయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు తదితరులు హాజరయ్యారు. మొత్తం 14 పార్టీల నాయకులు పాల్గొన్నారు. తమ డిమాండ్లపై ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీల ద్వారా ఉమ్మడిగా విజ్ఞాపన పత్రం సమర్పించాలని నిర్ణయించారు. కేంద్రం చేపట్టే ఎలాంటి డీలిమిటేషన్‌ ప్రక్రియపై అయినా ముందుగా భాగస్వామ్య పక్షాలన్నింటితోనూ చర్చించాల్సిందేనని జేఏసీ సభ్యులు కుండబద్దలు కొట్టారు. ‘‘అందరి భాగస్వామ్యంతో మాత్రమే డీలిమిటేషన్‌ జరగాలి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలతో కచ్చితంగా సంప్రదింపులు జరపాలి. అభిప్రాయాలు తెలుసుకోవాలి. లోక్‌సభ స్థానాల పునర్విభజన మన ప్రజాస్వామ్య వ్యవస్థ గౌరవ ప్రతిష్టలను పెంచేలా ఉండాలి’’అని పేర్కొన్నారు. ఈ మేరకు రూపొందించిన తీర్మానాన్ని జేఏసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘‘జనాభా నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని 42, 84, 87వ రాజ్యాంగ సవరణలు సూచిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జనాభా విషయంలో స్థిరీకరణ సాధించాలన్న లక్ష్యం ఇంకా నెరవేరలేదు. అందుకే 1971 నాటి జనగణన ఆధారంగా నిర్ధారించిన లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యపై పరిమితిని మరో 25 ఏళ్లపాటు పొడిగించాలి. రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించకూడదు. జనాభా నియంత్రణ చర్యలతో జనాభాను గణనీయంగా తగ్గించిన రాష్ట్రాలను శిక్షించాలనుకోవడం సరైంది కాదు. ఈ విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వం తగిన రాజ్యాంగ సవరణలు చేయాలి’’అని తీర్మానంలో పేర్కొన్నారు. తమ డిమాండ్లను లెక్కచేయకుండా కేంద్రం డీలిమిటేషన్‌ ప్రక్రియ ప్రారంభిస్తే కలిసికట్టుగా అడ్డుకోవడానికి ఎంపీలతో కూడిన కోర్‌ కమిటీ ద్వారా సమన్వయం చేసుకోవాలని, ఆ మేరకు వ్యూహాలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. ‘జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌’కు వ్యతిరేకంగా శాసనసభల్లో తీర్మానాలు ఆమోదించి కేంద్రానికి పంపించాలని నిర్ణయానికొచ్చారు. గతంలో జరిగిన డీలిమిటేషన్‌ ప్రక్రియల చరిత్ర, వాటి ఉద్దేశం, ప్రతిపాదిత పునర్విభజన వల్ల తలెత్తే విపరిణామాలపై తమ రాష్ట్రాల్లో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. తమిళనాడులో అధికార డీఎంకే దీనిపై ఇప్పటికే సోషల్‌ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. సమావేశంలో స్టాలిన్, పినరయి విజయన్, రేవంత్‌రెడ్డి, భగవంత్‌మాన్, కేటీఆర్, డీకే శివకుమార్, సురేశ్‌రెడ్డి, వద్దిరాజు, వినోద్‌కుమార్, మహేశ్‌గౌడ్, మల్లు రవి తదితరులు దక్షిణాది రాష్ట్రాలకు గొడ్డలిపెట్టు: విజయన్‌ ప్రతిపాదిత పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు గొడ్డలిపెట్టు వంటిదేనని విజయన్‌ తేల్చిచెప్పారు. జనాభా తగ్గించినందుకు ఇస్తున్న బహుమానం ఇదేనా అని మండిపడ్డారు. పునర్విభజనపై ముందుకెళ్లే ముందు కేంద్రం దక్షిణాది రాష్ట్రాలతో అర్థవంతమైన చర్చలు జరపాలన్నారు. ‘‘ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ చేపడితే లోక్‌సభ సీట్లు ఉత్తరాదిన పెరిగి దక్షిణాదిన తగ్గుతాయి. తద్వారా బీజేపీ లాభపడుతుంది. స్వీయ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్నదే బీజేపీ ఆలోచన’’అని మండిపడ్డారు. జేఏసీ సమావేశం అనంతరం విజయన్‌ ‘ఎక్స్‌’లో పలు పోస్టులు చేశారు. దేశ సమాఖ్య వ్యవస్థపై సంఘ్‌ పరివార్‌ బహిరంగ యుద్ధం ప్రారంభించిందని ధ్వజమెత్తారు. సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కలిసికట్టుగా పోరాటం చేయాలని దక్షిణాది రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. సమాఖ్య ప్రజాస్వామ్యానికి ముప్పు: డీకే కేవలం జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దేశ సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పని డీకే శివకుమార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. డీలిమిటేషన్‌ను దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంచేస్తున్న రాజకీయ దాడిగా అభివరి్ణంచారు. ‘‘సమా­ఖ్య నిర్మాణం మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. అంబేడ్కర్‌తో పాటు రాజ్యాంగ రూపకర్తలు నిర్మించిన సమాఖ్య ప్రజాస్వామ్య పునాదులను కూల్చివేయొద్దు’’అని కేంద్రానికి సూచించారు. ‘‘ఆధిపత్యాన్ని అంగీకరించడమా? తిరుగుబాటు చేయడమా? ప్రగతిశీల రాష్ట్రాలకు ఇప్పుడు ఈ రెండే అవకాశాలున్నాయి. మేం తిరుగుబాటునే ఎంచుకున్నాం’’అని ఉద్ఘాటించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై కక్ష ఎందుకని ప్రశ్నించారు. జాతీయ వేదికపై దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కడానికి కేంద్రం కుట్రలు సాగిస్తోందని ఆరోపించారు. దక్షిణాదిపై హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. అన్ని పార్టీలతో చర్చించాలి: నవీన్‌ పట్నాయక్‌ పార్లమెంట్‌లో, అసెంబ్లీల్లో ఎన్ని స్థానాలు ఉండాలో నిర్ణయించడానికి జనాభాను ప్రాతిపదికగా తీసుకోవద్దని బిజూ జనతాదళ్‌ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌ ప్రక్రియపై అన్ని పార్టీలతో సమగ్రంగా చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. జేఏసీ భేటీని ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఒడిశా ప్రజల ప్రయోజనాల కోసం తమ పార్టీ పోరాడుతుందని స్పష్టంచేశారు. డీమిలిటేషన్‌పై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. జనాభాను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాల ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని, ప్రజల హక్కులను కేంద్రం కాపాడాలన్నారు. దేశ అభివృద్ధి కోసం జనాభా నియంత్రణ అనేది అత్యంత కీలకమైన జాతీయ అజెండా అని నవీన్‌ వివరించారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేపడితే తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుందని పేర్కొన్నారు. బీజేడీ తరఫున మాజీ మంత్రి సంజయ్‌ దాస్, మాజీ ఎంపీ అమర్‌ పట్నాయక్‌ భేటీలో పాల్గొన్నారు.మన ఆమోదం లేకుండానే చట్టాలు: స్టాలిన్‌ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై రాజకీయ, న్యాయపరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని స్టాలిన్‌ చెప్పారు. పునర్విభజన పూర్తిగా న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరగాలన్నారు. ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసేలా చర్యలు చేపడితే ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. కేవలం జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే పలు రాష్ట్రాలకు చాలా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఇప్పుడు గానీ, భవిష్యత్తులో గానీ జనాభాను ప్రాతిపదికగా తీసుకోవద్దు. సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గరాదు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌ చేస్తే పార్లమెంట్‌లో చట్టాల రూపకల్పనలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుంది. మన ఆమోదం లేకుండానే చట్టాలు రూపొందితే మన ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది. సామాజిక న్యాయం దెబ్బతింటుంది’’అని ఉద్ఘాటించారు. సొంత దేశంలోనే రాజకీయ అధికారం కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని వ్యాఖ్యానించారు. ఈ జేఏసీ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని స్టాలిన్‌ అన్నారు. ఈ భేటీని ‘జేఏసీ ఫర్‌ ఫెయిర్‌ డీలిమిటేషన్‌’గా పిలుద్దామని ప్రతిపాదించారు. జేఏసీ రెండో భేటీ హైదరాబాద్‌లో జరుగుతుందని చెప్పారు. తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. రెండో భేటీ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా నేతలు ఏకాభిప్రాయానికి వచి్చనట్లు సమాచారం.

YSRCP President YS Jagan letter to PM Modi On Delimitation3
1971 జనాభా లెక్కలే.. జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలి: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)కు 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలని.. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి( YS Jagan Mohan Reddy) వివరించారు. జాతీయ ప్రాధాన్యతగా జనాభా నియంత్రణను నిజాయితీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్‌ ప్రక్రియ శిక్షగా మారకూడదని స్పష్టంచేశారు. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్‌ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ అమలుకు అడ్డంకిగా మారిన రాజ్యాంగంలోని 81(2)(ఏ) అధికరణ(ఆర్టికల్‌)ను సవరిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. దీనివల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయని, లోక్‌సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న అంశం ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వైఎస్‌ జగన్‌ శుక్రవారం లేఖ రాశారు. శనివారం మీడియాకు విడుదల చేశారు. కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యంతోపాటు ఆయా రాష్ట్రాల ప్రజల మనోభావాలను డీలిమిటేషన్‌ ప్రక్రియ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. డీలిమిటేషన్‌ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున, ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని ప్రధాని మోదీని కోరారు. ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గ నిర్దేశం చాలా ముఖ్యమని.. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహద పడుతుందని ప్రధానికి వైఎస్‌ జగన్‌ వివరించారు. లోక్‌సభలో ఇప్పుడున్న సీట్ల పరంగా ఆయా రాష్ట్రాలకు ఉన్న వాటాను కుదించకుండా పునర్విభజన (డీలిమిటేషన్‌) కసరత్తు చేపట్టాలని కోరారు. ఆ లేఖలో ఇంకా ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకూడదు రాజ్యాంగంలో 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026లో డీలిమిటేషన్‌ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. కానీ.. దీనికి ముందుగా 2021లో చేపట్టాల్సిన జనాభా లెక్కింపు ప్రక్రియ కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. 2026 నాటికి జనాభా లెక్కల ప్రక్రియను పూర్తి చేయడానికి ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇది జరిగిన వెంటనే డీలిమిటేషన్‌ ప్రక్రియ జరుగుతుందన్న అంశం అనేక రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ ద్వారా తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణను నిజాయితీగా చేయడం వల్లే.. జనాభా నియంత్రణ కోసం వివిధ రాష్ట్రాలు అనేక విధానాలు అమలు చేశాయి. అయితే వాటి ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. దీని వల్ల జనాభా పెరుగుదల వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంది. దేశ వ్యాప్తంగా జనాభా వృద్ధి ఒకే తరహాలో లేదు. అసమతుల్యత ఉంది. దీని వల్ల డీలిమిటేషన్‌ అంశం విస్తృత స్థాయిలో ఆందోళనకు దారి తీస్తోంది. 42వ.. 84వ రాజ్యాంగ సవరణల ద్వారా ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపును నిలిపేశారు. కాలక్రమేణా అన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణ కసరత్తులో భాగంగా ఒకే స్థాయిలో ఫలితాలు సాధిస్తాయని భావించి ఈ సీట్ల కేటాయింపును నిలిపేశారు. దేశ జనాభాలో ఆయా రాష్ట్రాల వాటా 1971 నాటికి అనుకున్న స్థాయికి చేరుకుంటుందని భావించారు. కానీ, 2011 జనాభా లెక్కల గణాకాంలను చూస్తే.. దశాబ్దాల తరబడి జనాభా వృద్ధి, దాని అంచనాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేవని తేలింది. 1971, 2011 మధ్య 40 సంవత్సరాల్లో దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. గత 15 సంవత్సరాల్లో జనాభా మరింత తగ్గిందని మేం నమ్ముతున్నాం. జనాభా నియంత్రణను జాతీయ ప్రాధాన్యతగా తీసుకున్నందున, దక్షిణాది రాష్ట్రాలు నిజాయితీగా తమ విధానాలను అమలు చేయడం వల్ల ఈ వాటా తగ్గింది. 1971 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 24.80 శాతం అయితే, 2011 జనాభా లెక్కల ప్రకారం 20.88 శాతంగా ఉంది. అపోహలు, భయాలు తొలగించండి రాష్ట్రాల్లో ఇప్పుడున్న జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని డీలిమిటేషన్‌ ప్రక్రియ జరిగితే దేశ విధానాల రూపకల్పన సహా శాసన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాలకు సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్‌ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయితే ఈ హామీని అమలు చేయాలంటే రాజ్యాంగ పరంగా చేయాల్సిన సడలింపును కూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81 (2) (ఎ) జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరగాలని పేర్కొంది. దీని ప్రకారం డీలిమిటేషన్‌ ప్రక్రియలో ముందుకు వెళ్తే ఈ నిబంధన వల్ల హోంమంత్రి అమిత్‌షా ఇచ్చిన హామీని అమలు చేయడంలో అడ్డంకులు ఏర్పడతాయి. అందువల్ల దామాషా ప్రకారం ప్రతి రాష్ట్రానికి సీట్ల కేటాయింపుపై రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. దీని వల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయి, ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే అంశం ఉత్పన్నం కాదు. డీలిమిటేషన్‌ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గనిర్దేశం చాలా ముఖ్యం. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహద పడుతుంది.డీఎంకే నాయకులకు లేఖ ప్రతి డీలిమిటేషన్‌ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష కమిటీ సమావేశం శనివారం చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్‌ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశం నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు.. ఆయన ప్రధాని మోదీకి రాసిన లేఖ ప్రతిని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి డీఎంకే నాయకులకు పంపారు.

Weekly Horoscope Telugu 23-03-2025 To 29-03-20254
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం....అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని సమస్యలు, వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలలో తొందరపడరాదు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు తథ్యం. కళాకారుల యత్నాలు సఫలీకతమవుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. వ్యయప్రయాసలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, దుర్గాదేవిని పూజించండి.వృషభం...శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. కొన్ని పనులు నేర్పుగా పూర్తి చేస్తారు. పట్టుదలతో సమస్యలు అధిగమిస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆరోగ్యం కుదుటపడి స్వస్థత చేకూరుతుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు రావచ్చు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు కొన్ని అదనపు బాధ్యతలు తప్పవు. కళాకారులకు యత్నకార్యసిద్ధి.. వారం ప్రారంభంలో చికాకులు. మానసిక అశాంతి. ఇంటాబయటా ఒత్తిడులు ఉండవచ్చు. గులాబీ, లేత నీలం రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మిథునం...పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు రావచ్చు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారి కలలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.కర్కాటకం...కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న ఆదాయం సమకూర్చుకుంటారు. విద్యార్థులు ప్రతిభను చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. బం«ధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పనిఒత్తిడులు, సమస్యలు తీరతాయి. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటారు. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. నిర్ణయాలలో మార్పులు శ్రమ మరింత పెరుగుతుంది.. తెలుపు, గులాబీరంగులు, గణపతి అర్చన చేయండి.సింహం...కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు సంభవం. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో కలహాలు. నీలం, తెలుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి.కన్య....మీ అభ్యర్థనను కుటుంబసభ్యులు మన్నిస్తారు. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు కూడా వసూలై ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల ద్వారా కొంత సహాయసహకారాలు అందుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం, ఖర్చులు. ఎరుపు, లేత పసుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.తుల...కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆప్తులు, సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. భూవ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పాతసంఘటనలు గుర్తకు తెచ్చుకుంటారు. ప్రత్యర్థులు మీకు దగ్గరవుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.వృశ్చికం..అనుకున్న పనుల్లో అవాంతరాలు ఎదుర్కొంటారు. ఎంత కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఒక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక విషయాలలో కొంత నిరుత్సాహం. రుణదాతల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు ∙నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో ధనలాభం. కార్యసిద్ధి. శుభవర్తమానాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, దేవీఖడ్గమాల పఠించండి.ధనుస్సు...ఇంతకాలం పడిన శ్రమ కొంత మేరకు ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి ఉంటుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, హనుమాన్‌ ఛాలీసా పఠించండి.మకరం...నూతన పరిచయాలు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. విద్యావకాశాలు పొందుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖులతో ముఖ్య విషయాలపై చర్చలు. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో కొన్ని వివాదాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో కొన్ని ఇబ్బందులు. నీలం,తెలుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.కుంభం...అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగతాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి లాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులకు అవకాశం.. కళాకారులకు చేజారిన అవకాశాలు తిరిగి దక్కుతాయి. వారం చివరిలో మానసిక అశాంతి. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యం మందగిస్తుంది. పసుపు, నీలం రంగులు.. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.మీనం...ఎంతటి పనైనా ఓపిగ్గా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

BRS Leader KCR Fires On Congress Govt5
తెలంగాణ సంపదపై గుంట నక్కల్లా కన్నేశారు: కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ సంపద మీద గుంట నక్కల మాదిరిగా అందరూ కన్నేశారు. ఇప్పుడు ఉన్న పాలకులు సరిగా పని చేస్తలేరట.. మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నా యి. కూటమి కట్టకుండా చంద్రబాబు అక్కడ (ఏపీలో) మళ్లీ అధికారంలోకి వచ్చేవాడా? అలాంటి వారిని ఏవో అద్భుత శక్తులు ఉన్నవారిగా మనకు చూపే కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణను ఆగం చేసేందుకు కొందరు ఎప్పుడూ రెడీగా ఉంటారు. వీరిపట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలి. ఒక పొరపాటు జరిగినా జీవితకాలం దుఃఖం తప్పదు’అని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ‘గోదావరి కన్నీటి గోస’పేరిట బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ నేతృత్వంలో రామగుండం నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు ఈ నెల 17న ప్రారంభమైన 180 కిలోమీటర్ల పాదయాత్ర శనివారం ముగిసింది. ఈ సందర్భంగా పాదయాత్రగా వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌­లో కేసీఆర్‌ సమావేశమై మాట్లాడారు. ‘తెలంగాణ నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల తరఫున ఎనిమిదేసి మంది ఎంపీలను గెలిపించినా ఏకాణా పని జరగడం లేదు. బీఆర్‌ఎస్‌ ప్రతినిధులను పార్లమెంటుకు పంపిస్తే కొట్లాడి మన హక్కులు సాధించుకునేవాళ్లం. ఈ దిశగా ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి’అని సూచించారు. వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదు ‘తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసింది. ఆ ఆవేదనతోనే వాళ్లను ఉద్యమ కాలంలో దద్దమ్మలు, సన్నాసులు అని తెలంగాణ సమాజం తరఫున అన్నాను. అంతేతప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఎందుకు ఉంటుంది? రామగుండం ఎమ్మెల్యేకు నీటి గోసపై మాట్లాడే అవకాశమున్నా మౌనంగా ఉంటే ఏమనాలి? బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుతో అలుగు పారితే ఇప్పడు చెరువులు, కుంటలు అడుగంటాయి. కొట్లాడి సాధించిన తెలంగాణను ఎంతో జాగ్రత్తగా నిలబెట్టినా ప్రజలు కొత్త ప్రభుత్వానికి తెచ్చుకున్నారు. అది వాళ్లిష్టం అయినా ఫలితాన్ని లోకం చూస్తోంది. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు మొదటి నుంచీ నీటి సమస్యను ఆర్థిక సమస్యగా చూడడం ఒక అవలక్షణంగా మార్చుకున్నారు. గల్ఫ్‌ దేశాలతో పాటు చెన్నై వంటి నగరాల్లోనూ ఎంతో ఖర్చుతో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకుంటున్నారు. తెలంగాణలోనూ ఖర్చుకు వెనుకాడకుండా తాగు, సాగునీరు అందించాల్సిందే’అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. పేదల ఇండ్లను కూల్చుతున్నారు ‘పల్లెల నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ లాంటి పట్టణాలకు వచ్చిన పేదలకు మనం అండగా నిలిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం వారి ఇండ్లను కూల్చివేస్తోంది. హైడ్రా కూల్చివేతలతో ఆవేదన చెందుతున్న ప్రజలు.. ‘కేసీఆర్‌ అన్నా.. ఎక్కడున్నవు.. రావే’అని పిలుస్తున్నారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా? పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, ఆందోళనలు మొదలయ్యాయి. తెలంగాణలో సమస్యలకు నాటి ప్రధాని నెహ్రూ మొదలుకొని సోనియాగాంధీ వరకు ప్రధాన శతృవు కాంగ్రెస్‌ పార్టీయే. రాష్ట్రంలో మళ్లీ సాగు, తాగునీరు, విద్యుత్‌ కష్టాలు ఎందుకు వస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తు తరాలను బాగుచేసే దిశగా ఆలోచించాలి. ప్రధాని మోదీ నా మెడపై కత్తి పెట్టినా నేను ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే. బెల్లం ఉన్న దగ్గరకు ఈగలు వస్తాయి. అధికారం పోగానే కొందరు పార్టీకి దూరమవుతారు. రాబోయే రోజుల్లో అధికారం బీఆర్‌ఎస్‌ పార్టీదే. సింగిల్‌గా అధికారంలోకి వస్తాం. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. ప్రతీ కార్యకర్త కేసీఆర్‌లా తయారై తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి’అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేసీఆర్‌కు పార్టీ నేత బొడ్డు రవీందర్‌ నాగలి బహూకరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, పుట్ట మధు, పార్టీ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, నారాయణదాస్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

Tdp Expanding illegal activities in the state6
‘పచ్చ’ బంధాలతో ‘రొచ్చు’ బిజినెస్‌

అప్పట్లో టీడీపీ పాలనలో కాల్‌మనీ కాలనాగులు.. ఇప్పుడు కూటమి సర్కారులో స్పా సెంటర్ల విష సర్పాలు..! నాడు మహిళలకు అధిక వడ్డీకి అప్పులిచ్చి.. తీర్చలేనివారిని వ్యభిచార రొంపిలోకి దించింది పచ్చ మూక..! నేడు స్పా సెంటర్ల ముసుగులోనూ అదే తీరున గలీజు దందా..! దాదాపు పదేళ్ల కిందట రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ రాకెట్‌ కొత్త అవతారంలో పుట్టుకొచ్చిందా అన్నట్లు.. ప్రస్తుతం స్పా రాకెట్‌ సాగుతోంది..! అప్పుడు.. ఇప్పుడు ఈ అరాచకానికి బలవుతున్నది మహిళలే కాగా.. అడ్డా విజయవాడనే కావడం.. గమనార్హం..! సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పైకి మసాజ్‌ కేంద్రాలు.. లోపల వ్యభిచార దందా..! అధికార కూటమి పార్టీలలోని ముఖ్య, ద్వితీయ స్థాయి నేతలతో ఉన్న సత్సంబంధాలే పునాది.. సమాజంలో ఉన్న పలుకుబడేపెట్టుబడి..! వాటితోనే కోట్లాది రూపా యల దందా..! కాల్‌ మనీ–సెక్స్‌ రాకెట్‌ వ్యవహారాల్లో మునిగితేలిన టీడీపీ నాయకుల బాగోతాలు ఇదివరకే బట్టబయలయ్యాయి. ఇప్పుడు ‘స్పా’ (మసాజ్‌) సెంర్ల వంతు వచ్చింది. విజయవాడ నగరంలోని స్పా సెంటర్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మాచవరం పోలీసులు గత నెలలో దాడిచేసి పది మంది మహిళలు, 13 మంది విటులను అరెస్టు చేశారు. ఆ తర్వాత స్పాలలోని లోగుట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్పాల నిర్వాహకులతో ‘క్రిడ్‌ ప్రోకో’ సంబంధాలున్న నాయకులు, పోలీసులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. కూటమి వచ్చాక పట్టపగ్గాల్లేకుండా.. ఆరేడు నెలల్లో ‘స్పా’లలో వ్యభిచార, ఇతర జుగుప్సాకర వ్యవహారాలు పెరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రస్థాయిలోని కొందరు కూటమి ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల సహకారంతోనే నిర్వాహకులు నిర్భయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ధనికులు నివసించే కాలనీలు, కాస్త చాటుగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని స్పాలను నెలకొల్పుతూ, ప్రాచుర్యం పొందిన తర్వాత అక్కడినుంచి మార్చేస్తూ కొత్త పేర్లతో నెలకొల్పుతూ దందా నడిపిస్తున్నారు. అబ్బో భార్గవ్‌.. అతడే సూత్రధారి చలసాని ప్రసన్నభార్గవ్‌.. విజయవాడ స్పా సెంటర్ల దందాలో ఇతడే కింగ్‌ పిన్‌. స్టూడియో 09, ఏపీ22 పేరుతో యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తూ అదే భవనం పైన స్పా సెంటర్‌ ముసుగులో వ్యభిచార గృహం నడిపిస్తున్నాడు. గత నెలలో పోలీసులు దాడి చేసింది ఇతడి స్పా సెంటర్‌ పైనే. అయితే, పోలీసుల రాకపై నిర్వాహకుల హెచ్చరికలతో పలువురు తప్పించుకున్నారు. కాగా, ఏలూరుకు చెందిన భార్గవ్‌ తనకు కూటమి పార్టీల్లోని పలువురు ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయంటూ వేర్వేరు సందర్భాల్లో వారితో కలిసి దిగిన ఫొటోలను చూపుతూ హల్‌చల్‌ చేస్తున్నాడు. విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్‌ తదితరులతో కలిసి దిగిన ఫొటోలను అవసరమైన చోట ప్రదర్శిస్తూ ఫలానా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే తమ బంధువులని, ప్రభుత్వమూ తమవాళ్లదేనంటూ హడావుడి చేస్తున్నాడు. దీనికోసం యూట్యూబ్‌ చానల్‌నూ అడ్డుపెట్టుకుంటున్నాడు. నల్ల అద్దాలతో కూడిన ఖరీదైన వాహనాలకు కూటమి పార్టీల లోగోలు ఏర్పాటు చేసుకుని అమ్మాయిల తరలింపునకు వాడుతున్నారు. విజయవాడ కేంద్రంగా పోలీసు అధికారులు, ముఖ్య నాయకులతో ఉన్న సంబంధాలతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్‌ తదితర నగరాల్లోనూ స్పాల మాటున వ్యభిచార గృహాలను నడుపుతున్నాడనే ఫిర్యాదులు ఉన్నాయి. భార్గవ్‌.. తెలుగు రాష్ట్రాల్లోని స్పా సెంటర్లకు అధ్యక్షుడిగా, ఆర్గనైజర్‌గానూ వ్యవహరిస్తుండడం గమనార్హం. విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్పాల ముసుగులో నిర్వహిస్తున్న హైటెక్‌ వ్యభిచార కేంద్రాలకు అమ్మాయిల సరఫరాను భార్గవ్‌ విజయవాడ నుంచి మార్గదర్శనం చేస్తుంటాడు. ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారానే సాగిస్తున్నాడు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్లాలి? ఏ అకౌంట్లో ఎంత మొత్తం జమ చేయాలి? ఏయే ఖాతాలకు బదిలీ చేయాలి? డెన్‌ల చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను ఎప్పటికప్పుడు పరిశీలించడం.. అంతా ఫోన్‌తోనే. దీంతో ప్రసన్న భార్గవ్‌ వేర్వేరుచోట్ల ఉన్నా రాకెట్‌ను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నాడు. రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు డిపాజిట్‌ స్పా సెంటర్లకు.. ఇదివరకే పరిచయాలున్న, వృత్తికి అలవాటుపడిన ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలను, వారి ద్వారా కొత్తవారిని పిలిపిస్తుంటారు. వారినుంచి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ చేయించుకుంటారు. ఈ డబ్బు తిరిగివ్వరు. కొందరినైతే రెండు, మూడు నెలలు కాంట్రాక్టు పద్ధతిన నిర్ణీత మొత్తానికి కుదుర్చుకుంటారు. వీరిని బృందాలుగా విభజించి ఇతర స్పాలకూ పంపుతుంటారు. డిపాజిట్‌ మొత్తాన్ని బట్టి సౌకర్యాలున్న రూంలను వారం, పది, పదిహేను రోజుల చొప్పున కేటాయిస్తారు. భార్గవ్‌ బృంద సభ్యులు సమాచారం ఇచ్చి విటులను రప్పిస్తుంటారు. వారి నుంచి రూ.5 వేలు–రూ.25 వేలు, అవగాహనను బట్టి ఇంకా ఎక్కువ యువతులు వసూలు చేసుకుంటారు. తమ డిపాజిట్‌ను మించి సంపాదించుకుని స్వస్థలాలకు, లేదా నిర్వాహకులు సూచించిన ఇతర ప్రాంతాల్లోని స్పా సెంటర్లకు వెళ్లిపోతారు.అదే సమయంలో స్పా నిర్వాహకులు కౌంటర్‌ ఫీజు కింద విటుల నుంచి రూ.2,500–­రూ.6,500, ఒక్కో యువతి నుంచి టిప్‌ కింద రూ.1,500–రూ.2 వేల వరకు లాగేసుకుంటున్నారు. మొత్తంమీద నెలకు 80 నుంచి 90 మంది యువతుల ద్వారా డిపాజిట్‌లు, టిప్స్, కౌంటర్‌ ఫీజు తదితరాల రూపంలో భార్గవ్‌ ముఠా నెలకు రూ.రెండున్నర నుంచి రూ.3 కోట్లు పోగేసుకుంటోంది. ఇందులో పోలీసులతో పాటు ఎవరి వాటా వారికి చేరుతుంది. అనుచర బృందంతో వ్యవహారాలు చలసాని ప్రసన్న భార్గవ్‌కు అత్యంత నమ్మకమైన సహచర బృందం ఉంది. వీరిలో మహిళలే అధికం. భార్గవ్‌ వ్యక్తిగత అనుచరుడు కుమార్‌ తన సోదరి పేరిట స్పాలు, సెలూన్‌లు నిర్వహిస్తున్నారు. సతీష్‌ యువతుల సరఫరా మొదలు ఇతర పనులు చేస్తుంటాడు. గోపీచౌదరి వ్యాపార భాగస్వామి. పోలీసులు, మీడియా వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు యువతుల సరఫరాలో ప్రధాన బాధ్యత ఇతడిదే. నాలుగు నెలల కిందటే ఫిర్యాదు చేసినా‘నాలుగైదు నెలల కిందటే పై విషయాలన్నింటినీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మహిళా సంఘాల వారికీ వివరించాం. వారు ఉన్నతా«ధికారులకు చెప్పారు. ఏసీపీ స్థాయి అధికారి ఒకరు ఒకటి, రెండు స్పా సెంటర్‌లకు వెళ్లి భారీఎత్తున బేరం కుదుర్చుకున్నారు. హెచ్చరికలు చేసినట్లు కలరింగ్‌ ఇచ్చారు. మొక్కుబడిగా స్పా ముసుగులోని ఓ వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇలాంటివి విజయవాడలో ఎన్ని ఉన్నాయో పోలీసులకు బాగానే తెలుసు. –భార్గవ్‌ బాధితురాలు హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఏపీ ప్రెసిడెంట్‌గా.. చలసాని ప్రసన్న భార్గవ్‌ ‘హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా– ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ అండ్‌ పొలిటికల్‌ రైట్స్‌’ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 2024 నవంబరు 28 నుంచి 2025 నవంబరు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు సర్టిఫికెట్‌ ఉంది.కోడ్‌ పేర్లతో ఎర.. రాష్ట్రంలోని తన స్పాలకు వచ్చే యువతులు, విటులతో పాటు ఇతర స్పాలకు క్లయింట్లుగా వెళ్లి సమాచారాన్ని రాబట్టడం, ఆ తరువాత బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడడం భార్గవ్‌ బృందం దందాలో మరో కోణం. టెలిగ్రామ్, సీక్రెట్‌ నంబర్ల ద్వారా స్పాకు కొత్త యువతులు వచ్చారంటూ విటులకు సమాచారం చేరవేస్తుంటారు. ‘ఫ్రెషర్స్, ఓన్లీ ఫ్యూ ఫ్లవర్స్‌ అవైలబుల్, ఫ్రెష్‌ లుక్స్, హాయ్‌ ఫ్రెండ్స్, న్యూ చాక్లెట్‌ అవైలబుల్‌’ వంటివి వారి కోడ్‌ పదాలు. ఆటో లిఫ్ట్, పిక్‌ అప్‌ మి లాంటి యాప్స్‌ ద్వారా అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా ఆహ్వానాలు ఉంటాయని సమాచారం. దాదాపు ఎనిమిది మంది సిబ్బందికి అదే పని. స్పాలలో డిజిటల్‌ లాకింగ్‌ సిస్టమ్‌ ఉంది. స్టాఫ్‌కు కూడా వీటి వివరాలు తెలియవు. స్పాల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ స్థానిక పేద విద్యార్థినులు, యువతులను కూడా రొంపిలోకి దింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారాల ముసుగులో.. చలసాని ప్రసన్న భార్గవ్‌.. చలసాని కన్‌స్ట్రక్షన్స్, చలసాని మీడియా, పాంపరింగ్‌ రిసార్ట్స్‌ అండ్‌ స్పా, ఏపీ23 న్యూస్, స్టూడియో 9 సెలూన్‌ అండ్‌ స్పా, కోజి 9 సెలూన్‌ అండ్‌ స్పా, సిగ్నేచర్‌ సెలూన్‌ అండ్‌ స్పాతో పాటు మరికొన్నింటిలో వ్యాపార భాగస్వామి. ఇతరుల వ్యాపారాల గురించి తెలుసుకోవడం, పెట్టుబడిదారుగా చేరడం, కొంతకాలానికి వారిని దెబ్బతీయడం అతడి నైజమని బా«ధితులు వాపోతున్నారు. విజయవాడతో పాటు ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఆయన చేతిలో మోసపోయినవారున్నారని గుర్తు చేస్తున్నారు. కాగా, భార్గవ్‌ తన బృందంలోని ముఖ్యులకు ఏరోజుకారోజు రాబడిలో పది నుంచి ముప్పయి శాతం వాటా ఇస్తున్నాడు. దీంతో యువతుల రాకపోకల నుంచి విటులకు ఆహ్వానాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. భిన్న రకాల మీడియా మాటున ఏ రంగం వారినైనా బ్లాక్‌ మెయిల్‌ చేయడానికి వెనుకాడడని, తనకు సమాచారం ఇచి్చనవారికి దండిగానే ముట్టజెబుతాడని సమాచారం.

Sold 1000 gold cards worth 5 million each in day: Donald Trump7
ఒక్క రోజే వెయ్యి గోల్డ్‌ కార్డులు

వాషింగ్టన్‌: అమెరికాలో నివాసంతో పాటు అంతిమంగా పౌరసత్వానికి కూడా వీలు కల్పిస్తూ ఇటీవల ప్రవేశపెట్టిన గోల్డ్‌ కార్డులకు డిమాండ్‌ బాగా పెరుగుతోందని వాణిజ్య మంత్రి హొవార్డ్‌ లుట్నిక్‌ ప్రకటించారు. శుక్రవారం ఆయన ఆల్‌–ఇన్‌ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ‘‘ఒక్క రోజులోనే ఏకంగా వెయ్యి గోల్డ్‌ కార్డులు అమ్మాం. ఒక్కోదానికి 50 లక్షల డాలర్ల చొప్పున 500 కోట్ల డాలర్లు సంపాదించాం’’అంటూ సంబరపడిపోయారు.డొనాల్డ్‌ ట్రంప్‌ సారథ్యంలో అగ్ర రాజ్యం ఫక్తు వ్యాపార రాజ్యంగా మారిపోతోందన్న వాదనలకు బలం చేకూర్చేలా మాట్లాడారు. ‘‘గోల్డ్‌ కార్డులు పూర్తిగా ట్రంప్‌ ఆలోచనే. దాన్ని కొనుగోలు చేయగల సామర్థ్యమున్న వారు ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మంది ఉన్నారు. కనుక 10 లక్షల కార్డులమ్మి 5 లక్షల కోట్ల డాలర్లు సమీకరించడమే ట్రంప్‌ లక్ష్యం’’అంటూ ప్రకటించారు. మంత్రి వాటిని ట్రంప్‌ కార్డులుగా సంబోధించడం విశేషం.వాటిని కొనేందుకు 2.5 లక్షల మంది ఇప్పటికే ఆసక్తి చూపారని కూడా ఆయన వెల్లడించారు. గోల్డ్‌ కార్డు అమ్మకాలను మరింత పెంచేందుకు వాటి పేరును ట్రంప్‌ కార్డ్‌గా మార్చే ఆలోచన ఉన్నట్టు అధ్యక్షుడు ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. ఈబీ–5 ఇన్వెస్టర్‌ వీసా స్థానంలో గోల్డ్‌ కార్డును ప్రవేశపెడుతూ ఆయన నెల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రస్తుతం ఏకంగా 36.1 ట్రిలియన్‌ డాలర్ల రుణభారంతో కునారిల్లుతోంది. గోల్డ్‌కార్డుల ద్వారా దాన్ని ఎంతో కొంత తగ్గించుకోవాలన్నది ట్రంప్‌ యోచన.

RCB defeated defending champion Kolkata Knight Riders by 7 wickets8
ఈడెన్‌లో మెరుపులతో మొదలు

డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొత్త సీజన్‌ను ఓటమితో మొదలు పెట్టింది. సొంతగడ్డ ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆడిన మ్యాచ్‌లోనూ శుభారంభం చేయలేకపోయింది. బ్యాటింగ్‌లో రహానే, నరైన్‌ మెరుపులతో ఒక దశలో 200 సాధించగలదనిపించిన టీమ్‌ ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.ఆర్‌సీబీ బౌలర్లు కేకేఆర్‌ను సరైన సమయంలో నిలువరించడంలో సఫలమయ్యారు. ఆ తర్వాత సాల్ట్, కోహ్లి మెరుపు ఓపెనింగ్‌తో విజయానికి బాటలు వేసుకున్న బెంగళూరు ఆశావహ దృక్పథంతో తమ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మరో 22 బంతులు మిగిలి ఉండగానే గెలిచిన మ్యాచ్‌తో రజత్‌ పాటీదార్‌ కెపె్టన్‌గా శుభారంభం చేశాడు. కోల్‌కతా: ఐపీఎల్‌ తొలి పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పైచేయి సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అజింక్య రహానే (31 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా... సునీల్‌ నరైన్‌ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), అంగ్‌కృష్‌ రఘువంశీ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. రహానే, నరైన్‌ రెండో వికెట్‌కు 55 బంతుల్లోనే 103 పరుగులు జోడించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కృనాల్‌ పాండ్యా (3/29) కీలక సమయంలో 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం బెంగళూరు 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు సాధించింది. విరాట్‌ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫిల్‌ సాల్ట్‌ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో చెలరేగగా...తొలి సారి కెప్టెన్‌గా వ్యవహరించి రజత్‌ పాటీదార్‌ (16 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా దూకుడుగా ఆడాడు. భారీ భాగస్వామ్యం... 10 ఓవర్లలో 107 పరుగులు...ఇన్నింగ్స్‌ తొలి భాగంలో కోల్‌కతా బ్యాటింగ్‌ జోరింది. డి కాక్‌ (4) మొదటి ఓవర్లోనే వెనుదిరిగిన తర్వాత రహానే, నరైన్‌ కలిసి చెలరేగిపోయారు. సలామ్‌ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లు బాదిన రహానే...కృనాల్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అదే ఓవర్లో సిక్స్‌తో నరైనా కూడా జత కలిశాడు. దయాళ్‌ ఓవర్లో కూడా ఇదే తరహాలో రహానే 2 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోయాడు. సుయాశ్‌ ఓవర్లో సిక్స్‌తో 25 బంతుల్లోనే రహానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా...చివరి రెండు బంతులను రహానే సిక్స్, ఫోర్‌గా మలిచాడు. సలామ్‌ తర్వాతి ఓవర్లో కూడా 4, 6 కొట్టిన నరైన్‌ అదే ఊపులో చివరి బంతికి అవుటయ్యాడు. ఇక్కడే కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ మలుపు తిరిగింది. ఒక్కసారిగా చెలరేగిన బెంగళూరు బౌలర్లు ప్రత్యర్థిపై పట్టు సాధించారు. 16 పరుగుల తేడాతో రహానే, వెంకటేశ్‌ అయ్యర్‌ (6) వెనుదిరగ్గా...ఐదు పరుగుల వ్యవధిలో భారీ హిట్టర్లు రింకూ సింగ్‌ (12), ఆండ్రీ రసెల్‌ (4) వికెట్లను జట్టు కోల్పోయింది. దాంతో అంచనాలకు అనుగుణంగా భారీ స్కోరును సాధించలేకపోయింది. దూకుడుగా దూసుకుపోయి... ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఇన్నింగ్స్‌ తొలి బంతినే ఫోర్‌గా మలచిన సాల్ట్‌ ఘనంగా మొదలు పెట్టగా, అతనికి కోహ్లి తోడవడంతో టీమ్‌ లక్ష్యం దిశగా సునాయాసంగా దూసుకుపోయింది. అరోరా ఓవర్లో సాల్ట్‌ 2 ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టగా, కోహ్లి మరో ఫోర్‌ బాదడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. నైట్‌రైడర్స్‌ ఎంతో ఆశలు పెట్టుకున్న వరుణ్‌ చక్రవర్తికి తొలి ఓవర్లో బాగా దెబ్బ పడింది. వరుస బంతుల్లో సాల్ట్‌ 4, 6, 4, 4 బాదడంతో పరిస్థితి అంతా ఆర్‌సీబీకి అనుకూలంగా మారిపోయింది. జాన్సన్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాది తానూ తగ్గలేదని కోహ్లి చూపించగా, 25 బంతుల్లో సాల్ట్‌ హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. తక్కువ వ్యవధిలో సాల్ట్, పడిక్కల్‌ (10) వికెట్లు తీసి కోల్‌కతా కాస్త ఊరట చెందినా...తర్వాత వచ్చిన పాటీదార్‌ కూడా బౌండరీల వర్షం కురిపించాడు. రాణా ఓవర్లోనే అతను ఏకంగా 4 ఫోర్లు కొట్టడం విశేషం. 30 బంతుల్లో విరాట్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. చివర్లో వరుసగా 6, 4 కొట్టి లివింగ్‌స్టోన్‌ (15 నాటౌట్‌) మ్యాచ్‌ ముగించాడు. స్కోరు వివరాలుకోల్‌కాత నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: డి కాక్‌ (సి) జితేశ్‌ (బి) హాజల్‌వుడ్‌ 4; నరైన్‌ (సి) జితేశ్‌ (బి) సలామ్‌ 44; రహానే (సి) సలామ్‌ (బి) పాండ్యా 56; వెంకటేశ్‌ (బి) పాండ్యా 6; రఘువంశీ (సి) జితేశ్‌ (బి) దయాళ్‌ 30; రింకూ (బి) పాండ్యా 12; రసెల్‌ (బి) సుయాశ్‌ 4; రమణ్‌దీప్‌ (నాటౌట్‌) 6; హర్షిత్‌ (సి) జితేశ్‌ (బి) హాజల్‌వుడ్‌ 5; జాన్సన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–4, 2–107, 3–109, 4–125, 5–145, 6–150, 7–168, 8–173. బౌలింగ్‌: హాజల్‌వుడ్‌ 4–0–22–2, యశ్‌ దయాళ్‌ 3–0–25–1, రసిఖ్‌ సలామ్‌ 3–0–35–1, కృనాల్‌ పాండ్యా 4–0–29–3, సుయాశ్‌ శర్మ 4–0–47–1, లివింగ్‌స్టోన్‌ 2–0–14–0. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) జాన్సన్‌ (బి) వరుణ్‌ 56; కోహ్లి (నాటౌట్‌) 59; పడిక్కల్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) నరైన్‌ 10; పటీదార్‌ (సి) రింకూ (బి) అరోరా 34; లివింగ్‌స్టోన్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.2 ఓవర్లలో 3 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–95, 2–118, 3–162. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 3–0–42–2, స్పెన్సర్‌ జాన్సన్‌ 2.2–0–31–0, వరుణ్‌ చక్రవర్తి 4–0–43–1 హర్షిత్‌ రాణా 3–0–32–0, సునీల్‌ నరైన్‌ 4–0–27–1. సందడిగా ప్రారంభోత్సవంతొలి మ్యాచ్‌కు ముందు ఈడెన్‌ గార్డెన్స్‌లో ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు జరిగాయి. షారుఖ్‌ ఖాన్‌ వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమం మొదలు కాగా...ఆ తర్వాత ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్‌ తన పాటతో అలరించింది. అనంతరం దిశా పటాని తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సింగర్‌ కరణ్‌ ఔజ్లా ఆమెకు జత కలిశాడు. చివర్లో షారుఖ్‌ చిత్రం ‘పఠాన్‌’లోని సూపర్‌ హిట్‌ పాటకు అతనితో కలిసి విరాట్‌ కోహ్లి వేసిన స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి. తొలి ఐపీఎల్‌ నుంచి ఇప్పటి వరకు ఆడుతున్న విరాట్‌ కోహ్లికి బీసీసీఐ ప్రత్యేక ‘18’ జ్ఞాపికను అందించింది. ఐపీఎల్‌లో నేడుహైదరాబాద్‌ X రాజస్తాన్‌ వేదిక: హైదరాబాద్‌ మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి చెన్నై X ముంబైవేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Dr Mark Burns at Global Business Summit 20259
2030 నాటికి 500 బిలియన్‌ డాలర్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై భారత్‌–అమెరికా మరింతగా కసరత్తు చేస్తున్నాయి. 2023లో సుమారు 190 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. ఆ దిశగా ఇరు దేశాలు పరస్పరం కొనుగోళ్లు, పెట్టుబడులను మరింతగా పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. యునైటెడ్‌ స్టేట్స్‌ గ్లోబల్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (యూఎస్‌జీసీఐ) ఇండియన్‌ చాప్టర్‌ను అధికారికంగా ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు మార్క్‌ బర్న్స్‌ ఈ విషయాలు తెలిపారు.ఇరు దేశాల భాగస్వామ్యం .. అసాధారణ వృద్ధి, కొత్త ఆవిష్కరణలకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. మిషన్‌ 500 కింద ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవడంతో పాటు వ్యూహాత్మక పెట్టుబడులకు ఇరు దేశాలు పెద్ద పీట వేస్తున్నాయన్నారు. భారత్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో 54 శాతం అమెరికాకే ఉంటున్నాయని చెప్పారు. అలాగే జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో వంటి దేశీ దిగ్గజాలు తమ దగ్గర, మైక్రోసాఫ్ట్‌.. గూగుల్‌ వంటి అమెరికన్‌ దిగ్గజాలు భారత్‌లోను భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నాయని మార్క్‌ వివరించారు. యూఎస్‌ఏఐడీ స్థానంలో యూఎస్‌జీసీఐ.. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఏర్పాటైన యుఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్‌ఏఐడీ) కొనసాగింపుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో దాని స్థానాన్ని భర్తీ చేసేందుకు యూఎస్‌జీసీఐ ఉపయోగపడనుంది. యూఎస్‌ఏఐడీ సహాయం నిలిపివేతతో నిల్చిపోయిన ప్రాజెక్టులను టేకోవర్‌ చేయడంపై ఇది దృష్టి పెడుతుందని యూఎస్‌జీసీఐ సహ వ్యవస్థాపకుడు ఘజన్‌ఫర్‌ అలీ తెలిపారు.ఇది గ్రాంట్ల మీద ఆధారపడకుండా కార్పొరేట్లు, ప్రభుత్వాల భాగస్వామ్యం దన్నుతో పనిచేస్తుందని ఆయన వివరించారు. యూఎస్‌ఏఐడీ కింద ఏటా 20 బిలియన్‌ డాలర్లు వ్యయం చేస్తుండగా, ప్రస్తుతం 130 పైచిలుకు దేశాల్లో తత్సంబంధిత ప్రాజెక్టులు దాదాపుగా నిల్చిపోయినట్లు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పాటైన తమ సంస్థ, ఈ ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు కృషి చేయనుందని వివరించారు. ఇప్పటికే 40 పైగా దేశాలు తమ వద్ద కూడా చాప్టర్లు ఏర్పాటు చేయాలని ఆహ్వనించినట్లు చెప్పారు. యూఎస్‌ఏఐడీ ప్రభావిత ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్న మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆగ్నేయాసియా ప్రాంత దేశాల్లోని ప్రభుత్వాలు, కార్పొరేషన్లు, ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అలీ చెప్పారు. భారత్‌లో యూఎస్‌జీసీఐ ప్రయత్నాలు విజయవంతమైతే మిగతా దేశాల్లోనూ పునరావృతం చేసేందుకు బ్లూప్రింట్‌గా ఉపయోగపడుతుందన్నారు. 5 బిలియన్‌ డాలర్ల సమీకరణ వచ్చే అయిదేళ్లలో 5 బిలియన్‌ డాలర్ల సామాజిక పెట్టుబడులను సమీకరించాలని యూఎస్‌జీఐసీ నిర్దేశించుకున్నట్లు అలీ చెప్పారు. అలాగే నిర్మాణాత్మక పెట్టుబడుల ద్వారా అమెరికా–భారత్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 20–30 శాతం వృద్ధి చెందగలదని, ప్రాజెక్టుల పునరుద్ధరణతో 5,00,000 పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, టెక్నాలజీ, తయారీ, ఇంధనం వంటి కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని అలీ వివరించారు. యూఎస్‌జీసీఐకి భారత్‌ కీలక హబ్‌గా నిలవగలదని ఆయన చెప్పారు.టారిఫ్‌లపై క్రియాశీలకంగా భారత్‌.. వివాదాస్పదమైన టారిఫ్‌లపై స్పందిస్తూ.. ఈ విషయంలో భారత్‌ క్రియాశీలక చర్యలు తీసుకుందని మార్క్‌ చెప్పారు. ఇప్పటికే కొన్ని రంగాల్లో టారిఫ్‌లను తగ్గించడం ప్రారంభించిందని, మరిన్ని అంశాల్లో మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన వివరించారు. అమెరికా నుంచి భారత్‌ మరింతగా ఆయిల్, గ్యాస్‌ మొదలైనవి కొనుగోలు చేయనుండగా, కీలకమైన మరిన్ని మిలిటరీ ఉత్పత్తులను అమెరికా అందించనుందని మార్క్‌ చెప్పారు.

CJI forms three member committee for deeper probe against Justice Varma10
జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై విచారణకు త్రిసభ్య కమిటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా శనివారం త్రిసభ్య కమిటీ నియమించారు. ఈ కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ షీల్‌ నాగ్, హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జి.ఎస్‌.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అనూ శివరామన్‌ను సభ్యులుగా నియమించారు.మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు ఎలాంటి న్యాయ సంబంధిత విధులు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.కె.ఉపాధ్యాయను సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఆదేశించారు. సీజేఐకి నివేదిక సమర్పించిన జస్టిస్‌ డి.కె.ఉపాధ్యాయ జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో భారీగా నోట్ల కట్టలు లభ్యమైన ఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.కె.ఉపాధ్యాయ తమ నివేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు సమర్పించారు. యశ్వంత్‌ వర్మ ఇంట్లో నగదు లభించడంపై జస్టిస్‌ డి.కె.ఉపాధ్యాయ అంతర్గత విచారణ చేపట్టారు. సాక్ష్యాధారాలు, సమాచారం సేకరించారు. సంబంధిత అధికారులతో చర్చించారు. అన్ని అంశాలతో నివేదిక సిద్ధం చేసి, సీజేఐకి అందజేశారు. దీని ఆధారంగా జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై సుప్రీంకోర్టు తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement