Top Stories
ప్రధాన వార్తలు

అతనికి కాస్త నీళ్లు ఇవ్వండి: మోదీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Delhi Assembly Elections 2025) బీజేపీ భారీ విజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi).. ఢిల్లీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ బీజేపీ హెడ్క్వార్టర్స్లోని ఏర్పాటు చేసిన పార్టీ సంబరాల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా, ఒక బీజేపీ కార్యకర్త అనారోగ్యంగా ఉండటాన్ని గమనించారు. మోదీ ప్రసంగిస్తున్న వేదికకు అతి దగ్గరగా ఉన్న ఆ కార్యకర్త.. కదలికల్ని మోదీ పసిగట్టారు. అతనికి ఆరోగ్యం బాలేదన్న విషయం మోదీకి అర్థమైంది. దాంతో ప్రసంగాన్ని మధ్యలో ఆపేసిన మోదీ.. ఆ కార్యకర్తకు కాస్త నీళ్లు ఇమ్మని బీజేపీ శ్రేణులకు సూచించారు. అంతేకాకుండా అక్కడున్న డాక్టర్లు.. అతన్నిఒకసారి పరీక్షించాలని కూడా మోదీ కోరారు.‘ఆ బీజేపీ కార్యకర్తకు కళ్లు మూతలు పడుతున్నాయి. చాలా అన్ఈజీగా ఉన్నాడు. ముందు అతనికి కాస్త మంచి నీళ్లు ఇవ్వండి. ఇక్కడ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఒకసారి అతని పరీక్షించండి’ అని మోదీ సూచించారు.Such is his aura ♾During his victory speech, PM Modi noticed a person feeling unwell and immediately paused to ensure they received medical help!#दिल्ली_के_दिल_में_मोदी#AmitShah #DelhiElections2025 pic.twitter.com/VG16Yv1qw1— PoliticsSolitics (@IamPolSol) February 8, 2025 అటు తర్వాత మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఢిల్లీ ప్రజలకు ఈరోజు పండుగ లాంటిదని,ఆప్ నుంచి వారికి విముక్తి లభించిందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మాట్లాడుతూ బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.‘ ఈ విజయంతో ఢిల్లీలో చరిత్ర సృష్టించాం. హర్యానా,మహారాష్ట్రలో గెలిచి రికార్డు సృష్టించాం. ఢిల్లీని ఇక అభివృద్ధి బాటలో నడిపిస్తాం.మీ ప్రేమను అభివృద్ధిలో చూపిస్తాం.ఢిల్లీ ప్రజల అభివృద్ధికి మోదీ గ్యారెంటీ. ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను అనేక రెట్లు వారికి తిరిగి ఇస్తాం. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలే విజేతలుగా నిలిచారు.మీ విశ్వాసాన్ని అభివృద్ధిలో తీసుకొస్తాం.ఢిల్లీ అనేది మినీ ఇండియా. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.డబుల్ ఇంజిన్ సర్కార్తో ఢిల్లీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. షాట్కట్ రాజకీయాలకు ప్రజలు షాకిచ్చారు. నేను పూర్వాంచల్ నుంచి ఎంపీగా ఉన్నందుకు గర్వపడుతున్నా. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం చూపిస్తున్నారు. చాలా స్టేట్లలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందిఅవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఆమ్ఆద్మీపార్టీ నేతలు అవినీతిలో మునిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ అయితే వరుసగా మూడోసారి సున్నా సాధించింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను మిత్రులు కూడా గమనించింది. యమునా నదిని కాలుష్య కోరల నుంచి రక్షిస్తాం. ఢిల్లీ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాగ్ రిపోర్టు బయటపెడతాం. కాంగ్రెస్కు ఓటములలో మెడల్ ఇవ్వొచ్చు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇండియా కూటమి పార్టీలకు అర్థమైంది’అని మోదీ పేర్కొన్నారు.

‘ఆప్’కు ఢిల్లీ ప్రజల షాక్: ప్రధాని మోదీ
సాక్షి,న్యూఢిల్లీ:ఢిల్లీ ప్రజలకు ఈరోజు పండుగ లాంటిదని,ఆప్ నుంచి వారికి విముక్తి లభించిందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా శనివారం(ఫిబ్రవరి 8) సాయంత్రం బీజేపీ హెడ్క్వార్టర్స్లో జరిగిన సంబరాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.‘ఈ విజయంతో ఢిల్లీలో చరిత్ర సృష్టించాం. హర్యానా,మహారాష్ట్రలో గెలిచి రికార్డు సృష్టించాం. ఢిల్లీని ఇక అభివృద్ధి బాటలో నడిపిస్తాం.మీ ప్రేమను అభివృద్ధిలో చూపిస్తాం.ఢిల్లీ ప్రజల అభివృద్ధికి మోదీ గ్యారెంటీ. ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను అనేక రెట్లు వారికి తిరిగి ఇస్తాం. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలే విజేతలుగా నిలిచారు. మీ విశ్వాసాన్ని అభివృద్ధిలో తీసుకొస్తాం.ఢిల్లీ అనేది మినీ ఇండియా. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.డబుల్ ఇంజిన్ సర్కార్తో ఢిల్లీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. షాట్కట్ రాజకీయాలకు ప్రజలు షాకిచ్చారు. నేను పూర్వాంచల్ నుంచి ఎంపీగా ఉన్నందుకు గర్వపడుతున్నా. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం చూపిస్తున్నారు. చాలా స్టేట్లలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందిఅవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఆమ్ఆద్మీపార్టీ నేతలు అవినీతిలో మునిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ అయితే వరుసగా మూడోసారి సున్నా సాధించింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను మిత్రులు కూడా గమనించింది. యమునా నదిని కాలుష్య కోరల నుంచి రక్షిస్తాం. ఢిల్లీ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాగ్ రిపోర్టు బయటపెడతాం. కాంగ్రెస్కు ఓటములలో మెడల్ ఇవ్వొచ్చు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇండియా కూటమి పార్టీలకు అర్థమైంది. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఎంతో పోరాడారు. ఆప్ ఓటమితో అన్నా హజారే కూడా ఎంతో సంతోషిస్తున్నారు’అని మోదీ పేర్కొన్నారు.

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. పరిచయాలు పెరుగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే సంతృప్తినిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యతిరేక పరిస్థితులను సానుకూలపర్చుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. చిరకాల స్వప్నం ఫలిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు. కళారంగం వారికి ఆహ్వానాలు, పిలుపులు అందుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. పార్వతీదేవికి కుంకుమార్చన చేయండి.వృషభం...ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. రుణాల కోసం యత్నిస్తారు. ఆలోచనలు కలసిరావు.బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత నత్తనడకన సాగినా చివరిలో స్వల్ప లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఇష్టం లేకున్నా మార్పులు తప్పవు. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి. వారం మధ్యలో వాహన యోగం. స్థిరాస్తివృద్ధి. శుభవార్తలు. నీలం, పసుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.మిథునం....ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి అప్పులు తీరుస్తారు. సన్నిహితులతో మరింత ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా పూర్తి చేస్తారు. మీ సత్తా పదిమందీ గుర్తిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనయోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహయత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాల యత్నాలు సఫలం. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.కర్కాటకం....ఉత్సాహంగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువుల్లో ఆదరణ పెరుగుతుంది. అనుకున్న విధంగా సమయానికి డబ్బు అందుతుంది. ఊహించని∙ఆహ్వానాలు రాగలవు. ప్రముఖులతో పరిచయాలు మీలో ధైర్యాన్ని నింపుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కొత్త పెట్టుబడులు సమీకరిస్తారు. ఉద్యోగాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు సంస్థల ఏర్పాటులో వివాదాలు పరిష్కారం. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.సింహం....చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంతమేర మెరుగ్గా ఉంటుంది. సోదరులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు తీరతాయి. ఒక ప్రకటన విద్యార్థులను సంతోషపరుస్తుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖ వ్యక్తులు ఊహించని రీతిలో సహకరిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం. వ్యాపారాలలో లాభాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. గులాబీ, నీలం రంగులు. సూర్యారాధన మంచిది..కన్య....నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. రుణబాధలు తొలగుతాయి.. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై పెద్దలతో సంభాషిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఊహించని విధంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.. రాజకీయవర్గాలకు మరింత గుర్తింపు లభిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఎరుపు, తెలుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.తుల....ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. . వ్యాపారాలు గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాలకు కాస్త ఊరట లభిస్తుంది. వారం ప్రారంభంలో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...దూరప్రాంతాల నుంచి ఊహించని శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహంగా కొనసాగుతాయి. ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు కాస్త అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. మీఖ్యాతి పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు ఆశించిన విధంగా పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి..ధనుస్సు...ఆర్థిక లావాదేవీలో మరింత పురోగతి కనిపిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగయత్నాలు కాస్త అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి «వస్తులాభాలు. ఆశ్చర్యకరమైన∙ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గే సూచనలు. రాజకీయవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. సోదరులతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు.. శివాష్టకం పఠించండి.మకరం...ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. పాతమిత్రులతో సరదాగా గడుపుతారు. కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు చాలావరకూ తగ్గుతాయి. రాజకీయవర్గాలకు వ్యవహారాలలో విజయం. వారం చివరిలో బంధువులతో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కుంభం....ఆర్థిక విషయాలు క్రమేపీ అనుకూలించి అవసరాలు తీరతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. నిరుద్యోగులకు నూతనోత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు సంస్థలో ఏర్పాటులో అనుకూలత. వారం చివరిలో శ్రమాధిక్యం. బంధువుల నుంచి మాటపడతారు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.మీనం....కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.. పాతబాకీలు కొన్ని వసూలై అవసరాలు తీరతాయి. సంఘంలో విశేషమైన గౌరవప్రతిష్ఠలు పొందుతారు. సన్నిహితులు, సోదరులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పైస్థాయి నుంచి సంతోషకరమైన వార్తలు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఎరుపు, పసుపు రంగులు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ అక్రమాలు.. మహిళ ఆత్మహత్యాయత్నం
తిరుపతి: తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిందో మహిళ. తన వద్ద కోటి రూపాయిలకు పైగా అప్పు తీసుకోవడమే కాకుండా తనను బెదిరిస్తున్నాడని లక్ష్మీ అనే మహిళ పేర్కొంది. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తాను అప్పు చేసి నగలు తాకట్టు పెట్టి ఆ మొత్తాన్ని ఇచ్చానని స్పష్టం చేసింది.‘నావద్ద నుంచి తిరుపతి జనసేన ఇన్చార్జ్గా ఉన్న కిరణ్ రాయల్ అనే వ్యక్తి కోటి 20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ీతీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. నేను కూడా అప్పు చేయడమే కాకుండా ఉన్న నగల్ని తాకట్టు పెట్టి ఆ డబ్బును తెచ్చాను. రూ. 30 లక్షలు ఇచ్చేందుకు ాబాండ్స్, ెచెక్ రాసిచ్చాడు. నన్ను బెదిరించి, భయపెట్టి వీడియో తీసుకున్నారు. నాకు అప్పులు ఇచ్చిన వాళ్ల వద్ద నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయి. నాకు చావే శరణ్యం’ అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది లక్ష్మి అనే మహిళ. తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాసేపటికే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమెకు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని సీఐపై భార్య ఫిర్యాదు

‘ఆప్’ ఓటమి వేళ..స్వాతి మలివాల్కు ‘మీమ్స్’ మద్దతు
న్యూఢిల్లీ:ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ, స్వయంగా ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు.ఈ ఓటమి అంశం బీజేపీ నేతలకు అంతులేని ఆనందాన్నిచ్చింది. వారి సంబరాలకు కారణమైంది.ఎందుకంటే ఆప్పై గెలిచింది వారే.అయితే ఆప్తో ఎన్నికల్లో తలపడకుండా ఆప్ ఓటమి పట్ల బీజేపీ తర్వాత అంత సంతోషించింది ఒక్కరే. ఆమే..ఆప్ నుంచి సస్పెండైన రాజ్యసభ ఎంపీ స్వాతిమలివాల్. ఢిలీ ఎన్నికల్లో ఆప్ ఓటమి నిర్ధారణ అయిన వెంటనే స్వాతి మలివాల్ తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేస్తూ మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం పోస్టు పెట్టారు. pic.twitter.com/kig39RQYmD— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, గతేడాది మేలో లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై బయటికి వచ్చారు.ఈ సమయంలో కేజ్రీవాల్ను కలవడానికి స్వాతి ఆయన నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత కొద్ది సేపట్టికి స్వాతి అక్కడి నుంచే పోలీసులకు ఫోన్ చేసిన తనపై కేజజ్రీవాల్ ఇంట్లో దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు.కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్కుమార్ తనను కొట్టాడని కేసు పెట్టారు. దీంతో పోలీసులు బిభవ్కుమార్ను అరెస్టు చేశారు.స్వాతి మలివాల్ జరిగిన దాడిని తొలుత ఖండించిన ఆప్ ఆ తర్వాత స్వాతి మలివాల్ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆరోపించింది. దీంతో స్వాతి మలివాల్ ఆప్, కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు చేశారు.తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆప్ వ్యతిరేకంగా పలు చోట్ల ప్రచారం కూడా చేశారు. స్వాతిమలివాల్కు మద్దతుగా ఆప్ ఓటమిపై శనివారం మీమ్స్, పోస్టులు సోషల్మీడియాను ముంచెత్తాయి.

టెక్ కంపెనీ భారీ లేఆఫ్స్: ఒకేసారి 3000 మంది బయటకు!
ఇన్ఫోసిస్ కంపెనీ ఫ్రెషర్లను తొలగించిన వార్తలు ఇంకా మార్చచిపోక ముందే.. టెక్ దిగ్గజం మెటా (Meta) భారీగా ఉద్యోగులను తొలగించడానికి సన్నద్ధమవుతోంది. ఇంతకీ మెటా ఎందుకు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది? ఎంతమందిని తొలగించనుంది? అనే విషయాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కంపెనీల మాతృ సంస్థ మెటా, ఫిబ్రవరి 10 (సోమవారం) నుంచి ప్రపంచవ్యాప్తంగా తొలగింపులను నిర్వహించనున్నట్లు సమాచారం. అదే రోజు అమెరికాతో సహా చాలా దేశాలలో సోమవారం స్థానిక సమయం ఉదయం 5 గంటల నుంచి ఉద్యోగాలు కోల్పోయే ఉద్యోగులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది..జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్లోని ఉద్యోగులకు స్థానిక నిబంధనల కారణంగా కోతల నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే యూరప్, ఆసియా, ఆఫ్రికా అంతటా సుమారు 12 దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ఉండనుంది. కంపెనీ తొలగింపు ప్రక్రియ కింది సుమారు 3600 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సమాచారం.పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులను తొలగించనున్నట్లు మెటా ఇప్పటికే వెల్లడించింది. ఇప్పుడు చెప్పినట్లుగానే తొలగింపులకు శ్రీకారం చుట్టింది. అయితే కంపెనీ ఏ విభాగంలో ఎంతమంది ఉద్యోగులను తొలగించనుంది అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు: ఎక్కడో తెలుసా?సెప్టెంబర్ 2024 నాటికి సుమారు 72,000 మందికి ఉపాధి కల్పించిన మెటా, ఉద్యోగుల తొలగింపు మొదలు పెడితే ఆ ప్రభావము 5 శాతం లేదా సుమారు 3600 మంది మీద పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లేఆఫ్స్ కారణంతో ఉద్యోగాలు కోల్పోయేవారికి సెవెరెన్స్ ప్యాకేజీ అందిస్తామని జూకర్ బర్గ్ ఇప్పటికే హామీ ఇచ్చారు.

ఓటరు దేవుడా..అని దండం పెట్టి మోసం చేశారు: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి,వైఎస్సార్జిల్లా: కూటమి ప్రభుత్వం అన్ని విధాల విఫలం అవుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. శనివారం(ఫిబ్రవరి8) వైఎస్సార్ జిల్లా జెడ్పీ మీటింగ్ అనంతరం అవినాష్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రైతులకు రూ.20వేలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఇచ్చింది లేదు. మా అధినేత వైఎస్ జగన్ 9 గంటల విద్యుత్ సరఫరా ఇస్తే దాన్ని 7 గంటలకు కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే రోడ్లెక్కుతాం.రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం.రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు. పంటల బీమా లేదు. కనీసం బీమా ప్రీమియం కూడా రైతులే కట్టుకోవాల్సి వస్తోంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ దరఖాస్తులు వేలల్లో పెండింగులో ఉన్నాయి. వాటినీ మంజూరు చేయడం లేదు. గతంలో ఉన్న పథకాలూ అమలు చేయడం లేదు. గొప్పలు చెప్పుకున్న సూపర్ సిక్స్ అమలు అంతకన్నా లేదు.కానీ ఈ 9 నెలల్లో 1.40లక్షల కోట్లు అప్పు మాత్రం తెచ్చారు..ఎక్కడ ఖర్చు చేశారో తెలియదు. చంద్రబాబు అనుభవం ఉన్న ఆర్థిక వేత్త అని చెప్పుకుంటారు. ఆయన కచ్చితంగా సూపర్ సిక్స్ అమలు చేసి తీరాల్సిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే ఆనాడు హామీలు ఇచ్చారు కదా. హామీలు అమలు చేయాల్సిన బాధ్యత వారిదే. ఆనాడు అలవిగాని హామీలు ఇచ్చి..ఓటరు దేవుడా అంటూ దండాలు పెట్టి ఇప్పుడు ఘోరంగా మోసం చేస్తున్నారు.ప్రభుత్వ పథకాలు లేక ప్రజల చేతుల్లో డబ్బు లేక వారి కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయింది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పరిషత్ సమావేశానికి కూటమి ప్రజాప్రతినిధులు కాదు..చివరికి కలెక్టర్,జేసీలు కూడా హాజరు కాలేదు. మేం అభ్యంతరం తెలిపితే అరగంట తర్వాత జేసీ వచ్చారు. ఇది తీవ్రమైన బాధ్యతారాహిత్యం. ఒక జిల్లా అత్యున్నతస్థాయి సమావేశానికి మంత్రులు సరే..కనీసం కలెక్టర్ కూడా రాలేదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నా’అని అవినాష్రెడ్డి అన్నారు.

సిల్వర్ స్క్రీన్ క్వీన్ : తోపుడు బండిపై అనాథ శవంలా!
జీవితం పట్ల అవగాహన, క్రమశిక్షణ లేకపోతే మన సంపాదించిన కీర్తి ప్రతిష్టలు, వేల కోట్ల సంపద అన్నీ హారతి కర్పూరంలా కరిగిపోతాయి. సక్సెస్ ఒక్కటే సరిపోదు. జీవితం పట్ల స్పష్టత ఉండాలి. కీర్తి ప్రతిష్టలైనా, కోట్ల రూపాయల సంపద అయినా చివరిదాకా నిలుపుకునే కనీస అవగాహన, సత్తా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు, సినీతారల విషయంలో ఇది చాలా అవసరం. ఎదురు దెబ్బలు, అవమానాలు తప్పవు. మరీ ముఖ్యంగా మహిళలైతే అప్రమత్తంగా లేకపోతే పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోతుంది. ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి, విలాసవంతమైన జీవితాన్ని గడిపి, చివరికి అనాథలా మిగిలిన ఒక తార జీవితం గురించి తెలుసుకుందాం.ఆమె ఒక గ్లామర్ హీరోయిన్. అద్భుతమైన అందం, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్ చక్కని నటన. తన అందం అభినయంతో, సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుని సిల్వర్ స్క్రీన్ క్వీన్ గా ఒక పేరు దక్కించుకుంది. నటిగా అనేక విజయాలు, కోట్ల ఆస్తి కట్ చేస్తే 34 ఏళ్ల వయసులోనే అనాథలా ఈ ప్రపంచం నుంచి సెలవు తీసుకుంది. ఆమె బాలీవుడ్ నటి విమ్మీ (Vimi). 1943లో సిక్కు కుటుంబంలో జన్మించింది. చదువుకుంటున్న రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు కూడా పాడేది.ముంబైలో సోఫియా కాలేజీలో సైకాలజీ చదివింది. బీఆర్ చోప్రా హాజరవుతారని తెలిసి, రవి తన కొడుకు పుట్టినరోజు పార్టీకి విమ్మీని, ఆమె భర్తను ఆహ్వానించాడు. ఈ పార్టీలో విమ్మీని చూసిన ప్రఖ్యాత ప్రముఖ నిర్మాత బీఆర్ చోప్రా ఆమెను బాలీవుడ్కు పరిచయం చేశాడు. 1967లో తీసిన హమ్రాజ్ చిత్రంలో ఆనాటి ఇద్దరు అగ్ర తారలు సునీల్ దత్ ,రాజ్ కుమార్ సరసన కొత్త హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రమే బ్లాక్ బస్టర్గా నిలిచింది. బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. చాలా తక్కువ సమయంలో విమ్మీ పాపులారీటీ సాధించింది. ఆబ్రూలో అశోక్ కుమార్, పతంగాలో శశి కపూర్ వంటి అగ్ర తారలతో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. 1960లలో ఒక పెద్ద స్టార్ హీరోయిన్ నిలిచింది. ఒకానొక దశలో బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా నిలిచింది. మరోవైపు ముంబైలాంటి వంటి విశ్వనగరంలో పుట్టి పెరిగినప్పటికీ,పాశ్చాత్య దుస్తులు ధరించడం , మేకప్ వేసుకొని విమ్మీ సినిమాల్లోకి రావడం ఇరుకుటుంబాలకీ నచ్చలేదు. దీనికి హమారాజ్సినిమా సమయంలో భర్తతో గొడవలు ఇది విమికి భారీగా నష్టం కలిగించింది.ఆమెతో మళ్ళీ పనిచేయడానికి నిరాకరించడం ఆమెకు భారీగా నష్టం కలిగించింది. అలాగే ఆమె భర్త అగర్వాల్ జోక్యంకారణంగా దర్శక నిర్మాతలు దూరంగా ఉండేవారు. క్రమంగా ఆమె స్టార్డమ్ తగ్గడం ప్రారంభమైంది. అలా పదేళ్ల కాలంలోనే ఆమె జీవితం తారుమారైపోయింది. 1970ల ప్రారంభం నాటికి, విమ్మీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పేలవంగా నిలిచాయి. దీంతో చిన్న చిన్న అతిధి పాత్రలు గుర్తింపు లేని నృత్య ప్రదర్శనలకు పరిమితమైపోయింది.విమ్మీ బాలీవుడ్లోకి అడుగుపెట్టే సమయానికే ఒక పారిశ్రామికవేత్త కుమారుడు శివ్ అగర్వాల్ (Shiv Agarwal)తో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక పక్క వృత్తి జీవితం చాలా హ్యాపీగా సాగుతుండగా, వ్యక్తిగత జీవితం మాత్రం చాలా బాధాకరంగా పరిణమించింది. తీవ్రమైన గృహహింను ఎదుర్కొంది. దీంతో భర్తనుంచి విడాకులు తీసుకుంది. నమ్మిన మరో మనిషి దారుణంగా మోసం చేయడంతో దయనీయ పరిస్థితులలోకి జారిపోయింది. జాలీ అనే చిన్న నిర్మాతతో సంబంధంలోకి ప్రవేశించింది. కానీ ఇది మరో పీడకలగా మారుతుందని ఊహించలేకపోయింది. బాధలో ఉన్న విమ్మీని అక్కున చేర్చుకోలేదు సరికదా అనేక రకాలుగా వేధింపులకు గురిచేశాడు. ఆర్థికంగా దోచుకున్నాడు. విమ్మీ సొమ్మునంతా వాడుకోవడం మాత్రమే కాదు ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడనే వార్తలు కూడా వినిపించాయి అప్పట్లో.చదవండి: భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్ అయ్యిందిలా!విషాదకరమైన ముగింపుఅయితే తన జీవితాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నంలో, విమ్మీ కోల్కతాలో విమి టెక్సటైల్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించింది. దురదృష్టవశాత్తూ అదీ విఫలమైంది. నష్టాలతో దివాలా తీసింది. మరోవైపు అప్పలు ముంచుకొచ్చాయి. ఇక లాభం లేక దాన్ని అమ్మేయవలసి వచ్చింది. ఈ అవమాన భారంతో మానసికంగా దెబ్బతింది. మద్యానికి అలవాటు పడింది. ఇదే ఆమె ఆరోగ్యాన్ని నాశనం చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో 1977న ఆగస్టు 22న అతి చిన్న వయసులో, విమ్మీ కాలేయ సమస్యలలో తనువు చాలించింది. దహన సంస్కారాలు నిర్వహించే దిక్కులేదు వెండి వెలుగుల్లో అకాల కీర్తి, దాని స్వభావాన్ని విషాదాంతాన్ని గుర్తు చేసిన మరో ఉదంతం ఏమింటే..ఆమె చనిపోయిన తర్వాత ఆమె భౌతిక కాయాన్ని ఒక తోపుడు బండిపై తరలించాల్సి రావడం. ఇదీ చదవండి: Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట

రోహిత్ ప్రాక్టీస్ ఆపేయ్.. ఫస్ట్ ఆ పనిచేయు: భారత మాజీ క్రికెటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేలవ ఫామ్తో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ ఆటతీరు పేలవంగా మారిపోయింది. టెస్టులు, వన్డేల్లో హిట్మ్యాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో దారుణంగా విఫలమైన రోహిత్.. ఇప్పుడు ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో అదే తీరును కనబరుస్తున్నాడు.నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్ పిచ్ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్.. ఇప్పుడు అదే బంతులకు ఔట్ అవుతుండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ తన ఫామ్ను అందుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్కు భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక సూచనలు చేశాడు. రోహిత్ శర్మ తన రిథమ్ను తిరిగి పొందడానికి గతంలో తను ఆడిన వీడియోలు చూడాలని బంగర్ అభిప్రాయపడ్డాడు."రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తన కెరీర్లో పరుగులు చేయని దశను అనుభవిస్తున్నాడు. అయితే అతడు తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి ఎక్కువగా నెట్స్లో శ్రమిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా సాధన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అతడు ఒంటరిగా ఉండి బ్యాటర్గా తన గత విజయాలను గుర్తు చేసుకోవాలి. గతంలో తన బ్యాటింగ్ చేసిన వీడియోలను చూడాలి. ప్రస్తుతం ఎక్కడ తప్పు జరుగుతుందో గుర్తించి సరిదిద్దుకోవాలి. కొన్ని సార్లు ఇలా చేయడం ఫలితాన్ని ఇస్తోంది. ఒక్కసారి రిథమ్ను అందుకొంటే చాలు. అంతేకానీ ఎక్కువగా ఆలోచించి నిరాశలో కూరుకుపోకూడదు" అని బంగర్ పేర్కొన్నాడు. కాగా కటక్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్లోనైనా రోహిత్ తన బ్యాట్కు పనిచేబుతాడో లేదో చూడాలి. కాగా ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అందుబాటులో ఉండనున్నాడు. గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన కోహ్లి.. ఇప్పుడు తన ఫిట్నెస్ను తిరిగిపొందాడు . ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ధ్రువీకరించాడు. కింగ్ ఎంట్రీతో యశస్వి జైశ్వాల్పై వేటు పడే ఛాన్స్ ఉంది. రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్చదవండి: SL vs AUS: సూపర్ మేన్ స్మిత్.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్

మోదీ రెండాకులు ఎక్కువే చదివారు.. అందుకే కేజ్రీవాల్కు మాస్టర్ స్ట్రోక్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు నిశ్చయించుకున్న బీజేపీ వ్యూహాలు పని చేశాయి. దేశరాజకీయాల్లో అత్యంత అనుభవం ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తన ‘బాణాన్ని’ ప్రచారం చివరి దశలో గురి చేసి వదిలారు. ఆ దెబ్బకే కేజ్రీవాల్ సర్కారు ఓటమి దాదాపు ఖరారై పోయింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. ఇది మోదీ వదిలిన తురుపు ముక్కగా గత వారమే విశ్లేషకులు అభివర్ణించారు.గత వారం.. సరిగ్గా శనివారం నాడే కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టించింది. . ఇది నిజంగా మోదీ మాస్టర్స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇది కచ్చితంగా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనా నేడు(శనివారం) అక్షరాలా నిజమైంది.మాస్టర్ స్ట్రోక్! ఆమ్ ఆద్మీ పార్టీ(AAP), బీజేపీ(BJP) మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారిన సంగతి తెలిసిందే. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది.దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పార్టీలు శాయశక్తులా ప్రయత్నించాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమైంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్క్లాస్పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది.ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది.ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసింది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్కు బదులు కాంగ్రెస్కు పడ్డాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇది బీజేపీకి బాగా అనుకూలంగా మారిందని, అందుచేతే ఆప్కు గట్టి దెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు.ఆప్తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా ఓటమి పాలవ్వడం ఆ పార్టీ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి కేజ్రీవాల్ ఓటమి చెందారు.ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. ఇది కేజ్రీవాల్కు మైనస్గా మారింది.అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్కు తల బొప్పి కట్టించాయి. . వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరిచారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్నే మట్టికరిపించారు కేజ్రీవాల్.నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసిరారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొట్టగా, ఇది బీజేపీ అభ్యర్థి పర్వేష్కు వరంలా మారింది.
3 ఇళ్లు.. రూ.4 కోట్ల ఆస్తులు
హీరో లేడీ గెటప్ వేస్తే హిట్టే: నిర్మాత సాహు గారపాటి
రుణాలు బంగారంలా పెరిగాయ్!
అక్కడ కాన్పులు ‘సాధారణం’!
తండ్రీకొడుకులను కబళించిన లారీ
చొరబాటు ప్రయాణం!
విద్యుత్ బకాయిలు రూ. 30,777 కోట్లు!
మెరిసిన షమ్స్, తనుశ్
ఫ్రీ స్టయిల్ చెస్ నాకౌట్కు గుకేశ్
చెన్నై ఏటీపీ టోర్నీ రన్నరప్గా సాకేత్ జోడీ
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఈ సారి ఏకంగా!
సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్
ఈ రాశి వారు బంధువులను కలుసుకుంటారు.. పరిచయాలు పెరుగుతాయి.
సీఎం, డిప్యూటీ సీఎంల పనితీరు మెరుగుపర్చుకోవాలని మంత్రులు అంటున్నార్సార్!!
ఫిర్యాదు చేసేందుకు వస్తే.. గర్భవతిని చేశాడు
సమంతతో విడాకులు.. అలాంటి కామెంట్లు ఇకనైనా ఆపేయండి: నాగచైతన్య
ఆ పనులు తప్ప వేరే పనుల జోలికే పోవడం లేదు!
సాయిరామ్ శంకర్ సస్పెన్స్ థ్రిల్లర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
డిన్నర్ మీటింగ్లు వద్దన్నారని బ్రేక్ఫాస్ట్, లంచ్ మీటింగ్లు పెట్టుకుంటున్నార్సార్!
అమెరికా అమ్మాయి.. నల్గొండ అబ్బాయి.. ధూంధాంగా పెళ్లి!
3 ఇళ్లు.. రూ.4 కోట్ల ఆస్తులు
హీరో లేడీ గెటప్ వేస్తే హిట్టే: నిర్మాత సాహు గారపాటి
రుణాలు బంగారంలా పెరిగాయ్!
అక్కడ కాన్పులు ‘సాధారణం’!
తండ్రీకొడుకులను కబళించిన లారీ
చొరబాటు ప్రయాణం!
విద్యుత్ బకాయిలు రూ. 30,777 కోట్లు!
మెరిసిన షమ్స్, తనుశ్
ఫ్రీ స్టయిల్ చెస్ నాకౌట్కు గుకేశ్
చెన్నై ఏటీపీ టోర్నీ రన్నరప్గా సాకేత్ జోడీ
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఈ సారి ఏకంగా!
సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్
ఈ రాశి వారు బంధువులను కలుసుకుంటారు.. పరిచయాలు పెరుగుతాయి.
సీఎం, డిప్యూటీ సీఎంల పనితీరు మెరుగుపర్చుకోవాలని మంత్రులు అంటున్నార్సార్!!
ఫిర్యాదు చేసేందుకు వస్తే.. గర్భవతిని చేశాడు
సమంతతో విడాకులు.. అలాంటి కామెంట్లు ఇకనైనా ఆపేయండి: నాగచైతన్య
ఆ పనులు తప్ప వేరే పనుల జోలికే పోవడం లేదు!
సాయిరామ్ శంకర్ సస్పెన్స్ థ్రిల్లర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
డిన్నర్ మీటింగ్లు వద్దన్నారని బ్రేక్ఫాస్ట్, లంచ్ మీటింగ్లు పెట్టుకుంటున్నార్సార్!
అమెరికా అమ్మాయి.. నల్గొండ అబ్బాయి.. ధూంధాంగా పెళ్లి!
సినిమా

'ఎమోషన్స్ అప్పటి వరకు ఎవరికీ అర్థం కావు'.. కరీనా కపూర్ ఆసక్తికర పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరో సైఫ్ అలీ ఖాన్ను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. తాజాగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. కుటుంబంలో ఉండే రిలేషన్స్ను ఉద్దేశించి కరీనా కపూర్ చేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. సమయంతో పాటు ఎవరికైనా నిర్ణయాలు మారవచ్చని తెలిపింది. సైఫ్ అలీ ఖాన్పై దాడి తర్వాత చేసిన పోస్ట్ కావడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ పోస్ట్లో ఏముందో ఓసారి చూసేద్దాం.కరీనా కపూర్ తన పోస్ట్లో రాస్తూ.. " వివాహాలు, విడాకులు, ఆందోళనలు, పిల్లలు పుట్టడం, ఇష్టమైన వ్యక్తి మరణం, పేరెంటింగ్ గురించి సంఘటనలు నిజంగా అర్థం చేసుకోలేరు. ఇది మీ జీవితంలో నిజంగా జరిగే వరకు మీకు ఇలాంటి విషయాలు అర్థం కావు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలోని పరిస్థితులు, సిద్ధాంతాలు, ఊహలు వాస్తవాలు కావు. జీవితంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడితే అంత తెలివైన వారిగా ఎదుగుతారు" అంటూ రాసుకొచ్చింది.కాగా.. ఇటీవల ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బాంద్రాలో ఉన్నఇంట్లోకి ఒక ఆగంతకుడు చోరీకి యత్నించాడు. అదే క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన సైఫ్ను కత్తితో దాడి చేశాడు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సినిమాల విషయానికొస్తే కరీనా కపూర్ చివరిసారిగా హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ది బకింగ్హామ్ మర్డర్స్ చిత్రంలో కనిపించింది.

ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి.. సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ముంబయిలోని ఓ రిసార్ట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రియాంక సోదరుడు సిద్దార్థ్ చోప్రా తన ప్రియురాలు నీలం ఉపాధ్యాయ మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లిలో ప్రియాంక చోప్రా తన డ్యాన్స్తో అదరగొట్టింది. బాలీవుడ్ సాంగ్స్కు స్టెప్పులు వేస్తూ పెళ్లి వేడుకల్లో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.తన సోదరుడి పెళ్లి ప్రియాంక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. మండపం వద్దకు సోదరుడిని తీసుకురావడంతో పాటు డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. కుటుంబ సభ్యులతో పాటు తన భర్త నిక్ జోనాస్లో కలిసి ఈ పెళ్లి వేడుకలో అలరించింది. అంతేకాకుండా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra)

తండేల్ను వదలని పైరసీ భూతం.. రెెండో రోజే ఆన్లైన్లో ప్రత్యక్షం!
అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ (Thandel Movie) మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మత్స్యకారుల బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది.తండేల్ను వదలని పైరసీ భూతం..అయితే సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. తాజాగా తండేల్ మూవీని సైతం పైరసీ భూతం వదల్లేదు. సినీ ఇండస్ట్రీకి తీరని సమస్యగా మారింది. విడుదలైన రెండో రోజే తండేల్ సినిమా ఆన్లైన్లో పలు వెబ్సైట్స్లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఫిల్మీ జిల్లా లాంటి పైరసీ సైట్లో తండేల్ పూర్తి సినిమా అప్లోడ్ చేసినట్లు సమాచారం. దీంతో తండేల్ మూవీ మేకర్స్ ఆందోళనకు గురవుతున్నారు.కాగా.. అంతకుముందే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విడాముయార్చి మూవీని సైతం పైరసీ భూతం వదల్లేదు. ఈ చిత్రం రిలీజైన కొద్ది గంటల్లోనే ఆన్లైన్లో అప్లోడ్ చేసేశారు. సినీ ఇండస్ట్రీ, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పైరసీ కేటుగాళ్లను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా పైరసీ చేసేవారిని కఠినంగా శిక్షించాలని నిర్మాతలు, సినీ ప్రియులు కోరుతున్నారు. తొలిరోజే అదిరిపోయే కలెక్షన్స్..తండేల్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధికంగా వసూళు చేసింది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు గతంలో తను నటించిన 'లవ్స్టోరీ' మొదటిరోజు సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడా రికార్డ్ను తండేల్ దాటేసింది.విదేశాల్లోనూ హవా..విదేశాల్లో మొదటిరోజు ఈ చిత్రం రూ. 3.7 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది. 'అలలు మరింత బలపడుతున్నాయి' అంటూ ఒక క్యాప్షన్ను పెట్టింది. విదేశాల్లోనే సుమారు రూ. 10 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఓటీటీకి కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శాండల్వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్ర పోషించారు. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ మూవీతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి జీ5 వేదికగా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. కాగా.. ఈ సినిమాను వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించారు.మ్యాక్స్ కథేంటంటే..సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
న్యూస్ పాడ్కాస్ట్

మార్గదర్శి కేసులో కాలయాపన సరికాదు, కౌంటర్లు వేయడానికి ప్రతీసారి వాయిదాలు కోరడం సమంజసం కాదు... ఆర్బీఐ తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి

ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబు నాయుడే, సంపద సృష్టి జరిగింది ఆయన జేబులోనే... నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఇక కార్యకర్తల కోసం ఎలా పని చేస్తానో చూపిస్తా... వైఎస్సార్సీపీ నేతలతో సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా

కులగణన, ఎస్సీల వర్గీకరణపై నివేదికలను ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్లో కూటమి దౌర్జానాల మధ్య సగం చోట్ల ఎన్నికల వాయిదా. 3 కార్పోరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు జరగాల్సి ఉండగా 5 చోట్ల జరగని ఎన్నికలు

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన. వచ్చే ఏడాది నుంచి 5 వేల స్కూళ్లలో షురూ!

కేంద్ర బడ్టెట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం... నిధులు సాధించడంలో సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యం

నాకు వట్టిగ కొట్టుడు అలవాటు లేదు, నాలుగు రోజులు కానీయ్ అని చూస్తున్నా... తెలంగాణ ప్రభుత్వంపై కేసీఆర్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి భారీగా రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు... ఏకంగా 50 శాతానికి పైగానే పెరగనున్న చార్జీలు

మెడికల్ పీజీలో లోకల్ కోటా రాజ్యాంగ విరుద్ధం... సుప్రీంకోర్టు స్పష్టీకరణ
క్రీడలు

సిరీస్ విజయమే లక్ష్యంగా...
ఇంగ్లండ్పై టి20 సిరీస్ జోరును కొనసాగిస్తూ వన్డేల్లోనూ శుభారంభం చేసిన భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్ను తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. అన్ని రకాలుగా ఫామ్లో ఉన్న టీమిండియా ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో చెలరేగుతున్న భారత్ను నిలువరించడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతూ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ ఈ సారైనా కోలుకొని పోటీనిస్తుందా చూడాలి. కటక్: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు సొంతగడ్డపై తమ సత్తాను ప్రదర్శిస్తున్న భారత జట్టు ఇంగ్లండ్పై వన్డే సిరీస్ను గెలుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బారాబతి స్టేడియంలో నేడు జరిగే రెండో వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 38.4 ఓవర్లలోనే ఛేదన పూర్తి చేసిన భారత్ అదే స్థాయి ఆటను ప్రదర్శిస్తే మరో మ్యాచ్ కూడా రోహిత్ సేన ఖాతాలో చేరుతుంది.టి20ల్లో చిత్తుగా ఓడి తొలి వన్డేలో కూడా 248కే పరిమితమైన ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శనతో సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. 2006 నుంచి భారత గడ్డపై 31 సార్లు భారత్తో తలపడిన ఇంగ్లండ్ 5 మ్యాచ్లే గెలిచి 25 ఓడింది. కోహ్లి సిద్ధం... గాయంతో తొలి మ్యాచ్కు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తి ఫిట్గా సిద్ధమయ్యాడు. రెండో వన్డేలో అతను బరిలోకి దిగడం ఖాయమైంది. కోహ్లి కూడా చాలా రోజులుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. లయ అందుకునేందుకు అతనికి ఇదే సరైన అవకాశం. అయితే ఎవరి స్థానంలో విరాట్ ఆడతాడనేది ఆసక్తికరం. గత మ్యాచ్లో చెప్పినదాని ప్రకారం శ్రేయస్ను తప్పించి కోహ్లిని తీసుకోవాలి. కానీ మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న శ్రేయస్ను పక్కన పెడితే టీమ్ మేనేజ్మెంట్పై తీవ్ర విమర్శలు రావచ్చు. కోచ్ గంభీర్ సాధారణంగా ఓపెనింగ్ ఎడమ, కుడిచేతివాటం కాంబినేషన్ను ఇష్టపడతాడు. అలా చూస్తే శ్రేయస్పైనే వేటు వేసి జైస్వాల్ను ఆడించవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని చూస్తే ప్రయోగాలు చేయకుండా జైస్వాల్ను పక్కన పెట్టడం సరైన నిర్ణయమవుతుంది. మరో వైపు రాహుల్ స్థానంలో కీపర్గా పంత్ను ఆడించే ఆలోచన కూడా ఉంది. లెఫ్టార్మ్ పేసర్ అర్ష్ దీప్ సింగ్ను పరీక్షించేందుకు రాణాను పక్కన పెట్టాలనే చర్చ కూడా జరుగుతోంది. ఎలాగైనా ఈ సిరీస్ గెలవాలని భావిస్తే భారత జట్టు మార్పులపై దృష్టి పెట్టకపోవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్లో ఆటగాళ్లను పరీక్షించాలనే ఆలోచన ఉంటే మాత్రం మార్పులు ఖాయం. సీనియర్ పేసర్ షమీ గత మ్యాచ్లో వికెట్లు తీయకపోయినా చక్కటి బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఆల్రౌండర్ అక్షర్ బ్యాటింగ్లో రాణించడం సానుకూలాంశం. అయితే అన్నింటికి మించి కెపె్టన్ రోహిత్ ఫామ్లోకి రావడం భారత్కు ముఖ్యం. చాలా కాలంగా వరుసగా విఫలమవుతున్న రోహిత్ ఇక్కడైనా రాణిస్తాడా చూడాలి. గిల్, పాండ్యా, జడేజాలతో మన బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గెలిపించేదెవరు? ఈ పర్యటనలో ఐదు మ్యాచ్లలో ఓడిన ఇంగ్లండ్ ఆట దిశానిర్దేశం లేకుండా సాగుతోంది. పేరుకు భారీ బ్యాటింగ్ లైనప్ కనిపిస్తున్నా ఆ జట్టు వ్యూహాల్లో పదును లోపించింది. గుడ్డిగా బ్యాట్లు ఊపడం తప్ప ఆటగాళ్లు విఫలమవుతున్న చోట రెండో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కోచ్ మెక్కలమ్ ప్రణాళికలు ఏవీ పని చేయడం లేదు. భారత గడ్డపై అనుభవం ఉన్న బట్లర్ మాత్రమే ఎంతో కొంత రాణిస్తుండగా బెతెల్ కాస్త పట్టుదలగా ఆడగలిగాడు. జట్టు ఆధారపడుతున్న రూట్, బ్రూక్ స్థాయికి తగ్గ ఆటను కనబర్చాల్సి ఉంది. ముఖ్యంగా బ్రూక్ 5 టి20లు, వన్డే కలిపి 91 పరుగులే చేశాడు. డకెట్ ఇంకా వన్డే ఓపెనర్గా కుదురుకోకపోగా, సాల్ట్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఆర్చర్, కార్స్ పేస్ భారత బ్యాటర్లపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, రషీద్ తేలిపోయాడు. ఈ మ్యాచ్లో మరో పేసర్ వుడ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. 40 ఓవర్లలోపే భారత్ తొలి వన్డే ముగించడం ఇంగ్లండ్ బౌలింగ్ బలహీనతను కూడా చూపించింది. దీనిని ఆ జట్టు ఎలా అధిగమిస్తుందో చూడాలి. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్/ పంత్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్ష్ దీప్, షమీ ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ),సాల్ట్, రూట్, బ్రూక్,డకెట్, లివింగ్స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్. పిచ్, వాతావరణం ఈ మైదానంలో ఐదేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరుగుతోంది. మొదటినుంచి ఇక్కడి పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలం. భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ సారి కూడా పరుగుల వరద ఖాయం. వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు.

శ్రీలంకతో రెండో టెస్టు.. విజయం ముంగిట ఆస్ట్రేలియా
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. క్రీజులో కుశాల్ మెండిస్(48), నిషాన్ పెర్రిస్(0) ఉన్నారు. అయితే లంక జట్టు ప్రస్తుతం 54 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.ఆస్ట్రేలియా బౌలర్లలో కునేమన్ 4 వికెట్లు పడగొట్టగా.. నాథన్ లియోన్ మూడు, వెబ్స్టర్ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు 330/3 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంబించిన ఆసీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 414 పరుగులకు ఆలౌటైంది. దీంతో కంగారులకు తొలి ఇన్నింగ్స్లో 157 పరుగుల ఆధిక్యం లభించింది.స్మిత్, కేరీ సెంచరీల మోత..కాగా మొదటి ఇన్నింగ్స్లో ఆసీస్ జట్టు 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ స్మిత్, కేరీ లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ జంట ఆడుతూ పాడుతూ పరుగులు చేయడంతో ఆసీస్ భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. ఈ క్రమంలో స్మిత్ 191 బంతుల్లో టెస్టుల్లో 36వ సెంచరీ నమోదు చేసుకోగా... కేరీ 118 బంతుల్లో టెస్టుల్లో తన రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ అబేధ్యమైన నాలుగో వికెట్కు 239 పరుగులు జోడించారు.ఇక శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ ప్రభాత్ జై సూర్య ఐదు వికెట్లతో సత్తాచాటగా.. పెర్రిస్ మూడు, మెండిస్ రెండు వికెట్లు సాధించారు. అదేవిధంగా శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (139 బంతుల్లో 85 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) పోరాడాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, లయన్, కునేమన్ తలా 3 వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచి సిరీస్లో 1–0తో ముందంజలో ఉన్న ఆస్ట్రేలియా.. ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ ఉంది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. టీమిండియాను ఓడించాలి: పాక్ ప్రధాని

శ్రేయాస్ జోరు మరి విరాట్ పరిస్థితి ఏమిటి?
ఇంగ్లండ్ తో గురువారం జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో నిజానికి భారత్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆడే పరిస్థితి లేదు. దానికి ముందు రోజు రాత్రి వరకు దీని పై స్పష్టత లేదు. శ్రేయాస్ అయ్యర్ ఏదో సినిమా చూస్తూ నిబ్బరముగా ఉన్నాడు. ఈ లోగా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయం కావడంతో అతను ఆడటం కష్టమని. అందువల్ల మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉండమని కోరాడు. దాంతో సినిమా ఆపేసి మ్యాచ్ కి ముందు విశ్రాంతి కోసం నిద్రకు ఉపక్రమించాడు శ్రేయాస్ అయ్యర్. "విరాట్ మోకాలి నొప్పి కారణంగా ఆడే అవకాశం లేనందున నువ్వు ఆడే అవసరం రావచ్చు అని కెప్టెన్ (రోహిత్ శర్మ) నుండి నాకు కాల్ వచ్చింది" అని అయ్యర్ స్వయంగా వెల్లడించాడు."నేను నా గదికి తిరిగి వెళ్లి వెంటనే నిద్ర పోయాను." గురువారం మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి అడుగు పెట్టే సమయానికి భారత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో ఉంది. ఇంగ్లాండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్ మరియు సాకిబ్ మహమూద్ నిలకడగా బౌలింగ్ చేస్తూ భారత్ ని పరుగులు కొట్టకుండా నిల్వరిస్తున్నారు.ఆ దశలో రంగ ప్రవేశం చేసిన అయ్యర్ ఇంగ్లాండ్ బౌలర్ల సవాలును ఎదుర్కొన్నాడు. అయ్యర్ రెండు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు. తన అద్భుతమైన ఎదురుదాడి ఇన్నింగ్స్తో మ్యాచ్ ని మలుపు తిప్పాడు. ఫలితంగా భారత్ తొలి వన్డేలో ఇంగ్లాండ్పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించగా, శ్రేయాస్ అయ్యర్ తన 19వ అర్ధ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ లో మరో విషయం వెల్లడైంది. యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా వస్తే శుభ్మాన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉంటాడు. ఎడమచేతి వాటం అక్షర్ తదుపరి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది, ఆట స్థితిని బట్టి కే ఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యా తర్వాత బ్యాటింగ్ చేస్తారు. అయితే కోహ్లీ గాయం లేకపోతే అయ్యర్ కి స్తానం లేదా అన్నది ఇక్కడ ప్రధానాంశం. "కోహ్లీ ఫిట్ గా ఉంటే అయ్యర్ ఆడటం సాధ్యం కాదన్న విషయం గురుంచే నేను తదేకంగా ఆలోచిస్తున్నాను. 2023 ప్రపంచ కప్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 500 కి పైగా పరుగులు చేసిన తొలి భారత్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.అటువంటి నైపుణ్యం ఉన్న బ్యాట్స్మన్ ని మీరెలా బెంచ్ మీద కూర్చో బెట్ట గలరు? అని భారత్ మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా జట్టు మేనేజ్మెంట్ పై విరుచుకు పడ్డాడు. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రేయాస్ అయ్యర్ ని సమర్ధించాడు."శ్రేయస్ తన నైపుణ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతను ప్రపంచ కప్లో పరుగుల ప్రవాహం సృష్టించాడు. ఒక ఆటగాడు ఇన్ని పరుగులు చేసినప్పుడు, అతనికి అవకాశాలు లభిస్తాయని భావించడంలో తప్పేం ఉంది. అతను అతని దృష్టిలో అత్యుత్తమ బ్యాట్స్మన్. అందుకే దేవుడు కూడా అలాగే భావించాడు. అతను చేసిన 50 పరుగులు, మ్యాచ్ రూపురేఖలను మార్చాయి," అని హర్భజన్ అయ్యర్ పై ప్రశంసలు కురిపించాడు.

పాక్ బౌలర్లకు చుక్కలు.. ఫిలిప్స్ విధ్వంసకర సెంచరీ! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాలను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. ఈ టోర్నీకి ముందు న్యూజిలాండ్-పాకిస్తాన్-దక్షిణాఫ్రికా జట్లు ట్రైసిరీస్లో తలపడుతున్నాయి. ఈ సిరీస్లో భాగంగా లహోర్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో కివీస్ బ్యాటర్లు జూలు విధిల్చారు. ముఖ్యంగా న్యూజిలాండ్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.ఆరో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన ఫిలిప్స్.. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పాక్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిదినైతే ఫిలిప్స్ ఓ ఆట ఆడేసికున్నాడు. బ్లాక్ క్యాప్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్లో ఈ కీవీ స్టార్.. రెండు సిక్స్లు, రెండు ఫోర్ల సాయం(Wd Wd 4 6 6 2 4 1) సాయంతో ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు.ఈ క్రమంలో కేవలం 72 బంతుల్లోనే తొలి వన్డే సెంచరీని ఫిలిప్స్ అందుకున్నాడు. ఆఖరి వరకు అతడిని ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఓవరాల్గా 74 బంతులు ఎదుర్కొన్న ఫిలిప్స్.. 6 ఫోర్లు, 7 సిక్స్లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు డార్లీ మిచెల్(81), కేన్ విలియమ్సన్(81) హాఫ్ సెంచరీలతో రాణించారు.దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్ సాధించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. అర్బర్ ఆహ్మద్ రెండు, రౌఫ్ ఒక్క వికెట్ సాధించారు.తుది జట్లుపాకిస్తాన్: ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), ఖుష్దిల్ షా, కమ్రాన్ గులాం, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్న్యూజిలాండ్: రచిన్ రవీంద్ర, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, బెన్ సియర్స్, విలియం ఒరోర్కేచదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. టీమిండియాను ఓడించాలి: పాక్ ప్రధానిGLENN PHILIPS SHOW AT LAHORE....!!- Philips smashed Hundred from just 72 balls against Pakistan in Pakistan 🔥⚡ pic.twitter.com/YnGqsULtsL— Johns. (@CricCrazyJohns) February 8, 2025
బిజినెస్

సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు
సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్స్ క్యాన్సిల్ చేసే బ్యాంక్స్ గురించి విని ఉంటారు. కానీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని పెళ్లి క్యాన్సిల్ చేసిన ఘటన గురించి ఎక్కడైనా విన్నారా? అయితే ఈ కథనం తప్పకుండా చదవాల్సిందే..ఒకప్పుడు పెళ్లి చేయాలంటే.. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసేవారు. ఇప్పుడు కాలం మారింది. అబ్బాయి ఉద్యోగం, బ్యాంక్ బ్యాలెన్స్ వంటివి చూస్తున్నారు. అయితే తాజాగా వరుడి సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని మహారాష్ట్రలోని ముర్తిజాపూర్లో ఒక వధువు కుటుంబం ఏకంగా వివాహాన్నే రద్దు చేసింది.మహారాష్ట్రలోని ముర్తిజాపూర్కు చెందిన యువతికి, అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పెద్దలు పెళ్లి నిర్చయించారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. కానీ పెళ్ళి జరగటానికి కొన్ని రోజుల ముందు, వధువు మేనమామ.. వరుడి సిబిల్ స్కోర్ చెక్ చేయాలని పట్టుబట్టాడు. ఇక చేసేదేమీ లేక సిబిల్ స్కోర్ చేసారు.సిబిల్ స్కోర్ చెక్ చేస్తే.. ఆ యువకుడు అనేక బ్యాంకుల నుంచో లోన్స్ తీసుకున్నట్లు తెలిసింది. అంతే కాకుండా అతని సిబిల్ స్కోర్ కూడా చాలా తక్కువ ఉందని గుర్తించారు. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్లో యువకుడు.. అమ్మాయికి ఆర్ధిక భద్రతను ఎలా కల్పిస్తాడు? అనే ప్రశ్న లేవనెత్తారు. చివరకు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఇలా అయితే ఇక అబ్బాయిలకు పెళ్లి అయినట్టే అని చెబుతుంటే.. ఇంకొందరు అమ్మాయి కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. అమ్మాయికి పెళ్లి చేయాలంటే.. ఆ మాత్రం జాగ్రత్త అవసరమని చెబుతున్నారు.సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?సిబిల్ స్కోర్ అనే పదాన్ని ఎప్పుడూ వినేవారికి కూడా.. బహుశా సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలిసుండకపోవచ్చు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL) అనే క్రెడిట్ బ్యూరో.. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్నే సిబిల్ స్కోర్ అంటారు.ఇదీ చదవండి: ఐఆర్సీటీసీ టికెట్ ధరలలో తేడా: రైల్వే మంత్రి సమాధానమిదే..సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఈ స్కోర్ అనేది 900కి దగ్గరగా ఉంటె మంచి సిబిల్ స్కోర్ అంటారు. 750 కంటే తక్కువ ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని చెబుతారు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే.. కొంత తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ఇస్తాయి. తక్కువ స్కోర్ ఉంటే.. కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఒకవేళా ఇచ్చినా.. వడ్డీ రేటు భారీగా ఉంటుంది.

ఐఆర్సీటీసీ టికెట్ ధరలలో తేడా: రైల్వే మంత్రి సమాధానమిదే..
ఐఆర్సీటీసీ టికెట్ ధరలలో వ్యత్యాసాల గురించి శివసేన (యుబిటి) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఐఆర్సీటీసీ టికెట్ ధరలలో వ్యత్యాసం ఉండటానికి కారణం ఏమిటనే విషయాలు ఇక్కడ చూసేద్దాం..ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు.. సౌలభ్య రుసుము, లావాదేవీ ఛార్జీల కారణంగా రైల్వే కౌంటర్లలో భౌతికంగా కొనుగోలు చేసే వారి కంటే ఎక్కువ చెల్లిస్తున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆన్లైన్ టికెటింగ్ సౌకర్యాన్ని అందించడానికి ఐఆర్సీటీసీ గణనీయమైన ఖర్చును భరిస్తుంది. అయితే టికెటింగ్ మౌలిక సదుపాయాల నిర్వహణ, అప్గ్రేడేషన్ వంటి వాటికి అయ్యే ఖర్చును తగ్గించడానికి.. సౌకర్య రుసుమును వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా.. కస్టమర్లు బ్యాంకులకు లావాదేవీ ఛార్జీలను కూడా చెల్లిస్తారనే విషయాన్ని కూడా వెల్లడించారు.ఐఆర్సీటీసీ అందించే ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యం అనేది ప్రయాణీకులకు చాలా ఉపయోగకరం. ప్రస్తుతం చాలా మంది ముందుగా రిజర్వ్ చేసుకోవాలనుకునే వారిలో 80 శాతానికి పైగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారని వైష్ణవ్ అన్నారు.ఇదీ చదవండి: IRCTC సూపర్ యాప్: అన్నీ సేవలు ఒకేచోటఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందించిన తరువాత.. టికెట్స్ కోసం ప్రత్యేకంగా కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరాన్ని నిరోదించింది. తద్వారా వారికి రవాణా కౌంటర్లకు వెళ్ళడానికి అయ్యే రవాణా ఖర్చు మాత్రమే కాకుండా సమయం కూడా తగ్గిందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ విషయాలను రౌత్ తప్పకుండా తెలుసుకోవాలనుకున్నారు.హైడ్రోజన్ రైళ్లుహైడ్రోజన్ రైళ్లను నిర్మించడానికి సంబంధించిన ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ.. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేయడానికి రైల్వేస్ అత్యాధునిక ప్రాజెక్టును చేపట్టాయని, ఇది ప్రపంచంలోనే అతి పొడవైన.. అత్యధిక శక్తితో నడిచే హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా ఉంటుందని అన్నారు.

కొత్త పథకం.. ఈపీఎఫ్వో గడువు పెంపు
యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేసుకోవడానికి జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రకటించింది . "యూఏఎన్ యాక్టివేషన్, ఆధార్ సీడింగ్ కోసం గడువును 2025 ఫిబ్రవరి 15 వరకు పొడిగించాం" అని ఫిబ్రవరి 2 నాటి సర్క్యులర్లో ఈపీఎఫ్వో పేర్కొంది.యూఏఎన్ అంటే..?యూఏఎన్ లేదా యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఈపీఎఫ్వో ద్వారా సభ్యులకు కేటాయించే ఒక విశిష్టమైన 12-అంకెల సంఖ్య. ఇది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహరణకు కీలకం. ఇది వివిధ కంపెనీల నుండి అన్ని ఈపీఎఫ్ ఖాతాలను ఒకే ఖాతాలోకి లింక్ చేస్తుంది. ఉద్యోగాలు మారేటప్పుడు నిధులను సులభంగా బదిలీ చేసుకోవడంలో సహాయపడుతుంది.యూఏఎన్ సురక్షిత ప్రామాణీకరణ ద్వారా ఖాతా సమాచారం, లావాదేవీలు రెండింటినీ రక్షిస్తూ భద్రతను పెంచుతుంది. అంతేకాకుండా వివిధ కంపెనీల కింద సృష్టించిన ఎక్కువ పీఎఫ్ ఖాతాలను ఏకీకృతం చేసే ఇబ్బందిని తొలగిస్తూ, ఉద్యోగుల పదవీ విరమణ పొదుపు ప్రక్రియను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. యూఏఎన్ జనరేట్ చేయడానికి అవసరమైన పత్రాలలో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, గుర్తింపు రుజువు (పాస్పోర్ట్, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి), చిరునామా రుజువు, బ్యాంక్ ఖాతా వివరాలు మొదలైనవి ఉన్నాయి.ఈఎల్ఐ పథకంసంఘటిత రంగంలో ఉపాధిని పెంచడమే లక్ష్యంగా 2024 బడ్జెట్లో ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకాలను ప్రవేశపెట్టారు. ఇవి అటు యాజమాన్యాలతోపాటు ఇటు మొదటిసారి ఉద్యోగులకు ఇద్దరికీ ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ప్రయోజనాలను పొందడానికి ప్రతిఒక్కరూ ఈపీఎఫ్వోలో నమోదు చేసుకోవాలి.ప్రస్తుతం మూడు ఈఎల్ఐ పథకాలు ఉన్నాయి. వాటిలో స్కీమ్-ఎ అనేది మొదటిసారి ఉద్యోగులకు వర్తిస్తుంది. స్కీమ్-బి తయారీ రంగంలోని కార్మికులకు, , స్కీమ్-సి యాజమాన్యాలకు మద్దతు అందిస్తుంది. ఈపీఎఫ్వోకి సంబంధించిన ఈఎల్ఐ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి యాఏఎన్ యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి.

హైదరాబాద్లో ఇళ్లకు డిమాండ్..
దేశీయ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలు కీలకంగా మారాయి. ఈ ఏడాది గృహ విక్రయాలు ఈ మూడు నగరాల్లోనే అధిక స్థాయిలో జరిగాయి. తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ప్రాపర్టీ ధరలే ఇందుకు కారణమని హౌసింగ్. కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్ (ఐఆర్ఐఎస్) అంచనా వేసింది. రియల్టీ స్టేక్ హోల్డర్లు, ప్రభుత్వం, బ్యాంక్లు, ప్రాపర్టీ ఇన్వెస్టర్లు అందరూ టర్న్ ఎరౌంట్ మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపింది. అది గతేడాది సానుకూల దృక్పథంతో మొదలైందని తెలిపింది. గతేడాది వృద్ధే ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. – సాక్షి, సిటీబ్యూరో ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే ఫ్లాట్లు, విల్లాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి పట్టణాలలోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. గతంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలు ఆన్లైన్లో ప్రాపర్టీల సెర్చ్లో గణనీయమైన వృద్ధి నమోదు చేశాయని తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబైలోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్ను లీడ్ చేస్తాయని తెలిపింది.మారిన అభిరుచులు.. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకట్నిర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. ప్రస్తుతం గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయని హౌసింగ్.కామ్ కన్జ్యూమర్ సెంటిమెంట్ ఔట్లుక్ తెలిపింది. 3 బీహెచ్కే, ఆపై పడక గదుల గృహాల్లో 2023తో పోలిస్తే 2024లో 15 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది.అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్ల ఆలస్యం, దివాళా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ప్రాపర్టీ కోసం సెర్చ్ గణనీయంగా పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఈ రీజియన్లో పలు మౌలిక సదుపాయల ప్రాజెక్ట్లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది. ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది.
ఫ్యామిలీ

ఆర్టిస్టిక్ .. ప్రేమ్..ఫ్రేమ్..
నగర రహదారుల్లోని గోడలు, అండర్ పాస్ వంతెనలు, ఫ్లై ఓవర్లు అద్భుతమైన చిత్రాలకు వేదికగా నిలుస్తున్నాయి. వాహన చోదకులు, పాదచారులు, అటుగా వెళ్లే ప్రయాణికులను ఈ గోడ చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. సుమారు రెండు లక్షల ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో పలు చిత్రాలకు ప్రాణం పోసిన యువ కళాకారుడు ప్రేమ్ ఇస్రమ్ ఫ్రేమ్స్ నగరానికి కొత్త సొబగులు అద్దుతున్నాయి. ములుగు జిల్లా గిరిజన తాండా నేపథ్యంలో ఈ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి చిత్రాలు నలుగురికీ స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కడ చూసినా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ రోడ్లు అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. రంగు రంగుల చిత్రాలు కొత్త సొబగులు అద్దుతున్నాయి. నగర సుందరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో భాగ్యనగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే పలువురు ఫైన్ ఆర్ట్స్ కళాకారులు గోడలపై తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీని కోసం దాదాపు 149 కోట్ల నిధులతో రోడ్లు, కూడళ్లు, వీధులను ప్రత్యేకంగా, అత్యంత సుందరంగా మారుస్తున్నారు. నగరానికి తలమానికమైన హైటెక్ సిటీ, కొండాపూర్, ఇతర ప్రధాన రహదారులు అందమైన పెయింటింగ్స్తో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి జోన్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్లు, స్ట్రీట్ ఆర్ట్లో ఓ యువకుడి కళాత్మకత కృషి దాగి ఉంది. మాసబ్ ట్యాంక్లోని జేఎన్ఏఎఫ్యూ వేదికగా ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిన ప్రేమ్ ఇస్రమ్ (27) కొన్ని ఫ్లై ఓవర్లకు అత్యాధునిక టెక్నాలజీని ప్రతిబింబించే రంగుల చిత్రాలతో హంగులను అద్దాడు.నాలుగు ఫ్లై ఓవర్లు.. హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి మార్గంలోని ఫ్లై ఓవర్పై సాఫ్ట్వేర్ టెక్నాలజీ, అధునాతన సాంకేతికత, ఈ తరం అధునాతన ఆలోచనలు ప్రతిబింబించే చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. దీనికి సమీపంలోని అయ్యప్ప సొసైటీ – 100 ఫీట్ రోడ్ అండర్ పాస్లో ‘బజార్స్ ఆఫ్ హైదరాబాద్’ థీమ్తో వేసిన పెయింటింగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వీటన్నింటినీ తన బృందం (15 నుంచి 20 మంది)తో పూర్తి చేశానని, వీరందరూ కూడా తనతో చదువుకున్న జూనియర్స్, ఆర్ట్ ఫ్రెండ్స్ అని ప్రేమ్ తెలిపారు. ఒక ఫ్లై ఓవర్పూర్తి చేయడమే కష్టతరమైన నేపథ్యంలో దాదాపు 2 లక్షల ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో నాలుగు ఫ్లై ఓవర్లు కళాత్మకంగా సుందరీకరించానని పేర్కొన్నాడు. కొత్తగూడ అండర్పాస్లో ఇండియన్ ఆర్మీ లైఫ్స్టోరీని, అదే ప్రాంతంలోని ఫ్లై ఓవర్పై అడ్వెంచర్, ట్రావెలింగ్కు సంబంధించిన పెయింటింగ్స్ వేశానని వివరించారు.హాబీగా మొదలై.. ములుగు జిల్లా అటవీ ప్రాంతంలోని నార్లపూర్ అనే మారుమూల గ్రామం మాది. చిన్నప్పుడు ఆర్ట్ పై పెరిగిన మక్కువ ఈ ప్రయాణానికి కారణం. చిన్నతనంలో సమీపంలోని రోడ్లపై చాక్పీస్తో పెద్ద పెద్ద బొమ్మలు వేసి సంతోషపడే వాడిని. అదే హాబీగా మారి నగరాన్ని అందంగా మార్చే స్థాయికి రావడం ఆనందంగా ఉంది. సాధారణంగా ఆయిల్ పెయింటింగ్ పోట్రేట్స్ వేయడంలో అనుభవజు్ఞడిని.. గతంలో నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా చారిత్రాత్మక అంశాలతో స్ట్రీట్ ఆర్ట్ వేశాను. నగరంలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో నా మూలాలైన ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలపై వేసిన పెయింటింగ్స్తో ‘వేరియస్ ఇంప్రెషన్స్’ అనే ప్రత్యేక ప్రదర్శన చేశాను. – ప్రేమ్ ఇస్రమ్, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి

సాటి లేరెవరూ నీ సాహసానికి!
బెంగళూరుకు చెందిన అనన్య ప్రసాద్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఒంటరి ప్రయాణం చేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. స్పానిష్ కానరీ దీవుల్లోని లా గోమెరా నుంచి 52 రోజుల్లో కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వాకు చేరుకుంది. 52 రోజుల్లో 3,000 మైళ్ల చారిత్రాత్మక యాత్రను ముగించింది. అనన్య ప్రముఖ కన్నడ కవి జీఎస్ శివరుద్రప్ప మనవరాలు.బెంగుళూరులో పుట్టిన అనన్య పెరిగింది, చదువుకున్నదీ యూకేలో. సరదాగా మొదలైన రోయింగ్ హాబీ ఆ తరువాత అంకితభావంతో కూడిన పాషన్గా మారింది.‘రోయింగ్ను వ్యాయామంగా ఆస్వాదిస్తాను. రోయింగ్ అనేది నా దృష్టిలో సాహసం’ అంటుంది అనన్య.వరల్డ్స్ టఫెస్ట్ రో’లో అన్ని వయసులు, అన్ని దేశాల వారు పాల్గొంటారు. ఈ రేసుకు అర్హత సాధించడానికి మూడున్నరేళ్లు శిక్షణ తీసుకుంది అనన్య. శిక్షణలో మానసిక, శారీరక ఫిట్నెస్, సాంకేతిక నైపుణ్యంపై పట్టు సాధించింది.తన యాత్రలో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడంలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొంది. ప్రతిరోజు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించేది. రోజుకు 5 నుంచి 6 గంటలు మాత్రం విశ్రాంతికి కేటాయించేది. ‘ఒంటరిగా ఉన్నప్పటికీ నాకు ఎప్పుడూ ఒంటరిగా అనిపించలేదు. వాతావరణ, సాంకేతిక నిపుణులు, సోషల్ మీడియా బృందాలతో ఎప్పుడూ టచ్లోనే ఉన్నాను’ అని తన ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకుంది అనన్య.తన సాహసానికి సామాజిక ప్రయోజనాన్ని కూడా జత చేసింది. మన దేశంలోని అనాథ పిల్లలకు ఆసరాగా నిలిచే మెంటల్ హెల్త్ ఫౌండేషన్, దీనబంధు ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థల కోసం విరాళాలు సేకరించింది.

కళంకారి వెలుగు దారి
కలంకారి అనే మాట ఎంతో సుపరిచితం. అయితే ఈ సుప్రసిద్ధ కళ చరిత్ర చాలామందికి అపరిచితం. ఆ ఘనచరిత్రను ఈ తరానికి పరిచయం చేయడానికి, కలంకారీని మరింత వైభవంగా వెలిగించడానికి పూనుకుంది లీలావతి. కలంకారి అద్దకపు పనికి బోలెడంత ఓపిక కావాలి అంటారు. పరిశోధకులకు కూడా అంతే ఓపిక కావాలి. పెద్ద వస్తువు నుంచి చిన్నవాక్యం వరకు ఎన్నో ఎన్నెన్నో పరిశోధనకు ఇరుసుగా పనిచేస్తాయి. ఈ ఎరుకతో కలంకారిపై లోతైన పరిశోధన చేసిన లీలావతి.. ఆ కళపై పీహెచ్డీ పట్టా పొందిన తొలి మహిళగా ప్రశంసలు అందుకుంటోంది..కలంకారి అంటే గుర్తుకు వచ్చేది పెడన. కృష్ణాజిల్లా పెడన పట్టణంలో కలంకారి వస్త్రాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 2,500 సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ఈ కళపై చరిత్ర అధ్యాపకురాలు గుడివాడకు చెందిన పామర్తి లీలావతి పరిశోధన చేసింది. ఈ పరిశోధనకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి ఇటీవల పీహెచ్డీ పట్టా అందుకుంది. కలంకారిపై తొలిసారిగా పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందిన మహిళగా ప్రశంసలు అందుకుంటోంది.పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా విధుల్లో చేరిన లీలావతికి సహజంగానే అక్కడి వాతావరణం వల్ల కలంకారి కళపై ఆసక్తి పెరిగింది. కళాశాలకు వెళ్లే సమయంలో కలంకారి వస్త్రాలపై ముద్రణ నుంచి కలంకారి కళాకారుల జీవన శైలి వరకు ఎన్నో విషయాలు గమనించేది. నాగార్జున యూనివర్శిటీలో కలంకారి పరిశ్రమలపైన, ఆయా కుటుంబాల సామాజిక పరిస్థితులపై ఒకసారి పరిశోధన ప్రసంగం చేసింది.ఆ ప్రసంగానికి మంచి స్పందన లభించింది. ఆ సమయంలోనే ‘కలంకారి కళ’పై పీహెచ్డీ చేయాలనే ఆలోచన వచ్చింది. నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ స్టూడెంట్గా ప్రవేశం పొందింది. ‘కలంకారి కళకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దేశవిదేశాల్లో గుర్తింపు ఉన్న కలంకారిపై ఇప్పటి వరకు ఎవరూ పరిశోధన చేయక పోవడంతో నేనే ఎందుకు చేయకూడదని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేశాను’ అంటుంది లీలావతి. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్న లీలావతి కలంకారిపై మరిన్ని పరిశోధనలు చేయాలని ఆశిద్దాం. ఎన్నో దారులలో...కలంకారిపై పరిశోధనలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందడం సంతోషంగా ఉంది. కలంకారి పరిశ్రమ చరిత్ర, సంస్కృతి, దేశ విదేశాల్లో ఉన్నప్రాధాన్యం, ఆదరణ, కార్మికుల జీవన స్థితిగతులపై నా పరిశోధనలో సమగ్రంగా తెలుసుకున్నాను. పరిశోధనలో ఉన్న విశేషం ఏమిటంటే ఒక దారి అనేక దారులకు దారి చూపుతుంది. ఇలా కలంకారి గురించి అనేక కోణాలలో అనేక విషయాలు తెలుసుకోగలిగాను.– పామర్తి లీలావతి– నారగాని గంగాధర్ సాక్షి, పెడన

వ్యాధిని వరంలా మార్చి..కుటుంటాన్ని పోషించింది..!
ఎదురైన సమస్యనే అనుకూలంగా మార్చుకుని ఎదిగేందుకు సోపానంగా చేసుకోవడం గురించి విన్నారా..?. నిజానికి పరిస్థితులే ఆ మార్గాన్ని అందిస్తాయో లేక వాళ్లలోని స్థ్యైర్యం అంతటి ఘనకార్యాలకు పురిగొల్పితుందో తెలియదు గానీ వాళ్లు మాత్రం స్ఫూర్తిగా నిలిచిపోతారు. కళ్ల ముందే కలలన్నీ ఆవిరై అడియాశలుగా మిగిలిన వేళ కూడా కనికనిపించని ఆశ అనే వెలుగుని వెతికిపట్టుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటారు కొందరు. వీళ్లని చూసి.. కష్టానికి కూడా కష్టపెట్టడం ఎలా అనేది క్లిష్టంగా ఉంటుంది. అలాంటి కోవకు చెందిందే ఈ మహిళ. ఆమె విషాద జీవిత కథ ఎందరికో ప్రేరణ కలిగించడమే గాక చుట్టుముట్టే సమస్యలతో ఎలా పోరాడాలో తెలుపుతుంది. మరీ ఇంకెందుకు ఆలస్యం అసామాన్య ధీరురాలైన ఆ మహిళ గాథ ఏంటో చూద్దామా..!.ఆ మహిళ పేరు మేరీ ఆన్ బేవన్(Mary Ann Bevan). ఆమె 1874లో లండన్లోని న్యూహామ్(Newham, London)లో జన్మించింది. ఆమె నర్సుగా పనిచేసేది . అయితే ఆమె థామస్ బెవాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారికి నలుగురు పిల్లలు పుట్టారు. అయితే వివాహం అయిన 11 ఏళ్లకు అనూహ్యంగా భర్త మరణిస్తాడు. ఒక్కసారిగా ఆ నలుగురి పిల్లల పోషణ ఆమెపై పడిపోతుంది. ఒక పక్క చిన్న వయసులోనే భర్తని కోల్పోవడం మరోవైపు పిల్లల ఆలనాపాలన, పోషణ అన్ని తానే చూసుకోవడం ఆమెను ఉక్కిరిబిక్కిర చేసేస్తుంటాయి.సరిగ్గా ఇదే సమయంలో ఆమె అక్రోమెగలీ(Acromegaly) అనే వ్యాధి బారినపడుతుంది. దీని కారణంగా ఆమె శరీరంలోని గ్రోత్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయ్యి శారీరక రూపం వికృతంగా మారిపోతుంది. ఆమె శరీరంలో కాళ్లు, చేతులు, ముఖ కవళికలు తదితరాలన్ని అసాధారణంగా పెరిగిపోతాయి. దీంతో బయటకు వెళ్లి పనిచేయలేక తీవ్ర మనో వేదన అనుభవిస్తుంది. ఓ పక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తానే సంపాదించక తప్పనిస్థితి మరోవైపు ఈ అనారోగ్యం రెండూ ఆమెను దారుణంగా బాధిస్తుంటాయి. భర్త పోయిన దుఃఖానికి మించిన వేదనలు ఎదుర్కొంటుంది మేరీ. ఈ అనారోగ్యం కారణంగా కండరాల నొప్పులు మొదలై పనిచేయడమే కష్టంగా మారిపోతుంటుంది. చెప్పాలంటే దురదృష్టం పగబట్టి వెంటాడినట్లుగా ఉంటుంది ఆమె పరిస్థితి. అయినా ఏదో రకంగా తన కుటుంబాన్ని పోషించుకోవాలని ఎంతలా తాపత్రయపడుతుందో వింటే మనసు ద్రవించిపోతుంది. సరిగ్గా ఆసమయంలో 1920లలో, "హోమిలీయెస్ట్ ఉమెన్" పోటీ పెడతారు. దీన్ని "అగ్లీ ఉమెన్" పోటీ(Ugly Woman contest) అని కూడా పిలుస్తారు. ఇందులో పోటీ చేసి గెలిస్తే తన కుటుంబాన్ని హాయిగా పోషించుకోవచ్చనేది ఆమె ఆశ. నిజానికి అలాంటి పోటీలో ఏ స్త్రీ పోటీ చేయడం అనేది అంత సులభంకాదు. ఎందుకంటే అందుకు ఎంతో మనో నిబ్బరం, ధైర్యం కావాలి. ఇక్కడ మేరీకి తన చుట్టూ ఉన్న కష్టాలే ఆమెకు అంతటి ఆత్మవిశ్వాసాన్ని స్థ్యైర్యాన్ని అందించాయి. ఆమె అనుకన్నట్లుగానే ఈ పోటీలో పాల్గొని గెలుపొందింది కూడా. ఆ తర్వాత ఆమె అరుదైన జీవసంబంధ వ్యక్తులకు సంబంధించిన ఐలాండ్ డ్రీమ్ల్యాండ్ సైడ్షోలో "ఫ్రీక్ షో ప్రదర్శనకారిణిగా పనిచేసింది. మరికొన్నాళ్లు సర్కస్లో పనిచేసింది. ఇలా కుటుంబాన్ని పోషించడానికి తన అసాధారణమైన వైద్య పరిస్థితినే(Medical Condition) తనకు అనుకూలమైనదిగా చేసుకుని కుటుంబాన్ని పోషించింది. చివరికి ఆమె 59 ఏళ్ల వయసులో మరణించింది. తన చివరి శ్వాస వరకు కుటుంబం కోసం పనిచేస్తూనే ఉంది. దురదృష్టం కటికి చీకటిలా కమ్ముకున్నప్పుడే దాన్నే జీవితానికి ఆసరాగా మలుచుకుని బతకడం అంటే ఇదే కదా..!. సింపుల్గా చెప్పాలంటే దురదృష్టంలోని మొదటి రెండు పదాలను పక్కన పడేసి అదృష్టంగా మార్చుకోవడం అన్నమాట. చెప్పడం సులువు..ఆచరించాలంటే ఎంతో గట్స్ కావలి కదూ..!.(చదవండి: బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?)
ఫొటోలు


ఖాజాగూడలో గ్రాండ్గా మంగళ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవం (ఫోటోలు)


లులు మాల్లో ఫ్లవర్ ఫెస్టివల్ ప్రారంభించిన బిగ్ బాస్ దివి (ఫోటోలు)


27 ఏళ్ల తర్వాత దక్కిన విజయం..ఢిల్లీలో బీజేపీ సంబరాలు (ఫొటోలు)


ర్యాంప్ వ్యాక్ చేసిన స్టార్ నటి కూతురు..గుర్తు పట్టారా ఎవరో..?


ప్రియురాలి మెడలో మూడు ముళ్లు.. ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి వేడుక (ఫోటోలు)


చంద్రకాంత రంగు చీరలో..మురిపిస్తున్న ట్రెండింగ్ గర్ల్ ఫోటోస్


ప్రధానిని కలిసిన అక్కినేని కుటుంబం... మోడీ చేతికి ANR బుక్ (ఫోటోలు)


కుర్రకారుని తెగ అట్రాక్ట్ చేస్తున్న లైలా హీరోయిన్ ఆకాంక్ష శర్మ అందాలు


Malavika Mohanan : మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటోస్


#HappyProposeDay : హ్యాపీ ప్రపోజ్ డే మై లవ్! (ఫొటోలు)
National View all

ఆపద నుంచి ప్రజలకు విముక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో(Delhi Elections) బీజేపీ విజయం(

‘సెల్’బ్రిటీ కష్టాలు!
సెలబ్రిటీల కదలికలు, వ్యక్తిగత జీవిత విషయాలను సొమ్ము చేసుకునే ఎల్లో మీడియా పాపరాజీ దారిలో రాజీ పడకుండా నడుస్తుంటుంది.

అతనికి కాస్త నీళ్లు ఇవ్వండి: మోదీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(

‘ఆప్’ ఓటమి వేళ..స్వాతి మలివాల్కు ‘మీమ్స్’ మద్దతు
న్యూఢిల్లీ:ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ, స్వయంగా ఆ పార్

యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని మిల్కిపూర్ అసెంబ్లీకి జ
International View all

రాయల్ నేవీ చీర!
‘రాయల్ నేవీ’ అనేది కొత్త డిజైన్తో వచ్చిన చీర కాదు. విషయం ఏమిటంటే...

అమెరికా కలవరం.. డిపోర్టేషన్ పరేషాన్
రూపాయి విలువ ఎక్కువున్న దేశానికి ఎందుకు వెళ్తాం? సంపాదించుకోవడానికి!

ట్రంప్కు గిఫ్ట్గా.. భూమ్మీద నరకం..?
ఎల్ సాల్వడార్ మహా కారాగారం...

ఎల్ సాల్వడార్ మెగా జైలు.. భూమిపై నరకం!
ఎల్ సాల్వడార్.. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్యనున్న సెంట్రల్ అమెరికాలో ఓ చిన్న దేశం. ఇందులో ఉందొక మహా కారాగారం.

బాంబుల మాత ‘మోబ్’.. ఇరాన్పై అమెరికా దాడి ప్లాన్?
ప్రపంచంలో బాంబులన్నిటికీ ‘మాత’ అనదగ్గ అత్యంత శక్తిమంతమైన అతి పెద్ద బాంబు అది.
NRI View all

Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట
అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెకీలు, ఇతరులకు భ

హెచ్-1బీ వీసాదారులకు అలర్ట్!
వాషింగ్టన్ : 2025-26 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా క్య

ఆకాశ్ బొబ్బ.. వీడు మాములోడు కాదు!
ఆకాశ్ బొబ్బ.. ఎవరీ కుర్రాడు?

టెక్సాస్లో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ స్ట్రీట్ కార్యక్రమం..!
భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..

భారత అక్రమ వలసదారులతో బయల్దేరిన విమానం
వాషింగ్టన్: అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే కార్యక్రమం అమెరి
క్రైమ్

ట్రాన్స్జెండర్ పల్లవితో ప్రేమ..
గద్వాల క్రైం: ట్రాన్స్జెండర్తో ప్రేమ వ్యవహారం చివరికి ప్రాణాల మీదకు తెచ్చింది. ట్రాన్స్జెండర్ను ప్రేమించి చివరకు పురుగుమందు తాగి బలవనర్మణానికి పాల్పడిన ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. మృతుడి తల్లి శంకుతుల, పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు... గద్వాల పట్టణంలోని చింతలపేటకాలనీకి చెందిన బోయ నవీన్(25) అనే యువకుడు, ట్రాన్స్జెండర్(రవి అలియాస్ పల్లవి) ఇద్దరు స్నేహితులు. కాగా వారిద్దరు ఇటీవలే ప్రేమలో పడ్డారు. వారి ప్రేమకు గుర్తుగా నవీన్ తన చెస్ట్ (ఎడమ వైపు) ట్రాన్స్జెండర్ పల్లవి(రవి) టాటును సైతం వేయించుకున్నాడు. ఇంతలో ఏం జరిగిందో కానీ మంగళవారం సాయంత్రం పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు సిఫార్సు చేశారు. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజులుగా అందించినా పరిస్థితి మెరుగు పడకపోలేదు. చేసేదేమీ లేక గురువారం రాత్రి తిరిగి గద్వాల ప్రభుత్వాస్పత్రికి తీసుకు రాగా.. ఇక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా ఈ విషయం ప్రస్తుతం గద్వాల జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అయితే మృతుడి రెండు కాళ్లు, తోడలు, సున్నితమైన ప్రదేశాల్లో గాయాలు ఉన్నాయి. గాయాలను పరిశీలిస్తే వేడి చేసిన వస్తువుతో వాతలు పెట్టినట్లు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. దీంతో మృతుడి తల్లి తన కుమారుడు పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోలేదని, చిత్రహింసలు పెట్టారని అనుమా నం వ్యక్తం చేసింది. ఈమేరకు ట్రాన్స్జెండర్ పల్లవి అలియాస్ రవి, నరేష్ పై ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తెలిపారు. పక్కా వ్యూహ రచనతోనే? ట్రాన్స్జెండర్ (పల్లవి) రవి, నవీన్లు ఇద్దరూ గతంలో చింతలపేటకాలనీలోనే ఉండేవారు. కొన్నేళ్ల క్రితం రవి కాలనీ వదిలి వెళ్లిపోయి ట్రాన్స్జెండర్గా మారి పట్టణ శివారులో హమాలీ కాలనీలో సొంత ఇళ్లు కట్టుకున్నాడు. నవీన్ జిల్లాకేంద్రంలోని ఓ ఫైనాన్సియర్ వద్ద కలెక్షన్ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇటీవలే అతడి తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. ఈ క్రమంలో పల్లవితో నవీన్ ప్రేమలో పడ్డాడు. ఈ నేపథ్యంలో పల్లవిని డబ్బులు యాచించేందుకు బయటికి వెళ్లొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. ఈనెల 4న అర్ధరాత్రి వేళ నవీన్ను పల్లవి (రవి) తమ్ముడు నరేష్ ఇంటి వద్దకు వచ్చి స్కూటీపై ఎక్కించుకు వెళ్లిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోలు సైతం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో పక్కా వ్యూహరచనతోనే నవీన్ను చిత్రహింసలకు గురి చేసి హత్యచేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరువురి మధ్య సంబంధాలపై ఆరా.. నవీన్ మృతిపై అతడి తల్లి శకుంతల ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశాం. ఇరువురి మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తాం. ట్రాన్స్జెండర్ పల్లవిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తాం. ఈ నెల 4న జరిగిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుటాం. – కళ్యాణ్కుమార్, పట్టణ ఎస్ఐ, గద్వాల Mettuguda Incident: అంతా కట్టుకథేనా!

అమెరికా నుంచి వచ్చి.. తాతను చంపిన మనవడు
హైదరాబాద్: చిన్నప్పటి నుంచి తనను అందరిలా పెంచలేదని.. అందరిని చూసినట్లు తనను చూడలేదని తాతను కత్తితో పొడిచి చంపేశాడు ఓ మనవడు. అడ్డుకోబోయిన కన్నతల్లిని గాయపరిచాడు. ఈ దారుణ ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎస్ మక్తాలో నివాసం ఉండే వి.చంద్రశేఖర జనార్దన్ రావు (86) వ్యాపారవేత్త. ఇతను వెల్జాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్త్రీ చైర్మన్. ఆయనకు సరోజ అనే కూతురు. ఆమె భర్త బెంగళూరులో ఉండగా.. సరోజ తండ్రి జనార్దన్ రావుతో కలిసి బీఎస్ మక్తాలో ఉంటోంది. సరోజ కొడుకు కిలారు కార్తి తేజ (29) అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి నగరానికి తిరిగి వచ్చాడు. తాత ఆస్తి కోసం నిత్యం గొడవ పడేవాడు. అందరినీ చూసినట్లు తనను చూడడంలేదని.. అందరిలా తనను పెంచలేదంటుండేవాడు. ఈ విషయంలో తాతతో విభేదించి కార్తితేజ ల్యాంకోహిల్స్లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గురువారం రాత్రి బీఎస్ మక్తాకు వచ్చి ఆర్థిక లావాదేవీల గురించి తల్లి, తాతతో గొడవకు దిగాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో తాత జనార్దన్ రావు కడుపులో పొడిచాడు. అడ్డుకున్న తల్లి సరోజను గాయపరిచాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతలోపే కార్తి తేజ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అప్పటికే జనార్దన్ రావు మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయాలపాలైన సరోజను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కార్తి తేజ కోసం గాలిస్తున్నారు.

Mettuguda Incident: అంతా కట్టుకథేనా!
చిలకలగూడ,హైదరాబాద్: చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడలో ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో దాడి చేసి పొడిచింది కట్టుకథేనని పోలీసులు తేల్చేశారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో కుమారుడు యశ్వంత్ కూరగాయలు కోసే చాకుతో కడుపులో పొడుచుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతుండగా.. వద్దని వారించేందుకు అడ్డొచ్చిన తల్లిని పొడిచినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగులకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించకపోవడం, స్థానికులు అందించిన కీలక సమాచారంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఇది వేరే వారి పని కాదని, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలే కారణమని నిర్ణయించి అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన తల్లి రేణుక తన ముగ్గురు కుమారులతో కలిసి నివసిస్తోంది. గురువారం మధ్యాహ్నం ఆరుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేయగా, తల్లి రేణుక, పెద్ద కుమారుడు యశ్వంత్లకు తీవ్ర గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుమారు 150 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా దుండగులకు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ లభించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లు లేవని స్థానికులు స్పష్టం చేశారు. గట్టిగా కేకలు వినిపించడంతో వెళ్లిచూడగా లోపల నుంచి తలుపు గడియ పెట్టి ఉందని, కొన్ని క్షణాల తర్వాత తలుపులు తెరుచుకోగా రేణుక, యశ్వంత్ ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని, అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. వినియోగించిన చాకు ఫోరెన్సిక్ ల్యాబ్కు.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వివాహం కాకపోవడం తదితర సమస్యలో తల్లి రేణుక కుమారుడు యశ్వంత్ల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని తెలిసింది. మూడు నెలలుగా యశ్వంత్ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన అతను.. కూరగాయలు కోసే చాకుతో కడుపులో పొడుచుకుని ఆత్మహత్యకు యతి్నంచగా, అడ్డుకున్న తల్లిని కూడా పొడిచినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఈ ఘటనలో వినియోగించిన చాకును పోలీసులు స్వా«దీనం చేసుకుని ఫింగర్ప్రింట్స్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు సమాచారం. బాధితుడే.. నిందితుడు... ఈ ఘటనలో బాధితుడే నిందితుడు కావడం గమనార్హం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యశ్వంత్ను బాధితుడిగా పేర్కొన్న పోలీసులు ఇప్పుడు నిందితుడిగా చేర్చనున్నారు. ఆత్మహత్యా యత్నంతో పాటు తల్లిని చాకుతో పొడిచి హత్యాయత్నానికి పాల్పడినందుకు యశ్వంత్పై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసును తప్పుదారి పట్టించేలా వ్యవహరించిన యశ్వంత్ సోదరులు యశ్పాల్, వినయ్లపై కూడా కేసులు నమోదు చేసేందుకు న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నట్లు తెలిసింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేణుక, యశ్వంత్లు కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. వీరు పూర్తిగా కోలుకున్న తర్వాత వాంగూల్మం నమోదు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిలకలగూడ ఇన్స్పెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు.

Hyderabad: నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
బౌద్ధనగర్,హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తి తరచూ అనుమానిస్తూ..వేధింపులకు పాల్పడడంతో భరించలేక ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బౌద్ధనగర్లోని అంబర్నగర్కు చెందిన నాగయ్య కుమార్తె ప్రవళిక (23) కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతుంది. కాలేజీ అయ్యాక సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు వారాసిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పార్ట్టైమ్ జాబ్ చేస్తుంది. కాగా నాలుగేళ్లుగా ప్రవళిక..సృజన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సృజన్ ఆమెను వేధిస్తూ వేధింపులకు దిగాడు. మరో యువకుడితో మాట్లాడుతున్నావని అనుమానించేవాడు. ఇదే విషయంపై పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ నెల 6వ తేదీన సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలోని ఓ బేకరీలో ప్రవళిక, సృజన్ల మధ్య వాగి్వవాదం జరిగింది. దీంతో మరో స్నేహితుడు మధుకర్ వచ్చి ఇద్దరిని సముదాయించాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ప్రవళిక తన తండ్రి నాగయ్యకు ఫోన్ చేయగా, తాను ఫంక్షన్కు వెళ్తున్నానని ఆలస్యంగా వస్తానని చెప్పాడు. అర్థరాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చిన నాగయ్యకు బెడ్రూమ్లో ప్రవళిక దుప్పటితో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో ప్రవళికను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రవళిక స్నేహితుడు మధుకర్..సృజన్తో ప్రేమ, గొడవల గురించి నాగయ్యకు తెల్పగా..ఆయన ఫిర్యాదు మేరకు సృజన్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భట్టి విక్రమార్క భేటీ


సీఎం రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ


ముద్రగడ ఇంటిపై దాడి హేయమైన చర్య : జగ్గిరెడ్డి


ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అతిషి రియాక్షన్


ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అగ్రనేతల ఘోర పరాజయం


కూటమి కుట్రలు భయంతో బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా


ఢిల్లీలో బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీ! కేటీఆర్ అదిరిపోయే సెటైర్


కాంగ్రెస్ సృష్టించిన భస్మాసురుడు కేజీవాల్


Delhi Election Results 2025: ఆ రెండు కారణాలే AAP ను కొంపముంచింది


కాంగ్రెస్ కు గాడిద గుడ్డు.. ఉచితాలతో అధికారం రాదు