పాపం పాకిస్తాన్..! మరోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్
ప్రపంచకప్తో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాం«దీనగర్ సమీపంలోని మోనుమెంట్ కాంప్లెక్స్కు చేరగానే అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. గుజరాత్ వారసత్వ కట్టడం ‘అడాలజ్ స్టెప్వెల్’ వద్ద అధికారిక ఫొటో సెషన్ నిర్వహించగా... టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ ప్రపంచకప్తో సందడి చేశాడు.అతను కప్తో చేరుకోగానే అభిమానులంతా ‘ఇండియా... ఇండియా...’ నినాదాలతో హోరెత్తించారు. తర్వాత అడాలజ్ కట్టడం వద్ద కప్ పట్టుకొని ఫొటోలకు ఫొజులివ్వడంతో కెమెరా ట్రిగ్గర్లన్నీ ‘కిస్సిక్... కిస్సిక్...’ మోత మోగాయి. సుప్రసిద్ధ అడాలజ్ స్టెప్వెల్’ 500 ఏళ్ల పైచిలుకు చరిత్ర ఉంది. రాణి రుడాబాయి ఈ అడాలజ్ను నిర్మించింది.ఆమె వాఘెలా సంస్థానదీశుడు రాణా వీర్ సింగ్ భార్య. రాణా వీర్ మరణానంతరం రుడాబాయి ఈ ప్రాంతాన్ని పాలించింది. ఆ సమయంలోనే అడాలజ్ స్టెప్వెల్ను నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. గుజరాత్ సంస్కృతి, వారసత్వ సంపదలో భాగమైన ఈ కట్టడాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్ సందర్భంగా విన్నర్స్ ట్రోఫీతో భారత జట్టు అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫొటోలు దిగారు. ట్రోఫీతో ఆలయంలో పూజలు అంతకుముందు స్టేడియంలో సంబరాల్లో పాల్గొన్న ఆటగాళ్లు కాసేపు సేద తీరారు. ఈ సమయంలో కోచ్ గంభీర్, కెపె్టన్ సూర్యకుమార్, ఐసీసీ చైర్మన్ జై షాతో కలిసి స్టేడియం లోపలే ఉన్న హనుమాన్ ఆలయానికి ప్రపంచకప్ను తీసుకువెళ్లి పూజలు చేశారు.పూజల అనంతరం మళ్లీ ఎప్పట్లాగే మైదానంలోకి వచ్చి అభిమానుల్ని అలరించారు. సోమవారం తెల్లవారుజాము వరకు ఈ సంబరాలు జరుపుకున్నారు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ తదితురులు ప్రపంచకప్తో దిగిన ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.పాక్ను ట్రోలు చేసిన వరుణ్కాగా విజయోత్సవాల సందర్భంగా టీమిండియా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో హాట్ టాపిక్గా మారింది. పాకిస్తాన్ను వరుణ్ మరోసారి ట్రోల్ చేశాడు. వరుణ్ చక్రవర్తి తన ఇన్స్టాగ్రామ్లో ట్రోఫీని పట్టుకుని టీ కప్పుతో సిప్ చేస్తున్న ఫోటోను షేర్ చేశాడు.ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇదే తరహా ఫోటోను ఆసియాకప్-2025 విజయనంతరం కూడా అతడు షేర్ చేశాడు. ఆసియా ఛాంపియన్స్గా నిలిచిన భారత జట్టు.. ఏసీసీ చైర్మెన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది.ఆ సమయంలో వరుణ్ చక్రవర్తి ట్రోఫీ లేకపోయినా, తన బెడ్ పక్కన ఒక 'టీ కప్పు' పెట్టుకుని పడుకున్న ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. "ట్రోఫీని లాక్కోవచ్చు కానీ, ఛాంపియన్ ట్యాగ్ను కాదు" అని పరోక్షంగా పాక్కు చురకలు అంటించాడు. ఇప్పుడు ఒరిజినల్ వరల్డ్ కప్ ట్రోఫీతో మళ్ళీ అదే విధంగా కాఫీ తాగుతూ ఫోటోను షేర్ చేస్తూ పాక్ను ట్రోల్ చేశాడు.చదవండి: ఐసీసీ ప్రపంచకప్ టీమ్లో సామ్సన్, బుమ్రా, పాండ్యా, ఇషాన్... కెప్టెన్గా మార్క్రమ్
ఈ రాశి వారికి గృహ, వాహనయోగాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు,ఫాల్గుణ మాసం, తిథి బ.సప్తమి రా.12.21 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం అనూరాధ సా.5.56 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం రా.12.09 నుండి 1.55 వరకు, దుర్ముహూర్తం ఉ.8.33 నుండి 9.21 వరకు, తదుపరి రా.10.56 నుండి 11.44 వరకు, అమృతఘడియలు... ఉ.6.25 నుండి 8.11 వరకు.సూర్యోదయం : 6.17సూర్యాస్తమయం : 6.04రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం... కార్యక్రమాలలో ఆటంకాలు. ఇంటాబయటా సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణదాతల ఒత్తిడులు. వ్యాపారాలలో నిరుత్సాహపడతారు. ఉద్యోగాలలో మార్పులు.వృషభం... కొత్త పనులు చేపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో విజయాలు.మిథునం.... నూతన పరిచయాలు. దేవాలయ దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తి లాభం. యత్నకార్యసిద్ధి. గృహ నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.కర్కాటకం... కొత్తగా అప్పులు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. శారీరక రుగ్మతలు.సింహం... కుటుంబసభ్యుల నుంచి వ్యతిరేకత. రాబడి అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.కన్య.... పడిన శ్రమ ఫలితమిస్తుంది. కొత్త పరిచయాలు. అదనపు రాబడి ఉంటుంది. చిరకాల మిత్రులను కలుస్తారు. ఉద్యోగాలు, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.తుల.... ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో చిక్కులు. కార్యక్రమాలలో అవాంతరాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్య సమస్యలు. మిత్రుల నుంచి ఒత్తిడులు.వృశ్చికం... సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు సేకరిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.ధనుస్సు... దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో అకారణ వైరం. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో పనిభారం.మకరం... పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ముందంజ. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు.కుంభం... వ్యవహారాలలో విజయం. సంఘంలో గౌరవమర్యాదలు. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.మీనం.... కుటుంబసభ్యుల తో అకారణ వైరం. ఆదాయానికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో కొత్త యత్నాలు విఫలం. ఆకస్మిక ప్రయాణాలు.
ఏఐకి రేపటి తరం సిద్ధమా?
మానవాళి ప్రగతిలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక నూతన శకాన్ని ఆరంభిస్తోంది. అయితే మనుషులకు ప్రయోజనం చేకూర్చడంలో ఈ టెక్నాలజీకున్న అపారమైన సామర్థ్యాన్ని, అది సమాజానికి హాని చేయడానికి కూడా ఉన్న ప్రమాదంతో బేరీజు వేసుకోవాలి. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మన సాధనాలలోని ఏఐ మోడళ్ళు ఇప్పటికే రుచి చూపిస్తున్నాయి. నా ఫోన్లోని ఫొటోలలో ఒక టీనేజీ అమ్మాయిని ఏఐ ‘స్వీట్’గా అభివర్ణించడంతో నేను ఖంగుతిన్నాను. ఫోన్లోని ఏఐకీ, ఆన్లైన్ మృగాడికీ ఇంక తేడా ఏముంది? రక్షణ కంచెలు, భద్రతల అవసరాన్ని ఈ చిన్ని ఉదాహరణ చెప్పకనే చెబుతోంది. ఓ కుర్రాడి ఆత్మహత్యకు చాట్ జీపీటీ దారి చూపిన వైనాన్ని మరచిపోగలమా? ఇవేవో చెదురుమదురు ఘటనలు కావు. ప్యారిస్లో జరిగిన కడపటి ఏఐ కాన్ఫరెన్స్ని ‘ఏఐ సేఫ్టీ సమిట్’గా అందుకే పిలిచినట్లుంది. ఉద్యోగాల కోతపై రెండు వాదనలుఅడ్డూ ఆపులేని ఏఐ సిస్టంలు తీసుకురాగల ప్రమాదాలపై ఆందోళనలు ఇదివరకే మొదలయ్యాయి. ఏఐ అభివృద్ధిపై మారటోరియం విధించాలంటూ ఓ లాబీ తయారైంది. అలా అడిగిన వారిలో ఒకరైన ఎలాన్ మస్క్ ఇపుడు ఏఐ రేసులోకి దిగక తప్పలేదు. ఏఐ సిస్టంలు స్విచాఫ్కు బదులుగా మనుషులను చంపేసే అవకాశాన్ని ఎంచుకున్నాయని ల్యాబ్ అధ్యయనాలలో తేలింది. ప్రముఖ కంప్యూటర్ సైన్స్ నిపుణుడు స్టువర్ట్ రసెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆ సంగతి వెల్లడించారు. కోడర్లలో చాలా మంది పురుషులే అయినందున లింగ వివక్ష ఈ సిస్టంలకు కూడా పాకిందని మహిళా నిపుణులు అన్నారు. కనుక, ఏఐ ఎకోసిస్టంని కంప్యూటర్లు, డేటా సెంటర్లు, ఎనర్జీ అవసరాలు, మోడళ్ళు–అప్లికేషన్ల వంటి పదజాలంతోనే కాక నైతిక దృక్కోణం నుంచీ వీక్షించవలసి ఉంది. ఉద్యోగాలు ఏమవుతాయోనని క్రమేపీ పెరుగుతున్న ఆందోళనల అంశాన్ని కూడా పరిశీలించవలసి ఉంది. ముఖ్యంగా ‘గ్లోబల్ సౌత్’ దీనిపై కలత చెందుతోంది. దీనిపై రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ ఉద్యోగుల అవసరం లేని విధంగా అంతిమంగా ఏఐ పరిణమిస్తుందన్నది వాటిలో ఒకటి. ఉద్యోగాల తీరుతెన్నులు మారతాయన్నది మరో వాదన. కొత్త టెక్నాలజీతో వివిధ రకాల నైపుణ్యాలు అవసరమవుతాయని అంటున్నారు. గతంలో పారిశ్రామిక విప్లవం సమయంలో అదే జరిగింది. దేశంలోని ఐటీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ రెండవ కేటగిరీలోకి వస్తారు. వ్యాల్యూ–యాడెడ్ సర్వీసులపై ఏఐ చూపగల ప్రభావంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను వారు ఇటీవలి ఢిల్లీ సమిట్లో తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఐటీ పరిశ్రమలోని లక్షలాది ఉద్యోగులు తక్షణ బెడదను ఎదుర్కొంటున్నారు. ఆ పరిశ్రమలోని అట్టడుగు ఉద్యోగులు చేసే పనులను ఇకపై ఏఐ సిస్టంలు చక్కబెడతాయని చెబుతున్నారు. మారుతున్న కస్టమర్ల అవసరాలు తీర్చేందుకు ప్రస్తుతం ఉన్న సిబ్బందికి కొత్త నైపుణ్యాలను నేర్పించడం స్వల్పకాలిక పరిష్కారంగా భావించవచ్చు. దీర్ఘకాలిక సమస్య కట్టెదుటే కనిపిస్తోంది. ఏఐ ప్రపంచంలో మనుగడ సాగించేందుకు అత్యవసరమైన వివిధ రకాల నైపుణ్యాలను విద్యార్థులు ఒంటబట్టించుకునే విధంగా దేశంలోని విద్యా వ్యవస్థలను తీర్చిదిద్దాలి. ప్రాథమిక విద్య నుంచే...ఇది ఉన్నత విద్యా రంగానికి మాత్రమే పరిమితమయ్యే సవాల్ కాదు. ప్రాథమిక, సెకండరీ విద్యా స్థాయులలో కూడా తగు మార్పులు చేసుకోక తప్పదు. మూడవ, నాల్గవ తరగతుల విద్యార్థులు చిన్నపాటి లెక్కలు కూడా చేయలేకపోతున్నారని వార్షిక (2024) విద్యాస్థాయి నివేదిక వెల్లడిస్తోంది. అధునాతన ఏఐ ఎకోసిస్టంతో వ్యవహరించగలిగిన విధంగా ఈ విద్యార్థులను సంసిద్ధులను చేయవలసి ఉంది. ప్రీ–ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయులలోను ఏఐని ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. కానీ, ప్రాథమిక విద్యా ప్రమాణాలను, ఆలంబనగా నిలువవలసిన మౌలిక వసతులను అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లుగా తీర్చిదిద్దినప్పుడే ఆ రకమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. డిజిటల్ వ్యత్యాసాన్ని ఏఐ వ్యత్యాసంగా పరిణమించనివ్వకూడదని ఢిల్లీ సదస్సులో పాల్గొన్న గూగుల్ ఛీఫ్ సుందర్ పిచాయ్ దాన్ని దృష్టిలో పెట్టుకునే హెచ్చరించారు. నవీకరణ, ప్రతిభా సామర్థ్యాలకు గ్లోబల్ కేంద్రంగా తనకున్న అనుకూలతను భారత్ నిలబెట్టుకుంటుందో, లేదో నిర్ణయించగల మౌలికాంశాలవి. పునాది బలంగా ఉంటేనే సౌధం నిలుస్తుంది. ప్రపంచంలోని చిప్ డిజైనర్లలో 20% మంది మన దేశంలోనే ఉన్నారు. సెమీకండక్టర్ అభివృద్ధికి ఆశావహమైన పథకాలతో అడుగు ముందుకేయడం దానివల్లనే తేలికైంది. విద్యా రంగంలో మౌలిక వసతులను సకాలంలో ఉన్నతపరిస్తేనే ఈ పోటీదాయక అడ్వాంటేజి భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ప్రభుత్వ పెట్టుబడులు తగ్గకూడదు!ప్రతిభావంతులు అందుబాటులో ఉన్నా ఇంకా మనం అమెరికా, చైనాలను అందుకునే పరుగులోనే ఉన్నామనే ఫిర్యాదు వినవస్తోంది. ఏఐలో మనం రేసులోనే ఉన్నామని ఢిల్లీ సమిట్ వెల్లడించింది. విదేశీ ఆర్కిటెక్చర్పై ఆధారపడకుండానే పలు లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ళ (ఎల్.ఎల్.ఎం.)ను మనం ఆవిష్కరించగలిగాం. ఏకంగా 22 భాషల్లో రియల్–టైమ్ స్పీచ్, డీప్ రీజనింగ్ సామర్థ్యాలతో ఆవిష్కృతమైన ‘సర్వం’ ఏఐ మోడళ్ళు అబ్బురపరచాయి. స్వయం శక్తితో ఏఐలో ముందుకు సాగగలమనే ధైర్యాన్ని ఇచ్చాయి. భారత్ జెన్ మోడల్, జ్ఞాని ఏఐ, టెక్ మహీంద్రా, ఫ్రాక్టల్ ఎనలటిక్స్ మోడళ్ళు కూడా చెప్పుకోతగినవే. కొన్ని మోడళ్ళు ‘ఇండియా ఏఐ మిషన్’ ద్వారానే సాధ్యమయ్యాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినా, ఢిల్లీ సమిట్ ఫలవంతమైనదనే చెప్పాలి. వచ్చే రెండేళ్ళలో ఏఐ, డీప్టెక్ పెట్టుబడి కింద 200 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. రిలయన్స్ద, అదానీ వంటి దేశీయ కంపెనీలతోపాటు, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. మన ప్రభుత్వ పెట్టుబడులు మాత్రం ఓ మోస్తరుగానే ఉన్నాయి. గత ఏడాది రూ. 2,000 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో అవి అందులో సగానికి తగ్గిపోయాయి. అత్యధునాతన టెక్నాలజీపై పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉన్న సమయంలో కోత పెట్టడం నివ్వెరపరుస్తోంది. ఇది ప్రభుత్వపరంగా ఖర్చును తగ్గించుకోవాల్సిన సమయం కాదు. పెద్ద టెక్ కంపెనీల ద్వారా బిలియన్ల కొద్దీ డాలర్లు వస్తే రావచ్చు. ఏఐ ఇండియా మిషన్ వంటి విజయ గాథల వేగాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం నుంచి కూడా నిధుల మద్దతు అవసరం. అదే సమయంలో, ప్రాథమిక విద్యా ప్రమాణాల పెంపుదలకు పెట్టుబడులు అత్యావశ్యకమని దీర్ఘకాలిక దార్శనికత సూచిస్తోంది. ప్రాథమిక పాఠశాలల మౌలిక వసతులను గణనీయంగా మెరుగుపరచి తీరాలి. అప్పుడు మాత్రమే ఏఐతో రాగల సమస్యలు, ప్రమాదాలను తదుపరి తరం సమర్థంగా ఎదుర్కోగలదు. సుష్మా రామచంద్రన్వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్
కబ్జాలకు చరమ‘గీతం’ పాడండి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలపై జనాగ్రహం కట్టలు తెంచుకుంది. దురాక్రమణకు తెగబడిన ప్రభుత్వం గీతం వర్సిటీ నుంచి భూములను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజలు విశాఖపట్నం కలెక్టరేట్కు భారీగా పోటెత్తారు. టీడీపీ ఎంపీ భరత్ దురాగతాలపై గళమెత్తారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో రాకముందే రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిలో లెవెలింగ్ పనులు చేపట్టిన వర్సిటీ యాజమాన్యంపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ అండతోనే ఎంపీ భరత్ చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. తక్షణం భూములు వెనక్కి తీసుకోవాలని భారీగా గ్రీవెన్స్కు ఫిర్యాదులు తీసుకొచ్చారు. దీంతో కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. ఏం చేయాలో పాలుపోని అధికారులు కంప్యూటర్లు పనిచేయడం లేదంటూ మీనమేషాలు లెక్కించారు. పోలీసులు ప్రజలపై జులుం ప్రదర్శించేందుకు యత్నించారు. దీంతో అధికారుల తీరుకు నిరసనగా ప్రజలు ఒక్కసారిగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ ముందు వైఎస్సార్సీపీ నేతలతో కలిసి బైఠాయించారు. ఫలితంగా జన నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫిర్యాదులు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలు అధికారులను నిలదీశారు. దీంతో దిగొచ్చిన అధికారులు ఎట్టకేలకు 200 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భరత్పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలి : కేకే రాజు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ అండతోనే విశాఖ టీడీపీ ఎంపీ భరత్ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో రాకముందే రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి లెవెలింగ్ పనులు చేపడుతున్న భరత్పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ జిల్లాలో జరిగిన భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుని సుమారు 2 వేల ఎకరాల భూమిని సంరక్షించిందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా గీతం ఆక్రమించిన రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాలకు పైగా భూమిని అప్పట్లో స్వాధీనం చేసుకుని అందులో ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇంకా 14 ఎకరాలకుపైగా భూమిపై కోర్టులో కేసు పెండింగ్లో ఉందని, తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని కోర్టు స్టేటస్ కో ఇచ్చిందని వివరించారు. అయినప్పటికీ అధికారుల అండతో బోర్డులు పీకేసీ గీతం యాజమాన్యం లెవెలింగ్ పనులు చేపట్టడం ఏమిటని కేకే రాజు మండిపడ్డారు. బోర్డులు తొలగించిన గీతం యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు తెలుసుకుని భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సిన ఎంపీ.. తమ తాతల కాలం నుంచి ఆక్రమించామని, తమకు ఇచ్చేయాలని మీడియా ముందే నిస్సిగ్గుగా చెప్పడం గర్హనీయమన్నారు. గీతం భూకబ్జాపై కలెక్టరేట్లో గ్రీవెన్స్కు ప్రజలు భారీగా తరలివస్తే అధికారులు ఫిర్యాదులను స్వీకరించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పోలీసుజులుం ద్వారా తమ పోరాటాన్ని అణిచివేయాలని యత్నిస్తున్నారని కేకే రాజు మండిపడ్డారు. గీతం భూకబ్జాపై ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. గీతం యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ కూటమి నాయకులకు బానిసలు కాదని ఆయన ధ్వజమెత్తారు. భూములను పరిరక్షించాలి : వాసుపల్లి గణేశ్మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ... టీడీపీ నాయకుల అవినీతి కేంద్రానికి మాయని మచ్చగా మిగులుతుందని హెచ్చరించారు. తక్షణం ఎంపీ భరత్ను జైల్లో పెట్టి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవాన్రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ఏపీ ‘ఎకో సిస్టం’ ఇక ఇంతేనా?
ఇయర్ఫోన్ల వాడకంలో ఈ తప్పు చేస్తున్నారా?
ఢీ కొట్టి.. 200 మీటర్లు ఈడ్చుకెళ్లి
యశ్ వల్లనే 'టాక్సిక్' వాయిదా.. యుద్ధం సాకు మాత్రమేనా?
ముగిసిన నిరీక్షణ.. భారత్ను వీడనున్న సౌతాఫ్రికా, విండీస్ జట్లు
దా‘రుణ’మైన ‘పెళ్లి కానుక’
ఊపిరి తీసిన ఊయల
పాపం పాకిస్తాన్..! మరోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్
యూఏఈ కాన్సులేట్పై డ్రోన్ దాడి
అక్రమార్కులపై రామబాణం సంధిస్తారా!
గ్యాస్ సిలిండర్ బుకింగ్.. కొత్త రూల్స్!
100 ఎకరాలు ఉంటే చెప్పండి: మీనాక్షి
మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..
భారీగా పెరిగిన గ్యాస్ ధరలు - యుద్ధంతో భగ్గుమన్న ధరలు
ఉగాదికి 'అల్లు సినిమాస్' ప్రారంభం.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పతనమైన వెండి.. రూ.35 వేలు తగ్గిన రేటు!
254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ పేసర్
ప్రేమలో పడ్డ కోర్ట్ జంట? రోషన్, శ్రీదేవి రియాక్షన్ ఇదే!
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్లో నీటి యుద్ధం మొదలైందా?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
వరల్డ్కప్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
పాత బంగారు లోకం
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
బుజ్జి అభిమానిని సర్ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ
పడిపోయిన పసిడి ధరలు.. వారమంతా ఆనందమే!
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
లక్కీ కెప్టెన్!
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు.. ఆకస్మిక ధనలబ్ధి
ఏపీ ‘ఎకో సిస్టం’ ఇక ఇంతేనా?
ఇయర్ఫోన్ల వాడకంలో ఈ తప్పు చేస్తున్నారా?
ఢీ కొట్టి.. 200 మీటర్లు ఈడ్చుకెళ్లి
యశ్ వల్లనే 'టాక్సిక్' వాయిదా.. యుద్ధం సాకు మాత్రమేనా?
ముగిసిన నిరీక్షణ.. భారత్ను వీడనున్న సౌతాఫ్రికా, విండీస్ జట్లు
దా‘రుణ’మైన ‘పెళ్లి కానుక’
ఊపిరి తీసిన ఊయల
పాపం పాకిస్తాన్..! మరోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్
యూఏఈ కాన్సులేట్పై డ్రోన్ దాడి
అక్రమార్కులపై రామబాణం సంధిస్తారా!
గ్యాస్ సిలిండర్ బుకింగ్.. కొత్త రూల్స్!
100 ఎకరాలు ఉంటే చెప్పండి: మీనాక్షి
మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..
భారీగా పెరిగిన గ్యాస్ ధరలు - యుద్ధంతో భగ్గుమన్న ధరలు
ఉగాదికి 'అల్లు సినిమాస్' ప్రారంభం.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పతనమైన వెండి.. రూ.35 వేలు తగ్గిన రేటు!
254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ పేసర్
ప్రేమలో పడ్డ కోర్ట్ జంట? రోషన్, శ్రీదేవి రియాక్షన్ ఇదే!
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్లో నీటి యుద్ధం మొదలైందా?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
వరల్డ్కప్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
పాత బంగారు లోకం
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
బుజ్జి అభిమానిని సర్ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ
పడిపోయిన పసిడి ధరలు.. వారమంతా ఆనందమే!
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
లక్కీ కెప్టెన్!
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు.. ఆకస్మిక ధనలబ్ధి
ఫొటోలు
కాబోయే భార్యని పరిచయం చేసిన హీరో బెల్లంకొండ (ఫొటోలు)
చీరలో పవర్ఫుల్గా హీరోయిన్ ధన్సిక (ఫొటోలు)
సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు (ఫొటోలు)
#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్ హైలైట్స్.. (ఫొటోలు)
టీ–20 వరల్డ్ కప్ : హైదరాబాద్ లో క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
గ్రాండ్గా హీరోయిన్ శ్రద్ధాదాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)
'మృత్యుంజయ్' థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 08-15)
తమిళనాడు డివోషనల్ ట్రిప్లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)
సినిమా
ఓటీటీలో క్రేజీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమా.. తెలుగు రివ్యూ
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు సంగతి పక్కనబెడితే ఓటీటీల్లోనూ నేరుగా కొన్ని మూవీస్ స్ట్రీమింగ్లోకి వస్తుంటాయి. అలా గత వీకెండ్ వచ్చిన హాలీవుడ్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'వార్ మెషీన్'. నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ దృష్టిలో పడింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఇది నిశ్చితార్థం కాదు.. షాకిచ్చిన హీరో బెల్లంకొండ.. కాబోయే భార్య ఫొటోలు)కథేంటి?అది అఫ్ఘానిస్తాన్లోని ఓ ప్రాంతం. పాడపోయిన తన తమ్ముడి ఆర్మీ కాన్వాయ్ బాగు చేసేందుకు అమెరికన్ ఆర్మీకి చెందిన స్టాఫ్ సార్జెంట్ (అలెన్ రిచ్సన్) వస్తాడు. సరిగ్గా అప్పుడే తాలిబన్లు వీరిపై దాడి చేస్తారు. దీని నుంచి సార్జెంట్ మాత్రమే ప్రాణాలతో బయటపడతాడు. తర్వాత అమెరికన్ ఆర్మీలోని అత్యంత కష్టమైన రేంజర్ కావాలనుకుంటాడు. నాలుగుసార్లు తిరస్కరణకు గురైనా సరే చివరకు ట్రైనింగ్కి ఎంపికవుతాడు. శిక్షణలో భాగంగా చివరి దశకు చేరుకుంటాడు. చిట్టచివరి పరీక్షలో పాసైతే చాలు అనుకుంటున్న తరుణంలో ఊహించని ఘటనలు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటి? సార్జెంట్.. ఏలియన్ షిప్తో ఎందుకు తలపడాల్సి వచ్చింది? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు గానీ దీన్ని థియేటర్లో విడుదల చేసుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అలాంటి అనుభూతిని ఇచ్చింది. ఎందుకంటే 100 నిమిషాలున్న ఈ మూవీ.. మొదటి సీన్ నుంచి చివరవరకు అసలు గ్యాప్ అనేది లేకుండా అదరగొట్టేసింది. ఓవైపు యాక్షన్ చూపిస్తూనే.. మరోవైపు ఏలియన్ షిప్ చేస్తున్న దాడి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనే పాయింట్ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.అసలు అమెరికన్ ఆర్మీ ఎలా ఉంటుంది? ఆర్మీలోని రేంజర్ కావాలంటే ఎలాంటి పరీక్షలు పెడతారు? ఎంతలా కష్టపడాల్సి వస్తుందనే విషయాల్ని ఇంట్రెస్టింగ్ గా చూపించారు. హీరోతో సహా మిగతా పాత్రధారులు ఎవరూ కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అయినా సరే చివరివరకు ఆపకుండా చూసేంత ఎంగేజింగ్గా మూవీని తెరకెక్కించారు.సింపుల్గా తేల్చేయొచ్చు అనుకునే పరిస్థితుల్లో ఊహించని విధంగా ఏలియన్ షిప్ దాడి చేసి.. కనిపించిన వాళ్లని కనిపించినట్లు చంపేస్తుంటే.. హీరో తను బయటపడటంతో పాటు మరో వ్యక్తిని ఎలా రక్షించాడు. చివరకు బతికి బట్టకట్టడంతో పాటు రేంజర్ అయ్యాడా లేదా అనేది తెలియాలంటే ఫుల్ మూవీ చూసేయాల్సిందే.మిలటరీ కాన్సెప్ట్, యాక్షన్-సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ అంటే ఆసక్తి ఉంటే మాత్రం దీనిపై లుక్కేయండి. కచ్చితంగా నచ్చేస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ప్రధాన పాత్ర చేసిన రిచ్సన్ తనదైన యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. ఓటీటీలో ఏదైనా ఓ మంచి యాక్షన్ మూవీ చూద్దానుకుంటే మాత్రం ఇదో బెస్ట్ ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: పనిచేసినా రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన)
ఇది నిశ్చితార్థం కాదు.. షాకిచ్చిన హీరో.. కాబోయే భార్య ఫొటోలు
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఆదివారం ఉదయం కావ్యరెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి కూడా. అయితే తామిద్దరి మధ్య జరిగింది ఎంగేజ్మెంట్ కాదని చెప్పి ఈ హీరో షాకిచ్చాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టడంతో పాటు తనకు కాబోయే భార్య ఫొటోలని కూడా పంచుకున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్)నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకు శ్రీనివాస్.. 'అల్లుడు శ్రీను' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. అడపాదడపా మూవీస్ చేస్తున్నప్పటికీ హిట్ రాలేదు. రాక్షసుడు, జయ జానకి నాయక లాంటి ఒకటి రెండు మూవీస్ మాత్రమే సక్సెస్ అయ్యాయి. గతేడాది 'కిష్కింధపురి', 'భైరవం' చిత్రాలతో వచ్చాడు. ప్రస్తుతం ఓ మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అయితే శ్రీనివాస్ చాన్నాళ్ల నుంచి హైదరాబాద్కి చెందిన కావ్యరెడ్డితో ప్రేమలో ఉన్నాడని, ఎంగేజ్మెంట్ అంటూ వార్తలొచ్చాయి. అంతా అదే అనుకున్నారు. కానీ ఇది కేవలం తమ ఫ్యామిలీ అనౌన్స్మెంట్ అని, నిశ్చితార్థం-పెళ్లి లాంటి శుభకార్యాలన్ని త్వరలో జరుగుతాయని తాజా ఇన్ స్టా పోస్టులో రాసుకొచ్చాడు.'నా కావ్యమ్మకు.. జీవితానికి తనకంటూ ఓ అందమైన టైమ్ ఉంటుంది. నా జీవితంలోకి ఆ సమయం నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. సరైన టైంలో నా లైఫ్లోకి వచ్చి నన్ను నమ్మి, నా రోజులని ఎంతో ఆనందంగా, పాజిటివ్గా చేసినందుకు థ్యాంక్స్. నీ ముఖంపైనున్న ఆ నవ్వు ఎప్పటికీ మాయమవకుండా చూసుకుంటాను. మనం ఎప్పటికీ కలిసుండే ఆ జీవితం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను' అని బెల్లంకొండ శ్రీనివాస్ రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: మగాళ్లు మా సినిమా చూడకపోయినా పర్వాలేదు: మంచు లక్ష్మీ) View this post on Instagram A post shared by Sreenivas bellamkonda (@sreenivasbellamkonda)
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్
వచ్చేవారం ఉగాది కానుకగా 'ధురంధర్ 2', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ఈ వారం బాక్సాఫీస్ని ఖాళీగానే వదిలేశారు. రావాల్సిన 'బ్యాండ్ మేళం' కూడా వాయిదా పడింది. దీంతో కొత్త మూవీసేం రావట్లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం స్టార్ హీరోలు చేసిన తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి. మొత్తంగా 15 వరకు ఉండటం విశేషం.(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్!)ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', విశ్వక్ సేన్ 'ఫంకీ', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు జూటోపియా 2, ద తాజ్ స్టోరీ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 9 నుంచి 15 వరకు)నెట్ఫ్లిక్స్వన్ పీస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 10మేడిన్ కొరియా (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 12వర్జిన్ రివర్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 12ఫంకీ (తెలుగు సినిమా) - మార్చి 12అమెజాన్ ప్రైమ్ఆస్పిరెంట్స్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మార్చి 13లోకల్ టైమ్స్ (తమిళ సిరీస్) - మార్చి 13హాట్స్టార్రిసార్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మార్చి 13ద సొసైటీ సీజన్ 2 (హిందీ రియాలిటీ సిరీస్) - మార్చి 09జూటోపియా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 13ద ఫ్యామిలీ మెక్ములెన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15జీ5పూకీ (తమిళ సినిమా) - మార్చి 13భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు మూవీ) - మార్చి 13అంధ ప్యార్ 2.0 (రియాలిటీ షో) - మార్చి 14లయన్స్ గేట్ ప్లేద తాజ్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 13ఎమ్ఎక్స్ ప్లేయర్సంకల్ప్ (హిందీ సిరీస్) - మార్చి 11సన్ నెక్స్ట్నాంగళ్ (తమిళ సినిమా) - మార్చి 13ఫ్రైడే (తమిళ మూవీ) - మార్చి 13(ఇదీ చదవండి: నటుడు పార్తిబన్ పరువు తీసేసిన త్రిష.. ట్వీట్ వైరల్)
మిషన్ నొక్కితే డబ్బే డబ్బు.. కాన్ సిటీ టీజర్ చూశారా?
డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు. దాదాపు అలాంటి కాన్సెప్ట్తో వస్తున్న తమిళ సినిమా "కాన్ సిటీ". కాకపోతే ఇక్కడ డబ్బులు చెట్లకు కాకుండా ఓ మిషన్కు కాస్తున్నాయి. అవును, బటన్ నొక్కితే చాలు లిమిట్ అనేదే లేకుండా ఎన్నిసార్లంటే అన్నిసార్లు డబ్బులు ప్రింట్ చేస్తూనే ఉంది.డబ్బులు ప్రింట్ చేసే మిషన్సోమవారం సాయంత్రం కాన్సిటీ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో.. డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావని ఓ గంభీర స్వరం ఫోన్లో హీరోను నిలదీస్తుంది. దాంతో అసహనానికి లోనైన హీరో వస్తువులన్నింటినీ కిందపడేస్తాడు. అప్పుడే ఒక మిషన్ను సైతం కిందపడేయబోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పిడుగు పడి యంత్రం ఆన్ అవుతుంది, అందులో నుంచి రూ.500 నోటు బయటకు వస్తుంది. ఇంకేముంది.. నొక్కిన ప్రతిసారి నోట్ల వర్షం కురుస్తూనే ఉంటుంది.చేతులు మారిన యంత్రందాంతో ఆ డబ్బంతా బ్యాగులో సర్దుకున్న హీరో ఆ యంత్రాన్ని జాగ్రత్తగా అల్మారాలో పెడతాడు. కట్ చేస్తే బట్టలు సర్దే సమయంలో భార్యకు ఆ మిషన్ కనిపిస్తుంది. బటన్ నొక్కితే డబ్బు వస్తుండటంతో దాన్ని తీసుకెళ్లి వంటగదిలో దాచేస్తుంది. అక్కడి నుంచి అది హీరో తల్లి చేతికి వెళ్తుంది. ఆమె దాన్ని పూజగదిలో దేవుడి ఫోటో వెనకాల భద్రపరుస్తుంది. తర్వాత సడన్గా మిషన్ కనిపించకుండా పోతుంది. వీధిలో నోట్ల వర్షంఇంటిల్లిపాది అంతా వెతుకుతారు. తీరా చూస్తే హీరో కొడుకు ఆ యంత్రంతో బాల్కనీలో ఆడుకుంటాడు. ఇంకేముంది, నడిరోడ్డులో డబ్బుల వర్షం.. దాన్ని దక్కించుకునేందుకు వీధిలో జనం ఎగబడుతుంటారు. మరిం తర్వాతేం జరిగిందో తెలియాలంటే కాన్ సిటీ చూడాల్సిందే! హరీశ్ దురైరాజ్ దర్శకత్వం వహించిన ఈ డిఫరెంట్ మూవీకి సేన్ రోల్డన్ సంగీతం అందించాడు. అర్జున్ దాస్, అన్నాబెన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రాన్ని టీ సిరీస్ తెలుగులో తీసుకురానుంది.
క్రీడలు
కావాల్సింది భారత్ విజయాలు
⇒ భారత జట్టు ప్రదర్శన, టోర్నీ అసాంతం ఆడిన తీరు అద్భుతం. అహ్మదాబాద్లో మన జట్టు చరిత్ర సృష్టించింది. (ఎప్పుడు గంభీరంగా ఉండే గౌతీని ఉద్దేశించి) కోచ్ సాబ్... మీ ముఖంపై ఈ చిరునవ్వు బాగుంది. గెలుపు కోసం తపించిన మీ పట్టుదల, ఈ చిద్విలాసం రెండు కిల్లర్ కాంబినేషన్. బుమ్రా చాంపియన్ బౌలర్. అతని గురించి ఓ ముక్కలో సరిపెట్టలేను. ఓ వాక్యంలో పూర్తి చేయలేను. ⇒ రెండేళ్ల తర్వాత ధోని ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఈ పోస్ట్కు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా ధోని, గంభీర్ అభిమానులైతే తెగ రీట్వీట్ చేసుకుంటున్నారు.అహ్మదాబాద్: తాజా ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదిస్తున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనకు వ్యక్తిగత మైలురాళ్ల కంటే భారత జట్టు ఘనవిజయాలే ముఖ్యమని అన్నాడు. విజయానంతరం కోచ్ మాట్లాడుతూ ‘మన జట్టు ట్రోఫీలతో సంబరాలు చేసుకోవాలి... వ్యక్తిగత ఘనతలతో కాదు’ అని కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తను పదవిలో ఉన్నంత కాలం సమష్టి విజయాలపైనే దృష్టి ఉంటుందని అన్నాడు. ఒకట్రెండు మెగా ట్రోఫీలతో, లేదంటే విజయాలతో భారత శకం మొదలైనట్లుగా భావించనన్నాడు. సోషల్ మీడియా చెత్తని పట్టించుకోనని తేలిగ్గా తీసిపారేశాడు. నమ్మకంతోనే జట్టును నిర్మించాలి, అంచనాలతో కాదని స్పష్టం చేశాడు. పలు అంశాలపై మీడియాతో గంభీర్ పంచుకున్న అభిప్రాయాలు అతని మాటల్లోనే... ఆటగాళ్లపై ఉండాల్సింది నమ్మకం ఏదైనా జట్టు నమ్మకంతో ఎదగాలి. అంచనాలతో కాదు. అంటే ఆటగాళ్ల ఎంపికైనా... జట్టు నిర్మాణమైనా... ఈ రెండింటిలో కామన్ పాయింట్ ఒకటే. అదే రాణిస్తారనే నమ్మకం. ఈ పునాదితోనే జట్టును నిర్మిస్తాం. అంతే కానీ ఫలానా ఆటగాడు ఈ పూటకు మెరిపిస్తాడు లేదంటే ఈ మ్యాచ్లో గట్టెక్కిస్తాడనే అంచనాలతో జట్టును నిర్మించడం సాధ్యపడదు. ఒక్కసారి నమ్మకం ఏర్పడితే ఒకటి అర వైఫల్యంతో కూలిపోదు. సంజూ సామ్సన్, అభిõÙక్, ఇషాన్ కిషన్లు కూడా విఫలమయ్యారు. కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. అందువల్లే జట్టులో కొనసాగారు. విజయవంతమయ్యారు. సోషల్ మీడియాను పట్టించుకోను అదేపనిగా విమర్శల్ని లేదంటే ప్రతికూల వార్తల్ని వైరల్ చేసే సోషల్ మీడియాను, పనికిరాని నెటిజన్ల పోస్టుల్ని పట్టించుకోను. కోచ్గా నేను జవాబుదారీగా ఉండాలనుకునేది ఈ 30 మందికే (డ్రెస్సింగ్ రూమ్లో భాగమయ్యే ప్లేయర్లు)! పరిమిత ఓవర్ల శకం మాదే అనుకోను అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ శకం మొదలైందని నేను అనుకోను. మా ఆధిపత్యం మొదలైనట్లయితే మేం గత మూడు వన్డే సిరీస్లలో రెండు ఎలా ఓడిపోతాం. ప్రత్యేకించి ఐసీసీ క్రికెట్ టోర్నిల్లో మాత్రం భారత్ ఆధిపత్యాన్ని అంగీకరిస్తాను. 2024లో టి20 ప్రపంచకప్, 2025లో చాంపియన్స్ ట్రోఫీ, 2026లో టి20 వరల్డ్కప్ ఇలా ఏడాదికో ఐసీసీ ట్రోఫీ చొప్పున భారత్ గెలుచుకుంది. లక్ష్మణ్, ద్రవిడ్లకు థ్యాంక్స్ముఖ్యంగా ఈ తాజా కప్ను నా కన్నా ముందు హెడ్ కోచ్గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్కు, బీసీసీఐ ఎక్సలెన్సీ కేంద్రం (సీఓఈ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్లకు అంకితమిస్తున్నా. కొన్నేళ్లపాటు అంకితభావంతో శ్రమించిన ద్రవిడ్ టీమిండియాను ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా మార్చాడు. అలాగే ఆటగాడిగా భారత్కు విజయాలందించిన లక్ష్మణ్ ఇప్పుడు బెంగళూరులో కుర్రాళ్లకు సరైన మార్గదర్శనం చేస్తున్నాడు.2028లో ‘హ్యాట్రిక్’, బంగారమాయేనా... భారత జట్టు సభ్యులందరూ గెలుచుకున్న వరుస ప్రపంచకప్లతో అంబరాన్నంటే సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుత జట్టు సభ్యుల సగటు వయసు 30. అంటే ఇంకో రెండేళ్లలో జరిగే మెగా ఈవెంట్కు దాదాపు వీరే ఉండటం ఖాయం. నిజానికి కెపె్టన్ సూర్యకుమార్ రిటైర్మెంట్పై ఊహాగానాలు వినిపించినా విజయానంతరం స్వయంగా అతనే వాటిని తోసి పుచ్చాడు. ప్రస్తుతానికి పక్కన బెట్టినా... 2028 వరకైతే సూర్య కొనసాగడం ముమ్మాటికి కష్టమే! ఇక ఆ ఏడాది (2028) భారత క్రికెట్కు అత్యంత కీలకం కానుంది.ఓవైపు ఆ్రస్టేలియా–న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్లో ‘హ్యాట్రిక్’ టైటిల్ ఊరిస్తుంటే... ప్రతిష్టాత్మక లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ కూడా జరుగనున్నాయి. ఇందులోనూ చాంపియన్ అయితే మాత్రం 2028 మనకి బంగారమవుతుంది! ఆదివారం రాత్రి కప్తో పిచ్పై కూర్చున్న కెపె్టన్ సూర్యకుమార్ ఫొటోలకు పోజులిస్తూ తమ తదుపరి లక్ష్యం ఒలింపిక్స్ స్వర్ణం, మరో టి20 ప్రపంచకప్ గెలవడమనే చెప్పాడు. ఆదివారం రాత్రి విన్నర్స్ ట్రోఫీ బహుమతి ప్రదానోత్సవం తర్వాత భారత క్రికెటర్లు తమ కుటుంబసభ్యులతో మైదానంలో ఉల్లాసంగా గడపడంతోపాటు ట్రోఫీతో ఫొటోలు దిగారు. సోమవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి పలువురు ఆటగాళ్లు తమ స్వస్థలాలకు బయలుదేరారు.
శ్రీలంక హెడ్ కోచ్గా టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తి
తాము సంయుక్తంగా (భారత్తో పాటు) ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్-2026లో ఘోరంగా విఫలమైన (సూపర్-8 దశలో నిష్క్రమణ) తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు ప్రక్షాళన చేపట్టింది. టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తిని హెడ్ కోచ్గా ఎంపిక చేసుకుంది. అతని పేరు గ్యారీ కిర్స్టన్. ఈ సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ 2011లో టీమిండియాను జగజ్జేతగా (హెడ్ కోచ్గా) నిలిపాడు.పొట్టి ప్రపంచకప్ వైఫల్యాల నేపథ్యంలో అప్పటివరకు హెడ్ కోచ్గా ఉండిన సనత్ జయసూర్య తన పదవికి రాజీనామా చేయడంతో లంక క్రికెట్ బోర్డు కిర్స్టన్ను ఎంపిక చేసింది. కిర్స్టన్ రెండేళ్ల ఒప్పందంలో భాగంగా ఏప్రిల్ 15న బాధ్యతలు చేపడతారు. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా లంక క్రికెట్ కిర్స్టన్ నియామకం చేపట్టింది.కిర్స్టన్ను హెడ్ కోచ్గా మంచి ట్రాక్ ఉంది. అంతర్జాతీయంగా, ఐపీఎల్లో అతను విజయవంతమైన జట్లకు కోచ్గా వ్యవహరించాడు. భారత్ను వన్డే ప్రపంచ ఛాంపియన్గా నిలపడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి కూడా చేర్చాడు. అలాగే తన సొంత జట్టు దక్షిణాఫ్రికాకు కూడా విజయవంతంగా సేవలందించాడు. అతని కెరీర్లో ఏదైనా ఫెయిల్యూర్ ఉందా అంటే అది పాకిస్తాన్ వైట్ బాల్ జట్టుకు కోచ్గా సేవలందించడమే. పాక్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే అతను రాజీనామా చేశాడు (బోర్డు మరియు ఆటగాళ్లతో విభేదాల కారణంగా).ఐపీఎల్లో కిర్స్టన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలతో పని చేశారు. టైటాన్స్ 2022లో తొలి సీజన్లోనే టైటిల్ గెలిచినప్పుడు అతను బ్యాటింగ్ కోచ్గా ఉన్నారు. 2027 వన్డే ప్రపంచకప్కు శ్రీలంకను నేరుగా అర్హత సాధించేలా చేయడమే కిర్స్టన్ ప్రధాన లక్ష్యం. లంక క్రికెట్ కొద్ది రోజుల క్రితమే తమ మహిళల జట్టు కోచ్ను ( జేమీ సిడ్డన్స్) కూడా మార్చింది.
ఈ విజయం వారిద్దరికీ అంకితం: గంభీర్
టీమిండియా సొంతగడ్డపై టి20 ప్రపంచకప్ విజేతగా నిలవడంతో హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ పేరు మారుమోగుతోంది. మొన్నటి వరకు అతడిని తిట్టిపోసిన వారు కూడా ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా క్రెడిట్ అంతా గౌతీదేనని పొగుడుతున్నారు. గంభీర్ మాత్రం ఇద్దరు దిగ్గజాల పేర్లు చెప్పాడు. మెన్ ఇన్ బ్లూ విజయాల వెనుక వీరిద్దరూ ఉన్నారని మీడియా ముఖంగా ప్రకటించాడు.మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడాడు గంభీర్. టీమిండియా టి20 ప్రపంచకప్ విజయాన్ని ఎవరికి అంకితం చేస్తారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు గంభీర్ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చాడు. ఎవరూ ఊహించని పేర్లు చెప్పాడు. వారే రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్. టీమిండియా విజయాల్లో వీరిద్దరి పాత్ర ఎంతో ఉందని గంభీర్ గుర్తు చేసుకున్నాడు."టి20 ప్రపంచకప్ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్లకు అంకితం చేస్తున్నాను. భారత జట్టును ద్రవిడ్ ఒక స్థానంలో ఉంచారు. అలాగే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను లక్ష్మణ్ క్రమపద్ధతిలో నడిపిస్తూ జట్టుకు విలువైన సేవలు అందిస్తున్నార"ని గంభీర్ పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్.. గంభీర్ కంటే టీమిండియా హెచ్కోచ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.వారిద్దరికీ కృతజ్ఞతలుఐసీసీ ప్రస్తుత చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జైషా తనకు కష్టకాలంలో అండగా నిలిచారని వెల్లడించారు. గతేడాది స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్నప్పుడు జైషా దన్నుగా నిలిచారని తెలిపాడు. ఎన్ని విమర్శలు వచ్చినా నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ను పొగిడారు. వీరిద్దరికీ గంభీర్ కృతజ్ఞతలు చెప్పాడు.భయాన్ని వదులుకోవాలితాను తన జట్టుకు జవాబుదారిగా ఉంటానని, సోషల్ మీడియాలోని వ్యక్తులకు కాదని గంభీర్ స్పష్టం చేశాడు. టీమ్ వల్లే తాను కోచ్ కాగలిగానని అన్నాడు. ఓడిపోతామనే భయాన్ని ముందుగా వదులుకోవాలని అభిప్రాయపడ్డాడు. సెమీస్, ఫైనల్లో 250 పరుగులు చేయాలంటే ధైర్యం చూపించాల్సిందేనన్నారు. ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డుల కంటే ట్రోఫీలు గెలవడానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు. తానేప్పుడు నమ్మకం ఆధారంగానే జట్టు సభ్యులను ఎంపిక చేస్తానని చెప్పాడు. చదవండి: సంజు, బుమ్రానే కాదు.. వారిద్దరూ కూడా హీరోలే!
T20 WC 2026 Final: అరువు తెచ్చుకున్న బ్యాట్తో అరిపించాడు..!
నిన్న (మార్చి 8) జరిగిన టీ20 వరల్డ్కప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో పొట్టి ప్రపంచకప్ను (2024, 2026), ఓవరాల్గా మూడో పొట్టి ప్రపంచకప్ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.ఫైనల్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చెలరేగి ఏకపక్ష విజయాన్ని సాధించారు. ముఖ్యంగా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టించారు. పవర్ ప్లేలో భారత బ్యాటర్లు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశారు.వరుస వైఫల్యాల తరువాత ఈ మ్యాచ్లో అభిషేక్ విలయతాండవం చేశాడు. కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ తన ఈ అద్భుత ఇన్నింగ్స్ వెనుక ఉన్న ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ను అతను సహచరుడు శివమ్ దూబే నుంచి అరువు తెచ్చుకున్న బ్యాట్తో ఆడినట్లు పేర్కొన్నాడు.అభిషేక్ మాటల్లో.. ఇవాళ నేను శివమ్ దూబే బ్యాట్తో ఆడాను. ఉదయం ఏదో కొత్తగా ప్రయత్నించాలని అనిపించింది. శుభ్మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో దూబే దగ్గరికి వెళ్లి అతని బ్యాట్ తీసుకున్నానని చెప్పాడు. ప్రస్తుత ప్రపంచకప్లో అభిషేక్ భారీ అంచనాల నడుమ బరిలోకి దిగి ఆరంభ మ్యాచ్లలో ఘోరంగా విఫలమయ్యాడు. హ్యాట్రిక్ డకౌట్లు సహా పేలవ ప్రదర్శనలు చేశాడు. అయితే కీలకమైన ఫైనల్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చి భారత్ భారీ స్కోర్ చేయడానికి పటిష్ట పునాది వేశాడు. సంజూ శాంసన్తో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్ దశనే మార్చేసింది. ఇలాంటి కీలక ఇన్నింగ్స్ను అతను అరువు తెచ్చుకున్న బ్యాట్తో ఆడటం విశేషం. అభిషేక్కు ముందు నుంచి సెంటిమెంట్లు ఎక్కువ. ఇదే ప్రపంచకప్లో వరుసగా విఫలమవుతున్నాడని ఓ మ్యాచ్లో సిరాజ్ జెర్సీ ధరించి బరిలోకి దిగాడు. అంతకుముందు కూడా టీమిండియా వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాట్తో పలు సందర్భాల్లో ఆడాడు. ఫైనల్గా ఫైనల్లో అరువు తెచ్చుకున్న బ్యాట్తో అరిపించి, భారత్ జగజ్జేతగా అవతరించడంలో తనవంతు పాత్ర పోషించాడు.
న్యూస్ పాడ్కాస్ట్
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
భవిష్యత్ అభివృద్ధి శూన్యం... ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్. సెమీస్లో 7 పరుగులతో ఇంగ్లండ్పై గెలుపు
హాజరైన సెలబ్రిటీలు... విరోష్ రిసెప్షన్ కు
‘లడ్డూ’పై బాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. శాసన మండలిలో చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు
స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెద్ది
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలపై ఆటవిక దాడి... మహిళా దినోత్సవ వేళ చంద్రబాబు మార్కు గిఫ్ట్
తీవ్రరూపం దాలుస్తున్న పశ్చిమాసియా యుద్ధం... ఇరాన్కు అండగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు...
బిజినెస్
మార్కెట్ పై క్రూసేడ్!
విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమనడంతో దేశీయంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. పశ్చిమాసియాలో చమురు క్షేత్రాలపై దాడులతో చమురు ధరలు తొలుత పీపాకు 30 శాతంపైగా ఎగశాయి. దీంతో ప్రారంభంలో 2,494 పాయింట్లకుపైగా పడిపోయిన సెన్సెక్స్ చివరికి 1,353 పాయింట్లు కోల్పోయి 77,566 వద్ద ముగిసింది. మొదట్లో 753 పాయింట్లు పతనమైన నిఫ్టీ సైతం.. చివరికి 422 పాయింట్ల క్షీణతతో 24,028 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 76,425 దిగువకు చేరగా.. నిఫ్టీ 23,698 వద్ద కనిష్టాన్ని తాకింది. దీంతో ఒక్క రోజులో బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 8 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది. ధరల మంట... లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ ధర ఉదయం 120 డాలర్లను తాకింది. న్యూయార్క్లో లైట్ స్వీట్ క్రూడ్ సైతం 119.5 డాలర్లకు చేరడంతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆందోళనలు తలెత్తాయి. వెరసి దాదాపు అన్ని రంగాలలోనూ అమ్మకాలకు పరుగుతీశారు. అయితే మిడ్సెషన్కల్లా చమురు ధరలు కాస్త ఉపశమించాయి. మరోపక్క యూఎస్ మార్కెట్ల ఫ్యూచర్స్ నష్టాలు సైతం సగానికి తగ్గాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లలో కొంతమేర రికవరీ కనిపించింది. గత వారం నైమెక్స్ క్రూడ్ 36 శాతం, బ్రెంట్ 28 శాతం జంప్ చేయడం తెలిసిందే. అమ్మకాల షాక్: ఎన్ఎస్ఈలో ఐటీ నష్టపోకుండా నిలదొక్కుకోగా.. ఆటో, పీఎస్యూ, ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్అండ్ గ్యాస్, కెమికల్స్ 4–2% మధ్య పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, టీఎంపీపీ, మారుతీ, ఎంఅండ్ఎం, ఐషర్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ, కొటక్ బ్యాంక్ 5.3–3.5% మధ్య పతనమయ్యాయి. అయితే విప్రో, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ 1.6–0.6 మధ్య బలపడ్డాయి. చిన్న షేర్లు డీలా బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతంపైగా నీరసించాయి. చమురు మంటతో టైర్లు, ఆటోమొబైల్, పెయింట్లు, ఎయిర్లైన్స్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ధరలకు రెక్కలురానుండటంతో ఆర్బీఐ కఠినతర విధానాలవైపు మొగ్గు చూపవలసి వస్తుందని తెలియజేశారు. దీంతో బ్యాంకింగ్ కౌంటర్లు సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు వివరించారు. ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం బలహీనపడటం సెంటిమెంటును దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. చమురు సెగతో చమురు దెబ్బకు ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ 6–4.3% మధ్య పడిపోయాయి. షాలిమార్, ఇండిగో, ఏషియన్, నెరోలాక్, బెర్జర్ పెయింట్స్ 4–2% మధ్య, జేకే, సియట్, ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్ 6–2% మధ్య క్షీణించాయి. ఏటీఎఫ్ వ్యయాలపై భయాలతో ఇంటర్గ్లోబ్ 4 శాతం పడింది.ఎఫ్పీఐల భారీ అమ్మకాలుయుద్ధ భయాలతో ఇటీవల దేశీ స్టాక్స్లో అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నగదు విభాగంలో తాజాగా రూ. 6346 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్ (డీఐఐలు) రూ. 9,014 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. ఈ నెల తొలి నాలుగు రోజుల్లో(2–6)నూ ఎఫ్పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించడం గమనార్హం.
బెంగళూరులో హోటళ్లు బంద్!?
వంటగ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఆకస్మిక అంతరాయం బెంగళూరు నగరంలోని హోటళ్లను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం కారణంగా ‘బెంగళూరు హోటల్స్ అసోసియేషన్’ సోమవారం కీలక ప్రకటన చేసింది. నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుండడంతో మంగళవారం బెంగళూరులోని హోటళ్లు మూతపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో రోజువారీ ఆహారం కోసం హోటళ్లపై ఆధారపడే వేలాది మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు, సీనియర్ సిటిజన్లు, వైద్య సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడనుంది.గతంలో చమురు కంపెనీలు కనీసం 50 రోజుల పాటు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చాయని, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరా ఆపివేయడం పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసిందని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు వెంటనే జోక్యం చేసుకుని, సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతల ప్రభావంఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మిడిల్ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరా గొలుసును దెబ్బతీసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం రిఫైనరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకుండా చూడాలని, ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు భారత్ ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, యూఏఈ వంటి దేశాల నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.Bengaluru Hotels to Shut Down From Tomorrow Amid Sudden Commercial Gas Supply CrisisBengaluruIn a major blow to the city’s food industry and daily commuters, the Bangalore #Hotels Association has announced a city-wide shutdown of hotels starting tomorrow. The decision comes… pic.twitter.com/h48xEbBHjh— Yasir Mushtaq (@path2shah) March 9, 2026పెరిగిన ధరల భారంమరోవైపు, సామాన్యుడిపై ధరల భారం మరింత పెరిగింది. శనివారం గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. సౌదీ అరేబియా ముడి చమురు ధరల కారణంగా వాణిజ్య సిలిండర్ల ధరలు కూడా అధికమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఎల్పీజీ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.ఇదీ చదవండి: డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు!
డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు!
డేటాతో పనిలేకుండా కేవలం కాలింగ్ ప్రయోజనాలు మాత్రమే కోరుకునే వారి కోసం రిలయన్స్ జియో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాల మేరకు వినియోగదారులపై అనవసరమైన డేటా భారాలను తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.చాలా కాలంగా టెలికాం కంపెనీలు వాయిస్ కాల్స్ను డేటాతో కలిపి విక్రయిస్తున్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ వాడకం లేని వారు కూడా అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. ‘వినియోగదారులకు తమకు నచ్చిన సర్వీసులను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి’ అన్న ట్రాయ్ సూచనతో జియో రూ.1,178, రూ.448 ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది.రూ.1,178 ప్లాన్..దీర్ఘకాలిక వాలిడిటీని కోరుకునే వారికోసం ఈ ప్లాన్ చాలా ఉపయోగమని కంపెనీ చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకు, కేవలం కాల్స్ కోసం ఫోన్ వాడే వారికి ఇది సరైన ఎంపికని తెలిపింది. దీని వాలిడిటీ 336 రోజులు. ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం వాలిడిటీ కాలానికి 3,600 ఎస్ఎంఎస్లు పొందవచ్చు.రూ.448 ప్లాన్..మూడు నెలల కాలపరిమితితో తక్కువ బడ్జెట్లో కాలింగ్ సేవలు పొందాలనుకునే వారికి ఇది అనుకూలమని కంపెనీ చెప్పింది. వాలిడిటీ 84 రోజులు. అపరిమిత వాయిస్ కాల్స్, మొత్తం 1,000 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అందులో ఇందులో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి యాడ్ ఆన్ సేవలకు యాక్సెస్ ఉంటుంది.డేటా కావాలంటే ఏం చేయాలి?ఈ ప్లాన్లలో ప్రాథమికంగా డేటా ఉండదు. అయితే, ఒకవేళ అత్యవసరంగా ఇంటర్నెట్ అవసరమైతే వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని జియో తెలిపింది. నేరుగా కంపెనీ అందిస్తున్న డేటా వోచర్లతో రీఛార్జ్ చేసుకోవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం!
బహ్రెయిన్ చమురు కేంద్రంపై ఇరాన్ దాడి
పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. గల్ఫ్ ప్రాంతంలో కీలకమైన ఇంధన కారిడార్ లక్ష్యంగా ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. బహ్రెయిన్లోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన ‘అల్-మామీర్’పై ఇరాన్ దాడికి పాల్పడింది. ఈ పరిణామంతో బహ్రెయిన్ ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ ‘బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ’ (బాప్కో) తన చమురు రవాణాపై ‘ఫోర్స్ మేజర్’(అదుపు చేయలేని అసాధారణ పరిస్థితులు) ప్రకటించింది.బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ అధికారిక సమాచారం ప్రకారం.. అల్-మామీర్ చమురు సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడిలో రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి. ఆస్తి నష్టం భారీగానే జరిగినప్పటికీ అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు ధ్రువీకరించారు. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర రక్షణ దళాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.‘ఫోర్స్ మేజర్’ అంటే ఏమిటి?చమురు వ్యాపార ఒప్పందాల్లో ఫోర్స్ మేజర్ అనేది అత్యంత కీలకమైన అంశం. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు లేదా నియంత్రించలేని అసాధారణ పరిస్థితులు సంభవించినప్పుడు.. ఒక కంపెనీ తన క్లయింట్లకు ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వస్తువులను (చమురు) సరఫరా చేయలేకపోతే ఈ నిబంధనను వాడుకుంటుంది. దీనివల్ల డెలివరీలో జాప్యం జరిగినా లేదా సరఫరా ఆగిపోయినా కంపెనీ(బాప్కో)పై ఎలాంటి చట్టపరమైన చర్యలు లేదా జరిమానాలు పడే అవకాశం ఉండదు.అంతర్జాతీయ సరఫరాలకు అంతరాయం కలిగినప్పటికీ బహ్రెయిన్ అంతర్గత మార్కెట్కు ఇంధన కొరత లేకుండా అత్యవసర ప్రణాళికల ద్వారా సరఫరాను కొనసాగిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.స్తంభించిన హార్ముజ్ జలసంధి..ఈ దాడి ప్రభావం కేవలం బహ్రెయిన్పైనే కాకుండా ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే చమురులో ఐదో వంతు రవాణా అయ్యే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ట్యాంకర్ల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా ట్యాంకర్లు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర భారీగా పెరిగింది. ఇది ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు మొదలైనప్పటి ధరల కంటే 60 శాతం అధికం కావడం గమనార్హం.ఇదీ చదవండి: నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం!
ఫ్యామిలీ
ఎవరీ నమ్రత స్టాన్లీ..? ఏకంగా వైన్ బ్రాండ్ని..
మహిళా సాధికారత, మహిళా చైతన్యం అని ఏవేవో చెబుతుంటారు గానీ ఇంకా వివక్ష తగ్గలేదనే గణాంకాలు చెబుతున్నాయి. అందుకు నిదర్శనంగా సమాజంలో జరుగుతున్న కొన్ని ఉదంతాలే ఉదాహరణ. వాటిని చూస్తే..ఇంకా ఏ కాలంలో ఉన్నామనే ఫీల్ కలుగుతుంది. మహిళలు పురుషులతో సమానమని పైపై మాటలుగా చెబుతుంటారే గానీ వాస్తవికంగా అది పూర్తి స్థాయిలో జరగదు. అయినప్పటికీ కొందరు ధీర వనితాలు.. ఆ మాటను అక్షరాల నిజం చేసి..అందర్నీ ఆశ్చర్యపరిచేలా సక్సెస్ని అందుకుంటున్నారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా వివక్ష, గృహహింసను ఎదుర్కొంటూనే అంచలంచెలుగా ఎదిగిన ఈ నారీమణి గురించి తెలుసుకుందామా. పైగా పురుషాధిక్య వ్యాపారమైన వైన్ బిజినెస్లో రాణిస్తున్న ఏకైక మహిళగా పేరు కూడా తెచ్చుకుందామె. ఇంతకీ ఎవరామె అంటే..ఆ శక్తిమంతమైన మహిళే 45 ఏళ్ల నమ్రత స్టాన్లీ. బెంగళూరు చెందిన నమ్రత కుటుంబంలో కూడా ఆడపిల్లకు ఉద్యోగం ఎందుకు అనే భావజాలం ఎక్కువగా ఉండేది. అంతగా ఆడపిల్లలకు ప్రాధాన్యతలోని తన కుటుంబంలో తండ్రి తీరు అస్సలు నచ్చేది కాదు నమ్రతకు. ఆమె తల్లి గృహిణిగి ఇంటి బాధ్యతలు చూసుకోవాలి. ఆయన ఇంటి నిర్ణయాలన్నింటిని తీసుకునేవారు. మా అమ్మకు ప్రతిభ ఉన్న ఇంటి గోడలకే పరిమితం చేశారాయన. ఇక నమ్రత ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో హాస్పిటాలిటీ చదివింది, అలాగే పాటిస్సేరీ(డెజర్ట్స్ తయారీ) నైపుణ్యం ఉందామెకు. 2024లో సరిగ్గా పెళ్లైంది. ఇక అక్కడ కూడా ఆడపిల్లలకు జాబ్ అనవసరం అనే అభిప్రాయమే బలంగా ఉండేది. అంతేగాదు ఆమె అత్తారింటిలో చీరకట్టుకుంటే గానీ బయటకు రాకూడదు, కనీసం స్నేహితులను కలవకూడదు, బేకరీ లాంటి వ్యాపారం వంటివి ఏమి చేయకూడదు. ఇంతలో 2007లో తనకు పాప జన్మించడంతో గృహహింస, ఛీత్కారాలు మొదలయ్యాయి. ఇవన్ని కూడా ఆమెను ఆపలేకపోయాయి. వీటన్నింటిని తట్టుకుంటూనే బెంగళూరులోని అలయన్స్ ఫ్రాంకైస్ స్థానిక కేంద్రానికి సమీపంలో నివసిస్తున్న ఆమె రహస్యంగా ఫ్రెంచ్ తరగతుల్లో చేరింది. మార్కెట్కి వెళ్తున్నా అని ఫ్రెంచ్ క్లాస్లకు వెళ్లేది. రాత్రిపూట కూతుర్ని పడుకోబెట్టి హెడ్ఫోన్లలో చదువుకునేది. ఇక తన కుటుంబానికి తానెంటో చూపాలనే ఉద్యేశ్యంతో 2013లో రెజ్యూమ్ని ఒక జాబ్సైట్లో అప్లోడ్ చేసింది. అయితే స్టాన్లీ స్కిల్స్కి ఫిదా అయ్యి ఒక ఫ్రెంచ్ ఐటీ సంస్థ ఆమెను పారిస్లో నియమించుకుని శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. తన పాపను అమ్మ చూసుకుంటుందని ఒప్పించి, భర్త అనుమతితో వెళ్లింది. అది కూడా ఒక నెలపాటు ట్రైనింగ్కి మాత్రమే పంపించారు స్టాన్లీని. అయితే స్టాన్లీ అక్కడ విజయవంతంగా ట్రైనింగ్ని పూర్తిచేసుకుని కుమార్తె కోసం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఫ్రెంచ్కి వెళ్లినప్పుడు సరదాగా భుజం మీద వేయించుకున్న టాటు కారణంగా భర్త ఆగ్రహానికి గురైంది. ఆ తర్వాత బెంగళూరులో జాబ్లు అన్వేషిస్తున్న ఆమెను వారించే ప్రయత్రం చేయడమే గాక, ఆమె పాస్పోర్ట్ని మాయం చేయడం, అర్థరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు పంపించేయడం వంటి టార్చర్ ఎక్కువైంది. దాంతో ఆ గృహహింస నుంచి బయటపడి 2017లో తల్లి మద్దతుతో ఫ్రాన్స్ బోర్డియక్స్లో వైన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ MBA ప్రోగ్రామ్లో చేరింది. చెప్పాలంటే ఆ క్లాస్లో అందరికంటే పెద్దది స్టాన్లీనే..అయినా సరే..లక్ష్యంపైనే ఫోకస్ పెట్టేది స్టాన్లీ. వైన్ తయారీ ప్రక్రియకు సంబంధించి.. ద్రాక్షపండను పండించడం నుంచి వైన్గా మారే వరకు ప్రతిదాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. అదీగాక బోర్డియక్స్లోని కఠినమైన చట్టాలు నీటిపారుదలను నిషేధిస్తాయి, దాంతో ద్రాక్ష పాదులను పండించడం చాలా సవాలుగా ఉండేది. అదే తనకు స్ట్రాంగ్గా పోరాడుతూ నిలబడటం ఎలాగో నేర్పిందని అంటోంది స్టాన్లీ. అలాగే ఈ వైన్ తయారీలో ప్రతి దశ చాలా కచ్చితత్వం అవసరమని అంటోంది. ఆ తర్వాత వైన్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని..వైన్ తయారీ కేంద్రాల నుంచి నేరుగా సోర్సింగ్ చూస్తూ..కంపెనీని బోర్డియక్స్లో నమోదు చేయించుకుంది. క్రమేణ తన సొంత బ్రాండ్ 'సోలికాంటస్' పేరుతో వైన్ని విక్రయించే రేంజ్కు చేరింది. ఇక్కడ సోలి అంటే నేల, కాంటస్ అంటే లాటిన్లో శ్రావ్యత. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఈ వైన్ వ్యాపార సామ్రాజ్యంలో శక్తిమంతమైన వ్యాపారవేత్తగా సాగుతూ..మహిళలు ఎందులోనైనా రాణించగలరు అని చాటి చెబుతోంది. అంతేగాదు స్టాన్లీ వైన్ నాణ్యత, రుచిని నిర్ణయించేది కూడా ఆమెనే కావడం విశేషం. (చదవండి: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ)
నయనిక రెడ్డి అల్లు శిరీష్ పెళ్లిలో హైలెట్ 'శంకు చక్రం' మెహందీ డిజైన్
ఈసారి సెలబ్రిటీల జంట ట్రెండ్ని సెట్ చేయడం లేదు. వాళ్లే సరికొత్త ట్రెండ్ని సెట్ చేసేలా భారతీయ మూలాలను గౌరవించడం విశేషం. ఈ మార్చి 6న అల్లు శిరీష్ నయనిక రెడ్డీల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో అల్లు శిరీష్ చేతి మెహందీ అందర్నీ అమితంగా ఆకర్షించింది. మన సంస్కృతికో పాతుకపోయిన గోరింటాకు అంతరార్థాన్ని తెలియజెప్పేలా శిరీష్ చేతి మెహిందీ ఉంది. నిజంగానే మన భారతీయ సంప్రదాయంలో వధువరులను లక్ష్మీ నారాయణులుగా భావిస్తారు. నారాయణుడకి తమ ఇంటి ఆడపిల్ల చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిని అందిస్తున్నాం అన్నట్లుగా కాళ్లు కడిగి మామగారు అల్లుడి చేతిలో పెడతారు. నారాయణ..మా లక్ష్మీకి ఇక నుంచి అన్ని నీవే అని చెబుతారు. ఆ నేపథ్యాన్ని ఇలా శిరీస్ చేతిపై ఉన్న మెహందీ డిజైన్ ద్వారా చెప్పకనేచెప్పారు. ఈ శంకు చక్రాలు ఎక్కువగా వైష్ణవులు తమ భుజాలపై ఛాతీపై ధరిస్తారు. అలాగే ప్రతి వైష్ణవ ఆలయాల్లో ఇవి దర్శనిమిస్తాయి. నిజంగా ఆ వివాహ వేడుకలో నారయణుడిగా శిరీష్..లక్ష్మీదేవిగా నయనికలు అతిథులకు చూడచక్కని జంటలా కనువిందు చేశారు. ఇక్కడ శంఖం అనేది శుభ శుచికానికి, ధనానికి ప్రతీక అయితే..చక్రం మన జీవిత గమనానికి సంకేతం..ఇక మధ్యలో ఉండే తిరునామాలు..అందరిలోనూ ఉండే సర్వాంతర్మామి ఆ నారాయణుడి అని గొంతెత్తి చెప్పేలా చాలామంది వైష్ణవులు ముఖంపై ధరిస్తుంటారు. కాగా ఈ వివాహ వేడుకలో అల్లు శిరీష్ బంగారు రంగులో క్లిష్టమైన ఎంబ్రాయిడీ కలిగి న్న ఆఫ్ వైట్ సిల్క్ షేర్వానీని ఎంచుకోగా, నయనికా రెడ్డి బంగారం వెండి జర్దోజీ వర్క్తో అంకరించబడిన లావెండర్ రంగు పట్టు చీరను ఎంచుకుంది. దానికి అనుబంధంగా రూబీ, వజ్రాల నెక్లెస్లు, స్టేట్మెంట్ చెవిపోగులు, గాజులతో ముగ్ధమనోహరంగా ఉంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) (చదవండి: Arjun Saaniya Chandhoks wedding: సారా మీనాకారి నెక్లెస్..! ఇంత స్పెషాల్టీ దాగుందా..?!)
సారా మీనాకారి నెక్లెస్..! ఇంత స్పెషాల్టీ దాగుందా..?!
సచిన్ టెండూల్కర్ అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండూల్కర్ల వివాహం గత గురవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు, పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు విచ్చేసి వధువరులు ఆశ్వీరదించారు కూడా. అయితే ఈ వేడుకలో అర్జున్ అక్క సారా కుందనపు బొమ్మలా అందరి కళ్లను ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె ధరించిన మీనాకారి నెక్లెస్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. సునీతా షెఖావత్ కలెక్షన్కి సంబంధించిన ఈ నెక్లెస్ చాలా ప్రత్యేకంగా తయారు చేశారట. ఇందులో హస్తకళ, సంప్రదాయ కుందన్ సెట్ పోల్కీలు, పూల మోటిఫ్లు తరతరాల సంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి. ప్రముఖ ఆభరణాల నిపుణురాలు ప్రియంషు గోయెల్ జైపూర్కి చెందిన సునీతా షెఖావత్ తయారు చేసిన ఈ నెక్లెస్ ధర దగ్గర రూ. 40 నుంచి రూ. 60 లక్షలు పైన ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెక్లెస్లో కొలంబియన్ ఎమరాల్డ్లు, సౌత్ సీ ముత్యాలను పొందుపరిచారు. అద్భుతమైన వారసత్వ ఆభరణాలు.. మన దేశ సంస్కృతిని, గత వైభవాన్ని కళ్లముందు కదలాడలే చేసింది ఈ ఆభరణం. అంతేగాదు దీన్ని తయారు చేసేందుకు 360 గంటలు పైనే పట్టిందట. ఈ ఆభరణం ప్రత్యేకతలను వివరిస్తూ నెట్టింట షేర్ చేశారు ప్రియంషు గోయెల్. View this post on Instagram A post shared by Sunita Shekhawat (@sunita_shekhawat_jaipur) (చదవండి: Arjun-Saaniya Chandhok Wedding: అంజలి, సారా ఆ చీరలే ఎందుకు ఎంచుకున్నారంటే..)
కుటుంబ బాధ్యత.. ఆర్థిక భరోసా!
మూసాపేట: మహిళలు ఆర్థికంగా ఎదిగనప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత తరంలో ఎందరో మహిళలు చిన్న ఉద్యోగాల నుంచి రైలు, విమానాలు నడిపిస్తున్నారు. ఉద్యోగాలే కాకుండా వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. ప్రభుత్వాలు పేద, మద్య తరగతి మహిళలను, చదువురాని మహిళలు కూడా తమ కాళ్లపై నిలబడేవిధంగా ప్రోత్సహిస్తున్నాయి. మూసాపేట పరిసర ప్రాంతాల్లో సమైఖ్య మహిళ గ్రూపులో ఉండి బ్యాంకు లోన్లు తీసుకుని చిన్న, చిన్న వ్యాపారాలు ఎదుగుతూ తోటి వారికి ఆదర్శంగా ఉన్న పలువురి మహిళల గురించి అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. లోన్తో మేకప్ టీచర్గా... మూసాపేటలో నివాసం ఉండే భాగ్యవతి వైష్ణవి దేవి మహిళ గ్రూపులో 10 మంది మహిళల్లో ఆమె ఒక్కరు. మూడు సంవత్సరాల క్రితం గ్రూపునకు బ్యాంక్ లోన్ మంజూరైంది. తన భాగానికి వచ్చిన రూ. 60 వేలతో మేకప్గా శిక్షణ తీసుకుంది. అనంతరం వాటికి మరికొంత డబ్బు జమ చేసి మేకప్ కిట్ కొనుగోలు చేసింది. అనంతరం మూసాపేట భవానీనగర్లో ఉన్న మేకప్ స్టూడియోలో 12 మందికి టీచింగ్ చేస్తుంది. బ్యాచ్కు 12 మందికి టీచింగ్ ఇస్తూ వారిని మేకప్ ఆర్టిస్టులుగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక ఈవెంట్లు, పెళ్లిలకు మేకప్లు వేస్తూ నెలకు రూ.50 నుంచి 70వేల వరకు సంపాదిస్తుంది. బ్యాంక్ లోన్ తానేకడుతూ మేకప్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లేందేకు కృషి చేస్తుంది. ప్రముఖ సింగర్ గీత మాధురికి కూడా మేకప్ వేసి ఔరా అనిపించింది. గోలీసోడా వ్యాపారంలో.. గోలిసోడా కొడుతూ వ్యాపారంలో రాణిస్తుంది భరత్నగర్కాలనీకి చెందిన ఎస్. సంధ్య. కాలనీలోని కల్వరి మహిళ పొదుపు సంఘంలో పది మందిలో తాను ఒక్కరు. నెలన్నర క్రితం గ్రూపునకు భ్యాంక్ లోన్ రావడంతో తన భాగం రూ.1.80 లక్షలు వచ్చాయి. వాటితో కొన్ని అప్పులు తీర్చుకుని సుమారు రూ.50వేలతో ఆరెంజ్ గోలి సోడా షాపును ఏర్పాటు చేసుకుంది. వేసవికాలంలో గోలిసోడకు ఆదరణ ఉండటంతో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. పిల్లలను స్కూల్కు పంపి, భర్తను ఉద్యోగానికి పంపి గోలి సోడా కొడుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు షాపు నడిపిస్తుంది. ఒక్కరి వద్ద ఉద్యోగం చేసే బదులు వ్యాపారం ఎంతో మేలు అని అంటుంది. రాజకీయాల్లో రాణిస్తూ బోటిక్ నడిపిస్తూ.. గృహిణిగా పిల్లలు, భర్త బాధ్యతలు చూసుకుంటూనే రాజకీయాలపై మక్కువతో బీఆర్ఎస్ మహిళ కార్యకర్తగా, సోషల్ మీడియా వారియర్గా రాణిస్తుంది మూసాపేట జనతానగర్కు చెందిన శిరీష. కుట్టు మిషన్స్ ఏర్పాటు చేసుకుని శ్రీహర్ష పేరుతో బోటిక్ నడిపిస్తుంది. భర్త ఇచ్చిన డబ్బులతో పాటు మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్ రూ. 35వేలతో కుట్టు మిషన్ ఇప్పించడంతో షాపును ఏర్పాటు చేసింది. షాపులో ప్రస్తుతం ముగ్గురు పనివారు, నాలుగు కుట్టు మిషన్స్ ఏర్పాటు చేసుకుంది. చీరలు అమ్మడంతో పాటు సంక్రాంతికి గాలి పటాలు, దీపావళికి టపాసులు, రాఖీ పౌర్ణమికి రాఖీలు విక్రయిస్తుంది.
అంతర్జాతీయం
హిజ్బొల్లాపై తిరుగుబాటు.. ఎన్నికలకు దూరంగా లెబనాన్
బీరూట్: లెబనాన్లో రాజకీయ, భద్రతా సంక్షోభం నెలకొంది. మే నెలలో జరగాల్సిన పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలను రెండేళ్ల పాటు వాయిదా వేస్తూ లెబనాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్,హిజ్బుల్లా మధ్య యుద్ధం వల్ల అస్థిరత నెలకొంది. హిజ్బుల్లా పట్ల దేశంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. ప్రభుత్వంలోని రాజకీయ మిత్రుల మద్దతు కోల్పోయింది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, ఇరాన్ ప్రతిదాడుల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్కు మద్దతుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభించింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడంతో లెబనాన్లో పరిస్థితులు మరింత దిగజారాయి. హిజ్బుల్లా ఈ యుద్ధంలో కలగజేసుకోవడం లెబనాన్ ప్రజల్లో అసంతృప్తిని పెంచింది. ఆర్థిక సంక్షోభం, భద్రతా సమస్యలతో విసిగిపోయిన ప్రజలు ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని భావించిన ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేసింది. పార్లమెంటరీ స్పీకర్ నబీహ్ బెర్రీ ఆధ్వర్యంలో జరిగిన ఓటింగ్లో 128 మంది సభ్యుల్లో 76 మంది ఎన్నికలను రెండేళ్ల పాటు వాయిదా వేయాలని మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల వాయిదాకు హిజ్బుల్లా ఎంపీలు కూడా మద్దతు తెలిపినట్లు సమాచారం.చిగురుటాకులా వణికిపోతున్న లెబనాన్హిజ్బొల్లా దాడితో రగిలిపోతున్న ఇజ్రాయెల్ లెబానాన్పై విరుచుకుపడింది. గతవారం జరిపిన దాడుల్లో 83మంది పిల్లలు మృతి చెందగా 200మందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడినట్లు ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కుల రక్షణ, ఆరోగ్యం, విద్య, పోషణ కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూనిసెఫ్ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో చిగురుటాకులా వణికిపోతున్న లెబనాన్ను ఆపన్న హస్తం అందించేందుకు ఫ్రాన్స్ ముందుకు వచ్చింది. 6.9బిలియన్ డాలర్లు అత్యవసర ఆర్థికసాయం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పడింది.
నేపాల్కు కాబోయే ప్రధాని.. అప్పట్లో బెంగళూరులో..
కాఠ్మాండు: నేపాల్తో పాటు ఆ దేశం చుట్టుపక్కల ఉన్న దేశాల రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అధికంగా వినిపిస్తున్న పేరు బాలెన్ షా (బాలేంద్ర షా). ర్యాపర్గా కెరీర్ను ప్రారంభించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి నేపాల్లో అతి ముఖ్యమైన నేతగా ఎదిగారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) తరఫున ఆయన ప్రధాని అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో పోరాడారు.ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇప్పటికీ కొనసాగుతోంది. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 124 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరో నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంది. నేపాలీ కాంగ్రెస్ 17 స్థానాలు గెలిచింది. మరో స్థానంలో ముందంజలో ఉంది. యూఎంఎల్ ఎనిమిది స్థానాలు గెలిచింది. ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఎన్సీపీ కేవలం ఏడు స్థానాలు మాత్రమే గెలిచింది. ఆర్పీపీ ఒక స్థానంలో గెలిచింది. శ్రామ్ సంస్కృతి పార్టీ మూడు స్థానాలు గెలిచింది. మయాగ్డి నియోజకవర్గం నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.నేపాల్లో 165 స్థానాలకు నేరుగా (ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్), మరో 110 స్థానాల్లో నైష్పక్షిక విధానం (ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్) కింద ఎన్నికలు జరిగాయి. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ కింద జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు 162 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్ (నైష్పక్షిక విధానం) కింద ఉన్న 110 స్థానాల్లో 68 స్థానాల లెక్కింపు పూర్తైంది. ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే పార్టీకి వచ్చిన మొత్తం ఓట్ల శాతానికి అనుగుణంగా స్థానాలు కేటాయించే ఎన్నికల విధానం. బెంగళూరులో బాలేంద్ర షా ఎంటెక్ బాలేంద్ర షా నేపాల్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒకప్పుడు బాలేంద్ర షా బెంగళూరు నిట్టె మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్లో చదివారు. అక్కడ ఆయన ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్లో విద్యనభ్యసించారు.తాజాగా, నిట్టె మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లెక్చరర్లు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తమ పూర్వ విద్యార్థి ఇప్పుడు నేపాల్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన తీరు చూసి గర్వంగా ఉందని తెలిపారు. ఆసక్తికర విషయం ఏంటంటే, ఆ సంస్థలో చదువుతున్న సమయంలో బాలేంద్ర షా రాజకీయాల్లో ఆసక్తి స్పష్టంగా చూపలేదు.రాజకీయాల్లోకి రావడానికి ముందు బాలేంద్ర షా.. నేపాలీ రాప్ మ్యూజిక్లో బాగా పాపులర్ అయ్యారు. అయినా క్యాంపస్లో ఉన్న సమయంలో ఆయన రాప్ పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. ఆయన మ్యూజిక్, పాటలు అధికంగా నేపాలి భాషలోనే ఉండేవి.బాలేంద్ర షాకు నేపాల్ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఉందని బెంగళూరులోని ఆయన లెక్చరర్లు భావిస్తున్నారు. ర్యాపర్ నుంచి కాఠ్మాండు మేయర్ స్థాయికి, అక్కడి నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిని బాలేంద్ర షా రాజకీయ ప్రయాణం ఇంకా ముందుకు సాగుతోంది. ఒకవేళ ఆయన తిరిగి క్యాంపస్కి అతిథిగా వస్తే ఘనస్వాగతం పలకాలని నిట్టె మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భావిస్తోంది. బాలేంద్ర షా ఝాపా-5 నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికలో విజయం సాధించారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి, మాజీ నేపాలి ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ ఓటమి చెందారు. ఆయన పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించింది.
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
టెహ్రాన్: ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉండి ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ దేశ పౌరులకు వార్నింగ్ ఇచ్చింది. శత్రుదేశాలకు మద్దతు ఇస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపింది. దేశంలోని వారి ఆస్తులన్నీ జప్తు చేస్తామని హెచ్చరించింది.ఇరాన్ అటార్నీ జనరల్ కార్యాలయం సోమవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఇరాన్ ప్రభుత్వ నియంత్రణలో నడిచే ఐఆర్ఐబీ వార్తా సంస్థ కూడా ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపింది. విదేశాల్లో నివసిస్తూ సొంత దేశానికి శత్రువుల్లా పనిచేస్తున్న వారి ఆస్తులు స్వాధీనం చేయాలని ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉందని ఇరాన్ న్యాయ వ్యవస్థ సైతం స్పష్టం చేసింది.ఈ ప్రకటన న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ వార్తా సంస్థలో కూడా ప్రచురితమైంది. విదేశాల్లో ఇజ్రాయెల్ లేదా అమెరికా ప్రభుత్వాల కోసం జరిగే ఏదైనా ఇంటెలిజెన్స్ లేదా ఎస్పియోనాజ్ కార్యకలాపాలు జరిగితే ఆయా పౌరుల ఆస్తులు స్వాధీనం చేయడం పాటు మరణదండన కూడా విధించవచ్చని హెచ్చరించింది. ఇరాన్కు వ్యతిరేకంగా తప్పులు చేసినట్లు నిర్ధారణ అయితే వదిలేది లేదని ఇరాన్ చెప్పింది. గత అక్టోబర్లో అమలు చేసిన చట్టం గురించి ప్రస్తావించింది. ఆ చట్టం ప్రకారం.. ఇజ్రాయెల్, అమెరికా లేదా ఇతర శత్రు దేశాలు లేదా సంస్థలకు అనుకూలంగా తమ పౌరులు పనిచేస్తే చేస్తే ఆస్తుల స్వాధీనంతో పాటు ఇస్లామిక్ పీనల్ కోడ్ ప్రకారం ఇతర చట్టపర శిక్షలు వర్తిస్తాయని తెలిపింది.పశ్చిమాసియాలో యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఆ రోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ నగరాలపై సైనిక దాడులు ప్రారంభించాయి. అప్పటి నుంచి.. విదేశాల్లో ఉంటున్న తమ దేశ పౌరులపై కూడా ఇరాన్ దృష్టి పెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా 1,200 మందికి పైగా ప్రజలు మరణించారు. 10,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు.
బలూచ్ ప్రజలపై పాక్ సర్కార్ దౌర్జన్యం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం బలూచ్ ప్రజల అణచివేతకు మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా బలూచ్ ప్రజల జీవనాధారంపై సర్కార్ దెబ్బకొట్టింది. వారి జీవనాధారమైన ఇంధనాన్ని కాల్చివేసింది. దీంతో, ఈ ఘటనను బలూచ్ యక్జెహ్తీ కమిటీ తీవ్రంగా పరిగణించింది. దీంతో పాక్ ప్రభుత్వ చర్యను ఖండించింది.బలూచ్ ప్రజలు దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక, సామాజిక అణచివేతను ఎదుర్కొంటున్నారు. గ్వాదర్, మక్రాన్ వంటి ప్రాంతాల్లో బలూచ్ ప్రజలు.. సరిహద్దు వ్యాపారం, ఇంధన విక్రయం వంటి చిన్నచిన్న జీవనాధారాలపై ఆధారపడుతున్నారు. కానీ, పాకిస్తాన్ సంస్థలు వీటిని తరచుగా నేరంగా పరిగణించి అణచివేస్తున్నాయి. తాజాగా గ్వాదర్లోని మోచెన్ కపర్, కుంటాని ప్రాంతంలో అక్కడి ప్రజల జీవనాధారమైన ఇంధనాన్ని సర్కార్కు చెందిన కొన్ని సంస్థలు కాల్చివేసింది. దీంతో, బలూచ్ యక్జెహ్తీ కమిటీ స్పందించింది. ఈ చర్యను తీవ్రంగా ఖండించింది.ఈ సందర్భంగా కేవలం ప్రకటనలు కాకుండా, మానవ హక్కుల సంస్థలు పాకిస్తాన్ను బాధ్యత వహించేలా ప్రాయోగిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బలూచ్ ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు, ఆర్థిక అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ప్రతీ చిన్న జీవన ప్రయత్నాన్ని కూడా నేరంగా పరిగణించడం, బలూచ్ ప్రజలను వలస పాలనలో ఉన్నట్టుగా ప్రభుత్వం చూపిస్తోంది అంటూ షహబాజ్ సర్కార్పై మండిపడింది. అలాగే, బలూచ్ ప్రజలు తమ జీవనాధారాన్ని కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉన్నారు. ఇంధనాన్ని కాల్చివేయడం వంటి చర్యలు, వారి ఆర్థిక హక్కులను మాత్రమే కాకుండా, మానవ హక్కులను కూడా ఉల్లంఘిస్తున్నారు. ఈ సంఘటన బలూచ్ ప్రజలపై జరుగుతున్న దీర్ఘకాలిక అణచివేతకు మరో ఉదాహరణగా నిలిచింది అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.𝗧𝗵𝗲 𝗕𝗮𝗹𝗼𝗰𝗵 𝗬𝗮𝗸𝗷𝗲𝗵𝘁𝗶 𝗖𝗼𝗺𝗺𝗶𝘁𝘁𝗲𝗲 𝘀𝘁𝗿𝗼𝗻𝗴𝗹𝘆 𝗰𝗼𝗻𝗱𝗲𝗺𝗻𝘀 𝘁𝗵𝗲 𝗯𝘂𝗿𝗻𝗶𝗻𝗴 𝗼𝗳 𝗳𝘂𝗲𝗹 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗠𝗼𝗰𝗵𝗲𝗻 𝗸𝗮𝗽𝗮𝗿, 𝗞𝘂𝗻𝘁𝗮𝗻𝗶 𝗮𝗿𝗲𝗮 𝗼𝗳 𝗚𝘄𝗮𝗱𝗮𝗿.On 8th March, in Mochen kapar, Kuntani, a remote area of Gwadar, many… pic.twitter.com/yaoYnXrWzH— Baloch Yakjehti Committee (@BalochYakjehtiC) March 9, 2026
జాతీయం
విమానంలో బీడీ కాల్చిన ప్యాసింజర్ .. అధికారులు ఏం చేశారంటే?
భారత్లో ఇటీవల విమాన ప్రమాద ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. ఈ దుర్ఘటనలకు కారణం సాంకేతిక సమస్యలతో పాటు నిర్వహణ సంస్థల లోపాలు దీనికి కారణంగా నిలుస్తున్నాయి. అయితే తాజాగా విమానంలో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగిన ఘటన అధికారులను కలవరపరిచింది. విమాన భద్రత చట్టాలను ఉల్లంఘించడంతో సదరు వ్యక్తిపై అధికారులు కేసు నమోదు చేశారు.ఢిల్లీకి చెందిన ఆశిశ్ అనే వ్యక్తి రాజధాని నుంచి గోవాకు వెళుతున్నాడు. దీని కోసం అక్షర ఎయిర్వేస్ QP1625లో టికెట్ బుక్ చేసుకొని ప్రయాణమయ్యాడు. అయితే ఆశిశ్ ప్రయాణ సమయంలో విమానంలోని టాయిలెట్లో బీడీ తాగాడు. ఇది గమనించిన ఎయిర్ఫోర్స్ సిబ్బంది అతనని తనీఖీ చేయగా అతని వద్ద బీడీతో పాటు లైటర్ సైతం లభించింది. దీంతో పోలీసులకు సమాచారమచ్చారు.దీంతో ఆశిశ్ను అదుపులోకి తీసుకొని గోవా, మోపా పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం సివిల్ ఏవియేషన్ చట్టాలను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే విమానంలో బీడీ తాగడం చాలా ప్రమాదకరమని అది విమాన భద్రతకు ముప్పని ఎయిర్ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు.
గల్ఫ్ దేశాల నుంచి 52 వేల మంది తరలింపు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం తలెత్తిన తర్వాత మార్చి ఒకటో తేదీ నుంచి 52 వేల మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పర్యాటకులుగా వెళ్లిన వీరంతా ఆయా దేశాల్లో చిక్కుకున్నారని తెలిపింది. మరింత మందిని తీసుకువచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామంది. పశి్చమాసియా దేశాల్లో ఉంటున్న కోటి మందికి పైగా భారతీయుల భద్రత కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ ప్రాంతంలో వేగంగా మారుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియా దేశాల్లో పాక్షికంగా గగనతలాలను తెరవడంతో దేశీయ, విదేశీ విమానయాన సంస్థలు నడిపే కమర్షియల్, నాన్ షెడ్యూల్డ్ విమానాల ద్వారా మన వాళ్లను తరలిస్తున్నామంది. మార్చి 1–7వ తేదీల మధ్య 52 వేల మందిని సురక్షితంగా తీసుకొచ్చినట్లు కేంద్రం వివరించింది. వీరిలో 32,107 మంది దేశీయ విమానయాన సంస్థలు తీసుకు వచ్చాయని పేర్కొంది. కమర్షియల్ విమానాల అందుబాటుకు సంబంధించిన సూచనలు, సలహాలను దగ్గర్లోని భారత దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లల నుంచి తెలుసుకోవచ్చంది. 24 గంటలూ పనిచేసే హెల్ప్లైన్ల ద్వారా కూడా సంప్రదించవచ్చని కేంద్రం వివరించింది.
తృణమూల్ను ప్రజలు క్షమించరు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్మును ఘోరంగా అవమానించిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఒక దళితురాలిని అవమానించిన ఆ పార్టీని బెంగాల్ ప్రజలు క్షమించబోరని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలో పర్యటించారు. ‘వికసిత్ ఢిల్లీ’ నిర్మాణంలో భాగంగా రెండు మెట్రో కారిడార్లు సహా దాదాపు రూ.33,500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. బెంగాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్న సంతాల్ గిరిజన సదస్సును తృణమూల్ బహిష్కరించిందని ఆరోపించారు.ఇది రాజ్యాంగానికి, దేశ ఆడబిడ్డలకు జరిగిన ఘోర అవమానమన్నారు. తృణమూల్ ను దేశ ప్రజలు, గిరిజన సమాజం, మహిళలు ఏనాటికీ క్షమించరన్నారు. అహంకారపూరిత రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి ఒక నగరానికి పరిమితం కాదని, దేశ ప్రతిష్టతో ముడిపడి ఉందని మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ మెట్రో రైలు నెట్వర్క్ను రికార్డు స్థాయిలో 375 కిలోమీటర్లకు విస్తరిస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత నారీ శక్తిని ప్రధాని మోదీ ప్రశంసించారు. రాజకీయాలు, సైన్స్, క్రీడలు తదితర రంగాల్లో మహిళలు నూతన శక్తితో ముందుకు సాగుతున్నారని మోదీ కొనియాడారు.
ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఆగ్రహం
న్యూఢిల్లీ/కోల్కతా: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రపతి పాల్గొనాల్సిన సంతాల్ గిరిజన సదస్సు వేదికను, ఆమె ప్రయాణ మార్గాన్ని హఠాత్తుగా మార్చడాన్ని తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రపతి ప్రొటోకాల్కు సంబంధించిన ‘బ్లూ బుక్’ నిబంధనలు ఎందుకు పాటించలేదో చెప్పాలంటూ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ‘‘సీఎం, మంత్రులు, సీఎస్, డీజీపీల్లో ఎవరూ రాష్ట్రపతికి స్వాగతం పలక్కపోవడం బ్లూ బుక్ రూల్స్కు విరుద్ధం.రాష్ట్రపతికి కేటాయించిన వాష్ రూమ్లో నీటి సౌకర్యం కూడా లేదు. ఆమె ప్రయాణానికి చెత్తాచెదారంతో నిండిన మార్గాన్ని ఎంపిక చేశారు. వీటిపై వివరణ ఇవ్వండి. ప్రొటోకాల్ ఉల్లంఘనకు బాధ్యులైన డార్జిలింగ్ జిల్లా మేజి్రస్టేట్, సిలిగురి పోలీసు కమిషనర్, అదనపు జిల్లా మేజి్రస్టేట్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి’’ అని ఆదేశించారు.బెంగాల్ పర్యటనకు వెళ్లిన ముర్ముకు శనివారం సీఎం మమతా బెనర్జీ గానీ, మంత్రులు గానీ స్వాగతం పలకలేదు. షెడ్యూల్ ప్రకారం బదాన్నగర్లో జరగాల్సిన దళిత సదస్సును చివరి నిమిషంలో బాగ్డోగ్రా ఎయిర్పోర్టు సమీపంలోకి మార్చేశారు. సరైన సమాచారం లేక జనం ఆశించినంతగా హాజరు కాలేదు. ఈ పరిణామాలపై ముర్ము తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.ప్రొటోకాల్ను ఉల్లంఘించలేదు: మమతరాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరగలేదని మమత తేల్చిచెప్పారు. రాష్ట్రపతి సదస్సులో లోపాలుంటే ప్రైవేట్ నిర్వాహకులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియానే బాధ్యత వహించాలన్నారు. ‘‘రాజ్యాంగం పట్ల, రాష్ట్రపతి పట్ల మాకు ఎనలేని గౌరవముంది. రాష్ట్రపతిని మా తల్లిగా భావిస్తాం. ముర్మును మేం అవమానించలేదు. ఆమెకు సిలిగురి మేయర్ స్వాగతం పలికారు’’ అని చెప్పారు. ‘‘రాష్ట్రపతిని అవమానించే అలవాటు బీజేపీదే. గతంలో ఒక సభలో రాష్ట్రపతి నుంచుని ఉంటే ప్రధాని మోదీ మాత్రం కురీ్చలో కూర్చున్నారు’’ అని మమత విమర్శించారు. బీజేపీ అగ్ర నేత ఎల్కే అడ్వానీతో పాటు మోదీ కూర్చుని ఉండగా వారి పక్కన ముర్ము నుంచున్న ఫొటోను ప్రదర్శించారు.
ఎన్ఆర్ఐ
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత
అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..
అమెరికాలో ఉండే మన భారతీయులు ఏ రేంజ్లో ప్యాకేజ్లు అందుకుంటారో తెలిసిందే. అంతలా వేతనాలు వస్తాయనే..విదేశాలంటే మోజు మనవాళ్లకు. కానీ ఆ వ్యక్తి కోట్లలో వచ్చే వేతనం కాదనుకుని మరి భారత్కి వచ్చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాదు దానికి గల కారణాన్ని వివరిస్తూ..అది సరైనదో కాదో సలహా ఇవ్వండి అంటూ రెడ్డిట్లో పోస్ట్ పెట్టాడు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అతడి ఉద్దేశానికి ఫిదా అవ్వతూ ప్రశంసలజల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.ఇంతకీ కారణం ఏంటేంటే..అమెరికాలో 12 ఏళ్లకు పైగా గడిపిన తర్వాత తిరిగి కుటుంబంతో సహా భారత వచ్చేయాలనకుంటున్నట్లు ఓ ఎన్నారై పోస్ట్లో తెలిపాడు. ఈ జూన్ కల్లా తాము ఐదుగురు ముంబైకి వచ్చేయాలని నిర్ణయించుకున్నామని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు. తన వయసు 36 ఏళ్లు అని, 2018లో నవంబర్ నుంచి హెచ్1బీ విసాతో అమెరికాలో నివశిస్తున్నట్లు తెలిపాడు. పైగా తన వార్షిక ఆదాయం రూ. 2.9 కోట్లు అని, నెట్వర్త్ వచ్చేసి రుణ రహిత ఇల్లుతో కలిపి దగ్గర దగ్గర రూ. 9 కోట్లు అని వెల్లడించారు. భారత్ తన ఉద్యోగ ఆఫర్ ఏడాదికి రూ. 1.5 కోట్ల ప్యాకేజ్ అని కూడా వివరించాడు. అయితే తన తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉన్నారని, కుటుబానికి దగ్గరగా ఉండటమే మేలని ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అందులోనూ తన పిల్లలు తాతయ్య నానమ్మల, దగ్గర బంధువులతో పెరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు పోస్ట్లో. అక్కడ అమెరికాలో ఇంటి అద్దె చెల్లించకుండా లగ్జరియస్గా గడిపినా తన కుటుంబానికి ఈ నిర్ణయం కారణంగా.. చాలా పెద్ద మార్పుని స్వాగతించాల్సి ఉంటుందని అంటున్నాడు. ఎందుకంటే ముంబైలో అద్దె చెల్లిస్తూ..ఏడాదికి రూ. 1.5 కోట్లతో బతకడం సాధ్యమేనా? అని సందేహం వ్యక్తం చేశాడు. అలాగే యూఎస్లో పుట్టి..అక్కడే పెరిగిన పిల్లలు ఇక్కడ జీవనశైలికి, ఎడ్యుకేషన్కి సులభంగా అలవాటుపడగలరా, అసలు తన నిర్ణయం సరైనదేనా..? ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని పోస్ట్ పెట్టాడు. అయితే నెటిజన్లు అది మంచి ప్యాకేజీ అని, ముంబైలో ధీమాగా బతకొచ్చు అని అన్నారు. పైగా ఇలా భారత్కి రావాలనుకుంటున్న మీ నిర్ణయానికి స్వాగతం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తల్లిదండ్రలు గురించి ఆలోచిస్తున్నందుకు మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: లే ఆఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే..?: మాజీ అమెజాన్ టెక్కీ)
13 ఏళ్ల టీనేజర్ అమెరికాలో మైనర్లపై వేధింపులు, దొంగతనాలు
అమెరికాలో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఒక భారతీయుడిని అరెస్టు చేశారు. ఓదెల యశస్వి కొత్తపల్లిగా గుర్తించబడిన నిందితుడు అక్రమ వలసదారు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రకటించింది. న్యూజెర్సీలో పిల్లలపై లైంగిక వేధింపులతోపాటు, దొంగతనానికి సంబంధించిన ఆరోపణలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించింది.సరైన పత్రాలు లేకుండా అమెరికాలోని ప్రవేశించిన నిందితుడు యశస్విని చైల్డ్ రేపిస్తూ అని పేర్కొంది. అతడిపై యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం తొలగింపు చర్యలు పెండింగ్లో ఉన్నాయని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఈసీఇ) ఎక్స్లో ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుమైనర్లపై లైంగిక నేరాలకుపాల్పడినట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, దొంగతనం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే నిందితుడిపై కేసు ఎప్పుడు, ఎక్కడ నమోదైంది, ఎప్పుడు అరెస్టు చేశారనే విషయాలపై స్పష్టతనివ్వలేదు.—SEXUAL ASSAULT OF A CHILD UNDER 13 —SHOPLIFTING —PUBLIC DISORDER Vodela Yashaswi Kottapalli, a criminal illegal alien from India, has pending charges for sexual assault and larceny in New Jersey. We’ll keep him in custody pending removal proceedings. pic.twitter.com/VM97e9KUD9— U.S. Immigration and Customs Enforcement (@ICEgov) February 16, 2026 ఇదీ చదవండి: పెళ్లయ్యి ఆరునెలలే.. వాలెంటైన్స్డే రోజే హత్య
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది కూడా శివాలయాల సందర్శన యాత్ర ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు నిర్వహించారు. సింగపూర్లోని జురాంగ్ ఈస్ట్ ,బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్రను నిర్వహించారు. సుమారు 230 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. భక్తుల శివనామస్మరణలతో ప్రముఖ దేవాలయాలు కిటకిటలాడాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష, ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవ, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల మరియు ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మొదలగు వారు ఉన్నారు.వీరితో పాటు యాత్రలో సహాయపడిన పెరుకు శివ రామ్ ప్రసాద్,సమ్మయ్య మొలుగూరి, లక్ష్మణ్ రాజు కల్వ, వేణు గోపాల్ ఐరేని, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు అందరికి కృతజ్ణతలు తెలియజేశారు. ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్ గారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి , చల్ల కృష్ణ మొదలగు వారు గత సంవత్సరం లాగే ఈ సారి కూడా భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
మహిళల పట్ల టీడీపీ నాయకుడి అమానుషం
గుంటూరు జిల్లా: మహిళల ఫొటోలను ఐటీడీపీకి చెందిన నాయకుడు తీసి మార్ఫింగ్ చేస్తున్న సంఘటన వెలుగు చూసింది. ప్రశ్నించిన మహిళలపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఆగ్రహించిన మహిళలు ఆందోళనకు దిగారు. సేకరించిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన నల్లమామిడి అంజయ్య కళాశాల విద్యార్థునులు, మహిళల ఫొటోలు తీసి మార్ఫింగ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ విద్యార్థిని గుర్తించి శనివారం రాత్రి అంజయ్య ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ నర్రా శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని ‘ఏం చేస్తారు మీరు అంటూ దురుసుగా మాట్లాడి, కేసులు పెట్టినా, వెంటనే తీసుకువచ్చి ఇదే రోడ్డులో తిప్పుతానని’ బెదిరించాడు. సమాచారం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల మహిళలు తెనాలి– మంగళగిరి రహదారిపై ఆందోళనకు దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకోకుండా సుమారు మూడు గంటల పాటు పక్కన ఉన్న చర్చిలో ఉంచారు. గతంలో కూడా ఫొటోలు తీస్తున్న విషయం గమనించి కొందరు మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు. అయినా కూడా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని బాధితులు అంటున్నారు. కేవలం దళిత పిల్లల్ని ఫొటోలు తీయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతు పలికారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాలుగు గంటల అనంతరం పోలీసులు నిందితుడిని దుగ్గిరాల పోలీసుస్టేషన్కు తరలించారు.
ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలి దుర్మరణం
బత్తలపల్లి: బస్సు రాగానే ఎక్కేందుకు ప్రయాణికుల నడుమ తోపులాట జరగడంతో ఓ వృద్ధురాలు అదే బస్సు కింద పడి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆదివారం జరిగింది. కదిరికి చెందిన భాగ్యమ్మ(80) తన కోడలు మాధవితో కలిసి ఆదివారం ధర్మవరంలో సమీప బంధువుల ఇంట్లో శుభకార్యం చూసుకుని బత్తలపల్లికి చేరుకున్నారు. నాలుగు రోడ్ల కూడలిలో కదిరి వెళ్లే బస్సు కోసం వేచి ఉండగా బస్సు రావడంతో ఎక్కే సమయంలో ప్రయాణికుల రద్దీ కారణంగా తోపులాట జరిగింది. భాగ్యమ్మ ప్రమాదవశాత్తు బస్సు వెనుక టైరు కింద పడింది. బస్సు ముందుకు కదలగానే ఆమె తలపై నుండి వెనుక చక్రాలు వెళ్లాయి. తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కేకలు వేయడంతో బస్సు నిలిపివేశారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసు స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ బస్సులో మహిళ మృతిజంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ శ్వాస ఆడక మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన ముప్పిడి జ్యోతిరెడ్డి (50) ఆదివారం జంగారెడ్డిగూడెంకు వెళ్లేందుకు గోపాలపురంలో కొవ్వూరు ఆర్టీసీ డిపో బస్సు ఎక్కింది. బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉండగా జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్కు వచ్చేసరికి జ్యోతిరెడ్డి స్పృహ తప్పి పోయిఉంది. తోటి ప్రయాణికులు గమనించి 108కు సమాచారమివ్వగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్టు చెప్పారు. జ్యోతిరెడ్డి కుమారుడు తన తల్లి అనారోగ్యంతో ఉన్నారని, ఆమె మృతిపై అనుమానాలూ లేవని చెప్పి మృతదేహాన్ని తీసుకువెళ్లారు.
నీటిగుంతలో మునిగి 10వ తరగతి విద్యార్థి మృతి
మంగళగిరి టౌన్: నీటిగుంతలో మునిగి 10వ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. కృష్ణాయపాలేంకు చెందిన కంతేటి ప్రకాష్, విమల దంపతుల కుమారుడు ప్రజ్వల సంతోష్ (15) పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షల నేపథ్యంలో పెనుమాకలోని ట్యూషన్కు ఆదివారం వెళ్లాడు. ట్యూషన్ అనంతరం ఇంటికి వచ్చే మార్గంలో నీటిగుంతలో ఈతకు దిగి మునిగిపోయాడు. స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చేలోపే సంతోష్ మృతిచెందాడు. కాగా, రాజధాని రోడ్డు నిర్మాణ పనుల కోసం తవి్వన నీటిగుంతలోనే బాలుడు మృతిచెందినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదం జరిగిన నీటిగుంత వద్ద ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం వల్లే బాలుడు మృతి చెందాడని పలువురు స్థానిక దళితనాయకులు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు ప్రభుత్వం, సంబంధిత కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాలుడి మృతిని ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నట్లు ఉద్ఘాటించారు. పోలీసులు సుమోటాగా తీసుకుని దీనికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని..
వలిగొండ: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలి గొండ మండలం ఎం.తుర్కపల్లి గ్రామంలో ఆది వారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎం.తుర్కపల్లికి చెందిన ముంత మమత (25), మొగిలిపాక గ్రామానికి చెందిన మర్ల మత్స్యగిరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసు కుందామని మత్స్యగిరిని ఇటీవల మమత కోరగా అతడు నిరాకరించాడు. ఆదివా రం మమత తల్లిదండ్రులు హైదరాబాద్కు వెళ్ల గా.. ఆమె సోదరి భవాని వ్యవసాయ బావి వద్ద కు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాను ప్రే మించిన వ్యక్తి మోసం చేశాడని మమత సూసై డ్ నోట్ రాసి, సోదరికి ఫోన్ చేసి ‘అమ్మానాన్న జాగ్రత్త’ అని చెప్పి చున్నీతో ఫ్యాన్కు ఉరేసు కుంది. మమత సోదరి బావి వద్ద నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కని పించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు.
వీడియోలు
మనోళ్ల భద్రతే ముఖ్యం
10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే
పరకామణిలో బంగారం చోరీ కేసు.. BR నాయుడు ఇప్పుడు మాట్లాడు!
మల్లంపేట నుంచి బాచుపల్లి కనెక్టింగ్ పేరుతో రోడ్డు నిర్మాణం
అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఫైట్ అసలు కారణం ఇదే..
టాస్క్ ఫోర్స్ లా ఏర్పడి పని చేద్దాం ఓటర్ల జాబితా సవరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు
మీకు 17 వరకు టైం ఇస్తున్న.. జడ శ్రవణ్ వార్నింగ్..
రోగులను గాలికొదిలేసి.. ఐటెం సాంగ్ కు నర్సుల డ్యాన్స్
మాటకు మాట.. రేవంత్ రెడ్డి, కేటీఆర్
టెహ్రాన్పై డైరెక్ట్ ఎటాక్ ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యం

