బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో బెంగాల్ ప్రజల మనోగతం ఎలా ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా వెలువడిన ‘ఓట్ వైబ్’ (Vote Vibe) సర్వే ఫలితాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై మమతా బెనర్జీ పట్టు ఏ మేరకు ఉన్నదనేది ఈ సర్వే తేల్చిచెప్పింది.దీదీకే జై కొడుతున్న జనం!తాజా సర్వే వివరాల ప్రకారం బెంగాల్ ముఖ్యమంత్రిగా 42 శాతం మంది మమతా బెనర్జీ వైపే మొగ్గు చూపారు. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారికి కేవలం 19 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఐప్యాక్ (ఐ-పాక్)సంస్థపై ఈడీ దాడులు జరిగినప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పర్సెప్షన్ యుద్ధంలో గెలిచిందని, ముఖ్యంగా ముస్లిం ఓటర్ల మద్దతును పదిలపరుచుకుందని సర్వే పేర్కొంది.ప్రభుత్వ పనితీరుపై మిశ్రమ స్పందనమమత ప్రభుత్వ పనితీరుపై జనం భిన్నంగా స్పందిస్తున్నారు. సుమారు 34 శాతం మంది ‘అద్భుతం’ అని కితాబివ్వగా, 18 శాతం మంది మాత్రం ‘చాలా దారుణం’ అంటూ పెదవి విరిచారు. సర్వేలో అధికార పార్టీకి కొన్ని హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. దాదాపు 36 శాతం మంది ఓటర్లు నిరుద్యోగాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. మరోవైపు టీఎంసీ.. అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందన్న బీజేపీ ప్రచారాన్ని 47 శాతం మంది నమ్ముతుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, యువ ఓటర్లు టీఎంసీకి దూరమయ్యే అవకాశం ఉందని సర్వే హెచ్చరించింది.ఎన్నికల నగారాకు అంతా సిద్ధంవచ్చే వారం రోజుల్లో పశ్చిమ బెంగాల్తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే 294 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటన ముగిసిన వెంటనే ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉన్నదని సమాచారం. 2021లో భారీ మెజారిటీతో గెలిచిన దీదీ, ఈసారి నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుంటారా? లేక బెంగాల్ కోటను బీజేపీ బద్దలు కొడుతుందా? అనేది వేచి చూడాలి.ఇది కూడా చదవండి: శబరిమల వివాదం.. కేరళ సర్కార్ ‘యూ టర్న్’
బీఆర్ఎస్లోకి జీవన్రెడ్డి..?
జగిత్యాల: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి.. బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి.. కారు ఎక్కేందుకు జీవన్రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20లోపే కాంగ్రెస్ రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఉగాది పండుగ లోపే కొత్త నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కార్యకర్తలతో జీవన్రెడ్డి మాట్లాడారని, ఈ క్రమంలోనే ఆయన అనుచరుల సోషల్ మీడియా డీపీలు కూడా మారిపోవడంతో రాజీనామా వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. అదే సమయంలో జీవన్రెడ్డి సోషల్ మీడియా గ్రూపుల డీపీలు, ప్రొఫైల్స్ కూడా మారిపోతున్నాయి. తాను కాంగ్రెస్లో సీనియర్గా ఉండి కూడా ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడాన్ని జీవన్రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇచ్చి.. ఆయన్ను పెద్దగా పట్టించుకోకపోవడంతో జీవన్రెడ్డి వేరే స్టెప్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు కూడా. ఇదే జీవన్రెడ్డిలో అసంతృప్తి జ్వాలలు పుట్టడానికి ప్రధాన కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాల తర్వాతే జీవన్రెడ్డి పార్టీ మారే యోచనకు వచ్చారనే చర్చ నడుస్తోంది. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి ఇప్పటికే జీవన్రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
పోలీసుల ఓవరాక్షన్.. పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కోసం పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. పేర్ని నాని ఇంటికి ఎవరినీ రాకుండా పోలీసులు మోహరించారు. పేర్ని నాని ఇంట్లో పనివారిని కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పేర్ని నాని ఇంటి వద్దే కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం ఉండగా.. పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా పోలీసులు వెళ్లనివ్వలేదు.పేర్ని నాని ఇంటికి వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో పోలీసులు మూసేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ను పోలీసులు తోసేశారు. పోలీసుల తీరుపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమలులో ఉందంటూ పోలీసులు వింత సమాధానం ఇచ్చారు. జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్ 30.. తమకు ఎలా వర్తిస్తుందని పోలీసులను పేర్ని నాని నిలదీశారు. సెక్షన్ 30 ఆర్డర్ చూపించమంటూ పేర్ని నాని ప్రశ్నించారు.
వ్యవసాయ బావిలో పడి ముగ్గురి దుర్మరణం
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం కొరికశాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పడి ముగ్గురు దుర్మరణం చెందారు. వ్యవసాయ బావిలో పూడిక తీసే క్రమంలో ఈ దారుణం జరిగింది. క్రేన్ వ్యవసాయ బావిలో పడటంతో విషాదం నెలకొంది. క్రేన్తో సహా నలుగురు వ్యవసాయ బావిలో పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పైడి(50), దేవరావు( 48), అభిలాష్(16) అనే ముగ్గురు మృతిచెందగా, మరో వ్యక్తి మోహన్ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చరిత్ర సృష్టించిన తెలంగాణ విద్యుత్ శాఖ
మీ యుద్ధ నౌకలను పంపండి..!
వీళ్లను పట్టిస్తే కోటీశ్వరులైపోవచ్చు.. ఏకంగా రూ.93 కోట్లు
ట్రంప్పై నిషేధం యోచనలో ఫిఫా!
బ్లాక్ డ్రెస్లో ఉప్పెన భామ కృతి శెట్టి.. హీరోయిన్ రెజీనా లేటేస్ట్ లుక్..!
IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్!
'ఆ డైరెక్టర్ తీరు నచ్చలేదు.. నాపై తప్పుడు ప్రచారం'.. లావణ్య త్రిపాఠి
కాలేజీ బస్సును ఢీ కొట్టిన రైలు.. 15 మందికి గాయాలు
పవన్ సభలో బయటపడ్డ చంద్రబాబు మోసం
రోహిత్ బాటలో రిషబ్ పంత్!
ఇంటి పేరు మార్చుకున్న విజయ్ వారసుడు
సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
దొరికినవి.. దేవతల నగలు
నాలుగు పెళ్లిళ్లు.. మీ కన్నా హిందువులే నయం: ముంతాజ్
పాక్ వివాదాస్పద బౌలర్కు జాక్పాట్
42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
శాంసన్ కాదు.. అతడే అందుకు అర్హుడు: డివిలియర్స్
దేశంలో గ్యాస్ సంక్షోభం
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
సిలిండర్ డెలివరీపై కఠిన నియమం
ఏ పని చేయకుండా నిత్యం అవే ఆలోచిస్తున్నారు!
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
రాజేంద్ర ప్రసాద్ గారు.. సారీ చెప్పండి : విశాల్ ట్వీట్
షాహీన్ అఫ్రిది సంచలన నిర్ణయం
చరిత్ర సృష్టించిన తెలంగాణ విద్యుత్ శాఖ
మీ యుద్ధ నౌకలను పంపండి..!
వీళ్లను పట్టిస్తే కోటీశ్వరులైపోవచ్చు.. ఏకంగా రూ.93 కోట్లు
ట్రంప్పై నిషేధం యోచనలో ఫిఫా!
బ్లాక్ డ్రెస్లో ఉప్పెన భామ కృతి శెట్టి.. హీరోయిన్ రెజీనా లేటేస్ట్ లుక్..!
IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్!
'ఆ డైరెక్టర్ తీరు నచ్చలేదు.. నాపై తప్పుడు ప్రచారం'.. లావణ్య త్రిపాఠి
కాలేజీ బస్సును ఢీ కొట్టిన రైలు.. 15 మందికి గాయాలు
పవన్ సభలో బయటపడ్డ చంద్రబాబు మోసం
రోహిత్ బాటలో రిషబ్ పంత్!
ఇంటి పేరు మార్చుకున్న విజయ్ వారసుడు
సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
దొరికినవి.. దేవతల నగలు
నాలుగు పెళ్లిళ్లు.. మీ కన్నా హిందువులే నయం: ముంతాజ్
పాక్ వివాదాస్పద బౌలర్కు జాక్పాట్
42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
శాంసన్ కాదు.. అతడే అందుకు అర్హుడు: డివిలియర్స్
దేశంలో గ్యాస్ సంక్షోభం
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
సిలిండర్ డెలివరీపై కఠిన నియమం
ఏ పని చేయకుండా నిత్యం అవే ఆలోచిస్తున్నారు!
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
రాజేంద్ర ప్రసాద్ గారు.. సారీ చెప్పండి : విశాల్ ట్వీట్
షాహీన్ అఫ్రిది సంచలన నిర్ణయం
ఫొటోలు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
వైట్ డ్రెస్లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
తెలంగాణ వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు (ఫొటోలు)
అల్లు సినిమాస్ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)
కూకట్పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)
ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)
‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, బన్నీ (ఫోటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)
సినిమా
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దురంధర్ మూవీ హిట్ కావడం చాలామందిని భయపెట్టిందన్నారు. ఆదిత్య ధర్కు ఆదరణ పెరగడం కొందరికీ నచ్చడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతన్ని చూసి చాలామంది అసూయ పడుతున్నారని అన్నారు. ఆదిత్య ధర్, ఆయన సతీమణి యామీ గౌతమ్ పతనం కోసం సినీ పరిశ్రమలో ఎంతోమంది ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్జీవీ దురంధర్ డైరెక్టర్పై ప్రశంసలు కురిపించారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ భారతీయ సినిమా గతిని మార్చిందని అన్నారు. ఆయన వల్ల సినీ ఇండస్ట్రీలో మిగిలిన వాళ్లంతా పునరాలోంచించేలా చేసిందని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆదిత్య ధర్, యామి గౌతమ్ మరింత జాగ్రత్తగా ముందడుగు వేయాలని సూచించారు.ఆర్జీవీ మాట్లాడుతూ..' తెరపై కథ చెప్పే విధానం, మేకింగ్ స్టైల్ ఆదిత్య ధర్ పూర్తిగా మార్చేశారు. మన సినిమాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు. ఇక్కడ నేను హిందీ మాత్రమే కాకుండా అన్ని భాషల గురించి మాట్లాడుతున్నా. తెలుగులో రాబోయే అనేక పెద్ద-బడ్జెట్ యాక్షన్ చిత్రాలు భారీ రీ షూటింగ్కు రెడీ అవుతున్నాయి. దీనివల్ల నిర్మాతలపై అదనపు భారం తప్పదు. ఆదిత్య ధర్ వల్లే ఇలా చేయాల్సి రావడం పరిశ్రమలోని కొందరికి నచ్చడం లేదు. అందుకే వారంతా అతన్ని ద్వేషిస్తారు. ఆయన అందరిని కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు తీసుకొచ్చేలా చేశాడు. అందుకే ఆదిత్య ధర్ ఫెయిల్యూర్ కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారని' అన్నారు. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తోన్న దురంధర్-2 ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది.
సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం.. ఇకపై అవీ తప్పనిసరి..!
ఇండియన్ సినిమాలపై సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సబ్ టైటిల్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 15 నుంచి అన్ని ఇండియన్ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఉండాలని సూచించింది. ఈ నిర్ణయంతో వినికిడి లోపం ఉన్నవారికి సినిమా అర్థం చేసుకునేందుకు వీలవుతుందని తెలిపింది. అయితే ఈ మార్పులు థియేటర్లలో ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై నెట్టింట చర్చకు దారితీసింది.ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు..సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను అన్ని రకాల ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ నిర్ణయం మొదటి అడుగుగా భావిస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి నిర్ణయాలతో సినిమాపై ప్రేక్షకుడి దృష్టిని మరల్చినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఓకే కానీ.. మన హిందీ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఎందుకని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. కింద ఉన్న పదాలు ప్రేక్షకుడి దృష్టిని మరల్చడం, కొన్నిసార్లు నటీనటులు మాట్లాడనప్పుడు కూడా సబ్ టైటిల్స్ వస్తే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ కొత్త నియమం అన్ని భారతీయ భాషలు, ప్రాంతాలలోని చిత్రాలకు వర్తిస్తుందని సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది.
ఆ మూవీ అప్పుడే తేడా కొట్టింది, కరెక్ట్ కాదన్నాను: రాశీ
తెలుగులో తొలి సినిమా 'ఊహలు గుసుగుసలాడె'తో గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా. జోరు, సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, వెంకీమామ, ప్రతిరోజు పండగే ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్ చేసింది. చివరగా తెలుగులో తెలుసు కదా మూవీతో అలరించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.సినిమా రిజల్ట్ ముందే ఊహించిన రాశీఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన రాశీ ఖన్నా తెలుసు కదా సినిమా వైఫల్యాన్ని ముందే ఊహించానంది. ఆమె మాట్లాడుతూ.. తెలుసు కదా షూటింగ్ జరుగుతున్న సమయంలో నాకు నచ్చని పాయింట్స్ అన్నీ చెప్పాను. కొన్ని సీన్స్ చిత్రీకరించేటప్పుడు ఇదెందుకో నాకు కరెక్ట్ కాదనిపిస్తుందన్నాను. అదే సమయంలో ఇది దర్శకుడి విజన్ అని గౌరవించాను. అదే నేర్చుకున్నాకానీ, షూట్ చేసేటప్పుడు చాలాసార్లు చెప్పాను.. ఇదెక్కడో కొడుతోంది, క్లైమాక్స్ కూడా అందరూ ఒప్పుకునేలా ఉండాలి, కాబట్టి ఆపరేషన్ సీన్ చేయనన్నాను. చివరకు తప్పలేదు. అయినా ఈ సినిమా ద్వారా అందరూ ఏదో ఒక గుణపాఠం నేర్చుకున్నారు. అలా నేను కూడా నా అభిప్రాయాన్ని మరింత గట్టిగా చెప్పాల్సింది అని తెలుసుకున్నాను. ఆ మూవీ షూట్ చేస్తున్నకొద్దీ స్క్రిప్ట్ చాలా మారిపోయింది. నా చేతుల్లో ఏం లేదు అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ
సినిమా టికెట్ల విషయంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు వివరాలు ప్రభుత్వం 90 రోజుల ముందే పబ్లిక్ డొమైన్లో ఉంచాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ దాఖలు చేసిన పిటిషన్ను బెంచ్ శుక్రవారం విచారించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు రాష్ట్రంలో విడుదల కాబోయే అన్ని సినిమాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఎస్.నిరంజన్రెడ్డిలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల అమలును సుప్రీం ధర్మాసనం నిలిపివేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
క్రీడలు
ముమ్మాటికీ అఘాదే తప్పు.. ఐసీసీ సీరియస్
పాకిస్థాన్ క్రికెటర్ సల్మాన్ అఘా రనౌట్ క్రికెట్లో పెను దుమారాన్ని రేపుతుంది. బంగ్లాదేశ్తో రెండో వన్డే సందర్భంగా సల్మాన్ ఔటైన తీరు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. తనను ఔట్ చేశాడన్న కోపంతో సల్మాన్ అఘా తన హెల్మెట్, గ్లౌవ్స్, బ్యాట్ను నేలకేసి కొట్టడమే గాక కెప్టెన్ మిరాజ్తో పాటు వికెట్ కీపర్ లిట్టన్ దాస్తో గొడవపడ్డాడు. అఘా ఔటైన తీరు వివాదాస్పదమే అయినప్పటికీ అతడి చర్య మాత్రం క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ పలువురు క్రీడా నిపుణులు పేర్కొన్నారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా సల్మాన్ అఘాపై చర్యలు తీసుకుంది. ఔట్ నిర్ణయం రాగానే మైదానంలో అనుచిత ప్రవర్తనకు దిగడమే గాక మ్యాచ్ రిఫరీ నీయముర్ రషీద్ ఫిర్యాదు మేరకు లెవల్ 1 నేరానికి అఘా పాల్పడినట్లు ఐసీసీ తేల్చింది.‘క్రికెట్ పరికరాలను అగౌరవపరిచినట్లు పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాపై ఫిర్యాదు అందింది. మైదానంలోనే అతను హెల్మెట్, గ్లౌవ్స్, బ్యాట్ను విసిరేసినట్లు తేలింది. గతంలో సల్మాన్ అఘా నుంచి ఇలాంటి ప్రవర్తన ఎన్నడూ చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం అఘా చేసిన పనిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ జత చేశాం. అయితే బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్తో జరిగిన వాగ్వాదంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిని కేవలం అపార్థంగా పరిగణించాం. మేం చట్టం ప్రకారమే నడుచుకుంటూనే ఇలాంటి తీర్పును ఇచ్చాం’ అని ఐసీసీ స్పష్టం చేసింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది.మాజ్ సదాఖత్ (75), సల్మాన్ అఘా (64) రాణించారు. అనంతరం మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 243 పరుగులుగా నిర్దేశించారు. అయితే బంగ్లాదేశ్ 23.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుతం ఇరుజట్లు చెరో వన్డే గెలవగా, మూడో వన్డే ఆదివారం జరగనుంది.చదవండి: ఐదేళ్ల ప్రయాణం.. దిగ్గజాల సరసన సూర్యా భాయ్!Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026
ఐదేళ్ల ప్రయాణం.. దిగ్గజాల సరసన సూర్యా భాయ్!
క్రికెట్ అభిమానులంతా అతడిని ముద్దుగా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అని పిలుస్తుంటారు. ప్రత్యర్థి బౌలర్ ఏ యాంగిల్లో బంతి వేసినా బౌండరీ లేదా సిక్సర్ బాదడం అతడి నైజం. దూకుడైన ఆటతీరుకు మారుపేరు. ఐదేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్లు గెలిచిన టీమిండియా జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇందులో ఒకసారి కెప్టెన్గా ఐసీసీ టైటిల్ అందుకొని దిగ్గజాల సరసన నిలిచి అరుదైన ఘనత సాధించాడు. అతడే భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మార్చి 14 (శనివారం)తో సూర్యకుమార్ తన క్రికెట్ కెరీర్లో ఐదేళ్ల ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ టీమిండియాతో ఐదేళ్ల ప్రయాణాన్ని తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నాడు. ‘ఐదేళ్ల ఏళ్ల క్రితం టీమిండియాకు ఆడాలన్న ఒక కల నిజమైంది. భారత జెర్సీని ధరించడమనేది ఇప్పటికీ నేను మాటల్లో పూర్తిగా వర్ణించలేని ఒక అద్భుతమైన అనుభూతి. ఈ నేపథ్యంలో ఒక ఆటగాడిగా, జట్టు కెప్టెన్గా నేను పొందిన జ్ఞాపకాలను మరోసారి పంచుకుంటున్నా.’ అంటూ ట్వీట్ చేశాడు.టీ20 క్రికెట్లో భారత తరఫున అత్యుత్తమ ఆటగాడిగా పేరు పొందిన సూర్యకుమార్ యాదవ్ 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం విశేషం. మార్చి 14, 2021లో ఇంగ్లండ్తో మ్యాచ్ ద్వారా సూర్య తన కెరీర్లో తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. సూర్యకుమార్ ఇప్పటివరకు టీమిండియా తరఫున 113 టీ20 మ్యాచ్లు ఆడి 162.94 స్ట్రైక్రేట్తో 3,272 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలతో పాటు 25 అర్థసెంచరీలున్నాయి.ప్రస్తుతం సూర్యకుమార్ టీ20 క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి రెండు స్థానాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఈ ఇద్దరు 2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్న సూర్యకుమార్ ఆ ప్రపంచకప్లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్లో బౌండరీ వద్ద క్యాచ్ అందుకోవడం ఎన్నటికీ మరిచిపోలేని సంఘటన. సూర్య క్యాచ్ అందుకోవడంతో మ్యాచ్ భారత్వైపు తిరగడం, ఆ తర్వాత టీమిండియా టైటిల్ గెలవడం చకచకా జరిగిపోయాయి.రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనంతరం కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న సూర్యకుమార్ జట్టును విజయపథంలో నడిపించడంలో విజయవంతమయ్యాడు. ఇప్పటివరకు సూర్య సారథ్యంలో 40 మ్యాచ్ల్లో గెలిచి, కేవలం ఎనిమిదింట మాత్రమే ఓడిపోయింది. అంతేకాదు టీ20 క్రికెట్లో సూర్య చేసిన నాలుగు సెంచరీలు నాలుగు వివిధ దేశాల్లో (భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్) రావడం విశేషం. 2022 ఏడాదిలో సూర్యకుమార్ టీమిండియా తరఫున 31 మ్యాచ్ల్లో 187 స్ట్రైక్రేట్తో 1164 పరుగులు సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్గా సూర్య రికార్డులకెక్కాడు. చదవండి: తూచ్.. అదంతా ఉత్తిదే!5 years ago, a dream turned into reality. Wearing the India jersey is a feeling I can still never fully put into words 🇮🇳Here’s to many more memories that we’re going to create, for team 🇮🇳 pic.twitter.com/qhis2f44tQ— Surya Kumar Yadav (@surya_14kumar) March 14, 2026
అబ్బో క్రీడాస్ఫూర్తి!.. పాక్ క్రికెటర్లపై లిటన్ దాస్ ఫైర్
పాకిస్తాన్ క్రికెటర్ల తీరుపై బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లా- పాక్ మధ్య శుక్రవారం జరిగింది చారిటీ మ్యాచ్ కాదని.. అదొక ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటూ చురకలు అంటించాడు. నిబంధనలకు అనుగుణంగానే తాము వ్యవహరించామని స్పష్టం చేశాడు.కాగా మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్ వెళ్లిన పాకిస్తాన్ జట్టు తొలి వన్డేలో చిత్తుగా ఓడింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో వన్డేలో మాత్రం సమిష్టిగా రాణించి ఆతిథ్య జట్టును చిత్తు చేసిన పాక్ 1-1తో సిరీస్ను సమం చేసింది.రనౌట్పై వివాదంఇదిలా ఉంటే.. పాక్ బ్యాటర్ సల్మాన్ ఆఘా రనౌట్ (Salman Agha's run-out)పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. బంగ్లా కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో మొహ్మద్ రిజ్వాన్ స్ట్రెయిట్ షాట్ ఆడగా.. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న సల్మాన్కు బంతి తాకింది. అప్పటికే క్రీజును వీడిన అతడు బంతి అందుకుని మిరాజ్కు ఇచ్చే ప్రయత్నం చేయగా.. వేగంగా స్పందించిన మిరాజ్ బంతిని వికెట్లకు గిరాటేశాడు.మాటల యుద్ధంఈ క్రమంలో బంగ్లాదేశ్ రనౌట్కు అప్పీలు చేయగా.. సానుకూల ఫలితం వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన సల్మాన్ హెల్మెట్ను నేలకేసి కొట్టి అసంతృప్తి వెళ్లగక్కాడు. మిరాజ్తో కాసేపు మాటల యుద్ధం చేశాడు. ఇంతలో లిటన్ దాస్ జోక్యంచేసుకోగా.. రిజ్వాన్ అతడిని సముదాయించి పక్కకు తీసుకువెళ్లాడు.క్రీడా స్ఫూర్తి ప్రదర్శించేవాడిని అయితే, సల్మాన్ రనౌట్ అయిన విషయంపై పాక్ జట్టు, మాజీ క్రికెటర్లు రాద్దాంతం చేస్తున్నారు. సల్మాన్ ఆఘా మిరాజ్ స్థానంలో ఉండి ఉంటే ఇలా చేసి ఉండేవాడిని కాదన్నాడు. క్రీడా స్ఫూర్తి ప్రదర్శించేవాడిని అన్నాడు.ఇక పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా స్పందిస్తూ.. ‘‘నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ చేసింది సరైందే కావచ్చు. కానీ క్రీడాస్ఫూర్తికి వారు భంగం కలిగించారు. బ్యాటర్ బౌలర్కు సాయం చేద్దామని చూశాడు. కానీ అతడు తనని రనౌట్ చేస్తాడని ఊహించలేదు’’ అని మిరాజ్ తీరును విమర్శించాడు.ఇదేమీ చారిటీ లీగ్ మ్యాచ్ కాదుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ స్పందిస్తూ.. ‘‘ముందుగా అందరికీ ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. ఇదేమీ చారిటీ లీగ్ మ్యాచ్ కాదు. ఇదొక అంతర్జాతీయ మ్యాచ్.క్రీడాస్ఫూర్తికి భంగమా?నిబంధనలకు అనుగుణంగానే మేము రనౌట్ చేశాము. ఇందులో క్రీడాస్ఫూర్తికి భంగం కలిగినట్లు నాకైతే ఎక్కడా కనిపించలేదు. ప్రతి ఒక్కరికి తమ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. అయితే, మైదానంలో ఆటగాళ్లుగా అది అవుట్ అంటే అవుటేనని మా అందరికీ తెలుసు’’ అని పాక్ క్రికెటర్లు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.కాగా ఢాకాలో జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (31), మాజ్ సదాకత్ (75)లతో పాటు రిజ్వాన్ (44), సల్మాన్ ఆఘా (64) రాణించారు. దీంతో 47.3 ఓవర్లలో 274 పరుగులు చేసి పాక్ ఆలౌట్ అయింది.బంగ్లా బౌలర్లలో రిషాద్ హొసేన్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ మిరాజ్ రెండు, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నహీద్ రాణా తలా ఒక వికెట్ తీశారు. ఇక వర్షం వల్ల బంగ్లా టార్గెట్ను డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం 32 ఓవర్లలో 243 పరుగులకు కుదించగా.. 23.3 ఓవర్లలో 114 పరుగులు చేసి ఆలౌట్ అయింది.చదవండి: SRH: బెస్ట్ ప్లేయింగ్ XII.. రూ. 13 కోట్ల ఆటగాడికి దక్కని చోటు!Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026
తూచ్.. అదంతా ఉత్తిదే!
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ చెత్త ఆటతీరుతో సూపర్-8లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. పాక్ జట్టుపై ఆగ్రహంతో ఊగిపోయిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒక్కో ఆటగాడికి పీకేఆర్ 50 లక్షలు (భారత కరెన్సీలో సుమారు రూ.16.5 లక్షలు) జరిమానా విధిస్తున్నట్లు కొన్ని రోజుల కిందట ఆ దేశ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ కఠిన నిర్ణయం స్వయంగా పీసీబీ చైర్మన్ మొహసీన్ నఖ్వీనే తీసుకున్నట్లు కూడా రూమర్లు వచ్చాయి. అయితే తాజాగా పాక్ ఆటగాళ్లకు విధించిన జరిమానాల్లో నిజమెంత అనే దానిపై పీసీబీ ప్రతినిధి ఆమిర్మిర్ స్పందించారు. ‘టీ20 ప్రపంచకప్లో చెత్త ప్రదర్శన కనబరిచినందుకు పాక్ ఆటగాళ్లకు జరిమానా విధించినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఇదంతా సోషల్ మీడియా ప్రచారం చేస్తున్న గాసిఫ్ మాత్రమే. అలాంటి నిర్ణయాలు పీసీబీ ఎప్పుడూ తీసుకోదు. ప్రపంచకప్లో చెత్త ప్రదర్శనకుగానూ పాకిస్థాన్ ఆటగాళ్లను, కోచ్, సిబ్బందిని హెచ్చరించిన మాట నిజమే కావొచ్చు. కానీ ఆటగాళ్లపై మాత్రం ఎలాంటి క్రమశిక్షణా చర్యలు గానీ జరిమానా కానీ విధించలేదు.’ అని చెప్పుకొచ్చారు.ఇక సల్మాన్ అఘా నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు టీ20 ప్రపంచకప్లో మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమైంది. తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్పై తడబడి గెలిచింది. ఆ తర్వాతి మ్యాచ్లో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్థాన్ ఎలాగోలా సూపర్-8లో అడుగుపెట్టింది. అయితే సెమీస్కు చేరాలంటే శ్రీలంకను భారీ తేడాతో ఓడించాలి. కానీ కేవలం ఐదు పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 2024లోనూ పాక్ జట్టు సెమీస్ చేరడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈసారి కూడా నాసిరకం ఆటతీరుతో నాకౌట్కు చేరకుండానే పాకిస్థాన్ వరుసగా రెండోసారి సూపర్-8 దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే టీ20 ప్రపంచకప్లో వైఫల్యం కారణంగా ఆటగాళ్లకు జరిమానా విధించారన్న విషయంపై వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. పాక్ ఆటగాళ్లకు విధించిన జరిమానా మొత్తాన్ని తాను కడుతానని, కానీ ఆ డబ్బులు జట్టును మళ్లీ మంచి ట్రాక్లోకి తెచ్చేందుకు ఉపయోగించాలని కోరడం గమనార్హం. ఇటీవలే బంగ్లాదేశ్లో మొదలైన వన్డే సిరీస్ను కూడా పాక్ ఓటమితోనే ప్రారంభించింది. తొలి వన్డేలో పాకిస్థాన్ 114 పరుగులకే కుప్పకూలింది. అయితే రెండో వన్డేలో మాత్రం బంగ్లాపై డక్వర్త్ లూయిస్ పద్దతిలో 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో వన్డే ఆదివారం జరగనుంది.చదవండి: ధోనీ ఆ విషయం అప్పుడే చెప్పాడు!
న్యూస్ పాడ్కాస్ట్
రైతులతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొండాట.. పేరుకే అన్నదాత సుఖీభవ, ఆచరణలో అంతా మోసం
విలువలు, విశ్వసనీయతకు వైఎస్సార్సీపీ మారుపేరు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఆదాయం... కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఇక్కడ బాబు, అక్కడ BR నాయుడు కోట్లల్లో భారీ స్కాం
పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు..ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
భవిష్యత్ అభివృద్ధి శూన్యం... ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
బిజినెస్
ఇల్లు కొనాలంటే.. ఈ వసతులు ఉండాల్సిందే!
గతంలో గృహ కొనుగోలులో ధరకు ప్రాధాన్యం ఉండేది. కానీ, ఇప్పుడు వసతులు చూశాకే నిర్ణయం తీసుకుంటున్నారు. ధర ఎంతైనా వసతుల విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. గృహ కొనుగోలుదారుల అభిరుచుల మేరకు డెవలపర్లు కూడా సరికొత్త సౌకర్యాలను అందిస్తున్నారు. గతంలో కమ్యూనిటీలలో జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి నాలుగైదు వసతులు ఉంటే సరిపోయేది కానీ, ఇప్పుడు భవిష్యత్తు అవసరాలు, కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టు ఉండాల్సిందే. ఇంటి నుంచి పని కోసం కో-వర్కింగ్ స్పేస్, ఆన్లైన్ క్లాస్ల కోసం డిజిటల్ క్లాస్ రూమ్ నుంచి మొదలుపెడితే.. టెర్రస్, క్లబ్హౌస్పై సౌర విద్యుత్ ఏర్పాట్లు, ఔట్డోర్ జిమ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, హోమ్ థియేటర్, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, పెట్ పార్క్, గోల్ఫ్కోర్స్ వరకూ అన్ని ఆధునిక వసతులు కావాలని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు.పెట్ పార్క్..జంతు ప్రేమికుల కోసం కూడా డెవలపర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నివాస సముదాయాల్లో వసతుల జాబితాలో పెట్ పార్కులు కూడా చేరిపోయాయి. గేటెడ్ కమ్యూనిటీలలో కొనుగోలుదారులు పెంచుకునే పెంపుడు జంతువుల కోసం పెట్ పార్క్, క్లబ్హౌస్లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్లలో అందుబాటులో ఉంటాయి. అలాగే పెట్రోల్, డీజిల్ వంటి వాహనాలతో పర్యావరణం కలుషితం అవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాహన కొనుగోళ్లపై రాయితీలు అందిస్తుండటంతో పాటు చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.హోమ్ గార్డెనింగ్..సొంతిల్లు కొనుగోలు చేసే క్రమంలో గేటెడ్ కమ్యూనిటీలో కామన్ ఏరియాలు ఎంత వరకు ఉన్నాయో అడిగి మరీ తెలుసుకుంటున్నారు. గతంలో కామన్ ఎలివేటర్, కామన్ కారిడార్, గ్యారేజ్, స్టేర్కేస్ ఉండేవి ఇప్పుడు వాటిని ప్రైవేట్గా కావాలని అడుగుతున్నారు. ఇంట్లో సొంత అవసరాల కోసం కమ్యూనిటీ గార్డెన్ను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపాటి స్థలంలో ఆకుకూరలు, కాయగూరలు పండించుకునేలా వర్టికల్ గార్డెనింగ్, బాల్కనీలలో ఉండేలా చూసుకుంటున్నారు. వారాంతాలలో కమ్యూనిటీ వాసులతో ఆహ్లాదంగా గడిపేందుకు ఔట్డోర్ కిచెన్, డైనింగ్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. టెర్రస్, క్లబ్ హౌస్పై సౌర విద్యుత్ ఉండాలని కోరుతున్నారు. వీధి దీపాలు, ఇతరత్రా అవసరాల కోసం ఈ విద్యుత్నే వినియోగిస్తున్నారు. దీంతో నివాసిత సంఘానికి కరెంట్ బిల్లు భారం తగ్గుతుంది.
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!
దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 14) పసిడి ధర గరిష్టంగా రూ.1030 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం బాటలోనే నేను కూడా అన్నట్టు.. వెండి అడుగులు వేసింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ.5000 తగ్గింది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ ధరలను గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అద్దె గృహాలకు ఫుల్ డిమాండ్.. ఎక్కడంటే?
కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. విక్రయించే సమయంలో ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాల్లో అద్దె గృహాల మార్కెట్ క్రమంగా పెరుగుతోంది.ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంది. ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండటంతో సప్లై తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్ పెరిగింది.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్ 50, సప్లై వాటా 39 శాతంగా ఉంది. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువ ఉంది.కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేల నుంచి రూ.35 వేల నెలవారీ అద్దెలకు కోసం అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ ఎక్కువ ఉంది.
ఇల్లు కొంటే ఖరీదైన బైక్.. తులం బంగారం
షాపుల్లో మెగా సేల్స్.. బంపర్ ఆఫర్లు చూస్తుంటాం.. ఈ కామర్స్ సంస్థల ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్లు చూస్తుంటాం.. మైక్ పట్టుకొని ‘రండి బాబూ రండి.. ఇలాంటి సువర్ణావకాశం మళ్లీ రాదు..’ అంటోంది స్థిరాస్తి రంగం. అందుబాటు ధరలు ఉండే హైదరాబాద్లో ఒకప్పుడు ప్రాపర్టీలు హాట్ కేక్లు. నిర్మాణం పూర్తి కాకముందే బ్రోచర్ల మీదే ఫ్లాట్ల అమ్మకాలు పూర్తయ్యేవి. ధరలు, నాణ్యత, బిల్డర్ల ట్రాక్ రికార్డ్లు, మార్కెట్ సెంటిమెంట్ అలా ఉండేది. 360 డిగ్రీల కోణంలో గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించేలా, ఆకర్షించేలా ఉండేది. కానీ, కొన్నేళ్లుగా మార్కెట్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. – సాక్షి, సిటీబ్యూరోమారిన పరిస్థితులతో పాటు కొన్ని ప్రతికూలతలతో స్థిరాస్తి రంగంలో సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతింది. దీంతో విక్రయాలు లేక నిర్మాణ రంగం క్షీణించే దశకు చేరుకుంది. ఈ రంగంపైనే ఆధారపడిన నిర్మాణ సంస్థలు, బిల్డర్లు కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్ల వల వేయక తప్పడం లేదు. ఇళ్ల అమ్మకాలను పెంచుకునేందుకు విలువైన బైక్, ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈవీ), తులం బంగారం, ఉచిత ఇంటీరియర్.. ఇలా రకరకాల ఆఫర్లతో ముందుకొస్తున్నారు.నిర్మాణ సంస్థలెన్నో.. స్థిరాస్తి రంగంలో ఆఫర్ల వల కొత్తేమీ కాదు. గతంలో ఉచిత ఇంటీరియర్, క్లబ్హౌస్ సభ్యత్వం, మాడ్యులర్ కిచెన్ వంటి పరిమిత స్థాయిలో ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్లో గృహ విక్రయాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో నగరంలోని చిన్నా, పెద్దా డెవలపర్లు, నిర్మాణ సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రీమియం మోటార్ సైకిళ్లు, 24 క్యారెట్ల బంగారం నాణేలు, ఈవీ వాహనాలు, ఉచిత ఇంటీరియర్ వంటి ఖరీదైన బహుమతులను అందజేస్తున్నాయి. ఉదాహరణకు నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కోకాపేట, కూకట్పల్లి, ఉప్పల్, పటాన్చెరు, రాజేంద్రనగర్లలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లలో అపార్ట్మెంట్ బుకింగ్తో ప్రతి కొనుగోలుదారుడికి రూ.3 లక్షల విలువైన హార్లీ డేవిడ్సన్ బైక్ను ఉచితంగా అందజేస్తామని ప్రచారం చేస్తోంది. మరో డెవలపర్ ఉప్పల్, రామాంతాపూర్లలో రాబోయే ప్రాజెక్ట్లో ప్రతి కస్టమర్కు రూ.8 లక్షల విలువైన ఈ–వాహనాన్ని అందిస్తామని ప్రచారం చేస్తున్నారు.ఆఫర్లతో విక్రయాలు స్పల్పకాలమే.. వేగంగా విక్రయాలు జరుపుకునేందుకు ఇలాంటి ఆఫర్లతో ప్రయత్నాలు చేస్తుంటారని డెవలపర్ల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రతికూల మార్కెట్లో అమ్ముడుపోని ఇన్వెంటరీని విక్రయించేందుకు ఇలాంటి ప్రత్యేక డీల్స్ను ప్రవేశపెడుతుంటారు. అయితే ఈ ఉచితాల ధర ప్రాజెక్ట్ ధరలో భాగం అవుతుందని, ఈ తరహా మార్కెట్ స్వల్పకాలంలో అమ్మకాలను పెంచినా.. స్థిరమైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే ఉచితాలు కాకుండా ధర, నిర్మాణ నాణ్యత, ప్రాంతాన్ని చూసి ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.బంగారంతో ఆకర్షణ.. పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆఫర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఫ్లాట్ బుకింగ్ చేసుకునే కస్టమర్లకు రిటర్న్ గిఫ్ట్ అందజేసే సంప్రదాయంగా పెరుగుతోంది. మియాపూర్కు చెందిన ఓ డెవలపర్ రూ.75–85 లక్షల మధ్య ధర కలిగిన రెండు, మూడు పడక గదుల ఇంటి కొనుగోలుపై కస్టమర్కు రూ.3 లక్షల విలువైన బంగారం ఇస్తామని ప్రకటించారు. అంటే దగ్గరిదగ్గర 10–14 గ్రాముల బంగారం ఇస్తున్నారు. అలాగే పిల్లల బెడ్ రూమ్కు ఇంటీరియర్, మాడ్యులర్ కిచెన్తో పాటు అందజేస్తామని ప్రచారం చేస్తున్నారు.రెరా పరిధిలోకి రావు.. ఆఫర్లు, ప్రోత్సాహకాలు కస్టమర్లను ఆకర్షించేందుకు డెవలపర్లు పన్నే వాణిజ్య వ్యూహాలు. అయితే ఈ ఉచిత ఆఫర్ల ప్రకటనలు తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(టీజీ రెరా) నియంత్రణ పరిధిలోకి రావు. ఇవి గృహ కొనుగోలుదారులకు రక్షణ కల్పించలేవు. అయితే సేల్డీడ్లో పేర్కొన్న విధంగా హామీలను అమలు చేయడంలో డెవలపర్ విఫలమైతే ఈ ఉచితాలు, బహుమతులతో సహా కొనుగోలుదారులు టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. ఆయా డెవలపర్లపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటారు.
ఫ్యామిలీ
మహిళా రైతులకు మద్దతిస్తే..!
ఒక మహిళా రైతు సాధికారితను పెంపొందిస్తే (అంటే, మద్దతు ఇస్తే లేదా బలోపేతం చేస్తే).. ఏమవుతుంది? ఆ కుటుంబం, సమాజం బాగుపడుతుంది. ఇందుకోసమే 2026 అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (యూఎన్–ఎఫ్ఏఓ) మహిళా రైతుల సాధికారితపై నాలుగు మాటల్లో ఏమంటోందో చూద్దాం..మీకు తెలుసా? దాదాపు ప్రతి గ్రామీణ మహిళ ఒక కార్మికురాలే, తిని కూర్చునే వారెవరూ లేరు! ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, 2021లో ప్రపంచ వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి, పంపిణీ రంగాల్లో పనిచేస్తున్న వారిలో మహిళలు 41% ఉన్నారు. అయినప్పటికీ గ్రామీణ మహిళలు అసమానతలను ఎదుర్కొంటున్నారు. వారి ఉపాధికి గ్యారంటీ లేదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. హక్కులను పరిమితంగా మాత్రమే పొందగలుగుతున్నారు.ఆదాయం వచ్చే పొలం పనుల కన్నా ‘వేతనం లేని కుటుంబ సంరక్షణ పనుల’కు మహిళా రైతులు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఇది లేబర్ మార్కెట్లో వారి విలువను తగ్గిస్తోంది. ఆర్థిక సాధికారత తగ్గిపోతోంది. ఈ పరిస్థితులు మహిళా రైతులకు అంత శ్రేయస్కరంగానూ లేదు. ప్రపంచవ్యాప్తంగా, మహిళలు, బాలికలు చేసే కుటుంబ సంరక్షణ పనులకు విలువ కడితే ఎంతవుతుందో తెలుసా? ఏడాదికి ఏకంగా రూ.9,95,264 కోట్లు అవుతుంది!మహిళా రైతులు సాధారణంగా పురుషుల కంటే చిన్న కమతాల్లోనే పంటలు పండిస్తున్నారు. పురుషులతో సమానమైన విస్తీర్ణం గల పొలాల్లో పంటలు పండిస్తున్న చోట్ల కూడా.. మహిళా రైతులకు వనరుల లభ్యత, వ్యవసాయ శిక్షణ, సలహాల అందుబాటు అరకొరగా అందుతుండటంతో ఉత్పాదకతలో వెనుకబడుతున్నారు. వీరి ΄పొలాల్లో పంటల దిగుబడి 24% తక్కువగానే వస్తోందని బెంగళూరుకు చెందిన ‘ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్’ చెబుతోంది.ఆహార అభద్రత పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ. ప్రపంచం లో ఏ ప్రాంతంలో చూసినా పరిస్థితి ఇలాగే ఉంది. ఉపాధి, విద్య, ఆదాయంలో లింగపరమైన వివక్షలను తొలగించటం ద్వారా ఈ అంతరం 52% పోతుందని నిపుణులు చెబుతున్నారు.మన దేశంలో మహిళా రైతుల పరిస్థితేమిటి?ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్ సర్వేల (2017–18) ప్రకారం, వ్యవసాయ సీజన్లో 92% గ్రామీణ మహిళలు ఆదాయం వచ్చే వ్యవసాయ పనులు చేస్తున్నారు. పనులు అంతగా ఉండని సీజన్ లో కూడా 64% మంది ఏదో ఒక పని చేస్తున్నారు. ఏడాది పొడవునా గ్రామీణ మహిళలు చాలా మంది పనిలో నిమగ్నం అవుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.పాడి పనుల్లో నిమగ్నమయ్యే వారిలో దాదాపు 70% మంది మహిళలే. అయినప్పటికీ ఈ రంగం యొక్క అసంఘటిత స్వభావం కారణంగా వారి పనిని చాలా సార్లు చిన్న చూపు చూస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకారం, 2022–23లో, ఉపాధి హామీ పనులు చేసే శ్రామికుల్లో 57.43% మంది మహిళలు ఉన్నారు.సాధికార మహిళా రైతులువారి కుటుంబాలు, సమాజాల శ్రేయస్సుకు దోహదపడుతుంది. ఆహార కొరత తగ్గుతుంది.అనేక రకాల ఆహారం, పౌష్టికాహారం మరింత మెరుగ్గా అందుతుంది. రైతు కుటుంబాల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి.రకరకాల ఒడొదుడుకులను తట్టుకునే శక్తి కుటుంబాలకు పెరుగుతుంది. (చదవండి: సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి!)
చేతులు లేవు కానీ పెయింటింగ్లో ప్రపంచ రికార్డు..!
కొందరి ప్రతిభ అసాధారణంగా బయటకొస్తుంది. సాధారణంగా చిత్ర కళాకారులు ప్రయాణం చేతిలో పెన్సిల్ పట్టుకోవడంతో ప్రారంభమవుతుంది. కానీ కొందరి విధివంచితులకు ఆ అవకాశమే లేకుండా చేసి వెక్కిరిస్తుంటుంది. అయినప్పటికీ వారి కళా ప్రయాణం ఆగదు..పైగా విభిన్న ప్రతిభపాటవంతో ప్రపంచమే చేతులెత్తి సలాం కొట్టేలా చేస్తారు. అంతేగాదు అసాధారణ ధృడ సంకల్పం ముందు ఎంతటి వైకల్యమైన వెలవెలబోవాల్సిందే..!. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు.ఆ యువకుడే చత్తీస్గఢ్కు చెందిన గోకరణ్ పాటిల్. పుట్టుకతో చేతులు, వినికిడి లోపంతో జీవిస్తున్న వ్యక్తి శక్తిమంతమై సృజనాత్మక వ్యక్తీకరణ రూపంగా మారాడు. గోకరణ్ పాటిల్ చత్తీశ్గఢ్లోని భిలాయ్లో పెరిగాడు. అక్కడ అతను తన తల్లి, తోబుట్టువులతో పెరిగాడు. రోజువారీ పనులకు అతడి శారీరక లోపాలు పెను సవాళ్లుగా మారాయి. అయినప్పటికీ పాటిల్ వెనక్కి తగ్గలేదు. అలా పాఠశాలలో చదువుకుంటున్నప్పుడూ అందరిలా చేతితో పెన్సిల్ పట్టుకోలేకపోతేనేం.. కాళ్లు ఉన్నాయి కదా అని అనుకున్నాడు పాటిల్. అలా కాలి వేళ్ల మధ్య పెన్సిల్ పట్టుకుని రాయడం ప్రారంభించాడు. అతనికి తన పాదాలపై ఉన్న అద్భుతమైన నియంత్రణకు ఉపాధ్యాయులు అబ్బురపడి..డ్రాయింగ్ వేసే దిశగా ప్రోత్సహించారు. దాంతో పాటిల్ ఆ మార్గంలోనే గట్టిగా సాధన చేశాడు. కాలక్రమేణ చిత్రీకరణ ఒక గొప్ప శక్తిగా రూపాంతరం చెందింది. అతి కాస్తా తన అభిరుచి, ఫ్యాషన్గా మారిపోయింది. అతడికి ఈ కళ ఒకరకంగా అపారమైన ఏకాగ్రత అబ్బేలా చేసింది. ఆ నేపథ్యంలోనే వివరణాత్మక చిత్రపటాలు, శక్తిమంతమైన ప్రకృతి దృశ్యాలతో ప్రేక్షకులను అలరించాడు. అలా చివరికి లలిత కళలలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. పాటిల్ చిత్రీకరణ సాంకేతికతపై మంచి పట్టుని సంపాదించుకున్నాడు. ప్రపంచ దృష్టించిన ఆకర్షించేలా రికార్డు..పాటిల్ అంకితభావం చివరికి అతనికి అంతర్జాతీయ గుర్తింపును సంపాదించిపెట్టింది. యుక్తవయసులో, ఒక గంటలోపు తన కాలి వేళ్లను ఉపయోగించి అత్యధిక సంఖ్యలో డ్రాయింగ్లను సృష్టించిన తర్వాత అతను గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకెక్కాడు. ఈ ఘనత వేగం కంటే అతడు వేసిన తీరు అతడిని వార్తల్లో నిలిచేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. నిజానికి పాదాలతో బొమ్మలు చిత్రించాలంటే..బ్రష్ను నియంత్రించడానికి సమతుల్యత, కండరాల బలం, తీవ్రమైన ఏకాగ్రత, నిరంతర సాధన చాలా అవసరం. అయితే పాటిల్ వాటిన్నింటిని మరింత మెరుగపరుచుకున్నాడు. అదే అతడని ఇలా ప్రపంచ రికార్డు నెలకొల్పేలా చేసింది. పాటిల్ చిత్రాలు కళాభిమానులు, ప్రభుత్వ అధికారులు, సోషల్ మీడియా ప్రేక్షకుల దృష్టిని అమితంగా ఆకర్షించాయి. అంతేగాదు ఈ అభిరుచి కాస్తా.. స్థిరమైన జీవనోపాధిగా మార్చుకున్నాడు. అంతేగాదు పాటిల్ వ్యక్తిగతంగా సక్సెస్ అయితే చాలు అనుకోలేదు. ముఖ్యంగా తనలాంటి విద్యార్థులకు, వినికిడి లోపం ఉన్నవారికి క్రియేటివిటీ, సాంకేతికత నైపుణ్యాలను నేర్చుకోవడంలో సహాయ సహకారాలు అందిస్తుండటం విశేషం. (చదవండి: 109 కిలోల నుంచి 72 కిలోలకు తగ్గిన డయాబెటిస్ డాక్టర్..!)
109 కిలోల నుంచి 72 కిలోలకు తగ్గిన డయాబెటిస్ డాక్టర్..!
సుదీర్ఘ పనిగంటలు, ఒత్తిడి, వర్కౌట్ల లేమి తదితరాల వల్ల బరువు తగ్గడం కష్టంగా ఉంటుంది. అలాంటివాళ్లు స్థిరమైన అలవాట్లతోనే బరువుకి చెక్పెట్టగలరు. శాశ్వత ఫలితాలు కావాలనుకుంటే క్రమశిక్షణతో కూడిన స్థిరత్వం అత్యంత ప్రధానం అని చెబుతున్నారు నిపుణుల. ఇక్కడ వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఈ డయాబెటిస్ డాక్టర్ కూడా..సుదీర్ఘ పనిగంటలతో బిజీగా ఉంటూ..వ్యక్తిగత ఆరోగ్యాన్ని పాడు చేసుక్నుఆడు. ఎందరో రోగులకు బరువు తగ్గడంపై శిక్షణ ఇస్తూ..వారికి ఆరోగ్య సూచనలిచ్చే వ్యక్తి వ్యక్తిగత హెల్త్, జీవనశైలి సవ్యంగా లేదు. ఫలితంగా ఊబకాయం బారినపడి ఇబ్బందిపడ్డాడు. విచిత్నం ఏంటంటే తన క్లినికల్ అనుభవంతో సాధ్యమైనంత తొందరగానే ఆ సమస్య నుంచి బయటపడి వెయిట్లాస్ ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచాడు. మరి అతడు ఈ అధిక బరువుని ఎలా జయించాడంటే..ఆ డాక్టరే న్యూఢిల్లీ చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ బ్రిజ్మోహన్ అరోరా. వృత్తిరీత్యా అత్యంత బిజీగా ఉండటం, లేట్నైట్ మీటింగ్స్ తదితరాల కారణంగా సరైన ఆహారపు అలవాట్లు ఉండేవి కావు. మద్యం సేవించడం, బయట తినడం, తీపి పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం తదితరాలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు. శారీరక శ్రమ అన్నదే అతని దైనందిన జీవితంలో దాదాపుగా లేదని చెప్పొచ్చు. దాంతో అతడు దాదాపు 109 కిలోల బరువుకి చేరుకున్నాడు. అది ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేసింది కూడా. దాంతో అరోరా ఎలాగైనా స్లిమ్గా మారాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. అయితే వేగవంతంగా బరువు తగ్గించే పద్ధతుల జోలికిపోకుండా..వ్యాయామం, సక్రమమైన జీవినశైలిపై దృష్టి పెట్టాడు. ఈ పద్ధతులు అతడి బాడీలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడమే గాక, కండర ద్రవ్యరాశిని రక్షించడం, తగినంత నిద్ర పోవడం వంటి అలవాట్లతో మెరుగైన ఫలితాలు అందుకున్నారు. ప్రభావవంతమైన మార్పుతో కొద్దికాలంలోనే స్లిమ్గా మారిపోయాడు. అలా 72 కిలోల ఆరోగ్యకరమైన బరువుకి చేరుకున్నాడు. ఇలా బరువు తగ్గడంతో ఏ పనైనా సునాయాసంగా చేసేలా యాక్టివ్గా మారింది శరీరం. ఈ వెయిట్లాస్ జర్నీలో కడరాలు కోల్పోకుండా కొలెస్ట్రాల్ తగ్గించుకున్నానని, రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరిచానని అన్నారు. అన్నీట్లకంటే ఏ మార్పు అయినా స్వీకరించేందుకు ముందుకు వచ్చినప్పడూ..స్థిరత్వంతో కూడిన సహనం, క్రమశిక్షణ చాలా అవసరమని, అప్పుడే అనుకున్న లక్ష్యానికి మనం చేరుకోగలమంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు అరోరా. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్..!)
అలా అయితే మహిళలకు ఉద్యోగాలు కష్టమే : సుప్రీం కోర్టు
ఢిల్లీ: మహిళల పీరియడ్ లీవ్కు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు రుతుస్రావం సమయంలో సెలవులు తప్పనిసరి చేస్తే ఏ కంపెనీలు వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి మెుగ్గు చూపవని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. రుతుస్రావం సమయంలో మహిళలకు తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలని నమోదైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజు శుక్రవారం విచారించింది. మహిళల సహజ రుతుస్రావం సమయంలో విద్యార్థినిలకు, ఉద్యోగస్థులకు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని లాయర్ శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విధంగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఆ పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ‘పీరియడ్ సమస్యపై, దాని సున్నితత్వంపై అవగాహన కల్పించడం వేరు. రుతుక్రమం సమయంలో సెలవులు తప్పనిసరి అనిచట్టం చేస్తే మహిళలకే నష్టకరంగా మారవచ్చు. వారిని ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోరు. గవర్నమెంట్ ఉద్యోగాలు, జ్యూడీషియరీ జాబ్స్ ఎందులోనూ వారికి చోటు ఉండదు. కంపెనీల మనస్థత్వం మీకు తెలియదు’ అని అన్నారు. అయితే దీనిపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఇదే అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 21 ప్రకారం ఆడపిల్లలకు గౌరవంగా జీవించే హక్కు ఉందని ఆరోగ్యం, విద్య, గౌరవం వారికి ప్రభుత్వాలు కల్పించాల్సిన బాధ్యత అని తెలిపింది.ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు వారికి ఉచితంగా నాప్కీన్స్, ప్రత్యేకమైన టాయిలెట్స్, మెంటల్ హెల్త్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది.
అంతర్జాతీయం
‘బ్లడ్ బ్యాంకుల్లో ఎన్ఏటీ తప్పనిసరి’ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని బ్లడ్ బ్యాంకుల్లో న్యూక్లియిక్ యాసిడ్ ఆంప్లిఫికేషన్ టెస్టింగ్(ఎన్ఏటీ)ని తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. వైద్య శాస్త్రం తెలియకున్నా తెలిసినట్లుగా ఎందుకు తాము నటించాలని ప్రశ్నించింది. ఢిల్లీకి చెందిన ‘సర్వేశం మంగళం ఫౌండేషన్’వేసిన పిల్పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగి్చల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్ఏటీ వల్ల గ్రహీతలకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేని రక్తాన్ని అందించేందుకు వీలవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం పిల్లకు విదేశీ నిధులు అందవని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించింది. ‘ఈ అంశంపై మాకు ఎటువంటి పరిజ్ఞానం లేదు, వైద్య శాస్త్రంతో ఎటువంటి పరిచయం లేకున్నా తెలిసినట్లుగా మేమెందుకు నటించాలి?అని ప్రశ్నించింది. బ్లడ్ బ్యాంకుల్లో ఎన్ఏటీకి అవసరమైన ఏర్పాట్లు చేసే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్ను కోరింది. రాష్ట్రాల కార్యదర్శులు సంబంధిత అంశాల్లో నిపుణుల సలహాలతో సరైన నిర్ణయం తీసుకుంటారంది. బ్లడ్ బ్యాంకుల్లో ఎటువంటి పరీక్షలు చేయాలన్నది నిపుణుల పరిధిలోనే ఉంటుందని తెలిపింది. ఈ అంశంలో ప్రత్యేకంగా తమకు ఎటువంటి పరిచయం లేనందున, పిటిషనర్ కోరిన విధంగా ఆదేశాలివ్వజాలమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకుల్లో ఖరీదైన ఎన్ఏటీకి ఏర్పాటు చేయడం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.పిటిషన్లో ఏముంది? రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21లోని జీవించే హక్కులో భాగమే సురక్షితమైన రక్తాన్ని పొందే హక్కని పిటిషన్ తెలిపింది. బ్లడ్ బ్యాంకుల్లో ఎన్ఏటీకి వెసులుబాటు కలి్పస్తే దాతల నుంచి సేకరించిన రక్తంలో హెచ్ఐవీ, హెపటైటిస్ సీ, బీ, మలేరియా, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు వీలవుతుందని వివరించింది. రక్త దాతల నుంచి సేకరించిన రక్తం పూర్తి సురక్షితంగా గ్రహీతలకు అందేలా చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. అయితే, ప్రభుత్వాల వైఫల్యాల వల్ల అత్యంత సున్నితమైన ఆరోగ్య పరిస్థితి కలిగిన, ముఖ్యంగా తలసీమియా రోగులను ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో విఫలమవుతున్నామని తెలిపింది. ఇన్ఫెక్షన్ కలిగిన రక్తాన్ని అందించడం వల్ల మధ్యప్రదేశ్లోని సత్నా ఆస్పత్రిలో ఆరుగురు తలసీమియా బాధిత చిన్నారులు హెచ్ఐవీ బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధంగా, జార్ఖండ్లోని చైబాసా ఆస్పత్రిలో 2025లో ఐదుగురు బాలలు, యూపీలోని ఓ మెడికల్ కాలేజీలో 2023లో 14 మంది బాలలకు హెపటైటిస్, హెచ్ఐవీ సోకిందని తెలిపింది.
అమెరికాతో చర్చలు నిజమే: క్యూబా
హవానా: అమెరికా ప్రభుత్వంతో తాము చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలను కమ్యూనిస్ట్ దేశం క్యూబా అధ్యక్షుడు మిగెల్ డయాజ్ కనెల్ ధ్రువీకరించారు. రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలన్నదే ఈ సంభాషణల లక్ష్యమని చెప్పారు. అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు అవకాశమిచ్చాయన్నారు. చర్చల వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఈ అంశంపై నిరాకరించేందుకు అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ నిరాకరించింది. అమెరికా ఇంధన దిగ్బంధం కారణంగానే గత మూడు నెలలుగా తమకు పెట్రోలియం ఉత్పత్తులు అందడం లేదని అధ్యక్షుడు డయాజ్ కనెల్ అన్నారు. సహజ వాయువు, సోలార్ పవర్ థర్మోఎలక్ట్రిక్ ప్లాంట్లతో నెట్టుకొస్తున్నామన్నారు. తీవ్ర ఇంధన కొరత ప్రభావం సమాచార, విద్య, రవాణా రంగాలపై ఎక్కువగా పడిందని, ఆస్పత్రుల్లో వేలాదిమందికి అవసరమైన శస్త్ర చికిత్సలు వాయిదాపడ్డాయని చెప్పారు. దేశంలో ఉన్న 115 బేకరీలు ప్రస్తుతం బొగ్గు, వంటచెరుకుతోనే నడుస్తున్నాయన్నారు. క్యూబాకు ప్రధాన చమురు సరఫరాదారు వెనెజువెలా. అయితే, రెండు నెలల క్రితం వెనెజువెలాపై అమెరికా దాడి చేసి అధ్యక్షుడిని బంధించి తీసుకెళ్లడంతో క్యూబాకు చమురు రవాణా ఆగిపోయింది. అమెరికా ఆంక్షల కారణంగా ఇతర దేశాల నుంచి అవసరమైన యంత్రాలు, ఇతర విడి భాగాలను క్యూబా కొనుగోలు చేయలేకపోతోంది.
లెబనాన్పై బాంబుల వర్షం
పశ్చిమాసియా యుద్ధ తీవ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. యుద్ధం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇరాన్కు మద్ధతుగా నిలిచే గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతుంది. హిజ్బూల్లా స్థావరాలే లక్షంగా అటాక్స్ చేస్తుంది. అయితే ఈ దాడుల్లో అధిక సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు తీవ్రతరం చేసింది. కొద్దిరోజుల క్రితమే గ్రౌండ్ లెవల్ ఆపరేషన్ చేపట్టింది. ఆ దేశ ఆర్మీ దక్షిణ లెబనాన్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేస్తున్నాయి. తాజాగా బీరూట్ నగరంపై బాంబులతో విరుచుకపడింది. హిజ్బుల్లా టార్గెట్గా జరిగిన దాడుల్లో ఆ దేశంలోని సాధారణ పౌరులు పెద్దమెుత్తంలో మరణిస్తున్నారు. తాజాగా బీరూట్పై జరిపిన బాంబుదాడుల్లో 12 మంది వైద్యసిబ్బంది మృతిచెందినట్లు లెబనాన్ ప్రకటించింది.హిజ్బుల్లా హెచ్చరికఅయితే ఈ నేపథ్యంలో హిజ్బుల్లా నేత నయీమ్ ఖాసిమ్ తీవ్రంగా స్పందిచారు. ఇజ్రాయెల్ దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ప్రకటించారు." మమ్మల్ని మేము దీర్ఘకాలిక పోరాటానికి సిద్దం చేసుకున్నాం. భగవంతుడు కోరుకుంటే ఇజ్రాయెల్ యుద్ధ రంగంలో మమ్మల్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇది సాధారణ యుద్ధం కాదు. అస్థిత్వ యుద్దం." అన్నారు. లెబనాన్లో మౌళిక సదుపాయాలపై జరుపుతున్న దాడులకు ఇజ్రాయెల్ మూల్యం చెల్లించాలని తెలిపారు.కాగా నిన్న శుక్రవారం జ్రారియే మరియు టేర్ ఫాల్సే పట్టణాలను కలిపే లిటాని నదిపై ఉన్న వంతెనను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇది హిజ్బుల్లాకు ప్రధానమైన రహదారి. ఇది ఉత్తర లెబనాన్ నుండి దక్షిణ లెబనాన్ చేరుకోవడానికి కీలకంగా ఉంటుంది. తాజాగా ఇజ్రాయెల్ దాన్ని ధ్వంసం చేసింది.ఇజ్రాయెల్ హెచ్చరిక కాగా మరోవైపు ఇజ్రాయెల్ ఈ దాడిపై ప్రకటన విడుదల చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే మరియు హిజ్బుల్లా ఉగ్రవాదులు ఉపయోగించే హిజ్బుల్లాకు తన మద్ధతు ఉపసంహరించి దానిని నిరాయుధీకరణ చేసే వరకూ లెబనాన్ భూభాగం కోల్పోతూనే ఉంటుందని ఇజ్రాయెల్ రక్షణ హెచ్చరించారు.ఐక్యరాజ్యసమితి స్పందనఅయితే శుక్రవారం బీరుట్ ప్రాంతంలో ఐక్యరాజ్యసమితి చీఫ్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్ పర్యటించారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లాలు తక్షణమే యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన లక్షలాది మంది ప్రజలకు మద్ధతు ఇవ్వడానికి 325 మిలియన్ డాలర్ల మానవతావాద సహాయం అందించాలని ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు.
ట్రంప్ విధ్వంసం: ‘క్రౌన్ జ్యువెల్’పై భీకర దాడి
వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. ఇరాన్ ఆర్థిక రాజధానిగా భావించే ‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా సైన్యం విరుచుకుపడింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్కు అత్యంత కీలకమైన ఈ దీవిపై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.సైనిక స్థావరాలు ధ్వంసం‘పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత భారీ బాంబు దాడులను మా సైన్యం చేపట్టింది. ఇరాన్ కిరీటంలోని రత్నం లాంటి ఖర్గ్ ఐలాండ్లోని ప్రతి సైనిక లక్ష్యాన్ని తునాతునకలు చేశాం’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ఒక వ్యూహాత్మక నిర్ణయంతో అక్కడి చమురు మౌలిక సదుపాయాలను ప్రస్తుతానికి ధ్వంసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 90 శాతం ఈ దీవి నుంచే సరఫరా అవుతుంది. రోజుకు సుమారు 70 లక్షల బారెళ్ల సామర్థ్యం కలిగిన ఈ కేంద్రంపై దాడి జరిగితే ప్రపంచ చమురు మార్కెట్ కుప్పకూలుతుందనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధిపై హెచ్చరికవ్యాపార నౌకల రాకపోకలకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. ‘ఒకవేళ హోర్ముజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి అడ్డుతగిలితే, చమురు క్షేత్రాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు’ అని ఆయన హెచ్చరించారు. యుద్ధ ట్యాంకర్లకు రక్షణగా త్వరలోనే అమెరికా నౌకాదళం కాపలాగా వస్తుందని ఆయన పేర్కొన్నారు.‘ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తాం’పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అమెరికా అదనంగా 2,500 మంది మెరైన్ సైనికులను, మూడు అత్యాధునిక యుద్ధ నౌకలను యుద్దప్రాంతానికి పంపింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తామని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇది కూడా చదవండి: సిలిండర్లు దాచారో.. జైలుకే!
జాతీయం
ఆకలి తీరుస్తున్న ‘గ్యాస్ అన్డూ’.. టెక్కీల క్రేజీ ఆవిష్కరణ
కొచ్చి: పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభపు సెగ వంటగదులనూ తాకింది. కేరళలోని కొచ్చి నగరంలో ఎల్పీజీ (LPG) కొరత తీవ్రం కావడంతో సామాన్యులు, హోటల్ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ మేధస్సుకు పదును పెట్టారు. గ్యాస్ కొరతతో ఏయే హోటళ్లు మూతపడ్డాయి? ఎక్కడ భోజనం దొరుకుతుంది? అనే వివరాలను ఇట్టే చెప్పేసే ఒక వినూత్న వెబ్సైట్ను వారు అందుబాటులోకి తెచ్చారు.చేదు అనుభవం.. సరి కొత్త ఆలోచనవైశాఖ్ సురేష్, వి. విశ్వనాథ్ కర్త అనే ఇద్దరు టెక్కీలు ఇటీవల తమ టీమ్ సభ్యులతో కలిసి డిన్నర్కు వెళ్లారు. 30 మంది ఉన్న ఆ బృందానికి నగరంలోని ప్రధాన హోటళ్లలో ఆహారం లభ్యం కాలేదు. గ్యాస్ కొరత కారణంగా హోటళ్లలో వంటలు నిలిచిపోయాయని తెలుసుకున్నారు. కావాల్సిన ఆహారం దొరకక, నగరం అంతా తిరగాల్సి రావడంతో వారికి గంటల కొద్దీ సమయం, ఇంధనం వృథా అయ్యాయి. ఈ ఇబ్బంది మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో ‘గ్యాస్ అన్డూ’ ‘Gas Undo’ (https://www.gasundo.live/) పేరుతో ఒక వెబ్సైట్ను క్రియేట్ చేసి, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు.లైవ్ మ్యాప్తో ఆహారం వేట సులభంఈ వెబ్సైట్ ఒక డిజిటల్ మ్యాప్ మాదిరిగా పనిచేస్తుంది. కొచ్చి నగరంలోని దాదాపు 2,488 రెస్టారెంట్ల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఏ హోటల్ ప్రస్తుతం ఏమి ఆహారం దొరుకుతుంది? ఎక్కడ పరిమితమైన మెనూ మాత్రమే అందుబాటులో ఉంది? తదితర వివరాలను రియల్ టైమ్లో ఈ వెబ్పసైట్ ద్వారా తెneighboursలుసుకోవచ్చు. గ్యాస్ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌవ్లు లేదా కట్టెల పొయ్యిలకు మారిన హోటళ్ల సమాచారాన్ని కూడా ఇందులో చూడవచ్చు.ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యంఈ ప్లాట్ఫారమ్ విశేషమేమిటంటే ఇది పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతో నడుస్తుంది. ఏదైనా హోటల్కు వెళ్లిన కస్టమర్లు అక్కడ ఆహారం అందుబాటులో ఉందో లేదో వెంటనే మ్యాప్లో అప్డేట్ చేయవచ్చు. దీనివల్ల వేరే వాళ్లు ఆ హోటల్కు వెళ్లి, నిరాశ చెందాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. సాంకేతికతను సామాన్యుల కష్టాలను తీర్చడానికి ఎలా ఉపయోగించవచ్చో ఈ కేరళ టెక్కీలు చక్కగా నిరూపించారు.ఇది కూడా చదవండి: అంతులేని ప్రేమతో.. మహిళ లోదుస్తులు చోరీ!
శబరిమల వివాదం.. కేరళ సర్కార్ ‘యూ టర్న్’
తిరువనంతపురం: శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయానికి మహిళల ప్రవేశం విషయంలో కేరళలోని ఎల్డీఎఫ్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్న తన పాత వైఖరిని మార్చుకుని, ఇప్పుడు ఆలయ సంప్రదాయాలు, ఆచారాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిశ్చయించింది. ఈ మేరకు శనివారం సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తన తాజా నిర్ణయాన్ని అధికారికంగా వివరించనున్నదని తెలుస్తోంది.రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందంటూ ‘మాతృభూమి’ తన కథనంలో పేర్కొంది. ఇటీవలే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కూడా శబరిమల పురాతన ఆచారాలను కాపాడాలని తీర్మానం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేసింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చ జరిగినప్పటికీ, తుది నిర్ణయాన్ని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు వదిలివేశారు. సీపీఎం నాయకత్వం, ఇతర మిత్రపక్షాలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయానికి ప్రభుత్వం మొగ్గు చూపింది.గత ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, బీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోకూడదని ఎల్డీఎఫ్ భావిస్తోంది. ఈ అంశంపై గతంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ ‘రాజ్యాంగబద్ధంగా నడిచే దేశంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. ఫలానా వారు ఆలయానికి వెళ్లకూడదని ఏ ఒక్క వర్గం నిర్ణయించలేదు’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ మాటలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ‘శబరిమలలోకి మహిళల ప్రవేశంపై మా వైఖరిలో మార్పు లేకపోయినా, ప్రస్తుత పరిస్థితులు, న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ సెక్రటేరియట్ నిర్ణయించింది’ అని ఆయన పేర్కొన్నారు. ఏదిఏమైనప్పటికీ ఓటర్ల మనసు గెలుచుకోవడమే లక్ష్యంగా కేరళ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నదని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘ఉగ్గు’తో ఉసురు తీయకండి!
మేమే దేశాన్ని నడిపించాలనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: ‘యావత్ దేశాన్ని మేమే నడపాలని మీరు కోరుకుంటున్నారా?’అంటూ సుప్రీంకోర్టు ఓ పిటిషనర్ను ప్రశ్నించింది. రహదారులు, వంతెనలు, విద్యుత్ వైరింగ్ తదితరాలు సక్రమంగా ఉండేలా ప్రజల భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా వర్తించే సమగ్ర ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్పై ఈమేరకు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగి్చల ధర్మాసనం శుక్రవారం ఇందుకు సంబంధించిన పిటిషన్పై విచారణ చేపట్టింది. షాపింగ్ మాల్లో అన్ని రకాల వస్తువులు, సేవలు అందుబాటులో ఉన్నట్లే అన్ని అంశాలకు ఒకే చోట పరిష్కా రం కోరుతున్న ఈ పిటిషన్ చాలా బాగుందని పేర్కొంది. ‘సమస్యలను నిర్దిష్టంగా ప్రస్తావించలేప్పుడు. ఆచరణ సాధ్యం కాని ఆదేశాలను జారీ చేయలేం. అందుకే ఈ రిట్ పిటిషన్పై విచారణకు నిరాకరిస్తున్నాం. పిటిషనర్ కావాలనుకుంటే సరైన రీతిలో పిటిషన్ను రూపొందించి, సంబంధిత పరిధిలోని హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కలి్పస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్లోని సానుకూల అంశాలపై తామెలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని పేర్కొంది. ‘పిటిషన్ కోరిన విధంగా చేసేందుకు ఆర్థిక వనరులు అవసరమవుతాయి. సంబంధిత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ను అర్థం చేసుకోవడానికి ఆయా రాష్ట్రాల హైకోర్టులే సరైనవి’అని ధర్మాసనం అభిప్రాయపడింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిత్యం దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పిటిషనర్ తరఫు లాయర్ తెలిపారు. అయితే, యావత్తు దేశాన్ని మేమే పాలించాలని భావిస్తున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘షోరూం, షాపింగ్ మాల్ మాదిరిగానే మీ పిటిషన్ కూడా చాలా బాగుంది. రోడ్లపై గుంతలు, రహదారులు, అసంపూర్తి వంతెనలు తదితర నిర్మాణాలు..ఇలా ప్రతి ఒక్కటీ ఇందులో ఉంది. భూమిపై ఉన్న ప్రతి ఒక్క సమస్యకూ మీరు పరిష్కారం చూపారు’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.పిటిషన్లో ఇంకా ఏముంది? రోడ్లు, వంతెనలు, విద్యుత్ వైరింగ్ వంటి బహిరంగ మౌలిక సదుపాయాల నిర్వహణ, సాధారణ తనిఖీలు, క్రమబద్ధమైన ఆడిటింగ్ నిర్వహించడం ద్వారా ప్రజా భద్రతను నిర్ధారించాలని కోరింది. నగర, శివారు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, ప్రజల భద్రతను పర్యవేక్షించడానికి ఒక ఉన్నత స్థాయి స్వతంత్ర భద్రతా ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో సివిల్ ఇంజనీర్లు, మౌలిక సదుపాయాల నిపుణులు, పౌర సమాజం, మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు ఉండాలి. 2020 నుంచి మౌలిక సదుపాయాల లోపాల వల్ల జరిగిన మరణాల డేటాను సేకరించి, డిజిటలైజ్ చేసి బహిరంగ పరచాలి. మూడు నెలలకోసారి జిల్లాల వారీ నివేదికలను సుప్రీంకోర్టుకు సమరి్పంచేలా ఆదేశాలు ఇవ్వాలి.
ట్రాన్స్జెండర్కు స్పష్టమైన నిర్వచనం
న్యూఢిల్లీ: ట్రాన్స్జెండర్ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇస్తూ కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ శుక్రవారం లోక్సభలో ట్రాన్స్జెండర్ పర్సన్స్(ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ట్రాన్స్జెండర్ పర్సన్స్(ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) చట్టం–2019లో కొన్ని మార్పులు చేసి ఈ బిల్లును రూపొందించారు. ట్రాన్స్జెండర్లకు హాని తలపెట్టే వారికి నేర తీవ్రతను బట్టి శిక్షలు విధించే అంశాన్ని బిల్లులో చేర్చారు. విభిన్న లైంగిక ధోరణులు, స్వీయ లైంగిక గుర్తింపు కలిగిన వ్యక్తులను ట్రాన్స్జెండర్ కేటగిరీలో చేర్చకూడదని ఇందులో ప్రతిపాదించారు. ట్రాన్స్జెండర్ల రక్షణ కోసం ఉన్న చట్టం ప్రయోజనాలు అసలైన, అర్హులైన వ్యక్తులకే చేరాలంటే ఈ పదానికి కచి్చతమైన నిర్వచనం ఇవ్వడం అత్యవసరం అని పేర్కొన్నారు. 2019 నాటి చట్టంలోని రక్షణలు, ప్రయోజనాలు చాలా విస్తృతమైనవని తెలిపారు. వాటిని అనర్హులకు అందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. ట్రాన్స్జెండర్ వ్యక్తిని నిర్వచించడానికి బిల్లులో సబ్క్లాజ్ చేర్చారు. జని్మంచిప్పుడు నిర్ధారించిన లింగం(స్త్రీ లేదా పురుషుడు) కాకుండా, తమకు నచి్చన లేదా భిన్నమైన లింగ గుర్తింపుతో జీవించే వ్యక్తిని ట్రాన్స్జెండర్ అనొచ్చు. సామాజికంగా–సాంస్కృతికంగా కిన్నెర్, హిజ్రా, అరావణి, జోగ్తా, కొజ్జా (నపుంసకుడు) వంటి గుర్తింపులు ఉన్న వ్యక్తులు ట్రాన్స్జెండర్లు అవుతారు. ఇంటర్సెక్స్ వైవిధ్యాలు కలిగిన వ్యక్తి లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లింగ లక్షణాలు ఉన్న వ్యక్తిని ట్రాన్స్జెండర్గా నిర్వచించాలి. ఒక వ్యక్తి ట్రాన్స్జెండర్ అవునో కాదో నిర్ధారించడానికి నిపుణుల సలహా తీసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ లేదా డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని మెడికల్ బోర్డుకు ఈ అధికారం ఉంటుంది. ట్రాన్సజెండర్లుగా అధికారికంగా గుర్తింపు పొందిన వ్యక్తులు తమ గుర్తింపును బర్త్ సరి్టఫికెట్ సహా ఇతర ధ్రువపత్రాల్లో మార్చుకోవచ్చు.
ఎన్ఆర్ఐ
వాషింగ్టన్ డీసీలో శంకర నేత్రాలయ నిధుల సేకణ కార్యక్రమం
గతేడాది డిసెంబర్ 6. 2025న వాషింగ్టన్ డి.సి. మెట్రో ప్రాంతంలో నిర్వహించిన శంకర నేత్రాలయ (SN) నిధుల సేకరణ కార్యక్రమం విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మక నేత్ర వైద్య సంస్థ కోసం మొత్తం $150,000 నిధులు సమీకరించారు. సంస్కృతి,కరుణను ప్రతిబింబించే ఈ వేడుకకు చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రమణ రెడ్డి మడ్డికుంట CapEx సభ్యుడు తిరుమల రెడ్డి మునుకుంట్ల నాయకత్వం వహించారు.ఆ సాయంత్రం థీమ్ కరుణ ప్రతిధ్వనులు: కళ హృదయాన్ని కలిసే స్థలం (Echoes of Compassion: Where Art Meets Heart)గా నిర్వహించబడింది. శాస్త్రీయ మరియు సాంప్రదాయ నృత్య కళలతో సేవా భావాన్ని మేళవిస్తూ ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక అకాడమీలు పాల్గొని యువ వయోజన నర్తకుల అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సాంస్కృతిక బృంద సభ్యురాలు లక్ష్మి బాబు సమన్వయంతో నృత్య ప్రదర్శనలు అత్యంత కన్నులపండుగగా నిర్వహించారుఈ వేడుకకు గౌరవ అతిథిగా ఎస్. వి. ఆచార్య గారు హాజరై తమ ప్రోత్సాహకర సందేశంతో కార్యక్రమానికి మరింత గౌరవాన్ని చేకూర్చారు. అలాగే 11 మంది MESU స్పాన్సర్ల మద్దతు ఈ కార్యక్రమ విజయానికి కీలకమైంది.ఉదార హృదయంతో సహకరించిన MESU స్పాన్సర్లు:సెల్వ, ప్రతిభ జయరామన్, భువనేశ్ బూజాల, భానుమతి రామకృష్ణ, శ్రవణ్ పడూరు, కృష్ణకాంత్ కుచ్చలకంటి, ప్రవీణ్ పాల్రెడ్డి, రఘు పాల్రెడ్డి, వెంకట్ దోమా, తిరుమల మునుకుంట్ల, రఘు జువ్వాది గారు. వీరి ఆర్థిక కార్యనిర్వహణ సహకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.ఇంకా SNUSA నేషనల్ మరియు డి.సి. మెట్రో చాప్టర్ సభ్యులు విశేషంగా సహకరించారు. ముఖ్యంగా శ్రీమతి నీలిమ గడ్డమనుగు, కృష్ణ రాజ్ భట్, సౌమ్య నారాయణన్, డి.సి. చాప్టర్ నాయకులు — బాలాజీ రాధాకృష్ణన్, హరిత రెడ్డి, అర్జున్ కామిసెట్టి, దిలీరాజ్ చాంతివేలు, రూపేష్ చిన్నకంపల్లి, కార్తిక్ గౌడ్ తదితరుల కృషి ప్రశంసనీయం.SNUSA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి గారి నాయకత్వం తోపాటు బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యుల మార్గదర్శకత్వం ఈ విజయానికి బలమైన ఆధారంగా నిలిచాయి. ట్రెజరర్ మూర్తి రేకపల్లి గారు లాజిస్టిక్స్ నిర్వహణలో విశేష కృషి చేయగా, మీడియా సహకారం అందించిన శ్రీగిరి కోటగిరి సేవలు అభినందనీయం. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువ వాలంటీర్లు, మీడియా,ఫోటోగ్రఫీ బృంద సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మాస్టర్ ఆఫ్ సెరిమనీగా వ్యవహరించిన శ్రియా బాబు తన చక్కని వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని చురుకుగా, సమర్థవంతంగా ముందుకు నడిపించారు.ఈ కార్యక్రమంలో సమీకరించిన నిధులు శంకర నేత్రాలయ లక్ష్యమైన అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించేందుకు వినియోగించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ముగిసే సమయానికి సేవా భావం, ఐక్యత, సామాజిక బాధ్యత స్పష్టంగా ప్రతిఫలించాయి. ఈ వేడుక కేవలం కళలు, సంస్కృతిని మాత్రమే కాకుండా, సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరి హృదయంలో మరింత బలంగా నాటింది.(చదవండి: అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..)
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు భారత్కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్ ఎవరు? ఆ వివరాలు మీకోసం.లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలోజన్మించారు నిత్య రామన్. ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య కుటుంబం, అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కరెన్ బాస్కు గట్టి పోటీప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!
అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత
క్రైమ్
‘ఉరి అలా కాదు, ఇలా వేసుకోవాలి‘
వైఎస్ఆర్ కడప జిల్లా: ఓ పైశాచిక భర్త కట్టుకున్న భార్యను చిత్రవధకు గురిచేశాడు. మానసికంగా వేధించి.. ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఆమె బలవన్మరణానికి పాల్పడబోతే నివారించాల్సింది పోయి సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిస్తూ ఉరి ఇలా వేసుకోవాలంటూ మానసికంగా మరింత కుంగదీశాడు. ఉరి బిగుసుకుని బాధితురాలు దుర్మరణం పాలైంది. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలంలోని బోయనపల్లెలో జరిగిన ఈ అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ నందలూరు రైల్వే కేంద్రంలో లోకోపైలట్గా పనిచేస్తున్నారు. ఆయన రెండో భార్య కృష్ణవేణి తన నివాసంలో గురువారం ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. అయితే, భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సిన భర్త, ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించడం అతనిలోని క్రూరత్వాన్ని బయటపెట్టింది. శ్రీరామ్ శ్రీనివాస్, కృష్ణవేణి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం కూడా ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఆత్మహత్య చేసుకుంటానని ఉరితాడు సిద్ధం చేసుకుంది. భర్త ఆమెను ఆపడానికి బదులు.. ‘ఉరి అలా కాదు, ఇలా వేసుకోవాలి‘ అంటూ సూచనలు చేస్తూ ఆ ఘటనను తన మొబైల్లో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలోని సెల్ఫోన్ ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడిని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహోదగ్రులైన కృష్ణవేణి బంధువులు నిందితుడిపై దాడికి యతి్నంచారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. గతంలో శ్రీనివాస్ తొలి భార్య కూడా తిరుపతిలో రైలు కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. కృష్ణవేణి మృతిపై మన్నూరు సీఐ లింగప్ప మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిన సమయంలో కృష్ణవేణి తలుపు వేసుకుని ఆత్మహత్యకు యతి్నంచిందని, దానిని భర్త కిటికీలో నుంచి వీడియో తీసినట్లు అందులోని మాటలను బట్టి అర్థమవుతోందని చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.
హైదరాబాద్లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయం.. వ్యాపారి అరెస్ట్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్లోని జెమ్ ఫుడ్స్ గోడౌన్పై పోలీసులు దాడి చేశారు. అక్కడ నిల్వ ఉంచిన 30 బాక్సులకు పైగా కుళ్లిపోయిన డ్రై ఫ్రూట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మనీష్ అనే డ్రై ఫ్రూట్స్ వ్యాపారి బూజు పట్టిన జీడిపప్పు, బాదంలను నాణ్యమైనవిగా చూపించి ప్రజలకు విక్రయిస్తున్నాడు. దాంతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేసే సమయంలో వాటి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. ఈ ఘటనతో కల్తీ ఆహార పదార్థాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్
ఆగ్రాలో ఒక మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. నాలుగేళ్లు సహజీవనంచేసి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఇప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని ఒక పోలీస్ కానిస్టేబుల్పై ఆరోపణలు గుప్పిస్తూ చనిపోయే ముందు ఆమె ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు కూడా విజ్ఞప్తి చేయడంతో ఇది వైరల్గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సంచలనంగా మారడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అసలు స్టోరీ ఏంటంటే..ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధిత మహిళది స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లా. ఆమె అంతకుముందే విడాకులు తీసుకుని, ఆగ్రాలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో తాజ్గంజ్ పోలీస్ స్టేషన్లోపనిచేస్తున్న జేవీ గౌతమ్ అనే కానిస్టేబుల్తో పరిచయమైంది. దీంతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కుటుంబం ఒప్పుకోదు అంటూ పెళ్లికి నిరాకరించాడు. చివరికి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో వివాదం రేగింది. తీవ్ర ఆవేదనతో వీడియో సందేశం రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వీడియోలో ఇలా పేర్కొంది..తాను కలిసి జీవించిన గౌతమ్ చేతిలో ఏళ్ల తరబడి శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఆ తర్వాత మాట తప్పాడని పేర్కొంది. గౌతమ్తో జీవించిన కాలంలో తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆమె పేర్కొంది. ఫిర్యాదు చేయడానికి తాను పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు, తమ చేతుల్లో ఏమీ లేదని, ఆ కానిస్టేబుల్పై ఎటువంటి చర్యలూ తీసుకోలేమని అక్కడివారు చెప్పినట్లు ఆమె తెలిపింది. తాను బతికి ఉన్నప్పుడు తనకు న్యాయం జరగలేదని, కనీసం తన మరణం తర్వాత అయినా తనకు న్యాయం జరగాలని ఆశించింది. అంతేకాదు గౌతమ్, అతని కుటుంబ సభ్యులు తనను ఎంతో మోసం చేశారని, మానసికంగా వేధించారని, చివరికి ఈ దారుణ నిర్ణయం తీసుకునేలా తనను నెట్టారని ఆమె ఆరోపించింది. ఏళ్ల తరబడి అతనితో కలిసి జీవించిన తర్వాత, ఇప్పుడు అతను వేరొక మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని ఆమె వాపోయింది."నా మరణానికి జేవీ గౌతమ్, అతని కుటుంబం మొత్తం కారణం. వారు నన్ను ఎంతగానో మోసం చేశారు. మానసికంగా ఎంతగా వేధించారంటే, చివరికి నేను చనిపోయేలా నన్ను బలవంతం చేశారు." అని చెప్పింది. అలాగే ‘‘అతని అన్నయ్య ఒకవైపు నన్ను పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు. మరోవైపు, నా కుటుంబం నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదని జేవీ గౌతమ్ నాతో చెబుతున్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ కనీసం ఏ అమ్మాయినీ మోసం చేయకు," అని పేర్కొంది."Don't get married to anyone, but don't keep any girl in deception either"The young woman who made a video before suicide in Agra leveled serious allegations of deception against police constable Jitendra Gautam!!Constable is arrested and send to Jail.99 percent of Live in… pic.twitter.com/OCDlXiEbLb— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 13, 2026 ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో కానిస్టేబుల్ జె.వి. గౌతమ్ను సస్పెండ్ చేశారు. మరోవైపు ఆమె మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుమార్తెకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు. బాధిత మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆ కానిస్టేబుల్పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.
బామ్మర్ది పెళ్లి.. బావ బలవన్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా: మరికాసేపట్లో బామ్మర్ది పెళ్లి జరగాల్సి ఉండగా.. కుటుంబ సమస్యలతో ఉరేసుకుని బావ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచమ్మగుడి ప్రాంతానికి చెందిన చిన్నం రమేష్(32) టోయింగ్ వెహికిల్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య ఉమారాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. రమేష్ కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఇటీవల అతడి తల్లి మృతిచెందడంతో మానసికంగా మరింత కుంగిపోయాడు. గురువారం రమేష్ సొంత బామ్మర్ది వివాహం జరగాల్సి ఉండగా.. బుధవారం చిన్నరామచర్ల గ్రామంలో జరిగిన హాల్ది వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం రాత్రి కారులో రమేష్ ఆలేరులోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. గురువారం ఉదయం భార్య, కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రమేష్ స్పందించలేదు. దీంతో పక్కింటి వారికి చెప్పడంతో వారు వెళ్లి చూడగా.. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని రమేష్ కనిపించాడు. మృతుడి సోదరి చిన్నం స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. ఇదిలా ఉండగా రమేష్ ఆత్మహత్యతో గురువారం జరగాలి్సన అతడి బావమర్ది పెళ్లి నిలిచిపోయింది.
వీడియోలు
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ రేపటి నుండి భారీ వర్షాలు
ఏపీ బడ్జెట్ లో చంద్రబాబు తప్పుడు లెక్కలు ఆధారాలతో బయటపెట్టిన బుగ్గన
భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు.. యుద్ధ ప్రభావం
99 పైసలకి కాకపోతే ఊరికే ఇస్తా, నా ఇష్టం అంటున్న నారా లోకేష్
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ వెలవెలబోతున్న దుబాయ్
రాజీనామాపై జీవన్ రెడ్డి క్లారిటీ.. నా నెక్స్ట్ స్టెప్ అక్కడికే
అన్నదాత సుఖీభవ పేరుతో. చంద్రబాబు భారీ మోసం
ఇరాన్ గుండెపై అమెరికా మిస్సైల్స్
పశ్చిమాసియా యుద్ధం కారణంగా కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత
ఏలూరు జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ కష్టాలు... అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
