రికార్డు ‘కిక్’!
సాక్షి, అమరావతి: సంక్రాంతి సీజన్లో టీడీపీ మద్యం సిండికేట్ పండుగ చేసుకుంది. మూడు బీర్లు.. ఆరు నిబ్బులుగా మద్యాన్ని ఏరులై పారించింది. ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లతోపాటు 75 వేలకుపైగా బెల్ట్ దుకాణాలు, కోడి పందేల బరులు, మట్కా జూదాల డెన్లు, బీచ్లు, వీధి వాడా విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు నెలకొల్పి యథేచ్ఛగా దందాకు తెగబడింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తుండిపోయింది. ఫలితం.. మద్యం అమ్మకాల్లో చంద్రబాబు సర్కారు కొత్త రికార్డులు సృష్టించింది. టీడీపీ మద్యం సిండికేట్ అడ్డగోలు దోపిడీని మరోసారి చాటిచెప్పిన మద్యం అమ్మకాల తీరు ఇలా ఉంది... రూ.3 వేల కోట్ల దిశగా.. సంక్రాంతి సీజన్లో మద్యం అమ్మకాల్లో ఏపీ కొత్త రికార్డులు సృష్టించింది. ఈ ఏడాది జనవరి 1వతేదీ నుంచి 17 వరకు రాష్ట్రంలో ఏకంగా రూ.1,797.57 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించడం గమనార్హం. మొత్తం 24.64 లక్షల మద్యం కేసులు, 11.36 లక్షల బీరు కేసులు విక్రయించారు. గతేడాది సంక్రాంతి సీజన్ సందర్భంగా జనవరి 1 నుంచి 17 మధ్య రూ.1,531.18 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మరో రూ.266.39 కోట్ల మేర అధికంగా మద్యం విక్రయాలు సాగాయి. ఇక ఈ నెలాఖరుకు మద్యం విక్రయాలు రూ.3 వేల కోట్ల మార్కును దాటుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. టాప్లో తిరుపతి జిల్లా సంక్రాంతి సీజన్ మద్యం విక్రయాల్లో తిరుపతి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో అత్యధికంగా రూ.111.97 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. తరువాత స్థానాల్లో రూ.108.17 కోట్ల విక్రయాలతో విశాఖ జిల్లా రెండో స్థానంలో ఉంది. రూ.97.43 కోట్ల మద్యం విక్రయాలతో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మూడో స్థానంలో, రూ.91.91 కోట్ల అమ్మకాలతో ఎనీ్టఆర్ జిల్లా నాలుగో స్థానంలో ఉన్నాయి.
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: శు.పాడ్యమి రా.2.09 వరకు, తదుపరి విదియ,నక్షత్రం: ఉత్తరాషాఢ ప.12.20 వరకు, తదుపరి శ్రవణం,వర్జ్యం: సా.4.31 నుండి 6.32 వరకు, దుర్ముహూర్తం: ప.12.33 నుండి 1.19 వరకు, తదుపరి ప.2.45 నుండి 3.32 వరకు,అమృత ఘడియలు: రా.2.33 నుండి 4.13 వరకు.సూర్యోదయం : 6.39సూర్యాస్తమయం : 5.44రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం... నిరుద్యోగులు శుభవర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. విందువినోదాలు.వృషభం.... కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు ఆస్తి వివాదాలు తప్పవు. అంచనాలు తారుమారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దేవాలయదర్శనాలు.మిథునం.... కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. కష్టం ఎక్కువగా ఉంటుంది. పనుల్లో తొందరపాటు తగదు. ఆరోగ్య,కుటుంబ సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు.కర్కాటకం..... పరపతి పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.సింహం..... భూ, గృహయోగాలు. అతిముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. చర్చలు సఫలం.కన్య... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అరోగ్య, కుటుంబసమసమస్యలు. స్నేహితులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోచిక్కులు.తుల... వ్యవహారాలలో అవరోధాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఖర్చులు పెరుగుతాయి.వృశ్చికం..... కాంట్రాక్టర్లకు అనుకూలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. భూలాభం. యత్నకార్యసిద్ధి. దేవాలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.ధనుస్సు..... ఎంతకష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. బంధువుల నుంచి విమర్శలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.మకరం..... అరుదైన ఆహ్వానాలు రాగలవు. ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. దేవాలయదర్శనాలు.కుంభం..... బంధువులతో వైరం. దూరప్రయాణాలు. చోరభయం. పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి. మీ అంచనాలు తప్పుతాయి. బాద్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనుకోని ఖర్చు.మీనం... దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
కేవీపల్లె/పీలేరు రూరల్: అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం బండవడ్డిపల్లెలో సంక్రాంతి పండుగ కోసం వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మద్యం తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బండవడ్డిపల్లెకు చెందిన నరసింహులు కుమారుడు ఆవులకుంట మణికుమార్ (32) చెన్నైలో, గోవిందు కుమారుడు వేముల పుష్పరాజ్ (28) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు వీరు స్వగ్రామానికి వచ్చారు. అదే గ్రామానికి చెందిన సమీప బంధువులైన శ్రావణ్, వేణు, శివమణి, అభిõÙక్లతో కలసి శనివారం గ్రామ సమీపంలోని గుట్ట ప్రాంతంలో కూర్చుని మద్యం తాగారు. ఈ క్రమంలో మణికుమార్, పుష్పరాజ్లు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరిని చికిత్స నిమిత్తం గరి్నమిట్ట పీహెచ్సీకి తరలించారు.ఆసుపత్రి సిబ్బంది సూచన మేరకు అక్కడ నుంచి పీలేరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మణికుమార్ మృతి చెందాడు. పుష్పరాజ్ను పీలేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని వారు సూచించారు. అక్కడి నుంచి పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పుష్పరాజ్ మృతి చెందాడు. వారు మద్యం తాగిన ప్రాంతాన్ని కలకడ సీఐ లక్ష్మన్న, కేవీపల్లె, కలకడ ఎస్ఐలు వెంకట శివకుమార్, రామాంజులు, పీలేరు ఎక్సైజ్ సీఐ సుబ్బారెడ్డిలు క్షుణ్ణంగా పరిశీలించారు.మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా, పండుగ సంబరాలకు స్వగ్రామానికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇలా మృతి చెందడంతో బండవడ్డిపల్లెలో విషాదం నెలకొంది. మృతుడు మణికుమార్కు భార్య నాగశివరాణి తోపాటు ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. ఎంబీఏ చదివిన పుష్పరాజ్ గత ప్రభుత్వంలో గ్రామ వలంటీరుగా పనిచేశాడు. తండ్రి గోవిందు కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పుష్పరాజ్ మృతితో తల్లి సరోజ జీవనాధారం కోల్పోయింది. మద్యం టిన్లు ఫోరెన్సిక్ ల్యాబ్కు.. అతిగా మద్యం తాగడం వల్లే కేవీపల్లె మండలం బండవడ్డిపల్లెలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారని అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం పీలేరులోని సీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మణికుమార్, పుష్పరాజ్ల సమీప బంధువులైన శ్రావణ్, శివమణి, వేణుగోపాల్, అభిషేక్లతో కలసి గరి్నమిట్టలోని మద్యం దుకాణం నుంచి బడ్వైజర్ టిన్ బీర్లు 19 కొనుగోలు చేశారని తెలిపారు. బండవడ్డిపల్లె సమీపంలోని గుట్టలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తాగారన్నారు.తిరిగి ఇంటికి వచ్చే సమయంలో వారిద్దరూ అస్వస్థతకు గురై మృతి చెందారని చెప్పారు. మణికుమార్ తండ్రి ఆవులకుంట నరసింహులు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేశామన్నారు. పీలేరు ఎక్సైజ్ అధికారులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారు తాగిన బీరు ఖాళీ టిన్నులు, మిగిలిన ఆహార పోట్లాలను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పారు.ఆ మద్యం అసలైనదేనా? యువకులు రెండు, మూడు బీర్లు తాగడం మామూలేనని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. బండవడ్డిపల్లె ఘటనలో ఆరుగురు కలిసి 19 టిన్ బీర్లు (ఒక్కో టిన్ 500 ఎంఎల్) తాగారని, అంటే ఒక్కొక్కరు రెండు బీర్లు (బాటిల్) తాగారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వారు తాగింది నకిలీ మద్యం కావొచ్చని గ్రామస్తులు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నాలుగైదు మద్యం/బీరు బాటిళ్లలో ఒకటి నకిలీదని ఇప్పటికే బట్టబయలైంది. ఆధారాలతో సహా పలు ప్రాంతాల్లో పట్టుబడిన నకిలీ మద్యం తయారీ కేంద్రాలే ఇందుకు నిదర్శనం.అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువు, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం, పాలకొల్లు, ఉభయ గోదావరి జిల్లాలు, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు బయట పడటం తెలిసిందే. ఇవన్నీ కూడా అధికార టీడీపీ నేతల కనుసన్నల్లో కొనసాగాయి. బయట పడనివి ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు, బెల్ట్ షాపులకు నకిలీ మద్యం/బీరు సరఫరా అవుతోంది.తయారీ, పంపిణీ, విక్రయదారులంతా వాళ్లే కావడంతో అడిగే వారు లేరు. ప్రభుత్వ పెద్దలు లాభాల్లో నీకింత–నాకింత అంటూ వాటాలు పంచుకుంటూ పై నుంచి భరోసా ఇస్తుండటంతో ఈ దందా వ్యవస్థీకృతమైంది. అందువల్లే నకిలీ మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్న, అనారోగ్యం పాలవుతున్న జనం సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో బండివడ్డిపల్లె ఘటనలో దర్యాప్తు ఎంత వరకు పారదర్శకంగా జరుగుతుందనే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఫుడ్ మీదకో నెపం తోసేసి దోషులను తప్పించరని గ్యారంటీ ఏమిటని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నవ లోకం... మన కోసం!
గతాన్ని సమీక్షించుకుంటూనే, రాబోయే కాలంలో శాస్త్ర, పరిశోధన రంగాల్లో భారత్ ఎటువంటి అద్భుతాలు సృష్టించనున్నది, ప్రపంచ యవనికపై మన దేశం ఏ ఏ మైలురాళ్లను అధిగమించబోతోంది అనే అంశాలను తరచి చూడాల్సిన సమ యమిది. శాస్త్ర – సాంకేతిక రంగంలో ఆవిష్కరణలు ఒక్కోసారి యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. ఎక్స్–రే వంటివి కనిపెట్టడాలు అనుకోకుండా జరిగినవే అయినా, భారీ ప్రాజెక్టులు మాత్రం పక్కా ప్రణాళికతోనే పట్టా లెక్కుతాయి. ఏళ్ల తరబడి సాగే కఠోర శ్రమ, వ్యూహాల ఫలితంగానే ఆ యా రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది.1969 తర్వాత మళ్లీ ఇప్పుడు జాబిల్లిపై మనిషిని దించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ‘నాసా’ చేపట్టిన ‘ఆర్టిమిస్’ కార్యక్రమం ద్వారా వ్యోమగాములను చంద్రుడి పైకి పంపే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరోవైపు చైనా సైతం తన ‘ఛాంగ్ ఈ–7’ ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు సిద్ధమైంది. సూర్యరశ్మి సోకని ఈ ప్రాంతంలో ఘనీభవించిన నీటి జాడలు ఉన్నట్లు తేలడంతో ప్రపంచ దేశాల్లో ఆసక్తి పెరిగింది. చైనా ఈ ఏడాదే ‘జున్టియాన్’ టెలిస్కోపును, ‘మెంగ్ఝౌ–1’ వ్యోమ నౌకను పరీక్షించనుంది. 2026 నాటికి ‘లాంగ్ మార్చ్–10’ ద్వారా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపాలన్నది చైనా లక్ష్యం.అంతరిక్ష రక్షణ విషయానికొస్తే, నాసా ’డార్ట్’ తరహాలోనే ఒక సరికొత్త ప్లానెటరీ డిఫెన్స్ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ‘2015 ఎక్స్ఎఫ్261’ అనే ఖగోళ శకలాన్ని నేరుగా ఢీకొట్టి దాని మార్గాన్ని మళ్లించే ప్రయత్నం చేయనున్నారు. గతంలో ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్లనే రాక్షసబల్లులు అంతరించినట్లు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. భవిష్యత్తులో అటువంటి ముప్పులు రాకుండా ఉండటంతో పాటు, ఆయా గ్రహశకలాల్లో ఉండే అరుదైన ఖనిజాలను మన అవసరాలకు వాడుకోవడం ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. కిలోమీటరు పొడవుండే ఉల్కా శకలాలను ఒడిసిపట్టి ఆర్థిక ప్రయోజనాలు పొందడం ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న సవాలు.గగన్ యాన్ పరీక్ష...భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవసహిత అంత రిక్ష ప్రయోగం ‘గగన్ యాన్ ’కు 2026 సంవత్సరం చాలా కీలకం కానుంది. అసలు ప్రయోగానికి ముందు సిబ్బంది లేకుండా అనేక ప్రయోగాలు నిర్వహించనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. హ్యూమనాయిడ్ రోబో ‘వ్యోమమిత్ర’, అత్యవసర పరిస్థితుల్లో వ్యోమనౌక నుంచి సురక్షితంగా బయటపడేందుకు ఉద్దేశించిన క్రూ ఎస్కేప్ సిస్టమ్, ప్యారాచ్యూట్ వ్యవస్థ పనితీరు, గగన్ యాన్ క్యాప్సూల్ను కక్ష్య వరకూ తీసుకెళ్లడం వంటివన్నీ ఉన్నాయి. ‘బ్లూ ఆరిజిన్’ తన హెవీ లాంచర్తో జాబిల్లిపైకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తమ్మీద ఈ ఏడాది అటు ప్రభుత్వ, ఇటు వ్రైవేట్ కంపెనీల అంతరిక్ష ప్రయోగాలు, జాబిల్లి యాత్రలు చాలానే ఉన్నాయన్నమాట. భారతదేశం దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన మూడంచెల అణు శక్తి కార్యక్రమం ఈ ఏడాది కీలకదశకు చేరనుంది. చెన్నై సమీపంలోని కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రంలోని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్బీఆర్) ఈ ఏడాది పని చేయడం మొదలుపెడు తుంది. ముందుగా ప్రయోగాత్మకంగా మొదలై... ఈ ఏడాది చివరి కల్లా పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అంచనా. దేశంలో విస్తృతంగా లభ్యమయ్యే థోరియంను ఇంధనంగా ఉపయోగిస్తుందీ రియాక్టర్. విజయవంతమైతే దేశ ఇంధన భద్రత మరింత పటిష్ఠమవుతుంది. దేశం మూడు దిక్కులా ఆవరించిన విశాల సముద్రాన్ని మానవ ప్రయోజనాలకు సద్వినియోగం చేసుకోవాలన్న భారతదేశ ఆశయం ఈ ఏడాది కార్యాచరణ దిశగా అడుగులు వేయనుంది. సముద్రయాన్లో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన ‘మత్స్య– 6000’ జలాంతర్గామి ముగ్గురు శాస్త్రవేత్తలను ఆరువేల మీటర్ల లోతు వరకూ తీసుకెళ్లనుంది. సముద్ర మట్టంతో పోలిస్తే 600 రెట్లు ఎక్కువ పీడనం ఉండే ఈ ప్రాంతాల్లో జలాంతర్గామి తొడుగులోని ప్రతి చదరపు సెంటీమీటర్ 600 కిలోల బరువును తట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే దీన్ని అత్యంత దృఢమైన ప్రత్యేకమైన టైటానియం మిశ్రమ లోహంతో తయారు చేశారు.వాతావరణ అంచనాలు అతి సంక్లిష్టమైన భారత దేశ వాతావరణ అంచనాల కోసం ఈ ఏడాది నుంచి కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ల వినియోగం మొదలు కానుంది. ఏడాది చివరికల్లా ఇది సిద్ధమవుతుందని అంచనా. ‘మిహిర్’ వంటి సూపర్ కంప్యూటర్ల సాయంతో ఆరు కిలో మీటర్ల పరిధికి సంబంధించిన వాతావరణ అంచనాలను పది రోజుల ముందే ఇవ్వవచ్చునని భారత వాతావరణ విభాగం చెబుతోంది. వరదల్లాంటి విపత్తుల నుంచి మెరుగైన సన్నద్ధత కలిగి ఉండేందుకు, వ్యవసాయానికీ, పర్యాటక రంగానికీ ఎంతో ఉపయోగపడనుంది ఇది. శిలాజ ఇంధన వినియోగాన్ని వేగంగా తగ్గించాలన్న లక్ష్యం వైపు భారత్ అడుగులేస్తోంది. ఇందుకు తగ్గట్టే సంప్రదాయేతర ఇంధన వనరుల సామర్థ్యంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. పవన విద్యుత్తులో నాలుగో స్థానంలో ఉంటే... సౌరశక్తి సామర్థ్యంలో మనది మూడో స్థానం. అయితే భారతదేశ స్థాపిత విద్యుదుత్పత్తి 482.82 గిగావాట్లలో ఇది సగం కంటే కొంచెం ఎక్కువ. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మనం నాలుగేళ్ల ముందుగానే ఈ స్థాయికి చేరుకున్నాం. ‘ఒన్ సన్ ఒన్ వరల్డ్, ఒన్ గ్రిడ్’ కార్యక్రమం కారణంగా సౌరశక్తి రంగంలో మన పురోగతి ఇకపై కూడా కొనసాగనుంది. కృత్రిమ మేధఏఐ వాడకంతో ఈ ఏడాది టిక్కెట్ల బుకింగ్ మొదలుకొని వాహ నాల రవాణా వరకూ అనేక విషయాలు మరింత సౌకర్యవంతం కానున్నాయి. అతి తక్కువ బడ్జెట్తో చైనా సంస్థ అభివృద్ధి చేసిన ‘డీప్సీక్’ వంటివి ఏఐని మరింత వైవిధ్యభరిత అవసరాల కోసం వాడుకునే అవకాశం కల్పించనున్నాయి. స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ వినియోగం కూడా ఈ ఏడాది మొదలయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా... ఇంగ్లీషులో కాకుండా కొరియన్ భాషలోనూ ఏఐ అందుబాటులోకి రావచ్చు. బయో టెక్నాలజీజన్యుపరమైన తప్పులను వెతకడం కంటే... వాటిని సరిచేయ డంపై ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. మన డీఎన్ఏలో జరిగే అతి చిన్న మార్పు కూడా వ్యాధులకు కారణ మవుతుందన్నది తెలిసిందే. ఈ మార్పులను సరిచేసేందుకు ‘క్రిస్పర్–క్యాస్9’ వంటి ఆధునిక జన్యు ఎడిటింగ్ టూల్స్ అందు బాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ టెక్నాలజీలు ఒకే ఒక్క జన్యువులోని మార్పులను సరి చేసేందుకు ఉపయోగించవచ్చు.అంతేకాదు క్రిస్పర్ టెక్నాలజీతో అననుకూల వాతావరణాలను కూడా తట్టుకుని పండే పంటలను అభివృద్ధి చేసేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టు కోవడంలో, ఆహార భద్రత కోసం ఇది ఎంతో కీలకం. ఇలా ఈ ఏడాది సైన్స్–టెక్సాలజీ రంగంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసు కుని మానవ చరిత్రలో మైలురాళ్లు కానున్నాయి.టి.వి.వెంకటేశ్వరన్ వ్యాసకర్త విజిటింగ్ ప్రొఫెసర్, ఐసర్ మొహాలీ
600వ సారి నింగిలోకి
భద్ర కాలువలో నలుగురు గల్లంతు
బీసీలపై అగ్రవర్ణం దాడులు
శాంతి మండలిలో సభ్యత్వం... బిలియన్ డాలర్లే!
వైద్య శాఖలో మరో అవినీతి టెం‘ఢర్’
మహా జంగిల్రాజ్ను అంతం చేయండి
మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
దుబాయ్లో ‘వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్’
రికార్డు ‘కిక్’!
ఏపీఎస్ ఆర్టీసీకి దండగ.. టీఎస్ ఆర్టీసీకి పండుగ!
ఆ దేశంతో కలిసిపోతాం: మోల్డోవా
ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారనే సార్! మాటిమాటికీ హైదరాబాద్ పోవాల్సి వస్తోంది!!
ఈ రాశి వారు విలువైన వస్తువులు కొంటారు.. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
... ఆయనకు ఆ బహుమతి ఎందుకు చూపించారు మేడం!
మరో వారసురాలు వచ్చేస్తుంది
నావల్లే డబ్బు పోయిందని ఇంతవరకు..: శర్వానంద్
టీమిండియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..?
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
ఇండియా వీసా వచ్చిందోచ్.. పాకిస్తానీ ఆనందం
కొంత స్థలం మనకు, మరికొంత స్థలం ప్రైవేటు వాళ్లకు.. మిగతా స్థలం మనవాళ్లు కబ్జా చేశారు. ఇక సమస్యలు ఏముంటాయ్ సార్!!
పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
7 పరుగులకే 5 వికెట్లు.. కట్ చేస్తే స్కోర్ ఎంతంటే..?
గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్
‘ఇష్టానుసారంగా పసిడి ధరలు పెంపు’
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అల్లింది పిట్టకథ.. కట్టు కథ: భట్టి సీరియస్
పాకిస్తాన్లో పిండి సంక్షోభం.. రెండు పూటలా తిండికీ దరిద్రం!
కలిస్తే తప్పులేదు! కలిసిపోతేనే ముప్పు!!
గుండెలపై పడుకున్న పాము.. తర్వాత ఏమైందంటే?
తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ
600వ సారి నింగిలోకి
భద్ర కాలువలో నలుగురు గల్లంతు
బీసీలపై అగ్రవర్ణం దాడులు
శాంతి మండలిలో సభ్యత్వం... బిలియన్ డాలర్లే!
వైద్య శాఖలో మరో అవినీతి టెం‘ఢర్’
మహా జంగిల్రాజ్ను అంతం చేయండి
మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
దుబాయ్లో ‘వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్’
రికార్డు ‘కిక్’!
ఏపీఎస్ ఆర్టీసీకి దండగ.. టీఎస్ ఆర్టీసీకి పండుగ!
ఆ దేశంతో కలిసిపోతాం: మోల్డోవా
ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారనే సార్! మాటిమాటికీ హైదరాబాద్ పోవాల్సి వస్తోంది!!
ఈ రాశి వారు విలువైన వస్తువులు కొంటారు.. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
... ఆయనకు ఆ బహుమతి ఎందుకు చూపించారు మేడం!
మరో వారసురాలు వచ్చేస్తుంది
నావల్లే డబ్బు పోయిందని ఇంతవరకు..: శర్వానంద్
టీమిండియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..?
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
ఇండియా వీసా వచ్చిందోచ్.. పాకిస్తానీ ఆనందం
కొంత స్థలం మనకు, మరికొంత స్థలం ప్రైవేటు వాళ్లకు.. మిగతా స్థలం మనవాళ్లు కబ్జా చేశారు. ఇక సమస్యలు ఏముంటాయ్ సార్!!
పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
7 పరుగులకే 5 వికెట్లు.. కట్ చేస్తే స్కోర్ ఎంతంటే..?
గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్
‘ఇష్టానుసారంగా పసిడి ధరలు పెంపు’
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అల్లింది పిట్టకథ.. కట్టు కథ: భట్టి సీరియస్
పాకిస్తాన్లో పిండి సంక్షోభం.. రెండు పూటలా తిండికీ దరిద్రం!
కలిస్తే తప్పులేదు! కలిసిపోతేనే ముప్పు!!
గుండెలపై పడుకున్న పాము.. తర్వాత ఏమైందంటే?
తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ
ఫొటోలు
హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
హీరోయిన్ సంఘవి కూతురి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)
మేడారం సందడి (ఫోటోలు)
'యుఫోరియా' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ బ్లాక్ బస్టర్ మీట్ (ఫోటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా, శర్వానంద్ (ఫోటోలు)
బుడ్డోడితో బీచ్లో బుల్లితెర నటి లహరి (ఫోటోలు)
నువ్వే పెద్ద బంగారానివి! (ఫోటోలు)
మిహికా: 2016.. అంతా సెల్ఫీలమయం (ఫోటోలు)
సినిమా
అటు మోడ్రన్గా.. ఇటు అమ్మవారి వేషంలో..
గడిచిన కాలం మళ్లీ రాదంటారు. కుదిరితే గడిచిన కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను నెమరేసుకుని ఏదో కాస్త సంతోషపడటమే! అందుకు 2016 ట్రెండ్ బాగా ఉపయోగపడుతోంది. సడన్గా అందరూ పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు. 2016లో జీవితం ఎలా ఉందో గుర్తు చేసుకుంటూ అప్పటి వేడుకలను, జ్ఞాపకాలను ఫోటోల రూపంలో షేర్ చేస్తున్నారు. అలా బిగ్బాస్ బ్యూటీ పై ఫోటో షేర్ చేసింది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?2016 నాటి మెమొరీస్బుల్లితెర నటి ప్రియాంక జైన్.. ఓవైపు మోడ్రన్ డ్రెస్లో సెల్ఫీలు, మరోవైపు అమ్మవారి వేషధారణ. ఇంకో ఫోటోలో అయితే రెండు జడలు వేసుకుని పిండి రుబ్బుతోంది. ఈ ఫోటోల్లో ప్రియాంక మరీ చిన్నపిల్లలా కనిపిస్తోంది. ఇకపోతే.. మౌనరాగం సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది ప్రియాంక జైన్. జానకి కలగనలేదు సీరియల్తో మరింత పాపులరైంది.ప్రియుడితో..తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొనగా టాప్ 5గా నిలిచింది. మౌనరాగం సీరియల్ సహనటుడు శివకుమార్తో ప్రేమలో పడగా.. వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. 2024 ఏప్రిల్లో వీరిద్దరూ హైదరాబాద్లో ఓ చోట భూమి కొన్నారు. గతేడాది మంచి ముహూర్తం చేసుకుని ఇంటిపనులు మొదలుపెట్టారు. ఈ లెక్కన ఈ ఏడాది కొత్తింట్లోకి వీరు జంటగా గృహప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207)
హార్స్ రైడింగ్.. బాహుబలి-2 జ్ఞాపకాల్లో మిల్కీ బ్యూటీ.. .!
టాలీవుడ్లో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామ తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీ అయిపోయింది. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్తోనూ అభిమానులను అలరిస్తోంది. తెలుగులో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా బాహుబలి-2 మూవీ రోజులను గుర్తు చేసుకుంది.బాహుబలి-2 కోసం గుర్రపు స్వారీ తరగతులను మరోసారి గుర్తు చేసుకుంది. ఈ మూవీ కోసం తాను చేసిన సాధనతో పాటు తల్లిదండ్రులతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. తన హెయిర్ కట్ ఆ రోజుల్లో చాలా బాగుండేదని తెలిపింది. అంతేకాకుండా చివర్లో బాహుబలి ప్రమోషన్ల సమయంలో దిగిన ఫోటోషూట్ అంటూ బ్లాక్ డ్రెస్లో కనిపించింది.కాగా.. గతేడాది ఓదెల -2తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన తమన్నా.. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. హిందీలో రోమియో, రేంజర్ లాంటి చిత్రాల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)
'ఆరనీకుమా ఈ దీపం' సాంగ్.. రవితేజ మాస్ డ్యాన్స్
ఈ సంక్రాంతి థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు.. కామెడీ నుంచి హారర్ వరకు ఇలా అన్నీ కలగలిపిన సినిమాలు రావడంతో ప్రేక్షకులు పోలోమని థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు దాదాపు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. వాటిలో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఉంది. ఆరనీకుమా ఈ దీపం సాంగ్ఈ మూవీలో కార్తీక దీపం డీజే సాంగ్ను వాడేశారు. కానీ సినిమా రిలీజయ్యేవరకు కూడా ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. తీరా థియేటర్లలో ఈ పాట రాగానే జనాలు సర్ప్రైజ్ అయ్యారు. స్క్రీన్పై రవితేజ మాస్ స్టెప్పులేస్తుంటే అటు జనాలు కూడా ఎగిరి గంతేస్తున్నారు. అలా సినిమాలో హిట్టయిన ఈ కార్తీకదీపం రీమిక్స్ సాంగ్ను తాజాగా రిలీజ్ చేశారు. పబ్లో హీరోయిన్ ఆషికా రంగనాథ్తో మాస్ మహారాజ వేసిన స్టెప్పులు మీరూ చూసేయండి..సినిమాసినిమా విషయానికి వస్తే.. రవితేజ హీరోగా నటించగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా ఎస్వీఎల్ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. జనవరి 13న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చదవండి: అప్పుడు దేవుడిపైనే నమ్మకం పోయింది.. అరుణాచలం వెళ్లాక: రీతూ
‘కథ’లేని సినిమాలపై కాసుల వర్షం.. కారణం ఏంటి?
‘సినీ ప్రేక్షకులు మారిపోయారు. కేజీయఫ్, బాహుబలి, పుష్ప లాంటి భారీ యాక్షన్, ఎలివేషన్ ఉన్న సినిమాలకు తప్ప.. మిగతావాటిని చూసేందుకు థియేటర్స్కు రావడం లేదు’ అని మొన్నటిదాకా మన దర్శకనిర్మాతలు చెప్పిన మాటలివి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని ఈ సంకాంత్రికి తెలుగు ఆడియన్స్ తేల్చేశారు.కొట్టడాలు.. నరకడాలు లేకున్నా.. స్వచ్ఛమైన వినోదాన్ని అందించేలా సినిమా తీస్తే.. ఫ్యామిలీతో కలిసి సినిమాకు వస్తామని మరోసారి నిరూపించారు. ఈ సంక్రాంతికి తెలుగులో వరుసగా ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో మూడు సినిమాలకు హిట్ టాక్ వచ్చింది. మిగతా రెండు సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చినా .. మంచి వసూళ్లను రాబడుతున్నాయి.ముందుగా హిట్ సినిమా గురించి చెప్పుకుందాం. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ప్రీమియర్ షోతోనే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న చిత్రం ‘మనశంకర వరప్రసాద్’. ఈ నెల 12న విడుదలై సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 260 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత వచ్చిన అనగనగ ఒకరాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు కూడా విజయాల బాట పడ్డాయి.ఈ మూడు సినిమాలను పరిశీలిస్తే..ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పుకోవడానికి ఈ మూడింట్లోనూ గొప్ప కథేలేం లేవు. నిజం చెప్పాలంటే.. అసలు కథే లేదు. అయినా కూడా ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. కారణం ఏంటంటే.. ఈ సినిమాల్లో కథ లేకున్నా..రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చునేలా చేసే స్వచ్ఛమైన వినోదం ఉంది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి తరలి వెళ్తున్నారు.చిరంజీవి కాబట్టి మన శంకరవరప్రసాద్ హిట్ అయిందని అనుకుంటే.. మిగతా రెండు సినిమాల్లోని హీరోలకు అంతపెద్ద ఫ్యాన్ ఫాలోయింగే లేదు. సినిమాలోని వినోదమే వారిని కాపాడింది. ఇక స్టార్ హీరో ఉంటేనే థియేటర్స్కి జనాలు వస్తారు అనుకుంటే ఈ సంక్రాంతికి ‘ది రాజాసాబ్’ అతిపెద్ద విజయం సాధించాలి. కానీ అది జరగలేదు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో వినోదం ఉన్నా..ప్రేక్షకులను ఆ డోస్ సరిపోలేదు. అందుకే బాక్సాఫీస్ రేసులో కాస్త వెనకబడింది. సంక్రాంతి కాబట్టే ఈ సినిమాలు ఆడుతున్నాయని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కామెడీ చిత్రాలు ఏ సీజన్లో వచ్చినా చూస్తారు. పండగక్కి వస్తే.. ఇంకాస్త ఎక్కువ మంది చూస్తారు. అయితే ప్రతిసారి యాక్షన్ సినిమాలే కాదు అప్పుడప్పుడు ఫ్యామిలీ డ్రామాలు కూడా వస్తే.. వాటిని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సంక్రాంతి సినిమాలతో అర్థమైంది. ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించే దమ్ము ఫ్యామిలీ డ్రామాల్లోనే ఉంది. అందుకే ఇక నుంచి మనవాళ్లు యాక్షన్తో పాటు వినోదాత్మక కథలపై కూడా దృష్టిపెడితే మంచిది.
క్రీడలు
చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్..
వన్డే క్రికెట్లో నిలకడగా రాణించే ఆటగాళ్లు ఎవరంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. అయితే కోహ్లి బాటలోనే న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ పయనిస్తున్నాడు. వన్డేల్లో ఈ కివీ స్టార్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మిడిలార్డర్ బ్యాటర్ కోహ్లి మాదిరిగానే నిలకడగా మారు పేరుగా మారాడు.ప్రస్తుతం భారత్తో జరుగుతున్న వన్డే సిరీస్లో మిచెల్ సెంచరీలు మోత మ్రోగించాడు. వడోదర జరిగిన తొలి వన్డేలో 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మిచెల్.. ఆ తర్వాత రాజ్కోట్ వన్డేలో సెంచరీ(131)తో మెరిశాడు. ఇప్పుడు ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో మిచెల్ శతక్కొట్టాడు. ఈ మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మిచెల్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మిచెల్ ఆరంభంలో భారత పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లను ఎదుర్కోవడంలో సంయమనం పాటించాడు. ఆ తర్వాత క్రీజులో కుదుర్కొన్నాక తనలోని విశ్వరూపాన్ని చూపించాడు. 106 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను మిచెల్ అందుకున్నాడు. మిచెల్కు ఇది 9వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా మొత్తంగా 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137 పరుగులు చేశాడు. భారత్పై అతడికి ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అదేవిధంగా భారత్పై గత ఐదు మ్యాచ్లలో అతడికి ఇది నాలుగో సెంచరీ.ఈ మ్యాచ్లో సెంచరీతో సత్తాచాటిన మిచెల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో(టెస్టు క్రికెట్ హోదా కలిగిన దేశాలు) కనీసం 2000 పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యధిక సగటు కలిగిన బ్యాటర్గా మిచెల్ చరిత్ర సృష్టించాడు. మిచెల్ ఇప్పటివరకు 58.47 సగటుతో 2690 పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి ఇప్పటివరకు వన్డేల్లో 58.45 సగటుతో 14673 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్తో కోహ్లిని మిచెల్ అధిగమించాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్(56.34) ఉన్నాడు. ఇక ఈ సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో మిచెల్తో పాటు గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీతో మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, అర్ష్దీప్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్దీప్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్
మిచెల్, ఫిలిప్స్ సెంచరీలు.. భారత్ ముందు భారీ టార్గెట్
ఇండోర్ వేదికగా భారత్తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలతో చెలరేగారు. మొదట బ్యాటింగ్కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు డెవాన్ కాన్వే(5), హెన్రీ నికోల్స్(0) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారిల్ మిచిల్.. విల్ యంగ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. యంగ్(30) ఔటయ్యాక అసలు కథ మొదలైంది. అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్, మిచెల్ కలిసి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు ఏకంగా 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని అర్ష్దీప్ సింగ్ బ్రేక్ చేశాడు. మిచెల్ 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137 పరుగులు చేయగా.. ఫిలిప్స్ కేవలం 88 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖరిలో బ్రేస్వెల్(28) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, అర్ష్దీప్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్దీప్ తలా వికెట్ సాధించారు. రవీంద్ర జడేజా మరోసారి కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. కాగా డారిల్ మిచెల్కు ఈ సిరీస్లో ఇది వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం.చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్
టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్
సనత్ జయసూర్య, రికీ పాంటింగ్, కుమార సంగ్కకర, మహేలా జయవర్దనే, ఏబీ డివిలియర్స్.. వీరంతా ఒకప్పుడు భారత జట్టుపై ఆధిపత్యం చెలాయించిన దిగ్గజ బ్యాటర్లు. ముఖ్యంగా వీరిందరికి వన్డేల్లో భారత్పై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు వారి బాటలోనే అడుగులు వేస్తున్నాడు న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్. ఈ మిడిలార్డర్ బ్యాటర్ ప్రస్తుతం టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారుతున్నాడు. ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్ కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్కు తలనొప్పిగా మారితే.. మిచెల్ మాత్రం దాదాపు ప్రతీ మ్యాచ్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడికి ప్రత్యర్ధి భారత్ అయితే చాలు చెలరేగిపోతాడు.మిచెల్ సెంచరీల మోత..మిచెల్ కాస్త లేటుగా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటికి.. అతి తక్కువ సమయంలోనే మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) తనదైన ముద్రవేసుకున్నాడు. ముఖ్యంగా అతడికి భారత్పై అసాధరణ వన్డే రికార్డు ఉంది. స్పిన్ను సమర్ధవంతంగా ఆడే మిచెల్ ఉపఖండ పిచ్లపై సత్తాచాటుతున్నాడు.వన్డే ప్రపంచకప్-2023లో కూడా ఆతిథ్య టీమిండియాను మిచెల్ గడగడలాడించాడు. సెమీఫైనల్ అయితే తన విరోచిత సెంచరీతో భారత్ను ఓడించే అంతపనిచేశాడు. అంతకుముందు లీగ్ మ్యాచ్లో కూడా భారత్పై సెంచరీ సాధించాడు. దీంతో వన్డే ప్రపంచకప్లో భారత్పై రెండు సెంచరీలు చేసిన ఏకైక విదేశీ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు అదే ఫామ్ను తాజా పర్యటనలో అతడు కొనసాగిస్తున్నాడు.ప్రస్తుతం భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో అతడు పరుగులు వరద పారిస్తున్నాడు. తొలి వన్డేలో 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మిచెల్.. ఆ తర్వాత రాజ్కోట్లో విరోచిత సెంచరీతో చెలరేగాడు. మళ్లీ ఇప్పుడు సిరీస్ డిసైడర్ మూడో వన్డేలోనూ శతక్కొట్టాడు. మిచెల్ భారత్లో తను ఆడిన చివరి ఐదు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా నాలుగుల సెంచరీలు బాదేశాడు. భారత్పై వన్డేల్లో అతడి సగటు దాదాపు 70గా ఉంది. ఇది చాలా మంది దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాలేదు.రెండో ప్లేయర్గా..భారత్పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా మిచెల్ నిలిచాడు. మిచెల్ ఇప్పటివరకు 4 సెంచరీలు సాధించాడు. ఈ సెంచరీలు మొత్తం భారత్లోనే రావడం గమనార్హం. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో నాథన్ ఆస్టిల్(5) అగ్రస్ధానంలో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే ఆస్టిల్ను మిచెల్ అధిగమిస్తాడు.చదవండి: T20 WC 2026: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో షాక్..
గంభీర్ చూశావా? తొలి ఓవర్లోనే వికెట్! వీడియో వైరల్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత తుది జట్టులోకి వచ్చిన పేసర్ అర్ష్దీప్ సింగ్.. తొలి ఓవర్లోనే తన మార్క్ చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే కివీస్ ఓపెనర్ హెన్రీ నికోల్స్ను పెవిలియన్ పంపి భారత్కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో గిల్ బౌలింగ్ ఎటాక్ను ప్రారంభించేందుకు కొత్త బంతిని అర్ష్దీప్ చేతికి ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని ఈ పంజాబ్ పేసర్ వమ్ముచేయలేదు. తన వేసిన తొలి ఓవర్ రెండో బంతికి డెవాన్ కాన్వే ఫోర్ బాదినా.. అర్ష్దీప్ ఏమాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు.అదే ఓవర్ ఐదో బంతికి అద్భుతమైన ఇన్స్వింగర్తో నికోల్స్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో అతడు గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో తొలి రెండు వన్డేల్లో అర్ష్దీప్కు అవకాశమివ్వని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. ఇటువంటి బౌలర్ను ఎలా పక్కన పెట్టావు? అంటూ పోస్ట్లు పెడుతున్నారు.మొదటి రెండు వన్డేల్లో అర్ష్దీప్ బెంచ్కే పరిమితమయ్యాడు. దీంతో అశ్విన్ మాజీలు గంభీర్పై విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఎట్టకేలకు సిరీస్ డిసైడర్ మ్యాచ్లో అర్ష్దీప్కు అవకాశం దక్కింది. ఈ పంజాబ్ స్పీడ్ స్టార్ ప్రసిద్ద్ కృష్ణ స్దానంలో తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్వెల్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్Arshdeep Singh has always been a wicket taker for India in every format.Still Gautam Gambhir used to bench him in most of the games. Jasprit Bumrah and Arshdeep will be the key in the T20 World Cup and the 2027 WC if Gambhir does not play politics 🔥🙇pic.twitter.com/tBcjoU9R2v— Tejash (@Tejashyyyyy) January 18, 2026
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో భూముల ‘రీ సర్వే’పై చంద్రబాబు దొంగాట... అప్పుడు దుష్ప్రచారం చేసి ఇప్పుడు క్రెడిట్ చోరీ కోసం పాకులాట
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా జూదాల జాతర.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో విచ్చలవిడిగా మద్యం ప్రవాహం
సంక్రాంతి సంబరాలను జూదంగా మార్చేసిన కూటమి నేతలు... ఏపీలో పండుగ వేళ యథేచ్ఛగా దోపిడీ... 2 రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల జూదం .
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ రిజిస్ట్రేషన్ల బాదుడు... వచ్చే నెల నుంచి పెంపు అమలు చేసేందుకు సన్నాహాలు... ఆదాయమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు పండుగ లేనట్లే... ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచిన ఏపీ సీఎం చంద్రబాబు
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు మరో డ్రామా. ఖజానాకు రాబడి తగ్గిందంటూ కార్యదర్శులు, కలెక్టర్లపై సీఎం చంద్రబాబు చిర్రుబుర్రు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్లుగా భారీగా తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య... ప్రైవేటు స్కూళ్లలో పెరిగిన చేరికలు
ఆంధ్రప్రదేశ్లో దారి దోపిడీకి పచ్చజెండా... సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు తలాడిస్తున్న కూటమి ప్రభుత్వం
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పన్నాగం...
ప్రజలకు సంజీవని లాంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
బిజినెస్
ఇళ్లకైనా, ఆఫీసులకైనా.. అక్కడే డిమాండ్!
మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతంలో గృహాలకే కాదు కార్యాలయ స్థలాలకూ అధికంగా డిమాండ్ ఉంటుంది. అందుకే హైదరాబాద్లో పశ్చిమ ప్రాంతం గృహ కొనుగోలుదారులకు, బహుళ జాతి సంస్థలకు హాట్ ఫేవరేట్ ప్లేస్గా మారింది. గతేడాది జులై–డిసెంబర్ (హెచ్–2)లో పశ్చిమ హైదరాబాద్ హవా కొనసాగింది. 2025 హెచ్2లో 19,355 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇందులో వెస్ట్ సిటీ వాటా 63 శాతం కాగా.. ఇదే సమయంలో నగరంలో 55 లక్షల చ.అ. ఆఫీసు స్థలం లావాదేవీలు జరిగాయి. ఇందులో పశ్చిమం వాటా 88 శాతంగా ఉందని నైట్ఫ్రాంక్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోమెరుగైన మౌలిక సదుపాయాలు, తక్కువ జీవనశైలి వ్యయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల వృద్ధి, కట్టుదిట్టమైన శాంతి భద్రతలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కాస్మోపాలిటన్ కల్చర్ వంటి రకరకాల కారణంగా హైదరాబాద్లో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో నగరంలో గృహాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. స్థిరమైన ఆదాయం, మెరుగైన ఫైనాన్సింగ్ పరిస్థితుల కారణంగా అద్దె ఆదాయం కోసం పెట్టుబడి రీత్యా కాకుండా సొంతంగా ఉండేందుకు నివాసాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకొస్తున్నారు. ఇళ్ల అమ్మకాల్లో కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశి్చమ హైదరాబాద్ హవా కొనుసాగుతూనే ఉంది. ఐటీహబ్, అంతర్జాతీయ స్థాయి మౌలిక, సామాజిక వసతులు, స్థిరమైన ఆదాయాలు వంటివి డిమాండ్కు ప్రధాన కారణాలు.పెరిగిన దక్షిణం, తూర్పు..సాధారణంగా భారతీయ కుటుంబాలు ప్రాపర్టీ విక్రయాల్లో వాస్తును తప్పనిసరిగా అనుసరిస్తుంటారు. తూర్పు ముఖంగా ప్రధాన ద్వారం ఉన్న ఇళ్లు, దక్షిణంలో స్థలం పెరిగిన ప్రాపరీ్టలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ కారణంగానే నగరంలో ఈ జోన్లలో ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి దక్షిణ హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా ఎదుగుతోంది. ఇళ్ల విక్రయాలలో ఈ జోన్ వాటా ఏడాది కాలంలో 5 శాతం నుంచి ఏకంగా 9 శాతానికి పెరిగింది. కనెక్టివిటీ, ఉపాధి అవకాశాల పెరుగుదల, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధి కారిడార్లతో ఈ జోన్ కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచింది. ఇక, ఉప్పల్, మల్కాజ్గిరి, ఎల్బీనగర్ వంటి తూర్పు హైదరాబాద్ వాటా స్థిరంగా 9 శాతంగా ఉంది. ప్రధాన ఉద్యోగ కేంద్రాలకు కనెక్టివిటీ లేకపోవడంతో తూర్పు ప్రాంతంలో కేవలం ధరల పోటీతోనే లావాదేవీలు జరుగుతుంటాయి.తగ్గిన ఉత్తరం, సెంట్రల్..ఇక, కొంపల్లి, మేడ్చల్, అల్వాల్, కుత్బుల్లాపూర్ వంటి ఉత్తర హైదరాబాద్ వాటా 19 శాతం నుంచి 17 శాతానికి క్షీణించింది. సాధారణంగా అందుబాటు గృహాలకు పెట్టింది పేరైన ఉత్తర హైదరాబాద్లో కస్టమర్ల అభిరుచిని అంచనా వేయకుండా ప్రీమియం ప్రాజెక్ట్లు పెద్ద ఎత్తున సప్లై కావడంతో డిమాండ్ తగ్గింది. భూమి కొరత, నియంత్రణ పరిమితుల కారణంగా బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ వంటి సెంట్రల్ హైదరాబాద్ వాటా 3 శాతానికి తగ్గింది.ప్రీమియం ఇళ్లకే మొగ్గు..2025 రెండో అర్ధభాగంలో అమ్ముడుపోయిన ఇళ్లలో రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 71 శాతంతో ఆధిపత్యాన్ని కొనసాగించాయి. అంతకుముందు ఏడాది హెచ్–2లో ఈ విభాగం వాటా 63 శాతంగా ఉంది. రూ.1.2 కోట్ల రేటు ఉన్న ఇళ్ల వాటా 44 శాతంగా ఉంది. ఇక, రూ.2.5 కోట్ల ధర ఉన్న విలాసవంతమైన గృహాల వాటా ఏకంగా 13 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. లగ్జరీ లైఫ్ స్టైల్, ఆధునిక వసతులు, గేటెడ్ కమ్యూనిటీ లివింగ్ వైపు కస్టమర్లు ఆసక్తి చూపించడంతో ఈ విభాగంలో ఇళ్ల విక్రయాలు పెరిగాయి. రూ.5 నుంచి రూ.10 కోట్ల ధర ఉన్న యూనిట్ల విక్రయాలు కూడా 3 శాతం నుంచి స్వల్పంగా 4 శాతానికి వృద్ధి చెందాయి.ఆఫీసు అ'ధర'హో..నగరంలో హెచ్ 2లో 55 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. అంతకుముందు ఏడాది హెచ్ 2తో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. ఇందులో హైటెక్ సిటీ, కొండాపూర్, రాయదుర్గం వంటి సబర్బన్ బిజినెస్ డిస్ట్రిక్ట్(ఎస్బీడీ) వాటా 88 శాతంగా ఉండగా.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట వంటి సెంట్రల్ బిజినెస్ డి్రస్టిక్ట్(సీబీడీ) ప్రాంతాల వాటా 6 శాతం, గచ్చిబౌలి, కోకాపేట, నానక్రాంగూడ వంటి పశ్చిమ ప్రాంతాలు(పీబీడీ–వెస్ట్) వాటా 2 శాతం, ఉప్పల్, పోచారం వంటి తూర్పు ప్రాంతాలు(పీబీడీ–ఈస్ట్) వాటా 4 శాతంగా ఉన్నాయి. గతేడాది హెచ్–2లో సగటు లావాదేవీ అద్దె చ.అ.కు రూ.77గా ఉంది.లాంచింగ్స్లో వెస్ట్దేనివాస విభాగంలో విలాసవంతమైన గృహాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. గృహ కొనుగోలుదారుల అభిరుచుల మేరకు డెవలపర్లు కూడా ప్రీమియం ప్రాజెక్ట్ల నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఇళ్ల విక్రయాలతో పాటు లాంచింగ్స్లోనూ లగ్జరీ యూనిట్లవే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. 2025 హెచ్–2లో నగరంలో కొత్తగా 19,775 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. ప్రీమియం ఇళ్ల నిర్మాణాలకు డెవలపర్లు ఆసక్తి చూపించడం, కస్టమర్ల ప్రాధాన్యతల నేపథ్యంలో 2024 హెచ్–2తో పోలిస్తే లాంచింగ్స్ 9 శాతం మేర క్షీణించాయి. ఇక, జోన్ల వారీగా చూస్తే.. లాంచింగ్స్లో పశ్చిమ హైదరాబాద్ వాటా 62 శాతంగా ఉండగా.. ఉత్తరం 15 శాతం, దక్షిణం 10 శాతం, తూర్పు 8 శాతం, సెంట్రల్ సిటీ వాటా 5 శాతంగా ఉంది.నగరంలోని ఆఫీసు స్పేస్ లావాదేవీల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ)లదే హవా కొనసాగుతోంది. నగరంలో 2025 హెచ్–2లో జరిగిన కార్యాలయ స్థలాల లీజులలో జీసీసీల వాటా ఏకంగా 50 శాతంగా ఉంది. చార్లెస్ స్క్వాబ్ కార్పొరేషన్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, రాండ్స్టాడ్, గోల్డ్మన్ సాచ్స్, సర్వీస్ నౌ వంటి బహుళ జాతి సంస్థలు నగరంలో జీసీసీలను ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత ఆఫీసు స్పేస్ లీజులు 25 శాతం వాటాతో ఫ్లెక్సిబుల్ స్పేస్ విభాగం ఉంది. థర్ట్ పార్టీ సంస్థల లావాదేవీలు 16 శాతంగా ఉంది. ఇక, నగరంలో ఆఫీసు స్థలం అద్దెలు వార్షిక ప్రాతిపదికన 10 శాతం మేర పెరిగి, ప్రస్తుతం నెలకు చ.అ.కు రూ.77గా ఉన్నాయి.ఆసక్తి తగ్గినా ఆఫర్డబుల్నగరంలో అందుబాటు గృహాలకు ఆదరణ తగ్గుతూనే ఉంది. రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల విక్రయాలు 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గాయి. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న ఇళ్ల వాటా కూడా 31 శాతం నుంచి 26 శాతానికి క్షీణించాయి.
10 ని.డెలివరీ నిలిపివేత.. పర్యవేక్షణ కఠినతరం
క్విక్ కామర్స్ రంగంలో డెలివరీ సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి భద్రతపై కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది. 10 నిమిషాల్లో డెలివరీ అనే ప్రచారాన్ని ప్లాట్ఫారమ్లు విరమించుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో గిగ్ వర్కర్ల పరిస్థితిపై కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నిరంతరం నిఘా ఉంచింది.ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే లేదా గిగ్ వర్కర్ల శ్రమను దోపిడీ చేసే అగ్రిగేటర్లపై కఠిన చర్యలు తప్పవని ఉన్నత స్థాయి వర్గాలు హెచ్చరించాయి. బ్రాండింగ్ మార్చినప్పటికీ డెలివరీ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గకపోవడం, ఐడీల బ్లాకింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.ముఖ్యమైన అంశాలుగిగ్ వర్కర్ల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో జరిగిన సమావేశం అనంతరం బ్లింకిట్, జెప్టో వంటి సంస్థలు 10 నిమిషాల డెలివరీ ప్రకటనలను ఉపసంహరించుకున్నాయి. కేవలం ప్రకటనల మార్పుతోనే పని ఒత్తిడి తగ్గదని, వ్యాపార నమూనాల్లో మార్పులు రాకపోతే కార్మికులకు ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈఎస్ఐసీ ‘స్ప్రీ’ (SPREE) పథకంగిగ్ వర్కర్లతో సహా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన ‘స్కీమ్ టు ప్రొమోట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ (స్ప్రీ)’ పథకం మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం, ఈ పథకం కింద ఇప్పటివరకు సుమారు 1.17 లక్షల మంది కొత్త యజమానులు (Employers) తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీనివల్ల సంస్థల స్థాయిలోనే కార్మిక సంక్షేమానికి మార్గం సుగమమైంది. కేవలం యజమానులే కాకుండా, భారీ సంఖ్యలో ఉద్యోగులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 1.03 కోట్ల మంది కొత్త ఉద్యోగులు ఈఎస్ఐ పరిధిలోకి చేరడం విశేషం.ప్రస్తుతం ఈ పథకం గడువు 2026 జనవరి చివరి వరకు అందుబాటులో ఉంది. గతంలో నమోదు కాని యజమానులు, ఉద్యోగులు ఎలాంటి జరిమానాలు లేదా శిక్షలు లేకుండా ఒకేసారి రిజిస్టర్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పరిశ్రమ వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఈ పథకం గడువును పొడిగించడం ద్వారా లక్షలాది మంది కార్మికులకు వైద్య, ఆర్థిక భద్రత చేకూరింది. గిగ్ ఎకానమీలో పారదర్శకత, కార్మిక సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం ముందుకు సాగుతోంది.ఇదీ చదవండి: డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్!
‘కేంద్రం–రాష్ట్రాలు రెండూ లోటు తగ్గించుకోవాలి’
భారతదేశ ఆర్థిక సుస్థిరతకు పెరుగుతున్న ఆర్థిక లోటు (Fiscal Deficit) ప్రధాన బలహీనతగా మారిందని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అర్వింద్ సుబ్రహ్మణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ లోటును తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల ‘భారతదేశ అభివృద్ధి మార్గం’ అనే అంశంపై నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణపై పలు వ్యాఖ్యలు చేశారు.‘ప్రికోసియస్ డెమోక్రసీ’ ప్రభావంభారతదేశం అభివృద్ధికి ముందే పరిణతి చెందిన ప్రజాస్వామ్యం (Precocious Democracy)గా అవతరించిందని సుబ్రహ్మణియన్ అభివర్ణించారు. సమాజంలోని ప్రతి వర్గం నుంచి వచ్చే డిమాండ్లను ప్రజాస్వామ్యబద్ధంగా తీర్చాల్సి రావడం కీలకంగా మారుతుంది. ఇది దేశ ఆర్థిక అలవాట్లపై ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత భారత ప్రభుత్వ లోటు సగటున జీడీపీలో 10 శాతం వరకు ఉంటోందన్నారు. మనతో సమానంగా ఎదుగుతున్న ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని ఆయన గుర్తుచేశారు.సంక్షేమ పథకాలపై సమీక్ష అవసరంప్రస్తుతం భారతదేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుండటం వల్ల ద్రవ్యలోటును తట్టుకోగలుగుతోందని ఆయన విశ్లేషించారు. అయితే, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ‘కేంద్రం, రాష్ట్రాలు రెండూ తమ ఆర్థిక లోటును క్రమంగా తగ్గించుకోవాలి. నగదు బదిలీ పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలపై చేసే వ్యయాన్ని పునసమీక్షించాలి. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ అవసరం లేకపోయినా, బాధ్యతాయుతమైన వ్యయం తప్పనిసరి’ అని చెప్పారు.ఇదీ చదవండి: డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్!
డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్!
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్కు, అమెరికా న్యాయస్థానాలకు మధ్య జరుగుతున్న ‘గుత్తాధిపత్య’ పోరు కొత్త మలుపు తిరిగింది. తమ సెర్చ్ డేటాను చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ వంటి ప్రత్యర్థి సంస్థలతో పంచుకోవాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ గూగుల్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. అప్పీలుపై తుది నిర్ణయం వచ్చే వరకు ఈ డేటా బదిలీని వాయిదా వేయాలని కంపెనీ కోరింది.తీర్పు నేపథ్యం ఏమిటి?ఆన్లైన్ సెర్చ్ మార్కెట్లో గూగుల్ చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని 2024లో వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి అమిత్ మెహతా చారిత్రాత్మక తీర్పునిచ్చారు. యాపిల్, శామ్సంగ్ వంటి కంపెనీలకు ఏటా 20 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించి, గూగుల్ను ‘డిఫాల్ట్’ సెర్చ్ ఇంజిన్గా ఉంచడం ద్వారా పోటీని అణచివేసిందని కోర్టు నిర్ధారించింది. ఈ ఆధిపత్యాన్ని తగ్గించే క్రమంలో గూగుల్ తన సెర్చ్ డేటాను ప్రత్యర్థులకు అందుబాటులో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు.గూగుల్ వాదన ఏంటి?అప్పీలు పెండింగ్లో ఉండగానే డేటాను పంచుకుంటే కంపెనీకి చెందిన కీలక వాణిజ్య రహస్యాలు ప్రత్యర్థుల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రజలు గూగుల్ను బలవంతంగా కాకుండా, మంచి సేవలు అందిస్తుంది కాబట్టే వాడుతున్నారు’ అని గూగుల్ రెగ్యులేటరీ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ లీ-అన్నే ముల్హోలాండ్ స్పష్టం చేశారు. ఇప్పటికే మార్కెట్లో గట్టి పోటీ ఉందని, కోర్టు నిర్ణయం ఆవిష్కరణల స్థాయిని తక్కువ అంచనా వేసిందని కంపెనీ వాదిస్తోంది.షరతులకు అంగీకారం.. కానీ!గోప్యత, భద్రతా రక్షణలకు సంబంధించిన నిబంధనలను పాటించడానికి సిద్ధమని గూగుల్ తెలిపింది. అయితే డేటా షేరింగ్, సిండికేటెడ్ ఫలితాలు, ప్రకటనల పంపిణీ విషయంలో మాత్రమే స్టే కోరుతోంది.ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు
ఫ్యామిలీ
ఆటపాటల అట్టహాసం
ఆటపాటల అట్టహాసం ఆ నగరంలో సందడి సందడిగా కనిపిస్తుంది. వీథుల్లో ఎక్కడ చూసినా సంప్రదాయ వాద్యాలకు అనుగుణంగా చిన్నా పెద్దా, ఆడా మగా చెట్టా పట్టాలేసుకుని అడుగులో అడుగులు కదుపుతూ నాట్యకేళితో కనువిందు చేస్తారు. ఒకరోజు కాదు, ఏకంగా పదిరోజులు అట్టహాసంగా సాగే ఆటపాటలతో సాగే అద్భుతమైన వేడుక ఇది. ఈ నాట్యోత్సవానికి వేదిక పెరులోని ట్రుజిలో నగరం. ట్రుజిలో నగరంలో ప్రతి ఏటా జనవరి నెలలో ‘ట్రుజిలో మరీనెరా’ పేరిట జరిగే ఈ నాట్యోత్సవాన్ని తిలకించేందుకు విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తారు. పెరు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా జరిగే ఈ పదిరోజుల పండుగలో అశ్వికుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఉరకలేసే పెరూవియన్ పాసో అశ్వాలను అధిరోహించిన అశ్వికులు నాట్యోత్సవం కొనసాగే వీథుల్లో విన్యాసాలు చేస్తూ తిరుగుతుంటారు. చిత్రవిచిత్ర గతులలో నాట్యమాడే నాట్యగత్తెలతో అశ్వాల మీద కూర్చునే సయ్యాటలాడుతుంటారు.పెరూ ప్రభుత్వం ఈ వేడుకను జాతీయ సాంస్కృతిక వేడుకగా గుర్తించింది. ట్రుజిలో నగరంలో జరిగే ఈ పది రోజుల పండుగలో జనాలు పెరూవియన్ సంప్రదాయ ‘మరీనెరా’ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అందువల్ల పెరు ప్రభుత్వం ట్రుజిలో నగరాన్ని ‘మరీనెరా రాజధాని’గా గుర్తించింది. ఈసారి ట్రుజిలోలో ఈ వేడుకలు జనవరి 20 నుంచి 30 వరకు జరగనున్నాయి.ఈ సందర్భంగా జాతీయ మరీనెరా పోటీలను కూడా నిర్వహిస్తారు. ఈ వేడుకలు జరిగే పది రోజుల్లోనూ ట్రుజిలో నగరం నలుమూలలా వీథుల్లో భారీ స్థాయిలో ఊరేగింపులు జరుగుతాయి. ఈ ఊరేగింపుల్లో రథాల వంటి వాహనాలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగిస్తారు. ఈ రథాలపై కొందరు నర్తకీమణులు రాణుల వేషాలలో నర్తిస్తూ జనాలను అలరిస్తారు. వీథుల్లో రథాల వెంట నడుస్తూ ఆడా మగా అన్ని వయసుల వారు జంటలు జంటలుగా నాట్యాలు సాగిస్తుంటారు.
సుదీర్ఘ సొరంగ రహదారి
ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన సొరంగ రహదారి. చైనా ప్రభుత్వం గత డిసెంబర్ 16న దీనిని ప్రారంభించింది. టియాన్షాన్ పర్వతశ్రేణుల వద్ద కొండలను తొలిచి నిర్మించిన ఈ సొరంగ రహదారి పొడవు 22.13 కిలోమీటర్లు. ఉరుంకీ నగరం నుంచి కోర్లా నగరానికి వెళ్లేందుకు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో చైనా ప్రభుత్వం ఈ సొరంగ రహదారిని నిర్మించింది. ఉరుంకీ నుంచి కోర్లాకు ఇదివరకు ఏడుగంటలు పట్టేది.ఈ సొరంగం వల్ల ప్రయాణ సమయం మూడున్నర గంటలకు తగ్గింది. దాదాపు ఏడువందల మీటర్ల లోతున ఈ సొరంగ మార్గాన్ని నిర్మించడం వల్ల అతి శీతల వాతావరణంలో సునాయాసంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. టియాన్షాన్ పర్వతశ్రేణుల వద్ద శీతకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 42 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంటాయి. పూర్తిగా మంచు నిండిన మార్గంలో వాహనాలు ప్రయాణించడం దుస్సాధ్యంగా ఉండేది. ఈ సొరంగం నిర్మించడం వల్ల మంచు కారణంగా ఆటంకాలు లేకుండా, సురక్షితంగా సునాయాసంగా ప్రయాణించేందుకు వీలవుతుంది.
ఆ ఒక్క నిర్ణయంతో అద్భుత ఫలితాలు!
నేడు జీవితం మొత్తం స్మార్ట్ స్క్రీన్ల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా చిన్నారుల్లో, యువతలో డిజిటల్ స్క్రీన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. శారీరకంగానూ, మానసికంగాను ఎన్నో ఇబ్బందులను తెస్తుంది. ఇదే ఇపుడు మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన ఒక సర్పంచ్ అద్భుతమైన ఆలోచనకు నాంది పలికింది. పిల్లలను, యువతను డిజిటల్ స్క్రీన్నుంచి బయటపడవేసే మహత్తర ప్రణాళిక రూపొందించారు. ఆ నిర్ణయం ఇపుడు అద్భుతమైన ఫలితాలనూ సాధిస్తూ, ఆ గ్రామం దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచేలా చేస్తోంది.మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉన్న అగ్రాన్ దుల్గావ్ (Agran Dhulgaon) అనే ఒక చిన్న గ్రామం డిజిటల్ స్క్రీన్ వినియోగంపై పరిమితులను విధించింది. ప్రతిరోజు నాలుగు గంటల పాటు డిజిటల్ స్క్రీన్కి దూరంగా ఉండాలని ఆ గ్రామ సర్పంచ్ శివ్దాస్ భోస్లే నిర్ణయించారు. ఉదయం 5 గంటలకు ఒకసారి, సాయంత్రం 7 గంటలకు ఒకసారి మొత్తంగా ఒక రోజులో నాలుగు గంటల పాటు మొబైల్ ఫోన్కి దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.నిర్ణీత సమయానికి గ్రామంలో ఒక సైరన్ (Siren) మోగుతుంది. ఆ సైరన్ వినగానే అందరూ తమ మొబైల్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పక్కన పెట్టేస్తారు. ఈ డిజిటల్ అలవాట్లు పిల్లల భవిష్యత్తును దెబ్బతీయకుండా ఉండాలని, వారు ప్రతిరోజు నిర్దిష్ట సమయం చదువుకు కేటాయించేలా ఈ నిబంధనను తీసుకువచ్చారు.ఈ డిజిటల్ డిటాక్స్ (Digital Detox) నిర్ణయం గ్రామంలో ఎంత అద్భుతమైన ఫలితాల్ని తీసుకు వచ్చిందంటే... ఏకంగా ఆ గ్రామంలోని 53 మంది విద్యార్థులు జాతీయ స్కాలర్షిప్లను గెలుచుకునేంతగా... మరికొంత మంది విద్యార్థులు యూపీఎస్సీ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ వంటి పోటీ పరీక్షల్లోనూ ఉత్తీర్ణులయ్యారు. గ్రామ సర్పంచ్ శివ్దాస్ భోస్లే తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ట్రెండ్సెట్టర్ సీతారామన్!
మధ్యతరగతి కల… కొడుకు ప్రేమతో నిజమైంది
మధ్య తరగతి వారికి విమాన ప్రయాణం ఒక తీరని కల. ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఆ వైపుగా ఆలోచన కూడా చేయరు. కానీ .. ఓ కుమారుడు తల్లిదండ్రుల కోసం ఆ కలను నిజం చేస్తే..? ఆ భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ అందరి మనసుల్ని గెలుచుకుంటోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఒక యువకుడు, ఇప్పుడు తన తల్లిదండ్రులకు ఆ మేఘాలపై విహరించే ఆనందాన్ని అందించాడు.తన తల్లిదండ్రులని విమానాశ్రయం వద్దకి తీసుకువెళ్లగానే భారీ విమానాశ్రయ భవనం, అక్కడి వెలుగులను చూసి వారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఉత్సాహంతో΄ాటు, విమానం ఎక్కే ముందు కొంచెం కంగారుగా కనిపించినా.. తమ కుమారుని చేయి పట్టుకుని విమానంలోకి ప్రవేశించినపుడు వారి ఆందోళన అంతా పోయి ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. ఆ క్షణం ఎంతో విలువైనది. తన తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని చూసి, ఆ కుమారుడి ముఖంలో ఎంతో తృప్తి, గర్వం. దీనికి సంబంధించిన వీడియోని చూసిన నెటిజనులు తల్లిదండ్రుల కల నెరవేరిన సంతోష సమయం అనీ... కొడుకు కళ్లల్లో ఆనందం వెల కట్టలేనిది అనీ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hey Vishnu👨💻 (@vishh.mms)
అంతర్జాతీయం
గ్రీన్లాండ్ వివాదం.. ట్రంప్నకు యూరప్ షాక్!
బెల్జియం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్ తగిలింది. గ్రీన్లాండ్ దక్కించునేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా.. అందుకు ఒప్పుకోని యూరోపియన్ యూనియన్ దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగాడు. అయితే, ఈక్రమంలో ట్రంప్ బెదిరింపులకు తాము తలొగ్గబోమని, అవసరమైతే అమెరికాతో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల్ని రద్దు చేసుకుంటామంటూ యూరోపియన్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. అంతేకాదు, తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్ కంపెనీలపై సుంకాల పేరుతో ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలైలో అమెరికా-యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ ట్రంప్ తాజా బెదిరింపులు ఈ ఒప్పంద భవిష్యత్తుపై ఆందోళనలను రేకెత్తించాయి. ఫిబ్రవరి 1 నుంచి గ్రీన్లాండ్ కొనుగోలుకు ఒప్పుకోని డెన్మార్క్తో సహా ఎనిమిది దేశాలపై 10శాతం సుంకం విధిస్తామని స్పష్టం చేశారు. అప్పటికీ ఒప్పుకోకపోతే, జూన్ నుంచి ఈ సుంకం 25 శాతం వరకు పెరుగుతుందన్నారు. గ్రీన్లాండ్ అమెరికా జాతీయ భద్రతకు కీలకం. చైనా, రష్యా ఈ ప్రాంతంలో ఆధిపత్యం పెంచుతున్నందున గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవడం అమెరికాకు అవసరమని ట్రంప్ పేర్కొన్నారు.ఈ క్రమంలో డెన్మార్క్తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఈయూ నాయకులు సైతం సోషల్ మీడియా వేదికగా..‘అమెరికా బెదిరింపులకు తలొగ్గం. అవసరమైతే ఒప్పందాలను రద్దు చేస్తాం’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో యూరప్లో పనిచేస్తున్న అమెరికన్ కంపెనీలపై జరిమానాలు, నిషేధాలు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇది గూగుల్, మెటా, ఎక్స్ వంటి టెక్ దిగ్గజాలకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ట్రంప్ సైనిక చర్య తీసుకోవచ్చనే భయంతో జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్ గ్రీన్లాండ్లో దళాలను మోహరించాయి. డెన్మార్క్ కూడా తన సైనిక ఉనికిని పెంచుకుంది. ట్రంప్ సైనిక చర్య తీసుకుంటే నాటో కూటమి కూలిపోతుంది. ఈ పరిస్థితి ట్రాన్స్ అట్లాంటిక్ భద్రతా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.గ్రీన్లాండ్ వివాదం అమెరికా-ఈయూ సంబంధాలను కొత్త సంక్షోభంలోకి నెడుతోంది. ట్రంప్ సుంకాల బెదిరింపులు, ఈయూ ప్రతిస్పందన, సైనిక ఉద్రిక్తత అన్నీ కలిపి ఇరు దేశాల వాణిజ్య ఒప్పంద భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. రానున్న రోజుల్లో ఈ సమస్య అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక రంగంలో ప్రధాన చర్చగా మారనుంది.
‘పాక్లో నన్ను వేధిస్తున్నారు’.. మహిళ ఆడియో వైరల్
ఇస్లామాబాద్: సర్భ్జిత్ కౌర్ అనే మహిళ సిక్కుల తీర్థయాత్ర కోసం పాకిస్థాన్కు వెళ్లి అక్కడే ఒక పాకిస్థానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆ మహిళ పేరుతో వచ్చిన ఓ ఆడియో టేపుల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పంజాబ్ రాష్ట్రం కపుర్తలా జిల్లా ఆమ్నీపూర్ గ్రామానికి చెందిన సర్బ్జిత్ కౌర్.. సిక్కుల మత గురువు గురునానక్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి గతేడాది నవంబర్లో వాఘబార్డర్ మీదుగా పాకిస్థాన్లోకి ప్రవేశించింది. ఆ తీర్థయాత్రకోసం దాదాపు 2 వేల మంది భక్తులు పాకిస్థాన్ వెళ్లగా అందరూ తిరిగి వచ్చారు. అయితే సర్బ్జిత్ రాకపోవడంతో వారి కుటుంబసభ్యులు పోలీసులను సంప్రదించగా వారు విచారించారు. అప్పుడు ఆమె అక్కడే నశీర్ హుస్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని తెలిసింది. దీంతో అందరూ షాక్కు గురయ్యారు. తాజాగా ఇప్పుడు ఆమె పేరుతో ఒక ఆడియో టేప్ వైరల్ అవుతోంది.అందులో అక్కడ తాను అస్సలు బాగాలేనని తాను పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు అతని కుటుంబం తనను చిత్రహింసలకు గురిచేస్తోందని అన్నట్లు ఉంది. దయచేసి తనను తిరిగి ఇండియా తీసుకెళ్లాలని తన భారత్లో ఎటువంటి హాని చేయనని ఆమె అందులో అన్నారు. తన పిల్లలను చూడాలని ఉందని ఎంతోమందికి లక్షల రుపాయలు దానంగా ఇచ్చిన తను ఇప్పుడు డబ్బుల కోసం వేడుకోవాల్సి వస్తోందని ఆడియోలో పేర్కొన్నారు. అయితే ఈ ఆడియో క్లిప్ సర్బ్జిత్ కౌర్కు చెందిందా కాదా అనే విషయం పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.అయితే సర్బ్జిత్ కౌర్ వివాహం అనంతరం అక్కడి పోలీసులు వారిపై దాడి చేసి పెళ్లిని రద్దు చేసుకోవాలని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారించిన లాహెర్ కోర్టు సర్భ్జిత్ని అక్కడి ప్రభుత్వ వసతి గృహానికి తరలించినట్లు అక్కడి తెలిపారు. అయితే కౌర్ను ఇది వరకే పాకిస్థాన్ నుంచి పంపించాలని ప్రయత్నించగా వాఘా బార్డర్ మూసివేయడంతో అది సాధ్యపడలేదని అక్కడి అధికారులు అన్నారు.
"భారత్ నుంచే అమెరికాకు సంపద"
ప్రస్తుతం పాకిస్తాన్- అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా బలపడ్డాయి. డొనాల్డ్ ట్రంప్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో భేటీ అవ్వడం పలుమార్లు ఆ దేశానికి మద్దతుగా మాట్లాడడం జరిగింది. దీంతో భారత్ యూఎస్తో కొంత డిస్టెన్స్ పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికా రిపబ్లికన్ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ఇండియాతోనే స్నేహం బాగుంటుందని అక్కడి నుండే భారత్కు సంపద,శాంతి లభించాయన్నారు. భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశ రిపబ్లికన్ పార్టీ ఎంపీ మెక్ కార్మిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆప్ అమెరికాకు పాకిస్థాన్తో కంటే భారత్తోనే రిలేషన్ బాగుంటుందన్నారు. అమెరికాకు పెట్టుబడులు వచ్చేవి భారత్ నుంచి తప్ప.. పాక్ నుంచి కాదని 'సెంటర్ ఫర్ స్ట్రాటజీస్అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్' నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.భారతదేశంలో అత్యధిక ప్రజలు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారని ప్రపంచంలోని మిడిల్ క్లాస్ మార్కెట్ని భారత్ డామినేట్ చేస్తుందని తెలిపారు. ఇండియాలోని ప్రతిభావంతులైన యువత అమెరికాకు వచ్చి దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నారని మెక్ కార్మిక్ అన్నారు. అయితే ఇటీవల భారత్లోని యుఎస్ రాయబారి సైతం భారత్కు అనుకూలంగా మాట్లాడారు.అమెరికాకు భారత్ తర్వాతే మరే దేశమైనా అని అన్నారు.కాగా ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య సంబంధాలు అంత మెరుగ్గా లేవు. ట్రంప్ ప్రభుత్వం భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువులపై 50 శాతం పన్ను విధిస్తోంది.దీంతో ఎగుమతులు మందగించి దేశంలో చాలామంది ఉపాధి కోల్పోయారు.
Bangladesh: మరో హిందువు దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్లోని ఘాజీపూర్ జిల్లాలో మరో హిందువు దారుణ హత్య చోటుచేసుకుంది. తన దుకాణంలోని ఉద్యోగికి.. కస్టమర్లకు మధ్య జరుగుతున్న గొడవను ఆపడానికి ప్రయత్నించిన ఒక హిందూ వ్యాపారిని దుండగులు కొట్టి చంపారు. ఈ హత్య అక్కడి మైనారిటీ వర్గాలలో తీవ్ర భయాందోళనలను నింపింది. మృతుడిని 55 ఏళ్ల లిటన్ చంద్ర ఘోష్గా గుర్తించారు. ఇతను వైశాఖి పేరుతో స్థానికంగా ఓ స్వీట్ షాపును నడుపుతున్నాడు.పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం, లిటన్ దుకాణంలో పనిచేసే అనంత దాస్ అనే ఉద్యోగికి.. ఒక కస్టమర్కు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, తన సిబ్బందిని రక్షించేందుకు యజమాని లిటన్ జోక్యం చేసుకున్నారు. అయితే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు లిటన్పై తిరగబడ్డారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం మొదట లిటన్పై పిడిగుద్దులతో దాడి చేసిన దుండగులు, అనంతరం ఒక పారతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లిటన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కలిగంజ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్-చార్జ్ ఎండి జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ హత్యకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. లిటన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దర్యాప్తులో భాగంగా అధికారులు ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. రిపన్ సాహా (30) అనే హిందూ యువకుడిని కారుతో తొక్కి చంపిన ఘటన మరువక ముందే ఈ దారుణం చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: బాంబు బెదిరింపు.. ‘ఇండిగో’ ఎమర్జెన్సీ ల్యాండింగ్
జాతీయం
రిసార్ట్లో ‘షిండే’ కార్పొరేటర్లు.. వీడని ‘మేయర్’ ఉత్కంఠ
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ఎన్నికల్లో బీజేపీ కూటమి స్పష్టమైన విజయం సాధించినప్పటికీ, ముంబై రాజకీయాల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, సొంతంగా మేజిక్ ఫిగర్ను దక్కించుకోలేదు. దీంతో పార్టీకి ఫిరాయింపుల భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మిత్రపక్షమైన బీజేపీ నుండే ఏవైనా ‘ఆపరేషన్లు’ జరుగుతాయేమోనన్న అనుమానంతో, కొత్తగా ఎన్నికైన తమ శివసేన కార్పొరేటర్లను బాంద్రాలోని ఓ రిసార్ట్కు తరలించారు. మేయర్ ఎన్నిక పూర్తయ్యే వరకు షిండే వర్గం ఈ ‘రిసార్ట్ పాలిటిక్స్’ వ్యూహాన్ని అమలు చేయనున్నదని తెలుస్తోంది.మ్యాజిక్ ఫిగర్కు అంచున ఎన్డీఏ కూటమిమొత్తం 227 స్థానాలున్న బీఎంసీలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు 114 స్థానాల మద్దతు అవసరం. తాజా ఫలితాల్లో బీజేపీ 89 స్థానాలను గెలుచుకోగా, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 29 స్థానాల్లో విజయం సాధించింది. ఇవి రెండూ కలిపితే ఎన్డీఏ కూటమి బలం 118కి చేరింది. ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువ. ఈ స్వల్ప ఆధిక్యం కారణంగా, ఏ చిన్నపాటి చీలిక వచ్చినా మేయర్ పీఠం చేజారిపోయే ప్రమాదం ఉంది.శివసేన ఐక్యంగా ఉంటే..మరోవైపు శివసేన (యూబీటీ) 65 స్థానాలను గెలుచుకుంది. ఒకవేళ శివసేన ఐక్యంగా ఉండి ఉంటే, ఉద్ధవ్, షిండే వర్గాల సీట్లు కలిపి (65+29) 94 అయ్యేవని, అది బీజేపీ (89) కంటే ఎక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తు ఉండి ఉంటే ఫలితాలు పూర్తిగా తారుమారయ్యేవని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. బీఎంసీపై పట్టు కోల్పోయినప్పటికీ, ముంబై మేయర్గా శివసేన (యూబీటీ) అభ్యర్థిని చూడాలన్న తన కల ఇంకా చెదరలేదని, దేవుడు అనుగ్రహిస్తే అది సాధ్యమేనని ఆయన వ్యాఖ్యానించారు.పార్టీలో అసంతృప్తి బీజేపీ అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీలో అసంతృప్తి నెలకొంది. ఎన్నికలకు ముందు 155 పైగా స్థానాల్లో పోటీ చేసి, కనీసం 110-125 సీట్లు గెలవాలని బీజేపీ తన లక్ష్యంగా పెట్టుకుంది. కానీ షిండే వర్గం గట్టిగా పట్టుబట్టి 91 సీట్లు తీసుకోవడంతో, బీజేపీ 137 స్థానాల్లోనే పోటీ చేయాల్సి వచ్చింది. చివరకు 89 సీట్లతో సరిపెట్టుకోవాల్సి రావడంతో పార్టీ నాయకత్వం నిరాశలో ఉంది. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుండి చేర్చుకున్న 11 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా ఓడిపోవడం గమనార్హం. ముంబై బీజేపీ యూనిట్లో సమన్వయ లోపం, అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు, రాజ్, ఉద్ధవ్ ఠాక్రేలు లేవనెత్తిన మరాఠీ ఆత్మగౌరవం నినాదాన్ని తిప్పికొట్టలేకపోవడమే ఈ ఫలితాలకు కారణమని బీజేపీ నేతలు అంటున్నారు.ఇది కూడా చదవండి: సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్?
సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్?
న్యూఢిల్లీ: దేశంలో వచ్చే ఫిబ్రవరి ఒకటి నుండి సిగరెట్లపై పన్నులు పెరగనున్న తరుణంలో, అక్రమ పొగాకు విక్రయాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద అక్రమ సిగరెట్ మార్కెట్లలో ఒకటిగా ఉందని, ఈ నేపథ్యంలో పన్నుల పెరుగుదల అక్రమ ముఠాలకు మరింత ఊతమిచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. దక్షిణాఫ్రికా, అజర్బైజాన్ తదితర దేశాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు భారత్కు హెచ్చరికగా మారుతున్నాయని వారు తమ వాదన వినిపిస్తున్నారు.దక్షిణాఫ్రికాలో ఏం జరిగింది?దక్షిణాఫ్రికాలో అక్రమ సిగరెట్ల వ్యాపారం మరింతగా మితిమీరిపోవడంతో, ఆ దేశానికి చెందిన సిగరెట్ల తయారీ సంస్థ ‘బ్రిటిష్ అమెరికన్ టొబాకో’ (బీఏటీ)తమ ప్లాంట్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పన్నులు చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా, తక్కువ ధరకు విక్రయించే నకిలీ సిగరెట్ల కారణంగా ఈ సంస్థ తన చట్టబద్ధమైన వ్యాపారాన్ని నిలదొక్కుకోలేకపోయింది. ఫలితంగా దక్షిణాఫ్రికాలో సిగరెట్ల తయారీ రంగంపై ప్రతికూల ప్రభావం పడింది.అజర్బైజాన్లోనూ..అజర్బైజాన్లో పొగాకు స్మగ్లింగ్లో ఒక మాజీ కస్టమ్స్ అధికారి హస్తం ఉండటం, ఆపై అతను అరెస్టు కావడం సంచలనం సృష్టించింది. దేశంలో పొగాకు అక్రమ నెట్వర్క్లు ఎంత శక్తివంతంగా మారాయంటే, అవి ప్రభుత్వ వ్యవస్థల్లోకి కూడా చొచ్చుకుపోయని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఒకసారి ఈ అక్రమ ముఠాలు వేళ్లూనుకుంటే, వాటిని అదుపు చేయడం చాలా కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అక్రమ సిగరెట్ల మార్కెట్ వాటాభారతదేశంలో గతంలో పన్నులు భారీగా పెంచినప్పుడు, చట్టబద్ధమైన, అక్రమ సిగరెట్ల ధరల మధ్య వ్యత్యాసం భారీగా కనిపించింది. ఇది స్మగ్లర్లను ప్రోత్సహించేదిగా పరిణమించింది. ప్రస్తుతం దేశంలో అక్రమ సిగరెట్ల మార్కెట్ వాటా 26.1% వరకు ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ. 23 వేల కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతోంది. ఈ నిధులు ఆరోగ్య, మౌలిక సదుపాయాల రంగానికి అందకుండా పోతున్నాయి.సరైన పన్ను విధానంతో..ప్రజారోగ్యం దృష్ట్యా పొగాకుపై పన్నులు అవసరమైనప్పటికీ, అవి హేతుబద్ధంగా లేకపోతే అక్రమ మార్కెట్ వృద్ధి చెందుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. పన్నుల భారం మితిమీరినప్పుడు లీగల్ మార్కెట్ కుంచించుకుపోయి, స్మగ్లింగ్ మాఫియా బలపడుతుందనే వాదన వినిపిస్తోంది. అందుకే, పటిష్టమైన నిఘా, సరైన పన్ను విధానం ద్వారానే అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: మౌని అమావాస్య : ధార్మికమే కాదు.. ఆరోగ్యానికి ‘సూపర్ ఫుడ్’
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలలో జీరో విజిబులీటీ నమోదైంది. పొగమంచు తీవ్రంగా ఉండడంతో విమానాలతో పాటు పలు ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు నగరంలో గాలికాలుష్య తీవ్రత సైతం మరోసారి పెరిగింది.దేశరాజధాని నగరంలో గాలికాలుష్యం మరోసారి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ రోజు ఉదయం గాలి కాలుష్య స్థాయి 439 పాయింట్ల నుంచి 500 కు చేరుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం గ్రేడ్-4 కఠిన ఆంక్షలు విధించింది. మరోవైపు పొగమంచు దట్టంగా అలుముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో విమాన రాకపోకల సమయాలు ప్రయాణికులకు వెబ్సైట్లలో చుసుకోవాలని ఇండిగోతో పాటు ఇతర ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశాయి.బేర్లీ, లక్నో, కుశీనగర్ ప్రాంతాలలో జీరో విజిబులిటీ నమోదుకాగా అమృత్ సర్, గోరఖ్పూర్లలో 100మీటర్లు, ప్రయాగ్రాజ్లో 200 మీటర్ల విజిబులిటీ నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.
మిషన్ డాల్ఫిన్: నదీ గర్భంలో భారీ ‘ఆపరేషన్’
దేశంలోని పలు జీవనదుల గర్భంలో దాగిన రహస్యాలను వెలికితీసేందుకు కేంద్రం భారీ ఆపరేషన్కు శ్రీకారం చుట్టింది. గంగమ్మ ఒడిలో ఆటలాడే డాల్ఫిన్ల సంఖ్యను కచ్చితంగా తేల్చేందుకు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, హైటెక్ బోట్లతో పరిశోధక బృందాలు రంగంలోకి దిగాయి. కేవలం డాల్ఫిన్ల గణాంకాలే కాదు, నదీ పర్యావరణ వ్యవస్థ భవితవ్యాన్ని నిర్ణయించే ఈ ప్రతిష్టాత్మక ‘మిషన్ డాల్ఫిన్ 2.0’ అసలు లక్ష్యం ఏమిటంటే...పర్యావరణ వ్యవస్థపై దృష్టిడాల్ఫిన్ల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి అడుగున శబ్దాలను సైతం పసిగట్టి, డాల్ఫిన్ల లెక్కలు వెలికి తీసేందుకు రెండో విడత దేశవ్యాప్త సర్వేను ప్రారంభించింది. ఇటు బిజినోర్ నుంచి అటు సుందర్బన్స్ వరకు సాగే ఈ భారీ అన్వేషణలో బయటపడనున్న వాస్తవాలపై ఎంతో ఆసక్తి నెలకొంది. గంగా, సింధు, బ్రహ్మపుత్ర తదితర ప్రధాన నదులలో డాల్ఫిన్ల జాడ కోసం పరిశోధకులు వేట మొదలుపెట్టారు. కేవలం డాల్ఫిన్ల గణాంకాలకే పరిమితం కాకుండా, నదీ పర్యావరణ వ్యవస్థను కాపాడటమే లక్ష్యంగా ఈ సర్వే మొదలైంది.నీటి అడుగున వినిపించే శబ్ధాలతో..ఈసారి సర్వే కేవలం పైకి కనిపించే డాల్ఫిన్లను లెక్కించడం మాత్రమే కాదు. 26 మంది నిపుణులైన పరిశోధకుల బృందం మూడు పడవల్లో నదీ జలాల్లోకి ప్రవేశించింది. వీరు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా నీటి అడుగున శబ్దాలను పసిగట్టే ‘హైడ్రోఫోన్స్’ (Hydrophones) ద్వారా డాల్ఫిన్ల కదలికలను రికార్డు చేస్తున్నారు. డాల్ఫిన్లు చేసే శబ్దాల ఆధారంగా వాటి ఉనికిని, సంఖ్యను అంచనా వేయడం ఈ సర్వే ప్రత్యేకత.బిజినోర్ టూ గంగా సాగర్ఈ బృహత్తర కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశలో గంగా నది ప్రధాన ప్రవాహమైన ఉత్తరప్రదేశ్లోని బిజినోర్ నుంచి పశ్చిమ బెంగాల్లోని గంగా సాగర్ వరకు జల్లెడ పట్టనున్నారు. అలాగే సింధు నది పరీవాహక ప్రాంతాల్లోనూ సర్వే కొనసాగనున్నది. దేశంలోని అతి పొడవైన నదీ తీరాల్లో సాగే ఈ అన్వేషణ డాల్ఫిన్ల ఆవాసాలపై స్పష్టమైన వివరాలను అందించనుంది.కొత్తగా ‘ఇరావాడి’ జాడ కోసం..రెండో దశ సర్వేలో బ్రహ్మపుత్ర నది, గంగా ఉపనదులు, సుందర్బన్స్, ఒడిశా ప్రాంతాలను కవర్ చేయనున్నారు. ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే, ఈసారి కేవలం గంగా, సింధు నదులలోని డాల్ఫిన్లనే కాకుండా.. అరుదైన ‘ఇరావాడి డాల్ఫిన్ల’ (Irrawaddy dolphins) లెక్కలను వెలికి తీయడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. సుందర్బన్స్, ఒడిశా ప్రాంతాల్లో వీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలకు ఈ డేటా కీలకం కానుంది.దేశంలో ఎన్ని డాల్ఫిన్లు..గతంలో అంటే 2021-2023 మధ్య జరిగిన తొలి సర్వేలో వెల్లడైన డాల్ఫిన్ల గణాంకాలను పరిశీలిస్తే భారతదేశంలో దాదాపు 6,327 నదీ డాల్ఫిన్లు ఉన్నట్లు తేలింది. వీటిలో గంగా, యమున, చంబల్, ఘాఘ్రా, కోసి, బ్రహ్మపుత్ర నదుల్లో గంగా డాల్ఫిన్లు అధికంగా ఉన్నాయి. బియాస్ నదిలో సింధు డాల్ఫిన్లు తక్కువ సంఖ్యాలో ఉన్నాయి. దేశం మొత్తం మీద ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలే డాల్ఫిన్లకు ప్రధాన ఆవాసాలుగా ఉన్నట్లు గత రికార్డులు చెబుతున్నాయి.రంగంలోకి వైల్డ్ లైఫ్ నిపుణులుఈసారి చేపట్టిన భారీ ఆపరేషన్ను డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)సమన్వయం చేస్తోంది. ఈ సంస్థకు అండగా ఆయా రాష్ట్రాల అటవీ శాఖలు, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తదితర స్వచ్ఛంద సంస్థలు నిలిచాయి. సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు అటవీ శాఖ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని బిజినోర్లో 13 జిల్లాల సిబ్బందికి వర్క్షాప్ నిర్వహించారు.అభయారణ్యంలో నౌకల గండంఇదిలా ఉండగా బీహార్లోని విక్రమశిల గంగా డాల్ఫిన్ అభయారణ్యం పరిధిలో జల రవాణా వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ వాటర్ వేస్-1లో భాగంగా సుల్తాన్గంజ్-కహల్గావ్ మార్గంలో నౌకల రాకపోకల కోసం పూడికతీత (Dredging) పనులకు జాతీయ వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. అయితే ఈ ప్రాంతం అంతరించిపోతున్న షెడ్యూల్-1 జాతి డాల్ఫిన్లకు అత్యంత కీలకమైన ఆవాసం కావడం గమనార్హం.డాల్ఫిన్ల రక్షణే ధ్యేయంగా..అభివృద్ధి పనుల కారణంగా మూగజీవాలకు ముప్పు వాటిల్లకూడదని వన్యప్రాణి బోర్డు కఠిన ఆంక్షలు విధించింది. పూడికతీత ఎక్కడ, ఎలా, ఎంత లోతు వరకు చేయాలనే దానిపై స్పష్టమైన మ్యాప్, ప్లాన్ను ముందుగానే బీహార్ అటవీ శాఖకు సమర్పించాలని ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీని ఆదేశించింది. డాల్ఫిన్ల ఆవాసాలకు భంగం కలగకుండానే ఈ పనులు జరగాలని స్పష్టం చేసింది. ఈ సర్వే ద్వారా లభించే శాస్త్రీయ డేటా భవిష్యత్తులో డాల్ఫిన్ల సంరక్షణ విధానాలకు ఉపయుక్తం కానుంది.ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఘోర పరాభవం వెనుక..
ఎన్ఆర్ఐ
త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి
విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ఎన్నారైల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన యశ్వంత్ కుమార్ గోషిక (33) శనివారం డల్లాస్లో గుండెపోటుతో మరణించారు. యశ్వంత్ ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. స్నేహితులను, తెలుగు ఎన్నారై సమాజాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.యశ్వంత్ కుమార్ తెలంగాణలోని చౌటప్పల్ గ్రామంలోని దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. అమెరికాలోనే మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆ తరువాత టాప్ MNCలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. స్లీప్ అప్నియాకు సంబంధించిన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని, ఆకస్మిక గుండెపోటు కారణంగా నిద్రలోనే మరణించాడని సన్నిహితులు వెల్లడించారు. తోటి తెలుగువారితో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు యశ్వంత్ మృతదేహాన్నిఅంతిమ సంస్కారాల కోసం భారతదేశానికి తిరిగి పంపడానికి NRI సంఘం ప్రయత్నాలు చేస్తోంది.విషాదం ఏమిటంటేయశ్వంత్కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైనట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పెళ్లికోసం స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్న తరుణంలో, పెళ్లికొడుకుగా చూడాలనుకున్న యశ్వంత్ అకాలమరణం వారిని తీరని విషాదంలోకి నెట్టేసింది.
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్కు కొత్త కార్యవర్గం ఎన్నిక
కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసుల ప్రత్యేక సంస్థ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (TDF - CANADA) రానున్న రెండేళ్ల కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. జితేందర్ రెడ్డి గార్లపాటి అధ్యక్షుడిగా, వెంకట్ రెడ్డి పోలు ప్రధాన కార్యదర్శిగా పనిచేయనున్నారు. 2026-27 రెండేళ్ల పాటు ఈ కొత్త కార్యవర్గం పనిచేయనుంది.కొత్త కార్యవర్గంలో ఫౌండేషన్ కమిటీ చైర్ పర్సన్గా అమిత పినికేశి, ఉపాధ్యక్షుడిగా మహేందర్ కీస్రా, సంయుక్త కార్యదర్శిగా అనికేత్ రెడ్డి శామీర్ పేట, ట్రెజరర్గా కృష్ణా రెడ్డి చాడ, జాయింట్ ట్రెజరర్గా రవీందర్ రెడ్డి కొండం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్గా అర్షద్ ఘోరి, కమిటీ చైర్మన్లుగా బిజినెస్ కౌన్సిల్ చైర్ పర్సన్గా ఇందు రెడ్డి, స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్గా కె. మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసుల కోసం 2005లో టీడీఎఫ్ కెనడా సంస్థ ఏర్పాటైంది. తెలంగాణ ఉద్యమ సమయంతో పాటు రాష్ట్రం ఏర్పటయ్యాక కూడా ఈ సంస్థ క్రియాశీలకంగా పనిచేస్తోంది. ప్రతీ ఏటా తెలంగాణ నైట్ను నిర్వహిస్తూ అక్కడి తెలుగువారిని ఏకం చేసే ప్రయత్నం చేస్తోంది. తంగేడు అనే అనుబంధ సాంస్కృతిక సంస్థ ద్వారా బతుకమ్మ పండగతో పాటు వివిధ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కెనడాలో స్థిరపడిన వందలాది మంది తెలుగువారు తమ కుటుంబాలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా తమ పిల్లలకు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన అన్ని సమయాల్లో సమాజ సేవ కార్యక్రమాలను కూడా విసృతంగా ఈ సంస్థ నిర్వహిస్తోంది. టీడీఎఫ్ కెనడా ఆధ్వర్యంలో ఏర్పాటైన క్రికెట్ క్లబ్లో వందలాది మంది తెలుగు విద్యార్థులు భాగస్వామ్యులుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి విద్య కోసం వెళ్లిన విద్యార్థులకు కూడా ఈ సంస్థ తగిన సహాయం అందిస్తోంది.(చదవండి: విజయవంతంగా 'TTA సేవా డేస్–2025' వేడుకలు)
భారతీయులు సహ వలసదారుల్లో సరికొత్త భయం!
H-1B వీసాలపై అమెరికాకు వెళ్లిన భారతీయులు గుబులు.. గుబులుగా కనిపిస్తారు. ఇప్పటికే కఠినమైన నియమాలు అమలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. ఇంకా ఏం మెలికలు పెడుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారతీయులే కాదు.. విదేశీ వలసదారులు సైతం ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడటానికి ఇష్టపడడం లేదు. ఎందుకైనా మంచిదని టోటల్గా ప్రయాణాలు రద్దు చేసుకొని ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం వలస నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తుండటంతో.. వలసదారులు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణాలకు భయపడుతున్నారట. కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్ (KFF)-న్యూయార్క్ టైమ్స్ సంయుక్తంగా నిర్వహించిన 2025 సర్వేలో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం అమెరికాలోని వలసదారులలో 27% మంది జర్నీలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారన్నది ఈ సర్వే సారాంశం. ఈ క్రమంలో.. చట్టబద్ధంగా ఉన్నవారు కూడా భయాందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. సరైన H-1B వీసాలు కలిగినవారు (32 శాతం), పౌరసత్వం పొందినవారు (15 శాతం) కూడా ప్రయాణాలకు వెనుకడుగు వేస్తున్నారు. ఇక.. అక్రమ వలసదారులలో ఈ సంఖ్య 63% గా ఉంది. ఇటు దేశీయంగానూ ప్రయాణాలపై వలసదారుల్లో భయం నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు.. ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (TSA) దేశీయ విమాన ప్రయాణికుల వివరాలను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE)కు షేర్ చేస్తోంది. దీంతో వలస దారులు తమపై దృష్టి పడకుండా ఉండేందుకు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారని సర్వేలో వెల్లడైంది. టెక్సాస్లో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణురాలు శిఖా ఎస్.. తన తల్లిదండ్రులను చూసేందుకు భారత్కి రావాలనుకుంటోంది. అయితే.. H-1B వీసా దారులపై పెరుగుతున్న పరిశీలన, ఆలస్యమవుతున్న ఇంటర్వ్యూల కారణంగా తన ప్రయాణాన్ని అర్ధాంతరంగా వాయిదా వేసుకుంది.ఈ ఏడాది జూలైలో H-1B వీసా రీన్యువల్స్ను స్వదేశంలోనే చేయాలని నిబంధన విధించగా.. సెప్టెంబర్లో కొత్త H-1B దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు విధించారు. అటుపై ట్రంప్ ప్రభుత్వం డిసెంబర్లో సోషల్ మీడియా స్క్రీనింగ్ను కూడా కఠినతరం చేసింది.ఇక.. వీసా ఇంటర్వ్యూలు 2026–2027 వరకు వాయిదా పడటంతో.. వందలాది మంది ఉద్యోగాలు, కుటుంబాల నుండి దూరమయ్యారు. దీనితో మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు వలసదారులు అత్యవసర పరిస్థితులు తప్ప విదేశీ ప్రయాణం చేయవద్దని సూచిస్తోంది. ఈ మొత్తం పరిణామాలన్నీ అమెరికాలో వలసదారులలో భయాన్ని పెంచి.. వారి రోజువారీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఉద్యోగాలు, కుటుంబాలు, చట్టబద్ధ స్థితి కాపాడుకోవడానికి, వలసదారులు ప్రయాణం పూర్తిగా నివారించడం సురక్షిత మార్గంగా భావిస్తున్నారని సర్వేలతో స్పష్టమవుతోంది.
ఘనంగా 'GTA మెగా కన్వెన్షన్ 2025'
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో 'GTA మెగా కన్వెన్షన్ 2025' వేడుకలు ఘనంగా జరిగాయి. గండిపేట మండలం ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లోని అక్షయ కన్వెన్షన్లో శని, ఆదివారం పలు కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా జరిగాయి.కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి, హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితర రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కాన్వెన్షన్ కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస భారతీయుల మేధస్సు, వనరులు, నెట్వర్క్ శక్తిని అనుసంధానం చేసే మహోద్యమమని జిటీఎ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 దేశాల నుండి వేలాది మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.జీటీఏ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి, యూఎస్ఏ ఫౌండర్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కల్వల, ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాడురి, ప్రెసిడెంట్ ఎలక్ట్ కంకణాల అభిషేక్ రెడ్డి, అడ్వైజరీ చైర్ ప్రతాప్ రెడ్డి పెండ్యాల, సహ వ్యవస్థాపకుడు శ్రవణ్ రెడ్డి పాడురు, యూఎస్ఎ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, వాషింగ్టన్ ప్రెసిడెంట్ రాము ముండ్రాతి, తదితరులు GTA లో కీలక పాత్ర పోషిస్తూ ఈ వేడుకలను విజయవంతం చేయడంలో తోడ్పాడ్డారు.తెలంగాణలో జిల్లాల వారిగా GTA చాప్టర్లు ప్రారంభించారు. జిల్లాల కార్యవర్గాన్ని ఈ వేదికపై పరిచయం చేశారు. కార్యక్రమంలో 100 మందికి పైగా కళాకారులతో తెలంగాణ జానపద, శాస్త్రీయ కళారూపాల ప్రదర్శనలు జరిగాయి. మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్, మంగ్లీ లైవ్ మ్యూజికల్ నైట్, మోహన భోగరాజు ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఆహా ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ షో నిర్వహించారు.రియల్ ఎస్టేట్, స్టార్టప్లు, ఎన్ఆర్ఐ లీగల్ అంశాలు, ఆరోగ్య రంగ ఆవిష్కరణలపై ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయడం విశేషం. “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ కింద - రాష్ట్ర అభివృద్ధి, గ్లోబల్ భాగస్వామ్యం, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, జిటీఎ కొత్త నాయకత్వ ప్రమాణ స్వీకారం, గ్రాండ్ లైవ్ కన్సర్ట్తో ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి. ప్రపంచ తెలంగాణ బిడ్డలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఈ మహాసభలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
క్రైమ్
ప్రియురాలి కోసం భార్యను చంపి..
కృష్ణా జిల్లా: తల్లిని తమ తండ్రి చంపటం జీర్ణించుకోలేక పోతున్నామని, తమ తండ్రికి కచ్చితంగా శిక్ష పడాలని మృతురాలు రేణుకాదేవి కుమార్తె, కుమారుడు ముక్కామల తేజశ్రీ, ముక్కామల నాగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పోరంకిలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమ తండ్రి ముక్కామల ప్రసాద్ చౌదరి ఆకునూరు ఝాన్సీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తమ తల్లి అడ్డుగా ఉందని పథకం ప్రకారం హత్య చేశారని తెలిపారు. తమ పట్ల తండ్రి కపటప్రేమ చూపాడని, తల్లి పేరున ఉన్న ఇంటిని నమ్మకంగా తన పేరున రాయించుకున్నాడని అన్నారు. తమ తండ్రి ఇంత దారుణానికి ఒడికడతాడని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. సెల్ఫోన్ డేటా ఆధారంగానే తల్లి హత్య ఉదంతం వెలుగు చూసిందని అన్నారు. హత్య వెనుక పలువురు వ్యక్తుల ప్రమేయం ఉందని అనుమానాలు ఉన్నాయని దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని కోరారు. నన్ను కూడా చంపాలని చూశారు... తన తండ్రి ప్రసాద్చౌదరి, ఆయనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఝాన్సీ తనను కూడా హత్య చేయాలని చూశారని మృతురాలి కుమారుడు నాగేష్ ఆరోపించారు. తనకు ఇష్టం లేకపోయినా తనను యూకేకు బలవంతంగా పంపారని, తనను యూకేలోనే చంపాలని పథకం వేశారని అన్నారు. తాను యూకేకు వెళ్లిన 25 రోజుల్లోనే తల్లిని హత్య చేశారని చెప్పారు. దీంతో తాను ఇండియాకు వచ్చానన్నారు. ఇంత దారుణానికి పాల్పడిన తండ్రి ప్రసాద్చౌదరి, ఝాన్సీలకు శిక్షపడాలని అన్నారు.
22 రూపాయల కోసం హత్య
చేగుంట(మెదక్ జిల్లా): కేవలం 22 రూపాయల పాత బాకీ విషయంలో గొడవపడి, తోటి కార్మికుడిని హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా అనంతసాగర్ శివారులోని సప్తగిరి కెమికల్ పరిశ్రమలో పనిచేసే ఉత్తరప్రదేశ్కు చెందిన సిరాజ్ (30), అదే రాష్ట్రానికి చెందిన మహేశ్కుమార్ధర్మ ఒకే గదిలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 15న పండుగ రోజు మద్యం సేవించేందుకు ఇద్దరు స్నేహితులు బయటకు వెళ్లారు. గ్రామశివారులో మద్యం తాగుతూ సిరాజ్ తనకు బాకీ ఉన్న రూ.22 విషయంలో మహేశ్కుమార్ గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా పెరగడంతో మహేశ్, సిరాజ్ తలను చెట్టుకు బాది, అనంతరం రాయితో తలపై గాయపరిచాడు. దీంతో సిరాజ్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మహేశ్కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మాసాయిపేట శివారులో నిందితుడు మహేశ్కుమార్ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యకు దారితీసిన వివరాలు తెలిపాడు. నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
అనుమానిస్తున్నాడని అంతమొందించి..
మహబూబ్ నగర్ జిల్లా: తనను అనుమానిస్తూ.. వేధిస్తున్నాడనే కోపంతో భర్త తలపై పారతో కొట్టడంతో భర్త మృతిచెందాడు. గోపాల్పేట ఎస్ఐ జగన్మోహన్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని ఏదుట్ల గ్రామానికి చెందిన శానాపల్లి చిన్నమల్లయ్య (40), శివమ్మ భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. గొర్లు, మేకలు పెంచుకుని జీవనం సాగిస్తున్నారు. ఇంటివద్ద స్థలం లేకపోవడంతో జీవాలను మల్లయ్య తన బామ్మర్ది ఇంటివద్దే ఆపేవాడు. అయితే కొంతకాలంగా మల్లయ్య తన భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే శనివారం మల్లయ్య, తన భార్య శివమ్మ గొర్లు నిలిపే ఇంటివద్దకు వెళ్లగా.. అప్పటికే మల్లయ్య మద్యం తాగి ఉండటంతో ఇద్దరికీ మాటామాటా పెరిగింది. దీంతో క్షణికావేశానికి లోనైన శివమ్మ ఇంటి ముందున్న పార తీసుకుని మల్లయ్య తలపై బాదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత భర్త ఇంటి గడపమీద పడి మరణించాడని చెప్పి అందరినీ నమ్మించింది. మల్లయ్య అన్న వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివమ్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో తాను పారతో కొడితేనే మృతిచెందాడని ఒప్పుకోవడంతో అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీచర్లు మృతి
అర్వపల్లి, నల్లగొండ: సంక్రాంతి సెలవులు ముగిసి శనివారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు టీచర్లు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ప్రత్యేక అధికారిణి మామిడాల కల్పన (43), తుంగతుర్తి మండలం రావులపల్లి జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు పోరెడ్డి గీత (48)తోపాటు తుంగతుర్తి జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు అలువాల ప్రవీణ్కుమార్, తుంగతుర్తి మండలం అన్నారం జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు అలువాల సునీతారాణి శనివారం ఉదయం గీతకు చెందిన కారులో నల్లగొండ నుంచి పాఠశాలలకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అర్వపల్లి శివారులోని ముదిరాజ్కాలనీ వద్దకు రాగానే అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఇంటి నిర్మాణం కోసం పోసిన ఇసుక కుప్పపై నుంచి వెళ్లి పల్టీలు కొడుతూ పొలాల్లోకి దూసుకెళ్లింది. అదే సమయంలో కారు ముందుభాగం ఎడమవైపు టైరు పేలింది. కారు పల్టీ కొట్టడంతోనే కల్పన రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత సునీతారాణి, గీత ఎగిరి కిందపడ్డారు. ప్రవీణ్కుమార్ కారులో ఇరుక్కుపోగా స్థానికులు బయటకు తీశారు. కారు డ్రైవర్ నదిపల్లి గిరి స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వారిని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కల్పన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గీతను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. సునీతారాణి, ప్రవీణ్కుమార్ పరిస్థితి విషమంగా ఉండగా హైదరాబాద్కు తరలించారు. వీరిద్దరు అన్నాచెల్లెళ్లు. ఈ ప్రమాదం కారు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లగొండలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసముంటున్న గీత.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం రావులపల్లి ప్రభుత్వ పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఈమె కుమారుడు సాయినితన్రెడ్డి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. కూతురు సౌమికకు పెళ్లి అయి భర్తతో కలిసి అమెరికాలో ఉంటోంది. వచ్చే నెలలో కుమారుడికి కాన్వొకేషన్ ఉంది. దీంతో గీత ఫిబ్రవరిలో పిల్లల వద్దకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ, శనివారం పాఠశాలకు వెళ్తూ గీత రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తల్లి మృతి విషయం తెలుసుకున్న కూతురు, కుమారుడు.. భారత్కు బయల్దేరారు. కాగా.. నల్లగొండలోని హనుమాన్నగర్లో నివాసం ఉండే లింగంపల్లి కల్పన తుంగతుర్తి కేజీబీవీలో ప్రత్యేకాధికారి(ఎస్ఓ)గా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. సాయంత్రం త్వరగా వస్తానని చెప్పి.. రోజూ వచ్చే సమయం కంటే ముందుగానే శవమై వచ్చిందని ఆమె భర్త, పిల్లలు విలపించారు. గీత, కల్పన మృతదేహాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నివాళులర్పించి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.
వీడియోలు
TDP నేతల చేతిలో చంపబడ్డ మంద సాల్మన్ కొడుకుల సంచలన వ్యాఖ్యలు
దమ్ముంటే టచ్ చెయ్.. హౌస్ అరెస్ట్ పై అశోక్ బాబు వార్నింగ్
వైయస్సార్, ఎన్టీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రశంసలు
నేను ఆ ఉద్దేశంతో అనలేదు.. క్లారిటీ ఇచ్చిన రెహమాన్
అపాయింట్ మెంట్ కోరుతూ ఏపీ డీజీపీకి MLC లేళ్ల అప్పిరెడ్డి లేఖ
సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ
హైవేపై ప్రమాదాలు..ఒకరు మృతి..
ట్రంప్ టారిఫ్.. షాక్ ఇచ్చిన యూరప్
మహిళ డ్యాన్సర్లతో మంత్రి వాసంశెట్టి డాన్స్.. బయటపడ్డ సంచలన వీడియో
లక్ష పెట్టుబడి.. నాలుగేళ్లలో రూ. 64 లక్షలు చేసిన కంపెనీ

